Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు పాల్పడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు మండిపడ్డారు. రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

    ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానమే ఆ కేసును కొట్టేసి, ఈ పొలిటికల్ డ్రామాకు తెరదించినా.. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు. అసలు ఈ నోటీసుల వెనుక ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని అన్నారు.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని, ఈ భారీ స్కామ్ నుండి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీష్ రావు గారికి నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు. ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ 'డైవర్షన్ పాలిటిక్స్' అని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, పాతపడిపోయిన కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

    గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని తెలిపారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేస్తూనే.. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం భ్రమ మాత్రమేనని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

  • సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆర్మూర్‌లో బీఆర్ఎస్‌లోకి మైనార్టీలు చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న  రెండు వేల రుపాయల  ఫించను రూ.  4000 చేస్తామని ప్రజాప్రభుత్వ హామీ ఇచ్చింది అది నెరవేర్చిందా అని ప్రశ్నించారు.

    ప్రజాప్రభుత్వం ఏర్పడి 24 నెలలకు కావస్తున్న  ఫించన్ పెంపు దాఖలు లేవన్నారు. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం జాడకనిపించడం లేదని దుయ్యబట్టారు.విద్యార్థులకు స్కూటీలు పంపిణీ చేస్తామని  సీఎం  రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఇప్పుడు వాటి పేరు ఎత్తడం లేదన్నారు.  యువతను  ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం వాటిని అమలు చేసే స్థితిలో లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది. 

    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్‌ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీష్‌ ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. హరీష​ కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేసు విషయమై రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో టర్న్‌ తీసుకుంది. 

    అయితే, గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా.. జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును  వీసీ సజ్జనార్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 

Movies

  • ఈ పండగ సీజన్‌లో విడుదలైన ప్రభాస్ – మారుతి రాజాసాబ్ సినిమా తరువాత ప్రభాస్‌కి వరుసగా పెద్ద ప్రాజెక్టులు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఒక మెగా హీరోతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మారుతి కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. 

    వీలైనంత రీజనబుల్ బడ్జెట్‌లో, మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే ఆ మెగా హీరో ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాతే మారుతి సినిమా వైపు అడుగులు వేయనున్నారు.ప్రస్తుతం మారుతి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లను పదును పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. కథ రెడీ అయిన వెంటనే ఈ మెగా ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

  • భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌గా వస్తోన్న చిత్రం "మా వందే". ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ సీహెచ్ రూపొందిస్తున్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ  "మా వందే రూపంలో ప్రేక్షకులను చూపించనున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో.. అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేయనున్నారు.

    ఈ మూవీని ప్రపంచంలో తొలిసారిగా ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్‌లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్‌లా కాకుండా సినీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ 22వ తేదీ నుంచి కశ్మీర్‌లో ప్రారంభం కానుంది.
     

  • మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్‌ టైమ్ రికార్డ్ సృష్టించింది.

    ఈ విషయాన్ని నిర్మాత సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ బద్దలైపోయింది ‍అంటూ ట్వీట్ చేసింది. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కేవలం రిలీజైన ఎనిమిది రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. 

    కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. 
     

     

  • దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడే దండోరా సినిమా చూశానని.. చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు.

    ఇంత బలమైన కథను ‍అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.

    కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్‌ అనే పేరు టైటిల్‌ పెట్టనున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.
     

     

  • టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమె వల్లే తనకు లక్‌ కలిసొచ్చిందని అన్నారు. పవిత్రా లోకేశ్ తన లక్కీ ఛార్మ్ అంటూ ప్రశంసలు కురిపించారు. నా లైఫ్‌లోకి ఆమె వచ్చాకే సక్సెస్‌ మొదలైందని నరేశ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుభకృత నామ సంవత్సరం  మూవీ గ్లింప్స్ లాంఛ్‌ ఈవెంట్‌లో నరేశ్ మాట్లాడారు. ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    అనంతరం పవిత్రా లోకేశ్ కూడా మాట్లాడారు. నరేశ్‌పై ప్రశంసలు కురిపించారు. దాదాపు 54 ఏళ్ల కెరీర్‌ ఆయనది.. ఇలాంటి గొప్ప వ్యక్తితో నేను జీవించడం అనేది నా అదృష్టమని పవిత్రా ఆనందం వ్యక్తం చేసింది. ఆయనతో మాట్లాడేందుకు నాకు కేవలం 30 నిమిషాలు మాత్రమే సమయం దొరుకుతుందని.. అంతా ఫుల్ బిజీగా ఉంటారని తెలిపింది. ఈ సినిమాలో ‍అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. కన్నడ నిర్మాత తెలుగులో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులోనూ నన్ను అభిమాస్తున్నారని.. కానీ అమ్మ భాషపై నాకు మమకారం ఎక్కువని తెలిపింది. నరేశ్ వల్లే నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాని పవిత్రా లోకేశ్ వెల్లడించింది.

    కాగా.. శుభకృత నామ సంవత్సరం మూవీలో నరేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ధనుంజయ, ప్రకృతి జంటగా నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వం వహించారు. డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మించిన ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సుధా శ్రీనివాస్ సంగీతమందించారు. 
     

     

  • అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం  ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు వేణు నక్షత్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై అవంతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి సినిమా టైటిల్‌ ఆవిష్కరించగా.. టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు హాజరై.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ… 'ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జయంత్ చల్లా, నాగేశ్వర్ రావు పూజారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అని అన్నారు.

    నిర్మాత అవంతిక  మాట్లాడుతూ… 'మా మీద నమ్మకం ఉంచి అండగా నిలిచిన 'ఆటాడిన పాట' చిత్రం టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలం. త్వరలోనే ‘ఆటాడిన పాట’ మీ ముందుకు వచ్చి, మీ హృదయాలను తాకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ ఈ సినిమా నిలబెడుతుంది. సోషియో- ఫ్యాంటసీ కోవలోని ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని' వెల్లడించారు.
     

  • హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.

    ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.  అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.

    కాగా.. విజయ్‌ దేవరకొండతో  ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్‌లో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ‍అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్‌ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. 
     

     

  • మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఆకాశంలో ఒక తార. ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ను పరిచయం చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక గ్లింప్స్ రిలీజ్ చేశారు.  

    ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేను ఆకాశంలోకి ఎలా వెళ్లాలి అనే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. రోడ్డు కూడా సరిగా లేని ఈ ఊరి నుంచి ఆకాశానికి నిచ్చేనేశావా? ముందు ఈ ఊరి పొలిమేర దాటి చూపించు చూద్దాం అనే డైలాగ్ వింటుంటే.. కనీస వసతులు కూడా లేని పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 
     

  • మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

    రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్‌పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    (ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)

    రహమాన్ డకాయిత్‌గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?

    రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

  • ఈ  సంక్రాంతి టాలీవుడ్ సినీ  ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.

    ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్‌ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు.  ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

    నవీన్ పొలిశెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది.  నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు 

     

     

     

     

     

     

     

     

  • టాలీవుడ్ యాంకర్ రష్మీ సైతం కుక్కల సంరక్షణపై మాట్లాడారు. ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో ఆమె పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు మిగిలిన ఆహారాన్ని బయట కుక్కలకు పెట్టేవారని తెలిపింది. ఆ సంప్రదాయాలన్నీ మేము మర్చిపోయామని వెల్లడించింది. ఒకప్పుడు ఆవు అనే మన కుటుంబంలో సభ్యురాలిగా ఉండేదని పేర్కొంది. ఇ‍ప్పుడు ఆవుపాలను కూడా కల్తీ చేశామని వాపోయింది.

    జున్ను పాలు అనేది ఆవు బిడ్డకే అందించాలి.. కానీ మనం మాత్రం జున్ను తింటున్నామని రష్మీ గౌతమ్ తెలిపింది. అది తిన్నా కూడా అరగదని వెల్లడించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో లెటర్స్ పంపడానికి పావురాలు పెంచుకున్నారు.. కానీ ఇప్పుడేమో ‍అవసరం లేదని చంపేయండి అంటున్నారు. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజీలో ఉండే ఎలుకలను తినేవి.. అప్పుడు ఎకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేదని తెలిపింది. డీ ఫారేస్టేషన్ వల్ల జింకలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని పేర్కొంది.  పావురాలు , కుక్కలతో అవసరం లేదని వాటిని చంపుకుంటూ వెళ్తారా?.. అలాగే భవిష్యత్‌లో తల్లిదండ్రులు కూడా అడ్డంకిగా ఉన్నారని చంపేస్తారా? అంటూ రష్మీ ప్రశ్నించింది.

    ఇదంతా కేవలం కుక్కల గురించి మాత్రమే కాదని రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఇదంతా సోషల్ కండీషనింగ్‌ అని తెలిపింది. మేము ఫారిన్ బ్రీడ్స్‌కు బానిసలా తయారయ్యామని యాంకర్ వివరించింది. 
     

  • రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని వాపోయింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. కేవలం వాటి గురించే ఈ రోజు ప్రెస్‌మీట్‌లో మాట్లాడానని పేర్కొంది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రేణు దేశాయి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.

    వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ముందు ఇలాంటి రూమర్స్‌ను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబునెయిల్స్ రాస్తున్నారు. నేను ప్రెస్‌మీట్‌కు వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్‌ లైఫ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ విడిచిపెట్టింది. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేసింది.

    ఇంకా మాట్లాడుతూ..' నేను ఎవరి కోసం పోరాడుతున్నాను. నేను కుక్కల కోసం పోరాడటం లేదు. కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే. అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్‌ఎంసీకి సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. అంతేకానీ నా పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడొద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్‌లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను ప్రెస్‌ వాళ్ల మీద ఎక్కడా అరవలేదు. వంద కుక్కల్లో ఒక పది మెంటల్‌ కూడా ఉంటాయి. మనుషుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉంటారు. కొందరు చెడ్డవాళ్లు  ఉంటారు. అవీ కూడా అంతే' అని రేణు దేశాయ్ వెల్లడించింది. 

     

     

  • ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు సినిమా 'త్రిముఖ'. ఇది ఇప్పుడు విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిని నమోదు చేయబోతోంది. ఈ చిత్రాన్ని కొత్త హీరోతో తీశారు. అయినా సరే అత్యధికంగా 500 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    ఇప్పటికే మంచి బజ్‌ సొంతం చేసుకున్న 'త్రిముఖ'... ప్రేక్షకుల అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేస్తూ.. ఒక కొత్త హీరోకు ఘనమైన ఆరంభాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సన్నీ లియోన్, అషూ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  • హీరో పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ మీడియా ముందుకొచ్చారు. వీధి కుక్కల్ని చంపేస్తున్న వాళ్లపై మండిపడ్డారు. రీసెంట్‌గా వీధి కుక్కల బెడదని అరికట్టేందుకు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగానే రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టారు. దోమకాటుతో ఏడాదికి 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా? అని ప్రశ్నించారు. అలానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    'అన్యాయంగా కుక్కల్ని చంపితే కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు. కుక్కలన్నీ మంచివే అని నేను చెప్పను. కుక్కల దాడిలో చిన్న బిడ్డలు చనిపోయారు. ఒక తల్లిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా కుక్కలన్నింటినీ చంపేస్తారా? మగాళ్లు రేప్ చేస్తారు, మగాళ్లే మర్డర్లు కూడా చేస్తారు. అంతమాత్రాన మగాళ్లందర్నీ రేపిస్టులు, హంతకులు అంటామా? రేపులు, మర్డర్లు చేసిన మగాళ్లందర్నీ పట్టుకుని చంపేయాలా? బుద్ది ఉందా కొంచెమైనా? ఏడాదికి దోమకాటుతో 10 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లవి ప్రాణాలు కాదా? కేవలం కుక్క కరిచి ఒక్కరు చనిపోతే అది మాత్రమే ప్రాణమా?' అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.

    (ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

    మీలో ఎంత మంది అనాధ ఆశ్రమానికి వెళ్లారు? ఎంత మంది అన్నదానం చేస్తున్నారు? ఎంత మంది అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు? చేసేది ఏమీ లేదు.. పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడతారు? అని రేణు దేశాయ్ రెచ్చిపోయింది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డుపై అడ్డదిడ్డంగా వైన్ షాప్స్ పెడతారు. ఆల్కహాల్ తాగొచ్చి చాలామంది చిన్నపిల్లల్ని చావులకు కారణమవుతున్నారు. వాటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు. చిన్నారుల జీవితానికి విలువ లేదా? కుక్క కరిస్తేనే అడుగుతారా? లక్షలాది మంది ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక చనిపోతున్నారు. దానికోసం ఎవరూ పోరాడటం లేదు? కుక్కలు కరిస్తేనే పోరాటాలు చేస్తున్నారు అని ఆవేశానికి లోనైంది.

    Renu Desai: ఆ 5 కుక్కల కోసం 95 కుక్కలను చంపుతారా?

    ప్రతిరోజూ తాను ఎన్నో కుక్కలని కాపాడుతున్నానని.. అంబులెన్సులు వచ్చి వాటి తీసుకెళ్తున్నాయని.. వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నానని రేణు దేశాయ్ చెప్పారు. కుక్కలు ఇప్పటికే రోజూ యాక్సిడెంట్స్ చాలా చనిపోతున్నాయి. బైక్, బస్, కార్ల వల్ల జరిగే ప్రమాదాల వల్ల కాళ్లు, నడుము విరిగిన కుక్కల్ని చాలాసార్లు కాపాడాను. వాహనదారుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కుక్కలు వెళ్లి కంప్లైంట్ చేయలేవుగా అని ప్రశ్నించారు.

    (ఇదీ చదవండి: నా కూతురు తిరిగి కొడుతుందేమోనని భయం: రాణీ ముఖర్జీ)

  • గత కొన్నిరోజుల నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకుర్ తెగ ట్రెండ్ అయిపోయింది. తమిళ హీరో ధనుష్‌ని వాలంటైన్స్ డే నాడు పెళ్లి చేసుకోనుందనే పుకార్లే దీనికి కారణం. ఒకటి రెండు రోజుల పాటు అందరూ ఈ వార్త నిజమేనని అనుకున్నారు. ఇదంతా ఫేక్ అని మృణాల్ టీమ్ ఇదంతా ఫేక్ అని చెప్పడంతో అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇదలా ఉండగానే ఓ రొమాంటిక్ మూవీని మృణాల్ రెడీ చేసింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)

    'దో దివానే షెహర్ మైన్' పేరుతో తీసిన ఈ రొమాంటిక్ సినిమాలో మృణాల్ సరసన సిద్ధాంత్ చతుర్వేది నటించాడు. ఫిబ్రవరి 20న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. సిద్ధాంత్-మృణాల్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి? ఎందుకంటే ఈమె గత రెండు చిత్రాలు.. సన్నాఫ్ సర్దార్ 2, ద ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలయ్యాయి. చూడాలి మరి ఈసారి ఏం చేస్తుందో?

    (ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

  • జెనరేషన్‌ మారుతోంది. మొన్నటి తరంలా నిన్నటి తరం లేదు, నిన్నటి తరంలా నేటితరం లేదు. ఇప్పుడంతా హైటెక్‌ స్పీడ్‌.. అయితే ఇదే కొన్నిసార్లు తనను భయానికి గురి చేస్తోందంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణి ముఖర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాన్న (రామ్‌ ముఖర్జీ) ఉన్నప్పుడు నా సినిమాలు చూసి పర్ఫామెన్స్‌ ఎలా ఉందో చెప్పేవాడు. ఆయన వెళ్లిపోయాక ఫీడ్‌బ్యాక్‌ పొందడమే కష్టమైపోయింది. 

    నా కూతురు తట్టుకోలేదు
    కానీ భగవంతుడు నాన్నను కోల్పోయిన లోటును కూతురితో భర్తీ చేశాడు. అయితే నా కూతురు నా సినిమాలు ఎక్కువగా చూడదు. ఎందుకంటే నేను ఏడ్చే సన్నివేశాలను చూసి తను తట్టుకోలేదు.. అదే సంతోషంతో డ్యాన్స్‌ చేసే సీన్స్‌ మాత్రం చాలా ఎంజాయ్‌ చేస్తుంటుంది. నేను నటించిన హిచ్కి, తోడా ప్యార్‌ తోడా మ్యాజిక్‌, బంటీ ఔర్‌ బబ్లీ సినిమాలు చాలా ఇష్టపడుతుంది.

    మేకప్‌ వేసుకున్నా బాధే
    కుచ్‌ కుచ్‌ హోతాహై మూవీ మాత్రం చూడలేదు. ఎందుకంటే అందులో నేను మొదటి సన్నివేశంలోనే చనిపోతాను. అది తను తట్టుకోలేదు. అలాగే నేను మేకప్‌ వేసుకుంటే కూడా తనకు నచ్చదు. నువ్వు నా అమ్మలా కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. మేకప్‌ తీసేయగానే ఇప్పుడు నువ్వు నా అమ్మవి అని చెప్తుంది. ఎంతైనా తను జెన్‌ ఆల్ఫా (2010 - 2024 మధ్య జన్మించినవారు) కిడ్‌. 

    అదే నా చిన్నతనంలో..
    ఒక్కోసారి కోపంతో నాపై అరిచేస్తుంటుంది. అప్పుడు తను చెప్పేది నేను ఓపికగా వినాల్సిందే! అదే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చెంపదెబ్బలు కొట్టేది. అదే పని నేను చేశాననుకోండి, నా కూతురు తిరిగి కొట్టినా కొట్టొచ్చు. తను చాలా మంచి అమ్మాయి అయినప్పటికీ తనకు కొన్నిసార్లు భయపడుతూ ఉంటాను అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    రాణీ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కూతురు అధీర జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే చిత్రానికిగానూ రాణీ ముఖర్జీ.. ఉత్తమ నటిగా గతేడాది జాతీయ అవార్డు అందుకుంది. ప్రస్తుతం మర్దానీ 3 మూవీ చేస్తోంది.

    చదవండి: కోహ్లితో రిలేషన్‌? స్పందించిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సంజనా

International

  • లండన్: బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందేందుకు నకిలీ పాస్‌పోర్టులు, వీసా పత్రాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు ఉపయోగించినందుకు వేలాది మందిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నిర్వహించిన వరుస ఇమ్మిగ్రేషన్ దాడుల్లో భారీగా నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్న హోం ఆఫీస్, దేశ చరిత్రలోనే అతిపెద్ద డాక్యుమెంట్ చెక్‌ను ప్రారంభించింది.

    యూకేలో ఉద్యోగాలు పొందేందుకు మోసగాళ్లు ప్రధానంగా మూడు మార్గాల్లో నకిలీ పత్రాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) మోసం
    స్పాన్సర్‌షిప్ లైసెన్స్ లేని కంపెనీల పేరుతో నకిలీ ‘సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్’లు (CoS) జారీ చేస్తూ కొన్ని గుంపులు భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి.

    షేర్ కోడ్ మోసం
    ప్రత్యేకంగా కేర్ సెక్టార్‌లో షేర్ కోడ్ కుంభకోణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. షేర్ కోడ్ అనేది ఒక వ్యక్తికి యూకేలో పని చేసే అర్హత ఉందో లేదో నిర్ధారించే ఆన్‌లైన్ విధానం. ఇతరుల వివరాలను ఉపయోగించడం లేదా సాంకేతికంగా మార్చడం ద్వారా నకిలీ షేర్ కోడ్‌లను సృష్టించే ధోరణి పెరుగుతోంది.

    బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ (BRP) మోసం
    దొంగిలించబడిన లేదా గడువు ముగిసిన BRP కార్డులలో ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని మార్చి కొత్త పత్రాలు తయారు చేయడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

    అలాగే, హెల్త్ అండ్ కేర్ వీసాలను దుర్వినియోగం చేస్తూ వేలాది మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఏజెన్సీలు ఒక వ్యక్తికి జారీ చేసిన స్పాన్సర్‌షిప్ పత్రాలతో ఒకరికి మించి ఉద్యోగులను నియమిస్తున్నాయని కూడా ఫిర్యాదులు అందాయి. ఇలాంటి నకిలీ పత్రాలు అందించి అభ్యర్థులను మోసం చేసిన సంస్థల స్పాన్సర్ లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను హోం ఆఫీస్ ప్రారంభించింది.

    చట్టవిరుద్ధంగా ఉద్యోగులను నియమించే సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదటిసారి పట్టుబడిన సంస్థలకు ఒక్కో అక్రమ కార్మికుడికి 45,000 పౌండ్లు (సుమారు రూ.48 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి నేరం రుజువైతే ఈ మొత్తం 60,000 పౌండ్లు వరకు పెరుగుతుంది. కార్మికులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే, వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బహిష్కరణ చర్యలు ప్రారంభిస్తారు.

    హోం ఆఫీస్ ప్రవేశపెట్టిన కొత్త డిజిటల్ వ్యవస్థలతో నకిలీ పత్రాలను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 2029 నాటికి డిజిటల్ ఐడీలను తప్పనిసరి చేయడం ద్వారా ఇలాంటి మోసాలను పూర్తిగా నిర్మూలించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కఠినమైన షరియత్ నియామాలను అమలు చేసే ఆ దేశంలో చిన్న తప్పుచేసినా శిక్షలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్, కార్మిక భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 14 వేలకు పైగా కార్మికులను సౌదీ నుండి బహిష్కరించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం వివిధ చట్టాలు ఉల్లంఘించిన 14,621 విదేశీ కార్మికులను  దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు చట్టాలు ఉల్లంఘించిన 18,054 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైయిన వారిలో 3,853 మందిని చట్టాలు పాటించనందుకు అదుపులోకి తీసుకోగా సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు 2,853మంది మందిని, అక్రమంగా దేశంలోకి చొరబడే యత్నం చేసినందుకు 1,491 మంది విదేశీయులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో అధికంగా ఇథియోపియన్లు 59 శాతం, యెమెన్ పౌరులు 40శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.

    కాగా ఇటీవల అక్రమంగా సౌదీలోకి ప్రవేశించిన వ్యక్తికి అక్కడే పనిచేసే ఓ భారతీయుడు అతని సమాచారం తెలియక లిప్ట్ ఇచ్చాడు. అనంతరం అధికారులు అతనిని పట్టుకున్నారు. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడని  అతనిని జైలులో వేశారు. అనంతరం అతని ఉద్యోగం సైతం ఊడింది. కనుక సౌదీలో ఉండే విదేశీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని  పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉండే భారతీయులు సూచిస్తున్నారు.

  • అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో బాంబుపేలుళ్లు కలకలం రేపుతున్నాయి. షహర్-ఏ-నవ్ ప్రాంతంలో తీవ్రబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు పౌరులు మృతిచెందగా, 13 మంది గాయపడ్డట్లు తాలిబన్‌ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది.  అయితే పేలుళ్లు ఏలా జరిగాయి. ఏవరు చేశారనే సమాచారం తెలియాల్సి ఉంది.

    ఈ దాడులు చైనీస్ ఫుడ్‌కోర్టులు అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగాయి. దీంతో చైనీయులే టార్గెట్‌గా ఈ దాడులు జరిగినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించాయి. కాగా  షహర్-ఎ-నవ్ ప్రాంతం అ‍క్కడ ఉండే సురక్షిత ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇప్పుడు అక్కడే పేలుళ్లు జరగడం చర్చనీయాంశమయ్యింది.

     

  • భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పోలాండ్‌కు కీలక సూచన చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి  ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని తెలిపారు. ఉగ్రవాదంపై ఖచ్చితంగా జీరో టోలరెన్స్  విధానాన్ని పాటించాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి జైశంకర్ 
    పోలాండ్ ఉపప్రధానితో మాట్లాడారు.

    పోలాండ్ విదేశాంగశాఖ మంత్రి రాడోస్లావ్  సిక్రోస్కీ,తో   జైశంకర్ ఈ రోజు ( సోమవారం) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మంత్రులు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఉ‍గ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానాన్ని పాటించాలని ముష్కరులను పెంచి పోషిస్తున్న దేశాలలో  మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఎటువంటి సహాయం చేయకూడదని తెలిపారు.

    జైశంకర్ మాట్లాడుతూ.."ఉపప్రధాని మీరు మాకు దూరమైన వ్యక్తి కాదు . మా ప్రాంతంలో జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదంపై మీకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించిన అంశం ఇటీవల మీరు పర్యటించిన ఓ దేశానికి సంబందించింది. పోలాండ్ టెర్రరిజానికి మద్దతివ్వకూడదు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టకూడదు" అని అన్నారు.

    పోలాండ్ దేశంతో జరిగిన భేటీ అంశాలను తన ఎక్స్‌ ఖాతాలో జైశంకర్ పంచుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలకు పోలాండ్ ఉప ప్రధాని అంగీకారం తెలుపుతున్నట్లుగా తల ఊపారు. పహల్గామ్ అటాక్ అనంతరం పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న అంశాన్ని భారత్ ఈయూ దేశాలకు వివరిస్తూ వస్తుంది.

  • వాషింగ్టన్‌ డీసీ: ‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని.. అందరూ అంటుంటారు రామరామ.. అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా’ అని సినీకవి అన్న మాటలు అగ్రరాజ్యం అమెరికాకు సరిగ్గా నప్పుతాయి..! స్వేచ్ఛాసమానత్వాల భూమిగా అమెరికా గడ్డకు పేరుంది. కానీ, ఆ పేరు వెనక విరోధ భావాలు కూడా ఉన్నాయి. అణచివేత ధోరణులూ ఉన్నాయి. మరో కోణంలో అమెరికాను చూస్తే.. విస్తుపోయే నిజాలు కనిపిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలన నేపథ్యంలో.. ‘అమెరికా మరో పార్శ్వం’పై సాక్షి డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ రిపోర్ట్..

    గన్‌కల్చర్‌కు అమెరికా పెట్టింది పేరు..! ఎప్పుడు ఏ బడిలో తూటా పేలుతుందో తెలియదు..! ఎప్పుడు ఏ పబ్లిక్ ఈవెంట్‌పై ఉన్మాదుల తుపాకీ గర్జిస్తుందో ఊహించలేం..! మనుషుల కంటే తుపాకులే ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం అమెరికా. విద్యార్థులు పరీక్షలకు కాకుండా.. గన్ షూటింగ్‌కు సన్నద్ధమవుతుంటారు. తొమ్మిది.. పదేళ్ల వయసులోనే బ్యాగులో తుపాకీ తెచ్చుకుని, కోపంతో టీచర్లు, తోటి విద్యార్థులపై గురిపెడతారు. 

    33.5 కోట్ల జనాభాకు 40 కోట్ల గన్స్ ఉండడం పరిస్థితి తీవ్రతకు దర్పణం పడుతోంది. 2024లో తుపాకీ తూటాలకు 40 వేల మంది బలవ్వగా.. వారిలో 1,200 మంది చిన్నపిల్లలున్నారు. అమెరికాలో తల్లిదండ్రులు ఏకంగా తమ పిల్లలకు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులు, దుస్తులు కొనే పరిస్థితి అక్కడ నెలకొంది. తుపాకీ కారణంగా అమెరికాలో పౌరులు బిక్కుబిక్కుమంటూ గడిపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి పౌరులకు స్వేచ్ఛ ఉన్నట్లా..? లేనట్లా..?

    స్వేచ్ఛావాయువులు అమెరికాలో బలంగా వీస్తాయంటారు. ఇంకా చెప్పాలంటే.. ఫలానా దేశంలో స్వేచ్ఛేలేదంటూ రిపోర్టులిచ్చే ఎన్నెన్నో ఏజెన్సీలకు అమెరికా ఆలవాలం. ఫలానా దేశంలో ఫలానా మతస్థులను ఊచకోత కోస్తున్నారంటూ గగ్గోలు పెట్టే మీడియా అమెరికాకు సొంతం. అయితే.. ఇదంతా గురివింద చందమే..! అమెరికాలో జాతి వివక్ష ఏమాత్రం తగ్గ లేదు. ఇంకా చెప్పాలంటే.. అమెరికా జైళ్లలో ఉంటున్న ఖైదీల్లో శ్వేత జాతీయుల కంటే.. నల్ల జాతీయుల సంఖ్య ఐదు రెట్లు అధికంగా ఉంటోంది. 

    అమెరికాలో జీఈ, న్యూస్ కార్ప్, డిస్నీ, వియాకామ్, టైమ్ వార్నర్, సీబీఎస్ అనే ఆరు సంస్థల చేతుల్లో 90% మీడియా ఉంది. ఈ సంస్థలేవీ అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షను బయటి ప్రపంచానికి చూపించవు. కానీ, భారత్ లాంటి దేశాల్లో స్వేచ్ఛ లేదంటూ గగ్గోలు పెడతాయి. అమెరికా జైళ్లలో రెండు మిలియన్ల ఖైదీలుండగా.. వీరిలో సింహభాగం శ్వేతజాతీయులు కాని వారే. 21 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారు. వీరితో జైళ్లలో బండ చాకిరీ చేయించుకుని, ముష్టి పారేసినట్లు గంటకు 25 సెంట్ల చొప్పున కూలీ ఇస్తారు.
     
    అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కడో స్లమ్‌లలో పరిస్థితులను భూతద్దంలో చూపించే అమెరికా మీడియా.. ఆయా దేశాల్లో పేదరికం పేట్రేగుతోందని, ప్రజలు కూడు, గూడు, గుడ్డకు నోచుకోవడం లేదని చూపడం సహజమే..! అయితే.. అమెరికాలో అంతా సంపన్నులే ఉన్నారా? పేదలే లేరా? అనే ప్రశ్నకు పాశ్చాత్య మీడియా కూడా నోరు మెదపదు. నిజమేంటంటే.. అమెరికాలో 18శాతం మంది పౌరులు నిరాశ్రయులు. ఆరున్నర లక్షల మంది పౌరులు వంతెనల కింద, రోడ్లపైనే నిద్రిస్తుంటారు. సైనికులు ఏర్పాటు చేసే టెంట్లలో 40 వేల మంది నిద్రిస్తారని అంచనా..! ఇక లాస్ ఏంజిల్స్, సాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ ప్రాంతాల్లో ఏకంగా ‘టెంట్ సిటీస్’ పేరుతో పేదల బస్తీలు పుట్టుకొస్తున్నాయి. అదే సమయంలో.. బిలియనీర్ల సంపద ఒక్క కొవిడ్ సమయంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం..! 

    ఏటా వైద్యంపై 4.5 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నామని అమెరికా గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. అనారోగ్యంతో సరైన వైద్యం అందక అమెరికాలో చనిపోతున్న వారి ఏటా 50 వేల మంది చనిపోతున్నట్లు ఓ నివేదిక ఉంది. అమెరికా అంటేనే వైద్య బీమా తప్పనిసరి అంటారు. అది కేవలం ఇమిగ్రెంట్లకేనని తెలుస్తోంది. ఇప్పటికీ అమెరికాలో 2 కోట్ల 70 లక్షల మంది పౌరులకు బీమా అందడం లేదని, ఐదు లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా దివాళా తీస్తున్నాయని పలు నివేదికలు వచ్చాయి. వైద్యం ప్రాథమిక హక్కు అని చెప్పుకొనే అమెరికాలో ఒక సర్జరీ కాస్ట్ 50 వేల డాలర్లుగా.. అంబులెన్స్ చార్జీలు కనీసం రెండు వేల డాలర్లుగా ఉండడం గమనార్హం..! అంటే.. అమెరికాలో రోగి ప్రాణాన్ని ధనమే నిర్ణయిస్తుందని స్పష్టమవుతోంది. 
     
    ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇప్పుడు అమెరికాలో ధరాభారం పెరిగింది. అమెరికాలో ఒక సగటు ఉద్యోగి జీతం తీసుకుని ఒక్కరోజు గడవక ముందే.. మళ్లీ జీతం రావడానికి ఎన్నిరోజులు ఉందా? అని లెక్కలేసుకుంటున్నాడు. ఈ కోవలో 60శాతం మంది ఉద్యోగులు ఉన్నట్లు ఓ అధ్యయనం చెబుతోంది. ఇళ్ల ధరలు, అద్దెలు, విద్య, వైద్యం, నిత్యావసరాలు.. ఇలా అన్నీ చుక్కలనంటుతున్నాయి. దిగుమతులపై ట్రంప్ టారిఫ్‌లతో ధరలు పెరిగి, అమెరికా పౌరులు విలవిల్లాడుతున్నారు. వేతనాలు పెరగవు.. ధరలు తగ్గవు అంటూ నిట్టూరుస్తున్నారు. 
     
    భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నికల వ్యవస్థపై అభాండాలు వేసే అమెరికాలో.. ఎన్నికలు కూడా అత్యంత ఖరీదుతో కూడుకున్నవే..! ట్రంప్ విజయం సాధించిన 2024 ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోయాయి. ఇందుకు 16 బిలియన్ డాలర్ల మేర ఖర్చయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఖర్చులో కార్పొరేట్ కంపెనీల విరాళాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఆయా సంస్థలు తమకు అనుకూల చట్టాలు తెప్పించుకుంటాయి. నేతల స్టాక్ పోర్ట్‌ఫోలియోలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. 2023లో 50 మంది నేతలు ఈ తరహాలో వ్యాపారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 
     
    ఇక అమెరికాలో ట్రంప్ వంటి పాలకుల కారణంగా.. పౌరుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక రుగ్మతను ఎదుర్కొంటున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సైకియాట్రీ చెబుతుంగా.. ఈ కారణాలతో 15 – 34 ఏజ్ గ్రూప్ వారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఒంటరితనం, ఒత్తిడి, డ్రగ్స్ వంటివి ఈ ఆత్మహత్యలకు కారణాలుగా తెలుస్తోంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలు అత్యధికంగా అమెరికాలోనే వినియోగమవుతున్నట్లు సమాచారం. ఓహియో, వెస్ట్ వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ఓవర్ డోస్ మరణాలు కూడా ఇక్కడ ఎక్కువే..! ఇక్కడి యువత డీ-అడిక్షన్ ఔషధాల కోసం వేల డాలర్లు ఖర్చుపెడుతోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ డేటా ఈ విషయాలను చెబుతోంది.

    ఇక టెక్నాలజీ.. డిజిటల్ యుగం అని చెప్పే అమెరికాలో యువత చదువు కోసం విలవిల్లాడుతోంది. విద్య ఓ హక్కు అయినా.. మన విద్యావేత్త చుక్కా రామయ్య లాంటి వారు రాసిన ‘అమెరికా పాఠం’ వంటి పుస్తకాల్లో ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను చక్కగా వివరించినా.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. విద్యలో ఒకప్పుడు అమెరికా నాయకత్వ ధోరణిలో ఉన్నా.. ఇప్పుడు విద్యపై అప్పులు పెరుగుతున్నాయి. స్టూడెంట్ డెబ్ట్ ఇప్పుడు 1.7 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు అంచనా. సగటు కాలేజీ విద్యార్థి 38 వేల డాలర్ల మేర అప్పును భరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం పాఠశాలల బడ్జెట్‌ను తగ్గిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు భారీ లాభాల్లో ఉంటున్నాయి. అమెరికాలో ఇప్పుడు విద్య అంటే ఆలోచనల సృష్టి కాదు. ఉద్యోగుల తయారీ వ్యాపారం అనే స్థాయికి చేరుకుంది. ఇక కాలుష్యంలోనూ అమెరికా అతిపెద్ద ఉత్పత్తిదారు కావడం తెలిసిందే. ఏటా 5 బిలియన్ టన్నుల మేర కార్బన్-డై-యాక్సైడ్ ఆ దేశంలో ఉత్పత్తి అవుతోంది. క్లైమేట్ యాక్షన్, పారిస్ ఒప్పందాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేది కూడా అమెరికానే. ప్రపంచాన్ని పాలించాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుంటే.. ఆ ప్రపంచాన్ని నాశనం చేసే రేంజ్‌లో కాలుష్యం వెదజల్లుతోంది అమెరికా..! ఇప్పుడు చెప్పండి.. ఇంతటి దరిద్రాలను కలిగి ఉన్న అమెరికాకు వెళ్లడం.. అక్కడ సెటిల్ అవ్వాలని, గ్రీన్‌కార్డు పొందాలని ఆశించడం సరైనదేనా?? 

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ టంప్‌కు నోబెల్ బహుమతిపై ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎలాగైనా  ప్రపంచశాంతి బహుమతి సాధించాలని ట్రంప్ ఎక్కని గడపా లేదు.. చేయని రచ్చా లేదు. ఎలాగైనా ఈ అవార్డు తనకు ప్రకటించాలంటూ  ‌పలుసార్లు బహిరంగ ప్రకటన సైతం చేశారు. కానీ నోబెల్ మాత్రం ట్రంప్‌కు దక్కలేదు. 

    తాజాగా ట్రంప్ మరోసారి నోబెల్‌పై తనకు ప్రకటించకపోవడంపై తనకున్న అక్కసును వెల్లగక్కారు. తాజాగా నార్వే ప్రధాని జోనస్ గహర్‌కు ట్రంప్ లేఖ రాశారు. అందులో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న  విధ్వంసానికి  కారణం ఆదేశం తనకు నోబెల్ ప్రకటించకపోవడమేనన్నారు. అందువల్లే తన రూట్ మార్చానని తెలిపారు. శాంతిని వదిలి యుద్ధ బాట పట్టినట్లు పేర్కొన్నారు.

    ఆలేఖలో ట్రంప్ ...  "నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. అయినా మీ దేశం నన్ను శాంతిదూతగా  గుర్తించలేదు.  అందుకే ఇక నేను శాంతి గురించి ఆలోచించాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను కేవలం అమెరికాకు ఏది లాభం చేకురుస్తోంది అదే చేస్తాను" అని ట్రంప్ లేఖలో అన్నారు. గ్రీన్‌లాండ్‌కు ఎప్పటికైనా  చైనా, రష్యాల నుంచి ముప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో ఆ భూమిపై వారికి యాజమాన్య హక్కులు ఎలా ఉంటాయి అని ట్రంప్ ప్రశ్నించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ పడవలు దిగాయి. మా భూభాగంలో కూడా పడవలు దిగాయి. అంతే .. ఆ భూమిపై యాజమాన్య పత్రాలు ఆదేశానికి లేవు అని అన్నారు.

    అయితే గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆక్రమించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయాన్ని డెన్మార్క్‌తో సహా ఇతర నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్  ఆ నాటో దేశాలపై 10 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.  నోబెల్ బహుమతి ప్రకటన అనేది పూర్తిగా నోబెల్ కమిటీ ఎంపిక మాత్రమే అక్కడి ప్రభుత్వానికి అందులో ఎటువంటి జోక్యం ఉండదు. 

        

  • 2024 జనవరి 20.. డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో అడుగు పెట్టిన రోజు. అమెరికా ఫస్ట్‌ నినాదంతో నెగ్గిన ఆయన.. దేశాన్ని ఓ గాడిన పెడతాడని, అదే సమయంలో అంతర్జాతీయంగా పెద్దన్న రోల్‌ను సమర్థనీయంగా పోషిస్తారని ఆనాడు అంచనాలు ఉండేవి. కానీ, ఒక సంవత్సరం గడిచేలోపే సీన్‌ సితార అయ్యింది. ట్రంప్‌ సంతకం చేసిన అనేక నిర్ణయాలు అమెరికాలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా తీవ్ర చర్చలకు దారితీశాయి. వాటిలో చాలామట్టుకు ‘‘తల తిక్క’’ నిర్ణయాలుగా గుర్తింపు దక్కించుకున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..  

    వలసవాదానికి చుక్కలు .. అధికారంలోకి రాగానే ట్రంప్‌ చేసిన మొదటి పని.. శరణార్థులపై కఠిన ఆంక్షల విధింపు. ఈ నిర్ణయంలో అక్రమ వలసవాదుల్ని వెతికి మరీ.. వాళ్ల వాళ్ల దేశాలకు డిపోర్ట్‌ చేశాడు. ఈ క్రమంలో బేడీలు వేసి.. కనీస వసతుల్లేని విమానాల్లో తరలించడం తీరు తీవ్రవిమర్శలు తావిచ్చింది. మానవ హక్కుల సంస్థలు వలసవాదులకు తలుపులు మూసేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అయినప్పటికీ అమెరికా భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్‌ సమర్థించుకున్నాడు.. ఇదేగాక..  

    వీసా టఫ్‌ రూల్స్‌.. అమెరికన్ల ఉద్యోగాల్ని రక్షించడం అనే పేరుతో..  హెచ్‌1బీ వీసా నియమాలను కఠినతరం చేశారు. ఫీజులు గణీయంగా పెంచారు. అధిక వేతన ప్రమాణాలు, కఠిన అర్హతలు, తక్కువ అనుమతులతో.. తీవ్ర చర్చనీయాంశంగా మారారాయన. ఈ నిర్ణయంతో.. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమయ్యారు.

    ఆ దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌.. 2025 డిసెంబర్‌లో ట్రంప్‌ చేసిన ఒక ప్రకటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల పౌరులపై అమెరికా ప్రవేశ నిషేధం విధించారాయన. అఫ్గన్‌ పౌరుడొకడు వాషింగ్టన్‌లో గన్‌ ఫైర్‌ ఎటాక్‌ జరపడమే ఇందుకు కారణం. ఈ లిస్టులో చాలా వరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

    టారిఫ్‌ కింగ్‌.. 2025లో ట్రంప్‌ను ప్రత్యేకంగా నిలిపింది ఏదైనా ఉందీ అంటే.. అది సుంకాల యుద్ధమే. తనకు నచ్చని.. తన మాట వినని దేశాలపై టారిఫ్‌ కొరడా ఝుళిపించారాయన. ఈ క్రమంలో.. చైనా, యూరప్‌, కెనడా, మెక్సికో వంటి దేశాలపై భారీ దిగుమతి సుంకాలు (tariffs) విధించారు. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌లు అమెరికా పరిశ్రమలను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైనా, అవి గ్లోబల్‌ ట్రేడ్‌లో ఉద్రిక్తతలు, భారత్‌ లాంటి మిత్రదేశాలతో సంబంధాల క్షీణత, వినియోగదారులపై అదనపు భారాలు వంటి అనేక సమస్యలకు దారితీశాయి.

    ఫెడరల్‌ టు స్టేట్స్‌.. 2024 నవంబర్‌లో ట్రంప్‌ తన ఎన్నికల హామీలో.. విద్యాశాఖను పూర్తిగా రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగా.. అధికారంలోకి రాగానే ఆ పని చేశారు. 2025 మార్చి 20న ట్రంప్‌ ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్పై సంతకం చేసి, కేంద్ర(ఫెడరల్‌) విద్యాశాఖను మూసివేయడానికి అధికారిక ప్రక్రియను ప్రారంభించారు. ఫెడరల్‌ ప్రభుత్వంపై అనవసర భారం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన. 40 ఏళ్లలో 3 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. విద్యా నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలి అనేది ఆయన వాదన. దీంతో ఆ దేశంలో కేంద్ర విద్యా శాఖ కనుమరుగు అయ్యే ప్రాసెస్‌ నడుస్తోంది. అయితే.. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భారం కానుంది.

    అదే సమయంలో.. ఇటు అమెరికా ఆరోగ్య శాఖ (Department of Health and Human Services – HHS)ను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు. రెండో టర్మ్‌లో ఈ మేరకు ప్రతిపాదన కూడా చేశారు. ఆయన వాదన ప్రకారం, ఆరోగ్య విధానాలు రాష్ట్రాలకే అప్పగించాలి.. ఫెడరల్‌ స్థాయిలో ప్రత్యేక శాఖ అవసరం లేదు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉంది. ప్రస్తుతానికి దాని అధికారాలు, నిధులు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామాకేర్‌( Affordable Care Act) రద్దు ప్రయత్నాలతో కలిపి, ఆరోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళిక మాత్రం రేపో మాపో అమలయ్యే ఛాన్స్‌ ఉంది.

    వీటితో పాటు ఐక్యరాజ్య సమితిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గప్పించడం.. నిధుల్ని తగ్గించడం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నిధుల్ని కోత వేసే ప్రయత్నాలు.. భారత్‌తో వాణిజ్య వివాదాలు.. పాక్‌తో మైత్రి, వెనెజువెలా అధ్యక్షుడ్ని బంధించి ఎత్తుకెళ్లి.. ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు మద్దతు.. ఆమెకు దక్కిన నోబెల్‌ మెడల్‌ను స్వీకరించడం.. “ఇకపై కేవలం శాంతి గురించే ఆలోచించాల్సిన బాధ్యత లేదు” అని వ్యాఖ్యలు చేయడం, ఇరాన్‌ నిరసనకారుల్ని రెచ్చగొట్టడం.. డెన్మార్క్‌ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలు..  వీటికి తోడు ఫేక్‌ న్యూస్‌ అంటూ మీడియా సంస్థలపై దాడులు, దావాలు వేయడం.. ఈ ఏడాది కాలంలో కుటుంబ వ్యాపారాలు విపరీతమైన లాభాలు అర్జించి సంపద పెరగడం ట్రంప్‌ను తిట్టిపోసేలా చేశాయి. 

Sports

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్‌ చేసింది.

    టాస్‌ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్‌ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్‌ ప్లేయర్‌ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.

    అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్‌ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8) బ్యాట్‌ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వాల్‌ తలో పరుగు చేసి ఔట్‌ కాగా.. డి క్లెర్క్‌ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.

    గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

    ఎవరీ గౌతమి నాయక్‌..?
    మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్‌ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్‌) ఆల్‌రౌండర్‌ అయిన ఈమె​కు దేశవాలీ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో రత్నగిరి జెట్స్‌ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది. 

  • జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు  6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ పతనాన్ని శాశించాడు. మొమిన్‌ కమర్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌ తలో వికెట్‌ తీశారు. 

    స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన థామస్‌ నైట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్‌ (33), ఓల్లీ జోన్స్‌ (30), మను సరస్వత్‌ (25), రోరి గ్రాంట్‌ (21), ఫిన్లే కార్టర్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్‌కు సరస్వత్‌, ఫిన్లే జోన్స్‌ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్‌ ఖాన్‌ (75), అహ్మద్‌ హుసేన్‌ (47) పాక్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్‌ ఫర్హాన్‌ (18 నాటౌట్‌) పాక్‌ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అలీ హసన్‌ బలోచ్‌ 15, స్టార్‌ బ్యాటర్‌ సమీర్‌ మిన్హాస్‌ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో ఓల్లీ జోన్స్‌, సరస్వత్‌ తలో 2 వికెట్లు తీశారు. 

    కాగా, ఈ మెగా టోర్నీలో పాక్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌ సూపర్‌-8కు చేరుకుంటుంది.

    ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ బుల్‌బులియా, జేసన్‌ రోల్స్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. 

    ఇవాళే మరో మ్యాచ్‌ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. 

  • త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్‌ మూడు లేదా నాలుగో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్‌ వేగంగా పురోగతి సాధిస్తే ‍ప్రణాళికలు మారవచ్చని  చెప్పుకొచ్చాడు. 
     
    కమిన్స్‌ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్‌కప్ తొలి రెండు మ్యాచ్‌లు సహా, దానికి ముందు పాకిస్తాన్‌లో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్‌తో సిరీస్‌కు కమిన్స్‌ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడం​ లేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు.  

    ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకైనా కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం​ ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్‌ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్‌కు దూరమైనా, ఆ జట్టు టైటిల్‌ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్‌లో ఆసీస్‌ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆసీస్‌ రెండో మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌..ఒమన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్‌-బిలో ఉంది. 

    ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్‌), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

  • 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రికెట్‌లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కార‌ణాల‌ను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో జరగబోయే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. 

    అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్‌ బోర్డు, భారత్‌లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్‌ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్‌లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోగా, భారత్‌లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. 

    బంగ్లాదేశ్‌పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్‌ ఆడబోమని ఓవరాక్షన్‌ చేస్తుంది. బంగ్లాదేశ్‌ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.

    తాజాగా ఈ అంశంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఎంట్రీతో ప్రపంచకప్‌లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

    కాగా, గత కొంత‌కాలంగా బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య రాజకీయ ఉద్రిక్త‌లు నెల‌కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుద‌ల చేయ‌డంతో ఈ ఉద్రిక్త‌లు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువుల‌పై దాడులు పెరిగిపోతుండ‌డంతో బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

    దీన్ని ఘోర అవ‌మానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్ పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను శ్రీలంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ‌ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదిక‌ల‌గా ఆడాల్సి ఉంది.
     

  • న్యూజిలాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. 

    జనవరి 21 నుంచి 31 వరకు భారత్‌లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్‌షాహీ వారియర్స్ (నీషమ్‌ బీపీఎల్‌ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. 

    కాగా, భారత్‌తో సిరీస్‌ న్యూజిలాండ్‌ జట్టుకు ప్రపంచకప్‌కు ముందు రిహార్సల్‌గా భావించబడుతోంది. ఈ సిరీస్‌​కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్‌ జట్టులోనూ ఉంటారు. నీషమ్‌ కూడా న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

    నీషమ్‌ను ప్రపంచకప్‌ ‍ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్‌ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌‍ జట్టులో లేకపోవడం​ న్యూజిలాండ్‌కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్‌తో సిరీస్‌ అయినా, ప్రపంచకప్‌ అయినా నీషబ్‌ లేని లోటు న్యూజిలాండ్‌ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

    కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్‌ 2025-26 ఎడిషన్‌లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్‌ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్‌షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్‌షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చట్టోగ్రామ్ రాయల్స్‌తో (తొలి క్వాలిఫయర్‌) తలపడనుంది.  

    ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం తప్పక ఉండేది.

    భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు..
    హెన్రీ నికోల్స్‌, విల్‌ యంగ్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), నిక్‌ కెల్లీ, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జకరీ ఫౌల్క్స్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డెవాన్‌ కాన్వే, మిచెల్‌ హే, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, కైల్‌ జేమీసన్‌, జేడన్‌ లెన్నాక్స్‌, మైఖేల్‌ రే

  • టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 

    ఈ సిరీస్‌కు ముందు వరకు గంభీర్‌ను టెస్ట్‌ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్‌ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్‌ (న్యూజిలాండ్‌) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

    వాస్తవానికి గంభీర్‌ పేలవ ప్రదర్శన టెస్ట్‌లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్‌ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌కు భంగపాటే ఎదురైంది.

    అతడి పుణ్యమా అని  భారత్‌ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్‌ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఒక్కటే.

    గంభీర్‌ పేలవ ప్రదర్శన టెస్ట్‌ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్‌ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.

    గంభీర్‌ కోచ్‌గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. 

    గంభీర్‌ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారని టాక్‌. రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్‌మన్‌ గిల్‌కు టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. 

    సంజూ శాంసన్‌కు అన్యాయం చేసి గిల్‌ను టీ20ల్లోనూ ప్రమోట్‌ చేయాలని గంభీర్‌ ప్రణాళికలు రచించాడని సమాచారం.

    మహ్మద్‌ షమీ లాంటి సీనియర్‌ను అకారణంగా తప్పించి, హర్షిత్‌ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌ గంభీర్‌ రాజకీయాలకు బలైయ్యారనే టాక్‌ కూడా నడుస్తుంది. కోచ్‌గా తన పనితనంపై ఫోకస్‌ పెట్టకుండా గంభీర్‌ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

    ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్‌పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

    గురువు ఎంతో శిష్యుడూ అంతే..!
    గంభీర్‌ ప్రమోట్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్‌ సైతం భారత కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్‌ తొలిసారి న్యూజిలాండ్‌ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్‌ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. 

    టెస్ట్‌ల్లోనూ గిల్‌ (కెప్టెన్‌గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్‌లో (ఇంగ్లండ్‌) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్‌ స్వీప్‌) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్‌ తన గురువు గంభీర్‌తో పోటీ పడుతున్నాడు. 

  • భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భార‌త్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్‌.. నేడు వన్డే సిరీస్‌. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కోల్పోవ‌డం ఇదే తొలిసారి.

    ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.

    రోహిత్‌.. నోహిట్‌ 
    సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్‌లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్‌ అన్నట్లుగా రోహిత్‌  మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.

    జడేజా అట్టర్ ప్లాప్‌
    రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును  ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్‌లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్‌తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.

    శ్రేయస్ సైలెంట్‌..
    ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్‌లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్‌కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

    బౌలింగ్ ఫెయిల్‌
    ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.
    చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!
     

  • ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.

    వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌. అతడు కరుంగ్‌ ఓన్‌కోలర్‌.. ఫుట్‌బాల్‌ ఆటగాడు. న్యాయవాది కూడా!

    బాక్సర్‌గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టానంటాడు కరుంగ్‌. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.

    వివాహేతర సంబంధం మచ్చ
    కోమ్‌ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్‌ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్‌కోలర్‌తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్‌ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.

    అయితే, ఈ విషయం గురించి ఓన్‌కోలర్‌ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్‌ అదాలత్‌లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్‌ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.

    సాక్ష్యంగా మెసేజ్‌లు
    ఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్‌కోలర్‌ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్‌ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.

    మేరీ కోమ్‌ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్‌కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్‌కోలర్‌ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్‌ ఇటీవల తెలిపింది. 

    తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.

    సంపాదన లేకుండా నాపై ఆధారపడి
    అప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్‌ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్‌లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.

    తాను కష్టపడి బాక్సింగ్‌ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్‌ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్‌కోలర్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు.

    పిల్లలకు తల్లినయ్యాను
    పెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్‌ కోసం తాను తన కెరీర్‌నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్‌తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.

    పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్‌, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.

    సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?
    మేరీ కోమ్‌- ఓన్‌కోలర్‌ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.

    ఏదేమైనా మేరీ కోమ్‌ వంటి దిగ్గజ బాక్సర్‌ రింగ్‌లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

  • న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ గడ్డపై తొలి దైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్‌ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసమైంది. 

    గత పర్యటనలో టెస్టుల్లో భారత్‌ను వైట్‌వాష్ చేసిన కివీస్‌.. ఈసారి వన్డేల్లో మట్టి కరిపించింది. చివరి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్ములేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 337 ప‌రుగులు చేసింది.

    డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(124) ఒంటరి పోరాటం చేశాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రోహిత్, గిల్‌,శ్రేయస్ అయ్యర్ వంటి టాపార్డర్ బ్యాటర్ల నుంచి సహకరం లభించకపోవడంతో 296 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ స్పందించాడు. భారత్‌పై సిరీస్ విజయం తమకెంతో ప్రత్యేకమని బ్రేస్‌వెల్ చెప్పుకొచ్చాడు.

    "భారత్‌కు వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాం. టీమిండియా వంటి పటిష్టమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించి, తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము ఎప్పటకీ మర్చిపోము. భార‌త్‌కు వ‌చ్చి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని ప్ర‌తీ జ‌ట్టు కోరుకుంటుంది.

    మేము ఒక జట్టుగా మా ప్రణాళికలకు కట్టుబడి, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. అది మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్ర‌పంచంలో ఒక మూలన ఉన్న చిన్న దేశం నుంచి వ‌చ్చిన మేము.. ఐక్యంగా ఉండి పెద్ద పెద్ద జట్లను సవాల్ విసురుతున్నాము.  క‌లిసి క‌ట్టుగా ఆడ‌డం ఒక్క‌టే న్యూజిలాండ్ క్రికెట్ సిద్ధాంతం. 

    ఇక డారిల్ మిచెల్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా వన్డేల్లో తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. అత‌డు మాకు మిడిలార్డ‌ర్‌లో కీలకమైన ఆటగాడు. మిచెల్ మా బ్యాటింగ్ యూనిట్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్ ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాము.  భారత్ వంటి కఠిన పరిస్థితులలో వారి ఆట తీరు చూస్తుంటే కివీస్ క్రికెట్ భవిష్యత్తుపై ఎటువంటి ఢోకా లేదన్పిస్తోందని" బ్రేస్‌వేల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: T20 World Cup: బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్ లైన్‌.. లేదంటే?
     

  • సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక​ శాతం మంది స్టార్‌ క్రికెటర్లయ్యారు.

    సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్‌లు ప్లాన్‌ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.

    చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్‌ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు. 

    సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్‌లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్‌లో కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోవాలని అనుకుంటారు.

    ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్‌తో పోలిస్తే, ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్‌ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్‌ పీటర్సన్‌, జేసన్‌ రాయ్‌, జోనాథన్‌ ట్రాట్‌, ఆండ్రూ స్ట్రాస్‌, మ్యాట్‌ ప్రయర్‌ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్‌కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్‌ లాంబ్‌, క్రిస్‌ స్మిత్‌, డెర్క్‌ రాండల్‌ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్‌ దిగ్గజాలుగా మారారు.

    ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్‌ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

    సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం​ వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.

    క్రికెట్‌లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA)..  పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.

    వీటికి తోడు ప్రైవేట్‌ టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్‌ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఇందుకు ప్రధాన ఉదాహరణ.

    ప్రైవేటు టీ20 లీగ్‌ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేజే స్మట్స్‌ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్‌ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

    క్రికెట్‌ చరి​త్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్‌ కాకుండా)..
    ఆస్ట్రేలియా
    మార్నస్‌ లబూషేన్‌
    కీగన్‌ మాథ్యూస్‌
    ఫిరోస్‌ ఎర్ఫాన్‌
    క్లైవ్‌ ఇంగ్లిస్‌

    న్యూజిలాండ్‌
    గ్రాంట్‌ ఇలియట్‌
    నీల్‌ వాగ్నర్‌
    డెవాన్‌ కాన్వే
    లూక్‌ రోంచి
    క్రిస్‌ కేన్స్‌

    నమీబియా
    డేవిడ్‌ వీస్‌

    జింబాబ్వే 
    గ్యారీ బ్యాలెన్స్‌

     

     

Business

  • మూడు దశాబ్దాలకు పైగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో స్ప్లెండర్ బైక్ ధరలు పెరిగాయి. కొత్త ఏడాది ఇతర కంపెనీల బాటలోనే హీరోమోటోకార్ప్ అడుగులు వేస్తూ.. ధరలను కేవలం రూ. 250 మాత్రమే పెంచింది. పెరుగుతున్న విడిభాగాల ధరలు, ఇతరత్రా కారణాల వల్ల ధరను పెంచడం జరిగిందని సంస్థ పేర్కొంది.

    హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. ఇందులోని 100 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 7.09 bhp & 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

    కంపెనీ ఈ బైక్ ధరలను పెంచింది. కానీ డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ముందు భాగంలో అదే టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

    ఇదీ చదవండి: టాటా సియెర్రా కారు కొన్న మంత్రి

    ధరల పెరుగుదల తరువాత హీరో స్ప్లెండర్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 73,902 నుంచి రూ. 74,152 వద్దకు చేరింది. ఐ3ఎస్ వేరియంట్ రూ. 75,055 నుంచి రూ. 75,305 వద్దకు, ఎక్స్‌టెక్‌ ధర రూ. 77,428 నుంచి రూ. 77,678 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డ్రమ్) వేరియంట్ ధర రూ. 79,964 నుంచి రూ. 80,214 వద్దకు, ఎక్స్‌టెక్‌ 2.0 (డిస్క్) వేరియంట్ ధర రూ. 80,471 నుంచి రూ. 80,721 వద్దకు చేరింది.

  • టాటా సియెర్రా ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. NATRAX పరీక్షా కేంద్రంలో తన సామర్థ్యాలను ప్రదర్శించిన అనంతరం ఈ ఎస్‌యూవీ కేరళకు చేరుకుంది. రాష్ట్ర రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ కేరళలో తొలి యూనిట్‌ను స్వీకరించిన మొదటి గ్రహీతగా నిలిచారు.

    కేరళ రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రముఖ టాటా డీలర్‌షిప్‌లలో ఒకటైన శ్రీ గోకులం మోటార్స్ నుంచి సియెర్రా కారును డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉన్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.

    వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్‌, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.

    ఈ కొత్త తరం టాటా సియెర్రాలో సరికొత్త 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 158 బీహెచ్‌పీ శక్తి, 255 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ ఏటీ గేర్‌బాక్స​తో మాత్రమే వస్తుంది. ఇక సియెర్రా 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ 105 బీహెచ్‌పీ శక్తి, 145 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అలాగే డీజిల్ 1.5-లీటర్ ఇంజన్‌ 116 బీహెచ్‌పీ శక్తి, 260 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ ఎంటీ లేదా ఏడు-స్పీడ్ డీసీటీతో లభిస్తుంది.

  • భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి ఇంకో రేటు ఉంది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఎంతలా దూసుకెల్తూ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.

    ఈ రోజు (జనవరి 19) ఉదయం 1,33,550 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. సాయంత్రానికి రూ. 1,34,050 వద్దకు (రూ. 500 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,690 రూపాయల నుంచి రూ. 1,46,240 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.

    ఢిల్లీలో కూడా ధరలు తారుమారయ్యాయి. ఉదయం 1,33,700 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు.. ఇప్పటికి రూ. 1,34,200 వద్ద (రూ. 500పెరిగింది) నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,840 రూపాయల నుంచి రూ. 1,46,390 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.

    చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల రేటు 1,34,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 146730 వద్ద ఉంది. వెండి రేటు ఏకంగా రూ.3 లక్షలు (1000 గ్రాములు) దాటేసింది.

    ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

  • చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    వడ్డీ వస్తుందా?
    స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లపై వడ్డీ లభిస్తుంది.

    నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్‌లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.

    స్విస్ బ్యాంక్‌లో ఖాతా సులభమేనా?
    స్విస్ బ్యాంక్‌లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్‌గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.

    కీలకమైన మార్పులు!
    ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్‌లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

    ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.

    ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

  • బినామీ ఆస్తులు... దాని వ్యవహారాలను భారతదేశంలో నిషేధించారు. ఇందుకు సంబంధించి 1988లో చట్టమే వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన, బలమైన చట్టం.

    ఆస్తి అంటే: బినామీ వ్యవహారాలన్నీ ఆస్తి చుట్టూ తిరుగుతాయి. అందుకని ‘ఆస్తి’ అనే పదాన్ని బాగా నిర్వచించారు. చట్టంలో ఈ నిర్వచనం కష్టమయితే చాలా తెలివిగా, పరిధి ఎక్కువగా ఉండేలా వివరణ ఇచ్చారు. ఈ క్రిందివన్నీ ‘ఆస్తి’ అని పెద్ద జాబితా చెబుతారు. ఈ నిర్వచనం చదివితే మీకు భగవద్గీత స్ఫురణకు రాకతప్పదు.

    (1) ఏ రకమయినా.. స్థిరమైన, అస్థిరమైన, కంటికి కనిపించేవి... కనపడవని... భౌతికమైనవి... నిరాకారమైనవి.  
    (2) హక్కు, ఆసక్తి, దస్తావేజుల్లో పేరు, ప్రస్తావన
    (3) రూపాంతరం చెందగలిగే ఆస్తి
    (4) పై పేర్కొన్న 1,2,3 ఆస్తుల ద్వారా వచ్చిన వసూళ్లు ..రియల్‌ ఎస్టేట్, భూములు, ఇళ్లు, పొలాలు, స్థిరాస్తులు, షేర్లు, వేతనాలు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బ్యాంకు డిపాజిట్లు, నగదు బ్యాంకు లాకర్లు, ప్రయివేటు లాకర్లు మొదలైనవి.

    బినామీ వ్యవహారం ఏమిటంటే..
    ➤ఒక వ్యవహారం–ఒప్పందం.. ఒక ఆస్తికి కాగితాల ప్రకారం ఓనర్‌ (యజమాని) ఓనమాలు రాని ఓబయ్య అయితే.., ఆ వ్యవహారానికి మదుపు పెట్టినది చదువుకున్న చలమయ్య. ఇందులో చలమయ్య గారికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది.

    ➤లేని వ్యక్తి పేరు మీద, డమ్మీ వ్యక్తి పేరు మీద జరిగే వ్యవహారం... కర్త, కర్మ, క్రియ... ఒకరైతే.. అబద్దపు పేరుతో దస్తావేజులు తయారవుతాయి.

    ➤ఒక వ్యక్తి/సంస్థకి తెలియకుండా/చెప్పకుండా/ ఎరుకలో లేకుండా జరిగిన వ్యవహారం. విచారణలో నాకు తెలియదు, నేను కాదని, నాకు హక్కు లేదని ధ్రువీకరించిన కేసులు.

    ➤కొన్ని వ్యవహారాల్లో మనిషి కల్పితం (చందమామ బేతాళ కథల్లోలాగా).

    గాభరా పడొద్దు.. వీటికీ మినహాయింపులున్నాయి. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త కాని, సభ్యులు కాని వారి పేరు మీద ఆస్తి ఉంచుకోవచ్చు. కానీ సోర్స్‌ మాత్రం కుటుంబం నుంచే రావాలి. ప్రయోజనం ఉమ్మడి కుటుంబానికే చెందాలి. ట్రస్టుల్లో, భాగస్వామ్యంలో, కంపెనీల్లో, డిపాజిటరీలాగా, ఏజెంటులాగా, విశ్వాసపాత్రుడి హోదాలో వ్యవహారాలు.. కుటుంబంలో భార్యభర్తల పేరు మీద, పిల్లల పేరు మీద జరిగే వ్యవహారాలు మొదలైన వాటికి సోర్స్‌ కుటుంబ సభ్యుల నుంచే రావాలి. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్లు, గత తరంగానీ, భవిష్యత్తు తరంగానీ, జాయింట్‌ ఓనర్స్‌... డాక్యుమెంట్‌ ప్రకారం ఉండి.. సోర్స్‌ వారిలో ఎవరి దగ్గర్నుంచైనా ఉండాలి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ‘సోర్స్‌’ అంటే ‘కెపాసిటీ‘ ఉండాలి. నిజమైన వ్యవహారం అయి ఉండాలి. డమ్మీలుండకూడదు.  

    మరి కొన్ని ఉదాహరణలు గమనించండి..
    ➤‘అ’ అనే అన్నగారు ఒక ఇల్లు కొన్నారు. తానే డబ్బు ఇచ్చారు. కానీ ‘ఆ’ అనే వదిన గారి పేరు మీద రిజిస్టేషన్‌ జరిగింది. ‘అ’ ఆ ఇంట్లోనే ఉంటారు. ఈ కేసులో ‘ఆ’ బినామీదారు. ‘అ’ ప్రయోజనం పొందిన వ్యక్తి.

    ➤ఇక మరో కేసు. ఇది వింటే ‘మత్తు’ వదిలిపోతుంది. 'పీ’ అనే వ్యక్తికి లిక్కర్‌ లైసెన్సు ఉంది. తన ఉద్యోగి ‘ఖ’ పేరు మీద అన్ని చెల్లింపులు. కానీ రాబడి అంతా 'పీ’దే. ఇదొక బినామీ వ్యవహారం.

    బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కల్పిత పేర్లతో, లేనివారి పేరు మీద, మరణించిన వారి పేరుతో మీద పెడతారు. ఇదీ బినామీయే. 
    ఉద్యోగస్తుల పేరు మీద బ్యాంకు లాకర్లు తెరిచి అందులో నగదు, బంగారం పెట్టడం, అలాగే బంధువుల పేరు మీద వ్యవహారాలు చేయడం.. ఇటువంటి వ్యవహారాల్లో బేతాళ కథల్లోని కల్పిత వ్యక్తి ... బినామీదారు. తన గుట్టు చెప్పకుండా ప్రయోజనం పొందే వ్యక్తి, ప్రయోజనం పొందిన వ్యక్తిని ఈ పేరుతో వ్యవహరిస్తారు.

    ఈ వ్యవహారాలు/ఆస్తులు, ఇందులోని సూత్రధారులు అందరూ శిక్షార్హులే! ‘‘బినామీ వ్యవహారాలకు దూరంగా ఉండండి’’ అని  డిపార్టుమెంటు వారు జారీ చేసిన కరపత్రాలు చదవండి. బినామీ అంటే సునామీ లాంటిది.

    ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య 

  • సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 324.17 పాయింట్ల నష్టంతో 83,246.18 వద్ద, నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద నిలిచాయి.

    భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఏఎండీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్  కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సుప్రీం హోల్డింగ్స్ & హాస్పిటాలిటీ (ఇండియా) లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డిలిజెంట్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • అమెరికాలో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గుదిబండగా మారుతున్నాయి. గత ఐదేళ్లలో విద్యుత్ ధరలు ఆకాశాన్ని తాకగా ఈ భారం పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డేటా సెంటర్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ, వాటి ఖర్చును కూడా సామాన్య పౌరులే మోయాల్సి వస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఆకాశాన్నంటుతున్న ధరలు

    ఫిబ్రవరి 2020తో పోలిస్తే అమెరికా వ్యాప్తంగా విద్యుత్ ధరలు సగటున 40 శాతం పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్‌లో జులై 2020 నుంచి జులై 2025 మధ్య విద్యుత్ ఖర్చులు ఏకంగా 93 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

    ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ (EIA) డేటా ప్రకారం 2022-2024 మధ్య..

    • నివాస వినియోగదారుల విద్యుత్తు బిల్లులు 10 శాతం పెరిగాయి.

    • వాణిజ్య వినియోగదారులపై 3 శాతం మాత్రమే పెరిగాయి.

    • పారిశ్రామిక వినియోగదారులపై ధరలు 2 శాతం తగ్గాయి.

    డేటా సెంటర్లు

    చిన్నపాటి నగరాలకు సరిపోయే విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్లు గ్రిడ్‌లోకి వస్తున్నా వాటికి తక్కువ ధరలకే విద్యుత్ అందుతోంది. ఈఐఏ గణాంకాల ప్రకారం, 2024 చివరి నాటికి నివాస వినియోగదారులకు యూనిట్ (కిలోవాట్-గంట) ధర 16 సెంట్లు ఉండగా వాణిజ్య వినియోగదారులకు అది 13 సెంట్లు మాత్రమే ఉంది.

    ఈ వ్యత్యాసానికి కారణాలు

    • నివాస ప్రాంతాలకు విద్యుత్ చేరవేయడానికి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఖర్చు పెరిగింది. ఇవి తుఫానులు, అడవి మంటల వల్ల దెబ్బతింటే ఆ మరమ్మతు ఖర్చులు వినియోగదారులపైనే పడుతున్నాయి.

    • డేటా సెంటర్లు నేరుగా హై-వోల్టేజ్ ట్రాన్స్‌మిషన్ లైన్లకు అనుసంధానమవుతాయి. తద్వారా పంపిణీ ఖర్చుల నుంచి తప్పుకుంటున్నాయి.

    • పెద్ద కంపెనీలకు ఉన్న లాబీయింగ్ బలం సామాన్య ప్రజలకు ఉండదు. యుటిలిటీ రెగ్యులేటర్ల వద్ద కంపెనీలు తమకు అనుకూలమైన ధరలను సాధించుకోగలుగుతున్నాయి.

    గ్రిడ్ అప్‌గ్రేడ్ భారం ఎవరిది?

    ఇటీవల యూఎస్‌లో పీజేఎం అనే గ్రిడ్ ఆపరేటర్ 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్రాన్స్‌మిషన్ లైన్ల అప్‌గ్రేడ్ ప్రాజెక్టును చేపట్టింది. డేటా సెంటర్ల వల్లేఈ అప్‌గ్రేడ్ అవసరం ఏర్పడినప్పటికీ వర్జీనియా, మేరీల్యాండ్ వంటి ప్రాంతాల్లో ఈ భారాన్ని నివాస వినియోగదారుల బిల్లుల్లో చేర్చడం వివాదాస్పదమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం, అనేక యుటిలిటీ సంస్థలు మెటా వంటి దిగ్గజ కంపెనీలతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. టెక్సాస్‌లో ఎల్ పాసో ఎలక్ట్రిక్ సంస్థ మెటా డేటా సెంటర్ కోసం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆ విషయాన్ని ప్రజల దృష్టికి రాకుండా దాచేందుకు ప్రయత్నించడం గమనార్హం.

    మార్పు దిశగా..

    ఈ అసమానతలపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ లా స్కూల్ ఎక్స్‌పర్ట్‌ అరి పెస్కో మాట్లాడుతూ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత రెగ్యులేటర్లపై ఉందన్నారు. ఇప్పటికే వర్జీనియా రాష్ట్రం డేటా సెంటర్ల కోసం ప్రత్యేక వినియోగదారుల క్లాస్‌ను ఏర్పాటు చేసి గ్రిడ్ అప్‌గ్రేడ్ల కోసం వారి నుంచే ఎక్కువ వసూలు చేసేలా నిబంధనలు మార్చింది. విస్కాన్సిన్ వంటి రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. పెరుగుతున్న విద్యుత్ ధరలు అమెరికాలో ఒక ప్రధాన రాజకీయ, ఆర్థిక అంశంగా మారాయి. దీన్ని సరిదిద్దకపోతే ఓటర్ల ఆగ్రహం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం

  • బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.

    పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.

    ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?

    వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
    వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.

Politics

  • దేవుడ్ని మొక్కేటోళ్లు రోజూ చెప్పుకునే మంత్రాలు కొన్నుంటాయి. వోటిని నిత్యపారాయణం అంటారు. ఆ పెకారం జూసినప్పుడు.. ఏడాదికి రెండుమార్లు చెప్పుకునే మంత్రాలను ఏటనుకోవాల? అట్టాంటివి మామూలు పెజానీకానికి అలవాటు లేదు గాబట్టి.. ఆ పనిజేసే చంద్రబాబుగోరే ఆటికి పేరు గూడా పెట్టాల! ఎందుకంటే ఆయన తనకి పిల్లనిచ్చి పెళ్లిజేసిన మావగార్ని తలుసుకుంటా.. ఒకే మంత్రాన్ని ఏడాదికి రెండుసార్లు జపిస్తావుంటాడు గాబట్టి. అదేనండీ.. పాపం అల్లుడే తనకు గొయ్యి తవ్వగలడనే మర్మం తెలీకుండా చేరదీసిన పెద్దాయన ఎన్టీవోడి పుట్టిన్రోజు, కండ్లుమూసిన్రోజూ వచ్చినప్పుడెల్లా బాబుగారు పాట పాడతావుంటారు.

    అబ్బెబ్బే.. బాబు గారు పాట పాడతారనగానే.. చీటీపాటో.. టెండరు పాటో.. పీపీపీ పాటో.. అమరావతి పాటో అనుకోబాకండి సార్లూ. యిది యింకో పాటూ. ఎన్టీవోడికి బారతరత్న యిప్పించేస్తా అని కల్లమాటలు అల్లిన పాట!. బాబుగారంతటి పెద్దాయన, భీష్ముడి మాదిర్తో అంతలావు పెతిగ్న జేసింతర్వాత.. వోటిని కల్లమాటలంటావా? అని కోపగించుకోకండి సార్లూ. శానా మంది సెవులు గొరుక్కుంటా వుండే మాటలు యిన్నాక అట్టా అనిపించింది. సెప్పినానంతే. యింతకీ సెవులు గొరుక్కునే మాటేటంటారా? సెంద్రబాబు గోరి అత్తమ్మ.. అదేనండీ.. పిల్లనిచ్చిన మాంగోరు తాళిగట్టిన యిల్లాలు.. జీవించి ఉండగా, భారతరత్నాన్ని సెంట్రల్ గవుర్మెంటోళ్లు, ఎన్టీవోడి మీద పేమతో బతిమాలి యిచ్చినా గూడా.. సెంద్రబోబుగారు ‘ఠాట్’ అని అడ్డం పడతారేమో అనేది గుసగుసగా యినిపిస్తాందాండీ.

    సెంద్రబోబు గారు.. యెప్పుడు జూసినా నేను ఢిల్లీలో సెక్రం తిప్పినా, సెక్రం తిప్పతా.. అని సెప్తా వుంటారు గదండీ. సెక్రం గుర్తుండే పార్టీలోళ్లు గూడా అన్ని సార్లు సెక్రం తిప్పడం గురించి మాటాడరండీ బాబో! మరట్టాంటి సెక్రధారి సెంద్రబాబు గోరు.. సిటికేస్తే సాలు.. భారతరత్న ఏంది.. యింకేదైనా రత్నముండినా గూడా సటుక్కున వొచ్చేయాలి గదా!. మరి ఆపాటి  పరపతి ఆయనకు వుండాలి గదా అనేది వొక డవుటు. అయినా, వొక్క సెంద్రబాబు గారిదేవుండాది లెండి. ఎన్టీవోడు కన్న పిలకాయిలేవైనా తక్కవోల్లా. ఎవురికి వారు రాజకీయాల్లో కొమ్ములు వంకర్లు దిరిగినోళ్లే గదా. సిన్నమ్మ అని అందురూ పిలుసుకుని ఆయన కూతురు పురందరేశ్వరమ్మ ఏవైనా తక్కవా? సెంటర్లో రాజ్యంజేసే పార్టీలో ఆమె శానాశానా పెద్ద పోస్టుల్లో వుండాది గదా? ఆమె గట్టిగా అడిగుంటే యీపాటికి యెప్పుడో యిచ్చేసేటోళ్లుగదా..!

    అయినా సార్లూ.. నాకో సంగతి తెలవక అడగతా. ఎన్టీవోడికి భారతరత్న అనిపించుకునే లెవిలు వుండాదో లేదో సెంటర్లో రాజ్జెంజేసేటోల్లకి తెలవదా అంట! ఆయనకి ఆ అవార్డు యిస్తే తమ పరపతే పెరిగిపోతాదని వోల్లకి తెలవదా అంట? యీనోటా ఆనోటా యినబడతా వుండేదేంటంటే.. గవుర్మెంటోల్లు యియ్యాలనుకున్నా గూడా.. బాబుగోరు అండ్ కో, అనగా ఎన్టీవోడి కన్నపిల్లలూ సైందవుల మాదిర్తో అడ్డం పడతా వుండారని గదా!. యీ యవ్వారం యెనకాల వుండేదేనండీ అసలు మతలబు! అవార్డే గనక వొస్తే.. ఢిల్లీకి బొయ్యి రాష్ట్రపతి చేతుల్లోంచి తీస్కోవాల్సింది యెవురు? కట్టుకున్న భార్య వుండగా.. ఎవురైనా సరే.. ఆమెనే గదా తొలీత పిలిసేది. ఆమెకే గదా ఆ మరేద దక్కేది. కడుపున బుట్టినోళ్లెవ్వరూ ఎన్టీవోడిని గెమనించుకోకుండా వొదిలేసినప్పుడు.. విలవిల్లాడిపోయిన పెద్దాయన యిష్టపడి కట్టుకున్నాడు గదబ్బా.. లక్ష్మిం పార్వతిని! సెంద్రబాబుకి ఆమె వరసకి అత్తమ్మే గదా కాబోతాది!!

    అక్కడే వుండాది అసలు పితలాటకం. సెంద్రబాబు సహా.. ఎన్టీవోడి పిలకాయిలంతా ఆమె మాటొస్తే సాలు అగ్గి మీద గుగ్గిలాల్లాగా ఎగిరెగిరి పడతా వుంటారు గదా. మరట్టంటాటిది.. ఆమె ఢిల్లీకి బొయ్యి భారతరత్న ఆమె చేతుల్తో అందుకుంటే యీల్లు తట్టుకుంటారా? అనేదే అసలు పెశ్న. అయినా సెక్రం దిప్పి.. ఎన్టీవోడికి భారతరత్న వొచ్చేలా చెయ్యడానికి సెంద్రబాబు పరపతి ఉపయోపడతాదో లేదో గానీ.. సెంట్రలు గవుర్మెంటోళ్లు పెద్దాయన మీద భక్తితో, ప్రేమతో యియ్యాలనుకున్నా గూడా.. సెంద్రబాబు సెక్రం అడ్డమేసి ఆపేయడం మాత్రం గ్యారంటీ అని అంతా అంటాండారు. కాబట్టి పైనలుగా అందరిలోనూ కొడతావుండే డౌటేందంటే.. అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
    -రాజేశ్వరి.

  • సాక్షి, విజయవాడ: ఏపీలో 18 నెలలుగా దళితుల మారణహోమం జరుగుతోందని కూటమి సర్కార్‌పై మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్. దళితుల పట్ల దాడులు జరుగుతుంటే హోంమంత్రి అనిత ఎక్కడికి పోయారు అ​ంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. ఇదే ఘటన మరో కులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.

    జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కందుకూరులో కాపు-కమ్మలకు మధ్య దాడి జరిగితే హోం మంత్రి అనిత పరుగు పరుగున వెళ్లారు. పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మీరు వాళ్లకు సపోర్ట్ చేశారా?. దళితులపై దాడులు జరిగితే కనీసం మీరు స్పందించరా?. తుని దుర్ఘటనలో 60 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపేస్తే.. చెరువులో దూకేశాడని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో ఆడవాళ్లను బట్టలు తీసేని డ్యాన్స్‌లు చేయమన్న జనసేన నేతను ఎందుకు అరెస్ట్ చేయలేదు?. జనసేన నాయకుడు మాట్లాడిన మాటలు మీకు కనబడవా?. ప్రతీ కేసులో అరెస్టులు చేసి రోడ్ల పై నడిపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్ అని హడావిడి చేస్తున్నారు. కేసు విచారణలో నిర్దోషిలుగా తేలితే వారి గౌరవాన్ని తిరిగి మీరు ఇవ్వగలరా?.

    పవన్ కళ్యాణ్‌ చెప్పిన కొత్త చట్టాలు ఇవేనా?. మీరు ఎంత రోడ్లపై నడిపిస్తే అన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఇకపై ఎవరినైనా అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపిస్తే చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో 60 శాతం మంది బాధితులు దళితులే. గ్రామాల్లోని నాయకుల ఇళ్లపై వేరే పార్టీ జెండాలు ఎగరేస్తే ఊరుకోవడం లేదు. టీడీపీ, జనసేన జెండాలు ఎగరకపోతే వారిని బహిష్కరిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఇదేనా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. కూటమి కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకున్నా రెడ్ బుక్ ఉపయోగిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి కావాలి.

    యరపతినేనిపై కేసు కట్టాలి.. 
    సామాన్య కార్యకర్త చనిపోయాడని ఎమ్మెల్యే యరపతనేని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. ఏపీలో మర్డర్ చేస్తే మాట్లాడే వాడు లేడు. అత్యాచారం చేస్తే అడిగేవాడు లేడు. సాల్మన్ హత్య కేసులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిందితుడు. తక్షణమే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేయాలి. 18 నెలల కూటమి పాలనలో 276 మంది దళిత ఆడబిడ్డలపై దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. చనిపోయిన వ్యక్తి సమాధుల వద్దకు కూడా కుటుంబ సభ్యులను వెళ్లనివ్వడం లేదు. కుటుంబసభ్యులను కూడా రానివ్వకుండా పోలీసులే దహన సంస్కారాలు చేసేయడమేంటి?. మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చంద్రబాబు సమాధానం చెప్పాలి

    దళితులకు, ఆడబిడ్డలకు ఏం జరిగినా పరుగు పరుగున వస్తానని పవన్ చెప్పారు.. ఇప్పుడు ఏమైపోయారు?. సాల్మన్ కుటుంబానికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సహా హత్యకు కారకులైన వారిపై 302 సెక్షన్ పెట్టాలి. లేనిపక్షంలో బాధితుల పక్షాన కోర్టులో కేసు వేసి న్యాయపోరాటం చేస్తాం. యరపతినేని శ్రీనివాసరావును ప్రధాన ముద్దాయిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తీరుతాం. ఇప్పుడు తప్పించుకున్నా 2029లోనైనా యరపతినేని తప్పించుకోలేడు. ఈ కేసులో మా వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత ఉద్యమం తప్పదు

    లోకేశ్‌ శాశ్వతంగా దావోస్‌కే.. 
    లోకేష్ ఇప్పటికైనా మారకపోతే.. భవిష్యత్ లో మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు. ఇప్పుడు నెలకొకసారి నారా లోకేష్ దావోస్‌కి వెళుతున్నాడు
    ఒక్కసారి ప్రభుత్వం మారితే నారా లోకేష్ పర్మినెంట్‌గా దావోస్‌కి పారిపోవడమే. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం కోల్పోయిన పరిస్థితి తర్వాత మీ పరిస్థితి ఏంటి?. తాటతీస్తా.. ఒంగోబెట్టేస్తా.. నారతీసేస్తా అంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?. సనాతన ధర్మాధికారి పవన్‌కు జనసేన నేతల చర్యలు కనిపించడం లేదా?. దేశంలోనే అత్యంత రక్షణ కవచం ఏర్పాటు చేసి ఆడపిల్లల మానప్రాణాలను కాపాడతానని పవన్ కబుర్లు చెప్పారు.

    పవన్‌ ఏం చేశారు.. 
    భారతదేశంలో ఈ స్థాయిలో కోడి పందాలు ఎప్పుడూ జరగలేదు. మీకు 164 సీట్లు ఇస్తే మందులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు. రికార్డింగ్ డ్యాన్సుల్లో చాలా గొప్ప క్వాలిటీ చూపించారు. పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రికార్డింగ్ డ్యాన్స్‌లు వేశారు. రాజకీయాలను మార్చడానికి వచ్చానని చెప్పుకునే పవన్ ఏం మార్చారు. ఇంతకుముందు కంటే ఎక్కువ వ్యభిచారం జరిగింది. గతం కంటే ఎక్కువ జూదం జరిగింది.. ఎక్కువ క్యాసినోలు జరిగాయి. క్యాసినో పేరుతో కొడాలి నానిపై వారం రోజులు డిబేట్లు పెట్టారు. మరి ఇప్పుడు పెట్టిన క్యాసినోలు మీకు కనిపించడం లేదా?.

  • సాక్షి, కాకినాడ: ఏపీలో బెల్టు షాపులకు సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు వైఎస్సార్‌సీపీ నాయకులు కురుసాల కన్నబాబు. డోర్‌ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. కూటమి సర్కార్‌ ఏపీని ‍డ్రగ్స్‌ డెన్‌గా మార్చేసిందని మండిపడ్డారు. లులు కంపెనీపై చంద్రబాబుకు ఎందకంత ప్రేమ? అని కన్నబాబు ప్రశ్నించారు.

    వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు కురసాల కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. వేదిక ఏదైనా చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ను తిట్టడానికే వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రులలో ఎవరికి  క్రెడిబులిటి ఉందో ప్రజలకు తెలుసు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. కరోనా వంటి కష్ట కాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేసింది వైఎస్ జగన్. ఒక నాయకుడిని ఓడించడం కోసం మూడు పార్టీలు కలిసి కూటమి కట్టడం ఒక చరిత్రే. రూ.500 కోట్లతో ఒక్కో మెడికల్ కళాశాలల్ని కట్టాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అవన్నీ వద్దని మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు

    ఎన్టీఆర్ వర్ధంతిలో చంద్రబాబు తనకు తనకే కీర్తించుకున్నారు. రాష్ట్రంలో పప్పు బెల్లల్లా ఎకరాలకు ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలను దారదత్తం చేస్తున్నారు. లులు కంపెనీ మీద ఎందుకు మీకు అంత ప్రేమ. విశాఖ హార్బర్ సమీపంలో కోట్లాది రూపాయల విలువైన భూములను నామమాత్రపు లీజుకు లులుకు ఇస్తున్నారు. విజయవాడలో ఆర్టీసి స్థలాన్ని కూడా లులుకు ఇస్తున్నారు. ఉర్సా అనే కంపెనీకి ఎకరా రూ.99 పైసలకే కేటాయించారు. మొత్తం భూమి రూ.99పైసలకే ఇచ్చేస్తానని మంత్రి లోకేష్ అంటున్నారు. భూములు పంచుకునేది మీరు. వైఎస్ జగన్ హయంలో జరిగింది అని ఎలా చెబుతున్నారు. నాయుడుపేట నుండి సత్యసాయి జిల్లా వరకు భూముల పందేరం జరుగుతోంది.

    కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రూ.18వేల  నుండి రూ.19వేలకు అమ్ముతున్నారు. అడ్డగోలుగా ఇసుకను తినేసిన చరిత్ర టీడీపీది. మీకు ఉన్న మీడియా బలం దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా?. ఒక మీడియా వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి, మరో మీడియాకు విశాఖలో భూములు ఇస్తారు. రాష్ట్రంలో మద్య నిషేధం ఎన్టీఆర్ అమలు చేస్తే.. దానిని ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుది కాదా?. బెల్టు షాపులకు సృష్టికర్త చంద్రబాబు. రాష్ట్రంలో నకిలీ మద్యం పరిశ్రమగా నడిపిన‌ చరిత్ర మీది కాదా?. ఈనెల ఒకటో తేదీ నుండి 17 వరకు రూ.17 కోట్ల మద్యాన్ని అమ్మారు. ఈ సంక్రాంతి లిక్కర్ సిండికేట్లకు సంక్రాంతి అయ్యింది. డోర్ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకువచ్చారు. గంజాయితో పాటుగా ప్రమాదకర మాదక ద్రవ్యాలు లభ్యమవుతున్న పరిస్ధితి రాష్ట్రంలో ఉంది.

    ఏపీలోనే కాదు‌.. ఈ దేశంలోనే వైఎస్ జగన్ శక్తివంతమైన నాయకుడు. చరిత్ర వక్రీకరించి.. ఒక కులమే ఆరాధనీయ కులం అని చెప్పుకుంటుంది. సంక్రాంతే కమ్మేవారి పండుగ అని చెప్పుకునే పరిస్ధితి వచ్చింది. సూర్య సిద్దాంతం, ఆర్యభట్ట సిద్దాంతం నుండి సంక్రాంతి ప్రస్తావన ఉంది. సంక్రాంతి ఒక కులానికి, ప్రాంతానికి సంబంధించినది కాదు. జానపదాల్లోను, శ్రీనాధుడు, అన్నమయ్య రచనలలోను సంక్రాంతి ప్రస్తావన ఉంది అని అన్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో దళితులకు రక్షణ లేదంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు. ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఓటు వేశారనే కారణంతో దళితులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం పని చేయడం లేదని కూటమి నేతలపై ఘాటు విమర్శలు చేశారు.

    వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు, దళితులు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు.  ఏపీలో ఇప్పుడున్న పరిస్థితి అదే. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. వైఎస్‌ జగన్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు. ఓటు వేశారా? లేదా? అనే తారతమ్యాలు లేవు.

    కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. మందా సాల్మన్ హత్య ప్రభుత్వం చేసిన హత్యే. ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాల్మన్ హత్యను కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత వ్యతిరేక ప్రభుత్వం ఉంది. దళితులంతా ఒకసారి ఆలోచన చేయాలి. పోరాటమా.. శరణమా తేల్చుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్యలపై ప్రజా ఉద్యమం చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.  
     జగనన్నకు ఓటేస్తే చంపేస్తావా? బాబుపై జూపూడి ఫైర్

  • లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్‌తో వేగలేక ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.  

    ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఆమెను ఫ్యామిలీ డిస్ట్రాయర్‌గా అభివర్ణించారు. ‘నా భార్య అపర్ణ యాదవ్‌ (బీజేపీ నేత)కు విడాకులు ఇస్తున్నాను. అపర్ణ యాదవ్‌ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది.  

     ఇలా స్వార్థంగా ఆలోచించే మహిళ నుంచి వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటాను. ఆమె నా కుటుంబ సంబంధాలను నాశనం చేసింది. ఆమె ఫేమస్‌ అవ్వాలని, ఇతరులను ఇన్‌ఫ్లయిన్స్‌ చేయాలని కోరుకుంటుంది.  నాకు నా మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది. అలా అని ఆమె నాకోసం బాధపడదు. తన కోసం తాను మాత్రమే బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు.  ఆమెను వివాహం చేసుకోవడం నా దురదృష్టం’ అని ప్రతీక్ అన్నారు.

     ప్రతీక్, అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు  వారికి ఒక కుమార్తె ఉంది. అయితే, అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ ..  ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు చెప్పారు.

     ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న అపర్ణ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి  పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో ఆమె జాతీయ వాదం కారణం చూపుతూ బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

    అపర్ణ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌కు కోడలుగా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. అయితే, ఆమె బీజేపీలో చేరిన తర్వాత యాదవ్ కుటుంబంలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు విడాకుల కేసు దాఖలు కావడంతో ఆ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదవ్ కుటుంబం  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విడాకుల కేసు ఆ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • సాక్షి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి. అధికార కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంజయ్‌ జోక్యం ఏంటి? అని ప్రశ్నించారు. సంజయ్‌ ఎవరు కాంగ్రెస్‌ వ్యవహారాలో జోక్యం చేసుకోవడానికి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే సంజయ్ రాజ్యంగా నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థిస్తూ ఎమ్మెల్యే సంజయ్.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవడాన్ని స్వాగతిస్తున్నా. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యమే కరెక్ట్‌ కాదు.

    1983 ఎన్నికల్లో టీడీపీ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది నేను ఎమ్మెల్యే, మంత్రిగా జగిత్యాలకు సేవ చేశాను. టీడీపీలో చంద్రబాబు ఆధిపత్యంతో విభేదించి నాదెండ్ల వర్గంలో చేరాను. అప్పుడు నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశాను. 1985లో పార్టీ ఫిరాయింపు చట్టం అమలులోకి వచ్చింది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు సంజయ్. పార్టీ ఫిరాయింపులపై గత దశాబ్ద కాలంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను. సంజయ్ అభివృద్ధి గురించి నేను నేర్చుకోవాలా?. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ అడుగుపెట్టాడు. కార్యకర్తల కాళ్లలో కట్టెలు పెట్టి మా హక్కులను కాజేశాడు. కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానానికి వ్యక్తం చేశాను. సంజయ్‌ ఎవరు మా పార్టీ వ్యవహారాల్లో తల దూర్చడానికి..’ అని ప్రశ్నించారు. 

Andhra Pradesh

  • సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్‌ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    వివరాల ప్రకారం.. ఎస్‌ఐ రవితేజ నగరంపాలెంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో, బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గుంటూరు నాలుగో జిల్లా అదనపు న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, ఎస్‌ఐ రవితేజ ప్రస్తుతం అమృతలూరు పనిచేస్తున్నాడు. అయితే, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. 

     

  • సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పంచాయతీ రాజ్‌ శాఖ ఖజానా ఖాళీ అయ్యింది. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ పంచాయతీ రాజ్‌ శాఖ హైకోర్టుకు చెప్పింది.

    2024 జూన్‌ నుంచి గౌరవ వేతనం చెల్లించడం లేదంటూ వైఎస్సార్‌ జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు గౌరవ వేతనం ఎందుకు చెల్లించలేదో ప్రమాణపత్రం సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు పంచాయతీ రాజ్‌ శాఖ స్పందించింది. తమ ఖజానాలో నిధులు లేవని స్పష్టం చేసింది. 

Family

  • కశ్మీర్‌ను ‘భూమిపై వెలసిన స్వర్గం’ అని పిలుస్తారు. గుల్మార్గ్‌ వెళ్తే మీరు కూడా అదే మాట అంటారు. సముద్ర మట్టానికి సుమారు 8,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మరో లోకంలోకి వచ్చామా అనే అనుభూతి కలగకమానదు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఉన్నట్టే అనిపిస్తుంది. సాహసాలు చేయాలనుకునే ప్రయాణికులకు, ప్రశాంతత కోసం వెతికే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అల్టిమేట్‌ డెస్టినేషన్‌.

    గండోలా రైడ్‌
    గుల్మార్గ్‌లో గండోలా అంటే రోప్‌వే. ఇది ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఆసియాలోనే అత్యంత ఎత్తైన గండోలా కూడా ఇదే. గండోలా ప్రయాణం రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్‌ నెం.1 లో గుల్మార్గ్‌ నుంచి కాంగ్‌దూరి స్టేషన్‌ వరకు 8,530 అడుగుల ఎత్తులో గండోలాపై ప్రయాణం ఉంటుంది. ఇది పైన్‌ చెట్ల మధ్యలోంచి ఈ థ్రిల్లింగ్‌ రైడ్‌లా సాగుతుంది. 

    ఫేజ్‌.2 లో కాంగ్‌దూరి స్టేషన్‌ నుంచి అఫర్వట్‌ పర్వతం వరకు 14,403 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తారు. 12 నిమిషాల రైడ్‌లో గతంలో ఎప్పుడూ చూడనంత మంచును, మంచు పర్వతాలను వీక్షించవచ్చు.

    మంచు పర్వతాల దర్శనం
    చలికాలానికి ముందు గుల్మార్గ్‌ ఒక అందమైన పువ్వుల లోయగా అలరిస్తుంది. చలికాలం వచ్చేసరికి మంచు ప్రపంచంలా మారిపోతుంది. చలికి డ్రంగ్‌ అనే జలపాతం గడ్డకట్టుకుపోవడం చూస్తే ప్రకృతి కాలాన్ని ఆపిందేమో, జలపాతాన్ని పాజ్‌ చేసిందేమో అనిపిస్తుంది. తీవ్రమైన చలిలో ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ మంచు ప్రేమికులతో కిటకిటలాడుతాయి. ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి గుల్మార్గ్‌లో ప్రతీ ఫ్రేమ్‌ ఒక పోస్ట్‌కార్డ్‌లా కనిపిస్తుంది.

    ఏమేం చూడాలంటే...
    గుల్మార్గ్‌ వెళ్లినప్పుడు మీరు వద్దన్నా మీకు ఎన్నో అందమైన లొకేషన్లు కనిపిస్తాయి. అయితే అవకాశం ఉంటే సెంట్‌ మేరీ చర్చ్‌ గోథిక్‌ శిల్పకళను, అఫార్వత్‌ పర్వతంపై మంచు మకుటాన్ని, చలికి మంచులా మారిన అల్ఫాథర్‌ సరస్సును, ఫ్రీజ్‌ అయిన డ్రంగ్‌ జలపాతాన్ని, దట్టమైన పైన్‌ చెట్ల వనాలు, స్థానిక గ్రామాలను, స్థానికుల జీవితాన్ని వెళ్లి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 

    మంచు కురిసే వేళల్లో ఆకాశం నుంచి జారిపడే మల్లెపువ్వుల్లాంటి స్నో, దూరంగా పొగమంచులోంచి కనిపించి కనిపించనట్టు ఉండే పైన్‌ చెట్లు, పర్యాటకులు కనిపించగానే స్థానికుల కళ్లలో కనిపించే వెలుగు, కలపతో చేసిన ఇళ్లపై పలకలపై అక్షరాల్లా చేరుకున్న మంచు.. ఇవన్నీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్లి చూసి అనుభూతి చెందాల్సిందే!

    పొద్దున్నే కావా.. మధ్యాహ్నం ఛాయ్‌
    కశ్మీర్‌ అనేది ఫుడ్‌ లవర్స్‌కు కూడా స్వర్గం లాంటిదే. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కశ్మీరీ కావా (kashmiri kahwa) అనే ఫేమస్‌ గ్రీన్‌ టీని అస్సలు మిస్‌ అవ్వరు. స్థానిక కుంకుమపువ్వు, నట్స్‌ను కలిపి సర్వ్‌ చేస్తారు. రోగన్‌ జోష్, యాఖ్ని, దమ్‌ ఆలూ ఇవి టేస్ట్‌ చేయకుండా పర్యాటకులు ఉండలేరు. అలాగే ఇక్కడ అడుగడుగునా చాట్, మ్యాగీ, వజ్వాన్‌ రుచులు అందుబాటులో ఉంటాయి. పొద్దున్నే కావా, మధ్యాహ్నం చాయ్‌ అనేది ఎక్కువ మంది టూరిస్టులు ట్రై చేసే కాంబినేషన్‌.

    బెస్ట్‌ స్కీయింగ్ పాయింట్‌
    చలికాలంలో గుల్మార్గ్‌లో స్కీయింగ్, స్నో బోర్డింగ్, స్నో ట్రెక్కింగ్‌ యాక్టివిటీస్‌ కోసం భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. ఎండాకాలంలో మౌంటెన్‌ బైకింగ్, ట్రెక్కింగ్‌ ట్రై చేయవచ్చు.
    వింటర్‌లో ఇక్కడ స్కీయింగ్, స్నో బోర్డింగ్‌ చేయడం అనేది ఒక లైఫ్‌టైమ్‌ ఎక్స్‌పీరియెన్స్‌. ఇక్కడి స్నో స్పోర్ట్స్‌ (Snow Sports) ఎంజాయ్‌ చేయడానికి ప్రొఫెషనల్‌ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇన్‌ స్ట్రక్టర్‌ ఉంటే సరిపోతుంది.

    జీవితాంతం గుర్తుండే ట్రిప్‌
    గుల్మార్గ్‌లో సూర్యోదయాన్ని అసలు మిస్‌ అవ్వొద్దు. పిర్‌ పంజాల్‌ పర్వత శ్రేణిలో ఉన్న హిమగిరులపై సూర్యకిరణాలు పడి, పర్వతాలు బంగార రంగులో మెరవడం అనేది జీవితాంతం గుర్తుంటుంది. అలాగే కేబుల్‌ కార్‌ రైడ్‌ సమయంలో తనువును మీటే చలిగాలి, పైన్‌ చెట్ల సువాసన, ఆకాశంలో విన్యాసం చేసే వివిధ రంగులు ఇవన్నీ ఎవరైనా అంత ఈజీగా మర్చిపోగలరా? మనకు తెలియకుండానే మన మనసు కోరుకునే అనుభూతులు ఎన్నో. 
    సూర్యాస్తమయం తరువాత గుల్మార్గ్‌లోని గ్రామాల్లో వీధి దీపాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా కనిపిస్తారు. వెచ్చని దుప్పటిలో ముడుచుకుని పడుకునే సమయంలో స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

    షాపింగ్‌
    గుల్మార్గ్‌లో కశ్మీరీ హ్యాండీక్రాఫ్టులు, శాలువాలు, కార్పెట్లు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్‌ చాలా ఫేమస్‌. అలాగే స్థానిక మసాలా దినుసులను కూడా ట్రై చేయవచ్చు. కశ్మీర్‌ యాపిల్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మీరు డ్రై యాపిల్‌ (Dry Apple) గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా మీరు ఇక్కడ ట్రై చేయవచ్చు.

    కశ్మీర్‌ టూరును (Kashmir Tour) ఒక యాత్రలా కాకుండా ఒక స్ట్రెస్‌ రిలీవింగ్‌ మాత్రలా భావించవచ్చు. గుల్మార్గ్‌కు కేవలం అందమైన లొకేషన్ల కోసం మాత్రమే కాకుండా ఇక్కడి వైబ్‌ను ఫీల్‌ అవ్వడానికి వెళితే స్వర్గం అంటే ఇదే అనిపించకుండా ఉండదు. కశ్మీర్‌ వెళ్తే స్వర్గం ఎక్కడ ఉంటుందో అనే ప్రశ్నకు సమాధానం కూడా తెలిసిపోతుంది.

    గుల్మార్గ్‌ ఎప్పుడు వెళ్లాలి?
    చలికాలంలో గుల్మార్గ్‌ మంచు ప్రపంచంలా మారిపోతుంది. అయితే మార్చి నుంచి జూన్‌ మధ్యలో పర్యటనకు బెస్ట్‌ టైమ్‌. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చదనం, పువ్వులు, పర్యాటకుల చిరునవ్వులు కనిపిస్తాయి. దూరం నుంచి భారీ పర్వతాలను చూస్తూ చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టవచ్చు. చలికాలంలో స్నో ఫాల్, వింటర్‌ స్పోర్ట్స్‌ కోసం బెస్ట్‌ టైమ్‌.

    ఎలా చేరుకోవాలి?
    గుల్మార్గ్‌ చేరుకోవడానికి కశ్మీర్‌ క్యాపిటల్‌ శ్రీనగర్‌ చేరుకోవాలి. శ్రీనగర్‌కు దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ ఉన్నాయి. శ్రీనగర్‌ నుంచి గుల్మార్గ్‌ను క్యాబ్‌ లేదా లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా చేరుకోవచ్చు. షేరింగ్‌లో కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్రయాణం చాలా అందమైనది. స్నో ఫాల్‌ (Snowfall) సమయంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్లాన్‌ చేసుకోవాలి.

    చ‌ద‌వండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్‌ వేస్తారు!

    ఎక్కడ ఉండాలంటే..! 
    గుల్మార్గ్‌ అనేది ఒక హాట్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌. వర్షాకాలం మినహా సంవత్సరం మొత్తం పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. గుల్మార్గ్‌లో బడ్జెట్‌ హోటల్స్‌ నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. పీక్‌ సీజన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ తప్పనిసరి. 
    రిసార్టుల్లో ఆధునిక సదుపాయాలు, వ్యాలీ వ్యూ రూములు, ఫైన్‌ డైనింగ్‌ సదుపాయాలు ఉంటాయి. బడ్జెట్‌ ప్రయాణికుల కోసం గెస్ట్‌ హౌసులు, హోమ్‌స్టేలు ఉన్నాయి. ఎకో–ఫ్రెండ్లీ కాటేజీలను కూడా ట్రై చేయవచ్చు.

    – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు.కామ్‌  

  • శబరిమలలోని భక్తుల దర్శనం ఈరోజు రాత్రి 10 గంటలకు ముగుయనుంది. భక్తులను పంప నుంచి సాయంత్రం 5 గంటల వరకే బయలుదేరడానికి అనుమతిస్తారు. ఉదయం కొద్ది మొత్తంలో డబ్బుతో అభిషేకం జరుగుతుంది. నెయ్యాభిషేకం నిన్న ముగిసింది. హరివరాసనం మంత్రోచ్ఛారణతో నాదం ముగిసిన తర్వాత, రాజ ప్రతినిధి సమక్షంలో గురుతి మణిమండపం ముందు ప్రారంభమవుతుంది.

    రేపు (జనవరి 20), రాజ ప్రతినిధికి మాత్రమే దర్శనం ఉంటుంది. గణపతి హోమం తర్వాత, తిరువాభరణం తిరుగు ప్రయాణం పండలం శ్రాంపిక్కల్ ప్యాలెస్‌కు బయలుదేరుతుంది. రాజ ప్రతినిధి దర్శనం తర్వాత, ప్రధాన పూజారి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం చేసి, ఆలయాన్ని మూసివేయడానికి హరివరాసనం పఠిస్తారు. ప్రధాన పూజారి ఆలయ తాళం చెవులను రాజప్రతినిధికి అప్పగిస్తారు. ఇది కూడా ఒక పద్ధతిలో నియమానుసారంగా జరుగుతుంది. 18వ మెట్టు దిగిన తర్వాత ప్రధాని పూజారి దేవస్వం బోర్డు ప్రతినిధులు, శబరిమల అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు తాళలను అప్పగిస్తారు. నెలవారి పూజ ఖర్చులు చెల్లించిన తర్వాత అతను పండలం ప్యాలెస్‌కు తిరిగి వస్తాడు.

    ఇదిలా ఉండగా, శబరిమల దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నేటి వరకు పనిచేస్తాయి, అప్పటి వరకు అయ్యప్ప భక్తులను దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. పంప, నీలక్కల్, ఎరుమేలిలలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. జనవరి 19న, వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందిని, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మంది భక్తులను అనుమతించినట్లు సమాచారం. 

    ఇవాళ మలికప్పురం గురుతి
    ఇవాళ, మలికప్పురం మణిమండపం ముందు శబరిమల యాత్ర ముగుస్తుంది. సన్నిధానం నాదం హరివరాసనం పారాయణంతో ముగిసిన తర్వాత, పండలం రాజప్రతినిధి సమక్షంలో వేడుక జరుగుతుంది. సాయంత్రం గురుతికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మణిమండపం ముందు వాఝపూల, కురుత్తోల ఉపయోగించి ఐదు 64 నేత్రాల కలాలు తయారు చేస్తారు. మధ్యలో ఒక లాంతరు వెలిగిస్తారు. తర్వాత దీపాలు,  పూల దండలతో అలంకరిస్తారు.

    ఈ గురుతి తంతు కూడా ఒకేసారి మలికప్పురం కన్నిమూల ప్రాంతంలో, కోచుకదత్త ముందు, మలికప్పురం గోపురం తూర్పున జరుగుతుంది. మలికప్పురంలోని రాజప్రతినిధి సాయంత్రం సన్నిధానానికి తిరిగి వస్తారు. అక్కడ హరివరాసనం పూర్తి అయ్యి.. రాజప్రతినిధి తిరిగి వచ్చాక ఈ వేడుక ప్రారంభమవుతుంది. అయితే భక్తులు గురుతి  మొదటి వేడుకను మాత్రమే చూడగలరు. గురుతికి ముందు, మలికప్పురం మేల్శాంతి కూడా సన్నిధానానికి తిరిగి వస్తారు.

    మలికప్పురం గురుతి (Malikappuram Guruthi) అంటే 
    శబరిమల అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్న మలికప్పురం దేవతకు నిర్వహించే ఒక ముఖ్యమైన, వార్షిక పూజా కార్యక్రమం. అయ్యప్ప ఆలయానికి  మలికప్పురం దేవత (మాలిక్కపురత్తమ్మ) ఉంటుంది. ఇక్కడ గురుతి పూజ అనేది తీర్థయాత్ర ముగింపులో నిర్వహించే సంప్రదాయ ఆచారం. దీనిలో భాగంగా కొండ దేవతల ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఘట్టాన్ని.. అయ్యప్పను సందర్శిన అనంతరం చాలా శుభప్రదంగా భావిస్తారు అయ్యప్ప భక్తులు. 

    (చదవండి: రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?)


     

  • బరువు తగ్గే జర్నీ నిబద్ధతతో కూడిన స్థిర ప్రయాణం. దీనికి ఎలాంటి షార్ట్‌కట్‌లు ఉండవు. కేవలం సరైన ఆహారం, చక్కటి వ్యాయామాల కలయికతోటే బరువు తగ్గడం అనేది సాధ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అదే నిజం అని నిరూపితమైంది కృష్ణ ఇంగ్లే రోగి విషయంలో. ఎన్నో ఏళ్లుగా అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఈ వ్యక్తి..జస్ట్‌ 90 రోజుల్లో ఏదో మ్యాజిక్‌ చేసినట్లుగా ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. తనకు అదేలా సాధ్యమైందో కూడా సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసుకున్నాడు. మరి అతడి వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ ఏంటో సవివరంగా చూద్దామా..!.

    మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన కృష్ణ ఇంగ్లే ఎక్స్‌లో తాను అధిక బరువు సంబధిత సమస్యలతో బాధపడుతున్నానని, వెయిట్‌లాస్‌ కోసం యూట్యూబ్‌లో అనేక వీడియోలతో సహా ఏఐ హెల్ప్‌ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అవేమి తన బరువుని తగ్గించలేకపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. ఏ చిట్కాలు, సూచనలు పనిచేయకపోవడంతో..కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్‌ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార ప్రణాళికను సూచించారు. 

    అదే సమయంలో భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకున్నారు. ప్రతి రోజు కనీసం 90 నుంచి 120 గ్రాముల ప్రోటీన్‌ ఉండేలా చూసుకున్నాడు. స్వీట్స్‌కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే 10 నుంచి 12 గ్రాముల చక్కెరను పెరుగులో కలుపుకుని తినేవాడు. అలాగే కృష్ణ రోజుకు రెండు పూటలా  భోజనం చేయడం, భోజనం తర్వాత 10 నిమిషాల నడక తప్పనిసరిగా పాటించేవాడు. అయితే పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేసేలా చూసుకున్నాడు. 

    అంతేకాకుండా వారానికి కనీసం నాలుగు రోజులు బీచ్‌లో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచేవాడు. ఈ విధమైన ప్రణాళికతో అంతకుమునుపు ఉన్న అధిక బరువు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎసిడిటీ సమస్య చాలమటుకు నార్మల్‌ అయ్యింది. అలా కృష్ణ 78 నుంచి 80 కిలోల బరువుకి చేరుకోగానే మొత్తం అనారోగ్య సమస్యలన్నీ చాలావరకు క్యూర్‌ అయ్యాయని  పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాదు తాను డైట్‌లో ఎలాంటి ఫుడ్‌ తీసుకునేవాడో కూడా తెలిపాడు. 

    కృష్ణ తన భోజనంలో గుడ్లు, చికెన్‌, పెరుగు, పప్పులు, సోయా చంక్స్‌ వాటితోపాటు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, పండ్లు, సలాడ్లు ఉండేలా చూసుకునేవాడనని వివరించాడు. ఇక కృష్ణ విషయంలో బరువు తగ్గడంలో కీలకంగా మారినవి ఏంటో డాక్టర్‌ సాయాజరివు గైక్వాడ్‌ ఇలా పంచుకున్నారు.

    • బాగా నిద్రపోవడం

    • ఆకలిని అదుపులో ఉంచుకోవడం

    • మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం 

    తదితరాలే బరువు తగ్గేందుకు హెల్ప్‌ అయ్యాయని అన్నారు. అందువల్లే ఎసిడిటీ సమస్య తగ్గి, అతనిలో శక్తి స్థాయిలు మెరుగుపడ్డాయని అన్నారు. చివరగా ఆయన.. శరీరానికి పోషణవంతమైన ఆహారాన్ని అందేలా దినచర్యలో భాగం చేసుకోవడం అనేది స్థిరంగా ఉంటే..బరువు తగ్గడం అత్యంత సహజసిద్ధంగానే జరుగుతుందని అన్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.

     

    (చదవండి: Republic Day 2026: గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..)

     

  • భారత్‌ జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి నుంచి అతిథులకు ప్రత్యేకంగా ఆహ్వానపత్రికను పంపుతారు. అయితే ఈసారి గణతంత్ర దినోత్సవ ఆహ్వాన పత్రిక 'ఎట్ హోమ్' అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ 'ఎట్ హోమ్' ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో నైపుణ్యం కలిగిని కళకారులకు నివాళిగా నిలిచింది. అంతేగాదు ఇది భారతదేశ ఈశాన్య ప్రాంతం కళాత్మక మేధస్సుకు ఘన నివాళిగా పేర్కొనవచ్చు. మరి ఈ విశేషల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

    'పీస్ సిల్క్'తో ఆహ్వానం..
    జనవరి 26న రాష్ట్రపతి భవన్‌కు అతిథులు వచ్చినప్పుడు, ప్రత్యేకంగా రూపొందించిన ఎరి సిల్క్ సాంప్రదాయ శాలువా కప్పి వారిని సాదరంగా స్వాగతిస్తారు. సాధారణంగా 'పీస్ సిల్క్' అని పిలువబడే ఎరి సిల్క్, ఈశాన్య భారతదేశం  సాంస్కృతిక ఫాబ్రిక్. అలాగే ఇది వారి జీవనోపాధిలో అత్యంత ముఖ్యమైన ఫ్యాబ్రిక్‌ ఇది. ఉత్పత్తి, మన్నిక పరంగా అత్యంత విలువైన ఫ్యాబ్రిక్‌ ఇది. అలాగే ఇందులో అష్టలక్ష్మీ రాష్ట్రాలవారిగా ఆయా సాంస్కృతిక వారసత్వాలు, సహజ ప్రకృతి దృశ్యమానాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. 

    నాగాలాండ్  నుంచి ఆ రాష్ట్ర జంతువు మిథున్ తోపాటు డెండ్రాన్ పువ్వుప్రాతినిధ్యం వహిస్తుంది, మణిపూర్ అరుదైన శిరుయి లిల్లీ, అంతరించిపోతున్న సంగై జింకల వ్యక్తీకరణ ఉంటుంది. త్రిపుర నాగకేసర్ పువ్వు. భారతీయ బటర్ క్యాట్ ఫిష్, అలాగే మిజోరాం రెడ్ వాండా ఆర్చిడ్, హిమాలయన్ సెరోవ్ వంటి ఇతర రాష్ట్రాల చిహ్నాలు ఈశాన్య పర్యావరణ వైవిధ్యాన్ని మరింతగా హైలెట్‌ చేసి చూపుతుంది ఈ శాలువా.

    ఆద్యంతం అద్భుతం ఆహ్వాన పెట్టే..
    ఇక అతిధులకు పంపే రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలో అత్యంత ప్రత్యేకతలు ఉన్నాయి. దీని గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.." ఈ ఏడాది ఆహ్వాన కిట్‌ భారతదేశ ఈశాన్య ప్రాంత జీవన సంప్రదాయాలను జరుపుకుంటుంది. ఈ ఆహ్వానం అష్టలక్ష్మీ రాష్ట్రాల నైపుణ్యం కలిగిన చేతి వృత్తుల వారికి నివాళి." అని పేర్కొన్నారు. ఇక్కడ ఆహ్వాన పెట్టే కూడా ఈశాన్య ప్రాంతాలలో దీర్ఘకాలంగా స్థిరపడిన చేతిపనుల పద్ధతుల నుంచి తీసుకోవడం విశేషం. 

    ఇది మగ్గంపై తయారు చేసిన వెదురు చాప. వార్ప్‌పై రంగు వేసిన కాటన్‌ దారాలను, నేతపై చక్కగా విభజింపబడిన వెదురును ఉపయోగిస్తూ రూపొందించారు. ఇది త్రిపురలోని చేతి వృత్తుల వారి కళకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. బయటి కవర్‌లో ఆహ్వానితుడి చిరునామా చేతితో తయారు చేసిన కాగితంతో ట్యాగ్‌ చేశారు. అలాగే మేఘాలయలో రూపొందించిన వెదురు ఆభరణం ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా పొగబెట్టిన వెదురు ముక్కలను ఉపయోగించి రూపొందిస్తారు. ఇది మట్టి గోధుమ రంగును కలిగి ఉంటుంది. 

    కవర్‌, పెట్టె రెండింటి మీద అస్సామీ మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ అలంకారణ నమునాలను తీసుకున్నారు. ఈ కళాత్మక ఆహ్వాన పత్రికను అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. ఎప్పటిలానే ఈసారి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈసారి విచ్చేసే అతిథులకు భారత సాంస్కృతిక, కళాత్మక వారసత్వాన్ని స్వయంగా తెలుసుకుని, అనుభవం పొందేలా ఆహ్వాన ప్రతికను ఇలా విలక్షణంగా రూపొందించింది. 

    అంతేగాదు పెట్టే లోపల అష్టభుజి వెదురునేతను గోడాకు వేలాడదీసుకునేలా స్క్రోల్‌ కూడా ఉంది. దీన్ని విప్పగానే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, తిప్రుర రాష్ట్రాల చేతిపనులను కళాత్మక ప్రదర్శిన కనువిందు చేస్తుంది. ఆ స్క్రోల్‌ని త్రివర్ణ దారాలతో అల్లడం మరింత హైల్‌ట్‌గా నిలిపింది ఆ కార్డుని. 

    సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఆహ్వాన కార్డు..భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్రంలోని రోజువారీ జీవితం, విలక్షణ సంప్రదాయాలు, ప్రత్యేకమైన హస్తకళా పద్ధతులు, ప్రజల హస్తకళా నైపుణ్యం, అక్కడి సహజ పర్యావరణ వ్యవస్థలు తదితరాలను ప్రతిబింబించే అంశాల సంగమం. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసినా..ఈ ఆహ్వాన పత్రిక అలా ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచిపోయేలా కళకు, సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్‌గా నిలిచే అపురూపమైన డిజైన్‌ ఇది.

     

    (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్‌ ఎన్నో...)

     

     

National

  • క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికి, అటువ్యాధితో  సతమతమవడంతోపాటు,  జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా తీసుకనే కీమో థెరపీ కారణంగా మొత్తం జుట్టును కోల్పోవడం సాధారణంగా చూస్తూంటాం. ఆ సమయంలో వారి మానసికవేదన వర్ణనాతీతం. అయితే అలా బాధపడుతున్న  విద్యార్థిని కోసం సహవిద్యార్థులు , ఉపాధ్యాయులు  తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది.
     
    క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రమంలో ఒక విద్యార్థిని జుట్టు ఊడిపోవడం ప్రారంభించింది. దీంతో స్కూల్‌కు రావడానికి భయపడింది. అందరూ గేలి చేస్తారేమోనని భయపడింది. కానీ ఆ చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. టీచర్లు, పిల్లలు గుండు కొట్టించుకొని ఆమెకు అండగా నిలిచారు. ఈ  పోరాటంలో నువ్వు ఒంటరివి కాదు, తోడుగా  మేమూ ఉన్నామనే ధైర్యాన్నిచ్చారు. వారంతా సామూహికంగా గుండు చేయించుకుని ఆ చిన్నారిలో ధైర్యాన్ని నింపారు. 

    ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

     

    ఇది కేవలం పాఠశాల కాదు, ప్రేమ, ధైర్యం కలగలిసిన కుటీరమని, మనిషి మనిషి ప్రేమించాలని నేర్పించే దేవాలయమని నిరూపించారు. వారు చూపించిన అప్యాయతా నురాగాలు, చేసిన గొప్ప పనిపై నెటిజన్లు ప్రశంసించారు. స్నేహానికి మారు పేరుగా నిలిచిన విద్యార్థులకు మార్గదర్శకులకు సెల్యూట్  చేయడం విశేషం. నిజానికి ఇది ఫేమ్‌ కోసమో, చప్పట్ల కోసమో చేసింది కాదు మనస్ఫూర్తిగా నిండుమనసుతో  చేసిన చర్య. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ చిన్నారి సంకోచం దూది పింజలా కరిగిపోయింది. అందరి కళ్లు భావోద్వేగంతో  చెమర్చే క్షణాలివి.

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
     

  • యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ)  అధ్యక్షుడు షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్  భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. యుఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానకి స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. యుఏఈ అధ్యక్షున్ని కౌగిలించుకొని సాదరంగా స్వాగతం పలికారు.

    ఈ వివరాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "నా సోదరుడు     షేక్ మెుహమ్మద్ బిన్ జాయెద్‌కు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. ఆయన పర్యటన భారత్‌కు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం.  యూఏఈ అధ్యక్షునితో చర్చల కోసం ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

    ఇరువురు దేశాధినేతలు  వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహర భద్రత, తదితర అంశాలలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

     

  • దగ్గు మందు విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 'ఆల్మండ్ కిట్' దగ్గు సిరప్‌ను నిషేధించింది. దీని తయారీ, అమ్మకం, పంపిణీ , వినియోగాన్ని నిషేధించిందని రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిషేధాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    బిహార్‌లో తయారయ్యే ఈ సిరప్‌లో తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కలిగించే ఇథిలీన్ గ్లైకాల్ అనే కలుషిత పదార్థం ఉందని అధికారులు తెలిపారు. ఈ సిరప్ తీసుకోవడం వల్ల తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం, మెదడు, ఊపిరితిత్తులకు నష్టం, కొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చని తమిళనాడు ఔషధ నియంత్రణ డైరెక్టరేట్ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు, ఫార్మసీలు వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఆదేశించింది. ప్రత్యేకంగా బ్యాచ్ నంబర్ AL24002ని తనిఖీ చేయాలని, ఈ సిరప్‌ను అస్సలు వాడకూడదని తెలిపింది.

    ఈ సిరప్‌ను తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీలు, ఆసుపత్రులలో తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసింది. అంతేకాదు దీనికి సంబంధించిన, సమాచారం ఫిర్యాదులు లేదా తదుపరి సూచనల కోసం, ప్రజలు డైరెక్టరేట్‌ను 94458 65400 నంబర్‌లో వాట్సాప్ ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు. ఔషధాల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లేబుల్‌లు మరియు బ్యాచ్ నంబర్‌లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, ఏదైనా అనుమానాస్పదంగా. లేదా నాణ్యత లేని మందులను గుర్తిస్తే,  వెంటనే తమకు నివేదించాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

    ఇదీ చదవండి: రూ. 50 నుంచి రూ. 100 కోట్లకు : ఆ సినిమానే ప్రేరణ

    కాగా ఇటీవలి సంవత్సరాలలో, దేశంలో కలుషితమైన ఔషధ సిరప్‌లు,ఇథిలీన్ గ్లైకాల్ లేదా డైథిలీన్ గ్లైకాల్ కలిగిన సిరప్‌ల కారణంగా పిల్లల మరణాలు సంభవించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, సురక్షితమైన, నాణ్యమైన మందులు మాత్రమే రోగులకు చేరేలా పర్యవేక్షణ విధానాలను బలోపేతం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

  • సాక్షి,ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌  ఏకగ్రీవమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు నితీన్‌ నబీన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్‌ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్లు నామినేషన్‌ దాఖలయ్యాయి.  

    2020 నుంచి 2026 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా  పనిచేశారు. ఆయన పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాయస్థ వర్గానికి చెందిన 45 ఏళ్ల నితిన్‌ నబీన్‌ ప్రస్తుతం బిహార్‌ కేబినెట్‌ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా స్థానంలో ఈయన బీజేపీ చీఫ్‌ పదవి చేపట్టనున్నారు. తద్వారా తక్కువ వయస్సులోనే బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన నేతగా నబీన్‌ చరిత్ర సృష్టించనున్నారు. 

    బిహార్‌లో బీజేపీ సీనియర్‌ నేత, నాటి ఎమ్మెల్యే నబీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా 2006లో ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు నితిన్‌ నబీన్‌కు పార్టీ అధిష్టానం పటా్న(పశ్చిమ) నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చి తొలిసారిగా బరిలోకి దింపింది. ఏకంగా 60వేల ఓట్ల భారీ మెజారిటీతో నబీన్‌ గెలిచారు. అప్పట్నుంచి వరసగా దాదాపు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. తాజాగా బిహార్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 51,000 ఓట్ల మెజారిటీతో బంకింపూర్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

    అలా కేవలం 45 ఏళ్ల వయసుకే ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌ ప్రభుత్వంలో మంత్రిగా పలుమార్లు పనిచేశారు. ప్రస్తుతం నితీశ్‌ ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. నబీన్‌ గతంలో యువ మోర్చాలో పనిచేశారు. రాష్ట్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. రేపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా  బాధ్యతలు చేపట్టనున్నారు.

  • నిజజీవిత కథలే చాలా సినిమాలకు ప్రేరణ.  కానీ ఒక నిరుపేద బాలుడిని ఒక సినిమా విజయ తీరాలకు  నడిపించింది అంటే నమ్ముతారా? బెంగళూరులో పేద కుటుంబంలో జన్మించి, ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయించిన పేద బాలుడి జీవితమే ఇందుకు నిదర్శనం.  సినిమా ప్రేరణతో అతని జీవితం అద్భుతంగా మారిపోయింది. వెండితెర వెలుగు కొత్త జీవితాన్ని బాటలు వేసి, విధిని తిరిగి రాసింది. సక్సెస్‌ ఫుల్‌ వ్యాపారవేత్త  సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం పదండి.

    ఈ స్టోరీలో హీరో పేరు రాజా నాయక్. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త. బెంగళూరులో ఒక చిన్న పిల్లవాడిగా ఆకలితో బాధపడే వాడు. ఎందుకంటే కుటుంబం ఆర్థికపరిస్థితి దుర్భరం. అందుకే  చదువుక పుల్‌స్టాప్‌ పెట్టేసి  17 ఏళ్లకే బతుకు దెరువును వెదుక్కుంటూ ముంబైకి బయలుదేరాడు.  ఆ మహానగరంలో దారి తప్పిన బాటసారిలా  అనేక కష్టాలు పడ్డాడు.

    ఏ ఉద్యోగం చేద్దామని తగిన విద్య లేదు. కానీఆత్మవిశ్వాం, పట్టుదల మెండుగా ఉన్నాయి. ఏదో ఒకటి సాధించాలని సంకల్పించు కున్నాడు. ఇంటినుంచి వస్తూ వస్తూ తన తల్లిదగ్గర తీసుకున్న చిన్న మొత్తమే అతనికి  దారి చూపించింది.  ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించేవాడు. తిరుప్పూర్ నుండి చౌకైన చొక్కాలు కొని బెంగళూరులోని రద్దీగా ఉండే వీధిలో  రూ.50 లకు అమ్మేవాడు.   నీలం, తెలపు రంగుల్లో సమీపంలోని ఫ్యాక్టరీ నుండి కార్మికులను చూసి ఆ రంగులను మాత్రమే అమ్మడంపై దృష్టి పెట్టాడు. తొలి రోజు రూ. 5,000 లాభం సంపాదించాడు.  అంత సొమ్ము చూడటం అదే మొదటి సారి. 

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

    ప్రేరణ నిచ్చిన సినిమా 
    ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నటించిన త్రిశూల్ మూవీ బాగా నచ్చేసింది. హీరో పేదరికం నుండి బయటపడి వ్యాపార వేత్తగా ఎదిగిన తీరు అతడిని ఆకట్టుకుంది. నేను ఎందుకు చేయలేను? అనే సంకల్పానికి  పునాది వేసింది. ఆ ఉత్సాహంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఫలితం ఫుట్‌పాత్‌పై సాగిన వ్యాపారం కాస్తా చిన్న దుకాణంలోకి మారింది.  అలా రాజా నాయక్ అనేక అడ్డంకులనుఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు.  బూట్లు, చెప్పులు, గృహోపకరణాలు జోడించాడు. అన్నీ నిజాయితీగా, తక్కువ ధరలకే అందించేవాడు.

    1991లో మలుపు తిరిగింది. తన కంపెనీ అక్షయ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించి ప్యాకేజింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. దాని సక్సెస్‌తో‌ రాజా నాయక్  వ్యాపార సామ్రాజ్యం అనేక విజయవంతమైన అడుగులు వేసింది.రవాణా సంస్థ MCS లాజిస్టిక్స్‌, వాటర్‌ బేవరేజెస్ , పర్పుల్ హేజ్ వెల్నెస్ స్పేస్, న్యూట్రి ప్లానెట్‌లతో కలిసి ఆయన వెల్నెస్ అండ్‌ న్యూట్రిషన్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్నింటి విజయమే.  అలా ప్రతి ఏటా అతని ఆదాయం రూ100 కోట్లకు దాటిపోయింది. 

    ఇదీ చదవండి: సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్‌ వీడియో
     

    భార్య అనిత తోడుగా
    రాజా బహుళ వ్యాపార సంస్థల వెనుక ఉన్న మరో చోదక శక్తి అతని జీవిత భాగస్వామి, అనిత. తన వ్యాపారాలను ఆమె  చక్క బెట్టుకుంటోంది కాబట్టే తాను వైవిధ్యభరితంగా విజయం సాధిస్తున్నాను అంటారు రాజా నాయక్‌. ఆమె కూడా నిరుపేద.ఆమె తండ్రి ఆటోరిక్షా డ్రైవర్.  చదువు మానేసి, 16 ఏళ్లవయసులో  ఉద్యోగం కోసం రాజా పాఠశాలకు వచ్చింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించి సిబ్బంది సమక్షంలో సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు.
     

    అడ్డంకులు వచ్చినంత మాత్రానా జీవితం ఆగిపోదు. పట్టుదల, నిజాయితీ ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు అనేందుకు 50 రూపాయల మొదలై, 100  కోట్లకు చేరిన రాజా నాయక్ జీవితమే ఒక శక్తివంతమైన పాఠం. ఏమంటారు.

  • పాట్నా: బీహార్‌లో అధికార జేడీ(యూ)కు చెందిన ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌.. ఓ ఆసుపత్రిలో సిగరెట్‌ తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆసుపత్రిలో సిగరెట్‌ తాగుతూ రీల్స్‌ చేస్తున్నాడా? ఏం సందేశం ఇచ్చారంటూ నేతలు మండిపడుతున్నారు.

    వివరాల మేరకు.. జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌.. పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)కు వైద్య చికిత్సల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్‌ సిగరెట్‌ తాగారు. ఆసుపత్రి లోపలే ధూమపానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

    మరోవైపు.. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ..‘నితీశ్‌ కుమార్‌కు ప్రియమైన నేత అనంత్‌ సింగ్‌ సిగరెట్‌ పొగతో బీహార్‌లో సుపరిపాలనను తీసుకువస్తున్నాడని ఎద్దేవా చేశారు. అలాగే, నితీశ్‌ గారాల పెంపుడు విలన్‌.. ఆసుపత్రిలో సిగరెట్‌ తాగుతూ రీల్స్‌ చేస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 

    ఇదిలా ఉండగా.. బీహార్‌ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనంత్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. జన్‌ సూరజ్‌ పార్టీ ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌ చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అనంత్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనంత్‌ సింగ్‌ విజయం సాధించారు. మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీకి చెందిన వీణా సింగ్‌పై 28,206 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ఆయనపై 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

  • బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పోలీసు అధికారి రాసలీలలకు సంబంధించిన వీడియా ఒకటి కలకలం రేపుతోంది. రాష్ట్రానికి చెందిన  ఓ సీనియర్ పోలీసు అధికారి డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్నా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

    వివరాల మేరకు.. డీజీపీ ఆఫీసులో సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా డా. రామచంద్రరావు పనిచేస్తున్నారు. అయితే, రామచంద్రరావు.. ఆఫీసులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. సదరు మహిళ ఆఫీసులో పనిచేస్తున్న సమయంలో అసభ్యకరంగా తాకడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేశారు. అయితే, ఇదంతా డీజీపీ ఆఫీసులో పనిచేస్తున్న కొందరు రికార్డు చేసినట్టు తెలిసింది. 

    ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక, ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో.. రాసలీలల వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య  సీరియస్ అయ్యారు.  ఈ వీడియోలపై అధికారి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్‌ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీసు శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీసు ఘటన పొలిటికల్‌ టర్న్‌ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. 

    Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

    మరోవైపు.. ఈ ఘటనపై పోలీసు అధికారి  రామచంద్రరావు స్పందించారు. ఆ  వీడియోలో ఉన్నది తాను కాదని ఈ వీడియోని తనకు గిట్టని వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారని ఆరోపించారు. కాగా  ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు గతంలో  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు తండ్రి కావడం గమనార్హం.  

  • పిల్లలతో ఇంటరాక్షన్‌ ఎపుడూ హృద్యంగానే ఉంటుంది.  అది రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి వారైనా సరే ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాల్సిందే. ఎపుడూ గంభీరంగా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను  మోముపై నవ్వులు పూయించిన  వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి  చేస్తోంది. స్టోరీ ఏంటీ అంటే

    యూపీలోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం సంప్రదాయం ప్రకారం గోరఖ్‌నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడొక చిన్నారితో  ముద్దుగా పలకరించారు. ఇదే  కరెక్ట్‌ టైం అనుకున్నాడో ఏమో గానీ ఆ బుడ్డోడు  తన మనసులోని కోరికను ముఖ్యమంత్రి చెవిన పడేశాడు.  దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి అడిగింది ఏమిటో చిన్న పిల్లలంతా ఇష్టపడే చిప్స్‌ ప్యాకెట్‌.  దీంతో ముఖ్యమంత్రి స్వయంగా పిల్లవాడికి చిప్స్ ప్యాకెట్లను అందజేయడంతో వాడి మొహం మతాబులా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మిషన్‌ ఎకాంప్ల్‌ష్‌డ్‌ కొంతమంది వ్యాఖ్యానించారు. సీఎం చూపిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

     

NRI

  • డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ కోట్ల రూపాయలు మోస పోతున్న కథనాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ దంపతులు ఏకంగా రూ. 15 కోట్లు  పోగొట్టుకున్న వైనం పలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా  ఉన్నాయి..

    డాక్టర్ ఇంద్ర తనేజా (77),ఆమె భర్త డాక్టర్ ఓం తనేజాను సైబర్‌ నేరగాళ్లు  టార్గెట్‌ చేశారు.  పోలీసులమని చెప్పి, మనీలాండరింగ్‌ ఆరోపణలు అంటూ భయపెట్టి  గత సంవత్సరం డిసెంబర్ 24 -జనవరి 9 వరకు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలోని డిజిటల్‌ అరెస్ట్‌ చేశారు.   వీరినుంచి రూ.14.85 కోట్లను దోచేశారు.నిందితులలో ఇద్దరు వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను స్కామర్లకు అందించగా, మూడవ వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడు

    అశ్లీల వీడియోలు, మనీలాండరింగ్‌ కేసులో  20 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని ఈ జంటను భయపెట్టేశారు. . మొత్తం రూ. 14.85 కోట్లలో, గరిష్టంగా రూ. 4 కోట్లు గుజరాత్‌లోని వడోదరలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. పోలీసులు రూ. 2.10 కోట్లను నిలిపివేయగలిగారు. డిసెంబర్ 26, 2025న అస్సాంలోని గౌహతిలోని జలుక్‌బరికి రూ.1.99 కోట్లు, ఆ తర్వాత డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఒక్కొక్కరికి రూ.2 కోట్లు వడోదరలోని సామ సావ్లికి బదిలీ  అయినట్టు పోలీసులు గుర్తించారు.  ఇలా రకరకాలుగా ఖాతాలు ఛారిటబుల్ ఫౌండేషన్‌లు, కెమికల్ ట్రేడింగ్ కంపెనీలు, రిక్రూట్‌మెంట్ సంస్థలు, టూర్, ట్రావెల్ వ్యాపారాల పేర్లతో నమోదైన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌  చేయించుకున్నారు. 

    అరెస్ట్‌ వారెంట్లు అంటూ వరుస వీడియో కాల్స్‌తో
    టెలికాం అధికారులు, పోలీసు అధికారులుగా నటిస్తూ వరుస నకిలీ కాల్స్ ,వీడియో కాల్స్‌ తమను ఉక్కిరి బిక్కిరి చేసేశారని బాధితులు  వాపోయారు. మహారాష్ట్రలో FIR ,అరెస్ట్ వారెంట్లు జారీ  అయ్యాయని బెదిరించారు. అలాగే ఆమె నా పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాను  ఒక ఒక పెద్ద మోసంలో ఉపయోగించారని భయపెట్టాడు.  దీంతో తన భర్త AIIMSలోఅపరేషన్‌ తరువాత కోటుకుంటున్నారని, పైగా  తమకు ఎవరూ సామయం చేసేవారు లేకపోవడంతో  రూ. 14.85 కోట్లు కోల్పోయాని తెలిపారు.

     

    ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

    ఈ కేసులోగుజరాత్‌లోని వడోదర నివాసితులు దివ్యాంగ్ పటేల్, కృతిక్ షిటోలి, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కెఎస్ తివారీ నిందితులుగా గుర్తించారు. చైనా, కంబోడియాకు చెందిన స్కామర్‌లతో వీరికేమైనా సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

  • అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం చేశారు. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.

    అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో  ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.

    పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు.  కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

    (చదవండి: జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు)