Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • లార్డ్స్‌ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్‌ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్‌లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్‌ చేసిన స్కోరునే భారత్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. తొలి సెషన్‌లో రాహుల్‌–పంత్‌ల భాగస్వామ్యం, రెండో సెషన్‌లో జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డిల నిలకడ... భారత్‌ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్‌’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్‌పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.

    లండన్‌: బుమ్రా తన బౌలింగ్‌తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్‌ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్‌ చేసిన స్కోరే చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్‌ పంత్‌ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

    ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3, జోఫ్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్‌ ఒక ఓవర్లో వికెట్‌ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్‌), డకెట్‌ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్‌ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇంగ్లండ్‌ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. 

    రిషభ్‌ పంత్‌ ఫిఫ్టీ  
    ఓవర్‌నైట్‌ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్‌ సహకారంతో ఓపెనర్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్‌ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్‌ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్‌ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్‌ అసాంతం భారత్‌దే పైచేయి అయింది.  ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్‌ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.

    చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు పంత్‌ వికెట్‌ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్‌... స్టోక్స్‌ విసిరిన డైరెక్ట్‌ త్రోకు వికెట్‌ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్‌ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్‌ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రాహుల్‌ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు.   

    రాహుల్‌ శతక్కొట్టిన వెంటనే... 
    రెండో సెషన్‌లో రాహుల్‌తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్‌ రాహుల్‌... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్‌కిది పదో సెంచరీ కాగా... క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో రెండో శతకం. 2021–22 సీజన్‌లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్‌ ఇంగ్లండ్‌ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్‌ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్‌ చేసే సామర్థ్యమున్న నితీశ్‌ వికెట్‌ కూడా భారత్‌ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్‌ కుమార్‌ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్‌ ముగిసింది.  

    జడేజా అర్ధ సెంచరీ 
    టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్‌ వికెట్‌ను పారేసుకున్నాడు. స్టోక్స్‌ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్‌ కీపర్‌ స్మిత్‌ చేతికి క్యాచ్‌ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్‌ సుందర్‌ (23; 1 ఫోర్, 1 సిక్స్‌) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్‌ తీసేందుకు ఇంగ్లండ్‌ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్‌ దీప్‌ (7), బుమ్రా (0) సుందర్‌ వికెట్లను కోల్పోవడంతో భారత్‌ సరిగ్గా 387 
    పరుగుల వద్దే ఆలౌటైంది. 

    స్కోరు వివరాలు 
    ఇంగ్లండ్‌ తొలిఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలిఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (సి) బ్రూక్‌ (బి) బషీర్‌ 100; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; శుబ్‌మన్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ రనౌట్‌ 74; జడేజా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 72; నితీశ్‌ రెడ్డి (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 30; సుందర్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 23; ఆకాశ్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 7; బుమ్రా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్‌) 387.

    వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.
    బౌలింగ్‌: వోక్స్‌ 27–5–84–3, ఆర్చర్‌ 23.2–6–52–2, కార్స్‌ 24–5–88–1, స్టోక్స్‌ 20–4–63–2, బషీర్‌ 14.5–2–59–1, జో రూట్‌ 10.1–0–35–0. 
    ఇంగ్లండ్‌ రెండోఇన్నింగ్స్‌: క్రాలీ బ్యాటింగ్‌ 2; డకెట్‌ బ్యాటింగ్‌ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా) 2/0. బౌలింగ్‌: బుమ్రా 1–0–2–0. 

  • ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో స‌రికొత్త ఛాంపియ‌న్ అవ‌త‌రించింది. వింబుల్డ‌న్-2025 టోర్నీ మ‌హిళ‌ల సింగిల్స్ విజేత‌గా  పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. 

    శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డ‌న్ టైటిల్‌ను సొంతంచేసుకుంది. రెండు సెట్ల‌లోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిల‌వ‌లేక‌పోయింది. క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది.
     

  • లార్డ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు యువ స్పిన్న‌ర్ షోయబ్ బషీర్ గాయ‌పడ్డాడు. 78వ ఓవ‌ర్ వేసిన బ‌షీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి భార‌త బ్యాట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా షాట్ ఆడాడు.

    ఈ క్ర‌మంలో బంతిని ఆపే  ప్రయత్నంలో అత‌డి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. దీంతో బ‌షీర్ తీవ్ర‌మైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో రాక‌ముందే త‌నంత‌ట తానే మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అత‌డి స్ధానంలో సామ్ కూక్ స‌బ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వ‌చ్చాడు. 

    కాగా ఇంగ్లండ్‌కు ఇది నిజంగా గ‌ట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జ‌ట్టులో బ‌షీర్ ఏకైక స్పిన్న‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అత‌డు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ రూట్ బౌలింగ్‌ను భార‌త బ్యాట‌ర్లు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నారు.

    కాగా సెంచూరియ‌న్ కేఎల్ రాహుల్‌ను బ‌షీర్ అద్బుత‌బ బంతితో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భార‌త్ ధీటైన స‌మాధానం ఇచ్చింది. 109 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(72), సుం‍దర్‌(19) ఉన్నారు.
    చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
     

  • లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ రిష‌బ్ పంత్ అద్బుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. ఎడమ చేతి వేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్‌కు వ‌చ్చి జ‌ట్టును ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు 141 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 

    ఓవ‌రాల్‌గా 112 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కన్పించిన రిష‌బ్‌ దుర‌దృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. అవ‌స‌రంలేని రన్‌కు ప‌రిగెత్తి తన వికెట్‌ను పంత్ కోల్పోయాడు. ఈ క్రమంలో పంత్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే విమర్శించారు. లంచ్ విరామానికి ముందు పంత్ అనవసరంగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడని కుంబ్లే మండిపడ్డాడు.

    "రిష‌బ్ పంత్ అన‌వ‌స‌రంగా ఔట‌య్యాడు. అస్సలు అక్క‌డ ప‌రుగు వ‌చ్చే ఛాన్స్ లేదు. పంత్ మొద‌ట ప‌రుగుకు పిలుపిచ్చి, వెంట‌నే త‌న మ‌నసు మార్చుకున్నాడు. కానీ పంత్ పిలుపుతో కేఎల్ రాహుల్  వెంట‌నే నాన్ స్ట్రైక్ నుంచి ర‌న్ కోసం ప‌రిగెత్తాడు.

    దీంతో ప్రారంభంలో పంత్ కాస్త సంకోంచి ప‌రిగెత్త‌డంతో ర‌నౌట్ అవ్వాల్సి వ‌చ్చింది. నిజంగా ఇది అన‌వ‌స‌రం. ఎందుకంటే మ‌రో మూడు బంతులు ఆడి ఉంటే, లంచ్ బ్రేక్‌కు వెళ్లిపోయేవారు. ఆ త‌ర్వాత త‌మ ప్రణాళిక‌ల‌ను అమ‌లు చేసి ఉంటే స‌రిపోయిండేది.

    అంత‌కుముందు  జో రూట్ 99 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా ఆట ముగిసింది. త‌న సెంచ‌రీ కోసం అత‌డు ఒక రాత్రి వేచి ఉండాల్సి వ‌చ్చింది. కానీ అత‌డు ఎక్క‌డ కూడా తొంద‌ర‌ప‌డి ఆడ‌లేదు. పోప్‌, స్టోక్స్‌తో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. అదే వారు భారీ స్కోర్ సాధించ‌డంలో స‌హాయ‌ప‌డింది" అని జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.
    చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • ఇంగ్లండ్ పర్య‌ట‌న‌లో భార‌త అండ‌ర్‌-19 కెప్టెన్ ఆయూష్ మాత్రే ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా ఇంగ్లండ్‌-19 జట్టుతో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆయూష్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.

    మొద‌టి ఇన్నింగ్స్‌లో మాత్ర‌మే వ‌న్డే త‌ర‌హాలో కేవ‌లం 107 బంతుల్లోనే త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 14 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 102 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఆరంభంలోనే టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ వికెట్‌ను కోల్పోయింది.

    14 ప‌రుగులు చేసిన సూర్య‌వంశీ.. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో ఆయుష్ మాత్రే త‌న అద్భుత‌ బ్యాటింగ్‌తో ముందుండి నడిపించాడు.  నంబర్ త్రీ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో క‌లిసి మూడో వికెట్‌కు 173 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

    త‌న సూప‌ర్ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ జ‌ట్టు బౌల‌ర్ల స‌హ‌నాన్ని ఈ సీఎస్‌కే బ్యాట‌ర్ ప‌రీక్షించాడు. 50 ఓవ‌ర్లు ముగిసే స‌రికి యువ భార‌త జ‌ట్టు త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 265 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిజ్ఞాన్ కుండు(33), రాహుల్ కుమార్‌(32) ఉన్నారు.
    చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


     

     

  • ఇంగ్లండ్  గ‌డ్డ‌పై టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ దుమ్ములేపుతున్నాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్బుత‌మైన నాక్ ఆడాడు. ఓవైపు చేతి వేలి గాయంతో పోరాడుతూనే కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో  112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ క్ర‌మంలో పంత్ పలు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    పంత్‌ సాధించిన రికార్డులు ఇవే..
    👉టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రిష‌బ్ పంత్ వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై 15 టెస్టులు ఆడిన పంత్‌.. 36 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉండేది.

    రిచర్డ్స్ తన17 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లండ్‌పై 36 టెస్టులు ఆడి 34 సిక్సర్లు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన పంత్‌.. విండీస్ గ్రేట్‌ను ఆధగమించాడు.

    👉అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక యాభైకి పైగా స్కోర్లు పర్యాటక వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ఇంగ్లండ్‌లో ధోని 8 సార్లు ఏభైకి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఎనిమిది సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించాడు. మరో ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధిస్తే ధోనిని ఆధిగమిస్తాడు.

    ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయ‌ర్లు వీరే
    35 రిషబ్ పంత్
    34 వివ్ రిచర్డ్స్
    30 టిమ్ సౌతీ
    27 యశస్వి జైస్వాల్
    26 శుభమన్ గిల్

    భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 5 వికెట్ల న‌ష్టానికి 291 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా ఇంగ్లండ్ కంటే 96 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా(31), నితీశ్ కుమార్‌(13) ఉన్నారు.

  • ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) శతకంతో మెరిశాడు. లార్డ్స్‌లో నిలకడైన ప్రదర్శనతో 176 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.

    కాగా రాహుల్‌కు ఇది టెస్టుల్లో పదో సెంచరీ కాగా.. ఇంగ్లండ్‌లో ఓవరాల్‌గా నాలుగోది. అదే విధంగా.. లార్డ్స్‌లో ఇది రెండోది కావడం విశేషం. తద్వారా దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ తర్వాత లార్డ్స్‌ మైదానంలో రెండు శతకాలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రాహుల్‌ చరిత్ర సృష్టించాడు.

    అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్‌ అవుటయ్యాడు. ఇంగ్లండ్‌ యువ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ స్పిన్‌ మాయాజాలంలో చిక్కుకున్న రాహుల్‌.. హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో నిరాశగా రాహుల్‌ క్రీజును వీడాడు.

    కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన గిల్‌ సేన.. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మక విజయంతో ఆతిథ్య జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. 

    ఇరుజట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతుండగా.. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మహ్మద్‌ సిరాజ్‌ తలా రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    ఇక రెండో రోజు బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టిన కేఎల్‌ రాహుల్‌ సెంచరీ పూర్తైన వెంటనే పెవిలియన్‌ చేరాడు. 

    ఇక భారత బ్యాటర్లలో మిగతా వారిలో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (13) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌ గిల్‌ (16) నిరాశపరచగా.. రిషభ్‌ పంత్‌ 74 పరుగులు చేశాడు. 74 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.

    లార్డ్స్‌ మైదానంలో టెస్టుల్లో సెంచరీ చేసిన భారత క్రికెటర్లు వీరే
    🏏దిలీప్‌ వెంగ్‌సర్కార్‌- 3
    🏏కేఎల్‌ రాహుల్‌-2
    🏏వినూ మన్కడ​- 1
    🏏గుండప్ప విశ్వనాథ్‌- 1
    🏏రవిశాస్త్రి- 1
    🏏మహ్మద్‌ అజారుద్దీన్‌- 1
    🏏సౌరవ్‌ గంగూలీ- 1
    🏏అజిత్‌ అగార్కర్‌-1
    🏏రాహుల్‌ ద్రవిడ్‌-1
    🏏అజింక్య రహానే-1.

    చదవండి: IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభ‌వ్‌.. నిన్నే న‌మ్ముకున్నాముగా
     

  • ఓ వైపు తీవ్ర‌మైన‌ గాయం.. అయినా నేను ఉన్నా అంటూ బ్యాట్ ప‌ట్టుకుని మైదానంలోకి వ‌చ్చాడు. అత‌డికి త‌న గాయం కంటే జ‌ట్టు గెల‌వ‌డ‌మే ముఖ్యం. తన విరోచిత పోరాటంతో క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును ఆదుకున్నాడు. గాయంతో పోరాడుతూనే జ‌ట్టు స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. చేతి వేలి నొప్పితో బాధపడుతూనే ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అత‌డే టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌. 

    లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో పంత్ అద్భుత‌మైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 112 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేటట్లు కన్పించిన పంత్.. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 

    గాయాన్ని లెక్కచేయ‌ని పంత్‌..
    తొలి రోజు ఆట సంద‌ర్బంగా పంత్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రెండో రోజు ఆటలో కూడా పంత్ ఫీల్డింగ్‌కు రాలేదు. అత‌డి స్ధానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ఆ త‌ర్వాత ప్రాక్టీస్‌లో కూడా పంత్ చేతి వేలి నొప్పితో బాధ‌ప‌డుతూ క‌న్పించాడు. 

    దీంతో అత‌డు బ్యాటింగ్‌కు వ‌స్తాడా రాడా? అన్న సందేహం అంద‌రిలోనూ నెలకొంది. కానీ పంత్ మాత్రం త‌న గాయాన్ని సైతం లెక్క చేయ‌కుండా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. అప్ప‌టికే జైశ్వాల్‌, గిల్ వికెట్ల‌ను కోల్పోయిన భార‌త జ‌ట్టును పంత్ ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. 

    రాహ‌ల్‌లో క‌లిసి నాలుగో వికెట్‌కు 141 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కానీ అద్బుతంగా ఆడుతున్న స‌మ‌యంలో ర‌నౌట్ రూపంలో పంత్ మైదానం వీడాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో పంత్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. శెభాష్ రిష‌బ్ అంటూ కొనియాడుతున్నారు.

    సెంచ‌రీకి చేరువ‌లో రాహుల్‌..
    మూడో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 248 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇంకా ఇంగ్లండ్ కంటే 139 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్‌(98) సెంచ‌రీకి చేరువ‌లో ఉన్నాడు.

  • ఇంగ్లండ్ అండ‌ర్‌-19తో  యూత్ టెస్టు సిరీస్‌ను భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ(Vaibhav Suryavanshi) పేల‌వంగా ఆరంభించాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా తొలి యూత్ టెస్టులో భార‌త్ అండ‌ర్‌-19, ఇంగ్లండ్ అండ‌ర్‌-19 జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

    అయితే వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఈ తొలి టెస్టులో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న సూర్య‌వంశీ.. మూడు ఫోర్ల సాయంతో కేవ‌లం 14 పరుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

    ఇంగ్లండ్ పేస‌ర్ అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి త‌న వికెట్‌ను వైభ‌వ్ కోల్పోయాడు.  అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    ఎంత పనిచేశావు వైభవ్, నిన్నే నమ్ముకున్నాముగా అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.12 ఓవర్లు ముగిసే సరికి భారత అండర్‌-19 జట్టు వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో విహాన్ మల్హోత్రా(6), ఆయూష్ మాత్రే(18) ఉన్నారు.

    వ‌న్డేల్లో విధ్వంసం..
    ఈ సిరీస్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌తో జ‌రిగిన యూత్ వ‌న్డేల్లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్‌ రాబట్టాడు. ఇక మూడో యూత్‌ వన్డేల్లో ఈ బిహార్ ఆటగాడు కేవలం 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అనంతరం నాలుగో వన్డేలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు

    52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది 355 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్‌లో ఈ యువ సంచలనం రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    తుది జట్లు
    ఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): జైద్న్ డెన్లీ, ఆర్చీ వాఘన్, హంజా షేక్(కెప్టెన్‌), రాకీ ఫ్లింటాఫ్, బెన్ మేయెస్, థామస్ రెవ్(వికెట్‌), ఎకాన్ష్ సింగ్, రాల్ఫీ ఆల్బర్ట్, జాక్ హోమ్, జేమ్స్ మింటో, అలెక్స్ గ్రీన్

    ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్త్రే(కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్‌),  అంబరీష్, మహ్మద్ ఈనాన్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అన్మోల్జీత్ సింగ్
    చదవండి: #Pat Cummins: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కీల‌క నిర్ణ‌యం..
     

     

  • అదృష్టం ఒక్క‌సారే త‌లుపు త‌డుతుందంటారు. కానీ అత‌డికి రెండుసార్లు ల‌క్ త‌గిలింది. ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్ ముగిసింద‌నుకుంటున్న త‌రుణంలో అనూహ్యంగా పుంజుకుని సెకండ్ చాన్స్ ద‌క్కించుకున్నాడు. అయితే ఈ అవ‌కాశాన్ని కూడా జార‌విచుకునే ప‌రిస్థితిలో నిలిచాడు. అత‌డు ఎవ‌రో కాదు టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్‌. ఊహించ‌ని విధంగా టెస్ట్ జ‌ట్టులో చోటు సంపాదించిన ఈ విద‌ర్భ క్రికెట‌ర్.. వ‌రుస వైఫ‌ల్యాల‌తో జ‌ట్టుకు భారంగా మారుతున్నాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ విఫ‌లం కావ‌డంతో అత‌డిని టీమ్ నుంచి త‌ప్పించాల‌న్న డిమాండ్లు రోజురోజుకు అధిక‌మ‌వుతున్నాయి.

    బ్యాటింగ్ భారం మోస్తాడ‌నుకుంటే..
    33 ఏళ్ల క‌రుణ్ నాయ‌ర్.. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఎంపికై త‌న పున‌రాగ‌మాన్ని ఘ‌నంగా చాటాడు. 3006 రోజుల విరామం త‌ర్వాత‌ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించి సెలెక్ట‌ర్ల కంట్లో ప‌డ‌డ‌డంతో ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక‌య్యాడు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ భారాన్ని మోస్తాడ‌న్న భ‌రోసాతో బీసీసీఐ అత‌డిని ఎంపిక చేసింది. అయితే గ‌త 2 టెస్టుల్లో అత‌డి తీరు స్థాయికి త‌గ్గ‌ట్టు లేక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం లార్డ్స్‌లో జ‌రుగుతున్న మూడో టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 40 ప‌రుగులు సాధించాడు. 5 ఇన్నింగ్స్‌లో క‌లిపి కేవ‌లం 117 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇదే ఇన్నింగ్స్‌లో శుబ‌మ‌న్ గిల్ 601 ప‌రుగులు సాధించి స‌త్తా చాటాడు. దీని బ‌ట్టే చూస్తే క‌రుణ్ ఎంతగా విఫ‌ల‌మ‌య్యాడ‌న్న‌ది అర్థ‌మ‌వుతుంది.

    ఇలాగైతే క‌ష్ట‌మే..
    మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క‌రుణ్ ఆట‌తీరు ఇలాగే కొన‌సాగితే జ‌ట్టులో అత‌డి స్థానం గ‌ల్లంతయ్యే అవ‌కాశం ఉంద‌ని సీనియ‌ర్లు హెచ్చరిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో విఫ‌ల‌మ‌యితే ముప్పు త‌ప్ప‌ద‌ని చ‌తేశ్వ‌ర్ పూజారా (cheteshwar pujara) అభిప్రాయ‌ప‌డ్డాడు. భారీ స్కోరు చేయ‌డంలో క‌రుణ్ విఫ‌ల‌మ‌వుతున్నాడ‌ని, అన‌వ‌స‌ర త‌ప్పిదాల‌తో వికెట్ పారేసుకుంటున్నార‌ని పూజారా వ్యాఖ్యానించాడు. రెండంకెల స్కోరును భారీ స్కోరుగా మ‌ల‌చ‌డానికి అత‌డు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించాడు. క్రీజులోనే పాతుకుపోవ‌డం ద్వారా త‌ప్పిదాల‌కు ఆస్కారం క‌లుగుతోంద‌ని విశ్లేషించాడు. బ్యాక్‌ఫుట్ చురుగ్గా క‌ద‌ప‌డం ద్వారా ప‌రుగులు సాధించొచ్చ‌ని స‌ల‌హాయిచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క‌రుణ్ ఎక్కువ స్కోరు చేస్తాడ‌న్న ఆశాభావాన్ని పూజారా వ్య‌క్తం చేశాడు. కరుణ్ లాంటి బ్యాటర్‌కు సిరీస్‌లో తనదైన ముద్ర వేయడానికి ఆరు ఇన్నింగ్స్‌లు సరిపోతాయని వ్యాఖ్యానించాడు.

    చ‌ద‌వండి: అత‌డిని నాలుగో టెస్టులోనూ ఆడించాల్సిందే

    క‌రుణ్ ప్లేస్‌లో ఎవ‌రు?
    త‌ర్వాతి ఇన్నింగ్స్‌లో ఎన్ని ప‌రుగులు చేస్తాడ‌నే దానిపై క‌రుణ్ భ‌విత‌వ్యం ఆధారప‌డి ఉంటుంద‌ని క్రీడా పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అత‌డి స్థానానికి పోటీ ఎక్కువ‌గా ఉంది. మొదటి టెస్ట్‌లో బాగానే ఆడిన‌ప్ప‌టికీ జ‌ట్టులో స్థానం కోల్పోయిన యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్ మ‌ళ్లీ చోటు ద‌క్కించుకోవ‌డానికి వేచిచూస్తున్నాడు. మ‌రో టాలెంటెడ్ ప్లేయ‌ర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా జ‌ట్టులో స్థానం సంపాదించి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టుల్లో మూడు అర్ధ సెంచరీలతో సహా 227 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కూడా రేసులో ఉన్నాడు. కాబ‌ట్టి క‌రుణ్‌కు ఇది పరీక్షా స‌మ‌యం. త‌న‌కు స్థాయికి త‌గిన‌ట్టు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జ‌ట్టులో అత‌డి చోటుకు భ‌రోసా ఉంటుంది. లేక‌పోతే పున‌రాగ‌మనం మూన్నాళ్ల ముచ్చ‌టే అవుతుంది. చూద్దాం నాయ‌ర్ ఏం చేస్తాడో!

  • ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకొన్నాడు. యాషెస్ సిరీస్, వేసవి బీజీ షెడ్యూల్ దృష్ట్యా అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కమ్మిన్స్ గత కొంత కాలంగా ఆ విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు.

    ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌లటెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్నాడు. శనివారం నుంచి ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. విండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు కూడా అతడు దూరంగా ఉండనున్నాడు.

    "రాబోయే రెండు నెలలు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వేసవిలో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు సిద్దమైందుకు నాకు దాదాపు 7 వారాల సమయం దొరికింది. అయితే ఈ సమయంలో బౌలింగ్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయకపోవచ్చు. 

    కానీ జిమ్ వర్క్ మాత్రం ఎక్కువగా చేస్తాను. న్యూజిలాండ్‌, భారత్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్‌లలో తిరిగి ఆడే అవకాశముంది. ఆ తర్వాత రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీషెఫీల్డ్ షీల్డ్, యాషెస్ సిరీస్‌ల‌తో బీజీబీజీగా గ‌డ‌ప‌నున్నాను" అని విండీస్‌తో మూడు టెస్టుకు ముందు విలేక‌రుల స‌మావేశంలో క‌మ్మిన్స్ పేర్కొన్నాడు.

    కాగా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు మూడు మ్యాచ్‌ల టీ20, వ‌న్డే సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు ఆస్ట్రేలియాకు రానుంది. ఆగస్టు 10న డార్విన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ వైట్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.

    ద‌క్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్‌
    తొలి టీ20- ఆగస్టు 10, ఆదివారం-డార్విన్‌
    రెండో టీ20-ఆగస్టు 12, మంగళవారం-కైర్న్స్‌
    మూడో టీ20-ఆగ‌స్టు 16,శనివారం-కైర్న్స్‌

    తొలి వ‌న్డే-ఆగస్టు 19, మంగళవారం-కైర్న్స్‌
    రెండో వ‌న్డే-ఆగస్టు 22,  శుక్రవారం-మక్కే
    మూడో వ‌న్డే-ఆగ‌స్టు 24, ఆదివారం-మ‌క్కే
    చదవండి: కేఎల్‌ రాహుల్‌, గిల్‌ తప్పుల వల్లే ఇలా జరిగింది: ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆగ్రహం

  • ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా రెండు ప్రధాన తప్పిదాలు చేసిందని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. వాటి వల్లే ఇంగ్లండ్‌ 350 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగిందని అభిప్రాయపడ్డాడు.

    కేఎల్‌ రాహుల్‌ పొరపాటుతో పాటు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తీసుకున్న నిర్ణయం వల్లే ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు నిలువరించే వీలు లేకపోయిందని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా లార్డ్స్‌ వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య గురువారం మూడో టెస్టు మొదలైంది.

    టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి.. మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే, 251/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.  బెన్‌ స్టోక్స్‌ (44), క్రిస్‌ వోక్స్‌ (0), సెంచరీ వీరుడు జో రూట్‌ (104)లను భారత పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా త్వరత్వరగానే పెవిలియన్‌ చేర్చాడు.

    ఇలాంటి దశలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జేమీ స్మిత్‌ (51), టెయిలెండర్‌ బ్రైడన్‌ కార్స్‌ (56) అద్భుత హాఫ్‌ సెంచరీలతో చెలరేగి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. నిజానికి జేమీ స్మిత్‌ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ నేలపాలు చేశాడు.

    మరోవైపు.. రెండో రోజు ఆటలో కేవలం 63 డెలివరీలు సంధించిన తర్వాతనే బంతిని మార్చాలంటూ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ పట్టుబట్టాడు. అప్పటికి బుమ్రా ఆ బంతితో బాగానే రాణిస్తున్నా.. గిల్‌ అంపైర్‌తో వాదనకు దిగి మరీ బంతిని మార్పించాడు. అయితే, దురదృష్టవశాత్తూ పాత బంతి కంటే అంపైర్‌ ఇచ్చిన కొత్త బంతి మరింత వాడినదానిలా ఉండటంతో టీమిండియాకు షాక్‌ తగిలింది. మొమెంటమ్‌ మారిపోయింది.

    ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ మాట్లాడుతూ.. ‘‘రెండోరోజు టీమిండియా చేసిన రెండు తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్‌ చేసే అవకాశం చేజారింది. కేఎల్‌ రాహుల్‌ జేమీ స్మిత్‌ క్యాచ్‌ జారవిడవడమే అన్నిటికంటే పెద్ద తప్పు. అక్కడే మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది.

    స్మిత్‌ ఐదు పరుగుల వద్ద ఉన్నపుడు రాహుల్‌ క్యాచ్‌ మిస్‌ చేశాడు. ఆ తర్వాత అతడు బ్రైడన్‌ కార్స్‌తో కలిసి అద్బుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్‌ గనుక అప్పుడే క్యాచ్‌ అందుకుని ఉంటే ఇలా జరిగేది కాదు.

    ఇక రెండోది... అసలు బంతిని మార్చమని ఎందుకు అడిగారో అర్థం కాలేదు. అప్పటికే తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు తీశారు. అలాంటపుడు బంతిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఆ సమయంలో.. ఒకవేళ బంతి ఆకారం మారినా దానితో పెద్దగా వచ్చే నష్టం ఏముంది?

    ఓ బౌలర్‌గా చెప్తున్నా.. బంతి వల్ల మనకు ఏమాత్రం ఉపయోగం లేదనిపించినప్పుడు మాత్రమే మార్చమని అడుగుతాము. ఒకవేళ ఆ బంతి మరీ అంత చెత్తగా ఉండి ఉంటే మీకు ఉదయాన్నే మూడు వికెట్లు ఎలా దొరికేవి?.. అసలు బంతిని ఎందుకు మార్చమన్నారు?’’ అంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రెండో రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
     

  • ఇంగ్లండ్‌ సిరీస్‌తో సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన.. టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ (Karun Nair) వరుసగా విఫలమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతున్నాడు. లీడ్స్‌ వేదికగా తొలి టెస్టు తుదిజట్టులో భాగమైనకరుణ్‌.. రీఎంట్రీలో డకౌట్‌ అయ్యాడు.

    ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇరవై పరుగులు చేయగలిగాడు. అయితే, ఆ తర్వాత కూడా కరుణ్‌ నాయర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడు చేసిన పరుగులు వరుసగా 31, 26. అయితే, ప్రఖ్యాత లార్డ్స్‌  మైదానం (Lord's Test)లో జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు.

    ఎట్టకేలకు కనీసం 40 పరుగుల మార్కు
    లార్డ్స్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కరుణ్‌ నాయర్‌.. 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో కనీసం అర్ధ శతకమైనా చేయకుండానే కరుణ్‌ వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఇంగ్లండ్‌లో ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కరుణ్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

    తుదిజట్టు నుంచి తప్పించండి!
    అయితే, యువ ఆటగాడు సాయి సుదర్శన్‌పై వేటు వేసి.. సీనియర్‌ అయిన కరుణ్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నా.. అతడి ఆట మెరుగుపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు నుంచి అతడిని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.

    ఫెయిల్యూరే.. కానీ.. నాలుగో టెస్టులోనూ ఆడించండి
    కరుణ్‌ నాయర్‌ విఫలమవుతున్న మాట వాస్తవమేనని.. అయితే, నాలుగో టెస్టులో కూడా అతడిని ఆడిస్తేనే బాగుంటుందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు అంత గొప్పగా ఆడటం లేదు. అలా అని అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగానూ లేదు.

    నిజానికి అతడి అదృష్టం అస్సలు బాలేదు. కరుణ్‌ ఇచ్చిన క్యాచ్‌లు సులువైనవి కాకపోయినా ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్బుత రీతిలో వాటిని ఒడిసిపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఓలీ పోప్‌.. ఇప్పుడు రూట్‌.

    కరుణ్‌ మరీ ఎక్కువగా పరుగులు చేయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించాలని అంటున్నారు.

    అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడిని తదుపరి మ్యాచ్‌లో తప్పక ఆడించాలి. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో గనుక కనీసం 30- 40 పరుగులు చేసినా అతడు నాలుగో టెస్టు ఆడేందుకు అర్హుడే అవుతాడు’’ అని ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

    ఏదేమైనా కరుణ్‌ నాయర్‌ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే తన థర్టీస్‌, ఫార్టీస్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మలచాల్సి ఉంటుందన్నాడు ఆకాశ్‌. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జూలై 23- 27 మధ్య మాంచెస్టర్‌ వేదికగా నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

    ఇదిలా ఉంటే.. లార్డ్స్‌ టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి 145 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనుకబడి ఉంది.  

    చదవండి: MLC 2025: పొలార్డ్‌ విధ్వంసం... సూపర్‌ కింగ్స్‌ అవుట్‌... ఫైనల్లో ఎంఐ న్యూయార్క్‌

  • టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తీరును ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుసేన్‌ విమర్శించాడు. ఓవైపు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా.. బంతిని మార్చాలంటూ అంపైర్‌ను ఒత్తిడి చేయడం సరికాదన్నాడు. అనవసరంగా బంతిని మార్చుకుని పెద్ద మూల్యమే చెల్లించారంటూ చురకలు అంటించాడు. అసలు విషయమేమిటంటే..

    ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ లార్డ్స్‌ (Lord's Test) వేదికగా మూడో మ్యాచ్‌ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో 251/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు బుమ్రా వరుస షాకులిచ్చాడు.

    వరుస షాకులిచ్చిన బుమ్రా
    బెన్‌ స్టోక్స్‌ (44), క్రిస్‌ వోక్స్‌ (0), జో రూట్‌ (104) వికెట్లను పెవిలియన్‌కు పంపిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. ఈ మేరకు కీలక వికెట్లు కూల్చి టీమిండియాలో జోష్‌ నింపాడు. అయితే, అదే సమయంలో అంటే రెండో రోజు 10.4 ఓవర్ల ఆట తర్వాత బంతిని మార్చాలని భారత్‌ కోరగా.. అంపైర్‌ హూప్‌ టెస్టు నిర్వహించాడు. బంతి ఆకారం మారిందని గుర్తించి మరో కొత్త బంతినిచ్చాడు.

    అయితే, అంపైర్‌ ఇచ్చిన బంతితో కెప్టెన్‌ గిల్‌, మరో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంతృప్తి చెందలేదు. మునుపటి బంతి కంటే ఇది మరింత పాతదిలా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గిల్‌ అంపైర్‌తో కాసేపు వాదించాడు కూడా!..

    అదొక చెత్త నిర్ణయం
    ఈ విషయంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ నాసిర్‌ హుసేన్‌ స్పందిస్తూ.. గిల్‌ తీరును తప్పుబట్టాడు. ‘‘బంతిని మార్చుకోవాలనే టీమిండియా నిర్ణయం వింతగా అనిపించింది. ఒకవేళ బంతి ఆకారం మారిందనుకుంటే అంపైరే స్వయంగా బంతిని మారుస్తాడు. లేదంటే.. ఉన్న బాల్‌తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని కెప్టెన్‌ భావిస్తే బంతిని మార్చమని కోరతాడు.

    ఈ రెండు సందర్భాల్లోనే బంతిని మారుస్తారు. కానీ.. తొలి సెషన్‌లో బంతి బాగానే ఉంది. 63 డెలివరీలో మాత్రమే సంధించారు. అప్పటికి బుమ్రా ఆ బంతితోనే అద్భుతమైన స్పెల్‌ వేశాడు. కానీ మరో ఎండ్‌లో సిరాజ్‌ మాత్రం క్యాచ్‌లు డ్రాప్‌ చేశాడు.

    బంతి వికెట్‌ కీపర్‌ చేతికి కూడా బాగానే వచ్చింది. అంతా సజావుగా సాగుతోన్న సమయంలో బంతిని మార్చాలని కెప్టెన్‌ కోరాడు. అంతటితో అతడు ఆగలేదు.. అంపైర్‌తో గొడవ కూడా పడ్డట్లు కనిపించింది. అయితే, మార్చుకున్న బంతి మరింత పాతదానిలా ఉంది. దీంతో వాళ్లు మరోసారి అసహనానికి లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ నిర్ణయాలు నాకైతే కాస్త చెత్తగానే అనిపించాయి.

    బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా.. ఎందుకిలా చేశావు?
    ఒకటి బంతిని మార్చమని అడిగి టీమిండియా తప్పటడుగు వేసింది. అందుకోసం అంపైర్‌తో వాదనకు దిగడం రెండో తప్పు. కొత్త బంతి పాత బంతి కంటే మరింత ఎక్కువగా వాడిన బంతిలా ఉండటంతో.. మంచి బంతిని చేజార్చుకున్నట్లయింది. 

    ఇది మీ మూడో తప్పు. ఓవైపు బుమ్రా ఆ బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా.. అనవసరంగా మార్చి ప్రత్యర్థికి మంచి అవకాశం ఇచ్చారు’’ అని నాసిర్‌ హుసేన్‌ గిల్‌ తీరుపై విమర్శల వర్షం కురిపించాడు. 

    కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 387 పరుగులకు ఆలౌట్‌ కాగా.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (13) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ 40 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌ గిల్‌ (16) నిరాశపరచగా.. రిషభ్‌ పంత్‌ 19 పరుగులు, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అజేయ అర్ధ శతకం (53)తో క్రీజులో ఉన్నారు.

    చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా  

National

  • కోల్‌కతా: వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో ఐఐఎంలో అత్యాచారం కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం అయిన వేళ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే ఆమె తండ్రి అత్యాచారం జరగలేదంటూ ట్విస్ట్‌ ఇచ్చారు. తన కూతురిపై అసలు అత్యాచారం జరగలేదని, ఆటోలోంచి పడిపోతే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అది కేవలం యాక్సిడెంట్‌ మాత్రమేనని అత్యాచారం వార్తలను కొట్టిపారేశారు. 

    దీనిపై శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం జరిగిందనే బాధితురాలు ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తండ్రి ఈరోజు(శనివారం. జూలై 12) తన కూతురిపై అత్యాచారం జరగలేదంటూ వెల్లడించారు. ‘ ‘నిన్న  రాత్రి మాకు ఫోన్‌ వచ్చింది. ఆటో రిక్షా నుంచి పడిపోయిందని ఆమె ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ను ట్రేస్‌ అవుట్‌ చేసి లొకేషన్‌ గుర్తించాం. పోలీసులే ఆమెను ఎస్‌ఎస్‌కేమ్‌ న్యూరాలజీ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. నా కూతురు తనపై అత్యచారం జరగలేదని నాకు చెప్పింది. పోలీసులు మాత్రం దీనిపై కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకర్ని అరెస్ట్‌ చేశామని చెప్పారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యక్తికి ఈ ఘటనతో ఏం సంబంధం లేదు’ అని తెలిపారు.

    ఈ కేసుకు సంబంధించి ఐఐఎమ్‌ క్యాంపస్‌ బాయ్స్‌ హాస్టల్‌లో అత్యాచారం జరిగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. బాధితురాలి తండ్రి తాజాగా ముందుకు అది అత్యాచారం కాదని, కేవలం యాక్సిడెంట్‌  మాత్రమేనని చెప్పడంతో  కేసు కొత్త మలుపు తిరిగింది. 

  • టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను హత్య చేసినందుకు ఆమె తండ్రి దీపక్‌ యాదవ్‌ కుమిలిపోతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనను ఉరి తీయాలంటూ.. రాధికా యాదవ్‌ తండ్రి పశ్చాత్తాపం పడినట్లు దీపక్‌ యాదవ్‌ సోదరుడు చెప్పుకొచ్చారు. ఆవేశంలో హత్య చేశానని.. తనను ఉరి తీయాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.

    ఈ కేసులో తండ్రి దీపక్‌ యాదవ్‌కు గురుగ్రామ్‌ కోర్టు 4 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించారు. రాధికా యాదవ్‌ను ఆమె తండ్రే హత్య చేశాడు. కిచెన్‌లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్‌ను వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్‌లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే  మృతి చెందింది.

    రాధికా యాదవ్‌ సొంతంగా టెన్నిస్‌ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని.. అందుకే ఆమెను హత్య చేశానంటూ పోలీసుల విచారణలో దీపక్‌ యాదవ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాధిక ఇన్‌స్టాలో పెట్టిన ఓ రీల్‌ కూడా హత్యకు కారణమంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

    కాగా, రాధికా యాదవ్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్‌ టెన్నిస్‌ కోచ్‌లలో ఒకరైన అజయ్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్‌ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్‌ చాట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్‌ యాదవ్‌ జాతీయ మీడియాకు తెలిపారు.

    ఇదీ చదవండి: రాధిక వాట్సాప్‌ చాట్‌లో సంచలన విషయాలు..!

  • సెల్‌ఫోన్‌ను ఒకరోజులో ఎంతసేపు చూస్తున్నాం? అనే విషయాన్ని ఎప్పుడైనా పరిశీలించారా? ఊహూ..  అంత పట్టింపు ఎక్కడిది అంటారా?. పోనీ మరి మీ పిల్లలు?.. అరగంట?.. గంటా..?.. అంత గమనించడం లేదని అంటారా? అయితే ఇది తప్పక తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో.. అందులోంచి ఎలా బయటపడేయాలో తెలుస్తుంది!.

    ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌ పరిశోధకులు ఈ మధ్య మెటా అనాలసిస్‌ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను ఎంచుకుని.. వాళ్లు ఫోన్లను ఏయే టైంలో.. ఎంతెంత సేపు వాడుతున్నారు(పేరెంట్స్‌ సమక్షంలోనే) అనే పదిరకాల అధ్యయాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు క్యూరస్‌(Cureus) అనే జర్నల్‌లో పబ్లిష్‌ అయ్యాయి. అందులో మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లలు రోజులో దాదాపు రెండున్నర గంటలపాటు(2గం. 22నిమిషాలు) సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారని తేలింది.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌(IAP) సూచిస్తున్న సమయం కంటే ఇది రెట్టింపు. మరో భయంకరమైన విషయం ఏంటంటే.. రెండేళ్లలోపు చిన్నారులు రోజులో గంటన్నరపాటు ఫోన్లకు అతుక్కుపోతున్నారట. అసలే ఈ వయసు వాళ్లను ఫోన్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తుండడం గమనార్హం.  

    తాజా అధ్యయన నివేదికపై ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యనిపుణుడు స్పందిస్తూ.. పిల్లల్లో 60-70 శాతం సూచించిన సమయం కంటే ఎక్కువ ఫోన్‌పై గడుపుతున్నారు. ఇది వాళ్లపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అని అన్నారు. చాలామంది పేరెంట్స్‌..  కాసేపేగా చూడనిస్తే ఏమైద్దిలే అనుకుంటారు. కానీ, వాళ్లు బిజీ లైఫ్‌లో సెల్‌ఫోన్లకు అతుక్కుపోయి నెమ్మదిగా వాళ్ల పిల్లలకు ఆ అలవాటు చేస్తున్నారు. 

    .. తినే టైంలోనో.. తమ పనుల్లో మునిగిపోయి పిల్లలను బుజ్జగించేందుకు చేతుల్లో పెడుతున్నారు. కేవలం స్మార్ట్‌ ఫోన్లతోనే ఆగిపోకుండా డిజిటల్‌ గాడ్జెట్లను(ట్యాబ్‌, పీసీ, స్మార్ట్‌ టీవీలు) అలవాటు చేస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల మాటలు ఆలస్యం కావడం, చూపులో సమస్యలు, ప్రవర్తనలో ఎదుగుదల లేకపోవడం, ఒబెసిటీ సమస్య, నిద్రలేమి, విషయాలపై దృష్టి సారించలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి అని తెలిపారాయన.

    అయితే ఇది తీవ్రంగా చర్చించదగ్గ అంశమే అయినా.. పరిష్కారం మాత్రం పేరెంట్స్‌ చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ముందు తల్లిదండ్రులు ఫోన్‌లో అధిక సమయం గడపడం ఆపాలని సూచిస్తున్నారు. 

    టెక్‌ ఫ్రీ జోన్‌.. తినేటప్పుడు, ఆడుకునేటప్పుడు.. వాళ్లకు ఫోన్లు, ఇతర గాడ్జెట్లు కనిపించకుండా చూడాలి. ఇందుకోసం బెడ్రూం లేదంటే ఇంటి పరిసరాల్లోకి తీసుకెళ్లాలి. వాళ్లతో మాట్లాడాలి.. మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడించాలి. ఏడుస్తున్నారు కదా అని ఫోన్లు చేేతులో పెట్టొద్దు. మరీ ముఖ్యంగా ఏ వయసులో ఎంతసేపు చూడొచ్చు అనే పరిమితికి కట్టుబడి ఉండాలి. అప్పుడే వాళ్లు ఆరోగ్యకరంగా పెరుగుతారు అని నిపుణులు అంటున్నారు.

  • గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు.  ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.

    కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.

    ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే  ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు. 

    ఆ రష్యన్‌ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్‌లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు.

     

     

  • హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో కన్న తండ్రి దీపక్‌ యాదవ్‌ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. 

    రాధికా యాదవ్‌ టెన్నిస్‌ కోచ్‌లలో ఒకరైన అజయ్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్‌ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్‌ చాట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్‌ యాదవ్‌ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు. 

    ఆంక్షలు భరించలేకపోతున్నా.. !
    తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్‌ చాట్‌లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుందన్నారు. 

    తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్‌ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్‌, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్‌ను ఎంజాయన్‌ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్‌ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్‌ యాదవ్‌కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్‌లో వాపోయింది. 

    ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!
    మరో కోచ్‌ అంకిత్‌ పటేల్‌ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్‌ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్‌గా నిలిచేవారు. 

    ఆమె ఎక్కడ టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు.  రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు.  టెన్నిస్‌ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు.  ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్‌ అంకిత్‌ పటేల్‌ తెలిపారు.

    ఇదీ చదవండి:

    ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు..!

  • భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

    సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్‌ చల్‌ చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

    కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్‌ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. 

    తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్‌కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్‌ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.

     

  • న్యూఢిల్లీ: వికసిత భారత నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంలో ప్రభుత్వాన్నికున్న నిబద్ధతను రోజ్‌గార్ మేళా ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో జరిగిన 16వ ఎడిషన్ రోజ్‌గార్ మేళా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా చేరిన 51 వేలకు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.

    కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ ‘మీరు నూతన ప్రయాణం సాగిస్తున్న తరుణంలో మిమ్మల్ని  అభినందిస్తున్నాను. భారతదేశానికి రెండు శక్తులు ఉన్నాయని ప్రపంచం భావిస్తోంది. అవి ఇక్కడి జనాభా, ప్రజాస్వామ్యం. నేను ఇటీవలే ఐదు దేశాల పర్యటన నుండి తిరిగి వచ్చాను. ఈ సందర్భంగా ఇతర దేశాలతో మనం చేసుకున్న ఒప్పందాలు ఖచ్చితంగా మన యువతకు ప్రయోజనం చేకూరుస్తాయి’ అని ప్రధాని పేర్కొన్నారు.

    యువత ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం రోజ్‌గార్ మేళా నిర్వహిస్తోంది. యువతకు సాధికారత కల్పించడం, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం కోసం దీనిని చేపట్టింది. రోజ్‌గార్ మేళా ప్రచారం ప్రారంభించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా నియామక  ఉత్తర్వులు అందించారు. 16వ ఎడిషన్ రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి.
     

    ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో యువత సాధికారత విషయంలో ప్రభుత్వనిబద్ధతను పునరుద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో యువ స్నేహితుల భాగస్వామ్యాన్ని పెంచాలని  నిశ్చయించుకున్నాం. దీనిలో భాగంగా జూలై 12న ఉదయం 11 గంటలకు, వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందజేస్తాం. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నాను’ అని ఆ పోస్టులో తెలిపారు. 
     

  • ఢిల్లీ: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

    కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. మంత్రిత్వ శాఖలో దీనిపై మేం విశ్లేషిస్తున్నాం. విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు. నివేదికపై మేము వారితో సమన్వయం చేసుకుంటున్నాం. తుది నివేదికలు త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నా. అనంతరం, ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉంటుంది. పైలట్లు, సిబ్బంది పరంగా ప్రపంచంలో మనకు అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి ఉంది. ఇది నేను నిజంగా నమ్ముతున్నాను. పైలట్లు, సిబ్బందే విమానయాన పరిశ్రమకు వెన్నెముక’ అని చెప్పుకొచ్చారు.

    ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో.. ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్‌ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.

    క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్‌ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్‌ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట​్‌ వాయిస్‌లో పైలట్‌ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. 

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని  మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని  పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్‌కు పిలిచారు. ఆ తర్వాత  ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని  పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్‌ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. 
     

Politics

  • సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్‌ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.

    ఉషాశ్రీచరణ్‌ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.

    విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

    వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.

    వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది?

     

  • సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.

    ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.

    బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.

    ..ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు దీనికేం  సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు.

  • తిరుపతి జిల్లా: ‘సుపరిపాలన తొలి అడుగు  కార్యక్రమం ఏమో కానీ ‘తెలుగు తమ్ముళ్ల తోపులాట’ కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోంది. ఈరోజు(శనివారం, జూలై 12) తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని టీడీపీ ఆఫీస్‌ వద్ద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించగా అది రసాభాసాగా మారింది. టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ శంకర్‌రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల తోపులాట చోటు చేసుకుంది. 

    టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ మాజీ ఎంపీపీ బట్ట రమేష్‌ ఆందోళనకు దిగారు. తనకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని రమేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీలు మారే రమేష్‌ను గౌరవించేది లేదంటూ మరో వర్గం సైతం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

    యార్లగడ్డ వర్సెస్‌ పొట్లూరి 
    కృష్ణాజిల్లాలోని గన్నవరం కేసరపల్లి వేదికగా తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ మాజీ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. ఇది కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన అంశమే కావడం గమనార్హం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ. పర్యటిస్తున్న సమయంలో యార్లగడ్డ పర్యటనను బసవరావు వర్గం బాయ్‌కాట్‌ చేసింది. 

    గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బసవరావు వర్గం సమావేశమైంది. దాంతో పెట్రోల్‌ బంక్‌ వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడితే గెలిచాక ప్రక్కకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం  గ్రామ పార్టీ నాయకులు, ,కార్యకర్తలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తే తమకు సమాచారవ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారని బసవరావు వర్గం నిలదీసింది.ఎమ్మెల్యే యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు.

     

     

    గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ  కనీస సమాచారం ఇవ్వరా?????

    గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారు.

     

  • గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

    మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు.  వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే  ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.  

    గంటకు పైగా కదలకుండా చుట్టుముట్టి..
    గుడివాడలో టీడీపీ, జనసేన గూండాల ఉన్మాద చర్యలకు పోలీసులు సహకరించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ హారిక కారును గంటకు పైగా కదలకుండా చేసినా పోలీసులు నామమాత్రంగానే వ్యవహరించారు.  తన కారును చుట్టుముట్టినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై హారిక అసహనం వ్యక్తం చేశారు. .జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం పై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
  • గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను పెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా.. ఓ కేసులో పీఎస్‌ విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. 

    సాక్షి, కృష్ణా జిల్లా: రాజకీయ కక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి పోలీసులను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తుండడంపై ఆర్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. పలు కేసుల్లో ఈ మధ్యే బెయిల్‌ మీద బయటకు వచ్చిన.. కోర్టు ఆదేశాలు మేరకు క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పీఎస్‌కు వెళ్లారు. 

    మధ్యాహ్నాం 12గం. సమయంలో ఆయన స్టేషన్‌కు వెళ్లి విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే అప్పటికి విచారణ అధికారి రాలేదు. గత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కాస్త త్వరగా విచారించి వంశీని పంపించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అయితే అధికారి రానిది తామేమీ చేయలేమని కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. అలా.. 

    మూడు గంటలు గడిచింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఆయన పీఎస్‌లో బెంచీపై అలా కూర్చుని ఉండిపోయారు. చివరకు అధికారి ఇవాళ రాడని.. మళ్లీ విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామంతో ఆయన అనుచరులు ఒకింత అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వంశీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆ సమయంలో వంశీ వారిని సముదాయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆస్పత్రికి వెళ్లారాయన. 

    Gannavaram Police Station: వల్లభనేని వంశీ లేటెస్ట్ విజువల్స్

    ఇదీ చదవండి: ఇంత అణచివేతనా? ఇది పోలీసుల రాజ్యమా? లేక..

  • హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ‍ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ చీప్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మరోసారి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదన్నారు.  సామాజిక విప్లవానికి నాంది పలికిన ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో తాను చేసుకున్న అదృష్టమని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

    బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్బగ్యమని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్‌ వారి హయాంలో మద్దతు ప్రకటించిందన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించానని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

    కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదు
    ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందనే విషయం అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. బీఆర్‌ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేదా?, దెయ్యాల పీడ వదిలిందా?, కవిత ఎందుకు స్పందించడం లేదు? అని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ప్రశ్నించారు. కవిత బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం చావుల‌కు చంద్ర‌బాబే కార‌ణమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డిస్టిల‌రీల నిర్వాహ‌కులంతా టీడీపీ వారేనని.. మ‌ద్యం త‌యారీకి య‌థేచ్ఛ‌గా స్పిరిట్‌ను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క‌ల్తీ మ‌ద్యాన్ని బ్రాండెడ్ మ‌ద్యంగా విక్ర‌యించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.

    ‘‘ప్ర‌తి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ క‌ల్తీ మ‌ద్యమే. టీడీపీ నాయ‌కుల ధ‌న దాహానికి అమాయకుల ప్రాణాలు బ‌లవుతున్నాయి. ఈ కల్తీ మద్యం దందా వెనుక టీడీపీలోని కీలక నేతలే ఉన్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్‌ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్‌ మద్యం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

    ..కల్తీ మద్యం తాగి ఇటీవ‌ల అనేక మంది హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ చావులకు టీడీపీ కల్తీ మద్యం సిండికేట్‌ కారణమన్న వాస్తవాన్ని చంద్రబాబు సర్కారు కప్పి పుచ్చుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు’’ అని మేరుగ నాగార్జున ఆరోపించారు.

     

  • కర్నూలు జిల్లా:   ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముందుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా నిలదీస్తామన్నారు. 

    పత్తికొండలో సీపీఐ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ..  సూపర్‌ సిక్స్‌ అమలు చేయకుండా ఇప్పుడు పీ4 అంటూ ప్రజలను మోసం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఒకవైపు అన్యాయం చేస్తూ.. మరొకవైపు బనకచర్ల ఆనడం పట్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  డబుల్‌ ఇంజన్‌ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోందని, జగన్‌ అప్పులు చేస్తున్నాడని గగ్గోలు పెట్టిన బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నట్లు అని రామకృష్ణ ప్రశ్నించారు. 

     

     

  • టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్‌ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్‌ చేస్తున్నారు. 

    సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. 

    టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉంది

    టీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్‌లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్‌ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్‌) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.

    అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చం‍ద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్‌ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్‌ కల్యాణ్‌ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు.

  • సాక్షి, ఢిల్లీ: బీసీల విషయంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ద్వంద్వవైఖరితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌. కాంగ్రెస్‌ పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘బీసీలను తమ ప్రయోజనాల కోసం రాజకీయ అస్త్రాలుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వాడుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి వద్దకు బిల్లు పంపి చేతులు దులుపుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం  మంత్రివర్గ తీర్మానం చేయడం బీసీలను వంచించడమే. షెడ్యూల్-9లో పొందుపరిస్తేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది. మీరు పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. అది తేలకముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి?. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో బిల్లు ఉంటే గవర్నర్ ఆమోదిస్తారా?. ఒకవేళ ఆమోదించిన కోర్టులలో నిలబడతాయా?.

    కాంగ్రెస్ పార్టీ చేసిన కుల సర్వే తప్పులతడకగా ఉంది. కేంద్రం మీద నిందలు వేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది. బుర్ర వెంకటేశం నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ గణాంకాలు ఎందుకు బయట పెట్టడం లేదు?. ఎంతమంది బీసీలు ఉన్నారనే లెక్క ముఖ్యం కాదు. బీసీ కులాల్లో ఎంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కిందో చెప్పాలి. ఈ వివరాలను దాచిపెట్టడం బీసీలను మోసం చేయడమే అవుతుంది.

    వికాస్ కిషన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే దీనికి ట్రిపుల్ టెస్ట్ అవసరమని సుప్రీం వెల్లడించింది. 50% రిజర్వేషన్లకు మించి వద్దని సుప్రీంకోర్టు చెబుతోంది. దాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో  చెప్పాలి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించి వారికి అన్యాయం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. 

Business

  • ఎలక్ట్రానిక్స్‌, డిజిటల్‌ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్‌ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చుతుంది.

    ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్‌ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్‌ని ప్లగ్‌ఇన్ చేసి తమ టీవీలో డెస్క్‌టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్‌ చేయదు.

    ధర, లభ్యత
    జియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్‌బ్యాండ్‌తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్‌ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.

    ఫీచర్లు, వినియోగం ఇలా..
    జియో వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్‌ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ లాంటి ఓపెన్‌-సోర్స్‌ ఆఫీస్‌ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్‌ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాప్‌లను విడి బ్రౌజర్‌ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్‌ ఖర్చు కూడా ఏమీ ఉండదు.
     

  • ఆన్‌లైన్‌ బాండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ప్రొవైడర్లపట్ల అప్రమత్తత అవసరమని స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఇటీవల ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌ వెలుగులో నిలుస్తున్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నిర్ధారిత ఆదాయ బాండ్ల (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) కొనుగోలు సులభతరమవుతున్న కారణంగా జాగ్రత్త వహించమని తెలియజేశాయి.

    వీటి ద్వారా పెట్టుబడులు చేపట్టేముందు పలు కీలక అంశాలను పరిశీలించవలసి ఉన్నదంటూ రెండు ఎక్స్ఛేంజీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. బాండ్ల క్రెడిట్‌ రేటింగ్, తిరిగి చెల్లింపుల్లో బాండ్ల జారీదారుల ట్రాక్‌ రికార్డ్, బాండ్ల లిక్విడిటీ, సెటిల్‌మెంట్‌ గడువు, పన్ను ప్రభావం తదితర పలు అంశాలను పరిగణించమంటూ సూచించాయి.

    ప్రధానంగా బాండ్‌ పాల్ట్‌ఫామ్‌.. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరైనదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. నిజానికి క్రెడిట్‌ రేటింగ్‌ ఆధారంగా బాండ్లలో పెట్టుబడులపై రిసు్కలు, రిటర్నులు నమోదవుతాయని వివరించాయి.

  • ఎంతో పాపులర్‌ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.

    అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్‌లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్‌డేటెడ్‌ స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్ 150 బైక్‌ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్‌ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్‌ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.

    పల్సర్ ఎన్ 150 స్పెక్స్‌ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్‌ ఇంధన ట్యాంక్‌ దీనిస్పోర్టీ వెయిస్ట్‌లైన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్‌బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.

    పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు.

  • సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్‌1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.

    అలాగే 2025 హెచ్‌1లో టాప్‌–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ సరఫరా అయింది. గతేడాది హెచ్‌1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్‌ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో 2025 హెచ్‌1లో 42 లక్షల చ.అ. స్పేస్‌ లీజుకు పోయింది.

    గతేడాది హెచ్‌1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్‌లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్‌1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది.  

  • దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన ఎయిర​్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలతో పాటు, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. మొబైల్‌ టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో మీరు మొబైల్ రీఛార్జ్, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లేదా డిటిహెచ్ రీఛార్జ్ పై ఆదా చేయాలనుకుంటే మీకో చక్కటి మార్గం ఉంది. దీని ద్వారా ప్రతి రీఛార్జ్ పైనా 25 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చని మీకు తెలుసా?

    యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. దీని సాయంతో రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై బంపర్ క్యాష్ బ్యాక్ పొందడం ఈ కార్డు ప్రత్యేకత. మీరు ఎయిర​్‌టెల్ రీఛార్జ్‌లలో డబ్బులు ఆదా చేయాలనుకుంటే, ఈ కార్డు మీకు సరైన ఎంపిక. దీనితో ఇతర కంపెనీల రీఛార్జ్ లపై కూడా డిస్కౌంట్లు పొందవచ్చు.

    25 శాతం క్యాష్ బ్యాక్ పొందండిలా..
    ఈ క్యాష్‌ బ్యాక్‌ కోసం యూజర్లు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వరా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్‌ కోసం ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లించినట్లయితే ఫ్లాట్ 25 శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. అదే సమయంలో ఇతర రీఛార్జ్ లపై కూడా 10 శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ 60 రోజుల్లో ప్రాసెస్ అయి నేరుగా క్రెడిట్ స్టేట్ మెంట్ లో ప్రతిబింబిస్తుంది.

  • విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీపడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి.  - సాక్షి, సిటీబ్యూరో

    ప్రాంతమెక్కడ? 
    ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్తోమతకు తగ్గ బడ్జెట్‌లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది.  

    సదుపాయాల సంగతేంటి? 
    నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్‌ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్‌ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి.  

    బిల్డర్‌కు మంచి పేరుందా? 
    స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్‌ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్‌ ఫండ్‌ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు.  

    పరిసరాలెలా ఉన్నాయి? 
    ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి. 

  • పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్‌లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్‌పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్‌ షో చేపట్టింది.

    తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్‌లో ఈ రోడ్‌ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

    ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్‌ కమిషనర్‌ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో  సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు.

  • దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు  చేపట్టింది. రూ .4.88 లక్షలు జరిమానా విధించినట్లు ప్రకటించింది.  తన క్లయింట్‌కు టర్మ్ లోన్ మంజూరు చేసేటప్పుడు 'మాస్టర్ డైరెక్షన్ - ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా' నిబంధనలను విస్మరించిందని, అందుకు గానూ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) సెక్షన్ 11 (3) నిబంధనల ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

    నిబంధనల ఉల్లంఘనలపై నిఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేయగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని, మౌఖిక సమర్పణలు కూడా చేసిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. కేసు వాస్తవాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పందనను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

    శ్రీరామ్ ఫైనాన్స్‌కూ జరిమానా 
    డిజిటల్ లెండింగ్ సంబంధిత నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పైనా రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ లెండింగ్) ఆదేశాలు, 2025" లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ .2.70 లక్షల జరిమానా విధించింది.

    2024 మార్చి 31 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్బీఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం, సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.

    రుణగ్రహీతలు నేరుగా రుణ చెల్లింపులను కంపెనీ ఖాతాలో జమ చేయడానికి బదులుగా థర్డ్ పార్టీ ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మళ్లించిందని ఆర్బీఐ తన తనిఖీలో గుర్తించింది. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్‌కు జరిమానా విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

  • భారతదేశంలోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్స్‌ను ‘డార్క్ ప్యాటర్న్స్’గా అభివర్ణిస్తూ జెరోధా సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్ కామత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు ఎక్కువ డబ్బు సంపాదించడానికి, తమ ప్రయోజనాలే ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టివేసేందుకు కొన్ని ట్రిక్స్ అనుసరిస్తున్నాయని కామత్ చెప్పారు.

    కామత్ తన ఎక్స్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్మించడంలో ప్రోత్సాహకాలు కీలకంగా మారుతాయి. అయితే ఇవి కస్టమర్ కోసం కాకుండా వ్యాపారానికి మంచి చేసేలా వక్రీకరించబడి ఉంటాయి. తాత్కాలికంగా వినియోగదారులకే పెద్దపీట వేసినట్లు ఉన్నా, నిలకడగా కస్టమర్లకు మొదటి స్థానం కల్పించడం చాలా కష్టం. ఇది కాసినో గేమ్‌ వంటిది. స్పష్టమైన ఫీచర్లు, స్థిరమైన నోటిఫికేషన్లు, వివరాలు లేకుండా ప్రమాదకరమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. చాలా ఫైనాన్షియల్‌ యాప్స్‌ డిజైనింగ్‌ ప్రజలు క్రమంగా ఎక్కువ ఖర్చు చేయడానికి, అజాగ్రత్తగా పెట్టుబడి పెట్టడానికి, నిత్యం అదే యాప్‌కు బానిస అయ్యేలా రూపొందించబడ్డాయి. ఈ డార్క్ ప్యాటర్న్స్ యాప్స్, వెబ్‌సైట్‌లో ఉపయోగించే డిజైన్ ట్రిక్స్’ అని చెప్పారు.

Movies

  • 'పుష్ప 2' సినిమా రిలీజై దాదాపు ఆరేడు నెలలు అయిపోయింది. దీని తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడా అన్న సస్పెన్స్‌కి కొన్నాళ్ల ముందు తెరదించాడు. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌తో పాటు షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఇప్పుడు క్రేజీ అప్‌‌డేట్ ఒకటి వినబడుతోంది.

    (ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)

    అల్లు అర్జున్ ఇప్పటివరకు 21 సినిమాలు చేశాడు. కానీ ఎందులోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ అట్లీ సినిమా కోసం మాత్రం ఏకంగా నాలుగు పాత్రలు పోషించనున్నాడట. అవి కూడా తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా బన్నీనే కనిపించబోతున్నాడని సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ కావొచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బన్నీ ఎలా కనిపిస్తాడా అని ఎగ్జైట్‌మెంట్ గ్యారంటీ.

    అట్లీ-బన్నీ సినిమాలో దీపికతోపాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్, రష్మిక కూడా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలానే హాలీవుడ్ నటుడు విలన్‌గా కనిపించే అవకాశముందని కొన్ని రోజుల క్రితం గట్టిగా వినిపించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంది. అలా ట్రెండ్ అవుతూనే ఉంది. మరి వీటిలో ఎన్ని నిజం ఎన్ని అబద్ధం అనేది కొన్నిరోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. అప్పటివరకు బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.

    (ఇదీ చదవండి: భార్యకు సీమంతం చేసిన తెలుగు కమెడియన్)

  • గతంలో యూట్యూబ్‌లో వైరల్‌ అయిన 'ఆ గ్యాంగ్‌ రేపు' షార్ట్‌ ఫిల్మ్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత 'ఆ గ్యాంగ్‌ రేపు 2' పేరుతోనూ షార్ట్‌ ఫిల్మ్‌ తీశారు. ఇప్పుడు ఈ టీమ్ నుంచి మూడో భాగం రాబోతుంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

    దర్శకుడు యోగి తొలి ఫీచర్‌ ఫిల్మ్‌  'లవ్‌ యూ టూ' నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈసారి 'ఆ గ్యాంగ్‌ రేపు 3'.. దర్శకుడిగా మరింత గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. నరేన్‌ అన్నసాగరం, ప్రీతి సుందర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. నోక్షియస్ నాగ్స్ నిర్మించారు. కంటెంట్ ట్రైలర్ జూలై 16న విడుదల కానుంది. పూర్తి వివరాలు త్వరలో బయటపెట్టనున్నారు. 

  • తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్‌ఏ' సినిమాని తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా.. ఈనెల 18న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్‌, పిజ్జా లాంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్‌ కొండేటి.. ఈ 'మై బేబి'ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

    అధర్వ మురళి, నిమిషా సజయన్‌ జంటగా నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి నెల్సన్‌ వెంకటేశన్ దర్శకుడు. 2014లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్‌ చెబుతున్నారు. ఎస్‌.కె.పిక్చర్స్‌ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. 

  • ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి

    యూకేలో రెడ్ గౌనులో రాయ్ లక్ష‍్మీ హాట్ పోజులు

    హీరోయిన్ రుహానీ శర్మ మత్తెక్కించే స్టిల్స్

    చెక్ షర్ట్‌లో ప్రియాంక మోహన్ కిక్కిచే లుక్స్

    వైట్ డ్రస్సులో క్లాసీగా 'యానిమల్' తృప్తి దిమ్రి

    ముక్కు పుడకతో మెరిసిపోతున్న ప్రియా వారియర్

    ప్రియమణి చుడీదార్ లుక్.. ఫుల్ క్లాస్

     

  • రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్‌ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచందర్‌ అందించిన మోనికా అనే ఐటం సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్‌తో అదరగొట్టింది. 

    అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికా
    ఇలా స్పెషల్‌ సాంగ్స్‌ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్‌గా డ్యాన్స్‌ చేసింది. ఎఫ్‌ 3 మూవీలోనూ లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్‌ప్రెషన్‌, గ్రేస్‌తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్‌ సృష్టిస్తోంది. 

    దడదడలాడించిన సౌబిన్‌
    అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌ (Soubin Shahir) పూజానే డామినేట్‌ చేస్తున్నాడు. హీరోయిన్‌తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్‌ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ మంజుమ్మల్‌ బాయ్స్‌లో యాక్ట్‌ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్‌ లుక్‌లోనే సూపర్‌ స్టెప్పులేస్తూ ఫుల్‌ హైలైట్‌ అవుతున్నాడు. స్పెషల్‌ సాంగ్‌లో సౌబిన్‌తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్‌ అంటూ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.

     

    చదవండి: 'బిగ్‌బాస్‌'లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా!

  • యూట్యూబర్‌గా ఫేమ్ తెచ్చుకుని ఆపై సినిమాలు చేసిన కమెడియన్ మహేశ్ విట్టా.. గత నెలలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేశాడు. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు ఇప్పుడు ఆమెకు సీమంతం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

    (ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో మోసపోయిన యాంకర్ అనసూయ)

    రాయలసీమ కుర్రాడిగా యూట్యూబ్ వీడియోలు చేసిన మహేశ్ విట్టా.. తర్వాత నటుడిగా పలు మూవీస్ చేశాడు. బిగ్‌బాస్ షోకి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ, మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ గురించి బయటపెట్టిన మహేశ్.. త్వరలో పెళ్లి ఉండొచ్చని చెప్పాడు. అన్నట్లుగానే 2023 సెప్టెంబరులో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించాడు.

    మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్నారు. మహేశ్ విట్టా సినీ కెరీర్ విషయానికొస్తే.. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. నిజానికి 'పుష్ప' మూవీలో కేశవ పాత్ర కోసం కూడా ఆడిషన్ ఇచ్చాడు. కానీ చివరి నిమిషంలో మహేశ్ విట్టా బదులు జగదీశ్ ప్రతాప్‌కి అవకాశం దక్కింది.

    (ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్)

  • సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాళ్లలో యాంకర్ అనసూయ ఒకరు. గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేయడంతో పాటు ట్రెండింగ్ టాపిక్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈమె కూడా ఆన్‌లైన్‌లో మోసానికి గురైంది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని, ఇప్పటికీ సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ అసలేం జరిగింది?

    ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. మరీ ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అనసూయ కూడా ఇలానే నెల క్రితం ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు వస్తువులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదని చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: వాళ్లని పిలిచి ఉండాల్సింది.. నేనెందుకు: రజినీకాంత్)

    సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్‌సైట్‌పై అనసూయ మండిపడింది. ఈమెకే కాదు గత కొన్నాళ్లుగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురువుతున్నాయి. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పనిచేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి?

    ప్రస్తుతం అనసూయ.. రెండు తమిళ సినిమాలు చేస్తున్నట్లు ఉంది. అలానే ఒకటి రెండు తెలుగు రియాలిటీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరిస్తోంది. చివరగా 'పుష్ప 2'లో దాక్షాయణిగా కనిపించింది. ఈనెల 24న రిలీజయ్యే 'హరిహర వీరమల్లు' చిత్రంలోనూ అనసూయ నటించింది.

    (ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?

  • ఛాన్స్‌ ఇస్తే ఇండియన్‌ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్‌ గేమ్‌ హీరో లీ జంగ్‌ జే (Lee Jung Jae). నెట్‌ఫ్లిక్స్‌ బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్‌ చేశాడు లీ జంగ్‌ జే. ప్లేయర్‌ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్‌ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్‌ జే భవిష్యత్తులో బాలీవుడ్‌ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!

    సినిమా- సిరీస్‌
    దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్‌ జే.. ఎన్‌ ఎఫైర్‌, సిటీ ఆఫ్‌ ద రైజింగ్‌ సన్‌, ఓ బ్రదర్స్‌, ఓవర్‌ ద రైన్‌బో, లాస్ట్‌ ప్రజెంట్‌, బిగ్‌ మ్యాచ్‌, ద ఫేస్‌ రీడర్‌, డెలివర్‌ అజ్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్‌ గేమ్‌ మొదటి సీజన్‌తో ఇంటర్నేషనల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్‌ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.

    చదవండి: 'బిగ్‌బాస్‌'లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్‌ కూడా!

  • ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే అప్పుడప్పుడు వాళ్లపై వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా ఇప్పుడు అలానే చేశారు. తమిళ రచయిత ఎస్.వెంకటేశన్ రచించిన 'వేల్పరి' పుస్తకానికి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు శంకర్‌తోపాటు రజినీ కూడా హాజరయ్యారు. తనపై తాను జోక్స్ వేసుకుని కాసేపు అందరినీ నవ్వించారు.

    'ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడలనేది స్టేజీపై ఆధారపడి ఉంటుంది. అలానే ఏం చెప్పాలి. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడుకుంటున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లని పిలవాల్సింది. ఎందుకంటే వాళ్లు ఎంతో మేధావులు'

    (ఇదీ చదవండి: అఫీషియల్.. ఫేమస్ యూట్యూబర్‌తో నటి డేటింగ్)

    ''వేల్పరి' కార్యక్రమానికి అతిథిగా నన్ను ఆహ్వానించినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్‌లో నటిచే నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయాను' అని రజినీకాంత్ తనపై తాను జోకులు వేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటిహీరో కమల్ తనకంటే మేధావి అని రజినీ చెప్పడం విశేషం.

    రజినీకాంత్ ప్రస్తుతం 'కూలీ' సినిమా చేశాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. మూవీపై అయితే హైప్ గట్టిగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజినీకాంత్.. ఏ డైరెక్టర్‌తో పనిచేస్తారా అనేది ప్రస్తుతానికి పెండింగ్‌లోనే ఉంది.

    (ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?

  • సినిమాలో ముద్దు సీన్‌ తొలగించిన సెన్సార్‌ బోర్డ్‌పై బాలీవుడ్‌ నటి శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthary) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రేక్షకులు థియేటర్స్‌ రాకుండా వెళ్తారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేక్షకులను చిన్నపిల్లల భావించి, థియేటర్ని అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారంటూ సెన్సార్బోర్డ్పై మండిపడింది. వివరాల్లోకి వెళితే..

    డేవిడ్కొరెన్స్వెట్‌, రెచెల్ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్సినిమాసూపర్మ్యాన్‌’(Superman) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఇండియన్వెర్షన్లో 33 సెకన్ల ముద్దు సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ని తొలగించారు. సెన్సార్టీమ్అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్రబృందం పేర్కొంది. దీనిని నటి శ్రేయా ధన్వంతరి తప్పుపట్టింది. ఇదొక అర్థంపర్థం లేని చర్య అని సోషల్‌ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెల్లడించింది. 

    సూపర్మ్యాన్లో 33 సెకన్ల ముద్దు సీన్ని తొలగించడం ఏంటి? ప్రేక్షకులు థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని సెన్సార్వాళ్లే చెబుతుంటారు. పైరసీని ప్రొత్సహించొద్దని అంటారు. కానీ వాళ్లు మాత్రం ఇలాంటి అర్థంపర్థం లేని పనులు చేస్తారు. వాళ్ల లక్ష్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న చిన్న సీన్లను కూడా కట్చేసి.. థియేటర్అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారు. మేమే డబ్బులు పెడుతున్నాం..మేమే సమయం కేటాయిస్తున్నాం కదా.. మరి మాకు నచ్చింది చూడకుండా ఆపుతారెందుకు? మేం ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్నే నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడడానికి థియేటర్ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్న పిల్లలా భావించి.. థియేటర్స్అనుభూతిని ఆస్వాదించకుండా చేస్తున్నారుఅని సెన్సార్బోర్డుపై ఫైర్అయింది.

    శ్రేయా ధన్వంతరి ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ‘జోష్’, ‘స్నేహగీతం’ చిత్రాల్లో నటించింది. త్వరలో విడుదల కానున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్‌లో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

  • బిగ్‌బాస్‌ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్‌, అలేఖ్య పికిల్స్‌ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్‌, సాయికిరణ్‌, ముకేశ్‌ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్‌లోకి పంపించనున్నారు.

    బిగ్‌బాస్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు
    తాజాగా పోకిరి విలన్‌ ఆశిష్‌ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్‌ అనిత హస్సానందని కూడా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్‌బాస్‌ టీమ్‌ కాదట! హిందీ బిగ్‌బాస్‌ టీమ్‌! హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. 

    కంటెస్టెంట్లు వీళ్లేనా?
    ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్‌ దత్తా, ఆలిషా పన్వర్‌, కనిక మన్‌, అరిష్ఫా ఖాన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అపూర్వ ముఖిజ, మిస్టర్‌ ఫైజు, యూట్యూబర్‌ గౌరవ్‌ తనేజా, పురవ్‌ జా, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా (హీరోయిన్‌ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్‌ ధూపర్‌, పరాస్‌ కల్నవత్‌, కృష్ణ ష్రాఫ్‌ (జాకీ ష్రాఫ్‌ కూతురు), సెలబ్రిటీ మేకప్‌ ఆర్టిస్ట్‌ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!

    సన్యాసం తీసుకున్న ఆమె కూడా!
    వీరే కాకుండా లతా సబర్వాల్‌ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది), ఆశిష్‌ విద్యార్థి (టాలీవుడ్‌ విలన్‌), హీరోయిన్‌ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్‌బాస్‌కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్‌ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్‌ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!

    చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు

  • ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డేటింగ్, పెళ్లి విషయంలో యువత ఆలోచనలో మార్పు కనిపిస్తుంది. కొందరు అసలు పెళ్లి చేసుకోవడానికే భయపడుతుంటే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి వరకు వెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇలానే అఖిల్.. తన కంటే పెద్దదైన జైనబ్‌ని పెళ్లి చేసుకున్నాడు! ఇప్పుడు ప్రముఖ నటి కూడా తన కంటే చిన్నవాడైన ఓ యూట్యూబర్‌తో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇద్దరూ ప్రకటించారు కూడా!

    (ఇదీ చదవండి: బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?

    యూట్యూబ్‌లో ఫన్నీ వీడియోలతో అశిష్ చంచ్లానీ చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించాడు. రీసెంట్ టైంలో ఇతడు బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్‌తో తరచుగా కనిపిస్తూ వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఫైనల్లీ' అని ఆశిష్ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఇందులో ఎల్లీని ఎత్తుకుని, ఇద్దరు నవ్వుతూ కనిపించారు. దీంతో పలువురు నటులు వీళ్లకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

    ఎక్కడా కూడా తన బంధం గురించి చెప్పలేదు కానీ ఆశిష్-ఎల్లీ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎల్లీ అవ్రామ్ విషయానికొస్తే ఈమెది మన దేశం కాదు స్వీడన్. కాకపోతే మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ దర్శకుల దృష్టిలో పడింది. అలా 2013 నుంచి హిందీతో పాటు తమిళ, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్ 7, జలక్ ధిక్లా జా 7, బాక్స్ క్రికెట్ లీగ్ 2 తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఈమె వయసు 34 ఏళ్లు కాగా, ఆశిక్‌కి 31 ఏళ్లు. మరి వీళ్లు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి?

    (ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)

  • ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టి కేరాఫ్‌ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.

    డైరెక్షన్‌ కష్టం
    తాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్‌ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్‌ చాలా కష్టమైనది. డైరెక్షన్‌ చేసేటప్పుడు చాలా డౌట్స్‌ వస్తాయి. ఈ పర్ఫామెన్స్‌ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్‌ అవుతుందా? ఈ ఎడిట్‌ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్‌ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.

    హీరోను కొట్టా, తిట్టా..
    హీరో మనోజ్‌ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.

    చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?

  • హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

    ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్‌లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)

    'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్‌గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.

    బన్నీతో తలపడే నెగిటివ్ రోల్‌లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.

    (ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు)

  • తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

    టాప్‌ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలు
    మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ఈసారి డబుల్‌ హిట్‌తో బాక్సాఫీస్‌లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్‌’ (ఎల్‌2) రాజకీయ థ్రిల్లర్‌గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్‌తో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్‌గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్‌’, ‘లేడీస్‌ పర్స్‌’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.

    చిన్న సినిమాలకు పెద్ద ఆదరణ
    వినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్‌ అలీ అనస్వర రాజన్‌ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’, టోవినో థామస్‌ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్‌ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.

    గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...
    భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్‌’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచాయి.

    ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్‌. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.

    మోహన్‌లాల్‌ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్‌ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి..

  • నటి రేణు దేశాయ్‌ (Renu Desai) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో తను పోస్ట్‌ చేసిన ఫోటోనే అందుకు కారణం. కూతురు ఆద్యతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన రేణు.. సెల్ఫీకి పోజిచ్చింది. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రేణు దేశాయ్‌కు ఏమైందని కంగారుపడుతున్నారు. అయితే నటి మాత్రం తనకు ఏ సర్జరీ జరిగింది? ఎన్నిరోజులు ఆస్పత్రిలో ఉంది? వంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

    సినిమా.. రీఎంట్రీ
    రేణు దేశాయ్‌.. తెలుగులో బద్రి, జానీ సినిమాలు చేసింది. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం రేణు.. సినిమాలకు దూరమైంది. ఈ జంటకు కుమారుడు అకీరా నందన్, కూతురు ఆద్య సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌.. టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

    చదవండి: మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో

  • కన్నప్ప సినిమా (Kannappa Movie)కు విమర్శలు కొత్తేమీ కాదు. మూవీ ప్రకటించినప్పటినుంచి ఎప్పుడూ ఏదో రకంగా విమర్శిస్తూనే ఉన్నారు. అయితే సినిమా నుంచి ఎప్పుడైతే భక్తి పాటలు రిలీజయ్యాయో అప్పుడే ఎత్తిన ప్రతివేలు ముడుచుకుంది, జారిన ప్రతి నోరు అదుపులో పెట్టుకుంది. జూన్‌ 27న రిలీజైన కన్నప్ప చిత్రాన్ని చూసి ఎంతోమంది మంత్రముగ్ధులయ్యారు.

    ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్‌బాబు
    విష్ణు నటనకు ఫిదా అయ్యారు. దర్శకుడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కానీ కొందరు మాత్రం అదే పనిగా విమర్శిస్తూనే ఉన్నారు. సినిమా ఫ్లాప్‌, అట్టర్‌ ఫ్లాప్‌.. కన్నప్ప ఏమీ బాగోలేదని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్‌పై మోహన్‌బాబు స్పందిస్తూ.. విమర్శ - సద్విమర్శ, ప్రకృతి- వికృతి.. ఇలా రెండూ ఉంటాయి. ఓ గొప్ప పండితుడు ఏమన్నారంటే.. మోహన్‌బాబుగారు, జరిగేదంతా చూస్తున్నాను. 

    కన్నప్ప మూవీ గురించి..
    గత జన్మలో లేదా ఈ జన్మలో తెలిసీతెలియక మీరేదైనా తప్పులు చేసుంటే ఇలా విమర్శించేవారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారని అర్థం. కాబట్టి వారిని ఆశీర్వదించండి అన్నారు. వారి గురించి నేనేం మాట్లాడను. వాళ్లు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించాడు.

    చదవండి: మూడు రోజుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో

  • ‘‘వెంకీ సార్, సుప్రీత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌ ఉంది.  అందుకే ‘కేడీ: ది డెవిల్‌’ని గొప్పగా నిర్మించారు. ధృవ నా తమ్ముడులాంటివారు. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా ‘కేడీ: ది డెవిల్‌’ సినిమాకి విజయం అందించాలి’’ అని సంజయ్‌ దత్‌ పేర్కొన్నారు. ధృవ సర్జా హీరోగా, రీష్మా నానయ్య హీరోయిన్‌గా ప్రేమ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కేడీ: ది డెవిల్‌’. సంజయ్‌ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. వెంకట్‌ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. 

    సంజయ్‌ దత్‌ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌తో నాకెంతో అనుబంధం ఉంది. ఎంతో మందితో కలిసి పని చేశాను. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ సినిమా చేస్తున్నాను. ఆ సెట్‌లో తెలుగు నేర్చుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ–‘‘సంజయ్‌ దత్, శిల్పా శెట్టి వంటి వారితో పని చేయడం సంతోషంగానే ఉంటుంది. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. 

    ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అని నమ్మకం వ్యక్తం చేశారు ప్రేమ్‌. శిల్పా శెట్టి మాట్లాడుతూ– ‘‘నేను నా తొలి చిత్రం హిందీలో కాకుండా తెలుగులో (సాహసవీరుడు సాగరకన్య) చేశాను. ఇప్పుడు చేసిన ఈ ‘కేడీ: ది డెవిల్‌’లో అన్ని వాణిజ్య అంశాలున్నాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. హీరోయిన్‌ రీష్మా నానయ్య, కేవీఎన్‌ ్ర΄÷డక్షన్‌ బిజినెస్‌ హెడ్‌ సుప్రీత్‌ మాట్లాడారు.   

  • ప్రేమ పుట్టడానికి క్షణం చాలు అంటుంటారు. కానీ, బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ రాయగురు విషయంలో ప్రేమలో పడేందుకు ఒక పాట చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతేడాది మేజస్టీ ఇన్‌ లవ్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటించింది. నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌తో కలిసి యాక్ట్‌ చేసింది. సాంగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడే శుభశ్రీ మనసులోనూ పెళ్లంటే ఇతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది.

    ప్రేమ జంటపై ట్రోలింగ్‌
    అజయ్‌ అయితే ఆమె చేయి ఇస్తే చాలు జీవితాంతం వదలకుండా పట్టుకుంటానని మనసులోనే కోటి కలలు కనేశాడు. అతడు ధైర్యం చేసి ప్రపోజ్‌ చేయగా సుబ్బు ఓకే చెప్పడం.. వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగడం కూడా అయిపోయింది. అయితే డబ్బు కోసమే శుభశ్రీ.. అజయ్‌ను పెళ్లి చేసుకుంటుందని, అతడి లుక్‌ బాలేకపోయినా జీవితాంతం కలిసుండేందుకు ఒప్పుకుందంటూ విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. దీనిపై సుబ్బు ఘాటుగానే స్పందించింది. మనిషి లుక్స్‌ కన్నా మంచి మనసే తనకు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని పేర్కొంది.

    శుభశ్రీ బర్త్‌డేకు..
    తాజాగా ఈ ప్రేమజంట ఓ మంచి పనికి పూనుకున్నారు. శుభశ్రీ బర్త్‌డే రోజు (జూలై 15)న లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి, మీకు సాయం చేస్తామంటూ వీడియో రిలీజ్‌ చేశారు. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్‌ చేసి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. కాబోయే జంట మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

     

     

    చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్‌ కామెడీ ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’

  • కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher )ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్‌, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవలఐరన్‌మ్యాన్‌ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే సారి ఆమె పిరియడ్స్లో ఉన్నప్పుడు ఘనత సాధించడం గమనార్హం.

    ఏమిటీ ‘ఐరన్మ్యాన్‌70.3’ 
    ఐరన్‌మ్యాన్‌ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్‌మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్‌లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్చేయాలి. తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్మ్యాన్‌ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6 స్వీడన్లోని జోంకోపింగ్లో నిర్వహించిన రేస్లో సయామీ ఖేర్పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్‌ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.

    నెలసరి సమస్యను అధిగమించి.. 
    నాకు పీసీఓఎస్‌(పాలిసిస్టిక్ఓవరీ సిండ్రోమ్‌) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశానుఅని సయామీ నేషనల్మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

    సయామీ సీనీ నేపథ్యం
    నాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత బాలీవుడ్కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాతవైల్డ్డాగ్‌‌’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్‌’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నాజర్ పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై  తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

    శేరిలింగంపల్లి సిద్ధిక్‌ నగర్‌లో కల్లు కాంపౌండ్‌పై దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు.. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్‌లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్‌లో మూడు, కాచిగూడలో రెండు కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టారు.

    కల్లు కాంపౌండ్లలో సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించిన ఎక్సైజ్ అధికారులు.. తనిఖీల సమయంలో కల్లు కాంపౌండ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలన్నారు. కల్లులో ఎలాంటివి కలిపిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అల్ప్రోజలం లాంటివి మత్తు కోసం కలిపితే నేరమన్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఒక్కసారి ఇలాంటివి చేసి పట్టుపడితే పర్మినెంట్‌గా లైసెన్స్ రద్దు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు.

  • ఆదిలాబాద్‌  జిల్లా మావల మండల కేంద్రంలోని ఈ భవనంలో జైనథ్‌ మండలానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతిగృహాన్ని నిర్వహిస్తున్నారు. పదేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భవనం శిథిలమై అసౌకర్యంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

    భవనానికి కిటికీలు సైతం లేకపోవడంతో.. ఇటీవలి వర్షాలకు నీరు లోపలకు రాకుండా గోనె సంచులు, చద్దర్లు, అట్టముక్కలు కడుతున్నారు. వర్షాకాలం కావడంతో పురుగు, పుట్రతో భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.      
    – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

    మక్క బుట్టలకు మస్తు గిరాకీ 
    నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామం పచ్చి మక్క బుట్టలకు చిరునామాగా నిలిచింది. చేతికి వచ్చిన బుట్టలను డజన్‌ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఆటో ట్రాలీ మక్క బుట్టల ధర రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు పలుకుతోంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్, మంచిర్యాల్, మహారాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాల వ్యాపారులు మక్కబుట్టలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. 

    అంకాపూర్‌ మార్కెట్‌ శుక్రవారం పచ్చి మక్క బుట్ట విక్రయాలతో సందడిగా మారింది. సీజన్‌లో ఉదయం 5 గంటల నుంచి.. ఉదయం 9 గంటల వరకు హోల్‌సేల్‌ వ్యాపారం సాగుతోంది.  
    – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌

    చ‌ద‌వండి: మేక‌ల క‌ల్యాణి.. నీకు హ్యాట్సాఫ్‌  

  • సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్‌ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య  చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.

    సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్‌.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

    పౌల్ట్రీ ఫామ్‌ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్‌.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్‌ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు.

     

     

     

  • ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది. 
    – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి   

    ట్రాక్టర్‌పై సీతక్క ప్రయాణం 
    ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్‌పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.  

  • మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్‌ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్‌ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్‌లో మోహన్‌ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్‌ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. 

    అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్‌ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్‌ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్‌ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. 

    ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్‌లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Andhra Pradesh

  • గుడివాడ: తనను టార్గెట్‌ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(శనివారం, జూలై 12) వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళుతున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. 

    ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ దాడితో భయపడిపోయి తన భర్త, తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోటీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు.

     

    కారును చుట్టుముట్టి..
    కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు.  వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే  ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.  

    గంటకు పైగా ఆమె కారును కదలనీయకుండా నానా బీభత్సం సృష్టించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మహిళా జడ్పీ చైర్‌పర్సన్‌ పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ రకంగా దాడికి పాల్పడటం ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనడానికి నిదర్శమని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

  • తిరుపతి  తిరుపతిలో అనేక నెలలుగా 8 కిలోమీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో వైఎ‍స్సార్‌సీపీ నిరసన  కార్యక్రమం చేపట్టింది. కిలో మీటర్ల మేర వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారడంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ భూమన అభినయ్‌ రెడ్డి నేతృత్వంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీది దీపాలు వెంటనే వెలిగించాలని వర్షంలో నిరసన వ్యక్తం చేశారు. 

    ఈ మేరకు భూమన అభియన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘...తిరుపతి హైవేలో అనేక నెలులుగా 8 కిలోమీటర్ల మేర బీద దీపాలు వెలగడంలేదు. రూ. 12 లక్షల బకాయి కారణంగా స్ట్రీట్ లైట్స్ నిలిచిపోయాయి. ఈ ప్రాంతం కొంత తిరుపతి, మరికొంత చంద్రగిరి నియోజకవర్గాలకు వస్తుంది. దీనిపై వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే  నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్పందించాలి.

    వీది దీపాలు వెలిగెలా చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తున్నాము. వీధి లైట్లు వెలగని కారణంగా ఈ రహదారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇకనైన ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉంది. ప్రభుత్వం స్పందించకుంటే నిరసన ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.

NRI

  • కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.

    బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు  ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు.  సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.

    ఆర్ఎస్ఎస్‌లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా,  అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో  వివిధ హోదాల్లో బిజెపిలో  ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని  తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.

    2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్  పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో  బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో  తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో  బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ  యాత్ర  ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.

    బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన   దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్  పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు.  కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా  పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం  దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని  చెప్పారు.

    ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి  అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

  • సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో  ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.

    బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

    మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి   వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు.  మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా   నిలిచాయి. ఈ సందర్భంగా  సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.

    బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి  సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్‌ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.

    కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

  • ట్రంప్‌ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్‌ మస్క్‌ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్‌ పటేల్‌ కూడా ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.

    వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన కాష్‌ పటేల్‌(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌ డాన్‌ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్‌ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్‌ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్‌ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. 

    ఎప్‌స్టీన్‌ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫ్లైట్‌ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి.  

    ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌ డాన్‌ బోంగినో

    ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్‌ పామ్‌ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్‌ డాన్‌ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్‌ పటేల్‌ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్‌ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. 

    పామ్‌ బాండీ

    ‘‘ఈ దర్యాప్తులో పామ్‌ బాండీ ఉండాలని కాష్‌ పటేల్‌ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను  విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.  

    ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్‌మెంట ఆఫ్‌ జస్టిస్‌)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌, ట్రంప్‌ అనుచరురాలు లారా లూమర్‌ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్‌ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం.  

    ప్రముఖ ఇన్వెస్టర్‌ అయిన ఎప్‌స్టీన్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్‌ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్‌ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.   అయితే.. 

    ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్‌ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్‌ మస్క్‌ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్‌ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు.  మరోవైపు ట్రంప్‌ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్‌ జ్యూడీషియల్‌ డిపార్టెమెంట్‌ వ్యవహారంపై వైట్‌హౌజ్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.

    కశ్యప్‌ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్‌ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్‌ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్‌ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

  • కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్‌ డ్రీమ్స్‌ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్‌ డ్రీమ్స్‌ ఇపుడు  మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

    ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా  ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా  పౌరసత్వం ఉంది. 

    ముగ్గురు సభ్యుల  ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్‌ చేస్తోంది.  ‘‘మేం  ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ,  ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక  ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్‌ మెంట్‌ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.

    రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై  స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు  సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి  రూ. 25 కోట్లు సరిపోతాయని  మరి కొందరు చెప్పగా,   టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి  ఒక మాదిరి  స్కూలు ఫీజు  నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్‌ లైఫ్‌కి నెలకు 2 లక్షలు  బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)

    ముగ్గురే కాబట్టి  ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే  జీవనశైలి బట్టి  నెలకు కనీసంగా  రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్‌ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే  ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి  మూడు మిలియన్‌ డాలర్లు సరిపోతాయా లేదా అనేది  మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.

    అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు,  వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.

    ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్‌ గ్రాండ్‌ మలేషియా సంచలన ఆరోపణలు!

Guest Columns

  • ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ల యిన సందర్భంగా సంజయ్‌ గాంధీ ప్రోద్బలంతో 1975– 77ల్లో జరిగిన నస్‌ బందీ (బల వంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) గురించి చాలామంది తలచుకున్నారు. అలాగే, తొమ్మి దేళ్ల కిందటి నోట్‌ బందీ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు అందరికీ స్వానుభవమే. సరిగ్గా ఎమర్జెన్సీని గుర్తు చేసుకునే రోజు (జూన్‌ 25)కు ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ‘వోట్‌ బందీ’ అంటున్నాయి.  అది గత జూన్‌ 24న ఎన్నికల సంఘం బిహార్‌లో ప్రత్యేక తీవ్రతర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌– సర్‌) కోసం ఇచ్చిన ఆదేశం. బిహార్‌లోని 7,80,22,933 మంది వోటర్లలో 2003లో ఉండిన నాలుగు కోట్ల మంది పోగా, మిగిలిన వోటర్లలో ప్రతి ఒక్కరినీ కలిసి అర్హులా అనర్హులా ధ్రువీకరించి, కొత్త వోటర్ల జాబితా తయారు చేయాలనేది ఈ ఆదేశం.

    ప్రస్తుతం ఉన్న వోటర్ల జాబితా తప్పుల తడక అనీ, అందులో పేర్లన్నీ అనుమానాస్పదమైనవనీ ఎన్ని కల సంఘం అంటున్నది. విపరీతమైన వర్షాలతో, రాష్ట్రంలో 70 శాతం భూభాగం వరదల్లో చిక్కుకుని ఉన్న ప్రస్తుత స్థితిలో ఈ ఇంటింటి పర్యటన సాధ్యమా అనుమానమే.

    2003 జాబితా తర్వాత చేరిన వోటర్లందరూ బర్త్‌ సర్టిఫికేట్, ప్రభుత్వోద్యోగి ఐడెంటిటీ కార్డ్, పెన్షన్‌ కార్డ్, పాస్‌ పోర్ట్, విద్యార్హతల సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర రిజిస్టర్, స్థానిక అధికారులు తయారు చేసిన కుటుంబ పట్టిక, ప్రభుత్వం భూమి పంపిణీ చేసి ఉంటే ఆ పత్రం వంటి పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి చూపితేనే అర్హుడైన వోటర్‌గా లెక్కి స్తారు. ఈ అర్హతా పత్రాలలో ఆశ్చర్యకరంగా ఆధార్‌ కార్డ్, రేషన్‌ కార్డ్, గ్రామీణ ఉపాధి హామీ పథకపు జాబ్‌ కార్డ్‌ లేవు. చివరికి ఎన్నికల కమిషన్‌ తానే స్వయంగా జారీ చేసిన వోటర్‌ కార్డ్‌ కూడా లేదు. బిహార్‌ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో ఆ పదకొండు పత్రాలలో ఏదో ఒకటి కన్నా వోటర్‌ కార్డ్, జాబ్‌ కార్డ్, రేషన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్‌ ఉండే అవకాశమే ఎక్కువ. కొన్ని రోజులు గడిచాక, ‘అర్హత నిర్ధారణను బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల విచక్షణకు వదులుతున్నాం’ అని ఎన్నికల సంఘం అంది. అంటే ఒక వ్యక్తి వోటరా కాదా అన్నది స్థానిక అధికారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుందన్నమాట!

    ఈ కార్యక్రమం అనుమానాస్పదంగా ఉన్నదనీ, దీన్ని ఆపాలనీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను కలిసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన స్వయంగా బిహార్‌ వోటర్ల జాబితా నుంచి కనీసం ఇరవై శాతం పేర్లు తొలగించవలసి ఉంటుందని అన్నారు. అంటే ఒక కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లలో కొందరు నిజంగానే అనర్హులు కావచ్చు గాని, ఈ పేరుతో అధి కార పక్షం చాలామంది పేర్లు తొలగించదలచుకున్న దన్న అనుమానాలు విస్తారంగా ఉన్నాయి.  

    2003లో వోటర్ల జాబితా సవరించడానికి 700 రోజులు పట్టింది. ఇప్పుడు నిర్దేశించిన నెల రోజుల్లో శిక్షణ, మెటీరియల్‌ తరలింపునకు పట్టిన కాలాన్ని మినహాయిస్తే 19 రోజుల్లో కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. అంటే తూతూమంత్రంగా ముగిస్తారన్నమాట.  

    ఎన్నికల సంఘం ప్రకటనలను బట్టి మొత్తం కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ప్రశ్నార్థకమయింది. అసలు వోటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు పునర్నవీకరణ చెందుతూనే ఉంటాయి. 2003 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఐదు లోకసభ ఎన్నికలలో, ఐదు శాసనసభ ఎన్నికలలో వోటు వేసిన వారందరినీ ఇప్పుడు అనర్హు లుగా, అర్హత రుజువు చేసుకోవలసినవారిగా ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నది. అంటే ఆ ఐదు లోకసభలూ, శాసనసభలూ ఈ అనర్హులైన వోటర్ల వల్ల ఏర్పడ్డాయని ఎన్నికల సంఘం భావిస్తున్నదా? అలా అయితే వాటి సాధికారత, చట్టబద్ధత ఎంత?

    వోటర్ల జాబితాల సవరణ ఎప్పటికప్పుడు చేయ వలసిన పనే గనుక ఎన్నికల నిబంధనలు అది ఎట్లా చేయాలో నిర్దేశించాయి. ఆ నిబంధనల్లో ఇంటెన్సివ్‌ రివి జన్‌ ఉంది గాని ఇప్పుడు ప్రకటించిన స్పెషల్‌ ఇంటె న్సివ్‌ రివిజన్‌ లేదు. అటువంటి పని చేసే అధికారం చట్ట ప్రకారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ప్రశ్నకు జవాబు లేదు. బిహార్‌ నుంచి ప్రతి జూన్‌–జూలై–ఆగస్ట్‌ నెలల్లో కనీసం 21 శాతం వోటర్లు ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్తారని ఎన్నికల సంఘమే ఇది వరకు అంచనా వేసింది. మరి సరిగ్గా అదే సమయంలో ప్రతి వోటర్‌నూ కలిసి జాబితాను సంస్కరించాలనడంలో ఔచిత్యం ఏమిటి? ఇంకా విచిత్రం, ఇదే ఎన్నికలసంఘం గత సంవత్సరం జూన్‌లో వోటర్ల జాబితాను సంస్కరించమని బిహార్‌ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వారు ఆరు నెలల పాటు శ్రమించి 2025 జన వరిలో జాబితా ప్రకటించారు. దాన్ని జూన్‌ 24 వరకూ ఎన్నికల సంఘం కూడా ఆమోదిస్తూ వచ్చింది.

    చ‌ద‌వండి: మార‌క నిల్వ‌లు క‌రిగిస్తేనే క‌ద‌లిక‌!

    ఇప్పుడు హఠాత్తుగా బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, ప్రతిపక్షానికి వోటు వేస్తారనే అను మానం ఉన్న లక్షలాది వోటర్లను అనర్హులుగా మార్చ డమే ఏకైక మార్గంగా ఏలినవారు భావించినట్టున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ వోట్‌ బందీ ప్రకటించినట్టుంది. నస్‌ బందీ తలపెట్టినవారు 1977లో ఓటమి పాలయ్యారు. 2016 నోట్‌ బందీ ప్రకటిత లక్ష్యాలు సాధించలేక బొక్కబోర్లా పడింది. ఇప్పుడు 2025 వోట్‌ బందీకి ఏమవుతుంది?

    - ఎన్‌. వేణుగోపాల్‌ 
    ‘వీక్షణం’ సంపాదకుడు 

Family

  • మనం తినే ఆహార పదార్థాలు లేదా తీసుకునే ద్రవపదార్థాలు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపు లోపలి భాగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కడుపు లో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.

    ఉదయం వేళల్లో మసాలాలు, డీప్‌ ఫ్రైస్‌ తినడం వల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా కడుపుకి మంచిదే కదా అని పీచు పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే పీచుపదార్థాలు తీసుకోవాలి.

    చాలామంది బ్రష్‌ చేసుకోగానే కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు. అయితే అలా కాఫీ లేదా టీ తాగడం వల్ల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. దానికి బదులు పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. అలాగని చల్లటి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు ఎదురై.. ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. 

    ఇదీ  చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!

    పరగడుపున ఆల్కహాల్‌ తీసుకోవడం చాలాప్రమాదకరం. ఇది కాలేయంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఖాళీ కడుపుతో మద్యం పుచ్చుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్‌ వేగంగా వ్యాపిస్తుంది. దానిమూలంగా రకరకాల అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి వీలయినంత వరకు పైన చెప్పుకున్న ఆహారం లేదా ద్రవపదార్థాలను వీలయినంత వరకు పరగడుపున తీసుకోకుండా ఉండటం చాలా మేలు.

    చదవండి : Yoga మెదడును ఉత్తేజపరిచే ఆసనాలు

  • మానసిక ఆందోళనలు తగ్గడానికి, స్పష్టత లేని ఆలోచనలను కట్టడి చేయడానికి, మెదడు ఆరోగ్యానికి యోగా శక్తివంతమైన టెక్నిక్‌లా ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాటిలో.. మత్సాసన, గరుడాసన, ధనురాసన, వజ్రాసన, అర్ధమత్యేంద్రాసన, బాలాసన, శవాసన.. మొదలైనవి ఉన్నాయి. 

    ఛాతీ, మెడను విస్తరించి, ఆక్సిజన్‌ మెరుగుపరుస్తుంది మత్సా్యసన. ఊపిరితిత్తులను, నాడీ వ్యవస్థను ఉత్తేజరుస్తుంది. మానసిక అలసట తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

    గరుడాసన ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రతను పదునుపెడుతుంది. ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుంది. 

    వజ్రాసన ద్వారా శరీరంపై అవగాహన పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరుకు సహాయ పడుతుంది. 

    భావోద్వేగాలను సమతుల్యం చేసే ధనురాసనం ఏకాగ్రతను పెంచుతుంది.  ∙అర్ధ మత్య్సేంద్రాసన వల్ల వెన్నెముక నరాలను ఉత్తేజపరచడం ద్వారా అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది. మెదడుకు రక్తప్రవాహం పెరుగు తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. 

    మోకాళ్లపై వంగి, చేతులు చాచి, ముందుకు వంగడం వల్ల శ్వాస తీసుకోవడంలో మెరుగ వుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. మెదడు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది. 

    శవాసనలో పూర్తి విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల భావోద్వేగాల సమతుల్యత కుదురుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది

     

  • పిల్లలూ.... మనందరికీ ఎవరెస్టు శిఖరం తెలుసు. హిమాలయాల్లో అన్నింటి కంటే ఎత్తయిన శిఖరం, ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌. కాని అది ఒక వ్యక్తి పేరు. ఎత్తయిన శిఖరానికి తన పేరు పెట్టేంత గొప్పవాడైన ఎవరెస్ట్‌ ప్రముఖ బ్రిటిష్‌ సర్వేయర్, జియోడెసిస్ట్, జియోగ్రాఫర్, రాయల్‌ సొసైటీ సభ్యుడు (George Everest)

    ఎవరెస్ట్‌ 1790 జూలై 4 న గ్వెర్న్‌ వేల్‌ లో జన్మించాడు. ఆయన ఇంగ్లాండులోని మిలిటరీ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి చేరుకున్నాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీలో 1806లో చేరాడు. ఏడు సంవత్సరాలు బెంగాలులో పనిచేశాడు. జావా సర్వే పనిలో 1814 నుండి 1816 వరకు పని చేశాడు. తర్వాత అతను భారత దేశ గ్రేట్‌ త్రికోణమితి సర్వే  Great Trigonometrical  విలియం లాంబ్టన్‌కు సహాయకుడిగా నియమించబడ్డాడు. భారతదేశపు అత్యంత చివరి దక్షిణ బిందువు కేప్‌ కొమరిన్‌ నుండి నే΄ాల్‌ వరకు దాదాపు 2,400 కిలోమీటర్ల (1,500 మైళ్ళు) దూరంలో ఉన్న మెరిడియన్‌ ఆర్క్‌ (Meridian Arc)ను సర్వే చేయడంలో ప్రధాన  పాత్ర  పోషించాడు ఎవరెస్ట్‌. ఆయన తన కాలంలోని అత్యంత ఖచ్చితమైన సర్వే పరికరాలను ప్రవేశపెట్టి సర్వే పని  ఖచ్చితత్వాన్ని పెంచాడు. 1865లో రాయల్‌ జియోగ్రాఫికల్‌ సొసైటీ ఎవరెస్ట్‌ గౌరవార్థం శిఖరం పేరును ఎవరెస్ట్‌ గా మార్చింది. ఆ  పర్వతానికి చాలా స్థానిక పేర్లు ఉన్నందున కన్ఫ్యూజన్‌ లేకుండా ఎవరెస్ట్‌ పేరును ప్రతి΄ాదించింది. అలా ఎవరెస్ట్‌ పర్వతానికి ఎవరెస్ట్‌ పేరు స్థిరపడింది.ఆయన పేరే ‘ఎవరెస్టు’కు పెట్టారు 

  • బరువు తగ్గాలంటే ఆహార అలవాట్లను మార్చుకోవాలి. వ్యాయామం చేయాలి. వీటన్నింటి కంటే ముందు అసలు మనం ఎందుకు బరువు ఎక్కువగా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. అంతర్లీనంగా ఏవైనా ఆరోగ్యసమస్యలున్నాయేమో అనేది వైద్య నిపుణుల ద్వారా చెక్‌ చేసుకోవాలి. అప్పుడు వ్యాయామం, ఆహారంమీద దృష్టిపెట్టాలి. అయితే ఎక్స్‌ర్‌సైజ్‌ చేయడానికి టైం లేదబ్బా.. ఇది అందరూ  చెప్పేమాట. మరి దీనికి పరిష్కారమేంటి?  బిజీ షెడ్యూల్‌తో సతమతయ్యేవారు, అస్సలు టైం ఉండటం  లేదు అని బాధపడే వారు  ఏం చేయాలి? ఇవాల్టి ‘ టిప్‌ ఆఫ్‌  ది డే’ లో  తెలుసుకుందాం.

    బిజీ బిజీ జీవితాల్లో బరువు తగ్గడంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరకడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించడం చాలా అవసరం.  అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. స్మార్ట్‌గా మన షెడ్యూల్‌ ఆధారంగా దినచర్యను అలవాటు చేసుకోవాలి.  గంటలు గంటలు జిమ్‌లో గడాల్సిన అవసరం లేకుండానే,  సింపుల్‌ చిట్కాలు, చిన్న చిన్న జీవనశైలి సర్దుబాట్లతో  ఫిట్‌నెస్‌ సాధించవచ్చు.

    స్మార్ట్ ప్రిపరేషన్
    బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండాలి అనే విషయంలో కూడా  కమిట్‌మెంట్‌  చాలా ముఖ్యం. ప్లాన్డ్‌గా, స్మార్ట్‌గా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

    ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌నుంచే మన ప్రిపరేషన్‌ మొదలు పెట్టేద్దాం. ఇందుకు పది నిమిషాలు చాలు. ఉడికించిన గుడ్లు,  స్మూతీ, లేదా రాత్రి నానబెట్టిన ఓట్స్‌ బెస్ట్‌. వీటిని తొందరగా ప్రిపేర్‌ చేసుకోవచ్చు. పోషకాలు కూడా ఎక్కువే. ఖచ్చితంగా ఇంతే తినాలని అనుకొని, టిఫిన్‌ లేదా లంచ్‌  ప్యాక్‌ చేసుకుంటే..అతిగా తినే ముప్పు తప్పుతుంది.  

    వ్యాయామం- ఆ 2 నిమిషాలు 
    కనీసం వ్యాయామం శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. రోజులో కనీసం అర్థగంట వ్యాయామానికి  కేటాయిస్తే చాలు. అలాగే సుదీర్ఘ వ్యాయామం చేయలేకపోతున్నామన్న దిగులు అవసరం లేదు.  రోజంతా రెండు, రెండు నిమిషాలు మినీ వర్కౌట్‌లు చేయండి.  అంటే కాఫీ విరామాలలో స్క్వాట్‌లు, డెస్క్ స్ట్రెచ్‌లు లేదా లిఫ్ట్‌లకు బదులుగా  ఎక్కడం  లాంటివి.  డెస్క్‌ వర్క్‌ అయినా సరే.. ప్రతీ గంటకు ఒకసారి స్వల్ప విరామివ్వడం ముఖ్యం.  వీలు, సౌలభ్యాన్ని  బట్టి, చిన్న చిన్న డెస్క్‌ వ్యాయామాలు చేయవచ్చు.

    అందుకే ఇటీవల చాలా ఐటీ కంపెనీల్లో స్టాండింగ్‌ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్ట్‌లలో  సమయం ఉన్నపుడు సాధ్యమైనంత నడవడానికి, నిల్చొని ఉండడానికి ప్రయత్నించండి. ఇవి జీవక్రియను చురుకుగా ఉంచడం తోపాటు, శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది.

    ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

    హైడ్రేషన్‌: ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్‌ను  వెంట తీసుకెళ్లండి. హైడ్రేటెడ్‌గా ఉండటం జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. మరింత ఉత్సాహంకోసం నిమ్మకాయ, పుదీనా  కలిపిన నీళ్లు, లేదా పల్చని మజ్జిగ తాగండి.

    “స్నాక్ స్మార్ట్”: వండుకునే టైం లేదనో టైం పాస్‌ కోసమో, ఆకలిగా ఉండనో, ఎనర్జీ డ్రింక్స్‌, ప్యాక్డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ వైపు మళ్లకండి. దీనికి బదులుగా నట్స్‌,  రోస్టెడ్‌  సీడ్స్‌, ప్రోటీన్ బార్‌లు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్ ప్యాక్‌లపై దృష్టిపెట్టండి.  వీలైతే వీటిని మీ బ్యాగ్, డెస్క్ లేదా కారులోనో ఉంచుకోండి. వీటి వల్ల పోషకాలు బాగా అందుతాయి. శక్తి లభిస్తుంది. అంతేకాదు  దీని వల్ల షుగర్‌ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్‌, అనారోగ్యకరమైన స్ట్రీట్‌ ఫుడ్‌కి దూరంగా ఉండొచ్చు.  

    వండుకోవడానికి సమయంలో లేనప్పుడు. తక్కువ సమయంలో, ఎక్కువ ప్రొటీన్డ్‌ ఫుడ్‌ తినేలా ప్లాన్‌ చేసుకోండి.  

    గంటల తరబడి కుర్చీకి, సోఫాకి అతుక్కుపోవద్దు. వీలైనన్నిసార్లు లేచి నడుస్తూ ఉండాలి. ఉదా : ఫోన్‌ మాట్లాటప్పుడు,  టీవీ చూస్తున్నపుడు, పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు  నడుస్తూ ఉండాలి. అలాగే  భోజనం తరువాత కనీసం 10నిమిషాల నడక అలవాటు చేసుకోండి.ఇలా చేయడం వల్లన యాక్టివ్ఉండటంతోపాటు,రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

    చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

    పోర్షన్ కంట్రోల్: మన తినే ఆహారంలో కొర్బ్స్‌ తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.  "మైండ్‌ఫుల్ ఈటింగ్" అనేది ముఖ్యం. ఎక్కువ తినకుండా పొట్ట నిండేలా ఉడికించిన కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు,  పుచ్చ, బొప్పాయి లాంటి పళ్లకు చోటివ్వండి.  కొద్దిగా కొద్దిగా నెమ్మదిగా తినండి. చిన్న ప్లేట్‌లను ఉపయోగించండి. ఎందుకంటే బిజీగా ఉండేవారు ఆ హడావిడిలో వేగంగా, ఎక్కువగా తినేస్తారు. అలాగని కేలరీలను మరీ అబ్సెసివ్‌గా లెక్కించాల్సిన అవసరం లేదు. పోర్షన్ కంట్రోల్‌పై దృష్టిపెడాలి. అపుడు ఎంత తక్కువ తిన్నా కడుపు నిండిన అనుభూతినిస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తినడం మానుకోండి. ఏం తింటున్నామన్న దానిపై దృష్టి పెట్టి శ్రద్ధగా, ఆస్వాదిస్తూ తినండి.

    గంట కొట్టినట్టు నిద్రపోవాలి
    నిద్ర లేకపోవడం ఆకలి హార్మోన్‌లను ఉత్తేజితం చేస్తుంది.   సమయానికి నిద్రపోవాలి. వారాంతాల్లో కూడా నిద్రవేళకు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోండి, దానికి కట్టుబడి ఉండండి. చక్కటి విశ్రాంతి తీసుకున్న శరీరం ఎక్కువ బరువు తగ్గేలా ప్రతిస్పందిస్తుంది.  సంకల్ప శక్తి పెరుగుతుంది.

    చీట్‌ మీల్‌, ఓకే 
    అప్పుడప్పుడూ వ్యాయామాన్ని మిస్‌ అయినా,  కాస్త ఎక్కువ తిన్నే మరీ ఎక్కువ ఆందోళన చెందకండి. చీట్‌మీల్‌ అనుకోండి. బిజీ షెడ్యూల్‌లో అన్నీ అనుకున్నట్టు ప్రణాళిక ప్రకారం జరగవు అని సర్దుకుపోండి. మిస్‌ అయిన వ్యాయాన్ని మరునాడు సర్దుబాటు చేసుకోండి.  అంతే... అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మీ సొంతం.

    నోట్‌: ఇవి అవగాహనకోసం అందించిన చిట్కాలు మాత్రమే. ఎవరి శరీరాన్నివారు అర్థం చేసుకొని, ప్రేమించాలి.  బరువు తగ్గడం అనేది ఎవరికి వారు  నిశ్చయించుకొని,  స్వీయ క్రమశిక్షణతో, పట్టుదలగా  చేయాల్సిన పని  అని మర్చిపోవద్దు.

  • మీ జీతం పెరుగుతున్న కొద్దీ మీ ఖర్చులనూ పెంచుకుంటూ పోతున్నారా? అయితే మీ జేబును నెలనెలా మీరే కొట్టేసుకుంటున్నారు అని అర్థం! జీతం పెరిగితే పొదుపు పెరగాలి. అలా కాకుండా, పెరిగిన జీతంతో సమానంగా.. పెట్టే ఖర్చూ పెరుగుతోందంటే మీ జీవన విధానం మీ చేయి దాటి పోయిందనే! ఆదాయం పెరిగినా ఆర్థికంగా మీరు ఇరుకున పడి పోయారనే! మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను  ఏ నెల చెక్‌ చేసినా ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉండిపోయిందనే! దీనినే ‘లైఫ్‌స్టైల్‌ ఇన్‌ఫ్లేషన్‌’ (Lifestyle Inflation) అంటున్నారు ఆర్థిక నిపుణులు. అంటే.. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’!  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  

    సాధారణంగా, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగటాన్ని ‘ద్రవ్యోల్బణం’అంటారు. కానీ, ఈ ‘జీవనశైలి ద్రవ్యోల్బణం’ వ్యక్తిగతంగా ఎవరికి వారు ఖర్చులు పెంచుకుంటూ పోతే ఏర్పడేది! జీతం పెరిగింది కదా అని, ఆ పెరిగిన మేరకు అలవాట్లను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ పోతే సంభవించేది! ఇంకాస్త మెరుగైన తిండి. ఖరీదైన బట్టలు. సౌఖ్యమైన కారు. అద్దెకు ఇంకాస్త పెద్ద ఇల్లు. ఒక్కమాటలో చెప్పాలంటే – కోరికలు అవసరాలుగా, విందులు అలవాట్లుగా, డిజైనర్‌ బ్రాండ్‌లు వినోదాలుగా మారిపోతే బతుకు లెక్క బ్యాలెన్స్‌ తప్పటమే జీవనశైలి ద్రవ్యోల్బణం.

    ‘పెరగటం’నిజం కాదు! 
    మెరుగైన జీవితాన్ని కోరుకోవటం తప్పు కాదు. అయితే భవిష్యత్తులో సంభవించబోయే ఆర్థిక ఆటుపోట్లను అంచనా వేయకుండా జీవితాన్ని మెరుగు పరుచుకోవటం వల్లనే ఆర్థిక స్థిరత్వం కోల్పోతామని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఇంటి ఖర్చులు పెరు గుతాయి. మెల్లగా అప్పులు మొదలౌతాయి. ద్రవ్యోల్బణం ప్రకారం పెరిగిన జీతాలను మినహాయించి చూస్తే 2019 నుంచి మనదేశంలోని ఉద్యోగుల జీతాలలో నిజమైన పెరుగుదల లేదని ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’పేర్కొంది. దీన్నిబట్టి సగటు ఉద్యోగి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే... ఖర్చులకు సరిపడా జీతం పెరుగుతుంది తప్ప, ఖర్చుపెట్టటానికి జీతం పెరగదని భావించి జాగ్రత్తగా ఉండాలని.  

    ఏఐ భయం పొంచి ఉంది!  
    జీవనశైలి ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్న ఉద్యోగులు ప్రస్తుతం అప్రమత్తంగా ఉండవలసిన ప్రధాన అంశం ఏఐ (కృత్రిమ మేధస్సు). ఏఐ వల్ల 2030 నాటికి 80 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. దీన్నిబట్టి ఉద్యోగ భద్రత, కెరీర్‌ వృద్ధి అనేవి ఒక భ్రమ అని గుర్తించాలి. జీతాలు పెరగటం, కెరీర్‌లో ఉన్నతస్థాయికి చేరుకోవటం అనే నమ్మకాలు క్రమంగా పాతబడుతున్నాయి. అందుకే అస్థిరతే లక్షణంగా ఉన్న ఒక ప్రపంచంలోకి ఇప్పటికే మనం ప్రవేశించామని ఉద్యోగులు గ్రహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

    పోల్చుకోవటం జీతానికి చేటు.. 
    తోటివారితో పోల్చుకోవటం కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి వారి జీవనశైలి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఎక్కు వ మంది సంపాదిస్తున్నారని, మెరుగ్గా జీవిస్తున్నారని, విలాసాలకు ‘అప్‌గ్రేడ్‌’అవుతున్నారని చెప్పి వాళ్లందరినీ అనుసరించటం అంటే.. పెరిగిన జీతానికి చేటు తెచ్చుకోవటమే. నిరంతర అశాంతి, అనారోగ్యాలు, రుణ భారం ఈ జీవనశైలి ద్రవ్యోల్బణం ఇచ్చే ‘బోనస్‌’. చాలామంది.. విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న తమ స్నేహితులు, బంధువులతో పోల్చి చూసుకుని వారి ‘స్థాయి’కి చేరుకోటానికి పరుగులు పెడుతుంటారు. నెలనెలా చెల్లింపులతో మన ల్ని కట్టిపడేసే ‘ఈఎంఐ’లతో ఖరీదైనవన్నీ సమకూర్చుకుంటారు. అంతే, ఇక ప్రతినెలా పరుగు మొదలవుతుంది. అందుకే దుప్పటి ఉన్నంత వరకే కాళ్లు ముడుచుకోవాలని పెద్దలు చెప్పిన మాటనే ఇప్పుడు ఆర్థిక నిపుణులూ ప్రబోధిస్తున్నారు.

    చిక్కుకోకుండా ఉండాలి 
    జీవనశైలి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్నాక తిరిగి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల పాఠశాల ఎంపిక. అప్పటికే లక్షల్లో ఫీజులు కట్టి ఉంటారు. వాటికి అదనంగా ట్యూషన్‌ ఫీజులు సరేసరి. ఈ పొరపాట్లను సరిదిద్దుకోవటం సాధ్యం కాదు. పిల్లల విద్యకు అంతరాయం కలగకుండా వారిని ఉన్నచోటనే కొనసాగించాలి. అలాగే, అద్దెకు తీసుకున్న పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంటికి వెళ్లడానికి ప్రిస్టేజ్‌ అడ్డుపడుతుంది. ఇక ఈఎంఐలను అవి తీరేవరకు కట్టాల్సిందే. క్రెడిట్‌ కార్డులైతే మెడకు చుట్టుకుని ఉంటాయి. ఈ పరిస్థితిలో దేని నుంచీ వెనక్కు మరలే అవకాశం ఉండదు. మళ్లీ జీతం పెరిగినప్పుడు జాగ్రత్తగా పొదుపు చేసుకోటానికి ఈ అనుభవం పనికొస్తుంది కానీ, అప్పటికే ఆ పెరగబోయే జీతం మొత్తాన్ని కూడా మింగేసే అనకొండల్లా చెల్లించవలసిన ఖర్చులు ఉంటే జీతం పెరిగీ ప్రయోజనం ఉండదు.

    ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

    ముందస్తు హెచ్చరిక  సంకేతాలు..
    జీవనశైలి ద్రవ్యోల్బణాన్ని ముందుగా తెలియబరిచే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. 
    మొదటి హెచ్చరిక: మీ జీతం ఎంత పెరిగినా, అందులో కొంతైనా పొదుపు మొత్తంలో చేర్చలేకపోవటం. 
    రెండో హెచ్చరిక: జీతం పెరిగిన నెల నుంచే మీరు బడ్జెట్‌ వేసుకోవటం మానేయటం.  
    మూడో హెచ్చరిక : జీతం పెరిగిందన్న ధీమా మీ క్రెడిట్‌ కార్డు మినిమం బ్యాలెన్స్‌ను పెంచేయటం. 
    నాలుగో హెచ్చరిక ‘ముందు కొనండి– తర్వాత చెల్లించండి’అనే స్కీములపై ఆధారపడటం.  
    అయిదో హెచ్చరిక  ఇంటర్నెట్, ఓటీటీల  సబ్బ్‌ స్క్రిపషన్‌లు పెరగటం.

    బయట పడే మార్గం  ఉంది.. 
    జీవనశైలిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటం అంటే ఖర్చులు తగ్గించుకునే విషయంలో మరీ కఠినంగా ఉండమని కాదు. సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తుగా ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం. సమాజం ఎంత ఎత్తులో ఉందో చూడకండి. మీ బడ్జెట్‌కు లోబడి మీరు ఎంత ఎత్తులో ఉండగలరో అంతలోనే ఉండండి. లగ్జరీ కొనుగోళ్లు, ఇంటర్‌నెట్‌ స్ట్రీమింగ్‌ ఖర్చులు తగ్గించుకోండి. మీ కుటుంబ సభ్యులకు మీ ఆదాయం, ఖర్చులు, పొదుపుపై స్పష్టమైన అవగాహన కలి్పంచండి. ఆర్థికంగా మీరు మీ పరిమితులను గుర్తెరిగి మెసులుకుంటే మీ జీవనశైలి ద్రవ్యోల్బణం కానీ, దేశ ద్రవ్యోల్బణం కానీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఏమీ చేయలేవని ఆర్థిక నిపుణుల ఉవాచ.

  • సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. 

    ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. 

    ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. 

    వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. 
    వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. 

    నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. 

    చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

    ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 

    ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.

    నోట్‌ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.  ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సం‍ప్రదించడం ఉత్తమం. 

    ఇదీ చదవండి: యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

Cartoon

International

  • డౌట్‌ అక్కర్లేదు. ఇది కారే. కాకపోతే.. ప్రపంచంలోనే అత్యంత సన్నటి (స్లిమ్‌) కారు. ట్రాఫిక్‌ జామ్‌ల ఫికర్‌ లేదు. పార్కింగ్‌ సమస్య లేనే లేదు. ఈ అల్ట్రా స్లిమ్‌ ఫియట్‌ పాండా ఎలక్ట్రిక్‌ కారును ఇటలీలో ఆవిష్కరించారు. డ్రైవర్‌ కాకుండా.. ఇంకొకరు వెనుక సీట్లో కూర్చొని ప్రయాణించవచ్చు. 50 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ కారును ఇటలీకి చెందిన మెకానిక్‌ ఆండ్రియా పాత  ఫియట్‌ కారు భాగాలను ఉప యోగించి రూపొందించాడు. 

    145 సెంటీమీటర్ల ఎత్తు, 340 సెంటీమీటర్ల పొడవున్న ఈ కారు బరువు 264 కిలోలు. దీన్ని చూసినోళ్లంతా గట్టిగా గాలి వస్తే పడిపోతుందేమో అని అనుమా నం చేయగా.. అటూ ఇటూ ఊగుతుంది గానీ.. పడిపోదు అని దీన్ని తయారుచేసిన ఆండ్రియా చెప్పాడు. దాన్ని నిరూపించడానికి అక్కడ నడిపి చూపాడు. ఇది స్లిమ్‌ కారు.. దానికి తగ్గట్లు ఇందులో సన్నగా ఉన్నవాళ్లే పడతారు. ప్రపంచంలోనే అత్యంత సన్నటి కారుగా దీని పేరు ను త్వరలో గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కించనున్నట్లు ఆండ్రియా తెలిపాడు.