Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు, యువ వ్యాపారవేత్త అనంత్ అంబానీ తన విలాసవంతమైన ఆటోమొబైల్ కలెక్షన్‌కు (Anant Ambani Car Collection ) మరో కొత్త మాస్టర్‌ పీస్‌ను జోడించారు. రోల్స్ రాయిస్  ఫాంటమ్ VIII సిరీస్ II ఎక్స్‌టెండెడ్‌ (Rolls Royce Phantom VIII Series II) కారును ఆయన కొనుగోలు చేశారు.ఆకర్షణీయమైన ‘స్టార్ ఆఫ్ ఇండియా ఆరెంజ్’ రంగులో ఉన్న  ఈ మోడల్‌ ధర సుమారు రూ.10.5 కోట్లు.

    విస్తరించిన వీల్‌బేస్ వేరియంట్‌ రోల్స్ రాయిస్‌ సాంప్రదాయం, ఆధునికతను సమపాళ్లలో మిళితం చేస్తుంది. హస్తకళతో రూపొందించిన ఇంటీరియర్‌, శబ్దరహిత V12 ఇంజిన్‌, అత్యున్నత సౌకర్యం కలిగిన కేబిన్‌ దీని ప్రధాన విశేషాలు. లెదర్‌, ఓపెన్‌పోర్ వుడ్ వెనీర్స్‌, కస్టమైజ్డ్‌ డీటైల్స్‌తో కూడిన ఇంటీరియర్‌ బ్రాండ్‌ తత్వమైన “సమయానికి మించిన లగ్జరీ”ని ప్రతిబింబిస్తుంది.

    ‘స్టార్ ఆఫ్ ఇండియా’కు నివాళి
    ఈ ప్రత్యేక ఆరెంజ్ షేడ్‌ (Anant Ambani Rolls Royce) 1934లో రాజ్‌కోట్ మహారాజా ఠాకూర్ సాహిబ్ ధర్మేంద్రసింహ్‌జీ లఖాజీరాజ్‌ ఆవిష్కరించిన పురాతన రోల్స్ రాయిస్‌ ఫాంటమ్ II నుండి ప్రేరణ పొందింది. ఆ కారు ‘థ్రప్ & మాబెర్లీ’ రూపొందించిన ఏడు సీట్ల క్యాబ్రియోలెట్‌ మోడల్‌.. షాఫ్రాన్‌, సిల్వర్‌ రంగుల కలయికలో తయారైంది. దానిని అప్పట్లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అని పిలిచేవారు. ఇది భారతీయ రాయల్టీ మోటరింగ్ చరిత్రలో అత్యంత చరిత్రాత్మక కార్లలో ఒకటి.

    తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు 2025లో అంబానీ కార్ల కలెక్షన్‌లో మెరిసింది. తాజా ఫాంటమ్ కూడా అదే కలర్‌ స్కీమ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉన్న ఇది 563 క్యారెట్ల నక్షత్ర నీలమణి.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్ సఫైర్ నుండి ప్రేరణ పొందింది.

    రాజ్‌కోట్ యువరాజు మంధాతసింహ్ జడేజా ఈ అసలైన ‘స్టార్ ఆఫ్ ఇండియా’ ఫాంటమ్ IIని మొనాకో వేలంలో బ్రిటిష్ కలెక్టర్‌ నుంచి తిరిగి కొనుగోలు చేయడం ద్వారా ఈ చరిత్రాత్మక కారు భారతదేశానికి తిరిగి తీసుకువచ్చారు.

    అప్పట్లోనే ఆధునిక సాంకేతికత
    1930లలోనే ఈ కారు స్టీరింగ్ వీల్‌తో నియంత్రించగలిగే, వాహనం కదలికను అనుసరించే హెడ్‌లైట్లు వంటి అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉండేది . నేడు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ వంటి కార్లలో కనిపించే అడాప్టివ్ కర్వ్ లైట్స్ సాంకేతికతకు ఇది తొలి రూపం అని చెప్పవచ్చు.

  • బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.

    ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.

    సెయిల్‌ బోట్‌ల రేసింగ్‌ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్‌ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్‌పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్‌ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.

    ఇదీ చదవండి: కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్‌ అంబానీ

  • ఇల్లా, ఫ్లాటా.. లేక వాణిజ్య భవనాల్లో స్థలమా? దేంట్లో తీసుకుంటే భవిష్యత్తులో ధర పెరగడానికి ఆస్కారముంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి అందుకోవచ్చు? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి, నేటికీ అధికశాతం మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  – సాక్షి, సిటీబ్యూరో

    అందుబాటు ప్రాంతాలిక్కడే.. 
    నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య 
    సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని 
    తెలిసింది.

    పక్కాగా చూడాలి 
    నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది.

    వాణిజ్య సముదాయాలా? 
    పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోలిస్తే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది.

    ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉంటాయి. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గృహరుణాలతో పోలి్చతే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు.  

    నివాస సముదాయాలా? 
    మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో 20 శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. 20–25 ఏళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. 20 శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది.

    నివాస సముదాయాల రంగంలో ఏటా 12–15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్‌ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్టును సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక నిర్వహణ మెరుగ్గా జరపాలి.

    ఇదీ చదవండి: ఇంటికి ఇలాంటి ఫ్లోరింగ్‌.. ఇప్పుడిదే ట్రెండింగ్‌!

  • ఎంతటి అనుభవం, అవగాహన ఉన్నవారికైనా వృత్తిపరమైన జీవితంలో అనేక సందేహాలు, సందిగ్ధాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ప్రొఫెషనల్‌ కమ్యూనిటీ వేదిక రెడిట్‌లో పంచుకుంటూ సలహాలు కోరుతుంటారు. ఇలాగే హైదరాబాద్‌కు చెందిన టెకీ కూడా తనకు ఎదురైన సందిగ్ధాన్ని షేర్‌ చేశారు.

    ఈ హైదరబాద్‌ టెకీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తనకు యూఎస్‌ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్‌ గురించి సబ్‌రెడిట్ (కమ్యూనిటీ గ్రూప్‌) ఇండియన్‌వర్క్‌ప్లేస్‌లో షేర్‌ చేసి ఏం చేయమంటూరు? అంటూ సలహా కోరడంతో ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.

    ఆ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగానికి సంవత్సరానికి 1,10,000 డాలర్లు (సుమారు రూ.96.6 లక్షలు) జీతం ఇస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు.. ప్రాజెక్టు ఆధారిత కన్సల్టెన్సీ కాంట్రాక్ట్. ఈ ఆఫర్‌ను తాను పరిశీలిస్తున్నప్పటికీ, పన్ను బాధ్యతలు, ఉద్యోగ భద్రత, అలాగే దీర్ఘకాలిక కెరీర్ ప్రమాదాలు వంటి అంశాలపై అనిశ్చితంగా ఉన్నట్లు టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

    తాను ఆ ఆఫర్‌ను అంగీకరించాలనుకుంటే, పన్ను ప్రయోజనాలను గరిష్ఠం చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్‌ సలహా తీసుకోవడం, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్‌ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో స్టార్టప్‌ వ్యాపారం విజయవంతంగా పెరిగితే యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చమని కోరే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

    ఈ పోస్ట్‌ కొద్ది సమయంలోనే వైరల్‌ అయింది. వందలాది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఫైనాన్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది ఈ ఆఫర్‌ను ప్రమాదకరంగా పేర్కొంటూ, స్థిరమైన ఉద్యోగాన్ని కొద్దిపాటి జీతం పెరుగుదల కోసం విడిచిపెట్టడం సరైంది కాదని అన్నారు.

    మరికొందరు మాత్రం, వృద్ధి చెందుతున్న యూఎస్‌ స్టార్టప్‌లో చేరడం దీర్ఘకాలంలో పెద్ద అవకాశాలను అందించవచ్చని, ముఖ్యంగా యూఎస్‌ రీలొకేషన్‌ సాధ్యమైతే ఇది కెరీర్‌ బూస్టర్‌ అవుతుందని వ్యాఖ్యానించారు. కన్సల్టెన్సీ రోల్‌లో ఉండే ఉద్యోగ భద్రతా లోపం దృష్ట్యా ఈ వేతనం సరిపోదని, మరికొంత కోరాలని మరో యూజర్‌  సలహా ఇచ్చారు.

    ఇదీ చదవండి: ‘కొత్త’ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు

  • శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కనిపించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. అనేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్‌)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూసేందుకు చక్కగా కనిపించడం.. తదితర కారణాలతో వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో

    రెండు రకాలు.. 
    వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్‌ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్‌ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్‌ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్‌ కోటింగ్‌ వేస్తారు.  

    ధర ఎంత? 
    ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీంతో ఇంటిని అలంకరించాలంటే.. చదరపు అడుగుకి రూ.200–రూ.350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ 100 చదరపు అడుగుల గదికి సుమారు రూ.20 వేలు అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్‌ కు చదరపు అడుగుకి రూ.300 దాకా అవుతుంది. వెదురు కలప ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ.15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. ఒక్కరోజులో పని పూర్తవుతుంది. ఈ గచ్చు ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. దీనిపై గీతలు కనిపించవు. కాలిపోవడమంటూ ఉండదు. కొన్నాళ్ల తర్వాత రంగు వెలిసిపోతుందన్న దిగులు అక్కరలేదు. నిర్వహణలో శ్రమపడక్కర్లేదు.  

    బుడతల గదికి ప్రత్యేకం.. 
    సిరాను పీల్చుకునే గుణం వెదురు గచ్చుకి ఉండటం వల్ల.. చాలామంది తమ బుడతల గదుల్లో వాడుతున్నారు. చిన్నారులు కిందపడినా దెబ్బలు తగలవు. హోమ్‌ థియేటర్లు, పడక గదుల్లోనూ ఈ తరహా గచ్చును కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. సంపన్న గృహాల్లోని బయటి ప్రాంతాల్లోనూ ఈ రకం కలపతో అలంకరిస్తున్నారు. ఉద్యానవనాలు, బాల్కనీలు, స్విమ్మింగ్‌పూల్, పోర్టికోల వద్ద విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చదరపు అడుగుకి రూ.400 వరకూ అవుతుంది. అన్నిరకాల 
    వాతావరణానికి ఎదురొడ్డి నిలబడం వల్ల వెదురు గచ్చు మీద ప్రత్యేక మక్కువ పెరుగుతోంది.

  • సెక్యూరిటీల జారీ ద్వారా రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. ‘‘రైట్స్‌ ఇష్యూ, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ), ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ లేదా ఇతర చట్టబద్దమైన మార్గాల ద్వారా ఈక్విటీ షేర్లు/వారెంట్లు లేదా కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు జారీ చేసి రూ.1,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.’’ అని బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే నిధుల సమీకరణ కారణాలను మాత్రం వెల్లడించలేదు.

    2024 ఆగస్టులో బోర్సులలో లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) లో తాజా ఇష్యూ ద్వారా రూ .5,500 కోట్లు సేకరించిన ఏడాది తరుతాత మళ్లీ ఇప్పుడు నిధుల సేకరణకు ఆమోదం లభించడం గమనార్హం​. 2025 మేలో, బెంగళూరుకు చెందిన కంపెనీ బోర్డు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు, ఇతర రుణ సాధనాల ద్వారా రూ .1,700 కోట్ల వరకు సేకరించే ప్రణాళికలను ఆమోదించింది. సాఫ్ట్ బ్యాంక్, జెడ్ 47, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్, ఇతరులతో సహా పెట్టుబడిదారులు ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీలో తమ వాటాలను తగ్గించుకున్నారు.

    ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ .428 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇది ఒక సంవత్సరం క్రితం రూ .327 కోట్లు కాగా, మార్చిలో రూ .870 కోట్ల నష్టం కంటే తక్కువగా ఉంది. నిర్వహణ ఆదాయం రూ .828 కోట్లు. ఇది ఒక సంవత్సరం క్రితం కంటే దాదాపు సగం.

  • ఫోన్ మన ఫ్రెండ్, మన స్టయిల్, కొన్నిసార్లు మన సీక్రెట్‌ కీపర్‌ కూడా! అలాంటి ఫోన్‌ను కాపాడే కవర్స్, ఫోన్‌ కేస్‌లను తక్కువ అంచనా వేయొద్దు! ఇవి కేవలం ప్రొటక్షన్ కోసం మాత్రమే కాదు. స్మార్ట్‌నెస్, సౌలభ్యం అన్నీ కలిపిన మ్యాజిక్‌ కవర్స్‌ కూడా!

    సోలార్‌ కేస్‌!
    ఫోన్ ‘లో బ్యాటరీ’ అని అరుస్తుందా? పైగా పవర్‌బ్యాంక్‌ కూడా మర్చిపోయారా? టెన్షన్ వద్దు! బయటకి వెళ్లి సూర్యుడి వైపు మీఫోన్‌ను చూపించండి. అప్పుడు ఈ కేస్‌ చెప్తుంది ‘ఓకే బ్రో, నేను ఉన్నా కదా!’ ఎందుకంటే ఇది సాధారణ ఫోన్‌ కవర్‌ కాదు. ‘అయాన్ సోలార్‌ కేస్‌’ మార్కెట్‌లో కొత్తగా వచ్చిన ఈఫోన్‌ కేస్‌ ఒక గంట సూర్యరశ్మిని ఉపయోగించి మీ ఫోన్‌ను ఫుల్‌ చార్జ్‌ చేస్తుంది. వైర్లు లేవు, ప్లగ్‌ లేదు. పైగా క్యూట్‌గా క్లాసీగా స్టయిలిష్‌ డిజైన్‌తో కూడా వస్తుంది. ఇది తొంభై ఐదు శాతం పవర్‌ను సమర్థంగా ట్రాన్స్‌ఫర్‌ చేయగలదు. అంటే ఎక్కడైనా, చార్జింగ్‌ ఎఫిషియెన్సీ పూర్తి అయితే, తర్వాతి రోజులకు ఇది, ఒక పవర్‌బ్యాంక్‌ లాగా బ్యాటరీని స్టోర్‌ కూడా చేస్తుంది. ధర 99 డాలర్లు అంటే రూ. 8,778.

    సెల్ఫీ స్టార్‌
    ఫోన్‌లో ఫొటో తీసుకుంటే వెలుతురు తక్కువగా ఉందా? వీడియో తీయాలంటే ముఖం స్పష్టంగా కనిపించడం లేదా? ఇక ఆ సమస్యలకు పూర్తి లైట్‌ సొల్యూషన్ వచ్చేసింది! అదే ఈ ‘సెల్ఫీ ఎల్‌ఈడీ రింగ్‌ లైట్‌ కేస్‌’. ఫోన్ కవర్‌లా కనిపించే ఈ కేస్‌లోనే లైట్‌ దాగి ఉంటుంది. బటన్ నొక్కగానే గుండ్రంగా వెలిగే రింగ్‌ లైట్‌ బయటకి వస్తుంది. ఒక్కసారి నొక్కితే లైట్‌ ఆన్, తర్వాతి ఆప్షన్లతో మీ ఇష్టానికి సరిపోయేలా వెలుతురు తక్కువగా లేదా ఎక్కువగా సర్దుకోవచ్చు. సెల్ఫీలు, వీడియోలు, మేకప్, రీల్‌లు ఏదైనా సరే, మిమ్మల్ని ఒక స్టార్‌లా మెరిపించే బాధ్యత ఇది తీసుకుంటుంది. అదనపు వైర్లు, బ్యాటరీల అవసరం లేకుండా, దీనిని యూఎస్‌బీ ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు. ధర బ్రాండ్, డిజైన్ బట్టి మారుతుంది.

    పాకెట్‌లో గేమ్‌ పార్ట్‌నర్‌
    పెద్ద గేమ్‌ కంట్రోలర్‌ను జేబులో పెట్టుకొని వెళ్లడం సాధ్యం కాదు. కాని, ఫోన్‌కు ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే కేస్‌లో దాచేస్తే ఎలా ఉంటుంది ? అదే ఈ ‘ఎమ్‌కాన్ కంట్రోలర్‌’. ఇది బయటకి సాధారణ ఫోన్‌  కేసులా కనిపించినా, లోపల మాత్రం గేమింగ్‌ మాయ దాగి ఉంటుంది. దీని సైడ్‌లో ఉన్న రెండు బటన్లను ఒకేసారి నొక్కగానే అసలు సరదా మొదలవుతుంది! అప్పటిదాకా, ఫోన్‌ వెనుక దాగి ఉన్న గేమ్‌ కంట్రోలర్‌ ఒక్కసారిగా బయటకి వచ్చేస్తుంది. కనెక్ట్‌ చేయడం చాలా సులభం. స్క్రీన్‌ను గేమింగ్‌ కోణంలో సెట్‌ చేసి, గ్రిప్స్‌ను లాక్‌ చేస్తే, ఇక దీనికున్న స్మూత్‌ బటన్లతో ఆట నిశ్శబ్దంగా, స్మూత్‌గా సాగిపోతుంది. తక్కువ బరువుతో, స్టయిలిష్‌గా పాకెట్‌లో సులభంగా ఇమిడిపోయేలా దీని డిజైన్ ఉంటుంది. ధర 129 డాలర్లు, అంటే సుమారు రూ. 11,439.

  • ప్రపంచ ప్రఖ్యాత షిప్పింగ్ కంపెనీ 'ఎవర్‌గ్రీన్'కు చెందిన ఒక పెద్ద కార్గో నౌక పెరూ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ నౌకలో ఉన్న సుమారు 5,00,000 ఐఫోన్ 17 మొబైల్స్ సముద్రంలో మునిగిపోయాయి. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది?, జరిగిన నష్టం ఎంత అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    పెరూలోని ప్రారంభ షిప్పింగ్ లాగ్‌లు & సంబంధిత అధికారుల ప్రకారం.. ఎవర్‌గ్రీన్ నౌక చైనాలోని షెన్‌జెన్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌కు వెళుతుండగా కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలోనే నౌక పెరూలోని కల్లావో ఓడరేవులో షెడ్యూల్ ప్రకారం ఆగింది. అయితే బలమైన గాలులు, శక్తివంతమైన అలల కారణంగా.. కంటైనర్లు పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం సుమారు 50 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు సమాచారం.

    సముద్రంలో మునిగిపోయిన కంటైనర్లలో.. యాపిల్ ఉత్పత్తులు ఉన్నాయా? అనే విషయంపై అటు యాపిల్ కంపెనీ.. ఎవర్‌గ్రీన్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఈ కంటైనర్లు దక్షిణ అమెరికా & ఉత్తర అమెరికా మార్కెట్లకు వెళ్లే ఐఫోన్ 17 యూనిట్లతో నిండి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రూ. 4,000 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.

    ప్రభావం ఇలా..
    ఐఫోన్ 17ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2025లో ప్రారంభించింది. అప్పటి నుంచి వీటికి రికార్డు స్థాయి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఐదు లక్షల ఐఫోన్ 17లు నీటిపాలవ్వడం అనేది బాధాకరమైన విషయం. ఇది ఐఫోన్ 17 డెలివరీలను చాలా ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఉప్పునీటిలో కలిసిపోవడం వల్ల, సముద్రంలోని జలచరాలు కూడా హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి: కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!

Telangana

  • హైదరాబాద్‌: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్‌ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య  హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు.  ఈ మేరకు జనరల్‌ బాడీ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు.

    • నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

    • లేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్

    • అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..

    • హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్‌ కాట్‌ చేస్తాం.

    • 2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్‌లో ఉన్న  బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలి

    • 2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలి

    • ప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలి

    • ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసన

    • హైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ

    • 10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసన

    • నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం

    • బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదు

    • బకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి

  • సాక్షి,హైద‌రాబాద్ : హైద‌రాబాద్ జేఎన్టీయూ ఫ్లై ఓవ‌ర్‌పై ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. TS 09 FU 5136 నెంబర్‌ గల కారు వేగంగా దూసుకొచ్చింది. డివైడ‌ర్‌ను ఢీకొట్టి ప‌ల్టీలు కొట్టింది. ఈ ప్ర‌మాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

    కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారును మరో ప్రాంతానికి తరలించారు.  ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఇద్ద‌రు యువ‌కులు, ముగ్గురు యువతులు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరూ సూడాన్ దేశ‌స్థులుగా గుర్తించారు.

    ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇద్దరు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

  • ఢిల్లీ:  తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలో  గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టితో గెలుపు సొంతం చేసుకుంటామన్నారు. ‘ జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 

    రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుంది. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం. ఎవరైనా, ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం. గోడలకు చెవులు ఉండే సమయం. జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం. 

    కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే  అడ్డంకి ఉండదు. ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి. మెట్రో ఫేస్ టూకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా?,’ అని ప్రశ్నించారు. 

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున నిన్న(శనివారం అక్టోబర్‌ 25) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ జరిగిన ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్‌మెన్ వీఎస్‌ఎన్‌ మూర్తిలను డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వారిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

    డీసీపీ, గన్‌మెన్‌ ధైర్య సాహసాలు కనబరిచారు : డీజీపీ శివధర్ రెడ్డి
    నిన్న చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్‌ స్నాచర్లు దాడులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్‌కి పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారు. డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్‌మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. డీసీపీ, కానిస్టేబుల్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.

    రౌడీ షీటర్‌లు, దొంగలపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్
    ఈ ఘటనలో ఇవోల్వ్ అయినా ఆటో డ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో  టీమ్స్ పని చేస్తున్నాయి. కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నాము. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచాం. నగర ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్‌లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్‌పై కూడా నిఘా పటిష్టం చేశాం డీసీపీకి మెడ భాగంలో గాయమైంది. గన్ మెన్ మూర్తికి కాలు గాయం అయ్యింది.  డ్రైవర్ సందీప్ అలర్ట్‌గా ఉండి కీలక పాత్ర పోషించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారు. ఐదు బృందాలు నిందితుల కోసం గలిస్తున్నాయి.

    అసలేం జరిగిందంటే..
    కరడుగట్టిన దొంగ అన్సారీ సెల్‌ ఫోన్‌ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య గమనించి తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్‌ తన గన్‌ మ్యాన్‌ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు.

    డీసీపీ, గన్‌మ్యాన్‌లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనార్‌ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్‌ అధికారి ఛేజింగ్‌ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.

  • హైదరాబాద్:  సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది.  అక్టోబర్‌ 28వ తేదీనగ బహిరంగ సభతో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారాన్ని న రోడ్‌ షోతో  ఆరంభించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఆదివారం(అక్టోబర్‌ 26వ తేదీ) వెల్లడించారు. 

    నాలుగు రోడ్‌ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్‌ పాల్గొంటారని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.  ఈ నెల 28వ తేదీన సీఎం రేవంత్‌ బహిరంగ సభకు ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌.. ఈ సభను పోలీస్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆపై అక్టోబర్‌ 30, 31, నవంబర్ 4,5 తేదీలలో సీఎం రోడ్ షో చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. పలువురు సినీ ప్రముఖులు కాంగ్రెస్‌ ప్రచారంలో పాల్గొననున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.

    సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. 

Movies

  • రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరస సినిమాలైతే చేస్తున్నారు గానీ ఎందుకో అనుకున్నంతగా వర్కౌట్ కావట్లేదు. చాన్నాళ్ల క్రితం రూట్ మార్చిన చిరు.. వీలైనంత వరకు యువ దర్శకులతోనే కలిసి పనిచేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి. సెట్స్ పైన మాత్రం రెండింటి పనినడుస్తోంది. ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ బయటకొచ్చింది.

    (ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)

    ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్ గారు' అనే మూవీ చేస్తున్నారు. ఇది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇందులో చిరుతో పాటు వెంకటేశ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ మేరకు కొన్నిరోజుల క్రితమే వెంకీ షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. ఇది పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు మరో మూవీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ రూమర్ వినిపిస్తుంది.

    చిరు-బాబీ కాంబో ప్రాజెక్ట్ గురించి కొన్నాళ్ల క్రితం అనౌన్స్‌మెంట్ వచ్చింది. వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో తమిళ హీరో కార్తీ.. కీలక పాత్రలో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇది నిజమే కావొచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చిరు సినిమాల్లో ఎవరో ఓ హీరో అతిథి పాత్రల్లో కనిపిస్తూనే ఉన్నారు. 'ఆచార్య'లో రామ్ చరణ్, 'గాడ్ ఫాదర్‌'లో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ.. ప్రస్తుతం చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్‌తో ఇలా ఫార్ములా ఫాలో అయిపోతున్నట్లు కనిపిస్తుంది. అలా కార్తీతో త్వరలో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది కొన్నాళ్లు ఆగితే తెలుస్తుంది.

    (ఇదీ చదవండి: ఈ పాన్ ఇండియా నటుడిని గుర్తుపట్టారా? బయోపిక్ కోసం ఇలా)

  • ఇతడు అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు. వయసు పెరిగి 50 ఏళ్లు దాటినా సరే కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటాడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?

    పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్. అవును మీరు విన్నది నిజమే. 'సఖి' సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. ఇప్పటికీ చకచకా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నంబీ నారాయణన్ అనే శాస్త్రవేత్త బయోపిక్‌లో నటించి మెప్పించిన ఈ నటుడు.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది.

    మాధవన్ చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ 'జీడీ నాయుడు'. బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. జీడీ నాయుడుని.. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. ఈయన పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం. మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయనుంచి వచ్చినవే. ఓటు రికార్డింగ్ మెషీన్, జ్యూస్ పిండే మెషీన్, కాయిన్‌తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్ లాంటివి రావడంలో ఈయన పాత్ర మరువలేనిది. అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం.

    ఇలాంటి వ్యక్తి బయోపిక్‌లో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫొటోలో ఉన్నది మాధవన్‌యేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు. మాధవన్ మూవీస్ విషయానికొస్తే.. తెలుగులో నిశ్శబ్దం, సవ్యసాచి అనే మూవీస్ మాత్రమే చేశాడు. ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

  • అందంగా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    గ్లామర్ అంతా చూపించేస్తున్న కృతి శెట్టి

    తెల్లని చీరలో మంచు లక్ష‍్మీ దీపావళి సెలబ్రేషన్స్

    హీరోయిన్ పూజా హెగ్డే ఫన్నీ రెగ్యులర్ ఫొటోలు

    తెగ నవ్వేస్తూ ఎంజాయ్ చేస్తున్న రెజీనా

    భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో అమలాపాల్

    వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న హన్సిక

     ే

  • కన్నడ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా, కర్ణాటక ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌(Puneeth Rajkumar). ఆయన మరణించి నాలుగేళ్లు(2021లో గుండెపోటుతో మరణించాడు) అవుతున్నా.. అభిమానులు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఏదో రకంగా ఆయనను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మధ్య ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి వెబ్సిరీస్లో పునీత్ రాజ్ కుమార్‌ని చూపించారు

    ఇప్పుడు అదే టెక్నాలజీతో ఏకంగా ఫ్యాన్స్తో మాట్లాడేలా యాప్ని తీసుకొచ్చారు స్టార్ ఫ్యాండమ్ LLP సంస్థ. తాజాగా యాప్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లాంచ్చేశారు. పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ సహకారంతో, స్టార్ ఫ్యాండమ్ LLP వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ సమర్థ రాఘవ నాగభూషణం నాయకత్వంలో అభివృద్ధి చేయబడిన ఈ యాప్, భారతదేశంలో మొదటి ఫ్యాన్‌డమ్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా చరిత్ర సృష్టించింది.

    పునీత్ రాజ్‌కుమార్ వర్ధంతి(అక్టోబర్‌ 29)కి మూడు రోజుల ముందే ఈ యాప్‌ని విడుదల చేశారు. 'అప్పు ఫ్యాండమ్ యాప్' (Appu Fandom App) అని కూడా పిలువబడే ఈ అప్లికేషన్, ఏఐ టెక్నాలజీ ద్వారా పునీత్ యొక్క ఆకర్షణ, క్రమశిక్షణ, సానుకూలత, మానవత్వ గుణాలను డైనమిక్‌గా ప్రతిబింబించడానికి రూపొందించబడింది. ఇది కేవలం ఒక ట్రిబ్యూట్ మాత్రమే కాకుండా, ఫ్యాన్స్‌తో పునీత్ ఆత్మను డిజిటల్‌గా కనెక్ట్ చేసే జీవంతమైన అనుభవంగా మారుతుంది.

    ఈ యాప్ పునీత్ రాజ్‌కుమార్ యొక్క 'పవర్ స్టార్' ఇమేజ్‌ను కొత్త తరాలకు అందించడమే కాకుండా, కన్నడ సినిమా పరిశ్రమకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. PRK ప్రొడక్షన్స్ ద్వారా అశ్విని నిర్వహించబడుతున్న ప్రాజెక్ట్‌గా, ఇది పునీత్ యొక్క సినిమాలు, గ్రామీణ సేవలు, యువత ప్రేరణలను కలిగి ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పటికే యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, పవర్ స్టార్‌తో 'కనెక్ట్' అవుతున్నారు.

  • ఇప్పటి జనరేషన్‌లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌ని రెండో సీజన్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)

    కథేంటి?
    'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్‌గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్‌లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్‌లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.

    కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్‌లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్‌లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.

    ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.

    రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్‌ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)

  • రీసెంట్ టైంలో పాన్ ఇండియా రేంజులో 'కాంతార 1' సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంది. తమిళనాడులోనూ ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. అయితే ఇలాంటి మూవీస్ హిట్ అయిన ప్రతిసారి మా ముగ్గురు దర్శకుల్నే కొందరు తమిళ ఫ్యాన్స్ ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదని ప్రముఖ డైరెక్టర్ పా. రంజిత్ అసహనం వ్యక్తం చేశాడు. 'బైసన్' సక్సెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హీరోల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    ఇంతకీ అసలేమైంది?
    ''కాంతార' లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పుడు.. కొందరు కోలీవుడ్ ఫ్యాన్స్ ముగ్గురు తమిళ దర్శకుల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మేమే తమిళ ఇండస్ట్రీని చెడగొట్టామని విమర్శిస్తుంటారు. గత రెండేళ్లలో కోలీవుడ్‌లో 600కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వీళ్లలో ఎంతమంది తమిళ సినిమా స్థాయిని పెంచగలిగారు?' అని పా. రంజిత్ ఫైర్ అయిపోయాడు.

    తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో కమర్షియల్, రూటెడ్ సినిమాలు వస్తున్నాయి. వందల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తమిళంలో మాత్రం ఏ దర్శకులు కూడా ఆ ఫీట్ సాధించలేకపోతున్నారు. దీంతో రీసెంట్ టైంలో కొందరు తమిళ నెటిజన్లు, రివ్యూయర్స్.. డైరెక్టర్స్ పా. రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్‌పై పడ్డారు. కులం, అణిచివేత సబ్జెక్ట్స్‌తో మాత్రమే వీళ్లు సినిమాలు తీస్తున్నారని, అందువల్లే తమిళ ఇండస్ట్రీ నాశనమైపోతుందని విమర్శించారు. ఆ కామెంట్స్‌కి హర్ట్ అయిన పా.రంజిత్.. ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు.

    ఇదే ఈవెంట్‌లో పా.రంజిత్ మాట్లాడుతూ.. 'సోషల్ మెసేజ్ ఉండే సినిమాలని అర్థం చేసుకోకుండా వాటిపై కులం అనే ముద్ర వేయొద్దు. ప్రేక్షకులు ప్రేమతో సినిమాల్ని చూస్తారు. కానీ ట్రోల్స్.. ఓ మూవీని చూడకముందే చాలామందికి ఓ అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.

    పా.రంజిత్ విషయానికొస్తే.. రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి మూవీస్ తీశాడు. తమిళంలో వీటికి ఓ మాదిరి ఆదరణ వచ్చింది. తెలుగులో మాత్రం రెండు ఫ్లాప్ అయ్యాయి. గతేడాది 'తంగలాన్' అనే మూవీతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది.

    (ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)

  • 'హీరోయిన్‌ షాలిని తండ్రి హోటల్‌లో గిన్నెలు కడిగేవాడు.. కూతురిని లేటుగా సెట్‌కు తీసుకెళ్లినందుకు ఓ డైరెక్టర్‌ చేతిలో తన్నులు తిన్నాడు.. ఒకప్పుడు పేదవాడిగా ఉండి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తమిళ దర్శకుడు అలెప్పీ అష్రఫ్‌. మీడియాకు దూరంగా ఉండే షాలిని తండ్రి బాబు... ఈ వ్యాఖ్యాలపై స్పందించాడు. అవన్నీ నిజం కాదని కొట్టిపారేస్తున్నాడు. 

    నన్ను కొడుతుంటే షాలిని ఏడుస్తూ ఉందా?
    మనోరమ ఆన్‌లైన్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు మాట్లాడుతూ.. అలెప్పీ అష్రఫ్‌ (Alleppey Ashraf) నాకు చాలా ఏళ్లుగా తెలుసు. మా కుటుంబానికి చాలా క్లోజ్‌. మేమెలాంటివాళ్లమో తనకు బాగా తెలుసు. అయినప్పటికీ మా గురించి అలాంటి వీడియో ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. పోనీ, చేసేముందు మాకో మాటైనా చెప్పలేదు. తను చెప్పినదాంట్లో దాదాపు అన్నీ అబద్ధాలే.. మలయాళ నటుడు కుంచకొ తండ్రి, దర్శకనటుడు బొబన్‌ నన్ను చెంపదెబ్బ కొట్టి.. చితకబాదుతుంటే నా కూతురు చూసి ఏడ్చిందట! అది పూర్తిగా అసత్యం. 

    ఒకటి నిజం
    బొబన్‌ అలాంటివారు కానే కాదు. అయితే ఒకటి మాత్రం నిజం. Aazhi (1985) మూవీ సెట్‌కు సమయానికి వెళ్లలేకపోయాం. ఎందుకంటే బొబన్‌ సినిమాకు సంతకం చేయడానికి ముందే నా కూతురు షాలిని (Shalini) మరో సినిమా చేస్తోంది. ఆ మూవీ షూటింగ్‌ నిమిత్తం మేము విదేశాల్లో ఉన్నాం. దానివల్ల ఒకరోజు ఆలస్యంగా సెట్‌కు వచ్చాం. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మాకంటే సినీ ఫ్యామిలీలో పుట్టిన బొబన్‌కే బాగా తెలుసు. అయినప్పటికీ మాపై కాస్త కోప్పడ్డాడు. 

    షాలిని కుటుంబం

    ఇది మరీ కామెడీ!
    పరిస్థితి ఇదీ.. అని మేము వివరించేసరికి తను కాస్త శాంతించాడు. అంతే తప్ప ఆయన నాపై చేయి ఎత్తలేదు. ఆయనే కాదు, ఎవరూ నన్ను కొట్టే పరిస్థితి నేను తెచ్చుకోలేదు. మేమెప్పుడూ ప్రేమగానే మసులుకునేవాళ్లం. అలాంటిది బొబన్‌ కొడితే ఆ దెబ్బకు నేను చెరువులో పడ్డానని, దెబ్బలు తగిలాయని, వేరేవాళ్లు నన్ను కాపాడారని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. పైగా నాకు ఈత వచ్చు. చెరువులోనే కాదు, సముద్రంలోనూ ఈత కొట్టగలను.

    అదేమైనా చేయకూడని పనా?
    అష్రఫ్‌ ఇంకా ఏమన్నారు.. షాలిని సినిమాల్లోకి రాకముందు హోటల్‌లో పని చేశానా? మురికివాడలో నివసించానా? నేను గిన్నెలు కడగడం, టేబుల్‌ క్లీన్‌ చేయడం అష్రఫ్‌ చూశాడా? ఎందుకీ అబద్ధాలో అర్థం కావడం లేదు. ముందుగా.. హోటల్‌లో పని చేయడం చిన్నతనమేమీకాదు. పొట్టకూటికోసం ఏదైనా చేసుకోవచ్చు. దేవుడి దయవల్ల నాకలాంటి అవసరం రాలేదు. నేను ఓ ఫ్యాన్సీ షాప్‌ రన్‌ చేసేవాడిని. మరో విషయం ఏమన్నాడు? నా భార్య జూనియర్‌ ఆర్టిస్టా? తనకసలు సినిమాలంటేనే ఆసక్తి లేదు. ఇల్లు వదిలి బయటకు రాదు. నా పిల్లలిద్దరికీ సినిమా ఛాన్సులు వచ్చినప్పుడు నేనే వాళ్లను పట్టుకుని తిరిగానే తప్ప తనెప్పుడూ మాతో రాలేదు. రమ్మని అడిగితే ఇంట్లోనే ఉంటాననేది. 

    రూ.100 కోట్ల ఆస్తి?
    ఒకప్పుడు కటిక పేదరికం అనుభవించానని, ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి ఉందన్నాడు. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలడో మరి? దేవుడి దయవల్ల మేము మంచి స్థాయిలోనే ఉన్నాం. ఇంకోటి.. అజిత్‌ (Ajith Kumar) రూ.180 కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అవును, తన రేంజ్‌ను బట్టి ఎంతైనా తీసుకుంటాడు. దాని ప్రకారమే ట్యాక్స్‌ కూడా కరెక్ట్‌గా కడతాడు. మరింకేంటి సమస్య? అష్రఫ్‌ మీద నాకెలాంటి కోపం లేదు. మేమిద్దరం గల్ఫ్‌ దేశంలో ఓ స్కిట్‌ కూడా చేశాం. అదిప్పటికీ నాకు బాగా గుర్తు. మరి తనెందుకు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో అంతు చిక్కడం లేదు అని బాబు చెప్పుకొచ్చాడు.

    సినిమా
    ఎలైస్‌-బాబు దంపతులకు కూతుర్లు షాలిని, షామిలి, కొడుకు రిచర్డ్‌ సంతానం. ఈ ముగ్గురూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసిన షాలిని.. 2000వ సంవత్సరంలో అజిత్‌ను పెళ్లాడింది. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. వివాహం తర్వాత షాలిని మూవీస్‌కు గుడ్‌బై చెప్పింది.

    చదవండి: పసిబిడ్డను చంపేయమని అడిగా.. నాపై ఉమ్మేశారు!: కస్తూరి

  • టాలీవుడ్‌ ‘డార్లింగ్‌’ ప్రభాస్‌(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్‌ స్టార్‌ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్‌తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్‌ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్‌ను ఆదరాబాదరా క్యాష్‌ చేసుకునే రెగ్యులర్‌ స్టార్స్‌కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్‌ స్టార్‌ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.

    ’బాహుబలి 2: ది కన్ క్లూజన్‌’ బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్‌ బ్రాండ్లు ప్రభాస్‌ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్‌ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్‌ ఫిట్‌నెస్‌ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్‌గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ఆఫర్‌లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్‌ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు. 

    గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్‌లో ప్రభాస్‌ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్‌లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.

    మరోవైపు టాలీవుడ్‌లో ప్రభాస్‌ తో పాటు టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్‌ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్‌లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్‌ ఎండార్స్‌మెంట్‌లతో సహా అగ్ర బ్రాండ్‌ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం. 

    ‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్‌ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్‌ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్‌ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్‌మెంట్‌లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్‌లను ప్రమోట్‌ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్‌ను ఎండార్స్‌మెంట్‌ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్‌ తెలిపాడు. 

    తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్‌లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్‌ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్‌కి మాత్రమే ప్రభాస్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

    రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్‌ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్‌గా ప్రభాస్‌ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు.

  • సూపర్ హీరో సినిమాలు అనగానే హాలీవుడ్‌లో మార్వెల్, డీసీ యూనివర్స్‌లే గుర్తొస్తాయి. కొన్నేళ్ల ముందు వరకు వీటి నుంచి అద్భుతమైన మూవీస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి రెస్పాన్స్ వచ్చేది. కానీ రీసెంట్ టైంలో మాత్రం చిత్రాలైతే వస్తున్నాయి గానీ అంతంత మాత్రంగానే ఆదరణ దక్కించుకుంటున్నాయి. అలా ఈ ఏడాది జూలైలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరోల మూవీ 'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్'. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్ అయింది.

    జూలై 25న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకనో పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. కొన్నిరోజుల ముందు రెంట్ విధానంలో ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు ఉచితంగానే నవంబర్ 5 నుంచి హాట్‌స్టార్‌లోకి రాబోతుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఒకవేళ సూపర్ హీరో జానర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ట్రై చేయండి.

    (ఇదీ చదవండి: 9 నెలల పిల్లాడు.. దెయ్యమై పగ తీర్చుకుంటే?)

    'ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్' విషయానికొస్తే.. రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్).. ఓ జట్టుగా ఉండే వీళ్లు ఆస్ట్రోనాట్స్. అందరూ వీళ్లని ఫెంటాస్టిక్ ఫోర్ అని పిలుస్తుంటారు. భూమిని ఎప్పుడూ కాపాడటమే వీళ్ల పని. స్యూ ప్రెగ్నెంట్ కావడంతో ఈమెకు పుట్టబోయే బిడ్డకు కూడా సూపర్ పవర్స్ వస్తాయా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) భూమిని అంతం చేయబోతున్నాడని తెలుస్తుంది. దీంతో ఇతడికోసం ఫెంటాస్టిక్ ఫోర్ వేట మొదలుపెడతారు.

    స్యూకి పుట్టబోయే బిడ్డని తనకు ఇస్తే.. భూమిని, మనుషుల్ని విడిచిపెడతానని గలాక్టస్ చెబుతారు. అ‍ప్పుడు స్యూ ఏం చేసింది? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్‌ని ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. ఓటీటీ రివ్యూ)

  • ‘‘డ్యూడ్‌’(Dude) సినిమా రూ. 100 కోట్లు వసూళ్లు దాటేసింది. నేను నటించిన ‘లవ్‌ టుడే, డ్రాగన్‌’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎంత ఆదరించారో... ‘డ్యూడ్‌’కి అంతకంటే ఎక్కువ ఆదరణ అందించారు. మీరు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని ప్రదీప్‌ రంగనాథన్‌(Pradeep Ranganathan ) చెప్పారు. 

    ఆయన హీరోగా మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డ్యూడ్‌’. శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డ్యూడ్‌ బ్లాక్‌ బస్టర్‌ 100 కోట్ల జర్నీ’ ఈవెంట్‌లో వై. రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘డ్యూడ్‌’ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమాకి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మా సంస్థలో దర్శకులుగా పరిచయమైన భరత్‌ కమ్మ, నితీష్‌ రానా, బుచ్చిబాబు పెద్ద దర్శకులు అయ్యారు. ఈ జాబితాలో కీర్తీశ్వరన్‌ ఉండటం ఆనందంగాఉంది’’ అని తెలిపారు. 

    ‘‘మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు’’ అని కీర్తీశ్వరన్‌ అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి, రచయిత కృష్ణ మాట్లాడారు.

  • తెలుగులో ఇప్పటివరకు చాలా హారర్ సినిమాలు వచ్చాయి. దాదాపుగా ప్రతిదానిలోనూ పెద్దవాళ్లు లేదంటే ఓ వయసు ఉండే పిల్లలు చనిపోయి దెయ్యాలుగా మారడం చూస్తుంటాం. కానీ 9 నెలల పిల్లాడు దెయ్యమై పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో ఓ మూవీ తీస్తున్నారు. అదే 'నెపోలియన్ రిటర్న్స్'. గతంలో నీడ పోయింది సర్ అనే స్టోరీతో మూవీ తీసిన ఆనంద్ రవి అనే దర్శకుడు.. ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నాడు.

    (ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!)

    దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ ఆనంద్ రవి నటిస్తున్నాడు. ఆటో రాంప్రసాద్, దివి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గేదె దెయ్యం వచ్చింది, నన్ను పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయమంది అనే డైలాగ్స్ చెప్పారు. కానీ ఆదివారం జరిగిన ఈవెంట్‌లో దర్శకహీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. మెయిన్ ప్లాట్ ఏంటో చెప్పాడు. 9 నెలల వయసు అంటే సరిగా నిలబడం, నడవడమే రాదు. అలాంటిది పిల్లాడు దెయ్యంగా మారి పగ తీర్చుకోవడం అనే పాయింట్ బాగానే ఉంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేస్తారో చూడాలి?

    (ఇదీ చదవండి: కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?)

  • ముక్కుసూటి వైఖరితో ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉంటుంది నటి కస్తూరి శంకర్‌ (Kasthuri Shankar). తమిళనాడులోని అంతఃపురంలో సేవలు చేసేందుకు తెలుగువారు వచ్చారని.. అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలామణి అవుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తన సినీ జీవితం, జైలు జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది

    అపార్థం చేసుకున్నారు
    కస్తూరి మాట్లాడుతూ.. 'నేను యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించాను. ఆ సమయంలో నాగార్జున షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. తర్వాత ఆయనతోనే అన్నమయ్య సినిమాలో నటించాను. అందుకు చాలా హ్యాపీ. గతేడాది నాకు అస్సలు కలిసిరాలేదు. ఓ రాజకీయ వేదికపై నేను చెప్పిన మాటల్ని ట్విస్ట్‌ చేసి వైరల్‌​ చేశారు. నాపై నింద వేసి మరీ జైల్లో వేశారు. తెలుగు భాష అన్నా, ఇక్కడివారన్నా నా ఫ్యామిలీలాగా భావిస్తాను. ఆ అభిమానంతోనే ఇక్కడ సెటిలయ్యాను. అలాంటిది వీళ్లందరూ నన్ను అపార్థం చేసుకున్నారన్నదే నా పెద్ద బాధ!

    బ్లడ్‌ క్యాన్సర్‌
    సినిమాల్లో చూపించినట్లుగా జైలు జీవితం ఉండదు. జైలుకు వెళ్లిన రోజు నా జీవితంలోనే వరస్ట్‌. ఇకపోతే నా జీవితం అయిపోయింది అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా అమ్మ ఆరోగ్యం బాగుచేయాలని ఆరేళ్లు కష్టపడ్డాం. కానీ చనిపోయింది. అమ్మ పోయిన ఐదు నెలలకే నాన్న మరణించాడు. తర్వాత మా అమ్మాయిని చావు అంచుల నుంచి బయటకు తీసుకొచ్చాం. తనకు బ్లడ్‌ క్యాన్సర్‌.. ట్రీట్‌మెంట్‌ పని చేయలేదు. ప్రపంచంలో 200 మందికి మాత్రమే వచ్చే అరుదైన బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చింది. తనను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అదే నాకు పెద్ద పరీక్ష, బాధ! నా కూతురి పేరిట మను మిషన్‌ అని ఓ స్వచ్చంద సంస్థను ప్రారంభించాను. 

    రైల్వే ట్రాక్‌పై పసిబిడ్డ దొరికింది
    ఈ చారిటీ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఏదైనా బహుమతులు, దుస్తులు ఇవ్వడం లాంటి చిన్నచిన్న పనులు చేస్తుంటాం. అలా చేస్తుండగా ఓసారి రైల్వే ట్రాక్‌పై ఓ పసిబిడ్డను చూశాను. తనకు రెండేళ్లు.. కానీ చూసేందుకు ఐదు నెలల పిల్లాడిలా ఉంటాడు. రోడ్లపై అడుక్కోవడం కోసం ఆ చిన్నారిని ఎదగనివ్వలేదు. నోట్లో సారా పోసి పడుకోబెట్టేవారు. ఆ బిడ్డను అవసరమైనంతవరకు వాడుకుని తర్వాత రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆ బాబును ఆస్పత్రికి తీసుకెళ్తే కాలేయం పూర్తిగా పాడైందన్నారు.

    చావును ప్రసాదించమన్నా..
    మానసిక ఎదుగుదల లేదని చెప్పారు. వారంపాటు నేన ట్రీట్‌మెంట్‌ చేయించాను. ఏమాత్రం బెటర్‌మెంట్‌ లేకపోయేసరికి నేను ధైర్యం తెచ్చుకుని ఓ మాట అడిగాను. తనకు ఎదుగుదల లేనప్పుడు వైద్యం చేయించి ఇంకా నరకంలోకి తోయడం ఎందుకు? తనను మెర్సీ కిల్లింగ్‌(చావు ప్రసాదించడం)కి వదిలేయొచ్చుగా అని అడిగాను. అందుకు డాక్టర్‌.. అలా చావాలని రాసుంటే ఆకలిదప్పికలతో ఎప్పుడో చచ్చిపోయేవాడు. బతికున్నాడంటే అతడొక ఫైటర్‌. 

    నాపై ఉమ్మేశారు
    తనను బతికించడం మా బాధ్యత అన్నారు. ప్రస్తుతానికైతే బాబు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చావును మనం నిర్ణయించకూడదు. బతకడం మాత్రమే మన కర్తవ్యం అని చెప్పుకొచ్చిందిది. తనకు ఎదురైన ఓ చెత్త అనుభవం గురించి చెప్తూ.. ఓసారి దగ్గర్లో ఉన్న ఏటీఎమ్‌ కోసం నడుచుకుంటూ వెళ్లాను. ఇంతలో ఓ బస్సులో నుంచి ఒకరు నా మీద ఉమ్మేశారు అని తెలిపింది.

    చదవండి: 'రూ.2 కోట్లిస్తావా? ప్రైవేట్‌ వీడియోలు బయటపెట్టమంటావా?'

  • బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్‌ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్‌ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల  బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్‌ పేరును పొందుపరిచారు. పాక్‌ చట్టాల ప్రకారం ఈ లిస్ట్‌లో ఉన్న వారిపట్ల  నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.

