Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ది రాజాసాబ్మూవీ మేకర్స్కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది.  

    కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. 

     

     

     

  • ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్‌లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్అక్కడికి చేరుకున్నారు.

    ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9 థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8 ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికేప్రీమియర్షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.

  • ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ది రాజాసాబ్ వచ్చేశాడు. మారుతి డైరెక్షన్లో వచ్చిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ప్రీమియర్స్తో ఫ్యాన్స్ముందుకొచ్చేశాడు. ఏపీలో ది రాజాసాబ్ ప్రీమియర్స్తో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. మూవీ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

    ది రాజాసాబ్లో ప్రభాస్ నటన అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంజయ్దత్ ఎంట్రీ చాలా భయానకంగా ఉందని ఫ్యాన్స్కామెంట్స్ పెడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

    హీరోయిన్ రిద్ది కుమార్దాదాపు 5 నిమిషాల పాటు కనిపిస్తుందని.. నిధి అగర్వాల్ మొదటి 30 నిమిషాల తర్వాతే ఎంట్రీ ఇచ్చిందని పోస్టులు పెడుతున్నారు. వీరిద్దరి లుక్, నటన అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మాళవిక మోహనన్ ఎంట్రీ ఆలస్యమైనా అద్భుతంగా నటించిందని చెబుతున్నారు. ఫస్ట్హాఫ్లో చివరి 30 నిమిషాల్లో కనిపించిన మాళవిక ఫైట్ సీన్లో అదరగొట్టేసిందని అంటున్నారు.

     

     

  • సంక్రాంతి పండగ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఉత్సాహం. అందుకే ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు పండగకి వారి సినిమాలు విడుదల చేయడానికి ఇష్టపడతారు. గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, హనుమాన్ వంటి సినిమాలు తక్కువ అంచనాలతో వచ్చి భారీ విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది కూడా అలాంటి సర్‌ప్రైజ్ హిట్ ఏదైనా వస్తుందా అనే ఆసక్తి పెరిగింది.  

    రాజాసాబ్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో థియేటర్లలోకి వచ్చి మంచి హైప్ సృష్టిస్తోంది. మన శంకరవరప్రసాద్ భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా. అనగనగా ఒక రాజు మోస్తరు అంచనాలతో వస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి తక్కువ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలు.  

    శర్వానంద్ కెరీర్‌లో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా మాత్రమే కాదు, ఒకే ఒక జీవితం కూడా సైలెంట్‌గా వచ్చి విజయాన్ని సాధించింది. అందుకే నారీ నారీ నడుమ మురారి సినిమాను తక్కువ అంచనా వేయడం సరికాదు. రవితేజ వరుస ఫ్లాపుల కారణంగా ఈసారి అంచనాలు తగ్గాయి. అయినప్పటికీ సంక్రాంతి బరిలో ఆయన సినిమా ఏదైనా మేజిక్ చేస్తుందేమో అనే ఆసక్తి ఉంది.  

    ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు, మూడు మిడ్ రేంజ్ సినిమాలు కలిపి బాక్సాఫీస్‌ను రంజుగా మార్చాయి. రాజాసాబ్‌తో సంక్రాంతి సినిమా పండగ మొదలైంది. ఇంకో వారం రోజుల్లో ఎవరు నిజమైన సంక్రాంతి హీరో అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ రేసు ప్రేక్షకులకు భలే ఆసక్తికరంగా మారింది. ఒక వైపు పెద్ద సినిమాలు తమ స్థాయిలో పోటీ పడుతుంటే, మరోవైపు చిన్న సినిమాలు సర్‌ప్రైజ్ హిట్ ఇవ్వగలవా అనే ఉత్కంఠను ప్రేక్షకులకు రేపాయి.  

  • తెలంగాణలో 'ది రాజా సాబ్‌' అభిమానులకు నిరాశ ఎదురైంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్‌ షోలు ఉంటాయని ఎదురుచూసిన ఫ్యాన్స్‌ బాధతో థియేటర్స్‌ నుంచి వెనుతిరుగుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో షో పడింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ కూడా నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని ప్రభాస్‌ అభిమానులు భగ్గుమంటున్నారు.

    'ది రాజా సాబ్‌' సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే టికెట్‌ ధరల పెంపునకు ఛాన్స్‌ ఇచ్చారు. కానీ, తెలంగాణలో టికెట్ ధరలు, షోల అనుమతిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఇప్పటికీ బుక్ మై షోలో బుకింగ్  మొదలు కాలేదు.  కొన్ని గంటల్లోనే సినిమా విడుదల కావాల్సి ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా కూడా టికెట్ల విక్రయం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభాస్‌ ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు. ప్రతి సినిమాకు ఇలాగే చివరివరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అంటున్నారు.

    కోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?
    టికెట్‌ ధరల పెంపు కోసం ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టులో వారికి భారీ ఊరట లభించింది.  టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

  • గుర్రం పాపిరెడ్డి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. డార్క్‌ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 19న విడుదల అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్‌ అయిపోయింది.

    గుర్రం పాపిరెడ్డి(Gurram Paapi Reddy ) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16న  జీ5(Zee5) వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్‌ ఈ మూవీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో బ్రహ్మానందం జడ్జ్‌ పాత్రలో ఫుల్‌‌ లెంగ్త్‌ రోల్‌ నటించారు.

    గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్‌ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్‌ దోపిడీకి పాల్పడతాడు. ‍అది విఫలం కావడంతో  మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్‌ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.

  • త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ న‌టించిన తాజా చిత్రం జన నాయగన్ విడుద‌ల అనూహ్యంగా వాయిదా ప‌డింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి సెన్సార్ స‌ర్టిఫికెట్ రాక‌పోవ‌డంతో సినిమా అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల కావడం లేదు. మ‌ద్రాస్ హైకోర్టు నిర్ణ‌యంపై ఈ సినిమా విడుద‌ల ఆధార‌ప‌డి ఉంది. ముందుగా ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం జ‌న‌వ‌రి 9న జన నాయగన్ రిలీజ్ కావాల్సివుంది. అయితే మ‌ద్రాస్ హైకోర్టు త‌మ నిర్ణ‌యాన్ని అదేరోజు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్ప‌డంతో సినిమా విడుద‌ల పోస్ట్‌పోన్ అయింది. ఈ నేప‌థ్యంలో కోర్టు తీర్పు కోసం విజ‌య్ అభిమానులు, మ‌ద్ద‌తుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

    జన నాయగన్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో నిశితంగా గ‌మ‌నిస్తున్నారు విజ‌య్ ఫ్యాన్స్‌. ఈ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌ర‌పున హైకోర్టులో వాద‌న‌లు విన్పిస్తున్న ప్ర‌ముఖ న్యాయ‌వాది స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్ (Satish Parasaran) గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌తో ఆయ‌న ద‌గ్గ‌ర సంబంధాలు ఉన్నాయ‌ని వెల్ల‌డైంది. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ మేన‌ల్లుడైన స‌తీశ్‌.. కోర్టులో ప‌దునైన వాద‌న‌ల‌తో సీబీఎఫ్‌సీ ప్ర‌తినిధుల‌కు దీటుగా కౌంట‌ర్ ఇస్తున్నార‌ని అభిమానులు అంటున్నారు.

    ఎవ‌రీ స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్?
    క‌మ‌ల‌హాస‌న్ సోద‌రి సరోజ కుమారుడే స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్. ఈయ‌న తండ్రి కె. పరాశరణ్ 1983-89 వరకు భారత అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి స‌తీశ్ న్యాయ‌విద్య పూర్తి చేశారు. త‌ర్వాత త‌మిళ‌నాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.

    కమల్ హాసన్ (Kamal Haasan) సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ త‌ర‌పున కూడా ప‌లు సంద‌ర్భాల్లో కోర్టుల్లో వాద‌న‌లు వినిపించారు. క‌మ‌ల్ సినిమాలకు అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయ‌న కోర్టులో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేవారు. గ‌త ఏడాది థగ్ లైఫ్ సినిమాను క‌ర్ణాట‌క‌లో నిషేధించిన‌ప్పుడు స‌తీశ్ ప‌రాశ‌ర‌ణే వాదించారు.

    చ‌ద‌వండి: 'జన నాయగన్' వాయిదా.. భారీగా రీఫండ్‌

    స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్‌పైనే ఆశ‌లు
    ఇండియన్ 2 సెట్ ప్రమాదం విషయంలో క‌మ‌ల్‌హాస‌న్‌కు మద్రాస్ హైకోర్టు సమన్లు ​​జారీ చేసినప్పుడు కూడా ఆయ‌న త‌ర‌పున కేసు వాదించారు. 2020లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో ముగ్గురు వ్యక్తులు చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా జన నాయగన్ సినిమా విడుద‌ల విష‌యంలో విజ‌య్ అభిమానులు స‌తీశ్ ప‌రాశ‌ర‌ణ్ వాద‌న‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. మద్రాస్ హైకోర్టు రేపు ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌రిస్తుందోన‌ని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. 

  • సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. విజయవాడతో ఘట్టమనేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కడ అయనకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. జనవరి 11న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు  కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ మనవుడు  'జై కృష్ణ' విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

    అగ్ని పర్వతం సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఆదిశేషగిరిరావు తెలిపారు.  ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారని చెప్పారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే31వ తేదీన సినిమా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. మహేష్ బాబు,  కృష్ణ లాగా తను కూడా అభిమానులను సంపాదించుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ సినిమా థియేటర్స్‌ యజమానులతో పాటు నగర ప్రజలతో కృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.

    సినిమా టికెట్‌ ధరలపై సూచన
    టాలీవుడ్‌లో సినిమా టికెట్‌ ధరల పెంపు అనేది ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ అంశంపై తాజాగా  ఆదిశేషగిరిరావు స్పందించారు.  నిర్మాతలతో పాటు ప్రేక్షకుల కోణంలో ఆయన మాట్లాడారు. ఒక సినిమాకు బడ్జెట్‌ పెరిగిందనే సాకు చూపించి టికెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్‌ పద్ధతి కాదని అయన అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాలకు టికెట్‌ ధరలు పెంచడంతో చిన్న సినిమాలు భారీగా దెబ్బతింటున్నాయన్నారు. ఆపై టికెట్‌ ధరల వల్ల సామాన్య ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెద్ద సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్‌ భారీ ధరలు ఉంటాయని, ఆ మూడు రోజుల  అయిపోగానే ఎటూ రేట్లు తగ్గుతాయన్నారు. టికెట్‌  ధరలు  అందుబాటులోకి థియేటర్‌కు వెళ్లాలని ప్రేక్షకులకు సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండాలని ఆదిశేషగిరిరావు తెలిపారు.

  • మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన ఏపీ యూట్యూబర్‌ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 'వైరల్ హబ్ 007' పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌లో చాలారోజులుగా ఆయన పలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే, అందులో మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 అక్టోబరు 16న తన ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయినట్లు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. దీంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.

    ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి రన్‌ చేస్తున్న సదరు యూట్యూబ్‌ ఛానల్‌లో ఎక్కువగా అసభ్యకరమైన రీతులోనే ఇంటర్వ్యూలలో ప్రశ్నలు  ఉంటాయని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 15 నుంచి 17ఏళ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇదంతా తన ఛానల్‌లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

    ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరేపించడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనను హైదరాబాద్‌ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు.  ఇతడు బాలల రక్షణ చట్టాలతో పాటు సైబర్‌ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు.  సైబర్‌ ఏసీపీ శివమారుతి టీమ్‌, ఎస్‌ఐ సురేశ్‌తో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేశారు.  అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డిజిటల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద సైబర్ క్రైం పోలీసులు  కేసు నమోదు చేసినట్లు సమాచారం.

  • బిగ్‌బాస్‌ తెలుగు 9 విన్నర్‌ కల్యాణ్‌ పడాల, రన్నర్‌ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్‌లో వీరిద్దరి ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్‌ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్‌లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్‌' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే'  అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్‌ అవుతున్నారు. 

  • ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్‌ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు గా తమని పలకరించేందుకు హుక్‌ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్‌ స్టెప్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది. మరి ఇంతకీ ఈ హుక్‌ స్టెప్‌ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?

    ‘హుక్‌ స్టెప్‌ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్‌లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్‌ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌ చెబుతున్నాడు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ నర్తించిన బ్యాడ్‌ న్యూజ్‌లోని తౌబా తౌబా పాట స్టెప్స్‌ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్‌తో‘ హుక్‌ స్టెప్‌ను కొరియోగ్రాఫ్‌ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.

    పెరిగిన కొరియోగ్రాఫర్‌ ప్రాధాన్యత...
    ‘హుక్‌ స్టెప్‌ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్‌లను మరింత పాప్యులర్‌ చేసింది. హుక్‌ స్టెప్‌ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్‌ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్‌ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్‌ కాదు. మైఖేల్‌ జాక్సన్‌ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్‌ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి

    ‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్‌లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.

    హుక్‌...హిస్టరీ...
    దీని గురించి బాలీవుడ్‌ మరో కొరియోగ్రాఫర్‌ ముదస్సర్‌ ఖాన్‌ మాట్లాడుతూ, హుక్‌ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్‌ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్‌ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్‌ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్‌లో హుక్‌ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్‌ చెప్పాడు.

    ‘నేను సల్మాన్‌ ఖాన్కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్‌ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్‌గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్‌ అన్నారు. హుక్‌ స్టెప్‌ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్‌ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్‌ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్‌ స్టెప్‌’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్‌ స్టెప్‌ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్‌గా ఉంటే, ఎంత మంచి హుక్‌ స్టెప్‌ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్‌ స్టెప్‌ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.

    హుక్‌ స్టెప్‌లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్‌ పునీత్‌ జె పాఠక్‌ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్‌ స్టెప్‌ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్స్ట్రాగామ్‌లో, రీల్స్‌లో ఉంచే హుక్‌ స్టెప్‌ను తయారు చేసి దానిని వైరల్‌ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్‌లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.

    అయితే రీల్స్‌ ఆధారిత హుక్‌ స్టెప్స్‌ డ్యాన్స్ సీక్వెన్స్ల వైరల్‌లో ఉన్న సమస్య వైరల్‌ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్‌ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్‌ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్‌ వైరల్‌ అవుతున్నాయి కానీ ఐకానిక్‌గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.

    ‘హుక్‌ స్టెప్‌ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్‌ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్‌ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్‌ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్‌ క్రియేటర్‌ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్‌గా, తాను ఈ హుక్‌ స్టెప్‌లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్‌ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.

    ఇటీవలి కాలంలో కొన్ని హుక్‌ హిట్స్‌...
    ఈ మధ్య కాలంలో వైరల్‌ అయిన హుక్‌ స్టెప్స్‌లో జాదు‘ (జ్యుయల్‌ థీఫ్‌) పాటలో జైదీప్‌ అహ్లావత్‌ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్‌ న్యూజ్‌): విక్కీ కౌశల్‌ మూవ్‌ మెంట్స్‌ , ‘జనాబ్‌ఆలీ‘ (వార్‌ 2) చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌తో హృతిక్‌ రోషన్‌ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2) పాటలో అజయ్‌ దేవగన్‌ స్టైల్‌ వైరల్‌ కాగా,‘ఝూమ్‌ షరాబీ‘ (దే దే ప్యార్‌ దే 2)లో కూడా అజయ్‌ దేవగన్‌ మళ్లీ గ్లాస్‌తో వైరల్‌ స్టెప్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్‌ స్టెప్‌‘ (మన శంకర వరప్రసాద్‌ గారు): చిరంజీవి స్టెప్స్‌ తోడయ్యాయి.

  • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' మూవీ సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 9)  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు, పాటలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజాసాబ్‌ గురించి పది ఆసక్తికరమైన విషయాలు..

    ప్రభాస్‌కి తొలి సినిమా: ప్రభాస్‌ కెరీర్‌లో చేస్తున్న తొలి హారర్‌ ఫాంటసీ కామెడీ చిత్రమిది. బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ తన రూట్‌ మార్చి వింటేజ్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అలరించడానికి వచ్చేస్తున్నాడు. ప్రభాస్‌ సినిమాలో మొదటిసారి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు . మాళవిక మోహనన్ , నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్‌కి జోడీగా నటించారు. 

    అతిపెద్ద సెట్‌: ఈ సినిమా కోసం హైదరాబాద్‌లోని అజీజ్ నగర్‌లో హవేలి సెట్‌ను నిర్మించారు.‌ దాదాపు 40,000 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెట్, భారతదేశంలో హారర్ జోనర్ కోసం నిర్మించిన అతిపెద్ద సెట్‌గా రికార్డ్ సృష్టించింది. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ నాయర్ ఈ సెట్‌ను హాలీవుడ్ స్థాయిలో డిజైన్ చేశారు. ఈ సెట్‌లోనే ఎక్కువ శాతం షూటింగ్‌ జరిగిందట. 

    భారీ రన్‌టైమ్: ఈ సినిమా రన్‌టైమ్‌ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్‌ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్‌ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు.

    థ్రిల్‌ చేసేలా ఫాంటసీ ఎలిమెంట్స్‌: ఇది కేవలం కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంది. సినిమాలోని ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ వెల్లడించారు.

    23 కోట్లతో మొసలి సీన్‌ : ఈ సినిమాలో మొసలితో ప్రభాస్ చేసే ఫైట్ సీన్ అదిరిపోతుందట.ఈ ఒక్క సీన్‌ కోసమే దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సీన్‌ కోసం హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ 10 గంటలు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందట. ‘ఒకవైపు చలికి చర్మం మొత్తం మొద్దుబారిపోతున్న ఫీలింగ్‌ కలిగేది. అదే సమయంలో మొసలి దాడి చేస్తున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టాలన్నారు. ఆ నీళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అందరూ అందులోకి దిగి షూట్‌ చేస్తున్నారు. పెయింట్‌, కెమికల్స్‌, వాడిపారేసిన వస్తువులు అన్నీ అందులో ఉన్నాయి. ఆ నీటిలోనే 3 రోజులు షూట్‌ చేశాం. అదొక వింత అనుభవం’ అని ఓ ఇంటర్వ్యలో మాళవిక చెప్పుకొచ్చింది. 

    రూ.450 కోట్ల బడ్జెట్‌.. ప్రభాస్‌కి తక్కువే: ఈ సినిమా కోసం పిపుల్స్‌ మీడియా దాదాపు రూ. 450 కోట్ల వరకు ఖర్చు చేసిందట. ఇందులో అత్యధికంగా రెమ్యునరేషన్లకే కేటాయించాల్సి వచ్చిదంట. అయితే ప్రభాస్‌ మాత్రం గత సినిమాల కంటే తక్కువ పారితోషికం తీసుకొని ఈ సినిమా చేశాడు. ప్రతి సినిమాకు రూ. 120-150 కోట్లు తీసుకునే ప్రభాస్‌.. రాజాసాబ్‌కి మాత్రం రూ.100 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. ఇక విలన్‌గా నటించిన సంజయ్‌ దత్‌ రూ. 6 కోట్లు, డైరెక్టర్‌ మారుతి రూ. 18 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే.. మాళవికా రూ. 2 కోట్లు, నిధి అగర్వాల్‌ రూ. 1.5 కోట్లు, రిద్ధి కుమార్‌ రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

    ఫస్ట్‌ టైటిల్‌ ఇదే: ఇది బామ్మ-మనవడి కథ. ఇందులో బామ్మ కూడా ఓ హీరోనే అంటూ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాసే ఈ సినిమా కథను రివీల్‌ చేశాడు. ఇందులో బామ్మ భర్త విలన్‌. అనుకోని పరిస్థితుల్లో హీరో పాడుబడ్డ మహల్‌కు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకనేది సినిమా చూడాలి.ఈ సినిమాకు ముందుగా రెండు, మూడు టైటిల్స్‌ అనుకున్నారట. రాజా డీలక్స్‌, రాజా అనే టైటిల్‌ అనుకున్నారట. రాజా అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ పూర్తి చేసి..  చివరకు ‘ది రాజాసాబ్‌’ని ఫిక్స్‌ చేశారు. సినిమా అధికారిక టైటిల్ ని 2024 జనవరిలో ప్రకటించారు.

    విలన్‌గా సంజయ్‌: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో ప్రభాస్ తాతగారి ఘోస్ట్ పాత్ర పోషించారు . ప్రభాస్‌తో ఆయన క్లాష్ సీన్స్ హైలైట్ అవుతాయని టాక్.

    తమన్‌ సంగీతం: ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ముఖ్యంగా ప్రభాస్ ఎనర్జిటిక్ స్టెప్పులు ఉన్న సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బీజీఎం అయితే ఓ రేంజ్‌లో ఉంటుందట. తమన్‌ తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని దర్శకుడు మారుతితో పాటు ప్రభాస్‌ కూడా అన్నారు. 

    జనవరి 9న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జోరుగా సాగుతున్నాయి .జనవరి 8న ఇండియాలో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు భారీగా పెరిగాయి.ప్రీమియర్స్‌కి టికెట్ ధర ఏకంగా రూ. 1000 గా ఫిక్స్‌ చేశారు. 

  • ప్రభాస్‌-  సందీప్‌రెడ్డి వంగా  కాంబినేషన్‌ నుంచి తెరకెక్కుతున్న హైఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ‘స్పిరిట్‌’..  కొత్త ఏడాది సందర్భంగా ఆ మూవీ నుంచి అదరిపోయే పోస్టర​్‌ను  దర్శకుడు సందీప్‌ రిలీజ్‌ చేశారు. స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ లుక్‌ను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. బాలీవుడ్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో డార్లింగ్‌ కనిపించారు. ఒళ్లంతా గాయాలతో తను ఉండగా.. ఆయన ముందు త్రిప్తి దిమ్రీ నిలబడి ఉంది. చేతిలో వైన్‌ బాటిల్‌తో మరింత  ఫైర్‌ను పెంచాడు. అందరినీ మెప్పించిన పోస్టర్‌పై సందీప్‌, ప్రభాస్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్‌ అయ్యారు.

    ప్రభాస్‌ నటించిన ది రాజాసాబ్‌ మూవీ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌ రెడ్డి హోస్ట్‌గా ప్రభాస్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌లతో ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలోనే వారు స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ గురించి ప్రభాస్‌ ఇలా అన్నారు. 'నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ పోస్టర్‌.. కల్ట్ పోస్టర్‌' అంటూ  దర్శకుడు సందీప్‌ను మెచ్చుకున్నారు.  ఇలాంటి ఆలోచన సందీప్‌కి ఎలా వచ్చిందోగానీ అదిరిపోయిందంటే డార్లింగ్‌ ప్రశంసించారు.  అయితే, సందీప్‌ రెడ్డి కూడా పోస్టర్‌ వెనుక జరిగిన కసరత్తు గురించి చెప్పుకొచ్చారు.  బాహుబలి తర్వాత అంతే రేంజ్‌లో ప్రభాస్‌‌ను  చూపించాలని ఆలోచించానని.. అందుకే ఆ పోస్టర్‌ను రెడీ చేశానన్నారు. అయితే, సినిమాలో ఒక సీన్‌ నుంచి  ఆ పోస్టర్‌ను తీసుకున్నట్లు ఆయన పేర్కన్నారు.
     

  • కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌  ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్‌ మై షో'(BookMyShow)  ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్‌లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్‌'(Jana Nayagan) రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

    బుక్‌ మై షోలో రికార్డ్‌
    'జన నాయగన్‌' వాయిదా పడటంతో  ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్‌ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్‌ చేసుకోవాలో కూడా మెయిల్‌ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్‌ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 

    విజయ్‌ కోసం 'కమల్‌హాసన్‌' మేనల్లుడు
    జన నాయగన్‌ సెన్సార్‌ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు  CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో    సెన్సార్‌ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్‌ మేనల్లుడు సతీశ్‌ పరాశరణ్‌ వాదిస్తున్నారు.

  • నటడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్‌ చేశారు. అవి సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్‌గా యాంకర్‌, నటి అనసూయ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లలం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. 'మా ఇష్టానికి మమ్మల్ని బతకనీయండి.' అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్‌ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. తిరిగి అదే రేంజ్‌లో సమాధానం చెప్పారు.

    కొద్దిరోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదికగా డిబెట్‌లలో పాల్గొంటున్నారు.  ఈ అంశంపై ఆమె వివరణ  ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమై లైవ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ చెప్పుకునే వ్యక్తిపై కామెంట్‌ చేశారు. ఫ్యాన్స్‌ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్‌మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా.. వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడుతాను. నిజాయితీగా ఉన్నవారితో టచ్‌లో కూడా ఉంటాను. 

    నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్‌ చేస్తారు.. వాటిని నేను షేర్‌ చేస్తూ ఉంటాను.  ఇప్పుడు నాపేరు చెప్పుకుని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలను నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్లు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు.  నా పేరు ఉపయోగించుకుని వారు బతుకుతున్నారు.' అంటూ  అనసూయ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడినంటూ డిబేట్స్‌లలో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్‌ చేశారు.
     

Telangana

  • సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ను కోరారు.

    అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

    దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్‌ చౌరస్తాలో తెలంగాణ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌, ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. 

    హైదరాబాద్‌ నుంచి కేరళ, బెంగళూరు, తమిళనాడు, పాండిచ్చేరిలతో పాటు ఏపీకి వెళ్తున్న బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. ఆర్టీఏ తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భవన అనుమతి గడువు ముగిసినప్పటికీ అనుమతించిన ప్లాన్ల ప్రకారమే నిర్మాణం పూర్తిచేసిన నాన్ హైరైజ్ భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది.
    భవన అనుమతులు పొంది, గడువు లోపల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందలేకపోయినప్పటికీ అనుమతించిన ప్లాన్ల మేరకు నిర్మాణం పూర్తి చేసిన భవనాలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

    ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల నీటి, విద్యుత్ కనెక్షన్లు (HMWSSB, TSSPDCL) పొందడంలో కొనుగోలుదారులు, గృహ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు, బ్యాంకు రుణాల విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అదనపు పెనాల్టీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు.

    కేసు–1:
    భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల లోపు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినట్లయితే, రూల్–26 ప్రకారం పెండింగ్ భవన అనుమతి ఫీజులు, లింక్ రోడ్ ఛార్జీలు, CRMP ఛార్జీలు తదితర వర్తించే రుసుములు వసూలు చేసి దరఖాస్తును పరిశీలిస్తారు.

    కేసు–2:
    భవన అనుమతి గడువు ముగిసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తరువాత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు తేదీ నాటికి మొత్తం నిర్మిత విస్తీర్ణానికి వర్తించే అన్ని రుసుములు, ఛార్జీలు వసూలు చేస్తారు.

    రెండు సందర్భాల్లోనూ, తప్పనిసరి సెట్ బ్యాక్ లో (ఫ్రంట్ సెట్ బ్యాక్ మినహా) 10 శాతం లోపు వ్యత్యాసాలు ఉన్న భవనాలకే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు నాన్ హైరైజ్ భవనాలకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో పౌరులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందే అవకాశం కలుగుతుందని, మౌలిక సదుపాయాల కనెక్షన్లు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం 2025–26ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ లభించనుంది. ఈ పథకం ప్రకారం, పన్ను చెల్లింపుదారులు పూర్తి ప్రిన్సిపల్ ట్యాక్స్‌తో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే ఒక్కసారి చెల్లిస్తే, మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుంది.

    దీని ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుంది. పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. OTS పథకం కింద చెల్లింపులు MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSCs) మరియు ఆన్‌లైన్ విధానాల ద్వారా చేయవచ్చు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా నగర మౌలిక సదుపాయాలు, పౌర సేవలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు.

  • సాక్షి, సిద్దిపేట: మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను మంత్రులు అందించారు. అనంతరం, కేసీఆర్ దంపతులు కూడా మంత్రులను సన్మానించారు.

    ఆహ్వానం సందర్భంగా దాదాపు  20 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మేడారంలో జాతర సందర్బంగా చేస్తున్న ఏర్పాట్లను కేసీఆర్‌కు వివరించినట్టుగా తెలిసింది. అనంతరం, మేడారం జాతరకు ఏదోఒక రోజు తాము హాజరు అవుతామని కేసీఆర్ చెప్పారని మంత్రులువెల్లడించారు. కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లిపోయారు.

    అంతకుముందు మంత్రులిద్దరూ మాట్లాడుతూ..‘మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. హెలికాప్టర్‌లో సతీసమేతంగా జాతరకు కేసీఆర్ వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాము. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. మేడారం జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అందరిని మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం’ అని అన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: చైనా మాంజా విషయంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దారాన్ని అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. తాజాగా భారీగా నిషేధిత మాంజాను పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. 

    చైనా మాంజాపై నిషేధం విధించి పదేళ్లు అవుతోంది.  ఇండస్ట్రీయల్‌ అవసరం కోసం తయారైన దారాన్ని మాంజాగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇక మీదట నగరంలో అమ్మినా.. కొన్నా.. ఆ దారంతో పతంగులు ఎగరేసినా కేసులు పెడతాం. చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలైనా కేసులు పెడతాం. చైనా మాంజా విషయంలో పీడీ యాక్ట్‌ ప్రయోగించే ఆలోచన చేస్తున్నాం అని సజ్జనార్‌ హెచ్చరించారు. 

    చైనా మాంజాపై బ్యాన్‌ ఉన్నప్పటికీ.. సంక్రాంతి సీజన్‌కు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని దుకాణాదారులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో అవి తెగి మాంజా గాలిలో వేలాడుతున్నాయి. వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే పక్షులు చనిపోతున్నాయి. తాజాగా.. 

    నగరంలో అధికారులు పట్టుకున్న మాంజా విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, సూరత్‌, మహారాష్ట్ర నుంచి దుకాణాదారులు చైనా మాంజాను తెప్పించే క్రమంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు.. చైనా మాంజా తయారు చేస్తున్న  రెండు ఫ్యాక్టరీలను సీజ్‌ చేసినట్లు.. గుజరాత్‌, రాజస్థాన్‌ తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ మాంజా ఫ్యాక్టరీలపై పోలీసుల ఆపరేషన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Politics

  • సాక్షి, వైఎస్సార్‌: జిల్లాలోని సుండుపల్లె మండలంలో టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాయవరం సర్పంచ్ షరీఫ్ ఇంటిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు వర్గీయులు దాడి చేశారు. పచ్చ నేతల దాడిలో సర్పంచ్‌ షరీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు.

    అనంతరం, సర్పంచ్‌ షరీఫ్‌ మాట్లాడారు. తన సోదరుడు, మండల మైనారిటీ నాయకుడు రఫీక్‌కు ఉన్న ఆదరణను ఒర్వలేకనే చప్పిడి బ్రదర్స్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేసేందే కాకుండా.. అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలు ఎదగడం ఇష్టం లేకనే తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమను టీడీపీ గుర్తించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సర్పంచ్ ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఏపీ రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు జాగీరు కాదని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌. రాయలసీమకు అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే కదా అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి.. మీకు అనుకూలంగా ఉండే చోట కాదంటూ హితవు పలికారు.

    మాజీ మంత్రి సాకే శైలజానాధ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని చంద్రబాబు జాగీరు కాదు. దాని గురించి మాట్లాడితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. ఏమీ చేయలేని వారే కోపపడుతుంటారు. రాయలసీమను అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాజధానిలో మా రాయలసీమ చెమట, రక్తం కూడా ఉంటుంది. అలాంటి రాజధానిని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సహించం. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే. దాదాపు వెయ్యి కోట్లు నీటిని ఎత్తిపోసేందుకే ఖర్చు చేశారు. అమరావతిలో బిల్డింగుల నిర్మాణానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతోంది.

    చంద్రబాబు పుణ్యమా అని రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి. మీకు అనుకూలంగా ఉండే చోట కాదు. ఎకరా అభివృద్దికి రెండు కోట్లు చొప్పున మౌళిక సదుపాయాల ఖర్చు చేస్తారా?. మీరు తెచ్చే అప్పులకు ప్రతి ఏటా పదహారు వేల కోట్లు వడ్డీలే కట్టాలి. ఇదంతా రాష్ట్రమంతా భరించాలి. ఇది ఎవరి సొమ్ము?. నారాయణ కాలేజీల నుంచి డబ్బు తెస్తున్నారా?. రాజధాని గురించి ఎవరూ అడగటానికి వీల్లేదా?. రెండు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఖర్మ ఏంటి?.  ప్రజల కోసం జగన్ మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తోంది?. రాయలసీమకు నష్టం చేయవద్దని చెబితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. చంద్రబాబు కట్టేది నీళ్లలో తేలియాడే నగరమా?. సమాధానం చెప్పలేకనే చంద్రబాబుకు కోపం వస్తోంది.

    అమరావతిలో వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తారా? అది సాధ్యమయ్యే పనేనా?. ఆల్రెడీ ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టును ఏం చేస్తారు?. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్టు దాన్ని కూడా నిలిపేస్తారా?. మునిగిపోయే ప్రాంతంలో ఎవరూ ఇల్లు కూడా కట్టుకోరు. మరి రాజధానిని ఎలా కడతారు?. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మరి ఇప్పటి వరకు ఏ సెల్ఫ్ ఫైనాన్స్‌తో కడుతున్నారు?.  అమరావతిలో కడుతోంది రాజధాని కాదు, లిఫ్టు ఇరిగేషన్లే. వడ్డమానులో భూ సమీకరణకు వెళ్తే రైతులు ఛీ కొట్టారు. భూములు ఇవ్వకపోతే లాగేసుకుంటామని బెదిరిస్తారా?. అందుకే రామారావు లాంటి రైతులు చనిపోతున్నారు. రాజధాని అందరిదీ, అదేమీ చంద్రబాబు జాగీరు కాదు. రాజధాని విషయంలో దేవతా వస్త్రాలు కట్టుకున్నట్లు వ్యవహరించవద్దు. అప్పులు తెస్తూ రుణ సమీకరణ అంటూ కొత్త పదాలు చెబుతున్నారు. ప్రజలు లేని రాజధానిని కడుతున్నారు. మీ రాజధాని కోసం మా చెమట, రక్తాన్ని ధారపోయవద్దు.  

    రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవటానికి అదేమీ మీ ఇంటి విషయం కాదు. రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల తరపున పోరాడుతాం. రానున్న రోజుల్లో రాజధాని గురించి అందరూ మాట్లాడతారు’ అని వ్యాఖ్యానించారు. 

  • సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ ప్రభుత్వం తరఫున బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం వెళ్లింది. ఆ సమయంలో ఆయన పలకరింపు మహిళా మంత్రులనూ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందనే చర్చ నడుస్తోంది. ‘‘బాగున్నారా అమ్మా..’’ అంటూ కొండా సురేఖను, సీతక్కలను ఆత్మీయంగా పిలిచి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారాయన. అంతటితో ఆగకుండా..  

    మేడారం జాతర పనులు ఎంతవరకు వచ్చాయని మంత్రులను అడిగి తెలుసుకున్నారు. పనులు చివరి దశలో ఉన్నాయని.. జాతర దగ్గర పడుతుండడంతో పనులు వేగంగా చేస్తామని ఈ సందర్భంగా మాజీ సీఎంకు మంత్రులిద్దరూ వివరించారు. అయితే.. పనుల విషయం జాగ్రత్త వహించండి.. పనులు తొందర కావాలని ఆగం కావొద్దంటూ ఆయన వాళ్లను సున్నితంగా సూచించారు. అవసరం అయితే కొన్ని పనులు జాతర అయిపోయాక కూడా చేసుకోవచ్చంటూ సలహా ఇచ్చారు. 

    అలాగే కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హెలికాప్టర్‌లో సతీసమేతంగా జాతరకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ‘‘ఆడబిడ్డలుగా కేసీఆర్ దగ్గరికి వచ్చాం. మాకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారు’’ అని మంత్రులిద్దరూ మీడియాకు చెప్పారు. అంతకు ముందు.. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్‌ దంపతులు అతిథి మర్యాదలతో పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కరించడం వైరల్‌గా మారింది. 

    కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్‌.. మొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రేవంత్‌ రెడ్డి పలకరింపునకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సీఎం రాక సందర్భంగా లేచి నిలబడి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. ‘‘దటీజ్‌ కేసీఆర్‌ అని.. ఆయనకంటూ ఓ సంస్కారం ఉందని.. ఆయన విమర్శలు ఏనాడూ హద్దుదాటి ఉండవు’’ అంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆ వీడియోను నెట్టింట తెగ వైరల్‌ చేశాయి.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎంట్రీతో రాజకీయగా ఒక్కసారిగా వేడెక్కింది. బెంగాల్‌లో రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం సహా ఐప్యాక్‌కు సంబంధించిన పలు ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు ఈడీ తెలిపింది. మరోవైపు.. ఈడీ దాడులపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    బెంగాల్‌లో ఈడీ దాడులపై తాజాగా మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దయచేసి క్షమించండి. మీ హోంమంత్రి అమిత్‌ షాను నియంత్రించండి. రాజకీయంగా మీరు మాతో(టీఎంసీ) పోరాడండి. అలా పోరాడలేకపోతే బెంగాల్‌కు ఎందుకు వస్తున్నారు?. ప్రజాస్వామ్య పద్ధతిలో మమ్మల్ని ఓడించండి. మీరు మా పత్రాలను, మా వ్యూహాన్ని, మా ఓటర్లను, మా డేటాను, మా బెంగాల్‌ను దోచుకోవడానికి ఏజెన్సీలను వాడుకుంటున్నారు. ఇవన్నీ చేయడం వల్ల, మీకు వచ్చే సీట్ల సంఖ్య సున్నాకు తగ్గిపోతుంది. దాడులతో మీరు చేసేది ఏమీ లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

    మరోవైపు.. ఈడీ అధికారులు ఐప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మనోజ్‌ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని బెంగాల్‌ సీఎం ఆరోపించారు.

    అలాగే, ఈడీ ఫోరెన్సిక్ బృందం మాకు సంబంధించిన కొంత డేటాను బదిలీ చేశారని నేను విన్నాను. వారు మా హార్డ్ డిస్క్, మా ఫైనాన్షియల్‌ పత్రాలు, రాజకీయ పత్రాలు తీసుకున్నారు. బీజేపీకి లక్షల కోట్ల ఆస్తి ఉంది. కానీ, సీబీఐ, ఈడీ వారిని ఎవరినీ పట్టుకోలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 

    కాగా, ఈడీ సోదాలు మనీలాండరింగ్ కేసు సంబంధించనట్టు అధికారులు చెబుతున్నారు. నేరానికి సంబంధించిన డబ్బు.. ఐ-ప్యాక్‌కు చేరినట్లు గుర్తించారని ఈడీ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఇదిలా ఉండగా.. మమత వద్ద కనిపించిన ఫైల్స్‌లో ఏమున్నాయో పెద్దగా తెలియకపోయినప్పటికీ ఫొటోలలో ఒక ఫైల్‌పై ‘ఫిబ్రవరి 2022’ అని గుర్తించి ఉంది. మరొక ఫైల్‌లో తృణమూల్ నాయకుల ప్రయాణ రికార్డులను వివరించే పత్రాల కట్ట ఉంది. అటువంటి ఒక పత్రంలో "మహువా మోయిత్రా x 1", ఫిబ్రవరి 2, 2022 ప్రయాణ తేదీ ప్రస్తావించబడింది. మోయిత్రా కృష్ణానగర్ ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    ఇక, ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్‌ జైన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ విభాగానికి హెడ్‌గానూ వ్యవహరిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి టీఎంసీతో కలిసి ఐప్యాక్‌ పనిచేస్తోంది. అయితే, మరికొన్ని నెలల్లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

  • ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్‌ స్థానం కోసం అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి నుంచే మేయర్‌ వస్తారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మేయర్‌ ఎంపిక విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ మాట్లాడుతూ..దేశం ముందు అనే భావజాలాన్ని బీజేపీ అనుసరిస్తుంది. ముంబై మేయర్ సీటు మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడింది. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజలు సహజంగానే మేయర్ తమిళుడు కావాలని చెబుతారు. అదేవిధంగా ముంబైలో కూడా మేయర్ మరాఠీ వ్యక్తే అవుతారు. మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

    అయితే, అంతకముందు మహారాష్ట్రకు చెందిన ఎం​ఐఎం నాయకుడు వారిస్ పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముంబై మేయర్‌ పీఠం ఎంఐఎం పార్టీదేనని అన్నారు. ముంబై మేయర్‌గా ముస్లిం వ్యక్తే ఉంటారని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై ట్రాఫిక్‌ విషయమై ఫడ్నవీస్‌ స్పందించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ ట్రాఫిక్ కంటే ‌ముంబై ట్రాఫిక్ చాలా బెటర్‌. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరు. ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు. సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్‌లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్‌తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

    ఇదిలా ఉండగా.. ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్‌ స్థానం ఎవరిదో అనే ఆసక్తి నెలకొంది. 

Sports

  • న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ  ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది.

    "తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్‌ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. నొప్పి త‌గ్గిన త‌ర్వాత అత‌డు త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

    ఏమి జరిగిందంటే?
     తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్‌కోట్‌లో గోకుల్‌కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.

    అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్‌ ఈ సిరీస్‌కు దూరమైనా టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

  • క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శుక్రవారం నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీని నవీ ముంబైతో పాటు వ‌డోద‌ర వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.

    జనవరి 9 నుంచి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జ‌ర‌గ‌నుండ‌గా. ఆ త‌ర్వాత టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు వ‌డోద‌రలోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో ఫైన‌ల్ కూడా ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, ఫిబ్రవరి 5న ఫైనల్‌

    సాధార‌ణంగా డ‌బ్ల్యూపీఎల్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగుతుంది. కానీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌-2026 కార‌ణంగా ఈ టోర్నీని గ‌తంలో కంటే ఒక నెల ముందుగానే నిర్వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. 

    అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు, యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌లు వచ్చారు. ఢిల్లీ జట్టుకు భారత స్టార్ ప్లేయర్ రోడ్రిగ్స్ సారథ్యం వహించనుండగా.. యూపీ వారియర్స్‌ను ఆసీస్ లెజెండ్ మెగ్ లానింగ్ ముందుండి నడిపించనుంది.

    డబ్ల్యూపీఎల్‌ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..
    జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)
    జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)
    జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
    జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)
    జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)
    జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
    జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)
    జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)
    జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)
    జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)
    జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)
    జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
    జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
    జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)
    జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
    జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)
    జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)
    జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)
    జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)
    ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)
    ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వ‌డోదర)
    ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)

    మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?
    ఈ మ్యాచ్‌లను అభిమానులు  స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌ల‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా నవీ ముంబైలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో యోయో హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్లు పాల్గోనున్నారు.
     

  • భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సమీపంలోని సిహ్ముయ్‌లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.

    ఈ టోర్నీలో వెంగ్‌నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్‌పుయ్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల  క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

    "లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడు.

    మిజోరం ఒక గొప్ప క్రికెటర్‌ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్‌గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

  • విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్‌ అయ్యర్‌ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్‌.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.  కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్‌ దూబే(40), త్రిపురేష్‌(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.

    అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌ పేసర్‌ శివాంగ్‌ కుమార్‌ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్‌ మయాక్‌ అగర్వాల్‌(49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    ఆర్సీబీకి గుడ్ న్యూస్‌..
    ఐపీఎల్‌-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.

    ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌-2025లో సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.
    చదవండి: VHT 2025-26: చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు
     

  • భారత క్రికెట్‌లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్‌ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్‌ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో  ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.

    దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

    సెంచరీల మోత
    చెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు (104)తో యూత్‌ టెస్టులో శతక్కట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌... ఆస్ట్రేలియాలో యూత్‌ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.

    ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్‌ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్‌ తరఫున దేశీ క్రికెట్‌లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్‌​-19 జట్టుతో యూత్‌ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్‌ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.

    ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు
    ఇలా భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఖతార్‌, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్‌ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్‌ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్‌-19 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.

    ఏంటి తమ్ముడూ ఇది!
    ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్‌ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.

    సంజూ శాంసన్‌ స్థానంలో
    అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026లో అతడు షోటాపర్‌ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్‌ జాతరే!

    అతడి పట్టుదల, టెంపర్‌మెంట్‌, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్‌ను రాజస్తాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే.

    ఓపెనింగ్‌ స్థానానికి ఎసరు
    ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్‌ స్థానానికి వైభవ్‌ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

    ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడితే.. క్రికెట్‌ దేవుడు, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్‌ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్‌ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్‌ సూర్యవంశీ జన్మించాడు.

    చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

  • టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటిం‍గ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది.  టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి శ్రీలంక జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

    రాథోర్‌ జ‌న‌వ‌రి 18న లంక‌తో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జ‌ట్టుతోనే ఉండ‌నున్నాడు. విక్ర‌మ్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. . 2019 సెప్టెంబ‌ర్ నుంచి 2024 జూలై వ‌ర‌కు భార‌త బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅత‌డు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవ‌ల్ 3 కోచ్‌గా కొన‌సాగాడు.

    అత‌డు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా ప‌నిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్ప‌టికే భార‌త మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను త‌మ ఫీల్డింగ్ కోచ్‌గా నియ‌మించింది. రాథోర్ భార‌త బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధ‌ర్ పనిచేశాడు.

    శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవ‌లందించ‌నున్నాడు. కాగా ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు శ్రీలంక‌, భార‌త్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. శ్రీలంక త‌మ లీగ్ మ్యాచ్‌ల‌న్నింట‌ని స్వ‌దేశంలోనే ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
     

  • యాషెస్‌ 2025-26 సిరీస్‌ను విజయంతో ముగించాలన్న ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆఖదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 4-1తో ఈ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్‌ తమ సొంతం చేసుకుంది.

    పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఆసీస్‌ గెలవగా.. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. అయితే, సిడ్నీ వేదికగా ఆదివారం మొదలైన ఐదో టెస్టు.. గురువారం ముగిసింది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.

     ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి!
    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) స్పందించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ముందుకుపోయే ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి పలుకుతామనే సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మాతో మ్యాచ్‌లో ఎలా ఆడాలో బహుశా అన్ని జట్లకు తెలిసిపోయి ఉంటుంది.

    బ్యాట్‌తో బరిలోకి దిగినపుడు మేము అంతా బాగుందనే అనుకుంటున్నాం. కానీ ప్రత్యర్థి జట్లు మాకోసం మరింత మెరుగైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. వాళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.

    ఇలాగే ఆడితే..
    కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మేము బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మా బ్యాటింగ్‌ సరిగ్గా లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఆడితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను.

    ఒకరిపై ఒకరం నిందలు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయితే, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మా జట్టు అలాంటిదే. మేము తిరిగి పుంజుకుని మునుపటి మాదిరే ఉన్నత స్థితికి చేరుకుంటాం.

    ఏదేమైనా ఈ సిరీస్‌ మొత్తం ఆస్ట్రేలియా అత్యద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌.. ఆసీస్‌ జట్టు మొత్తం అదరగొట్టింది. మేము కూడా మా పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు. 

    కాగా ఆసీస్‌ గడ్డపై యాషెస్‌లో మరోసారి ఘోర పరాభవం నేపథ్యంలో ‘బజ్‌బాల్’‌ ఆద్యులు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌, కెప్టెన్‌ స్టోక్స్‌ను పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

    ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ యాషెస్‌ ఐదో టెస్టు స్కోర్లు
    👉వేదిక: సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌, సిడ్నీ
    👉టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బ్యాటింగ్‌
    👉ఇంగ్లండ్‌: 384 & 342
    👉ఆస్ట్రేలియా: 567 & 161/5
    👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు.

    చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

  • విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటిం‍గ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.

    ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్  వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

    త‌ద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా స‌ర్ఫ‌రాజ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లి, రోహిత్‌ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.

    మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ ..  ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం​ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?
    దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్‌. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్‌ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.
    చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌

  • ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 1న వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేకు ముందు బ్రూక్‌ ఓ నైట్ క్ల‌బ్ బౌన్స‌ర్‌తో దురుసగా ప్ర‌వ‌ర్తించాడు.

    నైట్‌క్లబ్‌లోకి వెళ్లేందుకు బ్రూక్‌ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు.  అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్‌ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.

    సారీ చెప్పిన బ్రూక్‌..
    ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా  చర్యలతో నా జట్టుకు, దేశానికి  తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.

    ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో బ్రూక్ పేర్కొన్నాడు.

    ఈసీబీ సీరియస్‌
    ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. బ్రూక్‌కు  30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. 

    ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి  ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.
    చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..

  • టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన అపార్టుమెంట్‌ కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో రూ. 26.30 కోట్ల విలువ గల నివాస స్థలాన్ని ఆమె కొన్నారు. దీని విస్తీర్ణం 2760.40 చదరపు అడుగులు అని తెలుస్తోంది.

    అదే విధంగా.. మూడు కార్లు పార్కింగ్‌ చేసుకునే వెసలుబాటు కూడా ఉన్నట్లు సమాచారం. ‘స్క్వేర్‌ యార్డ్స్‌’ అందించిన వివరాల ప్రకారం.. ఈ అపార్డుమెంటు కొనుగోలు సమయంలో రితికా సజ్దే (Ritika Sajdeh).. రూ. 1.13 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. గతేడాది డిసెంబరు 12న రిజిస్ట్రేషన్‌ పూర్తైంది.

    స్పోర్ట్స్‌ మేనేజర్‌
    అజింక్య డీవై పాటిల్‌, పూజా అజింక్య పాటిల్‌ నుంచి రితికా సజ్దే ఈ అపార్డుమెంటును కొనుగోలు చేశారు. కాగా భారత దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన రోహిత్‌ శర్మ.. రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలుత తన స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేసిన రితికాను జీవిత భాగస్వామి చేసుకున్నాడు.

    నికర ఆస్తి విలువ ఎంతంటే?
    ఇక టీమిండియా సంపన్న క్రికెటర్లలో ఒకడైన రోహిత్‌ శర్మ (Rohit Sharma) నికర ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 230 కోట్లు అని సమాచారం. వర్లీలో అతడికి దాదాపు రూ. 30 కోట్ల విలువైన అపార్టుమెంట్‌ ఉంది. అతడి దగ్గర లంబోర్గిని ఉరుస్‌, బీఎండబ్ల్యూ ఎం5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

    ఓవైపు ఆటగాడిగా కొనసాగుతూనే క్రికెట్‌ అకాడమీ స్థాపించాడు రోహిత్‌ శర్మ. కాగా రోహిత్‌- రితికా దంపతులకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం. ఇదిలా ఉంటే.. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ లభిస్తుందట. ఇక మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.

    చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..
    Rohit Sharma: కోహ్లి కంటే సన్నబడ్డాడే!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!

  • ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్‌. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరికి అభిషేక్‌ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్‌ అయ్యర్‌ బృందానికి నిరాశ తప్పలేదు.

    పంజాబ్‌ టాపార్డర్‌ కుదేలు
    దేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్‌ ఎలైట్‌ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. జైపూర్‌ వేదికగా టాస్‌ ఓడిన పంజాబ్‌.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్‌ టాపార్డర్‌ కుదేలైంది.

    ఆదుకున్న అన్మోల్‌, రమణ్‌దీప్‌
    టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌, పంజాబ్‌ కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (8), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11), హర్నూర్‌ సింగ్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్‌ ధిర్‌ (22) ఫర్వాలేదనిపించాడు.

    216 పరుగులు
    ఆరో స్థానంలో వచ్చిన రమణ్‌దీప్‌ సింగ్‌ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (15), సుఖ్‌దీప్‌ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్‌ 216 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 

    ముంబై బౌలర్లలో ముషీర్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్‌ అట్రాడే, ఓంకార్‌ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్‌ పాటిల్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

    సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకం
    నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్‌క్రిష్‌ రఘువన్షి (23), ముషీర్‌ ఖాన్‌ (21) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.

    శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ 
    ఇక కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్‌ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్‌ తామోర్‌ (15) విఫలం కాగా.. సాయిరాజ్‌ పాటిల్‌ (2), శశాంక్‌ (0), ఓంకార్‌ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్‌ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.

    ఒకే ఒక్క పరుగు తేడాతో
    అయితే, పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే, పేసర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గుర్నూర్‌ బ్రార్‌ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్‌ప్రీత్‌ బ్రార్‌, హర్నూర్‌ సింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

    చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్‌.. సెలక్టర్లు పట్టించుకోరుగా!

International

  • వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్‌ను అరెస్ట్‌ చేసి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది అమెరికా. ఆపై ఆ దేశపు చమురు నిల్వలు పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటాయని.. అదీ నిరవధికంగానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. ఈ పరిణామంపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. అయితే..

    ఈ భూమ్మీద అత్యధిక చమురు నిల్వలు(సుమారు 300 బిలియన్ బ్యారెల్స్) వెనెజువెలాలోనే ఉన్నాయి. అందునా ఎక్కువగా ఒరినోకో బెల్ట్ ప్రాంతంలో లభిస్తున్నాయి. కానీ, వెనెజువెలాలో లభించే చమురు హెవీ సోర్‌ క్రూడ్‌.. అంటే మందంగా, మరీ చిక్కగా ఉంటుంది. డర్టీ ఆయిల్‌గా ఇక్కడి చమురు నిక్షేపాలకు  ఓ పేరుంది. పైగా ప్రతి బ్యారెల్‌కి ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ కాలుష్యం కలిగిస్తోంది. అలాగే..

    ఇంతకాలం వెనెజువెలా చమురును ఆవిరితో కరిగించి.. లైట్ క్రూడ్‌ ఆయిల్‌తో కలిపి అమెరికా, చైనా, ఇండియా వంటి దేశాల రిఫైనరీలకు పంపించి వాడుకున్నారు. కానీ ఇది ఖరీదైనది.. కాలుష్యం ఎక్కువగా కలిగించే ప్రక్రియ కూడా.

    కాబట్టి ఎలా చూసుకున్నా ఈ చమురును శుధ్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. దీనికి ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. కాబట్టి అడ్డగోలుగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి తోడు.. వెనెజువెలాలో ప్రస్తుతం చమురు శుద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాతది. పైగా మీథేన్ లీకేజీలు, అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే.. మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 80 రెట్లు ప్రమాదకరం కూడా. 

    అయితే.. తమ దగ్గర ఉన్న ఆధునిక సాంకేతికతతో ఉద్గారాలను తగ్గించగలమని అమెరికా అంటోంది. అయినప్పటికీ కూడా అమెరికా చమురు ఉత్పత్తి చేస్తే కూడా పర్యావరణంపై భారీ ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. వెనెజువెలా చమురు మొత్తాన్ని తీయడం అమెరికాకు ఆర్థిక భారమే కాదు.. ప్రపంచ వాతావరణ ప్రతికూల మార్పు మరింత వేగవంతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. 

  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ విద్యుత్‌ కోతలు సహజమే కావొచ్చు. కానీ, యూరప్‌లోనే అతిపెద్ద నగరమైన బెర్లిన్‌కు అందుకు మినహాయింపు. గత 80 ఏళ్లలో అక్కడ పవర్‌ కట్‌ లేనే లేదట ( ఇది మరీనూ.. చిన్న చిన్న అంతరాయలు ఉండొచ్చేమో). అలాంటిది ఆ నగరం ఇప్పుడు అంధకారాన్ని చవిచూసింది. 

    చీకట్లలో.. గడ్డ కట్టే చలితో వేలమంది బెర్లిన్‌ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. వాళ్లకు సదుపాయాలు కలిగించలేక అటు ప్రభుత్వం చుక్కలు చూసింది. చివరకు విద్యుత్‌ పునరుద్ధరణతో  అంతా హమ్మయ్యా అనుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. తొలిసారి బెర్లిన్‌ నగరాన్ని ఆ స్థాయిలో చీకట్లు అలుముకున్నాయని చెబుతున్నారు. 

    హైవోల్టేజ్‌ కేబుల్స్‌ కాలిపోవడంతో సుమారు 50 వేల ఇళ్లకు, దాదాపు 1500ల వ్యాపార సముదాయ భవనాలకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. గడ్డ కట్టే చలిని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అయితే ఏకంగా -9 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ నమోదు అయ్యింది. వెంటనే ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. 

    యుద్ధ ప్రాతిపాదికన హోటల్స్‌, స్కూల్స్‌, స్పోర్ట్స్‌సెంటర్‌లకు నగర పౌరులను తరలించింది. చివరకు బస్సులనూ షెల్టర్‌లుగా ఉపయోగించింది. అందరికీ ఆహారం, పడక, ఇతర సౌకర్యాలు కల్పించింది. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో.. 24 గంటలు హాట్‌ వాటర్‌ సదుపాయం కల్పించారు. ఇందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించింది కూడా. రెండ్రోజులకు తాత్కాలికంగా.. గురువారం నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. 

    ఉగ్ర దాడి.. 
    బెర్లిన్‌ను శనివారం నుంచి ఈ చీకట్లు అలుముకున్నాయి. అందుకు కారణం.. నగరానికి విద్యుత్‌ సరఫరా చేసే లైన్లలో జరిగిన అగ్నిప్రమాదమేనని గుర్తించారు. అయితే ఇది తమ పనేనని వుల్కాంగ్రూప్Vulkangruppe అనే నిషేధిత సంస్థ ప్రకటించుకుంది. క్లైమేట్ సంక్షోభం, ఏఐ ప్రభావంపై నిరసనగానే తాము ఈ దాడి చేసినట్లు 2,500 పదాల లేఖలో ఈ దాడిని సదరు సంస్థ సమర్థించుకుంది. దీంతో ఉగ్ర దాడి కోణంలోనే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు జరుపుతున్నారు.

    వుల్కాంగ్రూప్ అనేది జర్మనీలో పనిచేస్తున్న ఫార్‌లెఫ్ట్‌ ఎక్స్‌ట్రీమిస్ట్‌ గ్రూప్‌. 2011 స్థాపించబడిన ఈ సంస్థ.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తూ,డాటా సెంటర్లు, టెస్లా ఫ్యాక్టరీపై దాడులతో వార్తల్లో నిలిచేది. ఈసారి ఏకంగా బెర్లిన్‌ను కరెంట్‌ కట్‌ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 

  • బీటీఎస్.. ఈ తరం కుర్రకారును ఉర్రూతలూగించే కొరియన్ పాప్ బృందం అంది. దాదాపుగా అన్ని దేశాల్లో.. ముఖ్యంగా భారత దేశంలో చిన్నపిల్లలు మొదలు.. నడి వయస్కుల వరకు బీటీఎస్‌కు విపరీతమైన అభిమానులున్నారు. అంతెందుకు.. బీటీఎస్ పేరుతో ఉండే గిఫ్ట్‌లు, కీచైన్‌లు, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు.. ఇలా ఆన్‌లైన్‌లో కానీ.. ఆఫ్‌లైన్‌లో కానీ.. భారత్‌లో గిరాకీ ఎక్కువే..! అలాంటి బీటీఎస్ బృందం భారతదేశానికి వస్తే.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. అవును.. బీటీఎస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు రానుంది. ఆ విశేషాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!

    బీటీఎస్ అభిమానులకు 2026 నిజంగా ఓ శుభవార్తను మోసుకొచ్చింది. అదే.. బీటీఎస్ టీం భారత్‌కు రావడం..! ఇటీవల జరిగిన బీటీఎస్ స్టార్ కిమ్ టేంగ్ కార్యక్రమంలో స్వయంగా బీటీఎస్ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో.. సోషల్ మీడియాలో ఓ హల్‌చల్ మొదలైంది.

    ప్రపంచ పర్యటనలో భాగంగా BTS బృందం 2026లో మొదటిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తోంది. ముంబై  వేదికగా పాప్‌ బృంద ప్రదర్శనను స్టేడియం సామర్థ్యం ఆధారంగా సుమారు 60వేల మంది నేరుగా వీక్షిస్తారనే అంచనాలుండటంతో దేశంలో అతిపెద్ద పాప్‌ ఈవెంట్లలో ఒకటిగా మారనుంది. ప్రస్తుతానికి ముంబై వేదిక అని భావిస్తున్నప్పటికీ.. ముంబైలోనే నిర్వహిస్తారా? మరే ఇతర వేదికలను సిద్ధం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇండియాకు రానున్న పాప్‌ బృందంలో ఏడుగురు సభ్యులున్నారు. ఈ బృందంలో RM, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్ కూక్లు ఉన్నారు.

    ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ అభిమానులకు ఈ ఈవెంట్‌ ఓ శుభవార్తగా చెప్పవచ్చు. 2016లో కోల్డ్ ప్లే ప్రత్యక్ష సంగీతం ఎలా ప్రేక్షకాదరణ పొందినదో.. ఈ ఈవెంట్‌ కూడా అలాగే రికార్డు నెలకొల్పుతుందనే అంచనాలున్నాయి. దీంతో ముంబైలోని పర్యాటకం, ఆతిథ్యం, స్థానిక వ్యాపారాలు గణనీయంగా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. వేదికలో... ఈవెంట్‌ తేదీల్లో అధికారిక స్పష్టత లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. మరోవైపు నకిలీ టిక్కెట్ల విక్రయదారులు కూడా మార్కెట్‌లోకి చేరినట్లు సమాచారం అందడంతో అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

    జూన్ 2025 లో సైనిక సేవను పూర్తి చేసిన తర్వాత మళ్లీ వారు 2026 మార్చి 20న వారి 5వ ఆల్బమ్ విడుదల కోసం తిరిగి కలుస్తున్నారు. ఈ పాప్‌ ప్రదర్శన నిమిత్తం టికెట్‌లు ఉన్నప్పటికీ... టికెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు. కానీ జనరల్, వీఐపీ, ఫ్యాన్ క్లబ్ సభ్యుల కోసం టికెట్‌ ధరలు వేర్వేరుగా కేటాయించే అవకాశముంది. BTS డిమాండ్‌ ఆధారంగా, ఇక్కడి అభిమానులను దృష్ట్యా టిక్కెట్లు తక్షణమే అమ్ముడవుతాయని భావిస్తున్నారు.

  • మరో ఆరునెలల్లో.. ప్రపంచం చూపు మొత్తం అటు వైపే ఉండబోతోంది. వేలాది మందితో అక్కడ కోలాహలం కనిపించనుంది. వీవీఐపీల రాక నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈలోపు.. సంచుల్లో వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయన్న విషయం కలవరపాటుకు గురి చేస్తోంది.  

    ఈ పరిణామాల చోటు చేసుకుంటోంది ఎక్కడో కాదు.. మరో ఆరు నెలల్లో ఫుట్‌బాల్‌ సంబురం ఫిఫా వరల్డ్‌ కప్‌ జరగబోయే మెక్సికోలోని ఓ స్టేడియం దగ్గర్లో. జలిస్కో స్టేట్‌ గ్వాడలజారా(Guadalajara) ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శవాల సంచులు బయటపడుతున్నాయి. స్టేడియం నిర్మాణ పనుల నేపథ్యంలో.. ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే.. 

    ఇవేం ఒక్కసారిగా బయటపడ్డవేం కాదు. 2022 నుంచి గతేడాది డిసెంబర్‌ మొదటి వారంలోపు.. మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదీ సంచుల్లోనే గుర్తించారు. స్టేడియానికి 10 నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న లాస్ అగుజాస్, జపోపాన్, ట్లాక్వేపాక్ ప్రాంతాల్లో ఇవి బయటపడ్డాయి. ఇందులో ఒక్క  లాస్ అగుజాస్ ప్రాంతంలోనే 290 సంచులు బయటపడ్డాయట!. 

    2025 నాటికి మెక్సికోలో 1,30,000 మిస్సింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. జలిస్కో రాష్ట్రం అదృశ్యాల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అయితే.. లోకల్‌ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు నేర గుంపులు (కార్టెల్స్) చేసిన పనేనట. అందునా మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) కారణంగానే ఈ మిస్సింగ్‌లు, హత్యలు జరిగినవని అంచనా వేస్తున్నారు.

    2026 వరల్డ్ కప్ వేదికగా ఉన్న మెక్సికోలోని ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడటం.. అక్కడి భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వ్యవహారం అధికారుల స్పందన మరోలా ఉంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు. స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవి కాకుండా..  అదనంగా 3,000 సీసీ కెమెరాలు, ఆర్మర్డ్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, నేషనల్ గార్డ్ బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

    ఎస్టాడియో అక్రోన్ స్టేడియం 2026 వరల్డ్ కప్‌లో నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు నిర్వహించనుంది. మెక్సికో రెండో గ్రూప్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో చూడాలి.

  • భారత్‌కు చెందిన ఇద్దరు  ట్రక్ డ్రైవర్లను డ్రగ్స్‌ కేసులో  అమెరికాలోని  ఇండియానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది లక్షకు పైగా (1,13,000)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS)  ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు.

    గురుప్రీత్ సింగ్ (25) జస్వీర్ సింగ్ (30)  అమెరికాలోని  ఇండియానాలో  అదుపులోకి తీసుకున్నారు.   వీకెండ్‌ హైవే  తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్‌ తరలిస్తున్నట్టు  గమనించి  స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, "ట్రక్కు  సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్‌లో దుప్పటితో కప్పిన  అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్‌ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

    అయితే నిందితులు దీన్ని ఖండించారు. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్‌మండ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు. గురుప్రీత్ సింగ్ 2023, మార్చి 11న అరిజోనా నుండి అక్రమంగా యుఎస్‌లోకి ప్రవేశించగా,  జస్వీర్ సింగ్ 2017 ,మార్చి 21న కాలిఫోర్నియా నుండి అక్రమంగా అమెరికాలోకి  ప్రవేశించాడని అధికారులు  పేర్కొంటున్నారు. వీరిద్దరికీ కాలిఫోర్నియా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో చోరీ కేసులో జస్వీర్‌ను గత నెలలో అరెస్టు చేశారు.

    ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్

  • అమెరికాలో వలసదారులపై జరుగుతున్న దాడుల్లో భాగంగా  ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ దారుణానికి  ఒడిగట్టాడు. ఒక మహిళను కాల్చి చంపిన ఘటన  కలకలం రేపింది. మిన్నియాపాలిస్‌లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో  వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం  నెలకొంది. 

    బుధవారంమిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో ఇమ్మిగ్రేషన్ అండ్‌ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా  నిరసనకారులు ఉద్యమానికి దిగారు. నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పిన క్రమంలో ఇమ్మిగ్రేషన్ ఏజెంట్, కారులో కూర్చున్న మహిళ తలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో రెనీ గుడ్ (37) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో వాతావరణం  మరింత ఉ​ద్రిక్తంగా మారింది.

     

    ఇమ్మిగ్రేషన్ అమలు సమయంలో అధికారులను అడ్డుకోడంతో కాల్పులు జరిపినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఘర్షణ సమయంలో మహిళపై కాల్పులు జరిగాయని DHS ప్రతినిధి ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు. అల్లర్లకు, రెనీ గుడ్‌కు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలి తల్లి  డోనా గాంగర్  విచారం వ్యక్తం చేసింది. తన  కుమార్తె ఎంతో దయగల, గొప్ప మనిషి, ప్రజలంటే ప్రేమగల ఆమెను అన్యాయంగా కాల్చి చంపారని  తల్లి వాపోయింది. 

    అమెరికాలో  పెరుగుతున్న గన్‌ కల్చర్‌, హింస సర్వసాధారణంగా మారింది అని చెప్పడానికి మరో స్పష్టమైన ఉదాహరణ అని విశ్వవిద్యాలయ అధ్యక్షుడు బ్రియాన్ హెంఫిల్ వ్యాఖ్యానించారు.  వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనం అంటూ ఆగ్రహం పెల్లుబుకింది. వందలాది మంది నిరసనలకు దిగారు. మిన్నియాపాలిస్ నగర కౌన్సిల్‌లోని మెజారిటీ సభ్యులు రెనీ మరణానికి కారణమైన ఏజెంట్‌ను అరెస్టు చేసి,  విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ICE తమ నగరాన్ని విడిచి పెట్టాలంటున్నారు. 


    అధికారుల భిన్నవాదనలు
    ఈ సంఘటనల గురించి ఫెడరల్ , స్థానిక అధికారులు చాలా భిన్నవాదనలు వినిపిస్తున్నారు.  కారును  ఆపి బయటికి రావాలని ఆదేశాలను బేఖాతరు చేయడంతో పాటు, ఉద్దేశపూర్వకంగా ఏజెంట్‌పై ఎదురుదాడికి దిగి,  ICE అధికారిని ఢీకొట్టడానికి  ప్రయత్నించినందున మహిళను కాల్చి చంపామని అంటున్నారు.   ఈ ఘటనపై  FBI దర్యాప్తు జరుగుతోంది

    2020లో ఓల్డ్ డొమినియన్ విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషులో పట్టభద్రురాలైంది గుడ్‌.  ఆమె  కవయిత్రి కూడా. ప్రస్తుతం రెనీ నికోల్ గుడ్ తన భాగస్వామితో మిన్నియాపాలిస్‌లో నివసిస్తోంది.కాగా ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు  చేపట్టిన తరువాత  వలసదారుల ఆంక్షలు, దాడుల్లో  చనిపోయిన వారి సంఖ్య ఐదుకి చేరింది.
    ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్‌, పరారీలో ఎస్‌ఐ

Business

  • దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.

    ఇతర రీఛార్జ్ ప్లాన్స్!
    రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్‌ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.

    రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ  365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.

  • ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా 2026 (23వ ఎడిషన్) అధికారిక పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు పరిశ్రమల & వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన సంజయ్ కుమార్, IAS , తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి ఎం నాగప్పన్ పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణతో 2026 ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా సదస్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

    గత రెండు దశాబ్దాలుగా బయోఏషియా ఆసియాలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్, బయోఫార్మా, హెల్త్-టెక్ మరియు మెడికల్ ఇన్నోవేషన్  రంగాల్లో ఆసియాలో అగ్రగామి వేదికగా ఎదిగింది.. ప్రతి ఎడిషన్‌లో ప్రపంచ స్థాయి నాయకులు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరియు విధాన నిర్ణేతలనుఒకే వేదికపైకి తీసుకువస్తోంది. అత్యాధునిక శాస్త్రీయ ప్రగతిని పంచుకుంటున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ బయోఫార్మా, వ్యాక్సిన్‌లు, మెడ్‌టెక్ మరియు డిజిటల్ హెల్త్ ఆవిష్కరణల గ్లోబల్ హబ్‌గా మరింత బలపరుస్తోంది. రాష్ట్రంలోని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన శాస్త్రవేత్తల ప్రతిభ ఈ ఎదుగుదలకు పునాదిగా నిలుస్తున్నాయి.

    ఈసారి బయో ఏషియా 2026ను ‘TechBio Unleashed: AI, Automation & Biology Revolution’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, థెరపీ తయారీ, ఆరోగ్య సేవల అందజేతలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను ప్రతిబింబిస్తుంది. టెక్‌బయో వల్ల వ్యాధులను అర్థం చేసుకునే విధానం, చికిత్సలను రూపకల్పన చేసే విధానం, వైద్య సేవలను అందించే విధానం పూర్తిగా మార్పు చెందుతోంది. దీని ఫలితంగా ఆరోగ్య సేవలు మరింత ముందస్తు అంచనా విధానంతో, వ్యక్తిగతీకరణతో, అందుబాటులో ఉండే విధంగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ మరింత స్థిరంగా, సమానంగా, అందరికీ చేరువయ్యేలా రూపుదిద్దుకుంటోంది.

    బయో ఏషియా 2026 ద్వారా స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు మరియు అంతర్జాతీయ సంస్థలకు వ్యూహాత్మక అవకాశాలు లభిస్తాయి. ప్రయోగశాలల్లో జరిగిన ఆవిష్కరణలను మార్కెట్ అవసరాలకు అనుసంధానించడానికి ఈ సదస్సు వారధిగా పనిచేస్తుంది. నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు రోగుల భద్రత మరియు ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలను రూపుదిద్దేందుకు ఇది వేదికగా నిలుస్తుంది.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాగస్వాములను 2026 ఫిబ్రవరి 16–18 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా 2026లో పాల్గొని పెట్టుబడి అవకాశాలను అన్వేషించవలసిందిగా, భాగస్వామ్యాలను బలోపేతం చేయవలసిందిగా మరియు టెక్‌బయో విప్లవంలో భాగస్వాములు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు.

  • ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా వెలుగొందిన వెనెజువెలా.. నికోలస్ మదురో అరెస్టు తర్వాత తీవ్ర సంక్షోభంతో సతమతమవుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరిపోయాయి. పెట్రోల్ ధరల కంటే.. వాటర్ బాటిల్, పాలు ధరలు ఎక్కువైపోయాయి.

    ధరలు ఇలా..
    ఒక లీటరు పెట్రల్: రూ. 45.10
    ఒక లీటరు పాలు: రూ. 160.60
    ఒక లీటరు వాటర్ బాటిల్: రూ. 223.70
    ఒక లీటరు వంట నూనె: రూ. 315 నుంచి రూ. 405

    అమెరికా ఆంక్షలు, సరఫరా గొలుసులను తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే తాగు నీరు కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇక్కడ కరెన్సీకి విలువ తగ్గిపోవడం వల్ల.. లావాదేవీలు కూడా కష్టతరం అయిపోయింది.

    వెనెజువెలా ఆర్ధిక పతనానికి కారణాలు
    ➤వ్యవసాయం, తయారీ రంగాలను విస్మరించి.. ఎక్కువగా చమురుపైనే ఆధారపడటం.
    ➤నైపుణ్యం లేనివారికి పదవులు కట్టబెట్టడం వల్ల, నిర్వహణ లోపాలు తలెత్తాయి.
    ➤ఆదాయం లేకపోవడంతో.. ప్రభుత్వం విచ్చలవిడిగా కరెన్సీ ముద్రించింది. దీనివల్ల దేశ కరెన్సీ ఎక్కువైంది. విలువ పెరిగిపోయింది.

    ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

  • సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన గురుగ్రామ్ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల (కోటి) ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసి.. ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ దేశంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయాన్ని వెల్లడించింది.

    కంపెనీ మొదటి 5 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడానికి.. 14 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఆరేళ్లలో మరో 5 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే.. క్రమంగా కంపెనీ వాహనాలను డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీ తన ఉత్పత్తిని కూడా పెంచాల్సి వచ్చింది.

    సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అమ్మకాలు పెరగడానికి యాక్సెస్ 125 వెన్నెముకగా నిలిచింది. ఆ తరువాత జాబితాలో బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి ఇతర స్కూటర్లు, అలాగే జిక్సర్ 150/250 సిరీస్, అడ్వెంచర్ ఓరియెంటెడ్ V-స్ట్రోమ్ SX కూడా సంస్థ పురోగతికి చాలా ఉపయోగపడ్డాయి.

    సుజుకి మోటార్‌సైకిల్ ప్రస్తుతం 1,200 కంటే ఎక్కువ అమ్మకాలు & సేవా టచ్‌పాయింట్‌లను కలిగి ఉన్నారు. అంతే కాకుండా 60 కంటే ఎక్కువ దేశాలకు.. భారతదేశంలో నిర్మించిన మోడళ్లను ఎగుమతి చేస్తోంది. భవిష్యత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి, కంపెనీ హర్యానాలోని ఖార్ఖోడాలో రెండవ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని సమాచారం.

  • భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులను పెంచుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. సీఎస్‌ఐఆర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు.

    ఈ సందర్భంగా వ్యవసాయ వ్యర్థాలను విలువైన జాతీయ వనరుగా మార్చుకోవడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం కారణంగా వెలువడే కాలుష్యాన్ని నిరోధించొచ్చన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 15 శాతం కలపడం ద్వారా ఏడాదిలో 4,500 కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని ఆదా చేసుకోవచ్చని చెప్పారు.

    ఇటీవలే జపాన్‌ను దాటేసి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం తెలిసిందే. రహదారుల నిర్మాణంలో బయో బిటుమన్‌ను (పెట్రోలియం రహిత) వినియోగించడం 2047 నాటికి వికసిత్‌ భారత్‌ దిశగా పరివర్తనాత్మక అడుగుగా మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. వాణిజ్య పరంగా బయో బిటుమన్‌ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం భారత్‌ అని చెప్పారు. ఇది రైతుల జీవితాలను మార్చేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తుందన్నారు.

    వ్యవసాయం, నిర్మాణ రంగ సామగ్రి తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఫ్లెక్స్‌ ఇంజన్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించాలని కోరారు. హైడ్రోజన్‌ రవాణా అన్నది పెద్ద సమస్యగా పేర్కొంటూ.. ఈ విషయంలో భారత్‌ ఇంధన ఎగుమతిదారుగా అవతరించాలన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్‌ రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

    ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే బంపరాఫర్.. ప్రయాణికులకు శుభవార్త!

  • వరుస నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. గురువారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 780.18 పాయింట్ల నష్టంతో 84,180.96 వద్ద, నిఫ్టీ 263.90 పాయింట్ల నష్టంతో 25,876.85 వద్ద నిలిచాయి.

    ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్, జిందాల్ ఫోటో లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, పనాసియా బయోటెక్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎన్ఆర్బీ ఇండస్ట్రియల్ బేరింగ్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • సంక్రాంతి పండుగ వచ్చేసింది. నగరాల్లో ఉండేవారంతా దాదాపు ఊళ్లకు బయలుదేరుతున్నారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఇక్కడ..

    రైల్‌వన్ యాప్ (RailOne) ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపు మోడ్‌లను ఉపయోగించి RailOne యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లపై మాత్రమే తగ్గింపు పొందవచ్చు.

    రైల్‌వన్ యాప్ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ఎలా
    ➤గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా ఈ సూపర్‌ యాప్‌ ‘Railone’ను డౌన్‌లోడ్‌ చేయాలి.
    ➤యాప్‌ వినియోగదారుల లొకేషన్‌ను డిఫాల్డ్‌గా రీడ్‌ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్‌ చేసుకోవాలి.
    ➤యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత లాగిన్‌, న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌, గెస్ట్‌ అనే ఆప్షన్లు వస్తాయి.
    ➤కొత్తగా రిజిస్టర్‌ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్‌ రిజిస్ట్రేషన్‌పై క్లిక్‌ చేస్తే.. రైల్‌ కనెక్ట్‌, యూటీఎస్‌ అని రెండు ఆప్షన్లు డిస్‌ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్‌ కావొచ్చు. లేదంటే ➤కొత్తంగా వివరాలు ఎంటర్‌ చేసి సైనప్‌ చేయాల్సి ఉంటుంది.
    ➤సైనప్‌ కోసం మొబైల్‌ నెంబర్‌ ఇచ్చి రిజిస్టర్‌ చేయాల్సి.
    ➤మీ పూర్తి పేరు, మొబైల్‌ నెంబరు, ఈ-మెయిల్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, క్యాప్చా ఎంటర్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
    ➤ఓటీపీ, ఎంపిన్‌ ఇచ్చి అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్‌ వెరిఫికేషన్‌ కోసం ఫింగర్‌ ప్రింట్‌ లేదా డివైజ్‌ లాగిన్‌ వివరాలు ఇవ్వాలి.

    మూడు శాతం డిస్కౌంట్ కోసం..
    👉🏻ఇప్పటికే మీరు ఇన్‌స్టాల్‌ చేసుకున్న RailOne యాప్.. లాగిన్ అవ్వాలి. 
    👉🏻ప్రాథమిక వివరాలు (పేరు, ఇతర వివరాలు) నమోదు చేసుకోవాలి.
    👉🏻అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ కోసం ఎంపికను సెలక్ట్ చేసుకుని.. ప్రయాణ తేదీని, మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారా ఆ స్టేషన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 
    👉🏻డిజిటల్ మోడ్‌ (యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్)  ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీకు డిస్కౌంట్ లభిస్తుంది.
    👉🏻చెల్లింపు పూర్తయిన తరువాత.. టికెట్ యాప్‌లోనే జనరేట్ అవుతుంది. ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల కోసం దాన్ని మీ ఫోన్‌లో చూపించవచ్చు.

    రైల్‌వన్‌ యాప్ ద్వారా లభించే సేవలు
    టికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
    ప్లాట్‌ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.
    రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్‌, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.
    ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
    రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్‌డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. సంక్రాంతి పండుగ నుంచి మద్యం ధరలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బాటిల్ పై ఏకంగా రూ. 10 ధర బాదుడుకు చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 

    ఎన్నికల సమయంలో మధ్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్‌పై రూ.10 పెంచి.. ఇప్పుడు మరోసారి అదీ పండుగపూటనే పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది. 

    ఈ నిర్ణయం ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌(IMFL), ఫారిన్‌ లిక్కర్‌ (FL)కు వర్తింపజేయాలని భావిస్తోంది. దీంతో.. 70 శాతం మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. 

    లిక్కర్ సిండికేట్‌కి దాసోహం.. 

    లిక్కర్‌ సిండికేట్‌తో కుమ్మక్కు అయిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సిండికేట్‌కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్‌ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్‌కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

    మంత్రులపై మళ్లీ సీరియస్‌

    మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్‌ అయ్యారు. మంత్రులెవ్వరూ ఏ పని చేయడం లేదని..  తమ పని తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనే నెలకు రెండు, మూడుసార్లు పార్టీ ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. వినతులు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడ్డవారి వివరాలు ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోంది’’ అంటూ ఎప్పటిలాగే అసంతృప్తిని మంత్రులపై నెట్టేశారాయన.

  • సాక్షి, ఢిల్లీ: అవినీతి నిరోధ‌క చ‌ట్టం కేసుల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్లడించింది. ఏపీ ఏసీబీ (సీఐయూ) న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను ర‌ద్దు చేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టేసింది. రద్దు చేసిన ఆ ఎఫ్‌ఐఆర్‌లపై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

    ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌కు నోటిఫైడ్ పోలీస్ స్టేష‌న్ హోదా లేద‌ని గంప‌గుత్త‌గా ఎఫ్ఐఆర్‌ల‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబి సెంట్ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ యూనిట్‌.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)విజయవాడ నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌ల‌పై ద‌ర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌ల‌పై ఆరు నెల‌ల్లో తుది నివేదిక స‌మ‌ర్పించాలని కోరింది.

    అలాగే, ప్ర‌తివాదుల‌ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశిస్తూనే.. ద‌ర్యాప్తు పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించాలని ప్రతివాదులకు సూచించిఇంది. ఈ కేసుకు సంబంధించిన‌ ఎఫ్‌ఐఆర్‌లపై, పెండింగ్‌లో ఉన్న దర్యాప్తుల‌పై ఎలాంటి  పిటిష‌న్‌ల‌ను హైకోర్టు స్వీక‌రించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చ‌ట్టాలను మార్చ‌కుంటే పాత చ‌ట్టాలు అమ‌ల్లో ఉన్న‌ట్లేన‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలోనే అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద ప‌లువురిపై ఏసీబీ సీఐయూ.. ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది.

    అవినీతి నిరోధక చట్టం కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాలు
  • సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్‌​ జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.

    చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

    రెండో విడత భూసేకరణపై వైఎస్.జగన్ ఆగ్రహం

    ఇది కూడా చదవండి: క్రిడెట్‌ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్‌ జగన్‌

National

  • తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్‌ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్‌ కంట్రల్‌ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే  జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..

    బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్‌ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్‌ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్‌ పెడితే.. ట్రాఫిక్‌ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్‌సైడ్‌ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్‌ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్‌ చేశాడు.

    రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్‌ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్‌ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్‌ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్‌  అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్‌ తన్వర్‌ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.

    ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్‌లో ఉన్న కెమెరాలో చిప్‌తో పాటు సిమ్‌ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్‌గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా  పోలీస్‌ కంట్రోల్‌ రూంకు మెయిల్‌ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. 

  • న్యూఢిల్లీ:  ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు విద్యావేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త  సోనమ్ వాంగ్‌చుక్ జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఆంగ్మో పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు వాదించారు.  

    హింసకు వ్యతిరేకంగా మాట్లాడి, జాతి నిర్మాణంలో 30 అవార్డులు అందుకున్న  సోనమ్ వాంగ్‌చుక్‌ను ఇప్పుడు నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నారని  ఆయన భార్య సుప్రీంకోర్టుముందు వాపోయారు. సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ సిబల్, ఆయన నిర్బంధానికి సంబంధించి పూర్తి కారణాలు అందించలేదనీ దీనికి వ్యతిరేకంగా  వాదించేందుకు సరైన అవకాశం  కూడా  ఎప్పుడూ ఇవ్వలేదని వాదించారు. నిర్బంధానికి కారణాలు నిర్బంధించబడిన వ్యక్తికి అందించకపోతే, ఆదేశం (నిర్బంధం) "విటియేటెడ్" అని చట్టం నిర్దేశిస్తుందని నొక్కి చెబుతూ, సిబల్ నిర్బంధం మరియు ఆధారాల సరఫరాపై చట్టాన్ని ప్రస్తావించారు

    కాగా ప్రభుత్వాలకు ప్రజా శాంతి లేదా జాతీయ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై ముందస్తు చర్య తీసుకునే అధికారం ఇచ్చే NSA చట్టం కింద గత ఏడాది సెప్టెంబర్ 26న అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆయనను జోధ్‌పూర్‌కు తరలించారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద రాష్ట్ర హోదా మరియు రక్షణలను డిమాండ్ చేస్తూ లడఖ్‌లోని లేహ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగడంతో  ఆయనపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు.దీనిపై అతని భార్య , విద్యావేత్త గీతాంజలి ఆంగ్మో అతని నిర్బంధాన్ని సవాలు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంగ్మో తరపున  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.  ఈ కేసువిచారణ  జనవరి 12న వాయిదా పడింది.

    ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

    వాంగ్‌ చుక్‌ వాదన"నిర్బంధానికి గల అన్ని కారణాలను అందించకపోతే,  రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 22 (5)  ఏకపక్ష అరెస్టు , నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుందని వాంగ్‌ చుక్‌ తెలిపారు. సెప్టెంబర్ 10న నేను నిరాహార దీక్షకు దిగాను. దీక్ష 15వ రోజున, హింసాత్మక సంఘటనలు జరిగాయి, దానితో నేను చాలా కలత చెంది24న నా నిరాహార దీక్షను విరమించాను , హింస ఆపాలని ఒక ప్రసంగం ఇచ్చాను.. 26న అదుపులోకి తీసుకున్నారు. 1922లో ఫిబ్రవరి 4న చౌరీ చౌరా సంఘటన తర్వాత బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయాలని మహాత్మా గాంధీ తీసుకున్న నిర్ణయంతో వాంగ్‌ చుక్‌ పోల్చుకున్నారు. అలాగే  తనను నేరస్థుడిగా చూపించడానికే వాస్తవాలను తారుమారు చేస్తున్నారన్న వాంగ్‌చుక్‌ వాదనను సిబల్  కోర్టుకు  తెలిపారు.

    ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్
     పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్‌ చేస్తే అస్థిపంజరం దొరికింది


     

  • జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్‌ గోయెల్‌ ముఖం మీద ఉన్న రహస్య పరికరంపై సోషల్‌మీడియాలో  తెగ వైరల్‌ అవుతోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో అతను మాట్లాడుతున్న సమయంలో అతని ముఖంపై అతికించి ఉన్న ఆ చిన్న వస్తువే  హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు ఫోన్‌ చార్జర్‌ అని, మరి కొందరు బబుల్‌గమ్‌ అతికించుకుని ఉంటాడని కూడా  వ్యంగోక్తులు విసిరారు. ఇంతకీ అందేంటో తెలుసా?

    దీపిందర్‌ అందించిన వివరాల ప్రకారం ఆ పరికరం పేరు టెంపుల్‌. ఇది మానవ శరీరంలోని రక్త ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ.మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తూ, ఓవరాల్‌గా మన శరీరానికి ఆరోగ్యాన్ని అందించే పరికరం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టెంపుల్‌ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. కానీ ఏడాది కాలం నుంచి దీన్ని వినియోగిస్తున్నానని దీపీందర్  చెప్పారు.

    ఇది ఎలా పని చేస్తుందంటే..
    టెంపుల్‌ ధరించిన వ్య క్తి తన మెదడులో రక్త ప్రవాహం... వేగం వివరాలు గుర్తించడంతో పాటు... రక్త ప్రసరణ గురించి, మనపై ఏదైనా ఒత్తిడి వచ్చినప్పడు.. శరీరంలో కలిగే మార్పులను ఇది గుర్తించి మనకు తెలియజేస్తుంది. రియల్ టైమ్ లో మన బాడీ పరిస్థితి... అది మెదడును ఎలా ప్రభావితం చేస్తోందనే అంశాలను పసిగడుతుంది. 

    ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

    అలసట, మనస్సు కేంద్రీకరించకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, వృద్ధాప్య ప్రక్రియలో సమస్యలను గుర్తించి... వాటి నివారణకు కూడా ఈ యంత్రం సహకరిస్తుంది. అయితే ఈ పరికరం మార్కెట్‌లోకి అందుబాటులోకి రాలేదు. ఈ పరికరం పరిశీలన దశలో ఉన్నందున, దీపేందర్‌ గోయెల్‌ వ్యక్తిగత పరిశోధన చేస్తున్నట్లు సమాచారం. ప్రయోగ దశలో ఉన్న ఈ పరికరం మార్కెట్‌లోకి రావాలంటే చాలా విషయాల్లో క్లీన్‌చిట్‌ లభించాల్సి ఉంటుంది. దీన్ని వినియోగిస్తే ఇతర సమస్యలు వచ్చే ప్రమాదముందనే వాదన కూడా ఉంది. ధర విషయంలోనూ ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి ఈ పరికరం విలువ 25 మిలియన్‌ డాలర్లు అని నిర్ణయించారు... అంటే మన దేశ కరెన్సీలో సుమారు 200 కోట్ల రూపాయలు. 

    ఇదీ చదవండి: పెళ్లికి పిలిస్తే రాలేదు.. కట్‌ చేస్తే అస్థిపంజరం దొరికింది

  • తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరోవైపు.. శబరిమలలో మకరవిళక్కు పూజలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో మకర జ్యోతి వేడుకలకు శబరిమల సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 14న లక్ష మందికి పైగా భక్తులు జ్యోతి దర్శనం కోసం వస్తారని దేవస్థానం బోర్డు అంచనా వేసింది. ఇక, తొలిసారిగా ఫోటోలతో కూడిన పాస్‌లు, 900 బస్సులను భక్తుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. జనవరి 14న 35,000 మందికే అనుమతి ఉండటంతో రద్దీ నియంత్రణకు స్పాట్ బుకింగ్ నిలిపివేశారు. భక్తులకు అన్నదానం, వసతి సౌకర్యాలు కల్పించారు.

    ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో కానుకలు, హుండీ లెక్కింపులు జరుగుతున్నాయి. దేవస్థానం ఖజానాలో నాణేలు కొండలా పేరుకుపోయాయి. ప్రతిరోజూ, కానుకల హుండీలోని నోట్ల నుండి నాణేలను వేరు చేసి ఖజానాలోని ఒక భాగంలో ఉంచుతున్నారు. మండల కాలం నుండి మరియు మకరవిళక్కు పండుగ ప్రారంభమైన తర్వాత వచ్చిన నాణేలు కొండలా పేరుకుపోతున్నాయి. అయితే, దేవస్థానంలో డబ్బులు, నాణేలు లెక్కించడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతోంది.

    వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. 
    ప్రస్తుతానికి దేవస్థానం ఖజానాలో 175 మంది ఉద్యోగుల కొరత ఉంది. సిబ్బందిని నియమించుకోవడానికి దేవస్థానం ఉద్యోగులు అందుబాటులో లేరు. దీనికి బదులుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, వారు కూడా లభించడం లేదు. అందువల్ల, డబ్బు లెక్కించడం అసాధ్యంగా మారింది. తీర్థయాత్రల సీజన్‌లో, సన్నిధానం, పంపా మరియు నిలక్కల్‌లో సేవ చేయడానికి ప్రతి సంవత్సరం 2000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తారు. మరోవైపు.. భద్రతా సిబ్బంది ​కోసం ఈసారి కేవలం 1750 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1632 మందిని నియమించారు. వారిలో 50 మంది సన్నిధానం చేరుకున్న తర్వాత తిరిగి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది సరిపోక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, తాత్కాలిక ఉద్యోగులకు రోజుకు రూ. 650, ఉచిత వసతి, భోజనం ఇస్తామని హామీ ఇచ్చారు. భద్రతా విధులకు జీతం రోజుకు రూ. 900. వసతి, భోజనం అదనంగా ఉండనుంది.

    నాడు రోబోలతో లెక్కింపు.. 
    మకరవిళక్కు కోసం ఆలయం తెరిచిన తర్వాత, యాత్రికుల రద్దీ భారీగా పెరిగింది. దీనితో పాటు, కానుకల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అదే ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుత పరిస్థితిలో, మకరవిళక్కు తర్వాత ఆలయం మూసివేసినా, కానుకలను లెక్కించడం సాధ్యం కాదు. 2023లో, రోబోల సహాయంతో కానుకలను లెక్కించే ప్రణాళికను అమలు చేయడానికి దేవస్థానం బోర్డు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అప్పటి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. అనంతగోపన్ తిరుపతిని సందర్శించి ఒక అధ్యయనం నిర్వహించారు. అది విజయవంతమైందని తేలింది. ఇక్కడ కూడా దానిని అమలు చేయాలని నిర్ణయించారు. అప్పటికే అనంతగోపన్ పదవీకాలం ముగిసింది. తర్వాత వచ్చిన దేవస్థానం బోర్డు దీనిపై ఆసక్తి చూపకపోవడంతో అది అమలు కాలేదు.

    ఈ కారణంగా, గత 2 సంవత్సరాలుగా, నాణేలను లెక్కించడానికి ఖజానాలో తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో సన్నిధానంలోని ప్రతి డ్యూటీ పాయింట్ నుండి 10 మంది సిబ్బందిని ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు నాణేలను లెక్కించడానికి ఖజానాకు పంపాలని దేవస్వం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.

  • వీధికుక్కల కేసు విచారణలో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నది తెలిసిందే. అయితే కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్స్‌ భగ్గుమంటున్నారు. కుక్కలను.. మగవాళ్లకు ముడిపెట్టి ఆ పోస్ట్‌ ఉండడమే అందుకు కారణం.  

    వీధి కుక్కల అంశంపై మరోసారి విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. వీధి కుక్కలను(Dogs) వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే ‘‘ఫలానా కుక్క కాటేస్తుంది.. ఫలానాది కాటేయదు అని వీధుల్లో తిరిగే కుక్కలను చూసి ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదు. వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు’’ అంటూ బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

    అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్‌ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్‌ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని.. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు. 

    https://img-s-msn-com.akamaized.net/tenant/amp/entityid/AA1TNtHR.img?w=768&h=1038&m=6&x=47&y=54&s=48&d=48

    కన్నడ నటి రమ్య అలియాస్‌ దివ్య స్పందనకు శాండల్‌వుడ్‌ క్వీన్‌గా పేరుంది. ఆమె తెలుగు, తమిళ్‌ భాషల్లోనూ నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరారు. కాంగ్రెస్‌ తరఫున 2013 మాండ్య లోక్‌సభ ఉప ఎన్నికల్లో నెగ్గి ఎంపీ అయ్యారు.  అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. యువతలో ఆమెకు ఉన్న క్రేజ్‌ గుర్తించి.. రాహుల్‌ గాంధీ ఆమెకు సోషల్‌ మీడియా వింగ్‌ను అప్పగించారు. ఈ క్రమంలోనే తరచూ పలు అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. 

    కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో స్టార్‌ నటుడు దర్శన్‌ నిందితుడిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కన్నడ సినీ పరిశ్రమ మౌనంగా ఉండిపోయింది. అయితే.. ఎంతటి వారైనా చేసినదానికి ఫలితం అనుభవించాల్సిందే అంటూ రమ్య స్పందించడంతో దర్శన్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. ఆమెను రేప్‌ చేస్తామని, చంపుతామంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

  • అర్థరాత్రి వేళ,  కాన్పూర్‌ పోలీసులు  స్థానిక టవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో బయటపడిన దాన్ని చూసిన పోలీసు అధికారులతోపాటు, చలిని కూడా లెక్క చేకుండా పనిలో నిమగ్నమైన కూలీలకూ చెమటలు పట్టాయి. నేలమాళిగలో ఏడు అడుగుల లోతులో దారుణమైన స్థితిలో అస్థిపంజరం దొరికింది.  ప్రేమో, వ్యామోహమో, నమ్మిన వ్యక్తికి జరిగిన తీరని ద్రోహం తాలూకు విషాద గాథ ఇదీ..

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన తల్లి కనిపించడం లేదని కొడుకు ఫిర్యాదు చేయడం ఈ విషయం  వెలుగు చూసింది. దొరికిన  అస్థిపంజరం ఏడుగురు పిల్లల తల్లి అయిన 45 ఏళ్ల రేష్మాదిగా పోలీసులు భావిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నారు. రేష్మా భర్త రాంబాబు సంఖ్వార్ మూడేళ్ల క్రితం మరణించాడు. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణం తర్వాత, రేష్మా తన పొరుగువాడైన గోరాలాల్‌తో అనుబంధం పెంచుకుంది. ఆ  తరువాత  కొద్దికాలానికే, తన పిల్లలను వదిలి గోరాలాల్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. దీంతో మనస్తాపం చెందిన రేష్మా పిల్లలు ఆమెతో సంబంధాలు తెంచుకుని విడిగా జీవిస్తున్నారు.

    ఎలా బయటపడింది?
    తల్లితో సంబంధాలు తెంచుకున్న రేష్మా కుమారుడు గత ఏడాది నవంబర్ 29న కుటుంబంలో జరగబోయే ఒక పెళ్లికి ఆహ్వానం పంపాడు. రేష్మా పెళ్లికి రాలేదు. దీంతో బబ్లూకు అనుమానం వచ్చింది.  గోరాలాల్ ఇంటికి వెళ్లి రేష్మా గురించి ఆరా తీశాడు."నీ అమ్మ ఇక తిరిగి రాదు" అని గోరాలాల్ బదులిచ్చాడు. జోక్ చేస్తున్నాడనుకుని మొదట్లో పెద్దగా అనుమానం రాలేదు. కానీ పదే పదే అడిగినా, కచ్చితమైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఇక లాభం లేదనుకుని బబ్లూ పోలీసులను ఆశ్రయించాడు.డిసెంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    దిగ్భ్రాంతికరమైన నిజం
    బబ్లూ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, పోలీసులు గోరాలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. చివరికి, అతను నిజం చెప్పాడు. గత సంవత్సరం ఏప్రిల్‌లో తనకు, రేష్మాకు మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను రేష్మాను వదిలించు కోవాలనుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మని బెదిరించాడు. రేష్మా నిరాకరించింది. దీనివల్ల తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే  అతడు రేష్మాను గొంతు నులిమి చంపేశాడు. రెండు రోజుల పాటు అతను మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి, దానిని ఎలా వదిలించుకోవాలో ఆలోచించాడు. 

    ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

    దానిని కాలువలో పడేయాలని ప్లాన్ చేశాడు, కానీ కొన్ని రోజుల్లో మృతదేహం నీటిపై తేలుతుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాలనుకున్నాడు. విచారణ సమయంలో ఆ ప్రదేశం గురించి పొరపాటున చెప్పడంతో, ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆభరణాలు , బట్టల ద్వారా ఆమెను గుర్తించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, రేష్మా ఎముకలను  ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి  తెలిపారు.

    ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్
    పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?

  • బిచ్చగాళ్లు, వారి సంపద గురించి చాలానే విన్నాం.  బిచ్చగాళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఖరీదైన ఇళ్లలో జీవించే వారి గురించి గతంలో అనేక కథనాలు చూశాం. కానీ ఇదొక బిచ్చగాని విషాద గాథ. కేరళలోని అలప్పు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 50 ఏళ్ళ బెగ్గర్‌ వద్ద లభించిన నోట్ల కట్టలు చూసి అంతా అయ్యో అనుకున్నారు.  ప్రస్తుతం ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.

    ఆహారం కోసం  కేరళలోని అలెప్పూ వీధుల్లో  అడుక్కునే బిచ్చగాడి వద్ద  విదేశీ కరెన్సీతో సహా ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు లభ్యం కావడంతో స్థానికులు, అధికారులు ఆశ్చర్య పోయారు. ఈ నగదులో రద్దైన రూ.2,000 నోట్లు కూడా ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసింది. 

    చారుమూట్ , సమీప ప్రాంతాలలో  ఇతను అందరికీ సుపరిచితుడే. సోమవారం సాయంత్రం స్కూటర్‌పై వెళ్తుండగా ఒక వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  రికార్డుల ప్రకారం అతను తనను తాను అనిల్ కిషోర్‌గా పరిచయం చేసుకుని, స్థానిక చిరునామా ఒకటి ఇచ్చాడు.  తలకి  తీవ్రమైన గాయాలయ్యాయని ప్రత్యేక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.  కానీ వారి మాటల్ని అతను పట్టించుకోలేదు. మంగళవారం ఉదయానికి, అతని మృతదేహం కడతిన్నల్ ప్రాంతంలోని ఒక దుకాణం వెలుపల కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, అతని సమీపంలో దొరికిన వస్తువులను పరిశీలించగా   డబ్బుల విషయం వెలుగు చేసింది.

    డబ్బు కట్టలు
    అతని దగ్గర ఉన్న డబ్బాను స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో తెరిచి, అధికారులే ఆశ్చర్యపోయారు. దాని లోపల ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేసి, టేప్‌తో చుట్టబడిన డబ్బు కట్టలు ఉన్నాయి. మొత్తం నగదు రూ.4.5 లక్షలకు పైగా ఉంది. ఆ నోట్లలో రద్దు చేయబడిన రూ.2,000 నోట్లు ,సౌదీ రియాలు కూడా ఉన్నాయి.

    ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్

    అతను భిక్షాటనపైనే జీవించేవాడని, తరచుగా ఆహారం కొనడానికి చిన్న మొత్తంలో డబ్బు అడిగేవాడని స్థానికులు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు, అదీ విదేశీ కరెన్సీ ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు.  ఏమీ లేని వ్యక్తిగా జీవించే వ్యక్తి దగ్గర ఇంత మొత్తం ఉండటం అందర్నీ   దిగ్భ్రాంతికి గురిచేసిందని ఒక పంచాయతీ సభ్యుడుపేర్కొన్నాడు.

    కాగా అతడు తమ బంధువు అనిచెప్పి, మృతదేహం లేదా డబ్బు కోసం ఇంతవరకూ ఎవరూరాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో చట్ట ప్రకారం నగదును కోర్టుకు అప్పగిస్తారు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు కిషోర్ నేపథ్యాన్ని  ఆ డబ్బు అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

    ఇదీ చదవండి: పెద్ద కళ్ల తోటి.. ఎక్కడ చూసినా ఆమే.. ఎవరీమె?


     

  • ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) తీవ్ర ఆరోపణలకు దిగింది. ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో గురువారం జరిపిన తనిఖీల సందర్భంగా తమతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెబుతోంది. అంతేకాదు.. తాము రికవరీ చేసిన ఆధారాలను పట్టుకుపోయారని ఆరోపిస్తోంది. 

    ప్రముఖ పొలిటికల్‌ కన్సల్టెన్సీ ఐప్యాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కోల్‌కతా సహా దేశంలోని ఐప్యాక్‌కు చెందిన పలు చోట్ల ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం వద్ద సోదాలు జరుగుతుండగా.. అనూహ్యంగా అక్కడికి సీఎం మమతా బెనర్జీ సీపీ మనోజ్‌ బెనర్జీతో కలిసి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

    అయితే కాసేపటి తర్వాత జైన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె చేతిలో.. ఓ ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌ ఫోన్‌, పలు డాక్యుమెంట్లతో కూడిన గ్రీన్‌ ఫైల్‌ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  ఆమె మీడియాతో.. బెంగాల్‌ ఎలక్షన్స్‌ నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ తమను లక్ష్యంగా చేసుకుందని.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని ఆమె మండిపడ్డారు కూడా. అయితే ఆమె ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. 

    ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. పక్కా ఆధారాలతోనే ఈ తనిఖీలు నిర్వహించాం. ఎక్కడా కూడా ఏ పార్టీ కార్యాలయాన్ని టచ్‌ చేయలేదు. ఏ ఎన్నికలతోనూ మాకు సంబంధం లేదు. మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు. అంతా చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాం అని ఈడీ ప్రకటించింది. అలాగే.. ఆ సమయంలో ఆమె తమ నుంచి బలవంతంగా పత్రాలను, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ను లాక్కున్నారని ఆరోపించింది. అంతేకాదు.. ఈ పరిణామంపై ఈడీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. తమ విధులకు ఆటంకం కలిగించారని, ఆధారాలను తీసుకెళ్లారని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రేపు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

    కోల్కతాలో ఈడీ VS సీఎం మమతా బెనర్జీ

    మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోపు.. నేటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధం. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డిస్క్‌ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు అని దీదీ మండిపడ్డారు. 

    అయితే మమతా బెనర్జీ చేసింది ఈడీ దాడుల్లో జోక్యం చేసుకోవడమేనని ప్రతిపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. ఆమె ప్రవర్తన అనైతికం అన్నారు. 

  • సాక్షి, ఢిల్లీ: వీధి కుక్కల కేసు విచారణ ఇవాళ ఎటు నుంచి ఎటో పోయింది. ఈ కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీం కోర్టులో పిల్లుల ప్రస్తావన కూడా వచ్చింది. అలాగే వీధుల్లోని అన్ని కుక్కలను తరలించమని తాము ఆదేశించలేదని.. కేవలం సంస్థలు, కార్యాలయాల నుండి మాత్రమే తరలించమన్నామని స్పష్టం చేసింది. 

    జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్‌ ఈ కేసును విచారించింది. ‘‘కుక్కలను పెంచుకునే కంటే పిల్లుల్ని పెంచుకోండి. ఎలుకల్ని నియంత్రించడంలో పిల్లులు సహాయ పడుతాయి. కాబట్టి కుక్కలను పెంచే కంటే పిల్లులను పెంచుకోవడానికి ప్రోత్సహించాలి’’ అని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే.. వీధి కుక్కల తొలగింపు విషయంలో నియమాలను పాటించాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.

    విచారణలో భాగంగా.. పట్టణాల్లో జంతువుల నియంత్రణ అంశంపై వాదిస్తూ సీనియర్‌ అడ్వొకేట్‌ సీయూ సింగ్‌(యానిమల వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్స్‌ తరఫున) కుక్కల అంశంతో పాటు ఎలుకలు, పిల్లుల గురించి ప్రస్తావించారు. కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సందీప్ మెహతా.. కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రువులు. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే.. పిల్లుల సంఖ్య పెరుగుతుంది. అప్పుడవి ఎలుకలను తింటాయి కదా” అని జస్టిస్‌ మెహతా సరదాగా వ్యాఖ్యానించారు. 

    వీధి కుక్కల దాడుల వ్యవహారంలో సుప్రీం కోర్టు సుమోటో విచారణ కొనసాగుతోంది. సీనియర్‌ అడ్వొకేట్‌ సీయూ సింగ్‌ వాదిస్తూ.. ఏబీసీ (Animal Birth Control) నియమాలు అమలు చేయడం.. స్టెరిలైజేషన్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడం.. సరైందని వాదించారు. పెద్ద సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు.

    సీనియర్ అడ్వకేట్ కృష్ణన్ వేణుగోపాల్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ABC అమలు చేయడానికి రూ.1,600 కోట్లు అవసరమని, ఐదు మంత్రిత్వ శాఖలు కలసి పని చేయాలని సూచించారు. అయితే.. ప్రస్తుతం కేవలం 66 ABC కేంద్రాలు మాత్రమే ఉన్నాయని.. దేశవ్యాప్తంగా 5.2 కోట్ల వీధికుక్కలన్నాయనే అంచనాలున్నాయని, అదే సమయంలో వెటర్నరీ డాక్టర్లకు పెద్ద స్థాయిలో శిక్షణ అవసరమని పేర్కొన్నారు.

    బీజేపీ నేత విజయ్ గోయల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ABC నియమాలు కుక్కల జనాభాను తగ్గించడానికి రూపొందించబడ్డాయని చెప్పారు. హింసాత్మక కుక్క(violent dog) అనే పదానికి నిర్వచనం స్పష్టంగా లేదని, ఢిల్లీలో ఒకే కుక్క వరుసగా ముగ్గురిని కరిచిన ఉదాహరణను చూపించారు. తమ హెల్ప్‌లైన్‌కు ఇప్పటివరకు 20,000 పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.

    కోర్టు ఆందోళన
    దేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి అని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. - మున్సిపల్ సంస్థలు, స్థానిక సంస్థలు ABC నియమాలను సరిగా అమలు చేయడంలో విఫలమయ్యాయని పేర్కొంది. వీధుల్లో జంతువుల ఉనికి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోందని గమనించినట్లు తెలిపింది. తదుపరి వాదనలు రేపు కూడా జరగనున్నాయి. 

  • లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో దారుణ ఘటన  కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.

    బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్‌లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం  చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్‌ అరెస్ట్‌ చేశారు. సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య  పరారీలో ఉన్నాడు.

    ఏం జరిగిందంటే..
    7వ తరగతి చదువు మానేసిన  మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో  ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి  పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.

    నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.

    బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు.  జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్‌ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు  చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.
    పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో  పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు.

     

Family

  • నాకు మొదటినుంచి దేవుడంటే విపరీతమైన భయభక్తులు. తరచు గుళ్లకు వెళుతుంటాను. రోజూ పూజ చేస్తుంటాను. అయితే గత రెండేళ్లుగా దేవుళ్లపైన విపరీతమైన చెడు ఆలోచనలు వస్తున్నాయి. దేవుడిని బూతుమాటలు తిట్టినట్లు, దేవుడి పటాలను అగౌరవపరచినట్టు... ఇలా రాయడానికి వీలులేని చెడ్డ తలంపులు వస్తున్నాయి. దాంతోటే ‘ఇది చాలా తప్పు, నాలాంటి భక్తుడికి ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి...’ అని మాన సికంగా చాలా మధన పడుతున్నాను. ఈ ఆలోచనల మూలాన దేవుడు నన్ను శపిస్తాడేమోననే భయంతో సరైన తిండి, నిద్రలతోపాటు మనశ్శాంతికి కూడా దూరం అయియాను. ఏ పనిమీదా ధ్యాస పెట్టలేకపోతున్నాను. నాకీ బాధనుంచి విముక్తి కలిగే మార్గం చెప్పగలరు. 
    – రఘురామ్, నల్గొండ

    ఎంత వద్దనుకున్నా మనసులో ఇలా మాటిమాటికీ చెడు తలంపులు వచ్చి, మనసును బాధించే ఇలాంటి ఆలోచనలను అబ్‌సెషన్స్‌ అంటారు. ఆ చెడు తలంపులనుంచి బయటపడేందుకు మాటిమాటికీ లెంపలేసుకోవడం, దండాలు పెడుతూ ఉండటాన్ని కంపల్షన్స్‌ అంటారు. ఇది ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత. దీనిని ఓసీడీ అంటారు. మన మెదడులోని సెరటోనిన్‌ అనే ఒక ప్రత్యేకమైన రసాయన పదార్థం సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరిలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు, ధోరణులు కలుగుతాయి. 

    ఇవి రాకూడదని ప్రయత్నించినకొద్దీ మరింత ఎక్కువగా మనసులోకి చొచ్చుకొచ్చి విపరీతమైన మానసిక సంఘర్షణకు గురిచేస్తాయి. ఈ ఆలోచనలకు మూలకారణమైన మీ మెదడులోని రసాయన చర్యను సరిచేయడం ద్వారా ఈ అబ్‌సెషన్స్‌ను పూర్తిగా అదుపు చేయవచ్చు. ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో ఈ ఓసీడీ జబ్బును పూర్తిగా తగ్గించేందుకు మంచి మందులు, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ అనే మానసిక చికిత్స అద్భుతంగా పని చేస్తాయి. 

    మందులతోపాటు థాట్‌ స్టాపింగ్, ఎక్స్‌పోజర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అనే మానసిక చికిత్స ద్వారా దేవుడిపైన మీకు కలిగే చెడు ఆలోచనలనుంచి విముక్తి కలిగించవచ్చు. ఓసీడీ జబ్బును తగ్గించేందుకు వీటికితోడు ఇటీవలే వచ్చిన ఆర్‌.టి.ఎం.ఎస్‌. అనే అత్యాధునిక పరికరాన్ని వాడుతున్నాము. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న సైకియాట్రిస్టును కలిసి చికిత్స తీసుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!

    డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
    (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.co)
     

  • లాలీపాప్స్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టమో తెలిసిందే. పంచదార క్యాండీలాంటి ఈ చాక్లెట్‌లంటే పెద్దలకు కూడా ప్రియమైనవే. అలాంటి లాలిపాప్‌ని టెక్నాలజీ సాయంతో వినూత్నంగా ఆవిష్కరించారు. వాటి ప్రత్యేకత తెలిస్తే విస్తుపోతారు. 

    ప్రపంచ సమావేశమైన సీఈఎస్‌ 2026 లాస్‌ వేగాస్‌లో వినూత్న ఆవిష్కరణలతో ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), రోబోటిక్స్‌ టెక్నాలజీలో ఉన్నత స్థాయి పురోగతిని ప్రదర్శిస్తుండగా..ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ అందర్నీ ఆమితంగా ఆకట్టుకుంది. అదేంటంటే..క్యాండీ చాక్లెట్‌గా పిలిచే లాలిపాప్‌ని కొరికనప్పుడు మ్యూజిక్ వినిపిస్తుంటుందట. 

    వీటిని లాలిపాప్‌స్టార్‌గా పిలుస్తారట. ఈ అసాధారణమైన క్యాండీ బోన్‌ కండక్షన్‌ టెక్నాలజీతో పనిచేస్తుందట. ఈ క్యాండీలో మనం  ఐస్ స్పైస్, ఏకాన్, అర్మానీ వైట్  వంటి కళాకారుల పాటలు వినొచ్చట. ఆక్యాండీని చప్పరించినా లేదా కొరికనప్పుడూ మన పుర్రె ఎముకల ద్వారా లోపలి చెవికి ప్రయాణించే ధ్వని సంగీతంలా వినిపిస్తుందట. అంటే మన నోటిలోనే సంగీత కచేరి వినోచ్చన్నమాట. 

    సింపుల్‌గా చెప్పాలంటే..ప్రపంచపాప్‌ దిగ్గజాల పాటలన్నీ మన నోటిద్వారానే వినొచ్చు. పైగా కొరకండి సంగీతాన్ని అస్వాదించండి అని సదరు లావా కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొంది కూడా. అంతేగాదు వీటి ధర ఏకంగా రూ. 808లు. ఇవి కేవలం స్టార్‌వెబ్‌సైట్‌లో లభిస్తాయట. అయితే నెటిజన్లు ఈ ఆవిష్కరణపై మండిపడుతున్నారు. ఇంతకుమునుపు పిల్లల టూత్‌బ్రెష్‌లలో ఇలాంటి టెక్నాలజీనే వినియోగించారని గుర్తు చేస్తూ పోస్టులు పెట్టారు.  పైగా అత్యంత పనికిమాలిన వస్తువుగా తిట్టిపోయడం గమనార్హం. 

    (చదవండి: హీరో రామ్‌చరణ్‌ ఇంట జపాన్‌ చెఫ్‌ చేతి బిర్యానీ..! టేస్ట్‌ ఎలా ఉందంటే..)
     

  • బిర్యానీ ఎవ్వరినైనా ఇట్టే తన రుచికి ఫిదా చేసేస్తుంది. యావత్తు ప్రపంచాన్ని తన ఘుమఘమలు వైపుకి లాగేసుకుంటుంది. అసలు ఒక్కసారి రుచి చూసిన వారెవ్వరైనా..మరోసారి తినేలా ఊరించే వంటకం ఇంది. అలాంటి వంటకానికి ఎందరెందరో ఫిదా అయ్యారు. అచ్చం అలానే బిర్యానీ ప్రియుడిగా మారి అందులో స్పెషలిస్ట్‌గా అవతరించాడు ఈ జపనీస్‌ చెఫ్‌. ఆ ఇష్టమే హైదరాబాద్‌కి రప్పించి ..మన చిరు తనయడు ఇంటికి వచ్చేలా చేయడమే కాదు..హీరో రామ్‌చరణ్‌కి రుచి చూపించాడు కూడా. ఔనా ఏంటా కథా అని కుంటున్నారా..!. అయితే  తక్షణమే చదివేయండి ఆ సంగతేంటో..

    ప్రత్యేక బిర్యానీలకు సంబంధించి వరల్డ్‌ పేమస్‌ జపనీస్‌ చెఫ్‌ మాస్టర్‌  తకమాసా ఒసావా ఇటీవల హైదరాబాద్‌లోని మన రామ్‌చరణ్‌ ఇంటికే వచ్చి మరి వండుకున్నాడు. ఇదేంటి అనుకోకండి బహిరంగంగా వండుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసుకునే ఈ చెఫ్‌ తకమాసా..అలానే మన చరణ్‌ ఇంట్లో కూడా బిర్యానీ వండి ఆ వీడియోని నెట్టింట షేర్‌ చేసుకున్నాడు. ఇది క్షణాలో ఆహారప్రియులను, రామ్‌చరణ్‌ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ఇంతకీ ఏంటి మేటర్‌ అంటే..

    ఆయన రామ్‌ చరణ్‌ నివాసానికి వచ్చి..అక్కడ బ్యూటిఫుల్‌ లోకేషన్స్‌ని షేర్‌ చేస్తూ..అక్కడే తన స్పెషల్‌బిర్యానీ వండాడండోయ్‌. అక్కడితో ఆగలేదు రామ్‌చరణ్‌కి, వాళ్ల అమ్మ సురేఖమ్మకి కూడా టేస్ట్‌ చేయమని పెట్టాడు కూడా. మన హీరో రామ్‌చరణ్‌ అయితే బాస్‌ ఇది చాలా రుచిగా ఉంది గ్రేవీలా లేదంటూ చమత్కరించాడు. ఎందుకంటే జపాన్‌ వాళ్లు ఏదైనా సూప్‌ మాదిరిగా అదేనండి పులుసు టైపులో తింటుంటారు కథా అందుకని మన హీరో చరణ్‌ సరదాగా అలా అన్నారు. మన జపాన్‌ చెఫ్‌ తకమాసాకి ఈ బిర్యానీ వండడం ఎలా తెలిసిదంటారా..?

    అలా తెలుసుకుని..ఇలా గరిటపట్టేశాడు..
    టోక్యోకు చెందిన చెఫ్‌​ తకమాసా సింగిల్‌ పాట్‌ బిర్యానీ స్పెషలిస్ట్‌ అట. అంతేగాదు ట్యోక్కోలో బిర్యానీ రెస్టారెంట్‌ని కూడా నడుపుతున్నాడు. అతని బిర్యానీ వండే స్కిల్‌కి, టేస్ట్‌కి మిచెలిన్ బిబ్ గౌర్మాండ్‌ అనే మంచి అవార్డు సైతం వచ్చింది ఈ చెఫ్‌కి. మన తకమాసాకి బిర్యానీ గురించి తెలిసింది 2009లోనట. తమిళనాడులో ఆఫీస్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడూ..స్థానిక తినుబండారాలపై బిర్యానీ అని రాసి ఉడంట చూశాడట తకమాసాక. 

    ఆసక్తిగా అనిపించి ఆర్డర్‌ చేసి తిన్నాడట. అంతే ఆక్షణమే దానిపై మనసు పారేసుకుని ఇలా బిర్యానీ చెఫ్‌గా సెటిల్‌ అయ్యిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలన్ని పర్యటించి మరి అక్కడ బిర్యానీ వంట పద్ధతులను తెలుసుకుంటూ, దీని రుచిపై అధ్యయనం చేస్తున్నాడట ఈ చెఫ్‌ తకమాసా. బిర్యానీపై ఉన్న అతని ప్రేమ చూస్తుంటే భోజనప్రియులకు ఆహారమే సార్వత్రికభాష అని నిరూపితమైంది కదూ..!

     

    (చదవండి: ఏడేళ్లుగా నిలబడే ఉన్న సాధువు..! నిద్రపోవడం ఎలా అంటే..)