Archive Page | Sakshi
Sakshi News home page

International

  • గంటల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. వార్నింగ్‌ ఇచ్చిన విధంగానే గల్ఫ్‌ దేశాలపై దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే వీటిని సౌదీ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంది.

    సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రియాద్ వైపు ప్రయోగించబడిన నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు విజయవంతంగా అడ్డుకోబడ్డాయి.మిసైళ్లను అడ్డుకునే ప్రక్రియలో ఏర్పడిన శకలాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది.  

    కాగా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, ఆ దేశ  కీలక సైనికాధికారి అలీ లారిజానీ, ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ జనరల్‌ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. 

    తాజాగా అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు బుషేర్‌ ఫ్రావిన్స్‌లోని ఇరాన్‌ నేచురల్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ అయిన సౌత్‌ పర్స్‌పై కూడా దాడులు చేశాయి. వీటికి ప్రతీకారంగానే ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల ఇంధన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. 

  • తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్‌, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.  

    లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్‌, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.

    కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ జనరల్‌ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్‌స్టర్‌ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. 

  • వాషింగ్టన్‌: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేసిన మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు చేశారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేస్తే లేదా అంతం చేస్తే ఏమవుతుందో అని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. అమెరికా సైనికంగా ఇరాన్‌పై దాడి చేసి, అక్కడి ప్రస్తుత పాలనా వ్యవస్థనే పూర్తిగా తొలగిస్తే పరిస్థితి ఎలా మారుతుందో అన్న భావనను వ్యక్తం చేస్తూ ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

    హార్మూజ్ జలసంధిపై మిత్రదేశాలు స్పందించడం లేదని ట్రంప్‌ అన్నారు. హార్మూజ్ జలసంధిని “సో కాల్డ్ స్ట్రైట్” అని పేర్కొన్నారు. ఆ మార్గంపై అసలు అమెరికా ఆధారపడదని, వేరే దేశాలే ఆధారపడతాయని చెప్పారు.

    ఇరాన్‌ను ఉగ్రవాద దేశం అంటూ ‍ట్రంప్‌ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మిగిలిన వాటిని కూడా తాము పూర్తిగా ధ్వంసం చేస్తే ఏమవుతుందోనని తాను ఆలోచిస్తున్నాని చెప్పారు. అలాగే, హార‍్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడే దేశాలు దాన‍్ని రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆ జలసంధి బాధ్యతను అమెరికాకు ఇవ్వకుండా ఆ పని చేయాలని మిత్రదేశాలకు చెప్పారు. అమెరికా ఇలా వెనక్కి తగ్గితే, ప్రస్తుతం సాయం చేయని మిత్రదేశాలు కూడా వెంటనే కదిలి హార్మూజ్‌ను కాపాడుకునే  బాధ్యతల్లో పాల్గొనాల్సి వస్తుందని ట్రంప్‌ అంటున్నారు.

    కాగా, పశ్చిమాసియా ఘర్షణ మధ్య ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల్లో కలిసి పాల్గొనడానికి కొన్ని నాటో దేశాలు నిరాకరించాయి.  నాటో దేశాలపై కూడా ట్రంప్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. “మా నాటో మిత్రదేశాలు ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాల్గొనాలనుకోవడం లేదని అమెరికాకు తెలియజేశాయి. అయినా, ఇరాన్‌కు అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని దాదాపు ప్రతి దేశం అంగీకరించింది” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.

  • గత 19 రోజులుగా భీకరంగా సాగుతున్న ఇరాన్‌ యుద్ధంలో ఇరాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి.  తాజా దాడుల్లో  ఇరాన్ గూఢచార మంత్రిఇ స్మాయిల్ ఖతీబ్ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి  కాట్జ్ ప్రకటించారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.

    అదనపు అనుమతులు తీసుకోకుండా,  ఏఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా చంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కాట్జ్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఇరాన్‌  ముగ్గురు కీలక  వ్యక్తులను కోల్పోయింది. మంగళవారం ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్వచ్ఛంద బసిజ్ దళాధిపతి ఘోలమ్రెజా సోలేమానీని హత మార్చింది.   

    ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

    కాగా ఫిబ్రవరి 28న  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మొదలు పెట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం అయతుల్లా  అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన స్థానంలో, ఆయన కుమారుడు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ అత్యున్నత లీడర్‌గా ఎంపికయ్యారు. మరోవైపు ఈ దాడిలో మోజ్తబా కూడా తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 
    (బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!)

  • ఖాట్మాండు : తూర్పు నేపాల్‌లోని ఖోటాంగ్ జిల్లాలో  ఘోర  ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. బలమైన గాలులు లేదా ల్యాండింగ్ సమయంలో పేరుకుపోయిన దుమ్ము కారణంగా ఇది కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

    ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అది అకస్మాత్తుగా బోల్తా పడింది. పల్టీలు కొడుతూ చివరకు దాని తోక భాగం ఒక పర్వత గోడను ఢీకొట్టడంతో హెలికాప్టర్ ముక్కలై పోయింది. 

    ఎయిర్ డైనాస్టీకి చెందిన ఈ హెలికాప్టర్, ఖాఠ్మండు నుండి ఐదుగురు ప్రయాణికులతో కలిసి ఒక మృతదేహాన్ని తరలిస్తుండగా పొలంలో కూలి పోయిందని అధికారులు ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదనీ,  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఖోటాంగ్ జిల్లా ముఖ్య అధికారి రేఖా కండెల్ తెలిపారు.

     

    హెలికాప్టర్‌లోని ఒక ప్రయాణికుడు గాయపడగా, పైలట్ సబిన్ థాపా, ఇతర ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని హెలికాప్టర్ కంపెనీ వెల్లడించింది. గాయపడిన వ్యక్తికి సాయం చేసేందుకు అదనపు హెలికాప్టర్‌ను పంపించామని తెలిపింది.
     

  • ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే  ప్రపంచంలో,  బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అ‍న్న బిరుదును  స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి  గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!

    1874లో లండన్‌లోని న్యూహామ్‌లో పేద కుటుంబంలో  జన్మించింది మేరీ ఆన్ బెవాన్,  నర్సింగ్‌ కోర్స్‌ చదివి 1894లో నర్సుగా మారింది.  ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు  నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన  చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది.  

    అంతుచిక్కని వ్యాధి - వికృత రూపం
    మేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి.  చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి.  దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.

    ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

    పిల్లల కోసం తల్లి మనసు ఆరాటం

    రూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో  "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును."  అనే  ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్‌లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా   త్వరలోనే సర్కస్‌లో స్పెషల్‌ ఎ‍ట్రాక్షన్‌గా మారిపోయింది.  1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్‌లోని డ్రీమ్‌ల్యాండ్ సైడ్‌షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా  పనిచేసింది.

    మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది.  వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన  విద్యావంతుల్ని చేసింది.

    తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా  నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ".  చరిత్రలో  "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా  నిలిచిపోతుంది. ఏమంటారు? 


     

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు.  

    కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.

    వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్‌కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు.  

  • సాక్షి, తాడేపల్లి: కేవలం 5 సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలను మార్చేసినట్టు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు బస్సెక్కి హడావుడి చేశారని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆక్షేపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలో 50 శాతం సబ్సిడీ ఉందని గుర్తు చేశారు.

    చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, దివ్యాంగుల సహాయకులకు 50 శాతం సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల బతుకు భారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా సదరం సర్టిఫికెట్‌ల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇంద్రధనస్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రెస్‌మీట్‌లో పులిపాటి దుర్గారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

    ప్రచార ఆర్భాటంతో సరి:
    కేవలం 5 ఆర్టీసీ సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ దివ్యాంగులకు మేలు చేసినట్టు ఆర్భాటంగా మంగళగిరిలో బస్సెక్కి హడావుడి చేశారు. ఇప్పటికే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు చార్జీలో 50 శాతం సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు చంద్రబాబు కల్పిస్తున్నది కేవలం 50 శాతం మాత్రమే.

    అది కూడా 5 సర్వీసులకే వర్తింపజేస్తున్నారు. చంద్రబాబుకి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 11 సర్వీసుల్లోనూ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేవాడు. వారితోపాటు వచ్చే సహాయకులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ సర్వీసుల్లో వర్తింపజేసేవారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పినా రెండేళ్లలో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమరావతిలో దివ్యాంగులకు దివ్యాంగ భవన్‌ కడతామని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

    2016 నాటి చట్టం అమలు చేయాలి:
    ఇప్పటికే మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం, వాటిలో ఎక్కడా దివ్యాంగుల ఊసే ఎత్తలేదు. 2016 నాటి చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో 4 శాతం నిధులు అంటే, రూ.12 వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించలేదు. నియోజకవర్గానికి 5 ట్రై మోటార్‌ సైకిళ్లు ఇస్తామని చెప్పినా అరకొరగా పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా టీడీపీ  కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది.  

    దివ్యాంగులు ఎక్కడికెళ్లినా ఇబ్బందులు:
    చంద్రబాబు దివ్యాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 365 రోజులపాటు ఎప్పుడైనా సదరం సర్టిఫికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే వలంటీర్‌ వ్యవస్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌లు అందజేసేవారు.

    కానీ నేడు కూటమి పాలనలో సోమ, మంగళవారాలు మాత్రమే దరఖాస్తు చేసుకునే నిబంధన పెట్టారు. పైగా వైద్య పరీక్షల కోసం సొంత జిల్లాలకు కాకుండా పక్క జిల్లాలకు వెళ్లే నిబంధన పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సదరం సర్టిఫికెట్‌లలో తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఉండటం లేదు.

    డిజెబిలిటీ శాతం తక్కువగా చూపించి పింఛన్లలో కోతలు విధిస్తున్నారు. పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్న దివ్యాంగులకు పింఛన్లు తీసేసి వారి బతుకులను చంద్రబాబు అంధకారంలోకి నెట్టేశాడు. రెండేళ్లలో పింఛన్లు తీసేయడమే కానీ, దివ్యాంగులకు కొత్తగా ఒక్క పింఛన్‌ ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో దివ్యాంగులకు అందజేసే ట్రై మోటార్‌ సైకిళ్లు, హియరింగ్‌ యంత్రాలు, బ్లైండ్‌ పర్సన్స్‌ కి స్టిక్స్‌ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేకమైన స్కూల్స్, ప్రత్యేక వైద్యసేవలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి మోసగించారు.

    దివ్యాంగ విద్యార్థులకు వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందే స్కాలర్‌షిప్స్‌ కూడా అందకుండా చేశారు. ప్రభుత్వ కాలేజీలు, స్కూల్స్, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు, వీల్‌ చైర్లు ఉండటం లేదు. దివ్యాంగులకు హక్కుగా దక్కాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. దివ్యాంగులు ఆలయాలకు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు?:
    వైఎస్సార్సీపీ తరఫున రోడ్డెక్కి ఉద్యమిస్తే కానీ 2024–25, 2025–26 బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తూతూమంత్రంగా కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేషన్‌ ఇప్పించారు. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేషన్‌ ఇచ్చేస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

    వైఎస్సార్సీపీ హయాంలో రుణ సబ్సిడీలు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడడం  జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో దివ్యాంగులకే ఎక్కువ నష్టం జరిగింది టీడీపీ కూటమి ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పులిపాటి దుర్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  • చెన్నై: పొత్తులపై టీవీకే చీఫ్, సినీనటుడు విజయ్ క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని అన‍్నారు. తనను అణచివేయాలని కుట్ర పన్నుతు‍న‍్నారని చెప్పారు.

    తమిళనాడులోని మహాబలిపురంలో విజయ్‌ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  "మేము ప్రజల టీమ్. కొందరు మమ్మల్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నించారు... కానీ, అది పని చేయలేదు. మేము ఏదో ఒక కూటమిలో చేరతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఎప్పుడూ లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని స్పష్టంగా చెబుతున్నాను. దానిపై రాజీ పడము. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే నమ్మవద్దు. మన లక్ష్యాన్ని కచ్చితంగా సాధించగలం" అని అన్నారు.

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 23న జరగనున్నాయి. టీవీకేను నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్‌ (ఎన్డీఏ)లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.

    కాగా, దీనిపై ఇప్పటికే టీవీకే నేత ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. అలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమ వేదికల్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బీజేపీ/ఏఐఏడీఎంకే, శశికళ, డాక్టర్ అయ్యా రామదాస్‌తో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.

    ‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్‌జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత  జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్‌ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు

    ‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు.

    ..మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?

    ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

    ..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే.

    ..రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’  అని అంబటి రాంబాబు అన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని.. పవిత్ర ఇఫ్తార్‌లో పాల్గొని కూడా అబద్ధాలు చెప్పటం బాధాకరమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది’’ అని అంజాద్‌ బాషా గుర్తు చేశారు.

    ‘‘చంద్రబాబు 2019-24 మధ్య పెట్టిన బకాయి రూ.24 కోట్లను కూడా జగనే తీర్చారు. మొన్నటి ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు. 50 ఏళ్లు దాటిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?. ఈద్గాలు, ఖబరస్థాన్‌లకు భూమి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు?’’ అంటూ అంజాద్‌ బాషా నిలదీశారు.

    ‘‘విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తానని చెప్పి, ఇప్పటికీ స్థలం కూడా కేటాయించలేదు. నూర్ బాషా కార్పోరేషన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. గౌరవ వేతనం కూడా ఆర్నేళ్లుగా ఇవ్వకుండా బకాయి పెట్టారు. గట్టిగా పోరాటం చేస్తే రిలీజ్ చేసి పండుగ చేసుకోమంటున్నారు. అడ్వాన్స్ ఇచ్చి పండగ చేసుకోమన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. హజ్ యాత్రికులకు వైఎస్ జగన్ ఆర్థిక సహాయం అందించారు. 1870 మంది యాత్రికులు వెళ్తే కేవలం 72 మందికే చంద్రబాబు ఆర్థిక సాయం చేశారు. ఇదే మా ముస్లింల మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ?. ఈ ఏడాది వెళ్తున్న 2005 మంది హజ్ యాత్రికులకు అందరికీ లక్ష చొప్పున ఇవ్వాల్సిందే’’ అని అంజాద్‌ బాషా డిమాండ్‌ చేశారు.

    ‘‘వైఎస్ జగన్ హయాంలో విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ను ఓపెన్ చేశారు. ఒక్కొక్క ముస్లిం మీద పడిన  రూ.83 వేలు అదనపు భారాన్ని కూడా వైఎస్‌ జగన్ ప్రభుత్వమే భరించింది. వైఎస్‌ జగన్ ముస్లింల సంక్షేమం కోసం రూ.24,304  కోట్లు ఖర్చు చేశారు. ముస్లింల మీద జగన్ ఎంత ప్రేమ చూపిస్తారో అర్థం చేసుకోవచ్చు. మైనారిటీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఐదుగురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక్బాల్‌కి ఎమ్మెల్సీ ఇచ్చారు. జకియాఖానంకి ఎమ్మెల్సీ ఇచ్చి మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. 12 కార్పొరేషన్లకు ముస్లింలను ఛైర్మన్‌లుగా చేశారు. చంద్రబాబు హామీలు ఇవ్వటమే తప్ప.. ముస్లింలకు చేసింది ఏమీ చేయలేదు

    వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

    ..వక్ఫ్ ఆస్తులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం. 460 ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురైంది. చినకాకాని దగ్గర ఉన్న 71 ఎకరాల వక్ఫ్ భూమి మీద నారా లోకేష్ కన్ను పడింది. పరిశ్రమల పేరుతో తీసుకునేందుకు జీవో ఇచ్చారు. రాజధానిలో ఉన్న వేల ఎకరాల భూములను కాదని వక్ఫ్ భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. వక్ఫ్ భూములను కాపాడుకోవటానికి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. కూటమి‌ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేదు

    ..వినుకొండలో రషీద్ అనే ముస్లిం యువకుడిని నడిరోడ్డు మీద చంపేశారు. పుంగనూరులో మైనారిటీ బాలికను హత్య చేసి నీళ్లలో పడేశారు. రాయచోటిలో కౌన్సిలర్ మీద టీటీడీ గూండాలు దాడి చేశారు. పులివెందులలో బీటెక్ రవి అనుచరులు.. దంపతుల మీద దాడి చేశారు. నెల్లూరు జిల్లాలో ఒక‌ ముస్లింని హత్య చేశారు’’ అంటూ అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh

  • సాక్షి, ఢిల్లీ: ఏపీలో రైతులకు 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్ లను  ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్‌సభలో వ్యవసాయ శాఖ పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకం కింద సహాయాన్ని పదివేల రూపాయలకు పెంచాలన్నారు.

    ‘‘ఏపీలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశాం. 54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల బీమాను అందించాం. కానీ, ప్రస్తుత బాబు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. 2024 -25 బడ్జెట్‌లో దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 2025-26లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినా బీమా కంపెనీలకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు. రైతులకు పంట బీమాను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’’ అని వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.

    ‘‘2,492 కోట్ల రూపాయల ప్రీమియం చెల్లించకపోవడంతో ఏపీని ఇన్సూరెన్స్ కంపెనీలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. దాంతో రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో.. రైతులు ప్రీమియం చెల్లించడానికి యాప్ ఓపెన్ కావడం లేదు. ప్రీమియం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. 3,500 కోట్ల రూపాయల పంట బీమా క్లెయిమ్‌లను  ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏపీ రైతులకు బీమాను చెల్లించేలా చర్యలు తీసుకోవాలి

    ..ఇరాన్ యుద్ధం వల్ల అరటి, మామిడి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. పెండింగ్ ఇన్పుట్ బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి. హార్టికల్చర్‌ హబ్‌గా ఉన్న రాయలసీమలో భారీ ఎత్తున అరటి మామిడి మస్క్ మిలన్ వాటర్ మిలన్ పంటలు పండుతున్నాయి. పప్పులపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల విదేశాల నుంచి భారీ ఎత్తున పప్పులు దిగుమతి అయ్యాయి. దాని ఫలితంగా దేశీయ పప్పులు పండించే రైతులు గిట్టుబాటు ధర కంటే తక్కువకి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది.

    ఏపీలో 3.7 లక్షల ఎకరాల్లో శనగ పంట  పండిస్తున్నారు. పప్పు ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడం, పప్పు ధాన్యాలపై దిగుమతి పాలసీని పున:పరిశీలన చేయాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. మండల లెవెల్‌లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. వ్యవసాయంత్రీకరణ కు నిధులు కేటాయించాలి’’ అని వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

     

  • సాక్షి, విజయవాడ: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందు నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.

    ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌.. ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

    ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.. ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షలు విరమింపచేశారు. ఇఫ్తార్‌ విందులో ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

     

  • అమరావతి: ఆంధ‍్రప్రదేశ్‌లోని పలు జిల‍్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అమరావతిలో భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ మాత హై స్కూల్‌కు సమపీంలో పిడుగుపడి ఓ విద్యార్థి తండ్రి మృతిచెందారు.  

    కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో వర్షం పడింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి టెర్రస్ పైన పిట్టగోడ పాక్షికంగా ధ్వంసమైంది.

    రాగల మూడు గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు.

    తెలంగాణనూ వదలని వానలు 
    తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షానికి పలుచోట్ల పెద్దఎత్తున పంట నష్టం తలెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది.

    కరీంనగర్ జిల్లా వీణవంకలోనూ అపార పంటనష్టం జరిగింది. నర్సింగాపూర్‌లోనూ మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు.. చేతికొచ్చిన పంట  నేలరాలింది. 

    భారీగా పంట నష్టం తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మిర్చి కుప్పలపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు రైతులు. 
     

  • సాక్షి, పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 98 రోజుల పాటు  పిన్నెల్లి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి సర్కార్‌ అక్రమ కేసు బనాయించింది.

    మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

     

  • సాక్షి, తాడేపల్లి: శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు(మార్చి 19, గురువారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

    ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీపరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలన్నారు.

    ‘‘సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

  • విశాఖ: కూటమి అవినీతిని ప్రజలకు తెలియజేయాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విశాఖను దోచుకు తింటున్నారని తెలిపారు. ఉద్యమ కార్యచరణ రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీతో ఉన్న కార్పొరేటర్లకు సాధ్యమైనంత వరకు జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: శ్రీ పరాభవ నామ సంవత్సరాది.. ఉగాది సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

    శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు.

    కాగా, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రేపు (మార్చి 19న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.
    Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు 

     

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇవాళ(బుధవారం, మార్చి18) హైదరాబాద్ జర్నలిస్ట్ కె.వెంకట్రామి రెడ్డి (కేవీఆర్) కలిశారు. తనను కర్నూలు పోలీసులు వేధించిన తీరును ఆయన వివరించారు. హైకోర్ట్‌లో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేయడంతో విడుదల చేసినట్టు కేవీఆర్‌ తెలిపారు.

    తప్పుడు కేసులపై ఆందోళన చెందవద్దన్న వైఎస్‌ జగన్‌.. న్యాయపోరాటం చేద్దామనీ, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్ అన్నారు.

    జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి
  • డాబాగార్డెన్స్‌: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్‌ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2025 ఏప్రిల్‌ వరకు నాలుగేళ్ల పాటు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. 

    కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్‌ పెడుతూ, జగదాంబ జంక్షన్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలు, వాటర్‌ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్‌లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్‌లో 20 మీటర్ల క్లాక్‌ టవర్‌ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. 

    సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో  జీవీఎంసీ వైఎస్సార్‌ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్‌–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్లను కార్పొరేట్‌ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్‌ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. 

    పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు 
    కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్‌ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్‌ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.   

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిన్న(మంగళవారం) కుళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం వెలుగులోకి రాగా.. తాజాగా కల్తీ పన్నీర్, పచ్చళ్లు కూడా బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం రట్టు చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

    ఈ దాడుల్లో ఆరు హోల్‌సేల్, రిటైల్ దుకాణాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైపాల్ సింగ్ రాజ్‌పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    నిందితులు గుర్తు తెలియని ప్రాంతాల నుండి కల్తీ, అపరిశుభ్రమైన పనీర్, ఇతర పాల ఉత్పత్తులను భారీ మొత్తంలో సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ కిలో రూ. 280 చొప్పున హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. తనిఖీ సమయంలో ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, దుమ్ము, ఈగలు వాలే అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులపై ఎటువంటి బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ (Expiry Date) లేకపోవడమే కాకుండా, కనీస పేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని తేలింది.

    ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ.11,11,600 ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సొత్తులో 2,572 కేజీల పనీర్, 927 కేజీల కోవా, 249 కేజీల వైట్ క్రీమ్, 132 కేజీల అజ్మీరా కలకండ్ మరియు 12 కేజీల నెయ్యి ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ప్రధానంగా శంకర్లాల్ మిల్క్ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాప్, వైభవ్ మిల్క్ డెయిరీ, శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, జగదాంబ మిల్క్ మర్చెంట్ మరియు తులసి గిరిరాజ్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే సంస్థలు పాల్గొన్నట్లు గుర్తించారు.

    కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడి
    కుల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కుల్సుంపురా సబ్-ఇన్స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర నగర్‌లోని ఒక గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (License) లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

    72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, మరియు గోంగూర), 6 డ్రమ్ములు టమోటా, చింతపండు పేస్ట్. 1 చిన్న డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎన్. నరసింహ, ఎన్. నరేష్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

     

  • హైదరాబాద్‌: అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి విశిష్ఠ ప్రణాళిక అని అన్నారు. ప్రతిపక్షం ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, హుందాగా ప్రవర్తించకుండా అహంకారం ప్రదర్శించిందని అన్నారు.

    ‘ఎన్నో త్యాగాల ఫలితం మన దేశ స్వాతం‍త్య్రం. కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘపోరాటంతో స్వాతంత్య్రం వచ్చింది. పేదవాడికి బ్యాంకింగ్‌ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. బీఆర్‌ఎస్‌ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదు. 

    అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే ప్రతిపక్షం అహంకారం చూపిస్తోంది. 4 కోట్లమంది ప్రజలను నిరాశపర్చేలా విపక్షాల తీరు ఉంది. అధికారం పోయినా రాచరిక పోకడలు పోలేదు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వాళ్ల తీరు మారలేదు. కొందరు తమను తాము రాజులనుకుంటున్నారు. ఇప్పటికీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 

    ‘దేవుళ్ల కాలం నుంచే మారీచుల రూపంలో అడ్డంకులు సృష్టించే వారు ఉన్నారు. చెరువులు, నాలాలు, ఫుట్‌పాత్‌లను కబ్జాల నుంచి కాపాడుతున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యతో ప‍్రజలు సతమతమవుతున్నారు. అందుకే హైదరాబాద్‌ను కాలుష్యం, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.’ అని రేవంత్‌​ రెడ్డి చెప్పారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: మూసాపేటలోని రెయిన్‌బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఈ  కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు జ్వోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.

    6 గంటలకు శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ‘సంవత్సర పురుషోపాసన’ అనే అంశంపై ప్రముఖ తెలుగు ప్రొఫెసర్‌ డాక్టర్‌ పాతూరి నాగరాజు ప్రసంగిస్తారు. ఇంకా భజన తదితర ఇతర కార్యక్రమాలూ నిర్వహించనున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎల్‌పీజీ సిలిండర్లకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న(మార్చి 17, మంగళవారం) 2 లక్షల 35 వేల 678 LPG సిలిండర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.

    ఎల్‌పీజీ సిలిండర్లు రీ ఫిల్లింగ్ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదార్లకు ప్రభుత్వం  సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సగటున రోజుకు 2,15,151 ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ జరిగేవని.. నిన్న అంతకు మించి డెలివరీ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న IOCL నుండి 93,887(+1%) సిలిండర్లు, HPCL నుండి 84,156 (+11,98%)సిలిండర్లు, BPCL నుండి 57,635 (+22.63%)సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ  జరిగినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది.

  • హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలంగాణ గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు, సమృద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    ‘ఉగాది ఆనందం, ఆశల పండుగ. ఈ నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకురావాలి. ఉగాది స్ఫూర్తిని, సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు సూచించే భావాన్ని ఆమోదించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాద దృక్పథంతో ఎదుర్కొందాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సమృద్ధి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి’ అని గవర్నర్‌ శివప‍్రతాప్‌ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అన్యాయం ఏంటి? అంటూ కొండా రాఘవరెడ్డి నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల కేవైసీ ఉందా?. వైఎస్సార్‌ ఉ‍న్నప్పుడే ఆస్తుల పంపకం పూర్తి అయ్యింది. వైఎస్‌ జగన్‌ తన కుటుంబ ఆస్తుల నుంచి షర్మిలకు వాటా ఇచ్చారు. రూ.230 కోట్లు ఇచ్చిన అన్న జగన్‌పై షర్మిలకు కృతజ్ఞత లేదు. ఇప్పటికీ వైఎస్‌ జగన్‌పై కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు’’ అంటూ కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు.

    ‘‘వైఎస్‌ జగన్‌కు, షర్మిలకు ఎవరి ఆస్తులు వారికే ఉన్నాయి. వైఎస్‌ జగన్‌ ఏనాడూ షర్మిల ఆస్తిలో వాటా అడగలేదు.. మరి షర్మిల  ఎందుకు అడుగుతున్నారు?. శత్రువులు ఇంట్లోనే ఉంటారన్నట్టు షర్మిల, సునీత రూపంలో ఉన్నారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారింది.’’ అని కొండా రాఘవరెడ్డి దుయ్యబట్టారు.


     

  • సాక్షి,అబ్దుల్లాపూర్‌మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ప్రవర్తన సరిగా లేదనే ఆగ్రహంతో సోదరిని అత్యంత దారుణంగా హతమార్చాడో కర్కోటకుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడిసిన  ఘటన  స్థానికంగా కలకలం రేపింది. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • జగిత్యాల జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారన్న ఊహాగానాల మధ్య జగిత్యాలలోని ఆయన ఇంటికి ఏఐసీసీ నేతలు వెళ్లారు. జీవన్ రెడ్డిని కలిసిన వారిలో నేషనల్ కో ఆర్డినేటర్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ప్రొ.కత్తి వెంకటస్వామి ఉన్నారు. పార్టీ మార్పు ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

    జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దాదాపు గంటకుపైగా చర్చలు కొనసాగాయి. నిన్న జీవన్‌ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. జీవన్ రెడ్డి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగిన వేళ నేరుగా ఆయన ఇంటికే వెళ్లి ఏఐసీసీ నేతలు చర్చిస్తున్నారు. 

    కాగా, నిన్న జీవన్‌ రెడ్డి మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ, ఆయనతో కలిసి పనిచేయాలని తనకు చెబుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం సర్కారుతో కలిసి పనిచేయడం తప్పులేదుకానీ హక్కులను కాలరాయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం ఇవన్నీ కరెక్టేనా అని అడిగారు. పార్టీ మారాలని తనకు వచ్చిన ఆలోచనకు తనలోని ఆవేదనే ‍కారణమని చెప్పారు.   

Business

  • దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్‌గ్రేడ్ పనులు చేపట్టింది.

    జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!
    అధికారుల ప్రకారం.. అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్‌గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్‌ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్‌లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.

    ఎంక్వైరీ సేవల్లోనూ వేగం
    టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్‌గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.

    సాంకేతిక సమస్యలకు చెక్
    ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్‌లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.

    కొత్త ఫీచర్లు
    అప్‌గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.

    ఆన్‌లైన్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణ
    ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్‌గ్రేడ్‌తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది.

  • దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    ఉచితంగా సీట్ల కేటాయింపు
    కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.

    ఒకే పీఎన్ఆర్‌ ఉంటే పక్కపక్కనే సీట్లు
    ఒకే పీఎన్ఆర్‌పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.

    క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.

    రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణ
    విమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

    విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్‌లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

  • హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు  వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి  కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.

    ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.

    కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు  థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు.

  • ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్‌ టెక్నాలజీస్‌ (Dell Technologies) సైలెంట్‌గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్‌లో వెల్లడయ్యాయి.

    కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.

    ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్‌ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.

    డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్‌ వర్క్‌ఫోర్స్‌, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్‌ఫోర్స్‌ తగ్గిపోయినట్లైంది.

    ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్‌ఫామ్స్‌, అట్లాసిన్‌, బ్లాక్‌ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి.

  • ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్‌ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.

    వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది.  

    అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

    ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 
     

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. 
     
    నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.

    రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్‌ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి.

  • అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.

    కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్‌కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్‌కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్‌కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు.

    "మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.

  • దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల విలువైన ముసాయిదా అంచనా ఉత్తర్వులను (డ్రాఫ్ట్‌ అసెస్‌మెంట్‌ ఆర్డర్‌) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.

    వివాదం ఏమిటి?

    కంపెనీ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపిన ఆదాయానికి, ఐటీ శాఖ అంచనాలకు మధ్య తేడాలు రావడమే ఈ నోటీసులకు ప్రధాన కారణం. రిటర్నుల్లో వెల్లడించిన ఆదాయానికి కొన్ని అంశాలను కలపడం లేదా కొన్ని మినహాయింపులను నిరాకరించడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

    కంపెనీ స్పందన

    ఈ నోటీసులపై మారుతి సుజుకీ స్పందిస్తూ.. ఐటీ శాఖ ప్రతిపాదనలను సవాలు చేస్తూ వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.

    ఎగుమతులకు ‘షిప్పింగ్’ సెగ

    మరోవైపు, మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్‌ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు కలగడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాల రవాణాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి.

    సముద్ర మార్గాల్లో దాడుల భయం వల్ల కంటైనర్ లభ్యత తగ్గింది. దీనికి తోడు కంటైనర్‌కు 2,000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ షిప్పింగ్ సర్ఛార్జీలు, యుద్ధ-ప్రమాద భీమా ప్రీమియంలు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. హర్మూజ్‌ జలసంధి మీదుగా ప్రయాణించడం ప్రమాదకరమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని అమాంతం పెంచుతోంది. మారుతి సుజుకీ మొత్తం ఎగుమతుల్లో మిడిల్‌ఈస్ట్‌ దేశాల వాటా దాదాపు 12.5 శాతం. తాజా అంతరాయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Movies

  • సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్‌ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్‌ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.

    ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‍అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.

    గతేడాది రిలీజైన దురంధర్‌ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 

    t
     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్‌ షోలు ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.

    ఈ మూవీ చూసిన ఆడియన్స్‌ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్‌-2 ఒక మాస్టర్ పీస్‌ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్‌ స్టన్నింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్‌-2 ఫస్ట్ హాఫ్‌ బ్లాక్‌బస్టర్‌ అంటూ ఆడియన్స్‌ ట్వీటిర్‌ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్‌ చేస్తున్నారు.

     

     

     

     

     

     

  • కేడీ మూవీ సాంగ్‌ వివాదం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. హిందీ వర్షన్‌ లిరిక్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఏకంగా సాంగ్‌నే యూట్యూబ్‌ నుంచి తొలగించారు. కన్నడ హీరో ధృవ సర్జా హీరోగా కేడీ చిత్రానికి సంబంధించి సర్కే చునార్‌ తేరి సర్కే అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్‌ను సింగర్ మంగ్లీ పాడారు. 

    తాజాగా ఈ సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ప్రజల మనోభావాలను తాను ఎప్పుడు గౌరవిస్తానని అన్నారు.  అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వివాదం పట్ల బాధగా ఉందని.. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. లిరిక్స్‌లో మార్పు చేశారని.. అప్‌డేట్‌ అయిన సాంగ్‌ త్వరలో విడుదల చేస్తారని మంగ్లీ రాసుకొచ్చారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని హామీ ఇస్తున్నా తన నోట్‌లో ప్రస్తావించారు.

    కేడీ: ది డెవిల్‌ మూవీ సాంగ్‌ను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అయితే కేవలం హిందీ వర్షన్‌ లిరిక్స్‌పై మాత్రమే తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.  తాజాగా ఈ సాంగ్ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 
     

     

  • వయసు మీద పడితే ఎవరైనా సరే మారిపోతారు. కొందరిని గుర్తుపట్టొచ్చు కానీ మరికొంతమందిని మాత్రం సడన్‌గా చూస్తే గుర్తుపట్టలేం. ఇప్పుడు అలానే ఓ హీరోకి సంబంధించిన లేటెస్ట్ ఫొటో వైరల్ అవుతోంది. అతడి కొత్త మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ నటి సదరు హీరోతో ఫొటోలు తీసుకుంది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఇతడెవరో గుర్తుపట్టారా?

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)

    కర్తవ్యం, భారతీయుడు, ఖుషి తదితర సినిమాలని నిర్మించిన ఏఎం రత్నం.. రీసెంట్ టైంలో అయితే పవన్ కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఈయన పెద్ద కొడుకు జ్యోతికృష్ణ దర్శకుడు కాగా చిన్న కొడుకు రవికృష్ణ మాత్రం నటుడిగా మారాడు. పైన కనిపిస్తున్నది అతడే. 7జీ బృందావన కాలనీ మూవీతో అప్పట్లో అద్భుతమైన సక్సెస్ అందుకున్న రవికృష్ణ.. తర్వాతి కాలంలో అరడజనుకి పైగా చిత్రాలు చేసినప్పటికీ హిట్స్ కొట్టలేకపోయాడు. చివరగా 2011లో ఓ తమిళ సినిమా చేసిన ఇతడు.. ప్రస్తుతం 7జీ బృందావన కాలనీ సీక్వెల్ అయిన '7జీ రెయిన్ బో కాలనీ 2' చేస్తున్నాడు.

    మలయాళ నటి అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్ కాగా తొలి పార్ట్ తీసిన సెల్వ రాఘవన్.. దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కమెడియన్ సుమన్ శెట్టి కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగానే దియా మెర్సి అనే నటి, రవికృష్ణతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిని చూస్తే రవికృష్ణ ఎంతలా మారిపోయాడో అనుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇతడికి 21 ఏళ్ల వయసున్నప్పుడు 7జీ మూవీ వచ్చింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులో దీనికి సీక్వెల్ చేస్తుండటం విశేషం.

    రవికృష్ణ సోదరుడు జ్యోతికృష్ణ విషయానికొస్తే.. దర్శకుడిగా ఆరు మూవీస్ చేశాడు. క్రిష్ బయటకొచ్చేసిన తర్వాత 'హరిహర వీరమల్లు' మిగిలిన భాగానికి దర్శకత్వం చేశాడు. కానీ ఈ మూవీ ఘోరమైన ఫ్లాప్ అయ్యేసరికి కనుమరుగైపోయాడు.

    (ఇదీ చదవండి: సరికొత్త 'స్పైడర్ మ్యాన్' సినిమా ట్రైలర్ రిలీజ్)

  • బాపు బొమ్మలా మెరిసిపోతున్న సమంత

    కూర్చుని క్యూట్ పోజులిచ్చిన మీనాక్షి చౌదరి

    రెడ్ డ్రస్‌లో గ్లామరస్‌గా బ్యూటీ అషూరెడ్డి

    మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ స్టిల్స్

    గోవాలో షూటింగ్ బిజీలో బిగ్‌బాస్ దివి

    ఇండోనేసియా ట్రిప్‌లో రాయ్ లక్ష్మీ

  • టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో హేమ, సురేఖవాణి ముందువరుసలో ఉంటారు. పలు సూపర్ హిట్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు మంచి స్నేహితులు కూడా. ఎప్పుడు సినిమా వర్క్‌ లైఫ్‌లో బిజీగా ఉండే వీరిద్దరు సమ్మర్‌లో చిల్ అవుతూ కనిపించారు.

    తాజాగా ఓ గ్రామానికి వెళ్లిన హేమ, సురేఖవాణి ఫుల్‌గా చిల్ అయ్యారు. ఈత చెట్టు నుంచి కల్లు తీస్తూ కనిపించారు. ఇద్దరు కలిసి సరదాగా కల్లు తాగుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

     

     

  • 90స్ జనరేషన్ పిల్లల్ని ఎంతగానో అలరించిన 'స్పైడర్ మ్యాన్' నుంచి ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2021లో చివరగా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' పేరుతో రిలీజైన మూవీ ఆకట్టుకుంది. బాగానే కలెక్షన్స్ సాధించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కొత్త చిత్రం రాబోతుంది. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' టైటిల్‌తో తీశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?)

    ట్రైలర్ బట్టి చూస్తే.. నో వే హోమ్ సంఘటనల తర్వాత ప్రపంచానికి పీటర్ పార్కర్ ఎవరో తెలియని స్థితిలో అతడు న్యూయార్క్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ శరీరంలో వచ్చిన జన్యు మార్పులకు కారణమేంటి? అనే విషయాల్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టామ్ హోలండ్, జెండాయా ప్రధాన పాత్రలు చేశారు. ఈ జూలై 31న ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలోకి రానుంది.

    స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో భాగంగా 2002లో మొదటి సినిమా వచ్చింది. తర్వాత 2004, 07, 12, 14, 17, 19, 21ల్లో మిగిలిన మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వచ్చే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

  • రామ్‌ చరణ్‌ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి, రైరై రారా అంటూ సాంగ్స్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది.

    తాజాగా పెద్ది మూవీ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. మూవీ షూటింగ్‌ సెట్స్‌కు వెళ్లిన తిలక్ వర్మ.. రామ్ చరణ్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తిలక్‌ వర్మకు రామ్ చరణ్ ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. పెద్ది మూవీ షూట్‌లో వాడిన పాత బ్యాట్‌ను తిలక్ వర్మకు బహుమతిగా అందించారు. అంతేకాకుండా వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పెద్ది మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

  • మేడ్ ఇన్ కొరియా మూవీపై టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్ ఆర్‌ఏ కార్తీక్‌ను అభినందించారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడే చూశానని.. పూర్తిగా అస్వాదించానంటూ ట్వీట్ చేశారు. ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి సినిమా మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నాగ్ కొనియాడారు.  ఈ సినిమాలో మెప్పించిన ప్రియాంక మోహన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

    కొరియన్‌ కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించింది. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో నంబర్‌వన్‌గా ట్రెండ్‌ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రశంసించారు. 
     

     

  • స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

    మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్‌వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

    రణ్‌వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్‌లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

    ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇ‍చ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్‌కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్‌ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్‌గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.

    'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్‌కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్‌వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

  • భారతీయ సినిమాల్లో మాత్రమే కనిపించే పాటలు ఓ రకంగా ఇక్కడి సినిమా విజయాలకు అత్యంత కీలకం అని తెలిసిందే. అయితే అవే పాటలు వివాదాలకు  కేంద్రబిందువవుతూ ఒక్కోసారి నిషేధాలను కూడా ఎదుర్కుంటున్న పరిస్థితికి కూడా పాటకు ఉన్నంత చరిత్ర ఉంది. ఓ వైపు సినిమా సంగీతం ప్రేక్షకులను అలరించడంలో కీలక పాత్ర పోషిస్తూనే, కొన్ని  కొన్ని పాటలు మళ్లీ ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చాయి. తాజాగా విడుదలైన సర్కే చునర్‌ తెరి సర్కే కూడా తీవ్రవివాదంలో ఇరుక్కుంది. ఈ ‘సర్కే చునర్‌ తెరి సర్కే’  అనే పాటలో నోరా ఫతేహి, సంజయ్‌దత్‌లు ప్రధానంగా కనిపిస్తారు.  అయితే ఇందులో ఉన్న అసభ్యకర మైన సాహిత్యం నృత్య భంగిమలు ఉన్నట్టుగా ప్రేక్షకుల నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పాటను ‘‘చీప్‌’’గా అభివర్ణిస్తూ పలువురు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో, చివరికి యూట్యూబ్‌ నుంచి ఈ పాటను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్ర నిర్మాత, పాట రచయిత తదితరులపై కేసులు కూడా నమోదవడం జరిగింది. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన పాటలను పరిశీలిస్తే...

    ‘టటేరీ’ పాటతో బాద్‌షా వివాదాల బాట..
    ఇదే ఏడాదిలో మ్యూజిక్‌ ఇండస్ట్రీని కుదిపేసిన మరో వివాదం టటేరీ...ఈ  పాటను ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా రూపొందించారు. పాటలోని అసభ్యకర కంటెంట్, మహిళలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యల కారణంగా తీవ్ర పాట తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శల దాడి తీవ్రతరం కావడంతో చివరకు హర్యానా స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.  పలు కేసులు నమోదయ్యాయి. చివరికి బాద్‌షా క్షమాపణలు చెప్పి పాటను డిజిటల్‌ వేదికల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    నేటి ఖల్‌ నాయక్‌ నాటి ఖల్‌నాయక్‌...
    ఇలాంటి వివాదాలు మరీ కొత్తవేమీ కావు. గతంలో అంటే దాదాపు 3దశాబ్ధాల క్రితమే 1993లో విడుదలైన ఖల్‌నాయక్‌ సినిమాలోని చోలీకే పీఛే క్యాహై  పాట కూడా పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది.   ఈ పాటలో ద్వందార్థ పదాలు శృతిమించాయంటూ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛోళీ కే పీఛే క్యా హై  పాట హిట్‌ అయినప్పటికీ, దూరదర్శన్‌  ఆల్‌ ఇండియా రేడియోలో నిషేధించారు. ఈ పాటలో  నాటి బాలీవుడ్‌ గ్లామర్‌ క్వీన్‌ మాధురీ దీక్షిత్‌ నర్తించగా,ఆ పాటలోనూ డాన్‌గా నటించింది సంజయ్‌ దత్‌ కావడం విశేషం. మరో విచిత్రం ఏమిటంటే... సర్కే చునర్‌ తెరి సర్కే పాటలో కూడా ఖల్‌ నాయక్‌ ప్రస్తావన ఉండడం. అదేవిధంగా, 1994లో వచ్చిన  సెక్సీ సెక్సీ సెక్సీ ముఝే లోగ్‌ బోల్తీ పాట కూడా వివాదానికి గురైంది. ఇందులో ‘సెక్సీ’ అనే పదం వాడటం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాట లిరిక్స్‌ను ‘‘బేబీ బేబీ బేబీ’’గా మార్చాల్సి వచ్చింది.

    అశ్లీలం ఒకటే కాదు ఇతర కారణాలు కూడా పాటలకుచిక్కులు తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తుంది. గత 2007లో విడుదలైన ఆజా నాచ్లే టైటిల్‌ ట్రాక్‌  కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలోని ఒక లైన్‌ కులవివక్షను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు రావడంతో ఈ పాటను మన తెలుగులో కూడా తరచుగా పాటలు వివాదస్పదం అవుతున్నాయి.

     ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలోని దబిడి దబిడి పాట కూడా నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. కాలం మారినా, వివాదాస్పద పాటల చరిత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. కానీ ఒక స్పష్టమైన మార్పు ఏమిటంటే ఇప్పుడు ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా వెంటనే స్పందిస్తూ కంటెంట్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా, చిత్రసీమ కూడా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భవిష్యత్తులో మరింత నాణ్యమైన, బాధ్యతాయుతమైన కంటెంట్‌కు దారితీయొచ్చునని ఆశించవచ్చు.

     

  • 'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.

    (ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నటుడు)

    'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.

    తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.

    'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అ‍య్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

  • తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు.  ఇది కేవలం తమిళనాడులో మాత్రమే  కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో  పావుగా  వాడుకునే వస్తువులు   కాదని  ట్వీట్  చేశారు.  వారికి   కుటుంబం, గౌరవం, పర్సనల్‌ లైఫ్‌ అనేవి  కూడా ఉంటాయన్నారు.  

    ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను  శక్తిగా గౌరవిస్తామని  రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల  కోసం అవమానించేలా ఉండకూడదని  పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    విజయ్- త్రిష ఎపిసోడ్‌పైనే..

    ఇటీవల కోలీవుడ్‌లో  విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య  సంగీత  విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్‌ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. 
     

     

  • తమిళ నటుడు కరుణాస్‌ వారసుడు కెన్‌ కరుణాస్‌​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం యూత్‌. ఈ మూవీకి కెన్‌ కరుణాస్‌ స్వీయ దర్శకత్వం వహించడం విశేషం. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ పైసా పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా సంగీతం అందించాడు. ఇటీవలే తమిళ ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా మంచి స్పందన లభించింది. తాజాగా యూత్‌ తెలుగు ట్రైలర్‌ వదిలారు. 

    యూత్‌ తెలుగు ట్రైలర్‌
    'మీకు పుట్టినవాడు సాధారణమైన అబ్బాయి కాదు మేడమ్‌.. ఆ దేవుడే మీకు బిడ్డగా పుట్టాడు. వాడిని బ్యాడ్‌ బాయ్స్‌తో చేరనివ్వకండి' అన్న సంభాషణతో వీడియో మొదలవుతుంది. తీరా హీరో.. తనను ముగ్గురమ్మాయిలు ప్రేమిస్తున్నారని తెగ సంబరపడిపోతాడు. ఫైటింగ్‌, లవ్‌, కామెడీకి ఏమాత్రం కొదవ లేనట్లుగా చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అనేలా ట్రైలర్‌ కట్‌ చేశారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

     

  • కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్‌లో ఏం జరగొచ్చనేది చూద్దాం.

    'ధురంధర్' పూర్తి స్టోరీ
    30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్‌తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్‌లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.

    కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్‌లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్‌వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్‌కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్‌లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.

    లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్‌కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.

    అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్‌లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్‌కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్‌లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్‌లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్‌కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్‌ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.

    2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్‌ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్‌కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్‌కి ఓకే చెబుతాడు.

    ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్‌కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్‌లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్‌ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.

    రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?

    మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?

    అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?

    తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?

    ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్‌ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?

    స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?

    తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్‌లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి?

  • బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ తన చేదు బాల్యాన్ని బయటపెట్టింది. తన తండ్రి దర్శకనిర్మాత కమ్రాన్‌ ఖాన్‌ నిర్మించిన ఒక్క సినిమాతో ఉన్నదంతా పోగొట్టుకున్నామంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్‌ మాట్లాడుతూ.. ఐసా భీ హోతా హై సినిమాపై నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీశాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాభవాన్ని చవిచూసింది. 

    కటిక పేదరికంలోకి
    ఆ మూవీ శుక్రవారం రిలీజైతే ఆదివారానికల్లా కటిక పేదరికంలోకి నెట్టివేయబడ్డాం. ఎంతో ధనవంతుడైన నాన్న పేదవాడయిపోయాడు. తన కలలు ఛిద్రం కావడం తట్టుకోలేకపోయాడు. మద్యపానానికి బానిసయ్యాడు. రాత్రి అయిందంటే చాలు మేమంతా వణికిపోయేవాళ్లం. అంతలా తాగేవాడు. ఒకే ఒక్క సినిమా మమ్మల్ని ఐదారేళ్లు వెనక్కు నెట్టేసింది. ఆయన తలెత్తుకోలేకపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. 

    ఎవరికీ తెలీదు
    13 ఏళ్లు ఏ పనీ చేయలేదు. అమ్మానాన్న విడిపోయినా కూడా ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. నాన్న దర్శకుడిగా విఫలమైనందున నేను డైరెక్టర్‌ అయి మంచి పేరు తేవాలనుకున్నాను. అలా చిన్నతనంలో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎక్కువ చిత్రాలు చూసేవాదాన్ని. అయితే నాన్న ఎప్పుడూ కొడుకు గురించి ఆశపడేవాడు. సాజిద్‌ (ఫరా సోదరుడు) పుట్టాక నన్ను కాస్త పక్కనపెట్టేశాడు. 

    నాన్న చనిపోయినప్పుడు
    నాన్నకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు.. కానీ ఫోకస్‌ అంతా కొడుకుపైనే ఎక్కువ ఉండేది. అప్పుడు సక్సెస్‌ అవ్వాలన్న సంకల్పం నాలో మరింత బలపడింది. నాన్న చనిపోయినప్పుడు ఆయన జేబులో రూ.30 మాత్రమే ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. ఫరా ఖాన్‌ అన్నట్లుగానే హిందీ ఇండస్ట్రీలో మొదట కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకురాలిగా మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూయర్‌, తీస్‌మార్‌ ఖాన్‌ వంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించింది.

    చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నటుడు

Sports

  • టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తన జెర్సీ నంబర్‌ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్‌ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్‌. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు ఆడిన ధోని ఏడు నెంబర్‌ జెర్సీతోనే బరిలోకి దిగాడు. 

    అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లోనూ సీఎస్‌కే తరఫున అదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్‌ జెర్సీని పంచుకున్నాడు. 

    ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్‌ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్‌ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్‌ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. 

    మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్‌ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్‌ ఒక ఎమోషన్‌ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్‌ను వాడుతున్నాడు. 

    భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్‌ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్‌ను ఐపీఎల్‌లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    చదవండి: ‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

  • క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్‌నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్‌నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్‌మెంట్‌ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం. 

    కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్‌తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు. 

    ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. 

    నిరంతరం రిస్క్‌తో కూడుకున్నదే. ఆటలను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్‌ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్‌ బరిలోకి దిగా' అని  పీవీ సింధు చెప్పుకొచ్చింది.

    చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!

  • టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్‌ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్‌’ గ్రేడ్‌ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీలో రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. 

    వీరిలో కోహ్లీ, రోహిత్‌లు కేవలం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్‌కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్‌లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, జడేజా కూడా ఉన్నారు. 

    బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్‌లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. 

    కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

    దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా టాప్‌-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్‌ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.

    చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది.  కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ 2026 సీజన్‌లో ఆరంభం రోజునే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

    ఈ నేపథ్యంలోనే  కమిన్స్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ వైస్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలవడంలో ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

    అభిషేక్‌ సంగతి పక్కనబెడితే రిషబ్‌ పంత్‌,జితేశ్‌ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్‌ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్‌ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.

    ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్‌ దూరమయ్యాడు. ఇక కమిన్స్‌ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కమిన్స్‌ సారథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ రన్నరప్‌గా నిలిచింది. 

    ఆ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్‌ నుంచి గేర్‌ మార్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌, లివింగ్‌స్టోన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్‌ కమిన్స్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, ట్రావిస్‌ హెడ్‌, జీషన్‌ అన్సారీ, సలీల్‌ అరోరా, శివంగ్‌ కుమార్‌, లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్‌వర్డ్స్‌, అమిత్‌ కుమార్‌, క్రెయిన్స్‌ ఫెల్టూరా, సకిబ్‌ హుసేన్‌, ఒంకార్‌ తర్మలే, ప్రఫుల్‌ హింగే, శివమ్‌ మావి.

  • ఐపీఎల్లో 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్‌ఫిషర్‌ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్‏కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. 

    మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ ‏పై, అమెరికా సంస్థ కోల్‌బెర్గ్‌ క్రావిస్‌ రాబర్ట్స్‌ అండ్‌ కో (కేకేఆర్‌), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది.  కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. 

    గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 

    ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్‏గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

    ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. 

    అయితే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

    చదవండి: ఐపీఎల్‌ ఖరీదైన ఆటగాడి అసహనం!

  • టీ20 ప్రపంచకప్‌-2026 హీరో, టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.

    దాగుడుమూతల మాదిరి..
    భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్‌.. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్‌ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్‌ కోల్పోయాడు. దీంతో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు.

    నాకౌట్‌ దశలో వరుసగా హాఫ్‌ సెంచరీలు
    అయితే, కీలక నాకౌట్‌ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్‌ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

    ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు.  

    ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.

    ఆ విషయంలో నేను స్వార్థపరుడినే
    ‘‘మా కోచ్‌ , కెప్టెన్‌ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.

    నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్‌ చెప్పుకొచ్చాడు.

    కాగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.

    చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఎలాగైనా టైటిల్‌ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్‌ గ్రీన్‌ పై చాలా ఆశలే పెట్టుకుంది. 

    గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ను కేకేఆర్‌ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్‌ గ్రీన్‌ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లోనూ గ్రీన్‌ అంతగా ఆకట్టుకోలేదు. 

    మరో పది రోజుల్లో ఐపీఎల్‌ 18వ సీజన్‌  మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్‌కు ఒక రకంగా బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌లో వెస్ట్‌ ఆస్ట్రేలియా తరఫున కామెరున్‌ గ్రీన్‌ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్‌వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ సెంచరీ మార్క్‌ సాధించాడు. 

    ఈ సందర్భంగా ఆసీస్‌ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్‌ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్‌ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్‌ ఫీలింగ్‌ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్‌ లభించింది. కచ్చితంగా మ్యాచ్‌ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్‌లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. 

    ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్‌ ‘వేస్ట్‌ ఆఫ్‌ టైమ్‌’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్‌ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్‌ ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్ బ్యూకాసన్‌.. గ్రీన్‌ తరఫున మీడి యాకు క్షమాపణ  చెప్పడం ఆసక్తి కలిగించింది.

    చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్‌ ర్యాంకు!

  • టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన రిటైర్మెంట్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.

    గంభీర్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్‌ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆసీస్‌తో తొలి టెస్టులో అశూను బెంచ్‌కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను ఆడించింది.

    పిలిచి.. మళ్లీ తప్పించి
    అయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే అశ్విన్‌ రిటైర్మెంట్‌ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్‌ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.

    ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్‌ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

    అదే  అతిపెద్ద బలం
    ‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్‌లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్‌లో నేను, బ్రిస్బేన్‌లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్‌ దళాన్ని నడిపించాము.

    నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్‌లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్‌ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.

    నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు
    కోచ్‌గా తన జాబ్‌ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్‌, రోహిత్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్‌కోచ్‌గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.

    స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. 

    కాగా ఆసీస్‌ టూర్‌  తర్వాత అకస్మాత్తుగా రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్‌ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్‌పై మరోసారి విమర్శలు వచ్చాయి. 

    చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్‌ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’

  • అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స​్‌ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ అఘాను రనౌట్‌ చేయడం వివాదం సృష్టించింది. 

    అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్‌ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్‌ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ ఆటగాడు సల్మాన్‌ అఘా బ్యాటింగ్‌ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

    ఇక ఆల్‌రౌండర్ల విభాగంలోనూ సల్మాన్‌ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్‌ కెప్టెన్‌ షహీన్‌ అఫ్రిది ఆల్‌రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్‌ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్‌మన్‌ గిల్‌ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్‌ రాహుల్‌ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 

    బౌలింగ్‌ విభాగంలో కుల్దీప్‌యాదవ్‌ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ అక్షర్‌పటేల్‌ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో భారత్‌ నుంచి అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌లు టాప్‌-10లో కొనసాగుతున్నారు. 

    బౌలింగ్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మెరిసిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

    చదవండి: ‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు!

  • హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాకిస్థాన్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడంపై భారత్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్‌కు చెందిన సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై పాకిస్థాన్‌ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు చెందిన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

    కాగా అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

    ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్‌ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు.  అందుకే ఒకసారి నాకు కాల్‌ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్‌లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన సందేశం మాత్రం సన్‌రైజర్స్‌ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.

    అయితే తాజాగా భారత్‌లో ఐపీఎల్‌ ప్రారంభమవుతున్న వేళ  అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్‌ మోదీ.. కావ్యామారన్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్‌ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. 

    లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్‌లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి.  2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్‌లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్‌రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్‌ ఫిలిప్స్‌

  • ముంబై: లాస్‌ ఏంజెలిస్‌ మెగా ఈవెంటే మా అందరి లక్ష్యమని భారత టాప్‌ ర్యాంక్‌ స్క్వాష్‌ ప్లేయర్‌ అనాహత్‌ సింగ్‌ తెలిపింది. 2028 ఒలింపిక్స్‌లో తొలిసారి స్క్వాష్‌ క్రీడకు చోటు లభించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా వచ్చే రెండేళ్ల పాటు ఒలింపిక్‌ కలను సాకారం చేసుకునేందుకే శ్రమిస్తారని చెప్పింది. 

    ప్రతి అథ్లెట్‌ కల
    ఇండియా ఓపెన్‌ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘స్క్వాష్‌ తొలిసారి ఒలింపిక్స్‌లో భాగమవడం... ముమ్మాటికి ఉత్సాహాన్ని పెంచే విషయం. క్రీడాకారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మాకు (స్క్వాష్‌ ప్లేయర్లకు) కామన్వెల్త్‌ క్రీడలే మేజర్‌ ఈవెంట్‌గా ఉంది. 

    ఇప్పుడు విశ్వక్రీడల్లో ఆడే అవకాశం లాస్‌ ఏంజెలిస్‌ ద్వారా దక్కనుంది. ఒలింపిక్‌ పతకమనేది ప్రతి అథ్లెట్‌ కల. దీన్ని సాకారం చేసుకునేందుకే ఏళ్ల తరబడి శ్రమిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యంతో దేశానికి పతకం తేచ్చేందుకు నేను చెమటోడ్చుతాను’ అని వివరించింది. 

    కాగా 2023 ఏషియాడ్‌లో రెండు కాంస్య పతకాలు గెలుపొందిన అనాహత్‌ ఈ ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం జరిగే టోర్నీలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం రంగు మారుస్తానని తెలిపింది. 

    సన్నాహక టోర్నీగా
    ఇండియా ఓపెన్‌ ప్రొఫెషనల్‌ స్క్వాష్‌ అసోసియేషన్‌ (పీఎస్‌ఏ) కాపర్‌ ఈవెంట్‌గా జరుగుతోంది. ఇందులో రాణించిన ప్లేయర్లకు ర్యాంకింగ్‌ పాయింట్లు మెరుగవడమే కాకుండా ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలకు ముందు మేటి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది.

     పురుషుల కేటగిరీలో భారత రెండో ర్యాంకింగ్‌ ప్లేయర్‌ రమిత్‌ టాండన్‌ మాట్లాడుతూ స్క్వాష్‌ తాజాగా ఒలింపిక్‌ క్రీడ కావడంతో కార్పోరెట్‌ సంస్థలు సైతం ఆకట్టుకుంటోందని, తద్వారా ఆటగాళ్లకు స్పాన్సర్‌షిప్‌ అండదండలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.   

  • టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున హిట్‌మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్‌లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. 

    అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్‌ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌-19వ సీజన్‌లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.

    కాగా గత సీజన్‌లో రోహిత్ చాలా మ్యాచ్‌లలో ఇంపార్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్‌లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు.

    "గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్‌గా ఉపయోగించాము. వర్క్‌లోడ్ మేనెజ్‌మెంట్‌లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా  అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం రోహిత్‌ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.

    అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న కేకేఆర్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
    చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్‌!?
     

Family

  • తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.

    శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.

    ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.

    ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.

    అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది.  సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.

    –  నందిరాజు రాధాకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

  • స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఏజెన్సీ అంటూ ఫోన్‌ చేసిన వారిని నమ్మి ఒక వాట్సాప్‌ గ్రూపులో చేరాను. కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాను. మొదట్లో ఆరు లక్షల దాకా లాభం వచ్చింది అని దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఇంతలో ఉన్నట్టుండి ఓ రోజు ఒక్కసారిగా నా ఎకౌంట్లో నుంచి 8 లక్షల రూపాయలు కట్‌ అవడంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా కోర్టు ఆర్డర్‌ ద్వారా డబ్బులు వేరే అకౌంట్‌ కి పంపించేశారని,  నా అకౌంట్‌ను కూడా ఫ్రీజ్‌ చేశారనీ తెలిసింది. 

    కోర్టు ఆర్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయి. బ్యాంక్‌ వారిని అడిగితే పరిష్కారం కోసం తమిళనాడు కోర్టుకు, కర్ణాటక కోర్టుకు వెళ్ళమని చెప్తున్నారు. నా అకౌంట్లో ఇంకా 20 లక్షలు ఉన్నాయి కానీ కేసుల వల్ల అవి కూడా ఫ్రీజ్‌ అయి ఉన్నాయి.  తీరా చూస్తే నేను పెట్టుబడి పెట్టిన దానికంటే పోయిందే ఎక్కువ. దయచేసి నాకు పరిష్కారం సూచించగలరు.
    – నళిని, హైదరాబాద్‌

    అనేక రకాల సైబర్‌ నేరాల్లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కూడా ఒకటి. స్నేహం పేరుతో ప్రలోభ పెట్టి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు లాగేస్తున్నారు సైబర్‌ నేరగాళ్ళు. ట్రేడింగ్‌ చేయాలని అనుకుంటే నమ్మకమైన కంపెనీల ద్వారా మాత్రమే చేయాలి తప్ప, సోషల్‌ మీడియా ప్రకటనలు, వాట్సాప్‌ గ్రూపులలో ప్రకటనలు చూసి చేయడం అనేకమందిని బాధితులను చేస్తున్నాయి. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీరు నేరం చేయనప్పటికీ, మీరు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసి సంపాదించాను అనుకునే నగదు బహుశా సైబర్‌ నేరగాళ్లు చేసిన లావాదేవీలలో భాగం అయి ఉండవచ్చు. 

    మరొకరి దగ్గర అక్రమంగా తీసుకున్న డబ్బులను కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌ మాయలో పడిన వారికి లాభంగా చూపిస్తూ వారి ఎకౌంట్లో వేసి వారి నమ్మకాన్ని సాధిస్తారు. తర్వాత మీరు ఎక్కువ లాభాల కోసం ఎక్కువ నగదు ఇవ్వాలి అనేదే వారి ఎత్తుగడ. కాబట్టి మీ అకౌంట్లోకి వచ్చిన మొత్తం లాభంగా మీరు భావిస్తున్నది అయినప్పటికీ, అది మరొక బాధితుడి డబ్బు అయి ఉండే ఆస్కారం ఉంది. అయితే నిజానిజాలు నిర్ణయించవలసినది కోర్టు!

    ఇకపోతే, మీ ఎకౌంటు ఫ్రీజ్‌ అయింది అని చె΄్పారు కాబట్టి, ఆర్డరు ఇచ్చిన కోర్టును లేదా ఏ పరిధిలోని  పోలీసులు అకౌంట్‌ ఫ్రీజ్‌ చేశారో తెలుసుకొని వారిని సంప్రదించవలసి ఉంటుంది. వేరే రాష్ట్రాల కోర్టుకు వెళ్లడం లేదా అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి మీ ఎకౌంటులో ఉన్న నగదును కూడా కాడుకోవడం మాత్రమే మీకు ఉండే దారి. అదనంగా మీరు కూడా సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి ఒక ఫిర్యాదు చేస్తే మంచిది. 

    మిమ్మల్ని ఏ విధంగా ట్రేడింగ్‌ కంపెనీ వారు సంప్రదించారు, ఏ విధంగా ఏ అకౌంట్లోకి మీరు డబ్బులు జమ చేశారు వంటి పూర్తి వివరాలను సైబర్‌ క్రైౖమ్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి వెల్లడించి ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి. మీకు వచ్చినది ఎంత...? పోయినది ఎంత అనే విషయాన్ని రుజువులతో సహా ఇవ్వండి. మీరు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రావాలి అంటే అది పోలీసు వారు మాత్రమే చేయగలరు. అదీ విచారణ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే రికవరీ చేయగలరు. కోర్టు ఆర్డర్‌ ఉన్నప్పుడు మీ అకౌంట్‌లో లావాదేవీలు చేయడానికి మీ అనుమతి అవసరం లేదు! 
    శ్రీకాంత్‌ చింతల
    (హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

  • ఓ కూతురు తన తండ్రి ఆ రైంజ్‌లో డ్యాన్స్‌ చేస్తాడని ఊహించలేదు. ఒక్కసారిగి విస్తుపోయి..చివరికి అతడితో కలిసి పాదం కదిపింది. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..మేడమ్‌ బహిరంగంగా ప్లే చేస్తే..ఆయన టాలెంట్‌ ఏంటో తెలిసేది కదూ అని కామెంట్‌ చేస్తూ పోస్టుల పెట్టారు కూడా. 

    వివరాల్లోకి వెళ్తే..ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియలో ఓ యువతి 'బిల్లీ జీన్' పాటకు డ్యాన్స్‌ చేయడంతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి మాములుగా ఆమె వద్దకు వస్తాడు. ఆ తర్వాత ఆతడు చాలా సులభంగా మూన్‌వాక్‌ చేయడంతో ఒక్కసారిగా ఆ దృశ్యం అనూహ్య మలుపు తీసుకుంటుంది. ఈ నాన్న సాధారణ దుస్తులతో ఉన్నప్పటికీ..చాలా సునాయాసంగా ఆత్మవిశ్వాసంగా చేస్తున్న ఆ డ్యాన్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

    అత్యంత నేచురల్‌గా కనిపించే ఆ క్షణం మధుర జ్ఞాపకంగా మారిపోయిందా కూతురికి. ఒక్క క్షణం ఆమె సైతం తన తండ్రి అద్భుతమైన డ్యాన్స్‌ చూసి నిశ్చేష్టురాలైపోతుంది. ఆ తర్వాత కొంచెంసేపటికీ అతనితో కలిసి అడుగులు కదపడానికి ప్రయత్నించడంతో వీడియో ముగుస్తుంది. 

    కాగా 1982లో విడుదలైన 'బిల్లీ జీన్', మైఖేల్ జాక్సన్  అత్యంత ప్రసిద్ధ ఆల్బమ్‌లలో ఒకటైన 'థ్రిల్లర్'లోని ఒక భాగం. ఈ పాట పాప్ సంగీతం, నృత్య సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందులోనూ జాక్సన్‌ చేసిన మూన్‌వాక్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపుని తెచ్చిపెట్టింది. 

    (చదవండి: నటి జ్యోతిక మోడర్న్‌ పేరెంటింగ్‌ టిప్స్‌..!)
     

  • రీల్‌ లైఫ్‌లోనే గాదు రియల్‌ లైఫ్‌లో కూడా బ్యూటీఫుల్‌ కపుల్‌ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్‌  చేస్తూ..సూపర్‌ విమెన్‌గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్‌ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్‌ టిప్స్‌ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

    ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్‌గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు. 

    జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. 

    పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..

    • ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్‌ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు  సైతం మనతో పంచుకుంటారు.

    •  రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.

    • మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.

    చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్‌ చేస్తానని అన్నారామె. 

    (చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!)

National

  • సాక్షి,న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రవర్తన మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, ఆయన వ్యవహరించే తీరుతో మహిళలందరమూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నామన్నారు. అంతేకాదు రాహుల్ ఒక "టపోరీ"(ఆకతాయి)లా వచ్చి వెడతారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి.

    పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ 200కుపైగా మాజీ అధికారులు రాసిన బహిరంగ లేఖ రాజకీయ చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రవర్తనపై వచ్చిన విమర్శలపై రనౌత్ స్పందిస్తూ, రాహుల్‌ని చూస్తే మహిళలంతా అసౌకర్యానికి గురవుతారని, ఎందుకంటే ఒక పోకిరిలాగా దూకుడుగా మాట్లాడటం,  ఇంటర్వ్యూలు ఇచ్చే వారిని ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెడతారని ఆమె మండిపడ్డారు.

    ప్రియాంకతో పోలిక
    అయితే రాహుల్‌  సోదరి ప్రియాంక గాంధీ వాద్రా హుందాగా ప్రవర్తిస్తారని  కంగనా పేర్కొన్నారు. రాహుల్ తన సోదరి ప్రియాంకగాంధీని చూసి నేర్చుకోవాలని హితవు పలకం విశేషం. ప్రియాంక ప్రవర్తన చాలా బాగుంటుందని, కానీ రాహుల్ ప్రవర్తన మాత్రం "సిగ్గుచేటు" అంటూ  కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసారు.

     ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!


    రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఉండవచ్చు, కానీ రాహుల్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మహిళల గౌరవం, వారి అభ్యున్నతి పట్ల ఆయన చాలా నిబద్ధతతగా ఉంటారనీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నపుడు ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు. ఇందిరా గాంధీ, సోనియా లాంటి మహిళా నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

  • చైనాకు వెళ్లాల్సిన 7 చమురు ట్యాంకర్లు  దక్షిణ చైనా సముద్రంలో యూ-టర్న్ తీసుకుని భారత్‌వైపు మళ్లడం  అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కీలకంగా మారింది. రష్యా చమురు నౌకలు చైనా వైపు కాకుండా భారత్ వైపు మళ్లడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.  మాస్కో నుండి దిగుమతులను న్యూఢిల్లీ రెట్టింపు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

    దక్షిణ చైనా సముద్రం గుండా ప్రయాణిస్తూ, మొదట చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యన్ చమురు ట్యాంకర్లు అకస్మాత్తుగా తమ మార్గాన్ని మార్చుకున్నాయి   షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, 'ఆక్వా టైటాన్' అనే ఈ నౌక, జనవరి చివరలో బాల్టిక్ సముద్ర ఓడరేవు నుండి లోడ్ చేసుకున్న యురల్స్ కార్గో మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది. 

    సూయజ్‌మాక్స్ జౌజౌ ఎన్. భారతదేశంలోని సిక్కాకు మార్చి 25న చేరుకుంటుందని అంచనా.రష్యా నుండి కొనుగోళ్లను తాత్కాలికంగా పెంచుకోవడానికి భారతదేశానికి అమెరికా అనుమతి ఇచ్చిన కొద్ది రోజులకే, ఈ అఫ్రామాక్స్ నౌక మార్చి మధ్యలో చైనాలోని రిజావో ఓడరేవుకు  చేరాల్సి ఉంది. 

    ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!

    ఎందుకిలా?
    రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారతదేశానికి 30 రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత్ ఎటువంటి ఆంక్షల భయం లేకుండా రష్యా చమురును దిగుమతి చేసుకునే అవకాశం కలిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడంతో, ఇరాన్ ప్రతిచర్యగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసింది. దీనివల్ల మధ్యప్రాచ్యం నుండి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా   ప్రపంచ వ్యాప్తం చమురు సంక్షోభం ఏర్పడింది.  ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగి, ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు 120 డాలర్లకు  చేరుకుంది.

    ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఇంధన భద్రత కోసం భారత్ రష్యాపై మరింతగా ఆధారపడుతోంది.ఈ ఏడు ట్యాంకర్ల రాకతో దేశీయంగా పెరుగుతున్న చమురు ధరల నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని చైనాకు వెళ్లాల్సిన వనరులు ఇప్పుడు భారత అవసరాలకు ఉపయోగపడనున్నాయని అంచనా 

    ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

  • గాంధీనగర్‌: ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్‌కు మరో శుభవార్త అందింది. కాసేపటి క్రితమే హార్మూజ్‌ జలసంధి నుంచి మూడో నౌక జగ్‌లడ్కి షిప్‌ గుజరాత్‌ తీరానికి చేరుకుంది. దీంతో, భారత్‌కు చమురు కష్టాలు తీరనున్నాయి.

    వివరాల మేరకు.. జగ్‌లడ్కి నౌక బుధవారం ఉదయం వచ్చి ముంద్రా పోర్టుకు చేరుకుంది. సదరు నౌక యూఏఈలోని ఫుజైరా పోర్టు నుంచి 80,800 మెట్రిక్ టన్నుల కూడ్రాయిల్‌ను మోసుకొచ్చిది. హార్మూజ్‌ జలసంధి నుంచి మూడో నౌక సేఫ్‌గా భారత్‌కు చేరుకుంది. ఇక, ఇప్పటికే ఎల్పీజీతో శివాలిక్‌, నందాదేవి నౌకలు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. 


    ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎల్పీజీని మోసుకొచ్చిన శివాలిక్‌ ట్యాంకర్‌ సోమవారం భారత్‌లోని గుజరాత్‌ ముంద్రా పోర్ట్‌కు వచ్చింది. ఈ శివాలిక్‌ నౌకలో 45,000 మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ భారత్‌కు వచ్చింది. అలాగే పర్షియన్‌ గల్ఫ్‌కు పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిల్లో 616 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. హర్మూజ్‌ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు రెండురోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్‌ జలసంధిని దాటాయి. అందులో ఒకటి శివాలిక్‌ కాగా.. మరొకటి నందాదేవి. ఈ ‘నందాదేవి’ కూడా 45వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ను తీసుకొని కాండ్లా పోర్టుకు చేరుకుంది.