    పాక్‌ విషయంలో సల్మాన్‌  ఏమన్నారంటే..?
    కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్‌ ఫోరమ్‌ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌తో పాటు షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ వంటి స్టార్స్‌ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్‌ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా  ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.

    సల్మాన్‌పై బలూచిస్తాన్‌ ప్రశంసలు
    సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్‌, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్‌ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్‌ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్‌ చేసిన  ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్‌ కూడా చేశారు.  సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల  బలూచిస్తాన్‌ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్‌ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.

    ఖనిజ వనరులతో సమృద్ధిగా  ఉన్న బలూచిస్తాన్‌ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్‌ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా  ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు బలూచిస్తాన్‌ చేరుకుంది. పాక్‌కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్‌ తయారైంది. పాక్‌ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

  • తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ కుమారుడు ధ్రువ్‌ నటించిన చిత్రం బైసన్‌.. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో  అనుపమా పరమేశ్వరన్‌ తనకు జోడీగా నటించింది. అయితే, కోలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకింగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. కబడ్డీ ఆటగాడిగా ధ్రువ్‌ పడిన కష్టం ఏంటి అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. దర్శకుడు మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన ఈ మూవీని పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌, అప్లాజ్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి.  ఈ సినిమాలో ధ్రువ్‌ నటన పట్ల విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే రూ. 45 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది.

  • తమిళనాడులోని కరూర్‌ ఘటన బాధిత  కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్‌ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్‌ 27న చెన్నై కరూర్‌లో టీవీకే నేత విజయ్‌ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్‌ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్‌ ప్రకటించారు. 

    ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్‌ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్‌లో విజయ్‌ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. 

    చివరకు కరూర్‌లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్‌ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.  

Sports

  • మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.

    బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్‌ అక్తర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్‌ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్‌ 2, కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా 9, షోర్నా అక్తర్‌ 2, నహీద అక్తర్‌ 3, రబేయా ఖాన్‌ 3, నిషిత అక్తర్‌ 4 (నాటౌట్‌), మరుఫా అక్తర్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.

    భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్‌, దీప్తి శర్మ, అమన్‌జోత్‌ కౌర్‌ తలో వికెట్‌ తీశారు.

    కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది. 
    చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం

  • రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్‌లో అద్భుతం జరిగింది. అస్సాం​, సర్వీసస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్‌ ఇదే.

    గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్‌లో ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్‌ మ్యాచ్‌ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.

    అస్సామ్‌లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నిన్న (అక్టోబర్‌ 25) మొదలైన ఈ మ్యాచ్‌ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్‌) ముగిసింది. ఎలైట్‌ గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అస్సాంపై సర్వీసస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్‌), రెండో ఇన్నింగ్స్‌లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్‌) ఆడగా.. సర్వీసస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్‌), రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.

    మ్యాచ్‌ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.

    చరిత్రాత్మక హ్యాట్రిక్స్
    ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం ​కూడా చోటు చేసుకుంది. సర్వీసస్‌ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్‌లో (అస్సాం తొలి ఇన్నింగ్స్‌) హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.

    ఇన్నింగ్స్ విశ్లేషణ:
    - అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు)  
     టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52  
    - సర్వీసస్‌ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు)  
     అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25  
    - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు)  
     అర్జున్ శర్మ: 4/20  
     అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు  
    - సర్వీసస్‌ లక్ష్యం- 71 పరుగులు  
     13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది

    చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!

     

  • రాంచీ వేదికగా జరిగిన నాలుగో దక్షిణాసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో (South Asian Athletics Championship 2025) ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన మొగలి వెంకట్రాం రెడ్డి (Mogali Venkatramreddy) సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి  గర్వకారణంగా నిలిచాడు. ఈ ఈవెంట్‌ను వెంకట్రాం రెడ్డి 1:52.37 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

    ఈ గేమ్స్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్తాన్ దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు.

    వెంకట్రాం రెడ్డి పతకం సాధించిన అనంతరం హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అథ్లెటిక్స్‌ కోచ్‌ డా. జి.వి. సుబ్బారావు స్పందించారు. "ఇది దేశానికి గర్వకారణం. వెంకట్రాం రెడ్డి అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించాడు. ఇది అతని శ్రమకు ఫలితమని అన్నాడు.

    వెంకట్రాం రెడ్డి ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించి "గోల్డెన్ డబుల్" సాధించాడు. 

    చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
     

  • మహిళల వన్డే ‍ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్‌ 26) ఉదయం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ (New Zealand vs England) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ (England) సునాయాస విజయం సాధించింది. తొలుత బౌలర్లు, స్వల్ప ఛేదనలో బ్యాటర్లు సత్తా చాటడంతో ఆడుతూ పాడుతూ గెలుపుతీరాలు చేరింది. 

    ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్‌, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇదివరకే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్‌ ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగింది.

    చెలరేగిన బౌలర్లు
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. లిండ్సే స్మిత్‌ 3, కెప్టెన్‌ నాట్‌ సీవర్‌  బ్రంట్‌, అలైస్‌ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టి కివీస్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జార్జియా ప్లిమ్మర్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్‌ (35), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూజీ బేట్స్‌ 10, బ్రూక్‌ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్‌, ఇసబెల్లా గేజ్‌, జెస్‌ కెర్‌ 10, రోస్‌మేరీ మైర్‌ డకౌట్‌, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు.

    సత్తా చాటిన జోన్స్‌
    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్‌ యామీ జోన్స్‌ (86 నాటౌట్‌) సత్తా చాటడంతో 29.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్‌ (40), హీథర్‌ నైట్‌ (33) రాణించారు. కివీస్‌ బౌలర్లలో సోఫీ డివైన్‌, లియా తహుహు తలో వికెట్‌ పడగొట్టారు.

    కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది.

    చదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!

     

  • మహిళల వన్డే ప్రపంచకప్‌లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.

    ఘన చరిత్ర కలిగిన ఆసీస్‌.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్‌లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్‌తో అమీతుమీకి సిద్దమైంది. 

    ఈ మ్యాచ్‌ నవీ ముంబై వేదికగా అక్టోబర్‌ 30న జరుగనుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్‌ మరోసారి సెమీస్‌కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.

    తొట్ట తొలి ఛాంపియన్‌ ఇంగ్లండ్‌
    ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్‌లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

    తొలిసారి జగజ్జేత
    భారత్‌ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఆసీస్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్‌ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్‌. 

    రెండోసారి
    న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లోనే జరిగిన ఈ ఎడిషన్‌లో ఆసీస్‌ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

    హ్యాట్రిక్‌
    స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్‌లో ఆసీస్‌ మరోసారి ఛాంపియన్‌గా నిలిచి, హ్యాట్రిక్‌ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్‌ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

    తొలిసారి పరాభవం
    1993 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్‌కు చేరలేకపోయింది. రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ ఛాంపియన్‌గా, న్యూజిలాండ్‌ రన్నరప్‌గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఈ ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

    తిరిగి జగజ్జేతగా..
    1997లో భారత్‌ వేదికగా జరిగిన ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ రన్నరప్‌గా నిలువగా.. భారత్‌ సెమీస్‌ వరకు చేరుకుంది.

    మూడు సార్లు పరాభవం తర్వాత..!
    మూడు సార్లు ఫైనల్లో పరాభవం​ తర్వాత న్యూజిలాండ్‌ తొలిసారి 2000 ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

    భారత్‌పై గెలిచి ఐదోసారి
    సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.

    ఊహించని పరాభవం​
    స్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్‌లో ఆసీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్‌ సిక్స్‌ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకోగా.. ఇంగ్లండ్‌ తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

    ఆరో టైటిల్‌
    భారత్‌ వేదికగా జరిగిన 2013 ఎడిషన్లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం సాధించి ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్‌ సూపర్‌ సిక్స్‌కు కూడా చేరలేకపోయింది.

    ఇంగ్లండ్‌ నాలుగోసారి..
    స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.

    ఏడోసారి జగజ్జేతగా..
    న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన 2022 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో భారత్‌ నాకౌట్‌ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్‌ ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. 

    చదవండి: కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ గురు
     

  • ఐపీఎల్ 2025లో నిరాశజనక ప్రదర్శన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తమ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను తప్పించింది. తాజాగా పండిట్‌ స్థానాన్ని మాజీ ముంబై ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌తో (Abhishek Nayar) భర్తీ చేసినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గత వారం నాయర్‌కు తెలియజేసినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    నాయర్ గతంలో కేకేఆర్‌ అకాడమీకి కీలకంగా పనిచేశాడు. ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను వెలికితీయడంలో అతని పాత్ర ముఖ్యమైంది. గత సంవత్సరం సహాయక సిబ్బందిగా కేకేఆర్‌లో చేరిన నాయర్, ఇప్పుడు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

    42 ఏళ్ల నాయర్, ఇటీవల మహిళల ఐపీఎల్‌లో (WPL) యూపీ వారియర్జ్‌కు (UP Warriorz) హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. అతని కోచింగ్ శైలి వ్యక్తిగతంగా ఆటగాళ్లను ఫిట్‌నెస్, ఫామ్ పరంగా తిరిగి పుంజుకునేలా చేస్తుంది. 

    నాయర్‌ ఇటీవలే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్ శర్మలో (Rohit Sharma) ఊహించిన ఫిట్‌నెస్‌ పరివర్తను తీసుకొచ్చాడు. నాయర్‌ సహకారంతో రోహిత్‌ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. నాయర్‌ రోహిత్‌కు మంచి మిత్రుడు కూడా. నాయర్‌ రోహిత్‌కు మాత్రమే కాకుండా కేఎల్‌ రాహుల్‌ తదితర ఆటగాళ్లకు కూడా ఫిట్‌నెస్‌ గురుగా ఉన్నాడు.

    వ్యక్తిగత కోచ్‌గా, ఫిట్‌నెస్‌ గురుగా మంచి పేరున్న నాయర్‌ టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌గా మాత్రం రాణించలేకపోయాడు. ఇటీవలే బీసీసీఐ అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ నియమితుడయ్యాక నాయర్‌ను ప్రత్యేకంగా తన బృందంలో చేర్చుకున్నాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా నాయర్‌ ఎంతో కాలం భారత సహాయ కోచ్‌గా ఉండలేకపోయాడు.

    ఇదిలా ఉంటే, గత సీజన్‌లో కేకేఆర్‌ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి, ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. తదుపరి సీజన్‌లో కేకేఆర్‌ నాయర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌ పదవిపై అధికారిక ప్రకటన వచ్చాక నాయర్‌ యూపీ వారియర్జ్‌ కోచ్‌గా కూడా కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

    చదవండి: చెలరేగిన ఇంగ్లండ్‌ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్‌

     

  • మహిళల వన్డే ‍ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్‌ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ​్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.

    ఇంగ్లండ్‌ బౌలర్లలో లిండ్సే స్మిత్‌ 3, కెప్టెన్‌ నాట్‌ సీవర్‌  బ్రంట్‌, అలైస్‌ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జార్జియా ప్లిమ్మర్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్‌ (35), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

    సూజీ బేట్స్‌ 10, బ్రూక్‌ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్‌, ఇసబెల్లా గేజ్‌, జెస్‌ కెర్‌ 10, రోస్‌మేరీ మైర్‌ డకౌట్‌, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ త్వరగా మ్యాచ్‌ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్‌ (20), ట్యామీ బేమౌంట్‌ (26) క్రీజ్‌లో ఉన్నారు.

    కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్‌ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, భారత్‌ ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. అక్టోబర్‌ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్‌ (నవీ ముంబై) నవంబర్‌ 2న జరుగుతుంది.

    చదవండి: హ్యారీ బ్రూక్‌ ఐకానిక్‌ శతకం వృధా

     

  • న్యూజిలాండ్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్‌ జట్టు.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 26) జరిగిన తొలి వన్డేలో (New Zealand vs England) 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఐకానిక్‌ శతకం (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు​) కారణంగా గౌరవప్రదమైన స్కోర్‌ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్‌) చేయగా.. న్యూజిలాండ్‌ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో వన్డే హ్యామిల్టన్‌ వేదికగా అక్టోబర్‌ 29న జరుగనుంది.

    బ్రూక్‌ ఐకానిక్‌ శతకం
    ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ చేసిన శతకం వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత క్రేజీయెస్ట్‌ శతకంగా చెప్పవచ్చు. బ్రూక్‌ తన జట్టును 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్‌ వరకు చేర్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు.

    ఇంగ్లండ్‌ 166 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోగా ఆ సమయానికి బ్రూక్‌ స్కోర్‌ 86 పరుగులుగా ఉండింది. ఈ దశలో బ్రూక్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ మొత్తాన్ని నడిపాడు. జేమీ ఓవర్టన్‌ (46) అతనికి కాస్త సహకించాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    గెలిపించిన మిచెల్‌
    స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ కూడా తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డారిల్‌ మిచెల్‌ (78 నాటౌట్‌), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (51) ఆదుకున్నారు. ముఖ్యంగా మిచెల్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మిచెల్‌కు బ్రేస్‌వెల్‌తో పాటు టామ్‌ లాథమ్‌ (24), మిచెల్‌ సాంట్నర్‌ (27) సహకరించారు. 

    చదవండి: జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌! ఈ వీరుడి గురుంచి తెలుసా?
     

  • నవంబర్‌ 23, 1990.. ఆ రోజున ఇరవై ఏళ్ల యువ క్రికెటర్‌ శ్రీలంక తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. ఎన్నో ఆశలతో తన అంతర్జాతీయ క్రికెట్‌ ప్రయణాన్ని ప్రారంభించిన ఆ యువ ఆటగాడికి.. తొలి మ్యాచ్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. 

    డ్రెస్సింగ్‌ రూమ్‌లో అప్పటి కెప్టెన్‌తో పాటు హెడ్‌ కోచ్‌ అతడికి సపోర్ట్‌ నిలిచారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఖాతా తెరకుండానే పెవిలియన్‌కు చేరాడు. అప్పటికే అతడు దేశవాళీ క్రికెట్‌లో సెంచరీలు మోత మ్రోగిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ చూపించలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తీసేశారు. 

    అరంగేట్రం ఒక పీడకలగా మారింది.  అయినప్పటికి శ్రీలంక తరపున ఆడాలన్న తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టలేదు. దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వెళ్లి  తీవ్రంగా శ్రమించి మరో అవకాశం కోసం ఎదురు చూశాడు. సరిగ్గా  19 నెలల తర్వాత అతడికి జాతీయ జట్టు మళ్లీ పిలుపు వచ్చింది.

    మళ్లీ హార్ట్‌ బ్రేక్‌..
    రెండో సారి కూడా అతడికి హార్ట్‌ బ్రేకింగ్‌ మూమెంట్‌ ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్‌లో జీరో.. రెండు ఇన్నింగ్స్‌లో కేవలం​ ఒక్క పరుగు. అంటే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క పరుగు సాధించడానికి దాదాపు రెండు ఏళ్ల సమయం పట్టింది. దీంతో అతడిని మళ్లీ జట్టులోని నుంచి తొలిగించారు. అందరూ అతడి ఇంటర్నేషనల్‌ కెరీర్‌ ముగిసిందని, ఒత్తడిని తట్టుకోలేడని విమర్శల వర్షం​ కురిపించాడు. కానీ అతడు మాత్రం విమర్శలను పక్కన పెట్టి తన ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాడు. ‍

    డొమాస్టిక్‌ క్రికెట్‌ తిరిగొచ్చిన అతడు ఈసారి మరింత కష్టపడ్డాడు. మళ్లీ అతడికి 21 నెలల తర్వాత లంక తరపున ఆడేందుకు అవకాశం​ వచ్చింది. ఈసారి ఎలాగైనా తన సత్తా నిరూపించుకోవాలని ఆ యువ ఆటగాడు సిద్దమయ్యాడు. కానీ ముచ్చటగా మూడో సారి కూడా అతడికి నిరాశే ఎదురైంది. 

    మరో రెండు సున్నాలు అతడి ఖాతాలో చేరాయి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యాడు. అంటే తొలి ఆరు ఇన్నింగ్స్‌లలో అతడు కేవలం​ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. మిగితా ఐదు ఇన్నింగ్స్‌లలో డకౌటయ్యాడు. దీంతో మరోసారి అతడిపై వేటు పడింది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో చాలా మంది ఆటగాళ్లు ఇక చాలు అని తమ కెరీర్‌ను ముగించేస్తారు. కానీ అతడు మాత్రం వెనక్కు తగ్గలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడాతునే ఉన్నాడు.

    పట్టు వదలని విక్రమార్కుడు
    అతడు మళ్లీ దేశీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చి 36 నెలలు పాటు తీవ్రంగా శ్రమించాడు. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి దాదాపు మూడేళ్ల తర్వాత అతడు లంక టెస్టు జట్టులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అతడి కృషి ఫలించింది. మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించి తన జైత్ర యాత్రను ప్రారంభించాడు. అక్కడి నుంచి అతడు వెనక్కి తిరిగి చూడలేదు. 

    జీరో నుంచి హీరోగా మారిన అతడు ఏకంగా శ్రీలంక కెప్టెన్‌గా ఎదిగాడు. అతడే శ్రీలంక దిగ్గజం, మాజీ కెప్టెన్‌ మార్వన్‌ ఆటపట్టు. అతడి సక్సెస్‌ స్టోరీ ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తి దాయకం. అంతర్జాతీయ  క్రికెట్‌లో తన రెండవ రన్‌ సాధించడానికి మార్వన్‌కు 6 సంవత్సరాలు పట్టింది.

    ఇంత వైఫల్యం ఎదురైనా..అతడు మాత్రం గివప్‌ కాలేదు. అలా అని వేరే కెరీర్‌ చూసుకోలేదు. పడిన ప్రతీసారి బలంగా లేచిందుకు ప్రయత్నించాడు. ఫెయిల్‌ అవ్వడం ఎండ్‌ కాదు.. తిరిగి ప్రయత్నించడమే నిజమైన విజయమని మార్వన్‌ నిరూపించాడు.



    ఆరు డబుల్‌ సెంచరీలు.. 
    ఒక్క పరుగు సాధించడానికే ఇబ్బంది పడిన ఆటపట్టు.. తన టెస్టు కెరీర్‌లో ఏకంగా ఆరు డబుల్‌ సెంచరీలు సాధించాడు. 90 టెస్టులు ఆడిన మార్వన్‌ 39.02 సగటుతో 5502 పరుగులు సాధించాడు. అతడి పేరిట 16 టెస్టు సెంచరీలు, 6 ద్విశతకాలు ఉన్నాయి. వన్డేల్లో కూడా ఈ మాజీ కెప్టెన్‌ 11 సెంచరీల సాయంతో 8529 పరుగులు చేశాడు. మొత్తంగా ఆటపట్టు తన అంతర్జాతీయ కెరీర్‌లో 14,031 పరుగులు చేశాడు. అతడి కెప్టెన్సీలోనే 2004 ఆసియాకప్‌ టైటిల్‌ను లంక సొంతం చేసుకుంది.
    చదవండి: IND vs SA: టీమిండియా పొమ్మంది.. కట్‌ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్‌
     

National

  • ఢిల్లీ:  ఇప్పటికే బిహార్‌ రాష్ట్రంలో నిర్వహించిన  ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్‌ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’  నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి.  సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్‌ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. 

    ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్‌’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్‌’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. 

    అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై  ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

  • రాయ్‌పూర్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్‌ రేంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్‌కాల్‌ డివిజన్‌ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ముకేష్‌,  మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్  ఉన్నారు.

     

    ఆయుధాలతో సహా లొంగిపోయిన  మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు, ఆరోనంబర్  303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్‌ చేసినట్లు  బస్తర్‌రేంజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. 
     

     

     

  • లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్‌ డెక్కర్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.  ఆదివారం(అక్టోబర్‌ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్‌ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. 

    డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి  ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. టోల్‌ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. 

    బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్‌ జగత్‌ సింగ్‌ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు.  ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై చాలా సేపు ట్రాఫిక్‌ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు.

     

     

     

     

     

     

  • ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడు అఖిల్ అలియాస్ నైట్రా నేర చరిత్రకు సంబంధించి షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇండోర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ రౌడీగా పోలీసులు గుర్తించారు. ప్రపంచ కప్ మ్యాచ్ కోసం ఇండోర్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలో ఉన్న ఒక కేఫ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. 

    ఆ సమయంలో అఖిల్ తన బైక్‌పై క్రికెటర్ల వద్దకు వచ్చి, వారిలో ఒకరిని లాగడానికి ప్రయత్నించి, ఆ తర్వాత వేగంగా వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరో క్రికెటర్‌ను అసభ్యంగా తాకి పారిపోయాడు. భయపడిన క్రీడాకారులు వెంటనే తమ భద్రతాధికారికి తెలిపారు. ఆస్ట్రేలియా జట్టు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి డ్యానీ సిమన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అఖిల్‌పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. అతడి నేర చరిత్రలో దోపిడీ, దారి దోపిడీ, దొంగతనం, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ మద్యం వ్యాపారం వంటి కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

    అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజేష్ దండోతియా మాట్లాడుతూ, అఖిల్‌కు నేర చరిత్ర ఉందని.. అతను చాలాసార్లు జైలుకెళ్లి.. బెయిల్, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడల్లా కొత్త నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. సుమారు ఏడాది క్రితం, అఖిల్ కత్తితో ఒక యువ జంటపై దాడి చేసి, ఆ మహిళను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. మరో కేసులో, అతను ఉజ్జయినిలో పోలీసుల వద్ద నుంచి రైఫిల్స్‌ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడని.. జైలు శిక్ష పూర్తయ్యాక అతను ఇటీవలనే ఇండోర్‌కు తిరిగి వచ్చాడని తెలిపారు.

    ఈ ఘటనపై బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించిన సంగతిత తెలిసిందే. "ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. భారత్ అతిథిలను గౌరవించే దేశంగా పేరుగాంచినది. ఇటువంటి ఘటనలు  దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఎవ‌రిప‌ట్ల కూడా ఇలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. ఆసీస్ క్రికెట‌ర్ల‌కు ఇలా జ‌రిగినందుకు మేము చింతిస్తున్నామని పేర్కొంది

     

  • సతారా: మహారాష్ట్రలోని సతారాలో  వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. 

    ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్‌ గాంధీ ‘బీజేపీతో సంబంధం  కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని  ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల  రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్‌ పేర్కొన్నారు.
     

    ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్‌ తన ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ  ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి  ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని  రాహుల్‌ పేర్కొన్నారు.

    గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్‌ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు​న్నారు.

    ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్‌ పేరు మారింది

Andhra Pradesh

  • సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన అంబోజి వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నందుకు వినయ్‌పై కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అంబోజి వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    వినయ్‌పై డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.డిప్యూటీ స్పీకర్‌ ఫిర్యాదుతో హైదరాబాద్‌లో ఉన్న వినయ్‌ను ఆదివారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    వినయ్ అక్రమ అరెస్టును ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు ఖండించారు. వినయ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

  • సాక్షి,కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన 19 మృత దేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు  కర్నూలు వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగంలో జరిగాయి. ఇప్పటి వరకు డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన మొత్తం మృతదేహాల రిపోర్ట్‌ వివరాల్ని వైద్యులు ఎస్పీకి అందించారు. 

    వాటి ఆధారంగా అధికారులు భౌతిక కాయల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 14 మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో బిహార్ చెందిన ఆర్గా అనే వ్యక్తి మృతదేహానికి వారి కుటుంబ సభ్యులు కర్నూలు జోహరాపురంలో అంత్యక్రియలు చేశారు. బిహార్‌కు తీసుకుని వెళ్లేందుకు సమయం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో అక్కడ అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

     మరోవైపు బస్సు ప్రమాదంలో ఇంకా రెండు మృతదేహాల డిఎన్ఎ రిపోర్టు అందాల్సి ఉండగా.. ఇప్పటి దాకా 17 మృతదేహాల డీఎన్‌ఏ రిపోర్ట్‌లను అధికారులు పొందారు. ఈ రోజు రాత్రికి 19 మృతదేహాల్లో 18 మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. తమిళనాడుకు చెందిన మృతుడు ప్రశాంత్ కుటుంబ సభ్యులు రేపు కర్నూలుకి రానున్న నేపద్యంలో ఆ మృత దేహాన్ని రేపు అప్పగించనున్నారని సమాచారం.  

  • పాడేరు(అల్లూరి జిల్లా:  మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన చేపట్టింది. విద్యావ్యవస్థను నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలను తప్పుబట్టింది. ఈ మేరకు పాడేరు మెడికల్‌ కళాశాలను విద్యార్థి సంఘాల బృందం సందర్శించింది. విద్యార్థుల సంస్థల్లో  నెలకొన్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టింది ఏఐఎస్‌ఎఫ్‌.

    సీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రేవేటుపరం చేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుదాం! ఉద్యమాలను తీవ్రతం చేద్దాం!.... అంటూ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నెంబర్‌77ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థుల హక్కులను హరించే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

     

     

     

  • సాక్షి, విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎసిగిపడనున్నాయని.. తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

    సఖినేటిపల్లి-నర్సాపురం రాకపోకలు నిలిపివేత
    అంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సఖినేటిపల్లి -నర్సాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు నుండి తుపాను ఉధృతి తగ్గే వరకు రేవులో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    తీర ప్రాంతాల్లో అలర్ట్‌..
    మొంథా తుపాన్‌ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిపలీట్నంలోని మంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద హంసల దీవి బీచ్‌లను మూసివేశారు. మంగినపూడి బీచ్‌లో జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్‌లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

  • సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు.

    మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు.

     

  • సాక్షి,అమరావతి: హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌,ఎంపీ కేశినేని చిన్ని వివాదంపై పేర్నినాని స్పందించారు.

    ఈ సందర్భంగా కేశినేని చిన్నికి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను టీవీలో తప్ప  నేనెప్పుడూ చూడలేదు.కేసినేని చిన్ని మునిగిపోతున్న నావ మాదిరి కనిపిస్తున్నాడు. జగ్గయ్యపేట,నందిగామలో ఇసుకను కూడా లాగేసుకున్నారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్‌ పెట్టి పీకల్లోతు మునిగిపోయాడు. హైదరాబాద్‌లో చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయి’అని వ్యాఖ్యానించారు.  

  • సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బీచ్‌ వద్దకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో మునిగిపోతుండటం గమనించిన లైఫ్‌ గార్డులు సురక్షితంగా అతడిని రక్షించారు. సదరు విద్యార్థి సురక్షితంగా బయటకు రావడంతో, కుటుంబ సభ్యులు, అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 
     

  • యాదాద్రి భువనగిరి జిల్లా: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్‌ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు. 

    కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు.

Politics

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే  ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.

    రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

    ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..
    బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్‌ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.

    ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..
    రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.

    రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.

    ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.

    రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్‌లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

Family

  • కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్‌నర్‌ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్‌నర్‌ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్‌నర్‌ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్‌ సిటీలోని ఫిట్‌నెస్‌ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్‌ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. 

    యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్‌నర్‌ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. 

    ఇది ఫిట్‌నెస్‌తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. 

    ప్రయోజనాలెన్నో.. 
    ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.

    ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. 
    ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్‌ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్ని కూడా పెంపొందిస్తాయి. 

    ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్‌ సిద్ధా అక్షర్‌ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్‌నర్‌ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే 

    ముందు తప్పనిసరిగా వార్మప్‌ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్‌నర్‌ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. 

    భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి.   

    (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

  • ‘‘డాక్టర్‌! మా పాప రోజంతా ఏడుస్తుంటుంది. కాని, మొబైల్‌ చూపించగానే సైలెంట్‌ అయిపోతుంది. అందుకే రోజూ రెండుమూడు గంటలు రైమ్స్, కార్టూన్లు పెడతాం’’ అని అమాయకంగా చెప్పింది అనిత.
    ఆమె మాటల్లో ప్రేమ ఉంది కాని, లోపల ఒక ప్రమాదం దాగి ఉంది. అందుకే ఆ రెండేళ్ల పాపను చూశాను. ‘‘హాయ్‌ బుజ్జీ’’ అని పలకరించా, స్పందన లేదు. చేతికి బొమ్మ ఇచ్చినా ఆసక్తి చూపలేదు. కాని, ఫోన్‌ కనిపించగానే కళ్లు వెలిగాయి, చేతులు చాపింది. రెండేళ్లకే ఆ పాప మొబైల్‌కు అడిక్ట్‌ అయ్యిందని అర్థమైంది. 

    సైలెన్స్‌ వెనుక తుఫాను...
    ‘మేము బిజీగా ఉంటాం డాక్టర్‌. కాసేపు పిల్లల చేతిలో ఫోన్‌ పెడితే తప్పేముంది?’ అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. శిశువు ఏడుస్తుందంటే తనకు ఏదో అసౌకర్యంగా ఉందని సిగ్నల్‌. ‘‘అమ్మా, నా దగ్గరకు రా’’ అని పిలుపు.

    ఆ సమయంలో బిడ్డ చేతికి ఫోన్‌ ఇవ్వడమంటే ఆ సిగ్నల్‌ను మ్యూట్‌ చేయడం. తల్లితో బంధాన్ని కోల్పోవడం. ఎందుకంటే, తల్లి ముఖం కంటే స్క్రీన్‌ వెలుతురు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులు దగ్గరున్నా బిడ్డ ఒంటరిగా పెరుగుతుంది. 

    మెదడు మీద కాంతి దాడి
    శిశువు జననం తర్వాత మొదటి 36 నెలల్లో మెదడులో ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల కొత్త న్యూరల్‌ కనెక్షన్లు ఏర్పడతాయి. ఆ కనెక్షన్లు ఆటలతో, స్పర్శలతో, సంభాషణలతో బలపడాలి. తల్లి నవ్వు, తండ్రి చూపు, అమ్మమ్మ పాట – ఇవే అసలైన మానసిక ఆహారం. కాని, ఫోన్‌ స్క్రీన్‌ ముందు కూర్చునే పిల్లల మెదడు వేరే రకంగా అభివృద్ధి చెందుతుంది. స్క్రీన్‌లోని వేగం, రంగులు, శబ్దం – ఇవన్నీ మెదడును ఎక్కువగా ప్రేరేపిస్తాయి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 

    ఫలితంగా... 

    పిల్లలు సాధారణ ఆటలలో ఆసక్తి కోల్పోతారు. · బోరింగ్‌ అనిపిస్తే వెంటనే చిరాకు పెరుగుతుంది. · ఎప్పటికప్పుడు స్టిమ్యులేషన్‌ కావాలనిపిస్తుంది. 

    ఇదే మొదటి దశ డిజిటల్‌ అడిక్షన్‌. 

    స్క్రీన్‌ దెబ్బతో స్తంభించే మాటలు

    ‘‘డాక్టర్, మా పాపకు రెండేళ్లు. ఒక్క మాట కూడా మాట్లాడదు’’ అనేది ప్రస్తుతం నేను వినే అత్యంత సాధారణ ఫిర్యాదు. కారణం తెలుసా? తల్లిని చూస్తూ, వింటూ, అనుకరిస్తూ పిల్లలు ‘‘మాట’’ అనే మ్యాజిక్‌ నేర్చుకుంటారు.

    స్క్రీన్‌లోని కార్టూన్‌ మాట్లాడుతుంది కాని, వినదు. బిడ్డ ప్రయత్నించినా అది స్పందించలేదు. దీనివల్ల కమ్యూనికేషన్‌ లూప్‌ ఆగిపోతుంది. ‘రెండేళ్ల లోపు పిల్లలు 30 నిమిషాల స్క్రీన్‌ టైమ్‌ వల్ల మాటలు రావడం 49శాతం ఆలస్యమవుతుంది’ అని జర్నల్‌ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ 2020లో జరిగిన పరిశోధనను ప్రచురించింది. 

    ప్రేమ ముసుగులో ‘‘డిజిటల్‌ జైలు’’
    ‘‘మేము ఎడ్యుకేషనల్‌ వీడియోలు చూపిస్తున్నాం కదా! నష్టమేంటి?’’ అని కొందరు పేరెంట్స్‌ అనుకుంటారు. కాని, హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ను ఏ వీడియో భర్తీ చేయలేదని నాసా–యేల్‌ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం చెబుతోంది. వీడియోలు నేర్పే కంటెంట్‌ బౌద్ధికంగా ఉపయోగపడినా, భావోద్వేగ అనుభూతిని ఇవ్వలేవు.

    పిల్లలు నిజమైన ముఖాల నుంచి సహానుభూతి నేర్చుకుంటారు. కథల ద్వారా ఊహాశక్తి పెరుగుతుంది. కాని, స్క్రీన్‌ యాంత్రికంగా నేర్చుకోవడాన్ని మాత్రమే చేస్తుంది. ఫలితంగా... · భావోద్వేగ స్పర్శ తగ్గిపోతుంది. · స్నేహం కంటే స్క్రీన్‌ ప్రాధాన్యం పెరుగుతుంది. · పిల్లలో ‘డిజిటల్‌ లోన్లీనెస్‌’ ఏర్పడుతుంది. 

    స్క్రీన్‌తో ఏకాగ్రత లోపం... 
    శిశువుల మెదడును స్క్రీన్‌లు ‘ఫాస్ట్‌ రివార్డ్‌’ సిస్టమ్‌లో కట్టేస్తాయి. రంగులు, ఫ్లాష్‌లు, సంగీతం – ఒక్కో సెకనుకు ఒక కొత్త విజువల్‌ షాక్‌. దీని వల్ల మెదడు అటెన్షన్‌ను నిలుపుకోలేదు. ఆ తరువాత బిడ్డ పాఠశాలకు వెళ్లినప్పుడు ఫోకస్‌ నిలపలేరు. హైపర్‌ రియల్‌ స్క్రీన్‌ ప్రపంచం నచ్చి, రియల్‌ ప్రపంచం బోరింగ్‌గా మారిపోతుంది.

    తల్లిదండ్రులకు సూచనలు...

    ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకు ఏ స్క్రీన్‌ కూడా చూపకూడదు. బదులుగా శిశువులతో ఆడటం, పాడటం, తాకడం లాంటివి చేయాలి. · బిడ్డ ఏడిస్తే వెంటనే ఫోన్‌ ఇవ్వకండి. దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకోండి. ‘నువ్వు సేఫ్‌గానే ఉన్నావు’ అని సాఫ్ట్‌గా చెప్పండి. తల్లి మాట ఆత్మస్థైర్యం ఇస్తుంది – స్క్రీన్‌ కాదు.

    శిశువుతో కలిసి నడవడం, బొమ్మలతో ఆట, నీటిలో ఆడించడంలాంటివి సెన్సరీ ప్లస్‌ ఎమోషనల్‌ ఇంటిగ్రేషన్‌ను ఇస్తాయి. · 2–5 ఏళ్ల బిడ్డతో కలిసి చిన్న చిన్న ఎడ్యుకేషనల్‌ వీడియోలు మాత్రమే చూడాలి. ఆ తర్వాత వాటి గురించి చర్చించాలి. ప్రశ్నలు అడగాలి. 

    సైకాలజిస్ట్‌ విశేష్‌
    ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌
    www.psyvisesh.com

    (చదవండి: భారత్‌ 'ధర్మ యోగా' జపాన్‌ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!)


     

  • మన దేశంలోని యోగా వైభవానికి ఎంతో మంది విదేశీయులు ఆకర్షితులయ్యారు. అది నేర్చుకునేందుకు భారత్‌కి వచ్చి స్థిరపడిపోయినవాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు విదేశీయులు తమ మాతృభూమిలో దాని గొప్పతనం తెలిపేలా కృషి చేస్తున్నారు. అలాంటి యోగ గొప్పతనాన్ని తెలుసుకుని, అది నేర్చుకున్న తర్వాత పొందిన అనుభవం గురించి షేర్‌ చేసుకున్నాడు ఓ జపనీస్‌ వ్యక్తి. అతడి మాటలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

    భారత్‌లో నివశిస్తున్న జపనీస్‌ భారతీయుడు నోజోము హగిహర ఒక శక్తిమంతమైన పాఠాన్నినేర్చుకున్నానంటూ భ్యావోద్వంగంగా మాట్లాడిన వీడియోని  నెట్టిట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. తత్వం ఆంతర్యం తెలుసుకునేందుకు ఉపకరించే ధర్మ యోగా గురించి మాట్లాడాడు ఆ వీడియోలో. ఇది మనిషి ఎలా జీవించాలో..ఎలా ఉంటే మంచిది అనేది తెలియజేస్తుంది. 

    యోగ సూత్రాలైన యమ(నిగ్రహం), నియమ(క్రమశిక్షణ)లు నిజాయితీ, కరుణ, క్రమశిక్షణలతో పాతుకుపోయిందని చెబుతున్నాడు. ఇది జీవన విధానం గురించి తెలుపుతుంది. అహింస, సత్యం, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు పోస్ట్‌లో ఈ యోగా అహింస, సత్యం, నిజాయితీ, దొగతనం చేయకుండా ఉండటం వంటి విలువలను నేర్పుతుందని పేర్కొన్నాడు. 

    బ్రహ్మచర్యం, మిత సంభాషణ, శారీరక, మానసిక శక్తిని బలోపేతం చేయడమే కాదు, దురాశను, దక్కని దానియందు బాధ వంటి వాటిని దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ యోగా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసిందంటూ భావోద్వేగంగా మాట్లాడాడు నోజోము. దీనికి  దయతో జీవించే ఆర్ట్‌ని నేర్పింస్తుందనే క్యాప్షన్‌ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్‌ చేశారు. 

     

    (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)
     

  • మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్‌ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్‌ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

    ఢిల్లీ కార్డియాలజిస్ట్‌ "అనారోగ్యకరమైన ఆఫీస్‌ స్నాక్స్‌ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు  వైద్యులు. 

    ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి..  యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. 

    అదేనండి స్టంట్‌ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్‌ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్‌ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్‌. 

    అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్‌ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. 

     

    వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..
    అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్‌లో రోటీన్‌గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు.  కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. 

    (చదవండి: నీటికి బదులు బీర్‌! స్పెషల్‌ హైడ్రేషన్‌ స్టయిల్‌..)


     

     

     


     

  • తమిళనాడు పిడి కొళుకట్టై 
    కావలసినవి:  బియ్యప్పిండి– ఒక కప్పు, బెల్లం తురుము– రుచికి సరిపడా, నీళ్లు– కొన్ని, పచ్చికొబ్బరి తురుము– అర కప్పు, ఏలకుల పొడి– కొద్దిగా, నెయ్యి– ఒక టీ స్పూన్, ఉప్పు– చిటికెడు

    తయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి స్టవ్‌పై పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అందులో ఏదైనా చెత్త ఉంటే తొలగించడానికి ఆ బెల్లం నీటిని వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని తిరిగి పాన్‌లో పోసి, పాకం పట్టించాలి. అందులో ఏలకుల పొడి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా గరిటెతో కలపాలి. నీరు బాగా మరుగుతున్న సమయంలో, మంటను పూర్తిగా తగ్గించాలి. 

    ఇప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా చల్లుతూ, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి దగ్గరపడుతూ, ముద్దలా మారడం మొదలవుతుంది. ఆపకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మొత్తం మిశ్రమం దగ్గరపడి, గిన్నె అంచులను వదిలి ముద్దలా మారిన తర్వాత, వెంటనే మంటను ఆపెయ్యాలి. 

    ఈ ముద్దను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా పిసికి, చిత్రంలో ఉన్న విధంగా చేతులతో ఒత్తుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. ఈ పిడి కొళుకట్టైను పూజా సమయాల్లో నైవేద్యంగా కూడా పెడతారు.

    పాకిస్తాన్‌ హల్వా పూరీ
    కావలసినవి:  బొంబాయి రవ్వ– ఒక కప్పు
    పంచదార – అర కప్పు, బటర్‌– పావుకప్పు (కరిగించాలి)
    పాలు– రెండున్నర కప్పులు, పలుకులుగా చేసిన నట్స్‌ – ఒక గుప్పెడు, ఏలకులు – 3, నెయ్యి– 3 టేబుల్‌స్పూన్లు
    పూరీలు– 4 లేదా 5 (అభిరుచిని బట్టి పిండిలో పంచదార కూడా వేసుకోవచ్చు)

    తయారీ: ముందుగా ఒక పాత్రలో బొంబాయి రవ్వ, నెయ్యి వేసి, గరిటెతో తిప్పుతూ వేయించాలి. రవ్వ మంచి వాసన వచ్చాక, బటర్‌ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసి కలపాలి. తర్వాత పంచదార వేసి, కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి. 

    అనంతరం నట్స్‌ వేసి బాగా కలపాలి. చివరిగా, పాలను నెమ్మదిగా పోస్తూ, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దగ్గరపడే వరకు కలుపుతూ, ఉడికించాలి. హల్వా వేడిగా ఉన్నప్పుడే, నెయ్యి వేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

    క్రిస్పీ కోకోనట్‌ చికెన్‌
    కావలసినవి:  బోన్‌లెస్‌ చికెన్‌– అరకిలో (నిలువుగా కట్‌ చేసుకోవాలి)
    జొన్న పిండి, కొబ్బరి తురుము– పావు కప్పు చొప్పున, గుడ్లు– 2
    పాలు– 3 టేబుల్‌ స్పూన్లు(చిక్కటివి)
    పచ్చిమిర్చి పేస్ట్‌– ఒక టీ స్పూన్‌
    అల్లం వెల్లుల్లి పేస్ట్‌– అర టీ స్పూన్‌
    ఇంగువ– చిటికెడు, 
    నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి– అర టీ స్పూన్‌ చొప్పున
    ఉప్పు, నూనె– సరిపడా

    తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌ తీసుకుని, అందులో చికెన్‌ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్‌ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముక్కలకు మొత్తం ఆ మిశ్రమాన్ని పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 

    తర్వాత ఒక బౌల్‌లో జొన్న పిండి, ఇంకో బౌల్‌లో పాలు–గుడ్లు మిశ్రమం, మరో బౌల్‌లో కొబ్బరి తురుము వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్‌ ముక్క తీసుకుని, మొదట జొన్నపిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుములో ముంచి, బాగా పట్టించి– నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.  

    (చదవండి: ‘విలేజ్‌ హాలోవీన్‌ పరేడ్‌’కి వెళ్లాలంటే..గట్స్‌ ఉండాలి..!)

  • ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్‌ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్‌ టచ్‌తో, కంఫర్ట్‌ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్‌ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.

    నా ఫ్యాషన్‌  ఫార్ములా? 
    మిక్స్‌ ఇట్‌ అప్‌! ట్రెడిషనల్‌ టచ్‌కి మోడర్న్‌ ట్విస్ట్‌ జోడించడం నాకు ఇష్టం. క్యూట్‌ బిందీతో వెస్టర్న్‌ వేర్‌ స్టయిల్‌ చేస్తాను, అలాగే ట్రెడిషనల్‌ దుస్తులు ధరించినప్పుడు ఫంకీ జ్యూలరీ లేదా కూల్‌ ఫుట్‌వేర్‌తో మిక్స్‌ చేస్తా. నా మూడ్‌ను బట్టి లుక్‌ కూడా మారిపోతుందని అంటోంది నిహారికా

    చిన్నగా మెరిసే మెరుపు!
    చిన్నదే, కానీ చెవుల్లో పెద్ద ఫన్‌  షో లాంటి ప్రభావం! అవే మినీ హ్యాంగింగ్స్‌. పెద్ద ఇయర్‌రింగ్స్‌ కంటే, ఇవి తేలిగ్గా, క్యూట్‌గా ఉంటూ ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్‌ ఇస్తాయి. ఒక్కసారి మినీ గోల్డ్‌ బీడ్స్, చిన్న ముత్యాలు, కలర్‌ స్టోన్స్‌ వంటివి వేసుకుంటే, సాధారణ డ్రెస్సు కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. డైలీ వేర్‌కి, సింపుల్‌ డిజైన్‌  హ్యాంగింగ్స్‌ ఎల్లప్పుడూ బెస్ట్‌ ఆప్షన్‌. 

    ఆఫీస్‌కి వెళ్లినా, క్లాస్‌ రూమ్‌లో కూర్చున్నా, మీరు ప్రొఫెషనల్, ఫ్రెష్‌ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తారు. కాని, పార్టీ లేదా ఫంక్షన్‌  కోసం అయితే, కొంచెం స్టోన్‌ హ్యాంగింగ్స్‌ స్టేట్‌మెంట్‌గా మారతాయి. పోనీ, వేవీ, కర్ల్స్‌ ఏ హెయిర్‌ స్టయిల్‌ అయినా ఈ చిన్న హ్యాంగింగ్స్‌ క్యూట్‌ అండ్‌ రాయల్టీ ఫీల్‌ను ఇస్తాయి. ఇక్కడ నిహారిక ధరించిన చీర డిజైన్‌ చేసింది అశ్విని త్యాగరాజన్‌,  ధర: రూ. 70,000, ఇక జ్యూలరీ : బ్రాండ్‌: రాజీ ఆనంద్‌, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.  

    (చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)

  • అది హైద్రాబాద్‌లోని పాపులర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఒకటి. దాని ప్రిన్సిపాల్‌ వైద్యరాజ్‌ గదిలోకి వచ్చిన ప్యూన్‌  ఓ కాగితాన్ని ఇచ్చాడు. దాని వెనక ‘మీ స్టూడెంట్‌ ఫాదర్‌ని. దయచేసి ఓ ఐదు నిమిషాలు మీతో మాట్లాడే సమయం కేటాయించగలరా?’ అని ఇంగ్లీష్‌లో రాసుంది.‘‘రమ్మను.’’ ఆయన చెప్పాడు.లోపలకి వచ్చిన ఆయన వయసు నలభైఐదు– ఏభై మధ్య ఉండచ్చని వైద్యరాజ్‌ అనుకున్నాడు. అతని దుస్తులని బట్టి మధ్యతరగతి మనిషని కూడా గ్రహించాడు.‘‘రండి. కూర్చోండి.’’ మర్యాదగా ఆహ్వానించాడు.‘‘థాంక్‌ యు సర్‌. మీరు బిజీ అని నాకు తెలుసు.’’ ఆయన కంఠం సౌమ్యంగా ఉంది.‘‘నేను ఉన్నది మీ కోసమే. చెప్పండి.’’‘‘నా సమస్యని మీకు చెప్పాలని వచ్చాను. మా రెండో అమ్మాయి మీ కాలేజ్‌లో థర్డ్‌ ఇయర్‌ స్టూడెంట్‌. మీ కాలేజీలో చేరక మునుపే దానికి మొబైల్‌ కొనిచ్చాను.’’ కొద్దిగా బాధగా చెప్పాడు.

    ‘‘ఈ రోజుల్లో కుటుంబంలో ప్రతివారికీ ఓ మొబైల్‌ తప్పనిసరి.’’ వైద్యరాజ్‌ చెప్పాడు.‘‘ఇప్పుడు ప్రతి మొబైల్‌ పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ తో వస్తోంది. కాబట్టి నేను మా నలుగురి పాస్‌వర్డ్స్‌ని ఓ కాగితం మీద రాసి దాన్ని ఫ్రిజ్‌కి మేగ్నెట్‌తో తగిలించాను. నిన్న రాత్రి నేను మా ఆవిడకి పంపే ఈమెయిల్‌ మెసేజ్‌ని పొరపాటున మా అమ్మాయికి పంపాను. అది మా అమ్మాయి పెట్టే అధిక ఖర్చు గురించిన వివరాలు. నా తప్పుని గ్రహించాక వెంటనే దాన్ని మా అమ్మాయి జీమెయిల్‌లోంచి డిలీట్‌ చేయాలని అనుకున్నాను. అది ఆ సమయంలో నిద్రపోతోంది.

     పాస్‌వర్డ్‌ చూసి మా అమ్మాయి ఫోన్‌  ఓపెన్‌  చేసే ప్రయత్నం చేస్తే అది తెరచుకోలేదు. మా అమ్మాయి నిద్ర లేచాక ఫోన్‌  పాస్‌వర్డ్‌ ఎందుకు పని చేయలేదని అడిగాను. మార్చానంది. కొత్తది చెప్పమంటే నీళ్ళు నమిలింది. దాన్ని తెరచి ఇవ్వమంటే సందేహించింది. నేను గట్టిగా అరిస్తే వణుకుతూ తెరిచింది. వాట్సప్‌ ఓపెనైంది. అందులో టాప్‌లో ఓ అబ్బాయి నుంచి అప్పటికే ఐదారు మెసేజెస్‌ వచ్చి ఉన్నాయి. దాని మీద క్లిక్‌ చేస్తే...’’అతను స్వల్పంగా సిగ్గుతో ఆగాడు. తర్వాత కొనసాగించాడు.‘‘రెండు బూతు వీడియోలు, అలాంటి ఫొటోలు నాలుగు కనిపించి షాకయ్యాను.’’‘‘ఓ!’’ వైద్యరాజ్‌ వెంటనే ఆశ్చర్యంగా చెప్పాడు.‘‘ఆ అబ్బాయి తన సీనియర్‌ అని చెప్పింది.’’

    ‘‘పేరు?’’‘‘నేను ఆ అబ్బాయి మీద ఫిర్యాదు చేయడానికి రాలేదు. మీ స్టూడెంట్స్‌ అంతా ఇలా విచ్చలవిడిగా ఉన్నారేమోనని ఫిర్యాదు చేయడానికి వచ్చాను. మీరు మీ స్టూడెంట్స్‌ తల్లిదండ్రులకి తమ పిల్లల మొబైల్స్‌ మీద ఓ కన్నేసి ఉంచమని సూచించమని చెప్పడానికి వచ్చాను సార్‌. వయసులోని వారికి మొబైల్‌ ద్వారా సీక్రెసీ, ఏక్సెసిబిలిటీ అందుబాటులోకి వచ్చాక మన కళ్ళముందే ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వయసు మహిమ. ఇది మీ దృష్టికి తెస్తే కొందరి జీవితాలైనా బాగుపడచ్చు అనిపించింది.’’
    ‘‘ఇది సీరియస్‌ ప్రాబ్లం. ఇది నాకు చెప్పినందుకు థాంక్స్‌. దీని గురించి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను.’’ఆయన ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆగాడు. ఆయన మొహంలోని అనిశ్చితిని గమనించాక ప్రిన్సిపాల్ అడిగాడు.

    ‘‘ఇంకేదైనా ఉందా?’’‘‘ఎస్‌. తర్వాత మా ఆవిడ ఫోన్‌ ని కూడా నేను పంపింది డిలీట్‌ చేయడానికి తెరవాలని ప్రయత్నించాను. కాని ఆవిడ కూడా తన పాస్‌వర్డ్‌ని మార్చేసింది! మార్చినా నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. వెంటనే ఆమె మొహం పాలిపోయింది. తెరిపించి చూస్తే వాట్సప్‌లో ఎవరికో ఆమె పంపిన రొమాంటిక్‌ పోస్ట్‌లు, అక్కడి నుంచి వచ్చినవి కనిపించాయి. అది ఆర్కైవ్స్‌లో దాక్కుని ఉంది! నా దిమ్మ తిరిగిపోయింది సర్‌. మొబైల్‌ వరం అనుకున్నాను. కాని శాపం కూడా సార్‌. చాలామందికి ఈ కొత్తరకం టైమ్‌పాస్‌ జీవితాలని నాశనం చేసే శాపం అనుకుంటున్నాను.’’ ఆయన బాధగా చెప్పాడు.వైద్యరాజ్‌కి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. అతను వెళ్ళాక కాగితం అందుకుని విద్యార్థుల తల్లితండ్రులకి ఓ సర్కులర్‌ని డ్రాఫ్ట్‌ చేయసాగాడు.

    ఇంటికి వెళ్ళాక ప్రిన్సిపాల్ వైద్యరాజ్‌ తన భార్య స్నానానికి వెళ్ళేదాకా ఆగి, ఆవిడ మొబైల్‌ని తెరిచే ప్రయత్నం చేసి, పాస్‌వర్డ్‌ మారిందని గ్రహించాడు.ఆవిడ వచ్చాక తన మొబైల్‌ ని ఆవిడకి ఇచ్చి చాలా మామూలుగా చెప్పాడు.‘‘పాస్‌వర్డ్‌లు ఓ పట్టాన గుర్తుండవు. ఫింగర్‌ ప్రింట్స్‌తో కూడా తెరిచే మొబైల్స్‌ మనవి. నా దాంట్లో నీ ఫింగర్‌ ప్రింట్, నీ దాంట్లో నా ఫింగర్‌ ప్రింటూ పెట్టుకుందాం. ముందు నా దాంట్లో మారుద్దాం.’’ఆమె మొహం కొద్దిగా పాలిపోయింది. తన ఫింగర్‌ ప్రింట్‌ని కూడా ఆమె దాంట్లో నమోదు చేశాడు. నివారణ చర్య జరిగింది కాబట్టి తన భార్య మొబైల్‌లో ఏం ఉందోనని వెదికి ఆ విద్యార్థిని తండ్రిలా ఆయన తన మనసు పాడుచేసుకోదలచుకోలేదు.  

    ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

    ‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే 
    ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
    భాగస్వాములను చేయనున్నారు. 
    మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో 
    ఈ కింది మెయిల్‌కు పంపండి.  kathakalisakshi@gmail.com
     

  • న్యూయార్క్‌ నగరంలో జరిగే ‘విలేజ్‌ హాలోవీన్‌ పరేడ్‌’కి వెళ్లాలంటే గుండెల్లో దమ్ముండాలి. ఇది గ్రీన్‌విచ్‌ విలేజ్‌ పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. ఈ వేడుకలో అడుగడుగునా, దారిపొడవునా హడలెత్తించే రూపాలు దర్శనమిస్తాయి. హాలోవీన్‌లో పాల్గొనే ప్రజలంతా దయ్యాలు, భూతాలు, రక్తపిశాచాలలాంటి భయంకరమైన వేషాలు వేసుకుని తిరుగుతారు.

    ఈ హాలోవీన్‌ పండుగకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్టోబర్‌ 31న వారి కాలమానాల ప్రకారం జీవించి ఉన్న ప్రపంచానికి, చనిపోయిన వారి ఆత్మల లోకానికి మధ్యనున్న తెర పలుచబడుతుందని, దాంతో ఆత్మలు భూమిపైకి వస్తాయని అక్కడివారు నమ్మేవారు. అందుకే చెడు ఆత్మలను తమ దగ్గరికి రాకుండా ఆపడానికి, భయపెట్టడానికి లేదా ఆ ఆత్మలు తమను గుర్తుపట్టకుండా ఉండటానికి ప్రజలు భయంకరమైన లేదా వింతైన వేషాలను ధరిస్తారు.

    1974లో చిన్నపాటి కమ్యూనిటీ ఈవెంట్‌గా దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హాలోవీన్‌ పరేడ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఊరేగింపులో సుమారు 50 వేలమందికి పైగా చిత్రవిచిత్రమైన వేషధారణలతో ఎంట్రీ ఇస్తారు. వేలాదిమంది దీనిని తిలకించడానికి తరలివస్తారు. ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ– భారీ తోలుబొమ్మలే. 

    అవి కూడా హడలెత్తించేలానే హారర్‌ సీన్‌ను క్రియేట్‌ చేస్తాయి. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. భయపెట్టే కాస్ట్యూమ్‌ వేసుకున్న ఎవరైనా వచ్చి నేరుగా ఈ ఊరేగింపులో చేరవచ్చు. సాధారణంగా ఈ పరేడ్‌ మాన్‌హట్టన్‌లోని సిక్స్‌త్‌ అవెన్యూలో కెనాల్‌ స్ట్రీట్‌ నుంచి 15వ వీధి వరకు సాగుతుంది. 

    నిజానికి ఈ పరేడ్‌ న్యూయార్క్‌ నగర ప్రజల సృజనాత్మకతకు ఒక వేదిక. ఈ వేడుకలో పాల్గొనేవారంతా తమకు ఇష్టమైన వేషధారణలో రోడ్లమీదకు వస్తారు. ‘అలా వేరొక వేషధారణలో రావడంతో తమ నిజ జీవిత పాత్రల నుంచి ఒక రాత్రి బయటపడటమనేది ఒక ప్రత్యేక అనుభూతి’ అంటారు వాళ్లంతా. ఏది ఏమైనా ఈ పరేడ్‌లో వణుకు పుట్టించే డెవిల్‌ వేషాలను చూడాలంటే గుండెల్లో దమ్ము ఉండాల్సిందే మరి!
    · సంహిత నిమ్మన 

    (చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)

International

  • డబ్లిన్: ఐర్లాండ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో కేథరీన్ కొన్నోలీ ఘనవిజయం సాధించారు. శనివారం జరిగిన ఐర్లాండ్‌ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కేథరీన్ కొన్నోలీ ఘన విజయం సాధించారు. ఆమె 63.4శాతం ఓట్లతో గెలుపొందగా.. ప్రత్యర్థి హీదర్ హంప్రీస్ 29.5శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు.

    ఐర్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన కేథరీన్ కొన్నోలీకి గాల్వే ఎంపీగా సేవలందించిన అనుభవం ఉంది. అలాగే బారిస్టర్గా, క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో జరిగిన మీడియా సమావేశంలో యూరోపియన్ యూనియన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలు, శాంతి కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.

    ‘నేను వినే అధ్యక్షురాలిని, ఆలోచించే అధ్యక్షురాలిని, అవసరమైనప్పుడు మాట్లాడే అధ్యక్షురాలిని అవుతాను. మనం కలిసి అందరికీ విలువ ఇచ్చే కొత్త గణతంత్రాన్ని నిర్మించగలము’ అని ప్రకటించారు.

  • కౌలాలంపూర్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా రోజులు త‍ర్వాత మళ్లీ ఫుల్‌ జోష్‌లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్‌ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్‌ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్‌ డ్యాన్స్‌(Trump Dance Video) వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఆసియాన్‌ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్‌.. ఆదివారం కౌలాలంపూర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ నుంచి కిందకు దిగగానే ట్రంప్‌ రెడ్‌ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.

    దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్‌కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్‌ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్‌ తన మార్క్‌ డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్‌తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్‌ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్‌.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జపాన్‌ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు. 

Cartoon

Dr B R Ambedkar Konaseema

  • అన్నప్రసాద పథకానికి  రూ.88 వేల విరాళం

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంటిపూడి సాయిరామ్‌చౌదరి – పుష్పావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116, రావులపాలేనికి చెందిన కూసుమంచి గంగాధరరావు, కామేశ్వ రి కావేరిలు రూ.38,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

  • వనం..

    వన సమారాధనలకు వేళాయె

    నేడు కార్తికమాస తొలి ఆదివారం

    సందర్శకులతో కిటకిటలాడనున్న

    పర్యాటక ప్రాంతాలు

    కొత్తపేట: కార్తిక మాసం వచ్చింది.. ఊరూవాడా సందడి తెచ్చింది.. ఐక్యతను చాటే వన మహోత్సవాలకు వేళయ్యింది.. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు, స్నేహితులు, వివిధ కుల, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వన సమారాధనల జోరు అందుకోనుంది. కార్తిక వన సమారాధనల్లో అంతా ఐక్యంగా ఉసిరి చెట్టు ఉన్న పచ్చని కొబ్బరి, మామిడి తదితర తోటల్లో చేరి, ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసి, మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేయడం ఆచారంగా వస్తుంది. ఇది సమాజంలో మానవ సంబంధాలు, మత సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రకృతితో మమేకం కావడానికి ఉద్దేశించబడింది. ఇది పిక్నిక్‌ లాంటిదే కాకుండా, ఉసిరి చెట్టు వద్ద మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి, ఆ చెట్టు ద్వారా వీచే గాలి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అనుభవించడం ముఖ్యోద్దేశం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఆటవిడుపుగా, మానసికంగా ఉపశమనాన్ని కలిగించే కార్యక్రమంగా ఇది దోహదపడుతుంది. ఈ నెల 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో కార్తిక ఆదివారాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కడికక్కడ వన సమారాధనల సందడి కొనసాగనుంది.

    ఆనందంగా విహరిద్దాం

    కార్తిక మాసంలో ఎక్కువగా ఆదివారాల్లో వన విహారాలు, వన సమారాధనలకు ఏర్పాటు చేసుకుంటారు. కార్తిక మొదటి ఆదివారం (నేడు) కావడంతో పలు వర్గాల వారు వన సమారాధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందుకు అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కాకినాడ బీచ్‌, కాకినాడ – తాళ్లరేవు మధ్య కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, రంప, మారుడుమిల్లి అటవీ ప్రాంతాలు, జలపాతాలు, అఖండ గోదావరి నడుమ పాపికొండలు, కొత్తపేట సమీపాన కపిలేశ్వరపురం మండలం వీధివారిలంకలో ధనమ్మతల్లి కొలువైన ధనమ్మమర్రి ప్రాంతం, మందపల్లి – రావులపాలెం మధ్య కాశీరాజుగారి తోట, రాజోలు నియోజకవర్గంలో దిండి రిసార్ట్స్‌, పి.గన్నవరం అక్విడెక్ట్‌, బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక తదితర ప్రాంతాల్లో వన సమారాధనలు జరుపుకొంటారు.

    భక్తి నింపుతూ..

    కార్తిక మాసంలో పంచారామాలను దర్శించుకోవడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, సామర్లకోట కుమారా రామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, పిఠాపురం కుక్కటేశ్వరస్వామి, కొత్తపేట మండలం పలివెల కొప్పేశ్వరస్వామి, ముక్తేశ్వరం క్షణముక్తేశ్వస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, అయినవిల్లి వరసిద్ధి వినాయకస్వామి, మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, పట్టిసీమ వీరభద్రస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, ఆలమూరు మండలం జొన్నాడలో విశ్వేశ్వరస్వామి, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరస్వామి తదితర ఆలయాలున్నాయి. ఈ కార్తికంలో ముఖ్యంగా సోమవారాల్లో ఆయా ఆలయాలను సందర్శిస్తారు. నవంబరు 21 తేదీ మార్గశిర శుద్ధ పాఢ్యమి పుణ్యస్నానాలు, ఆకాశ దీపారాధనతో కార్తికమాసం ముగియనుంది.

    పచ్చనిసీమ.. చూద్దామా

    గౌతమి – వశిష్ట గోదావరి నడుమ కోనసీమలో పచ్చని పంటలు, కాలువలతో ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాలు ఉన్నాయి. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు పర్యాటక కేంద్రంగా ఖ్యాతికెక్కింది. పరవళ్లు తొక్కుతూ లొల్ల లాకుల నుంచి విడుదలవుతున్న సాగునీరు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ ప్రాంతం కార్తిక మాసంలో పర్యాటకులతో కిటకిటలాడుతోంది. సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మహాశయుడు కోనసీమలో సాగునీటి వ్యవస్థ నిర్వహణకు లాకులను నిర్మించారు. లాకుల గేట్లు ఎత్తే సమయాల్లో వాటి నుంచి ఎగసిపడుతూ ప్రవహించే నీటి కెరటాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లొల్ల లాకుల వరకు ప్రవహించే ప్రధాన పంట కాలువ లొల్ల లాకుల వద్ద ముక్తేశ్వరం, అమలాపురం, పి.గన్నవరం కాలువలుగా విడిపోతుంది. ఆ మూడు కాలువలకు నీరు వెళ్లే దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి లొల్ల లాకుల వద్ద కార్తిక సమారాధనలు జరుపుకొనేందుకు తరలివస్తుంటారు.

    అప్రమత్తంగా ఉండండి

    గౌతమి, వశిష్ట నదులు, సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు, వన సమారాధనల సందర్భంగా స్నేహితులతో సరదాగా స్నానాలకు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ నిర్లక్ష్యం వహిస్తే రెప్పపాటులో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేలా అప్రమత్తంగా ఉండాలి.

    సుంకర మురళీమోహన్‌, డీఎస్పీ, కొత్తపేట

  • రైల్వ

    సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గమనించారు. కాకినాడ రైల్వే ఎస్సై వాసంశెట్టి సతీష్‌ కథనం ప్రకారం.. రైల్వే ట్రాక్‌మాన్‌ సమాచారం మేరకు ఉండూరు రైల్వే గేటు సమీపంలో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి ఒంటిపై నీలం రంగు జీన్‌ ఫ్యాంట్‌, గ్రే, నలుపు రంగు టీ షర్టు ఉంది. ఎటువంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మరిన్ని వివరాల కోసం 94949 02914 ఫోన్‌ నంబరులో సంప్రదించాలన్నారు.

    వచ్చే నెలలో అథ్లెటిక్స్‌ పోటీలు

    రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజీయెట్‌ అథ్లెటిక్స్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నవంబర్‌ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ తెలిపారు.

    ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ అథ్లెటిక్స్‌లో 26 రకాల క్రీడా పోటీలు ఉంటాయని, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ, రిజిస్టార్‌ ఆచార్య కేవీ స్వామి, అసిస్టెంట్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎంవీఎస్‌ఎన్‌ మూర్తి, ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్రరావు, ఆర్గనైజింగ్‌ మెంబర్లు ఎం.ప్రసాద్‌, పీవీవీ లక్ష్మి, టి.విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.

  • ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి

    వాడపల్లి క్షేత్రంలో భక్తజన సంద్రం

    ఒక్కరోజే రూ...... లక్షల ఆదాయం

    కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్‌, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి – గంటల వరకూ దేవస్థానానికి రూ. – లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది.

  • అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌

    నిడదవోలు రూరల్‌: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్‌ జిల్లా దొంగను శనివారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎల్‌.బాలాజీ సుందరరావు తెలిపారు. సమిశ్రగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ నిడదవోలు మండలం శంకరాపురంలో ఈ నెల 6న కోలా నాగేశ్వరరావుకు చెందిన బంగారు ఉంగరం, 22న కాయల మంగకు చెందిన బంగారపు బొందును ఓ వ్యక్తి చోరీ చేశాడు. వీరిని బెదిరించి బంగారం దోచుకుపోయాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావును నిందితుడిగా గుర్తించామని ఎస్సై తెలిపారు. గోపవరం వద్ద అప్పారావును అరెస్ట్‌ చేసి మూడు బంగారు ఉంగరాలు, రెండు కాసుల బొందు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 14 పాత కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, ట్రైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, రాంబాబు, ధనుంజయ్‌లను ఎస్పీ డి.నరసింహకిశోర్‌, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్‌ అభినందించారు.

East Godavari

  • గుండెల్లో గుబేళ్లు

    దేవరపల్లి: పొగాకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పులు చేసి, శిస్తులు కట్టి సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. లోగ్రేడ్‌ పొగాకు అమ్ముడుపోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కాడికి సరి పెట్టుకుని ఏదో ధరకు అమ్ముకుందామన్నా కొనే నాథుడు దొరకడం లేదు. మార్కెట్లో లోగ్రేడు పొగాకు అమ్ముడు పోక అధికారులు, రైతులు అయోమయంలో పడ్డారు. దాదాపు 20 రోజుల నుంచి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయి. బ్రైట్‌, మీడియం గ్రేడు పొగాకును కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు.. లోగ్రేడు పొగాకు కొనుగోలుకు ససేమిరా అంటున్నారు. తక్కువ ధరకు ఇచ్చినా మా కొద్దు బాబోయ్‌ అని ట్రేడర్లు చేతులెత్తేయడంతో మార్కెట్లో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది.

    ముగింపు దశకు అమ్మకాలు

    బొగులు మాడు, సైలెన్‌, బాడవ భూముల్లో పండించిన లోగ్రేడు పొగాకు రైతుల ఇళ్ల వద్ద ఎక్కడకక్కడే ఉండిపోయింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు అమ్మకాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బోర్డు పరిమితి మేరకు పండించిన పొగాకు అమ్మకాలు పూర్తి కాగా, అదనంగా పండిన పంటను రైతులు వేలం కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. అదనపు పొగాకు అమ్మకాలు కూడా ముగింపు దశకు చేరుకోగా, లోగ్రేడు పొగాకు అమ్మకాలు పెద్ద సమస్యగా మారాయి. మొన్నటి వరకూ లోగ్రేడు కిలో ధర రూ.80 పలకగా, కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం రూ.59 నుంచి 60కి పడిపోయింది. అంటే కిలోకు సుమారు రూ.20 పతనమైనప్పటికీ కోనుగోలుదారులు నిరాకరిస్తున్నారు. చిన్న కంపెనీలు కూడా దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.

    అధికారుల సన్నాహాలు

    దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరుకు పొగాకు వేలం ప్రక్రియను ముగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్‌) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు 84 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. దీనిలో 4 మిలియన్ల కిలోలు లోగ్రేడు పొగాకు ఉత్పత్తి జరిగినట్టు అధికారులు లెక్కలు వేశారు. ఒక్కొక్క వేలం కేంద్రంలో 5 నుంచి 7 లక్షల కిలోల లోగ్రేడు పొగాకు ఉత్పత్తి అయినట్టు సమాచారం. గత రెండేళ్లుగా లోగ్రేడుకు మంచి ధర లభించింది. కిలో రూ.120 నుంచి రూ.170 వరకూ పలికింది. లోగ్రేడు పొగాకు అమ్మకాలు పూర్తయితే రైతుల వద్ద గల సూర కొనుగోళ్లు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజులు సూర పొగాకు కొనుగోళ్లు ఉంటాయని చెబుతున్నారు.

    అమ్ముడుపోని లోగ్రేడు పొగాకు బేళ్లు

    ఆందోళనలో రైతులు

    అయోమయంలో అధికారులు

    ధర తగ్గించినా ముందుకు రాని ట్రేడర్లు

    4 మిలియన్ల లోగ్రేడు ఉత్పత్తి

  • జగన్‌

    రాజమహేంద్రవరం సిటీ: జగన్‌ ప్రభుత్వంలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం కుదిరిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నగర అధ్యక్షుడు మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు అదానీ పేరు చెప్పకుండా, విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

    బాబుకు ప్రచార పిచ్చి

    భరత్‌రామ్‌ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయ్యారని, సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్‌లో 1992లో చేరారన్నారు. కానీ చంద్రబాబు తానే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ తీసుకువచ్చానని చెబుతున్నారన్నారు. సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌ డేటా సెంచర్‌ గురించి ప్రధానితో మాట్లాడానని చెబితే, అది కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు పునాదులు పడ్డాయన్నారు. సబ్‌ సీ కేబుల్‌ ఏర్పాటుకు సింగపూర్‌ ప్రభుత్వంతో ఆ రోజే చర్చించడం జరిగిందన్నారు. ఆదానీ, ఎయిర్‌ టెల్‌, గూగుల్‌ సంయుక్తంగా డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సుందర్‌ పిచాయ్‌ చెప్పారన్నారు.

    వైఎస్సార్‌ సీపీ నాయకులకు వేధింపులు

    కర్నూలు వద్ద దహనమైన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేదని, సుమారు 16 చలాన్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయని భరత్‌ అన్నారు. రాజమహేంద్రవరం హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బాలికను దీపావళి రోజున హాస్టల్‌ నుంచి తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు లైంగికంగా లోబర్చుకుంటే పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేసిన తమపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపిన వైఎస్సార్‌ సీపీ నాయకురాలు అనూ యాదవ్‌ను అరెస్టు చేసి, మూడు గంటల పాటు నిర్బంధించారన్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

    విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

    రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకు ఏరులై పారుతున్న మద్యమే కారణమని, 24 గంటలూ ఆ దుకాణాలు తెరిచే ఉంటున్నాయని భరత్‌రామ్‌ అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న పేకాట క్లబ్‌లపై డిప్యూటీ సీఎం వపన్‌ కల్యాణ్‌ విచారణకు ఆదేశిస్తే, డిప్యూటీ స్పీకర్‌.. గోదావరి జిల్లాల్లో పేకాట సహజం అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో పేకాట క్లబ్బులు ఇసుక, మద్యం, భూ సెటిల్‌మెంట్లు, స్పా సెంటర్లు అన్నీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అండదండలతో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులతో కలిసి భరత్‌ రామ్‌ ఆవిష్కరించారు.

    సబ్‌ సీకేబుల్‌ ఏర్పాటుకు

    సింగపూర్‌తో చర్చలు

    ఆ విషయాన్ని ప్రస్తావించని

    చంద్రబాబు, లోకేష్‌

    అంతా తామే చేశామంటూ

    అబద్ధపు ప్రచారం

    మెడికల్‌ కాలేజీల

    ప్రైవేటీకరణకు వ్యతిరేకిద్దాం

    విలేకరుల సమావేశంలో

    మాజీ ఎంపీ భరత్‌రామ్‌

  • అన్నవ

    పెరవలి: కార్తిక మాసంలో తొలి శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే కోనేరులో భక్తులు కార్తిక దీపాలు వదిలారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్‌లో దాదాపు రెండు గంటల పాట నిలబడి స్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సుమారు వంద మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 12 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్నసమారాధన, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామన్నారు.

    తిరుపతికి పోటెత్తిన భక్తులు

    పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో జిల్లా నలుమూలల నుంచీ అనేక మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 18 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,51,570, అన్నదాన విరాళాలకు రూ.67,918, కేశ ఖండన ద్వారా రూ.2,360 తులాభారం ద్వారా రూ.250, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.12,735లతో మొత్తం రూ.2,34,833 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశామన్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.

    కమీషన్‌ పెంచకపోతే షాపులు మూసేస్తాం

    అమలాపురం టౌన్‌: ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ పొందిన మద్యం షాపులకు మొదట్లో గెజిట్‌లో పేర్కొన్నట్లు 20 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మద్యం షాపుల యజమానులు డిమాండ్‌ చేశారు. తమకు 20 శాతం కమీషన్‌ ఇవ్వకపోతే వ్యాపారాలు చేయలేమని వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమలాపురం బ్యాంక్‌ స్ట్రీట్‌లో డీసీసీబీ బ్యాంక్‌ బ్రాంచ్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న మిడ్‌ టౌన్‌ అపార్ట్‌మెంట్స్‌లో మద్యం షాపుల యజమానులు శనివారం సమావేశమయ్యారు. తమకు కమీషన్‌ పెంచకపోతే షాపులను మూసివేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమీషన్‌ ఎంత మాత్రం సరిపోవడం లేదని తెగేసి చెప్పారు. జిల్లా వైన్‌ షాపుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యవర సమావేశానికి దాదాపు 150 మంది మద్యం షాపుల యజమానులు పాల్గొని ప్రభుత్వానికి తమ అసహనాన్ని, నిరసనను తెలియజేశారు. 2024–26 మద్యం పాటదారులైన లైసెన్స్‌ షాపుల యజమానులు మూకుమ్మడిగా తమ గళాన్ని అటు జిల్లా ఎకై ్సజ్‌ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి వినిపించారు. అలాగే గెజిట్లో లేని పర్మిట్‌ రూమ్‌ల కోసం వసూలు చేస్తున్న రూ.7.5 లక్షలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. రానున్న 15 రోజుల్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్‌ అధికారులకు జిల్లా వైన్‌ షాపుల అసోసియేషన్‌ తరఫున వినతిపత్రం అందించారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్‌ ప్రతినిధులు, మద్యం షాపుల లైసెన్స్‌దారులు తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

  • అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం

    క్లస్టర్‌ అభివృద్ధి,

    పారిశ్రామిక రాయితీలపై దృష్టి

    అధికారులతో కలెక్టర్‌ కీర్తి

    రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి సూచించారు. పోస్ట్‌ హార్వెస్టింగ్‌ యూనిట్లకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డెయిరీ, పాల ఉత్పత్తుల పరిశ్రమలకు పశుసంవర్ధక శాఖ, చేపల సీడ్స్‌, ఫీడ్‌ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు మత్స్యశాఖ ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్లస్టర్‌ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో రూ.15 కోట్ల అంచనాతో ఫర్నిచర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసి, ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రాజానగరం మండలం కలవచర్లలోని ఎంఎస్‌ఎంఈ పార్కులో గ్రాఫైట్‌, బంకమట్టితో క్రూసిబుల్స్‌ తయారీ పరిశ్రమతో పాటు సిరామిక్‌ క్లస్టర్‌ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఏపీఐఐసీ ద్వారా కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా గత జూలై నుంచి అక్టోబర్‌ వరకు వివిధ శాఖల పరిధిలో 3,246 దరఖాస్తులు రాగా, వాటిలో 3,174 దరఖాస్తులను ఆమోదించామని, 71 పెండింగ్‌లో ఉండగా, ఒక్క దరఖాస్తును తిరస్కరించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అల్యూమినియం వర్కర్స్‌ కాలనీలో అల్యూమినియం సర్కిల్స్‌, పాత్రల తయారీ కోసం గోదావరి రోలింగ్స్‌ అసోసియేషన్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసుకోవటానికి కమిటీ అనుమతి మంజూరు చేసిందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వి.రామన్‌, ఏపీ ఈఈసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ బి.పద్మజా దేవి, డీఆర్డీఏ పీడీ ఎన్‌వీఎస్‌ఎస్‌ మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి తదితరులు పాల్గొన్నారు.

  • హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

    సీఐటీయూ రాష్ట్ర ప్రధాన

    కార్యదర్శి నర్సింగరావు

    పెద్దాపురంలో జిల్లా

    మహాసభలు ప్రారంభం

    పెద్దాపురం (సామర్లకోట): కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. పెద్దాపురంలో శనివారం ప్రారంభమైన సీఐటీయూ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని, అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డిజిల్‌, గ్యాస్‌ ధరలు పెరగడంతో ప్రజలపై భారం విపరీతంగా పడిందన్నారు. కార్పొరేట్‌ సంస్థల లాభాలపై పన్ను రేటును 33 నుంచి 20 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్‌ పోర్టులను అదానీకి మోదీ అప్పగించారన్నారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • కుక్క

    సూదిని మింగేసిన వైనం

    రెండు గంటలు సర్జరీ చేసిన పశువైద్యులు

    ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): దారంతో ఉన్న సూదిని మింగేసిన కుక్కపిల్లకు పశు వైద్యులు ప్రాణం పోశారు. దాదాపు రెండు గంటల పాటు సర్జరీ చేసి సూదిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వరరావు ఇంట్లో ఎనిమిది నెలల సిజ్జు జాతి కుక్కపిల్ల ఉంది. అది శుక్రవారం రాత్రి చేతి కుట్లు వేసే సూదిని దారంతో కలిపి మింగేసింది. దీంతో యజమాని ఆ కుక్కపిల్లను శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశువైద్యశాలకు తీసుకువచ్చారు. ప్రభుత్వ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ కల్లూరి సత్యనారాయణ, వైద్యుడు డాక్టర్‌ రాజశేఖర్‌ రెండు గంటల పాటు సర్జరీ చేసి దారంతో ఉన్న సూది తొలగించారు. ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యంగా ఉంది.

  • నాలుగు బస్సుల సీజ్‌

    రాజానగరం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో దివాన్‌ చెరువులో శనివారం నిర్వహించిన తనిఖీలో రెండు బస్సులను సీజ్‌ చేశారు. ఇదే విధంగా శుక్రవారం రాత్రి చేసిన తనిఖీలో మరో రెండు బస్సులను సీజ్‌ చేశామని రాజమహేంద్రవరం మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ కుమార్‌ శనివారం విలేకరులకు తెలిపారు. ఇంత వరకూ చేసిన తనిఖీలలో 17 కేసులు నమోదు చేసి, రూ.1,40,450 చలానాల ద్వారా వసూలు చేశామన్నారు. ఇక నుంచి ప్రతి వారంలో రెండు రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఎం.రవికుమార్‌, సీహెచ్‌వీ రమణ, సహాయకులు చైతన్య సుమ, వీవీడీ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కంపెనీలు కొనడం లేదు

    లోగ్రేడు పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. కనిష్ట ధర కిలో రూ.60 ఉన్నా అమ్మకాలు లేవు. దేవరపల్లి వేలం కేంద్రంలో 11.5 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 12.8 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. దీనిలో 4 లక్షల కిలోల లోగ్రేడు ఉత్పత్తి అయ్యింది. బొగులు మాడు, సైలెన్‌ పొగాకు అమ్ముడు పోవడం లేదు. వేలానికి వచ్చన బేళ్లలో 50 శాతం కొనుగోలు జరగడం లేదు.

    – సీహెచ్‌ హేమస్మిత,

    వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి

  • అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌

    నిడదవోలు రూరల్‌: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్‌ జిల్లా దొంగను శనివారం అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై ఎల్‌.బాలాజీ సుందరరావు తెలిపారు. సమిశ్రగూడెం పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ నిడదవోలు మండలం శంకరాపురంలో ఈ నెల 6న కోలా నాగేశ్వరరావుకు చెందిన బంగారు ఉంగరం, 22న కాయల మంగకు చెందిన బంగారపు బొందును ఓ వ్యక్తి చోరీ చేశాడు. వీరిని బెదిరించి బంగారం దోచుకుపోయాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావును నిందితుడిగా గుర్తించామని ఎస్సై తెలిపారు. గోపవరం వద్ద అప్పారావును అరెస్ట్‌ చేసి మూడు బంగారు ఉంగరాలు, రెండు కాసుల బొందు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 14 పాత కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, ట్రైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, రాంబాబు, ధనుంజయ్‌లను ఎస్పీ డి.నరసింహకిశోర్‌, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్‌ అభినందించారు.

  • వచ్చే నెలలో అథ్లెటిక్స్‌ పోటీలు

    రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజీయెట్‌ అథ్లెటిక్స్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నవంబర్‌ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ అథ్లెటిక్స్‌లో 26 రకాల క్రీడా పోటీలు ఉంటాయని, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ, రిజిస్టార్‌ ఆచార్య కేవీ స్వామి, అసిస్టెంట్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎంవీఎస్‌ఎన్‌ మూర్తి, ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్రరావు, ఆర్గనైజింగ్‌ మెంబర్లు ఎం.ప్రసాద్‌, పీవీవీ లక్ష్మి, టి.విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు.

  • అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళా లు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంటిపూడి సాయిరామ్‌చౌదరి – పుష్పావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116, రావులపాలేనికి చెందిన కూసుమంచి గంగాధరరావు, కామేశ్వ రి కావేరిలు రూ.38,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Kakinada

  • ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి

    కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్‌, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి 8 గంటల వరకూ దేవస్థానానికి రూ. 42.01 ,916 ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది.