Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బాహుబలి ఫ్రాంచైజీతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించిన దర్శకధీరుడు రాజమౌళి, మళ్లీ అదే పద్ధతిలోకి అడుగుపెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్‌ను సింగిల్ మూవీగా తెరకెక్కించినా, ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారనే టాక్ ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.  

    ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇంత త్వరగా సినిమా వస్తోందంటే అది పార్ట్-1 అయి ఉంటుందనే వాదన మొదలైంది. దీంతో నెటిజన్లు టైటిల్స్ కూడా ఊహించేశారు. వారణాసి పార్ట్-1: గ్లోబ్ ట్రోటర్, వారణాసి పార్ట్-2: టైమ్ ట్రోటర్ అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై యూనిట్ ఇంకా స్పందించలేదు.  

    ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ఆఫ్రికా, ఐరోపా దేశాలను కూడా టార్గెట్ చేస్తూ భారీ ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘వారణాసి’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ ఎపిసోడ్‌లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వారణాసి’ రాజమౌళి కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.  
     

  • సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ ఇవాళ కన్నుమూశారు. గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించారు. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆయన మరణం కేరళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అభివర్ణించారు

    1980- 1990లలో మలయాళ సినిమాకు వెంకటేశ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. మలయాళ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్‌పీ వెంకటేశ్  ఒకరు. మలయాళ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు కొనసాగారు. 1980వ దశకంలో అత్యంత ఫేమస్ అయ్యారు. తన సూపర్ హిట్‌ పాటలతో, సినిమాల భావోద్వేగ లోతును పెంచే శక్తివంతమైన నేపథ్య సంగీతానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారు. రాజవింటే మకన్, జానీ వాకర్, పైతృకం, సోపానం, హైవే వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు వెంకటేశ్ సంగీతం అందించారు.

  • మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. 

    అభిమానులకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్..

    అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్‌ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ  మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్‌ అంటున్నారు.

    ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.
     

     

  • టాలీవుడ్‌లో ఇప్పుడంతా వీరిద్దరి పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. డేటింగ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్‌ వరకు ఫ్యాన్స్‌లో  కన్‌ఫ్యూజన్‌ అలాగే ఉంది. గతేడాది నిశ్చితార్థం జరిగినట్లు వార్తలొచ్చినప్పటికీ ఇంకా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ ఎవరి పెళ్లి అనుకుంటున్నారా?  అదేనండి మన రష్మిక- విజయ్ దేవరకొండ జంట గురించే. గత కొద్ది రోజలుగా ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌ అంటూ వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అంతేకాకుండా ఈనెల 2న రష్మిక- విజయ్ వెడ్డింగ్ అంటూ ఇద్దరు అమ్మాయిలు మాట్లాడిన వీడియో తెగ వైరలైంది. కానీ అదంతా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది.

    అయితే తాజాగా మరో మ్యారేజ్ డేట్‌ సోషల్ మీడియాలో వైరలవుతోంది. రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఓ అభిమాని ఫోటో తీసుకుంటానంటూ రష్మికను రిక్వెస్ట్ చేశాడు. దీంతో వెంటనే మాస్క్ తొలగించి ఫోటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత వెంటనే అతను రష్మికకు కంగ్రాట్స్‌ చెప్పాడు. దీనికి రష్మిక దేనికి రా అంటూ అతన్ని నవ్వుతూ అడిగింది. వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 26 ఫర్ వెడ్డింగ్ మేడం అన్నాడు. దీనికి రష్మిక క్యూట్‌గా నవ్వుకుంటూ ‍అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్మైల్‌తో పెళ్లి తేదీ ఫిక్సయినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక పరోక్షంగా తన పెళ్లి తేదీని రివీల్ చేసిందని అంటున్నారు.

    గత డిసెంబర్‌లో వచ్చిన సమాచారం ప్రకారం రష్మిక- విజయ్ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో తమ సినీ ఇండస్ట్రీ స్నేహితుల కోసం రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే వీటిపై ఈ జంట ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కాగా.. వీరిద్దరు జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. 

  • అనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తక్షకుడు. ఈ సినిమాకు వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిడిల్‌క్లాస్‌ మెలొడీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజైంది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. టీజర్ చూస్తుంటే ఆనంద్ దేవరకొండ మునుపెన్నడు చేయని డిఫరెంట్‌ రోల్‌ చేస్తున్నట్లు అర్థమవుతోంది. 'వాడు ఇక్కడే ఉన్నాడు.. నా కళ్లముందే ఉన్నాడు.. కానీ కనిపెట్టలేకపోతున్నాను..' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

    కాగా..  ఈ మూవీలో లపతా లేడీస్‌ ఫేమ్‌ నీతాన్షీ గోయెల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.  

     

  • టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ‍మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

    ఈ సమ్మర్‌ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు.
     

     

  • కింద పడుకుని పోజులిచ్చేసిన మీనాక్షి చౌదరి

    బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మాళవిక మోహనన్

    క్యూట్ అండ్ స్వీట్ లుక్స్‌లో అనన్య నాగళ్ల

    ముంబై జ్ఞాపకాలు పోస్ట్ చేసిన రుక్మిణి వసంత్

    తెగ నవ్వేస్తున్న యాంకర్ రష్మీ గౌతమ్

  • శృంగారం లేదా సె*క్స్ ఎడ్యుకేషన్ అనే పదాలు వింటే చాలు చాలామంది అదేదో బూతులా చూస్తారు. అసలు ఈ పదాలు ఉచ్ఛరించడమే తప్పు అన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రస్తుత జనరేషన్‌లో వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది పలు రకాలుగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై తెలుగులో ఓ వెబ్ సిరీస్ తీశారు. దాని టీజర్ ఇప్పుడు విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

    'సూపర్ సుబ్బు' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ లీడ్ రోల్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ఇది స్ట్రీమింగ్ కానుంది. ముంబైలో మంగళవారం ఓ ఈవెంట్ నిర్వహించిన సదరు ఓటీటీ సంస్థ.. అక్కడ దీని టీజర్ రిలీజ్ చేసిది. కాన్సెప్ట్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసింది. టీజర్ బట్టి చూస్తే.. సుబ్బు.. చిన్నప్పటి నుంచి చిలిపి కుర్రాడు. పెద్దయిన తర్వాత కూడా అలానే ప్రవర్తిస్తుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడనుకుంటే ఏకంగా 60 మంది అమ్మాయిలు ఇతడిని రిజెక్ట్ చేస్తారు.

    మరోవైపు సుబ్బుకి టీచర్‌గా అవకాశమొస్తుంది. కాకపోతే ఓ పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు వెళ్లిన పనిలో సక్సెస్ అయ్యాడా లేదా? అనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. ఈ సిరీస్‌లో సందీప్ కిషన్‌కి జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. మురళీ శర్మ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు చేశారు. 

    (ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ టాలెంట్.. వాళ్లకు శాపమవుతోంది!)

  • టాలీవుడ్‌లో ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. కమర్షియల్ సినిమాలు ఒకటో రెండు ఆడుతున్నాయి తప్పితే కంటెంట్ బేస్డ్ చిత్రాలకే ఎక్కువగా ప్రేక్షకాదరణ లభిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోలు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే రైటింగ్ లాంటి వాటిలో పాలుపంచుకుంటున్నారు. అలాంటి వాళ్లలో నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్ధు జొన్నలగొడ్డ పేర్లు ప్రముఖమైనవి. వీళ్ల ప్రతిభని అందరూ మెచ్చుకుంటున్నారు. కాకపోతే నాణెనికి మరోవైపు చూస్తే పరిస్థితి చిత్రంగా ఉంటుంది.

    (ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

    అడివి శేష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ.. వీళ్లు డైరెక్ట్‌గా హీరోలు అయిపోలేదు. చాన్నాళ్ల పాటు సైడ్ క్యారెక్టర్స్ చేశారు. గుర్తింపు రావడానికి చాలా టైమ్ పట్టింది. ఈ టైంలోనే కేవలం యాక్టింగ్‌ని నమ్ముకోకుండా రైటింగ్‌పై కూడా పట్టుసాధించారు. తమ సినిమాలకు కథలు, సీన్స్ విషయంలో వీళ్ల వైపు నుంచి అద్భుతమైన తోడ్పాటు అందించారు. ఇదే ఆయా చిత్రాల తీసే దర్శకులకు మైనస్ అవుతుందా అనే సందేహం కలుగుతోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.

    అడివి శేష్‌నే తీసుకుందాం. క్షణం, గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తోనే తీసిన ఈ మూవీస్.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. వీటి సక్సెస్‍‌లో శేష్ సహకారం చాలానే ఉంది. కానీ ఈ చిత్రాలు తీసిన దర్శకులు రవికాంత్ పేరేపు, శశికిరణ్ తిక్క.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. ఆయా చిత్రాల రిలీజ్‌కి ముందు, తర్వాత కూడా శేష్‌కే చాలా పేరొచ్చింది తప్పితే దర్శకులని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. శేష్ ప్రస్తుతం చేస్తున్న డకాయిట్, గూఢచారి 2 సినిమాలకు దర్శకులు ఎవరని అడిగితే చాలామంది చెప్పలేరు. అది పరిస్థితి.

    (ఇదీ చదవండి: ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?)

    నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే.. స్వతహాగా తెలుగు కుర్రాడే కానీ మొదట హిందీలో పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, వన్ నేనొక్కడినే, డీ ఫర్ దోపిడి లాంటి చిత్రాల్లో యాక్టింగ్ చేశాడు. కాకపోతే వాటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదు! హీరోగా చేసిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ'.. నవీన్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఈ మూవీ దర్శకుడు ఎవరని అడిగితే.. చాలామంది చెప్పలేరు. అంతెందుకు రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన 'అనగనగా ఒక రాజు' మూవీకి కూడా కర్త కర్మ క్రియ నవీనే.. దర్శకుడిగా మారి అనే కుర్రాడు ఉన్నప్పటికీ.. క్రెడిట్ అంతా నవీన్‌కే వచ్చింది.

    సిద్ధు జొన్నలగడ్డ.. కెరీర్ ప్రారంభంలో 'ఆరెంజ్'తో పాటు పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసినప్పటికీ 'డీజే టిల్లు' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కింది. 'టిల్లు స్కేర్'తో ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ రెండు మూవీస్‌కి దర్శకులు ఎవరంటే? చాలామంది చెప్పలేరు. ఎందుకంటే ఈ చిత్రాల రైటింగ్ విషయంలో సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమాల తర్వాత సదరు దర్శకులు కొత్తగా ఏం మూవీస్ చేస్తున్నారో? ఎక్కడున్నారో తెలీదు? ఇలా పైన చెప్పిన హీరోలు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నప్పటికీ.. వీళ్ల సినిమాలకు దర్శకులుగా చేస్తున్న వాళ్లు మాత్రం.. తర్వాత నుంచి పెద్దగా కనిపించకుండా పోతున్నారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?)

  • మెగాస్టార్ మూవీపై నటి ఖుష్బు సుందర్ ప్రశంసలు కురిపించారు. లాజిక్ లేదు.. కేవలం మ్యాజిక్ మాత్రమేనంటూ కొనియాడారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

    చిరంజీవి తాను ప్రేమించే అభిమానుల కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం చూసి గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. మరింతకాలం  మమ్మల్ని అలరిస్తూ ఉండటానికి మీకు మరింత ఉత్సాహం, శక్తి, మంచి ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు. అమ్మ ఆశీస్సులు.. ఆ భగవంతుని దయ ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి సార్ అంటూ ఖుష్బు ట్వీట్‌ చేశారు. ఈ మూవీలో నటించిన వెంకటేశ్‌ గురించి ఓకే మాటలో చెప్పాలంటే ఐ లవ్ యూ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే తన అందం, గాంభీర్యంతో అలరించిన నయనతార నటనకు ఫిదా అయ్యానంటూ ఖుష్బు పోస్ట్ చేసింది.

    కాగా.. కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్‌ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి అక్క పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ త్రిష హీరోయిన్‌గా కనిపించింది. 

    కాగా.. మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

     

     

  • కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు.  చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు.  ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.

    అసలేం జరిగిందంటే..

    చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు.  ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ‌ ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా  అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.

    అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్ బ్యాంక్‌ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది.  పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
     

     

  • ఈ రోజుల్లో సినిమాకు ప్రమోషన్స్ చేయడం చాలా ముఖ్యం. కథపై దర్శకుడికి నమ్మకమున్నా సరే మూవీ ప్రమోషన్స్ చేస్తే జనాల్లోకి వెళ్తుంది. అందుకే ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్స్‌తో పాటు ప్రీ రిలీజ్, సాంగ్ రిలీజ్‌ల పేరుతో ప్రమోషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాలను ఆడియన్స్‌తో పంచుకుంటారు. దీనివల్ల సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ పెరుగుతుంది. ‍అలా సినిమాలకు ప్రేక్షకులను తీసుకొచ్చేందుకు ప్రమోషన్స్‌ అనేది సినీ ఇండస్ట్రీలో తప్పనిసరి.

    అయితే ప్రమోషన్స్ పేరిట ఆడియన్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరోసారి అలాంటిదే జరిగింది. బరాబర్ ప్రేమిస్తా అనే మూవీ ఈనెల 6వ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ చంద్రహాస్ నటించారు. రిలీజ్‌కు దగ్గరవుతున్న వేళ సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్.

    అంతా బాగానే ఉన్నా.. ఈవెంట్‌లో పాడిన ఓ సాంగ్ తీవ్ర వివాదానికి దారితీసింది. హీరో చంద్రహాస్ ఒక వివాదాస్పదమైన బూతు పాట పాడటం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో సినీ ప్రియులే కాదు.. నెటిజన్స్‌ సైతం తీవ్రస్తాయిలో అతనిపై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత బరితెగించాలా అంటూ గడ్డిపెడుతున్నారు. అసలు ఆ బూతు పాటలేంటని మండిపడుతున్నారు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే ఇంతలా అసభ్యకర భాషను వాడతారా అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  

  • రణ్‌వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్‌కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్‌ రింకు రాజ్‌పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.

    ఈనెల 1వ తేదీన షూటింగ్‌లో సంజయ్ దత్‌ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను  పోలీసులు  గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్‌లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్‌లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.

    ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు.

     

  • 'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

    గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్‪ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్‌లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

    'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.

    'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్‌లో చూపించబోతున్నారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

  • 2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?

    సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)

    ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్‌లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?

    మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్‌గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్‌లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్‌ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?

    (ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

  • చిరంజీవి- అనిల్‌ రావిపూడి హిట్‌ సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.  ఈమేరకు తాజాగా ఒక వీడియోతో ప్రముఖ ఓటీటీ సంస్థ పంచుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకటన వచ్చేసింది.

    మన శంకరవరప్రసాద్ గారు చిత్రం త్వరలో జీ5లో విడుదల కానున్నట్లు ఒక వీడియోను పంచుకున్నారు. అయితే ఓటీటీ వర్షన్‌లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్‌, మరాఠిలో విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో చిరుకు ఫ్యాన్స్‌ ఉండటం వల్లే పలు భాషల్లో రిలీజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారికంగా స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించలేదు. అయితే, ఫిబ్రవరి 11న  ఓటీటీలోకి మన శంకరవరప్రసాద్ గారు రావచ్చని టాక్‌ ఉంది.

    ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

National

  • ముంబై ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది.  విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా, ఇండిగో విమానాల రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. ఇండిగో ఫ్లైట్ లాండ్ అయి రన్‌వేపై వస్తుండగా ఈ ఘటన జరుగినట్లు తెలుస్తుంది. అయితే విమానంలోని ప్రయణికులకు ఏటువంటి ప్రమాదం తలెత్తలేదు. ఈ ప్రమాదంపై డీజీసీఏ తక్షణమే స్పందించింది. ప్రమాదంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది.

  • ఈ రంగు కారు కొంటున్నారా?? ఒక చిన్న ప్రశ్న.. మనం కారు కొనే సమయంలో ఏమేమి చూస్తాం? మైలేజ్ చూస్తాం… ధర చూస్తాం… ఫీచర్స్ చూస్తాం… డిజైన్ చూస్తాం.. కానీ రంగు విషయంలో మాత్రం మనకు నచ్చిందే ఎంచుకుంటాం. అయితే ఆ రంగే మీ ప్రయాణ భద్రతపై ప్రభావం చూపుతుందని చెబితే నమ్ముతారా?

    అవును.. సురక్షితంగా డ్రైవ్ చేసినా, ట్రాఫిక్ రూల్స్ పాటించినా, వాహనం రంగు కూడా ప్రమాదాలకు ఒక కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలపై వారు చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

    👉ఇతర రంగులతో పోలిస్తే..
    ఏ రంగు కార్లకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలుసా? నలుపు రంగు కార్లకే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయట. ఇతర రంగులతో పోలిస్తే నలుపు రంగు విజిబులిటీ సుమారు 47 శాతం వరకు తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, మబ్బు ఉన్నప్పుడు, లేదా తక్కువ వెలుతురు ఉన్న సమయంలో నలుపు రంగు వాహనాలు స్పష్టంగా కనిపించవు. అందుకే ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    👉ఈ రంగులు అందంగా కనిపించినా..
    గ్రే రంగు కార్లకు కూడా ప్రమాదాల శాతం ఎక్కువగానే ఉంది. సుమారు 11 శాతం వరకు రిస్క్ ఉందని తెలిపారు. అలాగే నీలం, ఎరుపు రంగు కార్లు కూడా 7 శాతం కంటే ఎక్కువ ప్రమాదాలకు గురైనట్లు పరిశోధన చెబుతోంది. ఈ రంగులు అందంగా కనిపించినా, రోడ్డు మీద స్పష్టంగా కనిపించే విషయంలో కొంత వెనుకబడి ఉంటాయి.

    👉ఏ రంగులు సేఫ్‌..
    అయితే ఏ రంగులు సేఫ్‌గా భావిస్తున్నారు? తెలుపు, పసుపు, ఆరెంజ్, బంగారు రంగుల కార్లు రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల వీటికి ప్రమాదాల శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా తెలుపు రంగు వాహనాలు పగలు, రాత్రి రెండింట్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది టాక్సీలు, కమర్షియల్ వాహనాలు తెలుపు రంగులోనే ఉంటాయి.

    👉నలుపు కారు కొనొద్దా?..
    అంటే నలుపు కారు కొనొద్దా? అంటే అలా కాదు. రంగు ఒక్కటే కారణం కాదు. డ్రైవింగ్ విధానం, వేగం, రోడ్డు పరిస్థితులు, వాతావరణం… ఇవన్నీ కలిసి ప్రమాదాలకు కారణమవుతాయి. కానీ రంగు కూడా ఒక చిన్న అంశంగా పనిచేస్తుంది అనేది ఈ అధ్యయనం చెప్పే విషయం. కాబట్టి మీరు కొత్త కారు కొనాలని అనుకుంటే… ఒక్కసారి రంగు గురించి కూడా ఆలోచించండి. అందంగా కనిపించడమే కాదు… రోడ్డు మీద స్పష్టంగా కనిపించడం కూడా ముఖ్యం. భద్రత ముందు… స్టైల్ తరువాత.

  • ఇంఫాల్‌: మణిపూర్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్‌కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్‌చంద్ సింగ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది.

    మణిపూర్‌లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్‌చంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని   ఖేమ్‌చంద్ సింగ్‌కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఖేమ్‌ చంద్‌ సింగ్‌ నియామకంతో గత ఏడాది నుంచి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి, పరిపాలనా లోటు ఈ నియామకంతో ముగుస్తుందని ఆశిస్తున్నారు.

    ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉండటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పరిపాలనా నిర్ణయాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

    బీజేపీ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఖేమ్‌చంద్ సింగ్ నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • ఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం ప్రకటన చేసింది. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.‌

    ఈ ట్రేడ్‌డీల్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం.ఆక్వా,టెక్స్‌టైల్స్ ఎగుమితిలో మనకు ఇబ్బందులున్నాయి. వాణిజ్యం ఒప్పందం విషయాన్ని పార్లమెంట్‌లో చెప్పాలని చూశాం. ఈలోపే ట్రేడ్‌ డీల్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషం​ చిమ్మారు.

    వాణిజ్య ఒప్పందంతో ఏ వర్గానికి నష్టం జరగదు. బలహీనవర్గాల ప్రజలకు మేలు జరగడం రాహుల్‌కు ఇష్టం లేదు. ట్రేడ్‌ డీల్‌తో లక్షలమంది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని స్పష్టం చేశారు. 

  • ఢిల్లీ: లోక్‌సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ చేశారు.  సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, హిబి ఈడెన్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. స్పీకర్‌ తీరుకు నిరసనగా పార్లమెంట్‌ ఆవరణలో సస్పెండ్‌ అయిన ఎంపీల ఆందోళనకు దిగారు.

    రాహుల్‌ గాంధీ ‘చైనా’ కామెంట్స్‌పై ఉదయం నుంచి లోక్‌సభలో చర్చ జరిగింది. పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ఇంకా ప్రచురించని పుస్తకం ఆధారంగా వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ.. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యలు చేయడంతో వివాదం నెలకొంది.

    విపక్ష సభ్యులు.. సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేయడంతో గందరగోళం నెలకొంది. 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ సస్పెండ్‌ చేసింది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు.  అనంతరం లోక్‌సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.

    కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభలో 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని.. 8 మందిలో తానూ ఉన్నానని తెలిపారు. స్పీకర్.. రాహుల్ గాంధీ మైక్‌ను కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భాలలో వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తే సమావేశాన్ని వాయిదా వేసే విధంగా ప్రవర్తించారు. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ ఎంపీల వలనే సభ వాయిదా పడుతున్నట్టు బీజేపీ ప్రచారం చేస్తున్నారు.

    నరేంద్ర మోదీ ట్రంప్‌కు సరెండర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరుగుతున్న డిబేట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే ఆయన మైకు కట్ చేశారు. ఆయన మైక్ కట్ చేస్తే మేము ఎందుకు కట్ చేశారని అడిగేందుకు స్పీకర్ పోడియం ముందుకు వెళ్లాం. 8 మందిపై కావాలనే సస్పెన్షన్ వేటు వేశారు. మా నోరు మూయించాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. మిగతా ఎంపీలందరూ మా తరఫున రేపు సభలో ప్రశ్నిస్తూనే ఉంటారు. రేపు పార్లమెంట్ ఆవరణలో సస్పెన్షన్ గురైన ఎనిమిది మంది ఎంపీలం ఆందోళన చేస్తాం.

    స్పీకర్ అనే వ్యక్తి ఏ కులానికి చెందినవారనేది మేము చూడలేదు. మాకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశాం. మేం మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది’’ అని  కిరణ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

     

     

     

  • ఢిల్లీ: లోక్‌సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌పై విమర్శలు గుప్పించారు. 

    చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్‌ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్‌-ఇండియా ట్రేడ్‌ నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్‌-అమెరికా ట్రేడ్‌ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.

    ‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్‌ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్‌ ఒత్తిడితోనే ట్రేడ్‌ డీల్‌పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. 

    కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌
    లోక్‌సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్‌పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. 

  • ఒక్క చిన్న పొరపాటు… పెద్ద ప్రమాదానికి దారి.” అనే మాట నిజంగానే విమాన ప్రయాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగిన బారామతిలో టేబుల్‌టాప్ రన్‌వే ఉంది. కొండలను చదును చేసి లేదా లోయల మధ్య ఎత్తైన ప్రదేశంలో నిర్మించే రన్‌వేలను టేబుల్‌టాప్ రన్‌వేలు అంటారు. ఇవి సాధారణ రన్‌వేల కంటే ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమాన వేగాన్ని కంట్రోల్ చేయడం పైలట్లకు చాలా కష్టంగా మారుతుంది.

    మంగళూరు ఎయిర్‌పోర్ట్ కూడా టేబుల్‌టాప్ రన్‌వేతోనే ఉంది. 2010లో అక్కడ ఒక విమానం రన్‌వే అంచు దాటి లోయలో పడిపోవడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2020లో కోజికోడ్‌లో భారీ వర్షంలో ల్యాండ్ అవుతున్న విమానం రన్‌వే దాటి 35 అడుగుల లోతులో పడిపోయి రెండు ముక్కలు అయింది. ఆ ఘటనలో 21 మంది మరణించారు. ఈ సంఘటనలు టేబుల్‌టాప్ రన్‌వేల ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

    ఇక భూటాన్‌లోని పారో ఎయిర్‌పోర్ట్ చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. దీనిని ప్రపంచంలోనే అత్యంత డైంజరస్ ఎయిర్ పోర్ట్ గా భావిస్తారు. ఇక్కడ ల్యాండ్ కావాలంటే పైలట్లు పర్వతాల మధ్య నుంచి పదునైన కోణాల్లో విమానం నడపాలి. అందుకే అన్ని విమానాలకు అనుమతి ఉండదు. అలాగే నేపాల్‌లోని టెన్జింగ్-హిల్లరీ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 527 మీటర్ల చిన్న రన్‌వే మాత్రమే ఉంది. రెండు వైపులా కొండలు ఉండటంతో ల్యాండింగ్ చాలా క్లిష్టంగా ఉంటుంది.

    ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

    ఇలాంటివి ప్రపంచంలో ఇంకా కొన్ని విమానాశ్రయాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ అంటే పైలట్లకు పెద్ద సవాలు. అనుభవం ఉన్న పైలట్లు కూడా ప్రతిసారీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా పైలట్ల చాకచక్యంతోనే చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి. కానీ పర్వతాలు, సముద్రాలు లేదా చిన్న రన్‌వేలు ఉన్న ప్రాంతాల్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అలాంటి ఎయిర్‌పోర్ట్‌లలో ప్రతి ల్యాండింగ్ ఒక పరీక్షలాంటిదే.

     

     

  • మీరా భయందర్: మహారాష్ట్రలోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ డింపుల్ మెహతా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఆమె ఎన్నికను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌), మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్‌) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరాఠీ మాట్లాడే నేతలను మాత్రమే మేయర్‌గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

    మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 95 మంది కార్పొరేటర్లు ఉండగా, బీజేపీ 78 స్థానాలతో తిరుగులేని శక్తిగా నిలిచింది. ఇతర పార్టీల పరంగా చూస్తే.. కాంగ్రెస్‌కు 13 మంది, శివసేన (షిండే వర్గం) కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఒక బీజేపీ రెబల్ అభ్యర్థి అనిల్ పాటిల్  విజయం సాధించారు. అతను బీజేపీకే మద్దతు ప్రకటించడంతో డింపుల్ మెహతా విజయం మరింత సులభమయ్యింది.

    మేయర్ ఎన్నికల్లో బీజేపీ బలాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, శివసేన (షిండే వర్గం) చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాయి. బీజేపీ తరపున సీనియర్ నేత నరేంద్ర మెహతా మరదలు డింపుల్ మెహతా పోటీ చేయగా, ఆమెకు సవాల్ విసురుతూ కాంగ్రెస్-శివసేన కూటమి రుబినా ఖాతూన్‌ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. బలాబలాల పరంగా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, విపక్షాలు ఏకమై పోటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అటు ప్రాంతీయ భాషా వాదం, ఇటు రాజకీయ వ్యూహాల మధ్య సాగిన ఈ ఎన్నికల్లో చివరికి బీజేపీ తన పట్టు నిలుపుకుంది. డింపుల్ మెహతా గెలుపుతో మీరా భయందర్‌లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. 

    ఇది కూడా చదవండి: ముంబై మేయర్‌ పీఠం: ‘మహాయుతి’లో ముదిరిన పేచీ

Sports

  • మహిళల ప్రీమియర్ ఎలిమినేటర్ మ్యాచులో  ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ ఘన విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ముడు వికెట్లు కోల్పోయి అలవోకగా 169 పరుగులు చేసి టార్గెట్ చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలలో లివెల్లీ 43 పరుగులు, జెమామీరోడ్రిగ్స్ 41 పరుగులు షపాలీ వర్మ 31 పరుగులు సాధించారు. 

    అంతకు ముందు గుజరాత్‌ బ్యాటర్  బెత్‌మూనీ అర్థశతకం సాధించి జట్టుకు భారీస్కోరు అందించారు. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్లి హెన్రీ 3 వికెట్లు తీయగా నందాని శర్మ రెండు వికెట్లు తీసింది. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్  చేరుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదివరకే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.  

    గుజరాత్‌
    బెత్‌ మూనీ (వికెట్‌ కీపర్‌), సోఫీ డివైన్‌, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్‌నర్‌ (కెప్టెన్‌), జార్జియా వరేహమ్‌, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌.

    ఢిల్లీ
    లిజెల్లి లీ (వికెట్‌ కీపర్‌), షఫాలి వర్మ, లారా వల్వర్ట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ (కెప్టెన్‌), మరిజానే కాప్‌, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్‌, స్నేహ్‌ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ.
     

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఫైనల్‌ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్‌ జెయింట్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోటీ నెలకొంది.

    దంచికొట్టిన బెత్‌ మూనీ
    ఇందులో భాగంగా కొటాంబిలోని వడోదర స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. గుజరాత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (6), వన్‌డౌన్‌ బ్యాటర్‌ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.

    ఇక కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌, భారతి ఫల్మలి డకౌట్‌గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్‌ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్‌ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

    ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్‌ పడగొట్టారు. గుజరాత్‌ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.

    డబ్ల్యూపీఎల్‌-2026 ఎలిమినేటర్‌ మ్యాచ్‌ గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ
    తుదిజట్లు
    గుజరాత్‌
    బెత్‌ మూనీ (వికెట్‌ కీపర్‌), సోఫీ డివైన్‌, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్‌నర్‌ (కెప్టెన్‌), జార్జియా వరేహమ్‌, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌.

    ఢిల్లీ
    లిజెల్లి లీ (వికెట్‌ కీపర్‌), షఫాలి వర్మ, లారా వల్వర్ట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ (కెప్టెన్‌), మరిజానే కాప్‌, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్‌, స్నేహ్‌ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ.
     

  • టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో మెరుపు వేగంతో పరుగుల వరద మొదలవ్వనుంది. ఈ పరుగుల సునామీలో టాప్‌లో ఉండేదెవరు? తోపుగా నిలిచేదెవరు? ఈ సారి కొత్త రికార్డులు నమోదవుతాయా? ఆటగాళ్లు తమ రికార్డులను తిరిగి బ్రేక్ చేస్తారా? ఈసారీ టీమిండియా హాట్ ఫేవరెట్‌గా ఉన్నా.. భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?

    టీమిండియా బలాలు, బలహీనతలుఏమిటి?? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానంగా సాక్షి స్పోర్ట్స్ పలు పారామితులతో, అల్గారిథమ్‌లతో ఓ విశ్లేషణను రూపొందించింది. అదేంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి.

     

  • ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

    జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌ సిక్స్‌ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌ , ఇంగ్లండ్‌ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌- ఇంగ్లండ్‌ మంగళవారం తలపడ్డాయి.

    థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
    బులవాయోలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్‌ డాకిన్స్‌ (1) విఫలం కాగా.. జోసెఫ్‌ మూర్స్‌ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌ మేయ్స్‌ 24 రన్స్‌ చేశారు. టాపార్డర్‌ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

    శతకంతో చెలరేగిన థామస్‌.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్‌ ఫాల్కనర్‌ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్‌ అహ్మద్‌ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

    ఆసీస్‌ బౌలర్లలో హేడెన్‌ షీలర్‌, నడేన్‌ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్‌ బైరమ్‌, ఆర్యన్‌ శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 

    కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటం
    ఓపెనర్‌ విల్‌ మలాజుక్‌ 15, వన్‌డౌన్‌ బ్యాటర్‌ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ లీ యంగ్‌ (3), జేడన్‌ డ్రేపర్‌ (12) నిరాశపరిచారు.

    ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్‌ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖరారైంది. 

    టార్గెట్‌ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. థామస్‌ రూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్‌- అఫ్గనిస్తాన్‌ బుధవారం తలపడతాయి.

    అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆసీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ స్కోర్లు
    👉ఇంగ్లండ్‌-277/7(50)
    👉ఆస్ట్రేలియా- 250(47.3).  

    చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

  • క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్‌ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.

    కోరికోరి వివాదాలు
    భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది.

    అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్‌.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించింది. 

    తటస్థ వేదికల ఏర్పాటు
    కాగా భారత్‌- పాక్‌ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.

    ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. 

    ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాక్‌ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

    భారత్‌తో పెట్టుకుంటే అంతే
    అయినప్పటికీ బంగ్లాదేశ్‌ కోసమంటూ పాక్‌.. భారత్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా.. భారత్‌తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది.

    సెనేట్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్‌ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్‌ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.

    90 శాతం ఆదాయం అక్కడి నుంచే
    ఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్‌లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్‌ క్రికెట్‌ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్‌ క్రికెట్‌కు ఫండింగ్‌ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్‌ రాజా వ్యాఖ్యానించాడు. 

    అయితే, ఈ వీడియో ఫేక్‌ కావొచ్చు అంటూ పాక్‌ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు.  

    చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

  • టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహక మ్యాచ్‌లో ఒమన్‌ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్‌కప్‌ టోర్నీ  ఆరంభంకానున్న విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్‌తో తలపడింది. కొలంబో వేదికగా టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

    145 పరుగులకే పరిమితం
    అయితే, ఒమన్‌ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్‌లో ఓపెనర్‌ సినెత్‌ జయవర్దన (9), వన్‌డౌన్‌ బ్యాటర్‌ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ దుల్‌నిత్‌ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.

    మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్‌ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్‌ బౌలర్లో షా ఫైజల్‌, షకీల్‌ అహ్మద్‌, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఆమీర్‌ కలీమ్‌ ధనాధన్‌ 
    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్‌, 44 ఏళ్ల వెటరన్‌ ప్లేయర్‌ ఆమీర్‌ కలీమ్‌ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. 

    అతడికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వినాయక్‌ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్‌) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్‌ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్‌ లాహిరు సమరకూన్‌, కవిజ గమేజ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

  • ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్‌ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్‌ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్‌ఎల్‌ గతేడాది జరగలేదు. 

    ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్‌ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.

    ఈ నెల 14 నుంచే ఫుట్‌బాల్‌ లీగ్‌ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్‌బాలర్లు సైతం తమ మ్యాచ్‌ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్‌ జిందాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్‌ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు.  

    రూ.కోట్లు పోయి లక్షలు  
    ఐఎస్‌ఎల్‌ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్‌కోడ్‌’ యాప్‌ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్‌లున్న ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. 

    అంటే ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్‌ మీడియా రైట్స్‌ పొందింది. 2024–25 సీజన్‌లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్‌లు జరిగాయి. అంటే మ్యాచ్‌కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. 

    ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి 
    నేపాల్‌ వేదికగా దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్‌ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్‌సీ అండర్‌–17 మహిళల ఆసియా కప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్‌–19 టోరీ్నలో భారత్‌ అండర్‌–17 జట్టును బరిలోకి దింపింది.

    టీనేజ్‌ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆతిథ్య నేపాల్‌పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్‌ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్‌ (29వ నిమిషంలో), అల్పి అక్తర్‌ (40వ ని.) చెరో గోల్‌ చేశారు.

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి కౌంట్‌డౌన్‌ మొదలైనా పాకిస్తాన్‌ మొండివైఖరి వీడటం లేదు. బంగ్లాదేశ్‌ కోసమంటూ నాటకానికి తెరతీసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)నే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాక్‌ మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసినా.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరలేపింది.

    బంగ్లాదేశ్‌కు ఇప్పటికే షాక్‌
    తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని.. అందుకే టీమిండియాతో మ్యాచ్‌ ఆడబోమని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీకి మాత్రం ఇంతవరకు అధికారికంగా మాత్రం ఇ-మెయిల్‌ పంపలేదు. కాగా భారత్‌లో తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెట్టిన బంగ్లాదేశ్‌కు ఇప్పటికే ఐసీసీ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే.

    తమ పరిశీలన బృందం నివేదిక ప్రకారం భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని.. అందుకే వేదికను శ్రీలంకకు మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడకపోవడంతో ఆ జట్టును తప్పించి.. స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌ టోర్నీలో చేర్చింది. 

    టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు
    ఈ అంశమై ఓటింగ్‌ నిర్వహించగా.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఆ దేశంతో పాటు పాక్‌ మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా.. మిగతా ఐసీసీ సభ్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.

    దీంతో పాకిస్తాన్‌ తాము సైతం టోర్నీ నుంచి వైదొలుగుతామని మొదట బీరాలు పలికినా.. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే ఆడమని ప్రకటించింది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం. శ్రీలంకలో ఆడే మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా సమస్యలు.. టీమిండియాతో మ్యాచ్‌కు ఉంటాయని చెప్పడం విమర్శలకు దారితీసింది.

    ఆ అధికారం, హక్కు మాకు లేవు
    ఈ నేపథ్యంలో పాక్‌ బోర్డు.. ఇతర దేశాల బోర్డులను సంప్రదించి తమకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఐసీసీతో సమావేశంలో తమకు, బంగ్లాదేశ్‌కు అనుకూలంగా వ్యవహరించాలని బతిమాలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పాక్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.

    డబుల్‌ గేమ్‌ ఎందుకు?
    రెవ్‌స్పోర్ట్స్‌ కథనం ప్రకారం.. ఈ అంశాల్లో తలదూర్చే అధికారం, హక్కు తమకు లేవని ఆయా బోర్డులు పీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఐసీసీ, బీసీబీ మధ్య వివాదంలో తాము దూరలేమని పేర్కొన్న బోర్డులు.. పీసీబీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టినట్లు తెలుస్తోంది.

    కాగా ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో పాక్‌.. భారత్‌తో మ్యాచ్‌ ఆడింది. యువ భారత జట్టు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు.. పాక్‌ మహిళల ‘ఎ’ జట్టు.. ఫిబ్రవరి 15న భారత మహిళల ‘ఎ’ జట్టుతో తలపడనుంది. బ్యాంకాక్‌లో జరిగే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ 2026లో భాగంగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. అయితే, పాక్‌ ఈ మ్యాచ్‌లో యథావిధిగా ఆడనుంది.

    పాక్‌కు గట్టి షాక్‌
    ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ సభ్య దేశాలకు బోర్డులు.. పీసీబీకి తాము అండగా ఉండలేమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కాగా భారత్‌- శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ను కొలంబోలో ఫిబ్రవరి 15న నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు కాగా.. పీసీబీ ఇలా బాయ్‌కాట్‌ అంటూ సాగదీస్తోంది.

    చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

  • పొట్టి క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. ఇందులో భాగంగా తొలిరోజు ముంబైలోని వాంఖడే వేదికగా టీమిండియా అమెరికాతో తలపడనుంది.

    నాలుగు గ్రూపులు
    ఇక అదే రోజు కొలంబోలో పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఈసారి ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.

    గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ .. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే పోటీలో ఉన్నాయి. గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ల, ఇటలీ.. గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా బరిలో నిలిచాయి.

    ఉపఖండ పిచ్‌లపై వరల్డ్‌కప్‌
    ఇక ఈసారి ఉపఖండ పిచ్‌లపై వరల్డ్‌కప్‌ జరగడం స్పిన్నర్లకు అనుకూలించే అంశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెగ్రాత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అంచనా వేశాడు. 

    రేసులో వారు సైతం
    అయితే, టాప్‌ వికెట్‌ టేకర్ల పోటీలో టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆసీస్‌ స్టార్లు జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడం జంపా, ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ కర్రాన్‌ కూడా ఉంటాడని మెగ్రాత్‌ పేర్కొన్నాడు.

    టీ20 టాప్‌ బౌలర్‌
    కాగా రషీద్‌ ఖాన్‌ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికి 111 మ్యాచ్‌లలో కలిపి 187 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌-2024లో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచి "ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు" అందుకున్న బుమ్రా ఖాతాలో.. 102 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి.

    అభిషేక్‌ శర్మకే ఇద్దరి ఓటు
    ఇదిలా ఉంటే. ఆసీస్‌ మాజీ పేసర్‌ డెమేన్‌ ఫ్లెమింగ్‌ మాత్రం వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాకే ఓటు వేశాడు. ఇక ఈసారి టాప్‌ రన్‌ స్కోరర్‌గా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మను మెగ్రాత్‌ ఎంచుకోగా.. ఫ్లెమింగ్‌ కూడా అతడికి మద్దతు పలికాడు. కాగా గత కొన్నాళ్లుగా సూపర్‌ ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

    చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈసారి కూడా సత్తా చాటి.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సూర్యకుమార్‌ సేనకు అన్ని అర్హతలు ఉన్నాయి.

    ద్వైపాక్షిక సిరీస్‌లలో అద్భుత ఆట తీరుతో దుమ్ములేపిన టీమిండియా స్వదేశంలో మెగా టోర్నీ జరుగనుండటం సానుకూలాంశం. అయితే, వరల్డ్‌కప్‌ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలైన విషయం తెలిసిందే. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ గాయాలబారిన పడ్డారు.

    పూర్తిగా కోలుకున్న తిలక్‌
    వీరిలో వేలి నొప్పితో బాధపడిన అక్షర్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ (IND vs NZ)లో ఆఖరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) కూడా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యుడైన ఈ హైదరాబాదీకి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. 

    అనంతరం బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న తిలక్‌ మ్యాచ్‌ ఫిట్‌గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.ఈ క్రమంలో ప్రపంచకప్‌ అసలు పోరుకు ముందు జరిగే రెండు వార్మప్‌ మ్యాచ్‌ల ద్వారా తిలక్‌ వర్మకు ప్రాక్టీస్‌ కల్పించాలని భావించిన సెలక్టర్లు భారత ‘ఎ’ జట్టులో చోటు ఇచ్చారు. 

    ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా‌ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి.. వరల్డ్‌కప్‌ టోర్నీకి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.

    వాషీ విషయంలో ఆందోళన
    అయితే, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దైనిక్‌ జాగరణ్‌ కథనం ప్రకారం.. వాషీ వేగంగా కోలుకుంటున్నా వరల్డ్‌కప్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.

    "వాషింగ్టన్‌ సుందర్‌ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదు. అతడి పక్కటెముకలో ఫ్రాక్చర్‌ ఉంది. అయితే, అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. ఇ‍ప్పటికే నాలుగు బ్యాటింగ్‌ సెషన్లు పూర్తి చేసుకున్నాడు.

    సోమవారం (ఫిబ్రవరి 2) స్పాట్‌ బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ కూడా చేశాడు. బుధవారం మరోసారి బౌలింగ్‌ సెషన్‌లో వాషీ పాల్గొంటాడు. దీని ఆధారంగానే అతడు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడా? లేదా? అన్న అంశంపై అంచనాకు రావొచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. 

    వారికి లైన్‌క్లియర్‌
    కాగా వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్నాడు. తిలక్‌ వర్మ, మయాంక్‌ యాదవ్‌, రియాన్‌ పరాగ్‌ కూడా ఇక్కడే పునరావాసం పొందారు. వీళ్లందరూ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఫిజియోలు ఇటీవలే ప్రకటించారు. 

    కాగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతో పాటు స్వదేశీ స్పిన్‌ పిచ్‌ల మీద రాణించగల సత్తా వాషీకి ఉంది. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ వంటి స్టార్‌ స్పిన్నర్లు ఉన్నా వాషీ లేకపోవడం కూడా లోటు లాంటిదే. కాగా ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా మొదలయ్యే వరల్డ్‌కప్‌ టోర్నీ మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది.   

    చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

  • ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతుంది. స్టీవ్‌ను రానున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఎడిషన్‌ కోసం సియాల్‌కోట్‌ స్టాలియన్జ్‌ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్‌ స్టీవ్‌ను డైరెక్ట్‌ సైనింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

    ఈ వార్త పాక్‌ అభిమానుల సోషల్‌మీడియా గ్రూప్‌ల్లో హల్‌చల్‌ చేస్తుంది. పాక్‌ ఫ్యాన్స్‌ స్టీవ్‌కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్‌ ఇప్పటివరకు పీఎస్‌ఎల్‌లో ఆడలేదు. స్టీవ్‌ రాక పీఎ‍స్‌ఎల్‌కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

    తాజాగా ముగిసిన బిగ్‌ బాష్‌ లీగ్‌ (BBL) 15వ సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున ఆడుతూ 6 మ్యాచ్‌ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్‌ రేట్‌ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్‌లో 272 మ్యాచ్‌లు ఆడిన స్టీవ్‌..  6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు.  

    కాగా, పాకిస్తాన్‌​ సూపర్‌ లీగ్‌ తదుపరి ఎడిషన్‌ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి  ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్‌లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్‌ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్‌ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్‌ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.

    2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్‌, కామిల్‌ ఖాన్‌) స్టాలియన్జ్‌ను  రూ.1.85 బిలియన్‌ రికార్డు ధరకు కొనుగోలు చేశారు.  PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది.  

     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరించడంపై పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. 

    వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్‌ ఆఘా వ్యాఖ్యానించాడు.

    ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి..
    అదే విధంగా.. గ్రూప్‌ దశలో మ్యాచ్‌ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్‌ ఆఘా స్పందించాడు. లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 

    కాగా ప్రపంచకప్‌ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆసీస్‌ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్‌ ఈ మేర విజయం సాధించింది.

    ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదు
    ఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్‌ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్‌ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదు కదా!..

    లీగ్‌ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు  ప్రయత్నిస్తాం’ అని సల్మాన్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్‌ మాజీ క్రికెటర్లు షాహిత్‌ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్‌ లతీఫ్, మొయిన్‌ ఖాన్, సర్ఫరాజ్‌ అహ్మద్‌ సమర్థించారు.

    మిగిలిన మూడు జట్లు అవే
    కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్‌తో పాటు పాకిస్తాన్‌ గ్రూప్‌-‘ఎ’లో ఉంది. 

    అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్‌ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్‌ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. 

    అపుడు అమెరికా చేతిలో ఓడి
    అయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

    చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌!

  • టీ20 ప్రపంచకప్‌ 10వ ఎడిషన్‌ భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన విశేషాలు, రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీ తొలి ఎడిషన్‌ 2007లో ప్రారంభమైంది. 

    నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men’s T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్‌ జరిగింది. 2018, 2020లో మాత్రం జరగలేదు.  

    ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్‌ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్‌ 2010, 2022లో.. వెస్టిండీస్‌ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.

    టోర్నీ చరిత్రలో అత్యుత్తమ రికార్డులు..
    అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్‌ శర్మ, షకీబ్‌ అల్‌ హసన్‌ (9)
    అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు- రోహిత్‌ శర్మ (47)
    అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్‌ ధోని (33 మ్యాచ్‌లు)
    అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (1292)
    అత్యధిక వ్యక్తిగత స్కోర్‌- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)
    అత్యధిక సగటు- విరాట్‌ కోహ్లి (58.72)
    అత్యధిక స్ట్రయిక్‌రేట్‌- సూర్యకుమార్‌ యాదవ్‌ (158.94 స్ట్రయిక్‌రేట్‌)
    అత్యధిక సెంచరీలు- క్రిస్‌ గేల్‌ (2)
    అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు- విరాట్‌ కోహ్లి (15)
    అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు- విరాట్‌ కోహ్లీ (8)
    ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి- యువరాజ్‌ సింగ్‌ (12)
    ఫాస్టెస్ట్‌ సెంచరీ- క్రిస్‌ గేల్‌ (47)
    అత్యధిక సిక్సర్లు- గేల్‌ (63)
    అత్యధిక బౌండరీలు- రోహిత్‌ శర్మ (115)
    ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- గేల్‌ (11)
    ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు- గిబ్స్‌ (14)
    ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్‌ కోహ్లి (2014లో 319 పరుగులు)

    అత్యధిక వికెట్లు- షకీబ్‌ (50)
    అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు- అజంత మెండిస్‌ (6-8)
    అత్యుత్తమ ఎకానమీ- సునీల్‌ నరైన్‌ (5.17)
    ఓ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- అర్షదీప్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)
    హ్యాట్రిక్‌లు- మొత్తం 9 (బ్రెట్‌ లీ, కర్టిస్‌ క్యాంఫర్‌, హసరంగ, రబాడ, కార్తిక్‌ మైయప్పన్‌, జోష్‌ లిటిల్‌, కమిన్స్‌, క్రిస్‌ జోర్డన్‌) నమోదు కాగా.. కమిన్స్‌ ఒక్కడే రెండు (2024) తీశాడు.
    అత్యధిక క్యాచ్‌లు- డేవిడ్‌ వార్నర్‌ (25)

    అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు- శ్రీలంక (54)
    అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్‌ (67.30)
    అత్యధిక స్కోర్‌ చేసిన జట్టు- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230-8)
    అత్యల్ప స్కోర్‌ చేసిన జట్టు- నెదర్లాండ్స్‌ (39 ఆలౌట్‌, 2014లో శ్రీలంకపై)
    అత్యధిక స్కోర్‌ నమోదైన మ్యాచ్‌- ఇంగ్లండ్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)
    అత్యధిక మార్జిన్‌తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)
    అత్యధిక ఛేదన- ఇంగ్లండ్‌ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)
    అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్‌- డారెన్‌ సామీ (2012, 2016)

     

     

  • టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ను పాక్‌ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్‌ ఎహసాన్‌ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్‌ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.

    ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్‌ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు.  

    కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్‌ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్‌ హోల్‌ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్‌తో మ్యాచ్‌ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక​ సమాచారం కూడా ఇ‍వ్వలేదు. కేవలం​ ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.

    మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్‌ను పక్కన పెట్టి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్‌ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్‌ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్‌పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

     

International

  • మంగళవారం మయన్మార్‌లోని పలు ప్రాంతాలలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స‍్కేలుపై  6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు తెలుస్తుంది.రిక్టర్ స్కేలుపై 6.1గా తీవ్రత నమోదైంది. భూకంపం తీవ్రతతతో మయన్మార్‌లోని పలు ప్రాంతాలలో భూమి కంపించడంతో ఆందోళన చెందిన ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు. అయితే దీనివల్ల జరిగిన నష్టం వివరాలను అక్కడి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

    ఈ భూకంప ప్రభావం తూర్పు, ఈశాన్య ప్రాంతాలపై పడినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పరిసర ప్రాంతాలలో భూమికొద్దిగా కదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొద్ది చోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం అందుతుంది.

NRI

  • కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్‌సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్‌సైట్‌ను ప్రధాన నకిలీ పోర్టల్‌గా గుర్తించారు.

    కువైట్‌ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

    కువైట్‌-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్‌(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్‌ సయ్యద్ రబ్బానీ, జుబైల్‌- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది.

     

     

     

  • కార్పోరేట్‌ లైఫ్‌ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్‌మ్‌సంగ్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమె లండన్‌లో తన భర్తతో కలిసి సప్పర్‌ క్లబ్‌ని రన్‌ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలా

    ఇదే  ఎందుకంటే..
    ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్‌ కృష్ణ కలిసి  'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టిన ఖాంతే నాగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్‌ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్‌ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. 

    ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్‌బాద్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్‌ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్‌ స్థిరపడ్డాక జాబ్‌ మార్కెట్‌ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్‌సంగ​్‌లో ప్రొడక్ట్‌ డిజైనర్‌గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్‌ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. 

    పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్‌​ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్‌ క్లబ్‌గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్‌ బ్రేకర్‌గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్‌ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. 

    నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్‌ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్‌తో ఫుడ్‌ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్‌ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. 

    సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?
    ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్‌కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్‌ క్లబ్‌. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. 

    రెస్టారెంట్‌లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్‌ టేబుల్‌పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్‌ క్లబ్‌లో. 

    (చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..)
     

Business

  • పొద్దున్నే లేవగానే.. ఓ కప్పు కాఫీ తాగడం దాదాపుగా అందరి దినచర్యలో భాగమే..! భారత్‌లో కాఫీ బిజినెస్ టర్నోవర్ 5 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంటుందని అంచనా..! అయితే.. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రశ్నకు ఎవరైనా తమిళనాడులోని నీలగిరి తోటలు లేదా కేరళలోని కాఫీ ఎస్టేట్లు లేదా కర్ణాటకలోని చిక్కమగళూరు తోటల పేరు చెప్పేస్తారు..! ఇప్పటికి అది నిజమే అయినా.. నిజానికి కాఫీ పుట్టింది భారత్‌లో కాదు. డచ్, బ్రిటిష్ కాలంలో కాఫీ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ.. అసలు భారత్‌కు కాఫీ గింజలను తెచ్చిన ఓ సూఫీ సాధువు. ఆయన కూడా భారత్‌లో కాఫీ పరిశ్రమ బిలియన్ల డార్లకు చేరుతుందని అప్పట్లో ఊహించి ఉండరు. ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?? అయితే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!
     
    భారత్‌లో కాఫీ కథ సూఫీ సాధువు అయిన బాబా బుడాన్‌తో మొదలవుతుంది. 1600లలో ఆయన హజ్ యాత్రకు వెళ్లారు. మక్కా నుంచి తిరిగి వస్తున్న సమయంలో యెమెన్‌లోని అల్-మక్కా నౌకాశ్రయంలో కాఫీ రుచి చూశారు. అంతే.. ఏడు కాఫీ గింజలను తన గడ్డంలో దాచి, తీసుకువచ్చారు. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతంలో నిత్యం చలి, తేమతో ఉండే చంద్రగిరి కొండల్లో వాటిని నాటారు. అంతే.. ఆ ఏడు బీజాలే ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా భారతదేశమంతటా విస్తరించాయి. 

    అప్పటి నుంచి చంద్రగిరి కొండల్లోని బాబా బుడాన్ కాఫీ మొక్కలు నాటిన కొండకు ఆయన పేరే పెట్టారు. ఆ కొండను బాబా బుడాన్ గిరి అని పిలుస్తారు. దత్తాత్రేయ పీఠానికి సమీపంలో ఈ కొండ ఉంది. ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ ఇక్కడి కాఫీ రైతులు కొత్త పంట రాగానే.. బాబా బుడాన్ దర్గా వద్ద కాఫీ గింజలను సమర్పిస్తారు. అలా.. భారత్‌లో కాఫీకి జన్మస్థలంగా చిక్కమగళూరును పిలుస్తారు. సక్కరపట్నం రాజు రుక్మంగడ తన చిన్నకుమార్తెకు ఈ గిరులను బహుమతిగా ఇచ్చారు. చిన్న కూతురు అంటే.. కన్నడంలో చిక్క మగళు అని అర్థం. అందుకే.. ఈ ప్రాంతానికి చిక్కమగళూరు అని పేరు వచ్చింది. ‘కర్ణాటక కాఫీ ల్యాండ్‌కు స్వాగతం’ అనే స్వాగత తోరణం ఈ జిల్లా ప్రవేశానికి ముందు కనిపిస్తుంది.

    చిక్కమగళూరు పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇక్కడి ముల్లయనగిరి అత్యంత ఎత్తులో ఉంటుంది. రోడ్ల వెంబడి సిల్వర్ ఓక్, రోజ్‌వుడ్, ప్లమ్, అత్తిచెట్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో అరేబికా, రోబస్టా వంటి రకాలను పండిస్తారు. ఫిల్టర్ కాఫీకి అరేబికా, ఇన్‌స్టంట్ కాఫీకి రోబస్టాను వాడుతారు. అరేబికా కంటే రోబస్టా కొంత చవక. రోబస్టాను లోయల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. అరేబికా అలా కాదు.. ఏటవాలు ప్రాంతాల్లోనే సవ్యంగా పండుతుంది. వీటితోపాటు.. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌లో కనిపించే లిబ్రికా, ఆగ్నేయాసియాలోని ఎక్సెల్సా వేరియంట్లు కూడా ఇక్కడ సాగవుతాయి. అసలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే వచ్చే కాఫీ పరిమళంతో.. ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాలని ఎవరికైనా జిహ్వచాపల్యం కలగకమానదనడంలో అతిశయోక్తిలేదు. ఘాట్ రోడ్లలో.. ఇరువైపులా కాఫీ షాపులుంటాయి.
     
    అలా చిక్కమగళూరులో 1600లలో ప్రవేశించిన కాఫీ.. క్రమంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలు, తమిళనాడులోని నీలగిరి, కేరళలోని వయనాడ్కు వ్యాప్తి చెందాయి. దక్షిణ కర్ణాటకలోని కొడుగులో 1856లో ప్రవేశించిన కాఫీ.. ఇప్పుడు 11,331 హెక్టార్లలో సాగవుతోంది. బ్రిటిషర్ల కాలంలో మొత్తం 200 కాఫీతోటలు ఉండేవి. 1825లో కేరళలోని వయనాడ్‌లో కాఫీ పంటలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముర్డోక్ బ్రౌన్ పండించిన కాఫీ రకాన్ని ‘అంజరకాండి బ్రౌన్’ అని పిలిచేవారు. 

    1843లో కాక్బర్న్ షెవ్రోలెట్ ఓ కాఫీ తోటను ప్రారంభించారు. 1860లలో ఆర్నాల్డ్ నెల్లియంపతిలో పర్డేహ్యారీ ఎస్టేట్ మొదలైంది. 1860 నాటికి దక్షిణ భారతదేశంలో కాఫీ సాగు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 1860లలో అరేబికా ప్రధాన సాగుగా ఉండేది. 1900 సంవత్సరం నుంచి ఆఫ్రికా నుంచి వచ్చిన రోబస్టా ఊపు ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా కాఫీతోటలు విస్తరించాయి. నిజానికి అరేబికా పంటకు కాండంతొలిచే పురుగు బెడద ఉండడంతో.. రైతులు అప్పట్లో రోబస్టా వైపు మొగ్గుచూపారు.
     
    అప్పట్లో బ్రిటిషనర్లు ఇక్కడ పండే కాఫీ గింజలను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పటికీ దేశీయ అవసరాలను తీర్చడంతోపాటు.. కాఫీ గింజల ఎగుమతులు కొనసాగుతున్నాయి. భారతీయ కాఫీలో 70శాతం కర్ణాటకలోని కొడుగు, చిక్కమగళూరు, హసన్‌లలో ఉత్పత్తి అవుతుంది. ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి అవుతుండగా.. అందులో సింహభాగం.. అంటే.. లక్షా ముప్ఫై వేల టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలా మన దేశంలో కాఫీ బిజనెస్ 5 బిలియన్ డాలర్ల దాకా చేరుకుంది. 

    కాఫీడే, స్టార్ బక్స్, మోచా, బారిస్టా, కోస్టా, థర్డ్ వేవ్ కాఫీ వంటి డిజైనర్ కాఫీ స్టూడియోలు సైతం లాభాలను గడించాయి. ఈ కథనం మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

     

  • ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయో చాలామందికి తెలిసే ఉంటుంది. రెంట్ ఎక్కువైనా.. హైదరాబాద్ బెస్ట్ అంటున్నారు.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌ 'కోమల్ ఝా'.

    కోమల్ ఝా.. డెలాయిట్ కన్సల్టింగ్‌లో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెషనల్. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌కు చెందిన ఈమె ఉద్యోగ రీత్యా.. ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించింది. గత తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

    తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న కోమల్ ఝా.. భర్త & కుమార్తెతో కలిసి ఒక 3BHK ఇంట్లో ఉంటున్నారు. ఇతర మహానగరాలతో పోలిస్తే, హైదరాబాద్ జీవనశైలి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా వర్క్-లైఫ్ మధ్య మంచి సమతుల్యత కల్పిస్తుందని ఆమె చెబుతున్నారు.

    ఖర్చుల విషయానికి వస్తే.. 3BHK ఇల్లు అద్దె నెలకు రూ.50వేలు, పనిమనిషికి రూ.20వేలు.. ఎలక్ట్రిక్, వాటర్, యుటిలిటీ కోసం మరో 10వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురు చదువు కోసం ఇంకో రూ. 30వేలు కేటాయిస్తుంది. కిరాణా సరుకులు & వంటింటి అవసరాల కోసం నెలకు సుమారు రూ.15,000 ఖర్చవుతుంది. అంటే నెలకు దాదాపు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందన్న మాట. ప్రతి నగరంలో లాభాలు, నష్టాలు ఉన్నప్పటికీ.. జీవన నాణ్యత దృష్ట్యా హైదరాబాద్‌ను తాను ఎక్కువగా ఇష్టపడతున్నట్లు కోమల్ ఝా పేర్కొన్నారు.

  • బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)లో మరింత వాటా విక్రయానికి ప్రభుత్వం వచ్చే ఏడాది(2026–27) ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీవో) చేపట్టే వీలున్నట్లు నాగరాజు వెల్లడించారు. 2022 మే నెలలో ప్రభుత్వం పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా అమ్మిన సంగతి తెలిసిందే. షేరుకి రూ. 949 ధరలో వాటా విక్రయించడం ద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకుంది.

    ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా 96.5 శాతంగా ఉంది. దీంతో 2027 మే నెలకల్లా పబ్లిక్‌కు కనీసం 10 శాతం వాటా నిబంధన అమలు చేసేందుకు మరో 6.5 శాతం వాటా ఆఫర్‌ చేయవలసి ఉంది. వెరసి ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటా విక్రయించేందుకు వీలుగా ఎఫ్‌పీవోను పరిశీలించవలసిందిగా దీపమ్‌ను కోరినట్లు నాగరాజు తెలియజేశారు. అయితే అనుమతులు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా వచ్చే ఏడాది ఎల్‌ఐసీ ఎఫ్‌పీవోకు అవకాశమున్నట్లు వివరించారు.

  • జనవరి 30 నుంచి భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేటు మళ్లీ పెరుగుదల దిశగా పయనించింది. ఈ రోజు (మంగళవారం) ఉదయం రూ. 151750 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మారిపోయింది. దీంతో పసిడి కొనుగోలుదారుల్లో మరోమారు ఒకింత ఆందోళన మొదలైంది. అయితే ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,53,930 (రూ.760 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,41,100 వద్ద (రూ. 700 పెరిగింది) ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఉన్నాయి.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు వరుసగా రూ.740 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ.700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,080 రూపాయల దగ్గర, 22 క్యారెట్స్ తులం పసిడి ధర రూ.1,41,250 వద్ద నిలిచాయి.

    చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయానికి వస్తే.. ఇక్కడ బంగారం ధర దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3,490 రూపాయలు పెరిగి రూ.1,55,670 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ తులం రేటు 3200 రూపాయలు పెరిగి రూ.1,42,700 వద్దకు చేరింది.

    సిల్వర్ రేటు
    మంగళవారం ఉదయం రూ.20 వేలు తగ్గిన సిల్వర్ రేటు.. సాయంత్రానికి అంతే పెరిగింది (రూ.20,000 పెరిగింది). దీంతో రూ. 2.80 లక్షల దగ్గర ఉన్న కేజీ వెండి రేటు రూ. 3 లక్షలకు చేరింది.

    ఇదీ చదవండి: జియో, ఎయిర్‌టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

  • అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

    ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్
    రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

    రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.

    రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.

    రిలయన్స్ జియో
    రూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

    రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి.

    రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్‌స్టార్‌‌కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

  • మారుతి సుజుకి.. మార్కెట్లో విక్టోరిస్ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడల్ కేవలం నాలుగు నెలల కాలంలో 50,000 సేల్స్ సాధించగలిగింది. జనవరి 2026లో దీని అమ్మకాలు 15240 యూనిట్లు. నవంబర్ & డిసెంబర్‌లలో అమ్మకాలు వరుసగా 12,300 & 6,210 యూనిట్లు.

    మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

    మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

  • గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.

    ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్‌సెట్‌ పొందుతుంది.

    ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!

    ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుతుంది.

    కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం, ఫోన్‌లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్‌సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

  • మంగళవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపులో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,072.67 పాయింట్ల (2.54 శాతం) లాభంతో 83,739.13 వద్ద, నిఫ్టీ 639.15 పాయింట్ల (2.55 శాతం) లాభంతో 25,727.55 వద్ద నిలిచాయి.

    పారామౌంట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఫేజ్ త్రీ లిమిటెడ్, అవలోన్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ లిమిటెడ్, TECIL కెమికల్స్ & హైడ్రో పవర్ లిమిటెడ్, కామత్ హోటల్స్ (ఇండియా) లిమిటెడ్, MPS లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    అందులో భారీ లాభాల్లో..
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడానికి ప్రధాన కారణం. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పరస్పర టారిఫ్‌లను 25% నుంచి 18%కు తగ్గించారు. ఇది చైనా (35%), పాకిస్థాన్ (19%) కంటే తక్కువ కావడం విశేషం.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • పెద్దనోట్ల రద్దు జరిగి చాన్నాళ్లవుతోంది. అయితే ఇప్పటికి 98.42 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకునే నాటికి.. రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 జనవరి 31 నాటికి రూ.5,609 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. అంటే.. ఇంకా 1.58 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

    తొలుత 2023 అక్టోబర్‌ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికీ తమ వద్ద రూ.2,000 నోట్లు ఉంటే, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో దేనికి అయినా స్పీడ్‌పోస్ట్‌ ద్వారా పంపుకోవచ్చు. పంపించే వారు దరఖాస్తుతోపాటు కేవైసీ డాక్యుమెంట్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు అంత విలువ మేర బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది.

  • ఆటో మొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ త్వరలో కార్ల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. వాహన ధరల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తర్వాత మార్కెట్‌లో నెలకొన్న బలమైన డిమాండ్, పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల దృష్ట్యా ధరల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు.

    ‘కమోడిటీల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా విలువైన లోహాల (ప్రెషస్‌ మెటల్స్‌) ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వాహనాల ధరల పెంపుపై సమీక్ష చేయనున్నాం’ అన్నారు. 

    ధరల పెంపుపై తర్వలో నిర్ణయం

    మార్కెట్‌ లీడర్‌గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు కస్టమర్ల మీద భారం పడకుండా ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. క‍చ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం’’అని బెనర్జీ అన్నారు.  

    ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌

    అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ను ప్రవేశపెట్టింది. ‘‘ఫోర్‌ వీలర్‌ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారిని అప్‌గ్రేడ్‌ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు’’ అని బెనర్జీ చెప్పుకొచ్చారు.

    పెండింగ్‌లో 1.75 లక్షల ఆర్డర్లు

    జనవరిలో 2.78 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. అయితే పరిమితమైన ఉత్పత్తి సామర్థ్యం కారణంగా కంపెనీకి ప్రస్తుతం 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోందన్నారు. గతేడాది జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో ఎంట్రీ లెవల్‌ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్‌ 2025లో ఎస్‌–ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో కే10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్‌ ఆర్‌ ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది.

    ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

  • కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.

    అంకెలు పెరిగినా.. ఆందోళనలు?

    వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్‌నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

    దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    పరిశోధన నిధుల్లో కోత

    వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్‌ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.

    ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం

  • సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరించారు.

    సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గం

    వాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

    కేసు నేపథ్యం ఏమిటి?

    2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్‌కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్‌సీఎల్‌ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.

    దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

    కేసు పరిధి విస్తరణ

    ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.

    ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు

Telangana

  • హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు ప్రజలు 040-6905 9100 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

    కుటుంబంలో ఒకరు, అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వారసత్వ కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది.

    సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశమున్నప్పటికీ, సుమారు 10 శాతం క్యాన్సర్లు వారసత్వ జన్యు మార్పుల కారణంగా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు, తక్కువ వయస్సులో క్యాన్సర్ రావడం, తరతరాలుగా కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ కనిపించడం వంటి అంశాలు జన్యుపరీక్షలకు కీలక సూచికలని వివరించారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా లక్ష్యిత స్క్రీనింగ్, నివారణ చర్యలు మరియు వ్యక్తిగత వైద్య సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.

    కామినేని ఆసుపత్రి జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.

    కామినేని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ, “చాలామంది కుటుంబ చరిత్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. లక్షణాలు కనిపించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వచ్చి, తమ ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం, బోర్డు సర్టిఫైడ్ జన్యు కౌన్సెలర్లతో పాటు ఆంకాలజీ తదితర విభాగాల వైద్యులతో కలిసి సమగ్ర ప్రమాద అంచనా మరియు వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

  • సాక్షి,హైదరాబాద్‌: ఏఐఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026)  కన్నుమూశారు. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు. అనారోగ్య సమస్యతో గతేడాది నవంబర్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి చివరికి తుదిశ్వాస విడిచారు.

    పాషా ఖాద్రీ ఏఐఎంఐఎంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న నేత. 2004లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2018లో యాకుత్‌పుర నియోజకవర్గం నుంచి గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.  పాషా ఖాదద్రీ ఏఐఎంఐఎం వ్యవస్థాపకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ సహచరుడిగా గుర్తింపు పొందారు.

    2008లో ఏఐఎంఐఎం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన పాషా ఖాద్రీ, పార్టీని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ముస్లిం ఓటర్లలో ఏఐఎంఐఎం స్థిరమైన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, పార్టీ విస్తరణలో చేసిన కృషి ఏఐఎంఐఎంకు బలమైన పునాది వేశాయి.

    సుమారు 60 ఏళ్ల వయసులో ఖాద్రీ మరణం ఎంఐఎంకు పెద్ద లోటు. చార్మినార్, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో ఆయనకు ఉన్న బలమైన పట్టు, ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీకి అమూల్యమైందని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని సహచర నేతలు చెబుతున్నారు.  

     సయ్యద్ పాషా ఖాద్రీ గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(MCH)లో కార్పొరేటర్ నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించిన సయ్యద్ పాషా ఖాద్రీ మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. 

     

  • సాక్షి,మల్లాపూర్‌: జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ బోల్తా పడి నలుగురు రైతులు మృతి చెందారు. 

    స్థానికులు వివరాల మేరకు.. మల్లాపూర్ మండలం మొగిలిపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న పదిహేను మంది రైతుల్లో నలుగురు రైతులు మృతి చెందారు. మిగిలిన రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

  • భారతదేశం ఎలా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసింది తెలుసుకోవడానికి వరంగల్ ఎడిషన్ చూడండి, నగరం యొక్క అభివృద్ధి చెందుతున్న ఆహారపు అలవాట్లు మరియు గడిచిన సంవత్సరం యొక్క రుచికరమైన జ్ఞాపకాలు గుర్తించి ఇది క్లుప్తంగా వివరిస్తుంది.

    నగరానికి ఇష్టమైనవి
    చికెన్ బిర్యానీ నగరంలో అత్యంతగా ఆర్డర్ చేయబడిన వంటకంగా చికెన్ బిర్యానీ నిలిచింది. 2025లో 4.46 లక్షలకు పైగా ఆర్డర్లు చేయబడ్డాయి, ప్రతి రోజూ సగటున 1222 ప్లేట్స్ కంటే ఎక్కువగా ఆర్డర్ చేయబడ్డాయి! వెజ్ దోస, ఇడ్లీ మరియు వెజ్ బిర్యానీలు నగరంలో ఆర్డర్ చేయబడిన అగ్ర 5 వంటకాల్లో భాగంగా ఉన్నాయి.

    ఒక కస్టమర్ రూ. 13,778 విలువ గల సింగిల్ ఆర్డర్ చేసాడు. దీనిలో స్థానికంగా ఉత్తమమైన  ఆహారాలు అనగా జఫ్రాని మటన్ బిర్యానీ, జఫ్రాని చికెన్ బిర్యాని, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, చికెన్ 65, చికెన్ టిక్కా మసాల, ఇంకా ఎన్నో  మొత్తం 37 ప్లేట్స్ ఉన్నాయి -నగరంలో ఇది అత్యధికం.! అర్థరాత్రి ఎక్కువగా తినే అలవాటు కూడా ప్రసిద్ధి చెందుతోంది, దీని ఆర్డర్లు ప్రతి ఏడాది 118% పెరుగుతున్నాయి.

    బిర్యానీలు, బర్గర్ల కోసం కోరికలు  అర్థరాత్రి వరకు కొనసాగాయి ( ఉదయం 12 గంటలు నుండి  – ఉదయం 2 గంటలు వరకు). దీనిలో చికెన్ బిర్యాని ముందు స్థానంలో  ఉండగా తదుపరి  స్థానంలో చికెన్ షావర్మ ఉంది. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బర్గర్, చికెన్ పిజ్జాలు అనేవి ఇష్టపడిన ఇతర ఆహారాల్లో భాగంగా ఉన్నాయి.

    అత్యంతగా ఆర్డర్ చేయబడిన డిజార్ట్‌లో డార్క్ చాక్లెట్ ఐస్ క్రీమ్ నిలిచింది. తదుపరి చాకొలెట్ కేక్, చాకొలెట్ వేఫల్ నిలిచాయి. నగరంలో ఉదయపు వేళలు క్లాసిక్‌గా ఉన్నాయి. ప్రతి ఉదయం 200 ప్లేట్లు కంటే ఎక్కువగా ఆర్డర్ ఇడ్లీ ఆర్డర్ చేయబడింది. ఇది అత్యంతగా ఆర్డర్ చేయబడిన బ్రేక్ ఫాస్ట్ వంటకంగా నిలిచింది. వెజ్ దోస, వడ, ఉల్లి దోస, బోండాలు  తదుపరి స్థానంలో ఉన్నాయి.

    స్నాక్-టైమ్ ( మధ్యాహ్నం 3 నుండి- రాత్రి 7 వరకు) కోరికల్లో చికెన్ బిర్యానీ కార్ట్స్ లో అగ్ర స్థానంలో నిలిచింది, తదుపరి చికెన్ బర్గర్, చికెన్ షావర్మ, చికెన్ పిజ్జాలు ఉన్నాయి. వెజ్ మంచూరియన్, వెజ్ బిర్యానీలు కూడా నగరంలో ఇష్టపడిన అగ్ర 10 స్నాక్స్ లో ఉన్నాయి. ఆహారం ఆర్డర్ చేయడానికి డిన్నర్ అత్యంత ప్రసిద్ధి చెందిన సమయం.

    సరసమైన ఎంపికలకు ఆదరణ. 99 స్టోర్ ఆర్డర్స్‌పై, చికెన్ బిర్యానీకి ఇష్టమైన ఆహారాల్లో అగ్ర స్థానం వచ్చింది.  సుమారు 159 ప్లేట్స్ ప్రతి రోజూ ఆర్డర్ చేయబడ్డాయి. చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రైడ్ రైస్,మటన్ బిర్యానీలు ఇష్టమైన 5 ఆహారాల్లో అగ్ర స్థానంలో నిలిచాయి.

    ధోరణులను గురించి వివరిస్తూ సిద్ధార్థ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ ఇలా అన్నారు, “ 2025లో భారతదేశం ఇష్టమైన వంటకాల్లో లీనమైన కారణంగా  ఆహారం మన దైనందిన జీవితంలో, సంబరాల్లో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగింది. వరంగల్‌లో క్లాసిక్‌ఫై   ప్రేమకు  జాతీయంగా ఇష్టపడే వాటి సౌకర్యానికి మధ్య  ఉత్తమమైన సమతుల్యతను మేము చూసాము. ఆహారం అనేది ఒక భావోద్వేగం. నగరంలో ప్రతి మూలలో సాటిలేని ఆహార అనుభవాలను అందచేయడానికి మేము కట్టుబడ్డాము, ఒకేసారి ఒక భోజనం, ఒక సంబరం’ అని వ్యాఖ్యానించారు.  

  • సాక్షి, హైద‌రాబాద్‌: త‌న భార్య చాలా ధైర్య‌వంతురాలని, ఎందుకు బ‌ల‌వ‌స్మ‌ర‌ణానికి పాల్ప‌డిందో అర్థం కావ‌డం లేద‌ని స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ విజ‌య‌శాంతి రెడ్డి భ‌ర్త సురేంద‌ర్ రెడ్డి అన్నారు. త‌మ ఇద్ద‌రి పిల్ల‌ల‌తో క‌లిసి భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని ఆయ‌న చెప్పారు. బోడుప్ప‌ల్‌లోని త‌మ నివాసంలో మంగ‌ళ‌వారం ఆయ‌న సాక్షి టీవీతో మాట్లాడారు. ఒంట‌రిత‌నంగా అనిపిస్తున్న‌ట్టు త‌న భార్య‌ ఎప్పుడూ చెప్ప‌లేద‌న్నారు. త‌మ కుటుంబంలో ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, ఆమె ప‌నిచేసే చోట కూడా ఇబ్బందులు లేవ‌ని వెల్ల‌డించారు. అస‌లు ఆమెకు ఒంట‌రిత‌నం ఫీల‌య్యేంత స‌మ‌యం లేద‌ని.. ఉద్యోగం, కుటుంబంతోనే స‌రిపోయేద‌ని చెప్పారు. సెలవు రోజుల్లో పిల్ల‌ల‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లేద‌ని.. ఒక వారం అబ్బాయి ద‌గ్గ‌ర‌కు, మ‌రో వారం అమ్మాయి ద‌గ్గ‌రికి వెళ్లేద‌న్నారు. ఒక‌వేళ ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌న‌తో చెప్పాల్సింద‌ని, ఏదోలా ప‌రిష్క‌రించుకునే వాళ్ల‌మ‌ని అన్నారు.  

    ''అస‌లు ఏం జ‌రిగిందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఇలా ఎందుకు చేశారో తెలియ‌డం లేదు. మైండ్ మొత్తం బ్లాకే ఉంది. మా మ‌ధ్య ఎటువంటి దాప‌రికాలు లేవు. అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటాం. కుటుంబ స‌భ్యులంద‌రితోనూ బాగానే మాట్లాడుతుంది. ఒంట‌రిగా ఉండేంత‌ సంద‌ర్బాలు లేవు. జ‌న‌వ‌రి 29 నాడు నాతో చివ‌రిసారిగా ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా నార్మ‌ల్‌గానే మాట్లాడింది. పిల్ల‌ల భ‌విష్య‌త్తు గురించి ఇద్ద‌రం మాట్లాడుకున్నాం. పిల్ల‌లు నాకంటే వాళ్ల అమ్మ‌తో బాగా క్లోజ్‌గా ఉంటారు. వాళ్ల అమ్మ ఏది చెబితే అది తూచా త‌ప్ప‌కుండా పాటిస్తారు. అమ్మ చెబితే.. వ‌ద్ద‌ని అన‌నే అన‌రు. అమ్మ మీద ప్రేమ‌తోనే ఆమెతో పాటు వెళ్లారు.

    అంతా మంచిగ‌నే ఉన్నాం. ఫ్యామిలీ అంతా ఓకే. 19 ఏళ్ల మా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. 14 నెల‌ల క్రితం నేను దుబాయ్ వెళ్లాను. ఇండియాకు తిరిగొచ్చేమ‌ని నాతో ఎప్పుడూ చెప్ప‌లేదు. నీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌, ఇక్క‌డ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేది. నా భార్య అంటే నాకు దేవ‌త‌తో స‌మానం. న‌న్ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకునేది. మా పిల్ల‌లకు వాళ్ల అమ్మ‌తో ఎటాచ్‌మెంట్ ఎక్కువ‌, ఆమె లేకుండా ఉండలేరు. ప్ర‌తి విష‌యం వాళ్ల అమ్మ‌తో షేర్ చేసుకునేవారు. నేను లేక‌పోతే పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంద‌ని అనుకుందో ఏమో. మా అత్త‌య్య వాళ్ల‌తోనూ ఆమె ఏమీ చెప్ప‌లేదు. ఇంట్లో బ‌య‌టికి వెళుతున్న‌ప్ప‌డు.. 'ఈరోజు ఆఫీసు ఉండ‌దు కదా' అని అత్త‌య్య అడిగితే, పార్టీకి వెళుతున్న‌ట్టు చెప్పింది. నార్మ‌ల్‌గానే ఉన్న‌ట్టు క‌న‌బ‌డ‌డంతో ఎటువంటి అనుమానం క‌ల‌గ‌లేదు. నాకు తెలిసి ఆఫీసులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవ''ని సురేంద‌ర్ రెడ్డి చెప్పారు. 

    పార్కింగ్ స్లిప్ వెనకాల సూసైడ్ నోట్

    అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు
    సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి త‌న ఇద్ద‌రు పిల్లలు చైత‌న్యారెడ్డి (18), విశాల్ రెడ్డి (17)తో క‌లిసి శ‌నివారం తెల్ల‌వారుజామున చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ సమీపంలో గూడ్స్ రైలు కింద ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. అయితే ఆమె ఎందుకిలా చేశార‌నేది మిస్టరీగా మారింది. కుటుంబం, కెరీర్‌లోనూ ఎటువంటి ఇబ్బందులు లేవ‌ని ఆమె కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. మాన‌సికంగా కూడా ఆమె చాలా ధైర్య‌వంతురాలని, అలాంటి ఆమె ఎందుకు పిల్ల‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సి వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మ‌రోవైపు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లో ఏమైనా స‌మాచారం దొరుకుతుందేమోన‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. 

    కడియం శ్రీహరి కారు పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11గం. జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కడియం, వివేకా వాదనలను స్పీకర్‌ విననున్నారు.

    మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వాళ్లెవరూ పార్టీ మారలేదని.. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్‌ పిటిషన్‌ ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇకప్పుడు కడియం శ్రీహరి పిటిషన్‌ విచారణ జరగబోతోంది. మరో  ఎమ్మెల్యే సంజయ్‌ వ్యవహారంపై స్పీకర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

  • నల్గొండ జిల్లా : మండలంలోని కేతేపల్లి గ్రామంలో జరిగిన ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో మృతిచెందిన మమత, ఆమె చిన్ని కుమారుడు అద్విక్‌ అంత్యక్రియలు ఎట్టకేలకు సోమవారం రార్రి పూర్తయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన సుజాత సోమవారం నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేలు నగేష్‌తో అదే గ్రామానికి చెందిన సుజాత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.  నగేష్‌ భార్య మమతకు ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పెద్దమనుషుల సమక్షంలో నగేష్, సుజాతను పిలిపించి పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. అప్పటి నుంచి నగేష్‌ సుజాతతో మాట్లాడటం మానేశాడు.

     దీంతో ఎలాగైనా నగేస్‌ భార్య మమతను చంపాలని సూజాత నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సుజాత జనవరి 31న గ్రామంలోని కిరాణ దుకాణంలో ఒక బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొని ఇంటి వద్దకు వెళ్లింది. పెట్రోల్‌తో పాటు ఒక సంచిలో కత్తి, కారంపొడి తీసుకొని నగేష్‌ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి ముందు చిన్న కుమారుడు అద్విక్‌ పాలు పడుతున్న మమతపై సుజాత పెట్రోల్‌ పోసి నిప్పు అంటించడంతో మమత, ఆమె చిన్న కుమారుడు అద్విక్‌ మృతిచెందారు. నిందితురాలు సుజాత సోమవారం నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి చేసిన నేరం అంగీకరించి లొంగిపోగా.. ఆమెను జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. 

    పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన..
    మమత తరఫు బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మమత వివాహ సమయంలో కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు కోరారు. 

    భూమి రిజిస్ట్రేషన్‌..
    నగేష్‌ తల్లిదండ్రుల వద్ద ఉన్న నాలుగు ఎకరాల భూమిని మృతురాలు మమత పెద్ద కుమారుడు సాత్విక్‌ పేరిట ఆమె తరఫు బంధులు దగ్గరుండి రిజిస్ట్రేషన్‌ చేయించారు. గార్డియన్‌గా మమత తండ్రి, తల్లిని పెట్టారు. అదేవిధంగా కట్నం కింద ఇచ్చిన రూ.8లక్షల నగదు, 10 తులాల బంగారంను మమత పెద్ద కుమారుడి పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేందుకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం రాత్రి మమత, ఆమె చిన్న కుమారు అద్విక్‌ మృతదేహాలను బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కేతేపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.  

Politics

  • సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

    దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్‌ రిపోర్ట్‌ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ చేశారు. ప్రెస్‌ మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    సిట్‌ రిపోర్ట్‌పై క్యాబినెట్‌ నిర్ణయమా!:
    సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ అధికారుల్ని సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం అసాధారణ విషయం. వారి దగ్గరి నుంచి 11 పేజీల నివేదిక తీసుకుని సుదీర్ఘమైన చర్చ చేశామని కేబినెట్‌ భేటీ నుంచి బయటికి వచ్చిన మంత్రులు చెప్పారు. చంద్రబాబును కాపాడటానికి, ఆయన చెప్పిన అబద్ధాల్ని కప్పిపుచ్చడానికే వీళ్ల ప్రయాస. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2024 సెప్టెంబర్‌ 20వ తేదీన కూటమి సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారని ప్రకటించడంతో, వాస్తవాలు నిగ్గు తేల్చాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఏ విషయమూ నిర్థారణ కాకుండా మాట్లాడొద్దంటూ సూచించిన సుప్రీకోర్టు, ఈ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు చేసింది. అందులో సీబీఐ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు.

    సిట్‌ అధికారులు ఏడాది కాలంగా సుదీర్ఘ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. సిట్‌ అదనపు ఛార్జిషీట్‌లో కానీ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులో కానీ, చంద్రబాబు ఆరోపించినట్లు నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా చంద్రబాబు ఈ ఛార్జిషీట్‌పై సంతృప్తి చెందకుండా ఇవాళ కేబినెట్‌ సమావేశంలో నెయ్యి విషయంలో ప్రత్యేక విచారణ చేపడుతున్నట్లు మంత్రులతో బయట ప్రకటన చేయించారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ రిపోర్టు కాకుండా, మళ్లీ విచారణ చేయించాలన్న నిర్ణయం పూర్తిగా తప్పు.

    ‘భోలేబాబా డెయిరీ’ వెనుక ఉన్న ‘ఆలీ బాబా’ చంద్రబాబే:
        ఒక మంత్రి భోలే బాబాను తెచ్చిన అలీ బాబా ఎవరని ప్రశ్నించారు. ఈ భోలే బాబాను తెచ్చిన చంద్రబాబే. 2018లోనే భోలే బాబా రంగ ప్రవేశం చేశాడు. దాదాపు 87 వేల టిన్నులకు పైగా నెయ్యి ఈ కంపెనీ సరఫరా చేసింది. అది చాలా స్పష్టంగా సీబీఐ నివేదికలోనే ఉంది. కానీ దాన్ని వదిలేసి మా హయాంలోనే నెయ్యి సరఫరా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భోలే బాబాకు ముందున్న పేరు హర్‌‡్ష –వర్‌‡్ష డెయిరీకి అనుమతి ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. బీజేపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కు ఇప్పుడు భోలే బాబాను తెచ్చిన ఆలీ బాబా ఎవరో తెలిసిందని అనుకుంటున్నాం.

    ఆ నెయ్యిపైనా విచారణ జరిపించాలి:
    నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సిట్‌ విచారణ 2019–24 మధ్య కాలానికి వేశారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్‌ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలి. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం.

    2018లో టీటీడీ తీర్మానంతోనే నెయ్యి కల్తీకి బీజం:
    విభజిత రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసింది. నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్‌ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రోజున మీరు వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదు. అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్‌ కలిపారు.

    అప్పటి జేఈవో అధ్యక్షతన పని చేసిన ఈ కొనుగోలు కమిటీలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌ వంటి సాంకేతిక నిపుణుల్ని నియమించారు. వారే ఆ తర్వాత మా హయాంలోనూ కొనసాగారు. ఇప్పుడు సిట్‌ రిపోర్ట్‌ నిందితుల్లోనూ ఉన్నారు. అలాగే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం కూడా టీడీపీ హయాంలో ఉన్న వ్యక్తే ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే టెంపుల్‌ అఫైర్స్‌ ఏవో, ఎస్వీ గోశాల డైరెక్టర్‌ కూడా మొన్నటి వరకూ ఉన్నారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారు. అప్పటికే రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే కాలంలోనే ప్రతి రోజూ 975 కేజీల నెయ్యికి ఫ్లేవర్‌ అద్దడానికి వీళ్లు చేసిన దుర్మార్గం ఇది. 2018, ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనం.

    దమ్ముంటే 2014 నుంచీ నెయ్యి కల్తీపై విచారణ జరపండి:
    2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ దోషి అంటున్నారు. సిట్‌ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారు? నెయ్యి పేరుతో అనిల్‌ సింఘాల్‌ను టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయి.

    చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారు. మీరు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయింది. అయినా మీరు ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుమల శ్రీవారిపై భక్తి ఉంటే, ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకపోతే.. మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరుతున్నాం.

    మేము ఏ నిబంధనలూ సడలించలేదు:
        అలాగే మీ హయాంలో నుంచే ఉన్న అధికారుల్ని మేం నియమించినట్లు చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మేం నిబంధనల్ని సడలించడం వల్ల నెయ్యి కల్తీ జరిగిందనేది అబద్ధం. ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించి స్టార్టప్‌ కంపెనీలను ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూపొందించినవి. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. మీరు తెచ్చిన నిబంధనల్ని మేం సడలించి తెచ్చిన కంపెనీ ఒక్కటి కూడా లేదు. భోలేబాబా వంటి కంపెనీలు మీ హయాంలోనే టెండర్లు వేసిన విషయం గుర్తుంచుకోండి. ఏఆర్‌ డెయిరీ, మాల్‌ గంగా వంటి సంస్థలు మేం నిబంధనలు కఠినతరం చేసిన తర్వాతే టెండర్లలో పాల్గొన్నాయి. అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈ కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.

    దోషులెవరో సిట్‌ చెప్పినా మాకు అంటగట్టే యత్నం:
    చంద్రబాబు జంతుకొవ్వు, ఆవు  కొవ్వు కలిపారని చెప్పిన నాలుగు ట్యాంకర్లను తిరిగి శ్యామలరావు ఈవోగా, మీరు సీఎంగా ఉండగానే లడ్డూల్లో వాడారని సీబీఐ తన నివేదికలో చెప్పింది. ఇప్పడు చెప్పండి దొంగలెవరో? దోషులెవరో?. మా హయాంలో నాణ్యత లేని 18 నెయ్యి ట్యాంకర్లను మేం వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా 14సార్లు కూడా ఇలాంటి నాణ్యత లేని నెయ్యిని వెనక్కి పంపింది. సీఎస్‌ఆర్టీఐ రిపోర్టులు వచ్చాక ఛైర్మన్‌కు అందిస్తే ఆయన కళ్లు మూసుకున్నారని ఎలా చెప్తారు? టీటీడీ పాలక మండలి తనకున్న అధికారాల్ని ఈవోకు బదలాయించిన విషయం మీకు నిజంగా తెలియదా? అధికారులు ఈవోను కలవకుండా ఛైర్మన్‌ను ఎలా కలిశారు?

    వాస్తవాలన్నీ ఇలా ఉంటే, కేవలం దురుద్దేశంతో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా విచారణ చేయిస్తాం అంటున్నారు. మీ దృష్టిలో మేము (గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం) నేరస్తులమని, శ్రీ వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విచారణ జరిపిస్తామని కబుర్లు చెబుతున్నారు. నిజంగా నేరస్తులు అయితే శిక్షించమనే కదా మేం ముందు నుంచే అడుగుతున్నాం. సీబీఐ వంటి సంస్థే మేం నిర్దోషులమని నిర్థారించాక కొద్ది మంది అధికారులు, సరఫరా దారులు, టెక్నికల్‌ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారని రిపోర్ట్‌ ఇస్తే మా వాళ్లను దోషులుగా చేసే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు?.

    మేము తప్పు చేయలేదు. అందుకే గట్టిగా నిలబడ్డాం:
    పవన్‌కళ్యాణ్‌ తమ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నెయ్యిలో ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసిందని, అది అబద్దమని మా పార్టీ చేస్తున్న వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నామని, ఏం నిద్రపోతున్నారా అని కాకినాడ ఎంపీతో పాటు, తన సోదరుడిని కూడా ప్రశ్నించారు. నెయ్యిలో నిజంగా జంతుకొవ్వు కలిసినా, అది బయట పెడితే, ఎక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయోనని, సిట్‌ ఛార్జ్‌షీట్‌లో రాయలేదని చెబుతున్నారు.

    ఒకవేళ నిజంగా సీబీఐ ఆ పని చేసి ఉంటే, సనాతని, హైందవ ధర్మ పరిరక్షకుడదని చెప్పుకునే పవన్, అప్పుడు, ఇప్పుడు పదే పదే అదే మాట ఎందుకు చెబుతున్నారు. తిరుమలలో వాడిన నెయ్యిలో పందికొవ్వు, జంతుకొవ్వు, చేపనూనె కలిసిందని ఎలా ఆరోపిస్తున్నారు? సనాతనిగా ఉన్న మీరు భక్తుల మనోభావాల్ని ఎలా దెబ్బ తీస్తున్నారు?. తప్పు చేయలేదు కాబట్టే మేం ఛాలెంజ్‌గా మాట్లాడుతున్నాం. మీరు అబద్దాలు చెప్పారు కాబట్టే దాన్ని సమర్థించుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అటు టీడీపీలో కూడా ముప్పు తిప్పలు పడుతున్నారు.

    సీబీఐ రిపోర్ట్‌ పై విచారించే అధికారం మీకు లేదు:
    సీబీఐ నివేదిక మీద విచారణ చేసే అధికారం మీది కాదు కోర్టుది. కానీ నేరస్తుల్ని మేమే గుర్తించామంటూ విచారణలకు సిద్దమవుతున్నారు. ఇలాంటి తీర్పులు ఇచ్చే ప్రయత్నాలు మానుకుంటే మంచిది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే, నెయ్యిలో ఫ్లేవర్‌ కలపాలన్న నాటి టీటీడీ బోర్డు నిర్ణయానికి సమాధానం చెప్పాలి. మళ్లీ చెబుతున్నాం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికపై, మరో విచారణ జరిపించే అధికారం మీకు లేదు.

    మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    అనిల్‌ సింఘాల్‌ విషయంలో సీఎం పేషీనే పెద్ద నాటక వేదిక. ఆయన ఏ సిఫార్సుతో వచ్చారో మాకు తెలియదు కానీ, ఆయన్ను వచ్చిన రోజు నుంచే బదిలీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ నివేదికను అడ్డు పెట్టుకుని ఇప్పుడు బదిలీ చేశారు. సర్వోన్నత న్యాయస్థానం సరైన విచారణ చేయలేదని కేబినెట్‌ తీర్మానం చేస్తే అప్పుడు మళ్లీ మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి చెప్పుకోవాలి. చంద్రబాబు మిమ్మల్ని పట్టించడం అంటే దొంగ పోలీసును పట్టించినట్లుంది. కాబట్టి నెయ్యి మీద మీరు విచారణలు చేయడం కాదు మళ్లీ సుప్రీంకోర్టుతోనే ఆ పని జరిగేలా చూడాలని భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని  మండిపడ్డారు.

    ‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్‌ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

    ..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.

    ‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్‌ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు

    ..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్‌లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త.

    ..ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు.  వైఎస్సార్‌సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్‌గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

  • సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్‌ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్‌ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.

    జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్‌లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్‌లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.

    దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు.

  • సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: కూటమి ప్రభుత్వ ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో పడిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాలు పెట్రోల్‌ బాంబులు,మారణాలయుధాలతో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జోగి రమేష్‌ కుటుంబాన్ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పరామర్శించారు.

    ఈ సందర్భంగా జోగి రమేష్‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌ కుమార్‌ మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వంలో రాక్షస పాలన సాగుతోంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని తప్పుడు ప్రచారం చేశారు. తాను చేసింది అసత్య ప్రచారం అని తెలిసి పశ్చాత్తాపం పడకుండా దాడులు చేయిస్తున్నాడు.

    ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని. అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్ల పై వందల మంది గూండాలతో  దాడి చేయించారు.జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయించారు. దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి, భార్య,కుమారుడు ఇంటిలోనే ఉన్నారు.ఇంట్లో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.

    మీ పార్టీలో ఉన్నవారే మహిళలా. మీ పార్టీలో ఉన్నవారే బిసిలు,కాపులా. ప్రశ్నిస్తాననేపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు.జగన్ ఐదేళ్ల పాలనపై ఫ్యాక్షన్ ముద్ర వేశారు. నిజంగా మీరు చెప్పినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఏపీలో మీరు తిరగ గలిగేవారా. ప్రజలు మీకు ఓటేసింది ప్రజలకు మంచి చేయమని. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు చేయడానికి కాదు.

    ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పదు.టీడీపీ వాళ్లు ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడలేదు.మీరు రెచ్చగొట్టే కొద్దీ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వస్తారు.ప్రతీ ఒక్కరికీ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మీ ప్రభుత్వానికి మరో మూడేళ్లే ఎక్స్ పైరీ డేట్.

    పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

    అన్నారో లేదో తెలియని మాటకు చంద్రబాబు రాష్ట్రమంతా తిరిగి ఏడ్చారు.జోగి రమేష్ ఇంటి పై దాడి చేసిన సమయంలో వాళ్లింట్లో ఉన్నది కూడా మహిళలే. వెనక నుంచి దాడి చేయడం ..వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ దాడి చేయలేదు. కేవలం జోగి రమేష్ నిరసన తెలియజేశారు.జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ నేతలెవరో, వారి వివరాలు ఉన్నాయని హెచ్చరించారు. 

  • కడప:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకు ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, మరి దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు  తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘తిరుమల లడ్డూపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం ఆపడం లేదు. 

    డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసేందుకు ఈ దాడులు. బాధితులపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకు చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ప్రశ్నించడం తప్పా. చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చారా?, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.  

    హామీల అమలుపై కూటమి నేతలు చర్చకు సిద్ధమా?, తిరుమల లడ్డూ  వ్యవహారంలో చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వరస్వామి శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా  ఉన్న ఏపీలోని కూటమి సర్కార్‌.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

    తప్పించుకోలేరు.. సతీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
  • తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. పాలకులే గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం’ అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడదల రజిని.. ‘మళ్లీ వస్తాం.. మళ్లీ కొడతాం అని  ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తుంచుకుంటే మంచిది. మహిళా పక్షపాతి లాగ తెగ బిల్డప్‌లు ఇస్తారు.. మళ్లీ మీరే దాడులు చేస్తారు.

    కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు. లడ్డూ ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు. మాపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తే.. కనీసం స్పందన లేదు. కూటమి పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గుడికెళ్లి మొక్కుకుంటే తప్పా. వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కదా. వైఎ‍స్సార్‌సీపీ వాళ్లు ఏ గుడికి వెళ్లొద్దని చట్టం చేయండి. 

    తిరుమల లడ్డూ వ్యవహారంలో జరగని కల్తీని జరిగినట్లు దుష్ర్పచారం చేస్తున్నారు. మేము కూటమి నేతలను నిలదీస్తున్నామనే మాపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రాష్ట్రంలో రాజ్యాంగం లేదు.. ప్రజాస్వామ్యం లేదు.. శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలసీ, రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది. రెడ్‌బుక్‌ అరాచకంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మీరెన్ని దాడులు చేసినా మేము ప్రజల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.

    Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: ఏ హక్కుతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెడతారంటూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు గీతం యూనివర్సిటీ తరఫు న్యాయవాదులపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది.

    బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి.

    ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టే ప్రయత్నాలపై విశాఖకు చెందిన న్యాయవాది గ్రేస్‌ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.

    మంగళవారం ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.

     

  • సాక్షి, కృష్ణాజిల్లా: పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్‌లో పవన్ కుమార్‌కి తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జనవరి 5న పవన్‌పై ఆరుగురు విద్యార్థులు దాడి చేశారు. కొట్టిన దృశ్యాలను విద్యార్థులు ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్‌పై విద్యార్థులు దాడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థి.. హాస్టల్‌లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లను పవన్‌ చేతిపై రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు గోప్యంగా ఉంచిన శ్రీచైతన్య యాజమాన్యం.. సాక్ష్యాలను తారుమారు చేసింది. చేతిపై ఉన్న పేర్లను శ్రీచైతన్య సిబ్బంది తుడిచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను జువెనైల్  కోర్టుకు తరలించారు. కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జేఎల్‌లు రాజేష్, ఆనంద్, కృష్ణ, మెస్ బాయ్ హేమంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్‌ జగన్‌ పరిశీలించనున్నారు.

    టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

  • సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేసింది. 

    అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

    ‘చర్యలుండవ్‌’ అంటూ
    లైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్‌ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్‌’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.

    కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.

  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అంబటి రాంబాబుతో ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ములాఖత్‌ అయ్యారు. అనంతరం ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రుల ఇల్లు తగలపెట్టే సంప్రదాయం రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని.. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇలాంటి విధానం రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదన్నారు.

    ‘‘కల్తీ రిపోర్టు వచ్చింది. సారీ చెప్తున్నానని చంద్రబాబు చెప్పుంటే గౌరవం పెరిగి ఉండేది. తప్పించుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు.. మీరు చేసే పనులు బాగోలేదు.. మీలో మార్పు రావాలి. దేశంలో మాజీ మంత్రుల ఇల్లు తగలబెట్టిన అరాచకం ఎక్కడా జరగలేదు’’ అని ముద్రగడ పేర్కొన్నారు.

    పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ
    మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఓటు ద్వారా అధికారం లభిస్తే చంద్రబాబు మళ్లీ ఆటవిక పాలనలోకి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో బాధితులు ముద్దాయిలవుతున్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందని పోస్టర్లు వేయటం ఎంత దారుణం. అంబటి ఇంటిపై దాడి చేసిన 5 గంటల పాటు పోలీసులు నిస్తేజంగా ఉండిపోవటం దారుణం. దాడి సమయంలో ఇంట్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. బాధితులను చంద్రబాబు నిందితులుగా మారుస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది

    ..ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అంబటి చెప్పారు. జైల్లో మాజీ మంత్రికి ఇవ్వాల్సిన మినిమం ప్రివిలైజేస్ కూడా ఫాలో కావటం లేదు. కేంద్ర మంత్రి పెమ్మసాని  దారుణమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారాన్ని తెలియజేయటానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ప్రజా పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గేది లేదు’’ అని వేణుగోపాలకృష్ణ తేల్చి చెప్పారు.

  • కాకినాడ: ఏపీలో విచ్చలవిడిగా అధిక ధరలకు లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయని చాలాకాలంగా వైఎస్సార్‌సీపీ చెబుతూ వస్తున్నమాట వాస్తవమేననేది తేటతెల్లమైంది. ఏపీలో అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటనతో లిక్కర్‌ దందా జరుగుతుందనేది బట్టబయలైంది. ఏపీలో మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో అధిక ధరలపై తమకు వరుస ఫిర్యాదు వచ్చాయని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటించింది.  

    ఇందులో పవన్‌ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో అధిక ధరలే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయానికి ఫిర్యాదులొచ్చాయి.  ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటించడంతో అసలు విషయం వెలుగుచూసింఇ. 

    ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖక సూచించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది పవన్‌ కార్యాలయం. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి ఏపీలో లిక్కర్‌ షాఫులు నిర్వహిస్తున్నారు. అత్యధిక శాతం లిక్కర్‌ దందా అంతా కూడా కూటమి కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా అత్యధిక ధరలకు మద్యం అమ్ముతూ క్యాష్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Family

  • తలపై జుట్టు బాగా పెరగాలని మహిళలు కోరుకోవడం ఎంతో సాధారణమో... దేహంలోని కొన్ని భాగాల్లో అంటే... పైపెదవీ, గదమ మీద జుట్టు పెరగకూడదని కోరుకోవడం కూడా అంతే సహజం. అలా జుట్టు పెదవులపైనా గడ్డంపైనా పెరగడాన్ని వారు ఎంతమాత్రమూ ఇష్టపడరు. అలాంటి అవాంఛిత రోమాలను అనేక విధాల తొలగించుకోడానికి మహిళలు ప్రయత్నిస్తుంటారు. ఇలా వారు కోరుకోని ప్రదేశాల్లో వెంట్రుకలు పెరగడాన్ని అవాంఛిత రోమాలు అనీ... అదే వైద్యపరిభాషలో హిర్సుటిజమ్‌ (Hirsutism) అని చెబుతారు. అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు, వాటికి పరిష్కారాలేమిటన్నది తెలుసుకుందాం...

    సాధారణంగా మానవుల శరీరమంతటా రోమాలు ఉండనే ఉంటాయి. మనం క్షీరదాల కోవకు చెందినవాళ్లం కావడం వల్ల... క్షీరదాల్లో ఇలా ఒళ్లంతా వెంట్రుకలు ఉండటం ఒక లక్షణం కావడం వల్ల ఒంటి నిండా రోమాలు ఉండటం సహజం. కాకపోతే దేహంలోని కొన్ని చోట్ల అవి అవి ఉండాల్సినట్టుగా ఉండకుండా పెరగడాన్ని అవాంఛిత రోమాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు పురుషుల్లో గడ్డం, మీసం ఉండటం సహజం. కానీ మహిళల్లో అవి ఉండవు. ఉన్నప్పటికీ ప్రస్ఫుటంగా కనిపించకుండా... నూగుగా... ఉండీ ఉండకుండా కనిపిస్తుంటాయి. అయితే కొందరిలో అవి పురుషుల్లో మాదిరిగా పెరుగుతూ స్పష్టంగా కనిపించే అవకాశముంటుంది.  

    అవాంఛిత రోమాలంటే... 
    మహిళల్లో చెంపలూ, చుబుకం, పై పెదవుల వంటి చోట్ల కూడా కనీ కనిపించకుండా రోమాలు ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత సులభం కాదు. సాధారణంగా మహిళలందరి విషయంలోలా కాకుండా భిన్నంగా కనిపించేవాటిని అసహజమైన వెంట్రుకలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు గదమ, చెంపలు, పెదవులపైన వెంట్రుకలు పెరుగుతూ... అవి మరీ గుబురుగా పెరుగుతుంటే వాటిని అవాంఛిత  రోమాలుగా పేర్కొనవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది శాతం మహిళల్లో... పురుషుల్లో మాదిరిగానే గడ్డంపైనా, పెదవులపైనా వెంట్రుకలు కనిపిస్తాయన్నది వైద్య నిపుణుల మాట.

    హిర్సుటిజం, హైపర్‌ట్రైకోసిస్‌ అంటే...?
    మహిళల్లో కనిపించే ఈ అవాంఛిత రోమాలను హిర్సుటిజమ్‌ అనీ అలాగే  హైపర్‌ట్రైకోసిస్‌ (Hypertrichosis) అని రెండు రకాలుగా చెప్పవచ్చు. స్త్రీలలోనూ పురుషుల మాదిరిగానే  వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజమ్‌’గా చెప్పవచ్చు.

    అయితే హైపర్‌ట్రైకోసిస్‌ కండిషన్‌లోనూ వెంట్రుకలు పెరిగినప్పటికీ... అవి పురుషుల్లోలాగా ఉండవు. ఉదాహరణకు మహిళల హార్మోన్లలో ఏవైనా తేడాలు వచ్చి పురుషుల్లోలా వెంట్రుకలు పెరగడాన్ని హిర్సుటిజమ్‌గా చెప్పవచ్చు. కానీ వాళ్ల దేహంపైనా వెంట్రుకలు ఉన్నప్పటికీ అవి ఉండాల్సినంతగా కాకుండా చాలా ఎక్కువగా పెరగడాన్ని ‘హైపర్‌ ట్రైకోసిస్‌’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ఇలా జరుగుతుంది. ఇక కొందరిలో అంతకుముందు లేకపోయినా... కొన్ని రకాల మందులు వాడాక దేహంపైన రోమాలు రావచ్చు. అలా మునుపు లేనివీ... అటు తర్వాత ఏదైనా కారణాలతో రోమాలు పెరగడాన్ని కూడా ‘హైపర్‌ ట్రైకోసిస్‌’గా చెప్పవచ్చు.

    కారణాలు 
    మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... 
    హార్మోన్లలో తేడాలు...
    మహిళల్లో స్రవించే హార్మోన్లలో పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ అవసరమైన మోతాదు కంటే మించి స్రవించినప్పుడు... ఆ అంశం మహిళల్లో అవాంఛిత రోమాలకు దారితీయవచ్చు.

    పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌... 
    మహిళల్లో పురుషుల్లోలా వెంట్రుకలు పెరిగేందుకు పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌’ (పీసీవోడీ) కూడా ఒక కారణం. హిర్సుటిజమ్‌ ఉన్న మహిళలలో వైద్యపరీక్షలు చేసినప్పుడు వాళ్లలో చాలామందికి (దాదాపు 70% మందిలో) పీసీవోఎస్‌ ఉన్నట్లుగా ఫలితాలు రావడం చాలా సహజం. పీసీఓఎస్‌ ఉన్న మహిళల అండాశయాలు (ఓవరీస్‌) పురుష హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాంతో ఆ హార్మోన్‌ మహిళల్లో సాధారణంగా ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అవాంఛిత రోమాలు పెరగడం కనిపిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లలో మొటిమలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. యుక్తవయసు దాటి΄ోయాక కూడా మొటిమలు రావడం, అవాంఛితమైన రోమాలు ఉంటే పీసీవోఎస్‌ ఉందేమో అని అనుమానించాలి.

    పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీవోడీ) సమస్య ఉన్నప్పుడు నిపుణులైన గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా నెలసరి సమస్యలు సరయ్యేలా చూసుకోవడం, చికిత్సను మధ్యలో ఆపకుండా సమస్య పరిష్కారమయ్యేవరకు / పూర్తిగా తగ్గేవరకు వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ను కొనసాగించాలి.

    కొన్ని రకాల గ్రంథుల సమస్య ఉన్నప్పుడు... 
    కొందరు మహిళల్లో థైరాయిడ్‌ గ్రంథి సమస్యగానీ, పిట్యూటరీ గ్రంథి సమస్య ఉన్నప్పుడు కూడా వారిలో పురుషుల్లోలాగానే వెంట్రుకలు పెరగవచ్చు. అందుకే... అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించి దానికి అసలు కారణాలు తెలుసుకుని చికిత్స తీసుకోవడం అవసరం.

    ఇడియోపథిక్‌ హిర్సుటిజమ్‌ అంటే...
    కొద్దిమంది మహిళల్లో పురుషహార్మోన్‌ స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ... వెంట్రుకల పెరుగుదల మాత్రం అసాధారణంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను ‘ఇడియోపథిక్‌ హిర్సుటిజమ్‌’గా చెబుతారు. వీళ్లలో రుతుక్రమం మామూలుగానే ఉంటుంది. గర్భం రావడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాకపోతే వెంట్రుకల పెరుగుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.

    అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు 
    అవాంఛిత రోమాలున్న మహిళల్లో కనిపించే ఇతర లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. 
    సాధారణంగా వీళ్లు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటారు. అంటే స్థూలకాయం / ఊబకాయంతో ఉండవచ్చు. 
    పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం. 
    మెడ దగ్గర ప్రధానంగా మెడ వెనక భాగంలోనూ, చర్మం ముడతలు పడే ప్రదేశాల్లో చర్మం మరింతగా నల్లగా, మందంగా కనిపించవచ్చు. ఇలా చర్మం మందంగా, నల్లగా కనిపించే కండిషన్‌ను ‘ఎకాంథోసిస్‌ నైగ్రికాన్స్‌’ అంటారు.

    డయాబెటిస్‌ వచ్చే ముప్పు ఎక్కువ... 
    అవాంఛిత రోమాల సమస్యతో బాధపడేవాళ్ల రక్తంలో సాధారణంగా చక్కెర మోతాదులను అదుపులో పెట్టేందుకు మరింత ఎక్కువగా ‘ఇన్సులిన్‌’ హార్మోను అవసరమవుతుంది. అందుకే ఇలాంటి వాళ్లు చాలాకాలం పాటు ఎలాంటి చికిత్సా తీసుకోకపోతే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వచ్చి, అది క్రమంగా డయాబెటిస్‌ సమస్యకు దారితీసేందుకు అవకాశాలెక్కువ.

    ఈ వైద్యనిపుణుల సహాయంతో... 
    అవాంఛిత రోమాలు వచ్చే మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. అంటే వీళ్లలో నెలసరి (పీరియడ్స్‌) సక్రమంగా రావు. బరువు ఎక్కువగా పెరగడం, చర్మంలో ముడతలు ఉండే మెడ, బాహుమూలాలు వంటి చోట్ల చర్మం దళసరిగా మారడం, మొటిమలు ఎక్కువగా వస్తుండటం వంటి లక్షణాలతో పాటు ఒకవేళ మాడుపై తగినన్ని వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆ బాధితులు.. ఎండోక్రైనాలజిస్ట్‌ (హార్మోన్ల నిపుణులు)ను, డెర్మటాలజిస్ట్‌ (చర్మవ్యాధుల నిపుణుల)ను సంప్రదించాలి. ఈ లక్షణాలున్నవారు తాము ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్నప్పుడు గైనకాలజిస్ట్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఎండోక్రైనాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్‌... ఈ ముగ్గురూ ఒక టీమ్‌గా చికిత్స అందిస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. 

    ఒకవేళ పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌)తో బాధపడుతున్న మహిళలైతే వారు తమ జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లను కొనసాగించాలి. ఇవి చేస్తూ తమ బరువును తగ్గించుకోవడం లేదా నియంత్రణలో ఉంచుకోవడం చేస్తూ... వాటితో పాటు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి తాత్కాలిక ప్రక్రియలనో లేదా శాశ్వత పద్ధతులనో అవలంబించాలి.

    అవాంఛిత రోమాల తొలగింపునకు తాత్కాలిక ప్రక్రియలు

    థ్రైడ్డింగ్‌ అండ్‌ వ్యాక్సింగ్‌ ...
    సాధారణంగా చాలామంది మహిళలు తమ అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి ముఖ్యంగా థ్రెడింగ్, వ్యాక్సింగ్‌ లాంటి తాత్కాలిక ప్రక్రియలను అనుసరిస్తుంటారు. ఇవి తరచూ చేస్తున్న క్రమంలో కొందరిలో వెంట్రుకమూలంలో/ రోమం అంకురంలో ఇన్ఫెక్షన్స్‌ రావడం (ఫాలిక్యులైటిస్‌) వంటి ముప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అప్పుడక్కడ రోమం కుదురు దగ్గర ఒక గడ్డలా మారి అక్కడ చీమూ పట్టే అవకాశాలెక్కువ. అలాంటి సందర్భాల్లో నొప్పి కూడా రావచ్చు. ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్‌ ప్రక్రియలను అనురించేవారి చర్మం నల్లబడవచ్చు. 

    తగినంత పరిశుభ్రత పాటించకపోతే థ్రెడ్డింగ్‌తో ఒక్కోసారి పులిపిరులతో కూడిన వైరల్‌ వార్ట్స్‌ రావచ్చు. కొందరు మహిళలు అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్స్‌ ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించేప్పుడు అలర్జీలు రాకపోతే వాటిని సురక్షితమైనవిగా భావించి, వాటిని వాడుకోవచ్చు. అయితే హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌ను ఉపయోగించే ముందు అది సురక్షితమా, కాదా అని తెలుసుకోడానికి  చర్మంపై ఎక్కడైనా కొద్దిగా ఉపయోగించి చూడటం (ప్యాచ్‌ టెస్ట్‌) అవసరం.

    షేవింగ్‌... అపోహలు... 
    అవాంఛిత రోమాలను తొలగించుకోడానికి సాధారణంగా భారతీయ మహిళలు షేవింగ్‌ను అంతగా ఇష్టపడరు.  షేవింగ్‌ తర్వాత మరింత గుబురుగా వెంట్రుకలు వస్తాయన్న అపోహ ఉండటం, షేవింగ్‌ (Shaving) వల్ల చర్మం మరింత గరుగ్గా, మందంగా మారుతుందనే అభిప్రాయాలు ఉండటంతో తమ లుక్స్‌ను కాపాడుకునే క్రమంలో దాన్ని ఒక సురక్షితమైన, నమ్మదగిన ప్రక్రియ అనుకోరు. అయితే అవి అపోహలే. అయినప్పటికీ షేవ్‌ చేసిన మర్నాడో లేదా వెంటవెంటనో వెంట్రుకలు పెరుగుతుండటం మామూలే కావడం, షేవ్‌ చేసిన మేర చర్మం రంగు ఒకింత మారడం వంటి కారణాల వల్ల ఇలా అపోహ పడటానికి అవకాశముంది.

    చ‌ద‌వండి: నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఇదిగో ప‌రిష్కారం

    ఇవిగాక... అవాంఛితమైన రోమాలను తొలగించుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల వైద్యప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు లేజర్‌ ప్రక్రియలూ, ఎలక్ట్రోలైసిస్‌ (electrolysis) మార్గాల వంటి అధునాతన చికిత్సలూ ఉన్నాయి. అయితే వైద్య సంబంధితమైన ఎలాంటి విద్యార్హతలు లేకుండా తమను తాము బ్యూటీషియన్లు, కాస్మటాలజిస్టులమని చెప్పుకునే వారి దగ్గరకు వెళ్లడం కంటే... వైద్యపరమైన విద్యార్హతలు (క్వాలిఫైడ్‌) వైద్యనిపుణులై డర్మటాలజిస్టులు /ట్రైకాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది. ఇక ఇలాంటివారైతే... మహిళల్లో ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు (అండర్‌లైయింగ్‌ కాజెస్‌) ఉండటం వల్ల అవాంఛిత రోమాలు వస్తే... తగిన మందులు ఇవ్వడం లేదా  సమస్య మూలాలను తెలుసుకుని  సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించమంటూ సలహా ఇవ్వడం వంటివి చేస్తారు.

    కొందరు మహిళల్లో వెంట్రుకలు పలుచబడటం కూడా...
    మహిళల్లో అవాంఛిత రోమాలు ఎంత సహజమో... అలాగే కొంతమంది స్త్రీలలో  వెంట్రుకలు పలచబారడమూ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా పాపిట తీసే చోట కనిపించడం చాలా సాధారణం. అక్కడ వెంట్రుకలు మరింతగా పలచబారిపోయి పాపిట ఉండాల్సిన దానికంటే చాలా వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడాన్ని ‘ఫిమేల్ ప్యాటరన్‌ హెయిర్‌ లాస్‌’’ అంటారు. కొందరిలో ఈ సమస్యను గుర్తించాక... వీలైనంత త్వరగా చికిత్స తీసుకుంటే (సాధారణంగా ఆర్నెల్లలోపు) ఈ సమస్యను మందులతో అధిగమించవచ్చు. అంటే కోల్పోయిన వెంట్రుకలను తిరిగి పొందవచ్చు. అది కుదరకపోయినా మరిన్ని వెంట్రుకలు రాలిపోకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే వెంట్రుకలు మరింతగా రాలిపోయి పూర్తిగా పలచబడితే హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ మాత్రమే ప్రత్యామ్నాయమవుతుంది. 

    నిర్వహణ: యాసీన్‌