Archive Page | Sakshi
Sakshi News home page

NRI

  • సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.

    తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. 
      
    సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.

    తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు.  ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.

    తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు.

International

  • చైనాలోని ఓ ​కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను సోషల్ మీడియాలో విమర్శించినందుకు భార్యకు కోర్టు వింత శిక్ష విధించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. 

    చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన నియు నా అనే మహిళకు, గావో ఫీతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. గావో ఫీ ఒక బొగ్గు గని కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే ఆఫీసులో పనిచేసే ఒక వివాహితతో గావో ఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

    ఈ విషయం నియుకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె సోషల్ మీడియాలో తన భర్త బండారాన్ని బయటపెట్టింది. అతడు పనిచేసే ఆఫీస్ వివరాలతో, భర్తను తిడుతూ పోస్టులు పెట్టింది. దీంతో గావో ఫీ తన భార్యపై కోర్టులో 'పరువు నష్టం' దావా వేశాడు. 

    ఈ కేసును విచారించిన న్యాయస్ధానం ఎవరూ ఊహించని తీర్పు ఇచ్చింది. ఒకరు వ్యక్తిగతంగా ఎన్ని తప్పులు చేసినా, చట్టం ప్రకారం అతడి  వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని కోర్టు తేల్చింది. దీంతో తన భర్తకు వరుసగా 15 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని నియును కోర్టు ఆదేశించింది.

    కోర్టు ఆదేశాలు మేరకు జనవరి 12 నుంచి నియు నా క్షమాపణ వీడియోలు పెట్టడం ప్రారంభించింది. అయితే ఆమె మాత్రం చాలా వ్యంగ్యంగా తన భర్తకు సారీ చెబుతోంది. తన భర్త  వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉద్దేశించి.. "మీ ఇద్దరిది నిజమైన ప్రేమ. 

    నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీ గౌరవాన్ని నేను కాపాడాలి కాబట్టి క్షమించు" అంటూ సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే కోర్టు ఇచ్చిన ఈ వింత తీర్పుతో ఆమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు రోజుల వ్యవధిలోనే  3,50,000 మంది ఫాలోవర్లు వచ్చారు.
     

  • అఫ్గానిస్థాన్‌లో మంచుతుపాన్‌, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత మూడు రోజులలో దాదాపు 61 మంది మృతిచెందినట్లు అక్కడి విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా పలు ప్రాంతాలలో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు పేర్కొంది.

    తుఫాన్ బీభత్సంతో మధ్య, తూర్పు అఫ్గానిస్థాన్‌లో భారీ మరణాలు సంభవించినట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాదాపుగా 61మంది ప్రాణాలు కోల్పోగా 110 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. భారీ వానల దాటికి కాందహర్ ప్రావిన్సులోని ఒక ఇంటి పైకప్పు కూలడంతో ఆరుగురు చిన్నారులు మృతిచెందినట్లు తెలిపింది. అంతేకాకుండా మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరుకోవడంతో మృతులు మరింతగా పెరిగినట్లు పేర్కొంది.

    అఫ్గాన్‌ ప్రధాన రోడ్డు మార్గాలలో ఒకటైన సలాంగ్ జాతీయ రహదారి వానల దాటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉజ్బెనిస్థాన్ నుంచి అఫ్గాన్‌కు విద్యుత్‌ను సరఫరా అయ్యే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్ దెబ్బతినడంతో 12 ప్రావన్సులలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిపింది. తుఫాన్ దాటికి రహదారులు దెబ్బతినడంతో టెక్నికల్ సిబ్బంది సమాయానికి అక్కడికి చేరుకోలేక పోయారన్నారు.

    అకాల వర్షాలకు పెద్దమెుత్తంలో పంటనష్టం ఏర్పడిందని అక్కడి వార్త కథనాలు పేర్కొన్నాయి. అఫ్గాన్‌లో నాలుగు కోట్లకు పైగా మానవతా సహాయం కోరుతున్నారని యునేటైడ్ స్టేట్స్ నివేదిక ఇదివరకే ప్రకటించింది. కాగా ఇప్పుడు ఈ అకాల వరదలు ఆదేశాన్ని మరింత పేదరికంలో నెట్టాయి. 

  • వాషింగ్టన్‌: అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల విషయంలో భారత్‌కు సగానికి సగం ఊరట లభించే అవకాశం కని్పస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు విధించిన 25 శాతం టారిఫ్‌లను రద్దు చేసే అవకాశమున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ కొద్ది నెలలుగా భారీగా తగ్గించుకుంది. కనుక 25 శాతం సుంకాలను రద్దు చేసే అంశాన్ని మా ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది’’అని ఆయన చెప్పారు. 

    శుక్రవారం అమెరికా వార్తా సంస్థ పొలిటికో ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. ‘‘భారత్‌పై మేం విధించిన 25 శాతం చమురు టారిఫ్‌ బ్రహా్మండంగా పని చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు దాదాపుగా ఆగిపోయాయి. కనుక వాటిని వెనక్కు తీసుకునే ప్రక్రియ మొదలవుతుందనే భావిస్తున్నా’’అని వివరించారు. టారిఫ్‌ల వల్లే రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు భారీగా తగ్గాయని ఇటీవల దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా కూడా బెసెంట్‌ చెప్పుకొచ్చారు. 

    తాజా పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. అయితే, భారత్‌ నుంచి శుద్ధి చేసిన చమురు తదితరాలను యూరప్‌ కొనుగోలు చేయడంపై బెసెంట్‌ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘యూరప్‌ది నిజంగా మూర్ఖపు చర్యే. భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని యూరప్‌ అంగలారుస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆ దేశంపై అధిక సుంకాలు విధించలేదు’’అంటూ నిందించారు. 

    ఆగస్టు నుంచీ రగడ 
    భారీ వాణిజ్య అసమతుల్యతను సరిచేసే పేరిట భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత ఆగస్టులో తొలుత 25 శాతం టారిఫ్‌ విధించడం తెలిసిందే. రష్యా చమురు దిగుమతులను సాకుగా చూపుతూ కొంతకాలానికే మరో 25 శాతం మేరకు బాదారు. అంతేగాక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే, దాన్ని తిరిగి విక్రయించే దేశాలపై ఏకంగా 500 శాతం టారిఫ్‌ విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రిపబ్లికన్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఇటీవల అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు కూడా! రష్యా తన చమురు కొనుగోళ్ల నిధులను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెచ్చిస్తోందని అమెరికా ఆరోపిస్తుండటం తెలిసిందే. 
     
    అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా నుంచి అధిక మెుత్తంలో చమురు దిగుమతి చేసుకుంటుంది. కాగా మెుత్తంగా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారుగా ఉంది.

  • స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 2026లో గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్లు, ఆర్థికవేత్తలు,  భారత నాయకులు తమ  ప్రత్యేకతను చాటుకుంనేందుకు, ఒప్పందాలు,  పెట్టుబడులు అంటూ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు  కిక్కిరిసిన కాన్ఫరెన్స్ హాళ్లలో చిక్కటి చలికాలంలో అందిస్తున్న సమోసాలు, కరకర లాడే పకోడీలు ముఖ్యంగా వేడి వేడి 'కిచిడీ' అత్యంత ఆదరణ పొందుతుండటం విశేషం.

    వేదిక సమీపంలోని ఫుడ్ కోర్టులో భారతదేశానికి చెందిన ఈ పౌష్టికాహార వంటకం ప్రపంచ నాయకులు, ప్రతినిధుల నోరు ఊరిస్తోంది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1000 మందికి  ఉచితంగా వడ్డిస్తూ,  భారతీయ రుచులకు ఒక గొప్ప గుర్తింపును తెచ్చి పెట్టింది. కమ్మని వాసన, రుచికీ రుచితో ఈ కంఫర్ట్ డిష్‌ ప్రశంసలు అందుకుంటోంది. దీనికోసం ఎంతో  ఓపికగా  క్యూలో వేచి  ఉండటం విశేషం.

    గడ్డకట్టే మంచుతో నిండిన దావోస్ వీధుల్లో వేడి భారతీయ భోజనం (కిచిడీ, సమోసాలు, పకోడాలు) ఇక్కడకు వచ్చే వారికి సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ స్టాల్‌ను సందర్శించి, కిచిడీ రుచి చూసి దాని పోషక విలువలను ప్రశంసించారు. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ  కూడా దావోస్‌లో  ఇండియన్‌ ఫుడ్‌ ట్రక్ చిత్రాన్ని పంచుకున్నారు.

     ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్‌ అంటున్న మస్క్‌
     

    దావోస్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతుండటంతో, వరుసగా సమావేశాల మధ్య వేడిగా ఉండే కిచ్డీ తమకు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుందంటున్నారు. ఇ‍క్కడి వాతావరణానికి తగ్గట్టు వేడి వేడి  కిచిడీ   బావుందని  జపాన్  ప్రతినిధి చెప్పారు. ప్రపంచ వేదికపై  పెరుగుతున్న భారతీయ సాంస్కృతిక , ఆర్థిక పాదముద్రకు ఇది సంకేతమంటూ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.

    ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్‌ పెరోల్‌

     

  • ప్రపంచంలో ఎలాంటి మీడియా లేదు.... ఎలాంటి రికార్డింగ్ లేదు....కానీ ఒక మాట అందరి నోటా ఉంది.  మనం space-time(కాల కొలమానం) ను adjust చేసి... టైం ట్రావెల్‌ చేయొచ్చా? అంటే.... మనం కాలాన్ని సెట్‌ చేసి... గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లగలమా? , గణాంకాల ప్రకారం... సిద్ధాంతపరంగా ఒక వస్తువును లేదా వస్తువులను 99.9999% కాంతివేగం వరకు తీసుకెళితే time dilation(కాల వ్యత్యాసం) జరుగుతుంది....కాలం నెమ్మదిస్తుంది.... ఆ స్పీడ్‌లో టైం ట్రావెల్‌ సాధ్యమే కానీ.. అక్కడి వరకు వెళ్లడం ప్రస్తుతానికి అసాధ్యమే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో సాధ్యం కావచ్చు కూడా... 

    19వ శతాబ్ధం వరకు మన పూర్వీకుల గురించి మనం విన్నామే తప్ప వారి దినచర్యలు... కార్యకలాపాలు... వారి అసలు రూపాలు మనం చూడలేదు. ఆ తర్వాత క్రమేణా విగ్రహాలు... రాతి బొమ్మలు... ఆ తర్వాత కెమెరా... ఫోటోలు.. వీడియోలు వచ్చేశాయి. అంతకు ముందు వారికి దీని గురించి తెలియదు. ఇక 21వ శతాబ్ధంలో అధునాతన టెక్నాలజీ రావడంతో ప్రతి విషయం రికార్డెడ్‌గా మారింది. అంటే భవిష్యత్‌ తరాల వారికి మనం ఇప్పడు జీవిస్తున్న తీరు... మన చర్యలు.. మనకు సంబంధించి ప్రతి విషయం తెలిసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. 

    అంటే ఇప్పటి తరం గతంలోకి వెళ్లలేకపోయినా... రాబోయే తరాలు సోషల్‌ మీడియా ద్వారా భూతకాలంలోకి వెళ్లి చూసే అవకాశముంది. ఇది వినడానికి అంత వింతగా కనిపించకున్నా... భవిష్యత్తులో మాత్రం ఎన్నో ప్రయోగాలకు మూలం కానుంది. అయితే టైమ్‌ ట్రావెల్‌ కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు...

     Time travel ఒక science fiction మాత్రమే అయితే....  CERNలో శాస్త్రవేత్తలు వెదుకుతున్నదేంటీ? , Time travel అసాధ్యం అయితే.... 13 బిలియన్ డాలర్లు వెచ్చించి Large Hadron Collider ఎందుకు నిర్మించారు? , వాస్తవంగా కాలం కన్నా ముందు... కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారం ఏంటీ?, పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు.

    Laser ring తో time machine ఎందుకు తయారు చేసి ప్రయోగించారు. ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీంతో మనకు అర్థం అయ్యేదేమిటంటే.... Time travel వెంటనే కాకున్నా.... మరి కొన్ని పరిశోధనల తర్వాత... రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశముంది. టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమే అని 2017లో Stephen Hawking అన్నాడు. 

    సాంకేతికత కాకుండా... వాస్తవికతతో పరిశీలిస్తే... 
    ప్రతి రాత్రి మనం నిద్రపోతే.... నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తుంటాం... ఊహకందని విషయాలు... వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్‌ అని చెప్పవచ్చు. 

    కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది... కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యమనిపిస్తుంది. అంటే మనం నిద్ర పోయి time travel చేస్తున్నట్టే కదా? ప్రతి రాత్రి మన ఆత్మ వేరే dimension లోకి వెళ్తుంది, అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం.

    ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటి సిద్దాంతం కూడా కాలానికి సంబంధించి కచ్చితత్వం లేదని చెప్పారు. 
    ఇంటర్‌ స్టెల్లార్‌ సినిమాలో మాథ్యూ మెక్‌ కానవే పాత్ర black hole దగ్గర ఒక గ్రహంపై ఒక గంట గడుపుతుంది.... కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది  కాల వ్యత్యాస ఉదాహరణగా చెప్పవచ్చు.  

    టైమ్‌ ట్రావెల్‌ కోసం speed of light(కాంతి వేగం) కంటే ఎక్కువ వేగం కావాలి. కానీ mass(ద్రవ్య పరిమాణం) ఉన్న ఏ వస్తువూ శక్తి లేకుండానే speed of light చేరలేదు... అది చేరాలంటే infinite energy అవసరం అని... శాస్త్రవేత్తలు చెప్పారు. Einstein తో పాటు Nathan Rosen కూడా worm holes(సిద్ధాంతాత్మక మార్గం) గురించి చెప్పారు. 

    Worm holes... space-timeలో shortcuts కావచ్చు. అంటే రెండు దూర ప్రాంతాలను కలిపే ఓ పైపు లేదా సొరంగం లాంటి చర్య అని చెప్పవచ్చు. ఒక stable wormhole కోసం Milky Way galaxy మొత్తం mass కంటే ఎక్కువ energy కావాలి. ఆ ఎనర్జీ ఉంటే టైం ట్రావెల్‌ సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ ఎనర్జీ ఏకీకృతం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. 

