Archive Page | Sakshi
Sakshi News home page

Karimnagar

  • చిన్నారుల్లో కళా నైపుణ్యాల రూపం బాలభవన్‌లో వికసిస్తున్న సృజనాత్మక ప్రతిభ

    కరీంనగర్‌కల్చరల్‌: వేసవి సెలవులు సరదాగా గడపడమే కాకుండా తమలోని సృజనాత్మకతకు పదును పెడుతూ చిన్నారులు కళారంగంలో నైపుణ్యాలు సొంతం చేసుకుంటున్నారు. నగరంలోని బాలభవన్‌లో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంప్‌లో ఆర్ట్‌ అండ్‌క్రాస్ట్‌, మెహందీ, పెయింటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. పేపర్‌తో అందమైన తోరణాలు, రంగురంగుల పూల తయారీ, పాట్‌ పెయింటింగ్‌, వాల్‌ డిజైనింగ్‌ నేర్పిస్తున్నారు. సాధారణ వస్తువులతో అందమైన అలంకరణ వస్తువులు తయారు చేయడం చిన్నారుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తోంది. మరోవైపు మెహందీలో డిజైన్లను నేర్చుకుంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.

    నేను బాల భవన్‌లో టైలరింగ్‌, మెహందీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, ఎంబ్రాయిడరీ, కుట్లు, అలికలు, టైలరింగ్‌, బ్యూటీషియన్‌, వేస్ట్‌ మెటీరియల్‌ తోటి అందమైన వస్తువుల తయారీ చేయడంలో తర్ఫీదు ఇస్తున్నా. పిల్లలు ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నారు. మంచి మంచి వస్తువులు తయారు చేసి చూపిస్తున్నారు.

    – పెందోట సూర్యశ్రీ, శిక్షకురాలు

    నేను కుట్లు, అలికలు, సంగీతం, మెహందీ నేర్చుకుంటున్నాను. ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వడానికి ఈ నాకు బేసిక్స్‌ ఉపయోగపడతాయి. ప్రతి విషయం వివరంగా అర్థమయ్యే విధంగా నేర్పిస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు చక్కగా నేర్చుకుంటున్నాను.

    – సిద్దితా శ్రేయన్‌

  • జ్యోతినగర్‌(రామగుండం): మహిళా సాధికార త, మహిళల అత్యుత్తమ విజయాలను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక నారీ శక్తి అవార్డు– 2026ను తెలంగాణ ఇక్కత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌, మిస్‌ ఆసియా ఇంటర్నేషనల్‌ రష్మీ ఠాకూర్‌ అందుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మహిళలను సత్కరించారు. రామగుండంకు చెందిన రష్మీఠాకూర్‌ ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పోచంపల్లి ఇక్కత్‌ సారీస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పాల్గొన్నారు.

  • నేటి సమాజంలో మొబైల్‌ ఫోన్‌కు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వట్లేదు. మొబైల్‌ ఫోన్‌ ఉంటే ఏదైనా చేయవచ్చు.. ఏదైనా సాధించొచ్చు అనే ఊహలో బతికేస్తున్నాం మనం. మన ప్రతీ పనిలో మొబైల్‌ భాగమైపోయింది. ఈ మొబైల్‌ ఒక కుటుంబంలో ఆనందాన్ని నింపితే.. మరో కుటుంబంలో మంటలు రాజేస్తూ విషాదాలు నింపుతుంది. ఈ ఫోనే భౌతిక బంధాలను దూరం చేస్తుంది. సాటి మనిషిని కలవకుండా చేస్తుంది. నీ ఫోన్‌ను బంగారు భవిష్యత్‌ కోసం వినియోగించుకుంటావో? అనవసరమైన మనుషుల కోసం జీవితాన్ని భారంగా మలచుకుంటావో? నీ చేతుల్లోనే ఉంది సోదరా..

    మోటె శివకుమార్‌

    గ్రామం:

    కాకునూరు

    జిల్లా: రంగారెడ్డి

  • కణాల అసాధారణ పెరుగుదలే ట్యూమర్‌...

    బ్రెయిన్‌ ట్యూమర్‌ అనేది మెదడులో లేదా దాని చుట్టుపక్కల భాగాల్లో కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్య. ఇది నిరపాయమైన లేదా ప్రాణాంతకమైన రూపంలో ఉండొచ్చు. ఏ రూపమైనా మెదడు పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ట్యూమర్‌ ఎక్కడ ఏర్పడిందో దాని ఆధారంగా లక్షణాలు మారుతాయి. కొన్ని సందర్భాల్లో చాలా నెమ్మదిగా లక్షణాలు కనిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో సమస్యలు తీవ్రమవుతాయి.

    న్యూరో లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు...

    మెదడు సంబంధిత వ్యాధుల్లో సమయం అత్యంత కీలకం. ప్రారంభ దశలో గుర్తిస్తే శస్త్రచికిత్స, రేడియేషన్‌ లేదా ఇతర ఆధునిక చికిత్సల ద్వారా మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఆలస్యమయితే చికిత్స క్లిష్టమవడంతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ తలనొప్పి అనుకుని నెలల తరబడి మందులు వాడుతూ ఉండటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూర్చలు, చూపు సమస్యలు లేదా చేతులు– కాళ్ల బలహీనత వంటి లక్షణాలు కలిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

    అందుబాటులో ఆధునిక వైద్యం

    వైద్య సాంకేతికత వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ నిర్ధారణ, చికిత్సలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి ఆధునిక పరీక్షల ద్వారా ప్రారంభ దశలోనే ట్యూమర్‌ను గుర్తించవచ్చు. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మైక్రో న్యూరోసర్జరీ, న్యూరో నావిగేషన్‌ టెక్నాలజీ, ఆధునిక రేడియేషన్‌ థెరపీ వంటి విధానాలతో ప్రమాదాన్ని తగ్గిస్తూ చికిత్స అందించడం సాధ్యమవుతోంది. రోగులు సురక్షితంగా, వేగంగా కోలుకునే అవకాశం ఉంది.

    తరచూ తలనొప్పి, మూర్చను నిర్లక్ష్యం చేయొద్దు

    ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయడం సాధ్యం

    నేడు ‘ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే’

    బ్రెయిన్‌ ట్యూమర్‌ ప్రారంభ సంకేతాలు సాధారణ సమస్యలతో కలిపి కనిపించే అవకాశం ఉండటంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఈ లక్షణాలు పదేపదే కనిపిస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

    తరచూ లేదా తీవ్రమైన తలనొప్పి

    ఉదయం వేళల్లో ఎక్కువగా వాంతులు రావడం మూర్ఛ రావడం

    చూపు మందగించడం లేదా డబుల్‌ విజన్‌

    మాటలు తడబడటం లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది

    జ్ఞాపకశక్తి తగ్గడం, ప్రవర్తనలో మార్పులు

    నడకలో అసమతుల్యత, శరీరంలో ఒక వైపు బలహీనత

    ఈ లక్షణాలు ఇతర సాధారణ వ్యాధుల్లో కూడా కనిపించవచ్చు. కానీ నిరంతరంగా లేదా తీవ్రంగా పెరుగుతూ ఉంటే మాత్రం వెంటనే న్యూరో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

    కరీంనగర్‌: తరచూ తలనొప్పి వస్తోందా? కారణం లేకుండా వాంతులు అవుతున్నాయా? ఒక్కసారిగా మూర్చ రావడం, చూపు మందగించడం, మాట తడబడటం లేదా శరీరంలో ఒక వైపు బలహీనత కనిపిస్తోందా? వీటిని సాధారణ సమస్యలుగా తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పిని పనిఒత్తిడిగా... మతిమరుపును వయసు ప్రభావంగా.. కళ్లు తిరగడాన్ని అలసటగా.. తేలికగా తీసుకుంటాం... ఇవి కొన్ని సందర్భాల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌ సంకేతాలు కావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, రోగి జీవనప్రమాణం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. నేడు ప్రపంచ బ్రెయిన్‌ ట్యూమర్‌ డే.

    బ్రెయిన్‌ట్యూమర్‌ అనగానే భయపడొద్దు. గతంలో ట్యూమర్‌వస్తే చనిపోతారనే భయం ఉండేది. ప్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ప్రతి ట్యూమర్‌ కేన్సర్‌కాదు. ఆపరేషన్‌తో నయం అవుతుంది. అయితే బ్రెయిన్‌ ట్యూమర్‌ విషయంలో అవగాహన అత్యంత కీలకం. కుటుంబ సభ్యులు, సమాజం కలిసి ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకుంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చు. ముఖ్యంగా పిల్లలు, యువత, వద్ధులు తరచూ తలనొప్పి లేదా మూర్చ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

    – డాక్టర్‌ రాజీవ్‌రెడ్డి, న్యూరోసర్జన్‌

  • అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో రాజేశ్‌, స్వరూప అనే దంపతులు నివసించేవారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు సోము. ఆ సోముకి చదవడమన్న, ఎదుటివారితో మాట్లాడడమన్న చాలా భయం. సోమును తన తోటి విద్యార్థులు, గ్రామస్తులు పిరికివాడు అనేవారు. కానీ అతనికి చాలా పెద్ద కోరిక ఉండేది. పెద్ద కంపెనీకి సీఈవో కావాలని ఆశ. కానీ తనకున్న భయంతో ఎవరితో తన కోరిక చెప్పలేకపోతాడు. సోమును ఎవరూ ప్రోత్సహించకపోవడంతో.. ఎవరూ పట్టించుకోకపోవడంతో తనపై తనకు ద్వేషం కలిగింది.

    అలా ఉండగా ఒక రోజు సోమువాళ్ల లెక్కల మాస్టారు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతాడు. సోము అసలు చదవడం లేదని, ఎవరితో కలిసి ఉండడని, ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడని చెపుతాడు. ఆ విషయం విని బాధపడిన తల్లిదండ్రులు సోముని చేరదీసి అసలు విషయం అడుగుతారు. దానికి సోము ఎవరితోనైనా మాట్లాడాలంటే తనకు చాలా భయమని చెప్తాడు. ఆ విషయాన్ని విన్న రాజేశ్‌.. బేటా భయపడటం ద్వారా మనం ఈ సమాజంలో బతకడం చాలా కష్టం. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడుతావో అప్పుడే నీకు విలువ ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. అప్పుడే నీవు అనుకున్నది సాధించవచ్చు. అమాయకంగా ఉంటే నిన్ను పట్టించుకునే వాళ్లు ఎవరూ ఉండరు.. అని హితబోధ చేస్తాడు. తన తండ్రి మాటలతో ప్రభావితమైన సోము ఇక నుంచి నేను భయపడను. ధైర్యంగా ఉంటాను. బాగా చదువుకుంటాను అని అంటాడు.

    ఆ తర్వాత రోజు నుంచి సోము క్రమంగా తన భయాన్ని పోగొట్టుకొని అందరితో మాట్లాడుతాడు. తరగతిలో చురుకుగా ఉండి బాగా చదువుతాడు. సోములో వచ్చిన మార్పును చూసి అతని మిత్రులందరూ ఆశ్చర్యపోతారు. అతనితో అందరూ స్నేహంగా ఉంటారు. దాంతో సోము బాగా చదువుకొని పెద్దయ్యాక తను అనుకున్న విధంగానే ఒక పెద్ద కంపెనికి సీఈవో అవుతాడు. కొడుకును ఉన్నత స్థానంలో చూసి ఎంతో సంతోషపడతారు రాజేశ్‌ దంపతులు.

    టి.సుష్మ, పదోతరగతి

    తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

    చింతకుంట, కరీంనగర్‌(జిల్లా)

  • మల్లాపూర్‌: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఒబులాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తదాంరాజుపల్లికి చెందిన ఇల్లెందుల సత్తయ్య, పద్మ పెద్ద కుమారుడు వంశీ (26) బీటెక్‌ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లేందుకు రూ.1.50లక్షలు ఏజెంట్‌కు చెల్లించాడు. సదరు ఏజెంట్‌ గల్ఫ్‌కు పంపకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఒబులాపూర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఉరేసుకున్నాడు. మల్లాపూర్‌ ఇన్‌చార్జి ఎస్సై గంగాధర్‌ ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    మనస్తాపంతో రైతు..

    చొప్పదండి: చేసిన అప్పులు తీర్చడానికి వ్యవసాయ భూమి అమ్ముకొని మనస్తాపానికి గురై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చొప్పదండ మండలంలోని చాకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం చాకుంట గ్రామానికి చెందిన మద్దం నర్సయ్య(62) గతంలో డైరీఫార్మ్‌ నిర్వహించి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తనకున్న వ్యవసాయ భూమిని అమ్ముకున్నాడు. ఉన్న భూమి అప్పులకిందికే పోవడంతో మనస్థాపానికి గురై ఈ నెల 6న గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు ముద్దం నరేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • బాబు జగ్జీవన్‌రామ్‌ చంద్ర గ్రామంలో పుట్టాడు

    సామాజిక న్యాయంకై పోరాటం తలుపు తట్టాడు

    కనీస వేతన చట్టాన్ని ప్రవేశపెట్టిన దళిత నేత

    హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ప్రఖ్యాత !

    వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినవాడు

    స్వాతంత్య్ర సమరంలో నిలిచి గెలిచిన రేడు

    భారత్‌లో బాబూజీగా తాను ప్రసిద్ధుడు

    సమసమాజ స్థాపనకు తానాయే సంసిద్ధుడు !

    హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి

    కుల రహిత సమాజ ప్రాకారం కట్టి

    కాంగ్రెస్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీని పెట్టి

    జగత్‌ ప్రఖ్యాతి గాంచిన జగజ్జెట్టి

    స్వయం పోరాటం చేసి ఎదిగిన రాజకీయవేత్త

    దళితుల పోరాటంలో చూపించెను తన సత్తా

    ఆయన హృదయం నవనీతం కన్నా మెత్త

    పోరు సల్పిన అందరికీ పంచె సమన్యాయం బత్త !

    పోరాటాలకు ఆయన ఓ వెన్నెముక

    ఆరిపోని నిరంతరం మండే ఓ అగ్నిశిఖ

    సేవారంగంలో చూపించను తన తడాఖ

    గాంధీజీ నేతాజీలకు తానాయెను ప్రియ సఖ !

    శోభిరామ్‌ వసంత దేవిల కుమారుడు

    1986 జూలై నెలలో అయ్యాడు అమరుడు

    అమరుడైన బాబూజీకి ఇవ్వాలి నివాళి

    అంజలి ఘటించి చదువుదాం కావాలి !

    గుర్రాల లక్ష్మారెడ్డి

    కవి, రచయిత

    కల్వకుర్తి

    నాగర్‌ కర్నూల్‌ (జిల్లా)

  • తంగళ్లపల్లి(సిరిసిల్ల): సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావుకు పుత్రశోకం కలిగింది. అనారోగ్యంతో కుమారుడు అశ్విన్‌రావు ఆదివారం మృతిచెందాడు. దీంతో జిల్లా కేంద్రం సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలంలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల సెస్‌చైర్మన్‌ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్‌రావు(36) కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రక్తపోటు అధికం కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. కుమారుడి మరణంతో చిక్కాల రామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చికిత్సను అందించారు. అశ్విన్‌రావు అంత్యక్రియలు సోమవారం సిరిసిల్లలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అందె సుభాష్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌ తరలివెళ్లారు.

    అవయవదానం..

    అశ్విన్‌రావు బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆపదలో ఉన్న నలుగురికి ప్రాణదానం చేశారు.

    చిక్కాల అశ్విన్‌రావు బ్రెయిన్‌డెడ్‌

    అవయవదానంతో నలుగురికి ప్రాణదానం

  • ఇబ్రహీంపట్నం: జీవనోపాధి నిమిత్తం మస్కట్‌ వెళ్లిన మండలకేంద్రానికి చెందిన జంగోని రవీందర్‌ (48) రెండు రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపా రు. రవీందర్‌ 20 ఏళ్ల క్రితం మస్కట్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ట్రక్‌ను నడుపుతూ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. రవీందర్‌కు భార్య లావణ్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

    ఖిలా వరంగల్‌: రైలు నుంచి జారి పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆది వారం వరంగల్‌– చింతలపల్లి రైల్వేస్టేషన్‌ మ ధ్య జరిగింది. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తికి చెందిన పర్లపల్లి శ్రీకాంత్‌ (30) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మణుగూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు వ రంగల్‌ –చింతలపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య జారి ప డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద లభించిన పగిలిపోయిన మొబైల్‌లోని సిమ్‌నంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని తండ్రి అయిలయ్యకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ తెలిపారు.

Adilabad

  • ఆదిలాబాద్‌టౌన్‌: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐ టీ యూ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలను ఆర్థికంగా బలోపేతం చేసే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచుతూ పేదల నడ్డీ విరుస్తున్నారని విమర్శించారు. ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని జూలై 1న దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు తెలిపా రు. అలాగే ఈనెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వామి, లంకా రాఘవులు, ఆశన్న, చింటు, రాజక్క తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌టౌన్‌: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు పురస్కరించుకుని డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేయడం, నిల్వ చేయడంపై ఫుడ్‌సెప్టీ అధికారులు అందించే సూచనలు తప్పని సరిగా పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ టి.నాయక్‌ సురక్షితమైన ఆహారం తయారీ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు

  • ● కూలేందుకు సిద్ధంగా 135 ప్రభుత్వ పాఠశాలల భవనాలు ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● త్వరలోనే పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ● వర్షాకాలం కావడంతో అప్రమత్తమైన విద్యాశాఖ

    ఆదిలాబాద్‌టౌన్‌: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా మంజూరైన పలు పాఠశాల భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను చెట్ల కింద, పాఠశాల ఆవరణలో కూర్చోబెట్టి విద్యాబోధన సాగిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రెండు మూడు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అర్థంకాని పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. జూన్‌ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడులు ప్రారంభం కాకముందే మరమ్మతులు చేపట్టడం, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

    భయం గుప్పిట్లో..

    జిల్లాలో డీఈవో పరిధిలో 739 పాఠశాలలున్నాయి. ఇందులో 500 ప్రాథమిక, 119 ప్రాథమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల్లో 57,896 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 135 బడుల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అనధికారికంగా 150 వరకు ఉండవచ్చు. ఏటా శిథిల భవనాల్లోనే విద్యార్థులకు చదువులు చెబుతుండడంతో వారు భయం గుప్పిట గడుపుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కానుండడంతో వానలకు గోడలు తడిసి, పైకప్పు కూలే అవకాశాలు లేకపోలేదు.

    శిథిలావస్థలో 135 భవనాలు..

    జిల్లాలో 135 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులు ఉన్నాయి. వీటిలో భీంపూర్‌ మండలంలో 4, భోరజ్‌లో 10, జైనథ్‌లో 9, సాత్నాలలో 4, బేలలో 6, గాదిగూడలో 3, నార్నూర్‌లో 6, ఇంద్రవెల్లిలో 15, గుడిహత్నూర్‌లో 9, ఆదిలాబాద్‌రూరల్‌లో 1, ఆదిలాబాద్‌అర్బన్‌లో 8, తాంసిలో 3, తలమడుగులో 10, బజార్‌హత్నూర్‌లో 3, సొనాలలో 1, బోథ్‌లో 6, నేరడిగొండలో 9, ఇచ్చోడలో 10, ఉట్నూర్‌లో 18 గదులు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.

    గుర్తించాం.. ఆదేశాలు జారీ చేశాం

    జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను ఇప్పటికే గుర్తించాం. వాటిని తొలగించాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. మరమ్మతుల కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న వాటిని బడులు తెరిచే నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.

    – డి.మాధవి, డీఈవో

    జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో భవనా లు శిథిలావస్థకు చేరడంతో కొంత మంది గు రువులు విద్యార్థులకు చెట్ల కింద, ఆరుబయటనే తరగతులు బోధిస్తున్నారు. వర్షాలు ప డిన సమయంలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంతో వారి చదువులకు ఆటంకం ఎదురవుతుంది. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కూడా

    విద్యార్థులకు అవస్థలు తప్పకపోవచ్చు.

  • కై లాస్‌నగర్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి మార్కు దాటింది. ఇప్పటికే పెట్రో ధరలను పెంచిన ఆయిల్‌ కంపెనీలు తాజాగా గృహావసర సిలిండర్‌ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.29 పెంపుదలను ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చాయి. దీంతో జిల్లాలో ఈ సిలిండర్‌ ధర రూ.1,021 చేరింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సబ్సిడీలు సైతం నిలిచిపోవడంతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

    గుదిబండగా గ్యాస్‌బండ..

    పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిని తాకుతుంది. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.60 బాదిన ఆయిల్‌ కంపెనీలు తాజాగా మరో రూ.29 పెంచడంతో సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.వెయ్యి మార్కు దాటిపోయింది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరల కారణంగా నిత్యాసరాల ధరలు ఆకాశన్నంటాయి. తాజాగా గ్యాస్‌ ధరపెంపుతో పేద, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,05,250 వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక సిలిండర్‌ చొప్పున వినియోగించినా జిల్లా వినియోగదారులపై ప్రతీనెల దాదాపు రూ.60 లక్షల వరకు అదనపు భారం పడనుంది.

    ఉజ్వల, దీపం లబ్ధిదారులకు సైతం వర్తింపు..

    ఇది వరకు వంట గ్యాస్‌ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ గ్యాస్‌ కనెక్షన్‌ దారులకు మాత్రమే పరిమితం చేసేది. తాజాగా పెంచిన ధరను ఉజ్వల, దీపం గ్యాస్‌ కనెక్షన్‌ లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తోంది. కేంద్రం ఈ కనెక్షన్లన్నీ నిరుపేదలకే మంజూరు చేసింది. వాటికి రూ.300 సబ్సిడీని ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైన కూడా భారం మోపింది. నామమాత్రంగా అందించే రూ.47 సబ్సిడీని సైతం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్‌ సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ మిగతా సొమ్ము నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ క్రమంలో ఆయిల్‌ కంపెనీల తీరుపై వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    జిల్లాలో

    వంట గ్యాస్‌ ఏజెన్సీలు : 17

    మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు : 2,05,250

    దీపం : 46,136

    ఉజ్వల : 36,960

    జనరల్‌ : 83,096

    గృహావసర సిలిండర్‌ పాత ధర : రూ.992

    పెరిగిన తర్వాత కొత్త ధర : రూ.1,021

  • ఆదిలాబాద్‌: ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్‌ వ్యక్తుల అజమాయిషీ సాగుతోంది. క్రీడా, వ్యాయామ సాధనకు గమ్యంలా నిలవాల్సిన ప్రభుత్వ మైదానం ప్రై వేట్‌ కోచింగ్‌ సెంటర్లకు అడ్డాగా మారింది. శిక్షణ పేరిట నిరుద్యోగుల నుంచి రూ.వేలాదిగా ఫీజులు వసూలు చేస్తున్న పోలీస్‌, డిఫెన్స్‌ అకాడమీల నిర్వాహకులు ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని తమ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. అకాడమీల పేరిట సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోచింగ్‌ సెంటర్లపై అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

    ఎటు చూసినా వారే..

    స్టేడియానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామసాధకులు, క్రీడాకారులు వందల సంఖ్యలో వస్తుంటారు. మరోవైపు క్రీడా పాఠశాల విద్యార్థులు సాధన చేస్తుంటారు. అదే సమయంలో ప్రైవేటు కోచింగ్‌, అకాడమీలకు చెందిన విద్యార్థులు సైతం భారీగా చేరుకుంటున్నారు. మైదానంలోని 800 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌ను ఆక్రమించి వ్యాయామ సాధకులు, క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఆటంకం కలిగిస్తున్నారు. ఏ మూలన చూసినా అకాడమీల విద్యార్థుల గుంపులే కనిపిస్తుండడం గమనార్హం. లాంగ్‌ జంప్‌, రన్నింగ్‌ చేయాలనుకునే క్రీడాకారులకు ఇది తీవ్ర ఆటంకంగా మారుతుంది.

    ‘మామూలు’గా వ్యవహరిస్తున్న డీఎస్‌ఏ..

    వీరిని కట్టడి చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. కొన్నేళ్లుగా స్టేడియం వనరులను ఉచితంగా వాడుకుంటున్న శిక్షణ కేంద్రాల నిర్వహకులు పలువురు అధికారులను మచ్చిక చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో క్రీడా శాఖ బాధ్యతలు చూసిన ఓ అధికారికి రూ.వేలల్లో ముట్టజెప్పినట్లుగా కొంతమంది నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. తాజాగా ప్రస్తుత డీఎస్‌ఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

    చర్యలు తీసుకుంటాం..

    స్టేడియంలో ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్ల పేరిట శిక్షణ ఇవ్వడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. క్రీడా పాఠశాల విద్యార్థులు, వ్యాయామ సాధకులకు ఇబ్బందులు కలిగించడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు అందిస్తాం.

    – జక్కుల శ్రీనివాస్‌, డీవైఎస్‌వో

  • ఆదిలాబాద్‌టౌన్‌: జొన్నలను కొనుగోలు చేసినప్పటికీ తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. స్థానిక కొమురంభీంచౌక్‌లో వాహనాలతో ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఆ దిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో జొన్నలను విక్రయించిన రైతులు వాటిని మహేశ్వరి గోదాంకు తరలించగా అక్కడ స్థలం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆగ్రహించారు. జొన్నలతో ఉన్న వా హనాలను తీసుకువచ్చి నిరసనకు దిగారు. విష యం తెలుసుకున్న పోలీసులు వారిని సముదా యించి అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేస్తున్నప్పటికీ వాటిని నిల్వ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న జొన్నలకు స్థలం లేక వాటిని తరలించడం లేదన్నా రు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉంచడంతో వా టికి కిరాయి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశా రు. అధికారులు తగు చర్యలు చేపట్టి పంట నిల్వ కు అవసరమైన గోదాములను అందుబాటులో ఉంచాలని కోరారు.

  • ఆదిలాబాద్‌: ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయా మం అవసరమని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అ టవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్‌ నిర్వహించారు. డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌తో కలి సి ఆయన ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ, వ్యాయామం, క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. డీఎఫ్‌వో మాట్లాడుతూ, సైకిల్‌ దినోత్సవం పురస్కరించుకొని ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. ఇందులో ఏఎంసీ చైర్మన్‌ శ్రీ కాంత్‌రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఎఫ్‌డీవో అరవింద్‌కుమార్‌, ఎఫ్‌డీవో చిన్న భూషరె డ్డి, ఎఫ్‌ఆర్వోలు అవినాష్‌, షీలానంద, అరుణ, కవి త, సవిత, ఎఫ్‌ఎస్‌వోలు, డీఆర్‌వోలు పాల్గొన్నారు.

  • కై లాస్‌నగర్‌: జిల్లాకేంద్రంలోని రెండు ప్రాంతాల్లో ని ర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారుల తుది జాబితాను బల్దియా అధికారులు ప్రకటించారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయ నోటీసు బోర్డుపై వారి వివరాలు ప్రదర్శించారు. మొత్తం 932 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయగా కేఆర్‌కే కాలనీలో 754మందిని, సర్వేనంబర్‌ 170 లో 178 మందిని ఎంపిక చేశారు. కలెక్టర్‌ రాజర్షి షా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ర్యాండమైజేషన్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో ఏ బ్లాక్‌లోని ఏ ప్లాట్‌ను ఎవరికి కేటాయించాలనే దానిపై త్వరలోనే మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేసి చర్యలు చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికావడంతో ఏళ్లుగా ఇళ్లకోసం ఎదురుచూస్తున్న నిరుపేదల సొంతింటి కల ఎట్టకేలకు సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎంపికై న వారికి ఫ్లాట్లు కేటాయించాక బల్దియా అధికారులు అధికారికంగా ఇంటి నంబర్లను కేటాయించనున్నారు. ఇందులో ఎవరైనా అనర్హులైనట్లు తేలితే వారి ఇళ్లను రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు.

    బల్దియా నోటీస్‌బోర్డుపై ఉంచిన లబ్ధిదారుల జాబితా

  • బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.

    ఏ బస్తీలో చూసినా..

    మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్‌, సుభాష్‌నగర్‌, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్‌టెక్స్‌ ఏరి యా, గంగారాం నగర్‌, గాంధీనగర్‌, కన్నాల బస్తీ, మధునన్ననగర్‌, టేకుల బస్తీ, 24 డీప్‌ ఏరియా, కొత్తబస్టాండ్‌ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్‌ బస్తీ, షంషీర్‌నగర్‌, రవీందర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్‌ బస్తీ, అశోక్‌నగర్‌, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్‌బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

    వారం రోజుల్లో..

    పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్‌టెక్స్‌, 65 డీప్‌ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్‌, గోల్‌ బంగ్లాబస్తీ, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, సుభాష్‌నగర్‌ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్‌ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్‌ క్యాచర్లు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు.

    తేళ్లు వస్తున్నాయి

    ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్‌ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి.

    – మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ

    భయంగా ఉంది

    ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్‌. చీకటి పడటంతోనే చేరుతున్నయ్‌. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం.

    – వేల్పుల శాంత, టేకులబస్తీ

    పట్టుకుని వదిలేస్తున్నా

    మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను.

    – దుర్గా రాజేష్‌, సీనియర్‌ స్నేక్‌క్యాచర్‌, బెల్లంపల్లి

  • శ్రీరాంపూర్‌:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్‌షిఫ్ట్‌ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్‌ గాయపడ్డాడు. ట్రామర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్‌, జీరో లెవల్‌ 7 రేస్‌ వద్ద ట్రబ్బు ట్రా క్‌పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్‌ కావడంతో పాయకు, రేస్‌కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

    ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు..

    జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్‌ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌ కోరారు.

  • మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్‌లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్‌ డ్రైవ్‌పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, బైక్‌లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు మధుసూదన్‌, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

  • లోకేశ్వరం: చేపల వేటకెళ్లిన జా లరి ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మ ండలకేంద్రానికి చెందిన చౌటోల్ల నడ్పి పోశెట్టి(49), పోచమ్మ చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శని వారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు పోచమ్మ చెరువులోకి వెళ్లాడు. రాత్రివరకు ఇంటి రాకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తుల సహకారంతో చె రువులో గాలింపు చేపట్టిన ఫలితం లేకపోయింది. ఆ దివారం ఉదయం శవమై కనిపించాడు. తెప్ప సహా యంతో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తెప్పపైనుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని ఎస్సై తెలిపారు. పోశెట్టికి భార్య రసుల, కుమారుడు శ్రీకాంత్‌ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదుతో ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • జిల్లాకేంద్రంలోని ఎస్‌బీహెచ్‌ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌ హాల్‌ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు.

    –ఆదిలాబాద్‌టౌన్‌

    హైదరాబాద్‌ నుంచి వచ్చా

    మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్‌ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్‌ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్‌లో మాట్లాడతాను.

    – కుంట గంగయ్య, రిటైర్డ్‌ ఆర్మీ

    సంతోషంగా ఉంది

    చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్‌ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్‌ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు.

    – దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి

    మరుపురాని అనుభూతి

    40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం.

    – భీమన్న, పూర్వ విద్యార్థి

  • ● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం

    మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్‌కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్‌(65), కుమారుడు పూదరి వినయ్‌ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్‌ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్‌పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్‌ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్‌ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి

    జన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్‌తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్య

    కాగజ్‌నగర్‌రూరల్‌: రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్‌(32) అస్సాంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్‌నగర్‌, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

  • మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్‌(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్‌ తన స్నేహితులైన అభినయ్‌, అక్షయ్‌, అశ్విత్‌, రాంచరణ్‌తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్‌ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్‌ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్‌ తండ్రి రాజు హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్‌తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్‌ ర్యాలీ ప్రాజెక్ట్‌లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు.

    గజ ఈతగాళ్లతో గాలింపు

    దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్‌ మృతదేహం లభించింది. సందీప్‌ ముల్కల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్‌ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్‌కార్డు, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

    నూతన కమిటీ ఎన్నిక

    మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్‌, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్‌, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్‌, రాజమణి , నరేందర్‌, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

  • ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్‌నగర్‌బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.

    ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్‌ స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు.

  • ● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్‌

    ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్‌ కొడిమెల హి మతేజ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్‌ లీగ్‌ వేలంలో ఖమ్మం ఏసేస్‌ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్‌లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్‌లో ఎంపిక కావడం పట్ల కోచ్‌ జయేంద్ర పటాస్కర్‌ అభినందనలు తెలిపారు.

    మందమర్రిలో

    ఆర్టీసీ బస్సు బోల్తా

    మందమర్రిరూరల్‌:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌లగ్జరీబస్సు(టీఎస్‌28జెడ్‌ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్‌ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Peddapalli

  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

    ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో ఏదైనా జరగరానిది జరిగి, రోగులు ఆందోళన చేస్తే పోలీసులు వచ్చి ఇరువర్గాలతో మాట్లాడి ఫిర్యాదులు తీసుకుంటారు. వీలును బట్టి కేసులు నమోదు చేయడం లేదా హెచ్చరించి వదిలేయడం చూస్తుంటాం. ఇది చట్టబద్ధంగా జరిగే ప్రక్రియ. కానీ.. కరీంనగర్‌లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు చట్టాన్ని దాటి ఒకడుగు ముందుకేశాయి. ప్రైవేటు ఆస్పత్రుల ప్రొటెక్షన్‌ ఆర్మీ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆస్పత్రుల్లో ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఆర్మీకి వెంటనే సమాచారం వెళ్తుంది. వెంటనే ఈ ఆర్మీ రంగప్రవేశం చేస్తుంది. రోగులతో మాట్లాడటం, వారిని ఆందోళన చేయకుండా వారిని నయానో, భయానో బెదిరించి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఖాళీ చేయించడం వీరి ప్రాథమిక విధిగా పెట్టుకున్నారు. ఈ ప్రైవేటు ఆస్పత్రుల రక్షక దళం విషయంలో కరీంనగర్‌ జిల్లాలో ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు రెండుగా చీలిపోయారు. కొందరు ఈ ఆర్మీని సమర్థిస్తుండగా.. ఇది వైద్యుల వృత్తి ధర్మానికి విరుద్ధమని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇలాంటి వారిని నియమించడం చట్టానికి వ్యతిరేకమని కుండబద్దలు కొడుతున్నారు.

    సీపీ మందలింపు

    ప్రైవేటు హాస్పిటల్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్మీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటు విషయం నిఘా వర్గాల ద్వారా పోలీసులకు తెలిసింది. సీపీ కార్యాలయం, ఏసీపీ కార్యాలయాలు ఐఎంఏ ప్రతినిధులను పిలిచి ఆర్మీపై వివరణ కోరగా.. వారు తమకు ఎలాంటి సమాచారం లేదని, తాము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా ఏర్పడిన ఈ ఆర్మీ కొనసాగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీంతో సదరు ఆర్మీని నిర్వహిస్తున్న రెండు ప్రముఖ ఆసుపత్రుల వైద్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ఉండగా.. ప్రైవేటు హాస్పిటల్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్మీ పేరుతో సెటిల్మెంట్లు చేయడమేంటి? అని పోలీసులు నోటీసుల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని, ఇలాంటి ఆర్మీల ఏర్పాటు చట్టవిరుద్ధమని నోటీసుల్లో స్పష్టంచేశారు.

    నోటీసులు ఇచ్చాం

    ప్రైవేటు హాస్పిటల్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్మీ విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఐఎంఏ ప్రతినిధులతోపాటు, ఈ ఆర్మీని నిర్వహిస్తున్న వైద్యులతో మాట్లాడాం. ఆసుపత్రుల్లో సమస్యలు తలెత్తితే పోలీసులు, ఐఎంఏ ప్రతినిధులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయ కమిటీని రూపొందించుకోవాలని సూచించాం. ఎవరికి వారు ప్రైవేటు ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం తగదని, వెంటనే ఆర్మీని నిలిపివేయాలని ఆదేశించాం.

    – గౌస్‌ ఆలం, సీపీ, కరీంనగర్‌

    ఎందుకు పుట్టిందీ

    ఈ ఆర్మీ?

    కొంతకాలంగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలో తప్పులు జరిగాయని, వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు చనిపోయారంటూ వారి బంధువులు ఆందోళనకు దిగడం చూస్తూ ఉన్నాం. వైద్యుల తప్పు లేకుంటే ఆసుపత్రుల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరతారు. కానీ, ఆసుపత్రుల తప్పులు ఉంటే.. రోగుల బంధువులకు తృణమో, పణమో ఇచ్చి వివాదాన్ని సర్దుమణిగింపజేస్తారు. ఇకపై ఆసుపత్రుల్లో వైద్యం వికటించినా, చికిత్స సమయంలో రోగి మరణించినా, ఫీజు విషయంలో వివాదం చెలరేగినా.. రోగుల బంధువులను అదుపు చేసేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్స్‌ ప్రొటెక్షన్‌ ఆర్మీని రూపకల్పన చేశాయి. ఇందులో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది వైద్యులు దీనికి మద్దతు తెలిపారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఈ ఆలోచనను తోసిపుచ్చింది. ఇది వైద్య వృత్తికి, ప్రమాణాలకు పూర్తి విరుద్ధమని తేల్చిచెప్పింది. అయినా, వీరు మాత్రం ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలకాలంలో రెండు ఘటనల్లో చికిత్స పొందుతూ మృతిచెందిన రోగుల కుటుంబాలను ఆందోళన చేయకుండా బెదిరించి పంపినట్లు తెలిసింది.

  • వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా పంటల సాగు ప్రణాళికలను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఈసారి జిల్లాలో 2.15లక్షల ఎకరాల్లో వరి, 52వేల ఎకరాల్లో పత్తి పంటతో పాటు మొక్కజొన్న, కంది, మిరప, పసుపు పంటలను వందల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

    పంట మార్పిడి విధానానికి స్వస్తి

    ఏటా పంట మార్పిడి విధానం పాటించాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతుల్లో మాత్రం మార్పు రావడం లేదు. భూమిలో ఎప్పుడూ ఒకే రకం పంట వేయడం ద్వారా భూసారం తగ్గి దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం రాకముందు గ్రామాల్లో ఖరీఫ్‌లో వరి పంట సాగు చేసి రబీ సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేస్తుండేవారు. కానీ, ప్రస్తుతం రెండు సీజన్‌లలో కేవలం వరి పంటను మాత్రమే సాగు చేస్తున్నారు.

    ఎల్‌నినో ప్రభావంతో..

    ఈసారి సాధారణ వర్షాపాతం కంటే తక్కువగా పడే అవకాశం ఉందని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్‌, జూలై మాసాల్లో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వరి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ సమయంలో పంట వచ్చే స్వల్పకాలిక వరిని ఎంచుకోవాలని, తద్వారా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

    ఖరీఫ్‌లోనూ ఆరుతడి పంటలు

    సాధారణంగా ఆరుతడి పంటలు తక్కువ నీటితోనే సాగు చేస్తుంటారు. వేసవికాలంలో తక్కువ నీరు ఉండటం, పంట చేతికందే సమయానికి సాగు నీరు అందకపోవడంలాంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో వేసవికాలం సీజన్‌లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేసేవారు. కానీ, ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలంటూ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్‌నినో వరి సాగుపై ప్రభావం చూపుతుందని, ఈ క్రమంలో వరి కాకుండా పెసర, మినుములు, కంది, టమాట, తీగజాతి కూరగాయ పంటలు, ఆకుకూరలు పండిండచమే మేలని పేర్కొంటున్నారు.

    మంథనిరూరల్‌: వర్షాకాలం సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా కసరత్తు చేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలంటూ ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా ఆ దిశగా రైతులు అడుగులు వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వానాకాలం సీజన్‌లో అత్యధికంగా వరి సాగు చేయడం అలవాటుగా మారింది. కనీసం పంట మార్పిడి లేకుండానే వరి సాగు చేస్తున్నారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, ఈ క్రమంలో ఆరుతడి, స్వల్ప కాలిక వరి పంటలు సాగు చేసుకోవాలంటూ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

  • గోదావరిఖని(రామగుండం): సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, స్కాం పేరుతో మరింత నష్టపరుస్తున్నారని.. దీంతో సింగరేణి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని.. ఏది ఏమైనా అంతిమంగా నష్టపోయేది కార్మికులేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు మేనిఫెస్టో సభ్యుడిగా ఉండి తయారు చేసిన సింగరేణి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా పదేళ్లలో రూ.7,350కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం రెండేళ్లలో రూ.12,377కోట్లు అప్పుచేశారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, సింగరేణిలో పొగొట్టిన డిపెండెంట్‌ను తిరిగి కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిందన్నారు. గైర్హాజర్‌ పేరుతో కార్మికులను తొలగించే కుట్ర చేస్తున్నారని, సంస్థ ప్రమాదంలో ఉందన్నారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి తీరుపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిని కాంగ్రెస్‌ దోచుకుంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సింగరేణిని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమించే సమయం ఆసన్నమైందని పుట్ట మధు అన్నారు. అప్పులు తెచ్చి కార్మికులకు జీతాలకు చెల్లించే పరిస్థితిలో సింగరేణి నెట్టివేయబడిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. సదస్సులో టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసి రామ్మూర్తి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, మూల విజయారెడ్డి, జక్కు శ్రీహర్షిణి, నూనె కొమురయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు, కౌశికహరి పాల్గొన్నారు.

    రేవంత్‌రెడ్డికి హిట్లర్‌ గతే పడుతుంది

    పెద్దపల్లి: రానున్న రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి దేవుళ్లని, బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నుంచి రూ.23 లక్షలు ఇప్పించాలని బీఆర్‌ఎస్‌ నాయకుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్‌ సమావేశం ప్రారంభంలో మాజీ మంత్రి హరీశ్‌రావును వేడుకున్నారు. ఈక్రమంలో నాయకులు, మనోజ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

  • కరీంనగర్‌క్రైం: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు సుభోద్‌సింగ్‌, రఘునాథ్‌ కర్మాకర్‌, రవీష్‌కుమార్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోగా.. బంగారం ఆచూకీ మిస్టరీగానే మిగిలింది. ఇదే సమయంలో పరా రీలో ఉన్న మరో నిందితుడిని బిహా ర్‌లో అరెస్టు చేయ డం కేసు దర్యాప్తునకు బలం చేకూర్చింది. కరీంనగర్‌ పోలీ సు కమిషనరేట్‌లో ఆదివారం సీపీ గౌస్‌ ఆలం కేసు దర్యాప్తు, పురోగతి అంశాలను వివరించారు.

    బంగారం ఆచూకీపై గందరగోళం

    దోపిడీకి గురైన సొత్తు ఆచూకీ విషయంలో నిందితులు సహకరించడం లేదని సీపీ స్పష్టం చేశారు ఆభరణాలు ఎక్కడ దాచారు..? ఎవరికి విక్రయించారు..? ఎవరి ద్వారా తరలించారు..? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి..? వంటి అంశాలను నిందితులు వివరించడం లేదని అన్నారు. విచారణలో పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

    మాట మార్చిన రఘునాథ్‌ కర్మాకర్‌

    కేసు దర్యాప్తులో రఘునాథ్‌ కర్మాకర్‌ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. గతంలో గుండాల అటవీ ప్రాంతంలో దోపిడీ సొత్తును దాచిపెట్టినట్లు తెలిపిన నిందితుడు, ప్రస్తుతం ఆ సమాచారం సరైంది కాదని చెబుతున్నాడు. దీంతో నిందితులు ఉద్దేశపూర్వకంగానే నిజాన్ని దాచిపెడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

    మళ్లీ కస్టడీ కోరనున్న పోలీసులు

    నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. దర్యాప్తునకు అవసరమైన పూర్తి సమాచారం లభించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్‌సింగ్‌ అలియాస్‌ పహిల్వాన్‌ అలియాస్‌ ఆమరేంద్ర సింగ్‌ను బిహార్‌లోని సలింపూర్‌ ప్రాంతంలో జూన్‌ 4న అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా ఆదివారం కరీంనగర్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.

    వెలిచాల వద్ద తుపాకులు స్వాధీనం

    నిందితులు వెలిచాల బైపాస్‌ రోడ్డుకు సమీపంలో చెట్ల పొదల్లో రెండు తుపాకులు దాచినట్లు అంగీకరించారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. దోపిడీ అనంతరం ధర్మపురి వైపు వెళ్లి బుగ్గారం అటవీ ప్రాంతంలో మొబైల్‌ పడేసినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వస్తువులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయని, ఫోన్‌లోని కాల్‌ డేటా, లొకేషన్‌, ఇతర డిజిటల్‌ ఆధారాలు నిందితుల నెట్‌వర్క్‌ను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

  • పెద్దపల్లిరూరల్‌: బస్సుల కోసం వేచిచూసేందుకు ప్రయాణికులకు బస్‌షెల్టర్లు కరువయ్యాయి. పెద్దపల్లి నుంచి ధర్మారం వెళ్లే వారంతా ఇలా దుకాణాల ఎదుట నిరీక్షించాల్సి రావడంతో ఆయా దుకాణాల యజమానుల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో ఇలా నీడకోసం దుకాణాల ఎదుట నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు కనీసం చలువపందిర్లు వేసినా బాగుండేదని అంటున్నారు.

    సహజ కవయిత్రికి సత్కారం

    పెద్దపల్లిరూరల్‌: పట్టణానికి చెందిన సహజ కవయిత్రి బొమ్మిదేని రాజేశ్వరిని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ ఆవరణలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ సాహిత్యసంస్థ శ్రీశ్రీకళావేదిక ప్రతినిధులు సత్కరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల సందర్భంగా రాజేశ్వరి ఆలపించిన ‘ప్రకృతి పరిరక్షణకు ప్రతినబూనుదాం’.. ప్లాస్టిక్‌ మయం మన ప్రాణాలకు భయం.., విషపూరిత వాయువులు జీవితానికి శత్రు సాయుధులు’.. ఇలా సాగిన రాజేశ్వరి కవితాగానం పలువురి మన్ననలు పొందింది. గ్లోబల్‌ యూనివర్సిటీ అధినేత కేవీవీ సత్యనారాయణరాజు, కళావేదిక సీఈవో కళారత్న కత్తిమండ ప్రతాప్‌ తదితరులు సత్కరించారు.

    రేపు శ్రీసీతారామాలయ భూమి కౌలు వేలం

    పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబరు 934లోని 11.24ఎకరాల భూమికి ఈనెల 9న కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు రూ.50వేల ధరావత్‌ చెల్లించి పాల్గొనాలని సూచించారు.

  • కోల్‌ సిటీ(రామగుండం): ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ‘హ్యాపీ సండే’ కార్యక్రమం ఉపయోగపడుతుందని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మార్చిలో గోదావరినది పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టిన అనంతరం హ్యాపీ సండేను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు డిజిటల్‌ స్క్రీన్‌లకు ఎక్కువగా అలవాటు పడటంతో యోగా, క్రీడలు వంటి ఆరోగ్యకర కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గుతోందన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరిగి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని, నగరంలోని మైదానాల్లో వ్యాయామం, వాకింగ్‌ చేసే వారి సంఖ్య పెరగడం శుభపరిణామమన్నారు. రామగుండాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్ల య్య మాట్లాడుతూ, అభిదృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. యోగా ప్రదర్శన, కబడ్డీ, మ్యూజికల్‌ చైర్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ జె.అరుణశ్రీ, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ పబ్బాల శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పాల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ మధుకర్‌, మెప్మా టీఎంసీ మౌనిక, యోగా గురు గణేశ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు శోభారాణి, తిరుపతి, దావీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Nirmal

  • ఆ తర్వాత పట్టించుకోని ప్రభుత్వం రుణాల కోసం నిరీక్షిస్తున్న యువత

    బుస కొడుతున్న సర్పాలు

    జనావాసాలు, వీధులు, రోడ్లపై విష సర్పాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. రక్త పింజరలు, నాగుపాములు ఇళ్లలోకి దూరి ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

    గజ్జలమ్మా.. కరుణించమ్మా..

    కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్ల ఆలయాలకు ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మహా రాష్ట్రలోని ముంబై, నాందేడ్‌, ధర్మాబాద్‌, బోకర్‌, హిమాయత్‌నగర్‌, ఇస్లాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ఆలయానికి చేరుకుని బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు, ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించా రు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అర్చకులు శ్రీకాంత్‌ రామానుజదాస్‌, నగేశ్‌ ఆ ధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ తదితర పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.

    నిర్మల్‌చైన్‌గేట్‌: రాజీవ్‌ యు వ వికాసం పథకం లబ్ధి దారుల ఎంపికతోనే ఆగిపోయింది. యువతకు స్వ యం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే నెలలో అర్జీలు స్వీకరించిన ప్ర భుత్వం రుణాల ఊసే ఎ త్తడం లేదు. గతేడాది జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు ఇస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మిన్నకుండి పోయింది. అనంతరం దరఖాస్తుల పరిశీలన ప్రక్రి య పూర్తి చేసింది. ఆ తర్వాత రాజీవ్‌ యువ వికా సం పథకం అమలుపై కదలిక లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు గురవుతున్నారు.

    నిరాశ చెందుతున్న యువత

    గత ప్రభుత్వాలు ప్రతీ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజికవర్గాల యువతకు రాయితీపై రుణాలు పంపిణీ చేసేవి. దీంతో లబ్ధిదారులు రాయితీ పొందేవారు. కానీ, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు, బీసీ బంధు పథకాల పేరిట కొంత మందికే లబ్ధి చేకూర్చి ముఖం చాటేసింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లను అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ‘రాజీవ్‌ యువ వికాసం’ కింద రాయితీ రుణాలివ్వడానికి నిర్ణయించింది. దీంతో ఏడాది క్రితం జిల్లాలోని సుమారు 35వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ రుణం పంపిణీ చేయకపోవడంతో వారిలో నిరాశే మిగిలింది.

    దరఖాస్తులు ఎక్కువ.. మంజూరు తక్కువ

    ఇంటర్వ్యూలు నిర్వహించి..

    తొలుత ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూని ట్‌ విలువ ప్రకారం ఐదు విడతల్లో గత అక్టోబర్‌ వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో కేటగిరీ–1లో రూ.50 వేలు, కేటగిరీ–2 లో రూ.లక్ష రుణాల వరకు ఎంపికై న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఈ ప్రక్రియ వాయిదా పడటంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కాగా, ముఖ్యంగా సిబిల్‌ స్కోర్‌ను మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశముంటుంది.

    మండలాలవారీగా వచ్చిన దరఖాస్తులు

    మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ

    బాసర 25 196 403 115

    భైంసా 82 638 1,228 253

    దస్తురాబాద్‌ 161 302 488 2

    దిలావర్‌పూర్‌ 130 191 534 163

    కడెం 412 690 930 83

    ఖానాపూర్‌ 274 536 957 67

    కుభీర్‌ 469 431 1,234 107

    కుంటాల 94 261 799 89

    లక్ష్మణచాంద 103 280 717 78

    లోకేశ్వరం 110 431 811 74

    మామడ 325 238 501 124

    ముధోల్‌ 95 338 586 298

    నర్సాపూర్‌ (జి) 88 229 644 164

    నిర్మల్‌ రూరల్‌ 178 334 869 70

    పెంబి 207 97 234 20

    సారంగపూర్‌ 499 425 1,387 160

    సోన్‌ 101 204 722 75

    తానూర్‌ 143 375 755 95

    భైంసా బల్దియా 21 383 952 1,218

    ఖానాపూర్‌ బల్దియా 28 259 784 340

    నిర్మల్‌ బల్దియా 82 514 2,757 2,376

    కార్పొరేషన్‌ దరఖాస్తులు యూనిట్లు రాయితీ

    (రూ.కోట్లలో)

    ఎస్సీ 7,350 2,894 39.96

    ఎస్టీ 3,627 2,325 25.35

    బీసీ 17,286 3,876 41.00

    ఏంబీసీ/ఈబీసీ 923 842 8.90

    మైనార్టీ 5,926 1,045 17.41

    క్రిస్టియన్‌ 65 27 0.42

    బ్యాంకులు సమ్మతించినా..

    రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.50వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తే 100 శాతం, రూ.లక్ష వరకు 90శాతం, రూ.2లక్షల వర కు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందినవారికి 70శాతం రాయితీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ మంది రూ. 4లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా రు. బ్యాంకులూ సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీచేయలేకపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పునరాలోచన చేసి పథకాన్ని పునరుద్ధరించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

  • నిర్మల్‌ఖిల్లా: కృషి, పట్టుదలతో లక్ష్యం చేరుకో వచ్చని, తద్వారా సమాజంలో గుర్తింపు లభి స్తుందని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్ర భాకర్‌ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్‌లో గిన్ని స్‌ రికార్డు సాధించిన నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లికి చెందిన దేవోల్ల అనూషను ఆదివారం టీఎన్జీవోల సంఘ భవనంలో సన్మానించారు. తల్లిదండ్రులకు అభినందనలు తెలి పారు. ఆయా సంఘాల నాయకులు భీమ సు రేందర్‌, ఆనంద్‌, అశోక్‌కుమార్‌, సత్యనారాయణగౌడ్‌, సుకుమార్‌, రాములు, అశోక్‌, ముత్త న్న, స్వామి, గంగారాం పాల్గొన్నారు.

  • డీఏపీపై దోపిడీ!

    భైంసాటౌన్‌: జిల్లాలో రైతులు ఏటా దోపిడీకి గురవుతూనే ఉన్నారు. సాగు చేసిన నుంచి పంటలు విక్రయించేదాకా మోసాలకు గురవుతూ వస్తున్నారు. ఎరువులు, విత్తనాల దుకాణా దారులు అమాయక రైతులను నిలువునా ముంచుతూనే ఉన్నారు. జిల్లాలో తాజాగా డీఏపీ విక్రయాల్లో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్‌ నేపథ్యంలో రైతులు డీఏపీ కోసం డీలర్ల వద్దకు వెళ్తుండగా వారు యుద్ధం సాకుతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

    రూ.300 అధికంగా వసూలు!

    కేంద్ర ప్రభుత్వం 50 కేజీల డీఏపీ బస్తా గరిష్ట రిటైల్‌ ధరను రూ.1,350గా నిర్ణయించింది. కానీ, జిల్లాలో ని ఎరువుల డీలర్లు రూ.1650కి విక్రయిస్తూ బిల్లు మాత్రం రూ.1,350కే ఇస్తున్నారు. అంతే కాకుండా.. డీఏపీ కోసం వెళ్తే ఇతర ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కూడా కొనాలని షరతులు విధిస్తున్నారు. నిర్మల్‌, భైంసాలో ఎరువులు, విత్తన డీలర్లు ఎక్కువగా ఉండగా, ఖరీఫ్‌, రబీ సీజన్లలో వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో గతేడాది 10,903 మెట్రిక్‌ టన్నులు డీఏపీ విక్రయాలు జరగగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 3,573 మెట్రిక్‌ టన్నులు విక్రయించారు. డీఏపీ బస్తాను రూ.300 అధికంగా విక్రయిస్తూ.. జిల్లాలో రూ.2కోట్లకు పైగా రైతులను దోచుకున్నారు.

    అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

    ఎరువుల డీలర్లు డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే రైతులు మా దృష్టికి తీసుకురావాలి. అలాంటి డీలర్లపై చర్యలు తీసుకుంటాం. రైతులు ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. – అంజిప్రసాద్‌, డీఏవో

    కొరతతో రైతుల అవస్థలు

    ముధోల్‌: జిల్లాలో కొన్నిచోట్ల రైతులకు సరిపడా డీఏపీ అందుబాటులో లేదు. ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమై డీఏపీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. పీఏసీఎస్‌ కా ర్యాలయాల్లోనూ డీఏపీ లేక ప్రైవేట్‌ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఎమ్మార్పీ ధర కంటే అ ధికంగా విక్రయిస్తూ రైతులను ముంచుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తో ందని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డీఏపీ సరిపడా అందుబాటులో ఉంచాలని, అధిక ధరకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • భైంసాటౌన్‌: పట్టణంలోని ఏఎంసీకి చెందిన మిర్చి యార్డు స్థలం రెంటికి చెడ్డ రేవడిలా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌వెజ్‌, పండ్లు, పూల మార్కెట్లన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో భాగంగా భైంసాకు రూ.7.20 కోట్లతో సమీకృత మార్కెట్‌ మంజూరు చేసింది. స్థానిక మిర్చియార్డు ఆవరణలో 33 గుంటల స్థలంలో 2021లో భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. దాదాపు 50శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దాదాపు రెండేళ్లకుపైగా పనులు జరగక, భవనం అసంపూర్తిగా మిగిలింది. దీనికితోడు భవనం కోసం కేటాయించిన ఏఎంసీ స్థలం నిష్ప్రయోజనంగా మారగా, మార్కెట్‌ నిర్మా ణం కోసం ఏఎంసీకి చెందిన దుకాణా సముదాయాన్ని కూడా కూల్చివేశారు. ఇటు మార్కెట్‌ వినియోగంలోకి రాక, అటు దుకాణాలకు అద్దెల రూపంలో ఆదాయం కోల్పోయిన పరిస్థితి నెలకొంది.

    స్థలం పాయె.. అద్దెలు పోయె!

    ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం మిర్చియార్డులో 33 గుంటల స్థలం కేటాయించారు. ఇందుకోసం ఏఎంసీకి చెందిన దాదాపు పదికిపైగా గదులు కూల్చివేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాల భవనాన్ని కూడా కూల్చేశారు. ప్ర స్తుతం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన నిర్మాణ పనులు నిలిచి మార్కెట్‌ అందుబాటులోకి రాకపోగా, ఏ ఎంసీ స్థలం, దుకాణాల కూల్చివేతతో అద్దెల రూ పంలో వచ్చే ఆదాయం కోల్పోవడం గమనార్హం.

    వినియోగంలోకి తెస్తేనే..

    భైంసా పట్టణంలో ప్రతీ సోమవారం వారసంత ని ర్వహిస్తారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామా ల నుంచి కూరగాయలు విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు వస్తుంటారు. పట్టణంలో ప్రధాన రోడ్ల వెంబడి పండ్లు, పూలు, చికెన్‌, మటన్‌, ఫిష్‌ వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన నిర్మాణం పూర్తయితే అందులోనే వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లతోపాటు పూలు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశముండేది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా నిలిచి రోడ్ల పక్కన కూరగాయలు, పండ్లు, చికెన్‌, మటన్‌ విక్రయాలు చేపడుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు.

  • నిర్మల్‌చైన్‌గేట్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందించాలని జిల్లా ఆహార భద్రత అధికారి సునీత సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక‘, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం అంగన్‌వాడీ టీచర్లకు ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రపంచ ఆహా ర భద్రతా దినోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పూర్తి అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ఆహార నియమాలు అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. భవిష్యత్‌లోనూ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధి కారి వినూత్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • నిర్మల్‌ఖిల్లా: నిర్మల్‌కు చెందిన ప్రముఖ పద్యకవి, ఉమ్మడి జిల్లా సంస్కృత భాషా ప్రచార స మితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ బి.వెంకట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఆది వారం నిర్వహించిన ఏడో ప్రపంచ తెలుగు సా హిత్య మహాసభల్లో ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయంలో చైతన్య సారస్వత పరిషత్‌, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభల్లో డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌కుమార్‌, జి.ఈశ్వరీభూషణం, డాక్టర్‌ టి.పార్థసారథి, కేవీవీ సత్యనారాయణరాజు చేతుల మీదుగా వెంకట్‌కు పురస్కారం ప్రదానం చేశారు. మహాసభల్లో డాక్టర్‌ వెంకట్‌ విశిష్ట అతిథిగా, సమన్వయకర్తగా పాల్గొని తెలుగు భాషా వైభవంపై పద్యపఠనం, గానం చేసి ఆకట్టుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా వెంకట్‌కు పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

  • నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్‌ భవ న్‌లో ఏకలవ్య, దివ్యాంగ శక్తి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాలు ప్ర దానం చేశారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక, డీఈవో భోజన్న హాజరై మాట్లాడా రు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, మౌలి క వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫౌండేష న్ల సేవలను ప్రశంసించారు. ఏకలవ్య ఫౌండేష న్‌ చైర్మన్‌ వెంకట్రావు, ట్రస్టీ ది గంబర్‌, బాధ్యులు ప్రశాంత్‌, రామ్మోహన్‌, శంకర్‌, ముత్యం, దివ్యాంగ శక్తి ఫౌండేషన్‌ చైర్మన్‌ మహేశ్‌, ఎంసీ లింగన్న, ఎంఈవోలు పద్మ, సంధ్యారాణి, సదానంద్‌, నరేందర్‌, శ్రీహరి ఉన్నారు.

Mancherial

  • బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.

    ఏ బస్తీలో చూసినా..

    మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్‌, సుభాష్‌నగర్‌, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్‌టెక్స్‌ ఏరి యా, గంగారాం నగర్‌, గాంధీనగర్‌, కన్నాల బస్తీ, మధునన్ననగర్‌, టేకుల బస్తీ, 24 డీప్‌ ఏరియా, కొత్తబస్టాండ్‌ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్‌ బస్తీ, షంషీర్‌నగర్‌, రవీందర్‌నగర్‌, అంబేద్కర్‌నగర్‌, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్‌ బస్తీ, అశోక్‌నగర్‌, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్‌బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

    వారం రోజుల్లో..

    పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్‌టెక్స్‌, 65 డీప్‌ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్‌, గోల్‌ బంగ్లాబస్తీ, నెంబర్‌–2 ఇంక్‌లైన్‌, సుభాష్‌నగర్‌ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అఽధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్‌ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్‌ క్యాచర్లు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు.

    భయంగా ఉంది

    ఇళ్ల చుట్టూ రెండు, మూడు పాములు తిరుగుతున్నయ్‌. చీకటి పడటంతోనే చేరుతున్నయ్‌. రెండు రోజుల క్రితం పాము వచ్చింది. కొద్ది దూరం నుంచి చూసి కేకలు వేసి బయటకు పరుగుతీశాను. ఓ యువకుడు చాకచక్యంగా పామును పట్టుకుని ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఇట్ల పాములతో భయం భయంగా గడుపుతున్నం.

    – వేల్పుల శాంత, టేకులబస్తీ

    తేళ్లు వస్తున్నాయి

    ఇళ్ల పరిసరాల్లో పాములు, తేళ్లు భయపెట్టిస్తున్నాయి. ఒకసారి పాము కనిపిస్తే మరోసారి ఐదారు తేళ్లు వస్తున్నాయి. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే వాటి కాటుకు గురయ్యేవాళ్లం. పిల్లలు వణికిపోతున్నారు. పాములు, తేళ్లు రాకుండా మున్సిపల్‌ అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలి.

    – మేకల భాగ్యలక్ష్మి, టేకులబస్తీ

    పట్టుకుని వదిలేస్తున్నా

    మున్సిపాలిటీలో సర్పాలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటిలో ప్రాణాంతక రక్తపింజరలు, తా చుపాముల సంఖ్య అధికంగా ఉంది. గతంలో రక్త పింజరలు, నాగుపాములు అడపాదడపా కనిపించగా ప్రస్తుతం ప్రతి బస్తీలోనూ దర్శనమిస్తున్నాయి. వీటి సంతతి వృద్ధి చెందినట్లు కనిపిస్తుంది. వారం నుంచి రోజుకు రెండు, మూడు పాములను ప ట్టుకునిసురక్షితంగాఅటవీప్రాంతంలోవదిలేస్తున్నాను.

    – దుర్గా రాజేష్‌, సీనియర్‌ స్నేక్‌క్యాచర్‌, బెల్లంపల్లి

  • శ్రీరాంపూర్‌:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్‌షిఫ్ట్‌ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్‌ గాయపడ్డాడు. ట్రామర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్‌ ఆదివారం తెల్లవారు జామున 5 సీమ్‌, జీరో లెవల్‌ 7 రేస్‌ వద్ద ట్రబ్బు ట్రా క్‌పై నుంచి జారడంతో బల్ల వేసి దానిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా జంప్‌ కావడంతో పాయకు, రేస్‌కు మద్య ఇరుకున్నాడు. దీంతో తుంటి భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడున్న కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం, తుంటి భాగంలో రెండు ఫాక్షర్లు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

    ఈత చెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు..

    జన్నారం: మండలంలోని ఇందనపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గాజుల నారాయణ గౌడ్‌ ఈత చెట్టు పైనుంచి పడి గాయాలపాలయ్యాడు. శనివారం సాయంత్రం ఈత చెట్టెక్కి కల్లు గీస్తుండగా మోకు జారడంతో కిందపడి రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు అందించిన సమాచారంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్‌గౌడ్‌, నారాయణగౌడ్‌ కోరారు.

  • మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు. అర్ధరాత్రి బైక్‌లపై తిరుగుతున్న వారికి డ్రంకెన్‌ డ్రైవ్‌పరీక్షలు చేశారు. అదుపులో తీసుకుని విచారించి వివరాలు సేకరించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, బైక్‌లపై స్టంట్ల చేస్తున్నవారిపై లాఠీ ఝులిపించారు. లాడ్జీ గదులను డీసీపీ తనిఖీ చేశారు. అద్దెకు ఉన్నవారిలో అనుమానితులను విచారించారు. సీసీ కెమెరాలు, రికార్డు సక్రమంగా ఉండాలని, రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు మధుసూదన్‌, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

  • జిల్లాకేంద్రంలోని ఎస్‌బీహెచ్‌ నం.2 పాఠశాలలో 1985–86 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత వీరి అపూర్వ సమ్మేళనానికి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌ హాల్‌ వేదికై ంది. ఎక్కడెక్కడో స్థిరపడినవారు మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. మిత్రులు ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు లింబగిరి స్వామి, కుటుంబరావు, చక్రపాణి, టి.రాములు తదితరులను సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు.

    –ఆదిలాబాద్‌టౌన్‌

    సంతోషంగా ఉంది

    చిన్ననాటి మిత్రులను కుటుంబ సమేతంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిత్రుడి కుమారుడి పెళ్లికి వెళ్లిన సమయంలో స్నేహితులందరూ ఒకేచోట కలవాలని నిర్ణయించాం. రెండు నెలల నుంచి ఫోన్‌ నంబర్లు, వివరాలు సేకరించి గ్రూప్‌ తయారు చేశాం. సమ్మేళనం ఉందని చెప్పడంతో అందరూ వచ్చారు.

    – దొగ్గలి గంగయ్య, పూర్వ విద్యార్థి

    హైదరాబాద్‌ నుంచి వచ్చా

    మూడు సెక్షన్లు కలిపి దాదాపు 70 మంది ఉంటాం. సమ్మేళనం ఉందని సమాచారంతో హైదరాబాద్‌ నుంచి వచ్చాను. గురువులు విలువలతో కూడిన విద్య అందించారు. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్‌ అయ్యాను. అప్పుడప్పుడు చిన్ననాటి మిత్రులతో ఫోన్‌లో మాట్లాడతాను.

    – కుంట గంగయ్య, రిటైర్డ్‌ ఆర్మీ

    మరుపురాని అనుభూతి

    40 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితులందరినీ ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. అనాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నాం. ఆరోగ్య క్షేమాలు, ఇతర విషయాల గురించి పలకరింపులు మరవలేను. కష్టసుఖాల్లో అందరు పాలుపంచుంటాం.

    – భీమన్న, పూర్వ విద్యార్థి

  • భూపాలపల్లి అర్బన్‌: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్‌ జాతీ య బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. జయశంకర్‌ భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్‌లో ఆదివారం సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి మాట్లాడా రు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హా మీలు నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్య సంఘం ఐఎన్‌టీయూసీ పూర్తిగా వి ఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్య ం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడేళ్లుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, స మ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మికహక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్‌ వంటి అంశాలపై బీఎంఎస్‌ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్‌ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించా లని డిమాండ్‌ చేశారు. 12వ వేజ్‌బోర్డు అమలుకు సంబంధించి కోలిండియా యాజమాన్యం వెంటనే క మిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్‌ జారీ చేయాలని కో రారు. సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నివారించ డం, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డు పునరుద్ధరణ, తొలగించిన కార్మికులకు మరో అవకాశం కల్పించడం, కాంట్రాక్ట్‌ కార్మికులకు కోలిండియా తరహా వేతనాలు అమలు చేయడం వంటి డిమాండ్లను ప్రస్తావించారు. జాతీయ నాయకులు మాధవ్‌నాయక్‌, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్‌ నాయకులు వెలబోయిన సుజేందర్‌, ఆర్‌ నర్సింగ్‌రావు, అల్లం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • ● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణం

    మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌లో దారుణ హ త్య కలకలం సృష్టించింది. పో లీసుల కథనం ప్రకారం.. హా జీపూర్‌కు చెందిన పెద్దనాన్న పూదరి భాస్కర్‌(65), కుమారుడు పూదరి వినయ్‌ మధ్య ఇటీవల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివా రం రాత్రి వినయ్‌ కత్తితో వచ్చి అందరూ చూస్తుండగానే భాస్కర్‌పై రెండుసార్లు దాడిచేశాడు. తీవ్ర గా యాలైన ఆయన్ను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు స త్యనారాయణ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కా గా, ఈ దాడిలో భాస్కర్‌ కుమారుడు సత్యనారాయణకు గాయాలయ్యాయి. హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనస్థలాన్ని పరిశీలించారు. దాడి చేసిన వినయ్‌ను అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి

    జన్నారం: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు..మండలంలోని చింతగూడకు చెందిన గజ్జల భూపతి (31) ఆ దివారం తాను కౌలుకు చేస్తున్న భూమిలో పంటవ్యర్థాలు తొలగించడానికి వెళ్లాడు. అక్కడే బహిర్భూమికని వెళ్లాడు. పక్కనే ఉన్న బావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. మృతుడి భార్య శ్వేత ప్రస్తుతం నిండుగర్భిణి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సత్తవ్వ–మల్లేశ్‌తోపాటు భార్య రోదించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్య

    కాగజ్‌నగర్‌రూరల్‌: రైలు కిందపడి ఆర్మీజవాన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని బురదగూడకు చెందిన కొట్రంగి సురేష్‌(32) అస్సాంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలో మద్యం తాగుతుండడంతో మానేస్తేనే నీతో అస్సాంకు వస్తానని భార్య తిరుమల చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం తాగాడు. మత్తులో క్షణికావేశంలో కాగజ్‌నగర్‌, రెబ్బెన రైల్వేస్టేషన్ల మధ్య గల పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లు లభించాయి. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

  • మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్‌(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్‌ తన స్నేహితులైన అభినయ్‌, అక్షయ్‌, అశ్విత్‌, రాంచరణ్‌తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్‌ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్‌ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్‌ తండ్రి రాజు హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్‌తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్‌ ర్యాలీ ప్రాజెక్ట్‌లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు.

    గజ ఈతగాళ్లతో గాలింపు

    దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్‌ మృతదేహం లభించింది. సందీప్‌ ముల్కల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • బెల్లంపల్లి:పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్‌ అన్నారు. బెల్లంపల్లి అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా మూడో మహాసభలు ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రసాద్‌ హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి కూలీ రేట్లను పెంచలేదన్నారు. కూలీలపై వివక్ష ప్రదర్శిసస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతోందన్నారు. కూలీ రేట్లు పెంచుతామని హామీ ఇచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసెత్తడం లేదన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ కూలీలు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో వ్యవసాయ యంత్రాలు వచ్చిన తర్వాత కూలీలకు పనులు దొరకడం లేదని తెలిపారు. వలసలు పెరుగుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, కూలీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు, జాబ్‌కార్డు, ఇన్సూరెన్స్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

    నూతన కమిటీ ఎన్నిక

    మహాసభలో మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుమాస అశోక్‌, ఉపాధ్యక్షులుగా కృష్ణమాచారి , గోమాసబాపు, ఎం.జయ, కార్యదర్శిగా కనికరపు అశోక్‌, సహాయ కార్యదర్శులుగా వేల్పుల శంకర్‌, రాజమణి , నరేందర్‌, సరిత, కోశాధికారిగా ముడిమడుగుల బ్రహ్మయ్యను ఉన్నుకున్నారు. మరో 10 మందిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘం, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

  • ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్‌ స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు.

    ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్‌నగర్‌బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.

  • ● వేలంలో రూ.8 లక్షలు పలికిన యువ క్రికెటర్‌

    ఆదిలాబాద్‌: జిల్లాకేంద్రానికి చెందిన యువ క్రికెటర్‌ కొడిమెల హి మతేజ హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీజీ–20 వేలంలో సత్తాచాటాడు. హైదరాబాద్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన టీజీ–20 క్రికెట్‌ లీగ్‌ వేలంలో ఖమ్మం ఏసేస్‌ జట్టు రూ.8 లక్షలకు దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న యువ కెరటం తాజాగా టీజీ–20 లీగ్‌లో అత్యధిక ధర పలకడం విశేషం. లీగ్‌లో ఎంపిక కావడం పట్ల కోచ్‌ జయేంద్ర పటాస్కర్‌ అభినందనలు తెలిపారు.

    మందమర్రిలో

    ఆర్టీసీ బస్సు బోల్తా

    మందమర్రిరూరల్‌:మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపంలో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్‌లగ్జరీబస్సు(టీఎస్‌28జెడ్‌ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తుండగా ఓసీపీ సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమా దం జరగడంతో ఆ సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్‌ సీతారాం, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. వీరికి స్వల్పగాయాలు కాగా స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా పట్టణ ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. బస్సు డ్రైవర్‌ సీతారాం బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

  • మంచిర్యాలటౌన్‌: ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో రోజువారీగా వినియోగించే వంట నూనెలు, ఇతర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా పెంచుతుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఏ ధర పెరిగినా, వాటి ప్రభావం ఇతర వాటిపై పడుతోంది.

    – రాజమణి, గృహిణి, మంచిర్యాల

    భరించడం కష్టమే

    మంచిర్యాలటౌన్‌: అన్నింటి ధరలు ఒకేసారి పెరుగుతుండడంతో సామాన్యుల నెలవారీ ప్రణాళిక మారుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలను భరించడం కష్టంగా మారింది. వీటికితోడు వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ పోతున్నారు. వచ్చే వేతనాలకు, ఖర్చులకు పొంతన లేకుండా పోతుంది. పెరిగిన ధరలతో అప్పులు చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు.

    – సునీత, గృహిణి, మంచిర్యాల

  • మంచిర్యాలక్రైం: జిల్లాలోని హోటళ్లు, స్వీట్‌ షాపులు, బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆహార భద్రత నియమాలు పాటించాలని జిల్లా ఆహార భఽద్రత అధికారి జీ.మహేష్‌ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార ఉత్పత్తులను తయారు చేయకూడదన్నారు. ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ప్లాస్టి క్‌ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ వాసురాము నాయక్‌, 65 మంది వ్యాపారులు పాల్గొన్నారు.

  • మంచిర్యాలటౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోతరగతిలో అత్యధిక మార్కులు సాధించిన రెడ్డి కులానికి చెందిన విద్యార్థులకు ఆదివారం జిల్లా కేంద్రంలో రెడ్డి మహిళా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీ య బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4 వేలు అందించారు. మొత్తం 10 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా సభ్యులు సంతోషం గోపాల్‌రెడ్డి, వి.మధుసూదన్‌రెడ్డి, కె.సరేందర్‌ రెడ్డి, బొమ్మ సత్తిరెడ్డి, తాళ్ల సంపత్‌రెడ్డి, ఓడేటి బలరాంరెడ్డి, రెడ్డి మహిళా వెల్ఫేర్‌ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు గోనె మణిమాల, పద్మ, భాగ్యలక్ష్మి, పి.సుధా, స్వాతి, లీలా, బి.రాణి, పి.దివ్య, బి.సరిత, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

  • జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పౌష్టికాహారం అందించడంతో పాటు, ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మూడేళ్లు దాటిన చిన్నారులను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

    – రౌఫ్‌ఖాన్‌, జిల్లా సంక్షేమ శాఖ అధికారి

  • మంచిర్యాలటౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపే తం చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ రెండేళ్లుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలను పెంచే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘బడిబాట’ మాదిరిగానే రెండేళ్ల నుంచి ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ పేరిట విద్యాసంవత్సరం ప్రారంభంలోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సైతం మే 30 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అమ్మమాట అంగన్‌వాడీ బాట’ పేరిట జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడేళ్ల చిన్నారులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరేలా, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్లేస్కూల్‌కు పిల్లలను పంపించే తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాలకే వారి పిల్లలను పంపించేలా చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ఆకర్షితులవుతుండడం, ప్రైవేటు కంటే మెరుగ్గా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మారుతుండడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్య ఏటా పెరుగుతోంది.

    బ్రేక్‌ఫాస్ట్‌, భోజనం, విద్య ఒకేచోట అందేలా

    జిల్లాలో 974 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 40,794 మంది ఉన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని పాఠశాలల్లో చేర్పిస్తే చిన్నారుల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారిని అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ‘అమ్మ మాట అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్రానికి వచ్చే చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాల్లోనే ఉండి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు గానూ ఈ ఏడాది నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాబోధనలో భాగంగా చిన్నారులకు ఆటపాటలు, కథలతో పాటు, సంభాషణ నైపుణ్యాలు నేర్పించి, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగానే అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల సేవలను చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే తల్లులు, పిల్లల పేర్లను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసి, బాలింతలకు అవసరమైన పౌష్టికాహారం, చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. మూడేళ్లు వచ్చిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకుని, ఆరేళ్ల వరకు వారికి కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తూ పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేస్తున్నారు. అమ్మమాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లు పైబడిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా కార్యక్రమం చేపట్టనున్నారు.

    అంగన్‌వాడీ

    కేంద్రాలు 974

    చిన్నారులు

    40,794

    బాలింతలు

    3,543

    గర్భిణులు

    3,307

    జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

  • శ్రీరాంపూర్‌: బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. దేశవ్యాప్తంగా కోలిండియా దాని సబ్సిడరీ కంపెనీల్లో పనిచేసే కార్మికుల వేతనాలకు సంబంధించిన కీలకమైన 11వ వేతన ఒప్పందం కాలపరిమితి జూన్‌ 30, 2026తో ముగుస్తుంది. జూలై 1, 2026 నుంచి 12వ వేజ్‌బోర్డు అమలు కావాలి. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కదలిక లేదు. 1వ వేజ్‌బోర్డు నుంచి 4వ వేజ్‌బోర్డు వరకు నాలుగేళ్ల ఒప్పంద కాలపరిమితితో ఒప్పందం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఐదేళ్లకోసారి ఒప్పందం జరుగుతోంది. జూన్‌ 30 తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేజ్‌బోర్డు ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. నూతన వేజ్‌బోర్డు కోసం దేశ వ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు.

    కేంద్రంపై ఒత్తిడి..

    నూతన వేతన ఒప్పందం కోసం జాతీయ సంఘాలు కేంద్రం, కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. గడిచిన రెండు వేజ్‌బోర్డుల సమయానికి బొగ్గు పరిశ్రమలు విస్తరించిన ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ అవసరాల దృష్యా కేంద్ర ప్రభుత్వం అంతకు ముందు కంటే భిన్నంగా త్వరితగతిన వేజ్‌బోర్డు ఏర్పాటు, వేతన ఒప్పందానికి సహకరించాయి. ఈ వేతన ఒప్పందాన్ని నేషనల్‌ కోల్‌వేజ్‌ అగ్రిమెంట్‌(ఎన్‌సీడబ్ల్యూఏ) అని పిలుస్తారు. ఈసారి అలాంటి వాతావరణం లేకపోవడం, కోలిండియాలో షేర్ల విక్రయాలు, ప్రైవేటు బొగ్గు బ్లాకులు పెరిగి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఈ సమయంలో వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు, ఒప్పందం ఎప్పుడు జరుగుతుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది.

    జేబీసీసీఐ ఏర్పాటుకు ఒత్తిడి..

    ప్రతీ వేతన ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం కోలిండియా యజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలతో జాయింట్‌ బైపార్టియేట్‌ కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ కోల్‌ ఇండస్ట్రీ(జేబీసీసీఐ) పేరుతో కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇస్తారు. దీని ప్రకారం జాతీయ సంఘాలు తమ సభ్యుల పేర్లను అందజేస్తారు. కోలిండియా చైర్మన్‌ ఈ జేబీసీసీఐకి చైర్మన్‌గా వ్వవహరిస్తారు. జాతీయ సంఘాల సభ్యుల పేర్లను ఖరారు చేసిన తర్వాత పూర్తి కమిటీ స్వరూపం ఏర్పడి వేతన ఒప్పందం కోసం చర్చలు మొదలవుతాయి. ఈ ప్రక్రియకు ప్రతీసారి జాప్యం జరుగుతుండగా ఈసారి మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు, అలవెన్సుల పెంపు కోసం కార్మిక సంఘాలు తమ డిమాండ్ల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉంటే 11వ వేతన ఒప్పందం 23 నెలల ఆలస్యంతో మే 20, 2023న ఒప్పందం జరిగింది. ఇందులో సగటు కార్మికుని బేసిక్‌ వేతనం రూ.6,973.30 పెంపుదల జరిగింది. ఈసారి దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు తోడు, యుద్ధాల ప్రభావం కూడా వేతన ఒప్పందాలపై ఉంటుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా వరుస విజయాలతో రాజకీయ సుస్థిరతను సాధించుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కోసం తమ ఒత్తిడికి ఏమాత్రం దిగి వస్తుందోనన్న సందేహం కార్మిక సంఘాల నేతల్లో నెలకొంది.

  • మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు మూడురోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా జూన్‌ 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండటంతో పాటు పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల పున:ప్రారంభం వాయిదా పడినందువల్ల కోల్పోయిన విద్యాదినాలను భర్తీ చేయడానికి జూలై 11న రెండో శనివారం సాధారణ పనిదినంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 1,051 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా 1,32,322 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అన్ని పాఠశాలలు జూన్‌ 15న ప్రారంభించాలని విద్యాధికారులకు ఆదేశాలు వచ్చాయి.

    పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి..

    కొత్త విద్యాసంవత్సరం మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుండటంతో పాఠశాలలు సిద్ధం చేసుకోవాలి. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. స్కావెంజర్‌లకు నిబంధనల ప్రకారం పది నెలలు వేతనాలు చెల్లిస్తారు. జూన్‌ ఒకటి నుంచి వేతనాలు చెల్లించే నేపథ్యంలో మొక్కలకు నీరు పోయడం, తదితర పనులపై దృష్టి సారించేలా హెచ్‌ఎంలు చొరవ చూపాలి.

    వాటర్‌ ట్యాంకులపై కన్నేయండి..

    పాఠశాలల్లో ఉపరితల ట్యాంకులను 15 రోజులకోసారి, భూగర్భ ట్యాంకులను నెలకోసారి శుభ్రం చేయాల్సి ఉంది. రక్షిత నీటితో వంటలు చేయాలని ప్రభుత్వ నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో బోరు నీటితోనే వంటలు చేస్తుండడం పరిపాటిగా మారింది. మరికొన్నింట్లో ట్యాంకుల నుంచి వచ్చే నీటితో వంటలు చేస్తున్న సందర్భాలు న్నాయి. పాఠశాలలకు మిషన్‌ భగీరథ పైపులున్నా నీటిసరఫరా అంతంతమాత్రంగానే ఉంది. పాఠశాలలు చాలా రోజులుగా మూసివేయడంతో ట్యాంకులు శుభ్రం చేయక నాచు పేరుకుపోయి.. నీటిలో పురుగులు వచ్చే ప్రమాదముంది. అపరిశుభ్ర వా తావరణం వల్ల విద్యార్థులు అనారోగ్యం బారిన ప డే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నా రు. ట్యాంకులను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలి.

    మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం

    జిల్లాలోని మండల విద్యావనరుల కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిర్వహణ, సౌకర్యా ల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా విని యోగంలో జవాబుదారీతనం లోపిస్తోంది. కొన్ని మండలాల్లో తాగునీరు లేని పరిస్థితి. మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అవసరం నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్‌కు వెళ్లాలంటే మరుగుదొడ్ల పరిస్థితి చూసి ముక్కుమూసుకుంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లోనే మరుగుదొడ్లు క్లీనింగ్‌తో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

  • మంచిర్యాలటౌన్‌: కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాసభ విజయవంతం చేయాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల సత్యమూర్తి, ఉమ్మ డి జిల్లా చైర్మన్‌ సిరాజ్‌ ఉర్‌ రహమాన్‌ కోరారు. ఆదివారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రెయినేజీల నుంచి డ్యామ్‌ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ శాఖల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించి, లేనివాటిని నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ మాజీ చైర్మన్‌లు బి.సుగుణాకర్‌రావు, కట్కూరి దేవేందర్‌రెడ్డి, యూ.సురేందర్‌, స్టేట్‌ అడ్వైజర్‌ కె.ప్రభాకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మాజీ చైర్మన్‌ రామారావు, రవీందర్‌రావు, మనోజ్‌, జితేందర్‌, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

  • చెన్నూర్‌: కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతోంది. రెండు నెలల కాలంలోనే రెండు సార్లు గ్యాస్‌ ధరలు పెంచడం దారుణం. పెరిగిన ధరలతో ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,016లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచుతూ పోతే నిరుపేదలు బతకడం కష్టమే. పెంచిన ధరలను తగించాలి.

    – చిలుముల స్వప్న, గృహిణి, చెన్నూర్‌

    కట్టెలపొయ్యే దిక్కు..

    చెన్నూర్‌: కేంద్ర ప్రభుత్వం మాటిమాటికి గ్యాస్‌ ధరలు పెంచుతూ పోతుంటే కట్టెలపొయ్యే దిక్కయ్యేటట్లు ఉంది. వంట చెరుకు సైతం లభించడం లేదు. ఇలా అయితే పేదలు ఎలా బతికేది. పోయిన నెలలోనే ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచింది. మళ్లీ గ్యాస్‌ ఽసిలిండర్‌పై రూ.29 పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది.

    – పాతర్ల నిర్మల, గృహిణి, చెన్నూర్‌

Andhra Pradesh

  • తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. 

  • పల్నాడు జిల్లా: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్‌ను మాజీ మంత్రి విడదల రజిని తీవ్రంగా ఖండించారు. ఏపీలోని కూటమి సర్కారు తీరుపై ఆమె మండిపడ్డారు. బాధితుడు బొల్లా బ్రహ్మనాయుడిపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, కూటమి ప్రభుత్వం కనుసైగల్లోనే ఈ కేసును నమోదు చేశారని చెప్పారు. 

    బ్రహ్మ నాయుడు చేసిన మంచి సేవా కార్యక్రమాలు వినుకొండ ప్రజలకే కాకుండా, రాష్ట్ర ప్రజలకూ తెలుసని  విడదల రజిని తెలిపారు. అటువంటి వ్యక్తిపై కేసు నమోదు చేసి, జైలుకు పంపడం అత్యంత బాధాకరమని చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని, బొల్లా బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు. 

  • ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ తీరుపై సీపీఎం నేత శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన స్పందించారు. ఏపీని కూటమి ప్రభుత్వం మార్చుతున్న తీరుపై శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

    శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కూటమి రెండేళ్ల పాలన గాడి తప్పిందని చెప్పారు. ఏపీని విషాదాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కూటమి విఫలమైందని చెప్పారు. కమ్యూనిస్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌వి మతిలేని వ్యాఖ్యలని ఆయన విమర్శించారు. 

  • సాక్షి,వైఎస్సార్‌ జిల్లా: రాజ్యసభ సీట్ల విషయంలో టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. లాబీయింగ్‌ చేసే వారికే అవకాశాలుంటాయని ఆ పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి మొండిచేయి చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

    రాజ్యసభ సీటు రాకపోవడంపై  కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అలకబూనారు. సోషల్‌ మీడియాలో శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిని వెళ్లగక్కారు. 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోలేదు. పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని  హామీ ఇచ్చి మొండిచేయి చూపించింది. కష్టపడిన నేతలకు గుర్తింపు లేదంటూ సుదీర్ఘ సోషల్‌ మీడియా పోస్టులో తెలిపారు. కాగా, ఇటీవలే ఆయనకున్న పోలిట్ బ్యూరో సభ్యుడి పోస్ట్ తీసేసి జోనల్ కో ఆర్డినేటర్‌ స్థాయికి తగ్గించింది.  

     

     

Politics

  • కడప:  రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం.  టికెట్‌ ఆశించి భంగపడ్డ వారిలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి ఒకరు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. 

    అందులో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్‌ చేస్తూ పెట్టిన పోస్ట్‌ ఒకటి. ఈ పోస్ట్‌ను టీడీపీ అధిష్టానం డిలీట్‌ చేయించింది. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ఆ ట్వీట్‌ కనుమరుగు కావడంతో ఇది కాస్తా బుజ్జగింపు పర్వం చర్చకు దారి తీసింది. టీడీపీ అధిష్టానం ఆశావహులను బుజ్జగించే క్రమంలోనే శ్రీనివాసులరెడ్డి చేత ఆ పోస్ట్‌ డిలీట్‌ చేయించిందనే చర్చ నడుస్తోంది. మరొకవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా శ్రీనివాసులురెడ్డి ప్రకటించడంతో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైందనేది విశ్లేషకుల మాట.

    ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 
    డిసెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ కడప పర్యటన నేపథ్యంలో పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ మీటింగుకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్‌ చేస్తూ శ్రీనివాసులురెడ్డి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆర్ అండ్ బి శాఖలో బిల్లు పెండింగ్ ఉందన్న శ్రీనివాసులురెడ్డి.. పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త సొంత నిధులు ఖర్చు చేస్తే 18 నెలలుగా బిల్లులు ఇవ్వరా అని నిలదీశారు. నెలలు తరబడి బిల్లు పెండింగులో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదే సమయంలో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కూడా టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి. 

    ఇదీ చదవండి..
    చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్‌

    రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై పెట్టిన పోస్ట్‌ ఇది..

     

     

     

     

     

     

     

     



     

  • బొద్దింక అంటే ఏంటి? ఒక పురుగా, ఒక కీటకమా, లేక అసంతృప్తితో ఉన్న భారతీయ యువకుడిని అలా పిలుస్తున్నారా? కొత్తగా రూపుదిద్దుకుంటున్న "కాక్రోచ్ జనతా పార్టీ"ని ఇష్టపడుతున్న వారిని అడిగితే ‘‘పైవి అన్నీ’’ అనే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు ఇది వ్యంగ్యంగా పుట్టిన ఒక ఆసక్తికర గ్రూప్‌ మాత్రమే. ఇదొక క్వాసీ రాజకీయ పార్టీ. అంటే పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాకపోయినా, రాజకీయ లక్ష్యాలు ఉన్న పార్టీ లేదా రాజకీయాలపై ప్రభావం చూపే గ్రూపు.

    కానీ భారత ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా ఉన్న దేశ యువతకు తామే ప్రతినిధులమని ఇది చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని మిలియన్ల మంది అలా భావిస్తున్నారు. అయితే, ఇది క్షణికావేశం, కొన్ని రోజుల్లో నిరుగారిపోయే ఉత్సాహమేనా?

    కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్‌లైన్ జోక్‌గా మొదలైంది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మిలియన్ల మంది దాని సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టారు. చాలా మంది వ్యాఖ్యాతలు వెంటనే దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. కానీ అది కథలో సగం మాత్రమే.

    పెద్ద సందేశం ఏమిటంటే, ఎన్నికల్లో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చూపుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలకు అదే బలమైన కొలమానం. అనేక దేశాల్లో జెన్ జీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారు. భారతదేశంలో వారిలో చాలా మంది బీజేపీ పాలన కాలంలోనే (2014 నుంచి ఇప్పటివరకు) పెరిగారు. ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజా సేవలు. ప్రస్తుత రాజకీయ వర్గం ఈ ప్రాథమిక అవసరాలను అందిస్తోందా? అని చాలా మంది భావిస్తున్నారు. ఆ అసంతృప్తి కొత్త గొంతుకలకు, కొత్త మార్పులకు అవకాశం కల్పిస్తోంది.

    అయితే, సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యే వారు ఉన్నారంటే, అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ నిజమైన ఎన్నికల్లో కొన్ని వందల ఓట్లు కూడా పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ఆన్‌లైన్‌లో ఎవరినైనా అనుసరించడానికి ఒక ట్యాప్ చాలు. కానీ ఓటు వేయడానికి నిబద్ధత, వ్యవస్థీకరణ, విశ్వాసం, ఓటర్ల హాజరు అవసరం.

    కాక్రోచ్ జనతా పార్టీకి భయపడాలా? 
    కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నటికీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి.

    అప్పట్లో భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్‌వర్క్‌లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. మిలియన్ల మంది ఒక జోక్ (సీజేపీ వంటి) వెనుక నిలబడినప్పుడు, ఆ జోక్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దాన్ని ఏ రాజకీయ వర్గమైనా వినడం మంచిది.

  • న్యూఢిల్లీ: ఇండి కూటమి సమావేశంలో పాల్గొనడానికి కీలక నేతలు ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ నివాసంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. జూన్ 8న జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఇండియా బ్లాక్ సమావేశం ఇదే.

    కొన్ని రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే, డీఎంకే కూడా మద్దతు తెలుపుతుందన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఇండి కూటమి సమావేశం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

    కాంగ్రెస్‌ సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ మీడియాతో స్పందిస్తూ.. ప్రతిపక్ష కూటమి ఐక్యంగానే ఉందని, కొన్ని పార్టీలు పలు కారణాల వల్ల సమావేశానికి హాజరు కాకపోయినా ఐక్యత దెబ్బతినలేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క‍్లబ్‌లో జరగనున్న సమావేశానికి 23 రాజకీయ పార్టీలు హాజరవుతాయని ప్రకటించారు. సమావేశానికి రాకపోయినా, ఆ పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయని రమేశ్‌ చెప్పారు.

    "మోదీ ప్రభుత్వం కోట్లాది భారతీయుల ఓటు హక్కును హరించే చర్యలు చేపడుతోంది. రాజ్యాంగంపై ప్రతిరోజూ దాడి చేస్తోంది. దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోంది. కోట్లాది ప్రజల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిరంతర ద్రవ్యోల్బణంతో కుటుంబాల బడ్జెట్లను దెబ్బతీస్తోంది. లక్షలాది యువత ఆశలు, ఆకాంక్షలను వమ్ము చేస్తోంది. పెట్టుబడి వాతావరణాన్ని బలహీనపరుస్తోంది. విదేశాంగ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. భారత్ మాదిరిగానే ఇండియా జనబంధన్ తన వైవిధ్యంతో ఐక్యంగా నిలుస్తోంది" అని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు.

    ఇండియా బ్లాక్ సమావేశానికి ప్రాధాన్యం పెరిగింది. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, కూటమిలోని అంతర్గత విభేదాలు మరోవైపు ఉన్నాయి.

    తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి 5 స్థానాలు గెలుచుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ నిర్ణయంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సమావేశానికి హాజరుకాబోమని తెలియజేస్తూ రాసిన లేఖలో.. దేశ సంక్షేమాన్ని ప్రభావితం చేసే అంశాలపై ఇతర పార్టీలు లేవనెత్తే విషయాలకు తాము ఎప్పటిలాగే మద్దతుగా ఇస్తామని డీఎంకే పేర్కొంది.

  • హైదరాబాద్‌:  మూసీ మురికి కారణంగా ఉప్పల్‌ పరిధిలో ఉన్న భూముల రేట్లు పెరగడం లేదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మూసీ ప్రక్షాళన చేద్దామంటే అడ్డుపడుతున్నారని రేవంత్‌ పేర్కొన్నారు. ఉప్పల్ భగాయత్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో రేవంత్‌ మాట్లాడారు. ‘మేం మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న చేయోద్దా..?, మూసీ మురికి కార‌ణంగా ఇక్క‌డ భూముల రేట్లు పెర‌గ‌డం లేదు. న‌ల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వ‌ల్ల ఆనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఆడ‌బిడ్డ‌లు క‌డుపుకోతకు గురౌతార‌ని అక్క‌డి వాళ్లు బ‌య‌ట‌కు పంపుతున్నారు. 

    మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌మ‌ని న‌ల్గొండ ప్ర‌జ‌లు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశాను. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చ‌దువు చెప్పిస్తామంటే అడ్డుప‌డుతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్య‌క్తి ఈ రోజు మూసీకి అడ్డంప‌డుతున్నాడు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ కట్టుకున్నారు.

    హైద‌రాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి ప‌డిపోయింది. మెట్రోను విస్త‌రించ‌డానికి అడ్డుప‌డుతున్నారు. మెట్రో విస్త‌రించాల‌న్న అవ‌స‌రం ఉందా లేదా అన్న‌ది ఆలోచించాలి. అన్ని అనుమ‌తులు వ‌చ్చాక కేంద్ర మంత్రి గా ప‌నిచేస్తున్న ఆయ‌న కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టి ఆపుతున్నాడు. రీజ‌నల్ రింగ్ రోడ్డు వ‌స్తే ప్ర‌పంచంతోనే పోటీ ప‌డే అవ‌కాశం ఉంటుంది. 

    రెండున్న‌ర యేళ్ల నుంచి రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని క‌లిశాను. స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా..?, హైద‌రాబాద్ ప్ర‌జ‌లు కిష‌న్‌రెడ్డికి ఓట్లు వేయ‌లేదా..?, మెట్రోకు అనుమ‌తులు తెచ్చే బాధ్య‌త‌, మూసీకి నిధులు తీసుకువ‌చ్చే బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా..?, తెలంగాణ ప్ర‌భుత్వం 70 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవ‌రు కొనాలి. కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్య‌త కిష‌న్ రెడ్డికి లేదా?, తెలంగాణ ప్ర‌జ‌లతో గోకున్నోడు బాగుప‌డిన‌ట్లు లేదు. 15 వ తేదీ త‌ర్వాత బ‌రాబ‌ర్ మా కార్యచరణ ఉంటుంది’ అని పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌:  తనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్‌కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్‌ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్‌ ప్రధాని కాలేడు. కాంగ్రెస్‌ను ప్రజలు అడ్రస్‌ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. 

    కాగా, నిన్న(శనివారం, జూన్‌ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ సహా ఇంటిగ్రేటెడ్‌ రిజిస్ట్రేషన్‌ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ..  ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. 

    అవసరమైతే ఫాంహౌస్‌లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్‌గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. 

    ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్‌ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. 

Business

  • హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై ఆఫర్స్ ప్రకటించగా.. టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ తరుణంలో మారుతి సుజుకి.. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది.

    మారుతి సుజుకి విక్టోరిస్
    ఎంపిక చేసిన విక్టోరిస్‌ వేరియంట్లపై రూ. 90,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌లకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్‌లతో సహా అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి.

    విక్టోరిస్ CNG వేరియంట్లు రూ. 80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉండగా, పెట్రోల్ వేరియంట్లను రూ. 60,000 వరకు తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.

    మారుతి సుజుకి స్విఫ్ట్
    దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా ఈ నెలలో మారుతి సుజుకి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు.. మాన్యువల్, CNG వేరియంట్‌లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

    మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది చాన్నాళ్లుగా బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

    మారుతి బ్రెజ్జా, వ్యాగన్ ఆర్
    మారుతి సుజుకి బ్రెజ్జాను కొనుగోలు చేయాలనుకునే వారు పెట్రోల్, CNG వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ పథకాలు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ కొనుగోలుపై రూ. 52,500 వరకు తగ్గింపులు కూడా లభిస్తున్నాయి.

    ఆల్టో కే10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో
    వేరియంట్‌ను బట్టి మారుతి సుజుకి ఆల్టో కే10పై రూ. 52,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో.. సెలెరియో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఈకోలపై రూ. 37,500 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

    అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి డిజైర్, ఎర్టిగా మోడళ్లపై కంపెనీ ఈ నెలలో ఎలాంటి అధికారిక డిస్కౌంట్లు అందించడం లేదు. ఈ రెండు మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సంస్థ ఆఫర్స్ అందించకపోవడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఆఫర్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ అన్నీ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

  • గడిచిన వారం రోజులు (మే 31 నుంచి జూన్ 6)గా భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో దేశంలో ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మే 31న (ఆదివారం) రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు జూన్ 6 (శనివారం) నాటికి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.20 వేలు తగ్గిందన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి.

    అయితే.. ముంబైలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.

    2026లో వెండి రేటు గరిష్టంగా రూ.3 లక్షలు దాటేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ నేడు జూన్ 7 (ఆదివారం) రూ.2.75 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంటే.. సిల్వర్ రేటు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

    వెండికి ఎందుకు డిమాండ్!
    వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామిక రంగంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి ఎలక్ట్రానిక్స్‌లో సర్క్యూట్ బోర్డులు, మైక్రోచిప్‌లలో, విద్యుత్ పరిశ్రమలో కేబుల్స్, టర్మినల్స్, కనెక్టర్లలో ముఖ్యంగా వినియోగించబడుతుంది. ఆప్టికల్ పరికరాలు, లెన్స్‌లు, రిఫ్లెక్టర్లు, కొన్ని వైద్య పరికరాలు, డెంటల్ టూల్స్‌లో కూడా వెండి ఉపయోగం ఉంది. కాబట్టి వెండికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.

    ఇదీ చదవండి: తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!

  • మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది.  టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.

    • అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.

    • రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్‌లో హాట్ సెల్లింగ్ మోడల్‌గా మారింది.

    • మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.

    • నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.

    • ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.

    • ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.

    • ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్‌లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి.

    • తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.

    ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!

  • భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.

    ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.

    వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!
    ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్‌కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.

    జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.

    నిర్ణయాలపై నమ్మకం
    ప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.

    సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.

    కొత్త ప్రయత్నాలు అవసరం
    అలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.

    ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!

  • ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్‌కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.

    ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్‌ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.

    అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.

    గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్‌పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.

    ప్రస్తుతం అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి.

  • రోజూ వాడే చిన్న చిన్న వస్తువులే ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. చూడటానికి క్యూట్‌గా, వాడటానికి సూపర్‌గా ఉండే ఈ స్మార్ట్‌ హెల్పర్స్‌తో మీ డైలీ రొటీన్‌కు ఒక ఫన్ టచ్‌ వచ్చేస్తుంది!

    స్పూన్‌తో పనిలేని మగ్‌!
    ఉదయాన్నే ఆఫీస్‌ హడావుడిలో కాఫీ లేదా హెల్తీ ప్రొటీన్‌ షేక్‌ కలుపుకోవడానికి స్పూన్‌ వెతుక్కునే ఓపిక లేనప్పుడు– మీ పనిని చిటికెలో సులువు చేయడానికే వచ్చేసింది ఈ ‘ఆటోమేటిక్‌ సెల్ఫ్‌ స్టిరింగ్‌ మగ్‌!’ ఇది మీ చేతిలో ఉంటే చాలు, మీరు స్పూన్‌తో తిప్పాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క బటన్‌ ప్రెస్‌తో మీ డ్రింక్‌ని పర్ఫెక్ట్‌గా మిక్స్‌ చేసేస్తుంది.

    ఇందులో ఉండే అడ్వాన్డ్స్ మ్యాగ్నెటిక్‌ మిక్సింగ్‌ టెక్నాలజీ వల్ల అడుగున షుగర్‌ గానీ, ప్రొటీన్‌ పౌడర్‌ గానీ గడ్డలు కట్టకుండా స్మూత్‌గా బ్లెండ్‌ అవుతుంది. థర్మల్‌ లిడ్‌ డిజైన్‌తో రావడం వల్ల మీ డ్రింక్‌ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, పైగా ప్రయాణాల్లో వాడుతున్నా కూడా అస్సలు కింద వలకదు. ధర కేవలం రూ. 1000 మాత్రమే!

    మినీ ఎయిర్‌ పంప్‌...!
    సమ్మర్‌ క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు లేదా పూల్‌లో ఎంజాయ్‌ చేయాలనుకున్నప్పుడు ఎయిర్‌ బెడ్స్, స్విమ్‌ రింగ్స్‌లో నోటితో గాలి ఊదలేక ప్రాణం, ప్రాణం మీదికి వస్తోందా? మీ ఊపిరితిత్తుల కష్టాలను తీరుస్తూ, చిటికెలో గాలి నింపేయడానికి వచ్చేసింది ఈ ‘ఫ్లెక్స్‌టైల్‌గేర్‌ మ్యాక్స్‌ పంప్‌’.

    కేవలం 123 గ్రాముల బరువుండే ఈ బుజ్జి గ్యాడ్జెట్‌.. ఏకంగా 5.0 కెపీఏ ప్రెజర్‌తో నిమిషానికి 500 లీటర్ల గాలిని రాకెట్‌ స్పీడ్‌తో నింపేస్తుంది. దీని డిజైన్‌కు అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే దీని లోపలి భాగాలు కనిపించేలా ట్రాన్స్‌పరెంట్‌ బాడీతో ఉండటమే కాకుండా, రాత్రి పూట క్యాంపింగ్‌లో వాడుకోవడానికి వీలుగా 3 లెవెల్స్‌ బ్రైట్‌నెస్‌ ఉన్న ఒక సూపర్‌ ఎల్‌ఈడీ క్యాంపింగ్‌ లైట్‌లా కూడా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 60 నిమిషాల పాటు నాన్ స్టాప్‌గా చేస్తుంది. ధర రూ. ఐదు వేల నుంచి మొదలు!

    చార్జర్‌ ప్రొటెక్టర్‌!
    మీ చార్జర్‌ కేబుల్స్‌ త్వరగా విరిగిపోతున్నాయా? లేదా వైట్‌ కలర్‌ అడాప్టర్‌ మురికిగా అయిపోతోందని వర్రీ అవుతున్నారా? మీ చార్జర్‌ని సరికొత్తగా మారుస్తూ, దానికి లైఫ్‌ లాంగ్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వడానికి వచ్చేసింది ఈ ‘ఆస్ట్రోనాట్‌ థీమ్‌ చార్జర్‌ ప్రొటెక్టర్‌ సెట్‌!’

    ఇది చార్జర్, పవర్‌ అడాప్టర్లకు పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యే ఒక క్యూట్‌ గ్యాడ్జెట్‌. హై–క్వాలిటీ సిలికాన్‌ మెటీరియల్‌తో చేసిన ఈ కేస్, మీ చార్జింగ్‌ బ్రిక్‌ను స్క్రాచెస్‌ పడకుండా, కింద పడినా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో వచ్చే బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్పైరల్‌ వ్రాప్‌ మీ కేబుల్స్‌ అస్సలు వంగిపోకుండా, చిరిగిపోకుండా రక్షణ ఇస్తుంది. అంతేకాదు, ట్రావెలింగ్‌లో కేబుల్స్‌ చిక్కుపడిపోకుండా నీట్‌గా ఫోల్డ్‌ చేసుకోవడానికి ఇందులో ఒక ఆర్గనైజింగ్‌ స్ట్రాప్‌ కూడా వస్తుంది. దీని ధర రూ. 170 మాత్రమే!

International

  • వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్‌ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.

    ఎన్‌బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్‌పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.

    ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. 

Movies

  • ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా  హీరోయిన్‌గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.

    ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.

    ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్  సంగీతం అందించారు.

    దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.
     

  • ప్రస్తుతం థియేటర్లలో రామ్ చరణ్ పెద్ది మూవీ సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ మూవీపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ ‍అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. తనయుడి టాలెంట్‌ను చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారంటూ పొగిడారు.

    అయితే పెద్దికి మాత్రం టాలీవుడ్ హీరోల నుంచి సపోర్ట్ కరువైంది. కేవలం చిరంజీవి, కొందరు మెగా హీరోలు మాత్రమే రివ్యూలు ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్స్‌ వీక్షించి మరి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే మిగిలిన స్టార్‌ హీరోల నుంచి మాత్రం పెద్దికి ఎలాంటి మద్దతు రావడం లేదు. రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌పై ఒక్కసారిగా ట్వీట్ల వర్షం కురిపించిన తెలుగు హీరోలు.. పెద్ది విషయానికి వచ్చేసరికి గప్‌చుప్‌ అయిపోయారు.

     పెద్ది సినిమాపై ఇప్పటి వరకూ టాలీవుడ్ స్టార్స్‌ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు తమ అభిప్రాయాలను పంచుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి సైతం ఇప్పటి వరకు పెద్దిపై ఎలాంటి ట్వీట్ చేయలేదు. దురంధర్‌ సినిమాను సపోర్ట్ చేసిన మన హీరోలు.. టాలీవుడ్ మూవీని ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ మొదలైంది. ఇకనైనా మన హీరోలు.. మన సినిమాలకు మద్దతుగా నిలుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. 
     

  • కల్కి మూవీతో హిట్‌ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌ పనులతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ కల్కి-2 అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇవాళ చెన్నైలో జరిగిన సింగ్ గీతం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ ‍అశ్విన్ క్రేజీ న్యూస్‌ షేర్ చేశారు. కల్కి-2 సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చారు.

    కల్కి-2 ఇప్పటికే ప్రారంభమైందని నాగ్ అశ్విన్ తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ వచ్చేనెలలో మొదలు కానుందని అభిమానులకు గుడ్ న్యూస్‌ చెప్పారు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్‌ కల్లా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీని మరింత వేగంగా పూర్తి చేయడానికి  సన్నాహాలు చేస్తున్నామని నాగ్ అన్నారు. ఏప్రిల్ 2027 నాటికి మెయిన్ పార్ట్‌ చిత్రీకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.

    కాగా.. మొదటి భాగం కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్‌, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె సైతం అభిమానులను మెప్పించింది. కల్కిలో విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రభాస్ కోసం నిర్మాతలు మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 
     

  • ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం సింగ్ గీతం. సంగీతమే ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. 94 ఏళ్ల వయసులో ఈ సినిమాను రూపొందించడం విశేషం. ఈ మూవీ జూన్ 11న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా సింగ్ గీతం మూవీ నుంచి క్రేజీ సాంగ్ విడుదల చేశారు. ఓరి జీవుడా జీవుడా అంటూ సాగా పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. శంకర్‌బాబు ఆలపించారు. ఈ సాంగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.

     

  • సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు  విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.  చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.

    ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ పంచుకున్నారు.

    ఈ సినిమా కథేంటంటే.. 

    సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్‌కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.

     

  • కమల్‌ హాసన్‌-సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్‌ అయిన తర్వాత సింగీతం శ్రీనివాస రావు మరో కథను కూడా కమల్‌కు వినిపించాడట. 45 ఏళ్ల క్రితమే ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట కానీ, అది సాధ్యం కాలేదు.

     దాదాపు 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదే ‘సింగ్‌ గీతం’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని చెన్నైలో నిర్వహించారు. ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. ‘సింగ్‌ గీతం’సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ‘నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సింగీతం శ్రీనివాసరావుతో పరిచయం ఏర్పడింది. మా తొలి సినిమా అనుకోకుండా తెరకెక్కింది. ఆ తర్వాత నాకు రెండు కథలు వినిపించాడు. అందులో పుష్పక విమానం తెరకెక్కింది. రెండో కథ మాత్రం అలానే ఉండిపోయింది. దాని గురించి 45 ఏళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ చేయలేకపోయాం. అదే సింగ్‌ గీతం. 

    45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింగీతం శ్రీనివాసరావుకు వయసు అనేది కేవలం ఒక నెంబర్‌ మాత్రమే. ఆలోచన విషయంలో ఆయన ఇప్పటికీ జెన్‌ జీ కన్నా ఒక అడుగు ముందే ఉంటాడు. ఆయన నుంచి ఇంకా నేర్చుకుంటున్నా. సింగీతం దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయాలని ఉంది’ అని కమల్‌ అన్నారు. 

  • సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్‌తో పాటు ఇంటిమేట్‌ సీన్స్ కూడా ఉంటాయి. కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ తప్పకుండా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ముద్దు సీన్స్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా నటీనటులు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్‌ అయితేనే ముద్దు సీన్‌ అంత బాగా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. అలాంటి ఈ సీన్స్‌లో ఒక్కోసారి అభ్యంతరం రావడం కూడా సహజమే. తాజాగా ఓ నటి ముద్దు సీన్‌లో తనకెదురైన అనుభవాన్ని షేర్ చేసుకుంది.

    ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా బాపత్.. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఓ సాంగ్‌ షూట్‌లో హీరో తనను పదేపదే ముద్దు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించింది. ఆ టైమ్‌లో తాను ఎలా స్పందించాలో.. ఎలా సమర్థించుకోవాలో తెలియలేదని అన్నారు. షూటింగ్ తర్వాత కూడా ఆ సీన్ తన మైండ్‌లో నుంచి పోలేదని చెప్పారు. అయితే ఆ ముద్దు సన్నివేశంపై తాను మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేశానని ప్రియా తెలిపారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్లలో దాని అవసరం గురించి దర్శకుడిని ప్రశ్నించానని ప్రియా బాపత్ వెల్లడించారు. ఆ సన్నివేశం కంటే సహనటుడి ప్రవర్తన హద్దులు దాటిందని ఆమె ఆరోపించారు.

    అంతేకాకుండా చిత్రీకరణ సమయంలో తామిద్దరూ ఒకే హోటల్‌లో బస చేశామని వెల్లడించింది. తాను చాలాసార్లు వద్దని చెప్పినప్పటికీ నా సహనటుడు అల్పాహారం, రాత్రి భోజనానికి తనతో  కలిసి చేయాలని పదేపదే అడిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనను తీవ్రంగా కుంగదీసిందని తెలిపింది. తన పరిస్థితి గురించి ప్రతి రాత్రి తన భర్త ఉమేష్ కామత్‌కు ఫోన్ చేసేదాన్నని చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె భర్త  కామత్ ముంబయి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న భోపాల్‌కు వచ్చి మూడు రోజుల పాటు ఆమెతో పాటే ఉన్నారని వెల్లడించింది.

    కాగా.. ప్రియా బాపత్  మరాఠీ చిత్రసీమలో ఫేమ్ తెచ్చుకుంది. గత కొన్నేళ్లుగా ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసింది. 'కాక్‌స్పర్శ్', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో  నటనకు ఆమె బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా హ్యాపీ జర్నీ (2014), ఆమ్హీ దోగీ (2018), అంధేరా,  రాత్ జవాన్ హై లాంటి ప్రాజెక్ట్‌ల్లో కనిపించింది. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది.

     

  • ఈ రోజుల్లో చిన్న సినిమాలు చేసిన కొద్దిమంది నటులు, దర్శకులే తాము పెద్ద సెలబ్రిటీలమనే రేంజ్‌లో ఫీల్ అవుతూ గాల్లో తేలిపోతుంటారు. కానీ, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో 'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన  స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాత్రం తన సింప్లిసిటీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన నిరాడంబరతకు అద్దం పట్టే ఒక అరుదైన ఘటన తాజాగా చెన్నైలో చోటుచేసుకుంది.

    లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో 'సింగ్ గీతం' అనే సినిమాను నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు.  తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా  ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఒక ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ విశ్వనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రావడంతో వేదికపై మరియు గెస్టుల గ్యాలరీలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. వచ్చిన అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు కూర్చోవడానికి సీట్లు సరిపోలేదు. తన సినిమా ఈవెంట్‌కు వచ్చిన అతిథులకు ఇబ్బంది కలగకూడదని భావించిన నాగ్ అశ్విన్.. ఏమాత్రం ఈగోకు పోకుండా, తాను ఒక స్టార్ డైరెక్టర్ ని అనే విషయాన్ని పక్కన పెట్టి, సోఫాల పక్కనే కింద నేల మీద కూర్చుండిపోయారు. కమల్ హాసన్ లాంటి లెజెండ్ పక్కన కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, అతిథుల సౌకర్యం కోసం నాగ్ అశ్విన్ కింద కూర్చోవడం చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నాగ్ అశ్విన్ పై నెటిజన్లు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
     

Sports

  • ఇవాళ ముగిసిన లార్డ్స్‌ టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్‌ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. 

    మరోవైపు న్యూజిలాండ్‌పై గెలిచినా ఇంగ్లండ్‌ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.

    భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్‌ను రెండు మ్యాచ్‌ సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ (9), పాకిస్తాన్‌ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.

    లార్డ్స్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.

    ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జేమీసన్‌ 5, నాథన్‌ స్మిత్‌ 3, విలియమ్‌ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

    అనంతరం న్యూజిలాండ్‌ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్‌ 5, టంగ్‌ 3, అట్కిన్సన్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే (57), డకెట్‌ (33), జేమీ స్మిత్‌ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్‌ ఓరూర్కీ 2, మ్యాట్‌ హెన్రీ, జేమీసన్‌ తలో వికెట్‌ తీశారు.

    254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్‌ 5, రాబిన్సన్‌, టంగ్‌ తలో 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (44 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌ 17న మొదలవుతోంది.
     

  • పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్‌ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్‌కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

    తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్‌ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్‌రూమ్ నిర్ణయాలు, మ్యాచ్‌ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.

    భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..
    ఇటీవలికాలంలో భారత్‌పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్‌ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.

    వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్‌ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది.

    గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు
    భారత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్‌ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్‌ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

    ఖుష్దిల్‌ షా భారత్‌పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్‌లో పాక్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్‌ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.

     

  • భారత టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.

    ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్‌ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్‌కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.

    గంభీర్‌-అయ్యర్‌ గతంలో ఐపీఎల్‌లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్‌లో (మెంటార్‌-కెప్టెన్‌) కేకేఆర్‌ టైటిల్‌ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడారు.

    అయ్యర్ శైలి ప్రత్యేకం
    అయ్యర్‌ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.

    ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు.

     

  • హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద "తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం" పేరుతో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నేతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు చేశారు.

    టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్‌సీఏలో సరైన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన ఆటగాళ్లు హెచ్‌సీఏ వ్యవస్థ కారణంగా నష్టపోతున్నారని ఆరోపించారు.

    ప్రత్యేక తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, మండలాల స్థాయిలో ఇతర క్రీడలకు ఉన్నట్లుగా క్రికెట్‌కు కూడా ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడాలంటే హెచ్‌సీఏ పరిధిలోనే ఉండాల్సిన పరిస్థితి జిల్లాల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందన్నారు.

    హెచ్‌సీఏలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లేదని టీసీఏ నేతలు ఆరోపించారు. క్లబ్‌ల నమోదు, ఎన్నికలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడాకారుల ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. హెచ్‌సీఏలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

    అలాగే హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగ్‌లకు సంబంధించిన అనుమతులు, క్లబ్‌ల చట్టబద్ధత, పాలకవర్గ నియామకాలపై కూడా టీసీఏ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.

    గ్రామీణ, జిల్లా స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
     

  • లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో లార్డ్స్‌లో జరిగిన 150వ మ్యాచ్‌ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం​.

    పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జేమీసన్‌ 5, నాథన్‌ స్మిత్‌ 3, విలియమ్‌ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

    అనంతరం న్యూజిలాండ్‌ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్‌ 5, టంగ్‌ 3, అట్కిన్సన్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే (57), డకెట్‌ (33), జేమీ స్మిత్‌ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్‌ ఓరూర్కీ 2, మ్యాట్‌ హెన్రీ, జేమీసన్‌ తలో వికెట్‌ తీశారు.

    254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్‌ 5, రాబిన్సన్‌, టంగ్‌ తలో 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (44 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌ 17న మొదలవుతోంది. 

  • హైదరాబాద్ వేదికగా యోనెక్స్-సన్‌రైజ్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ (U-15) నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో సరికొత్త ఛాంపియన్లు అవతరించారు. సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన కిమ్‌కిమ్ ఖోంగ్‌సాయి, లియాన్‌సాంగ్‌పుయా జోడి మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో పసిడి పతకం కైవసం చేసుకున్నారు.

    ఫైన‌ల్‌లో ప్ర‌త్య‌ర్ధిపై 21-10, 21-15 వరుస సెట్లలో గెలిచి ఛాంపియ‌న్స్‌గా నిలిచారు. అంత‌కుముందు సెమీఫైన‌ల్లో టోర్నీ రెండువ సీడ్ జోడీపై వీరిద్ద‌రూ ఘ‌న విజ‌యం సాధించారు. కాగా కిమ్‌కిమ్ ఖోంగ్‌సాయి, లియాన్‌సాంగ్‌పుయా ఇద్దరూ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు.

    వారిద్ద‌రికి 'సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీ'లో చేరకముందు కనీసం రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లు కూడా అనుభవం లేదు.  వారిని చిన్న వయసులోనే హైదరాబాద్ తీసుకొచ్చి, అకాడమీ తరపున డైరెక్టర్  కె. ప్రదీప్ రాజు ఉచిత కోచింగ్ ఇచ్చారు.
     

  • ముల్లాన్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  ఐపీఎల్‌లో దంచికొట్టిన రాహుల్‌... టెస్టు ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగం కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు.

    చక్కటి షాట్‌లతో మంచి టచ్‌లో కనిపించిన యశస్వి జైస్వాల్‌ త్వరగానే అవుటవడంతో... అఫ్గాన్‌ శిబిరంలో ఆనందం కనిపించింది. వనడౌన్‌ బ్యాటర్‌ సుదర్శన్‌ సాయంతో రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చితూచి ఆడిన ఈ జంట ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లింది. మంచి బంతులను వదిలేసిన ఈ జోడీ... గతి తప్పిన బంతులపై విరుచుకుపడింది.

    దీంతో స్కోరుబోర్డు సాఫీగా సాగగా... అఫ్గాన్‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జంటను విడదీయలేకపోయారు. అనుభవరాహిత్యం అఫ్గాన్‌ జట్టుకు ప్రతిబంధకంగా మారింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ బ్యాట్‌ను తాకిన బంతి... కీపర్‌ చేతిలో పడింది. అయితే అంపైర్‌ ఇది గుర్తించకపోగా... అఫ్గాన్‌ రివ్యూ కోరలేదు. 

    తర్వాత రీప్లేలో అది స్పష్టంగా అవుట్‌ అని కనిపించింది. దీంతో బతికిపోయిన రాహుల్‌... టెస్టు ఫార్మాట్‌లో 12వ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఈ క్ర‌మంలో రాహుల్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

    చ‌రిత్ర సృష్టించిన రాహుల్‌
    రాహుల్ సరిగ్గా 100 పరుగుల వద్దే అవుట్ కావడం రాహుల్ కెరీర్‌లో ఇది మూడోసారి. దీంతో  టెస్టుల్లో అత్యధిక సార్లు ఖచ్చితంగా 100 పరుగుల వద్ద అవుట్ అయిన భారత బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో  సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తమ కెరీర్‌లో రెండేసి సార్లు  ఇలా వంద పరుగుల వద్ద అవుట్ అయ్యారు. 

    ఇప్పుడు రాహుల్ వారిని అధిగ‌మించాడు. అంతేకాకుండా రాహుల్ త‌న టెస్ట్ కెరీర్‌లో చేసిన చివ‌రి మూడు సెంచ‌రీలు కూడా ఇలా వంద ప‌రుగులు వ‌ద్దే ముగిశాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలను ఇలా 'ఖచ్చితంగా 100' వద్దే ముగించిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
     

  • పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్‌ అఫ్రిదికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన రెడ్‌బాల్ శిక్షణ శిబిరంలో అతడికి చోటు దక్కలేదు. దీంతో షాహీన్ టెస్టు భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.

    జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరిగే రెడ్‌బాల్ క్యాంప్‌కు 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన పీసీబీ, షాహీన్ పేరును జాబితాలో చేర్చలేదు. అయితే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగే వైట్‌బాల్ క్యాంప్‌లో మాత్రం అతడికి స్థానం కల్పించింది.

    ఆస్ట్రేలియాపై మెరిసినా..
    తాజాగా పాక్‌ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలవడంలో (2-1) షాహీన్ కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు తీసి, 3.86 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.

    అలాగే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు సాధించాడు. అయినప్పటికీ రెడ్‌బాల్ క్యాంప్ నుంచి అతడిని తప్పించడంపై ఆశ్చర్యకరంగా ఉంది.

    తీవ్ర విమర్శలు
    ఇటీవలి కాలంలో పాక్‌ టెస్ట్‌ జట్టు ప్రదర్శనలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. బంగ్లాదేశ్‌ చేతిలో వరుసగా రెండోసారి వైట్‌వాష్‌కు గురికావడం, నాలుగు వరుస టెస్టుల్లో ఓడిపోవడం జట్టు ఘోర పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో భారీ మార్పులు చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    రెడ్‌బాల్ క్యాంప్‌లో స్టార్ ఆటగాళ్లు
    రెడ్‌ బాల్‌ క్యాంప్‌లో షాహీన్‌కు చోటు దక్కకపోయినా.. బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, షాన్‌ మసూద్‌, సల్మాన్‌ అఘా, ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఆమిర్‌ జమాల్‌ వంటి ప్రముఖులకు అవకాశం లభించింది.

    ఇదిలా ఉంట, పాక్‌ తదుపరి టెస్ట్‌ మ్యాచ్‌లు జులై ఆఖర్లో ఆడాల్సి ఉంది. జులై 25 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు విండీస్‌లో పర్యటించనుంది. ఈ సిరీస​్‌తో పాటు తదుపరి టెస్ట్‌ షెడ్యూల్‌ దృష్ట్యా పాక్‌ రెడ్‌ బాల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. 

  • భారత క్రికెట్‌లో గత కొంతకాలంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే, అది మహ్మద్‌ షమీయే అని చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఫార్మాట్లకతీతంగా ఎంత అద్భుతంగా రాణించినా, జాతీయ జట్టులోకి తిరిగి రాలేకపోతున్నాడు.

    హర్షిత్‌ రాణా లాంటి బౌలర్ ఏమీ సాధించకపోయినా, ప్రతిసారి జట్టులో దర్శినమిస్తున్న వేల, షమీకి జరుగుతున్న అన్యాయంపై కొందరు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. హర్షిత్‌కు ఉన్న అర్హతలేంటి, షమీకి లేనివేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై బీసీసీఐని, సెలెక్టర్లను, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను నిలదీస్తున్నారు.

    తాజాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టును ప్రకటించగా.. షమీకి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసినా, సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకోలేదు.

    తాను లేని భారత జట్లను ప్రకటించిన గంటల వ్యవధిలోనే షమీ హ్యాట్రిక్‌ వికెట్లు తీసి సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. బెంగాల్ టీ20 లీగ్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ టోర్నీలో సిలిగురి స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. రార్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు.

    మొదటగా తన ఐపీఎల్ సహచరుడు షాబాజ్‌ అహ్మద్‌ను ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాతి రెండు బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీ వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

    షమీ (4/27)తో పాటు కరణ్ లాల్ (3/36) అద్భుత బౌలింగ్‌ చేయడంతో రార్ టైగర్స్‌పై సిలిగురి స్ట్రయికర్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్ట్రయికర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో షమీ, కరణ్‌ లాల్‌ ధాటికి తడబడిన రార్‌ టైగర్స్‌ 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది.  

     

Telangana

  • మెదక్: వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. భార్య కళ్లుగప్పి మరో ఇద్దరు మహిళలతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆ విషయాన్ని గుర్తించిన భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తన తల్లిదండ్రులు, సోదరుడి సాయంతో భర్తను అక్కడికక్కడే చంపేసింది. 

    మెదక్‌, మిలిటరీ కాలనీలో ఓ ఆర్మీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్‌ను అతడి భార్య, అత్త, మామ, బావమరిది హత్య హత్యచేశారు. ఇంట్లో ఇద్దరు మహిళలతో పొన్నం కుమార్‌ ఏకాంతంగా ఉండగా అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

    ఆ ఇద్దరు మహిళలు ఎవరంటూ ఆగ్రహంతో పొన్నం కుమార్‌ను హత్య చేసి, అనంతరం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితులు నలుగురు లొంగిపోయారు. ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా పని చేస్తున్న కుమార్.. ప్రస్తుతం సెలవులు ఉండడంతో ఇంటికి వచ్చాడు. ఈ నెల 10న విధులకు తిరిగి వెళ్లాల్సి ఉండగా హత్యకు గుర‍య్యాడు. 

  • సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లి ప్రాంతంలోని కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లి డీసీపీ రితిరాజ్‌ స్వయంగా ఆపరేషన్‌ నిర్వహించారు. సెక్యూరిటీని తప్పించుకుని పబ్‌లోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను ప్రత్యక్షంగా గమనించారు.

    డీసీపీ స్వయంగా పబ్‌ యాక్టివిటీని చిత్రీకరించి, వెంటనే లోకల్‌ పోలీసులను పిలిపించారు. అనంతరం సోదాలు నిర్వహించి, పబ్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో మొత్తం 9 నుంచి 10 మంది సిబ్బంది అరెస్టు అయ్యారు. యాజమాన్యం యువతుల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కూకట్‌పల్లి ప్రాంతంలో పబ్‌ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: హిట్లర్‌, తుగ్లక్‌ కలిస్తే రేవంత్‌ రెడ్డి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి గులాంగిరీ చేస్తున్నారని చెప్పారు.

    ‘సాక్షి’తో మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో తెలంగాణ నుంచే ఎఫ్‌సీఐ 60 శాతం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ‘‘హిట్లర్‌ ప్లస్‌ తుగ్లక్‌ కలిస్తే రేవంత్‌ రెడ్డి. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో అసమర్థ పాలన కొనసాగుతోంది. సోనియా గాంధీ కుటుంబానికి సలాం చేసేది రేవంత్‌ రెడ్డి.

    పదవి కాపాడుకోవడానికి సోనియాకు పన్నులు కడుతున్నారు. 11 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ కట్టిన పన్నుల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చింది. సోనియా కుటుంబం ముందుకు రేవంత్‌ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. 

National

  • సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే పని చేస్తున్న నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో... నిర్వహణ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

    ఈ ఘటన అశ్విని కుమార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నగలను శుభ్రపరిచే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఈ సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళ్తుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంక్‌ను ప్రతి 2 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తారు.

    డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-1) అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం శుభ్రపరిచే పనిలో భాగంగా ఒక సూపర్‌వైజర్, ముగ్గురు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే నలుగురూ కుప్పకూలిపోయారు. మూసివేసిన ఆ ప్రదేశంలో విష వాయువు ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడమే వారు మృతిచెందడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని, అయితే కచ్చితమైన కారణం పోస్టుమార్టం పరీక్ష తర్వాత తెలుస్తుందని తెలిపారు.

    కార్మికుల వద్ద భద్రతా పరికరాలు ఎక్కడ? 
    ట్యాంక్‌లోకి దిగే ముందు సూపర్‌వైజర్ అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం, పనులు నిర్వహించే సమయంలో కార్మికుల వద్ద అవసరమైన భద్రతా పరికరాలు గానీ, రక్షణ సామగ్రి గానీ లేవు.

    సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. నలుగురు కార్మికులను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.  

    నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా విధానాలు అమలు చేశారా లేదా తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులు ఎవరో గుర్తించనున్నారు.