Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్‌కేతో ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 195  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీ త 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 

    ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ 3 వికెట్ల‌తో ఆక‌ట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు.  అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (59) మెరుపు అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా, క్లాసెన్ (59) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

    వీరిద్ద‌రు మిన‌హా మిగతావారు ప‌రుగులు చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరు మార్కును దాట‌లేక‌పోయింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కంబోజ్‌, జేమి ఓవ‌ర్ట‌న్‌లు చెరో మూడు వికెట్లు తీయ‌గా, ముకేశ్ చౌద‌రీ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌ర్వాత ఛేద‌న‌ను సీఎస్‌కే ధాటిగానే ఆరంభించింది. 

    ఆరంభంలోనే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ఔటైన‌ప్ప‌టికీ వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్ సాయంతో 30 ప‌రుగులు సాధించాడు. మిడిలార్డ‌ర్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) ప‌రుగులతో ప‌ర్వాలేద‌నిపించారు. ఆఖ‌ర్లో ఓవ‌ర్ట‌న్ (16) కాస్త ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు క‌ఠినంగా బంతులేయ‌డంతో సీఎస్‌కే ఓట‌మి దిశ‌గా ప‌య‌నించింది.

     

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 

    ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్‌, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్  చేశాడు. 

    3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్‌, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.

    గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. 

    ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది.  మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. 

    ఈ సంగతి పక్కనబెడితే  చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్‌, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. 

    ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్‌కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. 

    ఇక 2011 నుంచి ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్ అది. కేవ‌లం ఒక్క ప‌రుగుతో గుజ‌రాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోవ‌డానికి డేవిడ్ మిల్ల‌ర్ ప్ర‌ధాన కార‌ణ‌మయ్యాడు. ఆఖ‌రి బంతికి రెండు పరుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో అన‌వ‌స‌ర ఒత్తిడికి పోయిన మిల్ల‌ర్ ఢిల్లీకి చేజేతులా ఓట‌మిని అందించాడు. 

    ఈ చ‌ర్య మిల్ల‌ర్‌ను కంట‌త‌డి పెట్టేలా చేసింది. మ‌రో అవ‌కాశం వ‌స్తే ఢిల్లీకి విజ‌యాన్ని అందించి త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని మిల్ల‌ర్ పేర్కొన్నాడు. అయితే త‌న త‌ప్పు స‌రిదిద్దుకునే రోజు ఇంత తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని బ‌హుశా మిల్ల‌ర్ కూడా ఊహించి ఉండ‌డు. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన‌ మ్యాచ్‌ మ‌రోసారి ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. 

    176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో మిల్ల‌ర్‌తో పాటు స్ట‌బ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్ల‌ర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్ట‌బ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 ప‌రుగులు అవ‌స‌రం. స్ట్రైక్‌లో ఉన్న మిల్ల‌ర్ ఈసారి ఢిల్లీని గెలిపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. 

    షెప‌ర్డ్ వేసిన మూడో బంతిని మిల్ల‌ర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. ఇక మ‌రుస‌టి బంతిని ఈసారి మిల్ల‌ర్ ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్ మీదుగా మ‌రో సిక్స‌ర్ సంధించాడు. దీంతో స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో ఒక ప‌రుగుకు మారిపోయింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొర‌పాటును మ‌ళ్లీ చేయ‌కుండా షెప‌ర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశ‌గా బౌండ‌రీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. 

    మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

    చదవండి: సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌!

  • ఐపీఎల్‌-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 

    ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో  ఫిల్‌ సాల్ట్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

    మిల్లర్‌.. కిల్లర్‌
    అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్‌(57), ట్రిస్టన్ స్టబ్స్‌(60 నాటౌట్‌) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌(26 రిటైర్డ్ హార్ట్‌) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.

    అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.

    ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్‌కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. 

    ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆరంభంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి సీఎస్‌కే గాడిన ప‌డింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సీఎస్‌కే కెప్టెన్సీ విష‌య‌మై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. 

    సంజూ శాంస‌న్ సీఎస్‌కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. అది ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక‌వేళ ఈ సీజ‌న్‌లో కాకపోయినా భ‌విష్య‌త్తులో మాత్రం శాంస‌న్ సీఎస్‌కేను శాసిస్తాడ‌ని జోస్యం చెప్పాడు. ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సీఎస్‌కేకు కెప్టెన్సీ అనుభ‌వం ఉన్న ఆట‌గాడు అవ‌స‌రమ‌ని, ఈ విష‌యంలో సీఎస్‌కేకు మొద‌టి చాయిస్ సంజూనే అని తెలిపాడు. 

    ఇప్ప‌టికే సంజూ శాంస‌న్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఫైన‌ల్ చేర్చిన‌ట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్‌కే యాజ‌మాన్యం ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే రుతురాజ్‌ను త‌ప్పించి శాంస‌న్‌కు బాధ్య‌త‌లు అప్పగించినా ఆశ్చ‌ర్చ‌పోన‌వ‌స‌రం లేద‌ని తెలిపాడు. ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న రుతురాజ్ ఈ సీజ‌న్‌లోనే కెప్టెన్సీ వ‌దిలేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని జోస్యం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

    ప్ర‌స్తుతం అశ్విన్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.  ఇక ఎంఎస్ ధోని సార‌ధ్యంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక సీఎస్‌కే ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు. ధోని త‌ర్వాత కెప్టెన్లు ఎంద‌రు మారినా సీఎస్‌కే మ‌రో టైటిల్ కొట్ట‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యింది. 

    2022 సీజ‌న్‌లో ధోని స్థానంలో ర‌వీంద్ర జ‌డేజాను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని త‌ట్టుకోలేక జ‌డేజా దానిని మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు. దీంతో గత్యంత‌రం లేక మ‌ళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అలా 2023 సీజ‌న్‌లోనూ సీఎస్‌కేను న‌డిపించిన ధోని ఐదోసారి చాంపియ‌న్‌గా నిలిపాడు. 

    ఆ త‌ర్వాత 2024 సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ ఆ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేర‌డంలో విఫ‌ల‌మైంది. ఇక 2025 సీజ‌న్‌లో రుతురాజ్ సార‌థ్యంలోని సీఎస్‌కే దారుణ ఆట‌తీరుతో అట్ట‌డుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

    చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌!

  • మొట్ట మొద‌టి తెలంగాణ టీ20 లీగ్ ఎడిష‌న్‌ను నిర్వ‌హించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స‌న్న‌ద్ద‌మైంది. జూన్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నమెంట్‌లో జట్ల యాజమాన్యం కోసం టెండర్ ప్రక్రియను హెచ్‌సీఏ ప్రారంభించింది.  జట్టు యాజమాన్య హక్కులు మొదటి 5 ఏళ్ల కాలానికి ఇవ్వబడతాయి.

    ఆ త‌ర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రెన్యూవ‌ల్ చేస్తారు. ఒక్కో జట్టుకు కనీస బిడ్ ధర రూ. 3 కోట్లుగా నిర్ణ‌యించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీల ఖర్చులను ఫ్రాంచైజీ యజమానులే భరించాలి. కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఏప్రిల్ 28లోపు టెండర్‌ పత్రాలు సమర్పించాలి. 

    ఏప్రిల్ 30న షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గోనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ,మహబూబ్‌నగర్ ప్రాంతాలను ప్రాతిపాదించారు. ఆఖరికి బిడ్డింగ్ ద్వారా 8 జట్లను ఖరారు చేస్తారు. ఈ టోర్నీ 21 రోజులు పాటు ఉప్పల్ మైదానం వేదికగా జరగనుంది. మొత్తంగా  32 మ్యాచ్‌లు జరుగుతాయి.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్‌కేతో ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 195  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. 

    ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ 3 వికెట్ల‌తో ఆక‌ట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు.  అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (59) మెరుపు అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా, క్లాసెన్ (59) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

    • 150 పరుగుల వద్ద సీఎస్‌కే ఆరో వికెట్‌ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్‌ ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో అనికేత్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    14 ఓవ‌ర్ల‌లో సీఎస్‌కే 135/5
    14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే ఐదు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివ‌మ్ దూబే 10 ప‌రుగుల‌తో ఆడు తున్నారు.

    బ్రెవిస్‌ డకౌట్‌
    113 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ను శివాంగ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

    • ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 

    • 66 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్‌ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    దంచికొడుతున్న సీఎస్‌కే
    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌  నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (30), రుతురాజ్‌ (14) క్రీజులో ఉన్నారు.

    195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    సీఎస్‌కే టార్గెట్ 195 ప‌రుగులు
    సీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (59), క్లాసెన్ (59) అర్థ‌సెంచ‌రీలతో రాణించారు. వీరిద్ద‌రు రాణించిన‌ప్ప‌టికీ మిగ‌తావారు విఫ‌లం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరును దాట‌లేక‌పోయింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో జేమి ఓవ‌ర్ట‌న్‌, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు.

    ఏడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ 177 పరుగుల వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది. 18వ ఓవర్‌లో క్లాసెన్‌ (59) కంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ 150 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. 13వ ఓవర్‌లో నితీష్‌కుమార్‌ (12) ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    12 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్‌ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.

    సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ జేమీ ఓవర్టన్‌ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

    • ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ముకేశ్‌ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్‌ రుతురాజ్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.

    అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ..
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్‌ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 38 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ 26, హెడ్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

    ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడు తున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 22 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో సీఎస్‌కే 15 విజ‌యాలలు, ఎస్ఆర్‌హెచ్ 7 విజ‌యాలు సాధించాయి. చివ‌రి ఐదు మ్యాచ్‌ల విష‌యానికొస్తే ఎస్ఆర్‌హెచ్ 3, సీఎస్‌కే రెండింట నెగ్గాయి.

    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ

    చెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట​ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్

     

     

  • 38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షాపుర్ జద్ర‌న్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లర‌క్త క‌ణాల సంఖ్య ప‌డిపోవ‌డంతో ప్ర‌స్తుతం షాపుర్ జ‌ద్ర‌న్‌ భార‌త్‌లోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్ల‌ర‌క్త క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. 

    మ‌రో 18 గంట‌లు గ‌డిస్తే కానీ షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఏంట‌నేది చెప్పలేమ‌ని వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో కూడా షాపుర్ జ‌ర్ద‌న్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. 

    అయితే కొన్ని వారాల కింద‌టే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జ‌ద్ర‌న్ చాలా రోజుల ఆసుప‌త్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవ‌లే డిశ్చార్జి అయిన అత‌డు మ‌రోసారి ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు. జ‌ద్ర‌న్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. 

    పాక్‌కు చెందిన మ‌రో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌యం తెలుసుకొని బాధ‌ప‌డ్డాడు. అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడిన షాహిద్ అఫ్రిది త‌న చిర‌కాల మిత్రుడు షాపుర్ జ‌ద్ర‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ ఎదుగుద‌ల‌లో షాపుర్ జ‌ద్ర‌న్ కీల‌క పాత్ర పోషించాడు. ద‌శాబ్దానికి పైగా ఆఫ్గ‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన షాపుర్ జ‌ద్ర‌న్ నిప్పులు చెరిగే బంతుల‌తో ప్ర‌పంచ మేటి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. 

    స్టీవ్ స్మిత్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, డేవిడ్ వార్న‌ర్ వంటి బ్యాట‌ర్ల‌ను త‌న స్వింగ్ బౌలింగ్‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టి పెవిలియ‌న్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్‌తో వ‌న్డే మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షాపుర్ జ‌ద్ర‌న్ అప్గానిస్తాన్ త‌ర‌ఫున 43 వ‌న్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అఫ్గానిస్తాన్ త‌ర‌ఫున మూడు టీ20 ప్ర‌పంచ‌క‌ప్పుల్లో పాల్గొన్న షాపుర్ జ‌ద్ర‌న్ 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స్కాట్లాండ్‌పై విజ‌యం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన అఫ్గానిస్తాన్ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు.

    చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?

  • శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్‌-2025లో ఫైనల్‌కు చేరిన పంజాబ్‌.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.

    అగ్రస్థానంలో
    తద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా శ్రేయస్‌ అయ్యర్‌ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు 2024లో టైటిల్‌ అందించిన శ్రేయస్‌.. 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

    కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్‌.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్‌ పంజాబ్‌ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్‌ను ముద్దుగా సర్పంచ్‌ సాబ్‌ అని పిలుచుకుంటున్నారు.

    అర్థం ఏమిటో తెలియదు
    అయితే, ఫ్యాన్స్‌ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్‌ కింగ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్‌ సాబ్‌ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.

    అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్‌ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. 

    చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

  • ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన మైలు రాయిని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది వందో మ్యాచ్‌. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా బెంగళూరు రికార్డులకెక్కింది. 

    ఐపీఎల్‌ తొట్ట తొలి సీజన్‌(2008) ఆర్సీబీ హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంలో బెంగళూరు జట్టు  ఇప్పటివరకు 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 46 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా.. మరో నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.

    ఈ మైదానంలో ఆర్సీబీకి అద్భుతమైన రికార్డు ఉంది. 2013 సీజన్‌లో ఇదే స్టేడియంలో పూణే వారియర్స్‌పై ఆర్సీబీ 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ తర్వాత స్ధానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఉంది. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడింది.

    ఇక ఈ ఏడాది సీజన్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ నాలుగింట విజయాలు సాధించగా, ఓ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.
    చదవండి: IPL 2026: సీఎస్‌కేతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులోకి యార్కర్ల కింగ్‌?

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ఓన‌ర్‌ కావ్యా మార‌న్.. పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని ప్రీతిజింటా.. ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని నీతా అంబానీ.. కేకేఆర్ స‌హ భాగ‌స్వామి జూహీ చావ్లా, ఆమె కూతురు జాన్వి మెహ‌తా వీరంతా క్యాష్‌రిచ్ లీగ్‌కు అద‌నపు ఆక‌ర్ష‌ణ‌. 

    వీరంతా త‌మ జ‌ట్లు ఆడే ప్ర‌తీ మ్యాచ్‌కు హాజ‌ర‌య్యి ఆట‌గాళ్ల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూనే త‌మ అందంతో అభిమానుల హృద‌యాల‌ను క‌ట్టిప‌డేస్తుంటారు. అయితే వీరంద‌రిలో పంజాబ్ కింగ్స్ కో-ఓన‌ర్ ప్రీతిజింటాది ప్ర‌త్యేక శైలి.  యువ‌రాజ్ సింగ్‌, మ్యాక్స్‌వెల్ స‌హా చాలా మంది పంజాబ్ ఆట‌గాళ్ల‌కు ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తూ ఉత్సాహ‌ప‌రుస్తుండేది. 

    ఇలా ఐపీఎల్ ఆరంభం నుంచి ప్ర‌తీ సీజ‌న్‌లో పంజాబ్‌ను ప్రోత్స‌హిస్తూ మ్యాచ్‌ల‌కు హాజ‌ర‌య్యే ప్రీతి జింటా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో టైటిల్ రేసులో దూసుకెళ్తోంది. సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజ‌యాలు (ఒక మ్యాచ్ ర‌ద్దు) సాదించిన పంజాబ్ 9 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కూడా కొన‌సాగుతుంది. 

    పంజాబ్ కింగ్స్ ఇంత‌లా రెచ్చిపోతున్న స‌మ‌యంలో ప్రీతి జింటా మైదానంలో క‌నబ‌డ‌క‌పోయేస‌రికి పంజాబ్ అభిమానులు చిన్న‌ బోతున్నారు. తాజాగా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ విజ‌యం సాధించిన అనంత‌రం ప్రీతిజింటా త‌న సామాజిక మాధ్య‌మంలో జ‌ట్టును అభినందిస్తూ పోస్ట్ చేసిందే త‌ప్ప బ‌య‌ట‌కు రాలేదు. మ‌రి ప్రీతిజింటాకు ఏమైన‌ట్లు అని అభిమానులు ఆరా తీస్తున్న స‌మ‌యంలో ఆమెనే స్వ‌యంగా స్ప‌ష్ట‌త ఇచ్చింది. 

    ‘చాలా కాలంగా నా పిల్లలకు దూరంగా ఉండి షూటింగ్‌లు, ఇతర పనులతో బిజీగా గడిపాను. ప్రస్తుతం వాళ్లకు సెలవులు ఉన్నాయి. అందుకే ఈ విలువైన సమయాన్ని నా పిల్లలతో గడపాలని నిర్ణయించుకున్నాను. తల్లిగా వాళ్లతో ఉండటం నా బాధ్యత, అందుకే మ్యాచ్‌లకు హాజరు కాలేకపోతున్నాను. అయితే పిల్ల‌ల‌తో సెల‌వులు ముగియ‌గానే మ‌ళ్లీ స్టేడియానికి వ‌చ్చి జ‌ట్టుతో పాటు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాను’ అని చెప్పుకొచ్చారు.

    పంజాబ్ జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండటం, దీనికి తోడు త్వరలోనే ప్రీతి జింటా ఎంట్రీ ఇవ్వనుండటంతో అభిమానుల జోష్‌ డబుల్‌ కానుంది. పంజాబ్‌ కింగ్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ ఆదివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో తలపడనుంది.

    చదవండి: చెన్నై జట్టులోకి చిచ్చరపిడుగు!

  • అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్‌, గుజ‌రాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ తండ్రయ్యాడు. అత‌డి భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను రషీద్‌ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు రషీద్ వెల్ల‌డించాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. 

    దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రషీద్ ఖాన్ గతేడాది ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు 2024 అక్టోబర్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్  మొదటి పెళ్లి జరిగింది. రషీద్  వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్‌ క్రికెటర్లంతా హాజరయ్యారు. 

    కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
    చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

  • భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ లిజ్‌లాజ్‌ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్‌లాజ్‌.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ ఆద్వైత్‌ వైద్యతో ఫొటోషూట్‌ చేసింది.

    కోహ్లి లైక్‌ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?
    భారత్‌లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్‌ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్‌లాజ్‌ ( LizLaz)  ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. కోహ్లి లైక్‌ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.

    అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్‌ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్‌ పేలాయి. గతంలో అవనీత్‌ కౌర్‌ అనే ఇన్‌ఫ్యూయెన్సర్‌ ఫొటోకు కూడా కోహ్లి లైక్‌ కొట్టినట్లు కనిపించగా వైరల్‌ అయింది. అయితే, తన ఇన్‌స్టా ఫీడ్‌ క్లియర్‌ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్‌ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.

    ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్‌లాజ్‌ మాత్రం ట్రెండ్‌ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు  చేసింది.

    విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది
    ‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్‌ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్‌ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్‌ వచ్చాయి.

    ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్‌ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్‌ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్‌ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్‌లాజ్‌ చెప్పుకొచ్చింది.

    చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్‌ గేల్‌!

  • IPL 2026 RCB vs DC Live updates: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. డేవిడ్‌ మిల్లర్‌ వరుసగా సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. 

    ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిల్లర్‌(10 బంతుల్లో 22)తో పాటు కేఎల్‌ రాహుల్‌(34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ట్రిస్టన్‌ స్టబ్స్‌(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 60) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ సాధించాడు.

    👉ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్‌, మిల్లర్‌ ఉన్నారు. 

    16 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 135/4
    16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. అక్షర్‌పటేల్‌ గాయం కారణంగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు.

    కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..
    దూకుడుగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ (57) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.

    8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 74/3
    8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(45), స్టబ్స్‌(12) ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌
    5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(30), స్టబ్స్‌(5) ఉన్నారు.

    నిప్పులు చెరుగుతున్న భువనేశ్వర్‌
    భువనేశ్వర్‌ కుమార్‌ నిప్పులు చెరుగుతున్నాడు. 3 ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. కరుణ్‌ నాయర్‌(5), సమీర్‌ రిజ్వీ(2) వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు.

    ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
    176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఫాథుమ్‌ నిస్సాంక..భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
    ఆర్సీబీ స్కోరెంతంటే?
    చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

    ఆర్సీబీ ఆరో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రోమారియో షెపర్డ్.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

    ఆర్సీబీ ఐదో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన డేవిడ్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15.2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 146-5
    ఆర్సీబీ నాలుగో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్‌.. ముఖేష్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12.4  ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌ 131-4

    ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 63 పరుగులు చేసిన ఫిల్‌ సాల్ట్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజత్‌ పాటిదార్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 99/2

    దూకుడుగా ఆడుతున్న సాల్ట్‌
    8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(45), పడిక్కల్‌(11) ఉన్నారు.

    ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
    52 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?
    3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుంగా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(14), సాల్ట్‌(10) ఉన్నాడు.

    ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువం‍టి మార్పులు లేకుండా ఆడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడుతోంది.

    తుది జట్లు:
    ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్‌), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్

    ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణా

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్

    ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్

  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ -2026లో లాహోర్ ఖలందర్స్ ఓటుమ‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. శుక్ర‌వారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ల‌హోర్ ఓట‌మి పాలైంది. షాహీన్ షా అఫ్రిది సార‌థ్యంలోని ల‌హోర్ ఖలందర్స్‌కు ఇది నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో లహోర్ బ్యాట‌ర్లు తీవ్ర నిరాశ‌ప‌రిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌హోర్ 19.5 ఓవర్ల‌లో 134 ప‌రుగులకే కుప్ప‌కూలింది.

    ల‌హోర్ ఇన్నింగ్స్‌లో హసీబుల్లా ఖాన్( 33) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌల‌ర్లు ఉస్మాన్ తారీఖ్‌, జునైద్ ఖాన్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ల‌హోర్ ప‌త‌నాన్ని శాసించారు. అనంతరం 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ కేవ‌లం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో ఊదిపడేసింది. క్వెట్టా ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ రిలీ రుసో(60) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తన సహనాన్ని కోల్పోయాడు.

    ఏమి జరిగిందంటే?
    మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన ల‌హోర్ ఖ‌లంద‌ర్స్.. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌల‌ర్ల ధాటికి  60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు కెప్టెన్ షాహీన్ అఫ్రిది త‌నను తానుగా ప్ర‌మోట్ చేసుకుని ముందుగా బ్యాటింగ్‌కు వ‌చ్చాడు.

    సికింద‌ర్ ర‌జా, డానియ‌ల్ సామ్స్‌ను కాద‌ని అఫ్రిది ముందుగా బ్యాటింగ్ రావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే షాహీన్ త‌న ఆడిన మొద‌టి బంతికే స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. దీంతో గోల్డెన్ డ‌కౌట్ అయిన బాధ‌లో షాహీన్ స‌హ‌నాన్ని కోల్పోయాడు.

    డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న టైర్లపై,సైడ్ స్క్రీన్‌పై తన బ్యాట్‌ను బలంగా బాదాడు.  అంతేకాకుండా మెట్ల‌కు కూడా త‌న బ్యాట్‌ను బ‌లంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి.
    చదవండి: T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. మరో సంచలన వార్త



     

     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్‌ గొయెంకా తిట్టాడని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గొయెంకా ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. పంత్‌ లాంటి ఆటగాడిని తిట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదని వివరణ​ ఇచ్చాడు. 

    నేను ఏది చేసినా వైరలవుతుంది, సోషల్‌మీడియాకు నేనో పంచింగ్‌ బ్యాగ్‌లాగా మారానని అన్నారు. బయట ఎన్ని ప్రచారాలు ఉన్నా, డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన హావభావాలు పదేపదే తప్పుగా అర్దమవుతున్నాయి. ఇక నుంచి చేతులు వెనుక పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటానని హాస్యంగా చెప్పారు.

    ఇదే సందర్భంగా ఆటలో తన జోక్యంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఎప్పుడూ ఆడలేదు. ఆటగాళ్లకు నేను క్రికెట్‌ పాఠాలు నేర్పాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. టెక్నికల్‌ వాళ్లు ఆ పనిని చూసుకుంటారు. నా రోల్‌ జట్టుకు సపోర్ట్‌ చేయడం మాత్రమే. నేను ఆటలో జోక్యం​ చేసుకుంటానన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.  

    కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీతో మ్యాచ్‌ పూర్తైన తర్వాత గొయెంకా పంత్‌ను తిట్టాడని సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ మ్యాచ్‌లో లక్నో ఓటమి అనంతరం బౌండరీ లైన్‌ వద్ద పంత్‌ను తిడుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. దీనికిపై అప్పుడే లక్నో అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేసి వివరణ ఇచ్చారు. 

    అందులో గొయెంకా-పంత్‌ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోలను నెటిజన్లు నమ్మలేదు. ఫేక్‌ వీడియోలని కొట్టిపారేశారు. గొయెంకాకు కెప్టెన్లను తిట్టిన చరిత్ర ఉంది. గతంలో కేఎల్‌ రాహుల్‌ను కూడా దూషించాడు. ఇప్పుడు పంత్‌ను కూడా తిట్టాడని చర్చించుకున్నారు. తాజాగా గొయెంకా స్వయంగా వివరణ ఇచ్చినా నెటిజన్లు అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో లక్నో పరిస్థితి హాట్‌ అండ్‌ కోల్డ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ కూడా పెద్దగా ప్రభావం​ చూపలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌ మినహా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తున్నాడు. లక్నో రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. 
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య  భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇలా
    ఈ మెగా ఈవెంట్లో కెనడా.. న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో కలిసి గ్రూప్‌-డి నుంచి పోటీపడింది. ఒక్క విజయం కూడా నమోదు చేయలేక చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది. అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం కెనడా మెరుగ్గా ఆడింది.

    అనూహ్య నిర్ణయం
    చెన్నైలో కివీస్‌తో తలపడ్డ కెనడా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా అద్భుత సెంచరీ (65 బంతుల్లో 110) కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆదిలో తడబడగా.. కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

    రెగ్యులర్‌ బౌలర్‌ కానప్పటికీ తానే స్వయంగా పవర్‌ ప్లేలో బంతితో రంగంలోకి దిగాడు బజ్వా. మొత్తంగా రెండు ఓవర్లలో 26 రన్స్‌ ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు. 39 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులే చేశాడు.

    ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్‌ బజ్వా వ్యవహారశైలిని ఉటంకిస్తూ ‘ది ఫిఫ్త్‌ స్టేట్‌’ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్‌ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో అతడిపై ఆరోపణలు చేసింది. ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్‌ బోర్డు, కెప్టెన్‌ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.

    రంగంలోకి ఐసీసీ.. విచారణకు ఆదేశం
    ఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ డాక్యుమెంటరీ ద్వారా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబీ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ సభ్యులు కెనడా బోర్డును బెదిరించినట్లు తెలుస్తోంది.

    లారెన్స్‌ బిష్ణోయి గ్యాంగ్‌ బెదిరింపులు
    డాక్యుమెంటరీలో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘మా ఆదేశాలను పాటించకపోతే మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన ఆటగాళ్లను జట్టు నుంచి అస్సలు తప్పించకూడదు. ఒకవేళ అలా చేశారంటే మీకు చిక్కులు తప్పవు’’ అని లారెన్స్‌ బిష్ణోయి బెదిరింపులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

    ఈ విషయం గురించి క్రికెట్‌ కెనడా సన్నిహిత వర్గాలు CBCతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినపుడు క్రికెటర్లు కూడా భయపడతారు. వాళ్లేమీ ఇందుకు అతీతులు కాదు. వాళ్లు చాలా భయపడిపోయారు. అందుకే ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నాయి.

    సీనియర్లు ఉండగా అతడికే ఎందుకు కెప్టెన్సీ?
    కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్‌ బజ్వాపై అనుమానాలు బలపడుతున్నాయి. సీనియర్లు ఉండగా బోర్డు 23 ఏళ్ల ఈ ఆటగాడిని.. అది కూడా టోర్నీకి దాదాపు వారం రోజుల ముందు సారథిగా నియమించడం సందేహాలకు తావిచ్చింది.

    అయితే, బయటి వ్యక్తుల ఆదేశాలతోనే అతడు ఫిక్సింగ్‌కు పాల్పడి ఉంటాడని సదరు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

    చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్‌ అలీ

  • ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాల కారణంగా ముప్పేటదాడిని ఎదుర్కొంటున్న కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మరో ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త కెప్టెన్‌గా అపవాదును సొంతం చేసుకున్నాడు. కనీసం 25 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే, అత్యధిక పరాజయాల శాతం కలిగిన కెప్టెన్‌గా రహానే అందరికంటే ముందున్నాడు.

    రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో 44 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 14 మ్యాచ్‌ల్లోనే (28 పరాజయాలు, 2 ఫలితం రాలేదు) తన జట్టును గెలిపించాడు. ఈ లెక్కన అతని విజయాల శాతం కేవలం 31.83 మాత్రమే. ఐపీఎల్‌లో కనీసం 25 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లలో ఇంత తక్కువ విన్నింగ్‌ పర్సంటేజ్‌ ఎవరికీ లేదు. రహానే తర్వాతి స్థానాల్లో.. 

    మహేళ జయవర్దనే (30 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 33.33 విన్నింగ్‌ పర్సంటేజ్‌),
    కుమార సంగక్కర (47 మ్యాచ్‌ల్లో 17 విజయాలు, 36.2),
    శిఖర్‌ ధవన్‌ (27 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 37),
    సౌరవ్‌ గంగూలీ (42 మ్యాచ్‌ల్లో 17 విజయాలు, 40.5) ఉన్నారు.

    మొత్తం కెప్టెన్సీ కెరీర్‌లోనే ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన రహానే, కేకేఆర్‌ కెప్టెన్‌గా మరింత దారుణమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2025 ఎడిషన్‌లో కేకేఆర్‌ సారధిగా (14 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) బాధ్యతలు చేపట్టిన రహానే, ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ తరఫున 19 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించి ఏకంగా 12 మ్యాచ్‌ల్లో తన జట్టును పరాజయం బాట పట్టించాడు. 

    కేకేఆర్‌ తరఫున అతని విజయాల శాతం కేవలం 26.31 మాత్రమే. కేకేఆర్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే, ఆ ఫ్రాంచైజీ తరఫున కూడా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాయల్స్‌ కెప్టెన్‌గా 24 మ్యాచ్‌ల్లో కేవలం తొమ్మిదే విజయాలు సాధించాడు.

    కాగా, రహానే సారథ్యంలో కేకేఆర్‌ తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడింది. ఈ ఓటమి ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఐదవది (6 మ్యాచ్‌ల్లో). పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం​ కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్‌ ఉంది. ఏప్రిల్‌ 19న జరిగే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌ పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. 

  • ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. శ‌నివారం ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్‌ త‌ల‌ప‌డ‌నుంది. గ‌త మ్యాచ్‌లో రాజ‌స్తాన్‌పై ఘ‌న విజ‌యం సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఇప్పుడు అదే జోరును సీఎస్‌కేపై కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    అయితే ఫిట్‌నెస్ టెస్టు క్లియ‌ర్ చేసి ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టుతో క‌లిసిన కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్‌.. ఈ మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో లేడు. ఏప్రిల్ 25న రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగే మ్యాచ్‌లో క‌మ్మిన్స్ ఆడ‌నున్నాడు.  కాగా సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టులో ఓ కీల‌క మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

    భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్న పేస‌ర్ ఇషాన్ మలింగ‌ను ప‌క్క‌న పెట్టాల‌ని స‌న్‌రైజ‌ర్స్ మేనెజ్‌మెంట్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. గ‌త సీజ‌న్‌లో త‌న అద్భుత బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్న మ‌లింగ.. ప్ర‌స్తుత సీజ‌న్‌లో మాత్రం దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు.

    ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడిన మ‌లింగ.. 10.40 ఏకాన‌మీతో ఏకంగా 156 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అతడి స్ధానంలో మ‌రో శ్రీలంక స్పీడ్ స్టార్ దిల్షాన్ మ‌ధుశంక‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని ఎస్ఆర్‌హెచ్ భావిస్తుందంట‌. లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అయిన మ‌ధుశంక‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. 

    ప‌వ‌ర్‌ప్లేతో పాటు డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే స‌త్తా కూడా ఉంది. ముఖ్యంగా అత‌డు పిన్ పాయింట్ యార్క‌ర్లు బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. మ‌ధుశంక ఇటీవ‌లే బ్రైడ‌న్ కార్స్ స్ధానంలో జ‌ట్టులోకి చేరాడు. గ‌త మ్యాచ్‌లో స‌త్తాచాటిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌తో మ‌ధుశంక బంతిని పంచుకునే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ న‌లుగురు పేస‌ర్ల‌తో ఎస్ఆర్‌హెచ్ ఆడాల‌ని భావిస్తే మ‌లింగ‌కు బ‌దులుగా స్పిన్న‌ర్ హ‌ర్ష్ దూబేను ప‌క్క‌న పెట్టే ఛాన్స్ ఉంది.

    సీఎస్‌కేతో మ్యాచ్‌కు ఎస్ఆర్‌హెచ్ తుది జట్టు(అంచ‌నా)
    ట్రావిస్ హెడ్‌, ఇషాన్ కిష‌న్‌( కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్‌, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వ‌ర్మ‌, స‌లీల్ అరోరా, హ‌ర్ష్ దూబే, శివంగ్ కుమార్‌, దిల్షాన్ మ‌ధుశంక‌, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే(ఇంపాక్ట్ సబ్)
    చదవండి: BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!

Movies

  • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి కష్టాలు మామూలుగా లేవు. తొలుత మార్చిలో రిలీజ్ అన్నారు. పని ఇంకా పూర్తవ్వకపోయేసరికి ఏప్రిల్ చివరలో కచ్చితంగా విడుదల చేస్తాం అని మాటిచ్చారు. తీరా ఈసారి కూడా మాట తప్పి జూన్‌లో థియేటర్లలోకి వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఈసారి తేదీ వెల్లడించనప్పటికీ బయట రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

    ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం.. 'పెద్ది' మూవీని జూన్ 4న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ తేదీ దాదాపుగా ఖరారు అయినప్పటికీ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ డేట్‌కి వస్తామని ఇప్పటికే యష్ 'టాక్సిక్' సినిమా ఖర్చీఫ్ వేసుకుంది. మరి 'పెద్ది' కూడా అదే తేదీకి వస్తే రెండు పాన్ ఇండియా చిత్రాల మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు ఇద్దరిలో పైచేయి ఎవరిది అవుతుందో చూడాలి?

    స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న 'పెద్ది'లో చరణ్.. క్రికెట్, కుస్తీ క్రీడాకారుడిగా కనిపించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడేసరికి చాలామంది దీనిపై మెల్లగా ఆసక్తి తగ్గుతోంది. ఒకవేళ మూడోసారి కూడా వాయిదా పడితే గనుక మరింత డ్యామేజీ కావడం గ్యారంటీ. మరి టీమ్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'దేవర 2' కంటే ముందు కొరటాల నుంచి మరో హిట్ సినిమా సీక్వెల్?)

  • రచయితగా ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ దర్శకుడిగా మారిన తర్వాత వరస విజయాలు అందుకున్న కొరటాల శివకు 'ఆచార్య'తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ ‍అయ్యేసరికి కొన్నాళ్లు కనిపించలేదు. తర్వాత ఎన్టీఆర్‌తో 'దేవర' తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇదంతా జరిగి రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొరటాల ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.

    (ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)

    'దేవర 2' కూడా అదిగో ఉంటుంది ఇదిగో ఉంటుందని అంటున్నారు గానీ సరిగ్గా ఎప్పుడు మొదలవుతుందనేది అర్థం కావట్లేదు. దర్శకుడిగా తర్వాత ఏం సినిమా చేస్తారనే సంగతి పక్కనబెడితే మరో విషయంలో కొరటాల బిజీగా మారిపోతున్నారు. 'దేవర' తీసిన నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి పలు చిత్రాలని నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

    రీసెంట్‌గానే విశ్వక్ సేన్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని 'దేవర' నిర్మాత ప్రారంభించారు. ఇప్పుడు 'మంగళవారం' చిత్రానికి సంబంధించిన సీక్వెల్ కూడా ఈ నిర్మాణ సంస్థలోనే తీయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీని పనులు కొరటాలనే దగ్గరుండి చూసుకోబోతున్నారట. దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' చేస్తున్నాడు. ఇది పూర్తవగానే 'మంగళవారం' సీక్వెల్ పనులు షురూ కాబోతున్నాయట.

    పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన 'మంగళవారం' మూవీ హారర్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే ఈసారి కథతో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

  • నవ్వుతూ కేక పుట్టిస్తున్న రుక్మిణి వసంత్

    బాలి ట్రిప్ లో మాళవిక మోహనన్ ఎంజాయ్

    చీరలో పద్ధతిగా కనిపిస్తున్న నిధి అగర్వాల్

    రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న కల్యాణి

    బీచ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న జైన్ మేరీ ఖాన్

    జిమ్‌లో కష్టపడిపోతున్న బిగ్‌బాస్ దివి

  • ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ది బ్రేకింగ్‌ న్యూస్‌’. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

    ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ‘ఈ సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీ మోహన్‌ని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో నేను ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసించారు. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు.

    చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, ‘ది బ్రేకింగ్ న్యూస్’ ఒక మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

  • మలయాళ టీవీ నటుడు సిద్ధార్థ్ వేణుగోపాల్ 41 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనమరణవార్తతోపరిశ్రమలోని అభిమానులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో సహోద్యోగులు, అభిమానులు  తీవ్ర  సంతాపం తెలిపారు.

    నటి సీమా జి. నాయర్ ఫేస్‌బుక్‌లో సిద్ధార్థ్ మరణవార్తను ధృవీకరించారు. ‘‘నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. సిద్ధార్థ్ వేణుగోపాల్ బాధలు లేని లోకానికెళ్లిపోయారు. నీ జీవితాన్ని తిరిగి తీసుకురావడానికి  చాలా  ప్రయత్నించాను.  కానీ ఈ రోజు నువ్వు ఇక బాధ పడకూడదని దేవుడు నిర్ణయించాడు. ఈ బాధ భరించలేనుసిద్ధార్థ్, కుప్పకూలిపోయాను’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కిషోర్ సత్య కూడా  సిద్ధార్థ్‌కు  నివాళులర్పించారు.

    మలయాళ టీవీ నటుడు,త్రిస్సూర్‌లోని చాలకుడికి చెందిన సిద్ధార్థ్ వేణుగోపాల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో పడుతున్నారు.  కాలేజీ టైంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. అతను బ్రాడ్‌కాస్టర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అతను కస్తూరిమాన్ , భాగ్యజాతకం వంటి టీవీ సీరియల్స్‌లో నటించాడు.సిద్ధార్థ్ వేణుగోపాల్‌కు అతని తల్లి ,తమ్ముడు ఉన్నారు.

    ఇదీ చదవండి: నో షార్ట్‌కర్ట్స్‌ : 16 కిలోలు తగ్గిన బాడ్మింటన్ కోచ్‌

  • 'వరూధిని పరిణయం' సీరియల్ హీరోయిన్ చందన శెట్టి తల్లికాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు మరో సీరియల్ హీరోయిన్‌గా కూడా ఇలాంటి శుభవార్త చెప్పింది. కాకపోతే ఆ విషయాన్ని కూడా సినిమాటిక్ వీడియోగా తీసి వెల్లడించింది.

    (ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

    'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో రామరాజు చిన్నకోడలు ప్రేమ పాత్రని లావణ్య భరద్వాజ్ చేస్తోంది. తనదైన చలాకీ నటనతో ఆకట్టుకుంటోంది. స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమెనే ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. భర్త శశి హెగ్డేతో కలిసి ఓ వీడియోని పోస్ట్ చేసింది. 'చిన్నారితో మా ప్రేమకథ కొనసాగుతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చింది.

    లావణ్య ఈ విషయాన్ని బయటపెట్టగానే తోటి హీరోయిన్ అన్షు రెడ్డితో పాటు మిగతా వాళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ నేపథ్యంలో లావణ్య.. ఈ సీరియల్‌కి గుడ్ బై చెప్పనుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఈమె స్థానంలో 'నిన్ను కోరి' సీరియల్ ఫేమ్ అక్షిత దేశ్ పాండేని తీసుకుంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.

    (ఇదీ చదవండి: ట్రైలర్: ఈసారి రక్తపాతాన్ని నమ్ముకున్న రవిబాబు)

  • షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ‘అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను’ అని తెలిపారు.

    ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రంలో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, షెరాజ్ మెహదీ, నేహా దేశ్‌పాండే, అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం.

  • గతంలో నటుడిగా మాత్రమే చేస్తూ ఆకట్టుకున్న రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు తీస్తూ వస్తున్నాడు. కుదిరినప్పుడు వాటిలో తనే లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇకపోతే రవిబాబు తీసిన గత రెండు చిత్రాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ కాగా.. దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్‌లోకి వచ్చే మూవీని సిద్ధం చేశాడు. అదే 'రేజర్'. వచ్చే నెల 8న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

    (ఇదీ చదవండి: 'పెద్ది' నటుడి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్)

    ట్రైలర్ బట్టి చూస్తే ఓ పాపని రక్షించే బాధ్యత రవిబాబు పాత్రది. ఈ క్రమంలోనే పాపని చంపేందుకు వచ్చిన రౌడీలని చంపుకొంటూ వెళ్తుంటాడు. అయితే చంపే క్రమంలో ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు రక్తపాతాన్ని బాగానే చూపించాడు. ఇతడి గత చిత్రాల మాదిరిగానే కలర్ టోన్ మెంటైన్ చేశాడు. ట్రైలర్ అయితే రొటీన్‌గానే అనిపించింది.

    కొన్నాళ్ల ముందు వరకు అవును, అవును 2 పేరుతో హారర్ సినిమాలు తీసిన రవిబాబు.. తర్వాత క్రైమ్ థ్రిల్లర్స్ తీశాడు. ఇప్పుడు యాక్షన్, రక్తపాతాన్ని నమ్ముకున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి బాక్సాఫీస్ దగ్గర 'రేజర్' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

  • ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌ సుమన్‌ శెట్టి. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందులో ‘అధ్యక్షా..’ అంటూ సుమన్‌ చేసే కామెడీకి తెలుగు ఆడియన్స్‌ పలగబడి నవ్వారు. జయం తర్వాత సుమన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకనొక దశలో ఆయన డేట్స్‌ కూడా దొరకనంత బిజీ కమెడియన్‌ అయిపోయాడు. 

    దాదాపు 300పైగా సినిమాల్లో నటించిన సుమన్‌.. సడెన్‌గా వెండితెరకు దూరం అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఆయన పేరు ఇండస్ట్రీ మరిచిపోయింది. బిగ్‌బాస్‌ షోతో మళ్లీ సుమన్‌ శెట్టి ఫామ్‌లోకి వచ్చాడు. బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో పాల్గొన్న ఆయన..తనదైన ఆటతీరుతో దాదాపు 14 వారాల పాటు హౌస్‌లో ఆకట్టుకున్నాడు. ఫినాలేకు ఒక్కవారం ముందు ఎలిమేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తర్వాత ఆయన కెరీర్‌ పరంగా బిజీ అయిపోతారనుకుంటే.. అదీ జరగలేదు. పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. 

    300పైగా సినిమాలతో పాటు నంది అవార్డు కూడా దక్కించుకున్న తనకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అర్ధం కావట్లేదని సుమన్‌ శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ఆయన  ఓ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

    అంతా బోగస్.. సుమన్ శెట్టి షాకింగ్ నిజాలు

    ‘ఒకప్పుడు నేను 30 రోజులూ షూటింగ్‌లోనే ఉండేవాడిని.300పైగా సినిమాలు చేశా. నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసేవాడిని. అయినా కూడా ఇప్పుడు నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదో అర్థం కావడం లేదు. ప్రాణం పెట్టి పని చేస్తా. నాలో ఉన్న లోపం ఏంటి? నటన విషయంలో ఎక్కడైనా తాను తగ్గిపోయానా? అనే సందేహాలు కూడా తనను వెంటాడుతున్నాయి’అని సుమన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. 

  • 'మీర్జాపుర్' సిరీస్‌తో మున్నాభయ్యాగా ఫేమస్ అయిన దివ్యేందు.. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు ఇతడు లీడ్ రోల్ చేసిన స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉండేసరికి సిరీస్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: నటిపై చాహల్ పరువు నష్టం దావా.. వీళ్ల మధ్య అసలేమైంది?)

    దివ్యేందు, పులకిత్ సామ్రాట్ ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'గ్లోరీ'. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చే నెల 01వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. 'మీర్జాపుర్' సిరీస్ తీసిన కరణ్ అన్షుమన్ దీని సృష్టికర్త కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

    'గ్లోరీ' సిరీస్ విషయానికొస్తే.. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష‍్యంగా బతికే కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ). ఇతడి కూతురు గుడియా (జన్నత్ జుబైర్)పై ఓ రోజు దాడి జరుగుతుంది. మరోవైపు వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్, అనుమానాస్పద రీతిలో చనిపోతాడు. దీంతో తండ్రి రఘుబీర్‌కి చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కొడుకులు దేవ్(దివ్యేందు), రవి (పులకిత్ సామ్రాట్) తిరిగి సొంతూరు శక్తిఘడ్‌కి వస్తారు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

  • ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్ చాహల్, నటి తానియా ఛటర్జీ మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజులు పంపిస్తున్నాడని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది?

    (ఇదీ చదవండి: కాళ్లకు మెట్టెలతో రష్మిక కఠిన శిక్షణ.. రోజుకు 8 గంటలకు పైనే!)

    స్వతహాగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ అయిన తానియా ఛటర్జీ.. 'ఫ్లాట్ మేట్స్' అనే ఒక్క సినిమాలో నటించింది. తాజాగా ఈమె మాట్లాడుతూ.. చాహల్ తనకు వ్యక్తిగత మెసేజులు చేసినట్లు స్క్రీన్ షాట్స్ మీడియాకు చూపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు.. చాహల్‌పై విమర్శలు చేశారు. అతడి పీఆర్ టీమ్.. ఈ వీడియోని తీసేయమని కోరారని తానియా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చాహల్.. ఈమెపై పరువు నష్టం దావా వేశాడు.

    దీని గురించి స్పందించిన తానియా.. ఈ విషయంలో తనని మాత్రమే ట్రోల్ చేస్తున్నారని, చాహల్‌ని ఎవరూ ఏం అడగట్లేదని ఆవేదన ‍వ్యక్తం చేసింది. ఇది ఇంతలా వైరల్ అవుతుందనుకోలేదు. నన్నే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. పరువు పోయింది నాది. కానీ ఇప్పుడు నా మీదే పరువు నష్టం దావా వేశారు. అతడి వ్యక్తిత్వాన్ని నేను తప్పు పట్టాలని అనుకోలేదు. నాకు చాహల్‌పై గౌరవం ఉందని తానియా పేర్కొంది. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఈమె చేస్తోందా? అనే సందేహం కలుగుతోంది.

    చాహల్ విషయానికొస్తే గతంలో నటి, ఇన్ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది ఆర్జే మహ్‌వశ్‌తో చాహల్ జంటగా కనిపించాడు. ఇప్పుడు ఆమె కూడా ఇతడికి దూరమైందా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

  • దాదాపు పదేళ్ల క్రితం 'ప్రేమమ్' సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో నివిన్ పౌలీ.. తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత గతేడాది చివరలో 'సర్వం మాయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండు మూవీస్ చేశాడు. అందులో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

    నివిన్ పౌలీ చేసిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతిఛాయ'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రొటీన్ స్టోరీ ఉండేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెలలోపే అంటే వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా రావొచ్చనే తెలుస్తోంది.

    'ప్రతిఛాయ' విషయానికొస్తే.. కేరళ ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పెద్ద కొడుకు జాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణలు వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అతడికి తెలిసిన నిజాలేంటి? రాజకీయాల్లో అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)

  • మొన్నటిదాకా పెళ్లి, బడ్డీమూన్‌ అంటూ పర్సనల్‌ లైఫ్‌ని ఆనందంగా గడిపినన రష్మిక, విజయ్‌ దేవరకొండ..ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇద్దరూ తమ కొత్త సినిమాలకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. రష్మిక అయితే తన ఫోకస్‌ అంతా ‘మైసా’పైనే పెట్టింది. ఈ చిత్రం కోసం ఆమె మానసికంగానే కాకుండా శారీరకంగానూ కష్టపడుతుంది.

    ఇన్నాళ్లు రొమాంటిక్‌, కమర్షియల్‌ పాత్రలకే పరిమితం అయిన రష్మిక..ఇప్పుడు యాక్షన్‌ అవతారం ఎత్తింది. మైసాలో ఆమెకు భారీ యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అందుకే సవాళ్లతో కూడా శిక్షణను తీసుకుంటుంది. దాని కోసమే తాజాగా రష్మిక బ్యాంకాక్‌ వెళ్లింది. అక్కడ అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ నేతృత్వంలో, అలాగే ప్రఖ్యాత జైకా స్టంట్ టీమ్‌తో కలిసి మార్షల్ ఆర్ట్స్, స్టంట్ టెక్నిక్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్‌లో శిక్షణ పొందుతోందట. దీని కోసం రష్మిక రోజుకు దాదాపు 8 గంటల పాటు ప్రాక్టీస్‌ చేస్తుందట. కాళ్లకు మట్టెలు ధరించి.. ప్రాక్టీస్‌ చేస్తున్న రష్మిక ఫోటోలు ఇప్పుడు నెటి​ంట వైరల్‌గా మారాయి.  

    మైసా విషయానికొస్తే.. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్‌ఫార్ములా ఫిలింస్‌ పతాకంపై అజయ్, అనిల్‌ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం.

  • లోక్‌సభలో  రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిపోయింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు ఫుల్‌స్టాప్‌ పడింది. బీజేపీ డీలిమిటేషన్‌ కుట్రలను ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. దీంతో  లోక్‌సభ స్థానాల సంఖ్యను 816 పెంచేందుకు మోదీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లుకు బ్రేక్‌ పడటంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ పేజీలో విపక్షాలపై మండిపడ్డారు. దీంతో ఆయనకు కౌంటర్‌గా సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

    మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంలో విపక్షాలు వ్యతిరేఖంగా నిలబడ్డాయని పవన్‌ కల్యాణ్‌ ఇలా అన్నారు. భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని పవన్‌ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంతో  విపక్షాలు జాతీయ ప్రగతిని అడ్డుకోవడంతో పాటు తమ రాజకీయ సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ తెలిపారు. అయితే. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్‌ చేశారు.

    పవన్‌ మీరు సిద్ధమేనా..?: ప్రకాష్‌ రాజ్‌
    దయచేసి ప్రధాని మోదీని మెప్పించడం కోసం పౌరులకు అబద్ధాలు చెప్పడం ఆపాలని పవన్‌ కల్యాణ్‌కు ప్రకాష్‌ రాజ్‌ సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదించబడిందని గుర్తు చేశారు. దాన్ని ఇప్పుడైనా ఆమోదించవచ్చని చెప్పుకొచ్చారు. 'కానీ, మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది, ఇది ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని ప్రకాష్‌ రాజ్‌ అన్నారు. మిమ్మల్ని డీసీఎం చేసిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను అమ్ముకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ అంశం గురించి వివరించడానికి మీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేనా..? ' అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రకాష్‌ రాజ్‌ కోరారు.
     

Business

  • భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్‌పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?

    ఏమిటీ పీఎన్ఆర్?
    పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్‌లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్‌లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.

    పది అంకెలే ఎందుకంటే..
    లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్‌ను రైల్వే ఎంచుకుంది.

    ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.
    మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.
    మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్‌ను తెలియజేస్తాయి.
    చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.

    పీఎస్‌ఆర్‌ వ్యవస్థ ఎందుకు కీలకం?
    కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.

    మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్‌ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్‌ఆర్‌లో గమనించండి.

  • న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.

    గత అక్టోబర్‌లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

    జీతం ఎంత పెరుగుతుందంటే?
    ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.

    8వ వేతన సంఘానికి డిమాండ్లు
    ఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

  • సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.

    మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్‌ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్‌ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్‌లు సిద్ధం చేస్తున్నారు.

    నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్‌లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్‌లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.

    ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్‌

  • ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్‌ఫాం ‘చెక్‌’, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్‌ ఎల్‌ఈడీ క్రెడిట్‌ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్‌ ఏయూ క్రెడిట్‌ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.

    ఎల్‌ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్‌ విధానం ఈ క్రెడిట్‌ కార్డు ప్రత్యేకత అని చెక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్‌ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్‌ కార్డులోని ఎల్‌ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.

    ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్‌ఎఫ్‌సీ ఫీల్డ్‌ సాయంతో ఎల్‌ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్‌ కార్డు కావాలనుకొనే వారు చెక్‌ యాప్‌ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

  • కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ 2025 సంవత్సరానికి గాను మొత్తం 10.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు 29 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ వేతనంలో 1.3 మిలియన్‌ డాలర్లు బేసిక్‌ పే, 4.3 మిలియన్‌ డాలర్లు నగదు ప్రోత్సాహకం, 4.9 మిలియన్‌ డాలర్ల ఆర్‌ఎస్‌యూ (ఈక్విటీ పరిహారం) చెల్లింపులు ఉన్నాయి.

    అయితే, ఆయన టార్గెట్ టోటల్ డైరెక్ట్ కాంపెన్సేషన్ 19 మిలియన్‌ డాలర్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఎందుకంటే పనితీరు ఆధారిత పీఎస్‌యూ (PSU) గ్రాంట్లు భవిష్యత్తులో లభించనున్నాయి. కాగా, ఇదే ఏడాది భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ
    సి.విజయకుమార్ (10.8 మిలియన్‌ డాలర్లు) నిలవగా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 80.6 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా రూ. 53.6 కోట్లు ఆర్జించారు.

    కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, కాగ్నిజెంట్ 2025లో అంచనాలను మించి రాణించింది. కృత్రిమ మేధ (AI), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భారీ ఒప్పందాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 21.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా కంపెనీ అంచనా వేసిన 15.3-15.7 శాతం కంటే మెరుగ్గా 15.8 శాతంగా నమోదైంది. గతంలో ఎదుగుదల విషయంలో వెనుకబడిన తమ సంస్థ, ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీల మధ్య అగ్రస్థానానికి చేరుకుందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కంపెనీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ కూడా తన లక్ష్యం కంటే అధికంగా 6.6 మిలియన్‌ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు.

    ఇక కంపెనీలోని వేతన వ్యత్యాసాల విషయానికి వస్తే, సీఈఓ వేతనానికి, సాధారణ ఉద్యోగి వేతనానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగి సగటు వేతనం 45,138 డాలర్లుగా ఉండగా, సీఈఓ వేతన నిష్పత్తి 477:1గా నమోదైంది. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 1,40,739 డాలర్లుగా ఉండటంతో అక్కడ నిష్పత్తి 153:1గా ఉంది. అయితే, జీవన వ్యయ సర్దుబాటు చేయకుండా లెక్కిస్తే, భారతీయ ఉద్యోగి సగటు వేతనం కేవలం 14,136 డాలర్లు (సుమారు రూ. 11.8 లక్షలు) మాత్రమే. ఈ క్రమంలో సీఈఓ, భారతీయ ఉద్యోగి వేతన నిష్పత్తి అత్యధికంగా 1,523:1గా ఉండటం గమనార్హం.

    ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,51,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో మెజారిటీ వాటా భారత్‌దే కావడం విశేషం. మన దేశంలో 2,56,900 మంది ఉద్యోగులు ఉండగా, ఉత్తర అమెరికాలో 41,600 మంది, యూరప్‌లో 14,600 మంది, బ్రిటన్‌లో 7,800 మంది పనిచేస్తున్నారు. కంపెనీ తన మార్జిన్లను మెరుగుపరుచుకుంటూ ఆదాయ వృద్ధి అంచనాలను 4 శాతం నుండి 6.5 శాతానికి పెంచడం, భవిష్యత్తులో ఐటీ మార్కెట్లో సంస్థ మరింత పట్టు సాధిస్తుందనే సంకేతాలను ఇస్తోంది.

    ఇదీ చదవండి: డ్యాన్స్‌ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!

    • 15 కి.మీ. దూరంలో సెక్రటేరియట్, లక్డీకాపూల్‌ వంటి హాట్‌ స్పాట్స్‌..

    • 20 కి.మీ. దూరంలో ఐటీ హబ్, శంషాబాద్‌ విమానాశ్రయం..

    • చుట్టూ ఆర్మీ కాపలా.. హిమాయత్‌నగర్, గండిపేట జలాశయాలతో కళకళ..

    • కూతవేటు దూరంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, వైద్య, వినోద కేంద్రాలు.. 
      ..ఇలాంటి వసతులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా స్థిరాస్తి ధరలు ఆకాశంలో ఉంటాయి. కానీ, అందుబాటు ధరల్లోనే సామాన్యుల సొంతింటి కలను నెరవేరుస్తోంది బుద్వేల్‌. రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ పరిధిలో అప్పా జంక్షన్, బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్‌పూర్, బుద్వేల్, అత్తాపూర్, పీరంచెరువు, మంచిరేవుల ప్రాంతాలు ప్రధానమైనవి. -సాక్షి, సిటీబ్యూరో

    హైదరాబాద్‌లో రియల్‌ బూమ్‌ బంజారాహిల్స్‌తో మొదలై.. జూబ్లీహిల్స్‌ నుంచి మాదాపూర్‌కు, అక్కడి నుంచి గచ్చిబౌలి, కొండాపూర్‌కు విస్తరించింది. ప్రస్తుతం ఈ బూమ్‌ బుద్వేల్‌కు విస్తరించిందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెట్రో రైలుతో సిటీలో ప్రయాణం సులువైంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ఆదిభట్ల, మహేశ్వరంలోని ఐటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లతో పాటు ఏరో స్పేస్‌ కంపెనీలకు సులువుగా చేరుకునే అవకాశం కలిగింది. అలాగే ఓఆర్‌ఆర్‌ మీదుగా 40 కి.మీ. దూరంలో షాద్‌నగర్, కొత్తూరులోని లాజిస్టిక్‌ పార్కులకూ చేరుకోవచ్చు. అందుకే ఇప్పటి వరకు ధనవంతులు తమ మొదటి ఆస్తిని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎంచుకుంటే.. రెండో ఆస్తిని రాజేంద్రనగర్‌లో ఎంచుకుంటున్నారు. ఇది చాలు రాజేంద్రనగర్‌ ఉన్నత శ్రేణి వర్గాలు ఉండే ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని చెప్పడానికి..  

    ఐటీ, ఎన్నారైల దృష్టి ఇక్కడే.. 
    రూ.35వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు ఉండే ప్రతి ఉద్యోకి ఇది అనుకూలమైన ప్రాంతం. ఐటీ ఉద్యోగులందరికీ భారీ వేతనాలు ఉండవు. దీంతో గచి్చబౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఉండలేకపోతున్నారు. అందుబాటు ధరల్లో.. తక్కువ దూరంలో ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. రేతిబౌలి ఫ్లైఓవర్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌ నుంచి ఐటీ హబ్‌కు త్వరగా చేరుకోవచ్చు.

    అందుకే గతంలో మాదిరిగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ జూబ్లీహిల్స్‌ మీదుగా సైబర్‌ టవర్స్‌కు వెళ్లే బదులు లంగర్‌హౌజ్‌ మీదుగా రాయదుర్గం జంక్షన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఐటీ హబ్‌కు కూతవేటు దూరమే. 20 నిమిషాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వీలుండటంతో ఎన్నారైలు, విదేశీయులు ఈ ప్రాంతంపై మక్కువ చూపుతున్నారు.

    వంద ఫీట్ల రోడ్డు.. 
    బుద్వేల్‌ నుంచి సన్‌సిటీ మీదుగా బండ్లగూడ జాగీర్‌ వరకూ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతం ఒక ప్రధాన వృద్ధి కారిడార్‌గా ఉండటంతో 3–4 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని అంచనా. ఈ ప్రాంతం మధ్యస్థాయి, ఉన్నత స్థాయి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎన్‌ఐఆర్‌డీ, ఎన్‌జీరంగా వర్సిటీలతో పాటు అప్పా జంక్షన్‌లో సుమారు 70కి పైగా విద్యా సంస్థలు, ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. అప్పా జంక్షన్‌ చుట్టూ మిలటరీ ఏరియా ఉండటంతో శాంతి భద్రతల సమస్య లేదు. ఈ ప్రాంతం హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకూ కొదవేలేదు.

    రిజిస్ట్రేషన్లు రయ్‌.. రయ్‌.. 
    గతేడాది రాజేంద్రనగర్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 13,423 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4,140 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయి. రూ.కోట్లలో ఆదాయం సమకూరింది. ప్రతి సంవత్సరం రిజి్రస్టేషన్లు 10–15 శాతం వృద్ధి చెందుతున్నాయి. ప్రధానంగా బుద్వేల్, కిస్మత్‌పూర్, మంచిరేవుల, హైదర్షాకోట్‌ ప్రాంతాల్లో రిజి్రస్టేషన్లు జోరుగా సాగుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు విదేశీ సంస్థల ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాపర్టీల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్‌ మెంట్లలో ధర చ.అ.కు రూ.10 వేల వరకు, విల్లాలు అయితే రూ.12 వేల వరకు చెబుతున్నారు.

    బుద్వేల్‌ ఎకో ఫ్రెండ్లీ జోన్‌
    బుద్వేల్‌ పర్యావరణ అనుకూల ప్రాంతం. జంట జలాశయాలు, గ్రీనరీ, ప్రతిపాదిత కొత్వాల్‌ ఎకో పార్క్‌లకు సమీపంలో ఉండటంతో ఎకో ఫ్రెండ్లీ జోన్‌ అయిన ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, వైద్యులు ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.
    – బూరుగు రాంబాబు, డైరెక్టర్, ప్రణవ గ్రూప్‌

    ఇది  చదివారా? రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్‌!  

International

  • హర్ముజ్‌ జలసంధి విషయంలో అమెరికా- ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్‌ మోజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. శత్రువులను ఓడించడానికి తమ దేశ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు.

    ప్రస్తుతం ఇరాన్‌ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ హర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.  సుప్రీం లీడర్ మెజ్తాబా  ఖమేనీ పేరిట  ఈ రోజు (శనివారం) ఒక ప్రకటన విడుదలైంది.

    మోజ్తాబా ఖమేనీ ‍ప్రకటనలో " అమెరికా దళాలను ఓడించేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉంది. శత్రువులకు కొత్త రకమైన ఓటమిని రుచి చూపిస్తాం". అని హెచ్చరించారు. కాగా యుద్దం ప్రారంభమైన నాటి నుంచి మోజ్తాబా బహిరంగంగా కనిపించలేదు. కేవలం ఆయన పేరు మీద ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో గాయపడ్డారని, ఆయన ముఖం వికారంగా మారిందని ప్రచారం జరిగింది.

    ఇరాన్‌- అమెరికా మధ్య సయోధ్య కుదురుతుందనే నేపథ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్‌.. ఒక రోజు గడవకముందే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో సోమవారం జరగనున్న చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్‌ నెలకొంది.

  • టెహ్రాన్‌: భారత వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో వాటిపై కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. 

    ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన రెండు గన్‌బోట్లు జలసంధి దాటుతున్న ఒక ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయని బ్రిటిష్ సైన్యం కూడా తెలిపింది. హార్మూజ్‌ను తెరుస్తున్నట్లు ప్రకటన చేసిన ఇరాన్.. ఆ తర్వాత అమెరికా తీరు వల్ల మళ్లీ మూసివేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆ కాసేపటికే కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

    ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.

    షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హార్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్‌ నుంచి స్పష్టత కోరుతున్నాయి.

    కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హార్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్‌ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.

    రెండో దశ చర్చలకు ఏర్పాట్లు?
    ఇరాన్ అధికారులు తెలిపిన ప్రకారం.. సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలు ఆదివారం ఇస్లామాబాద్‌ చేరుకునే అవకాశముంది.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడంలో ఆయన పర్యటన సాయపడుతుందని భావిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై 20 సంవత్సరాల విరామాన్ని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం 5 సంవత్సరాల విరామాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం.

    ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం వచ్చే వారం ముగియనుంది. ఇస్లామాబాద్‌లో ఇటీవల 21 గంటలు చర్చలు కొనసాగాయి. ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి.  

  • ఇటీవల అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీలు చైనాపై సంచలన ఆరోపణలు చేశాయి. ఇరాన్‌కు యుద్ధంలో చైనా సహకరిస్తోందని ఆ దేశానికి పరోక్షంగా ఆయుధాలు అందజేస్తుందన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని చైనా ఖండించింది. తాజాగా మధ్యప్రాచ్యంలో నాలుగు చైనా కార్గో విమానాలు రాడార్లకు చిక్కకుండా అదృశ్యమయ్యాయని నివేదికలు తెలిపాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు ఆందోళనకరంగా మారాయి. 

    కొద్దిరోజుల క్రితం అమెరికా నిఘా వర్గాలు ఇరాన్‌కు చైనా భారీగా మ్యాన్‌పాడ్‌ ఆయుధాలను తరలిస్తోందని ఆరోపించాయి. మ్యాన్‌పాడ్‌ అంటే భుజంపై ఎక్కడికైనా మోసుకెళ్లగల ఆయుధాలు. వీటిసాయంతో శత్రువుల హెలికాప్టర్లు, డ్రోన్లను సులభంగా కూల్చివేయవచ్చు. ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇవి ఎంతో కీలకంగా పనిచేశాయి. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని నివేదికలు అమెరికా సీక్రెట్‌ ఏజెన్సీల సర్వేలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయి.


    చైనా కార్గో విమానాలు

    కొన్నిరోజుల క్రితం.. కేవలం 48 గంటల వ్యవధిలో నాలుగు చైనా కార్గో విమానాలు తమ ట్రాన్స్‌పాండర్లను ఆపివేసి చైనా భూభాగంలో దిగాయని పలు నివేదికలు కథనాలు ప్రచురించాయి. ట్రాన్స్‌పాండర్‌ అనేది సాధారణంగా విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది. ఎంత వేగంతో వెళుతుంది అనే వివరాలని ప్రసారం చేసే ఒక పరికరం. దీనిని ఉద్దేశపూర్వకంగా ఆపివేయడాన్ని డార్క్‌ ఫ్లైట్‌ అంటారు. సాధారణంగా వెళ్లే గమ్యం వెల్లడించకుండా ఉండడానికి సైనిక కార్యకలాపాలు, రహస్య లావాదేవీల సమయంలో ఇటువంటి పద్దతులను ఉపయోగిస్తారు.


    ఆయుధాల తరలింపు?

    అయితే కొన్ని సామాజిక మాధ్యమాల కథనాల ప్రకారం.. ఆ విమానాలు ఇరాన్‌కు ఆయుధాలు తరలించడానికి ఉద్దేశించినవని  అందులో మందుగుండు సామాగ్రితో పాటు ఇతర ఆయుధాలు తరలిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను చైనా ఖండించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే చైనా, అమెరికా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ దేశం బాధ్యతాయుతమైన దేశమని యుద్ధాన్ని ప్రోత్సహించే ఏ పనులు తాము చేయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ నివేదికలు రావడం ఆందోళన కలిగించే అంశం.

    అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా  ఈ రకమైన నివేదికలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.

  • చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం, శాంతౌ (Shantou) నగరంలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఒక చిన్న గొడవ రోడ్డు మీద ఉన్న సామాన్యులకు కాసుల వర్షం కురిపించి నంత పని చేసింది.  అతి పెద్ద విలాసవంతమైన భవనం ఫ్లాట్‌నుంచి ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది. శాంతౌలోని లాంగ్‌హు జిల్లాలో ఉన్న 'స్టార్ లేక్ సిటీ' అనే నివాస సముదాయంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.  అయితే  ఎక్కడిదీ నగదు? వీటిని ఎవరు విసిరేశారు? 

    హై రేంజ్‌ భవనం బాల్కనీ నుంచి అనూహ్యంగా  రూ. 1.5 కోట్లను విసిరి పారేసిందో మహిళ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవే దీనికి కారణమని సమాచారం. అంతే ఆ కోపంతో ఆమె ఇంట్లోని డబ్బును బయటకు విసిరేసింది. సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన (సుమారు 162,000డాలర్లు) హాంకాంగ్ డాలర్ నోట్లను కిందకు విసిరేసింది.గాల్లోంచి నోట్లు ఎగిరి పడటంతో  ఒక్కసారి జనం పోగయ్యారు. ఆ నగదును దక్కించుకునేందుకు   ఎగబడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

    సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నగదును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ కార్యాలయం ఆ నోట్లు అసలైనవేనని ధృవీకరించింది. డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కొందరు నివాసితులు ఇప్పటికే ఆ నగదును తిరిగి అప్పగించారు.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    నెటిజన్ల  స్పందన 
    ఈవీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు "మనం కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి కాపాడు కోవడానికి పోరాడుతుంటే, ఈమె ఇలా గాలిలో కలిపేస్తోంది"అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా మనేది చూసుకోవడం అవసరం. ఇదే అతిపెద్ద ఆర్థిక సలహా" అంటూ మరొకరు చురకలు వేశారు. "గాలిలో ఆనందాన్ని (డబ్బు) విసరడం గురించి ఊహించలేక పోతున్నాను" అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.
     

    ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

  • ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్‌ జలసంధి వైపే. హర్మూజ్‌ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్‌ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్‌ 17వ తేదీ) హర్మూజ్‌ జలసంధిని తిరిగి ఓపెన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్‌.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది. 

    అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్‌కు అంతు చిక్కడం లేదు. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని ఓపెన్‌ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్‌ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్‌.  దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్‌ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్‌. అంతే హర్మూజ్‌ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. 

    నిన్న ఏం జరిగిందంటే..
    నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్‌  శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్‌ గల్ఫ్‌ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్‌ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. 

    హర్మూజ్‌పై ఇరాన్‌ ప్రకటనతో నిన్న స్టాక్‌మార్కెట్లకు  ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా  ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్‌కు ఇరాన్‌ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్‌కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.

    ట్రంప్ కామెంట్స్ 
    ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్‌ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్‌ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్‌ డస్ట్‌” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్‌ ద్వారా స్వేచ్ఛా రవాణా..  అన్నీ బాగుంటాయి"  అని వ్యాఖ్యానించారు. 

    ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ సీరియస్‌
    దీనిపై ఇరాన్‌ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్‌ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్‌ బకాయీ స్టేట్‌ మీడియా టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. 

    ట్రంప్‌ ద్వంద్వ వైఖరి
    ఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్‌ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్‌ను ఇరాన్‌ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్‌.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు.  హర్మూజ్‌ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్‌.. ఇరాన్‌ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. 

    కథ మళ్లీ మొదటికి
    ఈ పరిస్థితుల నడుమ హర్మూజ్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది.   ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్‌ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్‌. హర్మూజ్‌ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్‌ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్‌,.. హర్మూజ్‌ జలసంధిని మళ్లీ మూసేసింది.  దాంతో హర్మూజ్‌ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్‌ను  ఇరాన్‌ మూసేయడంతో  ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది. 

  • అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్‌ఫైర్‌ దాకా పలు సందర్భాల్లో ట్రంప్‌ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్‌ సోషల్‌ మీడియా ఘోరంగా ట్రోల్‌ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies')  అంటూ విరుచుకు పడ్డారు.  

    ట్రంప్‌ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందన
    ఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.

    ప్రపంచానికి ఇది ఒక గొప్ప  అద్భుతమైన రోజు అంటూ ట్రంప్‌  తన  ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్‌లో  ట్రంప్‌ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది.  "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్‌పై సెటైర్లు వేశాయి.  దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ  తినలేదు. ట్రంప్‌కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.

     ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్‌లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" 

    ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్‌లైన్ల ప్లాన్‌

    కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన  ‍ కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

Telangana

  • హైదరాబాద్‌: మహిళలు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పురుషుల తాట తీస్తున్నాయి షీటీమ్స్. సైబరాబాద్ షీ టీమ్స్ 116 డికాయ్ ఆపరేషన్స్ నిర్వహించి పోకిరీల ఆటలు కట్టించాయి. ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఆపరేషన్‌ వివరాలను డీసీపీ కె.సృజన తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 36 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు చిన్న కేసులు కూడా నమోదయ్యాయి. కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్‌కు మహిళా బాధితుల నుంచి 18 ఫిర్యాదులు అందాయి.

    సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఒక పీటా కేసులో ఒక బాధితురాలిని రక్షించింది. కో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లు / సీడీఈడబ్ల్యూ సెంటర్లలో భార్యాభర్తల వివాదాల్లో 41 కుటుంబాలను మళ్లీ కలిపే ప్రయత్నాలు చేశారు.

    అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ సైబరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. సుమారు 1,846 మంది ఇందులో పాల్గొన్నారు. వారికి మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాల హక్కులు, బాల కార్మికులు, భిక్షాటనం, సైబర్ బుల్లీయింగ్, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల హెల్ప్ లైన్ 181, బాలల హెల్ప్ లైన్ 1098, డయల్ 100 ప్రాధాన్యం, క్రైమ్స్ 1930 వంటి అంశాలపై కూడా వివరించారు.

    మహిళల భద్రత చర్యలు
    అంతర్జాతీయ మహిళా దినోత్సవం “గివ్ టు గెయిన్” కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ షీ టీమ్స్, ఎస్‌సీఎస్‌సీ మహిళల భద్రత ఫోరం సహకారంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని సేల్స్‌ఫోర్స్, జేఎల్‌ఎల్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కార్యాలయాల్లో మహిళల భద్రత అవగాహన సెషన్స్ నిర్వహించారు. ప్రతి సెషన్‌లో సుమారు 70-80 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమాలను పోలీస్ ఇన్‌స్పెక్టర్ హనుమాన్, సబ్ ఇన్స్పెక్టర్ అంబికా, షీ టీమ్స్ సిబ్బంది, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు నిర్వహించారు. వాస్తవ ఘటనల ఆధారంగా భద్రతపై సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పించారు.

     

  • హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిభ పురస్కారాన్ని వ్యవసాయ రంగంలో విశేష సేవలందించిన ‘ఐసీఏఆర్–ఐఏఆర్‌ఐ ’ డైరెక్టర్, వైస్‌ ఛాన్స్​లర్​ డాక్టర్​ సీహెచ్​ శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా 2024–25 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 9వ ‘ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డు’ పంపిణీ కార్యక్రమం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) ఇనిస్టిట్యూట్​లో ఏర్పాటు చేశారు. 

    ఈ కార్యక్రమానికి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, రిటైర్డ్ ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా ఎంఎస్​ స్వామినాథన్​ ప్రతిభా పురస్కారాన్ని వెంకయ్యనాయుడు.. డాక్టర్ శ్రీనివాసరావుకి ప్రదానం చేసి సత్కరించారు.

    ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వ్యవసాయం, పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దేశానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో శ్రీనివాస్‌రావు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. ప్రతిభకు గౌరవం ఇవ్వడం ద్వారా సమాజానికి ప్రేరణ కలుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మండవ వెంకటరామయ్య చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన విత్తన సంస్థను ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

    వ్యవసాయం దేశ భవిష్యత్తుకు కీలకమని, యువత ఈ రంగంపై దృష్టి సారించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం, పశుసంపదను కాపాడుకోవడం అవసరమని సూచించారు. వ్యవసాయం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి చేరాలని, శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు అందాల్సిన అవసరం ఉందన్నారు. భూసార పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, రసాయన ఎరువుల అధిక వినియోగం భూమి నాణ్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

    అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..  భారత గ్రీన్ రివల్యూషన్ శిల్పి ప్రొఫెసర్ స్వామినాథన్ జన్మ శతాబ్ది సందర్భంగా శ్రీనివాసరావుకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. భారత వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడంలో ఎంఎస్​ స్వామినాథన్​ గారి పాత్ర గొప్పదని  ఈ సందర్భంగా చెప్పారు.  వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి సాధారణ రైతులకు పూర్తిగా చేరడం లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో భూమిని పరిరక్షించకపోతే గ్రీన్ రివల్యూషన్ ఫలితాలు ప్రతికూలమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని ప్రోత్సహించాలని, మంచి కార్యక్రమాలను కొనసాగించాలని మండవ ప్రభాకర్​ రావును  కోరారు.

    వ్యవసాయానికి సేవ చేసిన వారికి గౌరవం దక్కుతుందని, క్లైమేట్ మార్పులకు తట్టుకునే వ్యవసాయం, సహజ వనరుల నిర్వహణలో డాక్టర్​ శ్రీనివాసరావు చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించిందని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకరరావు అన్నారు.  ఆయన దేశ వ్యాప్తంగా లక్షల హెక్టార్లలో వనరుల సంరక్షణ సాంకేతికతలను విస్తరించడం, జిల్లా స్థాయి కంటింజెన్సీ ప్రణాళికలను రూపొందించడం ద్వారా వ్యవసాయ స్థిరత్వం, ప్రతిఘటన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచినట్లు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్ : బాండెడ్ లేబర్ లాంటి దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని  రాష్ట్ర కార్మికశాఖ మంత్రి డా.వివేక్ అన్నారు. ఈ మేరకు అధికారులు ఈ విషయం పై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచాలన్నారు. ఈ రోజు (శనివారం) మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన “తెలంగాణలో మానవ అక్రమ రవాణా మరియు బాండెడ్ లేబర్ నిరోధం”పై స్టేట్ కన్వర్జెన్స్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంత్రి  హాజరయ్యారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోనే అనేక బాండెడ్ లేబర్ కేసులు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెరగడం అత్యవసరం అని తెలిపారు. ఏ వ్యక్తి కూడా వెట్టి చాకిరికి గురి కాకూడదన్నారు. ఇటీవల వచ్చిన చట్టంలో అదనపు పని చేస్తే అదనపు వేతనం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వెట్టి చాకిరి దురాచారాన్ని అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2021 నుంచి 2025 మధ్య రాష్ట్రవ్యాప్తంగా కనీసం 673 మంది బాండెడ్ కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు. 

    వీరిలో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉండగా, వ్యవసాయం, ఇటుక భట్టీలు, సాగునీటి పనులు, మత్స్యకార రంగం, గృహ సేవలు, సిమెంట్ పనులు, గొర్రెల కాపరి వంటి రంగాల్లో వీరు చిక్కుకున్నట్లు తెలిపారు. తాను లేబర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. దీంతో వారికి భద్రత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ లేబర్ సమస్యపై మంత్రి స్పందించారు. చిన్నారులు మానసిక వేదనకు గురవుతున్నారని పోలీసులు ఈ అంశాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా  మానవత్వంతో సానుభూతితో చూడాలన్నారు. మన ఇంటి పిల్లల్ని ఏవిధంగా చూస్తామో వారిని కూడా  అదే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

    ఈ నేపథ్యంలో 2025 జూలైలో నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. కృష్ణా నది బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని మత్స్యకార శిబిరంలో 29 మంది బాండెడ్ కార్మికులు చిక్కుకున్నారని అందులో నలుగురు చిన్నారులను పోలీసులు రక్షించినట్లు తెలిపారు.ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి పలుపురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

    2025 జూలై 30న నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ (8069434343) ప్రారంభించడం కీలక ముందడుగని తెలిపారు.బాండెడ్ లేబర్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 

  • పోచారం: ప్రపంచంలోనే అత్యున్నత విద్యావిధానం గల ఫిన్లాండ్‌ దేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ఈనెల 18 నుంచి పర్యటించనున్నది. ఈ బృందంలో మేడ్చ‌ల్ జిల్లా ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం చౌదరిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన సెకండ్‌ గ్రేడ్‌ టీచర్‌ విశ్వశాంతికి స్థానం లభించింది. 18 ఏళ్ల బోధనానుభవం గల విశ్వశాంతి (vishwashanti) జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ రీసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు మాడ్యూళ్ల రూపకల్పన, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక విద్యకు చెందిన వర్క్‌ బుక్స్, హ్యాండ్‌ బుక్స్‌ రచనల్లోనూ ఆమె సేవలు అందించారు.

    సీఎం రేవంత్‌రెడ్డి 4 బృందాలను ఏర్పాటు చేసి ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు ఒక్కో బృందాన్ని పంపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి 40 మంది నిపుణుల బృందం ఈనెల 18న ఫిన్లాండ్‌ దేశ పర్యటనకు వెళ్లనున్నది. 

    20 నుంచి 24 వరకు అక్కడి పాఠశాలలు, టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్లను సందర్శించి, పాఠ్యాంశాలు, వారు అవలంభించే బోధనా పద్ధతులు, విద్యార్థుల స్థాయిలను పరిశీలిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తుంది. విశ్వశాంతి ఎంపికవ్వడంపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, స్కూల్‌ హెచ్‌ఎం సాంబమూర్తి, టీచర్లు ప్రశంసించారు.

    చ‌ద‌వండి: మే 6 నుంచి వేసవి సంధ్యావందన శిక్షణ శిబిరం 

  • హైదరాబాద్‌:  నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం(ఏప్రిల్‌ 18వ తేదీ) సాయంత్రం వేళ హైదరాబాద్‌లో వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి.  ఫలితంగా పలు చోట్ల వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చని అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు.  

    మరొకవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అకాల వర్షం పడింది. డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్ పల్లి, సిరికొండ, మోపాల్, రూరల్ మండలాల్లో వర్షం కురిసింది. ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన వడగండ్లు వాన పడింది. ఈ అకాల వర్షంతో పలుచోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. 

    ఇదిలా ఉంచితే, తెలంగాణలో ఎండలు కూడా హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీ సెల్సియస్‌  అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. 

  • హైదరాబాద్‌: శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వటువులకు 14వ వేసవి సంధ్యావందన శిక్షణ శిబిరం(రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపు) నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 17 వరకు హైదరాబాద్‌, కుంట్లూరులోని శ్రీ వేద వ్యాస పాఠశాలలో దీన్ని నిర్వహిస్తారు. పేర్లు నమోదు చేసుకునేందుకు http://www.sjssstrust.org వెబ్‌సైట్‌ చూడొచ్చు. మరిన్ని వివరాలకు 9704706667, 8008391458కు ఫోన్‌ చేయొచ్చు.

    24వ ఆరాధన మహోత్సవాలు 
    జగద్గురువుల పరంపరలో వెలిగిన మహానుభావులు పరమహంస పరివ్రాజక చార్యులు శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి 24వ ఆరాధన మహోత్సవాలు కుంట్లూరు శ్రీ వేదవ్యాస పాఠశాలలో శనివారం నుంచి సోమవారం (ఏప్రిల్‌ 20) వరకు జరుగుతాయి. ఈ పుణ్య సమయములో వేదఘోషల మధ్య గణపతి పూజ, ఉపనిషత్ పారాయణులు, వేదపారాయణ, గురుపూజ, విద్వత్ సదస్సు, అన్నదానం వంటి వైదిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.

    విశిష్ట కార్యక్రమము
    విద్యారణ్య, శాస్త్ర సదస్సు: వేద శాస్త్రముల ఆంతర్యాన్ని ప్రతిపాదించే ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి ప్రముఖ పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని తమ పుణ్య సందేశాలను అందించనున్నారు. గౌరవనీయులు, ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్న ఈ మహోత్సవములో ప్రతి భక్తుడు పాల్గొని సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందొచ్చు. భక్తులందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ట్రస్ట్ ఆహ్వానం పలికింది.

  • ఢిల్లీ: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. టీడీపీ, చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా ఇలా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో రేవంత్‌​ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే పరిస్థితే చంద్రబాబు నాయుడికి కూడా వస్తుందని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారని అన్నారు.

    ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని తీసి పక్కన పడేస్తారని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని చెప్పారు.

    వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని తెలిపారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తానుగా రాజుగా  2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా? అని ప్రశ్నించారు. డిక్టేటర్‌షిప్‌ను ఎవరూ ఒప్పుకోబోరని తెలిపారు. 

    చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
  • జగిత్యాల : మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరికతో జగిత్యాలలో పండగ వాతావరణం నెలకొందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో పార్టీనేతలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. జగిత్యాల సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎన్ని కుట్రలు చేసిన ఎట్టిపరిస్థితుల్లో సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. రెండేళ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 20న జరిగే సభకు  సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల చేరుకుంటారని ఆయన రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

    కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన బిల్లు రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు కలిసి రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. కాగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 20 న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్‌ హాజరవుతారు. 

  • ఢిల్లీ:  బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రిశ్ర‌మ‌) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ  ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. గ్రీన్‌స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు క‌లుగుతుంద‌ని తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామి, ఉక్కు శాఖ స‌హాయ మంత్రి భూప‌తిరాజు శ్రీ‌నివాస వ‌ర్మ‌ల‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం ఉద‌యం స‌మావేశ‌మ‌య్యారు.

    ఈ సంద‌ర్భంగా  తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్ర‌తిపాద‌నల‌ను సీఎం కేంద్ర మంత్రుల‌కు వివ‌రించారు. తెలంగాణ‌లో పాత వాహ‌నాల‌ స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను సీఎం కోరారు. అందుబాటులో  ఉన్న సాంకేతిక‌త‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక ఉత్ప‌త్తికి ఉన్న అనుకూలత‌ల వ‌ల‌న దేశ పారిశ్రామిక ఉత్ప‌త్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ కేంద్రంగా నిల‌వ‌గ‌ల‌ద‌ని కేంద్ర మంత్రుల‌కు సీఎం వివరించారు.

    హైద‌రాబాద్‌లో హైడ్రోజన్‌ టెక్నాలజీతో గ్రీన్‌ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రిశ్ర‌మ‌లు, ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఈవీ  బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రులు కుమార‌స్వామి, శ్రీ‌నివాస‌వ‌ర్మ‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు.

    హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమల‌కు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌కు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ  శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

National

  • న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మహిళా రిజర్వేషన్లను అడ‍్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. భారత మహిళల కలలను నాశనం చేశారు. దేశహితమే మాకు ముఖ్యం’ అని తెలిపారు. 
     
    కాంగ్రెస్‌, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మోదీ ఆరోపించారు. 40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్‌ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ‍్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి‘ అని మోదీ ప్పారు.

    కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు
    ‘మహిళా రిజర్వేషన్ బిల్లును గర్భంలోనే చంపేశారు. ఈ భ్రూణ హత్యలకు కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మహిళలకు అన్యాయం చేశారు. మహిళా బిల్లును ఓడించి కొట్టిన చప్పట్లు.. మహిళలకు చేసిన గాయాలు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సమాజ్ వాదీ పార్టీ నిజస్వరూపం బయటపడింది.

    కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని భావించా. కానీ మహిళలకు న్యాయం చేసే అవకాశాన్ని జారవిడుచుకుంది. మిత్రపక్షాలపై ఆధారపడి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారమే నియోజకవర్గాలను పెంచాలని ప్రతిపాదించా. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. 

    అన్ని రాష్ట్రాలలో నియోజకవర్గాలు పెరిగి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవి. కానీ, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్కరణల వ్యతిరేక పార్టీ. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370ని కూడా వ్యతిరేకించింది. డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం చేశారు’ అని మోదీ తెలిపారు. 

  • చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెమెక్రటిక్‌ స్ట్రాటజీస్‌ సంచలన ఓపీనియన్ పోల్‌ వెల్లడించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన స్థానాన్ని పదిలం చేసుకోబుతున్నారని సర్వే తెలిపింది.

    ఏప్రిల్‌ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటములతో పాటు సినీ హీరో విజయ్‌ టీవీకే పార్టీ ‍ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి. అధికారం పొందడమే లక్షంగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే కూటమి తమిళనాట మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ఒపీనియన్ పోల్‌ చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్ష డీఎంకే కూటమి ఏ సారి కూడా ప్రతిపక్షానికి పరిమితం కానున్నట్లు పేర్కొంది. సినీహీరో విజయ్‌ అధికారానికి చాలా దూరంలో ఉన్నప్పటికీ మంచి స్థాయిలో ఓట్లషేర్‌ సాధించే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.


    ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెమెక్రటిక్‌ స్ట్రాటజీస్‌  ఓపీనియన్ పోల్‌ ప్రకారం


    డీఎంకే కూటమి-37.5 % ఓట్లు 121 సీట్లు

    ఏఐడీఎంకే కూటమి- 33.63 % ఓట్లు 83 సీట్లు

    టీవీకే పార్టీ - 24.71 % ఓట్లు 3 సీట్లు 

    సాధించనున్నట్లు సర్వే తెలిపింది. 27 చోట్ల హోరాహోరి పోరు నడుస్తోందని పేర్కొంది. అయితే డీఎంకే సైతం సొంతంగా మెజారిటీ సాధించలేదని అలియన్స్‌ ద్వారానే ‍ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇదివరకు వచ్చిన సర్వేలలో చాలా వరకూ డీఎంకే వైపే మెుగ్గుచూపాయి. కాగా  తమిళనాడులో 234 స్థానాలుండగా అధికారం సాధించడానికి 118 స్థానాలు అవసరం. 

  • బరువు తగ్గాలంటే కచ్చితత్వంతో, నిబద్దతతో వ్యాయామం, ఆహార నియమాలు పాటించాలి. అయితే చిన్న అవమానంతో ఒక బ్యాడ్మింటన్ కోచ్‌ తన జీవన శైలినిమార్చుకుంది. ఆహారనియమాలను సరిచేసింది.కట్‌ చేస్తే.. 16 కిలోలు తగ్గింది. అయితే  ఈ మార్పు  అకస్మాత్తుగా జరగలేదు. ఎంతో పట్టుదలతో కష్టపడి సాధించింది. అని చాటి చెప్పింది. విమర్శలనే సవాల్‌తీసుకుని  విజయ తీరాలకు బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

    36 ఏళ్ల బాడ్మింటన్ కోచ్ సాక్షి శ్రీవాస్తవ, తల్లి అయిన తర్వాత సుమారు 20 కిలోల బరువు పెరిగారు. ఒకానొక దశలో ఆమె బరువు 79 కిలోలకు చేరుకుంది. అయితే ఒక  రోజు తన క్లయింట్లలో ఒకరు, "మీరే మంచి శారీరక స్థితిలో లేకపోతే, మీ విద్యార్థులకు శిక్షణ  ఎలా ఇవ్వగలరని ఆశిస్తున్నారు?" అని అనడంతో అవమానంగా భావించింది. ఎంత మాట అనిపించుకున్నానే అని చిన్నబుచ్చుకుంది.కానీ అక్కడితే ఆగిపోలేదు.అప్పుడే ఆమె బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. చక్కటి  ఆహార నియమాలతో  దాదాపు 16 కిలోలు బరువు తగ్గింది.  XXL నుండి M సైజుకు  మారిపోయింది. మొదట్లో ఆమె 'క్రాష్ డైట్స్' (అతిగా పస్తులు ఉండటం) ప్రయత్నించింది, కానీ ఫలితం తాత్కాలికంగానే ఉండేది. ఆ తర్వాత శాస్త్రీయ పద్ధతిలో బరువు తగ్గడం ప్రారంభించారు. కాలిలో రాడ్ ఉన్నప్పటికీ, పట్టుదలతో క్రమబద్ధమైన వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాహారంపై దృష్టి పెట్టింది. 

    ఇదీ చదవండి: మోమోస్‌ తింటున్నారా? మెమరీ లాస్‌, లివర్‌ నాశనం, చివరికి!?
     

    డైట్ ప్లాన్
    ఆపిల్, ఓట్స్ (40 గ్రా), పోహా (40 గ్రా).
    అన్నం (50 గ్రా), గోధుమలు (40 గ్రా).
    ఎగ్ వైట్ (గుడ్డులోని తెల్లసొన), ఒక స్కూప్ వే ప్రోటీన్.

    ఇలా  రోజూ  కేలరీలను లెక్క వేసుకుంటూ నియంత్రించుకుంటూ క్రమశిక్షణతో కూడిన ఆహారం తీసుకునేది. ఫలితంగా తన బరువును 79 కిలోల నుండి 63 కిలోలకు తగ్గించుకుంది."అప్పట్లో నేను XXL సైజ్ బట్టలు వేసుకునేదాన్ని, ఇప్పుడు M సైజ్‌కు మారాను. వార్డ్‌రోబ్ మొత్తం మార్చడం వల్ల జేబుకు చిల్లు పడినా, నా ఆత్మవిశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది!" అని ఆమె గర్వంగా  చెబుతుంది.

    ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!

    ఆమె సలహా..షార్ట్‌కట్స్ వద్దు, త్వరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్స్ చేయకండి, స్థిరంగా బరువు తగ్గాలంటే  స్థిరత్వం, పౌష్టికాహారం, వ్యాయామం అవసరం, ఫలితం నెమ్మదిగా వచ్చినా, క్రమం తప్పని అలవాట్లను పాటించండి అంటారామె.

    నోట్‌ : బరువు తగ్గడం అనేది కేవలం తక్కువ తినడం కాదు, సరైన పోషకాహారం వ్యాయామం కలయిక. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. క్రాష్‌డైట్స్‌ ఎప్పటికీ మంచిది కాదు. ఏదైనా నిర్ణయం  తీసుకునేముందు వైద్యులను లేదా నిపుణులను  సంప్రదించడం ఉత్తమం. 

  • పిల్లల నుంచి వృద్ధుల వరకు ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్‌ ఫుడ్‌, ఆధునిక జీవనశైలిలో అంతర్భాగంగా మారిపోయింది. కానీ దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆహార, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో హెచ్చరించే ఒక హృదయ విదారక ఘటన ఢిల్లీలోని బురారీలో చోటుచేసుకుంది. మెమోస్‌ తింటున్నారా? అయితే ఈ షాకింగ్‌ న్యూస్‌ వివరాలు తెలుసుకుదాం.

    మెమోస్‌.. వేడి వేడిగా, కారం కారంగా, వెజ్‌  ఆర్‌ నాజ్‌ వెజ్‌ మోమోస్‌ తినడం చాలా మందికి ప్రాణం. కానీ నిత్యం  మోమోస్ వల్ల 10 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.  బురారీకి చెందిన కిషోర్, సావిత్రి దంపతుల తాన్యతోపాటు 8 ఏళ్ల గౌరీ అనే మరో పాపకూడా. తల్లి సావిత్రి మాథుర్,కేర్‌టేకర్‌గా తండ్రి కిషోర్ మొబైల్ రిపేర్లు  చేసే పనిలో  ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, తాన్య తన తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుని రోజూ బయట మోమోస్, చిప్స్ వంటివి కొని తినేది.  క్రమంగా ఆమె మెదడు పని తీరు దెబ్బతింది. జ్ఞాపకశక్తిని కోల్పోవడం ప్రారంభించింది, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయింది, చివరికి నడవడానికి కూడా ఇబ్బంది పడింది.  రోజు రోజుకు ఆమె పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది.

    ఇదీ చదవండి: రూ. 1000, రూ. 500 మార్పిడికి కొత్త రూల్స్‌? పీఐబీ స్పందన

    లక్షణాలుఎలా బయపడ్డాయి?
    చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం (జ్ఞాపకశక్తి తగ్గడం)తో సమస్య మొదలైంది. ఏగాగ్రతలేదు అనుకున్నారు.  ఆ తరువాత విపరీతమైన నీరసం, అలససటతో బాధపడేది. చివరికి నడవలేని స్థితికి చేరుకుంది.  అప్పుడు  వైద్యులను సంప్రదించగా షాకింగ్‌ నిజాలా వెలుగు చూశాయి. వైద్య పరీక్షలలో ఆమె కాలేయం దెబ్బతిన్నట్లు తేలింది. ఆమె శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల, మెదడు వాచిపోయింది, దీంతో ఆమెను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. మోమోస్ వంటి ఫాస్ట్ ఫుడ్‌ను తరచుగా తినడమే ఆమె పరిస్థితికి కారణమని వైద్యులు నిర్ధారించారు.

    వైద్యులు మొదట ఆ బాలికకు కాలేయ మార్పిడి చేయాలని సిఫార్సు చేశారు. కానీ ప్లాస్మాఫెరెసిస్ చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది. పీడియాట్రిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శైలేష్ శర్మ ప్రకారం, ఢిల్లీలో దాదాపు 35 శాతం మంది పిల్లలు ఫ్యాటీ లివర్ లక్షణాలను చూపిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, అధిక స్క్రీన్ సమయం , శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. దీంతో చిన్న పిల్లలలో కూడా తీవ్రమైన కాలేయ వైఫల్యం కేసులు కనిపిస్తున్నాయి. అంతేకాదు సగటున రోజుకు 2.5 లీటర్ల నీరు తాగాలి, కానీ చాలామంది 1 నుండి 1.5 లీటర్లు మాత్రమే తాగుతున్నారు. ఇది మెటబాలిజంపై ప్రభావం చూపుతోందని  కూడా ఆయన హెచ్చరించారు.

    ప్లాస్మాఫెరిసిస్ (Plasmapheresis) అంటే
    శరీరంలోని రక్తం నుండి విషపూరితమైన ప్లాస్మాను తొలగించి, దాని స్థానంలో శుభ్రమైన ప్లాస్మాను ఎక్కించే ప్రక్రియ. దీనివల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గి, అది కోలుకోవడానికి అవకాశం కలిగింది. రెండు యూనిట్ల ప్లాస్మా సహాయంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది.
     

    ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!

  • సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు  వీగిపోయిన వైనంపై వాడి వేడి చర్చ జరుగుతుండగా, డీమానిటైజేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతోంది. 2016లో చేపట్టిన పెద్ద నోట్లు రద్దు తరువాత ఇపుడు మళ్లీ పాతనోట్ల మార్పిడి అవకాశం కల్పిస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పీఐబీ  సోషల్‌  మీడియి ద్వారా వివరణ ఇచ్చింది.


    2016లో రద్దయిన పాత  రూ. 1000, రూ. 500,  నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీంతో   బ్యాంకు వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)  ​ స్పందించింది.  ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని  ఇది పూర్తిగా నకిలీ వార్త అని, ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని  ఫార్వర్డ్‌ చేయొద్దని కూడా హెచ్చరించింది. 

    కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సందేశం, ఫోటో లేదా వీడియో మీకు కనిపిస్తే, దానిని  తమకు సెండ్‌ చేయాలని కోరింది.దాని ధృవీకరిస్తామని తెలిపింది.కరెన్సీకి సంబంధించిన ఏ సమాచారం కోసమైనా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను (rbi.org.in) చెక్‌ చేయాలని వెల్లడించింది.


    WhatsApp: +91 8799711259
    Email: factcheck@pib.gov.in
     

  • రాయగడ : రాయగడలో బాక్సైట్‌ ఫైట్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు కోసం కాశీపూర్‌లో గల టికిరిలో ఉత్కళ అల్యూమినియం కర్మాగారానికి 1994లో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఎన్నో అభ్యంతరాలు, అవాంతరాలు, ప్రజల వ్యతిరేకతలు మధ్య 1996లో ప్రాజెక్టు పనులు పూర్తవ్వాల్సి ఉండగా అది 2006లో ప్రారంభమైంది. ఈ కర్మాగారం ఏర్పాటులో భాగంగా వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు సైతం త్యాగం చేశారు. అందుకు వారికి కర్మాగారం నష్టపరిహారం కూడా చెల్లించింది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాంతంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. 

    సిజిమాలి తవ్వకాలకు అనుమతి  
    కాశీపూర్‌ సమితి పరిధిలొని సగుబారి పంచాయతీలో గల కంఠమాల్‌ సమీపంలొ ఉన్న సిజిమాలి (Sijimali)లో సుమారు 311 మిలయన్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాలు దాదాపు 1549 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సిజిమాలి కొండలో ఉన్న బాక్సైట్‌ తవ్వకాల కోసం 2023 వ సంవత్సరంలో వేదాంత కంపెనీకి 50 ఏళ్ల కోసం లీజ్‌ కింద అనుమతులు ఇచ్చింది. అయితే ఆది నుండే అవాంతరాలు ఏర్పడుతుండటంతో వేదాంత కంపెనీ తవ్వకాల కొసం ప్రయత్నించినా ఆ దిశగా ముందుకు వెళ్లలేకపోయింది. గ్రామ సభలు, పల్లెసభలను నిర్వహించిన అనంతరం ఆయా ప్రభావిత ప్రాంతాల ప్రజల అనుమతులతో తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎలాంటి గ్రామ సభలు, పల్లె సభలను నిర్వహించకుండా ప్రజల అభిమతం తెలుసుకోకుండా వేదాంత కంపెనీ తవ్వకాల కొసం కదం తొక్కినప్పటికీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్లలేకపోయింది.  

    ఎందుకంత వ్యతిరేకత..?  
    కొండలనే తమ దైవంగా భావించే ఆదివాసీలు అడవులను నమ్ముకుని జీవనోపాధిని పొందుతుంటారు. మైనింగ్‌ తవ్వకాల వల్ల తాము దైవంగా భావించే కొండలు అంతరించిపోవడంతో పాటు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పచ్చని అడవులు నాశనం అవుతాయని భావించిన ఆదివాసీలు ఆది నుండే తవ్వకాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొండలపై జీవించే ఎంతో మంది ఆదివాసీలు తమకు నిలువనీడ లేకుండా పోతుందని, అదేవిధంగా తాగునీటి వనరులు కూడా దొరకడం గగనమవుతుందని భావిస్తూ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.  

    పరిశ్రమలు ఏర్పాటైతే తమ జీవన స్థితిగతులు మెరుగుపడతాయని భావించి మొదట్లో కాశీపూర్‌లో గల ఉత్కళ అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రభావితమయ్యే గ్రామాలకు చెందిన ప్రజలు వారి భూములను, స్థలాలను అప్పగించారు. కానీ ఆ తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఉన్న స్థలాల సైతం, నమ్ముకున్న అడవులసైతం ఇచ్చివేస్తే మిగిలేది ఏమీలేదని గట్టిగా నమ్మిన గ్రామస్తుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. 

    సిజిమాలిలో జరిగింది ఇదే.. 
    సిజిమాలి బాక్సైట్‌ నిక్షేపాలను తవ్వకాల కోసం వేదంత కంపెనీ సగుబారి నుంచి కంఠమాల్‌ గ్రామ సమీపంలో గల సిజిమాలి కొండవరకు రహదారిని నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా గ్రామస్తులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఏప్రిల్‌ 7 వ తేదిన జిల్లా కలెక్టర్‌ అశుతొష్‌ కులకర్ణి కంఠమాల్‌ గ్రామ ప్రజలకు ఈ కొండను ప్రభుత్వం తవ్వకాల కొసం వేదాంత కంపెనీకి అనుమతులు ఇచ్చిందని, వారు తవ్వుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలు తెలపకూడదని మైకు ద్వారా పోలీసులు బలగంతో అక్కడకు చేరుకున్న కలెక్టర్‌ గ్రామస్తులకు వివరించారు. 

    అదే రోజు రాత్రి పోలీసులు కంఠమాల్‌ గ్రామంలో గల సుభాసిణి మాఝి అనే ఒక నిందితురాలిని అరెస్టు చేసే పేరిట పూర్తి పోలీసుల బలగాలతో అర్ధరాత్రి గ్రామంలో దమన కాండను సృష్టించారు. ఈ దాడుల్లో ఎంతొ మంది ఆదివాసీలు గాయాలపాలయ్యారు. అదేవిధంగా గ్రామంలొకి భాష్వ వాయువును కూడా పోలీసులు ప్రయోగించారు. మరుసటి రోజు ఏప్రిల్‌ 8న మరికొంత మంది పోలీసులు ఉదయం కంఠమాల్‌ గ్రామానికి వెళ్లి రహదారి నిర్మాణానికి సంబంధించి సన్నాహాలు చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. సంప్రదాయ ఆయుధాలతో వ్యతిరేకించారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య జరిగిన వాగ్వాదంలొ పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. దీంతో సుమారు 58 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతొ పరిస్థితులు ఉద్రిక్తమవ్వడంతో గ్రామంలొ 163 సెక్షన్‌ జారీ చేశారు. కొద్ది రొజులు సద్దుమణగగా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలోకి వెళ్లారు. ఫ్యాక్ట్‌ పైండింగ్‌ టీంలుగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీజేడీ, అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన అగ్రనాయకులు కంఠమాల్‌ గ్రామంలొ గ్రామస్తులతో సమావేశమయ్యారు. తాము అండగా ఉంటామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ఆదివాసీల హక్కులను కాలరాయడం విచారకరమని ఈ మేరకు తమ హైకమాండ్‌ లకు రాజకీయ నాయకులు నివేదికలను కూడా సమర్పించారు. 

    ఇందులో భాగంగా కొరాపుట్‌ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక నేతృత్వంలొ రాయగడ, బిసంకటక్, గుణుపూర్‌ ఎమ్మెల్యేలు అప్పల స్వామి కడ్రక, నీలమాధవ హికక, సత్యజీత్‌ గొమాంగొలు కంఠమాల్‌ గ్రామంలొ పర్యటించిన అనంతరం కలెక్టర్‌ అశుతొష్‌ కులకరి్ణతో సమావేశమయ్యారు. పల్లె సభలు, గ్రామ సభలను జరిగినట్లుగా సాక్ష్యాలను సృష్టించి వేదాంత కంపెనీ సిజిమాలి కొండలను తవ్వేందుకు ప్రయత్నిస్తుందని సరాసరి కలెక్టర్‌తో చెప్పారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ఈ విషయమై చొరవ తీసుకొవాలని కొరారు. బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా ప్రతిపక్షపార్టీలు గ్రామస్తులకు మద్దతు చెబుతున్నాయి.  

    ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు

    ప్రభావిత గ్రామాలు  
    సిజిమాలి బాక్సైట్‌ తవ్వకాలు కొనసాగితే ప్రభావిత గ్రామాల గురించి తెలుసుకుంటే.. జిల్లాలోని 18 గ్రామాలు నేరుగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, కంపెనీలు అంచనా వేశారు. ఇందులో రాయగడ జిల్లాలోని 8 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజిక కార్యకర్తలు, గిరిజన సంఘాల అంచనా మేరకు మైనింగ్‌ వల్ల సుమారు 50 నుంచి 80 గ్రామాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీని వల్ల సుమారు ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అంచనా. 

    ఇదీ చదవండి: మొగుడుమీద అలిగింది..నోట్ల వర్షం కురిసింది!

  • ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన మూడోదశ 2028 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 83,977 కోట్ల రూపాయల కేటాయింపులు జరుగుతాయి. భారత్ మ్యారీ టైం ఇన్సురెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

    నిరంతర సముద్రయాన బీమా కవరేజీ  కోసం 12,980 కోట్ల రూపాయలు కేటాయింపులు ఉంటాయి. ప్రపంచ అస్థిరత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నౌకల బీమా కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. యుద్ధ ప్రమాద నష్టాలను కవర్ చేసేలా బీమా ఉంటుంది.

    రాజమండ్రి (నిడదవోలు)-(దువ్వాడ) మధ్య 3, 4వ రైల్వే లైన్ ట్రాక్  ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 198 కిలోమీటర్ల రూట్లో, 458 కిలో మీటర్ల ట్రాక్ ఏర్పాటు కానుంది. 9,889 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

    మరిన్ని కీలక నిర్ణయాలు

    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అదనపు డీఏ నిధుల విడుదలకు క్యాబినెట్ ఆమోదం 

    • ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా పెరిగిన రెండు శాతం డీఏ

    • డీఏ పెంపుతో ఖజానాపై 6,791 కోట్ల రూపాయల అదనపు భారం 

    • 50.46 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు,68.27 శాతం పెన్షన్ దారులకు  ప్రయోజనం

    • ఘజియాబాద్, సీతాపూర్ థర్డ్ , ఫోర్త్ రైల్ లైన్ విస్తరణకు 14,926 కోట్ల రూపాయలు

  • జైపూర్: రాజస్థాన్‌లో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. భూవ్యవహారానికి సంబంధించిన దందాలో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుబడింది. గతంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వూలో అవినీతిని అంతమెుందిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఈ అధికారి ఇప్పుడు తానే లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు ఈ వార్త  చర్చనీయాంశమైంది.

    రాజస్థాన్‌లో ఎస్‌డీఎమ్‌గా విధులు నిర్వహిస్తున్న కాజల్‌ మీనా అనే అధికారి భూవ్యవహారానికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం కోసం రూ. లక్ష తొలుత డిమాండ్ చేసింది. అయితే బాధితులు అంత చెల్లించలేము అని అనడంతో రూ. 60 వేలకు డీల్‌ కుదిరింది. అయితే ఈ వివరాలని బాధితుడు ఏసీబీకి తెలియజేయడంతో పక్కా ప్లాన్‌ వేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తన బ్యాగులో మరో రూ. 4 లక్షలున్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.

    కాజల్ మీనా నేపథ్యం

    కాజల్‌ మీనా 2024లో రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షలలో టాఫర్‌గా నిలిచారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌ ఐఐటీ మండిలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. అయితే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడు అవినీతిని నిరోధిస్తానని ప్రజా సేవ చేయడమే లక్షమని పేర్కొంది. 

    కాగా ఇప్పుడు తన తొలి పోస్టింగ్‌ లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రగల్భాలు పలికిన అధికారి తన తొలిపోస్టింగ్‌లోనే ఏసీబీకి చిక్కడమేంటని ‍ప్రశ్నిస్తున్నారు.

  • ఢిల్లీ: రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డంతో విప‌క్షాల‌పై అధికార ఎన్డీఏ నాయ‌కులు మండిప‌డుతున్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌కుండా అడ్డుకున్న విప‌క్షాల‌కు గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చరించారు. రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసమే బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌యంలో విప‌క్షాలు పెద్ద త‌ప్పు చేశాయ‌ని, దీనికి ఫ‌లితం క‌చ్చితంగా అనుభ‌విస్తాయ‌ని అన్నారు.

    ఓడిన బిల్లు.. కాంగ్రెస్ సంబ‌రాలు: ఇరానీ
    మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై కాంగ్రెస్ నాట‌కాలు ఆడుతోంద‌ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ధ్వ‌జ‌మెత్తారు. లోక్‌స‌భ‌లో మ‌హిళా బిల్లు వీగిపోతే కాంగ్రెస్ స‌భ్యులు బ‌ల్లలు చ‌రుస్తూ, న‌వ్వుతూ సంబ‌రాలు చేసుకున్నారని అన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసి, వారి హక్కులను  నిరాకరించడ‌మే కాకుండా సంబ‌రాలు చేసుకున్నార‌ని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా రిజ‌ర్వేష‌న్ కోసం పోరాడుతున్న మ‌హిళ‌ల ఆకాంక్ష‌ల‌ను కాంగ్రెస్ కాల‌రాసిందని దుయ్య‌బ‌ట్టారు. రాజ్యాంగ వ్యవస్థ, పార్లమెంటుపైనే కాదు.. దేశంలోని మహిళలపైనా కాంగ్రెస్‌కు నమ్మకం లేదని పేర్కొన్నారు. అధికారం కోసం బీజేపీ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని, సమానత్వ హక్కు కోసం ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు.

    మ‌హిళ‌లు త‌గిన జవాబిస్తారు: అథవాలే
    మ‌హిళా బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయ‌ని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేయ‌కుండా విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని విమ‌ర్శించారు. సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టారని వివ‌రించారు. ప్ర‌తిప‌క్షాల‌కు మహిళలు స‌రైన స‌మ‌యంలో తగినవిధంగా బుద్ధి చెబుతార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశంలోని మహిళలు అంద‌రూ కాంగ్రెస్ పనితీరును చూశారని, ఆ పార్టీని వారు క్షమించబోరని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పేర్కొన్నారు.

    కుంటి సాకుల‌తో అడ్డుకున్నారు: చిరాగ్‌
    లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొందకుండా చేసిన ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు మ‌హిళ‌లు భవిష్యత్తులో త‌గిన జవాబు ఇస్తారని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నేత‌ చిరాగ్ పాశ్వాన్ అన్నారు. కుంటి సాకుల‌తో విప‌క్షాలు మ‌హిళా బిల్లుకు మోకాలడ్డాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. "ఈ బిల్లును చదివిన ఎవరికైనా ఇంతకంటే మంచి ప్రతిపాదన మరొకటి ఉండదని అర్థమవుతుంది. మేము ముందుకు తెచ్చిన డీలిమిటేషన్ ప్రతిపాదనలో ప్రతి రాష్ట్రానికి సమాన వాటా ఇచ్చాం, సీట్లను సమానంగా పంపిణీ చేశాం. నిన్న లోక్‌స‌భ‌లో హోం మంత్రి అమిత్ షా కూడా అన్నీ స్పష్టంగా వివరించారు. ప్రతిపక్షం ఒకదాని తర్వాత ఒకటి సాకులు చెబుతూ బిల్లును అడ్డుకుంది. సగం జనాభాకు వారి హక్కులు దక్కడం వారికి ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ పార్లమెంట్ సమావేశాలను విని ఉంటారు, భవిష్యత్తులో వారు ప్రతిపక్షానికి తగిన జవాబు ఇస్తార"ని చిరాగ్ పాశ్వాన్ అన్నారు.

    కాంగ్రెస్ ఖ‌తం ఖాయం: హిమంత శ‌ర్మ‌
    మ‌హిళ‌ల ఆగ్ర‌హానికి గురైన కాంగ్రెస్ పార్టీ అంతమైపోతుందని అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ (himanta biswa sarma) అన్నారు. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదం పొంద‌కుండా అడ్డుకున్నందుకు రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులపై మ‌హిళ‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని చెప్పారు. విప‌క్ష నాయ‌కులు త‌మ‌ను అవ‌మానించార‌నే భావ‌న మ‌హిళ‌ల్లో బ‌లంగా ఉంద‌న్నారు. 

    చ‌ద‌వండి: నాకు, మోదీకి భార్య‌ల స‌మ‌స్య లేదు.. రాహుల్ గాంధీ స‌ర‌దా కామెంట్స్‌

    బాధ క‌లిగించింది: హేమమాలిని 
    మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోవ‌డం త‌న‌కెంతో బాధ క‌లిగించింద‌ని సీనియ‌ర్ న‌టి, బీజేపీ ఎంపీ హేమమాలిని అన్నారు. బిల్లు ఆమోదం కోసం తాము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విప‌క్షాలు అడ్డుప‌డ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీ తీరుకు నిర‌స‌గా దేశ‌వ్య‌ప్తంగా మ‌హిళ‌లు ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని చెప్పారు. కాగా, ఢిల్లీలో బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు నిర్వ‌హించిన నిర‌స‌న‌ కార్య‌క్ర‌మంలో హేమ‌మాలిని పాల్గొన్నారు. 

  • న్యూఢిల్లీ: మహిళా కోటా బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర సర్కారుకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్‌ 18) రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలను “దోషులు” అని ప్రధాని మోదీ అన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్షం వైఖరిని ఆయన తప్పు అని పేర్కొని, భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

    కాగా, లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు వీగిన విషయం తెలిసిందే. 352 ఓట్లు రావాల్సి ఉండగా అనుకూలంగా 298 ఓట్లే వచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఓటేశారు 230 మంది విపక్ష సభ్యులు. మూడింట రెండొంతుల మెజారిటీ రాలేదు. దీంతో ఆ తర్వాత సవరణతో పాటు మిగతా రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

    మోదీ హయాంలో ఓ బిల్లు వీగిపోవడం ఇదే మొదటిసారి. మహిళా చట్టం అమలుకు కృషి చేస్తూనే ఉంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు. విపక్షాలు మాత్రం బీజేపీ డీలిమిటేషన్‌ కుట్రలను ఓడించామని అంటున్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ శనివారం బీజేపీ మహిళా నేతలు నిరసనలు తెలుపుతునున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ మహిళా రిజర్వేషన్‌లపై మాట్లాడే అవకాశం ఉంది. 

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్‌కు అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్‌ ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. శెల్కే తనయుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. 

    జితేంద్ర శెల్కే అశోక్‌కు నమ్మిన బంటు మాత్రమే కాదు వ్యాపార భాగస్వామి కూడా. అశోక్‌ నిర్వహించిన ట్రస్ట్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ లావాదేవీలు మొత్తం చూసుకున్నాడు. అయితే లైంగిక వేధింపుల కేసు.. ఆపై అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు జితేంద్రను ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ట్రస్ట్‌ ఆస్తులు, భూ లావాదేవీలలో ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. జితేంద్ర మరణించడం హాట్‌ చర్చకు దారి తీసింది. 

    మార్చి నెలలో మహారాష్ట్ర నాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం వెలుగు చూసింది. పూజల పేరుతో తనపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కలకలం మొదలైంది. ఈ కేసులో మార్చి 18న అశోక్‌ ఖరాత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆపై దర్యాప్తులో సంచలన విషయం వెలుగు చూసింది.  

    పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్‌కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100-150 మధ్య అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేసేవాడని తేలింది. ఈలోపు అందులోని కొన్ని వీడియోలు నెట్టింటకు చేరడంతో ఇటు సోషల్‌ మీడియాలోనూ ఈ బాబా కామ లీలలపై జోరుగా చర్చ  నడిచింది. 

    రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు
    రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ప్రధానంగా దందాను సాగించినట్లు తెలుస్తోంది. ఈ పరిచయాలతోనే.. 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసింది. అలాగే ఆశ్రమానికి పలువురు ప్రముఖులు తరచూ వెళ్తుండేవాళ్లు. వాళ్లలో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చాకంకర్‌, ఆమె సోదరి కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు.. ఈ సెక్స్‌ స్కాండల్‌కు రాజకీయ మరక అంటడడంతో ఫడ్నవిస్‌ ప్రభుత్వం.. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ టీం ఖరాత్‌పై లైంగిక దాడులు, మోసం, బ్లాక్‌మెయిల్‌, మూఢనమ్మకాల ప్రోత్సాహం, మనీ లాండరింగ్‌ అభియోగాలపై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 

    ఈడీ సోదాలు
    గడిచిన కొన్నేళ్లలో అశోక్‌ ఖరాత్‌ ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయన, బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు మారుపేర్లతో మహారాష్ట్రలోని రెండు సహకార రుణ సంఘాల్లో 132 ఖాతాలు ఉన్నాయని.. గత రెండేళ్లలో ఈ ఖాతాల కింద రూ.62.74 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు సిట్‌ నిర్ధారించుకుంది. దీంతో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మనీ లాండరింగ్‌ (PMLA) కేసు నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. 

    ఏప్రిల్‌ 13వ తేదీన నాసిక్‌లో అశోక్‌ నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. తిరిగి 17, 18 తేదీల్లో తనిఖీలు జరిపి కొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ పరికరాలు స్వాధీనం చేసుకుంది. 

    కోపర్గావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో జితేంద్ర శెల్కే, ఆయన భార్య మరణంపై కేసు నమోదు అయ్యింది. అయితే సిట్‌ అనుమానాల నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీవో, ఆటోమొబైల్‌ నిపుణుల సహకారంతో క్రాష్‌ అనాలిసిస్‌ చేయనున్నట్లు అహిల్యా నగర్‌ జిల్లా ఎస్పీ సోమనాథ్‌ ఘార్గే తెలిపారు.

  • సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  డియర్‌ అలవెన్స్‌ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. 

    ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్‌ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉ‍ద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది.  ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. 

    ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్‌ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్‌ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. 

    ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్‌ మారిటైం ఫండ్‌ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోదించింది. దీని ద్వారా భారత్‌ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్‌ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.

    గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్‌ మంత్రి గ్రామ సడక్‌ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. 

Andhra Pradesh

  • కడప:  కూటమి ప్రభుత్వం పాలన పారిశ్రామిక రంగానికి ఒక శాపంగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విమర్శించారు.  పరిశ్రమల పట్ల జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.  ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారన్నారు. కార్మికులను లోపలకు వెళ్ళనివ్వకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని, ఆ కంపెనీలో అన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని ఇబ్బందిపెడుతున్నారన్నారు. ఈ తరహా వైఖరి వల్ల ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా.. వీళ్ల దౌర్జన్యాలకు ఉన్న పరిశ్రమలు కూడా మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. 

    ‘షాడో ముఖ్యమంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ.. వాస్తవంలో కూటమి ఎమ్మెల్యేలు ఉన్న పరిశ్రమలను పారద్రోలుతున్నారు.  ఎర్రగుంట్ల అల్ట్రా టెక్ సిమెంట్స్ లో అదినారాయణరెడ్డి గూండాలను పెట్టీ నడవనివ్వకుండా చేస్తున్నారు. క్వారీ ముడిసరుకు రాకుండా గూండాలను పెట్టీ అడ్డుకుంటున్నారు. చివరికి ఆ కంపెనీ ఉత్పత్తి చేసే సిమెంట్ టన్నుకి  కమిషన్ డిమాండ్ చేయడం దారుణం. మీ ప్రజాప్రతినిధులకు కప్పం కట్టుకుంటేనే పరిశ్రమలు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. గతంలోనే ఇదే పరిశ్రమను నెల రోజుల పాటు మూతవేయించారు. అయినా జిల్లా యంత్రాంగం స్పందించలేదు..గతంలో ముఖ్యమంత్రిని కలిసినా ప్రయోజనాంలేదు. మన ముఖ్యమంత్రి తప్పు చేస్తున్న వారిని దండించకుండా మధ్యవర్తిత్వం చేస్తున్నారు. మధ్యవర్తిత్వం చేసి కాంట్రాక్టులు ఇప్పించే పరిస్థితి

    ఈ తీరు చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నాలుగు రోజులుగా ఆ పరిశ్రమను నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించకపోవడంపై ఆదినారాయణరెడ్డికి సహకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తెలిసే పరిశ్రమపై గూండాగిరి జరుగుతోందని అనుమానం ఉంది. ఎంతో మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. 

    కార్మికులు ఫ్యాక్టరీలోకి వెళ్తుంటే పోలీసులే అడ్డుకుంటున్న తీరు దారుణం. కార్మికులు ఉండే గ్రామాల్లోకి వెళ్ళి ఆ పరిశ్రమకు పనికి వెళ్లొద్దని బెదిరిస్తున్నారు. ఇలానే వదిలేస్తే అన్ని పరిశ్రమలకు ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నేతలు సీఎం రమేష్, అది వర్గీయుల ఆధిపత్య పోరు అదానీ కంపెనీ కూడా తాకింది. లోకేష్ రచించిన రెడ్ బుక్ పాలన పరిశ్రమలకు కూడా వర్తింపు చేస్తున్నారు. ఆర్టీపీపీలో ఫ్లై యాష్ కోసం అది, జేసీ వర్గీయులు కొట్లాటకు దిగితే చంద్రబాబు రాజీ చేశారు. తన అనుయాయులకు పరిశ్రమల నుంచి దోచిపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక కడప లాంటి ప్రాంతానికి పరిశ్రమలు ఎలా వస్తాయి..?, చంద్రబాబును కలిసి వచ్చిన మరుసటి రోజే ఈ పరిశ్రమపై ఆది దాడికి దిగాడంటే ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలన్నీ మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది’అని హెచ్చరించారు.

  • తాడేపల్లి: చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో చేస్తున్న‌ అక్రమ అరెస్టులు, వేధింపులపై వైఎస్‌ జగన్‌ ట్వీట్ చేశారు.

    ‘చంద్రబాబూ..  మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా? మీరు చెప్ప‌నిది చూపించారా?  

    వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి? అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ’ అని ప్రశ్నించారు

    ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? 
    ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ‘ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు..  ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌?  

    మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు?  వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? 

    అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది’ అని వైఎస్ జగన్ విమర్శించారు. 

  • గుంటూరు:  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన నిరాహార దీక్షను విరమించారు.  తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్‌ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు(శనివారం) తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు. ఆ నిరాహార దీక్షను సాయంత్రం వరకూ అంబటి కొనసాగించారు. మాజీ హోంమంత్రి సుచరిత.. అంబటి రాంబాబు దీక్షను విరమింపజేశారు. 

    అంబటి దీక్షకు వైఎస్సార్‌సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివచ్చాయి. దీనిలో భాగంగా సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై దాడి హేయమని, 7 గంటల పాటు దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అంబటిని వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.  దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్‌ చేయాలన్నారు. 

Politics

  • ఢిల్లీ:  మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా బిల్లును ఓడించామని కాంగ్రెస్‌ నాయకులు సంబరపడుతున్నారని,  ఇది మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత చర్య అని మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీలే ఈ బిల్లును అడ్డుకున్నారన్నారు. 

    రాహుల్‌ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసిన సైనికులను రాహుల్‌ అవమానించారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బిల్లును అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని, రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపుపై కేంద్ర క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇప్పటివరకూ 7 సార్లు మహిళా బిల్లును అడ్డుకున్నారన్నారు కిషన్‌రెడ్డి.

  • చెన్నై: కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి వాదిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం దీనిపై మరోసారి స్పందించారు. ‘నియోజకవర్గాల పునర్విభజన అనే నల్ల చట్టం’పై చేసిన పోరాటం చేసిన ప్రతిపక్షం పార్లమెంటులో విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026 శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందలేదన్న విషయం తెలిసిందే. దీంతో ఇండియా బ్లాక్ ఎంపీలు, మహిళలకు స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

    నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు, అంటే 2051 వరకు వాయిదా వేయాలని స్టాలిన్‌ సూచించారు. “2001లో చేసినట్లే ఇప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 సంవత్సరాలు వాయిదా వేయడానికి రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. అంటే 2051 వరకు. అంతేకాకుండా, 2023లో మేము మద్దతు ఇచ్చి ఆమోదించిన మహిళల రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సభ్యుల సంఖ్య ఆధారంగా ఎటువంటి షరతులు లేకుండా బీజేపీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. దాని కోసం మనం పోరాడుదాం” అని స్టాలిన్ తెలిపారు.

    తమిళనాడు ప్రభుత్వం, దేశంలోని ప్రతిపక్ష నేతలు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దాదాపు ఒక సంవత్సరం ముందే అంచనా వేశారని స్టాలిన్‌ తెలిపారు. అప్పటినుంచే సమన్వయంగా చర్యలు చేపట్టారని అన్నారు. ప్రతిపాదిత చట్ట ప్రతులను దహనం చేస్తూ తెలిపిన నిరసనలు సహా పలు కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచాయని తెలిపారు.

    సంవత్సరం ముందే అంచనా వేశాం 
    ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలోలో స్టాలిన్ మాట్లాడుతూ.. “నేను నూతనోత్సాహంతో మీ ముందున్నాను. పునర్విభజన అనే నల్ల చట్టంపై మన పోరాటం విజయవంతమైంది. ఈ ప్రమాదాన్ని సంవత్సరం ముందే అంచనా వేసి అవసరమైన చర్యలు అప్పుడే ప్రారంభించాం. ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశాం. నల్ల జెండా ఎగరవేశాం. నిన్న,మొన్న చట్ట ప్రతిని దహనం చేశాం. ఈ అగ్ని వ్యాపించాలని అన్నాను. అది పార్లమెంటుకు కూడా చేరింది” అని చెప్పారు.

    ఇది గట్టి దెబ్బ.. 
    తమిళనాడు ప్రజలకు కూడా స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ మోసపూరిత ప్రయత‍్నానికి ఎదురు నిలిచారని అన్నారు. ‘‘పునర్విభజన పేరిట బీజేపీకి అనుకూలంగా నల్ల చట్టం తీసుకురావాలనుకుంది. పార్లమెంటులో దీనిని ఓడించిన అందరికీ తమిళనాడు ముఖ్యమంత్రిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ముఖ్యంగా తమిళనాడు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల రిజర్వేషన్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించింది. కానీ మహిళలే ముందుండి దీనిని ఓడించారు. ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి సభ్యులు ఏకమై నిలవడం వల్ల ఇది సాధ్యమైంది” అని అన్నారు.

    దేశాన్ని విభజించాలనే ప్రయత్నాలకు ఇది గట్టి దెబ్బ అని స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యత పెరుగుతుందనడానికి ఇది సంకేతమని తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొదటిసారి ఓ బిల్లు ఆమోదం పొందలేదని అన్నారు. ఉత్తరాది-దక్షిణాది పేరుతో మన మధ్య విభేదాలు సృష్టించాలని చూసిన వారికి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు.

  • తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బంధాలు, అనుబంధాలు అందరికీ తెలిసినవే అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పగలు బీజేపీతో.. సాయంత్రం కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. 

    ఈ రోజు(శనివారం, ఏప్రిల్‌ 18వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. చంద్రబాబు తన రాజకీయాలతో తీవ్ర అప్రతిష్టను తెచ్చారని విమర్శించారు. టీడీపీ ఎంపీలు రేవంత్‌రెడ్డిని కలవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో టీడీపీ ఎంపీలు కలవడానికి కారణం ఏంటని నిలదీశారు. 

    చంద్రబాబుకు, రేవంత్‌కు ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు.‘టీడీపీ మహిళా నేతలు కాంగ్రెస్ నేతలను ఎందుకు కలిశారు?, రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎంపీలు ఎందుకు ఫోటోలు తీసుకున్నారు. బీజేపీ ఎంపీ వర్మ రేవంత్ కి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వటం ఏంటి? టీడీపీ నేతలు కూడా వెళ్లటం ఏంటి?, అసలు ఏం రాజకీయాలు చేస్తున్నారు?

    మహిళా బిల్లుపై బాబు కుట్ర ఆధారాలతో బయటపెట్టిన MLC లేళ్ల అప్పిరెడ్డి

    మీ లోపాయికారి ఒప్పందాలు ఏంటో బయట పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు విఘాతం కలిగిస్తున్నారు?, చంద్రబాబు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో బంధాన్ని కొనసాగిస్తున్నారు. యువత, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు?, అసలు వెన్నుపోటు రాజకీయాలు చేసేదే చంద్రబాబు’  అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి కారకులను మహిళా లోకం కచ్చితంగా శిక్షిస్తుందన్నారు.

  • సాక్షి, ఢిల్లీ: విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. చిన్న సవరణతో మహిళా రిజర్వేషన్లు పెంచవచ్చు. సీట్లు పెంచడానికి మహిళా రిజర్వేషన్లు ముసుగు వేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలకి ఓటమి ఇది అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.

    సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘దక్షిణ భారతానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నాం. మహిళా బిల్లు చాటున డీలిమిటేషన్‌ బిల్లును తెచ్చారు. ఎన్డీయే నిజాయితీగా బిల్లును తీసుకురాలేదు. బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్‌ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్‌ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్‌ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. 

    రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఎంతో మంది మహిళా నేతలను కాంగ్రెస్‌ తయారుచేసింది’ అని చెప్పుకొచ్చారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో టెన్షన్‌ వాతవరణం నెలకొంది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి నాయకత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శనగా రేవంత్‌ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లారు.

    ఈ క్రమంలో బీజేపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం, మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

    మరోవైపు.. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘పక్ష నేతల తీరుకు నిరసనగా సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరితే అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారు. మా ముట్టడి అడ్డుకున్నారు. నిన్న దేశానికి ఎమర్జెన్సీ కంటే చీకటి రోజు. ఇండియా కూటమి మహిళలకు వ్యతిరేకం. కేవలం మైనార్టీ, కుటుంబ ప్రాతినిధ్యం కోసమే తప్ప సామాన్య మహిళ కోసం కాంగ్రెస్ మాట్లాడదు. కామన్ ఉమెన్ చట్ట సభలోకి రావొద్దని కాంగ్రెస్ తీరు ఉంది.  

    రిజర్వేషన్ రాబోతుందని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. హైబ్రిడ్, ఉత్తరాది, దక్షిణాది కేవలం మహిళ రిజర్వేషన్ వ్యతిరేకించే అంశాలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిది. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అంటూనే.. వ్యతిరేకంగా ఓట్లు వేశారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

  • సాక్షి, న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. 

    శనివారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయి. కోట్ల మంది మహిళలకు విపక్షాలు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఆ పార్టీలు శిక్ష అనుభవించక తప్పదు’’ అని అన్నారు.  

    పండుగ చేసుకుంటున్నారా?: కిరణ్‌ రిజిజు
    మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ఘోరమని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. కాంగ్రెస్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపాం. అయినా అడ్డుకున్నారు. మహిళా బిల్లును అడ్డుకుని పండుగ చేసుకోవడం దుర్మార్గం. ఈ బిల్లు ఎలా అప్రజాస్వామికమో రాహుల్‌ గాంధీ చెప్పాలి అని కిరణ్‌ రిజిజు డిమాండ్‌ చేశారు. 

    మూడు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కేంద్రం.. మహిళా రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్‌ సంబంధిత మొత్తం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే శుక్రవారం సాయంత్రం రాజ్యాంగ సవరణ-131పై లోక్‌సభలో ఓటింగ్‌ జరగ్గా మెజారిటీ చేరుకోలేక ఆ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. 

    మహిళా రిజర్వేషన్లకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని.. ఎన్డీయే ప్రభుత్వం రాజకీయానికి దిగిందని.. డీలిమిటేషన్‌ అంశాన్ని ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టడంతోనే ఓడించామని విపక్షాలు చెబుతున్నాయి. అయితే డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని.. మహిళా రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితోనే వ్యవహరించామని ఇటు కేంద్రం అంటోంది.

Family

  • అరటిపండు (banana) అలా  వంగి ఎందుకు ఉంటుంది?ఈ డౌన్‌ మీకు వచ్చిందా? అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది.   అదేంటో  తెలుసుకుందామా?

    అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్‌ జియోట్రోపిజం’ అంటారు. అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్‌ వంకరగా వస్తుంది. అరటిపండులో  పొటాషియం ఎక్కువ. అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్‌ స్పాట్స్‌ అంటారు. ప్రపంచంలో 1000 రకాల అరటిపండ్లు ఉన్నాయి.

    ఇదీ చదవండి: మీటింగ్‌లో అనుకోని అతిథి.. అవాక్కైన అధికారులు
     

     

     వింత పండు ’రంబుటాన్‌’ 

     ’రంబుటాన్‌’  పేరే వింతగా ఉందే? అవును. ’రంబుటాన్‌’ అంటే మలేషియా భాషలో ’వెంట్రుకలు’ అని అర్థం. ఎందుకంటే ఈ పండు బయటంతా పచ్చ, ఎరుపు రంగులో వెంట్రుకల్లాంటి మెత్తటి ముళ్లు ఉంటాయి. చూడ్డానికి చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో రోడ్డు పక్కన బళ్ల మీద గుట్టలు గుట్టలుగా అమ్ముతారు. అక్కడి పిల్లలు స్కూల్‌ అయిపోగానే రంబుటాన్‌ కొనుక్కుని తింటూ ఇంటికెళ్తారు. మన దగ్గర మామిడిపండు లాగా అన్నమాట. పై తొక్క తీస్తే లోపల తెల్లగా, జెల్లీలా, మెరుస్తూ ఉంటుంది. సరిగ్గా మన లిచీ పండు లాగానే. మధ్యలో ఒక చిన్న గింజ ఉంటుంది. దానిని తినకూడదు.

    ఈ పండు రుచి కొంచెం పుల్లగా, జ్యూసీగా ఉంటుంది. లిచీ + ద్రాక్ష కలిపినట్టు. అక్కడి పిల్లలు ‘ఒకసారి మొదలుపెడితే ఆపలేం‘ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. కొందరు జ్యూస్‌ చేసుకుంటారు, ఐస్‌ క్రీంలో వేసుకుంటారు.హెల్త్‌కి చాలా మంచిది! విటమిన్‌ ఇ ఉంటుంది – జలుబు దగ్గరికి రాదు. ఐరన్‌ ఉంటుంది – రక్తం బాగా పడుతుంది. ఫైబర్‌ ఉంటుంది – కడుపు హ్యాపీ. మొదటిసారి చూసిన వాళ్లు ‘అయ్యో ఇది పండా? బొమికా?‘ అని భయపడతారు. కానీ టేస్ట్‌ చూశాక ‘ఇంకోటి ఇంకోటి’ అని అడుగుతారు. 

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి