Archive Page | Sakshi
Sakshi News home page

International

  • కరాచీలోని 'గుల్ షాపింగ్ ప్లాజా'లో శనివారం(జనవరి 17) సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. సంఘటన స్థలంలో వరుసగా ఐదో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగాయి. సహయక సిబ్బంది గురువారం పదుల సంఖ్యలో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 67కు చేరింది.

    ఒకే చోట 30 మంది..
    సహాయక చర్యల్లో భాగంగా గుల్ షాపింగ్ ప్లాజా మెజానైన్ అంతస్తులోని 'దుబాయ్ క్రాకరీ' అనే షాప్ ష‌ట్ట‌ర్లు తెరిచిన సిబ్బంది షాకయ్యారు. ఒకే చోట 30 మృతదేహాలు లభ్యమయ్యాయి.  మంటల నుంచి తప్పించుకోవడానికి వీరంతా షాపు లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారని, అయితే బయట దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరాడక లోపలే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

    అయితే ఈ విషాధ సంఘ‌ట‌న‌లో మరణించిన వారిని గుర్తించడం అధికారుల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 61  మృతదేహాలలో, కేవలం 12 మంది మాత్రమే గుర్తించిన‌ట్లు  సింధ్ పోలీస్ సర్జన్ డాక్టర్ ఒక‌రు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

    అదేవిధంగా ఈ భ‌వ‌నంలో భ‌ద్ర‌త లోపాలు అధికారులు గుర్తించారు. భవనంలో మొత్తం 16 ఎగ్జిట్ గేట్లు ఉండగా, ప్రమాద సమయంలో 14 గేట్లు మూసివేసి ఉండటం వల్ల ప్రాణనష్టం పెరిగిందని ప్రాథ‌మిక‌ విచారణలో తేలింది. ఇంకా దాదాపు 85 మందికి పైగా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా మృతుల కుటుంబాలకు సింధ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. కోటి (10 మిలియన్లు) పరిహారం ప్రకటించింది.

  • ‘‘నన్ను చూసి ఏడ్వకు’’, ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ ఇలాంటి ఎన్నో సందేశాలను మనం సాధారణంగా ఆటోల వెనుక, లారీల వెనుక చూస్తూంటాం. వీటితో పాటు కొన్ని ఫన్నీ కోట్‌లు, చిత్ర విచిత్రమైన సందేశాలు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వీటన్నింటికి భిన్నంగా ఒక కారు వెనుక ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌ ఒకటి నెట్టింట సందడిగా మారింది. అదేంటో తెలుసుకుందామా.

    అమ్మాయి అనగానే ‘ఆడ’ బిడ్డ  అంటూ అనేక కుటుంబాలలో ఇప్పటికీ ఆడపిల్లలను భారంగా భావించే ఈ రోజుల్లో, ఈ సందేశంతో కూడిన వీడియో అందరి హృదయాలను హత్తుకుంది.

    “మీరు నన్ను భయపెట్టలేరు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.”  అన్నమెసేజ్‌ . దీంతోపాటు, దీని “M,” “A”  “S” అనే అక్షరాలు ఉన్నాయి. అంటే అవి అతని కుమార్తెల పేర్లను సూచిస్తాయని భావిస్తున్నారు. దీంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. ఒక్కోసారి చిన్నమాటలే ఎంత శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వగలవో  ఇది నిరూపించింది. ఈ క్లిప్‌ను కరాచీకి చెందిన వ్లాగర్ ఒకరు ఇన్‌స్టాలో పంచుకున్నారు. తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ముందు వెళ్తున్న కారు వెనుక భాగంలో దీన్ని గమనించి రికార్డ్ చేశారు. ఆ రోజు తాను చూసిన అత్యంత  హృద్యమైన విషయాలలో ఇది ఒకటి అంటూ పాకిస్థాన్‌కు చెందిన ఒక చిన్న వీడియోను ఇన్‌స్టాలో ఫాలోయర్లతో పంచుకున్నారు. "ఒక తండ్రి కల" అని క్యాప్షన్‌తో చేసిన వ్లాగర్ ఈ పోస్ట్‌ ఇప్పటికే 2 కోట్లకు పైగా వ్యూస్‌ను సంపాదించింది.

    నెటిజన్ల రియాక్షన్‌
    ఇతడు మేలిమి బంగారం అని ఒకరు, మరొకరు, “ప్రతి కుమార్తెకు ఇలాంటి తండ్రి ఉండాలని కలలు కంటుంది” అని వ్యాఖ్యానించారు.“ ఆడపిల్లలను ఇప్పటికీ భారంలా చూసే సమాజంలో, ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి, “పప్పా మేరీ జాన్ బచావో”, “ఎంత గర్వపడే తండ్రి,” అని ఒక వ్యక్తి ఆశ్చర్యపోగా, “ఎంత ముద్దుగా ఉంది,” “అదృష్టవంతుడు,” “మా నాన్నలాగే,” లాంటి స్పందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఒక వ్యక్తి చమత్కారంగా, “మరొకరిని కనండి, అప్పుడు మీరు వారిని MASS అని పిలవవచ్చు” అని సూచించడం విశేషం.
     

  • టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్  ఆధీనంలోని  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని ఒక ప్రధాన  ఉద్యోగి ట్వీట్‌ వైరల్‌గా మారింది. అమెరికాలో  H1b ఫీజు పెంపుతో, అమెరిలో వైద్యం అందని ద్రాక్ష మారుతోందని అక్కడి నిపుణులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు.  నిపుణులైన విదేశీ డాక్టర్లు అందుబాటులో లేని కారణంగా  మెడికల్‌ డెసర్ట్‌లు ఇంకా పెరుగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌  ఆధీనంలోని ఎక్స్‌ (ట్విటర్‌) ప్రొడక్షన్‌ హెడ్‌  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

    ఎక్స్‌ ప్రొడక్షన్‌ హెడ్‌ నికితా బియర్ తన ఆరోగ్యం గురించి తన ట్వీట్‌ ద్వారా ఒక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఫ్రైడ్‌ చికెన్ తింటు న్నప్పుడు తనకు గొంతులో గాయమైందని, దీంతో తాను సరిగ్గా మాట్లాడలేక పోతున్నానని లేదా మింగలేకపోతున్నానని చెప్పారు. వైద్యులు ఎండోస్కోపీ చేయించు కోవాలని సలహా ఇచ్చారట. ఇక్కడే అసలు విషయం గురించి చెప్పారు. ముందు నష్టాన్ని అంచనా వేయడానికి చాలా వారాలు వేచి ఉండాలని తనకు సలహా ఇచ్చారని బియర్ పేర్కొన్నారు.

    ఎండో​స్కోపీ పరీక్షకోసం అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించగా , నాలుగు లేదా ఆరు వారాల తరువాతే మాత్రమే అని  చెప్పడంతో షాక్‌ అవడం అతని వంతైంది. బియర్ ఈ అనుభవాన్ని “కాఫ్కా నవల” ను వర్ణిస్తూ రాసుకొచ్చారు.  దీంతో ఈ పోస్ట్‌  వైరల్‌గా మారింది.అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ ఇంత  దారుణంగా ఉందా అనేచర్చకు దారి తీసింది.

    అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థకు సంబంధించి  అనేకమంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు, నిపుణుల కొరత, బీమా సంబంధిత ఆంక్షలు, అధిక ఖర్చులపై మాట్లాడారు.  వీటి  కారణంగానే సాధారణ రోగనిర్ధారణ విధానాలకు కూడా  చాలా జాప్యం జరుగుతోందని  మండిపడ్డారు.

    హాయిగా ఇండియా ట్రిప్‌ వేయండి! 
    మరోవైపు బియర్‌ను భారతదేశంలో చికిత్స పొందాలని , అక్కడ ఆసుపత్రులలో రోగనిర్ధారణ పరీక్షలు చాలా తొందరగా అయిపోతాయని చెప్పారు. ఇండియాకు అలా విమానంలో వెళ్ళండి. గంటలోపే టాప్‌ డాక్టర్‌ని కన్‌సల్ట్‌ చేసి, ఆరు గంటల్లో ఎండోస్కోపీ లాంటివి పూర్తి చేసుకుని మూడు రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు అంటూ మరొకరు సూచించారు.  సత్వర చికిత్స కోసం బియర్‌ను దక్షిణ కొరియా, దుబాయ్ లేదా థాయ్‌లాండ్‌కు వెళ్లమని కొంతమంది నెటిజన్లు సలహా ఇచ్చారు.

    (అనంత్‌ అంబానీ మరో లగ్జరీ వాచ్‌, అదిరిపోయే డిజైన్‌, ధర ఎంత?)

    వ్యవస్థాపకుడు అమన్ గైరోలా కూడా భారతదేశ వైద్య మౌలిక సదుపాయాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యానించారు. "ఇక్కడ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మహా అయితే 48 గంటలు పడుతుంది. దేశం అందించే సౌకర్యాలను ప్రజలు ఎప్పుడూ గ్రహించరు.  ఇక్కడ కూడా ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి కానీ క్రమంగా మెరుగుపడుతోంది" అని ఆయన రాశారు.

    ఇదీ చదవండి: H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!

  • దావోస్‌: గాజా శాంతి మండలిని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆవిష్కరించారు. దావోస్‌ వేదికగా ‘‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ సంతకాలు జరిగాయి. అయితే, గాజా ’బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌కు కార్యక్రమానికి భారత్‌ దూరంగా ఉంది. అయితే, గాజా శాంతిమండలిలో పాకిస్తాన్‌ సభ్య దేశంగా చేరింది. గాజా పునర్నిర్మాణం, శాంతి కోసమే బోర్డ్ ఆఫ్ పీస్‌ అంటూ చెబుతున్న ట్రంప్‌.. ఆయుధాలు వీడకపోతే బూడిద చేస్తామంటూ హమాస్‌ను ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించారు.

    అంతర్జాతీయ విభేదాలను పరిష్కరించడానికి సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తామని కూడా ట్రంప్‌ స్పష్టం చేశారు. కాగా, శాంతి మండలిలో చేరాలని 50 మందికిపైగా ట్రంప్‌ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌ సహా పలు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి.

    మధ్యప్రాచ్యంలో శాంతిని సుస్థిరం చేయడానికి, ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి కొత్త మార్గాన్ని అన్వేషించడానికి ఉద్దేశించిన ఈ బోర్డులో చేరాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ లేఖ రాశారు. ఈ బోర్డులో చేరిన దేశాల్లో ప్రస్తుతం పాకిస్థాన్‌తో పాటు బహ్రెయిన్, మొరాకో, అర్జెంటీనా, అర్మేనియా, అజర్బైజాన్, బల్గేరియా, హంగేరి, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్థాన్, కొసోవో, పరాగ్వే, ఖతార్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, మంగోలియా ఉన్నాయి.

    గాజా శాంతి మండలిలో చేరాలంటూ ట్రంప్‌ ఆహ్వానంపై భారత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ మండలిలో పాకిస్థాన్ చేరికను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ గడ్డపై పని చేస్తున్న లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు, హమాస్‌కు మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి స్థానంలో ట్రంప్ ఈ గాజా శాంతి మండలిని తీసుకువస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది.

    ఈ బోర్డుకు ట్రంప్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ మండలిలో ఉప విభాగాలు ఏర్పాటు, రద్దు చేసే సర్వాధికారాలు ఆయనకే ఉంటాయిట్. ట్రంప్‌ ఎంపిక చేసే ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు రెండేళ్ల పదవీకాలం కలిగి ఉంటారు. వైట్ హౌస్ (అధ్యక్ష పదవి) నుండి వైదొలిగినా, ట్రంప్ స్వచ్ఛందంగా రాజీనామా చేసే వరకు ఆయనే ఛైర్మన్‌గా కొనసాగేలా నిబంధనలు రూపొందించారు.

     

  • మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. న్యూసౌత్‌ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. బాండీ బీచ్‌ దాడి ఘటన జరిగిన నెల రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 1500 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలోని వాల్కర్ వీధిలోని ఒక నివాస ప్రాంతంలో సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు వెల్లడించారు.

    తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు పరారీలో ఉండటంతో.. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నందున స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్‌ అధికారులు సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే సెంట్రల్ వెస్ట్ పోలీస్, క్రైమ్ స్టాపర్స్‌ (1800 333 000) నంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు.
     

Andhra Pradesh

  • సాక్షి, విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం సంస్థకు కట్టబెట్టే ప్రతిపాదనను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.  ఈ అంశాన్ని జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో 15వ అంశంగా చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనపై అధికారిక చర్చ జరగనుంది. 

    గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఇప్పటికే ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం స్కెచ్‌ వేసింది. భూ నజరానా రూపంలో ఈ భూములను కట్టబెట్టే ప్రక్రియకు రూపకల్పన చేశారు. కౌన్సిల్ ఆమోదం లభిస్తే ఈ భూములు అధికారికంగా గీతం సంస్థకు బదలాయింపు కానున్నాయి.  

     

  • సాక్షి, ఏలూరు: కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే కామినేనిపై కొల్లేరు వాసులు తిరగబడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కామినేని శ్రీనివాస్‌ను ప్రజలు నిలదీశారు. దీంతో, అసహనానికి గురైన ఎమ్మెల్యే.. ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

    వివరాల మేరకు.. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరు స్థానికులకే ఇచ్చేస్తామని కామినేని శ్రీనివాస్‌, కూటమి నేతలు.. స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తాజాగా కొల్లేరు ప్రాంతానికి వెళ్లడంతో స్థానికులు హామీ విషయమై నిలదీశారు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ కామినేనితో స్థానికులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తమకు ఏం చేశారంటూ కామినేనిని కొల్లేరు వాసులు నిలదీశారు. 

    ఇదే సమయంలో గత ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బంది పడలేదని కొల్లేరు వాసులు చెప్పుకొచ్చారు. అనంతరం, చెరువుల విషయంలో కామినేనిని నిలదీయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కొల్లేరు వాసులపై అసహనం వ్యక్తం చేశారు. నేను పట్టించుకోను ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.. ఓవరాక్షన్‌ చేశారు. నోరు మూయండి అంటూ కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి.. ఇలా మాట్లాడటం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. 

Sports

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా గాయాల కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. వారిద్దరి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్‌, ర్యాన్ రికెల్టన్ వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చారు.

    ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. టోనీ డి జోర్జి విషయానికి వస్తే.. గతేడాది ఆఖరిలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి కుడి కాలికి గాయమైంది. అతడు వరల్డ్‌కప్ సమయానికి కోలుకుంటాడని ప్రోటీస్ సెలక్టర్లు భావించారు. కానీ టోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పడుతోంది. 