    1974లో Frank Tipler అనే శాస్త్రవేత్త.... rotating cylinder concept(భ్రమించే సిలిండర్‌ సూత్రం) ఇచ్చాడు. Infinite density.... length తో cylinder space-time ను curve చేస్తుంది. అంటే కాలం భవిష్యత్తు... భూతకాలం... వర్తమానానికి తిరుగుతుందని ఓ సూత్రం చెప్పారు. అయితే దానిపై అంతగా ఫోకస్‌ జరగలేదు. 
    2001లో Ronald Mallett అనే ఆయన laser beams తో space-time twist చేయడం ప్రతిపాదించాడు. Research ఇంకా కొనసాగుతోంది... ఫలితం ఇంకా రాలేదు. 

    CERN లో particles ను 99.99% speed of light వద్ద collide చేస్తారు. Time dilation( కాల వ్యత్యాసం) జరుగుతుంది, particleకి సంబంధించిన lifetime పెరుగుతుంది.  మనుషుల కోసం ఇది practical కాదు.... కేవలం spiritual మాత్రమే. ఎందుకంటే టైమ్‌ ట్రావెల్‌ శక్తి ప్రస్తుతం మనుషులకు అసాధ్యమే అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమని భావిద్దాం.

  • టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్‌ మాస్క్‌ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

     లారీ ఫింక్‌తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు  ఏజింగ్‌ రివర్స్‌ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.

    సమాజానికి ముప్పు
    అయితే ఏజ్‌ రివర్సింగ్‌ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని  మస్క్‌ పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్‌స్పైర్‌ చేసిన 70 ఏళ్ల బామ్మ

    దావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన  మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధానాలపై విమర్శలు గుప్పించారు.

    ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్‌ పెరోల్‌

  • అమెరికా న్యూయార్క్‌లో భారీ మంచు తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా  కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 25, 26 తేదీలలో అక్కడికి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం అమెరికాకు మంచు తుపానులు భయం పట్టుకుంది. ఈ వారాతంలో ఆ దేశం తీవ్ర మంచుతుపాను ఎదుర్కొనే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ‍ప్రకటించింది. ఈ నేపథ్యంలో USA అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం స్పందించారు. తుపానును ఎదుర్కొవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైందని ‍ప్రకటించారు. అయితే దీని ప్రభావం భారత్‌లోని విమానయాన సంస్థలపై సైతం పడింది. మంచు తుఫాన్ నేపథ్యంలో న్యూయార్క్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

    ఈ విమానాల రద్దుపై వివరణ ఇస్తూ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాలలో రేపు, ఎల్లుండి తీవ్ర మంచుతుఫాను ప్రభావం ఉండనుంది. యుఎస్ తూర్పు తీరంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా జనవరి 25,26 తేదీలలో అక్కడికి ప్రయాణించే విమానాలను రద్దు చేస్తున్నాం. ఈ క్యాన్సిలేషన్‌పై పూర్తి సమాచారం మా సిబ్బంది ప్రయాణికులకు వ్యక్తిగతంగా అందిస్తుంది". అని ఎక్స్‌లో ఎయిర్‌ఇండియా పోస్ట్ చేసింది.

    అయితే ప్రస్తుతం రాబోయే మంచు తుఫాన్‌ అమెరికాలో 2/3 మందిని ఎఫెక్ట్ చేస్తుందని సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం వచ్చే మంచుతుఫాన్ టెక్సాన్‌ నుంచి ఇంగ్లాండ్‌ వరకూ దాదాపు 2వేల కిలోమీటర్ల మైళ్లు ప్రయాణించనున్నట్లు పేర్కొంది. దీనివల్ల దేశంలోనే విద్యుత్‌వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది.

Movies

  • ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా చుట్టూ పుకార్లు ఆగడం లేదు. ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొన్ని రూమర్లకు క్లారిటీ ఇచ్చినా, మరికొన్ని మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో హీరో గోపీచంద్ కూడా నటించబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ‘స్పిరిట్’లో ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేశారట. అయితే అది పాజిటివ్ క్యారెక్టరా లేక నెగెటివ్ క్యారెక్టరా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.  

    ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులు. తనకు అవకాశం దొరికితే ప్రభాస్ సినిమాలో తప్పకుండా నటిస్తానని గోపీచంద్ గతంలోనే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ‘స్పిరిట్’తో ఆ అవకాశం నిజమవుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో సరైన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ మార్కెట్ కొంత డల్ అయింది. అలాంటి సమయంలో ప్రభాస్ సినిమా వంటి భారీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర చేయడం ఆయన కెరీర్‌కు మళ్లీ బూస్ట్ ఇవ్వొచ్చని అభిమానులు భావిస్తున్నారు.  

    విలన్ పాత్రపై గాసిప్  
    ఇప్పుడు నాకు విలన్ పాత్రలు చేయాలని లేదు. కానీ ఆ పాత్రలో డెప్త్ ఉంటే మాత్రం చేస్తాను. ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ వస్తే తప్పకుండా చేస్తానని గోపీచంద్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సందీప్ వంగ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ‘యానిమల్’ చూసినవారికి తెలిసిందే. అందుకే ‘స్పిరిట్’లో గోపీచంద్‌ను విలన్‌గా చూపించబోతున్నారనే గాసిప్స్ ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ మాత్రం స్పందించలేదు. గోపీచంద్ నిజంగా ‘స్పిరిట్’లో నటిస్తున్నారా? ఆయన పాత్ర ఏదీ? అన్నది మాత్రం అధికారిక ప్రకటన వెలువడే వరకు మిస్టరీనే.  

  • తెలుగు బిగ్‌బాస్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రతి ఏడాది సెప్టెంబరు-డిసెంబరు మధ్య కాలంలో జరుగుతూ ఉంటుంది. గతేడాది కామనర్ కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. అంతకు ముందు సీజన్లలో నిఖిల్, పల్లవి ప్రశాంత్ తదితరులు విన్నర్స్ అయ్యారు. గెలిచిన వాళ్లు ఏమైనా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారా అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు అదే విషయమై మాట్లాడుతూ ఏడో సీజన్ రన్నరప్ అమర్‌దీప్ కుండబద్దలు కొట్టేశాడు. బిగ్‌బాస్ ఓట్లు దేనికి పనికిరావు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)

    'బిగ్‌బాస్‌లో ఓట్లు వేశారు కదా, వాళ్లంతా థియేటర్‌కి వచ్చేస్తారని మనం సినిమాలు చేయకూడదు. నువ్వు ఏం చేయగలవో ప్రూవ్ చేసి ప్రేక్షకులని రప్పించుకోవాలి. అంతే గానీ ఆ ఓట్లు దీనికి పనికిరావు. ఆ షోలో గెలిచినా, టాప్-5లో ఉన్నా గానీ అదంతా ఒక్కరోజుకే. తర్వాత నుంచి అంతా సాధారణమే. ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, స్టేజీ షోలు చేసుకోవడమే. అక్కడ వచ్చిన పేరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆలస్యమవ్వొచ్చు కానీ సక్సెస్ అయితే దొరుకుతుంది'

    'బిగ్‌బాస్‌లో చేసిన వాళ్లందరూ హీరోలు అయ్యింటే ఈ పాటికి పెద్ద లిస్ట్ అయ్యేది. ఈ షో అనేది వన్డే కింగ్. బయటకొచ్చిన తర్వాత ఎవడి జీవితం వాడిది. మన వ్యక్తిత్వం, అలవాట్లు, మాటలు చూసి కాసేపు రిలాక్స్ కోసం జనాలు మాట్లాడుకుని ఓట్లేస్తారు' అని అమర్‌దీప్ చెప్పుకొచ్చాడు. ఇతడు మాట్లాడిన దానిబట్టి చూస్తే సొహెల్‌కి పరోక్షంగా కౌంటర్ వేశాడా అని సందేహం వస్తుంది. ఎందుకంటే బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన కొన్ని సినిమాలు చేసిన సొహెల్.. ఓ మూవీ రిలీజ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. షోలు ఓట్లు వేశారు కదన్నా, సినిమాకు ఎందుకు రావట్లేదు అని అడిగాడు. ఇతడే కాదు సన్నీ తదితరులు కూడా హీరోగా ఒకటి రెండు మూవీస్ చేసి పూర్తిగా కనుమరుగైపోయారు. కాబట్టి బిగ్‌బాస్ ఫేమ్ అనేది నీటిపై బుడగ లాంటిదే. ఎప్పుడు పేలిపోతుందే చెప్పలేం!

    (ఇదీ చదవండి: #AA23.. సీక్రెట్ చెప్పేసిన లోకేశ్ కనగరాజ్)

  • 'పుష్ప 2' తర్వాత ఆచితూచి సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేస్తున్నాడు. దీని షూటింగ్ ఇప్పటికే జరిగింది. వచ్చే ఏడాది ఇది రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో బన్నీ కొత్త మూవీ చేయబోతున్నాడని వారం పదిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి స్వయంగా లోకేశ్ మాట్లాడాడు. ఓ సీక్రెట్ చెప్పేశాడు.

    తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్‌కి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రేక్షకుల అంచనాలు లేకుండా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకుంటే అది ఎలా ఉండబోతుంది? అని యాంకర్ అడగ్గా.. నా తర్వాతి సినిమా(#AA23) అలానే ఉండబోతుంది అని లోకేశ్ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎందుకంటే లోకేశ్ గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి స్టైలిష్ మూవీస్ తీశాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే వాటిని మించే ఉండొచ్చు.

    (ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)

    చాన్నాళ్ల క్రితమే లోకేశ్ ఓ సూపర్ హీరో తరహా స్టోరీ అనుకున్నాడు. ఇందులో హీరోకి ఓ చేయి ఉండదు. బదులుగా ఓ ఐరన్ హ్యాండ్ అమర్చుతారు. అప్పటినుంచి సదరు హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాల్లో లోకేశ్ చెప్పాడు. తొలుత హీరో సూర్యతో ఇది చేద్దామనుకున్నాడు. గతేడాది ఆమిర్ ఖాన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడదే ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేస్తున్నాడా? అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే బన్నీతో చేస్తున్న మూవీ కోసం అనౌన్స్ చేసిన వీడియోలో.. సినిమా అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని మరి అది ఇది ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.

    మరోవైపు అల్లు అర్జున్ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్.. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశాడు. కేవలం నాలుగు నెలల్లోనే మూవీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అట్లీ ప్రాజెక్ట్ నుంచి కాస్త ఫ్రీ అయిన వెంటనే అల్లు అర్జున్ దీన్ని చేస్తాడని తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ) 

  • ఓరచూపులతో మాయ చేస్తున్న అనన్య నాగళ్ల

    గ్లామరస్ డాల్‌లా ఆషికా రంగనాథ్ హొయలు

    అందంతో చంపేస్తున్న బిగ్ బాస్ ఫేమ్ దివి

    పూల డ్రస్‌లో క్యూట్ అండ్ స్వీట్‌గా దిశా

    జీరో సైజ్ నడుముతో అలరిస్తున్న సోనాల్

    వైట్ అండ్ వైట్ డ్రస్సులో రకుల్ సింగారం

  • పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ బాలీవుడ్‌ హీరోయిన్‌. తెలుగులోనూ ఒక సినిమా చేసింది. ఈమె అక్క, తల్లి, అమ్మమ్మ అందరూ హీరోయిన్సే కావడం విశేషం. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? తనే రియా సేన్‌. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు(జనవరి 24). ఈ సందర్భంగా తన కెరీర్‌ను ఓసారి చూసేద్దాం.

    ఫ్యామిలీ మొత్తం..
    రియా సేన్‌ది బెంగాలీ కుటుంబం. ఆమె తల్లి మూన్‌మూన్‌ సేన్‌, అమ్మమ్మ సుచిత్రా సేన్‌ ఇద్దరూ పేరున్న నటీమణులే. ఆ రక్తమే తనలో, తన అక్క రైమా సేన్‌లో ప్రవహించింది. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీనే ఎంచుకున్నారు. హీరోయిన్స్‌గా రాణించారు. రియా సేన్‌ ఐదేళ్ల వయసులోనే తన తల్లి సినిమాలో కూతురిగా యాక్ట్‌ చేసింది. 

    అక్కాచెల్లెళ్లకు అచ్చిరాని టాలీవుడ్‌
    టీనేజ్‌కు రాగానే తాజ్‌మహల్‌ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తమిళంలోనే కాకుండా హిందీ, బెంగాలీ, మలయాళ, ఇంగ్లీష్‌, ఒడియా భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక మూవీ 'నేను మీకు తెలుసా?'. ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యేసరికి ఇక్కడ అవకాశాలే రాలేదు. దాంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌లోనే సెటిలైంది. ఈమె అక్క రైమా సేన్‌ కూడా తెలుగులో ధైర్యం అని ఒకే ఒక్క సినిమా చేయడం గమనార్హం!

    సినిమా, పెళ్లి
    రియా బాలీవుడ్‌లో స్టైల్‌, ఝంకార్‌ బీట్స్‌, ఖయామత్‌, అప్న సప్న మనీ మనీ, లవ్‌ కిచిడీ.. ఇలా అనేక సినిమాలు చేసింది. మధ్యలో ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. ఓటీటీలో రాగిని ఎమ్‌ఎమ్‌ఎస్‌: రిటర్న్స్‌, పాయిజన్‌, మిస్‌మ్యాచ్‌ 2, కాల్‌ మీ బే వెబ్‌ సిరీస్‌లలో కనిపించింది. 2017లో వ్యాపారవేత్త శివం తివారిని రియా సేన్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ తర్వాత మాత్రం తన పెళ్లి గురించి రియా ఎప్పుడూ ఓపెన్‌ అవలేదు.

     

     

    చదవండి: స్టార్‌ హీరోకు తల్లిగా అడిగారు.. అయిష్టంగానే చేశా: మీనా

  • సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో ఉన్నాసరే దాన్ని బయటపెట్టరు. చాలా రహస్యంగా ఉంచుతారు. టాలీవుడ్‌లో అయితే రష్మిక-విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు టాక్. అయినా సరే తమ బంధాన్ని రివీల్ చేయట్లేదు. కానీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ మాత్రం పదేళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టింది. తాజాగా ఈమె తన ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిలేషన్‌షిప్ గురించి ఓ విలువైన సలహా కూడా ఇచ్చింది.

    న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళంలో మిడ్ రేంజ్ సినిమా హీరోయిన్‌గా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన 'హాట్ స్పాట్ 2' థియేటర్లలోకి వచ్చింది. అయితే కొన్నిరోజుల క్రితం ఈమె, తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఫేక్ అని వీళ్లిద్దరూ కలిసి చేసిన పోస్టుతో క్లారిటీ వచ్చేసింది. ప్రియ.. తన కాలేజీ మేట్ రాజ్ వేల్‌తో గత పదేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీళ్లు పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన వీళ్లిద్దరికీ లేనట్లే కనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ)

    తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ప్రియా భవానీ శంకర్ ఏం చెప్పిందంటే.. 'నాకు మొదటి, చివరి బాయ్‌ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా(నవ్వుతూ). నాతో రిలేషన్ మొదలుపెట్టకముందు కాలేజీ టైంలో అతడు చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. నేను చెప్పేదేంటంటే మీ విధేయత చూపించడానికి ఎక్కువ కాలం రిలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ టాక్సిక్ రిలేషన్‌షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటకొచ్చేయండి' అని చెప్పుకొచ్చింది.

    తెలుగులో ఈమె.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‌లో ప్రియకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతానికైతే తమిళంపైనే ఫోకస్ చేసింది.

    (ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)

  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ఇప్పటి వరకు ప్రకటించలేదు.  వీడీ14 అనే వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ ప్రారంభించారు. అయితే రిపబ్లిక్‌ డే సందర్భంగా రౌడీ ఫ్యాన్స్‌కి మేకర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఈ సినిమా టైటిల్‌ని జనవరి 26న అనౌన్స్‌ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. 

    19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "వీడీ 14" సినిమా రూపొందుతోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత "వీడీ 14"లో మూడోసారి రష్మిక, విజయ్ జంటగా కనిపించనున్నారు.
     

  • త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా  ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు,  ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఆంథమ్‌ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది .ప్రకాశ్ చెరుకూరి అందించిన మ్యూజిక్ సాంగ్‌కు ప్రాణం పోసింది.

    బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
     

  • ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. కాకపోతే థియేటర్లలో రిలీజైనప్పుడు అవి ఎక్కువమంది దృష్టిలో పడకపోవడం వల్ల కనుమరుగైపోతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'పతంగ్'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: ట్రెండింగ్‌లో 'ఒంటరి పెంగ్విన్'.. ఇంతకీ ఏంటి దీని స్టోరీ?)

    కొన్ని చిత్రాల్లో చెప్పుకోవడానికి పెద్దగా స్టోరీ ఏముండదు. 'పతంగ్' కోసం దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న ట్రయాంగిల్ ప్రేమకథ కూడా అలాంటి రొటీన్ లైనే. కాకపోతే దీనికి ఇచ్చిన ట్రీట్‌మెంట్, డైలాగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఆర్య, ప్రేమదేశం లాంటి ప్రేమకథని హైదరాబాద్ స్టైల్లో చెబితే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ యువతని ఆకట్టుకునేలా ఉంటాయి. యూత్ మూవీ అని బూతుల్లాంటివి ఏం పెట్టలేదు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరగా సినిమా చూడొచ్చు. ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

    'పతంగ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ(వంశీ పూజిత్‌), అదే ప్రాంతంలో ఉండే అరుణ్‌(ప్రణవ్‌ కౌశిక్‌) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి  ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ(ఓటీటీ))

  • సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది అందాల తార మీనా. అప్పటికీ, ఇప్పటికీ మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ వెండితెరపై వెలుగులీనుతోంది. సీనియర్‌ హీరోలతో జోడీ కడుతూనే ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మీనా మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబి సినిమాలు చేస్తోంది.

    సూపర్‌ హిట్‌ సినిమాలు మిస్‌
    తాజాగా మీనా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌-మమ్ముట్టిల 'హరికృష్ణన్స్‌', కమల్‌ హాసన్‌-శివాజీ గణేశన్‌ల 'తేవర్‌ మగన్‌' (క్షత్రియ పుత్రుడు), రజనీకాంత్‌ 'పడయప్ప' (నరసింహ) సినిమాల్లో నేను నటించాల్సింది. కానీ డేట్స్‌ కుదరకపోవడంతో ఈ ఆఫర్స్‌ తిరస్కరించాల్సి వచ్చింది. 

    అన్నీ మనమే చేయలేం
    ఇవే కాదు, ఇలా చాలా సినిమాలు ఇలాగే పోగొట్టుకున్నాను. అన్ని సినిమాలు మనమే చేయడం అసాధ్యం కదా! అయితే చేజారిన సినిమాలు సూపర్‌ హిట్‌ అయినప్పుడు కాస్త బాధగా అనిపించేది. అరె, మంచి మూవీస్‌ మిస్‌ చేసుకున్నానే అని ఫీలయ్యేదాన్ని. వాటిలో యాక్ట్‌ చేసుంటే నేను కూడా ఆ సక్సెస్‌లో భాగమయ్యేదాన్ని అనిపించేది. 

    హీరోకు తల్లిగా..
    ఇకపోతే నాకు బ్రో డాడీ సినిమా ఆఫర్‌ చేసినప్పుడు నా పాత్ర గురించి తెలుసుకోవాలని తహతహలాడాను. తీరా అందులో హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు తల్లిగా చేయాలని చెప్పారు. అది విని నేను షాకయ్యాను. అతడు నాకంటే కేవలం ఆరేళ్లు మాత్రమే చిన్నవాడు.. అలాంటిది అతడికి తల్లిగా నటించడం కష్టమని అభ్యంతరం చెప్పాను.

    మెచ్చుకోవాల్సిందే!
    దాంతో వాళ్లు నాకు నచ్చజెప్పారు. కథ బాగుండేసరికి నేను కూడా చివరకు ఒప్పుకుని చేశాను. సినిమా రిలీజయ్యాక జనం నా పాత్రపై ప్రశంసలు కురిపించారు. మా మధ్య వయసు వ్యత్యాసం తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ విషయంలో పృథ్వీరాజ్‌ను మెచ్చుకుని తీరాల్సిందే! ఎంతో అంకితభావం, నిబద్ధత ఉన్న వ్యక్తి. అందుకే గొప్ప నటుడితో పాటు మంచి దర్శకుడు కూడా అయ్యాడు అని మీనా చెప్పుకొచ్చింది.

    చదవండి: ఆ పాటలకు ఒక్క పైసా ఇవ్వలేదు: బాలీవుడ్‌ సింగర్‌

  • బాడీ షేమింగ్‌కు గురై ఆత్మహత్యలు చేసుకునేవారంతా తన దృష్టిలో మూర్ఖులేనని అన్నారు ప్రముఖ నటి రచితా రామ్‌. రజనీకాంత్‌ ‘కూలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి రచితా రామ్‌. ఆ సినిమాలో మాస్‌ విలన్‌ పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నారు.

    ఆమె నటించిన తాజా కన్నడ చిత్రం ‘కల్ట్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో బాడీ షేమింగ్‌ గురించి రచితా(Rachita Ram ) మాట్లాడారు. చాలా మంది ఆడపిల్లలాగే తాను కూడా బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నానని.. కానీ దాన్ని చాలా తెలివిగా హ్యాండిల్‌ చేశానని చెప్పారు. వాళ్ల కామెంట్స్‌ని పట్టించుకోకుండా..మన పని మనం చేసుకుంటే సరిపోతుందని ఆమె సలహా ఇచ్చారు.

    ‘ప్రతి మహిళ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణంతో బరువు పెరుగుతుంటారు. పీసీఓడీ, ఒత్తిడి వల్ల కొంతమంది లావు అవుతుంటారు. పీరియడ్స్‌కి ముందు, తర్వాత కూడా శరీరంలో మార్పులు వస్తుంటాయి. నిద్ర కూడా మన శరీరంపై ప్రభావం చూపుతుంది. 

    కొంతమందికి ఎనిమిది గంట నిద్ర కచ్చితంగా అవరసరం ఉంటుంది. లేదంటే వాళ్ల బాడీలో మార్పులు వచ్చేస్తుంటాయి. నేను కూడా ఆ లిస్ట్‌లోకి వస్తా. నేను సరిగా నిద్రపోకపోతే.. ఉదయం నా మొఖం చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. కొన్ని గంటల తర్వాత మళ్లీ సన్నబడుతుంది. నాతో పని చేసే దర్శకులు కూడా ఇది గమనించి చెప్పారు. ఇలాంటి సమస్యలు చాలా మంది మహిళలకు ఉంటాయి. ఇవన్నీ బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఇది నా శరీరం.. నా ఇష్టం. ఎందుకు లావు అయ్యామో.. ఎందుకు సన్నబడ్డామో అనే విషయాలను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం గురించి వేరేవాళ్లకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.  అని రచితా చెప్పుకొచ్చారు.

    అలాగే  ఆన్‌లైన్‌లో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోలింగ్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలనేదాని గురించి మాట్లాడుతూ.. ‘    అసలు నెగెటివ్‌ కామెంట్స్‌ని ఎందుకు చూడాలి? ఎందుకు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి? అలాంటి విషయాలను మీరు మైండ్‌లోకి తీసుకోకండి. వాటిని పట్టించుకోకుండా.. మన పని మనం చేసుకుంటేనే  ప్రశాంతంగా ఉంటాం’ అని రచితా రామ్‌ చెప్పుకొచ్చింది. 

  • యాక్టర్సే కాదు సింగర్స్‌ కూడా లక్షల్లో ఏకంగా కోట్లల్లో సంపాదిస్తున్నారు. అయితే అందరి పరిస్థితి అలా లేదంటున్నాడు బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణ బ్యూరా. ఇతడు చక్‌దే ఇండియాలో మౌలా మేరే లేలే మేరీ జాన్‌, ఆషిక్‌ బనాయా ఆప్నేలో ఆప్‌కీ కాశిశ్‌ వంటి పలు సాంగ్స్‌ ఆలపించాడు. తనకు సరైన పారితోషికం ఇవ్వలేదని చెప్తున్నాడు.

    సరైన పారితోషికం లేదు
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్‌ కృష్ణ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో సింగర్స్‌ కోసం ఎటువంటి విధివిధానాలు లేవు. ఆర్టిస్ట్‌కు ఒకరోజుకు ఇంత అని ఎలా ఇస్తారో.. సింగర్‌ను స్టూడియోకు పిలిపించినప్పుడు కనీసం రూ.10 వేలయినా ఇవ్వాలి. కానీ ఇవ్వరు. ఆప్‌ కీ కాశిశ్‌ పాటకు నాకు రూ.10 వేలిచ్చారు. అందులో రూ.900 టీడీఎస్‌ కట్‌ అయింది. చక్‌దే ఇండియాలో ఒక పాట పాడినందుకు మళ్లీ అంతే ఇచ్చారు.

    పైసా రాలే
    రాజ్‌ మూవీలోని సోనియా ఓ సోనియా పాటకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోకో కహా దుండెరే బండె, మేరా ఇంతకం దేకేగి పాటలకు పైసా పారితోషికం ఇవ్వలేదు. నా 23 ఏళ్ల కెరీర్‌లో సినిమా పాటలు పాడి పెద్దగా సంపాదించిందే లేదు. మేము బయట షోలు, కచేరీల ద్వారా బాగా సంపాదిస్తామని ఇక్కడ నిర్మాతలు అనుకుంటారు. 

    డిమాండ్‌ ఉంటేనే
    పోనీ, మొమహమాటం పక్కనపెట్టి డబ్బు అడిగామనుకో.. నెక్స్ట్‌ టైం నీకు పాడే ఛాన్స్‌ ఇవ్వరు. ప్రస్తుతానికైతే పరిస్థితి కొంత మారినట్లు కనిపిస్తోంది. కొందరు పాటకు రూ.5 లక్షలు, రూ.10 లక్షలు తీసుకుంటారు. ఒక్క సాంగ్‌కు రూ.50 లక్షలు, రూ.3 కోట్ల వరకు తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. సింగర్స్‌కు డిమాండ్‌ ఉంటేనే వారు అడిగినంత ఇస్తారు అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: పెళ్లికి పిలిచి అవమానించాలా? అసభ్యంగా ఫోటోలు, వీడియోలు: నటి ఆగ్రహం

  • గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో 'పెంగ్విన్' స్టోరీ ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొన్ని పెంగ్విన్స్ గుంపుగా సముద్రం వైపు వెళ్తుండగా.. ఒకటి మాత్రం ఒంటరిగా మంచు పర్వతాల్లోకి వెళ్తున్న వీడియో ఇది. చాలామంది దీనికి రిలేట్ అవుతున్నారు. తమని తాము ఆ ఒంటరి పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ సింగిల్ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలేమైంది?

    (ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

    పెంగ్విన్ వీడియో.. సాధారణ వైరల్ వీడియో అయితే కాదు. దీని వెనక పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఐదేళ్ల క్రితం తన మ్యూజింగ్స్‌లో ఒంటరి పెంగ్విన్ గురించి చెప్పుకొచ్చాడు. సందర్భం ఏంటో తెలీదు గానీ ఇప్పుడు మరోసారి అది వైరల్ అవుతోంది. అంటార్కిటికాలో పెంగ్విన్స్ అన్నీ నివసిస్తుంటాయి. వీటి జీవన విధానం చాలా సింపుల్. సముద్రంలో ఉంటాయి. లేదంటే కాలనీల్లో ఉంటూ మిగతా పెంగ్విన్స్‌తో కలిసి పిల్లల్ని కంటూ ఉంటాయి. ట్రెండింగ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్ వెనక మాత్రం కళ్లు చెమర్చే కథ ఉందట! మనుషులకే పరిమితమైన ప్రేమ, విరహం, వైరాగ్యం అనే ఎమోషన్స్ మూగజీవుల్లోనూ ఉంటాయని ఈ పెంగ్విన్ స్టోరీ చెప్పకనే చెబుతోంది.

    డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. సాధారణంగా మగ పెంగ్విన్ తన భాగస్వామి పట్ల చాలా నమ్మకంగా ఉంటుంది. ఒకసారి జత కుదిరితే చనిపోయే వరకు ఆ బంధాన్ని వదులుకోదు. ఒకవేళ ఆడ పెంగ్విన్.. ఆ నమ్మకాన్ని వంచిస్తే లేదా బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మగ పెంగ్విన్ ఆ వియోగాన్ని తట్టుకోలేదు. ఈ ఒంటరి పెంగ్విన్ కూడా అలానే బంధం నుంచి దూరమైనట్లు తెలుస్తోంది. అందుకే మిగతా వాటితో కాకుండా ఒంటరిగా పర్వతాల వైపు వెళ్లదలుచుకున్నట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

    ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెంగ్విన్ వీడియో బిట్.. 2007లో ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన 'ఎన్‌కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే డాక్యుమెంటరీలోనిది. పరిశోధకుడు డాక్టర్ ఐన్లీతో కలిసి వెర్నర్.. అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ గుంపుని గమనించినప్పుడు.. ఈ ఒంటరి పెంగ్విన్‌ని చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే..ఈ ఒంటరి పెంగ్విన్ మాత్రం కాసేపు అక్కడే ఆగిపోయింది. వెనక్కి తిరిగి దాదాపు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్న మధ్యభాగం వైపు నడవటం మొదలుపెట్టింది. అది దారితప్పిందేమో అనుకుని తీసుకొచ్చి గుంపులో కలిపినా  తిరిగి పర్వత ప్రాంతాల వైపు వెళ్లింది. దీంతో ఏదో విషయంలో అది మోసపోయిందని, జీవితంలో బాగా విసిపోయిందని.. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రేమలో విఫలమైందని అంటున్నారు.

    సోషల్ మీడియా.. ఈ ఒంటరి జీవికి 'నిహిలిస్ట్ పెంగ్విన్' అని పేరు పెట్టింది. ప్రస్తుతం జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది.. తమని తాము ఈ పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. పోటీతత్వం, బాధ్యతలు, జీవితంలో అలసట వల్ల 'ఇక చాలు' అని విషయాన్ని ఆ పెంగ్విన్ ప్రవర్తన ప్రతిబింబిస్తోందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓ ఒంటరి పెంగ్విన్ వీడియో.. ఇంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషమే!

    (ఇదీ చదవండి: మృణాల్-ధనుష్ పెళ్లి చేసేశారు.. వీడియో వైరల్)

  • తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ప్రేమలో ఉన్నారని.. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్నిరోజుల ముందు షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమని చాలామంది నమ్మేశారు కూడా. కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని స్వయానా మృణాల్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో రిలాక్స్ అవుతారనుకుంటే ఇప్పుడు ఏకంగా ధనుష్-మృణాల్ పెళ్లి చేసేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోతోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

    రీసెంట్ టైంలో ఏఐ(కృత్రిమ మేధ) వినియోగం చాలా పెరిగిపోయింది. తమకు నచ్చిన ఫొటోలు, వీడియోలని యూజర్స్ తయారు చేసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ నెటిజన్.. ఇలానే ధనుష్-మృణాల్ పెళ్లి జరిగినట్లు, ఈ కార్యక్రమానికి తమిళ ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్, అజిత్, త్రిష, అనిరుధ్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరైనట్లు కూడా సృష్టించారు. ఇది ఫేక్ వీడియోనే అయినప్పటికీ యూజర్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుండటం విశేషం.

    ఈ పెళ్లి రూమర్స్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ధనుష్ ఒంటరిగానే ఉంటున్నాడు. రీసెంట్ టైంలో మృణాల్ చేసిన సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ జరిగితే వీటిలో ధనుష్ కనిపించడం, డేటింగ్ రూమర్స్ రావడానికి కారణమైంది. ఈ క్రమంలోనే పెళ్లి గాసిప్స్ కూడా వచ్చాయి. అవి అబద్ధమని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏఐ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.

    (ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)

  • యాక్టర్స్‌ సినిమాలు, సీరియల్స్‌, యాడ్స్‌, షోలతో పాటు బయట ఈవెంట్స్‌ కూడా చేస్తుంటారు. నటి మౌనీ రాయ్‌ కూడా అలాంటి ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఓ ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఆ కార్యక్రమం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందంటోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 

    నడుముపై చేయి వేసిన అంకుల్స్‌
    'కర్నాల్‌లో ఓ ఈవెంట్‌కు వెళ్లాను. అక్కడ ఇద్దరు అంకుల్స్‌ చాలా చెత్తగా ప్రవర్తించారు. వాళ్లకు తాత వయసుంటుంది. నేను స్టేజీపైకి వెళ్తుంటే ఆ అంకుల్స్‌తో పాటు వారి కుటుంబంలోని మగవారు నాతో ఫోటోలు దిగేందుకు ముందుకు వచ్చారు. నా నడుముపై చేయి వేసి ఫోటోలు దిగారు. సర్‌, చేయి తీసేయండి అని వినయంగా చెప్పినా వెగటుగా ప్రవర్తించారు. స్టేజీ ఎక్కాక పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 

    పరిస్థితి మరింత ఘోరం
    ఎదురుగా ఉన్న ఇద్దరు అంకుల్స్‌ చెండాలమైన కామెంట్స్‌ చేస్తూ అసభ్య సంజ్ఞలు చూపించారు. దయచేసి అలా చేయొద్దు అని చెప్పగానే నాపై గులాబీలు విసరడం మొదలుపెట్టారు. అప్పుడు నేను డ్యాన్స్‌ మధ్యలోనే ఆపేసి స్టేజీ దిగి వచ్చేయాలనుకున్నాను. కానీ కోపాన్ని ఆపుకుని నా పర్ఫామెన్స్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత కూడా వాళ్లు అలాగే నీచంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నా ఆ ఫంక్షన్‌ నిర్వాహకులు, కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు వచ్చి వాళ్లను వారించలేదు. కనీసం పక్కకు కూడా తీసుకెళ్లలేదు.

    తలుచుకుంటనే భయంగా
    అవమానంతో చచ్చిపోయా.. మానసిక క్షోభకు లోనయ్యాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిల గురించి తలుచుకుంటనే భయంగా ఉంది. ఇలా నీచంగా ప్రవర్తించేవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. మాకు వచ్చిన కళను నమ్ముకుని మేము బతుకుతున్నాం. వీళ్ల కూతురితోనో, అక్కాచెల్లితోనే వేరేవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకుంటారా? 

    మగవాళ్లమన్న అహంకారమా?
    కొంచెమైనా సిగ్గుండాలి! ఇంకో విషయం.. స్టేజీ కాస్త హైట్‌లో ఉంది. దాంతో ఈ అంకుల్స్‌.. లో యాంగిల్‌లో వీడియోలు తీశారు. కొందరు అది చూసి వీడియోలు షూట్‌ చేయడం ఆపమని చెప్పినందుకు వారిపైనే అరిచారు. ఎందుకంత ధైర్యం? మగవాళ్లమన్న అహంకారమా? ఇలాంటివారిని తిట్టేందుకు తిట్లు కూడా రావడం లేదు. పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని దీవించేందుకు ఈ ప్రోగ్రామ్స్‌కు పిలుస్తారు, రివర్స్‌లో మాకు జరిగేది ఇలాంటి వేధింపులు, అవమానం!' అని మౌనీరాయ్‌ ఆవేదన వ్యక్తం చేసిందిద.

    సీరియల్స్‌, సినిమాలు
    మౌనీరాయ్‌.. క్యూంకీ సాస్‌భీ కబీ బహుతీ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసిన ఈ బ్యూటీ.. జర నచ్‌కే దిఖా 1 సీజన్‌ విన్నర్‌గా నిలిచింది. నాగిని సీరియల్‌తో ఫుల్‌ ఫేమస్‌ అయింది. గోల్డ్‌, మేడ్‌ ఇన్‌ చైనా, బ్రహ్మాస్త్ర, ద భూతిని సినిమాల్లో నటించింది. కేజీఎఫ్‌ 1లో స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమాలో యాక్ట్‌ చేస్తోంది.

    చదవండి: చెట్ల మందులు వాడా.. చాలా గలీజ్‌గా ఫీలయ్యా: శివజ్యోతి

  • బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

    ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్‌తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

  • సినీగేయరచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇటీవల కలకలం రేపింది. తమిళనాడులోని తిరుప్పూర్‌లో కొంగు కళ, సాహిత్య సంస్కృతి మండలి ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకుగానూ తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు రాగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడున్న ఓ మహిళ చెప్పు విసిరింది. 

    తొలి పోస్ట్‌
    అయితే అది వైరముత్తుపై కాకుండా మరోవైపు పడింది. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని తెలిపారు. ఈ ఘటన తర్వాత వైరముత్తు సోషల్‌ మీడియలో తొలిసారి ఓ పోస్ట్‌ పెట్టాడు. తిరుప్పూర్‌లో తను హాజరైన మరో కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేశాడు. రెండువేలమంది విద్యార్థులు ఒక్కచోట చేరి చప్పట్లు కొడుతుంటే తనను తాను మర్చిపోయానన్నాడు.

    గతంలో ఆరోపణలు
    కాగా వైరముత్తు గతంలో మీటూ ఉద్యమ సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. చాలామంది మహిళలతో వైరముత్తు అసభ్యంగా నడుచుకున్నారంటూ సింగర్‌ చిన్మయి శ్రీపాద సంచలన ఆరోపణలు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను వైరముత్తు కొట్టిపారేశాడు.

     

     

    చదవండి: ప్రెగ్నెన్సీ అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్‌ శివజ్యోతి

  • తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై ఓ మహిళ చెప్పు విసిరిన ఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.గత బుధవారం తిరుప్పూర్‌లో జరిగిన  కొంగు కళ, సాహిత్య, సంస్కృతి మండలి ప్రారంభోత్సవానికి వైరముత్తుకి ఆహ్వానం అందింది. ఇందులో పాల్గొనేందుకు వైరముత్తు తిరుప్పూర్‌ కలెక్టరేట్‌కు వచ్చినప్పుడు ఎవరో చెప్పు విసిరారు. అయితే ఆ చెప్పు ఆయనపై కాకుండా మరో వ్యక్తిపై పడింది. 

    వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చెప్పు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోలీవుడ్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. చెప్పు విసిరిన మహిళ పేరు జయ. 45 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళకు మతిస్థిమితం లేదు. కలెక్టర్‌ ఆఫీస్‌తో పాటు కోర్టు దగ్గర కూడా పలుసార్లు ఇలానే చెప్పులు విసిరిందట. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలియజేస్తూ..ఆమెను అరెస్ట్‌ చేసినట్లుగా అధికారికంగా వెల్లడించారు. 

    ఈ ఘటన జరిగిన తర్వాత వైరముత్తు తొలిసారిగా సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా ఆయన తిరుప్పూర్‌ లో విక్టోరియస్ తమిళ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ విద్యార్థులతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ.. ‘రెండు వేల మంది యువకులు ఏకగ్రీవంగా చప్పట్లు కొట్టడం చూసి, నన్ను నేను మర్చిపోయాను’ అంటూ రాసుకొచ్చాడు. చెప్పు విసిరిన ఘటనపై ఆయన స్పందించపోవడం గమనార్హం. అయితే ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం తెలిసి.. వైరముత్తు  ఆ ఘటనను లైట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

    గత కొంతకాలంగా వైరముత్తు వరుస వివాదాలతో వార్తల్లో ఉంటున్నారు. 2018లో, మీటూ ఉద్యమం సమయంలో, గాయని చిన్మయి శ్రీపాద భువన శేషన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే వైరమత్తు మాత్రం ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

     

     

  • సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు పలు కథనాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు.  సోషల్‌మీడియాలో తన పేరుతో పాటు ఫోటోలను ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏఐ సాయంతో పలు వీడియోలు క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని  పేర్కొన్నారు. 

    తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ సాంకేతికతతో క్రియేట్‌ చేసిన కంటెంట్‌ను  వెంటనే తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు.  సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.

    గతంలో ఇలాంటి ఈ అంశంపై పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..  నాగార్జున, ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌, కరణ్‌ జోహార్‌, అనిల్‌ కపూర్‌,  సునీల్‌ గావస్కర్‌ వంటి స్టార్స్‌ ఉన్నారు. అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ సాయంతో 56 నిమిషాల పాటు ఒక వీడియోను క్రియేట్‌ చేసి.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేశారంటూ  పవన్‌ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మూవీ తీసిన వారిని గుర్తించి  వెంటనే శిక్షించాలని కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఫ్యాన్స్‌ ఫిర్యాదు చేశారు.
     

Sports

  • మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైం‍ది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.

    ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్‌, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ స్మృతి మంధాన(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.

    అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్‌(42), కాప్‌(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

  • బులావాయో::  ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. 

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో  135 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నిర్ణయించారు. 

     ఫలితంగా భారత్‌ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్‌ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్‌ లేకుండా పోయింది. 

    భారత బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్‌ ఆయుష్‌(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్‌ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ పతనాన్ని శాసించగా, హెనిల్‌ పటేల్‌ మూడు వికెట్లతో మెరిశాడు.

  • టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ‌పై యువ‌ ఓపెన‌ర్ అభిషేక్ శర్మ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. హిట్‌మాన్ అడుగుజాడ‌ల్లో న‌డుస్తున్నాన‌ని చెప్పాడు. టి20 ప‌వ‌ర్ ప్లేలో రోహిత్ శర్మలా ఆడ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని అన్నాడు. త‌నపై హిట్‌మాన్ ప్ర‌భావం గురించి జియోస్టార్‌తో మాట్లాడుతూ.. "రోహిత్ భాయ్ దేశం కోసం చాలా చేశాడు. పవర్‌ప్లేలో అతడు ఇచ్చే ప్రారంభాల కారణంగా ఎల్లప్పుడూ ఒత్తిడి ఉంటుందని అన్నాడు. రోహిత్ శ‌ర్మ పాత్ర పోషించాల‌ని కోచ్ గౌత‌మ్ గంభీర్ తన‌కు సూచించిన‌ట్టు వెల్ల‌డించాడు.

    గంభీర్‌తో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) ప్రోత్సహంతో తాను రోహిత్ శ‌ర్మ ఫార్ములాను అనుస‌రిస్తున్నాన‌ని అభిషేక్ తెలిపాడు. "నేను జట్టులోకి వచ్చినప్పుడు.. కోచ్, కెప్టెన్ నా నుంచి అదే ఆశించారు. తొలి బంతి నుంచే విరుచుకుప‌డ‌డం నాకు ఇష్టం కాబ‌ట్టి.. అది నా శైలికి కూడా సరిపోతుందని భావించాను. రోహిత్ భాయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. టీమిండియా తరపున ఇలా ఆడుతూ రాణించడం నాకు నిజంగా సంతోషంగా ఉంద''ని అన్నాడు.

    దూకుడుగా ఆడటమే నా పని
    త‌న ఆట‌తీరును మెరుగు ప‌రుచుకోవ‌డానికి నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూ ఉంటాన‌ని అభిషేక్ శ‌ర్మ చెప్పాడు. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడి.. జ‌ట్టు భారీస్కోరుకు బాట‌లు వేయాల‌ని భావిస్తాన‌ని చెప్పాడు. "నేను ఇంకా పూర్తిగా పరిణతి చెందానని చెప్పను, ఎందుకంటే ఎల్లప్పుడూ మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కానీ మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా క్రికెట్ ఆడటమే నా పని అని భావిస్తున్నాను. దీని కోసం చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మంచి ఆరంభం ఇస్తే జట్టు ఆ ఊపును అనుసరించగలదని నాకు తెలుసు. అందుకే జ‌ట్టుకు ఆరంభం ఇవ్వాల‌ని ప్ర‌తిసారి అనుకుంటాన‌''ని ఈ డాషింగ్ ఓపెన‌ర్ పేర్కొన్నాడు.

    వారితో ప్రాక్టీస్ చేస్తా
    టి20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్న‌ద్ధ‌త కోసం మాట్లాడుతూ.. త‌న దూకుడుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తాన‌ని, మ్యాచ్‌లకు ముందు తానెప్పుడూ ఇదే ఫాలో అవుతాన‌ని అన్నాడు. ''నాకు వారం లేదా 10 రోజులు సమయం దొరికినప్పుడు, తదుపరి సిరీస్ లేదా మ్యాచ్‌లలో నేను ఎదుర్కొన‌బోయే బౌలర్లను గుర్తుంచుకుంటాను. వారిలా బౌలింగ్ చేసే వారితో ప్రాక్టీస్ చేస్తాను. కొత్త బంతితో అవుట్-స్వింగర్లు, ఇన్-స్వింగర్లు వేయ‌మ‌ని చెప్పి బ్యాటింగ్ చేస్తుంటాను. టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా భిన్న‌మైన పరిస్థిల్లో వేర్వేరు జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబ‌ట్టి ప్రిప‌రేష‌న్ చాలా ముఖ్య‌మ‌''ని అభిషేక్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

    ప‌వ‌ర్ హిట్టింగ్‌తో హిట్‌
    2024, జూలైలో టి20లో అరంగేట్రం చేసిన అభిషేక్ శ‌ర్మ‌ ప‌వ‌ర్ హిట్టింగ్‌తో త‌న స్థానాన్ని జ‌ట్టులో సుస్థిరం చేసుకున్నాడు. అతి త‌క్కువ కాలంలోనే నంబ‌ర్‌వ‌న్ బ్యాటర్ ఎదిగాడు. ఇప్పటివరకు 34 ఇంట‌ర్నేష‌న‌ల్‌ మ్యాచ్‌లు ఆడి 190.92 స్ట్రైక్ రేట్‌తో 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఫిబ్ర‌వ‌రి 7 నుంచి జ‌రిగే టి20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ త‌న జోరును కొన‌సాగించాల‌ని ఈ ఎడంచేతి వాటం ఓపెన‌ర్ ఉవ్విళ్లూరుతున్నాడు. 

    చ‌ద‌వండి: ప్ర‌ధాని త‌ర్వాత క‌ష్ట‌మైన జాబ్‌.. గంభీర్‌పై ప్ర‌శంస‌లు

  • ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్‌లలో మార్పులపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా శనివారం ధ్రువీకరించారు.

    బోర్డు సంతృప్తితో లేదు
    ‘‘A+ గ్రేడ్‌ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్‌ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్‌లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.

    ఈ గ్రేడ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్‌ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్‌ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.

    రో-కో వన్డేలలో మాత్రమే
    కాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్టులలో బ్యాటింగ్‌ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మలతో పాటు.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్‌ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్‌ అయ్యారు.

    మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్‌గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.

    బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?
    ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్‌ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.

    చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. 

    ప్రస్తుత టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

    అక్కడి నుంచి మొదలు
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్‌ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.

    ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.

    మొండి వైఖరి 
    అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆశ్రయించింది.

    ముందుగా హెచ్చరించినట్లుగానే
    తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.

    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్‌ స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్‌ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. 

    కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, నేపాల్‌, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్‌. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్‌ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. 

    చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్‌ ఆరోపణలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్‌ మనదే’’ అనుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.

    పద్దెనిమిదేళ్లకు
    ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గింది. లీగ్‌ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.

    చేతులు మారనున్న యాజమాన్యం
    ఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్‌ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్‌లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.

    ఆదార్‌ పూనావాలా ఆసక్తి
    ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్‌ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌ ఆదార్‌ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

    ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్‌ కపూర్‌!
    తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది.

    మరోవైపు.. రణ్‌బీర్‌ కపూర్‌ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.  కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్‌ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్‌) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. 

    చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన

  • న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అతడికి విశ్రాంతినిచ్చింది.

    మొత్తంగా రెండు వికెట్లు
    ఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్‌ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్‌ పడగొట్టిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు.

    వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌).. ఆల్‌రౌండర్‌ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టడంతో భారత్‌ 15.2 ఓవర్లలోనే కివీస్‌ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

    మురళీ కార్తిక్‌తో గొడవ?
    ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్‌ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్‌ అతడిని పలకరించాడు.

    ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్‌ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్‌ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్‌ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

    అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్‌ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్‌ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్‌ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

  • టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.

    కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో  227 పరుగులు సాధించాడు.

    ఐదో డబుల్‌ సెంచరీ 
    ఫలితంగా హైదరాబాద్‌తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. 

    ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదో డబుల్‌ సెంచరీ చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్‌ పార్కర్‌ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.

    ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌ విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు క్రెడిట్‌ ఇచ్చాడు.

    ఎలా ఆడాలో చూపించారు
    ‘‘నా కెరీర్‌లో పెద్దగా రివర్స్‌ స్వింగ్‌ షాట్లు ఆడలేదు. అజర్‌ సర్‌ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్‌ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.

    ఇక్కడ (ఉప్పల్‌) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అజర్‌ సర్‌ చెప్పారు. ఇన్‌స్వింగ్‌ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్‌ ఖాన్‌ అజారుద్దీన్‌ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.

    అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌
    ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్‌ సెంచరీ విషయంలో క్రెడిట్‌ మొత్తం సర్ఫరాజ్‌కే దక్కాలి. తను నా ఆఫీస్‌కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు.

    అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్‌ విమర్శించాడు.

    చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

Business

  • బైక్ కొనుగోలుదారుల్లో చాలామంది మైలేజ్ ఎక్కువ ఇచ్చేవాటినే సెలక్ట్ చేసుకుంటారు. అందులోనూ కొంత తక్కువ ధరలో లభిస్తే.. అంతకంటే సంతోషం ఉంటుందా?, కాబట్టి ఈ కథనంలో మన దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే 5 బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.

    హీరో HF డీలక్స్
    హీరో HF డీలక్స్ ప్రారంభ ధర రూ. 56,742 (ఎక్స్-షోరూమ్). ఇది దాదాపు 70 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 97.2 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌.. 7.91 hp పవర్, 8.05 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లైట్ క్లచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్‌లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.

    హీరో స్ప్లెండర్ ప్లస్
    హీరో స్ప్లెండర్ ప్లస్‌ను రూ. 74,152 (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. హీరో మోటోకార్ప్ ఈ కమ్యూటర్ బైక్‌ లీటరుకు దాదాపు 80 కి.మీ మైలేజీని ఇస్తుందని పేర్కొంది. ఇది 7.91 హెచ్‌పి పవర్ అందించే.. 97.2cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్ & ట్యూబ్‌లెస్ టైర్లు మొదలైనవి పొందుతుంది.

    హోండా షైన్
    హోండా షైన్ 100 భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. ఇది 98.98cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.28 hp పవర్, 8.05 Nm టార్క్‌ అందిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 71,959. ఇది డ్యూయెల్ టోన్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇది 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.

    టీవీఎస్ స్పోర్ట్
    టీవీఎస్ స్పోర్ట్ దాని విభాగంలో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో ఒకటిగా ఉంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులోని 109.7 సీసీ ఇంజిన్ మంచి పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 55,500 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్ ఇండికేటర్, 5 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్, లాంగ్ సీట్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు పొందుతుంది.

    బజాజ్ ప్లాటినా
    బజాజ్ ప్లాటినా 100 అధిక మైలేజ్ అందించే కమ్యూటర్ బైకులలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 59,049 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 99.59 సీసీ ఇంజిన్ 8.08 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది లీటరుకు 72 కిమీ మైలేజ్ అందిస్తుంది. ప్లాటినాలో పొడవైన సీటు, సరైన రియర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్ & కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటివి ఉన్నాయి.

    గమనిక: పైన చెప్పుకున్న బైక్స్ ధరలు కేవలం ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే. మీరు ఎంచుకునే మోడల్ లేదా వేరియంట్, కలర్ ఆప్షన్స్ మొదలైనవి ధరల మీద ప్రభావం చూపుతాయి. అంటే ధరలు మారే అవకాశం ఉందన్నమాట. మైలేజ్ విషయంలో కూడా తప్పకుండా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.

  • 2026 ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. అయితే ఈ టైమ్ 1999 నుంచి మారిపోయింది. టైమ్ ఎందుకు మారింది?, దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

    1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించడం ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేది. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం. ఇండియా టైమ్.. యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT (లండన్‌లోని గ్రీన్‌విచ్ వద్ద ఉన్న ప్రైమ్ మెరిడియన్ ఆధారంగా లెక్కించే ప్రపంచ ప్రామాణిక సమయం) ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.

    1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు.

    ఇదీ చదవండి: దేశంలో తొలి బడ్జెట్.. ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లేనా?

    భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.

  • కవాసకి కంపెనీ 2026 నింజా 300 లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.17 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని మునుపటి మోడల్ మెకానికల్స్ కలిగి ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ కలర్ (లైమ్ గ్రీన్ & క్యాండీ లైమ్ గ్రీన్/ఎబోనీ) ఆప్షన్స్ పొందుతుంది.

    కొత్త కవాసకి నింజా 300 కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. అదే 296 సీసీ లిక్విడ్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో కొనసాగుతుంది. ఈ మోటార్ 11,000 rpm వద్ద 39 hp శక్తిని & 10,000 rpm వద్ద 26.1 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొంత వరకు గ్రాఫిక్ డిజైన్ పొందుతుంది.

    2026 మోడల్ అయినప్పటికీ.. కవాసకి నింజా 300 బైక్‌లో పెద్దగా మార్పులు లేవు. ప్రొజెక్టర్లతో కూడిన సవరించిన హెడ్‌ల్యాంప్ సెటప్, పెద్ద విండ్‌షీల్డ్‌తో సహా కొన్ని చిన్న అప్‌డేట్‌లు కనిపిస్తాయి. ఫీచర్ల విషయానికొస్తే, నింజా 300 చాలా సరళమైన మోటార్‌సైకిల్.. ఇది డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ పొందుతుంది.

  • బంగారం ధరలు బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్తోంది. ఉదయం ఒక రేటు కనిపిస్తే.. సాయంత్రానికే ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మొత్తానికి గోల్డ్ రేటు భారీగా పెరిగిపోయింది. ఈ కథనంలో వారం రోజుల్లో (జనవరి 18 నుంచి 24 వరకు) పసిడి ధరలు ఎంత పెరిగాయో వివరంగా తెలుసుకుందాం.

    జనవరి 18న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,43,780 వద్ద ఉండేది. ప్రస్తుతం ఈ రేటు రూ. 160260 వద్దకు చేరింది. అంటే 7 రోజుల్లో (168 గంటల్లో) బంగారం ధర రూ. 16వేలు కంటే ఎక్కువ పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,31,800 వద్ద నుంచి 1,46,900 రూపాయల వద్దకు (రూ. 15వేలు కంటే ఎక్కువ) చేరింది.

    చెన్నైలో కూడా గోల్డ్ రేటు వారం రోజుల్లో భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,44,870 వద్ద నుంచి 1,59,490 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజులో 14620 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఇది 1,32,800 రూపాయల నుంచి రూ. 1,47,500 వద్దకు చేరింది.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

    ఢిల్లీలో జనవరి 18న రూ. 1,43,930 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు ఈ రోజుకు (శనివారం) రూ. 1,60,410 వద్దకు (రూ. 16480 తేడా) చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఇది 131950 రూపాయల నుంచి 147050 రూపాయల వద్దకు చేరింది.

    వెండి ధరలు
    భారతదేశంలో వెండి ధరలు చాలా వేగంగా ఎగబాకాయి. గత ఆదివారం (జనవరి 18) రూ. 3.10 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. శనివారం నాటికి రూ. 3.65 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో వెండి రేటు రూ. 55వేలు పెరిగిందన్న మాట.

  • ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడుకుంటున్న అంశం యూనియన్ బడ్జెట్ 2026. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే చాలామందికి ఈ బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది? దాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? అనే విషయాలు తెలిసి ఉండవు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    1860లో మొదటి బడ్జెట్
    1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' ఏప్రిల్ 7న తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది బ్రిటీష్ వాళ్లే అన్నమాట. అయితే ఈ బడ్జెట్ వలస పాలకుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లకు అప్పటి బడ్జెట్ పూర్తిగా భిన్నంగా ఉండేది.

    స్వాతంత్య్రం వచ్చిన తరువాత
    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్‌.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాదు. 1948 ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉండటంతో, ఈ బడ్జెట్‌ను ఒక మధ్యంతర బడ్జెట్‌గా ప్రవేశపెట్టారు.

    వీటికే ప్రాధాన్యత
    తొలి బడ్జెట్‌లో అభివృద్ధి కంటే పరిపాలన, భద్రత, పునరావాసం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం

    తొలి బడ్జెట్‌లో ఒక విశేష అంశం ఉంది. అదేమిటంటే.. భారత్‌, పాకిస్తాన్ రెండూ 1948 సెప్టెంబర్ వరకు ఒకే కరెన్సీని ఉపయోగిస్తాయి అని ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇండియా, పాక్ విభజన జరిగినప్పటికీ.. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా విడిపోలేదు. అయితే ఆర్థికంగా విడిపోవడం ఒక దశలవారీ ప్రక్రియగా కొనసాగిందన్నమాట.

    నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌
    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు.  వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.

    ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

  • రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైనప్పటికీ.. చాలా వినమ్రంగా ఉంటారు. చాలా సందర్భాల్లో వ్యక్తులను గౌరవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కొరియన్ - అమెరికన్ వ్యాపారవేత్త 'వారెన్ చాంగ్' ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన తరువాత అనుభవాన్ని పంచుకున్నారు.

    ముఖేష్ అంబానీ & అతని కుటుంబ సభ్యులను కలిసిన ఫోటోను వారెన్ చాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన వ్యక్తులు & కుటుంబం. నాకు చాలా గౌరవంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అంబానీ ఫ్యామిలీని ప్రశంసించారు.

    ఎవరీ వారెన్ చాంగ్?
    కొరియన్-అమెరికన్ వ్యాపారవేత్త అయిన వారెన్ చాంగ్ దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఈయన కంపెనీ నిర్వహించడంతో పాటు.. లెగో మినీఫిగర్‌లను (చిన్న బొమ్మలు) సేకరిస్తూ ఉంటారు. అంతే కాకుండా.. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వంటి ప్రముఖులను, క్రీడా ప్రముఖులను, రాజకీయ నాయకులు & రాజకుటుంబ సభ్యులను కలిసిన చిత్రాలు చూడవచ్చు.

  • భారతదేశంలోని అతి పెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్ సైకిల్ ధరలు పెంచింది. వేరియంట్‌ను బట్టి ధరలు రూ. 250 నుంచి రూ. 750 వరకు పెరిగాయి. ఇందులో హీరో HF 100 , హీరో HF డీలక్స్ & హీరో ప్యాషన్ ప్లస్ మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే బజాజ్ ఆటో కూడా తన బైక్ ధరలను పెంచింది.

    ముడి సరుకుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల బైక్ ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి. ధరల పెరుగుదల తరువాత హీరో HF100 రేటు రూ. 58,739 నుంచి 59,489 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్దకు చేరింది. హీరో HF డీలక్స్ ధరలు 56,742 రూపాయల నుంచి రూ. 69,235 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్.. భారతదేశంలో హీరో HF 100, హీరో HF డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్ మొదలైన మోడల్స్ విక్రయిస్తోంది. ఇవి మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిస్తో ఉండటంతో పాటు.. మంచి మైలేజ్ కూడా అందిస్తున్నాయి. ఈ కారణంగానే వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి..

  • వెండి ధరలు రోజుకో రికార్డ్‌ కొడుతూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ సిల్వర్‌ 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. వెండి ధరలపై నిరంతరం పోస్టులు పెడుతూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి అంతకు ముందే వెండి ధర 100 డాలర్లకు చేరువ కాగానే ఆనందంతో పోస్టు పెట్టారు.

    ‘వెండి 100 డాలర్లు (ఔన్స్‌కు) దాటుతోంది.. యేయ్‌’ అంటూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, ఫియాట్ కరెన్సీలపై నమ్మకం తగ్గడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి హార్డ్ అసెట్లకు కియోసాకి ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నారు.

    ఒకవైపు విలువైన లోహంగా, మరోవైపు పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం కావడం వల్ల వెండికి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో వినియోగం వెండి భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. అయితే, విశ్లేషకులు వెండి ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతాయని, ఇది అత్యంత అస్థిరమైన లోహాల్లో ఒకటని హెచ్చరిస్తున్నారు.

    అయితే ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని తన ఇంతకు ముందు పోస్ట్‌లో కియోసాకి తెలిపారు.
     

  • తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్  కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట​్‌ఫోన్‌ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్‌) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం..  యూజ్డ్‌ స్మార్ట్‌ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.

    ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్‌తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్‌మెంట్ ఖరారు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.

    మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్‌ చేపట్టారు. తాజా అప్‌డేట్‌లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్‌సెట్లు ఉన్నాయి.

    శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.

    2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు‌ 2024తో పోలిస్తే యూజ్డ్‌ స్మార్ట్‌ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్‌ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్‌లో పాత స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

National

  • ‘ఇరాన్‌ వైపు అమెరికా బలగాలు.. ఇక యుద్ధమే తరువాయి.. ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణమే ఇరాన్‌పై అమెరికా విజృంబించడం ఖాయం..’ ఇవే మనకు గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న వార్తలు. అమెరికా వెనక్కి తగ్గిందనేది కాసేపు..  అంతలోనే ఇరాన్‌ కాళ్ల బేరానికి వచ్చిందనేది మరొకవైపు. ఏది ఏమైనా తమది వెనక్కి  తగ్గే మనస్తత్వం కాదని అంటోంది ఇరాన్‌. అవసరమైతే ఎందాకైనా పోరాడతామని స్సష్టం చేసింది. తమకు యుద్ధాలు కొత్త కాదని, వాటికి భయపడటం అనేది తమ రక్తంలోనే లేదని భారత్‌లోని ఇరాన్‌ కాన్సుల్‌ జనరల్‌ సయ్యద రెజా మొసాయెబ్‌ మోత్లాఘ్‌ స్పష్టం చేశారు. 

    ముంబైలో ఇరాన్ కాన్సులేట్‌ ప్రతినిధిగా పనిచేస్తున్న ఆయన.. ఇరాన్‌ నైజం ఎంత  స్ట్రాంగ్‌గా ఉంటుందో వివరించే యత్నం చేశారు. ఇటీవల ఇజ్రాయిల్‌తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధాన్ని, అంతకుముందు తాము ఎదుర్కొన్న యుద్ధ పరిస్థితులను వివరించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన..  ఏ సమయంలోనూ తాము ధైర్యం కోల్పోలేదన్నారు. తాము ఎవరో భయపెడితే భయపడిపోయే తత్వం కాదన్నారు. 

    ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ కూడా దేనికి భయపడరన్నారు. ఖమేనీ బంకర్‌లో దాక్కున్నారని వస్తున్న వార్తలను  ఖండించారు. బంకర్‌లో దాక్కొనేంత పిరికి నేత ఖమేనీ కాదన్నారు. దేనికైనా తమ దేశం సిద్ధంగా ఉంటుందన్నారు.  ఇక భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆంక్షల  బెదిరింపులు ఉన్నప్పటికీ భారత్‌తో సంబంధాలు యధావిధిగా కొనసాగించేందుకు యత్నిస్తున్నామన్నారు.

  • తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలని నివారించడమే లక్షంగా కేంద్ర మోటారు వాహన చట్టాన్ని మరింత కఠినతరం చేయనున్నట్లు ప్రకటించింది. ఒక వ్యక్తిపై  సంవత్సరంలో ఐదు కంటే ఎక్కువ సార్లు చలాన్లు ఉంటే అతని లైసెన్సును రద్దు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

    రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా కేరళ ప్రభుత్వం వాహన చట్టంలో కీలక మార్పులు చేసింది. వాహనానికి చలాన్లు పడ్డ 45 రోజుల్లోపు వాటిని చెల్లించకుంటే సదరు వాహనాలను జప్తు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. వెహికిల్‌పై చలాన్ పడ్డ సమయంలో దానిని వేరే వారు నడుపుతున్నట్లయితే దానిని నిరూపించాల్సిన బాధ్యత సదరు వాహన యజమానిపై ఉంటుందని తెలిపింది.

    వెహికిల్‌కు సంబంధించిన పెండింగ్‌ చలాన్లు చెల్లించాలు పరివాహన్ అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చెల్లించాలని తెలిపింది. అదేవిధంగా పెండింగ్ చలాన్లపై ఎవైనా ఫిర్యాదులుంటే సదరు వాహనదారుడు కోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది.

  • ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు అరుదైన  ఆపరేషన్‌ను విజవంతంగా ముగించారు. 43 ఏళ్ల పెద్దప్రేగు క్యాన్సర్ రోగి కడుపునుంచి ఏకంగా 19.9 కిలోల కణితిని తొలగించారు. మల్టీ  ఆమెకు  కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు విజయవంతమైన శస్త్రచికిత్సను ఎయిమ్స్‌ ప్రకటించింది.

    పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన మున్మున్‌ను జూలై 2024లో ఉదర ఉబ్బరం (సాధారణం కంటే పెద్ద బొడ్డు)తో ఆసుపత్రికి తరలించారు.  పాతికేళ్ల క్రితం, యూనిలేటర్‌  సాల్పింగో-ఊఫొరెక్టమీ (ఒక ఓవరీ, ఒక ఫెలోపియన్ ట్యూబ్‌ను) తొలగించారు.

    అలాగే స్టేజ్-4 పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.  పెల్విక్ ప్రాబల్యం ఉంది.  అనేక ఆసుపత్రులను తిరిగి,  పలు రౌండ్ల  కీమోథెరపీ చేయించుకుంది.  అయినా ఎలాంటి ఫలితం లేదు పైగా  వ్యాధి పెరుగుతూనే ఉంది. కణితి అనేక ఉదర అవయవాలకు వ్యాపిస్తుండటంతో. 3-4 నెలలు ఎక్కువ బతకదని వైద్యులు అంచనా వేశారు.  

    అయితు ఎయిమ్స్ ఢిల్లీలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ ఎం.డి. రే నేతృత్వంలోని వైద్యుల బృందం జనవరి 12న విజయవంతంగా సైటోరేడక్టివ్ సర్జరీని నిర్వహించి, 19.9 కిలోల కణితిని తొలగించారు.  జనవరి 15న శస్త్రచికిత్సతో పాటు HIPECని పూర్తి చేసి, ఆంకోసర్జికల్ నిర్వహణను పూర్తి చేసింది. ప్రస్తుతం ఆస్పత్తి డిశ్చార్జ్‌ అయ్యింది కోలుకుంటోంది. 

    CT మరియు PET-CT స్కాన్‌ల ఆధారంగా, అంత పెద్ద కణితి ఆపరేషన్‌ ఒకేసారి  చేస్తే రోగి తట్టుకోవడం కష్టమని భావించిన  వైద్యులు రెండు దఫాలుగా దీన్ని పూర్తిచేశారు. పొట్టలోని కొన్ని భాగాలను అంటే. ట్రాన్స్‌వర్స్ పెద్దప్రేగులో మూడింట రెండు వంతులు, సిగ్మోయిడ్ పెద్దప్రేగు, ఓమెంటం, గర్భాశయం ,  రెండు ఫెలోపియన్  ట్యూబ్స్‌, కాలేయం   కాప్యూల్‌, పెరిటోనియంను తొలగించామని డాక్టర్ రే చెప్పారు.

    ఇదీ చదవండి: ఫైబర్‌ ఎక్కువ తీసుకుంటే, ఏమవుతుందో తెలుసా

    సాధారణంగా కీమోథెరపీలా కాకుండా,  హైపర్‌థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీలో -- కణితిని పూర్తిగా తొలగించిన తర్వాత,  హీటెడ్‌  కీమోథెరపీ (41–43 డిగ్రీల సెల్సియస్)ని నేరుగా ఉదర కుహరంలోకి పంపించండం ద్వారా చికిత్స అందించారు. కణితులన్నీ తొలగించబడ్డాయని నిర్ధారించుకున్నాక, కంటికి కనిపించని సూక్ష్మ వ్యాధిని నిర్మూలించడానికి గంటన్నర పాటు HIPEC చికిత్స అందించారు.మొదటి శస్త్రచికిత్స జనవరి 12న, రెండోదిజనవరి 15న జరిగింది,   ఐదు రోజులకు జనవరి 20న డిశ్చార్జ్ చేశామని డాక్టర్ చెప్పారు.శస్త్రచికిత్స తర్వాత, కణితులు లేకుండా కాలేయం,ప్రేగులు స్పష్టంగా కనిపించాయన్నారు.

    కొన్ని కోలన్‌ క్యాన్సర్ కేసులను నయం చేయవచ్చు
    పెద్దప్రేగు క్యాన్సర్ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పనటికీ కొన్ని కేసుల్లో నయం చేయ వచ్చ న్నారు. ఇప్పటికీ నయం చేయగలదని రే వివరించారు. నిపుణులైన సర్జన్ల సలహా లేకుండా మెటాస్టాటిక్ పెద్దప్రేగు క్యాన్సర్‌కు  చికిత్స లేదని ప్రకటించకూడదని కూడా ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే, కానీ రిస్క్‌ అంటున్న మస్క్‌
     

  • చక్కెర లేని తీపిని ఆస్వాదించేందుకు, కేలరీలను తగ్గించుకునేందుకు కృత్రిమ తీపి పదార్థాలు  ఒక పరిష్కారంగా మార్కెట్‌లోకి ప్రవేశించాయి. కాలక్రమేణా ఇవి డైట్ సోడాలు, షుగర్-ఫ్రీ స్నాక్స్, దైనందిన ఆహారాలలో భాగంగా మారిపోయాయి. ఎఫ్‌డీఏ (ఎఫ్‌డీఏ), ఈఎఫ్‌ఎస్‌ఏ (ఈఎఫ్‌ఎస్‌ఏ) తదితర నియంత్రణ సంస్థలు వీటిని పరిమితి మేరకు వాడితే సురక్షితమే అని చెబుతున్నప్పటికీ, తాజా అధ్యయనాలు మాత్రం దీర్ఘకాలిక వినియోగంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

    ఈ అంశంపై బెంగళూరు ఆస్టర్ వైట్‌ఫీల్డ్‌కు చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర బి.ఎస్. ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. ఈ స్వీటెనర్లు అందరికీ పూర్తిగా హానికరం కానప్పటికీ, చాలామంది అనుకుంటున్నంత సురక్షితం కూడా కాదన్నారు. వీటి వాడకంతో వచ్చే క్యాన్సర్ ముప్పు గురించి  ఆయన మాట్లాడుతూ తాజా పరిశోధన ఫలితాలను సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. ఆర్టిఫిషియల్‌ షుగర్‌లోని ఆస్పర్టేమ్ అనే పదార్థాన్ని ఐఏఆర్‌సి (ఐఏఆర్‌సీ)‘క్యాన్సర్ కారకం కావచ్చు’ అని వర్గీకరించింది. దీని అర్థం అది కచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుందని కాదు, కానీ దానిపై మరింత లోతైన పరిశోధన అవసరమని  ఆయన తెలిపారు.

    ఇక బరువు తగ్గే విషయంపై ఆయన మాట్లాడుతూ, చక్కెరతో పోలిస్తే ఇవి కేలరీలను తగ్గించడంలో కొంత మేలు చేస్తాయని, అయితే అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కేవలం స్వీటెనర్లను వాడటం వల్ల బరువు సమస్యలు మాయం కావని స్పష్టం చేశారు. ఫలితాలనేవి వ్యక్తిని బట్టి మారుతుంటాయని  అన్నారు. ఈ స్వీటెనర్ల ప్రభావం కేవలం బరువుకే పరిమితం కాదు. సుక్రలోజ్, సాకరిన్ వంటి కొన్ని స్వీటెనర్లు పేగులలోని మంచి బ్యాక్టీరియా, ఇన్సులిన్ పనితీరు, గ్లూకోజ్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జంతువులు, మనుషులపై చేసిన కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని డాక్టర్ నరేంద్ర పేర్కొన్నారు.

    వృద్ధులలో తక్కువ లేదా జీరో-కేలరీ స్వీటెనర్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగంగా మందగించే అవకాశం ఉందని కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయని నరేంద్ర తెలిపారు. గర్భిణులు, చిన్న పిల్లలు, జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ స్వీటెనర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వైద్య సలహాలు తీసుకోవాలని డాక్టర్ నరేంద్ర సూచించారు. రోజువారీ వినియోగం సురక్షిత పరిమితుల్లో ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెప్పలేమన్నారు. కేవలం రుచి కోసం వీటిపై ఆధారపడకుండా పండ్లు, పెరుగు వంటి సహజసిద్ధమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. 

    ఇది కూడా చదవండి: ‘తగ్గేదే లే..’.. అదే మాటపై శశి థరూర్ 

  • అనుకున్నది సాధించేందుకు,అద్భుతాల సృష్టించేందుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు లేటు వయసు సిటిజన్లు. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వినోద్ కుమార్ శర్మ  తొలి వ్లాగ్‌లొ అద్భుతమైన వ్యూస్‌ సాధించి వార్తల్లో నిలిచాడు.  ఏదో సరదాగా చేసిన వ్లాగ​ కేవలం 72 గంటల్లోనే 3 కోట్ల వ్యూస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.  సంకల్ప ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపిస్తున్న మరో 70  ఏళ్ళ మహిళ ప్రస్తుతం నెట్టింట సందడిగా మారారు.

    ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం, సంగ్వాన్ 68 సంవత్సరాల వయసులో వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆమె ఆర్థరైటిస్ పేషెంట్ , ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్. రోష్ని దేవి సంగ్వాన్ (70) ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ తన బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ.. ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె దృఢ సంకల్పం సోషల్ మీడియా వినియోగదారులను మాత్రమే కాకుండా నటుడు సునీల్ శెట్టితో సహా ప్రముఖులను కూడా ప్రేరణగా నిలిచింది.

    ఇదీ చదవండి: పెప్సికో ఇండియా కీలక బాధ్యతల్లో సవితా బాలచంద్రన్‌
    ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయిన రోష్ణి దేవి సంగ్వాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొత్త వీడియో  14 మిలియన్లకు పైగా వ్యూస్‌తో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో సన్నీ డియోల్, అహాన్ శెట్టి , వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన కొత్త చిత్రం బోర్డర్ 2 మూవీలోని ఘర్ కబ్ ఆవోగే పాటకు సెట్  చేశారు. సునీల్ శెట్టి , సన్నీ డియోల్ ఈ రీల్‌పై వ్యాఖ్యానిస్తే, 40  ఏళ్ల తరువాత  సినిమా హాల్‌లో  బోర్డర్ 2  సినిమా చూస్తుంది అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్‌ కావడం విశేషం.  దీంతో  "మీరు చాలా స్ఫూర్తి మంతులు. జై హింద్ జై భారత్," సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు.  చాలా బావుంది మేడమ్‌ అంటూ ఆయన కుమారుడు అహన్ శెట్టి కూడా స్పందించారు.

    కాగా రోష్ణి దేవి సంగ్వాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 116 వేలకు పైగా అనుచరులను కలిగి ఉన్నారు. సంగ్వాన్ 103 కిలోల బరువును డెడ్‌లిఫ్టింగ్ చేయడం గమనార్హం. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నఆమె, జీవనశైలిలో మార్పులు, కష్టమైనవ్యాయామం సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ,  శరీరం చెప్పినట్టుగా విని  కాలక్రమేణా తన బలాన్ని తిరిగి పొందగలిగినట్టు చెప్పారు.
     

  • కోజికోడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిని పార్లమెంటులో  ఏనాడూ ఉల్లంఘించలేదని, అయితే ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించానని  శశి థరూర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఆ ఒక్క విషయంలో మాత్రమే పార్టీతో బహిరంగంగా విభేదించాల్సి వచ్చిందని, దానికి తాను ఏమాత్రం విచారించడం లేదని థరూర్ తేల్చిచెప్పారు.

    శనివారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడిన శశి థరూర్, పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు. పార్లమెంటులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు, విధానాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తాను భిన్నమైన వైఖరిని అవలంబించినట్లు అంగీకరించారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను తీసుకున్న కఠినమైన వైఖరికి కట్టుబడి ఉన్నానని, దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధరూర్‌ తేల్చి చెప్పారు.

    పహల్గామ్ ఘటన తర్వాత తాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కాలమ్‌ను థరూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ పరిమిత సైనిక చర్య చేపట్టాలని తాను ఆనాడే సూచించానన్నారు. భారత్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న దేశమని, పాకిస్తాన్‌తో సుదీర్ఘ యుద్ధానికి దిగకుండానే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని తాను భావించానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాను సూచించిన తరహాలోనే చర్యలు తీసుకుందని, ఈ విషయంలో తన వైఖరి సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలపైన కూడా థరూర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని అన్నారు. తాను హాజరుకాలేనని పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చానని, ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చిస్తానన్నారు. మరోవైపు కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, థరూర్ గైర్హాజరును వివాదంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.  

    ఇది కూడా చదవండి: ముంబై మేయర్‌ ఎన్నికపై మరింత ఉత్కంఠ

  • ఎఫ్.ఎమ్.సి.జి (FMCG) దిగ్గజం  పెప్సికో సవిత బాలచంద్రన్‌ను భారతదేశం మరియు దక్షిణాసియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.  పెప్సికో నుంచి కౌశిక్ మిత్రా పదవీవిరమణ చేస్తున్న నేపథ్యంలో పెప్సికో ఈ కీలక నియామకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి బాధ్యతలు చేపడతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనాన్స్ స్ట్రాటజీ (ఆర్థిక వ్యూహం), గవర్నెన్స్ , పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్‌ను ఆమె పర్యవేక్షిస్తారు.

    బాలచంద్రన్ నియామకాన్ని స్వాగతిస్తూ, ఇండియా & సౌత్ ఆసియాలో కంపెనీ తన తదుపరి దశ వృద్ధిని వేగవంతం చేస్తున్నందున ఆర్థిక, వ్యూహం మరియు విలువ సృష్టిలో ఆమె నైపుణ్యం చాలా కీలకమని పెప్సికో తెలిపింది.  పెప్సికో ఇండియా & సౌత్ ఆసియా CFOగా నియమితులైన సంగతిని లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా ప్రకటించిన   సవితా బాలచంద్రన్ తన  కరియర్‌లో ఇదొక ఉత్సాహకరమైన  కొత్త అధ్యాయానికి నాందిగా అభివర్ణించారు.

    ఎవరీ సవితా బాలచంద్రన్
    దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞురాలైన ఫైనాన్స్ ప్రొఫెషనల్. పెప్సికోలో చేరడానికి ముందు,  ఐదేళ్లకు పైగా టాటా టెక్నాలజీస్‌లో సీఎఫ్‌వోగా పనిచేశారు. ఆర్థిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడానికి బాధ్యత వహించారు.టాటా టెక్నాలజీస్‌లో CFOగా ఎంపిక కావడానికి ముందు ఆమె టాటా మోటార్స్‌లో సీనియర్ ఫైనాన్స్ పాత్రలను నిర్వహించారు.

    అంతకుమందు ఆమె టాటా మోటార్స్‌లో 18 సంవత్సరాలకు పైగా పనిచేశారు, ఫైనాన్స్, కార్పొరేట్ వ్యూహం మరియు వ్యాపార కార్యకలాపాలలో సీనియర్ నాయకత్వ పాత్రలను నిర్వహించారు. టాటా గ్రూప్‌లో ,సుదీర్ఘ పదవీకాలం ప్రపంచ మార్కెట్లు, తయారీ ఆధారిత వ్యాపారాలు మరియు పరివర్తన-ఆధారిత వృద్ధి అంశాలో లోతైన అవగాహన  ఆమె సొంతం.

    బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పూణేలోని Symbiosis (SCMHRD) నుండి ఫైనాన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (MBA) పొందారు.  అలాగే అమెరికా కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుండి Fulbright-CII Fellowship కూడా పొందారు.

     

  • ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. జనవరి 31న జరగాల్సిన ఈ ఎన్నిక, గ్రూప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీజేపీ - ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు తమ కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడంలో విఫలం కావడంతోనే ఈ ఆకస్మిక వాయిదా అని సమాచారం. రిజర్వేషన్లు ఖరారైనప్పటికీ, ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ కార్యదర్శికి సమర్పించడంలో జాప్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయింది.

    మేయర్‌ ఎన్నిక కోసం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) తమ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తమ 65 మంది కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను శరవేగంగా పూర్తి చేసి, అధికార కూటమి కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. మరోవైపు, బీజేపీ, షిండే వర్గం ఉమ్మడి గ్రూపుగా ఏర్పడతాయా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

    ఈ అనిశ్చితి 227 మంది సభ్యులున్న సభలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూ. 60,000 కోట్ల బడ్జెట్ కలిగిన బీఎంసీపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరులో ప్రతి నిమిషం కీలకంగా మారింది. ఎన్నికల వేడి ఇలా ఉంటే ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి బాలసాహెబ్ థాకరే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ‘శివసేన కేవలం ఒక పార్టీ కాదని, అదొక సిద్ధాంతమని, ముంబై మట్టి బిడ్డల ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. శివసేనను అంతం చేయాలని బీజేపీ కలలు కంటోందని, కానీ అది అసాధ్యం. అణగారిన వర్గాల గుండెల్లో రగిలే జ్వాల శివసేన. ఆ జ్వాలను ఆర్పడం ఎవరివల్లా కాదు’ అని అన్నారు.

    ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన కూటమి (మహాయుతి) ఘన విజయం సాధించి, బీఎంసీపై పట్టు సాధించింది. 227 సీట్లలో మెజారిటీకి కావాల్సిన 114 సీట్లను దాటి, ఈ కూటమి 118 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, షిండే సేన 29 సీట్లు గెలుచుకుంది. దీంతో బీఎంసీపై మూడు దశాబ్దాల పాటు సాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది.
     

  • న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నేడు (శనివారం) జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా ఎంపికైన దాదాపు 61 వేల మంది యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేశారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ నియామక పత్రం కేవలం ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదు.. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఒక ఆహ్వానం. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) కలను సాకారం చేయడానికి, దేశ ప్రగతిని వేగవంతం చేయడానికి ఇది ఒక సంకల్ప పత్రం వంటిది’ అని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
     

    కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా రక్షణ రంగంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు పంపిణీ చేసిన నియామక పత్రాల్లో 49,200 హోం మంత్రిత్వ శాఖ, పారామిలటరీ దళాలకు సంబంధించినవే కావడం విశేషం. మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. సరిహద్దుల్లోని జీరో లైన్ వద్ద బీఎస్‌ఎఫ్ మహిళా దళాలు పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే జనవరి 26న కర్తవ్య పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో సీఆర్‌పీఎఫ్ పురుషుల దళాలకు ఒక మహిళా అసిస్టెంట్ కమాండెంట్ నాయకత్వం వహించనున్నారు’ అని ప్రధాని మోదీ  ప్రకటించారు.

    భారత ప్రభుత్వం అనేక దేశాలతో వాణిజ్య  ఒప్పందాలు  కుదుర్చుకుంటోందని, దీనివల్ల భారతీయ యువతకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. జనవరి 24వ తేదీకి  ప్రత్యేక చారిత్రక ప్రాముఖ్యత ఉందని మోదీ గుర్తుచేశారు. సరిగ్గా 76 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగ సభ ‘జనగణమన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ఆమోదించింది. ఈ పవిత్రమైన రోజున నియామక పత్రాలు అందుకోవడం రాజ్యాంగం పట్ల బాధ్యతను మరింత పెంచుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Politics

  • నగరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత ఆర్‌కే రోజా మరోసారి ధ్వజమెత్తారు. భూముల  రీసర్వే అంశానికి సంబంధించి  ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదేమిటో అంటూ నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేనే ఇప్పుడు మీరు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఆనాడు తమపై విషం చిమ్మి.. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు కదా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.  ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ)  చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్‌కే రోజా.. చంద్రబాబు పాలనంతా ఎగనామాలు, కోతలే అంటూ విమర్శించారు.

    ‘పాస్‌బుక్‌లపై మీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నారు.  మీ పాలనంతా ఎగనామాలు.. కోతలుగానే ఉంది. 51 లక్షల మంది మహిళలకు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ఎగనామం పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. సిగ్గులేకుండా సూపర్‌-సూపర్‌హిట్‌ అని ప్రచారం చేసుకోవడం నిజంగా సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. 

    RK Roja : మరుగుదొడ్లపై ఫోటోలు వేసుకునే మీరా జగన్ గురించి మాట్లాడేది
  • విశాఖ:  ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా జరగడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములు విశాఖలో ఉండగా ఆ ప్రాంతానికి చెందిన 57 ఎకరాల అత్యంత విలువైన భూములను ఉర్సా కంపెనీకి ప్రభుత్వం దారదత్తం చేసిందన్నారు. ఎన్నికల ముందు భూములు కాపాడతామని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు.  

    శనివారం ఆయన విశాఖ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రూ. 5వేల కోట్ల విలువైన భూమి అక్కడి గీతం సంస్థ ఆధీనంలో ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అత్యంత విలువైన భూములు కట్టబెట్టడం ఏంటని దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూములను అన్యక్రాంతంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం న్యాయం కాదని అందుకే దీని కోసం వైస్సార్సీపీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టిన వెనక్కితగ్గేది లేదని  మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు.

    54 ఎకరాలు ఖరీదైన భూమి అప్పనంగా గీతం సంస్థలకు...విశాఖ ప్రజలు మేలుకోకపోతే
  • సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయన్నారు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

    మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారు. చంద్రబాబు పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లుగా ఉంది. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావటం తప్ప చంద్రబాబు సాధించింది శూన్యం. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ట్రంప్‌తో ఫోటో కోసం చంద్రబాబు ప్రయత్నించారని సమాచారం. డబ్బా కొట్టుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అందరినీ ట్రంప్ భయపెడితే.. చంద్రబాబుతో ఫోటో దిగేందుకు ట్రంప్ భయపడ్డారట!

    ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను రెడ్‌బుక్ ద్వారా నాశనం చేశారు. రెడ్‌బుక్ అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు. ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ భజన చేస్తున్నాయి. దావోస్ నుంచి జీరోల్లా తిరిగి వచ్చామని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించాలి. 99 పైసలకు చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు ఇచ్చుకోవాలి. చంద్రబాబు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. చంద్రబాబు అబద్దాలు చెప్పడం మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టింది. చంద్రబాబుకు బ్రాండ్‌ లేదు. సోషల్‌ మీడియాలో లైక్‌, కామెంట్‌ చేస్తే ప్రభుత్వం సహించలేకపోతుంది. రెడ్‌బుక్‌లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయి. కూటమి పాలనలో పోలీసు శాఖ నిర్వీర్యం అయింది అని ఘాటు విమర్శలు చేశారు. 

    లోకేష్ ఎవరు నువ్వు? రెడ్ బుక్ లో జనసేన నేతలు ఏకిపారేసిన శైలజానాథ్
     

Telangana

  • సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పర్యటన వాయిగా వేసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్  సూచించారు. అగ్నిప్రమాదంతో పాటు శనివారం కావడంతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.  

    దాంతో  అగ్ని ప్రమాదం జరిగిన చోట రెస్కూ చేయడం కష్టంగా మారింది.  దాంతో పోలీసులు  ఎవరూ ఎగ్జిబిషన్‌ సందర్శించే వారు తమ  ప  ర్యటనను వాయిదా వేసుకోవాలని నగరవాసులకు విజ‍్క్షప్తి చేశారు. 

    కాగా, నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు.

    ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది రోబో ఫైర్‌ మిషన్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు.

  • సాక్షి భువనగిరి: ఈ రోజుల్లో వివాహనికి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లలో తమ తాహతుని చూపించాలని అరాటపడుతూ రూ. లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. అదే కెరీర్‌లో బాగా సెటిలైన వారయితే  ఆ మ్యారేజ్ హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే దేశంలోనే ఎంతో పేరొందిన సివిల్స్ సర్వీస్‌కు ఎంపికైన  అధికారుల జంట సాదాసీదాగా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

    చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఈ ఆదర్శ వివాహనికి అధికారులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వధువు శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉండగా, వరుడు శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు.

  • హైదరాబాద్‌: సింగరేణి ఫైల్స్‌ తారుమారయ్యే చాన్స్‌  ఉందన్నారు కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌,. సింగరేణలో కొంతమంది అధికారులు బీఆర్‌ఎస్‌ కంట్రోల్‌లో ఉన్నారని, సింగరేణికి సంబంధించిన ఫైల్స్‌ను వెంటనే సీజ్‌ చేయాలన్నారు. సింగరేణి విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తోడు దొంగలు మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

    ‘రెండు పార్టీలు సింగరేణిని  ఏటీఎమ్‌గా మార్చుకున్నాయి.  అధికారిని బదిలీ చేయాలని కోరినా అప్పటి ముఖ్యమంత్రి చేయలేదు. సింగరేణి వల్ల పాలకులకు, కాంట్రాక్టర్లకు లాభం జరుగుతోంది. సింగరేణికి మాత్రం నష్టం జరుగుతుంది.  సింగరేణిలో కేసిఆర్ ఫ్యామిలీ అంతా దోచుకుంది.  సింగరేణి కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్లు ఉంది.  

    కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలను కార్మికులు చీదరించుకుంటాయి.  సింగరేణిని కాపాడేది కేవలం కేంద్ర ప్రభుత్వమే అని కార్మికులు అంటున్నారు.  సింగరేణి నష్టాలకు కారకులు ఎవరు? అసలు దొంగలు ఎవరు ?,  క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కమిటీ వేశారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడదాం’ అని పేర్కొన్నారు.

  • సాక్షి హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. నాలగు అంతస్థుల భవనంలో భారిీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నాయి. అయితే భవనంలో వాచ్ మెన్ కుటుంబంలోని ఇద్దరు పిల్లలతో అఖిల్, ప్రణీతతో పాటు మరో నలుగురు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో వృద్ధురాలితో పాటు ఇద్దరు యువకులున్నట్లు సమాచారం. దీంతో బాధితుల బంధువులు తీవ్ర అందోళన చెందుతున్నారు. 

    ప్రమాదం జరిగిన స్థలం ఫర్నిచర్‌కు చెందినది కావడంతో భవనం సెల్లార్‌లో పెద్దఎత్తున ఫర్నీచర్ సామాగ్రి పెట్టి ఉంచారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జేసీబీల సహాయంతో ఫర్నిచర్ డంప్‌లను క్లియర్ చేస్తున్నారు. ఆ డంప్‌ పూర్తిగా తొలగించిన తర్వేతే లోపల చిక్కుకున్న వారి సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా ఉందని సీపీ సజ్జనార్ అన్నారు.  

    ఆరుగంటలగా కొనసాగుతున్న రెస్క్యూ
    నాంపల్లిలో ఫర్నిచర్‌ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో సహాయక బృందాల ఆపరేషన్ ఇంకా కొససాగుతుంది. భవనంలో ఇద్దరు చిన్నారులతో పాటు ఇంతియాజ్, హాబీబ్ అనే ఇద్దరు ఫర్నిచర్ గోదాం సిబ్బంది చిక్కున్క్నుట్లు తెలుస్తోంది. లోపల తమ వారు చిక్కుకోవడంతో బాధితుల తరపు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లి అబిడ్స్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు వచ్చే పర్యాటకులు తన పర్యటనను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.

    Hyd: భారీ అగ్ని ప్రమాదం తగలబడుతున్న భవనం మంటల్లో చిక్కుకున్న పిల్లలు

     

     

     

Family

  • సంగీతానికి సరిహద్దులు లేవని, ఏ భాష పాటకైనా మన మట్టి వాసనను అద్ది కొత్తగా మార్చవచ్చని రాజస్థానీ జానపద కళాకారులు నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాటకి మన స్థానిక సంస్కృతిని జోడించి.. అందరిచే వహ్‌ వా అనిపించుకుంటున్న వారి సృజనాత్మకతకు నెటిజనులు ఫిదా అయ్యారు.

    ఆఫ్రికన్‌ రిథమ్స్‌తో సాగే షకీరా పాడిన వాకా వాకా అనే ఆ పాటకు మన మూలాలను జోడించడం అద్భుతం. ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌లో మూడుసార్లు పాల్గొన్న ఈ కళాకారుల బృందం, తమదైన శైలిలో రాజస్థానీ సాంప్రదాయ సంగీతంలోకి వాకా వాకా పాటను రీమిక్స్‌ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

    సారంగి, ఖర్తాల్, డోలక్‌ వంటి వాద్యాలతో ఈ గ్లోబల్ పాటకు దేశీ టచ్‌ ఇచ్చారు. ఈ పాట చివరలో వచ్చే దిస్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఆఫ్రికా అనే ప్రసిద్ధ పంక్తిని వారు వెల్కమ్‌ టు రాజస్థాన్‌ (Welcome to Rajasthan) అని మార్చడం ఇందులోని ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల తలపాగాలు, ఎంబ్రాయిడరీ జాకెట్లు, అద్దాలతో అలంకరించిన డ్రస్సులతో పక్కా రాజస్థానీ వాతావరణాన్ని కళ్లముందు ఉంచారు ఆ కళాకారులు.

    రాజస్థానీ జానపద కళాకారుల బృందం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరలయ్యింది. బస్సు ప్రయాణంలో కూడా తమ కళను ప్రదర్శిస్తూ వారు పంచుతున్న ఆనందం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

     చ‌ద‌వండి: కొత్త పెళ్లికూతురి స్ట‌న్నింగ్ క్యాచ్‌..! 

     

  • శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టాలన్నా, జీర్ణక్రియ మెరుగుపడాలన్నా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అందరూ భావిస్తుంటారు. అయితే అతి అనర్థ దాయకం అన్నట్లుగా గట్‌ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్‌ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అసలు రోజుకు ఎంత ఫైబర్‌ తీసుకోవాలో తెలుసు కుందాం.

    నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ ప్రకారం, వయస్సును బట్టి మనం తీసుకునే ఫైబర్‌ పరిమాణం మారుతుండాలి. పెద్దలు రోజువారీ ఆహారంలో సుమారు 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. 15 ఏళ్లలోపు పిల్లలకు 20 గ్రాములు, మూడేళ్లలోపు వారికి15 గ్రాముల ఫైబర్‌ సరి పోతుంది. 

    అతిగా పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల పేగుల్లో చికాకు కలగడం, కడుపు బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువైనప్పుడు తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం సమస్య మరింత జటిలమవుతుంది. అంతేకాకుండా, ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, జింక్‌ వంటి కీలకపోషకాలను శరీరం గ్రహించకుండా ఈ ఫైబర్‌ అడ్డుకుంటుంది. దీనివల్ల బరువు విపరీతంగా తగ్గడంతో పాటు పేగుల్లో అడ్డంకులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
    ఫైబర్‌ మాక్సింగ్‌ డైట్‌  పాటించేవారు కొన్ని ముఖ్యమైన సూచనలు  పాటించడం అవసరం. ఒకేసారి కాకుండా ఆహారంలో ఫైబర్‌ పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడే జీర్ణాశయం ఆ మార్పుకు అలవాటు పడుతుంది. పీచు పదార్థాలు తీసుకున్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే కడుపు బిగదీసినట్టుగానూ...తిప్పుతున్నట్టు గానూ ఉండే ప్రమాదం ఉంటుంది.

    కృత్రిమ ఫైబర్‌  పైడర్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి. విభిన్న రకాల ఫైబర్లు అందాలంటే మొక్కల ఆధారిత ఆహారాలకు  ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగు లో గింజలు వేసుకోవడం లేదా సలాడ్స్‌ తీసుకోవడం మంచి పద్ధతి. పీచు పదార్థాలు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే వాటిని పరిమితికి లోబడి తీసుకున్నప్పుడే ఆ ప్రయోజనాలు లభిస్తాయని మరువ కూడదు. 

Andhra Pradesh

  • నగరి: స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌ పట్టాభిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. అసలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో పని జరగడం లేదంటూ తేల్చేశారు చంద్రబాబు. పట్టాభి అన్నీ కథలే చెబుతారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టాభి బయట ఇచ్చే స్టేట్‌మెంట్‌ వేరు.. లోపల మాట్లాడే మాటలు వేరంటూ చురకలంటించారు. ఉపన్యాసాలు అందరూ ఇస్తారని పట్టాభి పనితీరుపై తప్పుబట్టారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్‌లో పని జరగడం లేదనే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు.

    ఇదిలా ఉంచితే, స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఆ సభ జనాలు లేక వెలవెలబోయింది.   టీడీపీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ సభ కాస్తా జనాలు లేకపోవడంతో బోసిపోయింది.

    సభా ప్రాంగణంలో జనాలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. భారీ అంచనాల నడుమ ఏర్పాటు చేసిన  చంద్రబాబు సభను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు సభకు ప్రజలు ముఖం చాటేయడంతో టీడీపీ పెద్దలు కంగుతిన్నారు. 

    ఇది కూడా చదవండి:

    ‘గోవిందరావు మృతికి టీడీపీ నేత పట్టాభినే కారణం’

  • చిత్తూరు:  స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ఆ సభ జనాలు లేక వెలవెలబోయింది.   టీడీపీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ సభ కాస్తా జనాలు లేకపోవడంతో బోసిపోయింది.  

    సభా ప్రాంగణంలో జనాలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. భారీ అంచనాల నడుమ ఏర్పాటు చేసిన  చంద్రబాబు సభను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు సభకు ప్రజలు ముఖం చాటేయడంతో టీడీపీ పెద్దలు కంగుతిన్నారు.

    Nagari : బాబు సభకు జనాదరణ కరువు ఖాళీ కుర్చీలకు స్పీచ్

     

     

  • బాపట్ల: మద్యం మత్తులో ఓ మహిళ నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫుల్ గా మద్యం  తాగిన యువతి.. వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడి చేయడం కనిపించింది. ఈ ఘటన బాపట్ల పట్టణంలోని రైలు పేట ప్రాంతంలో ఉన్నశ్రీనివాస వైన్స్ షాపులో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

     మద్యం సేవించిన సదరు మహిళ, షాప్ సిబ్బందితో అనవసరంగా వాగ్వాదానికి దిగి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. కేవలం మాటలతో ఆగకుండా, వైన్స్ షాపు లోపలికి వెళ్లి అక్కడి సిబ్బంది పై విచక్షణారహితంగా దాడికి దిగింది. సదరు మహిళ సిబ్బందిని కొడుతుండగా, చుట్టుపక్కల ఉన్నవారు వారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం తగ్గలేదు. స్థానికులు ఈ ఘటనను చూసి విస్తుపోయారు. మద్యం మత్తులో మహిళ ఇలా బహిరంగ ప్రదేశంలో హంగామా సృష్టించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
     

     

Cartoon