Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. 248 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 

    కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ లక్ష్యాన్ని అందుకుంటుందని అంతా భావించారు. కానీ సునీల్ నరైన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో మ్యాచ్ చేజారిపోయింది. చివరిలో సాయిసుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌(57), సాయిసుదర్శన్‌(53 నాటౌట్‌) రాణించారు.

    అంతకముందు బ్యాటింగ్‌  చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.

  • ఐపీఎల్‌-2026లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు.ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో బౌండరీల వర్షం కురిపించాడు.

    30 పరుగుల లోపు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అలెన్.. ఆ తర్వాత మాత్రం గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లుతో 93 పరుగులు చేశాడు. ఈ ‍క్రమంలో అలెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

    👉ఒకే ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌ తరపున ఒకే ఇన్నింగ్స్‌లో రెండుసార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. అంతకుముందు మే 8న ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లోనూ అతడు 10 సిక్సర్లు బాదాడు. 

    👉గుజరాత్‌ టైటాన్స్‌పై కేకేఆర్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ప్లేయర్‌గా అలెన్‌ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెంకటేశ్‌ అయ్యర్‌(83) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో అయ్యర్‌ను అలెన్‌ అధిగమించాడు.

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఫిన్‌ అలెన్‌తో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.

    గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. కాగా ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌పై అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా కేకేఆర్‌ చరిత్ర సృష్టించింది.
    చదవండి: IND vs AFG: టీమిండియాలోకి ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?
     

  • టీమిండియా పేస‌ర్, గుజ‌రాత్ టైటాన్స్ స్టార్ బౌల‌ర్ మహమ్మద్ సిరాజ్ త‌న టీ20 కెరీర్‌లో అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టీ20ల్లో 200 వికెట్ల‌ను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అజింక్య ర‌హానే అవుట్ చేయ‌డం ద్వారా సిరాజ్‌ ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

    ఈ ఘ‌న‌త సాధించిన 21 భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 174 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మియా.. 8.00కు పైగా ఏకాన‌మితో రెండు వందల వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో 6 ఫోర్ వికెట్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

    2024, 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కూడా సిరాజ్ మియా సభ్యునిగా ఉన్నాడు. సిరాజ్‌టెస్టు క్రికెట్‌లోనే కాకుండా వైట్‌బాల్‌తో కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే... తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.

    ఓపెనర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. అలెన్‌ కేవలం 35 బంతుల్లోనే  4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.
     

  • ఐపీఎల్‌-2026లో శుక్ర‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి చ‌విచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 188 పరుగుల లక్ష్యాన్ని కేవ‌లం 16.4 ఓవర్లలోనే ఛేదించడం ద్వారా సీఎస్‌కే పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్ధానానికి ప‌డిపోయింది.

    ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. ఆరింట గెలుపొందగా, మరో ఆరింట ఓటమి పాలైంది. చెన్నై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

    సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ప్లేఆఫ్ అవకాశాలపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సీఎస్‌కేకు చివ‌రి రెండు మ్యాచ్‌ల‌లో క‌ఠిన స‌వాల్ ఎదురుకానంద‌ని చోప్రా తెలిపాడు.

    "చెన్నై సూప‌ర్ కింగ్స్  గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. కానీ  ఆ మార్కును అందుకోవాలంటే వారు ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. గ‌త మ్యాచ్‌లో ఘోర ఓట‌మి కార‌ణంగా నెట్ రన్ రేట్ కూడా ప‌డిపోయింది. 

    అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో సీఎస్‌కేకు గెల‌వ‌డం అంత సులువు కాదు. ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ఏ పై జట్లనైతే ఓడించలేకపోయారో, ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా ఆ పై జట్లనే ఇప్పుడు త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డంది. గుజ‌రాత్‌, హైద‌రాబాద్‌ల నుంచి మ‌రోసారి గ‌ట్టి పోటీ చెన్నైకి ఎదురు కావ‌డం ఖాయ‌మ‌ని" చోప్రా త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. సీఎస్‌కే మే 18న ఎస్‌ఆర్‌హెచ్‌, మే 21న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.
     

  • Gujarat titans vs Kolkata knight riders Live updates: ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో కేకేఆర్‌ విజయం సాధించింది. 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది.

    గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బట్లర్‌(57), సాయిసుదర్శన్‌(53 నాటౌట్‌) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ రెండు, దూబే, గ్రీన్‌ తలా వికెట్‌ సాధించారు.

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    177 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 85 పరుగులు చేసిన గిల్‌.. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    రసవత్తరంగా జీటీ-కేకేఆర్‌ మ్యాచ్‌
    16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్ నష్టానికి 177పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(85), జోస్‌ బట్లర్‌(50) ఉన్నారు.

    గిల్‌ హాఫ్‌ సెంచరీ
    12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌(52), జోస్‌ బట్లర్‌(29) ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న గిల్‌
    9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(46), జోస్‌ బట్లర్‌(6) ఉన్నారు.

    కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
    49 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు చేసిన సింధు.. నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌
    గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఇన్ ఫామ్ బ్యాట‌ర్ సాయిసుద‌ర్శ‌న్(23) గాయం కార‌ణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 4 ఓవ‌ర్లు ముగిసే సరికి గుజ‌రాత్ 49 ప‌రుగులు చేసింది.

    గుజరాత్‌ ముందు భారీ టార్గెట్‌
    ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలెన్‌ కేవలం 35 బంతుల్లోనే  4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. 

    అతడితో పాటు అంగ్క్రిష్ రఘువంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82), కామెరూన్‌ గ్రీన్‌(52) హాఫ్‌ సెంచరీలతో సత్తచాటారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌,సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు.

    భారీ స్కోర్‌ దిశగా కేకేఆర్‌
    అలెన్‌ ఔటైనప్పటికి గ్రీన్‌(35), రఘువంశీ(45) దూకుడుగా ఆడుతున్నారు.16 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 192/2

    ఫిన్‌ అలెన్‌
    ఫిన్‌ అలెన్‌ రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసిన అలెన్‌.. సాయికిషోర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఫిన్‌ అలెన్‌ హాఫ్‌ సెంచరీ
    ఫిన్‌ అలెన్‌ 21 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 8 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 85/1

    తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 
    ర‌హానే రూపంలో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన ర‌హానే.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 5 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 47/1

    ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు
    2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే(9), ఫిన్‌ అలెన్‌(4) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. కేకేఆర్‌ జట్టులోకి వరుణ్‌ చక్రవర్తి తిరిగి రాగా.. గుజరాత్‌ టీమ్‌లోకి సాయి కిషోర్ వచ్చాడు. 

    తుది జట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్‌), ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి

    గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

  • అఫ్గానిస్తాన్‌తో జ‌రిగే ఏకైక టెస్టు, మూడు వ‌న్డేల సిరీస్ కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మే 19న ప్ర‌క‌టించ‌నుంది. ఈ సంద‌ర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు సెల‌క్ట‌ర్లు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

    వ‌న్డేల్లో మాత్రం బుమ్రా ఆడ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027 స‌న్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయ‌స్ అయ్య‌ర్, వంటి స్టార్ ప్లేయ‌ర్లు బ‌రిలోకి దిగ‌నున్నారు.

    భార‌త జ‌ట్టులోకి ఆకిబ్ నబీ!
    ఇక దేశ‌వాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న జ‌మ్మూ కాశ్మీర్ పేస‌ర్ ఆకిబ్ నబీ భార‌త టెస్ట్ జ‌ట్టులోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.

    భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.

    ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

    ప్రిన్స్‌కు పిలుపు!
    మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న అత‌డు.. ఇప్ప‌టివ‌ర‌కు 16 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదేవిధంగా దేశ‌వాళీ వ‌న్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ స‌త్తాచాటాడు. హ‌ర్షిత్ రాణా గాయప‌డ‌డంతో అతడి స్ధానంలో ప్రిన్స్ ప‌రీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట‌.
    చదవండి: గిల్‌, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్‌ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు
     

  • పాక్‌ వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ తన దేశ దిగ్గజ పేసర్లైన వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ సరసన చేరాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో 3 వికెట్లు తీసిన అతడు.. విదేశీ గడ్డపై 100 టెస్ట్‌ వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో పాకిస్తాన్‌ పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్‌ (260) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. వకార్‌ యూనిస్‌ (211), ఇమ్రాన్‌ ఖాన్‌ (199), మొహమ్మద్‌ ఆమిర్‌ (119), ఉమర్‌ గుల్‌ (111) మొహమ్మద్‌ అబ్బాస్‌ కంటే ముందున్నారు.

    2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అబ్బాస్ ఇప్పటివరకు కేవలం 28 టెస్టులే ఆడినా, 51 ఇన్నింగ్స్‌ల్లో 109 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22.84గా ఉండటం విశేషం. అందులో 100 వికెట్లు విదేశీ పిచ్‌లపైనే రావడం అతని విదేశీ ప్రదర్శన ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తోంది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్‌ బౌలర్లు చెలరేగారు. అబ్బాస్‌తో (3 వికెట్లు) పాటు ఖుర్రమ్‌ షెహజాద్‌ (4), హసన్‌ అలీ (2), సాజిద్‌ ఖాన్‌ (1) సత్తా చాటారు. వీరి ధాటికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. 

    వాస్తవానికి బంగ్లాదేశ్‌ ఈపాటి స్కోర్‌ చేయడం కూడా చాలా గొప్పే. మిడిలార్డర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌ (126) వీరోచిత శతకంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.

    తంజిద్‌ హసన్‌ (26), మొమినుల్‌ హక్‌ (22), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (23), తైజుల్‌ ఇస్లాం (16), ఫోరిఫుల్‌ ఇస్లాం (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నహిద్‌ రాణా డకౌట్లయ్యారు.

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్‌ అవైస్‌ 13, అబ్దుల్లా ఫజల్‌ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు పాక్‌ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. 
     

  • సిల్హెట్‌ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు  తడబడి నిలబడింది. లిట్టన్‌ దాస్‌ వీరోచితమైన పోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్‌ (278 పరుగులు) చేయగలిగింది. పాక్‌ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్‌ కుప్పకూలగా.. దాస్‌ ఒంటరిపోరాటం చేసి సూపర్‌ శతకంతో మెరిశాడు. ఓ పక్క సహచరులు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా, దాస్‌ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు.  

    దాస్‌ 159 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. దాస్‌ మినహా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. తంజిద్‌ హసన్‌ (26), మొమినుల్‌ హక్‌ (22), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (23), తైజుల్‌ ఇస్లాం (16), ఫోరిఫుల్‌ ఇస్లాం (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

    మిగతా ఆటగాళ్లలో మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నహిద్‌ రాణా డకౌట్లయ్యారు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌ 4, మొహమ్మద్‌ అబ్బాస్‌ 2, హసన్‌ అలీ 2, సాజిద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్‌ అవైస్‌ 13, అబ్దుల్లా ఫజల్‌ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు పాక్‌ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. 

    కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.

     

     

     

     

  • ఐపీఎల్‌-2026లో మే 22న ఉప్పల్ మైదానం వేదికగా జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడం, దానికి తోడు కింగ్ విరాట్ కోహ్లి బరిలోకి దిగనుండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

    దీనిని క్యాష్ చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం టికెట్ ధరలను ఏకంగా 50% నుండి 110% వరకు పెంచేసింది. ధరలు భారీగా పెరిగినప్పటికీ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఈ మ్యాచ్‌కు కనిష్ట టికెట్‌ ధరను రూ.1,950గా.. గరిష్ట ధరను ఏకంగా రూ.45,000గా నిర్ణయించింది. 

    సౌత్‌ రెండో అంతస్తులోని కార్పొరేట్‌ బాక్సు టికెట్‌ ధర రూ.45,000 పలకడం విశేషం. గతంలో ఈ టికెట్ ధర రూ. 30,000గా ఉండేది. అలాగే వెస్ట్‌ రెండో అంతస్తు కార్పొరేట్‌ బాక్సు ధర రూ.30,000గా, ఆరెంజ్‌ ఆర్మీ ఈస్ట్, వెస్ట్‌ లాంజ్‌ల ధరను రూ.20,000గా నిర్ణయించారు. 

    ఇక టికెట్లు దొరకని అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వేల రూపాయలకు టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. బ్లాక్ టికెట్ దందా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

    కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉన్న ఆర్సీబీ మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయి గట్టి షాక్ తింది.ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ వాళ్లకు చావో రేవో లాంటిది.
    చదవండి: గిల్‌, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్‌ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు

  • మన్జోత్ కల్రా.. ఈ క్రికెట‌ర్ గురుంచి చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ 2018 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ సొంతం చేసుకోవ‌డంలో అత‌డిది కీల‌క పాత్ర. ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఫైన‌ల్లో అద్భుత‌మైన సెంచ‌రీ సాధించి టీమిండియాను మన్జోత్ ఛాంపియ‌న్‌గా నిలిపాడు.

    ఆ టోర్నమెంట్ సమయంలో పృథ్వీ షా, శుభమన్ గిల్ వంటి స్టార్లతో సమానంగా మన్జోత్ కల్రా పేరు కూడా మారుమోగింది. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా భావించారు. ఆ టోర్నీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) అతన్ని ఐపీఎల్ కోసం కొనుగోలు చేసింది. 

    అయితే 2019లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడి కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. వయస్సులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కల్రాపై ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పునరాగనమం చేసినప్పటికి అతడు రాణించలేకపోయాడు. మన్జోత్ కల్రా చివరగా ఢిల్లీ తరపున 2021లో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఆడాడు.

    ఫ్రాంచైజీ ఓనర్‌గా కల్రా
    అయితే మన్జోత్ కల్రా మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త పాత్రలో కన్పించేందుకు సిద్దమయ్యాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా అతడు మారాడు. మన్జోత్ .. ప్రముఖ పారిశ్రామికవేత్త మయాంక్ గోయెల్‌తో కలిసి 'స్పోర్ట్స్ కమ్యూన్'  అనే సంస్థ ద్వారా జాఫ్నా కింగ్స్ జట్టులో వాటాలను కొనుగోలు చేశాడు.

    ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ఆపరేషన్స్ బాధ్యతలను కల్రా పర్యవేక్షించనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌-2026 సీజ‌న్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ ఆకాశ్‌ మహరాజ్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.

    తన అద్భుత స్పెల్‌తో చెన్నై టాపార్డర్‌ను ఆకాశ్‌ సింగ్‌ కుదేలు చేశాడు. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (20), రుతురాజ్‌ గైక్వాడ్‌ (13).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉర్విల్‌ పటేల్‌ (6)ను పెవిలియన్‌కు పంపి చెన్నైని నామమాత్రపు స్కోరు (187)కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

    క్రీడా వర్గాల్లో చర్చ
    అయితే, కీలక వికెట్లు తీసిన సంతోషంలో ఆకాశ్‌ సింగ్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘‘అక్కీ ఆన్‌ ఫైర్‌.. టీ20 మ్యాచ్‌లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’’ అని రాసి ఉన్న నోట్‌ చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

    అప్పటి నుంచి..
    ఈ నేపథ్యంలో ఆకాశ్‌ సింగ్‌ చర్యపై విమర్శల వర్షం కురుస్తోంది. ‘పేపర్‌ ట్రెండ్‌’ మానుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ.. ‘‘ఇది ఆరెంజ్‌ ఆర్మీ కోసం’’ అంటూ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అభిమానులకు అంకితమిస్తూ నోట్‌ చూపించాడు.

    అప్పటి నుంచి ఈ ట్రెండ్‌ మొదలైంది. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ రఘు శర్మ సైతం ఇదే తరహాలో నోట్‌ చూపిస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో చెన్నై స్టార్‌ ఉర్విల్‌ పటేల్‌ సైతం.. ‘‘ఈ ఇన్నింగ్స్‌ నీకోసమే నాన్నా’’ అని రాసి ఉన్న పేపర్‌ చూపించాడు. తాజాగా ఆకాశ్‌ ఇదే పనిచేశాడు.

    నిజం చెప్పాలంటే
    ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ఈ పేపర్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చింది. ఇకపై ఇదేమీ ట్రెండ్‌ కాబోదు. నిజం చెప్పాలంటే గతంలోనూ దీనిని ట్రెండ్‌గానూ ఎవరూ గుర్తించలేదు’’ అని ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

    ఇక భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడి అభివ్యక్తి అది. అయితే, చాలా మందికి ఇది నచ్చలేదు. ఇదొక రకంగా సరదాగా.. అదే సమయంలో చెత్తగా ఉంది.

    ఇదంతా నాన్‌సెన్స్‌
    ఈ చిట్టీల బిజినెస్‌ను నిషేధించాలి. ఇదంతా నాన్‌సెన్స్‌. వాళ్లు మైదానంలోకి ఇలా చిట్టీలు తీసుకురావడం నాకైతే నచ్చడం లేదు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. విమర్శలపై ఆకాశ్‌ సింగ్‌ స్పందించాడు.

    ‘‘నాకు ఇలా చేయడం స్ఫూర్తినిస్తుంది. అంతే తప్ప మైదానంలోకి నోట్‌ తీసుకురావడంలో వేరే ఉద్దేశం లేదు. మ్యాచ్‌ సమయంలో నాకు స్ఫూర్తినిచ్చే వాటిని నేను వదిలేయలేను’’ అని ఆకాశ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ‌

    చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ

  • క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. భారత్‌-పాక్‌ మధ్య టెస్ట్‌ మ్యాచ్‌లు మళ్లీ మొదలుకానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఐసీసీ నిర్వహించబోయే కీలక సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ భవిష్యత్‌ నిర్మాణంపై చర్చించేందుకు ఐసీసీ ఈ నెలాఖర్లో (మే 30, 31) అహ్మదాబాద్‌లో బోర్డు సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో టెస్టు క్రికెట్ విస్తరణతో పాటు భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ పునరుద్ధరణ అంశం  ప్రధాన చర్చగా మారే అవకాశముంది. 

    ఈ సమావేశాలకు బీసీసీఐ, పీసీబీ అధ్యక్షులు హాజరవుతారు. పీసీబీ చీఫ్‌ నఖ్వీ ఈ మీటింగ్‌కు వర్చువల్‌గా అటెండ్‌ అవుతాడని తెలుస్తుంది.

    కాగా, భారత్‌, పాక్‌ మధ్య మళ్లీ టెస్టు సిరీస్ జరగొచ్చన్న చర్చ ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో నక్వీ మాట్లాడుతూ.. తదుపరి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో అన్ని దేశాలతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. దీంతో భారత్‌తో టెస్టు సిరీస్‌పై ఊహాగానాలు మరింత పెరిగాయి.

    భారత్‌, పాక్‌ చివరిసారిగా 2007-08లో టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఐసీసీ సమావేశాల్లో దీనిపై ప్రత్యక్ష నిర్ణయం వచ్చే అవకాశం లేకపోయినా, భవిష్యత్ చర్చలకు ఇది బాటలు వేయొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    12 జట్లు
    టెస్టు క్రికెట్ భవిష్యత్‌పై అధ్యయనం చేసేందుకు ఐసీసీ గతేడాదే మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ రోజర్‌ ట్వోస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రస్తుతం ఉన్న 9 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఆఫ్ఘనిస్తాన్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ వంటి జట్లకు కూడా డబ్ల్యూటీసీలో చోటు దక్కే అవకాశం ఉంటుంది.

    ఒకే టెస్ట్‌తో సిరీస్‌
    ఈ సమావేశాల్లో ఒకే టెస్టుతో సిరీస్ నిర్వహించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి డబ్ల్యూటీసీ సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు తప్పనిసరి. అయితే చిన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక భారం తగ్గించేందుకు, మరిన్ని జట్లకు టెస్టు అవకాశాలు కల్పించేందుకు ఒకే టెస్టు సిరీస్ మోడల్‌పై ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
     

Andhra Pradesh

  • ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా వైఎ‍స్సార్‌సీపీ నేత యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని వైఎ‍స్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత యలమర్తి రామకృష్ణ గతవారం జరిగన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

    ఈ నేపథ్యంలో యలమర్తి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో పార్టీ  కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

  • సాక్షి, కడప: వైయస్సార్ జిల్లాలో ఘోర విషాదం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నూరు మండలం ముళ్లపల్లెకి చెందిన సుధీర్, పెంచలమ్మ దంపతులు శనివారం రైలు కింద పడి బలవన్మరణం చెందారు.

    శనివారం మధ్యాహ్నం కనుమలోపల్లె రైల్వే ట్రాక్‌ వద్ద రైలు కిందపడి భర్త సుధీర్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని భార్య సాయంత్రం అదే ప్రాంతంలో మరో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మృతికి కారణాలపై విచారిస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ సునీల్ కుమార్‌ తెలిపారు.

Movies

  • టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చేసే లీక్స్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తన సినిమాలే కాదు, ఇతర సినిమాల సంగతుల్ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటారు. ఈసారి రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ట్రయిలర్‌ విషయాలు ముందుగానే చెప్పేశారు. తాజాగా పెద్ది ట్రయిలర్‌ను చిరంజీవితో పాటు కొంతమంది మీడియా వ్యక్తులకు చూపించారు. ఆ విషయం అందరూ గోప్యంగానే ఉంచారు. అయితే మెగాస్టార్‌ మాత్రం ట్రయిలర్‌లోని ఓ కీలక డైలాగ్‌ను లీక్‌ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్” అనే డైలాగ్‌ ట్రయిలర్‌లో ఉంటుందని వెల్లడించారు. “సారీ బుచ్చి.. ట్రయిలర్‌ చూశాక కంట్రోల్‌ తప్పింది” అంటూ హాస్యంగా కొనసాగించారు.  

    అంతేకాదు పెద్ది సినిమా ట్రయిలర్‌ 3 నిమిషాల నిడివి కలిగి ఉందని కూడా చిరంజీవి బయటపెట్టారు. చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ముగ్గురూ తమ బెస్ట్‌ ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడియన్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్రయిలర్‌ ఉంటుంది. అంతా కలిసి రఫ్ఫాడించారని మెగాస్టార్‌ ట్రయిలర్‌పై ఉన్న  హైప్‌ను అమాంతం పెంచేశారు.  ఈ నెల 18న రిలీజ్‌ కానున్న పెద్ది ట్రయిలర్‌పై చిరంజీవి చేసిన ఈ లీక్స్‌ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఆయన రివ్యూ వల్ల ట్రయిలర్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.  

  • బొద్దుగా కనిపించే హీరోయిన్లు, హఠాత్తుగా బక్కచిక్కిపోయి కనిపిస్తే ఎవరికైనా లేనిపోని సందేహాలు వస్తాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి గతంలో ఇలానే అనుకున్నారు. 2018లో 'మహానటి'లో నిండుగా బొద్దుగా కనిపించిన ఈమె.. తర్వాత కాలంలో ముఖంలో జీవకళ కోల్పోయినట్లు సన్నగా మారిపోయి షాకిచ్చింది. దీంతో అసలు ఈమెకు ఏమైందా అనుకున్నారు. కొందరైతే సర్జరీ చేసుకుందేమోనని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ సందేహాలపై స్వయంగా కీర్తినే క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)

    '2013లో నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్‌పై నాకేం అవగాహన లేదు. జిమ్ నా వల్ల కాదు అనుకునేదాన్ని. 2018లో 'మహానటి' చేసిన తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకున్నా. హెచ్ఐఐటీ, కార్డియో వర్కౌట్స్‌తో పాటు ఎక్కువ ప్రొటీన్, తక్కువ కార్బో డైట్ పాటించి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ నేను ఇంత కష్టపడితే కొందరు మాత్రం బలహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా అని అన్నారు. అది నాకు ఆవేదన కలిగించింది'

    '2020లో యోగా చేయడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగింది. సరైన విధంగా జిమ్ చేస్తే ఎంత ఉపయోగమో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రస్తుతం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోపాటు యోగా, అనిమల్ ఫ్లో, కార్డియో, కాలిస్థెనిక్స్‌ను బ్యాలెన్స్‌గా చేస్తున్నాను. ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నా'

    'అయితే నా చిన్నప్పుడు కాస్త లావుగా ఉన్నానని సన్నబడమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు సన్నబడిన తర్వాత గతంలోనే బాగున్నావని అంటున్నారు. అసలు ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఈ మధ్య శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవడం వల్లే బయట కనిపించలేదు. జీవితంలో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాల్సి రావచ్చు. కానీ జిమ్‌ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.

    కేరళకు చెందిన కీర్తి సురేశ్.. 'నేను శైలజ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'మహానటి'తో అదరగొట్టి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా దక్కించుకుంది. రీసెంట్ టైంలో టాలీవుడ్‌లో పెద్దగా నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లో చేస్తోంది.

    (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

  • 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ కాస్తంత గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు నస్లేన్.. ఇదే మూవీ దర్శకుడితో కలిసి చేసిన చిత్రం 'ఐ యామ్ కాదలన్'. 2024లోనే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

    కథేంటి?
    విష్ణు(నస్లేన్) తన క్లాస్‌మేట్ శిల్ప(అనీష్మా)ని కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. కానీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విష్ణుకి జాబ్ రాకపోవడంతో శిల్ప నిరుత్సాహపడుతుంది. ఈమె.. తన తండ్రి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరిపోతుంది. ఓసారి తన ప్రేమ గురించి చెప్పేందుకు శిల్ప తండ్రి దగ్గరకెళ్లిన విష్ణుకు చేదు అనుభవం ఎదురవుతుంది. ఇంతకీ అదేంటి? దీని తర్వాత శిల్ప తండ్రి కంపెనీని విష్ణు ఎలా హ్యాక్ చేశాడు? శిల్ప తండ్రిని ముప్పతిప్పలు పెట్టిన విష్ణు చివరకు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    తెలుగులో ఎప్పుడూ దాదాపుగా ఒకే కమర్షియల్ ఫార్ములా చుట్టూ స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు తిరుగుతుంటారు. మలయాళంలో మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే కాస్త భిన్నంగా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీనే ఇది. ప్రేమించిన అమ్మాయిపై ప్రతీకారం తీర్చుకోవడం పాత కాన్సెప్టే. కానీ దానికి హ్యాకింగ్ అనే అంశం జోడించడం కాస్త చిత్రంగా అనిపించింది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే సూపర్ కాకపోయినా పర్లేదు బాగానే ఉంది.

    అసలు పాయింట్ చెప్పడానికి కాస్త టైమ్ తీసుకున్న దర్శకుడు.. విషయం తెలిసిన తర్వాత ఎంటర్‌టైనింగ్‌గానే సినిమాని నడిపాడు. పెద్దగా టెక్నికల్ సెటప్ లేకపోయినప్పటికీ హీరో తన దగ్గరున్న డబ్బా కంప్యూటర్‌తోనే హ్యాకింగ్ చేయడం సహజంగానే ఉంది. హ్యాకింగ్ అనగానే ఏదేదో అనుకుంటాం కానీ సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా సింపుల్‌గానే చూపించారు. ఆ సీన్లు బాగానే కుదిరాయి. కాకపోతే కామెడీ లాంటి పెద్దగా ఉండవు.

    క్లైమాక్స్‌లో హీరో దొరికిపోతాడు అనుకున్న దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అయితే నవ్వులు పూయిస్తుంది. ఇక హ్యాకర్ అయిన హీరోని పట్టుకునేందుకు హీరోయిన్ తండ్రి నియమించుకున్న లేడీ హ్యాకర్ చాలా ట్రై చేస్తుంది. మరి హీరో దొరికాడా లేదా? హ్యాకర్లు ఇద్దరూ ఏ సందర్భంలో ఎక్కడ కలుసుకున్నారనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా బాగుంటుంది. మలయాళంలో చాలా చిత్రాల్లో ఉన్నట్లే కాస్తంత సాగదీత కూడా ఉంటుంది. దాన్ని తట్టుకుని చూస్తే ఇదో టైమ్ పాస్ సినిమా.

    హీరోహీరోయిన్లు నస్లేన్, అనీష్మా బాగా చేశారు. మిగతా పాత్రధారులు కూడా సహజంగా నటించారు. టెక్నికల్ విభాగాలు కూడా తమ పని తాము చేశారు. ఓటీటీలో ఏదైనా కొత్త మూవీ.. అలా అలా సాగిపోయేలా ఉండేది చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మలయాళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

    -చందు డొంకాన

    (ఇదీ చదవండి: మహేశ్ సినిమా.. ఆర్మీని కామెడీ చేశారు: మేజర్)

  • భారత ఆర్మీకి చెందిన గూఢచారులు అనగానే స్టైల్‌గా సూటు బూటు వేసుకుని ప్రైవేట్ జెట్స్‌లో తిరుగుతూ విలన్లని చితగ్గొట్టేస్తుంటారు లాంటి వాటినే ఇన్నాళ్లుగా సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. అయితే ఓ గూఢచారి.. ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడనేది 'ధురంధర్'లో కొంతమేర రియాలిటీకి దగ్గరగా చూపించారు. అయితే మన మూవీస్‌లో ఆర్మీని చూపించే తీరుపై మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ధురంధర్ 2'.. తెలుగులోనూ)

    'ఆర్మీ సినిమాలు నాకు పెద్దగా నచ్చవు. 'ధురంధర్' పక్కనబెట్టేస్తే నిజానికి దూరంగా ఉంటాయి. అందుకే నేను వాటిని చూసేందుకు వెళ్లను కూడా. మహేశ్ బాబు మూవీ(సరిలేరు నీకెవ్వరు) ఏదో ఉంది. బాంబు ఉంటే పక్కనే కూర్చుని కాఫీ తాగుతుంటాడు. అదంతా చూసి నాకు కామెడీగా అనిపిస్తుంది. ఇదే సినిమాకు నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాను. నేను నవ్వుతుంటే.. అరేయ్ నవ్వకురా జనాలు కొడతార్రా అని అన్నాడు. మరి ఆ సీన్ అలా ఉంది ఏం చేయమంటావ్ అని అడిగా. నువ్వు ఆర్మీ వాడివి అని తర్వాత అడుగుతార్రా, ఫస్ట్ కొడతారు అని ఫ్రెండ్ నాతో అన్నాడు. దీంతో నేను థియేటర్ నుంచి బయటకొచ్చేశా. ఆర్మీని వాళ్లు అపహస్యం చేసినట్లు అనిపించింది. నేను అది తీసుకోలేకపోయాను' అని మేజర్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు.

    సినిమాలంటేనే రియాలిటీకి ఆమడ దూరంలో ఉంటాయి. వాటిలో లాజిక్స్ వెతకలేం. 'సరిలేరు నీకెవ్వరు'లోనూ అదే తరహాలో ఉంటాయి. విలన్ ప్రకాశ్ రాజ్‌ని చివరలో ఆర్మీ చేర్పించే సీన్స్‌పై రిలీజ్ టైంలోనే విమర్శలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో ఆర్మీ మేజర్.. ఈ ప్రస్తావన తీసుకురావడంతో మహేశ్ మూవీ మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది.

    (ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)

  • అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటి పావలా శ్యామలకు నిర్మాత దిల్‌ రాజు అండగా నిలిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూసేందుకు దిల్ రాజు తన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాడు. తన మేనేజర్ల ద్వారా అక్కడి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

    కాగా, గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, డబ్బులు లేవని ఆమెను బయటకు పంపించేశారు. క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెను అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ఆమెను పట్టించుకునేవారే లేరని, తీవ్ర గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తక్షణమే స్పందించాడు.

    తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్‌లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, ‘శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్‌లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను’ అని భరోసా ఇచ్చారు.

    కన్నీళ్లు పెట్టుకున్న శ్యామల
    దిల్ రాజు టీమ్ పావలా శ్యామలను కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపింది. గతంలో కూడా చాలా సార్లు దిల్‌ రాజు సహాయం చేశాడని..మరోసారి తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని శ్యామల పేర్కొంది. 

  • షాకింగ్ లుక్‌లో కనిపించిన సమంత

    నడుము అందాలతో హన్సిక పోజులు

    బీచ్‌లో నోరా ఫతేహి గ్లామరస్ డ్యాన్స్

    పూల పక్కన మెరిసిపోతున్న నయనతార

    కళ్లద్దాలతో రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మ

    కొత్త హెయిర్ స్టైల్‌తో ప్రగ్యా జైస్వాల్

  • ‘న‌టుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మ‌రిడేశ్‌ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా న‌టుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది’ అని రాగ్ మ‌యూర్ అన్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్‌ మయూర్‌.. ఇండస్ట్రీకి వచ్చి ఈ శుక్రవారం(మే 15)తో ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెల‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. 

    👉 సినిమా బండి రిలీజ్‌ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాలు  యువ‌త‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి. ప్ర‌ముఖ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయ‌త్‌’కు రీమేక్‌గా వ‌చ్చిన ‘సివ‌రాప‌ల్లి’ న‌టుడిగా మరింత గుర్తింపు తెచ్చింది.

    👉 ‘సివరాపల్లి’ సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వ‌చ్చింది. చాలా మంది ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను రాశామ‌ని చెప్పారు. ద‌ర్శ‌కులు నాకోసం ప్ర‌త్యేకంగా పాత్ర‌లు రాయ‌టం అనేది న‌టుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేట‌ర్ ఆర్టిస్ట్ కావ‌టంతో న‌ట‌న‌లో విభిన్న కోణాల‌ను అన్వేషించే అవ‌కాశం ద‌క్కింది. అది నా న‌ట‌న‌ను మ‌రింత మెరుగు ప‌రిచింది.

    👉 ‘శుభం’లో క్యామియో రోల్‌ చేశా. అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు. 

    👉 ప్రస్తుతం డైరెక్ట‌ర్ గౌరి నాయుడు జ‌మ్ము తెర‌కెక్కిస్తోన్న ‘గ‌రివిడి లక్ష్మి’లో  బుర్ర‌క‌థ క‌ళాకారుడి పాత్ర చేశా. ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి న‌టించాను.

    👉 నా ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉంది. కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను’ అని అన్నారు.

  • అప్పడెప్పుడో 1999లో సినిమాల్లోకి వచ్చిన త్రిష.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. ‍స్టార్ హీరోయిన్‪గా తెలుగు, తమిళ భాషల్ని కవర్ చేస్తోంది. అయితే తమిళనాడు సీఎంగా విజయ్ గెలవడం మాటేమో గానీ సోషల్ మీడియాలో ఈమెనే ట్రెండ్ అయిపోతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

    'మహేశ్ బాబు 'అర్జున్' కోసం త్రిషని ఆడిషన్ చేశారు కానీ ఎందుకో ఈ అమ్మాయి సెట్ అవ్వదని దర్శకుడికి అనిపించింది. మహేశ్ దగ్గర ఆ ఫొటోలని చూసి ఆమెని కలవాలనుకున్నాను. ఆ టైంకి ఛాన్సులు రాకపోవడంతో కొంచెం నిరాశలో ఉంది. నా నుంచి ఫోన్ రాగానే తెగ ఆనందపడింది. తర్వాత నేను ఆమె ఇంటికి వెళ్లి చూసి ఓకే అనుకున్నాక 'వర్షం'లో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశా. షూటింగ్‌లో 75 రోజుల పాటు వర్షంలో తడుస్తూనే షూటింగ్ చేసింది. ట్రైన్ నుంచి దూకే సీన్స్ చేయలేక నా వల్ల కాదు అని ఏడ్చేసింది. నేను ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో నేను కచ్చితంగా చేస్తానని అంది. ఈ మూవీ రిలీజైన తర్వాత త్రిష మా ఇంటిలో మనిషి అయిపోయింది. అందుకే ఆమెని చిన్నపిల్లలా ట్రీట్ చేసేవాడిని'

    'త్రిషకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది. నాపై ఆమెకు అంత నమ్మకం ఉండేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరోయిన్‌ని ఇంకా ఎవరిని అనుకోలేదు. కానీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసింది. భోజనం చేసి తన డేట్స్ బుక్ ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేస్తానని చెప్పింది. ఇక 'ఆట'లో ఇలియానాని హీరోయిన్‌గా పెట్టినందుకు నాపై అలిగింది. నేను షూటింగ్‌కి వచ్చేస్తానని వరసపెట్టి ఫోన్లు చేస్తూనే ఉంది. షూటింగ్ మొదలైపోయింది. ఆపడం కుదరదు అనే చెప్పడంతో శాంతించింది' అని ఎమ్మెస్ రాజు.. త్రిషతో తన బాండింగ్ గురించి చెప్పుకొచ్చారు.

    వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వీటిలో తొలి రెండు సూపర్ హిట్ కాగా మూడోది మాత్రం బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. అప్పట్లో స్టోరీ అందించి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దర్శకుడిగా మూవీస్ చేస్తున్నారు. ఈయన తీసిన 'అగధ' విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్లలోనే త్రిషతో తన బంధం గురించి చెప్పారు.

    (ఇదీ చదవండి: శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్‌లో 'ధురంధర్ 2')

Rangareddy

  • యాచారం: ప్రధాని మోదీ పాలనలో భారత రాజ్యాంగానికి పెనుప్రమాదం పొంచి ఉందని.. రైతాంగం, పేదలు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగ హక్కులు పొందలేకపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యల బ్రహ్మయ్య సంస్మరణ సభ, స్తూప ఆవిష్కరణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్‌ శక్తులతో కుమ్మకై ్క డబ్బులతోనే రాజకీయం చేస్తోందన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇతర పార్టీలను మనుగడ లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగం, కార్మికులు, మహిళలు రాజ్యాంగ ఫలాలు అందక అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలపై నిత్యం ఏదో ఓ చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకేనేందుకు దేశ ప్రజలు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ఇతర నిత్యవసరాల ధరలను పెంచేందుకు మోదీ సర్కార్‌ దృష్టి సారించదని చెప్పారు. దేశం ఆర్థికంగా బలంగా ఉందని నమ్మిస్తూ ప్రజలను బంగారం కొనొద్దు, విదేశీ యాత్రలు చేయరాదు, దుబారా ఖర్చులు పెట్టరాదని ప్రజలను డైలామాల్లో నెట్టారని మోదీపై మండిపడ్డారు.

    బ్రహ్మయ్య మృతి పార్టీకి తీరని లోటు

    పేదలు, కార్మికుల హక్కుల సాధన కోసం తన చివరి వరకు పోరాడిన బ్రహ్మయ్య మృతి సీపీఎంకు తీరని లోటన్నారు. ఆయన ఆశయాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన కుటుంబానికి పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉంటుంందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, నాయకులు బోడ సామేల్‌, నర్సింహ, డి.జగదీశ్‌, చంద్రమోహన్‌, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

    కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్న మోదీ సర్కార్‌

    పెండ్యాల బ్రహ్మయ్య సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Hyderabad

  • ప్రోత్సాహంగా పన్ను మినహాయింపు..

    నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్‌ వాహనాలు

    సాక్షి, సిటీబ్యూరో

    కొద్ది రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని వల్లెవేసిన కేంద్రం ఊహించినట్లుగానే పెట్రో బాంబు పేల్చింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని అందరిపైనా పెట్రోల్‌, డీజిల్‌ భారం మోపింది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ఇంధనం ధరలకు రెక్కలొచ్చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ధరలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్ట్రిక్‌ వాహనాలు ఈ ధరాఘాతం నుంచి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్‌ వాహనాలు నమోదయ్యాయి. ఈ వాహనాల వినియోగంతో రోజుకు సుమారు 1.82 లక్షల లీటర్ల చొప్పున ప్రతి నెలా సుమారు 54.86 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నట్లు అంచనా. తద్వారా సుమారు రూ. 56.53 కోట్లు ఆదాయం మిగులుతుంది. అస్థిరమైన పెట్రోల్‌, డీజిల్‌,సీఎన్జీ, ఎల్పీజీ, తదితర ఇంధన ధరలను దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

    ఎలక్ట్రిక్‌ వాహనాలపై రవాణాశాఖ జీవితకాల పన్నును మినహాయించింది.ఇది విద్యుత్‌ వాహనాలకు ఎంతో ప్రోత్సాహంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యుత్‌ వాహనాలపైన రూ.810 కోట్ల వరకు ఈ మినహాయింపు లభించినట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ సి.రమేష్‌ తెలిపారు.ఆర్టీఏలో నమోదైన 81812 వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 56,465 ఉన్నాయి. వీటిపైన రూ.67.14 కోట్లు, సుమారు 22049 కార్లపైన రూ.741.19 కోట్ల చొప్పున పన్ను మినహాయింపు లభించింది. అలాగే 2608 ఆటోరిక్షాలు, 372 సరుకు రవాణా వాహనాలు, మరో 318 బస్సులకు కూడా జీవిత కాల పన్ను నుంచి ఊరట కల్పించినట్లు జేటీసీ చెప్పారు.హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపును కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విద్యుత్‌ వాహనాల వినియోగం వల్ల ప్రతి నెలా 1.31 లక్షల టన్నులకు పైగా కాలుష్య కారకాలు తగ్గుముఖం పట్టినట్లు అంచనా.

    ప్రతి నెలా రూ.56 కోట్లకు పైగా ఆదా

    రోజుకు 1.83 లక్షల లీటర్ల ఇంధనం పొదుపు

    ప్రజా రవాణా సదుపాయంతో మరింత తగ్గనున్న ఖర్చులు

    వాహన రకం సంఖ్య నెల ఇంధన ఆదా

    (రూ.కోట్లలో)

    ద్విచక్ర వాహనాలు 56,465 26.68

    కార్లు 22,049 22.23

    ఆటోలు 2,608 2.88

    గూడ్స్‌ వాహనాలు 372 1.23

    బస్సులు 318 3.51

    మొత్తం వాహనాలు 81,812 56.53

    విద్యుత్‌ వాహనాలతో ఆదా ఇలా..

  • ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు

    ఇతర పనివారి వివరాలూ ధ్రువీకరించుకోండి

    సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌

    రాజధాని వ్యాప్తంగా ఇటీవలి నేరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలున్నంత వరకు నేపాలీలను పనిలో పెట్టుకోవడాన్ని నిలువరించాలని సూచిస్తున్నారు. ఇతర పనివాళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ నగరవ్యాప్తంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాజీ ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజ దారుణ హత్య, దోపిడీ ఘటన జరిగిన వారం రోజుల్లోనే జవహర్‌నగర్‌ కౌకూర్‌లో నేపాలీలు మరో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నేపాలీల నేరాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తులో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

    అత్యంత జాగ్రత్తగా ఉండాలి..

    ఇక ఇతర పనివారి రికార్డులూ లేకపోవడంతో జరగరానిది జరిగినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఠాణాల వారీగా క్షేత్రస్థాయిలో నేపాలీలు, ఇతర పనివారి వివరాలు సేకరించడంతో పాటు నేపాలీలను నివారించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిలో... కొందరు నేరచరితులు డ్రైవర్లు, కార్మికులు, కేర్‌టేకర్లుగా చేరి యజమానుల విశ్వాసం పొందుతున్నారు. ఆపై అదును చూసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాళ్లలో నేపాలీలు ఎక్కువ ఉంటున్నారు. ఈ దృష్ట్యా పనిలో పెట్టుకునే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందించి పూర్వాపరాల పరిశీలన, ధ్రువీకరణ చేసుకోవాలని, వీటిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. వీలున్నంత వరకు నేపాలీ గృహ కార్మికులను నియమించుకోవడాన్ని నివారించాలని, ఒకవేళ నియమించుకుంటే పూర్తి నాగరిక్‌/గుర్తింపు వివరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్‌, ఫొటోగ్రాఫ్‌, మొబైల్‌ నంబర్‌, శాశ్వత చిరునామాను ధ్రువీకరించువాలని, ఈ వివరాలన్నీ రికార్డుల నిర్వహణ కోసం స్థానిక స్టేషన్‌లో అందించాలని పోలీసులు కోరుతున్నారు. దీంతోపాటు నేరాల నిరోధం, ఆధారాల సేకరణకు సాధ్యమైన చోటల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విలువైన వస్తువులు, లాకర్లు, నగదు ఉన్నవాటితో పాటు సున్నిత ప్రాంతాలకు పనివాళ్ల ప్రవేశాన్ని పరిమితం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపం లేదా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

    నేపాల్‌తో సంబంధాలపై ప్రభావం?

    హైదరాబాద్‌ పోలీసుల చర్యలు సరిహద్దు దేశమైన నేపాల్‌తో భారత్‌ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేశంతో స్నేహపూర్వక, వర్తక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాలీల అంశంలో జారీచేసిన నోటీసుల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలని చెబుతున్నారు.

  • ● రోగులకు అవయవాలువిజయవంతంగా అమర్చిన వైద్యులు

    24 గంటల్లో 2 లివర్‌.. 3 కిడ్నీ మార్పిడి సర్జరీలు

    లక్డీకాపూల్‌: నిమ్స్‌ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్‌), 3 మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్‌ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మార్పిడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు.

    ● బ్రెయిన్‌ డెడ్‌ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు.

    ● కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్‌ క్రానిక్‌ లివర్‌ డిసీజ్‌ (డీసీఎల్‌డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్‌ డీసీఎల్‌డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మార్పిడి చేపట్టింది.

    ● దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్‌ఆర్‌డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్సలు జరిగాయి.

  • మాజీ ఐపీఎస్‌ భార్య హత్య కేసులో ముంబయిలో పట్టివేత

    చోరీ ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్‌ కూడా..!

    బంజారాహిల్స్‌: విశ్రాంత ఐపీఎస్‌ వినయ్‌రంజన్‌ భార్య తనూజ రంజన్‌ను జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లో నేపాలీ పని మనిషి కల్పన, మరో ముగ్గురు నేపాలీలు దారుణంగా హత్య చేసిన ఉదంతం దర్యాప్తులో నగర పోలీసులు కొంత పురోగతి సాధించారు. కీలక నిందితుడు సునీల్‌ పరియర్‌తో పాటు ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్‌ను ముంబైలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. దోపిడీలో పాల్గొన్న మిగతా ముగ్గురు కల్పన అలియాస్‌ ధర్మ, సురేష్‌షాహి, గణేష్‌షాహి కోసం ముంబైలో సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. తనూజను ఈ నెల 8న నలుగురు నేపాలీలు హత్య చేసి తెల్లవారుజామున 3.30కు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. పోలీసుల కళ్లుగప్పేందుకు చర్లపల్లిలో దిగి కారు బుక్‌ చేసుకుని నగర శివార్ల వరకు వెళ్లారు. కాగా, కల్పన, సురేష్‌, గణేష్‌ల వద్ద ఫోన్‌ లేకపోవడంతో పట్టుకోవడంలో జాప్యమవుతోంది. సునీల్‌ ద్వారా వీరి జాడ కోసం సాంకేతికతను వినియోగించి జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్‌లో ఒకరు దొరకడంతో దర్యాప్తు కొంత సులువైంది. కల్పన, సునీల్‌, సురేష్‌, గణేష్‌లు తనూజను హత్య చేసి 22 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తు కల్పన దగ్గరే ఉండడంతో ఆమెను పట్టుకుంటే మొత్తం మిస్టరీ వీడనుంది. కాగా, ప్రశాసన్‌నగర్‌ ఘటనలో ఒకరు పట్టుబడడం పోలీసులకు కొంత ఊరటనిచ్చింది. వీరి ద్వారా నగరంలో తిష్టవేసిన నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

  • మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

    బండ్లగూడ పరిధిలో విషాదం

    చాంద్రాయణగుట్ట: రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్‌కు చెందిన వాచింగ్‌ మిషన్‌ టెక్నీషియన్‌ మహ్మద్‌ ఆమేర్‌ (26), ఫాతిమా బేగం (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. గురువారం అర్ధరాత్రి ఈ దంపతులు తమ ఆడపడచు పిల్లలు షేక్‌ సులేమాన్‌ (9), నౌషిన్‌ బేగం(11)లతో కలిసి బండ్లగూడలోని బంధువుల శుభకార్యానికి హాజరై జహంగీరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హాషామాబాద్‌ యూటర్న్‌ వద్ద ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్‌కు చెందిన జితేందర్‌ కుమార్‌ (22) లారీతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఫాతిమా లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లలు షేక్‌ సులేమాన్‌, నౌషిన్‌ బేగం, ఆమేర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

    ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

    రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Medak

  • పెద్దశంకరంపేట(మెదక్‌): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పలు ఇళ్లలో చొరబడి 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని అపహరించారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో ఐదు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. మూడు ఇళ్లలో ఎలాంటి వస్తువులు పోలేదని పోలీసులు తెలిపారు. మిగితా రెండిళ్లలోనే ఏకంగా 113 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారన్నారు. గ్రామానికి చెందిన రాయిని రాములు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన పాఠశాల ప్రారంభోత్సవానికి తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. రాములుకు భార్య, ముగ్గురు కుమారులు, కోడళ్లు, మనుమలు ఉన్నారు. వీరికి చెందిన 110 తులాల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి చోరీకి గురైంది. అలాగే ఏసీరెడ్డి మాణిక్‌రెడ్డి ఇంట్లో 3 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం ఉదయం రాములు ఇంటికి వచ్చిన పనిమనిషి గమనించి వారికి సమాచారం అందించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐ రేణుకారెడ్డి, ఎస్సైలు ప్రవీణ్‌ రెడ్డి, శంకర్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో ఆధారాలు సేకరించారు. ఎస్పీ శ్రీనివాసరావు చీలపల్లిలో పర్యటించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

    113 తులాల బంగారం,

    2.5 కిలోల వెండి అపహరణ

  • అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం తహసీల్దార్‌ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా అధికారుల అండదండలతో సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో బయటపడినా, ఉన్నతాధికారుల హస్తం ఉండటంతో తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. బతికున్న రైతు మరణించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి, మరొకరికి అక్రమ పట్టా చేశారు. ఆ సర్టిఫికెట్‌ ఎవరు ఇచ్చారు. ఏ అధికారి జారీ చేశారనే విషయం ఇప్పటికీ బయటపడలేదు. అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు చేసిన తప్పులకు రూ.లక్షలు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిపెద్దాపూర్‌లో ఎలాంటి ఆధారాలు లేకున్నా నాలుగెకరాల భూమిని మరో వ్యక్తికి పట్టా చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు జరుగుతాయి, సవరిస్తామని ఆర్డీఓ స్థాయి అధికారులే చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్‌ మల్లయ్య అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురిపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూ భారతి చట్టాన్ని అక్రమాలకు నిలయంగా మార్చిన అధికారులపై కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించాలని రైతులు కోరుతున్నారు.

Siddipet

  • దుబ్బాక: ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్‌మిల్లర్స్‌ దిగుమతులు వేగంగా చేపట్టి సహకరించాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. శుక్రవారం డీఎస్‌ఓ తనూజతో కలిసి దుబ్బాక, భూంపల్లి–అక్బర్‌పేట, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల్లోని రైస్‌మిల్లుల్లో ధాన్యం దిగుమతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచి పనిచేయించాలన్నారు. దిగుమతిలో జాప్యం కాకుండా చూసేందుకు రెవెన్యూ అధికారులను నియమించామన్నారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులు సన్నవడ్లను పండించాలని, సన్నాలకు 500 బోనస్‌ వస్తుందన్నారు. రేషన్‌ షాప్‌లలో సన్నబియ్యం సరిపోక ఇతర జిల్లాలనుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

    కలెక్టర్‌ హైమావతి

    రైస్‌మిల్లుల్లో ధాన్యం దించివేత పనుల పరిశీలన

West Godavari

  • పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్‌ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్‌ రూ.113.12కు, డీజిల్‌ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 19.6 లక్షలు భారం పడుతుందని అంచనా.

    సాక్షి, భీమవరం: నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరాన్‌ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్‌ సిలెండర్‌ రూ.892 నుంచి రూ. 952కు, వాణిజ్య సిలెండర్‌ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్‌ ధరను రూ.3,170కు పెంచింది. జిల్లాలో 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్‌) కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలెండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్‌ సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్‌ కోసం రెండు నెలల క్రితం వరకు ఏడాదికి రూ.6,244 వెచ్చిస్తే, తాజా పెంపుతో రూ.6,664 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన ధరలు మేరకు జిల్లా వాసులపై రూ. 24.94 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

    సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్‌ ప్యాకెట్‌ రూ.140 వరకు ఉండగా, సన్‌ఫ్లవర్‌, వేరుశనగ, బ్రాన్‌ ఇతర ఆయిల్‌ ధరలు రూ.150 నుంచి రూ. 200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్‌ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్‌ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్‌ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్‌, మీల్స్‌పై ప్లేటుకు రూ. 5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

    జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీ), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీ)తో పాటు రిలయన్స్‌, నయారా తదితర ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన పెట్రోల్‌ బంకులు 165 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్‌, 4.5 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోల్‌పై రూ. 3.29, డీజిల్‌పై రూ. 3.14 చొప్పున ఆయిల్‌ కంపెనీలు ధరలను పెరిగాయి. ఈ మేరకు వినియోగదారులపై రోజుకు పెట్రోల్‌పై రూ. 4.93 లక్షలు, డీజిల్‌పై రూ. 14.13 లక్షలు కలిపి రూ.19.6 లక్షల భారం పడుతుంది.

    నిత్యావసర ధరల నియంత్రణ, రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. 2024 అక్టోబరులో రేషన్‌ దుకాణాల ద్వారా కంది పప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గత ఏడాది మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కార్డుదారులకు రూ.20కు కిలో చొప్పున గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్‌ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో 5,67,700 రేషన్‌ కార్డులకు భీమవరం పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదవర్గాల వారు కోరుతున్నారు.

    లీటరు పెట్రోల్‌కు రూ.3.29,డీజిల్‌కు రూ.3.14 పెంపు

    జిల్లాలో రోజుకు 4.5 లక్షల లీటర్ల డీజిల్‌, 1.5 లక్షల లీటర్ల వరకూ పెట్రోల్‌ వినియోగం

    వినియోగదారులపై రోజుకు రూ.19.6 లక్షల భారం

    ఇప్పటికే డొమెస్టిక్‌ సిలెండర్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.1370ల పెంపు

    సామాన్యులపై పెరిగిన ధరల భారం

  • భీమవరం (ప్రకాశంచౌక్‌): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌ కుమార్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 22 అర్జీలు అందినట్లు డీఆర్వో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్‌కు రావడానికి దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.

  • సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ఏసీబీ డేగకన్ను వేసిందా? గురువారం నాటి ఏసీబీ దాడితో దాడులు ఆగుతాయా? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని అధికారులు కొందరు అవినీతి విషయంలో చురుగ్గా ఉన్నట్టు విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో సర్వేయర్‌ రౌతు రామకృష్ణ, తాజాగా గురువారం పట్టణ ఎస్‌ఐ నాగరాజు, బాలకృష్ణలపై ఏసీబీ దాడులతో రానున్న నెలల్లో మరిన్ని అవినీతి జలగలను పట్టే అవకాశాలున్నట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తున్నా, లారీల అక్రమ తరలింపునకు బ్రేక్‌ పడటంలేదు. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో వచ్చిన అధికారగణం ఇష్టారాజ్యం సాగుతోంది. అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యమే అన్నట్టుగా వ్యవహారాలున్నట్టుగా ప్రచారం ఉంది. తాజాగా మున్సిపాలిటీలో సామాజిక జాడ్యం కూడా వేళ్లూనుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సుపీరియారిటీ కాంప్లెక్స్‌ పద్ధతిలో వర్గాలుగా అధికారులు విడిపోయినట్టుగా చెబుతున్నారు.

    దూకుడుగా ఏసీబీ అధికారులు

    నియోజకవర్గానికి సుపరిచితుడుగా ఉన్న పట్టణ సర్వేయర్‌ రామకృష్ణపై ఏసీబీ దాడి చేసినట్టు దాడి అనంతర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా గురువారం పట్టణ ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్‌ బాలకృష్ణల ఉదంతంలో అవినీతి కోణం కన్నా, వ్యక్తిగత ప్రాబల్యాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడులు ఇకపై కొనసాగవచ్చని, నియోజకవర్గంలో ఆరుగురు అవినీతి అధికారుల వివరాల సేకరణలో ఏసీబీ దూకుడుగా ఉన్నట్టుగా సమాచారం. నాగరాజుపై దాడి చేయడానికి గాను 72 గంటల పాటు ఏసీబీ అధికారులు గూడెంలో మకాం వేసి, రెడ్‌ హ్యాండెడ్‌గా ఎస్సైను, కానిస్టేబుల్‌ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువుగా ఉన్న సిబ్బంది ఒకరి నేతృత్వంలోనే వ్యవహారాలు సాగినట్టు కలరింగ్‌ ఇచ్చారు. అధికారుల బదిలీలు, చేర్పులు, మార్పుల నేపథ్యంలో ఒక వ్యక్తిని హోల్డ్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. శ్రీచైతన్యశ్రీవంతుడైన వసూలుదారుడు ఒకరు ఇద్దరు అధికారులకు కలెక్షన్‌ ఏజెంట్‌గా వ్యవహరించినట్టుగా బాహాటంగానే చెబుతున్నారు. వాస్తవానికి గురువారం జరిగిన ఏసీబీ దాడిలో కలెక్షన్‌ ఏజెంట్‌ బుక్‌ కావాల్సి ఉండగా, ట్రాప్‌లో బాలకృష్ణ పడినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సర్వేయర్‌ను ట్రాప్‌ చేసి వాయిస్‌ రికార్డింగ్‌ ఆధారంగా మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తర్వాత కొందరి పోద్బలంతో జరిగిన ట్రాప్‌ అని తేలింది. తాజా ఉదంతంలో కూడా ప్రేమజంట వ్యవహారంలో ఎస్‌ఐ వాయిస్‌ రికార్డింగ్‌ క్రియాశీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో ఒక వ్యాపారికి సంబంధించి కుటుంబ వ్యవహారంలో వరకట్న వేధింపుల కేసును కాస్తా, హత్యాయత్నం కేసుగా నమోదు చేయించేందుకు గాను ఒక ప్రజాసంఘ నేత ద్వారా పట్టణ పోలీసులు కొందరితో సంప్రదింపులు సాగించినట్టుగా తెలుస్తోంది.

    హిట్‌ జాబితాలో ఆరుగురు అధికారులు

    నియోజకవర్గంలో ఒక రెవెన్యూ అధికారి అక్రమ రేషన్‌ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్టు, ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్‌ నేనున్నా, ఎవ్వరు నిన్ను టచ్‌ చేస్తారో నే చూసుకుంటా అనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. వారసత్వపు ఆస్తులు, మాస్టర్‌ప్లాన్‌లు, టీడీఆర్‌ బాండ్లు వంటి విషయాలలో ముగ్గురు మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలి, తదనంతర వ్యవహారాలపై ఏసీబీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సామాజిక కార్డు బలంతో నెట్టుకొస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇంకొకరు సైలెంట్‌గా వ్యవహారాలు జరపడంలో నిష్ణాతుడంటున్నారు. ఇలాంటి ఆరుగురు వ్యక్తులకు చెందిన సమాచార సేకరణలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • భీమవరం: భీమవరం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 150 మందికి 143 మంది విద్యార్దులు హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 150 మందికి 144 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు షిప్ట్స్‌లో 220 మంది విద్యార్థులకు 211 మంది, డీఎన్నార్‌ అటానమస్‌ కళాశాల సెంటర్‌లో 200 మందికి 194, ఇంజనీరింగ్‌ కళాశాల సెంటర్‌లో 200 మందికి 193 మంది విద్యార్థులు హాజరయ్యారు.

    ఏలూరు జిల్లాలో 787 మంది హాజరు

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్‌నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు.

    వీరవాసరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ కార్యదర్శిగా వీరవాసరానికి చెందిన మద్దాల అప్పారావును నియమించినట్లు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా మద్దాల అప్పారావు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగ కార్యదర్శిగా నియమించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

    పెనుగొండ: ఆచంట బాలంవారిపాలెంలోని పీ4 భవనంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి 238 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌కు జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శశ్రద్ధ చూపాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలతో వచ్చే సమావేశానికి హజరు కావాలని సూచించారు. ఆచంట మండలం నుంచి 129, పెనుమంట్ర మండలం నుంచి 28, పోడూరు మండలం నుంచి 17, పెనుగొండ మండలం నుంచి 64 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, డ్వామా పీడీ డాక్టర్‌ సీహెచ్‌ అప్పారావు, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్‌ కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీలలో ప్రీ స్కూల్‌ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

  • ఉండిలో రఘురామ రాక్షసరాజ్యం

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

    ఉండి: ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో బుల్డోజర్‌, రాక్షస రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఉండి మండలం ఉణుదుర్రు, సాగుపాడు గ్రామాల్లో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇళ్ల బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డ మహిళల బాధలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతుంటే వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొందరు భూస్వాముల స్వార్థం కోసం పోలీసుల అండతో 84 కుటుంబాలకు చెందిన 71 ఇళ్లను, ఆలయాలను తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లోని సామాగ్రిని కూడా బయటకు తెచ్చుకోనివ్వకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. భూస్వాముల ఇళ్లు, గెస్ట్‌హౌస్‌లను వదిలేసి, పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సీపీఎం తరపున తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నివాసయోగ్యం కాని చోట సెంటున్నర భూమి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం బాధితులకు 3 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలో బుల్డోజర్‌, రఘురామ రాక్షస పాలన సాగనివ్వబోమని పేదల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. కలెక్టర్‌, ఎస్పీలు చట్టవిరుద్ధమైన చర్యలను చూస్తూ మౌనంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, ధనికొండ శ్రీని వాస్‌, జుత్తిగ నర్సింహమూర్తి, జక్కంపూడి సత్యనారా యణ, కేవీపీ జిల్లా కార్యదర్శి క్రాంతి పాల్గొన్నారు.

  • తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్‌ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. బాల వెంకటేశ్వర స్వామి భూములను కబ్జా చేసి విక్రయించి సొమ్ములు చేసుకున్న ఘనమైన చరిత్ర కలిగిన ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్‌లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్‌ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది. దేవదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో అక్రమ రహదారి నిర్మాణానికి చెక్‌ పెట్టారు. అక్రమ నిర్మాణాలపై దేవదాయశాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది,. కూలగొట్టడానికి మాత్రం ఆ శాఖ వెనుకడుగు వేస్తోంది.

    దేవదాయ శాఖ భూమిలో నిర్మాణాలు

  • కోకో ధర పెంచాలి
    అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 8లో u

    భీమవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సరుకు రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్నంటాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారనుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో భీమవరం బుధవారం మార్కెట్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు కొరవడిన కారణంగానే దేశానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. చిరకాల మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ పట్ల భారత్‌ వైఖరి దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. మోదీ స్వార్ధపూరిత నిర్వాకం కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారామ్‌ ప్రసాద్‌, కిలారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  • ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయానికి ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా విద్యుత్‌ సర్వీసును తొలగించిన అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన విద్యుత్‌ అధికారులకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల విద్యుత్‌ సరఫరాను తొలగించారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా సర్వీసును తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ నాయకులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సదరు కార్యాలయానికి మూడు రోజుల్లోపు సర్వీసును పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను నాయకులు ఈనెల 12న ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సాల్మన్‌రాజుకు కలిసి అందచేశారు. ఈ నెల 15 తేదీలోపు విద్యుత్‌ సర్వీసును పునరుద్ధరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తిరిగి వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. లీగల్‌ సెల్‌ నాయకులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందచేశారు. ఉత్తర్వులను ధిక్కరించిన నేరానికి జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని సదరు నోటీసులో గుర్తు చేశారు.

  • భీమవరం: గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు, అపర భగీరథుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ అని పలువురు వక్తలన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని కాటన్‌ విగ్రహం వద్ద శుక్రవారం కాటన్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. రైతు కార్యాచరణ సమితి నాయకులు పాతపాటి మురళీకృష్ణంరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, కోళ్ల సీతారామ్‌, పి.రామకృష్ణంరాజు(పార్క్‌రాజు) మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్‌ అని కొనియాడారు. చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ తరాలు మారినా గోదారి గుండె చప్పుడు కాటన్‌ దొరేనని గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో మాత్రం కాటన్‌ గుండె చప్పుడు ఎప్పుడూ వినిపిస్తాయన్నారు. కార్యక్రమంలో కె.కృష్ణంరాజు, టీవీవీ ప్రసాద్‌, భట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందరకుమార్‌, ఎస్‌.సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

  • భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్‌ శాఖాధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఏలూరు (టూటౌన్‌): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరతా లేదని, సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

  • తాడేపల్లిగూడెం : నేలసారాన్ని కాపాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు, నర్సరీల నిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతిరైతూ తమ నేలను పరిరక్షించుకోవాలని, దాని ఆధారంగానే ఎరువులను వాడుకోవాలన్నారు. ఎరువుల ఖర్చును తగ్గించుకొని భూసారం పెంచుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు జీవ ఎరువులు, సూక్ష్మ జీవుల వాడకం, వర్మి కంపోస్టు పద్ధతులపై విశదీకరించారు. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి పద్ధతులు తల్లి చేపల ఎంపిక, అఽఽధిక దిగుబడులు సాధించడం గురించి తెలిపారు. వ్యాధులులేని అధిక దిగుబడినిచ్చే రోహు, కట్ల, మృగల, గ్రాస్‌ కార్ప్‌,సిల్వర్‌ కార్ప్‌ చేపల ఎంపిక గురించి వివరించారు. హార్మోన్‌ ఇంజక్షన్లు, నర్సరీల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్‌కుమార్‌, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు వసంత్‌ రావులు పాల్గొన్నారు.

  • ఏలూరు టౌన్‌: ఏలూరు నిమ్మకాయల యార్డ్‌ ప్రాంగణంలో గోడ పక్కగా ఒక మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఒక మృతదేహాన్ని నిమ్మకాయల యార్డులో పనిచేసే వారు గుర్తించారు. వెంటనే ఏలూరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై లేత ఆకుపచ్చ రంగు పుల్‌హ్యాండ్స్‌ చొక్కా, నలుపురంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందనీ... ఎవరికై నా తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

  • జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ

    దళారుల గుప్పిట్లో గిరిజన రైతులు

    గిట్టుబాటు ధర రాక ఇళ్లలోనే నిల్వ

    బుట్టాయగూడెం: అమాయక గిరిజన రైతులు దళారులు చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల దందా తెలిసినా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోవడం శోచనీయం.

    మన్యంలో 1,100 మందికి పైగా రైతులు

    గిరిజన ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 11 వందల మందికి పైగా గిరిజన రైతులు సుయారు 2 వేల ఎకరాల్లో జీడిమామిడి పంటలను పండిస్తున్నారు. ప్రతిఏటా ఆరువేల టన్నులు వరకు జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. సగటున 160 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిరిజన ప్రాతంలో పండించే జీడి పిక్కలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో సేకరించే జీడిమామిడి పప్పు బయట పప్పుకంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడి పప్పు కొనుగోలు చేసేందుకు బయట వ్యాపారులు ఎగబడతారు.

    ఎక్కడా కనిపించని కొనుగోలు కేంద్రాలు

    గిరిజనులు పండించిన జీడిమామిడి పంట అమ్మకోవడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో దళారులే గ్రామస్థాయిలో విక్రయాలు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.170కి వ్యాపారులు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారు. తర్వాత కిలో రూ.150 నుంచి ప్రస్తుతం కిలో రూ. 140 కి కొనుగోలు చేస్తున్నట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీని వల తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బయట నుంచి వచ్చిన వ్యాపారులు సిడికెట్‌గా ఏర్పడి ధరను పతనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    గిట్టుబాటు ధర కోసం రైతుల విజ్ఞప్తి

    గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉద్యాన తోటలో జీడిమామిడి పంటల సాగు చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా ఉద్యానవన శాఖ పంటల సాగుకు ప్రోత్సహిస్తుంది. అయితే గిరిజనులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో మాత్రం పట్టించుకునే నాథుడే లేరని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే తాము పండించిన పంటకు క్వింటాకు రూ.20 వేలు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

    గిరిజన ప్రాంతంలో గిరిజనలు ప్రతిసీజన్‌లో జీడిమామిడి పంటను అమ్ముకోవడాకి కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ప్రభుత్వం, అధికారులు కనీసం పట్టించుకోకపోడం వల్ల గిరిజనులు దళారు చేతిలో మోసపోతున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకుని కనీసం జీసీసీ ద్వార నైనా జీడిపిక్కలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలి.

    – కారం రాఘవ, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు, అలివేరు

  • చింతలపూడి: ప్రస్తుత రోజుల్లో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటలకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు పంటల్లో కనిపిస్తుంది. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించకపోయినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్‌ పరిధిలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 35,542 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఇవి కాక 340 ఎకరాల్లో మొక్కజొన్న, 157 ఎకరాల్లో వేరుశనగ పంటలు పండిస్తారు. రబీ సీజన్‌లో సుమారు 1,500 హెక్టారుల్లో వరి, 18,000 హెక్టారుల్లో మొక్కజొన్న, 2, 500 హెక్టారుల్లో వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తుంటారు.

    ఎరువుగా జిప్సం

    జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ శ్రేణి పోషకాలను అత్యంత చౌకగా జిప్సం ద్వార అందించవచ్చు. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి గింజకట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది.

    వేరుశనగలో ఇలా

    వేరుశనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సంను పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల వేరుశనగ ఊడలు జిప్సంలోని కాల్షియం, గంధకాన్ని తీసుకుని అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం కలిగి ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు కలిగి మంచి ధర పలుకుతాయి. కాబట్టి పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా వేసుకోవాలి. బీడు ,చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగంవల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది.

    – వై సుబ్బారావు, చింతలపూడి వ్యవసాయ సబ్‌డివిజన్‌ ఏడీఏ

    పాడి–పంట

  • గణపవరం: గణపవరం మండలం ఎస్‌. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ దండు రాము, వైఎస్సార్‌ సీపీ మండల యూత్‌ అధ్యక్షుడు కొట్టు నరేష్‌, కొండేపాడు మాజీ సర్పంచ్‌ తోట సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు.

    పాలకొల్లు సెంట్రల్‌: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్‌ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎన్విరాన్‌మెంట్‌ బోర్డుకు వచ్చిన ఫిర్యాదు మేరకు డంపింగ్‌ యార్డుకు తనిఖీ చేస్తున్నామన్నారు. మునిసిపల్‌ అధికారులకు నోటీసు జారీ చేసి నివేదిక కోరతామన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో ఉన్న రెండు డంపింగ్‌ యార్డుల్లో నిత్యం పొగ వస్తుందని చుట్టూ ఇళ్లు, ఆలయాలు ఉన్నాయని స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పలు సమస్యలను తెలియజేస్తూ నేరుగా ఎన్విరాన్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ బి.విజయసారథి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ డీఈ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్‌ జ్యుడిషియల్‌ ఫస్టు క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్‌ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్‌ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్‌ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు.

  • దెందులూరు: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్‌ సీతారామ కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అన్‌సీజన్‌ వర్షాకాలపు గింజలకు కిలోకు రూ.350 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేశాయని, అత్యంత నాణ్యత కలిగిన సీజన్‌ గింజలకు ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.300 మాత్రమే ధర ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌ ధర ప్రకారం కిలో గింజలకు రూ.400 ఉందని, దిగుమతి సుంకాలతో అధర రూ.600 పైగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ ధర తగ్గినప్పుడు కోకో గింజలకు ధర తగ్గించిన కంపెనీలు పెరిగినప్పుడు ఎందుకు పెంచడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోకో రైతుల సంఘం, కోకో రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో జాయింట్‌ సమావేశం వెంటనే జరిపి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య (అశోక్‌), రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్‌ బాబు,కూసం రామిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • నూజివీడు: నూజివీడు పీఏసీఎస్‌లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ అనుచరులను, కావాల్సిన వారిని నియమంచుకుంటూ వారికి జీతాల రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. సొసైటీల్లో ఏవరినైనా నియమించాలంటే జిల్లా స్థాయి సాధికార కమిటీ ఉత్తర్వుల ప్రకారం నియమించుకోవాల్సి ఉండగా ఈ సొసైటీలో ప్రస్తుతం 8 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి ప్రతినెలా రైతుల సొమ్మును దోచిపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సొసైటీలో పర్మినెంట్‌ పోస్టులు ఆరు ఉండగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులలో ముగ్గురు వ్యక్తులను నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎనిమిది మందిని నియమించుకున్నారు. ఇందులో ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తుండగా ముగ్గురిని మాత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటీవలే నియమించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 కోట్ల వ్యాపారం మాత్రమే చేసినా సొసైటీ రుణాల రికవరీ కూడా వందశాతం లేదు. ఇష్టారాజ్యంగా నియమించుకొని జీతాలకు సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తే తరువాత ఆడిట్‌ అభ్యంతరాలు వచ్చి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా నూజివీడు సొసైటీ తీరుపై సహకారశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

  • పెంటపాడు: మండలంలో పలు ప్రాంతాలలో మట్టి మాఫియా ఊపందుకొంది. కాగా ఇదే అదనులో బి.కొండేపాడుకు చెందిన టీడీపీ నాయకునిడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ఓల్డ్‌ వయ్యేరుకు ఆనుకొని ఉన్న పొలం నుంచి సమీపంలో ఉండే మరో ఈనాం భూమిగా పిలిచే సుమారు 25 సెంట్లను ట్రాక్టర్లతో హడావుడిగా పూడ్చుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామ వీఆర్‌ఓ పద్మ, సివిల్‌ సప్లయిస్‌ డీటీ శ్రీనివాస్‌, వీఆర్‌ఏ రాజు తదితరులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకం చేసినా, అనుమతులు లేని భూములు పూడ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

    జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏడో రోజు శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం, ఉదయం ఎనిమిది గంటల నుంచి నవకల స్నపనం, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్‌ ఆచార్యులు మాట్లాడుతూ స్వామి వారికి 12సార్లు పూలతో అర్చన, 12 రకాల ప్రసాదాలతో నివేదన చేశామన్నారు. దాతలు వెంకటేశ్వర ఎడ్యుకేషన్‌ సొసైటీ విద్యాసంస్థలవారు, వెలివేటి సత్య వెంకట సూర్య రామకృష్ణ దంపతులు, శ్రీ దత్త సర్వాణి దంపతులు, జమ్మి గంగరాజు, దివంగత ముదుపాక సింగరాజు కుటుంబ సభ్యులను అర్చకులు స్వామివారి వేద ఆశీస్సులు, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారని ఈఓ కలగర శ్రీనివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామకుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • ఏలూరు టౌన్‌: నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్‌ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్‌ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్‌ డ్రైవర్లతో ట్రాఫిక్‌ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్‌ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్సై శ్రీధర్‌, ట్రాఫిక్‌ సిబ్బంది ఉన్నారు.

Vikarabad

  • వికారాబాద్‌: జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు ఊపందుకున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ మాసంలో 50 వేల మంది కూలీలు అధికంగా వస్తున్నారు. కలెక్టర్‌, ఆర్‌డీఓ నిరంతర పర్యవేక్షణ, సమీక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధి పనుల్లో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. వ్యవసాయ పనులు లేని కాలంలో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం 2008లో దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఈ పథకం ద్వారా జిల్లాలో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు కొన్ని పనులకే పరిమితమైన ఈ పథకం ప్రస్తుతం 50కి పైగా పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వ్యవసాయ అనుబంధ పనులు, పొలాల గట్ల వెంట మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వుకోవడం, పాఠశాల క్రీడా మైదానాల చదును, పశువుల, గొర్రెల, మేకల పాకలు నిర్మించుకోవడం, మట్టి రోడ్లు వేసుకోవడం, చెక్‌ డ్యాంలను ఏర్పాటు చేసుకోవడం వంటి వాటికి అవకాశం కల్పిస్తున్నారు.

    నిత్యం 60వేల మందికి పైగా..

    జిల్లాలో 1,86,197 జాబ్‌కార్డులు.. 3,77,087 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 74,953 మంది ఉపాధి పనులకు వస్తున్నారు. 20 మండలాల్లో రోజుకు సగటున 60వేల నుంచి 70వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. గత నెలలో రోజుకు 20వేల మందే వచ్చేవారు. ప్రస్తుతం అత్యధికంగా పెద్దేముల్‌ మండలంలో 7,171 మంది, ధారూరులో 5,735 మంది, మర్పల్లిలో 5,018 మంది కూలీలు పనులకు వస్తున్నారు. అయితే కూలి గిట్టుబాటు కావడంలేదని పలువురు అంటున్నారు.

    తగ్గుతున్న పనిదినాలు

    కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి పనుల్లో కోత విధిస్తూ వస్తోంది. సంస్కరణల పేరుతో నిబంధనలను కఠినతరం చేస్తూ పేదలను పనులకు దూరం చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాకు కల్పించాల్సిన పని దినాల్లో దాదాపుగా కోటి రోజులు కోత విధించిందంటే ఈ ప్రభావం ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం కూలీల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం నిర్ణయించిన పనులు మాత్రమే చేపట్టాలనే నిబంధన ఇబ్బందిగా మారింది. గతంలో ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇళ్లకు చేరుకునే వారు. ప్రస్తుతం ఉదయం ఒక పని.. మధ్యాహ్నం తర్వాత మరో పనికి సంబంధించి ఫొటో అప్‌లోడ్‌ చేయాలి. రెండు సార్లు ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌లో ఫొటోలు దిగాలి. ఇందు కోసం కూలీలు మండుటెండలో వేచి చూడాల్సి వస్తోంది.

    జిల్లాలో చురుగ్గా ఉపాధి హామీ పథకం పనులు

    జాబ్‌కార్డులు 1,86 లక్షలు

    కూలీల సంఖ్య 3.77 లక్షలు

    ప్రస్తుతం పనికిహాజరవుతున్న వారు 74,953

    గత నెలతో పోలిస్తే

    50వేల మంది అధికం

    జిల్లాలో 74వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. వారం రోజుల్లోగా కూలీలకు డబ్బులు అందుతున్నాయి. అందరి సహకారంతో పనులు బాగా కల్పించగలుగుతున్నాం. మూడేళ్లుగా ఉపాధి పనుల్లో మన జిల్లా ముందు వరుసలో ఉంది.

    – శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Nalgonda

  • నల్లగొండ : జనగణన – 2027లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన ఎన్యుమరేటర్ల వద్ద వివరాలను నమోదు చేయించుకుని మాట్లాడారు. ప్రజలు ఎన్యూమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కోరారు. జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు కీలక ఆధారమని, భవిష్యత్‌ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జనగణన పేరుతో మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లు ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా, ఏటీఎం వివరాలు, ఓటీపీలు అడగరని తెలిపారు. అలాంటి వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు ఉస్మాన్‌, మల్లిక్‌ ఉన్నారు.

  • నల్లగొండ టూటౌన్‌ : పట్టణంలోని ఐస్‌ తయారీ యూనిట్లను జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్‌.శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ, ఆహార భద్రత ప్రమాణాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఐస్‌ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా, చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంటుందని, ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రకాశం బజార్‌లోని ఒక చికెన్‌ సెంటర్‌ నుంచి ఒక ఫంక్షన్‌ హాల్‌కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్‌ను అధికారులు తనిఖీ చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలివేశారు.

  • పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి. ఈ పెంపు వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. నేను ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నా. బండి మీద వెళ్లాలి. వచ్చిన జీతంలో అధిక శాతం పెట్రోల్‌కే ఖర్చయితే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పునరాలోచించాలి.

    – మాదవి, ప్రైవేట్‌ ఉద్యోగి, నల్లగొండ

    ప్రభుత్వం నాలుగేళ్ల తర్వాత ఽపెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. ఇప్పటికే ధరలు పెరిగి వ్యాపారాలు లేవు, కుటుంబం గడవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. దాంతో మళ్లీ ధరలు పెరుగుతాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టపోతాం. ప్రభుత్వం ధరలు తగ్గించాలి.

    – ముర్తూజా, పండ్ల వ్యాపారి, నల్లగొండ

  • నల్లగొండ అగ్రికల్చర్‌, పెద్దవూర : యాసంగిలో సన్నాలు సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు. కేవలం వానాకాలం కొనుగోలు చేసిన సన్నాలకే పరిమితం చేసింది. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2024–25 వానాకాలం నుంచి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం కేవలం వానాకాలం సాగుకే అమలవుతోంది. గత యాసంగి బోనస్‌ ఇవ్వలేదు. ఈ యాసంగిలో అసలు బోనస్‌పై ఎలాంటా ప్రకటనా చేయలేదు. మరోవైపు ఈ వానాకాలం నుంచి తాము సూచించిన 8 రకాల సన్నాలకే బోనస్‌ ఇస్తామని వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తోంది. దీంతో రైతులు ఏ రకాలు సాగు చేయాలోనని గందరగోళం చెందుతున్నారు.

    రూ.10.97 కోట్లు పెండింగ్‌

    2024–25 వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి 74,393 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికి కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ను కూడా విడుదల చేసింది. ఆ సీజన్‌లో రూ.37.20 కోట్లను రైతులకు బోనస్‌ కింద జమ చేసింది. కానీ 2024–25 యాసంగి సీజన్‌లో రైతులు పండించిన సన్నాలు 21,939 మెట్రిక్‌ టన్నుల దాన్యం కొనుగోలు చేసింది. బోనస్‌ కింద రూ.10.97 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా ఇంత వరకు విడుదల చేయలేదు.

    ఈ యాసంగిలో బోనస్‌ ఊసే లేదు..

    2025–26 వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం 1,48,812 మెట్రిక్‌ టన్నుల సన్న దాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. యాసంగి సీజన్‌ బోనస్‌ను విడుదల చేయని ప్రభుత్వం 2025–26 సీజన్‌కు సంబంధించిన వానాకాలం బోనస్‌ కింద రూ.74.41 కోట్లను విడుదల చేయడం విశేషం. తిరిగి 2025–26 యాసంగి సీజన్‌ కూడా ముగిసి ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నా.. గత యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్‌పై నోరు మొదపడం లేదు. అసలు యాసంగి సీజన్‌కు బోనస్‌ ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే 2024–25, 2025–26 యాసంగి సీజన్లకు సంబంధించిన బోనస్‌ను ఖాతాల్లో జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

    తాము చెప్పిన రకాలే సాగు చేయాలి..

    వానాకాలంలో సాగు చేసే వరి సన్నాల్లో తాము సూచించే ఎనిమిది రకాలనే సాగు చేయండి.. బోనస్‌ పొందండి అంటూ వ్యవసాయశాఖ ప్రచారం చేపట్టింది. సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా కేవలం ఎనిమిది రకాలనే ప్రమోషన్‌ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. గడిచి రెండు వానాకాలం సీజన్లలో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్రయించినా ప్రభుత్వం బోనస్‌ను అందించింది. 2026 వానాకాలం సీజన్‌కు సంబంధించి మాత్రం 8 రకాలనే వ్యవసాయ శాఖ ప్రమోషన్‌ చేయాలని నిర్ణయించడం.. రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే అనుమానం నెలకొంది.

    ఫ ఏడాది గడిచినా రైతులకు

    అందని పోత్సాహకం

    ఫ వానాకాలం సన్నాలకే

    బోనస్‌ ఇస్తున్న ప్రభుత్వం

    ఫ యాసంగిలో సన్నాలు సాగు చేసినా ప్రయోజనం లేదంటున్న రైతులు

    ఫ 8 రకాలకే బోనస్‌ ఇస్తామంటూ

    ఇప్పుడు వ్యవసాయ శాఖ ప్రచారం

    ఈ ఫొటోలోని రైతు మాడ్గులపల్లి మండల కేంద్రానికి చెందిన పుల్లెంల యాదగిరి. ఈ రైతు గత యాసంగిలో 16 ఎకరాల్లో పండిన 437 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో అమ్మాడు. ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పడంతో తనకు మద్దతు ధరతోపాటు రూ.2,18,500 వస్తాయని లెక్కలు వేసుకున్నాడు. కానీ ప్రభుత్వం బోనస్‌ ఇవ్వలేదు. గత వానాకాలంలో ఐకేపీలో సన్న ధాన్యం అమ్మిన బోనస్‌ వచ్చింది. దీంతో ఈ యాసంగి సీజన్‌లో కూడా 318 క్వింటాళ్ల సన్న ధాన్యం ఐకేపీలో విక్రయించాడు. ఈ యాసంగిలోనైనా ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నాడు.

    సన్నాల్లో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూచించిన రకాల్లో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సూచించే 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్‌ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, అంతేకాని తాము సూచించిన రకాలకే బోనస్‌ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు కోరుతున్నారు. వానాకాలం సాగుకు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని, దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు.

  • లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.40,

    డీజిల్‌పై రూ.3.27 పెంపు

    నిరసన తెలిపిన రాజకీయ పక్షాలు

    నల్లగొండ : సామాన్యుడిపై పెట్రో బాంబు పేలింది. కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది. ఇప్పటికే గ్యాస్‌ ధరల పెరుగుదల, కొరతతో హోటళ్లు, చిన్న వ్యాపారాలు మూతపడుతున్న తరుణంలో.. తాజా పెంపు ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ తయారైంది.

    రూ.3 పైనే పెంపు

    పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సాకుతో కేంద్రం ఇంధన ధరలను సవరించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.40, డీజిల్‌పై లీటరుకు రూ.3.27 పెంచింది. డీ జిల్‌ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై నేరుగా పడనుంది. ఫలితంగా నిత్యావసరాలైన బియ్యం, ప ప్పులు, నూనె ధరలు పెరగనున్నాయి. కూరగాయలు, రవాణా ఖర్చులు పెరగడంతో సా మాన్యుడిపై భారం పడనుంది. స్టీల్‌, సిమెంట్‌ ధరలు పెరిగి సామాన్యుడి సొంతింటి కల మరింత దూరం కానుంది.

    జిల్లాపై ప్రభావం

    నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 240 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిత్యం వేల లీటర్ల ఇంధన విక్రయాలు జరిగే ఈ జిల్లాలో, తాజా పెంపు వల్ల ప్రజలపై ప్రతి నెలా కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితుల్లో, మధ్యతరగతి జీవి బడ్జెట్‌ తలకిందులవుతోంది.

    వెల్లువెత్తుతున్న

    నిరసనలు

    పెరిగిన ధరలకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసన సెగలు మొదలయ్యాయి. నల్లగొండ పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ పెట్రో ధరల పెంపుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

    ఫ్రీ బస్‌తో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. నల్లగొండ నుంచి చర్లపల్లి, ఎస్‌ఎల్‌బీసీ, పానగల్‌ వెళ్లేవారు కూడా బస్‌లు ఎక్కుతున్నారు. వృద్ధులు, నడవలేని వారు మాత్రమే ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ దరలు పెంచింది. దీంతో మా బతుకులు బస్టాండ్‌ పాలు కానున్నాయి. – గాలయ్య, ఆటో డ్రైవర్‌, నల్లగొండ

  • నల్లగొండ టూటౌన్‌ : విద్యా వారోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శుక్రవారం ఆర్ట్స్‌ బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ‘ఆర్టిఫిపియల్‌ ఇంటెలిజెన్స్‌ పర్‌ ఎవ్‌రి వన్‌’ అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన ఏఐ నిపుణుడు డాక్టర్‌ కళ్యాణ్‌ సర్వేపల్లి.. ప్రొపెసర్లకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏఐ సాంకేతికత, మిషన్‌ లెర్నింగ్‌.. విద్యా రంగంలో, ఇంజనీరింగ్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరుగుతాయని, విద్యార్థులు వీటిని గమనించి లోతైన అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అంజిరెడ్డి ప్రిన్సిపాల్‌ ఆర్‌.రేఖ, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ వై.ప్రశాంతి, ప్రొఫెసర్లు హరీష్‌కుమార్‌, జయంతి, సంధ్యారాణి, సుధారాణి, అధాపకులు పాల్గొన్నారు.

    వర్షపు నీటిని సంరక్షించాలి

    కనగల్‌ : వర్షపు నీటిని సంరక్షించాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కోరారు. జల సంచాయ్‌ – జన్‌ భాగిదారి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనగల్‌ గ్రామంలో ఆయన నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఎంపీఓ సతీష్‌కుమార్‌, సర్పంచ్‌ నర్సింగ్‌ మురళిగౌడ్‌, ఉప సర్పంచ్‌ చంద్రయ్య, ఏపీఓ సుధాకర్‌, కార్యదర్శి వీరబాబు, మాజీ సర్పంచ్‌ చిట్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

    ‘ఇక్కత్‌’ను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం

    భూదాన్‌పోచంపల్లి : ఇక్కత్‌ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్‌ ఏషియా ఇంటర్నేషనల్‌, తెలంగాణ ఇక్కత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్‌కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలతో రెడ్‌ కార్పెట్‌పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్‌ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

  • ‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..

    సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్‌ 21వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు.

    శిక్షణలో నేర్పించే అంశాలు

    ఐబ్రోస్‌(త్రెడింగ్‌), వ్యాక్సింగ్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచింగ్‌, స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్స్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్స్‌), హెయిర్‌ మసాజ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ గ్రూమింగ్‌, శారీ డ్రాపింగ్‌.

    రిజిస్ట్రేషన్‌ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు

    సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు

    రిజిస్ట్రేషన్‌ ఫీజు : రూ.2,500/–

    వర్క్‌షాపు షెడ్యూల్‌ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు

    శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు

    తన్విక బ్యూటీపార్లర్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, రోడ్‌ నెం.1బి, వీటి కాలనీ,

    నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్‌ : 8341151413, 9666013544

    రిజిస్ట్రేషన్‌ మరియు

    శిక్షణా స్థలం వివరాలు

    ఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి

  • కొండమల్లేపల్లి : ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కొండమల్లేపల్లిలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పంట వేశాక యూరియా ఇవ్వకుండా, ఇప్పుడు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఫ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌

  • నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేయాలని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రభుత్వం ప్రాధామ్య పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక అధికారులు మండలాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా పెండింగ్‌ ఉన్న కేంద్రాలను సందర్శించి కారణాలను విశ్లేషించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు నూటికి నూరు శాతం గ్రౌండింగ్‌ చేయాలని, గ్రౌండింగ్‌ కాని వాటిని రద్దుచేసి కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఎల్‌–3 నుంచి ఎల్‌–1కు వచ్చే కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు అవకాశం కల్పించాలని, బదిలీల్లో ఎలాంటి సమస్యలకు అవకాశం ఇవ్వకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

  • నల్లగొండ : జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతువుల రవాణా విషయంలో నిబంధనలు పాటించాలని, ఒకే వాహనంలో అధిక సంఖ్యలో జంతువులను తరలించవద్దని చెప్పారు. పశు వైద్యాధికారి సర్టిఫికెట్‌ లేకుండా జంతువులను తరలించడం నేరమన్నారు. రవాణా వాహనాల్లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తప్పనిసరిగా ఉండాలని, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల్లో జంతువులకు ఆశ్రయం కల్పించే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని సూచించారు. వీధి కుక్కల నియంత్రణ కోసం త్వరలో కుక్కల దత్తత కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్‌, పశు సంవర్ధక అధికారి డాక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

International

  • ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు అమెరికా మీడియా ప్రచురించింది. టెహ్రాన్‌పై మరోసారి వైమానిక దాడులకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

    ట్రంప్‌ చైనా పర్యటన ముగించుకొని ప్రయాణంలో ఇరాన్‌ ప్రతిపాదించిన శాంతియుత ఒప్పందాని ఆయన తోసిపడేసినట్లు కథనాలు పేర్కొన్నాయి. "నేను దానిని చూశాను, మొదటి వాక్యం నచ్చకపోతే నేను దానిని పక్కన పడేస్తాను" అని ఆయన అన్నట్లు తెలిపాయి.

    ‍‍‍పశ్చిమాసియాలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు ఈ విషయమై మీడియాతో మాట్లాడారాని అమెరికా- ఇజ్రాయెల్‌ బలగాలు మరోసారి సంయుక్తంగా అమెరికాపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయనితెలిపినట్లు పేర్కొన్నాయి. కాగా ఇరాన్‌ అణ్వాయుధ రహిత దేశంగా ఉండాలని అమెరికా, చైనా సంయుక్తంగా అంగీకరించాయిని ఎట్టిపరిస్థితుల్లో ఇరాన్ హర్ముజ్‌ జలసంధిని తెరవాలని సంయుక్త ప్రకటన చేసినట్లు ANI నివేదిక పేర్కొంది.

    చైనా రాగం పాడిన ట్రంప్

    చైనా పర్యటన తిరుగు ప్రయాణంలో ట్రంప్ చైనా రాగం పాడారు. "మేము అక్కడ చాలా బాగా గడిపాము అది ఒక అద్భుతమైన కాలం. అధ్యక్షుడు షీ ఒక అద్భుతమైన వ్యక్తి. జిన్‌పింగ్‌, తాను తైవాన్ గురించి చాలా మాట్లాడుకున్నాము అన్నారు. అదే విధంగా ఇరాన్ గురించి చాలా చర్చించాము ఈ రెండు విషయాలపై మాకు చాలా మంచి అవగాహన ఉందని నేను భావిస్తున్నాను". అన్నారు.

    కాగా ఇరు దేశాల చర్చలలో చైనాకు తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశంగా నిలిచింది. బీజింగ్ తన భూభాగంగా చెప్పుకుంటున్న ఈ స్వయం పరిపాలన ద్వీపం విషయంలో ఉన్న విభేదాలు అమెరికా, చైనాల మధ్య ఘర్షణలకు లేదా సంఘర్షణలకు దారితీయవచ్చని జిన్‌పింగ్‌ వ్యక్తిగతంగా ట్రంప్‌ను హెచ్చరించినట్లు రాయిటర్స్ నివేదించింది.
     

  • జపాన్‌లో నూతనంగా తీసుకవచ్చిన వీసా నిబంధనలు అక్కడే స్థిరపడిన విదేశీయుల పట్ల శాపంగా మారాయి. గత 30 ఏళ్లుగా జపాన్‌లో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్న ఓ భారతీయునికి అక్కడి అధికారులు వీసా పునరుద్ధరణకు నిరాకరించారు. దీంతో ఆయన ఏం చేయాలో తోచక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 

    భారత్‌కు చెందిన మనీష్ కుమార్ గత 30 ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడి సైతామా ప్రిఫెక్చర్‌ ప్రాంతంలో గత 18 ఏళ్లుగా ఓ భారతీయ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు.   అయితే ఆ దేశంలో ఇటీవల వీసా నిబంధనలు తీవ్ర కఠినతరం చేయడంతో  అధికారులు తన బిజినెస్ మేనేజర్ వీసా పునరుద్ధరణను తిరస్కరించారు. దీంతో 18 ఏళ్లుగా నడుపుతున్న రెస్టారెంట్‌ మూసివేయవలసి వచ్చిందని కన్నీటితో కుప్పకూలిపోయారు.

    టోక్యోలో జరిగిన వీసా నిబంధనల  నిరసన ర్యాలీలో మాట్లాడుతూ "రెండు వారాల క్రితం, నా సొంత దేశానికి తిరిగి వెళ్ళమని ఐఎస్ఏ నాకు చెప్పింది. నా పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారు, వారికి జపనీస్ మాత్రమే అర్థమవుతుంది, వారి స్నేహితులు కూడా జపనీయులే. అయినా మమ్మల్ని భారతదేశానికి తిరిగి వెళ్ళమంటున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి?" అని  కన్నీటీ పర్యంతమయ్యారు. ఈ నిర్ణయంతో తాను తీవ్రంగా కుంగిపోయానని, జపాన్‌లో తన కుటుంబ భవిష్యత్తు గురించి భయపడుతున్నానని కుమార్ అన్నారు.

    కాగా గతేడాది  జపాన్ తన బిజినెస్ మేనేజర్ వీసా విధానంలో సమూలంగా మార్పులు ప్రవేశపెట్టింది. దీంతో అక్కడే ఉన్న విదేశీ చిన్న తరహా వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా అధికారిక సమాచారం ప్రకారం, అక్టోబర్ 2025లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీసా దరఖాస్తులు 96 శాతం తగ్గాయి. నెలవారీ దరఖాస్తులు గతంలో సూమారు  1,700 వరకూ వస్తుండగా ఇప్పుడు  70కి పడిపోయినట్లు సమాచారం.

    అయితే అక్కడ నిజమైన వ్యాపారాలు నిర్వహించకుండా, దీర్ఘకాలిక నివాసం కోసం వీసాను సులభ మార్గంగా ఉపయోగించుకునే వారిని అరికట్టడానికే ఈ కఠినమైన నిబంధనలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

Politics

  • సాక్షి, నరసాపురం: ఆక్వా సిండికేట్‌ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్‌ సిండికేట్‌ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి కారణం కూడా సిండికేట్‌ ముఠాను నడిపించేది చంద్రబాబు బంధువుల కావడం వల్లనే అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు.

    నరసాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన విద్యుత్, డీజిల్‌ ధరలతో రైతులు అల్లాడిపోతుంటే కొత్తగా ఫీడు ధరలు పెంచి, 100 కౌంట్‌ రొయ్యల ధరలను ఏకంగా రూ.25 తగ్గిస్తే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్‌ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్సన్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్‌ రూ.250 పలుకుతుంటే, దానికి రైతుకి రూ.350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.

    సిండికేట్‌ ముఠాకి లబ్ధి చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగానే మంత్రి అచ్చెన్నాయుడు అప్సడా సమావేశానికి డుమ్మా కొట్టాడని, మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెంచిన ధరలకే ఫీడు అమ్మకాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఫీడు వ్యాపారులు డీలర్లకు అవసరమైన మేర ఫీడు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళితే రైతుల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

    అప్సడాతో సంబంధం లేకుండా ఎలా పెంచుతారు?:
    కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్‌ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్‌ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఫిబ్రవరిలోనే ఫీడు ధరలు టన్నుకు రూ.4 వేలు పెంచగా, ఇప్పుడు మళ్లీ మరో రూ.12 వేలు పెంచేశారు. ఫీడ్, సీడ్‌ రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా వైఎస్సార్సీపీ హయాంలో అప్సడా ద్వారానే జరిగేది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో అప్సడాలో రైతులు, ఎగుమతుదారులు, ప్రభుత్వం, పీడు యాజమాన్యం సభ్యులుగా ఉండి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. కానీ నేడు సిండికేట్‌ ముఠా అప్సడాతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకొంది. ఫీడు ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది.

    ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సిండికేట్‌ ముఠాకి పెత్తనం అప్పగించేసింది. కాబట్టే నిన్న (శుక్రవారం) జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు గైర్జాజరయ్యారు. ఫీడు ధరలను ప్రభుత్వం పెంచిందా,  తగ్గించిందా తెలియని పరిస్థితి నెలకొంది. ఫీడ్‌ వ్యాపారులు మాత్రం పెంచిన ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. సరిపోయినంత ఫీడు డీలర్లకు ఇవ్వకుండా కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో ఫీడు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    100 కౌంట్‌ ధర రూ.25 తగ్గించేశారు:
    గత వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్సీపీ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు సహకారం అందించడం జరిగింది. ఫీడు ధరలు మూడుసార్లు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించడం జరిగింది. కానీ నేడు సీఎం చంద్రబాబు నుంచి కూటమి నాయకులు ఎవరూ రైతుల పక్షాన ఉండటం లేదు. ఫీడు వ్యాపారులే ఎగుమతుదారులుగా కూడా వ్యవహరిస్తూ మొన్నటి వరకు రూ.275 వరకు ఉన్న 100 కౌంట్‌ ధరను ఇప్పుడు ఏకంగా రూ.25  తగ్గించేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో రూ.10 తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    ఎక్స్‌పోర్టర్స్‌ మీటింగ్‌ పెట్టుకుంటే చాలు ధరలు తగ్గిపోతాయన్న భయం ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఒకపక్క ఫీడు ధరలు పెంచుతూ ఇంకోపక్క కౌంట్‌ ధరలు తగ్గిస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఫీడు ధరలు పెరిగితే వైయస్‌ జగన్‌ లంచాలు వెళ్లాయని ప్రచారం చేసేవారు. ఇప్పుడు లోకేష్‌ ఎంత లంచం తీసుకున్నాడో కూటమి నాయకులు చెప్పాలి. ఫీడు యాజమాన్యాలు చంద్రబాబుకి బంధువులు కాబట్టే వారి లబ్ధి కోసం రైతులను గాలికొదిలేశారు.

    చంద్రబాబు బంధువులదే సిండికేట్‌ ముఠా:
    ఆక్వా ఇండస్ట్రీస్‌కి సబ్సిడీ ధరకు కరెంట్‌ అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీతో మాట్లాడి ఫిష్‌ మీల్‌ ఇతర దేశాలకు ఎగుమతులు కాకుండా స్థానికంగా ఉపయోగపడేలా ఒప్పించాలి. అంతేకానీ రైతులు నిండా మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్స్‌పోర్టర్‌కి, సీడు, ఫీడు యాజమాన్యంపై భారం పడితే అంతిమంగా ఆ నష్టం ఆక్వా రైతు మీదే పడుతోంది.

    సిండికేట్‌ నాయకులు చంద్రబాబుకి బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వారికి కొమ్ముకాస్తూ వైయస్‌ జగన్‌ గారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అప్సడా చట్టానికి తిలోదకాలిస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు ఫీడు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సోయా ధర తగ్గినప్పుడు ఒక్కసారి కూడా ఫీడు ధరలు తగ్గించిన పాపానపోలేదు. మొత్తం మీద ఆక్వా సంక్షోభానికి సీఎం చంద్రబాబే కారణం అవుతున్నారు. అప్సడా ద్వారా వైయస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సీడు, ఫీడు ధరలు పెంచకుండా రైతులను ఆదుకోవడం జరిగింది.

    కొత్తగా ఒక్క కనెక్షన్‌ కి సబ్సిడీ విద్యుత్‌ ఇవ్వలేదు:
    వైఎస్సార్సీపీ హయాంలో 55 వేల కనెక్షన్లకు సబ్సిడీ ధరకు కరెంట్‌ ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ ధరకు కరెంట్‌ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వలేదు. సిండికేట్‌ ముఠా ప్రభుత్వానికి తెలియకుండా ఫీడు ధరలు పది రూపాయలు పెంచింది. రేపు రూ.5 లు తగ్గించి, అది కూడా ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే రొయ్యల రైతులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా సహించబోమని, కాదని మొండిగా వ్యవహరిస్తే ఆక్వా రైతుల పక్షాన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు.

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ను శనివారం సినీనటుడు, మక్కల్ నీది మయ‍్యం అధినేత కమల హాసన్‌ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కమల హాసన్ శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. “ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్‌ను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపాను. తమిళనాడు అభివృద్ధి విషయంలో ఉన్న ఆశయాలను ఆయన ఉత్సాహంగా చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చూపిన వినయం, అభిమానం నాకు గర్వంగా అనిపించాయి” అని తెలిపారు.

    ఈ సమావేశంలో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు కీలక వినతులను కూడా సమర్పించినట్లు కమల హాసన్‌ వెల్లడించారు. “పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న తమిళ సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ.. తమిళనాడు ప్రభుత్వానికి 6 కీలక డిమాండ్లు చేశాను” అని తెలిపారు.

    ఇంతకుముందు విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న తొలి కీలక నిర్ణయాల్లో ఒకటిదానికి కమల హాసన్ మద్దతు తెలిపారు. తమిళనాడులో ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేయడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    కొన్ని రోజుల క్రితం వినోద రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న నటుడికి ఏమైనా సలహా ఇస్తారా అని కమల్‌ను ప్రశ్నించగా.. కొత్త ప్రభుత్వానికి, మద్యం దుకాణాల మూసివేత నిర్ణయానికి అభినందనలు తెలిపారు. “తమిళనాడు కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. 717 మద్యం దుకాణాల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయం. దీని గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఇప్పుడు అమలు చేశారు. ఇది ప్రశంసనీయం” అన్నారు.

    విజయ్ రాజకీయ ప్రయాణంపై కమల్ ఇంకా మాట్లాడుతూ.. “విజయ్‌ను కేవలం సినీ నటుడిగా మాత్రమే చూడకూడదు. ఆయనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. ఏ రంగం నుంచి అయినా రాజకీయాల్లోకి రావచ్చు. మన పరిశ్రమ నుంచి విజయ్ అధికారంలోకి రావడం గర్వకారణం” అన్నారు. కాగా, విజయ్ రాజకీయ పార్టీ టీవీకే పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 108 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది.

  • శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని ప్రతీ ప్రాజెక్ట్‌ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనతేనన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యమని అప్పలరాజు విమర్శించారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రాకు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చెత్త సంపద కేంద్రం ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా? అని ప్రశ్నించారు. 

    ‘ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడోసారి జిల్లాకు వచ్చారు. ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టటం నేర్పించారు. రెండోసారి బుడగట్ల పాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయాడు. మూడోసారి పర్యటనలోచెత్త సంపద కేంద్రం తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. మీకు శ్రీకాకుళం జిల్లా అంటే ఇంత చిన్న చూపా. 

    పిల్లలు భారం కాదు....వాళ్లే మీ సంపద అంటున్నారు. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. మీ అబ్బాయికి ఆ సలహా ఇవ్వండి. మీరెందుకు ఒక్కరితో ఆగిపోయారు. ఇద్దరిని, ముగ్గురిని ఎందుకు కనలేదు. నేటి చంద్రబాబు టీడీపీకి ఒకప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది.  వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం, ప్రజలకు సేవ చేయాలనే ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. మా పార్టీతో మీ పార్టీకి పోలికా?’ అని మండిపడ్డారు. 

    దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర  గుంటూరులో ఉంది. ఇది మన ఏపీ ఘనత. ఆ రోజు పెట్రోల్ ధర ఎక్కువ ఉంటే జగన్ వైఫల్యం అట. ఈరోజు పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబుకు సంబంధం లేదట. పెట్రోల్ పై రాష్ట్రంలో అదనంగా రూ 4 వ్యాట్ వేసారు. దాన్ని తగ్గించండి. అమరావతి కోసం డీజిల్ తరలిస్తే ఎంతగా కొరత వచ్చిందో చూసాం...కేంద్ర అలా కుదరదని చివాట్లు పెడితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో అంతులేని అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు. స్కూల్స్ కోసం దాతల నుండి విరాళాలు అడుగుతున్నారు. అతని కుమారుడే విద్యాశాఖ మంత్రి. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. 

    రీ సర్వే వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆ రోజు ఏం మాట్లాడారు. మీ భూములు లాక్కుంటారు, మేం వచ్చిన వెంటనే రీ సర్వే రద్దు చేస్తాం  మిమ్మల్ని బెదిరించడానికే జగన్ రీ సర్వే చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా?

    రీ సర్వేలో అసలు మీ పాత్ర ఏంటి? ఒక్క ఎక్విప్ మెంట్ అయిన మీరు కొన్నారా?, రీ సర్వే ఘనతను వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి మాట్లాడుతున్నారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రావడంలో ఎవరు ఎక్కువ రోల్ చేసారు చంద్రబాబు చెప్పాలి. మీరు మాట్లాడే ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే.

    నేరేడు బ్యారేజ్ పై ట్రిబ్యునల్ తీర్పు 2021 లో జగన్ అధికారంలో ఉండగా వచ్చింది. నేరేడు బ్యారేజ్ పై ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఘనత జగన్‌ది. అందులో మీ ఘనత ఏముంది. అందులో నీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు పాత్ర ఏంటి. గెజిట్ నోటిఫికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మీరు నాలుగుసార్లు సీఎంగా చేసిన సమయంలో ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా.. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు చెప్పoడి’ అని సవాల్‌ చేశారు. 

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, “పుష్ప” అని చెప్పుకునే జహంగీర్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం హెచ్చరిక చేశారు. “అతడు అత్యంత కిరాతక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. అతడి వ్యవహారాన్ని నేను స్వయంగా చూసుకుంటా. పుష్ప అని చెప్పుకునే ఆ వ్యక్తి బాధ్యత ఇప్పుడు నాది” అని హెచ్చరించారు.

    ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఫల్తాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సభలో సువేందు అధికారి మాట్లాడారు.

    “మేనల్లుడు (అభిషేక్‌ బెనర్జీ) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పదేళ్లుగా ప్రజలు ఓటు వేయలేని పరిస్థితి ఫల్తాలో ఉంది. ఈ రీపోలింగ్‌తో ఓటర్ల హక్కులు మళ్లీ స్థిరపడతాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ఫల్తా ఓటర్లు బీజేపీ అభ్యర్థిని లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా” అని సువేందు అధికారి అన్నారు.

    అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తృణమూల్ నేత, ఫల్తా అభ్యర్థి జహంగీర్ ఖాన్ తనను తాను “పుష్ప”గా చెప్పుకున్నారు. “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్‌ పోషించిన స్మగ్లర్‌, శక్తిమంతమైన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్‌ పాల్‌ శర్మను ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ పోలీసు పరిశీలకుడిగా నియమించింది. ఆయనను “సింగం” సినిమా సిరీస్‌లో అజయ్‌ దేవగన్‌ పోషించిన పోలీసు అధికారి పాత్రతో పోల్చి, ఖాన్ ‘‘పుప్ప’’ వ్యాఖ్యలు చేశాడు.

    కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు దశల్లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కాగా, మొన్న తమిళనాడు అసెంబ్లీలోనూ ‘‘పుష్ప’’ పాత్రను గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Business

  • పెట్టుబడుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే రాబర్ట్ కియోసాకి.. తాజాగా పెద్ద కంపెనీలు మాత్రమే విజయం సాధిస్తాయనే విషయంపై స్పందించారు. AI సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించగలరు అని పేర్కొన్నారు.

    ఈ కాలంలో పెద్ద కంపెనీలకు మాత్రమే విజయావకాశాలు ఉన్నాయనే భావన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా తన ఇంటి వంటగదిలో కూర్చొని, కేవలం ల్యాప్‌టాప్‌, ఏఐ సహాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారాన్ని నిర్మించగలడని కియోసాకి పేర్కొన్నారు.

    ఒకప్పుడు పెద్ద వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి, ఉద్యోగులు, ఆఫీస్, మార్కెటింగ్ టీమ్, మౌలిక సదుపాయాలు అవసరమయ్యేవి. కాబట్టి వ్యాపారం అనేది ధనికులకు మాత్రమే లేదా పెద్ద సంస్థలకు మాత్రమే సాధ్యమని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ సాయంతో ఒక వ్యక్తి ఒంటరిగా.. చాలామంది చేసే పనులు చేసేస్తున్నాడు.

     
     

    పెద్ద పెద్ద ఆఫీసులు లేకపోయినా, ఇంట్లో నుంచే వ్యాపార నిర్ణయాలు తీసుకొని విజయాన్ని సాధించవచ్చు. AI సహాయంతో ఒక వ్యక్తి పెద్ద కంపెనీల మార్కెటింగ్ విభాగం కంటే ఎక్కువ కంటెంట్‌ను తయారు చేయగలడు. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగలడు. కస్టమర్లకు త్వరగా స్పందించగలడు. మార్కెట్‌లో వచ్చే మార్పులకు పెద్ద కంపెనీల కంటే వేగంగా.. అనుగుణంగా మారగలడని కియోసాకి అన్నారు.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

    పెద్ద కంపెనీలకు డబ్బు, వనరులు ఎక్కువగా ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు వేగం గొప్ప ఆయుధం ఉంది. ఈ రోజుల్లో వేగంగా ఆలోచించి, వేగంగా అమలు చేసే వారే గెలుస్తున్నారు. పెద్ద సంస్థలు ఒక నిర్ణయం తీసుకునేలోపు.. చిన్న వ్యాపారులు కొత్త అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఏ రంగంలో అయినా.. తెలివిగా ఆలోచిస్తే తప్పకుండా విజయం సొంతం అవుతుందని కియోసాకి చెబుతున్నారు.

  • దేశ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడం, వాణిజ్య లోటును తగ్గించడం, రూపాయి విలువను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది.

    భారతదేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల దిగుమతులు భారీగా పెరిగాయి. ప్రజలు పెట్టుబడుల కోసం, ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా ఈ లోహాలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే విదేశాల నుంచి ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

    ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం మే 13న బంగారం, వెండి దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5 శాతం ఏఐడీసీ ఉంటుంది. ఇది  మే 13 నుంచే అమల్లోకి వచ్చింది.

    తాజాగా ప్రభుత్వం వెండి దిగుమతులపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఫ్రీ నుంచి పరిమిత వర్గంలోకి మార్చింది. ఫ్రీ అంటే.. ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. పరిమిత వర్గంలో అయితే.. ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. దీని వల్ల వెండి దిగుమతులు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది.

    విదేశీ వాణిజ్యం (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ఈ మార్పులు అమలు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడం.

  • సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్‌ పడ్డప్పుడు కొంటేనే తక్కువ ధరకు వస్తుంది.. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్కవుట్‌ అవుతుంది. మార్కెట్‌ బాగలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. వారు అందించే ఆఫర్లు అందుకునే అవకాశం ఉంటుంది.

    హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో రెండు రకాల కస్టమర్లు ఉన్నారు. ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక, రెండో రకం రిటైల్‌ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు.

    మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్‌ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో ధరలు మరింత తగ్గుతాయేమోనని వేచి చూస్తారు. ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్‌లో లాభాలు ఆర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్‌. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్‌లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.

    ప్రభుత్వం ప్రోత్సహించాలి
    ఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవనాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్‌ టూరిజం, ఎడ్యుకేషనల్‌ హబ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.

    ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్‌కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.

    పారిశ్రామిక పాలసీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.

    కొత్త ప్రాజెక్ట్‌లపై పునరాలోచన
    ప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ లెమాన్‌ బ్రదర్స్‌ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం పతనం.. 2014 వరకూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైంది.

    కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణలపై అస్పష్టత వంటి కారణాలు అనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్‌ బూమ్‌ 2022 వరకూ కొనసాగింది. ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్‌లు, అపరిమిత సరఫరా, ఎఫ్‌ఎస్‌ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు.

    మార్కెట్‌లో బోలెడంత ఇన్వెంటరీ
    విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్‌ లాంచింగ్‌ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్‌లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు రేట్లు పెరగవు.

    ఎందుకంటే ఇప్పటికే మార్కెట్‌లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే.. లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు.

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ 2025-26లో మొత్తం రూ. 28 కోట్ల వేతనం అందుకున్నారని. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికమని కంపెనీ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది.

    అయితే.. టాటా గ్రూప్ అండ్ టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐటీ దిగ్గజం నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోకుండా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి సిట్టింగ్ ఫీజుగా కేవలం రూ. 4.2 లక్షలు మాత్రమే తీసుకున్నారు. ఈ విషయాన్ని కూడా సంస్థ తన వార్షిక నివేదిక తెలిపింది.

    కృతివాసన్ ప్యాకేజీలో ప్రాథమిక వేతనం రూ. 1.67 కోట్లు కాగా.. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు, ప్రయోజనాలు రూ.1.43 కోట్లు. పర్ఫామెన్స్ బేస్డ్ కమీషన్ కింద రూ.25 కోట్లు ఉన్నాయి. సంస్థ వార్షిక నివేదిక ప్రకారం, సీఈఓ వేతనం టీసీఎస్ ఉద్యోగుల మధ్యస్థ పారితోషికం కంటే 332.8 రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల మధ్యస్థ వేతనం 5.1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది.

    భారతదేశంలో జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులకు సగటు వార్షిక జీతాల పెరుగుదల 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపులు లభించాయి. టీసీఎస్ తన మార్చి త్రైమాసిక నికర లాభంలో 12.22 శాతం వృద్ధిని నమోదు చేసి, రూ. 13,718 కోట్లను ఆర్జించింది.

    ఇదీ చదవండి: 600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్!

  • ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగ అభ్యర్థికి వచ్చిన రిజెక్షన్ మెయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.

    సాధారణంగా కంపెనీలు అభ్యర్థిని తిరస్కరించేటప్పుడు.. క్వాలిఫికేషన్, స్కిల్స్ వంటివి చూస్తాయి. తమకు అవసరమైన స్కిల్ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయి. లేకుంటే రిజెక్ట్ చేస్తాయి. కానీ.. అభ్యర్థి పనిచేసిన పాత ఆఫీస్ 600 మీటర్ల దూరంలో ఉండటం వల్ల రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ మెయిల్ ద్వారా వెల్లడించింది.

    కంపెనీకి సంబంధించిన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కారణం చదివిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా కంపెనీలలో గోప్యత అనేది ఉద్యోగి బాధ్యత. కాబట్టి దీనికి కొన్ని సెక్యూరిటీ పాలసీలు ఉంటాయి. కానీ.. కేవలం భౌగోళిక దూరం ఆధారంగా ఉద్యోగిని తిరస్కరించడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయ్యింది.

    సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత, చాలామంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇది పాతకాలపు ఆలోచన అని విమర్శించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా చేరవచ్చు. కాబట్టి, కేవలం ఆఫీసుల మధ్య దూరం ఆధారంగా గోప్యత భంగం కలుగుతుందని భావించడం సరైనది కాదని అన్నారు.

    ఇదీ చదవండి: టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు!

  • అంతర్జాతీయంగా డాలరు బలోపేతం అవుతుండటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దేశీయంగా వెండి, పసిడి ధరలు భారీగా పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కేజీ ధర మూడు రోజుల్లో రూ.30వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి రూ.2.80 లక్షల వద్దకు చేరింది.

    బంగారం ధరలు కూడా వరుస తగ్గుదలను నమోదు చేశాయి. పెరిగిన ఇంధన ధరలు.. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయచ్చని, రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చనే భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు.

  • నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి బుక్ చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ క్యాబ్, రైడ్ సేవలను నిలిపివేయాలని.. యాపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్స్ నుంచి సంబంధిత యాప్స్ తొలగించాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో అక్రమంగా బైక్, ట్యాక్సీ సేవలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

    మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ సైబర్ విభాగానికి రాసిన లేఖలో వెల్లడించారు. ఆ కంపెనీల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    రాపిడోకు అగ్రిగేటర్ లైసెన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో, 2022 చివరిలో బైక్ ట్యాక్సీలతో కొనసాగుతున్న వివాదం ప్రారంభమైంది. రాపిడో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జనవరి 2023 నాటికి అన్ని బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేశారు. చివరికి బైక్ ట్యాక్సీల కోసం ఒక అగ్రిగేటర్ విధానాన్ని రూపొందించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Telangana

  • హైదరాబాద్‌: పేట్‌బషీరాబాద్‌లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్‌.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్‌ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో  బండి భగీరథ్‌ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. 

    పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‌
    ‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా.  ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్‌.

    తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత  ఏ  తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్‌. చట్టం ముందు అంతా సమానమేనని,   ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

    బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేశాం: సీపీ
    బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేశామని  సైబరాబాద్‌ సీపీ రమేష్‌రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్‌ను గాలించే క్రమంలో అరెస్ట్‌ చేశామన్నారు. నార్సింగ్‌లోని పోలీస్‌ అకాడమీ వద్ద భగీరథ్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. అటు తర్వాత పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నామన్నారు సీపీ

    ఇదిలా ఉంచితే, బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్‌ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ కూడా కోర్టు రికార్డ్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు.

    ​కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ​బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్‌మెంట్ ప్రక్రియ.. ​కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.

  • సాక్షి, మేడ్చల్‌: బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్‌ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ కూడా కోర్టు రికార్డ్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు.

    ​కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ​బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్‌మెంట్ ప్రక్రియ.. ​కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.

    మరోవైపు, భగీరథ్‌ కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ముమ్మరంగా గాలించారు. బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు (పోక్సో  చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్‌ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. 

    ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. భగీరథ్‌ కోసం ఐదు బృందాలు.. ఢిల్లీ, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ను జల్లెడపట్టారు. ఇవాళ సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి (శనివారం మే 16) షేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్‌ లొంగిపోయారు.

  • సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్‌ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు

    నిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్‌ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్‌ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.

    సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్‌లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్‌ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్‌ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.


     

  • సాక్షి, మహబూబ్‌నగర్‌: జడ్చర్లలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదని ఓ యవకుడు.. యువతి ప్రాణం తీశాడు. యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని స్థానికులు చితకబాదారు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది.
     

Family

  • పిల్లలూ... నిజంగా ఏలియెన్స్‌ ఉన్నాయా అని సైంటిస్టులు రోజూ టెలిస్కోప్‌లతో ఆకాశాన్ని వెతుకుతున్నారు. 2026లో జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ఓ2–18b  అనే దూరపు గ్రహం గాలిని చూసింది. ఆ గాలిలో డైమిథైల్‌ సల్ఫైడ్‌ అనే వాయువు కనిపించింది. ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే భూమి మీద ఈ వాయువుని సముద్రంలో ఉండే చిన్న చిన్న జీవులు మాత్రమే తయారు చేస్తాయి. చెట్లు గానీ, రాళ్లు గానీ చేయలేవు. అంటే ఆ గ్రహం మీద కూడా సముద్రం ఉండి, అందులో ఏదైనా సూక్ష్మజీవం ఉందేమో అని సైంటిస్టులు అనుమానిస్తున్నారు. ఇది ఏలియెన్‌ అని కచ్చితంగా చెప్పలేం, కానీ ఇప్పటివరకు దొరికిన అతి పెద్ద క్లూ ఇదే.

    ఇంకో వింత విషయం. మన సూర్యుడికి దగ్గర్లోనే, కేవలం 10.7 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి కొత్త గ్రహం ఒకటి బయటపడింది. దాని సైజు భూమి అంతే ఉంటుంది. అది తిరిగేది సూర్యుడు లాంటి నక్షత్రం చుట్టూ! ఆ నక్షత్రం నుంచి కోపంగా మంటలు రావు, సున్నితంగా వెలుగు ఇస్తుంది. అందుకే ఆ గ్రహం మీద వాతావరణం చల్లగానూ ఉండదు, వేడిగానూ ఉండదు. సరిగ్గా నీళ్లు మనగలిగేంత దూరంలో ఉంది. నీళ్లు ఉంటే జీవం ఉండే ఛాన్స్‌ ఉంటుంది కదా. సైంటిస్టులు ఇప్పుడు ఆ గ్రహం మీద గాలి ఉందా, ఆ గాలిలో ఆక్సిజన్‌ ఉందా అని చూస్తున్నారు. ఉంటే మాత్రం ఏలియెన్స్‌కి ఇల్లు దొరికినట్టే.

    ఏలియెన్స్‌ అంటే పచ్చగా ఉండి, పెద్ద తలకాయతో ఉండాలని లేదు. అవి బాక్టీరియా లాగా చిన్నగా కూడా ఉండొచ్చు. చిలీ దేశంలో అటకామా ఎడారి ఉంది. అక్కడ వానే పడదు, భూమి మీద అంగారక గ్రహం లాగా ఉంటుంది. అలాంటి చోట కూడా సైంటిస్టులు 2 మీటర్ల లోతులో రాళ్ల సందుల్లో దాక్కుని బతికే సూక్ష్మ జీవుల్ని 2026లో కనుక్కున్నారు. వెలుతురు లేకపోయినా, నీళ్లు లేకపోయినా అవి బతుకుతున్నాయి.

    చ‌ద‌వండి: పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా..?

    భూమి మీదే ఇలా ఉంటే, మరి అంగారకుడి మీద, లేదా దూరపు గ్రహాల మీద కూడా ఇలాంటి జీవం ఉండొచ్చు కదా. అందుకే సైంటిస్టులు ఇప్పుడు గ్రహాల పైపైన కాకుండా, లోపల తవ్వి చూస్తున్నారు. ఏదో ఒక రోజు నిజమైన ఏలియెన్‌ మనకు దొరుకుతుందేమో.  

National

  • ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలకు భారీ ఊరటనిచ్చింది. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ATF)పై వ్యాట్‌ భారీగా తగ్గించింది. ఎటిఎఫ్‌పై వ్యాట్‌ 25 నుంచి 7 శాతానికి తగ్గిస్తూ.. ఢిల్లీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. విమానాలను నడపడానికి జెట్ ఇంజన్లలో ఈ ఏటీఎఫ్‌ను ఉపయోగిస్తారు.

    ఈ నిర్ణయంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఇంధనాన్ని కొనుగోలు చేసే విమానయాన సంస్థలు.. ఈ వ్యాట్ తగ్గింపు కారణంగా ఇప్పటి నుండి తక్కువ ధరలను చెల్లించే అవకాశముంటుంది. ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఇంధన సరఫరాకు ఏర్పడిన అంతరాయాల వల్ల విమానయాన సంస్థలు ఇప్పటికే భారీ జెట్ ఇంధన ధరలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని నుంచి నడిచే విమానయాన సంస్థలపై ఈ నిర్ణయం పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపనుంది.

    కాగా, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కారణంగా ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఏటీఫ్‌పై విధించే విలువ ఆధారిత పన్నును 18 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం నవంబర్ 14 వరకు అమల్లోకి రానుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంధన వ్యయం విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో అధిక శాతం ఉండటంతో ఈ పన్ను తగ్గింపు.. విమానయాన సంస్థలకు ఉపశమనంగా మారనుంది.

    పెరుగుతున్న జెట్ ఇంధన ధరల వల్ల భారీ నిర్వహణ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలకు ఈ నిర్ణయంతో భారం దిగనుంది. భారతీయ విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చులలో దాదాపు 35–40 శాతం కేవలం ఇంధనానికే ఖర్చవుతుంది. అందువల్ల విమానయాన రంగంలో ఇంధనమే భారీ భారంగా మారింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం విమానయాన సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో విమాన ఛార్జీల పెంపు.. కొన్ని మార్గాల రద్దుకు దారితీయవచ్చనే ఆందోళనలను రేకెత్తించింది.  ఈ నేపథ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించినట్లయింది. 

  • దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ (యూజీ) పరీక్ష అవకతవకల అంశంపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్ష రద్దులు, పునఃపరీక్షల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు పరీక్ష అనంతరం ఎదురైన వివాదాల వల్ల నిరాశ, ఆందోళనకు లోనవుతున్నారని తెలిపారు.

    దేశంలోని అనేక మంది విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి కోసం భారీగా ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరయ్యారని, ఇప్పుడు మళ్లీ అదే పరీక్షా ప్రక్రియను ఎదుర్కోవాల్సి రావడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.

    జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే ముందు పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, భద్రంగా, బాధ్యతాయుతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఏడాది ఏర్పడిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కనీసం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే అయినా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్య ప్రవేశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు.

  • ఢిల్లీ: ‘‘నిరుద్యోగులు బొద్దింకలు’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. శుక్రవారం (మే 15న) జరిగిన విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి బెంచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కేసు విచారణ సమయంలో దేశ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    దీనిపై సీజేఐ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ‘‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింక‌లతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.

    ఓ పనికిమాలిన కేసు విచారణ సమయంలో చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా తప్పుగా చూపించిందని సీజేఐ సూర్యకాంత్ చెప్పారు. “నిన్న కేసు విచారణ సమయంలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా కొంత భాగం తప్పుగా చూపించిన తీరు చూసి బాధపడ్డాను. బార్‌ వంటి వృత్తుల్లోకి నకిలీ, బోగస్ డిగ్రీల సాయంతో వచ్చిన వారినే నేను ప్రత్యేకంగా విమర్శించాను. అలాంటి వారు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవనీయ వృత్తుల్లోకి చొరబడ్డారు. అందుకే వారిని పరాన్నజీవులతో పోల్చాను” అని సూర్యకాంత్   చెప్పారు.

    కాగా, నిరుద్యోగ యువ న్యాయవాదులను బొద్దింకలుగా పేర్కొన్నారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. సీనియర్ హోదా కల్పించే ప్రక్రియపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కాలేదని ఆరోపిస్తూ న్యాయవాది సంజయ్ దూబే ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌పై దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.

    విచారణ సమయంలో సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం దూబేను ప్రశ్నించింది. సీనియర్ న్యాయవాది హోదా ప్రతిష్ఠకు గుర్తా లేదంటే న్యాయ వ్యవస్థలో భాగస్వామ్యం సాధనమా? అని జోయ్‌మాల్యా బాగ్చి ప్రశ్నించారు.

    ఆ సమయంలో “వృత్తిలో.. ఉపాధి దొరకని బొద్దింకల్లాంటి యువకులు ఉన్నారు” అని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. వారు సోషల్ మీడియా, ఆర్‌టీఐ ఉద్యమాల వైపు వెళ్తున్నారని చెప్పారు. నల్ల కోట్లు వేసుకున్న వేలాది మందిపై వారి డిగ్రీల విషయంలో అనుమానాలు ఉన్నాయని అన్నారు.

    దీంతో, తన వ్యాఖ్యల భావాన్ని వక్రీకరించారని శనివారం సూర్యకాంత్ స్పష్టం చేశారు. “దేశ యువతను నేను విమర్శించానని చెప్పడం పూర్తిగా నిరాధారం. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మానవ వనరులపై నాకు గర్వంగా ఉంది. భారత యువత నాకు ఎంతో గౌరవం ఇస్తారు. నేనూ వారిని అభివృద్ధి చెందే భారతానికి స్తంభాలుగా చూస్తాను” అని తెలిపారు.

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్‌–యూజీకి సంబంధించిన నేషనల్‌ టెస్టింట్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వారి పేపర్‌ సెట్టింట్‌ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్‌ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు. 

    బయాలజీ పేపర్‌ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్‌–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్‌టీఏ నియమించింది. పేపర్‌ సెట్టింగ్‌ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్‌–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.  

    ఎవరీ మనీషా? 
    మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ  లెక్చరర్‌. పుణెలోని మోడ్రన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్, కామర్స్‌ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్‌టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది  నీట్‌–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్‌ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు. 

    ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్‌ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్‌చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్‌–యూజీ ఎంట్రన్స్‌ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్‌ సెట్టింగ్‌ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్‌వర్క్‌ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్‌చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది.  

    వేట వేగవంతం 
    ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను సీజ్‌చేసింది. డబ్బులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్‌ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా.. 

    1. మనీషా గురునాథ్‌(బాటనీ లెక్చరర్‌) 
    2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు) 
    3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి) 
    4. ధనంజయ్‌ లోఖండా(అహల్యానగర్‌వాసి) 
    5. శుభం ఖైర్నర్‌( నాసిక్‌ వాసి) 
    6. మంగీ లాల్‌ బివాల్‌( జైపూర్‌వాసి) 
    7. వికాస్‌ బిలాల్‌( జైపూర్‌వాసి) 
    8. దినేశ్‌ బిలాల్‌( జైపూర్‌వాసి) 
    9. యశ్‌ యాదవ్‌(గురుగ్రామ్‌వాసి)  
     

  • ఢిల్లీ: భారత్‌ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్‌లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్‌ మీరు బయిటకి వెళతారా లేక గన్‌ తీయమంటారా అని హెచ్చరించారు.  

    దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ని  ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్‌లో మాట్లాడడంతో లావ్రోవ్‌ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్‌ని వదిలేయండి" అని ఆయనతో అ‍న్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్‌  "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్‌ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.

    దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం  వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు.  ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.

  • చెన్నై: తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్‌ శాఖలు కేటాయించారు. విజయ్‌ దగ్గరే హోంశాఖ, ‍స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగొట్టైయన్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర‍్తన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

    ఎవరెవరికి ఏయే శాఖలు? 

    • శాఖల కేటాయింపు జాబితా ప్రకారం.. విజయ్ వద్ద ప్రజా వ్యవహారాలు, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక పథకాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, శిశు సంక్షేమం, వృద్ధులు-దివ్యాంగుల సంక్షేమం, పురపాలక శాఖ, పట్టణ జల సరఫరా శాఖలు ఉన్నాయి.

    • కేఏ సెంగొట్టైయన్ కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు.

    • అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలూ ఆమెకే అప్పగించారు. కీలక శాఖను మహిళా మంత్రికి ఇవ్వడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    • ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి.

    • ఆధవ్ అర్జున ప్రజా పనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భవనాలు, రహదారులు, చిన్న నౌకాశ్రయాలు సహా ప్రజా పనుల శాఖతో పాటు క్రీడాభివృద్ధి శాఖను ఆయన పర్యవేక్షిస్తారు.

    • డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలు కేటాయించారు.

    • పీ వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారు. వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖలూ ఆయనకే అప్పగించారు.

    • ఆర్ నిర్మల్‌కుమార్ కు ఇంధన వనరులు, న్యాయ శాఖలు దక్కాయి. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, కోర్టులు, జైళ్లు, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ శాఖలు ఆయన పరిధిలో ఉంటాయి.

    • రాజ్‌మోహన్ పాఠశాల విద్య, తమిళాభివృద్ధి, సమాచార-ప్రచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపడతారు. పురావస్తు శాఖ, అధికారిక తమిళ భాష, తమిళ సంస్కృతి, సినీ సాంకేతికత, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ, ప్రభుత్వ ముద్రణ శాఖలూ ఆయన పరిధిలో ఉంటాయి.

    • డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు.

  • ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9,10 తరగతుల భాషా విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఏడాది(2026) జూలై నుంచి త్రిభాషా విధానం అమలు చేయనుంది. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశాన్ని సీబీఎస్‌ఈ కల్పించింది.

    సీబీఎస్‌ఈ అనుబంధ స్కూళ్ల అన్నింటికి సర్క్యూలర్‌ జారీ చేసింది. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 తరగతుల సిలబస్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

    ప్రస్తుత విద్యా సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ 2026లో ప్రారంభమైనప్పటికీ, దీని అమలు కోసం ఒక తాత్కాలిక మార్పు విధానాన్ని అనుసరిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఈ సవరించిన భాషా విధానం ప్రకారం.. విదేశీ భాషను చదవాలనుకునే విద్యార్థులు.. వారు ఎంచుకునే మిగిలిన రెండు భాషలు కచ్చితంగా భారతీయ దేశీయ భాషలైనప్పుడు మాత్రమే దాన్ని ఎంచుకోవడానికి వీలుంటుంది. లేదా విదేశీ భాషలను అదనపు నాలుగో భాషగా కూడా చదువుకోవచ్చని బోర్డు తెలిపింది. 

  • తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న వీడీ సతీశన్‌ శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ను కలిశారు. వేణుగోపాల్ ఇంటి​కి వెళ్లిన సతీశన్‌ కాసేపు మాట్లాడారు.

    ఈ సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. “ఇందులో అసాధారణం ఏమీ లేదు. ఇది సాధారణ సమావేశమే. వీడీ సతీశన్‌ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా దానికి కట్టుబడి ఉండాలి. ఎల్లుండి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    వీడీ సతీశన్ నాయకత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని కేరళ మొత్తం ఆశిస్తోంది. అభివృద్ధి, పాలనలో కేరళలో మార్పు అవసరం. అందుకే కేరళ ప్రజలు, దేశ ప్రజలు కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు.

    మాది ప్రజాస్వామ్య పార్టీ.. బీజేపీ లేదా సీపీఐఎంలా కాదు. కొంత భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఐక్యంగా ఉండాలి. దేశానికే మా తొలి ప్రాధాన్యం. పార్టీకి రెండో ప్రాధాన్యం. దేశ సంక్షేమం కోసమే ముందుకు సాగుతాం” అని అన్నారు.

    కాగా, వీడీ సతీశన్‌ మే 18న కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ‍్యంలో మంత్రివర్గ ఏర్పాట‍్లలో భాగంగా కేసీ వేణుగోపాల్‌ ఇంటికి వీడీ సతీశన్‌ వెళ్లారని కూడా స్థానిక మీడియా పేర్కొంటోంది. కాంటోన్‌మెంట్ హౌస్‌లో లీగ్ నేతలతో కూడా చర్చలు జరిగాయి.

    కాగా, కేరళలో యూడీఎఫ్‌ గెలిచాక కేసీ వేణుగోపాల్‌ సీఎం అవుతారని చాలా మంది భావించారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు. వేణుగోపాల్‌కు హైకమాండ్‌తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రమేశ్‌ రామకృష్ణన్ చెన్నితాల, వీడీ సతీశన్‌ బలమున్న నాయకులు. చెన్నితాల మాజీ ప్రతిపక్ష నేత. వీడీ సతీశన్‌ కేరళలో మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడు. చివరకు ఆయననే సీఎం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసీ వేణుగోపాల్‌ అసంతృప్తితో ఉన్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. 

  • సాక్షి, విశాఖపట్నం: అండమాన్‌ తీరాన్ని రుతు పవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు పయనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మొత్తం నికోబార్ దీవులు, శ్రీవిజయపురం (బ్లెయిర్ పోర్ట్) సహా అండమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.

    రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

    నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందే.. అంటే మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న (శుక్రవారం) తెలిపిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఇది భారతదేశంలో నైరుతి రుతుపవనాల కాలం (జూన్ నుండి సెప్టెంబర్) ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. ఈ సీజన్‌లో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని.. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది.

     

Crime

  • వేరే ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి వస్తే  మళ్లీ పాత ప్రాంతానికి వెళ్లిపోతాం. కానీ ఇక్కడో పెద్ద మనిషి  ఇంటి అద్దె చెల్లించలేక పూర్తిగా నైతికతేనే వదిలేశాడు. తాను ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో భార్యను, కూతుర్ని ఇంటి యజమానికి  శారీరక అవసరం కోసం పంపి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

    వివరాల్లోకి వెళితే..  గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి అక్కడ మోర్బీ ప్రాంతానికి  వచ్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె రూ. 2 వేలు కాగా, దాన్ని చెల్లించడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా నాలుగు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. 

    దీన్ని ఇంటి యజమాని అవకాశంగా తీసుకున్నాడు.  భార్య, కూతుర్ని అప్పచెప్పే ఒప్పందానికి సదరు వ్యక్తి అంగీకరించాడు.  తద్వారా  అతని భార్య, కూతురిపై పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు ఇంటి యజమాని. ఈ విషయం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్న వ్యక్తి అత్తకు తెలియడంతో మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటి యజమానిని,  ఈ దారుణానికి పూర్తి బాధ్యడైన సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దీని తరువాత పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే చట్టం (పోక్సో)తో సహా పలు కఠినమైన కేసులు నమోదు చేశారు.

    మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమాని కలిసి ఈ వేధింపులకు పాల్పడినట్లు మోర్బీ  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జే ఎం లాల్ తెలిపారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు.