Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో తరచూ వినిపించే ఓ వార్త ఏమిటంటే.. హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్నది. అయితే ఈ వార్తలు కొత్తవి కావు. గతంలో ఒక ఫంక్షన్‌లో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. కొంతమంది మేధావులు ఫిబ్రవరి 14న వీరి వివాహం జరుగుతుందని కథనాలు ప్రచారం చేశారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఈ పుకార్లపై స్పందింది. “ఫిబ్రవరి 14 కాస్తా ఏప్రిల్ 1గా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే కదా. ఇదంతా ఎవరు మొదలుపెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను అధికారికంగా చెప్పినట్టు కొంతమంది ఇలాంటి గాసిప్స్‌ వ్యాపింపజేస్తున్నారు. ఇది తనకు చాలా భయంకరంగా ఉందని వ్యాఖ్యానించింది.  

    ఇంతకుముందు పలుమార్లు ఈ విషయంపై ఆమె స్పందించినప్పటికీ, ఆ మాటలు పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టే అయ్యాయి. ఈసారి మాత్రం మృణాల్ స్పష్టంగా తనకు ధనుష్‌తో ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. అయితే ఆమె ఇచ్చిన క్లారిటీతో ఈ గాసిప్స్‌కు ముగింపు లభిస్తాయేమో చూడాలి. మొత్తానికి ధనుష్‌తో వస్తున్న పెళ్లి వార్తలు కేవలం పుకార్లేనని మృణాల్ ఠాకూర్ తేల్చి చెప్పింది.  

    • ఫుల్ గ్లామరస్‌తో మెరిసిపోతున్న హీరోయిన్ అమలా పాల్..
    • స్వయంభూ బ్యూటీ సంయుక్త మీనన్ లేటేస్ట్ పోజులు..
    • యూకేలో చిల్ ‍అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..
    • బ్లాక్ డ్రెస్‌లో కల్యాణి ప్రియదర్శన్‌ గ్లామరస్‌ పిక్స్.. 
    • స్టైలిష్ హెయిర్‌ లుక్‌లో హీరోయిన్ ప్రియమణి.. 

     

     

     

     

     

     

     

  • సంతాన ప్రాప్తిరస్తు ఫేమ్ విక్రాంత్ హీరోగా వస్తోన్న చిత్రం మార్కండేయ. ఈ సినిమాకు వీఎంకే సిస్ట్లా దర్శకత్వం వహస్తున్నారు. ఈ మూవీని దిల్ రాజు డ్రీమ్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్ల్ రిలీజ్‌ చేశారు మేకర్స్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు నిర్మాత దిల్‌ రాజు కూడా హాజరయ్యారు.

    మార్కండేయ గ్లింప్స్ చూస్తుంటే శివుడి ఇతివృత్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్ల్‌లో మంచుకొండల్లో సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. చివర్లో శివుడి శక్తి హీరోలోకి ప్రవేశించడం మరింత ఇంట్రెస్టింగ్‌గా ‍అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్య ఈ పవర్‌ఫుల్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.

     

  • కన్నడ బ్యూటీలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. రష్మిక, శ్రీలీలకు ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా తమ పేరును లిఖించుకున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందన్నా రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. అలా కన్నడ భామలు ఇలా వచ్చి తెలుగులో సూపర్‌ పవర్‌గా ఎదిగారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కంటే శాండల్‌వుడ్ భామలకే ఫుల్ డిమాండ్ ఉంటోంది.

    ఇప్పుడదే అదే బాటలో మరో కన్నడ బ్యూటీ అడుగులేస్తోంది. గతేడాది కాంతార-2 మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న భామ రుక్మిణి వసంత్.  ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి సారించింది. సప్త సాగరాలు దాటి లాంటి కన్నడ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

    ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీతోనైనా రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకుంటుందేమో వేచి చూడాల్సిందే. రష్మిక, శ్రీలీల మాదిరిగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో స్టార్‌గా హోదాను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. 
     

  • అది సినిమా అయినా, జీవితం అయినా వాటిలో కొన్ని ఘటనలను చూడాలన్నా, వినాలన్నా దమ్ముండాలి. ప్రేక్షకులందరూ ఒకేలా ఉండరు. కొన్ని సన్నివేశాలను, ఘటనలను చూడాలంటే కొందరికి ధైర్యం తప్పనిసరి. ఆ కోవలోకి చెందినదే దల్ దల్ వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ ఏడు భాగాల వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకుడికి చమటలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా హింస ను చూడలేనివారు ఈ సిరీస్ గురించి మర్చిపోవడమే మేలు. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం.

    అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ దల్ దల్ సిరీస్ మొత్తం ఓ సీరియల్ కిల్లర్ కేసు చుట్టూనే తిరుగుతుంది. అతి చిన్న వయస్సులో ముంబై నగరానికి డీసిపి అయిన రీటా ఫెరారియాకి ఆ కేసు ఓ సవాలుగా మారుతుంది. ఇంతకీ  కేసు ఏంటంటే నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు కూడా ఒకే పంథాలో ఓ సీరియల్ కిల్లర్ చేస్తూ ఉంటాడు.  కిల్లర్ పోలీసులకు ఏమాత్రం  క్లూ కూడా వదలకుండా చాలా పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. హత్య గావించబడ్డ బాధితులు అతి దారుణంగా హింసించి హత్య చేయబడుతుంటారు. ఈ విషయం పై మీడియా పోలీసులపై ఒత్తిడి పెంచుతుంది. అందులోనూ అనితా ఆచార్య అనే జర్నలిస్టు ఏకంగా డీసిపి అయిన రీటాని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉంటుంది. 

    విచారణలో భాగంగా రీటా నేరస్తుడిని కనుక్కునే ప్రయత్నంలో తాను ఆ కేసునుండి తప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి కిల్లర్ వేసిన ప్లాన్ వల్లనే ఇలా జరుగుతుంది. ఇంతలో పోలీస్ స్టాఫ్ లో ఒకరిని మళ్ళీ సిరీయల్ కిల్లర్ చంపుతాడు. మరి దాదాపుగా నేరస్తుడిని కనుక్కున్న రీటా ఏం చేస్తుంది అన్న విషయం మాత్రం దల్ దల్ చూసే తెలుసుకోవాలి. ఈ సిరీస్ ఓ సైకలాజికల్ త్రిల్లర్, అందులోనూ హింసా నేపధ్యమున్న సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ప్రధాన పాత్రధారి రీటా భూమికను పోషించిన భూమి పెడ్నేకర్ సిరీస్ ఆద్యంతం చాలా సీరియస్ గా కనిపించడం, దానితో పాటు సన్నివేశాలలో వచ్చే  దారుణమైన హింసాత్మక ఘటనలను తప్పిస్తే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులతో ఇదో థ్రిల్లింగ్ సీరిస్ . గుర్తుపెట్టుకోండి ఈ దల్ దల్ గుండె నిబ్బరం కలవాళ్ళు మాత్రమే చూడండి.

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు రిలీజైనా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఈ వారంలో విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. దీంతో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే, కపుల్ ఫ్రెండ్లీ లాంచి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

    ఇక ఓటీటీల విషయానికొస్తే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ సందడి చేస్తున్నాయి. ఈ ఫ్రైడే మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. తెలుగు సినిమాలు లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్‌ మూవీస్‌ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే దాదాపు 13 చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

    ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు

    నెట్‌ఫ్లిక్స్

    •    జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13
    •    మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ సిరీస్) - ఫిబ్రవరి 13
    •    ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 13

    అమెజాన్ ప్రైమ్..

    •   బ్యాండ్‌వాలే( హిందీ వెబ్ సిరీస్)-ఫిబ్రవరి 13
    •   లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 13

    జియో హాట్‌స్టార్..

    • ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 13

    జీ5

    • భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్‌ మూవీ)- ఫిబ్రవరి 13
    • పాతిరాత్రి(మలయాళ సినిమా)- ఫిబ్రవరి 13
    • ఉత్తర్(మరాఠీ సినిమా)- ఫిబ్రవరి 13

      సన్ నెక్స్ట్

    •    సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ చిత్రం) - ఫిబ్రవరి 13
    •   మాయబిమ్‌బుమ్(తమిళ సినిమా)-ఫిబ్రవరి 13

    ఆపిల్ టీవీ ప్లస్

    •    ఎటర్నటీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 13

    ది లయన్స్ గేట్ ప్లే..

    • ది రఫ్‌నెక్(హాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ)- ఫిబ్రవరి 13
  • టాలీవుడ్‌ హీరో నాని నటిస్తోన్న యాక్షన్‌ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్‌ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.

    కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్‌గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్‌ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. 

     

  • సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యువత ఈ ట్రైలర్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దానికి కారణం అందులో ఓ ముద్దు సీన్‌ కూడా చూపించడం. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయంటోంది హీరోయిన్‌ మానన వారణాసి. కథ చెప్పినప్పుడే తనకు ముద్దు సీన్ల గురించి చెప్పారని.. టీమ్‌పై నమ్మకంతో ఓకే చెప్పానని అంటోంది. అయితే ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఇంట్లో వాళ్లు ఆ సీన్లను చూసి ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా మానస వారణాసినే చెప్పింది. 

    సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం కలిగింది. 

    నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు’ అని మానస చెప్పుకొచ్చింది. 

  • కేజీఎఫ్ హీరో నటించిన ఫుల్ యాక్షన్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. టీజర్ రిలీజ్ తర్వాత బోల్డ్ సీన్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఆ సీన్‌ విషయంలో కొందపు ఏకంగా డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌పై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. 

    తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌కు ముందే మరో కొత్త వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో మతపరమైన విశ్వాసాలను కించపరిచేలా చిత్రీకరించారని ఓ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మత విశ్వాసాలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సంబంధిత అధికారులకు లేఖ రాసింది. తమ మతంలో ప్రధాన దేవదూత అయిన సెయింట్ మైఖేల్ చిత్రీకరణపై ఈ బృందం ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్‌ను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్  ఆరోపిస్తోంది.

    అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాడని ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ అధికారులను కోరారు. వివాదాస్పద దృశ్యాలను, ఆన్‌లైన్ వీడియోలను కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా అదనంగా చిత్రనిర్మాతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రనిర్మాతలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా.. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ధురంధర-2తో పోటీ పడనుంది.
     

  • టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్‌ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.

    కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్‌ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ‍ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించనుంది. గోపి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. 
     

  • టాలీవుడ్‌లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్‌మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్‌ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్‌లో మోస్ట్‌ వైరల్‌ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.

    ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్‌ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్‌ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

  • మనోజ్‌ బాజ్‌పేయీ తాజా చిత్రం ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’  వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేరు మార్చనిదే విడుదలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. నీరజ్‌ పాండే, రితేశ్‌ షా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదల కానుంది. ఇందులో మనోజ్‌.. అజయ్‌ దీక్షిత్‌ అనే అవినీతీ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. 

    అయితే ఈ సినిమా పేరు, మనోజ్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానంపై బ్రహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలను నిలిపిపివేయాలంటూ  కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీ కోర్టు.. టైటిల్‌ మార్చిన తర్వాత విడుదల చేయాలని నిర్మాతలను ఆదేశించింది. 

