Archive Page | Sakshi
Sakshi News home page

International

  • బస్సులోనో, ట్రైన్‌లోనో వెళ్తున్నప్పుడు.. 'నాకు విండో సీటే కావాలి' అని పిల్లలు మారాం చేయడం చూస్తుంటాం. బయట కనిపించే ప్రకృతి అందాల కోసం ఆ ఆత్రుత. అయితే ట్రైన్‌లో కూర్చున్న వారందరికీ విండో సీటే అయితే? బయటి ప్రపంచం మొత్తం అద్దాల్లా మన ముందుంటే? ఎలా ఉంటుంది. ఈ కలను నిజం చేసింది నార్వే.

    నార్వే ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రత్యేకమైన పానొరమిక్ నైట్ ట్రైన్‌ని ప్రారంభించింది. ఈ ట్రైన్ పేరు 'మిడ్‌నైట్ అరోరా రూట్'. ప్రత్యేకంగా నార్తర్న్ లైట్స్‌ని చూడటానికి వచ్చే పర్యాటకుల కోసం దీన్ని రూపొందించారు. సాధారణంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు నార్వే ఆర్కిటిక్ ప్రాంతంలో ఆకాశమంతా రంగుల కాంతులు మెరుస్తుంటాయి. వాటినే నార్తర్న్ లైట్స్ అంటారు. ప్రత్యేకంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ఇవి చూడటానికి మంచి టైమ్. ఈ సమయంలో రాత్రులు ఎక్కువగా ఉంటాయి. ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ట్రోమ్సో నగరానికి వేలాది పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసేందుకే వస్తుంటారు.

    ఈ ట్రైన్ భోగీలు పూర్తిగా గాజుతో తయారు చేశారు. గాజు గోడలు, గాజు పైకప్పు అంటే ట్రైన్ లోపల కూర్చున్నా 360 డిగ్రీల కోణంలో బయట ప్రకృతి అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకాశం అంతా విరిసే అరోరా రంగులు, మెరిసే నక్షత్రాలు, మంచుతో కప్పుకున్న పర్వతాలు, జలపాతాలు అన్నీ ఒకే ఫ్రేమ్‌లో!

    ఆర్కిటిక్ ప్రాంతం అంటే గడ్డ కట్టే చలి. కానీ ట్రైన్‌లో ప్రయాణికుల కోసం హీటెడ్ సీట్లు, వెచ్చని బ్లాంకెట్లు ఏర్పాటు చేశారు. బయట మంచు లోపల వెచ్చదనం.. అదే ఈ ప్రయాణం ప్రత్యేకత. ఇంకో ఆసక్తికర విషయం ఏవటంటే ఈ ట్రైన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. అంటే ప్రకృతి మధ్య ప్రయాణం. ప్రకృతిని కాపాడే శక్తితో! నార్వే మాత్రమే కాదు స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్‌లాండ్, కెనడా, అలాస్కా ప్రాంతాల్లో కూడా అరోరా కనిపిస్తుంది. కానీ ఇలా అద్దాల ట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడటం మాత్రం అరుదైన అనుభూతి.

  • రోడ్డు అంటే మనకు గుర్తొచ్చేది ట్రాఫిక్, హారన్‌లు, స్పీడ్ బ్రేకర్లు. కానీ ప్రపంచంలో కొన్ని చోట్ల రహదారులే సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. వీటినే 'మ్యూజికల్ రోడ్స్' అంటారు. ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్స్.. అంటే రోడ్డుపై పొడవైన కమ్మీలు లేదా గీతలు.. కారు వాటిపై నుంచి దూసుకెళ్తే వైబ్రేషన్ ద్వారా సంగీతాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా ఇవి డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ సృజనాత్మక ఆలోచనతో అదే స్ట్రిప్స్‌ను ప్రత్యేక దూరం, పొడవుతో అమర్చితే, కారు వెళ్లే వేగాన్ని బట్టి అవే ఒక మెలోడియస్ ట్యూన్‌గా మారిపోతాయి.

    ఇలా పాడే రహదారుల్లో అమెరికా ముందుంది. కాలిఫోర్నియాలోని లాంకాస్టర్ నగరంలో 'సివిక్ మ్యూజికల్ రోడ్' పేరుతో ఒక ప్రత్యేక రహదారి ఉంది. హైవే 14 సమీపంలోని అవెన్యూ జీలో, 30వ , 40వ వీధుల మధ్య ఉన్న పావు మైలు పొడవైన ఈ సెక్షన్‌పై గంటకు 50 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే ప్రసిద్ధమైన 'విలియం టెల్ ఓవర్చర్' స్వరాలు వినిపిస్తాయి. రోడ్డుపై కారు వెళుతుంది  కానీ వినిపించేది ఆర్కెస్ట్రా మ్యూజిక్!

    అసలు ఈ ప్రాజెక్ట్ 2008లో మొదట అవెన్యూ జీలో, నివాస ప్రాంతాలకు దూరంగా తిరిగి నిర్మించారు. హోండా సివిక్ బ్రాండ్ స్పాన్సర్ చేయడంతో దీనికి 'సివిక్ మ్యూజికల్ రోడ్' అనే పేరు వచ్చింది. స్వరంలో చిన్నచిన్న విరామాలు ఉన్నా ఆ అనుభూతి మాత్రం మరిచిపోలేనిది. ఇలా రోడ్డు నుంచి పాట వినేందుకు చాలా మంది డ్రైవర్లు ఒక్కసారే కాదు మళ్లీ మళ్లీ అదే రోడ్డుపై డ్రైవ్ చేస్తారు!

    ఇదే తరహాలో న్యూ మెక్సికోలో కూడా మరో మ్యూజికల్ రోడ్ ఉంది. చారిత్రాత్మక యూఎస్ రూట్ 66 సమీపంలోని టిజెరాస్ పట్టణం వద్ద, ఎన్ఎమ్ 333 రహదారిపై ప్రత్యేకంగా రూపొందించిన ఈ భాగంలో గంటకు 45 మైళ్ల వేగంతో డ్రైవ్ చేస్తే 'అమెరికా ది బ్యూటిఫుల్' స్వరాలు వినిపిస్తాయి. ఆ మెలోడి అంత స్పష్టంగా, అంత ప్రేరణాత్మకంగా ఉంటుంది కాబట్టి ప్రయాణం ఒక సంగీత యాత్రగా మారిపోతుంది.

    ఇలాంటి సంగీత రహదారులు జపాన్, దక్షిణ కొరియా, డెన్మార్క్, హంగేరీ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. కొన్ని జాతీయ గీతాలు ప్లే చేస్తాయి. కొన్ని క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తాయి. నిజానికి వీటిని డ్రైవింగ్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, డ్రైవర్లకు  ప్రయాణాన్ని మర్చిపోలేని జ్ఞాపకంగా  మార్చడం వీటి లక్ష్యం. ఒక చిన్న ఇంజినీరింగ్ ఐడియా.. ఒక సాధారణ రోడ్డును మ్యూజిక్ స్టేజ్‌గా మార్చింది. ఇకపై రోడ్డుపై డ్రైవ్ చేస్తూ బోర్ కొట్టేస్తే ఎక్కడో ఒకచోట రహదారే మీ కోసం పాట పాడుతుందేమో!

  • వాషింగ్టన్‌ డీసీ: హెచ్‌-1బీ వీసాల అమలులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌-1బీ వీసాలను రద్దు చేయాలని అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ ఎంపీ స్టూబ్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికాకు నష్టమన్న స్టూబ్‌.. అమెరికా యువతకు ఉద్యోగాలు రావడం లేదని వాదించారు. 

    అమెరికా కాంగ్రెస్‌లో ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ఒక సంచలనాత్మక బిల్లు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు పేరు  Ending Exploitative Imported Labour Exemptions Act (EXILE Act). దీని ద్వారా అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు.

    ‘విదేశీ కార్మికులను ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అమెరికా పౌరుల సంక్షేమం, అభివృద్ధి దెబ్బతింటోంది. ఇది జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం’అని అన్నారు. హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్ కారణంగా అమెరికా యువత, కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మన పిల్లలకు అమెరికన్ డ్రీమ్‌ను కాపాడాలంటే విదేశీయులకు పెద్దపీఠ వేయకూడదని స్పష్టం చేశారు.

    అదే సమయంలో గ్రెగ్‌ స్ట్యూబ్ బిల్లులో హెచ్‌-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా కార్మికులు ఎలా నష్టపోయారో ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు, 2015లో డిస్నీ 250 మంది ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో విదేశీ కార్మికులను హెచ్‌-1బీ వీసా ద్వారా తీసుకువచ్చింది. 2014లో సదర్న్ కాలిఫోర్నియా ఎడిసన్ 540 మంది ఉద్యోగులను తొలగించి, భారతీయ ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా వచ్చిన కార్మికులను నియమించింది. మైక్రోసాఫ్ట్‌లో 16,000 మంది ఉద్యోగులు తొలగింపులకు గురి కాగా.. ఆ సమయంలో 9వేల హెచ్‌-1బీ వీసాలు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు.

    ఈ బిల్లుతో అమెరికాలోని ఐటీ రంగం, ముఖ్యంగా భారతీయ వృత్తిపరులు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్‌-1బీ వీసాలు లేకుండా అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఇప్పటికే భారతదేశంలో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్నాయి. వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన అనేక మంది భారతీయులు అమెరికాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. 

  • బాలి: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్‌) కు ఇండోనేషియా తొలి దేశంగా సైనిక దళాలను పంపేందుకు సిద్ధమైంది.

    గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెనక్కి తగ్గిన తర్వాత, అక్కడి భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ శాంతి దళాలను ఏర్పాటు చేయాలని అమెరికా మధ్యవర్తిత్వంతో నిర్ణయించారు. ఈ దళాలు స్థానిక ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ, శాంతి వాతావరణాన్ని కొనసాగించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి. 

    ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా ఇప్పుడు గాజాకు సైనికులను పంపేందుకు ముందడుగు వేసింది. గతంలో యుఎఇ, ఈజిప్ట్, ఇటలీ, అజర్‌బైజాన్, పాకిస్తాన్, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా సహకారం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఏ దేశం కూడా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  

    పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వేలాది మంది ఇండోనేషియా సైనికులు గాజా దక్షిణ ప్రాంతంలో ప్రవేశించి, IDF స్థానాన్ని భర్తీ చేయనున్నారు. వీరు శాంతి భద్రతా చర్యలు, శరణార్థుల సహాయం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయనున్నారు.  

    ఇండోనేషియా నిర్ణయంపై అంతర్జాతీయంగా సానుకూల వాతవారణం నెలకొంది. ఇండోయనేషియా నిర్ణయంతో గాజా ప్రజలకు శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇతర దేశాలు కూడా త్వరలో తమ దళాలను పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    గాజాలో యుద్ధం తర్వాతి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ శాంతి దళాల ఏర్పాటులో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఇది కేవలం గాజా ప్రజలకు మాత్రమే కాకుండా, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కూడా ఒక కొత్త ఆశను కలిగిస్తోంది.

  • కీవ్‌: డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్‌పై అమెరికా విధిస్తున్న అధిక సుంకాలు తగ్గించారు. దానికి ప్రతీగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్నారు. అయితే భారత్ దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లవ్రోవ్ తొలిసారిగా ట్రంప్ వైఖరిపై స్పందించారు.

    ఇటీవలే ట్రంప్ తిరిగి భారత్‌కు స్నేహహస్తం అందిస్తున్నారు. ఇంతకాలం భారత్‌ను తన అంగబలం ఆర్థికబలంతో గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ట్రంప్ అది కుదరదనే తెలిసాక తిరిగి రాజీ బాట పట్టారు. భారత్ ఎగుమతులపై అమెరికా పెంచిన అధిక పన్నులను తగ్గిస్తున్నామని ప్రకటించారు. భారత్ సైతం దీనికి సానూకూలంగా స్పందించి ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ సమయంలో ట్రంప్ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అన్నారు. అయితే ఈ స్టేట్‌మెంట్‌పై భారత్ స్పందించలేదు. తాజా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ వ్రోవ్ ఈ అంశంపై స్పందించారు.

    సెర్గీయో లవ్రోవ్ మాట్లాడుతూ" ఉక్రెయిన్ సమస్య  పరిష్కరించాలని వారు  మాకు చెబుతున్నారు. మేము అమెరికా ప్రతిపాదనను అంగీకరించాము. అమెరికా స్థానం మాకు ముఖ్యమైనది. అయితే వారేమో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. సముద్ర చట్టాలపై ఉన్న UN కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తూ బహిరంగ సముద్రంలో ట్యాంకర్లపై యుద్ధం జరుపుతున్నారు. భారత్, ఇతర భాగస్వాములు చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా నిషేధం విధిస్తున్నారు. అధిక ధరలకు US, LNG  సహజ వాయువు కొనుగోలు చేయమని వారిని బలవంతం చేస్తున్నారు ” అని సెర్గీ లవ్రోవ్ అన్నారు.

    డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా అధిపత్యం సాధించేందుకు ప్రపంచ దేశాలపై పన్నుల ఆంక్షలతో విరుచుకపడుతున్నారని తెలిపారు. అయితే భారత్, చైనా, కెనడా వంటి దేశాలతో సహాకారం అందిస్తూనే మనం ఈ అమెరికా అ‍డ్డంకులను ఎదుర్కోవాలని సెర్గియో లవ్రోవ్ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారని అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని  సెర్గియో లవ్రోవ్ అన్నారు. అధిక ధరలకు చమురు కొనుగోలు చేస్తే ప్రజలపై భారం పడుతుంది కనుక దేశప్రజల ప్రయోజనాలే ఆ దేశానికి ప్రథమంగా ఉండాలని రష్యా విదేశాంగశాఖ మంత్రి తెలిపారు.

  • ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాయి. అందులో భాగంగానే పిల్లలకు పోషకాహార పథకాలు మెుదలు.. స్కూళ్లలో మద్యాహ్న భోజనాలు లాంటి ఏన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే యూఏఈ మాత్రం మరో అడుగు ముందుకేసి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య రక్షణకై కీలక నిర్ణయం తీసుకుంది.

    సాధారణంగా పిల్లలకు శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఇతరత్రా తీపి పదార్థాలతో పాటు జంక్ ఫుడ్‌ ఇష్టం ఉంటాయి. అయితే ఆ వయసులో వాటి వల్ల కలిగే నష్టం వారికి తెలియదు. అందుకే వాటిని ఇష్టపడుతూ తింటుంటారు.  ఈ నేపథ్యంలో పిల్లల్లో క్రమశిక్షణను పెంచడంతో పాటు వారి ఆరోగ్య రక్షణకు యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఉండే క్యాంటీన్లతో పాటు పరిసర ప్రాంతాల్లో జంక్‌ ఫడ్స్ అమ్మకం నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    అంతేకాకుండా ఎటువంటి ఎనర్జీ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేకులు, డోనట్స్, నూడుల్స్ లాంటివి ఏవికూడా పాఠశాలల పరిసర ప్రాంతాలలో అమ్మకూడదని తెలిపింది. వాటితో పాటు పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇంటి నుంచే సమతుల్య ఆహరం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి పంపించాలని తెలిపింది. వీటితో పాటు ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు పాఠశాలకు ఫోన్లు తీసుకరాకూడదని పేర్కొంది.

    ఒకవేళ గనుక వారు మెుబైల్ ఫోన్లు పాఠశాలలకు తీసుకవస్తే మెుదటి సారి ఒక నెల వరకూ వారి ఫోన్ జప్తు చేయాలని తిరిగి అదే పునరావృతం అయితే విద్యా సంవత్సరం చివరి వరకూ మెుబైల్స్ స్వాధీన పరచుకోవాలని పేర్కొంది. అయితే పాఠశాల అనుమతుల ప్రకారం టాబ్స్, ఐప్యాడ్‌ లాంటివి వినియోగించవచ్చని పేర్కొంది. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఏఈ విద్యాశాఖ ప్రకటించింది.

Movies

  • టాలీవుడ్‌లో విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలు వరుసగా రెడీ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఓటిటి సంస్థలు ఇలాంటి సినిమాలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు కుదిరే పరిస్థితి లేదు. గతంలో వచ్చిన పలు విఎఫ్ఎక్స్ చిత్రాలు నాసిరకమైన గ్రాఫిక్స్ కారణంగా ప్రేక్షకుల నిరాకరణకు గురైన విషయం తెలిసిందే. ఆ అనుభవం వల్లే ఇప్పుడు ఓటిటి సంస్థలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. సినిమా ఫైనల్ వెర్షన్ చూపిస్తేనే రేటు నిర్ణయిస్తామని ఓటిటిలు స్పష్టంగా చెబుతున్నాయి.

    మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర, నిఖిల్ స్వయంభు, నాగ్ చైతన్య వృషకర్మ వంటి భారీ విఎఫ్ఎక్స్ ప్రాజెక్టులు ఓటిటి డీల్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే పూర్తయిన సినిమాలు మాత్రం సులభంగానే అమ్ముడవుతున్నాయి. కానీ ఇంకా మేకింగ్‌ దశలో ఉన్నవాటికి ఫైనల్ కాపీ చూపించకపోతే ఒప్పందాలు ముందుకు సాగట్లేదు. ఇలాంటి వాటిలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. కానీ నిర్మాతలు మాత్రం కొత్తగా విఎఫ్ఎక్స్ సినిమాలు ప్లాన్ చేయడంలో ముందుకు వెనుకకు ఆలోచిస్తున్నారు. ఓటిటి మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. 

  • సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె తాయ్ కిజావి అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడు చేయని రోల్‌లో కనిపించనుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్‌ చూస్తుంటే.. అస్సలు రాధికను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ మూవీ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఈ పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

    ఈ సినిమాలో నా కొత్త లుక్‌ కోసం నటుడు కమల్‌హాసన్‌ నుంచి సలహాలు తీసుకున్నానని రాధిక తెలిపారు. రోజూ మేకప్‌ వేసుకునేందుకు 5 గంటలు.. దానిని తీసేందుకు 2 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. మొదట తాను ఈ సినిమాలో ఆ పాత్ర చేసేందుకు ఆసక్తిగా చూపలేదని అన్నారు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ దాదాపు రెండేళ్ల పాటు నా చుట్టే తిరిగారని రాధిక పేర్కొన్నారు. అంతే కాకుండా తన భర్త శరత్‌కుమార్‌ సలహాతోనే ఈ మూవీలో నటించానని చెప్పారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం  ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

    • బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్‌ హాట్‌ పోజులు..
    • టాలీవుడ్ నటి పూర్ణ బేబీ బంప్ ఫోటోలు..
    • గ్రీన్ శారీలో ఫుల్ గ్లామరస్‌గా ఐశ్వర్య రాజేశ్..
    • పూల లాంటి డ్రెస్‌లో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల.. 
    • బాయ్‌ఫ్రెండ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో పాయల్ రాజ్‌పుత్..

     

     

     

     

     

     

     

  • దురంధర్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు బెదిరింపులొచ్చినట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు వాట్సాప్ వాయిస్ చాట్ ద్వారా ఆయనను బెదిరించారు. వాట్సాప్ వాయిస్ సందేశం ద్వారా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయం కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించారు.

    తాజా బెదిరింపుల నేపథ్యంలో ముంబయిలోని రణ్‌వీర్ సింగ్‌ ఇంటి బయట భద్రతను మరింత పెంచారు. కాగా.. ఇటీవలే ముంబయిలోని జుహులో బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే స్టార్‌ హీరోకు బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

    కాగా.. ఇటీవల రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన దురంధర్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ బెదిరింపులపై రణ్‌వీర్‌ సింగ్‌ కానీ.. అతని టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
     

  • హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్‌ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది.

    మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు అర్జున్‌, ఆయన కూతురు ఐశ్వర్య. తండ్రి, కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఐశ్వర్య అర్జున్. తాను చెన్నైలో స్కూల్లో చదివే సమయంలో కడుపునొప్పిగా ఉందని డాడీకి కాల్ చేశానని తెలిపింది. అప్పుడు నాన్న ఒకే ఒక్కడు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. దాదాపు నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నేను చెప్పగానే నాకోసం హుటాహుటిన స్కూల్‌కు వచ్చేశారని ఐశ్వర్య అర్జున్‌ వెల్లడించారు.
     
    ఆ రోజు నేను చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ వచ్చానని ‍అర్జున్‌ సర్జా తెలిపారు. ఆ రోజు నా డ్రైవింగ్ చూసి చాలామంది తిట్టుకుని ఉంటారని అన్నారు. వీరిద్దరి బాండింగ్ చూస్తుంటే కూతురంటే అర్జున్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రలు పోషించారు.

  • అల్లు అర్జున్‌ లాంటి  హీరోతో యాడ్‌ షూటింగ్‌ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో  చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్‌ స్టార్‌తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

    ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి ‍అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్‌ విడుదల చేసింది.

    ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్‌తో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

    allu
  • శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్‌ టాక్సిక్. కేజీఎఫ్-‌2 తర్వాత రాకింగ్‌ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్‌ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి  గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్‍సీస్‌లో ఇండియన్ లాంగ్వేజేస్‌కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్‌ ఓకే అయినట్లు సమాచారం.  ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ డీల్‌ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు  దక్కిన ఘనతగా భావిస్తున్నారు.

    ఈ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ డీల్‌తో ఓవర్‌సీస్‌లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్‌ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 
     

  • క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి ఎస్తర్‌ నోరోన్హా కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పటికీ కొనసాగుతుందని, కమిట్‌మెంట్‌ ఇస్తేనే చాన్స్‌లు ఇస్తామని చెప్పే దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారని ఆరోపించింది. ఆడియన్స్‌ మాత్రమే క్యాస్టింగ్‌ కౌచ్‌ని కంట్రోల్‌ చేయగలరని ఎస్తర్‌ చెబుతోంది. ఆమె కీలకపాత్ర పోషించిన చిత్రం అమరావతికి ఆహ్వానం చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మాట్లాడింది.

    పేరు చెప్పరు..
    క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పటికే టాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. రెండ్రోజుల క్రితమే నాకు ఓ కాల్‌ వచ్చింది. కమిట్‌మెంట్‌కి ఓకేనా అడిగారు. నో చెప్పడంతో వదిలేశారు. చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలలో నేను కష్టపడి వచ్చాను.. టాలెంట్‌తోనే పైకి వచ్చాను, ఒక్కరు కూడా నన్ను కమిట్‌మెంట్ అడగలేదని చెబుతారు. కానీ అదంతా అబద్దం. చాలా మంది కాంప్రమైజ్‌ అయినవాళ్లే. నటన రానివాళ్లు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఎలా ఉంటారు? వాళ్లకు ఉన్న లోపాన్ని కప్పిపుచ్చాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే. అయితే ఎవరు అడిగారు అనేది ముందే చెప్పరు. ముందుగా మీడియేటర్‌ ద్వారా కమింట్‌మెంట్‌ గురించి అడిగిస్తారు. ఓకే అంటే రెమ్యునరేషన్‌ ఇలా, లేదంటే అలా చెబుతారు. మనసైడ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే.. అడిగింది ఎవరనే పేరుని చెబుతారు. అందుకే ముందుగానే కమిట్‌మెంట్‌ అడిగింది ఎవరు అని కనిపెట్టలేం.

    నా గురించి క్లారిటీ రాలేదు
    సినిమాలలో ఎప్పుడు చీరలో కనిపించి.. బయటికి దేవతలా కనిపించేవాళ్లు కూడా అలాంటి పనులు చేస్తారు. అయితే నేను ఏ కేటగిరీలో ఉన్నాను అనేది వారికి  క్లారిటీ రావడం లేదు. కొంతమంది ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడి.. తర్వాత అలాంటి పనులు చేస్తుంటారు. నేను కూడా అదే క్యాటగిరీ అనుకొని కాల్‌ చేస్తుంటారు. ఆడియన్స్‌ కూడా ‘ఈవిడ బాగానే మాట్లాడుతుంది, కానీ ఏదో ఒకటి చేసే ఉంటుందని‘ అనుకుంటారు. అలాంటి వాళ్లు నా ఫిల్మోగ్రఫీ చూడాలి. ఒకవేళ నేను కూడా కమిట్‌మెంట్‌కి ఓకే చెబితే.. ఇన్నేళ్లలో ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా నా దగ్గరకు రాదా? నన్ను జనం ఇంతలా ప్రేమిస్తున్నారు.. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఆదరిస్తున్నారు. ఆడియన్స్, మీడియా సపోర్ట్ నాకుంది. అలాంటప్పుడు ఎందుకు నాకు అవకాశం రాలేదో ఆలోచించాలి.

    వాళ్లంతా అంకుల్స్‌ బ్యాచ్‌
    ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న యువతరం.. కమిట్‌మెంట్‌ గురించి అడగడం లేదు. వాళ్ల చాలా ఫ్యాషన్‌తో పని చేస్తున్నారు. అలాంటి పనులు చేసేవాళ్లంతా పాత బ్యాచ్‌. వారందరిని నేను అంకుల్స్‌ బ్యాచ్‌ అని పిలుచుకుంటాను. వాళ్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మనలోని లోపాలను ఆసరాగా చేసుకొని కమిట్‌మెంట్‌ గురించి అడుగుతారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది కనిపించకుండే చేసే అవకాశం ఆడియన్స్‌కి మాత్రమే ఉంది. వాళ్లు ఫిక్స్‌ అయితే.. ఇక్కడ అలాంటి పనులు జరుగవు. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో లాగా.. ఇక్కడ కూడా కాంప్రమైస్‌ అయి నటించే నటీనటులను బ్యాన్‌ చేయాలి. అలాంటి వాళ్లు ఎంత పెద్ద సినిమా చేసినా బాయికాట్‌ చేయాలి. అప్పుడే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆగిపోతుంది’ అని ఎస్తర్‌ చెప్పుకొచ్చింది. 

  • బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్‌-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా  బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.

    గతేడాది మరోసారి తండ్రైన ఆది రెడ్డి దంపతులకు కూతురు పుట్టింది. తాజాగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు. మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ అన్నప్రాసన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మొదటి వీరిద్దరికీ ఓ కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో ఆయన సతీమణి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. 
     

     

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్‌ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్‌ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. 

    ఇదిలా ఉంచితే అల్లు అర్జున్‌పై ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె.. అల్లు అ‍ర్జున్‌ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్‌ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్‌ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

    కావేరి బారువా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్‌తో జరిగింది. ఈ సౌత్ స్టార్‌ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్‌కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. ‍అలాగే షేక్ హ్యాండ్స్‌ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‍‍‍అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్  బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

     

     

  • టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌లో మహేశ్‌ బాబు, నమ్రత జోడి ఒకటి. ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. విమానంలో మహేశ్‌బాబుతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్‌ చేస్తూ.. ‘21 వసంతాలు దాటినా ఇప్పటికీ ప్రతి రోజు నిన్నే ఎంచుకుంటాను’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

     ఈ ఫోస్ట్‌ని మహేశ్‌ కూడా తన ఇన్‌స్టా ఖాతాలో రీ షేర్‌ చేశాడు. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా కామెంట్‌ చేసింది. లవ్, ఫైర్, క్లాపింగ్ ఎమోజీలతో  మ్యారేజ్‌ డే విషెస్‌ తెలియజేసింది. 

    కాగా, వంశీ(2000) మూవీ షూటింగ్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఐదేళ్ల తర్వాత 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2006లో గౌతమ్‌, 2012లో సితార జన్మించింది. మహేశ్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. 

  • మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్‌ అండ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. తొలిసారి వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు డేట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

    ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ గురించి ప్రియాంక భర్త నిక్ జోనాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత పద్నాలుగు నెలలుగా ప్రియాంక ఓ మూవీ కోసం పనిచేస్తోందని తెలిపారు. ఈ సౌతిండియా ఫిల్మ్‌ను ఆర్ఆర్ఆర్ డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నారని వెల్లడించారు. ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ది సినిమా అని నిక్ జోనాస్ ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ అద్భుతంగా ఉండనుందని నిక్ కొనియాడారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    కాగా.. మహేశ్ బాబు- రాజమౌళి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్‌ రోల్ ప్లే చేస్తున్నారు .  ఇందులో మహేశ్‌బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 

     

     

     

  • ఈ సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్స్‌గా నిలిచాయి. థియేటర్‌ రన్‌ ముగిసిన ఈ రెండు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వెండితెరపై వాటిని మిస్ అయిన వారు, మళ్ళీ చూడటానికి ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు శుభవార్త వచ్చింది. రెండు సినిమాలు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో  ఈ రాత్రి ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.

    అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ఫిబ్రవరి 11న జీ5(ZEE5)లో విడుదల కానుంది. అంటే నేడు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జీ5 పేర్కొంది. ఇందులో మరో హీరో వెంకటేశ్‌ సందడి చేయగా నయనతార తన నటనతో మెప్పించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 375 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరీ ఓటీటీలో కూడా ఈ చిత్రం రికార్డ్‌ స్థాయిలో వ్యూస్‌ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు కూడా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ఘన విజయాన్ని నమోదు చేసింది. మారి దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ రాజకీయ హాస్య చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం కూడా నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో OTTలోకి అడుగుపెడుతుంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.. రెండు విజయవంతమైన సినిమాలు ఒకే రాత్రి ప్రీమియర్ అవుతుండటంతో, ఇది OTT ప్రేక్షకులకు డబుల్ ట్రీట్‌గా మారుతుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో చూడతగిన చిత్రాలుగా  ఉండనున్నాయి.

Telangana

  • హైదరాబాద్ సిటీలో రహదారి భద్రతని మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్చి 1 నుంచి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    లైసెన్స్ తప్పనిసరి: వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. లైసెన్స్ లేకపోతే వెంటనే సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నుంచి దాన్ని పొందండి.

    ప్రమాదాల విశ్లేషణ: నగరంలో జరుగుతున్న మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో, వాహనం నడుపుతున్న వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణం.

    వాహన యజమానులకు హెచ్చరిక: తమ వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీన్ని నేరంగా పరిగణిస్తాం.

    భీమా వర్తించదు: లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    హైదరాబాద్ నగర వాసులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోరారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: గాజుల రామారంలో భారీ శబ్ధంతో భూ ప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. మెట్కాన్‌ గూడెంలో ఉదయం 10 గంటల సమయంలో భారీ శబ్ధంతో భూమి కంపించిందంటూ స్థానికుల చెబుతున్నారు. క్వారీ బ్లాస్టింగా? భూంకపమా? అనే దానిపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

    శబ్ధాలు రావడంతో ఉలిక్కిపడిన గేటెడ్‌, అపార్ట్‌మెంట్‌ వాసులు  రోడ్లపైకి వచ్చారు. స్థానికంగా ఉన్న పాఠశాలలకు స్కూల్స్‌ యాజమాన్యం సెలవు ప్రకటించాయి.

    హైదరాబాద్ లో భూకంపమా! భయంతో జనం పరుగులు

Sports

  • కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. కొన్నిరోజుల క్రితం టీమిండియాపై అద్బుతంగా ఆడిన అమెరికా జట్టు.. ఇప్పుడు పాక్‌పై కూడా అదే జోరు ప్రదర్శించింది. కానీ గెలుపు రుచిచూడలేకపోయింది.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరు చేసింది. ఫర్హాన్ 73 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బాబల్ ఆజమ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.

    అనంతరం అమెరికా జట్టు.. దూకుడుతో ఛేదన మొదలుపెట్టింది. కానీ వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ.. 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభం రంజనే 51, షయన్ జహంగీర్ 49 పరుగులతో మెప్పించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్ 3, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌, యూఎస్‌ఏ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గత ఎడిషన్‌లో యూఎస్‌ఏ పాక్‌పై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్‌ఏ ప్రస్తుత ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో భారత జట్టుకు కూడా పోటీనివ్వడం ఈ ప్రాధాన్యతను రెట్టింపు చేసింది. 

    యూఎస్‌ఏ ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నుంచే పాక్‌ను మరోసారి చిత్తు చేస్తామని సవాళ్లు చేశారు. ఇది కూడా ఓరకంగా ఈ మ్యాచ్‌కు హైప్‌ తెచ్చిపెట్టింది. యూఎస్‌ఏ జట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లతో పాటు పాక్‌ మూలాలున్న ఆటగాళ్లు (ఎహసాన్‌ ఆదిల్‌,  మొహమ్మద్‌ మొహిసిన్‌) కూడా ఉన్నారు. వీరు కూడా పాక్‌ ఓడిస్తామని ఛాలెంజ్‌ చేయడం ఈ మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచింది.

    కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ ప్రారంభంలో పాక్‌ తడబడింది. అయితే పాక్‌ను తొలుత ఇబ్బంది పెట్టింది మాత్రం పాక్‌ మూలాలున్న ఆటగాళ్లు కాని, భారత మూలాలున్న ఆటగాళ్లు కానీ కాదు. 

    షాడ్లే వాన్‌ ష్కాల్విక్‌ అనే సౌతాఫ్రికా మూలాలున్న ఆటగాడు. ఈ షాల్విక్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌ టీమిండియాపై 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

    ఇప్పుడు ఇదే బౌలర్‌ పాక్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కీలకమైన సైమ్‌ అయూబ్‌ (19), కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (1) వికెట్లు తీసిన షాల్విక్‌.. ఇన్నింగ్స్‌ చివర్లో బ్యాట్‌ ఝులిపిస్తున్న షాదాబ్‌ ఖాన్‌ (30), ఫహీమ్‌ అష్రాఫ్‌ (1) వికెట్లు తీశాడు. మొత్తంగా షాల్విక్‌ తన కోటా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 

    ఈ మ్యాచ్‌లో పాక్‌ మూలాలున్న బౌలర్‌ మొహమ్మద్‌ మొహిసిన్‌ కూడా పాక్‌ను ఇబ్బంది పెట్టాడు. మొహిసిన్‌ పెద్దగా వికెట్లు తీయకపోయినా (4-0-27-1) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. మరో పాక్‌ మూలాలున్న పాక్‌ బౌలర్‌ ఎహసాన్‌ ఆదిల్‌ మాత్రం ధారాళంగా (3-0-29-0) పరుగులు సమర్పించుకున్నారు. 

    భారత మూలాలున్న బౌలర్లు సౌరభ్‌ నేత్రావల్కర్‌ (4-0-40-1), హర్మీత్‌ సింగ్‌ (4-0-41-1) కూడా బాగానే పరుగులు ఇచ్చారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోర్‌ చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (73) అర్ద సెంచరీతో రాణించగా.. బాబర్‌ ఆజమ్‌ (30) పర్వాలేదనిపించాడు. 

  • బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ 2026 క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఇన్నింగ్స్‌ 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఓడినా, ఇన్నింగ్స్‌ పరాజయాన్ని గట్టెక్కించేందుకు నితీశ్‌ కుమార్‌ రెడ్డి చేసిన పోరాటం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్‌ 144 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. 

    టెయిలెండర్లు కేఎస్‌ నరసింహ రాజు (25), త్రిపురణ విజయ్‌ (46)తో కలిసి నితీశ్‌ చూపిన పోరాటపటిమ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నితీశ్‌ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ (33) ఓ మోస్తరు పరుగులు చేశాడు. అలాగే ఓ వికెట్‌ కూడా తీశాడు.

    రెండు ఇన్నింగ్స్‌ల్లో నితీశ్‌ మినహా ఎవ్వరూ రాణించకపోవడంతో ఆంధ్రకు ఇన్నింగ్స్‌ పరాభవం తప్పలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగాల్‌ సెమీస్‌కు చేరింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే రెండో సెమీఫైనల్స్‌లో ఈ జట్టు జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో తలపడుతుంది. అదే రోజు మొదలయ్యే తొలి సెమీస్‌లో ఉత్తరాఖండ్‌-కర్ణాటక పోటీపడతాయి.

    పాపం.. ఒక్క పరుగు తేడాతో ట్రిపుల్‌ మిసయ్యాడు
    ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు.

    రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు.

    ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

    ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.

    ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.

    రాణించిన భుయ్‌
    దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.

    టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.

  • టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సంజూ శాంసన్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఇటీవల న్యూజిలాండ్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమవడంతో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడే సువర్ణావకాశాన్ని కోల్పోయిన అతను.. అనూహ్యంగా ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చేలా ఉన్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాలో జరుగబోయే మ్యాచ్‌లో సంజూ ఆడటం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. 

    రెగ్యులర్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత కొన్ని రోజులుగా కడుపు సమస్యతో బాధపడుతుండటం సంజూకి కలిసొచ్చేలా ఉంది. నమీబియాతో మ్యాచ్‌ సమయానికి అభిషేక్‌ అందుబాటులో ఉండటం కష్టమేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌ టెన్ డష్కటే పరోక్షంగా వెల్లడించాడు. 

    ఇవాళ (ఫిబ్రవరి 10) అతను మీడియాతో మాట్లాడుతూ.. అభిషేక్‌ సహా మిగతా కీలక ఆటగాళ్లకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చాడు. అభిషేక్‌ కడుపు సమస్యతో బాధపడుతూ ఇంకా జట్టుతో కలవలేదని, నమీబియా మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువని చెప్పాడు. అభిషేక్‌ గైర్హాజరీలో సంజూ శాంసన్‌కు అవకాశం రావచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ సంజూ తుది జట్టులోకి వస్తే ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.

    డష్కటే.. బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో ఉండే విషయంపై కూడా అప్‌డేట్‌ ఇచ్చాడు. బుమ్రా జ్వరంతో తొలి మ్యాచ్ మిస్ అయినా, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడని, ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టాడని, నమీబియాపై ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని వెల్లడించాడు.

    వాషింగ్టన్ సుందర్ కూడా రిబ్ ఫ్రాక్చర్‌ నుంచి కోలుకొని జట్టులో చేరాడని తెలిపాడు. సుందర్‌ అందుబాటులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనే విషయంపై మాత్రం డష్కటే స్పష్టతనివ్వలేదు.

    ఇదే సందర్భంగా డష్కటే భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌పై కూడా స్పందించాడు. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. పాక్‌ తమ మనసు మార్చుకొని భారత్‌తో ఆడేందుకు సిద్దమవడం మంచి పరిణామంగా పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా ఉండబోతుందని తెలిపాడు.

    కాగా, బుమ్రా, సుందర్‌ అందుబాటులోకి వస్తే ఎవరిని తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సిరాజ్‌ స్థానంలో బుమ్రా వచ్చినా, సుందర్‌ కోసం ఎవరిని తప్పిస్తారన్నది చర్చనీయాంశమైంది. అవకాశాలను పరిశీలిస్తే, అక్షర్‌ పటేల్‌ స్థానంలో సుందర్‌ తుది జట్టులోకి రావచ్చు. అభిషేక్‌ అందుబాటులోకి రాక సంజూ శాంసన్‌కు అవకాశం వస్తే.. నమీబియాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇలా ఉండవచ్చు.

    నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
    ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో న్యూజిలాండ్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. 

    ఫిన్‌ అలెన్‌ (50 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్‌ సీఫర్ట్‌ (42 బంతుల్లో 89 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్‌ కేవలం​ 15.2 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 

    సీఫర్ట్‌-అలెన్‌ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్‌ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్‌ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్‌ రన్స్‌ను కూడా సీఫర్ట్‌ సిక్సర్‌తోనే సాధించాడు. 

    అలెన్‌ తన హాఫ్‌ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్‌ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సీఫర్ట్‌ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

    సీఫర్ట్‌ ధాటికి ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్‌ విధ్వంసకర ఫామ్‌ చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్‌ అలెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, మార్క్‌ చాప్‌మన్‌ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్‌కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్‌లపై న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమే. 

    బ్యాటింగ్‌ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టు బౌలింగ్‌లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్‌, నీషమ్‌ లాంటి ప్రమాదకర ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్‌ విభాగంలో మిచెల్‌ సాంట్నర్‌ లాంటి టాప్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌ సూపర్‌-8 బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

    అసాధారణ ప్రదర్శన
    ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌.

    కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (66 నాటౌట్‌), అలీషాన్‌ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్‌ అందించారు. ఆఖర్లో మయాంక్‌ కుమార్‌ (21) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్‌, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ తీశారు.

    బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు
    174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్‌ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్‌ ఖాన్‌ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్‌ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్‌ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. మొత్తంగా టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 
     

  • న్యూజిలాండ​ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఓ అసోసియేట్‌ దేశంపై ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్‌ మెంబర్‌ జట్టు బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 

    2026 ఎడిషన్‌లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ఫిలిప్స్‌ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్‌లో ఫిలిప్స్‌ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో‌ యూఏఈ కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం, మయాంక్‌ కుమార్‌ ఫిలిప్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు.

    టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఓ అసోసియేట్‌ దేశంపై ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టు బౌలర్‌ ఓ ఓవర్‌లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు

    27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 2026
    22 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్‌, 2016
    22 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 2024
    22 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026

    ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్‌లో ఫిలిప్‌ ఒక్క ఓవర్‌లో తడబడినా, ఫీల్డ్‌లో మ్యాజిక్‌ చేశాడు. మూడు కీలక క్యాచ్‌లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్‌ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్‌లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ కూడా తీశాడు.

    అసాధారణ ప్రదర్శన
    ఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌. 

    కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (66 నాటౌట్‌), అలీషాన్‌ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్‌ అందించారు. ఆఖర్లో మయాంక్‌ కుమార్‌ (21) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్‌, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ తీశారు. 

  • టీ20 ప్రపంచకప్‌కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్‌ మ్యాచ్‌లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్‌ చేశాడు. అయితే మ్యాచ్‌ అయిపోయాక తీసిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో హసరంగ ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్‌లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 

    దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్‌ మ్యాచ్‌లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 

    అతనికి  ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌ దుషన్‌ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్‌ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. 

    హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్‌-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. 

    హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక.. ఐర్లాండ్‌, ఒమన్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్‌-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించి, సూపర్‌-8 దిశగా సాగుతోంది. గ్రూప్‌ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్‌-8లో మాత్రం  ఇబ్బందిపడాల్సి ఉంటుంది.

  • సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

    సూర్యకుమార్‌ ధనాధన్‌
    ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో ఇషాన్‌ కిషన్‌ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్‌ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్‌ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌)తో జట్టును ఆదుకున్నాడు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్‌ గౌస్‌ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్‌ పడగొట్టగా.. కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (0)ను అర్ష్‌దీప్‌ సింగ్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు.

    రాణించిన సిరాజ్‌
    మొత్తంగా సిరాజ్‌ మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి ఒక వికెట్‌ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్‌లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.

    వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులోకి
    ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రాకతో సిరాజ్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.

    సిరాజ్‌పై వేటు తప్పదు
    కాగా హర్షిత్‌ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్‌ వరల్డ్‌కప్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్‌కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్‌ ఛాన్స్‌ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్‌పై వేటు తప్పదని బంగర్‌ అన్నాడు.

    నమీబియాతో మ్యాచ్‌ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్‌ సుందర్‌ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.

    స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్‌ బంగర్‌ అభిప్రాయప్డాడు. 

    ఇదిలా ఉంటే.. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్‌ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్‌లలోనూ అతడినే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది.

    నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు అంచనా
    ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా/మొహమ్మద్‌ సిరాజ్‌.

    చదవండి: భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించిన పాక్‌.. బీసీసీఐ రియాక్షన్‌ ఇదే

  • బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో (2025-26) ముగ్గురి పేర్లు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇషాన్‌ కిషన్‌, మొహమ్మద్‌ షమీ, సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నా, బీసీసీఐ కాంట్రాక్ట్‌లు దక్కలేదు. షమీ, సర్ఫరాజ్‌ను పక్కన పెడితే ఇషాన్‌ కిషన్‌కు కాంట్రాక్ట్‌ లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

    ఎందుకంటే, ఇతగాడు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20 సుడిగాలి శతకం (43 బంతుల్లో) బాదాడు. అయినా అతనికి బీసీసీ​ఐ కాంట్రాక్ట్‌ దక్కలేదు. ఇషాన్‌కు కాంట్రాక్ట్‌ దక్కకపోవడానికి బీసీసీఐ ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పనప్పటికీ.. నిబంధనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

    అదేటంటే.. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్ట్ లభించాలంటే సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలి. ఇషాన్‌ ఈ మధ్యకాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడంతో అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్‌ లభించలేదు. కాంట్రాక్ట్‌ లభించడానికి ఫామ్‌ కొలమానం కాదు. ఈ కారణంగానే ఇషాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా కాంట్రాక్ట్‌ లభించలేదు.

    షమీ, సర్ఫరాజ్‌ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరు కూడా సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. దేశవాలీ క్రికెట్‌లో ఈ ముగ్గురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటినా, బీసీసీఐ కాంట్రాక్ట్‌ దక్కలేదు. వీరిలో ఇషాన్‌, సర్ఫరాజ్‌కు వచ్చే ఏడాదైనా కాంట్రాక్ట్‌ లభించవచ్చేమో కాని, షమీని మాత్రం ఇక మరిచిపోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు లభించిన ఆటగాళ్లు..
    గ్రేడ్‌ ‘ఎ’ – శుబ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా  
    గ్రేడ్‌ ‘బి’ – రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, వాషింగ్టన్‌ సుందర్, కేఎల్‌ రాహుల్, సిరాజ్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌.  
    గ్రేడ్‌ ‘సి’ – అక్షర్‌ పటేల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, శివమ్‌ దూబే, సంజు సామ్సన్, అర్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్, ధ్రువ్‌ జురేల్, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్‌ గైక్వాడ్‌.  

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఉదయం (11 గంటలకు) జరిగిన పోరులో పసికూనలు నెదర్లాండ్స్‌, నమీబియా తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ పైచేయి సాధించింది. బాస్‌ డి లీడ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపుల కారణంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

    లీడ్‌ తొలుత బంతితో (3-0-20-2), ఆతర్వాత బ్యాట్‌తో (48 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటి నెదర్లాండ్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బోణీ కొట్టింది. ఈ జట్టు తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఖంగుతింది. మరోవైపు నబీమియాకు ఇదే తొలి మ్యాచ్‌. తొలి మ్యాచ్‌లోనే ఆ జట్టు పరాజయంపాలైంది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్‌ ఫ్రైలింక్‌ (30), జాన్‌ నికోల్‌ లాఫ్టీ ఈటన్‌ (42) ఓ మోస్తరు స్కోర్లు సాధించి నమీబియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. మిగతా బ్యాటర్లలో జేజే స్మిట్‌ (22), కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లొగన్‌ వాన్‌ బీక్‌, బాస్‌ డి లీడ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్‌ దత్‌, ఫ్రెడ్‌ క్లాస్సెన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ సునాయాసంగా ఛేదించింది. బాస్‌ డి లీడ్‌ అజేయమైన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. లీడ్‌తో పాటు కొలిన్‌ ఆకెర్‌మన్‌ (32), మైఖేల్‌ లెవిట్‌ (28), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (18 నాటౌట్‌) కూడా రాణించడంతో నెదర్లాండ్స్‌ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్‌ స్కోల్జ్‌, రూబెన్‌ ట్రంపెల్మన్‌, నికోల్‌ లాఫ్టీకి తలో వికెట్‌ దక్కింది. 
     

  • అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో టోర్నీల నిర్వహణకు సంబంధించి బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (BWF) పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం పలు టోర్నమెంట్‌లో స్థాయిని తగ్గించడంతో పాటు మరికొన్ని టోర్నీలను అదనంగా చేర్చారు.

    వరల్డ్‌ టూర్‌ టోర్నమెంట్‌ల నిర్వహణ కోసం గత ఏడాది 32 దేశాలు దరఖాస్తు చేయగా, ఈసారి డిమాండ్‌ మరింతగా పెరిగి 56 దేశాలు మ్యాచ్‌ల నిర్వహణకు ఆసక్తి చూపించాయి. 

    అస్తవ్యస్త నిర్వహణ పట్ల విమర్శలు.. అయినా ఓ శుభవార్త
    దాంతో భిన్న దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించింది. దీని ప్రకారం భారత్‌ ఎప్పటిలాగే కచ్చితంగా నిర్వహించే ఏడాదికి నాలుగు టోర్నీల సంఖ్య తగ్గి రెండుకు పరిమితం అయింది.

    ఇక 2023లో సూపర్‌–750 టోర్నీగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఓపెన్‌ (India Open Retains)అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇటీవల ఈ టోర్నీ అస్తవ్యస్త నిర్వహణ పట్ల పలు విమర్శలు వచ్చిన... అదృష్టవశాత్తూ బీడబ్ల్యూఎఫ్‌ నుంచి ఎలాంటి చర్యలూ ఎదురు కాలేదు. 

    సయ్యద్‌ మోడీనే స్థాయి తగ్గించి
    అయితే మరో టోర్నీ సయ్యద్‌ మోడీ సూపర్‌–300 స్థాయి మాత్రం మారింది. లక్నోలో ప్రతీ ఏటా భారత మాజీ షట్లర్‌ సయ్యద్‌ మోడీ సంస్మరణార్ధం నిర్వహించే ఈ టోర్నీని ఇప్పుడు సూపర్‌–100కు పరిమితం చేశారు.

    ఇండియా ఓపెన్‌ కాకుండా తమకు సూపర్‌–100 మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న టోర్నీ కాబట్టి పేరు మార్చకుండా సయ్యద్‌ మోడీనే స్థాయి తగ్గించి కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత్‌లో కొనసాగుతున్న మరో రెండు సూపర్‌–100 టోర్నీలు (గువహటి, ఒడిషా)లను సర్క్యూట్‌నుంచి బీడబ్ల్యూఎఫ్‌ పూర్తిగా తొలగించింది.  

    మొత్తం 36 టోర్నీలు... 
    బీడబ్లూఎఫ్‌ కొత్త క్యాలెండర్‌ ప్రకారం ఒక ఏడాదిలో టోర్నీలను ఆరు స్థాయిల్లో విభజించారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ అన్నింటికంటే అగ్రభాగాన ఉంటుంది. ఆ తర్వాత 5 సూపర్‌–1000, 5 సూపర్‌–750, 9 సూపర్‌–500, 8 సూపర్‌–300 టోర్నీలు జరుగుతాయి. తొలి సారి సూపర్‌–100 టోర్నీలను కూడా ప్రధాన టూర్‌ సర్క్యూట్‌లో చేర్చారు. ఏడాదికి 8 సూపర్‌–100 టోర్నమెంట్‌లు నిర్వహిస్తారు.

    గతంలో సూపర్‌–1000 టోర్నీలు నాలుగు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని ఐదుకు పెంచారు. అన్ని టోర్నీలు కలిపి మొత్తం ప్రైజ్‌మనీని 26.9 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 245 కోట్లు) పెంచుతున్నట్లు కూడా బీడబ్ల్యూఎఫ్‌ ప్రటించింది. ఫార్మాట్‌లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.

    లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో
    ఇప్పటి వరకు తొలి మ్యాచ్‌నుంచి ‘నాకౌట్‌’ కాగా...ఇప్పుడు దీనిని మార్చి లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో ప్లేయర్‌ ఒక టోర్నీలో కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం కల్పించాలనేదే అందుకు కారణం. టీమ్‌ ఈవెంట్లు సుదిర్మన్‌ కప్, థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌లలో కూడా జట్ల సంఖ్యను పెంచనున్నారు. 

    మరింత ఎక్కువ మందికి బ్యాడ్మింటన్‌కు చేరువ చేసే క్రమంలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లను టీవీల్లో ప్రసారం చేయాలని ఫెడరేషన్‌ నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాదికి కనీసం 3 వేల మ్యాచ్‌లు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు.  

    పావురాల రెట్టలు
    న్యూఢిల్లీలో ఇండియా ఓపెన్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని.. ప్రాక్టీస్‌ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

    బ్లిచ్‌ఫీల్డ్‌ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్‌లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగి.. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించింది. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

    థాంక్యూ చెబుతున్నా
    ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్‌గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్‌ (జై షా), ఆఫీస్‌ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.

    అతిపెద్ద విజయం ఇది
    పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్‌ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్‌ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.

    బంగ్లాదేశ్‌ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్‌ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ సజావుగా సాగాలి’’ అని రాజీవ్‌ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.

    భద్రతా కారణాలు చూపుతూ బంగ్లా
    కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్‌ తప్పుకొంది. భారత్‌లో తాము మ్యాచ్‌లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.

    మధ్యలో ఎంటరైన పాక్‌
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్‌ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.

    ఈ ప్రభావం బంగ్లా, పాక్‌లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్‌లో పాక్‌, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్‌.. యూటర్న్‌ తీసుకుని టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది.

    చదవండి: IND vs PAK: పాక్‌ యూటర్న్‌.. స్పందించిన ఐసీసీ

  • సౌతాఫ్రికా క్రికెట్‌ స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా గ్రూప్‌-‘డి’లో నుంచి సౌతాఫ్రికా- కెనడా సోమవారం పోటీపడ్డాయి.

    మార్క్రమ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ
    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లలో కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (32 బంతుల్లో 59) సాధించగా.. క్వింటన్‌ డికాక్‌ 22 బంతుల్లో 25 పరుగులు చేయగలిగాడు.

    మిగతా వారిలో ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33), డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.

    156 పరుగులకే పరిమితం
    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితం అయింది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్‌ లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

    క్వింటన్‌ డికాక్‌ ‘వరల్డ్‌’ రికార్డు
    ఇక ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ రెండు డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో కెనడా ఓపెనర్లు కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా (0), యువరాజ్‌ సమ్రా (12) ఇచ్చిన క్యాచ్‌లను డికాక్‌ ఒడిసిపట్టాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్‌గా ధోని వరల్డ్‌ రికార్డును డికాక్‌ సమం చేశాడు.

    టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డిస్మిసల్స్‌లో భాగమైన వికెట్‌ కీపర్లు వీరే
    🏏🧤క్వింటన్‌ డికాక్‌- 32
    🏏🧤ఎంఎస్‌ ధోని- 32
    🏏🧤కమ్రాన్‌ అక్మల్‌- 30
    🏏🧤దినేశ్‌ రామ్‌దిన్‌- 27
    🏏🧤కుమార్‌ సంగక్కర- 26
    🏏🧤జోస్‌ బట్లర్‌- 26.

    చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం

National

  • గాంధీనగర్‌:  ఉప్పు లోడింగ్‌ కోసం తొలిసారి నిర్వహించిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కంటైనర్ల పరీక్ష విజయవంతమైంది. గుజరాత్‌ రాష్ట్రంలో భీమసర్–గాంధీధామ్ విభాగంలో భారతీయ రైల్వేలు తొలిసారి స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను ఉపయోగించి ఉప్పు లోడింగ్ ట్రయల్ నిర్వహించాయి.  ఇది సక్సెస్‌ఫుల్‌ ట్రయల్‌గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. 

     

    ఉప్పు ఒక అత్యంత కరిమి  పదార్థం కావడంతో సాధారణ కంటైనర్లు త్వరగా దెబ్బతింటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లు ఉపయోగించేందుకు వేసిన తొలి అడుగు విజయవంతమైంది. 

    ఉప్పు వల్ల కలిగే తుప్పు సమస్యను తగ్గడమే కాకుండా సాధారణ కంటైనర్ల కంటే ఎక్కువకాలం ఉపయోగించవచ్చు. వేగంగా, సురక్షితంగా లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. యాంత్రిక పద్ధతుల్లో పెద్ద ఎత్తున లోడింగ్ అనేది సులభతరం అవుతుంది. ఉప్పు చిందర వందర కాకుండా సమర్థవంతంగా రవాణా చేయడానికి వీలుగా ఉండటంతో తక్కువ వృథానే అవుతుంది. 

    దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఉప్పు ఉత్పత్తి ప్రాంతాలకు సురక్షితంగా ఆధునిక రవాణా పరిష్కారం అందిస్తుంది.  రైల్వే ఫ్రైట్ ఆపరేషన్లు మరింత వేగవంతం అవుతాయి. ఈ ట్రయల్ విజయవంతం కావడం వల్ల, భవిష్యత్తులో ఉప్పు రవాణా కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్ల వినియోగం విస్తృతంగా పెరిగే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంచితే, భీమసర్–గాంధీధామ్ విభాగం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది భారతీయ రైల్వేలోని పశ్చిమ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. భీమసర్ అనేది కచ్ ప్రాంతంలోని ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. 

    గాంధీధామ్ అనేది కచ్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రం, కాండ్లా పోర్ట్‌కు దగ్గరగా ఉండటం వల్ల రైల్వే రవాణాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగం ద్వారా ఉప్పు, బొగ్గు, ఖనిజాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు వంటి వస్తువులు పెద్ద ఎత్తున రవాణా అవుతాయి.

  • ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై స్పష్టత వచ్చే వచ్చే వరకు లోక్‌సభకు రాకూడదని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. 

    లోక్‌సభ సమావేశాలు ప్రారంభం నుంచి స్పీకర్‌ ఓంబిర్లా సభ నిర్వహణలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేయడం, సభ నుంచి కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేయడం వంటి కారణాలను ఉదహరించాయి. అదే సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కాంగ్రెస్‌ మహిళా ఎంపీలపై చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా అనర్హులు అంటూ ఆయనపై 120మంది ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం జారీ చేశారు.

    ఈ సందర్భంగా లోక్‌సభను ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్‌ ఓంబిర్లాను ఆర్టికల్ 94(సీ) నిబంధనల ప్రకారం ఆయన్ను పదవి నుంచి తొలగించే అధికారం ఉందంటూ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

    దీంతో పాటు లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వివాదానికి దారితీసింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ (ఎంఎం) నరవణే ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ అనే పుస్తకం రాశారు. కానీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. నరవణే పుస్తకంలో 2020లో తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభన,గల్వాన్ లోయ ఘర్షణ, అగ్నిపథ్ ప్రణాళిక, ఆగస్టు 31, 2020 రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సంభాషణతో పాటు పలు సున్నిత అంశాలు అందులో పేర్కొన్నారు. అయితే కారవాన్ మ్యాగజైన్‌లో ఈ పుస్తకంపై వచ్చిన ఆర్టికల్‌లోని కొన్ని భాగాలను రాహుల్ చదివే ప్రయత్నం చేశారు. అందుకు ఓంబిర్లా ఒప్పుకోలేదు. నిబంధనల ప్రకారం లోక్‌సభలో పబ్లిష్‌ అవ్వని పుస్తకాన్ని సభలో ఉదహరించకూడదు సూచించారు. 

    నరవణే రాసిన పుస్తకం పబ్లిష్ కానప్పటికీ రాహుల్‌ గాంధీకి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందనేది ప్రశ్నార్ధకంగా ఉంది. దీనిపై అధికార ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుస్తకంలోని అంశాల గురించి ప్రస్తావించేందుకు ఓంబిర్లా అనుమతి ఇవ్వలేదనే కారణంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తేలింది.

  • ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎంత అప్పుల భారంలో ఉన్నారో పార్లమెంట్‌ సాక్షిగా బయటపడింది. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) లోక్‌సభలో ఏపీలో రైతుల అప్పుల భారంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌  చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ,. శివరాజ్‌సింగ్‌ లిఖిత పూర్వక సమాధానంలో ఏపీలోని రైతుల అప్పుల పరిస్థితి ఎలా  ఉందనేది తేటతెల్లమైంది. ఇది దేశంలోనే ఏపీ రైతుల అతి ఎక్కువగా అప్పుల భారంగా శివరాజ్‌సింగ్‌ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. 

    జూలై 2018- జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం  సగటు అప్పు రూ.2,35,554 రూపాయలుగా ఉన్నట్లు శివరాజ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇది తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం కంటే ఎక్కువగా నమోదైంది. తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం  రూ.1,52,113 ఉండగా, ఏపీ రైతుల సగటు అప్పుల భారం రూ.2,35,554 గా ఉంది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పుల భారం   74,121 రూపాయలు కాగా, ఏపీలో మాత్రం అత్యధికంగా ఉండటం గమనార్హం.

  • లక్నో:  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లంబోర్కిని కారు ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు కాన్పూర్‌ టుబాకో టైకూన్‌ కేకే మిశ్రా. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో  ఈ అంశం చాలా సీరియస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేకే మిశ్రా కుమారుడు శివమ్‌ కారు ప్రమాదానికి కారణమై ఆరుగుర్ని తీవ్రంగా గాయపరిచినట్ల వార్తలు వచ్చాయి. అయితే దీన్ని మాత్రం కేకే మిశ్రా ఖండించారు. ఆ సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు చెప్పుకొచ్చారు.  

    కారు ప్రమాదానికి గురి కావడానికి ముందు తన కుమారుడు శివమ్‌ తల తిరగుతూ స్పృహ కోల్పోయాడని,  బౌన్లర్లలో ఒకరు కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారు. ఆపై ఇంటికి తీసుకురాగా, అక్కడ నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్‌ అని పేర్కొన్నారు. కారు కండిషన్‌ సరిగా లేకపోవడంతోనే యాక్సిడెంట్‌ బారిన పడిందన్నారు. 

    ఏది ఏమైనా చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మమ్మల్ని విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని పేర్కొన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేకే మిశ్రా తెలిపారు.

    ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారనేది వార్తలు వెలుగుచూశాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే వీటిని ఖండించారు శివమ్‌ తండ్రి, ప్రముఖ టుబాకో వ్యాపారవేత్త కేకే మిశ్రా.

  • ఒక్క సారి ఊహించండి… మొత్తం కొండ అంతా  ఒక్కసారిగా నీలిరంగు సముద్రంలా మారిపోతే ఎలా ఉంటుంది? అది ప్రకృతి సృష్టించిన నిజమైన అద్భుతం. అదే – నీలకురింజి!

    మనకు పుష్కరాలు పన్నెండేళ్లకోసారి వస్తాయి కదా… అలానే ఈ నీలకురింజి పూలు కూడా పన్నెండేళ్లకు ఒక్కసారే పూస్తాయి. ఒకేసారి విరబూసి, ఆ తర్వాత మళ్లీ పదేళ్లకు పైగా ఈ పువ్వులు  కనిపించవు.

    సముద్ర మట్టానికి 1300 నుంచి 2600 మీటర్ల ఎత్తులో పెరిగే ఈ పొదలు… పూయగానే కొండలన్నీ నీలి-ఊదా రంగులో మునిగిపోతాయి. ఆ దృశ్యం చూడటానికి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఈ పూల వల్లే ఆ ప్రాంతానికి ‘నీలగిరి’ పర్వతాలు అనే పేరు వచ్చిందని ప్రతీతి. అదే నీలగిరి కొండల మధ్యలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఊటీ  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.   పశ్చిమ కనుమల ఎత్తైన కొండలపై  కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అద్భుతం కనిపిస్తుంది. టొడా, పాలియన్ వంటి గిరిజన తెగలు ఈ పుష్పాలను పవిత్రంగా భావిస్తారు.ఈ తెగల సంస్కృతిలో, సంప్రదాయాల్లో ఈ పూలకు ప్రత్యేక స్థానం ఉంది.

    చివరిసారి 2018లో ఈ పూలు పూశాయి. మళ్లీ 2030లో ఈ నీలి పూలతో కొండలు అందంగా కనిపిస్తాయి.ఊటీ, నీలగిరి ప్రాంతాలు మరోసారి నీలి తివాచీ పరచుకున్నట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అక్కడికి వేలాది మంది పర్యాటకులు చేరుకుంటారు. ప్రకృతి ప్రేమికులకు అది జీవితంలో ఒకసారి చూసే అద్భుత దృశ్యం అవుతుంది. కానీ… ఈ అందమైన అద్భుతం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. టీ, కాఫీ తోటల విస్తరణ… పెరుగుతున్న పర్యాటకం… అడవుల నాశనం… ఇవన్నీ నీలకురింజి ఆవాసాలను క్రమంగా తగ్గిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక పరిశోధనలు ప్రారంభించింది. బాబాబుదాన్ గిరి, కుడ్రేముఖ్, నీలగిరి ప్రాంతాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా దీన్ని అత్యంత కీలకమైన జాతిగా గుర్తించింది.ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అరుదైన బహుమతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.2030లో ఊటీ నీలగిరి కొండలు మళ్లీ నీలి సముద్రంలా మెరిసే దృశ్యం చూడాలంటే… మనం ఇప్పుడే ప్రకృతిని రక్షించాలి.ఎందుకంటే… నీలకురింజి కేవలం ఒక పువ్వు కాదు… పన్నెండేళ్ల సహనానికి ప్రతీక!
     

     

  • శివమొగ్గ( కర్ణాటక): వ్యభిచారం కేసులో ముగ్గురు మహిళలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ భద్రావతి 4వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్‌ తీర్పు వెలువరించారు. వివరాలు.. 2021, డిసెంబర్‌ 24వ తేదీన భద్రావతిలోని ఉజ్జయిన్‌పూర్‌లోని మరియమ్మ ఆలయం వెనుక ఉన్న 3వ క్రాస్‌లోని ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతుందనే ఫిర్యాదుపై ఐపీఎస్‌ అధికారి జితేంద్ర కుమార్‌ దయామా నేతృత్వంలోని పోలీసు బృందం దాడి చేసింది. 

    భద్రావతిలోని హోసూరులోని జెడికట్టే నివాసి చంద్రకళ అలియాస్‌ శ్వేత, ఉజ్జయినిపూర్‌ నివాసి శిల్ప, హోసా సిద్ధాపూర్‌ నివాసి కవితను అరెస్ట్‌ చేశారు. ఈ విషయమై పేపర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మంజునాథ్‌ ఈఓ కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున పి.రత్నమ్మ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితులకు జైలు శిక్షతో పాటు రూ.1.61 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఇందిరా మైలస్వామి చెట్టియార్‌ తీర్పు ఇచ్చారు. 

  •  శివమొగ్గ(కర్ణాటక ): గుర్తు తెలియని వ్యక్తి తనకు వీడియో కాల్‌ చేసి ప్రైవేట్‌ భాగాలు చూపించాడని ఓ మహిళ శివమొగ్గలోని ఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. శివమొగ్గకు చెందిన ఒక మహిళ మొబైల్‌ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్‌లో çవీడియో కాల్‌ చేశాడు. ‘నీవు నాకు తెలుసు.. నీతో వీడియో కాల్‌లో మాట్లాడాలి’ అని చెప్పాడు. మహిళ కాల్‌ లిఫ్ట్‌ చేయగా.. ఆ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్‌ భాగాలు చూపిస్తూ వేధించాడు. మహిళ వెంటనే స్క్రీన్‌ రికార్డింగ్‌ ద్వారా వీడియోను రికార్డు చేసుకుంది. అనంతరం శివమొగ్గలోని ఈఎన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వీడియోలను చూపించి ఫిర్యాదు చేసింది.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

  • న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ  మంగళవారం నోటీసు ఇచ్చింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ను కలిసి నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గగోయ్ వెల్లడించారు. ఇందుకోసం  వందమందికి పైగా ఎంపీల సంతకాలను కాంగ్రెస్‌ సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్  ఆరోపించింది. రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని పై దాడి చేస్తారన్న స్పీకర్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

    మొత్తం 118 మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం, స్పీకర్‌ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా సభలో జరుగుతున్న పరిణామాలు, వరుస వాయిదాల నేపథ్యంలో విపక్ష నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

    భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని కాంగ్రెస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు.  కాగా మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా స్పీకర్‌కు ఫిర్యాదు లేఖ ఇవ్వాలని కొందరు సూచించినప్పటికీ, చివరికి అవిశ్వాస తీర్మానానికే మొగ్గు చూపారు.

    లోక్ సభలో యుద్ధం మొదలు 100 ఎంపీలతో కాంగ్రెస్ సిద్ధం
  • బెంగళూరు: ఆటోడ్రైవరు బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయల బ్యాలెన్సు ఉంది. భారీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథకు బ్రేక్‌ పడింది. ఈ సంఘటన హుబ్లీ నగరంలో జరిగింది. కేశ్వాపురలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలో ఒక ఖాతాదారు అకౌంట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయల అక్రమ నగదు బదిలీ అయినట్లుగా వెలుగు చూసింది. ఈ ఖాతా ఓ ఆటో డ్రైవర్‌ ఇర్ఫాన్‌ది. సమాచారం అందుకున్న హుబ్లీ– ధార్వాడ పోలీసులు, సైబర్‌ క్రైం పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతని ఖాతాకు దేశంలోని వివిధ బ్యాంక్‌ల ఖాతాల నుంచి డబ్బులు వరదలా వచ్చి పడ్డాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఖాతా చురుగ్గా ఉండగా, స్కాం వెలుగు చూడగానే ఫ్రీజ్‌ చేశారు. ఈ ఖాతా సంఖ్య– 54910200000346 గా తెలిపారు.

    ఖాతాదారుల ఫిర్యాదుతో కదిలిన డొంక 
    సైబర్‌ నేరాల్లో డబ్బులు పొగొట్టుకున్న పలువురు బాధితులు 1930 సైబర్‌క్రైం హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి ఫలానా ఖాతాకు తమ డబ్బులు అక్రమంగా జమ అయినట్లు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో ఆరా తీయగా ఇర్ఫాన్‌ డొంక కదిలింది. కుక్కింగ్‌ విత్‌ కేటరింగ్‌ అనే పేరుతో ఈ ఖాతా ఉంది. సుమారు 50 సార్లకు పైగా వివిధ ఖాతాల నుంచి డబ్బు జమ అయింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సైబర్‌ మోసాల బాధితుల డబ్బు ఈ ఖాతాకే చేరింది.  

    తనిఖీలో 16 పాస్‌ పుస్తకాలు దొరికాయి 
    ఏసీపీ శివరాజ్‌ కటకబావి మీడియాతో మాట్లాడుతూ గోపనకొప్ప ఇర్ఫాన్‌ కాగినెలె అనే వ్యక్తి ఖాతాకు ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తోందన్నారు. అతని ఇంట్లో తనిఖీ చేయగా 16 బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు దొరికాయని చెప్పారు. ఎంత మేర డబ్బులు బదిలీ అయ్యాయి. ఏయే మార్గాల్లో వచ్చాయి? అని బ్యాంక్‌ అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.   

  • బిహార్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీ చేసిన పనిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థిస్తుంటారు. అయితే అక్కడ అసెంబ్లీలో ఇందుకు వ్యతిరేకంగా జరిగింది. ఇటీవల బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే మైథిలి ఠాకూర్ అక్కడి ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

    ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎ‍న్నికల్లో  అక్కడి ఆలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యేలలో ఆమె అతి పిన్న వయస్కురాలు. అయితే ప్రస్తుతం బిహార్‌లో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడి వైద్యశాఖ మంత్రి మంగళ్ పాండేని మైథిలీఠాకూర్ ఆసుపత్రుల పనితీరుపై ప్రశ్న అడిగింది. దీనికి ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే దీనిపట్ల మైథిలీ ఠాకూర్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేసింది.

    మైథిలీ మాట్లాడుతూ "వైద్యశాఖ మంత్రి ఆసుపత్రుల భవనాలకు చిన్న మరమ్మత్తులు చేస్తే సరిపోతుందన్నారు. అయితే నేను వాటిని స్వయంగా చూశాను. అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. అక్కడి ఆసుపత్రులన్ని ఒక చిన్న గదిలో కొనసాగుతున్నాయి. మంత్రి సమాధానంపై నాకు సంతృప్తి కలగలేదు". అని మైథిలీ ఠాకూర్ అన్నారు.

    వైద్యశాఖ మంత్రి అంతా బాగుందన్నారు. అయితే పరిస్థితులు మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇంతకు ముందు ఆసుపత్రులలో ఎంబీబీఎస్ డాక్టర్లు ఉండేవారని ఇప్పుడు మాత్రం ఆయుష్ ప్రాక్టీషినియర్లతోటే ఆసుపత్రులు నడుస్తున్నాయని తెలిపారు.ప్రస్తుతం జనాభా 40 నుంచి 50 వేలున్న ప్రాంతంలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

    ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్‌ ఫోక్‌ సింగర్‌. అయితే బిహార్‌లో ఇటీవలే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. బీజేపీ, ఆర్జేడీలతో పాటు ఇతర మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో  స్వంత ప్రభుత్వంపైనే విమర్శలు చేయడంతో ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో మైథిలీ వ్యాఖ్యలు హాట్‌ టాఫిక్‌గా మారాయి.

  • న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాదప్రతివాదనలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు ఫిబ్రవరి 4న లోక్‌సభలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి మరికొద్ది నిమిషాల ముందు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు ప్రధాని కూర్చునే స్థానానికి అత్యంత సమీపంలోకి దూసుకెళ్లడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సభలో నెలకొన్న గందరగోళం దృష్ట్యా, ప్రతిపక్ష ఎంపీలు దాడికి దిగే అవకాశం ఉందని భావించి, ఆ రోజు ప్రధానిని సభకు రావద్దని స్పీకర్ ఓం బిర్లా ముందే సూచించినట్లు తెలియవచ్చింది.

    ఈ ఘటనపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పుబట్టారు. వారి ఎంపీల దిగజారుడు ప్రవర్తనపై కాంగ్రెస్ గర్వపడుతోందని ఆయన విమర్శించారు. ‘మేము గనుక మా బీజేపీ ఎంపీలను ఆపకుండా, కాంగ్రెస్ ఎంపీలను ఎదుర్కొనేందుకు అనుమతించి ఉంటే, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను కాపాడాలన్నదే మా ప్రథమ ప్రాధాన్యత’ అని రిజిజు పేర్కొన్నారు. సభా మర్యాదలను కాపాడటానికే తాము సంయమనం పాటించామని ఆయన స్పష్టం చేశారు.

    ఈ నిరసన వెనుక జనరల్ (రిటైర్డ్) ఎం.ఎం. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే ప్రచురితం కాని పుస్తక ప్రస్తావన ఉంది. గత వారం రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో పార్లమెంటులో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ వివాదమే ఫిబ్రవరి 4నాటి గందరగోళానికి దారితీసింది. అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రధాని లక్ష్యంగా ప్రతిపక్ష ఎంపీలు వ్యూహరచన చేస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించడంతో, ఆ రోజు సభ అర్థంతరంగా వాయిదా పడింది.

    	ప్రధానిపై దాడికి యత్నం.. మోదీ సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు

     

Business

  • భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.

    చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.

    వెండి ధరలు
    ఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట.

  • హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్‌కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.

    విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.

    సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.

    ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?

    హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్‌షిప్‌లు, విడా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్నారు.

  • ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

    మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్‌ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

    మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.

    ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.

  • సూపర్ కార్లను లాంచ్ చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫెరారీ కంపెనీ.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు ఫెరారీ లూసే (Ferrari Luce) అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 9, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది.

    ఫెరారీ లూసే క్యాబిన్ డిజైన్‌ను మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ అభివృద్ధి చేశారు. దీంతో ఇది రెట్రో డిజైన్ పొందింది. ఈ కారులో టచ్‌స్క్రీన్‌లు మాత్రమే కాకుండా.. నాబ్‌లు & స్విచ్‌లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని ఎప్పటిలాగే అందించడానికి ఇలా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.

    త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. రేంజ్, టూర్ & పెర్ఫార్మెన్స్ వంటి డ్రైవింగ్ మోడ్‌ల కోసం రోటరీ స్విచ్‌లు ఉంటాయి. కుడి వైపున ఉన్న ఎరుపు మానెట్టినో డయల్ డ్రైవర్లు.. ఐస్, వెట్, డ్రై, స్పోర్ట్ & ఈఎస్సీ ఆఫ్ వంటి ఛాసిస్ సెట్టింగ్‌లను టోగుల్ చేయడానికి అనుమతిస్తుంది.

    12.5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. బ్యాటరీ స్థితి, పవర్ రీజెనరేషన్, టైర్ ప్రెజర్ & జీ ఫోర్స్ డేటాను ఇందులో చూడవచ్చు. ఫెరారీ లూస్ ప్రత్యేకమైన కంట్రోల్ సిస్టమ్‌ పొందనుంది. సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్‌లు, బూట్ & లాక్ ఫంక్షన్‌ల కోసం భౌతిక బటన్లు, నాలుగు విండోల కోసం స్విచ్‌లు ఉంటాయి. వెనుక ప్రయాణీకులు స్పీడ్, ల్యాప్ టైమ్స్ తెలుసుకోవడానికి టచ్‌స్క్రీన్‌ను పొందుతారు.

  • రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్‌. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్‌ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

    ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.

    భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్‌లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.

    రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.

    ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.

    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.

    రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.

    ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్‌క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

  • మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.

    పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్‌పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్‌నెట్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

    ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.

    ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.

    రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.

    ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

    ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.

    జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?

    • చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..

    • ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.

    • కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్‌-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.

    • క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.

    నోటీసు అంటే భయపడాలా?

    వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.

    • జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.

    • అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.

    • చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్‌కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.

    తెర వెనుక ఏం జరుగుతుంది?

    జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్‌పుట్‌ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్‌లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్‌లెస్ అసెస్‌మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

    అవగాహనే రక్షణ

    జీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్‌లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

    - దవనం శ్రీకాంత్‌

  • టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.

    తొందరపాటు వద్దు..

    ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

    జెమిని 3

    సుందర్‌ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్‌లో ‘ఏఐ ఓవర్‌వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్‌ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.

    రికార్డు ఆదాయం

    ఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్‌లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్‌ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.

    ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివ స్వాములపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయ‌డంపై వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొన్న పరిస్థితులను తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

    ‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో,  శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయ‌డం బాధాక‌రం. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వ‌స్తున్నారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

    చంద్రబాబు పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది.

    జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ  ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.

    దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు.

    దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

    2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..

    • తిరుపతిలో జనవరి 8,  2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి

    • శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు

    • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న  కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే  ఉన్నాయి

    • జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను  వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబు నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది

    భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

     

  • విజయవాడ: కృష్ణా జిల్లాలో రైతు బజార్ మాఫియా రెచ్చిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేల అండతో రైతు బజార్ల మాఫియా జులుం ప్రదర్శిస్తోంది. రైతు బజార్లలో టీడీపీ నేతల వద్దే సరుకులు కొనాలని హుకుం జారీ చేసింది. ఏ షాపు పెట్టాలన్నా కూరగాయల సిండికేట్ దగ్గరే కొనాలని ఆదేశాలు ఇచ్చింది.  ఈ దందా ద్వారా నెలకు సుమారు రూ. 20లక్షలు టీడీపీ నేతల తమ ఖాతాల్లో నింపుకుంటున్నారు. 

    మొత్తం దందాను టీడీపీ నేత నాగబాబు నిర్వహిస్తున్నారు. రైతులు తోటల నుంచి కాకుండా నాగబాబు నుండి తేవాలని రైతు బజార్‌ మాఫియా వార్నింగ్‌లు ఇస్తుంది. 

    ఎమ్మెల్యే యార్లగడ్డకు అనుచరుడిగా ఉన్న నాగబాబు... తాను చెప్పిన వాళ్లకే షాపులు ఇవ్వాలని సిఫార్సులు చేస్తున్నారు. ఇలా గుడివాడ రైతు బజార్‌లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. గుడివాడలో జేపీటీ వాళ్ల దగ్గరే సరుకులు కొనాలని డీల్ కుదుర్చుకున్నారు. దాంతో ఏళ్ల తరబడి ఉన్న రైతులను, వ్యాపారులను టీడీపీ నేతలు తరిమేస్తున్నారు. వేరే వాళ్ల నుండి సరుకులు తెస్తే దించేది లేదని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే రైతు బజార్‌ అధికారులు.. టీడీపీ నేతలతో కుమ్మక్కై పోయి ఈ దందా నిర్వహిస్తున్నారు.




     

  • విజయవాడ: శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీఛార్జిని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. శ్రీశైలం లో నిన్న జరిగిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. వారం రోజుల క్రితం, రెవిన్యూ, హోమ్, ఇండోమెట్ మంత్రులు వెళ్ళి రద్దీ పై సమీక్ష చేసినా ఫలితం శూన్యమన్నారు. వేలాది మంది భక్తుల వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. 

    క్యూ లైన్‌లు లేవు, వాటర్ లేదు కనీసం సౌకర్యాలు కల్పించలేదు. పోలీసు యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సింది పోయి శివ భక్తుల మీద లాఠీఛార్జ్ చేశారు. ముందుస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది.  ఏపీలో దేవాలయాలకు వెళ్లిన భక్తులు వెనక్కి వస్తారా అనే భయం కలుగుతుంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు, సింహాచలం, కాశీబుగ్గలో భక్తులు చనిపోతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది..

    అరసవిల్లిలో రథ సప్తమిలో తొక్కిసలాట  జరిగింది. తప్పులు సరిచేసుకోవాలి అనే భావన ప్రభుత్వంలో కనిపించడం లేదు. హిందూ దేవుల్లో భద్రత గాలికొదిలేశారు. హిందూ ధర్మం పై కూటమి చిన్న చూపు చూస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇవీ చదవండి: 

    శ్రీశైలంలో ఉద్రిక్తత

    శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం..చరిత్రలో మొదటిసారి..

  • సాక్షి,విజయవాడ: డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్‌ ఏరియాలోని గిరిజనుల చేత పూరించవలసిన 3వేల అధ్యాపక పోస్టులను జనరల్‌లో పూరించడంపై సీరియస్‌ అయ్యింది.

    గిరిజన యువతీ యువకులకు అన్యాయం చేయడమే రాష్ట్రప్రభుత్వ ఉద్దేశమా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. గిరిజన నిరుద్యోగులకు చెందాల్సిన పోస్టులను ఏ అధికారంతో డీఎస్పీలో కలిపారంటూ నిలదీసింది.

    ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఖాళీలున్నాయి. ఎంతమంది అభ్యర్థుల చేత ఖాళీలు పూరించబడ్డాయి. ఇంకా ఎన్నిపోస్టులు పూరించాలో ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

    రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గిరిజన నిరుద్యోగులు తమ హక్కులు కోల్పోతున్నారన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

  • సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ, పనితీరు తక్కువ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు.  చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. 

    రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్‌డీపీ (GSDP) లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు.

    2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ..జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.

    ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్‌డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి

    22 వ స్థానానికి పడిపోయిన ఏపీ.. పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ

    23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా.. ఏపీ  పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ ‌ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ  ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే.. అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే’ అంటూ దుయ్యబట్టారు.

     

  • సాక్షి,నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం జరిగింది. శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని జరిపించలేదు. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు స్వామి అమ్మ వార్లకు నిర్వహించాల్సిన వాహనసేవ, గ్రామోత్సవాన్ని దేవస్థానం  అధికారులు రద్దు చేశారు.  

    క్యూలైన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని ఆలయ ప్రాంతానికి పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగ కపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Family

  • హార్ట్‌ఎటాక్‌ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్‌ ఎటాక్‌ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్‌ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.

    ఓ కేస్‌ స్టడీ... 
    శ్రీధర్‌ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్‌ ఎటాక్‌తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్‌ ఎటాక్‌ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్‌కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్‌. కుటుంబంలో చాలామందికి హార్ట్‌ ఎటాక్‌ రావడం, పైగా నాన్నగారు హార్ట్‌ ఎటాక్‌తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్‌ను అడగసాగాడు.

    శ్రీధర్‌కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్‌ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్‌ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.

    గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే...  
    కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవేమిటంటే... 
    ఇవీ ఆ రిస్క్‌ఫ్యాక్టర్స్‌...
    వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. 
    డయాబెటిస్‌ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. 
    రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... 
    కొలెస్ట్రాల్‌ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. 
    స్మోకింగ్‌ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో.  
    స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. 
    మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్‌ ఎటాక్‌ రావడం వంటివి కూడా రిస్క్‌ ఫ్యాక్టర్లే.

    పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్‌ ఎక్కువ... 
    మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్‌ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్‌ తర్వాత) ఈస్ట్రోజెన్‌ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.

    రామిప్రిల్‌ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్‌గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు.  

    అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. 

    బీటాబ్లాకర్స్‌ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్‌ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. 
    అయితే బీటాబ్లాకర్స్‌ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్‌ చేసుకుంటూ ఉండాలి.  

    ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... 
    హై రిస్క్‌ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్‌ కోసం మాత్రమే. 
    ఆస్పిరిన్‌ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్‌ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్‌ కోసం ఆస్పిరిన్‌ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్‌ను కేవలం సెకండరీ ప్రివెన్షన్‌ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. 
    పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్‌ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.

    మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్‌గానే... 
    ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్‌) అంటారు. అయితే  గుండెపోటుగాని, బ్రెయిన్‌స్ట్రోక్‌గాని ఒకసారి వచ్చాక... అది  మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్‌’గా చెబుతారు.  

    సాధారణంగా మధుమేహం (డయాబెటిస్‌), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్‌గా చెప్పవచ్చు.  అసలు డయాబెటిస్‌గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే  జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్‌ ప్రివెన్షన్‌’ అవుతుంది. ఈ ప్రివెన్షన్‌ ప్రైమరీ ప్రివెన్షన్‌ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్‌ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్‌లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.

    సెకండరీ ప్రివెన్షన్‌గా వాడే మందులివి... 
    ఆస్పిరిన్‌: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్‌ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్‌ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.

    అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్‌ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్‌ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్‌ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్‌ సూచిస్తున్నారు.

    స్టాటిన్స్‌ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్‌ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. 

    చ‌ద‌వండి: ఫిట్స్‌తో ఎవ‌రైనా ప‌డిపోతే ఇలా చేయ‌కండి

    ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్‌ ఉన్నవారికి సైతం స్టాటిన్స్‌ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్‌ఎస్‌ సిఆర్‌పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్‌’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్‌ స్కోర్‌’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్‌ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్‌ వాడాలంటే ముందుగా డాక్టర్‌ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

    వ్యాయామంతో గుండెజబ్బులు దూరం  
    ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్‌వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్‌ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.

    ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... 
    గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. 
    కొలెస్ట్రాల్‌ మోతాదులు : 
    రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్‌ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. 
    చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. 
    మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. 
    ట్రైగ్లిజరైడ్స్‌ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. 

  • చిన్న‌త‌నంలో సైకిల్ తొక్క‌డం నేర్చుకున్నారా? పెద్ద‌య్యాక కూడా సైకిల్ తొక్కే అలవాటును కొన‌సాగిస్తున్నారా? అబ్బే.. అస‌లు అల‌వాటు చేసుకోలేదండీ అంటారా? మ‌రేం ఫ‌ర్వాలేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్క‌డం ఎంచ‌క్కా నేర్చేసుకోవ‌చ్చు. ఏంటీ.. సైకిల్ తొక్క‌డం కూడా నేర్పుతారా? కారు, బైక్ డ్రైవింగ్ నేర్ప‌డం గురించి విన్నాం కానీ.. దీని గురించి ఎప్పుడూ విన‌లేదే అనుకుంటున్నారా? మీకో ఆస‌క్తిక‌ర సంగ‌తి తెలుసా? సైకిల్ తొక్క‌డం నేర్పించి ఓ కుర్రాడు రెండేళ్ల‌లో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు సంపాదించాడు. ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇంత‌కీ ఎవ‌రా కుర్రాడు, ఏమా క‌థ.. తెలుసుకుందాం రండి.

    డ‌బ్బు సంపాదించ‌డం కోసం మ‌నుషులు ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తుంటారు. చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఆఫ్ స్పోర్ట్‌లో మూడవ సంవత్సరం మాస్ట‌ర్ డిగ్రీ చ‌దువుతున్న లీ అనే విద్యార్థి కూడా ఖాళీ స‌మ‌యంలో డ‌బ్బు సంపాదించాల‌నుకున్నాడు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సైక్లింగ్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను గ‌మ‌నించి ఆ దిశ‌గా అడుగులు వేశాడు. త‌న స్నేహితుడితో క‌లిసి షాంఘైలో ప్రొఫెషనల్ సైక్లింగ్ శిక్ష‌ణ మొద‌లు పెట్టాల‌ని భావించాడు. అయితే త‌న మిత్రుడికి ఉద్యోగం దొర‌క‌డంతో అత‌డు మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడు. లీ మాత్రం ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

    చ‌దువు కొన‌సాగిస్తూనే..
    ముందుగా సైకిల్ తొక్క‌డం ఎలా నేర్చుకోవాలో బోధిస్తూ చేసిన వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. రెండు నెల‌ల త‌ర్వాత అత‌డికి తొలి అవ‌కాశం ద‌క్కింది. అక్క‌డి నుంచి లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క చ‌దువు కొన‌సాగిస్తూనే, మ‌రో ప‌క్క ఉపాధి వెతుక్కున్నాడు. పిల్ల‌లు, పెద్ద‌ల‌కు ఎంతో ఓపిగ్గా సైకిల్ తొక్క‌డం (bicycle ride) నేర్పిస్తూ మ‌న్న‌న‌లు పొందాడు. దీంతో అత‌డికి ద‌గ్గ‌ర సైకిల్ నేర్చుకునేందుకు స్థానికులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. 

    త‌న వ‌ద్ద‌ నేర్చుకుంటే క‌చ్చితంగా సైకిల్ వ‌స్తుంద‌న్న భ‌రోసా ఇవ్వ‌డంతో ఔత్సాహికులకు న‌మ్మ‌కం పెరిగింది. ఒక్కొక్క‌రి నుంచి 800 యువాన్లు (సుమారు రూ. 10 వేలు) తీసుకునేవాడు. రెండు క్లాసుల‌తోనే శిక్ష‌ణ పూర్తి చేసేవాడు. ఒక్కొ క్లాస్‌కు గంట‌న్న‌ర నుంచి 2 గంట‌ల స‌మ‌యం తీసుకుంటాడు. పిల్ల‌లు త్వ‌ర‌గా నేర్చుకోలేరు కాబ‌ట్టి వారికి ఎక్కువ స‌మ‌యం కేటాయించేవాడు. సైక్లింగ్ శిక్ష‌ణ ద్వారా రెండేళ్లలో అత‌డు దాదాపు 35 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల‌కు పైగా సంపాదించిన‌ట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్ల‌డించింది.

    అలా నేర్పిస్తాడు..
    ఓర్పుగా నేర్పించ‌డ‌మే త‌న విజ‌య ర‌హ‌స్యం అంటాడు లీ. శిక్ష‌ణ కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారితో ముందుగా 10 నిమిషాలు మాట్లాడతాన‌ని, దీని ద్వారా వారు ఎంత స‌మ‌యంలో నేర్చుకోగ‌లుగుతారో అంచ‌నా వ‌స్తాన‌ని చెప్పాడు. చిన్నత‌నం సైకిల్ నేర్చ‌కుంటూ ప‌డిపోవ‌డంతో క‌లిగిన భ‌యం వ‌ల్ల చాలా మంది  వెనుకంజ వేస్తుంటారు. వారిలో ఆ భ‌యాన్ని పొగొట్టడానికే వారితో మాట క‌లుపుతాన‌ని వివ‌రించారు.

    చ‌ద‌వండి: ఫిట్స్‌తో ఎవ‌రైనా ప‌డిపోతే ఇలా చేయ‌కండి

    షాంఘై దాటి..
    సైక్లింగ్‌కు ఇంత ఆద‌ర‌ణ ఉంద‌ని తాను ఊహించ‌లేద‌ని లీ చెప్పాడు. జూన్‌లో త‌న చ‌దువు పూర్త‌వ‌గానే త‌న సేవ‌ల‌ను విస్తరిస్తాన‌ని తెలిపాడు. తన బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని షాంఘై వెలుప‌ల కూడా శిక్ష‌ణ ఇస్తాన‌ని వెల్ల‌డించాడు. జెజియాంగ్, జియాంగ్సు ప్రాంతాల్లోనూ సైక్లింగ్ కోచింగ్‌కు ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నాడు. 

  • అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉండే తమిళ నటుడు అరవింద్‌ స్వామి నటన పరంగానే కాదు గ్లామరస్‌ పరంగా ఆయనకు సాటిలేరెవ్వరూ. బాంబే, రోజా మూవీలో వేలాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు అరవింద్‌స్వామి. అలాంటి ఆయన కెరీర్‌పీక్‌లో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇటీవలే ‍ప్రధాన పాత్రలతో ప్రేక్షకులకు చేరవవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తాను ఎందుకు సినీ ఫీల్డ్‌కి ఎందుకు దూరంగా ఉన్నారో వెల్లడించారు. అనారోగ్యం బారిన పడటం ఒక కారణమైతే, అధిక బరువు మరో కారణమంటూ..తాను ఎదుర్కొన్య ఆరోగ్య సమస్య గురించి కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఏ అనారోగ్య సమస్యతో బాధపడ్డారంటే..

    అరవింద్‌ స్వామికి 2005లో పాక్షికంగా పక్షవాతం వచ్చింది. 18 నెలలు ఎంతగానో నొప్పితో విలవిలలాడాడు. చివరికి శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన అది వద్దనుకుని కేరళకు చెందని ఆయుర్వేద వైద్యుడిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఒకటిన్నర ఏడాదిగా అనుభవించిన బాధ అంత ఇంత కాదని, ఆఖరికి స్పర్శను కూడా కోల్పోయానని అన్నారు. కానీ ఆయుర్వేదం తనను మూడు రోజుల్లో తిరిగి నడిచేలా చేసిందన్నారు. 

    అది నాకు చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తనకు పనిచేసింది కాబట్టి ప్రజలను ఫాలో అవ్వమని సూచించడం లేదు. అలాగే గుడ్డిగా కూడా ఫాలో కావొద్దన్నారు. వైద్యుల సూచనల మేరకు, ఆరోగ్య పరిస్థితి రీత్యా సరైన నిర్ణయం తీసుకోండని అన్నారు. ఇక్క నొప్పి, కదలలేని పరిస్థితి కంటే..మానసికంగా స్థైర్యంగా ఉండటం అత్యంత ప్రధానమని అన్నారు. ఆ పరిస్థితిలో నాకే ఇలా అనే ఆలోచన దరిదాపుల్లోకి కూడా వెళ్లకూడదన్నారు. ఆ సమస్య నుంచి బయటపడ్డ వెంటనే..ఫజిల్స్‌, చదరంగం వంటి ఆటలతో బిజీ అయిపోయినట్లు తెలిపారు. 

    అయితే ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డాక మళ్లీ సినీ రంగంవైపుకి రావాలని అస్సలు అనుకోలేదు, సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఎందుకంటే ఆ టైంలో చాలా మందులు వాడటంతో విపరీతం బరువు పెరిగిపోయి, జుట్టు ఊడిపోయి అదోలా తయారయ్యానని, దాంతో సినిమాల ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు అరవింద్‌ స్వామి. ఎంత టెక్నాలజీ అభివృద్ది చెంది..ఆధునాత వైద్యం చెంతకు చేరినా..ఏళ్లనాటి పురాతన ఆయుర్వేదమే అత్యుతమమని పలు ఉదంతాల్లో నిరూపితమైంది కూడా.

    (చదవండి: అమెరికా కోడలు..ఇండియా అత్త..! అనుబంధం మాములుగా లేదుగా..)

     

  • అత్తా కోడలు బంధం అనగానే ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక ఇంటిలో రెండు కొప్పులు పొసగవు అన్న నానుడిలా ఉంటుంది చాలావరకు. కానీ ఈ అత్తాకోడళ్లు అందుకు విరుద్ధం. పైగా ఆ కోడలు దేశం, సంస్కృతి, వేషధారణ అన్ని పూర్తి విభిన్నం..అయినా వారి మధ్య అనుబంధం మాములుగా లేదు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

    ఆ వీడియోని డెట్రాయిట్‌లో జన్మించిన వ్యవస్థపకురాలు బ్రిటినీ గ్రే యాదవ్‌ షేర్‌ చేశారు. ఆ వీడియోలో రెండు వేర్వేరు దేశాలు మధ్య శక్తిమంతమైన బాండింగ్‌ని చూపించింది. ఆమె తన భారతీయ అత్తగారితో గడిపిన క్షణాన్ని షేర్‌ చేసింది. తాము రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటామని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆతర్వాత ఆమె తన అత్తగారు ఆ వీడియోలో ఎందుకు అంతలా నవ్వుకుంటున్నామో వివరించింది. 

    తాము సరదాగా మాట్లాడుకుంటూ..తన అత్తగారు కోడలి నుంచి ఆశిస్తోంది ఏంటో చెప్పగా..దాన్ని తాను చేసి చూపించడంతో నవ్వులు విరిశాయని పేర్కొంది. ఇంతకీ భారతీయ అత్తగారు కోడలి నుంచి ఏం ఆశించారంటే..ప్రతి రోజు వంట చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పాదాలు నొక్కడం తదితరాలని మాట. ఆ అత్తగారు కోరుకున్నట్లుగానే బ్రిటనీ నేలపై కూర్చోగా..అత్తగారు సోఫాలో కూర్చొని..ఒకటే పకపక నవ్వు. ఇద్దర్నీ చూస్తే..అత్త కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా మెలుగుతున్న వారిని చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత అద్భుతంగా ఉంది ఆ ఘట్టం. 

    ఇక బ్రిటనీ డెట్రాయిట్‌కి చెందిన నల్లజాతి అమ్మాయి కాగా, ఆ అత్తగారు భారత్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ. నెటిజన్లు కూడా ఆ అత్తాకోడళ్లు కలిసిమెలిసి ఉన్న విధం చూసి ఫిదా అవ్వడమే గాక ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: బరువు తగ్గాలంటే..తూచా తప్పకుండా పాటించాల్సిన ఏడు సూత్రాలు..!)

     

  • మధుమేహ రోగులకు HbA1c పరీక్ష ప్రామాణికం. రక్తంలో చక్కెర స్థాయుల సగటు ఎంత ఉందో ఈ పరీక్షలో కచ్చితంగా తెలుస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈ పరీక్ష ఫలితాలపై ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... ప్రపంచవ్యాప్త వైద్యవిశేషాలతో ప్రచురితమయ్యే ప్రముఖ పత్రిక లాన్సెట్! 

    భారతీయులు HbA1c పరీక్ష బదులుగా ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ చేయించుకోవడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు. గత కొద్ది నెలలుగా గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉన్న మధుమేహ రోగుల విషయంలో సాధారణంగా చేసే HbA1c పరీక్ష అత్యంత కచ్చితమైన పద్ధతి కాదనేది దేశంలోని పలువురు సుప్రసిద్ధ డయాబెటాలజిస్టుల తాజా వాదన. లాన్సెట్ పత్రికలో ‘ప్రాంతీయ ఆరోగ్యం: ఆగ్నేయాసియా (రీజినల్ హెల్త్: సౌత్ ఈస్ట్ ఆసియా) పేరిట ఈ అధ్యయన ఫలితాలు ఈ నెల 9న ప్రచురితమయ్యాయి. చక్కెర వ్యాధికి భారత్ రాజధాని. మన దేశంలో మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 10.10 కోట్లు. వీరిలో చాలామంది తమ గ్లూకోజ్ స్థాయులు తెలుసుకోవడానికి HbA1c పరీక్ష చేయించుకుంటుంటారు. అయితే ఇండియాలో ఈ పరీక్ష స్పష్టమైన వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించడం లేదనే మరో కథనం కూడా ఇటీవల ‘లాన్సెట్’లో వచ్చింది.

    HbA1c పరీక్ష ఎందుకు?
    ఎర్ర రక్తకణాలు సుమారు మూడు మాసాలు జీవిస్తాయి. కనుక HbA1c లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ పరీక్షను గత రెండు నెలలు లేదా మూడు నెలల కాలానికి రక్తంలోని చక్కెర నిల్వల స్థాయిని తెలుసుకోవడానికి చేస్తారు. హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఆక్సిజన్ ను మోసుకెళ్లే ప్రోటీన్. ఇది గ్లూకోజును అతుక్కుని ఉంటుంది. HbA1c  టెస్టులో హీమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షిస్తారు. HbA1c స్థాయి 5.7 శాతం కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేనట్టు. అది 5.7-6.4 శాతం మధ్య ఉంటే ప్రీ-డయబెటిస్ కింద లెక్క. 6.5 శాతాన్ని మించితే సుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణిస్తారు. రక్తంలో చక్కెర నియంత్రణ, HbA1c లెవల్స్ మధ్య గల లింకు గురించి 1976లో తెలిసినప్పట్నుంచి ‘గ్లైసెమిక్ కంట్రోల్’ పరిశీలనకు సంబంధించి HbA1c అనేది ‘స్వర్ణ ప్రామాణిక పరీక్ష’ తరహాలో ఓ గీటురాయిగా మారింది. ఇది ఓ స్థిరమైన ముందస్తు విశ్లేషణతో కూడిన పరీక్ష. 2010లో దీన్ని ఓ డయాగ్నొస్టిక్ విధానంగా కూడా ప్రతిపాదించారు. పరగడుపున సేకరించే రక్త నమూనా కోసం సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా HbA1c విధానంలో రోగి ఏమీ తినకుండా ‘ఉపవాసం’ పాటించాల్సిన అవసరం లేదు.

    HbA1cలో కచ్చితత్వం ఉండదా?
    పరిశోధకులు ఈ సందర్భంగా వివిధ పద్ధతుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయులను కొలిచి, వాటిని పోల్చుతూ పలు అధ్యయనాలతో సమీక్షించారు. దక్షిణ భారత దేశంలో ఇటీవల 1,120 మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో HbA1c పరీక్ష (45.4%)తో పోలిస్తే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (87.8%) (OGTT)లో ఎక్కువ ప్రీ-డయాబెటిస్ కేసులు నమోదయ్యాయి. (ప్రీ-డయాబెటిస్ అంటే మధుమేహం త్వరలో రాబోతోందని తెలిపే ఓ ముందస్తు సూచిక. ఆహార అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, మద్యం- ధూమపానం మానివేయడం, జీవన శైలిని మార్చుకోవడం వంటివి పాటించకపోతే అనతి కాలంలోనే వారికి అతిదాహం-అతిమూత్ర వ్యాధి ఖాయం!). 

    పుణెలో 116 మంది యువతపై నిర్వహించిన ఓ స్టడీలో 23.3% ప్రీ-డయాబెటిస్ కేసుల్ని HbA1c పరీక్ష గుర్తించగా, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (OGTT) మాత్రం 7.8% కేసుల్లో మాత్రమే ప్రీ-డయాబెటిస్ ఉన్నట్టు తేల్చింది. ఆయా వ్యక్తుల్లో ఎర్ర రక్తకణాల స్థాయులు, వాటి జీవితకాలం, అవి గ్లూకోజుతో అంటిపెట్టుకొని ఉండే అంశాల కారణంగానే ఈ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. “HbA1c స్థాయులపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఐరన్ (ఇనుము) కొరతతో తలెత్తే రక్తహీనత (అనీమియా) లేదా జీ6పీడీ (ఎర్ర రక్తకణం ఎంజైమ్) కొరత వల్ల రక్తకణాలు విచ్ఛిన్నమవుతాయి. ఇటువంటి పరిస్థితులు హీమోగ్లిబిన్ లెవల్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా HbA1c లెవల్స్ మారతాయి” అని ఫోర్టిస్ సి-డాక్ సెంటర్ ఫర్ డయాబెటిస్ ఛైర్మన్, పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్న రచయితల్లో ఒకరైన డాక్టర్ అనూప్ మిశ్రా వ్యాఖ్యానించారు.

    దేశంలో అనీమియా వ్యాప్తి అధికంగా ఉందని, దీంతోపాటు కొన్ని జన సమూహాల్లో తలసేమియా (దేహంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తయ్యే అనువంశిక రక్తసంబంధ రుగ్మత), సికిల్ సెల్ (హీమోగ్లోబిన్ సంబంధిత వంశపారంపర్య రుగ్మత) వంటి హీమోగ్లోబినోపతీస్ (జన్యుపరమైన అనువంశిక వ్యాధులు) ఉన్నాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు, అధ్యయనకర్తల్లో ఒకరైన శశాంక్ జోషి తెలిపారు. అలాగే మలేరియా కేసులు కూడా వ్యాప్తిలో ఉన్నాయని, ఇవన్నీ హీమోగ్లోబిన్ స్థాయులపై ప్రభావం చూపుతాయని చెప్పారు. 

    ఇటువంటి స్థితిలో HbA1c లెవల్స్ కచ్చితమైన ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. నిపుణుల సలహా ఏమిటంటే... మధుమేహ రోగులకు HbA1c పరీక్ష కంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) లేదా నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) టెస్ట్ ఉత్తమం. HbA1c పరీక్ష అక్కర్లేదని, వారంలో రెండు లేదా మూడు సార్లు వంతున కొంతకాలం పాటు రక్తపరీక్ష చేయించుకుంటే షుగర్ లెవల్స్ సంగతి ఇట్టే తెలిసిపోతుందని డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో HbA1c పరీక్ష రుసుము సుమారు రూ.600గా ఉంది. 

    - జమ్ముల శ్రీకాంత్

    (Credits: The Lancet, The Indian Express, Hindustan Times, The Economic Times, ET Health World, NDTV)

  • బరువు తగ్గడం అన్నది చాలామందికి అతిపెద్ద సమస్య. కానీ కొందరికి చాలా సింపుల్‌. అదికూడా నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండానే వెయిట్‌లాస్‌ అవుతారు. అలాగని, అధిక వర్కౌట్లు, వ్యాయామాలు కూడా చేయరు. సాధారణంగా రోజువారీగా చేసే సింపుల్‌ వ్యాయామాలు..కాస్త తెలిగా మంచి ఆహారం తీసుకుంటూ తగ్గుతారు.  ఇక్కడ ఆరోగ్యానికి భంగం వాటిల్లకుండా..తగిన ప్రోటీన్లు, విటమిన్లు అందేలా జాగ్రత్త వహిస్తే..ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గేలా మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక్కడొక ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా అదే నిరూపించాడు. రోజువారీ ఆహారాన్ని రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని..అవలీలగా 35 కిలోలు తగ్గి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు బరువు తగ్గాలంటే ఈ ఏడు చిట్కాలు తప్పకుండా ఫాలో అవ్వాలని అంటున్నాడు. అవేంటో చూద్దామా..!

    ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అన్ష్‌ త్రిపాఠి కొలెస్ట్రాల్‌ తగ్గించే వాస్తవిక ఆహార నియమాలను షేర్‌ చేసుకున్నాడు. తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. బరువు తగ్గడంలో కన్ఫ్యూజన్‌కి గురికావొద్దని అంటున్నాడు. మన స్వచ్ఛమైన భారతీయ ఆహారంతోనే కొవ్వుని కరిగించేలా తీసుకుంటే చాలని చెబుతున్నాడు. 

    ప్రధాన నియమం..
    కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఆహారాలే మన భోజనపు ప్లేట్‌లో ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్‌ వేటిలో ఉంది..? తగినన్ని కూరగాయలు తింటున్నామా?.. నూనె దగ్గర నుంచి కార్బోహైడ్రేట్స్‌ వరకు అన్ని నియంత్రణలో ఉన్నాయా..?  అని గమనించాలి. ఇక్కడ ఏది మిస్‌ అవ్వకూడదు. 

    ఆహారంలో ఉండాల్సినవి..
    తప్పనిసరిగా సగం కూరగాయల్లో  1/4 వంతు ప్రోటీన్‌,  1/4 కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడాలి.

    ప్రోటీన్ తప్పనిసరి..
    ఆహారంలో కొవ్వు నష్టాన్ని ప్రోటీన్ నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ తక్కువగా ఉంటే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో కండరాలను కోల్పోవడం ప్రారంభమవుతుంది. .

    కూరగాయలు తప్పనిసరి..
    ఆరోగ్యకరమైన ఆహారంలో అతి ముఖ్యమైన భాగం. ప్లేట్‌లో వండిన లేదా పచ్చిగా ఉన్న భోజనానికి కనీసం రెండు వేర్వేరు కూరగాయలు ఉండాలి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి

    కార్బోహైడ్రేట్ నియంత్రణ నియమం
    మన ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను జోడించాలి కానీ మితంగా ఉండాలి. భోజనంలో 1 రోటీ లేదా 1 కప్పు బియ్యం ఉండేలా కేర్‌ తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాటి స్థానంలో పోహా లేదా ఉప్మాతో కూడా మార్చుకోవచ్చు. 

    కొవ్వు/నూనె నియమం
    డైట్‌ విషయంలో చాలామంది ఫెయిలైదే ఇక్కడే అని అంటున్నాడు. మన భోజనంలో రెండు నుంచి మూడు స్పూన్లకు మించి నూనె ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుంది. కేలరీలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

    గుర్తించుకోవాల్సిన విషయాలు
    శాఖాహారుల కోసం,  కొవ్వు తగ్గింపు ప్లేట్‌లో సగం ప్లేట్ సబ్జీ, 1 కటోరి పప్పు/పనీర్/టోఫు,  1 రోటీ లేదా చిన్న మొత్తం రైస్‌ ఉండాలి. శాఖాహారులకు కొవ్వు నష్టం కష్టంగా అనిపించిందంటే..ప్రోటీన్ తీసుకోవడం చాలా తక్కువగా ఉందని అర్థం.

    అలాగే నాన్-వెజ్ ప్లేట్‌లో చికెన్/చేప/గుడ్లు ప్రధానంగా ఉంటాయి. ప్లేట్‌లో సగానికిపైగా కూరగాయలు ఉండాలి. సమతుల్యతను కాపాడుకోవడానికి కార్బ్ భాగం చిన్నగా ఉండాలి. భాగాలను నియంత్రించినప్పుడు మాత్రమే మాంసాహార ప్లేట్ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.

    అల్పాహారం ప్లేట్‌లలో తక్కువ కార్బోహైడ్రేట్‌లతో ప్రోటీన్ ఉండాలి, ద్రవ కేలరీలు ఉండకూడదు. అయితే డిన్నర్ లేదా లంచ్ ప్లేట్‌లో ప్రోటీన్ క్వాండిటీ తక్కువగా ఉంటే..ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉండవచ్చు.

    చక్కెర పానీయాలు నివారించండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలను ఇతరులతో షేర్‌ చేసుకోండి. 

    ఇలా గనుక ఆహారంలో మార్పులు చేసుకుని తూచా తప్పకుండా ఫాలో అయితే..ఇట్టే బరువు తగ్గుతారంటూ తన పోస్ట్‌ని ముగించాడు ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ త్రిపాఠి.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: ఉబర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని మరి.. యూట్యూబ్‌లో కోడింగ్‌..!)

     

Politics

  • తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రస్టేషనలో ఉన్నారని, ఆయన ఏదోదో చేద్దామనుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు( మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన బొత్స.. రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని మండిపడ్డారు. 

    రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని. రేపు వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బొత్స. ‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగాలేవు. ప్రజలు అర్ధాకలితో ఉంటే‌ పట్టించుకోవటం లేదు. రాష్ర్టంలో పాలన గాలికి వదిలేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబిఐ చెప్పింది. 

    ఇక దాని గురించి మాట్లాడి టైం వేస్ట్ ఎందుకు?, సిట్ నివేదిక ఇచ్చాక ఇంకా కమిషన్ వేయటం ఎందుకు?, అసలు ఆ కమిషన్‌కి చట్టబద్ధత ఉంటుందా?, చంద్రబాబు సిట్ నివేదికను  బయట పెట్టాలి. ఎల్లుండి శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. అన్ని విషయాలు అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని బొత్స తెలిపారు.

  • ఢిల్లీ :  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరికీ దత్తపుత్నుడ్ని కాదనే విషయాన్ని రేవంత్‌ తెలుసుకుంటే మంచిదన్నారు. తన తల్లి పెట్టిన పేరును మార్చడానికి రేవంత్‌ ఎవరని, కావాలంటే రేవంత్‌.. రేవంత్‌ఖాన్‌ అని పేరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మజ్లిస్‌తో మీరు కాపురం చేసినన్నాళ్లూ తాము నిప్పులు పోస్తామన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏమిచ్చారో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

    కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిదా..? లేక కిషన్‌రెడ్డిదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఎంపీ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు రాదని మాట్లాడారు. నా పేరు మార్చినా ఎన్ని మాట్లాడినా గెలిచేది బీజేపీనే. తల తోకా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెండేళ్లుగా మాటలతో గడిపారు. రేవంత్ ఏం చేస్తారో చేతల్లో చూపించాలి. ఇచ్చిన మాటపై నిలబడే శక్తి లేకపోతే రాజీనామా చేయాలి. రేవంత్  చేతగానితనాన్ని బీజేపీ పై రుద్దొద్దు. రేవంత్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’ అని స్సష్టం చేశారు.

  • హైదరాబాద్‌: కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్‌ అప్పనంగా తీసుకొని పోతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్‌ ప్యాలెస్‌లో కూర్చొని కళ్లప్పగించి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. 

    ఈరోజ(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తెలంగాణ భవన్‌ నుంచి మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు.. కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్‌సీ.. కేఆర్‌ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. 

    తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుందని హరీష్‌ స్పష్టం చేశారు.  రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని, ఈఎన్‌సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్‌ నిర్లక్ష్యంగా ఉందని హరీష్‌ మండిపడ్డారు.

  • తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.  ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) తిరుపతి నుంచి మీడియాతో మాట్లాడిన భూమన.. తిరుమల లడ్డూపై  సిట్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

    బీఆర్‌ నాయుడు, ముద్దాడ, రవిచంద్ర బలవంతంగా పెద్ద జీయర్‌ స్వామితో లేఖ రాయించారు. లడ్డూ అంశంలో రాజకీయ నాయకులకు ఎలాంటి ప్రమేయంలేదని సిట్‌ స్పష్టంగా చెప్పింది. కొంతమంది స్వాములను చంద్రబాబు భయపెట్టి లేఖలు రాయిస్తున్నారు. చంద్రబాబు క్షద్ర రాజకీయాల్లో ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోతున్నారు. స్వాములను భయపెట్టి చంద్రబాబ ఏం సాధించాలని అనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.

    ‘కొంతమంది స్వాములకు భక్తి కంటే పైరవీలు ఎక్కువ అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులపైనే ఎల్లో మీడియా దాడులు చేస్తోంది. హైందవ సమాజానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు రెడ్‌బుక్ పాలన పెద్ద జీయర్‌స్వామిపైకి మళ్లింది. వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

  • సాక్షి, విశాఖ‌ప‌ట్నం: తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ పేరుతో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా కూట‌మి నాయ‌కులు శ్రీవారి భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకుంటున్నార‌ని, పాల‌న‌లో ఘోరంగా విఫ‌ల‌మైన చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేసే సత్తా లేక వాటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడ‌ని విశాఖ‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు కెకె రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    విశాఖలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంతో చంద్ర‌బాబు వికృత రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న అస‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ ప‌డ‌కుండా ఏడాదిన్న‌ర‌గా క‌లియుగ‌ దైవం శ్రీవేంక‌టేశ్వ‌రుడిని రాజకీయాల్లోకి లాగుతూ చంద్ర‌బాబు ప‌బ్బం గ‌డుపుతున్నాడ‌ని, శ్రీవారిని రాజ‌కీయాల్లోకి లాగి ల‌బ్ధి పొందాల‌ని చూడటం సిగ్గ‌చేట‌న్నారు. తిరుమ‌ల‌పై చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అండ్ కో చేస్తున్న‌ దుష్ప్ర‌చారాల‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దని హెచ్చ‌రించారు.

    చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా టీటీడీ రిజెక్టు చేసిన ట్యాంక‌ర్లు దొడ్డి దారిన ఎలా ప్ర‌వేశించాయో స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. బోలేబాబా డెయిరీకి కూడా గతంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండగానే అనుమ‌తి ల‌భించింద‌ని, అంతేకాకుండా ఎన్నిక‌ల స‌మ‌యంలో 2019 ఏప్రిల్ లో 82 వేల కేజీల నెయ్యి స‌ప్లై ఆర్డ‌ర్ ఎలా ఇచ్చార‌ని నిలదీశారు. దీనిపై సీబీఐ సిట్ చార్జిషీట్ లో అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    ఆల‌య ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చారు
    స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని ఏడాది క్రితం సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ఆల‌య ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన సీబీఐ సిట్ చార్జిషీట్ త‌ప్ప‌ని తేల్చ‌డంతో కూట‌మి ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డింది. త‌ప్పును చేశామ‌ని అంగీకరించి శ్రీవారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందిపోయి.. అబ‌ద్ధాన్ని నిజం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌రిన్ని త‌ప్పులు చేస్తున్నారు.

    ఏకంగా కేబినెట్ మొత్తాన్ని మీడియా ముందుకు పంపించి శ్రీవారి ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా మంత్రుల‌తో చంద్ర‌బాబు మాట్లాడిస్తున్నాడు. దేవుడితో ముడిపడిన సున్నిత‌మైన అంశాన్ని ప‌ట్టుకుని వికృత రాజ‌కీయాల‌కు తెర‌దీయ‌డం సిగ్గుచేటు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రోజుకో క‌ట్టు క‌థ‌లు ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే కుట్ర‌లు చేస్తున్నారు. ల‌డ్డూకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేప‌ల నూనె క‌లిసింద‌ని మొన్న‌టిదాకా ప్ర‌చారం చేసిన కూట‌మి నాయ‌కులు.. కొత్త‌గా పామాయిల్‌, బాత్రూమ్‌లు క‌డిగే ర‌సాయ‌నాలు క‌లిశాయంటూ తిమ్మిని బ‌మ్మిని చేసే కుట్ర‌కు తెర‌దీశారు.

    బాబూ.. వీటికి స‌మాధానం చెప్పు
    వాస్త‌వానికి తాను చేసిన ఆరోప‌ణ‌ల‌న్నింటికీ తానే స‌మాధానం చెప్పాల్సిన చంద్ర‌బాబు.. ఆ నెపాన్ని వైయ‌స్సార్సీపీ మీద‌కు నెట్టేసి త‌ప్పించుకోవాలని చూడ‌టం సిగ్గుచేటు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక టీటీడీకి వ‌చ్చిన నాలుగు ట్యాంక‌ర్ల నుంచి సేక‌రించిన నెయ్యి శాంపిల్స్‌ తోనే ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్ఐ ప‌రీక్ష‌లు జ‌రిపింది. ఆ నెయ్యి లోనే పామాయిల్‌, బాత్రూమ్‌లు క‌డిగే ర‌సాయ‌నాలు క‌లిశాయంటూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అండ్ కో ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజుకో క‌ల్పిత క‌థ‌నాలు రాసి ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురిచేసి రాజ‌కీయ ల‌బ్ధి పొందడ‌మే ల‌క్ష్యంగా క‌ల్తీ నెపాన్ని వైయ‌స్సార్సీపీ మీద‌కు నెట్ట‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

    చంద్ర‌బాబు సీఎం అయ్యాక టీటీడీ రిజెక్టు చేసి వెన‌క్కి తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంక‌ర్ల‌నే దొడ్డి దారిన తెప్పించి ల‌డ్డూ త‌యారీకి వాడారు. దీనికి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సిందిపోయి  దొంగే దొంగ అన్న‌ట్టుగా ఆయ‌నే తిరుమ‌లపై త‌ప్పుడు ప్ర‌చారం ఊపందించాడు. భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించిన సున్నిత‌మైన అంశంపై రాజ‌కీయాలు చేస్తూ ల‌బ్ది పొందాలనుకోవ‌డం సిగ్గుచేటు. సీబీఐ చార్జిషీట్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప్రీమియ‌ర్ అగ్రీ ఫుడ్స్ చంద్ర‌బాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు 2014-19 వ‌ర‌కు  రూ. 273.90 ల‌కు తిరుమ‌ల‌కు నెయ్యిని స‌ర‌ఫ‌రా చేసింది. వాస్త‌వం ఇలా ఉంటే నువ్వుల నూనె క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు నెయ్యి ఎలా స‌ప్లై చేస్తున్నార‌ని వారే ప్ర‌శ్నిస్తారు.

    తప్పు చేసి దొరికిపోయి కవర్ చేసేందుకు హార్పిక్ డ్రామా

    నేరం చేసిన‌ట్టు సీబీఐ చార్జిషీట్లో పొందుప‌రిచిన బోలేబాబా డెయిరీకి కూడా చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గానే టీటీడీకి అనుమ‌తి ల‌భించింది. మార్చి 6, ఏప్రిల్ 19, 2019న 82 వేల కేజీలు ఒక‌సారి, 12 వేల కేజీలు ఇంకోసారి నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేసే బ‌ల్క్ ఆర్డ‌ర్ ఇవ్వ‌డంపైన సీబీఐ సిట్‌ అనుమానం వ్య‌క్తం చేసింది. పైగా ఆ ఆర్డ‌ర్ కేజీ విలువ రూ.291 మాత్ర‌మే కావ‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.

    దీనికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌కి లేదా?  బోలేబాబా డెయిరీకి 82 వేల కేజీల నెయ్యిని రూ.291ల‌కు ఆర్డ‌ర్ ఇవ్వ‌లేద‌ని, టీటీడీ రిజెక్టు చేసి పంపిన నెయ్యిని అడ్డదారిలో తెచ్చి వాడ‌లేద‌ని చంద్ర‌బాబు స‌హా కేబినెట్ మంత్రులు ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా?  2015లో టీటీడీకి నెయ్యిని స‌ప్లై చేస్తున్న నందిని డెయిరీ పేరుతో విజ‌య‌వాడ‌లో డూప్లికేట్ నెయ్యి త‌యారు చేసి 12 ట్యాంక‌ర్లు స‌ప్లై చేస్తే ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌) విచార‌ణ చేసిన విష‌యం నిజ‌మా కాదా?  ఈ ఘ‌ట‌న‌పై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌కు ఏం స‌మాధానం చెబుతారు?

    హామీలు అమ‌లు చేయ‌లేక డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌
    అధికారంలో ఉన్న చంద్ర‌బాబు త‌న వ‌ద్ద ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌తో విచార‌ణ జ‌రిపించి ఎవ‌రైనా త‌ప్పు చేసి ఉంటే న్యాయ‌ స్థానాల్లో శిక్ష‌లు ప‌డేలా చేయకుండా రోడ్డెక్కి త‌ప్పు ప్ర‌చారం చేయ‌డం, త‌న‌కు అనుకూల ప‌త్రిక‌లు, టీవీల‌లో ఊద‌ర‌గొట్టడం, ఫ్లెక్సీలు, వాల్‌ పోస్ట‌ర్లు, క‌ర‌ప‌త్రిక‌ల ద్వారా తిరుమ‌ల ప్ర‌తిష్ట‌కు న‌ష్టం వాటిల్లేలా దుష్ప్ర‌చారం చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మో ఆలోచించుకోవాలి. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం హిందూ మ‌త విశ్వాసాలను దెబ్బ‌తీస్తూ భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకునే హ‌క్కు చంద్ర‌బాబుకి ఎవ‌రిచ్చారు?

    చంద్ర‌బాబు చేసిన మ‌హాప‌చారం తెలుగుదేశం పార్టీకి అంటుకుని ఆ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేకుండా పోతుంద‌నే భ‌యంతో పాపాన్ని జ‌న‌సేన, బీజేపీకి అంటించ‌డానికే ప్రెస్‌మీట్ పెట్టించాడు. కానీ అక్క‌డ కూర్చున్న వారంద‌రిలోనూ త‌ప్పు చేశామ‌న్న భావ‌న క‌నిపిస్తోంది. దేవుడితో ఆట‌లాడుకుంటున్నామ‌న్న అప‌రాధం కనిపిస్తోంది. స్వామీజీలు, పీఠాధిపతులు, భ‌క్తుల విశ్వాసాల‌కు భంగం క‌లిగించే చంద్ర‌బాబు మోసాల‌ను ఇక‌నైనా గుర్తించి ఆయ‌న్ను ప్ర‌శ్నించాలి. త‌న అస‌మ‌ర్థ పాల‌న నుంచి ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయ‌లేని చేత‌కాని త‌నం నుంచి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికి క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌రుడితో ఆట‌లాడుకుంటున్న చంద్ర‌బాబుని నిల‌దీయాలి. చేసిన త‌ప్పుకి ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించ‌కుండా అబ‌ద్దాలు, మోసాల‌తో మ‌భ్య పెట్టాల‌ని చూస్తున్న కూట‌మి నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు గ‌ట్టిగా బుద్ధి చెప్పాలి.

Guest Columns

  • భారత్‌–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా, లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది. భారత ఆర్మీ మాజీ ఛీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణె రాసిన ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకం (Four Stars of Destiny) అధికారికంగా ఇంకా ప్రచురణ కాలేదు. కానీ, ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘క్యారవాన్‌’ మ్యాగజైన్‌ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. 2020 జూన్‌ నాటి సంగతి. గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాశ్‌ రేంజ్‌ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుద్ధ ప్రకటన!

    2020 ఆగస్టు 31. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్‌ దూరంలో మోహరించాయి. భారత  కమాండర్లు అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలూ లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి. అప్పటి ఆర్మీ చీఫ్‌ నరవణె రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్‌ చేసి ‘ఏం చేయాలి?’ అని అడిగారు. వెంటనే స్పందన రాలేదు. తరువాత రక్షణ శాఖ మంత్రి నుండి ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. ‘ప్రధానితో మాట్లాడాను... జో ఉచిత్ సమ్‌ఝో వో కరో’ (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి). ఈ సూచన విని షాక్‌కు గురైనట్టు నరవణె రాసుకున్నారు. యుద్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది.

    ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్‌పేయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణె ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో అలాంటి నిర్ణయాత్మక స్పష్టత కనిపించలేదూ అని! ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్థే నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని సైన్యం పాటిస్తుంది. చైనా విషయంలో మోదీ తడబడి నట్టుగా నరవణె కథనం ద్వారా అర్థం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.

    జాతీయ భద్రత కారణంగా నరవణె పుస్తకాన్ని (Naravane Book) పరిశీలించాల్సి ఉందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తి కాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రత కన్నా తమకు ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఒక ఆర్మీ మాజీ ఛీఫ్‌ తన యుద్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా? ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో నరవణె పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించి నపుడు అధికార పక్షాలు అడ్డుకున్నాయి.

    చ‌ద‌వండి: నరవణె పుస్తకంపై పెంగ్విన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

    ‘అగ్నివీర్‌’, ‘అగ్నిపథ్‌’ పథకాల మీద కూడా నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడా తక్కువనీ గుర్తు చేశారు. భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. క్యారవాన్‌ పత్రిక (caravan magazine) ఆ పుస్తకంలోని కొన్ని అంశాలతో ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మిగిలిన పుస్తకంలో ఇతర సందరాల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి ఉండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.

    - డానీ 
    వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు