Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ నెంబర్ 734 వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో అగ్నికీలలు బస్సును చుట్టుముట్టాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మంటలు ఆర్పడంలో నిమగ్నమైంది.

    ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. తొలుత డ్రైవర్‌ క్యాబిన్‌లో మంటలు వచ్చాయి. దీంతో.. అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోని 18 మంది ప్రయాణికులను కిందికి దించేశారు. తరువాత మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది.

  • హైదరాబాద్‌:  తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని సాహసోపేతంగా అడ్డుకుని, పోలీసులకు అప్పగించిన ముగ్గురు పౌరులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సెజల్, గణపతి, కాశీనాథ్‌లను ఆయన ఘనంగా సన్మానించి.. వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డును అందజేశారు.

    ఈ సందర్భంగా నగర సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సమయస్ఫూర్తితో, సామాజిక బాధ్యతతో వ్యవహరించిన ఈ యువతను కొనియాడారు. వీరి సాహసం సమాజానికి ఒక గొప్ప సందేశమని, మహిళలు, చిన్నారుల రక్షణలో పౌరులు ఇలాగే అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను అరికట్టవచ్చు అని ఆయన అన్నారు.

    నేరాల నియంత్రణలో పోలీసులు ఎంత కృషి చేసినా, పౌర చైతన్యం తోడైనప్పుడే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రజా పోలీస్‌గా మారాలని పిలుపునిచ్చారు. ఇటీవల గోల్కొండ ప్రాంతంలో మహమ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి ఇలాగే ఎనిమిదేళ్ల బాలికను రక్షించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    సమాజంలో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 కి ఫోన్ కాల్ గానీ, హైదరాబాద్ పొలీస్ వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం అందించి, బాధ్యతాయుతమైన పౌరులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, జూబ్లీహిల్స్ ఎస్సై సోమ శేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

    అసలేం జరిగిందంటే..
    ఈ నెల 14న సెజల్ తన స్నేహితుడు గణపతితో కలిసి యూసుఫ్‌గూడ నుండి మాదాపూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 సమీపంలో ఒక వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గమనించారు. 

    ఆ చిన్నారి కళ్లలో భయాన్ని చూసి చలించిపోయిన వారు, తక్షణమే స్పందించి అటుగా వెళ్తున్న కాశీనాథ్, శ్రీ నారాయణల సాయంతో నిందితుడిని అడ్డుకున్నారు. బాలికను సురక్షితంగా రక్షించడమే కాకుండా, డయల్ 100కు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు పట్టించారు.

    పోలీసుల విచారణలో  నిందితుడు యూసఫ్ గూడకు చెందిన జావీద్ అనే వ్యక్తిగా తేలింది. బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో, ఆ చిన్నారికి ఐస్‌క్రీమ్ కొనిస్తానని మభ్యపెట్టి తన బైక్‌పై తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

  • సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి  ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.

    దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

    బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్‌
    బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo

     పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్
    మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాం

    బీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావు
    దేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం

     

  • హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం మరమ్మత్తుకు సంబంధించిన పనులపై కల్నల్‌ పరీక్షిత్ మెహ్రా అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల రీహాబిలిటేషన్‌కు ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ నియమించినట్లు పేర్కొంది. మే 30 నాటికి మరమ్మత్తుకు సంబంధించిన పరిశోధన పూర్తిచేయాలని ఆదేశించింది.  

  • సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తు ‘ఏరోస్పేస్’ రంగ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ’ను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్అండ్ డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్.. ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ‘ఏరోస్పేస్’ లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా... ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని  అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

    శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్; ఆర్‌అండ్‌డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘ఏరోస్పేస్’ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు.

    ఈ రంగంలో ఒకప్పుడు.. యూఎస్, రష్యా, ఐరోపా దేశాలదే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి ధీటుగా ‘గ్లోబల్ సప్లై చైన్’లో మన దేశం కూడా ‘కీ’ రోల్ ప్లే చేస్తోందన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. కానీ... మెకిన్సే నివేదిక ప్రకారం.. ల్యాబ్‌ల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు.

    డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సర్వే ప్రకారం.. నేడు 74 శాతం మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటిష్ఠమైన సప్లై-చైన్, తయారీ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు అంచనా వేశాయన్నారు. ఈ డిమాండ్‌ను ‘హైదరాబాద్’ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు.

    ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా.. ఉత్పత్తుల గ్రౌండింగ్‌కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు ‘హైదరాబాద్’ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని.. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్, అడ్వాన్డ్స్ మెటీరియల్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయన్నారు.

    అందుకు అనుగుణంగానే.. ఇప్పటి నుంచే ‘తెలంగాణ’ను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు.  ఏరోస్పేస్, డిఫెన్స్ ఆర్అండ్ డీ ఇన్సిట్యూషన్లు, గ్లోబల్ ఓఈఎంలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్‌ఈజెడ్, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, రోడ్డు నెట్ వర్క్ తదితర మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్... ప్రపంచ ఏరో స్పేస్ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూసేలా చేశాయన్నారు.

    ‘హైదరాబాద్’ వేదికగా ఏరోస్పేస్ భవిష్యత్తును నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. అనంతరం ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు డా.వీకే సారస్వత్, డీజీ సీఎస్ఐఆర్ అండ్ డీఎస్ఐఆర్ సెక్రటరీ డీ.ఎన్ కళైసెల్వి, ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు డా.సతీష్ రెడ్డి, డా.సోమనాథ్, రాజబాబు, డా.శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.  181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

    కెప్టెన్ గిల్ (86) సూపర్ ఇన్నింగ్స్‌తో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. బట్లర్ (25), సాయి సుదర్శన్ (22) పర్వాలేద నిపించారు. గిల్ ఔటయ్యాక కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (17), రాహుల్ తెవాటియా (7 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. 

    కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్‌, రమన్‌దీప్‌, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గ్రీన్ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. 

    గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్‌, అశోక్ శర్మలు చెరో 2 వికెట్ల పడగొట్టారు. ఈ విజయంతో గుజరాత్‌ పట్టికలో నాలుగో  స్థానానికి చేరుకోగా, కేకేఆర్‌ వరుసగా ఐదో పరాజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

  • బంగ్లాదేశ్ టూర్‌ను న్యూజిలాండ్ ఘ‌నంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ 26 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 247 ప‌రుగులు చేసింది. హెన్రీ నికోల‌స్ (68) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. 

    బంగ్లా బౌల‌ర్ల‌లో రిష‌ద్ హొసెన్‌, షోరిపుల్ ఇస్లామ్‌, త‌స్కిన్ అహ్మ‌ద్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సైఫ్ హ‌స‌న్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. లిట‌న్ దాస్ (46) ప‌ర్వాలేదనిపించాడు. 

    అయితే వీరు ఔటైన త‌ర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేక‌మేడ‌ను త‌ల‌పించింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బ్లెయిర్ టిక్న‌ర్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, నాథ‌న్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అర్థ‌సెంచ‌రీ, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసి ఆల్‌రౌండ్ ప్ర‌దర్శ‌న క‌న‌రబ‌రిచిన డియాన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే సోమ‌వారం జ‌ర‌గ‌నుంది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఆట‌గాడు కామెరున్ గ్రీన్ ఎట్ట‌కేల‌కు మెరిశాడు. సీజ‌న్‌లో కామెరున్ గ్రీన్ తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ సాధించిన గ్రీన్ మొత్తంగా 55 బంతుల్లో 79 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. 

    ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. గ్రీన్‌ దంచికొడుతున్న సమయంలో కేకేఆర్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ చివరి రెండు ఓవర్లలో తనకే స్ట్రైక్ వచ్చినప్పటికీ పరుగులు చేయడంలో విఫల మయ్యాడు.

    ఇక గ‌తేడాది జ‌రిగిన వేలంలో గ్రీన్‌ను కేకేఆర్ రూ. 25 కోట్ల రికార్డు ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. అధిక ధ‌ర‌కు అమ్ముడైన గ్రీన్ ఈ సీజ‌న్‌లో మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌లేదు. దీంతో అత‌డిపై విమ‌ర్శ‌లు పెరిగిపోయాయి. 23 కోట్లు దండ‌గంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో గ్రీన్‌ను ఏకిపారేశారు. 

    అభిమానుల మాట‌లు గ్రీన్ మ‌నుసుకు తగిలాయేమో కానీ గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చివ‌రిదాకా నిల‌బ‌డి కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈ సీజ‌న్‌లో గ్రీన్ ఐదు మ్యాచ్‌ల్లో వ‌రుసగా 18, 2, 4, 32, 0 ప‌రుగులు సాధించాడు. 

     

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ సృష్టికర్త లలిత్ మోదీ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. 2030 నాటికి ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలో ఎన్‌బీ , ఎన్‌ఎఫ్ఎల్ వంటి దిగ్గజ లీగ్‌లతో సమానంగా నిలుస్తుందని మోదీ అంచ‌నా వేశాడు. అంతేకాకుండా టాప్ ఆట‌గాళ్లు ఒక్కో సీజ‌న్‌కు రూ. 130 నుంచి రూ. 150 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తారని అత‌డు జోస్యం చెప్పాడు. 

    లలిత్ మోదీ తాజాగా ఇంగ్లండ్ దిగ్గ‌జ క్రికెట‌ర్ మైఖ‌ల్ వాన్‌తో కలిసి  'ది ఓవర్‌ల్యాప్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగానే ఒక్కో ఫ్రాంచైజీకి రూ.125 కోట్లుగా ఉన్న ప్లేయర్ పర్స్ విలువ‌, రాబోయే నాలుగేళ్లలో ఏడు రెట్లకు పైగా పెరగనుందని అత‌డు చెప్పుకొచ్చాడు.

    "ఐపీఎల్ ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతోంది. ఫ్రాంచైజీల‌కు ఆట‌గాళ్లపై ఖ‌ర్చు చేయ‌డానికి  ఒక నిర్దిష్ట మొత్తం ఉంటుంది.  ప్ర‌స్తుతం ప‌ర్స్ విలువ రూ.125 కోట్లుగా ఉంది. కానీ 2030 నాటికి ఈ మొత్తం ఏకంగా 100 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 932 కోట్లు) చేరుకుంటుంది. 

    దీంతో సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లు ఆడే అగ్రశ్రేణి ఆటగాళ్లు, ఒక్కో మ్యాచ్‌కు ఒక మిలియన్ డాలర్ (రూ. 8 కోట్లు) చొప్పున పారితోష‌కం అందుకుంటారు. అంటే మొత్తంగా 16 మ్యాచ్‌లకు సుమారుగా రూ. 140 నుంచి రూ.150 కోట్లు ద‌క్క‌నుంది" అని ల‌లిత్ మోదీ పేర్కొన్నాడు.

    ఈ భారీ మొత్తాన్ని అందుకునే సత్తా ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' ప్లేయర్లుగా ఇద్దరు యువ ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక‌రు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ కాగా.. మ‌రొకరు ఇంగ్లండ్ యంగ్ క్రికెట‌ర్ జాకబ్ బెథెల్. ఐపీఎల్ 2026లో వైభ‌వ్ సూర్య‌వంశీ దుమ్ములేపుతున్నాడు. 

    త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌కు సైతం వైభ‌వ్ చుక్క‌లు చూపించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన వైభ‌వ్ 263.16 స్ట్రైక్ రేటుతో 200 ప‌రుగులు చేశాడు. కాగా ఐపీఎల్‌-2027 మెగా వేలానికి ముందు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వైభ‌వ్‌ను విడిచిపెడితే అత‌డిని భారీ ధ‌ర‌కు ద‌క్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.
    చదవండి: IPL 2026: వ‌రుస ఓట‌ములు.. హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న నిర్ణ‌యం!
     

  • ఐపీఎల్ 2026 సీజన్‌కు సీఎస్‌కే బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఖలీల్ అహ్మద్ స్థానంలో ఆకాశ్ మధ్వల్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌, రాజస్తాన్ రాయ‌ల్స్‌కు ఆకాశ్ మధ్వల్ ప్రాతినిధ్యం వ‌హించాడు. 

    ఇక‌ మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అతను కోలుకోవడానికి 10 నుంచి 12 వారాల సమయం పట్టనుండడంతో ఖలీల్ అహ్మద్ దాదాపు సీజన్ మొత్తానికి దూరమైనట్లే. అందుకే సీఎస్‌కే ఖలీల్ స్థానంలో ఆకాశ్‌ను జట్టులోకి తీసుకోనుంది. 

    అయితే శనివారం సీఎస్‌కే ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇక తొలుత ముంబై ఇండియ‌న్స్‌కు నెట్ బౌల‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ ఆకాశ్ మధ్వల్ 2023 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు కీల‌క బౌల‌ర్‌గా ఉన్నాడు. ఆ సీజ‌న్‌లో 8 మ్యాచ్‌లాడిన ఆకాశ్ 14 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఆకాశ్ మ‌ధ్వ‌ల్ 5 ప‌రుగుల‌కే 5 వికెట్లు ప‌డ‌గొట్టి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు.

    చదవండి: అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2011 సీజ‌న్ నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క‌చ్చితంగా ఒక మ్యాచ్‌లో గ్రీన్‌జెర్సీలో బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్‌సీబీ దీనిని పాటిస్తూ వ‌స్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. 

    ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజ‌న్‌లోనూ కంటిన్యూ చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌ర‌గనున్న పోరులో ఆర్సీబీ ఆట‌గాళ్లు గ్రీన్ జెర్సీల‌తో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఈ సీజ‌న్‌లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో4 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

    అచ్చిరాని జెర్సీ..
    అయితే ఆర్‌సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గ్రీన్‌జెర్సీతో బ‌రిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో‌నే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యింది. మరొక‌ మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గ్రీన్ డే మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.

    2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్‌ల‌ను ఆడ‌డం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గ‌త సీజ‌న్‌లో రాజస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ వ‌ర‌కు 15 మ్యాచ్‌లు ఆడింది.  ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ  గెలిచిన‌ప్ప‌టికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్‌లో సెంచరీ,  మరో మ్యాచ్‌లో కీలకమైన 27 పరుగులు చేశాడు.

    గ్రీన్‌జెర్సీతో ఆర్సీబీ విజయాలు..

    • ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్‌గా నిలిచాడు.

    • 2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ  మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.

    • 2022 సీజ‌న్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో  కోహ్లి గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 ప‌రుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే ప‌రిమిత‌మై ఓట‌మిపాలైంది.

    • 2023 సీజ‌న్‌లో రాజస్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వ‌డం విశేషం. అయితే మ్యాక్స్‌వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజ‌స్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అయితే ఛేద‌న‌లో రాజ‌స్తాన్ పోరాడిన‌ప్ప‌టికీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

    • గ‌త సీజన్‌లోనూ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆర్సీబీ 17.3 ఓవ‌ర్ల‌లోనే ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.

     చదవండి: వైభవ్‌ సేఫ్‌.. రోమి భిందర్‌కు బీసీసీఐ షాక్‌!

  • Gujarat Titans Vs KKR Updates..

    ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.   181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్‌ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్‌, రమన్‌దీప్‌, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. 

    కేకేఆర్‌ 180 ప‌రుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) ప‌రుగుల‌తో కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో రబాడ 3 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్, అశోక్ శ‌ర్మ‌లు చెరో 2 వికెట్లు ప‌డగొట్టారు.

    86 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌ వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో కామెరున్‌ గ్రీన్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

    • 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

    గిల్ అర్థ‌శ‌త‌కం.. గుజ‌రాత్ 101/2
    కేకేఆర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అర్థ‌శ‌త‌కం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంత‌క‌ముందు గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన జాస్ బ‌ట్ల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ 11 ఓవ‌ర్ల‌లో  రెండు వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది.

    తొలి వికెట్ కోల్పోయిన గుజ‌రాత్‌
    కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన సాయి సుద‌ర్శ‌న్ సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ 6 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది.

    దంచికొడుతున్న గుజ‌రాత్‌
    181 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేద‌న‌ను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 57 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.

    గుజ‌రాత్ టార్గెట్ 181 ప‌రుగులు
    గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ 180 ప‌రుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) ప‌రుగుల‌తో కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. రోవ్‌మెన్ పావెల్ 27 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. ఒక ద‌శ‌లో 15 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగుల‌తో ప‌టిష్టంగా క‌నిపించిన కేకేఆర్ చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 32 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో రబాడ 3 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్, అశోక్ శ‌ర్మ‌లు చెరో 2 వికెట్లు ప‌డగొట్టారు.

    • 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్‌ రబాడ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

    ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
    గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ 147 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ ‍గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.

    87 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. పావెల్‌ (27).. అశోక్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    8 ఓవర్లలో కేకేఆర్‌ 59/3
    8 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్‌ (21), గ్రీన్‌ (8) క్రీజులో ఉన్నారు. 

    • గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్‌ రబాడ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
    8 ప‌రుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ర‌బాడ బౌలింగ్‌లో జాస్ బ‌ట్ల‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం కేకేఆర్ 2 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 22 ప‌రుగులు చేసింది.

    రహానే గోల్డెన్‌ డక్‌
    గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే సిరాజ్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

    బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
    ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కేకేఆర్‌ ఈ  మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్‌ అలెన్‌ స్థానంలో టిమ్‌ సీఫెర్ట్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్‌ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. 

    ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్‌ మూడుసార్లు, కేకేఆర్‌ ఒకసారి గెలుపొందాయి.

    కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

    గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్‌ కీప‌ర్‌),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్‌ క్రిష్ణ.

  • ఐపీఎల్-2026 మ‌ధ్య‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజ‌న్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హుయిజెన్‌తో గుజ‌రాత్ భర్తీ చేసింది. ఈ విష‌యాన్ని గుజ‌రాత్ టైటాన్స్ ఎక్స్ వేదిక‌గా ధ్రువీక‌రించింది.

    గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో టామ్ బాంట‌న్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేసింది. కానీ  ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ సెష‌న్‌లో బాంట‌న్ చేతి వేలికి గాయమైంది. దీంతో అత‌డు గుజ‌రాత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. అయితే బాంట‌న్‌ తన గాయం నుంచి కోలుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుండ‌డంతో.. ఇప్పుడు మొత్తం సీజ‌న్‌కే దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ఎస్టర్హుయిజెన్‌ రూ. 75 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది

    ఎవ‌రీ ఎస్టర్హుయిజెన్‌?
    24 ఏళ్ల కానర్ ఎస్టర్హుయిజెన్  గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. త‌న మొద‌టి సిరీస్‌లోనే అద్బుత ప్ర‌ద‌ర్శ‌ల‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. 5 మ్యాచ్‌ల‌లో 145.98 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

    అత‌డికి అద్బుత‌మైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అతడి రాకతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. జోస్ బట్లర్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎస్టర్హుయిజెన్ ఉండనున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో గుజరాత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది. గిల్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.
    చదవండి: IPL 2026: వ‌రుస ఓట‌ములు.. హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న నిర్ణ‌యం!
     

  • ఐపీఎల్‌-2026లో మూడు సార్లు ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి.  ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్ బోణీ కొట్టలేదు. 5 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ నాలుగింట ఓట‌మి చ‌విచూడగా.. మ‌రో మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దు అయింది. దీంతో కోల్‌క‌తా జ‌ట్టు ప్ర‌స్తుతం  పాయింట్ల ప‌ట్టిక‌లో అట్టడుగున నిలిచింది.

    ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య ర‌హానేపై తీవ్ర‌స్ధాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌హానే వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా ఫ‌ర్వాలేద‌న్పిస్తున్న‌ప్ప‌టికి, కెప్టెన్సీ ప‌రంగా జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించ‌లేక‌పోతున్నాడు. తాజాగా ర‌హానే కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ క్రిష్ణ‌మ‌చారి శ్రీకాంత్ నిప్పులు చెరిగాడు. 

    ర‌హానేను త‌ప్పించి కేకేఆర్ జ‌ట్టు ప‌గ్గాల‌ను స్టార్ ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ అప్ప‌గించాల‌ని శ్రీకాంత్ సూచించాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌హానే ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు 152 ప‌రుగులు సాధించాడు. అయితే ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత త‌న దూకుడును ర‌హానే కొన‌సాగించ‌లేక‌పోతున్నాడు.

    "రహానేకు మరో ఒకటి లేదా రెండు అవకాశాలు ఇవ్వండి. అప్పటికీ మార్పు రాకపోతే అతడిని జట్టు నుంచి తప్పించి, సీజ‌న్ మ‌ధ్య‌లోనే సునీల్ నరైన్‌ను కెప్టెన్ చేయండి. రహానే అవసరం ఉంటేనే దిగాలి. లేదంటే అత‌డు కేవ‌లం కెప్టెన్‌గా మాత్రమే వ్యవహరించాలి. ఓపెన‌ర్‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నాడు. 

    పవర్‌ప్లే తర్వాత పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మిడిలార్డ‌ర్‌కు కూడా స‌రిపోడు. అసలు రహానేను కెప్టెన్ చేయడమే తప్పుడు నిర్ణ‌యం. కానీ ఇప్పుడు సీజ‌న్ మ‌ధ్య‌లో తొలగించే ధైర్యం మేనేజ్‌మెంట్‌కు ఉందా?  కేకేఆర్ ఫిన్ అలెన్‌, కామెరాన్ గ్రీన్‌ల‌ను కూడా జ‌ట్టు నుంచి త‌ప్పించాలి.

    వారిద్ద‌రి స్ధానంలో రచిన్ రవీంద్ర, పతిరానాలకు అవ‌కాశ‌మివ్వాలి. అప్పుడు ర‌చిన్ ర‌వీంద్ర‌, ర‌హానేలు ఇన్నింగ్స్‌ను ప్రారంభించవ‌చ్చు. టీమ్ కాంబనేష‌న్ బ్యాలన్స్‌డ్‌గా ఉంటుంది. కేకేఆర్ ఆట‌గాళ్ల కంటే వారి స‌పోర్ట్ స్టాపే మెరుగ్గా క‌నిపిస్తున్నారు" అని శ్రీకాంత్ ఎద్దేవా చేశాడు. కాగా కేకేఆర్ శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్ట‌నుంది.
    చదవండి: IPL 2026: వ‌రుస ఓట‌ములు.. హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న నిర్ణ‌యం!
     

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు మేనేజ‌ర్ రోమి భింద‌ర్ డ‌గౌట్‌లో ఫోన్ వాడ‌డంపై బీసీసీఐ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. ఐపీఎల్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు గాను రోమి భింద‌ర్‌కు రూ. ల‌క్ష జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే అత‌డిపై నిషేధం కూడా ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినప్ప‌టికీ బీసీసీఐ మాత్రం రోమి భింద‌ర్‌కు జ‌రిమానాతో స‌రిపెట్టింది. 

    ఈ విష‌యాన్ని బీసీసీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా వెల్ల‌డించాడు. ఐపీఎల్‌లో జ‌ట్టు మేనేజ‌ర్‌లు మొబైల్ ఫోన్‌లు ఉప‌యోగిం చ‌డానికి అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ఫోన్ వాడడం నిషేధమ‌ని ఆయ‌న తెలిపారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న‌ప్పుడు మాత్రం జ‌ట్టు మేనేజ‌ర్లు ఫోన్ వాడేందుకు అనుమ‌తి ఉందన్నారు. 

    ఈ విష‌యంలో రోమి భింద‌ర్‌కు షోకాస్ నోటీసు కూడా జారీ చేశామ‌ని, కానీ నోటీసుపై అత‌డు ఇచ్చిన వివ‌ర‌ణ‌పై యాంటీ క‌ర‌ప్ష‌న్ యూనిట్ అసంతృప్తి వ్య‌క్తం చేసింద‌ని పేర్కొన్నారు. అయితే రోమి భింద‌ర్‌కు మొద‌టి ఉల్లంఘ‌న కాబ‌ట్టి, నిబంధ‌న‌ల ప్ర‌కారం అత‌డికి రూ. ల‌క్ష జ‌రిమానాతో స‌రిపెడుతున్న‌ట్లు చెప్పారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. 

    ఈ ఘ‌ట‌నను అంద‌రూ గుణ‌పాఠంగా తీసుకోవాల‌ని, ఆట దెబ్బ‌తిన‌కుండా ప్ర‌తీ ఒక్క‌రు నియ‌మ నిబంధ‌న‌లు పాటించాల‌ని తాము విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10న గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో రోమి భింద‌ర్ డ‌గౌట్‌లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాల‌కు చిక్కాడు. 

    ఆ స‌మ‌యంలో రాజ‌స్తాన్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ కూడా అత‌డి ప‌క్క‌నే కూర్చొని ఫోన్ చూడ‌డం వివాదానికి దారి తీసింది. అయితే ఈ చ‌ర్య‌తో వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధం లేక‌పోవ‌డంతో, అత‌డిని కేవ‌లం హెచ్చ‌రిక‌తోనే స‌రిపెట్టిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు స‌న్‌రైజ‌ర్స్ బ్రేకులు వేసింది. మ్యాచ్‌లో హైద‌రాబాద్ 57 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను ఆదివారం కేకేఆర్‌తో ఆడ‌నుంది.

    చదవండి: ముఖం చాటేసిన పాండ్యా.. ఏడుపొక్కటే త‌క్కువ‌!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వైఫ‌ల్యం కొన‌సాగుతుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో  ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించిన ముంబై గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ దారుణ ఓట‌మిని చ‌విచూసింది. ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల విధ్వంసంతో ముంబై బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్‌లో ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానానికి ప‌డిపోయింది. 

    ముంబై ఓట‌మి త‌ర్వాత‌ ఢీలా ప‌డిన ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బస్సులో హోట‌ల్ రూమ్‌కు బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో మీడియా కంట ప‌డ్డాడు. మీడియాను చూసి ముఖం చాటేసిన పాండ్యా తన చేతులు అడ్డుపెట్టుకొని ఏడ్చినంత ప‌ని చేశాడు. త‌న ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా డ‌ల్‌గా క‌నిపించాడు. 

    ప‌క్క‌నే కూర్చున్న సూర్య‌తో కూడా ఏం మాట్లాడ‌కుండా బ‌స్ అద్దంవైపు తిరిగిన పాండ్యా బ‌య‌ట‌కు చూస్తూ కంట‌త‌డి పెట్టిన‌ట్లు కెమెరాల‌కు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక కెప్టెన్‌గానే గాక ఆట‌గాడిగానూ పాండ్యా విఫ‌ల‌మ‌వుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 27 స‌గ‌టుతో కేవ‌లం 81 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్ర‌మే తీసిన పాండ్యా ఇచ్చుకున్న ప‌రుగులుఎకాన‌మీ రేటు 11.16గా ఉండ‌డం గ‌మ‌నార్హం. 

    పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోవ‌డం దగ్గ‌రి నుంచి పాండ్యాకు ఏదీ క‌లిసిరాలేదు. బ్యాటింగ్‌లో 14 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఈ ఆల్‌రౌండ‌ర్ మూడు ఓవ‌ర్లు వేసి 39 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 195 ప‌రుగులు చేసింది. 

    క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో మెర‌వ‌గా, న‌మ‌న్ ధిర్ అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. అనంత‌రం పంజాబ్ ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్ విధ్వంసంతో 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 198 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికే నాలుగు ఓట‌ముల‌తో ప‌ట్టిక‌లో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియ‌న్స్‌కు గుజ‌రాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 20న జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్ వేదిక కానుంది.

    చదవండి: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అరుదైన దృశ్యం..

  • ఐపీఎల్‌-2026లో ఐదు సార్లు ఛాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌కు ఏది కలిసిరావ‌డం లేదు. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ప‌రాజ‌యం పాలైంది. ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి నుంచి రెండో స్దానంలో కొన‌సాగుతోంది.

    కాగా వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా- స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్దం ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

    ఏమి జ‌రిగిందంటే?
    196 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ దూకుడుగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అత‌డిని ఔట్ చేసేందుకు హార్దిక్ పాండ్యా తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశాడు. అయిన‌ప్ప‌టికి ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. దీంతో పాండ్యా త‌న స‌హ‌నాన్ని కోల్పోయాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు పాండ్యా పదే పదే ఫీల్డ‌ర్ల‌ను మారుస్తూ విసుగు తెప్పించాడు.

    తన బౌలింగ్‌కు తగ్గట్టుగా ఫీల్డింగ్ పెట్టుకునే అవకాశం ఇవ్వకుండా, హార్దిక్ జోక్యం చేసుకోవడం బుమ్రాకు నచ్చలేదు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి మాటల యుద్దం జ‌రిగింది. బుమ్రా అసహనంతో నీవు నాకు చెప్పొద్దు అన్న‌ట్లు సైగ‌లు చేశాడు. ఏదేమైన‌ప్ప‌టికి బుమ్రా చివ‌రికి నిర్ణయానికే తలవంచాల్సి వచ్చింది.

    ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో బుమ్రా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ టీమిండియా పేస్ గుర్రం ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా సాధించ‌లేదు.
    చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?


     

     

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ ఓటుమ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై పరాజ‌యం పాలైంది. ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం కావడం గమనార్హం. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తీసుకున్న ఓ నిర్ణయంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది.

    ఏమి జరిగిదంటే?
    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్‌లో ముంబై ర్యాన్ రికెల్టన్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వెంట వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో ముంబై తరపున తొలి మ్యాచ్ ఆడుతున్న క్వింటన్ డికాక్‌, యువ ఆటగాడు నమన్ ధీర్ తమ అద్బుత బ్యాటింగ్‌తో ముంబైని ఆదుకున్నాడు. డికాక్ సెంచరీతో చెలరేగగా.. నమన్‌ధీర్ ఆర్ధ శతకంతో సత్తాచాటాడు. వీరిద్దరూ  మూడో వికెట్‌కు 122 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి దూకుడు చూసి ముంబై 230కి పైగా స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. 

    కానీ నమన్ ధీర్ ఔటయ్యాక సీన్ రివర్స్ అయిపోయింది. నమన్ ధీర్ ఔటయ్యాక, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను కాదని హార్దిక్ పాండ్యా స్వయంగా క్రీజులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన పాండ్యా తీవ్ర నిరాశపరిచాడు. పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే ఔటయ్యాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. తాజాగా హార్దిక్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మండిపడ్డాడు.

    హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ?
    కెప్టెన్ ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఈ ఒక్క సీజన్ కాదు, గత రెండు సీజన్‌ల‌లో కూడా ఇదే తీరును కనబరిచింది. ఈ వైఫల్యాలకు మూల కారణాలను వెతకాలి. 2013 నుంచి 2023 మ‌ధ్య కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్‌కు ఐదు టైటిల్స్‌ను అందించాడు. ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ క‌నీసం ఒక్క‌సారి కూడా ఫైన‌ల్‌కు చేర‌లేక‌పోయింది. 

    ఇప్పుడు ఈ ఏడాది  కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. హార్దిక్ కెప్టెన్సీ బాగోలేదు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోహార్దిక్ ముందుగా బ్యాటింగ్‌కు రావాల్సిన అవ‌స‌రం ఏముంది? 12 బంతుల్లో 14 పరుగులు ప‌రుగులు మాత్రమే చేశాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు కేవలం ఐదు బంతులు మాత్రమే లభించాయి. ఒకవేళ రూథర్‌ఫోర్డ్ కూడా అన్ని బంతులు ఆడి ఉంటే, అతను 3-4 సిక్సర్లు కొట్టి ఉండేవాడు. అంతేకాకుండా జ‌స్ప్రీత్ బుమ్రాతో తొలి ఓవ‌ర్ వేయించాల్సింది. 

    ఇలా ముంబై ఓట‌మికి చాలా కార‌ణాలు ఉన్నాయి. శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత‌మైన కెప్టెన్సీతో పంజాబ్‌ను విజ‌య ప‌థంలో న‌డిపిస్తుంటే, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఇందుకు ఒకే ప‌రిష్క‌రం ఉంది. హార్దిక్ వెంట‌నే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోని, ఆ బాధ్యతను తిరిగి రోహిత్‌కు అప్పగించాలని నేను భావిస్తున్నాను," అని తివారీ క్రిక్‌బజ్ డిబేట్‌లో పేర్కొన్నాడు. 

    కాగా ఈ ఓట‌ముల‌కు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ హార్దిక్ సీజ‌న్ మ‌ధ్య‌లోనే ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి వైదొల‌గ‌నున్నాడ‌ని సోషల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ వైఫల్యం కూడా ముంబై జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఇప్పటివరకు ఒక్క వికెట్‌ కూడా సాధించలేదు. వికెట్ల విషయం పక్కన పెడితే పరుగులను కట్టడం చేయడంలో బుమ్రా విఫలమవుతున్నాడు.
    చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

     

  • టీ20 ప్రపంచకప్‌-2026లో విఫలమైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సారథిగా, బ్యాటర్‌ అతడు పూర్తిగా విఫలం కావడమే ఇందుకు కారణం.

    భారత్‌ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. భారత్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-ఎ నుంచి పోటీపడిన పాక్‌.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.

    కొనసాగుతున్న వైఫల్యాలు
    అయితే, పసికూనలపై ప్రతాపం చూపి సూపర్‌-8 వరకు చేరుకోగలిగింది. కానీ ఈ దశను దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో సల్మాన్‌ ఆఘా ఆరు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 60 పరుగులే చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఘా వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

    నా ప్రదర్శన బాగాలేదు..
    ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి ఆఘా కేవలం 84 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌కు సుదీర్ఘ విరామం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నా ఫామ్‌ గురించి చర్చ నడుస్తోంది. వరల్డ్‌కప్‌ టోర్నీలో నా ప్రదర్శన బాగాలేదు.

    పాకిస్తాన్‌ లీగ్‌లోనూ ఇదే కొనసాగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2027 కూడా ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం నేను ఈ టోర్నీ మీదే దృష్టి సారించాలని భావిస్తున్నాను. ఈ ఏడాది డిసెంబరు దాకా టీ20 మ్యాచ్‌లు కూడా లేవు.

    నా దృష్టి మొత్తం వాటి మీదే
    అందుకే పీఎస్‌ఎల్‌ ముగిసిన తర్వాత వన్డే, టెస్టు ఫార్మాట్ల మీదే ఎక్కువగా దృష్టి సారిస్తాను. వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం టీ20లకు దూరంగా ఉండమన్నా ఉంటాను. నా దృష్టి ఇప్పుడు వన్డే, టెస్టుల మీదే ఉంది’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సల్మాన్‌ ఆఘా మెరుగ్గా రాణించాడు. మొత్తంగా 175 పరుగులు సాధించాడు.

    ఇదిలా ఉంటే.. సల్మాన్‌ ఆఘా ఇప్పటి వరకు పాకిస్తాన్‌ తరఫున కేవలం 916 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 123.11 కావడం గమనార్హం. ఇక యాభై వన్డేల్లో కలిపి 1538 రన్స్‌ రాబట్టిన ఆఘా.. 23 టెస్టులాడి 1487 పరుగులు సాధించాడు. 

    ఇందులో మూడు సెంచరీలు ఉండగా.. అత్యుత్తమ స్కోరు 132 నాటౌట్‌. కాగా పీఎస్‌ఎల్‌ తర్వాత పాక్‌ జట్టు మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఆగష్టు 19న లీడ్స్‌లో తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు.

    చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

Andhra Pradesh

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయిన సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు, దాని వల్ల తామేం సాధించామనేది గట్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గేవనేది వాస్తవం అని పేర్కొన్నారు.

    అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా వాయిదా పడింది. దీని వల్ల అటు దక్షిణాది రాష్ట్రాలకు కానీ, ఇటు మహిళలకు కానీ న్యాయం జరగలేదని వెల్లడించారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు గనక అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి  మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు.

  • న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు తాము మద్దతిస్తామని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) డీలిమిటిషన్‌, మహిళా రిజర్వేసన్‌ బిల్లులపై లోక్‌సభలో చర్చ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ డీలిమిటేషన‌‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లులకు మేం  మద్దతిస్తాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరగాలి. 

    డీలిమిటేషన్‌ ప్రక్రియలో అన్ని పార్టీలకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీట్ల సంఖ్య పెంచాలి. ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా 50 శాతం సీట్లు పెంచే విషయం చట్టంలో పెట్టాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. ఇది కేవలం నోటి మాటగా చెప్తే మేం అంగీకరించం. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌లో చెప్పిన మాటలు అమలు కాలేదు’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. 

  • తాడేపల్లి :  ఏపీలో పారిశ్రామిక వేత్తలకు వేధింపులు తప్పడం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వర్గాలపై రెడ్‌ బుక్‌ పాలనను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  దాంతో ఏపీలో పారిశ్రామిక వర్గాలకు ఇదొక శాపంలా మారిందన్నారు. 

    ‘ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు వాటాలను సెటిల్మెంట్ చేస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఇటీవలే సీఎంను కలిశారు. ఆ తర్వాత అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని రకాలుగా బెదిరించినా యాజమాన్యం స్పందించక పోవటంతో మరింత రెచ్చిపోతున్నారు. చంద్రబాబు పాలనను కమ్మగా ఉందంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎంతో సెటిల్మెంట్ చేసుకున్నారు. తన అనుచరులతోనే ఆల్ట్రాటెక్ పై అనేక ఫిర్యాదులు చేయించారు. తర్వాత పరిశ్రమ  వాహనాలను కట్టడి చేశారు..

    అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని చూస్తున్నారు.. జిందాల్ కంపెనీ వారిని కూడా ఇలాగే వేధించారు. వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళిపోయారు. ఇలా‌ కూటమి నేతలు పలు కంపెనీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. పారిశ్రామికవేత్తలను ఇలా బెదిరిస్తుంటే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు?, రాష్ట్రానికి మేం ఎన్ని పరిశ్రమలు తెచ్చాం.. మీరు ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి. పారిశ్రామిక వర్గాలపై బెదిరింపులు ఆపాలి’ అని టీజేఆర్‌ సుధాకర్‌ బాబు హెచ్చరించారు.

Movies

  • తిరువీర్ నటించిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'.  'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో హిట్ కొట్టిన హీరో.. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయన హీరోగా నటించిన పాపం ప్రతాప్ ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాశి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

    ఈ స్టోరీ చెప్పినప్పుడు నా పక్కన మొదట అజయ్ అనుకున్నానని రాశి తెలిపింది. టాలీవుడ్‌లో నాకు హైట్‌ ఎక్కువగా ఉండే అజయ్ మాత్రమే తెలుసని వెల్లడించింది. కానీ సెట్‌లో బయటికి వచ్చి అజయ్ కోసం వెతుకుతున్నా.. కానీ అక్కడే అజయ్‌ ఘోష్ చైర్‌లో కూర్చుని కనిపించారు. అజయ్ ఘోష్‌ని చూసి.. నాకు మావయ్య క్యారెక్టర్ ఏమోనని అనుకున్నానని రాశి చెప్పింది. కానీ ఎప్పుడైతే డైరెక్టర్ ఇతనే నా భర్త క్యారెక్టర్ అంటే షాక్ అయ్యానని అన్నారు. కానీ అజయ్ ఘోష్ అద్భుతంగా చేస్తారని రాశి కొనియాడింది. ఫస్ట్‌ టైమ్‌ ఆయనతో పని చేశానని తెలిపింది. సింగిల్ టేక్‌లో సీన్ చేయడం ఆయనకే సాధ్యమన్నారు రాశి.
     

     

  • నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో వచ్చిన చిత్రం తెరచాప. ఈ మూవీకి జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాశ్ దుర్గం నిర్మించారు. ఈ రోజు ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

    అసలు కథేంటంటే..

    సమాజంలో తన ప్రజల కోసం పోరాడే నాయకుడైన కాశీ బాబు (నాగ మహేష్) అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి కొడుకు నిర్లక్ష్య స్వభావం వల్ల చనిపోయాడని అందరూ అంటారు. అయితే తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ఈశ్వర్ (నవీన్ రాజ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) పాత్ర ఏంటి? ఆనంద్ రాజు (రాజీవీ కనకాల), పుష్ప ఫేమ్ కేశవ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదే మిగతా కథ.

    ఎలా ఉందంటే..

    సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మత్స్యకారుల నేపథ్యం ఉన్న కథ అని ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ జోయెల్ జార్జ్.  తాను అనుకున్న కథను ఎక్కడా మిస్సవకుండా తెరపై ఆవిష్కరించాడు.

    సెకండాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సీన్స్‌ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న కథనం బాగున్నప్పటికీ స్క్రీన్‌ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. మధ్య మధ్యలో కనిపించే రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్తా చిరాకు తెప్పిస్తాయి. మొత్తానికి స్క్రీన్‌ప్లేలో లోపాలు ఈ కథకు పెద్ద మైనస్. ఓవరాల్‌గా ఓ ఆకట్టుకునే వాస్తవిక డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. . ఈ వీకెండ్‌కు తెరచాపను ఓసారి ట్రై చేయొచ్చు.

    ఎవరెలా చేశారంటే..

    గ్రామీణ యువకుడి పాత్రలో నవీన్ రాజ్  అద్భుతంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడిగా ఆయన లుక్ చాలా సహజంగా.. పాత్రకు తగినట్లుగా ఉంది. శ్రీలు, పూజా సుహాసిని తమ పాత్రల్లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నాగ మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేశవ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే ప్రజల్ కృష్ణ అందించిన సంగీతం బాగుంది.. ఎంఎల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. అజీమ్, వెంకట్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రాజు బోదాసింగి ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.

    రేటింగ్: 2.5/5

  • కొత్త లోకా మూవీతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్. ఈ కోలీవుడ్‌ బ్యూటీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. అంతేకాకుండా తమిళం, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించిన ముద్దుగుమ్మ.. 2022లో వచ్చిన 'హృదయం' చిత్రంలో నటించింది. ఈ మూవీలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్‌ హీరోగా నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు భార్యా, భర్తలుగా మెప్పించారు. తెరపై వీరద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

    దీంతో నిజ జీవితంలోనూ వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొస్తున్నాయి. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ మదర్ లిస్సీ ప్రియదర్శన్ స్పందించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది.

    సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ కల్యాణి మదర్ లిస్సీ ప్రియదర్శన్ రిప్లై ఇచ్చింది. కళ్యాణి, ప్రణవ్‌ పెళ్లి కోసం వెయిటింగ్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. అది తప్పుడు వార్త అంటూ లిస్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది. వారిద్దరి మధ్య ఎలాంటి లవ్, డేటింగ్‌ లాంటి రిలేషన్స్‌ లేవని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కళ్యాణి ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో లేదని లిస్సీ తేల్చి చెప్పంది. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వీరిద్దరి వెడ్డింగ్ రూమర్స్‌కు తెరపడింది.

    k
     

  • టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ‍తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ  చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    ముఖ్యంగా ఐకాన్ స్టార్‌  అల్లు అర్జున్‌ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్‌లో ఏడ్చిన సందర్భం నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్‌లో టీమ్‌తో సెండాఫ్‌ టైమ్‌లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్‌లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. 

    కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో ‍అల్లు అర్జున్‌కు జంటగా హన్సిక హీరోయిన్‌గా నటించింది. 
     

  • వైట్ డ్రస్‌లో గ్లామరస్‌గా రితిక నాయక్

    ఫారిన్ బ్యూటీలా జాన్వీ కపూర్

    చీరలో అందంగా కాయదు లోహర్

    మొరాకో ట్రిప్‌లో సింగర్ జోనితా

    హోటల్ రూంలో రుక్మిణి చిల్ మోడ్ 

  • కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తంగలాన్ తర్వాత మరో యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌లో 63వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్, టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ ‍అప్‌డేట్‌ ఇచ్చారు. ఇవాళ చియాన్ విక్రమ్ బర్త్ డే కావడంతో ఫస్ట్‌ లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫ్లేమ్ పేరుతో ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. 


     

     

  • ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

    భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.

    'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన  రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక)

  • హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న ఓ మూవీ షూటింగ్‌లో ఆమె నగదు చోరీకి గురైంది. రాశీ హ్యాండ్ బ్యాగ్‌ నుంచి రూ.50 వేలను తస్కరించినట్లు తెలుస్తోంది. మూవీ సెట్స్‌లోని వానిటీ వ్యాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని చితకబాది.. బయటికి గెంటేశారు.

    ఈ చోరీతో మూవీ సెట్స్‌లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి  సంఘటనలు జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశీ ఖన్నా టీమ్‌ చెప్పడం విశేషం. ఈ విషయంపై మాట్లాడటానికి రాశీ ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా.. రాశీ ఖన్నా ప్రస్తుతం అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్‌లతో కనిపించనుంది. 
     

  • తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ హన్సిక.. గత నెలలో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భర్త సొహెల్ కతురియా నుంచి విడిపోయింది. అధికారికంగా ఈమె ఈ విషయం బయటపెట్టనప్పటికీ.. ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొలిసారి హన్సిక.. విడాకుల గురించి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)

    'ప్రజలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్. అవి వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఇందులో(విడాకులు తీసుకోవడంలో) నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, శ్రేయస్సే ముఖ్యం. విడాకుల కారణాలు పూర్తిగా వ్యక్తిగతం. అవి మా మధ్యే ఉండాలి. ఈ కష్ట సమయంలో తల్లి, సోదరుడు అండగా నిలిచారు. విడాకులు తర్వాత విశ్రాంతి కోసం జపాన్ వెళ్లొచ్చాను' అని హన్సిక చెప్పుకొచ్చింది.

    బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, టీనేజీలోనే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. 2022 డిసెంబరులో సొహెల్ కతురియాని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఈమె వివాహాన్ని.. 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరిట ఓటీటీలోనూ విడుదల చేశారు. కానీ ఇప్పుడు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. హన్సిక స్నేహితురాలితోనే తొలుత సొహెల్‌కి వివాహమైంది. ఆమెకి విడాకులిచ్చేసిన తర్వాత హన్సికని పెళ్లాడాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.

    (ఇదీ చదవండి: చెల్లి ఆలియా భట్ పెళ్లయిన నాలుగేళ్లకు అక్క ఎంగేజ్‌మెంట్‌)

  • సిల్వర్‌స్క్రీన్‌ మీదే కాదు వెబ్‌ స్క్రీన్‌ మీద కూడా మైథలాజికల్‌ కంటెంట్‌కి కూడా రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది. ఇలాంటి కథను చిన్న పిల్లల నుంచి మొదలు పెద్ద పిల్లల వరకు అందరూ ఆసక్తికరంగా చూస్తారు. అందుకే మన దర్శకనిర్మాతలు మైథలాజికల్‌ టచ్‌తో డిఫరెంట్‌ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వెబ్‌ సిరీసే పోచమ్మ. అచ్యుత్ కుమార్‌, స్నేహ‌ల్ కామ‌త్‌, అర్జున్ అంబ‌టి కీల‌క పాత్ర‌ల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ నేటి(ఏప్రిల్‌ 17) నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    వ్యాపారవేత్త ఫెడ్రిక్‌(రమేశ్‌ ఇందిరా) అరకులో కొత్తగా ఓ కాఫీ ఎస్టేట్‌ కొనుగోలు చేస్తాడు. ఒకప్పటి ఆ ఎస్టేట్‌ ఓనర్‌ రఘుపతి(అచ్యుత్‌ కుమార్‌).. ఆర్థిక సమస్యలతో దాన్ని ఫెడ్రిక్‌కి అమ్మి, అందులోనే మేనేజర్‌గా పని చేస్తాడు. ఫెడ్రిక్‌ ఆ బంగ్లాలోకి రాగానే.. ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత వారింట్లో సమస్యలు మొదలవుతాయి. ఫెడ్రిక్‌ చిన్న కూతురు జెస్సీ(స్నేహల్‌ కామత్‌) అనుమానాస్పద రీతిలో చనిపోతుంది. 

    ఆమె చావుకు రఘుపతి కొడుకు సురేశ్ కారణమని ఫెడ్రిక్‌ పెద్ద కూతురు ఇవా(ప్రియా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు మాత్రం ఈ హత్య వెనుక ఇవా భర్త డేవిడ్‌(అర్జున్‌ అంబటి) కూడా ఉన్నట్లు అనుమానిస్తారు. ఊరువాళ్లు మాత్రం పోచమ్మ విగ్రహం తొలగించినందుకే.. అమ్మ ఆగ్రహించి జెస్సీని చంపేసిందని నమ్ముతారు. అసలు జెస్సీ ఎలా చనిపోయింది? ఆమె చావుకు అసలు కారకులు ఎవరు? దేని కోసం చేశారు? పోచమ్మ విగ్రహం తొలగించిన తర్వాత ఫెడ్రిక్‌ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? చివరకు ఫెడ్రిక్‌కి తెలిసిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘పోచమ్మ’ సిరీస్‌ చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    ఇదొక మర్డర్‌ మిస్టరీ. దానికి మైథాల‌జీ ఎలిమెంట్‌ను యాడ్‌ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్‌ని తీర్చిదిద్డాదు దర్శకుడు రమేష్‌ ఇందిరా. తక్కువ నిడివితో మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. జెస్సీ చనిపోయే సన్నివేశంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. పోలీసులు ఇన్వెస్టిగేషన్‌..కథపై ఆసక్తిని పెంచుతుంది. జెస్సీ చావుకు కారణం ఏంటనేది చివరి వరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. రెండో ఎపిసోడ్‌లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే సీన్‌ మాత్రం కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. 

    ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో కొత్త కొత్త విషయాలు బయటకు రావడం.. మరోవైపు పోచమ్మకు సంబంధించిన సీన్లతో ఐదు ఎపిసోడ్లను ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి.‍ అయితే థ్రిల్లర్‌ సిరీస్‌లు చూసే ఆడియెన్స్ మాత్రం విలన్‌ ఎవరు అనేది ఈజీగానే కనిపెట్టగలరు. రూపాలు వేరైనా దేవుళ్లు అంద‌రూ ఒక్క‌టే అంటూ సిరీస్‌ని ముగించిన తీరు బాగుంది. తెలుగువారికి పెద్దగా పరిచయం లేని నటీనటులు ఉండడం.. కథనం కొంతమేర ఊహకందేలా సాగడం ఈ సిరీస్‌కి మైనస్‌. అలాగే పోచమ్మకు సంబధించిన సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. నిడివి తక్కువగా ఉండడం  ఈ సిరీస్‌కి ప్లస్‌ పాయింట్‌. థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ‘పోచమ్మ’ నచ్చుతుంది. 

    ఎవరెలా చేశారంటే..
    ఈ సిరీస్‌కి రమేశ్‌ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా.. కీలకమైన ఫెడ్రిక్ పాత్రను కూడా పోషించాడు. కాఫీ ఎస్టెట్‌ ఓనర్‌గా ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజీ చక్కగా కుదిరింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న డేవిడ్‌ పాత్రలో అర్జున్‌ అంబటి ఒదిగిపోయాడు. నిడివి తక్కువే అయినా.. ఆయన పాత్ర గుర్తిండిపోతుంది. ఇక జెన్సీగా స్నేహిల్‌ గ్లామర్‌గా కనిపిస్తూనే..తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇవా పాత్రకి ప్రియా న్యాయం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అచ్యుత్‌ కుమార్‌ రోల్‌ గురించి. రఘుపతి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. చివరిలో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్‌-2 రిలీజై నెల రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మార్చి 19న విడుదలైన దురంధర్‌-2 వసూళ్ల పరంగా ఇంకా రాణిస్తోంది. ఇప్పటికే రెండు పార్టులు కలిపి రూ.3 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రాలు ఇండియన్ సినిమా గతినే మార్చేశాయి. తాజాగా దురంధర్-2 మూవీ అరుదైన రికార్డ్‌పై కన్నేసింది.

    అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 అల్ టైమ్ వసూళ్ల రికార్డ్‌కు అతి చేరువగా వచ్చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1,742.10 కోట్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ దురంధర్‌ రూ. 1,737.74 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. అంటే కేవలం రూ.5 కోట్లు మాత్రమే వెనకంజలో ఉంది. ఈ మూవీ 5 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే పుష్ప-2 రికార్డ్‌ను బ్రేక్ చేయనుంది. ఈ జాబితాలో అమిర్ ఖాన్ దంగల్, రాజమౌళి బాహుబలి-2, పుష్ప-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వసూళ్లు ఇలాగే కొనసాగితే దురంధర్‌-2 త్వరలోనే పుష్ప-2ను వెనక్కి నెట్టనుంది.

    కాగా..ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం  వహించారు. ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ రిలీజ్ చేసిన సరికొత్త రికార్డ్ సృష్టించారు. 
     

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. చివరిసారిగా జిగ్రా మూవీలో కనిపించిన ఆలియా..  సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'లవ్ అండ్ వార్' (2027) చిత్రంలో కనిపించనుంది.

    ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ సిస్టర్ షాహీన్ భట్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్‌ ఇషాన్ మెహ్రీతో తన నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ జంట తమ బంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా చేశామేమో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న షాహీన్ తల్లి, ఆలియా అత్త నీతూ కపూర్, సోనీ రజ్దాన్, అనన్య పాండే, నీనా గుప్తా, మసాబా గుప్తా,  జోయా అక్తర్, షనయా కపూర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

    కాగా.. మహేష్ భట్, సోనీ రజ్దాన్‌ల పెద్ద కుమార్తె షాహీన్ భట్. ఆమె స్క్రీన్ రైటర్‌తో పాటు మానసిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. షాహీన్ కాబోయే భర్త ఇషాన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోచ్‌గా రాణిస్తున్నారు. ఆమెతో పాటు ఆలియా భట్, పూజా భట్, రాహుల్ భట్ అనే మరో ముగ్గురు వీరికి సంతానం. ఆలియా భట్‌ ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడగా.. వీరికి రాహా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. 
     

     

  • ప్రముఖ నటుడు  జేడీ చక్రవర్తి  ప్రధాన పాత్రలో , నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్న సినిమా 'చేతబడి'. ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యాస్ దర్శకుడు కాగా మహేంద్ర నాథ్ కూండ్ల  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతమందిస్తున్నాడు.

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)

    బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో హారర్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి ప్రకటించారు. డిఫరెంట్ అవతార్‌‌లో హీరో, విలన్‌గా  జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.

    ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవకముందే ఐదు భాషల ఆడియో రైట్స్‌ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఓ  పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్‌, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 

    (ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

  • మలయాళంలో తీసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీ డబ్బింగ్‌లు రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. రీసెంట్‌గా 'సంభవం అధ్యాయం ఒన్ను' అనే టైమ్ లూప్ థ్రిల్లర్ అలరిస్తుండగా.. ఇప్పుడు మరొకటి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 'దృశ్యం' తీసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో అందుబాటులో ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్ నుంచి త్వరలోనే 'దృశ్యం 3' రాబోతుంది. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి రావాలి గానీ వచ్చే నెలకు వాయిదా వేశారు. ఈ దర్శకుడి తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ 'వలతు వషత్తే కల్లన్'. దృశ్యం తరహాలో మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. గత నెల చివరలో మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు.

    'వలతు వషత్తే కల్లన్' విషయానికొస్తే.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎథికల్ హ్యాకర్ శ్యామ్యూల్ జోసెఫ్(జోజూ జార్జ్) గతాన్ని వదిలేసి భార్యకూతురితో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటాడు. ఇతడి కూతురు లా స్టూడెంట్, యాక్టివిస్ట్. ఇకపోతే రాజకీయ నాయకుడు కొడుకు ఒకడు ఓ అమ్మాయి మరణానికి కారణమవుతాడు. స్థానిక పోలీసాఫీసర్ ఆంటోని(బిజూ మేనన్) చాలా అవినీతపరుడు. ఈ కుర్రాడిని కాపాడుతాడు. వీళ్లిద్దరిపై సదరు లా స్టూడెంట్ పోరాడుతుంది. ఇంతలోనే ఈమె దారుణ హత్యకు గురవుతుంది. మరి ఇద్దరిలో ఈమెని చంపింది ఎవరు? వారిపై జోసెఫ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

International

  • ప్రళయ కాలం వచ్చేసింది. నవంబర్ 13, 2026 శుక్రవారంనాడు మానవాళికి ఆఖరి రోజు... ఇది ఏ జ్యోతిష్కుడో లేక ప్రసిద్ధి చెందిన తత్వ వేత్తలు చెప్పిన భవిష్యత్తు కాదు. అక్షరాలా ఓ సైంటిస్టు లెక్కలు వేసి మరీ పక్కాగా చెప్పిన సమాచారం. అది కూడా 60 ఏళ్ళ క్రితం లెక్క గట్టిన పక్కా విషయం. ఇకపోతే ఈ ప్రళయానికి కారణం ప్రకృతి వైపరీత్యాలో లేక మరొకటో అనుకుంటే మీరు పొరబడినట్లే. అసలు కారణం వెంటే ముక్కున వేలేసుకుంటారు.  అవును, మీరు విన్నది నిజమే. సైన్స్ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, భయంకరమైన అంచనా ఇది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవకుండా చూడండి.

    మనం ఊహించే అణు యుద్ధం వల్లనో, ఉల్కలు పడటం వల్లనో కాదు... మానవ జనాభా పెరిగే వేగాన్ని బట్టి 'అనంతం' (Infinity) అనే బిందువును మనం చేరుకుంటాం. అంటే, భూమి ఇక ఒక్క మనిషిని కూడా మోయలేదు. అంతా ముగిసిపోతుంది! ఈ భయంకరమైన జోస్యం చెప్పింది ఎవరో కాదు... సైబర్నెటిక్స్ ప్రపంచపు పితామహుడు, గ్రేట్ ఫిజిసిస్ట్ హీంజ్ వాన్ ఫోయెర్‌స్టర్. ఆయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చెప్పే మాయావి. జాన్ వాన్ న్యూమాన్, మార్గరెట్ మీడ్ వంటి దిగ్గజాలతో కలిసి పని చేసిన మేధావి. కానీ ఆయన 1960లో 'సైన్స్' మేగజైన్‌లో ఒక ఆర్టికల్ ప్రచురించారు. దాని పేరు "డూమ్స్‌డే: ఫ్రైడే, 13 నవంబర్, ఏడీ 2026". సరిగ్గా ఆయన 115వ పుట్టినరోజు నాడే ఈ ప్రపంచం అంతమైపోతుందని ఆయన లెక్కలు తేల్చాయి. ఇది వినడానికి ఒక పిచ్చివాడి వాదనలా అనిపించవచ్చు... కానీ ఆ లెక్కల వెనుక ఉన్న లాజిక్ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది!

    ఆయన వాదన ప్రకారం, గత రెండు వేల ఏళ్లుగా మానవ జనాభా కేవలం పెరుగుతూనే లేదు... పెరిగే వేగం కూడా పెరుగుతూ పోతోంది. దీనినే 'సూపర్ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్' అంటారు. ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే, 2026 నవంబర్ 13న జనాభా గరిష్ట స్థాయిని దాటిపోతుంది. జనాభా అనంతం అవుతుంది. అంటే అర్థం ఏమిటి? వనరులు సున్నా అవుతాయి. ఆక్సిజన్ అందదు. ఆహారం ఉండదు. కేవలం మనుషులు మాత్రమే మిగులుతారు... ఒకరిని ఒకరు తొక్కేసుకునే స్థాయిలో! అయితే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఫోయెర్‌స్టర్ నిజంగానే ప్రపంచం నాశనమవుతుందని నమ్మారా? లేక మనల్ని ఏదో హెచ్చరించాలని చూశారా? ఆయన సిద్ధాంతంలో "సెకండ్ ఆర్డర్ సైబర్నెటిక్స్" అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, మనం ఒక వ్యవస్థను గమనిస్తున్నప్పుడు, మనం కూడా ఆ వ్యవస్థలో భాగమే అవుతాం. అంటే, "మనం చూసేదే నిజం కాదు... మనం ఎలా చూడాలనుకుంటున్నామో అదే మనకు కనిపిస్తుంది." ఆయన చెప్పిన 'డూమ్స్‌డే' లెక్క కేవలం గణితం కాదు, మనుషులు కేవలం నంబర్లను చూసి భవిష్యత్తును అంచనా వేయలేరని, మన మేధస్సుతో ఆ మార్గాలను మార్చగలమని ఆయన చెప్పకనే చెప్పారు. దీన్నే ఆయన 'ఎథికల్ ఇంపరేటివ్' (Ethical Imperative) అన్నారు—అంటే "ఎప్పుడూ అవకాశాలను పెంచుకునేలా ప్రవర్తించు, తగ్గించేలా కాదు."

    ఆయన ప్రకారం ప్రస్తుతం మనం 2026 లో ఉన్నాం. ఇవాళ మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, కాలుష్యం, కొత్త కొత్త వైరస్‌లు... ఇవన్నీ చూస్తుంటే ఫోయెర్‌స్టర్ చెప్పిన ఆ 'డూమ్స్‌డే' భయం నిజమే అనిపిస్తోంది కదా? ఆయన ఆ రోజును 'శుక్రవారం 13' అని ఎందుకు ఎంచుకున్నారు? అది మూఢనమ్మకమా లేక మానవాళిని భయపెట్టి మేల్కొల్పే ప్రయత్నమా? మనం ఒక 'ట్రివియల్ మెషిన్'  లాగా కేవలం ఇచ్చిన ఇన్‌పుట్‌కు అవుట్‌పుట్ ఇచ్చే రోబోల్లా బ్రతుకుతున్నామా? లేక మన చుట్టూ జరుగుతున్న వినాశనాన్ని ఆపగల 'అబ్జర్వర్స్'  లాగా మారుతామా? హీంజ్ వాన్ ఫోయెర్‌స్టర్ వారసత్వం మనకు ఒకటే నేర్పుతోంది. రేపటి ప్రళయం గురించి భయపడటం కాదు... ఆ ప్రళయాన్ని ఆపే శక్తి మన ఆలోచనల్లోనే ఉంది. మనం సృష్టించుకున్న సిద్ధాంతాలే మనల్ని బంధీలను చేస్తున్నాయా? లేక కొత్త మార్గాలను వెతుక్కునేలా చేస్తున్నాయా? నవంబర్ 13, 2026 రాబోతోంది. అది ప్రళయ దినమా? లేక మానవ పరిణామ క్రమంలో ఒక కొత్త పాఠమా? ముగింపు మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే... ఈ ప్రపంచాన్ని చూస్తున్న మనం కేవలం ప్రేక్షకులు కాదు, ఈ వ్యవస్థను నడిపించే శక్తులు! 

     

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్‌ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్‌ తెరిచి ఉంది.. కానీ ఇరాన్‌తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్‌ కొనసాగుతుంది’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో ప్రకటించారు.

    ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్‌ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్‌ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్‌ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మరోవైపు అణు అంశంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు.  

    అంతకుముందు హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి.

     

     

  • కేప్‌టౌన్‌ : పొప్‌ లియో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు చేయడానికి బిలియన్లు ఖర్చు చేసి కొద్ది మంది నియంతల వల్ల ప్రపంచ తీవ్ర వినాశనానికి గురవుతుందన్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తిక్కరేస్తే అంతే సంగతులు. ఏవరికైనా వార్నింగ్‌ ఇస్తారు. ఈ దేశంపైనైనా దాడికి తెగబడతారు. ఇటీవల ఆ జాబితాలో పోప్‌ లియో-14 చేరారు. ఆయన బలహీన పోప్‌ అని అతనికి ఆ పదవి తన వల్లే వచ్చిందన్నారు. ఆయన విదేశాంగ విధానం చాలా దారుణమని మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షున్నే విమర్శించే పోప్‌ తమ దేశానికి వద్దని విరుచుకపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలకు పోప్‌ సైతం ఎక్కడా తగ్గకుండా సమాధానం ఇచ్చారు.

    ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పోప్‌  మీడియాలో ఇలా మాట్లాడారు " యుద్ధాలు చేయడానికి బిలియనల్ కొద్ది డబ్బు ఖర్చు చేసే వారి వల్ల ప్రపంచం నాశనమవుతోంది.అంతేకాకుండా తమ స్వార్థపు లక్షాలను సాధించడానికి వీరు భగవంతుని పేరు వాడుకోవడం చాలా బాధకరమన్నారు. విధ్వంసం కోసం బిలియన్లు ఖర్చు చేసే వారు విద్య, పునరావాసంపై దృష్టిసారించరు. దేనినైనా నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. కానీ సరిచేయడానికి ఒక జీవితకాలం కావాలి" అన్నారు. అయితే పోప్‌ పర్యటనకు అక్కడ విశేష స్పందన లభించింది. బబెండా నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరయి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇస్లామిక్‌, క్రైస్తవ మత నాయకులతో పోప్‌ లియో ఒక శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

  • అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్‌లైన్స్ (Spirit Airlines) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఇంధన ధరలు, భారీ అప్పుల కారణంగా ఈ సంస్థ నేటి నుండే తన కార్యకలాపాలను నిలిపివేసే దిశగా పయనిస్తోంది.

    CBS న్యూస్ రిపోర్ట్‌ ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు పెరగడం వల్ల, రాబోయే రుణ చెల్లింపులు చేయగల సామర్థ్యం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో  విమానయాన సంస్థ రుణదాతలు  సందేహాలు వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది.

    త్వరలోనే మూత పడుతుందా? 
    అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2026లో గాలన్ ఇంధనం ధర 2.24 cగా ఉంటుందని కంపెనీ అంచనా వేయగా, ప్రస్తుతం అది 4.24 డాలర్లకు చేరింది. ఇది కంపెనీ అంచనాల కంటే రెట్టింపు. దీనికి తోడు  భారీగా పేరుకుపోయిన అప్పులు తీర్చగల కంపెనీ సామర్థ్యంపై రుణదాతలు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంస్థను లిక్విడేట్ (ఆస్తులు విక్రయించి మూసివేయడం) చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.రుణదాతలతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి ఈ వారం లోపే కంపెనీ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    దివాలా ప్రక్రియ (Bankruptcy)
    స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే రెండుసార్లు దివాలా రక్షణ  కోరింది. గత ఏడాది ఆగస్టులో 214 విమానాలతో రెండోసారి దివాలా దరఖాస్తు చేసింది. సంస్థను బతికించుకునే ప్రయత్నంలో భాగంగా విమానాల సంఖ్యను భారీగా తగ్గించాలని (సుమారు 80 జెట్‌లకు) నిర్ణయించింది. ఇది గతంలో ఉన్న విమానాల సంఖ్యలో మూడింట ఒక వంతు మాత్రమే.

    ఇదీ చదవండి: టీసీఎస్‌ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం

    ప్రయాణికులకు హెచ్చరిక
    ప్రస్తుతానికి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ, నిపుణులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు కంపెనీ కార్యకలాపాలు ఎప్పుడైనా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందే 'బ్యాకప్ ప్లాన్' సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

    కాగా  ఒకప్పుడు 200 పైగా విమానాలతో వెలిగిన ఈ సంస్థ, ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. తక్కువ ధరకే ప్రయాణించే వారు ఎక్కువగా స్పిరిట్‌ను ఎంచుకునేవారు. ఒకవేళ ఇది మూతపడితే, ఇతర విమాన సంస్థల్లో పోటీ లేక టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

    ఇదీ చదవండి: నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం

  • హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ప్రపంచానికి శుభవార్త అందిస్తూ హర్మూజ్‌ జలసంధిని ఎట్టకేలకు తెరిచింది. హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల సీజ్‌ఫైర్‌(కాల్పుల విరమణ) ఒప్పందంతో హర్మూజ్‌ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్‌ స్పష్టం చేసింది. ఆ దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ కొనసాగేంతవరకూ హర్మూజ్‌ తెరిచే ఉంటుందని పేర్కొంది. 

    హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ ప్రకటనతో  నౌకల రాకపోకలు యధావిధిగా కొనసాగనున్నాయి.  అదే సమయంలో హర్మూజ్‌ను తెరిచామన్న ఇరాన్‌ ప్రకటన అనంతరం చమురు ధరలు భారీగా పడిపోయాయి.  ఇక హర్మూజ్‌ను తెరిచినందుకు ఇరాన్‌కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. 

    కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్నిగురువారం రాత్రి(భారత కాలమాన ప్రకారం) ట్రంప్‌ తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. 

    ప్రధానంగా లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రుబియో ఫోన్‌ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్‌ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు.  దాంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్‌. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చారు.  మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం అవి సత్ఫలితాల్ని ఇవ్వడం గమనార్హం.

  • ప్రపంచాన్ని ఓ వైపు యుద్ధం కుదిపేస్తుంటే అమెరికాలో మాత్రం ఇమ్మిగ్రేషన్ నిబంధనల పేరుతో అధికారులు ఆగడాలు ఏంతమాత్రం ఆగడం లేదు. అమెరికాలో 35 ఏళ్లుగా నివాసముంటున్న భారత్‌కు చెందిన ఒక మహిళను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.

    మీనూ బాత్రా అనే 53 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ వేరే ప్రాంతానికి ప్రయాణం కోసం మార్చి 17 న హర్గింగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తన విమానం కోసం ఎయిర్‌పోర్టు వద్ద ఎదురుచూస్తుండగా హఠాత్తుగా ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు వచ్చి తన చేతికి సంకెళ్లు వేసి తనను అరెస్టు చేశారు. అనంతరం రేమండ్ విల్లాలోని డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. తనకు చట్టపరమైన పరిమితి ఉందని ఎంత వాదించినా వారు పట్టించుకొనే యత్నం చేయలేదు.

    అయితే దీనిపై మీనూ బాట్రా స్పందించారు. " నన్ను ఒక ఖైదీలా చూశారు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విచారణ సమయంలో 24 గంటలపాటు  ఎటువంటి ఆహారం ఇవ్వలేదు. కనీసం మంచినీరు కూడా అందించలేదు. అరెస్టు తర్వాత తనను చేతులు వెనక్కి పెట్టి బేడీలు వేసినట్లు కనిపించేలా ఫోటోలు తీయించుకోవాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో నేను చాలా అవమానానికి గురయ్యాను, నన్ను ఒక నేరస్థురాలిలా ట్రీట్ చేశారు" అని ఆమె మీడియా ఎదుట వాపోయారు.

    దీంతో బాత్రా అనే మహిళ తన అరెస్టును సవాలు చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు మొదటి 24 గంటల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా నిర్బంధించారని, కనీసం తన మందులను కూడా ఇవ్వడానికి నిరాకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    కాగా బాత్రా 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివసిస్తున్నారు. టెక్సాస్‌లో పంజాబీ, హిందీ మరియు ఉర్దూ భాషలకు గుర్తింపు పొందిన ఏకైక కోర్టు ఇంటర్‌ప్రెటర్‌గా (అనువాదకురాలిగా) ఇమ్మిగ్రేషన్ కోర్టులో కొన్నేళ్లుగా వందలాది మందికి సహాయం చేశారు. ఇలాంటి గుర్తింపు ఉన్న వ్యక్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడ అరెస్టు చేస్తే సాదారణ వ్యక్తుల పరిస్థితి ఏంటని అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

     

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆరోగ్య రంగంలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఊబకాయం (Obesity) తగ్గించుకోవడానికి ఇంజెక్షన్లతో పనిలేకుండా, రోజూ ఒక మాత్ర వేసుకుంటే సరిపోయే 'ఫౌండాయో' (Foundayo - orforglipron) అనే ఔషధానికి యూఏఈ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    ప్రముఖ ఫార్మా కంపెనీ 'ఎలీ లిల్లీ' (Eli Lilly) దీనిని అభివృద్ధి చేసింది. ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో, ఇంజెక్షన్ల ద్వారా బరువు తగ్గించే చికిత్సలకు సూది అవసరం లేని ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలోని మొదటి దేశాలలో యూఏఈ ఒకటిగా నిలిచింది.


    ఫౌండాయో  ప్రత్యేకతలు
    టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు,  కొన్ని రకాల క్యాన్సర్లతో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఊబకాయం ముడిపడి ఉన్న తరుణంలో ఈ ఆమోదం లభించింది.ఇప్పటివరకు బరువును తగ్గించుకునే చికిత్సలో  ఇంజెక్షన్‌లను తీసుకోవాల్సి వచ్చేది.  ఇపుడిక సూదితో పనిలేకుండానే  బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి వాడే 'GLP-1' మందులు ఇంజెక్షన్ల రూపంలో ఉండేది.  కానీ ఫౌండాయో అనేది నోటి ద్వారా తీసుకునే మాత్ర. సులభమైన పద్ధతి కూడా. ఈ మాత్రను భోజనంతో సంబంధం లేకుండా రోజుకు ఒకసారి వేసుకోవచ్చు. ఇది రోగులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఈ మాత్రకు  USFDA ఆమోధం లభించింది.  ప్రయోగాల్లో ఇది 15శాతం వరకు బరువు తగ్గినట్టు తేలింది.   

    ఎలా పని చేస్తుంది?
    ఇది శరీరంలోని ఆకలిని నియంత్రించే హార్మోన్లలా పనిచేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి తగ్గుతుంది, తద్వారా తక్కువ కేలరీలు తీసుకుంటారు. ఈ మాత్ర అందరికీ అందుబాటులో ఉండదు. ఇది సాధారణ లేదా సౌందర్య ఉపయోగం కోసం ఉద్దేశించినది కాదు. కేవలం వైద్యుని సిఫార్సుతో, కఠినమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే లభిస్తుంది. యూఏఈ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ మందును సిఫార్సు చేసే ముందు స్పష్టమైన అర్హత మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

    యూఏఈలోని ఫార్మసీలలో మే 2026 నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు వాడకూడదు. చికిత్స ప్రారంభించే ముందు రక్త పరీక్షలు మరియు మెటబాలిక్ స్క్రీనింగ్ తప్పనిసరి. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 30 పైన ఉన్నవారు లేదా BMI 27 ఉండి రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు దీనికి అర్హులు.

    ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య

    ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ 
    క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, ఈ మాత్ర వాడిన వారు 72 వారాల కాలంలో సగటున 12.4% బరువు (సుమారు 12 కిలోలు) తగ్గినట్లు తేలింది. బరువుతో పాటు కొలెస్ట్రాల్ , రక్తపోటు కూడా తగ్గుతాయి. ప్రారంభ దశలో వికారం, జీర్ణక్రియ సమస్యలు ఉండవచ్చు. అందుకే వైద్యుల పర్యవేక్షణ అవసరం.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    ధర  ఎంత? 
    యూఏఈలో దీని అధికారిక ధర ఇంకా ఖరారు కాలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలు దీనిని కవర్ చేస్తాయనే దానిపై ధరను నియంత్రించవచ్చు. మరో బరువు తగ్గే ఔషం Novo Nordiskతో పోటీగా దీని ధర నెలకు సుమారు 149 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

    ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్‌

    నోట్‌ : బరువు తగ్గడం అనే ప్రక్రియ షార్ట్‌కట్‌లతో కాదు. కచ్చితమైన వ్యాయామం, ఆహార నియమాలు అవసరం. అలాగే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి.   గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  ఇలాంటి మందులను వాడకూడదని గమనించాలి.

Politics

  • చెన్నై: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. లోక్‌సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్‌. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్‌. ఇదిట్రైలర్‌ మా  త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్‌.

    ఇక తెలంగాణ సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్‌ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్‌.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.

    ఇదీ చదవండి:

    ఓడిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు
     

     

     

  • డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టమా? పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ డీలిమిటేషన్‌తో రాష్ట్రాలకు నష్టమా? రాష్ట్రాల మధ్య వివాదాలు జరుగుతాయా? దీనిపై పాలిటీ విశ్లేషకుడు, యూపీఎస్సీ సివిల్స్‌, పోటీ పరీక్షల మెంటార్‌ మెన్నేని సంతోష్‌రావు వివరణ లైవ్‌లో మీకోసం..

    LIVE: డీలిమిటేషన్ తో... రాష్ట్రాల మధ్య యుద్ధం .?
  • ఢిల్లీ: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌పై చర్చ కొనసాగుతోంది.అయితే, ఈ కీలక బిల్లలుపై చర్చ జరిగే సమయంలో సొంత పార్టీ నేతల గైర్హాజరుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ  (ఆప్‌) రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా సెటైర్లు వేశారు.

    రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి నన్ను తొలగించారు. అయినా సరే మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతుంటే సభకు నేను హాజరయ్యాను. మరి వాళ్లద్దరేరి అంటూ ఆప్‌ పార్టీ ప్రతినిధి, పార్టీ నూతన రాజ్య సభ ఉపనాయకుడిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

    నా పార్టీకి చెందిన నాయకుడు, నా స్థానంలో కొత్త నియమితులైన ఉప నాయకుడు కూడా సభలో లేరు. ఆప్‌ ఇటీవల తొలగించబడిన ఉప నాయకుడిని నేను. నేను సభలోనే ఉన్నాను. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని అన్నారు.  

    రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి చద్దాను ఇటీవల తొలగించడంతో పాటు, సభలో ఆయన మాట్లాడే సమయాన్ని కూడా పార్టీ తగ్గించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్ణయంపై పార్టీలో విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు ఈ పరిణామం ఆజ్యం పోసింది.

Business

  • చెన్నై: రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు.

    అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు.

    తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

  • ముంబై: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌), తన ఫిన్‌టెక్‌ విభాగం ఇన్ఫినైట్‌ కింద మహిళల కోసం మహిళలే నిర్వహించే ‘లీడర్‌షిప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవలు ఫిన్‌టెక్‌ రంగాల్లో ప్రారంభ దశలో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు దీని కింద మద్దతు ఇస్తుంది. అలాగే, వారికి అవసరమైన వనరులు అందించడంతోపాటు వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వ్యాపార విస్తరణకు స్థిరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.

    ఈ 'లీడర్‌షిప్‌' కార్యక్రమం ద్వారా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లోని అగ్రశ్రేణి నిపుణుల నుండి ప్రత్యక్ష పర్యవేక్షణ (Mentorship) లభిస్తుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, మార్కెట్ యాక్సెస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి స్టార్టప్‌లను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఫిన్‌టెక్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లింగ వివక్షను తొలగించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఏబీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

    అంతేకాకుండా, ఈ వేదిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వారిని సిద్ధం చేస్తారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, సుస్థిరమైన, సమ్మిళిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ముందడుగు వేసింది.

  • ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ నికర సంపద 92.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్‌కు చేరుకున్నారు.

    చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్‌ అంబానీ 90.8 బిలయన్‌ డాలర్ల సంపదతో  ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.

    అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలు
    ఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.

    ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..
    ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు.

  • ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్‌’ పోస్ట్‌లో హెచ్చరించారు.

    బుడగ పేలిపోనుంది!
    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    "దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

    బాధితులుగా మిగిలిపోకండి..
    ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.

    ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

  • ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) భారత మార్కెట్లోకి సంచలన మోడల్‌ను ప్రవేశపెట్టింది. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'సింపుల్ అల్ట్రా' (Simple Dot One/Ultra)ను రూ. 2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో 'జెన్ 2' లైనప్‌తో పాటు ఆవిష్కరించిన ఈ స్కూటర్, ఇప్పుడు బుకింగ్స్‌కు సిద్ధంగా ఉంది.

    ఒక్క ఛార్జ్‌తో 400 కిలోమీటర్లు!
    ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 400 కిలోమీటర్ల (IDC) మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ద్విచక్ర వాహన రంగంలో ఇదే అత్యధికం. ఈ స్థాయి రేంజ్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లకు కూడా లేదు.

    ఉదాహరణకు, భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా టియాగో ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ (ధర సుమారు రూ. 7.99 లక్షలు) ఒక్క ఛార్జ్‌పై 293 కిమీ మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన చూస్తే, కారు కంటే సగం ధరలోనే అంతకంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్‌గా 'సింపుల్ అల్ట్రా' రికార్డు సృష్టించింది.

    పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్
    ఈ స్కూటర్ 6.5 kWh భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది కేవలం 2.77 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రైడర్ భద్రత కోసం ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే, రైడింగ్ డేటా, కనెక్టివిటీ ఫీచర్ల కోసం 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.

    విలువ పరంగా చూస్తే.. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 2.35 లక్షలు ఖర్చు చేయడం ఎక్కువ అనిపించినా, అది ఇచ్చే 400 కిమీ రేంజ్ వాహనదారులకు భారీ లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ధర ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.17 లక్షలు) వంటి స్పోర్ట్స్ బైక్ల ధరకు ఇంచుమించు సమానంగా ఉంది.

  • కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్‌లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    అసలేం జరిగింది?
    హెచ్‌సీఎల్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్‌ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

    సీన్ కట్ చేస్తే.. 
    సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్‌ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

    ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.

    ఇదీ చదవండి: ‘టెక్‌ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మంచి లాభాల్లో ముగిశాయి. వారాంతాల్లో జరగనున్న యూఎస్-ఇరాన్ చర్చల కోసం ట్రేడర్లు సిద్ధమవడంతో భారత బెంచ్‌ మార్క్‌ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 504.86 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 78,493.54 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 156.8 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 24,353.55 వద్ద ముగిసింది.

    హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. 

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.27 శాతం, 1.48 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచాయి.

    ఇరాన్ తో యుద్ధం త్వరలో ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. లెబనాన్, ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన గురువారం ప్రకటించారు. లెబనాన్ పై దాడిని ఆపడం ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ నుండి వచ్చిన ముఖ్య షరతులలో ఒకటి అని నివేదికలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ ఈ వారాంతంలో చర్చల కోసం సమావేశమవుతున్నాయి.

     

  • దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.

    రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యం
    గణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

    సర్వే ఎలా చేస్తారంటే.. 
    నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.

    ప్రపంచ దేశాల సరసన భారత్
    ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.

    ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'
    ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.

    హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

National

  • న్యూఢిల్లీ:  లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడానికి కారణమైన పలు  పార్టీల వైఖరికి నిరసనగా ఎన్డీయే ఎంపీలు.. పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేపట్టారు. ఈ బిల్లును విపక్షాలే ఓడించాయంటూ నిరసనకు దిగారు. విపక్ష ఎంపీలన దేశం క్షమించదు అంటూ నినాదాలు చేశారు.  ‘మీరు ఓడించారు.. మీకు మహిళలే బుద్ధి చెబుతారు’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. 

    మహిళా లోకానికి ఇది చీకటి రోజు అని అన్నారు బీజేపీ మహిళా ఎంపీ డీకే అరుణ. మహిళా రిజర్వేషన్‌ బిల్లు క్రెడిట్‌ మోదీకే దక్కుతుందన్నారు. రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదన్నారు. 

    మరొకవైపు హైదరాబాద్‌లో బీజేవైఎం నేతలు.. విపక్ష నేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా రిజర్వేషన్‌ను రాహుల్‌ అడ్డుకోవడంపై మండిపడ్డారు. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. 

    విపక్షాల నిజస్వరూపం మరోసారి బయటపడిందంటూ బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. డీలిమిటేషన్‌ ముసుగులో మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు. 

    కాగా, కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే  డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.

    సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన  రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్‌ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.

  • కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే  డీలిమిటేషన్‌ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.

    సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన  రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్‌ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. 

    బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 352.  దాంతో  రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్‌, మహిళ రిజర్వేషన్‌ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు. 

    బిల్లులివే..

    రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026: మహిళా రిజర్వే షన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం.

    కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026: అసెంబ్లీల్లో 33శాతం మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం.

    డీలిమిటేషన్ బిల్లు-2026: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం.

    బిల్లులు ప్రవేశఫెట్టేముందు కేంద్రమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ..  ‘ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్‌ ముందుంటుంది. చరణ్‌ సింగ్‌,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఓబీసీల కోసం కాకాసింగ్‌ కాలేకర్‌ చేసిన సూచనలను కాంగ్రెస్‌ తుంగలో తొక్కింది. మండల్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్‌ ఆమోదించలేదు. వీపీ సింగ్‌ వచ్చిన తర్వాత మండల్‌ కమిషన్‌ రిపోర్టుకు మోక్షం దక్కింది. రాజీవ్‌ గాంధీ తన జీవితాంతం మండల్‌ కమిషన్‌ నివేదికను  వ్యతిరేకిస్తూ వచ్చారు. 

    15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్‌కు ఓబీసీలు గుర్తుకొచ్చారు. బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది. మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే. మొత్తం క్యాబినెట్‌లో ఓబీసీల శాతం 40. 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్‌ తన సొంత మనిషిగా భావించలేదు. 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మన్మోహన్‌ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.

    కాంగ్రెస్‌ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది.ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.

  • మహిళా బిల్లు వీగిపోవడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టామన్నారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కానేకాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని 2023కు సంబంధించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువస్తే మద్దతిస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లుకు ముడిపెడితే కుదరదన్నారు.

    అమిత్‌షా ఏమన్నారంటే?

    కాగా అంతకుముందు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్‌ విసిరారు.. కాంగ్రెస్ ‍నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు. 

    అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. 

    రాహుల్ గాంధీ  

    అంతకుముందు రాహుల్ గాంధీ ఈ బిల్లుపై మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు. నిన్న జరిగిన సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. 


    వీగిపోయిన మహిళా బిల్లు

    కాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మెుత్తం 528 మంది ఓటింగ్‌లో పాల్గొనగా అనకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓట్లు వేశారు. దీంతో సరైన సంఖ్యా బలం లేక బిల్లు వీగిపోయింది.  

     

  • ఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై లోక్‌స‌భ‌లో ప్రతిప‌క్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎన్డీఏ నాయకులు త‌ప్పుబ‌ట్టారు. మోదీ మెజీషియ‌న్ అంటూ రాహుల్ వ్యాఖ్య‌నించ‌డంతో లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం గంద‌ర‌గోళం రేగింది. రాహుల్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అధికార స‌భ్యులు డిమాండ్ చేయ‌డంతో స‌భ ద‌ద్ద‌రిల్లింది. స‌భ వెలుప‌ల ప‌లువురు నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తీరును త‌ప్పుబ‌ట్టారు.

    లోక్‌స‌భ‌లో రాహుల్ గాంధీ న్యూసెన్స్ చేశార‌ని ఫైర్ అయ్యారు బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌. పార్ల‌మెంట్ బ‌య‌ట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం త‌ల‌నొప్పి తెప్పించింద‌ని, ఆయ‌న మాట‌లు ఇబ్బందిక‌రంగా అనిపించాయ‌న్నారు. స‌భాప‌తి కూడా ఆయ‌న్ను ఆప‌మ‌న్నార‌ని తెలిపారు. పార్ల‌మెంట్ ప్ర‌తిష్ట‌ను రాహుల్ అప‌హాస్యం చేశార‌ని కంగ‌న ఫైర్ అయ్యారు.

    రాహుల్‌ హ‌ద్దులు దాటారు: చిరాగ్‌
    రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగంలో హ‌ద్దులు దాటార‌ని.. ఆయ‌న ప్ర‌సంగం త‌న‌కు నిరాశ క‌లిగించింద‌ని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నేత‌ చిరాగ్ పాశ్వాన్ విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా రాహుల్ ప‌నికిరార‌ని అన్నారు. "రాహుల్ ప్ర‌సంగం ప్రతిపక్ష నాయకుడి పదవి గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ప్ర‌ధానిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి హ‌ద్దులు దాటారు. మీ పార్టీలో తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి మీరెలాంటి ఉదాహరణ ఇస్తున్నారు? సొంత ఎంపీల ముందే తనను తాను నవ్వులపాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కీలక పాత్ర ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకుడు తనను తాను అపహాస్యం చేసుకోవాలనుకుంటే, కేవలం హాస్య ప్రసంగాలు చేయాలనుకుంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడని నేను అనుకోను అని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

    క‌రెక్ట్ కాదు: హేమ‌మాలిని 
    ప్రధానమంత్రిని ఇంద్రజాలికుడు అని పిలవడం సరికాదని సీనియ‌ర్ న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని అన్నారు. రాహుల్ గాంధీ మాట‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని, అందులో నిర్దిష్టమైన విషయం ఏమీ లేదని పేర్కొన్నారు. కేంద్ర‌ మాజీ మంత్రి, డీఎంకే సీనియ‌ర్ నేత టీఆర్ బాలు స్పందిస్తూ.. మెజీషియ‌న్ అనే ప‌దం అనుచిత‌మైంది కాద‌ని స్ప‌ష్టం చేశారు.

    చ‌ద‌వండి: నాకు, మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేదు.. రాహుల్ స‌ర‌దా కామెంట్స్‌

  • కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్‌పారైలో వ్యాను బోల్తాపడింది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు 10మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకొనికేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా కేరళ రాష్ట్రానికి చెందిన వారిగా సమాచారం.

  • పార్లమెంట్‌ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చలతో వాడీవేడీగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఛాలెంజ్‌ విసిరారు.. కాంగ్రెస్ ‍నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లులో 50శాతం సీట్లు పెంచే విషయాన్ని రాతపూర్వంగా బిల్లులో రాసి తీసుకుని వస్తే బీజేపీ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు? దీనికి అమిత్‌ షా ఘాటుగా స్పందించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రస్తుతమున్న బిల్లును కేవలం గంటలోపే మార్చి తిరిగి ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ మద్దతిస్తుందా అని ప్రశ్నించారు.

    అదే విధంగా 50 శాతం సీట్ల పెంపును బిల్లులో పెట్టేందుకు సిద్దమని ఆ కాఫీని ప్రతి ఎంపీకి అందజేస్తామని తెలిపారు.డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కలపకూడదని మహిళా బిల్లును అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ వేసిన ట్రాఫ్‌లో భాగంగానే ఈ రెండు బిల్లులను కలుపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ బీజేపీ చేసిన ప్రతి సంస్కరణకు అడ్డు తలిగిందన్నారు త్రిపుల్‌ తలాక్‌ను అడ్డుకుందని రామమందిరం నిర్మాణానికి ఆటంకం కలిగించిందని అన్నారు. దళిత మహిళను రాష్ట్రపతి చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందన్నారు. 

    మహిళా రిజర్వేషన్ల బిల్లు కాంగ్రెస్‌ పార్టీ మద్దతివ్వకుంటే వీగిపోతుందని వీరిని దేశంలోని మహిళలంతా గమనిస్తున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు లోక్‌సభలో గొడవ చేసి  బతికిపోవచ్చుగానీ ప్రజాక్షేత్రంలో  మహిళల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరని అన్నారు.

  • ఢిల్లీ: లోక్‌సభలో మూడు కీల‌క బిల్లుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ నాయ‌కుడు రాహుల్ గాంధీ న‌వ్వులు పూయించారు. త‌న‌కు, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేద‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించ‌డంతో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి. 131 రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌, డీలిమిటేష‌న్, కేంద్ర పాలిత ప్రాంతాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుల‌పై చ‌ర్చ‌లో శుక్ర‌వారం ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర గురించి గొప్ప‌గా చెప్పారు.

    ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మహిళల నుంచే నేర్చుకుంటారని అన్నారు. దైనందిన జీవితంలో ప్ర‌తి విషయంలోనూ మ‌హిళ‌ల స‌హ‌కారం అవస‌రం ఉంటుంద‌ని వివ‌రించారు.  “మన జాతీయ భావన, దృక్పథంలో మహిళలు ఒక కేంద్ర, చోదక శక్తి. మనమందరం, ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని తల్లులు, సోదరీమణులు, భార్యలైన మహిళల నుంచి ఎంతో ప్రభావితమయ్యాం, స్ఫూర్తి పొందాం, నేర్చుకున్నాం“ అంటూ మ‌హిళ‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

    ఈ సంద‌ర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సరదాగా చేసిన ఓ వ్యాఖ్యకు రాహుల్ గాంధీ కూడా స‌ర‌దాగానే స‌మాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లాగా తాను తన భార్య కోసం కవిత రాయనందుకు ఇంట్లో తిట్లు తిన్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ జవాబిస్తూ.. "నిజానికి నాకు, ప్రధానమంత్రికి భార్యల‌ సమస్య లేదు. కాబట్టి మాకు అలాంటి సలహాలు అందవు. కానీ మాకు మా అమ్మలు, సోదరీమణులు ఉన్నారు" అని అన్నారు. దీంతో స‌భ‌లో న‌వ్వులు విరిశాయి.

    నేను చేయ‌లేని ప‌ని ప్రియాంక చేసింది
    గురువారం లోక్‌సభలో తన సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగంపై కూడా రాహుల్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. "నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో సాధించడం చూశాను. అదే అమిత్ షా గారిని నవ్వించడం" అని రాహుల్ అన‌గానే సభికులందరూ పగలబడి నవ్వారు. 

    చ‌ద‌వండి: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు క్రెడిట్ ప్ర‌తిప‌క్షాల‌కే

    రాహుల్ వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం
    కాగా, ఆప‌రేష‌న్ సిందూర్, బాల‌కోట్ వంటి అంశాల‌పై ప్ర‌ధాని మోదీ మ్యాజిక్ చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌తో లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం రేగింది. ప్ర‌ధాన‌మంత్రిని అవ‌మానించిన రాహుల్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఎన్డీఏ స‌భ్యులు డిమాండ్ చేశారు. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఇలాంటి మాట‌లు మాట్లాడ‌డం స‌రికాద‌ని అన్నారు. రాహుల్ గాంధీని స‌భ నుంచి బ‌హిష్క‌రించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. 

  • సాక్షి, లక్నో:  లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship)  రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. ఈ విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.

    రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించగా, ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై  కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కర్ణాటక నివాసి అయిన పిటిషనర్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టం, విదేశీయుల చట్టం, పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద ఆరోపణలు చేస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    ఈ ఫిర్యాదును మొదట రాయ్‌బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 17న, హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టివేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
     

    ఇదీ చదవండి: టీసీఎస్‌ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యం

    ఇదీ చదవండి:  నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం

  • రాంచీ: కాల్పుల మోతతో జార్ఘాండ్‌ అరణ్యాలు దద్దరిల్లాయి. హజారీబాగ్ జిల్లాలో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సహదేవ్ మహతో అలియాస్ అనుజ్, నతాషా, బుధన్ కర్మాలి (ఏరియా కమాండర్),రంజిత్ గంజూ (ఏరియా కమాండర్)లు ఉన్నారు. ముట్టడి అనంతరం భద్రతా బలగాలు పలు  ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

    ఈ ఆపరేషన్‌ ద్వారా ప్రాంతంలో నక్సలైట్‌ కార్యకలాపాలకు ఎదురు దెబ్బ తగిలినట్లైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఖపియా అడవి ప్రాంతంలో 209 కోబ్రా బెటాలియన్‌ బృందాలు యాంటీ-నక్సల్ ఆపరేషన్‌ నిర్వహించాయి. చీతా రాజేష్ కుమార్ యాదవ్ నాయకత్వంలో, చీతా అభిషేక్ యాదవ్‌తో కలిసి ఉన్న బృందం మావో యిస్టు గ్రూప్‌ను ఎదుర్కొంది. నక్సలైట్‌ బృందానికి సహదేవ్ మహతో నేతృత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

  • బెంగళూరు:  కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణికి జీవితఖైదు విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. బీజేపీ నేత యోగేష్‌గౌడ్‌ హత్య కేసులో వినయ్‌ కులకర్ణిని దోషిగా నిర్ధారించిన కోర్టు.. జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 

    2016లో యోగేష్‌ గౌడ్‌ హత్యకు  గురయ్యారు.  ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణల అనంతరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణితో పాటు మరో 16 మందికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం యావజ్ఝీవ కారాగార శిక్ష విధించింది. 

     ఈ కేసులో ఇప్పటికే దోషిగా వినయ్‌ కులకర్ణిని నిర్ధారించిన కోర్టు.. శిక్షా కాలాన్ని శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ శిక్షా కాలాన్ని ఖరారు చేశారు.  ఈ కేసుకు సంబంధించి వినయ్‌ కులకర్ణి, మరో 16 మందిపై హత్య (సెక్షన్ 302), నేరపూరిత కుట్ర (సెక్షన్ 120బి) నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది.

    ఈ హత్య కేసులో పదవిలో ఉన్న శాసనసభ్యుడి ప్రమేయం ఉన్నందున సమాజానికి గట్టి సందేశం పంపే శిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శివానంద పెర్ల , ఎస్. హేమహద్‌లు వాదించారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని తమ వాదనలు వినిపించారు. అయితే వినయ్‌ కులకర్ణి న్యాయబృందం మాత్రం ఆయనకున్న కనికరం చూపి శిక్ష తగ్గించాలని అ భ్యర్థించిన  ప్పటికీ నేరం యొక్క తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది  కోర్టు.

    యోగేష్‌ గౌడ్‌ హత్య ఇలా..
    2016, జూన్ 15న బీజేపీ ధార్వాడ్  జిల్లా పంచాయత్ సభ్యుడైన యోగేష్‌గౌడ గౌడర్‌ను ధార్వాడ్‌లోని ఆయన జిమ్‌లో దారుణంగా నరికి చంపారు. మొదట్లో స్థానిక పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. రాజకీయ  ఒత్తిళ్ల కారణంగా ఈ కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కులకర్ణి

     అప్పటి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కులకర్ణి.., ఎదుగుతున్న రాజకీయ ప్రత్యర్థిని అణచివేసేందుకు ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి.  అయితే 2016లో హత్య జరిగితే 2019లో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. 

  • సాక్షి, ముంబై:  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్‌  బ్రాంచ్‌లో వెలుగుచూసిన మత మార్పిడి కేసులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి లభించిన రెండేళ్ల నాటి ఒక ఫోటో ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యంగా మారింది. బాధితులను ఒక క్రమపద్ధతిలో మతమార్పిడికి   ఎలా ప్రలోభ పెట్టారో, ఆకర్షించారో ఈ చిత్రం ఒక అరుదైన సాక్ష్యమని, కొనసాగుతున్న దర్యాప్తులో కీలకమైన కొత్త కోణాన్ని తెరిచిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

    సాక్ష్యంగా ఫోటో
    తనిఖీల్లో భాగంగా పోలీసులకు లభించిన ఒక ఫోటోలో, ఈ కేసులో ప్రధాన నిందితుడైన తౌసిఫ్ అత్తార్ పక్కన తెల్లటి టోపీ ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మొదట్లో అతను మరో నిందితుడని పోలీసులు భావించారు. కానీ  అత్తార్‌ను మరింత విచారించగా, అప్పటికే మత మార్పిడికి గురైన, టీసీఎస్‌కు  చెందిన సహోద్యోగి గోపాల్ (పేరు మార్పు) అని తేలింది. మత మార్పిడి తర్వాత అతను తన పేరును 'గుల్షన్'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో బాధితుడు దుస్తులు మార్చుకుని, మతపరమైన ఆచారాలలో పాల్గొంటున్నట్లు కనిపిస్తోందని  దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు.

    బాధితుడు చెప్పిన సంచలన విషయాలు
    పోలీసులు సదరు బాధితుడిని విచారించగా, అతన్ని ఎలా ప్రలోభపెట్టారో వివరిస్తూ సంచలన విషయాలు వెల్లడించాడు.  2023 మార్చిలో బాధితుడి తండ్రికి పక్షవాతం రావడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండవాడు. తోటి ఉద్యోగులు అతని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మతం గురించి ప్రబోధించడం మొదలు పెట్టారు. బాధితుడి సొంత మతం సరైనది కాదని, వారి మత పద్ధతులను పాటిస్తేనే సమస్యలు తీరుతాయని నమ్మబలికారు. 

    ఇదీ  చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

    ఇందుకు సంబంధించి అనేక వీడియోలను కూడా అతనికి పంపారు. మత గ్రంథాలను పఠించడంతో సహా కొత్త ఆచారాలను పాటించేలా వారిని క్రమంగా ప్రేరేపించారు. మతం మారమని, పేరు మార్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. బాధితుడు వ్యతిరేకించినా, బలవంతంగా కొన్ని మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లి ఆచారాలు చేయించారని సమాచారం. బాధితుడి మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అతని కుటుంబ సభ్యుల భద్రతపై కూడా భయాందోళనలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    ఈ ఫోటో  బాధితుడి వాంగ్మూలం ద్వారా, వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగులను ఎలా టార్గెట్‌ చేస్తున్నారు,  క్రమ పద్ధతిలో మత మార్పిడికి పాల్పడుతున్నారో అర్థమవుతోందని పోలీసులు తెలిపారు. నిందితుల ఫోన్ల నుండి సేకరించిన డిజిటల్ సాక్ష్యాలు, వీడియోలు సందేశాలను పోలీసులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: నో ఇంజెక్షన్‌, రోజుకో పిల్‌ : యూఏఈ సంచలనం

  • సాక్షి,చెన్నై: ‘నేను ఈ మధ్య ఓ విషయాన్ని గమనించాను. విద్యార్థినులు తరుచుగా షార్ట్స్‌ ధరించి క్లాసులకు అటెండ్‌ అవుతున్నారు. ఇలాంటి వస్త్రధారణ పట్ల అటు విద్యార్థులు, ఇటు ప్రొఫెసర్లు ఆకర్షణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైంగిక వేధింపులకు ఆస్కారం కలిగిస్తాయంటూ తమిళనాడు నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రొఫెసర్‌, వైస్‌ ఛాన్సలర్‌ వి. నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    వైస్‌ ఛాన్సలర్‌ వి.నాగరాజు వ్యాఖ్యలపై యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వైస్‌ చాన్సలర్‌ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించారు. యూనివర్సిటీ అధికారులు మాత్రం.. విద్యార్థులకు ఓ తండ్రిలా మాట్లాడారే తప్పా.. విద్యార్థునులను కించ పరిచే ఉద్దేశం కాదని అన్నారు. ప్రస్తుతం ఛాన్సలర్‌ చేసిన  వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.

    విద్యార్థినులు షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులను ఆహ్వానిస్తుంది అంటూ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, విద్యార్థులు యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు షార్ట్స్ ధరించి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే వీసీ మాత్రం తాను చేసి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు గర్వకారణంగా ఉందని చెప్పుకొచ్చారు.  

    జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బుధవారం యూనివర్సిటీ న్యాయవాద విద్యార్థులతో జరిగిన ఓ సాధారణ సమావేశంలో వైస్ ఛాన్సలర్ నాగరాజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఆయనతో పాటు, రిజిస్ట్రార్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల డీన్‌లు, మహిళా సంక్షేమ కేంద్రానికి అధిపతిగా ఉన్న అధ్యాపకులతో సహా పరిపాలనలోని ఇతర సభ్యులు కూడా హాజరయ్యారు.

    తనపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్ని వీసీ నాగరాజు ఖండించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఏ వైస్-ఛాన్సలర్ కూడా డ్రెస్ కోడ్ పెట్టలేరు. కానీ నా అభిప్రాయం ప్రకారం, సంస్థ ప్రతిష్టను మెరుగుపరిచే విషయంలో విద్యార్థుల వస్త్రధారణ ఒక అంశం కావొచ్చని అన్నారు. విద్యార్థుల ప్రశ్నలను వారి అభిప్రాయాలుగా ఆయన కొట్టిపారేశారు. నేను ఏం మాట్లాడానో అర్థం చేసుకోకుండా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు.

    తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి వైస్‌ ఛాన్సలర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

  • సోషల్‌ మీడియాలో ఓ చిన్నారి వీడియో కదిలిస్తోంది. తోటి స్నేహితులు ఆడుతుంటే చూసి మురిసిపోయిన ఓ దివ్యాంగ చిన్నారి నెటిజన్ల మనసు గెలుచుకుంది. హృదయాలను తాకిన ఈ దృశ్యానికి ఎమోషనల్‌గా కనెక్టయిపోతున్నారు. పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి సంబంధించిన ఈ సంఘటన కళ్లు చెమర్చేలా చేస్తోంది. మనం స్వయంగా ఆటల్లో పాల్గొనకపోయినా.. ఇతరుల ఆనందాన్ని చూస్తూ కూడా సంతోషాన్ని పొందవచ్చని ఈ వీడియో నిరూపిస్తోంది. 

    ఒక దివ్యాంగ చిన్నారి తన స్నేహితులు ఆడుకుంటుంటే చూసి.. వారితో పాటు నవ్వుతూ ఆనందాన్ని పంచుకుంది. ఆమె శారీరక స్థితి వల్ల వారితో కలిసి పరిగెత్తలేకపోయినా.. ఆమె ముఖంలోని చిరునవ్వు నెటిజన్లను ఒకేసారి భావోద్వేగానికి, ఆనందానికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఓ చిన్నారి మెట్ల వద్ద కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఆమె దగ్గర్లోనే ఇద్దరు అబ్బాయిలు ఒకరినొకరు తరుముకుంటూ.. కుస్తీ పడుతూ ఆడుకుంటున్నారు. వారు అటు ఇటు పరిగెడుతూ నవ్వుతుంటే.. ఆ చిన్నారి అక్కడే కూర్చుని వారిని గమనిస్తూ.. వారితో పాటు కేరింతలు కొడుతూ ఆ క్షణాలను ఆస్వాదించింది.

    ఈ వీడియో నిడివి తక్కువైనా.. అది పంచిన భావోద్వేగం మాత్రం చాలా పెద్దది. శారీరక పరిమితులు ఉన్నప్పటికీ.. తన చుట్టూ ఉన్న ఆనందాన్ని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారి తన బాధను మర్చిపోయి.. కేవలం తన స్నేహితుల ఆటను చూస్తూ వారితో కలిసి నవ్వుతోందని ఆ వీడియో వివరించింది. ఇది ఆ దృశ్యానికి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె చిరునవ్వు చూస్తుంటే ఒక పక్కన మనసు నిండిపోతోంది. మరోపక్క కళ్లు చెమర్చుతున్నాయి. చాలా ధైర్యవంతురాలైన అమ్మాయి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి’’ అంటూ నెటిజన్లు దీవెనలు కురిపిస్తున్నారు.

     

     View this post on Instagram

  • సాక్షి, ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా ఎంపీ మై‍క్‌ కట్ చేయడంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తనూజ రాణి, గురుమూర్తి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మైక్ కట్ చేసిన సభాస్థానంలో టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున చర్చలో ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజారాణి పాల్గొన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై కొనసాగుతున్న హింసను ఆమె ప్రస్తావించారు. 

    ఏపీలో మహిళను తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిని చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. అమ్మ ఒడి, మహిళల పేరుపైనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 2019-24 వైఎస్‌ జగన్ పరిపాలనా కాలం మహిళలకు స్వర్ణయుగం లాంటిది. ఏపీలో మహిళలపై హింస జరుగుతుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటన తీవ్ర ఆందోళనకరం. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మహిళలను వేధిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’’ అని తనూజరాణి మండిపడ్డారు.

  • ఢిల్లీ: నారిశక్తి వందన్‌ అధినియం పేరుతో కేంద్రం తీసుకవచ్చిన బిల్లు వాస్తవానికి మహిళల రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు కానేకాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు చర్చపై ఆయన ఈ రోజు( శుక్రవారం) పార్లమెంటులో మాట్లాడారు. 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని ఇది మహిళలను అడ్డుగా పెట్టి తీసుకొచ్చిన షేమ్ ఫుల్ యాక్ట్ అన్నారు.

    మా నానమ్మ ఇందిర వల్లే నాలో ఆత్మ విశ్వాసం పెరిగిందని నిన్న సభలో తన సోదరి ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.మన జీవితంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తల్లులు చెల్లెలు , భార్య బిడ్డల రూపంలో వారు ఎంతో కీలక పాత్ర పోషిస్తారన్నారు. కాగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో కేంద్రం ఎంతో కుట్ర చేస్తోందన్నారు. ఇది రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చాలనుకుంటున్న బిల్లు అని రాజ్యాంగాన్ని బైపాస్ చేసి నియోజకవర్గాలని పెంచాలనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.

    ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం కులగణన లెక్కలు లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నదే అన్నారు. ఓబీసీలకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇదన్నారు. బీజేపీ సభ్యులు రాజ్యాంగం కంటే మనువాదానికి  ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఉన్నతస్థాయి  అధికారుల్లో , న్యాయవ్యవస్థలో ఓబీసీలు గిరిజనులు లేరని, ప్రేవేటు రంగంలో కూడా రంగంలో కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యత లేదన్నారు. హిందుత్వం పేరుతో బీజేపీ పార్టీ బీసీ, ఎస్సీ,ఎస్టీలకు  చేసిందేమీ లేదన్నారు.

    ఇది మహిళల బిల్లు కాదు.. "షేమ్ ఫుల్ యాక్ట్..!"

    కులగణనను బైపాస్‌ చేసేందుకే కేంద్ర యత్నిస్తోందని అస్సోం, జమ్మూలో చేసినట్లు డీలిమిటేషన్ చేయాలనుకంటున్నారని  ఆరోపించారు. ఈ బిల్లు దేశవ్యతిరేఖ బిల్లని ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చేయడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ఆత్మని చంపే బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకొని తీరాతమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. కాగా రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

  • ఇరాన్‌ వార్‌  నేపథ్యంలో నెలకొన్న వంట  గ్యాస్‌ సరఫరా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  భారతదేశం వంటగ్యాస్ (LPG) రవాణాను మరింత సురక్షితంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు, రిఫైనరీలు, ఓడరేవులను బాట్లింగ్ ప్లాంట్లతో అను సంధానించేలా నాలుగు పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంధన రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా  పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) సుమారు రూ. 12,500 కోట్ల అంచనా పెట్టుబడితో, సుమారు 2500కిలో మీటర్లు నాలుగు పైప్‌లైన్‌ల బిడ్ ప్రతిపాదనలకోసం బిడ్డింగ్ ప్రక్రియను ముగించే పనిలో ఉంది. 

    నాలుగు ప్రధాన మార్గాలు ఏవంటే
    చెర్లపల్లి – నాగ్‌పూర్ పైప్‌లైన్
    శిఖ్రాపూర్ – హుబ్లీ – గోవా పైప్‌లైన్
    పారాదీప్ – రాయ్‌పూర్ పైప్‌లైన్
    ఝాన్సీ – సీతార్‌గంజ్ పైప్‌లైన్

    ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం
    ప్రస్తుతం ఎల్పీజీని ట్యాంకర్ల ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పైప్‌లైన్ల ద్వారా రవాణా చేయడం వల్ల ప్రమాదాల ముప్పు తగ్గుతుంది. రిఫైనరీలు మరియు ఓడరేవులను నేరుగా బాట్లింగ్ ప్లాంట్లతో అనుసంధానించడం ద్వారా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడవచ్చు. అవసరమైన సమయంలో ఈ పైప్‌లైన్లు స్టోరేజ్ యూనిట్లుగా కూడా పనిచేస్తాయి. రోడ్డు రవాణా తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుంది.

     ఇదీ చదవండి: ఒకప్పుడు స్టార్‌ లీడర్‌.. చివరికి భార్యను హత్య చేసి, ఆత్మహత్య

    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారత్ ఎల్పీజీ దిగుమతుల కోసం అమెరికా, ఆస్ట్రేలియా వైపు చూస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశీయంగా బలమైన పైప్‌లైన్ వ్యవస్థ ఉండటం వల్ల పంపిణీ ఖర్చులను కొంతవరకు నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం 9 ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను గుర్తించగా, ప్రస్తుతం ఈ నాలుగు ప్రధాన ప్రాజెక్టులపై PNGRB దృష్టి సారించింది. ఇది భారతదేశ ఇంధన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని అంచనా

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

  • ఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్లమెంటులో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ నడుస్తోన్న వేళ ఎక్స్‌ వేదికగా ‍ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. పార్లమెంటు తీసుకునే ఈ నిర్ణయం కోసం యావత్‌ మహిళా లోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోందన్నారు. మహిళల మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదని  అందరం కలిసి చరిత్ర సృష్టిద్దామని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

    మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం బీజేపీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఓటింగ్‌కు ముందు కీలక నేతలతో భేటీ అయ్యారు. బిల్లు ఆమోదం పొందేలా సీనియర్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

    రాజకీయ లబ్ధికోసమే ఈ బిల్లు తీసుకవచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ఆరోపించారు. డీలిమిటేషన్ అనేది నిరంతరం ప్రక్రియని మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకు పెట్టారని ఆరోపించారు. ఇక తమిళనాడు డీఎంకే సైతం ఇదివరకే డీలిమిటేషన్‌కు తమ పార్టీ వ్యతిరేకమని ‍ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సమావేశాలకు వారు నల్లదుస్తులు ధరించి హాజరయ్యారు. 

    రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంటులో మూడింట, రెండో వంతు మెజార్టీ అవసరముంటుంది. అనగా 360 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఎన్డీఏ బలం 294 దీంతో ఇంకా 64 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగతుందా అనే టెన్షన్‌  సర్వత్రా నెలకొంది.

    మహిళా సెంటిమెంట్స్ ను దెబ్బతీయొద్దు ఎంపీలకు పీఎం మోదీ విజ్ఞప్తి..

Family

  • వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్‌ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్‌గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.

    ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం
    దాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.

    నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..
    శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో  తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

    డీహైడ్రేషన్‌ను తీవ్రతరం చేసే పానీయాలు ..
    చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్‌డ్రింక్‌లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.

    హైడ్రేషన్‌ స్థిరంగా ఉండదట..
    హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు.  శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్‌ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్‌గా  ఉంటే..శరీర హైడ్రేటెడ్‌గా ఉందని అర్థమట.

    వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..
    నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్‌తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.

    ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..
    తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

    ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..
    ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్‌ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.

    ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..
    ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.

    డీహైడ్రేషన్  పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..
    నిజానికి డీ హైడ్రేషన్‌ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్‌గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.

    (చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్‌నెస్‌ మంత్ర..)

     

  • ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. 

    ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. 

    అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.

    అంగీకరించక తప్పని పరిస్థితి..
    మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. 

    నవ్వు మాయమైన క్షణం..
    పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్‌లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్‌ ఆర్టిస్ట్‌. బొమ్మలేయడంలో దిట్ట.

    అతడి రాకతో వచ్చిన మార్పు..
    ఆ క్రమంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్‌ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్‌ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్‌కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్‌ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. 

    ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్‌ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. 

    ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..!

     

    (చదవండి: సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!)
     

Guest Columns

  • మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) ఇటీవల విడుదల కావడం హైదరాబాద్‌ పర్యావరణ భవిష్యత్తుకు కీలక మలుపుగా ప్రచారం అవుతోంది. ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 21 కిలోమీటర్ల పరిధిని కవర్‌ చేసే ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ నుండి 4,100 కోట్ల రుణం ప్రతిపాదించారు. ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో అమలు కాబోయే ఈ ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కాలుష్యంతో నిండిన నదిని ఆధునిక పట్టణ కారిడార్‌గా మార్చుతామని హామీ ఇస్తోంది. మెరిసే ప్రెజెంటేషన్లు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ పేర్ల వెనుక ఒక కీలక ప్రశ్న: ప్రభుత్వం నిజంగా నదిని పునర్నిర్మిస్తుందా? లేక కేవలం నది ఒడ్డులను అలంకరిస్తుందా?

    ఈ ప్రణాళికలో మలిన జలశుద్ధి కేంద్రాలు, అందమైన రివర్‌ఫ్రంట్‌లు, వాణిజ్య మండ లాలు, ఎలివేటెడ్‌ కారిడార్లు, పర్యాటక సదు పాయాల ప్రతిపాదనలు ఉన్నాయి. అధికా రులు ఇవి నదిని శుభ్రం చేస్తాయనీ, వరద లను నియంత్రిస్తాయనీ, ఆర్థిక కార్యకలాపా లకు కేంద్రంగా మారుస్తాయనీ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిజమైన పర్యావరణ పునరుద్ధరణ కంటే రియల్‌ ఎస్టేట్‌ ఆధారిత అభివృద్ధి వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందని విమర్శకులు అంటున్నారు. 

    హైదరాబాద్‌ నగరం రోజుకు సుమారు 1,950 ఎమ్‌ఎల్‌డీ  మలిన జలాలను ఉత్పత్తి చేస్తోంది. అందులో సుమారు 750 ఎమ్‌ఎల్‌డీ నేరుగా మూసీ నదిలోకి చేరుతోంది. నదిలో ఆక్సిజన్‌ స్థాయులు అత్యంత తక్కువగా ఉండగా... భారీ లోహాలు, ప్రమాదకర బ్యాక్టీరియా నీటిని మానవులకు, జీవజాలానికి అనర్హంగా మార్చాయి. ఇంకా కొత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసినా, కాలుష్యాన్ని మూలంలోనే ఆపకపోతే నది ఎప్పటికీ మురుగు కాలువగానే మిగిలిపోతుంది. అదనంగా, రివర్‌బెడ్‌లో పేరుకుపోయిన విషపూరిత మట్టి నిర్వహణపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నది ఒడ్డున నివసిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తు గురించి స్పష్టత లేదు.

    చ‌ద‌వండి: ద‌ళిత క్రైస్త‌వుల ఎస్సీ హోదా కోసం చ‌ట్ట స‌వ‌ర‌ణ‌!

    నిజంగా మూసీ బాగుపడాలంటే... మలిన జలం ఒక్క చుక్క కూడా నదిలోకి వెళ్లకూడదు. శాస్త్రీయ విధానంలో స్లడ్జ్‌ నిర్వహణ, కాంక్రీట్‌ నిర్మాణాల కంటే సహజ పర్యావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వడం, నీటి నాణ్యతపై రియల్‌ టైమ్‌ పబ్లిక్‌ మానిటరింగ్, ప్రజల భాగస్వామ్యం, బాధ్యత వంటివి లేకపోతే ఈ ప్రాజెక్టు మరొక ఖరీదైన ప్రయోగంగా మిగిలిపోవచ్చు.

    – షేక్‌ బాబా 
    ప్రజా సైన్స్‌ వేదిక ప్రధాన కార్యదర్శి