    ‘సినిమాలకు ఇలాంటి పేర్లు పెట్టి ఓ వర్గం ప్రజలను తక్కువ చేసి చూపే అధికారం ఎవరీకీ లేదు. వెంటనే పేరు మార్చాలి. కొత్త టైటిల్‌ని కోర్టుకు తెలిపిన తర్వాత విడుదల చేయాలకు అనుమతి ఇస్తాం’ అని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పాటు చిత్రంలో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని హామీ ఇస్తూ నిర్మాతలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో  చిత్ర బృందం టైటిల్‌ను మార్చే యోచనలో ఉంది.

  • సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్‌తో సహా పలువురు హీరోలు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు. కొత్తగా తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కుడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ హీరో అర్జున్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ మధ్య కొన్ని వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై అర్జున్‌ స్పందించారు. రాజకీయాలపై ఆసక్తి లేదని.. అంత జ్ఞానం కూడా తనకు లేదన్నాడు. 

    (చదవండి: విశ్వక్‌ సేన్‌తో సినిమా తీస్తారా?.. అర్జున్‌ ఆన్సర్‌ ఇదే!)

    అర్జున్‌ దర్శకత్వంలో ఆయన కూతురు హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడిన అర్జున్‌.. ‘రాజకీయ ఎంట్రీ’పై స్పందింస్తూ... ‘నాకు మంచి పని చేయాలని ఉంది కానీ..దాని కోసం రాజకీయాల్లోకి రావాలని లేదు. నాకు అంత జ్ఞానం కూడా లేదు. ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. ఒకవైపు నటిస్తూనే..మరోవైపు కొన్ని కథలను రాసుకుంటున్నాను. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయితే నాకు లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. మంచి చేయాలనుకునేవాళ్లు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. విజయ్‌ ఇప్పుడే వచ్చాడు. ఆయన పని తీరు ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే తాను కూడా విజయ్‌ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. 

Sports

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్‌గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.

    నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్‌మెన్స్‌ తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో  నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.

    భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్‌లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. 

    తొలుత టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. 

    తుది జట్లు..
    భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

  • భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్‌ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్‌ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. జాన్‌ ఫ్రైలింక్‌ వికెట్‌ అర్షదీప్‌కు 250వ వికెట్‌.

    అర్షదీప్‌ కెరీర్‌ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్‌ మొత్తంలో అర్షదీప్‌ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్‌ తన టీ20 కెరీర్‌లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్‌ అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్‌లో అర్షదీప్‌ 97 వికెట్లు తీశాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్‌కు ఈ స్కోర్‌ అందించారు.

    మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12;  సిక్స్‌) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు.

    ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

    నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

    భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 88-5గా ఉంది. వరుణ్‌ చక్రవర్తి 3, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నమీబియాను దెబ్బకొట్టారు.
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

    ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. 

    మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12;  సిక్స్‌) ఆచితూచి ఆడారు. 

    శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

    నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు ఏ భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్‌ (2007, 2024) అయినా, ఓ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం​ నిజంగానే ఆశ్చర్యకరం.

    20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ
    ఈ రికార్డు హాఫ్‌ సెంచరీని ఇషాన్‌ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. 

    మూడో ఓవర్లో అతను సహజ మోడ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్‌.. ఆమరుసటి ఓవర్‌లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్‌ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో వరుసగా మరో సిక్సర్‌, బౌండరీ కొట్టాడు. 

    అనంతరం 7వ ఓవర్‌ తొలి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్‌ ధాటికి భారత్‌ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.

    అంతకుముందు సంజూ శాంసన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్‌ సిక్సర్లు, బౌండరీ ​కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్‌ ఔటయ్యాక భారత స్కోర్‌ కాస్త నెమ్మదించింది.

    హార్దిక్‌ లైన్‌లోకి వచ్చాడు
    అయితే హార్దిక్‌ పాండ్యా రాకతో భారత స్కోర్‌ మళ్లీ జోరందుకుంది. హార్దిక్‌ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 205/5గా ఉంది. శివమ్‌ దూబే (23), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్‌, నమీబియా మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. 

    కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్‌ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్‌ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్‌ నమీబియా మ్యాచ్‌తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.

    యూఎస్‌ఏ మ్యాచ్‌ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్‌.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్‌ డిశ్చార్జ్‌ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్‌ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్‌ ఆరోగ్యం ఇం​కా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. 

    అభిషేక్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్‌ అవుతుంది. అభిషేక్‌ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్‌ ఫలితాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్‌ ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.

    కాగా, నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్‌ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.

    గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్న సంజూ
    అభిషేక్‌ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ అందివచ్చిన గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. 

    అయితే ఆతర్వాతి బంతికే బౌలర్‌ బెన్‌ షికోంగో ఉచ్చులో (స్లో బాల్‌) చిక్కి వికెట్‌ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్‌ కిషన్‌ 11, తిలక్‌ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

    తుది జట్లు..

    భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో
     

  • ఇంగ్లండ్‌ వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్‌ తన అసమాన క్యాచింగ్‌ ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు. బట్లర్‌కు ముందు ఈ ఫీట్‌ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.

    బట్లర్‌ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్‌-ఐ కమ్యూనికేషన్‌తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్‌ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ప్రవేశించాడు.  

    ఈ ఫీట్‌కు క్రికెట్‌తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్‌కు ఆన్‌ ఫీల్డ్‌ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్‌ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్‌ తప్పక సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

    బట్లర్‌ ఇప్పటికే ఆన్‌ ఫీల్డ్‌లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నాడు. వికెట్‌కీపర్‌గానే కాకుండా ఫీల్డర్‌గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్‌ రికార్డు) మాత్రం బట్లర్‌ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్‌ రికార్డు ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

    ఇదిలా ఉంటే, బట్లర్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌ ఇటీవలికాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్‌లోనూ బట్లర్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్‌పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో బట్లర్‌కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.

    బట్లర్‌ ఫామ్‌లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్‌ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్‌, స్కాట్లాండ్‌, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. 
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్‌ వర్సెస్‌ నమీబియా మ్యాచ్‌ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

    ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. 

    అలాగే గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్‌ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్‌ కూడా ఈ మ్యాచ్‌లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.

    తుది జట్లు..

    భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

  • ఇటలీ క్రికెట్‌ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్‌ జట్టు ప్రపంచకప్‌లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్‌ 2026 బెర్త్‌ దక్కించుకుంది.

    తొలి ప్రపంచకప్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న నేపాల్‌పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్‌ జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్‌ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.

    మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్‌-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇటలీ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్‌సన్‌ స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.

    తొలి మ్యాచ్‌లో ఇటలీకి స్కాట్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్‌ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.

    తిప్పేసిన స్పిన్నర్లు
    టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ నేపాల్‌ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు.

    నేపాల్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.

    మోస్కా బ్రదర్స్‌ అదుర్స్‌
    124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్‌ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్‌ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. 

    జస్టిన్‌, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.

    చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్‌
    ఈ మ్యాచ్‌లో మోస్కా బ్రదర్స్‌ చరిత్ర సృష్టించారు. తొలి వికెట​్‌కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అ‍న్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు. 
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో రెండు రోజుల కిందట పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసిన పసికూన నేపాల్‌, ఇవాళ (ఫిబ్రవరి 12) వారి కంటే చిన్న జట్టైన ఇటలీ ముందు తేలిపోయింది. మొన్న తన మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లను గడగడలాడించిన లోకేశ్‌ బామ్‌.. ఇవాళ ఇటలీ బౌలర్ల ముందు తస్సుమన్నాడు. లోకేశ్‌తో పాటు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చాటలేకపోవడంతో ఇటలీతో మ్యాచ్‌లో నేపాల్‌ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.

    27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ అన్ని విభాగాల్లో నేపాల్‌ను కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు. 

  • ఐపీఎల్‌ 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో కనకవర్షం కురిసింది. పీఎస్‌ఎల్‌లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం​ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్‌ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్‌పాట్‌ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌, ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఉన్నారు.

    ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోక, పీఎస్‌ఎల్‌ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..
    డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు ఐపీఎల్‌ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్‌ఎల్‌లో మాత్రం మిచెల్‌పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్‌ కరెన్సీకి  కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.

    ఆడమ్ జంపా: ఐపీఎల్‌ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను ఐపీఎల్‌ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్‌ఎల్‌ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్‌ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.

    రిలీ రొస్సో: ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్‌ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.

    పీఎస్‌ఎల్‌-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. 
    మార్క్‌ చాప్‌మన్‌- 7 కోట్లు (పాక్‌ కరెన్సీలో)
    ఆస్టన్‌ టర్నర్‌- 4.2 కోట్లు
    మైఖేల్‌ బ్రేస్‌వెల్‌- 4.2 కోట్లు
    కుసాల్‌ మెండిస్‌- 4.2 కోట్లు
    టామ్‌ కర్రన్‌- 4.2 కోట్లు
    కుసాల్‌ పెరీరా- 3.1 కోట్లు
    జేమ్స్‌ విన్స్‌- 3 కోట్లు
    రిషద్‌ హొసేన్‌- 3 కోట్లు 

    వీరితో పాటు పీటర్‌ సిడిల్‌, జోష్‌ ఫిలిప్‌, తబ్రేస్‌ షంషి, జాన్సన్‌ ఛార్లెస్‌, మ్యాక్స్‌ బ్రయాంట్‌, షమార్‌ జోసఫ్‌, ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, గుడకేశ్‌ మోటీ, రిచర్డ్‌ గ్లీసన్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, దసున్‌ షనక, సామ్‌ హార్పర్‌, బెవాన్‌ జాకబ్స్‌ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్‌ఎల్‌ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.

    పీఎస్‌ఎల్‌లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్‌ అల్‌ హసన్‌, కైల్‌ మేయర్స్‌, కొలిన్‌ మున్రో, అల్జరీ జోసఫ్‌, జేమ్స్‌ నీషమ్‌, జేసన్‌ రాయ్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, డేవిడ్‌ మలాన్‌, కేశవ్‌ మహారాజ్‌ తదితరులు ఉన్నారు.
     

  • అఫ్గనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది.

    సమ ఉజ్జీలుగా
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్‌ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్‌ కీలక ఆటగాళ్లను అవుట్‌ చేసి‌ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.

    రెండు సూపర్‌ ఓవర్లు
    ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. అఫ్గన్‌- ప్రొటిస్‌ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.

    ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్‌ లిండే బౌలింగ్‌లో ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్‌ పద్నాలుగో ఇన్నింగ్స్‌లో నబీ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.

    అంపైర్‌తో వాగ్వాదం
    లుంగి ఎంగిడి ధరించిన రిస్ట్‌ బ్యాండ్‌ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్‌తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ గిల్బర్ట్‌ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.

    అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్‌ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.  

    చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్‌ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

    తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. కుసాల్‌ మెండిస్‌ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్‌ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ దసున్‌ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్‌ మిషారా 8, కమిందు మెండిస్‌ 19 (నాటౌట్‌), వెల్లాలగే 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

    ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్‌ రామనంది (4-0-41-2), సూఫ్యాన్‌ మెహమూద్‌ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్‌ ఖాన్‌ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.

    నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్‌ కలీమ్‌ 6, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ 1, హమ్మద్‌ మీర్జా 9, వినాయక్‌ శుక్లా 1, నదీం ఖాన్‌ 2, సూఫ్యాన్‌ మెహమూద్‌ 1, షా ఫైసల్‌ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్‌), జితేన్‌ రామనంది డకౌటయ్యారు.

    నదీం ప్రపంచ రికార్డు
    ఒమన్‌ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్‌ నదీం ప్రపంచ రికార్డు  సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం​ వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.

    మరో ప్రపంచ రికార్డు కూడా సమం
    ఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్‌ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు.

  • శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో ధనాధన్‌ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్‌ గురువారం నాటి మ్యాచ్‌లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.

    కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకం
    పల్లెకెలె వేదికగా టాస్‌ గెలిచిన ఒమన్‌.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్‌ నిస్సాంక (13), కమిల్‌ మిశారా (8) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ అర్ధ శతకంతో అలరించాడు.

    మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్‌.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ పవన్‌ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌ దసున్‌ శనక సుడిగాలి ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.

    కేవలం 19 బంతుల్లోనే 
    ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.

    ఇక ఒమన్‌తో తాజా మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్‌ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్‌ ఏడు బంతుల్లో 19, దునిత్‌ వెల్లలగే నాలుగు బంతుల్లో  6 పరుగులతో అజేయంగా నిలిచారు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్‌ బౌలర్లలో జితేన్‌ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్‌ మెహమూద్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే
    🏏దసున్‌ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్‌ మీద 19 బంతుల్లో
    🏏దసున్‌ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో
    🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో
    🏏కుమార్‌ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.

    చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ!

Andhra Pradesh

  • కాకినాడ: వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌, తిమ్మాపురం సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ అక్రమ అరెస్ట్‌ను కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఖండించారు.  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

    బెజవాడ సత్యనారాయణతో పాటు మరో పది మందిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని కురసాల తప్పుబట్టారు. తిమ్మాపురం శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లలో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలపైనే కేసులు నమోదు చేయడాన్ని కురసాల తీవ్రంగా ఖండించారు. 

    ‘కొందరు పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు.  వైఎస్సార్‌సీపీకి కేసులంటే ఎలాంటి భయంలేదు. గత 18 నెలలుగా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ కొత్త సాంప్రదాయం మంచిది కాదు’ అని హెచ్చరించారు.

  • సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్‌.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోంది.

    సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్‌, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్‌ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.

    కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్‌ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్‌ మంజూరు చేశారు.  నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్‌ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్‌ జారీచేశారు.

    ఇలా వరుస కేసులతో బాబు సర్కార్‌.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

    అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్‌ వేశారు.  రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్‌ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం  గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ  బెయిల్‌ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన  తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ  హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది.
     

  • సాక్షి, తాడేపల్లి: చిన్నారికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్షరాభ్యాసం చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్సార్సీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు కోరారు.

    తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్‌కు అక్షరాభ్యాసం చేసి.. ఆశీస్సులు అందజేశారు. తమ కుమారుడికి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్‌ కుటుంబ సభ్యులు.. గతంలో తమ కుమార్తెకు కూడా జగన్‌ అన్నప్రాసన చేశారని  లెనిన్ కుటుంబం గుర్తుచేసుకున్నారు.

    Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం
  • ఢిల్లీ:  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల భవిష్యత్తును గందరగోళంలో పడేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ కార్మికులు.. ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. లోక్‌సభలో ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ కోడ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికుల గురించి ప్రస్తావించారు. 

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగాలు, ఉపాధి కోసం పోరాటం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అకస్మాత్తుగా 5000 మంది కార్మికులను తొలగించారు. పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే వెయ్యి మందిని మళ్లీ నియమించుకున్నారు. అక్కడ కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడేశారు. చట్టాలపై కార్మికులకు తగిన అవగాహన కల్పించాలి. కార్మికుల భవిష్యత్తును గందరగోళ పరిచేలా విధానాలు  ఉండకూడదు. వివాదాల పరిష్కారానికి తగిన చట్టాలు అవసరం’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇంచార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్‌లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.

    ‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.

    ‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు క‌లెక్ట‌ర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.

    ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన వాగ్ధానాల అమ‌లుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయ‌డం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవ‌డంపై ముఖ్య‌మంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

    Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
  • మామిడికుదురు: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్‌ పేలడంతో భారీగా పూరి గుడిసెలు దగ్ధమైన ఘటన మామిడికుదురులో సంభవించింది. ఒక ఇంట్లో సిలిండర్‌ పేలడంతొ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఆ మంటలు చెలరేగి పక్కనున్న పూరిగుడిసెలు సైతం దగ్ధమయ్యాయి. సుమారు 10 పూరిగుడిసెలు వరకూ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.


     

Business

  • ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    ఫ్లిప్‌కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

    వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

    ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

    ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి.

  • జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.

    ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!

    జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

  • బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) పోలియోకు వ్యతిరేకంగా.. ఒక ప్రధాన మైలురాయిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2) కోసం ఫేజ్ II ప్రీ-క్వాలిఫికేషన్ (PQ) మంజూరు చేసింది. ఈ ప్రీ-క్వాలిఫికేషన్ ద్వారా.. BE తన సింగిల్ ఇంటిగ్రేటెడ్ సైట్‌లో మొత్తం ఉత్పత్తి శ్రేణి (డ్రగ్ సబ్‌స్టాన్స్ & డ్రగ్ ప్రొడక్ట్) కోసం WHO ప్రమాణాలను పూర్తి చేసింది.

    ఫేజ్ I ప్రీ-క్వాలిఫికేషన్ (జూన్ 2024) కేవలం డ్రగ్ ప్రొడక్ట్ ఉత్పత్తికి మాత్రమే వర్తించింది. ఇది బయట నుంచి అందిన డ్రగ్ సబ్‌స్టాన్స్ ఆధారంగా తయారయ్యేది. కానీ ఫేజ్ II ద్వారా BE మొత్తం ఉత్పత్తి విధానాన్ని WHO ప్రమాణాలతో నిర్వహించగలుగుతుంది, ఇది ప్రపంచంలో పోలియోవైరస్ టైప్ 2 (cVDPV2) వ్యాప్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

    బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 700 మిలియన్ల డోసుల nOPV2 ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకి పంపించింది. అక్కడ cVDPV2 వ్యాప్తిని నియంత్రించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. nOPV2 ప్రత్యేకంగా ఔట్‌పుట్ నియంత్రణ కోసం రూపొందించారు. ఇది పోలియో వైరస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    ఈ ప్రీ-క్వాలిఫికేషన్ సాధనలో PT Bio Farma (ఇండోనేషియా), PATH, Gates Foundation వంటి అంతర్జాతీయ భాగస్వాములు కీలక సహకారం అందించారు. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఉత్పత్తి సరాసరి పరిశీలనలు, ప్రత్యేక పరీక్షలు మరియు తయారీ సిద్ధత కార్యక్రమాలు ఈ విజయానికి తోడ్పడ్డాయి.

  • న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) అభివృద్ధి కోసం గతంలో పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ కోణంలో అవి ఇంకా భారీగా విస్తరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. మార్కెట్స్‌లో లిస్ట్‌ కావడం వల్ల చిన్న కంపెనీల్లో గవర్నెన్స్‌ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కానీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ గురించి అంతగా తెలియకపోవడం వల్ల, మర్చంట్‌ బ్యాంకర్లు అంత తేలిగ్గా దొరక్కపోవడం వల్ల చిన్న సంస్థలు లిస్టింగ్‌పై సందేహిస్తుంటాయని పేర్కొన్నారు.

    ఐపీవోల ద్వారా నిధులను సమీకరించేందుకు వ్యయాల భారం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఇండియా ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడం వల్ల గవర్నెన్స్‌ మెరుగుపడుతుందని, విశ్వసనీయత పెరగడం వల్ల పెట్టుబడి వ్యయాలు కూడా తగ్గుతాయని పాండే చెప్పారు. చిన్న సంస్థలకి వర్తించే మినహాయింపులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేయడం వల్ల ఎస్‌ఎంఈ ఐపీవోలపై ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంటుకి దారి తీసిందని ఆయన తెలిపారు. అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా నిబంధనలను సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మెరుగుపర్చాయన్నారు.

    ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజీల్లో 1,400 కంపెనీలు లిస్టయ్యాయని, వాటి మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4.1 లక్షల కోట్లని పాండే చెప్పారు. ఇందులో 350 సంస్థలు మెయిన్‌ బోర్డుకి మైగ్రేట్‌ అయ్యాయని గర్గ్‌ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా 98 సంస్థలు రూ. 9,800 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 232 లిస్టింగ్స్‌ ద్వారా రూ. 10,500 కోట్లకు సమీకరించినట్లు చెప్పారు.

  • పాన్‌ కార్డుకు సంబంధించి పలు నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026’లో పాన్ కార్డు (PAN) బహిర్గతం తప్పనిసరి అయ్యే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్లో మార్పులను ప్రతిపాదించింది.  

    లక్ష్యం ఏమిటంటే.. 
    సాధారణ, తక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని తగ్గిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలలో పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. తుది ఆమోదం అనంతరం కొత్త నిబంధనలు  2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

    నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మోటారు వాహనాల కొనుగోలు, హోటల్, రెస్టారెంట్ బిల్లులు, స్థిరాస్తి లావాదేవీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాన్ కార్డు అవసరం ఎలా మారబోతోందో ఈ కింద తెలుసుకుందాం.

    నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు 
    ప్రస్తుతం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ చేసినప్పుడు మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.

    మోటారు వాహనాల కొనుగోలు
    ప్రస్తుత నిబంధనల ప్రకారం మోటార్ సైకిళ్లు మినహా అన్ని వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం. ప్రతిపాదిత మార్పుల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు (బైక్‌లు సహా) కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.

    హోటల్, రెస్టారెంట్ బిల్లులు
    ఇప్పటి వరకు ఒక చెల్లింపులో రూ.50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాలో ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని సూచించారు.

    స్థిరాస్తి లావాదేవీలు
    ప్రస్తుతం రూ.10 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ప్రతిపాదన ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు.

    ఇన్సూరెన్స్ పాలసీలు
    ఇప్పటివరకు రూ.50,000 పైగా ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. ఇకపై బీమా సంస్థలతో ఏదైనా ఖాతా ఆధారిత సంబంధం ఏర్పరిస్తేనే పాన్ తప్పనిసరి చేయాలని సూచించారు.

  • ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు స్పందించింది. మీరు భారత్‌కు తిరిగి రావాలి, లేకుంటే.. మేము మీ పిటిషన్‌ (ఆర్థిక నేరస్థుల చట్టం, 2018)ను విచారించలేము వెల్లడించింది.

    పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటే, ముందుగా మీరు (విజయ్ మాల్యా) భారతదేశానికి తిరిగి రావాలి. మేము ఇప్పటికీ కేసును కొట్టివేయడం లేదు.. మీకు మరొక అవకాశం ఇస్తున్నామని కోర్టు వెల్లడించింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని స్పష్టం చేసింది.

    ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టంగా వ్యాఖ్యానించింది. మీరు కోర్టు అధికార పరిధిని తప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు సమాన న్యాయం కోరలేరు. ముందుగా మీరు భారతదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మాల్యా భారత్‌కు వస్తారా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రానుంది.

    ఆర్ధిక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న నిందితులు విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చేలా.. భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో విజయ్ మాల్యా మాత్రమే కాకుండా.. లలిత్ మోదీ కూడా ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

    ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే రష్యా ప్రయత్నం?

    2018లో అమలులోకి వచ్చిన ఎఫ్ఈఓ చట్టం ప్రకారం.. మొత్తం 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించారు.  వీరిలో 9 మంది ప్రభుత్వ బ్యాంకులకు సుమారు రూ. 26,645 కోట్ల నష్టం కలిగించారు. 2025 అక్టోబర్ 31 వరకు వడ్డీ కలిపి ఈ మొత్తం రూ. 31,437 కోట్లకు చేరింది. ఇందులో రూ. 19,187 కోట్లు ఇప్పటివరకు తిరిగి వసూలు చేశారు.

  • ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ యాప్‌లు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి కోట్లాది మంది వినియోగదారులను కలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో.. రష్యా ప్రభుత్వం తమ సేవలను దేశంలో పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించిందని వాట్సాప్ వెల్లడించింది. దీనికి కారణం.. ప్రభుత్వం నిర్వహించే 'మ్యాక్స్' సూపర్ యాప్‌ను ముందుకు తీసుకురావడానికే అని పేర్కొంది.

    రష్యా మ్యాక్స్ యాప్
    మ్యాక్స్ అనే యాప్‌ను రష్యా ప్రభుత్వం వీచాట్ (చైనా దేశంలో ప్రసిద్ధి చెందన యాప్) నమూనాను అనుసరించి రూపొందించింది. ఇది కేవలం మెసేజెస్, కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సేవలు, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్సక్షన్స్‌ చేయడానికి కూడా ఇది అనుమతిస్తుంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న అన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాక్స్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    ''రష్యా ప్రభుత్వం వాట్సాప్‌ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. ప్రజలను ప్రభుత్వ యాజమాన్యంలోని యాప్‌కి నడిపించే ప్రయత్నం చేసింది. అయితే వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాము'' అని వాట్సాప్ ట్వీట్ చేసింది.

    టెలిగ్రామ్ సేవలు పరిమితం!
    రష్యా ప్రభుత్వం విదేశీ యాప్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే.. వాట్సాప్, టెలిగ్రామ్ సేవలను పరిమితం చేసింది. టెలిగ్రామ్ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, క్రిమినల్ & ఉగ్రవాద కంటెంట్ తొలగించలేదని ఆరోపణలు రావడంతో.. రష్యా కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జర్ టెలిగ్రామ్‌పై పరిమితులు విధించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, టెలిగ్రామ్‌పై 64 మిలియన్ రూబిళ్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

    మ్యాక్స్ యాప్‌పై విమర్శలు
    ఇక రష్యా ప్రభుత్వం నిర్వహించే.. మ్యాక్స్ యాప్‌పై విమర్శకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం ప్రభుత్వం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

    క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) ప్రకారం.. వాట్సాప్ రష్యాలో తిరిగి తన సేవలు యధావిధిగా అందించాలంటే, దేశంలోని చట్టాలను పూర్తిగా పాటించాలి. మెటా సంస్థ రష్యా అధికారులతో చర్చలకు సిద్ధంగా ఉంటే.. ఒప్పందం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మెటా మొండిగా ప్రవర్తిస్తే మాత్రం.. వాట్సాప్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు.

    ఇదీ చదవండి: రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?

  • బ్యాంకు బ్యాలెన్స్‌ కొన్నిసార్లు అనవసరంగా కట్‌ అవుతూ ఉంటుంది. ఎందుకు కట్‌ అయిందో తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఏ ఇన్సూరెన్సో, మరేదో సర్వీస్‌ యాక్టివేట్‌ అయింది... దానికి సంబంధించిన  ప్రీమియమే కట్‌ అయింది అని. ఇది చాలా మంది ఖాతాదారులకు ఎదురయ్యే అనుభవమే. ఇకపై అలా కుదరదు..

    బ్యాంకుల్లో తప్పుడు అమ్మకాల (మిస్-సేలింగ్) నిర్వచనాన్ని మరింత కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు, బీమా సంస్థలు ఇప్పటివరకు వినియోగిస్తున్న కొన్ని రక్షణలను తొలగిస్తూ, కస్టమర్‌కు అనుచితంగా ఉత్పత్తులు విక్రయించినట్లు నిరూపితమైతే పూర్తి రీఫండ్ చెల్లించాల్సిన బాధ్యతను విధించింది.

    2026లో అమల్లోకి రానున్న డ్రాఫ్ట్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ – రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) సవరణ ఆదేశాలు’ ప్రకారం.. కస్టమర్ వయస్సు, ఆదాయ స్థాయి, రిస్క్ స్వభావం వంటి ప్రొఫైల్‌కు సరిపోని ఉత్పత్తి లేదా సర్వీస్‌ను విక్రయించడం ‘తప్పుడు అమ్మకం’గా పరిగణిస్తారు.

    అంతేకాదు.. “డార్క్ ప్యాటర్న్స్” (చీకటి నమూనాలు) అనే భావనను కూడా మొదటిసారిగా ఆర్బీఐ నిర్వచించింది. ఇవి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసిన మోసపూరిత యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ నమూనాలు. ఇవి వినియోగదారుల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసి, వారు ఉద్దేశించని చర్యలకు ప్రేరేపిస్తాయి. ఇటువంటి చర్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు సమానమని ఆర్బీఐ పేర్కొంది.

    ఇప్పటివరకు బ్యాంకులు, బీమా సంస్థలు ‘కొనుగోలుదారు జాగ్రత్త’ (Buyer Beware) విధానాన్ని అనుసరిస్తూ, సంతకం చేసిన పత్రాలు, నిర్ధారణ కాల్స్ ఆధారంగా తమను తాము రక్షించుకునేవి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు విక్రయించిన సంక్లిష్ట బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విషయంలో వివాదాలు ఎక్కువగా వచ్చేవి.

    కస్టమర్ సమ్మతి ఉన్నా కూడా, అది అనుచిత అమ్మకాన్ని చట్టబద్ధం చేయదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. దీని ద్వారా బ్యాంకులను ‘అత్యున్నత సద్భావన’ (Utmost Good Faith) సూత్రానికి లోబరచి, కేవలం కమీషన్ ఆధారిత మధ్యవర్తులుగా కాకుండా వారు విక్రయించే ఉత్పత్తులు సరైనవిగా ఉండేలా బాధ్యత వహించే సంస్థలుగా నిలిపింది. వినియోగదారుల పరిహారం కోసం ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

    ముసాయిదా నిబంధనలు రుణ ఆమోదాన్ని బీమా లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానించే తప్పనిసరి బండిలింగ్‌ను నిషేధించాయి. అలాగే, థర్డ్‌ పార్టీ ఏజెంట్ల పర్యవేక్షణను కఠినతరం చేస్తూ, అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల తాజా జాబితాను బ్యాంకుల వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది. బ్రాంచీల్లో పనిచేసే ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు వేరువేరని స్పష్టమైన నిర్ధారణ ఉండాలి.

    ఈ నిబంధనలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు శాఖల ద్వారా బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విక్రయ విధానంలో ఇవి గణనీయమైన మార్పులకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
     

  • గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.

    టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.

    ఏమిటీ వివాదం?

    హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్‌పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

    ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలు

    విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

    కోర్టు ఆదేశాలు

    రెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.

    ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!

  • ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఎంజీ మెజెస్టర్ (MG Majestor) వచ్చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీ.. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

    కొత్త మెజెస్టర్ కోసం ఎంజీ మోటార్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ.41 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2026 మే నెలలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏప్రిల్‌లో టెస్ట్ డ్రైవ్‌లు మొదలవుతాయి. కాగా కంపెనీ త్వరలోనే ఈ కారు ధరలను వెల్లడించనుంది.

    ఎంజీ మోటార్.. తన కొత్త మెజెస్టర్ ఎస్‌యూవీని మూడు వేరియంట్లలో లాంచ్ చేయనుంది. అవి ఎంట్రీ లెవల్ షార్ప్ 4x2, మిడ్ స్పెక్ సావీ 4x2 & టాప్ స్పెక్ సావీ 4x4. ఇవి 6 సీటర్, 7 సీటర్ రూపంలో మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంది. మెజెస్టర్‌ను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్ట్, 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్‌ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

    ఎంజీ మెజెస్టర్ కేవలం 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది 215 హార్స్ పవర్ & 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ రెగ్యులర్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. పనితీరు దాదాపు గ్లోస్టర్ మాదిరిగా ఉంటుందని సమాచారం.

    ఇదీ చదవండి: కారు మైలేజ్‌ కోసం.. ముఖ్యం ఈ వేగం!

    మంచి డిజైన్ కలిగిన మెజెస్టర్.. ట్విన్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 12 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ & 64 కలర్ యాంబియంట్ లైట్స్ వంటి వాటితో పాటు.. లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ కూడా పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ & హిల్-డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజ్‌లు, సరౌండ్ వ్యూ కెమెరాలు & ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

  • భారత్‌ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్‌సైట్స్‌ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.

    ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్‌లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్‌ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.

    నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:

    మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.

    బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).

    మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ల పేరుతో వచ్చాయి.

    స్పామ్ ఎస్‌ఎంఎస్‌లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.

    స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.

    2026లో పొంచి ఉన్న ముప్పు

    రాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్‌లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.

    జాగ్రత్తలు

    అత్యవసరమని వచ్చే కాల్స్‌ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.

    ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!

Telangana

  • ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము అద‌నంగా  సేక‌రించిన 18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఆయ‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గురువారం క‌లిశారు.

    వానా కాలం పంట‌కు సంబంధించి 53.73 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కు (ఎల్ఎంటీ) అనుమ‌తించార‌ని.. కానీ భారీగా పంట ఉత్ప‌త్తి కావ‌డంతో అద‌నంగా 18 ఎల్ఎంటీలు తాము సేక‌రించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూక‌తో ఎఫ్ సీఐ సేక‌రించాల‌ని కేంద్ర మంత్రికి వారు విజ్ఞ‌ప్తి చేశారు. 2024-25 యాసంగి పంట‌కు సంబంధించి 5 శాతం నూక‌తో అద‌నంగా 10 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమ‌తించాల‌ని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కోరారు.

    2024-25 వానా కాలం పంట‌కు సంబంధించి క‌స్ట‌మ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ వ‌ర‌కు గడువు నిర్దేశించార‌ని,  దానిని మ‌రో రెండు నెల‌లు పాటు పొడిగించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. భార‌త ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 వానా కాలంలో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణ‌కు బ‌కాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని  కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని సీఎం, రాష్ట్ర మంత్రి కోరారు. 

    నాడు అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే భ‌రించింద‌ని కేంద్ర‌ మంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. నాడు సేక‌ర‌ణ‌కు తాము రుణం తీసుకున్నామ‌ని.. దానికి వ‌డ్డీ రూ.2 వేల కోట్ల‌కుపైగా పెరిగింద‌ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద 2021, మే నుంచి 2022, మార్చి వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన అద‌న‌పు బియ్యం,  2022 ఏప్రిల్ నెల‌లో స‌ర‌ఫ‌రా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్ల‌ను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అద‌న‌పు డైరెక్ట‌ర్ రోహిత్‌ సింగ్, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.

  • అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మ్సావ, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.

    వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. లోక కల్యాణార్థం సకల శుభ్రప్రాప్తి కోసం అస్మద్‌ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..

    విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభం
    స్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి. 17వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.

    విశేష కార్యక్రమం వివరాలు 
    నేటినుంచి పల్లకిసేవ... 
    12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)
    13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ, 
    14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 
    15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి.సాయంత్రం అశ్వవాహన సేవ. 
    16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 
    17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి. 
     

    ఉదయం 5 నుంచి మధ్యాహ్నం  12 గంటల వరకు 
    సుప్రభాత సేవ,  ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార,ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి

    సాయంత్రం  5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
    శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి

    – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి

  • వాలంటైన్స్‌ డే పేరుతో ఎవరూ కూడా వలపు వలలో పడొద్దని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు.. ప్రమాద ఘంటికలు కూడా! సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో మీరు తోడు కోసం వెతుకుతుంటే.. సైబర్ కేటుగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి కాచుకుని ఉంటారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా వలపు వలలో పడొద్దన్నారు.

    పరిచయం అయిన వెంటనే 'ఐ లవ్ యూ' చెప్పడం, విదేశాల్లో ఉన్నామంటూ గొప్పలు చెప్పడం, హఠాత్తుగా ఆపద వచ్చిందని నాటకాలాడటం.. ఇవన్నీ మిమ్మల్ని బుట్టలో వేసుకునే ఎత్తుగడలేనన్న విషయం గ్రహించాలన్నారు.

     

  • సంగారెడ్డి: ఎన్నికల సంఘం ఆదేశాలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని నిన్న(బుధవారం) రాత్రి 9గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం అధికారి వినయ్‌ కుమార్‌. 

    జగ్గారెడ్డిపై బీఎన్‌ఎస్‌ 223,351,352,132,329,191(2) సెక్షన్లతో పాటు 215(1)(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. FIR లో A1గా జగ్గారెడ్డి, A2గా అడ్డు అలియాస్ హమీద్‌లను చేర్చారు. దీనిపై సీఐ శివకుమార్ వివరణ ఇచ్చారు. అడ్డు అలియాస్ హామీద్ అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ తీసుకుని తరచుగా వస్తుండటంతో రావొద్దని చెప్పామని సీఐ శివకుమార్‌ స్పష్టం చేశారు. అయినా మాట వినకుండా ఎన్నికల సిబ్బందిని బెదిరించి ప్రశాంత వాతావరణానికి  ఇబ్బంది కలిగించారని, గేటు వద్ద కూడా పోలీసులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడన్నారు. 

    విధి నిర్వహణలో ఉన్న సీఐ శివకుమార్ అతన్ని వారించడంతో తాను జగ్గారెడ్డి మనిషినని చెప్పాడని, తననే ఆపుతావా.. ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తానని బెదిరించాడన్నారు. విషయం జగ్గారెడ్డికి తెలియడంతో ఆయన తన అనుచరులతో ఇంద్రానగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అక్కడ విషయాన్ని పెద్దది చేశారన్నారు. అంతటితో ఆగకుండా తనపై దాడి చేసేందుకు యత్నించారని సీఐ శివకుమార్ తెలిపారు.

    ఇంకా జగ్గారెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు
    జగ్గారెడ్డిని పోలీసులు ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ప్రశ్నించారు. నిన్న జగ్గారెడ్డితో ఉన్నది గోల్కొండ రౌడీ షీటర్లేనని, కౌంటింగ్‌ సందర్భంగా తమపై దాడులు జరిగే ప్రమాదముందన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రక్షణ కల్పించలని డీజీపీని కోరామన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యలపై రగడ నెలకొంది. ఉచిత ఆర్టీసీ బస్సులను ఇంకా పెంచుతామని వీహెచ్‌ తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతుండగా ఆటో కార్మికులు నిరసనకు దిగారు. ఆటో కార్మికులు ఏం చేస్తారంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్‌ తీరుపై కార్మికులు మండిపడుతున్నారు.

  • హైదరాబాద్‌:  హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్‌ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్‌ ఖానామెట్‌లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్‌లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేయడంపై ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

    కాగా, అక్రమ నిర్మాణాలను హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలోనే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే పలు చోట్ల మాత్రం హైడ్రా చర్యలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎప్పట్నుంచో ఇక్కడ ఉంటుంటే హఠాత్తుగా హైడ్రా పేరుతో ఈ తొలగింపులేమిటని ప్రశ్నిస్తున్నారు. 

    ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

    ఇదిలా ఉంచితే, హైదరాబాద్‌ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్‌ఎస్‌, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ  మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. ప్రధానంగా బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి.

National

  • కోర్బా: ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాకు చెందిన జర్నలిస్ట్ సల్మా సుల్తానా హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టులో ప్రత్యక్ష సాక్షి కోమల్ సింగ్ రాజ్‌పుత్ చెప్పిన నిజాలతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్న ఆ దారుణాన్ని ఆమె కోర్టులో వివరించారు.

    పాట పాడుతూ..
    2018లో తన లివ్-ఇన్‌ భాగస్వామిని గొంతు నులిమి చంపిన తర్వాత నిందితుడు మధుర్ సాహులో ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించలేదు.. సల్మాను హత్య చేసిన సమయంలో మధుర్‌ చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. అతను మృతదేహం పక్కనే కూర్చుని సిగరెట్ తాగుతూ, సల్మాకు ఇష్టమైన "తుఝ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై.’’ అనే పాటను పాడినట్లు కోర్టుకు కోమల్ సింగ్ రాజ్‌పుత్ తెలిపారు.

    ఆ రోజు ఏం జరిగింది?
    మధుర్‌ సాహు జిమ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే కోమల్‌ సింగ్.. ఘటన జరిగిన రోజున శారదా విహార్‌లోని సల్మా ఇంటికి తనను పిలిచారని చెప్పాడు. దంపతుల మధ్య మొదలైన చిన్న వాగ్వాదం.. కాసేపటికే హింసాత్మకంగా మారిందన్నారు. వాగ్వాదం జరుగుతుండగానే మధుర్ మొదట సల్మా గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని.. ఘర్షణ తీవ్రం కావడంతో ఆమెను మంచంపైకి నెట్టి గొంతు గట్టిగా నొక్కినట్లు తెలిపారు. సల్మా అరవకుండా ఉండేందుకు మరో నిందితుడు కౌశల్ శ్రీవాస్ ఆమె నోటిపై దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. కోమల్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. నోరు మూసుకుని ఉండు.. లేదంటే నీకు కూడా ఇదే గతి పడుతుంది"  అంటూ నిందితులు ఆమెను బెదిరించారు.

    నమ్మించేలా ప్లాన్..
    హత్య తర్వాత, సల్మా ఫోన్ నుండి ఆమె కుటుంబ సభ్యులకు ఒక మెసేజ్ పంపాలని మధుర్ తనను, ఇంట్లో పనిచేసే సవితను బలవంతం చేసినట్లు కోమల్ తెలిపింది. ‘‘నేను వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకకండి అంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఆమె తనంతట తానుగా వెళ్ళిపోయిందని నమ్మించేలా ప్లాన్ చేశారు. నిందితుడు తన కంప్యూటర్‌లో పలువురు మహిళలకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను దాచిపెట్టి, వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడని కూడా కోర్టుకు కోమల్‌ సింగ్‌ తెలిపారు. తాను ఈ విషయం గురించి పోలీసులకు మరియు సల్మా బంధువులకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ, ఆ విషయం నిందితుడికి తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని ఆమె చెప్పారు.

    రోడ్డుకింద ఆస్థి పంజరం..
    హత్య అనంతరం సల్మా మృతదేహాన్ని భవానీ దబ్రీ వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి కింద పాతిపెట్టారు. ఐదేళ్లపాటు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి.. కానీ దాని కింద ఒక జర్నలిస్ట్ శవం ఉందనే విషయం ఎవరికీ తెలియదు. 2023లో గ్రౌండ్‌ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), శాటిలైట్ మ్యాపింగ్‌ సాంకేతికతను ఉపయోగించిన పోలీసులు రహదారిని తవ్వి అస్థిపంజరాన్ని వెలికితీశారు. డీఎన్‌ఏ పరీక్షలో అది సల్మాదేనని తేలింది.

    తుది దశలో విచారణ
    ప్రభుత్వ న్యాయవాది సునీల్‌ సోన్వానీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 41 మంది సాక్షులను విచారించారు. మరో 10 మంది మిగిలి ఉన్నారు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా బలంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, హత్య తర్వాత నిందితుడు పాట పాడాడనే కోమల్ సింగ్ రాజ్‌పుత్ సాక్ష్యం ఈ కేసులో అత్యంత కీలకమైన అంశంగా మారింది.

     

  • లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్‌  కుమారుడు శివం మిశ్రా కుమారుడు 26 ఏళ్ల శివం మిశ్రాను కాన్పూర్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల్లోనే  కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం  జరిగిందంటే..

    ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని కాన్పూర్‌ (Kanpur) లో గత ఆదివారం జరిగిన లగ్జరీ లంబోర్ఘిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా టుబాకో టైకూన్‌ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా (Shivam Mishra) ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే  కోర్టులో హాజరుపర్చిన కేవలం గంటల వ్యవధిలోనే శివం మిశ్రాకు  కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఖరీదైన , హైస్పీడ్‌  కారు ఢీకొని  ముగ్గురు ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్‌ జరిగింది.

    గత ఆదివారం  రింగ్ వాలా చౌరాహా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన లంబోర్ఘిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్‌ బైకును ఢీకొని, ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా డ్రైవర్ తౌసీఫ్ అహ్మద్, ఇద్దరు మోటార్ సైకిల్ రైడర్లు విశాల్, సోను త్రిపాఠి గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్‌ కాదని, డ్రైవర్‌ మోహన్‌ యాదవ్‌ అని శివమ్‌ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్‌ మోహన్‌ యాదవ్‌ కూడా తానే డ్రైవ్‌ చేశానని తొలుత ఒప్పుకున్నాడు.

    అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారును శివం మిశ్రానే నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా, తమ దర్యాప్తులో తేలిందని , ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు  పోలీసులు  ప్రకటించారు. శివమ్‌ మిశ్రా కాన్పూర్‌లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కన్పూర్‌ డీసీపీ తెలిపారు.

    శివం మిశ్రా అరెస్ట్‌ అక్రమని న్యాయవాది నరేష్ చంద్ర త్రిపాఠి వాదించారు. అందుకే అతని రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు.  రూ.20,000 అండర్‌ టేకింగ్‌ , మరో రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌పై విడుదలైనట్టు తెలిపారు. 

  • ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల మధ్య జరగాల్సిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో వరుడు సహా బంధువులంతా హతాశులయ్యారు. వధువు కిడ్నాప్‌ అయ్యిందంటూ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కట్‌ చేస్తే.. కథ అడ్డం తిరిగింది.

    ఇద్దరూ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. జోడీ బావుంది అని పెద్దలు వారిద్దరికి ఫిబ్రవరి 8న పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని, మీరట్‌లోని బహ్సుమా ప్రాంతంలోని అక్బర్‌పూర్ సదాత్ గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సపరివార సమేతంగా వివాహానికి ఆహ్వానిస్తూ బంధువులందరికి వెడ్డింగ్‌ కార్డ్స్‌ పంచారు. బంధువులతో సందడిగా ఉంది. సంధ్య చేతులను కాబోయే భర్త పేరుతో మెహందీ తీర్చి దిద్దారు. ముజఫర్‌ నగర్‌లోని మీరాపూర్ నుండి వచ్చే వివాహ ఊరేగింపును స్వాగతించడానికి అంతా బిజీగా ఉన్నారు. సరిగ్గా వివాహానికి ముందు రాత్రి పెళ్లి కూతురు 25 ఏళ్ల సంధ్య భరద్వాజ్ మాయమైంది. ఆమె ప్రస్తుతం అలీఘర్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. వరుడు అతుల్ శర్మ ముజఫర్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 

    వధువు కనిపించకుండా పోవడంతో వధువు తండ్రి అంకిత్ ఠాకూర్‌ను అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే అతను గతంలో (ఫిబ్రవరి 5న) తన కుమార్తెను వివాహం చేసుకుంటే చంపేస్తానంటూ వరుడిని ఫోన్‌లో బెదిరించాడని శర్మ తన ఫిర్యాదులో హింట్‌ ఇచ్చాడు. అంకిత్‌ తన కుమార్తెను బెదిరించి కిడ్నాప్ చేశాడని , ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని తండ్రి ఆరోపించాడు.

    అసలు సంగతి ఏంటంటే..
    పోలీసులు ఎనిమిది గంటల్లోనే మీరట్ జిల్లాలోని బక్సర్‌లో వధువు భరద్వాజ్‌ను గుర్తించారు. వధువు కిడ్నాప్‌కు గురికాలేదని ఇష్టపూర్వకంగా ‍ఇల్లు వదిలి ప్రేమికుడు అంకిత్ ఠాకూర్‌తో వెళ్లిపోయిందని గుర్తించారు.

    పోలీసుల ప్రకారం గత కొన్నేళ్లుగా భరద్వాజ్ -అంకిత్‌ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దలు కుదిర్చిన  పెళ్లి ఇష్టంలేకపోవడంతో అతని స్వస్థలం ధికోలి గ్రామంలోని ఇంటికి పారిపోయింది. తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. పోలీసు అధికారి మవానా సర్కిల్ ఆఫీసర్ పంకజ్ లావానియా చెప్పారు. ఇక చేసే దేమీ లేక వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. భరద్వాజ్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తామని సీనియర్ ఎస్‌పి(గ్రామీణ) అభిజీత్ కుమార్ తెలిపారు

    ఇదీ చదవండి: ఎన్‌ఆర్‌ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా

    కాగా అంకిత్‌కు నేర చరిత్ర ఉందని, దోపిడీ, హత్య అభియోగాలతో సహా కనీసం తొమ్మిది కేసులు నమోద య్యాయని పోలీసులు నిర్ధారించారు. గత సంవత్సరం ఒక మద్యం దుకాణంలో జరిగిన దోపిడీ కేసులో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.

    మరోవైపు తన కూతురు ప్రేమ వ్యవహారం, పెళ్లి విఫలమవడం చూసి సంధ్య తండ్రి తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. ఫలితంగా బాజా భజంత్రీలు, విందుభోజనాలతో కళకళ లాడాల్సిన ఇల్లు  నిశ్శబ్దంగా మారిపోయింది.

    ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం

  • దూరదర్శన్ ప్రముఖ మాజీ న్యూస్‌ రీడర్‌ సరళ మహేశ్వరి ఈ రోజు మృతి చెందారు. గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణతో మూడు దశాబ్దాల పాటు వార్తా రంగంలో ప్రముఖ న్యూస్‌రీడర్‌గా నిలిచారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

    1976లో దూరదర్శన్‌లో అనౌన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. దాదాపు మూడు దశాబ్దాల పాటు మీడియా రంగంలో తన గంభీరమైన స్వరంతో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న సరళ మహేశ్వరి ఇక లేరు. న్యూస్ యాంకర్ అనే భావన సాధారణం కాకముందు హుందాగా స్పష్టమైన ఉచ్చారణతో వార్తలను చదువుతూ న్యూస్‌ రీడర్‌గా ప్రస్థానం ప్రారంభించాలనుకునే యువ యాంకర్లకు మార్గదర్శకంగా నిలిచారామె.  71 ఏళ్ల వయసులో ఢిల్లీలో కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. సరళ మహేశ్వరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దూరదర్శన్‌ నేషనల్‌.. ‘X’ వేదికగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా వార్తా రంగంలో ఆమె సేవలను గుర్తు చేసుకుంది. 1984 వరకు దూరదర్శన్‌లోనే పనిచేశారామె.

    “దూరదర్శన్ కుటుంబం తరపున.. సరళ మహేశ్వరికి మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. దూరదర్శన్ న్యూస్ రీడర్‌గా.. ఆమె సున్నితమైన స్వరం, కచ్చితమైన ఉచ్చారణ, గౌరవప్రదమైన డెలివరీతో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె సింప్లిసిటీ, సంయమనం, వ్యక్తిత్వం.. ప్రేక్షకులలో లోతైన నమ్మకాన్ని కలిగించాయి” అని పోస్ట్‌ చేసింది. 

    మహేశ్వరి మరణాన్ని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్.. “టెలివిజన్ జర్నలిజంలో స్వర్ణయుగం ముగింపు”గా అభివర్ణించింది. ఆమె విశ్వసనీయత, మర్యాద ఎల్లప్పుడూ రాబోయే తరాలకు ప్రేరణగా ఉంటాయని పేర్కొంది. ప్రశాంతమైన అందమైన ముఖంతో ప్రేక్షకులను పలకరిస్తున్నట్లుగా అత్యంత నైపుణ్యంతో వార్తలు అందించేవారామె. ఆమె గొంతుకకు మాతమ్రేగాక ధరించే దుస్తులకు కూడా అభిమానులు ఉండేవారట. దూరదర్శన్‌కు ఆమె దుస్తుల గురించి వందలాది అబిమానుల లేఖలు వచ్చేవట. 

    ఆమె ధరించే గుజరాతీ చీరలను హిందీ చిత్రపరిశ్రమలో నటీనటుమణులు కూడా కాపీ చేసేవారట. అంతేగాదు ఆమె చీర కట్టు తీరు కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది, పైగా ఆ క్రెడిట్‌ని తన తల్లికే ఇచ్చేవారట ఆమె. నిజానికి టెలిప్రాంప్టర్లు లేని యుగం, న్యూస్ రీడర్లు పూర్తిగా వారి జ్ఞాపకశక్తిపై ఆధారపడవలసి వచ్చింది. దాంతో సరళ తరుచుగా ఇంటర్వ్యూలలో ఇలా అనేవారట. ఇది అపారమైన బాధ్యతతో కూడిన పని అని, దీన్ని బాగా చేయడానికి ఎంతో కొంత పరిణతి ఉండాలని చెప్పేవారట.

    (చదవండి: ఎవరీ పప్పుదేవి..? ఆమె అద్భుతమైన పులి కళ్లతో..)

     

  • అమూల్‌ సహా కొన్నిప్రముఖ భారతీయ పాల ఉత్పత్తుల బ్రాండ్లపై జరిపిన పరీక్షల్లో అధిక కోలిఫాం బ్యాక్టీరియా , ఇతర వాటిలో TPC పెరుగుదల కనిపించిందన్న వార్త సంచలనం రేపుతోంది.  అమూల్ ఉత్పత్తులైన తాజా అండ్‌  గోల్డ్ పౌచ్ (Taaza and Gold pouch) పాలలో   ప్రమాదకర బ్యాక్టీరియా స్థాయి  ఎక్కువగా ఉందన్న వార్త వైరల్‌గా మారింది. ట్రస్టీ ఫైడ్ అనే స్వతంత్ర పరీక్షా వేదిక  =నిర్వహించిన  బ్లైండ్ టెస్ట్‌లో కోలిఫామ్ స్థాయి  ఎక్కువ ఉందంటూ  ఒక వీడియో హల్‌హల్‌ చేస్తోంది.


    తాజా నివేదికల ప్రకారం అమూల్‌ ప్యాకెట్ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు పాల భద్రతపై ఆందోళనలు రేకెత్తించాయి. పాలలో కనిపించే కోలిఫామ్ స్థాయి FSSAI సూచించిన పరిమితుల కంటే 98 రెట్లు ఎక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. అంతేకాదు మదర్ డైరీ, కంట్రీ డిలైట్ లాంటి ప్యాకెట్‌ పాల బ్రాండ్లలో కోలిఫాం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పాలలోని టోటల్ ప్లేట్ కౌంట్ (TPC) అనేది పాల నమూనాలోబ్యాక్టీరియా సంఖ్యను కొలవడానికి ఉపయోగించే ప్రయోగశాల పరీక్ష. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తనిఖీలు ముమ్మరం చేసింది.

    కోలిఫామ్ అంటే ఏమిటి?
    కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది నేల, నీరు, వృక్షసంపద, జంతువుల ప్రేగులు మరియు మానవ ప్రేగులలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా సమూహం. పాలలో కోలిఫామ్  అంటే  మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితం కావడమే. దీంతో సోషల్‌ మీడియా యూజర్లు పాల ఉత్పత్తుల్లోని పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను అమూల్‌ కంపెనీ ఖండించింది.

    అమూల్‌ స్పందన
    తన ఉత్పత్తులన్నీ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని అమూల్‌ ప్రకటించింది.  తయారీ వైఫల్యం లేదని, కానీ రిటైల్ లేదా పంపిణీ స్థాయిలో కోల్డ్ చైన్‌లో ఏదైనా విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉందని కంపెనీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. 


    ఏం చేయాలి?
    ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కాలుష్యానికి గురికావడం ఉత్పత్తి , పాలు పితికే దశకు మాత్రమే పరిమితం కాదు, కానీ రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ లేదా రిటైల్ నిర్వహణ సమయంలో ఏదైనా కల్తీ జరిగే అవకాశం ఉంది. పేలవమైన ఉష్ణోగ్రత నియంత్రణ బ్యాక్టీరియా పెరిగేందుకు దోహదపడుతుంది. పాశ్చరైజేషన్ ద్వారా హానికరమైన జీవులు తగ్గినప్పటికీ, ప్రాసెసింగ్ తర్వాత తగినంత నిల్వ లేకపోవడం కూడా బ్యాక్టీరియాకు కారణమవుతుంది. అందుకే ప్యాకెట్‌ పాలను మరిగించ కుండా వాడకూడదు. ప్యాకెట్‌ పాలను సరైన శీతలీకరణలో ఉంచేలా రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

    • పాలను ఫ్రిజ్‌లోనే పెట్టాలి. ముఖ్యంగా వేడి వాతావరణంలో పాలను ఎక్కువసేపు బయట ఉంచవద్దు.

    • లీక్‌ అవుతున్న, లేదా ఉబ్బిన ప్యాకెట్లును కొనుగోలు చేయవద్దు.

    • టెట్రా ప్యాక్ (UHT) మిల్క్ ప్యాకెట్లు అల్ట్రా-హై టెంపరేచర్ ట్రీట్‌మెంట్‌కు లోబడి ఉంటాయి, తెరిచే వరకు స్టెరైల్‌గా ఉంటాయికాబట్టి కోల్డ్ చైన్ విశ్వసనీయత అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ  ఇవి సురక్షితం 

    • ప్యాకెట్‌ ఓపెన్‌ చేసిన తరువాత 24-48 గంటల్లోపు వాడాలి. ఆ తర్వాత బ్యాక్టీరియా పెరుగుదల రేటు వేగవంతం అవుతుంది.

    అలాగే కలుషితమైన పాలను మరిగించకుండా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఉబ్బరం లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు  చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది.


    పాలు కల్తీ అయ్యాయో లేదో గుర్తించే చిట్కాలు

    నీరు: ఒక చుక్క పాలు నునుపైన వంపుతిరిగిన ఉపరితలంపై ఉంచితే, స్వచ్ఛ మైన పాలు తెల్లగా మందంగా పారతాయి.  అవే నీళ్లు కలిపినవైతే పలుచగా త్వరగా జారిపోతాయి.

    క్రీమ్ పరీక్ష: పాలను మరిగించి, చల్లబరచండి. దాని పైన క్రీమ్ పొర ఏర్పడకపోతే, పాలు పలుచబడినట్లు  అర్థం.
    నురుగు పరీక్ష: పాలను ఒక సీసాలో నిల్వ చేసి, ఆపై దానిని కదిలించండి. చాలా నురుగు ఏర్పడితే, అది డిటర్జెంట్ కాలుష్యంతో ముడిపడి ఉండవచ్చు.

    కలుషితమైన పాలు, పరిశుభ్రత లేకపోవడం లేదా సురక్షిత నిర్వహణ లేమితో E.coli, Salmonella, Listeria, coliform లాంటి హానికరమైన బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయి.

  • ఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఈ మేరకు ఫ్రాన్స్‌తో రూ. 3 లక్షల 25 వేల కోట్లతో రఫేల్‌ యుద్ధ విమానాల డీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 114 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు Defence Acquisition Council (DAC) స్పష్టం చేసింది.

    ఈ నెల 18వ తేదీన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ .. భారత్‌కు రానున్నారు. అయితే మేక్రాన్‌ పర్యటనకు ముందే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ీడీల్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది భారత రక్షణ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

    ఈ డీల్‌ ద్వారా భారత వాయుసేనకు ఆధునిక సాంకేతికతతో కూడిన శక్తిమంతమైన యుద్ధ విమానాలు లభిస్తాయి. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది మరింత కీలకం కానుంది.  మరొకవైపు భారత నేవీ కోసం, Scalp Cruise Missiles ఇతర రక్షణ సామగ్రిని కూడా కొనుగోలు చేయనున్నారు.

    కాగా, భారత్ ఇప్పటివరకు రెండు ప్రధాన సందర్భాల్లో రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 2016లో ఎయిర్‌ఫోర్స్‌ను మరింత పటిష్టం చేసేందుకు 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఫ్రాన్స్‌తో రూ. 59 వేల కోట్లతో ఈ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో మొదటి బ్యాచ్ భారత్‌కు చేరింది, 2022 నాటికి అన్ని విమానాలు ఐఏఎఫ్‌లో చేరాయి.

    ఇక నేవీ కోంస 2025 ఏప్రిల్‌లో భారత్‌ రూ. 63 వేల కోట్లతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.  22 సింగిల్‌ సీట్‌, 4 ట్విన్‌ సీట్‌, రఫేల్‌ మెరైన్‌ జెట్స్‌ను భారత్‌ కొనుగోలు చేసింది. ఇవి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యా ఎయిర్‌క్రాఫ్ట్‌పై మోహరించబడతాయి.

International

  • కరాచీ:  ప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కల్గిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ యొక్క కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు.    ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్‌ పేర్కొన్నారు. ఇమ్రాన్‌ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతోనే కంటి చూపు సన్నగిల్లినట్లు ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. 

    గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్త గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని  అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.కొన్ని నివేదికలు ఆయనకు సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంటున్నాయి.

    ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్‌లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

    పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?

  • రక్షిత వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేయడం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలోనే థాయ్‌లాండ్‌ లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో భారతీయ టూరిస్ట్‌ అడ్డంగా బుక్కయ్యాడు.  థాయిలాండ్ నుండి రెండు సజీవ కోతులను  అక్రమంగా రవాణి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    నేషన్ థాయిలాండ్ నివేదించిన ప్రకారం ముంబైకి విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నప్పుడు కస్టమ్స్ అధికారులు అతని సామానులో దాచిన జంతువులను కనుగొన్నారు. ఈ సంఘటన ఫిబ్రవరి 3న రాత్రి  చోటు చేసుకుంది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణులు మరియు మొక్కల సంరక్షణ విభాగం ప్రైమేట్‌లు థాయిలాండ్‌లోని రక్షిత జాతి అయిన ఇండోచైనీస్ లుటుంగ్‌లు అని నిర్ధారించింది. ఈ ప్రైమేట్‌ల విలువ దాదాపు 100,000 భాట్ (సుమారు రూ. 2.9 లక్షలు) ఉంటుంది. విమానాశ్రయంలోని వన్యప్రాణుల తనిఖీ కేంద్రంతో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ స్వాధీనం జరిగింది.

    థాయ్ ఎయిర్‌లైన్స్ విమానం TG351 బ్యాంకాక్ రూట్ (BKK)లో 28 ఏళ్ల భారతీయుడు కార్తీక్‌ను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. తనిఖీల్లో భాగంగా ఇండో-చైనీస్ లుటుంగ్‌లు బయటపడ్డాయనీ, వాటిని స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు, సంరక్షణ కోసం వన్యప్రాణి నిపుణులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సువర్ణభూమి విమానాశ్రయం లోని ప్యాసింజర్ ఇన్‌స్పెక్షన్ కస్టమ్స్ ఆఫీస్ డైరెక్టర్ శాంటానీ ఫైరట్టనకోర్న్  ప్రకటించారు. వైల్డ్ యానిమల్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ (2019) మరియు కస్టమ్స్ యాక్ట్ (2017) కింద కేసులు నమోదు చేశారు.

    ఇదీ చదవండి: అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం

    ఇండోచైనీస్ లుటుంగ్
    జర్మైన్ లంగూర్ (ట్రాచీపిథెకస్ జెర్మైన్) అని కూడా పిలిచే ఇండోచైనీస్ లుటుంగ్ థాయ్ చట్టం మరియు అంతర్జాతీయ పరిరక్షణ ఒప్పందాల ప్రకారం రక్షిత జాతి. ఇవి ప్రకాశవంతమైన నారింజ రంగు బొచ్చుతో చిన్నగా ఉంటాయి. పెరిగేకొద్దీ బూడిద లేదా నలుపు రంగులోకి మారుతాయి. ఇవి ప్రధానంగా థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ మరియు వియత్నాంలో కనిపిస్తాయి.

    ఈ జాతి అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. దాని వ్యాపారం అంతరించిపోతున్న జాతుల అడవి జంతువులు, వృక్షజాలం (CITES)లో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం ప్రకారం ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. అనుమతి లేకుండా అటువంటి జంతువులను దేశం నుండి బయటకు రవాణా  చేయడం చట్టవిరుద్ధం. ఇందుకు  భారీ జరిమానాలు విధించవచ్చు.

    అనుమానితుడు ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మొదటి చట్టం రక్షిత వన్యప్రాణులను అనధికారికంగా ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తుంది, రెండవది కస్టమ్స్ ఫార్మాలిటీలను పూర్తి చేయకుండా థాయిలాండ్ నుండి వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధం.

    ఇదీ చదవండి: కానిస్టేబుల్స్‌ పెళ్లి : వధువు నేరగాడితో పారిపోయింది

Politics

  • సాక్షి, ఢిల్లీ: ‘‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. పదిన్నరేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్‌ అన్నారు. తానూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని..తనను అన్నవాళ్లనే తాను అంటున్నానన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని.. కేసీఆర్‌, హరీష్‌రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు.

    ‘‘మున్సిపల్ ఎన్నికల్లో నేను డిస్టింక్షన్‌లో పాస్ అవుతా. జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ విగ్రహం నేనే ఆవిష్కరిస్తా. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతా. సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వం వచ్చినట్టుకే సింగరేణి అప్పుల్లో ఉంది. మా ప్రభుత్వం ఎవరి ఫోన్లు టాపింగ్ చేయడం లేదు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

    ప్రభాకర్‌రావును విచారించేందుకే మాకు 20 నెలలు పట్టింది. ఫోన్ టాపింగ్ కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్‌రావును రప్పించాను. త్వరలో చార్జిషీట్ కూడా వేయమని ఆదేశాలు ఇచ్చా. ప్రభాకర్‌రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టుపైకి లేస్తుంది. గుంతలోకి కూరుకుపోదు. ఎన్డీఎస్ఎ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుగుతుంది’’ అని రేవంత్‌ వెల్లడించారు.

  • సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతును వినిపిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో గట్టిగా నిలదీస్తాం. అన్యాయపు పోకడలను గట్టిగా ప్రశ్నిస్తామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

    ‘‘అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేయటం నుండి మా నేతలపై అక్రమ కేసుల వరకు చర్చిస్తాం. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా హయాంలో నాణ్యత లేని నెయ్యి టాంకర్లను వెనక్కు పంపాం. అవన్నీ పక్కాగా రికార్డులు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే నాణ్యత లేని నెయ్యి వచ్చినట్టు సీబిఐ కూడా చెప్పింది. వీటన్నిటి పై మండలిలో గట్టిగా ప్రశ్నిస్తాం

    ..సగటు హిందువు వినటానికి కూడా భయపడేలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చంద్రబాబు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల విలువైన భూములను తమవారికి దోచి పెడుతున్నారు. గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారు. వీటన్నిటిపై మండలిలో చర్చిస్తాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

    మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి
  • హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని, అన్నీ గమనిస్తున్నారని, రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్‌ మాత్రమే శ్రీరామరక్ష అని అన్నారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడాన్ని కేటీఆర్‌ స్వాగతించారు.  దీనిలో భాగంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌లోనే  ఉన్నారన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందన్నారు కేటీఆర్‌.

    ‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి  చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చెయ్యండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. గ్రేటర్ హైదరాబాద్ లో కొందరు నాయకులు పార్టీ మారిన, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్ లోనే ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ లేదు. కేసీఆర్ హయంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని పేర్కొన్నారు.

  • సాక్షి,తాడేపల్లి: శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:

    అందరూ యుద్దంలో ఉన్నారు. నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా బెటర్‌గా పోరాడతారు. మనకు అసెంబ్లీలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం.

    మండలిలో బలం ఉంది కాబట్టి..:
    కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్‌ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకొండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్‌ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది.

    లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు:
    అంబటి రాంబాబు, జోగిరమేష్‌ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు.

    చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే:
    లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్‌ వస్తే, మే 13న, పోలింగ్‌ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. జూన్‌ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్‌ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్‌ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్‌ పరీక్షల్లో పాస్‌ అయ్యాయి.

    ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్‌ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్‌ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా రాసింది.

    వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు.

    టీటీడీలో నెయ్యి సప్లైపై ఒక పక్కా విధానం:
    టీటీడీలో నెయ్యి సేకరణకు టీటీడీలో ఒక పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడిటెడ్‌ ల్యాబ్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్‌గా ఉంటేనే, లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్‌ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటేం, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురదజల్లుతున్నారు.

    2014–19 మధ్య కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు నెయ్యి సరఫరా:
    సీబీఐ ఛార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలు 2014–19 మధ్య కూడా సప్లై చేశాయి. ప్రీమియర్‌ డెయిరీ 2016,  2017, 2018 లో కూడా నెయ్యిని సప్లై చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.

    కూటమి ప్రభుత్వం.. స్కామ్‌ల మయం:
    మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్‌ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాష్‌..  సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌.’. ఇది బాగా వినిపిస్తోంది.

    ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. పోరాడాలి. చిత్తశుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందని వైఎస్‌ జగన్‌ వివరించారు.
     

    ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో YS జగన్ కీలక సమావేశం
  • సాక్షి, విజయవాడ: తల్లికి వందనంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. మండలిలో గవర్నర్ ప్రసంగంపై టీడీపీ.. ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చలో వైఎస్సార్‌సీపీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రి పార్థసారధి ఎదురుదాడికి దిగారు.

    విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు మొత్తం ఇచ్చారా? అంటూ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. 80 శాతం మందికి పైగా విద్యార్థులకు ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల మాత్రమే ఇచ్చారని.. రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నామని తెలిపారు. ‘‘నేను మాట్లాడిన మాటలు తప్పైతే రికార్డుల నుంచి తొలగించండి. నేను చెప్పింది వాస్తవమోకాదో మీ అధికారులతో విచారణ చేయించండి. తప్పు నాదైతే సభకు క్షమాపణ  చెప్పడానికి నేను సిద్ధం’’ అంటూ బొత్స సవాల్‌ విసిరారు.

    తానూ 15 ఏళ్లు మంత్రిగా పనిచేశానని.. మీరు మాకు సభా సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం లేదని బొత్స పేర్కొన్నారు. బొత్స ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి కొలుసు పార్ధసారధి నీళ్లు నమిలారు. బొత్సపై మంత్రి ఎదురుదాడికి దిగారు.

    సభ అనంతరం బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాల్లో  రెండు అంశాల పై చర్చ నడిచిందన్నారు. భూములు 99 పైసలుకే ఇవ్వడం పై ప్రశ్నించామని.. కానీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖలో ఐటీని అభివృద్ధి చేశాం.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 99 పైసలుకే భూములిస్తానంటోంది.. ఎందుకు కంపెనీలతో లాలూచీ పడి భూములివ్వాలంటూ బొత్స ప్రశ్నించారు.

    వైఎస్‌ జగన్‌ హయాంలోనే అదానీ డేటా సెంటర్‌ వచ్చింది. సీఎం కుటుంబ సభ్యులు 5 వేల కోట్ల భూములు కబ్జా చేశారు. 5 వేల కోట్లు కాదు వెయ్యి కోట్ల భూములే తమ వద్ద ఉన్నాయని గీతం సంస్థ చెబుతోంది. వేల కోట్ల భూములు కబ్జా చేయడమేంటి?. పెన్షన్లపై ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద నుంచి సమాధానం లేదు. గవర్నర్ ప్రసంగంపై అధికారపార్టీ సభ్యులు డబ్బాలు కొట్టారు. ప్రతీ ఒక్కరికీ 15 వేలు తల్లికం వందనం ఇస్తామన్నారు. తల్లికి వందనం అందరికీ ఇచ్చారా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు

    బొత్స ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి

    తల్లికివందనం డబ్బులో పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ కాలేదు. చాలామంది ఖాతాల్లో ఏడెనిమిది వేలే జమ అయ్యాయి. మేం చెప్పిన విషయాలు అవాస్తవమని నిరూపిస్తే మా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని చెప్పా. మేం వేసిన ప్రశ్నకు అడ్డగోలుగా మంత్రి సమాధానం చెబుతున్నారు. 15 ఏళ్లు నేను కూడా మంత్రిగా చేశా. మేం బాధ్యతారాహిత్యంగా వివరాలు లేకుండా ఏ విషయాన్ని ప్రశ్నించం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. మీకు చేతనైతే మీ అధికారులతో ఎంక్వైరీ చేయించండి. మేం చెప్పింది అసత్యమని నిరూపించండి. ఈ సమావేశాలు ముగిసేలోపు తల్లికి వందనం బకాయిలను పూర్తిగా చెల్లించాలి.

    ప్రతిపక్షం చెప్పిన విషయాలను కనీసం పరిగణలోకి తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తదా ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వలేదు. గత వైఎస్సార్‌సీపీలో ఏడాదికి రెండు సార్లు కొత్త పెన్షన్లు ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్‌ కూడా ఇవ్వలేదు’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

Family

  • అపార కారుణ్యమూర్తి, భక్తవత్సలుడు, సర్వగుణ సంపన్నుడు, భూలోక వైకుంఠ క్షేత్ర నాథుడు అయిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ‌, సంవత్సరోత్సవ సేవలలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం.

    వైఖానస ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయటం (ధ్వజారోహణం), బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణా నక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు.

    లోక కల్యాణార్థం సకల శుభ‌ప్రాప్తి కోసం అస్మద్‌ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనాలతో అంగరంగ వైభవంగా... అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలు..

    విశేష కార్యక్రమాలు అంకురార్పణతో ఆరంభం
    స్వర్ణగిరీశుని ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. 17 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి మంగళాశాసనాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వాహకులు మానేపల్లి రామారావు తెలిపారు.

    విశేష కార్యక్రమం వివరాలు

    నేటినుంచి పల్లకిసేవ... 
    12 వ తేది: సింహవాహన సేవ, పరమేష్టివాహనం, నిశాచూర్ణోత్సవం, సాయంత్రం: ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామి వారికి గజవాహన సేవ, అమ్మవారికి హంసవాహన సేవ(లోక కల్యాణం కోసం)
    13 వ తేది: పల్లకీ సేవ, సుదర్శన ఇష్టిహవనం, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గరుడవాహన సేవ, అశ్వవాహనసేవ.
    14 వ తేది: పల్లకీసేవ, సకల కార్యసిద్ధి కొరకు విష్వక్సేన ఇష్టి, సాయంత్రం హనుమంతవాహన సేవ. 
    15 వ తేది: పల్లకి సేవ, సకల విద్యాప్రాప్తి కొరకు హయగ్రీవ ఇష్టి. సాయంత్రం అశ్వవాహన సేవ. 
    16 వ తేది: పల్లకి సేవ, ధన్వంతరి ఇష్టి, సాయంత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. 
    17 వ తేది: సర్వభూపాల వాహన సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్రస్నానం. సాయంత్రం పల్లకి సేవ, పుష్పయాగం, ద్వాదశారాధన, దేవతోద్వాసన, బలిహరణ మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం, సప్తవరణ, మహా కుంభ సంప్రోక్షణ, శాత్తు మొఖై, వేద విన్నపములు, రుత్విక్వరణం, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్టితో పూర్తికానున్నాయి.

    ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
    సుప్రభాత సేవ, ప్రాతఃకాల ఆరాధన, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చనలు, వేదవిన్నపం, విశేష హోమాలు, పంచసూక్త పరివార, ప్రాయశ్చిత్త హోమాలు, నివేదనలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.

    చ‌ద‌వండి: మోక్ష‌మార్గం.. శివ‌నామ స్మ‌ర‌ణం

    సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
    శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలలో ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, విశేష హోమాలు, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హోమాలు, నివేదన, నిత్యపూర్ణాహుతి, బలిహరణ, శాత్తుమొలై, ప్రసాద గోష్ఠి.

    – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి

  • బంగారం ధర ఏ రేంజ్‌లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్‌ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్‌గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. 

    ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. 

    అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్‌లో ఒక వ్యక్తి ఒక బాక్స్‌ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. 

    మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్‌ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్‌ బ్రాండ్‌లు బాగా ఫేమస్‌ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.

     

    (చదవండి: ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్‌..! ఆలుమగలకు అసలైన అర్థం..)

     

  • మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పూసలమ్మే అమ్మాయి గుర్తుందా..!. అందమైన మోముతో అందర్నీ ఆకర్షించి..రాత్రికిరాత్రికే సంచలనంగా మారింది. పైగా నటిగా అవకాశం వరించింది కూడా. అలా ఏదోక విశిష్ట లక్షణంతో సెన్సెషన్‌ అయిన వాళ్లెందర్నో చూశాం. కానీ ఇలాంటి కళ్లున్న అమ్మాయిని మాత్రం చూసుండరు. ఈ అమ్మాయి 20 ఏళ్ల క్రితం పలు పోస్ట్‌కార్డ్‌లపై కనిపించి సంచలనంగా మారింది. అయితే అప్పుడు సోషల్‌ మీడియాలు లేవు కాబట్టి..మ్యాగ్జైన్‌ కవర్‌పేజీలో, పర్యావరణ సావనీర్‌లలోనూ ఆమె ముఖ చిత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏముంది ఆమె ముఖంలో అంతగా ఆకర్షించేది అంటే..ఆమె అందమైన కళ్లు. కవులు చెప్పే కలువరేకుల్లాంటి కనులు గురించి విని ఉంటారు. కానీ ఈమె కళ్లు ఎలా ఉంటాయో తెలిస్తే..విస్తుపోతారు. ఇంతకీ ఎవరీమె అంటే..

    దాదాపు రెండు దశాబ్దాల క్రితం రాజస్థాన్‌లోని పుష్కర్ ఫెయిర్‌లో ఆ యువతి ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఎడారి పట్టణ నేపథ్యం నుంచి వచ్చి ఆమె చిత్రాలు చాలా దూరం ప్రయాణించాయి. ఆ అమ్మాయే రాజస్థాన్‌కి చెందిన పప్పుదేవి. మళ్లీ ఇన్నేళ్లకు ఆన్‌లైన్‌లో ఆమె ఫోటో వైరల్‌గా మారి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. 

    ఇంతకీ ఆమె మోములోని స్పెషల్టీ మొత్తం కళ్లదే. ఆ కళ్లు అలాంటి ఇలాంటివి కాదు..అచ్చం పులి లాంటి అందమైన కళ్లు. వాటిని చూస్తే కళ్లుతిప్పుకోలేం. మరోసారి చూడాలనిపించేంతగా కట్టిపడేస్తాయి. 20 ఏళ్ల క్రితం ఒక విజిటింగ్‌ ఫోటోగ్రాఫర్‌ ఆమె అద్భుతమైన పులికళ్లను క్లిక్‌మనిపించడంతో ఆమె ముఖ చిత్రం పలు వార్తపేపర్లలోనూ, పోస్టకార్డులపైకి వెళ్లిపోయింది. అలా ఆమె రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయిపోయింది. 

    మళ్లీ సరిగ్గా ఇప్పుడుమరోసారి ఆ పప్పుదేవి ఫోటోలు వైరల్‌ అవ్వడం మొదలయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందని ఆరాలు మొదలయ్యాయి. ఇ​క పప్పు దేవి ఒక సఫారి డ్రైవర్‌ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆమె ఇద్దరు కుమార్తెలకు వారసత్వంగా పులికళ్లు వచ్చాయి. ఆ అమ్మాయిలు ఇద్దరు పప్పు దేవికి స్టాల్‌లో చేదోడు వాదోడుగా ఉంటారట. 

    పర్యాటకులను పిలుస్తూ..మిర్రర్‌ వర్క్‌ బ్యాగులను విక్రయించడంలో సాయం అందిస్తారట. అయితే సందర్శకులు చాలామంది తనను, ఆ ఇద్దరు కుమార్తెలను చూసి అవిశ్వాసం వ్యక్తం చేస్తూ..ప్లీజ్‌ కళ్లజోడు పెట్టుకోరా అని అడగుతారని అంటోంది పప్పుదేవి. కాగా, పప్పుదేవి తాను బంజారా కమ్యూనిటీకి చెందినదాన్ని కాదని స్పష్టం చేసింది. ఎవరో ఒక వ్యక్తి తన కళ్లను చూసి అందుకు సరిపోయే దుస్తులు ధరించమని సూచించడంతో ఈ వేషధారణలో ఉన్నానని వివరణ ఇచ్చిందామె.

     

    (చదవండి: ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్‌..! ఆలుమగలకు అసలైన అర్థం..)

     

Narayanpet

  • మహ దేవప్ప కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ

    రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత

    మక్తల్‌/మాగనూర్‌: మక్తల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్‌ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్‌కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్‌ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్‌డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య పాల్గొన్నారు.