Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

Politics

  • సాక్షి,ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నాయి.  పెదపాడు మండలం ఏపూరి గ్రామ వైఎస్సార్‌సీపీ దళిత సర్పంచ్ చోటగిరి రామకృష్ణ పై పచ్చ మూకలదాడి చేశాయి.

    ద్విచక్ర వాహనంపై నూజివీడు వెళ్లివస్తున్న రామకృష్ణను టీడీపీ మూకలు అడ్డగించి దాడి చేశాయి.  బాధితుడి బైక్ నెంబర్ ప్లేట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే  అబ్బయ్య చౌదరి ఫోటోలు ఉన్నాయని దాడికి దిగారు.  

    బైక్‌పై వెళ్తున్న రామకృష్ణను కిందకి లాగి దాడి చేశారు. ఆపై అసభ్యంగా దూషించారు. తనపై  టీడీపీ నేతలు దాడి చేసి, అసభ్యంగా దూషించారని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
     

  • సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి  కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డిపై మనుబోలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి.. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా? అంటూ మండిపడ్డారు.

    కావాలనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవడం లేదు. కూటమినేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు నేను బతికున్నంత కాలం అండగా నిలబడతా’’ అని కాకాణి పేర్కొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా  ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.

    ‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు.

    ..చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు

    ..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.

    ‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు  పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.

    ‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత  పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్‌ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు

    ..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు.

  • సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.

    టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది‌మరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్‌ నిప్పులు చెరిగారు.

    ‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్‌కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్‌ని ప్రేమిస్తారు

    ..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్‌పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును‌ ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్‌ సుధాకర్‌బాబు హెచ్చరించారు.

  • సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇదీ జరిగింది..
    రాజధానిలో ఎన్‌–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్‌ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..

    ‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.

    ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్‌లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు  రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

     

  • సాక్షి, తాడేప‌ల్లి: లెక్కా జ‌మ లేకుండా ఏడాదిన్న‌ర‌లోనే రూ.2.80 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్ర‌బాబు దివాళా అంచున నిల‌బెట్టాడ‌ని వైఎస్సార్‌సీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ‌శంక‌ర్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కం అమ‌లు చేయ‌క‌పోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా క‌నిపించ‌క‌పోయినా అప్పులు మాత్రం రూ. 2.80 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయ‌ని వివ‌రించారు.

    కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌కు లెక్క‌లుంటే చూపించాల‌ని శివశంకర్‌ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతుల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వ‌లేద‌ని వివ‌రించారు. చంద్ర‌బాబు అప్పుల ద్వారా తెస్తున్న డ‌బ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోంద‌ని, అప్పులు తెచ్చిన డ‌బ్బుతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌లు ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ జ‌ల్సాలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    వైఎస్‌ జ‌గ‌న్ త‌న ఐదేళ్ల పాల‌న‌లో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవ‌లం రూ. 3.72 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశార‌ని, అందులోనూ రూ. 2.73 ల‌క్ష‌ల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేశార‌ని వెల్ల‌డించారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం ఏడాదిన్న‌ర‌లోనే 2.80 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్య‌త‌గా లెక్క‌లు చూపించ‌డం లేద‌ని చెప్పారు. పోర్టులు, మెడిక‌ల్ కాలేజీలు, ఇళ్ల స్థ‌లాల పంపిణీ, గ్రామ స‌చివాల‌యాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్‌ జగన్‌ సృష్టించిన సంప‌ద‌ను కూట‌మి నాయ‌కులు దోచుకుతింటున్నార‌ని పుత్తా శివ‌శంక‌ర్‌ మండిప‌డ్డారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    ఆ ముగ్గురు ప్ర‌త్యేక విమానాల్లో 70 సార్లు హైద‌రాబాద్‌కి
    కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఏడాదిన్న‌ర‌లోనే అప్పులు రూ.2.80 ల‌క్ష‌ల కోట్ల‌ను మించిపోయాయి.  మంగ‌ళ‌వారం వారం వ‌చ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న ప‌రిస్థితి. బ‌డ్జెట్ ప‌రిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్ర‌భుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమ‌రావ‌తి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవ‌స‌రం లేదంటూనే రాజ‌ధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కం కూడా స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌లేదు.

    రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు క‌నిపించ‌డం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగ‌తి ప‌క్క‌న‌పెడితే క‌నీసం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీన జీతం ఇస్తామ‌న్న హామీని కూడా నెర‌వేర్చడం లేదు. ప‌దిహేనో తేదీ వ‌చ్చినా కొన్ని శాఖ‌ల ఉద్యోగుల‌కు జీతాలు జ‌మ కావ‌డం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డ‌బ్బంతా ఏమ‌వుతున్న‌ట్టు అని ప్ర‌శ్నిస్తుంటే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌మాధానం లేదు. చంద్ర‌బాబు, లోకేష్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఒక్కొక్క‌రు 70 సార్ల‌కు మించి హైద‌రాబాద్‌కి ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జ‌ల్సాలు చేస్తున్నారు. ఇంకోప‌క్క చంద్ర‌బాబు త‌న బినామీల‌కు రాష్ట్ర సంప‌ద‌ను విచ్చ‌ల‌విడిగా దోచిపెడుతున్నారు.

    సంప‌ద సృష్టి లేదు.. దోచుకోవ‌డ‌మే
    వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కరోనా సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ ఆర్థిక క్ర‌మశిక్ష‌ణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. ఇంకోప‌క్క మెడిక‌ల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో స‌చివాల‌యాలు, ఆర్బీకే సెంట‌ర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. 31 ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డంతో పాటు వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.

    ఈ విధంగా రాష్ట్రంలో ల‌క్ష‌ల కోట్ల సంప‌ద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాల‌న‌లో రూ. 3.72 లక్ష‌ల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 ల‌క్ష‌ల అప్పులు చేశారంటూ దుష్ప్ర‌చారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 ల‌క్ష‌ల కోట్లు నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ ప‌థ‌కాల రూపంలో జ‌మ చేయ‌డం జ‌రిగింది. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్న‌ర‌లోనే చేశారు.

    మైనింగ్ ఆదాయం తాక‌ట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పు
    రైతులు పండించిన ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఇచ్చింది లేక‌పోయినా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతుల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర చెల్లిస్తామ‌ని ఇచ్చిన హామీ ప్ర‌కారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మ‌ద్ధ‌తు ధ‌ర కోసం రోడ్డెక్కి ధ‌ర్నాలు చేస్తున్నా ప‌ట్టించుకున్న పాపాన‌పోవ‌డం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజ‌మ‌న్యాల‌కు క‌ట్ట‌బెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్ర‌యాల కోసం సెంట్ భూమి కొన‌క‌పోయినా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.

    ఏపీ స్టేట్ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ఆదాయాన్ని తాక‌ట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధికి లోబ‌డి 6.5 శాతంకి మించి వ‌డ్డీ ఉండ‌కూద‌ని ఆర్బీఐ స్ప‌ష్టంగా చెప్పినా రాష్ట్ర ప్ర‌భుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వ‌డ్డీ రేట్ల‌తో అప్పులు తెచ్చారు. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధికి లోబ‌డి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్ర‌భుత్వాన్ని తూల‌నాడింది. కానీ కూట‌మి ప్ర‌భుత్వంలో ఏడాదిన్న‌ర‌లోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ స‌మీక‌ర‌ణ అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. త‌న‌కిష్ట‌మైన చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌టంతో అప్పుల వార్త‌ల‌ను లోప‌లి పేజీల్లో చిన్న‌వార్త‌గా ప్ర‌చురించి మ‌మ అనిపిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జ‌గన్ సృష్టించిన సంప‌ద‌ను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండ‌కుండానే ఏపీని దివాళా అంచున నిల‌బెట్టారని పుత్తా శివ‌శంక‌ర్ మండిపడ్డారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా.. పార్టీ మీటింగ్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్‌కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్‌ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు  అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్‌సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్‌సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్‌ కూడా రెడ్‌బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. 

    ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్‌ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న  సంకేతం ఈ సర్వేలలో వస్తోంది.

     ఈ సర్వేల ఫలితాలు  ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. 

    ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న  అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట.  ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి  ఉండాలట.

     ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్‌సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్‌ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు  కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన  ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న  ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది. 

    అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న  వైఎస్సార్‌సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. 

    అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్‌ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. 

    అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు  పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.  వైఎస్సార్‌సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను  అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు  ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.

    కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

  • సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇంచార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.

    వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.

    ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.

    ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏ‌ఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. 

  • సాక్షి, విజయవాడ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీ కన్నుపడింది. అందుకే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్‌ కల్యాణ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ఊగిపోతూ మాట్లాడారు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారు?.

    టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుకి ఎంతో చరిత్ర ఉంది. 1966లో స్టీల్ ప్లాంట్ కోసం అమృతరావు నిరాహారదీక్ష చేశారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌పై ఇందిరాగాంధీ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రరాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మారింది. విశాఖ ఉక్కు ఉద్యమం ఒక చరిత్ర. ఆంధ్రుల ఆస్తి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుకు కట్టబెట్టాలనే కుట్ర మొదలైంది.  

    రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్‌కు నాయకులు లేకుండా పోయారు.. కార్యకర్తలు మిగిలారు. ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఊగిపోతూ మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు చంద్రబాబు సీఎం అయ్యాడు. ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. కుల పిచ్చిలో ఏపీ ప్రజలు నాయకులను ఎన్నుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా బీజేపీ ప్రభుత్వానికి లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

     

Sports

  • జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా  వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.

    అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్‌లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్‌లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.

    కెప్టెన్‌గా వైభవ్‌..
    ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా  గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు.  మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.

    అండర్‌-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:
    ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.

    సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు
    వైభవ్ సూర్యవంశీ(కెప్టెన్‌), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్,  ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది.

     

  • భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో  ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్‌-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది. 

    టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్‌కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ గాయ‌ప‌డ‌డంతో సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్ర‌స్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.  దీంతో కివీస్‌తో వ‌న్డే సిరీస్‌లో జ‌ట్టును గిల్ న‌డిపించ‌నున్నాడు.

    శ్రేయ‌స్ అయ్య‌ర్ రీ ఎంట్రీ?
    ఇక ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ భార‌త మిడిలార్డ‌ర్ శ్రేయస్ అయ్య‌ర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయ్య‌ర్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.

    అతడు త‌న ప్రాక్టీస్‌ను కూడా మొద‌లు పెట్టాడు. అత‌డికి రెండు మూడు రోజుల్లో ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. అందులో అత‌డు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక కానున్నాడు.

    ప‌డిక్క‌ల్‌కు చోటు..!
    ఒక‌వేళ అయ్య‌ర్ ఫిట్‌నెస్ సాధించ‌క‌పోతే అత‌డి స్ధానంలో క‌ర్ణాట‌క ఆట‌గాడు దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌డిక్క‌ల్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీ-2025లో ప‌డిక్క‌ల్ దుమ్ములేపుతున్నాడు. 

    వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ప‌డిక్క‌ల్ శ‌త‌క్కొట్టాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ప‌డిక్క‌ల్ స‌గ‌టు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అత‌డిని వ‌న్డే జ‌ట్టులోకి తీసుకోవాల‌ని మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు. మ‌రోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్‌తో వ‌న్డేల‌కు స్టార్ ప్లేయ‌ర్లు హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రాల‌కు విశ్రాంతి ఇచ్చే అవ‌కాశ‌ముంది.

    న్యూజిలాండ్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు(అంచనా)
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌)/ ప‌డిక్క‌ల్‌, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌

  • యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇం‍గ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆట‌గాడు ల‌బుషేన్ ఔట్ విష‌యంలో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.

    అస‌లేం జ‌రిగిందంటే?
    ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్‌లో ఇంగ్లండ్ పేస‌ర్ జోష్ టంగ్ తొలి బంతిని.. ల‌బుషేన్‌కు గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ స్లిప్‌లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.

    వెంట‌నే ఇంగ్లండ్ ఆట‌గాళ్లు సెల‌బ్రేట్ చేసుకోగా.. ల‌బుషేన్ మాత్రం బంతి నేల‌కు త‌గిలి చేతిలోకి వ‌చ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్ర‌మంలో ఫీల్డ్ అంపైర్‌లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు.

    థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ ల‌బుషేన్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ఈ ఆసీస్ షాక‌య్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేల‌కు తాకిన‌ట్లు అన్పించింది. థ‌ర్డ్ అంపైర్ అసహ‌నం వ్య‌క్తం చేస్తూ ల‌బుషేన్ మైదానాన్ని వీడాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు అది క్లియ‌ర్‌గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
    చదవండి: గంభీర్‌కు పదవీ గండం!.. అత‌డితో చ‌ర్చ‌లు జ‌రిపిన బీసీసీఐ?


     

     

  • టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

    అతడిని వెంటనే ప్రధాన కోచ్‌గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.  టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.

    ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్‌  వీవీఎస్ లక్ష్మణ్‌ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్‌ను లక్ష్మణ్‌ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్‌గా ఉన్నాడు. అయితే  ప్రస్తుత  బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్‌పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్‌తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. 

    గంభీర్ మెడపై కత్తి..
    కాగా వన్డే ప్రపంచకప్‌-2027 ముగిసే వర​కు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్‌ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్‌లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది.

    గంభీర్‌ ముందు పొట్టి ప్రపంచకప్‌తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్‌లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత క్రికెట్‌ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్‌లు లేవు.
    చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. శుభ్‌మన్‌ గిల్‌ కీలక నిర్ణయం
     

  • యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జ‌యం సాధించింది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై 14 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ తొలి యాషెస్ టెస్టు విజయాన్ని నమోదు చేసింది. అయితే  ఈ ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్టు కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.

    మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్‌పై  ఇరు జట్లు బౌలర్లు నిప్పులు చెరిగారు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలోనూ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. దీని బట్టి ఎంసీజీ వికెట్ బ్యాటర్లకు ఎంతకష్టతరంగా మారిందో ఆర్ధం చేసుకోవచ్చు. కేవలం రెండు రోజుల్లోనే మొత్తం 36 వికెట్లు నేలకూలాయి.

    ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఇంగ్లండ్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన స్మిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌లో విఫలమైంది.

    ఇంగ్లండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచిగల్గింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది.

    ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. తమ జట్టుపై స్టోక్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. అదేవిధంగా ఇటువంటి పిచ్‌ను తను ఇప్పటివరకు చూడలేదని అతడు చెప్పుకొచ్చాడు.

    చాలా సంతోషంగా ఉన్నా..
    "ఆస్ట్రేలియాలో సుదీర్ఘ కాలం త‌ర్వాత విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్ప‌టికే సిరీస్ కోల్పోయిన‌ప్ప‌టికి ఎట్ట‌కేల‌కు  స‌రైన ట్రాక్‌లో ప‌డ్డాము. చివ‌రి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తాము. ఈ మ్యాచ్‌లో మా కుర్రాళ్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. 

    కేవ‌లం జ‌ట్టు కోస‌మో, మా కోస‌మో ఆడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా మా వెన్నంటి ఉండి ప్రోత్సహించే లక్షలాది మంది అభిమానుల కోసం ఆడుతున్నాం. ఎక్క‌డికి వెళ్లినా మాకు ల‌భించే మ‌ద్దుతు మాలో కొత్త ఉత్స‌హాన్ని నింపుతోంది.  ఈ విజయం మా అభిమానులందరికీ ఎంతో సంతోషాన్నిస్తుందని భావిస్తున్నాను. 

    గత కొన్ని రోజులగా మా జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి.  కానీ ఆటగాళ్లు, మా కోచింగ్ స్టాప్ ఏకాగ్రతను కోల్పోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టారు. ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన చేసినందుకు ఆటగాళ్లకు, సపోర్ట్‌ స్టాప్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే.

    ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. మెల్‌బోర్న్ వికెట్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉంది.  అందుకే  మా బ్యాటర్లను పాజిటివ్‌గా ఆడమని, బౌలర్లపై  ఒత్తిడి తీసుకురావాలని సూచించాను. మా బ్యాటర్లు ఎంతో ధైర్యంగా ఆడి లక్ష్యాన్ని అందుకున్నారు. మా బౌలర్లు కూడా అద్భుతంగా  రాణించారు. ముఖ్యంగా జోష్‌ టంగ్‌ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బాక్సింగ్‌ డే రోజుల వేలాది మంది ప్రేక్షకుల ముందు 5 వికెట్లు తీయడం చిన్న విషయం కాదని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

    అదేవిధంగా ఎంసీజీ పిచ్‌పై కూడా స్టోక్స్ ఘాటుగా స్పందించాడు. ఇటువంటి పిచ్‌ను నేను ఇప్పటివరకు చూడలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటి పిచ్‌ను తాయారు చేసి ఉంటే పెద్ద రచ్చ జరిగి ఉండేది. బాక్సింగ్ డే టెస్టు కోసం లక్షలాది మంది అభిమానులు ఎదుచూస్తుంటారు. అటువంటి మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసి పోవడం చాలా బాధాకరం అని స్టోక్స్ అన్నాడు.
    చదవండి: Ashes: ఇదేంటో ఇలా ఉంది.. స్టీవ్‌ స్మిత్‌ విమర్శలు

     

  • టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్‌ బ్రేస్‌వెల్‌ సారథ్యం వహించనున్నాడు.

    అయితే, టీ20 సిరీస్‌ సందర్భంగా సాంట్నర్‌ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్‌ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ కార్ల్‌సన్‌, జేడన్‌ లెనాక్స్‌ ఈసారి ఇండియా టూర్‌కు రానున్నారు.

    ఆది అశోక్‌
    భారత సంతికి చెందిన కివీస్‌ క్రికెటర్‌ ఆదిత్య అశోక్‌. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్‌ లెగ్‌ స్పిన్నర్‌. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.

    భారత సంతతికే చెందిన ఇష్‌ సోధి కెరీర్‌ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడి వారసుడిగా కివీస్‌ బోర్డు అశోక్‌ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్‌ తరఫున అశోక్‌ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.

    క్రిస్టియన్‌ క్లార్క్‌
    దేశీ క్రికెట్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్‌ క్లార్క్‌ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌. ఇప్పటి వరకు అతడు కివీస్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.  అయితే, టీమిండియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

    లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 34 మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటర్‌గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్‌ వైపు కివీస్‌ మొగ్గుచూపవచ్చు.

    జోష్‌ క్లార్క్‌సన్‌
    ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జోష్‌ క్లార్క్‌సన్‌.  లోయర్‌ ఆర్డర్‌లో ఫినిషర్‌గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన క్లార్క్‌సన్‌.. 92 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 98 మ్యాచ్‌లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.

    జేడన్‌ లెనాక్స్‌
    భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్‌.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్‌కు వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్‌ స్పిన్‌ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్‌ ఉంది.

    చదవండి: IND vs NZ: కివీస్‌ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీల​క ప్లేయర్లు దూరం

  • హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బాక్సింగ్‌ డే టెస్టులో ఇంగ్లండ్‌ చేతిలో ఆసీస్‌కు ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్నారు.

    3-0తో సిరీస్‌ సొంతం
    పెర్త్, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో గెలుపొంది.. ఇంగ్లండ్‌పై మరోసారి ఆధిపత్యం చాటుతూ.. మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే వరుసగా రెండోసారి యాషెస్‌ సిరీస్‌ గెలుచుకుంది. తొలి రెండు టెస్టులకు రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ దూరం కాగా.. స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహించాడు.

    మూడో టెస్టుకు కమిన్స్‌ తిరిగి వచ్చి జట్టుకు గెలుపు అందించగా.. అనారోగ్యం వల్ల స్మిత్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు నుంచి కమిన్స్‌ విశ్రాంతి తీసుకోగా.. స్మిత్‌ తిరిగి పగ్గాలు చేపట్టాడు.

    అయితే, ఈ మ్యాచ్‌లోనూ ఆది నుంచి ఆధిపత్యం కనబరిచిన ఆసీస్‌... శనివారం నాటి రెండో రోజు ఆటలో బోల్తా పడింది. ఫలితంగా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై ఇంగ్లండ్‌ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది.

    ఇదిలా ఉంటే.. మెల్‌బోర్న్‌ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలిరోజే ఇరవై వికెట్లు కూలి ఇరుజట్లు ఆలౌట్‌ అయ్యాయి. రెండో రోజు సైతం పదహారు వికెట్లు పడ్డాయి. ఇక ఈ విషయంపై స్మిత్‌ స్పందించాడు. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ..

    మా ఓటమికి కారణం అదే
    ‘‘కష్టతరమైన మ్యాచ్‌. తొందరంగా ముగిసిపోయింది. మేము అదనంగా కనీసం 50- 60 పరుగులు చేసి ఉంటే మంచి పోటీ ఉండేది. ఏదేమైనా చివరి వరకు మేము పట్టువీడలేదు.

    ఇదేంటో ఇలా ఉంది
    వికెట్‌ ముందుగా ఊహించినట్లుగానే ఉంది. అయితే, బంతి పాతబడే కొద్ది పూర్వపు రూపాన్ని కోల్పోయింది. వాళ్లు బ్యాటింగ్‌కు వచ్చినపుడు కొన్ని ఓవర్లు దూకుడుగానే ఆడారు. ఏదేమైనా ఈ పిచ్‌ బౌలర్లకు అతిగా సహకరించింది.

    రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చికను కాస్త మెరుగుపరిచి ఉంటే బాగుండేది. అయితే, వికెట్‌ ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా మేము ఆడాల్సింది’’ అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. పరోక్షంగా పిచ్‌పై విమర్శలు గుప్పించాడు.

    ఆసీస్‌- ఇంగ్లండ్‌ యాషెస్‌ బాక్సింగ్‌ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు
    👉ఆస్ట్రేలియా: 152 &132
    👉ఇంగ్లండ్‌: 110 &178/6
    👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆఖ‌రి రెండు మ్యాచ్‌ల‌కు గాయం కార‌ణంగా దూరమైన టీమిండియా వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్‌ గిల్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌లో భార‌త జ‌ట్టును ముందుండి న‌డిపించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు. అంత‌కంటే ముందు విజ‌య్ హజారే ట్రోఫీ-2025లో గిల్ ఆడనున్నాడు.

    టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే గిల్ అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో గిల్ ముందే చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరంగా ఉన్నాడు.

    దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, నేరుగా కివీస్ సిరీస్‌లోనే ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాత్రం ఈ దేశవాళీ వన్డేలో టోర్నీలో ఆడేందుకు సిద్దమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 3న  సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్‌లలో గిల్ బరిలోకి దిగనున్నాడు. 

    ప్రస్తుతం మొహాలీలో ఉన్న శుభ్‌మన్.. జనవరి 1న జైపూర్‌లో పంజాబ్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా ముంబైతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ ఆడేందుకు కూడా గిల్ ఆసక్తిచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 8న పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది.

    అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత భారత్‌-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ క్యాంపును ఏర్పాటు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ముంబైతో మ్యాచ్‌కు గిల్ దూరం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. దీంతో అతడికి టీ20 వరల్డ్‌కప్‌-2026 జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
    చదవండి: రికెల్టన్‌ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్‌ మెరుపులతో బోణీ
     

  • సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26 సీజన్‌కు తెరలేచింది. కేప్‌టౌన్‌ వేదికగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌- ఎంఐ కేప్‌టౌన్‌ మధ్య శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన సూపర్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో డెవాన్‌ కాన్వే మెరుపు అర్ధ శతకం (33 బంతుల్లో 64) సాధించగా.. కేన్‌ విలియమ్సన్‌ ధనాధన్‌ (25 బంతుల్లో 40) దంచికొట్టాడు.

    వన్‌డౌన్‌లో వచ్చిన జోస్‌ బట్లర్‌ (12 బంతుల్లో 22), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (14 బంతుల్లో 22) ఆకట్టుకోగా.. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (17 బంతుల్లో 35), ఇవాన్‌ జోన్స్‌ (14 బంతుల్లో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖర్లో డేవిడ్‌ వీస్‌ (5 బంతుల్లో 9) మెరపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.

    కేప్‌టౌన్‌ బౌలర్లలో జార్జ్‌ లిండే రెండు వికెట్లు తీయగా.. కార్బిన్‌ బాష్‌, ట్రిస్టన్‌ లూస్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో కేప్‌టౌన్‌ ఆదిలోనే ఓపెనర్‌ రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌ (2) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు.

     

     కేవలం 63 బంతుల్లోనే ఐదు ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లు బాదిన రికెల్టన్‌ 113 పరుగులు సాధించాడు. మిగతా వారిలో రీజా హెండ్రిక్స్‌ (28) ఫర్వాలేదనిపించగా.. జేసన్‌ స్మిత్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 41)తో మెరిశాడు.

     

    అయితే, మిగిలిన వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. నికోలస్‌ పూరన్‌ (15) నిరాశపరచగా.. డ్వేన్‌ ప్రిటోరియస్‌ (5) తేలిపోయాడు. జార్జ్‌ లిండే డకౌట్‌ కాగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ 1, కార్బిన్‌ బాష్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఏడు వికెట్లు నష్టపోయిన కేప్‌టౌన్‌ 217 పరుగులకు పరిమితమై.. 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

    డేవిడ్‌ వీస్‌, సైమన్‌ హార్మర్‌, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టగా.. ఎథాన్‌ బాష్‌ నాలుగు వికెట్లతో చెలరేగి కేప్‌టౌన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తొలి శతకం బాదిన రికెల్టన్‌ ఇన్నింగ్స్‌ వృథాగా పోయింది.

  • బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫ్రాంచైజీ  ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) ఆకస్మికంగా మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.

    వెంటనే స్పందించిన ఫిజియోలు ఆయనకు సీపీఆర్ (CPR) నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహబూబ్ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధృవీకరించారు. ఈ విషాద ఘటన మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా చోటు చేసుకుంది. 

    అయితే మహబూబ్ అలీ జాకీ మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఆయనకు గుండెపోటు (Cardiac Arrest) వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అంతకుముందు వరకు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఫిట్‌గానే ఉన్నారని సహచరులు తెలిపారు. 

    ఈ వార్త తెలియగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయ‌న మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.

    ఒక దిగ్గజ కోచ్‌గా..
    బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ విభాగంలో జాకీ ఒక లెజెండరీ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్(2020)ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో బౌలింగ్ కోచ్‌గా ఆయనది కీలక పాత్ర. అదేవిధంగా  టాస్కిన్ అహ్మద్‌, షోర్‌ఫుల్ ఇస్లాం వంటి స్టార్ పేస‌ర్లు జాకీ కోచింగ్‌లోనే రాటుదేలారు. ఆయ‌న బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా, బౌలింగ్ యాక్షన్ రివ్యూ కమిటీ సభ్యుడిగా సేవ‌లందించారు.
    చదవండి: టీమిండియా కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

     

  • ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్‌ తొలిసారి టెస్టు మ్యాచ్‌ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా బాక్సింగ్‌ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    గెలుపు బోణీ
    ఆతిథ్య ఆసీస్‌ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన కంగారూలు యాషెస్‌ సిరీస్‌ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్‌ బృందం తీవ్ర విమర్శలపాలైంది.

    ముఖ్యంగా.. బజ్‌బాల్‌ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్‌.

    బౌలర్లదే పైచేయి
    శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అయితే, పచ్చటి పిచ్‌ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్‌ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్‌ను 110 పరుగులకే కుప్పకూల్చారు.

    ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పొరపాట్లకు తావివ్వలేదు.

    ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్‌ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్‌ చివరగా 2010లో టెస్టు మ్యాచ్‌ గెలిచింది. 

    ఆసీస్‌ గడ్డపై తొలిసారి ఇలా..
    ఇక ఇంగ్లండ్‌ టెస్టు దిగ్గజం జో రూట్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్‌ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్‌ టంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?

  • ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.

    తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్‌ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ హర్మన్‌ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.

     112 పరుగులకే పరిమితం
    నిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్‌ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

    ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్‌ కవిశా దిల్హారి బౌలింగ్‌లో స్మృతి మంధాన (1) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ (9)ను కవిశా వెనక్కి పంపింది.

    షఫాలీ, హర్మన్‌ ధనాధన్‌
    ఇలాంటి దశలో మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్‌ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్‌ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.

    ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్‌ 3-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.

    మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్‌గా అత్యధిక విజయాలు (సూపర్‌ ఓవర్‌ సహా)
    👉హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (ఇండియా)- 130 మ్యాచ్‌లలో 77 విజయాలు
    👉మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్‌లలో 76 విజయాలు
    👉హీదర్‌ నైట్‌ (ఇంగ్లండ్‌)- 96 మ్యాచ్‌లలో 72 విజయాలు
    👉చార్లెట్‌ ఎడ్‌వర్డ్స్‌ (ఇంగ్లండ్‌)- 93 మ్యాచ్‌లలో 68 విజయాలు
    👉ఎన్‌ చైవాయి (థాయ్‌లాండ్‌)- 79 మ్యాచ్‌లలో 55 విజయాలు.

    చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
     

  • ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తాజా ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో స్టోక్స్‌ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్‌లో కంగారూల సిరీస్‌ ఆధిక్యాన్ని తగ్గించింది.

    యాషెస్‌ సిరీస్‌ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఆసీస్‌ చేతిలో ఇంగ్లిష్‌ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్‌ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్‌ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.

    రెండు రోజుల్లోనే..
    ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్‌ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్‌బోర్న్‌ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. 

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. యువ పేసర్‌ జోష్‌ టంగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన స్టోక్స్‌ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.

    నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్లు
    హ్యారీ బ్రూక్‌ 41 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆసీస్‌ పేసర్లు నాసర్‌ 4, బోలాండ్‌ 3, స్టార్క్‌ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆసీస్‌.. వికెట్‌ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. 

    ఇక 4/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (46), కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (24 నాటౌట్‌) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.

    విజృంభించిన ఇంగ్లండ్‌ బౌలర్లు
    ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్‌ స్టోక్స్‌ మూడు, జోష్‌ టంగ్‌ రెండు, గస్‌ అట్కిన్సన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్‌ను 132 పరుగులకు ఆలౌట్‌ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్‌.. ఇంగ్లండ్‌కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.

    ఎట్టకేలకు తొలి విజయం
    పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ సఫలమైంది. టాపార్డర్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలీ (37), బెన్‌ డకెట్‌ (34) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ‘పేసర్‌’ బ్రైడన్‌ కార్స్‌ (6) విఫలమయ్యాడు.

    ఈ క్రమంలో జేకబ్‌ బెతెల్‌ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్‌ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్‌ స్టోక్స్‌ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్‌ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్‌ (18) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, జే రిచర్డ్‌సన్‌, స్కాట్‌ బోలాండ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్‌ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.

    బాక్సింగ్‌ డే టెస్టు సంక్షిప్త స్కోర్లు
    ఆస్ట్రేలియా: 152 &132
    ఇంగ్లండ్‌: 110 &178/6.

    చదవండి: నవతరం క్రికెట్‌లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్‌-5 ప్లేయర్లు వీరే!

Business

  • 2026 కవాసకి నింజా 1100SX.. భారతదేశంలో రూ.14.42 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లాంచ్ అయింది. ధర స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉన్నప్పటికీ.. ఇది మెటాలిక్ బ్రిలియంట్ గోల్డెన్ బ్లాక్/మెటాలిక్ కార్బన్ గ్రే అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది.

    కొత్త నింజా 1100ఎస్ఎక్స్ బైక్ కలర్ స్కీమ్.. 2025 మోడల్‌లో అందుబాటులో ఉన్న మెటాలిక్ కార్బన్ గ్రే/మెటాలిక్ డయాబ్లో బ్లాక్ కలర్ స్కీమ్‌తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేదు. కాబట్టి ఇది 1099 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ 134.14 bhp & 113 Nm ఉత్పత్తి చేస్తుంది.

    ఇదీ చదవండి: కారు మైలేజ్ పెరగాలంటే..

    నింజా 1100ఎస్ఎక్స్ బైకులోని ఇంజిన్ ఈ20కి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

  • ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే క్రమంగా కొన్ని రోజులకు మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా.. మైలేజ్ పెరగాలంటే వాహనదారులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

    సరైన డ్రైవింగ్
    కారు మైలేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. ఆకాశమత్తుగా వేగం పెంచడం, సడన్ బ్రేక్స్ వేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి స్మూత్‌గా.. ఒక నిర్దిష్టమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సాధారణంగా గంటకు 60 కిమీ నుంచి 80 కిమీ వేగం ఉత్తమ మైలేజ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా.. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకుండా, సరైన గేర్‌ను ఉపయోగించాలి.

    వాహనాన్ని సక్రమంగా నిర్వహించడం
    వాహనాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా.. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తుండాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తప్పకుండా తగ్గుతుంది. టైర్ ప్రెషర్ సరిగా లేకపోతే ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ వంటి వాటిని సమయానికి మారుస్తుండాలి.

    అనవసర బరువు వేయొద్దు
    కారులో లోపల లేదా కారు డిక్కీలో అవసరం లేని లగేజ్ ఉంచకూడదు. బరువు పెరిగితే.. ఇంజిన్ పనితీరు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్ కొంత పెంచుకోవచ్చు.

    ఏసీ, ఎలక్ట్రిక్ పరికరాల వినియోయాగం
    కారులో అవసరం లేనప్పుడు ఏసీ ఆపేయాలి. ఏసీ వినియోగం కూడా ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా నగరంలో తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు AC వాడకం మైలేజ్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా లైట్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచాలి.

    రూట్ ప్లానింగ్
    మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. భారీ ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్‌లో ఉండటం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి ముందుగానే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, కారు ఇంజిన్ ఆప్ చేసుకోవడం ఉత్తమం.

  • భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్‌ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.

    బడ్జెట్ ప్రతిపాదనలు

    2025-26 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్‌లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.

    నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకత

    గ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్‌బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..

    • విద్యుత్తు బిల్లుల చెల్లింపులు

    • నీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులు

    • ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.

    ప్రయోజనాలు

    యుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్‌వర్తినెస్‌’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.

    చట్టపరమైన, సాంకేతిక సవాళ్లు

    ప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.

    గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

    ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

  • ఇంకొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. ఇప్పటికే పండుగలు, ఇతర పర్వ దినాలకు సంబంధించిన సెలవులను సంబంధిత శాఖలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే ఏడాది (2026) సుమారు 21 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.

    మకర సంక్రాంతి (జనవరి 15)
    రిపబ్లిక్‌ డే (జనవరి 26)
    హోలీ (మార్చి 3)
    ఉగాది (మార్చి 19)
    రంజాన్‌ (మార్చి 21)
    శ్రీరామ నవమి (మార్చి 27)
    అకౌంట్స్‌ క్లోజింగ్‌ డే (ఏప్రిల్ 1)
    గుడ్‌ఫ్రైడే (ఏప్రిల్ 3)
    అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్ 14)
    మే డే (మే 1)
    బక్రీద్‌ (మే 27)
    మొహర్రం (జూన్ 26)
    స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)
    మిలాద్‌ ఉన్‌-నబీ (ఆగస్టు 26)
    శ్రీకృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్‌ 4)
    వినాయక చవితి (సెప్టెంబర్‌ 14)
    గాంధీ జయంతి (అక్టోబర్‌ 2)
    విజయ దశమి (అక్టోబర్‌ 20)
    దీపావళి (నవంబర్‌ 8)
    గురునానక్‌ జయంతి (నవంబర్‌ 24)
    క్రిస్మస్‌ (డిసెంబర్‌ 25)

    బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

    ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!

  • 2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్‌కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.

    ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.

    కృత్రిమ మేధ

    భారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్‌’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.

    ఈవీ చార్జింగ్ సదుపాయాలు

    ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.

    ఆఫీస్ వర్క్‌స్పేస్

    భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్‌గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.

    లగ్జరీ, ప్రీమియం వస్తువులు

    పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.

    ఇదీ చదవండి: క్విక్‌ కామర్స్‌.. గిగ్‌ వర్కర్ల సమస్యలివే..

  • 2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.

    జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.

    ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.

    వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలు
    వెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.

    ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్‌

  • టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నెక్సాన్ EV దేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.

    2020లో తన మొట్టమొదటి నెక్సాన్ ఈవీని లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రారంభంలో నెలకు 300 నెక్సాన్ కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఆ తరువాత నెలకు 3000 యూనిట్లను విక్రయించగలిగింది. ఇప్పుడు భారతీయ రోడ్లపై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటాను కలిగి ఉంది.

    ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు

    టాటా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ రానున్న రోజుల్లో.. సియెర్రా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ అవుతాయి.

  • భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆహార పంపిణీ (Swiggy, Zomato), రవాణా (Ola, Uber), నిత్యావసరాల డెలివరీ (Blinkit, Zepto) వంటి సర్వీసులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. అయితే, ఈ సౌకర్యాల డెలివరీలో భాగంగా ఉన్న లక్షలాది మంది గిగ్‌ వర్కర్ల జీవితాలు మాత్రం అనేక సవాళ్లతో, అభద్రతతో నిండి ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్లు చేపట్టిన నిరసనలు ఈ సమస్యల తీవ్రతను బహిర్గతం చేస్తున్నాయి.

    గిగ్‌ వర్కర్ల సమస్యలు

    • సాంప్రదాయ ఉద్యోగులకు ఉండే హక్కులు ఏవీ గిగ్‌ వర్కర్లకు వర్తించవు. వారిని ఉద్యోగులు అని పిలవకుండా పార్టనర్లు(Partners) అని కంపెనీలు సంబోధిస్తాయి. దీనివల్ల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే..

    • ఆదాయ అస్థిరత.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ప్లాట్‌ఫామ్‌లు ఇచ్చే కమీషన్లు తగ్గుతున్నాయనే వాదనలున్నాయి. దీనివల్ల వారి నికర ఆదాయం పడిపోతోంది. కనీస వేతన గ్యారంటీ లేకపోవడం అతిపెద్ద లోపం.

    • అల్గారిథమ్ నియంత్రణ.. డెలివరీ భాగస్వాములకు ఆర్డర్లు కేటాయించేది ఒక సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్. ఏ కారణం చెప్పకుండానే సడన్‌గా ఐడీ(ID) బ్లాక్ చేయడం వల్ల ఒక్కసారిగా వారి ఉపాధి కోల్పోతున్నారు.

    • పని వేళలు.. రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.

    క్విక్ కామర్స్ రంగంలో గిగ్‌వర్కర్ల కష్టాలు

    ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’(Quick Commerce) పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్‌ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.

    డిమాండ్లు

    క్రిస్మస్ (డిసెంబర్ 25) నుంచి న్యూ ఇయర్ (డిసెంబర్ 31) వరకు దేశవ్యాప్తంగా క్విక్‌ కామర్స్‌ విభాగంలో పని చేస్తున్న గిగ్‌ వర్కర్లు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

    • కనీస ఆదాయ భద్రత.. పెట్రోల్ అలవెన్స్‌తో కలిపి కిలోమీటరుకు కనీసం రూ.20 చెల్లించాలి.

    • 10-మినిట్స్ డెలివరీ రద్దు.. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ఈ మోడల్‌ను ఉపసంహరించుకోవాలి.

    • సామాజిక భద్రత.. ప్రమాద బీమా (Accident Insurance), ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.

    • న్యాయబద్ధమైన ఐడీ బ్లాకింగ్.. సరైన కారణం లేకుండా, వివరణ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఐడీలను బ్లాక్ చేయకూడదు.

    గిగ్‌ వర్కర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం, సామాజిక గౌరవం, భద్రత కల్పించినప్పుడే ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. గిగ్‌ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం మరింత చర్చించి ఇటు కంపెనీలు, అటు వర్కర్లకు అనువైన నియమాలు అమోదించాలని మార్కెట్‌ వర్గాలు కోరుతున్నాయి.

    ఇదీ చదవండి: రేషన్‌ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం

  • ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్న చైనా.. మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగవంతమయ్యే మాగ్లెవ్ (Maglev) రైలు ఈ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. చాలామంది ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నారు. అంతేలోనే మెరుపుతీగలా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్నవారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది.

    అత్యంత వేగవంతమైన సూపర్‌కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును విజయవంతంగా టెస్ట్ చేశారు. 700 కిమీ వేగంతో వెళ్లినప్పటికీ.. రైలును సురక్షితంగా స్టాప్ చేశారు. ఈ టెస్ట్ చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించారు.

    మాగ్లెవ్ ట్రైన్స్.. సాధారణ పట్టాలపై నడవవు. బదులుగా ఇందులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు నెట్టివేస్తాయి. దీనివల్ల వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్‌ల ద్వారా ప్రయాణించేలా చేయనున్నారు.

    ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చైనా యూనివర్సిటీ బృదం పదేళ్లుగా కృషి చేస్తున్నారు. 2025 జనవరిలో టెస్ట్ చేసినప్పుడు ఇది గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా జరిపిన టెస్టులో 700 కిమీ వరకు వేగవంతం అయింది. అదే యూనివర్సిటీ.. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది.

  • భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ అగ్రిమెంట్‌-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    కీలక పర్యటనలు - సన్నాహక చర్చలు

    కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.

    మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు

    2023 సెప్టెంబర్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.

    50 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం లక్ష్యం

    అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.

    రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.

    ఇదీ చదవండి: రేషన్‌ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం

  • బంగారం, వెండి ధరలు నువ్వా నేనా అని పోటీపడుతున్న సమయంలో.. ప్లాటినం ధర ఆల్‌టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. ఈ ఏడాది భారతదేశం ఏకంగా 125 శాతం పెరిగింది. దీంతో పదిగ్రాముల ప్లాటినం రేటు సుమారు రూ. 70వేలకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఇందులో విరివిగా పెట్టుబడులు పెడుతున్నారు.

    ప్లాటినం ధరలు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల ప్లాటినం రేటు రూ.4,320 పెరిగి.. రూ. 68,950 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో ఈ లోహానికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్లాటినం రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    ప్లాటినం రేటు పెరగడానికి కారణాలు

    • డిమాండుకు తగిన సరఫరా లేకపోవడమే. 

    • డాలర్ విలువ బలహీనపడటం, కొత్త టెక్నాలజీల్లో ప్లాటినం అవసరం పెరగడం

    • ప్రపంచ దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం

    • బంగారం, వెండి ధరలతో పోలిస్తే.. ప్లాటినం రేటు కొంత తక్కువ కావడం

    • ఆటోమొబైల్ క్యాటలిటిక్ కన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల్లో కూడా ప్లాటినం వినియోగం ఎక్కువ కావడం

  • వెండి ధర మళ్లీ రికార్డ్‌ యిలో ఎగిసింది. భారత్‌లో అయితే కేజీకి ఏకంగా రూ. 20 వేలు పెరిగి రూ.2.74 లక్షలకు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్‌‌కు 80 డాలర్లకు చేరువైంది. ఇక బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని వాదించే ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి.. వెండి ముచ్చట అంటే ఆగుతాడా.. మళ్లీ వచ్చేశాడు. తాజాగా సిల్వర్‌ గురించి మరో ముచ్చట పంచుకున్నారు.

    ‘వెండి 80 డాలర్లను (ఔన్సుకు) దాటనుంది. తెలివిగా వెండిని పొదుపు చేస్తున్న వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ ఓపికే మీకు సంపాదన తెచ్చిపెట్టింది. ఇప్పుడు మనం సంపన్నులయ్యాం. బంగారాన్ని వెండి అధిగమించింది’ అంటూ రాబర్ట్‌ కియోసాకి ( Robert Kiyosaki) ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

    అంతకు ముందు ఈ వైట్‌ మెటల్‌పై ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చా.. ఇప్పటికే ఆలస్యమైందా? అన్న సందేహానికి కియోసాకి ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న వెండి ధరే ఆల్‌టైమ్‌ హై అని అనుకోవద్దని, ఇప్పుడిది ప్రారంభమేనని, అసలు ర్యాలీ ముందుందని పేర్కొన్నారు.

  • ప్రపంచంలో కొన్ని ఊళ్లు కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ఇదే క్రమంలో చైనాలోని ఒక చిన్న గ్రామం ప్రస్తుతం ఆన్ లైన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ ఊరు విధిస్తున్న వింత జరిమానాలు, వసూలు చేస్తున్న విచిత్ర పన్నులే ఇందుకు కారణం. పెళ్లికీ, పిల్లలకూ పెనాల్టీలు వసూలు చేయడంపై ఆ గ్రామం తీవ్ర విమర్శలకు గురవుతోంది.

    నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని లింకాంగ్ గ్రామంలో వివాదం చెలరేగింది. 'విలేజ్ రూల్స్: ఎవ్రీవన్‌ ఈజ్‌ ఈక్వల్' అనే పేరుతో ఆ గ్రామానికి స​ంబంధించిన పెనాల్టీల నోటీసుల ఫొటోలు నెటిజన్లు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివాహం, గర్భం, వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన వివిధ జరిమానాలను నోటీసులో వివరించడం ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారితీసిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది.

    ఫొటోలలో చూపించిన నోటీసు ప్రకారం.. యునాన్ ప్రావిన్స్ వెలుపల ఉన్న వ్యక్తిని ఆ గ్రామస్తులు వివాహం చేసుకుంటే 1,500 యువాన్ల జరిమానా విధిస్తారు. పెళ్లికి ముందే గర్భవతి అయిన మహిళలు 3,000 యువాన్లు జరిమానా చెల్లించాలి. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించే జంటలకు ఏటా 500 యువాన్లు చొప్పున పన్ను కట్టాలి.

    ఇక పెళ్లయిన 10 నెలల్లోపు బిడ్డను కంటే 3 వేల యువాన్ల జరిమానా విధించనున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అలాగే చీటికీమాటికీ పోట్లాడుకునే మొగుడూపెళ్లాలకూ పెనాల్టీ తప్పదు. భార్యభర్తలు తగువులాడుకుంటే గ్రామ పెద్దలు పంచాయితీ చేస్తారు. ఇరువురికీ చెరో 500 యువాన్లు జరిమానా విధిస్తారు.

    మద్యం మత్తులో వీరంగం సృష్టించే మందుబాబులకూ ఇక్కడ పెనాల్టీలు ఉన్నాయి. గ్రామంలో ఇలా ఎవరైనా చేస్తే వారికి 3,000 నుండి 5,000 యువాన్ల మధ్య జరిమానా విధిస్తారు. అలాగే అనవసరమైన పుకార్లు వ్యాప్తి చేసినా 500 నుండి 1,000 యువాన్ల జరిమానా ఎదుర్కొంటారు.

    ఈ లింకాంగ్ గ్రామం జనాభా లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆ నోటీసు చాలా అసాధారణంగా ఉందని స్థానిక మెంగ్డింగ్ టౌన్ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి రెడ్ స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ చెప్పారు. తమను సంప్రదించకుండానే గ్రామ కమిటీ సొంతంగా ఆ నోటీసును పోస్ట్ చేసిందని, తర్వాత దాన్ని తొలగించినట్లు ఆ అధికారి తెలిపారు.

  • హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం గాడినపడింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, కీలకమైన ప్రాజెక్ట్‌ల కార్యాచరణ, అందుబాటు ధరలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కాస్మోపాలిటన్‌ కల్చర్‌ వంటి కారణాలు అనేకం. ఈ ఏడాది నవంబర్‌లో 6,923 నివాస సముదాయాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.4,904 కోట్లు. ఈ ఏడాదిలో ఈ నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ప్రాపర్టీల ధరలు సగటున 9 శాతం మేర వృద్ధి చెందాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.  

    గతేడాది నవంబర్‌లో రూ.3,504 కోట్ల విలువ చేసే 5,528 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అంటే గతేడాది నవంబర్‌తో పోలిస్తే 25 శాతం మేర, అంతకుముందు నెల అక్టోబర్‌తో పోలిస్తే 12 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే రిజిస్టర్డ్‌ ప్రాపర్టీల విలువ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 40 శాతం మేర వృద్ధి చెందాయి.

    విశాలమైన ఇళ్లు.. 
    విస్తీర్ణమైన ఇళ్ల కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవంబర్‌లో రిజిస్ట్రేషన్‌ జరిగిన ప్రాపర్టీలో 17 శాతం వాటా 2 వేల చ.అ.ల కంటే విస్తీర్ణమైన యూనిట్లే అత్యధికంగా ఉన్నాయి. ఇక, విస్తీర్ణాల వారీగా చూస్తే.. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా 1,000–2,000 చ.అ. ప్రాపర్టీల వాటా 67 శాతం కాగా.. 500–1,000 చ.అ. యూనిట్ల వాటా 14 శాతం, 500 చ.అ.ల్లోపు ప్రాపర్టీల వాటా 2 శాతంగా ఉంది.

    లగ్జరీదే హవా.. 
    విశాలమైన, విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నవంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 87 శాతం ఈ విభాగానివే కావడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన 1,487 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. వీటి విలువ రూ.2,491 కోట్లు. ఇక, రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్నవి 1,735 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1,244 కోట్లు, రూ.50 లక్షల్లోపు ధర ఉన్నవి 3,701 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ కాగా వీటి విలువ రూ.1.169 కోట్లు.

Telangana

  • సాక్షి హైదరాబాద్: గచ్చిబౌళి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి కార్యక్రమం గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శనివారం సాయంత్రం నాలుగు వేల మంది కళాకారులతో కూచిపూడి కళా వైభవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రమాదేవి ఆర్ట్స్ అకాడమీ కళాకారుల బాల కూచిపూడి నృత్యకారిణి బృందం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దానితో పాటు వేలాది మంది నర్థకిమనుల నృత్యం అందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది.

  • సాక్షి, నల్గొండ:మిర్యాలగూడలోని  ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నీరు అనుకొని లాబోరేటరీ కెమికల్ తాగి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల గణేశ్ అనే 19 ఏళ్ల యువకుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో పట్టణంలో గల కృష్ణసాయి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. ఈ సమయంలో గణేశ్‌కు దాహం వేయడంతో నీరు అనుకొని అక్కడే ఉన్న లాబరేటరీ కెమికల్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

National

  • మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆడపిల్ల అనే కోపంతో ఆరు సంవత్సరాల పసికందును సుప్రియ ‍అనే ఓ కిరాతక తల్లి పొట్టన బెట్టకుంది. అనంతరం గుండెపోటుతో పాప మృతి చెందిందని కట్టుకథ అల్లింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

    మహారాష్ట్ర నావీ ముంబై కళంబోళిలో మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం చిన్నారి తండ్రి ఎప్పటిలాగా విధులు ముగించుకొని ఇంటికి వచ్చారు. అయితే రావడంతోనే పాప అపస్మారక స్థితిలో పడి ఉండడం చూశారు. దీంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలిచంగా అప్పటికే తను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

    అయితే దీనిని గుండెపోటుగా చిత్రీకరించడానికి సుప్రియ ప్రయత్నించగా అనుమానం వచ్చిన  పోలీసులు శవపరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో తనకు బాబు కావాలని ఉండేదని దానికి తోడు చిన్నారి మరాఠీ మట్లాడకపోవడంతో ఇంకా పగ పెంచుకుందని పోలీసులు తెలిపారు. గతంలోనూ సుప్రియ తన కూతురుకు పలుమార్లు హానీ కలిగించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆమెను పోలీసులు ‍అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

  • కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను ప్రశంసిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఒకప్పడు సాధారణ కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగారన్నారు. ప్రధాని మోదీ 1990 దశకంలో ఉన్న చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో జోడిస్తూ ఈ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌ను ఇరుకున పడేశాయి.

    ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే పెనం లోంచి పొయ్యి మీద పడ్డ చందాన కనిపిస్తుంది. ‍ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు తరచుగా ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తూ సంస్థాగత లోపాలను ప్రశ్నిస్తుంటే..  తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ కీలక నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హస్తానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.

    దిగ్విజయ్ సింగ్, ప్రధాని మోదీకి సంబంధించిన 1990 దశకం చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ చిత్రంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘోలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలో తీసింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఉన్నారు. ఇందులో ప్రధాని మోదీ సాధారణ కార్యకర్తలా అద్వానీ ముందు నేలపై కూర్చొని ఉన్నారు. ఆ చిత్రాన్ని  ప్రశంసిస్తూ దిగ్విజయ్ సింగ్ పోస్ట్ చేశారు.

    "ఈ చిత్రాన్ని నేను కోరాలో చూశాను. ఇది చాలా ఇంపాక్ట్ పుల్ అనిపించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంటుందో ఈ చిత్రం తెలుపుతుంది. ఒకప్పుడు నాయకుల ముందు నేలపై కూర్చున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దేశానికే ప్రధాని అయ్యారు. ఇది సంస్థ యెుక్క గొప్పతనానికి నిదర్శనం. జైశ్రీరామ్" అని దిగ్వీజయ్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆ పోస్టును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ట్యాగ్ చేశారు.

    ఈ పోస్టుతో బీజేపీ కాంగ్రెస్‌పై అటాక్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ పోస్టులకు రాహుల్ సమాధానం ఇవ్వగలరా అని ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన దిగ్విజయ్ సింగ్ తాను ఆర్ఎస్ఎస్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తాను కేవలం ఆర్గనైజేషన్ సంస్థగత నిర్మాణాన్ని మాత్రమే తాను ప్రశంసించానని తెలిపారు.

    కాగా వారం రోజుల క్రితం దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్‌ పార్టీలోని లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు "రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌కు ఎలా సంస్కరణలు అవసరమో కాంగ్రెస్‌కు సైతం అదేవిధంగా సంస్కరణలు అవసరం. నాయకత్వ వికేంద్రీకరణ జరగాలి. మీరు అది చేయగలరని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద ప్రాబ్లం అని రాహుల్‌ని ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలో దుమారం చెలరేగింది. 

  • ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీ-రామ్ జీ బిల్లుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ  ఒంటి చేత్తో రాష్ట్రాలతో పాటు పేదల బతుకులపై దాడి చేశారన్నారు.నోట్ల రద్దు మాదిరిగా ఈ నిర్ణయం సైతం ఏక పక్షంగా తీసుకున్నారని తెలిపారు. వీబీ- జీ-రామ్ బిల్లుకు నిరసనగా త్వరలో దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని రాహుల్ తేల్చి చెప్పారు.

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్" (వీబీ-జీ రామ్‌ జీ) బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి పార్లమెంటు లోని ఊభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా ఈ పథకానికి మహత్మా గాంధీ పేరు మార్చడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ చర్యలు ఖచ్చితంగా మహాత్మున్ని అవమానించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

    రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ ఒంటి చేత్తో రాష్ట్రాల్ని, పేదల్ని దెబ్బకొట్టారు. నోట్లరద్దు సమయంలో మాదిరి ఇప్పుడు అలానే వ్యవహరించారు. ప్రతిపక్షాలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా MGNREGA పథకాన్ని రద్దు చేశారు. దీనిని మేము పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం మాతో కలిసి వస్తాయని ఆశిస్తున్నాం". అని రాహుల్ అన్నారు.మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు  లభించాయన్నారు. అటువంటి గొప్ప పథకాన్ని రద్దు చేయడం రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడేమనని తెలిపారు. 

    వీబీ-జీ-రామ్ జీ బిల్లుకు నిరసనగా జనవరి 5నుంచి ప్రత్యేకంగా MGNREGA బచావ్ అభియాన్ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. MGNREGA స్థానంలో ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వీబీ-జీ-రామ్-జీ బిల్లు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పని కల్పిస్తుంది.  

  • బాఘ్‌పత్‌: ఆధునిక పోకడలతో యువత తప్పుదారి పడుతోందని భావించిన ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌ జిల్లా ‘థాంబా దేశ్ పంచాయతీ’ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో సంప్రదాయ విలువలను కాపాడటంతో పాటు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా టీనేజర్లపై పలు ఆంక్షలు విధిస్తూ తీర్మానం చేసింది. 18 నుంచి 20 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులు స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని,  బహిరంగ ప్రదేశాల్లో హాఫ్ ప్యాంట్లు (షార్ట్స్) ధరించడంపై  నిషేధం విధిస్తున్నట్లు పంచాయతీ పెద్దలు ప్రకటించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించిన వారిపై సామాజిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

    గౌరవ మర్యాదలకు భంగం
    ఈ నిర్ణయానికి గల కారణాన్ని పంచాయతీ పెద్దలు వివరిస్తూ.. స్మార్ట్‌ఫోన్ల కారణంగా  పిల్లలు కుటుంబానికి దూరమవుతున్నారని, ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను కేవలం ఇళ్లకే పరిమితం చేయాలని, అవసరమైతే తప్ప బయటకు తీసుకురావద్దని వారు సూచించారు. పాశ్చాత్య దుస్తులైన హాఫ్ ప్యాంట్లు ధరించడం వల్ల గ్రామీణ ప్రాంత గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, అందుకే యువతీయువకులు సంప్రదాయ దుస్తులనే ధరించాలని తీర్మానించారు. యువత తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో కాకుండా కుటుంబ పెద్దలతో గడుపుతూ విలువలు నేర్చుకోవాలని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
     

    వాట్సాప్ ఆహ్వానాలు చాలు..
    వివాహ వేడుకల విషయంలోనూ పంచాయతీ పెద్దలు పలు మార్గదర్శకాలను తెలిపారు. ఆడంబరాలకు పోయి భారీ ఖర్చులతో పెళ్లిళ్లు చేయవద్దని, ఇళ్ల వద్ద నిరాడంబరంగా వివాహాలు జరపాలని కోరారు. అతిథుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు, ఖరీదైన వివాహ పత్రికలకు బదులుగా వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపుకోవాలని సూచించారు. ఈ నిబంధనలపై పంచాయతీ పెద్దలు చౌధరి ఒంపల్ సింగ్, బ్రజ్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. సామాజిక ఐక్యతను కాపాడేందుకే ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ఇవి ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించేవి కావని పేర్కొన్నారు.

    అ‍న్ని గ్రామాల్లో అమలు? 
    ఈ నిర్ణయం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాఘ్‌పత్‌ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, యువత మాత్రం ఈ ఆంక్షలపై అసహనం వ్యక్తం చేస్తున్నది. డిజిటల్ యుగంలో ఫోన్లపై నిషేధం విధించడం తగినది కాదని కొందరు విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఆంక్షలను  అ‍న్ని గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఇతర జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, సాంస్కృతిక పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు చెబుతున్నారు.

    ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్‌.. 285 మంది అరెస్ట్

  • న్యూఢిల్లీ: కొత్త ఏడాది సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులు చర్యలు ప్రారంభించారు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పరిధిలో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఏకంగా 285 మంది నేరగాళ్లను పోలీసులు కటకటాల వెనక్కి తరలించారు. ఈ ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున మారణాయుధాలు, మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో అసాంఘిక శక్తులు చెలరేగిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు ఈ మెగా డ్రైవ్‌ నిర్వహించారు.

    ‘ఆపరేషన్ ఆఘాత్’ (Operation Aaghaat) పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో పోలీసులు పక్కా వ్యూహంతో నేరస్తుల అడ్డాగా పేరున్న పలు ప్రాంతాల్లో  ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 40కి పైగా అక్రమ ఆయుధాలు, లక్షలాది రూపాయల నగదు లభ్యమైంది. వీటితో పాటు భారీ పరిమాణంలో డ్రగ్స్, అక్రమ మద్యం నిల్వలను కూడా పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 1,000 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, నేర చరిత్ర ఉన్న 285 మందిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.

    న్యూ ఇయర్ వేడుకల సమయంలో గొడవలకు దిగే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల పని పట్టేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేశామని సీనియర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై ఆయుధ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం కింద పలు కేసులు నమోదు చేశామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మందు పార్టీలు చేసుకునే వారిపై, న్యూ ఇయర్ ముసుగులో రెచ్చిపోయే పోకిరీలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.

    ఇది కూడా చదవండి: UP: ‘జాబితా’లో భారీ ప్రక్షాళన.. రెండు కోట్లపై మాటే!

Movies

  • సెలబ్రిటీలు స్టేజీ ఎ‍క్కితే చాలా మాట్లాడేస్తుంటారు. కొన్నిసార్లు రాబోయే సినిమాల గురించి పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. మూవీ హిట్ అయిందా సరేసరి లేదంటే మాత్రం ఈ వ్యాఖ్యలు రివర్స్ కొడుతుంటాయి. రీసెంట్ టైంలో శివాజీ, స్టేజీపై మాట్లాడుతూ మహిళలపై ఎలాంటి కామెం‍ట్స్ చేశాడో చూశాం. ఇప్పుడు కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ 'రాజాసాబ్' గురించి ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

    'మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి తీసిన ఈ 'రాజాసాబ్' సినిమా.. ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. అలాగే కోడి గుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త. రాసిపెట్టుకోండి. 'ద రాజాసాబ్'.. రూ.2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా నా డబ్బులు, ఆ డబ్బులు మనందరం కలిసి ఇద్దాం' అని సప్తగిరి కామెంట్స్ చేశాడు. కచ్చితంగా వీటిపై మీమ్స్ గానీ ట్రోల్స్ గానీ రావడం గ్యారంటీ.

    'రాజాసాబ్' సినిమాని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతమందించాడు. మారుతి దర్శకుడు. పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ప్రభాస్ చేసిన పూర్తిస్థాయి కమర్షియల్ మూవీ ఇది. జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. చూడాలి మరి ఈ మూవీ సప్తగిరి చెప్పినట్లు రూ.2 వేల కోట్లు సాధిస్తుందో లేదో?

  • రెడ్ డ్రస్‌లో అందాల ఆరబోస్తున్న ఆషికా

    దుబాయి ట్రిప్ జ్ఞాపకాల్లో హెబ్బా పటేల్

    ఈ ఏడాది మెమొరీస్ షేర్ చేసిన పూజా కన్నన్

    చీరలో రాశీ సింగ్ నాభి గ్లామర్ డోస్

    పొట్టి స్కర్ట్‌తో స్టెప్పులేస్తున్న దివ్యభారతి

  • రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.

    దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు.

  • టాలీవుడ్‌లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)

    సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.

    ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)

  • యంగ్‌ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్‌ హీరో మోహన్‌లాల్‌. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్‌ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్‌లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...

    అన్నీ హిట్లే..
    తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్‌ షూట్‌ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్‌ చేస్తారు. అలా 2025లో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఎల్‌ 2: ఎంపురాన్‌, తుడరుమ్‌, హృదయపూర్వం.. బాక్సాపీస్‌ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.

    లుక్‌పై విమర్శలు
    అదేంటో కానీ డిసెంబర్‌ నెల మోహన్‌లాల్‌కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్‌ ఓడియన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. కలెక్షన్స్‌పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్‌లాల్‌ లుక్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. 2021 డిసెంబర్‌లో రూ.100 కోట్ల బడ్జెట్‌ మూవీ మరక్కర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్‌లాల్‌. 

    సగం కూడా రాలే!
    ఈ సినిమా రిలీజ్‌కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్‌ వచ్చినా కూడా థియేటర్‌లోనే ముందుగా రిలీజ్‌ చేయాలని సినిమాటీమ్‌ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్‌ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్‌లో సగం కూడా తిరిగి రాలేదు.

    దర్శకుడిగా డిజాస్టర్‌
    వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్‌లాల్‌ బరోజ్‌ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్‌ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్‌ రాబట్టింది.

    ఈసారి కూడా పరాజయమే!
    సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్‌ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్‌ హీరో. కలెక్షన్స్‌ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్‌ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్‌లాల్‌ ఈ డిసెంబర్‌ సెంటిమెంట్‌ ఎప్పుడు బ్రేక్‌ చేస్తాడో చూడాలి!

  • ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్‌ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?

    ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.

    ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.

    గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్‌తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.

    మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్‌కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.

    చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్‌కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.

    చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్‌కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?

    ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్‌డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది!

  • "ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.

    బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

  • ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్‌లో వైరల్‌ వయ్యారి ఒకటి. యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్‌.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్‌ అయింది. ఈ సాంగ్‌లో.. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్‌ బ్లోయింగు.. ఫాలోవర్స్‌ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్‌ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్‌ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్‌లో పడి వైరల్‌ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన మహిళలెవరో చూసేద్దాం..

    మోనాలిసా
    మోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్‌. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్‌ అయిపోయింది. ఒక సాంగ్‌లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది.

    ఆర్యప్రియ భుయన్‌
    కేవలం ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో వైరల్‌ అయిపోయింది ఆర్యప్రియ భుయన్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్‌ ధోనీ అవుట్‌ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. కెమెరామన్‌ దాన్ని క్యాప్చర్‌ చేయడం.. అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది.

    గౌరీ స్ప్రాట్‌
    బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్‌. ముంబైలో ఓ సెలూన్‌ నడుపుతూ ప్రైవేట్‌ లైఫ్‌ గడుపుతున్న గౌరీ.. ఆమిర్‌తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్‌గా మారింది.

    అలీషా ఓరీ
    ఈమె కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌ ద్వారా క్లిక్‌ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్‌ (కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) అభిమాని. వెస్ట్‌ ఇండీస్‌ క్రికెట్‌ దిగ్గజం డ్వేన్‌ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్‌ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్‌ చేశారు. అలీషా మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌. తను 2021లో మిసెస్‌ ఇండియా లీగసీ టైటిల్‌ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్‌ యూనివర్స్‌ 2022 పోటీల్లో మిసెస్‌ పాపులర్‌ 2022 టైటిల్‌ అందుకుంది.

     

     

    మహికా శర్మ
    క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్‌తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్‌ అయింది.

    చదవండి: 'విగ్‌ కావాలా? ధురంధర్‌ నటుడికి పొగరు తలకెక్కింది'

  • పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా "నీలకంఠ". ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "నీలకంఠ" సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ - నాకు సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. షూటింగ్ కొద్ది రోజుల పాటు ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలు దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.

    డైరెక్టర్ రాకేష్ మాధవన్ మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది.  ఆ కోరిక మా డైరెక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న "నీలకంఠ" అనే మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

    హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. ఇందులో మంచి ఫైట్స్, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" సినిమాతో నాకు ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
     

  • గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్‌కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)

    టీజర్‌లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్‌ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్‌తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

    అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.

    (ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే)

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నేడు (డిసెంబర్‌ 27న) 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు ప్రముఖులు పర్సనల్‌గా, సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తన స్నేహితుడికి ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా విషెస్‌ తెలియజేశారు.

    హ్యాపీ బర్త్‌డే
    నా ప్రియమైన సోదరుడికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్న సల్లూభాయ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంతోషం, ప్రేమ పొందాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు లక్షలాదిమందికి ఒక ఇన్‌స్పిరేషన్‌.. నిన్ను స్నేహితుడని పిలవడం మాలాంటివారికి దక్కిన అదృష్టం.

    ఎంజాయ్‌ చెయ్‌
    నువ్వు మరెన్నో విజయాలు అందుకోవాలి, సుఖసంతోషాలతో గడపాలి. ఈ ప్రత్యేకమైన రోజును హ్యాపీగా ఎంజాయ్‌ చెయ్‌ అంటూ సల్లూ భాయ్‌తో దిగిన ఫోటో షేర్‌ చేశారు. కాగా చిరంజీవి నటించిన 'గాడ్‌ ఫాదర్‌' మూవీలో సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించాడు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర', 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీస్‌ చేస్తున్నారు. సల్మాన్‌.. 'బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌' మూవీ చేస్తున్నాడు.

     

     

    చదవండి: బట్టతలపై జుట్టు.. అడ్వాన్స్‌ తీసుకుని డ్రామాలు

  • పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సూర్యకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇతడికి చాలా ఫాలోయింగ్ ఉంది. గతంలో 'రక్తచరిత్ర 2' అనే తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంలో నటించాడు గానీ పూర్తిస్థాయిలో తెలుగు మూవీ  చేయలేదు. అలాంటిది ఇప్పుడు 'సార్', 'లక్కీ భాస్కర్' దర్శకుడు తీస్తున్న సినిమా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందని తెలుసు గానీ కాన్సెప్ట్ ఏంటనేది బయటకు రాలేదు. ఇప్పుడు స్వయానా నిర్మాత నాగవంశీ.. స్టోరీ కాస్త రివీల్ చేశారు.

    (ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)

    ఈ మూవీలో హీరో సూర్య.. 'గజిని'లో సంజయ్ రామస్వామిలా ఓ ధనవంతుడు. అతడి వయసు 45 ఏళ్లు. అలాంటి ఇతడు 20 ఏళ్ల అమ్మాయి(మమిత)తో ప్రేమలో పడతాడు. వీళ్ల మధ్య స్నేహం, ప్రేమ, కోపం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ల మధ్య ఉన్నది ప్రేమా కాదా అనేది స్టోరీ పాయింట్ అని నాగవంశీ చెప్పుకొచ్చారు. చూస్తుంటే సూర్య.. ఈసారి ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు.

    సూర్య గత కొన్నేళ్లుగా చేస్తున్న సినిమాల చూస్తే చాలావరకు యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఓ లవ్ స్టోరీ అని తెలిసి తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. వెంకీ అట్లూరి తీస్తున్న ఈ సినిమాలో సూర్య, మమిత బైజుతో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్ర చేస్తోంది. మరో రెండు మూడు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వచ్చే వేసవిలో లేదంటే వేసవి చివరలో థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

    (ఇదీ చదవండి: 'పుష్ప-2' తొక్కిసలాట కేసు: ఏ-11గా అల్లు అర్జున్‌)

  • దృశ్యం ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న మూడో భాగం "దృశ్యం 3". మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తవగా త్వరలోనే హిందీలో షూటింగ్‌ మొదలుకానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ప్రముఖ నటుడు అక్షయ్‌ ఖన్నా తప్పుకున్నట్లు రూమర్స్‌ వచ్చాయి.

    సడన్‌గా విగ్‌ కావాలట!
    పారితోషికం పెంపుతోపాటు, విగ్‌ కావాలని కోరాడని.. ఈ విషయంలో నిర్మాతతో భేదాభిప్రాయాలు రావడంతో ఆయన సినిమా నుంచి వైదొలగాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఇవే నిజమంటున్నాడు నిర్మాత కుమార్‌ మంగట్‌ పాఠక్‌. ఆయన మాట్లాడుతూ.. దృశ్యం 3 కోసం అక్షయ్‌ ఖన్నా అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడు. ఆయన అడిగినంత డబ్బు ఇస్తామన్నాం. కానీ ఆయన విగ్‌ కావాలని డిమాండ్‌ చేశాడు. 

    పక్కనున్న చెంచాల వల్లే..
    దృశ్యం 2లో అక్షయ్‌ విగ్‌ లేకుండా బట్టతలతోనే కనిపించాడు. అలాంటిదిప్పుడు విగ్‌ పెడితే బాగోదని దర్శకుడు అభిషేక్‌ పాఠక్‌ నచ్చజెప్పాడు. దాంతో ఆయన సరేనన్నాడు. అయితే ఆయన పక్కనున్న చెంచాలు విగ్‌ పెట్టుకుంటే స్మార్ట్‌గా కనిపిస్తావని లేనిపోనివి ఎక్కించారు. దాంతో ఆయన మళ్లీ విగ్‌ కావాలని అడిగాడు. దర్శకుడు ఆయన్ను సముదాయించాలని చూశాడు. 

    అప్పుడేమో ఎగిరి గంతేసి..
    కానీ ఈసారి అతడు ఏకంగా సినిమా నుంచే తప్పుకున్నాడు. దృశ్యం 3 కథ చెప్పినప్పుడు.. ఇది రూ.500 కోట్ల సినిమా.. జీవితంలో ఇలాంటి కథ వినలేదంటూ టీమ్‌ను హత్తుకున్నాడు. రెమ్యునరేషన్‌ ఫైనల్‌ అయ్యాక అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. పదిరోజుల్లో షూట్‌ ఉందనగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ విషయంలో తనకు నోటీసులు పంపించాం.

    గుర్తింపు లేని సమయంలో ఛాన్స్‌
    అక్షయ్‌కు పేరు, గుర్తింపు లేని సమయంలో తనతో సెక్షన్‌ 375 మూవీ చేశాను. ఆయన గురించి చాలామంది ఎన్నో చెప్పారు. సెట్‌లో కూడా ఓవర్‌గా ప్రవర్తించేవాడు. సెక్షన్‌ 375 వల్ల అతడికి మంచి పేరు వచ్చింది. అలా అతడిని దృశ్యం 2కి తీసుకున్నాను. ఈ మూవీ తర్వాతే అతడికి పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడేమో గర్వం తలకెక్కింది.

    అక్షయ్‌ కంటే మంచి నటుడు
    దృశ్యం.. అజయ్‌ దేవ్‌గణ్‌ మూవీ, ఛావా.. విక్కీ కౌశల్‌ మూవీ, అలాగే ధుంధర్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా! ఒకవేళ అక్షయ్‌ ఖన్నా సోలోగా సినిమా చేస్తే దానికి రూ.50 కోట్లు కూడా రావు. తనవల్లే ధురంధర్‌ బాగా ఆడుతోందని మాతో అన్నాడు. ధురంధర్‌ విజయానికి అనేక కారణాలున్నాయి. దృశ్యం 3లో అక్షయ్‌ స్థానంలో జైదీప్‌ అహ్లావత్‌ను తీసుకున్నాం. అక్షయ్‌ కంటే ఇతడు మంచి నటుడు అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ

  • 'పుష్ప 2: ది రూల్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళ రేవతి మరణానికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.  ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్‌ను, ఏ-11గా అల్లు అర్జున్‌(Allu Arjun)ని చేర్చుతూ.. ఆయన  మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ ఫైల్‌ చేశారు. 

    గత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' బెనిఫిట్ షో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్  థియేటర్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్‌ అంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.  దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

    దర్యాప్తులో భాగంగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. థియేటర్‌లో తగిన భద్రతా చర్యలు, ప్రత్యేక ఎంట్రీ-ఎగ్జిట్ ఏర్పాట్లు లేకపోవడం, అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఒకేసారి అనుమతించడం వంటి లోపాలు గుర్తించారు. అయితే, అల్లు అర్జున్ రాకను ముందుగా సమాచారం ఇవ్వకపోవడం, ఆయన బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టడం వంటి కారణాలతో ఆయనపై  కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చారు. 

  • అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్‌ బ్యూటీ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌తో పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది.

    అందుకే పేరు మార్చుకున్నా
    నా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.

    అనుకోకుండా అవకాశం.. 
    మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్‌ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్‌ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్‌ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.

    ఒకేసారి ఐదారు జాబులు చేశా
    డబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్‌లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్‌ రెంట్‌ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా.  డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్‌ పొషిషన్‌లో ఉన్నాను.

    ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీ
    ఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్‌లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.  
     

  • 'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్‌లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్‌ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.

    ఎండగట్టిన అనసూయ
    ఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్‌ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్‌ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.

    ట్రోలర్స్‌పై ఫైర్‌
    అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్‌ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్‌ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్‌లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.

    నా భర్తను ఎందుకు లాగుతున్నారు?
    నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. 

    హేటర్స్‌.. మీరు కూడా నా ఫ్యాన్సే!
    ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్‌లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్‌ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్‌ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్‌కు చురకలంటించింది.

     

     

    చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు

  • మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ, సింగర్‌ చన్మయిలను నెట్టంట ట్రోలింగ్‌కు దిగారు. దీంతో వారు కూడా గట్టిగానే తిరిగి కౌంటర్‌ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ అనసూయకు మద్ధతుగా తన ఎక్స్‌ పేజీలో ఒక ట్వీట్‌ చేశారు.

    శివాజీ, అనసూయల మధ్య మొదలైన వివాదం నెట్టింట వైరల్‌ అవుతుంది.  ఈ సందర్భంలో ప్రకాష్‌ రాజ్‌ ఇలా అన్నారు. సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అంటూ అనసూయకు మద్ధతుగా పోస్ట్‌ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్‌ చేస్తూ పేర్కొన్నారు. 

    శివాజీని రేపిస్ట్‌తో పోల్చిన ఆర్జీవీ
    నటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు ఆర్జీవీ భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని  పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్‌ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్‌  చేసిన వ్యాఖ్యలు ఇలా ఇలా ఉన్నాయి. ' రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు.  అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్‌ పేర్కొన్నాడు.

  • లోకేశ్‌ కనగరాజ్‌ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు గ్యారెంటీ! ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వరద పారించాడు. రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' సినిమా మిక్స్‌డ్‌ టాక్‌తోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.

    వేలల్లో విమర్శలు
    ఈ విమర్శలు, కలెక్షన్స్‌పై లోకేశ్‌ తాజాగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. కూలీ సినిమాకు వేలకొద్దీ విమర్శలు వచ్చాయి. ఎక్కడ తప్పు చేశానో గుర్తించి దాన్ని నెక్స్ట్‌ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకుంటాను. అయితే ఓపక్క విమర్శిస్తూనే రజనీకాంత్‌ సర్‌ కోసం మా సినిమా ఆదరించారు. ఈ చిత్రానికి రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వచ్చాయని మా నిర్మాత చెప్పారు.

    గతంలో ఏమన్నాడంటే?
    అంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. గతంలోనూ కూలీ మూవీకి వచ్చిన మిశ్రమ స్పందన గురించి మాట్లాడుతూ.. జనాల అంచనాలకు తగ్గట్లుగా తాను కథలు రాయలేనన్నాడు. తాను రాసిన కథ వారి అంచనాలను అందుకుంటే మంచిది. లేదంటే వాళ్లు సంతోషపడేవరకు మళ్లీమళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చాడు.

    వార్‌ 2పై కూలీ విజయం
    కూలీ విషయానికి వస్తే.. ఇందులో రజనీకాంత్‌, నాగార్జున, సౌబిన్‌ షాహిర్‌, శృతి హాసన్‌, సత్యరాజ్‌ రచిత రామ్‌, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ల వార్‌ 2 సినిమాతో పోటీగా బాక్సాఫీస్‌ బరిలోకి దిగింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్‌లో వార్‌ 2ని దాటేయడం విశేషం!

    చదవండి: మొన్న ఆమిర్‌.. ఇప్పుడు షారూఖ్‌

  • టాలీవుడ్‌ సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఛాంపియన్‌’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 25న  ఆడియెన్స్ ముందుకు వచ్చింది.తొలి షోకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ..మొదటి రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్లు రాబట్టింది. 

    అయితే రెండో రోజు మాత్రం కలెక్షన్స్‌ తగ్గిపోయాయి. శుక్రవారం ఈ సినిమాకు రూ. 2.4 కోట్ల కలెక్షన్స్‌  లభించాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.90 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

    ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడిగా నటించి, మెప్పించాడు.  అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించగా.. మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ గెస్ట్‌ రోల్‌ చేసి అలరించాడు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. (ఛాంపియన్‌ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

  • రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్‌ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్‌ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాయి. 

    రజనీకాంత్‌ సినిమాలో గెస్టులు
    జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్‌స్టార్‌ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌ లాల్‌ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్‌ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్‌ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

    మిక్స్‌డ్‌ టాక్‌
    అదేవిధంగా రజనీకాంత్‌ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్‌ స్టార్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్‌ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం జైలర్‌–2. ఇది జైలర్‌ చిత్రానికి సీక్వెల్‌. 

    జైలర్‌ 2లో సూపర్‌ స్టార్‌
    ఇందులోనూ మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, శాండిల్‌ వుడ్‌ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్, బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి, బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి.. జైలర్‌ 2లో షారూఖ్‌ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

Family

  • 2025వ సంవత్సరం డిసెంబర్‌ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్‌నెస్‌ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్‌ ఏమిటో తెలుసుకుందాం..

    ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుని ఫిట్‌ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్‌ చేసుకుందాం.

    మొబైల్‌ ఫిట్‌నెస్‌ యాప్స్‌
    ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్‌నెస్‌ను (Fitness) ట్రాక్‌ చేయడానికి ట్రాకింగ్‌ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్‌ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్‌నెస్‌ ట్రాకర్స్, స్మార్ట్‌ వాచ్‌లు, హార్ట్‌ రేట్‌ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్‌ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్‌నెస్‌ను సొంతంగా ట్రాక్‌ చేసుకున్నారు.

    మితంగా తినే మినిమల్‌ ఈటింగ్‌ హ్యాబిట్‌
    ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్‌ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్‌ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్‌ రీల్స్‌ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్‌లో మంచి మార్పులు చేసుకున్నారు.

    ఔట్‌డోర్‌ యోగా
    2025లో అధిక సంఖ్యాకులు ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్‌ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్‌ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్‌ వంటి యాక్టివిటీస్‌ కూడా ప్రజల ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగమయ్యాయి.

    చ‌ద‌వండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?

    మార్నింగ్‌ వర్కవుట్స్‌
    సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్‌లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్‌ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.

    కలిసి మెలిసి..
    2025లో వైరల్‌ అయిన వాటిలో గ్రూప్‌ ట్రైనింగ్‌ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్‌ చేయడంలో మునిగిపోయారు.   

  • ఈ యేడాది క్విక్‌గా, హెల్తీగా ఉండే వంటకాలపై చాలా మంది దృష్టి పెట్టారు.  ఆరోగ్యకరమైన భోజనంతో పాటు సమయాన్ని ఆదా చేయడం కూడా దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం. క్విక్‌ అండ్‌ హెల్తీ, టేస్టీగా ఉండే వంటకాల తయారీ గురించి చెఫ్‌ గోవర్ధన్‌ ఇచ్చిన రెసిపీస్‌తో వంటిల్లు (Vantillu).

    చాలామందిలో ఆరోగ్య స్పృహతో పాటు ఫిట్‌గా ఉండాలనే ఆలోచన కూడా పెరిగింది. వారాంతాల్లో, ప్రత్యేకమైన రోజుల్లోనూ వంటకాల వైపు దృష్టి పెడుతున్నారు. వాటిలో... అధిక ప్రోటీన్‌ ఉండేవి, మొక్కల ద్వారా లభించే పదార్థాలు... కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, వివిధ రకాల పండ్లు... మొదలైనవాటిని కుండ లేదా పాన్‌ పైన నిమిషాల్లో తయారుచేసుకొని తినడం అనేది ట్రెండ్‌గా నడిచింది. ఇది మాంసాహార వంటకాలకూ వర్తించింది. సులభంగా తయారు చేయగల వంటకాలలో కొన్ని...

    తడ్కా స్ప్రౌట్స్‌ (Tadka sprouts)
    కావలసినవి: మొలకలు (పెసలు లేదా శనగలు) – కప్పు; ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది); పచ్చిమిర్చి – 2–3 (సన్నగా తరిగినవి); ఆవాలు – 1/2 టీస్పూన్‌; జీలకర్ర – 1/2 టీస్పూన్‌; కరివేపాకు – 2 రెమ్మలు; కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – రుచికి సరిపడా.

    తయారీ: 
    మొలకలను కొద్దిగా ఉప్పు వేసి కాస్త పలుకుగా ఉండేలా ఉడికించాలి. 
    పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. 
    తాలింపులో ఉడికించిన మొలకలు, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.  
    ఈ వంటకాన్ని సలాడ్‌ రూపంలో తినచ్చు. లేదా కొంచెం మసాలా వేసి, వడ లేదా రెసిపీ కూడా చేసుకోవచ్చు.  

    ఎగ్‌ రోల్‌ (Egg roll)
    కావలసినవి: చపాతీ/పరాఠా –  2–3; గుడ్లు  –  2 లేదా 3; ఉల్లిపాయ – సన్నగా తరిగినది; పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి); అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – టీస్పూన్‌; క్యారెట్‌ తురుము – తగినంత;  పసుపు – చిటికెడు; కారం – అర టీ స్పూన్‌; కొత్తిమీర – కొద్దిగా; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – వేయించడానికి సరిపడా; టొమాటో కెచప్, మయోనైజ్‌ – తగినంత.

    తయారీ: 
    ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలలి. 
    పాన్‌ లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
    అల్లం–వెల్లుల్లి పేస్ట్, క్యారెట్‌ తురుము వేసి, వేయించాలి. పసుపు, కారం, కొత్తిమీర వేసి కలపండి. 
    ఈ మిశ్రమంలో గుడ్డు మిశ్రమాన్ని పోసి, స్పూన్‌తో వెడల్పుగా అని, ఆమ్లెట్‌లాగా సిద్ధం చేసుకోవాలి. 

    వేడి చపాతీని ఒక ప్లేట్‌ లో పెట్టి, దానిపై టొమాటో కెచప్, మయోనైజ్‌ రాయాలి. 
    తయారుచేసుకున్న ఆమ్లెట్‌ ను చపాతీ మధ్యలో పెట్టి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లాలి. 
    చపాతీని గట్టిగా రోల్‌ చేసి సర్వ్‌ చేయాలి.

  • జెన్‌ జడ్‌ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన.. ఈ సాంకేతికను అలవర్చుకున్న.. చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్‌ అని.. అంటే జనరేషన్‌ జడ్‌ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా.. కొత్త ఆలోచనలు.. దానికి మించి.. ఆన్‌లైన్‌ సాంకేతికత.. అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్‌ జడ్‌.

    ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్‌ జడ్‌ తీరు గురించి మనో వైజ్క్షానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్‌ చేద్దాం.

    జన్‌ జడ్‌ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్.., "ఐ జనరేషన్".., "డిజిటల్ స్థానికులు"... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్‌ గ్రూప్‌ పిల్లలు చిన్నప్పుడే మొబైల్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు.

    దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్‌ జడ్‌లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్‌ వెదకటం, చాట్‌ జీపీటీని అడగం.. లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే.. దీంతో వారి మనస్సులు.. వారి సామాజిక స్పృహ.. ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు.

    జన్‌జడ్‌ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం.. కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా.. ఎక్కువగా ఆలోచిస్తారు.. చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం.. దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Zలో చాలా వరకు వ్యక్తులు  సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం.. సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం.. ఇ-కామర్స్ బ్రాండ్స్‌, డిజిటల్ కంటెంట్‌లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు.

    జెన్‌ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.. భయం లేకుండా ప్రవర్తించడం.. కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని.. లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికితీయడానికి ప్రయత్నిస్తారు. జెన్‌జడ్‌ తరం మానసికంగా బలంగా ఉంటారు.. భావోద్వేగాలకు తావు లేకుండా.. బాధను వ్యక్తీకరించడం.. ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.. సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా.. వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.

    ఆన్‌లైన్‌లో చర్చల ద్వారా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు.. ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన.. చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు.. వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.

    వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్‌ ఎక్స్‌పోజర్.. అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం.. ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు.. కలిగి ఉంటారు.

    కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ.. బలహీనత కాదు.. అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.. గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి.. కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.. తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు.

  • టైమ్‌లెస్‌ ఇండియన్‌ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్‌ ఇస్తోంది. ప్రీ–డ్రేప్‌డ్‌ శారీస్, డెనిమ్‌–ఇన్‌ఫ్యూజ్‌డ్‌ ఫ్యాబ్రిక్స్, బాంబర్‌ జాకెట్‌లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్‌ ఇది.

    సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్‌లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్‌ కోర్సెట్‌ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్‌ల వరకు... ఈ ట్రెండ్‌ మోడ్రన్‌ ఇండియన్‌ ఫ్యాషన్‌ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.

    ‘హ్యాండ్లూమ్‌ ఫ్యాబ్రిక్స్‌ ఇన్‌ మోడ్రన్‌ 
    సిల్హవుటీ’ ట్రెండ్‌ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్‌లాంటి చేనేత వస్త్రాలను జంప్‌సూట్‌లు, వోవర్‌సైజ్‌డ్‌ కోట్స్, కో–ఆర్డర్‌ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్‌ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.

    సంప్రదాయ జెండర్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ న్యూట్రల్‌–కలర్డ్‌ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్‌ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్‌–ఎక్స్‌ప్రెషన్స్‌కు అవకాశం ఇస్తున్నాయి.

    చ‌ద‌వండి: లేత రంగుల లేటెస్ట్ చీర‌ల ట్రెండ్‌

    ఇంజినీరింగ్‌ వైపు మ్యూజిక్‌ స్టూడెంట్స్‌ మొగ్గు
    విద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్‌ స్టూడెంట్స్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్‌ డైరెక్టర్‌ప్రొఫెసర్‌ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు.  ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మ్యూజిక్‌’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్‌ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు.

NRI

  • హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్‌ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్య‌క్ర‌మాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.

    హైదరాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వరంగల్‌, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, నల్గొండ, మెదక్‌ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ లైబ్రరీలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్‌లు, ఎగ్జామ్‌ ప్యాడ్‌లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆల‌యాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్‌ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో  ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్‌షిప్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.

    అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్‌లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్‌, నార్త్‌కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు

Guest Columns

  • భారతదేశ చరిత్రకు ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షి. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్‌ దోపిడీకి బలవుతోంది. ఇది కేవలం పర్యా వరణ సమస్య కాదు; ప్రజల జీవన హక్కులపై దాడి.

    ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరావళి పర్వతాలను (Aravalli Range) ప్రధానంగా ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా నిర్వచించింది. ఇది కీలక ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా సాంకేతికంగా ఉన్నా, దాని ప్రభావాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.

    ఆరావళి ఒక పర్వత శ్రేణి కాదు, ఒక జీవవ్యవస్థ. అవి కేవలం రాళ్ల సమూహం కాదు, భూగర్భ జలాలకు సహజ భండారం; ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ; అడవులు, వన్యప్రాణులకు నివాస స్థలం; ఢిల్లీ – ఎన్‌సీఆర్‌కు సహజ గాలి శుద్ధి యంత్రం. భౌగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం వంటివన్నీ కలిసి ఆరావళిని జీవవ్యవస్థగా నిలబెట్టాయి. ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం అంటే శాస్త్రానికే అవమానం. ఆరావళిలో మైనింగ్‌ నష్టాలు తాత్కాలికం కావు. పర్వతాలను పేల్చడం ద్వారా శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి. భూగర్భ జలాల సహజ ప్రవాహం తెగిపోతుంది. అడవులు తిరిగి పునరుద్ధరించలేని విధంగా నశిస్తాయి. ‘సస్టెయిబుల్‌ మైనింగ్‌’ భావన ఒక మిథ్య.

    హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమ వుతోంది. మైనింగ్‌ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల అడవులు... ధూళిని, ఇసుక గాలులను అడ్డుకుంటూ సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఆ గోడను కూల్చేసి, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైదీ భావానికి ప్రతీక. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్‌ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ వైపు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్‌ తరాలపై విధించే శిక్షతో సమానం.

    చ‌ద‌వండి: విభేదాలు ప్ర‌మాదకరం కాదు! 

    ప్రకృతి వనరులు కొద్దిమంది కార్పొరేట్‌ లాభాల కోసం త్యాగం చేయ బడితే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్‌ తరాల భద్రతకు హామీ ఇచ్చేదిగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడటం కాదు, దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.

    - కె. నారాయణ 
    చైర్మన్, కంట్రోల్‌ కమిషన్‌; కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా

  • దువ్వూరి సుబ్బారావు, లతా వెంకటేష్‌

    రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య జరిగే ‘ఘర్షణ’లు తరచుగా వార్తల్లోకి వస్తుంటాయి. ‘‘కానీ, ఇది సంక్షోభానికి సంకేతం కాదు. పాలన లక్షణం’’ అంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు. ఈ ఘర్షణలను ఆయన, వైవా హిక జీవితంలోని విభేదాలతో పోల్చారు. ‘‘కొన్నిసార్లు అవి తీవ్రంగా ఉండొచ్చు. అయితే అవి ఒకే లక్ష్యం పట్ల ఉమ్మడి నిబద్ధతతో జరుగుతాయి’’ అని దువ్వూరి చెబుతున్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి కోసం జరిగే సంస్థాగత చర్చ ల్లోని ఘర్షణలు చివరికి మంచే చేస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన ఈ పాడ్‌కాస్ట్‌లో వెలిబుచ్చారు.

    ఘర్షణ ఉండటం మంచి లక్షణం
    రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య అనివార్యంగా కొంత ఘర్షణ ఉండనే ఉంటుంది. నా అనుభవాన్ని బట్టి, అలా ఉండటం అవసరం కూడా! ఈ రెండు సంస్థలు ఆర్థిక వ్యవస్థను భిన్న దృక్పథాలతో చూస్తాయి. ఆర్బీఐ ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ భద్రతపై దృష్టి పెడితే; ప్రభుత్వం సహజంగానే అభివృద్ధి, ఉపాధి, ప్రజలకు జవాబుదారీగా ఉండటం వంటి బాధ్యతలపై దృష్టి సారిస్తుంది. ఈ భిన్న దృక్పథాలు కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఇది వ్యవస్థలోని లోపం కాదు. ఇండియా వంటి విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ఉన్న సంక్లిష్టతకు ఒక లక్షణం మాత్రమే.

    ప్రత్యర్థులు కారు, భాగస్వాములు
    నేను తరచూ, ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలను దాంపత్య జీవితంలోని చిన్న గొడవలతో పోలుస్తాను. మీరు బలంగా వాదించవచ్చు. ఒక్కోసారి తీవ్రమైన ఆవేశంతో కూడా! కానీ, అందువల్ల మీరు ప్రత్యర్థులు అవుతారని కాదు. చివరికి, ఇద్దరూ ఒకే పక్షంలో ఉన్నారన్న గ్రహింపు వస్తుంది. విభేదాలు ప్రమాదకరం కాదు. వాటిని శత్రుత్వంగా లేదా సంస్థాగత వైఫల్యంగా భావించడమే ప్రమాదకరం. పరస్పర గౌరవం ఉన్నంత కాలం ఈ చర్చలు, లేదా ఘర్షణలు నిర్మాణాత్మకంగానే ఉంటాయి.

    సంఘర్షణ, సంభాషణలో భాగమే!
    ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండూ కూడా భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి అనే ఒకే భారీ లక్ష్యం కోసం పని చేస్తాయి. ఆ ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటాయి. మా విధానాలు వేరుగా ఉండవచ్చు. మా కాల పరిమితులు కలవకపోవచ్చు, కానీ చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటే. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, విభేదాలు సంభాషణల ద్వారా పరిష్కా రమవుతాయి. ఆ సంభాషణలకు మరొక స్వరూపమే సంఘర్షణ.

    ఇటు దృఢత్వం... అటు సంక్షేమం
    చాలామంది ఈ ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు, వ్యక్తిగత విభేదాల వల్ల వస్తాయని అనుకుంటారు. అలా జర గడం చాలా అరుదు. అసలు కారణం, సంస్థలకు అప్పగించిన బాధ్యతలే. ఆర్బీఐ గవర్నర్‌గా ప్రజాదరణ లేని, స్వల్పకాలికంగా అసౌకర్యాన్ని కలిగించే నిర్ణయాలైనా సరే తక్షణం తీసుకోవలసి వస్తుంది. ధరల స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని కాపాడటం ఆర్బీఐ బాధ్యత. అదే సమయంలో, ఆర్థిక మంత్రి తక్షణ ఆర్థిక ఒత్తిడులకు, ప్రజల అంచనాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ భిన్నమైన బాధ్యతలే విధానపరమైన విభేదాలకు దారితీస్తాయి.

    చ‌ద‌వండి: స‌ర్దుబాటుతోనే సాన్నిహిత్యం!

    విభేదాలు పదును పెడతాయి!
    పరిపక్వతతో, పరస్పర గౌరవంతో ఈ ఘర్షణను నిర్వహిస్తే, అది విధాన రూపకల్పనను మరింత బలపరు స్తుంది. వాదనలు... ఇరు పక్షాలనూ తమ ఆలోచనలను పదును పెట్టుకునేలా చేస్తాయి. అంచనాలను, అభ్యంతరాలను ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఊహించని ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రేరేపిస్తాయి. సులభమైన ఏకాభిప్రాయం కంటే లోతైన చర్చల నుంచే మెరుగైన విధానాలు వెలువడతాయి. ముఖ్యంగా... సంస్థల మధ్య నమ్మకం ఉండటం, అంతరాయం లేని స్పష్టమైన సంభాషణ కొనసాగడం అత్యంత ముఖ్యం.

    - ఎడిటోరియల్‌ టీమ్‌

Andhra Pradesh

  • చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన  10 రోజుల అనంతరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

    కుప్పం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కుప్పం మండలం ఎన్‌. కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    విషయం బయటకు చెప్తే.. తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలి భర్త తెలిపారు. దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయింది. నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు’’ అని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.

     

  • సాక్షి, విజయవాడ:  శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానానికి ఏపీసీపీడీసీఎల్‌ షాకిచ్చింది. కరెంటు బిల్లు చెల్లించలేదని ఆలయానికి విద్యుత్‌ సరఫరా నిలిపిసేసింది. దుర్గమ్మ ఆలయానికి రూ.3.08 కోట్ల బిల్లు బకాయి ఉందని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు నోటిసులిచ్చినా అధికారులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.

    ఈ క్రమంలో విసుగు చెందిన విద్యుత్ శాఖ అధికారులు హెచ్‌టీ లైన్‌ నుంచి పవర్ సరఫరా నిలిపేశారు. కరెంటు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది జనరేటర్‌ సాయంతో విద్యుత్ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే  ఆలయానికి చెందిన సోలార్‌ ప్లాంట్‌ నుంచి దేవస్థానానికి విద్యుత్ సరఫరా అవుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. అందుకే విద్యుత్ శాఖను పలుమార్లు నెట్‌ మీటరింగ్‌ ఏర్పాటు చేయాలని కోరామని  తెలిపారు.

    అయితే విద్యుత్ శాఖ సోలార్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సాంకేతిక కారణాలతో నమోదు చేయడం లేదన్నారు. కరెంట్ సరఫరా నిలిపివేస్తామని నిన్న సాయంత్రమే ఈవోకు సమాచారమిచ్చి  అధికారులు స్పందించేలోపే  విద్యుత్ నిలిపివేసారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తుల వస్తారని వారి  మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్ సరఫరా చేయాలని  అధికారులను అభ్యర్థించారు. 

  • నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సంచలనంగా మారిన బాలింత మృతిపై జరిగిన విచారణలో దారుణ వాస్తవాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. రక్త మార్పిడి విషయంలో ప్రభుత్వ డాక్టర్, బ్లడ్‌ బ్యాంక్‌ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విచారణలో తేలినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.  రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) పురిటినొప్పులతో ఈ నెల 15వ తేదీన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు వచ్చింది.   17న కాన్పు చేశారు. శస్త్రచికిత్స తర్వాత  ఆమెకు ‘ఓ’ పాజిటివ్‌ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో నిర్వహిస్తున్న బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఆమె శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలో  ప్రాణాలు కోల్పోయింది.   

    తీవ్ర నిర్లక్ష్యం 
    ‘ఓ’ పాజిటివ్‌ బదులుగా ‘ఏ’ పాజిటివ్‌ రక్తం ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందుకు సంబంధించి విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో రక్త గ్రూప్‌ నిర్ధారణ, క్రాస్‌ మ్యాచ్, డబుల్‌ చెక్‌.. వంటి ముఖ్య విధానాలను అటు బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది.. ఇటు వైద్యులు విస్మరించారన్న విషయం స్పష్టమైంది. విచారణ నేపథ్యంలో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఇటు బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది, అటు వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.  పైగా వీరిపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేత ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బ్లడ్‌ బ్యాంక్‌పై  డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణసైతం పూర్తిగా కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి.  మరోవైపు మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి వివాదాన్ని సర్ధుమణిగింపచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.  

    త్వరలో చర్యలు.. 
    బాలింత మృతిపై విచారణ జరిపి నివేదికను పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా,  వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపించాం. బాధ్యులపై త్వరలో చర్యలుంటాయి. ఇటువంటి             సంఘటనలు పునరావృతం కాకుండా తగిన  చర్యలు తీసుకుంటాం.  
    – ఎం ప్రసూన, డీసీహెచ్‌ఎస్, పల్నాడు జిల్లా  

  • అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన విజ‌య‌నగ‌రం జిల్లా కొత్తవలస పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.  

    కొత్తవలస: మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్‌.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. 

    శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవి్వన మట్టిపోగులపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపైనుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు.  

    ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది..  
    షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్‌ బ్రిడ్జిని ఆనకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందాడు.

International

  • పాకిస్థాన్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్‌గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

    ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే  ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్‌గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.

    గడిచిన 24 నెలలో పాకిస్థాన్‌లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.

    పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్‌డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.

    2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని  డేటా తెలుపుతుంది 

    ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది.

  • ఇది కూడా లారెన్స్‌ తరహా అంశమే. తనకు పనేమీ చెప్పకుండా బోర్‌ కొట్టించారని పేర్కొంటూ ఓ వ్యక్తి యజమానిపై కోర్టుకెళ్లాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఫెడ్రిక్‌ డెస్నార్డ్‌ ఫ్రెంచ్‌ పెర్ఫ్యూమ్‌ తయారీ కేంద్రంలో మేనేజర్‌గా పనిచేశాడు. అయితే, తనకు చిన్నచిన్న పనులు తప్ప కీలకమైన విధులేమీ అప్పగించకపో­వడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డానని యజమానిపై దావా వేశాడు. నాలుగేళ్లు తనది అదే పరిస్థితి అని పేర్కొన్నాడు. పని చెప్పకుండా ఇలా ఇబ్బందులకు గురి చేసినందుకు కంపెనీ 4 లక్షల డాలర్ల (రూ.3.6కోట్లు) పరిహారం ఇవ్వాలని కోరాడు. ఏమీ పనిచేయకుండా జీతం తీసుకున్నందుకు సిగ్గుగా ఉందని.. పైగా దానివల్ల మూర్ఛవ్యాధి కూడా వచి్చందని వివరించాడు. వాదనలు విన్న న్యాయస్థానం ఫెడ్రిక్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అధిక పనిఒత్తిడితో బాధపడే ఉద్యోగికి ఈ వ్యవహారం భిన్నంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఫెడ్రిక్‌కు 45వేల(రూ.40 లక్షలు) డాలర్ల పరిహారం చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.  

    20 ఏళ్లు ఉత్తినే జీతమిచ్చారని కంపెనీపై దావా  
    పని చేయకపోయినా జీతం ఇచ్చేస్తాం అంటే.. ఇలాంటి డీల్‌ ఉంటే ఎలా వదులుకుంటాం అనే కదా అంటారు. కానీ ఆమె అలా అనలేదు. తనకు ఎలాంటి పనీ అప్పజెప్పకుండా 20 ఏళ్ల పాటు వేతనం ఇచి్చన కంపెనీపై కోర్టుకెక్కారు. లారెన్స్‌ వాన్‌ వాసెన్‌హోవ్‌ అనే మహిళ 1993లో ఫ్రాన్స్‌ టెలికాం కంపెనీలో ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారు. అయితే, పుట్టుకతోనే హెమిప్లెజియా (ముఖం, అవయవాలలో పాక్షిక పక్షవాతం) ఉండటంతో ఆమెకు అందుకు అనుగుణమైన పనులే అప్పగించారు. ఆ తర్వాత ఆ కంపెనీని ఆరెంజ్‌ సంస్థ స్వా«దీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్వీయ అభ్యర్థనపై ఆమెను ఫ్రాన్స్‌లోని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. కానీ అక్కడ కొత్త కార్యాలయం ఆమె అవసరాలకు అనుగుణంగా లేదు. దీంతో కంపెనీ ఎలాంటి పనులూ అప్పజెప్పకుండా వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, వాసెన్‌ దీనిని వివక్షగా భావించి.. పోరు మొదలుపెట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ కొనసాగుతోంది.

    16 ఏళ్లుగా సిక్‌ లీవ్‌.. తిరిగి యజమానిపైనే కేసు  
    జర్మనీకి చెందిన ఓ టీచరమ్మ కూడా ఇదే బాపతు. కాకుంటే కాస్త పద్ధతిగా సిక్‌ లీవ్‌ పెట్టింది. సిక్‌ లీవ్‌ అంటే వారాలు, నెలలు కాదు.. ఏకంగా 16 సంవత్సరాలు. అవాక్కయ్యారా? కాస్త ఆగండి. ఇంకా ఉంది. అనారోగ్యానికి సంబంధించిన రుజువులు చూపించండి అని అడిగినందుకు యాజమాన్యంపైనే కేసు పెట్టింది. జర్మనీలోని నార్త్‌ రైన్‌–వెస్ట్‌ఫాలియాకు చెందిన ఓ మహిళ వెసెల్‌లోని ఓ వృత్తి విద్య కాలేజీలో ఉపాధ్యాయురాలు. అనారోగ్యం సాకుతో 16 ఏళ్లు సిక్‌ లీవ్‌లోనే ఉండి 11.66 లక్షల డాలర్లు (దాదాపు రూ.10 కోట్లు) వేతనం తీసుకుంది. జర్మనీ చట్టాల ప్రకారం ఉపాధ్యాయులు అనారోగ్య సెలవులో ఉన్నప్పుడు పూర్తి జీతం తీసుకోవడంతో సహా కొన్ని ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. దీనినే ఆమె క్యాష్‌ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీకి కొత్త యాజమాన్యం వచ్చి.. ఆమె అనారోగ్యానికి రుజువు అడగడంతో వారిపై దావా వేసింది. అయితే, న్యాయస్థానం ఆమెనే చీవాట్టు పెట్టింది. అనారోగ్యానికి సంబంధించి రుజువును అడిగే హక్కు యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పింది.  

    పని చేయకుండానే పదేళ్లుగా జీతం తీసుకుని..  
    ఇతడు ఎలాంటి విధులూ నిర్వర్తించలేదు.. ఇంకా చెప్పాలంటే అసలు ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా జీతం మాత్రం తీసుకున్నాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదేళ్ల పాటు దర్జాగా వేతనం పొందాడు. ఎట్టకేలకు అతడి బాగోతం బయట పడటంతో కటకటాలపాలయ్యాడు. కువైట్‌ లోని పౌర సేవల విభాగంలో ఉద్యోగిగా ఉన్న ఓ వ్యక్తి గత దశాబ్దకాలంగా ఆఫీసుకే రాలేదు.. కానీ నెలనెలా అతడి ఖాతాలో జీతం జమైంది. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. రెండు కోర్టుల్లో తీర్పు అతడి పక్షాన రాగా.. కోర్ట్‌ ఆఫ్‌ క్యాసేషన్‌లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే పదేళ్లుగా తీసుకున్న వేతనం మొత్తం 1,04,000 కువైట్‌ దీనార్లను (దాదాపు రూ.3 కోట్ల పైనే) రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నిధుల నుంచి అక్రమంగా వేతనం పొందినందుకు 3,12,000 కువైట్‌ దీనార్ల (దాదాపు రూ.9 కోట్ల పైనే) జరిమానా విధించింది.   

Cartoon