Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్దం సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య తారాస్థాయికి చేరింది. 48 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇంధన కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామని అమెరికా వార్నింగ్‌ ఇవ్వగా.. ఇరాన్‌ తొలుత మొత్తబడినట్లే కనిపించి, ఆతర్వాత గట్టి కౌంటరిచ్చింది.

    ఇరాన్‌ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప, మిగతా అన్ని నౌకలు హర్మూజ్‌ జలసంధి ద్వారా వెళ్లవచ్చని ప్రకటించిన ఇరాన్‌.. అమెరికా మా ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, హర్మూజ్‌ జలసంధి పూర్తిగా మూతపడుతుందని వార్నింగ్‌ ఇచ్చింది. 

    అలాగే మధ్యప్రాచ్య మౌలిక సదుపాయాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని హెచ్చరించింది. అమెరికా 48 గంటల వార్నింగ్‌ ఇచ్చిన కొద్ది గంటల్లో ఇరాన్‌ మిలిటరీ ఈ ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూస్తే, అమెరికా వార్నింగ్‌లకు ఇరాన్‌ బెదిరేలా కనిపించడం​ లేదు. దెబ్బ​కు దెబ్బ తీసేలా కనిపిస్తుంది. 

    ఊపిరి పీల్చుకున్న ప్రపంచం
    హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌ తొలుత చేసిన ప్రకటన వల్ల ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది. ధరల పెరుగుదలపై ఆందోళనలు కూడా ఒకింత తగ్గాయి. అయితే ఇరాన్‌ తాజా ప్రకటన త​ర్వాత పరిస్థితి మొదటికొచ్చింది. 

  • ఒమన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్‌లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.

    ఒమన్‌లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

    మరోపక్క ఒమన్‌ ఇరాన్‌ మిస్సైల్‌ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ప్రతిరోజు ఒమన్‌పై దాడులు చేస్తుంది. ఒమన్‌తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్‌ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్‌,అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే.  

  • అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..

    ఇరాన్
    అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్‌లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన‍్నారు.


    లెబనాన్ 
    మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.

    ఇజ్రాయెల్ 
    ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.

    వెస్ట్ బ్యాంక్ 
    రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.

    గల్ఫ్ 
    గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. 
    కువైట్‌లో ఆరుగురు మరణించారు.
    యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.
    సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.
    బహ్రెయిన్‌లో ఇద్దరు పౌరులు మరణించారు. 

    ఇరాక్  
    యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్‌లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.

    జోర్డాన్

    జోర్డాన్‌లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు.
     

    గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది.

     

  • టెహ్రాన్‌: ప్రపంచంలో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్‌గా పేరుగాంచిన ఎఫ్-35ను ఇరాన్ ఎలా గుర్తించింది, ఎలా పేల్చేసింది? ఎఫ్-35 శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. అయినప్పటికీ, ఇరాన్‌ దాని పని పట్టింది.

    ఇరాన్‌కు ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా, 44 సెకన్ల ఓ యానిమేటెడ్ క్లిప్ దీన్ని కొత్త కోణంలో విశ్లేషించి చూపించింది. రాడార్ సంకేతాలపై ఆధారపడకుండా ఇరాన్ ప్యాసివ్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లపై ఆధారపడి ఉండొచ్చు. అంటే, ఏదైనా వస్తువు నుంచి వెలువడే వేడి (ఉష్ణం)ని గుర్తించి, ఆ వేడి ఆధారంగా ఆ వస్తువు ఎక్కడ ఉంది? ఎలా కదులుతోంది? అనేది దీని ద్వారా గుర్తించొచ్చు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ చాలా వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడిని సెన్సర్లు గుర్తించి, ఆ జెట్ స్థానాన్ని తెలుసుకుంటాయి. దీంతో పైలట్లకు ఇరాన్‌ సైనికులు తమను గమనిస్తున్నారని తెలియకపోవచ్చు.

    ఇరాన్ ఎఫ్-16ను కూడా దెబ్బతీసినట్లు ప్రకటించింది. నిన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దేశ మధ్యభాగంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించాయి. “జయోనిస్టు పాలనకు చెందిన ఎఫ్-16 శత్రు ఫైటర్ జెట్‌ను ఉదయం 3.45 గంటలకు దెబ్బతీశాం” అని గార్డ్స్ తమ సెపా న్యూస్ వెబ్‌సైట్‌లో తెలిపాయి.

    ఇరాన్ మీడియా ఆకాశంలో పొగ కనిపిస్తున్న చిత్రాన్ని విడుదల చేసి, మరో విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది, కానీ అది ఏ రకమో లేదా ఇజ్రాయెల్‌దా, అమెరికాదా అన్నది కూడా వెల్లడించలేదు.

    ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ యానిమేషన్‌ వీడియో నిశ్శబ్ద ప్యాసివ్ గుర్తింపు సిద్ధాంతాన్ని చూపుతోంది. టెక్ వ్యాఖ్యాత ఫుర్కాన్ గోజుకారా ఎక్స్‌లో పంచుకున్న ఈ క్లిప్ ఈ విషయాన్ని వివరిస్తుంది. తరంగాలను విడుదల చేసే రాడార్ వ్యవస్థలతో భిన్నంగా, ప్యాసివ్ ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థలు నిశ్శబ్దంగా ఉండి, ముఖ్యంగా జెట్ ఇంజిన్ల నుంచి వచ్చే వేడిని గుర్తిస్తాయి.

    యానిమేషన్‌లో ప్రకాశించే గుర్తులు విమానం ప్రయాణ మార్గాన్ని చూపుతాయి, సెన్సర్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా లక్ష్యాన్ని పట్టుకుంటాయి. ఏ సంకేతం ప్రసారం కాకపోవడంతో విమానంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థలు అలర్ట్ ఇవ్వవు.  

    యానిమేటెడ్ క్లిప్ ఇదే..

  • టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్‌ దేశాల్లో అధికంగా లభించే సహజ వనరులు అయిన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్‌)తో పాటు ఇతర ఇంధన వనరుల నౌకలు హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది.

    శనివారం ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్‌ 48 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి. లేదంటే ఇరాన్‌ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం. పెద్ద దానితో మొదలు పెట్టి గట్టిగా ముగిస్తాం” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.

    ఈ నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్‌ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి స్పందించారు.‘ఇరాన్‌ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు హర్మూజ్‌ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇరాన్‌ ప్రత్యక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.

    ఇరాన్‌ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్‌ ప్రాంతంలో అధికంగా లభించే ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్‌) వంటి ఇంధన వనరుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది.

    ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి తెరవబడటం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిస్తుంది.

  • టెహ్రాన్‌: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన వెంటనే ఇరాన్‌ మరింత అప్రమత్తమైంది.  అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని పేల్చేసింది.

    ‘హార్మూజ్ దీవి సమీపంలో, ఇరాన్‌ దక్షిణ తీరంపై అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించాం. ఎఫ్-15 యుద్ధ విమానాన్ని మా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి’ అని ఇరాన్‌ మీడియా ప్రెస్‌ టీవీ ఎక్స్‌లో పేర్కొంది. ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేసింది.

    కాగా, అమెరికాకు చెందిన అతి భీకర ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్‌ అతి తక్కువ ఖర్చుతో ఢీకొట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్-35 యుద్ధ విమానాల చరిత్రలో ఇటువంటిది మునుపెన్నడూ జరగలేదు. ఎఫ్-35 అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం. ఇది శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్‌ చెబుతూ ఆధారాన్ని కూడా పోస్ట్‌ చేసింది.

    మరోవైపు, యుద్ధం వేళ నిరాధార వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. యూరప్‌పై ఇరాన్‌ క్షిపణులను ఎక్కుపెట్టిందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని యూకే తెలిపింది. యూరప్‌పై క్షిపణి దాడులకు ఇరాన్‌ ప్రణాళికలు వేసుకుంటోందని, అంతటి సామర్థ్యం ఇరాన్‌కు ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని బ్రిటన్ తెలిపింది.

    లండన్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలను చేరే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన తరువాత బ్రిటిష్ కేబినెట్ మంత్రి స్టీవ్ రీడ్ ఆ వాదనను తిరస్కరించారు.

     ఇరాన్‌ మీడియా పోస్ట్‌ చేసిన వీడియో

  • టెహ్రాన్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు బలం తోడైంది.  హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్‌ జలసంధిలో వాలిపోయింది.  

    ఈ క్రమంలో న్యూక్లియర్‌ పవర్డ్‌ బ్రిటిష్ సబ్‌మెరైన్‌ ‘హెచ్‌ఎంఎస్‌ ఆన్సన్‌’‌హర్మూజ్‌ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్‌ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్‌ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్‌పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్‌ మెరైన్‌ హర్మూజ్‌ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు మరింత బలం చేకూరినట్లువుతుంది. 

    ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్‌మెరైన  హర్మూజ్‌ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

    అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్‌ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్‌ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్‌ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్‌ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్‌ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి. 

    సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్‌ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్‌మెరైన్‌ ఉపయోగపడనుంది. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్‌, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్‌ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి.  

  • దోహ: ఖతార్‌ సైనిక హెలికాఫ్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం.

    ఖతర్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, సాధారణ విధుల్లో ఉన్న ఒక సైనిక హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా దేశపు సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ఎటువంటి సంబంధం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదానంతరం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి వివరాల గురించి తెలియాల్సి ఉంది.  

     


     

  • టెహ్రాన్‌: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్‌ స్పందించింది. ట్రంప్‌కే తిరిగి వార్నింగ్‌ ఇచ్చింది. పశ్చిమాసియా అంతటా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పింది.

    “మా ఇంధన, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై శత్రువులు దాడి చేస్తే.. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఆస్తులతో పాటు ఆయా దేశాల్లోని ఎనర్జీ, సమాచార సాంకేతిక, సముద్ర జల ఉప్పుతీత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాం” అని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

    కాగా, హార్మూజ్ భద్రతకు యూరోపియన్ దేశాలు, నాటో మిత్రదేశాలు, ఇతర దేశాలు సహకరించాలని ట్రంప్‌ కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్‌ మాట్లాడుతూ.. “48 గంటల్లో ఇరాన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా హార్మూజ్‌ జలసంధిని తెరవకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తాం’’ అని అన్నారు.

    బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇరాక్ దేశాల్లో పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ చేసిన దాడులను జీ7 విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు.

    “ఈ దేశాలపై ఇరాన్ చేసిన దాడులు ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పుగా నిలుస్తున్నాయి. ఇరాన్ తక్షణం, ఎలాంటి షరతులు లేకుండా అన్ని దాడులను నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాం. సముద్ర మార్గాల రక్షణ, నౌకాయాన భద్రతకు సహకరించాల్సిందే. హార్మూజ్ జలసంధి సహా కీలక జలమార్గాలు, సరఫరా చైన్‌ భద్రత, ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం అవసరం” అని జీ7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.

    కాగా, ఇరాన్‌ ఇప్పటికే పలు దేశాలకు హార్మూజ్‌ జలసంధిని వినియోగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలు హార్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని, నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన‍్వయం చేసుకోవాలని పేర్కొంది. 
     

  • జెరూసలేం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. తాజాగా,ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలో నతాంజ్ అణు కేంద్రాన్ని లక్క్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్‌..ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్ నగరాలపై క్షిపణులతో విరుచుకు పడింది.

    ఇరాన్‌ జరిపిన క్షిపణ దాడుల్లో అనేక భవనాలు శిథిలయ్యాయి. క్షిపణుల దాడి సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇరాన్‌ ప్రయోగించిన ఓ క్షిపణి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు,కిటికీల ఫ్రేములు ఎగిరిపోతుండగా..సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

    ఏఎఫ్‌పీ ప్రకారం..ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌ అరద్ పట్టణంలో 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, డిమోనాలో 33 మంది గాయపడ్డారు. డిమోనాలో బాంబు షెల్‌ కారణంగా తీవ్రంగా గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి డిమోనా కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ దాడులకు ప్రాముఖ్యత ఏర్పడింది.

     


     

  • టెహ్రాన్‌: రోమ్‌ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్‌ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్‌ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్‌ ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌లలో హాట్‌టాపిక్‌గా మారింది

    అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    జెరూసలెం పోస్ట్‌ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    మోజ్తాబా మౌనం
    మరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్‌పై ముప్పేటా దాడి,ఇరాన్‌ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్‌పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్‌ బాధ్యతలు ఎవరు  నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్‌ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది    

    మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?
    అదే సమయంలో ఇజ్రాయెల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ స్టడీస్‌ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్‌తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్‌ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.

    వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్‌ అగ్రనాయకులు 
    ఇదే సమయంలో ఇజ్రాయెల్‌–అమెరికా దాడుల్లో ఇరాన్‌ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్‌ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్‌ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్‌ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.

    ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్‌, హర్మూజ్‌ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్‌ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.

  • మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్‌లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.

    ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్‌లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్‌సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి.
     

    వారికి భారీ జరిమానాలు
    వరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్‌ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి  వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది.  కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

    ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ

Family

  • భారతీయ జీవన దర్శనం మౌనాన్ని ఒక మహోన్నత తపస్సుగా, ముని వృత్తిగా  అభివర్ణించింది. ‘మౌనం సర్వార్థ సాధకమ్‌‘ – అనగా మౌనం ద్వారా సమస్త కార్యాలను సాధించవచ్చు. మౌనం అంటే కేవలం పెదవులు మూసి ఉంచడం కాదు; అనవసర ఆలోచనలను నియంత్రించి మనసును నిశ్శబ్దంగా మార్చడం.

    నేటి ఆధునిక కాలంలో మనిషి నిరంతరం బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య, సామాజిక మాధ్యమాల అలజడిలో జీవిస్తున్నాడు. ఈ గందరగోళం వల్ల తనతో తాను మాట్లాడుకునే అమూల్య సమయాన్ని కోల్పోతున్నాడు. మౌనం మనలో నిద్రాణమై ఉన్న సృజనాత్మకతను, వివేకాన్ని మేల్కొల్పుతుంది. మాటల ద్వారా వ్యయమయ్యే శక్తిని ఆదా చేసి, ఆ శక్తిని అంతరంగ వికాసానికి ఉపయోగించేలా చేస్తుంది.

    వైదిక ఆధ్యాత్మిక చరిత్రలో మౌనానికి రమణ మహర్షి ఒక మహోన్నత నిదర్శనం. ఆయన కేవలం తన మౌనం ద్వారానే భక్తుల సంశయాలను నివృత్తి చేసేవారు. మాటలు వివరించలేని గూఢ సత్యాలను మౌనం సులువుగా వివరిస్తుంది. అలాగే, దక్షిణామూర్తి స్వరూపంలో పరమశివుడు మౌన ముద్ర ద్వారానే శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. అశాంతిగా ఉన్న మనసు ఎప్పుడూ వాదిస్తుంది; ప్రశాంతమైన చిత్తం మౌనంలో లీనమవుతుంది. మౌనం మనల్ని అహంకారం నుండి విముక్తులను చేసి, పరమాత్మతో అనుసంధానం చేస్తుంది. లోతైన నిశ్శబ్దంలోనే దైవ వాక్కు వినిపిస్తుంది. నిశ్చలత్వమే నిత్య సత్యమని గ్రహించినప్పుడే మానవుడు పరిపూర్ణుడు కాగలడు.

    నిత్య జీవితంలోని ఆచరణాత్మక అంశాన్ని గమనిస్తే, మనం మాట్లాడే మాటల్లో చాలా వరకు అనవసరమైనవి, ఇతరులను నొప్పించేవి ఉంటాయి. మౌనాన్ని అలవర్చుకోవడం వల్ల వాక్‌ దోషాలు నశిస్తాయి. ఒక వివాదం తలెత్తినప్పుడు ఎదురు దాడి చేసే కంటే, కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఆవేశం తగ్గి విచక్షణ పెరుగుతుంది. ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా ఏకాంతంగా మౌనం పాటించడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఇది మన నరాల వ్యవస్థకు విశ్రాంతినిచ్చి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనం ఎంత తక్కువగా మాట్లాడితే మన మాటలకు అంతటి గౌరవం పెరుగుతుంది. మౌనం బలహీనత కాదు; అది ఒక ఉన్నతమైన మానసిక పరిపక్వత.

    ఆర్ష సంస్కృతి అందించిన ఈ మౌన మార్గం వ్యక్తిని ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్న నానుడి అక్షర సత్యం. మన అంతరంగంలో మౌనం అనే జ్యోతి వెలుగుతున్నప్పుడు, బాహ్య ప్రపంచంలోని కల్లోలాలు మనల్ని స్పృశించలేవు. మాటలకందని ఆనందాన్ని అనుభవించాలంటే మౌనమే ఏకైక శరణ్యం. అశాంతిని వీడి, మౌనాన్ని ఆలింగనం చేసుకుని ఆత్మాన్వేషణ సాగిద్దాం. మౌనమే శక్తి, మౌనమే శాంతి. సర్వం నిశ్శబ్దమయం!

    బాహ్య ప్రపంచంలో మనం ఎంత ఎదిగినా, అంతరంగంలో మౌనాన్ని ఆశ్రయించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. మౌనంలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి; వాటిని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని అంధకారం నుండి వెలుగు వైపు, అశాంతి నుండి ప్రశాంతత వైపు 
    నడిపించే దివ్య మార్గం.

    – కె. భాస్కర్‌ గుప్తా 
    వ్యక్తిత్వ వికాస నిపుణులు

  • కేసర్‌ పిస్తా దోసె

    కావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్‌ స్పూన్‌  , మెంతులు–ఒక టీ స్పూన్‌ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్‌ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)
    పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్‌ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. 

    తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్‌ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.

    పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.

    రష్యన్‌  మష్రూమ్‌ జూలియన్‌ 
    కావలసినవి:  పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు 
    ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్‌ స్పూ¯Œ  
    హెవీ క్రీమ్‌–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్‌– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. 

    తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్‌  వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్‌ బౌల్స్‌లో వేయాలి. 

    అదే పాన్‌లో అర టీస్పూన్‌  వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్‌ వేసి మిక్స్‌ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్‌లా బాగా కలపండి. ఈ సాస్‌ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్‌ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్‌హీట్‌ డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసిన మైక్రోవేవ్‌ ఒవెన్‌లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్‌ చేయండి. అంతే టేస్టీ రష్యన్‌  మష్రూమ్‌ జూలియన్‌ రెడీ.

    ఛత్తీస్‌గఢీ ఫరా 
    కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్‌ స్పూన్‌ , జీలకర్ర– ఒక టేబుల్‌ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్‌ , కరివేపాకు–రెండు రెమ్మలు, 
    పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, 
    నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.

    తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. 

    ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్‌ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్‌ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. 

  • ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాలతో చాలామందిలో నల్లటి మచ్చలు, ముఖం మీద సన్నని రంధ్రాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో ముఖం నిస్తేజంగా మారుతుంది. 

    ఇటువంటి సమయంలో ముఖంలోని సహజ మెరుపును తిరిగి పొందేందుకు చాలా మంది పార్లర్లకు వెళుతుంటారు. అయితే చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చుకునేందుకు ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ సాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి తాజాగా ఉంచుతుంది. దీని సాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండానే ఇంట్లోనే సహజమైన నిగారింపు పొందవచ్చు.

    ఐస్‌ క్యూబ్‌లను నేరుగా ముఖానికి రాసుకుంటే చర్మం ఎర్రగా మారడం, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ ఉపయోగిస్తే చల్లని స్పర్శ ముఖం అంతటికి సమానంగా అందుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సహజంగా కాంతిమంతంగా మారుతుంది. చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు రావు. 

    ఈ పరికరంతో సున్నితంగా మసాజ్‌ చేస్తే చర్మంపై ఏర్పడిన సన్నని రంధ్రాలు తగ్గి, చర్మం నునుపుదేరుతుంది. కళ్ల కింద వాపు, ముఖంపై అలసట మటుమాయం అవుతాయి. ఎండ ధాటికి చర్మం వడలిపోయే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఈ మసాజర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మసాజర్‌ను ఉపయోగించడం చాలా తేలిక. మసాజర్‌లో నీటిని నింపి ఫ్రీజర్‌లో ఉంచాలి. 

    నీరు గడ్డకట్టిన తర్వాత ముఖంపై మసాజ్‌ చేస్తే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మసాజర్‌ కేవలం అందాన్ని పెంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పోర్టబుల్‌ సైజులో ఉండటంతో ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాలు లేకుండా ముఖాన్ని మెరిపించుకునేందుకు ఈ ఐస్‌ కంప్రెస్‌ ఫేస్‌ మసాజర్‌ మంచి ఎంపికనే చెప్పుకోవాలి. ఆన్‌లైన్‌లో లభిస్తున్న ఈ పరికరం ధర కేవలం రూ. 2,299 మాత్రమే.

    (చదవండి: పక్షవాతానికి వార్నింగ్‌ బెల్‌..!)

     

  • పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్‌తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు. 

    ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్‌ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్‌  గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి. 

  • నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?
    – రమ్య, గుంటూరు.

    సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్‌ అవుతుంది. 

    కాబట్టి ఇవి మైల్డ్‌గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌  చేసి, డాప్లర్‌ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్‌  మందు, చర్మానికి రాసుకునే లోషన్‌ లేదా మాయిశ్చరైజర్‌ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. 

    చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్‌ బైల్‌ యాసిడ్స్, లివర్‌ ఫంక్షన్‌  టెస్టులు చేసి ఆబ్‌స్టెట్రిక్‌ కొలెస్టాసిస్‌ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్‌ యాసిడ్స్‌ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. 

    ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు, బైల్‌ యాసిడ్స్‌ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్‌స్టెట్రిక్‌ కొలెస్టాసిస్‌ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.

    నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?
    – లక్ష్మీ దేవి, కర్నూలు.

    ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్‌ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్‌ రెగ్యులర్‌గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. 

    నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్‌ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్‌ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్‌ , సీబీపీ, థైరాయిడ్‌ హార్మోన్‌ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. 

    అదనంగా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌  తప్పనిసరిగా చేస్తారు. స్కాన్‌లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్‌ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్‌  సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్‌ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్‌ థిక్నెస్‌ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్‌ హార్మోనల్‌ మందులు ఇస్తారు. 

    హార్మోనల్‌ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్‌కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్‌లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్‌ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్‌ ఎండోమెట్రియల్‌ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. 

    దీనివల్ల హార్మోన్‌ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్‌కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్‌ హార్మోనల్‌ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్‌ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్‌ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో  నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. 
                          ∙
    డా. కె. అపర్ణ 
    సీనియర్‌ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్‌ సర్జన్, సికింద్రాబాద్‌ 

    (చదవండి: పక్షవాతానికి వార్నింగ్‌ బెల్‌..!)

  • పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్‌ సిగ్నల్స్‌ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్‌ సిగ్నల్స్‌. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...

    ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ ఎటాక్‌  (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్‌ స్ట్రోక్‌కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి.  కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. 

    ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు.  అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్‌కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. 

    టీఐఏ లక్షణాలు: 
    ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం 

    ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం 

    మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం 

    నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్‌ తప్పడం) 

    అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. 

    ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. 

    అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని, డాక్టర్‌ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్‌స్టైల్‌ మాడిఫికేషన్స్‌తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు.  

    ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌కు కారణాలు... 
    1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. 

    టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... 

    రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో 

    అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్‌ ఉన్నవారిలో 

    పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో 

    నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్‌ ఆప్నియా), 

    నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్‌ డాప్లర్‌ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్‌ కోయాగ్యులేషన్‌ పారామీటర్స్‌ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు.  

    చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్‌ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్‌ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.
    డా. రంజిత్‌, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌  

    (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!)

  • ఇటీవల డ్రగ్స్‌ అనే మహమ్మారి సెలిబ్రిటీల వేడుకల్లో కనిపించడం పరిపాటిగా మారింది. ఇక చిన్నపిల్లలూ, టీనేజ్‌ బాలల్లో ఈ అలవాటు పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో టీనేజ్‌ పిల్లలు కొంత పెద్దయ్యాక మద్యం అలవాటుకు దగ్గరవుతుంటేనే ఎంతో ఆందోళనగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పెద్ద నగరాల్లోని కొన్ని పబ్స్‌లో, పార్టీలలో, న్యూ ఇయర్‌ వేడుకల్లాంటి సోషల్‌ ఈవెంట్స్‌లో డ్రగ్స్‌ కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు... పెద్ద పెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవాళ్ల పార్టీల్లోనూ డ్రగ్స్‌ కనిపించడం బెంబేలెత్తిస్తోంది. డ్రగ్స్‌ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో... తమ టీనేజ్‌ పిల్లలూ, కుటుంబ సభ్యుల్లోని యువత ఇలా డ్రగ్స్‌కు అలవాటు పడటాన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో అవసరం. డ్రగ్స్‌ అలవాటు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలపడం, దానికి కావాల్సిన చికిత్స ప్రక్రియలను సూచించడం కోసమే ఈ కథనం...

    ఈమధ్య కాలంలో కొన్ని స్కూల్‌ ప్రాంగణాలలో హైస్కూల్‌ స్థాయికి వచ్చిన పిల్లలు సైతం డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న వార్తలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల పరిశీలనల్లో డ్రగ్స్‌కు అలవాటు పడటం 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో ఎక్కువని తెలుస్తోంది. అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నా ఈ కింది వాటిని ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. అవి... 

    పాశ్చాత్య ధోరణుల్లోని పెడపోకడలను మన పిల్లలూ అనుసరించడం / అనుకరించడం 

    సెలిబ్రిటీలు కుటుంబాల్లో లేదా బాగా ధనవంతుల ఫ్యామిలీలలో పిల్లలపై పేరెంట్స్‌ పర్యవేక్షణ తక్కువగా ఉండటం 

    స్నేహితులూ, తోటివారు చేస్తున్న పనులు చూసి... వాటిలో ఏదైనా ఆనందాన్ని తాము మిస్‌ అవుతున్నామన్న భావనతో వాళ్లను అనుకరించడం (పియర్‌ ప్రెషర్స్‌)

    ఆర్థికంగా మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం తోపాటు కొత్తగా టీన్స్‌లో ఉండే సహజ ఉత్సాహంతో జీవితాన్ని ఎడ్వెంచరస్‌గా, ఎక్సయిటింగ్‌గా ఉండేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఈ పెడదారులు తొక్కడం 

    మానసిక ఒత్తిడులనుంచి చాలా త్వరితంగా బయటపడాలన్న ఆకాంక్ష. 

    డ్రగ్స్‌ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు... 
    ఈలోకంలోని చాలామందిలో ఒక అ΄ోహ ఉంటుంది. తమపై తమకు నియంత్రణ ఎక్కువ అనీ, తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓ అలవాటు మానుకోగలమనే అపోహ ఉండటం చాలా సహజం. కానీ డ్రగ్స్‌ విషయంలో అలా కాదు. అవి మనిషిని బానిసగా మార్చేస్తాయి. అందుకే డ్రగ్స్‌ను మొదలుపెట్టి వదిలించుకోడానికి ప్రయత్నించడం కంటే ముందునుంచే దూరంగా ఉండటం మేలు

    డ్రగ్స్‌ తాలూకు దుష్పరిణామాలు చాలా దీర్ఘకాలం ఉపయోగించాక కనిపిస్తాయని అనుకోవడం సాధారణం. కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యంపై చూపే ఆ దుష్ప్రభావాలు తొలిసారే కనిపించవచ్చు. 

    పార్టీ స్పైకింగ్‌ అంటే... : కొత్త అమ్మాయిలకూ లేదా అప్పటివరకూ ఎప్పుడూ మత్తుమందుల జోలికి వెళ్లని అబ్బాయిలకు డ్రగ్స్‌ అలవాటు చేయడం కోసం... వాళ్లకు తెలియకుండానే మత్తు ఇవ్వడాన్ని ‘పార్టీ స్పైకింగ్‌’గా చెబుతారు.

    సహజంగా అలవాటుగా మారే డ్రగ్స్‌ ఇవి...  

    యాంఫిటమైన్స్, మెటా యాంఫిటమైన్స్‌ కొకైన్‌ 

    బార్బిట్యురేట్స్, 

    మిథాజోలిన్, క్వినాజోలిన్‌ వంటి నిద్ర మాత్రలు (క్రాష్‌). కెన్నాబిస్‌ (గంజాయి)

    నల్లమందు వంటి మాదకద్రవ్యాలు, 

    పొగాకులో ఉండే నికోటిన్‌ 

    ఆల్కహాల్‌  (కాకపోతే నికోటిన్, ఆల్కహాల్‌ను పూర్తిగా డ్రగ్స్‌ కేటగిరీలో చెప్పలేకపోయినప్పటికీ... తమను బానిసగా మార్చుకునే సామర్థ్యం వీటికీ ఉంది).

    మళ్లీ మళ్లీ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే... 
    సాధారణంగా మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరికతో డ్రగ్స్‌కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అన్నది రెండు రకాలుగా జరుగుతుంది. 

    1) శారీరక లక్షణాలతో : తొలుత అంతులేని ఉత్సహం, ఎక్సైట్‌మెంట్, ధైర్యం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలనూ, హాయి భావనను కలగజేసే ఈ డ్రగ్స్‌... వాటిని తీసుకోనప్పుడు దేహంలో శారీరకంగా కొన్ని తీవ్రమైన మార్పులు జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అవేమిటంటే... డ్రగ్స్‌కు అలవాటు పడ్డ శరీరం వాటిని తీసుకోనప్పుడు దేహమంతా వణుకు, విపరీతంగా చెమటలు పట్టడం, స్థిరంగా స్థిమితంగా ఉండలేక΄ోవడం, గుండె దడ, కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

    2) మానసికమైన భ్రాంతులతో : డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటయ్యాక ఎప్పుడైనా తీసుకోనప్పుడు... కొందరిలో కొన్ని రకాల భ్రాంతులు కనిపించవచ్చు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వాస్తవం కాని దృశ్యాలు కనిపించడం వంటివి. ఒక్కోసారి డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు తమనెవరో బాధపెడుతున్నట్లు భ్రాంతి చెందడమూ జరగవచ్చు. దాంతో మానసికంగా డ్రగ్‌కోసం పరితపించడం జరుగుతుంది.

    సామాజికంగా జరిగే నష్టాలు డ్రగ్స్‌ తీసుకున్న వారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేగంగా వాహనాలు నడపటం, సెక్స్‌లో వికృతంగా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవచ్చు. కొందరు దొంగతనాలూ, హత్యల వంటి నేరాలకూ పాల్పడవచ్చు. చదువు దెబ్బతినవచ్చు. 

    గుర్తించడం ఎలా... 
    పిల్లలు నలుగురితోనూ, కుటుంబసభ్యులతో కలవకుండా... తాము ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం 

    గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రంగా ప్రవర్తించడం

    మాటలలో, చేతలలో నిర్లక్ష్యం, ఎవరినీ లెక్కచేయక΄ోవడం 

    వ్యక్తిగత పరిశుభ్రత అంతగా పాటించక΄ోవడం ∙

    డ్రగ్స్‌కు అలవాటైన వారి చెమటనుంచి ఒక రకం వాసన వస్తుండటం 

    స్కూల్లో, కాలేజీలో స్కోర్‌ తగ్గడం... వంటి మార్పులు కనిపిస్తుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను డాక్టర్‌కు లేదా సైకియాట్రిస్ట్‌కు చూపించాలి.
    డాక్టర్‌ శివ అనూప్‌ యెల్లా, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌ 

    (చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్‌..!)

  • ఇటీవలకాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కోసం మార్కెట్లో ఇప్పటికే పలు రకాల డయాబెటిస్‌ మందులు కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటితో ఎంతో కొంత దుష్ప్రభావాలు తప్పవనేది నమ్మకతప్పని నిజం. ఆ నేపథ్యంలోనే సహజసిద్ధంగానే సులభంగా అధిక బరువుకి చెక్‌పెట్టే మార్గాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా సైంటిస్టులు ఈ సమస్యకు కొండచిలువ రక్తంతో పరిష్కార మార్గం చూపి సరికొత్త ఆశను రేకెత్తించారు. వాట్‌ కొండచిలువ రక్తం అని వెన్నులో వణుకు పుట్టుకొస్తున్నా..అలా ఎందుకు చెప్పారో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనంలో చాలా ఆసక్తికర విషయాలను సవివరంగా వెల్లడించారు కూడా. 

    బరువు తగ్గించే ఒక అణువుని బర్మీస్‌ కొండచిలువ రక్తంలో గుర్తించారు. ఆకలిని భిన్నమైన రీతీలో లక్ష్యం చేసుకోవడం అనే పరిశోధనలో భాగంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది సరికొత్త ఆశను రేకెత్తించింది. సాధారణంగా కొండచిలువలు విపరీతమైన ఆహారపు అలవాట్లకు ప్రసిద్ధి చెందినవి. అవి తమ శరీర బరువుకి సమానమైన పరిమాణంలో ఉన్న ఆహారాన్ని స్వాహా చేస్తాయి. ఆ తర్వాత నెలల తరబడి ఆహారం లేకుండా జీవిస్తాయి. 

    అలా.. ఎలా అన్నేళ్లు ఆహారం లేకుండా ఉంటాయని పరిశోధించగా..ఆ సమయంలో వాటి రక్తప్రవాహంలో కొన్ని అణువులు వేగంగా పెరుగుతాయిని గుర్తించారు వైద్యులు. ఇవి అసాధారణ జీవక్రియను నిర్వహించడానికి సహాపడతాయిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్థాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలోని జోనాథన్‌ లాంగ్‌ నేతృత్వంలో జరిగిన పరిశోధనలో కొండచిలువలు ఆహారం తినడానికి, తర్వాత వాటి రక్తనమునాలను విశ్లేషించారు. 

    వాటిలో గణనీయంగా పెరిగిన 200కు పైనే ఎక్కువ అణువులను గుర్తించారు. ఆ అణువుల్లో పీటీఓఎస్‌(pTOS)గా పిలిచే ఒక అణువు వెయిరెట్లకు పైగా పెరిగింది. పేగులలో బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ అణువు మానవులలో కూడా తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. దాని సామర్థాన్ని పరీక్షించడానికి పరిశోధకులు ఊబకాయం ఉన్న ఎలుకలకు ఈ పీటీఓఎస్‌ ఇచ్చారు. 

    ఆ ఫలితాల్లో ఆ ఎలుకలు తక్కువ ఆహారం తిని, 28 రోజుల వ్యవధిలో తమ శరీర బరువులో సుమారు 9% కోల్పోయాయని గుర్తించారు. కడుపు ఖాళీ అయ్యి..జీర్ణక్రియ నెమ్మదించే ప్రక్రియను తరుచుగా వికారం వంటి దుష్ప్రభావాలను కలిగించే వెగోవీ వంటి బరువు తగ్గించే మందుల్లా కాకుండా ఈ పీటీఓఎస్‌(pTOS) నేరుగా బ్రెయిన్‌పై పనిచేస్తోందట. ఇది ఆకలిని నియంత్రించే ప్రాంతమైన హైపోథాలమస్‌ను లక్ష్యంగా చేసుకుంటుందట. 

    ఇది ఒకరకంగా ప్రస్తుత చికిత్సలలో ఉన్న సాధార దుష్ప్రభావాలు లేకుండా ఆకలిని నియంత్రించే కొత్త మార్గాన్ని అందించిందని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన నేచరల్‌ మెటబాలిజంలో ప్రచురితమైంది. ఇది మానవులుకు ఎంతవరకు సురక్షితమైనది అనేది నిర్థారించడానికి ఇంకా పలు అధ్యయనాలు చేయాల్సి ఉంది. కానీ శాస్త్రవేత్తలు మాత్రం భవిష్యత్తులో ఊబకాయ భయానికి ఇదో గొప్ప ఆశకిరణంగా మారుతుందని ప్రగాఢం నమ్ముతుండటం విశేషం.

    (చదవండి: జస్ట్‌ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!)

     

NRI

  • న్యూజిల్యాండ్‌లోని తెలుగువారు ఉగాది పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో ఆక్లాండ్ నగరంలో శ్రీ పరాభవ నామ‌ సంవత్సరం వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జ‌రుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుతనం,  తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను తెలుసుకున్నారు.

    చిన్నారులు పెద్దలు తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనం చేశారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్ట‌ర్ మదన్ మోహన్ సేథి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సామజికసేవలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో సన్మానించారు. చిన్నారులకు, నృత్యకారులకు బహుమతులు అందజేశారు.


    అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అధ్య‌క్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, యాదవ్, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, కావ్య, వర్ష పట్లోళ్ల,  మేకల స్వాతి, కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, మొహమ్మద్ బిలాలోద్దీన్, విజయ్ శ్రీరామ్, రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, శ్రీనివాస్ పందిళ్ల, రవి కుమార్ వట్టం, మారుతి, ఆర్తి, భరత్ జవ్వాజి, మహేందర్ రెడ్డి, నిఖిత తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Andhra Pradesh

  • సాక్షి, నెల్లూరు జిల్లా: జువ్వలదిన్నె బోట్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. వివాదంలో ఎంపీ బీద మస్తాన్‌రావు తీరుపై నెల్లూరు సముద్ర తీర మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు ప్రస్తావనకు రాకుండా ఉండటం కోసం పోలీసులు యాక్షన్ ప్లాన్ చేశారు. నారా లోకేష్ ఆదేశాలతో మత్స్యకార గ్రామాల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ టీం ఆపరేషన్ చేపట్టింది.

    సర్వేపల్లి నియోజకవర్గం, వెంకన్నపాలెం గ్రామ మత్స్యకారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవహారంతో బీదాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు.. మత్స్యకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల‌ యత్నాలను మత్స్యకారులు తీవ్రంగా ప్రతిఘటించారు.

    ‘‘ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ముందుగా మాకు నిజం చెప్పి వుండాలి. నిజాన్ని ఎందుకు దాచాడు? మేమే సమస్యను పరిష్కరించుకునే వాళ్లం. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయడం సరైంది కాదు. ఎవరు తప్పు చేశారో మాకు తెలుసు. మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఆపండి. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మా ప్రతిష్ట మాకు ముఖ్యం. మీ ప్రభుత్వ, పోలీస్ బెదిరింపులకు తలొగ్గేది లేదు’’ అంటూ పోలీసులతో మత్స్యకారులు తేల్చి చెప్పారు.

  • కుందాలపల్లి: డాక్టర్‌  బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం కుందాలపల్లిలో కుల వివక్షకు గురైన బాధితులను జై భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ పరామర్శించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుందాలపల్లిలో దళితులపై వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు జడ శ్రవణ్‌.  

    ఎస్సీ వర్గాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితు కుటుంబానికి తానే న్యాయవాదిగా ఉండి వాదిస్తానని శ్రవణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

     

  • నెల్లూరు: వ్యభిచార నిర్వహణ లాడ్జీపై పోలీసుల దాడిలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమ నాయుడు పట్టుబడ్డారు. నెల్లూరు ఏఎస్పీ పలు లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. మొత్తం 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

    సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా రాధాకృష్ణమ‌ నాయుడు చలామణి అవుతున్నారు. ఇటు వ్యభిచార గృహాలు నడుపుతూ ఆయన అధిష్ఠానంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో రాధాకృష్ణమ నాయుడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధిష్ఠానంలో పలుకుబడితో సర్వేపల్లిలో అక్రమాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయింపులో సదరు ప్రస్తుత విటుడు రాధాకృష్ణమ నాయుడిది కీలక భూమిక.

  • చిత్తూరు జిల్లా: పుత్తూరు మున్సిపాలిటీలో 99 శాతం అభివృద్ధి పనులు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా చేశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. 35-40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకులమని చెప్పుకునే వాళ్లు ఏమీ చేయలేదని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన పనులు చేసినట్లు వివరించారు.

    చిత్తూరు జిల్లాలో రోజా మీడియాతో మాట్లాడుతూ... ‘పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం. అది పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. జగనన్న పాలనలో మూడేళ్లలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర‍్మించాం. పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.

    ఎమ్మెల్యే గాలి భానుకు ఫేస్ వాల్యూ లేదు. మున్సిపల్ కమిషనర్, పోలీసుల్ని పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఉగాది పండగకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండపై లేరు. జనసేనలో క్యారెక్టర్ లేని వాళ్లతో మాట్లాడిస్తున్నారు. వాళ్ల బ్రతుకులు ప్రజలకు తెలుసు.. అది జనసేన కాదు కామసేన.

    మేము అధికారంలోకి వచ్చాక అద్బుతమైన పార్కులు నిర్మించాం. గతంలో పుత్తూరులో ప్రభుత్వ హస్పిటల్ నిర్మాణానికి నిధులువస్తే టీడీపీ నాయకులు కుట్రచేసి అడ్డుకున్నారు. పుత్తూరులో ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. పెన్షన్, రేషన్ కోసం గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. సున్నావడ్డీ రుణాలు ఇవ్వకుండా మహిళల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. చంద్రబాబు సిగ్గు లేకుండా ఉగాది రోజు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.

    తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. పుట్టా సుధాకర్  కొడుకు పుట్టా మహేష్ డ్రగ్ వ్యవహారంలో దొరికారు. టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు రాసలీలలు ఆడుతూ వీడియోతో సహా బయటపడ‍్డారు. ఆయనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామి అందరి లెక్కలను తేల్చేస్తారు. మనం చూస్తూ ఉంటే చాలు.

    రేణిగుంట నుంచి పుత్తూరు వరకు జాతీయ రహదారి పూర్తి అయ్యేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశాం. పుత్తూరు నుంచి నగరి వరకు రద్దు అయిన రోడ్డు  టెండర్లు పూర్తి చేశాం’ అని రోజా అన్నారు.

     

  • విశాఖ: ఆక్రమిత భూముల్లో గీతం యూనివర్సిటీ నిర్మాణాలు చేపడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 5 వేల కోట్ల రూపాయల భూములను కబ్జా చేయడమే కాకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఎంపీ భరత్ భూకబ్జాకు పాల్పడ్డారని చెప్పారు.

    ‘కోర్టులో కేసులు ఉండగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ మార్గంలో యూనివర్సిటీ కోసం జీవీఎంసీ సమావేశంలో వాటిని క్రమబద్ధీకరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఎంపీ 5 వేల కోట్ల రూపాయల భూ కబ్జాకు పాల్పడలేదు. ప్రభుత్వ భూముల బోర్డులను తొలగించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. గీతం భూకబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 

    మళ్లీ అధికారంలోకి రాబోమని తెలిసి భూ దోపిడీకి పాల్పడుతున్నారు. జీవీఎంసీ కమిషనర్ కు ఐఏఎస్‌కు ఉండాల్సిన లక్షణాలు ఒకటీ లేవు. గీతం భూకబ్జాపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాము. ఈ కేసుల్లో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఆర్డీఓలను భాగస్వాములగా చేస్తున్నాము. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులకు బానిసలు కాదు.

     ఊరు, పేరు లేని కంపెనీలకు 99 పైసలకే వేల కోట్ల రూపాయల భూములు కట్టబెడుతున్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న భూ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద కుంభకోణం. కూటమి భూ రాబందుల నుంచి విశాఖ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది’ అని తెలిపారు.

  • సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మత్స్యకారులు నిర్బంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదలిపెట్టేశారన్నారు ఆరోజు( ఆదివారం) నెల్లూరులో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలను ఎండగట్టారు.

    తమిళనాడు నుంచి బోట్లు వచ్చి రాష్ట్ర మత్స్య సంపదని అక్రమంగా  దోచుకుంటున్నాయని దీంతో రాష్ట్ర మత్స్యకారులు ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లు పట్టుకున్నారన్నారు. అంత కష్టపడి వాటిని పట్టుకుంటే మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో వాటిని వదిలిపెట్టారని తెలిపారు. బీదా మస్తాన్ రావ్, కావలి సీఐ కలిసి ఈ ఆపరేషన్ అమలు చేశారు. మత్స్యకార గ్రామ పెద్దకాపు తాతయ్య వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్ వీరి పాత్ర కనబడుతుందన్నారు.

    తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లతోనే చంద్రబాబు, లోకేష్ ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు. పోలీసులను ఉపయోగించి పక్క ప్లాన్ అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన దారుణంతో  మత్స్యకారులు ఆవేశంతో రగిలిపోతున్నారని ఈ ఘటనపై గళం విప్పుతున్న మత్స్యకారులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో మత్స్యకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక హర్బర్‌ నిర్మాణాలు చేపట్టారన్నారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాటిని సైతం ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు.

    పోలీస్ మార్క్ రాజకీయాలు నెల్లూరు జిల్లాలో రాజ్యమేలుతున్నాయని మంత్రి లోకేష్ పర్యటనకు మత్స్యకారుడు అయిన సర్పంచ్ కు ఆహ్వానం లేదని దుయ్యబట్టారు. శిలాఫలకంలో మత్స్యకార సామాజిక వర్గాలను చెందిన సర్పంచ్ పేరు వేయడానికి ప్రభుత్వానికి నామోషీగా ఉందన్నారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు అండగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఏదేమైనా అపహరించుకపోయిన బోట్లను యధాస్థానంలో పెట్టే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని  మాజీ మంత్రి కాకాణి స్పష్టం చేశారు. 
     

Business

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్‌ను (మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్) దాటేయగలదు.

    భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్‌కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.

    ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.

    నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.

    వికసిత భారత్ - మోదీ కల
    భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.

    వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.

    మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.

    ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..

  • జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.

    ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.

  • స్కోడా కంపెనీ.. అప్‌డేటెడ్ కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.

    హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్‌లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది.

    కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్‌లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

    మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్‌డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

  • ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.

    అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.

    వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!
    బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.

    బంగారం ధరలు తగ్గుతాయా?
    బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు.

  • వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్‌’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.

    ఫోనుకి బుజ్జి ఏసీ!
    సమ్మర్‌లో గేమ్స్‌ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్‌ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్‌ కూలింగ్‌ ప్యాడ్‌! ఇది మామూలు ఫ్యాన్‌ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్‌ టెక్నాలజీ మీ ఫోన్‌ టెంపరేచర్‌ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. 

    అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్‌ మాత్రం వింటర్‌ వాతావరణంలో ఉన్నట్టే చిల్‌ అవుతుంది! దీనికి ఉన్న ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫోన్‌ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్‌ ఫీచర్‌ వల్ల ఫోన్‌ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్‌ చేసినా లేదా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసినా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్‌ లేదా ఐఫోన్‌.. ఏదైనా సరే, సెట్‌ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!

    మ్యాజిక్‌ గ్లాసెస్‌!
    ఫోన్‌ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్‌కి రిలాక్సేషన్‌ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్‌ బ్లూటూత్‌ గ్లాసెస్‌! ఇందులో ఇన్‌–బిల్ట్‌ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్‌ వినిపిస్తుంది.

    ఫోన్‌ తీయకుండానే కాల్స్‌ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్‌ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్‌ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్‌ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్‌ గ్లాసెస్‌లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్‌ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!

    మంచు కురిపించే గొడుగు!
    బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్‌ ఏసీలాంటి ఈ బీఎన్‌ఎఫ్‌ సన్‌ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్‌ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్‌ప్రూఫ్‌ డిజైన్‌తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్‌. ధర రూ. 5,900.

  • మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.

    చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్‌ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.

    డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.

    కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.

    ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

    ఇదీ చదవండి: రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!

    ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

  • మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్‌పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.

    ఎక్కడంటే..
    దేశంలోనే మొట్టమొదటి ఎల్‌పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. గురుగ్రామ్‌లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్‌స్టా ఎల్‌పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్‌లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.

    ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..
    ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..

    • మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

    • ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.

    • క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్‌కోడ్‌ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.

    • ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్‌ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.

    • చెల్లింపు: స్క్రీన్‌పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.

    • నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.

    ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?

    • లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను  అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.

    • స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్‌లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.

    గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

  • న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.

    అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్‌–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్‌ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.

  • అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్‌ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.

    కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్‌కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్‌కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.

    పతనానికి ప్రధాన కారణాలు
    సాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.

    • బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.

    • ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి.

    • ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.

    1983లో ఏం జరిగిందంటే.. 
    1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్‌ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.

    నేటి బంగారం, వెండి ధరలు 
    నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

Movies

  • కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.

    (ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)

    గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.

    మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.

    కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

  • అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని ఏ దర్శకులు కూడా తీసుకోవట్లేదు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ అస్సలు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఈయన కీలక పాత్రలో నటించిన సినిమా 'బైకర్'. శర్వానంద్ హీరో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోనే రాజశేఖర్.. తనకు అవకాశాలు ఇవ్వాలని బతిమలాడుకున్నారు.

    (ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)

    ఒకప్పుడు హీరోగా హిట్స్ కొట్టిన చాలామంది ఇప్పుడు తెరమరుగైపోయారు. మధ్యలో విలన్, సహాయ పాత్రలతో జగపతిబాబు లాంటి వాళ్లు వచ్చారు. ఒకరిద్దరు మాత్రమే బలంగా నిలబడ్డారు. ఇప్పుడు రాజశేఖర్ 'బైకర్'లో హీరో తండ్రిగా, రేసింగ్ కోచ్‌గా మంచి నిడివి ఉన్న పాత్రనే చేసినట్లున్నారు. అయితే తనని ఏ దర్శకుడు కూడా సంప్రదించకపోయేసరికి.. స్వయంగా ఈయనే 'ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి' అని రిక్వెస్ట్ చేశారు.

    సెకండ్ స్టేజీకి వచ్చేశానని ఇన్నాళ్లు అనుకున్నానని.. కానీ అలాంటివేం ఇ‍ప్పుడు లేవని తన కూతుళ్లు చెప్పడంతోనే 'బైకర్'లో నటించానని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ఈ చిత్ర షూటింగ్‌లో తనని రెండో హీరోలా ట్రీట్ చేశారని, శర్వానంద్ కూడా నేనే హీరోని అన్నట్లు ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా రాజశేఖర్ లాంటి నటుడు.. ఇలా అవకాశాల కోసం బతిమలాడుకోవడం వింతగా అనిపించింది. రీసెంట్ టైంలో అయితే గోటీల ఫ్యాక్టరీ అనే మాటతో తెగ వైరల్ అవుతున్నారు.

    (ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

  • చీరలో అందాలు చూపించేస్తున్న ఆషిక

    వావ్ అనేలా మెరిసిపోతున్న తమన్నా

    గ్లామరస్ వీడియోతో సంయుక్త హొయలు

    మెరుపు తీగ కంటే సన్నగా మౌనీ రాయ్

    మాల్దీవుల్లో చిల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్

    కన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ మెరుపులు

  • మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌ కన్నన్‌ సాగర్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వీలైనంత త్వరగా బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తనకు లేదని, దాతలు సాయం చేయాలని కోరుతున్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ నోట్‌ వదిలాడు.

    కుటుంబ బాగోగులు 
    ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కోనివారు ఈ ప్రపంచంలో ఉండరు. అలాగే సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతని ఎవరు కాదనగలరు? మన సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తాం, పిల్లల్ని చదివిస్తాం.. వాళ్ల బాగోగులు చూసుకుంటాం. అలాగే మనకున్నదాంట్లోనే పక్కవాళ్లకు కూడా సంతోషాన్ని పంచే ప్రయత్నం చేస్తాం.

    పిడుగులాంటి కుదుపు
    కానీ సడన్‌గా అనారోగ్యం అనే ఓ పిడుగులాంటి వార్త మన జీవితాలను కుదిపేస్తుంది. మోయలేనంత భారాన్ని, బాధను తీసుకొస్తుంది. మన దారుల్ని మూసేస్తుంది.. ఇప్పుడెలా ముందుకెళ్తావని ప్రశ్నిస్తుంది. దృడ సంకల్పంతో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్థిక అంశాలు వెనక్కులాగుతాయి. అప్పుడే మన నిస్సహాయ స్థితి అర్థమై.. ఇతరుల సాయం కోసం వెతకడం మొదలుపెడతాం. 

    గుండె సమస్య
    ఇలా సాయం కోసం అర్థించడం బలహీనత అని నేననుకోను. ఎందుకంటే మన పరిస్థితి గురించి తెలిసినప్పుడే మంచి మనసున్నవారు మనకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాను. నిన్ననే యాంజియోగ్రామ్‌ చేయించుకున్నాను. గుండె రక్తనాళాల్లో పూడిక ఉందని తెలిసింది. 

    ఓదారుస్తున్నా
    తక్షణమే బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు. ఈ విషయం తెలిసినప్పటినుంచి నా భార్యాపిల్లలు బాధతో ఏడుస్తూనే ఉన్నారు. వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ, ఆపరేషన్‌ చేయించుకునేంత స్థోమత నాకు లేదు. సాయం కోసం చూస్తున్నా అన్నాడు. కన్నన్‌ సాగర్‌.. మలయాళంలో చార్లీ, అన్వేషిప్పిన్‌ కండేతుమ్‌, కర్ణన్‌ నెపోలియన్‌ భగత్‌ సింగ్‌ సినిమాల్లో నటించాడు.

    చదవండి: లాభాల్లో 70% వాటా డిమాండ్‌ చేస్తున్న స్టార్‌ హీరో

  • శర్వానంద్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బైకర్'. ఒకప్పటి హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అభిలాష్ రెడ్డి దర్శకుడు కాగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది. లెక్క ప్రకారం గతేడాది డిసెంబరులోనే ఈ మూవీ రిలీజవ్వాలి. కానీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అదిరిపోయిందని చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

    రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. అందులోనూ బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు అయితే రాలేదు. ఇందులో శర్వానంద్, రాజశేఖర్.. తండ్రికొడుకులు పాత్రలు చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఉన్నాయి. మరి మూవీ ఏం చేస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?)

  • అమరన్‌ సినిమా తర్వాత శివకార్తికేయన్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన సినిమాలకు మార్కెట్‌ వాల్యూ కూడా పెరిగింది. అది దృష్టిలో పెట్టుకున్న హీరో కేవలం పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడుగుతున్నాడు. మదరాసి, పరాశక్తికి ఇదే రూల్‌ ఫాలో అయ్యాడట.. ఇప్పుడు తన నెక్స్ట్‌ సినిమాకు కూడా ఇదే విధానం అమలు చేయనున్నాడంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.

    సెయాన్‌ అంటే..
    శివకార్తికేయన్‌ ప్రస్తుతం సెయాన్‌ సినిమా చేస్తున్నాడు. స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నాడు. అమరన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై శివకార్తికేయన్‌ చేస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీతోనే శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెయాన్‌ అంటే కుమారస్వామికి మరో పేరు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

    లాభాల్లో వాటా
    ఈ మూవీకి శివకార్తికేయన్‌ భారీ పారితోషికాలు గట్రా అడగలేదట! లాభాల్లో వాటా అడిగాడట! ఇప్పటికే రూ.10 కోట్ల అడ్వాన్స్‌ తీసుకున్న హీరో సినిమా రిలీజయ్యాక 70% లాభాలను డిమాండ్‌ చేశాడని తెలుస్తోంది. అంటే మిగిలిన 30% మాత్రం కమల్‌ హాసన్‌ బ్యానర్‌కు వెళ్తాయి. సెయాన్‌ బడ్జెట్‌ రూ.35 కోట్లని తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత జరగనుంది? బాక్సాఫీస్‌ వద్ద ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి!

    చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రయిన బాలీవుడ్‌ నిర్మాత

  • ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.

    (ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)

    గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.

    అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్‌లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్‌లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.

    'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్‌లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్‌లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?

    (ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)

  • బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్, హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శకనిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఒక స్పెషల్‌ వీడియోతో ముందుకు వచ్చారు.

    ఏలియన్‌కి డ్యాన్స్‌
    "జాదూ వర్సెస్ రాకీ" అని టైటిల్‌ ఇచ్చిన ఈ వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ 'ఏక్ పల్ కా జీనా' ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ 'రాకీ'కి నేర్పిస్తున్నట్లు చూపించారు.  హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, 'కోయీ.. మిల్ గయా'లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు 'జాదూ' క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ.

    హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం, 'ది మార్షియన్' ఫేమ్ ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కింది. 2025 డిసెంబర్‌లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. 

    హృతిక్ లాంటి స్టార్ తమ సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి షోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్‌లో మార్చి 26న విడుదల కానుంది.

     

     

  • ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెన తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. 50 ఏళ్ల వయసులో తండ్రయ్యాడు. మధు మంతెన - ఐరా త్రివేది దంపతులకు ఆదివారం (మార్చి 22) తెల్లవారుజామున పండంటి మగ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా మధు మంతెన- ఐరా త్రివేది దంపతులు ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ ఏడాది జనవరి 15న వెల్లడించారు. 

    బిడ్డ కోసం ఎదురుచూపులు
    భార్య బేబీ బంప్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మార్చిలో డెలివరీ డేట్‌ ఇచ్చినప్పటినుంచి బిడ్డ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు బాబు ఈ ప్రపంచంలో అడుగుపెట్టగానే వారి కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

    రెండో పెళ్లి
    హైదరాబాద్‌కు చెందిన మధు మంతెన.. 2015లో ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వైవాహిక జీవితం ఎంతోకాలం సజావుగా సాగలేదు. దీంతో 2019లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యోగా ట్రైనర్‌ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ఈయన గతంలో తెలుగులో కార్తీక్‌ మూవీని నిర్మించాడు. ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. ఆమిర్‌ ఖాన్‌ గజిని, క్వీన్‌, సూపర్‌ 30, రక్త చరిత్ర వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు.

    చదవండి: ధురంధర్‌ 2 నుంచి నన్ను తీసేశారనుకున్నా: బాలీవుడ్‌ నటుడు

  • గతంలో పవన్ కల్యాణ్ వరస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు 'దబంగ్'ని రీమేక్ చేసి 'గబ్బర్ సింగ్' తీసిన దర్శకుడు హరీశ్ శంకర్ హిట్ కొట్టాడు. ఇది 2011లో జరిగింది. మూవీలో కంటెంట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేసరికి ప్రేక్షకులు ఆదరించారు. దాదాపు అదే టెంప్లేట్‌తో తీసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ అభిమానుల కోసం దీన్నే తీశానని హరీశ్ శంకర్ మొదటి నుంచి చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్లే ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ఆడియెన్స్‌కి నచ్చలేదు. బుకింగ్సే అందుకు నిదర్శనం.

    (ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)

    ఇప్పుడు పవన్‌తో మరో సినిమా తీస్తానని హరీశ్ శంకర్ అంటున్నాడు. ఈసారి స్టోరీ కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చేలా తీస్తానని అంటున్నాడు. అయితే ఈ దర్శకుడు మూవీ చేస్తానని అనడం బాగానే ఉంది గానీ పవన్ ఒప్పుకొన్నాడా లేదా అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి మూవీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఒప్పుకొన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి తర్వాత మూవీస్ చేస్తాడా అనేది సందేహమే.

    హరీశ్ శంకర్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. అప్పుడెప్పుడో వచ్చిన 'గబ్బర్ సింగ్' హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో దువ్వాడ జగన్నాథం, సుబ్రమణ్యం ఫర్ సేల్ ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. గద్దలకొండ గణేశ్, మిస్టర్ బచ్చన్ లాంటి రీమేక్స్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇప్పుడు తీసిన 'ఉస్తాద్..' ప్రకటించి, పూర్తి చేసి రిలీజ్ చేయడానికే ఐదేళ్లు పట్టేసింది. ఇప్పుడు మరో సినిమా అంటే అయ్యే పనేనా అని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకొన్న ప్రొడ్యూసర్ ఎవరనేది చూడాలి?

    (ఇదీ చదవండి: 'పెద్ది'కి ఐటమ్ బ్యూటీ దొరికేసింది!)

  • రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'పెద్ది'.. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే షూటింగ్ నడుస్తుండటంతో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. మరోవైపు చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించడంతో వాయిదా లాంటిది లేదని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారా అనే ప్రశ్న కూడా ఇంకా అలానే మిగిలిపోయింది. ఫైనల్‌గా దానికి సమాధానం దొరికేసినట్లు కనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)

    గతంలో 'పెద్ది' ఐటమ్ కోసం పూజా హెగ్డే, ఆయేషా ఖాన్, మృణాల్ ఠాకుర్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ పాట షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండేసరికి ఎవరిని తీసుకున్నారనే విషయం బయటకు రాలేదు. చివరకు ఇప్పుడు ముందు అనుకున్న వాళ్లలో మృణాల్ ఠాకుర్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈమె హీరోయిన్‌గా చేసిన 'డకాయిట్' రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు ప్లస్ 'పెద్ది' సాంగ్ చేసేందుకుగానూ రాబోయే కొన్నిరోజులు ఈమె హైదరాబాద్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

    ఈ ఐటమ్ పాటలో చరణ్-మృణాల్‌తో పాటు జాన్వీ కపూర్ కూడా కాసేపు కనిపిస్తుందని అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ విలేజ్ డ్రామాగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా రెండూ సూపర్ హిట్ అయ్యాయి. 

    (ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)

  • పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఘర్షణల కారణంగా షకీరా భారత సంగీత కచేరీ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీలలో జరగాల్సిన ఈ ప్రదర్శనలను "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రాంతీయ ఉద్రిక్తతల" కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్టు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని చెప్పారు.

    ఈ కార్యక్రమం గురించి నిర్వహాకులు ఇలా ప్రకటించారు. "ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా.. షకీరా పాల్గొనవలసిన 'ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్' మరో తేదీకి వాయిదా వేయబడింది. అభిమానుల రక్షణే మా యూనిట్‌  అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టిక్కెట్టు కొనుగోలు చేసిన వారందరికీ పూర్తి వాపసు ఇవ్వబడుతుంది," అని డిస్ట్రిక్ట్ అప్‌డేట్స్ ఇన్‌స్టాగ్రామ్ తమ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పేర్కొంది.

    కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. కొలంబియన్ సింగర్‌ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్‌లో తొలిసారి ముంబైలో(2007)  ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి  ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది.

  • మహిళల వస్త్రధారణ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంది దుస్తులు ధరించాలనేది వారిష్టం కానీ, సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెలగాలని ఆమె అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం, వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలి. 

    నేను ఏదైనా ఒక పెళ్లికి వెళితే కచ్చితంగా చీర కట్టుకొనే వెళ్తాను. అలాగే నా ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి వెళితే లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా? అలా వెళ్తే.. అందరూ కింది నుంచి పైవరకు అలా చూస్తారు(నవ్వుతూ..).  మనం వెళ్లే సందర్భాన్ని బట్టి దుస్తులు ఉండాలి. 

    టీనేజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్‌ ఇలాంటి డ్రెస్‌ వేసుకొద్దు.. అలా రెడీ కావాలని చెబుతుంటారు. అది మనకు కండీషన్లు పెట్టినట్లు కాదు..బయట సమాజం గురించి తెలియదు కాబట్టే వాళ్లు ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం. నాక్కుడా నాన్న అలాంటి సలహా ఇచ్చేవారు. అమ్మ కూడా ‘ఇది నీకు సెట్‌ అవ్వలేదు..అది వేసుకో బాగుంటుంది’ అని చెప్పేది. అందులో తప్పేం లేదు. టీనేజ్‌ దాటిన తర్వాత కూడా అలాంటి కండీషన్లు పెట్టడం కరెక్ట్‌ కాదు. వాళ్లకు తెలుసు. ఏ డ్రెస్‌ వేసుకుంటే.. ఎలాంటి కామెంట్స్‌ చేస్తారో. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు ధరించాలి’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

    నిహారిక కెరీర్‌ విషయానికొస్తే.. నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి.. నిర్మాణ సంస్థపై ఫోకస్‌ చేసింది. తన బ్యానర్‌  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోంది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కాబోతుంది. 

     

  • రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్‌ 2 బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్‌ ఇక్బాల్‌.. బడే సాహెబ్‌ అలియాస్‌ దావూద్‌ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్‌ 1 రిలీజయ్యాక సీక్వెల్‌లో బడే సాహెబ్‌గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. 

    నన్ను తీసేశారనుకున్నా..
    ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్‌ ఖాన్‌, ఇమ్రాన​ హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్‌ కోసం అప్పటికే నేను సెలక్ట్‌ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్‌ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌కు ఫోన్‌ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.

    ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదు
    కానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్‌, దావూద్‌ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్‌ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్‌ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్‌ ముషారఫా? ఒసామా బిన్‌ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.

    మేకప్‌ కోసం 12 గంటలు
    ముసలి వయసులో ఉన్న దావూద్‌గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్‌ మేకప్‌ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్‌కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్‌ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

  • బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీ అవుతుందని చాలామంది వాదన. ఆ విషయం తాను కూడా అంగీకరిస్తానంటోంది హీరోయిన్‌ శృతి హాసన్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నెపోకిడ్‌ వంటి అంశాల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేనస్సలు ఫైట్‌ చేయను. ఎందుకంటే నాకు తొలిసారి పాట పాడే అవకాశం చాలా ఈజీగా లభించింది. 

    నా గొంతు ఇబ్బంది
    ఇళయారాజా సర్‌ సంగీత దర్శకత్వంలో నాన్న సినిమాలోనే తొలిసారి పాట పాడాను. నా వాయిస్‌ గంభీరంగా ఉంటుందని ఇళయరాజా అంటుండేవారు. ఒకసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్‌పై అరుస్తున్నాను. అప్పుడాయన నీ గొంతులో మంచి రేంజ్‌ ఉందన్నారు. అయితే ఆయన్ని ఇంప్రెస్‌ చేసిన నా గొంతు చాలామందికి మాత్రం డామినెంట్‌గా అనిపించింది.

    నాన్న సలహా తీసుకోను
    నేను చిన్నప్పుడే పండిత్‌ మనోహర్‌ కులకర్ణి, సురేశ్‌ వాడక్కర్‌ వంటి మహామహుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. అలా నాకు మంచి గురువులు లభించారు. కెరీర్‌లో ఏం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అనే విషయంలో ఎన్నడూ నాన్న సలహా తీసుకోలేదు. అలాగే రజనీకాంత్‌ను కూడా సలహా అడగలేదు. కాకపోతే వాళ్లిద్దరూ చాలా కష్టపడతారు. 

    పిచ్చి రీల్స్‌ 
    దాన్ని ఇబ్బందిగా ఫీలవకుండా ఇష్టంగా, నిశ్శబ్ధంగా కష్టపడతారు. సినిమా కోసం ప్రాణాలైనా ఇస్తారు.. ఇద్దరూ పని రాక్షసులు. అటు ఆఫీసును, ఇటు ఇంటిని చక్కగా నిర్వహిస్తారు. నాన్నయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే పిచ్చి రీల్స్‌ ఏవేవో పంపుతాడు. అది చూసినప్పుడు ఈ ఆంటీ ఫన్నీగా ఏం లేదు నాన్నా అంటుంటాను. అప్పుడాయన కొన్ని మంచి రీల్స్‌ పంపుతాడు.. 

    అలాంటి వీడియోలు ఇష్టం
    చిన్న పాప అందంగా పాడుతున్నట్లు, గ్రామాల్లో వంట చేసే వీడియోలు.. ఇలాంటివి చూసి ఆయనెంతగానో సంతోషిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. కాగా ఐదేళ్లకే సింగర్‌గా పరిచయమైంది శృతి హాసన్‌. తేవార్‌ మగన్‌ (1992) మూవీలో పొట్రి పాడది పొన్నె అనే పాట ఆలపించింది. తర్వాత హీరోయిన్‌గా ఎక్కువ క్రేజ్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం సింగర్‌గా, హీరోయిన్‌గా రాణిస్తోంది.

    చదవండి: మహేశ్‌బాబు సెట్‌లో ఎలా ఉంటారంటే?: బాలీవుడ్‌ నటి

  • ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోమనే చెబుతున్నారు. మరికొంతమంది అయితే తనకు నచ్చిన అబ్బాయి దొరికితే చేసుకుంటా..లేదంటే సింగిల్‌గానే ఉంటామని అంటున్నారు. తాజాగా కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కూడా అదే కామెంట్‌ చేసింది. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి కాదని, తోడు కావాలనుకుంటే సహజీవనం బెటర్‌ అని చెబుతోంది ఈ 34 ఏళ్ల సుందరి. 

    తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘గత 30 ఏళ్ల నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలను ఎన్నో చూశా. వారిలో సంతోషంగా జీవితం గడుపుతున్నవారు చాలా తక్కువ. పెళ్లి తర్వాత భాగస్వామి కెరియర్‌లో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింపజేశాయి. ఒకప్పుడు అందరి అమ్మాయిల్లాగానే నేను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. నా ఫ్రొఫైల్‌ని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లోనూ పెట్టాను. అయితే నా ఫోటో చూసి ఫేక్‌ ప్రొఫెల్‌ అనుకున్నారు. అదే సమయంలో నాకు పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయింది.

    నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.  ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అయితే అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే భాగస్వామి కావాలి. కానీ ఆ బంధం నిలబడడానికి పెళ్లి అనే ట్యాగ్‌ అవసరం లేదు. ఇద్ధరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే.. సహజీవనం చేయడం బెటర్‌. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే పెళ్లి కంటే ముందే సహజీవనం చేయడమే మంచిది.’ అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

    ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక  2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం  రోహిత్ కెపి దర్శకత్వంలో వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌కి జోడీగా నటిస్తోంది.

  • టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాలకు ఆమె భర్త ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ సుమ బర్త్‌ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను వ్యక్తం చేశారు. తెలుగులో వేద మంత్రాన్ని రాస్తూ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  నిండూ నూరేళ్లు… కాదు కాదు.. ఒక 120–130 ఏళ్లు మీ మనవలు, మనవరాళ్లతో హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నానంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు రాజీవ్ కనకాల. ఇది చూసిన అభిమానులు సైతం సుమకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 

    కాగా.. రాజీవ్ కనకాల, సుమ 1999లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కుమారుడు రోషన్ ‍టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి పరిచయం సీరియల్స్‌తోనే మొదలైంది. అలా ప్రేమలో పడిన ఈ జోడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సరదా వ్యాఖ్యలు చేశారు. సుమ - రాజీవ్ కలిసి నటించిన సూపర్‌ హిట్‌ సీరియల్‌ 'శాంతి నివాసం' సీరియల్‌తోనే వారి మధ్య ప్రేమ చిగురిందని అన్నారు.

  • ఐకాన్ స్టార్ అ‍ల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్ట్‌లోకి(AA 22) బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప-2 తర్వాత బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు భారీ క్రేజ్‌ ఏర్పడింది. దీంతో తను నటించబోయే సినిమాల్లో హిందీ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నట్లు టాక్‌. ఇప్పటికే అట్లీ సినిమా కోసం దీపికా పదుకోణ్‌ను తీసుకున్నారు.  లోకేశ్‌ కనగరాజ్‌ మూవీ కోసం శ్రద్ధా కపూర్‌ పేరు పరిశీలనలో ఉంది. ఇంతలోనే మరో క్రేజ్‌ హీరోయిన్‌ పేరు తెరపైకి రావడం విశేషం.

    అ‍ల్లు అర్జున్- అట్లీ మూవీ కోసం అనుష్క శర్మను తీసుకోనున్నట్లు బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. కానీ, ఈ వార్త వైరల్‌ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క ఈ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయనున్నారు. క్రికెటర్‌ కోహ్లీతో వివాహం తర్వాత అనుష్క కాస్త సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్‌తో సినిమా కావడంతో ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

    AA22 చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.  ఈ సైన్స్‌ఫిక్షన్‌ మూవీలో హీరో పాత్ర మూడు విభిన్న కోణాల్లో సాగుతుందని టాక్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ దీపికా పదుకొణ్‌తో పాటు అనుష్క శర్మ ఎంట్రీ ఇస్తే ఇదో సంచలనంగా మారడం ఖాయం.

Sports

  • న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్ అమేలియా కెర్ అరుదైన రికార్డు సాధించింది. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అమేలియా కెర్ వ‌రుస‌గా పదోసారి 30కి పైగా పరుగులు సాధించ‌డం విశేషం. సౌతాఫ్రికా మ‌హిళ‌ల‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా అమేలియా ఈ ప్రపంచ రికార్డును అందుకుంది. 

    ఈ నేప‌థ్యంలోనే పురుషుల,మ‌హిళ‌ల క్రికెట్‌లోనూ ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు కూడా అమేలియా కెర్ తాజాగా త‌న పేరిట లిఖించుకుంది. గ‌తంలో అమేలియా కెర్ సహా శ్రీలంక‌కు చెందిన చ‌మేరి ఆట‌ప‌ట్టు, రోమానియాకు చెందిన రెబెక్కా బ్లేక్‌లు 9 సార్లు వ‌రుస‌గా 30కి పైగా స్కోర్లు సాధించారు.

    తాజాగా వీరిని వెన‌క్కినెట్టిన అమేలియా కెర్‌ అగ్ర‌స్థానంలో నిలిచింది. పురుషుల క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ (భార‌త్‌), అభిషేక్ శ‌ర్మ (భార‌త్‌), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (పాకిస్థాన్‌), హ్రిస్టో లాకోవ్‌లు వ‌రుస‌గా ఏడుసార్లు 30కి పైగా స్కోర్లు సాధించారు. ఇదే మ్యాచ్‌లో మరో కివీస్‌ బ్యాటర్‌ సోఫీ డివైన్ కూడా అరుదైన రికార్డు సాధించింది. 

    మ్యాచ్‌లో 34 బంతుల్లో 64 ప‌రుగులు చేసిన సోఫీ డివైన్.. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై 10సార్లు 50 ప్ల‌స్ స్కోర్లు సాధించిన బ్యాట‌ర్‌గా నిలిచింది. గ‌తంలో బాబ‌ర్ ఆజ‌మ్ (వ‌ర్సెస్ న్యూజిలాండ్‌), స్మృతి మంధాన (వ‌ర్సెస్ ఇంగ్లండ్‌), బెత్‌ మూనీ (వ‌ర్సెస్ భార‌త్‌) తొమ్మిదేసి సార్లు 50 ప్ల‌స్ స్కోర్లు సాధించారు. మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

    మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే కివీస్ 3-1తో సిరీస్ కైవ‌సం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. అనంత‌రం కివీస్ మ‌హిళ‌లు 18.3 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 160 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. జెస్ కెర్ ప్లేయ‌ర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నామ‌మాత్ర‌మైన ఐదో టీ20 బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.

    చదవండి: IPL 2026: అభిమానుల కన్నీటిపర్యంతం!

  • ఎంఎస్‌ ధోని.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టీమిండియాకు రెండుసార్లు ఐసీసీ వరల్డ్‌కప్‌లు అందించిన ధోనికి అభిమాన గణం కూడా ఎక్కువే. ధోని నడిచినా, నవ్వినా, బ్యాటింగ్ చేసినా అతడి మైకంలో మునిగితేలిన అభిమానులు ఎందరో ఉన్నారు. అతడు మైదానంలోకి దిగుతున్నాడంటేనే ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారిపోతుంది. 

    అచ్చం అలాంటి సంఘటనే చెపాక్ స్టేడియంలో మరోసారి జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా సీఎస్‌కే తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్న ధోని ఆదివారం అలా చెపాక్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడో లేదో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. విషయంలోకి వెళితే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగితేలారు. మ్యాచ్ జరగనప్పటికీ చెపాక్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. 

    దీనికి ప్రధాన కారణం ధోనినే అన్న సంగతి తర్వాతి క్షణంలోనే తెలిసొచ్చింది. సీఎస్‌కే ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిన సమయంలో ధోని అలా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.  పెవిలియన్ ఎండ్ నుంచి చిన్నగా నడుచుకుంటూ గ్రౌండ్ మధ్యలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రేక్షకులంతా లేచి నిలబడి ‘ధోని.. ధోని.. ధోని’.. ‘తలా.. తలా’ అంటూ అరుపులు, కేకలతో స్టేడియం దద్దరిల్లింది. 

    ఇదే సమయంలో కొంతమంది అభిమానులు ధోనిని చూసి ఎమోషన్‌ను అదుపు చేసుకోలేక కన్నీటిపర్యంతమవ్వడం కనిపించింది.  ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలలికినప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి ధోనిని చూడగానే అభిమానుల్లో దుఃఖం బయటికి రావడానికి ‘ధోనికి బహుశా ఇదే చివరి సీజన్‌’ అనే కారణం కూడా ఉండొచ్చు.  

    కొంతకాలంగా ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది.  దీనికి సంబంధించిన వీడియోనూ సీఎస్‌కే యాజమాన్యం తన ‘ఎక్స్‌’లో షేర్ చేసుకోవడంతో వైరల్‌గా మారింది. ఇక 2023లో విజేతగా నిలిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో మరోసారి టైటిల్ సాధించి ధోనికి ఘనమైన వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ఈసారి సీఎస్‌కేకు సంజూ శాంసన్ రాకతో జట్టుకు అదనపు బలం చేకూరినట్లయింది. ఇక ఐపీఎల్ 19వ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

    చదవండి: 21 సిక్సర్లతో ఆర్సీబీ మాజీ ఆటగాడి విధ్వంసం!

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ ఆటగాడు  స్వస్తిక్ చికారా అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని స్వస్తిక్‌ లీగ్‌లో 69 బంతుల్లోనే 195 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్‌పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

    పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. 69 బంతుల్లో 195 పరుగులు బాదిన స్వస్తిక్‌ చికారా ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే 126 పరుగులు వచ్చాయంటే ఊచకోత ఏ రేంజ్‌లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. 

    చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. ఈ దశలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అలరించినప్పటికీ డబుల్‌ మార్క్‌కు ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు.  అనంతరం 308 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ కు దిగిన హిండన్‌ టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

    ఎవరీ స్వస్తిక్‌ చికారా?
    భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధ్య క్రికెటర్‌గా భావించిన స్వస్తిక్‌ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్‌లో 499 పరుగులు సాధించిన స్వస్తిక్‌ చికారా టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు. 

    దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్‌లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేసింది. కానీ వేలంలో స్వస్తిక్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.

    చదవండి: క్ష‌మాప‌ణ చెప్పిన‌ పీసీబీ చైర్మ‌న్‌!

  • ప‌శ్చిమాసియాలో భీక‌ర యుద్ధం పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)పై ప్ర‌భావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రగ‌నుంది. యుద్ధం కార‌ణంగా త‌లెత్తిన చమురు సంక్షోభం, ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌డం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌ని పీఎస్ఎల్ నిర్వాహ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. 

    ఈ నేప‌థ్యంలో పీసీబీ చైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ క్రికెట్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. 'ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్ర‌భావం కార‌ణంగా దేశంలో ఇంధ‌న సంక్షోభం త‌లెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్ర‌జ‌లంద‌రూ త‌మ రాక‌పోక‌ల‌ను ప‌రిమితం చేసుకోవాల‌ని ప్ర‌ధాని కోరారు. ప‌రిస్థితుల‌న్నింటిని గ‌మనించి, మా భ‌ద్ర‌తా సంస్థ‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ప్రేక్ష‌కులు లేకుండా పీఎస్ఎల్‌ను నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాం. 

    10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే జ‌రుగుతాయి. ఫైన‌ల్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించే విష‌య‌మై ఆలోచిస్తాం.  ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్‌, క‌రాచీ వేదిక‌ల్లోనే జ‌రుగుతుంది. అంతేకాదు చ‌మురు సంక్షోభం కార‌ణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుక‌ల‌ను కూడా ర‌ద్దు చేశాము. 

    అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తుండ‌డంతో గేట్ రెవెన్యూలో వ‌చ్చిన న‌ష్టానికి ఫ్రాంచైజీల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌నున్నాం. అఫ్గానిస్థాన్‌కు స‌రిహ‌ద్దుగా ఉండ‌డంతో పెషావ‌ర్ స్టేడియంను మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ నుంచి తొల‌గించినందుకు కూడా న‌ఖ్వీ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.

    చదవండి: లక్నో సూపర్‌జెయింట్స్‌ కథ మారేనా?

  • ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ కొత్తగా ప్రవేశించాయి. తమ తొలి సీజన్‌లోనూ గుజరాత్‌ టైటాన్స్‌ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపిస్తే.. లక్నో ప్లేఆఫ్స్‌కు చేరి ఆకట్టుకుంది. 2023 సీజన్‌లోనూ లక్నో జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. 

    2024 సీజన్‌లో లీగ్‌ దశకే పరిమితమైన లక్నో 2025లో కెప్టెన్‌ను మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత సీజన్‌లోనూ పంత్‌ కెప్టెన్సీలోని లక్నో సూపర్‌జెయింట్స్‌ జట్టు లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం గత అనుభవాలను తిరగరాస్తూ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటాలని పంత్‌ సేన పట్టుదలతో ఉంది. 

    అదొక్కటే ఊరట!
    మిగతా జట్లతో పోలిస్తే ప్లేయర్ల గాయాల బాధ లేకపోవడం ఒకింత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. షమీ, నోర్ట్జే, మోసిన్‌‌ ఖాన్‌, ఆవేశ్‌ఖాన్‌, మయాంక్‌ యాదవ్‌ లాంటి పేసర్లు ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించగలరు. మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో లక్నో బలాలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాం.

    లక్నో జట్టులో హార్డ్‌హిట్టర్లకు కొదువలేదు. పొట్టి ఫార్మాట్‌లో తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చే శక్తి ఉన్న ప్లేయర్లు లక్నో సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ఆటతీరుతో ముద్రవేసిన మార్కరమ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, నికోలస్‌ పూరన్‌, మిచెల్‌ మార్ష్‌ లక్నోకు కొండంత బలం. వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్న మ్యాచ్‌ ఫలితం మారినట్లే.

    విదేశీ ప్లేయర్లే బలం..
    ఇటీవలి టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన మార్కరమ్‌.. మిచెల్‌ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టే అవకాశముంది. మరోవైపు గత రెండు సీజన్లలో 499, 524 పరుగులతో జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన నికోలస్‌ పూరన్‌ లక్నోకు అదనపు ఆకర్షణ. అవసరమైతే కీపర్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉండే పూరన్‌..మిడిలార్డర్‌తో పాటు ఆఖర్లో మెరుపులు మెరిపించడంలో దిట్ట. ఇక​ కెప్టెన్‌ పంత్‌ ఫామ్‌ కొంత ఆందోళన కల్గిస్తున్నది. 

    గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన పంత్‌ ఈసారైనా మెరుపులు మెరిపిస్తాడని ఫ్రాంచైజీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి ఇంగ్లిస్‌, నోర్ట్జే, హసరంగ వంటి ప్లేయర్లను వేలంలో తీసుకున్న లక్నో..వెటరన్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ, అర్జున్‌ టెండూల్కర్‌లను ట్రేడ్‌ ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన షమీ దేశవాళీ సీజన్‌లో దుమ్మురేపాడు.

    షమీ కథేంటి?
    తన సూపర్‌ స్వింగ్‌తో అటు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీతో పాటు రంజీల్లోనూ అదరగొట్టాడు 2027 వన్డే ప్రపంచకప్‌ కోసం ఇస్పటి నుంచే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టిన బీసీసీఐ..షమీని పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. జట్టులో కొంత మందికి గాయాల బెడద తోడు ఫిట్‌నెస్‌ సమస్యలు జట్టుకు ప్రతికూలంగా మారనున్నాయి. మిస్టరీ స్పిన్నర్‌ హసరంగకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు నుంచి ఎన్‌వోసీ మంజూరు కాలేదు. 

    మరోవైపు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్‌ నోకియా తరుచూ గాయాల పాలు అవుతుండటం జట్టుకు ఆందోళన కల్గిస్తున్నది. బౌలింగ్‌ పరంగా పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్న లక్నోకు ఫిట్‌నెస్‌ పెద్ద సమస్యగా మారింది. షమీ, ఆవేశ్‌ఖాన్‌, మయాంక్‌ యాదవ్‌ పూర్తి సీజన్‌ జట్టుకు అందుబాటులో ఉంటారా అన్నది అనుమానమే. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

    చదవండి: బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!

  • ఫార్ములా వ‌న్ రేసులో రారాజులే ఎక్కువ‌గా క‌నిపిస్తారు.  మైకెల్ షుమాక‌ర్‌, లూయిస్ హామిల్ట‌న్‌, వెర్‌స్టాపెన్ వంటి ఎంద‌రో దిగ్గ‌జాల‌ను ఫార్ములా వ‌న్ రేస్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. భార‌త్‌లో కూడా ఫార్ములా వ‌న్ రేసుపై మ‌క్కువ ఇటీవ‌లే కాలంలో పెరిగిపోయింది. ఫార్ములా వ‌న్ అబ్బాయిలే ఎక్కువ‌గా ఇష్ట‌పడతారనేది ఎక్కువ‌గా వినిపిస్తుంది. 

    కానీ భార‌త్‌లో మాత్రం 11 ఏళ్ల అతికా మిర్ మాత్రం అబ్బాయిల‌కు ధీటుగా ఫార్ముల్ వ‌న్‌లో దూసుకెళ్తోంది. యూరోపియ‌న్ స‌ర్క్యూట్‌లో అతికా మిర్ త‌న తొలి ప్ర‌యత్నంలో (12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య‌) నిర్వ‌హించే రేస్ కార్టింగ్‌లో అంచ‌నాలకు మించి రాణించింది. అయితే రేసింగ్ ఇప్ప‌టికీ పురుషాధిక్య క్రీడగానే ఉండ‌డంతో త‌ర‌చూ అబ్బాయిల చేతిలో బెదిరింపుల‌కు గుర‌య్యేదానిన‌ని అతికా మిర్ చెప్పు కొచ్చింది. 

    అతికా మిర్ కేవ‌లం త‌న ప్ర‌తిభ ఆధారంగానే మినీ (8 నుంచి 12 ఏళ్లు) విభాగం నుంచి జూనియ‌ర్ (12 నుంచి 14 ఏళ్లు) వేగంగా ప‌దోన్న‌తి పొంద‌డ‌మే గాక త‌న అద్భుత‌మైన రేసింగ్ నైపుణ్యంతో చాలా మంది దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త్ త‌ర‌ఫున అతికా మిర్ ప్ర‌పంచ వేదిక‌పై అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న భార‌తీయ కార్ట‌ర్‌గా మాత్ర‌మే గాక‌, 40 వ‌ర‌కు ఉండే కార్ట్‌లు ఉండే ర‌ద్దీగా ఉండే గ్రిడ్‌ల‌పై కూడా అతికా చాలా మంది పురుష రేస‌ర్ల‌ను వెన‌క్కి నెట్టేయ‌డం విశేషం. 

    జ‌మ్మూ క‌శ్మీర్ రాష్ట్రానికి చెందిన అతికా మిర్‌ ప్ర‌స్తుతం దుబాయ్‌లో నివ‌సిస్తోంది. నాలుగుసార్లు ప్ర‌పంచ చాంపియ‌న్ అయిన మాక్స్ వెర్‌స్టాపెన్‌ను అతికా త‌న ఆరాధ్య దైవంగా భావిస్తోంది. అతికా మిర్ రేసింగ్ కుటుంబం నుంచి వ‌చ్చింది. ఆమె తండ్రి ఆసిర్ మిర్ భార‌త మొట్ట‌మొద‌టి జాతీయ కార్టింగ్ చాంపియ‌న్‌.  

    2021లో అబుదాబిలో జ‌రిగిన ఫార్ములా వ‌న్ సీజ‌న్ ఫైన‌ల్లో లూయిస్ హామిల్ట‌న్‌, వెర్‌స్టాపెన్‌ల మ‌ధ్య జ‌రిగిన అద్భుత‌మైన టైటిల్ పోరును చూసిన‌త త‌ర్వాత అతికా మిర్ రేసింగ్‌పై ఇష్టాన్ని పెంచుకుంది.  మోటార్ రేసింగ్‌లో పురుషాధిక్యం మామూలే. అందుకే ఫార్ములా వ‌న్‌లో మ‌హిళ‌లు క‌నిపించ‌రు. కానీ న‌మ్మ‌కం, ఆత్మ‌విశ్వాసం ఇవాళ న‌న్ను రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా చేశాయి. 

    ట్రాక్‌పై అబ్బాయిలు వేధింపుల‌కు గురైన‌ప్పుడ‌ల్లా నాలో ఆత్మ‌విశ్వాసం మ‌రింత పెరుగుతూ పోయింది. 2021లో ఫార్ములా వ‌న్ రేసు ఫైన‌ల్ వీక్షించే వ‌ర‌కు నాకు పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదు.  టీవీలో అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ ద్వారా రేసింగ్‌పై మ‌క్కువ పెంచుకున్నా అని అతికా చెప్పుకొచ్చింది. 

    చదవండి: పంజాబ్ కింగ్స్‌లో లుకలుకలు!

  • న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి.  

    తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్‌హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్‌), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బ​రిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. 

    టిమ్ రాబిన్‌సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్‌గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్‌మన్‌, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.  అర్థసెంచరీతో  మెరిసిన ఎస్తర్‌హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ గెలుచుకున్నాడు.  

    మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్‌లు రెండో వికెట్‌కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత క​ఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. 

    ఎస్తర్‌హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్‌, డియాన్ ఫెరస్టర్‌లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది.

  • ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్‌ కూడా ఒకటి.  అయితే 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ ప్లేఆఫ్స్‌ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్‌లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 18వ సీజన్‌లో మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది. 

    అయితే తుది పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. పంజాబ్‌ కింగ్స్‌లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు. 

    పఠాన్‌ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ (అప్పటిక కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌)ప్లేఆఫ్స్‌కు చేరింది. తొలి సీజన్‌ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్‌లు ఇద్దరూ క్రికెట్‌పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి. 

    ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ,  మోహిత్ బర్మన్‌, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 

    18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్‌కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్‌ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్‌లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు. 

    చదవండి: '250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'

  • వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

    ప్రోటీస్ ఆల్‌రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

    కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.
    చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోతుంది'
     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గత సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెం‍జ్ ఆర్మీ తమ హోం గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది.

    అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ సీజన్ మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో చేరే అవకాశముంది. దీంతో అప్పటివరకు సన్‌రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్‌లో దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొం‍ది.

    అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను బౌలింగ్ కష్టాలు వెంటాడడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు.

    ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు.

    "కమ్మిన్స్‌, మలింగ లేకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్‌గా కన్పిస్తోంది. కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడన్ కార్స్ జట్టులో ఉన్నప్పటికి ఉపఖండ పిచ్‌లపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడడం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఓంకర్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.

    హర్షల్ పటేల్‌, జయదేవ్ ఉనద్కట్‌కు మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఎలా మేనెజ్‌చేస్తోందో ఆర్ధం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా, బౌలర్లు ఆ టోటల్‌ను డిఫెండ్ చేసుకునేలా లేరు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: వేలంలో అన్‌సోల్డ్‌.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్‌లోకి

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభానికి ముందే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా గాయం కార‌ణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మ‌రో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.

    మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్‌వోసీ లభించలేదు. అతడు ఫిట్‌నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భ‌ర్తీ చేసే ప‌నిలో ప‌డింది.

    కేకేఆర్‌లోకి సిమర్‌జీత్ 
    హ‌ర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేస‌ర్ సిమర్‌జీత్ సింగ్‌ను తీసుకోవాల‌ని కేకేఆర్ ఆస‌క్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్‌జీత్ గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్‌కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు. 

    అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మధ్వాల్‌కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్‌-2023 ఎలిమినేటర్‌లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్‌ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. 
    చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?

National

  • కదులుతున్న రైలులో అనారోగ్యానికి గురైన తన చిన్నారికి నిమిషాల వ్యవధిలోనే వైద్యుడిని ఏర్పాటు చేసి.. సకాలంలో వైద్య సహాయం అందించిన భారతీయ రైల్వేపై ఓ తల్లి ప్రశంసల జల్లు కురిపించారు. మార్చి 13న బెంగళూరు నుంచి గుజరాత్‌కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటనను ఆమె తన  ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు.

    వృత్తిరీత్యా దంత వైద్యురాలైన ఓ తల్లి.. పాపకు మునగకాయ సూప్ (drumstick soup) తాగించింది.  అనంతరం ఆ పాప పదేపదే వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. చిన్నారి పరిస్థితిపై ఆందోళన చెందిన ఆ తల్లి వెంటనే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించి రైలులో మందులు ఎలా తెప్పించుకోవచ్చని అడిగారు. వేగంగా స్పందించిన  రైల్వే సిబ్బంది.. రైలు హిందూపూర్ స్టేషన్‌కు చేరుకునే సరికి పాపకు వైద్యం అందించేందుకు అప్పటికే ఒక వైద్యుడిని సిద్ధంగా ఉంచారు. ఆ వైద్యుడు చిన్నారిని పరీక్షించి అవసరమైన మందులు అందించారు.

    "నేను నా బిడ్డకు మునగకాయ సూప్ తాగించాను.. ఆ తర్వాత, పాపకు చాలా వాంతులు అయ్యాయి.. నేను భయపడి రైలులో మందులు ఎలా ఆర్డర్ చేయాలని టీటీఈని అడిగాను. కానీ నేను వారి నుంచి పెద్దగా సహాయం ఆశించలేదు. వారు ఎంత వేగంగా స్పందించారో చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నా బిడ్డకు సహాయం ఊహించిన దానికంటే వేగంగా వైద్యం అందింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పోస్ట్‌ చేశారు

     

     

  • ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ జరిపారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది.

    పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.

    విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ (LPG) కేటాయింపులను కేంద్రం పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ (PNG) కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి.

    దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని.. ఎలాంటి రద్దీ లేదని అధికారులు తెలిపారు. సరఫరాలను మెరుగుపరిచే క్రమంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వస్తున్న ఒక కార్గో నౌక మంగళూరులోని 'న్యూ మంగళూరు పోర్టు'కు చేరుకుంది. మార్చి 14 నుంచి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్‌పీజీపై కార్గో సంబంధిత ఛార్జీలను మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

    కాగా, భారత జెండాతో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు ‘పైన్‌ గ్యాస్‌’, ‘జగ్‌ వసంత్‌’ త్వరలో ఉద్రిక్తమయ హార్మూజ్‌ గుండా పయనించి స్వదేశానికి చేరుకోనున్నాయి. గత 24 గంటలుగా హార్మూజ్‌ గుండా ఎలాంటి నౌకల సంచారం లేకపోయినా అదే జలసంధి గుండా ఈ రెండు ఎల్పీజీ నౌకలు సాహసోపేత ప్రయాణం సాగించనున్నాయని రాయిటర్స్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాన్ని నిలిపేసి హార్మూజ్‌కు దూరంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని షార్జా సమీప నౌకాశ్రయంలో ఈ రెండు నౌకలు లంగరువేశాయని, త్వరలోనే ప్రయాణం ఆరంభిస్తాయని నౌకలను ట్రాక్‌ చేసే సంస్థ ‘మెరైన్‌ట్రాఫిక్‌’ వెల్లడించింది.

     

  • గురుగ్రామ్: గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం చివరికి విషాదంగా మిగిలింది. నర్సు హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో భర్తే.. భార్యకు అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది, రేడియాలజిస్ట్ అరుణ్ శర్మ, నర్సుగా పని చేస్తున్న కాజల్ ఓ నర్సింగ్ హోమ్‌లో సహోద్యోగులుగా పరిచయమయ్యారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడాది నవంబర్‌లో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే, నాలుగు నెలలు తిరక్కుండానే వరకట్నం కోసం అరుణ్ ఆమెను హత్య చేయడంతో వారి బంధం విషాదాంతమైంది.

    వివాహం జరిగిన కొద్ది రోజులకే చిన్న చిన్న విషయాలకే అరుణ్ తన భార్యపై చేయి చేసుకునేవాడు. డబ్బు తేవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడని.. వరకట్నం కోసం వేధిండని కాజల్‌ సోదరుడు పేర్కొన్నాడు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 4న ఈ దంపతులు గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులో ఉన్న కాజల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. దాదాపు రెండు వారాల తర్వాత మార్చి 17న మద్యం మత్తులో ఉన్న అరుణ్.. కాజల్‌పై దాడి చేశాడు.

    మరుసటి రోజు ఉదయం, మాట్లాడాలని చెప్పి అరుణ్.. కాజల్‌ను కిందకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఈ కొత్త దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కాజల్ స్పృహతప్పి పడిపోయింది, ఆమె ముక్కు నుంచి రక్తం కారడం గమనించారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే సరికి పరిస్థితి చేయిజారిపోయింది; ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

    టాయిలెట్‌లో తమకు ఒక సిరంజి దొరికిందని.. అరుణ్ ఆమెకు విషం ఇచ్చి ఉంటాడని కాజల్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాజల్‌కు అరుణ్‌ మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌ పరిధిలోని బెహ్తా హాజీపూర్‌కు చెందిన అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో మాదకద్రవ్యాలు వాడే అలవాటు ఉన్నట్లు సమాచారం. 

  • జమ్మూ వర్సిటీ  ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ  పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చాఫ్టర్‌ని వెంటనే  తొలిగించాలని లేనిచో ఆందోళన మరింతగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

    జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-2028 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసన సిలబస్‌లో  'ఆధునిక భారత రాజకీయ ఆలోచన' అనే శీర్షిక కింద, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. దేశ విభజనలో పాత్ర పోషించి, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వీరే. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తోంది'. అని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

    పాఠ్యప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా, మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.

    అయితే దీనిపై పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి బల్జిత్ సింగ్ మాన్ స్పందించారు" జిన్నా మరియు ఇతర మేధావులను చేర్చడం పూర్తిగా విద్యాపరమైనదేనని, ఇది దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళికలకు, అలాగే యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని" తెలిపారు. విశ్వవిద్యాలయం ఏ భావజాలాన్నీ ప్రోత్సహించదని, కానీ విమర్శనాత్మకతకు వీలు కల్పించేందుకు భిన్నమైన దృక్కోణాలను విద్యార్థులకు అందిస్తుందన్నారు.  మంచి చెడులను అంచనా వేసి, ఏది సరైనదో ఏది తప్పో విచక్షణ కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. 

  • న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా (Head of Government) పనిచేసిన నాయకునిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నారు. ఆదివారం (మార్చి 22, 2026) నాటికి ప్రధాని పదవిలో 8,931 రోజులు పూర్తి చేసుకున్న మోదీ.. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న సుదీర్ఘకాల పదవీకాల రికార్డును అధిగమించారు. గతంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి చామ్లింగ్ 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు మోదీ ఆ మైలురాయిని అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించడంతో పాటు, భారత ప్రధానిగా మోదీ కొనసాగిస్తున్న పయనం ఈ అరుదైన ఘనతను సాధ్యం చేసింది.

    వాద్‌నగర్ నుంచి ఢిల్లీ వరకూ..
    గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించి, రైల్వే స్టేషన్‌లో తండ్రికి టీ అమ్మడంలో సాయపడిన స్థాయి నుంచి దేశాధినేత వరకు మోదీ ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2001లో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2014 వరకు సుమారు 13 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో (2014, 2019, 2024) బీజేపీని అఖండ విజయంతో గెలిపించి, హ్యాట్రిక్ ప్రధానిగా రికార్డు సాధించారు.

    దిగ్గజాల రికార్డులు బద్ధలు: మోదీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అధిగమించారు.

    ఇందిరా గాంధీ రికార్డు: 2025 జూలైలో ఇందిరా గాంధీ (4,077 రోజులు) రికార్డును అధిగమించి, అత్యధిక కాలం వరుసగా ప్రధానిగా పనిచేసిన రెండో నేతగా నిలిచారు.

    నెహ్రూతో సమానంగా: జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏకైక నేతగా మోదీ గుర్తింపు పొందారు.

    తొలి ప్రధాని: స్వతంత్ర భారతదేశంలో జన్మించి, ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి వ్యక్తి కూడా నరేంద్ర మోదీనే కావడం విశేషం. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా కూడా మోదీ తన ప్రత్యేకత చాటుకున్నారు.

    ఇది కూడా చదవండి: అస్సాం పోరు 2026: ఈ ఐదు అంశాల్లోనే ‘దోబూచులాట’

  • గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 9న జరగనున్న ఒకే దశ పోలింగ్ కోసం రాష్ట్రంలో సన్నాహాలు సాగుతున్నాయి. 126 స్థానాల కోసం జరుగుతున్న ఈ సమరంలో కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. అస్తిత్వం, సామాజిక న్యాయం, వివాదాస్పద ‘ఎవిక్షన్’ డ్రైవ్‌లు.. మొదలైనవి గెలుపోటములను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా ఐదు అంశాలు ఈసారి ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారబోతున్నాయి.

    1. జుబీన్ గార్గ్ సెంటిమెంట్
    అస్సాం సాంస్కృతిక దిగ్గజం జుబీన్ గార్గ్ 2025 సెప్టెంబర్‌లో సింగపూర్‌లో మృతిచెందడం రాష్ట్ర ప్రజలను విషాదంలోకి నెట్టింది. ఈ కేసును హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం స్పెషల్ కోర్టుకు అప్పగించినప్పటికీ, విచారణ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. యువతలో ‘వాయిస్ ఆఫ్ జనరేషన్’గా పేరొందిన జుబీన్ ప్రభావం ‘సైలెంట్ ఓటర్ల’ రూపంలో తీర్పును మార్చే అవకాశం ఉంది.

    2. ఎవిక్షన్ డ్రైవ్‌లు (ఆక్రమణల తొలగింపు)
    అటవీ భూములు, ఆలయ భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేశామని బీజేపీ కూటమి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే కాంగ్రెస్, ఏఐడీయూఎఫ్‌ మాత్రం దీనిని మైనారిటీలను లక్ష్యం చేసుకుని చేసిన మానవతా సంక్షోభంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ అంశం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కీలకం కానుంది.

    3. చొరబాటు - సీఏఏ/ఎన్‌ఆర్‌సీ చర్చ
    అక్రమ వలసల అంశం అస్సాం రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పీడిత మైనారిటీలకు రక్షణగా సీఏఏను బీజేపీ సమర్థిస్తుంటే, అస్సాం ఒప్పందాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఎన్‌ఏఆర్‌సీ ద్వారా అసలైన భారతీయులను వేధిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

    4. బాల్య వివాహాలపై ఉక్కుపాదం
    ‘పాక్సో’ చట్టం కింద ప్రభుత్వం చేపట్టిన సామూహిక అరెస్టులను ఎన్డీఏ ప్రభుత్వం ఒక చారిత్రక సామాజిక సంస్కరణగా అభివర్ణిస్తోంది. అయితే ఇది ఓటర్ల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నమని విపక్షాలు అంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉన్న మహిళా ఓటర్ల తీర్పుపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

    5. సంక్షేమం - నిరుద్యోగం
    నెలకు ₹1,250  అందించే ‘అరుణోదయ్ పథకం, టీ-వర్కర్ల సంక్షేమం, 1.6 లక్షల ఉద్యోగాల కల్పనపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అయితే పెరిగిన అప్పులు, నిరుద్యోగం, భూసేకరణ సమస్యలను ఎత్తిచూపుతూ గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దీటుగా బదులిస్తోంది.

    అస్సాం ఎన్నికల కీలక తేదీలు
    నామినేషన్ల గడువు: మార్చి 23, 2026
    పోలింగ్ తేదీ: ఏప్రిల్ 9, 2026 (ఒకే దశ)
    ఫలితాల విడుదల: మే 4, 2026

    ఇది కూడా చదవండి: Kerala Polls: వణికిస్తున్న ‘తీరప్రాంత ఓటు’

Politics

  • నర్మెట్ట:  సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌ పర్యటనలో భాగంగా ఆయిల్‌ఫామ్‌ ప్యాక్టరీని ప్రారంభించారు.  ఈ మేరకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్‌. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ 70 లక్షల మందికి రైతు భరోసా నిధులను జమ చేశాం. రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నం చేస్తోంది. పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్‌గా ఇస్తాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నాం. 

    2029లో సిద్ధిపేట నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తా. 1984 నుంచి 2029 వరకూ  ఇక్కడ ఒకే కుటుంబం అధికారంలో ఉంది. 2029 మళ్లీ వస్తాం.. సిద్ధిపేటలో మళ్లీ సమావేశం పెడతాం. కొంతమంది అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సూచనలు చేయాలి. అభివృద్ధికి అడ్డుపడతామంటే ఎలా?, చెట్టుకు పట్టిన పురుగును ఎలా వదిలించాలో తెలుసు.  అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూస్తాం’ అని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

    సీఎం రేవంత్‌ కామెంట్స్‌.. 
    రైతు భరోసాకి 3600 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేశాము. రేపు మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. మరో 45 రోజుల్లో రైతు భరోసా అందరికి వస్తుంది. ఉగాది రోజున ఇందిరమ్మ చీర ఇస్తే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకు కృతజ్ఞతలు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న నానుడి నిజం. అందుకే రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. 114 నెలలు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. రైతుల కోసం రూ. 2533 కోట్లు ప్రతి నెల కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. 28 నెలల్లో ప్రతి నెల రూ. 5500 కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం.  తుపాన్‌కి కామారెడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రైతుకి పంట నష్టం జరిగితే ఎకరానికి 10 వేల పరిహారం ఇచ్చాము. ఈ 28 నెలల్లో రైతుల కోసం లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని అన్నారు.

    సీఎం రేవంత్‌ పర్యటనపై బీఆర్‌ఎస్‌వీ నిరసన
    సీఎం రేవంత్‌ నర్మెట్ట పర్యటనపై బీఆర్‌ఎస్‌వీ(బీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం) నిరసన వ్యక్తం చేసింది. ఫ్లకార్డులు ప్రదర్శించి సిద్ధిపేట అభివృద్ధి ఏది అంటూ నిరసన తెలిసింది. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు.. కటింగ్‌ మాస్టర్‌ అంటూ ఫ్లకార్డులను బీఆర్‌ఎస్‌వీ ప్రదర్శించింది. సిద్ధిపేట నియోజకవర్గానికి నిధులేవి అని ప్రశ్నించింది. సిద్ధిపేట అభివృద్ధిపై వివక్ష  అంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేసింది. 

  • సాక్షి, విశాఖపట్నం: భగవద్గీతపై బీఆర్‌ నాయుడు అహంకారంతో మాట్లాడారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తిరుపతి ప్రతిష్టని చంద్రబాబు మంట కలిపారని.. బీఅర్ నాయుడు అసభ్య వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనను ఎందుకు టీటీడీ చైర్మన్‌గా కొనసాగిస్తున్నారంటూ వరుదు కళ్యాణి ప్రశ్నించారు.

    ‘‘చంద్రబాబు తప్పులను టీవీ5 ఛానల్ కప్పిపుచ్చుతుంది. అందుకే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా తొలగించలేదు. ఒక చేతగాని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. బీఆర్‌ నాయుడు వైఫల్యం వల్లే క్యూలైన్‌లో భక్తులు చనిపోయారు. భగవంతుడు అంటే భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడు. ప్రసాదంలో నాణ్యత లేదని కూటమినేతలే చెప్తుతున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.

    ‘‘మహిళలను మోసం చేసే దుర్మార్గుడిని ఎందుకు టీటీడీ చైర్మన్‌గా నియమించారు. టీటీడీ ఫుడ్ సేఫ్టీ విభాగం వైఎస్‌ జగన్ హయాంలో ఏర్పాటు చేశారు.. హిందూ ద్రోహి చంద్రబాబు. విజయవాడ నడిబొడ్డున 40 దేవాలయాలను కూల్చారు’’ అంటూ కళ్యాణి మండిపడ్డారు.

     



     

  • సాక్షి, జగిత్యాల జిల్లా: రాజీనామాపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని.. ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండలేనంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో రాజీనామాను ప్రకటించిన జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించారు. పార్టీని వీడడానికి గల కారణాలపై కూడా జీవన్‌రెడ్డి లేఖ విడుదల చేశారు.

    కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానన్న జీవన్‌రెడ్డి.. 40 ఏళ్ల బంధానికి స్వస్తి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా తనతో పాటు ప్రయాణం చేస్తున్న తన అనుచరులు, కాంగ్రెస్ నాయకులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 25న సమావేశంలో చర్చించేందుకు కలుద్దామన్న జీవన్‌రెడ్డి.. గత 20 మాసాలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు మీరంతా గమనించారన్నారు.

    ఇదిలా ఉండగా, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బుజ్జగింపులు ఫలించలేదు. శనివారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈనెల 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి నుంచి మొదట నుంచి బలమైన సంకేతాలు ఇచ్చారు.

    కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడగా, రెండురోజుల క్రితం పీసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి చర్చించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో తాజాగా మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు రంగంలోకి దిగారు. ఆయన ఇంటికి చేరుకుని చర్చలు జరిపారు. అయినా కూడా జీవన్‌రెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

     


     

  • హైదరాబాద్‌:  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని  తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ చేసే అభివృద్ధి ఏమీ ఉండదని, అంతా అవినీతే ఉంటుందని విమర్శించారు. లక్షన్నర కోట్ల రూపాయిలతో కేసీఆర్‌ కాళేశ్వరం అంటే,.. ఇప్పుడు రేవంత్‌ మూసేశ్వరం అంటున్నారని సెటైర్లు వేశారు.

    ఆదివారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మూసీ పునరుజ్జీవం-వాస్తవాలు అంశంపై రాంచందర్‌ రావు అధ్యక్షతను చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్‌ రావు మాట్లాడుతూ.. ఎ‍న్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకే నిధులు లేవంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మరి మూసీ ప్రక్షాళనకు ినిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అని ప్రశ్నించారు. 

  • సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్‌ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్‌గా ఉండకూడదంటూ మండిపడ్డారు.

    పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్‌లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు.

    ..కోటి మంది భారతీయులు గల్ప్‌ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్‌కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు
     

  • సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అంటకాగుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. బీఆర్‌ నాయుడును దూరంగా ఉంచినట్టు చంద్రబాబు నటించారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ నాయుడును అటెండర్‌ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

    టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుమల పర్యటన సందర్భంగా చంద్రబాబు.. బీఆర్‌ నాయుడును దూరంగా ఉంచినట్టు నటించారు. చంద్రబాబు కార్యకర్తలతో కూడా నాటకాలు ఆడుతున్నారు. బీఆర్‌ నాయుడుది కల్మష స్వభావం. చంద్రబాబు అన్నప్రసాదానికి వెళ్లే బీఆర్‌ నాయుడు నక్కి నక్కి ఉన్నారు. బీఆర్‌ నాయుడుకు అటెండర్‌ కూడా పట్టించుకోరు. నీతి మాలిన బీఆర్‌ నాయుడు నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు. బీఆర్‌ నాయుడును తీసేసి దేవాలయ ప్రతిష్ట కాపాడితే అర్థవంతంగా ఉండేది.

    కీలక సమావేశంలోనే బీఆర్‌ నాయుడు.. చంద్రబాబు పక్కన లేడు. బీఆర్‌ నాయుడు ఏ టెక్నాలజీతో మాయం అయ్యాడో?. ప్రసాదం ఇచ్చే సమయంలోనూ మాయావి బీఆర్‌ నాయకుడు మాయమయ్యాడు. బీఆర్‌ నాయుడికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాల్సిందే. వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు అన్నట్టు బీఆర్‌ నాయుడు పరిస్థితి ఉంది. నిన్న ఘటన చూసిన తర్వాత బీఆర్‌ నాయుడుకి ఎవరైనా మర్యాద ఇస్తారా?. అధికారం లేని పదవి, ఆదరణలేని ఉద్యోగుల మధ్య ఉండటం అవసరమా?. బీఆర్‌ నాయుడుని తీసేయడానికి చంద్రబాబుకు భయం. చంద్రబాబు పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది. చంద్రబాబు, బీఆర్‌ నాయుడు ఇద్దరూ స్వామి వారి ద్రోహులే. చంద్రబాబు ఓ కళంకితుడికి పదవి ఇచ్చారు. అసమర్థుడు అని తేలిన తర్వాత కూడా బీఆర్‌ నాయుడు పదవి అంటిపెట్టుకున్నారు. పవన కల్యాణనంద స్వాముల వారు కొండపై ప్రతీ రాయిని కడిగినా పాపం పోదు.

    బీఆర్‌ నాయుడు కుమారుడు జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఏప్రిల్‌ ఐదో తేదీన జూబ్లీహిల్స్‌ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసమే బీఆర్‌ నాయుడు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగుతున్నారా?. బీఆర్‌ నాయుడుని ఇంకా పదవిలో కొనసాగించడం అత్యంత హేయం అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. 

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్‌చల్‌ చేశారు. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌-2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. ఇవాళ ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్న సీఎం రమేష్‌ హడావుడి చేశారు.

    2006లో శివనారాయణ అనే వ్యక్తి.. సర్వే నెంబర్‌ 129/1లో ప్లాట్‌ నంబర్‌లు 29,30ల్లో భూమి కొనుగోలు చేశారు. ప్రభాత్‌ సొసైటీ వివాదాస్పద స్థలంలో సీఎం రమేష్‌ కబ్జాకు యత్నించినట్లు సమాచారు. తన భూమిని సీఎం రమేష్‌ కబ్జాకు యత్నించారని శివనారాయణ ఆరోపిస్తున్నారు.  మా భూమిలోకి ఎవరూ రావొద్దని ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉంది. 2006 నుంచి సీఎం రమేష్‌ ఇబ్బందిపెడుతున్నారు’’ అని శివనారాయణరెడ్డి తెలిపారు. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ చేరింది.

     

     

  • సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాలనా సౌలభ్యం ఏమో గానీ ఆ ఊరి ప్రజలు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిందే. అవును.. మీరు చదువుతున్నది నిజమే ! ప్రస్తుతం పాల్వంచ మండలంలోకి మారిన ‘సింగరాయపల్లి’ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. తాలూకా వ్యవస్థను తొ లగించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో మాచారెడ్డి మండలం పరిధిలో సింగరాయ పల్లి గ్రామాన్ని చేర్చారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మాచారెడ్డి మండలంలో కొనసాగింది. 

    2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో సింగరాయపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన రామారెడ్డి మండలంలోకి చేర్చారు. దీంతో గ్రామస్తులు తమ పనుల కోసం రామారెడ్డి మండలానికి వెళ్లి వచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాచారెడ్డి మండలంలోని పాల్వంచ కేంద్రంగా కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ప్రజల విన్నపం మేరకు అప్పటి ప్రభుత్వం పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సింగరాయపల్లిని పాల్వంచ మండలానికి మార్చారు. మాచారెడ్డి నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి పాల్వంచ మండలానికి మారింది. గ్రామస్తులకు పాల్వంచ గ్రామం కొంత అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే మూడు మండలాలతో ఉన్న లింకు ఇబ్బందికరంగా మారింది.  

    రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ 
    సింగరాయిపల్లి ఇప్పటికీ రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఉంది. దీంతో  కేసుల విషయంలో గ్రామస్తులు రామారెడ్డికి వెళ్లాల్సిందే. గ్రామంలో ఏ ఘటన జరిగినా రామారెడ్డి పోలీసులు రావాల్సిందే. కొత్త మండలంగా ఏర్పాటైన పాల్వంచకు పోలీస్‌ స్టేషన్‌ మంజూరు కాలేదు. దీంతో పోలీసు సేవలు రామారెడ్డి నుంచే అందుతున్నాయి.  

    మాచారెడ్డి సొసైటీ  
    ‘సహకార’ సేవల కోసం సింగరాయపల్లి గ్రామస్తులు మాచారెడ్డికి వెళ్లాల్సిందే. పాల్వంచలో సొసైటీ ఏర్పాటు కాలేదు. సహకార బ్యాంకు శాఖ కూడా రాలేదు. దీంతో రుణాలు, పంటలకు అవసరమైన ఎరువుల కోసం మాచారెడ్డికి వెళ్లాల్సిందే. ఏ పని మీద వెళ్లినా రోజంతా అటే గడిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల సేవలు పాల్వంచ మండలంలో అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

    పాల్వంచలో తహసీల్‌ సేవలు  
    పాల్వంచ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేస్తూ 2023 ఏప్రిల్‌ 18న జీవో విడుదలైంది. మే నెలలో తహసీల్‌ కార్యాలయం ఏర్పాటైంది. రామారెడ్డి మండలంలో కొనసాగిన సింగరాయపల్లి గ్రామాన్ని పాల్వంచ మండలానికి మార్చారు. తొలుత తహసీల్‌ కార్యాలయం ఒక్కటే ఏర్పాటైంది. గతేడాది జనవరి 28న మండల పరిషత్‌ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సింగరాయపల్లి గ్రామస్తులు మండల పరిషత్‌ పనుల కోసం పా ల్వంచకు వెళ్తున్నారు. అయితే ప్రజాపాలనలో వివిధ పనులకు ఇప్పటికీ రామారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో మండల పరిషత్‌ సేవలను పా ల్వంచ మండలానికి ఇవ్వాలి. 

    మూడు మండలాలు తిరగాల్సి వస్తోంది 
    మా ఊరికి మూడు మండలాలతో లింకు ఉండడంతో చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పట్లో అన్ని పనులకు రామారెడ్డికి వెళ్లేవాళ్లం. తరువాత పాల్వంచ మండలం అయ్యింది. దగ్గరైందన్న సంతోషం ఉన్నా, పనుల కోసం రామారెడ్డికి, మాచారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. – సొంటెం సాయిలు, గ్రామస్తుడు

    రికార్డులను పాల్వంచకు మార్చాలి
    పాల్వంచలో మండల పరిషత్‌ కార్యాలయం ఏర్పాటైనా ప్రజాపాలనకు సంబంధించిన పనుల కోసం రామారెడ్డి ఆఫీసుకు వెళ్లమంటున్నారు. మాకేమీ అర్థం కావడం లేదు. అన్ని రికార్డులను పాల్వంచకు మారిస్తే ఇబ్బంది పోతుంది.  
    – కెంగర్ల భిక్షపతి, గ్రామస్తుడు

    మా ఇబ్బందులు తీర్చాలి 
    ఎరువుల బస్తాల కోసం మాచారెడ్డి సొసైటీకి వెళ్లాల్సి వస్తోంది. కో ఆపరేటివ్‌ బ్యాంకు కోసం కూడా మాచారెడ్డికి వెళ్లాలి. పోలీసు స్టేషన్‌కు రామారెడ్డికి, మండలాఫీసుకు పాల్వంచకు వెళ్లాలి. మా ఇబ్బందులను గుర్తించి వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలి. 
    అన్నబోయిన శ్రీనివాస్, గ్రామస్తుడు

     

  • సాక్షి,జగిత్యాల: కోరుట్లలో సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైష్ణవి హత్యకేసులో రిమాండ్‌ ఖైదీ, ఆమె భర్త హరిబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

    జైల్లో రిమాండ్‌ ఖైదీ ఉన్న హరిబాబు పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు అతన్ని అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.