    ఈ క్రమంలోనే అతడు పొట్టి ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో ఫెరీరా గాయ‌ప‌డ్డాడు. ప్రిటోరియా క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫెరీరా(జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్‌) భుజం ఎముక విరిగింది. దీంతో అత‌డు కూడా  ఈ మెగా టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రికెల్టన్‌, స్టబ్స్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు.

    అదేవిధంగా ఈ మెగా టోర్నీ విధ్వంస‌కర ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కూడా దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. మిల్ల‌ర్ ప్ర‌స్తుతం కండరాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ ముందు వెస్టిండీస్‌తో జ‌రిగే టీ20 సిరీస్‌కు మిల్ల‌ర్ దూర‌మ‌య్యాడు. అత‌డిస్ధానంలో రూబెన్ హెర్మ‌న్‌కు చోటు ఇచ్చారు. 

    టీ20 ప్రపంచకప్‌-2026కు సౌతాఫ్రికా జట్టు
    ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.

    వెస్టిండీస్‌తో టీ20లకు ప్రోటీస్‌ జట్టు
    ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్‌, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, హెర్మన్‌, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబడా, జాసన్ స్మిత్.

     

  • టీమిండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌.

    1199 పరుగులు
    ఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.

    వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ 
    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

    ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్‌ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్‌ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.

    అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్‌ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్‌ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.

    రోహిత్‌- గిల్‌ జోడీ
    ఇక వన్డేల్లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

    ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

    చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

  • బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.

    శ్రీలంకకు మార్చాలని 
    కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్‌ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్‌ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.

    కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీ
    మరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.

    తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్‌ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.

    నమ్మకాన్ని కోల్పోవడం లేదు
    ఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.

    ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.

    కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే
    ఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్‌ నిర్ణయాలు తీసుకున్నారు.

    ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్‌ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

    చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

  • టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడాడు గిల్‌. అనంతరం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో బిజీ అయ్యాడు.

    ఈ సిరీస్‌లో గిల్‌ సేన కివీస్‌ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్‌ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్‌ కెప్టెన్‌గా రంజీ సెకండ్‌ లీగ్‌ బరిలో దిగాడు.

    పంజాబ్‌ తొలుత బౌలింగ్‌
    రాజ్‌కోట్‌ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్‌ సింగ్‌ రెండు, సన్వీర్‌ సింగ్‌, ప్రేరిత్‌ దత్తా చెరో వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ అయింది.

    జడ్డూ విఫలం
    సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ జై గోహిల్‌ 82 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. ప్రేరక్‌ మన్కడ్‌ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.

    ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్‌, కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ దెబ్బకు పంజాబ్‌ ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

    అయితే, మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉదయ్‌ సహారన్‌ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ నేహాల్‌ వధేరా (6)ను పార్థ్‌ భూట్‌ అవుట్‌ చేశాడు.

    గిల్‌ డకౌట్‌
    ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ను సైతం పార్థ్‌ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్‌ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ (LBW)గా పెవిలియన్‌ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్‌కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్‌ తరఫున గిల్‌ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.

    పంజాబ్‌ ఆలౌట్‌.. సౌరాష్ట్రకుకు ఆధిక్యం
    కాగా పంజాబ్‌ తరఫున ప్రభ్‌సిమ్రన్‌ (44), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్‌ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్‌ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్‌లో మాత్రం  ఫర్వాలేదనిపించాడు.

    చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

  • టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రూ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అస‌మ్మ‌తి నాయ‌కుడు, తిరువ‌న‌తంపురం ఎంపీ శ‌శిథ‌రూర్ మాత్రం ప్ర‌శంస‌లు కురిపించారు. దేశంలో రెండో క‌ష్ట‌త‌ర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బ‌రంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్‌పూర్‌లో బుధవారం భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి టి20 మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. అంత‌కుముందుకు గంభీర్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్‌'లో పోస్ట్ చేసి, త‌మ ఫొటోను షేర్ చేశారు.

    ''నాగ్‌పూర్‌లో నా పాత స్నేహితుడు గౌత‌మ్ గంభీర్‌తో జ‌రిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది త‌న‌ను విమ‌ర్శిస్తున్నా ప్ర‌శాంతంగా ప‌నిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్‌ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్ర‌శంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు ద‌క్కాల‌ని కోరుకుంటున్నాన''ని ఎక్స్‌లో రాసుకొచ్చారు. శ‌శిథ‌రూర్ ట్వీట్‌కు ధ‌న్య‌వాదాలు అంటూ గంభీర్ స‌మాధానం ఇచ్చారు.

    కివీస్ ర‌న్స్ కంటే నా సెల్పీలే ఎక్కువ‌
    త‌న నాగ్‌పూర్‌లో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆంత్ర‌ప్రెన్యూర్స్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈవో) నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో శ‌శిథ‌రూర్ పాల్గొన్నారు. బుధ‌వారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భార‌త్‌- న్యూజిలాండ్ టి20 మ్యాచ్‌ను ఆయ‌న వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహ‌లం న‌డుమ మ్యాచ్ చూడ‌డం ఎంతో బాగుంద‌ని పేర్కొంటూ.. త‌న ఫొటోల‌ను 'ఎక్స్‌'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడ‌డంతో త‌న నాగ్‌పూర్ ప‌ర్య‌ట‌న పూర్త‌యింద‌న్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చాన‌ని చ‌మ‌త్క‌రించారు. టీమిండియా (Team India) విజ‌యాన్ని పూర్తిగా ఆస్వాదించాన‌ని పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: బెంగ‌ళూరు ఎన్నిక‌లు.. రంగంలోకి బీజేపీ కీల‌క నేత‌

    కాగా, శ‌శిథ‌రూర్ కొంత‌కాలంగా సొంత పార్టీతో అంటిముట్ట‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంసలు కురిపించి హ‌స్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌ను క‌ల‌వ‌డంతో పాటు ఆయ‌న‌ను పొడ‌గ్త‌ల‌తో ముంచెత్తారు. గంభీర్ హెడ్‌కోచ్‌గా వ‌చ్చిన త‌ర్వాతే టీమిండియా ఎన్న‌డూ చవిచూడ‌ని ప‌రాజ‌యాలు పొందింద‌ని అంద‌రూ విమ‌ర్శిస్తుంటే.. థ‌రూర్ మాత్రం ఆయ‌న‌ను వెనుకేసుకురావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి భేటీపై కాంగ్రెస్ నాయ‌కులు ఇంకా స్పందించ‌లేదు. 

     

  • భారత క్రికెట్‌ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్‌ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.

    పూర్వాపరాలు ఇవే
    ప్రైవేట్‌ సంస్థ అయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్‌ కన్సాల్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    టీమిండియా అనకూడదు
    ప్రసార్‌ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్‌ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్‌ కన్సాల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.

    దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

    మీ సమస్య ఏమిటి?
    ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్‌ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది 
    అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.

    ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్‌ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. 

    చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

  • భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌ షట్లర్‌ ఫో లినే హోజ్‌మార్క్‌ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

    500వ విజయం
    ఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా తన కెరీర్‌లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్‌గా ఆరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలిచింది.

    ఇక ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 13వ ర్యాంకర్‌ అయిన సింధు.. వరల్డ్‌ నంబర్‌ 4, చైనాకు చెందిన చెన్‌ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్‌ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది.

    లక్ష్య సేన్‌ సైతం
    మరోవైపు.. లక్ష్య సేన్‌ సైతం ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్‌ షట్లర్‌ జేసన్‌ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్‌ ముందుడుగు వేశాడు.

Movies

    • శారీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాలు..
    • బ్యూటీఫుల్ డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ స్మైలీ లుక్స్..
    • పాలరాతి బొమ్మలా తమన్నా హోయలు..
    • గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్..
    • వైట్ డ్రెస్‌లో మరింత అందంగా అనుపమ పరమేశ్వరన్..

     

     

     

     

     

     

     

  • తన లైఫ్‌లో చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టమని టాలీవుడ్ హర్షవర్ధన్ అన్నారు. మనశంకర వరప్రసాద్‌దగారు సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది నా లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అని తెలిపారు. తనకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చిందని హర్షవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు.

    అయితే ఈ సినిమాకు నా వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాని హర్షవర్ధన్ తెలిపారు. తన కాలికి గాయం కావడంతో రెండు నెలలకు పైగా టైమ్ పడుతుందని అన్నారు. దీంతో చిరంజీవి సినిమా మిస్‌ అవుతానని చాలా బాధపడ్డానని తెలిపారు. అందుకే నా వల్ల మూవీ ఆలస్యం కాకూడదనే.. నా బదులు ఎవరినైనా తీసుకోండని అనిల్‌తో చెప్పానని హర్షవర్ధన్ వెల్లడించారు.

    కానీ అనిల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. మీరు అవన్నీ మాట్లాడొద్దు..అంతా నేను చూసుకుంటానని ‍అన్నారు. మీరు కేవలం నడవకూడదు అంతేకదా.. డైలాగ్స్, యాక్టింగ్ చేస్తే చాలని నాకు ధైర్యం చెప్పారు. అనిల్‌కు నా పట్ల మంచి అభిప్రాయం ఉంది..నారాయణ క్యారెక్టర్‌కు నువ్వు తప్ప ఎవరినీ పెట్టే  ప్రసక్తే లేదని అనిల్ రావిపూడి చెప్పారని హర్షవర్ధన్‌ పంచుకున్నారు. నా వల్ల సినిమా ఆలస్యమైతే  ఎక్కడా తీరని మచ్చలా ఉండిపోతుందేమో భయపడ్డానని తెలిపారు. 
     

     

  • టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మూవీ ప్రమోషన్స్ చేస్తేనే ఆడియన్స్‌ థియేటర్లకు వస్తారని అన్నారు. ఆది సాయికుమార్ నటించిన శంబాలకు అద్భుతంగా ప్రమోషన్స్ చేయడం వల్లే సక్కెస్ సాధించారని అన్నారు. నేను చేసింది చిన్న రోలే అయినా.. ఏప్రిల్ నుంచే ప్రమోషన్స్ ప్రారంభించారని అన్నారు.

    శ్రీకాంత్ తనయుడు ఛాంపియన్ మూవీ కూడా చాలా బాగుందని హర్షవర్ధన్ అన్నారు. కానీ జనాల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనకపడ్డారని తెలిపారు. ఈ వీడియో నిర్మాతలు కూడా చూడాలని అన్నారు. ఛాంపియన్ లాంటి మంచి సినిమాకు ఇంకా గొప్పగా ప్రమోషన్స్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిరు జీవికైనా.. చిరంజీవికైనా పబ్లిసిటీ ఒక్కటే ప్రధామమని పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్ బాగా చేస్తేనే ఆడియన్స్‌ థియేటర్లకు వస్తారనేది వందశాతం నిజమన్నారు. ప్రమోషన్స్‌పై హర్షవర్ధన్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
     

     

  • ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డ్ నామినేషన్స్-2026 లిస్ట్ విడుదలైంది. ఈ ఏడాది అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. గతేడాది రిలీజైన సత్తా చాటిన చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. ఏయే సినిమా ఏ విభాగంలో పోటీ పడుతుందో ఈ లిస్ట్ చూసేయండి. అయితే ఈ ఏడాది ఉత్తమ చిత్రం విభాగంలో ఏకంగా పది సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌ మార్చి 15న లాస్ ఎంజిల్స్ వేదికగా జరగనుంది. 

    హాలీవుడ్ డైరెక్టర్‌ రేయాన్‌ కూగ్లర్‌ దర్శకత్వంలో రూపొందిన సిన్నర్స్‌ అత్యధికంగా 16 కేటగిరిల్లో నామినేషన్స్‌ సాధించింది. ఇప్పటివరకూ 14 నామినేషన్స్‌తో ఆల్‌ అబౌట్‌ ఈవ్‌, టైటానిక్‌, లా లా ల్యాండ్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. తాజాగా సిన్నర్స్‌ ఆ రికార్డ్‌ను తిరగరాసింది. ఈ మూవీ తర్వాత వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌కు ఎక్కువ నామినేషన్స్‌ దక్కించుకుంది.  ఈ ఏడాది కొత్తగా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ కేటగిరీని తీసుకొచ్చారు. 

    బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ.. 

    • బగోనియా

    • ఎఫ్‌-1

    • ఫ్రాంకిన్‌స్టన్‌

    • హ్యామ్‌నెట్‌

    • మార్టీ సుప్రీం

    • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

    • ది సీక్రెట్‌ ఏజెంట్‌

    • సెంటిమెంటల్‌ వాల్యూ

    • సిన్నర్స్‌

    • ట్రైన్‌ డ్రీమ్స్‌

    బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ... 

    • క్లోయి జావ్‌: హ్యామ్‌నెట్‌

    • జాష్‌ షాఫ్డీ: మార్టీ సుప్రీం

    • పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

    • యోఆకీమ్‌ ట్రియర్‌: సెంటిమెంటల్‌ వాల్యూ

    • రేయాన్‌ కూగ్లర్‌: సిన్నర్స్‌

    బెస్ట్ యాక్టర్...

    • తిమోతి చాలమేట్‌: మార్టీ సుప్రీం

    • లియోనార్డ్‌ డికాప్రియో: వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

    • ఈథన్‌ హాక్‌: బ్లూ మూన్‌

    • మైఖేల్‌ బి జోర్డాన్‌: సిన్నర్స్‌

    • వాగ్నర్‌ మౌరా: ది సీక్రెట్‌ ఏజెంట్

    బెస్ట్ యాక్ట్రెస్

    • జస్సీ బక్లీ: హ్యామ్‌ నెట్‌

    • రోజ్‌ బర్న్‌: ఇఫ్‌ ఐ హ్యాడ్‌ లెగ్స్‌ ఐ వుడ్‌ కిక్‌ యు

    • కేట్‌ హడ్సన్‌: సాంగ్‌ సంగ్‌ బ్లూ

    • రెనాటా రైన్సావా: సెంటిమెంటల్ వాల్యూ

    • ఎమ్మా స్టోన్‌: బగోనియా

      ఉత్తమ సహాయ నటి

    •    ఎల్‌ ఫ్యానింగ్‌- సెంటిమెంటల్‌ వాల్యూ

    •    ఇంగా ఇబ్సిడాట్టర్‌ లిల్లాస్‌- సెంటిమెంటల్‌ వాల్యూ

    •    ఎమీ మాడిగన్‌- వెపన్స్‌

    •    ఉన్మి మసాకు- సిన్నర్స్‌

    •    టియానా టేలర్‌: వన్‌ బ్యాటిల్‌- ఆఫ్టర్‌ అనదర్‌

      ఉత్తమ సహాయ నటుడు

    •    బెనిసియో డెల్‌ టారో: వన్‌ బ్యాటిల్‌  ఆఫ్టర్‌ అనదర్‌

    •    జేకబ్‌ ఎల్రోడి: ఫ్రాంకిన్‌స్టన్

    •    డెల్రాయ్‌ లిండో: సిన్నర్స్‌

    •    షాన్‌ పెన్‌: వన్‌ బ్యాటిల్‌  ఆఫ్టర్‌ అనదర్‌

    •    స్టెలెన్‌ స్కార్స్‌గార్డ్‌:  సెంటిమెంటల్‌ వాల్యూ

      బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీ

    •    ది గర్ల్‌ హూ క్రైడ్‌ పెరల్స్‌

    •    బటర్‌ఫ్లై

    •    ఫరెవర్‌ గ్రీన్‌

    •    రిటైర్మెంట్‌ ప్లాన్‌

    •    ది త్రీ సిస్టర్స్‌

     

    మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌ కేటగిరీ.. 

    •    ది స్మాషింగ్‌ మెషీన్‌

    •    ది అగ్లీ స్టెప్‌ స్టిస్టర్‌

    •    ఫ్రాంకిన్‌స్టన్

    •    కొకుహో

    •    సిన్నర్స్‌

     

    బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌..

    •     బగోనియా

    •    సిన్నర్స్‌

    •    ఫ్రాంకిన్‌స్టన్

    •    హ్యామ్‌నెట్‌

    •    వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
         

      బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌

    •    బుచర్స్‌ స్టెయిన్‌

    •    ది సింగర్స్‌

    •    ఎ ఫ్రెండ్‌ ఆఫ్‌ డార్ఫీ

    •    జేన్‌ ఆస్టన్స్‌ పీరియడ్‌ డ్రామా

    •    టూ పీపుల్‌ ఎక్స్ఛేంజ్‌ సలైవా

      ఒరిజినల్‌ సాంగ్‌

    • డియర్‌ మి (డయాన్‌ వారెన్‌ రెలెంట్‌లెస్‌)

    • గోల్డెన్‌: కెపాప్‌ డెమెన్‌ హంటర్‌

    • ఐ లైక్డ్‌ టు యు: సిన్నర్స్‌

    • స్వీట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ జాయ్‌ (వీవా వీర్డీ)

    • ట్రైన్‌ డ్రీమ్స్‌: ట్రైన్‌ డ్రీమ్స్‌

    బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్.. 

    • ది సీక్రెట్‌ ఏజెంట్‌ (బ్రెజిల్‌)

    • ఇట్‌ వాజ్‌ ఏ జస్ట్‌ యాక్సిడెంట్ (ఫ్రాన్స్‌)

    • సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే)

    • సిరాట్‌ (స్పెయిన్‌)

    • ది వాయిస్‌ ఆఫ్ హింద్‌ రజాబ్‌ (తునీషియా)

      బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే

    •    వన్‌ బ్యాటిల్‌  ఆఫ్టర్‌ అనదర్‌

    •    బగోనియా

    •    ఫ్రాంకిన్‌స్టన్

    •    హ్యామ్‌నెట్‌

    •    ట్రైన్‌ డ్రీమ్స్‌

      బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే

    • బ్లూమూన్‌

    •    ఇట్‌ వాజ్‌ జస్ట్‌ యాన్‌ యాక్సిడెంట్‌

    •    మార్టీ సుప్రీం

    •    సెంటిమెంటల్‌ వాల్యూ

    •    సిన్నర్స్‌

    బెస్ట్ క్యాస్టింగ్‌

    • హ్యామ్‌నెట్‌

    • మార్టీ సుప్రీం

    • వన్‌ బ్యాటిల్‌  ఆఫ్టర్‌ అనదర్‌

    • ది సీక్రెట్‌ఏజెంట్‌

    • సిన్నర్స్‌

    బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్‌

    • అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌

    • ఫ్రాంకిన్‌స్టన్‌

    • హ్యామ్‌నెట్‌

    • మార్టీసుప్రీం

    • సిన్నర్స్‌

    బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌

    • ది ఆలబామా సొల్యూషన్స్‌

    • కమ్స్‌ సీ మి ఇన్‌ ది గుడ్‌ లైట్‌

    • కటింగ్‌ థ్రూ రాక్స్‌

    • మిస్టర్‌ నో బడీ అగైనెస్ట్ పుతిన్‌

    • ది పర్‌ఫెక్ట్‌ నైబర్‌

    బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌

    • ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్

    • ఆర్డ్మ్‌ ఓన్లీ విత్‌ ఏ కెమెరా: ది లైఫ్‌ అండ్‌ డెత్‌ ఆఫ్‌ బ్రెంట్‌ రెనోడ్‌

    • చిల్డ్రన్‌ నో మోర్‌: వర్‌ అండ్‌ ఆర్‌ గాన్‌

    • ది డెవిల్‌ ఈజ్‌ బిజీ

    • పర్‌ఫెక్ట్‌లీ ఎ స్ట్రేంజ్‌నెస్‌

    బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

    • ఆర్కో
    • ఎలియో
    • కెపాప్‌ డెమన్‌ హంట్స్‌
    • లిటిల్‌ ఆమలీ ఆర్‌ ది క్యారెక్టర్‌ ఆఫ్‌ రెయిన్‌
    • జుప్టోపియా-2

    బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌

    • ఫ్రాంకిన్‌స్టన్‌
    • హ్యామ్‌నెట్‌
    • మార్టీ సుప్రీం
    • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
    • సిన్నర్స్‌

    బెస్ట్ ఎడిటింగ్‌

    • ఎఫ్‌1
    • మార్టీ సుప్రీం
    • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
    • సెంటిమెంటల్‌ వాల్యూ
    • సిన్నర్స్‌

    బెస్ట్ సౌండ్‌

    • ఎఫ్‌1
    • ఫ్రాంకిన్‌స్టన్‌
    • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
    • సిన్నర్స్‌
    • సిరాట్‌

    బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌

    • అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌
    • ఎఫ్‌1
    • జురాసిక్‌ వరల్డ్‌ రీబర్త్‌
    • ది లాస్ట్‌ బస్‌
    • సిన్నర్స్‌


    బెస్ట్ సినిమాటోగ్రఫీ

    • ఫ్రాంకిన్‌స్టైన్‌
    • మార్టీ సుప్రీం
    • వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
    • సిన్నర్స్‌
    • ట్రైన్‌ డ్రీమ్స్‌

       

     

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల సందడి కూడా దాదాపు ముగిసిపోయింది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రావడం లేదు. ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఈ వీకెండ్‌ కోసం సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.

    ఈ ఫ్రైడే థియేటర్లలో సినిమాలు రాకపోయినా.. ఓటీటీల్లో మాత్రం సందడి చేయనున్నాయి. ఈ శుక్రవారం శోభిత ధూళిపాల చీకటిలో, హెబ్బా పటేల్ మరియో.. టాలీవుడ్ ఆడియన్స్‌కు స్పెషల్‌గా అనిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి మస్తీ-4, గుస్తాక్ ఇష్క్, కన్నడ నుంచి 45 లాంటి సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు తమిళ, మలయాళ డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. 
     

    నెట్‌ఫ్లిక్స్

    •    స్కై స్క్రాపర్ లైవ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23

    •    తేరే ఇష్క్ మైన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23

    •    ద బిగ్ ఫేక్ (ఇటాలియన్ సినిమా) - జనవరి 23

     

    అమెజాన్ ప్రైమ్

    •    చీకటిలో (తెలుగు సినిమా) - జనవరి 23

    •    గుస్తాక్ ఇష్క్(హిందీ సినిమా)- జనవరి 23

    •    ఇట్స్ నాట్ లైక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25


    జియో హాట్‌స్టార్

    •    మార్క్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 23

    •    స్పేస్ జెన్: చంద్రయాన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 23

      ఆహా

    • మరియో(తెలుగు సినిమా)- జనవరి 23

    జీ5

    •    45 (కన్నడ సినిమా) - జనవరి 23

    •    మస్తీ 4 (హిందీ మూవీ) - జనవరి 23

    •    సిరాయ్ (తమిళ సినిమా) - జనవరి 23

    •    కాళీపోట్కా (బెంగాలీ సిరీస్) - జనవరి 23

    సన్‌ నెక్ట్స్..

    • షెషిప్పు(మలయాళ సినిమా)- జనవరి 23

    ముబీ

    •    లా గ్రేజియా (ఇటాలియన్ మూవీ) - జనవరి 23

       

  • ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్‌ దేవరకొండ,  దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.

    రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.


     

  • హీరో ఎప్పటికీ హీరోనే.. ఎంత వయసొచ్చినా సరే వాళ్లు ఎవర్‌గ్రీన్‌ స్టార్స్‌గానే కొనసాగుతారు. అలాంటి హీరోను పట్టుకుని ఓ నటి అంకుల్‌ అనేసిందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అన్నది ఎవరినో కాదు, లక్షలాది మంది మనసుల్ని దోచుకున్న కింగ్‌ షారూఖ్‌ ఖాన్‌ను! అసలు ఎవరా నటి? ఏంటీ కథ ఓసారి చూసేద్దాం..

    అక్కడ మొదలైంది
    సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇటీవలే జాయ్‌ అవార్డుల ఫంక్షన్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీ పెరీ, మిల్లీ బాబీ బ్రౌన్‌ వంటి పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ హాజరయ్యారు. బాలీవుడ్‌ నుంచి షారూఖ్‌ ఖాన్‌ కూడా వెళ్లాడు. అలాగే టర్కిష్‌ నటి హండె ఎర్సెల్‌ కూడా ఆ వేడుకలో పాల్గొంది. ఆమె స్నేహితురాలు, నటి అమీనా ఖలీల్‌.. షారూఖ్‌తో కలిసి అవార్డులు ప్రదానం చేసింది. దాన్ని హండె తన ఫోన్‌లో వీడియో తీసింది. దాంతో హండె కూడా షారూఖ్‌ ఖాన్‌కు పెద్ద అభిమాని అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం తీశారు.

    ఎవరీ అంకుల్‌?
    ఇంతలోనే నెట్టింట మరో పోస్ట్‌ ప్రత్యక్షమైంది. అందులో ఏముందంటే.. హండే  తన స్నేహితురాలిని మాత్రమే వీడియో తీశానని రాసుంది. షారూఖ్‌ను చూపిస్తూ ఎవరీ అంకుల్‌ అని రాసుకొచ్చింది. అతడికి తాను అభిమానిని కాదని, దయచేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపేయమని కోరినట్లుగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ స్క్రీన్‌షాట్‌ తెగ వైరలయింది.

    అది ఫేక్‌
    దీంతో నెటిజన్లు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. ఇంతకీ హండె షారూఖ్‌ అభిమానియేనా? అయినా అంత పెద్ద హీరోను పట్టుకుని అంకుల్‌ ఎలా అనేసింది? అని విమర్శించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ వివాదంపై స్పందించింది హండె. వైరలవుతున్న స్క్రీన్‌షాట్‌ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె షారూఖ్‌ అభిమానా? కాదా? అన్నది పక్కనపెడితే ఆయన్ను అంకుల్‌ అనైతే అనలేదు అని ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు.

    సినిమా
    సినిమాల విషయానికి వస్తే.. షారూఖ్‌ ఖాన్‌ ప్రస్తుతం కింగ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. కాగా హండె ఎర్సెల్‌.. ఇంటాక్సికేటెడ్‌ బై లవ్‌, చేజింగ్‌ ద విండ్‌ అని రెండు టర్కిష్‌ సినిమాలు చేసింది. వెండితెరపైకి రావడానికి ముందు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్‌ చేసింది. అవకాశామొస్తే బాలీవుడ్‌లోనూ యాక్ట్‌ చేస్తానంది.

    ఫేక్‌ స్క్రీన్‌షాట్‌ (ఫోటోలో ఎడమవైపు)

    చదవండి: వాళ్లంతా వేశ్యలూ.. నువ్వూ అదే అవుతానంటే ఎలా?: నటిపై అమ్మ ఫైర్‌

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా "హలో ఇట్స్ మీ". ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో లాంఛ్ చేశారు. 

    ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈమూవీలో చూపించింది. ఆమె స్టోరీ నెక్ట్స్ లెవెల్ లో చెప్పింది. అప్పుడే డైరెక్టర్ గా ఆమెను నమ్మాను. షగ్న తప్పకుండా మంచి సినిమా చేస్తుందని నమ్మకంతో చేశాను.  నా మూవీస్ కొత్తబంగారు లోకం, హ్యాపీడేస్ సాంగ్స్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఆడియెను మిస్ అవుతున్నాను అనుకున్నాను. ఈ చిత్రంలోని పాటలతో ఆ కొరత తీరనుంది. ఈ మూవీ సాంగ్స్ ను కొన్నేళ్ల వరకు వింటూనే ఉంటారు. వంశీకాంత్ అంతమంచి ఆడియో ఇచ్చారు. ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ సందీప్, సంజీవ్, సంకీర్త్ లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలి. అన్నారు.

     హీరోయిన్, డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ - డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా. మంచి కథా కథనాలతో సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ రిలేట్ అవుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు హీరోయిన్ దర్శకత్వంలో సినిమా ఎందుకని నెగిటివ్ గా మాట్లాడారు. మా ప్రొడ్యూసర్స్ నాపై నమ్మకం ఉంచి, ఎవరి సందేహాలు వినకుండా సినిమా చేశారు. సినిమాను దర్శకత్వం చేయడంలో ఆడా, మగా తేడా ఏం లేదు. మనం అనుకున్న సీన్ అనుకున్నట్లు రూపొందించామా లేదా అనేది కావాలి. అందుకు టీమ్ అంతా సపోర్ట్ చేయాలి. నాకు అలాంటి మంచి సపోర్టింగ్ టీమ్ దొరికింది. వరుణ్ ఎంతో సపోర్ట్ చేశారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజశేఖర్‌, జశ్వంత్‌, సంగీత దర్శకుడు వంశీకాంత్‌, డీవోపీ బ్రహ్మతేజ మురిపూడి, నిర్మాత సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
     

  • నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో చైతూ, సాయిపల్లవి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా చైతూ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. 

    తాజాగా ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి బిగ్‌ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది వాలైంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. నా హృదయానికి హత్తుకున్న సినిమా లవ్ స్టోరీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లవ్ స్టోరీ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లవర్స్ డే రోజున థియేటర్లలో మరోసారి లవ్ స్టోరీ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
     

     

  • సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందిలో చెడు అభిప్రాయం ఉంది. అందుకే ఈ ఇండస్ట్రీలోకి వెళ్తామనగానే పేరెంట్స్‌ అంత ఈజీగా అస్సలు ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్ని అసలే అనుమతించరు. తన ఇంట్లో అయితే అమ్మ చచ్చిపోతానని బెదిరించిందంటోంది బాలీవుడ్‌ నటి సయాని గుప్తా.

    మంచి జీతం
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా చదువైపోగా ఓ ఉద్యోగం సంపాదించాను. మంచి సంపాదన.. సీజన్‌లో కనిపించింది. బాగానే డబ్బులు వచ్చేవి. ఏడాదిన్నరపాటు జాబ్‌ చేశాను, కానీ అది నాకు సంతృప్తినివ్వలేదు. యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి రావాలన్నది నా కల. అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. చేతి మణికట్టు కోసుకుని చస్తానని బెదిరించింది. తను యాక్టర్స్‌ను వేశ్యలు అని పిలిచేది. 

    అమ్మ సపోర్ట్‌ లేదు
    నేను కూడా నటిగా మారతానన్న ఆలోచన తట్టుకోలేకపోయింది. చిన్నప్పటినుంచి నేను ఎక్కడా ఎలాంటి రిహార్సల్స్‌ చేయకుండా ఇంట్లోనే బంధించేది. యాక్టర్స్‌ అందరూ వేశ్యలూ.. అటువైపే వెళ్లొద్దు అనేది. నాన్న మాత్రం నేనేం చేసినా సపోర్ట్‌ చేసేవాడు. అలా ఆయన అంగీకారంతో ఎఫ్‌టీఐఐ (ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా)లో చేరాను. 

    సినిమా
    అప్పుడు నెలరోజులపాటు అమ్మ నాతో మాట్లాడటమే మానేసింది. ఆ తర్వాత ఓసారి క్యాంపస్‌కు వచ్చాక తన ఆలోచనా విధానం మారిపోయింది. సయానీ గుప్తా.. జాలీ ఎల్‌ఎల్‌బీ 2, ఆక్సన్‌, పాగలైట్‌, ఆర్టికల్‌ 15, జ్విగాటో వంటి పలు చిత్రాల్లో నటించింది. చివరగా ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ వెబ్‌ సిరీస్‌ నాలుగో సీజన్‌లో కనిపించింది.

    చదవండి: పదో సినిమా ఫిక్స్‌.. టైటిల్‌ విచిత్రంగా ఉంటుంది: అనిల్‌ రావిపూడి

  • విజయ్‌ సేతుపతి, అదితి రావు హైదరీ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం గాంధీ టాక్స్. ఈ సినిమాకు కిశోర్‌ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రేజీ మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

    పదే పదే కంగారుగుంటది.. అంటూ సాగే ఈ మెలోడి లవ్ సాంగ్‌  విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. నయన్సీ శర్మ, శిబి శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 30న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

     

  • తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఈ నగారానికి ఏమైంది. 2018లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభివన్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, సాయి సుశాంత్‌ కీలక పాత్రల్లో మెప్పించారు. ఇందులో సాయి సుశాంత్‌.. కార్తీక్ పాత్రలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు.

    అయితే ఈ మూవీ సీక్వెల్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఈ సీక్వెల్‌ నుంచి సాయి సుశాంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు సుశాంత్‌ను మిస్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఈ విషయం దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. సుశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నానని పెట్టిన పోస్ట్ చూసి తన గుండె పగిలినంత పనైందని అన్నారు. అయితే కథ సహజంగా సరైన సమయంలో వచ్చిందని.. సుశాంత్ లేకపోయినా కార్తీక్ పాత్ర ఇప్పటికీ కథలో ఉంటుందని సోషల్ మీడియా ద్వారా దర్శకుడు పంచుకున్నారు.

    తరుణ్ భాస్తర్‌ పోస్ట్‌ను  ప్రొడ్యూసర్ సృజన్ యరబోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే కార్తీక్‌గా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అలరించిన సుశాంత్‌పై తనకు ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ టాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారింది. 

    t
     

  • దర్శకుడిగా వరుస బ్లాక్‌బస్టర్లు కొడుతున్న అనిల్‌ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్‌ సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. 

    సరైన నిర్ణయం తీసుకోకపోతే
    ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్‌ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్‌ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్‌ ఇచ్చాను.

    టైటిలే విచిత్రంగా ఉండబోతోంది
    తాజాగా వైజాగ్‌ టూర్‌లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్‌ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్‌ అయితే జరగబోతోంది. టైటిల్‌ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్‌ ప్రకటిస్తాను.

    పవన్‌ కల్యాణ్‌తో కాదు!
    ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్‌ మాత్రమే ఫిక్స్‌ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్‌ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్‌ దరకడం కదా! జూన్‌, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్‌ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: పెళ్లి ప్రపోజల్‌.. ముందు కెరీర్‌పై ఫోకస్‌ చేయ్‌: హీరోయిన్‌

  • బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ గతేడాది అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్‌- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.

    ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు.  గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా  చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా  మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.

    కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్‌ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. 
     

  • సెలబ్రిటీకు ప్రపోజల్స్‌ రావడం అనేది చాలా కామన్‌. అయితే చిన్నపిల్లలు కూడా ప్రపోజ్‌ చేస్తున్నారని, అదే కాస్త ఆశ్చర్యంగా ఉందంటోంది హీరోయిన్‌ అవంతిక మోహన్‌. టీనేజ్‌ పిల్లలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని చెప్తోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్స్‌ షేర్‌ చేసింది. అందులో ఓ అబ్బాయి.. కేరళలో చాలామంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వారిలో నేనూ ఒకడిని అన్నాడు. 

    చిన్న వయసులో ఎంత ధైర్యమో..
    ఆ మెసేజ్‌కు అవంతిక స్పందిస్తూ.. ఈ పిల్లాడిని చూడండి.. అంత చిన్నవయసులోనే ఎంత ధైర్యమో! చిన్నోడా.. నేను చెప్పేదేంటంటే నాకు ఆల్‌రెడీ పెళ్లయిపోయింది. కాబట్టి నా గురించి ఆలోచించకుండా వెళ్లి నీ హోమ్‌వర్క్‌ చేసుకో.. నా జీవితంలో కొత్త హీరో ఎంట్రీకి ఛాన్స్‌ లేదు. నీ కెరీర్‌ మీద ఫోకస్‌ చేయు అని చెప్పుకొచ్చింది.

    నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? 
    మరో స్క్రీన్‌షాట్‌లో ఓ యువకుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా? అని అడిగాడు. అది చూసిన అవంతికకు కోపం రాలేదు, నవ్వొచ్చింది. నీ మెసేజ్‌ చూడగానే నాకు నిజంగా నవ్వొచ్చింది. నీకు దాదాపు 20 ఏళ్లు ఉంటాయనుకుంటా.. చాలా రాంగ్‌ టైమ్‌ ఇది! అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే!

    సినిమా
    సరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్‌ పర్సన్‌ నీ జీవితంలోకి వస్తారు.. అప్పటివరకు జీవితాన్ని ఆస్వాదించు అని రిప్లై ఇచ్చింది. అవంతికకు ఇలాంటి ప్రపోజల్స్‌ గతంలోనూ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే.. అవంతిక యక్షి: ఫేత్‌ఫుల్లీ యువర్స్‌, నీలాకాశం పచ్చకాదల్‌ చువన్న భూమి, క్రొకొడైల్‌ లవ్‌ స్టోరీ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. తెలుగులో ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది.

    చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు: శర్వానంద్‌

  • సన్నీ డియోల్  హీరోగా నటించిన బోర్డర్‌ 2 చిత్రం ఈ నెల 23న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం డియోల్ ఫ్యామిలీ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బోర్డర్‌ 2పై అప్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. దుబాయ్‌లో హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘బోర్డర్‌ 2 సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా.ఇప్పుడు నేను ఈ రీల్‌ పోస్ట్‌ చేస్తున్నా కదా.. చూద్దాం ఏమవుతుందో చూద్దాం’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

    ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో బోర్డర్‌ 2లోని పాట ప్లే  చేయడం గమనార్హం. రషీద్‌ పోస్ట్‌పై బాలీవుడ్‌ ప్రముఖులు సరదాగా స్పందించారు. ‘హా భాయ్‌’ అని వరుణ్‌ ధావన్‌  కామెంట్‌ పెట్టగా..  ‘అదే మార్గం’( ఆ హైవే నుంచే సినిమాకు రావాలి అనే అర్థం వచ్చేలా..) సునీల్‌ శెట్టి కామెంట్‌ చేశాడు.

    బోర్డర్‌ 2 విషయానికొస్తే.. 1997లో వచ్చిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌  'బోర్డర్'కి సీక్వెల్ ఇది. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. సన్నీ డియోల్‌ తో పాటు వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి వంటి ప్రముఖులు నటించారు. మన దేశంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది. విదేశాల్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యింది.  అయితే పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఈ సినిమా కథ ఉందంటూ.. కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లాంటి గల్ఫ్‌ దేశాలు బ్యాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 
     

  • మొత్తానికి టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ హిట్టు కొట్టాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో సంక్రాంతి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

    నిర్మాతతో విభేదాలు?
    ఇకపోతే శర్వానంద్‌కు, నిర్మాత అనిల్‌ సుంకర మధ్య విభేదాలంటూ గతంలో కొన్ని రూమర్స్‌ వచ్చాయి. సినిమా రిలీజ్‌ సమయంలో శర్వా.. అనిల్‌ సుంకరను ప్రశంసించిన విధానం చూస్తే అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయాయి. అయినప్పటికీ తాజాగా ఓ చిట్‌చాట్‌లో నిర్మాతతో విభేదాలపై స్పందించాడు.

    నా పరిస్థితి ఇలా..
    శర్వానంద్‌ మాట్లాడుతూ.. అనిల్‌గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మాకే తెలుసు. మేమంతా ఒకరకమైన బాధలో ఉన్నాం. ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ నాకు హిట్టొచ్చి ఆరేడేళ్లవుతోంది. నా పరిస్థితి ఇలా ఉంటే అనిల్‌ నిర్మాతగా చేసిన గత రెండు సినిమాలు పోయాయి. అలా ఒకరికొకొకరం సహాయం చేసుకునే పరిస్థితి కూడా లేదు.

    మోసం చేశారు
    గతంలో నేను చాలామంది నిర్మాతలకు సాయం చేశాను. అందరూ వాడుకుని వదిలేసినవాళ్లే! నేను సాయం చేసినప్పుడు శర్వా మనవాడు అన్న భావన వారిలో ఉండాలి కదా.. అది ఏమాత్రం లేదు. నన్ను మోసం చేశారు. అలాంటి వాళ్లను నమ్మాలంటే కూడా ఆలోచించాల్సి వస్తోంది. అలా వారి వల్ల నాకు తెలియకుండానే తిక్కలోడిగా మారిపోయాను. కానీ, అనిల్‌గారు నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశారు. ఆయన నాకు అన్నకంటే ఎక్కువ అని చెప్పుకొచ్చాడు. శర్వానంద్‌ ప్రస్తుతం బైకర్‌, భోగి సినిమాలు చేస్తున్నాడు.

    చదవదండి: నటుడు, ఎమ్మెల్యే రెండో పెళ్లి.. మొదటి భార్య సంచలన ఆరోపణలు

  • చిరంజీవి- అనిల్‌ రావిపూడి మూవీ 'మన శంకరవరప్రసాద్‌గారు'.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 300 కోట్లకు పైగానే రాబట్టింది. ఇందులో చిరంజీవి కూతురు నిక్కీ పాత్రలో బాలనటి ఖుషి నటించింది. చిరు కూతురుగా తను చాలా చక్కగా నటించి ప్రశంసలు కూడా అందుకుంటుంది.  నయనతార, చిరు వంటి స్టార్స్‌తో ఖుషి కూడా తన స్థాయికి మించి నటించి మెప్పించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఖుషి మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకుంది.

    చిరంజీవి కూతురుగా నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఖుషి పేర్కొంది. అయితే, తనకు నాన్నలేరని  తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ, తన తండ్రికి సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. రాజస్థాన్‌కు చెందిన తమ కుటుంబం రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పింది. ఇక్కడే 7వ తరగతి చదువుతున్నట్లు తెలిపింది. తన మదర్‌ కూడా అదే స్కూల్‌లో పనిచేస్తున్నారని పేర్కొంది.

    తనకొక బ్రదర్‌ కూడా ఉన్నాడని తమ సంరక్షణ అమ్మ మాత్రమే చూసుకుంటుందని ఖుషి చెప్పుకొచ్చింది. సినిమా సెట్స్‌లో చిరంజీవి గారిని నాన్న అని పిలిచినప్పుడు చాలా ఎమోషనల్‌ అయ్యేదానినని ఒక్కోసారి కన్నీళ్లు కూడా వచ్చేవని గుర్తుచేసుకుంది. తనకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయ పడింది. చిరు సార్‌తో చాలా మెమరీస్‌ ఉన్నాయని ఖుషి పంచుకుంది. చిరు సార్‌ను కలిసిన ప్రతిసారి కేక్స్‌, చాక్‌లెట్స్‌ ఇచ్చేవారని తెలిపింది. మెగాస్టార్‌తో గారితో మరో సినిమా ఛాన్స్‌ రావాలని  ఆశపడుతున్నానని కోరుకుంది.  నయనతారతో కూడా మంచి బాండింగ్‌ ఏర్పడిందని ఖుషి చెప్పింది. అయితే, నయన్‌ను అక్క అని పిలుస్తానని, తను చాలా యంగ్‌గా కనిపిస్తారని తెలిపింది. నయన్‌ గారు దుస్తులు కొనిచ్చారని చెబుతూ.. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా తనకు చాలా ఇచ్చిందని ఖుషి పేర్కొంది. 

Telangana

  • దావోస్‌: దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సమావేశాల్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.

    బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... యువతకు ఏఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు.

    ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఏఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్‌తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

    ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జార్జ్న్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది.

    అలాగే దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC)తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. రెండు దేశాల మార్కెట్లు, ఎకోసిస్టమ్లపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.

  • దావోస్: ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)- 2026 సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గోద్రేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రేజ్ క్రీమ్ లైన్ డెయిరీ ప్లాంట్ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకాశాలపై చర్చించారు.

    భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపై మాట్లాడారు. ఫ్యూచర్ సిటీలో మౌళిక వసతులు (స్కూళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ సౌకర్యాలు) ఏర్పాటు చేయడం ప్రభుత్వానికీ, సంస్థకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలంగాణ ప్రతినిధులు పేర్కొన్నారు. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్‌కు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

  • సాక్షి, రంగారెడ్డి జిల్లా: ల్యాండ్‌ పూలింగ్ పేరుతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చట్ట విరుద్దంగా పేదల భూములను లాక్కుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూములు ఎందుకు తీసుకుంటున్నారంటూ నిలదీశారు. ఏం కంపెనీలు పెడతారు? ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పకుండా పేదలను మోసం చేసి అన్యాయంగా విలువైన భూములను ఆక్రమించాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేనపుడు ప్రభుత్వం పేదల భూములు సేకరించడం చట్టవిరుద్దమన్నారు. షాబాద్ మండలంలోని రేగడిదొస్వాడ, మక్తగూడెం, తాళ్లపల్లి, తిమ్మారెడండిగూడెం గ్రామాలకు చెందిన ఎస్సీల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ఈశా ఫౌండేషన్ కోసం భూములు ఇవ్వడానికి పేదల భూములే దొరికాయా? అందుకోసం ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలు కేటాయించవచ్చు కదా అని నిలదీశారు. ధనవంతులు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించే ఆశ్రమాల కోసం పేద ఎస్సీల భూములు కావాలా అంటూ నిలదీశారు. రేవంత్ రెడ్డి మేమూ భూస్వాములమేనని చెప్పుకున్నారు,మరి వాల్ల భూములను ఈశా ఫౌండేషన్ వారికి ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈశా ఫౌండేషన్ వల్ల ఇక్కడి పేదలకు జరిగే లాభం ఏంటని అడిగారు. పేదలకు ఉద్యోగాలిస్తారా,చదువు చెప్తారా? హాస్పిటల్ నిర్మిస్తారా అంటూ ధ్వజమెత్తారు.దానివల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

    చేవెళ్ల సాక్షిగా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో, పేదల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక, లగచర్లలో అల్లుడి ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమిని లక్కోవాలని చూశారని, ఇపుడు సద్గురు బాబా కోసం రేవంత్ బాబా ఎస్సీల భూములు లాక్కోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పేదలను పుట్టినప్పటి నుండి కేసిఆర్ కిట్ ఇచ్చి,గురుకులాలు పెట్టి డాక్టర్లను తయారు చేసి, పేదలకు మూడు ఎకరాల భూమి ఇచ్చి,దళిత బంధుతో వ్యాపారస్తులుగా తయారు చేయాలని చూశారన్నారు. కానీ  రేవంత్ రెడ్డి మాత్రం పేదల భూములు లాక్కొని నిరాశ్రయులను చేసి,అడ్డా కూలీలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.

    కంపెనీలు పెట్టుకోవడానికి హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నా,రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల భూమిని లాక్కొని వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారన్నారు. కంపెనీల కోసం కేటాయించిన భూములను హిల్ట్ పాలసీ కింద తక్కువ ధరకు అమ్ముకోవాలని చూస్తున్నారన్నారు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక రేవంత్‌ రెడ్డి సెక్రటేరియట్ లో పెట్టే ప్రతి సంతకం, పేదలకు వ్యతిరేకంగానే చేస్తున్నారన్నారు.

    రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టా బుక్ జారీచేసి,పేదలకు భూములపై సర్వ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడలో భూమి సేకరణకు ప్రయత్నం చేస్తే, లగచర్ల స్పూర్తిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం, భూమి మార్కెట్ విలువకు 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంతేకాకుండా భూమికి బదులు భూమే కావాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు న్యాయం జరిగేదాక పోరాడతామన్నారు.

  • సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో సింగరేణి నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్ల విషయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ బ్లాక్ వివాదంపై విచారణకు కేంద్ర బృందాన్ని సింగరేణికి పంపిచనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కేంద్రం బృందం.. తెలంగాణలో పర్యటించనుంది.

    కాగా, నైనీ కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు.. ఇద్దరు సభ్యుల కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. ఈ వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలను, ఇతర అంశాలపైనా ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. ఈ బృందంలో కేంద్ర బొగ్గు శాఖ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, డైరెక్టర్ టెక్నికల్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు తాజాగా సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) కేటీఆర్‌ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 

    తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు విషయంలో సిట్‌ అధికారులు స్పీడ్‌ పెంచారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా రేపు(శుక్రవారం) జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. సిటీలోని నంది నగర్‌లో ఉన్న కేటీఆర్‌కు నివాసానికి వెళ్లిన పోలీసులు.. అక్కడే నోటీసులు అందజేశారు. 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావును ఇప్పటికే సిట్‌ బృందం విచారించిన విషయం తెలిసిందే. 

    మరోవైపు.. కేటీఆర్‌కు సిట్‌ నోటీసులపై మాజీ మంత్రి హరీష​్‌ రావు స్పందించారు. ఈ సందర్బంగా హరీష్‌ మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి అటెన్షన్‌ డైవర్షన్లకు భయపడే ప్రసక్తే లేదు. నాకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నీ వెంట పడుతాం. నీ బావ మరిది కుంభకోణం బయటపడొద్దనే ఇలా డైవర్షన్‌ డ్రామాలు చేస్తున్నారు. నేను, కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే మాకు నోటీసులు ఇచ్చారు. సిట్‌ నోటీసులకు భయపడేది లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉంటాం అని హెచ్చరించారు. 

    కేటీఆర్ కు సిట్ నోటీసులు

     

     

Business

  • గూగుల్ పే గురించి వినుంటారు, ఫోన్‌పే ఉపయోగించుంటారు. యాపిల్ పే గురించి ఎప్పుడైనా విన్నారా?, అయితే ఈ వార్త మీ కోసమే. త్వరలోనే భారత్‌లో యాపిల్ పే సేవలు ప్రారంభం కానున్నాయి.

    యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఎందుకంటే.. భారత్‌లో యాపిల్ పే సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూజర్లు కార్డులను స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసుకునేలా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కంపెనీ ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సంస్థలతో చర్చలను ప్రారంభించింది.

    భారతదేశంలో కూడా.. యాపిల్ సంస్థ అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆర్‌బీఐ తరఫున అనుమతులు పొందేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సేవలు తొలుత యూపీఐ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. యూపీఐ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అవసరం. కాబట్టి తొలుత కార్డు ఆధారంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.

    యాపిల్ వ్యాలెట్‌లో కార్డుల వివరాలను భద్రపరుచుకుంటే.. అవసరమైనప్పుడు యాపిల్ పే యాప్‌తో చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారంగా ట్యాప్-టు పే టెక్నాలజీతో పనిచేస్తాయి. భద్రత ప్రమాణాల రీత్యా ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీల ధ్రువీకరణలను తప్పనిసరి చేస్తారు. ఏది ఏమైనా.. యాపిల్ గనక రంగంలోకి దిగితే.. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలకు గట్టిపోటీ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాపిల్ పే సేవలు 89 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

  • సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.

    ఏఐ జనరేషన్, డీప్‌ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.

    అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్‌ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్‌నూ చెక్ చేస్తుంది. కంటెంట్‌ను మూడు విధాలుగా (లెవెల్స్‌) విభజిస్తుంది.

    ➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది
    ➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది
    ➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుంది

    డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్‌ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్‌గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు. 

    కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్‌ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్‌బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్‌ఫేక్‌ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.

    అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్‌ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్‌లో ఉంది.

  • రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లలో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) - 2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు.

    విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రీయల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.

    పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని ముఖ్యమంత్రి  తెలిపారు.

    ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని మంత్రులు తెలిపారు.

  • విలువైన సంస్థలకు సారథ్యం వహిస్తున్న యువ ఎంట్రప్రెన్యూర్స్‌ సంఖ్యపరంగా చైనాను భారత్‌ వెనక్కి నెట్టింది. ఆ కోవకి చెందిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు భారత్‌లో 166 మంది ఉండగా చైనాలో 140 మంది ఉన్నట్లు అవెండస్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూత్‌ సిరీస్‌ 2025 ఒక నివేదికలో తెలిపింది.

    100 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే అంకురాలను స్థాపించిన 40 ఏళ్ల లోపు ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. నివేదిక ప్రకారం 200 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలకు సారథ్యం వహిస్తున్న వారి సంఖ్య చైనాలో 54గా ఉండగా, భారత్‌లో 35గా ఉంది. ఇక 100 మిలియన్‌ డాలర్ల సంస్థలను స్థాపించిన లేదా 200 మిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే సంస్థలను నడిపిస్తున్న, 40 ఏళ్ల లోపు కొత్త తరం వ్యాపారవేత్తల సంఖ్య భారత్‌లో 201గా ఉండగా, చైనాలో 194గా ఉంది. ఈ జాబితాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ఎండీ కరణ్‌ అదానీ అగ్రస్థానంలో ఉండగా, అల్కెమీకి చెందిన నిఖిల్‌ విశ్వనాథన్‌ రెండో స్థానంలో, అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

    ఈ ఎంట్రప్రెన్యూర్లు సారథ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ రూ. 31 లక్షల కోట్లుగా (357 బిలియన్‌ డాలర్లు) ఉందని హురున్‌ పేర్కొంది. ఇది భారతదేశపు జీడీపీలో 11వ వంతు అని తెలిపింది. ఈ ఎంట్రప్రెన్యూర్ల నేతృత్వంలోని కంపెనీలలో మొత్తం 4.43 లక్షల మంది పని చేస్తున్నట్లు వివరించింది. అపోలో హాస్పిటల్స్‌లో అత్యధికంగా 42,497 మంది ఉద్యోగులు ఉన్నారు.  ముప్ఫైల మధ్యలో ఉన్న చాలా మంది ఫిన్‌టెక్, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సరీ్వస్‌), హెల్త్‌కేర్, క్లీన్‌ ఎనర్జీ తదితర విభాగాల్లో తమ సంస్థలను అగ్రగాములుగా తీర్చిదిద్దుతున్నట్లు హురున్‌ ఇండియా ఫౌండర్‌ అనాస్‌ రెహా్మన్‌ జునైద్‌ తెలిపారు.

  • ఆర్ధిక పరిస్థితులు ఎప్పుడు, ఎలా మారుతాయో.. ఎవరూ అంచనా వేయలేరు. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోవచ్చు, కరెన్సీ విలువ అమాంతం తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ తరుణంలో పోలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ ఆర్ధిక రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

    ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు అయిన నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్.. మరో 150 టన్నుల విలువైన బంగారం కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం పోలాండ్ వద్ద ఉన్న బంగారం నిల్వల పరిమితిని 550 టన్నులకు చేరింది. 2026 డిసెంబర్ 31 నాటికి దీనిని 700 టన్నులకు పెంచాలని సెంట్రల్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరుతున్నట్లు గవర్నర్ ఆడమ్ గ్లాపిన్స్‌కీ గత వారం ప్రకటించారు.

    పోలాండ్ వద్ద ఉన్న బంగారం.. ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఉందని సమాచారం. గోల్డ్ అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక దేశాన్ని ఆర్థికంగా రక్షించే కవచం అని ఆడమ్ గ్లాపిన్స్‌కీ పేర్కొన్నారు. పసిడి విలువ ఎప్పటికీ దాదాపు పడిపోయే అవకాశం లేదు. ఆర్ధిక అస్థిరత్వం లేదా ఆర్ధిక మాంద్యం ఏర్పడినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని. ఇతర దేశాల ద్రవ్య విధానంతో సంబంధం లేకుండా.. ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.

    విదేశీ మారక నిల్వల్లో పోలాండ్ వాటా 2024 నాటికి 16.86 శాతంగా ఉండేది. 2025 నాటికి ఇది 28.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి బంగారం పోగు చేసుకోవాలనే ఉద్దేశం ఒక్క పోలాండ్ దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలకు ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

    బంగారం ధరలు ఇలా..
    భారతదేశంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజు (గురువారం) రూ.1,54,310 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,450 రూపాయల వద్ద ఉంది. గోల్డ్ రేటు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా.

    ఇదీ చదవండి: బడ్జెట్ 2026.. ఆదివారం కూడా స్టాక్ మార్కెట్!

  • గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 479.45 పాయింట్ల (0.59 శాతం) లాభంతో 82,389.08 వద్ద, నిఫ్టీ 161.35 పాయింట్ల (0.64 శాతం) లాభంతో 25,318.85 వద్ద నిలిచాయి.

    బజాజ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్, ట్రాన్స్‌వరల్డ్ షిప్పింగ్ లైన్స్ లిమిటెడ్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్, అక్ష్ ఆప్టిఫైబర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్, హ్యూబాచ్ కలరెంట్స్ ఇండియా లిమిటెడ్, IIFL ఫైనాన్స్ లిమిటెడ్, పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • సంపద నిర్మించుకోవడానికి ఎప్పుడూ అధిక రిస్క్ పెట్టుబడులు లేదా స్టాక్ మార్కెట్‌పై లోతైన అవగాహనే అవసరం లేదు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే చిన్నపాటి రోజువారీ పొదుపు కూడా కాలక్రమేణా బలమైన ఆర్థిక భద్రతగా మారుతుంది. అలాంటి నమ్మదగిన పథకమే ‘పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్’ (RD). రోజుకు కేవలం రూ.200 పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో రూ.10 లక్షలకు పైగా నిధిని నిర్మించుకోవచ్చు.

    చిన్న పొదుపు.. పెద్ద ఫలితం
    ఈ పథకంలోని అసలైన బలం స్థిరత్వం. రోజుకు రూ.200 అంటే నెలకు రూ.6,000 మాత్రమే. ఇది చాలా కుటుంబాలకు సులభంగా నిర్వహించగలిగే మొత్తమే. ఈ చిన్న మొత్తాలు మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి లేకుండా, క్రమంగా పెద్ద మొత్తంగా మారతాయి.

    పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. పోస్టాఫీస్ భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో, ఈ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా, రిస్క్ లేకుండా పొదుపు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన ఎంపిక.

    ఖాతా ప్రారంభం సులభం
    కేవలం రూ.100తోనే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ ఖాతా ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు తమ సమీప పోస్టాఫీసులో ఈ ఖాతాను సులభంగా తెరవవచ్చు. నెలవారీ డిపాజిట్లు వెంటనే ప్రారంభించవచ్చు.

    రికరింగ్ డిపాజిట్‌కు ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ అనంతరం, ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పొడిగింపు వల్ల చక్రవడ్డీ ప్రయోజనం పెరిగి, సంపద మరింత వేగంగా పెరుగుతుంది.

    అత్యవసర అవసరాలకు రుణ సదుపాయం
    ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, మీరు జమ చేసిన మొత్తంలో 50% వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ, ఆర్‌డీ వడ్డీ రేటు కంటే కేవలం 2 శాతం మాత్రమే ఎక్కువ. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇది తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉపయోగపడుతుంది.

    కొన్ని షరతుల మేరకు ప్రీ-మెచ్యూరిటీ విత్‌డ్రాయల్‌కు కూడా అవకాశం ఉంటుంది. అనివార్య కారణాలతో ఖాతాదారు మరణించినప్పుడు, డిపాజిట్‌  మొత్తాన్ని నామినీ సులభంగా పొందవచ్చు.

