Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

NRI

  • దుబాయ్ క్రౌన్‌ ప్రిన్స్‌, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.

    సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్‌ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్‌ ప్రిన్స్‌ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.

    సందర్భంగా ఆయన చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్రాజు షేక్ మహమ్మద్తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్‌ తండ్రి షేక్ మహమ్మద్‌ కూడా దుబాయ్వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.

    దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?
    దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.

    దుబాయ్లంచ్సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..
    దుబాయ్‌ లంచ్‌ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.

    2026.. కుటుంబ సంవత్సరం
    కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.

     

Movies

  • విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

    తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా ఓకేసారి రెండు ఓటీటీల్లో రిలీజ్‌ కావడం విశేషం. ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వేదికగా సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు.  ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు.

    కథేంటంటే.. 

    చైతన్య(విక్రాంత్‌) హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తన స్నేహితుడి సుబ్బు(అభినవ్‌ గోమఠం)ని ఎంగ్జామ్‌ సెంటర్‌లో డ్రాప్‌ చేయడానికి వెళ్లగా.. అక్కడ కల్యాణి(చాందిని చౌదరి) చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెది వరంగల్‌ అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కల్యాణి తండ్రి ఈశ్వరరావు(మురళీధర్‌ గౌడ్‌)కు ఈ విషయం తెలిసి.. ఆమెను కలవకుండా చేసి చైతన్యను తిరిగి పంపిస్తాడు. ఓ సంఘటనతో చైతన్య, కల్యాణి మళ్లీ కలుస్తారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి..అది కాస్త ప్రేమగా మారుతుంది. ఈశ్వరరావు ఒప్పుకోడని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. బిడ్డ పుడితే ఆయనే దగ్గరకు వస్తాడని జాక్‌ (తరుణ్‌ భాస్కర్‌) ఇచ్చిన సలహాతో కాపురాన్ని ప్రారంభిస్తారు.

    కొన్నాళ్ల తర్వాత చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళితే.. చైతన్యకు స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువ ఉందని..బిడ్డలు పుట్టే అవకాశం లేదని చెబుతారు. ఈ విషయం భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడతాడు చైతన్య. అదే సమయంలో ఈశ్వరరావు వీరింటికి వస్తాడు. కూతురుతో ప్రేమగా మాట్లాడుతూనే..‘ఎలాగైన మీ ఇద్దరి విడగొట్టి నా కూతురిని తీసుకొని వెళ్తానని’ అల్లుడికి వార్నింగ్‌ ఇస్తాడు. ఒకవైపు పిల్లలు పుట్టరేమోననే బాధ..మరోవైపు మామ వార్నింగ్‌తో చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కల్యాణిని దక్కించుకునేందుకు ఆయన పడిన కష్టాలు ఏంటి? కూతురిని చైతన్యకు దూరం చేయడానికి ఈశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవి ఫలించాయా లేదా? ఒకవైపు నాన్న..మరోవైపు భర్త చూపించిన అతిప్రేమ కల్యాణిని ఎలా ఇబ్బందికి గురి చేసింది?  చైతన్యకు స్పెర్మ్‌కౌంట్‌ తక్కువ ఉందనే విషయం కల్యాణికి తెలిసిన తర్వాత ఎం జరిగింది? చివరకు చైతన్య-కల్యాణికి పిల్లలు పుట్టారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

     

     

    • మరింత హాట్‌హాట్‌గా లిటిల్ హార్ట్స్ బ్యూటీ శివాని..
    • బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన భూమిక చావ్లా..
    • సెల్ఫీ మూడ్‌లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్..
    • క్రిస్‌మస్‌ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..
    • ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సెల్ఫీ లుక్స్..

     

     

     

     

     

     

     

  • టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న పీరియాడికల్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి   హనుమ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్‌ సరసన మరియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌ చేశారు.  ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మంచు మనోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ఈ గ్లింప్స్‌లో కనిపించిన వార్‌ డాగ్ బైక్ గురించి మంచు మనోజ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ బైక్‌ను కల్కి టీమ్‌కు పనిచేసేవారే డిజైన్‌ చేశారని వెల్లడించారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొని తయారు చేశారని తెలిపారు. కల్కిలోని బుజ్జిని తయారు చేసిన టీమ్‌ ఈ వార్ ‍డాగ్‌ క్రియేట్‌ చేశారని పంచుకున్నారు. దీని బరువు దాదాపు 700 కేజీల వరకు ఉందని మంచు మనోజ్‌ అన్నారు. కాగా.. ఈ బైక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

    అయితే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అతిథి పాత్ర పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై కూడా మనోజ్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో అతిథి పాత్రలకు మంచి స్కోప్‌ ఉంది..కానీ మేము ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. దీంతో ఈ వార్తలకు ఫుల్‌ స్టాప్ పెట్టారు మంచు మనోజ్.  
     

     

  • ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.

    అయితే ఇవాళ సాంగ్ రిలీజ్‌ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  
     

     

  • రెబల్ స్టార్ డార్లింగ్‌ ప్రభాస్‌ -మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ థ్రిల్లర్‌ ది రాజాసాబ్. ఈచిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సహనా సహనా అంటూ సాంగే రొమాంటిక్ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

    తాజాగా రిలీజైన ఈ పాట ప్రభాస్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. విశాల్ మిశ్రా, తమన్ ఎస్, శృతి రంజనీ ఆలపించారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేశారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌ నిర్మించారు. 

     

  • టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.

    తాజాగా లిస్ట్‌లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్‌ షేర్ చేసింది.  ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

    (ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)

    అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్‌ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. 
     

     

  • దేశంలో వేల కోట్ల రూపాయల పరిశ్రమగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఎ.వి.జి.సి) విజృంభణతో విస్తృతమైన వినోద రంగంలో సినిమా ఓ చిరుభాగమైంది. ఇవాళ మారిన కాలంతో పాటు మారాల్సి వస్తున్న సినిమా ఒకపక్క భాష, ప్రాంతీయ భేదాలను చెరిపేస్తుంటే, మరోపక్క ఓటీటీ వేదికలు దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సొంతంగా నిర్మిస్తున్న ‘ఒరిజినల్స్’ కొత్త తరహా కథ, కథనాలను పరిచయం చేస్తున్నాయి. ఫిల్మ్ సిటీల నిర్మాణం మొదలు శిక్షణ, మెంటర్ షిప్‌ల ద్వారా ఈ సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందుగా పై చేయి సాధించాలని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీ పడుతున్నాయి.

    సాధారణ ఆర్థిక రంగంలోనే కాదు... సృజనాత్మక ఆర్థికవ్యవస్థ (క్రియేటివ్ ఎకానమీ)లోనూ తమదైన ముద్ర వేసేందుకు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు దూసుకు వస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట డిసెంబర్ 8 – 9 తేదీలలో గ్లోబల్ సమిట్ జరిగి, అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమను సైతం తెలంగాణకు ఆకర్షించాలన్న ప్రయత్నం జరిగింది. సరిగ్గా అదే సమయంలో డిసెంబర్ 9న చెన్నైలో ప్రముఖ ‘జియో – హాట్‌స్టార్’ సంస్థ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త వెబ్ సిరీస్‌లు, షోలను జనం ముందుకు తెస్తూ, అందుకు ముందస్తుగా ‘సౌత్ అన్‌బౌండ్’ అనే ఉత్సవం నిర్వహించింది. అక్కడే తమిళనాట సినీ పరిశ్రమ అభివృద్ధికి గాను ఆ సంస్థకూ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య ఓ ప్రాథమిక అవగాహన కూడా కుదరడం విశేషం.

    మరోపక్క తెలుగు రాష్ట్రాలు ఒకటికి రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సైతం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కొన్నేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగులకు  సింగిల్ విండో అనుమతుల మొదలు పలు చర్యలు గతంలోనే పాలకులు చేపట్టారు. స్థానికంగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్లను ప్రోత్సహించి, ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో పరిశ్రమకు మరో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనేది ప్రయత్నం. వెరసి, సినీ పరిశ్రమకు చెరగని చిరునామాగా నిలిచి, తద్వారా ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందు వరుసలో నిలవాలని దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతుండడం గమనార్హం.

    సినిమాకు ‘ఫ్యూచర్ సిటీ’... వినోదానికి గ్లోబల్ హబ్…

    తెలుగు సినీ పరిశ్రమకు ఆది నుంచి తమ కాంగ్రెస్ ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయని పదే పదే నొక్కిచెబుతున్న ప్రస్తుత తెలంగాణ సర్కార్ హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు మరో కీలక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలాకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా రానున్న ‘ఫ్యూచర్ సిటీ’లో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్ లాంటి హిందీ తారలకు సైతం ఫిల్మ్ సిటీ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు 50 ఏళ్ళుగా హైదరాబాద్‌తో మమేకమైన అన్నపూర్ణ స్టూడియోస్ సైతం ‘ఫ్యూచర్ సిటీ’లో భాగమవుతుందంటూ అక్కినేని నాగార్జున లాంటి వారు ప్రకటించారు.


    అలాగే, సంస్కృతి, సినిమా, సృజనాత్మకతలకు గ్లోబల్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ డిసెంబర్ ప్రథమార్ధంలోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐ.ఐ.ఎఫ్.ఎ – ‘ఐఫా’)తో సైతం తెలంగాణ సర్కార్ పలు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 120కి పైగా దేశాల్లో వీక్షకులున్న “వార్షిక ‘ఐఫా’ ఉత్సవం 2026 నుంచి 2028 వరకు వరుసగా మూడేళ్ళ పాటు హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు ‘ఐఫా’ అవార్డులు అందించే ఈ ఉత్సవాల వల్ల ఏటా కొన్ని వేల మంది సందర్శకులు మన దగ్గరకు వస్తారు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.  

    దక్షిణాదిపై కన్నేసిన ‘జియో- హాట్‌స్టార్’!

    ఇక, తమిళనాడు ప్రభుత్వంతో తాజాగా ‘జియో-హాట్‌స్టార్’ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వంతో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్‌’పై సంతకం చేస్తున్నట్లు డిసెంబర్ రెండోవారంలో ప్రకటించింది. ఫలితంగా, తమిళనాట సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ‘జియో-హాట్‌స్టార్’ కీలక పాత్ర పోషించనుంది. “ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. అందుకు తగ్గట్టే నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్‌లు, డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్‌లు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్‌ల లాంటివి చేపడతాం” అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.  

    ఇప్పటికే, నెట్‌ఫిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటివి దక్షిణాదిలోనూ అనేక రకాల ఒరిజినల్ కంటెంట్‌తో ముందుకొస్తున్నాయి. తాజాగా ‘జియో – హాట్ స్టార్’ సైతం ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం... ఇలా నాలుగు దక్షిణాది భాషల్లో ఫిక్షన్, నాన్ – ఫిక్షన్ కేటగిరీలలో 25 రకాల కొత్త టైటిల్స్‌ను వీక్షకుల నెట్టింట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. “దక్షిణ భారతదేశం ఎప్పుడూ సృజనాత్మకశక్తికి కేంద్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రేక్షకులు వినోద రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వినోదం అందించాలన్నది మా ప్రయత్నం. అందుకే ఈ ‘సౌత్ అన్ బౌండ్’. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొత్తగా 25 వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు అందిస్తున్నాం. ఈ కృషిలో భాగంగా గత పది నెలల్లో, దాదాపు 500 మందికి క్రియేటర్లు, డైరెక్టర్లు, షో రన్నర్లు మా సంస్థ కుటుంబంలో భాగమయ్యారు” అని ‘జియో స్టార్’ ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి వివరించారు.


    దక్షిణాది సినీ ప్రముఖులు ఎందరో...

      ఈ ప్రసిద్ధ స్ట్రీమింగ్ దిగ్గజం అందిస్తున్న సిరీస్‌లు, షోలలో సినీ ప్రముఖులు సైతం భాగం కావడం చెప్పుకోదగ్గ విశేషం. తమిళంలో విజయ్ సేతుపతి సైతం ‘కాట్టాన్’ అనే ఓ వెబ్ సినిమాను స్వయంగా నిర్మిస్తూ, నటిస్తుంటే, మలయాళంలో ‘దృశ్యం’ చిత్ర సిరీస్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శక – నిర్మాత జీతూ జోసెఫ్ సైతం మరో ఓటీటీ ప్రయత్నాన్ని సమర్పిస్తున్నారు. ఇక, ప్రసిద్ధ నటుడు నివిన్ పాలీ సైతం భారతీయ ఔషధ రంగంలోని లోటుపాట్లపై నిర్మిస్తున్న ‘ఫార్మా’ అనే వెబ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ప్రముఖ సినీ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ఐశ్వర్యా రాజేశ్, సీనియర్ నటి జయసుధ, యువ హీరో ప్రియదర్శి, యువ హీరోయిన్ శివాత్మికా రాజశేఖర్, కమెడియన్ అభినవ్ గోమఠం, సీనియర్ నటుడు సాయికుమార్... ఇలా సుపరిచితులైన పలువురు ఈ వెబ్ షోలలో అలరించనున్నారు.


    ఇలా రాబోయే అయిదేళ్ళలో ఆ సంస్థ దక్షిణాది భాషల్లో ఏకంగా రూ. 12 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. స్వయంగా పలు చిత్రాలు నిర్మించి, వెండితెరపై నటించిన తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం రాష్ట్రంలో మరింత ఉపాధి, ఆదాయం పెంచే ఈ ఆలోచన పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారు. “దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఓ ప్రధాన కేంద్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఇక్కడే పుట్టాయి. అన్ని భాషల కళాకారులకూ ఇది నిలయం. దక్షిణాది సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది” అని ఆయన వ్యాఖ్యానించారు.


     దక్షిణాదిలో రానున్న సరికొత్త ఫిల్మ్ సిటీలు!
        
        నిజానికి, సినీ రంగంలోకి రావాలనుకొనే ఔత్సాహికులకు శిక్షణ నిచ్చేందుకు 1970ల నాటికే చెన్నైలో సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ పక్షాన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఆరంభమైంది. ఆ తరువాత కాలంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతూ వచ్చింది. ఇప్పటికీ అది నడుస్తోంది. ఇక, 1990ల నాటికే చెన్నైలో ఒకే చోట పలు సినిమా, టీవీ సీరియళ్ళ నిర్మాణానికి అనువుగా ఉండేలా ప్రభుత్వం ‘ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ’ పేరిట ప్రత్యేకంగా నెలకొల్పింది. అది చాలాకాలం తమిళ, తెలుగు, మలయాళ సినిమాలకు నిర్మాణ కేంద్రంగా నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో సినిమా స్టూడియోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం కోసం ప్రయత్నాలు సాగుతుంటే... మరోపక్క చెన్నైలో ఇప్పటికి రెండేళ్ళుగా సమస్త సౌకర్యాలతో, అధునాతన ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

    2024 జనవరిలోనే డి.ఎం.కె. అధినేత – తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. చెన్నై శివార్లలోని పూనమల్లి దగ్గర కుతంబాక్కమ్ ప్రాంతంలో 152 ఎకరాల స్థలంలో రూ. 500 కోట్లతో ఈ నవీన ఫిల్మ్ సిటీ రూపొందనుంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పాటు భారీ ఎల్ఈడీ గోడలతో కూడిన వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలు, పోస్ట్ ప్రొడక్షన్ వసతులు, పరిశ్రమ వర్గీయుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ వసతి వగైరా అంతా అందుబాటులో ఉంచాలని యోచన. “త్వరలోనే నిర్మాణం చేపట్టి, సరికొత్త ఫిల్మ్ సిటీ కల సాకారం చేస్తాం” అని ఉదయనిధి ప్రకటించారు.


     నేరుగా ఇంట్లోనే రిలీజ్!

    ఇప్పుడు ఓటీటీలు కూడా రావడంతో అవి ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్ సినిమాలు, సిరీస్‌లు, షోల చిత్రీకరణ కూడా హెచ్చింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అందరినీ అలరించడమూ పెరిగింది. దక్షిణాది మీద ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న ఈ ఓటీటీ వేదికల ప్రాజెక్టులకు సైతం వసతి సౌకర్యాలు పెరగాల్సి ఉంది. అందుకోసం రానున్న కొత్త ఫిల్మ్ సిటీ వసతులు, రాష్ట్రాల ప్రత్యేక పాలసీలు ఉపకరిస్తాయి. ఆ సంగతి గ్రహించబట్టే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.


    థియేటర్లతో సంబంధం లేకుండా నేరుగా నట్టింటికే సినిమాను తీసుకొచ్చేసిన ఓటీటీలు ఇటీవల సులభమైన డబ్బింగ్, సబ్ టైటిల్స్ సాయంతో భాష, భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేశాయి. “కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. ఇప్పుడైనా, ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి” అని అభిమానులు ఆప్యాయంగా ‘కింగ్’ అని పిలుచుకొనే హీరో నాగార్జున సైతం ఇటీవల బాహాటంగా అన్నారు. ఉదయనిధి సైతం ఆ మాటే అంటూ, “కథను ఎలా చెప్పాలి, ప్రజలకు ఎలా చేరువ చేయాలి అన్న దానికి కమలహాసన్ సార్ గొప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినీరంగంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఓటీటీలు ఏవీ రాక ముందే, పుష్కరకాలం క్రితమే 2013 లోనే ఆయన తన (‘విశ్వరూపమ్’) చిత్రాన్ని డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) రిలీజ్ చేశారు” అని గుర్తు చేశారు.

    కరోనా కాలంలో థియేటర్లు మూసివేతలో ఉండడంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు తమదైన ప్రత్యేకత చాటాలని ‘జియో-హాట్ స్టార్’, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలు తమ ఒరిజినల్స్ ద్వారా చేస్తున్నది అదే. అవి నేరుగా వీక్షకుడి నట్టింటిలోకే తమ కొత్త సినిమా, సిరీస్, షోలను అందిస్తున్నాయి. వినోద రంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. థియేటర్లలో రిలీజయ్యే కొత్త సినిమాకు సైతం పోటీ అవుతున్నాయి. అయితే, ఓటీటీ కొత్త ద్వారాలు తెరిచింది. ఉదయనిధి అభిప్రాయపడినట్టు, “ఇవాళ ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదికలు వచ్చి, సినిమా స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని అనుకుంటే పొరపాటు. నిజానికి, సినీ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. కొత్త తరహా కథలు, కథనరీతులు, ఇంతకాలం లోకానికి వినిపించని అనేక గొంతులకు ఓటీటీ జాగా ఇస్తోంది.”

    ఈ కొత్త అవకాశాన్నీ, అందుబాటులో ఉన్న స్థానాన్నీ ఓటీటీలు తమ ఒరిజినల్స్ ద్వారా ఎంతవరకు అందిపుచ్చుకుంటాయో చూడాలి. వాటికి తగిన వాతావరణాన్నీ, వసతులనూ కల్పిస్తే... సొంత గడ్డపై సరికొత్త ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల దృష్టి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ‘జియో – హాట్‌స్టార్‌’ ప్రతిపాదనకు తమిళనాడు సై అన్నా, ‘ఐఫా’తో తెలంగాణ జట్టు కట్టినా అందరూ ఈ ‘ఆరెంజ్ ఎకానమీ’ కోసమే మరి!

    -రెంటాల జయదేవ

  • టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ మంచు మనోజ్ లుక్, వార్‌ డాగ్‌ బైక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నెేల కరిగింది' ..' ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై' ‍అనే డైలాగ్స్ మంచు మనోజ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

    ఇవాళ విడుదలైన డేవిడ్ రెడ్డి టీజర్ గ్లింప్స్‌ చూస్తుంటే జలియన్ వాలాబాగ్‌ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్‌ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. గ్లింప్స్‌ చూడగానే పీరియాడికల్‌ మూవీ అని చెప్పేయొచ్చు. తాజా గ్లింప్స్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

     

  • రష్మిక ప్రధాన పాత్రలో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్‌. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ నిలిచింది. దీక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.28 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే కేవలం మౌత్‌ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది.

    ప్రస్తుతం ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. ది గర్ల్‌ఫ్రెండ్ పోస్టర్‌ను షేర్ చేసింది. కాగా.. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.

    ది గర్ల్‌ఫ్రెండ్‌ కథేంటంటే?

    భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్‌)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్‌ (దీక్షిత్‌ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్‌) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్‌ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్‌ కంట్రోల్‌లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ.
     

     

  • 2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. ఈ ఏడాది ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్ని ఊహించినట్లుగానే అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా.. మరికొన్ని మాత్రం అనుహ్యంగా డిజిటల్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకున్నాయి. అలా బెస్ట్ అనిపించుకున్న చిత్రాలేంటి? ఇవి ఏయే ఓటీటీల్లో ఉన్నాయనేది చూద్దాం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి థియేటర్లలో కళ్లు చెదిరే వసూళ్లు అందుకున్న సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్, ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై విడుదల టైంలోనే విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. అయినా సరే దీన్ని ఓటీటీలోనూ అదేస్థాయిలో చూశారు. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

    సాధారణ ప్రేక్షకుల నుంచి దైవభక్తుల వరకు ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసిన మూవీ 'మహావతార్ నరసింహా'. ఇదో యానిమేటెడ్ మూవీ. కాబట్టి దీనికి బాషతో సంబంధం లేదు. విజువల్స్, మ్యూజిక్, స్టోరీ, సీన్స్.. ఇలా అన్నీ టాప్ నాచ్‌లో ఉంటాయి. తొలుత థియేటర్‌లో, ఆపై నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చాక కూడా సేమ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

    పవన్ కల్యాణ్ నుంచి చాలారోజుల తర్వాత వచ్చిన స్ట్రెయిట్ సినిమా 'ఓజీ'. థియేటర్లలో అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు సుజీత్‌కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రానికి సాధారణ ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.

    హీరో నాని నిర్మించిన చిన్న సినిమా 'కోర్ట్'. థియేటర్లలో రిలీజైనప్పుడే అద్భుతమైన హిట్ అయిన ఈ చిత్రం.. తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి రెస్పాన్స్ అందుకుంది. మిగిలిన దక్షిణాది భాషల్లోనూ దీనికి ఓటీటీలో హిట్ టాక్ రావడం విశేషం.

    శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'సింగిల్'. ప్రేమకథని కామెడీగా తీసిన విధానం, అందులో ట్రెండింగ్ మీమ్స్, వన్ లైనర్స్ లాంటివి ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడానికి కారణమయ్యాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

    నవీన్ చంద్ర హీరోగా నటించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఎలెవన్'. థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి జనాలకు పెద్దగా తెలియలేదు గానీ ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం సర్‌ప్రైజ్ రెస్పాన్స్ అందుకుంది. థ్రిల్లర్ మూవీస్ లవర్స్‌కి ఇది నచ్చేసింది.

    తెలుగులో ప్రేమకథలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అలా ఈ ఏడాది రిలీజైన సినిమా '8 వసంతాలు'. అనంతిక లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు దీనికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి గానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ వినిపించింది. డైలాగ్స్, విజువల్స్ ఈ మూవీలో మెయిన్ హైలైట్. నెట్‌ఫ్లిక్స్‌లో దీన్ని చూడొచ్చు.

    తేజా సజ్జా చేసిన మరో సూపర్ హీరో సినిమా 'మిరాయ్'. ఇందులో మంచు మనోజ్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీలో లాజిక్స్‌పై ట్రోల్స్ వచ్చినప్పటికీ ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ మంచి స్పందనే అందుకుంది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో ఉంది.

    విలన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం హీరోగా చేస్తున్న తిరువీర్ నుంచి వచ్చిన లేటేస్ట్ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిన్న చిత్రం.. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. స్వచ్ఛమైన హాస్యం, సిచ్యుయేషన్ కామెడీ ప్లస్ పాయింట్స్. ఇది జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?)

  • ఈ రోజుల్లో మలయాళ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. కేవలం కంటెంట్‌తోనే ఈ సినిమాలు హిట్టవుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. తాజాగా మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ అలరించేందుకు వచ్చేస్తోంది. తాజాగా ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే కేవలం మలయాళంలోనే రిలీజైంది.

    ఆషికా అశోకన్, సంద్ర అనిల్ కీలక పాత్రల్లో వస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ జస్టిస్‌ ఫర్ జెని. ఈ మూవీకి సంతోష్ ర్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్. 

    తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఓ యువతిపై ‍అత్యాచారం, మర్డర్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్ విన్సెంట్ సంగీతం సమకూర్చారు. ఈ మూవీని అస్నా క్రియేషన్ ప్రెజెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో సినాన్, ఐశ్వర్య, బిట్టు థామస్ మప్పిళ్లస్సేరి, రేఖ, హరీష్ పేరడి, నిజల్గల్ రవి కీలక పాత్రలు పోషించారు. 
     

  • మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్‌ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.

    ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్న టాలీవుడ్‌.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్‌టైమ్ ‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

    బాహుబలి-2 ప్రభంజనం.. 

    గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్‌ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్‌ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

    బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్‌ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన ‍అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.

    ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్‌ ప్రభాస్ సలార్‌ టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    పుష్ప-2 రికార్డ్..

    గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్‌ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్‌ చూస్తే ఈ ఏడాది ‍అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ దురంధర్‌ ఈ రికార్డ్‌ బ్రేక్‌ అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

  • పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.

    (ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)

    వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్‌లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.

    'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్‌తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.

    (ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)

  • ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ పలు రకాలుగా వినియోగంలోకి వచ్చేసింది. మిగతా విషయాల్లో ఏమో గానీ సినిమా వాళ్లకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. దీని బారిన పడగా ఇప్పుడు శ్రీలీల కూడా తనకెదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కొన్నింటిని చూసి చాలా డిస్ట్రబ్ అయిపోయానని చెప్పింది.

    'ఏఐ నాన్సెన్స్‌ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. టెక్నాలజీ వినియోగానికి ఓ పద్ధతి అంటూ ఉంది. ఇది మన జీవితాల్ని సులభతరం చేయడానికి. సంక్లిష్టం చేసుకోవడానికి కాదు. నా బిజీ షెడ్యూల్స్ వల్ల బయట జరిగే చాలా విషయాలు నాకు తెలియవు. అయితే ఓ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. చాలావాటిని నేను లైట్ తీసుకుంటాను. కానీ ఇది మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. నా తోటీ నటీనటులు కూడా ఇలాంటి వాటిని అనుభవించారు. కాబట్టి మాకు అండగా నిలబడాలని మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఇకపై సంబంధిత అధికారులు ఈ విషయాన్ని చూసుకుంటారు' అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

    అయితే రీసెంట్ టైంలో శ్రీలీల ఫొటోలని కొన్నింటిని ఏఐ టెక్నాలజీతో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఇవి నిజమే అని భ్రమపడుతున్నారు. షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఈ హీరోయిన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తోంది.

  • అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్‌కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? 

    అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్‌కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్‌ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్‌ కన్నా టాలెంట్‌ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్‌ సినిమాలతో సెన్సేషన్‌గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

    19 ఏళ్లకే జుట్టు రాలడం
    దివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్‌ ఖన్నా కుమారుడే అక్షయ్‌ ఖన్నా. స్కూల్‌, కాలేజీ డేస్‌లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్‌ లాస్‌ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్‌ వస్తాయనుకునేవాడు. 

    తండ్రి సినిమాతో ఎంట్రీ
    కానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్‌ (Akshaye Khanna)కు మంచి బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్‌'. ఈ చిత్రం తర్వాత అక్షయ్‌ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మార్క్‌ సృష్టించాడు. 

    వైరల్‌
    దిల్‌ చహ్తా హై, హమ్‌రాజ్‌, దీవాంగే, రేస్‌, తీస్‌ మార్‌ ఖాన్‌, ఇత్తేఫఖ్‌, సెక్షన్‌ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ధురంధర్‌ చిత్రంలో తన యాక్టింగ్‌, డ్యాన్స్‌ క్లిప్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్‌కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండే అలవాటు లేదు. 

    50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే..
    వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్‌ కరిష్మా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్‌ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా!

     

     

  • తెలుగులో కాస్త తక్కువ గానీ బాలీవుడ్‌లో స్టార్స్ హీరోలు, దర్శకులు వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. అలా ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రలో, నీరజ్ పాండే దర్శకత్వం వహించిన సిరీస్ 'టస్కరీ'. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ ఎప్పుడనేది కూడా ప్రకటించారు.

    ఇందులో కస్టమ్స్‌ అధికారిగా ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌‌లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుంది. టీజర్ బట్టి చూస్తుంటే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎలా స్మగ్లింగ్ చేస్తుంటారు. దీన్ని కస్టమ్స్ అధికారులు ఎలా చేధిస్తారు అనే అంశాలతో దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    దర్శకుడు నీరజ్ పాండే.. గతంలో 'స్పెషల్ చబ్బీస్', 'బేబీ' సినిమాలతో పాటు 'ఖాకీ: ద బిహార్ ఛాప్టర్', 'ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్' సిరీస్‌లు తీశాడు. మంచి గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు కూడా 'టస్కరీ'తో మరో సక్సెస్ అందుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

  • తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్‌ కుమార్‌ (కేకే) బుధవారం (డిసెంబర్‌ 17న) ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన దర్శకత్వం వహించిన కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్‌ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సమయంలో దర్శకుడు మరణించడంతో చిత్రయూనిట్‌, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

    అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాకు కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2010లో విడుదలైంది. దీనికంటే ముందు పలు సినిమాలకు రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. కిరణ్‌ కుమార్‌ను అందరూ ఆప్యాయంగా కేకే అని పిలుచుకుంటారు. కేకే దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సందీప్‌ రెడ్డి ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

    చదవండి: తండ్రి నుంచి తాతగా ప్రమోషన్‌? నాగ్‌ ఆన్సరిదే

  • గత నెలలో రాజమౌళి-మహేశ్ బాబు సినిమా లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. 'వారణాసి' అని టైటిల్ ప్రకటించారు. మూడున్నర నిమిషాల ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే దీన్ని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరిస్తారని అప్పుడు రూమర్స్ వచ్చాయి కానీ అదేం జరగలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి-జేమ్స్ కామెరూన్ మధ్య 'వారణాసి' గురించి డిస్కషన్ నడిచింది. సెట్‌కి వచ్చి కెమెరా పట్టుకుని సీన్స్ తీస్తానని కామెరూన్ చెప్పడం విశేషం.

    (ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)

    జేమ్స్ కామెరూన్ తీసిన లేటెస్ట్ సినిమా 'అవతార్ 3'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. రాజమౌళి ఇక్కడే ఉండగా.. వీడియో కాల్ ద్వారా కామెరూన్ జక్కన్నతో మాట్లాడారు. మిగతా విషయాలు ఏమో గానీ 'వారణాసి' గురించి చేసుకున్న డిస్కషన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.

    'వారణాసి' సినిమా సంగతేంటి అని కామెరూన్ అడగ్గా.. ఏడాది నుంచి షూటింగ్‌ చేస్తున్నామని, మరో ఏడెనిమిది నెలల్లో పూర్తవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 'వారణాసి' షూటింగ్‌, సెట్స్‌ చూడాలని ఉందని చెప్పిన కామెరూన్‌.. కెమెరా పట్టుకుని తాను కూడా కొన్ని సీన్స్‌ తీస్తానని అన్నారు. అలానే 'పులులతో ఏదైనా షూట్‌ ప్లాన్‌ చేస్తుంటే చెప్పు' అని కామెరూన్‌ సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. రాజమౌళి చెప్పిన దానిబట్టి చూస్తుంటే వచ్చే ఏడాది ద్వితియార్ధానికి షూటింగ్ అయిపోతుందనమాట. అంటే చెప్పినట్లు 2027 వేసవిలో రిలీజ్ చేస్తారనమాట.

    (ఇదీ చదవండి: ఏఎన్నార్ కాలేజీకి నాగార్జున రూ.2 కోట్లు విరాళం)

National

  • పరస్పర అంగీకారంతో విడాకులపై (Mutual Consent Divorce) ఢిల్లీ హైకోర్టు  (Delhi High Court) కీలక తీర్పునిచ్చింది. విడాకుల కోసం మొదటి మోషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం విడిగా జీవించాల్సిన షరతు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ కాలాన్ని సెక్షన్ 14(1) ప్రొవైజో ఆధారంగా కోర్టు (ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు) మాఫీ చేయవచ్చని తెలిపింది.

    అలాగే, ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్ (ఫస్ట్ మోషన్ – సెకండ్ మోషన్ మధ్య) కూడా స్వతంత్రంగా మాఫీ చేయవచ్చని పేర్కొంది. విడాకులు కోరుతున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వెల్లడించింది.

    ఇలా చేయడం విడిపోవాలని నిశ్చయించుకున్న వారి ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛకు విరుద్ధవుతుందని వ్యాఖ్యానించింది. శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ (జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని, జస్టిస్ రేణు భట్నాగర్) ఈ తీర్పు వెలువరించింది.

     

     

  • పతనంతిట్ట: ఎరుమేలి మీదుగా సాంప్రదాయ (పెద్దపాదం) అటవీ మార్గం గుండా శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు రేపటి నుంచి(డిసెంబర్‌ 18, గురువారం) ప్రత్యేక పాస్‌లను అటవీ శాఖ అందించనుంది. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ చేయనున్నారు.

    ప్రత్యేక పాస్‌లు పంపిణీ చేయాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు.. గంటలు తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడంతో భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి.

    అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరకూట్టం నుంచి చంద్రనందన్ రోడ్డు, నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుండి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది.

  • న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్‌ షాకిచ్చింది.  రైల్వే ప్రయాణికులు ఇకపై ఉచిత పరిమితిని మించి తీసుకెళ్లే లగేజీపై అదనపు ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభలో స్పష్టం చేశారు. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. విమానాల్లో అమలవుతున్న విధానంలాగే రైల్వేలో కూడా సామాను పరిమితి నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు.

    ఈ సందర్భంగా ఏ కోచ్‌లో ఎంతమేర వరకు లేగేజీని తీసుకొని వెళ్లొచ్చు. ఎన్నికేజీల వరకు పరిమితి దాటితే అదనంగా డబ్బులు చెల్లించాలనే వివరాల్ని చదివి వినిపించారు. 

    • క్లాస్‌ వారీగా ఉచిత పరిమితులు

    • సెకండ్‌ క్లాస్‌: 35 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 70 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు..35 కేజీల నుంచి పెరిగితే అదనపు ఛార్జీలు చెల్లించాలి.

    • స్లీపర్‌ క్లాస్‌: 40 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 80 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి.

    • ఏసీ 3-టైర్ / చైర్‌ కార్‌: 40 కిలోల వరకు ఉచితం.

    • ఫస్ట్‌ క్లాస్‌, AC 2-టైర్‌: 50 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 100 కిలోల వరకు అనుమతి.

    • ఏసీ ఫస్ట్‌ క్లాస్‌: 70 కిలోల వరకు ఉచితం. గరిష్టంగా 150 కిలోల వరకు అనుమతి, అదనపు ఛార్జీలు తప్పనిసరి’ అన్నారు. ‘ప్రయాణికులు నిర్దిష్ట పరిమితిని మించి సామాను తీసుకెళ్తే.. రైల్వే నియమాల ప్రకారం ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాలి. ఇది కొత్త నియమం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనే’ అని మంత్రి వైష్ణవ్‌ స్పష్టం చేశారు.



    ఇది కొత్త నియమం కాదు.. కానీ 
    అవును, రైల్వే శాఖ గతంలో కూడా అదనపు సామానుపై ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇది కొత్త నియమం కాదు. కానీ ఇప్పటివరకు కఠినంగా అమలు చేయకపోవడం వల్ల చాలా ప్రయాణికులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.చాలా కాలం పాటు ఈ నియమాలు కఠినంగా అమలు కాలేదు. స్టేషన్లలో సామాను తూకం వేసే వ్యవస్థలు లేకపోవడం, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వసూళ్లు జరగలేదు.

    రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్‌ తరహాలో
    తాజాగా.. రైల్వే శాఖ.. ఎయిర్‌లైన్‌ మాదిరి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన స్టేషన్లలో ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు ఏర్పాటు చేసి, ఉచిత పరిమితిని మించిన సామానుపై తప్పనిసరిగా ఛార్జీలు వసూలు చేయనుంది. కాబట్టి, గతంలో కూడా నిబంధనలు ఉన్నప్పటికీ, అవి సడలింపుతో అమలయ్యాయి. ఇప్పుడు మాత్రం రైల్వే శాఖ కఠినంగా వసూలు చేయబోతోంది.

    కాగా,ప్రతిరోజూ కోట్లాది మంది రైల్వేలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే సామాను పరిమితి నిబంధనలు అమలు చేస్తోంది. అయితే, చాలా మంది ప్రయాణికులు ఈ నియమాల గురించి తెలియకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి.

  • కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం జర్మనీలోని మ్యూనిచ్‌లోని ఆటోమొబైల్ దిగ్గజం BMW ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా భారతదేశంలో క్షీణిస్తున్న  తయారీరంగంపై విచారం వ్యక్తం చేశారు. తన జర్మనీ పర్యటన సందర్భంగా రాహుల్‌ BMW కారు నడుపుతూ దాని, ఫీచర్ల గురించి తెలుసుకుంటూ కనిపించారు. దుబాయ్‌కు చెందిన ఒక కుటుంబంతో సహా అనేక మంది భారతీయులతో కూడా ఆయన సంభాషించారు సందర్శకులతో చిత్రాలకు పోజులిచ్చారు.  రాహుల్‌ గాంధీవీడియోను కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్‌ చేసింది.

    BMWతో భాగస్వామ్యంతో భారత్‌ అభివృద్ధి చేసిన TVS 450cc మోటార్‌ సైకిల్‌ను చూసి గాంధీ సంతోషించారు. భారతీయ ఇంజనీరింగ్‌ను నైపుణ్యాన్ని ఇక్కడ చూడటం గర్వకారణమన్నారు. 

    అయితే తయారీ బలమైన ఆర్థిక వ్యవస్థలకువెన్నెముక. విచారకరంగా, భారతదేశ తయారీ రంగం క్షీణిస్తోంది. వృద్ధిని వేగవంతం చేయడానికి, మరింత ఉత్పత్తి చేయాలని, అర్థవంతమైన తయారీ పర్యావరణ వ్యవస్థలను నిర్మించాలని, అధిక-నాణ్యత ఉద్యోగాలను సృష్టించాలని గాంధీ  పేర్కొన్నారు. 

    కాగా  కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ 5 రోజుల జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు IOC (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్) బృందం  ఆయనకు ఘన స్వాగతం పలికింది. యూరప్‌లోని IOC నాయకులను  రాహుల్‌ కలుస్తారు.  NRIలతో భేటీ అయ్యి, వారి సమస్యలపై, పార్టీ సిద్ధాంతాన్ని మరింతగా వ్యాప్తి చేయాలనే దానిపై చర్చలు జరుపుతారు.

     

  • దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయుకాలుష్యం భూతం వేయి కాళ్లతో విస్తరిస్తోంది. రోజురోజుకూ పెనుభూతంలా మారుతున్న కాలుష్యం కారణంగా వాయు నాణ్యత రికార్డ్‌ స్థాయిల్లో క్షీణిస్తోంది. డబ్ల్యూహెచ్వో నివేదిక కంటే 18 రెట్లు ఎక్కువగా ఢిల్లీలోని సూక్ష్మ కణిక పదార్థం (PM2.5) 2.5 గా ఉందని అంచనా. ఫలితంగా ఢిల్లీలో రోగాలతో ఆస్పత్తుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముసురుకుంటున్న కాలుష్య మేఘాల కారణంగా అనే  రోడ్డు ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదవుతున్నాయి.  

    తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడం, ఊపిరితిత్తుల పనితీరు బలహీనం కావడం ఇలాంటి సమస్యలతో పాటు,అకాల మరణాలకు దారితీస్తుంది. ఢిల్లీ కాలుష్యంతో లంగ్ క్యాన్సర్ ముప్పు ఉందని శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది. పీఎం 2.5, నైట్రోజన్ డయాక్సైడ్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి  చేరడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.  పీఎం 2.5 పెరుగుదలతో లంగ్ క్యాన్సర్ ముప్పు 14శాతం పెరుగుతుందని డబ్ల్యుహెచ్‌వో నివేదిక ద్వారా తెలుస్తోంది. ఎక్కువసేపు బయట పని ప్రదేశంలో ఉంటున్న  యువతీ యువకులపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతోంది.

    వాయు కాలుష్యం ఆరోగ్యం పై ప్రభావం
    వాయు కాలుష్యానికి స్వల్ప మరియు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల స్ట్రోక్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ట్రాకియా, బ్రోంకస్ ,ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు, తీవ్ర ఆస్తమా ,దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు లాంటి పలు వ్యాదులు వస్తాయి.  వాయు కాలుష్యానికి గురికావడంవల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, దైహిక వాపు, అల్జీమర్స్ వ్యాధి , చిత్తవైకల్యానికి దారి తీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తేల్చింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాయు కాలుష్యాన్ని, ముఖ్యంగా PM2.5ని క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా వర్గీకరించింది. దీర్ఘకాలికంగా ఈ కాలుష్యం బారిన పడితే శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న అనారోగ్య పరిస్థితులనుమరింత తీవ్రతరం చేస్తుందని మరొక ప్రపంచ సమీక్ష కనుగొంది.

    ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న పిల్లలు,కౌమారదశలో ఉన్న వారిపై మరింత హానికరమైన ప్రభావం ఉటుంది. వాయు కాలుష్యం బాల్యంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జీవితంలో తరువాతి కాలంలో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

    EEA  లెక్కలు
    యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ (EEA) తాజా అంచనాల ప్రకారం సూక్ష్మ కణ పదార్థం (PM 2.5) ఆరోగ్యానికి గణనీయ మైన ప్రభావాలను కలిగిస్తూనే ఉంది.2021లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూపించే తాజా శాస్త్రీయ ఆధారాలను క్రమబద్ధంగా సమీక్షించిన తర్వాత కొత్త గాలి నాణ్యత మార్గదర్శకాలను ప్రచురించింది. దీని ప్రకారం 2050 నాటికి గాలి, నీరు మరియు నేల కాలుష్యాన్ని ఆరోగ్యానికి మరియు సహజ పర్యావరణ వ్యవస్థలకు హానికరం కాని స్థాయికి తగ్గించడానికి ఒక దార్శనికతను నిర్దేశించింది. దీంతోపాటు జీరో పొల్యూషన్ యాక్షన్ ప్లాన్ 2030కి లక్ష్యాలను నిర్దేశించింది. 

    •  2005తో పోలిస్తే వాయు కాలుష్యం (అకాల మరణాలు) ఆరోగ్య ప్రభావాలను 55శాతం కంటే ఎక్కువ తగ్గించడం.

    • 2005తో పోలిస్తే  జీవవైవిధ్యానికి ముప్పుగా మారుతున్న ఈయూ పర్యావరణ వ్యవస్థల వాటాను 25శాతం తగ్గించడం.
       

      యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ (EEA) అంచనా ప్రకారం 2023లో, పట్టణ జనాభాలో 94.4శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఆరోగ్య ఆధారిత మార్గదర్శక స్థాయి కంటే ఎక్కువ సూక్ష్మ కణాల సాంద్రతలకు గురయ్యారు.27 EU సభ్య దేశాలలో 182,000 అకాల మరణాలు సంభవించాయి.

    ముప్పు గుప్పిట్లో  హైదరాబాద్‌ 
    మరోవైపు ఢిల్లీ నగరం మాత్రమే కాదు హైదరాబాద్‌లో కూడా కాలుష్యం తీవ్రంగానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో వాయుకాలుష్యంతో పాటు, నీటి కాలుష్యం,  శబ్ద, ఆహార కాలుష్యం ఇలా పలు రకాలతో కూడిన కాలుష్య భూతం నగరవాసుల పాలిట ప్రమాదకరంగా పరిణమించి ప్రమాద ఘంటికలను మోగిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని పర్యావరణ  వేత్తలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ట్రాఫిక్ సమస్య కూడా ప్రధాన కారణమని కోర్టు తెలిపింది. ఢిల్లీ వాయుకాలుష్యంపై బుధవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్న తొమ్మిది టోల్‌ప్లాజాలను వేరే చోటుకు మార్చాలని  ఎన్‌హెచ్‌ఐఏకు  నోటీసులు జారీ చేసింది.

    ఢిల్లీ వాయుకాలుష్యంపై నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. వాయు కాలుష్య నివారణకు సరైన నిర్ణయం త్వరతగతిన తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీనగరంలోని 9టోల్ప్లాజాల తాత్కాలిక సస్పెండ్కు వారంలోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "మాకు టోల్‌గేట్స్‌ ద్వారా మీరు సంపాదించే ఆదాయం వద్దు. కానీ మీరు ఖచ్చితంగా ఈ టోల్స్ వల్ల సమస్యలు సృష్టిస్తున్నారు. టోల్ప్లాజా లేకుండా ఖచ్చితమైన ప్లాన్జనవరి 31లోగా రూపొందించాలి" అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు

    కాగా ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్యానికి గత ఆప్ ప్రభుత్వమే కారణమని ఆరాష్ట్ర మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న వాయుకాలుష్య పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి కాలుష్యం అనే జబ్బు అంటించింది కేజ్రీవాల్సర్కారేనన్నారు. అయితే వాయు కాలుష్యానికి బాధ్యత వహించాల్సిందిపోయి ఇప్పుడు ఆ అంశంపై కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారన్నారని మంత్రి ఆరోపించారు.

     

  • లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో దారుణం చోటు చేసుకుంది. స్వల్ప వివాదానికే ఒక వ్యక్తి తన భార్యను, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేశాడు. అంతేకాదు ముగ్గురు బాధితుల మృతదేహాలను వారి ఇంటి ప్రాంగణంలోని ఏడు అడుగుల లోతైన గొయ్యిలో పాతిపెట్టినట్లు  పోలీసులు గుర్తించారు. తల్లీ పిల్లలు  ఆరు రోజులుగా కనిపించకుండా పోవడంతో అందిన ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.  విచారణలో, ఫరూఖ్ నేరం అంగీకరించాడని తెలుస్తోంది.

    నిందితుడిని కాంధ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్హి గ్రామానికి చెందిన ఫరూక్‌గా గుర్తించారు.  పోలీసుల ప్రకారం, ఫరూక్ తన భార్య తాహిరా (32) బుర్ఖా ధరించకుండా తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు ప్రారంభమైన వాగ్వాదం తీవ్రమైంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త  తొలుత భార్యను కాల్చి చంపాడు.  ఆ తరువాత కుమార్తెలు అఫ్రీన్ (14) , సెహ్రీమ్ (7)కూడా పొట్టనబెట్టుకున్నాడు.

    ఈ జంటమధ్య గత కొన్ని నెలలుగా తరచుగా గొడవలు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. కుటుంబ వివాదాలతో ఫరూక్  తల్లిదండ్రులు దావూద్ ,అస్గారి నుండి విడిగా ఉంటున్నాడు. ఈ దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు, వారిలో ముగ్గురు సంఘటన సమయంలో లేనందున ప్రాణాలతో బయటపడ్డారు. డిసెంబర్ 9-10 రాత్రి హత్యలు జరిగాయని పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ పి సింగ్ తెలిపారు. టీ తయారుచేసే నెపంతో ఫరూఖ్ తన భార్యను నిద్రలేపి, ఆపై ఆమెను , పెద్ద కుమార్తెను కాల్చి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమార్తె గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ఇంట్లోనే లోతైన గొయ్యి తవ్వి, మృతదేహాలను పాతిపెట్టి, ఆ ప్రదేశాన్ని ఇటుకలతో కప్పేశాడ. పథకం ప్రకారం ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.  మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఆర్థిక ఒత్తిడి, తరచుగా వాదనలు, కోపం, అవమాన భారంతోనే ఈ తప్పు చేశానని ఫరూఖ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

  • న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు బంగ్లాదేశ్‌ వ్యవహరిస్తోంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.

    ఢాకాలోని షహీద్ మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో అబ్దుల్లా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని తప్పుబట్టారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించని వారికి భారత్ అండగా నిలిస్తే, తాము కూడా భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాద శక్తులకు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే, ఆ అగ్ని జ్వాలలు సరిహద్దులు దాటి భారతదేశానికి కూడా వ్యాపిస్తాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నరికివేసేలా (చికెన్ నెక్ కారిడార్‌ను ఉద్దేశించి) బంగ్లాదేశ్ తన వ్యూహాలను అమలు చేయగలదని అబ్దుల్లా పేర్కొనడం కలకలం రేపింది. అస్సాం, మేఘాలయ, త్రిపుర  తదితర రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ  నేపధ్యంలో అక్కడ వేర్పాటువాద శక్తులను ప్రోత్సహిస్తామనే బంగ్లాదేశ్‌ హెచ్చరికను భారత్ భద్రతా పరమైన ముప్పుగా భావిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా భారత్ తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని అబ్దుల్లా ఆరోపించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, భారత్ పట్ల పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని భారత్ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది. 

    ఇది కూడా చదవండి: పుస్తకాల మధ్య ప్రాణవాయువు.. ‘అతుల్’‌ కష్టం ఎవరికీ వద్దు!

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. PAC సభ్యులుగా వంగా గీత (పిఠాపురం), షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ (కదిరి) నియమితులయ్యారు.

    కాగా, ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగిన సంగతి తెలిసిందే. షేక్‌ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి),  సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్‌ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు.

  • సాక్షి, తాడేపల్లి: జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న కోటి సంతకాల ప్రతులను బుధవారం.. ఆ పార్టీ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్‌ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం? అంటూ ప్రశ్నించారు.

    మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు ప్రజల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. కోటిమందికి పైగా చేసిన సంతకాలే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై వెల్లువెత్తిన ప్రజా నిరసనకు నిదర్శనమని, ప్రభుత్వ నిర్ణయంపై ఇది కచ్చితంగా రెఫరెండమే అని ఆయన తేల్చి చెప్పారు. ఏపీని మెడికల్ హబ్ గా మార్చాలని కలగన్నవైఎస్‌ జగన్ అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

    అయితే అధికారంలోకి రాగానే కాలేజీల నిర్మాణాలను నిలిపివేసిన చంద్రబాబు.. కమిషన్ల కక్కుర్తితోనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మమ్మాటికీ ముందస్తు కుట్రేనని.. . ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు. కాలేజీల ప్రైవేటీకరణతో పాటు అప్పనంగా ఆస్తులు అప్పగిస్తున్న చంద్రబాబు.. అదనంగా 2 ఏళ్ల పాటు రూ.1400 కోట్లు జీతాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలన్న నిర్ణయం.. మరో భారీ కుంభకోణమని స్పష్టం చేశారు.

    చంద్రబాబు తీరుకు నిరసనగా రేపు సాయంత్రం(డిసెంబర్‌ 18, గురువారం) వైఎస్‌ జగన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గౌరవ గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు సమర్పిస్తారని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన... లేనిపక్షంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే వీటిపై సమీక్షించి, బాధ్యులను బోనెక్కిస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

    ఏపీని మెడికల్ హబ్ చేయడమే వైఎస్‌ జగన్ లక్ష్యం:
    ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకుని రావటమే కష్టం, అలాంటి అనుమతులన్నీ వైఎస్‌ జగన్ సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కాలేజీలు తెచ్చారు. దేశంలోనే ఉత్తమ మెడికల్ హబ్‌గా ఏపీని మార్చాలని జగన్ కలలు కన్నారు. ఆ మేరకు కింది స్థాయి నుండి పటిష్ఠం చేసుకుంటూ వచ్చారు.

    తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసింది. అనంతరం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. ప్రైవేటు రంగంలోనే అత్యుత్తమ సేవలందుతాయని తాను నమ్ముతున్న సిధ్దాంతాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. తాను అధికారంలో లేనప్పుడు ఎప్పుడూ ప్రైవేటు రంగం గురించి నోరెత్తని చంద్రబాబు.. గెలిచిన తర్వాత ప్రైవేటు రంగంలో మంచి సేవలు అందుతాయని చెప్పడం అలవాటు.

    ఆర్థిక వనరులు లోటు లేకున్నా ప్రైవేటీకరణ మంత్రం:
    వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ వైద్య కళాశాలను పూర్తి చేయకుండానే, కేవలం కాలేజీలని నిర్మించాలని లక్ష్యంగా మాత్రమే చెబితే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం కష్టమని చెప్పడంలో అర్ధముంది. కానీ ఐదు మెడికల్ కాలేజీలను వైఎస్‌ జగన్ పూర్తి చేసి, ఆ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగి, విజయవంతంగా కాలేజీలు నడుస్తున్నాయి. మరో రెండు కాలేజీలు పూర్తయ్యాయి.. మరో మూడు కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.

    అంటే మొత్తం 10 కాలేజీలు దాదాపు పూర్తైన దశలో ఎందుకు వాటిని ఆపాల్సి వచ్చింది. మరో కీలకమైన అంశం ఏమిటంటే... కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేకుండా వివిధ ఆర్ధికసంస్ధలతో వైయస్.జగన్ ప్రభుత్వమే టై అప్ అయింది. నీకు కావాల్సిందల్లా కాలేజీల నిర్మించాలన్న మనసు మాత్రమే. అదే చంద్రబాబుకు లేదు. 

    చంద్రబాబు హెరిటేజ్‌తో సహా ఎవరైనా ప్రైవేటు రంగంలో ఉచితంగా సేవలు అందిస్తారా? రూపాయి పెట్టుబడి పెట్టి రూ.10, రూ.20, రూ.50 ఎలా సంపాదించాలనే వస్తారు. చంద్రబాబు ఏం చెప్పినా పీపీపీ అనేది ఓ పెద్ద స్కామ్. ఇంకా జనాల చెవిలో పువ్వులు ఎలా పెట్టగలననుకుంటున్నాడో తెలియడం లేదు? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కోసం వైఎస్‌ జగన్ అక్టోబరులో పిలుపునిస్తే... ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రజాస్పందన చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయం చంద్రబాబుకు అర్థం కావడం లేదు. కోటి సంతకాలకు అక్టోబరులో పిలుపునిస్తే.. జనంలో వస్తున్న స్పందన అందరికీ తెలుసు.

    ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రిఫరెండంలా.. చరిత్రలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎప్పూడూ చూడని విధంగా తొలిసారిగా ఇంత పక్కాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. వైయస్సార్సీపీ ఆధ్యర్యంలో ప్రతిచోటా జనంలోని వెళ్లి సంతకాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదలతో పాటు సమసమాజం కావాలనుకునేవాళ్లు,  సమాజంలో అసమానతలు తగ్గించాలని కోరుకునేవారు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు.

    ప్రైవేటీకరణే చంద్రబాబు విజన్:
    ఇవాల్టికి చంద్రబాబు కొంచెం తగ్గి.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం పేరు పెద్దదిగా ఉంటే.. ప్రైవేటు వాళ్ల పేరు చిన్న అక్షరాల్లో ఉంటుందని చెబుతున్నారు. కాలేజీల భవనాలు, ఆసుపత్రులు, భూమి అంతా ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్లు పేరు పెట్టినా, పెట్టకపోయినా ఏం ప్రయోజనం ఉంటుంది. పైగా వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించడానికి అంగీకరించడం మరించి ఆశ్చర్యకరం. ఇన్ని ప్రైవేటు వారికి ఇచ్చినప్పుడు... ప్రభుత్వమే ఎందుకు నిర్వహించలేకపోతుంది?

    మెడిసిన్ చేయాలనుకునే విద్యార్ధులు తొలుత ప్రభుత్వ కాలేజీలనే కోరుకుంటారు. కారణం ఆయా కాలేజీలకు వచ్చే పేషెంట్లు, ఉత్తమ సర్వీసులు, మంచి శిక్షణ అందుతుందన్న ఆలోచనతోనే ఎంచుకుంటారు. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం.. వైఎస్‌ జగన్ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెడితే... మేం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నింటినీ రద్దు చేసి ఉచితం చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్నే నిలిపివేశారు.

    ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సపోర్టు చేసి నెత్తిన పెట్టుకునే ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన మొదటి నుంచి ఇదే తీరు. కేవలం కాసుల కోసం కక్కుర్తి పడి ప్రైవేటీకరణ చేయడం ఒక అంశం అయితే... ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్యరంగంలో ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. వైయస్.జగన్ విజయవంతంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే...  దాన్ని కొనసాగించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు 100 శాతం మెడికల్ సేవలు ఉచితం అని చెప్పాడు. ఇవాళ 100 శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా వస్తాయని, 70 శాతం ఇన్ పేషెంట్ కేటగిరీలో ఉచితం అని చెబుతున్నాడు. ఇవన్నీ ఎవరికి చెబుతున్నావ్ చంద్రబాబూ?

    జీతాలు చెల్లింపు మరో కుంభకోణం..
    వైఎస్‌ జగన్ ఇప్పటికే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి, విజయవంతంగా నిర్వహించవచ్చని, సామర్థ్యం ఉన్న సిబ్బందిని నియమించవచ్చని నిరూపించిన తర్వాత.. ఇవాళ చంద్రబాబు దాన్నుంచి పక్కకు పోవడం అంటే ఇది పెద్ద కుంభకోణం. రెండో కుంభకోణం.. రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని చెప్పడం. ఒక వైపు మెడికల్ కాలేజీలను నిర్మించడానికి డబ్బుల్లేవు అని చెబుతూ... మెడికల్ కాలేజీలను, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, భూమితో సహా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూనే.. వారికి రెండేళ్ల జీతాలు కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడం అంటే ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.8 కోట్లు చొప్పున 10 మెడికల్ కాలేజీలకు రూ.80 కోట్లు ఖర్చువుతుంది. రెండేళ్లకు రూ.1400 కోట్లు ఇవ్వాలి. ఈ డబ్బులతో  కాలేజీలు పూర్తి కావా?

    ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో వైద్యం ఖర్చు ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇవాళ కొత్త ట్రీట్మెంట్ వచ్చిందంటే అది ఎన్ని లక్షలు కట్టమంటే అంతా కట్టాల్సిందే? ఇక్కడ మొదలుపెట్టి ప్రైమరీ హెల్త్ కేర్‌ను కూడా ప్రైవేటుకు కచ్చితంగా అప్పగిస్తాడు. అంటే మొత్తం వైద్య ఆరోగ్యరంగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. మన ఆర్దిక వ్యవస్ధలో ప్రైవేటు ఉండడం మన మార్కెట్ ఎకానమీలో భాగం.

    ప్రజల పట్ల ప్రేమ - పాప భీతి లేని వ్యక్తి చంద్రబాబు
    లాభం లేకుండా ప్రైవేటు వ్యాపారులు రారని తెలిసి, వాళ్లకు లాభాలిచ్చి, నువ్వు వేల కోట్లు కుమ్మిరించి.. ఇక్కడ అవసరమైన రూ.2-3 వేల కోట్లు పెట్టలేదంటే చంద్రబాబు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఆయన సేవలు చేయనవసరం లేదు, కానీ ద్రోహం చేయడం మహాపాపం. నా వల్ల ఇంత నష్టం జరుగుతుందన్న భయం కానీ పాపభీతి కానీ రెండూ చంద్రబాబుకు లేవు. అందుకే నేటికీ ప్రైవేటీకరణ మంచిదని బుకాయిస్తున్నాడు.

    రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల వెల్లువ
    ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరనసగా వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు అక్టోబర్‌లో సంతకాల సేకరణ ఉద్యమం మొదలుపెట్టి... రెండు నెలల కాలంలో 1 కోటి సంతకాలను లక్ష్యంగా పెడితే... 1,04,11,136 సంతకాలు వచ్చాయి. ఈ సంతకాలన్నీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తే... సంతకం చేయమని అడిగితే..

    రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో చేసినవే. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళంలో జిల్లాలో 4,02,833, విజయనగరం జిల్లాలో 3,99,908, పార్వతీపురం మన్యం 2,15,500,  అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,47,000, విశాఖపట్నం 4,19,200, అనకాపల్లి జిల్లాలో 3,73,000, కాకినాడ జిల్లాలో 4,00,600, బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,20,086, తూర్పుగోదావరి జిల్లాలో 4,06,929, పశ్చిమ గోదావరి జిల్లాలో 4,19,650, ఏలూరు జిల్లాలో 3,60,008, కృష్ణా జిల్లాలో 3,77,336, ఎన్టీఆర్ జిల్లాలో 4,31,217, గుంటూరు జిల్లాలో 4,78,059,

    ..పల్నాడు జిల్లాలో 4,31,802, బాపట్ల జిల్లాలో 3,73,199,  ప్రకాశం జిల్లాలో 5,26,168, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 6,30,040, కర్నూలు జిల్లాలో 3,98.277, నంద్యాల జిల్లాలో 4,05,500, అనంతపురం జిల్లాలో 4,55,840, శ్రీసత్యసాయి జిల్లాలో 4,40,358, వైయస్సార్ జిల్లాలో 4,80,101, అన్నమయ్య జిల్లాలో 2,60,500, చిత్తూరు జిల్లాలో 7,22,025 మొత్తం 1 కోటి 3 లక్షల 71వేల 136 సంతకాలు చేరాయి. ఇవి కాకుండా కేంద్ర కార్యాలయానికి చేరిన మరో 40వేలు సంతకాలు కలిపి మొత్తం... 1, 04,11,136 నిఖార్సైన సంతకాలతో ప్రవైటీకరణకు వ్యతిరేకంగా తమ మద్ధతు తెలిపారు.

    బ్యాలెట్ తీర్పు తరహాలో ప్రజాభిప్రాయం:
    రాష్ట్రంలో ప్రజాభిప్రాయసేకరణలో ఇంత పక్కాగా బ్యాలెట్ బాక్సులో తీర్పునిచ్చినట్లు.. రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారు. 1.04 కోట్ల మంది సంతకాలు అంటే అన్ని కుటుంబాలు సంతకాలు చేశారంటే... రాష్ట్రంలో  మొత్తం కుటంబాలు 1.60 కోట్లు పైగా ఉంటే...  అందులో 1.04 కోట్ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.

    ఇంతమంది సంతకాలు చేసిన తర్వాత చంద్రబాబు పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఆయనే తీసుకుని... మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలి. 
    టిడ్కో ఇళ్ల విషయంలో కూడా గతంలో చంద్రబాబు డబ్బులు వసూలు చేసి పూర్తి చేయకుండా వదిలేస్తే.. వైఎస్‌ జగన్ హయాంలో క్రెడిట్ కూడా క్లెయిమ్ కూడా చేయకుండా.. ఉచితంగా అందించారు. అది వైఎస్‌ జగన్‌కు ఉన్న ఆలోచన. రాజకీయం కోసం ప్రజలతో ఆడుకోవడం సరికాదు. వైఎస్‌ జగన్ హయాంలో కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో చూపించుకున్నాడు.  ఏమాత్రం జంకులేకుండా క్లెయిమ్ చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు.

    కాలేజీల నిర్మాణానికి కుంటిసాకులు:
    ఇవాళ మెడికల్ కాలేజీలను కూడా తానే కట్టానని చంద్రబాబు క్లెయిమ్ చేసుకోవచ్చు.. కానీ ప్రైవేటీకరణ చేసి ప్రజల ఉసురు తీసుకోవద్దు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దు. వైఎస్‌ జగన్ ప్రారంభించిన వాటి నిర్మాణం కొనసాగిస్తే సరిపోతుంది. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు చేసిన రూ. 2.60 లక్షల కోట్లకు పైగా అప్పులో .. కొంత మెడికల్ కాలేజీల కోసం వెచ్చిస్తే సరిపోయేది. కానీ కుంటిసాకులు వెదుకుతూ, పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్పిందని తన అనుకూల పత్రికల్లో రాయించుకోవడం మానేసి... చేసి చూపించాలి వైఎస్సార్‌ ఉచిత కరెంటు ఇవ్వడం అసాధ్యమని అందరూ అన్నారు.. దాన్ని ఆయన చేసి చూపించేసరికి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు.

    నీవు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సాధ్యం కాదు అనుకున్నావు.. కానీ వైఎస్‌ జగన్ వాటిని చేసి చూపిస్తే దాన్ని కొనసాగించ లేకపోవడం దారుణం. భవిష్యత్తు తరాలకు 20, 30 ఏళ్లు గడిచిన తర్వాత... మెడిసిన్‌లో గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకునే అవకాశాన్ని చేతులారా చంద్రబాబు చంపేస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రబాబుకు మంచి బుద్ధి కలిగి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నాం.

    ఇదే విషయంపై రేపు సాయంత్రం 4 గంటలకు వైఎస్‌ జగన్ ఒక ప్రతినిధి బృందంతో... గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వడంతో పాటు, సంతకాల ప్రతులను ఆయనకు సమర్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అప్పటికైనా చంద్రబాబు కుట్రపూరితమైన, తన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

    అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానమిస్తూ..
    రోడ్లు పీపీపీ విధానంలో నిర్మిస్తే అవి ప్రభుత్వం వద్దే ఉంటాయి కదా అని ప్రశ్నించగా.. అలా చేయడం వల్ల టోల్ గేట్ల ఖర్చు భారీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఇవేవీ లేవని.. ప్రైవేటు వ్యక్తులు లాభాపేక్ష లేకుండా ఎందుకు వస్తారని నిలదీశారు. మెడికల్ కాలేజీలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని... ఏ దేశమైనా ప్రభుత్వ పరిధిలేకుండా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయలేదని గుర్తు చేశారు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు.. వాటి ధరలను సమాజం భరించలేదని... అందుకే ప్రభుత్వం వాటిని బేలన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కోటి సంతకాలు ఎవరు చేశారన్నది.. తెలుగుదేశం పార్టీ నేతలందరికీ తెలుసు. ప్రైవేటీకరణ విషయంలో మారిన చంద్రబాబు మాట తీరే ఇందుకు నిదర్శనం. అయినా మొండిగా  ముందుకు వెళ్తూ చంద్రబాబు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు.

    వైఎస్‌ జగన్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ పైనాన్స్ సీట్లు ప్రవేశపెడితే.. ఇదే కూటమి నేతలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం సీట్లు ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాలేజీలనే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 108 సేవలకు సంబంధించి ప్రతిచోటా మొత్తం ప్రభుత్వం చేయాలనుకోవడం మంచి మార్గం. ఒకవేళ అది కాకపోతే ప్రభుత్వ కంట్రోల్ ఉంచేలా చూడాలి. కానీ కూటమి నేతలు మేం అధికారంలోకి వస్తే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేసి మొత్తం ఉచితంగా భర్తీ చేస్తామని చెప్పి... ఇవాళ ప్రైవేటీకరణకు వెళ్లడమే మంచిదని వితండవాదం చేయడం దుర్మార్గం.

    రాజధాని నిర్మాణం కోసం డిజైన్లు, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లాది రూపాయులు ఖర్చుపెడుతున్నారు. కానీ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వచ్చేసరికి చేయాలన్న ఉద్దేశం లేకపోవడంతోనే ప్రైవేటీకరణ  చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మాత్రం ఇలా చేయడం దుర్మార్గం. ఉచితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైయస్.జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి చూపించిన తర్వాత కూడా ఇలాంటి వాదన చేయడం అర్ధరహితమని తేల్చి చెప్పారు.

     

  • సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాలు కాదు.. చంద్రబాబు పతనానికి పునాదులు’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ మీద ఉన్న కోపంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. విశాఖ ఉక్కును సైతం ప్రైవేటీకరణ చేస్తారా? అంటూ గోరంట్ల మాధవ్‌ నిలదీశారు.

    భూమి, బిల్డింగ్‌లు అన్నీ ప్రభుత్వమే ఇస్తే నీ బినామీలకు దోచి పెడతారా?. వంద రూపాయలకే ఎకరం భూమి ఇస్తారా?. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కాలేజీలను ప్రైవేట్‌ వారికి ఇచ్చి జీతాలు మాత్రం ప్రభుత్వమే ఇస్తుందంట.. ఆదాయం మాత్రం ప్రైవేట్‌ వారే తీసుకుంటారట. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి’’ అని గోరంట్ల మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

     

  • సాక్షి, తాడేపల్లి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని.. పీపీపీ ముసుగులో అడుగడుగునా అడ్డగోలు దోపిడీకి తెర తీశారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌.. చంద్రబాబు విధానాలను నిలదీశారు.

    కుడిచేత్తో కాలేజీలిచ్చి.. ఎడమ చేత్తో కమీషన్లు: గుడివాడ అమర్‌నాథ్‌
    మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైయస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొన్నారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, 7 కాలేజీలను పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టి 10 మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయించడంపై ప్రజలు మండి పడుతున్నారు.

    కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ అవినీతి దాగి ఉందన్న వైఎస్సార్‌సీపీ వాదనను ప్రజలు అర్థం చేసుకున్నారు. గత మా ప్రభుత్వం నిర్మించిన కాలేజీలు, ఆస్పత్రులతో పాటు ఆయా ఆస్పత్రుల పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములను కాజేయాలన్న కుట్రతోనే  చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

    సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఒక వైపు ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్ల అప్పు చేయడమే కాక, మెడికల్‌ కాలేజీల రూపంలో జగన్‌ సృష్టించిన వేల కోట్ల విలువైన సంపదను ప్రైవేటుకి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు ఆయా కాలేజీల్లో పనిచేసే స్టాఫ్‌కి రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో ప్రజా సంపదను దోచిపెడుతున్నాడు. కుడి చేతితో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకి రాసిచ్చి, జీతాల రూపంలో ఒక్కో ఏడాది ఇచ్చే దాదాపు రూ.800 కోట్ల సొమ్మును ఎడమ చేత్తో వారి నుంచి లాక్కుంటున్నాడు. తన దోపిడీ కుట్రలను యథేచ్ఛగా అమలు చేయడానికి నిస్సిగ్గుగా పార్లమెంట్‌ స్థాయీ సంఘం నివేదికను కూడా వక్రీకరించేస్తున్నాడు. కిక్‌ బ్యాక్‌ల కోసం తాను ఎంతకైనా దిగజారుతానని చెప్పకనే చెబుతున్నాడు.

    జీతాల చెల్లింపుల పేరుతో రూ.1400 కోట్లు దోపిడీ: గోరంట్ల మాధవ్‌
    పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రలను రాష్ట్ర యువత, మేథావులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కూటమి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించే దర్జాగా దోపిడీకి బాటలు వేసుకుంటున్నాడు. రేపు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై లోతైన విచారణ చేసి నిందితులు ఎవరున్నా వదిలి పెట్టబోము. న్యాయస్థానాల్లో నిలబెట్టి కఠినంగా శిక్షించే వరకు వెనకాడబోము.

    కేవలం దోపిడీ ఆలోచనలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. జగన్‌గారు నిర్మించిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టు కాలేజీలను దక్కించుకున్న 10 మెడికల్‌ కళాశాలల ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా మరో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా ప్రజల ఆస్తులను అప్పనంగా తన బినామీలకు దోచిపెట్టే కుట్రే. ఒక్కో కాలేజీకి ఏడాదికి రూ.70 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ. 140 కోట్లు.. రెండేళ్లలో 10 మెడికల్‌ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు దోచిపెట్టే కుట్రకు తెర లేపారు. కుడిచేత్తో కాలేజీలను, కాలేజీ భూములను వారి చేతిలో పెట్టి.. ఎడమ చేత్తో జీతాల పేరుతో ఇచ్చిన రూ.1400 కోట్ల డబ్బును వారి నుంచి తీసుకునే దోపిడికి స్కెచ్‌ వేశాడు. ఇందుకు రాబోయే రోజుల్లో చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు.

    ప్రైవేటీకరణ వెనుక లక్ష కోట్ల దోపిడీ: :మొండితోక అరుణ్‌కుమార్‌
    మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు లక్ష కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో వైయస్‌ జగన్‌ గారు నాడు 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు 7 కాలేజీలను పూర్తి చేసి 5 కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఒక్కో మెడికల్‌ కాలేజీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మెడికల్‌ కాలేజీల రూపంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల విలువైన సంపద సృష్టిస్తే. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు దాన్ని తన బినామీలకు ధారాదత్తం చేసే కుట్రలకు తెరలేపాడు.

    నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, తన పాలనలో ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా నిర్మించకపోగా.. వైఎస్‌ జగన్‌ నిర్మించిన కాలేజీలను 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు. మెడికల్‌ కాలేజీలకున్న 50 ఎకరాలు ప్రభుత్వ భూమి, భవనాలు ప్రభుత్వానివి వాటి విలువ వందల కోట్లలో ఉంటే ఎకరా రూ.100లకు ధారాదత్తం చేశాడు. ఇది కాకుండా రెండేళ్లపాటు జీతాలు చెల్లించే పేరుతో 10 మెడికల్‌ కాలేజీలకు దాదాపు రూ.1400 కోట్లు ముట్టజెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు. ప్రభుత్వ సంపదపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం అప్పజెబుతున్నాడు.

    మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన వచ్చింది. 1.36 కోట్ల మందికిపైగా సంతకాలు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని బాహాటంగానే తప్పుబట్టారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లెలో కూడా సగం మందికిపైగా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారంటే ఏ విధంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మెడికల్‌ కాలేజీలపై పీపీపీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు మా పార్టీ వెనక్కి తగ్గబోదు.

    ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే..
  • న్యూఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.

    ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్‌ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.

    కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రధాన మార్గమని మేడ రఘునాథ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ హైవేపై సర్వే నిర్వహించి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

    ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు.

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ..‘హాస్టళ్లలో నీళ్లు సరిగా లేవు, బాత్‌రూమ్‌లు సరిగా లేవు. కలుషిత నీరు ఇవ్వడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇది మనందరం సిగ్గుపడే విషయం’ అని అన్నారు.  

    ఇన్నాళ్లూ మంత్రులు హాస్టళ్లలో నీటి సమస్య లేదని, కలుషితం కాలేదని బుకాయించారు. కానీ ఇటీవల మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  హాస్టళ్లలోని దుస్థితిని బయటపెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించగా.. ఇప్పుడు తన పాలనా వైఫల్యాల్ని చంద్రబాబు సైతం అంగీకరించడం గమనార్హం. 


     

     

  • సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రెడిట్‌ చోరీని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తన ఖతాలో వేసుకున్న చంద్రబాబు మరోసారి క్రెడిట్‌ చోరీకి సిద్ధమయ్యారు. 

    ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పేరును   మార్చి ఇకపై వాటిని ‘స్వర్ణ  గ్రామం’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. క్రెడిట్‌ చోరీకి సిద్ధమయ్యారు.  

    వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ గ్రామంలోనే అన్ని ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కలిగింది. పలు శాఖల పనులను ఒకే కేంద్రంలో సమీకరించడం వల్ల ప్రజలకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.  

    కొత్త పేరుతో కొనసాగింపు
    అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం, ఈ వ్యవస్థను కొనసాగిస్తూ..దానికి కొత్త పేరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘స్వర్ణ గ్రామాలు’ అనే పేరుతో క్రెడిట్‌ చోరీకి పాల్పడ్డారు.

    చంద్రబాబుపై విమర్శలు
    చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్‌ జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్చి క్రెడిట్‌ తీసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

Sports

  • టీమిండియా- సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ విజేత తదుపరి మ్యాచ్‌లో తేలనుంది. లక్నో వేదికగా బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 టాస్‌ పడకుండానే రద్దై పోయింది. అయితే, ఎప్పటిలా వర్షం వల్ల కాకుండా.. ఈసారి పొగమంచు కారణంగా మ్యాచ్‌ మొదలుకాకుండానే ముగిసిపోయింది.

    స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో వరుస విరామాల్లో మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం 6.30 నిమిషాలకు టాస్‌ పడాల్సి ఉండగా.. ఈ కారణం వల్లే తొలుత ఆలస్యమైంది. ఈ క్రమంలో వరుస విరామాల్లో అంపైర్లు వచ్చి సమీక్ష నిర్వహించారు. మైదానమంతా కలియదిరుగుతూ బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల స్థానాల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అని పరిశీలించారు.

    పదే.. పదే
    ఇందులో భాగంగా 6.50 నిమిషాలకు ఓసారి.. 7.30 నిమిషాలకు మరోసారి.. ఆపై.. 8 గంటలకు.. అనంతరం 8.30 నిమిషాలకు.. మైదానంలోకి వచ్చిన అంపైర్లు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచాలని సూచించారు. ఈసారి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాతోనూ వారు మాట్లాడటం గమనార్హం.

    అనంతరం 9 గంటలకు మరోసారి రివ్యూ చేసిన అంపైర్లు.. ప్రేక్షకుల సహనానికి మరోసారి పరీక్ష పెట్టారు. ఈసారి 9.25 నిమిషాలకు మరోసారి రివ్యూ చేస్తామని చెప్పి మైదానం వీడారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేడియంలోని ప్రేక్షకులు కంగుతిన్నారు. మ్యాచ్‌ సాగుతుందా? లేదా? అన్న అంశంపై త్వరగా తేల్చకుండా ఇదేం తీరు అనేలా రియాక్షన్స్‌ ఇచ్చారు.

    మరోవైపు.. లక్నోలో పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సాగదని తెలిసినా ఎందుకు సాగదీస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక కామెంటేటర్లు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఎట్టకేలకు
    ఈ క్రమంలో... 9.25 నిమిషాలకు మరోసారి మైదానంలోకి వచ్చి పరిస్థితి పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.

    కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ‍తొలుత కటక్‌లో భారత్‌ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

    ఈ క్రమంలో సిరీస్‌ 1-1తో సమం కాగా.. ధర్మశాల వేదికగా మూడో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది.. 2-1తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య బుధవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌ టాస్‌ పడకుండానే ఇలా ముగిసిపోయింది. ఇక సిరీస్‌ విజేతను తేల్చే శుక్రవారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

    చదవండి: నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌!

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్‌ ఆడిన ఈ ముంబైకర్‌.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్‌ రిచ్‌లో పునరాగమనం చేయనున్నాడు.

    ఐదుసార్లు చాంపియన్‌ జట్టు అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సర్ఫరాజ్‌ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

    సర్ఫరాజ్‌ స్పందన ఇదే
    సోషల్‌ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్‌కే’’ అంటూ సర్ఫరాజ్‌ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్‌ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.

    కాగా దేశవాళీ క్రికెట్‌లో రన్‌ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్‌ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. 

    ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్‌ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. 

    కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో యాభై మ్యాచ్‌లు ఆడి.. 585 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. మరోవైపు.. సర్ఫరాజ్‌ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.

    అమ్ముడుపోని స్టార్లు వీరే
    ఐపీఎల్‌లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్‌ కాన్వే, జేక్‌ ఫ్రేజర్, గస్‌ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్‌ కొయెట్జీ, ముజీబుర్‌ రహమాన్, మహీశ్‌ తీక్షణ, స్టీవ్‌ స్మిత్, డారిల్‌ మిచెల్, షాయీ హోప్... 

    టామ్‌ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్‌ ఉల్‌ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్‌ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్‌హఖ్‌ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్‌ హుడా, మయాంక్‌ అగర్వాల్, కరణ్‌ శర్మ, మనన్‌ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు. 

  • భారత్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పొగమంచు అంతరాయం కలిగించింది.  ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్‌ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమైనట్లు సమాచారం.

    పేలవ ప్రదర్శన
    కాగా ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్‌ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్‌.. నాటి నుంచి ఓపెనర్‌గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).

    తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్‌ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాగా గిల్‌ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌లను యాజమాన్యం విడదీసింది.

    సంజూను పక్కనపెట్టేసి మరీ..
    అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ అతడికి గిల్‌ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్‌ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్‌ దూరమైనట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.

    కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్‌.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్‌ కెప్టెన్‌ కాగా.. టీ20లలో సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

    చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

  • టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ ముగిసిపోయింది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం.. సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్‌ వేయాల్సి ఉండగా పొగమంచు కమ్ముకుంది. దీంతో 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. 

    దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

    వీడిన సస్పెన్స్‌
    ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అ‍న్న విషయాన్ని పరిశీలించారు. 

    ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పుడూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగగా.. ఈసారీ స్పష్టత రాలేదు. 9.25 నిమిషాలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించిన అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌కు తెరదించారు.

    రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్‌ అహ్మద్‌
    కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్‌ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

    ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్‌ స​మం చేసింది. 

    అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది.

    చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

  • టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్‌ చక్రవర్తి బద్దలు కొట్టాడు.

    అత్యుత్తమంగా 32 వికెట్లు
    కాగా 2021 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్‌లలో కలిపి వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.

    సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్‌.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపాడు.

    818 రేటింగ్‌ పాయింట్లు
    టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్‌ చక్రవర్తి.. రేటింగ్‌ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్‌ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్‌ జేకబ్‌ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.

    అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గానూ వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్‌ బెస్ట్‌ 783 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్‌ ఇప్పుడు దానిని అధిగమించాడు.

    అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉన్న టాప్‌-10 ఓవరాల్‌ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్‌ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే. 

    ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్‌ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.

    పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్‌ బౌలర్‌ రేటింగ్స్‌
    👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865
    👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864
    👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858
    👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832
    👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828
    👉తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా)- 827
    👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822
    👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818
    👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811
    👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.

    చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్‌కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.

    ఐపీఎల్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్‌ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌... ఐపీఎల్‌ వేలంలో ప్రశాంత్‌ వీర్ (Prashant Veer), కార్తీక్‌ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.

    రంజీ ట్రోఫీ, ముస్తాక్‌ అలీ టోర్నీ, భారత్‌ ‘ఎ’, అండర్‌–19, అండర్‌–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం.  ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...

    ధోనీకి ప్రత్యామ్నాయమా! 
    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్‌ ధోనినే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) వికెట్‌ కీపర్‌గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. 

    దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా షాట్‌లు ఆడగల ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.

    అంతకుముందే టీమిండియా ప్లేయర్‌ సంజూ శాంసన్‌(Sanju Samson)ను ట్రేడింగ్‌లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్‌ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది.  

    జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... 
    ఐపీఎల్‌ వేలానికి ముందే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్‌ వీర్‌ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అయిన ప్రశాంత్‌... లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల సమర్థుడు. 

    ఉత్తర ప్రదేశ్‌ లీగ్‌లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్‌... ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 2 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్‌లాడి 160కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. 

    చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

  • భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కార్తీక్‌ శర్మ (Kartik Sharma), ప్రశాంత్‌ వీర్‌ (Prashant Veer).

    రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్‌ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్‌ వీర్‌లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌‌ కోట్లాభిషేకం చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్‌ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. 

    అత్యధిక ధర
    ఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.

    కారణం ఇదే
    ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్‌ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్‌ పంత్‌)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.

    ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అయిన కామెరాన్‌ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్‌ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్‌ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. 

    అత్యధిక పర్సు వాల్యూతో..
    కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్‌ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్‌ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.

    వీరితో పాటు తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్‌ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.

    ఐపీఎల్‌-2026కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఇదే
    అజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌ కామెరాన్‌ గ్రీన్‌, మతీశ పతిరణ, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, తేజస్వి సింగ్‌ , రచిన్‌ రవీంద్ర, ఫిన్‌ అలెన్‌ , సీఫెర్ట్‌, ఆకాశ్‌దీప్‌, రాహుల్‌ త్రిపాఠి , కామ్రా , సార్థక్‌ రంజన్‌ , ప్రశాంత్‌ సోలంకి, కార్తీక్‌ త్యాగి.

    చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 సీజన్‌కు పది ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వేలానికి ముందు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. మంగళవారం నాటి వేలంపాటలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. 

    అబుదాబి వేదికగా జరిగిన వేలంలో.. అత్యధిక పర్సు (రూ. 64.3 కోట్లు) కలిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది.

    మరోవైపు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు కార్తీక్‌ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌(రూ. 14.20 కోట్లు)లపై కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కూడిన పది జట్ల వివరాలు మీకోసం..

    ముంబై ఇండియన్స్‌ 
    అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
    అల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    క్వింటన్‌ డి కాక్‌ (రూ.1 కోటి), మయాంక్‌ రావత్‌ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్‌ (రూ. 30 లక్షలు), మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ (రూ. 30 లక్షలు), డానిశ్‌ మాలేవర్‌ (రూ. 30 లక్షలు). 

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, ఎంఎస్‌ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్‌), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్‌ చౌదరి.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    కార్తీక్‌ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌ (రూ.14.20 కోట్లు), రాహుల్‌ చహర్‌ (రూ.5.20 కోట్లు), మాట్‌ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్‌ హొసీన్‌ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్‌ (రూ.1.50 కోట్లు), జాక్‌ ఫూల్క్స్‌ (రూ.75 లక్షలు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.75 లక్షలు), అమన్‌ ఖాన్‌ (రూ.40 లక్షలు). 

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    అజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    కామెరాన్‌ గ్రీన్‌ (రూ. 25.20 కోట్లు), మతీశ పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    ప్యాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, అనికేత్‌ వర్మ, జీషన్‌ అన్సారీ, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌​ కార్స్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    లివింగ్‌స్టోన్‌ (రూ.13 కోట్లు), జేక్‌ ఎడ్వర్డ్స్‌ (రూ.3 కోట్లు), సలీల్‌ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్‌ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్‌ (రూ. 30 లక్షలు), అమిత్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు), ఓంకార్‌ (రూ. 30 లక్షలు), సాకిబ్‌ హుస్సేన్‌ (రూ. 30 లక్షలు), శివాంగ్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు).

    గుజరాత్‌ టైటాన్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), షారుఖ్‌ ఖాన్‌, కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), అనూజ్‌ రావత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియా, నిషాంత్‌ సింధు, గ్లెన్‌ ఫిలిప్స్‌, అర్షద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి కిశోర్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    జేసన్‌ హోల్డర్‌ (రూ.7 కోట్లు), బాంటన్‌ (రూ. 2 కోట్లు), అశోక్‌ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్‌వుడ్‌ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్‌ (రూ. 30 లక్షలు). 

    రాజస్తాన్‌ రాయల్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    ధ్రువ్‌ జురెల్‌, రియాన్ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, డొనొవాన్‌ ఫెరీరా (ట్రేడింగ్‌), సామ్‌ కర్రాన్‌ (ట్రేడింగ్‌), యుధ్‌వీర్‌ చరక్‌, జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, శుభమ్‌ దూబే, నండ్రీ బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్‌), వైభవ్‌ సూర్యవంశీ.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    రవి బిష్ణోయ్‌ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్‌ (రూ.95 లక్షలు), సుశాంత్‌ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్‌ సేన్‌ (రూ.75 లక్షలు), బ్రిజేశ్‌ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్‌రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్‌ (రూ. 30 లక్షలు), యశ్‌రాజ్‌ (రూ. 30 లక్షలు). 

    రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    అభినందన్‌ సింగ్‌, నువాన్‌ తుషార, టిమ్‌ డేవిడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, యశ్‌ దయాళ్‌, జేకబ్‌ బెతెల్‌, రసిఖ్‌ ధార్‌, జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సూయాంశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 7 కోట్లు), మంగేశ్‌ యాదవ్‌ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్‌ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్‌ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్‌ (రూ. 30 లక్షలు). 

    ఢిల్లీ క్యాపిటల్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    ఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్‌ (రూ.2 కోట్లు), ఎన్‌గిడి (రూ.2 కోట్లు), డకెట్‌ (రూ. 2 కోట్లు), మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు)

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    అబ్దుల్‌ సమద్‌, దిగ్వేశ్‌ రాఠీ, మొహ్సిన్‌ ఖాన్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌. ఆకాశ్‌ సింగ్‌, మణిమరన్‌ సిద్దార్థ్‌, ప్రిన్స్‌ యాదవ్‌. అర్జున్‌ టెండుల్కర్‌ (ముంబై నుంచి ట్రేడింగ్‌), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్‌ పంత్‌, అర్షిన్‌ కులకర్ణి, మయాంక్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, మొహమమ్మద్‌ షమీ (సన్‌రైజర్స్‌ నుంచి ట్రేడింగ్‌), ఆయుశ్‌ బదోని, మిచెల్‌ మార్ష్‌

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    ఇన్‌గ్లిస్‌ (రూ.8.60 కోట్లు), ముకుల్‌ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్‌ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్‌ తివారి (రూ.1 కోటి). 

    పంజాబ్‌ కింగ్స్‌ 
    అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
    అర్ష్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ముషీర్‌ ఖాన్‌. సూర్యాంశ్‌ షెడ్గే, హర్నూర్‌ పన్నూ, నేహాల్‌ వధేరా, విష్ణు వినోద్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైశాక్‌ విజయ్‌కుమార్‌, లాకీ ఫెర్గూసన్‌, ప్రియాంశ్‌ ఆర్య, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కో యాన్సెన్‌, పైలా అవినాశ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, శశాంక్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.

    వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
    బెన్‌ డ్వార్‌షుయిస్‌ (రూ.4.40 కోట్లు), కూపర్‌ కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్‌ (రూ. 30 లక్షలు), ప్రవీణ్‌ దూబే (రూ. 30 లక్షలు).

  • లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. 

    ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20కు ముందు తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో వెంటనే అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నాలుగో టీ20కు బుమ్రా అందుబాటులో ఉండవచ్చని దూబే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినప్పటికి.. టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

    ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు.  గత మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. క్వింటన్ డి కాక్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. 

    టీమిండియా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది. లక్నో వంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీ మరోసారి కీలకంగా మారనున్నారు. బుమ్రా అందుబాటులోకి వస్తే రాణాపై వేటు పడే అవకాశముంది. మరోవైపు సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సౌతాఫ్రికా జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడు.

    తుది జట్లు
    దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్‌ లిండే/కేశవ్, ఎంగిడీ, బార్ట్‌మన్‌.

    భార‌త్‌
    సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, శుభ్‌మన్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి. 
    చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్‌!

  • ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన గ్రీన్‌.. వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు. 

    ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో గ్రీన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

    దీంతో నెటిజన్లు గ్రీన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఇలానే ఆడుతావా? కేకేఆర్ భయపడుతోంది అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.

    గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. దాదాపు ఆరు నెలల తర్వాత పోటీ క్రికెట్‌లో తిరిగొచ్చిన గ్రీన్‌.. టెస్టుల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం పర్వాలేదన్పిస్తున్నాడు. అయితే కామెరూన్ తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 ప‌రుగులు చేసింది. 

    ఆసీస్ బ్యాట‌ర్ల‌లో అలెక్స్ క్యారీ(106) సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. ఉస్మాన్‌ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్‌(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్‌(33), లియోన్‌(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: 'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్‌ సంచలనం

     

Business

  • దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1, 2026 నుంచి రవాణా విభాగంలో ఒక కొత్త విప్లవం రాబోతోంది. ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ దిగ్గజాల ఆధిపత్యంలో ఉన్న ఆన్‌లైన్ ట్యాక్సీ మార్కెట్‌లోకి ప్రభుత్వ మద్దతుతో ‘భారత్ ట్యాక్సీ’(Bharat Taxi) సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు, తక్కువ కమిషన్లతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

    భారత్ ట్యాక్సీ

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ యాప్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తరహాలో పనిచేసే అవకాశం ఉంది. ఇది ఒక ప్రైవేట్ లాభాపేక్ష కలిగిన సంస్థలా కాకుండా డ్రైవర్లను, ప్రయాణికులను నేరుగా అనుసంధానించే వేదికగా పనిచేస్తుంది. ఇందులో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటోలు, బైక్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది కాబట్టి భద్రత, పారదర్శకత ఎక్కువగా ఉంటాయి.

    డ్రైవర్లకు చేకూరే ప్రయోజనాలు

    ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో 25% నుంచి 30% వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి. దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని అభిప్రాయాలున్నాయి. భారత్ ట్యాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయంలో 80% నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది. మిగిలిన 20% నిర్వహణ ఖర్చులు, ఇతర పన్నులకు పోతుంది. తక్కువ కమిషన్ భారం వల్ల డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ అనుసంధానంతో ఉండటం వల్ల పేమెంట్స్ విషయంలో జాప్యం తగ్గుతుంది.

    ప్రయాణికులకు కలిగే లాభాలు

    ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో ఎక్కువ ధరలు), డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్లకు భారత్ ట్యాక్సీ చెక్ పెట్టనుంది. కంపెనీ తీసుకునే కమిషన్ తగ్గడం వల్ల సహజంగానే ప్రయాణికులపై పడే భారం తగ్గుతుంది. సాధారణ సమయాల్లోనూ, రద్దీ సమయాల్లోనూ స్థిరమైన ధరలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.

    భారత్ ట్యాక్సీ రాకతో రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం, ప్రయాణికులకు తక్కువ ధరలో సురక్షితమైన ప్రయాణం లభించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు

  • భారతీయ టెలికాం వినియోగదారులకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక షాకిచ్చే వార్తను అందించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.

    ఎంత పెరగవచ్చు?

    మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. 2026 నాటి పెంపుతో ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరగాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    టారిఫ్‌లు పెంచడానికి కారణాలు

    దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఈ పెట్టుబడులపై రాబడిని (ROI) రాబట్టడం ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం’(ARPU) కనీసం రూ.300 దాటాలని సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 - రూ.210 స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర రుణాలను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరం.

    సామాన్యులపై ప్రభావం

    నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ టారిఫ్ పెంపు భారంగా మారనుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. 20% పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఖరీదైనదిగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం ఉంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడం మానేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు.

    ఇదీ చదవండి: రైల్వే వాలెట్‌ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు

  • భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత వేగంగా టికెట్ బుకింగ్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ఐఆర్‌సీటీసీ (IRCTC) ఈ-వాలెట్’ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వివరణ ఇచ్చారు. వాలెట్‌లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి వెనక్కి తీసుకోవడం (Withdrawal) సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, దీనివల్ల రైల్వేకు చేకూరే ప్రయోజనాలను చూద్దాం.

    లోక్‌సభలో మంత్రి వివరణ

    • లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కింది అంశాలను వెల్లడించారు.

    • ఐఆర్‌సీటీసీ వాలెట్‌లో ఉన్న డబ్బును కేవలం రైలు టికెట్ల బుకింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలి.

    • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్’ నిబంధనల ప్రకారం.. ఈ తరహా క్లోజ్డ్ వాలెట్ల నుంచి నగదును విత్‌డ్రా చేయడానికి వీల్లేదు.

    • ఒకవేళ వినియోగదారుడు తన ఐఆర్‌సీటీసీ వాలెట్ ఖాతాను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకుంటే మాత్రమే అందులోని నగదును వారి సోర్స్‌ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.

    విత్‌డ్రాకు అనుమతించకపోవడానికి కారణాలు

    • ఐఆర్‌సీటీసీ వాలెట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్. అంటే ఏ సంస్థ అయితే వాలెట్ సేవలను అందిస్తుందో ఆ సంస్థ సర్వీసులను మాత్రమే ఆ నగదును వాడాలి. దీన్ని నగదుగా మారిస్తే అది బ్యాంకింగ్ కార్యకలాపాల కిందకు వస్తుంది. దానికి వేరే రకమైన నిబంధనలు ఉంటాయి.

    • నగదు విత్‌డ్రా సౌకర్యం ఉంటే దీన్ని కొందరు నగదు బదిలీకి లేదా ఇతర మనీ లాండరింగ్ అవసరాలకు వాడే అవకాశం ఉంటుంది. కేవలం ప్రయాణికుల అవసరాల కోసమే పరిమితం చేశారు.

    • నిత్యం వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే ఐఆర్‌సీటీసీలో ప్రతి చిన్న మొత్తాన్ని వెనక్కి పంపడం వల్ల అకౌంటింగ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతుంది.

    రైల్వేకు కలిగే ప్రయోజనాలు

    • లక్షలాది మంది ప్రయాణికులు వాలెట్‌లో ఉంచే సొమ్ము రైల్వే వద్ద ముందే జమ అవుతుంది. ఈ ‘ఫ్లోట్ మనీ’ ద్వారా రైల్వేకు వడ్డీ రూపంలో లేదా వర్కింగ్ క్యాపిటల్ రూపంలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.

    • ప్రయాణికులు బ్యాంక్ కార్డులు లేదా యూపీఐ వాడితే రైల్వే కొంత సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. వాలెట్ వాడకం వల్ల ఈ లావాదేవీ ఖర్చులు తగ్గుతాయి.

    • తత్కాల్ సమయాల్లో పేమెంట్ గేట్‌వేలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాలెట్ లావాదేవీలు అంతర్గతంగా జరుగుతాయి కాబట్టి, సర్వర్‌పై భారం తగ్గి బుకింగ్ వేగం పెరుగుతుంది.

    ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు

    ఐఆర్‌సీటీసీ వాలెట్ వాడటం వల్ల ప్రయాణికులకు ప్రధానంగా సమయం ఆదా అవుతుంది. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లేదా కార్డుల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు పేమెంట్ గేట్‌వే రిడైరెక్షన్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వాలెట్ ద్వారా కేవలం సెకన్లలోనే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇది ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎంతో కీలకం. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో తత్కాల్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది. వీటన్నింటికీ మించి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా లేదా వెయిటింగ్ లిస్ట్ కారణంగా బుకింగ్ కాకపోయినా దానికి సంబంధించిన రీఫండ్ సొమ్ము వెంటనే వాలెట్‌కు చేరుతుంది. సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్లలా దీని కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

    ప్రతికూలతలు

    మరోవైపు ఈ వాలెట్ విధానంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాలెట్‌లో డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి బ్యాంక్ ఖాతాకు విత్‌డ్రా చేసుకునే వీలు లేకపోవడంతో ప్రయాణ ప్రణాళికలు లేనప్పుడు ఆ డబ్బు వ్యాలెట్‌లోనే నిలిచిపోతుంది. దీనివల్ల అవసరానికి ఆ నగదును వాడుకోలేరు. అలాగే ఈ డబ్బు వినియోగానికి పరిమితులు ఉంటాయి. దీన్ని కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్లు కొనడానికి తప్ప ఇతర వ్యక్తిగత అవసరాలకు లేదా ఇతర వెబ్‌సైట్లలో వాడలేం. ఒకవేళ వాలెట్‌లోని డబ్బును తిరిగి పొందాలంటే వినియోగదారుడు తన ఐఆర్‌సీటీసీ వాలెట్ ఖాతాను శాశ్వతంగా మూసివేయాల్సి ఉంటుంది. నగదు కోసం ఖాతాను రద్దు చేసుకోవాల్సి రావడం ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా మారుతుంది.

    ఇదీ చదవండి: వ్యాపార సామ్రాజ్యంలో రారాజు ఎవరంటే..

  • భారత కార్పొరేట్ రంగంలో 2000 సంవత్సరం తర్వాత స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో సంప్రదాయ వ్యాపార దిగ్గజాలను వెనక్కి నెట్టి టెక్ ఆధారిత స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్‌-200 వ్యాపారవేత్తల జాబితా 2025’లో జొమాటో మాతృసంస్థ ఎటర్నెల్ సీఈఓ దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో నిలిచారు.

    ఇప్పటివరకు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న డీమార్ట్ (అవెన్యూ సూపర్‌మార్ట్స్) అధినేత రాధాకృష్ణ దమానీని దీపిందర్ గోయల్‌ వెనక్కి నెట్టి రెండో స్థానానికి పరిమితం చేశారు. గడిచిన ఏడాది కాలంలో ఎటర్నెల్ మార్కెట్ విలువ 27 శాతం వృద్ధి చెంది రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం క్షీణించి రూ.3 లక్షల కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలందిస్తున్న జొమాటో నెట్‌వర్క్ దీపిందర్‌ను ఈసారి జాబితాలో మొదటిసారి నిలపడమే కాకుండా నేరుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.

    తొలి ప్రయత్నంలోనే మూడో స్థానం

    ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ ఈ జాబితాలో తొలిసారి చోటు సంపాదించి ఏకంగా మూడో స్థానంలో నిలవడం విశేషం. వీరి సంస్థ ‘ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్’ మార్కెట్ విలువను రూ.2.2 లక్షల కోట్లుగా హురున్ లెక్కగట్టింది. విమానయాన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ 65 శాతం మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రగామిగా దూసుకుపోతోందని ఈ నివేదిక ప్రశంసించింది.

    టాప్-10 సెల్ఫ్‌మేడ్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ 2025

    ర్యాంక్వ్యాపారవేత్తలుకంపెనీ పేరు
    1దీపిందర్ గోయల్ఎటర్నెల్ (జొమాటో)
    2రాధాకృష్ణ దమానీడీమార్ట్
    3రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ఇండిగో
    4అభయ్ సోయిమ్యాక్స్ హెల్త్‌ కేర్‌
    5శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డిస్విగ్గీ
    6దీప్ కర్లా, రాజేశ్ మాగౌమేక్ మై ట్రిప్
    7యాశిష్ దహియా, అలోక్ బన్సల్పాలసీ బజార్
    8విజయ్ శేఖర్ శర్మపేటీఎం
    9ఫల్గుణి నాయర్, అద్వైత్ నాయర్నైకా
    10పీయూష్ బన్సల్ & టీమ్లెన్స్‌కార్ట్‌
  • భారతదేశంలో బంగారం వినియోగానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, ఇటీవల మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్‌ను పెంచడంపై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, దీనివల్ల కలిగే పర్యవసానాలను చూద్దాం.

    ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడానికి ప్రధాన కారణాలు

    భారత ప్రభుత్వం సాధారణంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్(ద్రవ్యలోటు) నియంత్రించడానికి, రూపాయి విలువను కాపాడటానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్-టైమ్ కనిష్టానికి (దాదాపు రూ.91 మార్కుకు) పడిపోవడం ఆందోళనగా మారింది. రూపాయి పతనమైతే దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు పెరుగుతుంది. బంగారం దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో విదేశీ మారక నిల్వలు హరించుకుపోకుండా చూసేందుకు ట్యాక్స్‌ను ఆయుధంగా వాడుతున్నారు.

    పెరుగుతున్న వాణిజ్య లోటు

    దేశం నుంచి అయ్యే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్య లోటు ఏర్పడుతుంది. భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంది. దిగుమతులు తగ్గించడం ద్వారా ఈ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది మన దిగుమతి బిల్లును మరింత పెంచుతోంది.

    దిగుమతి సుంకం రేట్లు (ప్రస్తుతం)

    గతంలో (2024 బడ్జెట్‌లో) ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6%కి తగ్గించింది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిపుణులు ఈ సుంకాన్ని మళ్లీ పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    అంశంప్రస్తుత రేటుగత రేటు (2024 జులైకి ముందు)
    బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)5%10%
    అగ్రికల్చర్ సెస్ (AIDC)1%5%
    మొత్తం సుంకం6%15%

     

    పర్యవసానాలు

    వినియోగదారులపై భారం

    సుంకం పెరగడం వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనడం భారంగా మారుతుంది. ఇప్పటికే 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలకు చేరడంతో అదనపు పన్ను కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది.

    స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం

    దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే దేశీయ మార్కెట్ ధరలకు, అంతర్జాతీయ ధరలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఈ గ్యాప్‌ను సొమ్ము చేసుకునేందుకు అక్రమ మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారాన్ని తరలించే ముఠాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) హెచ్చరిస్తోంది.

    జ్యువెలరీ పరిశ్రమపై ప్రభావం

    పెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఆభరణాల తయారీ రంగంలో పనిచేసే లక్షలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుంది. అలాగే, భారత్ నుంచి జరిగే ఆభరణాల ఎగుమతులు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.

    ప్రత్యామ్నాయ మార్గాలు

    ప్రభుత్వం కేవలం పన్నుల మీదనే ఆధారపడకుండా భౌతిక బంగారం దిగుమతిని తగ్గించడానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సాధానాలుగా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ల ద్వారా ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల ద్వారా చెలామణిలోకి తీసుకురావాలి. ఇప్పటికే ఈ పని చేస్తున్నా దీన్ని మరింతగా పెంచాలి.

    బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు అనేది ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం. రూపాయి విలువను కాపాడటం, వాణిజ్య లోటును తగ్గించడం దీని వెనుక ఉన్న సానుకూల ఉద్దేశ్యాలు అయినప్పటికీ దీనివల్ల దేశీయంగా ధరలు పెరగడం, జ్యువెలరీ రంగం మందగించడం వంటి సవాళ్లు తప్పవని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ప్రజలు భౌతిక బంగారం వైపు కాకుండా డిజిటల్ బంగారం లేదా బాండ్ల వైపు దృష్టి సారిస్తేనే దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే..

  • భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జీతాల పెరుగుదల నిలకడగా కొనసాగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా వేతనాల పెంపు ఆశించినమేర ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నిర్వహించిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ ప్రకారం, 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలు సగటున 9 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశం ఉంది. దాదాపు 1,500 కంటే ఎక్కువ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

    రంగాల వారీగా అంచనాలు

    ఈ పెంపులో కొన్ని రంగాలు ఇతర విభాగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులకు సుమారు 9 శాతం మేర పెంపు ఉంటుందని అంచనా.

    ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మెరిట్ ఆధారిత వేతన పెంపు స్థిరంగా ఉండటం అనేది ఆర్థిక వాతావరణం పట్ల సంస్థల నమ్మకాన్ని సూచిస్తుంది. వ్యయ నియంత్రణ పాటిస్తూనే అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు.

    ఇన్సెంటివ్‌లపై ఫోకస్

    ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీలు తమ రివార్డ్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కేవలం వార్షిక పెంపుపైనే కాకుండా స్వల్పకాలిక ప్రోత్సాహకాలపై కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    నియామకాల్లో తగ్గుదల..

    వేతనాల పెంపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొత్త నియామకాల విషయంలో కంపెనీలు కొంత అప్రమత్తత పాటిస్తున్నాయి. 2024లో 43 శాతంగా ఉన్న నియామక విస్తరణ ప్రణాళికలు 2026 నాటికి 32 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సుమారు 31 శాతం కంపెనీలు నియామకాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాదిలో అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు) గణనీయంగా తగ్గింది. 2023లో 13.1 శాతంగా ఉన్న అట్రిషన్ 2025 మొదటి అర్ధభాగం నాటికి 6.4 శాతానికి పడిపోయింది.

    ఇదీ చదవండి: సామాన్యుడికి ఆర్‌బీఐ ఈ ఏడాది గిఫ్ట్!

  • భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొన్నేళ్లుగా వడ్డీ రేట్ల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలకు 2025 సంవత్సరంలో ఊరటకల్పించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల (1.25%) మేర రెపోరేటును తగ్గించింది.

    ఫిబ్రవరిలో 6.5%కి చేరిన రేటు వరుస కోతలతో ఇప్పుడు 5.25 శాతం వద్ద స్థిరపడింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు గణనీయంగా తగ్గాయి. కొత్తగా అప్పులు తీసుకునే వారికి కూడా ఇది శుభవార్తే. 2025-26 నాటికి 7.3% జీడీపీ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం ఈమేరకు పనిచేస్తోంది.

    మానిటరీ పాలసీ సమావేశంరెపోరేటులో మార్పు(బేసిస్‌ పాయింట్లు)ప్రస్తుత రెపోరేటు
    ఫిబ్రవరి 2025256.25%
    ఏప్రిల్ 2025256.00%
    జూన్ 2025505.50%
    డిసెంబర్ 2025255.25%

     

    ఆర్‌బీఐ దీర్ఘకాలిక లక్ష్యాలు

    • ఆర్‌బీఐ కేవలం వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి పడిపోయింది.

    • ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని 2% వద్ద స్థిరీకరించాలని భావిస్తోంది. తక్కువ ధరల వల్ల సామాన్యుడి వస్తు కొనుగోలు శక్తి పెరుగుతుంది.

    • దేశీయ డిమాండ్‌ను పెంచడం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 7.3%కి పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు పుంజుకుంటాయని అంచనా.

    • బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్‌బీఐ దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.

    సవాళ్లు - వ్యూహాత్మక నిర్ణయాలు

    • అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును తాకినప్పటికీ ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటంతో రూపాయి పతనంపై ఆందోళన చెందకుండా దేశీయ వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.

    • అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారత ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ అది భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి దేశీయంగా ఉత్పాదకతను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించారు.

    • తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.

    ఇదీ చదవండి: భారత్-అమెరికా ట్రేడ్‌ డీల్ జాప్యం..

  • ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.

    అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..

    టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరం

    భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్‌సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.

    భారత్ వాదన

    భారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.

    రష్యా నుంచి చమురు కొనుగోళ్లు

    ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.

    జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదా

    గతంలో అమెరికా భారత్‌కు జీఎస్‌పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్‌లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.

    డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలు

    అమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్‌మార్ట్ (ఫ్లిప్‌కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.

    ఫార్మా రంగంలో..

    అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.

    డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్‌తో ట్రేడ్ డీల్‌ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

    ప్రతికార సుంకాలు

    భారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్‌ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్‌పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.

    క్రూడాయిల్‌.. ఎస్‌-400 పేచీ

    ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్‌నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్‌పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్‌ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.

    అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.

    వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వం

    కొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్‌తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్‌కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.

    ప్రస్తుత పరిస్థితి

    ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..

  • భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది.. డాలర్‌ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు (EMIs), రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి.

    ఈఎంఐలపై ప్రభావం ఇలా..
    రూపాయి విలువ పడిపోతే లోన్లపై ప్రభావం రెండు విధాలుగా కనిపిస్తుంది.

    విదేశీ కరెన్సీ లోన్లు
    డాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీలో లోన్ తీసుకున్నవారికి నేరుగా దెబ్బ పడుతుంది. ఉదాహరణకు డాలర్‌ ధర రూ.80 నుంచి రూ.90కి పెరిగితే, రీపేమెంట్ భారం సుమారు  12.5 శాతం పెరుగుతుంది.

    దేశీయ లోన్లు
    ఇక్కడ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం, మందులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచితే, ఫ్లోటింగ్ రేట్ లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి.

    ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నారనుకోండి..  20 ఏళ్లు టెన్యూర్‌, 8% వడ్డీతో ప్రస్తుతం ఈఎంఐ సుమారు రూ.41,045 గా ఉంటే వడ్డీ రేటు 0.5% పెరిగితే ఈఎంఐ రూ.42,366కి చేరుతుంది. అంటే నెలకు రూ.1,321 అదనపు భారం. మొత్తం కాలంలో రూ.3.17 లక్షలు  అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట.

    జీతాలపై రూపాయి ప్రభావం
    రూపాయి పతనం వల్ల జీతాలు వెంటనే తగ్గవు కానీ సమస్య అక్కడే మొదలవుతుంది.

    ప్రైవేట్ ఉద్యోగులకు

    • కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు.

    • కొత్త నియామకాలు తగ్గే అవకాశం

    • కొన్నిచోట్ల బోనసులు, వేరియబుల్ పే తగ్గవచ్చు

    • ఐటీ, ఎగుమతి రంగాలలోని డాలర్లలో ఆదాయం వచ్చే కంపెనీలకు కొంత లాభం ఉన్నా, ఆ ప్రయోజనం ఉద్యోగుల జీతాల పెంపులోకి వెంటనే రావడం కష్టం

    ప్రభుత్వ ఉద్యోగులకు
    జీతాలు స్థిరంగానే ఉన్నా, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీతం విలువ తగ్గినట్లే అవుతుంది. డీఏ పెంపు ఆలస్యమైతే భారమవుతుంది.

    రూపాయి పతనం అంటే కేవలం ఎగుమతులు–దిగుమతుల సమస్య కాదు. ఇది జీతం విలువను తగ్గించి, ఈఎంఐ భారం పెంచి, కుటుంబ బడ్జెట్‌ను కుదించే నిశ్చబ్ద దెబ్బ. నేరుగా అయినా, పరోక్షంగా అయినా సామాన్యుడిపై ప్రభావం తప్పదు.

  • డిజిటల్ స్వీకరణ, నియంత్రణ మార్పులు, విదేశీ పెట్టుబడులు భారత బీమా రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. అయాన్‌ (Aon) విడుదల చేసిన ‘గ్లోబల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఇన్‌సైట్స్ రిపోర్ట్’ ప్రకారం.. కొన్ని విభాగాల్లో కొనుగోలుదారులకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, సైబర్, ప్రాపర్టీ బీమాల్లో ఒత్తిడి పెరుగుతోంది.

    చాలా బీమా విభాగాలు ఇప్పటికీ “సాఫ్ట్ మార్కెట్”లో ఉన్నాయి. అంటే పోటీ ధరలు  విస్తృత కవరేజ్ లభిస్తున్నాయి. అయితే, సైబర్ బీమాలో క్లెయిమ్స్ సంఖ్య, వ్యయం గణనీయంగా పెరగడంతో బీమా సంస్థలు కఠిన అండరైటింగ్ విధానాలు, అధిక డిడక్టిబుల్స్ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ కారణంగా సైబర్ బీమా అత్యధిక వృద్ధి అవకాశాలు కలిగిన రంగంగా మారింది.

    ప్రాపర్టీ బీమాలో 2025లో అమలులోకి వచ్చిన క్వాసీ-టారిఫ్ ధర విధానాలు డబుల్ డిజిట్ ప్రీమియం పెరుగుదలకు దారితీశాయి. దీంతో ఖర్చు తగ్గించుకునే అవకాశాలు కొనుగోలుదారులకు తగ్గాయి. మరిన్ని రీ-ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఈ విభాగంలో అస్థిరత కొనసాగనుంది.

    ఇదిలా ఉండగా, భారత బీమా మార్కెట్లో సామర్థ్యం పెరుగుతోంది. కొత్త బీమా సంస్థలు, విదేశీ రీ-ఇన్సూరర్లు ప్రవేశించడం, అలాగే బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల పోటీ, ఆవిష్కరణలు పెరిగాయి.

    ఈ పరిణామాలపై స్పందించిన అయాన్‌ ఇండియా చీఫ్ బ్రోకింగ్ ఆఫీసర్ శాంతనూ సక్సేనా.. “2025లో భారత బీమా మార్కెట్ వేగంగా ఎదుగుతున్న, అవకాశాలతో నిండిన వాతావరణాన్ని చూపిస్తోంది. ఇది కొనుగోలుదారులకు మరింత ఎంపికలను అందిస్తోంది” అని పేర్కొన్నారు.

International

  • ‘దోస్త్ మేరా దోస్త్.. నువ్వే నా ప్రాణం’.. అంటూ ఏక కంఠంతో చెప్పిన చైనా-పాకిస్థాన్ మధ్య దోస్తీ ఇప్పుడు చెడిందా..! పాకిస్థాన్ ఆవిర్భావం నుంచి డ్రాగన్‌తో కలిసే ఉన్నా.. ఇంత సడెన్‌గా ఎందుకు చైనా దూరమవుతోంది..? షోలే సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మాదిరిగా కలిసి ఉండే చైనా-పాకిస్థాన్‌లు ఇప్పుడు విడిపోవడానికి కారణాలేమిటి..? ఇంతకాలం చైనా నుంచి ఇతోధికంగా సాయం పొందిన పాకిస్థాన్.. ఉన్నఫళంగా ఎందుకు రూట్ మార్చింది..? భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జియోపాలిటిక్స్ ఇంత వేగంగా మారిపోవడానికి దోహదపడిన అంశాలేమిటి..? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

    సిల్క్ రోడ్ మాదిరి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించింది. దీని కోసం చైనా ఎన్నో బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అనే షీ జిన్‌పింగ్ కలను సాకారం చేసే దిశలో పాకిస్థాన్ సీపీఈసీకి సహకరించింది. అంతేకాదు.. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేసి, తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంది. భారత్‌కు ధీటుగా పాకిస్థాన్‌ను ప్రపంచం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసింది. అంతెందుకు.. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్య రాజ్య సమితిలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.

    పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై గళమెత్తిన ప్రతీసారి.. చైనా రొటీన్‌గా ఆధారాలేవి? అంటూ ప్రశ్నించేది. అలా పాలు-నీళ్లలా చైనా-పాకిస్థాన్ బంధం కొనసాగింది. భారత్‌కు చెక్ పెట్టేలా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ పరికరాలను సరఫరా చేయడంలో చైనా ముందంజలో ఉండేది. అంతెందుకు.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటలాలు.. ముఖ్యంగా స్టీల్ బుల్లెట్లు కూడా చైనా సరఫరా కావడం గమనార్హం..! సంక్షోభ సమయాల్లోనూ పాక్‌కు చైనా వెన్నంటే ఉంది.

    చైనా-పాకిస్థాన్‌ల చైనా బంధం దశాబ్దాలుగా కొనసాగింది. పాకిస్థాన్‌లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలకులు మాత్రం చైనాకు అనుకూలంగా ఉండడం రివాజుగా మారింది. చివరకు సైనిక పాలన కొనసాగినా.. సైన్యాధికారులు చైనాకు తొత్తులగానే పనిచేసేవారు. నిజానికి చైనా మతరహిత సమాజాన్ని కోరుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ఫక్తుగా ఇస్లామిక్ దేశం. ఇంకా చెప్పాలంటే.. చైనాలో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై మారణకాండ కొనసాగినా.. పాకిస్థాన్ మాత్రం చైనాకు వంతపాడేది.

    అంటే.. సిద్ధాంతపరంగా వేర్వేరు భావజాలాలున్నా.. ‘అవసరం’ అనే ఒకే ఒక్క పదం ఈ రెండు దేశాలను ఫ్రెండ్స్‌గా మార్చేశాయి. జియోపాలిటిక్స్‌ అనే రాజనీతితో ఇరుదేశాలు సఖ్యతను ప్రదర్శించాయి. బలూచిస్థాన్‌లో వ్యతిరేకత పెరిగినా.. పాకిస్థాన్ మాత్రం చైనా కోసం అణచివేత ధోరణిని కొనసాగిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. బలూచిస్థాన్‌లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను చైనాకు కట్టబెట్టేందుకు పాకిస్థాన్ ఇప్పుడు బలూచీలపై కత్తిదూస్తోంది. వారి ఆగ్రహ జ్వాలలకు సొంత సైన్యం, పోలీసులు బలవుతున్నా.. మొండిధోరణితో ముందుకు సాగింది.

    పాలు-నీళ్లుగా స్నేహ బంధంలో మునిగితేలిన చైనా-పాకిస్థాన్ ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో భారత రక్షణశాఖ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. భారత డిఫెన్స్‌తోపాటు.. అఫెన్స్ కెపాసిటీకి అగ్రదేశాలు సైతం అద్దిరిపోయాయి..! అందుక్కారణం.. ఈ రెండు అంశాల్లో భారతే టాప్ అన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేశాయి. డిఫెన్స్‌లో తోపులమనుకునే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా కంటే.. ఎంతో ముందంజలో ఉన్నట్లు ‘ఆపరేషన్ సిందూర్’ నిరూపించింది.

    అమెరికా తయారీ ఎఫ్-16, చైనా తయారీ జే-10సీ వంటి అధునాతన యుద్ధ విమానాలున్నా.. పాకిస్థాన్ చతికిలపడిపోయింది. అదే సమయంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాంతో.. భారత్‌కు చెక్ పెట్టాలని అమెరికా నిర్ణయించింది. ఓవైపు సుంకాల భారం మోపుతూనే.. మరోవైపు పాకిస్థాన్‌ను పావులా వాడుకోవాలని వ్యూహాలు రచించింది. అదే సమయంలో చైనాకు పోటీగా పాకిస్థాన్‌లోని ఓ పోర్టును అభివృద్ధి చేసి, బలూచిస్థాన్‌లోని అపారమైన ఖనిజ సంపదను దోచుకోవాలని ప్లాన్ చేసింది. దాన్ని అర్థం చేసుకోకుండా.. తమకు పెద్దన్న పెద్దపీట వేస్తున్నాడనే ఉద్దేశంతో పాకిస్థాన్ ట్రంప్‌ను గుడ్డిగా నమ్మేసింది..!

    అమెరికాను బద్ధ శత్రువుగా భావించే చైనా.. ఇప్పుడు పాకిస్థాన్ నిర్ణయంతో షాక్ అయ్యింది. దాంతో.. పాకిస్థాన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. 2013 నుంచి వ్యూహాత్మకంగా గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేసినా.. ఇప్పుడు పాక్‌కు దూరంగా ఉంటోంది. అయితే.. హోర్మూజ్ జలసంధి నుంచి గ్వాదర్ పోర్టు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు సరఫరా అయ్యే చమురు ఈ పోర్టు మీదుగానే వస్తుంది. అక్కడి నుంచి సీపీఈసీ ద్వారా గిల్గిట్-బాల్టిస్థాన్‌కు.. అక్కడి నుంచి జిన్జియాంగ్‌కు చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా శత్రుదేశాల యుద్ధ నౌకలను అడ్డుకునేందుకు గ్వాదర్ పోర్టును అడ్డాగా మార్చుకోవాలని చైనా భావించింది.

    ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకలు ఈ మార్గం మీదుగానే దక్షిణాసియాకు రావాల్సి ఉంటుంది. అయితే.. పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు వాటిని అప్పుగా చూపించి, వసూలు చేసుకుంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పైగా.. బలూచిస్థాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వాల్లో రోడ్లను చైనా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో లభించే అరుదైన ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. దీన్ని చైనా సహిస్తుందా??

    గ్వాదర్ పోర్టు నుంచి జిన్జియాంగ్ వరకు సీపీఈసీ, రైల్వేలు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన చైనా.. వాటిని ఊరికే వదిలిపెడుతుందా??? ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే..! గ్వాదర్‌కు సమాంతరంగా పజ్నీ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలకు చైనా ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే..!

    -హెచ్.కమలాపతిరావు
     

  • బంగ్లాదేశ్ నేతల విద్వేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఇండియా  కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని ఇండియా వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముంపు పొంచిఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది

    దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన నేత భారత్ను విచ్ఛిన్నం చేసే వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తద్వారా సెవెన్సిస్టర్స్ ప్రాంతం చీలిపోయే అవకాశం ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆదేశ రాయభారి రియాజ్ హమీదుల్లాకి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి శాంతి భద్రతల సమస్య పొంచిఉన్న నేపథ్యంలో బంగ్లాదేశీయులకు భారత వీసా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    అసలేం జరిగింది.
    బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ఆమెకు వివిధ కేసుల్లో మరణశిక్షతో పాటు 21 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ షేక్‌ హసీనాను ఆదేశానికి అప్పగించాలని భారత్‌ను కోరింది. ఈవిషయంపై ఇండియా ఇంకా స్పందించలేదు. 

    ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్‌పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కల్పిస్తామని దాని వల్ల భారత్‌నుంచి ఈశాన్య ప్రాంతం సెవెన్‌సిస్టర్స్ వేరయ్యే అవకాశం ఉందన హెచ్చరించారు. దీనిపై సీరియస్‌ అయిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ని వివరణ కోరింది. తాజాగా బంగ్లాదేశీయులకు భారత వీసాను నిలిపివేసింది.

  • పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. గాజాలో శాంతిస్థాపనకు ముస్లిం దేశాలు అక్కడ సైనిక దళాలలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ ఆవిషయమై యుఎస్ అధ్యక్షుడితో చర్చించనున్నట్లు సమాచారం.

    ప్రస్తుతం పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాలు బలీయంగా న్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్, పాక్ ప్రధాని షెహబాజ్‌, ఆర్మీచీఫ్ ఆసిమ్మునీర్లతో ఇటీవల తరచుగా భేటీలు జరుపుతున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ట్రంప్ ఎఫ్-16 యుద్ధవిమానాలఅప్గ్రేడ్కోసం పాకిస్థాన్కు ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేశారు. చర్య భారత్ను కలవరపాటుకు గురిచేసింది. అనంతరం కూడా భారత్పై పలు రకాల ఆంక్షలు విధించి అదే సమయంలో పాకిస్థాన్కు దగ్గరయ్యే యత్నం ట్రంప్ చేశారు.

    కాగా ఇటీవల గాజాలో శాంతిస్థాపన కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ముస్లిం దేశాలైన పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాలు తమ దేశ సైనిక దళాలను గాజాలో మెుహరించాలని ట్రంప్ ప్రతిపాదించారు. విషయమై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ట్రంప్తో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై పాకిస్థాన్లో వ్యతిరేకత ఎదురవుతుంది. అక్కడి ప్రజలు ఆదేశ సైనికులను గాజా పంపించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఒకవేళ ఈ డీల్కు అంగీకరిస్తే సొంత దేశంలో వ్యతిరేకత, అంగీకరించకుంటే అమెరికా అధ్యక్షుడి ఆగ్రహాం మెుత్తానికి ఆసిమ్ మునీర్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి న్న చందాన ఉంది. డీల్కు టర్కీ, ఈజిప్టు, జోర్దాన్ దేశాలు మద్దుతిస్తున్నాయి. ఇరాన్మాత్రం వ్యతిరేకంగా ఉంది. విషయమై గత నెలలో పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి స్పందించారు. గాజాలో సైనిక దళాల మెుహరింపు విషయం ఆలోచిస్తామన్నారు. అయితే హామాస్ని నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు.

  • ఇల్లినాయిస్‌లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల  వ్యక్తి,  67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.

    కేసు  ఏంటీ అంటే
    అనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ గురించి భార్యకు ఫోన్‌ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్‌ రాకపోవడం,  అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్‌లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు.  ఏదో అనుమానం వచ్చి తల్లి  చెక్‌ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే  ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో తేలింది.  

    మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్‌, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్‌ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది.  అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్‌ నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.

    చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారు
    రణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్‌ పరిస్థితి విషమం

  • ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. వాయు కాలుష్యం పరిమితికి మించి ఉండడంతో ప్రభుత్వం సైతం పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో చైనా, భారత్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. ఎయిర్‌ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెలకువలు పాటించాలని తెలిపింది. వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ బీజింగ్‌ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

    ఢిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గాలికాలుష్యం నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఢిల్లీలో పనిచేసే అన్ని సంస్థలకు 50శాతం వర్క్‌ఫ్రమ్ హోమ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆంక్షలతో పనులు చేయలేకపోతున్న నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు పరిహారం అందిస్తుంది. అయినప్పటికీ గాలి నాణ్యత మెరుగవుతుందన్న ఆశలు పూర్తిస్తాయిలో లేవు.

    ఈ విషయమై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి సైతం తొమ్మిది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించలేమని ‍అది సాధ్యమయ్యే ప్రక్రియ కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా ఢిల్లీకి ఒక సజేషన్ ఇచ్చింది ఒకప్పుడు చైనా రాజధాని బీజింగ్‌లో కూడా  తీవ్రమైన వాయుకాలుష్యం ఉండేదని అయితే తగిన చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ఆపరిస్థితులు మారాయని తెలిపింది.

    ప్రస్తుతం చైనా-భారత్‌ రెండు దేశాలు పట్టణీకరణ కారణంగా విపరీతమైన వాయు కాలుష్యాన్ని ఎదురుకుంటున్నాయని చైనా ఎంబసీ స్పోక్స్ పర్సన్‌ యూ జింగ్‌ పేర్కొన్నారు. అయితే చైనా గత దశాబ్దకాలంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు. భారత్‌ సైతం కొన్ని నియామాలు పాటిస్తే గాలి కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు.

    • బీఎస్‌ 6 వెహికల్స్‌ మాత్రమే అనుమతించాలి.

    • సర్సీస్ పూర్తి చేసుకున్న వాహనాలకు అనుమతి నిరాకరణ.

    • కార్లపై పెరుగుదలపై ఆంక్షలు విధించాలి.

    • వాహనాలు రోడ్డుపై రావడానికి సరిసంఖ్య, బేసిసంఖ్యలతో లాటరీ సిస్టమ్ తీయాలి

    • మెట్రో నెటెవర్క్‌ను విస్తరించాలి.

    • బస్సు సదుపాయాలని మెరుగుపరచాలి.

    • ప్రస్తుత వాహనాలను ఎలక్ట్రిక్ విధానంలోకి మార్చాలి.

    అంతేకాకుండా కాలుష్య నియంత్రణకు బీజింగ్‌తో కలిసి పనిచేయాలని యూ జింగ్ తెలిపారు. డిసెంబర్‌ 15న ఢిల్లీ, బీజింగ్‌ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌కు సంబంధించిన చిత్రాలను ఆమె ఎక్స్‌లో షేర్ చేసింది. దీనిలో ఢిల్లీ AQI 447గా ఉండగా, బీజింగ్ AQI 67 గా ఉంది. అయితే భారత్ 2020 ఏప్రిల్ 1నుండే ఢిల్లీలో బీఎస్‌6 వాహనాల వాడకం తప్పనిసరి చేసింది.

  • పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌.. ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కథ జైల్లోనే సమాప్తం కానుందా?.. మిగిలిన జీవిత కాలం ఆయన జైల్లోనే మగ్గిపోవాల్సిందేనా??..  పీటీఐ వర్గాలు, ఖాన్‌ కుటుంబ సభ్యుల ఆందోళలను హెష్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందా?..  అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లను అసలు పట్టించుకోవడం లేదా?..

    ‘మా తండ్రిని మళ్లీ చూడలేమేమో’.. అంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ తనయులు చెబుతున్న ఈ మాట పీటీఐ వర్గాలను, ఆయన అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ మీడియా సంస్థ స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్‌ ఇద్దరు కొడుకులిద్దరూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఖాసిమ్ ఖాన్.. మా తండ్రికి(ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి..) రెండేళ్లుగా ఇతరులతో సంబంధాలు లేకుండా చేశారు. ఒక సెల్‌లో ఒంటరిగా బంధించారు. తాగడానికి ఆయనకు  మురికి నీరు ఇస్తున్నారు. ఆయన చుట్టూ హెపటైటిస్‌తో బాధపడుతున్న ఖైదీలు ఉన్నారు అని అన్నాడు.

    మరో కొడుకు సులేమాన్ ఇసా ఖాన్ తన తండ్రి ఉంది డెత్‌ సెల్‌లో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జైల్లో ఆయనతో ఎవరూ మాట్లాడకూడదనే ఆంక్షలు పెట్టారు. చివరకు జైలు గార్డులు కూడా ఆయన్ని పలకరించడానికి వీల్లేదు. పాక్‌ ప్రభుత్వం ఆయన విషయంలో సైకాలజికల్ టార్చర్ స్ట్రాటజీ అవలంభిస్తోంది అని ఆరోపించారు. పరిస్థితి పోనుపోను మరింత కఠినంగా మారుతోంది. ఆశను నిలుపుకోవడం కష్టమవుతోంది. ఇక ఆయనను మళ్లీ చూడలేమేమోనని భయపడుతున్నాం అని ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 22 నెలలుగా తాము తండ్రిని కలవలేకపోయామని.. జనవరిలో తాము ఇస్లామాబాద్‌ వెళ్తామని.. ఎలాగైనా ఆయన్ని కలిసి తీరతామని అంటున్నారు. 

    మరోవైపు.. ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడిపించేందుకు పీటీఐ పోరాటం చేస్తోంది.  ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖానుం, నూరీన్ ఖాన్ నియాజీ ఆ నిరసనల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వివిధ దేశాల అధినేతలకు, ప్రముఖులకు ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయితే వాటికి ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో..  

    ఇమ్రాన్‌ ఖాన్‌పై దేశ ద్రోహం పెట్టాలని షెహబాజ్‌ షరీఫ్‌ సర్కార్‌ యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ కుట్ర ఉందనేది ఖాన్‌ కుటుంబం చెబుతున్న మాట. ఈ పరిణామాల నడుమ.. ఖాన్‌ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇమ్రాన్‌ ఖాన్‌ విడుదల డిమాండ్‌తో పాటు పీటీఐ కార్యాలయాల మూసివేత.. కీలక నేతల అరెస్టులకు వ్యతిరేకంగా నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. రావల్పిండిలోని ఆడియాలా జైలు సమీపంలోని ఫ్యాక్టరీ నాకా వద్ద ఈ నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే షెహబాజ్‌ ప్రభుత్వం రావల్పిండిలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించుకోకుండా కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఆ ఆంక్షలను అణచివేతగా పేర్కొంటూ ఖాన్‌ సోదరీమణులు స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొనబోతున్నారు. జైలు చుట్టుపక్కల ప్రాంతాల్లో 840 అనే రాతలు(ఖాన్‌కు కేటాయించిన ఖైదీ నెంబర్‌) కనిపిస్తున్నాయి.

    నాటి నుంచి.. 
    పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవి కోల్పోయారు. ఆ మరుసటి ఏడాది.. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మార్చి 24న వారానికి రెండు సార్లు (మంగళవారం, గురువారం) సందర్శకులను అనుమతించాలని ఆదేశించింది. అయితే PTI ఈ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపిస్తోంది.

    జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్‌ల ద్వారా ఇమ్రాన్‌ ఖాన్‌ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌, షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేశాక.. ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు.

    ములాఖత్‌లకు అడియాలా జైలు అధికారులు అనుమతించకపోవడమే అందుకు కారణంగా తెలిసింది. అయితే జైల్లో ఆయన భద్రంగానే ఉన్నారా?.. సజీవంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అనే అనుమానాలతో ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ పరిణామాల నడుమ ఖాన్‌ సోదరీమణికి 20 నిమిషాల ములాఖత్‌కు అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన జైల్లో మానసికంగా కుంగిపోయి ఉన్నారని అన్నారామె. అయితే అటుపైనా ములాఖత్‌లకు పోలీసుల ఆటంకాలు ఎదురయ్యాయి. ఒకానొక దశలో పీటీఐ కార్యకర్తలు జైల్లోకి దూసుకెళ్లే ప్రయత్నంగా చేయగా.. వాటర్‌ కెనన్‌లతో చెదరగొట్టారు.

    భారత్‌ రియాక్షన్‌ ఇదే..
    ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు నిర్బంధంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక ఒంటరి నిర్బంధంలో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.. పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచే ప్రనయత్నంలో ఉంది. పాక్‌ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారే అవకాశం లేకపోలేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యంతో పాటు యూరప్‌ దేశాలు న్యాయమైన విచారణ జరగాలని, కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇవ్వాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే భారత్‌ మాత్రం ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుపై ఇంతదాకా ఎక్కడా స్పందించలేదు. కానీ, అది పాక్‌ రాజకీయ సంక్షోభంగా మాత్రం భావిస్తోంది. ఇక గల్ప్‌ దేశాలు ప్రత్యక్షంగా స్పందించకపోయినప్పటికీ.. అక్కడి ప్రవాస పాకిస్తానీలు మాత్రం #FreeImranKhan పేరిట నిరసనలు చేపడుతున్నారు. 

    ఖాన్‌ కొడుకులు లండన్‌లో..
    ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇప్పటిదాకా మూడుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌ బ్రిటిష్‌ జర్నలిస్గ్‌.  1995లో వీళ్ల వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు. అయితే.. 2004లో విడాకులు తీసుకున్నాక ఆమె పిల్లలతో లండన్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత రెహామ్‌ను ఖాన్‌ 2015 వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం ఎన్నో రోజులు నిలవలేదు. 

    2018లో బుష్రా బీబీ (బుష్రా మానేకా)ను వివాహం చేసుకున్నారు. అయితే.. అవినీతి ఆరోపణల్లో ఖాన్‌తో పాటు అరెస్ట్‌ అయిన ఆమె అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

  • వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తన ప్రియురాలు, మోడల్, సామాజికవేత్త అయిన బెట్టినా ఆండర్సన్‌తో వైట్‌హౌస్ హాలిడే పార్టీలో నిశ్చితార్థం చేసుకున్నారు. 

    ఈవిషయాన్ని వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రీ-క్రిస్మస్ వేడుకల సందర్భంగా ట్రంప్ జూనియర్  తెలియజేశారు. ఇప్పటికే రెండు సార్లు నిశ్చితార్థం చేసుకున్న ఈయనకు ఇది మూడో నిశ్చితార్థం కావడం గమనార్హం. వేడుకలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

    తనకు ఎస్‌ చెప్పిన ప్రియురాలికి 47 ఏళ్ల  జూ. ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఇది అత్యంత మరపురాని వారాంతం. జీవిత ప్రేమను వివాహం చేసుకోబోతున్నాను. నేను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిని, ధన్యవాదాలు,” అంటూ  39 ఏళ్ల  బెట్టీ తన సంతోషాన్ని ప్రకటించారు. 

    బెట్టినా ఆండర్సన్ ఎవరు?
    బెట్టినా ఆండర్సన్ దాతృత్వవేత్తలు హ్యారీ లాయ్ ఆండర్సన్ జూనియర్, ఇంగర్ ఆండర్సన్ కుమార్తె. ఆమె పామ్ బీచ్  సామాజిక మరియు దాతృత్వ వర్గాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆడ్రీ గ్రస్ స్థాపించిన హోప్ ఫర్ డిప్రెషన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు న్యాయవాది. ఫ్లోరిడాకు చెందిన పరిరక్షణ చొరవ ప్రాజెక్ట్ పారడైజ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే పామ్ బీచ్ కౌంటీ  అక్షరాస్యత కూటమితో క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా పాల్గొంటుంది.

    ఈ జంట దాదాపు ఒక సంవత్సరం పాటు కలిసి ఉన్నారని సమాచారం. గత నెలలో జరిగిన  వ్యాపారవేత్త కుమార్తో వివాహానికి హాజరై ఉదయపూర్‌లో సందడి  చేశారు.


    ట్రంప్ జూనియర్ గతంలో వెనెస్సా ట్రంప్‌ను వివాహం చేసుకున్నాడు. 12 ఏళ్ల తరువాత 2018లో వారి విడాకులు తీసుకున్నారు. వీరికి. ఐదుగురు పిల్లలు ఉన్నారు

    ఈ తర్వాత, ట్రంప్ జూనియర్ 2018లో మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ కింబర్లీ గిల్‌ఫోయిల్‌తో డేటింగ్ ప్రారంభించాడు. 020లో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి దాకా రాలేదు. అయితే వారి సంబంధం 2024 చివరిలో ముగిసింది.  2024లో  ఆండర్సన్‌,  జూ. ట్రంప్‌ బంధం వెలుగులోకి వచ్చింది.

     

     ">  

     

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త హైకోర్టు భవన సముదాయం పనుల పురోగతిని రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ బుధవారం పరిశీలించారు. పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్లు (బిల్డింగ్స్, ఎలక్ట్రికల్), ఆర్‌అండ్‌బీ ఫీల్డ్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ సంస్థ డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కన్సల్టెంట్లు టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. పనుల వేగం, క్రమబద్ధత, నాణ్యతను వికాస్ రాజ్ సమీక్షించి, వివిధ దశల పూర్తి కాలపట్టికలను ఖరారు చేశారు.

    తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక న్యాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కొత్త హైకోర్టు భవన సముదాయానికి రూ.2,583 కోట్ల పరిపాలనా అనుమతి ఉంది. మొత్తం 36.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, ఎంఈపీ పనులకు రూ.1,980 కోట్లు, ఫర్నిచర్ మరియు ఆపరేటివ్ పరికరాలకు రూ.603 కోట్లు కేటాయించారు. 2024 డిసెంబర్ 7న జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెం.827 ద్వారా పరిపాలనా ఆమోదం లభించింది.

    పనుల సమీక్షలో భాగంగా, డ్రాయింగ్‌లను ముందుగానే సమర్పించాలని కన్సల్టెంట్లను వికాస్ రాజ్ ఆదేశించారు. తద్వారా కార్మికులు, సామగ్రి, యంత్రాల సమర్థ వినియోగం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పనుల పూర్తి కార్యక్రమాన్ని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్), కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ కలిసి రూపొందించాలని, దానిపై తరచూ సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

    ఒప్పందంలో పేర్కొన్న మైలురాళ్ల ప్రకారం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. న్యాయ అధికారుల సూచనలకు అనుగుణంగా మార్పు చేసిన నమూనాలను ఆలస్యం లేకుండా సిద్ధం చేసి, అనుమతులు పొందాలని కన్సల్టెంట్లకు ఆదేశించారు. జోన్-2కు సంబంధించిన అటవీ అనుమతులు సహా అన్ని క్లియరెన్సులను త్వరితగతిన పూర్తిచేయాలని చీఫ్ ఇంజినీర్ (బిల్డింగ్స్)కు సూచించారు.

    డిజైన్ మార్పుల వల్ల ఏర్పడిన ఆలస్యాలను అధిగమించేందుకు శాఖ, కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్ సమన్వయంతో పనిచేయాలని, ప్రాజెక్టును సమయానికి పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అయితే, స్పీకర్‌ నిర్ణయాన్ని పిటిషన్‌ దాఖలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

     తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అరికపూడి గాంధీ,గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తీర్పును వెలువరించారు. 

    ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్‌ విచారణ చేపట్టారు. ఆ ఐదుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి అనర్హత వేటు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వరుస పరిణాలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుమంది ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్‌తో పిటిషనర్లు వివరించినట్లు తెలుస్తోంది. 

    స్పీకర్‌ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ స్పందించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. 

  • సాక్షి,  హైదరాబాద్‌: ఫిరాయింపుల కేసులో స్పీకర్‌ కీలక తీర్పునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల  పిటిషన్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ డిస్మిస్‌ చేశారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్న స్పీకర్‌.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై  బీఆర్‌ఎస్‌ ఆరోపణలను స్పీకర్‌  తోసిపుచ్చారు. 

    ఎమ్మెల్యేలు, అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌ మహిపాల్‌ రెడ్డిలపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్‌ నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్ల ఎక్కడా ఆధారాలు లేవన్నారు. బీఆర్‌ఎస్‌ వాదనతో స్పీకర్‌ ఏకీభవించలేదు.

    కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటీషన్  స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుగురి ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. స్పీకర్‌ దగ్గర మాకు న్యాయం  దక్కలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కోసం కోర్టులను ఆ‍శ్రయిస్తాం. కండువాలు  కప్పుకుని పార్టీ మారినా  వేటు వేయలేదు. న్యాయం  కోసంకచ్చితంగా  కోర్టు తలుపులు తడతాం’’ అని పల్లా చెప్పారు.

     

     

     

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు మధ్యాహ్నం హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మూర్మును హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతం పలికారు.

    భద్రతా ఏర్పాట్లు
    రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హకీంపేట, బోలారం, అల్వాల్‌, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్‌ ఉండనుంది. కాగా, డిసెంబర్19 ఉదయం 11.00 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. 

    అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

    హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి
  • సాక్షి,హైదరాబాద్‌: జీహెచ్ఎంసి డీలిమిటేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు స్వీకరించే గడువును మరో రెండు రోజులు పొడిగించింది. 

    ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ 24 గంటల్లోపు జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. పౌరులు రెండు రోజుల్లోపు తమ అభ్యంతరాలను సమర్పించాలి. వాదనలో అడ్వకేట్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి ప్రస్తావించారు. డెడ్‌లైన్ దగ్గర పడుతున్నందున.. రెండు రోజులకు మించి గడువు పొడిగించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరగా.. హైకోర్టు రెండు రోజులు సరిపోతుందని తేల్చిచెప్పింది.

    అంతకుముందు జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు  వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

    డీలిమిటేషన్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్‌ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ఏజీ చెప్పారు. నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా వార్డుల విభజన మాత్రమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పై విధంగా స్పందించింది.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల పదవి బాధ్యతలు స్వీకరించే అపాయింట్‌మెంట్ డే వాయిదా పడింది. ఈనెల 20న నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 22కి మార్చింది.

    తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే సరైన ముహూర్తాలు లేవని.. కావున అపాయింటెడ్ డే ను ఈ నెల 22కు వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్ డేను రెండు రోజుల పాటు వాయిదా వేసి, డిసెంబర్ 22న నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు అదే రోజు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను మాఫీ చేయడానికి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావుపై సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వేటు వేశారు. ఆయనను వెంటనే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    ఇన్స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్ఐ అశోక్‌, హోంగార్డు కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను కూడా బదలీ చేస్తూ సీపీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించిన చలాన్లను క్లియర్ చేయడానికి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ సిబ్బందిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకున్న ఆయన, పోలీస్ వ్యవస్థలో అవినీతికి తావులేదని హెచ్చరిస్తున్నారు.

Family

  • పని చేయటం, విశ్రాంతి తీసుకోవటం అనేవి జీవితంలో రెండు అత్యంత ప్రధాన విషయాలు. ఈ రెండింటిలో సమతుల్యత కలిగి ఉండటం అనేది నైపుణ్యతకు సంబంధించినది. ఈ రెండింటిపై సరైన పట్టు తెలిసి ఉండటమే జ్ఞానం. పనిచేయడంలో విశ్రాంతి, విశ్రాంతిలో కార్యచరణతను చూడటం అనేది అంతులేని స్వేచ్ఛని అందిస్తుంది.

    బ్రేక్‌ ప్రాముఖ్యత...
    కాలం అనేది ప్రవహించే నది లాంటిది. ఆనందంగా ఉన్న సమయాన్ని సైతం తన ప్రవాహంలో తీసుకుపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రవాహంలో ముక్కుపుటాలవరకు మునిగిపోతాం. ఆ తర్వాత నది ఒరవడి తగ్గాక లేదా వరద ఉద్ధృతి తగ్గాక ఒడ్డుకి చేరుకుంటారు. అలేగా జీవితంలో కూడా ఒక్కోసారి సంపూర్ణంగా కాలంతో ఉండాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒడ్డుకు చేరి కూర్చొని గమనించాలి కూడా. అలాగే జీవితంలో కూడా ఇలాంటి సమతుల్యతను పాటించాల్సిన అవసరం తప్పక ఉంది.

    సరైన కార్యాచరణే విశ్రాంతికి పునాది..!
    ఎంత ఎత్తైన భవనాన్ని నిర్మించాలన్నా దానికి సరైన పునాది లోతుగా ఉండాల్సిందే. వింటినారిని ఎంత భాగా వెనక్కు లాగితే అంతవరకు బాణం దూరంగా వెళ్తుంది. అలాగే మన పనులు ఫలవంతమై, విజయం సాధించాలంటే. మనకు సరైన సమయంలో తగిన విశ్రాంతి అంత అవసరం. 
    ధ్యానం అంటే..
    ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండే ఓ అద్భుత కళ. ఇది గాఢ నిద్రలో పొందే విశ్రాంతి కంటే విలువైనది. శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ సుదర్శన క్రియ. మెదడులోని ఆల్ఫా, బీటా తరంగాలు రెండింటిని పెంచి, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఫలితం విశ్రాంతిగా ఉంటూనే అ‍ప్రమత్తంగా(ఎరుకగా) ఉంటాం. ఫలితంగా ఒత్తిడికి గురికాకుండా పనిచేయగలుగుతాం.

    బ్యాలెన్సింగ్‌ లైఫ్‌ కోసం..
    ధ్యానం వెనుకకు లాగిపట్టి లోలోపలకు తీసుకువెళ్లి..పరిస్థితుల నుంచి పారిపోనివ్వకుండా చేస్తుంది. ఇది సమతత్వాన్నిసాధించేందుకు చేసే అభ్యాసం. అంతరంగంలో ప్రశాంతత, బాహ్యంగా చైతన్యంగా ఉండేలా చేస్తుంది.ఇది అందరికి తప్పక అవసరమైనది. మనలో కలిగే సంఘర్షణలకు పరిష్కారం తోపాటు అంతరంగ శాంతికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ప్రశాంతత ఏర్పడుతుందో..సానూకూలంగా స్పందించగలుగుతాం. 

    సున్నితంగా ఉంటూ సానకూలంగా వ్యవహరించడం అత్యంత అవసరం. ఎందుకంటే సున్నిత మనస్కులు చిన్న విషయాలకే ఆవేశ పడిపోతారు. అతిగా స్పందించేవారు ఇతరులు ఏమనుకుంటారనేది అనవసరం, తమ వైఖరే సరైనదనేది వారి నమ్మకం. అందువల్ల సున్నతత్తం స్పందించే మనసు  రెండూ అవసరమే మనిషికి. ఈ నాగరిక సమాజంలో మనగలగాలంటే..సంబంధాలు, సమతుల్యత రెండూ అవసరం. ముఖ్యంగా మన భావ ప్రకటన సవ్యంగా ఉంటే ఎలాంటి ఘర్షణలకు తావుండదు.

    విరామపు శక్తని ఎలా పెంపొందించుకోవాలంటే..
    మొదటగా విరామం అవసరం అన్న ఆలోచనే మిమ్మల్ని విశ్రాంతిగా ఉండనివ్వదు. బాగా కష్టపడి పనిచేయాలన్న ఆలోచన అలసట తెప్పిస్తుంది.తక్కువ సమయమైనా విశ్రాంతి పునరుత్తేజాన్ని అందిస్తుంది. ధ్యానం చేసేందుకు నాకు ఏం అక్కర్లేదు, నేను ఏం కాను, ఏమి చేయడం లేదు అనే వాటిని వదిలేయండి. మూడు కాలం మిమ్మల్ని నియంత్రించేలా చేయకండి, సమయం సరిపోవటం లేదన్న ఆలోచనే వద్దు. చివరగా చేసే పనిలో తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించండి. ఇ‍క్కవ విశ్రాంతి తీసుకున్నప్పుడు శక్తిపొందుతారు, పనిచేసినప్పుడూ శక్తిని వ్యక్తపరుస్తారు. ఈ రెండిటి కలయికే జీవితం.

    సృజనాత్మకత, చైతన్యానికి మూలం ధ్యానం..
    చివరగా ధ్యానం చేయండి, అది మిమ్మల్ని, మీ మనసుని శుభ్రపరిచి, పనిభారాన్ని స్వీకరించేందుకు సిద్ధం చేస్తుంది. మనసు విశ్రాంతి పొందినప్పుడే బుద్ధి పదునెక్కుతుంది.ప్రశాంతమైన, స్థిరమైన మనసు మందకోడిగా ఉంటుంది. అది ఉత్సాహానికి, సృజనాత్మకతకు నెలవుగా మారి, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటన్నింటిని పొందగలిగేలా చేస్తుంది.
     

  • మోకాళ్లు నొప్పులు ఎంతలా వేధిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. బాధితులు తాళలేక ఎంతలా ఇబ్బంది పడతారనేది మాటలకందనిది. టాలీవుడ్‌ నటుడు నాగార్జున సైతం తానుకూడా ఆ సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.వాళ్ల అమ్మ కూడా ఆ సమస్యతో బాధపడేదని, తన బాధను చూడలేపోయేవాడినని అన్నారు. అభివృద్ధి చెందిన టెక్నాలజీతో తనకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అదెలాగో నటుడు నాగార్జున మాటల్లోనే తెలుసుకుందామా..!.

    మా అమ్మకు మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉండేవి. దీంతో అప్పట్లో ఆమె బాధ చూడలేకపోయేవాడిని.. నొప్పులతో ఓ వైపు అమ్మ బాధ పడుతుంటే.. ఆమెను చూసిన నాకు ప్రాణం విలవిలలాడిపోయేది. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఇంత అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం నన్ను బాధించింది.. ప్రస్తుతం నగరంలో ఈ మోకాళ్ల నొప్పులకు స్కైవాకర్‌ ఆర్థోపెడిక్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది.. అని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. 

    భాగ్య నగరంలోని గచ్చిబౌలిలో  ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన స్కైవాకర్‌ ఆర్థోపెడిక్‌ రోబోటిక్‌ టెక్నాలజీని బంజారాహిల్స్‌లోని లీలా గ్రాండ్‌లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ టెక్నాలజీ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. 

    ‘రోజులు మారుతున్న కొద్దీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. శరీరంలో కృత్రిమ అవయువాలు అమర్చడం, అవయవ మార్పిడి వంటి చికిత్సలు విజయవంతంగా చేపడుతున్నారు. గతంలో ఇటువంటి వైద్య సేవలు అందుటులో ఉండేవి కావు. దీంతో బాధితుల కష్టాలు వర్ణణాతీతం. ఇందుకు మా అమ్మే ఉదాహరణ. నా కళ్ల ముందు అమ్మ బాధపడుతుంటే చూడలేకపోయేవాడిని. 

    ఆర్టిఫిషియల్‌ అవయవాలు అందుబాటులోకి వచ్చిన తరువాత పెయిన్‌ ఫ్రీ లైఫ్‌ చూస్తున్నాం. ప్రయాణ సమయంలో, ఎయిర్‌ పోర్టులు, ఇతర ప్రదేశాల్లో మోకాళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొత్త టెక్నాలజీ గౌరవంగా బతకడానికి ఎంతో ఉపయోగకరంగా మారింది.. ప్రస్తుత పరిస్థితుల్లో శరీరానికి ఫిట్నెస్‌ అవసరం. అదే మంచి జీవితాన్ని అందిస్తుంది. 

    కులూమనాలీ షూటింగ్‌ సమయంలో నీ పెయిన్‌ సివియర్‌గా బాధించింది. కుంటుకుంటూ వెళ్లాను. అమ్మను చూసిన తరువాత నాకు ఆపరేషన్‌ తప్ప వేరే మార్గం లేదనిపించింది. నా స్నేహితులు డా.ప్రభాకర్‌ గురించి చెప్పారు. ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాక ఐదేళ్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ లేదు’అని నాగార్జున తెలిపారు. అక్కడి నుంచి ఏదైనా కొత్తగా మందులు, టెక్నాలజీ వస్తే పరస్పరం షేర్‌ చేసుకుంటాం. స్కైవాకర్‌ బిగ్‌ హీల్‌ ఫర్‌ మీ అని పేర్కొన్నారు నాగార్జున . కార్యక్రమంలో ఆరిట్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

    (చదవండి: వెయిట్‌ లిఫ్టింగ్‌తో కంటి చూపుకే ముప్పు..! హెచ్చరిస్తున్న వైద్యులు)
     

  • చాలామటుకు ఆర్థోపెడిక్‌​ సమస్యలు ఉన్నవారు, పెద్దవాళ్లు వెయిట్‌లిప్టింగ్‌తో ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ మోకాళ్ల సమస్యల నుంచి బయటపడుతున్నారు కూడా. కానీ ఒక్కోసారి ఇలాంటి వెయిట్‌ లిఫ్టింగ్‌లు అనుకోని సమస్యలు కూడా తెచ్చుపెడుతుందట. భారీ వెయిట్‌ లిఫ్టింగ్‌లు ఎత్తితే కంటి చూపే పోయే ప్రమాదం ఉంటుందట. ఇది చాలా అరుదుగా సంభవించే గాయమట. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఫిట్‌నెస్‌ కోసం చేసే వ్యాయామాలు కంటిచూపుపై ప్రభావం చూపించడానికి రీజన్‌.

    27 ఏ‍ళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తి భారీ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఎత్తిన వెంటనే ఆకస్మికంగా దృష్టికోల్పోయాడు. ఒక సాధారణ జిమ్‌ సెషన్‌​ కాస్తా అత్యవసర వైద్య పరిస్థితిగా మారింది. నిజానికి అంతకుమునుపు అతడి కంటికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. జిమ్‌లో డెడ్‌లిఫ్ట్ సమయంలో ఒత్తిడికి గురైన వెంటనే ఆ వ్యక్తికి దృష్టి సమస్యలు మొదలయ్యాయి. 

    వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా కుడి కంటిలో అస్పష్టత ఉందని, ఎడమకన్ను సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ప్రభావిత కంటిలో దృష్టిలోపం గణనీయంగా ఉందని చెప్పారు. వ్యాయమాం చేసిన వెంటనే ఎంత అకస్మికంగా ఇబ్బందిగా అనిపించిందో వైద్యులకు వివరించాడు. అది ఎలాంటి నొప్పి లేకుండా ఒక గందరగోళంలా జరిగిందని అన్నాడు. 

    ఎందువల్ల ఇలా అంటే..
    అతనికి దట్టమైన ప్రీ రెటీనా ఉందని, దీనిని  సబ్‌హైలాయిడ్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా పైన ఉంటుంది. ఇది పదునైన దృష్టికి కారణమయ్యే రెటీనా కేంద్ర భాగం. దీన్ని క్షణ్ణంగా స్కాన్‌ చేయగా ఆ రోగికి విట్రియస్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇది ఆకస్మికంగా భయపడినప్పుడూ లేదా తీవ్రమైన బరువు ఎత్తడం వల్ల వస్తుందట. ప్రస్తుతం ఈ రోగి ఎదుర్కొంటున్న సమస్యను 'వల్సాల్వా రెటినోపతి'గా పేర్కొన్నారు.  

    వల్సాల్వా రెటినోపతి అంటే..
    వల్సాల్వా రెటినోపతి అనేది రెటీనా రక్తస్రావం. ఇది దగ్గు, ఎత్తడం లేదా గట్టిగా వాంతు చేసుకున్నప్పుడూ..ఛాతీ ఒత్తిడిలో అకస్మాత్తుగా పెరుగుదల కారణంగా రెటీనా కేశనాళికలు పగిలిపోయి కంటిలో రక్తస్రావం కలుగుతుందట. దాంతో అకస్మాత్తుగా, నొప్పిలేకుండా దృష్టి నష్టానికి దారితీస్తుంది. 

    సాధారణంగా ఇలాంటి సమస్య కాసేపటి తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు తీవ్రంగా ఉంటే లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం అవుతుంది. బరువులు ఎత్తడం, వాంతులు లేదా లైంగిక కార్యకలాపాలు వంటి కార్యకలాపాల తర్వాత ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా ఈ సమస్య అత్యంత సాధారణం అని చెబుతున్నారు.

    ఇది ఎందువల్ల అంటే ఏదో తెలియని ఒత్తిడి ఫలితం ఇలాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన చురుకైన వ్యక్తులనే ప్రభావితం చేస్తుందట.

     లక్షణాలు

    • నిపుణుల అభిప్రాయం ప్రకారం, దృష్టిలో అకస్మాత్తుగా తగ్గుదల, తరచుగా ఒక కంటిలో. రోగులు వారి కేంద్ర దృష్టిలో ఒక చీకటి మచ్చ లేదా నీడను గురించి వివరిస్తారు. దాన్ని కొన్నిసార్లు సిరా మచ్చ లేదా అద్దాలపై మరకలా ఉందని చెబుతుంటారు. 

    • అస్పష్టమైన లేదా వక్రీకరించబడిన దృశ్య క్షేత్రాలు, తేలియాడే మచ్చలు 

    • అరుదుగా, గణనీయమైన రక్తస్రావం జరిగితే తేలికపాటి అసౌకర్యం

    • ముఖ్యంగా శారీరక శ్రమ లేదా శ్రమ తర్వాత మీ దృష్టిలో ఆకస్మిక మార్పులను మీరు గమనించినట్లయితే అత్యవసర అంచనాను పొందడం చాలా అవసరం.

    ఎలా చికిత్స చేస్తారంటే..

    ఈ పరిస్థితికి చికిత్స చేయడం అంటే.. రక్తస్రావంను సురక్షితంగా, వేగంగా క్లియర్ చేసి, దృష్టిని పునరుద్ధరించడం. అలాగే శాశ్వత రెటీనా నష్టాన్ని నివారించడం అని వైద్యులు అంటున్నారు. 

    చిన్నపాటి రక్తస్రావం కోసం, రోగి  దృష్టి, రెటీనా ఆరోగ్యాన్నినిశితంగా పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది. .

    యాగ్ లేజర్ చికిత్స
    రక్తం లోపలి పరిమితి పొర కింద చిక్కుకున్నప్పుడు, YAG లేజర్ చికిత్సను సూచిస్తారు వైద్యులు. అరుదుగానే శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెప్పుకొచ్చారు వైద్యులు. .
     

  • బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ మందిరంలో దేవుడికి నైవేద్య సమయాల్లో గందరగోళం ఏర్పడింది.  అందుకు కారణం ఆలయంలో చెల్లింపులతో కూడిన "ప్రత్యేక పూజలు" చేయడానికి భక్తులను అనుమతించడమేనని  ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ  నిరంతర పూజల వల్ల కృష్ణుడి విశ్రాంతి వేళలు లేకుండాపోయాయని మండిపడింది. అంతేగాదు కాసులకు కక్కర్తిపడి ఇలా చేస్తున్నారా అంటూ ఆలయ అధికారులపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలానే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో తెరిచిన ఆలయ ఖజనా వివాదానికి సంబంధించి.. పలు ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందామా..!

    1862లో రాజస్తానీ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఉత్తరప్రదేశ్‌లోని  బృందావన్‌ బాంకే బిహారీ ఆలయం శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి. ఇది ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం. ఈ ఆలయంలో  కృష్ణుడిని బాంకే బిహారీగా పూజలందుకుంటాడు. అంటే ఇక్కడ కృష్ణుడు బాల రూపంలో దర్శనమిస్తాడు. 

    ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే..గంటలు మోగించరు, హారతులు ఇవ్వరు. భక్తి శ్రద్ధలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఇలా చేస్తుంటామని ఆలయ పూజారులు చెబుఉతున్నారు. ఏడాదిలో ఒక్కసారి అదికూడా అక్షయ తృతియ రోజున మాత్రమే భక్తులు బాల కృష్ణుని పాదాలను దర్శించుకునే భాగ్యం లభిస్తుందట.

    ఖజానా వివాదం..
    అనంతపద్మనాభుని ఆలయంలో మూసి ఉన్న గదిలాంటిదే బృందావన్‌లోని బాంకే బిహారి ఆలయంలో కూడా ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయని అంతా అనుకునేవారు. ఆ గదిని అక్టోబర్ 2025లో, సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌ పర్యవేక్షణలో తెరిచారు. నిజానికి ఈ గది 1970ల నుంచి మూసివేసే ఉంది. సుమారు 54 ఏళ్ల తర్వాత తెరిచే ప్రయత్నం చేస్తే అదికాస్త పెను వివాదాంశమైంది. 

    అయితే ఆ గదిలో ప్యానెల్‌ సభ్యులు రాగి కూజాలు, రాళ్లు, చెక్కపెట్టే, మూడు వెండి కడ్డీలు, ఒక బంగారు కడ్డీ,కొన్ని పాత్రలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. అయితే అదంతా అబద్ధమంటూ పూజారులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు, శతాబ్దాల నాటి కానుకలు అపహరణకు గురయ్యాయని, ప్యానెల్‌ సభ్యులు తప్పదారి పట్టిస్తున్నారంటూ కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకత కోసం ప్రత్యక్షప్రసారంలో ఆ గది తనిఖీని ప్రసారం చేయాల్సిందిగా డిమాండ్‌ కూడా చేశారు. 

    అంతేగాదు ఆలయ సంపద దుర్వినియోగం చేయబడిందనే అనుమానాలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికీ ఆ ఆలయ ఖజనా విషయం ఓ వివాదాస్పదమైన మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలని కోరుతూ ప్రధాని మంత్రికి లేఖ సైతం రాశారు. 

    విశేషం ఏంటంటే..
    ఈ బృందావన్‌లో ఉన్న కృష్ణుడి ఆలయానికి భారీగానే ఆర్థిక వనరులున్నాయి. ఏకంగా రూ. 400 కోట్ల వరకు బ్యాంకు డిపాజిట్లు, సీలు వేసిన లాకర్లు, భూమి కమతాలు, భారీ విరాళల రికార్డులు ఆడిట్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొనడం విశేషం. కాగా, అపహరణకు గురైన ఆస్తులపై తొలి పూర్తిస్థాయి ఆడిట్‌ని నిర్వహించాలని సుప్రీం కోర్టు ప్యానెల్‌ ఆదేశించింది.

    (చదవండి: నెలగంట కట్టడం అంటే..? అది పండుగ రాకకు సంకేతమా..?)

     

Cartoon