Archive Page | Sakshi
Sakshi News home page

National

  • పట్నా: బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి పట్నాకు చెందిన బిల్డర్ సంజీవ్ శ్రీవాస్తవ్ బహుమతిగా ఇచ్చిన కార్టూన్ శైలిలోని ఓ చిత్రపటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భారీగా మీమ్స్ సృష్టిస్తూ, సెటైర్లు వేస్తున్నారు.

    పట్నాకు చెందిన పాల్వి రాజ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ అధినేత సంజీవ్ శ్రీవాస్తవ్ విలాసవంతమైన జీవనశైలితో ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే చిత్రపటంపై విపరీతమైన చర్చ మొదలైన తర్వాత ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా మార్చారు.

    సంజీవ్‌ ఆ నలుపు-తెలుపు పెన్సిల్/చార్కోల్ చిత్రంలో సమ్రాట్ చౌధరి ముఖాన్ని అతిశయంగా చూపించారు. పెద్ద కళ్లతో పాటు మందమైన గడ్డం, బాగా హైలైట్ చేసిన నుదురు, పెద్ద కార్టూన్ తరహా చెవులు, పొడవైన కనురెప్పలు చిత్రంలో కనిపించాయి. ఈ చిత్రాన్ని ఎవరు వేశారన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా, కుటుంబానికి దగ్గరగా ఉన్నవారే గీసి ఉండొచ్చని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. చిత్రపటంతో పాటు శ్రీవాస్తవ్ మరికొన్ని బహుమతులను కూడా ముఖ్యమంత్రికి అందించారు.

    నెటిజన్ల స్పందనలు
    ఆ చిత్రం అసలు సమ్రాట్ చౌధరిలా లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. బాలీవుడ్ సినిమా వెల్‌కమ్‌లో కనిపించిన “మజ్ను భాయ్” పెయింటింగ్‌తో ఈ చిత్రాన్ని పోల్చారు.

    ఓ ఎక్స్ యూజర్‌ స్పందిస్తూ.. “ఈ వ్యక్తి బిహార్ సీఎం సమ్రాట్ చౌధరికి ఇచ్చింది పెయింటింగ్ అని అసలు చెప్పలేం. సమ్రాట్ చౌధరి మంచి మనిషి కాబట్టే ఆయనకు ఈ విచిత్ర చిత్రాన్ని ధైర్యంగా అందించి కూడా సురక్షితంగా బయటపడ్డాడు” అని సెటైర్‌ వేశారు. వేరే నేత అయితే ఈ చిత్రం ఇచ్చిన వారిని శిక్షించే వారని అన్నారు.

    మరో వ్యక్తి స్పందిస్తూ.. “మజ్ను భాయ్ గర్వపడేవాడు. బిహార్ నిర్మాణ సంస్థ డైరెక్టర్.. సీఎం సమ్రాట్ చౌధరిని కలిసి ఈ కళాఖండాన్ని పూర్తి నమ్మకంతో బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగు ఫొటోలను గర్వంగా సోషల్ మీడియాలో పెట్టాడు” అని పేర్కొన్నాడు. “తప్పుడు రూపం చూపించారని కేసు వేస్తారా?” అని ఓ వ్యక్తి ప్రశ్నించారు.

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దేశ రాజధానిలో తన తొలి అధికారిక పర్యటనను ముగించుకుని గురువారం చెన్నైకి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. అయితే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలవకుండానే ఆయన పర్యటన ముగిసింది. సోనియా, రాహుల్‌తో విజయ్‌ సమావేశం రద్దయింది. ముఖ్యమంత్రి తన పర్యటనను కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేసుకున్నారని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అందుకే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ క్రిస్టోఫర్ తిలక్ చెప్పుకొచ్చారు.

    అయితే, ప్రచారం జరుగుతున్నట్లుగా విజయ్, రాహుల్ గాంధీల భేటీ రద్దు కాలేదని... కేవలం వాయిదా మాత్రమే పడిందని తిలక్ పేర్కొన్నారు. సీఎం నీతి ఆయోగ్ సమావేశం కోసం జూన్ 11 ప్రాంతంలో మళ్లీ ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని.. అప్పుడు రాహుల్, సోనియా గాంధీలను కలుస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన మీడియాతో అన్నారు.

    కాగా, తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే చీఫ్‌ విజయ్‌ తొలిసారి బుధవారం ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం  దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో విజయ్‌కి ఇదే తొలి భేటీ కావడం విశేషం. ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం విజయ్‌ తిరిగి తమిళనాడు భవన్‌కు  చేరుకున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర నిధులపై చర్చించారు.

    ఈ క్రమంలో జాతీయ ప్రతిపక్ష నేతలైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోనూ విజయ్‌ సమావేశమవుతారంటూ ప్రచారం జరిగింది. అటు అధికార పక్ష అగ్రనేతలను, ఇటు ఇండియా కూటమి ప్రతిపక్ష నేతలనూ సమానంగా కలుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. చివరికి  సోనియా, రాహుల్‌లతో భేటీ కాకుండానే విజయ్‌ పర్యటన ముగిసింది.

  • ఒకరు ప్రముఖ  మరాఠీ టీవీ నటుడు ఏళ్ల నటుడు మహేష్ పవార్ (25) ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ (SUV) వాహనం దాదాపు 1,000 అడుగుల లోతునున్న లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేష్ పవార్‌తో పాటు ప్రయాణిస్తున్న మరో ఏడుగురు కూడా అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో  పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

    ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాడ్‌పూర్-మహాబలేశ్వర్ రోడ్డులోని అంబెనాలి ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పీటీఐ (PTI) నివేదించింది. కొండల మధ్య ఉన్న ఈ ప్రమాదకరమైన ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. బాధితుల చివరి మొబైల్ లొకేషన్ ఆధారంగా,  అంబెనాలి ఘాట్ విభాగంలో పోలీసులు శోధించగా, లోయలో పడి ఉన్న వాహనాన్ని గుర్తించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.

    బాధితులు ఎవరు?
    పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారంతా 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు. వీరంతా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాపోలిలోని హర్నే నుండి బయలుదేరారు. అయితే వారు గమ్యస్థానమైన సతారాకు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

    మృతులను సతారాకు చెందిన రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), మహేష్ పవార్ (25), ఆదిత్య సాలుంఖే (21), రాజేష్ కట్కర్ (35)  రత్నగిరికి చెందిన అన్ష్ చవాన్ (19)లుగా అధికారులు గుర్తించారు.

    ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం
    ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను "యుద్ధప్రాతిపదికన" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది మంది స్నేహితులు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతదేహాలను వెలికితీసేందుకు జిల్లా యంత్రాంగం వెంటనే ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిందని సీఎం పేర్కొన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) , స్వచ్ఛంద రెస్క్యూ టీమ్‌ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మహేష్ పవార్ ప్రముఖ మరాఠీ టెలివిజన్ షో 'అప్పి ఆమ్చీ కలెక్టర్' లో తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన అకాల మరణం మరాఠీ చిత్ర పరిశ్రమను ,ఆ సీరియల్ ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

  • Bashir Badr Passed Away ప్రముఖ ఉర్దూ కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బషీర్ బద్ర (91)ఇకలేరు.  సుదీర్ఘ అనారోగ్యం, డిమెన్షియా (మతిమరుపు) సమస్యలతో పోరాడుతూ   ఈ రోజు (మే 28న) భోపాల్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మరణవార్తను ఆయన కుమారుడు నుస్రత్ బద్ర ధృవీకరించారు. ఆయనకు భార్య రాహత్ బద్ర, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    "బషీర్ సాహబ్ మనల్ని విడిచి వెళ్లిపోయారు...ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి"  అంటూ ఆయన భార్య రాహత్ బద్ర్ సోషల్ మీడియా ద్వారా  భర్త మరణం గురించి వెల్లడించారు.  కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ఆయన గతంలో కవి సమ్మేళనాలు (ముషాయిరాలు) నిర్వహించే తన గదిలోనే చివరి శ్వాస విడిచారు. బషీర్ బద్ర్ 1935, ఫిబ్రవరి 15 న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. ఇటావా, అలీగఢ్‌లలో విద్యనభ్యసించారు. మీరట్‌లో కొన్నాళ్లు సేవలు అందించిన అనంతరం, చివరకు భోపాల్‌లోని ఫతేగఢ్ ప్రాంతంలో ఉన్న 'బషీర్ మంజిల్'లో స్థిరపడ్డారు. కేవలం ఏడేళ్ల వయసులోనే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించి దిగ్గజ కవిగా ఎదిగారు.

    అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU) నుండి బ్యాచిలర్స్ , డాక్టరేట్ డిగ్రీలను పొందారు. అక్కడే చాలా సంవత్సరాలు ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మీరట్ కాలేజీలో 17 ఏళ్ల పాటు ఉర్దూ విభాగాధిపతిగా (HOD) సేవలందించారు. బషీర్ బద్ర్ తన పీజీ పూర్తి చేయకముందే ఆయన రాసిన ప్రారంభ కవితలను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సిలబస్‌లో చేర్చడం విశేషం.

    y"> ఆయన ఆధునిక ఉర్దూ కవిత్వానికి (Modern Urdu poetry) ఎనలేని సేవ చేశారు.  దాదాపు 10,000 ఉర్దూ కవితలను రాశారు. గజల్స్‌కు సంబంధించి 7 సంకలనాలను (Collections) ప్రచురించారు. సాహిత్య రంగానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1989లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'తో సత్కరించింది. అదే సంవత్సరంలో ఆయన రాసిన 'ఆస్' (Aas) అనే కవితా సంకలనానికి ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.


    సాధారణ ప్రజలకు అర్థమయ్యే సరళమైన, వాడుక భాషలో ఉర్దూ గజల్స్ రాయడం బషీర్ బద్ర శైలి. భాషా భేదాలను తొలగించడానికి ఆయన తన గజల్స్‌ను దేవనాగరి (హిందీ) లిపిలో కూడా ప్రచురించారు. ఆయన రాసిన కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన పంక్తులు:

    •    "ఉజాలే అప్నీ యాదోన్ కే హమారే సాత్ రెహ్నే దో, నా జానే కిస్ గలీ మే జిందగీ కీ శామ్ హో జాయే." (నీ జ్ఞాపకాల వెలుగులను నాతోనే ఉండనివ్వు, జీవితపు సాయంత్రం ఏ వీధిలో వస్తుందో ఎవరికి తెలుసు)
    •  "కుచ్ తో మజ్బూరియాన్ రహీ హోంగీ, యూన్ హీ కోయి బేవఫా నహీ హోతా." (ఏదో ఒక బలవంతపు పరిస్థితి ఉండే ఉంటుంది, ఎవరూ ఊరికే నమ్మకద్రోహం చేయరు)
    •   "లోగ్ టూట్ జాతే హై ఏక్ ఘర్ బనానే మే, తుమ్ తరస్ నహీ ఖాతే బస్తీయాన్ జలానే మే." (ఒక ఇల్లు కట్టుకోవడానికి మనుషులు విరిగిపోతారు, కానీ మీరు బస్తీలను తగలబెట్టడానికి ఏమాత్రం జాలి చూపరు)
       

     విషాదం : అనేక కవితలు, పత్రాలు కాలిపోయాయి
    1987లో మీరట్ వర్గీయుల ఘర్షణల్లో ఆయన ఇల్లు తగలబడిపోయింది. ఆయన జీవితకాల శ్రమ అయిన అనేక ప్రచురించని కవితలు, పత్రాలు అందులో బూడిదయ్యాయి. ఈ తీవ్ర నష్టం తర్వాత ఆయన భోపాల్‌కు వలస వెళ్లి తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు.

    ప్రముఖుల సంతాపం
    ఆయన మృతి పట్ల సాహిత్య లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్   అత్యంత మధురమైన కవి మనల్ని వీడిపోయారు. ఉర్దూ భాషకు ఆయన లేని లోటు తీరనిది అంటూ సంతాపం తెలిపారు. ప్రముఖ కవి అంజుమ్ బారాబంక్వి స్పందిస్తూ.. "మొత్తం ప్రపంచంలోనే 'నయీ గజల్' ఉద్యమానికి చెందిన అత్యంత గొప్ప కవిని  మనం కోల్పోయాము" అని నివాళులర్పించారు.

    ఇదీ చదవండి: ఈ వెహికల్‌ తెచ్చిన లక్‌ : నెలకు రూ. 45 వేల

  • మైసూర్‌: కర్ణాటకలో విషాదం జరిగింది. 43 ఏళ్ల ఐటీ నిపుణుడు మృతిచెందారు. వ్యవసాయ పనుల్లో ఉండగా.. పిడుగు పడి టెక్కీ రోషన్‌ బాలకృష్ణ మరణించారు. మడికేరి పట్టణానికి చెందిన రోషన్‌.. కుటుంబంతో కలిసి పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఇటీవలే వ్యవసాయం మీద ఆసక్తితో తన ఐటీ జాబ్‌ను వదిలేసి.. ఒక స్నేహితుడితో కలిసి సాగు బాట పట్టారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను విక్రయించే (మార్కెటింగ్) వ్యాపారంలో కూడా ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇంటి నుంచే ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

    రోషన్ తన వ్యవసాయ ప్రణాళికల్లో భాగంగా ఒక భూమిని పరిశీలించడానికి మైసూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు భార్య, కుమారుడు కూడా ఉన్నారు. ఆ పొలం సమీపంలో రోషన్‌.. ఒక మామిడి చెట్టు దగ్గర కాయలు కోయడానికి ఆగిన సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

    రోషన్ బాలకృష్ణ కుటుంబానికి  రూ. 5 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మొత్తంలో రూ.4 లక్షలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి, మిగిలిన రూ.1 లక్షను జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుండి విడుదల చేయనున్నారు.

     

  • జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) వ్యవస్థాపకుడు, సీఈఓ  ఆకాష్ గుప్తా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక సాధారణ రోడ్‌సైడ్ సంభాషణ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఒకపుడు నిరుద్యోగిగా  ఉన్న వ్యక్తి జీవితం ఎలక్ట్రిక్‌ వాహనం కొనుగోలు చేయడం ద్వారా అనూహ్యం మలుపు తిరిగింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఎలాంటి అద్భుతమైన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తోందో కళ్లకు కట్టిందంటూ  ఆయన  ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.

    ఇది కేవలం ఒక వ్యవస్థాపకుడు ,కస్టమర్ మధ్య జరిగే సంభాషణ, ఎపుడైనా జరగవచ్చు..రాత్రి 11 గంటల సమయంలో నడుస్తూ అతనితో సంభాషణ అంటూ  ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుండి నగరానికి వలస వచ్చిన ఒక యువ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉన్న ఆ యువకుడు.. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అద్దెకు తీసుకుని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆర్డర్‌లను డెలివరీ చేస్తూ రోజుకు సగటున రూ. 1,500 సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు.  ఇందులో స్కూటర్ అద్దె  వారానికి రూ. 2,100 (రోజుకు సుమారు రూ. 300) నెలకు దాదాపు రూ. 45,000 వరకు సంపాదిస్తున్నాడు.

    ఈ వివరాలు విన్న ఆకాష్ గుప్తా ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ.. ఈ బిజినెస్ మోడల్ ఒక "సూపర్ హిట్" అని, సంప్రదాయ ఉపాధి అడ్డంకులను తొలగించడంలో ఇది నిజమైన "విప్లవాత్మక మార్పు" అని అభివర్ణించారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. ఆ యువకుడు నవ్వుతూ, తను సంపాదించే మొత్తంలో దాదాపు అంతా ఫిరోజాబాద్‌లోని తన కుటుంబానికే తిరిగి పంపుతున్నానని చెప్పాడు.

    ఈవీల వల్ల తగ్గిన పెట్టుబడి భారం
    తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు అద్దెకు దొరుకుతుండటం వల్ల, గిగ్-ఎకానమీ (Gig-economy/Delivery jobs) లోకి ప్రవేశించాలనుకునే కార్మికులకు పెట్టుబడి భారం తగ్గి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, గ్రామీణ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక గొప్ప మార్గంగా నిలుస్తోందని ఈ సంఘటన నిరూపించింది అంటున్నారు  నిపుణులు.

     

     

    ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!

    సోషల్ మీడియా స్పందన
    ఆకాష్ గుప్తా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా , స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. ఈ ఇద్దరు కో-ఫౌండర్స్ , పార్ట్నర్స్ ఆకాష్ , ఆయన భార్య మధ్య ఉన్న ప్రత్యేకత ఇదే. ఆకాష్ ఆ డెలివరీ బాయ్ నేపథ్యం, ఉద్యోగ అనుభవంపై దృష్టి పెట్టగా.. ఆయన భార్య మాత్రం జిప్ (Zypp) వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎదురవుతున్న సౌకర్యాలు, సవాళ్లు వంటి ప్రాక్టికల్ విషయాల గురించి అడిగారు. దీంతో ఈ సంభాషణ మరింత అర్థవంతంగా మారింది అంటూ దంపతులిద్దరిపైనా ప్రశంసలు కురిపించారు. 

    ఇదీ స్పందించండి : భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా?

  • సాక్షి, న్యూఢిల్లీ:  సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు స్పందించారు. ఓఎస్ఎం వ్యత్యాసాలకు, విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యతవహిస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలను గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

    ఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రధాన్, బోర్డు  కొత్త డిజిటల్ మూల్యాంకన నమూనాను సమర్థించడంతో పాటు, విద్యార్థులు ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా అంగీకరించారు.స్కాన్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటం, జవాబులను సరిచూసుకోలేదని ఆరోపణలు, పోర్టల్ క్రాష్‌లు, చెల్లింపు సమస్యలు, పునఃమూల్యాంకన ప్రక్రియలో గందరగోళం వంటి అంశాలపై  అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన  నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి తాను బాధ్యత తీసుకుంటున్నానని,  అవకతవకలు కనుగొనబడితే "ఎవరినీ వదిలిపెట్టబోమని" విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు దీన్ని సరిచేసేలా పరిష్కారం కనుగొంటామనీ తామందరూ ఆ పనిపైనే పనిచేస్తున్నామని హామీ ఇచ్చారు. పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థుల 98 లక్షల కాపీల జవాబు పత్రాలను భద్రపరిచామని వెల్లడించారు. 

    ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా?

    కాగా సీబీఎస్‌ఈ మార్క్‌ల షీట్లు తారుమారు కావడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై  విద్యార్థులు ఆన్‌లైన్‌ వేదికగా తమ అనుభవాలను స్ర్కీన్‌ షాట్లతో  సహా పంచుకోవడంతోఇది మరింత ముదిరింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా  సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్‌ జనతా పార్టీ కూడా  ప్రదాన్‌   నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌  చేసింది.  

  • కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కబోతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఆస్తుల వివరాలపై నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది.. 

    డీకే శివకుమార్‌ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. వొక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే.. విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.

    1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సతనూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత ప్రభావవంతమైన వొక్కలిగ నేతగా గుర్తింపు పొందారు.

    కుటుంబం కూడా హైప్రొఫైల్‌!
    డీకే శివకుమార్‌ భార్య ఉషా శివకుమార్‌. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. ఒక కుమారుడు ఆకాశ్‌. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త, కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం దేశవ్యాప్తంగా హైప్రొఫైల్‌ ఈవెంట్‌గా నిలిచింది.

    డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్‌ కుమార్‌ కూడా కాంగ్రెస్‌ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్‌ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్‌లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది.

    కాంగ్రెస్‌కు ‘ట్రబుల్‌ షూటర్‌’
    డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్‌ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్‌లో అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

    దేశంలోనే ధనిక నేతల్లో ఒకరు
    డీకే శివకుమార్‌ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు రూ.840 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

    వ్యవసాయ భూములు, కమర్షియల్‌ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల రూ.43 లక్షల విలువైన కార్టియర్‌ వాచ్‌పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే.. “నా దగ్గర రోలెక్స్‌ కూడా ఉంది” అంటూ సెటైరిక్‌గా బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు.

    ఈడీ, ఐటీ కేసులతోనూ వార్తల్లో..
    డీకే శివకుమార్‌ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌, ఐటీ దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకూ వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో తిరిగి నిలబడ్డారు.

    ఇప్పుడు సీఎం కుర్చీ..
    2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్‌ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్‌ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. ఆయన కల నిజం కాబోతోందన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

  • బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి సారించింది. శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలనేదానిపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.

    యువతకు ‍ప్రాధాన్యత
    మంత్రివర్గంలోకి అధికశాతం యువకులను తీసుకోవాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. 2028లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో మార్పును ప్రతిబింబించేలా, యువతను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేరళ తరహాలోనే యువ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ తన వ్యూహంలో భాగంగా, ప్రస్తుతమున్న 35 మంది మంత్రులలో 25 మందిని తొలగించి, వారిని పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేసే అవకాశం ఉంది.

    ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రతిపాదన
    కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలనే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారిలో ఒకరిని దళిత నేతకు కేటాయించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి లేరు. ఉపముఖ్యమంత్రి పదవిని దళిత నేతకు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న జి. పరమేశ్వర దళిత నేత కావడం గమనార్హం. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న దళిత, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పార్టీ భావిస్తోంది.

    భిన్నాభిప్రాయాలు
    అయితే ఉపముఖ్యమంత్రుల సంఖ్య విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ వర్గం ఒక్కరికే అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సిద్ధరామయ్య వర్గం మాత్రం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కొత్త మంత్రివర్గం రాజకీయంగా సమతుల్యంగా ఉండాలని, ఏ ఒక్క వర్గం లేదా క్యాంపునకు అనుకూలంగా ఉండకూడదని రాహుల్ గాంధీ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపారు. నెలల తరబడి సాగిన అంతర్గత పోరుకు తెరదించుతూ, మంగళవారం ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ఒప్పించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విజయం సాధించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా సిద్ధరామయ్య ఎగువ సభలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి: బీజేపీలో భారీ ప్రక్షాళన: కీలక రాష్ట్రాలకు కొత్త సారథులు!

Movies

  • పాన్‌ ఇండియా స్థాయిలో జూన్‌ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. భోపాల్‌, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్‌ భారత్‌ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్‌ అనే ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్‌ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్‌ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’’ అని చరణ్‌ వివరించారు.

    ఇక భోపాల్‌లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్‌ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు.  

    గతంలో భోపాల్‌లో జరిగిన ఈవెంట్‌లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్‌ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు.  

    మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్‌ను అనధికారికంగా అప్‌లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి.

  • తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్)

    'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

    హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత.

    (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)

  • వచ్చేవారం ఈపాటికే థియేటర్లలోకి వచ్చేయబోతున్న సినిమా 'పెద్ది'. ఇందులో రామ్ చరణ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా అంటే రెజ్లర్, క్రికెటర్, రన్నర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఓ మాదిరి హైప్ తీసుకొచ్చింది. మూడు పాటలు కూడా రాగా వాటిలో చికిరి చికిరి, రయ్ రయ్ రారా.. అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోగా, ఐటమ్ సాంగ్ మాత్రం మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)

    ఇ‍ప్పుడు 'మస్సా మస్సా' అంటూ సాగే పాటని వదిలారు. అయితే లిరికల్ వీడియోలా కాకుండా కేవలం పాటకు సంబంధించిన ఆడియోని మాత్రమే రిలీజ్ చేశారు. ట్రైలర్, టీజర్‌లో వినిపించిన క్రేజీ మ్యూజిక్ సంబంధించిన పాట ఇది. కొన్నిరోజుల క్రితం భోపాల్ ఈవెంట్‌లో ఈ పాటని ఫెర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు స్ట్రీమింగ్)

    s

  • తెలుగు హీరో రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా' మన దేశంలో ఇండీ  సినిమాలకు సరికొత్త ప్లాట్‌ఫామ్‌గా మారుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇండియాలోని అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, క్రియేటివ్ కథలను సపోర్ట్ చేస్తూ వాటిని థియేటర్ల వరకు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలను, మన నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడమే స్పిరిట్ మీడియా మెయిన్ టార్గెట్.

    దీనివల్ల పెద్దగా గుర్తింపు లేని ఎంతోమంది ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలకు తమ కథలను దేశవ్యాప్తంగా చూపించే ఒక అద్భుతమైన ఛాన్స్ దొరుకుతోంది. ఈ ఇండీ ఫిలిం మూవ్‌మెంట్‌లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ సినిమాలు చాలా స్పెషల్‌గా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అసోం, మణిపూర్ లాంటి ప్రాంతాల నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతి ఇస్తున్నాయి. అక్కడి విభిన్నమైన కల్చర్‌ని, అచ్చమైన భావోద్వేగాలని చాలా రియలిస్టిక్‌గా చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సిక్కిం మూవీ 'షేప్ ఆఫ్ మోమో'ని చెప్పుకోవచ్చు.

    ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే 15కి పైగా అంతర్జాతీయ అవార్డ్స్ గెలుచుకుంది. జోయా అక్తర్, పాయల్ కపాడియా లాంటి క్రేజీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇలాంటి అద్భుతమైన సినిమాలను థియేటర్లకు తీసుకురావడం ద్వారా స్పిరిట్ మీడియా అన్ని ప్రాంతాల సినిమాలకు సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి సినిమా కల్చర్ ని బిల్డ్ చేస్తోంది.

  • మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి త్రికాల, బ్లాస్ట్ జోన్, కాటలాన్ లాంటి చిన్న, డబ్బింగ్ చిత్రాలే రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం కాస్త చెప్పుకోదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇప్పటికే ధనుష్ 'కర', సత్య 'జెట్ లీ', 'డ్రింకర్ సాయి' తదితర సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేయగా ఇవి కాకుండా మరో 16కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు శుక్రవారం ఒక్కరోజే రాబోతున్నాయి. ఇంతకీ అవేంటి? ఏది ఎందులోకి రానుందనేది చూద్దాం.

    (ఇదీ చదవండి: 'పెద్ది' కూడా రిలీజ్ అవుతోంది.. 'విశ్వంభర' ఎక్కడ?)

    ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు (మే 29)

    అమెజాన్ ప్రైమ్

    • లీడర్ - తెలుగు డబ్బింగ్ మూవీ

    • సుఖమానో సుఖమమ్ - మలయాళ సినిమా

    • ద లాస్ట్ వికింగ్ - డానిష్ మూవీ

    హాట్‌స్టార్

    • కజిన్స్ అండ్ కల్యాణమ్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

    • లార్డ్ కర్జోన్ కీ హవేలీ - హిందీ సినిమా (మే 30)

    • జాలీ ఎల్ఎల్‌బీ 3 - హిందీ మూవీ

    • జెట్ లీ - తెలుగు చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

    ఆహా

    • సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ - తెలుగు సినిమా

    నెట్‌ఫ్లిక్స్

    • బ్రెజిల్స్ 70: ద థర్డ్ స్టార్ - పోర్చుగీస్ సిరీస్

    • కలబాసస్ కాన్ఫిడెంటల్ - ఇంగ్లీష్ సిరీస్

    • రఫా - స్పానిష్ సిరీస్

    • కర - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

    సన్ నెక్స్ట్

    • ఫేసెస్ - తెలుగు డబ్బింగ్ సినిమా

    జీ5

    • ద అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - బెంగాలీ సిరీస్

    • డ్రింకర్ సాయి - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

    ఆపిల్ టీవీ ప్లస్

    • ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ - ఇంగ్లీష్ సినిమా

    • స్టార్ సిటీ - ఇంగ్లీష్ సిరీస్

    లయన్స్ గేట్ ప్లే

    • ద రేస్ - రొమేనియన్ మూవీ

    హెచ్‌బీఓ మ్యాక్స్

    • ద మూమెంట్ - ఇంగ్లీష్ సినిమా

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

  • పాదాల వరకు జడతో షాకిచ్చిన అనికా సురేంద్రన్

    మామిడిపళ్లు పట్టుకుని మురిసిపోతున్న మిథిలా

    నిషా కళ్లతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్

    జీన్స్ టీషర్ట్‌లో టామ్ బాయ్‌లా యాంకర్ శ్రీముఖి

    హెలికాప్టర్ రైడ్‌లో భర్తతో కలిసి మెహ్రీన్ చిల్

    బక్రీద్ శుభాకాంక్షలు చెప్పిన ప్రియా వారియర్

  • పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేని హీరోల సినిమాలకు సమస్యలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా రిలీజ్ అవడానికి నానా పాట్లు పడుతుంటే ఏమనుకోవాలి. అవును 'విశ్వంభర' గురించే ఈ డిస్కషన్. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. భారీ బడ్జెట్, సోషియో ఫాంటసీ ‍స్టోరీ అని ఓ రేంజ్ హైప్ ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఇంతకీ 'విశ్వంభర' రిలీజ్ ఎక్కడివరకు వచ్చింది?

    (ఇదీ చదవండి: మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌ 'త్రికాల' రివ్యూ)

    చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చాన్నాళ్ల క్రితం మొదలైన సినిమా 'విశ్వంభర'. యూవీ క్రియేషన్ దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిందని రూమర్స్ వచ్చాయి. అయితే రెండున్నరేళ్ల క్రితం టీజర్ రిలీజైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఘోరాతీఘోరంగా విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ అంతా పునరాలోచనలో పడిపోయింది.

    తర్వాత మరో వీడియో రిలీజ్ చేశారు. ఓ పాట వదిలారు. అయినా సరే బజ్ రాలేదు. దీని షూటింగ్ గతేడాది పూర్తి చేసిన చిరంజీవి.. అనిల్ రావిపూడితో 'మన శంకరవరప్రసాద్' సినిమా చేశారు. ఇది రిలీజై 5 నెలలు దాటేసింది. విశ్వంభర చిత్రం ఈ ఏడాది వేసవిలో రావొచ్చని కొన్ని నెలల క్రితం అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు వేసవి కూడా దాదాపు అయిపోవచ్చింది. కానీ చిరు మూవీ సంగతేంటనేది ఎవరికీ తెలీదు.

    అదుగో ట్రైలర్, ఇదుగో మూవీ రిలీజ్ డేట్ అని పలు సందర్భాల్లో రూమర్స్ వస్తున్నాయి. కానీ వీటిని జనాలు లైట్ తీసుకుంటున్నారు. చూస్తుంటే ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌కే ఈ చిత్రంపై దాదాపుగా ఇంట్రెస్ట్ పోయినట్లు అనిపిస్తుంది. రీసెంట్‌గానే బాబీ దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెట్టిన చిరు.. దీని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు 'పెద్ది' విషయంలో ఏర్పడిన పర్సంటేజీ సమస్యని కూడా పరిష్కరించారు. కానీ 'విశ్వంభర' విషయంలో ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఈ ఏడాదిలోనైనా మూవీ రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారపోయింది.

    (ఇదీ చదవండి: చిరు జోక్యంతో సద్దుమణిగిన 'పెద్ది' వివాదం)

  • కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌ కథతో తీసిన సినిమా 'త్రికాల'. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను తదితర అంశాలతో దీన్ని తీశారు. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

    కథేంటి?
    శ‌తాబ్దాల క్రితం కుమారి ఖండం అనే ప్రాంతంలో కొందరు ఋషులు.. శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన రహస్యాలను ఓ రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. వాటిని రక్షించేందుకు ఓ ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. ప్రస్తుతానికొస్తే శివ (మాస్టర్ మహేంద్రన్) కనిపించకుండా పోయిన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం సిటీకి వస్తాడు. ఇతడి జీవితంలోకి వైతరణ్ వస్తాడు. నిజానికి ఇతడు పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. ఇతడి ఆత్మ ఓ బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    'త్రికాల' రొటీన్ హారర్ సినిమా కాదు. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్‌ తదితర అంశాలతో తీశారు. పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం, డార్క్ ఫాంటసీ లాంటివి బాగానే కుదిరాయి. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రలతో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతని ఆధునిక ప్రపంచంతో మిక్స్ చేసి చూపించారు.

    అలానే వైతరణ్ పాత్రలో అజయ్, శివగా మాస్టర్ మహేంద్రన్, సైకియాట్రిస్ట్‌గా శ్రద్ధా దాస్ పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగిలిన పాత్రధారులు తమ వంతు న్యాయం చేశారు. దర్శకుడు మణి తెల్లగూటి కూడా మెప్పించాడు. సినిమాటోగ్రాఫర్ పవన్ తనదైన కెమెరా మ్యాజిక్ చేశారు. థ్రిల్లింగ్ మూడ్ తీసుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ సినిమాకు సెట్ అయింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్ తదితర విజువల్స్ ఆకట్టుకున్నాయి.

    (ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాం! ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండు మారింది. ఓపక్క యాక్టింగ్‌ చేస్తూనే మరోపక్క మెడిసిన్‌ పూర్తి చేస్తున్నారు తారలు. కొందరైతే డాక్టరయ్యాక కూడా యాక్టర్‌ అవొచ్చని నిరూపిస్తున్నారు. అలాంటివారి జాబితాలోకే వస్తుంది నటి శ్రద్ధా గోకుల్‌. ఈమె మలయాళ దృశ్యం 3 మూవీలో నర్సుగా కనిపించింది. కానీ నిజ జీవితంలో ఈమె మాత్రం నర్సు కాదు, ఏకంగా వైద్యురాలు.. తనగురించే ఈ ప్రత్యేక కథనం..

    చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా..
    మలయాళ నటి శ్రద్ధా గోకుల్‌కు సినిమాలు కొత్తేం కావు. చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. 'హలో కుట్టిచేతన్‌' అనే మలయాళ సీరియల్‌లో వర్ష పాత్రలో కనిపించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అప్పట్లోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇది కేవలం పిల్లల కోసమే డిజైన్‌ చేసిన సీరియల్‌. ఈ సీరియల్‌ కంటే ముందు సూపర్‌ డ్యాన్సర్‌ జూనియర్‌ అనే డ్యాన్స్‌ షోలో పాల్గొంది శ్రద్ధా.

    చదువు నిర్లక్ష్యం చేయొద్దని..
    సీరియల్స్‌లో క్లిక్‌ అవడంతో దుల్కర్‌ సల్మాన్‌ 'పట్టం పోలే' మలయాళ మూవీలో నటించే ఛాన్స్‌ చేజిక్కించుకుంది. తర్వాత సినిమా అవకాశాలు రాలేదని కాదు కానీ చదువును నిర్లక్ష్యం చేయొద్దనుకుంది. నటనకు బ్రేక్‌ ఇచ్చేసి చదువుపైనే దృష్టి సారించింది. ఫిలిప్పీన్స్‌లో మెడిసిన్‌ పూర్తి చేసింది. అనంతరం కేరళ తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసింది.

    రీఎంట్రీ
    తను సినిమాల్లోకి వస్తుందని మళ్లీ ఊహించలేదు. కానీ అనుకోకుండా కొచ్చిలో ఓ ఆడిషన్‌కు వెళ్లింది. అక్కడ సెలక్ట్‌ అవడంతో జీతూ జోసెఫ్‌ డైరెక్ట్‌ చేసిన 'వళతు వశతె కల్లాన్‌' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో చిన్న పాత్రే అయినా బాగా క్లిక్‌ అయింది. దాంతో జీతూ జోసెఫ్‌ ఆమెకు దృశ్యం 3లో ఛాన్స్‌ ఇచ్చాడు. ఇందులో డాక్టర్‌ శ్రద్ధా గోకుల్‌ నర్సుగా కనిపించింది.

    యాక్టింగ్‌, మెడిసిన్‌.. రెండింటినీ వదిలేయాలని లేదు. డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయాలనుంది. దానికోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాను. అలాగే నాకు డ్యాన్సింగ్‌, యాక్టింగ్‌  రెండూ చాలా ఇష్టం. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను.
    - శ్రద్ధా గోకుల్‌

     

     

    చదవండి: కుటుంబమంతా చనిపోవాలనుకున్నాం.. ఒంటిపై కిరోసిన్‌ పోశా..: శివకుమార్‌

  • తమిళ స్టార్ హీరో సూర్య హిట్ కొట్టి ఏళ్లు గడిచిపోయింది. అయితే ఈ నెల రెండో వారం వచ్చిన 'కరుప్పు'(తెలుగు 'వీరభద్రుడు') ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఇది థియేటర్లలో ఆడుతోంది. ఇంతలోనే మరో మూవీ రిలీజ్ డేట్ ని సూర్య ప్రకటించేశాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

    సర్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి.. సూర్యతో తీసిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. మమిత బైజు హీరోయిన్. సాఫ్ట్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. 40 ఏళ్లు దాటేసిన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడితే అనేది కాన్సెప్ట్. లెక్క ప్రకారం జూలైలోనే తీసుకురావొచ్చని అనుకున్నారు. కానీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ తో ప్రకటించారు.

    'కరుప్పు'తో సక్సెస్ అందుకున్న సూర్య.. 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడనేది చూడాలి. ఇందులో రాధిక, రవీనా టండన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీత దర్శకుడు.

    (ఇదీ చదవండి: ఈ గుండెని తాకిపో తాతా: తారక్‌ ఎమోషనల్‌ పోస్ట్‌)

  • యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్'. సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసింది. అర్జున్‌ సినిమా కావడంతో టాలీవుడ్‌లోనూ ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 28) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    రాజారామన్ (అర్జున్ సర్జా) కరాటే మాస్టర్. ఆయన సతీమణి నీలవేణి(అభిరామి), కూతురు నీల(ప్రీతి ముకుందన్‌)తో పాటు కుటుంబ సభ్యులంతా మార్షన్‌ ఆర్ట్స్‌లో నిపుణులు. ఒకపక్క కరాటే శిక్షణ ఇస్తూనే మరోపక్క మెడికల్‌ షాపు రన్‌ చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుంటారు. తనతో దురుసుగా ప్రవర్తించే మగాళ్లను చితకబాదుతూ.. తల్లితో తింట్లు తింటుంది నీల. కూతురుకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నీలవేణి ప్లాన్‌ చేస్తుండగా.. అనుకోకుండా ఒక పెద్ద క్రిమినల్ గ్యాంగ్‌తో శత్రుత్వం ఏర్పడుతుంది. వారి వెనుక బడా వ్యాపారవేత్త వరుణ్‌ దయాల(జాన్ కొక్కెన్) ఉంటాడు. ఓ ఇల్లీగల్‌ బిజినెస్‌ డీల్‌ కోసం అతను మంత్రికి లంచంగా ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లు చేరాల్సిన చోటుకి చేరకుండా పరోక్షంగా రాజారామన్‌ ఫ్యామిలీ అడ్డుకుంటుంది. దీంతో వరుణ్‌ దయాల మనుషులు కూడా రాజా రామన్‌ ఫ్యామిలీని చంపేందుకు ప్లాన్‌ చేస్తారు. ఈ ప్రమాదం నుంచి రాజారామన్‌ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? రూ. 1000 కోట్ల లంచం వెనుక ఉన్న రూ. 7000 కోట్ల ఇల్లీగల్‌ బిజినెస్‌ ఏంటి? ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న మార్షన్‌ ఆర్ట్స్‌ శిక్షణతో అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యాన్ని రాజా రామన్‌ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది? అనేదే మిగతా కథ. 

    ఎలా ఉందంటే..
    ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సమాజంలో అన్యాయాలు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అనే సందేశం ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏమి లేదు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత పెద్దగా బోర్‌ కొట్టదు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అలాగే కథనం చాలా వరకు ఊహకందేలా సాగుతుంది. అయితే కొన్ని కథల విషయంలో తర్వాత ఏం జరుగుతుందనేది ముందే తెలిసినా.. దాన్ని తెరపై ఎలా ప్రజెంట్‌ చేస్తాడనే క్యూరియాసిటీ మాత్రం ప్రేక్షకుడిలో కలుగుతుంది. తాను ఊహించినట్లుగానే ఆయా సన్నివేశాలు సాగితే.. కథతో మరింత కనెక్ట్‌ అవుతాడు. ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఊహించినట్లుగానే కథనం సాగినా.. ఆసక్తి మాత్రం తగ్గదు. బోర్‌ కొడుతుందని ప్రేక్షకుడు ఫీలయ్యేలోపు ఓ భారీ యాక్షన్‌ సీన్‌తో పాటు ప్రతి పాత్రకు ఎలివేషన్‌ ఇచ్చి కథతో లీనమయ్యేలా చేశాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు.

    సినిమా ప్రారంభంలో రాజారామన్‌ ఫ్యామిలీని ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఒకవైపు రాజారామన్‌ ఫ్యామిలీ స్టోరీని, మరోవైపు రౌడీ వ్యాపారవేత్త వరుణ్‌ దయాల్‌ రూ. 7000 కోట్ల బిజినెస్‌ డీల్‌ని చూపిస్తూ కథనం నడిపించి ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచేశాడు. ఈ రెండు కథలకు మధ్య సంబంధం ఉంటుందని ప్రేక్షకుడు ఊహించినా.. ఎలా ముడిపెడతాడనే ఆసక్తి మాత్రం ఫస్టాఫ్‌ అంతా కొనసాగుతుంది. 

    ఫ్యామిలీ సీన్లు రొటీన్‌గానే ఉన్నా.. ప్రతీ ముకుందన్‌ చేసే యాక్షన్‌ సీన్స్‌ మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్‌కి ముందు ఇంట్లో అర్జున్‌, ప్రీతి ముకుందన్‌, అభిరామి చేసే యాక్షన్‌ సీన్‌ అదిరిపోతుంది. ఇంటర్వెల్‌ బ్లాస్ట్‌ బాగుంటుంది. ఇక ద్వితియార్థంలో అర్జున్‌ ఫ్యామిలీ.. రౌడీలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఉంటుంది. కథనం ఊహకందేలా సాగినా.. యాక్షన్‌ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. ముగింపు రొటీన్‌గానే ఉంటుంది. 

    ఎవరెలా చేశారంటే.. 
    చాలా రోజుల తర్వాత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా చేసిన యాక్షన్‌ సినిమా ఇది. రాజారామన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు. కొన్ని చోట్ల వింటేజ్‌ అర్జున్‌ని చూస్తారు. ఇక ఇన్నాళ్లు కేవలం గ్లామర్‌ పాత్రకే పరిమితం అయిన ప్రీతి ముకుందన్‌, అభిరామి.. ఇందులో యాక్షన్‌ సీన్స్‌ చేసి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని చేసిన హై-ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్సులు సినిమాకు కొత్తదనం తెచ్చాయని చెప్పొచ్చు. వరుణ్‌ దయాల్‌గా జాన్‌ కొక్కేన్‌, అబ్రహాంగా అర్జున్‌ చిదంబరం, కిరుబకరన్‌గా పవన్‌ కృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రవి బస్రూర్‌ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • శివకుమార్‌.. ఈ బుల్లితెర నటుడు మౌనరాగం సీరియల్‌తో ఫేమస్‌ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో ఓ ధారావాహికలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే సీరియల్స్‌ కన్నా సోషల్‌ మీడియాలోనే ఈయన ఎక్కువ పాపులర్‌ అయ్యాడు. ముఖ్యంగా అతడి ప్రేమ వ్యవహారం ఆన్‌లైన్‌లో ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.

    కలిసుంటున్న జోడీ
    'మౌనరాగం', 'జానకి కలగనలేదు' సీరియల్స్‌ నటి ప్రియాంక జైన్‌తో రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డాడు. కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు, ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ప్రియాంక ఆల్‌రెడీ తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో రాబోయే బిగ్‌బాస్‌ సీజన్లలో ఆమె ప్రియుడు శివకుమార్‌ ఉండటం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు.

    ప్రియాంకజైన్‌తో శివకుమార్‌

    తండ్రి కర్కశత్వం
    పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే శివకుమార్‌ బాల్యంలో మాత్రం తండ్రి ప్రేమకు నోచుకోలేదు. ప్రేమను పంచాల్సిన తండ్రి బాధ పెడుతుంటే తట్టుకోలేకపోయాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. శివకుమార్‌ మాట్లాడుతూ.. మా అమ్మ స్కూల్‌ టీచర్‌. సాయంత్రం 5 తర్వాత అరగంట ఆలస్యంగా వస్తే చాలు అమ్మపై నాన్న కోప్పడేవాడు. ఎవడితో తిరుగుతున్నావ్‌? అని నీచంగా మాట్లాడేవాడు. అమ్మను కొట్టేవాడు. 

    రూ.20 కోసం పెద్ద గొడవ
    ప్రతిరోజు ఇదంతా చూసి అలిసిపోయాను. ఆయన ప్రవర్తనకు విసిగిపోయాను. ఆయన మందు తాగుతాడు, గుట్కా నములుతాడు, ఎన్నో ఎఫైర్స్‌ ఉన్నాయి. మా నాన్నను చూశాక మా చెల్లికి అబ్బాయిలంటేనే విరక్తి వచ్చేసింది. ఒకరోజు ఏమైందంటే.. మా నాన్న జేబులో రూ.20 కనిపించలేదు. ఆయనే ఎక్కడో తాగినచోట ఖర్చు చేసుంటాడు.  నేనే తీశానని నాపై నింద వేశాడు. ఆయన చేసిన గొడవకు ఊరంతా మా ఇంటి ముందుకొచ్చింది. 

    కుటుంబమంతా చనిపోదామని..
    కేవలం రూ.20 కోసం అంత పెద్ద గొడవ! ఈ జీవితమే వద్దు అని చచ్చిపోవాలనుకున్నా.. నాతోపాటు అమ్మ, చెల్లిపై కిరోసిన్‌ గుమ్మరించాను. అగ్గిపుల్ల వెలిగించేలోపు అమ్మ స్టూడెంట్‌ ఒకరు మమ్మల్ని బయటకు తీసుకెళ్లి కాపాడారు. ఆరోజు గనక తను ఆపకపోయుంటే ఈరోజు శివకుమార్‌ మీ ముందుండేవాడు కాదు. ఎవరినైనా మంచి తండ్రిని చూసినప్పుడు నాకెందుకు ఇలాంటి నాన్న లేడని బాధపడేవాడిని. నాన్న ప్రేమను పొందలేకపోయాను. ఇలాంటి వ్యక్తితో ఇంకా ఎందుకు కలిసుండటం? విడాకులు ఇచ్చేయమని అమ్మతో అనేవాడిని. ఇన్నాళ్లకు వాళ్లిద్దరికీ విడాకులు ఇప్పిస్తున్నాను అని శివకుమార్‌ ఎమోషనలయ్యాడు.

    NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
    ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
    మెయిల్: roshnihelp@gmail.com

    చదవండి: పాతిక వేల సాయం.. దాని విలువ ఇప్పుడు రూ.5 కోట్లు

  • విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 103వ జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన మనవడు, హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చుని తాతతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

    వీడియో వైరల్‌
    జూనియర్‌ ఎన్టీఆర్‌ రాక నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని హీరోకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయి కిందపడ్డాడు. దీంతో తారక్‌.. అతడిని పైకి లేపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    గుండె తల్లడిల్లుతోంది
    జూనియర్‌ ఎన్టీఆర్‌.. తాతను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలోనూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు.

    జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్ Jr. NTR కోసం పోటెత్తిన ఫ్యాన్స్

     

     

     

Telangana

  • హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ "ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’ కార్యక్రమంతో రాష్ట్రాల మధ్య సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల కు కనెక్టివిటీ నీ కేంద్ర ప్రభుత్వం పెంచిందని తద్వారా ఈశాన్య రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలకు మరింతగా సాంస్కృతికంగా చేరువయ్యాయని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.

    కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్-యువ సంగమ్ ఫేజ్-6’ కార్యక్రమంలో భాగంగా మేఘాలయ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) షిల్లాంగ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు గురువారం లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానాల పరస్పర అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.

    యువత దేశ సమైక్యత, జాతీయ సమగ్రత బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి విశేషాలను విద్యార్థులకు అధికారులు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ కిరణ్ కుమార్, సునీల్ కుమార్, ప్రొఫెసర్ పెరుగు శ్యామ్ (కో-నోడల్ ఆఫీసర్), ప్రొఫెసర్ హరిప్రసాద్ రెడ్డి (నోడల్ ఆఫీసర్) పాల్గొన్నారు.

    గవర్నర్‌ను కలిసిన ఎన్‌ఎస్‌జీ గ్రూప్ కమాండర్‌
    నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ), ముంబై 28 స్పెషల్‌ కాంపోజిట్‌ గ్రూప్‌ (ఎస్‌సీజీ) గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ అభిషేక్‌ సింగ్‌ గురువారం లోక్‌ భవన్‌లో  గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను కలిశారు.
     

  • హైదరాబాద్ :  ప్రపంచానికే  తలమానికంగా  ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు.   గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.

    ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్నికి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

    ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో  “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

    ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
    ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.

    అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీకె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌:  టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. రంగారెడ్డి శేరిలింగపల్లి మండలంలోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలం నిర్వహించగా, వాటికి రికార్డు ధర పలికింది. 

    సర్వే నంబర్  83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించింది టీజీఐఐసీ. ఈ-వేలంలో ఎకరం భూమి ధర రూ. 237 కోట్లు పలికింది. గతేడాది ఇక్కడ ఎకరం భూమి ధర రూ.177 కోట్లు పలకగా, ఈ ఏడాది మరింత పెరిగి ఎకరం రూ. 237 కోట్లు పలకడం విశేషం.  

    మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్‌ దక్కించుకుంది.గతేడాది  ఎకరం రూ. 177 కోట్లకు ఎంఎస్‌ఎన్‌ రియాల్టీ దక్కించుకోగా, ఈసారి గౌర వెంచర్స్‌  ఎకరం భూమిని రూ. 237 కోట్లకు దక్కించుకుంది. జూన్‌ 1వ తేదీన మరో 5.09 ఎకరాలకు టీజీఐఐసీ వేలం వేయనుంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: తూర్పు, ఉత్తర తెలంగాణకు వడగాల్పుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వడదెబ్బతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 19 మంది మృతిచెందారు. 

    కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు తాజా వాతావరణం ఊరటనిచ్చింది. చాలాచోట్ల సాధారణంకంటే 2 నుంచి 6 డిగ్రీల మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గురువారం ఉత్తర, తూర్పు జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

    బుధవారం తూర్పు జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిశాయి. గురు, శుక్రవారాల్లో కూడా తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బిహార్‌ పరిసర ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  

    కాగా, ఏపీలో రాగల మూడు గంటల్లో  కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ  సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు . ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడరాదని విజ్ఞప్తి చేశారు.

Business

  • జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా .. భారతీయ మార్కెట్లో మెజెస్టర్‌ను లాంచ్ చేసింది. గ్లోస్టర్ స్థానంలో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ.40.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది టయోటా ఫార్చ్యూనర్ , వోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ , జీప్ మెరిడియన్, స్కోడా కోడియాక్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

    నాలుగు రంగులలో, 4x2, 4x4 కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండే ఎంజీ మెజెస్టర్‌ డిజైన్ పరంగా గ్లోస్టర్ దృఢంగా ఉంటుంది. భారీ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉన్నాయి. ఐదు మీటర్లకు పైగా పొడవు, 2,950mm వీల్‌బేస్‌తో, ఇది తన సెగ్మెంట్‌లోని అతిపెద్ద కారుగా నిలిచింది.

    ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, 12-స్పీకర్ల జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ సీటుకు మెమరీ, వెల్కమ్ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్ట్‌మెంట్ లభిస్తుంది, అలాగే ముందు సీట్లలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి.

    ఎంజీ మెజెస్టర్ 213 Bhp పవర్ 478.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో లభిస్తుంది. మెకానికల్ సెటప్ మారలేదు. ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్, మల్టిపుల్ టెర్రైన్ మోడ్‌ మొదలైనవి ఉన్నాయి.

    ఇదీ చదవండి: 2026 టియాగో ఈవీ లాంచ్: ధర రూ.4.70 లక్షలు!

  • భారతదేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడోరోజు (మే 28) పసిడి రేటు భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎక్కడ, ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో మే 26న 1,58,890 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి (మే 28) 1,56,060 రూపాయల వద్దకు చేరింది. అంటే మూడు రోజుల్లో 3320 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల ధర 1,45,650 రూపాయల నుంచి 1,43,050 వద్దకు (3050 రూపాయలు తగ్గింది) చేరింది.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 24 క్యారెట్ల తులం ధర రూ.1,59,040 దగ్గర నుంచి 1,56,210 రూపాయల (రూ.3320 తగ్గింది) వద్దకు.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,45,800 రూపాయల నుంచి 1,43,200 రూపాయల (3050 రూపాయలు తగ్గింది) వద్దకు చేరింది.

    చెన్నైలో బంగారం ధరలు.. మూడు రోజుల్లో భారీ మార్పుకు లోనయ్యాయి. ఇక్కడ మే 26న రూ.1,60,690 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మే 28 నాటికి 158180 రూపాయల (రూ.3060 తగ్గింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,47,300 నుంచి రూ. 1,45,000 వద్దకు (రూ.2800 తగ్గింది) చేరింది.

    ఇదీ చదవండి: ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది!

  • శాంసంగ్‌ ఇండియా తాజాగా విజన్‌ ఏఐ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. 72 టీవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. వీటిలో మైక్రో ఆర్‌జీబీ, ఓఎల్‌ఈడీ, నియో క్యూఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ మొదలైనవి ఉన్నాయి. శాంసంగ్‌ టీవీ ప్లస్‌ ద్వారా ఉచిత కంటెంట్, కేర్‌ ప్లస్‌ ద్వారా అదనపు వారంటీ మొదలైనవి పొందవచ్చు.

    పరిమిత కాలం పాటు నిర్దిష్ట టీవీ మోడల్స్‌పై కాంప్లిమెంటరీగా రూ. 1,02,990 విలువ చేసే సౌండ్‌బార్, రూ. 23,990 విలువ చేసే మ్యూజిక్‌ స్టూడియో ఉచితంగా లభిస్తాయని సంస్థ తెలిపింది. యూహెచ్‌డీ టీవీల శ్రేణి ధర రూ. 36,990 నుంచి, మైక్రో ఆర్‌జీబీ రేటు రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది.

  • కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీ గురించి చేసిన ప్రకటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీటిలో 7 శాతం ఇథనాల్ కలిపితే.. వంటగ్యాస్‌లా మంట వస్తుందని, ఇది ఎల్‌పీజీ కంటే తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఇది భవిష్యత్తులో వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందా?, ఇథనాల్ నిజంగా ఎల్‌పీజీ స్థానాన్ని భర్తీ చేయగలదా? అనే సందేహాలు తలెత్తాయి.

    ఇథనాల్ అనేది మండే స్వభావం కలిగిన ఒక ఆల్కహాల్. దీనిని ఇప్పటికే ఆటోమొబైల్స్‌లో బయోఫ్యూయల్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ద్రవరూపంలో ఉంటుంది. కాబట్టి గాలిలో ఆక్సిజన్‌తో కలిసినప్పుడు, సరైన ఉష్ణోగ్రత వద్ద మంట వస్తుంది. అయితే.. ఇథనాల్ మండటానికి దాని సాంద్రత చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    'జర్నల్ ఆఫ్ లాస్ ప్రివెన్షన్ ఇన్ ది ప్రాసెస్ ఇండస్ట్రీస్'లో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం.. నీటిలో ఇథనాల్ శాతం చాలా తక్కువగా ఉంటే.. మంట నిలకడగా ఉండదు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఇథనాల్ ఆవిరి త్వరగా ఏర్పడదు. అందుకే బీర్ వంటి ఆల్కహాల్ పానీయాలు సులభంగా మండవు. కానీ వాణిజ్యపరంగా ఉపయోగించే ఇథనాల్ స్టవ్‌లో 70 నుంచి 90 శాతం వరకు అధిక సాంద్రత కలిగిన ఇథనాల్‌ను ఉపయోగిస్తారు. అప్పుడు మాత్రమే ఎల్‌పీజీ మాదిరిగా మంట వస్తుంది.

    స్వచ్ఛమైన ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా మండే లక్షణం కలిగి ఉంటుంది. కానీ.. అందులో నీటి శాతం పెరిగేకొద్దీ మంట తగ్గిపోతుంది కష్టమవుతుంది. ఎందుకంటే నీరు వేడిని గ్రహించి, ఇథనాల్ ఆవిరి ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి సరైన నిష్పత్తి, ప్రత్యేక బర్నర్ టెక్నాలజీ ఉంటే మాత్రమే ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది.

    లేటెస్ట్ ఇథనాల్ స్టవ్‌లో ప్రెషరైజ్డ్ బర్నర్లు, ఫ్యూయల్ కార్ట్రిడ్జ్‌లు, ప్రీ-హీటింగ్ సిస్టమ్‌లు వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇవి ఇంధనాన్ని వేగంగా ఆవిరి చేసి స్థిరమైన మంటను అందిస్తాయి. అందువల్ల వంట సులభంగా పూర్తవుతుంది.

    భారతదేశంలో చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరుగుతోంది. ఇప్పటికే పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో వంట కోసం కూడా దేశీయంగా తయారయ్యే ఇథనాల్‌ను ఉపయోగిస్తే ఎల్‌పీజీ దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇథనాల్ మంట పగటి వేళల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాగే సరైన నిష్పత్తిలో ఇంధనం లేకపోతే మంట సరిగా రాకపోవచ్చు.

  • వెంచర్‌ క్యాపిటల్, ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) ఫండ్స్‌ పెట్టుబడులు గత నెలలో సగానికి క్షీణించాయి. వెరసి ఏప్రిల్‌లో 38 డీల్స్‌ ద్వారా 2.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా డాలరుతో మారకంలో రూపాయి క్షీణత, రాజకీయ భౌగోళిక ఆందోళనలు దెబ్బతీశాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్‌తో పోలిస్తే విలువలో 50 శాతం తగ్గాయి.

    2026 ఏప్రిల్‌లో 83 లావాదేవీలు నమోదయ్యాయి. ఇవి 29 నెలల కనిష్టంకాగా.. గతేడాది ఏప్రిల్‌లో 134, ఈ ఏడాది మార్చిలో 131 ట్రాన్సాక్షన్స్‌ జరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 96 స్థాయికి పడిపోవడం, అధికస్థాయిలలో కొనసాగుతున్న ముడిచమురు ధరలు, రాజకీయ భౌగోళిక ఆందోళనలు పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఈవై పార్ట్‌నర్‌ వివేక్‌ సోనీ పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్‌ ఆల్టర్నేటివ్స్‌ 28.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు గత నెలలో నమోదైన అతిపెద్ద డీల్‌గా నివేదిక తెలియజేసింది. బెంగళూరు, పుణేలలో ఆర్‌ఎంజెడ్‌ కార్యాలయ ఆస్తులలో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది.

  • న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి (2025–26 ఆర్థిక సంవత్సరం) ఐటీఆర్‌–2 (రిటర్నుల పత్రం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై రిటర్నుల దాఖలు సాధ్యపడుతుంది.

    వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), మూలధన లాభాలు ఆర్జించి ఉంటే ఐటీఆర్‌–2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15న ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–4 పత్రాలను సైతం ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తేవడం గమనార్హం. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్‌–1, 2 దాఖలుకు జూలై 31 తుది గడువుగా ఉంది.

    అదనంగా, ఈసారి ఐటీఆర్‌–2 ఫారంలో పన్ను చెల్లింపుదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, అధిక విలువ గల పెట్టుబడుల వివరాలను మరింత స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ముందుగా నింపిన సమాచారం (ప్రీ–ఫిల్డ్‌) సౌకర్యాన్ని కల్పించడం వల్ల బ్యాంక్ వడ్డీలు, డివిడెండ్‌లు, టీడీఎస్‌ వివరాలు ఆటోమేటిక్‌గా కనిపించే అవకాశం ఉంది. దీంతో రిటర్నుల దాఖలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

  • లేఆఫ్‌లకు సంబంధించి రోజుకో కొత్త వ్యథ వెలుగులోకి వస్తోంది. టెక్నాలజీ, ఫిన్‌టెక్‌, విమానయాన రంగాల్లో కొనసాగుతున్న ఉద్యోగ కోతల తీవ్రతను ప్రతిబింబించే ఓ కుటుంబ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు వరుసగా ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

    ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ప్రముఖ FAANG (మెటా, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆల్ఫాబెట్‌) కంపెనీల్లో పనిచేసినప్పటికీ గత ఏడాదిలో ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో ఒకరు ఏడాదికిపైగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, మరొకరు ఎలాంటి సెవరెన్స్‌ ప్యాకేజీ లేకుండానే తొలగింపునకు గురైనట్లు తెలిపాడు. మరో సోదరుడు ఫిన్‌టెక్‌ కంపెనీలో పనిచేసి గత ఆగస్టులో ఉద్యోగం కోల్పోగా, చిన్న సోదరి పనిచేసిన విమానయాన సంస్థ మూతపడటంతో ఆమె కూడా నిరుద్యోగిగా మారింది.

    ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో కొందరికి గృహ రుణాలు ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నా నెలసరి తనఖా చెల్లింపులకు సరిపడా ఆదాయం రావడం లేదని వారు చెబుతున్నారు. ఇద్దరు చిన్న తోబుట్టువులు అద్దె ఇళ్లు వదిలి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

    ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు తాత్కాలిక పనులు చేసుకుంటూ ఖర్చులను తగ్గించుకోవాలని, అవసరమైతే ఒకే ఇంట్లో కలిసి నివసించాలని సూచించారు. కొందరు ఈ పరిస్థితిని 2008 ఆర్థిక మాంద్యంతో పోల్చగా, మరికొందరు ఏఐ ప్రభావంతో టెక్‌ రంగంలో ఉద్యోగ కోతలు మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

    Posts from the recruitinghell
    community on Reddit

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈపీఎఫ్ఓ 3.0 ప్రారభించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి చందాదారులు త్వరలోనే తమ పీఎఫ్ డబ్బును మరింత వేగంగా, సులభంగా పొందగలుగుతారు. ఈ కొత్త విధానం ద్వారా.. సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ డబ్బును నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చని, తద్వారా పేపర్ వర్క్, ప్రాసెసింగ్ సమయం వంటివి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే.. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ఖాతా నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేయవచ్చు?, మొత్తం బ్యాలెన్స్‌ను తక్షణమే పొందవచ్చా?. దీనికి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

    EPFO 3.0 గురించి
    ఈపీఎఫ్ఓ 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేయడానికి.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్న డిజిటల్ ప్రక్రియ. ఇదివరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారమ్‌లు, క్లెయిమ్ ప్రాసెసింగ్, ధృవీకరణ వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం పట్టేది. కానీ కొత్త విధానం ద్వారా.. ఈ ప్రక్రియ సులభతరం కానుంది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో అర్హత కలిగిన మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా పేపర్‌లెస్ విధానం. కాబట్టి ఉద్యోగులకు సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి.

    ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?
    ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలోని మొత్తంలో 50% నుంచి 75% వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే.. మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకునే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత. భవిష్యత్తు కోసం కొంత మొత్తం ఖాతాలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం నియమాలు రూపొందిస్తోంది.

    ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?
    కొత్త నియమాల ప్రకారం.. పీఎఫ్ ఖాతాలో కనీసం 25శాతం ఉండాలి. దీనిని ఉద్యోగులు తమ రిటైర్మెంట్ సమయంలో ఉపయోగించుకోవచ్చు.

    అయితే.. ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ.1 లక్ష వరకు మాత్రమే క్లెయిమ్‌లు త్వరగా ప్రాసెస్ అయ్యేవి. ఇప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల సభ్యులు తక్షణ అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని త్వరగా పొందగలుగుతారు.

    యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
    ఈపీఎఫ్ఓ 3.0 విధానంలో.. చందాదారుడు ముందుగా తాను ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది చూడవచ్చు. తరువాత తన బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యూపీఐ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సేఫ్టీ కోసం యూపీఐ పిన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. డబ్బు ఖాతాలో జమ అయిన తర్వాత సభ్యుడు ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుకు బదిలీ చేయడం లేదా ఏట్ఎం ద్వారా నగదు రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చు.

    EPFO 3.0 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
    కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకారం.. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కాబట్టి ఇది త్వరలోనే ఈ సదుపాయం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. అయితే.. తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

    ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట!

  • డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్‌కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్‌కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.

    అమెరికా మీడియా సంస్థ సీఎన్‌బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.

    ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్‌స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్‌ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు.

    ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్‌ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్‌ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ‍ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.

    దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్‌కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు.

  • బజాజ్‌ గ్రూప్‌ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. రూ.2,000–2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో పుణెలో హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్‌ ఇంటెగ్రేటెడ్‌ హెల్త్‌ సిస్టమ్‌ ఎండీ నీరవ్‌ బజాజ్‌ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్‌లు, అంబులేటరీ సేవలు, హోమ్‌కేర్‌ (ఇంటివద్దే వైద్య సేవలు), హాస్పిటల్‌తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.

    వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు.

  • దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. తమ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అయిన 'టియాగో ఈవీ'ను కొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ (టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్) రూపంలో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే దీనిని బాస్ (BaaS) స్కీమ్ కింద రూ.4.69 లక్షల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

    2026 టాటా టియాగో కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, మెరుగైన ఇంటీరియర్‌తో మధ్యతరగతి కుటుంబాలు, యువతను ఆకర్షించేలా తయారైంది.

    డిజైన్ విషయానికి వస్తే.. ఇది సాధారణ మోడల్ కంటే కూడా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.  కొత్త ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు స్పోర్టీ లుక్‌ ఇస్తాయి. ముందుభాగంలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్ ఉండటం వల్ల ఇది ఈవీ అని స్పష్టంగా అర్థమవుతోంది. బ్లాక్ కలర్ ఓఆర్‌వీఎంలు, విండో లైన్, కొత్త వీల్ డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వల్ల రాత్రివేళల్లో మంచి విజిబిలిటీ  లభిస్తుంది. టెయిల్‌గేట్‌పై టియాగో ఈవీ అని ఉండటం కూడా గమనించవచ్చు.

    ఈ కారు లోపల 10.25 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఫ్రీ-స్టాండింగ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కార్‌కు ప్రీమియం ఫీల్‌ అందిస్తాయి. వెనుక సీట్లలో ఉండే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

    పవర్‌ట్రైన్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి కొత్త టియాగో ఈవీ కూడా.. స్టాండర్డ్ మోడల్‌లో మాదిరిగానే రెండు బ్యాటరీ ప్యాక్ (19.2 కిలోవాట్, 24 కిలోవాట్) ఎంపికలను పొందుతుంది. పనితీరు, రేంజ్ (పరిధి) అన్నీ కూడా పాత మోడల్‌ మాదిరిగానే ఉంటాయి.

    బాస్ (BaaS) స్కీమ్ గురించి
    బాస్ (Battery as a Service) అనేది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత చవకగా, సులభంగా చేయడానికి తీసుకొచ్చిన ప్రత్యేక పద్ధతి. ఈ స్కీమ్‌లో కారు, బ్యాటరీని వేర్వేరుగా పరిగణిస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ కావడంతో.. దాని ధర మొత్తం కార్ ధరను పెంచుతుంది. కానీ బాస్ విధానంలో వినియోగదారు కారును తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేసి, బ్యాటరీ కోసం ప్రత్యేకంగా నెలవారీ లేదా వినియోగానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తారు.

    ఉదాహరణకు, టాటా టియాగో ఈవీ బాస్ స్కీమ్ కింద రూ. 4.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వల్ల, సాధారణ కొనుగోలుతో పోలిస్తే.. మొదట్లో తక్కువ మొత్తంతోనే కారును సొంతం చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల ఎలక్ట్రిక్ కార్లను కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుంది. అదనంగా.. బ్యాటరీ పనితీరు లేదా మార్పిడి వంటి విషయాల్లో కంపెనీ సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల, BaaS స్కీమ్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

    ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే..

  • దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, సైనిక దివ్యాంగుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వితంతువులు(వీర నారీ-యుద్ధంలో భర్తలను కోల్పోయినవారు), వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్మీ ప్రత్యేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా భారత సైన్యంతో ఎయిరిండియా సహకార ఒప్పందం కుదుర్చుకుంది. దేశ నిర్మాణంలో, సామాజిక బాధ్యతలో కార్పొరేట్ రంగానికి ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

    తొలి విడతగా 60 మందికి అవకాశం

    ఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా వీర నారీలు, వారి పిల్లలకు ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఏఐ సాట్స్‌)లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం కింద ప్రాథమికంగా 20 మంది యుద్ధ వితంతువులను, 40 మంది వారి పిల్లలను ఎయిర్‌లైన్స్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీరికి విమానాశ్రయ కార్యకలాపాల్లో కీలకమైన కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో బాధ్యతలు అప్పగిస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వీరికి శిక్షణ అందిస్తారు. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ ఉద్యోగానికి తక్షణమే సిద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు.

    ‘ఆశా’ పాఠశాలల్లో వృత్తి విద్యా ల్యాబ్‌ల ఏర్పాటు

    కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, పూర్వ సైనికోద్యోగులు (అనుభవజ్ఞులు), దివ్యాంగుల పిల్లల సంక్షేమం కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ‘ఆశా’ (ఆర్మీ స్పెషల్‌ హెల్ప్‌ అండ్‌ అసోసియేషన్‌) పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తును అందించేందుకు ఎయిరిండియా వృత్తి శిక్షణా మౌలిక సదుపాయాలను నిర్మించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఆశా పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడమే ఈ చొరవ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 10 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన 15 పాఠశాలలకు కూడా దీనిని విస్తరించనున్నారు.

    వైవిధ్యమైన రంగాలలో శిక్షణ

    చిన్నారుల సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేలా ఈ ల్యాబ్‌ల్లో విభిన్న విభాగాలపై అనుభవపూర్వక శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంలో ఫోటోగ్రఫి, విజువల్ స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, పెయింటింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కుకింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, బోటిక్ అండ్ టైలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇ‍స్తారు.

    భారత సైన్యంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిరిండియా గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ హెడ్ పి.బాలాజీ మాట్లాడుతూ ‘భారత సైన్యంతో ఎయిరిండియా భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు; ఇది దేశ నిర్మాణ ప్రయత్నంలో భాగం కావాలనే మా ఉమ్మడి సంకల్పానికి ప్రతిరూపం. నైపుణ్యాలను బలోపేతం చేయడం, సరైన అవకాశాల ద్వారా సమాజంలో గౌరవాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. సైన్యంతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో స్థిరమైన, సానుకూల ప్రభావాన్ని చూపే ఒక స్కేలబుల్ మోడల్‌ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అన్నారు.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

  • మసాలా దినుసుల తయారీ కంపెనీ పుష్ప్‌ బ్రాండ్‌ (ఇండియా) పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌) కంపెనీ ఇందుకు అనుమతించాలంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. తద్వారా కంపెనీ రూ. 800–1,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి.

    ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 74.45 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. 1974లో ఏర్పాటైన కంపెనీ బ్రాండెడ్‌ ప్యాకేజ్‌డ్‌ మసాలాలు, ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. విస్తరణలో భాగంగా కంపెనీ 2028కల్లా పర్యావరణహిత తయారీ కేంద్రంతోపాటు.. సమీకృత స్టోరేజీ సౌకర్యాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

    ఈ బాటలో పూర్తిస్థాయి శుద్ధ మసాలాలకు వీలుగా 2029కల్లా గ్రైండింగ్, మిల్లింగ్‌ లైన్‌కు తెరతీసే ప్రణాళికలు వేసింది. కాగా.. ప్యాకేజ్‌డ్‌ మసాలాల విభాగంలో ఎవరెస్ట్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్, ఓర్‌క్లా ఇండియా, ఎండీహెచ్, బాద్‌షా మసాలా తదితర సుప్రసిద్ధ కంపెనీలతో పోటీ పడుతోంది. గతేడాది(2025–26) రూ. 482 కోట్ల టర్నోవర్‌ సాధించడంతోపాటు.. రూ. 59 కోట్ల నికర లాభం ఆర్జించింది.

  • కృత్రిమ మేధ ప్రపంచాన్ని మార్చేస్తోందని, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారిపోయిందని ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు ఖండించారు. ప్రపంచ టెక్ పరిశ్రమ అంతా కలిసి ‘ఏఐ వల్ల మాత్రమే సానుకూల మార్పులు సాధ్యం’ అనే ఒక బలవంతపు కథనాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆయన మండిపడ్డారు.

    ప్రస్తుతం టెక్ ప్రపంచంలో నడుస్తున్న ఏఐ హైప్ వెనుక ఉన్న అసలు నిజాలను సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ఆయన ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్, ఆర్థిక మందగమనంపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఉత్పాదకత శూన్యం..

    ఏఐ వల్ల కంపెనీల్లో ఉత్పాదకత అసాధారణంగా పెరిగిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. వాస్తవ లాభాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కంపెనీలు తమ ఆర్థిక ఒత్తిళ్లను దాచడానికి, పెట్టుబడిదారుల అంచనాలను అందుకోవడానికి మాత్రమే ఏఐని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు.

    ‘కంపెనీలు తాము చేస్తున్న ఉద్యోగాల తొలగింపులను ఏఐ ఖాతాలో వేయడం చాలా సౌకర్యవంతంగా మారింది. ఇలా చేయడం వల్ల ఆయా సంస్థలు భవిష్యత్ సాంకేతికతను అందుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. కానీ, అసలు నిజం అది కాదు’ అని శ్రీధర్ వెంబు అన్నారు. మానవ శ్రమను అకస్మాత్తుగా భర్తీ చేసేంత సామర్థ్యం ఏఐకి ఇంకా రాలేదని, ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్‌కు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక ఒత్తిళ్లే ప్రధాన కారణమని వెంబు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక చిత్రం రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు. కేవలం ఏఐ మాత్రమే ఆ లోతైన సంక్షోభ సమస్యలను పరిష్కరించలేదని హెచ్చరించారు.

    ఐఫోన్ విప్లవం కూడా 2008 సంక్షోభాన్ని ఆపలేకపోయింది!

    గత సాంకేతిక విప్లవాలను ఉదాహరణగా చూపుతూ శ్రీధర్ వెంబు ప్రస్తుత ఏఐ బూమ్‌ను విమర్శించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతానికి ఈ ఏఐ ఇన్వెస్ట్‌మెంట్ బబుల్ కాపాడుతూ వస్తోందని, కానీ ఇది ఎక్కువ కాలం సాగదని స్పష్టం చేశారు. గతంలో ఐఫోన్ విప్లవం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేకపోయిందని గుర్తుచేశారు. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అసమతులాన్ని ఏఐ తన మాయాజాలంతో ఒక్క రాత్రిలో నయం చేయలేదని వెంబు తేల్చిచెప్పారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ టూల్స్ ఉత్పాదకతను ఆకాశానికి తీసుకెళ్తాయనే అతిపెద్ద అపోహను కూడా తీవ్రంగా ప్రశ్నించారు.

    స్వరం మారుస్తున్న గ్లోబల్ టెక్ లీడర్స్!

    విచిత్రం ఏమిటంటే, ఏఐ విప్లవానికి పితామహుడిగా చెప్పుకునే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం ఇటీవల తన స్వరాన్ని మార్చడం గమనార్హం. ‘దీని (ఏఐ ప్రభావం) గురించి నేను తప్పుగా అంచనా వేసినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ ఆల్ట్‌మాన్ వ్యాఖ్యానించారు. టెక్ పరిశ్రమ మొదట్లో ఊహించిన దానికంటే సమాజం ఇప్పటికీ మానవ మేధస్సుకు, మానవ పరస్పర చర్యలకే అత్యధిక విలువ ఇస్తోందని ఆయన అంగీకరించారు.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

  • దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పౌరుల జీవన ప్రమాణాలను, ప్రభుత్వ సేవలను సమూలంగా మార్చేస్తోంది. సాధారణ యుటిలిటీ బిల్లులకే పరిమితం కాకుండా, విస్తృత శ్రేణి ప్రభుత్వ సర్వీసులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడంలో భారతదేశం ప్రగతి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యాప్‌ల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ కనెక్ట్‌’ ఈ డిజిటల్ చెల్లింపుల పరివర్తనకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.

    భారత్ కనెక్ట్ (గతంలో భారత్ బిల్ పే - బీబీపీఎస్‌) వివిధ బిల్లుల చెల్లింపులను, ఆర్థిక లావాదేవీ మార్గాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడం ద్వారా పౌరులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా భారత్ కనెక్ట్ ఆధారిత యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా కింది సేవలను క్షణాల్లో అందుతున్నాయని పేర్కొంది.

    • విద్యుత్ బిల్లులు

    • మున్సిపల్, నీటి పన్నులు

    • ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు

    • ఈ-చలాన్లు

    • లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు

    • నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌)

    ఇది భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కస్టమర్-టు-గవర్నమెంట్ (సీ2జీ) డిజిటల్ సర్వీసుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ కనెక్ట్ నెట్‌వర్క్‌లో 29 కంటే ఎక్కువ విభాగాల్లో 22,000 పైగా బిల్లుదారులు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే 700 కంటే ఎక్కువ యాప్‌ల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

    డిజిటల్ భరోసా

    ఈ మార్పు కేవలం చెల్లింపుల వేగానికి సంబంధించింది మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేదని ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్‌బీబీఎల్‌) ఎండీ, సీఈఓ నూపుర్ చతుర్వేది పేర్కొన్నారు. ‘శ్రమతో కూడిన ప్రక్రియల స్థానంలో సులభతరమైన డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా అన్ని సేవలు పారదర్శకంగా ఉన్నాయి. భారీ స్థాయిలో డిజిటల్ అడాప్షన్‌ను కొనసాగించడానికి ఈ నమ్మకమే అత్యంత కీలకం’ అని చతుర్వేది అన్నారు.

    హైబ్రిడ్ మోడల్

    భారత్ కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతోపాటు అందరికీ కలుపుకొనిపోయే సాంకేతిక నిర్మాణాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఆఫ్ లైన్ ఏజెంట్ల ద్వారా డిజిటల్ పరిజ్ఞానం లేని వారికి కూడా ఈ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తమ సమీపంలోని ఏజెంట్ వద్దకు వెళ్లి నగదు రూపంలో ప్రభుత్వ బాకీలను సులభంగా చెల్లించవచ్చు. ఈ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ విభజనను సమర్థవంతంగా తొలగిస్తోంది.

    ఈ వ్యవస్థీకృత ప్రక్రియ ద్వారా ప్రజలు తమ ఖర్చులను ట్రాక్ చేసుకోవడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.‘ప్రభుత్వ విభాగాలకు సైతం ఇది ఎంతో మేలు చేస్తోంది. దీనివల్ల రాబడుల సేకరణ మెరుగైంది. చెల్లింపుల్లో జాప్యం తగ్గింది. వ్యవస్థలో పారదర్శకత పెరిగి పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నమ్మకం బలపడింది’ అని తెలిపారు.

    ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు

International

  • కెన్యా రాజధాని నైరోబికి వాయవ్య దిశలో సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిల్గిల్ ప్రాంతంలోని ఓ బోర్డింగ్‌ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి 16 మంది విద్యార్థినులు మృతి చెందారు. అంతేగాక, పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయపడగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. 

    వారిలో 71 మందికి చికిత్స అందించి డిశ్చార్జ్ చేయగా, మరో ఏడుగురికి ఇంకా చికిత్స అందుతోంది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో ఇంకా తేలలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఉటుమిషి గర్ల్స్‌ అకాడమీలో గురువారం తెల్లవారుజామున విద్యార్థినులు నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. తమ పిల్లల గురించి సమాచారం తెలుసుకునేందుకు ఆందోళనతో తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

    దీనిపై కెన్యా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. వసతి గృహంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, ఆ భాగం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. అగ్నిమాపక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని, కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయిందని చెప్పారు.  

    మృతుల కుటుంబాలకు అంతర్గత వ్యవహారాల మంత్రి కిప్చుంబా సంతాపం తెలిపారు. “ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు గుర్తించాం. కెన్యా ప్రజలు అందరూ ఆ కుటుంబాలకు ప్రార్థనలతో, మద్దతుతో అండగా నిలవాలి” అని అన్నారు. ప్రజలు సహనం పాటించాలని, వదంతులను నమ్మొద్దని చెప్పారు. కెన్యాలోని వసతి పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు కొత్త విషయం కాదు. గత కొన్ని సంవత్సరాల్లో అనేక ప్రాణాంతక ఘటనలు చోటుచేసుకున్నాయి.

  • ప్యాంగ్యాంగ్: క్వాడ్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనను ఉత్తర కొరియా గురువారం ఖండించింది. సంపూర్ణ అణు నిరాయుధీకరణ చేపట్టాలని క్వాడ్‌ దేశాలు ఆ ప్రకటనలో కోరగా తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎప్పటికీ విడిచిపెట్టబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్హాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.

    భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ కూటమి ఇటీవల సమావేశం జరిపిన విషయం తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా, జపాన్  విదేశాంగ మంత్రులు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి ఇటీవల న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై తమ వైఖరిని మరోసారి ప్రకటించారు.

    దీనికి ప్రతిస్పందనగా ఉత్తర కొరియా విదేశాంగ శాఖ.. క్వాడ్ ప్యాంగ్యాంగ్ సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. అలాగే, ఈ తీరు “అమెరికా ఏకపక్ష ఆధిపత్య లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రాజకీయ, దౌత్య సాధనం మాత్రమే” అని విమర్శించింది.

    “డీపీఆర్‌కే(డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అణు నిరాయుధీకరణ ఎప్పటికీ చేయదని మేము మరోసారి చెబుతున్నాం” అని ఆ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా నేతృత్వంలోని క్వాడ్ తమ దేశంపై తీసుకున్న వైఖరిని పూర్తిగా తిరస్కరిస్తున్నామని ఉత్తరకొరియా తెలిపింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఘర్షణాత్మక చర్యలను నిలిపివేయాలని క్వాడ్‌ కూటమిని గట్టిగా కోరింది.

    విధ్వంసకర ఆయుధాలు వద్దు 
    మంగళవారం విడుదలైన క్వాడ్ విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటనలో... “సంబంధిత యూఎన్‌ఎస్‌సీఆర్‌లకు అనుగుణంగా ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణపై మా వైఖరిని మళ్లీ తెలియజేస్తున్నాం. సంబంధిత యూఎన్‌ఎస్‌సీఆర్‌ల కింద ఉన్న అన్ని బాధ్యతలను ఉత్తర కొరియా పాటించాలని కోరుతున్నాం” అని పేర్కొన్నారు. యూఎన్‌ఎస్‌సీఆర్‌ అంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు.

    “ఉత్తర కొరియా అక్రమ బాలిస్టిక్ క్షిపణులు, విధ్వంసకర ఆయుధాల అభివృద్ధిని మేము ఖండిస్తున్నాం. ఉత్తర కొరియా సైబర్ కార్యకలాపాలు, ఐటీ కార్మిక చర్యలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇవి ఉత్తర కొరియా అక్రమ సామూహిక విధ్వంస ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నాయి. 

    ఉత్తర కొరియాకు సంబంధించిన యూఎన్‌ఎస్‌సీఆర్‌ల ఉల్లంఘనలను ఎదుర్కొనే చర్యలకు మద్దతు కొనసాగిస్తాం. ఉత్తర కొరియాకు ఆయుధాలు, సంబంధిత సామగ్రి బదిలీ చేయడం లేదా అక్కడి నుంచి కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధం సహా, యూఎన్‌ఎస్‌సీఆర్‌ల కింద ఉన్న అంతర్జాతీయ బాధ్యతలను అన్ని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు అమలు చేయాలి” అని క్వాడ్‌ దేశాల విదేశాంగ మంతత్రులు కోరారు.

  • పశ్చిమాసియాలో ఇప్పుడు యుద్ధం అంటే కేవలం క్షిపణులు, ఫైటర్‌ జెట్లు కాదు.. “డ్రోన్ వార్‌” అనేది కొత్త భయంగా మారింది. ముఖ్యంగా ఇరాన్‌ ఉపయోగిస్తున్న “షాహెద్‌” కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలకే సవాల్‌గా మారాయి. ఇప్పుడు అదే మోడల్‌ను సౌదీ అరేబియా కూడా అనుసరించే ప్రయత్నంలో ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.

    ఇరాన్‌ తయారు చేసిన షాహెద్‌-136 డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. కానీ వీటి దాడి ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. చాలా తక్కువ ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఈ డ్రోన్లు రాడార్‌లకు చిక్కకుండా టార్గెట్‌పై నేరుగా దూసుకెళ్తాయి. ఒకేసారి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం వల్ల అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా ఓవర్‌లోడ్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ఇరాన్‌ ప్రధాన యుద్ధ వ్యూహంగా మారింది.

    ఇటీవల అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ ఉద్రిక్తతల సమయంలో గల్ఫ్‌ దేశాలపై వరుసగా డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయి. సౌదీ చమురు క్షేత్రాలు, రియాద్‌ సమీప ప్రాంతాలు, ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌, అరాంకో ఆయిల్‌ ఫెసిలిటీలపై దాడుల ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అనేక డ్రోన్లు, క్షిపణులను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినప్పటికీ ఈ దాడులు రియాద్‌ను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయి.

    ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా కొత్త వ్యూహంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రియాద్‌ సమీపంలో భారీ డ్రోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఇరాన్‌ షాహెద్‌ తరహా లాంగ్ రేంజ్‌ అటాక్ డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెరికా–సౌదీ డిఫెన్స్ కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం రక్షణ చర్య మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇరాన్‌ “స్వార్మ్ డ్రోన్‌ స్ట్రాటజీ” ప్రపంచ యుద్ధ విధానాన్నే మార్చేసిందని వారు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో వేల డ్రోన్లు ప్రయోగించి శత్రువు రక్షణ వ్యవస్థను చేధించడం, ఆర్థిక నష్టం కలిగించడం, చమురు ఉత్పత్తిని దెబ్బతీయడం.. ఇదే కొత్త యుద్ధ ఫార్ములాగా మారుతోంది. ఇప్పుడు అదే పద్ధతిని సౌదీ కూడా అధ్యయనం చేస్తోందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

    ఇక, ఇప్పటివరకు పూర్తిగా రక్షణాత్మక వైఖరిలో కనిపించిన సౌదీ.. ఇప్పుడు ప్రతీకార దాడుల దిశగా కూడా అడుగులు వేస్తోందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇరాన్‌ డ్రోన్‌, క్షిపణి లాంచ్‌ సైట్లపై సౌదీ సీక్రెట్‌గా వైమానిక దాడులు నిర్వహించిందని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇది మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెద్ద వ్యూహాత్మక మార్పుగా భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్‌ ప్రాంతం మొత్తం “డ్రోన్‌ కోల్డ్‌వార్‌” దిశగా వెళ్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. భారీ యుద్ధ విమానాల కంటే ఇప్పుడు చౌకైన డ్రోన్లే ఎక్కువ ప్రమాదకరంగా మారుతున్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఇరాన్‌ ప్రత్యేకతగా భావించిన డ్రోన్‌ వార్‌ఫేర్‌.. ఇప్పుడు సౌదీతో పాటు ఇతర దేశాలు కూడా అనుసరించే స్థాయికి చేరుకోవడం ప్రపంచ భద్రతా సమీకరణాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది.

    డ్రోన్ స్వార్మ్ అంటే ఏమిటి?

    • ఒకేసారి డజన్ల నుంచి వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడం

    • రాడార్‌, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను గందరగోళానికి గురిచేయడం

    • ఒకటి కాదు.. వరుస దాడులతో శత్రువును అలసటకు గురిచేయడం

    • తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగించే కొత్త యుద్ధ వ్యూహం


    సౌదీకి అసలు భయం ఏంటి?

    • చమురు క్షేత్రాలపై దాడులు జరిగితే ప్రపంచ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటుంది

    • అరాంకో వంటి కంపెనీలకు భారీ నష్టం వచ్చే ప్రమాదం

    • గల్ఫ్ ప్రాంత భద్రతపై ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం పెరుగుతుంది

    • సౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం


    అమెరికా ఎందుకు అలర్ట్‌?

    • గల్ఫ్‌లో అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్నాయి

    • ఇరాన్‌ డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది

    • అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకే సవాల్‌గా మారుతోంది

    • గల్ఫ్‌లో యుద్ధం పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం

Politics

  • సాక్షి, తాడేపల్లి: మెగా డీఎస్సీ స్కామ్‌ బయటపడడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ మహానాడులో రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగ మల్లీశ్వరి ఫైర్‌ అయ్యారు. తొలి సంతకం అంటూ నానా హడావిడి చేసి నిర్వహించిన డీఎస్సీ–2025లో ప్రభుత్వం పెద్ద స్కామ్‌ చేసిందని ఆమె ఆరోపించారు. అందుకే అది మెగా డీఎస్సీ కాదని ఒక దగా డీఎస్సీ అని అభివర్ణించారు.

    చెప్పుకోవడానికి రెండేళ్లుగా చేసిందేమీ లేదని, అందుకే అదే పనిగా జగన్‌పైనా, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా విమర్శలు, నిందల పర్వంతోనే మహానాడు నిర్వహిస్తున్నారని నాగ మల్లీశ్వరి తేల్చి చెప్పారు. కాబట్టి నాడు ఎన్టీఆర్‌ హయాంలో నిర్వహించిన మహానాడుకు, ఇప్పటి ఈ మహానాడుకు మధ్య నక్కకు నాక లోకానికి ఉన్న తేడా ఉందని చెప్పారు. వర్చువల్‌ మహానాడు సమావేశాలకు చివరకు పార్టీ కార్యకర్తలు కూడా రావడం లేదని, అందుకే రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, డ్వాక్రా మహిళలను బెదిరించి, సమావేశాలకు తీసుకొచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాగ మల్లీశ్వరి తెలిపారు.
    ప్రెస్‌మీట్‌లో నాగ మల్లీశ్వరి ఇంకా ఏం మాట్లాడారంటే..:

    అందుకోసమేనా మీ ‘మహానాడు’?:
    టీడీపీ మహానాడు సమావేశాలు పూర్తి హాస్యాస్పదంగా మారాయి. తనకు తానే విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ కామెడీ వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో, అభివృద్ధి కోసం ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్పకుండా.. రాబోయే రోజుల్లో ఏం చేస్తారన్న దానిపైనా మాట్లాడకుండా కేవలం జగన్‌గారిని తిట్టడానికే మహానాడు వేదికగా మార్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ కాలిగోటికి కూడా సరిపోని వ్యక్తులతో విమర్శలు చేయించడం పూర్తిగా దిగజారిన చంద్రబాబు నైజానికి అద్దం పడుతోంది.

    స్త్రీ శక్తి పేరు పెట్టుకోవడం విడ్డూరం:
    రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మహానాడులో 1160 సార్లు జగన్‌ పేరు జపించారు. మహిళల కోసం పోరాడుతున్నట్లు ‘స్త్రీ శక్తి’ అంటూ మహానాడుకు పేర్లు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మహానాడుకు మహిళలు రావడం లేదనే పరిస్థితిలో స్త్రీశక్తి అంటూ హడావిడి చేస్తున్నారు. కొన్ని చోట్ల రికార్డింగ్‌ డ్యాన్సులు కూడా పెట్టారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? ‘కనిపిస్తే ముద్దన్న పెట్టాలి.. లేకపోతే కడుపైనా చేయాలి’ అన్న డైలాగులు చెప్పింది మీ మామ బాలకృష్ణ కాదా?. చంద్రబాబు క్రెడిబులిటీని తగ్గించి లోకేష్‌ను హైలైట్‌ చేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. నటనలో భాస్కర్‌ అవార్డు చంద్రబాబు, లోకేష్‌కే ఇవ్వాలి. అంత పెద్ద పెర్ఫార్మెన్స్‌ చేస్తున్నారు.

    అనిత వ్యాఖ్యలు హాస్యాస్పదం:    
    మహానాడు తొలి రోజు హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ద్వారా 30 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా మా లోకేష్‌ మహిళలకు అవకాశాలు ఇస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అనిత.. నీకు హోం మంత్రి పదవి ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకో. జీవితాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ గారికే తప్ప చంద్రబాబు, లోకేష్‌కు కాదు. దళిత మహిళలకు హోం మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర జగన్‌గారిది. మహిళలకు 50 శాతం పదవులు, పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ 2019–2024 మధ్య చట్టబద్ధంగా అవకాశాలు కల్పించకపోయి ఉంటే ఇవాళ నీకు ఆ పదవి వచ్చేదా? చంద్రబాబుకు నిజంగా నీపై అంత ప్రేమ ఉంటే గతంలో ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఇవాళ పరిస్థితులు మారడంతో మంత్రి పదవి ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడి జగన్‌ను తిడితే సరిపోతుంది అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు.

    బూతులు. నిందలు. విమర్శలు.. ఇదే మహానాడు:
    మహానాడు అంటే నాలుగు బూతులు, నాలుగు విమర్శలు, నాలుగు తిట్లు, నాలుగు నిందలు అన్నట్టుగా మార్చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి.. 175 నియోజకవర్గాల అభ్యర్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి జగన్‌ గారు మీటింగ్‌ పెడితే మీ మహానాడు మొత్తం కొట్టుకుపోతుంది. అదే జగన్‌ స్టామినా. అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని లోకేష్‌ అంటున్నారు. దేనిమీదైనా చర్చకు మేం సిద్ధం. మా ఎమ్మెల్యేలు మీతో చర్చకు వస్తారు రెడీనా? కానీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం కాదు.. మేం రాసిన రెడ్‌బుక్‌ రాజ్యాంగమే రాష్ట్రంలో నడవాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు చివరకు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయని మర్చిపోతున్నారు.

    ఇప్పటికీ ఎన్టీఆర్‌ పేరునే వాడుకుంటున్నారు:
    ఎన్నికల సమయంలో ఆడబిడ్డకు నెలకు రూ.1500, మూడు ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం అంటూ ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదు. ‘సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌’ అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప 22 నెలల పాలనలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు. ఎన్టీఆర్‌ పథకాలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క పథకం పేరైనా చెప్పగలరా? 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇప్పటికీ ఎన్టీఆర్‌ పేరునే వాడుకుంటున్నారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లుకు మొదటి మద్దతు తెలిపింది జగన్‌ గారే. ఇప్పుడు అదే విషయంపై క్రెడిట్‌ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు:
    పాలనా వైఫల్యాలు, డీఎస్సీ స్కామ్‌ బయట పడడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే మహానాడును వాడుకుంటున్నారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికే టాప్‌ ర్యాంక్‌ ఎలా వచ్చిందో లోకేష్‌ సమాధానం చెప్పాలి. ఇది మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాటికి సమాధానం చెప్పలేక తల్లి, చెల్లి పేర్లతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ‘గొడ్డలి పార్టీ’ అంటూ మాట్లాడేవాళ్లు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలి. మీది వెన్నుపోటు పార్టీ కాదా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్‌ ఎంతో మంది మహిళలకు రక్షణ కల్పించింది. దాన్ని తీసేసి శక్తి యాప్‌ తెచ్చారని, మరి దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించిన నాగ మల్లీశ్వరి, చంద్రబాబు కూటమి పాలనలో మహిళలే ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు.

  • సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్‌ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

    ‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

    ‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్‌లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు

    ..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్‌మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్.

    ..బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్‌మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్‌ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్‌లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్‌ స్కామ్‌లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్‌మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

  • లక్నో: ఉత్తరప్రదేశ్ శాస‌నస‌భ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. అధికార బీజేపీ, విప‌క్ష స‌మాజ్‌వాదీ పార్టీల మ‌ధ్య వాగ్యుద్ధం న‌డుస్తోంది. ఎన్‌కౌంట‌ర్లపై ఇరు పార్టీలు వాదులాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన “యమరాజ్” వ్యాఖ్యలతో ఈ వివాదం మొద‌లైంది. ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంట‌ర్లు చేయింస్తోంద‌ని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించడంతో ఈ వివాదం ముదిరింది. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు ఎన్డీఏ మిత్ర‌ప‌క్షం సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ కౌంట‌ర్ ఇవ్వ‌డంతో వాగ్యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.

    ఉత్తరప్రదేశ్‌లో కులం, రాజకీయ ప్రయోజనాల ఆధారంగా బీజేపీ ప్ర‌భుత్వం ఎన్‌కౌంటర్లు చేయిస్తోంద‌ని అఖిలేశ్ యాద‌వ్ ఆరోపించారు. వీటిలో కొన్ని నకిలీ ఎన్‌కౌంటర్లు కూడా ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు కొన్ని వ‌ర్గాల‌ను ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసింద‌న్నారు. అఖిలేశ్ ఆరోప‌ణ‌ల‌కు మ‌ద్ద‌తుగా సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగ నేత పంకజ్ రాజ్‌భర్.. లక్నోలోని పార్టీ కార్యాలయం బయట ఓ భారీ పోస్ట‌ర్‌ను ఏర్పాటు చేశారు. 2024 నుంచి 2026 మధ్య కాలంలో హత్యకు గురైన రాజ్‌భర్ కులానికి చెందిన వారి ఫొటోలు ఇందులో ముద్రించారు. వారణాసి, ఘాజీపూర్, జౌన్‌పూర్, బరాబంకీ, కుషీనగర్, సంత్ కబీర్ నగర్, మౌ, బల్లియా జిల్లాల్లో హ‌త్య‌కు గురైన వారి వివ‌రాలు ఇందులో పేర్కొన్నారు.

    ఈ పోస్టర్ రాజకీయంగా యూపీలో తీవ్ర దుమారం రేపింది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే స‌మాజ్‌వాదీ పార్టీ త‌న కార్యాల‌యం ఎదుట‌ ఈ పోస్ట‌ర్ పెట్టింద‌ని ఓం ప్రకాశ్ రాజ్‌భర్ విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ఎన్‌కౌంట‌ర్ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. పోస్ట‌ర్‌లో పేర్కొన్న పలువురిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి నేరస్థులపై పోలీసులు తీసుకునే చర్యలకు రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు. గతంలో స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌భుత్వం ఎంతో మంది నేరస్థులను కాపాడింద‌ని ఆయ‌న‌ ఆరోపించారు.

    ఎన్నిక‌ల అంశంగా ఎన్‌కౌంట‌ర్లు
    2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్‌భర్ వర్గం మద్దతు పొంద‌డానికి స‌మాజ్‌వాదీ పార్టీ చేసిన ప్ర‌య‌త్నంగా ఈ వ్యవ‌హారాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్‌కౌంట‌ర్ల అంశం కీలకంగా మారే అవకాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ అంశంపై మున్ముందు అధికార, విప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు. 

    చ‌ద‌వండి: కేంద్రం నిర్ణ‌యంపై అన్నామ‌లై అభ్యంత‌రం

    టికెట్ చిరిగిపోవ‌డం ఖాయం
    మ‌హిళ‌లు, అమ్మాయిల జోలికి వ‌స్తే తాట తీస్తామ‌ని హెచ్చరిస్తూ యమరాజు ప‌దాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కువ‌గా ఉచ్చ‌రిస్తున్నారు. మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని, వెంట‌నే వారి టికెట్ కత్తిరించడానికి య‌మ‌రాజు సిద్ధంగా ఉంటాడ‌ని సీఎం యోగి వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, ఆయ‌న 9 ఏళ్ల పాల‌న‌లో 17,043 ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగిన‌ట్టు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

  • బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ లేకపోవడంతో ఆయన కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. హైకమాండ్‌ ఆదేశాలను అనుగుణంగా రాజీనామా చేశానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్య మీడియా సమావేశంలో తన పదవీకాలం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

    “నేను గవర్నర్ కార్యాలయానికి నా రాజీనామా సమర్పించాను. గవర్నర్ ఇక్కడ లేరు. ఆయన ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు. అందుకే నా రాజీనామాను ఆయన కార్యాలయానికి సమర్పించాను. పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయాలని చెప్పింది. అందుకే నేను ఈ రోజు నా రాజీనామాను సమర్పించాను. గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా ఆమోదిస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. 

    మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అందువల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వడం రాజ్యాంగబద్ధం. నాకు ఇన్నాళ్లు ఈ అవకాశం కల్పించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    అధిష్ఠానం నాకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చింది. కానీ, నేను రాజ్యసభ సీటును తీసుకోనని అధిష్ఠానానికి చెప్పాను. ఐదేళ్ల కాలానికి నన్ను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా వ్యవహరిస్తాను. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జాతీయ రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 

    దీంతో రాష్ట్ర అత్యున్నత పదవి విషయంలో పార్టీలో చాలా కాలంగా కొనసాగుతున్న నాయకత్వ పోరు ముగిసింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చారు. 

    సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా

    గవర్నర్‌ కార్యాలయం ఏమంది? 
    మరోవైపు, కర్ణాటక గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ మాట్లాడుతూ.. “సిద్ధరామయ్య ఇచ్చిన రాజీనామాను నేను స్వీకరించాను. అయితే గవర్నర్ తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన దాన్ని ఆమోదిస్తారు” అని తెలిపారు.

  • తెలుగు దేశం​ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫీలయ్యే ‘‘మహానాడు’’ గతకొన్నేళ్లుగా రాజకీయ సెటైర్లకు కేంద్రబిందువుగా మారుతోంది. టెక్నాలజీ వినియోగంలో తాము దేశానికి మార్గదర్శకులమని చెప్పుకునే ఆ పార్టీ పెద్దకు.. ఈసారి హైబ్రిడ్‌ మహానాడు చేదు అనుభవమే మిగులుస్తోంది. ఈ వర్చువల్‌ ప్రయోగం ఆయనో షాక్‌లా మారడమే కాదు.. సీనియర్ల నుంచి పెదవి విరుపులకు కారణమైందనే చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

    ఒకవైపు టీడీపీ వర్గాలు, వాటి అనుకూల మీడియాలు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి 7.20 లక్షల మంది వర్చువల్‌గా పాల్గొన్నారని భారీ లెక్కలు చెబుతుండగా.. మరోవైపు అంతటా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న వీడియోలు అదే మీడియా చానెళ్ల ద్వారా బయటకు వస్తున్నాయి. కృష్ణాజిల్లాలోని మోపిదేవి సెంటర్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్‌ మహానాడు కార్యక్రమం అయితే ఈ విమర్శలకు ప్రధాన ఉదాహరణగా మారింది. భారీ టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ.. కుర్చీలు మాత్రం ఖాళీగా కనిపించాయి. 

    చంద్రబాబు ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానికంగా చర్చ నడుస్తోంది. “రండి బాబు రండి” అంటూ నేతలు కార్యకర్తలను బ్రతిమాలుకున్నా స్పందన ఆశించిన స్థాయిలో రాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

    నేతల తంటాలు
    మహానాడులో జనం ఉన్నట్లు కవరింగ్‌ చేసుకునేందుకు టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో జనాలు లేకపోవడంతో పాత రికార్డింగ్‌ వీడియోలు ప్లే చేశారని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రికార్డింగ్‌ డ్యాన్సులు, భోజనాలు ఏర్పాటు చేసి జనాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పొదుపు సంఘాల మహిళలను తప్పనిసరిగా హాజరు కావాలంటూ స్థానిక నేతల ద్వారా ఒత్తిళ్లు తెచ్చారన్న ప్రచారం కూడా వినిపించింది.

    అయితే టీడీపీ మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. “యాప్‌ రిజిస్ట్రేషన్‌, టైం టు టైం అటెండెన్స్‌, డిసిప్లిన్‌, వర్చువల్‌ కనెక్టివిటీ”తో మహానాడు ఘనవిజయమైందని చెబుతోంది. తెలంగాణ, అండమాన్‌ నుంచి కూడా కార్యకర్తలు పాల్గొన్నారని.. ఒక్కో క్లస్టర్‌లో 300 మందికిపైగా హాజరయ్యారని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం మరోలా ఉంది.

    అంతా లోకేష్‌ వల్లే.. 
    ఈ హైబ్రిడ్‌ మోడల్‌ వెనుక నారా లోకేష్‌ సలహా కీలకంగా ఉందన్న ప్రచారం పార్టీలోనే వినిపిస్తోంది. డిజిటల్‌ ఫార్మాట్‌తో భారీ ఇంపాక్ట్‌ వస్తుందని భావించినా.. చివరికి అది రివర్స్‌ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే.. “లోకేష్‌బాబు మాట వినొద్దు సర్‌” అంటూ కొందరు టీడీపీ సీనియర్లు ముందుగానే చంద్రబాబును హెచ్చరించారట. కార్యకర్తల ఉత్సాహం, ప్రత్యక్ష హాజరు, రాజకీయ వేడి లేకుండా మహానాడు ప్రభావం తగ్గిపోతుందని చెప్పినా.. చివరకు అదే నిజమైందన్న చర్చ ఇప్పుడు పార్టీలోనే నడుస్తోందట. ఈ ప్రయోగం విఫలమైందనే ఫీలింగ్‌లో చంద్రబాబు కూడా ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

    ఇదిలా ఉంటే.. గతేడాది కడపలో జరిగిన మహానాడులో ఎన్టీఆర్‌ వారసత్వం, పార్టీ భవిష్యత్తు, లోకేష్‌ నాయకత్వంపై భారీ ఎమోషనల్‌ హైప్‌ క్రియేట్‌ చేసిన టీడీపీ.. ఈసారి మాత్రం పూర్తిగా టెక్నాలజీ ఆధారిత ప్రయోగానికి వెళ్లి బొక్కబొర్లా పడింది. అప్పట్లో “ఎన్టీఆర్‌ దిగొచ్చి చంద్రబాబు, లోకేష్‌లను చూసి గర్వపడ్డారు” అన్నట్టుగా ఏఐతో వైరల్‌ చేసిన వీడియోలు, విజువల్స్‌తో నవ్వులపాలయ్యారు. ఇప్పుడు అదే లోకేష్‌ సూచించిన హైబ్రిడ్‌ మోడల్‌తో సొంత నేతల నుంచే విమర్శల పాలవుతోంది.

    డిజిటల్ మహానాడుకు ఆదరణ కరువు.. కార్యకర్తలని బతిమాలాడుతున్న లీడర్లు

    “డిజిటల్‌ కనెక్టివిటీతో కొత్త రాజకీయ సంస్కృతి” తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈసారి వర్చువల్‌ మహానాడును భారీగా ప్లాన్‌ చేసినప్పటికీ.. గ్రౌండ్‌లో కనిపించిన ఖాళీ కుర్చీలు మాత్రం పార్టీ అంచనాలను తారుమారు చేశాయన్న చర్చ సాగుతోంది. “గతేడాది ఎమోషన్‌తో హైప్‌.. ఈసారి యాప్‌లతో టైప్‌” అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లోకేష్‌ టీమ్‌ టెక్నాలజీ ప్రెజెంటేషన్‌, యాప్‌ అటెండెన్స్‌, డిజిటల్‌ మానిటరింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టి.. కార్యకర్తల భావోద్వేగ కనెక్ట్‌ను మిస్‌ అయ్యిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

    ఈ ఏడాది మహానాడు ముగింపునకు ఒకరోజు ముందే టీడీపీకి గ్రౌండ్‌ రియాలిటీని చూపెట్టింది. వచ్చే ఏడాది ఇలాంటి “వర్చువల్‌ ప్రయోగాలు” వద్దని పార్టీ సీనియర్లు చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి టెక్నాలజీతో రాజకీయాలను మార్చేస్తామని చెప్పిన టీడీపీకి.. ఈసారి “డిజిటల్‌ మహానాడు” మాత్రం సోషల్‌ మీడియాలో సెటైర్ల సునామీగా మారిపోయింది.

Andhra Pradesh

  • విజయవాడ: ఏపీలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఏపీలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించగా, మళ్లీ ఏపీకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు.  

    ప్రధానంగా పల్నాడు, ప్రకాశం,. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.   ఈ క్రమంలోనే గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో  ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

    రెండు రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. 

    అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

  • అలజంగి(విజయనగరం జిల్లా):  కూటమి ప్రభుత్వ పెద్దల ఆగడాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. పేదల ఇళ్లనే టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు,. అటు పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు..  72 మంది పేదల ఇళ్లను కూల్చివేశారంటూ ఒకవైపు రచ్చ నడుస్తుండగానే విజయనగరం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే బేబీ నాయన కూడా ఇదే ఫాలోవుతున్నట్లు ఉన్నారు. 

    విజయనగరం జిల్లా అలజంగిలో  తాజాగా ఓ పేద పూజారి కుటుంబంపై బెదిరింపులకు దిగారు ఎమ్మెల్యే బేబి నాయన.  ఆ పేద పూజారిని ఇళ్లు కూల్చివేస్తామంటూ అధికారుల చేత ఆదేశాలు పంపంచారు. 70 ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఆ పూజారి..  విద్యుత్‌ బిల్లులు, పంచాయతీ రశీదులు చూపించినా అధికారులు కనికరించడం లేదు. పైగా ఎమ్మెల్యే బేబీ నాయన కాళ్ల మీద పడితే వదిలేస్తామంటున్నారు అధికారులు.

    ‘మా ఇళ్లే అడ్చొచ్చాయా..? మమ్మల్ని ఒకసారే చంపేయండి’

  • విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో పేదల ఇళ్లు కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. రొయ్యల చెరువులకు తమ ఇళ్లు అడ్డువస్తున్నాయని చెప్పి కూల్చివేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా అర్థంలేని కారణంతో గంటలో కూల్చివేయడం తాము పేదలం కాబట్టే చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

     పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో గురువారం(మే 28వ తేదీ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీని కోసం విజయవాడకు వచ్చిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

    ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇళ్లు కూల్చివేత మానుకోవాలని, కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని అంటున్నారు బాధితులు. సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయడమే కాకుండా రఘరామ కృష్ణంరాజు పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. 

    ఉందూరు మండలానికి చెందిన పద్మ అనే బాధితురాలు మాట్లాడుతూ.. ‘ 72 ఇల్లు కూల్చేశారు. 70 ఏళ్ళ నుండి అక్కడే ఉంటున్నాం. రొయ్యల చెరువులు పిటిషన్ పెట్టారని కూల్చారు. అందరికి పిటిషన్ పెట్టాం..కనీసం కనికరం చూపించలేదు. నడిరోడ్డు మీద ఇప్పుడు నిలబడ్డం. ఇల్లు కట్టుకొని సంవత్సరం అయ్యింది. రఘురామ కృష్ణం రాజు భార్య గారిని అడిగాం. ఆవిడా కూడా దారుణంగా మాట్లాడారు. అక్వా రైతులకు అడ్డం గా ఉన్నామని కూల్చేశారు. కలెక్టర్, లోకేష్, చంద్రబాబు ఇంటికి వెళ్ళాం. చంపేస్తే ఒకసారే చంపేయండి. కూలీపనులు చేసుకొని ఒకసారే ఇల్లు కట్టుకోగలం..అలాంటి ఇళ్లను కూర్చేశారు. పెద్దల గెస్ట్ హౌస్‌లు అడ్డం రాలేదు.. మా ఇల్లులు అడ్డం వొచ్చాయా?’ అని నిలదీశారు.

    చంపేస్తే ఒకేసారి చంపేయండి కనీళ్ళు పెట్టుకున్న మహిళ బాధితులు
  • సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

    ‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.

    ‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

  • కర్నూలు: మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెందిన కురువ మురళి నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ప్రియుడి మాటలను నమ్మి శారీరకంగా ఒక్కటయ్యారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నట్టేట ముంచాడు. రెండు పర్యాయాలు గర్భం దాల్చగా మందు బిల్లలు వేయించి గర్భస్రావం చేయించినట్లు బాధితురాలు వాపోతోంది. ఎలాగో పెద్దలను ఒప్పిస్తాడని ఎంతో నమ్ముకుంది. 

    చివరకు ప్రియుడు తమ ప్రేమను కాదనుకున్నాడు. మోజు తీరాక కులం అడ్డుపెట్టుకుని ఉడాయించాడు. దీంతో ఇటీవల ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్ష చేపట్టింది. అప్పటికే ఇంటికి తాళాలు వేసుకుని ఉడాయించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడకు చేరుకోగానే కొందరు పెద్దలు బాధితులను ఏమార్చారు. బాధితురాలికి న్యాయం చేస్తామంటూ ఊరికి తీసుకొచ్చారు. 

    వంచన విలువ రూ.15 లక్షలు 
    ప్రేమ పెళ్లికి అక్షింతలు వేయాల్సిన పెద్దలు వంచనకు విలువ కడుతూ పంచాయితీ చేపట్టారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు రాజీ కుదిర్చారు. ఇప్పటికే ప్రియుడి కుటుంబ సభ్యులు రూ.4 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇందులో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు వాటాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయిననూ బాధితురాలు తనను మోసగించిన మురళితోనే వివాహం చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. కాగా ప్రియుడు మురళి గ్రామానికి ఆరు నెలలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. 

    బాధితురాలు ఒప్పుకుంటే మిగిలిన కాస్త బ్యాలెన్స్‌ చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ కొందరు అధికారులు అతి తెలివి ప్రదర్శించారు. బాధితురాలితో తనకు మురళితో ఎలాంటి సంబంధం లేదన్నట్లు సంతకాలు పెట్టించారు. బాధితురాలు తిరగబడకుండా పెద్దల సమక్షంలో సంకెళ్లు వేసుకునేలా చేయడం గమనార్హం. బలమైనా పోక్సో చట్టాలు ఉన్న నేపథ్యంలోనూ ఇలాంటి పంచాయితీలు చోటు చేసుకోవడం దారుణం.

     

Sports

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సంజూ శాంసన్‌ వెళ్లడం ఖరారైనప్పుడు.. ఇకపై రాజస్థాన్‌ రాయల్స్‌ బాధ్యతలు యశస్వి జైస్వాల్‌ చేపడతాడని చాలా మంది భావించారు. లేదంటే జట్టులో ప్రధాన ఆటగాడిగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది. ఏడాది క్రితమే ఐపీఎల్‌లోకి ప్రవేశించిన టీనేజర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఇప్పుడు జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లోని కీలక ఆటగాళ్లను సైతం డామినేట్‌ చేస్తున్నాడు.

    మరోవైపు, 2023 ఐపీఎల్‌ సీజన్‌లో 600కుపైగా పరుగులు, 48.07 సగటుతో రాణించినప్పటి నుంచి యశస్వి జైస్వాల్‌ను భారత క్రికెట్ ఫ్యూచర్‌ స్టార్‌గా భావించారు. కానీ, 2026 మే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ దాదాపు ప్రతి అంశంలోనూ అతడిని మించిపోయాడు.

    వైభవ్‌ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా ఇప్పుడు యశస్వి జైస్వాల్‌ కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచాడు. ఆటను మరింత మెరుగుపర్చుకుని రాజస్థాన్‌ జట్టులోనే ఉండడం. లేదంటే జట్టు మారడం. జైస్వాల్‌ తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోకపోతే వైభవ్‌ సూర్యవంశీ ఎదుగుదల ముందు అతడి పేరు, గుర్తింపు, ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంది.

    మాజీ భారత క్రికెటర్‌ అంబటి రాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్‌ సూర్యవంశీ నీడ నుంచి బయటకు వచ్చి(ఆర్‌ఆర్‌ నుంచి), మరో జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని జైస్వాల్‌కు సూచించాడు.

    “అతడు తన ఆటతీరును మార్చుకోవాలి. ఎందుకంటే సూర్యవంశీతో కలిసి ఆడుతూ ప్రతిసారీ అతడి పర్ఫార్మన్స్‌ ముందు మసకబారిపోతూ ఉండలేడు. జైస్వాల్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు. మరో జట్టుకు వెళ్తే తన సొంత ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అతడికో ఓ వేదిక అవసరం. ఎందుకంటే వైభవ్‌ సూర్యవంశీ ఇకముందూ ఇతరుల ప్రభ తగ్గిపోయేలా చేస్తూనే ఉంటాడు” అని అంబటి రాయుడు అన్నాడు.

    “వైభవ్‌ సూర్యవంశీతో పాటు ఓ సీనియర్‌ భాగస్వామి ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అతడి విజయాన్ని చూసి ఆనందించాలి. పోటీగా భావించకూడదు. అతడితో పోటీ పడటం సాధ్యం కాదు” అని తెలిపాడు. జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్‌ సరైన జట్టని అన్నాడు.

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్‌లో సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో చెల‌రేగిన రాజస్థాన్ రాయల్స్ సిక్స‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్‌గేల్ ప్ర‌శంస‌లు కురిపించాడు. సూర్య‌వంశీని స‌రికొత్త సిక్సర్ల యంత్రంగా వ‌ర్ణించాడు. అత‌డి ఆట అద్భుతం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. 29 బంతుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు  సూర్యవంశీని ఓదార్చాడు. ఏదో ఒక‌రోజు ఈ యువ బ్యాట‌ర్ త‌న రికార్డును బ్రేక్ చేస్తాడ‌న్న విశ్వాసాన్ని వ్య‌క్త ప‌రిచాడు.

    న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా బుధ‌వారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో ప‌లు రికార్డు తిర‌గ‌రాశాడు. 3 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ కోల్పోయాడు. 29 బంతుల్లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 334కు పైగా స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేసి జ‌ట్టుకు ఒంటిచేత్తో విజ‌యాన్ని అందించాడు. 30 బంతుల్లో సెంచ‌రీ చేసిన క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ అవకాశాన్ని కొంచెంలో మిస్స‌య్యాడు. 2012లో గేల్ చేసిన 59 సిక్సర్లను రికార్డును మాత్రం సూర్య‌వంశీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు (65) కొట్టి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 

    వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డుల స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టా స్టోరీలో క్రిస్‌గేల్ షేర్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ మెచ్చుకున్నాడు. ఏ న్యూ సిక్స్ మెషీన్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సూర్య‌వంశీ ఇన్నింగ్స్‌ను మార‌ణ‌కాండ‌తో పోల్చాడు. సెంచ‌రీ మిస్ అయినందుకు దురదృష్టవంతుడు అంటూ కామెంట్ పెట్టాడు. త‌న రికార్డును ఎప్పటికైనా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. 

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది. వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లో ఫైన‌ల్‌కు చేరుకుండానే టోర్నీని నుంచి ఎస్ఆర్‌హెచ్ ఇంటిముఖం ప‌ట్టింది. బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లో 47 ప‌రుగుల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి పాలైంది. బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ ఎస్ఆర్‌హెచ్ త‌మ మార్క్ చూప‌లేక‌పోయింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగుల‌కు ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను ప‌రిశీలిద్దాం.

    వైభవ్ ఊచకోత.. తేలిపోయిన బౌల‌ర్లు
    ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం బౌలింగ్ వైఫ‌ల్య‌మ‌నే చెప్పుకోవాలి. వ‌ర‌ల్డ్ క్లాస్ పేస‌ర్ అయిన పాట్ క‌మిన్స్ సైతం ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. రాజ‌స్తాన్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని సన్‌రైజర్స్ బౌలర్లు ఆపలేకపోయారు. కమ్మిన్స్‌ను వైభవ్ ఉతికారేశాడు. అతడి దెబ్బకు కమిన్స్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్‌లలో అద్బుతంగా రాణించిన ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్ సైతం ఎలిమినేటర్‌లో విఫలమయ్యారు. ఒకవేళ వైభవ్‌ను వీరు ముందుగానే అవుట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. 

    జోఫ్రా ఆర్చర్ దెబ్బ.. అభిషేక్ అబ్బ
    ఇక సాధారణంగా ప్రతీ మ్యాచ్‌లోనూ మెరుపు ఆరంభాన్ని అందించే ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు.. ఆర్చర్ దెబ్బకు విలవిల్లాడారు. ఇన్నింగ్స్ రెండో బంతికే అద్భుతమైన బంతితో అభిషేక్‌ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. దీంతో అభిషేక్ ఖతాతెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్‌, ట్రావిస్ హెడ్‌లను సైతం ఆర్చర్ అవుట్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ను కోలులోలేని దెబ్బ తీశాడు. అతడితో పాటు బర్గర్ కూడా ఓ వికెట్ సాధించాడు. దీంతో సన్‌రైజర్స్ పవర్‌ప్లేలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

    మిడిలార్డర్ ఫెయిలూర్‌
    అయితే కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నప్పటికి కీలకమైన ఎలిమినేటర్‌లో కూడా అతడిని ఆడించి ఎస్‌ఆర్‌హెచ్ తప్పుచేసింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన స్మరణ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతడి స్ధానంలో అనికేత్ వర్మ వంటి ఆటగాళ్లకు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. మిడిలార్డ‌ర్‌లో నిల‌క‌డ‌గా రాణించే క్లాస‌న్ కూడా ఈ మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు.

    కొంపముం‍చిన కమిన్స్‌
    ఎస్‌ఆర్‌హెచ్ ఓటమికి టాస్ కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. దాదాపు చాలా మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కమిన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. అయితే  ముల్లాన్‌పూర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు, రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ చేసిన జట్లకు మధ్య విజయాల శాతంలో పెద్దగా తేడా లేదు. రెండు వైపులా దాదాపు సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్ ముందు బ్యాటింగ్ చేసి రాజస్తాన్ ముందు మంచి స్కోర్ ఉంచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో.

  • బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి కివీస్ 361 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

    క్రీజులో టామ్ బ్లండెల్(142), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(38) ఉన్నారు. అంతకంటే ముందు రచిన్‌ రవీంద్ర(121) కూడా సెంచరీతో సత్తాచాటాడు. అయితే ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా వారిద్దరూ రికార్డులెక్కారు.

    ఇంతకుముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు 11 దేశాలలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడి షేన్ వార్న్, క్రిస్ గేల్, శివనరైన్ చందర్‌పాల్‌లతో పాటు పలువురు పాకిస్తాన్ దిగ్గజ ఆటగాళ్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉండేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారిందరిని కేన్ మామ, లాథమ్ అధిగమించారు. ఈ చారిత్రత్మక మ్యాచ్‌లో విలియమ్సన్ 36 పరుగులు చేసి ఫర్వాలేదన్పించగా.. టామ్ లాథమ్ మాత్రం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    విలియమ్సన్ 2010లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కేన్ వెనక్కి తిరిగి చూడలేదు. 

    అతడి కెప్టెన్సీలో కివీస్ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(2021) టైటిల్‌ను సొంతం చేసుకుంది. విలియమ్సన్ ఇప్పటివరకు 109 టెస్టుల్లో 9,497 పరుగులు చేశాడు. త్వరలోనే 10,000 పరుగుల మార్కును అతడు అందుకోనున్నాడు.లాథమ్ విషయానికి వస్తే.. అతడు కూడా 2014 ఫిబ్రవరిలో భారత్‌పైనే టెస్ట్ అరంగేట్రం చేశాడు.. ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన లాథమ్ 16 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో 6,261 పరుగులు సాధించాడు.
    చదవండి: IPL 2026: 'ఆ సీక్రెట్‌ ఐపీఎల్ అయిపోయాక చెప్తా'

Family

  • భారతదేశంలో వేసవికాలం అంటేనే నోరూరించే ఆవకాయ పట్టే కాలం. పచ్చి మామిడికాయల ఘాటైన పుల్లదనం, తాజాగా దంచిన మసాలాల సహజమైన తీక్షణత, ఆ మిశ్రమంపై పోసే వేడి నూనె స్పష్టమైన, గాఢమైన సువాసన మనందరి పాకశాస్త్ర జ్ఞాపకాలను నిర్వచిస్తాయి. తరతరాలుగా, సాంప్రదాయ రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఊరగాయ రహస్యం పూర్తిగా నూనె ఎంపికలోనే ఉందని అమ్మమ్మలు చెబుతుంటారు. 

    సున్నితమైన గింజల రుచితో కూడిన వేరుశెనగ నూనె ఒక వైవిధ్యమైన  పాకశాస్త్ర విజేత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శక్తివంతమైనది. పైగా వంటకాలకు మరింత రుచిని అందించేది. 

    ఇక్కడ వేరుశెనగ నూనె సహజ నిల్వకారిగా, రుచిని పెంచేదిగా పనిచేస్తుంది. ఇది తేలికపాటి సువాసనను, సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగివుంటుంది. దాంతో ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని గాలి చొరబడని విధంగా మూత వేసి ఉంచితే..బూజు పట్టకుండా, పాడవకుండా నివారిస్తుంది. 

    ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో మామిడి కాలంలో, సాంప్రదాయ ‘అమ్మమ్మ’ వంటకాలతో ఊరగాయ తయారు చేయడం ఒక ఆచారం. ఇది కుటుంబాలను ఒకచోట చేర్చి, ఆ సంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేసి, పాత జ్ఞాపకాలలో మునిగిపోయేలా చేస్తుంది. సాంప్రదాయ తెలుగు/కన్నడ కుటుంబాలలో ఊరగాయ తయారీ అనుభవం గురించి జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్పి. చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఫ్రీడమ్ డబుల్ ఫిల్టర్డ్ వేరుశెనగ నూనెను జాగ్రత్తగా ఎంపిక చేసిన వేరుశెనగల నుంచి తీసి, రెండుసార్లు ఫిల్టర్ చేయడం జరుగుతుంది. 

    కాబట్టి ఈ అధిక నాణ్యత గల,  శుద్ధి చేసిన నూనెను ఎంచుకోవడం ద్వారా, భారతీయ నిల్వ పద్ధతుల ప్రాచీన జ్ఞానాన్ని గౌరవిస్తూనే, మీ కుటుంబానికి స్వచ్ఛమైన, పోషకాలు అధికంగా ఉన్న,  గాఢమైన సువాసనతో కూడిన వేసవి మధుర జ్ఞాపకాలను అందివ్వగలరని అంటున్నారు. 

    (చదవండి: 60 ఏళ్ల తల్లి వెయిట్‌లాస్‌ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్‌, షుగర్‌..)

  • పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్‌కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్‌ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.

    కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్  తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్‌లాస్‌ జర్నీని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్‌కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. 

    అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్‌ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్‌ తల్లి సైతం జిమ్‌కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్‌, రక్తపోటు, థైరాయిడ్‌ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. 

    అలాగే కంటెంట్‌ క్రియేటర్‌ హరీష్‌ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్‌ చేశారు. ఆమె ఫిట్‌నెస్‌ చర్యలో భాగంగా డెడ్‌లిఫ్ట్‌లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.

    పెద్దలకు మంచిదేనా..?
    60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు.

     

    (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్‌ మస్ట్‌)

     

  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్‌ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు  కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

    అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    • ప్రతి పేరెంట్‌ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు. 

    • వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్‌ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ‍ట్రైన్‌ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి. 

    • ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.

    • ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్‌లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి.  

    • అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు. 

    • ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. 

    • ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.

    (చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్‌, లవ్‌ అన్ని ఫెయిల్‌ చివరికి..!)

     

  • పిల్లలతో ఊహాశక్తి, బాధ్యత, అలంకరణ పట్ల అభిరుచిని పెంచేది వారి డ్రీమ్‌ హౌస్‌. అందులో గోడలు, ఫర్నిచర్, వాతావరణం.. ప్రతిదీ పరిచయం చేయవచ్చు. పిల్లల్లో వచ్చే సృజనాత్మక ఆలోచనలకు మీరే ఆశ్చర్యపోతారు.

    వెల్‌కమ్‌ చెప్పే డోర్‌..
    మన ఇంటి తలుపు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఆహ్వానించేలా ఉండాలి. దాంతోపాటు మెయిన్‌ డోర్‌ ఎలా ఉండాలో చూపమనండి.

    లివింగ్‌ – డైనింగ్‌..
    కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని ఆనందించే ప్రదేశం, అందరూ కలిసి భోజనం చేసే చోటు ఎలా ఉంటే వారికి నచ్చుతుందో చెప్పమనవచ్చు. గది గోడల రంగు, లైటింగ్, వాల్‌ పేపర్స్‌ .. ఇలా ప్రతిదీ క్రియేటివ్‌గా వారి మైండ్‌లో నుంచి వచ్చినదై ఉండాలి. రంగులు మన మూడ్‌ను ఏ విధంగా మార్చుతాయి... ఎక్కువ వస్తువులు కాకుండా ఇంటిని నీటుగా ఎలా సర్దుకోవడం, ప్రతి వస్తువు ఉపయోగం.. ఇలా ప్రతిదీ పాఠమే అవుతుంది.

    ‘పిల్లలను ఇంటి బొమ్మ డ్రా చేయమని సాధారణంగా అడుగుతుంటాం. వాళ్లు ఒక ఇంటి రూపాన్ని డ్రాయింగ్‌ చేసి చూపుతారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ అక్కడితో ఆగిపోతుంది. అలా కాకుండా వారి డ్రీమ్‌ హౌజ్‌.. దానితో పాటు కిచెన్, బెడ్‌రూమ్, లివింగ్, స్టడీ రూమ్, రంగులు, ఆర్కిటెక్చర్, అలంకరణ, ఇండోర్‌– ఔట్‌డోర్‌ మొక్కలు... ఇలా ఇంటికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎలా ఉండాలో చెప్పమనవచ్చు. డ్రా చేసి చూపమనవచ్చు. ఇల్లు.. పిల్లల్లో ఎన్నో క్రియేటివ్‌ ఐడియాలకు రూపకల్పన ఇస్తుంది. వారి క్రియేటివ్‌ ఐడియాలను మాకు పంపించండి. మెయిల్‌ ఐడి : sakshisummerkids@gmail.com

    - గీతాభాస్కర్, నటి, ఆర్ట్‌ టీచర్‌

    బెడ్‌రూమ్‌ – చదువుకునే ప్లేస్‌
    పిల్లల గది ఆలోచనల పుట్టకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. వాళ్ల చెప్పిన విధానం, డ్రాయింగ్‌లో చూపిన విధానం.. వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. దీని వల్ల గదులను శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు అవుతుంది. కాంతి ఎక్కువగా, ప్రశాంతంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే దగ్గర, ఒకే సమయంలో చదువుకోవడం అలవాటుగా మార్చుకుంటే ఏకాగ్రత క్రమశిక్షణ అలవడతాయి. రీడింగ్‌ ప్లేస్‌ను ఎలా ఉంచుకోవాలో బాధ్యత పెరుగుతుంది.

    మొక్కలు – అలంకరణ..
    ఇండోర్‌ ΄్లాంట్స్‌ అమర్చితే ఇల్లు జీవకళతో ఆకట్టుకుంటుంది. ప్రకృతిపట్ల ప్రేమ పెరుగుతుంది. ఇంటి లోపల పెంచే మొక్కలు ఎన్ని రకాలు, వాటికి గాలి, వెలుతురు, నీరు .. ఎంతవరకు అవసరమో తెలుసుకుంటారు. మన జీవనానికి ఉపయోగపడే వాటి గురించి కొత్తగా ఆలోచించగలుగుతారు.

    ‘నీ గది ఎలా ఉండాలని అనుకుంటావు? ఏ రంగు అయితే బాగుంటుంది?’, ‘‘పుస్తకాలను ఎలా సెట్‌ చేద్దాం?,’ ‘చిన్నమొక్కలు ఎక్కడ పెడతావు..’ ఇలా అడిగితే వాళ్లు తమ చిన్న చేతులతోనే చేసి చూపుతారు. ప్రేమ, పరిశుభ్రత, ప్రశాంతత ఉన్న ఇల్లు నిజమైన డ్రీమ్‌ హౌస్‌ అంటూ ఒక వ్యాసం రాసి చూపమనవచ్చు.
    నిర్వహణ : నిర్మలా రెడ్డి

Crime

  • ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్‌లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్‌లైన్‌లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్‌ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్‌లోడ్‌ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

    అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్‌లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.

    ఎలా మొదలైంది? 
    ఆన్‌లైన్‌లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్‌చంద్ శర్మతో గుజరాత్‌కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో చాట్‌చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

    ఏఐతో అసభ్యకర కంటెంట్ 
    బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్‌షిప్‌ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్‌లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు శర్మ. ఆ టూల్స్‌ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

    ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్‌ను వాటిలో అప్‌లోడ్‌ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్‌ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.

    “నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్‌లోడ్‌ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.

    “యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్‌లోడ్ చేసి, గూగుల్‌లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్‌సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.

    ఢిల్లీలో దొరికిపోయాడు..
    బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. 

NRI

  • కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది.  మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. 

    అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను  ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు  ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

    ఇదీ చదవండి: సీబీఎస్‌ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్‌
    ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్‌ బ్యాన్‌ : ఎందుకో తెలుసా?

Cartoon