    రోజుకు రూ.200.. రూ.10 లక్షలు ఎలా అవుతాయంటే?
    ➕రోజుకు రూ.200 
    ➕నెలకు రూ.6,000
    ➕5 సంవత్సరాలు డిపాజిట్ చేస్తే
    ➕మొత్తం డిపాజిట్: రూ.3.60 లక్షలు
    ➕వడ్డీ: సుమారు రూ.68,197
    ➕మెచ్యూరిటీ మొత్తం: రూ.4.28 లక్షలు
    ➕అదే ఖాతాను మరో 5 ఏళ్లు పొడిగిస్తే
    ➕మొత్తం డిపాజిట్: రూ.7.20 లక్షలు
    ➕మొత్తం వడ్డీ: సుమారు రూ.2.05 లక్షలు
    ➕తుది మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ.10.25 లక్షలు

    సున్నా మార్కెట్ రిస్క్, ప్రభుత్వ హామీ, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా చిన్నపాటి రోజువారీ పొదుపులు కూడా గొప్ప ఆర్థిక మైలురాయిగా మారతాయని పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం నిరూపిస్తోంది.

  • కియా ఇండియా.. తన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'సోనెట్'ను లాంచ్ చేసినప్పటినుంచి 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 35 శాతం. మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తూ.. వరుసగా రెండో సంవత్సరం లక్ష యూనిట్ల వార్షిక సేల్స్ సాధించింది.

    ప్రీమియం ఫీచర్లు & కనెక్టెడ్ మొబిలిటీ ఎంపికల కారణంగా ఈ కారు గొప్ప అమ్మకాలను పొందగలిగిందని కంపెనీ వెల్లడించింది. కియా సోనెట్ ప్రారంభ ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

    కియా సోనెట్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇందులో మధ్యప్రాచ్యం & ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా - పసిఫిక్ ప్రాంతాలు ఉన్నాయి. కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా లక్ష కంటే యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

  • ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.

    సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.

    “వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.

    ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.

    ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు  ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.

National

  • నోయిడా: కారుతో సహా నీటి గుంతలో పడి మరణించిన నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ చివరి క్షణాలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సహాయక బృందాలు గాలిస్తున్న దృశ్యాలతో పాటు.. దట్టమైన మంచులో నీటిపై ఆ వ్యక్తి తన ఫోన్ టార్చ్‌ లైట్ ఆన్ చేసి ఉంచిన వెలుగు కనిపిస్తోంది. రక్షణ సిబ్బంది అతడిని కంగారు పడొద్దంటూ ధైర్యం చెబుతున్న మాటలు కూడా వీడియోలో వినిపించాయి. జనవరి 16 రాత్రి 27 ఏళ్ల యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటనపై  దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఈ వీడియో బయటకొచ్చింది.

    గురుగ్రామ్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా... ఇంటికి తన కారులో తిరిగి వస్తుండగా నోయిడాలోని సెక్టార్-150లో నిర్మాణ స్థలం దగ్గర తవ్విన లోతైన గోతిలో కారు పడిపోయింది. అతను దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం అభ్యర్థించాడు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. యువరాజ్ తండ్రి రాజ్‌కుమార్ మెహతా కూడా ఘటన స్థలంలోనే ఉన్నారు. మూడు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం కారును బయటకు తీశారు.

    లోటస్ గ్రీన్స్ కన్స్ట్రక్షన్, ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్‌ సంస్థలకు చెందిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, ఆ నీటి గోతి వల్ల జరిగిన మరణానికి వీరిని బాధ్యులను చేస్తూ కేసు నమోదైంది. 2014లో కొనుగోలు చేసిన ఈ ప్లాట్‌లో భారీ యంత్రాలతో గోతిని తవ్వి, ఏళ్ల తరబడి నీటితో అలాగే వదిలేశారు. దీంతో నీటితో నిండిపోయి చెరువులా మారింది. బురద నీరు, చెత్తాచెదారంతో కలుషితమైంది. ఎం.జెడ్ విజ్‌టౌన్ ప్లానర్స్ డైరెక్టర్ అభయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది.

  • రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ‍ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే క్రాసింగ్‌ వద్ద గేటు పడకపోవడంతో ట్రాక్‌పై వెళ్తున్న వాహనాలను ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లోని దేవోబంద్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    వివరాల ప్రకారం.. గోండా-అసన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో దేవోబంద్‌ వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడంతో రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాల మీదుగా పలు వాహనాలు వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రైలు గేటు వరకు వచ్చింది. కానీ, వాహనాలు మాత్రం ట్రాక్‌పైనే నిలిచిపోయి ఉన్నాయి. దీంతో, ట్రాక్‌పై ఉన్న లారీని రైలు ఢీకొట్టింది.

    అయితే, అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న లోకోపైలట్‌.. రైలుకు బ్రేకులు వేసి మెల్లగా రానిచ్చాడు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని మెల్లగా ఢీకొట్టి ఆగింది. ఆ లారీ ఒక పక్కకు ఒరిగింది. రెండు బైకులను అది ఢీకొట్టింది. అయితే ఆ బైకులపై ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మరోవైపు రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గుమిగూడిన జనాన్ని వెళ్లగొట్టారు. ఈ ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.

    అయితే సిగ్నల్‌ క్లియరెన్స్‌ లేనప్పటికీ ఆ రైలు ముందుకు కదిలిందని గేట్‌ మ్యాన్‌ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో గేట్‌ పడకపోవడం, సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలు, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

  • బెంగళూరు: భారత్‌ అనగానే ప్రపంచ దేశాలకు గుర్తుకు వచ్చే విషయం సంస్కృతి, భారతీయులు ఇచ్చే మర్యాద. అలాగే, భారత్ వచ్చే టూరిస్టులను కొందరు అతిథిలా గౌరవిస్తూ వారి మన్ననలు సైతం పొందారు. కానీ, కొందరు మాత్రం అతిథులుగా వస్తున్న ఎందరో యువతులను వేధిస్తున్నారు. దీంతో, వారి చేసే తప్పులకు భారత్‌ పరువు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటకలో వెలుగు చూసింది. ఓ కొరియన్‌ యువతికి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎదురైన చేదు అనుభవాన్ని ఆవేదనతో చెప్పుకొచ్చారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొరియన్ యువతి కిమ్ సుంగ్ ఇటీవల బెంగళూరులోని తన స్నేహితురాలి వద్దకు వచ్చారు. అనంతరం, ఈనెల 19వ తేదీన ఆమె.. కొరియాకు వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అనంతరం, ఆమె కొరియన్ ఇమిగ్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. అప్పుడే ఎయిర్‌పోర్టుకు చెందిన స్టాఫ్ అఫాన్‌ అహ్మద్‌ అనే వ్యక్తి వచ్చి ఆమె బ్యాగ్‌ చెక్ చేయాలని ఆర్డర్‌ వేశాడు. అయితే, కౌంటర్ చెక్ చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని.. ఈ కారణంగా ఆమె వెళ్లాల్సిన విమానం కూడా మిస్‌ అయ్యే అవకాశం అవుతుందని, పర్సనల్‌ చెక్ చేస్తానని ఆమెని నమ్మించాడు.

    అనంతరం, ఆమెను వాష్ రూమ్ వైపుగా తీసుకెళ్లాడు. ఇంతలో కిమ్‌పై అహ్మద్‌ చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చెకింగ్‌ పేరిట.. ఆమె చెస్ట్, ప్రైవేట్ పార్టులను పదేపదే తాకుతూ లైంగికంగా వేధించాడు. పలుమార్లు అలా చెకింగ్ చేస్తూ రాక్షాసానందం పొందాడు. చివరగా ఆమెను వెనుక వైపుగా తిరగమని చెప్పి బలవంతంగా గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో సదరు మహిళ అతడిని తోసేసే ప్రయత్నించగా ఓకే.. థాంక్యూ అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన నుంచి వెంటనే తేరుకున్న కిమ్‌.. ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీకి ఫిర్యాదు చేసింది. ఆమెకు జరిగిన షాకింగ్ ఘటనను అధికారులకు తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీని చెక్‌ చేశారు. అహ్మద్‌పై సెక్షన్ 75 BNS కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే, సాధారణంగా ప్రయాణికులును ఎవరినైనా.. ఫిజికల్‌గా చెక్ చేసే అధికారం ఏ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌కు ఉండదు. 
     

  • ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్‌ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు.  పండుగైనా, వేడుకైనా  వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది.  ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట  తెగ సందడి చేస్తోంది.

    పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్‌. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే.  ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్‌ అవ్వకూడదు. అదీ అతని కమిట్‌మెంట్‌. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్‌ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు.  

    కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్‌ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్‌ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో  నెట్టింట వైరల్‌ అవుతోంది. వాట్‌ ఏ కమిట్‌మెంట్‌ బ్రో అని నీ డెడికేష్‌కి సలాం అంటూ  నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

    నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు

    ఇదీ చదవండి : అనంత్‌ అంబానీ మరో లగ్జరీ వాచ్‌, అదిరిపోయే డిజైన్‌, ధర ఎంత?
     

  • దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ వారసుడు, వ్యాపారవేత్త అనంత్‌ అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అటు వ్యాపారంతోపాటు, వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతార’ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. తాజాగా అనంత్‌ అంబానీ, వంతారాకు సంబంధించి మరో  అంశం విశేషంగా నిలుస్తోంది.

    న్యూయార్క్‌కు చెందిన లగ్జరీ జాకబ్ & కో అనంత్ అంబానీ కోసం కస్టమ్ 'వంతారా' గడియారాన్ని రూపొందించింది. ఈ హోరోలాజికల్ మాస్టర్‌పీస్‌ 'ఒపెరా వంటారా గ్రీన్ కామో' ను జనవరి 21న ఆవిష్కరించింది. అనంత్ అంబానీకి ఇష్టమైన వంతారాకు నివాళిగా ఈవాచ్‌ను తయారు చేసింది. డెమాంటాయిడ్ గోమేదికాలు, సావోరైట్‌లు, ఆకుపచ్చ నీలమణి , తెల్ల వజ్రాలు  ఇందులో ఉన్నాయి. 21.98 క్యారెట్లతో దాదాపు 400 విలువైన రాళ్ల సంక్లిష్టమైన అమరిక అని, జాకబ్ అండ్ కో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ టైమ్‌పీస్ విలువ దాదాపు ‘1.5 మిలియన్లు’ (సుమారు రూ.12.5 కోట్లు). ప్రస్తుతం ఇది హోరాలజీ ప్రియులతోపాటు, ఫ్యాషన్‌ ప్రియుల ప్రశంసలందుకుంటోంది. (నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు)

    'ది వంతారా'లో 397 రత్నాలు
    ఈ వాచ్‌ డిజైన్‌ మరింత  స్పెషల్‌గా నిలుస్తోంది. డయల్‌లో మధ్యలో చేతితో తయారుచేసిన అనంత్‌ అంబానీ బొమ్మ అమర్చారు. అలాగే  చుట్టూ బెంగాల్‌ టైగర్‌, సింహాన్నిఅమర్చారు. అలాగే  బంగారం రూపొందించిన వంతారా,  ఎనుగు ఈ డయల్‌లో మరో ఆకర్షణ. అనంత్ అంబానీ లగ్జరీ వాచెస్‌ అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించినాయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే ఉత్తమమైన జాకబ్‌ బ్రాండ్‌ది కూడా  చేరింది. అనంత్ అంబానీ గడియారాల్లో పటేక్ ఫిలిప్, ఆడెమర్స్ పిగ్యుట్, రిచర్డ్ మిల్లె, రోలెక్స్ నుండి చాలా అందమైన విలాసవంతైన టైమ్‌పీస్‌లు చోటు దక్కించుకున్నాయి.  వీటి మొత్తం విలువ రూ. 200 కోట్లకు పైమాటేనని అంచనా.  

  • ముంబై: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్‌ విషయంలో ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ముంబై మేయర్‌ పోస్టును ఏ కేటగిరికి కేటాయించాలి? అనే అంశంపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్‌ మహిళ’ కేటగిరీ ఎంపిక కావడంపై ఉద్దవ్‌ థాక్రే శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో, మేయర్‌ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.

    వివరాల మేరకు.. ముంబై మహిళా మేయర్‌ రానున్నారు. అయితే, సదరు మహిళా మేయర్‌.. ఏ కేటగిరి నుంచి రావాలనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, ఈ పోస్ట్‌ను ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్‌ మహిళ’ కేటగిరీ ఎంపికైంది. కాగా, ఈ లాటరీ ప్రక్రియ, ఫలితంపై ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది గందరగోళ పరిస్థితులకు దారితీసింది.  బీఎంసీని ఓబీసీ కేటగిరీ కింద ఎందుకు పరిగణించలేదని మాజీ మేయర్ కిశోరి ఫడ్నేకర్ ప్రశ్నించారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం, సభ నుంచి ఉద్దవ్‌ వర్గం సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, మేయర్‌ స్థానంలో ఉత్కంఠ నెలకొంది.

    మరోవైపు.. మేయర్ పదవి కోసం డ్రా పూర్తయిన తర్వాత బీఎంసీలోని అర్హులైన కార్పొరేటర్లు నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. ఈ లాటరీ ప్రక్రియ తర్వాత పుణె, ధూలే, బీఎంసీ, నాందేడ్‌, నవీ ముంబయి, మాలేగావ్‌, మీరా భయందర్, నాసిక్, నాగ్‌పుర్ మేయర్‌ పోస్టులు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. అలాగే.. లాతూర్, జల్నా, థానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో లాతూర్, జల్నా ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగానికి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో అకోలా, చంద్రపూర్, అహిల్యానగర్, జల్గావ్ ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేయబడగా.. పన్వెల్, ఇచల్‌కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్‌నగర్ ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు.

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు  చేసుకుంది. తన  అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.  స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప వివాదమే  ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది.  

    పోలీసుల ప్రకారం మృతులను గుజరాత్ మారిటైమ్ బోర్డులో క్లాస్-1 అధికారి యశరాజ్‌సింగ్ గోహిల్ , అతని భార్య రాజేశ్వరి గోహిల్‌గా గుర్తించారు. ఈ జంటకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. బుధవారం రాత్రి  ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశంతో యశరాజ్‌సింగ్ తన లైసెన్స్ రివాల్వర్‌తో రాజేశ్వరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత, యశరాజ్‌సింగ్ 108 అత్యవసర సేవకు ఫోన్ చేశాడు. అధికారులు అక్కడికే చేరుకునేసమయానికే రాజేశ్వరి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్యవసర బృందం ఫ్లాట్ నుండి వెళ్లిపోయిన తర్వాత, యశరాజ్‌సింగ్ మరో గదిలోకి వెళ్లి అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.

    ఇదీ  చదవండి: రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!

    మరోవైపు యశరాజ్‌సింగ్ గుజరాత్ కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు , రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు. ఈ మరణాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అన్నారు. అతనొక యువ అధికారి, ఇటీవల పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ మారిటైమ్ బోర్డులో చేరాడనీ, యూపీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నాడని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అతని తుపాకీ లైసెన్స్, 108 కాల్ రికార్డులు వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.

    ఇదీ చదవండి: మొన్ననే పెళ్లి, తగాదా...నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!

  • సాక్షి, ఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఈ క్రమంలో విజయ్ పార్టీ టీవీకేకు విజిల్ గుర్తును ఈసీ కేటాయించింది. అలాగే, కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తమిళనాడులో టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్‌ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది.

    ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్‌ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. ఇక పొత్తులు ఉండబోవని విజయ్‌ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

    అయితే.. కరూర్‌ ఘటన తర్వాత విజయ్‌ ఒక్కసారిగా స్పీడ్‌ తగ్గించారు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్‌ రిలీజ్‌ ఆగిపోయిన కూడా స్పందించలేదు. అయితే, ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్‌ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా.. పొంగల్‌ తర్వాత ఇటీవలే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్‌ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్‌ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

  • బందేర్వాహ్‌/జమ్మూ: ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న 10 మంది సైనికులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జ మ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లాలోని భందేర్వాహ్‌–ఛంబా అంతర్రాష్ట్ర రహదారిలో 9,000 అడుగుల ఎత్తయిన ఖన్నీ పర్వత ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భారత ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

    విషయం తెల్సిన వెంటనే సైన్యం, పోలీసులు అన్వేషణ, సహాయక చర్యలను ఆరంభించారు. 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన వాహనం నుంచి నలుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సైనికులను ఎలాగోలా పైకి తీసుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైనిక వాహనం చాలా ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌ భుత్యాల్‌ వెల్లడించారు. 

    అసలేమైంది?
    ఖన్నీ పర్వతం మీద ఉన్న ఆర్మీ పోస్ట్‌కు చేరుకునేందుకు పలువురు సైనికులు గురువారం మధ్యాహ్నం అత్యంత అధునాతన ‘క్యాస్పిర్‌’ ఆర్మీ వాహనంలో బయల్దేరారు. రహదారిలో పాతిపెట్టిన మందుపాతరలు, శక్తివంత పేలుడు పదార్థాలు(ఐఈడీ)లను గుర్తించే, ఉగ్రవాదుల తుపాకీ గుళ్ల వర్షాన్ని సైతం తట్టుకోగల బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంగా ‘క్యాస్పిర్‌’ పేరొందింది. గురువారం అననుకూల వాతావరణంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ చేతుల్లోంచి వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని జమ్మూ కేంద్రంగా పనిచేసే వైట్‌నైట్‌ కోర్‌ బలగం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టింది.

    దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని
    సైనికుల వీరమరణం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘డోడా ఘటన అత్యంత విచారకరం. సాయుధ బలగాల్లో అత్యంత ధైర్యవంతులను కోల్పోయాం. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన మీ త్యాగాలను జాతిజనులు సదా గుర్తుంచుకుంటారు’’ అని ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్ష తెలియజేశారు. గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ప్రధాని సూచించారు.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం
  • రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్-భటపారా జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ఓ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో సంభవించిన భారీ పేలుడుకు ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 10 మంది తీవ్ర గాయాలపాలైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    పోలీసుల కథనం ప్రకారం భటపారా గ్రామీణ ప్రాంతంలోని బకులాహి గ్రామంలో ఉన్న ‘రియల్ ఇస్పాట్ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ’లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద స్థలంలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. పేలుడు దాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసిన దృశ్యాలు  వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి భారీ ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే పోలీసులు, జిల్లా సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
     

    అగ్నిమాపక సిబ్బంది,  రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాయి. మంటలను అదుపులోకి తేవడంతో పాటు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాల లోపం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. 

Politics

  • చెన్నై: త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల‌ని బీజేపీ నాయకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. త‌న ప‌ద‌వికి ఉద‌య‌నిధి రాజీనామా చేయాల‌న్నారు. త‌మ పార్టీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన నేప‌థ్యంలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థ‌తో మాట్లాడుతూ.. డీఎంకే ప్ర‌భుత్వానికి న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం లేద‌ని విమ‌ర్శించారు. న్యాయ‌స్థానాలు ఇచ్చిన తీర్పుల‌ను స్టాలిన్ స‌ర్కారు అమ‌లు చేయ‌డం లేద‌ని ఆరోపించారు.

    "అమిత్ మాలవీయకు సంబంధించిన కేసులో మ‌ద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి 48 గంటల క్రితం ఇచ్చిన తీర్పులో ఉప ముఖ్యమంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌పై తీవ్రమైన వ్యాఖ్య‌లు చేశారు. మ‌త విశ్వాసాల‌పై ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌లు జాతి నిర్మూలనకు దారితీసేలా ఉన్నాయ‌న్నారు. తమిళనాడు పోలీసులు కనీసం ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. ఇది నిజంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే, ఆయ‌న నుంచి రాజీనామా లేఖ తీసుకోవాల''ని అన్నామలై అన్నారు.

    చెన్నైలో మూడేళ్ల క్రితం ఈ స‌భ‌లో ఉద‌య‌నిధి చేసిన వ్యాఖ్య‌లు దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. మ‌లేరియా, డెంగ్యూ వ్యాధుల్లా.. స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌న్నారు. దీన్ని మార‌ణ‌హోమానికి పిలుపుగా అమిత్ మాలవీయ (Amit Malviya) వ‌ర్ణించారు. దీంతో త‌మిళ‌నాడు పోలీసులు ఆయ‌న‌పై అప్ప‌ట్లో క్రిమిన‌ల్‌ కేసు న‌మోదు చేశారు. తాజాగా ఈ కేసును మ‌ద్రాస్ హైకోర్టు కొట్టేసింది.

    కోర్టు తీర్పుల‌ను లెక్క‌చేయ‌డం లేదు
    కోర్టు తీర్పుల‌ను స్టాలిన్ ప్ర‌భుత్వం ఏమాత్రం ఖాత‌రు చేయ‌డం లేద‌ని అన్నామ‌లై తాజాగా ఆరోపించారు. తిరుప్పరంకుండ్రం కేసుతో సహా అనేక వివాదాల్లో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. మరో 50 రోజుల పాటు ప్రజలు డీఎంకే ప్ర‌భుత్వ‌ దారుణాలను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ''డీఎంకే, వామపక్ష పార్టీలు ఏ తీర్పును ఆమోదించవు. న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే.. వారు కులం, మతం ఉపయోగించి దుర్భాషలాడేందుకు ప్రయత్నిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు పేద‌ల కోసం పోరాడ‌తాయ‌ని పేరుండేది. కానీ డీఎంకేతో చేతులు క‌లిపిన త‌ర్వాత తోక పార్టీలుగా మారిపోయాయ''ని ధ్వ‌జ‌మెత్తారు.

    చ‌ద‌వండి: బెంగ‌ళూరు ఎన్నిక‌లు.. రంగంలోకి బీజేపీ కీల‌క నేత‌  

  • సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు.. దావోస్‌ వెళ్లి అబద్దాలు చెప్పారంటూ ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాలతో తండ్రి, కొడుకులు బతుకుతున్నారంటూ దుయ్యబట్టారు. కప్పు టీ కంటే తక్కువ రేటుకు విశాఖలో భూముల కేటాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధి పనులకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేస్తున్నారు. వైఎస్‌ జగన్ హయాంలో గ్రీన్కో కంపెనీ మన రాష్ట్రానికి వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగిపై ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడితో ఉద్యోగి మరణించాడు. అదే నిజమైతే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ దేనికోసం?. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ఎందుకు రాజీపడుతున్నారు. కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ కావాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని కురసాల కన్నబాబు హెచ్చరించారు.

  • సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అండే స్టాండ్‌ అనే విధంగా సిట్‌ వ్యవహరిస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం లేదా? అని ప్రశ్నించారు. అడిగిందే అడిగి.. టైం పాస్‌ చేయడం తప్ప దీంట్లో మరేమీ లేదని వ్యాఖ్యలు చేశారు.

    ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నోటీసులపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డి సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అండే స్టాండ్‌. పాలన చేతగాక అటెన్షన్‌ డైవర్షన్‌ చేస్తున్నారు. ఫోనట్‌ ట్యాపింగ్‌ కేసు కార్తీక దీపం సీరియల్‌ మాదిరిగా నడుస్తోంది. కార్తీక దీపం సీరియల్‌ కూడా ముగిసింది. ఇది మాత్రం అవ్వట్లేదు. టీవీ సీరియల్‌ డ్రామాలను తలపించేలా డ్రామాలు చేస్తున్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయ్యింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బలి అయ్యేది పోలీసు అధికారులే అని చెప్పుకొచ్చారు. 

    ఇది ట్రాష్‌ కేసు.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. హరీష్‌ రావును అడిగిందే అడిగి టైమ్‌ పాస్‌ చేశారు. రేపు నాతో కూడా అదే చేస్తారు. నా ఫోన్‌ ట్యాప్‌ అవుతుందో లేదో సిట్‌ను అడుగుతాను. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లను ట్యాపింగ్‌ చేయడం లేదు?. గతంలో ఇంటెలిజెన్స్‌ ఐజీగా ఉన్న శివధర్‌ రెడ్డిని విచారణకు పిలిచారా?. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్‌ జరుగుతున్నాయని చెబుతున్నారు. సిట్‌ వేయాల్సింది ఎవరి మీదనో తెలుసా.. గూండాలతో భూములు కబ్జా చేస్తున్న మంత్రి పొంగులేటి కొడుకుపై సిట్‌ వేయాలి. బొగ్గు కుంభకోణంలో రేవంత్‌ రెడ్డి బావమరిదిపై సిట్‌ వేయాలి. కంచె గచ్చిబౌలి భూముల్లో స్కామ్‌ జరిగింది. సిట్‌ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా ఇప్పటి వరకు సిట్‌ వేయలేదన్నారు.

    హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టారు. సాయంత్రం కల్లా సిట్ నోటీసులు అందాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అనేది నేడు జరుగుతోంది ఏం కాదు.. 1952 నుంచి ఇప్పటి వరకూ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా అదే ట్వీట్ చేస్తాడు. ఆయనకేం తెలుసో, లేదో నాకైతే తెలియదు. సిట్ విచారణకు బరాబర్‌ వెళ్తాను. అన్ని సమాధానాలు చెబుతాను అని అన్నారు. 

    అలాగే, పరాభవం తప్పదనే భయంతో జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రజల సౌలభ్యం కోసమే మేము జిల్లాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేయాలని చూస్తున్నారు. కొత్త జిల్లాల రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సులభతరం అవుతుందని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం.   కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపివేయాలని చూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచాయతీ ఫలితాలు మించి మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం సంపాదిస్తుంది. జిల్లాల ఏర్పాటుపైన కమిషన్ వేస్తున్నామంటున్నారు. కొత్త జిల్లాలైన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలను రద్దు చేయాలనే యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయమంటూ తుగ్లక్ పనులు చేస్తే ప్రజల చేత తిరస్కరించబడతారు. అధికార వికేంద్రీకరణ కొరకు కేసీఆర్ అడుగేస్తే మీరు చెరిపేయాలనుకుంటే ఉద్యమిస్తాం అని హెచ్చరించారు. 

  • సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరాచకాలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్‌ వేశారు. తాడిపత్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక పాత్ర పోషించడం గమనార్హం.

    తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అధికార కూటమికి సవాల్‌ విసిరారు. తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ పాలనకు, ఐదేళ్ల తన పాలనపై చర్చకు రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే, కేతిరెడ్డి సవాల్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేపు(శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతల జనసమీకరణ చేశారు.

    ఇందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు స్కెచ్‌ రచిస్తున్నట్టు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జేసీ వర్గీయులు ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చి.. కేతిరెడ్డి ఇంటి వద్ద పోశారు. దాడి చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కంకర రాళ్లు సిద్ధం చేసుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

    కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడం ఉత్కంఠను రేపింది. మరోవైపు.. కాసేపట్లో ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్‌ వద్దకు కేటీఆర్‌, హారీష్‌ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సిట్‌ విచారణపై చర్చించే అవకాశం ఉంది.

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. ప్రస్తుతం సిరిసిల్లలో కేటీఆర్, మెదక్‌లో హరీష్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో వీరిద్దరూ ఎర్రవల్లి చేరుకుంటారు. అయితే, సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ చర్చించే అవకాశం ఉంది. అయితే, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సైతం సిట్‌ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. రేపు సిట్‌ విచారణకు వెళ్లేందుకు కేటీఆర్‌ సిద్దమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రేపు తెలంగాణభవన్‌కు రావాలని బీఆర్‌ఎస్‌ సూచించింది. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: కేటీఆర్‌ సిట్‌ నోటీసులపై హరీష్‌రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై  ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారన్న హరీష్‌.. అటెన్షన్‌ డైవర్షన్‌లకు భయపడబోమన్నారు. ‘‘నాకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంటే పడతాం’’ అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

    నీ బావమరిది కుంభకోణం బయటపడొద్దనే ఈ డైవర్షన్‌ డ్రామా. ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. నేను, కేటీఆర్‌ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సిట్‌ నోటీసులు ఇస్తున్నారంటూ హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్.. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం’’ అని హరీష్‌ తేల్చి చెప్పారు.

    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

     

  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..
    ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందన్నారు.

    రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న “రెడ్ బుక్ పాలన” కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్‌పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.

    పార్లమెంట్‌ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం  అంకితభావంతో పనిచేస్తుందని వైఎస్ జగన్‌ స్పష్టం చేశారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అవకతవకలపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు దావోస్‌ వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ తీరుపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించి నాలుగు నెలలు పూర్తి, అనుబంధ విభాగాల పనితీరుపై ఆయన సమీక్ష చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీ పనితీరుపై రామచందర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం, రామచందర్‌ రావు మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాం. జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి వారి సభల కోసం బీఎల్ సంతోష్‌కి ప్రతిపాదనలు పంపాం అని అన్నారు.

    ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ..‘సింగరేణి నైనీ కోల్‌ టెండర్ల విషయంలో రాష్ట్రం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీబీఐకి ఇస్తే 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలన్నది బీజేపీ డిమాండ్. దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ లాస్ట్ టైం వెళ్లినప్పుడు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో చూపెట్టాలి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి. దావోస్ వెళ్లి చేస్తున్నారు?. మంచు చూడటానికి వెళ్లారా?. దావోస్ డెస్టినేషన్ మీటింగ్ అడ్డలా మారింది. పెట్టుబడులు తేవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. రెండు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యం చెందాయి కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. 

Family

  • ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూలకారణం విద్య ఒక్కటే. చక్కటి విద్యకారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్పూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.

    సకల కళలకు, విద్యకు అధిదేవత శ్రీసరస్వతీదేవి. వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కనబడుతుంది. ‘‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి.....’’ అంటూ విధ్యాభ్యాసం ప్రారంభిస్తారు. అగ్నికార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఈ విధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని ఙ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది. 

    ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా వసంత పంచమి నాటి ఉదయమే స్నానాదికాలు ముగించుకుని, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. 

    సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమె ప్రతిమ లేదా చిత్రపటాన్ని తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వులతో చేసిన లడ్లు, చెరుకురసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. లేదంటే ఎవరైనా పేద విద్యార్థులను చదివించే బాధ్యతను హృదయపూర్వకంగా తీసుకోవడం లేదా శక్తి కొలది ఎవరైనా పేద విద్యార్థులకు పుస్తకాలను కొనివ్వడం లేదా పండితులు, గురువులకు గ్రంథాలను బహూకరించడం. 
    (చదవండి: ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!)

  • జీవితంలో ఏం పోగొట్టుకున్నా..ఏదో ఒక సమయానికి తిరిగి దాన్ని సంపాదించుకోగలం. కానీ పాడైన ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి పూడ్చలేని నష్టం వాటిల్లచ్చు కూడా. అందుకే భూమ్మీద నూకలు ఉంటే ఏమైనా చేయగలం..అదే పోతే ఎన్ని ఉన్నా..నిరూపయోగమే అని మన పెద్దలు ఊరికే అనలేదు కాబోలు. ఇప్పుడు ఆ విషయాన్ని ఓ వ్యవస్థాపకుడు నెట్టింట షేర్‌చేస్తూ..తాను కూడా అదే తప్పిదం చేశానంటూ సోషల్‌ మీడియా వేదికగా తన గోడుని వెళ్లదీసుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ప్రతిఒక్కర్నీ ఆలోచించేలా చేయడమే గాక 'ఆరోగ్యమే అన్నికంటే ముఖ్యం' అనే విషయాన్ని అందరికి గర్తు చేసేలా అమితంగా ఆకర్షిస్తోంది. 

    ముంబైకి చెందిన వ్యవస్థాపకుడు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని షేర్‌ చేశాడు. తాను వ్యాపార సంస్థలో సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టపోయానని చెప్పారు. దానిఫలితం తన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించిందని నిజాయితీగా వివరించారు. తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ..బరువు పెరుగుతూనే వస్తున్నానని వాపోయారు. వ్యాపారం నష్టం తట్టుకోవడం సులువే..ఎప్పటికైన పోగొట్టుకున్నది సంపాదించేయొచ్చు. కానీ పాడైన ఆరోగ్యం బాగవ్వడం దాదాపు అసాధ్యం అని బాధగా చెప్పుకొచ్చారు. అంతేగాదు వ్యాపార నష్టం ఎప్పటికీ వ్యక్తిగత నష్టానికి దారితీయకూడదని గట్టిగా హెచ్చరించారు కూడా. 

    తాను వ్యాపారంలో కేవలం రూ. 30 కోట్లే పోగొట్టుకున్నానని, దానికంటే విలువైన ఆరోగ్యంకోల్పోయానని ఆవేదనగా చెప్పుకొచ్చారు ఎవర్‌స్టోన్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేశాయ్‌. కాగా, 2017లో దేశాయ్‌  భారతీయ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ని దేశాయ్ D: FYని ప్రారంభించారు. అయితే ఈ వెంచర్‌ భారీ నష్టాలను చవిచూసింది. కేవలం 30 నెలల్లో ఆయన దాచుకున్న పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అయితే అంతా తాను 30 కోట్లు ఎలా కోల్పోయానో ఆరా తీశారే గానీ..ఈ 30 నెలల​లో ఎంత టెన్షన్‌, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాననేది అడగలేదని అన్నారు. 

    నిద్రలేమి అదిక బరువుకి దారితీస్తుంది..
    ఆ టైంలో ఒత్తిడితో రాత్రి ఆరుగంటల కంటే తక్కువ సమయం నిద్రపోయానని, తనకు తెలియికుండానే చాలా ఒత్తిడిని అనుభవించానని అన్నారు దేశాయ్‌. వారానికి నాలుగుసార్లు వాకింగ్‌, జాగింగ్‌ వంటివి అన్ని చేసినా..తన శరీరంలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. 

    ఎంత కష్టపడి వర్కౌట్లు చేసినా..నాణ్యమైన నిద్ర మాత్రం తిరిగి పొందలేకపోయానన్నారు. అలాగే ఒత్తిడిని కూడా దూరం చేసుకోలేకపోయానని చెప్పారు. 

    ఒత్తిడి, నిద్రలేమి శరీరాన్ని చిత్తు చేస్తాయ్‌..
    తన పోస్ట్‌లో ఒత్తిడి, నిద్ర లేమి ఏవిధంగా శరీరాన్ని ప్రభావితం చేస్తాయో వివరించారు. 

    • ఆరుగంటల కంటే తక్కువ నిద్ర లేమి ఇన్సులిన్‌ని ప్రభావితం చేసి, టెస్టోస్టిరాన్‌ను దెబ్బతీస్తుంది.

    • ఎక్కువైన కార్టిసాల్ (ఒత్తిడి ) క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుంది

    • ఎంతలా ప్రయత్నించినా నిద్ర లేమిని తరిమికొట్టలేరు

    చివరగా ఆయన తాను కోల్పోయిన సంపదను తిరిగి పొందగలిగినప్పటికీ..ఆరోగ్యపరంగా పూర్తిస్థాయిలో కోలుకోలేదని అన్నారు. అంతేగాదు. తాను సుమారు ఏడేళ్లలోనే కోల్పోయినదంతా సంపాదించానని, కానీ ఆరోగ్యాన్ని తిరిగి పొందలేకపోయానని అన్నారు. అలాగే దేశాయ్‌ తన పోస్ట్‌ని ముగిస్తూ..తన తోటి వ్యవస్థాపకులందర్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి అని పిలుపునివ్వడం విశేషం.

     

    (చదవండి: మోదీ మెచ్చిన 'బగురుంబ'..! అచ్చం సీతకోక చిలుకలా..)

     

  • ప్రకృతిని పూజించడం, ఆరాధించడం ఇవాళ్టిదేం కాదు.. మనిషి జీవితంలోని ప్రతిదశ ప్రకృతితో ముడిపడిపోయి ఉంటుంది. అంతలా పెనువేసుకుపోయారు మనిషి, ప్రకృతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. అలా ప్రకృతిని ఆరాధించే అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక సంప్రదాయ నృత్యమే బగురుంబ. మరి ఆ నృత్యం విశేషాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

    అస్సాం ప్రజలకు ప్రకృతి అంటే కేవలం ఒక వనరుకాదు, ఒక జీవనాధారం. వారి నృత్యం, పాట, పండుగ, అన్నీ పచ్చదనం చుట్టూనే తిరుగుతాయి. అలా ప్రకృతితో మమేకమయి చేసే ప్రసిద్ధ నృత్యం బగురుంబ నృత్యం. అతిపెద్ద గిరిజన తెగ అయిన బోడో ప్రజల సంప్రదాయ నృత్యం ఇది. ఈ నృత్యంలో మహిళలు తమ చేతుల్లో రంగురంగుల కండువాలను పట్టుకుని రెండు చేతులు చాచి ఎగురుతున్న సీతాకోక చిలుకల వలె కదులుతారు. అందుకే దీనిని సీతాకోక చిలుక నృత్యం అని కూడా పిలుస్తారు.

    వసంతాన్ని ఆహ్వానిస్తూ..
    ప్రకృతి పట్ల బోడో ప్రజలకున్న గౌరవానికి చిహ్నం బగురుంబ. వసంత రుతువు రాకను ఆహ్వానిస్తూ, ప్రకృతి అందాలను కొనియాడుతూ ఏప్రిల్‌ నెలలో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యం చేసేటపుడు స్త్రీలు దోఖానా అనే సంప్రదాయ చీర, జ్వమ్గ్రా అనే కండువాను ధరిస్తారు. వీరు సాధారణంగా పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నృత్యానికి తోడుగా పురుషులు వెదురు ఫ్లూట్, డ్రమ్, వయోలిన్, జోటా, తార్ఖా వంటి వాయిద్యాలను వాయిస్తారు.

    ప్రధాని ప్రశంస
    ఇటీవలే గువాహటిలోని సరుసాజై స్టేడియంలో 10,000 మంది బోడో మహిళా కళాకారులు ఏకకాలంలో ఈ బగురుంబ నృత్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా వీక్షించి ప్రశంసించారు. బిహు నృత్యం కూడా అస్సాంలో చాలా ప్రసిద్ధమైనది. ఇది వసంత కాలాన్ని, పంటల సాగును సూచిస్తుంది. ఈ రెండు నృత్యాలు అస్సాంలోని వైవిధ్యమైన సంస్కృతిని చాటి చెబుతాయి.

     

    (Beauty Tips: కళ్ల కింద నలుపు తగ్గాలంటే..!)

     

  • ఈ స్మార్ట్‌ టెక్నాలజీ కాలంలో స్కీన్‌ టైం ఎక్కువైపోతోంది. దేనికైనా..ఫోన్‌, ల్యాప్‌టాప్‌తోనే రోజంతా పని. అది లేకుండా ఒక్క పూట గడవడం కష్టం అన్నంతగా టెక్నాలజీపై ఆధారపడిపోయాం. దాంతో అందరి కళ్లు మసకబారిపోయి అందవిహీనంగా  తయారవుతున్నాయి. అందానికి కేంద్రమైన నయనాలే డల్‌గా అలసిపోయినట్లు ఉంటే అందమైన ముఖానికి ఆస్కారం ఏముంది. అందుకే కంటి కాంతి కోసం ఈ కేర్‌ తప్పనిసరి. అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకుందాం ఇలా..!.

    కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడటం వంటివి తరచూ జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే  ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి.

    బంగాళదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో  దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను, ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేయాలి. బేబీ ఆయిల్‌ని కళ్లచుట్టూసున్నితంగా మసాజ్‌ చేస్తే ఒత్తిడి తగ్గి మంచి రిలీఫ్‌ వస్తుంది.

    కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు రెప్పలకి ఆముదం రాయాలి. కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో నెమ్మదిగా మసాజ్‌ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.

    కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లని కడిగితే కాంతిమంతంగా కనిపిస్తాయి.

    టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా మంచి రిలీఫ్‌ వస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పెడితే మంచి ఫలితాన్నిస్తుంది. 

    కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం తీసుకోవాలి. దాంట్లో రోజ్‌వాటర్‌ని కలిపి కళ్లచుట్టూ పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి.

    (చదవండి: అసామాన్య ప్రతిభాశాలి స్పేస్‌ జర్నీ ముగిసింది..! రిటైర్మెంట్‌ తర్వాత సునీత..)

  • నాసాలోని అనుభవజ్ఞురాలైన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆమె కెరీర్‌లో మూడు మిషన్‌ బహుళ అంతరికక్ష  ప్రయాణ రికార్డులు సునీతా పేరు మీదనే ఉన్నాయి. స్పేస్‌లో 608 రోజులు గడిపిన ఘనత కూడా ఆమెదే. మొత్తం తొమ్మిది స్పేస్‌ వాక్‌లు పూర్తి చేసి..రికార్డు నెలకొల్పారామె. అంతేగాదు తొమ్మిది  సార్లు 62 గంటల ఆరు నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేసిన ఏకైక మహిళా వ్యోమగామి. అలా ఎన్నో ఘనతలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సునీతా..నాసా ఎక్స్‌ వేదికగా రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

    అంతే ఒక్కసారిగా సునీతా కంగ్రాట్స్‌ ఇన్నాళ్లు మీరందించిన అంతరిక్ష సేవలకు ధన్యవాదాలు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో మరికొందరు ‘ఇకపై సునీతను వ్యోమగామిగా చూడలేమా?’ అంటూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా అందర్నీ ప్రభావితం చేసిన ఈ సూపర్‌ విమెన్‌ పదవీవిరణమ తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుంది..? పెన్షన్‌ వస్తుందా తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.

    సునీతా విలియమ్స్‌ పదవీ విరమణ డిసెంబర్ 27, 2025 నుండి అమల్లోకి వస్తుంని యూఎస్‌ ఏజెన్సీ దృవకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె  పదవీ విరమణ తర్వాత నాసా నుంచి నేరుగా పెన్షన్‌ పొందరట. ఆమెకు ఫెడరల్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (FERS) కింద పెన్షన్‌ తీసుకుంటారట. ఆమె 2ళ్ల సర్వీసు, అలాగే వరుసగా మూడేళ్లు అత్యధిక జీతం పొందిన సగట తదితరాల ఆధారంగా పెన్షన్‌ ఇవ్వడం జరుగుతుంది. 

    అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం సుమారు రూ. 36 లక్షల వరకు పెన్షన​పొందే అవకాశం ఉందట. దీంతోపాటు ఆమెకు యూఎస్‌ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి ప్రయోజనాలను కూడా అందుకుంటారు. ఇవేగాక ఫెడరల్‌ ఆరోగ్య బీమా, జీవిత బీమా, థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ (TSP) తదితర బీమా ప్రయోజనాలు కూడా ఆమె పొందుతారు.

    అక్కడకు వెళ్తే..సొంతింటికి వెళ్లిన  ఫీల్‌..
    కాగా, సునీత అమెరికాలోనే స్థిరపడినా తన మాతృదేశాన్ని మర్చిపోలేదని చెబుతుంటుంది. ఆమె ఇటీవల తన మాతృభూమి భారత్‌ పర్యటకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికన్‌ సెంటర్‌లో ‘Eyes on the Stars, Feet on the Ground’ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెషన్‌కి ఆమె  బ్లూ కలర్‌ స్పేస్‌ సూట్‌ ధరించి హాజరవడం విశేషం. 

    ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ..భారత్‌లోకి అడుగుపెట్టగానే తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతుందుని పేర్కొంది. ప్రతిసారి అంతరిక్షంలోకి వెళ్లగానే భూమిపై తన ఇల్లు ఎక్కడ ఉందా అని ఆతృతగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చంది. నాన్నది భారత్‌లోని గుజరాత్‌ కాగా అమ్మది స్లోవేకియా..అందువల్ల తన దృష్టిలో ఈ మూడు తన స్వస్థలాలుగానే భావిస్తా అంటూ పోస్ట్‌ ముగించింది.

    (చదవండి: ఓన్లీ టైమ్‌స్పెండ్‌ చేసేందుకే..! ఆ ఒక్క మాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా..)