Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసింది. సీఎస్‌కే విషయానికొస్తే.. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడి, తాజాగా పంజాబ్‌ చేతిలో పరాజయంపాలైంది.

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) రాణించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలో ప్రియాంశ్‌ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్‌ కాగా.. ప్రభ్‌సిమ్రన్‌ (43), కూపర్‌ కన్నోల్లీ (36), శ్రేయస్‌ అయ్యర్‌ (50) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి గెలుపుకు పునాది వేశారు. 

    ఆఖర్లో శశాంక్‌ సింగ్‌ (14 నాటౌట్‌), స్టోయినిస్‌ (9 నాటౌట్‌) ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పంజాబ్‌ను గెలుపు తీరాలు దాటించారు. సీఎస్‌కే బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, అన్షుల్‌ కంబోజ్‌ తలో 2 వికెట్లు తీశారు. సీఎస్‌కే సొంతగడ్డపై భారీ స్కోర్‌ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. 

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్‌ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 

    ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసిన ఆ జట్టు.. 36వ సారి 200 ప్లస్‌ మార్కును తాకింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సీఎస్‌కే, ఆర్సీబీ (35) పేరిట సంయుక్తంగా ఉండేది.

    ఈ విభాగంలో సీఎస్‌కే, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో పంజాబ్‌ కింగ్స్‌ (32), ముంబై ఇండియన్స్‌ (31), కేకేఆర్‌ (29) ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉంది. 2024 ఎడిషన్‌లో ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో భారీ స్కోర్‌ చేసింది. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించాడు. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 210 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ సైతం ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్‌ నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్‌ కాగా.. ప్రభ్‌సిమ్రన్‌ (38), కూపర్‌ కన్నోల్లీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ప్రియాంశ్‌ ఆర్యను మ్యాట్‌ హెన్రీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.   
     

  • సీఎస్‌కే యువ బ్యాటర్‌, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

    ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు సురేశ్‌ రైనా పేరిట ఉండేది. రైనా ఐపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌లో (2008) 21 ఏళ్ల 148 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు. తాజాగా మాత్రే 18 కిందటి ఆ రికార్డును బద్దలు కొడుతూ 18 రోజుల 261 రోజుల వయసులో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ విభాగంలో మాత్రే, రైనా తర్వాతి స్థానంలో పార్థివ్‌ పటేల్‌ (23 ఏళ్ల 76 రోజుల, 2008) ఉన్నాడు.

    ఈ హాఫ్‌ సెంచరీతో మాత్రే మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. ఈ హాఫ్‌ సెంచరీ అతనికి ఐపీఎల్‌లో రెండవది. తద్వారా 19 ఏళ్లలోపు ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షాతో (2) కలిసి రెండో స్థానంలో నిలిచాడు. 

    ఈ విభాగంలో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. గత ఎడిషన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన వైభవ్‌ ఇప్పటికే 3 అర్ద సెంచరీలు చేశాడు. కొద్ది రోజుల కిందటే వైభవ్‌ 15వ పడిలోకి అడుగుపెట్టన విషయం తెలిసిందే.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ శాంసన్‌ (7) వికెట్‌ కోల్పోయినా, ఆయుశ్‌ మాత్రే ధాటిగా ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 156-4గా ఉంది. శివమ్‌ దూబే (14), సర్ఫరాజ్‌ ఖాన్‌ (20) క్రీజ్‌లో ఉన్నారు. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భీకర ఫామ్‌ ప్రదర్శించి, టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్‌ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అతను ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. 

    ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ అయిన చెటా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్‌ 3) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

    అప్పటివరకు భీకర ఫామ్‌లో ఉండిన సంజూ తమ ఫ్రాంచైజీకి వచ్చే సరికి వరుసగా విఫలం​ కావడాన్ని సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంద చెటా ఇది అంటూ బాధపడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండిన సంజూపై సీఎస్‌కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.

    అసలే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజూనే అనుభవజ్ఞుడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ నుంచి ఆశించడం తప్పేమీ కాదు. నేటి మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్‌ కీపర్‌ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

    ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 71-1గా ఉంది. సంజూ త్వరగా ఔటైనా, ఆయుశ్‌ మాత్రే ధాటిగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (14) అండగా ఉన్నాడు. 

    కాగా, ఈ  సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోయింది. వారు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఛేదనలో యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, ఆదిలోనే తన జట్టు గెలుపును ఖరారు చేశాడు.  
     

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు నలుగురు 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆ జట్టు చరిత్రలో ఇలా జరగడం​ ఇది రెండో సారి మాత్రమే. గత ఎడిషన్‌ ఆరంభంలో తొలిసారి ఇలా జరిగింది. 

    సాధారణంగా సీఎస్‌కేను ముసలివాళ్ల జట్టుగా పరిగణిస్తారు. ఆ జట్టు చరిత్ర చూస్తే 30 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా సీఎస్‌కే ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది.

    పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే, కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌, నూర్‌ అహ్మద్‌ లాంటి యువకులను సీఎస్‌కే బరిలోకి దించింది. వీరంతా 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు.

    ఆయుశ్‌ మాత్రే (18 ఏళ్ల 261 రోజులు)
    కార్తీక్ శర్మ (19 ఏళ్ల 342 రోజులు)
    ప్రశాంత్ వీర్ (20 ఏళ్ల 130 రోజులు)
    నూర్ అహ్మద్ (21 ఏళ్ల 90 రోజులు)

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌ చివరి బంతికి సంజూ శాంసన్‌ (7) ఔటయ్యాడు. సీఎస్‌కేకు మారిన తర్వాత సంజూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 24-1గా ఉంది. ఆయుశ్‌ మాత్రే (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. 

  • ఐపీఎల్‌-2026 తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ పేస‌ర్ జోష్ హాజిల్‌వుడ్ ఊహించిన దానికంటే ముందుగానే తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. హాజిల్‌వుడ్ ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడున్నాడు.

    దీంతో యాషెస్ సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హాజిల్‌వుడ్ మాత్రం భారత్‌కు వచ్చి ఆర్సీబీ జట్టుతో చేరాడు. అయితే ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు.

    అయితే ఇప్పుడు హాజిల్‌వుడ్ తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. చిన్నస్వామి స్టేడియం నెట్స్‌లో జోష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. చాలా రోజుల తర్వాత పూర్తి రిథమ్‌తో బౌలింగ్ చేయడంతో దాదాపుగా అతడు పూర్తి సాధించినట్లు కన్పిస్తున్నాడు. ఏప్రిల్ 10న గువాహటిలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హాజిల్‌వుడ్ పునరాగమనం చేస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న సీఎస్‌కేతో తలపడనుంది.
    చదవండి: IPL 2026: అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై పంజాబ్‌ కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా.. పంజాబ్‌ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

    రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    8.5వ ఓవర్‌-95 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. లేని రెండో పరుగుకు ప్రయత్నించి ప్రభ్‌సిమ్రన్‌ (43) రనౌటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    210 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించిన తర్వాత పంజాబ్‌ 61 పరుగుల వద్ద (4.2వ ఓవర్‌) తొలి వికెట్‌ కోల్పోయింది. విధ్వంసం సృష్టించిన ప్రియాంశ్‌ ఆర్యను (39) మ్యాట్‌ హెన్రీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

    సీఎస్‌కే భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆయుశ్‌ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్‌ దూబే (45 నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

    రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (7), కార్తీక్‌ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్‌ బౌలర్లలో విజయ్‌ కుమార్‌ 2, చహల్‌, జన్సెన్‌, బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.  

    ఐదో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
    16.4వ ఓవర్‌- 168 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ (32) ఔటయ్యాడు.

    మాత్రే (73) ఔట్‌
    12.3వ ఓవర్‌-123 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ మాత్రే ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
    11.1వ ఓవర్‌- 110 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో నేహల్‌ వధేరాకు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) ఔటయ్యాడు. 

    భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న సీఎస్‌కే
    టాస్‌ ఓడి తొలుత బ్యాటంగ్‌ చేస్తున్న సీఎస్‌కే భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ వికెట్‌ కోల్పోయినా.. ఆయుశ్‌ మాత్రే (62) ధాటిగా ఆడుతుండటంతో 10 ఓవర్లలో వికెట​్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మాత్రే తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతనికి రుతురాజ్‌ (25) సహకరిస్తున్నాడు. 

    సంజూ మరోసారి విఫలం
    సీఎస్‌కే మారిన తర్వాత సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులకు ఔటైన అతను.. ఇవాల్టి మ్యాచ్‌లో మరో పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. 

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

    ఈ మ్యాచ్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సీఎస్‌కే ఓ మార్పు చేసింది. మాథ్యూ షార్ట్‌ స్థానంలో ప్రశాంత్‌ వీర్‌ తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు..

    పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

    ఇంపాక్ట్ సబ్స్‌: సూర్యాంశ్ షెడ్గే, ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బ్రార్

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్

    ఇంపాక్ట్ సబ్స్: జామీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్

  • ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్‌​ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్‌ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. 

    నిఖిల్‌ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్‌..  టాస్మానియా తరఫున క్రికెట్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.

    నిఖిల్‌ తాజాగా ముగిసిన బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబార్ట్‌ హరికేన్స్‌ తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్‌ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసే నిఖిల్‌ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్‌లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.

    ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్‌ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు.

    ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. 
     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ‍కేకేఆర్ చిత్తు అయింది.  2012 తర్వాత కేకేఆర్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.

    దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత సీజన్‌లో కూడా కేకేఆర్‌ను విజయపథంలో రహానే నడిపించలేకపోయాడు. కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరుకుండానే కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి కూడా అదే సూచనలు కన్పిస్తున్నాయి.

    రహానేపై వేటు?
    ఈ క్రమంలో అజింక్యా రహానేను సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రహానే స్ధానంలో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని 'రాయ్‌స్పోర్ట్స్' ప్రతినిధి సందీపన్ బెనర్జీ పేర్కొన్నారు. రింకూ ప్రస్తుతం కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా రహానే గాయంతో మైదానం వీడినప్పుడు రింకూ కెప్టెన్సీ బాధ్యతలు చేప‌ట్టాడు.

    కానీ  221 పరుగుల భారీ ఛేదనను అడ్డుకోవడంలో అతను విఫలమయ్యాడు. కానీ రింకూ సింగ్‌కు మాత్రం కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది. 2024-25 డొమాస్టిక్ సీజ‌న్‌లో యూపీ జ‌ట్టు కెప్టెన్‌గా రింకూ వ్య‌వ‌హ‌రించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి పూర్తి స్ధాయి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని కేకేఆర్ మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు సమాచారం.

    త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ర‌హానే స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అనంత‌రం ర‌హానే మాట్లాడుతూ.. నేను ఆడటం కొందరికి ఇష్టం లేదు.  నా విజయాలను చూసి వారు అసూయపడుతున్నారు. నేను బ‌య‌ట వ్య‌క్తుల మాట‌ల‌ను ప‌ట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు.  కేవలం ఒక ఇన్నింగ్స్ విఫలమైతే విమర్శలు చేయడం సరికాదు అని పేర్కొన్నాడు.
    చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

  • భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్‌ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో సానియా మీర్జా మొత్తంగా 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది.

     కెరీర్‌లో అత్యున్నత స్థాయికి
    ఇందులో మూడు మహిళల డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఉండటం విశేషం. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలు చవిచూసింది. తొలుత సొహ్రాబ్‌ అనే వ్యక్తితో సానియా నిశ్చితార్థం చేసుకోగా.. ఆ బంధం పెళ్లి వరకు రాలేదు.

    షోయబ్‌తో వివాహం, విడాకులు
    ఆ తర్వాత పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించిన సానియా మీర్జా.. అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సానియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరిగింది. అయినా సరే ఆమె ఏనాడూ ధైర్యం కోల్పోకుండా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఇక షోయబ్‌- సానియాలకు కుమారుడు ఇజహాన్‌ సంతానం.

    కాగా కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సానియా- షోయబ్‌ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. షోయబ్‌ ప్రవర్తనతో విసిగిపోయిన సానియా.. తానే అతడికి విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి సానియా దుబాయ్‌లో నివసిస్తోంది. టెన్నిస్‌ అకాడమీ వ్యవహారాలతో బిజీగా గడుపుతోంది.

    ఆ రెండింటి కలయిక నేను
    ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టా వేదికగా సానియా మీర్జా భావోద్వేగ పోస్టు పెట్టగా వైరల్‌గా మారింది. "కొన్ని రోజులు ఆమె యోధురాలిగా ఉంటుంది. మరికొన్నిసార్లు కుప్పకూలిపోతుంది. చాలాసార్లు ఈ రెండింటి కలయికగా ఆమె ఉంటుంది. అయితే, ప్రతి రోజు ఆమె ఉనికి మాత్రం అలాగే ఉంటుంది.

    ధైర్యంగా నిలబడటం.. పరిస్థితులతో పోరాడటం.. నిరంతరం కొత్తగా ఏదైనా ప్రయత్నించడం.. ఆమెకు అలవాటు. ఆ ఆమెను నేనే’’ అని సానియా స్ఫూర్తిదాయక వాక్యాలు పంచుకుంది. 

    చదవండి: Sheetal Devi: పోరాటానికి పరిమితులెందుకు?

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్ వ్య‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ గాయం కార‌ణంగా ఫ‌స్ట్ హాఫ్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో జ‌ట్టు ప‌గ్గాల‌ను కిష‌న్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం అప్ప‌గించింది.

    ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, అభిషేక్ శ‌ర్మ వంటి ప్లేయ‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కిష‌న్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది. తాజాగా ఇదే విష‌యంపై భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిష‌న్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

    అభిషేక్ 2017 నుంచి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. కానీ కిష‌న్ మాత్రం గ‌తేడాదే ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. కిష‌న్ ఇటీవ‌లే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని స్టాండిన్ కెప్టెన్‌గా ఆరెంజ్ ఆర్మీ నియ‌మించింది. అత‌డికి డిప్యూటీగా మాత్రం అభిషేక్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

    "అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కోపోవ‌డం న‌న్ను నిరాశ‌ప‌రిచింది. ఇషాన్ కిష‌న్ అంటే నాకు కూడా ఇష్ట‌మే. అతడు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శ‌ర్మ గ‌త 7 ఏళ్లగా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.

    ఎస్ఆర్‌హెచ్ కోసం త‌న సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కూడా కెప్టెన్ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అటువంటి వ్య‌క్తికి కెప్టెన్సీ ఇవ్వ‌క‌పోవ‌డం నిజంగా బాధాక‌రం. గ‌తంలో కూడా నాకు ఇలానే జ‌రిగింది. 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.

    కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భార‌త్‌కు గొప్ప విజ‌యాలు అందించాడు.

    అందుకు అత‌డే అర్హ‌డు అన్పించింది. ఇది నేను కేవ‌లం ఉదాహరణగా మాత్ర‌మే చెబుతున్నాను. కానీ ఒక ఆట‌గాడు కొన్నేళ్లు పాటు జ‌ట్టుకు తన సేవలు అందించినప్పుడు.  ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తాయి" స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.
    చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్మెంట్‌ ప్రకటించడానికి నాడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కారణమని బాంబు పేల్చాడు. తన ఎంపికను పరిగణలోకి తీసుకోవడం లేదన్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. 

    సీనియర్‌ని అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఫైరయ్యాడు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసి, సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలాకాలం ఎదురుచూశానని తెలిపాడు. చివరికి ధోనితో మాట్లాడితే కాని విషయం అర్దం కాలేదని అన్నాడు. చేసేదేమీ లేక రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

    నిజాయితీగా పరిస్థితిని వివరించి సహాయం చేశాడని ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ విషయంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ తీరు కూడా తప్పుబట్టాడు. తాజాగా స్పోర్ట్స్‌ టాక్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.

    కాగా, యువీ 2019 జూన్‌ 10న రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అతను చివరిగా 2017లో టీమిండియా తరఫున వన్డే ఆడాడు. అవకాశాల కోసం చాలాకాలం వేచి చూసి, చేసేదేమీ లేక ఆట నుంచి వైదొలిగాడు. యువీ చివరి వన్డే ఆడే సమయానికి మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఆ ఏడాది 11 మ్యాచ్‌ల్లో 98.67 స్ట్రయిక్‌రేట్‌తో 372 పరుగులు చేశాడు. అయినా టీమిండియాలో స్థానం దక్కలేదు. 

    17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు చేసి, రెండు ప్రపంచకప్‌ విజయాల్లో (2007 టీ20, 2011 వన్డే) కీలకపాత్ర పోషించిన యువీ అవమానకర రీతిలో రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. క్యాన్సర్‌పై విజయం సాధించి, తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్‌ ఆటకు సంబంధించి తన చివరి కోరికను తీర్చుకోకుండానే రిటైరయ్యాడు. 

    యువీకి 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఆడాలని కోరిక ఉండింది. ఇందుకోసమే అతను వయసు మీద పడుతున్నా తీవ్రంగా శ్రమించి ఫిట్‌నెస్‌ మెయిన్‌టైన్‌ చేశాడు. అయినా సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపించారు. 

    వాస్తవానికి యువీని పక్కకు పెట్టడానికి విరాట్‌-రవిశాస్త్రి వద్ద కూడా ఎలాంటి వ్యక్తిగత కారణాలూ లేవు. కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. 2015 వరల్డ్‌ కప్‌ సమయంలో నాటి కెప్టెన్‌ ధోని కూడా గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌లను ఈ కారణంగానే పక్కన పెట్టాడు.  

     

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) దిగొచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సత్సంబంధాల కోసం ముందడుగు వేసింది. ఇరుదేశాల మధ్య క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీబీ.. బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం.

    దౌత్యపరమైన ఉద్రిక్తతలు
    కాగా ఆది నుంచి బంగ్లాదేశ్‌కు భారత్‌ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొన్నినెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లా నేతలు ఈశాన్య భారతంపై అవాకులు, చెవాకులు పేలడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

    బంగ్లాదేశ్‌ హైడ్రామా
    ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ టూర్‌ నిరవధికంగా వాయిదాపడింది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు భారత్‌కు రామని బంగ్లాదేశ్‌ హైడ్రామా చేసింది.

    భద్రతా కారణాలు చూపుతూ తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బీసీబీ ఐసీసీ (ICC)ని కోరింది. ఇందుకు ఐసీసీ నిరాకరించడంతో.. తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. అంతేకాదు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

    సత్సంబంధాలు కోరుకుంటున్నామని..
    అయితే, కొత్త ప్రభుత్వం మాత్రం క్రికెట్‌ విషయంలో భారత్‌తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. ఐపీఎల్‌ ప్రసారాలపై ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించింది. కానీ జియోస్టార్‌ రంగంలోకి దిగి.. బంగ్లా స్థానిక బ్రాడ్‌కాస్టర్‌ బాకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నందున కాంట్రాక్టు రద్దు చేసింది.

    బీసీసీఐకి లేఖ
    ఈ నేపథ్యంలో తాజాగా బీసీబీ మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. దైనిక్‌జాగరణ్‌ కథనం ‍ప్రకారం.. బీసీబీ బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడేందుకు టీమిండియాను తమ దేశానికి పంపాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే క్రమంలోనే బీసీబీ ఈమేరకు దిగివచ్చినట్లు తెలుస్తోంది.

    అదే జరిగితే..
    కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌-2027 ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాకుండా ఓవరాక్షన్‌ చేసిన బంగ్లాదేశ్‌కు టీమిండియా ఈ విషయంలో షాకిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు గనుక ఆసియా కప్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లకపోతే.. వేదికను శ్రీలంక లేదంటే యూఏఈకి మార్చడం లాంఛనమే అవుతుంది.

    అదే జరిగితే బంగ్లాదేశ్‌ ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా బీసీబీ బీసీసీఐకి లేఖ రాసిన విషయాన్ని బంగ్లాదేశ్‌ బోర్డు అధికారి ఒకరు ధ్రువీకరించారు. రొటీన్‌ ప్రాసెస్‌లో భాగంగానే తాము ఈ పని చేసినట్లు వెల్లడించారు. 

    చదవండి: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!

  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో క‌రాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి సార‌థ్యంలోని కరాచీ కింగ్స్ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. కరాచీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి టేబుల్ టాప‌ర్‌గా కొన‌సాగుతోంది.

    అయితే రావల్పిండిజ్‌తో గురువారం జరిగిన మ్యాచ్ అనంత‌రం వార్న‌ర్‌,  ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ మ‌ధ్య తీవ్ర‌ వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదో విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. దీంతో బ‌హిరంగంగానే అలీపై గ‌ట్టిగా కేక‌లు వేస్తూ డేవిడ్ భాయ్ క‌న్పించాడు.

     కరాచీ టీమ్‌ డైరెక్టర్‌ హైదర్‌ అజర్ జోక్యంతో గొడ‌వ స‌ద్ద‌మణుగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. షేక్ హ్యాండ్స్ విష‌యంలో గొడ‌వ తలెత్తిన‌ట్లు స‌మాచారం. అయితే త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఇది కేవ‌లం టీమ్ బాంటర్ మాత్రమే అని వార్న‌ర్ స్ప‌ష్టం చేశాడు.

    ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన డేవిడ్‌ భాయ్‌?
    ఇక ఇది ఇలా ఉండ‌గా.. డేవిడ్ వార్న‌ర్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. క‌రాచీ కింగ్స్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 9న పెషావ‌ర్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే దాదాపు వారం రోజుల విశ్రాంతి ల‌భించడంతో వార్న‌ర్ త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయిన‌ట్లు స‌మాచారం.

    అత‌డు తిరిగి మ్యాచ్‌కు ముందు జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు పాక్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాగా సోషల్‌ మీడియాలో మాత్రం  వార్నర్‌ కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీపై అలిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కరాచీ కింగ్స్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
    చదవండి: IPL 2026: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే!

  • పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

    ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్‌ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.

    లీటర్‌ పెట్రోల్‌ ధర  రూ. 458
    ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్‌ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.

    అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్‌ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్‌ మాలిక్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.

    మన పరిస్థితి మెరుగ్గా ఉంది
    ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్‌ ఆఫ్రిది. 

    ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్‌పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. 

    ప్రభుత్వం చెప్పినట్లే  నడుచుకోవాలి
    ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే  నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. 

    దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్‌ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.

    చదవండి: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త

  • ఆడ‌మ్ జంపా.. ఆస్ట్రేలియా అత్యుత్త‌మ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిగా పేరు గాంచాడు. షేన్ వార్న్ తర్వాత ఆసీస్‌కు దొరికిన అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్‌గా జంపా కొన‌సాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని రికార్డు ఉన్న జంపా, ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా ఇదే విష‌యంపై ఓ పాకిస్తానీ క్రికెట్ షోలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు కమ్రాన్ ఆక్మల్‌, బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    "ఆడ‌మ్ జంపా ఒక అద్భుత‌మైన స్పిన్న‌ర్‌.  లైన్ అండ్ లెంగ్త్, గూగ్లీ, ఫ్లిప్పర్, అన్నీ బౌలింగ్ చేయగ‌ల‌డు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు టెస్టు క్రికెట్ ఆడ‌క‌పోవ‌డం నాకు ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది.  క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అత‌డిని టెస్టుల కోసం ఎందుకు పరిగణించలేదో" అర్థం కావట్లేదు ఆక్మ‌ల్ అన్నాడు.

    అయితే ఇందుకు బ‌సిత్ అలీ పొంత‌న లేని స‌మాధాన‌మిచ్చాడు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆపడం వల్లే జంపా టెస్ట్ క్రికెట్ ఆడలేదని అలీ పేర్కొన్నాడు.

    కాగా జంపా, స్టోయినిష్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఉద్దేశించి బాసిత్ అలీ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు అన్పిస్తోంది. వారిద్ద‌రూ ఆన్‌ది ఫీల్డ్‌, ఆఫ్‌ది ఫీల్డ్ చాలా క్లోజ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గ‌తంలో మార్కస్ స్టాయినిస్ , ఆడమ్ జంపా ‘గే కపుల్స్’ అంటూ రూమర్స్ వినిపించాయి. 

    అయితే రూమర్స్‌కు స్టోయినిస్‌, జంపా ఎప్పుడో చెక్ పెట్టేశారు. తాము మంచి ఫ్రెండ్స్ అని.. ఎక్కువగా గేమ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటామని స్పష్టం చేశారు. 

    2021లో ఆడమ్ జంపా తన గర్ల్‌ఫ్రెండ్ హాటెల్‌ని వివాహం చేసుకోగా.. స్టోయినిష్ గతేడాది ఆఖరిలో తన ప్రియురాలు సారా జార్నుచ్‌ని నిశ్చితార్దం చేసుకున్నాడు. అయితే లైవ్‌షోలో ఇద్దరు స్టార్ క్రికెటర్లను అవమానించిన బసిత్ అలీపై నెటిజన్లు ఫైరవవుతున్నారు.

    కొంచెం అయినా సిగ్గు ఉందా అంటూ మండిపడుతున్నాడరు. కాగా జంపా ప్ర‌స్తుతం పీఎస్ఎల్ 2026లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతుండ‌గా.. స్టోయినిష్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.
    చదవండి: IPL 2026: ఆర్సీబీ, స‌న్‌రైజ‌ర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవే!
     

  • ఐపీఎల్‌-2026 సీజన్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఈ టోర్నీలో మొద‌టి ఆరు మ్యాచ్‌లు ముగిశాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, పంజాబ్‌, ఎస్ఆర్‌హెచ్ వంటి జ‌ట్లు బోణీ కొట్ట‌గా.. మూడు సార్లు ఛాంపియ‌న్ అయిన కేకేఆర్ మాత్రం వరుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

    అదేవిధంగా గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ల‌క్నో వంటి జ‌ట్లు త‌మ మొద‌టి మ్యాచ్‌ల‌లో ఓట‌మిని చ‌విచూశాయి. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. ఆర్సీబీ, ఢిల్లీ, ముంబై త‌ర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. రాబోయో మ్యాచ్‌ల త‌ర్వాత ఈ స్ధానాలు తారుమారయ్యే అవ‌కాశ‌ముంది.

    ఈ నేప‌థ్యంలో ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించే జ‌ట్ల‌ను ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ అంచ‌నా వేశాడు. ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్, పంజాబ్ టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయని పీట‌ర్స‌న్ జోస్యం చెప్పాడు. 

    అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీకి ఈ జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం గమ‌నార్హం. అంతేకాకుండా ఎస్ఆర్‌హెచ్‌, గుజ‌రాత్ టైటాన్స్, రాజ‌స్తాన్ వంటి జ‌ట్ల‌ను కూడా అత‌డు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో రాజ‌స్తాన్ బౌలింగ్‌, బ్యాటింగ్ ప‌రంగా ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. అయిన‌ప్ప‌టికి పీట‌ర్స‌న్ త‌న టాప్‌-4లో చోటు ఇవ్వ‌లేదు.
    చదవండి: IPL 2026: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’

  • సెయింట్ కిట్స్ వేదిక‌గా వెస్టిండీస్ మ‌హిళ‌ల‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిల జ‌ట్టు 9 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తో   ఆస్ట్రేలియా  క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఆఖ‌రి వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 136 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

    అసీస్ స్పిన్న‌ర్ అలానా కింగ్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి క‌రేబియ‌న్ జ‌ట్టు ప‌తనాన్ని శాసించింది. ఆమెతో పాటు గార్డనర్‌ రెండు, హామిల్టన్‌, కారీ, మెక్‌గ్రాత్‌ తలా వికెట్‌ సాధించింది. విండీస్‌ బ్యాటర్లలో చినెల్లే హెన్రీ (42 పరుగులు), హేలీ మాథ్యూస్(34 పరుగులు) రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

    అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(68), ఎలీస్ పెర్రీ(33) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. విండీస్ బౌలర్లలో అష్మిని మునిసర్ ఒక్క వికెట్ ప‌డ‌గొట్టింది.

    కాగా అంత‌కుముందు టీ20 సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వ‌న్డే సిరీస్‌ను కూడా త‌మ ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం పర్యటనలో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
    చదవండి: ముస్తాఫిజుర్‌ రహమాన్‌ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్‌ చైర్మన్‌

  • ఐపీఎల్‌-2026లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌ ఆడిన హార్దిక్‌ సేన.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది.

    ఓ శుభవార్త 
    ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి ఈ మ్యాచ్‌కు అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త అందింది.

    న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ గురువారం ముంబై జట్టుతో చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉండనున్నాడు. కాగా భారత్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సాంట్నర్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాతో ఫైనల్లో కివీస్‌ ఓడిపోవడంతో అతడు రన్నరప్‌ జట్టు కెప్టెన్‌గా మిగిలిపోయాడు.

    ఐదు సీజన్ల పాటు
    ఇదిలా ఉంటే.. 2019లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మిచెల్‌ సాంట్నర్‌.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగాడు. అయితే, 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్‌ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక తుదిజట్టులో సాంట్నర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మంచి బ్యాకప్‌ ఆప్షన్‌గా పనిచేస్తాడు. 

    కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సాంట్నర్‌ 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌జాక్స్‌ ఒక్కడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు.

    ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ జట్టు
    అల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌, క్వింటన్‌ డి కాక్‌ , మయాంక్‌ రావత్‌, అథర్వ అంకోలేకర్‌, మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ , డానిశ్‌ మాలేవర్‌.

    చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

  • అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్‌ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సర్ల‌ ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. 

    మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్‌ డిమాండ్‌ చేశాడు. గత డిసెంబర్‌లో మెస్సీ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా, హైదరాబాద్‌లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది.

    కాగా ఈ ఏడాది జూన్‌ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్‌ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్‌ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్‌ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

    ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్‌-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

    చదవండి: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’

International

  • పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక  F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్‌ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి  క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల  మధ్య ఆందోళనకరంగా మారింది.

    నైరుతి ఇరాన్ ప్రాంతంలో  (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్‌లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్‌టాఫిక్‌గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

    అమెరికా వాదన 
    ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్‌ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం తెలిపినట్లు వైట్‌హౌస్‌ కథనాలు పేర్కొన్నాయి.

    ఇరాన్‌ వాదన 
    అయితే జెట్‌ కూల్చివేతతో ఇరాన్‌లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్‌ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్‌ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.

    కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్‌ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్‌గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్‌ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
     

  • ఢాకా: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్‌లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

    ఈ మేరకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే పనిచేయాలి. బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

    పశ్చిమాసియా యుద్ధం కారణంగా బంగ్లాదేశ్‌లో ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైంది. దేశం 95 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుండటంతో ధరలు పెరగడం, సరఫరా అస్థిరత పెరగడం వల్ల ప్రభుత్వం కఠినమైన ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్ నేతృత్వంలోని కేబినెట్ 180 రోజుల మితవ్యయ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. 

    ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, కొత్త వాహనాలు లేదా కంప్యూటర్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. అధికారుల విదేశీ ప్రయాణాలను 50 శాతం తగ్గించడం, సమావేశాలు, సదస్సుల ఖర్చులను పరిమితం చేయడం, వివాహాలు మరియు ఇతర కార్యక్రమాల్లో అలంకార లైటింగ్ నిషేధం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

    ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భారతదేశం ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేసింది. మరిన్ని సరఫరాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ముందుగానే మూసివేయడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు కూడా తగ్గిన సమయానికి పరిమితం కావడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించనున్నాయి.

    మొత్తం మీద, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కఠినమైన మితవ్యయ చర్యలు చేపట్టింది. ఈ చర్యలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, దీర్ఘకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయని అధికారులు విశ్వసిస్తున్నారు.

  • అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏది చేసినా వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ప్రజల ఆగ్రహానికి గురౌవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్‌ను ఫ్రాడ్‌ జార్‌గా నియమించారు. అమెరికా ప్రభుత్వంలో పెద్దగా యాక్టివ్‌గా లేని జేడీ వాన్స్‌కు కావాలనే ఈ పదవి కట్టబెట్టారా? అనే చర్చ నడుస్తుంది.

    అయితే సాధారణంగా అమెరికాలో ఉపాధ్యక్షుడు, మంత్రి వర్గంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికి ఈ పదవిని ఇస్తూ ఉంటారు. విశ్వసనీయ రాజకీయ నాయకుడిగా ఉన్న వారికి కూడా ఈ పదవిని అప్పగిస్తారు. ఫెడరల్‌ స్థాయిలో మోసాలపై దర్యాప్తు, పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం ఫ్రాడ్‌ జార్‌కే ఉంటాయి. ఇవి ప్రత్యేక బాధ్యతలుగా చెబుతూ ఉంటారు. 

    డొనాల్డ్‌ ట్రంప్‌ జేడీ వాన్స్‌ను ఈ పదవిలో ప్రకటించడం వెనుక ఆంతర్యం రాజకీయపరమైనదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది అమెరికాలో మోసపూర్వక లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ప్రధానంగా డెమోక్రాటిక్‌ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమేనని చర్చ నడుస్తోంది.

    ఈ పదవిని వాన్స్‌కు ఇవ్వడం ద్వారా డెమోక్రాటిక్‌ రాష్ట్రాల్లో అవినీతి, మోసాలు ఎక్కువగా ఉన్నాయనే సందేశం పంపడమే కాకుండా, ఇది ఆయన మద్దతు దారులకు కూడా తాము అవినీతిని అరికడతామనే సంకేతాలు కూడా పంపినట్లయ్యింది.

    ఇది  వాన్స్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తెస్తుంది, కానీ పార్టీ ఆధారిత లక్ష్యాలు ఉన్నాయనే విమర్శలు రావచ్చు.ట్రంప్‌ ప్రభుత్వానికి ఇది అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నామని బలమైన సంకేతం  ఇవ్వొచ్చు కానీ రాజకీయ ఆయుధంగా కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. డెమోక్రాటిక్‌ రాష్ట్రాలు ఇది ఫెడరల్‌ జోక్యంగా భావించి, చట్టపరమైన–రాజకీయ పోరాటాలు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

  • టెహ్రాన్‌: ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇద్దరు అమెరికన్‌ పైలెట్‌లను అదుపులోకి తీసుకున్నామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డు కోర్‌ (IRGC) ప్రకటించింది. అమెరికా వెంటనే సెర్చ్‌ పార్టీలను పంపి పైలెట్‌లను వెతికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటనపై అమెరికా అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు, కానీ ఇరాన్‌ మీడియా ప్రచారం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

    అదే సమయంలో, ఇరాన్‌ గగనతలంపై అమెరికా అపాచీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ వర్గాలు ఈ హెలికాప్టర్లను టార్గెట్‌ చేశామని పేర్కొంటున్నాయి. మరోవైపు, అమెరికా రీ-ఫ్యూయెలింగ్‌ ఫ్లైట్‌ కూడా మిస్‌ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఇరాన్‌-అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి.

    ఈ సంఘటనలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత పొందలేదు. స్వతంత్ర ధృవీకరణ లేకపోవడంతో, ఇరాన్‌ ప్రకటనలు ప్రచార యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, ఈ వార్తలు పశ్చిమాసియా  భద్రతా పరిస్థితులను కుదిపేస్తూ, అమెరికా-ఇరాన్‌ సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
     

  • ప్రస్తుతం  మళ్ళీ 'లాక్‌డౌన్' అనే మాట వినిపిస్తోంది. అయితే ఇది గతంలో మనం చూసిన కరోనా లాక్‌డౌన్ లాంటిది కాదు. ఒక దేశం ఆర్థికంగా, రాజకీయంగా మరియు అంతర్జాతీయ యుద్ధ పరిణామాల వల్ల ఏ స్థాయి సంక్షోభంలోకి వెళ్తుందో చెప్పడానికి  ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పాకిస్తాన్ మొత్తం షట్ డౌన్ కాబోతోందా? అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి? 

    లాక్ డౌన్ అనగానే మనలో ప్రతి ఒక్కరికి ముచ్చెమటలు పోస్తాయి. నాటి లాక్ డౌన్ లో పడ్డ కష్టాలు అటువంటివి మరి. అయితే మళ్ళీ మనం లాక్ డౌన్ లోకి వెళ్ళనున్నామా.. పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తున్నాయి. కాని ఈ సారి ఈ లాక్ డౌన్ ముందుగా మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో రానుంది. అసలు అక్కడ లాక్‌డౌన్ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన కారణం 'ఇంధన కొరత'. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంటే, బయట దేశాల నుండి పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొనడానికి వారి దగ్గర తగినంత డబ్బు లేదు. అందుకే, దేశంలో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని పొదుపు చేయడానికి 'స్మార్ట్ లాక్‌డౌన్' విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.

    పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ తదితర ఉన్నతాధికారులు ఇటీవలే ఒక కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట మార్కెట్లను , వ్యాపార సముదాయాలను త్వరగా మూసివేయాలని వారు ప్రతిపాదించారు. అంటే పాకిస్తాన్‌లో రాత్రి 8 లేదా 9 గంటలకే అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు మూసివేసేట్టుగా చూడాలి అని తీర్మానం చేశారు. అలాగే కార్యాలయాలకు వారంలో 5 రోజులు కాకుండా, కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఆఫీసులకు రావాలని, మిగిలిన రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయాలని సూచించారు. దీనివల్ల రవాణా ఖర్చులు, ఏసీలు అలాగే విద్యుత్ వినియోగం తగ్గుతుందని వారి ప్లాన్.

    పాకిస్తాన్ లోని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌లోని ప్రావిన్షియల్ ప్రభుత్వాలు (రాష్ట్రాలు) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం (Inflation) వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తే వ్యాపారాలు దెబ్బతిని నిరుద్యోగం మరింత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ , సింధ్ ప్రావిన్సులు పూర్తి స్థాయి లాక్‌డౌన్ వద్దని, కేవలం కొన్ని నియంత్రణలు మాత్రమే విధిద్దామని స్పష్టం చేశాయి. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్‌లో "కంప్లీట్ వీకెండ్ లాక్‌డౌన్" విధించారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే పాకిస్తాన్ సమాచార శాఖ దీనిని ఖండించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారిక లాక్‌డౌన్ లేదు. కేవలం పొదుపు చర్యలు (Austerity Measures) మాత్రమే అమల్లో ఉన్నాయి. ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయితే ఏ నిమిషమైనా లాక్ డౌన్ వార్తలు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

    ఒక పక్క లాక్‌డౌన్ భయం, మరోపక్క ఆకాశాన్ని తాకుతున్న ధరలు. పాకిస్తాన్‌లో సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. గోధుమ పిండి నుండి పప్పుల వరకు ప్రతి వస్తువు ధర రెండింతలు పెరిగింది. విద్యుత్ బిల్లులు కట్టలేక ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ విధిస్తే అది "పుండు మీద కారం చల్లినట్లు" అవుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి మెరుగుపడాలంటే ఐఎంఎఫ్ (IMF) నుండి మరో విడత రుణం రావడం చాలా ముఖ్యం. కానీ ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులు సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒకవేళ మిడిల్ ఈస్ట్ యుద్ధం గనుక మరింత ముదిరితే, చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో దేశం మొత్తాన్ని మూసివేయాల్సి రావచ్చు.

    మొత్తానికి చూస్తే, పాకిస్తాన్ ప్రస్తుతం ఒక "ఎకనామిక్ లాక్‌డౌన్"లో ఉంది. అధికారికంగా షాపులు తెరిచి ఉన్నా, కొనే శక్తి ప్రజలకు లేదు. ప్రభుత్వం పెట్రోల్ ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నా, అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పొరుగు దేశంలో నెలకొన్న ఈ అస్థిరత దక్షిణాసియా ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఒక్క పాకిస్తాన్ కే కాదు మనకూ ఓ హెచ్చరికే.అప్పుడెప్పుడో కరోనా వేల కిలోమీటర్ల అవతల ఉంది మనకేం కాదులే అనుకున్న క్షణం పట్టలేదు కరోనా అనే మహమ్మారి మన పై విరుచుకుపడి లాక్ డౌన్ లోకి రోజుల్లో తీసుకువెళ్ళిపోయింది. మరి ఇప్పుడూ కరోనా కన్నా ప్రమాదమైన యుద్ధం క్షణక్షణం ఉత్కంఠతతో ఏ దేశం మీద ఎటువంటి ప్రభావం చూపనుందో అర్ధం కాని పరిస్థితి. లాక్ డౌన్ అనేది మన లోగిలిలోకి రాకూడదని గట్టిగా అనుకుందాం ప్రార్ధిద్దాం. 

     

  • చీకటి పడితే మనం ఆకాశం వైపు చూస్తాం.. ఆ నక్షత్రాల మధ్య ఎక్కడో ఏలియన్స్ ఉంటాయని, ఏదో ఒకరోజు అవి భూమిపైకి వస్తాయని మనం నమ్ముతాం. కానీ, ఒకవేళ ఆ ఏలియన్స్ రాక వెనుక ఉన్నది అంతరిక్ష జీవులు కాకుండా.. మన మధ్యే తిరుగుతున్న మనుషులు అయితే? మన కళ్లను మనమే నమ్మలేనంత భయంకరమైన ఒక 'ఫేక్ ఏలియన్ ఇన్వేషన్' (నకిలీ గ్రహాంతరవాసుల దాడి) జరగబోతోందా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విజిల్‌బ్లోయర్ డాక్టర్ స్టీవెన్ గ్రీర్ బాంబు లాంటి నిజం పేల్చారు. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవడానికి 'డీప్ స్టేట్' పన్నిన అతిపెద్ద కుట్రను ఆయన బయటపెట్టారు. సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే మనం చూడబోయేది సినిమా కాదు, మానవ చరిత్రలోనే అతిపెద్ద మోసం!

    ముందుగా ఎవరీ స్టీవెన్ గ్రీర్ ఓ సారి చూద్దాం. అమెరికా ప్రభుత్వంలోని అత్యంత రహస్యమైన 'బ్లాక్ బడ్జెట్' ప్రాజెక్టుల గుట్టు విప్పిన వ్యక్తి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే చర్చ పక్కన పెడితే.. ఏలియన్స్ పేరుతో మనుషులను ఎలా భయపెట్టబోతున్నారో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఆయన హెచ్చరిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వింత కాంతులు, గ్రహాంతర నౌకలు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాయి. ఇది హాలీవుడ్ గ్రాఫిక్స్ కాదు.. అంతకంటే కొన్ని వందల ఏళ్లు ముందున్న సాంకేతికత! ఈ కుట్రను 'ప్రొజెక్ట్ బ్లూ బీమ్' అని పిలుస్తారు. దీని వెనుక ఉన్నది గ్రహాంతరవాసులు కాదు.. వాషింగ్టన్, లాంగ్లీ , గ్లోబలిస్ట్ కేంద్రాల్లో దాగి ఉన్న శక్తులు. వారు గత కొన్ని దశాబ్దాలుగా విరిగిపోయిన UFOల నుండి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వింత టెక్నాలజీని సంపాదించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీని మనపైనే వాడబోతున్నారు. హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ద్వారా ఆకాశంలో భారీ గ్రహాంతర నౌకలను సృష్టిస్తారు. అవి 100 శాతం నిజమైనవిగా కనిపిస్తాయి. అంతేకాదు, వారి దగ్గర ఉన్న 'యాంటీ గ్రావిటీ' విమానాలు సైనిక అధికారులను కూడా తికమక పెడతాయి. ఏంటి ఆశ్చర్యపోయారా...

    అయితే మీరు విన్నది నిజమే! కేవలం నౌకలే కాదు.. కృత్రిమంగా ల్యాబ్‌లలో తయారు చేసిన ఏలియన్ లాంటి జీవులను కూడా వారు రంగంలోకి దించవచ్చు. వీటిని చూసిన సామాన్య ప్రజలు అది నిజంగానే అన్యగ్రహ జీవుల దాడి అని నమ్ముతారు. గాల్లో నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత భాషలు మనిషి మెదడును స్తంభింపజేస్తాయి. గ్రీర్ మాటల్లో చెప్పాలంటే.. "మన భూమిపై ఒక నకిలీ దాడిని సృష్టించే సామర్థ్యం వారికి ఉంది. అసలు ఇంత పెద్ద నాటకం ఎందుకు? సమాధానం చాలా సింపుల్.. అది 'అపరిమితమైన అధికారం'. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చావు భయం గురిచేసి, "మాకు రక్షణ కావాలి" అని వారు బ్రతిమిలాడేలా చేయడం. అప్పుడు, దేశాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి, ఒకే ప్రపంచ ప్రభుత్వం (One World Government) ఏర్పాటు చేస్తారు. మీ ప్రతి కదలికపై నిఘా ఉంచుతారు. దేశాల సార్వభౌమాధికారం అంతమైపోతుంది. శాంతి పేరుతో మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటారు.

    గత 20-30 ఏళ్లుగా సినిమాల్లో, వార్తల్లో UFOల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇదంతా ఒక పెద్ద 'సైకలాజికల్ ఆపరేషన్' (Psyop). ప్రజల మనసులను ఏలియన్స్ దాడికి మానసికంగా సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ నాటకంలో చివరి అంకం మొదలైంది. ఆకాశంలో కాంతులు కనిపిస్తే, లేజర్ ఆయుధాలు మన నగరాలను నాశనం చేస్తుంటే.. మనం సైలెంట్‌గా లొంగిపోతాం. కానీ గుర్తుంచుకోండి.. ఆ దాడి చేస్తున్నది నక్షత్రాల నుండి వచ్చిన వారు కాదు, మన భూమిపై ఉన్న కుట్రదారులు!గ్రీర్ హెచ్చరిక ఒక్కటే.. అప్రమత్తంగా ఉండండి. అసలైన శత్రువు అంతరిక్షంలో లేడు, వాడు మన కళ్ల ముందే అధికార పీఠాల్లో కూర్చుని ఉన్నాడు. వారు మన భయాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడని అతిపెద్ద మోసం మీ కళ్ల ముందు జరగబోతోంది. మీరు దానిని నమ్ముతారా? లేక నిజం తెలుసుకుని ఎదురు నిలుస్తారా?

    వచ్చే కొన్ని ఏళ్లలో ఆకాశంలో వింతలు జరిగితే.. అద్భుతం అని మురిసిపోకండి, అది ఒక మృత్యుపాశం కావొచ్చు. గ్రీర్ బయటపెట్టిన ఈ నిజాలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.చీకటిని చూసి భయపడకండి.. వెలుగు వెనుక ఉన్న నీడను చూసి భయపడండి!

     

  • చైనా తాజాగా చేసిన భారీ రాకెట్‌ ప్రయోగం విఫలమైంది.  ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 3వ తేదీ)  గోబీ ఎడారిలోని జియుక్వాన్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ మధ్యలో లోపం రావడంతో మిషన్ విఫలమైంది. 

    ఇది స్పేస్‌ ఎక్స్‌ (SpaceX Falcon 9) స్టార్‌లింక్‌కు పోటీగా పోటీగా అభివృద్ధి చేసిన చైనాలోని అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ప్రయోగం ఇది. అయితే ఈ ప్రయోగం విఫలమైంది. చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విఫలం కావడాన్ని ధృవీకరించింది. తాము ప్రయోగించిన టియాన్‌లాంగ్-3 రాకెట్ ప్రయోగం విఫలమైందని పేర్కొంది.

    టియాన్‌లాంగ్-3ను చైనా Starlink వంటి ఇంటర్నెట్‌ శాటిలైట్‌ మెగా-కాన్స్టెల్లేషన్లను ఏర్పాటు చేయడానికి కీలకంగా భావించింది. SpaceX Falcon 9కి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది విఫలం కావడం చైనాలోని ప్రైవేట్‌ స్పేస్‌ రంగానికి పెద్ద దెబ్బ, ముఖ్యంగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ప్రాజెక్టులలో ఆలస్యం అవుతుంది.

    ప్రయోగం వివరాలు

    • రాకెట్ పేరు: టియాన్‌లాంగ్-3

    • అభివృద్ధి సంస్థ: బీజింగ్‌ ఆధారిత స్టార్టప్ స్పేస్‌ పయినీర్‌

    • ప్రయోగ స్థలం: జియుక్వాన్‌ శాటిలైట్‌ లాంచ్‌ సెంటర్‌, గోబీ ఎడారి

    • ప్రయోగ సమయం: ఏప్రిల్ 3, 2026, మధ్యాహ్నం 12:17 (స్థానిక సమయం)

    • లోపం: మధ్యలో “flight anomaly” కారణంగా రాకెట్ విఫలమైంది

     

     

  • చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్‌హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం,  విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్‌హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్‌రెన్‌ను వివాహం చేసుకుంది.  యు, యుచెన్ (రెన్‌రెన్)  ఈ మార్చిలో  పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.

    (పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్‌)

    ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్  తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్‌ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో   పదేళ్ల రిలేషన్‌షిప్‌లో  ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.

    ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

    వీరిద్దరి పరిచయం ఎలా
    2025లో లైవ్ స్ట్రీమింగ్‌లో  వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు.  ఈ  పరిచయం వారిని మరింత దగ్గర చేసింది.  ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.

    నెటిజన్లు స్సందన 
    మల్టీ మిలియన్‌ డాలర్ల  డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా,  ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.

    యు వెన్‌హాంగ్  సక్సెస్‌ స్టోరీ

    సామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లోని డాలియన్‌లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్‌గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్‌కాంగ్‌లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్‌లతో విస్తరించింది.

    వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన  కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది.
     

  • జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో లెబనాన్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఐడీఎఫ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. లెబనాన్‌లో దాదాపు 3,500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్‌ పేర్కొంది.

    ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా స్పందిస్తూ..‘లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అన్ని ప్రధాన కేంద్రాలపై దాడులు జరిగాయి. వైమానికి, సముద్ర, భూ మార్గాల ద్వారా దాడులు చేశాం. దక్షిణ లెబనాన్‌లో ఐడీఎఫ్‌ దృఢ నిశ్చయంతో పనిచేస్తోంది. 91వ, 146వ, 36వ, మరియు 162వ డివిజన్లు దక్షిణ లెబనాన్‌లో లక్షిత కార్యకలాపాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే, ఉగ్రవాదులను నిర్మూలించడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన సామర్థ్యాలను మరింత దెబ్బతీసి, దానిని ఆ ప్రాంతం నుండి తరిమివేసేందుకు ఒక కేంద్రీకృత భూతల ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయి.

    ఇప్పటివరకు, అనేక మంది సీనియర్ కమాండర్లు, వందలాది మంది రద్వాన్ ఫోర్స్ కార్యకర్తలతో సహా సుమారు 1,000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లెబనాన్ వ్యాప్తంగా 3,500కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై ఐడీఎఫ్‌ దాడులు చేసింది. ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ సౌకర్యాలు, ప్రయోగ స్థానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయాలపై కేంద్రీకరించబడ్డాయి.

    దీనికి అదనంగా, లెబనాన్‌లో సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పనిచేస్తూ, పౌర నిధులను దుర్వినియోగం చేస్తూ, హెబ్‌జొల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు ఇరాన్‌ నుంచి సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బు అందుకునే ఆర్థిక సంస్థ అయిన “అల్-ఖార్ద్ అల్-హసన్” అసోసియేషన్ కీలక ఆస్తులు, ఆర్థిక నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్‌కు ఆయుధాలు, శత్రు బలగాలను తరలించడానికి ఉపయోగించే ఐదు ప్రధాన వంతెనలను కూల్చివేశాం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి’ అని తెలిపారు. 

National

  • భారతదేశం అనేక హిల్‌ స్టేషన్స్‌కు  ప్రశాంతమైన పర్వత గ్రామాలకు నిలయం, అందులోనూ విశేషం ఏమిటంటే.. ప్రతిదానికీ దాని కంటూ ఒక స్వంత కథ ఉంటుంది. అదే విధంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో దాగి ఉన్న అటువంటి ఒక చిన్న పట్టణం, భారతదేశపు యాపిల్‌ సాగులో కీలక పాత్ర పోషించింది. దట్టమైన కొండలు, స్వచ్ఛమైన పర్వత గాలి  నలువైపులా యాపిల్‌ తోటలతో నిండి ఉండే ఈ పట్టణం ప్రశాంతంగా  సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంది.  సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈ గ్రామంలో జీవనం స్లోగా ప్రశాంతంగా సాగుతుంది. సందర్శకులు దాని సహజ సౌందర్యానికి  సరళమైన, ప్రశాంతమైన జీవనశైలికి ఆకర్షితులవుతారు. అయితే, ఈ చిన్న పట్టణానికి యాపిల్‌ పండ్ల వల్లే గొప్ప ప్రాచుర్యం వచ్చింది.

    హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉన్న  చిన్న పట్టణమైన కోట్‌గఢ్, దేశానికి యాపిల్‌ సాగును పరిచయం చేయడంలో  చారిత్రక పాత్ర పోషించింది. తద్వారా భారతదేశపు యాపిల్‌ సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 20వ శతాబ్దం ప్రారంభంలో తొలి బీజం పడింది , అమెరికన్‌ మిషనరీ కి చెందిన శామ్యూల్‌ ఎవా న్స్ స్టోక్స్‌ వాణిజ్యపరంగా మొదటి యాపిల్‌ తోటలను నాటారు. కోట్‌గఢ్‌లోని సారవంతమైన నేల, చల్లని వాతావరణం  అనువైన ఎత్తులో యాపిల్‌ సాగుకు చాలా అనుకూలంగా ఉండడంతో ఈ అభివృద్ధి చెందుతున్న ఉద్యానవన పరిశ్రమకు పునాది వేశాయి. కాలక్రమేణా, యాపిల్‌ సాగు కోట్‌గఢ్‌ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, హిమాచల్‌ ప్రదేశ్‌ను  దేశంలోని ప్రముఖ యాపిల్‌ ఉత్పత్తిదారుగా నిలిపింది.

    సందర్శనీయ ప్రాంతం..
    ముఖ్యంగా ఆగస్టు నుంచి∙అక్టోబర్‌ వరకు పంట కోత కాలంలో, కోట్‌గఢ్‌లోని విస్తారమైన యాపిల్‌ తోటలు,  ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండ్లతో నిండిన ఆపిల్‌ చెట్ల వరుసల మధ్య నడవడం ప్రశాంతమైన  అనుభూతిని అందిస్తుంది. అనేక స్థానిక కుటుంబాలు యాపిల్‌ సాగు తమ  తోటల నడుమ జీవితం గురించిన కథలను సంతోషంగా మనతో పంచుకుంటాయి. కోట్‌గఢ్‌కు కొద్ది దూరంలో ఉన్న తాని జుబ్బర్‌ సరస్సు, దేవదారు అడవులు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రశాంతమైన జలాలు స్వచ్ఛమైన పర్వతపు గాలి ఆహ్లాదపరుస్తాయి. 

    ఏకాగ్రతతో  ఆలోచించుకోవడానికి, ఫోటోగ్రఫీకి లేదా విశ్రాంతిని అందించే  పిక్నిక్‌కు అనువుగా అనిపిస్తాయి. కోట్‌గఢ్‌తో తరచుగా ముడిపడి ఉండే థానేదార్‌  గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటి యాపిల్‌ మొక్కలు నాటిన ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయ గృహాలు, మెట్ల పొలాలు  హిమాలయాల విశాల దృశ్యాలతో ఈ గ్రామం ఆకట్టుకుంటుంది. కోట్‌గఢ్‌లో స్థానిక దేవతలకు చెందిన పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాంతీయ నమ్మకాల గురించి తెలియజెబుతాయి. ఇక్కడి హోమ్‌స్టేలో బస చేయడం ద్వారా సందర్శకులు కోట్‌గఢ్‌లోని రోజువారీ జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణ, ఇంట్లో వండిన భోజనం నుంచి పండ్ల తోటల యజమానులతో సంభాషణల వరకు, ఇది ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకయే అవకాశాన్ని అందిస్తుంది.

    కోట్‌గఢ్‌ను సందర్శించడానికి  మార్చి నుంచి  జూన్‌ నెల మధ్య అనువైనది.  ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది  కొండల అంతటా పువ్వులు వికసించడం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఉండే శరదృతువు మరో విధంగా ప్రత్యేకం. ఎందుకంటే యాపిల్‌ పంట కోత కాలం ఈ పట్టణాన్ని చైతన్యవంతమైన కార్యకలాపాల కేంద్రంగా మారుస్తుంది. అయితే శీతాకాలాలు చల్లగా ఉంటూ మంచు కురుస్తుంది, ఇది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది,

    ఎలా వెళ్లొచ్చు?
    విమాన మార్గంలో వెళ్లాలంటే..ఈ పట్టణానికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం జుబ్బర్‌హట్టిలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, ఇది  కోట్‌గఢ్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్‌ విమానాశ్రయం కూడా మరో ఎంపిక, రైలు మార్గంలో అయితే సమీపంలోని రైల్వే స్టేషన్‌ సిమ్లా, ఇది వారసత్వ నారో–గేజ్‌ రైల్వే ద్వారా కల్కాతో అనుసంధానితమై ఉంది.  సిమ్లా నుంచి కోట్‌గఢ్‌కు రోడ్డు మార్గం ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది. సాధారణ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

  • దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ-NCR ప్రాంతంలో భూమి పెద్దఎత్తున కంపించింది. దీంతో పరిసరాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయిటకి పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేలుపై భూంకపం తీవ్రత  5.9గా నమోదైంది.  దీని ప్రభావంతో ఉత్తర భారతదేశం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  కాగా ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ భూకంప తీవ్రత వల్ల ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

  • కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సరిగ్గా తాళి కట్టే సమయానికి  కొన్ని నిమిషాల ముందు, వధువు పల్లవి అకస్మాత్తుగా పెళ్లిని ఆపేసింది. దీంతో  పెళ్లి కొడుకుతోపాటు, అందరూ షాకయ్యారు. వధువు  ఎందుకలా చేసింది?  చివరికి ఏమైంది? ఇలాంటి మీ అనుమానాలకు, సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఈ కథనాన్ని చదివేయండి మరి.

    బంధువుమిత్రులు, బాజా భజంత్రీల మధ్య వరుడు వేణుగోపాల్‌ తాళి కట్టడానికి రెడీ అయ్యాడు. ఇంతలో సినిమా ఫక్కిలో నాకీ పెళ్లి ఇష్టం లేదంటూ భయపడుతూనే ధైర్యం చేసి మెల్లగా చెప్పింది వధువు పల్లవి. దీంతో అందరూ ఒకింత దిగ్భ్రాంతికి, మరింత గందర గోళానికి గురయ్యారు.

    అసలు ఏం జరిగింది? 
    అపుడు అసలు విషయం తాపీగా చెప్పింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని,  అయితే ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తన కుటుంబానికి చెప్పలేకపోయానని కళ్ళనీళ్లతో చెప్పింది. ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, వరుడికి,  ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అయినా ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ ఆమె తన మనసు మార్చుకోలేదు.

    వరుడు  ఏం చేశాడు?
    అయితే  వరుడి స్పందన మరింత విశేషంగా నిలిచింది.  వధువు మానసకి పరిస్థితిని అర్థం చేసుకున్న వరుణ వేణుగోపాల్‌ ఆమె పట్ల  సానుకూలంగా స్పందించాడు. తాను ప్రేమించని వారిని పెళ్లి చేసుకోమని ఎవరినీ బలవంతం చేయనని  ​స్పష్టం చేశాడు. ఈ స్టోరీని ఒక ఎక్స్‌యూజర్‌ వరుడికి హ్యాట్యాఫ్‌ అంటూ పోస్ట్‌ చేశారు. దీంతో నెటిజనులనుంచి కూడా సానుకూల స్పందన లభించింది. 

    నెటిజన్లు స్పందన
    ఈ క్రెడిట్‌కు పల్లవికి కూడా దక్కుతుంది.  ఎలాగైతేనేం ధైర్యం చేసి  తన ప్రేమకోసం ధైర్యంగా నిలబడింది. అలాగే వరుడు కూడా ఎలాంటి డ్రామా  క్రియేట్‌ చేయకుండా పరిస్థితిని అర్థం చేసుక్నాడని ఒకరు, వావ్, ఇద్దరికీ అభినందనలు! తన ప్రేమ కోసం నిలబడిన పల్లవికి, పరిస్థితిని అర్థం చేసుకున్న వేణుగోపాలకు. ఇదే నిజమైన పరిణితి, గౌరవం అంటూ ఒకరు కమెంట్‌ చేశారు.  అంతేకాదు ఇంతదాగా ఎందుకు లాగాలని కొందరంటే.. ఒకే బెటర్‌ నెవర్‌ దేన్‌ లేట్‌,  అబ్బాయ్‌ సేఫ్‌.. బతికిపోయాడు బిడ్డ ఇలాంటి ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తడం గమనార్హం.  

  • చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థుల జాబితాను బీజేపీ శుక్ర‌వారం విడుద‌ల చేసింది. అన్నాడీఎంకేతో జ‌ట్టు క‌ట్టిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల పేర్ల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఈ 27 మందిలో న‌లుగురు మ‌హిళా అభ్య‌ర్థులు ఉన్నారు. ఐదుగురు ఎస్సీల‌కు సీట్లు ద‌క్కాయి. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేసిన త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్.. మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

    అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ద‌క్కినందుకు త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్ సంతోషం వ్య‌క్తం చేశారు. తాను విజ‌యం సాధిస్తాన‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఎలాంటి తేడా లేదు. చెన్నై నాకు కొత్త ప్రదేశం కాదు. మేము మైలాపూర్‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతోనే నేను గవర్నర్ పదవి నుంచి తిరిగి వచ్చాను. ప్రతి నాయకుడి కష్టానికి పార్టీ తగిన గౌరవం ఇస్తుంది. అన్నామలైకి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్న న‌మ్మ‌కం నాకుంది. డీఎంకే ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పార్టీ. డీఎంకే కుటుంబ రాజకీయాలను ప్ర‌జ‌లు తిప్పికొడ‌తార‌''ని ఏఎన్ఐతో త‌మిళ‌సై సౌంద‌రాజ‌న్ చెప్పారు. 

    భుజం భుజం కలిపి ప్ర‌చారం చేస్తా: అన్నామ‌లై
    అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై బీజేపీ జాతీయ కార్యవర్గ స‌భ్యుడు కె. అన్నామ‌లై 'ఎక్స్‌'లో స్పందించారు. గెలిచే వారినే అగ్ర‌నాయ‌క‌త్వం ఎంపిక చేసింద‌ని పేర్కొంటూ, అభ్యర్థుల‌కు అభినందనలు తెలిపారు. డీఎంకే వంచ‌న‌తో విసిగిపోయిన త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎన్డీఏ అభ్య‌ర్థుల‌కు ఉంటుంద‌న్నారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో దేశం ప్ర‌గ‌తి పథంలో ప‌య‌నిస్తోంద‌ని, డీఎంకే ప్ర‌భుత్వం కార‌ణంగా అన్నిరంగాల్లో త‌మిళ‌నాడు వెనుబ‌డిపోయింద‌ని తెలిపారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి 210 సీట్లు గెలవాలనే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంద‌ని, దీనికి కార్య‌క‌ర్త‌గా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.

    ఆ బాధ్యతను నెరవేరుస్తా
    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాగంగా అగ్ర‌నాయ‌క‌త్వం త‌న‌కు ప్ర‌చార బాధ్య‌తలు అప్ప‌గించింద‌ని అన్నామ‌లై తెలిపారు. కేరళలోని కన్నూర్ శుక్రవారం ఆయ‌న ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం బీజేపీ, ఎన్డీఏ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం సాగిస్తున్న‌ట్టు చెప్పారు. "ఈ ఎన్నికలలో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే నా పాత్ర. ఈనెల‌ 7వ తేదీ వరకు పుదుచ్చేరి, కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ప్ర‌స్తుతం అదే ప‌నిమీద ఉన్నాను. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు త‌మిళ‌నాడులో ప్ర‌చారానికి వెళ‌తాను. ఇది పార్టీ నాకు అప్పగించిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నిర్విస్తానని చెప్పారు. 
     

    చ‌ద‌వండి: 21 స్థానాల్లో కాన‌రాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు

  • ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ  భార్య, మాజీ బాలీవుడ్ నటి టీనా అంబానీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి జర్నా కన్నుమూశారు. తన సోదరి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న టీనా అంబానీ, సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.ప్రస్తుతం ఆమె తన సోదరిని కోల్పోయిన బాధలో ఉండటంతో, యావత్ అంబానీ కుటుంబం ఈ విషాదంలో మునిగిపోయింది.

    టీనా అంబానీ, తన అక్క జర్నా మరణ వార్తను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన సోదరి జ్ఞాపకార్థం ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. జర్నా తనకు కేవలం అక్క కాదు,  రెండో తల్లిలాంటిది, తన జీవితంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది అంటూ ఆమెను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన వివాహ సమయంలో జర్నా స్వయంగా కన్యాదానం చేసి, ఆప్యాయతాను రాగాలతో తనను అత్తవారింటికి పంపించారని భావోద్వేగానికి లోనయ్యారు.

    ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్‌ లేఆఫ్‌ : ఈ టెకీ ప్లాన్‌ మామూలుగా లేదు!

    ఆమె చాలా ప్రేమగల వ్యక్తిత్వమని, ఆమె తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేదని టీనా వర్ణించారు. జర్నా హుందాగా దయగా ఎపుడూ నవ్వుతూ అందరిలోనూ సంతోషాన్ని నింపేవారని సానుకూల శక్తితో అక్కచెల్లెళ్లందరికీ, వారి పిల్లలకు, మనవళ్లకు స్ఫూర్తి  అని తన సోదరికి నివాళులర్పించారు.  "మా కుటుంబానికి జర్నా ఒక వెలుగు. ఓం శాంతి, నా జియా. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నీవు పంచిన ప్రేమ తరతరాలకూ గుర్తుండిపోతుంది," అని రాసుకొచ్చారు. టీనా అంబానీ షేర్ చేసిన ఈ పోస్ట్‌ను చూసి అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆమె మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు

  • కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోలెల్కెరె పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తనపై జరిగిన పుకార్ల ప్రచారంతో  తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఆయుర్వేద వైద్య విద్యార్థిని (BAMS) ఆత్మహత్యకు పాల్పడిన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:

    23 ఏళ్ల లిఖిత, మల్లాడిహళ్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) చదువుతోంది. హోలెల్కెరె పట్టణంలోని బసవ లేఅవుట్‌లో ఉన్న తన ఇంట్లో మంగళవారం ఆమె విగతజీవిగా కనిపించడం విషాదాన్ని నింపింది.  లిఖితకు ఆమె కాలేజీలోని ఒక ప్రొఫెసర్‌తో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా కళాశాలలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్ల వల్ల తన పరువు పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నానని ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

    సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌లో స్వాధీనం చేసు​కున్నారు. ఈ లేఖలో లిఖిత సంచలన విషయాలు పేర్కొంది.తన మరణానికి ఒక ఫ్యాకల్టీ మెంబర్, అతని భార్య, మరి కొందరు తోటి విద్యార్థినులు కారణమని ఆరోపించింది.  వేధించి, తనపై తప్పుడు ప్రచారం చేసి మానసిక క్షోభకు గురిచేశారని లేఖలో వాపోయింది.

    మరోవైపు స్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న లిఖిత తండ్రి ఉమాశంకర్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించారు. కొందరు  క్లాస్‌మేట్స్  తమ కుమార్తెను కావాలనేవేధించారని, లెక్చరర్‌తో అఫైర్ ఉన్నట్లు పుకార్లు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వారిద్దిరీ కేవలం గురువుకు, శిష్యురాలికి మధ్య ఉండే గౌరవ ప్రద సంబంధం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. నిరంతరం వేధించడం, సూటిపోటి మాటలతో అవమానించడం వల్లే తన కూతురు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న సహవిద్యార్థులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాని ఆయన డిమాండ్‌ చేశారు.  ఈఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

     

  • న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ త‌నను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి త‌ప్పించ‌డంపై ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం స్పందించారు. తాను చేసిన నేరం ఏంట‌ని సూటిగా ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించ‌డ‌మే తాను చేసిన త‌ప్పా అంటూ నిల‌దీశారు. ఈ మేరకు ఎక్స్‌లో శుక్ర‌వారం వీడియో పోస్ట్ చేశారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై తాను పార్ల‌మెంట్‌లో మాట్లాడుతున్నాన‌ని, త‌న‌ను ఆపాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

    "పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను ప్రజల సమస్యలను లేవనెత్తాను. అలా చేయడం నేరమా లేక తప్పా? న‌న్ను పార్లమెంటులో మాట్లాడ‌కుండా చేయ‌మ‌ని రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా స‌మాచారం ఇచ్చినందువ‌ల్లే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. నన్ను ఎవరైనా ఎందుకు మౌనంగా ఉంచాలనుకుంటారు? నా మౌనాన్ని నా ఓటమిగా పొరపాటు పడకండి" అని రాఘవ్ చ‌ద్దా అన్నారు.

    రాజ్యసభ డిప్యూటీ లీడర్ ప‌ద‌వి నుంచి తొల‌గించినంత మాత్రాన పార్ల‌మెంట్‌లో త‌న గ‌ళం మూగ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విన్పిస్తూనే ఉంటాన‌ని అన్నారు. తన‌కు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కాగా, రాఘవ్ చద్దా వ్య‌వ‌హారంపై ఆమ్ ఆమ్ ఆద్మీ ఇప్ప‌టివ‌ర‌కు బ‌హిరంగంగా స్పందించ‌లేదు.  

    చ‌ద‌వండి: ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన సొంత పార్టీ

    విమానాశ్రయాల్లో అధిక ఆహార ఛార్జీలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్లు, డేటా ప్లాన్ల‌తో ప్రైవేటు టెలికం కంపెనీల మాయాజాలం, మినిమ‌మ్ చార్జీల పేరుతో బ్యాంకుల బాదుడు, న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌, టోల్ ఫీజుల రుద్దుడు, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల్లో అసంబ‌ద్ధ‌త‌, పితృత్వ సెలవుకు చట్టబద్ధత వంటి అంశాల‌ను రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. ఆయ‌న మాట్లాడిన వీడియోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. 
     

     

Movies

  • మెరుపుతీగలా సన్నగా మారిపోయిన రకుల్

    నేపాల్ ట్రిప్ ఎంజాయ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే

    గ్లామర్ చూపించేస్తున్న 'దృశ్యం' ఎస్తర్

    కశ్మీర్‌లో చీరకట్టులో అందంగా ప్రియమణి

    రిసార్ట్‌లో చిల్ అయిపోతున్న రాయ్ లక్ష్మీ

    షార్ట్‌లో హెబ్బా పటేల్ అందాల జాతర

  • తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. గత నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇంట్లోనే చిన్నపాటి వేడుక నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీలని పిలిచాడు. ఇది నిశ్చితార్థం అని చాలామంది భావించారు. అయితే ఇది ఇరు కుటుంబాల పరిచయ వేడుక అని త్వరలో ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలని వెల్లడిస్తానని అన్నాడు. ఇప్పుడు అదే చేశారు.

    (ఇదీ చదవండి: 'రామాయణ' కోసం రెహమాన్‌కి అన్ని కోట్ల పారితోషికమా?)

    కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చినట్లే ఈ నెల 29న తిరుపతిలో పెళ్లి జరగనుంది. అంతకు ముందు అంటే ఈ ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోనే టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్(వివాహ విందు) ఏర్పాటు చేయనున్నారు.

    శ్రీనివాస్ విషయానికొస్తే ప్రముఖ నిర్మాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు గాన సరైన సక్సెస్ దక్కట్లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. ఈమె తండ్రి, తాత న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు.

    (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)

  • భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'రామాయణ' నుంచి రాముడు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వచ్చింది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ ఆహార్యం బాగానే ఉన్నప్పటికీ ఏదో వెలితిలానే అనిపించింది. గ్రాఫిక్స్ మరీ తీసికట్టులా లేనప్పటికీ రూ.4000 కోట్ల బడ్జెట్ ఔట్‌పుట్ ఇదేనా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే సినిమా రిలీజయ్యే టైంకి క్వాలిటీలో మార్పు ఉండొచ్చు. ఈ విషయం కాసేపు పక్కనబెడితే మరో ఆసక్తికరమైన ముచ్చట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)

    'రామాయణ' కోసం ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ కలిసి పనిచేశారు. రీసెంట్‌గా రిలీజైన గ్లింప్స్ వీడియోలో రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. అయితే ఈ చిత్రానికి పనిచేసినందుకుగానూ రెహమాన్ రికార్డ్ స్థాయిలో పారితోషికం అందుకున్నాడట. ఇప్పటివరకు ఏ సంగీత దర్శకుడికి ఇవ్వనంత మొత్తం, ఏకంగా రూ.30 కోట్లని తీసుకున్నాడట. దీనితో పాటు రిలీజ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ లాభాల్లోనూ వాటా కూడా రానుందట.

    'రామాయణ్' గ్లింప్స్ గురించి ఓ వైపు చర్చ జరుగుతుంటే.. మరోవైపు రెహమాన్ పారితోషికం కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకుడు. ఈ ఏడాది దీపావళికి తొలి పార్ట్ రిలీజ్ కానుంది. రణ్‌బీర్ కపూర్ రాముడు కాగా.. సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇప్పటికే రామాయణాన్ని భారతీయ ప్రేక్షకులు చాలా సినిమాల్లో చూశారు. మరి ఇది ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)

    (ఇదీ చదవండి: రూ.4,000 కోట్ల బడ్జెట్‌.. ఇదెలా మర్చిపోయారు? వీడియో వైరల్‌)

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూస్తున్నారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. భయంకరమైన మొసలి.. ఓ ప్రేమ జంటని వెంటాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. ఇంతకీ ఇది ఎందులో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? ఈ మూవీ సంగతేంటి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)

    ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన హిందీ మూవీ 'తు యా మై'. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. 2018లో వచ్చిన థాయ్ సినిమా 'ద పూల్' ఆధారంగా దీన్ని తీశారు. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకుంది గానీ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

    'తు యా మై' విషయానికొస్తే.. అవని(షనయ కపూర్) మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బాగా డబ్బున్న అమ్మాయి. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా(ఆదర్శ్ గౌరవ్) ఓ ర్యాపర్. గల్లీలో పెరుగుతుంటాడు. ఓ వీడియో చేసేందుకు వీళ్లిద్దరూ కలుస్తారు. తర్వాత ప్రేమలో కూడా పడతారు. కలిసి గోవా వెళ్లిన టైంలో ఓ పాడుబడిన హోటల్‌లో చిక్కుకుపోతారు. అక్కడి స్మిమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్లని ఓ మొసలి వెంటాడుతుంది. దీని నుంచి ప్రేమజంట బయటపడ్డారా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)

  • ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్.. ఇప్పుడు 'బైకర్' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీనికి కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ దాటితే అసలు రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. సరే ఈ విషయాలు పక్కనబెడితే ఈ హీరో విడాకుల రూమర్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అందుకు ఓ కారణం కూడా ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)

    సహాయ నటుడిగా కెరీర్ మొదలుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. 2022లో 'ఒకే ఒక జీవితం' సినిమాతో హిట్ కొట్టాడు. తర్వాత ఏడాది జూన్‌లో రక్షితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జైపూర్‌లో ఈ వేడుక జరగ్గా టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు, సిద్ధార్థ్-అదితీ తదితరులు హాజరయ్యారు. వివాహం జరిగిన ఏడాదికే శర్వా-రక్షితకు కూతురు పుట్టింది. ఈ చిన్నారికి లీలా దేవి మైనేని అనే పేరు పెట్టారు. ఓ ఫొటోని కూడా శర్వా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

    అయితే గతేడాది సెప్టెంబరులో శర్వానంద్ విడాకులు గురించి కొన్ని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం శర్వా, అతడి భార్య రక్షిత విడివిడిగా ఉంటున్నారనే విషయం బయటకొచ్చింది. కూతురు కొన్నిరోజులు తండ్రి దగ్గర, మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటోందని టాక్ కూడా వినిపించింది. అలాంటిదేం లేదని శర్వా టీమ్ అప్పుడు క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు శర్వా.. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలని డిలీట్ చేసేశాడు. దీంతో గతంలో వినిపించిన రూమర్స్ నిజమేనా అని ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

    శర్వా ఇన్ స్టాలో ప్రస్తుతం సినిమాల పోస్టర్స్, వ్యక్తిగత ఫొటోలు తప్పితే భార్య ఫొటో గానీ కూతురు ఫొటో, కుటుంబం ఫొటోలు ఎక్కడా లేకపోవడంతోనే విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

    (ఇదీ చదవండి: అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో)

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    ఈ మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో దురంధర్‌ టీమ్‌కు ఎక్కడా లేని క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్‌లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్‌ నటుడికి ఏకంగా టాలీవుడ్‌ ఛాన్స్‌ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తోన్న డ్రాగన్‌ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్‌కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.

    కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్‌లో బలోచ్‌ యునైటెడ్‌ ఫోర్స్‌ లీడర్‌ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో  బిమల్ ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్‌ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 
     

     

  • బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో  సినిమాను రూపొందిస్తున్నారు.

    ఈ క్రేజీ ప్రాజెక్టులో జాక్వెలిన్ సరసన నటించే హీరో ఎవరు? సినిమా టైటిల్ ఏమిటి? అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే, టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  త్వరలోనే ఈ చిత్ర టైటిట్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. 

  • తెలుగమ్మాయిలకు హీరోయిన్‌గా అవకాశాలు రావట్లేదని ఒకప్పుడు అనేవారు. కానీ రీసెంట్ టైంలో ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, వైష్ణవి చైతన్య తదితరులు అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. 'మసూద' చిత్రంలో దెయ్యం పాత్రలో మెప్పించిన ఓ నటికి ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని శుక్రవారం లాంఛనంగా మొదలుపెట్టారు.

    (ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేశ్‌.. త్వరలో కూతురి పెళ్లి)

    గతేడాది చివరలో 'శంబాల' అనే థ్రిల్లర్ మూవీతో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన ఆది సాయికుమార్.. ఇప్పుడు 'సైరాభాను' అనే ఓ రొమాంటిక్ ప్రేమకథా సినిమాలో నటించేందుకు సిద్ధమైపోయాడు. రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టాడు. ఇందులో హీరోయిన్‌గా 'మసూద'లో దెయ్యంగా నటించి ఆకట్టుకున్న బాంధవి శ్రీధర్‌ని తీసుకున్నారు.

    'మసూద'లో సహాయ నటిగా ఆకట్టుకుని హిట్ కొట్టినప్పటికీ బాంధవి శ్రీధర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ హల్‌చల్ చేసేది. ఇప్పుడు హీరోయిన్‌గా అంటే పెద్ద ఛాన్సే అనే చెప్పొచ్చు. ఈ సినిమా హిందూ-ముస్లిం బ్యాక్‌డ్రాప్‌లో హైదరాబాద్-ఆంధ్రా కనెక్షన్‌తో రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్‌తో రాబోతుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • ఓటీటీలు అనగానే చాలామంది థ్రిల్లర్సే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఆయా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ని ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాయి. ఇప్పుడు కూడా అలానే మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఓ సిరీస్ తీశారు. అదే 'పోచమ్మ'. దీని గ్లింప్స్‌ని 'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన బండ్ల గణేశ్‌.. త్వరలో కూతురి పెళ్లి)

    సీరియల్ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ అంబటి అర్జున్ లీడ్ రోల్ చేస్తుండగా.. శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. శ్రుతి నాయుడు నిర్మించగా.. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించారు. గ్లింప్స్ బట్టి చూస్తుంటే.. థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. పోచమ్మ దేవత గొప్పతనం, మహిమని అంచనా వేయక తప్పులు చేసే కొందరిని ఆమె ఎలా శిక్షించింది? తనను పూజించే వారిని ఎలా రక్షించింది? అనేది స్టోరీ అనిపిస్తుంది.

    పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు అనే డైలాగ్ ఈ సిరీస్ ఎలా ఉండబోతోంది అని తెలియజేస్తోంది.మిస్టికల్ థ్రిల్లర్ కంటెంట్ చూసే ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ‍అయితే ఈ మూవీ ఆగిపోయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 

    ఈ నేపథ్యంలోనే మెగా హీరో మరో కొత్త సినిమా ప్రకటించారు. క మూవీ డైరెక్టర్‌ సుజిత్, సందీప్‌ల  దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో 19 మూవీగా నిలవనుంది. ప్రస్తుతం ఈ సినిమాను ఎస్‌డీటీ19 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కంచునున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ చేయనున్నారు.

     

     

     

  • కొన్ని కథలు తెరపై ఎన్నిసార్లు చూపించినా చూడాలనిపిస్తుంది. తెలిసిన కథే అయినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి ఇతిహాస కథే రామాయణం. రాముడి కథను మరోసారి సినీప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు సినిమా వస్తోంది.. అదే రామాయణ. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.

    టీజర్‌లో ఇది గమనించారా?
    హనుమాన్‌ జయంతి సందర్భంగా గురువారం (ఏప్రిల్‌ 2న) టీజర్‌ కూడా వదిలారు. ఇందులో రాముడు శివధనస్సు విరిచినప్పటినుంచి అరణ్యవాసం వరకు అనేక విషయాలకు సంబంధించిన గ్లింప్స్‌ను జత చేశారు. అయితే శ్రీరాముడు నగర వీధుల్లో నడుస్తుంటే జనం పూలతో స్వాగతం పలికే చిన్న క్లిప్‌లో ఓ పొరపాటు దొర్లింది. ఓ వ్యక్తి తలపాగా ఉన్నట్లుండి రంగు మారింది. మొదట నీలిరంగులో, తర్వాత వంకాయ కలర్‌లో.. ఆ తర్వాత మళ్లీ నీలిరంగులోకి మారింది. 

    అలా వదిలేశారేంటి?
    34 సెకన్ల నుంచి 38 సెకన్ల నిడివి మధ్యలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌ మూవీలో ఈ చిన్న తప్పిదాన్ని అలాగే వదిలేశారేంటి? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇది వీఎఫ్‌ఎక్స్‌ సమస్య కాదని కలర్‌ గ్రేడింగ్‌ వల్ల అలా జరిగిందని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటున్నారు.

    సినిమా
    రామాయణ విషయానికి వస్తే.. నితీశ్‌ తివారి దర్శకత్వం వహించిన ఈ మూవీని నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. 8సార్లు ఆస్కార్‌ పొందిన డీఎన్‌ఈజీ సంస్థ ఈ మూవీకి వీఎఫ్‌ఎక్స్‌ చేసే బాధ్యతలను చేపట్టింది. హన్మ్‌ జిమ్మర్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

     

     


     

    చదవండి: యుగానికి ఒక్కడు సీక్వెల్‌.. నేనైతే అస్సలు చేయను: ఆండ్రియా

  • 'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా  ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాకు 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సాయి సోమయాజులు లిరిక్స్ అందించగా..శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటకు కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

     


     

  • ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మెగా డాటర్‌ నిహారిక నిర్మించిన రెండో చిత్రం రాకస. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్‌..మరే చిత్రానికి చేయలేదు. మెగా హీరోలు కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇక ట్రైలర్‌, టీజర్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇలా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా నిహారిక ఖాతాలో రెండో విజయం పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వీరబాబు అలియాస్‌ వీరు(సంగీత్‌ శోభన్‌).. తన ప్రియురాలు సుకన్యను పెళ్లి చేసుకోవాలని సొంతూరుకి వస్తాడు. కానీ అప్పటికే వేరే వ్యక్తితో సుకన్య పెళ్లికి రెడీ అవుతుంది. బ్రేకప్‌ బాధలో ఉన్న సమయంలోనే సోము(వెన్నెల కిశోర్‌) అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతని పాస్‌పోర్ట్‌ని పోలీసులు తీసుకెళ్తారు. సోము జాడని కనిపెడితే తన పాస్‌పోర్టు తిరిగి వస్తుందని.. స్నేహితుడు బాలు(గెటప్‌ శ్రీను)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. 

    అదే సమయంలో ఆ ఊరి చివరిలో ఎన్నో దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్న బ్రహ్మ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఊరంతా కలిసి ఓ ముసలాడిని బలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. చివరి క్షణంలో అతను చనిపోతాడు. అతనికి బదులుగా బాలు పోవాల్సి ఉండగా.. వీరూ అడ్డుపడతాడు. దీంతో బాలుకి బదులుగా వీరూ ఆ కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ కోట ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఏంటి? నిజంగానే ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడా? సుబ్బులక్ష్మి(నయన్‌ సారిక) ఎవరు? ఆమె ఎందుకు కోటలోకి వెళ్లింది? సోము సంగతి ఏంటి? నిజంగా చనిపోయాడా? లేదా బతికే ఉన్నాడా? బలి కోసం కోటలోకి వెళ్లిన తర్వాత వీరూకి ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి ప్రాణాలలో బయటకు వచ్చాడా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే.. 
    హారర్‌ కామెడీ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నటీనటులు, కథను పట్టించుకోరు. భయపెడుతూ నవ్విస్తే చాలు.. ఆ సినిమాను ఆదరిస్తారు. రాకస టీమ్‌ కూడా అదే పని చేసింది. చిన్నప్పుడు చదువుకున్న బకాసురుడి కథను స్ఫూర్తిగా తీసుకొని దర్శకురాలు మానస శర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే హారర్‌ కంటే ఎక్కువగా కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అది బాగానే వర్కౌట్‌ అయింది కూడా. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్‌ చేసే సన్నివేశాలతో ఆద్యంతం వినోదాత్మకంగా సినిమాను తీర్చిదిద్దారు.

    పాడుబడ్డ కోట..ఆ కోటకు వెయ్యేళ్ల చరిత్ర.. బ్రహ్మరాక్షసుడి కండీషన్‌..ఇలా సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడైతే హీరో ఎంట్రీ ఇస్తాడో కథనం కామెడీ వైపు టర్న్‌ తీసుకుంటుంది. ప్రియురాలి కోసం అమెరికా నుంచి రావడం..అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. ఊరి పెద్దల తీర్పుతో పాస్‌పోర్టు కోల్పోవడం..ఇందంతా కామెడీగా సాగిపోతాయి. అయితే ఈ తరహా పంచ్‌లు, కామెడీ సీన్లు చాలా సినిమాల్లో చూడడంతో ఫస్టాఫ్‌ అంతగా ఆకట్టుకోదు. అసలు కథను ప్రారంభించడానికి ఇదంతా సాగదీశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

    ఇంటర్వెల్‌ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. హీరో ఎప్పుడైతే కోటలోకి ప్రవేశిస్తాడో.. అప్పటి నుంచి కథనం పరుగులు పెడుతూ.. నవ్వులు పూయిస్తుంది. బ్రహ్మరాక్షసుడి సీన్‌ భయపడితే..దెయ్యాల సీన్‌ నవ్వులు పూయిస్తుంది. ఇక గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌, నయన్‌ సారిక కూడా కోటలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నవ్వులు డబుల్‌ అవుతాయి.  అదే సమయంలో బ్రహ్మరాక్షసుడి నుంచి ఈ గ్యాంగ్‌ ఎలా తప్పించుకుంటుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.  క్లైమాక్స్‌ కాస్త ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అయితే సినిమా ప్రారంభం నుంచి ఎండ్‌ వరకు చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది. ఈ రోజుల్లు దెయ్యాలు, రాక్షసులు ఉంటాయా? అని లాజిక్కులు వెతక్కుండా  సినిమా చూస్తే ఎంజాయ్‌ చేస్తారు. 

    ఎవరెలా చేశారంటే.. 
    సంగీత్‌ శోభన్‌ మంచి నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే లీనమైపోతాడు. వీరూ పాత్రలో కూడా ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌, సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నయన్‌ సారిక తెరపై అందంగా కనిపించింది. వీరిద్దరి లవ్‌ట్రాక్‌ అంతగా పండలేదు కానీ.. బోర్‌ మాత్రం కొట్టించదు.  గెటప్‌ శ్రీను, వెన్నెల కిశోర్‌ల కామెడీ కూడా ఈ సినిమాకు ప్లస్‌ అయింది. కోటలో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. కొన్ని చోట్ల బీజీఎంతోనే భయపెట్టాలి.  ఈ విషయంలో సంగీత దర్శకుడు అనుదీప్‌ దేవ్‌ సక్సెస్‌ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్‌ఎక్స్‌  విజువల్స్‌  బాగుతున్నాయి.  ఎడిటింగ్‌ ఓకే. నిహారిక ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. గ్రాండ్ లెవల్ లో సినిమాను నిర్మించారు.

  • కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిని రీరిలీజ్‌ చేసినా, సీక్వెల్‌ తీసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా యుగానికి ఒక్కడు (ఆయిరత్తిల్‌ ఒరువన్‌) సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్‌ హీరోయిన్లుగా నటించారు. ధనుష్‌ సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రకటించాడు. 

    ఆషామాషీ కాదు
    కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పనులు జరగలేదు. గతేడాది చివర్లో మరోసారి సీక్వెల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెల్వ. ధనుష్‌, కార్తీతో కలిసి సీక్వెల్‌ తీస్తానని, కాకపోతే ఏడాదిపాటు వారు కాల్‌షీట్స్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న ఇద్దరు స్టార్‌ హీరోలు ఏడాదిపాటు డేట్స్‌ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!

    సీక్వెల్‌లో నేనుండను
    ఇకపోతే యుగానికి ఒక్కడు సీక్వెల్‌పై నటి, సింగర్‌ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యుగానికి ఒక్కడు సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మూవీ నటిగా ఎదిగేందుకు తోడ్పడింది. అయితే రెండో భాగంలో నేను ఉంటానని మాత్రం ఊహించకండి. యుగానికి ఒక్కడు సీక్వెల్‌ తెరకెక్కితే సంతోషమే కానీ నేను మాత్రం అందులో చేయలేను.

    ఆయనతో పని చేయడం కష్టం
    ఎందుకంటే మొదటి భాగమే 200 రోజులు తెరకెక్కించారు. అన్ని రోజులు పని చేయడమంటే మాటలు కాదు. అక్కడ అంత కష్టపడ్డాను గనుకే తర్వాత చేసిన సినిమాలు ఎంతో సులువుగా అనిపించాయి. ఏదేమైనా దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి పని చేయడం చాలా కష్టం అని పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో మనుషి, పిశాచి 2, నో ఎంట్రీ సినిమాలున్నాయి.

    చదవండి: బండ్ల గణేశ్‌ ఇంట శుభకార్యం.. కూతురి పెళ్లి వేడుక

Business

  • రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరడం భారత్‌లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.

    ప్యాకేజింగ్ భారం
    నీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.

    ధరల పెంపు
    మార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్‌ బాటిళ్ల ధరలను  11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.

    పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'
    కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్‌ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.

    సామాన్యుడిపై నీటి భారం
    భారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.

    కర్మాగారాల మూసివేత
    పెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ లారీ ఎల్లిసన్ సంపద ఊహించని రీతిలో ఆవిరైపోయింది. గడిచిన ఆరు నెలల కాలంలోనే ఆయన నికర విలువ ఏకంగా 193 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 16.10 లక్షల కోట్లు) మేర క్షీణించింది. ఒరాకిల్ షేర్లు మార్కెట్‌లో భారీగా పతనమవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

    కుబేరుల జాబితాలో వెనక్కి..
    బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 22, 2025 నాటికి ఎల్లిసన్ నికర విలువ 388 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. అప్పట్లో ఆయన ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఏప్రిల్ 3, 2026 నాటికి అది 195 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల ర్యాంకింగ్స్‌లో ఆయన రెండో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయారు.

    షేర్ల పతనమే కొంపముంచింది..
    ఒరాకిల్ సంస్థలో ఎల్లిసన్‌కు దాదాపు 41% వాటా ఉంది. కంపెనీ షేర్ల విలువ తగ్గితే ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా నేరుగా ప్రభావితమవుతుంది. సెప్టెంబర్ 2025లో 345.72 డాలర్ల వద్ద ఉన్న ఒరాకిల్ షేర్ ధర, ఏప్రిల్ 2, 2026 నాటికి 146.38 డాలర్లకి పడిపోయింది. అంటే దాదాపు 58% మేర పతనం నమోదైంది.

    భారీగా ఉద్యోగుల తొలగింపు 
    ఒకవైపు సంపద క్షీణిస్తుండగా, మరోవైపు ఒరాకిల్ సంస్థ ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా భారీగా ఉద్యోగ కోతలకు పాల్పడింది. మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 18%) తొలగించినట్లు సమాచారం.

    భారత్‌పై తీవ్ర ప్రభావం
    మీడియా నివేదికల ప్రకారం, ఈ తొలగింపుల ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంది. దేశంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులను కంపెనీ సాగనంపినట్లు తెలుస్తోంది.

    "ప్రస్తుత వ్యాపార అవసరాలు, సంస్థాగత మార్పులను దృష్టిలో ఉంచుకుని మీ పాత్రను తొలగించాలని నిర్ణయించాం," అంటూ తెల్లవారుజామునే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    వ్యాపార ఒత్తిళ్లు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు అటు ఇన్వెస్టర్లను, ఇటు ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

  • కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి (2026–27 ఏప్రిల్‌-సెప్టెంబర్) రూ.8 లక్షల కోట్ల రుణాలను మార్కెట్‌ నుంచి సమీకరించే ప్రణాళికతో ఉంది. ఆదాయం లోటును పూడ్చుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మేరకు నిధులను సమకూర్చుకోనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.17.20 లక్షల కోట్లను మార్కెట్‌ నుంచి నిధుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.

    బడ్జెట్‌ సమర్పణ అనంతరం, ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌) మార్పిడి ప్రక్రియలు నిర్వహించడంతో స్థూల మార్కెట్‌ రుణాలు రూ. 16.09 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. ‘‘రూ.16.09 లక్షల కోట్లకు గాను రూ.8.20 లక్షల కోట్లను (మొత్తం లక్ష్యంలో 51%) మొదటి ఆరు నెలల్లో డేటెడ్‌ సెక్యూరిటీల ద్వారా సమీకరించనున్నాం.

    ఇందులో రూ.15,000 కోట్లు సావరీన్‌ గ్రీన్‌ బాండ్ల జారీ కూడా ఉంటుంది. 2026–27లో వాస్తవ ద్రవ్యలోటు రూ.16.9 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు డేటెడ్‌ సెక్యూరిటీల జారీ ద్వారా మార్కెట్‌ నుంచి నికర రుణ సమీకరణ రూ.11.7 లక్షల కోట్లుగా ఉంటుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు నిధులు, ఇతర వనరుల రూపంలో సమకూర్చుకోనున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది.

  • న్యూఢిల్లీ: దిగుమతి చేసుకున్న, సర్టిఫై చేయని యూనిట్లపై నిషేధంతో సీసీటీవీ కంపెనీలు ఏప్రిల్‌ 1 నుంచి దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాయి. హిక్‌విజన్, టీపీ–లింక్‌లాంటి చైనీస్‌ సీసీటీవీ కంపెనీలపై దీనితో ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

    స్టాండర్డైజేషన్‌ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్‌ (ఎస్‌టీక్యూసీ) నిబంధనల అమలుతో సర్వైలెన్స్‌ పరిశ్రమ స్వరూపం మారినట్లు సీపీ ప్లస్‌ బ్రాండ్‌ సీసీటీవీలను తయారు చేసే ఆదిత్య ఇన్ఫోటెక్‌ వెల్లడించింది. ఎస్‌టీక్యూసీ లేని సీసీటీవీ యూనిట్ల విక్రయాన్ని 2025 ఏప్రిల్‌ 9 నుంచి కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. అయితే అప్పటికే దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు వీలు కల్పించింది. దీనితో పలు సంస్థలు దేశీయంగా ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాయి.

  • దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనుండగా, అన్ని వాహనాలపై సగటున 1.6 శాతం పెరుగుదల ఉంటుంది.

    పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, మొత్తం వ్యయాల మొదలైన కారణాల వల్లనే ధరల పెంపు జరిగిందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. దీంతో XUV 3ఎక్స్ఓ ఈవీ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలో త్వరలోనే వెల్లడవుతాయి. థార్, స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి.

    మహీంద్రా XUV7XO ధరల సవరణ మొదటి 40,000 బుకింగ్‌ల డెలివరీ తర్వాత జరుగుతుంది. ధరల పెరుగుదల జరిగినప్పటికీ.. కారు ఫీచర్లు లేదా మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు.

  • ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.

    బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.

    ఇలా వస్తే పన్ను లేదు..
    బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.

    వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్‌లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.

    వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

    ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..
    స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో  రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.

    బంగారం అమ్మితే పన్ను ఎంత? 
    బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. 
    దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.

    స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.

    సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్‌లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.

    కొనుగోలుపై జీఎస్టీ అదనం
    బంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.

    నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.

    ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.

    ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

    యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.

    గోల్డ్-సిల్వర్ రేషియో
    ఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.

    నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.

    వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!
    ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.

    బంగారం విలువను కోల్పోదు!
    ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.

    సమతుల్యత ఉత్తమం!
    పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

    ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!

  • ముంబై: బ్యాంకు ఖాతాకి అనుసంధానమైన మొబైల్‌ నంబరును మార్చుకోవడానికి సంబంధించి ఆధార్‌ ఆధారిత ఫేస్‌ ఆథెంటికేషన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇందుకోసం ముందుగా కొత్త నంబరును ఎంటర్‌ చేసి, ఆధార్‌ఫేస్‌ఆర్‌డీ యాప్‌ ద్వారా ఫోన్‌ ఫ్రంట్‌ కెమెరాతో లైవ్‌ ఫోటోని తీసుకోవాల్సి ఉంటుంది.

    ఆ తర్వాత కొత్త మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్‌ మొబైల్‌ యాప్‌ ‘యాప్‌’లో రీ–రిజిస్టర్‌ చేసుకున్నాక, భద్రతా కారణాల రీత్యా తొలి 24 గంటల పాటు మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల పరిమితులు, డిఫాల్ట్‌ స్థాయికి సెట్‌ అవుతాయి.  

    ఈ నూతన సదుపాయం వల్ల ఖాతాదారులు మొబైల్ నంబర్ మార్పు కోసం బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు లేదా బ్యాంకుకు వెళ్లలేని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే, ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే ఖాతాదారుడి ఆధార్ డేటాబేస్‌లో ఫోటో, ఇతర వివరాలు లేటెస్ట్‌ ఉండటం తప్పనిసరి.

    సాంకేతిక భద్రతతో కూడిన ఈ ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని, కేవలం ముఖ గుర్తింపు ద్వారానే కాకుండా ఓటీపీ ధ్రువీకరణ కూడా ఉండటం వల్ల ఖాతాదారుల డేటాకు పూర్తి రక్షణ లభిస్తుందని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • ప్రభుత్వరంగ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) చైర్మన్, ఎండీ అయిన అమరేందు ప్రకాష్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్‌ 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిన సెయిల్‌ సమాచారం ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ కుమార్‌సింగ్‌కు చైర్మన్, ఎండీగా తాత్కాలిక బాధ్యతలను అప్పగించినట్టు.. ఏప్రిల్‌ 2 నుంచి జూలై 1 వరకు లేదా రెగ్యులర్‌ నియామకం జరిగే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది.

    అమరేందు ప్రకాష్‌ తన రాజీనామాకు సంబంధించి నోటీసును జనవరి 2న ఉక్కు శాఖకు సమర్పించారు. అధికారిక అమోదం రావడంతో ఏప్రిల్‌ 1తో సెయిల్‌ బోర్డు నుంచి వైదొలగినట్టు సెయిల్‌ ప్రకటించింది. మరోవైపు సెయిల్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్న అశోక్‌ కుమార్‌పాండాను చైర్మన్, ఎండీ పదవికి ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది.

  • రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం 2026 సందర్భంగా ప్రారంభమైన #Water4Life దేశవ్యాప్త ప్రచారం ద్వారా 33,000కు పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, భారతదేశం అంతటా.. నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం కలిసి పనిచేస్తున్నారు.

    తొలి 10 రోజుల్లోనే, ఈ కార్యక్రమం ద్వారా 912 గ్రామాలలో 1,400కు పైగా జల వనరులను శుబ్రపడిచారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 108 జిల్లాలకు విస్తరించింది. తక్షణ చర్యలైన చెత్త తొలగింపు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో పాటు, దీర్ఘకాలికంగా సముదాయం ఆధారిత నీటి నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.

    ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా సంఘాలు, యువత, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక సంస్థలు మరియు ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే 15 జిల్లాల్లోని 146 గ్రామాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.

    ఇప్పటివరకు ఈ ప్రచారం ద్వారా 85,000 కిలోలకుపైగా చెత్త సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, చెత్త వేరు చేయడం వంటివి మాత్రమే కాకుండా.. నీటి సహజ ప్రవాహ వ్యవస్థల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రిలయన్స్ ఫౌండేషన్ శిక్షణ ఇచ్చిన 2,500 గ్రామ వాతావరణ ఛాంపియన్లు అవగాహన పెంపు, దీర్ఘకాలిక చర్యలకు కీలక పాత్ర పోషిస్తున్నారు.

    #Water4Life ప్రచారం.. ఇప్పటికే 91,000కు పైగా గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు ఆధారంగా ఉంది. ఫౌండేషన్ చేపట్టిన నీటి సంరక్షణ చర్యల ద్వారా ఇప్పటివరకు 2,000 లక్షల ఘన మీటర్లకు పైగా నీటి నిల్వ సాధ్యమై, లక్షలాది మందికి ప్రయోజనం కలిగింది.

    నీతా అంబానీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో సాగించే స్థిరమైన ఉద్యమంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముదాయం భాగస్వామ్యం మరియు సంస్థల సహకారంతో జల వనరుల దీర్ఘకాల సంరక్షణపై దృష్టి కొనసాగుతుంది.

  • ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తరువాత.. దేశంలో తమ కార్ల ధరలను తగ్గించే తొలి తయారీదారులలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఒకటిగా నిలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. మొదటి సంవత్సరంలో యూకే నుంచి దిగుమతి అయ్యే పూర్తిస్థాయి యూనిట్లపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో.. భారతదేశంలోని రేంజ్ రోవర్ SV మోడళ్ల ధరలు తగ్గుతాయి.

    ప్రస్తుతం రూ. 2.75 కోట్లుగా ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ ఎడిషన్ ధర.. ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత రూ. 40 లక్షల తగ్గింపుతో రూ. 2.35 కోట్లకు చేరవచ్చు. రూ. 4.25 కోట్ల ధర కలిగిన రేంజ్ రోవర్ 4.4-లీటర్ పెట్రోల్ ఎస్‌వి ధర సుమారు రూ. 3.19 కోట్లకు తగ్గవచ్చు.

    కేవలం యూకే నుంచి దిగుమతి చేసుకున్న ఎస్‌వీ మోడళ్లు ధరలు మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి జనాదరణ పొందిన వేరియంట్లు పూణేలో స్థానికంగా అసెంబుల్ అవుతున్నాయి. దీనివల్ల వాటిపై ఇప్పటికే తక్కువ సుంకాలు ఉంటాయి. కాబట్టి వీటి ధరలు తగ్గే అవకాశం లేదు.

  • విదేశీ ఉద్యోగం అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కన్సల్టెన్సీలు, విదేశాల్లో నెట్‌వర్కింగ్, లేదా అక్కడే చదువుకుని ఉండాలని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఏ విధమైన విదేశీ కనెక్షన్లు లేకుండా, కేవలం తన గదిలో కూర్చుని పక్కా ప్రణాళికతో రూ. 1.8 కోట్ల అంతర్జాతీయ జాబ్‌ ఆఫర్‌ను సొంతం చేసుకున్నాడు కార్తీక్ మోడీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ప్రస్తుతం ఈ వార్త టెక్ నిపుణుల్లో హాట్ టాపిక్ కావడమే కాకుండా, ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తోంది.

    అసాధ్యం కాదు..
    తొలుత ఇండియాలో ఉంటూనే రిమోట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కార్తీక్, ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాతే యూకేకి మకాం మార్చారు. ‘విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద నెట్‌వర్క్ ఉండటం ముఖ్యం కాదు. సరైన నైపుణ్యం, స్పష్టమైన ప్రణాళిక ఉంటే మీ గది నుంచే ప్రపంచాన్ని గెలవొచ్చు’ అని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    కార్తీక్ మోడీ సక్సెస్ మంత్రం ఇదే..
    గుడ్డిగా వందలాది కంపెనీలకు దరఖాస్తు చేయకుండా, కేవలం 25-30 అంతర్జాతీయ కంపెనీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. వీసా స్పాన్సర్‌షిప్ ఇచ్చే కంపెనీల కోసం లింక్డ్‌ఇన్, ఇండీడ్, లెవల్స్‌.ఫై వంటి వేదికలను ఉపయోగించుకున్నారు.

    సుమారు 40 ఉద్యోగ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించి, అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఆశిస్తున్న నైపుణ్యాలను గుర్తించి తనను తాను సిద్ధం చేసుకున్నారు. ఇందు ​కోసం 12 వారాల పక్కా ప్లాన్ వేసుకున్నారు. మొదటి 5 వారాలు డేటా స్ట్రక్చర్స్ & అల్గోరిథమ్స్ పై పట్టు సాధించారు. వేల సమస్యలు కాకుండా, కేవలం 100 కీలకమైన సమస్యలను ఎంచుకుని, వాటి వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకున్నారు.

    సిస్టమ్ డిజైన్‌పై పట్టు సాధించేందుకు పేమెంట్స్, సెర్చ్, నోటిఫికేషన్స్ వంటి 8-10 కీలక కోర్ సిస్టమ్స్‌పై లోతైన అధ్యయనం చేశారు. రియల్ వరల్డ్ ప్రాజెక్టులలో స్కేలబిలిటీ, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శించాలో ప్రాక్టీస్ చేశారు.

    రిజ్యూమ్ చిన్నగా.. ఇంపాక్ట్ పెద్దగా!
    అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కేవలం ఒకే ఒక్క పేజీలో తన రిజ్యూమ్‌ను రూపొందించారు. సుదీర్ఘమైన వివరణలు ఇవ్వకుండా, తాను చేసిన పని వల్ల కలిగిన ఫలితాలను గణాంకాలతో సహా పొందుపరిచారు. ఇంటర్వ్యూ భయం పోగొట్టుకోవడానికి పలు 'మాక్ ఇంటర్వ్యూలు' కూడా నిర్వహించుకున్నారు.

    ఏ విధమైన షార్ట్‌కట్‌లు వెతక్కుండా, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్ ఉంటే ప్రపంచస్థాయి అవకాశాలు మన ముంగిటకే వస్తాయని కార్తీక్ మోడీ నిరూపించారు. కేవలం 10-12 వారాల కఠోర శ్రమ ఆయన జీవితాన్నే మార్చేసింది.

  • తయారీ రంగం మార్చిలో కొంత బలహీనపడింది. ఈ రంగం వృద్ధి నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 53.9 పాయింట్లకు పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 56.9గా ఉంది. 2022 జూన్‌ తర్వాత ఇదే తక్కువ వృద్ధి కావడం గమనార్హం.

    తయారీలోకి వినియోగించే ముడి సరుకుల ధరల ఒత్తిళ్లకు తోడు తీవ్రమైన పోటీ ఈ పరిస్థితికి దారితీసింది. తమపై పడే వ్యయాల భారాన్ని ధరల పెంపు రూపంలో పూర్తిగా బదిలీ చేసే పరిస్థితుల్లేకపోవడం కంపెనీలపై ప్రభావం చూపించింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొత్త ఆర్డర్ల రాకపై ప్రభావం చూపించడం కారణాల్లో ఒకటిగా ఉంది.

    హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్ల ఇండెక్స్‌ (పీఎంఐ) గణాంకాలను గురువారం విడుదల చేసింది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదలగా చూస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయని, ఇవి పరోక్షంగా భారత తయారీదారులపైనా పడుతున్నట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు.

  • భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త చందాదారులను ఆకర్షించడంలో వరుసగా మూడో నెలలోనూ ముందుంది. ఫిబ్రవరిలో 48.5 లక్షల కొత్త చందాదారులను తన నెట్‌వర్క్‌లో భాగం చేసుకుంది. వైర్‌లైన్‌ కూడా కులుపుకుంటే ఎయిర్‌టెల్‌ మొత్తం మీద 50.88 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. జియో నికరంగా 17.41 లక్షల చందాదారులను (మొబైల్‌ విభాగంలో 16.24 లక్షలు) ఆకర్షించింది.

    మొత్తం మీద ఫిబ్రవరి చివరికి మొబైల్, ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ కనెక్షన్ల సంఖ్య 127.33 కోట్లకు పెరిగింది. వొడాఫోన్‌ ఐడియా ఇటీవలి కాలంలోనే మొదటిసారి 21,927 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ 1.01 లక్షల కస్టమర్లను కోల్పోయింది. జియో నికర చందాదారులు 51.96 కోట్లకు పెరిగారు. 36.4 కోట్ల చందాదారులతో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంటే, 12.93 కోట్ల కస్టమర్లతో వొడాఫోన్‌ ఐడియా, 2.8 కోట్ల కస్టమర్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  

    గ్లోబల్‌గా రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌ 
    అంతర్జాతీయంగా 65 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్స్‌తో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం ఆపరేటరుగా భారతి ఎయిర్‌టెల్‌ నిల్చింది. మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న జీఎస్‌ఎంఏ ఇంటెలిజెన్స్‌ గణాంకాలను ఉటంకిస్తూ కంపెనీ ఈ విషయాలు తెలిపింది. ఎయిర్‌టెల్‌కి భారత్‌లో 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. వినూత్న ఆవిష్కరణలు, విశ్వసనీయత ప్రాతిపదికన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు భారతి ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న.. ఈ కాలంలో టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం.. ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ఎక్కువగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ వంటివాటిపై మొగ్గు చూపుతున్న కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది.

    ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ టెకీ.. పాతకాలపు విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు నేరుగా కంపెనీలకు వెళ్లి ఉద్యోగం సెర్చ్ చేయమని సూచించడంతో.. దాన్నే ఫాలో అయ్యాడు. తాను ఉంటున్న నగరంలోనే ఏడు కంపెనీలను సందర్శించారు.

    మొదట రెండు పెద్ద కంపెనీలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినప్పుడు, అక్కడి సిబ్బంది అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని చెప్పారు. అంతే కాకుండా అసలు వారు పేపర్ రెజ్యూమ్ తీసుకోలేదు. ఇంకో రెండు చిన్న కంపెనీలకు వెళ్లినప్పుడు, ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చాలా కాలం క్రితం పెట్టారని, అది తప్పుగా మళ్లీ కనిపించిందని చెప్పారు. మరొక కంపెనీ అతని రెజ్యూమ్ తీసుకున్నప్పటికీ, ఆన్‌లైన్‌లో అప్లై చేయమని సూచించిందని అతడు పేర్కొన్నాడు.

    మిగిలిన మూడు కంపెనీల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రెండు కంపెనీలు అసలు అక్కడ లేవు. ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. చివరికి ఒక చోటకి అతను వెళ్లినప్పుడు, అది ఒక పెద్ద గది మాత్రమే ఉండి, అందులో ఇద్దరు వ్యక్తులు ల్యాప్‌టాప్‌లతో పని చేస్తూ కనిపించారు. వాళ్లను కంపెనీ గురించి అడిగితే.. వారు అయోమయంగా చూసి అతన్ని వెళ్లమని చెప్పినట్లు వెల్లడించాడు.

    ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

    ఉద్యోగం సెర్చ్ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన అనుభవాన్ని.. అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ కాలంలో నేరుగా వెళ్లి ఉద్యోగం కోసం అడగడం ఉండదని.. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలామంది చెప్పారు. కొందరు మాత్రం అరుదుగా ఈ విధానం పనిచేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.

  • ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వడ్డీ రేటును 10 శాతానికి పెంచుతారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ వైఖరిని వివరించారు.

    కార్మిక సంఘాల నుంచి డిమాండ్ లేదు
    ఈపీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచాలని కార్మిక సంఘాలు ఏవైనా డిమాండ్ చేశాయా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. అటువంటి విజ్ఞప్తులేవీ ప్రభుత్వం వద్దకు రాలేదని స్పష్టం చేశారు. వడ్డీ రేటు పెంపుపై యూనియన్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రతిపాదనలు లేవని ఆమె పేర్కొన్నారు.

    10 శాతం రేటు సాధ్యమేనా?
    వడ్డీ రేటును 10 శాతానికి పెంచే అంశంపై ఈపీఎఫ్ఓ (EPFO) ఏదైనా ఆర్థిక లేదా యాక్చురియల్ విశ్లేషణ నిర్వహించిందా అన్న అంశాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ఈపీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT)కు ఉంటుందని, వారి సిఫార్సుల మేరకే నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు.

    వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తారంటే..
    ఈపీఎఫ్ వడ్డీ రేట్ల లెక్కింపు వెనుక ఉన్న ప్రాతిపదికను ప్రభుత్వం ఈ సందర్భంగా వివరించింది. ఈపీఎఫ్ నిధిని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టగా వచ్చే వాస్తవ ఆదాయం ఆధారంగానే వడ్డీ రేటును నిర్ణయిస్తారు.ఇది కేవలం పెట్టుబడి రాబడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇతర ఆర్థిక వేరియబుల్స్‌తో దీనిని పోల్చడం సాధ్యం కాదు. ఈపీఎఫ్ పథకం-1952లోని పారాగ్రాఫ్ 60(4) ప్రకారం.. వడ్డీ ఖాతాలో నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది.

  • మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.

    కొత్త పని గంటలు

    పెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.

    • ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.

    • మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

    • పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్‌ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్‌)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

    విద్యా రంగంలో మార్పులు

    పాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్‌లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.

    ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు

  • సామాన్యుడి విమాన ప్రయాణంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ఏవియేషన్ రంగానికి సవాలుగా మారుతోంది. దాంతో ఇటీవల విమానయాన సంస్థలు ఇంధన సర్‌ఛార్జీలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌) ధరల పెరుగుదల, దాని పర్యవసానాలపై విమానయాన సంస్థలతో చర్చలు జరిపేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.

    విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా కేవలం ఇంధనానిదే. అందుకే ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప మార్పు వచ్చినా అది టికెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల సవరణల తర్వాత ధరల వ్యత్యాసం ఇలా ఉంది.

    విభాగంపాత ధర (కిలోలీటరుకు)ప్రస్తుత ధర (కిలోలీటరుకు)
    ఇంటర్నేషనల్‌/చార్టర్డ్రూ. 96,638.14రూ. 2,07,341.22 (దాదాపు రెట్టింపు)
    దేశీయ కార్యకలాపాలు-రూ. 1,04,927.18

     

    ప్రభుత్వం విమానయాన రంగానికి వెసులుబాటు కల్పిస్తూ 25 శాతం వరకు పెంపునకు అనుమతించినప్పటికీ దేశీయ ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రభావాన్ని 8.5 శాతానికి పరిమితం చేయాలని భావించింది.

    ఇండిగో దూకుడు..

    ప్రభుత్వ అధికారిక ఆదేశాలు రాకముందే దేశీయ దిగ్గజం ఇండిగో ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా ఇంధన సర్‌ఛార్జీలను సవరించింది. అయితే, గతంలో ఉన్న రూ.425 ఫ్లాట్ ఛార్జీని తొలగించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.275 నుంచి రూ.950 వరకు దేశీయ మార్గాల్లో సర్‌ఛార్జీని నిర్ణయించింది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ రూట్లలో ముఖ్యంగా యూరప్ వంటి సుదూర ప్రాంతాలకు ఇంధన సర్‌ఛార్జీ ఏకంగా రూ.10,000 వరకు పెరగడం గమనార్హం.

    ప్రభుత్వ జోక్యం

    ధరల పెరుగుదలపై విమానయాన సంస్థల నుంచి కేంద్రం వివరణ కోరుతోంది. ‘ధరల పట్ల సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్‌లో ఇంధన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపడం సరైనది కాదు’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం ఇంకా ఎటువంటి అధికారిక నియంత్రణ ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, త్వరలో జరగబోయే చర్చల ద్వారా అదనపు సర్‌ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేదా కనీసం పునసమీక్షించాలని సంస్థలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు

Telangana

  • సాక్షి, కరీంనగర్‌ : రూరల్‌ మండలం జూబ్లీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు కుమార్తెలను హత్య చేసి బావిలో పడేశాడు.

    పోలీసుల వివరాల ప్రకారం, శుక్రవారం శ్రీశైలం తన భార్యతో గొడవపడ్డాడు. కోపోద్రికుడైన అతడు ఐదేళ్ల కవల కూతుళ్లకు గడ్డి మందు తాగించి అనంతరం బావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు పిల్లల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభించగా, మరో కూతురు కోసం గాలింపు కొనసాగుతోంది.

    ఈ ఘటనపై ఆగ్రహించిన స్థానికులు శ్రీశైలంపై దాడి చేశారు. భార్యతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు చెబుతున్నారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

     

  • సాక్షి,  హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 'దివ్యాంగులు, వృద్ధులు ,ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ' (EPwD), ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నైపుణ్య శిక్షణా కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ శిక్షణా కార్యక్రమాలలో డ్రోన్ పైలట్ శిక్షణ, హోటల్ నిర్వహణ విభాగం కింద క్యాంటీన్ చెఫ్ శిక్షణ , కారు డ్రైవింగ్ నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు (04.04.2026) ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న NITHM ప్రాంగణంలో జరగనుంది.

    ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల గౌరవ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని  నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 
     

  • సాక్షి,నిర్మల్‌: విధి ఆడిన వింత నాటకంలో సర్పంచ్‌ లహరిక మృతి చెందారు. నిర్మల్ జిల్లా మాసాయిపేట సర్పంచ్‌ లహరిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. లహరికను తీసుకెళ్తున్న కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.ప్రమాదంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు లహరికను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.

    ఈ విధంగా వరుస సంఘటనలు విషాదాంతానికి దారితీశాయి. ఆత్మహత్య ప్రయత్నం, రోడ్డు ప్రమాదం, ఆసుపత్రి చికిత్స.. వరుస సంఘటనలు చివరికి విషాదాంతానికి దారితీశాయి. మాసాయిపేట సర్పంచ్‌ లహరిక మృతి నిర్మల్‌ జిల్లాలో చర్చనీయాంశమైంది


     

Andhra Pradesh

  • తిరుపతి: తుమ్మలగుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంబిరెడ్డిని ముగ్గురొచ్చి కిడ్నాప్‌ చేశారని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు.  ‘31న రాత్రి ముగ్గురొచ్చి తంబిరెడ్డిని గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులను అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టులో కేసు వేశాం. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇలా చేయడం దారుణం. .60 సంవత్సరాల వయస్సులో ఉన్న తంబిరెడ్డిని ఇలా కిడ్నాప్ చేయడం దారునం. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని తెలిపారు

    కారులో బలవంతంగా తీసుకెళ్లారు
    ‘నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పలు పోలీస్‌ స్టేషన్లలో తిప్పారు. ఫేస్‌బుక్‌లో పోస్టుకు కామెంట్‌ పెట్టినందుకే అరెస్ట్‌ చేశారు. పోస్ట్‌ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశనించారు. 

     

  • తాడేపల్లి : తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. 

    ఈ రోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 3వ తేదీ) వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. 

    రాజధానిపై మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది..
    ‘రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు గ్రోత్ కారిడార్‌గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా మారుతున్నాయి.  వైఎస్‌ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సజ్జల సూచించారు.

    ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి..
    ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. బీఎల్‌వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ‘ పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది.  త్వరలో వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ పెంచాలి’ అని పేర్కొన్నారు.

  • సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘మావిగన్‌’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

    అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్‌లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా  వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.

    అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే...
        
    జగన్ చెప్పిన మావిగన్‌పై రాష్ట్రంలో చర్చ
    రెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం  తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

    అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు  50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.

    2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు
    2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.

    2028-29కి ఈ ఏడు బిల్డింగ్‌లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు  బిల్డింగ్‌లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో  వైఎస్‌ జగన్‌ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.

    ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2  లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.

    మావిగన్‌  ట్రోలింగ్స్‌కు వైఎస్సార్సీపీ భయపడదు
    అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.

    ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్‌లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.

    20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ 
    ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.

    చంద్రబాబే ఊసరవెల్లి
    2014లో  రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్‌మోహన్‌ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్‌ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్‌ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు.

  • సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి  రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్‌ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  

    నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్‌తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్‌ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం  ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్‌ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు.  

    ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్‌ చైల్డ్‌(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్‌ కమెడియన్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 

  • సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్‌లైన్‌పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.

    పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. 

  • సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.

    వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్‌కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్‌ఎస్‌, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు.  

    మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్‌కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్‌కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్‌ చేశారు. 

  • ఢిల్లీ: ఉప రాష్ట్రపతిని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కలిశారు. సీపీ రాధాకృష్ణన్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. నిన్న( ఏప్రిల్‌ 2, గురువారం) అమరావతి బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు.

    పార్లమెంట్‌లో తమ గొంతు నొక్కడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు సభ్యులు ఉన్న వైఎస్సార్‌సీపీకి ఐదు నిమిషాలు కేటాయించగా.. ఇద్దరు సభ్యులు ఉన్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం పట్ల వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

Politics

  • కడప:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు  మాట్లాడిన మాటలు అంతా మోసపూరితం, అసత్యాలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో అత్యద్భుత రాజధాని అని నిన్నటి వరకు గ్రాఫిక్స్ కథలు చెప్పారని, రెండేళ్లలో రాజధాని పూర్తి చేస్తా అని చంద్రబాబే చెప్పారని, ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ అంటూ మాట మారుస్తున్నారని మండిపడ్డారు. 

    ‘రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు మారిపోయాయి అని టీడీపీ హడావుడి చేస్తోంది. ఈ రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు మోసపూరితం, అసత్యాలే. మొన్న రెండేళ్లలో రాజధాని పూర్తి అని చెప్పారు.. ఈ రోజు ఇది నిరంతర ప్రక్రియ, కొంత భాగం మాత్రమే పూర్తి చేస్తా అంటున్నారు. లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో అప్పులు తీసుకుని  నామమాత్రపు పనులు చేశారు. విభజన తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతి రాజధాని అని చెప్పాయని అబద్ధపు మాటలు చెప్పారు.

     మేధావులు ఆ కమిటీల రిపోర్ట్ ఇప్పటికీ చూడవచ్చూ. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కమిటీల పేర్లు చెప్తున్నారు. 44 శాతం మంది అమరావతికి ఒకే చెప్పారు అంటున్నారు...మరి మిగిలిన 56 శాతం గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడూ రైతు గురించి మాట్లాడటం లేదు...కేవలం అక్కడున్న రియల్ ఎస్టేట్ కోసమే మాట్లాడతావు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోరాం...తుంగలో తొక్కారు. పోలవరం ఈయనే చేసాడట...వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైంది ప్రజలకి తెలియదా..?

    అదే 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది?
    విభజన సమయంలో 7 మండలాల విలీనం చేస్తామని కేంద్రం చెప్పింది. దాన్ని తీసుకుని ఆ మండలాలు ఇచ్చే వరకు నేను ప్రమాణం చేయను అని నాటకాలు ఆడాడు. జపాన్ సంస్థ మకీ బిహార్ కంటే ఇక్కడ దారుణ ప్రస్తుతులు ఉన్నాయని చెప్పింది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నీ వల్ల నాశనమై పోయాడు. నువ్వు విట్, srm వంటి ప్రైవేటు సంస్థలు తెచ్చి ఏదో చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళు పిల్లల వద్ద లక్షలకు లక్షలు పిండేస్తున్నారు. అదే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎంత మేలు జరిగేది..?

    వైజాగ్ అంటే నానా యాగీ చేశారు..
    మిగతా రాజధానుల్లాగానే మనకూ ఒక మంచి నగరం ఉండాలని వైజాగ్ అంటే నానా యాగీ చేశారు. అన్నీ బాగుండాలనే జగన్‌కి పిచ్చా...ఏమీ లేని చోట గ్రాఫిక్స్ చూపే నీకు పిచ్చా...?, జగన్ ఇప్పుడు చెప్తున్నట్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చేస్తే ఎంత బాగుండేది..?, తక్కువ ఖర్చుతో వాటిని అభివృద్ధి చేస్తే ఎంత అభివృద్ధి జరిగేది..?, కొత్త నగరం నిరంతర ప్రక్రియ అంటూ నువ్వే చెప్తున్నావు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు 4 వేలకు కడితే...నువ్వు అమరావతి 12వేలుతో కడతావా...?, ఆర్ధిక పరిస్థితి చూసుకుని వెళ్దాం అంటే నువ్వు దుర్మార్గుడివి అని ఎదురు దాడి చేస్తున్నారు..నువ్వు అక్కడ పెడుతున్న ఖర్చు ఉన్న నగరాల్లో పెట్టీ ఉంటే ఎంత సంపద సృష్టించే వాళ్ళం..?, ఇవన్నీ చెబితే ప్రతిపక్ష నేతను హేళన చేస్తూ మాట్లాడుతున్నారు

    నేను చెప్పిందే వేదం అంటూ మేధావిలా ఫోజులు కొడుతున్నారు. చట్టబద్ధత పేరుతో అమరావతిని కేంద్రం చేతుల్లో పెట్టాడు. ఏ రాష్ట్ర రాజధానికి ఇలా చట్టబద్ధత తీసుకోలేదు. 

    రాయలసీమకు ఏం చేశావో ఒక్కటి చెప్పు..
     నీ నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు ఏమీ చేశావో ఒక్కటన్నా చెప్పు. కర్నూలు హైకోర్టు మొదలుపెడితే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లావు. మేము మనుషులం కాదా...మాకు సెంటిమెంట్లు ఉండవా...?, అమరావతి దేవతల రాజధాని అయితే..కర్నూలు పరమ శివుడి తిరుగాడిన ప్రాంతం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మాకు లేదు...నువ్వే వాటిని రాజేస్తున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు, నేడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తాకట్టు పెట్టావు. నీకు తెలంగాణపై ఉన్నంత ప్రేమ రాయలసీమపై లేదా..?,  నీలా ఒక ప్రాంతాన్ని కాకుండా  రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌తో సంబంధం లేదని మొన్న చట్టం చేశారు...మరి ఉమ్మడి ఆస్తులు సంగతి ఏమిటి..?, తెలంగాణలో నిన్ను తరిమేస్తే వచ్చి...కట్టుబట్టలతో వచ్చానని చెప్పడం దేనికీ..?

    జగన్ చేపట్టిన పోర్ట్, మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రజల జీవితాలను మార్చేశారు. రాయచోటి జిల్లా కేంద్రం తీసేసిన నీకు అక్కడి ప్రజలకు సెంటిమెంట్లు ఉంటాయని తెలియదా...?, అమరావతిలో ఏదో జరిగితే మా రాయలసీమ ప్రాంతపు వాదులు అమాయకంగా కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అలా ఆదేశాలు ఇచ్చి మరీ పండగ అంటూ హడావుడి చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబు పబ్లిసిటీ చేసుకోవడంలో దిట్ట. 

    రాజ్యసభలో అమరావతి అని మాట్లాడించి కులాల కుంపట్లు రాజేస్తూ ఇతరులను విమర్శిస్తున్నారు. రేణుకా చౌదరీ మాటలను మీలో ఎవరైనా ఖండించారా...?, ఆనాడు జలయజ్ఞం నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకూ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని కులాల పరంగా చిచ్చులు పెట్టీ రాజకీయ లబ్ది పొందుతూ మమ్మల్ని అంటే ఎలా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • మంచిర్యాల:  తెలంగాణాలో బీజేపీకి స్థానం లేదని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఆరోపించారు. ఎన్నికలొస్తే దేవుళ్ల పేరు చెప్పడం బీజేపీకి అలవాటని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్‌ఎస్‌పై కూడా మహేష్‌ గౌడ్‌ విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌, హరీష్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నారు. కవిత వేరుకుంపటితో బీఆర్‌ఎస్‌ రోడ్డున పడిందన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. 

    ‘ బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కేసుల పాలయ్యారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ రోజు మేము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే. కేసీఆర్‌ శృతి లేని పాలన చేసిండు. వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం . తెలంగాణాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సిట్లకు పైగా గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. 

     

Family

  • రాజస్థాన్‌లోని సింధారి జిల్లాలోని కర్దాలి గ్రామంలో... యాభై ఏళ్ల నాటి పూరి గుడిసె పునాది బలహీన పడడంతో కూలిపోయే ప్రమాదంలో పడింది. ఈ గుడిసె పూర్ణారామ్‌ అనే వ్యక్తి తాతది. పూర్ణరామ్‌కు అది పాత గుడిసె కాదు. 

    ఒక అమూల్యమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని కాపాడుకోవాలనుకున్నాడు పూర్ణారామ్‌. హైడ్రాలిక్‌ క్రేన్‌ సహాయంతో గుడిసెను వేరే చోటికి తరలించాడు. చెదల వల్ల గుడిసె పునాది దెబ్బతిందని, అందుకే దాన్ని తరలించాల్సి వచ్చిందని పూర్ణారామ్‌ వివరించాడు. గుడిసె పై కప్పు మరమ్మతు చేస్తే అది 30 నుండి 40 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని అతను భావిస్తున్నాడు.

    ‘లక్ష రూపాయల విలువ కూడా లేని ఈ పాత గుడిసె కోసం ఇంత శ్రమ ఎందుకు?’ అనే ప్రశ్నకు పూర్ణారామ్‌ ఇచ్చిన జవాబు...‘నా దృష్టిలో అది కోట్లాది రూపాయల కంటే విలువైన గుడిసె. ఈ గుడిసె చుట్టూ ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి’.

     

    (చదవండి: వివాహిత మహిళలు గూగుల్‌లో ఏం సర్చ్‌ చేస్తున్నారో తెలుసా..!)
     

  • పెళ్లికి ముందు వరకు అమ్మాయిల లైఫ్‌ చదువులు, కాలేజ్‌ లైఫ్‌ తదనంతర ఉద్యోగం వంటివాటితో హాయిగా తుళ్లుతూ సాగిపోతుంది జీవితం. పెద్దగా ట్రబుల్స్‌ ఏమి ఉండవు. తల్లిదండ్రుల వద్ద గారాభంగా, ముద్దుగా ఏ చీకు చింత లేకుండా గడిపేస్తారు. పెళ్లి అనే రెండే అక్షరాల బంధంలోకి ఎప్పుడైతే అడుగుపెడతారో అప్పుడే బాధ్యతలు, బరువు ఒకేసారి మీద పడినట్లుగా ఉంటుంది జీవితం. 

    ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అనే వాటిపై అటెన్షన్‌ ఎక్కువై ఒకటే ఆత్రం, ఆందోళన వెంటాడుతూ ఉంటాయి. దాంతో పెళ్లి తర్వాత అమ్మాయిలంతా గూగుల్‌ని అవే ఎక్కువ అడుగుతున్నారట. వాళ్లంతా చిటికెలో దొరికే పరిష్కారాల కోసం గూగుల్‌ని అడుగుతున్న విచిత్రమైన ప్రశ్నలేంటంటే..

    1. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ భర్తలను సంతోషంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పర్యవసానంగా, వారు తమ భర్త ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడం ఎలా?, ఏం చేయకూడదు, ఎలా తీసుకోకూడదు వంటి వాటిని సర్చ్‌ చేస్తున్నారట. ముఖ్యంగా తమ భర్త సంతోషం కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారట.

    2. వివాహిత మహిళలల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక ప్రశ్న, తమ భర్త మనసును గెలుచుకోవడం ఎలా అనేది. భర్త సంతోషంగా ఉంటేనే కదా మనల్ని సంతోషంగా ఉంచుతాడనే నమ్మకంతో దానికోసం చిట్కాల కోసం వెతుకుతారట. .

    3. తమ భర్తలను విధేయులుగా ఎలా మార్చుకోవాలి అనేదాని గురించి కూడా ఎక్కవగా సర్చ్‌ చేస్తున్నారట. కొంతమంది మహిళలు తమ భర్తలు తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకే దీనిపై గూగుల్‌ని ఎక్కువగా సలహాలు కోరుతున్నారట.

    4 కొత్తగా పెళ్లైన వారిలో పిల్లలను కనడానికి సరైన సమయం గురించిన ప్రశ్నలు కూడా వస్తుండటం విశేషం. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వం లేకపోవడంతో, చాలా మంది మహిళలు జాగ్రత్తగా, ప్రణాళికతో మాతృత్వాన్ని స్వీకరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారట.

    5. కొత్త కుటుంబంలో ఎలా సర్దుకుపోవాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలామంది కొత్త వధువులు కొత్త ఇంట్లో తమ సంబంధాలను ఎలా నిర్వహించుకోవాలిని కుటుంబసభ్యులతో సముచితంగా ఎలా మెలగాలి వంటి సలహాలు కూడా అడుగుతున్నారట.

    6. వివాహంతో వచ్చే బాధ్యతలు అధిక భారాన్ని మోపవచ్చు. మహిళలు తరచుగా ఈ కొత్త విధులను నిర్వహించడానికి వ్యూహాల కోసం వెతుకుతున్నారట. ఎందుకంటే అప్పటి వరకు తల్లిదండ్రుల వద్ద హాయిగా సాగిన జీవితాల్లోకి ఒక్కసారిగా వచ్చిపడిన బాధ్యత భారం ఎలా నిర్వహించాలనే ఆందోళన ఎక్కువగా ఉంటుందట మహిళల్లో. 

    7. ​కొందరైతే ఫ్యామిలీ లైప్‌, వృత్తి జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఆందోళన చెందుతున్నారట. వృత్తిపరమైన ఆశయాలకు కుటుంబ జీవితం ఆటంకంగా మారకూడదనే ఆందోళన నేపథ్యంలో దీనిపై ఎక్కువగా గూగుల్‌లో సర్చ్‌ చేస్తున్నారట. చెప్పాలంటే మహిళలు సమర్థవంతమైన సమయ నిర్వహణతో రెండింటిని ఎలా బ్యాలెన్స్‌ చెయ్యొచ్చు అని సలహాలు అడుగుతుండటం విశేషం. 

    (చదవండి: జస్ట్‌ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!)