Archive Page | Sakshi
Sakshi News home page

Politics

  • సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రైవేటీకరణ మత్తులో జోగుతున్నారని సీపీఎం మాజీ పార్లమెంట్ సభ్యులు పెనుమల్లి మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి యశోదానగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 66,350 కోట్ల ఖర్చుతో అమరావతి నగరాన్ని ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. పట్టణ ప్రాంతాలలో రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, విద్యుత్తు తదితర ప్రజా సౌకర్యాలు అన్నింటిని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పుతూ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

    రూ.6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపేసి 60 డిగ్రీ కాలేజీలు మూతపడ్డానికి చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది. మరిన్ని కాలేజీలు మూసివేతకు సిద్ధమైన పరిస్థితి నెలకొంది.. ఈ కారణంగా 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో 100 రోజుల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తామని ప్రకటన చేసిన లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించమని విద్యాసంస్థల యాజమాన్యాలు అడిగినందుకు వారిని బెదిరించడం ఎంతవరకు సమంజసం? అంటూ మధు నిలదీశారు.

    ఆరోగ్యశ్రీ పథకానికి రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారని ఈ కారణంగా ఆసుపత్రులు 1300 రకాల జబ్బులకు వైద్యం చేయలేమని తీర్మానించిన విషయాన్ని మధు గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతను చంద్రబాబు సమర్థించటం ఎవరి ప్రయోజనాలకంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ కార్మికులను సోమరిపోతులు, అవినీతిపరులంటూ అవమానించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు నడుం కట్టాల్సిన ముఖ్యమంత్రి.. పక్కనే మరో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నించడమే కాకుండా తన మంత్రులను ఎంపీలను ప్రారంభం కానీ పరిశ్రమకు గనులు కేటాయించమని వినతి పత్రాలు ఇస్తూ కేంద్ర మంత్రుల వెంట తిరుగుతున్న వైనాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

    రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బీజేపీతో అంట కాగుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ప్రజలు తిప్పికొట్టకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని మధు అన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ వామపక్షాలు మాత్రమే ప్రత్యామ్నాయమని మిగిలిన బూర్జువా పార్టీలు బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని వారి తోకలుగా మారిపోయాయని ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు.

    తిరుపతి రైల్వే స్టేషన్ లో భక్తులకు రక్షణ కల్పించాలి
    తిరుపతి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయని ఉదయం పూట ఒక్కసారిగా రైళ్లు వస్తున్న సందర్భాల్లో వేలాదిమంది భక్తులు బయటికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు తొక్కిసలాట జరుగుతుందన్నారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా కాంట్రాక్టర్ వేడుక చూస్తున్నారన దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయం పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తాను లేఖలు రాస్తానని.. తక్షణం తొక్కిసలాట నివారణకు తగిన జాగ్రత్తలను రైల్వే యాజమాన్యాలు తీసుకోవాలని మధు సూచించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నేతలు కందారపు మురళి, వందవాసి నాగరాజు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం ఎస్ జయచంద్రలు పాల్గొన్నారు.

  • సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదు. 

    అరటి, ఉల్లి, మొక్కజొన్న, ధాన్యం, కొబ్బరి... ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు ప్రతిరోజూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రైతుల కన్నీరు కనిపించడం లేదా?. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని శైలజానాథ్‌ అన్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్‌సిబ్బంది మంటలార్పుతున్నారు. షాపులో ఉన్న సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు

    మంటల ధాటికి ఎలక్ట్రానిక్‌ వస్తువులు పేలిపోతున్నాయి. పేలుడు శబ్ధాలకు స్థానికులు పరుగులు పెడుతున్నారు. చుట్టుపక్కల నివాస ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 8 ఫైరింజన్లతో మంటలను ఫైర్‌ సిబ్బంది అదుపుచేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏ‍ర్పడింది.
     

     

  • సాక్షి హైదరాబాద్: ఇమ్మడి రవి అలియాస్ (ఐబొమ్మ రవి) కన్ఫెషన్ రిపోర్టులో (నేరాంగీకారం) కీలక విషయాలు వెలుగు చూశాయి. కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం రవిది మెుదటి నుండి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు వెల్లడించారు. స్నేహితుడి గుర్తింపుకార్డుతో  పలు మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. 

    రవి తన భార్యా, పిల్లలను సైతం చిత్రహింసలు పెట్టేవాడని.. అతని ప్రవర్తన నచ్చకే భార్య అతనికి విడాకులు ఇచ్చిందని అన్నారు. రవి భార్యను విచారిస్తే ఈ విషయాలు బయటపడ్డాయని తెలిపారు. 

    పోస్టర్ డిజైన్ చేసినందుకుగాను అతని స్నేహితుడు నిఖిల్‌కు ప్రతినెలా రూ. 50 వేలు ఇచ్చేవాడని తెలిపారు. ఐ బొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవన్నారు. ఇదిలా ఉంటే.. సినీ పైరసీ కేసులో అరెస్టైన రవికి నేటితో ఐదు రోజుల కస్టడీ పూర్తి కావడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం  నగర కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

  • సాక్షి, సిద్ధిపేట: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన జంటను రోడ్డు ప్రమాదం బలిగొంది.  ఘటనలో నవ వధువు మృతి చెందగా.. భర్త తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

    సిద్దిపేటకు చెందిన ప్రణతి(24), సాయికుమార్‌లకు ఈ మధ్యే వివాహం జరిగింది. లీవ్స్‌ ముగిసిపోవడంతో జాబ్‌ నిమిత్తం సోమవారం హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. అయితే.. మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారుకు చేరుకోగానే ఓ ట్రాక్టర్‌ వీళ్ల బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. 

    స్థానికులు అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రణతి దారిలోనే మృతి చెందింది. సాయికుమార్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్‌ అదుపు తప్పి బైక్‌ను ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కాదు.. స్థానికంగానూ తీవ్ర విషాదాన్ని నింపింది.

    ఇదీ చదవండి: పెళ్లి కోసం వేసిన టెంట్ కిందే అంతిమ సంస్కారాలు

  • సాక్షి, జనగాం: స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంతో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయబోనని సోమవారం అన్నారాయన. 

    ‘‘నేను రాజీనామా చేయడం లేదు. నా రాజీనామా, ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు. స్పీకర్‌ నిర్ణయం తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్‌. దేశవ్యాప్తంగా నాకు గుర్తింపు ఉంది. నేను ఫ్లైట్‌ దిగితే అభిమానులు ఎదురొస్తారు’’ అని అన్నారాయన. 

    ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన నోటీసుల గడువు ఆదివారం ముగిసింది. అయితే స్పీకర్‌ విధించిన గడువులోగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ సమాధానం ఇవ్వలేదు. అయితే నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు తనకు కొంత వ్యవధి కావాలని ఈ నెల 21న స్పీకర్‌ను కడియం శ్రీహరి వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

    అయితే ఆయన చేసిన విజ్ఞప్తిపై స్పీకర్‌ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా స్పీకర్‌ను ఫోన్‌ ద్వారా గడువు కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలు జరిగాయి. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్‌స్ట్రక్షన్స్‌తో సహా మొత్తం ఎనిమిది సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

    జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కాకర్ల శ్రీనివాస్, అనుబంధ సంస్థలపై PMLA, 2002 కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రీలాంచ్‌ స్కీమ్‌ పేరిట గృహ కొనుగోలుదారులను రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టై.. బెయిల్‌ మీద బయటకు వచ్చిన శ్రీనివాస్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే.. 

    ఈ స్కాంతో లింకుల నేపథ్యంలో ఎనిమిది రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో తాజాగా తనిఖీలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమ నగదు చలామణి.. మనీలాండరింగ్ అనుమానాల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  సోదాల సమయంలో అధికారులు కీలక పత్రాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ కంపెనీ రూ.300 కోట్లు అక్రమాలు చేసిందని, అంతేకాకుండా ప్రభుత్వానికి మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేని చోటకూడా అక్రమ మైనింగ్ చేపట్టారని, సబ్ కాంట్రాక్టులకు అనుమతి లేకున్నా జీవీఆర్ సంస్థకు సబ్ క్రాంట్రాక్లులచ్చారని కంపెనీపై ఫిర్యాదులున్నాయి. వాటితో పాటు అనుమతి తీసుకున్న చోట పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు చేపట్టి భారీగా కోట్లు కొల్లగొట్టారని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఈడీ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది.  కంపెనీకి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.

     

     

     

     

  • సాక్షి కొడంగల్, ఆడబిడ్డ పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీటవేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ సోమవారం తన సొంత నియోజకర్గం కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. విద్యతోనే పేదల ఇంట్లో వెలుగులు నిండుతాయన్నారు. అందుకే మీ బిడ్డలను ఉన్నత చదువులు చదివించడమే సీఎంగా తన ముందున్న టార్గెట్ అన్నారు. ప్రపంచంతో పోటీపడాలంటే ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెండూ కీలకమని సీఎం తెలిపారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికి సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రానన్నాయని రెండు, మూడు రోజుల్లో దానికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను ఎన్నుకోవద్దని, అభివృద్ధి చేసే వారికి అండగా నిలవాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు. కొడంగల్ లోని ప్రతి ఎకరాకు కృష్ణానది నీరు అందిస్తామని త్వరలోనే రూ.ఐదువేల కోట్లతో ఎడ్యుకేషనల్ క్యాంపస్ నిర్మించి కొడంగల్‌ను ఎడ్యుకేషనల్ హాబ్ గా మార్చుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

    Revanth Reddy: అదొక్కటే మన తలరాతను మార్చేది వేరే ఆప్షన్ లేదు..

     


     

  • సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కోకాపేట భూముల వేలంలో రికార్డు బద్ధలైంది. ఎకరానికి రూ.137.25 కోట్లు చొప్పున పోయింది. ఫ్లాట్‌ట్‌నెంబర్‌ 17, 18 స్థలాలకుగానూ ఈ ధర పలికింది. 

    కోకాపేట నియోపోలిస్‌లో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసిన సంగతి తెలిసిందే. కోకాపేట్‌ ప్లాట్లకు ఎకరానికి 99కోట్ల ఆఫ్‌సెట్‌ ధరతో ఇవాళ ఈ రెండు ప్లాట్లను విక్రయించింది. ప్లాట్‌ నెంబర్‌17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకరాలు ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు గానూ 1,355.33 కోట్లు ధర పలికింది. 

    ఇక నవంబర్‌ 24న, 28న, డిసెంబర్‌ 3న మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. గోల్డెన్‌ మైల్‌లోని సైట్‌-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్‌లో 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల్లోని రెండు సైట్లను వేలం వేయనుంది. గోల్డెన్‌ మైల్‌కు 70 కోట్లు, మూసాపేట్‌ సైట్‌ను 75 కోట్ల చొప్పున ఆఫ్‌సెట్‌ ధరను హెచ్ఎండీఏ ఇప్పటికే నిర్ణయించింది.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో సోమవారం  ఘోరం జరిగింది. ఆసుపత్రి బిల్డింగ్‌లో పనిచేస్తుండగా సెంట్రింగ్ కూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈఎస్‌ఐ(ESI) హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డులో రెన్నోవేషన్ పనులు చేస్తుండగా స్లాబ్ ఉచ్చులు మీద పడ్డట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  • హైదరాబాద్‌: #NothingIsFree ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) గురించి పరిచయం అవసరంలేదు. తాను  ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చేలా  మెలగడం ఆయన నైజం. పోలీస్‌ అధికారిగా నేరగాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. ఆర్టీసీ ఎండీగా, ఆర్టీసీలో  వినూత్న విధానాలను అవంలంబించి, తానేంటో నిరూపించు కున్నారు. ఇక బెట్టింగ్‌యాప్స్‌కు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ప్రచారం ఉద్యమంలా సాగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రచారం చేసే  వారి పాలిట సింహ స్వప్నమే అయ్యారు. తాజాగా  హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా సైబర్‌ నేరాలపై దృష్టిపెట్టరు. డేటా సేప్టీ గురించి తనదైన రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్‌ లో చేసిన వరుస పోస్ట్‌లు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.

    డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఒక ఆప్షన్ కాదు… మీ భద్రతకు తప్పనిసరి! మీ డేటా… మీ జీవితానికి సంబంధించిన అంశం. దాన్ని మీరు కాపాడుకోకపోతే మరెవ్వరూ కాపాడలేరు.

    చదవండి: ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ
     

     త‌స్క‌ర‌ణ‌కు గురైన డేటాను ఉప‌యోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు.. మీకు ఫేక్ లింకులు పంపుతారు, ప్రలోభపెట్టే కాల్స్ చేస్తారు. ఖాతాలు హ్యాక్ చేస్తారు. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. డ‌బ్బులు గుల్ల చేస్తారు. డిజిట‌ల్ అరెస్ట్‌లు లంటూ వ్య‌క్తిగ‌తంగా వేధింపుల‌కు దిగుతారు. ఒక్క క్లిక్‌తోనే మీ మొబైల్‌ను టార్గెట్ చేస్తారు.

    అనుమానాస్పదమైన సైట్లు, యాప్స్… ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. ‘Free movies’, ‘Free downloads’, ‘Free games’ — ఇవన్నీ ప్రమాద సంకేతాలు. ఉచితం అనిపించే ఈ కంటెంట్‌.. మీకు తాత్కాలిక ఎంజాయ్‌ ఇచ్చినా… భవిష్యత్తులో జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పొంచి ఉంది.

    మీ డేటా- మీ భద్రత. నమ్మదగిన వెబ్‌సైట్లనే వినియోగించండి. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దు. మీ ఖాతాల‌కు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. అనుమానాస్పద యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి. అంటూ వరుస ట్వీట్లు చేశారు.  డేటా చోరికి గురైతే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే జాతీయ హెల్ప్ లైన్ నంబ‌ర్ 1930 కాల్ చేయండి. లేదా జాతీయ సైబ‌ర్ క్రైం పోర్ట‌ల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని  సజ్జనార్‌ ప్రజల్నికోరారు.
     

  • సాక్షి హైదరాబాద్‌: సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు. అయితే కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. 

    ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని.. అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్‌ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్‌ లింక్‌ అయ్యేలా ఏర్పాటు చేశాడని గుర్తించారు.

    రవికి బెయిల్‌ రావొచ్చు.. 
    రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వొకేట్ సీవీ శ్రీనాథ్. రవి బెయిల్‌ వ్యవహారంపై ఆయన సాక్షితో మాట్లాడారు. ‘‘మా క్లయింట్‌ రవి  ఐదు రోజుల కస్టడీ ముగిసింది. కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడా జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. 

    బెయిల్ పిటిషన్ రిమాండ్ అయిన రెండో రోజే వేశాం. కస్టడీ విధించాక వేశాం కాబట్టే ఆలస్యమైంది. రేపు పీపీ కౌంటర్ వేశాక బెయిల్ మూమెంట్ ఉంటుంది. అతనిపై రెండు సెక్షన్ లు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మిగతా కేసులపై కోర్టులో కొట్లాడుతాం. బెయిల్ వస్తుందని భావిస్తున్నాం. అన్నీ ట్రయల్స్‌లో చూసుకుంటాం అని రవి లాయర్‌ శ్రీనాథ్‌ తెలిపారు.

    రవి ఐదు రోజుల కస్టడీలో వెబ్ సైట్, డొమైన్ నెట్వర్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై ఆరాతీసినట్లు సమాచారం. రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తేల్చుకున్నారు. రూ.20 కోట్ల బదిలీ వివరాలను బ్యాంకు అధికారుల ద్వారా తెప్పించుకున్న పోలీసులు ఆ నగదు విషయంపై ఆరా తీశారు.

    1xbet అనే బెట్టింగ్ యాప్‌తో పాటు ఇతర యాప్‌ల ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను క్రిఫ్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. కాగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్ని తానొక్కడినే చేశాను తన వెనుక ఎవరూ లేరు అని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం.  

    రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలోనూ ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ  వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశమూ లేకపోలేదు. కాగా రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్‌మీట్‌ ద్వారా మిగతా వివరాలను వివరించే అవకాశం ఉంది.

    నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ రవి
  • సూర్యాపేట జిల్లా: తొమ్మిది పదుల వయస్సు దాటినా నవ యువకుడిలా జీవనం సాగిస్తున్నాడు ఆ వృద్ధుడు. అరవై ఏళ్లు దాటితేనే కాళ్ల నొప్పులతో బాధపడుతూ అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి కొందరిది. అలాంటిది 91 ఏళ్ల వయస్సులోనూ స్వతహాగా తన పనులు తాను చేసుకుంటూనే సైకిల్‌ తొక్కుతూ వీధివీధి తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు తేజావత్‌ గనియా. చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన తేజావత్‌ గనియాకు ఏడుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు). తనకున్న రెండెకరాల భూమిలో వరితోపాటు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈయన పిల్లలందరూ వివిధ ఉద్యోగాల్లో సిర్థరపడగా ఇందులో ఒకరైన బావసింగ్‌ ఇటీవలే హెచ్‌ఎంగా రిటైర్‌ అయ్యారు.

    రోజూ 20 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ..
    90 ఏళ్ల వయస్సు దాటినా, పిల్లలు ప్రయోజకులైనా గనియా మాత్రం నేటికీ కూరగాయలు అమ్మే వృత్తిని మాత్రం వదులుకోలేదు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల కల్లా లేవడం సుమారుగా 20 కిలోమీటర్ల మేర సైకిల్‌పై తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. తన పొలంలో కూరగాయలు పండని సమయంలో కోదాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూరగాయలను కొనితెచ్చి గ్రామాల్లో తిరుగుతూ అమ్మడం ఆయన దినచర్య. నేటికీ బీపీ, ఘగర్‌ లాంటివి లేకుండా వృద్ధాప్యంలోనూ ఒకరిపై ఆధారపడకుండా తన భార్యతో కలిసి జీవిస్తూ చేతనైనా పనిచేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు గనియా. ఇటీవల అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో గనియాను జిల్లా కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు.

    పనిచేయడం వల్లే ఆరోగ్యంగా ఉన్నా
    నిత్యం నా పనులు నేను చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పటి వరకు బీపీ, షుగర్‌ లాంటివి లేవు. రోజూ సైకిల్‌ తొక్కుతున్నా ఎలాంటి కాళ్ల నొప్పులు లేవు. ఎన్నో ఏళ్ల నుంచి సైకిల్‌పైనే కూరగాయలు అమ్మతున్నాను. ఇప్పటికీ ఆ వృత్తిని వదులుకోలేకపోతున్నా.

    – తేజావత్‌ గనియా, సీత్లాతండా, చిలుకూరు మండలం

Movies

  • టాలీవుడ్ నటుడు, కమెడియన్ జోష్ రవి కుటుంబాన్ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి పరామర్శించారు. స్వయంగా రవి ఇంటికి వెళ్లి అతన్ని హత్తుకుని ధైర్యం చెప్పారు. ‍అనంతరం జోష్ రవి తల్లిని ఓదార్చారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని.. ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

    కాగా.. ఇటీవలే జోష్ రవి తండ్రి మరణించారు. గుండె పోటుకు గురైన ఆయన కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అయితే సంఘటన కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటకొచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. 

     

     

    • శారీలో హీరోయిన్ ప్రియాంక మోహన్ బ్యూటీఫుల్ లుక్..

    • రివాల్వర్ రీటా ప్రమోషన్స్లో కీర్తీ సురేశ్ ఫుల్ బిజీ..

    • బ్యూటీఫుల్ అవుట్ఫిట్లో నటి నిక్కీ గల్రానీ హోయలు..

    • బుల్లితెర భామజ్యోతిపూర్వాజ్ స్టన్నింగ్పోజులు..

    • గోవాలో చిల్ అవుతోన్న హీరోయిన్ మంజరి ఫడ్నవీస్..

     

     

     

     

     

     

     

  • కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఏడాది విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అభిమానులను అలరించాడు. వీటిలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్హిట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో అజిత్ మరోసారి ఆయనతో జతకట్టనున్నారు. విషయాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ వెల్లడించారు.

    చెన్నైలో ఈవెంట్కు హాజరైన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ గుడ్ న్యూస్పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. మేము ఇప్పుడు లొకేషన్స్ ఖరారు చేస్తున్నామని.. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశముంది.

    కాగా.. అజిత్ కుమార్ ఏడాది సినిమాలతో పాటు కార్ రేసింగ్లోనూ దూసుకెళ్తున్నారు. ఇటీవలే ఇటలీకి చెందిన మోటార్‌స్పోర్ట్స్ గ్రూప్ నుంచి 'జెంటిల్‌మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రశంసలు అందుకుంది.

  • రోజుల్లో కంటెంట్కింగ్ అనే మాట అక్షరాల నిజమవుతోంది. భారీ బడ్జెట్సినిమాలు, పెద్దపెద్ద స్టార్స్ఉంటేనే మార్కెట్ఉంటుందనే భ్రమలోనుంచి బయటికి రావాల్సిందే. చిన్న సినిమా అయినా సరే.. జనాలకు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురిపించడం ఖాయమే. అదే నిజం చేస్తోంది ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా. అదేనండి రూరల్బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి.

    ఈనెల 21 థియేటర్లలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్కు ముందే తన కథపై నమ్మకంతో డైరెక్టర్ ఛాలెంజ్చేశారు. అందుకు తగ్గట్టుగానే మూవీ బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. మొదటి రోజే మూవీకి దాదాపు కోటిన్నర కలెక్షన్స్వచ్చాయి. తర్వాత వీకెండ్ కలిసి రావడంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఒక్క నైజాంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మూవీ కేవలం మౌత్టాక్తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా.. మూవీలో తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతు సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.

    మూవీ కథేంటంటే..

    'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.

     

  • సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం లాంటిది. ఎంత పెద్ద హీరోహీరోయిన్ అయినా సరే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. సినిమాలు చేయడంతో పాటు ఎవరితో పరిచయం పెంచుకుంటున్నామో కూడా అప్పుడప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అంతే సంగతులు. ఈ హీరోయిన్ కూడా అలానే ఓ క్రేజీ హీరోయిన్. కానీ డాన్‌ని ప్రేమించి జైలుపాలైంది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

    పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మోనికా బేడీ. ప్రస్తుత జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో తెలుగు, హిందీ సినిమాలు చూసిన వాళ్లకు ఈమె సుపరిచితమే. పంజాబ్‌లోని చబ్బేవాల్ గ్రామానికి చెందిన ఈమె.. 1994లో హిందీలో తొలి మూవీ చేసింది. తర్వాతి ఏడాది శ్రీకాంత్ హీరోగా నటించిన 'తాజ్ మహల్' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత శివయ్య, సోగ్గాడి పెళ్లాం, సర్కస్ సత్తిపండు, చూడాలని ఉంది తదితర చిత్రాల్లో నటించింది. హిందీలో అయితే సల్మాన్, షారుఖ్ లాంటి హీరోలతో చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక్కడివరకు బాగానే ఉంది.

    (ఇదీ చదవండి: దుబాయిలో అర్హ బర్త్ డే సెలబ్రేషన్.. ఫొటోలు వైరల్

    హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని స్వయంగా మోనికానే వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దుబాయిలో ఈవెంట్‌ కోసం నాకు ఫోన్‌ చేశారు. చేసింది అబు సలేం. ఈవెంట్‌ కోసం దుబాయి వెళ్లినప్పుడు మొదటి సారిగా ఆయనని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్‌ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు మాట్లాడుకున్నాం. అబు మాటలు, కేరింగ్‌ నచ్చి ప్రేమలో పడిపోయాను. కానీ డాన్‌ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడ్డానని మెనికా చెప్పింది.

    డాన్‌తో ప్రేమలో పడిన తర్వాత సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. 2022 సెప్టెంబరులో నకిలీ పత్రాలతో దేశంలోకి వచ్చినందుకుగానూ పోర్చుగల్‌‌లో మోనికాతో పాటు అబూ సలేంని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించింది. అలా డాన్‌తో ప్రేమలో పడటం అనే ఒ‍క్క తప్పటగుడు ఈమె కెరీర్ ఇబ్బందుల్లో పడటానికి కారణమైంది. తర్వాత మళ్లీ నటిగా పలు సినిమాలు చేసింది. 2017లో చివరగా ఓ పంజాబీ చిత్రంలో నటించింది. బిగ్‌బాస్ హిందీ 2వ సీజన్‌లోనూ పాల్గొంది గానీ ఓకే ఓకే అనిపించింది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో అడపాదడపా కనిపిస్తూనే ఉంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

  • బాలీవుడ్ ఇండస్ట్రీలో శకం ముగిసింది. దిగ్గజ నటుడు, 300లకి పైగా చిత్రాల్లో నటించిన తన పేరు చిరస్థాయిగా లిఖించుకున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. చివరిశ్వాస వరకు సినిమాల్లో నటించిన ఆయన.. అనారోగ్యంతో కన్నుమూశారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ లోకానికి తీవ్ర విషాదం మిగిల్చింది. షోలే మూవీతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ధర్మేంద్ర తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు.

    నేపథ్యంలో ధర్మేంద్ర తొలి సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఆయన నటించిన మొదటి చిత్రమేది? అప్పట్లో ఎంత పారితోషికం అందుకున్నారని నెటిజన్స్తో పాటు అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై ఆసక్తకరి విషయం బయటకొచ్చింది. ఆయన 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అర్జున్ హింగోరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో బల్రాజ్ సాహ్ని, కుంకుమ్ సినీతారలు కీలక పాత్రల్లో నటించారు. తర్వాత ఆయీ మిలన్ కీ బేలా, ఆయే దిన్ బహార్ కే లాంటి చిత్రాల్లో కనిపించారు. ఫూల్ ఔర్ పత్తర్ అనే మూవీ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. షోలే మూవీతో స్టార్డమ్ను సొంతం చేసుకున్నారు.

    అయితే ఆయన తన తొలి సినిమాకు తీసుకున్న వేతనం(పారితోషికం) కేవలం జీతం రూ.51 లేనని ఇంటర్వ్యూలో వెల్లడించారు. సల్మాన్ ఖాన్ గేమ్ షో దస్ కా దమ్‌కు హాజరైనప్పుడు విషయాన్ని పంచుకున్నారు. తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్‌తో ఈ షోలో కనిపించారు.  గేమ్ షోలో రూ.లక్ష గెలుచుకున్న తర్వాత.. సల్మాన్ ఖాన్ ఆయన మొదటి రెమ్యునరేషన్గురించి ప్రశ్న అడిగాడు. నాకు కెరీర్మొదట్లో రూ.3500 నుంచి రూ.7 వేల వరకు వచ్చేదని అన్నారు. కానీ నా ఫస్ట్ సినిమాకు రూ.5 వేల పారితోషికం ఇస్తారని అనుకున్నానని తెలిపారు. తీరా సంతకం చేసేటప్పుడు చూస్తే కేవలం రూ.51 మాత్రమే ఉందని ధర్మేంద్ర వెల్లడించారు. డబ్బులతో ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి మద్యం కొనుగోలు చేశానన్నారు. పోలీసులు పట్టుకుంటే నా కెరీర్ ముగిసిపోతుందని.. మందు తాగేటప్పుడు నా వేలిముద్రలు గ్లాస్పై పడకుండా రుమాలు పట్టుకుని తాగానని ధర్మేంద్ర పంచుకున్నారు.

    కాగా.. ధర్మేంద్ర తన కెరీర్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సీతా ఔర్ గీతా, షోలే, యాదోం కి బారాత్ వంటి చిత్రాల్లో ఆయన నటనను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కొద్ది సమయంలోనే అత్యంత ధనిక నటులలో ఒకరిగా మారిపోయారు. 1970ల వరకు తన స్టార్‌డమ్తో పాటు యాక్షన్హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనతో హీ-మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఐకానిక్ బిరుదును సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరీర్లో 300 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు.

  • పారా గ్లైడింగ్ చేసిన 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ

    రివాల్వర్ రీటా ప్రమోషన్లలో బిజీగా కీర్తి సురేశ్

    జిగేలు అనిపించేలా దిశా పటానీ గ్లామర్ పోజులు

    పొద్దుపొద్దునే ట్రెక్కింగ్ చేసిన యాంకర్ రష్మీ

    దుబాయిలో బన్నీ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్

    కుటుంబ సభ్యులతో చిల్ అవుతున్న రాశీఖన్నా

  • బాలీవుడ్ నట దిగ్గజం ధర్మేంద్ర మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. కష్ట సమయంలో నా స్నేహితులు సన్నీ డియోల్, బాబీ డియోల్ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుందని మెగాస్టార్ తెలిపారు.

    చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ధర్మజీ కేవలం ఒక దిగ్గజ నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన మనిషి కూడా. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ వినయం, ఆప్యాయతను నేర్చుకున్నా. ఆయన మాటలు నా హృదయాన్ని లోతుగా తాకాయి. ఆయనతో నేను పంచుకున్న మధురమైన జ్ఞాపకాలు, వ్యక్తిగత క్షణాలను జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటా. మృతికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. ఆయన వారసత్వం లక్షలాది మంది హృదయాలలో సజీవంగా ఉంటుంది. ఓం శాంతి' అంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.

    జూనియర్ ఎన్టీఆర్ సంతాపం

    ధర్మేంద్ర మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ధర్మేంద్ర జీ మరణవార్త విని చాలా బాధపడ్డా.. ఆయన గొప్ప శకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము.. భారతీయ సినిమాకు తీసుకొచ్చిన గొప్పతనం ఎప్పటికీ మనతో ఉంటుందని ట్వీట్ చేశారు. సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నానంటూ పోస్ట్ చేశారు.

     

    ధర్మేంద్ర మరణంతో రామ్ చరణ్ మూవీ పెద్ది టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. రోజు ప్రకటించాల్సిన అనౌన్స్మెంట్ను వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వాల్సిన అప్డేట్ను పోస్ట్ పోన్చేస్తున్నట్లు పెద్ది సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్వీట్ చేసింది. ధర్మేంద్ర మరణం పట్ల సంతాపం తెలిపారు మేకర్స్.

     

     

     

  • ఈ మధ్యే అల్లు అర్జున్ ఫ్యామిలీ దుబాయి ట్రిప్ వేశారు. తన కూతురు అర్హ పుట్టినరోజు వేడుకల్ని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు ఫొటోలేం బయటకు రాలేదు. ఇప్పుడు బన్నీ భార్య స్నేహ తన సోషల్ మీడియాలో ఆయా ఫొటోలని షేర్ చేశారు. తన బేబీ గర్ల్‌కి తొమ్మిదేళ్లు నిండాయని చెబుతూ దుబాయి ట్రిప్ ఫొటోలని పోస్ట్ చేసింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

    అయితే బన్నీ ఫ్యామిలీ దుబాయిలోనే ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి కారణముంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. పలు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు దుబాయిలో కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబంతో పాటు బన్నీ.. దుబాయి వెళ్లాడు. స్నేహతో పాటు పిల్లలు అయాన్, అర్హ తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయాడు.

    అల్లు అర్జున్-అట్లీ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్. సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన 'డ్యూడ్'కి సంగీతమందించింది ఇతడే. ఇకపోతే ఈ మూవీ 2027లో రిలీజయ్యే అవకాశముందని అంటున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా లెవల్లో అలరించిన బన్నీ.. ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్‌గా పెట్టుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజమేంటనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.

    (ఇదీ చదవండి: అమెజాన్ ఓటీటీపై ఘోరంగా ట్రోలింగ్.. ఏంటి విషయం?)

  • ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇవాళ కన్నుమూశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దశబ్దాలుగా చెరగని ముద్రవేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మృతితో బాలీవుడ్తో పాటు సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల బాలీవుడ్తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

    1935 డిసెంబర్‌ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌. ఆయన కేవలం 19 ఏళ్ల వయసులోనే ప్రకాశ్‌ కౌర్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరే అనే మూవీతో తన సినీ ప్రస్థాన ప్రారంభమైంది. తర్వాత 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. అంతేకాకుండా రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు.

    అయితే ఇవాళ ధర్మేంద్ర మరణించడంతో ఆయన ఆస్తులపై చర్చ మొదలైంది. తన కెరీర్లో ఎన్ని ఆస్తులు కూడబెట్టరనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఓవరాల్గా చూస్తే ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.335 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం హీరోగానే కాదు.. తన కెరీర్లో హోటల్, అతిథ్యరంగంలో బిజినెస్చేశారు. 2015లో న్యూఢిల్లీలో తన మొదటి రెస్టారెంట్ గరం ధరం ధాబాను ప్రారంభించారు. ఆ తర్వాత 2022లో, కర్నాల్ హైవేలో హీ మ్యాన్‌ అనే రెస్టారెంట్ ప్రారంభించారు.

    లోనావాలాలో 100 ఎకరాల ఫామ్‌హౌస్

    పుణె సమీపంలోని లోనావాలాలోని అతని 100 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆయన తన కుటుంబంతో ముంబయి నుంచి ఈ ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. ఫామ్హౌస్లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ధర్మేంద్ర రూ. 17 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఆయన పేరిట ఉన్నాయి. రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర ప్లాట్స్ఉన్నాయి. ఫామ్‌హౌస్ సమీపంలోని 12 ఎకరాల స్థలంలో ఓ రిసార్ట్‌ను అభివృద్ధి చేశారు.

    లగ్జరీ కార్లు..

    లగ్జరీ కార్లు అంటే ధర్మేంద్రకు చాలా ఇష్టం. ఆయన మొదట వింటేజ్ ఫియట్‌అనే కారును కొన్నారు. తర్వాత చాలా ఏళ్లకు రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 85.74 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ (రూ. 98.11 లక్షలు)ను కొనుగోలు చేశాడు. అంతేకాకుండా 1983లో ధర్మేంద్ర విజేత ఫిల్మ్స్‌ అనే నిర్మాణ సంస్థ స్థాపించారు. తన బ్యానర్లోనే కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1983లో బేతాబ్‌తో సన్నీ, 1995లో బర్సాత్‌తో బాబీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తరువాత తన మనవడు కరణ్ డియోల్పాల్ పాల్ దిల్ కే పాస్‌ అనే మూవీతో 2019లో అరంగేట్రం చేశాడు. అలా తనతో పాటు భారతీయ సినిమాపై కుటుంబ వారసత్వం శాశ్వతంగా ఉండేలా ప్రోత్సహించారు ధర్మేంద్ర.

  • ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'పైరసీ' అనే భూతంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఎప్పటినుంచో దీని గురించి అందరికీ తెలుసు. కానీ 'ఐ బొమ్మ' సైట్ నిర్వహకుడు రవి అరెస్ట్ కావడంతో మరోసారి చర్చకు కారణమైంది. సామాన్యులు చాలామంది రవికే తమ సపోర్ట్ అని అంటున్నారు. దానికి కారణాలు బోలెడు. నిర్మాతలు ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచేస్తున్నారని, దానికి తోడు థియేటర్లలోనూ పార్కింగ్, తినుబండరాల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు మరో సమస్య కూడా చేరినట్లు కనిపిస్తుంది.

    గత శుక్రవారం 'ద ఫ్యామిలీ మ్యాన్' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే 50 నిమిషాలుండే ప్రతి ఎపిసోడ్‌లోనూ నాలుగైదు యాడ్స్ వస్తున్నాయని, దీంతో సిరీస్ చూడాలంటే చిరాకు వస్తుందని చాలామంది యూజర్స్.. సోషల్ మీడియాలో తన అసహనం బయటపెడుతున్నారు. యాడ్స్ భరిస్తూ కొందరు చూస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం నిర్ధాక్ష‍ిణ్యంగా ఈ కారణం వల్లే పైరసీ సైట్‌లో సిరీస్ చూశానని, అందులో ఒక్క యాడ్ కూడా రాలేదని పోస్టులు పెడుతున్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

    కొన్నేళ్ల క్రితం జనాలు యూట్యూబ్‌లో వీడియోలు, సినిమాలు చూసేవారు. విపరీతమైన యాడ్స్ రావడంతో.. వాళ్లలో చాలామంది ఓటీటీలకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోనూ యాడ్స్ వస్తున్నాయి. దీంతో డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాసరే ఈ యాడ్స్ గోలేంట్రా బాబు అని చిరాకు పడుతున్నారు. మరీ 40-50 నిమిషాల ఎపిసోడ్‌కి 4-5 యాడ్స్ రావడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇది ఇలానే జరిగితే ఓటీటీల్లోనూ జనాలు సినిమాలు చూడటం తగ్గించేయడం గ్యారంటీ. అప్పుడు కూడా నష్టపోయేది నిర్మాతలే.

    ఓటీటీలు వచ్చిన తర్వాత కొంతమేర పైరసీ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు డబ్బుల కోసం వాళ్లు కూడా యాడ్స్ వేస్తున్నారు. ఇలాంటి అత్యాశ.. మరిన్ని పైరసీ సైట్ల పెంచి పోషించేందుకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువ. అమెజాన్ ప్రైమ్ వీడియోనే తీసుకుంటే.. కొన్ని సినిమాల్ని నేరుగా రిలీజ్ చేస్తారు. కొన్నింటిని మాత్రం రెంటల్ బేసిస్(అద్దె విధానం) అని చెప్పి మళ్లీ కొంత డబ్బు చెల్లిస్తేనే చూడటం కుదురుతుందని అంటారు. చాలా ఛానెల్స్ చూపిస్తారు. మళ్లీ వాటిల్లో సినిమాలు చూడాలి అంటే సెపరేట్‌గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటారు. ఇవన్నీ గత కొన్నిరోజుల నుంచి ఉన్నప్పటికీ.. తాజాగా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ వల్ల మరోసారి వెలుగులోకి వచ్చాయి. 

    (ఇదీ చదవండి: మళ్లీ వచ్చేశాడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 3' రివ్యూ)

  • ఇప్పుడున్న ఎంతోమంది స్టార్‌ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్‌ శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.

    సినిమాల్లోకి వస్తావా?
    టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్‌.సినిశ్‌ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్‌? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్‌' మూవీలో చిన్న కామెడీ రోల్‌ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.

    కామెడీ పాత్రలే సెట్టు!
    ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్‌? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్‌.. అలాంటి పాత్రలు ట్రై చేయ్‌ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్‌ మర్చిపోలేదు. 

    నేను మర్చిపోయా.. కానీ!
    నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్‌ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

    చదవండి: నా ముఖం చూస్తేనే లవ్‌ ఫెయిల్యూర్‌: ధనుష్‌

  • కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్‌లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్‌ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత 'తేరే ఇష్క్‌ మే' సినిమాతో బాలీవుడ్‌లో సందడి చేయనున్నాడు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 28న విడుదల కానుంది.

    లవ్‌ ఫెయిల్యూర్‌
    సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్‌ ఫెయిల్యూర్‌ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్‌ ఫెయిల్యూర్‌ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్‌ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. 

    చాలా కష్టం
    ఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్‌ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్‌ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్‌ మే సినిమాలో శంకర్‌ పాత్ర కూడా చాలెంజెస్‌తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్‌ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్‌ ఎల్‌. రాయే తెరకెక్కించాడు.

    చదవండి: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు రాజాసాబ్‌ డైరెక్టర్‌ క్షమాపణలు

  • బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. హీ మ్యాన్ ధర్మేంద్ర (89) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఇంట్లోనే కన్నుమూశారు. ఈయన మృతి విషయాన్ని ఇంకా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు కానీ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే సినీ రాజకీయ ప్రముఖులు ఈయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ధర్మేంద్ర ఎవరు? ఆయన జీవితంలోని విశేషాలు ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం.

    1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1960ల నుండి 1980ల వరకు ఈయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్‌గా నిలిచాయి. 300కు పైగా మూవీస్ చేసిన ఈయన ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. దీంతో అభిమానులు కూడా "యాక్షన్ కింగ్", "హీ-మ్యాన్" అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం ఆయన కెరీర్‌లో పెద్ద మలుపు. ఆ తర్వాత సీత ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్‌ వీర్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్‌ హౌస్‌, లగ్జరీ కార్లు.. ధర్మేంద్ర కళ్లు చెదిరే సంపద)

    బాలీవుడ్‌లలో కండలు తిరిగిన సౌష్టవంతో కనిపించి ఆరోజుల్లోనే ధర్మేంద్ర ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆరోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఏకంగా అందరి ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలతారను ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘మేచో మేన్’గా పేరొందిన తొలినటుడిగా పేరుగాంచిన ధర్మేంద్ర.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ప్రస్తుత ట్రెండ్‌ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్‌ వర్షం కురిసింది. బాలీవుడ్‌ నుంచి సౌత్‌ ఇండియా వరకు సుమారు రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా రాణించారు.

    టాలెంట్‌తో తొలి ఛాన్స్‌
    లూధియానా  సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామంలోని  ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. దీంతో ఆయన అక్కడే  ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. చదువులు పెద్దగా చురుకుగా ఉండేవాడు కాదు.  ఏదో రకంగా తన మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అయితే, స్కూల్‌ రోజుల్లోనే స్టేజీలపై నాటకాలు వేయడం ఇష్టం. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరీర్‌ మలుపు తిప్పింది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పడంతో అటువైపు అడుగులు వేశారు. 

    (ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)

    ముంబై వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ, పట్టువదలకుండా అక్కడే ఉంటూ తన వేట సాగించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్జున్ హింగోరానీ కంటికి  ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయాడు. దీంతో తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు.  అలా తన మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’లో మెప్పించారు. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి  ధర్మేంద్ర నటించడం విశేషం. అయితే, అనుకున్నంత రేంజ్‌లో ఈ మూవీ మెప్పించలేదు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించాల్సి వచ్చింది. 1962లో  విడుదలైన  ‘అన్ పడ్’  చిత్రం సూపర్‌ హిట​ అయింది. కానీ, 1966లో వచ్చిన  ‘ఫూల్ ఔర్ పత్థర్’ చిత్రం ధర్మేంద్రను స్టార్‌ హీరోను చేసింది.

    హేమమాలినితో ప్రేమ.. రెండో పెళ్లి
    1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త్, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వారిద్దరి కాంబినేషన్‌లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, హేమ మనసు ఆయనతో కలిసి అడుగులు వేయాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్, అహనా డియోల్ . ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు జన్మించిన వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. వారిద్దరూ కూడా  హీరోలుగా మెప్పించారు. హేమామాలినితో పెళ్లి తర్వాత కూడా తన కుమారులని ఆయన దూరం పెట్టలేదు. నిర్మాతగా వారిద్దరిని హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు.

    ధర్మేంద్ర కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2012లో భారత  ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

    (ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)

  • డార్లింగ్‌ ప్రభాస్‌ (Prabhas) లేటెస్ట్‌ మూవీ రాజాసాబ్‌. ఈ హారర్‌ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ షురూ చేశారు. రాజా సాబ్‌ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.

    మారుతిపై ట్రోలింగ్‌
    సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్‌ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్‌ వార్‌ 2 రిలీజ్‌ సమయంలో తన రెండు కాలర్స్‌ పైకి ఎగరేసి చూపించారు.

    క్షమాపణలు చెప్పిన మారుతి
    ఇప్పుడు మారుతి.. ప్రభాస్‌ కటౌట్‌కి కాలర్‌ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్‌ ఫ్యాన్స్‌ అతడిని ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్‌ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్‌ చేశాడు.

    నా ఉద్దేశం అది కాదు
    ముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్‌ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు.

     

     

    చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్‌

  • బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస  (Actor Dharmendra Death) విడిచారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బందిపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ధర్మేంద్ర చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి వద్దే  వ్యైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. అయితే, పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. యాక్షన్‌ కింగ్‌గా, బాలీవుడ్‌ హీ మ్యాన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

    (ఇదీ చదవండి: ధర్మేంద్ర వద్దన్నా హేమమాలిని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?)

    1935 డిసెంబర్‌ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్‌, ఆహానా డియోల్‌ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది.  అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

    ధర్మేంద్ర చనిపోయినట్లు ప్రస్తుతం జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికకు ధర్మేంద్ర భార్య హేమమాలిని, కూతురు ఈషా డియోల్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వచ్చిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ధర్మేంద్ర మృతి విషయాన్ని  ధ్రువీకరించారు. ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టారు.

    (ఇదీ చదవండి: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర జీవితంలోని స్పెషల్ ఫొటోలు)

International

  • ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం(Hayli Gubbi ) దాదాపు 10,000 సంవత్సరాల తర్వాత విస్ఫోటనం చెందింది. నవంబర్‌ 23 ఉదయం డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో ఈ విస్ఫోటనం గుర్తించబడింది. భూమి క్రింద నిశ్శబ్దంగా ఉన్న ఈ షీల్డ్ వోల్కానో నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసి పడుతూ ఆకాశాన్ని కమ్మేసింది.

    టూలూస్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ (VAAC) నివేదిక ప్రకారం.. ఇది అత్యంత అరుదైన విస్పోటనం, ఎర్ర సముద్రం దాటి యెమెన్, ఒమాన్ వైపు వోలకనో కదులుతోంది. ఈ ప్రాంతం అత్యంత వేడి, చేరుకోవడం కష్టమైనది. అందువల్ల భూగర్భ పరిశోధకులు ఉపగ్రహ డేటా, వాతావరణ రీడింగ్స్ ఆధారంగా మాత్రమే పరిశీలిస్తున్నారు.

    హైలీ గుబ్బి అగ్నిపర్వతం హోలోసీన్ కాలంలో(ఐస్‌ ఏజ్‌ ముగిసిన తర్వాత.. 11,700 సంవత్సరాల కాలం) ఎప్పుడూ విస్ఫోటనం కాలేదని నిర్ధారించుకున్నారు. ఈ విస్ఫోటనం ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో(హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా) దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన అగ్నిపర్వత సంఘటనగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

    సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడంతో ఒమన్‌, యెమన్‌ ప్రాంత ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ఎయిర్‌ క్వాలిటీ వార్నింగ్‌ నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

    కొన్ని మార్గాల్లో విమానాలు మళ్లించబడ్డాయి.  ఉత్తర భారతదేశం వైపుగా దీని ప్రభావం ఉండే అవకాశం నెలకొంది. దీంతో.. భారత విమానయాన అధికారులకు అలర్ట్‌ జారీ అయ్యింది నవంబర్‌ 24న కన్నూర్‌ నుంచి అబుదాబీ వెళ్తున్న ఇండిగో విమానం (6E 1433) అహ్మదాబాద్‌కు మళ్లించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

  • న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా బంపరాఫర్‌ ప్రకటించింది. రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి ప్రధాన రష్యన్ చమురు సంస్థలపై అమెరికా గత వారం ఆంక్షలు విధించడంతో, రష్యా తన ముడి చమురును రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది.

    భారత రిఫైనర్లకు యురల్స్ ధర డెలివరీ ప్రాతిపదికన డేటెడ్ బ్రెంట్‌తో పోలిస్తే బ్యారెల్‌పై ఏడుడాలర్ల వరకు తగ్గించింది. ఈ ఆఫర్ డిసెంబర్‌లో లోడ్ అయ్యే, జనవరిలో భారత్‌కు చేరే కార్గోలపై వర్తించనుంది.అమెరికా ఆంక్షలకు ముందు యురల్స్ బ్యారెల్‌కు మూడు డాలర్ల వరకు డిస్కౌంట్‌ ఇచ్చింది. 

    రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత భారత రిఫైనర్లు రష్యన్ చమురు ఆర్డర్లు తగ్గించాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత భారత్ చౌకైన చమురును విస్తృతంగా దిగుమతి చేసుకుంది. కానీ ఆంక్షల కారణంగా దిగుమతి నిలిపివేసింది. 

     రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌తో పాటు గాజ్‌ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్‌నెఫ్టెగాస్‌పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత రిఫైనర్లు మధ్యప్రాచ్యం సహా ఇతర ప్రాంతాల నుండి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు. రష్యా చమురు ధరలు తగ్గడం భారత్‌కు తాత్కాలిక లాభం కలిగించవచ్చు. కానీ ఆంక్షల కారణంగా సరఫరా స్థిరత్వం అనిశ్చితంగా మారింది. రిఫైనర్లు తక్కువ ధరల ఆకర్షణతో రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నా, దీర్ఘకాలంలో అమెరికా ఆంక్షలు వాణిజ్యాన్ని మరింత క్లిష్టం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Sports

  • టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్‌ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.

    గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్‌ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.

    ఆరు వికెట్లతో చెలరేగి..
    ముఖ్యంగా పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్‌ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.

    ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్‌ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.

    పటిష్ట స్థితిలోనే..
    సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్‌ ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ 13, ఐడెన్‌ మార్క్రమ్‌ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.

    కాగా అప్పటికే బౌలింగ్‌, బ్యాటింగ్‌ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్‌ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్‌ సిరాజ్‌ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్‌ రాహుల్‌ అతడిని వారించిన తీరు హైలైట్‌గా నిలిచింది.

    ఫ్రస్టేషన్లో సిరాజ్‌ మియా.. వైల్డ్‌ త్రో
    ప్రొటిస్‌ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాటి ఆఖరి ఓవర్‌ (8)ను చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని రికెల్టన్‌ లాంగాఫ్‌ దిశగా షాట్‌ బాదగా.. సిరాజ్‌ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్‌ మియా.. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వైపు వైల్డ్‌గా బాల్‌ త్రో చేశాడు.

    పంత్‌ ఆ బంతిని మిస్‌ కాగా.. స్లిప్స్‌లో అతడి వెనకే ఉన్న కేఎల్‌ రాహుల్‌ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్‌ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్‌’ అన్నట్లు రాహుల్‌ సైగ చేశాడు. 

    ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.కాగా ప్రొటిస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

    చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్‌పై మండిపడ్డ కుంబ్లే

  • ప్రపంచకప్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత మహిళా కబడ్డీ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.

    క్రమశిక్షణ, అంకిత భావానికి నిదర్శనం
    వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ గెలవడం మన అమ్మాయిల క్రమశిక్షణ, ఆట పట్ల వారికి ఉన్న నిబద్ధత, సమిష్టితత్వానికి నిదర్శనమని వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు. క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటూ భారత మహిళా కబడ్డీ జట్టును అభినందించారు.

    వరుసగా రెండోసారి
    కాగా బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా మహిళల కబడ్డీ ప్రపంచకప్‌-2025 ఫైనల్లో భారత జట్టు.. చైనీస్‌ తైపీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పన్నెండు జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్‌.. గ్రూప్‌ దశ నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది. భారత్‌కు వరుసగా ఇది రెండో టైటిల్‌ కావడం విశేషం.

     

  • టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరును భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే (Anil Kumble) విమర్శించాడు. సౌతాఫ్రికాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు వికెట్‌ కీపర్లకు చోటిచ్చిన సెలక్టర్లు.. అర్హుడైన మరో ఆటగాడిని మాత్రం ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. టెస్టుల్లో ఆడుతున్నాడనే కారణంతో ధ్రువ్‌ జురెల్‌ను వన్డేలకు కూడా సెలక్ట్‌ చేయడం సరికాదని విమర్శించాడు. 

    కాగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సీనియర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. 

    ప్రస్తుతం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరుగుతుండగా... ఆ తర్వాత వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.

    వాళ్లు దూరం.. వీరికి విశ్రాంతి
    ఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్‌ 3న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరుగుతాయి. సఫారీలతో తొలి టెస్టు సందర్భంగా గిల్‌ గాయపడగా... శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్‌ పాండ్యా అంతకుముందే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో గతంలో 12 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించిన రాహుల్‌కు మరోసారి అవకాశం దక్కింది.

    సీనియర్‌ పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌తో పాటు స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు.

    సంజూకు దక్కని చోటు
    అయితే, ఈ జట్టులో సంజూ శాంసన్‌ పేరు మాత్రం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరఫున వన్డే ఆడిన సంజూ.. సెంచరీ చేశాడు. అది కూడా సౌతాఫ్రికా గడ్డపై శతక్కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కనే లేదు. తాజాగా స్వదేశంలో ప్రొటిస్‌ జట్టుతో సిరీస్‌లో ఆడిస్తారని భావించగా.. మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే స్పందిస్తూ సంజూకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ జట్టులో ఒక పేరు కచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్‌. దాదాపు రెండేళ్ల క్రితం వన్డే ఆడిన అతడు శతకంతో చెలరేగాడు.

    అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?
    కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు సెలక్ట్‌ చేస్తారని భావించా. ఆడిన చివరి మ్యాచ్‌లో శతకం బాదిన ఆటగాడు జట్టులో చోటుకైనా అర్హుడు’’ అని అనిల్‌ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 

    కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో పాటు రిషభ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌ ఎంపికయ్యారు. సీనియర్‌ అయిన సంజూను కాదని.. వన్డేలో టీమిండియాకు ఆడిన అనుభవం లేని జురెల్‌కు సెలక్టర్లు చోటు ఇవ్వడం గమనార్హం.  కాగా జురెల్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 457, 12 పరుగులు చేశాడు.

    సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు
    కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, రిషభ్‌ పంత్, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌. 

    చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

  • మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ గెలుపు జెండా ఎగురవేసింది. చైనీస్‌ తైపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది.

    వరుసగా రెండోసారి
    బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్‌ పోరులో భారత్‌ తొలి అర్ధ భాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజూ దేవి సూపర్‌ రెయిడ్‌లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా.. సారథి రీతూ నేగి ట్యాకిల్‌కు యత్నించి గాయపడింది. ఇక సెకండాఫ్‌లోనూ భారత్‌ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే, చైనీస్‌ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు.

    సమయం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్‌ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే, భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్‌ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా..డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ టైటిల్‌ సొంతం చేసుకుని సత్తా చాటింది.

    గుత్తాధిపత్యం మనదే
    కాగా భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇప్పటికి మూడు ప్రపంచకప్‌ టోర్నీలు జరుగగా.. మూడింట చాంపియన్‌గా నిలిచింది. మహిళా జట్టు సైతం అదే పరంపరను కొనసాగించడం విశేషం. ఇప్పటికి ఓవరాల్‌గా ఐదు ప్రపంచకప్‌ టోర్నీ (3 పురుష, 2 మహిళలు)లు జరుగగా ఐదింట భారత్‌దే విజయం. కబడ్డీలో మన గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు ఇరుజట్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    ఆఖరి వరకు అజేయంగా
    ఇదిలా ఉంటే.. గ్రూప్‌ దశలో భారత్‌ అన్ని మ్యాచ్‌లు గెలిచింది, గ్రూప్‌-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్‌-‘బి’లో చైనీస్‌ తైపీ సైతం ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచింది. 

    ఇక సెమీ ఫైనల్లో భారత్‌ ఇరాన్‌ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా.. మరో సెమీస్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ బంగ్లాదేశ్‌పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్‌ చేరగా భారత్‌- చైనీస్‌ తైపీపై గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి. 

    ఆసియా నుంచి భారత్‌, ఇరాన్‌, బంగ్లాదేశ్‌, చైనీస్‌ తైపీ, నేపాల్‌, థాయ్‌లాండ్‌ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్‌.. యూరోప్‌ నుంచి పోలాండ్‌, జర్మనీ.. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా పాల్గొన్నాయి.

    మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ టోర్నీ-2025లో పాల్గొన్న భారత జట్టు
    రీతూ నేగి (కెప్టెన్‌), పుష్ఫ రాణా (వైస్‌ కెప్టెన్‌), సొనాలి షింగాటే, పూజా నర్వాల్‌, భావనా ఠాకూర్‌, సాక్షి శర్మ, పూజా కజ్లా, చంపా ఠాకూర్‌, రీతూ షోరేన్‌, రీతూ మిథర్వాల్‌, సంజూ దేవి, ధనలక్ష్మి, అనూ కుమారి.

    చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

  • సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. తప్పుడు షాట్‌ సెలక్షన్‌తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్‌ పారేసుకుని పెవిలియన్‌ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.

    గువాహటి వేదికగా భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.

    దారుణంగా విఫలం
    సఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్‌ రాహుల్‌ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్‌ (15), ధ్రువ్‌ జురెల్‌ (0), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.

    పంత్‌ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్‌
    ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 48 పరుగులతో భారత టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. టెయిలెండర్‌ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్‌ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్‌ అనవసరపు షాట్‌కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.

    భారత ఇన్నింగ్స్‌ 40వ ఓవర్లో ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్‌.. యాన్సెన్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి.. వికెట్‌ కీపర్‌ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.

    అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్‌.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పంత్‌ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.

    ఇలా ఎవరైనా చేస్తారా?
    కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్‌ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్‌ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్‌ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.

    అతడిని త్వరగా అవుట్‌ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్‌ మ్యాచ్‌ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్‌ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పంత్‌ షాట్‌ సెలక్షన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌
     

  • భారత మహిళా జట్టు స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌-2025లో భారత్‌ విజేతగా నిలవడంలో బ్యాటర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.

    నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..
    తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌, రాధా యదవ్‌లతో కలిసి తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని రీల్‌ ద్వారా రివీల్‌ చేసింది.

    అనంతరం పలాష్‌.. భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్‌ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్‌ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్‌ మీడియాలో అకౌంట్లో షేర్‌ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్‌ నుంచి డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

    గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..
    కాగా స్మృతి- పలాష్‌ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.

    ఆ వీడియోలన్నీ డిలీట్‌ చేసిన మంధాన
    ఆ వెంటనే పలాష్‌ ముచ్చల్‌ కూడా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్‌ మూమెంట్స్‌ను స్మృతి మంధాన సోషల్‌ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్‌ మాత్రం డిశ్చార్జ్‌ అయ్యాడు.

    కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్‌మెంట్‌ రివీల్‌, ప్రపోజల్‌ వీడియోలు షేర్‌ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్‌ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్‌ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.

    చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

  • సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్‌ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్‌ ఈ ఘనత సాధించాడు.

    ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్‌ పర్యటనకు వచ్చింది. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.

    సెంచరీ.. జస్ట్‌ మిస్‌
    బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్‌ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్‌లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్‌ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

    ఆరు వికెట్లు పడగొట్టి
    ఇక ప్రొటిస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన యాన్సెన్‌.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్‌ జురెల్‌ (0), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్‌ చేశాడు ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.

    అదే విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ (19), జస్‌ప్రీత్‌ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు యాన్సెన్‌.

    ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్‌లో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్‌ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్‌ చేరాడు.

    పట్టు బిగించిన సౌతాఫ్రికా
    టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.

    ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్‌ కెప్టెన్‌ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. 

    ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ 13, ఐడెన్‌ మార్క్రమ్‌ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

    చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

  • సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్‌.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.

    అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    ముఖ్యంగా వాషింగ్టన్‌ సుందర్‌తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం గంభీర్‌ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.

    కాగా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను కోల్‌కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్‌లో వాషీతో ఒకే ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్‌ చేశారు.

    అసలు సెన్స్‌ ఉందా?
    ఈ పరిణామాలపై కామెంటేటర్‌ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్‌ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.

    కోల్‌కతాలో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో ఒకే ఒక్క ఓవర్‌ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్‌ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి?  

    ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?
    కోల్‌కతా టెస్టులో వాషీని వన్‌డౌన్‌లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. మరీ అంత లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

    భారీ ఆధిక్యంలో సఫారీ జట్టు
    కాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ (288) కలుపుకొని.. భారత్‌ కంటే ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులతో రాణించాడు. 

    చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

  • సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆన్‌ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.

    అయితే, సఫారీ జట్టు కెప్టెన్‌ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్‌ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్‌ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. 

    ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్‌ అయిన యాన్సెన్‌
    ప్రొటిస్‌ ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (38), ర్యాన్‌ రికెల్టన్‌ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (49), కెప్టెన్‌ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్‌ సెనూరన్‌ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్‌తో చెలరేగిపోయాడు.

    భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    జైసూ హాఫ్‌ సెంచరీ
    భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (58), కేఎల్‌ రాహుల్‌ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్‌ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.

    అంతా ఫెయిల్‌.. వాషీ ఒక్కడే..
    వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (15), ధ్రువ్‌ జురెల్‌ (0), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్‌ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు.

    ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్‌ యాదవ్‌ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్‌.. బుమ్రా (5)ను కూడా అవుట్‌ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.  సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్‌ హార్మర్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

    కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్‌ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్‌ ఏంటయ్యా? అంటూ పంత్‌ సేనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?

  • ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్‌ ముచ్చల్‌తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.

    తప్పనిసరి పరిస్థితుల్లో..
    ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్‌ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.  ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్‌ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.

    నాన్న చూడని వేడుక నాకొద్దు
    కానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్‌ తుహిన్‌ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.

    ఆస్పత్రి పాలైన పలాష్‌ ముచ్చల్‌!
    కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    ఎన్‌డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పలాష్‌ ముచ్చల్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.

    స్మృతి తండ్రి హెల్త్‌ అప్‌డేట్‌ ఇదే!
    ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్‌ నమన్‌ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్‌ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్‌ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్‌ పంపించాము.

    వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్‌ ఎంజైమ్స్‌ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. 

    వారం రోజులుగా వేడుకలు
    కాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌ తదితరులు హల్దీ, సంగీత్‌ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్‌ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. 

    ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్‌ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

    చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్

  • ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా త‌డ‌బ‌డింది. మొద‌ట ప‌స‌లేని బౌలింగ్‌తో ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న భార‌త్‌.. త‌ర్వాత బ్యాటింగ్‌లోనూ స‌త్తా చాట‌లేక‌పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 ప‌రుగులు చేయ‌గా.. టీమిండియా 122 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఓపెన‌ర్లు ఫ‌ర్వాలేద‌ని పించినా.. త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో భార‌త్ ఎదురీదుతోంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుద‌ర్శ‌న్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపింది. సాయి 40 బంతులు ఎదుర్కొని 15 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు. అయితే ధ్రువ్ జురైల్‌(0), రిష‌బ్ పంత్‌(7), ర‌వీంద్ర జ‌డేజా(6), నితీశ్ కుమార్‌రెడ్డి (10) కూడా వ‌రుస‌గా విఫ‌లం కావ‌డంతో టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది.

    అయితే సోష‌ల్ మీడియాలో సాయి సుద‌ర్శ‌న్‌పై నెటిజ‌నులు ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. శుబ్‌మ‌న్‌ గిల్ (Shubman Gill) స్థానంలో అత‌డికి జ‌ట్టులో చోటు క‌ల్పించ‌డాన్ని ప‌లువురు త‌ప్పుబ‌డుతున్నారు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కడానికి గిల్ కోటా కారణమని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ స్నేహితుడు కాబ‌ట్టే సాయికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గిల్‌ స్థానంలో అదే జ‌ట్టు ఆట‌గాడిని త‌ప్ప మ‌రొక‌ని తీసుకోరా అని ప్ర‌శ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా కాగా, సాయి ఓపెన‌ర్‌.

    "గిల్ స్నేహితుడు కాబట్టి సాయి సుద‌ర్శ‌న్‌కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఒక‌ట్రెండు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైతే చాలు ఇత‌ర ఆట‌గాళ్ల‌ను జ‌ట్టు నుంచి తొల‌గించారు. ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా అత‌డినిటెస్టుల్లోకి తీసుకున్నారు. దేశ‌వాళీ క్రికెట్‌లో చూపిన ప్ర‌తిభ ఆధారంగా కాద‌ని ఓ నెటిజ‌న్ ఎక్స్‌లో కామెంట్ చేశారు. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) లాంటి వారిని కాద‌ని సాయి సుద‌ర్శ‌న్‌ను జ‌ట్టులోకి తీసుకున్నందుకు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ క‌నీసం ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని మ‌రొక నెటిజ‌న్ పేర్కొన్నారు. టెస్టులో సాయి ప్ర‌ద‌ర్శ‌న అంతంత మాత్ర‌మేన‌ని పెద‌వి విరిచారు. సీఎస్కే ఆట‌గాడు కాబ‌ట్టే రుతురాజ్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేద‌ని అత‌డి మ‌ద్ద‌తుదారులు ఆరోపిస్తున్నారు.

    చ‌ద‌వండి: రిష‌బ్ పంత్‌పై నెటిజ‌న్ల మండిపాటు

    టెస్టుల్లో విఫ‌లం
    త‌మిళ‌నాడుకు చెందిన సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudharsan) గ‌తేడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన సిరీస్‌తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఆరు టెస్టుల్లో రెండు అర్ధ‌సెంచ‌రీల‌తో 288 ప‌రుగులు సాధించాడు. టెస్టుల్లో అత‌డి అత్య‌ధిక స్కోరు 87. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండవ టెస్ట్‌లో ఈ స్కోరు న‌మోదు చేశారు. 24 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం బ్యాట‌ర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 3 వ‌న్డేలు ఆడి 127 ప‌రుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 28 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 6 సెంచ‌రీల‌తో 1396 ప‌రుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 40 మ్యాచ్‌ల్లో 2 సెంచ‌రీలు, 12 హాఫ్ సెంచ‌రీల‌తో 1793 ప‌రుగులు బాదాడు. టెస్టుల్లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న స్థాయికి త‌గ్గ‌ట్టు లేద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. 

     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీలో వరుసగా నూతన నియామకాలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రకటనను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. 

    పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్ద పోలిరెడ్డి (బద్వేలు)ని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడుని, అలాగే.. అరకు, పాడేరు పరిశీలకులుగా బొడ్డేటి ప్రసాద్ నియమిస్తున్నట్లు పార్టీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: అన్నా.. త్వరగా కోలుకో: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

  • సాక్షి కృష్ణా: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఘంటసాలలో ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. 

    ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే  ఆ కార్యక్రమంలో రైతుల వద్దకు వెళ్లేందుకు అచ్చెన్న భయపడినట్లు ఉన్నారు. అందుకే అన్నదాతలకు బదులు టీడీపీ నేతలతో ముఖాముఖీ నిర్వహించారు. 

    ముఖాముఖిలో అయినపూడి యశోధర, దోనేపూడి విజయలక్ష్మి, బంజి పరాత్మరరావులు అచ్చెన్నతో మాట్లాడారు. బండి పరాత్మర రావు ఘంటసాల పీఏసీఎస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. యశోధర, విజయలక్ష్మిలిద్దరూ టీడీపీ నేతకు సంబంధించిన కుటుంబీకులు. అలా.. ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించామని చెబుతూ సొంతపార్టీ నేతలతోనే మాట్లాడి మంత్రి అచ్చెన్న నవ్వులపాలయ్యారు. 

     

  • సాక్షి, తాడేపల్లి: కావలి(నెల్లూరు) మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటీవలె బైపాస్‌ సర్జరీ జరిగింది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రతాప్‌రెడ్డి అన్నా .. మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోమవారం ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. 

  • సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. 

    టీడీపీకి ఓటు వేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు కూడా కోటి సంతాకాల్లో భాగమయ్యారని పేర్కొన్నారు. పేదవర్గాల పిల్లలు డాక్టర్లు కావాలన్న కలలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపం ఇచ్చిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చింది. చాలా చోట్ల 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. పేద పిల్లలు డాక్టర్లు అవుతారని ప్రజలు ఆశించారని పెద్దిరెడ్డి తెలిపారు.

    మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజి పై కుక్కలు మొరుగుతూ ఉంటాయి. రూ.70కోట్లు పైగా ఖర్చు చేశారు ఇప్పటి వరకు రూ. 27 కోట్లు బిల్లులు చెల్లించారు అని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వం చేసే అవినీతి చాలా పెద్దది. దానిపై దృష్టి మళ్లించడానికి మాపై బురద చల్లుతున్నారు. సర్పంచ్ నుంచి కిందిస్థాయి నాయకులు కూడా విమర్శలు చేసే స్థితికి చేరుకున్నారు అని మండిపడ్డారు. 

    జిల్లాలో తమ గురించి ఎవరిని అడిగినా తాము చేసిన సేవల గురించి చెబుతారని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పూర్తిచేయాలి. పేద వర్గాల పిల్లలు డాక్టర్లు అయ్యేందుకు ప్రభుత్వాలు సహకరించాలని పెద్దిరెడ్డి అన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిపట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రఖ్యాత నటుడు, పార్లమెంటేరియన్‌ అయిన ధర్మేంద్ర మరణం తనను ఎంతో కలచివేసిందని అన్నారాయన. 

    ‘‘మంచి నటుడుగా, మంచి పార్లమెంటు సభ్యునిగా అయన ఎంతో కీర్తిని పొందారు. ఆయన తన జీవితంలో సరళత, మానవత్వం, ఆప్యాయత, ఉత్సాహం.. విలువలను ప్రతిబింబించారు. అలాంటి వ్యక్తి మృతి బాధ కలిగించింది.  ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్‌ ఖాతాలో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను వల్ల భారీ నష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.

    40 బస్తాల పంట 25 బస్తాలకు పడిపోయింది. రైతులు రోడ్డున పడ్డా పట్టించుకునే వారు లేరు. చంద్రబాబుకు రైతులపై చిన్నచూపు ఉందని అనిల్ కుమార్ అన్నారు.

    ఇదిలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టాల్లో ఉందని కోత వ్యయం రూ.15 వేల మేర పెరిగిందని చెప్పారు. ఆర్బీకేలు నిర్వీర్యం కావడంతో దళారీ వ్యవస్థ పెరిగిందని విమర్శించారు.

    పంట నష్టం అంచనాల్లోనూ రైతులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయాలి. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. తేమ పేరుతో మిల్లులు చేసే మోసాలను అడ్డుకోవాలని కైలే అనిల్ డిమాండ్ చేశారు.

  • సాక్షి, ఏలూరు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan) పోలవరం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోందని.. త్వరగా బాగు చేయించాలని పవన్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానికులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

    రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవపోవడంతో నేరుగా పవన్‌ దృష్టికే సమస్యను తీసుకెళ్లాలని స్థానికులు భావించారు. ఈ క్రమంలోనే కొందరు స్కూల్‌ చిన్నారులతో కలిసి తల్లిదండ్రులను నిరసకు దిగారు. అయితే.. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు తోసేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

    గెలిచాక తమ సమస్యలు గాలికి వదిలేశారని.. రోడ్ల సమస్యను విన్నవించేందుకు వస్తే అడ్డుకుంటున్నారని స్థానికులు ఈ సందర్బంగా పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు ఆంబులెన్స్‌లు కూడా రావడం లేదంటూ పలువురు మీడియా ఎదుట వాపోయారు. 

    వీటిని రోడ్లంటారా?
    కొయ్యలగూడెం మండలం గవరవరం నుండి యర్రంపేట ప్రయాణించే రోడ్లు దారుణంగా పాడైపోయాయి. గవరవరం, కృష్ణం పాలెం,ఏడు వాడల పాలెం, గంగన్నగూడెం, గొల్లగూడెం, యర్రం పేట గ్రామాల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకెళ్తున్నా.. ఆయన ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా గత ప్రభుత్వంపై నిందమోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ దృష్టికే సమస్య తీసుకెళ్లాలని భావించారు. ‘‘జనసేన పార్టీ పదవుల కోసమే కాదు.. పని కూడా చేయడం.. అవసరమైతే ప్రశ్నించడం కూడా’’ అని స్థానికులు ఆందోళన బాట పట్టారు. 

    అక్కడా అడ్డుకున్న పోలీసులు
    ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ పవన్‌ను నిరసన సెగ తప్పలేదు. ఆయన రాక గురించి తెలిసిన సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు  రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుని నిరసనకు దిగారు. తమకు 20 నెలల జీతాలు చెల్లించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. 

    బూతులు తిట్టుకున్న తమ్ముళ్లు.. 
    పవన్‌ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. విమానాశ్రయంలో పవన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా ఉన్న పెందుర్తి వెంకటేశ్ వర్గీయులు, రాజానగరం టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గీయులు వచ్చారు. అయితే.. రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణను అనుమతించకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఎం ప్రోగ్రాం కమిటీ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌ను ఎలా అనుమతించారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం వాగ్విదానికి దిగాయి. బూతులు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకునే స్థాయికి రెండు వర్గాల నేతలు వెళ్లారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల నేతలను విడదీయడంతో పరిస్థితి సర్దుమణిగింది.

  • సాక్షి, కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. చిప్పగిరిలో జరిగిన సమావేశంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

    వైఎస్సార్‌ సీపీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. టిడిపిలో తమకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల స్థానిక సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. దాంతో వైఎస్సార్‌ సీపీలోకి వస్తున్నాం. టిడిపి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ప్రజలకు ఏమీ చేయలేదు కానీ ప్రజలను మోసం మాత్రం చేసిందని వారు విమర్శించారు. 

    ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. 2029లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు.

    ఆలూరు నియోజకవర్గ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, త్రాగునీటి ఇబ్బందులు ఎక్కువగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

    పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అని విరుపాక్షి హామీ ఇచ్చారు.

  • సాక్షి, ఎన్టీఆర్‌: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో జూన్‌ 18వ తేదీన ఆయన అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

    అయితే వెరికోస్‌ వెయిన్స్‌తో బాధపడుతున్న ఆయన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆయన అరోగ్య స్థితిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆస్తులను ఎటాచ్‌ చేయాలని జరుగుతున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఆయన జడ్జి ఎదుట వాపోయారు కూడా. 

    ‘‘నేను లిక్కర్‌ వ్యాపారం చేయలేదు. ఒక్క రూపాయి కూడా లిక్కర్‌ నుంచి సంపాదించలేదు. రియాల్‌ ఎస్టేట్‌ చేసి నేను సంపాదించుకున్నా. లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు. నేను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించానని చెప్తున్నారు. నేను మీకు ఇప్పుడు చెప్పకపోతే నేను నిజంగా తప్పు చేశాననుకుంటారు. నిజం ఏంటీ అనేది ప్రజల్లోకి వెళ్లాలి. మీకు తెలియాలి. కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైల్లో పెట్టినా నాకు భయం లేదు. ఎన్ని రోజులు అయినా జైల్లో ఉంటాను అని ఆవేదన వ్యక్తం చేశారాయన.

  • సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఎక్సైజ్ శాఖ చర్యలపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. స్థానిక మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ కేసు పెడుతున్నామంటూ బహిరంగంగా ప్రకటించి మరీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి.

    ప్రశాంత్ గౌడ్‌ను కొన్ని రోజులుగా స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తూ, మద్యం షాపును తమకు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్‌ కావడం గమనార్హం. అంతేకాదు.. కేసు నమోదు సమయంలో “నీపై అక్రమ కేసు పెడుతున్నాం.. నన్ను క్షమించు” అని ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య అన్నారని ప్రశాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు.

    టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు పెట్టారని వైఎస్సార్‌ సీపీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, స్థానిక టీడీపీ నేతల బరితెగింపు పెరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    ఎక్సైజ్ శాఖ తీరును హిందూపురం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త దీపిక,  వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్  తప్పుబట్టారు. టీడీపీ నేతల సూచన మేరకు అక్రమ కేసులు నమోదు చేయడం విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ గౌడ్‌పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

Business

  • నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. స్థిరమైన ఆదాయం కోసం లిక్విడ్‌ ఫండ్‌ లేదా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ)ను ఎంపిక చేసుకోవచ్చా?  – నివేష్‌ పటేల్‌

    లిక్విడ్‌ ఫండ్స్‌ స్థిరత్వంతో, తక్కువ రిస్‌్కతో ఉంటాయి. కనుక షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌తో పోలి్చతే సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) కోసం లిక్విడ్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. లిక్విడ్‌ ఫండ్స్‌పై మార్కెట్‌ అస్థిరతలు పెద్దగా ఉండవు. లిక్విడ్‌ఫండ్స్‌ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు.

    లిక్విడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఇన్‌స్టంట్‌గా అదే రోజు వెనక్కి తీసుకునేందుకు (నిరీ్ణత మొత్తం) కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అనుమతిస్తున్నాయి. లేదంటే మరుసటి రోజు అయినా పెట్టుబడులు చేతికి అందుతాయి. వీటిల్లో రాబడి ఎంతన్నది ముందుగానే అంచనాకు రావొచ్చు. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి యూనిట్‌ నెట్‌ అసెట్‌ వ్యాల్యూ (ఎన్‌ఏవీ)లో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. కనుక ఇది నెలవారీ ఉపసంహరించుకునే పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ, ఈ మేరకు రిస్క్‌ కూడా అధికంగా ఉంటుంది.

    నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు హెల్త్‌ రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం ఉంది. అయినా, వ్యక్తిగతంగా ఒక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం మంచి ఆలోచనేనా? – రేణు

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు హెల్త్‌ కవరేజీ ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ఎంపానెల్డ్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాల కొనుగోలుకు పరిహారం పొందొచ్చు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద, యునానీ, సిద్ధ, యోగా చికిత్సలకు సైతం రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు. వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలకు కుడా పరిహారం వస్తుంది. కాకపోతే ఎంపిక చేసిన ఆస్పత్రుల వరకే ఈ కవరేజీ పరిమితం. అయితే, ప్రభుత్వ ఆమోదం పొందిన ఆస్పత్రులు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలని లేదు. కనుక మీకు సమీపంలోని ఏఏ ఆస్పత్రుల్లో కవరేజీ ఉందో, అక్కడ వసతులు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోండి.

    ప్రభుత్వ ఆమోదం ఉన్న ఆస్పత్రి మీకు సమీపంలో లేకపోయినా, లేదంటే మెరుగైన, రోబోటిక్‌ వంటి అత్యాధునిక చికిత్సలను తమకు ఇష్టమైన ఆస్పత్రిలో పొందాలని కోరుకుంటే.. అప్పుడు వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీతో తీసుకోవాలి. అది కూడా వృద్ధాప్యం వచ్చే వరకు ఆగకుండా, యుక్త వయసులోనే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. మంచి హెల్త్‌ ట్రాక్‌ రికార్డు కూడా లభిస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత తీసుకోవాల్సి వస్తే కో–పే షరతుకు అంగీకరించాల్సి వస్తుంది. కోపే వద్దనుకుంటే ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సదుపాయం అధిక శాతం చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ రూపంలోనే ఉంటుంది. కనుక ముందుగా తాము చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వద్ద క్లెయిమ్‌ దాఖలు చేసి పొందగలరు. అదే వ్యక్తిగత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ ఉంటే అవసరమైన సందర్భంలో నగదు రహిత చికత్సను దాని కింద పొందొచ్చు.

    ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

    సోషల్ మీడియాలో రూ.5000 నోట్లకు సంబంధించి, వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఐదు వేలరూపాయల నోట్ల విషయంలో ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. సామజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు స్పష్టం చేసింది.

    ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండువేల రూపాయల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్‌ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్‌ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

  • సరసమైన రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత స్థిరంగా చేస్తుంది. ఈఎంఐలను తగ్గించడం వల్ల వినియోగదారుల పునర్వినియోగపరచలేని ఆదాయం పెరుగుతుంది, గృహాలు, వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా కాలంగా నెమ్మదిగా అమ్మకాలతో సతమతమవుతున్న రియల్ ఎస్టేట్ రంగం వడ్డీ రేటు తగ్గింపు నుంచి ఉపశమనం పొందుతుంది.

    ద్రవ్యోల్బణం తగ్గడం చౌక రుణాలకు కొత్త అవకాశాలను తెరిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం పదేళ్ల కనిష్ట స్థాయి 0.25 శాతానికి పడిపోయింది. అయితే టోకు ద్రవ్యోల్బణం కూడా 27 నెలల కనిష్ట స్థాయి మైనస్ 1.21 శాతానికి చేరుకుంది. ఈ తగ్గుదల ప్రధానంగా కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాదరక్షలు, ధాన్యాలు ,వాటి ఉత్పత్తుల ధరలు తగ్గడం, అలాగే విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ సేవల కారణంగా ఉంది. సెప్టెంబర్‌లో అమలు చేసిన జీ ఎస్టీ రేట్ల తగ్గింపు కూడా గణనీయమైన పాత్ర పోషించింది, ఇది ఆహార పదార్థాల ధరలు తగ్గడానికి దారితీసింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2.5 శాతం వద్ద స్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు, ఇది గత సంవత్సరం 4.6 శాతం రేటు కంటే తక్కువ. ఇది వృద్ధిని పెంచడానికి డిసెంబర్ నెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో విధాన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాన్ని పెంచింది. తక్కువ పన్నులు, ద్రవ్యోల్బణం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతోందని, దేశం క్రెడిట్ రేటింగ్ మెరుగుపడుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు హైలైట్ చేస్తున్నాయి. అయినప్పటికీ, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి రుణాలను చౌకగా చేయవలసిన అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక దిగుమతి సుంకాలను విధించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటుతో, తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన ఆర్థిక ఫండమెంటల్స్ కారణంగా భారతదేశం G-20 దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని మూడీస్ గ్లోబల్ మాక్రో అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది.

    వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతుల్యతను కొనసాగించిన ఆర్బీఐ జాగ్రత్తగా ద్రవ్య విధానాన్ని మూడీస్ కూడా ప్రశంసించింది. గత నెలలో రెపో రేటును స్థిరంగా ఉంచడం ద్వారా, తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన వృద్ధి వాతావరణంలో ఆర్బీఐ జాగ్రత్తగా ముందుకు సాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే, ప్రైవేట్ రంగం ఇప్పటికీ పెద్ద ఎత్తున పెట్టుబడుల గురించి అనిశ్చితంగా కనిపిస్తోంది. ఈ సమయంలో, ప్రపంచ వృద్ధి మందగమనం, అమెరికా సుంకాల పెంపు మధ్య పరిశ్రమ, వ్యాపారానికి సరళీకృత ఫైనాన్సింగ్ అవసరం మరింత ఒత్తిడికి గురైంది.

    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ మధ్య-సంవత్సర సమీక్ష నివేదిక GST రేటు తగ్గింపులు, తగ్గిన ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థకు స్పష్టంగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా పరిశ్రమ, వ్యాపారానికి ఆర్థిక సహాయం అవసరమని పేర్కొంది. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆశయానికి ఆర్థిక రంగ సంస్కరణలు, సులభంగా రుణం పొందడం చాలా అవసరమని ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.

    ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్‌లలో ఆర్బీ ఐ ఇప్పటికే రెపో రేటును మొత్తం ఒక శాతం తగ్గించింది, దీని వల్ల అది 5.5 శాతానికి చేరుకుంది. నగదు నిల్వ నిష్పత్తి కూడా మూడు శాతానికి తగ్గింది. అయితే, ప్రస్తుత ప్రపంచ సవాళ్లు, భారత పరిశ్రమ, వాణిజ్య అవసరాల దృష్ట్యా, మరింత వడ్డీ రేటు తగ్గింపులు ఈ సమయంలో అవసరం. ఆర్థిక సూచికలు నిరంతరం మెరుగుపడుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మరోసారి భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చౌక రుణాలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి. ట్రంప్ సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల మధ్య భారతదేశం వ్యూహాత్మక సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని, సులభంగా క్రెడిట్ పరిశ్రమ, వాణిజ్యం, సేవల రంగాలలోకి కొత్త శక్తిని చొప్పించగలదు. తగ్గిన వడ్డీ రేట్లు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆవిష్కరణ, ఉత్పత్తి, మార్కెట్ విస్తరణకు కొత్త పునాదిని కూడా సృష్టిస్తాయి. ఇది విదేశీ పెట్టుబడులను కూడా పెంచుతుంది. గ్రామీణ, పట్టణ డిమాండ్ కూడా పెరుగుతుంది, తయారీ, సేవా రంగాలను బలోపేతం చేస్తుంది.రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అంతేకాదు దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుంది. ఈఎంఐలను తగ్గించడం వల్ల వినియోగదారుల పునర్వినియోగపరచలేని ఆదాయం పెరుగుతుంది, గృహాలు, వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా కాలంగా సరైన అమ్మకాలు లేక  ఇబ్బంది పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం వడ్డీ రేటు తగ్గింపు నుంచి ఉపశమనం పొందుతుంది.

    రిటైల్, టోకు ద్రవ్యోల్బణంలో పదునైన తగ్గుదల జీఎస్టీ తగ్గింపు, సానుకూల ప్రభావం దృష్ట్యా, ఆర్బీఐ తన రాబోయే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించడానికి గణనీయమైన నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇది వ్యాపార అభివృద్ధిని పెంచుతుంది, వినియోగదారులకు ఉపశమనం కూడా కలిగిస్తుంది, అంతేకాదు మార్కెట్ డిమాండ్‌ను బలోపేతం చేస్తుంది. కొత్త పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, ట్రంప్ సుంకాల సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది.

  • గ్లోబల్ మార్కెట్లలో అమ్ముడవుతున్న.. మూడు వరుసల SUV కియా సొరెంటో (Kia Sorento) మొదటిసారి భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది. కంపెనీ ఎంక్యూ4ఐ అనే కోడ్‌నేమ్‌తో దీనిని ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇది మహీంద్రా XUV700, టాటా సఫారీ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

    టెస్టింగ్ సమయంలో కనిపించిన కియా కొత్త కారు.. టెస్ట్ మ్యూల్. ఇది 235/55 R19 టైర్లతో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & బాక్సీ సిల్హౌట్‌ పొందుతుంది. లోపల ఒక రోటరీ గేర్ సెలెక్టర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను సూచిస్తుంది. క్యామోపేజ్ ఉన్నప్పటికీ.. మూడు వరుసల మోడల్ అని స్పష్టంగా తెలుస్తుంది. ముందు భాగంగా నిలువుగా అమర్చిన టీ షేప్ లైటింగ్, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ లాంప్‌లు ఉన్నాయి.

    ఫీచర్స్ విషయానికి వస్తే.. టెస్టింగ్ మోడల్ కారులో ఇవి బహిర్గతం కాలేదు. కానీ 12.3-అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ విండోలు, టెయిల్‌గేట్ కోసం ప్రైవసీ గ్లాస్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే మొదలైనవి ఉండనున్నాయి.

    ఇదీ చదవండి: బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!

    పవర్‌ట్రెయిన్ వివరాలకు కూడా అధికారికంగా వెల్లడికాలేదు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కియా సోరెంటో మూడు ఇంజన్ ఎంపికల లభిస్తుంది. అవి 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్, 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, 2.2-లీటర్ డీజిల్ హైబ్రిడ్ ఇంజిన్లు. అన్ని వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతాయి. అయితే మన దేశంలో లాంచ్ అయ్యే సోరెంటో ఏ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

  • ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ రిటైలర్లు ఐఫోన్ 16పై ఆఫర్స్ & డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా ఈ మొబైల్ కొనుగోలుపై రూ. 13,000 తగ్గింపులను ప్రకటించింది.

    128జీబీ ఐఫోన్16 అసలు ధర రూ. 69900 (ఫ్లిప్‌కార్ట్). ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. దీనిని రూ. 13000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్‌లో అనేక ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు అన్ని బ్యాంక్ ఆధారిత ఆఫర్‌లు ఉంటాయి. HDFC, SBI కార్డ్ హోల్డర్లు రూ. 5,000 వరకు తక్షణ 10% క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కింద రూ. 25000 వరకు తగ్గింపు (ఈ ధర మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ స్థితిని బట్టి ఉంటుంది) లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐలో భాగంగా.. 3-24 నెలల్లో చెల్లింపులు చేసుకోవచ్చు.

    ఫ్లిప్‌కార్ట్ ఇతర ఐఫోన్ మోడళ్లపై కూడా డీల్‌లను అందిస్తోంది. 6.7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ & పెద్ద బ్యాటరీ కలిగిన ఐఫోన్ 16 ప్లస్ ధర, డిస్కౌంట్ తర్వాత రూ.69,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 రూ.49,999కి, ఐఫోన్ 15 ప్లస్ రూ.59,999కి, ఐఫోన్ 14 కేవలం రూ.44,499కే అందుబాటులో ఉంది.

    ఐఫోన్ 16
    ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగిన యాపిల్ ఫోన్. ఇది 48MP ఫ్యూజన్ లెన్స్‌లతో కూడిన కెమెరా సిస్టమ్ పొందుతుంది. ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా యాక్సెస్‌ చేయగలదు. కొంత తక్కువ ధరతో ఐఫోన్ 16 కొనడానికి ఇది సరైన సమయం.

    ఇదీ చదవండి: రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే!

  • అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.

    1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్‌మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్‌లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్‌డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.

    ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

  • భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పనిచేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (NIRDC), MSME వాడుక, పరిధిని పెంచడానికి దేశీయంగా రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ InDApp రూపకల్పనను నేడు ప్రకటించింది.

    అంతర్జాతీయంగా పోటీతత్వ భారతీయ బ్రాండ్‌లను సృష్టించడం, భారతీయ కళాకారులు మరియు చేతివృత్తులవారికి ప్రపంచ గుర్తింపును అందించడం మరియు MSMEలు వికసిత్ భారత్ దార్శనికతకు దోహదపడేలా చేయడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా B2B మార్కెట్‌ప్లేస్ నిర్మించబడింది.

    ఎనిమిది మంత్రిత్వ శాఖల మద్దతుతో, InDApp, భారతదేశం అంతటా MSME రంగంలోని వ్యవస్థాపకుల కోసం ప్రత్యేకంగా సృష్టించబడింది. ఈ ప్లాట్‌ఫామ్ అందించే సేవలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని అందించడం, మూలధనాన్ని యాక్సెస్ చేయడం నుంచి వ్యాపార దృశ్యమానతను పెంచడం.. శిక్షణ, సామర్థ్య నిర్మాణానికి సహాయం చేయడం వరకు, IndApp ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా లేదా మీ ఫోన్‌లో ట్యాప్ చేయడం ద్వారా MSMEలకు డిజిటల్ యాక్సెస్‌ను గణనీయంగా పెంచుతుంది.

    ఈ యాప్ దాని బహుళ ఉపయోగకరమైన విలువ కారణంగా MSME రంగంలో సాంకేతిక విప్లవంగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతం నుంచి వస్తువుల వ్యాపారం చేసే భారతీయ వ్యాపారానికి, InDApp యొక్క మార్కెట్‌ప్లేస్ అంటే వ్యాపారి ప్రత్యేక వర్గం కింద ఉత్పత్తులు మరియు సేవలను పొందుపరచవచ్చు మరియు ఇతర ప్రాంతాలలో వ్యాపారాలను కూడా అన్వేషించవచ్చు.

    ఈ అప్లికేషన్‌ను రూపొందించిన నోడల్ బాడీగా, వనరులు మరియు మద్దతు విధానాలకు యాక్సెస్‌ను క్రమబద్ధీకరించడానికి NIDRC ఇతర ప్రభుత్వ సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తుంది. ఈ సహకార  వ్యవస్థ, పారిశ్రామిక సౌకర్యాలు మరియు విధాన అమలుకు సమగ్రమైన మరియు పరిపూర్ణమైన విధానం ఉందని నిర్ధారిస్తుంది.

  • సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 445.06 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 84,786.86 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్లు లేదా 0.42 శాతం నష్టంతో.. 25,959.50 వద్ద నిలిచాయి.

    RKEC ప్రాజెక్ట్స్, జెట్ ఫ్రైట్ లాజిస్టిక్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, విఎల్‌ఎస్‌ ఫైనాన్స్, NRB ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మంగళం డ్రగ్స్ & ఆర్గానిక్స్, మాగెల్లానిక్ క్లౌడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, సుమిత్ వుడ్స్, యూరో ప్యానెల్ ప్రొడక్ట్స్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • మూడు దశాబ్దాలు బ్రిటన్‌లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.

    ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్‌లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్‌లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.

    లక్ష్మీ ఎన్ మిట్టల్
    1950 జూన్ 15న రాజస్థాన్‎లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

    భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్‌లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు  కారణంగా.. స్విట్జర్లాండ్‌కు మకాం మార్చారు. ఈయన నెట్‌వ‌ర్త్ 22 బిలియన్ డాలర్లు.

    ఇదీ చదవండి: అంబానీ స్కూల్‌లో ఫీజులు అన్ని లక్షలా?

  • గత రెండు వారాలుగా వ్యవసాయ భూముల గురించి, వ్యవసాయ ఆదాయం గురించి తెలుసుకున్నాం. మూడో వారం ముచ్చటగా వ్యవసాయ ఆదాయం వల్ల పన్ను భారం ఎలా లెక్కించాలో ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ కాలమ్‌లో చెప్పిన ఉదాహరణలలో ప్రస్తావించిన వ్యవసాయ ఆదాయం, చట్టప్రకారం నిర్దేశించిన రూల్స్‌ను బట్టి లెక్కించినదిగా అనుకోండి. 

    కేవలం వ్యవసాయ ఆదాయమే ఉంటే.. 
    ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం పూర్తిగా వ్యవసాయం నుంచే వచ్చి, ఇతరత్రా ఆదాయమేమీ లేదనుకుందాం. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి పన్నుభారం ఏర్పడదు. నూటికి నూరుపాళ్లు మినహాయింపే. దీని ప్రకారం చాలా మంది చిన్నకారు/సన్నకారు రైతులకు ఇన్‌కంట్యాక్స్‌ పడదు.  
        
    కేవలం వ్యవసాయేతర ఆదాయం ఉండి, వ్యవసాయం మీద ఆదాయం లేకపోతే.. 
    సవ్యసాచి అనే వ్యక్తి వయస్సు 60 సంవత్సరాల లోపు ఉందనుకుందాం. అతను రెసిడెంటు అయి ఉండి, వ్యాపారం కలిగి ఉన్న వ్యక్తి అనుకుందాం. సాధారణంగా ట్యాక్సబుల్‌ ఇన్‌కం రూ. 14,00,000. 2025–26 ఆరి్థక సంవత్సరానికి ఈ వ్యక్తి కొత్త పద్ధతిని ఫాలో అయితే, శ్లాబులు/రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 90,000 ఉంటుంది. విద్యా సుంకం అదనం.  

    ఇదే సవ్యసాచికి రూ. 9,00,000 వ్యవసాయం మీద ఆదాయంగా వస్తోంది. ఇది కాకుండా పైన చెప్పిన రూ. 14,00,000 ఆదాయం కూడా ఉంది. ఇప్పుడు పన్ను ఎలా లెక్కించాలంటే..

    A. వ్యవసాయ ఆదాయం, వ్యవసాయేతర ఆదాయం కలిపితే మొత్తం ఆదాయం రూ. 23,00,000. దీనిపై పన్ను= రూ. 2,90,000

    B. వ్యవసాయ ఆదాయం, బేసిక్‌ లిమిట్‌ మాత్రమే కలిపితే మొత్తం ఆదాయం రూ.13,00,000. దీనికి సంబంధించి రిబేటు = రూ. 75,000 
    ఇప్పుడు (A) నుంచి (B)ని తీసివేస్తే, అంటే రూ. 2,90,000 నుంచి రిబేటు రూ. 75,000 తీసివేస్తే కట్టాల్సిన పన్ను భారం రూ. 2,15,000గా ఉంటుంది. దీనికి విద్యా సుంకం అదనం.

    ఇప్పుడు విశ్లేషణలోకి వెళ్దాం..

    • మొత్తం వ్యవసాయేతరం మీద ఆదాయం వచి్చందనుకోండి, రూ. 2,90,000 పన్ను కట్టాలి.  

    • రూ. 2,90,000 ఎక్కువగా భావించి, ఇందులో కొంత ఆదాయం, అంటే రూ. 9,00,000 వ్యవసాయం అని అన్నాం అనుకోండి. రూల్సు ప్రకారం ఆధారాలన్నీ ఉన్నాయనుకుంటే, రూ. 75,000 రిబేటు వస్తుంది. ఈ మేరకు పన్ను భారం తగ్గుతుంది.  

    • అందరూ కేవలం రూ. 14,00,000 మీద పన్ను చెల్లిస్తే సరిపోతుంది, వ్యవసాయ ఆదాయం మీద మినహాయింపు వస్తుందని అనుకుంటారు. ఈ ఊహ అబద్ధం. నిజం కాదు. ఇక్కడో వల, మెలిక ఉన్నాయి.  

    • ఈ రెండింటి మీద ఆదాయాన్ని కలిపి స్థూల పన్ను భారాన్ని లెక్కిస్తారు. (రూ. 14,00,000 + 9,00,000)

    • బేసిక్‌ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపి పన్ను లెక్కిస్తారు (రూ. 4,00,000 + రూ. 9,00,000)

    • చెల్లించాల్సిన పన్ను (5) – (6)

    • దీనికి విద్యా సుంకం అదనం

    • రూ. 9,00,000 వ్యవసాయ ఆదాయం కలపడంతో శ్లాబు మారుతుంది. పెద్ద శ్లాబులోకి వెళ్తారు.

    • బేసిక్‌ లిమిట్‌కి వ్యవసాయ ఆదాయం కలిపితే అది తక్కువ / లేదా చిన్న శ్లాబులో ఉంటుంది.  

    • పై శ్లాబుకి వెళ్లడం వల్ల పన్ను భారం పెరుగుతుంది.

    • రూ. 9,00,000 మీద అదనంగా రూ. 1,25,000 కట్టాల్సి వస్తోంది.  వాస్తవానికి పన్ను భారమే ఉండదనుకుంటే, అది ఏకంగా రూ. 1,25,000కు పెరిగింది.  

    • మరో కేసు. 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి. జీతం రూ. 8,00,000, వ్యవసాయం మీద ఆదాయం రూ. 4,00,000. పాత పద్ధతిని ఎంచుకుని, పన్ను లెక్కిస్తే రూ. 1,72,500 అవుతుంది. అందులో నుంచి రూ. 42,500 రిబేటు తీసివేయగా రూ. 1,30,000 చెల్లించాలి. విద్యా సుంకం అదనం.

    • కొత్త పద్ధతైనా, పాత పద్ధతైనా, ఇలా కలపడాన్ని పార్షియల్‌ ఇంటిగ్రేషన్‌ ( partial integration) అంటారు. దీని వల్ల పన్ను భారం పెరుగుతుంది.

    • అయితే, వ్యవసాయ ఆదాయం కలపడం వల్ల, వ్యవసాయేతర ఆదాయం పెద్ద శ్లాబులోకి వెళ్లింది. ఆ మేరకు పన్ను భారం పెరిగింది. కానీ, రిబేటు ఇవ్వడం వల్ల పన్ను భారం తగ్గుతుంది.

    • పన్ను భారాల పంపిణీ న్యాయబద్ధంగా ఉండేలా, పన్ను విధింపులో సమానత్వాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా దీన్ని భావించాలి.  

    ఏదైతేనేం, వ్యవసాయ ఆదాయాన్ని ఒక ట్యాక్స్‌ ప్లానింగ్‌ మార్గంగా భావించి, పన్ను ఎగవేత వైపు వెళ్లేవారికి ఇదొక హెచ్చరిక.

  • సాధారణంగా మధ్యతరగతివారికి డిస్కౌంట్లు అంటే మోజు ఎక్కువ. ఎక్కడ ఏది కొనాలన్నా మొదట డిస్కౌంట్‌ ఎంత వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ సంపన్నులు కూడా వీటికి అతీతులు కాదని కొందరు నిరూపిస్తున్నారు.

    పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా ఓ రెస్టారెంట్‌ బిల్లుపై భారీ తగ్గింపు పొందిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్త వైరల్‌గా మారి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. బిలియనీర్లు కూడా డిస్కౌంట్‌ల కోసం చూస్తారనే అంశంపై నెటిజన్లు చమత్కారాలు చేయడం మొదలుపెట్టారు.

    ఢిల్లీ విమానాశ్రయంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు విందు జరుపుకొన్న విజయ్ శేఖర్‌ శర్మ..  డిన్నర్ బిల్లు రూ. 40,828 వచ్చినట్లు తెలిపారు. అయితే ఈజీడైనర్‌లోని ఆఫర్లు, కూపన్లు ఉపయోగించి బిల్లును రూ. 24,733కి తగ్గించగలిగారు. మొత్తం రూ. 16,095 ఆదా కావడం ఆయనను ఆశ్చర్యపరచింది.

    ఈ బిల్లు స్క్రీన్‌షాట్‌ను తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన  “ఇది ఊహించని పుట్టినరోజు గిఫ్ట్‌లా అనిపించింది” అంటూ ఈజీడైనర్,  దాని వ్యవస్థాపకుడు కపిల్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. 35% రెస్టారెంట్ డిస్కౌంట్‌ రూ. 14,290 తో పాటు రూ. 2,000 అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూపన్‌ కూడా వర్తించడంతో ఈ భారీ తగ్గింపు వచ్చింది.

    నెటిజన్ల స్పందనలు
    విజయ్ శేఖర్‌ శర్మ పోస్ట్ వైరల్ కావడంతో, డిస్కౌంట్‌ను ఆయన వాడుకోవడంపై సోషల​్‌ మీడియా యూజర్లు జోకులు పేలుస్తున్నారు. “మాకు కూడా ‘కపిల్ చోప్రా లాంటి స్నేహితులు’ ఉంటే బాగుండేది” అని కొందరు సరదాగా చెప్పారు. “బిలియనీర్లు డిస్కౌంట్ చూసి ఇలా ఎంజాయ్ చేస్తే… మనం మాత్రం రెస్టారెంట్లలో రూ. 20 సర్వీస్ ఛార్జీ కోసం వాగ్వాదం చేస్తాం” అని మరో కామెంట్ వైరల్ అయింది.  “పేటీఎం క్యాష్‌బ్యాక్ కర్మ తిరిగి వస్తోంది” అని ఒకరు వ్యాఖ్యానించారు. “మీరు బిలియనీర్ కాదా? బిలియనీర్లు కూడా డిస్కౌంట్లను ఇష్టపడతారా?” అంటూ మరొకరు ప్రశ్నించారు.

National

  • జనాభా అవసరాలకు అనుగుణంగా సొంత వాహనాలు పెరిగే కొద్దీ.. నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ అంత కంతకూ పెరిగిపోతోంది. అయితే.. ముంబై వీధుల్లో ఆ గందరగోళం ఇక పాతాళంలోకి కరిగిపోనుంది. భూమి క్రింద మరో కొత్త లోకం తెరుచుకోబోతోంది. అవును..

    ముంబై ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న ప్రణాళికను ప్రకటించారు. “పాతాళ్ లోక్”(Paatal Lok) పేరుతో భూగర్భ టన్నెల్‌ నెట్‌వర్క్‌ను నిర్మించి నగర రోడ్లపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించనున్నట్లు సోమవారం ఆయన తెలిపారు. ఈ టన్నెల్‌లు పైభాగంలోని రహదారులకు సమాంతరంగా ఉంటూ.. మెట్రో మార్గాలతో కలుపుతూ.. ముంబైకి కొత్త రవాణా రూపకల్పనను అందించబోతునున్నట్లు తెలిపారాయన. 

    ఎలా సహాయపడుతుందంటే.. 
    ముంబైలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యను తగ్గించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం.. పాతాళ్‌ లోక్‌ ముఖ్య ఉద్దేశం.  భూమి క్రింద రోడ్లకు సమాంతరంగా పెద్ద టన్నెల్ వ్యవస్థ నిర్మిస్తారు.  ఇది భూమి క్రింద సమాంతర రహదారి వ్యవస్థగా పనిచేస్తుంది.  అంటే పైభాగంలోని ప్రధాన రహదారులకు “షాడో నెట్‌వర్క్”లా ఉంటుందన్నమాట. 

    డీకన్జెషన్‌తో పైభాగంలోని రోడ్లపై వాహనాల ఒత్తిడి తగ్గి.. ట్రాఫిక్ సాఫీగా కదులుతుంది. తద్వారా ప్రయాణికులకు ‘గంటల తరబడి’ అనే నరకయాతన తప్పనుంది. అలాగే.. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారాలు, లాజిస్టిక్స్ వేగవంతం కానుంది. అదే సమయంలో వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా కదలడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది.

    ముంబై నగరం కోసం ఫడ్నవీస్‌ సర్కార్‌ అమలు చేయబోతున్న ప్రణాళికలో.. బోరివలి–గోరేగావ్ మధ్య సమాంతర రహదారి, వర్లీ–శివడి కనెక్టర్ (తదుపరి సంవత్సరం పూర్తి), బాంద్రా–BKC టన్నెల్ ( దీని ద్వారా ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ మెరుగుపరుస్తుంది). దక్షిణ ముంబై నుంచి భయందర్‌ వరకు విస్తరించే కోస్టల్ రోడ్ కూడా ఈ ప్రణాళికలో భాగం. అలాగే.. ఈ టన్నెల్ ప్రాజెక్ట్‌కి తోడ్పాటుగా మెట్రో విస్తరణ కూడా జరగనుంది. 

  • ఇంట్లో చిన్న పిల్లలు అంటే ఆ  ఆనందమే వేరు. వారికి తోడు  ఏదైనా పెట్‌  ఉంటే ఇక ఆ సందడి రెట్టింపు అవుతుంది. చిన్నపిల్లలు, పెంపుడు జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇళ్ళలో పెంచుకునే కక్కలు చిన్నారులను చాలా ప్రేమిస్తాయి. మరో విధంగా చెప్పాలంటే కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాపాయ ప్రమాదాలనుంచి కాపాడతాయి.  పెట్స్‌తో కలిసి చిన్న పిల్లలు చేసే అల్లరి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. తాజాగా  దీనికి సంబంధించి ఒకఫ న్నీ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

    సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తూ అమ్మనుంచి దాక్కునేందుకు   చాలా ఎత్తులు వేస్తూ ఉంటారు. వాటిల్లోముఖ్యమైనది  దొంగచాటుగా, ఫోన్లలో  ఆటలాడుకుంటూ, సరదా రీల్స్‌ చేస్తూ గడపుతూ  ఉంటారు అదీ  అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడుతూ. ఈ వీడియోలో  చిన్నపిల్లాడికి తోడుదొంగలా నిలిచింది ఓ బుజ్జి కుక్కపిల్ల. ఇద్దరు ముసుగేసుకుని ఎంచక్కా ఫోన్‌ చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక మహిళ  మీ యవ్వారం నాకు తెలుసులో అన్నట్టు వీళ్ల గదిలోకి తొంగి చూస్తుంది. అపుడు ఏమీ ఎరగనట్టు.. ఠక్కున ముసుగేసుకుని పడుకుంటారు.   ఈ ఏడాది మేటి నటులు వీళ్లే అనే క్యాప్షన్‌తో షేర్‌ అయిన  ఈ వీడియో 10లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.  అదేంటో మీరు కూడా చూసి..  ఎంజాయ్‌ చేయండి మరి.!
     

  • ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో  ప్రధాన న్యాయముర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమం అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అధికారిక వాహనంలో కాకుండా సాధారణ వ్యక్తులలా ప్రైవేట్ వాహనంలో ఇంటికి వెళ్లారు. ఎందుకని వారిని ప్రశ్నించగా నుతన సీజేఐ మెుదటి రోజు నుంచే అధికారిక వాహనంలో వెళ్లాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    "నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే చెప్పాను. పదవీ విరమణ తర్వాత ఏ అధికారిక హోదాను అనుభవించనని, తరువాతి తొమ్మిది,10 రోజులు కొంత ప్రశాంతంగా గడుపుతా, అనంతరం నా కొత్త ఇన్నింగ్స్ మెుదవవుతుంది" అని గవాయ్ అన్నారు. తాను దళితుడైనప్పటికీ ఎస్సీ, ఎస్టీ కులాలలో క్రిమిలేయర్ ఉండాలన్న తన అభిప్రాయాన్ని గవాయ్ మరోసారి సమర్థించుకున్నారు.

    రిజర్వేషన్ల ఫలితం ప్రతిసారి ఒకరికే అందుతుంటే వారే అభివృద్ధి చెందుతారు. గ్రామంలో పని చేసుకునే ఒక కార్మికుడి కుమారుడు, ఐఏఎస్, ఐపీఎస్ ల కుమారులతో పోటీపడగలరా ఇది సమానత్వ వేదిక అవుతుందా అని గవాయ్ ప్రశ్నించారు. అందుకే రిజర్వేషన్లు వాటి ‍అవసరమున్న కుటుంబాలకే చేరాలన్నారు.

    రాష్ట్రపతి భవన్లో జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులతో పాటు ప్రధాని మోదీ పాల్గొన్నారు. 

  • సైబర్‌ నేరాలు, డేటా చోరీలు ఇంటర్నెట్‌ వినియోగదారులను వణికిస్తున్నాయి.  కొంతమంది నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించి, వారి పేరుతో సన్నిహితులు, స్నేహితుల వద్ద భారీగా డబ్బు దండుకున్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ అమాయకులను బెదిరించి కోట్ల రూపాయలను దండుకున్నారు సైబర్‌ నేరగాళ్లు. మరోవైపు సోషల్‌  నకిలీ ఐడీలు, నకిలీ ఖాతాలతో వారి ఫాలోయర్లను దారుణంగా మోసగిస్తున్నారు మరి కొంతమంది.  దీనికి సంబంధించిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌  సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

    తన  వాట్సాప్‌ నంబరు అంటూ  నకిలీ నెంబరుతో    చాట్‌ చేస్తున్నారని  స్పందించ వద్ద అంటూ  హీరోయిన్‌ రకుల్‌  ఎక్స్‌లో ఒక ట్వీట్‌ చేసింది. ‘‘హాయ్ గైస్... ఎవరో వాట్సాప్‌లో  నాపేరుతో  జనంతో చాట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇది నా నంబర్ కాదని గమనించండి . వారితో మాట్లాడకండి దయచేసి బ్లాక్ చేయండి’’ అనేది ఈ ట్వీట్‌ సారాంశం.

    కాగా గత వారం  ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత వివరాలు లీక్‌ వార్త సంచలనం రేపిన సంగతి విదితమే. 
     

  • క‌న్న‌డ‌నాట సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు కొన‌సాగుతున్నాయి. సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మ‌ధ్య కుర్చీలాట‌కు ఇప్పుడ‌ప్పుడే ముగింపు ఉండేట్టు క‌న‌బ‌డ‌డం లేదు. అంతా హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కంటితుడుపు ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో అస‌లు స‌మ‌స్యే లేద‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. మీడియా అన‌వ‌స‌రంగా లేని విష‌యాన్ని ప్ర‌చారం చేస్తోంద‌ని నిష్టూర‌మాడారు. ఇదిలావుంటే ముఖ్య‌మంత్రి రేసులో తాను ఉన్నానంటూ మ‌రో నాయ‌కుడు తెర‌పైకి వ‌చ్చారు.

    కర్ణాట‌కలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం న‌వంబ‌ర్ 20 నాటికి రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి మార్పు ప్ర‌చారం ఊపందుకుంది. దీన్నే కొంత మంది 'నవంబ‌ర్ విప్ల‌వం'గా వ‌ర్ణిస్తున్నారు. 2023లో సీఎం సిద్ధ‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మ‌ధ్య అధికార మార్పిడి ఒప్పందం కుదిరింద‌ని.. దాని ప్ర‌కారం ఇద్ద‌రూ చెరో రెండున్న‌రేళ్లు సీఎంగా ఉండేందుకు అంగీక‌రించిన‌ట్టు చాలా రోజుల‌ నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 20 నాటికి సిద్ధ‌రామ‌య్య ప‌ద‌వీకాలం రెండున్న‌రేళ్లు పూర్త‌యినందున, ఆయ‌న స్థానంలో డీకే శివ‌కుమార్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తార‌న్న ప్ర‌చారం జోరందుకుంది. దీంతో క‌న్న‌డ రాజ‌కీయాల్లో (Kannada Politics) కొద్దిరోజులుగా హీట్ పెరిగింది.

    ముఖ్యమంత్రి రేసులో ఉన్నా
    సిద్ధ‌రామ‌య్య‌, శివ‌కుమార్ మ‌ధ్య‌లోకి తాజాగా హోంమంత్రి జి. ప‌ర‌మేశ్వ‌ర (G. Parameshwara) కూడా వ‌చ్చారు. నాయ‌క‌త్వ మార్పిడి అనివార్య‌మైతే తాను కూడా రేసులో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి మార్పిడిపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎవరూ ఇప్పటివరకు మాట్లాడలేదని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ శాసనసభా పక్షంలోనూ దీనిపై చర్చించలేదని వెల్ల‌డిచారు. కాగా, పీసీసీ అధ్య‌క్షులు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టే అవ‌కాశం కాంగ్రెస్ పార్టీలో ఉంద‌ని బెంగ‌ళూరులో మీడియా ప్రతినిధుల‌తో అన్నారు. అయితే కొన్ని ప‌రిస్థితుల్లో మాత్ర‌మే దీనికి మిన‌హాయింపు ఉంద‌ని ముక్తాయించారు.

    ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా అని ప‌ర‌మేశ్వ‌ర‌ను విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ''నేను ఎప్పుడూ పోటీలోనే ఉంటాను.. అది పెద్ద సమస్య కాదు. నేను 2013లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అదంతా నా ఒక్క‌డి ఘ‌న‌త అని నేను ఎప్పుడూ చెప్ప‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో నేను ఓడిపోయాను. ఒక‌వేళ నేను గెలిచివుంటే ఏం జరిగివుండేదో నాకు తెలియ‌ద''ని బ‌దులిచ్చారు.

    చ‌ద‌వండి: స్వ‌రం మార్చిన ముఖ్య‌మంత్రి సిద్దూ!

    ముఖ్య‌మంత్రిని మార్చాల‌ని హైక‌మాండ్ అనుకుంటే.. మీ పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోమ్మ‌ని కోర‌తారా అని అడ‌గ్గా.. "ఆ పరిస్థితి రానివ్వండి అప్పుడు చూద్దాం, అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు" అని పరమేశ్వర అన్నారు. ద‌ళితుడిని సీఎం చేయాల‌న్న డిమాండ్ చాలా కాలంగా ఉంద‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. 

  • ముంబై:  70 ఏళ్ల  అపురూపమైన స్నేహం వారిది. ఇద్దరూ లెజెండ్స్‌.   లెజెండరీ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ (నవంబర్ 24)న  90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని మరో లెజెండ్రీ నటుడు  ధర్మేంద్ర  (డిసెంబర్ 8) కూడా 90 ఏళ్లు నిండుతాయనగా జరుపుకునే వారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఇటీవల తీవ్ర అనారోగ్యం నుంచి  కోలుకుని ఇంటికి చేరిన  ప్రముఖ బాలీవుడ్‌  ధర్మేంద్ర  ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడారు. అదీ తన ప్రాణ స్నేహితుడు సలీం ఖాన్‌ బర్త్‌డే రోజు కావడం మరింత విషాదాన్ని కలిగించింది. తనకు షోలే, సీతా ఔర్ గీతా చిత్రాలతో లాంటి సూపర్‌హిట్స్‌ అందించిన రచయిత సలీం ఖాన్ 90వ పుట్టినరోజున, 89 ఏళ్ల వయసులో మరణించడం యాదృచ్చికమే అయినా బాధాకరమైందని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ధర్మేంద్రకు  అంజలి ఘటించారు.

    అపూర్వ  స్నేహితుల పరిచయం
    1935వ సంవత్సరంలో వీరిద్దరూ రోజుల తేడాతో జన్మించారు. బ్లాక్‌బస్టర్‌ మూవీ సీతా ఔర్ గీత చిత్రంతో 1972లో సలీం ఖాన్ ,ధర్మేంద్ర  తొలిసారి కలిశారు. నిజానికి సలీం-జావేద్‌ ఇద్దరూ దిగ్గజ రైటర్స్‌గా చలామణి అయ్యారు.  ధర్మేంద్ర హీరోగా, నటి హేమ మాలిని టైటిల్ డబుల్ రోల్‌లో వచ్చిన చిత్రం సీతా ఔర్ గీత  భారీ హిట్‌ అందించింది. ఆ  తరువాత ధర్మేంద్ర, సలీం ఖాన్, జావేద్ అక్తర్‌తో కలిసి మరో మూడు చిత్రాలలో పనిచేశారు. వాటిల్లో ఈ ఏడాది ప్రారంభంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఐకానిక్ ‘షోలే’ కూడా ఉంది. మల్టీస్టారర్ యాదోం కి బారాత్ (1973),చాచా భటిజా (1977) ఉన్నాయి. రమేష్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన షోలే కేవలం ధరేంద్ర కరియర్‌లోనేకాదు, హిందీ సినిమా చరిత్రలోనే  మైలురాయిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం నాలుగు సినిమాలకే రచయితగా, నటుడిగా కలిసి పనిచేసినప్పటికీ, వార స్నేహసంబంధం కాలక్రమేణా వ్యక్తిగతంగా వికసించింది. 

    చదవండి: పెళ్లయ్యి ఏడాది కాలేదు, డెంటిస్ట్‌ అత్మహత్య : మంత్రి సన్నిహితుడు అరెస్ట్‌

    ఫిట్నెస్‌లో ఆయనే  స్ఫూర్తి
    1998లో సలీం ఖాన్ చిన్న కుమారుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో,  సల్మాన్ ఖాన్, కాజోల్  జంటగా నటించిన చిత్రం ప్యార్ కియా తో డర్నా క్యాలో ధర్మేంద్ర తండ్రి పాత్ర పోషించారు.  ఈసందర్బంగా సలీంఖాన్‌ గురించి ధరేంద్రతో తన  ఫ్రెండ్‌షిప్‌గురించి మాట్లాడారు. తమ అనుబంధం 1958-1959 నాటిదనీ, తమ స్నేహం చాలా గొప్పది, తనకు అన్నయ్య లాంటివాడు అని  సలీం ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ధర్మేంద్ర పట్ల తన ప్రేమ గురించి మాట్లాడాడు.  90లలో ఆయన ఫిట్‌నెస్‌ తనకు స్ఫూర్తి అనీ, ఆయన తన తండ్రిలాంటి వారు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. (ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ)

     

  • ఒడిలో ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ అకస్మాత్తుగా మాయమైపోతే.. ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి బాధ వర్ణనాతీతం. ఎవరెత్తుకుపోయారో.. ఏం  చేశారో, ఏమైపోయిందో.. అసలు బతికి ఉందో లేదో తెలియక  ప్రతీక్షణం నరకయాతన తప్పదు.  ఆరు నెలలు పాటు  మానసిక క్షోభను అనుభవించారో తల్లితండ్రులు.

    కానీ ఆ బిడ్డ ఆచూకీ దొరికేదాకా పోలీసులు కూడా అదే ఆవేదనను అనుభవించడమే ఈ వార్తలోని ప్రత్యేకత. చిన్నారి దొరికేదాకా వారికి ఊపిరి ఆడలేదు. సొంత బిడ్డ పోయినట్టుగా విలవిల్లాడి పోయారు. రాత్రింబవళ్లు కష్టపడ్డారు.  చివరికి ఆరు నెలలకు వారి కష్టం ఫలించింది. అలా ఈ ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం అనుకోకుండా అటు తల్లి దండ్రుల జీవితాల్లోనూ, ఇటు పోలీసు అధికారుల జీవితాల్లోనూ ఒక మర్చిపోలేని  మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

    అసలు కథ ఏంటంటే..
    అది మే 20, (2025) రాత్రి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌. షోలాపూర్‌కు చెందిన  ఒక సాధారణ జంట. తమ కలల పంట అయిన నాలుగేళ్ల  ఆరోహిని వెంట బెట్టుకొని ఈ దంపతులు, తన తండ్రి చికిత్స కోసం ముంబైకి వచ్చారు.  ప్రయాణంలో అలసిపోయారు. కాసేపు సేద దీరుతామని అలా కూర్చున్నారు. ఇంతలో తల్లిగా మాగన్నుగా నిద్ర పట్టింది.  ఉన్నట్టుండి ఒడిలో ఉన్న బిడ్డ మాయమైపోయింది. కళ్లు మూసి తెరిచేలోపే అంతా జరిగిపోయింది. దీంతో కంటిధారగా విలపించిన వారు పోలీసులను ఆశ్రయించారు. అనేక సార్లు అధికారులను వేడుకున్నారు. బిడ్డ ఫోటోను రైళ్లలో, మురికివాడల్లో, అనాథాశ్రమాలలో అపరిచితులకు చూపించారు. అలా ఆరు నెలలు తిండీ తిప్పలు లేకుండా  గడిపారు. కళ్లుమూసినా, తెరిచినా ‘‘ఆరోహి…ఆరోహి’’ ఒకటే ఒకటే ధ్యాస. బిడ్డ ఏమైపోయిందీ అనీ. మాయ దారి నిద్ర బిడ్డను దూరం చేసిందనే బాధతో నిద్రకే దూరమయ్యారు.

    అటు ముంబై పోలీసులుకూడా ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఆరోహి పోస్టర్‌లను ముద్రించారు, లోకమాన్య తిలక్ టెర్మినస్ నుండి భూసావల్ నుండి వారణాసి కాంట్ వరకు ప్రతి ప్లాట్‌ఫామ్‌పైనా అతికించారు. పేపర్లలలో ప్రకటనలు ఇచ్చారు. మరో విధంగా చెప్పాలంటే చేయని ప్రయత్నం లేదు. చివరికి జర్నలిస్టులను సంప్రదించారు. కొంతమంది అధికారులైతే చిన్నారిని తమ సొంత బిడ్డలా భావించి  ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకొని మరీ ఆచూకీ కోసం  ప్రయత్నించారు.

    ఆనందం వెల్లివిరిసిన క్షణాలు
    నవంబర్ 13న, వారణాసిలోని ఒక స్థానిక రిపోర్టర్  ఆరోహి పోస్టర్‌  చూశాడు. అంతే అతడి బుర్రలో ఏదో క్లిక్ అయింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే  ఒక అమ్మాయిని  గురించి తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం, ముంబై పోలీస్ ఇన్‌స్పెక్టర్ వారణాసిలో ల్యాప్‌టాప్ ముందు కూర్చుని వీడియో కాల్చేవాడు. అపుడు స్క్రీన్‌పై ఒక అద్భుతమైన దృశ్యం  కనిపించింది. పింక్ ఫ్రాక్‌లో  తన పాప. అదృశ్యమైన రోజుధరించింది అదే రంగుగౌను. ముంబైలో అధికారి వెనుక నిలబడి ఉన్న తల్లి తన కూతుర్ని తల్లికి నోట మాట రాలేదు.  తండ్రి మాత్రం  కళ్లనీళ్లతో సంతోషంగా "అది నా ఆరోహి... అది నా బిడ్డ..." అని   అరవడం మొదలు పెట్టాడు.

    అంతే వేగంగా  స్పందించిన పోలీసులు  విమానంలో పాపను  తీసుకొచ్చారు.  ముంబై క్రైమ్ బ్రాంచ్ మొత్తం  అక్కడ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొత్త బెలూన్లు , నీలి రంగు కొత్త ఫ్రాక్‌. కానీ  చిన్నారి  బయటకు వచ్చి ఖాకీ యూనిఫాంల సముద్రాన్ని చూసి తొలుత నివ్వెర పోయింది. మరుక్షణం పరుగెత్తుకుంటూ వచ్చి చేతులు చాచి, ఆమె సమీపంలోని అధికారిని మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది. ఆరు నెలలు మాయమైపోయిన అందమైన చిరునవ్వుతో, స్వచ్ఛంగా, నోరారా విరబూసిన నవ్వులు చూసిన ప్రతీ హృదయం  ఆనందంతో ఒప్పొంగి పోయింది. 

    తల్లిదండ్రులైతే నిశ్చేష్టులైపోయారు. గొంతు పూడుకుపోయింది. అడుగు ముందుకు పడలేదు. దీంతో పోలీసులే ఆమెను కన్నవారి వద్దకు తీసుకెళ్లారు. తల్లి  బిడ్డను తడిమితడిమి చూసుకుంది. ఆరు నెలలపాటు దూరమైన తన బంగారాన్ని ఆత్రంగా నిమురుకుంది. తండ్రి అయితే ఆ చిన్ని పాదాలపై మోకరిల్లిపోయాడు. ఇది నిజమేనా అనుకుంటూ బిడ్డ, భగవంతుడా నా బిడ్డను నాకు తిరికి నాకిచ్చావు అంటూ ఆ తల్లిదండ్రులు ఒకర్నొకరు తడిమి తడిమి చూసుకున్నారు.  ఒకరి కన్నీరు ఒకరు తుడుచుకున్నారు. ఆరు నెలల ఆవేదన, చీకటి వారి కౌగిలింతలు, ముద్దుల్లో దూదిపింజలా తేలిపోయింది.

    ఇంతకీ పాప ఎక్కడెళ్లిపోయింది
    రైల్వే స్టేషన్‌లో మాయమైన  పాప, వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసి(varanasi)లో తేలింది. ఆమెను ఎత్తుకు పోయిన కిడ్నాపర్‌ చెరనుంచి తప్పించుకుందో, లేదంటే వాళ్లే వదిలివేశారో తెలియదు కానీ,  జూన్‌లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ, చెప్పులు లేకుండా, బిక్కు  బిక్కు మంటూ కనిపించడంతో, అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది.   నీడనిచ్చి  కొత్త పేరు కూడా ఇచ్చింది. తన అసలు పేరు గుర్తులేని ఆ చిన్నారి “కాశీ”గా మారిపోయింది. కానీ  రాత్రిళ్లు మాత్రం దుప్పటి అంచుని పట్టుకుని "ఆయ్" (మరాఠీలో  అమ్మ) అని  మౌనంగా రోదించేది. ఆ జ్ఞాపకమే ఆమెను కన్నతల్లి ఒడికి తిరిగి తీసుకెళ్లింది.

    కిడ్నాపర్ మాత్రం ఎవరు?ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ ముంబైలో తప్పిపోయి, కాశీలో తేలి, తిరిగి తల్లి ఒడికి  చేరింది. ఇలాంటి తప్పిపోయిన పిల్లలను తిరిగి కన్న ఒడికి చేర్చే ఇలా కన్నీటి గాథలు విన్నపుడు ఖాకీలు కూడా మనుషులే. వారిలోనూ మానవత్వం ఉంది అన్న మాటలు అక్షర సత్యాలు అనిపించకమానదు.  హ్యాట్సాఫ్‌..!

    ఆనంద్‌ మహీంద్ర పొగడ్తలు 
    మోహిని మహేశ్వరి అనే ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ అయిన ఈ  ఘనటపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర  ఎక్స్‌లో స్పందించారు. ముంబై పోలీసులను ప్రశంసించారు.  మీరు  ఆశను, ఆనందాన్ని గొప్ప బహుమతిగా ఇచ్చారు.  ఈ ఒక్క కారణంతోనే మీరు మీరు ప్రపంచంలోని అత్యుత్తమ దళాలలో ఒకరు అంటూ కొనియాడటం విశేషం. ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది.ముంబై పోలీసులపై చిన్మయి శ్రీపాద, ఇతర సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా అభినందనలు వెల్లువెత్తాయి 


     

  • నాయకత్వ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. కర్ణాటక రాజకీయంలో బడా ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీఎం మార్పు ఉండొచ్చనే సంకేతాలను బలపరిచేలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానంటూ ఇంతకాలం పదేపదే చెబుతూ వచ్చిన ఆయన.. ఇవాళ సరికొత్తగా మాట్లాడడం కన్నడనాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

    సోమవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయిస్తే.. ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను. ఒకవేళ సీఎంను మార్చి తీరాలని అధిష్టానం భావిస్తే అందుకు కట్టుబడి ఉంటాను. నేను మాత్రమే కాదు.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా దీనిని అంగీకరించాల్సి ఉంటుంది’’ అని అన్నారాయన. 

    నవంబర్‌ 20వ తేదీన నుంచి కర్ణాటక రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌.. పవర్‌ షేరింగ్‌ ఫార్ములా ద్వారా సీఎం రేసులో ఉన్న సిద్దూ, డీకేశిలను చల్లార్చిందనే ప్రచారం ఒకటి ఉంది. రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే మద్దతుదారులు ఆయనకు సీఎంపగ్గాలు అప్పగించాలని గళం వినిపిస్తుండగా.. అనుభవాన్ని,సామాజిక వర్గాల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని కొనసాగించాలంటూ సిద్ధరామయ్య మద్దతుదారులు ఢిల్లీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. 

    డీకే శివకుమార్‌కు శిబిర ఎమ్మెల్యేల సంఖ్య పరిమితంగా ఉండడంతో ఈ మార్పునకు అధిష్టానం సుముఖంగా లేదని నిన్నటిదాకా ప్రచారం వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. వాళ్లంతా మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ హైకమాండ్‌ను కలవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఇటు సిద్ధరామయ్య కూడా సీఎం సీటు నుంచి దిగేందుకు సిద్ధమంటూ తాజాగా ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

    అంతా వాళ్ల చేతుల్లోనే..
    కర్ణాటకలో కేబినెట్‌ పునర్వవ్యస్థీకరణ(పీసీసీ చీఫ్‌ మార్పు సహా) చేపట్టాలని సిద్ధరామయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సీఎం సీటు పంచాయితీ తేల్చిన తర్వాతే ఆ పని చేయాలంటూ డీకే శివకుమార్‌ పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో.. ‘‘నాలుగైదు నెలల కిందటే హైకమాండ్‌ నుంచి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు తనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిందని.. అయితే రెండున్నరేళ్ల పాలన పూర్తి అయ్యేదాకా ఆగాలని భావించానని’’ సిద్ధరామయ్య ఇవాళ మీడియాకు తెలిపారు. అయితే.. పవర్‌ షేరింగ్‌ ఫార్ములా(రెండున్నరేళ్ల తర్వాత  సీఎం సీటు వదులకునేందుకు సిద్ధపడ్డారా?) అనేది ఒకటి ఉందా?.. అందుకు మీరు అంగీకరించారా? అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు.. అంతా హైకమాండ్‌ చేతుల్లోనే ఉంటుంది అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారాయన. 

    ఆయన వస్తేనే..
    కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌తో రీప్లేస్‌ చేయాలంటూ కొంత కాలంగా నడుస్తున్న రాజకీయాలతో ఢిల్లీ వేడెక్కుతోంది. ఇప్పటికే డీకే శివకుమార్‌ వర్గీయులు హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపారు. మరోవైపు.. శనివారం సిద్ధూ వర్గం ఎడతెరిపి లేకుండా బెంగళూరు పర్యటనకు వచ్చిన ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరిపింది. అయితే.. అంతిమ నిర్ణయం అగ్రనేత రాహుల్‌ గాంధీ చేతుల్లోనే ఉందంటూ ఖర్గే వాళ్లతో తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 

    ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఖర్గే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాకే కర్ణాటక కాంగ్రెస్‌ సంక్షోభం ఓ కొలిక్కి రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

  • న్యూఢిల్లీ: గుజరాత్‌ వ్యాపారవేత్తలు సందేసర సోదరుల ఆర్థిక కుంబకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు బ్యాంకుల వద్ద రుణాల ఎగవేతకు పాల్పడిన సందేసర సోదరులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు. వారి విజ్ఞప్తికి సుప్రీం కోర్టు అంగీకరించింది. డిసెంబర్‌ 17లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారిపై నమోదైన అన్నీ క్రిమినల్‌ కేసులపై విచారణ నిలిపివేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

    నితిన్ సందేసర, చేతన్ సందేసర,దీప్తి సందేసర ఇతర కుటుంబ సభ్యులు స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రమోట్ చేశారు. ఈ సంస్థ భారత్‌తో పాటు, విదేశీ బ్యాంకుల్లో విదేశీ  శాఖల నుంచి రూ.13వేల కోట్లుకు (అంచనా)పైగా రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి, బ్యాంకులకు నష్టం కలిగించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ కేసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్కామ్ కంటే పెద్దదిగా భావించబడుతోంది. పీఎన్‌బీ స్కామ్ (నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ) సుమారు రూ. 13,500 కోట్లుకాగా.. సందేసరా బ్రదర్స్ స్కామ్ రూ. 14,000 కోట్లకు పైగా ఉంది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద మోసాలలో ఒకటిగా పరిగణలో ఉంది.  

    స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై పదుల సంఖ్యలో ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే కేసులు నమోదయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతూ వస్తోంది. ఈక్రమంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్ని తిరిగి చెల్లిస్తామని సందేసర సోదరులు ముందుకు వచ్చారు. ఇదే అంశంపై జరిగిన విచారణలో సందేసర సోదరుల విజ్ఞప్తికి సుప్రీం కోర్టు సమ్మతి తెలిపింది. డిసెంబర్ 17 లోగా వారు రుణదాత బ్యాంకులకు రూ.5,100 కోట్ల వన్ టైమ్ సెటిల్‌మెంట్ చెల్లించాలనే షరతు విధించింది.

    ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. నితిన్ సందేసర,చేతన్ సందేసర సహ నిందితులపై సీబీఐ,ఈడీ,పీఎంఎల్‌ఎ కింద దాఖలు చేసిన అన్ని కేసులను సెటిల్‌మెంట్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత క్రిమినల్‌ విచారణ నిలిపివేస్తామని ఉత్తర్వులో పేర్కొంది. ఆ ఉత్తర్వులో, ప్రజాధనాన్ని తిరిగి పొందడం ప్రాథమిక లక్ష్యం అని బెంచ్ నొక్కి చెప్పింది. మోసం చేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తే నేరారోపణలను పొడిగించడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది.

  • Dentist Suicide case  ముంబై:  హత్యారోపణల కింద మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే  (Pankaja Munde) ముఖ్య సన్నిహితుడిని పోలీసలు అరెస్టు చేయడం  కలకలం రేపింది. పంకజ ముండే వ్యక్తిగత సహాయకుడు అనంత్ గార్జేని ముంబైలోని వర్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య గౌరీ గార్జే ఆత్మహత్య కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

    అనంత్‌ భార్య గౌరీ శనివారం సాయంత్రం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే  భర్త ఆమెపై వేధింపులకు పాల్పడి, తీవ్రంగా హింసించాడని, అవి భరించలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందన్న గౌరీ కుటుంబం ఆగ్రహం  వ్యక్తం చేసింది.  గార్జేకు వివాహేతర సంబంధం ఉందని మరొక మహిళతో మొబైల్ ఫోన్‌లో చాట్ చేస్తుండగా పట్టుబట్టాడని, దీంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆరోపించారు.  దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్-కెమెరా పోస్ట్‌మార్టం ,సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా కేసు దర్యాప్తు చేయాలని  డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చసిన పోలీసులు  సోమవారం తెల్లవారు జామున వర్లీ పోలీసులు గార్జేను అరెస్టు చేసి, కోర్టులో హాజరపర్చారు.

    గౌరీ ప్రభుత్వ కెఇఎం ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా పని చేస్తున్నారు.  అనంత్‌, గౌరీ వివాహం ఈ ఏడాది  ఫిబ్రవరి 7న  జరింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి పంకజ ముండే, మాజీ ఎంపీ ప్రీతమ్ ముండే సహా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అయితే పెళ్లి అయ్యి ఇంకా  ఏడాది కూడా నిండకుండానే ఆమె బలవన్మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు  తావిస్తోంది. 

    ఇదీ చదవండి: బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స

  • ఉత్తరఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలోని నరేంద్రనగర్ ప్రాంతం సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు లోయలో బోల్తాపడింది. ఈఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి.  ప్రమాద సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో ఐదుగురు మృతి చెందగా మిగిలిన 13 మందికి తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం కుంజాపురి ఆలయానికి సమీపంలో ఉంటుంది. 

    కాగా బస్సుప్రమాద ఘటనపై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తననుతీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాలైన ప్రయాణికులను వెంటనే జిల్లాయంత్రాంగం స్థానిక ఆసుపత్రులకు తరిలించిందని తీవ్రంగా గాయపడ్డవారిని రిషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

  • బాగ్‌పత్‌: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో పెళ్లి వేడుక విషాదకరంగా మారింది. కొద్దిసేపటిలో జరిగే వివాహానికి సిద్ధమవుతున్న వరుడు సుబోధ్ కుమార్ (25) అకాల మృత్యువు బారిన పడ్డాడు. అప్పటివరకూ ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లి వేదికపై విషాదం తాండవించింది. పిచోక్రా గ్రామానికి చెందిన సుబోధ్ కుమార్  బంధువులతో సహా ఆదివారం రాత్రి సరూర్‌పూర్ కలాన్ గ్రామానికి వాహనంలో బయలుదేరాడు.

    కొద్దిసేపటికి సుబోధ్‌కు అస్వస్థతగా అనిపించి, వాంతి చేసుకునేందుకు వాహనం నుంచి దిగి రోడ్డు పక్కకు వెళ్లాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబోధ్ రోడ్డు పక్కన వాంతులు చేసుకుంటున్న సమయంలో ఎదురుగా అత్యంత వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అతన్ని ఢీకొని కొన్ని మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన సుబోధ్‌ను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే సుబోధ్‌ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

    రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వరుడిని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజ్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన బినౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ట్రక్ డ్రైవర్‌ను గుర్తించేందుకు అధికారులు హైవేతో పాటు సమీప ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

    ఇది కూడా చదవండి: 25న అయోధ్యలో మరో ఉత్సవం.. ‍ప్రధాని మోదీ హాజరు

Family

  • భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన తండ్రికి అస్వస్థతగా ఉండటంతో ఉన్నపళంగా పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైద్యులు ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధానాకు గుండెపోటుని పోలిన లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడమ వైపు ఛాతీ నొప్పి, రక్త పోటుపెరగడం వంటివి గుండెపోటుకి సంకేతమని, తక్షణమే యాంజియోగ్రఫీ అవసరమని వైద్యులు భావిస్తున్నారు. అసలు ఇలా ఆకస్మికంగా ఈ లక్షణాలు ఎలా వస్తాయి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, యాంజియోగ్రఫీ అంటే..వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.

    స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధానకు ఎడమవైపు ఛాతినొప్పి వచ్చిన తర్వాత ఉదయం 11.30 గంటల ప్రాంతంలో గుండెపోటు లక్షణాలు కనిపించాయి. వెంటనే కుటుంబసభ్యులు సాంగ్లిలోని సరవిత్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ శ్రీనివాస్‌కి కార్డియాక్ ఎంజైమ్‌లు కొద్దిగా పెరిగినప్పటికీ పూర్తి వైద్య బృందం పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు వైద్యులు. 

    ఆయనకు రక్తపోటు పెరుగుతోందని, అందువల్ల నిరంతన ఈసీజీ పర్యవేక్షణ తోపాటు యాంజియోగ్రపీ కూడా అవసరం అవ్వొచ్చని చెప్పారు. ఇది శారీరక లేదా మానసిక ఒత్తిడి వల్ల కావొచ్చని అన్నారు. అందులోనే వివాహం అనగానే ఒకవిధమైన ఆందోళన సహజంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఓ కారణం కావోచ్చని అన్నారు.

    అధిక రక్తపోటు అంటే..
    ధమని గోడలపై రక్తం నెట్టడం వల్ల కలిగే శక్తి స్థిరంగా చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి. దీనిని 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువ స్థిరంగా చూపించడంగా పేర్కొనవచ్చు. ఈ పరిస్థితి వల్ల గుండె రక్తాన్ని పంప్‌ చేసేందుకు కష్టపడాల్సి వస్తుంటుంది. తగిన సమయంలో చికిత్స అందించకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్‌, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. 

    సాధారణంగా అధిక రక్తపోటుకు ఎలాంటి లక్షణాలు ఉండవట. అందువల్లే చాలామంది వ్యక్తులు ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఏళ్ల తరబడి దాంతో గడిపేస్తుంటారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. 46 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలకు  తమకు అధిక రక్తపోటు ఉందని కూడా తెలియదని చెబుతున్నారు నిపుణులు. 

    బీపీ ఎక్కువగా ఉంటే ఈ లక్షణాలు తప్పనిసరి..

    • మానసిక పనితీరులో మార్పులు

    • ఛాతీ నొప్పి

    • మైకము

    • శరీరంలో ఎడెమా లేదా వాపు

    • గుండె దడ

    • సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన

    • మూర్ఛలు

    • తీవ్రమైన తలనొప్పి

    • ఆకస్మికంగా ముఖం వంగిపోవడం, అస్పష్టమైన ప్రసంగం లేదా  చేయి లేదా కాలులో స్ట్రోక్ సంకేతాలు

    • కంటి నొప్పి, దృష్టి కోల్పోవడం లేదా ఆకస్మిక అస్పష్టమైన దృష్టి లోపం

    కారణాలు..
    అందరికీ అధిక రక్తపోటుకు ఇందువల్లే రాగలదని ఒకే కారణాన్ని చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక రకాల అంశాలు కారణమవుతాయని, వాటివల్లే ఈ పరిస్థితికి దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని:

    • 55 ఏళ్లు పైబడిన వారు

    • కుటుంబంలో చరిత్రలో ఎవరికైన ఈ పరిస్థితి ఉంటే

    • ధూమపానం లేదా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం

    • అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం

    • సోడియం అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం

    • తగినంత శారీరక శ్రమ లేకపోవడం.

    • అధికంగా మద్యం సేవించడం

    • చాలా సందర్భాలలో అధిక రక్తపోటుకు ఎందువల్ల వచ్చిందనేది గుర్తించగలరట. ఇందులో అంతర్లీన పరిస్థితి, మందులు లేదా పదార్ధం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, మూత్రపిండ ధమని స్టెనోసిస్, ప్రాథమిక ఆల్డోస్టెరోనిజం, థైరాయిడ్ వ్యాధి వంటి వాటి వల్ల కూడా కావొచ్చట.

    యాంజియోప్లాస్టీ ఎందుకు చేస్తారు?
    ఇరుకైన లేదా మూసుకుపోయిన ధమనిలో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ముఖ్యంగా గుండెపోటు సమయంలో లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి (కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు ఇరుకుగా మారడం) వల్ల వచ్చే తీవ్రమైన ఛాతీ నొప్పి (ఆంజినా) వంటి పరిస్థితులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ధమనిని తెరిచి, గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు. 

    దీన్ని  మెడ, కాళ్ళు లేదా మూత్రపిండాలు వంటి శరీరంలోని ఇతర భాగాలలోని ధమనులపై కూడా ఆయా ప్రాంతాలలో అడ్డంకులను చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. 

    అంతేగాదు హృదయ ధమనిలో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. కాబట్టి, ధమనిని త్వరగా తెరవడానికి, రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి, గుండె కండరాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి యాంజియోప్లాస్టీని అత్యవసర ప్రక్రియగా చేస్తారు వైద్యులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: Farah Khan: వెయిట్‌ లాస్‌ జర్నీ కోసం ఫరా ఖాన్‌ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..)

     

  • బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్‌కట్‌లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్‌తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్‌గా నిజాయితీగా తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్‌ మారడానికి ఎంత టైం పట్టిందంటే..

    ఫరాఖాన్‌ సోహా అలీఖాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్‌ ఆల్‌ అబౌట్‌ హర్‌ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్‌ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్‌ ఇచ్చేసింది ఫరా. 

    తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్‌ నైట్‌ షిప్ట్‌లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్‌ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్‌కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె. 

    అయితే తాము అక్కడ ఒక రూమ్‌ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్‌ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది.  అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.

    తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్‌లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్‌ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్‌గా మారలేదన్నమాట.

    (చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!)

     


     

  • నవంబర్‌21, 2025న మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకుంది ఫాతిమా బాష్‌. ఆ కిరీటం తోపాటు పూర్వీకులు(ఇంతకుమునుపు ఆ కీరిటం గెలుపొందినవారు) నెరవేర్చిన బాధ్యతలను సైతం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌తో నీలిరంగు దుస్తులతో ఆ కిరీటం తోపాటు వెండి రంగు రిబ్బన్‌ కూడా ధరించి. ఇంతకీ ఇది దేనికి సంకేతం, దాని ప్రాముఖ్యత ఏంటంటూ అంత తెగ వెతికేస్తున్నారు. మరి అదెంటో తెలుసుకుందామా..!.

    సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు ధరించే ముడివేసిన రిబ్బన్‌ దేనికోసం నిలబడుతున్నారనేది తెలుపుతుంది. ఎరుపు రంగు ఎయిడ్స్‌, గుండెజబ్బుల అవగాహనను సూచిస్తుంది. అదే గులాబీ రంగు రిబ్బన్‌ రొమ్ము కేన్సర్‌ని సూచిస్తుంది​. ఇక పసుపు ఆత్మహత్య నివారణను సూచిస్తుంది. అలా ఇలా కాకుండా సిల్వర్‌ కలర్‌ ధరించిన ఫాతిమా దేనికోసం కృషి చేసింది, ఏ అంశంపై అవగాహన కల్పిస్తుంది అంటే..

    వెండి రిబ్బన్‌ ప్రాముఖ్యత..
    మిస్‌ యూనివర్స్‌ ఫాతిమా బాష్‌  ధరించిన వెండి రిబ్బన్‌ స్కిజోఫ్రెనియా, పార్కిన్సన్స్, డైస్లెక్సియాతో సహా మెదడు వ్యాధులు, రుగ్మతలు, వెకల్యాలకు మద్దతును సూచిస్తుంది. ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న కళంకాన్ని తొలగించి, పరిశోధన, మద్దతు కోసం తన ఫాలోవర్లుకు అవగాహన కల్పించేలా ప్రభావితం చేసేందుకు ఆ రిబ్బన్‌ని ధరించారామె.  

    అదే ఎందుకంటే..
    ఫాతిమా బాస్‌ పాఠశాలలో ఉన్నప్పుడు డిస్లెక్సియా ADHDతో ఇబ్బంది పడినందున ఆమె ముడి వేసిన వెండి రిబ్బన్‌ను ధరించి కనిపించింది.ఇక ఆమెక చదవు అంటే మహా ఇష్టం. ఆ అభిరుచితోనే జస్ట్‌ 16 ఏళ్లకే యూఎస్‌ వెళ్లింది. ఆమె తన కెరీర్‌ని పూర్తిగా ఫ్యాషన్‌కే అంకితం చేసింది. అలాగే కేన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా కూడా పనిచేస్తుంది. వీక్‌ ఆఫ్‌ సమయాల్లో వార్షిక టోయ్‌ డ్రైవ్‌ని నిర్వహిస్తుందట

     

     

    (చదవండి: పిల్లలు నాకే పుట్టారా?.. డీఎన్‌ఏ టెస్టుల కలకలం)