Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ఈ సినిమా ప్రచారం మధ్యలో ఆయన చేతికి కట్టుతో కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. దాంతో చాలామంది ఇది సర్జరీ జరిగిన తర్వాతి పరిస్థితి అనుకున్నారు. అయితే ఈ విషయంపై చరణ్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకు ఎలాంటి ఆపరేషన్‌ చేయించుకోలేదని, తాత్కాలికంగా నొప్పి తగ్గించుకునేందుకు మాత్రమే కట్టు కట్టారని తెలిపారు. పెద్ది సినిమా రిలీజ్‌ తర్వాతే సర్జరీ చేయించుకుంటానని చరణ్‌ స్పష్టం చేశారు. కాగా ‘పెద్ది’లో పహిల్వాన్‌ పాత్రలో చరణ్‌ కనిపిస్తునన్నాడు. దానికోసం నిజమైన మల్లయోధులను తెప్పించి పెద్ది’లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్‌ షూటింగ్‌లో ఒక పట్టుపట్టినప్పుడు ఆయన చేతికి చిన్నపాటి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆ నొప్పిని భరిస్తూనే, చరణ్‌ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.  

    ఇక ఈ సినిమా రిలీజ్‌ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవర్సీస్‌కి కంటెంట్‌ను కూడా పంపించేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల పెంపు కోసం ప్రత్యేక జీవో కూడా విడుదలైంది. ప్రీమియర్‌ షోకు రూ.600 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. రిలీజ్‌ రోజు నుంచి 10 రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్సులో రూ.125 పెంపు అనుమతించారు. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. టికెట్‌ రేట్ల పెంపుపై వివాదాలు కొనసాగుతున్న వేళ, ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో వస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. 

  • సినిమా ఇండస్ట్రీలో 'పనిగంటలు' అనేవి గత కొన్నాళ్ల నుంచి హాట్ టాపిక్ అయిపోయాయి. టాలీవుడ్‌లో వర్కింగ్ టైం సెట్ కాకపోవడం వల్లే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. ‍స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ సినిమాలని వదులుకుందనే రూమర్స్ ఉన్నాయి. అయితే దీపికకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చేలా ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'పెద్ది' ప్రమోషన్లలో భాగంగా జాన్వీ ఇలా స్పందించింది.

    (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్)

    'బాలీవుడ్ కంటే టాలీవుడ్ వర్క్ కల్చర్ సూపర్. ఇక్కడ పనిగంటలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో అందరూ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. నా వరకు నేను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పనిచేయలేదు. అదే ముంబైలో అయితే ఒక్కో నిర్మాణ సంస్థ ఒక్కోలా పనిచేస్తుంది. అక్కడ పనిగంటల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమయపాలన సరిగా ఉండదు'

    'రాత్రి షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్‌లో స్పష్టమైన ప్లానింగ్ ఉంటుంది. తెలుగులో నైట్ షిఫ్ట్ ఉంటే కచ్చితంగా రాత్రి 2 గంటలకల్లా ప్యాకప్ చెప్పేస్తారు. దీనివల్ల అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ ముంబైలో పరిస్థితి వేరు. అక్కడ ఏ టైంకి షూటింగ్ పూర్తవుతుందో చెప్పలేం. టాలీవుడ్‌లో రోజుకు 12 గంటల పాటు పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రోజులు 9 గంటల్లోనే ‍అయిపోయింది' అని జాన్వీ కపూర్ చెప్పింది.

    తెలుగులో ఎన్టీఆర్ సరసన 'దేవర' మూవీ చేసిన జాన్వీ కపూర్.. రామ్ చరణ్ సరసన 'పెద్ది' చేసింది. ఇది గనక హిట్ అయితే టాలీవుడ్‌లో ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.

    (ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)

  • ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)

    బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

    అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.

    బిహార్‌కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏ‍ళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్‌లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.

    (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్)

  • హీరోయిన్ శోభిత.. నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మానేస్తుందేమోనని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. కాకపోతే ఈమె నటించిన 'చీకటిలో' మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. వివాహం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)

    శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ హిందీ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలోనూ పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ తీస్తున్న 'వెట్టువం' అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో శోభిత లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఫొటో రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించింది.

    (ఇదీ చదవండి: చైతూతో పెళ్లి తర్వాత పరిస్థితుల గురించి శోభిత కామెంట్స్)

  • హాట్ పోజులతో మృణల్ ఠాకుర్ గ్లామర్

    చీరలో అందంగా హీరోయిన్ రాశీఖన్నా

    ఆదివారం చిల్ అయిపోతున్న భాగ్యశ్రీ

    మే జ్ఞాపకాలు షేర్ చేసిన రుక్మిణి వసంత్

    సొంతూరిలో గుళ్లు తిరిగేస్తున్న సంయుక్త

    బ్లాక్ డ్రస్‌లో మాయ చేసేలా అషురెడ్డి

  • హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల.. అక్కినేని ఇంటి కోడలు అయిపోయింది. అయితే 2024 డిసెంబరులో వివాహం జరిగిన టైంలో వీళ్ల గురించి సోషల్ మీడియాలో చాలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే చైతూ అప్పటికే సమంతని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశాడు. దీంతో చైతూ-శోభిత పెళ్లి హాట్ టాపిక్ అయిపోయింది. ఆ టైంలో వచ్చిన కామెంట్స్, డిస్కషన్ గురించి ఇప్పుడు శోభిత స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం గురించి మాట్లాడింది.

    (ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)

    వ్యక్తిగత జీవితంపై వస్తున్న విపరీతమైన అటెన్షన్ నుంచి ఎలా దూరంగా ఉంటారనే ప్రశ్నకు బదులిచ్చిన శోభిత.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఇలాంటి పరిస్థితులన్నీ నాకు చాలా విషయాలు నేర్పించాయి. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల్లో కొంత ఆసక్తి ఉండటం సహజం. అయితే నేను నాకు నచ్చినట్లు బతుకుతున్నా. నా నుంచి జనాలు ఏం ఆశిస్తున్నారో నాకు తెలీదు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను. నాపై వచ్చే డిఫరెంట్ అభిప్రాయాల మధ్య కూడా స్థిరంగా ఉండగలను'

    'ఇప్పుడు ప్రతి విషయంపై సమాజంలో చాలా చర్చ నడుస్తంది. ఇదంతా వాతావరణం లాంటిది. సమాజంలోనూ వెదర్ ఉంటుంది. దీన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవేవి శాశ్వతం కాదు. వాతావరణం మారినట్లు సమాజంలో మన గురించి చర్చ కూడా మారిపోతుంది' అని శోభిత చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే చైతూతో పెళ్లి టైంలో వచ్చిన ట్రోల్స్ లాంటివి అస్సలు పట్టించుకోలేదనమాట.

    శోభిత ప్రస్తుతం తమిళంలో 'వెట్టువం' అనే సినిమా చేస్తోంది. పా.రంజిత్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో దీన్ని తీస్తున్నారు. నాగచైతన్య విషయానికొస్తే 'వృషకర్మ' చిత్రం చేస్తున్నాడు.

    (ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)

  • కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్‌సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్‌ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది.

    ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచిన జయం రవి(రవి మోహన్) బెంజ్‌ మూవీలో నటించనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మూవీలో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్‌ పౌలీ విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

    మరోవైపు లోకేశ్ కనగరాజ్..  ఐకాన్ స్టార్‌ బన్నీతో సినిమా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీ తర్వాత అల్లు అర్జున్‌- లోకేశ్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. అంతేకాకుండా లోకేశ్ కనగరాజ్  డీసీ అనే సినిమాతో  హీరోగా పరిచయం కాబోతున్నారు. 
     

     

  • సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

    'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్‌ ఫైట్ సీన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

     

  • 'జన నాయగణ్'.. ‍ఐదారు నెలల క్రితమే రావాల్సిన సినిమా కానీ ఇప్పటికీ రిలీజ్ కావట్లేదు. అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి దీని విషయంలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్.. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో మూవీ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అంతా అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలేం జరుగుతుంది అని అంతా మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)

    'జన నాయగణ్' సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌కి మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. సినిమా రిలీజ్ నా చేతుల్లో లేదు. ఈ మూవీకి సంబంధించిన నిజాలు మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా దానిని ప్రసారం చేసే ధైర్యం మీకు లేదు' అని అన్నాడు. ఈ మాటలు విని అంతా షాకవుతున్నారు.

    ఎందుకంటే స్వయంగా డైరెక్టరే.. 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదని మాట్లాడటం కొత్త కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఏంటా నిజాలు? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈనెల 19నే మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ అయితే ఉంది గానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. విజయ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్. 

    (ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)

  • ‘రాను బొంబాయికి రాను’ ఫోక్‌ సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్‌ కంటే ఎక్కువగా రామ్‌ రాథోడ్‌, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్‌ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే  మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.

    దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.

    హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ  ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్  క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు.
     

  • సక్సెస్ ఉన్నడినే అందరూ గుర్తుపెట్టుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉంటేనే మార్కెట్ బాగుంటుంది. సినిమాలకు కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అలా చాలా ఏళ్ల తర్వాత 'కరుప్పు' మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో హీరో సూర్య ఆనందం పట్టలేకపోతున్నాడు. చిత్ర యూనిట్‌కి కార్లని బహుమతిగా ఇస్తున్నాడు.

    (ఇదీ చదవండి: అప్పుడు ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలనుకున్నా : శివరాజ్‌కుమార్‌)

    సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'కరుప్పు'. తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో రిలీజ్ చేశారు. మన దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది గానీ పర్లేదనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.

    ఇకపోతే ఈ సినిమాలో తనని అద్భుతంగా చూపించినందుగానూ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణుకి మహీంద్ర బీ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని సూర్య బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని విష్ణు తన ఇన్ స్టాలో వెల్లడించాడు. ఈ కారు ఖరీదు రూ.30-40 లక్షల ఉంటుంది. ఇతడితో పాటు సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కి కూడా ఇదే మోడల్ కారు ఇచ్చాడు. ఆ విషయాన్ని సాయి తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. చూస్తుంటే సూర్య.. టీమ్ అందరికీ ఒకేలాంటి కార్లు గిఫ్ట్స్ ఇస్తున్నట్లున్నాడు.

    (ఇదీ చదవండి: 'నీకు నేను చాలా కృతజ్ఞుడిని'.. శోభితకు చైతూ స్పెషల్ విషెస్)

  • దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి దుస్థితిని చూసి అందరూ షాకయ్యారు. ముళ్లకంపలతో నిండి ఉన్న ఆ సమాధి వద్ద శుభ్రం చేసేందుకు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముందుకొచ్చారు. ఓ యాంకర్ పోస్ట్ చేసిన వీడియో చూసిన వెంటనే తన టీమ్‌తో కలిసి చెవేళ్లకు చేరుకుని క్లీనింగ్ చేపట్టారు. అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ ప్రముఖులు సైతం దాసరిని గుర్తు చేసుకున్నారు. 

    మే 30న దాసరి వర్ధంతి కావడంతో నటి హేమ సైతం నివాళులర్పించారు. ఆ వీడియో చూసి నాకు చాలా బాధ కలిగిందన్నారు. ఈ రోజు గురువుగారి వర్ధంతి అని నా మైండ్‌లో కూడా లేదని తెలిపింది. కానీ ఆ వీడియో చూసి మరో నలుగురిని పోగేసుకుని ఇక్కడికి వచ్చానని తెలిపారు. మా గురువు గారు మా చేతనే ఆయన సమాధిని శుభ్రం చేయించుకున్నారు.

    మా గురువు గారే బతికి ఉంటే నా లైఫ్‌ మరోలా ఉండేదని హేమ ఎమోషనలయ్యారు. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు నా మీద ఉంటాయని హేమ ఆనందం వ్యక్తం చేశారు. గురువు గారే నన్ను మర్చిపోయారా అని.. మమ్మల్ని పిలిపించుకున్నట్లు అనిపించిందని తెలిపారు. ఈ రోజు నుంచే నేను సినిమాల్లో బిజీగా ఉండాలని.. గొప్ప రాజకీయ నాయకురాలిని అవ్వాలని నన్ను ఆశీర్వదించాలని దాసరిని కోరుకున్నారు. 
     

  • మరో నాలుగు రోజుల్లో పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం చెబుతున్న విషయాలతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. చరణ్‌కు అవార్డుకు రావడం పక్కా అంటున్నారు. అలాగే క్లైమాక్స్‌ కన్నీళ్లును పెట్టిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ కూడా ‘పెద్ది’ తనకు చాలా స్పెషల్‌ చిత్రం అంటున్నాడు. కథ వినగానే నటించేందుకు ఓకే చెప్పేశాడట. కానీ మధ్యలో మళ్లీ ఈ సినిమా వదిలేద్దాం అనుకున్నాడట ఈ స్టార్‌ హీరో. తనకు బదులుగా వేరే వ్యక్తిని తీసుకోమని చెబితే.. బుచ్చిబాబు వినలేదని.. తాను వచ్చేవరకు షూటింగ్‌ చేయకుండా ఆపేశాడని చెప్పాడు శివరాజ్‌ కుమార్‌.

    నటించలేనని చెప్పా.. 
    శివరాజ్‌ కుమార్‌ 2024లో క్యాన్స్‌ర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. చికిత్స కోసం కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్లి వచ్చాడు. అయితే క్యాన్సర్‌ బారిన పడేకంటే ముందే శివరాజ్‌ కుమార్‌ పెద్ది సినిమా ఒప్పుకున్నాడట. తనకు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. కానీ బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదని..తాను వచ్చేవరకు ఎదురు చూశారని శివరాజ్‌ కుమార్‌ చెప్పాడు. తాజాగా చెన్నైలో నిర్వహించి పెద్ది ఈవెంట్‌లో శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘, బుచ్చి బాబు నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. ఆ రోజు నేను రామ్ చరణ్‌తో కూడా మాట్లాడాను. ఆ తర్వాత, దురదృష్టవశాత్తు, నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయింది, నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా.

    నా కోసం ఎదురు చూశారు..
    నా నిర్ణయాన్ని చిత్రబృందానికి తెలియజేశా.  గౌర్‌నాయుడు(పెద్దిలో శివరాజ్‌కుమార్‌ పోషించిన పాత్ర) పాత్రకి వేరే నటుడిని తీసుకోమని వారికి చెప్పా. కానీ నిర్మాతలు, దర్శకుడు నన్ను వెళ్లనివ్వలేదు. బుచ్చిబాబు వచ్చి ‘మాకు మీరే కావాలి సార్‌’ అన్నాడు. నా కోసం చాలా కాలం ఎదురు చూశారు.  వారికి కృతజ్ఞతలు. పెద్ది నాకు స్పెషల్‌ మూవీ’ అని శివరాజ్‌ కుమార్‌ అన్నాడు. 

  • మెగా హీరో రామ్ చరణ్‌పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్‌కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్‌లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

    ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్‌ సైతం ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. 
     

  • ‘సంపంగి, 6 టీన్స్‌’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్‌ అందించిన ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రిస్క్‌’. సందీప్‌ అశ్వ, సన్యా ఠాకూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించి, సంగీతం అందించడంతో పాటు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ రెండో వారంలో విడుదల కానుంది. 

    ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది’’ అన్నారు. ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్‌గానూ మా మూవీ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది’’ అని చెప్పారు. ‘‘మ్యూజిక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ ఇక్కడివరకు వచ్చాను. ‘రిస్క్‌’ తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని సందీప్‌ అశ్వ పేర్కొన్నారు.   

Sports

  • ఐపీఎల్ 2026 చాంపియ‌న్‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. చేజింగ్ మాస్ట‌ర్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖ‌రి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

    విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 ప‌రుగులు) ఆర్సీబీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ర‌బాడ, అర్షద్‌ ఖాన్‌ తలా వికెట్ తీశారు. 

    అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50 నాటౌట్‌), నిషాంత్ సిందూ (20 ప‌రుగులు) ఆడుతున్నారు. ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.

    కోహ్లీ కమాల్‌..
    156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్‌, కోహ్లీలు కలిసి తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్‌, పాటీదార్‌లు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.

    ఆర్సీబీ అరుదైన ఫీట్‌
    ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జ‌ట్టుగా ఆర్సీబీ రికార్డుల‌కెక్కింది. గ‌తంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్‌ను  సాధించాయి.

  • రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్‌ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్‌.. యావత్తు క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌-2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్‌ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్‌లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

    దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్‌ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్‌-2026 సీజన్‌లో గిల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. తాజా సీజన్‌తో గిల్‌ ఆల్‌టైమ్‌ రికార్డును వైభవ్‌ బ్రేక్‌ చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా నిలిచినందుకు వైభవ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.

    ఛాంపియన్స్‌గా ఆర్సీబీ
    ఇక ఐపీఎల్‌-2026 సీజన్‌ ఛాంపియన్స్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 

    156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్‌ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 

    అతడితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది

  • ఐపీఎల్‌-2026లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్‌ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్‌ దాటింది. 

    దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్‌-2023 సీజన్‌ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్‌కే రికార్డును ఆర్సీబీ బ్రేక్‌ చేసింది. 

    విజేతగా ఆర్సీబీ
    ఇక ఈ ఏడాది సీజన్‌ ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్‌ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్‌ కోహ్లి కేవలం  42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ 32 పరుగులతో రాణించాడు.
    చదవండి: వైభవ్‌కు నో ఛాన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే?

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ​ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్‌లాడిన భువనేశ్వ‌ర్ 28 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌ద్వారా ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన రెండో భార‌త బౌల‌ర్‌గా భువ‌నేశ్వ‌ర్ ష‌మీతో క‌లిసి రికార్డుల‌కెక్కాడు. 

    కాగా ఈ జాబితాలో ఆర్సీబీ త‌ర‌ఫున‌ హ‌ర్ష‌ల్‌ప‌టేల్ (32 వికెట్లు, 2021 సీజన్‌), గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌ఫున‌ మ‌హ్మ‌ద్ ష‌మీ (28 వికెట్లు, 2023 సీజ‌న్‌) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున‌ జ‌స్‌ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజ‌న్‌), రాజ‌స్తాన్ త‌ర‌ఫున చాహ‌ల్ (27 వికెట్లు, 2022), గుజ‌రాత్ త‌ర‌ఫున మోహిత్ శ‌ర్మ (27 వికెట్లు, 2022) భువ‌నేశ్వ‌ర్ త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. 

    ఇక ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే ప‌ర్పుల్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో ఉన్న భువ‌నేశ్వ‌ర్ మ‌రో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజ‌న్‌లో తొలి ప‌వ‌ర్ ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో భువ‌నేశ్వ‌ర్ (17 వికెట్లు) ష‌మీతో క‌లిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ క‌గిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.

    చదవండి: 'కోహ్లీ కాస్త త‌గ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్లో ఇప్ప‌టికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ సాధార‌ణ స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అయితే గుజ‌రాత్ వికెట్లు ప‌డిన ప్ర‌తీసారి కోహ్లీ హైప‌ర్ యాక్టివ్‌గా క‌నిపించాడు. 

    ముఖ్యంగా గుజ‌రాత్ ఓపెన‌ర్లు సాయి సుద‌ర్శ‌న్‌, శుబ్‌మ‌న్ గిల్ వికెట్లు ప‌డ్డ‌ప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్ష‌న్ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ ఔటైన వెంట‌నే పిచ్‌పైకి ప‌రిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్‌వైపు చూస్తూ గ‌ట్టిగా అరుస్తూ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం క‌నిపించింది. అంత‌టితో ఆగ‌కుండా సాయి సుద‌ర్శ‌న్ ఔట్ కావ‌డానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. 

    హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్లు ప్ర‌తీ బంతికి ముందు కోహ్లీ సాయి సుద‌ర్శ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అన‌డం స్టంప్ మైక్‌లో రికార్డ‌యింది. అదే ఓవ‌ర్ నాలుగో బంతికి సాయి సుద‌ర్శ‌న్ భారీ షాట్‌కు య‌త్నించి జితేశ్ శ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చ‌ర్య‌ల‌పై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కోహ్లీ కాస్త త‌గ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.

    మ‌రో విష‌య‌మేంటంటే.. గ‌త రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుద‌ర్శ‌న్ ఈ మ్యాచ్‌లోనూ అలా ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవ‌ర్ రెండో బంతిని ఆడే క్ర‌మంలో బ్యాట్ అత‌ని చేతి నుంచి జారిపోయేలా క‌నిపించిన‌ప్ప‌టికీ ఈసారి మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. 

    ఇక మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాష్టింగ్ట‌న్ సుంద‌ర్ (50) అర్థ‌సెంచ‌రీతో గుజ‌రాత్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. ర‌సిక్ స‌లామ్ మూడు వికెట్లు తీయ‌గా, హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

    చదవండి: అయ్యో గుజ‌రాత్‌.. సీన్ రివ‌ర్స్ అయ్యేలా ఉందే!

  • రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్‌ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్‌ జాబితాలో వైభవ్‌ చోటు దక్కించుకున్నాడు.

    అంతకంటే ముందు ఐర్లాండ్‌ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టుకు వైభవ్‌ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2028లో భారత జట్టుకు వైభవ్‌ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్‌.. అభిషేక్‌ శర్మ లేదా సంజూ శాంసన్‌లతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.

    కానీ భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్‌ కోసం కొత్త భారత ఓపెనింగ్‌ జోడీని ఎంచుకున్నాడు. శుబ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌లు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని అతడు సూచించాడు. 

    "ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్‌-శుభ్‌మన్‌ గిల్‌)ని ఇప్పుడు మనం ఐపీఎల్‌లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా పిచ్‌లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్‌ను కలిగి ఉన్నాయి. 

    అలాంటి పిచ్‌లపై కూడా గిల్‌-సుదర్శన్‌ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్‌ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్‌-సుదర్శన్‌లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. 

    విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం భారత టీ20 సెటాప్‌లోనే లేడు. 

    అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్‌ ఆడాడు. వరుస మ్యాచ్‌లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్‌-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్‌ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.
    చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్‌మన్‌ గిల్‌

     

  • ఐపీఎల్‌-2026లో అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ఓపెనర్లు శబ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌ తీవ్ర నిరాశపరిచారు.  క్వాలిఫయర్‌-2లో మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

    గుజరాత్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ వేసిన జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్‌ షార్ట్-ఆర్మ్ జాబ్‌ ఫుల్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని మిడ్‌-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌​ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.

    దీంతో గిల్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్‌ కుమార్‌ ఓవర్‌లో సాయిసుదర్శన్‌(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో గుజరాత్‌ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్‌ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్‌(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.
    చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ క‌ష్టాల్లో ప‌డింది. అయితే హోంగ్రౌండ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్ప‌టినుంచి గుజ‌రాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. 

    ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ గుజ‌రాత్ విజ‌యాల‌ను సాధించింది. ఇందులో ముంబై ఇండియ‌న్స్‌పై 36 ప‌రుగుల‌తో, రాజ‌స్తాన్‌పై 58 ప‌రుగులతో, ఎస్ఆర్‌హెచ్‌పై 38 ప‌రుగుల‌తో, ఎస్ఆర్‌హెచ్‌పై 82 ప‌రుగులతో, సీఎస్కేపై 89 ప‌రుగుల‌తో విజ‌యాల‌ను అందుకుంది. అయితే ఈసారి జ‌రుగుతున్న ఫైన‌ల్లో మాత్రం గుజ‌రాత్ టైటాన్స్‌కు సీన్ రివ‌ర్స్ అయ్యేలా క‌నిపిస్తుంది. 

    పైగా టాస్ స‌మ‌యంలో గిల్ చేసిన వ్యాఖ్య‌లు కూడా ఆస‌క్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ప‌టీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్‌పై చేజింగ్ చేసిన జ‌ట్టే ఎక్కువ విజ‌యాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడిన‌ని చెప్పుకొచ్చాడు. 

    అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ గుజ‌రాత్ ఆర్సీబీ బౌల‌ర్ల‌ను ఎదుర్కోలేక‌పోతుంది. 8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి గుజ‌రాత్ టైటాన్స్ 2 వికెట్ల న‌ష్టానికి 55 ప‌రుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బ‌ట్ల‌ర్ (10) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    చదవండి: చ‌రిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్ జోడీ

  • భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్‌ డ‌బుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చ‌రిత్ర సృష్టించారు. సింగ‌పూర్ ఓపెన్‌లో ఈ జోడీ చాంపియ‌న్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఫ‌జ‌ర్ అల్ఫియ‌న్‌-ముహమ్మ‌ద్ ఫిక్రీ జంట‌పై అద్భుత విజ‌యాన్ని అందుకుంది. 

    ఈ నేప‌థ్యంలో సింగ‌పూర్ ఓపెన్ సాధించిన తొలి భార‌త డ‌బుల్స్ జోడీగా సాత్విక్‌-చిరాగ్ రికార్డులెక్కారు. మ్యాచ్‌ తొలి గేమను 18-21 తేడాతో కోల్పోయినప్ప‌టికీ, రెండో గేమ్‌లో ఫుంజుకొని సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్‌ను  సొంతం చేసుకుంది. 

    ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

    తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది. విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.

    ‘గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వారు తెలిపారు.

    చదవండి: స్వియాటెక్‌కు షాక్‌.. వరుసగా 16వ విజయం

  • ఫ్రెంచ్ ఓపెన్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. నాలుగుసార్లు చాంపియ‌న్‌, మాజీ నంబ‌ర్‌వ‌న్ ఇగా స్వియాటెక్ ప్రిక్వార్ట‌ర్స్‌లో ఇంటిబాట ప‌ట్టింది. ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన‌ 15వ ర్యాంక‌ర్ మార్తా కొస్త్యుక్ చేతిలో 7-5, 6-1తో స్వియాటెక్ ఓట‌మి పాలైంది. 

    గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో కొస్త్యుక్ 5 ఏస్‌లు సంధించ‌గా.. స్వియాటెక్ సున్నా ఏస్‌ల‌కు ప‌రిమిత‌మైంది. కొస్త్యుక్ 25 విన్న‌ర్లు సంధించ‌గా, స్వియాటెక్ కేవ‌లం 13 విన్న‌ర్ల‌కే ప‌రిమిత‌మైంది. గ‌తంలో త‌ల‌ప‌డిన మూడుసార్లు ఓట‌మి పాలైన కొస్త్యుక్ ఈసారి మాత్రం స్వియాటెక్‌పై పైచేయి సాధించింది. స్వియాటెక్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో కొస్త్యుక్ గ్రౌండ్ న‌లుమూలలా షాట్లు ఆడింది. 

    ముఖ్యంగా మ్యాచ్‌లో కొస్త్యుక్‌ గ్రౌండ్ స్ట్రోక్ విన్నర్స్‌తో అల‌రించింది. అయితే క్లే కోర్టుపై కొస్త్యుక్ త‌న రికార్డును మ‌రింత మెరుగుపరుచుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు క్లే కోర్టులో కొస్త్యుక్ వ‌రుస‌గా 16వ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. కాగా ప్రెంచ్ ఓపెన్‌కు ముందు ఫ్రాన్స్‌లో క్లే కోర్టులో టైటిల్ నెగ్గిన కొస్త్యుక్ ఆ త‌ర్వాత మాడ్రిడ్ టోర్నీ కూడా గెలుచుకుంది. 

    మరోవైపు 2024 ఫ్రెంచ్ ఓపెన్ త‌ర్వాత స్వియాటెక్ క్లే కోర్టులో మ‌రో టైటిల్ గెల‌వ‌లేదు. జూన్ 2న జ‌ర‌గ‌నున్న క్వార్ట‌ర్ ఫైన‌ల్లో కొస్త్యుక్ ఏడో ర్యాంక‌ర్ ఎలీనా స్వితోలినాను ఎదుర్కోనుంది.

    చదవండి: పాక్ మాజీ కెప్టెన్‌కు అవమానం..

  • IPL 2026 RCB vs GT Live Updates:  ఐపీఎల్‌-2026 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిది కీలక పాత్ర. 

    156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో  75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

    విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ
    విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 116/4

    ఊహించ‌ని ట్విస్ట్‌.. నాలుగో వికెట్ డౌన్‌
    గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న ఐపీఎల్‌ ఫైన‌ల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెన‌క్కి పంపిన ర‌షీద్‌.. ఆ త‌ర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరక‌బుచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు చేసింది.

    8 ఓవర్లలో ఆర్సీబీ 88-2
    8 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.

    ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్‌దత్త్‌ పడిక్కల్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దుమ్ములేపుతున్న విరాట్‌ కోహ్లి
    158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్‌ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్‌ అయ్యర్‌(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్‌ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ దాటింది.

    దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌
    2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుం‍డా 23 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌(22) దూకుడుగా ఆడుతున్నాడు.

    ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?
    అహ్మదాబాద్‌ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీతో గుజరాత్‌ను ఆదుకున్నాడు. 

    కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(12), సాయిసుదర్శన్‌(12), జోస్‌ బట్లర్(19) వంటి స్టార్‌ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

    ఏడో వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 143/7

    ఆరో వికెట్ కోల్పోయిన గుజ‌రాత్‌
    ఆర్సీబీతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 115 ప‌రుగుల‌వ వ‌ద్ద‌ ఆరో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన రాహుల్ తెవాటియా ర‌సిక్ స‌లామ్ బౌలింగ్‌లో పాటీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

    ఐదో వికెట్‌ డౌన్‌
    అర్షద్‌ ఖాన్‌(15) రూపంలో గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అర్షద్‌ ఔటయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న అర్షద్‌ ఖాన్‌
    జోష్‌ బట్లర్‌ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్‌ ఖాన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 100/4

    గుజరాత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్‌ బట్లర్‌(19) రూపంలో గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 73/4

    గుజరాత్‌ మూడో వికెట్‌ డౌన్‌
    నిషాంత్‌ సింధు రూపంలో గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌(2), జోస్‌ బట్లర్‌(2) ఉన్నారు.

    గుజరాత్‌కు భారీ షాక్‌
    గుజరాత్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌(12) రూపంలో గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సుదర్శన్‌ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 30/2

    గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌.. రజత్‌ పాటిదార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    2 ఓవర్లకు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 18/0
    2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(6), సాయిసుదర్శన్‌(9) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ  హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్‌ సాయికిషోర్‌ స్ధానంలో పేసర్‌ అర్షద్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జట్లు
    గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్

  • శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌, అస్సాం స్టార్‌ ప్లేయర్‌ రియాన్ పరాగ్‌ గాయం కారణంగా లంక టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. 

    తిలక్‌ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్‌ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్‌కే కెప్టెన్‌ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. ఐపీఎల్‌-2026లో రుతురాజ్‌ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు.    అయితే రుతు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్‌ మంచి అవకాశం.

    ఇక పరాగ్‌ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలోనే  హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. 

    కానీ రాజస్తాన్‌ ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. 

    అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్‌లో గైక్వాడ్‌ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.  కాగా లంక టూర్‌లో భాగంగా భారత్‌-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్‌-ఎ టీమ్స్‌తో ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడనుంది.

    శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:
    తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.
     

  • ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శ‌నివారం రావ‌ల్పిండి వేదిక‌గా తొలి వ‌న్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి 1000వ వ‌న్డేను మ‌ధురానుభూతిగా మ‌ల్చుకుంది. మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో మెరిసిన బాబ‌ర్ ఆజంకు అవ‌మానం జ‌రిగింది. 

    పాక్ వెయ్యి వ‌న్డేలు పూర్తి చేసుకున్న క్ర‌మంలో ఆ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ యూస‌ఫ్ జ‌ట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాట‌ర్‌, బౌల‌ర్‌, ఆల్‌రౌండ‌ర్‌, వికెట్ కీప‌ర్‌) సంబంధించి అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబ‌ర్ ఆజంకు చోటు ద‌క్క‌లేదు. 1992 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన పాక్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన ఇమ్రాన్‌ఖాన్‌ను కెప్టెన్‌, ఆల్‌రౌండ‌ర్ స్లాట్‌కు ఎంపిక చేశాడు. 

    ఇక బ్యాట‌ర్‌గా బాబ‌ర్ ఆజం కాకుండా స‌యీద్ అన్వ‌ర్‌ను ఎంపిక చేశాడు. వికెట్ కీప‌ర్‌గా ర‌షీద్ ల‌తీఫ్‌ను, ఫాస్ట్ బౌల‌ర్ కోటాలో వ‌సీమ్ అక్ర‌మ్‌ను, స్పిన్న‌ర్ కోటాలో స‌క్లెయిన్ ముస్తాక్‌ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవ‌ర్ల‌లో 200 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మాట్ రెన్‌షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. 

    అరాఫ‌త్ మిన్హాస్ 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అబ్రార్ అహ్మ‌ద్ 2 వికెట్లు తీశాడు. అనంత‌రం పాకిస్తాన్ 42.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 202 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. బాబ‌ర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచ‌రీల‌తో జ‌ట్టును గెలిపించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయ‌గా, మాథ్యూ కునెమ‌న్‌, త‌న్వీర్ సంగా, మార్న‌స్ ల‌బుషేన్ త‌లా ఒక వికెట్ తీశారు.

    చదవండి: ఐపీఎల్ ఫైన‌ల్లో వైభ‌వ్ సూర్య‌వంశీ!

  • వన్డే వరల్డ్‌కప్‌-2027లో టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్‌-2026లో రోహిత్‌ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

    ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్‌నెస్‌తో మాత్రం హిట్‌మ్యాన్‌ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేసినప్పటికి, అతడు ఆడేది అనుమానమే. సిరీస్‌ ప్రారంభ సమయానికి  పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే రోహిత్‌ శర్మను జట్టులో కొనసాగించే అవకాశముంది.

    కాగా వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నీ భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు, యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా గంభీర్‌ భావిస్తున్నట్లు 'క్రిక్‌బ్లాగర్' వెబ్‌సైట్ పేర్కొంది.

    వాస్తవానికి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కే రోహిత్‌ స్థానంలో జైశ్వాల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భావించందంట. కానీ రోహిత్‌ శర్మ బోర్డు అధికారులతో ఫోన్‌ చేసి మాట్లడడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని 'క్రిక్‌బ్లాగర్' వెల్లడించింది.

    జైస్వాల్ ఎంపికపై సస్పెన్స్
    కాగా జైశ్వాల్‌ గతేడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రెగ్యూలర్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా దూరం కావడంతో జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను జైశూ ప్రారంభించాడు.

    తొలి రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన యశస్వి.. వైజాగ్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్కొట్టాడు. దీంతో జైశ్వాల్‌ను అఫ్గాన్‌తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. 

    ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు మాత్రమే కాకుండా, శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన 'ఇండియా-ఎ' జట్టులోనూ జైస్వాల్‌కు చోటు దక్కలేదు. రోహిత్‌ ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని జైశ్వాల్‌ను  'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అఫ్గాన్‌తో వన్డేలకు రోహిత్‌ దూరమైతే ఆ స్ధానాన్ని జైశ్వాల్‌ భర్తీ చేయనున్నాడు.

    ఆఫ్గాన్‌ వన్డే  సిరీస్‌కు భారత జట్టు
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ (ఫిట్‌నెస్‌కు లోబడి), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌), హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్‌కు లోబడి), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.

  • ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ రూపంలో ఐసీసీ టైటిల్‌ గెలిచిన భారత్‌.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.

    ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్‌ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.

    ఓపెనర్ల విభాగంలో పోటీ
    ఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌ల నుంచి వైభవ్‌ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్‌ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.

    ఐపీఎల్‌-2026లో వైభవ్‌ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్‌ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌, టీ20 ప్రపంచకప్‌ విజేత అభిషేక్‌ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్‌ వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున 477 పరుగులు సాధించాడు.

    ఇషాన్‌కు చోటు లేదు!
    ఇక ఇషాన్‌ కూడా సన్‌రైజర్స్‌ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్‌, ఇషాన్‌ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్‌ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరే
    ఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌ బ్యాటర్ల విభాగంలో సెట్‌ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శివం దూబే, హర్ష్‌ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.

    బౌలర్ల విషయానికొస్తే.. పేస్‌ దళంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, యశ్‌ ఠాకూర్‌.. స్పిన్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.

    పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లు
    కాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్‌ పురుషుల, మహిళల క్రికెట్‌ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.

    అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
    అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజూ శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌, తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్‌, హర్ష్‌ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయి, ప్రసిద్‌ కృష్ణ, యశ్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి.

    ప్రాబబుల్స్‌ జాబితా
    యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్, సంజూ శాంసన్‌, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌, తిలక్ వర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్ యాదవ్‌, నితీశ్ కుమార్‌‌ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్‌, ఆయుశ్‌ బదోని, హర్ష్‌ దూబే, ధ్రువ్‌ జురేల్, ఖలీల్ అహ్మద్‌, రుతురాజ్ గైక్వాడ్‌, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్‌ దూబే, విప్రాజ్ నిగమ్‌, హర్షిత్ రాణా, యశ్‌ ఠాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌. 

    చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్‌ ఖతం’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచిన పేరు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, ప‌డుకున్నా.. ఇలా అత‌డు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన‌ప్ప‌టికీ క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాల‌యిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సీజ‌న్‌ను మూడో స్థానంతో ముగించింది. 

    జ‌ట్టు ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ వైభ‌వ్ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట‌ను మ‌రొక్క‌సారి చూస్తే బాగుంటుంద‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ సూర్య‌వంశీ అభిమానుల‌కు ఒక శుభ‌వార్త‌. అత‌డి ఆట‌ను చూడ‌లేక‌పోవ‌చ్చు కానీ అత‌డిని స్టేడియంలో మ‌రోసారి చూసే అవ‌కాశం మాత్రం ద‌క్క‌నుంది. 

    అహ్మ‌దాబాద్ వేదిక‌గా నేడు ఆర్సీబీ, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య‌ జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ హాజ‌రుకానున్నాడు. అహ్మ‌దాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌బ్‌భాయ్ ప‌టేల్ అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులో వైభ‌వ్ త‌ళుక్కుమ‌న్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఫైన‌ల్ మ్యాచ్ చూసేందుకు వైభ‌వ్ త‌న కుటుంబంతో క‌లిసి అహ్మ‌దాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 

    అంతేకాదు ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీని ప్ర‌త్యేకంగా స‌న్మానించే అవ‌కాశం కూడా ఉంది. ఈ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఒక‌వేళ ఇవాల్టి ఫైన‌ల్లో గిల్‌, సాయి సుద‌ర్శ‌న్ త‌క్కువ స్కోర్ల‌కు వెనుదిరిగితే మాత్రం వైభ‌వ్ సూర్య‌వంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. 

    ఈ సీజ‌న్ ఆరంభం నుంచి స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తూ వ‌చ్చిన వైభ‌వ్ ఒక సెంచ‌రీ స‌హా ఐదు అర్థ‌సెంచ‌రీలు సాధించాడు. సీజ‌న్‌లో 72 సిక్స‌ర్ల‌తో ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్సర్లు బాదిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక‌  గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 ప‌రుగులు చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స‌ర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. 

    ఇక ఎలిమినేట‌ర్ పోరులోనూ ఎస్ఆర్‌హెచ్‌పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభ‌వ్ 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో సెంచ‌రీ చేజార్చుకున్న‌ప్ప‌టికీ అత‌డి ఆట‌తో అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.

    చదవండి: IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

  • ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. 

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. పాక్‌ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్‌ ఇంగ్లిష్‌, గ్రీన్‌, లబుషేన్‌ వంటి కీలక వికెట్లను అరాఫత్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

    తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్‌ బౌలర్‌గా మిన్హాస్‌ నిలిచాడు. ఇక ఆసీస్‌ బ్యాటర్లలో మాట్ రెన్‌షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో మిన్హాస్‌తో పాటు అబ్రార్‌ రెండు, రౌఫ్‌, అఫ్రిది, అఘా తలా వికెట్‌ సాధించారు.

    బాబర్‌, ఘోరి హాఫ్‌ సెంచరీలు
    అనంతరం  పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్‌ బ్యాటర్‌  బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్‌కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్‌(18), సమద్‌(1) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

    ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఈల్లీస్‌ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్‌ సంగా, లబుషేన్‌ తలా వికెట్‌ సాధించారు.  ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్‌ 2న లహోర్‌ వేదికగా జరగనుంది.
    చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్‌
     

  • టీమిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా అజిత్‌ అగార్కర్‌ వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విషయంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుందనేది బహిరంగ రహస్యమే.

    ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ను గెలిపించిన తర్వాత.. మరుసటి సిరీస్‌ నుంచే రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక సంజూ శాంసన్‌ను కాదని.. టెస్టు, వన్డే జట్ల సారథి శుబ్‌మన్‌ గిల్‌ను టీ20 ఓపెనర్‌గా దించి నాయకత్వ బృందం భారీ మూల్యమే చెల్లించింది.

    గిల్‌పై వేటు వేసి.. 
    అయితే, పొరపాటును గ్రహించిన అగార్కర్‌ బృందం.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. గిల్‌పై వేటు వేసి.. ఇషాన్‌ కిషన్‌ను ప్రపంచకప్‌ జట్టులో కొనసాగించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్‌ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

    ఈ టోర్నీలో నాకౌట్‌ మ్యాచ్‌లలో గొప్పగా రాణించిన ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (97*, 89, 89) ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఏదేమైనా.. ఏ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించినా అగార్కర్‌పై విమర్శలు రావడం సహజమే. ఈ విషయం గురించి అతడు తాజాగా స్పందించాడు.

    ముంబైలో శనివారం జరిగిన క్రిక్‌ఇన్ఫో అవార్డు ప్రదానోత్సవానికి అగార్కర్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రజెంటర్‌ డానిష్‌ సైట్‌ (ఆర్సీబీ మిస్టర్‌ నాగ్స్‌గా పాపులర్‌) అతడిని తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.

    ప్రజెంటర్‌: ‘అబ్బ.. ఎంత గొప్ప జట్టును ఎంపిక చేశానో’ అని మీరు మురిపిసోయిన సందర్భాలు ఉన్నాయా?
    అగార్కర్‌ (నవ్వుతూ): నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు!.. ఏదేమైనా జట్టు గెలిచిన సందర్భంలో.. ఆ క్షణంలో నాకు గర్వంగానే ఉంటుంది. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మంచి జట్టును ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉంటుంది.

    ప్రజెంటర్‌: మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. క్రికెట్‌ అభిమానుల దృష్టి మీపైనే ఉంటుంది. మరి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వలేనప్పుడు.. ‘సారీ మ్యాన్‌.. ఈసారి కాదు గానీ.. మళ్లీ వచ్చే సిరీస్‌కు చూద్దాంలే’ అని మీరు అతడికి చెప్పగలరా? ఇందుకు మీరు ఎలాంటి మార్గం ఎంచుకుంటారు?
    అగార్కర్‌ (గట్టిగా నవ్వేస్తూ): ఇప్పటికీ నో చెప్పేందుకు నాకు సరైన దారి దొరకలేదు. ఇది రోజూవారీ ప్రక్రియ. ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సి ఉంటుంది.

    ప్రజెంటర్‌: మరి అందులో మీరు వినూత్నంగా కనుక్కున్న దారి ఏమైనా ఉందా?
    అగార్కర్‌: దయచేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దు. త్వరలోనే మేము మరో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది అంటూ నవ్వులు పూయించాడు.

    చదవండి: ‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’

  • ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్‌ను.. రజత్‌ పాటిదార్‌ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సాధించాడు.

    ఏమాత్రం అంచనాలు లేకుండా
    తద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్‌.. ఐపీఎల్‌-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సత్తా చాటి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

    మెరుపులు మెరిపించి
    ముఖ్యంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

    ఇప్పటి వరకు ఈ సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పాటిదార్‌ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్‌ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ విషయంపై రజత్‌ పాటిదార్‌ తాజాగా స్పందించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్‌ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.

    భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు
    నా దృష్టి మొత్తం ఐపీఎల్‌-2026 సీజన్‌ మీదే ఉంది. ప్రతి కెప్టెన్‌ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్‌ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.

    తాజా ఎడిషన్‌లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.

    అదంతా నాకు అనవసరం
    గతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్‌ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. 

    అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్‌ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి​ చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్‌ పాటిదార్‌ పేర్కొన్నాడు.

    చదవండి: కెప్టెన్‌ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ?

  • డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆది నుంచి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్‌ సేన.. టేబుల్‌ టాపర్‌గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.

    ఈ క్రమంలో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి టైటిల్‌ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్‌లోనూ ఆర్సీబీ బౌలింగ్‌ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

    పటిష్టంగా పేస్‌ దళం
    టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్‌ దర్‌ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్‌ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్‌ హాజిల్‌వుడ్‌ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్‌ శర్మ (9), జేకబ్‌ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్‌తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్‌ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్‌ సాల్ట్‌ తిరిగి వచ్చినా వెంకటేశ్‌ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.

    అతడినే ఓపెనర్‌గా కొనసాగించాలి
    ఈ మేరకు.. ‘‘ఫిల్‌ సాల్ట్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉన్నా వెంకటేశ్‌ అయ్యర్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్‌గా కొనసాగిస్తే మంచిది.

    అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్‌ ఖతమే
    ఇక బౌలింగ్‌ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్‌తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్‌ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్‌ ఖతమే.

    PC: BCCI

    షెఫర్డ్‌ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రొమారియో షెఫర్డ్‌ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.

    పేలవ ప్రదర్శన
    ఈ క్రమంలో తాజా ఎడిషన్‌కు కూడా ఆర్సీబీ షెఫర్డ్‌ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్‌లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్‌లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్‌ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్‌గా 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్‌తో క్వాలిఫయర్‌-1లో షెఫర్డ్‌ ఒక ఓవర్‌ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.

    ఐపీఎల్‌-2026 ఫైనల్‌.. ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌ ​తుది జట్లు (అంచనా) 
    ఆర్సీబీ: 
    రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్‌/ వెంకటేశ్ అయ్యర్‌, దేవ్‌దత్‌ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్‌ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్, రసిఖ్‌ దర్‌, జేకబ్‌ డఫీ/ సుయశ్‌ శర్మ‌ 

    గుజరాత్‌:  
    శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్‌ బట్లర్, వాషింగ్టన్‌ సుందర్, నిశాంత్ సంధు, జేసన్‌ హోల్డర్, రాహుల్‌ తెవాటియా, రషీద్ ఖాన్‌, కగిసో రబాడ, మహ్మద్‌ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్‌.   

    చదవండి: కెప్టెన్‌ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ!

  • ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి.

    ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.

    ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీ
    ఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో నిష్క్రమించిన ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.

    వైభవ్‌కు మరో భారీ జాక్‌పాట్‌..?
    ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్‌ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (722), సాయి సుదర్శన్‌ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.

    పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీ
    పర్పుల్‌ క్యాప్‌ రేసులో గుజరాత్‌ పేసర్‌ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్‌ భువనేశ్వ్‌ర్‌ కుమార్‌ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్‌కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.

    ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్
    ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్‌ ఆర్య (పంజాబ్‌ కింగ్స్‌)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.

    ఎంవీపీగా ఎవరు..?
    మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్‌ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.

    ఫెయిర్‌ప్లే అవార్డు
    ఈ సీజన్‌లో ఫెయిర్‌ప్లే పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌ ముందంజలో ఉంది. ఫెయిర్‌ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.

    ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర
    2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.

    ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

     

     

  • ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్‌లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ మింజ్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

    జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్‌, జంషెడ్‌పూర్‌ స్టీలర్స్‌, చోటా నాగ్‌పూర్‌ రాయల్స్‌, కోయలాంఛల్‌ సూపర్‌కింగ్స్‌, థన్‌బాద్‌ డైమాండ్స్‌, సంథల్‌ స్ట్రయికర్స్‌ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

    ఈ వేలంలో రాబిన్ మింజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.

    మరోవైపు ఇషాన్ కిషన్‌ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్‌తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్‌రేట్‌తో 602 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.

    అయినా, దేశీయ క్రికెట్‌లో రాబిన్ మింజ్‌కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్‌ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

    కాగా, తొలి జార్ఖండ్‌ టీ20 లీగ్‌ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 27 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్‌ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

     

     

  • సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌ అంతర్జాతీయ కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్‌గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్‌లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. 

    ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను భారత ఒలింపిక్‌ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్‌ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.

    ఆ సమావేశంలోనే నిర్ణయం!
    ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

    ఆ మీటింగ్‌లోనే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్‌ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..

    ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!
    ‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్‌ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్‌కప్‌ టోర్నీలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్‌ పటేల్‌ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.

    అయితే, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్‌గా ఫామ్‌లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.

    నిజానికి మేనేజ్‌మెంట్‌ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్‌-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.

    సెప్టెంబరు 19 నుంచి
    అయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

    అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.

    ఇక ప్రాబబుల్స్‌లోనే అయినా తొలిసారి భారత సీనియర్‌ టీమ్‌ బృందంలో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత జూన్‌ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది.
      
    ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌ జాబితా: 
    యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్, సంజూ శాంసన్‌, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌, తిలక్ వర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్ యాదవ్‌, నితీశ్ కుమార్‌‌ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్‌, ఆయుశ్‌ బదోని, హర్ష్‌ దూబే, ధ్రువ్‌ జురేల్, ఖలీల్ అహ్మద్‌, రుతురాజ్ గైక్వాడ్‌, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్‌ దూబే, విప్రాజ్ నిగమ్‌, హర్షిత్ రాణా, యశ్‌ ఠాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌.  

    చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్‌

  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటైన "ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు" బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్‌ భుర్టెల్‌ ఈ ఘనతను సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

    భుర్టెల్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో హెర్షల్‌ గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, కీరన్‌ పోలార్డ్‌, జస్కరన్‌ మల్హోత్రా, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా భుర్టెల్‌ వీరి సరసన చేరాడు.

    పురుషుల ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ (మే 31) జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భుర్టెల్ చైనా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 

    ముఖ్యంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో Zhuoyue Chen వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

    భుర్టెల్ కేవలం ఆరు సిక్సర్లతోనే ఆగిపోలేదు. మొత్తం 43 బంతుల్లోనే 129 పరుగులు చేసి చైనా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 సిక్సర్లు నమోదయ్యాయి. అనంతరం Deng Jinqi అతన్ని ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

    భుర్టెల్‌కు తోడుగా కుషాల్‌ మల్లా 47 బంతుల్లో 85 పరుగులు, రోహిత్‌ పౌడెల్‌ కేవలం 21 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి చెలరేగారు. ఫలితంగా నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 313 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది.

    314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు చైనా బ్యాటింగ్ కుప్పకూలింది. చైనా జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. Zheng Shenjian 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు.

    కాగా, సింగపూర్‌ వేదికగా జరుగుతున్న పురుషుల ఏషియన్‌ గేమ్స్‌ టీ20 క్వాలిఫయర్-2026 టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడుతున్నాయి. నేపాల్‌, చైనా, ఖతార్‌, మలేసియా ఓ గ్రూప్‌-ఏలో ఉండగా.. బెహ్రెయిన్‌, హాంగ్‌కాంగ్‌, ఒమన్‌, సింగపూర్‌ గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాయి.

     

     

International

  • ఖట్ట్మాండు: నేపాల్ ప్రధాని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉన్న దీర్ఘకాలిక సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, బ్రిటన్‌ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు.  నేపాల్ పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విధంగా మాట్లాడారు. 

    ఇటీవలే నేపాల్ ప్రధానిగా ఎన్నికైనా బాలేంద్ర షా ఆదివారం నేపాల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ "కేవలం భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించలేదు. నేపాల్ కూడా భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను ఆక్రమించింది. ఈ అంశంపై ఇరు దేశాలు దీనిపై చర్చించుకోవాలి." అని అన్నారు.ఈ సరిహద్దు వివాదం 'బ్రిటిష్ ఇండియా' కాలం నాటిదని, అందుకే ఈ సమస్య పరిష్కారంలో ఇంగ్లాండ్ (బ్రిటన్) కూడా పాలుపంచుకోవాలని నేపాల్ భావిస్తోందని షా పేర్కొన్నారు.

    వివాదం ఏంటి? 

    లింపియాధురా, లిపులేఖ్ మరియు కాలాపానీ ప్రాంతాలపై నేపాల్ హక్కులు కోరుతోంది. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత, జూన్ మొదటి వారం నుండి లిపులేఖ్ కనుమ ద్వారా భారత్-చైనాలు సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించబోతున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన నోట్ పంపింది.అయితే దీనిపై చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో ప్రత్యేక  బృందాలను ఏర్పాటు చేసి, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ప్రత్యుత్తరం ఇచ్చినట్లు నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.

    భారత ప్రభుత్వం స్పందన
    నేపాల్ చేస్తున్న భూభాగాల వాదనలకు ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఏకపక్షంగా సరిహద్దులను పెంచుకుంటూ పోవడం చెల్లదని, అయితే ఈ సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

  • బ్యాంకాక్: ఈశాన్య మయన్మార్‌లో ఆదివారం మధ్యాహ్నం ఓ భవనంలో ఘోర పేలుడు ప్రమాదం సంభవించింది. గనుల తవ్వకాల కోసం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ఘోర ప్రమాదంలో మరో 70 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది, స్థానిక మీడియా వెల్లడించాయి. చైనా సరిహద్దుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్‌ఖామ్ పరిధిలోని ‘కౌంగ్‌టుప్’ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల సమయంలో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ’ అనే సాయుధ తిరుగుబాటు ముఠా ఆధీనంలో ఉంది.

    వందకు పైగా ఇళ్లు ధ్వంసం 
    ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. పేలుడు ధాటికి ఆకాశంలోకి దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్.. ఆదివారం సాయంత్రానికి ఆరుగురు చిన్న పిల్లల మృతదేహాలతో సహా మొత్తం 46 మృతదేహాలను వెలికితీసి అంత్యక్రియల కోసం తరలించారు. గాయపడిన మరో 74 మందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు తీవ్రత వల్ల చుట్టుపక్కల ఉన్న దాదాపు 100కు పైగా నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంపై తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స్పందించింది. గనులు, క్వారీ తవ్వకాల కోసం తమ ఎకనామిక్ డిపార్ట్‌మెంట్ ఈ భవనంలో ‘జెలిగ్నైట్’ అనే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిందని స్పష్టం చేసింది.

    సాధారణంగా జెలిగ్నైట్‌ను రాళ్లు బద్దలు కొట్టడానికి వాడతారు. అయితే దీనిని ఎక్కువ కాలం పాటు సరిగ్గా నిల్వ చేయకపోతే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం ఈ పేలుడు ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక యంత్రాంగం వైద్య సహాయం, పునరావాస చర్యలను అందిస్తోంది.

     

     

  • పారిస్‌ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ ముగిసిన తర్వాత హింస చెలరేగిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ఫైనల్‌లో పారిస్ సెయింట్-జెర్మైన్ విజయం సాధించడంతో వేలాది మంది పారిస్ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొన్ని గ్రూపులు పోలీసులతో ఘర్షణలకు దిగాయి. 

    గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఇదే పోటీని గెలిచిన సమయంలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంతో ఫ్రాన్స్ అంతటా సుమారు 22,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా హింస చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 780 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. వారిలో 450 మందికి పైగా ఇప్పటికీ తమ అదుపులోనే ఉన్నారని తెలిపారు.  

    వారు భద్రతా సిబ్బందే లక్ష్యంగా నిందితులు బాణసంచాను విసేరేశారని చెప్పారు. అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్‌ న్యునెన్జ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 57 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. ఫ్రాన్స్ అంతటా ఫుట్‌బాల్ అభిమానులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 219 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నునెజ్ తెలిపారు. 

    పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. 25 వయస్సు ఉన్న ఓ యువకుడు తన మోటోక్రాస్ బైక్‌పై పారిస్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ర్యాంప్ వద్ద కాంక్రీట్ బ్లాక్‌లను ఢీకొట్టి మరణించాడు. ఓ వివాదంలో కత్తి దాడికి గురైన మరో యువకుడు పారిస్‌లో తీవ్రంగా గాయపడ్డాడని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

    దేశవ్యాప్తంగా సుమారు 15 నగరాల్లో దొంగతనాలు, దోపిడీలు జరిగాయని, 71 మున్సిపాలిటీల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని పేర్కొంది. గత ఏడాది పారిస్ సెయింట్-జెర్మైన్ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత జరిగిన వేడుకలతో పోల్చితే ఈ సారి అరెస్టుల సంఖ్య 32 శాతం పెరిగిందని చెప్పింది. పారిస్ రాజధానిలో బస్సు, రైలు సేవలకు అంతరాయం కలిగించేలా చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు వేలాది మంది పోలీసులను మోహరించారు. ఆదివారం ఈఫిల్ టవర్ సమీపంలో జరిగే విజయోత్సవ ర్యాలీ భద్రత కోసం సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు.

  • టెహ్రాన్‌: ఇరాన్‌ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. 

    అదే సమయంలో, ట్రంప్ ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.

    ఈ నేపథ్యంలో ఇరాన్‌-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప‍్రమాదం ఉందని యూఎస్‌ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్‌), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్‌గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్‌గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్‌కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.

    ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్‌లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.

    చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

    ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.

    ఇజ్రాయెల్‌ ఊరుకోదు 
    ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్‌గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్‌లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.

    ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం. 

    ట్రంప్‌నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్‌కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు? 

    నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.

    ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ‍్వాలని  నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. 
     

  • వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

    పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.

    మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్‌కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు,  హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత  సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

    పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్‌లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.

    తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

  • ఇస్తాంబుల్: పశ్చిమ తుర్కియేలో ఆదివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటక బస్సు రహదారి పక్కన ఉన్న ఫెన్సింగ్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకోవడంతో  8 మంది ప్రాణాలు కోల్పోగా, 33 మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియాను ఉటంకిస్తూ షిన్‌హువా వెల్లడించింది.

    షిన్‌హువా తెలిపిన వివరాల ప్రకారం.. 38 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు తుర్కియేలోని ఇజ్మిర్ నగరం నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని పర్యాటక నగరం అంతాల్యాకు వెళ్తుండగా, దేశంలోని డెనిజ్లీ ప్రావిన్స్‌లో డెనిజ్లీ-అయ్దిన్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

    మృతుల్లో బస్సు డ్రైవర్‌తో పాటు 9 నెలల శిశువు కూడా ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని షిన్‌హువా తెలిపింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం.. దట్టమైన పొగమంచు, అధిక వేగం ప్రమాదానికి కారణాలై ఉండొచ్చని భావిస్తున్నారు.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరికి తీవ్ర గాయాలు కావడంతో అవయవాల తొలగింపు శస్త్రచికిత్సలు అవసరం కావచ్చని పేర్కొన్నారు. పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Politics

  • హైదరాబాద్‌:  ‘సర్‌’  ఇప్పడు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, దీని పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం నిర్వహించగా అందులో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘ SIR ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 

    SIR పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఓటు అనేది ప్రతి ఒకరి హక్కు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారు. SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి. ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ కేంద్రం SIR పేరుతో తొలగిస్తుంది. 18 సంవత్సరాల నిండిన వారు ఓటు ఎన్రోల్ మెంట్ చేసుకోవాలి. బీఆర్‌ఎస్‌ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున జరగాలి. 

    ఈసారి మెంబర్ షిప్ డ్రైవ్ డిజిటల్ లో చేస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేశాం. కంటోన్మెట్ ప్రజలు సురక్షిత మంచినీరు అందజేశాం. అలవీ కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక.. హామీలు గాలికి వదిలేశారు. ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది’ అని మండిపడ్డారు.

  • రాజ‌మండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాం జ‌రిగిన‌ట్టు ఆధారాల‌తో స‌హా వెలుగులోకి రావ‌డంతో దానికి స‌మాధానం చెప్పుకునే ధైర్యం లేక గ‌త ప్ర‌భుత్వంలో ఇసుక అక్ర‌మాలు అంటూ మ‌రో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి కూట‌మి ప్ర‌భుత్వం తెర‌లేపింద‌ని వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్ర‌మాల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు టీడీపీ నాయ‌కుల‌కు లేద‌ని చెప్పారు.

    వైఎస్సార్‌సీపీ హ‌యాంలో కేంద్ర ప్ర‌భుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాద‌ర్శ‌కంగా ఈ టెండ‌ర్లు నిర్వ‌హించి ప్ర‌భుత్వ ఖ‌జానాకి రూ.4 వేల కోట్లు వ‌చ్చేలా చేశామ‌ని చెప్పారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన రెండేళ్ల‌లో ఉచిత ఇసుక అంటూ ఆ డ‌బ్బు ప్ర‌భుత్వ ఖ‌జానాకి రాకుండా నాయ‌కులు జేబులు నింపుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూల‌నైనా ఉచితంగా ఇసుక ల‌భిస్తోందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

    2014-19 మ‌ధ్య గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా ఐదేళ్ల‌లో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి ర‌క‌ర‌కాలుగా ఇసుక దోపిడీకి పాల్ప‌డిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌భుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చిన‌వైఎస్సార్‌సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జ‌రిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖ‌జానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూట‌మి వ‌ల్ల ఇంకెంత న‌ష్టం జ‌రిగి ఉండాల‌ని ప్ర‌శ్నించారు. గోదావ‌రి జిల్లాల ప‌రిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెల‌కు రూ. కోటి సంపాదిస్తున్నార‌ని,వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక వారి బాగోతాల‌న్నీ బ‌య‌ట‌పెట్టి చ‌ట్ట‌ప‌రంగా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మార్గాని భ‌ర‌త్ హెచ్చ‌రించారు.

    ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..  

    80 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక నెల‌రోజుల్లో లేపేశారు
    ఒక‌ప‌క్క డీఎస్సీ అక్ర‌మాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంటే దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి గ‌త ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మ‌రో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి కూట‌మి ప్ర‌భుత్వం తెర‌లేపింది. గ‌త ప్ర‌భుత్వంలో 5.08 కోట్ల ట‌న్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్ర‌మాల గురించి చంద్ర‌బాబు అండ్ కో మాట్లాడ‌ట‌మే పెద్ద జోక్‌.  ఉచిత ఇసుక అని ప్ర‌చారం చేస్తున్న ప్ర‌భుత్వం, రాష్ట్రంలో ఎక్క‌డైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. 

    మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుకను కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి నెల‌రోజులు గ‌డ‌వ‌క ముందే స‌గం ఇసుకను టీడీపీ నాయ‌కులు కాజేశారు. గోదావ‌రి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవ‌లం ఇసుక ద్వారానే నెల‌కు రూ. కోటి సంపాదిస్తున్నారు.

    ఇసుక విధానంపై రోజుకో మాట‌
    చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గ‌త ఐదేళ్లవైఎస్సార్‌సీపీ పాల‌న‌లో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజ‌మే అయినా, ప్ర‌భుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వ‌చ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్ర‌చారం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్ర‌భుత్వ ఖ‌జానాకి న‌ష్టం జ‌రిగి ఉండాలి?  ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డ‌బ్బంతా ప్ర‌భుత్వ ఖ‌జానాకి చేర‌కుండా ఎవ‌రి జేబుల్లోకి వెళ్లిన‌ట్టు?  

    ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక కూట‌మి నాయ‌కుల ఇసుక దందాను ఖ‌చ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కార‌కులైన వారిని చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేదాకా పోరాడుతాం.  

    నాడు పార‌ద‌ర్శ‌కంగా ఇసుక ఈ టెండ‌ర్లు.. ఖ‌జానాకి రూ.4 వేల కోట్ల ఆదాయం
    గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్‌ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయ‌డం జ‌రిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.

    డీఎస్సీ అక్ర‌మాల‌పై మంత్రి లోకేష్ స‌మాధానం చెప్పాలి
    సంక్షేమం, అభివృద్ధి ఎవ‌రి హ‌యాంలో జ‌రిగిందో చ‌ర్చించ‌డానికి నారా లోకేష్ చేసిన స‌వాల్‌నువైఎస్సార్‌సీపీ జాతీయ మీడియా అధికార ప్ర‌తినిధిగా నేను స్వీక‌రిస్తున్నా. దీనిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు ఎప్పుడు, ఎక్క‌డికి ర‌మ్మ‌న్నా రావ‌డానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొద‌టి ర్యాంకు తెచ్చుకున్న న‌వీన్ అనే వ్య‌క్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వ‌లేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్ప‌గ‌ల‌రా?  

    స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కి రాలేద‌ని చెబుతున్నారు. కానీ, ఇదే న‌వీన్ ప్ర‌భుత్వం త‌న ఐడీని బ్లాక్ చేసి కాల్ లెట‌ర్ రాకుండా చేసింద‌ని హైకోర్టును కూడా ఆశ్ర‌యించారు. మంత్రి నారా లోకేష్ స్వ‌యంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్‌సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన‌ అభ్య‌ర్థుల  ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవ‌రెవ‌రికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధ‌న‌ల ప్ర‌కారం వారికి ఉద్యోగాలిచ్చారో బ‌య‌ట‌పెట్టాలి. టీచ‌ర్ ఉద్యోగం కోసం రూ. 15 ల‌క్ష‌లు వ‌సూలు చేశార‌ని బ‌య‌ట‌కొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్ప‌ష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ స‌మాధానం చెప్పాలి. నిరుద్యోగుల‌కు వివ‌ర‌ణ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

  • తాడేపల్లి:  డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకుని, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తో రాజకీయ ప్రసంగాలు చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, వరుదు కల్యాణి మండిపడ్డారు. కోన శశిధర్‌ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఏంటని ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్‌ ట్యాబ్‌ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలకు దిగుతున్నారని ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. 

    డీఎస్సీ అక్రమాలపై తేలిపోయిన కోన శశిధర్‌ వివరణ:
    :లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
    రాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడించారు. ఆయన ఏకపక్షంగా మాట్లాడి, విలేఖరుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, 

    లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది ? మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్‌ ల ద్వారా కాల్‌ లెటర్స్‌ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?

    డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్‌ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్‌ పిన్‌ బౌలింగ్‌ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్‌ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ ను కూడా డీఎస్సీ స్పోర్ట్‌ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా ? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్‌ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.

    నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు
    మీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న వైఎస్‌ జగన్‌  ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్‌ ను అక్షర క్రమంతో పాటు ఆభివద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్‌ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్‌ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా ? మాట్లాడితే కేసులు పెడతారా ? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్‌ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు. 

    ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్‌ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్‌ నిర్వహించబోతున్నాం.

    రాజకీయ నేతగా కోన శశిధర్‌ వ్యాఖ్యలు
    :పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ
     ప్రెస్‌మీట్‌లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అని మర్చిపోయి రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకుల మీద సివిల్, క్రిమినల్‌ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏంటి? అసలేం జరిగింది, దాని మీద మేమేం మాట్లాడాం ? వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే అధికారంలో ఉన్న నాయకులు మాట్లాడతారు. కానీ మీరు వాళ్ల పాత్రను తీసుకుని బెదిరింపులకు దిగడం నిరుద్యోగులు, ప్రజలు హర్షించలేదు. నిరుద్యోగుల వేదనపై కోన శశిధర్‌ గారి నుంచి సమాధానం వస్తుందని భావించాం, కానీ తెలియదు, అవగాహన లేదు, తన దృష్టిలో లేదని చెప్పేశారు. సరైన సమాధానం చెప్పలేక బెదిరింపులకు దిగి ప్రెస్‌ మీట్‌ ముగించారు.

     డీఎస్సీలో ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న నవీన్‌ అనే వ్యక్తి  సోషల్‌ స్టడీస్, తెలుగు మెథడాలజీలో పరీక్షలు రాస్తే సోషల్‌ లో ఫస్ట్‌ ర్యాంక్, తెలుగులో ఆరో ర్యాంక్‌ వచ్చింది. దీనిపై ప్రశ్నిస్తే కోన శశిధర్‌.. ఆయన మా దగ్గర ఉద్యోగిగా ఉన్నాడు, పరీక్ష రాసేటప్పుడు ఎన్వోసీ ఇవ్వలేదు కాబట్టి పక్కనబెట్టామన్నారు. తర్వాత అడిగితే సర్టిఫికెట్ల «ధృవీకరణకు రాలేదని పక్కనబెట్టామన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన చెప్పాలి. నవీన్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ ఉన్నట్లు వెబ్‌ సైట్‌ లో పెట్టాక, ఆరోపణలు రావడంతో మెరిట్‌ లిస్ట్‌ తీసేసి, దాని స్ధానంలో  రివైజ్డ్‌ లిస్ట్‌ పెట్టారు.  

    ‘బైజూస్‌’ పేరుతో డైవర్షన్‌ పాలిటిక్స్‌
    జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్ధులకు బైజూస్‌ ట్యాబ్స్‌ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్‌ ట్యాబ్స్‌ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్‌ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్‌ ఇస్తే.. ఈ ప్రభుత్వం  దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. 

    మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్‌ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.

    ఒక్క నవీన్‌ విషయంలోనే ఎన్నో అనుమానాలు:
    వెబ్‌ సైట్‌ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్‌ లిస్ట్‌ లో నుంచి తొలగించాక, అతని లాగిన్‌ కూడా బ్లాక్‌ చేశారు. సెప్టెంబర్‌ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్‌ చేశాక కూడా అతనికి కాల్‌ లెటర్‌ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్‌ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే  అవకాశం ఉంటుంది ? నా లాగిన్‌ బ్లాక్‌ చేశారు, నాకు కాల్‌ లెటర్‌ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. 

    మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కు రాలేదని అంటే అతని లాగిన్‌ ఎందుకు బ్లాక్‌ చేశారో, అతని ఫస్ట్‌ ర్యాంక్‌ ను ఎందుకు డిలీట్‌ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్‌ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్‌ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.

    డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
    లక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన  అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ ల ప్రకారం సెలెక్షన్‌ లిస్ట్‌ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్‌ లెటర్స్‌ వ్యక్తిగతంగా పంపించారు. 

    సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్‌ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్‌ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. 

    కాల్‌ లెటర్స్‌ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్‌ లెటర్స్‌ పంపక ముందు చూసుకోలేదా ? హారిజాంటల్‌ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్‌ పాయింట్స్‌ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్‌ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు. 

    మహిళా రిజర్వేషన్‌ ప్రకారం కాకుండా జనరల్‌ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్‌ సిస్టమ్‌ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్‌ కోటాలో కూడా గోల్డ్‌ మెడల్‌ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాం.

    డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ
    :వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ
    ఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్‌ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. 2025 ఏప్రిల్‌ 18న ఇంకో 36 గేమ్స్‌ కలిపి మొత్తం 65  క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు.  2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. 

    పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్‌ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్‌ షిప్‌ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. 

    డీఎస్సీ పేపర్‌ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చే ఉద్యోగం నుంచి తొలగించారు. కోన శశిధర్‌ కూడా మా ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు. కేవలం దాటవేత ధోరణి ప్రదర్శించారు. నవీన్‌ గురించి మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని అర్దమవుతోంది. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం’ అని డిమాండ్‌ చేశారు.

  • సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.

    చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్‌ సిక్స్‌ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన మెడికల్‌ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు.  

  • సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్‌లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్‌ ప్రారంభమవుతుందని.. సర్‌’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్‌ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

    ‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్‌లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్‌లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్‌లో మొత్తం బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం.

    ..సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్‌ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్‌ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్‌లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్‌ సూచించారు

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.

    ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, చెన్నై: తిరుచ్చి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్‌ సోమవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందు కోసం తిరుచ్చి తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  వివరాలు.. సీఎం విజయ్‌ చెన్నై పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు.

    సీఎంగా బాధ్యతలు చేపట్టడం, మంత్రి వర్గం విస్తరణ, వాగ్దానాల అమలు, ఢిల్లీ పర్యటన అంటూ బిజీగా ఉన్న విజయ్‌ ఎట్టకేలకు తిరుచ్చి తూర్పు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్‌ సీఎంగా బాధ్యలు చేపట్టినానంతరం ప్రజలలోకి ప్రథమంగా వస్తున్నారు.  

    చెన్నై నుంచి తిరుచ్చికి విజయ్‌ విమానంలో వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయం టెర్మినల్‌ నుండి తన సొంత, ప్రత్యేక వాహనంలో (ఓపెన్‌ వ్యాన్‌)లో బయలుదేరుతారు. తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డులోని టీవీఎస్‌ టోల్‌ గేట్, ఓల్డ్‌ డెయిరీ ఫామ్‌ ,మిల్క్‌ స్టేషన్‌ మీదుగా ప్రయాణించి సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఆయన ఓపెన్‌ వ్యాన్‌లో నిలబడి ప్రజలకు , కార్యరర్తలకు  చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతూ, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన తమిళనాడులోని ఇతర జిల్లాలలో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారని సమాచారం.  

  • సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం.. మహానాడు సాక్షిగా చెప్పిన అబద్ధాలపై తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. సమావేశానికి వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచకపాలన. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లలో మహిళలకు పెద్దపీట వేశారు. చంద్రబాబు మోసం చేసి పుండుమీద కారం చల్లుతున్నారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడు. చంద్రబాబుకు జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయాలనేది జగన్ ఆలోచన. ఇచ్చిన హామీలను నెరవేర్చడం బాధ్యతగా జగన్ భావించారు. కానీ చంద్రబాబు ఏం చేయకుండానే సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చేశానంటున్నాడు. ఇప్పుడు పిల్లలే సంపద పిల్లల్నికనండి అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు ఇంటి నుంచే ఎందుకు మొదలుపెట్టరు. నెలకు 1500 ఆడబిడ్డ నిధి హామీని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ముగ్గుర్ని కంటే రూ.30 వేలు నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నాడు. మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలన ఒక ఉదాహరణ

    ..రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్‌ జగన్‌.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధిచేయగల శక్తి జగన్‌కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం వివరించాలి. ఆడబిడ్డ నిధి ఇస్తామని చంద్రబాబు చేసిన అతిపెద్ద మోసం. చంద్రబాబు చొక్కా పట్టుకుని నిలదీయాలి. మా హామీల సంగతి ఏంటని చంద్రబాబు,లోకేష్,పవన్‌ను ఎక్కడ కనబడినా అడగాలి’’ అని సజ్జల పిలుపునిచ్చారు.

    అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం: వరుదు కల్యాణి
    వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు పాలన అంతా మోసం దగా. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామాలు పెట్టారు. చంద్రబాబు చీఫ్ మినిస్టర్ కాదు చీటింగా మాస్టర్. మొన్న జరిగింది హైబ్రీడ్ మహానాడు కాదు లోగ్రేడ్ మహానాడు. తల్లికి, చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. మహానాడులో వైఎస్‌ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు వైఎస్‌ జగన్‌ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా?.

    ..టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ బోత్ ఆర్ నాట్ సేమ్. తెలుగువారి పౌరుషాన్ని జగన్ ఢిల్లీకి చూపించారు. తెలుగువారి ప్రయోజనాలను ఢిల్లీకి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌. హామీలను ఎగ్గొట్టిన మోసగాడు చంద్రబాబు. మా బ్రాండ్ సంక్షేమం.. మీ బ్రాండ్ సంక్షోభం. హోంమంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం కూడా మీలా మాట్లాడగలం కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. జైల్లో ఖైదీలతో కుమ్మక్కైన మీకు వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రాన్ని మద్యం, గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. హోంమంత్రి అనిత ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తాం. వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన అభివృద్ధి మీకు వివరిస్తాం

     

Business

  • లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ జీ-క్లాస్ కోసం అధికారికంగా రీకాల్‌ ప్రారంభించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, ఈ ప్రభావం ఎన్ని కార్లమీద పడుతుంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    వీల్ బోల్ట్‌లకు సంబంధించిన సమస్య కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఈ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం 99 కార్లపై పడుతుంది. అంటే 99 కార్లకు రీకాల్ ప్రకటించారన్నమాట. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు.. వీల్ బోల్ట్‌ల బిగింపు వల్ల, రానున్న రోజుల్లో వీల్ కనెక్షన్ వదులయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వాహనం నడిపే స్థిరత్వం దెబ్బతినవచ్చు, ప్రమాదం జరిగే అవకాశం కూడా పెరగవచ్చు.

    కంపెనీ ప్రకారం.. 12 జూలై 2024, 18 ఆగస్టు 2025 మధ్య తయారైన మొత్తం 99 యూనిట్లు ఈ రీకాల్ వల్ల ప్రభావితమయ్యాయి. అధికారిక ప్రకటన ఏదీ జారీ చేయనప్పటికీ, ఈ సమస్యను కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా పరిష్కరించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. కార్ల తయారీ సంస్థ సంబంధిత డీలర్‌షిప్‌ల ద్వారా ప్రభావితమైన కార్ల యజమానులను సంప్రదించే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: టయోటా కొత్త కారు లాంచ్: 543 కిమీ రేంజ్!

  • ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలం కావడం అంటే.. చాలామంది విద్యార్థుల జీవితాల్లో పెద్ద నిరాశగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, కొంతమందికి కొత్త ప్రారంభానికి మార్గం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణాత్మక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. ఒక యూజర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, తాను రెండు సార్లు ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో విఫలమైనట్లు చెప్పుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చినందుకు.. చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం, ప్రెజర్స్ అన్నీ చాలా కష్టంగా అనిపించాయని అతను చెప్పుకోచ్చారు. ఒకానొక దశలో జీవితం ముగిసిపోయినట్టే అనిపించిందని కూడా పేర్కొన్నారు.

    ఫెయిల్యూర్ తర్వాత తన ఊరిని వదిలి, వేరే నగరంలోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. తల్లిదండ్రులు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితి కావడంతో, చదువు కోసం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చిన్న పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి కొంత ఆదాయం సంపాదించాడు. కొన్ని సార్లు రెండు సమోసాలతో రోజంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదని వివరించారు.

    ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. కాలేజీ పూర్తి చేసిన తర్వాత, అతనికి నెలకు రూ.20,000 జీతంతో ఒక ఐటీ సపోర్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జీతం కాకపోయినా.. అతని కెరీర్‌కు ఒక ప్రారంభం అయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. తన కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో, ఉద్యోగం తర్వాత ఖాళీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషిన్ లెర్నింగ్ (ML) నేర్చుకోవడం ప్రారంభించాడు.

    ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి మెంటార్ లేకుండా, కేవలం ఇంటర్నెట్ సాయంతో అతను స్వయంగా ఈ టెక్నాలజీలను నేర్చుకున్నాడు. ఈ ప్రయత్నం అతని కెరీర్‌లో పెద్ద మలుపు తీసుకువచ్చింది. తర్వాత అతనికి ఏఐ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతను ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, బిజినెస్ లీడర్‌షిప్ రోల్స్‌లోకి ఎదిగాడు.

    కొన్నేళ్ల తర్వాత.. ఐఐటీలో సీటు పొందిన తన స్నేహితులతో సమాన స్థాయిలో సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒకప్పుడు పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడిన కుటుంబం నుంచి, ఇప్పుడు రెండవ ఆలోచన లేకుండా కావలసినవి కొనగలిగే స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.

    జీవితంలో ఎదగాలంటే.. పర్ఫెక్ట్ స్టార్ట్ అవసరం లేదు, మీకు దృఢ సంకల్పం కావాలి అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అతని పట్టుదలను, కష్టపడి ఎదిగిన తీరును ప్రశంసిస్తున్నారు.

    ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు!

  • ప్రయివేట్‌ రంగ సంస్థ టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలనువీడి రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4 కోట్ల నికర నష్టం ప్రకటించింది.

    మొత్తం ఆదాయం సైతం 21 శాతం ఎగసి రూ. 3,032 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,499 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 10 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,996 కోట్ల నుంచి రూ. 11,003 కోట్లకు బలపడింది.

  • ఒకప్పుడు ఐటీలో కొలువంటే చాలామంది ఎగిరి గంతేసేవారు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక కొంతమంది బిక్కుబిక్కుమనే రోజుల్లో టెకీలు బతికేస్తున్నారు. ఏ ఉదయం ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ కారణం చేత జాబ్ పోతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రాత్రికి రాత్రే కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఘటనతో 700 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రెషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఉద్యోగుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటివి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ప్రారంభంలో భారీ నియామకాలు
    థింక్ టెక్నాలజీ ఇండియా 2025లో పెద్ద మొత్తంలో నియామకాలను చేపట్టింది. ఇందులో ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట్లో సంస్థ అందరికీ జీతాలు, స్టైఫండ్స్ క్రమంగా చెల్లించింది. దీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం పెరిగింది.

    అయితే.. 2026 ప్రారంభం నుంచి పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి నుంచి జీతాల చెల్లింపుల విషయంలో ఆలస్యం జరిగిందని ఉద్యోగులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 7 లేదా 8వ తేదీకి జమయ్యే జీతాలు ఆగిపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ సమయంలో సంస్థ సీఈఓ హర్షల్ భానుదాస్ ఠాక్రే ఆడిట్ జరుగుతోందని, ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.

    ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
    సీఈఓ ఇచ్చిన హామీ ప్రకారం.. జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అయితే కొన్ని రోజులకు సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. సంస్థ మూతపడటంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన కొన్ని జీతాల చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు, లోన్స్ చెల్లింపులు చేయలేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    ఈ వ్యవహారంలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) జోక్యం చేసుకుంది. బాధిత ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫైట్ అధ్యక్షుడు పవంజీత్ మానే తెలిపారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు వెల్లడించారు.

    మరో ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే.. ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంస్థ ఉద్యోగులతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు జరిపినట్లు స్పష్టమవుతుంది.

    భద్రతపై చర్చ
    ఈ ఘటన మరోసారి భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై చర్చకు తెరలేపింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యోగి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జీతాల చెల్లింపులు, ఆర్థిక పారదర్శకత, ఉద్యోగుల రక్షణ కోసం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు విచారణ కొనసాగుతోంది. జీతాల బకాయిలు, బౌన్స్ అయిన చెక్కులు, ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా!

  • మొక్కలకు నీళ్లు పోయడం నుంచి, పక్షులకు ఆహారం పెట్టడం వరకు... ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ కూడా హైటెక్‌ అయిపోయింది! ఇంట్లోనే ఉంటూ తక్కువ కష్టంతో ఎక్కువ గ్రీనరీని ఎంజాయ్‌ చేయాలనుకునేవారి కోసం వచ్చేసిన సూపర్‌ నేచర్‌ గ్యాడ్జెట్సే ఇవీ!

    రోబోటిక్‌ తోటమాలిఈ వేసవి ఎండల్లో మీరు మాత్రం హాయిగా రూమ్‌లోనో కూర్చుంటే, ఎవరైనా పైపు పట్టుకుని తోటలో నిలబడితే బాగుండు! అని అనుకుంటున్నారా! అందుకే మీ మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతను మోయడానికి వచ్చేసింది ఈ సోలార్‌ స్మార్ట్‌ వైఫై స్ప్రింక్లర్‌ టైమర్‌! ఇది మీ గార్డెన్‌కు ఒక చిన్న డిజిటల్‌ తోటమాలి లాంటిది. దీనికి జీతం అక్కర్లేదు, కరెంట్‌ బిల్లుల తలనొప్పి లేదు, ఇందులోని సోలార్‌ ప్యానెల్‌తో ఎండలోనే ఆటోమేటిక్‌గా రీచార్జ్‌ అవుతుంది.

    పైగా మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ చేసి ఎక్కడి నుంచైనా నీళ్లు ఎప్పుడు పట్టాలో కంట్రోల్‌ చేయొచ్చు. లేదంటే వాయిస్‌ కంట్రోల్‌తో సోఫాలో కూర్చునే ‘అలెక్సా.. మొక్కలకు నీళ్లు పోయ్‌!’ అని చెప్పేస్తే సరిపోతుంది. ‘రెయిన్ డిలే’ ఫీచర్‌తో ‘వర్షం పడుతోంది కదా.. ఎందుకు మళ్లీ నీళ్లు!’ అన్నట్టుగా ఆగిపోతుంది. ఐపీ65 వాటర్‌ప్రూఫ్‌ బాడీ, బలమైన బ్రాస్‌ ఇన్లెట్‌తో ఎండా వానలకు తట్టుకునే ఈ రోబోటిక్‌ తోటమాలి ధర రూ. 10,180 మాత్రమే!

    పక్షుల కోసం స్మార్ట్‌ హోటల్‌!
    ఉదయం కిటికీ దగ్గరకు వచ్చే పిచ్చుకలు, చిన్న చిన్న పక్షులను దగ్గరగా చూడాలని అనిపిస్తుందా? అయితే మీ ఇంటికే చిన్న బర్డ్‌ థియేటర్‌లా మారిపోయే ఈ సోలార్‌ ఏఐ బర్డ్‌ ఫీడర్‌ మీ కోసం! ఇది కేవలం గింజలు పెట్టే పాత్ర మాత్రమే కాదు, పక్షుల ప్రపంచాన్ని మీ కళ్ల ముందుకు తీసుకొచ్చే స్మార్ట్‌ గాడ్జెట్‌. దీనిలో ఉన్న కెమెరా పక్షులు వచ్చి గింజలు తింటున్న ప్రతి క్యూట్‌ మూమెంట్‌ను క్యాప్చర్‌ చేస్తుంది. పైగా ఇందులో ఉన్న ఏఐ టెక్నాలజీ ఏ పక్షి వచ్చిందో కూడా గుర్తించగలదు. సోలార్‌ పవర్‌తో పనిచేయడం వల్ల బ్యాటరీల తలనొప్పి ఉండదు. వర్షం, ఎండలకు తట్టుకునే వెదర్‌ప్రూఫ్‌ మెటల్‌ బాడీతో తయారైన ఈ స్మార్ట్‌ ఫీడర్‌  ధర రూ. 7,000 మాత్రమే!

    మట్టిలేకుండానే మినీ తోట!
    ఇంట్లోనే తాజా పుదీనా, తులసి లేదా చిన్న చిన్న కూరగాయలు పెంచుకోవాలని ఉందా? కానీ మట్టి, కుండీలు, రోజూ నీళ్లు పోసే టెన్షన్  వద్దనుకుంటున్నారా? అయితే ఈ హైడ్రోపోనిక్‌ గ్రోయింగ్‌ సిస్టమ్‌ మీ కోసం! ఇది మీ ఇంట్లోనే ఒక చిన్న స్మార్ట్‌ ఫార్మ్‌లా పనిచేస్తుంది. ఇందులో మొత్తం 12 ప్లాంటింగ్‌ స్టేషన్స్ ఉంటాయి.

    మట్టికి బదులుగా నీరు, పోషకాలు, ఎల్‌ఈడీ కాంతితో మొక్కలు వేగంగా పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్‌ ఎల్‌ఈడీ లైట్లు సూర్యరశ్మిలా పనిచేసి మొక్కలకు అవసరమైన కాంతిని ఇస్తాయి. 4.2 లీటర్ల పెద్ద వాటర్‌ ట్యాంక్, ఆటోమేటిక్‌ వాటర్‌ సర్క్యులేషన్ సిస్టమ్‌తో మొక్కలకు కావాల్సిన నీరు, ఆక్సిజన్  నిరంతరం అందుతాయి. లైట్‌ స్టాండ్‌ ఎత్తును కూడా మొక్కల పెరుగుదలకు తగ్గట్టు మార్చుకోవచ్చు. ధర రూ. 14,000 మాత్రమే!

  • వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటర్స్‌ ఇండియా తమ డీ–మ్యాక్స్‌ ఎస్‌–క్యాబ్‌కి సంబంధించి దేశీయంగా లీజింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో నాలుగేళ్ల ఫిక్సిడ్‌ కాలవ్యవధికి, నెలవారీ అద్దె రూ. 38,999 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ తెలిపింది. సంప్రదాయ ఫైనాన్స్‌ మోడల్‌తో పోలిస్తే కస్టమర్లకు రూ. 1.81 లక్షల మేర ఆదా అవుతుందని వివరించింది. ఫ్లీట్‌ ఆపరేటర్లతో పాటు వివిధ వ్యాపార వర్గాల కోసం ఈ సొల్యూషన్‌ని రూపొందించినట్లు కంపెనీ ఎండీ రాజేష్‌ మిట్టల్‌ తెలిపారు.

    ఇసుజు డీ-మ్యాక్స్ ఎస్-క్యాబ్ 2.5-లీటర్ VGT ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులో పెద్ద కార్గో బెడ్‌తో పాటు హెవీ-డ్యూటీ సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది, ఇది అధిక డిమాండ్ ఉన్న వాణిజ్య అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. క్యాబిన్ లోపల, డి-మాక్స్ ఎస్-క్యాబ్ ఆరు విధాలుగా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఎయిర్ కండిషనింగ్, అనేక స్టోరేజ్ స్థలాలు, మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే వంటి ఆచరణాత్మక ఫీచర్లు ఉంటాయి.

  • డిజిటల్ ప్రకటనల రంగంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు, గూగుల్‌పై కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రముఖ బాత్‌రూమ్ ఫిట్టింగ్స్ అండ్ శానిటరీ వేర్ తయారీ సంస్థ 'హింద్‌వేర్' ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘించిందని గుర్తించిన కోర్టు, గూగుల్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది.

    హింద్‌వేర్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శానిటరీ వేర్ బ్రాండ్. వినియోగదారులు గూగుల్‌లో Hindware అని వెతికినప్పుడు, హింద్‌వేర్ వెబ్‌సైట్‌కు బదులుగా ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలు ముందుగా కనిపిస్తున్నాయని సంస్థ గుర్తించింది. దీనికి కారణం.. ఆ కంపెనీలు హింద్‌వేర్ అనే పదాన్ని తమ ప్రకటనల కోసం కీవర్డ్‌గా కొనుగోలు చేయడమే.

    గూగుల్ యొక్క AdWords (ప్రస్తుతం గూగుల్ యాడ్స్) వ్యవస్థలో కంపెనీలు తమకు కావలసిన కీవర్డ్లపై బిడ్ వేస్తాయి. వినియోగదారులు ఆ పదాలను సెర్చ్ చేసినప్పుడు, ఎక్కువ బిడ్ వేసిన కంపెనీల ప్రకటనలు పైభాగంలో కనిపిస్తాయి. ఈ విధంగా హింద్‌వేర్ పేరును ప్రత్యర్థులు ఉపయోగించుకోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కంపెనీ వాదించింది.

    163 పేజీల తీర్పు
    ఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. గూగుల్ కేవలం ఒక మధ్యవర్తి కాదని స్పష్టం చేశారు. గూగుల్ స్వయంగా కీవర్డ్లను సూచించడం, వాటి వేలాన్ని నిర్వహించడం, ప్రకటనల ప్రదర్శనను తన అల్గోరిథమ్‌ల ద్వారా నియంత్రించడం వంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి ట్రేడ్‌మార్క్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం ప్రదర్శించాల్సిన బాధ్యత గూగుల్‌పైనా ఉంటుందని కోర్టు తన 163 పేజీల తీర్పులో పేర్కొంది.

    కోర్టు అభిప్రాయం ప్రకారం.. హింద్‌వేర్ అనే ట్రేడ్‌మార్క్‌పై గూగుల్‌కు ఎటువంటి యాజమాన్య హక్కు లేదు. అయినప్పటికీ.. ఆ పేరును ప్రత్యర్థి సంస్థలకు అమ్మి లాభం పొందడం ద్వారా గూగుల్ ఆ కంపెనీ ప్రతిష్ఠను వాణిజ్యపరంగా వినియోగించుకుంది. దీనిని కోర్టు ఫ్రీ రైడింగ్ (ఇతరుల కృషి వల్ల ఏర్పడిన పేరును ఉపయోగించి లాభపడటం) అని వెల్లడించింది.

    గూగుల్ వాదన
    గూగుల్ తనను తాను కేవలం ప్రకటనల వేదికగా మాత్రమే పేర్కొంటూ.. హింద్‌వేర్ సమస్యకు తాము బాధ్యులు కాదని వాదించింది. కీవర్డ్స్ అనేవి వినియోగదారుడు సెర్చ్ చేసినప్పుడు.. ప్రకటనలు చూపించడానికి బ్యాక్ ఎండ్‌లో పనిచేసే కొన్ని సాధనాలు మాత్రమే అని వెల్లడించింది. అంతేకాకుండా.. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 79 ప్రకారం తమకు సేఫ్ హార్బర్ రక్షణ వర్తిస్తుందని తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.

    ఎందుకంటే.. గూగుల్ కేవలం ప్రకటనలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ట్రేడ్‌మార్క్‌లను కీవర్డ్లుగా అమ్మి ఆదాయం పొందుతోందని గుర్తించింది. అందువల్ల గూగుల్ ఒక క్రియాశీల పాత్ర పోషిస్తోందని, సేఫ్ హార్బర్ రక్షణకు అర్హత లేదని తీర్పు చెప్పింది.

    ప్రత్యర్థి సంస్థలు
    ఈ కేసులో ప్రత్యర్థి సంస్థలుగా గ్రోహే ఇండియా, ఓంకార ఇన్ఫోవెబ్, సెరా శానిటరీవేర్ కూడా ఉన్నారు. వీరు హింద్‌వేర్ పేరును లేదా హింద్‌వేర్ శానిటరీవేర్ వంటి పదాలను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ ప్రకటనలను ప్రదర్శించారు. అయితే విచారణ సమయంలో ఈ సంస్థలు హింద్వేర్‌తో రాజీ చేసుకోవడంతో, చివరకు గూగుల్ మాత్రమే ఈ కేసులో మిగిలింది.

    ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు అనేక కంపెనీలు ప్రత్యర్థి బ్రాండ్ల పేర్లను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ వ్యాపారాలను ప్రోత్సహించేవి. ఇకపై అలాంటి చర్యలు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది. నితిన్ కామత్ కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ, తమ సంస్థకు ఇలాంటి సమస్యలు సంవత్సరాలుగా ఎదురవుతున్నాయని, ఇప్పుడు చట్టపరమైన పరిష్కారం పొందేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!

  • ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.

    సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

    ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.

    అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు.

     

  • డెరివేటివ్స్‌ (ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌–ఎఫ్‌అండ్‌ఓ) విభాగంలో ట్రేడింగ్‌ సమయాలను పొడిగిస్తున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం 2026 ఆగస్టు 3 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌లో సాధారణ ట్రేడింగ్‌ ముగింపు సమయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3:40 గంటలకు మారనుంది. ప్రీ-ఓపెన్‌ సెషన్‌, మార్కెట్‌ ప్రారంభ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

    క్యాష్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్న ‘క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌’ (CAS)తో డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ సమయాలను సమలేఖనం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. కొత్త విధానంలో క్యాష్‌ మార్కెట్‌లో మధ్యాహ్నం 3:15 నుంచి 3:35 గంటల వరకు క్లోజింగ్‌ ఆక్షన్‌ నిర్వహించి, ఆ రోజు అధికారిక ముగింపు ధర (Closing Price)ను నిర్ణయించనున్నారు.

    ట్రేడర్లకు మరింత వెసులుబాటు

    క్లోజింగ్‌ ఆక్షన్‌ సమయంలో ఏర్పడే ధరల మార్పులను దృష్టిలో ఉంచుకుని, ఎఫ్‌అండ్‌ఓ ట్రేడర్లు తమ పొజిషన్లను హెడ్జ్‌ చేసుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి లేదా ఎగ్జిట్‌ కావడానికి అదనంగా 10 నిమిషాల సమయం లభిస్తుంది. దీంతో క్యాష్‌, డెరివేటివ్స్‌ మార్కెట్ల మధ్య ముగింపు సమయాల్లో ఉండే వ్యత్యాసం తగ్గి, ధరల ఆవిష్కరణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

    మారని అంశాలు ఇవే...

    • ప్రీ-ఓపెన్‌ సెషన్‌ ఉదయం 9 గంటలకే ప్రారంభం

    • రెగ్యులర్‌ మార్కెట్‌ ప్రారంభ సమయం యథాతథం

    • ట్రేడ్‌ మాడిఫికేషన్‌ సౌకర్యం సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగుతుంది

    • ఎఫ్‌అండ్‌ఓ క్లోజింగ్‌ ధరల లెక్కింపునకు ఉపయోగించే VWAP విండోను 3:10–3:40 గంటల మధ్య ట్రేడింగ్‌కు అనుగుణంగా సవరించనున్నారు.

    ఇటీవలి కీలక మార్పులు

    గత కొంతకాలంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ పలు సంస్కరణలను అమలు చేస్తోంది. 2025 చివర్లో ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో ప్రీ-ఓపెన్‌ సెషన్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు క్లోజింగ్‌ ఆక్షన్‌ వ్యవస్థకు అనుగుణంగా ట్రేడింగ్‌ సమయాన్ని కూడా పొడిగిస్తోంది. మార్కెట్‌ పారదర్శకత, మెరుగైన ధరల నిర్ణయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు.

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి : బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. కేఎఫ్‌ఎఫ్‌ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో వారు టైటిల్ గెలుచుకోవటంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘వీరి గెలుపు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో వీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఆకాంక్షించారు  
     

     

  • నంద్యాల:  నంద్యాల శ్రీనివాస్‌ సెంటర్‌ వద్ద మహానేత వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అది వైఎస్సార్‌సీపీ కార్యకర్త పనే అంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని  వైఎస్సార్‌సీపీ ఖండించింది. ఘటన జరిగి కొద్ది సేపట్లోనే టీడీపీ వారి సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో తప్పుడు ప్రచారం మొదలు పెట్టడంపై మండిపడింది.

    పోలీసులు మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తి అని సర్టిఫికేట్ చూపించి విషయాన్ని తప్పదోవ పట్టించే ప్రయత్నం చెశారని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ధ్వంసం చేసిన వ్యక్తి టీడీపీ-జనసేన నాయకులతో తిరిగితే అతను వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ చెప్పడాన్ని ప్రశ్నించింది.  కచ్చితంగా ఈ ఘటన వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. 

    ఈ ధర్నాలో నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ భాషా , పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

  • తాడేపల్లి : మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ రెండు వేర్వేరు ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఘటనలో ఐదుగురు, గాజువాక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

    ‘తుంగభద్ర నదిలో మునిగి ఐదుగురు మృతిచెందడం విషాదకరం. ఈతకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వైఎస్‌ జగన్‌ సంతాంప వ్యక్తం చేశారు. 

    ఇక గాజువాక రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడటంపై వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వైఎస్‌ జగన్‌. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

    కాగా, మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన సంగతి తెలిసింద. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు.  వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. 

    అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. వారంతా విగత జీవులుగా మిగిలిపోయారు. 

    ఈ విషాద ఘటనలో ఇద్దకు హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర, సతీష్‌లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది.  

    మరొకవైపు ఈరోజు(ఆదివారం, మే 31) ఉదయం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

  • తాడేపల్లి: బ్రిటిష్ కాలం నాటి విధానాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. బ్రిటిషర్లపై పోరాడినట్లే ఇప్పుడు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 

    మోసానికి రెండేళ్లు పేరుతో వైఎస్సార్‌సీపీ మహిళా నేతల సమావేశం జరిగింది. ఇందులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు మొదట ఇందిరా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్లినందుకు కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోగానే చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లదగ్గర చేరాడు. చంద్రబాబును పార్టీలోకి తీసుకోవద్దని అందరూ వ్యతిరేకించారు.

    లోకేశ్‌ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదవలేదు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కొన్నారు. లోకేశ్‌ సెవెన్త్ క్లాస్ కూడా సరిగ‍్గా పాసవ్వలేదు. ఇలాంటి అసమర్థుడిని చంద్రబాబు ప్రజలపై రుద్దాలని చూస్తున్నాడు. మహిళల క్యార్టెక్టర్ ను కించపరచడమేనా చంద్రబాబు మహిళలకు చేసే మేలు. బాలకృష్ణ ఈ రోజు చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడంటే వైఎస్సార్ పెట్టిన భిక్ష. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చూడాలంటే మహిళల పైనే ఎక్కువ బాధ్యత ఉంది.

    కానీ భార్యను అడ్డంపెట్టుకుని చంద్రబాబు ఎన్టీఆర్ ను బుట్టలో వేసుకున్నాడు. చంద్రబాబుకు ఎడారి ఒంటె కథ సరిగ్గా సరిపోతుంది. టెంటు కింద చోటిస్తే యజమానిని బయటకు తోసేసిన ఒంటె, చంద్రబాబు ఒకే రకం. చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడు. ఎన్టీఆర్ తో నా పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్టీఆర్ పార్టీ నుంచి బయటికి పొమ్మంటే నన్ను బతిమిలాడుకున్నాడు. నేను పట్టుబట్టడం వల్లే చంద్రబాబును పార్టీ నుంచి బయటికి గెంటేయకుండా ఆగారు.

    ఆ రోజు ఎన్టీఆర్ కు ద్రోహం చేయొద్దని నేను కోరాను. ఎన్టీఆర్ ను ఎప్పటికీ మోసం చేయనని నా చేతిలో చేయి వేసి, తన కొడుకుపై చంద్రబాబు ఒట్టు వేశాడు. నా దగ్గర ఒట్టు వేసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చేయి తాకడం కూడా పాపమే. వైస్రాయ్ హోటల్ కు వెళ్లినందుకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించారు. అవమానిస్తే ఎన్టీఆర్ చనిపోతాడని తెలిసి తీవ్రంగా అవమానించారు. ఎన్టీఆర్ పై క్షుద్రపూజలు కూడా చేయించిన నీచుడు చంద్రబాబు’’ అని చెప్పారు.

National

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పలువురు నిందితులకు సోనార్‌పూర్ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

    ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో తపన్ మైతి, ఆకాశ్ గాయెన్, కాజల్ దాస్, దేవాశిష్ దత్తా, నిర్మాల్య సెంగుప్తా అలియాస్ జాయ్ ఉన్నారు. ఈ ఘటనలో వారి పాత్రలపై దర్యాప్తు జరుపుతున్నారు. తపన్ మైతి, జాయ్ సెంగుప్తా మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహిత సహచరులు. కాజల్ దాస్, దేవాశిష్ దత్తా కూడా లవ్లీ మైత్రాతో అనుబంధం ఉన్నవారని తెలుస్తోంది. ఈ నలుగురూ కేసులో అరెస్టయిన వారిలో ఉన్నారు.

    ఆకాశ్ గాయెన్ ఎవరు?
    ఈ దాడి కేసులో అరెస్టయిన నిందితుల్లో ఆకాశ్ గాయెన్ ఒకరు. ఆయన స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త.. తన కుమారుడు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నాడని, టీఎంసీ ఎన్నికల బూత్‌ల వద్ద క్రమం తప్పకుండా విధులు నిర్వహించేవాడని ఆయన తల్లి తెలిపారు.

    తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అభిషేక్‌ బెనర్జీపై ద్వేషం పెట్టుకునే కారణం ఆకాశ్‌కు లేదని చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటన తర్వాత అతడు ఇంటికి వచ్చి, అనంతరం సమీప మైదానంలో ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లాడు. అదే రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కచ్చితమైన కారణాలను కుటుంబానికి తెలియజేయలేదని ఆమె అన్నారు. ఆకాశ్ తండ్రి వ్యాన్-రిక్షా నడుపుతుండగా, ఆకాశ్ నిరుద్యోగి.

    జాయ్ సెంగుప్తా ఎవరు?
    ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు జాయ్ సెంగుప్తా. ఆయన స్థానిక టీఎంసీ నాయకుడు. చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. 

    సెంగుప్తా 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్నారని, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు మారినా పార్టీ పట్ల విధేయత చూపారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిషేక్‌ బెనర్జీపై సెంగుప్తాకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా వారు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అక్కడికి రావద్దని బెనర్జీకి సూచించాడని, అయినప్పటికీ పర్యటన జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలో సెంగుప్తాకు ఎలాంటి పాత్ర లేదని కుటుంబ సభ్యులు చెప్పారు.

    రాజకీయ ఆరోపణలు
    టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై జరిగిన దాడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించిందని ఆరోపించారు. బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

    ఈ దాడి ఘటన పెద్ద రాజకీయ వివాదంగా మారింది. హింసకు బాధ్యత ఎవరిదన్న అంశంపై రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అరెస్టయిన పలువురు నిందితులకు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం దర్యాప్తును కొత్త కోణంలో చేయడానికి అవకాశం ఇచ్చింది. దాడి జరిగిన పరిస్థితులు, అరెస్టయిన వారి మధ్య సంబంధాలపై దర్యాప్తు అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు కాంచీపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యుందాయ్‌ కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

    అ‍గ్నికీలల్లో కార్లు,సామాగ్రి దగ్ధమయ్యాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న  ప్రయత్నాలు విఫలమయ్యాయి. పదుల సంఖ్యలో మొహరించిన ఫైరింజన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.   

  • సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిక్కబళ్లాపూర్ జిల్లా బాగేపల్లి టౌన్ సమీపంలోని జాతీయ రహదారి 44పై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు బాగేపల్లి టౌన్ శివారులోని గంగోత్రి పెట్రోల్ బంక్ సమీపంలో తమ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోను ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

    ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ ఈరోజు (ఆదివారం) ప్రసారమైంది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక అంశాలు, దేశ ప్రగతి, పౌరుల స్ఫూర్తిదాయక గాథలను ప్రధాని దేశానికి పరిచయం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో క్రీడారంగంలో యువత సాధిస్తున్న విజయాలను కొనియాడుతూనే, పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.

    క్రీడా రంగంలో సరికొత్త చరిత్ర
    భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో మన క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టికె, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వంటి క్రీడాకారులు సాధించిన మైలురాళ్లు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ముఖ్యంగా 100 మీటర్ల స్ప్రింట్‌లో రెండు రోజుల్లోనే మూడుసార్లు జాతీయ రికార్డులు బద్దలవ్వడం, భారతీయ అథ్లెటిక్స్ ఎదుగుదలకు నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు.
     

    ఎండల తీవ్రత - జాగ్రత్తలే శ్రీరామరక్ష
    ప్రస్తుత వేసవి కాలంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ, ఎండలో అనవసర ప్రయాణాలను నివారించాలని కోరారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఆయన కోరారు.

    చరిత్ర పుటల నుంచి నూతన ప్రయాణం
    మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా గత ఎపిసోడ్ విశేషాలను కూడా ప్రధాని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగిన 133వ ఎపిసోడ్‌లో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ముఖ్యంగా, ‘ఆర్కైవ్స్ వాల్ పోర్టల్’ ద్వారా దాదాపు 20 కోట్ల చరిత్రక పత్రాలను డిజిటల్ రూపంలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం భారత చరిత్రను భద్రపరచడంలో ఒక గొప్ప అడుగు అని మోదీ అభివర్ణించారు.

  • హుగ్లీ: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చండితాల పోలీస్ స్టేషన్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా టీఎంసీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి.

    ఘర్షణకు దారితీసిన పరిస్థితులు
    టీఎంసీ బృందం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు పరిస్థితి భౌతిక దాడుల వరకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు ‘చోర్-చోర్’ (దొంగ-దొంగ) అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో, టీఎంసీ మద్దతుదారులకు, వారికి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.

    అధికార యంత్రాంగం అప్రమత్తం
    ఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

Telangana

  • సాక్షి,సిద్ధిపేట: ఉచిత విద్యుత్‌ కరెంట్‌ విషయంలో బడేభాయ్‌ చెప్పినట్టు సీఎం రేవంత్‌ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. డిస్కంల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నది వేరు.. వాస్తవం వేరని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆదివారం (మే29) సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

    24గంటల విద్యుత్‌ ఇవ్వడం కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌ అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్‌ రానే రాదు. రైతు డిస్కం రైతులకు ఉరి తాడుగా మారబోతుంది.లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల పాలిట రైతు డిస్కం శాపంగా మారుతుంది. మేం పద్దతిగా ఆధారాలతో మాట్లాడుతాం. రేవంత్‌ రెడ్డిలా బట్ట కాల్చి మీద వేయం.

    ఆర్పీడీసీఎల్‌ ఏర్పాటుతో కనీసం ఏడు గంటల కరెంట్‌ కూడా రాదు. 13గంటలకు మించి రైతులకు కరెంట్‌ రావడం లేదు. రైతులకు మూడు గంటలు కరెంట్‌ చాలు అని కోదండరెడ్డి మాట్లాడుతున్నారు.

    గుజరాత్‌లో రైతులకు ఏడుగంటలే కరెంట్‌ ఇస్తున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే ఓట్లు అడుగుతానని రేవంత్‌ చెప్పాలి. రేవంత్‌ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌కు మంగళం పాడింది. టీజీఆర్‌పీడీసీఎల్‌ థర్మల్‌ పవర్‌ ఇవ్వరట.. సోలార్‌ పవర్‌ మాత్రమే ఇస్తారట. బడేభాయ్‌ చెప్పినట్టు రేవంత్‌ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వరద వచ్చినప్పుడే ప్రాజెక్టులు నింపుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.  

     

Family

  • తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ నెలలో పలు విశేష ఆర్జిత, మాసోత్సవాలు భక్తి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందాలని ఆలయ అధికారులు కోరారు.

    ప్రతి శనివారం అభిషేకం.
    జూన్ 6, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల మూలవర్లకు పవిత్ర అభిషేకం నిర్వహిస్తారు.

    అమావాస్యనాడు సహస్ర కలశాభిషేకం – హనుమంత వాహనసేవ.
    జూన్ 15న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్రునికి పరమభక్తుడైన ఆంజనేయస్వామి సేవను స్మరింపజేసే హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనుంది.

    పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం.
    జూన్ 17న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకువెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.

    పౌర్ణమినాడు అష్టోత్తర శతకలశాభిషేకం.
    జూన్ 29న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం ఆలయ నాలుగు మాడవీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు సాగుతుంది. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం నిర్వహించనున్నారు. భక్తులు ఈ విశేష ఉత్సవాలలో పాల్గొని శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

  • ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్‌ స్పీక్స్‌’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్‌ రాబర్ట్స్‌– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్‌ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్‌ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్‌ బట్స్‌ 1963 డిసెంబర్‌ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్‌కు ఒక అశరీరవాణి వినిపించిందట! 

    ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్‌’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్‌ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్‌ రాబర్ట్స్‌ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్‌ తనకు చెప్పిన కథలను జేన్‌ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్‌ మెటీరియల్‌’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.

    బంగారు మ్యూజియం
    ప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్‌ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. 

  • ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిని, సముద్రాలను విషపూరితం చేస్తూ పర్యావరణానికి పెద్ద శాపంగా మారాయి. మరోవైపు, రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ‘స్వచ్ఛమైన ఇంధనం’ కోసం శాస్త్ర పరిశోధనా రంగం వెతుకులాటలో ఉంది. ఒకవేళ మనల్ని వేధిస్తున్న ఈ ప్లాస్టిక్కే... స్వచ్ఛమైన ఇంధనంగా మారిపోతే? ఆహా, ఆ ఊహే ఎంత ఊరటగా ఉంది!

    ఇకపై అది ఊహ కాకపోవచ్చు. త్వరలోనే ఈ అద్భుతం జరగొచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు సౌరశక్తిని ఉపయోగించి, ప్లాస్టిక్‌ వ్యర్థాలను అత్యంత స్వచ్ఛమైన ‘హైడ్రోజన్‌ ఇంధనం’గా మార్చే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ఒక వ్యర్థ పదార్థాన్ని, దేశాన్ని నడిపించే ఇంధన వనరుగా మార్చే ఈ ప్రయోగం నిజంగానే సఫలం అవుతుందా?

    ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటి?  
    మైనస్‌ ఇంటూ మైనస్‌ = ప్లస్‌ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సమస్యలైన ప్లాస్టిక్‌ కాలుష్యం, పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛమైన ఇంధనం (క్లీన్‌ ఎనర్జీ) కొరతలను ఒకేసారి పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అడిలైడ్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని జియావో లూ నేతృత్వంలో జరిగిన ఒక తాజా పరిశోధన దీని గురించి వివరించింది. పనికిరాని ప్లాస్టిక్‌ను సౌరశక్తితో.. హైడ్రోజన్, సింగ్యాస్, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా ఎలా మార్చవచ్చో ఈ పరిశోధన చూపించింది. 

    ప్లాస్టిక్‌ వస్తువులకు ఈ విధంగా మళ్లీ విలువ కల్పించడం ద్వారా, పర్యావరణానికి మేలు చేసే ఒక స్థిరమైన, ‘సర్క్యులర్‌ ఎకానమీ’ (వనరులను వృథా చేయకుండా వాటినే పదే పదే ఉపయోగించడం)  వ్యవస్థను నిర్మించడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. సింగ్యాస్‌ అంటే.. ఒక రకమైన వాయువుల మిశ్రమం. ముఖ్యంగా కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోజన్‌ల కలయిక. దీనిని ఇంధనంగా వాడతారు. 

    తివిరి ప్లాస్టిక్‌న తైలంబు..!
    ప్రపంచవ్యాప్తంగా యేటా 45 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతోంది. ఆ ప్లాస్టిక్‌లో ఎక్కువ భాగం భూమిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. అదే సమయంలో, పర్యావరణానికి హాని చేసే బొగ్గు, పెట్రోల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం పెరగడంతో.. ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన ఇంధనాల కోసం అన్వేషణ ముమ్మరమైంది. శిలాజ ఇంధనాలు అంటే తెలిసిందే. భూమి పొరల నుండి లభించే బొగ్గు, నూనె, గ్యాస్‌ వంటివి. వీటి వల్ల కాలుష్యం పెరుగుతుంది.

    ‘కెమ్‌ క్యాటలిసిస్‌’ అనే సైన్స్‌ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన.. ప్లాస్టిక్‌లో కార్బన్, హైడ్రోజన్‌ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్లాస్టిక్‌ను కేవలం ఒక వ్యర్థ పదార్థంలా కాకుండా, ఒక ఉపయోగకరమైన వనరుగా చూడవచ్చని చెబుతోంది. కార్బన్, హైడ్రోజన్‌.. ప్లాస్టిక్‌ తయారీలో ఉండే ముఖ్యమైన రసాయన మూలకాలు. ఇవే ఇంధనంగా మారడానికి దోహదపడతాయి.

    ఆశాజనకమైన ఫలితాలు
    అడిలైడ్‌ యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌’ సీనియర్‌ ప్రొఫెసర్‌ జియావోగువాంగ్‌ డువాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల చేసిన ప్రయోగాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఎలాంటి ఆటంకం లేకుండా 100 గంటలకు పైగా నిరంతరాయంగా ఈ సాంకేతికత ఎంత స్థిరంగా సమర్థంగా పనిచేయగలదో ఈ ప్రయోగాలు నిరూపించాయి. 

    ఈ ప్రయోగాల ద్వారా పెద్ద మొత్తంలో హైడ్రోజన్‌ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, పరిశ్రమలలో వాడే ఎసిటిక్‌ యాసిడ్, డీజిల్‌ లాంటి హైడ్రోకార్బన్లు కూడా తయారైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఎసిటిక్‌ యాసిడ్‌ అనేది పరిశ్రమలలో రసాయనాల తయారీకి, నిత్యజీవితంలో వెనిగర్‌  రూపంలో వాడే ఒక ఆమ్లం. హైడ్రోకార్బన్‌లనేవి పరమాణువులతో తయారయ్యే సమ్మేళనాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ వంటి ఇంధనాలన్నీ హైడ్రోకార్బన్ల కిందికే వస్తాయి. 

    సవాళ్లు కూడా ఉన్నాయి
    ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఈ పరిశోధనలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈ సాంకేతికతను భారీస్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ‘‘ఇందులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ప్లాస్టిక్‌ వ్యర్థాల స్వభావం చాలా సంక్లిష్టంగా ఉండటం’’ అని ప్రొఫెసర్‌ డువాన్‌ అంటారు. ‘‘వేర్వేరు రకాల ప్లాస్టిక్‌లు ఇంధనంగా మారేటప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. 

    అంతేకాకుండా, ప్లాస్టిక్‌లలో ఉండే రంగులు, స్టెబిలైజర్లు (ప్లాస్టిక్‌ మన్నికను పెంచే రసాయనాలు) ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు. అందువల్ల, మంచి ఫలితాలను, నాణ్యమైన ఇంధనాన్ని పొందాలంటే.. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సరిగ్గా వర్గీకరించడం, ముందుగా శుద్ధి చేయడం చాలా అవసరం’’ అని డువాన్‌ చెబుతున్నారు. 

    భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం
    ఈ సాంకేతికతను ప్రయోగశాల నుండి పరిశ్రమల స్థాయికి ఎలా తీసుకువెళ్లాలో వివరించే కొన్ని ముఖ్యమైన దశలను పరిశోధకుల బృందం సిద్ధం చేసింది. రాబోయే దశాబ్దాలలో ఈ క్లీన్‌ హైడ్రోజన్‌ ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, పరిశ్రమలలో ఇది అంతరాయం లేకుండా పనిచేసేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యాలు. ‘‘ఇది చాలా ఆసక్తికరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం’’ అని పరిశోధకురాలు జియావో లూ గొప్ప ఉత్తేజంతో చెబుతున్నారు. 

    ‘‘కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగితే.. సౌరశక్తితో ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చే ఈ సాంకేతికతలు... భవిష్యత్తులో కాలుష్యం లేని, పర్యావరణహితమైన సమాజాన్ని నిర్మించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాం’’ అని ఆమె అంటున్నారు.

    ‘ఇంజినీరింగ్‌’ అడ్డంకులు
    ఈ ప్రక్రియ ద్వారా చివరకు తయారయ్యే ఇంధనాలను, రసాయనాలను ఒకదానికొకటి వేరు చేయడం కూడా ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఈ రసాయన చర్యల వల్ల వాయువులు, ద్రవాల మిశ్రమం ఉత్పత్తి అవుతాయి. వీటిని విడివిడిగా వేరు చేయాలంటే భారీగా శక్తిని (విద్యుతు, లేదా వేడిని) ఉపయోగించాల్సి వస్తుంది. 

    దీనివల్ల, పర్యావరణాన్ని కాపాడాలనే ఈ మొత్తం ప్రక్రియ అసలు ఉద్దేశానికే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ సమస్యలను దాటేందుకు, పరిశోధకులు అన్ని విభాగాలను సమన్వయం చేసే ఒక సమీకృత వ్యూహం అవసరమని గట్టిగా చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను హైడ్రోజన్‌గా మార్చేందుకు వేటివేటిని మెరుగుపరచాలో వారు చెబుతున్నారు. అవి:

    క్యాటలిస్ట్‌ డిజైన్‌: కాంతి ఉత్ప్రేరకాల పనితీరును మరింత నాణ్యంగా మార్చటం.
    రియాక్టర్‌ ఇంజనీరింగ్‌: రసాయన చర్యలు జరిగే పాత్రలు లేదా యంత్రాలను మరింత సమర్థవంతంగా తయారు చేయడం.
    సిస్టమ్‌ ఆప్టిమైజేషన్‌: యంత్రాలు, రసాయనాలు, మానవ శ్రమతో కూడిన మొత్తం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం.

    పాస్టిక్‌ను ఇంధనంగా ఎలా మారుస్తారు?
    సౌరశక్తితో ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చే విధానాన్ని ‘సోలార్‌–డ్రివెన్‌ ఫొటోరిఫార్మింగ్‌’ అంటారు. ఇది సూర్యకాంతికి స్పందించే ‘కాంతి ఉత్ప్రేరకాలు’ (ఫొటోక్యాటలిస్ట్‌లు) అనే ప్రత్యేక పదార్థాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. ప్లాస్టిక్‌ను సిద్ధం చేయడం సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను మొదట బాగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఎందుకంటే పెద్ద ప్లాస్టిక్‌ వస్తువుల కంటే చిన్న ముక్కలపై రసాయన చర్య చాలా వేగంగా జరుగుతుంది.

    ఫోటోక్యాటలిస్ట్‌ను కలపడం
    ఈ చిన్న ప్లాస్టిక్‌ ముక్కలను ఒక ప్రత్యేకమైన ద్రవంలో ముంచుతారు. అందులో ‘ఫొటోక్యాటలిస్ట్‌’ అనే ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఫొటోక్యాటలిస్ట్‌ అనేది సూర్యకాంతిని తనపై పడగానే క్రియాశీలం అయి, రసాయన చర్యలను అత్యంత వేగంగా జరిగేలా చేసే ఒక ఉత్ప్రేరకం.

    సూర్యకాంతి ప్రయోగం
    ఇప్పుడు ఈ మిశ్రమంపై సూర్యకాంతి పడేలా చేస్తారు. ఇక్కడే అసలైన అద్భుతం జరుగుతుంది. ప్లాస్టిక్‌ ముక్కల్లో కార్బన్, హైడ్రోజన్‌ పరమాణువులు ఒకదానికొకటి గట్టిగా అంటుకుని ఉంటాయి. సూర్యకాంతిలోని శక్తిని ఫొటోక్యాటలిస్ట్‌ గ్రహించి, ఆ శక్తితో ప్లాస్టిక్‌లో ఉన్న ఈ కార్బన్‌– హైడ్రోజన్‌ బంధాలను ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది.

    ఇంధనం విడుదల అవటం
    బంధాలు విడిపోగానే, ప్లాస్టిక్‌ నుండి విడిపోయిన హైడ్రోజన్‌ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి హైడ్రోజన్‌ వాయువుగా మారి పైకి విడుదలవుతాయి. దీనిని శాస్త్రవేత్తలు ప్రత్యేక గొట్టాల ద్వారా సిలిండర్లలో భద్రపరుస్తారు. మిగిలిన కార్బన్‌ భాగం పరిశ్రమలలో వాడే ఇతర ఉపయోగకరమైన రసాయనాలుగా (ఎసిటిక్‌ యాసిడ్‌ లేదా డీజిల్‌ వంటి హైడ్రోకార్బన్లు) మారుతుంది.  

    సాక్షి స్పెషల్‌ డెస్క్‌

  • బరువు తగ్గడం అనగానే తీవ్రమైన జిమ్‌ సెషన్‌లు, అధిక వ్యాయామాలు, స్ట్రిక్ట్‌ డైట్‌ తప్పనిసరని అనుకుంటాం. అలాగే చాలామంది శ్రమతో కూడిన వ్యాయామాలు చేసి..చివరికి శరీరం అలిసిపోయి..మా వల్ల కాదని మధ్యలోనే వెయిట్‌లాస్‌ జర్నీని వదిలేస్తుంటారు. అయితే అలా ఇబ్బందిపడకుండా కొద్దిపాటి వ్యాయామాలతోనే సులభంగా కేజీల కొద్దీ బరువు తగ్గొచ్చని అంటున్నారు ఫ్యాట్ లాస్ కోచ్. కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించకుండా, కేలరీలను బర్న్ చేసే చిన్నపాటి వ్యాయామాలు కూడా ఉన్నాయని అంటున్నురామె. అదెలాగో తెలుసుకుందామా.!.

    అధికబరువుతో ఉండి కొవ్వు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే..వర్కౌట్‌లు చాలా ప్రభావవంతంగా ఉంటాయంటున్నారామె. అయితే కీళ్లకు నొప్పి కలిగించి, ప్రేరణను దూరం చేసే అధిక ప్రభావ వ్యాయామాలతో ప్రయత్నించమని చెబుతున్నారు. మోకాళ్లు,  కీళ్లను దెబ్బతీయకుండా కొవ్వును కరిగించే, క్రమబద్ధమైన, తక్కువ-ప్రభావం, అధిక-తీవ్రత గల వ్యాయామాలను ఎంచుకోమని చెబుతున్నారు.

    స్టాండింగ్ జాక్స్
    తక్కువ-ప్రభావం గల స్టాండింగ్ జాక్స్ మీ హృదయ స్పందన రేటును పెంచడానికి మరియు కేలరీలను కరిగించడానికి కీళ్లకు అనుకూలమైన మార్గం. ఒక పాదాన్ని నేలపై ఉంచడం ద్వారా, మొత్తం శరీరాన్ని నిమగ్నం చేస్తూనే ప్రభావాన్ని తగ్గిస్తారు. కొవ్వు తగ్గించే కోచ్ నియంత్రిత కదలికతో 20 సార్లు చేయమని సిఫార్సు చేస్తున్నారు.

    స్టాండింగ్ హై నీస్
    ఒక పాదాన్ని నేలపై ఉంచి, మోకాళ్లను మీ ఛాతీ వరకు పైకి లేపండి. ఈ వ్యాయామం మీ కోర్‌ను తీవ్రంగా నిమగ్నం చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. చేసే వేగం ఆధారంగా కచ్చితంగా ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తారనేది ఆధారపడి ఉంటుంది. అందుకోస ఆన్‌లైన్ కేలరీ బర్న్ కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ కదలికను స్థిరమైన వేగంతో 20 సార్లు యండి.

    పల్స్ స్క్వాట్స్
    ఈ బాడీవెయిట్ వ్యాయామం కీళ్ళను సురక్షితంగా ఉంచుతూనే,క్వాడ్స్ (తొడ ముందు కండరాలు), గ్లూట్స్ (పిరుదులు), కోర్ (శరీర మధ్యభాగం) కండరాలను ఉత్తేజపరుస్తుంది. సాధారణ స్క్వాట్‌లో ఉండే పూర్తిగా నిలబడి, తిరిగి యధాస్థానానికి వచ్చే కదలికను తొలగించడం ద్వారా,కండరాలపై నిరంతర ఒత్తిడిని ఉంచుతారు. ఇది లీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియ రేటు పెంచడానికి సహాయపడుతుంది.

    వాల్ క్లైంబర్
    పాదాలను నేలపై స్థిరంగా ఉంచి, 30 రెప్స్ చేయడం వల్ల భుజాలు, ఛాతీ, కోర్ కండరాలు ఉత్తేజితమవుతాయి. ఇది హృదయ స్పందన రేటును పెంచుతూ, మోకాళ్లు కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల కేలరీలను కరిగించడంలో సహాయపడే కార్డియోవాస్కులర్ ప్రభావం ఏర్పడుతుంది.

    వివరాలకు ఈ వీడియోపై క్లిక్‌ చేయండి

    (చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి)

     

     

  • చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్‌ లూజ్‌గా ఉన్నాయని ఫీల్‌ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్‌ ట్రెండీ ఫ్యాషన్స్‌లో ఇప్పుడు ఓవర్‌సైజ్డ్, రిలాక్స్‌డ్‌ ఫిట్‌ కూడా ఒక హాట్‌ స్టయిల్‌గా మారిపోయింది. అందుకే, లూజ్‌గా, లైట్‌గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్‌ఫిట్స్‌ సమ్మర్‌లో కంఫర్ట్‌తో పాటు స్టయిల్‌ కూడా ఇస్తున్నాయి.

    హీరో లినెన్‌ !
    సమ్మర్‌ అనగానే గుర్తొచ్చేది లినెన్‌  బట్టలే. వీటిల్లో రిసార్ట్‌ కాలర్‌ అంటే ఓపెన్‌ కాలర్‌ షర్ట్స్‌ వేసుకుంటే పక్కా బీచ్‌ వైబ్‌ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్‌ ఫిట్టెడ్‌ టీషర్ట్‌ వేసి, పైన షర్ట్‌ బటన్స్‌ తీసేసి ఓపెన్‌గా వదిలేయండి. లేయర్డ్‌ లుక్‌ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. 

    నిట్టెడ్‌ పోలోస్‌కి క్లాస్‌
    రెగ్యులర్‌ కాలర్‌ టీషర్ట్స్‌ బోర్‌ కొడితే, ఈ నిట్టెడ్‌ అంటే అల్లిక డిజైన్‌  పోలోస్‌ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్‌ కూడా ఇస్తాయి.

    వైడ్‌ లెగ్‌ ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌ కింద లూజ్‌గా ఉంటూ, పైన ప్లీట్స్‌ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్‌ లుక్‌ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్‌ మీటింగ్స్‌ లేదా స్మార్ట్‌ క్యాజువల్‌ ఈవెంట్స్‌కి కూడా పర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతాయి. లైట్‌ కలర్స్‌లో ప్లీటెడ్‌ ట్రౌజర్స్‌ వేసుకుని, లోఫర్స్‌ జోడిస్తే సమ్మర్‌ ఫ్యాషన్‌లో మీరే టాపర్‌!

    డ్రాస్ట్రింగ్‌ లినెన్‌ ప్యాంట్స్‌
    బెల్ట్‌ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్‌  ప్యాంట్లు బెస్ట్‌ చాయిస్‌. క్యాజువల్‌ అవుటింగ్స్, ఈవినింగ్‌ వాక్స్, ట్రావెల్స్‌ ఏదైనా సరే ఈజీగా సెట్‌ అయిపోతాయి.

    జాగ్రత్తలు!

    లూజ్‌ ఫిట్‌ అంటే చాలా పెద్ద సైజ్‌ కాదు. లేదంటే బెడ్‌షీట్‌లా కనిపించే చాన్స్‌ ఉంది.

    లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్స్‌ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్‌ అయితే సమ్మర్‌లో భరించలేరు.

    ఒక ఔట్‌ఫిట్‌లో చాలా ప్రింట్స్‌ వద్దు. రిలాక్స్‌డ్‌ ఫిట్‌ అంటే క్లీన్, సింపుల్‌ లుక్‌ బెటర్‌.

    లైట్‌ కలర్స్‌ వేసుకుంటే సమ్మర్‌లో కూల్‌గా కనిపిస్తారు. బ్లాక్‌తో పూర్తి ఔట్‌ఫిట్‌ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్‌గా కనెక్ట్‌ అయిపోతాడు! 
    కొండి దీపిక

    (చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..)

  • కొందరు కేవలం పర్యాటనలకు వెళ్లి వచ్చేయరు. పర్యావరణ స్ఫూర్తిని రగిలించే ఆలోచింప చేస్తారు. అందుకు దేశం, సరిహద్దుతో పనిలేదు. మంచి మనసు, తనవంతుగా పర్యావరణానికి మేలు చేయాలన్న దృక్పథం చాలు అని నిరూపిస్తున్నాడు ఈ విదేశీయుడు. అంతేగాదు అతడి చర్యకు అక్కడి ప్రభుత్వం స్పందించి కదలివచ్చింది కూడా.

    పర్యావరణ బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తూ..అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు బ్రిటన్‌కు చెందిన మార్క్‌. ఆయన ఉత్తరాఖండ్‌లోని కాసర్‌ దేవి ప్రాంతంలో అటవీ మార్గాలు, పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిశబ్దంగా ఏరుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సంచులు చేత బట్టుకుని సుందరమైన కొండ ప్రాంతంలో పడి ఉన్న ప్లాస్టిక్‌ను, చెత్తను ఏరుతూ కనిపించాడు. 

    అక్కడి స్థానికుల ప్రకారం..మార్క్ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడట. పైగా పరిశుభ్రతను తన వ్యక్తిగత దినచర్యగా మార్చుకున్నాడని చెబుతున్నారు. అతను ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు సమీపంలోని అటవీ ప్రాంతాలను కాలిబాటను శుభ్రం చేస్తూ..ఆ ప్రాంత సహజ సౌందర్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని కృషి ఆన్‌లైన్‌లో విశేష ప్రచారం పొందింది.  అతడు చేస్తున్న పని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పిందని అక్కడకి వస్తున్న పలువురు పర్యాటకులు చెబుతుండటం విశేషం.

    అంతేగాదు అతడొ చొరవకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఫిదా అవ్వతూ అతడిని అభినిందించింది. అలాగే అతడికి అన్ని విధాల మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అంతేగాదు అక్కడి అధికారులు పర్యావరణం, పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పించడంలో సానుకూల ఉదహారణగా నిలిచాడని ప్రశంసించారు. అంతేగాదు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత పట్ల విద్యార్థులను, యువతను ప్రేరేపించే విధంగా మార్క్‌ను ఒక "మార్పు కారకుడిగా" ప్రోత్సహించాలని పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

     

    (చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..)
     

  • చదవాలన్న కోరిక బలంగా ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. అయితే ఓ మహిళ కుటుంబ బాధ్యతలతో తలమునకలులవ్వుతూ ఐదుపదుల వయసులో చదవాలనుకోవడం అంటే.. అంత ఈజీ కాదు. మాటల్లో చెప్పినంత సులువు కూడా కాదు. కానీ ఓ మహిళా దాన్ని సాధ్యం చేసి చూపించింది అది కూడా 52 ఏళ్ల వయసులో. కష్టపడి చదవడానికి భయపడే యువతరానికి ఆమె కథ ఓ స్ఫూర్తి.

    గుజరాత్‌కు చెందిన, కామర్స్ గ్రాడ్యుయేట్  అనితా కప్డి 23 ఏళ్ల పాటు విద్యార్థులకు ఆర్ట్ అండ్‌ క్రాఫ్ట్ బోధించారు. అయితే, ఆమెకు గణితం, అకౌంటెన్సీలో మంచి అభిరుచి, నైపుణ్యం ఉన్నాయామెకు. పూర్తికాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఎంకామ్‌, బీఎడ్‌ పూర్తి చేశారామె. అలాగే ఆమెకు సీఏ చేయాలనే జీవితకాల డ్రీమ్‌ కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే 48 ఏళ్ల వయసులో, పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు ఎలాగైనా సీఏ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. పైగా ఆ సీఏ డిగ్రీని తన సీఏ తండ్రి (ఒక కంపెనీ సెక్రటరీ) 75వ పుట్టినరోజుకి గిఫ్ట్‌గా ఇవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. 

    అలా ఆమె 2012లో, ఆమె ICAI డైరెక్ట్ ఎంట్రీ మార్గం ద్వారా సీఏ(CA) కోసం నమోదు చేసుకున్నారామె. అలా అని హాయిగా కూర్చొని చదువుకునే తీరిక మాత్రం లేదు. ఆమె చదవుకోవాలనే జర్నీ ఎంతో సవాలుతో మొదలైంది. ఒక పక్క కుమార్తె వివాహ సన్నహాలు, మరోవైపు కుమారుడి బోర్డు పరీక్షలకు మద్దతివ్వడం, వంటి కుటుంబ బాధ్యతలతో సతమతమవ్వుతూనే సీఏకి ప్రిపరయ్యారామె. పైగా కోచింగ్‌ లేకుండా సీఏ రెండో దశ ఐపీసీసీ(IPCC)ని క్లియర్‌ చేసింది. 

    ఆ తర్వాత కూడా సరిగ్గా చదువుకునే అవకాశం చిక్కలేదు అనితకు. సరిగ్గా సీఏ ఫైనల్‌ పరీక్షలకు సన్నద్ధమవ్వుతుండగా అత్తగారిని కోల్పోవడం, ఆ బంధువుల హడావిడి మధ్య అలానే నిశబ్దంగా చదువు కొనసాగించి అనుకున్నట్లుగా క్లియర్‌ చేసి సీఏ అయ్యారామె. అలాగే అనిత తను కోరుకున్నట్లుగానే తండ్రి 75వ పుట్టినరోజు నాడు సీఏ డిగ్రీని గిఫ్ట్‌గా ఇచ్చింది. అలా అనిత 52 ఏళ్ల వయసులో సీఏ అయ్యింది. 

    (చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపునులు సైతం..)
     

  • రోజంతా అలసిపోయిన తర్వాత లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం కోసం ఆరాటపడుతున్నారా? అది ఐస్‌క్రీమ్ కావచ్చు, వేడి వేడి ఫ్రైస్ కావచ్చు లేదా ఇంట్లో వండిన పప్పు అన్నం కావచ్చు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మనసులోని భావోద్వేగాలకు ఉపశమనంగా కంఫర్ట్ ఫుడ్ పనిచేస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.

    తీపి వంటకాలతో ఓదార్పు
    చాలామంది కష్టకాలంలో చాక్లెట్లు, స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. చక్కెర పదార్థాలు మెదడులో తాత్కాలికంగా ‘ఫీల్-గుడ్’ రసాయనాలను విడుదల చేస్తాయి. ఒంటరితనంగా లేదా బాధగా ఉన్నప్పుడు, ఈ తీపి పదార్థాలు మనసుకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి మనసుకు అశాంతి నుంచి తాత్కాలిక ఊరటను ప్రసాదిస్తాయి.

    జ్ఞాపకాలతో ముడిపడిన ఆహారం
    వేడి సూప్ లేదా తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటకాలు మనకు భద్రతా భావాన్ని, ఆత్మీయతను అందిస్తాయి. అలాగే, స్పైసీ ఫుడ్ తినేవారిలో ఉత్సాహం కోసం లేదా బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తదనం కోసం ఆరాటపడే మనస్తత్వం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఒత్తిడిలో కరకరలాడే ఆహారం
    చిప్స్ లేదా పాప్‌కార్న్ వంటి కరకరలాడే ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు నమ్ముతారు. నమలడం అనే ప్రక్రియ శారీరక ఉద్రిక్తతను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మీ మనసు ఏం కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్లేట్‌లో ఉన్నది కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ హృదయపు అలజడి.

    ఇది కూడా చదవండి: కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్‌తో లైఫ్ హ్యాపీ!

  • కొన్ని వస్తువులతో గొప్ప ఎమోషన్‌ ఉంటుంది. ఎన్ని సరికొత్త ట్రెండ్‌లు వచ్చినా..ఆ వస్తువులనే పదేపదే వాడతాం. అవి మనకు ఓదార్పు, ప్రియమైన లేదా ఇష్టమైన వ్యక్తులు మనతో ఉన్న అనుభూతిని అందిస్తూ సదా ధైర్యాన్ని ఇస్తుంటాయ్‌. ఆ విషయమైన చెబుతున్నాడు ఈ బాలీవుడ్‌ బుల్లితెర నటుడు. మనలో ఇలాంటి భావోద్వేగ కనెక్టివిటీ ఉన్నవాళ్లు ఉన్నారంటూ తన భావోద్వేగ కథను పంచుకున్నారు. 

    బుల్లితెర నటుడు, హోస్ట్‌  రాజీవ్ ఖండేల్వాల్, ప్రతి ఉదయం 56 ఏళ్ల నాటి టీ కప్పులలో టీ తాగే తన దినచర్యకు సంబంధించిన ఒక భావోద్వేగ జ్ఞాపకాన్ని షేర్‌ చేసుకున్నారు. తన అమ్మ నాన్న చనిపోయినప్పుడు 70వ దశకంలో తను కొన్న కప్పులను మాత్రమే వాడాలని నిర్ణయించుకుని ఇప్పటికీ వాటిల్లోనే టీ తాగుతుంటానని అన్నారు. తన రోజు మొదలయ్యేది కూడా ఆ కప్పులోని టీ సిప్‌తోనే అని అన్నారు. 

    అవే ఎందుకంటే..1970లో వాళ్ళ పెళ్లి సమయంలో... ఈశాన్యంలో బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్లారని, అక్కడే తన తండ్రికి పోస్టింగ్‌ ఉండేదని చెప్పుకొచ్చారు. 2019లో అమ్మ, 2022లో నాన్న చనిపోయినప్పుడూ..ఏమేమి తీసుకువెళ్లాలని చర్చిస్తుండగా..తాను ఈ కప్పులు కావాలని అడిగానని అన్నారు.  తన తల్లి   కొన్న ఆ ఐదు కప్పులు, సాసర్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయన్నారు. 

    ప్రతి ఉదయం వీటిలోనే టీ తాగుతానని చెప్పారు. ఈ అలవాటు మన వాళ్లను కోల్పోయిన బాధకు ఉపశమనంగా, ఆ వస్తువులు వ్యామోహంతో కూడిన విలువను కలిగి ఉంటాయన్నారు. మానవువుల కేవలం మనుషులతోనే బంధాలు ఏర్పరుచుకోరని మనం ప్రేమించే వ్యక్తులతో ముడిపడి ఉన్న ఆచారాలను, వాసనలు, ప్రదేశాలు, దినచర్యలు, వస్తువులు, స్పర్శలు, వంటి వాటితో బంధాలను ఏర్పరుచుకుంటామని అన్నారు. చూడటానికి అవి వస్తువులే గానీ అంతకుమంచి.. అనుబంధాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా దఃఖం నుంచి కోలుకుని ముందుకు సాగడానికి, భావోద్వేగపరంగా స్ట్రాంగ్‌గా మారడానికి హెల్ప్‌ అవుతాయని అంటున్నారు. 

    భద్రత, అనుబంధాన్ని కొనసాగించడం..
    మానసిక నిపుణులు దుఃఖానికి మందు, భావోద్వేగ భద్రతను ఇస్తుందని ఇది సరైనదనే అంటున్నారు. ఒక తండ్రి తన దివంగత భార్య మొక్కలకు నీరు పోసినట్లుగానే తాను చేస్తుంటాడు. ఒక కుమార్తె తన తల్లి శాలువాను మడిచి దిండు పక్కన పెట్టుకుంటుంది. ఒక కుమారుడు ప్రతి ఉదయం తన తల్లిదండ్రులకు ఇష్టమైన కప్పులో టీ తయారుచేస్తూనే ఉంటాడు. ఇవన్నీ వాళ్లతో ఉన్న అనుబంధాలకు సజీవ సాక్ష్యాలు, కొనసాగింపు అంటున్నారు. 

    ఇవి వారికి దుఃఖం నుంచి బయటపడేసి, కోల్పోయిన వ్యక్తులు తమతో ఉన్నారనే భావోద్వేగ భద్రత, మద్దతను ఇవ్వడమే గాక, ధైర్యంగా లైఫ్‌ని లీడ్‌ చేసేందుకు దోహదపడుతుందని అంటున్నారు. ఒక్కోసారి వారి జ్ఞాపకాలు మోయలేనంతగా మారినప్పుడూ..ఒంటరిగా ఉండకుండా..సాముహిక సేవ, ప్రార్థన, పని, వ్యాయామం వంటి పనులతో మమేకమవ్వాలంటున్నారు. 

    అలానే పూర్తిగా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆ వస్తువులే పరమావధిగా కాకుండా ఆ జ్ఞాపకాలతో ముందుకు సాగండని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒక్కోసారి ఆయా వస్తువులు కూడా కాలక్రమేణ పాడయ్యే అవకాశం ఉంది, కాబట్టి అది మనల్ని కుంగదీయకముందే అంతరంగికంగా స్ట్రాంగ్‌గా ఉండేలా స్థిరంగా ఉండండని చెబుతున్నారు.

     

    (చదవండి: డెలివరీ సమయంలో బ్లడ్‌ అరేంజ్మెంట్‌కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?)

     

Sangareddy

  • ఇప్పటికే జిల్లాలో విత్తనాల పంపిణీ

    చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): అధిక మొత్తంలో రసాయన ఎరువులు వినియోగించడం మూలంగా నేల భూసారాన్ని కోల్పోవడంతో పాటు, ప్రకృతికి సైతం హాని జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,285 క్వింటాళ్ల జీలుగ, 1030 క్వింటాళ్ల జనుము విత్తనాలను అధికారులు పంపిణీ చేశారు. కాగా ఇవి రెండు కలిపి మరో 715, 180 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీలుగ 30 కేజీల బస్తా ధర రూ.2452 ఉండగా ఎకరాకు 12 నుంచి 16 కిలోలు, జనుము 40 కేజీల బస్తా ధర రూ.3110 ఉండగ.. ఎకరాకు 16 నుంచి 20 కిలోల వరకు చల్లుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    జీలుగతో భూసారం పెరుగుదల

    జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. 35 నుంచి 45 రోజుల వరకు పెరిగిన జీలుగ మొక్కలను నేలలోనే కలియదున్నితే సుమారు 12 టన్నుల జీవపదార్థం నేలలో చేరుతుంది. దీంతో సేంద్రియ కర్బనం పెరిగి భూమి సారవంతమవడంతో పాటు, సూక్ష్మజీవుల పెంపకం, తెగుళ్ల నివారణ, నీటి నిల్వ సామర్థ్యం పెరగుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పంట దిగుబడిని కొంతవరకు పెంచుతుంది.

    జనుము ప్రయోజనాలు

    పర్యావరణ అభివృద్ధికి జనుము కీలక పంట అని, పూత దశకు వచ్చిన తర్వాత నేలలో కలియదున్నడం మూలంగా పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. కాగా పంట ఏపుగా పెరగడంతో కలుపు మొక్కలను సైతం అణిచి వేస్తుంది. తర్వాత వేరే పంట సాగు చేస్తే కలుపు నివారణ సులభం అవుతుంది. ఈ పంట పశుగ్రాసానికి సైతం వినియోగించుకోవచ్చు. సాగు వల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గి, భూసారంతో పాటు పంట దిగుబడి సైతం పెరుగుతుంది.