Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బాలీవుడ్‌లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్‌చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.  

    అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్‌పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్‌లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.  
     

  • ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (M4M – Motive for Murder) సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా వైడ్ ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.

    (ఇదీ చదవండి: హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని)

    భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు తీసుకున్నాను. విడుదలకు ముందే ఈ మూవీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పలాసిస్ సీ థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.

    ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్.. సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, థ్రిల్లింగ్ స్టోరీ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  

    (ఇదీ చదవండి: ఆరు రోజుల్లో బర్త్‌ డే.. బుల్లితెర నటి బలవన్మరణం)

  • సినీ నటి రేణు దేశాయ్‌ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై ‍అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కాగా.. రేణు దేశాయ్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే.  వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.

    సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్‌(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల  అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.
     

     

  • ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్‌, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్‌ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను ‍అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించారు.

    తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్‌ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.

    ఈ చిత్రంలో వినయ్ పాఠక్,  నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్,  సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్‌కపూర్ అంతకుముందు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆర్‌కే అనే మూవీని తెరకెక్కించారు.
     

     

  • తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ కోర్ట్. రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక్కడ సూపర్ హిట్‌ అయిన మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్‌ డైరెక్షన్‌లో రంజన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    ఈ మూవీతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇస్తోంది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ లాంఛ్‌కు హాజరైన దేవయాన్ని ఈ విషయాన్ని ప్రకటించింది. తన కూతురికి ‍అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. తన కూతురు సినీ ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.

    కాగా.. నటి దేవయాని గురించి పరిచయం అవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగు తదితర భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు.  ఆ తర్వాత దర్శకుడు రాజకుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. ప్రస్తుతం తన చిన్న కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. కాగా.. గతేడాది విడుదలైన 3 బీహెచ్‌కే సినిమాలో సిద్ధార్థ్ తల్లిగా దేవయాని కనిపించిన విషయం తెలిసిందే.
     

     

  • ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్‌ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఈ టాపిక్‌ మరింత చర్చనీయాంశంగా మారింది.

    ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్‌ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్‌ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.  అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్‌ చేసిన కామెంట్స్‌ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

     

  • నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం తెరచాప. ఈ సినిమాకు జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అనన్య క్రియేషన్స్ బ్యానర్‌లో కైలాష్ దుర్గం నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

    ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. 
     

  • టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ బ్యాడ్‌బాయ్ కార్తీక్. ఈ చిత్రంలో విధి యాదవ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో నాగ శౌర్య ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఫైట్ సీన్స్‌ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్‌, నరేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.  ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతమందించారు. 
     

  • టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజును మరింత స్పెషల్‌గా జరుపుకుంది. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో తన బర్త్‌ డే రోజు మరింత ఆనందంగా గడిపింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాల మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. విజయ్‌తో పెళ్లి తర్వాత జరిగిన పుట్టినరోజు కావడంతో మరింత ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 

    ప్రస్తుతం రష్మిక- విజయ్ దేవరకొండ జంటగా రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రాయలసీమలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు.  రష్మిక పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేశారు.  జయమ్మ పాత్రలో రష్మిక వీడియోలో  అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక బర్త్‌ డే రోజు మైసా టీమ్ సైతం ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్ చేసింది. 
     

     

  • సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ బుల్లితెర నటి సుభాషిణి బాలసుబ్రమణ్యం బలవన్మరణానికి పాల్పడింది.  తన భర్తతో వీడియో కాల్‌ మాట్లాడిన నటి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కోలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది.  కుటుంబ కలహాల కారణంగానే సూసైడ్‌ చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ సంఘటనపైగు  సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు ఆమె మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.  ఈ విషయం తెలుసుకున్న పలువురు సహనటులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

    తమిళంలో ప్రముఖ సీరియల్ కాయల్‌లో తన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. 2012లో 'ఇని అవన్' అనే చిత్రంతో ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.  అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించారు. శ్రీలంక మూలాలు కలిగిన నటి చెన్నైలోని అయ్యప్పంతంగల్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన పుట్టినరోజుకు కేవలం కొన్ని రోజుల ముందుగానే ఆమె మరణించడంతో అభిమానులు షాకవుతున్నారు. ఏప్రిల్ 12న ఆమె తన పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. ఇదే నెలలో ఏప్రిల్ 21న ఆమె వివాహ రెండవ వార్షికోత్సవం కూడా రాబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుభాషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
     

  • సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం  (Subashini Balasubramaniyam) చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని అయ్యప్పంతంగళ్‌లో గల తన నివాసంలో సుభాషిణి మృతదేహం లభ్యమైంది.  సుభాషిణి ఆకస్మిక మరణం అటు టెలివిజన్ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే  కెరీర్‌లో ఎదుగుతున్న నటి ఆకస్మిక మరణం తోటి నటీ నటుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

    ప్రాథమిక పోలీసు విచారణలో ఇది ఆత్మహత్యగా తేలింది. వీడియో కాల్‌లో తన భర్తతో జరిగిన వ్యక్తిగత వాగ్వాదం తర్వాత ఆమె తీవ్రమైన మానసిక క్షోభకు గురైనట్టు తెలుస్తోంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణను కొన సాగిస్తున్నారు. ఆమె మరణం సోషల్ మీడియాలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. అభిమానులు, తోటి నటీనటులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆమె నటనకు సంబంధించిన క్లిప్‌లు, జ్ఞాపకాలను పంచుకుంటూ, ఆమెను కేవలం ఒక నటిగానే కాకుండా, ఆయా పాత్రలకు సహజత్వాన్ని తీసుకువచ్చిన గొప్ప నటిగా గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంక నుండి తమిళ టెలివిజన్ వరకు సుభాషిణి ప్రయాణం ఆశయం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిపోతుందంటూ సంతాపం వెలిబుచ్చారు. ఆమె జీవితం విషాదాంతమైనప్పటికీ,   మంచి నటిగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటున్నారు.

    ఎవరీ సుభాషిణి 
    సుభాషిణి స్వస్థలం శ్రీలంక. తమిళ వినోద పరిశ్రమలో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలనే ఆశయంతో ఆమె చెన్నైకి వలస వచ్చింది. ఎంతోమంది వర్ధమాన నటుల మాదిరిగానే,  ఎన్నోకష్టనష్టాలకోర్చి అవకాశాలను దక్కించుకుంది.  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ, ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని  సక్సెస్‌ఫుల్‌ కరియర్‌కు బాటలు  వేసుకుంది. నటనపై ఆమెకున్న పట్టుదల, అభిరుచి, ఆమెలోని భావోద్వేగాలను, తెరపై అద్భుతంగా ప్రదర్శించే పాత్రలను సంపాదించడంలో సహాయ పడ్డాయి. ముఖ్యంగా 'కాయల్' సీరియల్‌తో ఆమెకు మంచి బ్రేక్‌త్రూ లభించింది, ఇందులో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్ టీవీలో స్థిరమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ షో, ఆమెను వెలుగులోకి తీసుకువచ్చి, అనేక తమిళ కుటుంబాలలో సుపరిచితమైన  నటి నిలిపింది.  ఈ సీరియల్‌లో సుభాషిణి పాత్ర చిత్రణ ద్వారా అనేక ప్రశంసలను అందుకుంది.

  • మలయాళ హీరోయిన్‌ మంజు వారియర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని పాలక్కాడ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన మంజు వారియర్‌ను ఓ మహిళా అభిమాని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అది చూసిన అక్కడి యాంకర్‌ ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శించింది. అయితే సదరు మహిళ మాత్రం.. నాకు మంజు అక్క అంటే చాలా ఇష్టం.. అందుకే ముద్దు పెట్టుకున్నా అని బదులిచ్చింది.

    ఓపికగా సెల్ఫీలు
    ఇంత జరిగినప్పటికీ మంజు వారియర్‌ కోపగించుకోలేదు. ఎంతో సహనంతో మిగతా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారితో సెల్ఫీలు దిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మంజు వారియర్‌ విషయానికి వస్తే.. ఈమె నటి మాత్రమే కాదు. డ్యాన్సర్‌, రైటర్‌, ప్రొడ్యూసర్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌ కూడా! సాక్ష్యం అనే మలయాళ చిత్రంతో కథానాయికగా వెండితెరపై అరంగేట్రం చేసింది. 

    సినిమా
    ఈ పుళయం కాదన్ను, అసురన్‌, పాత్రం, కలియట్టం ఇలా అనేక సినిమాలు చేసింది. కన్నెళుతి పొట్టుం తొట్టు (1999) చిత్రానికిగానూ జాతీయ అవార్డు పొందింది. అయితే ఈ సినిమా తర్వాత బ్రేక్‌ తీసుకుంది. హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. చివరగా ఎల్‌ 2: ఎంపురాన్‌ చిత్రంలో కనిపించింది. చతుర్ముఖం చిత్రంతో నిర్మాతగా మారింది. సల్లాపం అనే పుస్తకం రాసి తనలో రచయిత్రి కూడా దాగి ఉందని నిరూపించింది. అలాగే ఈమెకు వీణ వాయించడం కూడా వచ్చు.

     

     

    చదవండి: పెద్దిలో ఐటం సాంగ్‌.. భలే తప్పించుకుందే!

  • కొన్ని బంధాలు ఎప్పుడు జతకలుస్తాయో, ఎప్పుడు విడిపోతాయో అర్థం కాదు. మలయాళ స్టార్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ కెరీర్‌ ప్రారంభించిన కొంతకాలానికే హీరోయిన్‌ లిస్సీతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ప్రేమను పెళ్లి బంధంగా మార్చాలనుకున్నారు. 1990 డిసెంబర్‌ 13న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత లిస్సీ తన పేరును లక్ష్మిగా మార్చుకుంది. అలాగే సినిమాలకు సైతం గుడ్‌బై చెప్పేసి ఇంటికే పరిమితమైపోయింది. 

    2016లో విడాకులు
    ఈ దంపతులకు కుమారుడు సిద్దార్థ్‌, కూతురు కల్యాణి సంతానం. ప్రియదర్శన్‌- లిస్సీ దంపతులు ఎంతో అన్యోన్యంగానే ఉండేవారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాగానే ఉన్న ఈ జంట తర్వాత సడన్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా అని వీరిమధ్య పెద్ద గొడవలు కూడా జరిగన దాఖలాలు లేవు. 2014లో లిస్సీ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 2016 సెప్టెంబర్‌లో వీరికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. 

    ఇటీవలే కలిసిపోయిన జంట
    అప్పటినుంచి వీరు విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే విచిత్రంగా పదేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. ఈ విషయాన్ని ప్రియదర్శనే స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం కలిసే ఉంటున్నామని, కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకోలేదన్నాడు. మరి అసలు ఈ జంట అప్పట్లో ఎందుకు విడిపోయింది? అన్నది చాలామంది అర్థం కాని ప్రశ్న!ఆ విషయం గురించి ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. పెళ్లయిన కొన్నేళ్లకు జీవితం బోరింగ్‌గా అనిపించింది. మా ఇద్దరి మధ్య ఇగో కూడా పెరిగింది. 

    అసలు కారణమిదే!
    దానివల్లే పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. దాన్ని మరీ తెగేవరకు లాగకుండా విడిపోవడమే మంచిదని ఓ నిర్ణయానికి వచ్చాం, విడిపోయాం. కానీ కొన్నేళ్ల తర్వాత మేము ఒకరినొకరం మిస్‌ అయ్యాం, భాగస్వామి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. తోడు కావాలనిపించింది. అందుకే కలిసిపోయాం. అంతే..! అని సింపుల్‌గా బదులిచ్చాడు. అంటే అప్పుడు బోర్‌ కొట్టిందని విడిపోయారు.. ఇప్పుడు సింగిల్‌గా ఉంటే బోర్‌ కొడుతోందని మళ్లీ కలిసిపోయారన్నమాట!

    చదవండి: ఆ సమస్య వల్ల పాటలకు దూరమైన స్టార్‌ సింగర్‌

Family

  • మలయాళ సాహిత్యంతో, సినిమాలతో మంచి పరిచయం ఉన్న చదువరులకు ఓ శుభవార్త. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఓ సుప్రసిద్ధ మలయాళ రచన ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 'పద్మభూషణ్' ఎంటి వాసుదేవన్ నాయర్ నాలుగు దశాబ్దాల క్రితం రచించిన మలయాళ నవల 'రెండామూజం'(రెండోసారి - 1984) నవల.. సాహితీ లోకంలో సుప్రసిద్ధం. పురాణపాత్ర భీమసేనుడి దృక్కోణం నుంచి మహాభారత గాథని వినూత్నంగా పాఠకలోకం ముందు ఉంచిన ఈ ఐతిహాసిక నవల కొన్ని దశాబ్దాలుగా మలయాళంలో బెస్ట్ సెల్లర్. పదే పదే పునర్ముద్రణలు పొందడమే కాకుండా ఇప్పటికే ఇంగ్లీషు (సెకండ్ టర్న్, భీమ – లోన్ వారియర్), తమిళం (ఇరండామ్ ఇడమ్), కన్నడం (భీమాయణ)తో సహా వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైన మోస్ట్ పాపులర్ రచన.

    భీమసేనుడి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ని హీరోగా తీసుకొని, ఆ నవలని వెండితెరకు ఎక్కించాలని ఇప్పటికి దశాబ్దిన్నర క్రితమే పలు ప్రయత్నాలు జరిగాయి. దర్శకులు నిర్మాతలు మారుతూ వచ్చినా దురదృష్టవశాత్తూ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనేలేదు. అపరిమితమైన ఆలస్యానికి కినిసిన రచయిత ఎంటి.. చివరకు సుప్రీమ్ కోర్ట్ దాకా వెళ్ళి, నిర్మాతలు తనకిచ్చిన కోటింబాతిక రూపాయల పెద్ద అడ్వాన్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసి మరీ, నవల ఆధారంగా తానే రాసిచ్చిన సినిమా స్క్రిప్ట్‌ని వెనక్కి తీసేసుకున్నారు. ఇది కొద్దిమందికే గుర్తున్న కథ. దాదాపు వెయ్యి కోట్ల పైగా బడ్జెట్‌తో, 2020 నాటికి రెండు భాగాల సినిమాగా తెలుగు సహా వివిధ భాషల్లో రావాల్సిన ఆ 'రెండామూజం' నవల ఎట్టకేలకు సినిమా కన్నా ముందుగా ఇప్పుడు 'అద్వితీయుని ఆత్మకథ' పేరిట అనువాద రచనగా తెలుగు సాహితీ లోకం ముందుకు వచ్చింది.

    మలయాళంలో మన 'మిథునం' దర్శకుడు

    నిర్మాల్యం(1973)లాంటి పలు అవార్డు సినిమాలకు దర్శకత్వం వహించి దాదాపు 60 సినిమాలకు స్క్రిప్టులు రాసిన చరిత్ర ఎంటి వాసుదేవన్ నాయర్‌ది. రచయిత శ్రీరమణ ప్రసిద్ధ తెలుగు కథ 'మిథునం'ని తెలుగులో కన్నా పుష్కరకాలం ముందే మలయాళంలో 'ఒరు చెరు పుంచిరి'(చిరు నగవు – 2000) పేరిట సినిమాగా రూపొందించిన దర్శకుడు. అందుకు తగ్గట్టే, ఆయన ప్రసిద్ధ మలయాళ నవల ‘రెండామూజం’ తెలుగు అనువాదం ఆవిష్కరణ సైతం సాహితీ ప్రియులైన ముగ్గురు తెలుగు సినీ ప్రముఖుల సాక్షిగా ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత వి.ఆర్.గణపతి తెలుగులో అనువాదం చేసిన ఈ పుస్తకాన్ని నటుడు,రచయిత,దర్శకుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. మంచి పుస్తకాలకు వీలైనంత ప్రచారం కల్పించి, జనంలోకి తీసుకువెళ్ళాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, ఎం.టి. వాసుదేవన్ నాయర్ రచన తెలుగులోకి రావడం ఎంతైనా ఆనందదాయకమని తనికెళ్ళ అన్నారు. ఇటీవల తాను ప్రత్యేకించి ‘హంసవింశతి’ కావ్యాన్ని తెలుగులో ప్రచురింపజేసి, ప్రచారం కల్పించడంతో లభిస్తున్న స్పందన గురించి ప్రస్తావించారు.

    రచయిత ముళ్ళపూడి వెంకట రమణ గారి సతీమణి – స్వయానా రచయిత్రి అయిన ముళ్ళపూడి శ్రీదేవి మాట్లాడుతూ, 'ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది. భారతంలో లేనిదేదీ ప్రపంచంలో లేదు' అంటూ వ్యాస భారతంలోని విశేషాలను ప్రస్తావించారు. భీమసేనుడు చెప్పినట్టుగా సాగే ఈ నవల రచయిత బ్నిమ్ మాటల్లో చెప్పాలంటే, “భీమసేనుడి సెల్ఫీ భారతం” అంటూ చమత్కరించారు.

    మన తెలియని మన భీముడి కోణంలో భారతం

    రచయిత్రి – కాలమిస్ట్ ప్రొఫెసర్ సి. మృణాళిని ప్రసంగిస్తూ.. దాదాపు పదేళ్ళ పైగా ఎం.టి.తో వ్యక్తిగతంగా తనకున్న సాహితీ అనుబంధాన్నీ, ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలనూ పంచుకున్నారు. తెలుగు సాహిత్యలోకానికి భిన్నంగా... బిరుదులతో కాక, “మన ఎం.టి.” అంటూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించే మలయాళీ సాహిత్య సంస్కృతిని ఆమె ప్రస్తావించారు. అలాగే, ఎం.టి. వాసుదేవన్ నాయర్ కేరళలో స్వస్థలమైన తిరూర్‌లో ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుతూ వచ్చిన ‘తుంజన్ సాహితీ ఉత్సవం’ తాలూకు గొప్పతనాన్ని వివరించారు. రామాయణ, భారత, భాగవతాలను మలయాళంలో అందించిన ‘మలయాళ ఆది కవి’, ‘ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడు’ అయిన (తుంజత్ రామానుజన్) ఎళుత్తచ్చన్ పేరిట ఆ ఉత్సవాన్ని ఏటా ఎం.టి. అద్భుతంగా జరిపే తీరును మృణాళిని గుర్తు చేసుకున్నారు. “యాదృచ్ఛికంగా ఎం.టి.కీ, నాకూ మధ్య జరిగిన ఆఖరి సంభాషణ కూడా ఈ ‘రెండామూజం’ నవల గురించే! 2022లో క్యాలికట్‌లో మహాభారతంపై వివిధ భాషలతో వారితో జరిగిన జాతీయ సాహిత్య సదస్సులో పాల్గొన్నప్పుడు ఈ ‘రెండామూజం’ నవల తెలుగు అనువాదం ప్రస్తావన మా మధ్య వచ్చింది. ఈ నవల అప్పటికే ఇంగ్లీషులో అనువాదమైంది. అయితే, ఇంగ్లీషు నుంచి కాక, మలయాళం నుంచే ఆ తెలుగు అనువాదం సాగాలని ఆయన ప్రత్యేకంగా కోరుకున్నారు” అని మృణాళిని తెలిపారు.

    ‘అద్వితీయుని ఆత్మకథ’ పుస్తకాన్ని కూలంకషంగా సమీక్షించిన మృణాళిని, “నటనలో దిలీప్ కుమార్ లాగా, రచనలో ఎం.టి. వాసుదేవన్ నాయర్ అలా! నాటకీయతకు అవకాశం ఉన్నా, ఆ జోలికి పోకుండా, అండర్ ప్లే చేస్తారు. భారతాన్ని ఎం.టి. చూసిన దృష్టి వేరు. గతంలో కొందరు రచయితలు కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ లాంటి పాత్రలను ప్రధానంగా ఎంచుకొని తమదైన పద్ధతిలో భారత కథ రాశారు. కానీ, నూర్గురు కౌరవులను సంహరించడంతో సహా భారతంలో కీలకంగా వ్యవహరించినప్పటికీ తన మనసులోని మాటలను ఎన్నడూ బయటకు చెప్పుకోని భీమసేనుడి దృష్టి నుంచి ఈ నవల సాగడం విశేషం. పాండవుల్లో ద్వితీయుడైనా, అందరికీ తెలిసిన భుజ పరాక్రమంతో పాటు మానసిక చిత్తవృత్తిలోనూ అద్వితీయుడిగా అనిపించే భీముడి పాత్ర తాలూకు రెండో కోణాన్ని సమాంతరంగా, అద్భుతంగా చెబుతుందీ నవల. ఎంతో పరిశోధించి, వ్యాసభారతంలో లేని అంశాలను కొన్నింటిని జొప్పించడంతో పాటు, వ్యాసుడు నిశ్శబ్దంగా ఉన్నచోట ఆ ఖాళీలను పూరిస్తూ ఎం.టి. ఈ అసాధారణ నవలను మలయాళంలో రచించారు. భారత ఇతిహాస కథలోని మాయలు, మహిమలను పరిహరించి, చాలా సహజంగా, హేతుబద్ధంగా, భీముని సున్నితత్వం, మానసిక చైతన్యం, స్త్రీల మానసిక స్థితిని అర్థం చేసుకొనే తత్వాన్ని ప్రధానంగా ఆవిష్కరిస్తూ ఈ నవల సాగడం గమనార్హం” అంటూ అనేక ఉదాహరణలతో లోతుగా విశ్లేషించారు.

    అందుకే... ఆ సాహిత్యం, సినిమా అంత విలక్షణం!

    చలం ‘దోషగుణం’ కథ ఆధారంగా ‘గ్రహణం’ మొదలు పలు ఆంగ్ల రచనల ఆధారంగా ‘అష్టాచెమ్మా’, ‘సారంగపాణి జాతకం’ దాకా పలు చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు. “ఇవాళ చరిత్రకూ, పురాణానికీ మధ్య తేడా ప్రమాదకరంగా చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రలకు సమకాలీనత ముఖ్యం. ఆ దృక్కోణంతో పాత్రలనూ, ఇతిహాసాలనూ ఆవిష్కరించగల రచయితల అవసరం ఉందిప్పుడు. మలయాళ సాహిత్యం, సినిమాల్లో ఆ పనే చేస్తుంటారు. అందుకే అవి విలక్షణంగా నిలుస్తున్నాయి” అని అభిప్రాయపడ్డారు.

    సినీ నటుడు – రచయిత – దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ, సాహిత్యంపై తనకున్న అక్కరను పంచుకున్నారు. “తెలుగు సాహిత్యం కోసం బాధపడుతున్నవారితో నేనూ గొంతు కలుపుతున్నా. బహుశా, అందుకే ఇటీవల కాలంలో వివిధ సాహిత్య సమావేశాల్లో నాకూ స్థానమిస్తున్నారు. కోవిడ్ అనంతర కాలంలో చదవడం కొంత తగ్గింది. నేను చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి చేయడమే కాక, తెలుగు సాహిత్య ప్రచారం కోసం నా వంతు కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు.

    పలుకు తేనెల తెలుగు... ‘పాలక్కాడ్’ గణపతి!

    మలయాళ మాతృక ‘రెండామూజం’ తెలుగు అనువాద రచయిత వి.ఆర్. గణపతి ప్రత్యేకంగా ఈ సభ కోసం కేరళ సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు రావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన పాలక్కాడ్ వాస్తవ్యులు. తమిళ, మలయాళాల నుంచి తెలుగులోకి పలు అనువాదాలు చేస్తున్న ఆయన ఇప్పటికే ప్రముఖ మలయాళ రచయిత్రి పి. వత్సల రచన ‘ఆగ్నేయం’తో పాటు మరో ప్రసిద్ధ మలయాళ రచయిత ముకుందన్ రచన ‘దైవత్తిండ వికృతిగళ్‌’ను ‘వైకుంఠపాళి’గా తెలుగులోకి చేశారు. ఇంగ్లీషు నుంచి కాక, ఎం.టి. రచించిన మలయాళ మాతృకనే ఆధారంగా చేసుకొని, సరళమైన తెలుగులో, హాయిగా చదివించేలా ఆయన అనువాదాలు చేయడం విశేషం. మాతృకలోని ఆచారాలు, సంప్రదాయాలు, తిట్లు, సామెతలను అనువదించేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ప్రస్తావిస్తూనే, ఆయన ఈ తాజా అనువాద ప్రస్థానం విశేషాలను పంచుకున్నారు.

    “నేను పెరిగింది, చదివింది కరీంనగర్‌లోనే. తెలుగునాట ఉద్యోగం కూడా చేశాను. ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగిగా ఎందరో మిత్రులను సంపాదించుకున్నాను. నిజానికి, ఎం.టి. తన రచనల అనువాదానికి అంత సులభంగా అనుమతినివ్వరు. సినిమా స్క్రిప్టుల కోసం తన వద్దకు వచ్చేవారిని సైతం ఆయన అనేక నెలలు తిప్పించుకొని, వారి శ్రద్ధను పరీక్షించాకనే ఒప్పుకొనేవారు. అలాంటిది... ఆయన సుప్రసిద్ధ రచన ‘రెండామూజం’ తెలుగులోకి చేయాలని ‘కథాప్రపంచం’ కిరణ్ నన్ను కోరినప్పుడు, ‘ఎం.టి. అనుమతి ఇచ్చినప్పుడు కదా’ అని తేలికగా తీసుకున్నా. కానీ, కిరణ్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన అనుమతి సాధించి, నాతోనే అనువాదం చేయించారు. నిజానికి, 2024లోనే ఈ అనువాదం పూర్తయింది. ఎం.టి.కి చూపించి, ఆయన ఆశీర్వాదం తీసుకుందామనుకొనే లోగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. మా ఆశ తీరకుండానే ఆయన కన్నుమూయడం మాకు తీరని లోటు” అంటూ ఎం.టి.కి గణపతి నివాళులర్పించారు.

    మరిన్ని అనువాదాల విందుకు మార్గం!

    నిజానికి, మలయాళంలో ‘రెండామ్ ఊజం’ (సంధి ప్రక్రియ వల్ల... ‘రెండామూజం’) అంటే... ‘రెండో సారి’ అని అర్థం. అయితే, ఆ పేరును తెలుగు పాఠకలోకానికి సన్నిహితమయ్యేలా అర్థవంతంగా ‘అద్వితీయుని ఆత్మకథ’గా సమర్పించడం అనువాదకుడి శ్రద్ధాభక్తులకు నిదర్శనం. మంచి అభిరుచితో మేలైన పుస్తకాలు ప్రచురించడంలో ముందుంటున్న తిరుపతికి చెందిన ‘కథా ప్రపంచం’ ప్రచురణల అధినేత కిరణ్ ఈ తెలుగు అనువాదాన్ని అందించారు. ఎంతో కాలం, ధనం, శ్రమ వెచ్చించి, పట్టుదలగా ఆయన ఈ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించడాన్ని తనికెళ్ళ, ఇంద్రగంటి, అవసరాల సహా అతిథులందరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.

    సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వరీ కల్యాణం సభా నిర్వహణ సాగించిన ఈ సమావేశంలో రచయిత వాసిరెడ్డి నవీన్, బ్నిమ్, సినీ సమాచార సేకర్త పంచకర్ల రమేశ్, సీనియర్ జర్నలిస్టు పద్మశ్రీ, ఆకాశవాణి వార్తావిభాగం జ్యోత్స్న సహా పలువురు సినీ, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. అనువాద రచయితకు పూర్వాశ్రమ మిత్రులు – సహచరులైన ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు పెద్దయెత్తున వచ్చి, ఆయనను అభినందించారు. తిరుపతి ‘కథా ప్రపంచం’ కిరణ్ అతిథులను సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయతను పంచారు. ఎం.టి. వాసుదేవన్ నాయర్ బృహత్తర కృషిగా పేర్కొనే ‘కాలం’ (1969) సహా మరిన్ని నవలలు, కథలను తెలుగులోకి తెచ్చేందుకు ఈ ‘అద్వితీయుని ఆత్మకథ’ ఆవిష్కరణ కొత్త దారులు వేసినట్టే కనిపిస్తోంది. అదే జరిగితే... తెలుగు పాఠక లోకానికి అంతకన్నా అక్షరాల విందు మరేముంటుంది!

    -రెంటాల జయదేవ

  • ఫస్ట్‌ టైమ్‌ యూరోప్‌కి వెళ్లాలని ప్లాన్‌ చేసే వారికి టిబిలిసి ఒక మంచి స్టార్టింగ్‌ పాయింట్‌ అవుతుంది. ఫ్లైట్‌ దిగిన వెంటనే సిటీ వైబ్‌ చాలా కామ్‌గా, రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ఎక్కువ రష్‌ లేకుండా స్మూత్‌గా అడ్జస్ట్‌ అయ్యే ప్లేస్‌లా ఫీలవుతారు. 

    సిటీలో వాక్‌ చేస్తుంటే పురాతన భవనాలు, రంగురంగుల బాల్కనీలు, కోబుల్‌ స్టోన్‌ వీధులు కలిసి ఒక సాఫ్ట్‌ విజువల్‌ క్రియేట్‌ చేస్తాయి. మార్నింగ్‌ లైట్‌లో స్ట్రీట్స్‌ స్లోగా వేక్‌ అవ్వడం చూస్తే, ఈ ప్లేస్‌తో కనెక్షన్‌ నాచురల్‌గా బిల్డ్‌ అవుతుంది.

    సందర్శనీయ స్థలాలు 
    పాత టిబిలిసిలో చిన్న చిన్న ఇరుకైన సందుల్లో నడుస్తూ ఉంటే గతంలోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. నరికలా కోటకి వెళ్లినప్పుడు సిటీ వ్యూ వైడ్‌గా కనిపిస్తుంది. బ్రిడ్జ్‌ ఆఫ్‌ పీస్‌ రాత్రి సమయంలో ప్రశాంతంగా వెలుగుతూ ఉంటుంది. అబానోతుబాని ప్రాంతంలో ట్రెడిషనల్‌ టిబిలిసి సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి.

    ఏం తినాలి?
    ఇక్కడ ఫుడ్‌ సింపుల్‌గా కనిపించినా చాలా శాటిస్ఫయింగ్‌గా ఉంటుంది. ఖాచాపూరిలో కరిగిన చీజ్, సాఫ్ట్‌ బ్రెడ్‌తో కలిసి కంఫర్ట్‌ ఫుడ్‌లా ఉంటుంది. అలాగే ఖింకలి అనే డంప్లింగ్స్‌ చాలా జ్యూసీగా ఉంటాయి. వీటిని తినే విధానం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా మిగులుతుంది.

    ఎప్పుడు వెళ్లాలి?
    స్ప్రింగ్‌ (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) సమయంలో వాతావరణం చాలా ఫ్రెష్‌ ఫీల్‌ను ఇస్తుంది. ఆటమ్‌లో సిటీ రంగులు చాలా సాఫ్ట్‌గా, అందంగా మారుతాయి.

    హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?

    హైదరాబాద్‌ నుంచి డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ కొన్ని సీజనల్‌గా అందుబాటులో ఉంటాయి.

    లేదంటే దుబాయ్‌ లేదా దోహా నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ సులభంగా లభిస్తాయి.

    ప్రయాణ సమయం సుమారు 7 నుంచి 10 గంటలు.

    టిబిలిసిలో గడిపే టైమ్‌ ఫాస్ట్‌గా వెళ్లి΄ోతుందిం కానీ మెమోరీస్‌ మాత్రం స్లోగా మనసులో నిలిచి΄ోతాయి. సింపుల్‌ ట్రిప్‌ప్లాన్‌ చేసినా, ఈ నగరం అనుభవం మాత్రం నేచురల్‌గా స్పెషల్‌గా మిగిలి΄ోతుంది.

    హిమాలయాల్లో రహస్య జీవనం
    హిమాలయ పర్వతాల మధ్య ఒక గుహలో మలచిన పుగ్తాల్‌ మొనాస్టరీని చూస్తే ఇలాంటి నిర్మాణం సాధ్యమేనా అనిపిస్తుంది. ఇక్కడ జీవితం చాలా ప్రశాంతంగా, సింపుల్‌గా గడుస్తుంది. అందుకే మనశ్శాంతి కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి చేరుకోవడం అనేది ఒక ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక అద్భుతమైన అనుభవం కూడా.

    కాలం కొత్త రంగులు
    ఈ మోనాస్టరీలో బౌద్ధ సన్యాసుల దినచర్య చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి ఉదయం ప్రార్థనల శబ్దం పర్వతాల మధ్య ఒక ఎకోలా మార్మోగుతుంది. చుట్టూ గోధుమ రంగులో మెరిసే పర్వతాలు, కింద నిశ్శబ్దంగా సాగే నది... ఈ కాంబినేషన్‌లో కాసేపు గడిపినా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ కాలం ఆగిపోయినట్టు జీవితం కొత్త రంగులను అద్దుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌గా సాగుతున్న జీవితానికి ఈ ప్రదేశం ఒక స్పీడ్‌ బ్రేకర్‌లా పని చేస్తుంది. 

    ప్రకృతితో సహజీవనం
    ఎలక్ట్రిక్‌ లైట్స్‌ కన్నా సహజమైన సూర్యోదయానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గాలి శబ్దం, నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి ఒక నేచురల్‌ రిథమ్‌ను క్రియేట్‌ చేస్తాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ వ్యూస్‌ను ఆస్వాదిస్తూ, నిశ్శబ్దంలో ప్రకృతి పలికే మాటలను వినడానికి ప్రయత్నిస్తారు.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుండి ఢిల్లీ వరకు ఫ్లైట్‌ లేదా ట్రెయిన్‌లో వెళ్లాలి. అక్కడి నుంచి లేహ్‌కి ఫ్లైట్‌ తీసుకుని, లేహ్‌ నుంచి జాన్సా్కర్‌ ప్రాంతానికి రోడ్డు ప్రయాణం చేయాలి. చివరిగా ఒక చిన్న ట్రెక్‌ చేసి ఫుగ్తాల్‌ మొనాస్టరీకి చేరుకోవచ్చు. అయితే ఈ ప్రయాణాన్ని ఒక చెక్‌లిస్టుగా కాకుండా మనశ్శాంతికి మార్గంగా భావించి ΄్లాన్‌ చేసుకోవాలి.ఈ ప్రాంతంలో ప్రతి అడుగు ఒక డిస్కవరీలా అనిపిస్తుంది. ఈ రహస్య నిలయం ఈ బౌద్ధ ఆలయం మనసులో చాలా లోతుగా నిలిచి΄ోతుంది. 

    మేఘాలలో దాగిన హరిత స్వర్గం(ఆగుంబే)

    ప్రకృతిలో కొన్ని ప్రదేశాలు మన మనసులను మెల్లిగా మార్చేస్తాయి. ఆగుంబే కూడా అలాంటి ఒక ప్రదేశమే. ఫస్ట్‌ టైమ్‌ వెస్టర్న్‌ ఘాట్స్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అవ్వాలి అనుకునే వారి కోసం ఇది ఒక సాఫ్ట్‌ ఎంట్రీ ఫీల్‌ ఇస్తుంది.  ఈ ప్రదేశం పచ్చదనానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా అనిపిస్తుంది. రోడ్‌ జర్నీలోనే మార్పు మొదలవుతుంది. సిటీ సౌండ్స్‌ తగ్గి, చుట్టూ లష్‌ ఫారెస్ట్, మిస్ట్‌తో కప్పబడిన కొండలు కనిపిస్తాయి. ఆగుంబేలో వాక్‌ చేస్తుంటే ప్రతి కార్నర్‌లో తడిసిన ఆకుల సువాసన, తాజా గాలి టచ్‌ క్లియర్‌గా తెలుస్తుంది.

    సందర్శనీయ స్థలాలు 
    సన్‌సెట్‌ పాయింట్‌ దగ్గర మెల్లిగా ఆకాశం రంగులు మారడం చూస్తే కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆగుంబే రెయిన్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ వద్ద చిక్కటి అడవులను పర్యాటకులు బాగా ఇష్టపడుతుంటారు. బర్కానా ఫాల్స్‌ చుట్టుపక్కల నేచర్‌ చాలా రా అండ్‌ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్‌ ట్రైల్స్‌లో నడిస్తే సైలెన్స్‌ కూడా ఒక ఎక్స్‌పీరియెన్స్‌లా అనిపిస్తుంది.

    ట్రై చేయాల్సిన ఫుడ్‌
    ఇక్కడ ఫుడ్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది. లోకల్‌ స్టైల్‌ మీల్స్‌ ఫ్రెష్‌గా సర్వ్‌ చేస్తారు. హాట్‌ రైస్, లైట్‌ కర్రీలు ఇంటి భోజనం ఫీల్‌ ఇస్తాయి. వర్షాకాలంలో చాయ్‌తో స్నాక్స్‌ ఎంజాయ్‌ చేయడం ఒక మెమరీలా ఉంటుంది.

    ఎప్పుడు వెళ్లాలి?
    జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షాల్లో ఆగుంబే ఒక ఆకు పచ్చ ప్రపంచంలా మారిపోతుంది. చలికాలంలో కూడా ఇక్కడి అందాలు అలరిస్తాయి.

    ఎలా చేరుకోవాలి?
    హైదరాబాద్‌ నుండి మంగళూరు లేదా ఉడుపి వరకు ఫ్లైట్‌ లేదా ట్రైన్‌లో చేరి, అక్కడి నుండి రోడ్‌ జర్నీ ద్వారా ఆగుంబే చేరుకోవచ్చు. మొత్తం ట్రావెల్‌ టైమ్‌ సుమారు 10–12 గంటలు వరకు ఉంటుంది. ఆగుంబేలో లైఫ్‌ స్లోగా, నేచర్‌తో సింక్‌ అయిన ఫ్లోగా ఉంటుంది. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. ఈ గ్రీనరీ జర్నీలో మీరు ఒక రీల్‌లో ఉన్నట్టే రియల్‌ అనుభూతిని పొందుతారు.  

    – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు

    (చదవండి: తొలి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల..!)

     

  • మన దేశంలో తయారైన మొట్టమొదటి కారు ఎలా ఉంది.. అసలు మనిషి మొదటగా ఉపయోగించిన రవాణాసాధనం ఎలా ఉండేది.. ఎడ్ల బండి నుంచి ఏరోప్లేన్‌ వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణాసాధనాలన్నింటినీ ఒకే చోట చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని ఈ వేసవిలో పిల్లలకు పరిచయం చేయాలని.. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వేసవిలో ‘హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ కు వెళ్లడం ఓ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది.

    ఢిల్లీ నుంచి సోహ్నా–గుర్‌గావ్‌ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా దాదాపు 63 కిలోమీటరు ప్రయాణిస్తే .... హర్యానా రాష్ట్రం, బిలాస్‌పూర్‌ చౌక్, టారు రోడ్‌లో ఉంది ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా సాధనాల ప్రదర్శనశాల ఇదే!

    దాదాపు 90 వేల చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియమ్, షాప్‌లు, రెస్టారెంట్‌ వసతులు కూడా ఉన్నాయి. 

    రూపకర్త ఎవరు అంటే.. 
    ఢిల్లీ నివాసి తరుణ్‌ థక్కర్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. ఆసక్తి, ఉత్సాహం, శోధన నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్‌ థక్కిర్‌ విషయంలోనూ జరిగింది. గ్రామోఫోన్‌ల నుంచి టేబుల్‌ ల్యాంప్స్‌ వరకు రాజస్థాన్, గుజరాత్‌ చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా 2013లో ఈ చారిత్రాత్మక వాహన శాల ఏర్పాటైంది. 

    సినిమా సన్నివేశాలకు వీలుగా!
    భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్‌ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో పాత కార్లనూ వీక్షించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్‌ పంపు, బాలీవుడ్‌ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్‌ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్‌కూడా ఏర్పాటు చేశారు.

    బస్సుల పాత్ర ఎంతో..
    మానవ ప్రగతికి బస్సు చక్రం ఎలా ఉపయోగపడిందో తెలియజెప్పవచ్చు. పెద్ద పెద్ద వాహనపరికరాలు గల బస్‌ డిపోతో పాటు, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... అందుకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీని సందర్శించవచ్చు. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. 
    మేఘాలలో తేలిపోమ్మన్నది..

    సైకిల్, స్కూటర్, మోటార్‌సైకిల్, మోపెడ్స్‌... ఒకనాడు సింగిల్‌గానూ, కపుల్‌గానూ ప్రయాణించిన ద్విచక్రవాహనాలు ఈ మ్యూజియంలో కొలువుదీరి ఉన్నాయి. వీటితో పాటు చిన్నా, పెద్ద వాహనాలను పోలిన బొమ్మలూ ఇక్కడ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ ఈ మ్యూజియమ్‌లో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. వీటిని చూస్తుంటే పెద్దవాళ్లు తమ చిన్ననాటి రోజుల జ్ఞాపకాల్లో వెళ్లకుండా ఉండలేరు.

    ఆకాశయానం
    ఎప్పటి నుంచి విమానమార్గంలో మన దేశస్తులు ప్రయాణించారు.. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందింది... దశలవారీగా తెలియజెప్పే విశేషాలన్నీ ఈ మ్యూజియంలో ఉన్నాయి. మన దేశ విమాయానపరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ ఒక చక్కని వేదిక. స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న విమానాన్నీ ఇక్కడ చూడవచ్చు.

    రైలు.. టికెట్లు..
    రైలు రవాణా మన దేశంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది, నాటి నుంచి నేటి వరకు రైలు మార్గంలో, రైలు తయారీలో వచ్చిన మార్పులు. మొదటి రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటయ్యింది, ఎంత సమయం పట్టింది? వివరాలతోపాటు 1930ల నాటి రైల్వే స్టేషన్‌ ΄ఫ్లాట్‌ఫామ్‌ నమూనా, సెలూన్‌ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి రైలుబండి ఛాయా చిత్రాలు, ట్రెయిన్‌ టికెట్లు, రైల్వే సిగ్నల్స్, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.

    నీటిపైన తేలియాడే...
    మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు. 

    భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఒకే దగ్గర తెలుసుకునే మహత్తర అవకాశంగా ఈ మ్యూజియమ్‌ను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమం ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియమ్‌ మన కళ్లకు కడుతుంది.

    ఎక్కడ ఉందంటే...
    బిలాస్‌పూర్‌ – తౌరు రోడ్, మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్‌ 132 ఆఫ్‌ ఎన్‌.హెచ్‌ 8, బిలాస్‌పూర్, చౌక్, తౌరు, హర్యానా

    సందర్శన సమయం
    ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు (సోమవారం సెలవు) 

    టికెట్‌ ధర: 
    పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.250, ఫొటోగ్రాఫ్స్‌ తీసుకునే సౌలభ్యం ఉంది. 

    (చదవండి: 'షోలే' మూవీని తలపించేలా ఆ వృద్ధ స్నేహితులు..!)
     

  • మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య మైత్రి బంధం చూడగానే షోలో మూవీలోని స్నేహితుల్లా కనిపిస్తారు. అచ్చం అందులో జై, వీరుల (ధర్మేంద్ర, అమితా బచ్చన్‌) మధ్య సాగే పాటలోని సీన్‌ గుర్తుకొస్తుంది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    అసలేం జరిగిందంటే..మహారాష్ట్రలోని ఒక డిపొ నుంచి షేర్‌ చేసి ఒక వీడియో అందరి మనసులను హత్తుకుంది. పదవీ విరమణ చేసిన రాష్ట్ర రవాణా డ్రైవర్‌కు భావోద్వేగభరితమైన వీడ్కోలు చిత్రీకరించంది. ఇద్దరు వృద్ధ సహోద్యోగులు మధ్య చోటు చేసుకున్న దృశ్యం. అచ్చం యువకుల మాదిరిగా ఆ సహోద్యోగి పదవీవిరమణ చేస్తున్న తన స్నేహితుడైన బస్సు డ్రైవర్‌ని భుజాలపై తీసుకెళ్తున్న దృశ్యం అందర్నీ కదిలిస్తుంది. 

    వృద్ధాప్యం మనసుకే గానీ..ఆప్యాయతను వ్యక్తం చేయడానికి కాదు అన్నట్లుగా తన సహోద్యోగిని ఎత్తుకుని వీడ్కోలు పలుకుతున్న కమనీయ దృశ్యం అందర్నీ ఆకర్షించింది. అది పనిలో తన చివరి రోజు కావడంతో, ఆ వీడ్కోలు అతను అక్కడ నిర్మించుకున్న జీవితానికి ఒక వేడుకగా మారింది. చూడటానికి చిన్న పనే అయినే ఎన్నో ఏళ్లుగా ఉ‍న్న స్నేహబంధాన్ని, గౌరవాన్ని పంచుకున్న జ్ఞాపకాలను ప్రతిబింబించింది. 

    అది సరిగ్గా షోలో మూవీలోని జై వీరుల ఐకానిక్‌ స్నేహం గుర్తు చేసింది. ముఖ్యంగా దోస్తీ పాటలో ధర్మేంద్ర అమితా బచ్చన్‌ భుజాలపై కూర్చునే ప్రసిద్ధ సన్నివేశం గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్‌ ఉద్యోగానికే కానీ, ఏర్పడిన స్నేహాలు, జ్ఞాపకాలు జీవితాంతం నిలిచిపోతాయని ఈ సన్నివేశం చెబుతోంది కదూ..!.

     

    (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!)
     

  • విడాకులు అనగానే మహిళల పరంగా ఒక కళంకంగా చూస్తుంది ఈ సమాజం. అటు అబ్బాయి తరుఫు వాళ్ల నుంచి సమస్యలే వచ్చినా..కూడా ఆ అమ్మాయే తప్పు చేసినట్లుగా, అభాగ్యురాలిగా చులకనగా చూస్తుంటుంది. దాని తోడు చుట్టపక్కల వాళ్ల ప్రభావంతో పుట్టింటివాళ్లు సైతం అండగా నిలబడేందుకు ముందుకు రారు. భర్త వదిలేసిన స్త్రీ పట్ల అనాదిగా ఉన్న భావనను తుడిచివేసేలా కొందరు తండ్రులు ముందుకు వస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడ ఈ తండ్రి కూడా అలానే కూతురికి అండగా నిలబడటమే గాదు  ఆ క్షణాన్ని ఒక సంబరంలా సెలబ్రేట్‌ చేశాడు.

    ఈ అనూహ్య ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. ప్రణిత అనే మహిళకు కుటుంబ న్యాయస్థానం నుంచి విడాకులు మంజూరు అయిన వెంటనే ఆమె తండ్రి రిటైర్డ్‌ జడ్జి కోర్టు ప్రాంగణం వెలుపల డబ్బులు వాయిస్తూ..మిఠాయిలు పంచుతూ ఆ క్షణాన్ని సెలబ్రేట్‌ చేశారు. బంధువులు డప్పుల శబ్దానికి నృత్యం చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ఆ వీడియోలో కుటుంబ సభ్యులు ప్రణిత ఫోటో తోపాటు "నా కూతురిని ప్రేమిస్తున్నాను. ఆమె హృదయం, ఆమెనా సర్వస్వం " అని సందేశం ముద్రించిన నల్లటి టీ షర్టులు ధరించి కనిపించారు. ప్రణిత కూడా "నా కుటుంబం, నా జీవితం" అని రాసి ఉన్న నల్లటి టీ-షర్టును ధరించింది. ఇక ప్రణిత మీరట్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ..తాను తన వివాహాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది. 

    ఆమెకు 2018లో పంజాబ్‌లోని జలంధర్‌లో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన భారత సైన్యంలో మేజర్ అయిన గౌరవ్ అగ్నిహోత్రితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కాలక్రమేణా, ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

    ఈ విషయం కుటుంబ న్యాయస్థానానికి చేరగా, ఆ తర్వాత కోర్టు ఆ విడాకులను ఆమోదించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే డాక్టర్‌ శర్మ ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, మిఠాయిలు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ వింత ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. 

    కాగా, శర్మ కుటుంబం ఇప్పటికే వ్యక్తిగత నష్టాన్ని చవిచూసింది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణిత సోదరుడు మరణించడం వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అదే సమయంలో ప్రణిత తన అత్తగారి ఇంట్లో రోజూ వేధింపులను ఎదుర్కొంటుంటూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమెకు తండ్రి అండగా నిలిచి, తన శ్రేయస్సు కోసం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రోత్సహించారు. విడాకులు మంజూరైన తర్వాత ఆ క్షణాన్ని నిశ్శబ్దంగా గడపకుండా, వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది.

    సెలబ్రేషన్స్‌ ఎందుకంటే..
    ప్రణిత తండ్రి, రిటైర్డ్ జడ్జి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, ఈ వేడుక వెనుక గల కారణాన్ని వివరించారు. "మా కూతురు పుట్టినప్పుడు డప్పులు వాయించారు. ఒక కూతురి జీవితంలోని ప్రతి దశలోనూ ఆమె విలువ మారదని చూపించడానికి, ఈ రోజున మళ్ళీ ఇలా డప్పులతో సెలబ్రేట్‌ చేశాం. అని చెప్పారు.

     

    (చదవండి: కృష్ణకాళి ఆలయాన్ని దర్శించుకున్న అనంత్‌-రాధిక)

     

International

  • ఇరాన్‌కి విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రెస్ మీట్ పెట్టారు. వైట్ హౌస్‌లో మాట్లాడుతూ తమ దేశానికి చెందిన రెండో పైలట్‌ని కూడా ఇరాన్ నుంచి రక్షించామని చెప్పుకొచ్చారు. అలానే డెడ్‌లైన్‌కి ముందు ఇరాన్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

    'రేపటి(మంగళవారం) వరకు ఇరాన్‌కి గడువు ఉంది. డెడ్ లైన్ తర్వాత ఇరాన్‌కి గడువు పొడిగింపు ఉండదు. ఇరాన్ దిగిరాకపోతే ఆ దేశ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తాం. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా కొనసాగుతుంది. రెండో పైలట్‌ని ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించాం. అతడి కోసం భారీ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌ని సమర్థంగా నిర్వహించినందుకు గర్విస్తున్నాం. ఏడు గంటల పాటు జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అమెరికన్ సైనికులు గాయపడలేదు'

    'ఏ దేశానికి లేని విధంగా అమెరికాకు ఆయుధాలు ఉన్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాం. శత్రువులకు చిక్కకుండా ఎత్తయిన కొండపైకి పైలెట్ చేరుకున్నాడు. అన్ని ప్రమాదాలని ధ్వంసం చేసి పైలట్‌ని రక్షించాం. మా హెలికాప్టర్లు పది నిమిషాల్లో తమ పని పూర్తిచేశాయి. వేలాది విమానాలతో దాడి చేస్తే ఇరాన్ ఒక్క విమానాన్నే కూల్చింది. రేపు ఇరాన్ తుడిచిపెట్టుకునిపోవచ్చు' ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.

    శుక్రవారం ఇరాన్‌ ఐఆర్‌జీసీ దళాలు ఎఫ్‌-15ఈ ఫైటర్‌ జెట్‌ను కూల్చిశాయి. దీంతో అందులో ఉన్న పైలట్‌, మరో పైలట్‌ (వెపన్‌ ఆఫీసర్‌) ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే వారిలో ఒకరిని అమెరికా ముందుగానే రక్షించింది. రెండో పైలట్‌ని చాలా కష్టపడి రక్షించుకుంది. హాలీవుడ్‌ సినిమాను తలపించే రీతిలో 24 గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్‌లో అదృష్టం రెండు దేశాల వైపు దోబూచులాడి చివరికి అగ్ర దేశాన్నే వరించింది. శత్రుగడ్డపై చిక్కుకున్న తమ పైలట్‌ను అమెరికా బలగాలు ప్రాణాలకు తెగించి రక్షించాయి.

    అంతకు ముందు అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనని ఇరాన్‌ తిరస్కరించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. 'నేను చాలా నిరాశకు గురయ్యాను. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు' అని హెచ్చరించారు. ఇరాన్‌ చేయాల్సినవి చేస్తే ఈ ఉద్రిక్తతలు త్వరగా ముగిసిపోవచ్చని పేర్కొన్నారు. ఆ దేశానికి విధించిన గడువును మంగళవారం తర్వాత ఇక పొడిగించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు.

  • వాష్టింగన్‌: హర్మూజ్‌ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేదంటే ఇరాన్‌లో విధ్వంసం తప్పదని హూంకరిస్తున్నారు. అయితే, ట్రంప్‌ బెదరింపుల్ని ఇరాన్‌ ఖాతరు చేయడం లేదు. హర్మూజ్‌ జలసంధిని తెరిచేది లేదని తేల్చి చెబుతోంది. అమెరికాను ఏకాకిని చేస్తూ.. పశ్చిమాసియా యుద్ధంలో తమకు భారత్‌, చైనాతో పాటు ఇతర దేశాలు తమకు అండగా ఉన్నాయని తెలిసేలా సెటైరికల్‌ ట్వీట్లు వేస్తోంది. 

    ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తున్నాయి. ఆ ట్వీట్‌లలో 
    దక్షిణాఫ్రికాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో 

    ట్రంప్:హర్మూజ్‌ జలసంధిని తెరవండి అని ఇరాన్‌ అడుగుతుంటే మిగిలిన దేశాలు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశాయని అర్ధం వచ్చేలా ట్వీట్‌లలో హైలెట్‌ చేశాయి. 

    భారత్: హర్మూజ్‌ జలసంధిని మూసేశారా?
    పాకిస్థాన్: హర్మూజ్‌ జలసంధిని మూసేసింది. 

    రష్యా: విచిత్రంగా ఉంది…
    దక్షిణాఫ్రికా: లేదు హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉంది
    ఫ్రాన్స్: అబ్బే అలా ఏం లేదే. హర్మూజ్‌ జలసంధిని చూస్తుంటే మాకు అలా అనిపించడం లేదే
    చైనా: హర్మూజ్‌ జలసంధి తెరిచే ఉంది. మేం ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం’అని ట్వీట్‌లలో పేర్కొంది.  
    బల్గేరియా ఎంబసీ: ‘టేక్ ఇట్ ఈజీ టైగర్, కీప్ యువర్ కూల్’ అంటూ ట్రంప్‌ను ఎగతాళి చేసింది 
    జింబాబ్వే ఎంబసీ: “ట్రంప్‌, నాతో మాట్లాడు. మాకు చాలా బోర్‌గా ఉంది” అని సరదాగా వ్యాఖ్యానించింది 
    మరికొన్ని ఎంబసీలు ‘తాళాలు పోయాయి’ అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాయి.

    విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇరాన్‌ ట్వీట్లలో భారత్‌, చైనా వంటి దేశాల పేర్లు ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉంది. తాను ఒంటరిగా లేనని, తనకు మిత్రదేశాలు అండగా ఉన్నాయని ప్రపంచానికి సంకేతం ఇవ్వడమే. అమెరికాను ఏకాకిగా చూపించడమే కాకుండా, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉందని అంతర్జాతీయ సమాజానికి ధైర్యం చెప్పడమేనని వారు విశ్లేషిస్తున్నారు.

    హర్మూజ్‌ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఎనర్జీ కారిడార్. ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా వెళ్తుంది. ఇక్కడి ఉద్రిక్తతలు చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. తాజా పరిణామాల వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగాయి.

    ఇటీవలి అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నగరం హైఫాపై దాడి చేశాయి. సౌదీ అరేబియా, కువైట్, యుఎఈ తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి. టెహ్రాన్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రివల్యూషనరీ గార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదెమీ మరణించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

    ఇరాన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఒకవైపు అమెరికా అధ్యక్షుడిని ఎగతాళి చేస్తే, మరోవైపు ప్రపంచానికి “మా వెనుక ఇతర దేశాలు ఉన్నాయి, పరిస్థితి నియంత్రణలో ఉంది” అనే సందేశాన్ని పంపుతున్నాయి. అయితే, హర్మూజ్‌ వివాదం కొనసాగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు కుదిపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

     

  • ఇరాన్‌,..  యుద్ధ రీతిలో అమెరికాకు ఏమాత్రం అర్థం కావడం లేదు.. అమెరికా అనడం అంటే కూడా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏమాత్రం అంతు చిక్కడం లేదు ఇరాన్‌.  ఇరాన్‌తో యుద్ధం రోజులు, నెలలు గడుస్తున్నా అమెరికా ఇంకా డెడ్‌లైన్లతోనే సరిపెడుతుంది. మూడు వారాలలోపే ఇరాన్‌తో యుద్ధంపై చర్చలకు సిద్ధం అంటూ ప్రకటించిన ట్రంప్‌.. ఆ దేశానికి గడువులు విధిస్తూనే ఉన్నారు. 

    ఆ దేశం హార్మూజ్‌ జలసంధిని తెరవకపోతే అంటూ 48 గంటలు డెడ్‌లైన్‌ విధించిన ట్రంప్‌.. ఇప్పుడు మరో 24 గంటలంటూ డెడ్‌లైన్‌ అంటూ ప్రకటించారు. అంటే ఇక్కడ ట్రంప్‌ వార్నింగ్‌లకే పరిమితం అవుతున్నారు తప్ప  ఇరాన్‌పై పట్టుసాధించే ప్రక్రియ మాత్రం ప్రస్తుతానికి అందని ద్రాక్షగానే ఉంది.

    మరొకవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ డెడ్‌లైన్లను ఇరాన్‌ అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఒకవైపు చర్చలకు డెడ్‌లైన్‌ అంటూ మాపై ఆ ప్రతీకార మాటలేంటి.. చర్చలకు వచ్చే వారు అలానే మాట్లాడతారా?, చర్చలు అనేవి సామరస్యపూర్వకంగా జరగాలే తప్ప  ఆ తుపాను మాటలేంటి అంటూ మండిపడుతోంది.  

    అసలు ట్రంప్‌ మాటల్లోనే చర్చలు చేసే ధోరణే కనిపించడం లేదని, అటువంటి సమయంలో ఎలా చర్చలు జరుగుతాయని ప్రశ్నిస్తోంది. ఏం చేసుకుంటారో చేస్కోండి.. మీ  ఆ తరహా మాటలతో చర్చలు అనేవి కుదరనే కదరవు అని తెగేసి చెప్పేసింది. ఈ వార్తను తెలుసుకున్న ట్రంప్‌.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.  ఇరాన్‌ ప్రకటనతో చాలా నిరాశ చెందానని ట్రంప్‌ తన మాటల ద్వారా తెలియజేశారు. 

    ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం గట్టిగా చేస్తే అమెరికా పౌరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది.. మరొకవైపు ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది.  ఇటువంటి తరుణంలో ఏం చేయాలి అనే పునరాలోచనలో పడ్డారు. ముందుకేస్తే గొయ్యి.. వెనుకకు వస్తే నుయ్యి అన్న చందంగా మారింది ట్రంప్‌ పరిస్థితి.  

    ‘ఇక ఏం చేయాలి నేను.. వార్నింగ్‌లు మీద వార్నింగ్‌లు ఇస్తున్నాం.. డెడ్‌లైన్‌ విధించాం. అగ్రరాజ్యంగా చేయాల్సినదంతా చేశాం.. ఇలా చిక్కుకుపోయామేంటి.. ఇప్పటివరకూ నాకు ఎదురేలేదని అనుకున్నా.. ఇరాన్‌ ఇలా తగులుకుందేమిటి.. అసలు ఇరాన్‌తో యుద్ధం చేయాలనే ఇజ్రాయెల్‌ వ్యూహంలో ఎలా చిక్కుకున్నాం. ప్రశాంతంగా అమెరికా అధ్యక్షుడిగా గౌరవంగా బ్రతికాల్సిన నేను ఇలా అయిపోయానేంటి.. ఏ దేశం కూడా నాకు సాయం చేయడం లేదు.  సాయం అడిగితే  ‘‘ఓ నో సారీ’’ అంటూ మిత్రదేశాలు సెలవిస్తున్నాయి. 

    అనవసరంగా పరువు తీసుకున్నాం. ఎటు చూసినా ఇది మనకే తిప్పి కొట్టేలా ఉంది’ అని ట్రంప్‌ తన అంతరంగంలో మదన పడే ఉంటారు కదా.. డామిట్‌.. కథ అడ్డం తిరిగింది.. అనుకోవడం ట్రంప్‌ వంతై ఉంటుంది కూడా. 

    మరి  ఇటువంటి తరుణంలో ట్రంప్‌ అన్నట్లు ఇరాన్‌కు చుక్కలు చూపిస్తారో.. తాడో-పేడో తేల్చుకుంటారో అనే సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ మళ్లీ ట్రంప్‌ యుద్ధానికి కాలు దువ్వితే మాత్రం మరింత విధ్వంసం జరగడం ఖాయం.  

  • హర్మూజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌కు అమెరికా డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువును ఇరాన్‌ బేఖాతరు చేసింది. బెదిరింపులతో చర్చలు జరగవని తేల్చిచెప్పింది. అయితే తాజాగా ఇరాన్ రియాక్షన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.

    పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ వైపేమై ట్రంప్ దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్‌లో ఉన్న విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే వాటిని ఇరాన్‌ పట్టించుకోవడం లేదు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు తలొగ్గేది లేదని తేల్చి చెబుతుంది. తాజాగా సీజ్‌ఫైర్‌ ఒప్పందాన్ని సైతం తిరస్కరించింది. దీంతో ట్రంప్ తీవ్ర ఆవేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

    ట్రంప్ మాట్లాడుతూ" ఇరాన్ సీజ్‌ ఫైర్‌ ఒప్పందాన్ని తిరస్కరించడం నన్ను తీవ్రకలతకు గురి చేసింది. దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోబోతున్నారు. ఇరాన్‌ అనుకుంటే ఈ పరిస్థితి ముగిసిపోయేది. అది వారికి తెలుసు క్రితం వారితో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వివేకవంతులు" అని ట్రంప్ అన్నారు.

    ఇటీవల ఇరాన్‌ భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు ఫైలట్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతో ట్రంప్‌ డిమాండ్స్‌కు ఇరాన్ తలొగ్గకపోవడంతో  ఇప్పుడు అమెరికా పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

  • ట్రంప్ 48 గంటల అల్టిమేటం వేళ ఇరాన్ భారీ ఝలక్‌ ఇచ్చింది. తమ దేశం ఎట్టి పరిస్తితుల్లో వెనుకంజ వేయదని తేల్చిచెప్పింది. బెదిరింపులతో చర్చలు జరగవని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్‌ కుండ బద్ధలు కొట్టారు. తమ దేశాన్ని పూర్తి స్థాయిలో రక్షించుకుంటామన్నారు.

    డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హర్మూజ్‌ జలసంధిని తెరవకపోతే టెహ్రాన్‌ని నాశనం చేస్తామన్నారు. ఈ మేరకు చర్చల చేసుకోవాలని డెడ్‌లైన్ సైతం విధించారు. బెదిరింపులను ఇరాన్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగేయ్‌ ఘాటుగా బదులిచ్చారు.. అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎంత మాత్రం గౌరవించడం లేదని ఇస్మాయిల్ బగేయ్‌ అన్నారు. ఆ దేశాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని వాటికి హద్దులే లేవని దుయ్యబట్టారు.

    వాషింగ్టన్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను బగేయ్ తిరస్కరించారు."ఇరాన్ తన న్యాయబద్ధమైన డిమాండ్లను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏమాత్రం వెనుకాడదు.ఇలా చేయడాన్ని రాజీ పడటంగా భావించకూడదు, బదులుగా తన వాదనలను రక్షించుకోవడంలో ఇరాన్‌కు ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబంగా దీనిని చూడాలి" అని బఘాయ్ అన్నారు.

    ఒకవేళ ఒప్పందం అంటూ జరిగితే అది దేశభద్రతా, ప్రయోజనాల ఆధారంగానే ఉండాలి తప్ప బెదిరింపులకు లొంగి చర్చల్లో పాల్గొనేది లేదనిస్పష్టం చేశారు. ప్రస్తుతం మా దృష్టంతా దేశాన్ని రక్షించడంపైనే అని తెలిపారు. అదే విధంగా తమ దేశ  ప్రయోజనాల ఆధారంగా తమ డిమాండ్లను వివరిస్తూ, మధ్యవర్తులకు అందించాల్సిన లిఖితపూర్వక ప్రతిస్పందనను సిద్ధం చేశామని ఈ విషయాన్ని అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తామని  బఘాయీ పేర్కొన్నారు. 

    అదేవిధంగా తమ దేశంపై జరిగే దాడులకు అదే రీతిన తగిన బధులిస్తామని హెచ్చరించారు. కాగా అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్‌ దృక్పథం తెలియజేశారు. బ్రిడ్జిలు కూలిపోతే మళ్లీ  నిర్మించవచ్చు, కానీ అమెరికాకు బుద్ధి చెప్పే అవకాశం మళ్ళీ రాదన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ రుద్దిన యుద్ధానికి  శాశ్వత ముగింపు టెహ్రాన్ కోరుకుంటోందని తెలిపారు. 

  • జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యర్థులు శత్రు స్థావరాలపై దాడులు జరపడం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి జనావాసాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

    సోమవారం ఇరాన్ భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌తో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ నివేదించింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. రోజంతా పదేపదే సైరన్‌లు మోగుతుండగా, రాబోయే మరిన్ని దాడుల గురించి అధికారులు హెచ్చరిస్తూ, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.

     

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవకపోతే విధ్వంసకర రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. అయితే తాజాగా ఇరాన్‌ డెడ్‌లైన్ గడువును మరో రోజు పొడిగించినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు మరింత భీకరంగా మారాయి. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్మూజ్‌ జలసంధిని క్లోజ్‌ చేసి ఇరాన్‌  చమురు సంక్షోభానికి కారణమయ్యింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎట్టిపరిస్థితుల్లో హర్మూజ్‌ని తెరవాలని లేకపోతే వినాశనమేనని ఇరాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

    ఏప్రిల్‌ 5 నిన్న (ఆదివారం) 48 గంటల్లో హర్మూజ్‌ తెరవాలని లేకపోతే దాడులతో విరుచుకపడతామన్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో రోజు గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ కొత్త డెడ్‌లైన్ ప్రకారం GMT బుధవారం ఉదయం 12 గంటల వరకూ డెడ్‌లైన్ పొడిగించినట్లు సమాచారం. దీంతో ఇరాన్‌కు హర్మూజ్‌ జలసంధిని తెలవడానికి మరో రోజు గడువు లభించినట్లయింది..

    అయితే ట్రంప్‌ ఈ విషయమై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌తో మాట్లాడినట్లు సమాచారం. ఒకవేళ డెడ్‌లైన్ ముగిసేలోపు వారు హర్మూజ్‌ను తెరవకపోతే వారి దేశంలో విద్యుత్‌ ప్లాంట్లు, వంతెనలు ఏమి ఉండవని హెచ్చరించారు. ఒకవేళ వారు గనుక ఈ సమయంలో చర్చలు జరపకపోతే వారి దేశంలోని మౌళిక సదుపాయాలను ధ్వంసం చేసి చమురును స్వాధీనం చేసుకుంటామన్నారు.

    కాగా ట్రంప్ ఆంక్షలను ఇరాన్‌ బేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్‌ గడువు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకూ టెహ్రాన్‌ తరపునుంచి ఏటువంటి ప్రకటనలు వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్ నెలకొంది.

  • టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్‌ ఐఆర్‌జీసీ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్‌ ఖదేమీ మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో ఖదేమీ మృతి చెందినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌ ‌జజీరా తెలిపింది.  

    ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ అధికారికంగా మజీద్‌ మరణాన్ని ధృవీకరించింది. ఐఆర్‌జీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ పలు కథనాలు ప్రసారం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మజీద్‌ మరణించారని ఐఆర్‌జీసీ ప్రకటించింది. మజీద్‌ గత ఐదేళ్లుగా ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చీఫ్‌గా పనిచేశారు. ఈ కాలంలో విదేశీ శక్తుల చొరబాటును అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ టీవీ కథనాలు కూడా ప్రస్తావించాయి.

    ఇరాన్ కు మరో బిగ్ షాక్..IRGC ఇంటలిజెన్స్ చీఫ్ ఖదేమీ మృతి

Sports

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

    అయితే తొలుత తేలికపాటి వర్షం పడడంతో తగ్గముఖం పడుతుందని అభిమానులు భావించారు. కానీ తర్వాత నెమ్మదిగా వర్షం తీవ్రత పెరిగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అప్పటికే ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో పాటు కట్-ఆఫ్ టైమ్ కూడా దగ్గరపడడం కాణంగా అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌(5) అగ్రస్థానానికి చేరుకుంది. కేకేఆర్‌ ఖాతాలో తొలిపాయింట్‌ వచ్చి చేరింది.

  • ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ త‌మ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. మంగ‌ళ‌వారం(ఏప్రిల్ 7) గువహటి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ కీల‌క పోరుకు ముందు ముంబై అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌కు అనారోగ్యం కార‌ణంగా దూర‌మైన ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి కోలుకున్నాడు.

    దీంతో రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌నున్నాడు. ఈ విష‌యాన్ని ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ధ్రువీక‌రించారు. "హార్దిక్ పాండ్యాకు ఎటువంటి గాయం కాలేదు. కేవలం అనారోగ్యం కారణంగానే గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మంగ‌ళవారం రాజ‌స్తాన్‌తో జ‌రిగే మ్యాచ్‌లో పాండ్యా త‌ప్పకుండా ఆడ‌తాడు
    మాంబ్రే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.

    కాగా శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోయింది. పాండ్యా రీఎంట్రీ ఇస్తే దీప‌క్ చ‌హ‌ర్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు(అంచ‌నా) : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, హార్దిక్ పాండ్యా మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, , జస్ప్రీత్ బుమ్రా

  • ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అమీ జోన్స్  వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి , ఆస్ట్రేలియా మ‌హిళా క్రికెట‌ర్ పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకుంది. 2022 నుంచి డేటింగ్‌లో ఉన్న వీరిద్ద‌రూ  గ‌తేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. 

    ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏప్రిల్ 4న వీరిద్దిరి వివాహం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జోన్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. వీరి వివాహ వేడ‌క‌కు ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. కాగా మ‌హిళ‌ల బిగ్ బాష్ లీగ్‌-2023లో సంద‌ర్భంగా జోన్స్‌-పీపాకు ప‌రిచయం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ పెర్త్ స్కార్చ‌ర్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం హహిస్తున్నారు.

    ఇక‌ ఇటీవ‌ల మ‌హిళ‌ల క్రికెట్‌లో సేమ్ జేండ‌ర్ పెళ్లిల్లు కామ‌న్ అయిపోయాయి. వీరికంటే ముందు న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌- సహచరి లియా, ఇంగ్లండ్ స్టార్‌ ప్లేయ‌ర్లు స్కివ‌ర్-కేథ‌రిన్ బ్రంట్‌, ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్- కాప్‌, డానియెల్‌ వ్యాట్‌- జార్జీ హోడ్జ్ జంట‌లు పెళ్లి చేసుకుని అంద‌రిని షాక్‌కు గురి చేశారు. అమీ జోన్స్ ఇంగ్లండ్ జ‌ట్టులో కీల‌క స‌భ్యురాలిగా కొన‌సాగుతోంది.
    చదవండి: IPL 2026: ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు

  • ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్‌.. త‌న ఆట ప‌రంగా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లో విఫ‌ల‌మ‌య్యాడు.

    ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గ్రీన్ కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్‌.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. 

    ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. 

    కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుం‍చి ఇంకా అనుమతి లభించలేదు.
    చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్‌రైజర్స్ ఫిర్యాదు?

  • IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి ఔట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

    ఈడెన్‌ గార్డెన్స్‌లో భారీ వర్షం
    ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్‌ ఇప్పటిలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు. మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు.

    వ‌ర్షం అంత‌రాయం
    ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆట నిలిచిపోయే సమయానికి కేకేఆర్‌ స్కోర్‌:25-2

    కేకేఆర్‌కు భారీ షాక్‌
    టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జేవియర్ బార్టలెట్  వేసిన రెండో ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు ఫిన్ అలెన్‌(6),కామెరూన్ గ్రీన్(4) వికెట్లను కేకేఆర్ కోల్పోయింది. 

    ఐపీఎల్‌-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌ స్టార్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ దూరమయ్యారు.

    వారిద్దరి స్ధానంలో నవ్‌దీప్ సైనీ, పావెల్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా పంజాబ్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉండగా.. కేకేఆర్‌ మాత్రం ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.

    తుది జట్లు:
    పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

    ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ బ్రార్

    కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

    ఇంపాక్ట్ సబ్‌లు: బ్లెస్సింగ్ ముజారబానీ, మనీష్ పాండే, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, సౌరభ్ దూబే

  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేస‌ర్ అవేష్ ఖాన్‌కు పేరుకు త‌గ్గ‌ట్టే అవేషం ఎక్కువే. గ‌తంలో త‌న చ‌ర్య‌లతో భారీ జ‌రిమానా ఎదుర్కొన్న అవేష్ ఖాన్‌.. ఇప్పుడు మ‌రోసారి త‌న అత్యుత్సాహంతో చిక్కుల్లో ప‌డ్డాడు. ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ్డాయి.

    అసలేం జరిగింది?
    ఈ మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో విజ‌యానికి తొమ్మిది ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ వేసిన ఆ ఓవ‌ర్‌లో తొలి రెండు బంతుల‌ను పంత్ బౌండ‌రీలగా మ‌లిచాడు. దీంతో స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. ఆ త‌ర్వాతి రెండు బంతులకు ఎలాంటి ప‌రుగు కాలేదు. ఐదో బంతిని పంత్  మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీకి తరలించాడు. అయితే ఆ బంతి బౌండరీ లైన్‌ను తాకకముందే, డ‌గౌట్ వ‌ద్ద అవేష్ ఖాన్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శ‌రించాడు.

    తదుపరి బ్యాటింగ్ కోసం ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్న ఆవేష్ ఖాన్.. బయటి నుండి బ్యాట్‌తో ఆ బంతిని కొట్టాడు. కానీ దీన్ని ఎవరూ గమనించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినట్టు నిర్థారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు తమ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఎస్ఆర్‌హెచ్ ఇది గ‌మ‌నించి ఫిర్యాదు ఉంటే ల‌క్నోకు ఐదు పరుగులు పెనాల్టీ ప‌డేద‌ని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

    రూల్స్ ఏమి చెబుతున్నాయి?
    నిబంధనల ప్ర‌కారం.. బంతి లైన్ దాటకముందే బయటి ఉన్న వ్యక్తి తాక‌కూడ‌దు. లా 20.4.2: మైదానం బయట ఉన్న వ్యక్తి ఆటలో జోక్యం చేసుకుంటే, అంపైర్ ఆ బంతిని 'డెడ్ బాల్'గా ప్రకటించవచ్చు. అంతేకాకుండా లా 41 (అన్‌ఫెయిర్ ప్లే) ప్రకారం.. ఆ బంతిని ర‌ద్దు చేసి స‌ద‌రు జ‌ట్టుకు 5 ప‌రుగులు పెనాల్టీ విధిస్తారు. 
    అయితే అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో ఎస్ఆర్‌హెచ్‌ ఫిర్యాదు చేసినా అంపైర్‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోపోయేవార‌ని  విశ్లేషకులు చెబుతున్నారు.

    బీసీసీఐకి స‌న్‌రైజ‌ర్స్ ఫిర్యాదు?
    అయితే ఘటన మాత్రమే కాకుండా, ఈ సీజన్ లో జరిగిన మరికొన్ని అంపైరింగ్ నిర్ణయాలపై సన్‌రైజర్స్ యాజ‌మాన్యం గుర్రుగా ఉంది. దీనిపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ఎస్ఆర్‌హెచ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ అవుట్‌పై కూడా ఎస్ఆర్‌హెచ్‌ అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తీరు కూడా వివాద‌స్ప‌ద‌మైంది.

  • టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథిగా వ్యవహరించిన ఈ ముంబైకర్‌.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇక గతేడాది వేలంలో రూ. 26.75 కోట్లు పైగా వెచ్చించి పంజాబ్‌ కింగ్స్‌ అతడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

    పైసా వసూల్‌ ప్రదర్శన
    ఈ క్రమంలో ఐపీఎల్‌-2025లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పంజాబ్‌కు పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). మొత్తంగా 17 మ్యాచ్‌లలో 604 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. సారథిగా పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

    ఇక ఐపీఎల్‌-2026 టోర్నీని కూడా శ్రేయస్‌ అయ్యర్‌ ఘనంగా ఆరంభించాడు. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించుకున్నాడు. బ్యాటర్‌గా రెండు మ్యాచ్‌లలో కలిపి 68 పరుగులు రాబట్టాడు. ఇదిలా ఉంటే.. గతేడాది దేశీ క్రికెట్‌లోనూ ముంబై తరఫున అయ్యర్‌ అదరగొట్టాడు.

    అయినప్పటికీ భారత టీ20 జట్టుకు సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోనే లేదు. అయితే, పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ వైశాఖ్‌ విజయ్‌కుమార్‌ మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ తప్పక టీమిండియా టీ20 కెప్టెన్‌ అవుతాడని అంచనా వేశాడు. సారథి అయ్యేందుకు అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొనియాడాడు.

    త్వరలోనే టీమిండియా కెప్టెన్‌ అవుతాడు
    ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘జట్టులోని ప్రతి బౌలర్‌, ప్రతి ఆటగాడికి అతడు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. బాగా ఆడినా.. ఆడకపోయినా వారికి అండగానే ఉంటాడు. ఆటగాళ్లకు కావాల్సింది ఇలాంటి కెప్టెనే.

    టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా అతడు అత్యద్భుతంగా ఆడుతున్నాడు. కచ్చితంగా అతడు త్వరలోనే టీమిండియా కెప్టెన్‌ అవుతాడు’’ అని వైశాఖ్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నాడు. కాగా వైశాఖ్‌ పంజాబ్‌ తరపున ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. 

    ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ 2023, డిసెంబరులో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు శ్రేయస్‌ అయ్యర్‌.

    చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

  • ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది. ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ విజయంతో పాటిదార్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.

    ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు సీఎస్‌కే ముందు 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక సీఎస్‌కే 207 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆశ్చ‌ర్య‌క‌ర‌ సంఘటన చోటు చేసుకుంది.

    ఏమి జరిగిందంటే?
    ర‌జ‌త్ పాటిదార్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ క్రీజులో ఉన్న‌ప్పుడు ఆర్సీబీ సెకెండ్ డ్రింక్స్ బ్రేక్‌ను తీసుకుంది. సాధార‌ణంగా డ్రిక్స్ బ్రేక్ స‌మ‌యంలో  కోచ్‌లు వ్యూహాలు పంచుకోవడానికి మైదానంలోకి వస్తుంటారు. ఈ క్ర‌మంలో ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్‌, బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌.. త‌మ బ్యాట‌ర్లు పాటిదార్‌, ప‌డిక్క‌ల్ కోసం డ్రింక్స్ తీసుకుని మైదానంలో లోప‌లికి వ‌చ్చారు. అయితే ఇక్క‌డే ఓ వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 

    పాటిదార్ కోసం తీసుకొచ్చిన డ్రింక్ బాటిల్‌ను అంపైర్ తీసుకుని తాగాడు. ఇది చూసిన పాటిదార్ వెంట‌నే అంపైర్ దగ్గరకు వెళ్లి తన బాటిల్ తనకు ఇచ్చేయమని అడిగాడు. దినేష్ కార్తీక్ కూడా అంపైర్‌తో కాస్త సీరియ‌స్‌గానే మాట్లాడాడు. ఆ పక్కనే ఉన్న ఆండీ ఫ్లవర్ ఇదంతా చూస్తూ సైలెంట్‌గా ఉన్నాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అయితే నెటిజ‌న్లు కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఈ ఘ‌ట‌న‌ను హాస్యస్పదంగా తీసుకుంటుంటే, మ‌రికొంత మంది పాటిదార్‌, కార్తీక్ తీరును త‌ప్పుబ‌డుతున్నారు.
    చదవండి: IPL 2026: రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!

     

     

     

  • టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్‌ సింగ్‌. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంతో ఈ మాజీ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్‌ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.

    అయితే, కెరీర్‌ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది.

    కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..
    ఈ విషయం గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా స్పోర్ట్స్‌ తక్‌ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్‌ ఇచ్చానని తెలిపాడు.

    అంతటి యువీకే తప్పలేదంటే
    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్‌ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్‌ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.

    అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన యువరాజ్‌ సింగ్‌ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్‌ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్‌మెంట్‌ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నాడు.  

    రో-కోలకు చెప్పండి
    కాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్‌ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్‌కప్‌-2026 రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు కూడా మేనేజ్‌మెంట్‌ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.

    చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

  • ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే హ్యాట్రిక్ ఓట‌ముల‌ను మూట క‌ట్టుకుంది. ఆదివారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో చెన్నై ప‌రాజ‌యం పాలైంది. 

    అయితే రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మ‌వుతున్న‌ చోట ఒక్క‌డు మాత్రం స‌త్తా చాటుతున్నాడు. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో సీఎస్‌కే మేనెజ్‌మెంట్ త‌నపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ కాదు టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంద‌ని నిరూపించుకుంటున్నాడు. అత‌డే ముంబై మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సర్ఫ‌రాజ్ ఖాన్‌.

    ధర తక్కువ.. క్వాలిటీ ఎక్కువ
    గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను కేవలం రూ.75 లక్షలకు మాత్రమే సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ కోట్ల ధర పలికిన సంజూ శాంసన్‌, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కంటే సర్ఫరాజ్ అద్భుతమైన ప్రదర్శనమైన కనబరుస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనుహ్యంగా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. 17 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌న్పించాడు. 

    ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 12 బంతుల్లోనే 32 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యపరిచాడు. ఆదివారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా స‌ర్ఫ‌రాజ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. 

    శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అయూశ్‌ మాత్రే సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔట్‌ అయితే.. ఈ ముంబైకర్‌ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం 99 పరుగులతో సీఎస్‌కే లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వేలంలో ఇతడిని వదిలేసిన జట్లు ఇప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాయి.

    28 కోట్ల ఆటగాళ్లు విఫలం
    కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సీఎస్‌కే ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై భారీ మొత్తం ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను తలా రూ.14.20 కోట్లు వెచ్చించి సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన వీరిద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన కార్తీక్ శర్మ.. ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. 

    ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ ఫామ్‌ను చూసి స్కౌటింగ్ టీమ్ అతడిపై అతిగా అంచనా వేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నయంగా ప్రశాంత్ వీర్‌ను సీఎస్‌ఎకే జట్టులోకి తీసుకుంది. 

    అయితే అతడితో ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం  ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు మ్యాచ్‌లు ఆడి 49 పరుగులు చేశాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 రన్స్ చేసి రాణించాడు. కానీ అతడు తీసుకుంటున్న జీతానికి ఇది ఏ మాత్రం సరిపోదు.
    చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. గతేడాది అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది సీఎస్‌కే. పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. తమ చరిత్రలో తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

    హ్యాట్రిక్‌ పరాజయాలు
    ఇక ఐపీఎల్‌-2026ను కూడా చెన్నై ఓటమితోనే ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిన సీఎస్‌కే.. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌కు మ్యాచ్‌ను చేజార్చుకుంది. తాజాగా ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన విఫలమైంది. ఈ నేపథ్యంలో చెన్నై ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.

    ధోని, బ్రెవిస్‌ దూరం
    ఇదిలా ఉంటే.. దిగ్గజ కెప్టెన్‌, చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన మహేంద్ర సింగ్‌ ధోని గాయం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమిండియా టీ20 స్టార్‌, వరల్డ్‌కప్‌ విజేత సంజూ శాంసన్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

    ఇక ధోనితో పాటు యువ ఆటగాడు, పవర్‌ హిట్టర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌కి ధోని అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. ధోని ఫిట్‌నెస్‌ పరీక్షకు సిద్ధంగా ఉన్నాడు.

    ఇద్దరూ వచ్చేస్తున్నారు
    అదే విధంగా డెవాల్డ్‌ బ్రెవిస్‌ కూడా ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా బ్రెవిస్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగల సత్తా ఈ సౌతాఫ్రికా ప్లేయర్‌కు ఉంది. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ..

    ‘‘తదుపరి మ్యాచ్‌ వరకు అంతా సర్దుకుంటుందనే అనుకుంటున్నాం. తర్వాతి మ్యాచ్‌కు మాకు ఐదు రోజుల సమయం ఉంది. ఈ ఓటమి బాధించింది. అయితే, మా ప్రణాళికలకు అనుగుణంగా తదుపరి మ్యాచ్‌లో ముందడుగు వేయగలమనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ ధోని, బ్రెవిస్‌ తిరిగి వస్తే సీఎస్‌కే గాడిన పడుతుందని చెప్పవచ్చు. కాగా తదుపరి మ్యాచ్‌లో సొంత మైదానం చెపాక్‌ వేదికగా చెన్నై ఏప్రిల్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

    చదవండి: ‘అప్పట్లో ఒకడు ఉండేవాడు వికెట్ల వెనుక!.. చిల్లర బుద్ధి’

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పాటు ఆ జట్టు యజమాని కావ్యా మారన్‌కు కూడా అభిమాన గణం ఎక్కువే. మ్యాచ్‌ సమయంలో స్టేడియానికి విచ్చేసి జట్టును ఉత్సాహపరచడం ఆమెకు పరిపాటి. ముఖ్యంగా హోం గ్రౌండ్‌ అంటే ఉప్పల్‌లో మ్యాచ్‌లో కావ్య తప్పక ఉండాల్సిందే.

    ఇక మ్యాచ్‌ ఆసాంతం తాను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లతో గత కొన్నేళ్లుగా కావ్యా మారన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఆమెకు పోటీగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యంలో భాగమైన అనన్య బిర్లా వచ్చి చేరింది. ముఖ్యంగా ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ తలపడగా.. వీరిద్దరు హైలైట్‌ అయ్యారు.

    తాజాగా ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడగా.. కావ్యా మారన్‌ ఈ మ్యాచ్‌కు హాజరైంది. మరోవైపు.. సాయంత్రం ఆర్సీబీ- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు అనన్య బిర్లా విచ్చేసింది.

    అయితే, ఈసారి అనన్య తనతో పాటు తన ప్రాణ స్నేహితురాలు, భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను కూడా తీసుకువచ్చింది. ఓవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. మరోవైపు.. అనన్య- సానియా స్టాండ్స్‌ నుంచి ఆర్సీబీ ఉత్సాహపరిచారు. ఇక సానియాతో పాటు ఆమె కుమారుడు ఇజహాన్‌ సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించాడు.

    ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అనన్య పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. సానియా- ఇజహాన్‌ల వెనుక వరుసలో తాను కూర్చుని ఉన్న ఫొటోను పంచుకున్న అనన్య.. ‘‘కలిసి ఫొటో దిగాలని ఎల్లప్పుడూ అనుకుంటాము. కానీ ఎప్పుడూ ఇలా కుదరలేదు. ఈసారి ఈ ఫొటో దొరికింది. ఐ లవ్‌ యూ సానియా.. ఇజ్జూ.. నువ్వు బెస్ట్‌ బాబూ’’ అని క్యూట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది.

    ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే.. లక్నో చేతిలో సన్‌రైజర్స్‌ ఓడిపోగా.. ఆర్సీబీని చెన్నైని చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్తానానికి చేరింది. ఈ క్రమంలో కావ్య నిరాశగా వెనుదిరగగా.. అనన్య బృందం సంబరాలు చేసుకుంది.

    చదవండి: IPL కాదు!.. PSL నంబర్‌ వన్‌: పీసీబీ చీఫ్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌

National

  • ఢిల్లీ: ఎన్నికల ప్రధానాధికారి  జ్ఞానేశ్వర్ కుమార్‌పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం తిరస్కరణకు గురైంది.తీర్మానంలోని అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించిన రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు. మరోవైపు లోక్‌సభలోనూ ఈ నోటీసు తిరస్కరణకు గురైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనిని తిరస్కరించారు.

    సీఈసీ జ్ఞానేశ్వర్ అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆయనపై విపక్షాలు మెుత్తంగా ఏడు  అభియోగాలు మోపాయి. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఇండియా కూటమి పక్షాలు ఉభయ సభల్లో నోటీసులు సమర్పించాయి. దీనిపై 63 మంది రాజ్యసభ ఎంపీలు, 130 మంది లోక్‌సభ ఎంపీలు సంతకం చేశారు. తాజాగా తీర్మానాన్ని రాజ్యసభ స్పీకర్ తిరస్కరించారు.

  • Assam Assembly Election 2026 గోలాఘాట్‌: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోనే అత్యంత అవినీతి పరుడు హిమంత బిశ్వ శర్మ అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే హిమంతపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం రాహుల్‌ అస్సాంలోని బిశ్వనాథ్, గోలాఘాట్‌ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. 

    రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్నారు. ‘మరికొన్ని రోజులు ఆయన్ను మాట్లాడనివ్వండి. ఆ తర్వాత అస్సాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్షమాపణ కోరినా వదిలేది లేదు. 10–15 రోజుల్లోనే ఆయన్ను జైలుకు పంపుతాం’అని పేర్కొన్నారు. శర్మ కుటుంబసభ్యుల అవినీతిపైనా చర్యలు తప్పవన్నారు. 

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండ

    సీఎం హిమంతతో కలిసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అస్సాంలో ‘ల్యాండ్‌ ఏటీఎం’ఏర్పాటు చేసి ప్రజల భూముల్ని బడాబాబులకు కట్టబెడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఇప్పటికే 98 వేల బిఘాల భూమి మూడు కార్పొరేట్‌ సంస్థలకు బదలాయించారని అన్నారు. ఈ సంస్థలు బీజేపీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఫలితంగా అమెరికా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అస్సాంను ఐక్యంగా ఉంచేందుకు జీవితాంతం కృషి చేసిన గాయకుడు జుబీన్‌ గర్గ్‌ తమ పార్టీకి ఆదర్శమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఆయన మాదిరిగా అస్సాం ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

    ఇదీ చదవండి: 17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు

  • మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసుస్టేషన్‌లో తండ్రి కొడుకును చిత్రహింసలకు గురి చేసి చంపిన కేసులో తొమ్మిదిమంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

    తమిళనాడు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈ రోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్ మరియు బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్‌పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్‌పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్ లతో పాటు మరో ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లకు ఉరిశిక్ష విధించారు.

    ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ కేసు అత్యంత అరుదైనదిగా పేర్కొంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం దారుణమని తెలిపింది. దాదాపు 6 ఏళ్ల పాటు సాగిన ఈ విచారణలో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. సమగ్ర విచారణ అనంతరం నిందితులందరికీ ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

    కేసు నేపథ్యం
    2020 జూన్ నెలలో లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి షాపు తెరిచి ఉంచారనే కారణంతో జయరాం, అతని కూమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రాత్రంతా లాకప్‌లో చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఇద్దరికి తీవ్రగాయాలై మరణించారు. సీబీఐ విచారణలో ఆ రాత్రంతా తండ్రీకొడుకులిద్దరినీ పోలీసులు అత్యంత క్రూరంగా శారీరక మరియు లైంగిక హింసకు గురిచేశారని తేలింది. అంతేకాకుండా పోలీసుల దెబ్బలకు బాధితులకు రక్తంవస్తే బాధితులే స్వయంగా ఆ రక్తపు మరకలను తుడిచివేసేలా పోలీసులు వారిని బలవంతం చేశారని విచారణలో వెల్లడైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

  • బీహార్‌లో  చోటుచేసుకున్న భారీ దోపిడీ  అక్కడి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గుజరాత్‌లోని  రాజ్‌కోట్‌కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారికి చెందిన రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని, అత్యంత పకడ్బందీగా, సినిమా ఫక్కీలో ప్లాన్‌ వేసి  కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్న  వైనం కలకలం రేపింది.

    పోలీసులు అందించిన సమాచారం  ప్రకారం రాజధాని పాట్నాలో దనాపూర్లోని ఖాగౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, దుండగులు బంగారు వ్యాపారి సిబ్బంది నుండి 17 కిలోల బంగారాన్ని దోచుకున్నారు. దీని విలువ సుమారు 25 కోట్ల రూపాయలు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి సంస్థ కేవీ & సన్స్ లో మహేష్ మమ్తోరా, ప్రిన్స్ రాన్‌పారియా అనే ఇద్దరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లిద్దరు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాల డెలివరీ ఇచ్చేందుకు రైలులో బీహార్‌కు వెళ్లారు. అక్కడ వారు రైల్వే స్టేషన్‌లో దిగీ దిగగానే, పక్కా ప్లాన్‌తో మోటార్‌సైకిళ్లు,  కారులోవచ్చిన  సుమారు ఎనిమిది మంది దుండగులు వీరిని చుట్టుముట్టారు.

    ఇదీ చదవండి: నో ఫుడ్‌,నో ఫోన్‌, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్‌ చేస్తే!

    అదీ కస్టమ్స్ శాఖ అధికారులుమంటూ వారిని చుట్టుముట్టారు. విచారణ జరపాలంటూ వారిని  భయపెట్టారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనగానే బాధితులు కూడా నిజమైన అధికారులు కావొచ్చని భ్రమపడ్డారు. దీంతో బాధితులను కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఆ తరువాత వారిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, వారి వద్ద ఉన్న రూ. 25 కోట్ల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. అనంతరం, దుండగులు అక్కడి నుండి ఉడాయించారు.  ఆ తర్వాత  తేరుకున్న బాధితులు సంస్థ యజమానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బీహార్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.ప్లాన్ తోనే ఈ దోపిడీ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాజ్‌కోట్‌లోని 'సోని బజార్' వ్యాపారుల మధ్య ఆందోళన మరియు అలజడిని రేకెత్తించింది. 

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

  • పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో బఫర్‌ స్టాక్స్ తగినంతగా ఉన్నయని తెలిపింది. ప్రజలకు రోజువారి అవసరాలకు సంబంధించిన నిత్యావసర ధరల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవని తెలిపింది. గోధుమ, బియ్యం, ఉల్లి, టమాట, ఆలు ధరలు స్థిరంగా ఉన్నాయని వాటి ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

    అదేవిధంగా దేశంలో ప్రస్తుతం ఎల్‌పీజీ కొరత తీవ్రతరమైన నేపథ్యంలో గ్యాస్‌ నిల్వలపై కీలక ప్రకటన చేసింది. ఎల్‌పీజీ సరఫరా తగిన మోతాదులో ఉందని రిఫైనరీలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొంది. గ్యాస్‌ కొరతపై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముడిచమురు సరఫరా సైతం తగినంతగా ఉందని తెలిపింది.

    కాగా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాలతో ఫోన్‌లో దౌత్య చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అదే విధంగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతోనూ మాట్లాడారు. 

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన కలకలం రేపింది. తల్లితండ్రులు ఆసుపత్రిలో  ప్రాణాపాయ చికిత్స పొందుతున్నారు. నగరవ్యాప్తంగా అనేక హోటళ్లలో ఆహారం కలుషితమైన ఘటనలు పదేపదే నమోదవుతున్న నేపథ్యంలో మరో విషాదం తీవ్ర ఆందోళన రేపుతోంది.

    ఈ ఘటన చంద్ఖేడా ప్రాంతంలో  జరిగింది. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోగా, వారి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. వీరు మార్కెట్ నుంచి  రెడీ మేడ్‌  దోస పిండిని (ఖీరు) కొనుగోలు చేశారు  ఆ పిండితో చేసిన దోసెలు తిన్న తర్వాత, కుటుంబ సభ్యులందరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహా (మూడు నెలల పసికందు), మిశ్రి(నాలుగేళ్ల బాలిక) చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు తల్లి భవనా ప్రజాపతి,  తండ్రి విమన్‌  ప్రజాపతి  కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    అయితే, సాధారణంగా పసిపిల్లలకు ఘన ఆహారం ఇవ్వరు కాబట్టి, ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన తర్వాత తల్లి బిడ్డకు పాలివ్వడం వల్లనే  మూడు నెలల పసికందు ప్రభావితమై ఉండవచ్చని భావిస్తున్నారు.

    “మా అబ్బాయి రాత్రి సుమారు 8:00 గంటలకు ఐఓసీ రోడ్డులోని ఘనశ్యామ్ డెయిరీ నుంచి పిండి తెచ్చాడు. దానితో దోసె వేసుకుని తిన్నాడు. మరుసటి రోజు ఉదయం, అతనికి వాంతులు మొదలవడంతో ఆసుపత్రిలో చేర్పించాం.  ఆ తర్వాత, ఆహారం వల్ల అనారోగ్యం వచ్చిందని తెలియని అతని భార్య కూడా అదే పిండిని తిని, వారి చిన్నారికి దోసె తినిపించింది. మరుసటి రోజు నుంచి, వారికి కూడా వాంతులు మొదలయ్యాయి’’ అని విమల్ తండ్రి, గౌరీశంకర్ తెలిపారు. ప్రస్తుతం తన కొడుకు కోడలు కేడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    ఇదిలా ఉండగా, చంద్ఖేడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఆహార నమూనాలను సేకరించారు.   మరణానికి  మరణినాకి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించుకోవడానికి, పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) సహాయాన్ని కూడా కోరారు. ఫుడ్ పాయిజనింగ్ కేసు, పిండిలో కల్తీ, లేదా మరేదైనా అనుమానాస్పద కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇదీ చదవండి: నో ఫుడ్‌,నో ఫోన్‌, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్‌ చేస్తే!

    ఈ ఘటనపై ఘనశ్యామ్ డైరీ యజమాని కేతన్ పటేల్ ఇలా అన్నారు, తాముతిరోజూ సుమారు 100 నుండి 125 కిలోల ఖీరును విక్రయిస్తాం, చాలా వినియోగదారులున్నారు, దీన్ని ఘనశ్యామ్ డైరీలోనే తయారు చేస్తాం.  ఒకవేళ ఆ పిండి నిజంగానే పాడై పోయి ఉంటే, పలువురు వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులొచ్చి ఉండేవి. ఈ ఒక్క ఫిర్యాదు తప్ప, మరెవరి నుండీ ఇటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. దర్యాప్తునకు తాము సహకరిస్తున్నామని చెప్పారు. 

    ఇదీ చదవండి: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య, షాక్‌లో ఇండస్ట్రీ

    మరోవైపు  అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆహార విభాగం అధికారి డాక్టర్ తేజస్ షా మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

  • తిరువ‌నంత‌పురం: కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై మాట‌ల దాడులు, తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌చారాన్ని హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నేత‌, వ‌య‌నాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా త‌మ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నారు. సోమ‌వారం మ‌ల‌ప్పురంలో ప్ర‌చారం సాగించిన ఆమె.. బీజేపీ, సీపీఎం పార్టీల‌పై విరుచుకుప‌డ్డారు. సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఈ రెండు పార్టీలు చేతులు క‌లిపాయ‌ని ఆరోపించారు. బీజేపీతో సీపీఎం కుమ్మ‌క్క‌యింద‌ని విమ‌ర్శించారు.

    మరోసారి అధికారం దక్కించుకోవ‌డం కోసం కాషాయ పార్టీతో క‌మ్యూనిస్టులు డీల్ మాట్లాడుకున్నార‌ని ప్రియాంక ధ్వ‌జ‌మెత్తారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కోసం అధికార ఎల్‌డీఎఫ్ సిద్ధాంతం, జవాబుదారీతనం, బాధ్యతల విషయంలో రాజీ పడుతోందని ఆరోపించారు. మైనారిటీలను, ముఖ్యంగా క్రైస్త‌వుల‌ను వేధించే బీజేపీతో ఎల్‌డీఎఫ్ ఒప్పందం చేసుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎల్‌డీఎఫ్ నేత‌లు, మంత్రుల్లో అహంకారం పెరిగిపోయింద‌ని విమ‌ర్శించారు. ప్రజల పట్ల ప్రతి నాయకుడికి ఉండాల్సిన బాధ్యత, జవాబుదారీతనం కొర‌వ‌డింద‌ని మండిప‌డ్డారు.

    మోదీకి వ్య‌తిరేకంగా మాట్లాడితే అంతే
    ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం శబరిమలలో భారీగా దొంగతనం జరిగితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నుంచి క‌నీస స్పంద‌న క‌రువైంద‌ని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. బీజేపీ-ఎల్‌డీఎఫ్ ఒప్పందానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాల‌ని ప్ర‌శ్నించారు. ఎవరైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం విప్పితే.. వారు సీబీఐ, ఈడీ లేదా ఆదాయపు పన్ను కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంద‌న్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అలాంటి ఒక్క కేసు కూడా లేక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. 

    చ‌ద‌వండి: టికెట్ నిరాక‌ర‌ణ‌పై మౌనం వీడిన అన్నామ‌లై

    ఒకే దెబ్బ‌తో రెండు పార్టీల‌కు చెక్!
    కాగా, బీజేపీతో ఎల్‌డీఎఫ్ ర‌హ‌స్య పొత్తు పెట్టుకుంద‌ని ఇంత‌కుముందే రాహుల్ గాంధీ ఆరోపించారు. మైనార్టీల‌పై దాడులు చేయించిన బీజేపీతో ఎలా  చేతులు క‌లుపుతార‌ని ప్ర‌శ్నించారు. మోదీకి కేర‌ళ సీఎం భ‌య‌ప‌డుతున్నారని, త‌న కేసుల నుంచి కూతురిని కాపాడుకునేందుకు బీజేపీ చెప్పిన‌ట్ట‌ల్లా వింటున్నార‌ని విమ‌ర్శించారు. ఎల్‌డీఎఫ్‌-బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయ‌ని రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌నే తాజాగా ప్రియాంక గాంధీ ఉటంకించారు. ఒకే దెబ్బ‌తో రెండు పార్టీల‌కు చెక్ పెట్టాల‌న్న వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ అగ్ర నేత‌లు ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ ఆరోణ‌ల‌ను అధికార ఎల్‌డీఎఫ్ నాయ‌కులు తోసిపుచ్చారు. కాగా, ఏప్రిల్ 9న కేర‌ళ ఎన్నికల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 4న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

  • పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్‌కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్‌ ప్రగల్భాలు పలుకుతుంటే  మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) ‍నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్‌కతా  (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

    మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎ‍న్నికల సభలో బెంగాల్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడే మోదీ కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్‌ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    అదే ఏవరైనా భారత్‌ అదే విధంగా కోల్‌కతాను టార్గెట్‌ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

  • ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేగింది. ఓ మాస్క్‌ ధరించిన అగంతకుడు తన కారుతో అసెంబ్లీ వీఐపీ ఇనుప గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకెళ్లాడు. స్పీకర్‌ రూమ్‌ ఎదురు బొకే ఉంచి.. స్పీకర్‌ కారుపై ఇంకు చల్లాడు. అనంతరం తన కారుతో పరారయ్యాడు. 

    పోలీసులు సమాచారం మేరకు.. ముసుగు ధరించిన వ్యక్తి కారులో వచ్చి గేట్ నంబర్ 2 వద్ద ఇనుప గేటును బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించాడు. డ్రైవర్‌ అసెంబ్లీ స్పీకర్‌ విజయేందర్‌ గుప్తా కార్యాలయం వైపు వెళ్లాడు. ఆపై స్పీకర్‌ ఛాంబర్‌ ఎదుట బూకే ఉంచడం, ఆయన కారుపై ఇంక్‌ చల్లడం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవడం అంతా సినిఫక్కీలో జరిగినట్లు అసెంబ్లీ అధికారులు తెలిపారు.  

    అంగతకుండి తీరుపై అనుమానంతో అప్రమత్తమైన బాంబు స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. మాస్క్‌ మ్యాన్‌ ఉంచిన పూల బుకేలో పేలుడు పదార్ధాలు ఉన్నాయేమోనని పరిశీలించింది. అందులో ఎలాంటి పేలుడు, అనుమానాస్పద వస్తువులు లేదని నిర్ధారించింది.   

    అసెంబ్లీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. మాస్క్‌ మ్యాన్‌ కారు ఉత్తర ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

    ఢిల్లీ అసెంబ్లీ ఘటన కేసులో అగంతకుడు సరబ్ జీత్  సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ ఢిల్లీలోని రూప్ నగర్‌లో సరబ్ జీత్  సింగ్ కారు పార్కు చేసినట్లు గుర్తించారు. ఆపై సరబ్‌ జీత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.    

    అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు, స్పీకర్ కారుపై ఇంక్ చల్లి పారిపోయిన దుండగులు

  • అడవుల్లో తప్పిపోయి నాలుగురోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా  ఒంటరిగా గడిపింది.  ఎటు చూసినా భయంకరమైన శబ్దాలతో తీవ్ర భయభ్రాంతులకు లోనైంది. మరోవైపు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది. చివరికి క్షేమంగా బయటపడిన వైనం విశేషంగా నిలిచింది.  అసలేం జరిగింది?

    కేరళలోని కోజికోడ్‌కు చెందిన జి.ఎస్. శరణ్య (36), కొచ్చిలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు 12 మంది సభ్యుల బృందంతో కలిసి ట్రెకింగ్  బయలుదేరారు.   కొండపైకి చేరి, కిందకు దిగుతుండగా, మిగిలినవారితో పోలిస్తే  వేగంగా నడిచి ముందుకు వెళ్లింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, వారు ఒక బండరాయిపై కూర్చుని కనిపించారు. వస్తారులే అని అక్కడే కూచ్చుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి, వారు ఎక్కడా కనిపించలేదు. పిట్‌స్టాప్‌కు చేరుకుని  ఇతర ట్రెక్కర్ల కోసం వెతికింది.  అలా శరణ్య  ఆ అడవుల్లో దారి  తప్పిపోయింది.  

    ఇదీ చదవండి:  5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం

    హోమ్‌ స్టే యజమానికి ఫోన్ చేసి తాను దారి తప్పానని, అధికారులకు తెలియజేయమని సమాచారం ఇచ్చింది. నేను తప్పిపోయిన అన్న మెసేజ్‌ స్నేహితులికిచ్చేలోపే ఫోన్‌ స్విచాఫ్‌ అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న శరణ్య, ఒక వాగు పక్కన ఉన్న పెద్ద రాయిపై కూర్చుని తనను ఎవరైనా రక్షిస్తారా అని  ఎదురు చూస్తూ గడిపింది. ట్రెకింగ్ వెళ్లినందువల్ల వెంట పెద్దగా ఆహారం కూడా ఏమీ తీసుకెళ్లలేదు. కేవలం  అర లీటర్‌ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆకలిని తట్టుకునేందుకు వాగులోని  నీటినే  రోజుకు 3 లీటర్ల చొప్పున  తాగుతూ  కాలం గడిపింది.

    చుట్టూ చీకటి, భయంకరమైన శబ్దాలు

    పైగాఅది వన్యప్రాణులు సంచరించే ప్రాంతం అది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో రాత్రిపూట నాలుగు వైపుల నుంచీ వింత శబ్దాలు వినిపించినా, ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడింది. చివరికి ఒక మారుమూల ప్రాంతంలో స్థానిక నివాసితులు ఆమెను గుర్తించారు. ఒక భావోద్వేగభరిత క్షణాలమధ్య  తన ఇద్దరు మామయ్యలు, ఒక సోదరుడు , ఆఫీసు సహోద్యోగులను కలుసుకుంది. ఆదివారం నాడు ఆమె అడవి నుండి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ ఘటపై స్పందిస్తూ ఆశ్చర్యకరంగా తనకు పెద్దగా ఆకలి, భయం వేయలేదని తన అనుభవాన్ని శరణ్య గుర్తు చేసుకుంది. భవిష్యత్తులో కూడా తాను ట్రెకింగ్ కొనసాగిస్తానని ఆమె ధైర్యంగా చెప్పడం విశేషం

Business

  • ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేశాడు.

    అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.

    పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.

    ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!

    అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్‌కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.

    కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.

  • బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది.

  • చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్‌లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..

    ➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం
    ➤ పీపీఎఫ్‌: 7.1 శాతం
    ➤ సేవింగ్స్‌ డిపాజిట్‌ రేటు: 4 శాతం
    ➤ కిసాన్‌ వికాస్‌ పత్ర: 7.5 శాతం
    ➤ నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్: 7.7 శాతం
    ➤ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌: 7.4 శాతం
    ➤ సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: 8.2 శాతం
    ➤ ఏడాది టైమ్‌ డిపాజిట్‌: 6.9 శాతం
    ➤ రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7 శాతం
    ➤ మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.1 శాతం
    ➤ ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌: 7.5 శాతం
    ➤ ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ): 6.70 శాతం

  • కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు వస్తుండటంతో.. భారతదేశ రాహదారి వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే జాతీయ రహదారులలో పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఏర్పాటు ఒక సవాలుగా మారిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి.. రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ట్వీట్‌లో.. MoRTH 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్'ను ప్రకటించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్ల గురించి తెలియజేయమని ప్రయాణికులను కోరింది. ఒకవేళ వినియోగదారుడు అపరిశుభ్రమైన మరుగుదొడ్లను గమనిస్తే.. దాని ఫోటోను రాజమార్గయాత్ర యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఇలా చేస్తే.. వారికి రూ. 1,000 ఫాస్ట్‌ట్యాగ్ క్రెడిట్ లభిస్తుంది. ప్రజా మౌలిక సదుపాయాల పర్యవేక్షణలో భాగంగా.. జాతీయ రహదారులపై పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.

  • పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ వంటి ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలు ఇరాన్‌తో జరిపిన చర్చలు సఫలం కావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    రెండు రోజుల్లో 21 నౌకల ప్రయాణం

    గత వారాంతంలో ఈ జలమార్గం గుండా ఏకంగా 21 నౌకలు ప్రయాణించాయి. మార్చి మొదటి వారంలో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ 21 నౌకలలో 13 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఇరాన్ నౌకల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిత్రదేశం అనే కారణంతో ఇరాక్ ముడి చమురు ట్యాంకర్లకు టెహ్రాన్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. భారతదేశం ఇరాన్‌తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఎనిమిది ఎల్‌పీజీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డాయి.

    అగ్రరాజ్యం హెచ్చరికలు

    యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. నౌకల ప్రయాణంపై టోల్ వసూలు చేసే ప్రక్రియను చట్టబద్ధం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకువస్తామని చెప్పింది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఈ రుసుములతోనే భర్తీ చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత్, చైనా, గ్రీస్‌, టర్కీ, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ సూచించిన తీర ప్రాంత మార్గాల గుండా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

  • ఇండియన్ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8,500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా.. ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేస్తారు. అయితే.. ఒక రైల్వే స్టేషన్ మాత్రం.. అక్కడికి వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్, వీసా అవసరం. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్'.. భారతదేశంలో చివరి రైల్వే స్టేషన్‌గా పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్తారు. అందువల్ల.. ఈ స్టేషన్‌లో ప్రవేశించాలంటే భారతీయ పౌరులు కూడా తప్పనిసరిగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి.

    ఇక్కడ రూల్స్ అన్నీ కూడా చాలా కఠినంగా అమలు చేస్తారు. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ స్టేషన్‌లోకి ప్రవేశిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫారిన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించినవారికి జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేషన్‌ను సందర్శించాలనుకునే వారు ముందుగానే అన్ని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

    ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!

    ఈ స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుంది. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అయితే, కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ రైలు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడం కూడా జరిగింది. అటారి స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కూడా ఉండరు. కాబట్టి ప్రయాణికులు తమ లగేజ్ తామే మోసుకోవాల్సి ఉంటుంది. అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ చిన్నదే అయినప్పటికీ.. మంచి సౌకర్యాలతో ఉంటుంది.

  • పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు అయిన భారతదేశం సుమారు 2.5 మిలియన్ (25 లక్షల) టన్నుల యూరియాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

    టెండర్ల జారీ

    ప్రభుత్వ పక్షాన ఎరువుల కొనుగోళ్లు జరిపే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్‌) ఇటీవల భారీ అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల యూరియాను పశ్చిమ తీర నౌకాశ్రయాల ద్వారా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన మొత్తాన్ని తూర్పు తీర ప్రాంతాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎరువుల రవాణా నౌకలు జూన్ 14వ తేదీ నాటికి సంబంధిత ఓడరేవుల నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. టెండర్ల ఆఫర్ల సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా, ఇవి ఏప్రిల్ 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

    భారతదేశ యూరియా ఉత్పత్తి ప్రధానంగా సహజ వాయువుపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా వినియోగించే సహజ వాయువులో మెజారిటీ భాగం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హార్మూజ్‌ జలసంధి వద్ద రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎల్‌ఎన్‌జీ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో గత నెలలో దేశంలోని కొన్ని కీలక ఎరువుల ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

    ఖరీఫ్ సన్నద్ధత - నిల్వల వివరాలు

    జూన్-సెప్టెంబర్ వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ టన్నుల ఎరువులు అవసరమని ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వ 18 మిలియన్ టన్నులుగా ఉంది. మిగిలిన 21 మిలియన్ టన్నులను దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

    ఇదీ చదవండి: ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

  • సోమవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 787.30 పాయింట్లు లేదా 1.07 శాతం లాభంతో 74,106.85 వద్ద, నిఫ్టీ 255.15 పాయింట్లు లేదా 1.12 శాతం లాభంతో 22,968.25 వద్ద నిలిచింది.

    అల్పా లాబొరేటరీస్ లిమిటెడ్, STL గ్లోబల్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్కేఈసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్, రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్‌) లిమిటెడ్, హరియోమ్ పైప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గీకే వైర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • జాతీయ రహదారులపై ప్రయాణించేవారి ప్రయాణాన్ని మరింత సుగమనం చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఫాస్ట్‌ట్యాగ్. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా వెల్లడించింది.

    ఎన్‌హెచ్ఏఐ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు ఉండవు. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే అన్నమాట. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు NHAI స్పష్టం చేసింది.

    ఇప్పటివరకు టోల్ చెల్లింపుల కోసం నగదు, ఫాస్ట్‌ట్యాగ్ వంటి పద్ధతులు ఉపయోగించేవారు. కానీ కొత్త నియమాల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ ప్రధాన చెల్లింపు విధానంగా మారుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది.. వాహనాల ముందుభాగంలో అమర్చే ఒక ఎలక్ట్రానిక్ ట్యాగ్, ఇది టోల్ ప్లాజా వద్ద స్కాన్ చేయబడుతూ ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అవుతుంది. దీనివల్ల వాహనాలు ఆగకుండా సులభంగా ముందుకు వెళ్లగలుగుతాయి.

    అయితే.. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారులకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. వారు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. కానీ ఇలా టోల్ ఫీజు చెల్లించేవారు సాధారణ టోల్ ఫీజుకంటే కూడా 25 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఫాస్ట్‌ట్యాగ్ వాడటం ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

  • జియో నుంచి అదిరిపోయే ప్లాన్‌! కేవలం రూ. 339లకే పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను రిలయన్స్ జియో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా 28 రోజుల ప్లాన్‌లతో విసిగిపోయిన కస్టమర్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఈ కొత్త ప్లాన్ విశేషాలేంటో తెలుసుకుందాం.

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 349 ప్లాన్ కంటే ఇది రూ. 10 తక్కువ ధరకే లభించడం విశేషం. ఈ ప్లాన్ ద్వారా ఏడాదికి 13 సార్లు కాకుండా, కేవలం 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.

    రూ. 339 ప్లాన్ ప్రయోజనాలు
    పూర్తి 31 రోజుల క్యాలెండర్ నెల వ్యాలిడిటీ.
    రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా.
    ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్.
    రోజుకు 100 SMSలు ఉచితం.
    అదనంగా రూ. 14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా లభిస్తుంది.
    సుమారు రూ. 35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో' సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
    ఏకంగా 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
    జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌తో పాటు నానో బనానా (Nano Banana) సేవలకు కూడా యాక్సెస్ లభిస్తుంది.

    5G వినియోగదారులకు గమనిక
    ఈ ప్లాన్‌లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక చిన్న పరిమితి ఉంది. రూ. 349 ప్లాన్ మాదిరిగా ఇందులో అపరిమిత 5G డేటా సౌకర్యం లేదు. మీరు 5G నెట్‌వర్క్‌ను అపరిమితంగా వాడాలనుకుంటే మాత్రం రూ. 349 ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Andhra Pradesh

  • ప్రకాశం:   ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకి వివిధ చోట్ల ఐదుగురు మృత్యవాత పడ్డారు. ఏపీలో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, ఉమ్మడి జిల్లాలో  ఉరుములు మెరుపులతో  కూడిన వర్షం పడింది. 

    ఈ పిడుగుపాటు కారణంగా జిల్లాలోని పుల్లల చెరువులోని మొక్కజొన్న ఫ్యాక్టరీ పిడుగుపడి కన్నయ్య(28) మృతి చెందగా, పుల్లల చెరువు మండలం యంద్రపల్లిలో పొలంలో పని చేస్తున్న బొండపాటి నాగయ్య మృతి చెందారు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన దుర్గేష్ పిడుగు పాటుకి మృతి చెందాడు. సాయంత్రం ఒక్కసారి ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం పడింది. పలుచోట్ల పిడుగు పాట్లతో జిల్లాలో టెన్షన్ వాతావరణం అలుముకుంది. 

    కాగా, ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

    ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ విధించింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    మరోవైపు.. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. 

  • తాడేపల్లి: తమ నేతలను కించపరిచేలా ఏబీఎన్‌ అల్లిన కథనాలపై  వైఎస్సార్‌సీపీ.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఏబీఎన్‌ కథనాలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మూడు పేజీల లేఖలు రాశారు ఎమ్మెల్సీ లేళ్ల. అభ్యంతరకర కథనం ప్రసారం చేసిన చానల్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

    తమ పార్టీ నేతలను కించపరిచేలా..సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం ప్రసారం చేశారన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ఏబిఎన్ వ్యవహరించిందంటూ ఫిర్యాదు చేశారు. ఇది అత్యంత అనైతిక చర్య అనీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. 

  • సాక్షి,విజయవాడ: ఏపీలో పంచాయతీ కార్యదర్శులకు కూటమి సర్కార్‌ బిగ్‌ షాకిచ్చింది. జీవో నెం 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. 

    గతంలో పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్ రూ.28280 ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.25220కి తగ్గించింది. పేస్కేల్‌ తగ్గిస్తూ జీవో నెంబర్‌.91ను సవరణ చేసింది. అయితే కూటమి సర్కార్‌ తీరుపై పంచాయతీ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని  డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే పోరాటం తప్పదని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 

  • సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

    ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది.

  • సాక్షి,విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మావిగన్‌ ప్రతిపాదనతో చంద్రబాబుకి వెన్నులో వణుకుపుడుతోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు.  ఈ రోజు( సోమవారం) వైజాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  

    ‘తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయెుచ్చనే ఆలోచనతో చంద్రబాబు భయపడుతున్నారన్నారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు వారికి అర్ధమవుతుంది. మావిగన్ ప్రతిపాదన అమరావతి అవినీతిపై ఎక్కు పెట్టిన గన్‌లా వారికి కనిపించింది. రూ.20 వేల కోట్ల ఖర్చు చేస్తే మచిలీపట్నం విజయవాడ గుంటూరు అభివృద్ధి చెందుతుంది.  ఇదివరకే అమరావతి కోసం చంద్రబాబు రూ. ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేశారు. అమరావతి కోసం చంద్రబాబు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారని ఏబీఎన్‌ రాధాకృష్ణ రాస్తున్నారు.ఓ వైపు జీతాలకు డబ్బులు లేవని ఆర్ధిక మంత్రి  అంటూనే మరోవైపు వృథాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.  

    కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని, కమ్మరావతి పిలుస్తున్నారు. అమరావతి అందరి రాజధాని అయితే కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి మాటలను కూటమి నేతలు ఎందుకు ఖండించడం లేదు. ఏబీఎన్ రాధా కృష్ణ చెత్త పలుకు రాసారని దిగజారి రాతలు రాస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై  కడుపు మంటతోనే తప్పుడు రాతలు రాస్తున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడనే పదమే కూటమి ప్రభుత్వానికి ఉరుకులు పెట్టిస్తోందని వ్యాఖ్యానించారు.  

    జగన్ పెట్టిన "GUN" అందుకే బాబు గుండెల్లో దడ...
  • వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ‘మావిగన్‌’ ప్రతిపాదనను ప్రజలు హర్షిస్తున్నారని అర్థం కావడంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్‌ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

    ‘మావిగన్‌ ప్రతిపాదనను ప్రజల నుంచి తప్పించడం చేతకాక ఇక పచ్చ మీడియాను రంగంలోకి దించారు. చంద్రబాబుకు శిఖండి మాదిరిగా ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రిక రంగంలోకి దిగింది. రాధాకృష్ణ చేస్తుంది జర్నలిజం కాదు... బ్రోకరిజం. వీకెండ్‌ కామెంట్స్‌ పేరుతో రాధాకృష్ణ తీరు అత్యంత దారుణంగా మారింది. 

    మేము వెన్నెముక లేని మనుషులమని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల పట్ల నీచంగా, అనుచితంగా మాట్లాడారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అవమానం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమే. రాధాకృష్ణ... నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా.. నీలా మేం మాట్లాడితే? కానీ, మేం అంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడలేం. 

    చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ జర్నలిజం అంటావా? ప్రజలు చంద్రబాబు ఎంతటి నీతి బాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో గమనించాలి. కేవలం జగన్‌ మావిగన్‌ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా?

    మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన చేశారు. రూ.2 లక్షల కోట్లు పెట్టి, ఆచరణలో సాధ్యంకాని భ్రమరావతిని ఊహించుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం.

     కేవలం రూ.20 వేల కోట్లతో ఇది గ్రోత్‌ ఇంజిన్‌గా తయారవుతోందని ఆచరణ సాధ్యమైన ప్రతిపాదన చేశారు. దానికే కోట్లు ఖర్చు చేసి సోషల్‌ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్‌ చేయిస్తున్నారు. నీచాతినీచంగా టీడీపీ మూకలు ట్రోలింగ్‌ చేయిస్తూ వికృతానందం పొందుతున్నాయి. మంత్రులు, చోటా మోటా నాయకులు అయిపోయిన తర్వాత పచ్చ మీడియాను రంగంలోకి దించారు. 

    కండకావరంతో, కొవ్వెక్కి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడినా శాంతియుతంగా నిరసన తెలపండని వైఎస్‌ జగన్‌ మాకు చెప్పారు’ అని రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. 
     

  • కుటుంబంలో కలహాలు పొడచూపినా.. అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు తలెత్తినా.. బలహీనులపై బలవంతుల దౌర్జన్యాలు పేట్రేగినా బాధితులకు కనిపించే ఏకైక ధైర్యం.. పోలీసులు. అలాంటిది పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. అధికారం అండగా చెలగేరిపోతున్నారు. బాధితులకు అందాల్సిన న్యాయాన్ని పోలీసు స్టేషను మెట్ల వద్దే సమాధి చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో తొక్కేయాల్సిన వారు అరాచకాలకు పాల్పడేవారికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఓ సీఐ రాసలీలల బాగోతం, మరో సీఐ లంచావతారం, ఇంకో సీఐ అధికార పార్టీ దాసోహం... ఇలా జిల్లా పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మారాయి.  

    సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. ప్రజలకు తామున్నామని భరోసా ఇవ్వాల్సిన పోలీసు అధికారులు వరుస ఆరోపణలతో బజారున పడుతున్నారు. దీంతో ఆ వ్యవస్థపై విశ్వసనీయత దెబ్బతింటోంది. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగుచూసిన అనేక సంఘటనలు పోలీసు వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో పల్నాడులో పోలీసు వ్యవస్థ దారితప్పుతోంది.  పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పోలీసుస్టేషన్‌లో పనిచేసిన సీఐ భాస్కర్‌ ఓ మహిళతో సహజీవనం చేశాడన్న ఆరోపణలపై వారం క్రితం వీఆర్‌కు పంపినట్టు తెలుస్తోంది. గతంలో మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ సీఐ వ్యవహారాన్ని ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధికి అందించాడు. త్వరలో మీడియా ముందు బహిర్గతం చేస్తానని చెప్పాడు. 

    అదే జరిగితే పోలీసు శాఖకు మాయని మచ్చగా మిగులుతుందని భావించిన ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. వాస్తవానికి సీఐపై వచ్చిన ఆరోపణ తీవ్రత దృష్ట్యా సస్పెండ్‌ చేయడంతోపాటు కేసు నమోదు చేయాల్సి ఉంది. అతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా నామమాత్రపు చర్యలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఇలా ఉండగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రతి చర్యకు దిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళతో ఫిర్యాదు చేయించి అతన్ని అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతన్ని బెదిరించి ఎలాగైనా తనకున్న పలుకుబడితో మళ్లీ దాచేపల్లికి సీఐగా రావాలని భాస్కర్‌ ప్రయతి్నస్తున్నారని సమాచారం. 

    పరువు హత్యకు సహకరించిన సీఐపై వేటు... 
    మాచర్లకు చెందిన చౌడేశ్వరి నెల కిందట నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారంలో తలదూర్చిన మాచర్ల టౌన్‌ సీఐ వెంకటరమణ.. యువతి తండ్రి చంద్రశ్రీనుతో బేరం కుదుర్చుకొని యువతిని బలవంతంగా తండ్రికి అప్పగించాడు. దీంతో కుమార్తెను గత నెల 18వ తేదీన తండ్రి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు.  విషయం బయటకు రావడంతో సదరు సీఐ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. వైద్యురాలు సహకరించకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మీడియాలో కథనాలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో సీఐ అవినీతి బాగోతం వెలుగుచూసింది. సుమారు రూ.6.5 లక్షలు  చేతులు మారినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా ఆదివారం సీఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  

    సివిల్‌ పంచాయితీలకు ఆ స్టేషన్‌ అడ్డా... 
    పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌ సివిల్‌ పంచాయితీలకు అడ్డాగా మారింది. అక్కడ ప్రజాప్రతినిధి అండతో     ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు.  ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారిచే ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్‌లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారట. గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఆర్యవైశ్య మహిళ పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా ఆ సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో  చంద్రబాబు ప్రభుత్వంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు. 

    బుకీలను తప్పించిన పోలీసులు... 
    క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్మూలనపై పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టి సారించి బుకీల ఏరివేతకు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను రంగంలోకి దించారు.  విషయం తెలుసుకున్న జిల్లాలోని కొంతమంది అవినీతి అధికారులు ఆ సమాచారాన్ని బుకీలకు ముందుగానే చేరవేశారు. దీంతో బుకీలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. వారి ఆచూకీ కోసం ఎస్బీ పోలీసులు గాలిస్తున్నా ప్రయోజనం దక్కడం లేదు. అందరి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌లు ఇతర రాష్ట్రాలలో ఉన్నట్టు కనిపిస్తుండటంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. ఐపీఎల్, వర్డల్‌ కప్, ఇతర ముఖ్యమైన మ్యాచ్‌లు జరిగే సమయంలో బుకీల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఆయా స్టేషన్లలో పనిచేసే కొంతమంది అధికారులు, సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారు. బుకీలు చిక్కితే వీళ్ల అవినీతి బాగోతం బయటపడుతుందని ముందస్తు సమాచారం ఇచ్చి పరారీకి సహకరించినట్టు సమాచారం. నేరుగా బుకీలతో సంబంధం పెట్టుకొని బెట్టింగ్‌ ఆడిస్తున్న ఓ సీఐపై వ్యవహారంపై జిల్లా ఎస్పీ దృష్టి సారించినట్టు తెలియవచ్చింది.

    పేకాటకు సహకరిస్తున్న సీఐలు... 
    ఇప్పటికే చిలకలూరిపేట పట్టణం పేకాటకు అడ్డాగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి చిలకలూరిపేటకు పెద్ద సంఖ్యలో జూదగాళ్లు తరలి వస్తున్నారు. నిత్యం రూ.కోట్లు చేతులు మారుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పేకాట శిబిరాలపై సీఐ దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వా«దీనం చేసుకొని పేకాట రాయుళ్లను స్టేషన్‌కు తరలించాడు. ఇక్కడి రెండు వర్గాల్లో ఓ వర్గానికి మద్దతుగా రెండో వర్గం వారిపై ఇలా దాడులు జరిగాయి. కానీ ఈ వ్యవహారంలో చినబాబు వద్ద పనిచేసే వ్యక్తి కలుగుజేసుకొని సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్‌కు పిలవాలని ఉన్నతా«ధికారులపై ఒత్తిడి చేశాడు.  దీంతో సీఐ వెనక్కితగ్గి ఆ పేకాట రాయుళ్లను కేసు లేకుండా విడిచిపెట్టాడు. అధికార పార్టీకి వత్తాసుగా వ్యవహరించొద్దన్నారు.  మిగతా చోట్ల పోలీసు సీఐ తనవంతు సహకారం         అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   

Guest Columns

  • అడవిలో పుట్టే ఒక చిన్న పువ్వు... పేద గిరిజన కుటుంబానికి ఆదాయం తెచ్చే మూలం అవుతుందా లేక సమాజాన్ని మరో మద్యం సంక్షోభంలోకి నెడుతుందా? ఇప్ప (మహువా) పువ్వుతో తయారయ్యే ఇప్పసారా చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఒక సభ్యుడు ఇప్పసారా, ఇప్ప పూలలో పోషకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాక ఇంతవరకు ప్రభుత్వాలు ఇప్పచెట్టు విలువను నిజంగా అర్థం చేసుకోలేక పోయాయి అనే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

    మధ్యప్రదేశ్‌లో చట్టబద్ధం!
    సంప్రదాయంగా గిరిజనులు తయారు చేసుకునే ఇప్పసారాను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చట్టబద్ధం చేసి, ఉత్పత్తి, విక్రయాలను నియంత్రణలోకి తీసుకొచ్చింది. ఇది ఒక వైపు అభివృద్ధి కథలా కనిపిస్తే, మరోవైపు కొన్ని ప్రశ్నలను తీసుకొచ్చింది.

    శతాబ్దాలుగా గిరిజనుల జీవనంలో ఇప్పపువ్వు భాగం. దీనితో తయారుచేసిన మద్యం ఒకప్పుడు ‘అనధికారిక మద్యం’. ఇప్పుడదే ‘హెరిటేజ్‌ లిక్కర్‌’గా మారింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇది ఒక ఆర్థిక మార్పు. గిరిజన మహిళలు పూలను సేకరిస్తున్నారు. సహకార సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. లైసెన్స్‌ పొందిన యూనిట్లు సారా తయారు చేస్తున్నాయి. ఈ సారాను మార్కెట్లో బ్రాండ్‌గా విక్రయిస్తున్నారు. అంటే, అడవిలో పుట్టిన వనరుకు ఇప్పుడు విలువ గొలుసు ఏర్పడింది.

    ఈ ప్రాజెక్ట్‌ వల్ల కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి: ఇప్పపూలకు స్థిరమైన ధర, మధ్యవర్తుల దోపిడీ తగ్గింపు, గిరిజన మహిళలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం... ‘పేదరికాన్ని తగ్గించాలంటే వనరులను విలువైనవిగా మార్చాలి’ అనే సిద్ధాంతానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.

    మద్యం, అది ఏ రూపంలో ఉన్నా సమాజంపై ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటుంది. ఈ మద్యం చట్టబద్ధమైతే అది ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే మద్యం వల్ల సమస్యలు ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే... సంప్రదాయ జ్ఞానం గిరిజనులది, కానీ మార్కెట్‌ లాభాల్లో వారికి తగిన వాటా అందటం లేదు. గిరిజనులు కేవలం ముడిసరుకు సరఫరా దారులుగానే మిగిలిపోతే, ఇది అభివృద్ధిగా కాక వ్యాపారీకరణగా మాత్రమే మిగిలిపోతుంది. లాభ ఫలాలు గిరిజనేతరులు తమ ఖాతాలో వేసుకుంటారు.

    ఇప్పసారా ప్రాజెక్ట్‌ (Ippa Puvvu Sara) రెండు అంచుల కత్తి లాంటిది. ఒక వైపు ఉపాధి, ఆదాయం పెరగడంతో గిరిజనుల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మరో వైపు మద్యపానం వ్యసనంలా పరిణమించి ఆరోగ్య సమస్యలు, సామాజిక అసమతౌల్యానికి దారితీస్తుంది. ఈ రెండింటి మధ్య సంతులనం ఎలా సాధిస్తామనేదే కీలకం.

    ఈ మోడల్‌ విజయవంతం కావాలంటే: మద్యం వినియోగంపై కఠిన నియంత్రణ ఉండాలి. గిరిజనులకు లాభాల్లో న్యాయమైన వాటా లభించాలి. మహిళా సంఘాలకు అధిక అధికారాలు ఇవ్వాలి. ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు పెరగాలి. ఇవి లేకపోతే, ఇప్ప సారా ఒక ఆర్థిక ప్రయోగంగా కాక ఒక సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉందంటారు షేక్‌ రజియా. ఆమె బస్తర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో గిరిజన మహిళా సంఘాలతో ఇప్పపూలతో పలు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయించి దేశమంతా మార్కెట్‌ చేస్తున్నారు.

    చ‌ద‌వండి: చ‌మురు సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?

    అడవిలో పుట్టిన పువ్వు, ఒక కుటుంబానికి అన్నం పెడుతుంది. అదే పువ్వు ఒక సమాజాన్ని మత్తులోకి నెట్టే శక్తి కూడా కలిగి ఉంది. ఇప్పసారాను ఆర్థిక సాధనంగా మార్చుకుంటామా? లేక దాన్ని సామాజిక భారంగా మారనిస్తామా? సమాధానం పాలసీల్లో కాదు, అమలులో ఉంది!

    – శ్యాం మోహన్‌
    ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేస్తున్న జర్నలిస్ట్‌

Politics

  • దిస్‌పూర్‌: తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై అస్సాం సీఎం హిమాంత్‌ బిశ్వా శర్మ భార్య రింకీ భుయాన్‌ శర్మ స్పందించారు.  వారికి వ్యాఖ్యలను చూస్తే నవ్వొస్తుందన్నారు.  అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలు రాజకీయ దురద్దేశంతో మాత్రమే చేశారనే విషయం అర్ధమైందని, అందుకే మీ ఆరోపణలు చూసి నవ్వొస్తుందన్నారు.  

    మీ ఉత్కంఠకు తానే సమాధానమిస్తానంటూ ట్వీట్‌ చేశారు రింకీ భుయాన్‌ శర్మ.  ఆ మూడు పాస్‌పోర్టుల సాయంతో భారత బయట పలు వ్యాపారాలు చేస్తున్నానంటూ కాంగ్రెస్‌ చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు.  

    కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ ఎంతో ఉత్కంఠతో, ఆతృతతో తనపై వ్యాఖ్యలు చేశారని, వాస్తవాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలన్నారు.  ‘మీకు 24 గంటలు టైమ్‌ ఇస్తున్నా. వాస్తవాలు ఉంటే బయటపెట్టండి. ఎన్నికల స్టంట్స్‌ చేయొద్దు. నాకు కానీ, నా పిల్లలు కానీ భారత బయట ఎక్కడా ఆస్తులు, వ్యాపారాలు లేవు. మీరు నిరూపించి చూపించండి’ అంటూ సవాల్‌ చేశారు. తనకు పాకిస్తాన్‌ బ్యాంక్‌లతో కూడా సంబంధాలున్నాయని కూడా కాంగ్రెస్‌ ఎంపీ ఆరోపించారు. ‘ అవేంటో చూపించి మాట్లాడండి. ఎందుకో అంత ఆతృత.. పబ్లిక్‌ నిరూపిస్తే పోతుంది కదా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

     

     

     

     

  • తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్‌ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. 

    ఈరోజు(సోమవారం, ఏప్రిల్‌ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. 

    ‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని‌ ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. 

    కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు  అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా  చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు.

    పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలైన ఐఐఎంలలో ప్రవేశాల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘క్యాట్‌’లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాదని, అహేతుక నిబంధనలతో మెరిట్‌ను కాలరాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఐఎం ముంబై అనుసరిస్తున్న విధానాలపై విచారణ జరపాలని కోరుతూ ఒక బాధిత విద్యార్థి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కు మార్చి30న ఫిర్యాదు చేశారు.

    కాగా, ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్‌ దృష్టికి సైతం తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా పరిగణించే క్యాట్‌ (కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)లో 99.52 పర్సంటైల్‌ సాధించినప్పటికీ, తనకు కనీసం ఇంట ర్వ్యూ (పీఐ) పిలుపు కూడా రాకపోవడంపై హైదరాబాద్‌ గుండ్ల పోచంపల్లికి చెందిన సత్యసాయి కటారు అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్కోరు సాధించిన విద్యార్థులను పక్కనపెట్టి, తక్కువ పర్సంటైల్‌ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వ డం రాజ్యాంగంలోని 14వ అధికరణం (సమానత్వపు హక్కు) కింద కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    కాగా, ఐఐఎంలు క్యాట్‌ స్కోరుకు కేవలం 30 శాతం నుంచి 60 శాతం మాత్రమే వెయిటేజీ ఇస్తున్నాయని, పదేళ్ల క్రితం పూర్తి చేసిన 10వ, 12వ తరగతి మార్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అభ్యర్థి ప్రశ్నించారు. వివిధ బోర్డుల మధ్య మూల్యాంకన విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు, పాత అకడమిక్‌ రికార్డులను ప్రామాణికంగా తీసు కోవడం గ్రామీణ, వెనుకబడిన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్ట‌లేరా?

    ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఐఐఎం ముంబై యాజమాన్యం సరిగ్గా అమలు చేయలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. తాను దరఖాస్తు చేయని కోర్సులో ఇంటర్వ్యూ ఇస్తామంటూ తప్పుడు సమాచారంతో కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితుడు కోరారు. 

  • సాక్షి, నిర్మల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్మల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు తమ మనవడు రియాన్ష్‌కు అక్షరాభ్యాసం చేయించారు.

    ఇక, దర్శనం అనంతరం బాసర ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. బాసర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రాచీన ఆల‌యం కావ‌డం, ఏటేటా పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌కపోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాస‌ర ఆల‌య అభివృద్ధి చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు అనుగుణంగా ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టేందుకు అధికారులు మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించారు.

    బాసర పర్యటన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పిప్రి  చేరుకోనున్నారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.