Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న హనీ ట్రాప్ దందాకు పోలీసులు బ్రేక్ వేశారు. ధనవంతులు, వ్యాపారులను టార్గెట్ చేసి ఉచ్చులో పడేసి నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ప్రధాన సూత్రధారి రాజుకుమార్, స్వప్నతో పాటు కొందరు రౌడీ షీటర్ల సహకారంతో ఈ దందాను నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ఉన్న ధనవంతులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని, పరిచయాలు పెంచి వారిని ఓ ఇంటికి లేదా లాడ్జ్‌కు రప్పించి హనీ ట్రాప్‌లోకి దించేవారు. అనంతరం రహస్యంగా నగ్న వీడియోలు తీసేవారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు.

    ఇటీవల ఈ ముఠా మెట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. కాగా వీరి బెదిరింపులు తట్టుకోలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుగా దర్యాప్తు చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై నిఘా పెట్టారు. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    అరెస్టు అయిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియో రికార్డులు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ తరహా బ్లాక్‌మెయిల్ ఘటనలపై ప్రజలు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. మెట్‌పల్లి పట్టణంలో కలకలం రేపిన ఈ హనీ ట్రాప్ కేసు, ఇలాంటి నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సందేశాన్ని ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

  • సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు అనేక ప్రత్యేక పథకాలను ప్రకటించింది. పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఈ పథకాలు వర్తించనున్నాయి. విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని గౌరవించేందుకు నగదు పురస్కారాలు, పింఛన్ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.  

    ప్రకటించిన పథకాలు  
    - తెలంగాణ శౌర్య పథకం – నెలకు రూ. 500 పింఛన్ + రూ.10,000 నగదు  
    - మహోన్నత సేవ పథకం – రూ.40,000 ఒకేసారి నగదు  
    - ఉత్తమ సేవ పథకం – రూ.30,000 నగదు  
    - కటినా సేవ పథకం – రూ.20,000 నగదు  
    - తెలంగాణ సేవ పథకం – రూ. 20,000 నగదు  

    ఈ పథకాలు పోలీస్, ఫైర్, విజిలెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

    సీఎం సర్వోన్నత పోలీస్ పథకం  
    న్యూ ఇయర్ డే సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. CRO సెల్, ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఎస్‌ఐ మణీష్ కుమార్ లఖానీ విశిష్ట పోలీస్ సేవలకు గాను సీఎం సర్వోన్నత పోలీస్ పథకం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డులో భాగంగా ఆయనకు రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేయబడింది. 

  • హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ జోష్‌ లిక్కర్‌ అమ్మకాల ద్వారా స్పష్టంగా కనబడుతోంది. రికార్డుస్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి.  ఈ క్రమంలోనే గత ఏడాది రికార్డును ఈ ఏడాది అమ్మకాలు దాటేశాయి. ఇప్పటికే రూ. 5 వేల కోట్లు లిక్కర్‌ సేల్స్‌ జరిగినట్లు అధికారులు తెలిపారు. 

    కొత్త మద్యం పాలసీతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈరాత్రి అమ్మకాల తర్వాత మరింతగా లిక్కర సేల్స్‌ పెరగనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లు అదనంగా మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం.

     

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. డిసెంబర్ మాసానికి సంబంధించి రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. పెండింగ్ బిల్లులు ఆగస్టు నుంచి ప్రతినెల కనీసం రూ.700 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. విడుదలైన బిల్లుల్లో గ్రాట్యూటీ, జీపీఎఫ్ -సరెండర్ లీవులు, అడ్వాన్స్‌లు ఉన్నట్లు సర్కార్‌ వెల్లడించింది.

    ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని గతంలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ నెలాఖరులో రూ.183 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్ట నుంచి ప్రతి నెలా నిధులను విడుదల చేస్తోంది. ఇవాళ రూ.713 కోట్లను విడుదల చేసింది.

     

  • సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల వేళ మందుబాబులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్‌ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు అని హెచ్చరించారు.

    న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మరోసారి వీసీ సజ్జనార్‌ స్పందిస్తూ.. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తామని తెలిపారు. ఈ తనిఖీలు కేవ‌లం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు.

    ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. చక్రవ్యూహంతో సిటీలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు జరుగుతాయి. చక్రవ్యూహం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్‌ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు. తాగి డ్రైవింగ్‌ చేస్తే నో షార్ట్‌ కట్స్‌.. నో స్మార్ట్‌ మూవ్స్‌ అంటూ హెచ్చరించారు.

    CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

    అలాగే, కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ చేయడం వంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి, స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి క్షేమంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ర్యాష్‌ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Sports

  • 2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్‌ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. 

    స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్‌, ఆతర్వాత ఇంగ్లండ్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌, దాని తర్వాత న్యూజిలాండ్‌ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్‌.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.

    వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్‌ ఇదే...

    జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా
    3 వన్డేలు, 5 టీ20లు

    ఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

    మార్చి  నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026

    జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా
    1 టెస్టు, 3 వన్డేలు

    జూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్
    5 టీ20లు, 3 వన్డేలు

    ఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక
    2 టెస్టులు

    సెప్టెంబర్‌లో టీమిండియా వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)
    3 టీ20లు

    సెప్టెంబర్‌, అక్టోబర్‌లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా
    3 వన్డేలు, 5 టీ20లు

    సెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026

    అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్
    2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు

    డిసెంబర్‌లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా
    3 వన్డేలు, 3 టీ20లు

    * పైన తెలిపిన షెడ్యూల్‌లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు.  

     

     

  • సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో పార్ల్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్‌ బౌలర్లు చేలరేగిపోయారు. ఆతర్వాత కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (38 బంతుల్లో 71 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి రాయల్స్‌ను గెలిపించాడు. ప్రస్తుత ఎడిషన్‌లో రాయల్స్‌కు ఇది విజయం కాగా.. ఈస్ట్రన్‌కేప్‌కు తొలి పరాజయం.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఈస్ట్రన్‌కేప్‌కు రాయల్స్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. మొకొయెనా (4-0-34-4), ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-36-3), ఫోర్టుయిన్‌ (4-0-16-0), ముజీబ్‌ రెహ్మాన్‌ (4-0-30-1), డెలానో పొట్గెటర్‌ (2-0-15-1) ధాటి​కి ఈస్ట్రన్‌కేప్‌ 149 పరుగులకే చాపచుట్టేసింది.

    ఈస్ట్రన్‌కేప్‌ ఇన్నింగ్స్‌లో జోర్డన్‌ హెర్మన్‌ (47) టాప్‌ స్కోరర్‌గా నిలువగా..బెయిర్‌స్టో (33) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్‌ స్టబ్స్‌, మార్కో జన్సెన్‌ తలో 17, బ్రీట్జ్కీ 13, డికాక్‌ 7, గ్రెగరి 5, ముత్తుసామి 2, నోర్జే 4, రత్నాయకే 1 (నాటౌట్‌) పరుగులు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో రాయల్స్‌ కూడా తడబడింది. మిల్నే (4-0-22-0), జన్సెన్‌ (4-0-25-2), నోర్జే (4-0-21-2) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. అయితే డేవిడ్‌ మిల్లర్‌.. కీగన్‌ లయన్‌ (45) సాయంతో రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ప్రిటోరియస్‌ (11), ట్రైబ్‌ (7), హెర్మన్‌ (9), వెర్రిన్‌ (3) విఫలమయ్యారు.

     

     

     

  • ఆస్ట్రేలియా వెటరన్‌ బ్యాటర్‌ క్రిస్‌ లిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు (అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆడుతూ).

    ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేసిన లిన్‌.. చారిత్రక మైలురాయిని తాకడంతో పాటు తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ కెరీర్‌లో 129 ఇన్నింగ్స్‌లు ఆడిన లిన్‌ 149.77 స్ట్రయిక్‌రేట్‌తో 32 అర్ద సెంచరీలు, సెంచరీ సాయంతో 4065 పరుగులు చేశాడు.

    మొత్తం టీ20 కెరీర్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన లిన్‌.. 57 అర్ద శతకాలు, 6 శతకాల సాయంతో 8636 పరుగులు చేశాడు. పవర్‌ హిట్టర్‌గా పేరున్న లిన్‌ ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 2012-21 మధ్యలో 42 మ్యాచ్‌లు ఆడి 140.6 స్ట్రయిక్‌రేట్‌తో 10 అర్ద సెంచరీల సాయంతో 1329 పరుగులు చేశాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. లిన్‌ చెలరేగడంతో బ్రిస్బేన్‌ హీట్‌పై అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ​ చేసిన హీట్‌.. జేమీ ఓవర్టన్‌ (4-0-19-3), లియామ్‌ స్కాట్‌ (4-0-12-2), హసన్‌ అలీ (4-0-29-2), లూక్‌ వుడ్‌ (4-0-19-1), మాథ్యూ షార్ట్‌ (0.4-0-1-1) దెబ్బకు 19.4 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైంది. 

    హీట్‌ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడు కుహ్నేమన్‌ (31 నాటౌట​) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అడిలైడ్‌ 14.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. క్రిస్‌ లిన్‌ (79 నాటౌట్‌) మెరుపు అర్ద శతకంతో అడిలైడ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

     

  • జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా ఇంట తీవ్ర విషాదం​ నెలకొంది. అతని 13 ఏళ్ల చిన్న తమ్ముడు మహ్మద్‌ మహ్ది అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడు. హీమోఫీలియా కారణంగా మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. 

    దీని వల్ల ఇటీవల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. డిసెంబర్ 29 మహ్ది  హరారేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే (డిసెంబర్‌ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో జరిగాయి. 

    చిన్న వయసులోనే తమ్ముడిని కోల్పోవడంతో సికందర్‌ రజా బాధ వర్ణణాతీతంగా ఉంది. రజా కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌ సమాజం నుంచి కూడా రజాకు సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.  

    39 ఏళ్ల సికందర్‌ రజా పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించి, ఆతర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుటి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన రజా.. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రజా ప్రపంచవ్యాప్తంగా అ‍గ్రశ్రేణి ఆల్‌రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 శతకం చేసిన బ్యాటర్‌గా రజా గుర్తింపు కలిగి ఉన్నాడు.

    2013 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రజా, జింబాబ్వే తరఫున 21 టెస్ట్‌లు, 153 వన్డేలు, 109 టీ20లు ఆడాడు. ఇందులో 9 సెంచరీలు, 49 హాఫ్‌ సెంచరీల సాయంతో 8000 పైచిలుకు పరుగులు చేశాడు. అలాగే మూడు ఫార్మాట్లలో 215 వికెట్లు తీశాడు. 

    పాకిస్తాన్‌లో జన్మించినప్పటికీ.. రజా 2023, 2024 ఐపీఎల్‌ సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. అప్పటికి పాక్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ప్రవేశం లేదు. రజా ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి 2025వ సంవత్సరం చివరి రోజు కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్‌.. చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్‌-2లో (ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో) సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

    నేటికి ముందు ఈ రికార్డును విరాట్‌ మరో దిగ్గజ బ్యాటర్‌, విండీస్‌ యోధుడు వివ్‌ రిచర్డ్స్‌ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొల్లాక్‌తో (9) కలిసి షేర్‌ చేసుకున్నాడు. తాజాగా సింగిల్‌గా ఈ ప్రపంచ రికార్డును కబ్జా చేశాడు.

    ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్‌గా ముగించిన విరాట్‌.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్‌ బ్యాటర్‌గా ముగించాడు.  

    డిసెంబర్‌ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్‌.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. 

    2025ను నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ముగించిన ఆటగాడు మరో భారత దిగ్గజం రోహిత్‌ శర్మ కావడం మరో విశేషం. రోహిత్‌కు విరాట్‌కు రేటింగ్‌ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్‌ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.

    ఈ ఏడాదే టెస్ట్‌లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌పై శతకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 

  • వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఎలిస్‌ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్‌ తాజా సీజన్‌ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్‌ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్‌ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్‌ పెర్రీ ప్రకటించింది.

    అత్యధిక పరుగులు
    గత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్‌కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్‌గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.

    ఇక గతంలో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్‌లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. 

    సదర్లాండ్‌ కూడా
    మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్‌కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్‌ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్‌ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.

    ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్‌ స్థానంలో ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌ అలానా కింగ్‌ను క్యాపిటల్స్‌ తీసుకుంది. కింగ్‌ గత ఏడాది యూపీ వారియర్స్‌ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!
    ‘‘ఈసారి ఎలిస్‌ పెర్రీ రావడం లేదు. అనాబెల్‌ సదర్లాండ్‌ కూడా ఈ సీజన్‌ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్‌గా ఉంది.

    కానీ ఎలిస్‌ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్‌గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్‌ సెట్‌ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్‌ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

    అదే విధంగా.. అనాబెల్‌ స్థానంలో అలనా సరైన ప్లేయర్‌ కాదని ఈ మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. అనాబెల్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ చేయగలదన్న ఆకాశ్‌ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్‌ మాత్రమే అని.. బ్యాటింగ్‌ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.

    తారా నోరిస్‌ దూరం
    ఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్‌ జట్టు సభ్యురాలు తారా నోరిస్‌ కూడా లీగ్‌కు దూరమైంది. టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్‌ స్థానంలో  ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ చార్లీ నాట్‌ను వారియర్స్‌ జట్టులోకి ఎంచుకుంది. నాట్‌ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్‌ ఆడలేదు. 

    చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీకి గ్రేట్‌ న్యూస్‌ అందుతుంది. ఆ ఫ్రాంచైజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో పోలిస్తే బంతితో మెరుగ్గా రాణించే కృనాల్‌.. విజయ్‌ హజారే ట్రోఫీలో బ్యాట్‌తోనూ చెలరేగుతున్నాడు. 

    ఈ టోర్నీలో వరుసగా బెంగాల్‌ (63 బంతుల్లో 57), ఉత్తర్‌ప్రదేశ్‌పై (77 బంతుల్లో 82) అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (డిసెంబర్‌ 31) హైదరాబాద్‌పై మరింత రెచ్చిపోయి విధ్వంసకర శతకం బాదాడు.

    కేవలం 63 బంతుల్లోనే 18 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 109 పరుగులు చేశాడు. కృనాల్‌కు ఓపెనర్లు నిత్యా పాండ్యా (122), అమిత్‌ పాసి (127) సెంచరీలు కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కృనాల్‌ జట్టు బరోడా భారీ స్కోర్‌ (417-4) చేసింది. 

    ఇదే బరోడా జట్టులో సభ్యుడైన టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొని ఖాతా కూడా తెరవలేకపోయాడు. నిత్యా, పాసి, కృనాల్‌ మెరుపు శతకాలతో కదంతొక్కడంతో హైదరాబాద్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్‌ మిలింద్‌ 2, త్యాగరాజన్‌, వరుణ్‌ గౌడ్‌ తలో వికెట్‌ తీశారు.

     

  • వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 31) ప్రకటించారు. ఈ జట్టును స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ముందుండి నడిపించనున్నాడు. స్టార్‌ ఆటగాళ్లు గుల్బదిన్‌ నైబ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ రీఎంట్రీ ఇచ్చారు. 20 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ ఇషాక్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు.

    తాజాగా జింబాబ్వే సిరీస్‌లో ఆడిన షరాఫుద్దీన్ అష్రఫ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, బషీర్ అహ్మద్, ఇజాజ్ అహ్మద్, అహ్మద్‌జాయ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. మొత్తంగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన ఈ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఛాంపియన్‌ జట్లకు సైతం వణుకు పుట్టిస్తుంది. 

    ఈ జట్టులో రషీద్‌ ఖాన్‌ సహా చాలామంది మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. నూర్‌ అహ్మద్‌, సెదిఖుల్లా అటల్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్‌, మహ్మద్‌ నబీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, ఇబ్రహీం జద్రాన్‌ లాంటి ప్లేయర్లు ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. 

    పైగా వీరికి భారత్‌, శ్రీలంకలో పరిస్థితులపై సరైన అవగాహన కూడా ఉంది. అందుకే ఈ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును చూసి భారత్‌ సహా మిగతా జట్లన్నీ అప్రమత్తం అవుతున్నాయి.

    2026 టీ20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు..
    రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సదిఖుల్లా అటల్, ఫజల్‌ హక్ ఫారూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమాల్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దర్వీష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్

    రిజర్వ్ ఆటగాళ్లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.  

    ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గ్రూప్‌-డిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న న్యూజిలాండ్‌తో చెన్నైలో ఆడనుంది. 

    ప్రపంచకప్‌కు ముందు (జనవరి 19 నుంచి) ఇదే ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా ఆడనుంది. 

  • విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా యువ బ్యాటర్, కర్ణాటక స్టార్‌ ప్లేయర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలతో శతక మోత మోగించాడు. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ​్‌లో 116 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసిన అతను.. జార్ఖండ్‌ (118 బంతుల్లో 147; 10 ఫోర్లు, 7 సిక్సర్లు), కేరళపై (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా శతకాలు బాదాడు

    తాజా శతకంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పడిక్కల్‌ శతకాల సంఖ్య 12కి చేరింది. పడిక్కల్‌ కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 12 శతకాలు, 12 అర్ద శతకాలతో 80కిపైగా సగటుతో 2300 పైచిలుకు పరుగులు చేశాడు.

    పుదుచ్చేరితో మ్యాచ్‌లో పడిక్కల్‌తో పాటు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (124 బంతుల్లో 132; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌, మయాంక్‌ సెంచరీలకు కరుణ్‌ నాయర్‌ (34 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ కూడా తోడైంది.

    సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్‌
    ఇవాళే (డిసెంబర్‌ 31) జరిగిన మరో మ్యాచ్‌లో మరో టీమిండియా యువ బ్యాటర్‌, మహారాష్ట్ర స్టార్‌ ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (113 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ ఈ శతకం బాదాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (50-3) రుతురాజ్‌ బ్యాట్‌ నుంచి ఈ క్లాసిక్‌ సెంచరీ వచ్చింది. రుతురాజ్‌ శతకం కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర భారీ స్కోర్‌ (331-7) చేసింది.

    ఈ సెంచరీతో రుతురాజ్‌ తన లిస్ట్‌-ఏ శతకాల సంఖ్యను 19కి పెంచుకున్నాడు. రుతురాజ్‌ ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేశాడు. ఈ ఏడాది రుతురాజ్‌ ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇండియా-ఏ, ఇండియా, తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీ.. ఇలా ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ సెంచరీలు చేసి, విరాట్‌ కోహ్లి తర్వాత టీమిండియా ఆశాకిరణంగా మారాడు.

     

  • వరుస విజయాలతో జోరు మీదున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్న ఈ ముంబైకర్‌.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ కానున్నాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకంగా సాగే ఈ సిరీస్‌లో బ్యాటర్‌గానూ సత్తా చాటి విమర్శలకు చెక్‌ పెట్టాలని సూర్యకుమార్‌ పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ తన భార్య దేవిశా శెట్టితో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.

    అదే సమయంలో సూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌ అయింది. బాలీవుడ్‌, టీవీ నటి ఖుషి ముఖర్జీ.. సూర్యకుమార్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. కానీ నాకు క్రికెటర్‌తో డేటింగ్‌ చేసే ఉద్దేశం లేదు.

    సూర్యకుమార్ యాదవ్‌ తరచూ మెసేజ్‌లు చేసేవాడు. అయితే, మా ఇద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ జరుగలేదు. నా పేరు వేరొకరితో ముడిపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఖుషి ముఖర్జీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో సూర్యపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. భార్య దేవిశానే ప్రపంచంగా బతికినట్లు కనిపించే సూర్య ఇలాంటి వాడని అనుకోలేదంటూ కామెంట్లు చేశారు.

    తన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఖుషి ముఖర్జీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ యాదవ్‌తో తనకు ఎలాంటి రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ లేదని స్పష్టం చేసింది. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమకు నచ్చిన రీతిలో వాటిని వ్యాప్తి చేశారని పేర్కొంది.  

    అంతేకాదు.. తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయ్యిందన్న ఖుషి.. సూర్యతో తాను ఓ ఫ్రెండ్‌గా మాట్లాడి ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. గతంలో తమ మధ్య స్నేహ బంధం ఉండేదని.. అయితే ఇప్పుడు టచ్‌లో లేమని తెలిపింది.

  • టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న జైసూ.. సొంత జట్టు ముంబై తరఫున దేశీ క్రికెట్‌ బరిలో దిగాడు. విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ 2025-26లో భాగంగా గోవాతో మ్యాచ్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు.

    జైపూర్‌ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఓపెనర్లలో అంగ్‌క్రిష్‌ రఘువన్షి (11) త్వరగానే పెవిలియన్‌ చేరగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌తో కలిసి యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) నిలకడగా ఆడాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు.

    జైసూ జస్ట్‌ మిస్‌.. 
    అయితే, అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న వేళ.. జైసూ దర్శన్‌ మిసాల్‌ (Darshan Misal) బౌలింగ్‌లో స్నేహల్‌ కౌతంకర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గోవాతో మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్‌.. ఆరు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు.. ముషీర్‌ ఖాన్‌కు తోడైన.. అతడి అన్న, టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ దుమ్ములేపాడు.

    సర్ఫరాజ్‌ విధ్వంసకర, భారీ శతకం
    తమ్ముడు ముషీర్‌ (60)తో కలిసి మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.

    మొత్తంగా 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు బాదిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. 157 పరుగులు చేసి దర్శన్‌ మిసాల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ తామోర్‌ హాఫ్‌ సెంచరీ (28 బంతుల్లో 53)తో మెరవగా.. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (8 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు.

    ముంబై భారీ స్కోరు
    ఇక సిద్దేశ్‌ లాడ్‌ 17, షామ్స్‌ ములాని 22 పరుగులు చేయగా.. ఆఖర్లో తనుశ్‌ కొటియాన్‌ (12 బంతుల్లో 23), తుషార్‌ దేశ్‌పాండే (3 బంతుల్లో 7) ధనాధన్‌ దంచికొట్టి అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ముంబై ఎనిమిది వికెట్ల నష్టానికి 444 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. గోవా బౌలర్లలో దర్శన్‌ మిసాల్‌ మూడు వికెట్లు కూల్చగా.. వాసుకి కౌశిక్‌, లలిత్‌ యాదవ్‌ చెరో రెండు, దీప్‌రాజ్‌ గవోంకర్‌ ఒక వికెట్‌ కూల్చారు. 

    చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Movies

  • సామాన్యులైనా సెలబ్రిటీలైనా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడో ఇప్పుడో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లల్ని వద్దనుకుంటున్నారు. ఎవరి కారణాలు వాళ్లకు ఉ‍న్నాయి. ఇప్పుడు నటి వరలక్ష‍్మి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేసింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అ‍మ్మతనం గురించి చెప్పింది.

    'అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిలల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు. ఎందుకంటే నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను. నా పెంపుడు కుక్కలకు తల్లిగా వ్యవహరిస్తా. నా స్నేహితులని తల్లిలా చూసుకుంటా. సాయం కావాల్సిన వాళ్లకు తల్లిగా తోడుంటా. నా వరకు అమ్మతనం అంటే అర్థమిదే. నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు పెళ్లే వద్దనుకున్నాను. అలానే పిల్లల్ని వద్దనుకునే చాలామంది.. వాళ్లు తీసుకున్న మంచి నిర్ణయం అదే' అని వరలక్ష‍్మి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: అమ్మనాన్న విడాకులు.. రాధికనే కారణమని తిట్టుకున్నా: వరలక్ష్మి)

    సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష‍్మి.. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది. పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి మంచి పాత్రలు చేస్తూ అలరిస్తోంది. హీరో విశాల్‌తో ఈమెకు పెళ్లని కొన్నాళ్ల ముందు వార్తలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ గతేడాది నికోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఓవైపు యాక్టింగ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్‌తో వరలక్ష‍్మి బిజీగా ఉంది.

    వరలక్ష‍్మి పిల్లల్ని వద్దని అనుకోవడంపై చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను చిన్నతంలో లైంగిక వేధింపులకు గురయ్యానని గతంలో ఓ షోలో చెప్పింది. ఐదారుగురు తనని ఇబ్బంది పెట్టారనే విషయం బయటపెట్టింది. అలానే ఈమెకు ఊహ తెలిసొచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఈమె తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్ కుమార్, నటి రాధికని పెళ్లిచేసుకున్నారు. ఒకవేళ పిల్లల్ని కంటే తనలా ఎక్కడ ఇబ్బంది పడతారోనని వరలక్ష‍్మి ఆలోచిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ వ్యాఖ్యలు చేసిందా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ ఎప్పుడంటే?)

  • సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్లపై బి.వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భూతం ప్రేతం'. యాదమ్మ రాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగుంది.

    ఇప్పుడు న్యూఇయర్ సందర్భంగా పార్టీ సాంగ్‌ రిలీజ్ చేశారు. 'చికెన్ పార్టీ' అంటూ సాగే ఈ పాటని రాజేష్ ధృవ రాయగా.. అనిరుధ్ శాస్త్రి పాడారు. గిరీష్ హోతుర్ ఇచ్చిన బాణీ.. పార్టీ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ ప్రకటించనున్నారు. ఈ సినిమాకు యోగేష్ గౌడ సినిమాటోగ్రాఫర్‌, ఉజ్వల్ చంద్ర ఎడిటర్‌, దేవి ప్రకాష్.ఎస్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

  • పృథ్వీరాజ్ సుకుమారన్ అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంటాడు. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హిందీ, తెలుగులోనూ నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉంటాడు. గతంలో ప్రభాస్‌ 'సలార్'లో విలన్ తరహా పాత్రలో కనిపించాడు. క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మహేశ్-రాజమౌళి 'వారణాసి'లోనూ విలన్ ఇతడే. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈవెంట్‌లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు మరో తెలుగు మూవీలోనూ విలన్‌గా చేసేందుకు సిద్ధమయ్యాడట.

    'ప్యారడైజ్'తో బిజీగా ఉన్న నాని.. దీన్ని మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా వదిలిన అప్డేట్స్ మాత్రం చెప్పిన తేదీన రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చాయి. దీని తర్వాత 'ఓజీ'తో హిట్ కొట్టిన సుజీత్ దర్శకత్వంలో నాని నటించబోతున్నాడు. చాన్నాళ్ల క్రితం దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. వచ్చే వేసవి నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది.

    ఈ సినిమా కోసం ఇప్పటినుంచే అన్ని రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్‌ని నాని-సుజీత్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం అనుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమై పృథ్వీరాజ్ పాత్ర హిట్ అయితే గనక.. ఇతడు తెలుగు స్థిరపడిపోవడం గ్యారంటీ. ఇప్పటికే ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ టాలీవుడ్‌లో హీరోలుగా మెల్లగా సెటిలైపోతున్నారు. చూస్తుంటే పృథ్వీరాజ్ కూడా మెల్లగా తెలుగులో జెండా పాతేలా కనిపిస్తున్నాడు

  • గ్లామర్ చూపిస్తూ మాయ చేస్తున్న మీనాక్షి చౌదరి

    కిర్రాక్ పోజుల్లో 'రాజాసాబ్' బ్యూటీ నిధి అగర్వాల్

    ఇదే లాస్ట్ పోస్ట్ అంటున్న బిగ్‌బాస్ భామ దివి

    ఇయర్ ఎండ్ ఫొటో డంప్ షేర్ చేసిన కృతి సనన్

    2025 జ్ఞాపకాలు పంచుకున్న అనన్య నాగళ్ల

  • తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన కూతురు వరలక్ష‍్మి కూడా టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది. శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఛాయాదేవిని మొదట పెళ్లి చేసుకోగా.. వరలక్ష‍్మి పుట్టింది. కానీ కొన్నాళ్లకు వైవాహిక బంధంలో సమస్యలొచ్చి శరత్ కుమార్ తొలి భార్యకు విడాకులిచ్చేశాడు. తర్వాత నటి రాధికని పెళ్లి చేసుకున్నాడు. అయితే తన తల్లిదండ్రులు విడిపోవడానికి రాధికనే కారణమని అప్పట్లో ఆమెని చాలా తిట్టుకున్నానని వరలక్ష‍్మి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    'చాన్నాళ్ల క్రితమే ఆయన్ని(శరత్ కుమార్) క్షమించేశా. నేను థెరపీ చేయించుకుంటున్న టైంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాను. కొన్నిసార్లు ఇద్దరు మనుషులు కలిసుండే పరిస్థితులు ఉండకపోవచ్చు. నా వరకు నాన్నంటే నాన్నే. ఆయన నాకు బయలాజికల్ తండ్రి కాబట్టి కచ్చితంగా గౌరవిస్తా. కాకపోతే అమ్మ-నాన్న విడిపోవడం నాకు చాలా కోపం తెప్పించిన విషయం. ఆయన మరో పెళ్లి చేసుకోవడం మరింత కోపానికి కారణమైంది. కాలక్రమేణా అది తగ్గిపోయింది. విడాకులు విషయంలో అమ్మనాన్న సరైన నిర్ణయమే తీసుకున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరూ ఆనందంగా ఉన్నారు' అని తండ్రి గురించి వరలక్ష్మి చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)

    రాధిక గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఆమె వచ్చి.. అమ్మనాన్న బంధాన్ని చెడగొట్టిందని అనుకుంటారు. కానీ నా తల్లిదండ్రుల విడాకులకు ఆమె కారణం కాదు. మీరు(రాధికతో) ఇంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు. మా అమ్మనాన్న విడాకులకు ఆమె కారణం కాదు కాబట్టి అని నేను చెబుతుంటాను. ఆంటీ(రాధిక) వచ్చేసరికే అమ్మనాన్న వైవాహిక బంధంలో సమస్యలున్నాయి. ఆమె(రాధిక) నాన్న జీవితంలోకి వచ్చిన కొత్తలో.. ఆమెతో పెద్దగా నాకు సత్సంబంధాలు ఉండేవి కావు. నా తల్లిదండ్రుల విడాకులకు కారణం ఆమెనే అనుకోవడం దీనికి కారణం. కాస్త పెద్దయ్యాక అన్ని విషయాలు అర్థమయ్యాయి. ప్రస్తుతం ఆంటీతో నాకు మంచి రిలేషన్ ఉంది. అమ్మతో కూడా ఆమెకు మంచి రిలేషనే ఉంది' అని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది.

    గతంలో కూడా ఓసారి మాట్లాడిన వరలక్ష‍్మి.. తండ్రి శరత్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్న రాధిక, తనకు ఆంటీ మాత్రమే అని.. తాను ఆమెని అలానే పిలుస్తానని చెప్పింది. ఆమె తనకు అమ్మ కాదని కూడా క్లారిటీ ఇచ్చింది. రాధిక సవతి తల్లినే అయినప్పటికీ ప్రస్తుతం వరలక్ష్మితో మంచి బాండింగ్ మెంటైన్ చేస్తోంది. వరలక్ష‍్మి పెళ్లి కూడా దగ్గరుండి జరిపించింది.

    (ఇదీ చదవండి: 'అవతార్ 3' విలన్ చార్లీ చాప్లిన్ మనవరాలా?)

  • పదిరోజుల క్రితం థియేటర్లలో వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3'.. భారత్‍లో అంతంత మాత్రంగానే ఆడింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే స్టోరీపై విమర్శలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయనే ప్రశంసలు వచ్చినప్పటికీ ఓవరాల్ టాక్ మాత్రం ఏమంత గొప్పగా అయితే లేదు. సరే టాక్, కలెక్షన్స్ గురించి పక్కనబెడితే ఇందులో విలన్‌గా చేసిన నటి.. దిగ్గజ కమెడియన్ చార్లీ చాప్లిన్ మనవరాలు అనే విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

    1950,60ల్లో మూకీ కామెడీతో చాలా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్.. ఇప్పటి తరంలోనూ చాలామందికి తెలుసు. అయితే ఈయన తర్వాత కుటుంబ సభ్యులెవరైనా యాక్టర్స్ అయ్యారా? ఏదైనా సినిమాలు చేశారా? అనేది పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే 'అవతార్ 3'లో విలన్ వరంగ్ పాత్రలో చేసిన ఊనా చాప్లీన్.. ఆయనకు మనవరాలి అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్.. తెలుగు వెర్షన్ వాయిదా)

    ఊనా చాన్నాళ్లుగా యాక్టింగ్ చేస్తోంది. 2007 నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో సహాయ పాత్రలు చేస్తోంది. కాకపోతే పెద్దగా ఫేమ్ లాంటిది దక్కలేదు. ఓటీటీల్లో క్లాసిక్ సిరీస్ అయిన 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లోనూ స్టార్క్ రాజు పెద్ద కొడుకు భార్యగా టలీషా స్టార్క్ పాత్రలో కొన్ని ఎపిసోడ్స్ కనిపిస్తుంది. చిన్న పాత్రనే అయినప్పటికీ గుర్తుండిపోయింది. దీనితో పాటు చాలా మూవీస్, సిరీస్‌లు చేసినప్పటికీ మళ్లీ ఇన్నాళ్లకు 'అవతార్ 3'లో విలన్ రోల్ వల్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

    చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్. ఈమె పుట్టింది ఊనా చాప్లిన్. తాత, అమ్మలానే యాక్టర్ అయింది. తాత కామెడీతో నవ్విస్తుంటే మనవరాలు మాత్రం విలనిజంతో భయపెడుతోంది.

    (ఇదీ చదవండి: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ మూవీ రివ్యూ)

  • టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో నటించింది విజయ్‌ దేవరకొండ మేనమామ యశ్‌ రంగినేని.

    నిర్మాతగా హిట్‌ సినిమాలు!
    యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.  బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

    నటన పై ఇష్టంతో..
    నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్‌కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్‌లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా  వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.
     

  • సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లు చాలామంది. వారితో ఒక్క సెల్ఫీ అయినా దిగాలని, నేరుగా చూడాలని.. ఇలా చాలా కలలు కంటుంటారు. కొందరైతే ఏకంగా ప్రేమ, పెళ్లి ప్రపోజల్స్‌ కూడా పంపిస్తుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్‌ సనా ఆల్తఫ్‌కు అలాంటి ప్రపోజలే వచ్చింది.

    డేటింగ్‌ ప్రపోజల్‌
    డేట్‌కు రమ్మని ఓ వ్యక్తి పదేపదే మెసేజ్‌ చేస్తున్నాడంటూ ఈమెయిల్‌లో వచ్చిన సందేశాలను స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేసింది. అందులో ఏముందంటే.. డియర్‌ సనా.. ఎలా ఉన్నావు? నేను చెన్నైకి చెందిన వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త బాలాజీని. నాకు నీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది. దానికి ఎంత తీసుకుంటావో చెప్పు.. అలాగే ఎప్పుడు వీలవుతుందో కూడా తెలియజేయు. 

    మాల్దీవులు, దుబాయ్‌..
    దాన్నిబట్టి మనం ప్రోగ్రామ్‌ పెట్టుకుందాం. అయితే ఇండియాలో లేదంటే మాల్దీవులు, దుబాయ్‌కు వెళదాం. ఒక్కసారి ఆలోచించు అని బాలాజీ అనే వ్యక్తి రాసుకొచ్చాడు. ఇలా పలుమార్లు మెయిల్‌ చేశాడు. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్‌ చేసిన సనా.. ఎంత ప్రొఫెషనల్‌గా, రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేశాడో.. అని సరదాగా చమత్కరించింది.

    సినిమా
    సనా ఆల్తఫ్‌ 'విక్రమాదిత్య' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ మలయాళ మూవీలో దుల్కర్‌ సల్మాన్‌ సోదరిగా నటించింది. తర్వాత 'మరియం ముక్కు' మూవీలో ఫహద్‌ ఫాజిల్‌ సరసన హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. 'రాణి పద్మిని', 'ఓడియన్‌' చిత్రాల్లోనూ మెరిసింది. తమిళంలో 'ఆర్‌కే నగర్‌', 'పంచరాక్షరం' సినిమాలు చేసింది.

    చదవండి: హీరో విజయ్‌ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్‌

  • మలయాళంలో ఈ ఏడాది ది బెస్ట్ ఫిల్మ్ అనిపించుకున్న వాటిలో 'ఎకో' ఒకటి. మూవీ లవర్స్ ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలానే ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి తెరపడింది. ఓటీటీలోకి వచ్చింది. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రాకపోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ తెలుగు వెర్షన్ రిలీజ్ ఎప్పుడు?

    నవంబరులో థియేటర్లలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'(Eko Movie). అద్భుతమైన హిట్ అనిపించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఓటీటీలో డబ్బింగ్ వస్తుందని తెలిసి ఆనందపడ్డారు. లెక్క ప్రకారం ఈరోజు(డిసెంబరు 31) అన్ని భాషలు అందుబాటులోకి వచ్చేయాలి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే బుధవారం(జనవరి 07) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

    (ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)

    'ఎకో' విషయానికొస్తే ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. ఐదేళ్లుగా కనిపించకుండా పోయిన కురియాచన్ అనే వ్యక్తి కోసం చాలామంది వెతుకుతుంటారు. కుక్కల సంరక్షకుడిగా పేరున్న ఇతడికి ఎన్నో నేరాలతో సంబంధముందనేది అందరూ నమ్మే నిజం. భార్య మ్లాతి కూడా ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. నక్సలైట్లని వేధించడంతో పాటు ఎందరినో హింసించడం వెనక ఇతడి హస్తం ఉందని నమ్మి.. పోలీసులు, విలన్స్ వెంటపడుతూ ఉంటారు. అయితే అడవిలో ఉన్న క్రూరమైన కుక్కలకు, బయటకు కనిపించని మాఫియా ప్రపంచానికి లింక్ ఏంటనేదే మిగతా స్టోరీ.

    కేరళలోని అటవీ ప్రాంతాల్లో రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీయడం విశేషం. గతంలో మలయాళంలో వచ్చిన సూక్ష‍్మదర్శిని, కిష్కిందకాండం లాంటి డబ్బింగ్ మూవీస్ నచ్చితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. స్టోరీ నెమ్మదిగా సాగుతుంది అనిపించినప్పటికీ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేస్తాయి. 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, సందీప్ ప్రదీప్, వినీత్ తదితరు అదరగొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

    (ఇదీ చదవండి: యూట్యూబర్‌ అన్వేష్‌పై కేసు నమోదు)

  • 'బైసన్‌' మూవీతో ఈ ఏడాది మంచి హిట్‌ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్‌ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్‌ పెరుమాల్‌', 'కర్ణన్‌', 'మామన్నన్‌', 'వాళై', 'బైసన్‌' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్‌ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్‌.

    కలత చెందా..
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్‌' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్‌డౌన్‌ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది. 

    నా దృక్కోణాన్నే మార్చేసింది
    హోంబౌండ్‌ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్‌ విషయానికి వస్తే.. ఇషాన్‌ ఖట్టర్‌, విశాల్‌ జెత్వా, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్‌ గెవాన్‌ దర్శకత్వం వహించాడు. మార్టిన్‌ స్కోర్సెస్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

    చదవండి:  చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు

  • యశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్‌’. మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నయనతార ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. ఒక భారీ క్యాసినో బ్యాక్‌డ్రాప్‌లో.. మోడ్రన్‌ డ్రెస్‌లో గన్‌ పట్టుకొని పవర్‌ఫుల్‌ లుక్స్‌తో నయన్‌ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఆమె హావభావాలు సినిమాలోని ఇంటెన్సిటీని, భారీతనాన్ని తెలియజేస్తున్నాయి. 

    ఈ పాత్ర గురించి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టాక్సిక్'లో నయనతార సరికొత్త నటనా ప్రతిభను చూస్తారు. షూటింగ్ జరుగుతున్న కొద్దీ గంగ పాత్ర ఆత్మకు, నయనతార వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని నేను గమనించాను’ అని ఆమె అన్నారు. 

    ఈ చిత్రంలో నయనతారతో కలిపి మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే కియరా అద్వానీ, హ్యుమా ఖురేషీకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కియారా..నదియా పాత్రలో కనిపించగా, ఖురేషీ ఎలిజబెత్‌ పాత్రలో అలరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 

  • చాలా హిందీ సినిమాల్లో నవ్వులు పంచిన అర్షద్‌ వార్సీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశాడు. 16 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు, బతుకు బండి సాగించేందుకు నానా అగచాట్లు పడ్డాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

    బంగారు లైటర్‌
    అర్షద్‌ వార్సీ మాట్లాడుతూ.. నా తండ్రి పేరు అహ్మద్‌ అలీ ఖాన్‌. తను హార్మోనియం వాయించేవాడు. ఉర్దూలో షాయరీలు రాసేవాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్‌లో వేశారు. సెలవులకు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. ఓసారి ఆయన తనదగ్గరున్న గోల్డ్‌ లైటర్‌ను వేరేవాళ్లకు బహుమతిగా ఇచ్చేశాడు. మా ఇంట్లో పెద్ద కారు కూడా ఉండేది. మా అంకుల్‌ ఆ కారు మీద మనసు పారేసుకోవడంతో ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. 

    ఉన్నదంతా పోయింది
    ఇలా ఉన్నదంతా ఇచ్చుకుంటూ ఏమీ మిగలదని చిన్న వయసులోనే అర్థమైంది. మా ఇంటికి జగదీప్‌, యునుస్‌ పర్వీజ్‌ వంటి సెలబ్రిటీలు వచ్చి మాతో కలిసి భోజనం చేసేవారు. మా నాన్నకు ముంబైలో రెండు భవంతులు ఉండేవి.  ఆ సమయంలో ఇంట్లో ఎక్కువకాలం అద్దెకు ఉండేవాళ్లు ఆ ఇంటి యజమానులవుతారు అని కోర్టు ప్రకటించింది. 

    అన్నీ మానేశా..
    దీంతో నాన్న వెంటనే ప్రాపర్టీని కొందరి పేరు మీదకు బదిలీ చేశారు. తర్వాత వాళ్లు తిరిగిచ్చేస్తారనుకున్నాడు. కానీ అది జరగలేదు. సుమారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటిదాకా గాలికి తిరుగుతున్న నేను ఒక్కసారిగా పెద్దవాడినైపోయాను. ఫ్రెండ్స్‌తో తిరగడం, పార్టీలకు వెళ్లడం.. అన్నీ మానేశాను. 

    సినిమా
    అన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాను. ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాను. నాలుగు రాళ్లు సంపాదించాను. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. అ‍ర్షద్‌ వార్సీ.. మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌, హల్‌చల్‌, సలాం నమస్తే, జాలీ ఎల్‌ఎల్‌బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఢమాల్‌ 4, కింగ్‌, వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నాడు.

    చదవండి: 25 ఏళ్లకే పెళ్లా? ఆ తప్పు చేయొద్దంటున్న బాలీవుడ్‌ బ్యూటీ

Business

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. 2025వ సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ముగించింది. కంపెనీకి చెందిన క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో దాని విభాగంలో.. అత్యంత పోటీ ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను సాధించగలిగింది.

    2025లో హ్యుందాయ్ రోజుకు 550 క్రెటా కార్లను విక్రయించింది. అంటే.. మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. మిడ్-సైజ్ SUV విభాగంలో 34 శాతానికి పైగా కమాండింగ్ మార్కెట్ వాటాతో, దాని పోటీదారుల కంటే అమ్మకాల్లో చాలా ముందుంది.

    క్రెటా రెండు లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను పొందిన సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు.

  • ప్రపంచ టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలిచిన సిలికాన్ వ్యాలీ.. దశాబ్దాలుగా ప్రముఖ వ్యాపారవేత్తలు & ఆవిష్కర్తలకు నిలయంగా ఉంది. అయితే తాజాగా వెలువడిన కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాల ప్రకారం.. ఇద్దరు ప్రముఖ టెక్ బిలియనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయంగా.. చర్చనీయాంశంగా మారింది.

    సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లలో ఒకరు పేపాల్ కో-ఫౌండర్ పీటర్ థీల్, మరొకరు గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్.

    పీటర్ థీల్, లారీ పేజ్ ఇరువురూ.. సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి కారణం క్యాలిఫోర్నియా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ''బిలియనీర్ ట్యాక్స్'' అని తెలుస్తోంది. ఈ పన్ను ప్రకారం.. ఒక బిలియన్ డాలర్లకు మించిన ఆస్తి కలిగిన వ్యక్తులపై అదనపు సంపద పన్ను విధించాలనే యోచన ఉంది.

    ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నప్పటికీ.. సంపన్నులు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను వల్ల తమపై భారీ ఆర్థిక భారం పడుతుందని, పెట్టుబడులు & వ్యాపార స్వేచ్ఛకు ఆటంకం కలుగుతుందని చెబుతున్నారు. ఈ కారణంగానే పీటర్ థీల్, లారీ పేజ్ వంటి బిలియనీర్లు సిలికాన్ వ్యాలీని విడిచిపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

    బిలియనీర్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న మార్గం.. క్యాలిఫోర్నియా నుంచి ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వెళ్లిపోవడమే. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవేళా ఈ బిలియనీర్లు నిజంగా నగరాన్ని విడిచిపెడితే, ఇతర టెక్ వ్యాపారవేత్తలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఫలితంగా క్యాలిఫోర్నియా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గడమే కాకుండా, సిలికాన్ వ్యాలీకి ఉన్న ప్రపంచవ్యాప్త ప్రాధాన్యం కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    యూకే వీడిన లక్ష్మీ మిట్టల్
    ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల కారణంగా దేశం వీడిన బిలియనీర్ల జాబితాలో ప్రముఖ్ ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ కూడా ఉన్నారు. యూకే ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయం వల్ల.. ఆయన దేశం విదిచిపెట్టి దుబాయ్‌ చేరుకున్నారు. 2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 

    ఇదీ చదవండి: లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. కుటుంబం లోన్ చెల్లించాలా?

  • 2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.

    ➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం
    ➤3 మార్చి (మంగళవారం): హోలీ
    ➤26 మార్చి (గురువారం): రామనవమి
    ➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి
    ➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
    ➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి
    ➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం
    ➤28 మే (గురువారం): బక్రీద్
    ➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం
    ➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి
    ➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి
    ➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా
    ➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద
    ➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి
    ➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్

    2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.

    శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు
    ➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి
    ➤21 మార్చి (శనివారం): రంజాన్
    ➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం
    ➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి

  • కొంతమంది భక్తులు.. తాము నమ్మిన దేవునికి ధనం సమర్పించుకుంటారు. ఇంకొందరు వాహనాలు సమర్పించుకుంటూ ఉంటారు. దేవుడు ఎవరైనా.. ఎవరి నమ్మకం వారిది. ఇటీవల 'గురువాయూరప్పన్'కు (దేవాలయానికి) టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300 (TVS Apache RTX 300) బైక్ అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి.

    గురువాయూరప్పన్ దేవాలయానికి.. టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ TVS Apache RTX 300 బైకును, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ.. దేవస్వం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్వం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

    టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300
    టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్‌ 300ను.. కంపెనీ రూ.1.99 లక్షల ప్రారంభ ధరలతో మార్కెట్లో విక్రయిస్తుంది. ఇది బేస్, టాప్, బీటీఓ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.

    ఇదీ చదవండి: 2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు

    అపాచీ ఆర్‌టిఎక్స్‌ 300 బైక్.. 299 సీసీ ఇంజిన్‌తో 9,000rpm వద్ద 36hp పవర్ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది Apache RR 310 తర్వాత తయారీదారు యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన బైక్‌గా నిలిచింది. ఇది ఆఫ్ రోడర్‌గా మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ టూరర్‌గా కూడా ఉపయోగపడుతుంది.

  • దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.., కంపెనీలు కార్యకలాపాలకు అంతరాయాలు కలగకుండా ఉండేదుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే.. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లైన స్విగ్గీ & జొమాటోలు పీక్ అవర్స్.. సంవత్సరాంతపు రోజులలో డెలివరీ కార్మికులకు అధిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాయి.

    జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడాన్ని నిరసిస్తూ డిసెంబర్ 25, డిసెంబర్ 31 తేదీలలో డెలివరీ వర్కర్ యూనియన్లు సమ్మెలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాల ప్రకటన వెలువడింది.  సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య రద్దీ సమయాల్లో జొమాటో డెలివరీ భాగస్వాములకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 చెల్లింపులను ఆఫర్ చేసినట్లు కార్మికులు.. ఈ విషయం తెలిసిన వ్యక్తులకు పంపిన సందేశాలు చెబుతున్నాయి.

    తాజా ప్రోత్సాహకాల ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు సగటున 3000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా.. క్యాన్సిలేషన్లు లేదా ఆర్డర్‌ తీసుకోకపోయిన సందర్భాల్లో సాధారణంగా విధించే పెనాల్టీలను కూడా అమలు చేయబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిద్వారా.. ఎక్కువ మంది డెలివరీ ఏజెంట్లు పనికి రావాలని సంస్థలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా, స్విగ్గీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 12 గంటల మధ్య రూ. 2,000 వరకు పీక్-అవర్ ఆదాయాన్ని ప్రకటిస్తోంది.

    ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. వొడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్!

    ఇకపోతే.. డిసెంబర్ 25న సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు.. మరోమారు ఈరోజు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. మెరుగైన చెల్లింపులు, మెరుగైన పని పరిస్థితులను మాత్రమే కాకుండా.. 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) పేర్కొన్నాయి.

  • రుణభారంతో సతమతమవుతున్న 'వొడాఫోన్ ఐడియా'కు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలు రూ. 87,695 కోట్లను ఫ్రీజ్ చేసింది. అంతే కాకుండా.. 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు.. 10 సంవత్సరాల కాలంలో వారి తిరిగి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది.

    ఏజీఆర్ సంబంధిత అంశాలు.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ మద్దతు కోసం వేచిచూస్తున్న వొడాఫోన్ ఐడియాకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించింది.

    వోడాఫోన్ ఐడియాలో.. ప్రభుత్వానికి 49% వాటా ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి బకాయిల చెల్లింపును క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడమే కాకుండా.. కంపెనీకి చెందిన 20 కోట్ల మంది వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది.

  • రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

    డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్‌కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్‌ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్‌లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

    ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.

  • బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 544.66 పాయింట్లు లేదా 0.64 శాతం లాభంతో 85,219.74 వద్ద, నిఫ్టీ 197.50 పాయింట్లు లేదా 0.76 శాతం లాభంతో 26,136.35 వద్ద నిలిచింది.

    కేఎస్ఆర్ ఫుట్‌వేర్ లిమిటెడ్, ఆస్పిన్‌వాల్ అండ్ కంపెనీ, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్, కిరి ఇండస్ట్రీస్, ఓరియంట్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రివి స్పెషాలిటీ కెమికల్స్, వోడాఫోన్ ఐడియా, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ముంబై: సంపన్న కస్టమర్ల కోసం ప్రైవేట్‌ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తాజాగా గజ్ (Gaj) పేరిట ప్రీమియం మెటల్‌ కార్డును ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఈ కార్డుపై జాయినింగ్, వార్షిక ఫీజు రూ. 12,500గా (జీఎస్‌టీ అదనం) ఉంటుంది.

    12,500 ఇన్విటేషన్ రివార్డు పాయింట్లతో ఇది లభిస్తుంది. 1 రివార్డు పాయింటు రూ. 1కి సమానంగా ఉంటుంది. వీటిని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ యాప్‌ ద్వారా ట్రావెల్‌ బుకింగ్స్‌పై వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా రూ. 10 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

    జీరో ఫారెక్స్‌ మార్కప్, గ్లోబల్‌ ఏటీఎంలలో వడ్డీరహితంగా నగదు లభ్యత, రూ. 50,000 వరకు విలువ చేసే ట్రిప్‌ క్యాన్సిలేషన్‌ కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ప్రీమియం మెటల్‌ క్రెడిట్‌ కార్డుల త్రయం ’అశ్వ–మయూర–గజ’లో భాగంగా ఇది ఉంటుందని బ్యాంకు పేర్కొంది.

    ఇదీ చదవండి: దేశం వీడుతున్న సంపన్నులు.. కారణాలు ఇవే!

  • ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్‌ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

    భారత మార్కెట్‌లో క్రోమ్ ప్రభంజనం

    భారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్‌కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్‌ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.

    ఈ లెగసీకి కారణం..

    • కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..

    • జీమెయిల్, గూగుల్‌ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.

    • కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్‌లోకి ఎంబెడ్ చేసింది.

    • సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.

    • చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్‌లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్‌వర్డ్‌లు, హిస్టరీ, బుక్‌మార్క్‌లను వదులుకుని కొత్త బ్రౌజర్‌కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.

    ఏఐ ఏజెంట్ వైపు..

    ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్‌గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్‌కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్‌గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?

  • ప్రపంచ పెట్టుబడి రంగంలో ఒక శకం ముగియబోతోంది. లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నుంచి బెర్క్‌షైర్ హాత్వే బాధ్యతలను గ్రెగ్ అబెల్ ఈ వారం చివరలో అధికారికంగా చేపట్టనున్నారు. 1962లో కేవలం ఒక చిన్న టెక్స్‌టైల్‌  మిల్లుగా ప్రారంభమైన బెర్క్‌షైర్‌ను నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు బఫెట్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో బఫెట్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అబెల్ ముందున్న అతిపెద్ద సవాలు.

    అసాధారణ ప్రస్థానం: బఫెట్ వారసత్వం

    గత ఆరు దశాబ్దాల్లో బఫెట్ బెర్క్‌షైర్‌ను ఒక సామ్రాజ్యంగా మార్చారు. గీకో (Geico), నేషనల్ ఇండెమ్నిటీ వంటి బీమా సంస్థలు, డెయిరీ క్వీన్, బీఎన్‌ఎస్‌ఎఫ్‌(BNSF) రైల్ రోడ్ వంటి దిగ్గజ కంపెనీలను కొనుగోలు చేశారు. యాపిల్, కోకాకోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థల్లో వారెన్‌ బఫెట్‌ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు అపారమైన లాభాలను తెచ్చిపెట్టాయి. గత 20 ఏళ్లలో 60 బిలియన్‌ డాలర్లకు పైగా దానం చేసినప్పటికీ, బఫెట్ వ్యక్తిగత సంపద నేడు సుమారు 150 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

    గ్రెగ్ అబెల్.. కొత్త నాయకత్వం

    2018 నుంచి బెర్క్‌షైర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న 62 ఏళ్ల గ్రెగ్ అబెల్, బఫెట్ కంటే భిన్నమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అబెల్ ఇటీవల నెట్ జెట్స్ సీఈఓ ఆడమ్ జాన్సన్‌ను కంపెనీ సర్వీస్, రిటైల్ విభాగాలకు హెడ్‌గా నియమిస్తూ సంస్థలో మూడో విభాగాన్ని సృష్టించారు. టాడ్ కాంబ్స్ (గీకో సీఈఓ) నిష్క్రమణ, సీఎఫ్ఓ మార్క్ హాంబర్గ్ పదవీ విరమణ నేపథ్యంలో అబెల్ కంపెనీలో కీలకంగా మారారు. సంస్థలో నాయకత్వ మార్పులు ఉన్నప్పటికీ బెర్క్‌షైర్ ప్రధాన సూత్రమైన ‘వికేంద్రీకరణ’ (Decentralization) మారదని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ముందున్న సవాళ్లు

    బెర్క్‌షైర్ ప్రస్తుతం 382 బిలియన్‌ డాలర్ల భారీ నగదు నిల్వ కలిగి ఉంది. ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు దొరకకపోవడం అబెల్ ముందున్న ప్రధాన సమస్య అని కొందరు చెబుతున్నారు. ఒకవేళ కొత్త కొనుగోళ్లు చేయలేకపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాటాదారులకు డివిడెండ్లు చెల్లించాలని లేదా స్టాక్ బైబ్యాక్ చేయాలని పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అయితే, బఫెట్ వద్ద ఉన్న 30 శాతం ఓటింగ్ పవర్ కారణంగా అబెల్‌కు ప్రస్తుతం ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చు. బఫెట్ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగుతూ, రోజూ కార్యాలయానికి వస్తూ సలహాలు ఇస్తానని ప్రకటించడం వాటాదారులకు ఊరటనిచ్చే అంశం.

    ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?

Andhra Pradesh

  • రావులపాలెం:  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అక్రమ అరెస్ట్‌ చేశారు. పోలీసుల సహకారంతో కూటమినేతలు రెచ్చిపోయారు. రావులపాలెంలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు కూటమి నేతలు. 

    అనుమతులు లేని ప్రాంతంలో విగ్రహం పెట్టడంపై జగ్గిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే ప్రదేశంలో ఏ విధమైన విగ్రహం పెట్టకూడదని గతంలో తీర్మానం చేశారు. పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా విగ్రహాన్ని పెట్టడమే కాకుండా జగ్గిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. జగ్గిరెడ్డిని రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

  • ప్రకాశం: జిల్లాలోని కురిచేడలో అధికార పార్టీ నేత అరాచకానికి పాల్సడ్డాడు. ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పితీసుకెళ్లాడు అధికార పార్టీకి చెందిన క్యక్తి. అయితే ఈ ఘటనపై పోలీసుల ఫోక్స యాక్ట్‌ కేసు నమోదు చేయకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తిని కాపాడే యత్నం​ చేశారు. 

    అదే సమయంలో రాజీ పడాలని బాధితురాలి తల్లిదండ్రులపై ఒత్తిడి చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షకు తీసుకెళ్లకుండా కురిచేడు ఎస్సై కాలయాపన చేస్తున్నాడు.    బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేస్తామని   రజక రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం డిమాండ్‌ చేశారు.

     

     

     

  • తాడేపల్లి: కొత్త ఏడాది ఆరంభం కానున్న తరుణంలో తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 

    2026లో.. ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని,  2026 ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. వచ్చే ఏడాది.. అందరికీ ఆరోగ్యం అందించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలన్నారు.

  • సాక్షి, తిరుపతి జిల్లా: వెంకటగిరిలో దారుణం జరిగింది. భార్య కోసం అత్తింటికి వెళ్లిన అల్లుడిపై మామ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పాపన హరిప్రసాద్ (32), లక్ష్మీ మౌనిక భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. భర్త హరిప్రసాద్‌పై  భార్య లక్ష్మీ మౌనిక అలిగి పుట్టింటికి వెళ్లింది.

    భార్య, పిల్లల కోసం హరిప్రసాద్‌.. ఇవాళ అత్తింటికి వెళ్లగా.. అల్లుడిపై మామ దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో బాధితుడ్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 70 శాతం శరీరం కాలిపోగా.. మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయాకు తరలించారు.

  • తాడేపల్లి : మన మిత్ర యాప్‌ పేరుతో సచివాలయ సిబ్బందిని వేధించడం సరికాదని వైఎస్సార్‌సీపీ ఉద్యోగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు.  ఆ యాప్‌ని జనం వాడకపోతే సిబ్బంది మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం, డిసెంబర్‌ 31) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రదాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘  కొత్త యాప్‌లు వాడాలంటే జనం భయపడుతున్నారు. తెలిసి, తెలియక ఏదైనా నొక్కితే అకౌంట్‌లో డబ్బులు పోతున్నాయి. అందుకే చాలామంది యాప్‌లు వాడటం తగ్గించారు.  

    అటువంటప్పుడు మన మిత్ర యాప్‌ని వాడటం లేదని సచివాలయ సిబ్బందిని ఎందుకు  టార్గెట చేస్తున్నారు?, అసలు మన మిత్ర యాప్‌ వలన ఏం ప్రయోజనం ఉంది?,  20 శాతం మంది కూడా ఆ యాప్‌ని వాడటం లేదు. ఈ కారణంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వేధించటం కరెక్టు కాదు. వాలంటీర్ల వ్యవస్థ ను రద్దు చేసి వారి పనిని కూడా సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారుఉద్యోగుల సొమ్ము రూ.34 వేల కోట్లు వాడుకుని ఇంతవరకు ఇవ్వలేదు. డీఏ, పీఆర్సీ  ఊసే లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి ఉద్యోగుల సొమ్ము కాజేస్తారా?’ అని ప్రశ్నించారు. 

    వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు
  • నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్‌ షెరాన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు.

     తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ ఆదేశించారు.

  • సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయడంపై రాయచోటిలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హేతుబద్ధత లేకుండా జిల్లా కేంద్రాన్ని తరలించడాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎ‍స్సార్‌సీపీ నేతలు, ప్రజలకు డిమాండ్‌ చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండిపడుతున్నారు.

    ఇక, జిల్లాను మూడు ముక్కలు చేయడంపై వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ‍రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. స్థానిక ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కేబినెట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాను చీల్చవద్దంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. రాయచోటిలో జిల్లా కేంద్రం కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమంటూ శ్రీకాంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

    ఇదిలా ఉండగా.. జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్‌లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్‌రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్‌రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్‌రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

    తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

International

  • ఆఫ్రికాలో 500 సంవత్సరాల పురాతన ఓడ  ఏడారిలో జరిపిన తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమయ్యింది. అయితే  సముద్ర గర్భంలో ఉండాల్సిన నౌక ఇంత భారీ పరిమాణం గల నౌక ఇసుక ఏడారిలోకి ఎలా వచ్చిందబ్బా అని వారు తొలుత హవాక్కయ్యారు. తాజాగా అందులో అపారమైన బంగారం. వెండితో పాటు పెద్ద మెుత్తంలో ఖజానా దొరికింది.

    2008 సంవత్సరంలో ఆఫ్రికాలోని నమీబియాలో నమీబ్ ఏడారిలో వజ్రాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అప్పుడు ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల పురాతన బోమ్ జీసస్ అనే నౌకను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో దాదాపు 2వేల బంగారు నాణేలు, వెండి నాణేలు, వందల కిలోగ్రాములు రాగి కడ్డీలు ఇతర జంతువుల దంతాలు లభించాయి. దీంతో దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా అది వాణిజ్య నౌకగా గుర్తించారు.

    అయితే ఆ నౌక 1533 సంవత్సరంలో ఆఫ్రికా నుంచి భారత్‌కు వాణిజ్యానికి వెళుతోందని తెలిపారు. ఆ సమయంలో నమిబీయా తీరాన్ని తీవ్ర మంచుతుపాను తాకడంతో ఓడ రాళ్లను ఢీకొట్టి మునిగిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఓడలో ప్రయాణించిన వారి అవశేషాలు ఎక్కడ లభ్యం కాలేదు ఈ విషయం వారికి ఇప్పటికీ రహస్యంగానే ఉంది.

  • అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారు

    విదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్‌ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో  భాగం పంచుకోవాలని కోరారు.

    ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్‌లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు.   రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి. 

  • మస్కట్‌: వర్క్‌ పర్మిట్లు,  వృత్తిపరమైన  లైసెన్స్‌, సర్టిఫికెట్లపై  ఒమన్‌  దేశం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ వర్క్‌ పర్మిట్లు, జాబ్‌ లైసెన్స్ పత్రాలను సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.  దీనికి సంబంధించి నకిలీని సర్టిఫికెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ  గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో నిబంధనలను కఠినతరం చేసింది. ఫేక్‌ సర్టిఫికెట్లు, కాపీలు లాంటి  చర్యలు చట్టాలు, నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

    ఒమన్‌లో పని అనుమతులు (వీసాలు) పునరుద్ధరించడానికి, కొత్త ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి, సంబంధిత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికెట్లు, వృత్తిపరమైన అభ్యాస లైసెన్స్‌లను సమర్థ అధికారుల (సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లు) నుండి పొందాలని స్పష్టం చేసింది.అదే సమయంలో, అన్ని ఉద్యోగులు, కంపెనీలు ఈ పత్రాలు జారీ చేసే క్రమంలో వాటి ప్రామాణికతను ధృవీకరించాల్సిన బాధ్యత ఉందని తెలిపింది. ఏదైనా అనధికార పత్రాలను ఉపయోగించకుండా  అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

    ప్రొఫెషనల్ వర్గీకరణ సర్టిఫికేట్ , వృత్తిని అభ్యసించడానికి లైసెన్స్ ముఖ్యమైనవి. ఉద్దేశించిన వృత్తికి సంబంధిత వ్యక్తి సుముఖత , అర్హతను ధృవీకరించడం, వృత్తిపరమైన సామర్థ్యం , పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం, కార్మిక మార్కెట్‌ను నియంత్రించడం వృత్తిపరమైన ప్రమాణాలను నిర్ధారించడమే దీని లక్ష్యంమని పేర్కొంది. నకిలీ లేదా తప్పుడు పత్రాన్ని సృష్టించడం నేరస్థుడిపై చట్టపరమైన చర్యలకు దారితీసుకుంటామని హెచ్చరించింది.  చట్టాలని లోబడి జరిమానా, ఇతర చర్యలుంటాయని  మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     

  • లాస్ ఏంజెల్స్: భద్రతా కారణాలు, ఉగ్రదాడుల ముప్పు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేశారు. లాస్ ఏంజెల్స్‌లో వరుస బాంబు దాడులే లక్ష్యంగా కుట్ర పన్నిన నలుగురిని ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఎఫ్‌బీఐ వివిధ దేశాలు హెచ్చరికలు జారీ చేసింది.

    ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండై బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించగా, 40 మందికి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 15,000 మందికి పైగా పాల్గొనే బోండై బీచ్‌లోని పటాకుల ప్రదర్శనతో పాటు ఇతర వేడుకలు రద్దయ్యాయి. యూదుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    పారిస్‌లోని షాంప్స్-ఎలీసీ వద్ద ప్రసిద్ధ సంగీత కార్యక్రమాన్ని పోలీసులు సూచన మేరకు రద్దు చేశారు. భారీ జనసమూహం, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్త చర్యగా కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే అధికారిక పటాకుల ప్రదర్శన మాత్రం జరుగుతుంది.

    టోక్యోలోని షిబుయా స్టేషన్ వెలుపల జరిగే ప్రపంచ ప్రసిద్ధ నూతన సంవత్సరం కౌంట్‌డౌన్ రద్దు చేశారు. భారీ రద్దీ కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ఆవకాశముందని అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించారు. అయితే, న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

  • దీర్ఘకాలంగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ అరేబియా... యూఏఈల మధ్య ఘర్షణలు చెలరేగడంతో మధ్య ప్రాచ్య దేశాల్లో అలజడి చెలరేగింది. అంతగా స్నేహంగా ఉన్న దేశాల మధ్య ఒక్కసారిగా విబేధాలు రావడానికి యెమన్‌ దేశమే కారణమైంది. 9 ఏళ్లుగా యెమన్‌లో యుఏఈ మద్దతు ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న సదరన్‌ ట్రాన్సిషనల్‌ కౌన్సిల్‌ అనే వేర్పాటువాద గ్రూప్. ఆ గ్రూప్‌ను యెమన్‌ దేశంతో పాటు...  సౌదీ అరేబియా వ్యతిరేకిస్తోంది. కానీ... యూఏఈ మాత్రం ఆ గ్రూప్‌ను సమర్థిస్తోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ పేరిట పుట్టిన వేర్పాటు వాద గ్రూప్... అంతర్గత కలహాలు సృష్టిస్తూ  యెమెన్‌లోని ప్రధాన దక్షిణ వేర్పాటువాదం కోసం పోరాడుతోంది. ముఖ్యంగా యెమెన్ దక్షిణ ప్రాంతానికి స్వతంత్రత సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఈ గ్రూప్‌ 2017లో పుట్టింది.

    వేర్పాటు వాదులకు మద్దతు ఇస్తోందన్న అనుమానంతో సౌదీకి కోపం వచ్చింది. దీంతో సౌదీ బలగాలు నేరుగా డిసెంబర్‌ ౩౦న యెమెన్‌లోని ముకల్లా పోర్ట్‌ నగరంపై దాడి చేయగా... యుఏఈ దీనిని తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా అక్కడ ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. యెమన్‌పై జరిగిన దాడితో పాత మిత్రుల మధ్య పుట్టుకొచ్చిన వ్యతిరేకతను దూరం చేయడానికి గల్ఫ్‌ దేశాలు సమాలోచనలు చేస్తున్నాయి. మరోవైపు దాడి జరగ్గానే యెమన్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.  

    యెమన్‌లోని వేర్పాటు వాదులకు యూఏఈ నుంచి ఆయుధాలు అందుతన్నాయన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ... యెమెన్‌లోని ముకల్లా పోర్ట్‌పై సౌదీ సైన్యం వైమానిక దాడులు జరిపింది. దాడిని యూఏఈ ఖండిస్తూ... సౌదీ ఆరోపణలు నిరాధారమైనవని.. అసలు వారి వద్ద ఆయుధాలే లేవని యూఏఈ స్పష్టం చేసింది. అనాలోచిత దాడి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ యెమన్‌లో ఉన్న యూఏఈ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది ఊహించని పరిణామమని గల్ఫ్‌ దేశాలు చెబుతున్నాయి. అయితే అక్కడ చెలరేగిన యూఏఈ- సౌదీ మధ్య విబేధాలు ఇటు మన దేశంపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక భద్రత, భారత్‌కు అందే ఇంధన సరఫరా, ప్రవాస భారతీయుల సంక్షేమాలపై ప్రభావం చూపే అవకాశముంది. 

     తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణ గురించి ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. యెమన్‌లో మళ్లీ సౌదీ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదని... దీంతో గల్ఫ్‌ దేశాల్లో ప్రధానమైన సౌదీ అరేబియా- యూఏఈల మధ్య ఘర్షణ ముదిరితే.. యెమన్‌, యూఏఈతో పాటు ఇతర దేశాలకూ ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగితే వాటి ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది. భారత్ లో ప్రవాస భారతీయుల భద్రత, భారత్‌కు ఇంధన సరఫరా, వాణిజ్య సంబంధాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
    -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్
     

  • న్యూ ఇయర్- 2026 దుబాయ్‌లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్‌ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.    

    దుబాయ్ అంటే కాస్లీ లైఫ్‌కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్‌కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.  

    పామ్ జుమేరా, దుబాయ్‌ హిల్స్, డౌన్‌టౌన్‌, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.

    వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య  గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు.

  • పాక్‌లోకి చొరబడి... దాక్కుని ఉన్న టెర్రరిస్టులను భారత్‌ హతమార్చలేదా? అనేది ప్రశ్న... సాధారణంగా ఈ ప్రశ్నను ఎవరు అడుగుతారు?  ఎవరో భారతీయుడు అడిగి ఉంటాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మతపెద్ద...జమీయతే ఉలేమా ఇస్లాం చీఫ్‌మౌలానా ఫజలుర్రహ్మన్‌ .. కరాచీలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..ఈ ప్రశ్నను అడగడం...గమనార్హం. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే... వాస్తవంగా ఆఫ్ఘనిస్థాన్‌పై.. దేశం లోపలకి ప్రవేశించి పాక్‌ ఆర్మీ వరసగా దాడులకు పాల్పడుతోంది. 

    ఆ దాడులను ఖండిస్తూ... ఇతర దేశాలపై దాడులు చేయడం సమంజసం కాదని... ఒకవేళ అది సరైన నిర్ణయమే అని పాకిస్తాన్‌ భావిస్తే... మరి భారత్‌ ఇక్కడికి వచ్చి దాడులు చేయడం కూడా సబబే కదా అని ఆయన సభను ఉద్దేశించి చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌పై పాక్‌ దాడులు ఆపాలని... చర్చలు జరపాలని ఆయన అన్నారు. అయితే దాడులకు మూలకారకుడిగా ఉన్న పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్ లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులను నివారించి... పాకిస్తాన్‌... ఆఫ్గనిస్తాన్‌ల మధ్య సయోధ్య కుదర్చడానికి... ఇరు దేశాల మతపెద్దలు ఏకమవుతామని కూడా ఆయన ప్రకటించారు. 

    పాక్‌లో జరిగిన బహిరంగ సభలో పెద్దల మాటలను ఆఫ్గాన్‌లోని తాలిబాన్‌ మతపెద్దలు ఆహ్వనించారు. ఇది మంచి సంకేతమని... దాడులకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఆసిమ్‌ మునీర్‌ ఆటలకు అడ్డుకట్ట వేయడానికి ఆ రెండు దేశాల మత పెద్దలు సిద్ధమయ్యారు. ఆ పెద్దల నిర్ణయం... అటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ జనగరల్‌ ఆసిమ్‌ మునీర్‌లకు చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా ఆసిమ్‌ మునీర్‌ గేమ్‌ చివరి దశకు చేరిందని... ఖేల్‌ ఖతమ్‌ అని అక్కడి పత్రికలు రాయడం కూడా ప్రారంభించాయి. అక్కడ అసలేం జరుగుతోందో... జరగబోతుందో...  ఇప్పుడు మనం చూద్దాం.

    ఇరు దేశాల మతపెద్దల కలయిక ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు పెద్ద చిక్కుల్లోనే నెట్టింది. పాకిస్తాన్‌- ఆఫ్గాన్‌ల మధ్య చెలరేగిన వివాదాలకు మతపెద్దలు ఆపే ప్రయత్నం చేస్తున్నారని... అసిమ్‌ మునీర్‌ లక్ష్యంగా సాగుతున్న ఈ మతపెద్దల కలయిక మునీర్‌కు పెద్ద ఇరకాటంలో నెట్టనుంది. తాలిబాన్‌ పెద్దలు, పాకిస్తాన్‌ మత పెద్దల సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఆ పెద్దలు కలిసి దాడులను ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆసిమ్‌ మునీర్‌ అనవసరంగా ఆఫ్గాన్‌పై దాడులు చేయిస్తున్నారని.. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను కూడా చెడగొడుతోందన్నారు. ఇరు దేశాలకు నష్టాల పాలు చేస్తున్న దాడులు వెంటనే ఆపేయాలని పెద్దలు హుకుం జారీ చేశారు. 

     ఫజలుర్‌ రహ్మాన్‌ వ్యాఖ్యలు ఆఫ్గనిస్తాన్‌లో సంబరాలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు తాలిబాన్‌ ప్రభుత్వ అంతర్గత శాఖల మంత్రి సిరాజుద్దీన్‌... పాక్‌ మతపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మెట్టు దిగిన పాక్‌ ప్రభుత్వం మతపెద్దల శాంతి రాయబారాన్ని స్వాగతిస్తున్నామని... ఆఫ్గన్‌పై దాడులు నిలిపివేస్తామని డిప్యూటి ప్రధాన మంత్రి ఇషాక్‌ దార్‌ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని... ఆర్మీని వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చారు. అసలు దాడుల ఆలోచనే లేదు... ఇక దాడుల పేరిట ఆఫ్గనిస్తాన్‌పై అరాచకం సృష్టించిన ఆర్మీ చీఫ్‌ మునీర్‌ మాత్రం నోరు విప్పడం లేదు. 
    -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్

  • సంవత్సరపు చివరి క్షణాలు మనసులో జ్ఞాపకాల ముత్యాలు చల్లుతూ.. కొత్త ఆశలతో నిండిన ఉదయం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. పాతది మసకబారుతుంటే, కొత్తది వెలుగులు విరజిమ్ముతోంది.  న్యూ ఇయర్‌కు కొత్త ఉదయం తలుపులు తడుతుంటే.. ఇప్పటి వరకూ మనం ఆస్వాదించిన ఇయర్‌-2025 ముగింపునకు సిద్ధంగా ఉంది. 

    అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది  ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్‌ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి.  అలాగే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభమైంది.   ప్రస్తుతం అక్కడి జనవరి 1 వచ్చేసింది కాబట్టి వారు కొత్త సంవత్సరం వేడుకల్లోకి ప్రవేశించారు.

    కిరిబాటి.. చిన్న ద్వీప దేశం
    భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో  ఇది ఒకటి.  ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్‌-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం.  ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది. 

    సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే  ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్‌ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.

    భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే  నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..

    • కిరిబాటి(8.30 am on Jan 1)

    • సమోవా, టోంగా((7.30 am on Jan 1)

    • న్యూజిలాండ్‌((7.30 am on January 1)

    • రష్యా, ఫిజి((6.30 am on January 1)

    • ఆస్ట్రేలియా((5.30 am on January 1)

    • పాపువా న్యూగినియా((4.30 am on January 1)

    • ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)

    • చైనా, మలేషియా, సింగపూర్‌(2.30 am on January 1)

    • వియాత్నాం, థాయ్‌లాండ్‌( 1.30 am on January 1)

    • మయన్మార్‌(1 am on January 1)

    • బంగ్లాదేశ్‌, కజికిస్తాన్‌, భూటాన్‌( 12.30 am on January 1)

    • నేపాల్‌(12.15 am on January 1)

     

  • బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్‌ హాదీ హత్య విషయంలో  సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్‌ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్‌ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది.  

    రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్‌ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్‌ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు.  ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.  ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.

    ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్‌ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్‌ వీడియోలో తెలిపారు.

    ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని  ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.

    అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్‌ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు.

  • ఢాకా: దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియాకు వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఢాకా నగరంలోని దేశ మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త, దివంగత జియావుర్‌ రహ్మాన్‌ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేశారు. మూడు సార్లు ప్రధాని పగ్గాలు చేపట్టి బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన 80 ఏళ్ల జియా మంగళవారం పలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో కన్నుమూయడం తెల్సిందే. 

    బుధవారం ఢాకాలోని మాణిక్‌ మియా అవెన్యూ సమీపంలోని షేర్‌–ఎ–బంగ్లా నగర్‌లోని శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో జియా అంత్యక్రియలను సాయంత్రం 4.30 గంటలకు మొహమ్మద్‌ యూనుస్‌ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిచేసింది. తొలుత బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ్ట(బీఎనీ్ప) కార్యకర్తలు, వేలాది మంది అభిమానుల సందర్శనార్థం జియా పార్థివదేహాన్ని జాతీయ సంసద్‌ భవన్‌(పార్లమెంట్‌) సమీప మాణిక్‌ మియా అవెన్యూలో ఉంచారు. జియా మృతదేహంపై బంగ్లాదేశ్‌ జాతీయజెండాను కప్పారు. 

    అక్కడే మధ్యాహ్నం రెండో నమాజు ‘జుహుర్‌’తర్వాత అంత్యక్రియల సంబంధ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైతుల్‌ మొకర్రం జాతీయ మసీదు ప్రధాన మతాధికారి మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుదూరాల నుంచి సైతం జియా అభిమానులు కడసారి ఆమెను చూసేందుకు తరలివచ్చారు. దీంతో పార్లమెంట్‌ చుట్టూతా ఉన్న రహదారులన్నీ బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులతో జనసంద్రంగా మారాయి. 

    రోడ్లమీదనే జియా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జియా ఫొటోలున్న భారీ ప్లకార్డులను చేతబూని ఆమె దేశానికి చేసిన సేవను గుర్తుచేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్‌ యూనుస్, చీఫ్‌ జస్టిస్‌ జుబేయర్‌ రహ్మాన్‌ చౌదరి, బేగం జియా కుమారుడు, బీఎన్పీ తాత్కాలిక చైర్మన్‌ తారిఖ్‌ రెహ్మాన్, పలు దేశాల ప్రత్యేక ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హాజరై జియా కుమారుడికి ప్రధాని మోదీ తరఫున సంతాప లేఖను అందజేశారు.

  • ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ తరచుగా భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఈ విషయంపై భారత్ ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ మామ తన తీరు మార్చుకోవడం లేదు. నిన్న ఇజ్రాయెల్ ప్రధానితో జరిగిన భేటీలో కూడా ఈ వ్యాఖ్యలే చేశారు.ఇది చాలదన్నట్లు తాజా ఆజాబితాలో చైనా దేశం కూడా చేరింది.

    ఆపరేషన్ సిందూర్‌ విషయంలో భారత్‌కు తంటాలు తప్పడం లేదు. ఇండియన్ ఆర్మీ ముష్కరుల స్థావరాల్ని వారి స్వస్థలంలోనే ధ్వంసం చేసి ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలిసేలా చేసింది. తన జోలికస్తే రిప్లై ఏలా ఉంటుందో చిన్న ట్రైలర్‌ చూపించింది. దీంతో భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైన పాక్ దారికొచ్చింది. ఇరు దేశాలు పరస్పర కాల్పులు విరమణ ఒప్పందంపై సంతకం పెట్టాయి. తాజాగా చైనా ఈ అంశంలో  వేలు పెట్టింది. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించి తానే ఈ యుద్ధాన్ని ఆపానని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది

    ఆ దేశ విదేశాంగ మంత్రి వాంఘ్‌ యీ మాట్లాడుతూ " చైనా చాలా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించింది. మయన్మార్‌లో సందిగ్ధతలు, ఇరాన్ న్యూక్లియర్ సమస్య, భారత్- పాకిస్థాన్ సమస్య, కంబోడియా-థాయిలాండ్ వివాదం, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య గొడవ ఇలా ప్రపంచ దేశాల మధ్య గొడవలన మధ్యవర్తిత్వం వహించి పరిష్కరించాం" అని చైనా విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.

    అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. " మేము ఇదివరకే ఇటువంటి వ్యాఖ్యలను ఖండించాం. భారత్-పాకిస్థాన్ అంశంలో మూడవ పార్టీ జ్యోక్యం లేదు. మా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం  రెండు దేశాల మధ్యలోనే జరిగిందని" భారత్ హెచ్చరించింది. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాక్‌కు మద్ధతుగా నిలిచింది. పాక్‌కు అవసరమైన యుద్ధ సామాగ్రిని, ఫైటర్‌ జెట్స్‌ అందించింది. ఆసమయంలో భారత్ చేసిన దాడులలో డ్రాగన్ కంట్రీకి చెందిన కొన్ని వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

National

  • బెంగళూరు: బాల్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో ఉపాధ్యాయుల  ప్రేరణ చాలా ఉంటుంది. తల్లి దండ్రుల తరువాత పిల్లలపై తమ ప్రేమ అప్యాయతలను కురిపించేది టీచర్లు మాత్రమే. అందుకే గొప్ప గొప్ప నాయకులు, సెలబ్రిటీల జీవితాలపై టీచర్ల ప్రభావం ఉంటుంది. తాజాగా కర్ణాటకలోని కొప్పల్ జిల్లా బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యుడి చేసిన పని నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.

    విమానం ఎక్కాలనే విద్యార్థులకలను సాకారం చేసేందుకు కర్ణాటకకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దాతృత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలిచింది. బహద్దూరిబండి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బీరప్ప అందగి 24 మంది విద్యార్థులను తొలి సారి  విమానం  ఎక్కించారు. తన సొంత ఖర్చులతో రూ. 5 లక్షలు  వెచ్చించి మరీ తన విద్యార్థులను లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చారు. 5-8 తరగతుల విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పాఠశాల అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులు మొత్తం 40 మంది విమానంలో ప్రయాణించారు. వీరి కోసం తోరణగల్లులోని జిందాల్ విమానాశ్రయం నుండి బెంగళూరుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.ప్రతీ క్లాస్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి ఆరుగుర్ని ఈ జర్నీకి ఎంపిక చేశారు.

     కొప్పల్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది విద్యార్థులు తమ తొలివిమాన ప్రయాణాన్ని అనుభవించారు, వారి  ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి సంతోషం పడే  వారు తొలిసారి విమానం ఎక్కి తెగ సంతోష పడిపోయారు. బెంగళూరులో రెండు  రోజులు ఉండి అనేక పర్యాటక ప్రదేశాలను, పాఠశాలలను సందర్శించి  తమ అభిమాన హెడ్మాస్టర్‌కి శతకోటి అభివందనాలు కొప్పల్‌కు తిరిగొచ్చారు. ఎన్నో మధురమైన,సంతోషకరమైన క్షణాలను, అనుభవాలను మూటగట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగామారింది. ఆయనపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

    ఇదీ  చదవండి: నాకు వేరే దారి లేదు! మమ్మా యూ ఆర్‌ ద బెస్ట్‌.. సారీ!

  • ఉత్తరప్రదేశ్‌లోని,ముజఫర్‌నగర్‌లో అద్భుత సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం చని పోయాడని భావిస్తున్న వ్యక్తి ఊహించని విధంగా  కళ్ల ముందు కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. తొలుత అస్సలు నమ్మలేదు.ఈ తరువాత కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

    ఖతౌలి పట్టణంలోని మొహల్లా బల్కారాం నివాసి షరీఫ్ 28 ఏళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. బంధువులకు అందుబాటులో లేకుండా పొయ్యాడు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో షరీఫ్ అధికారిక పత్రాలకోసం 1997 తరువాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అకస్మాత్తుగా వృద్ధుడైన  షరీఫ్‌  ప్రత్యక్షం కావడంతో బంధువులు, పొరుగు వారు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

    కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం షరీఫ్ మొదటి భార్య 1997లో మరణించింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుని భార్యతో పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాడు. ప్రారంభంలో ల్యాండ్‌లైన్ ఫోన్ కాల్స్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేవాడు. అయితే, కాలక్రమేణా అవీ ఆగిపోయాయి. అతను ఇచ్చిన అడ్రస్‌లో షరీఫ్‌ను సంప్రదించాలని ప్రయత్నించిన బంధువులకు నిరాశే ఎదునైంది.  దీంతో అతను చనిపోయాడని భావించారు. అయితే ఎస్‌ఐఆర్‌ పుణ్యమా అని రెండు రోజుల క్రితం షరీఫ్ ఖతౌలికి తిరిగి వచ్చాడు. తొలుత ఎవరూ నమ్మలేదు.  షరీఫ్ తిరిగి వచ్చాడన్న సమాచారంతో స్థానికంగా సందడి నెలకొంది. ఇరుగు పొరుగువారు, బంధువులు, పరిచయస్తుంతా గుమిగూడారు, దూరపు చుట్టాలు వీడియో కాల్స్ చేసి మురిసి పోయారు.

    ఇదీ చదవండి: లిఫ్ట్‌ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం

    గత 15, 20  ఏళ్లుగా అతని కోసం ఎంత వెదికినా ఫలితంలేదని మేనల్లుడు మొహమ్మద్ అక్లిమ్ తెలిపారు. అయితే రెండో పెళ్లి తరువాత ఆర్థిక పరిస్థితి, కమ్యూనికేషన్ సదుపాయం లేక పోవడం వల్ల తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఇపుడు ప్రభుత్వ పత్రాలు అవసరం కాబట్టి తిరిగి వచ్చానని, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోతానని కూడా చెప్పాడు. అన్నట్టుగానే సంబంధిత పత్రాలను తీసుకొని బెంగాల్‌కు వెళ్లిపోయాడు.
     

  • ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ప్రియుడు ఆకాష్ మోసం చేశాడంటూ  ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందర్భంగా  ఆమె రికార్డు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    హాత్రాస్‌లోని ఆవాస్ వికాస్ కాలనీలో నివసించే కామిని శర్మ, ప్రియుడు ఆకాష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకుంది. ‘‘నేను ఎపుడూ ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. కానీ నాకు చావు మరో ఆప్షన్‌ మిగలకుండా చేశావ్‌. బలహీను రాల్నిచేసి ఆడుకున్నావ్‌...ఎవరి జీవితంతో ఆడుకోవడ్డం మీ ఇంట్లో వాళ్లు ఎపుడూ చెప్పలేదా.. కానీ మానవత్వం అనేది బతికి ఉంటే నీకు కూడా నాలాంటి గతే పడుతుంది. ఎందుకంటే నేను ఎవర్నీ మోసం చేయలేదు.. నిన్ను చాలా ప్రేమించాను’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. అంతేకాదు అమ్మా నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నువ్వే అత్యుత్తమ తల్లివి. నా సూసైడ్‌కి బిహార్‌ వాలా ఆకాష్‌ కారణం అని తన వీడియోలో పేర్కొంది. అలాగే తన అత్తకు కూడా క్షమాపణలు చెప్పింది. నీలాంటి అత్త యూనివర్స్‌లో ఎక్కడా దొరకదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.

     కామినీ సోమవారం మధ్యాహ్నం విషం సేవించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఆకస్మిక మరణం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అంత్యక్రియల తర్వాత, కుటుంబ సభ్యులకు కామిని వీడియో గురించి తెలిసింది.  దీంతో కామిని తల్లి రష్మి శర్మ కొత్వాలి సదర్‌లో ఫిర్యాదు చేసింది. కుమార్తె మరణానికి కారణమైన తన కుమార్తె ప్రియుడు ఆకాష్‌పై ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఇదీ చదవండి: బాలనటి ఇంట్లో తీరని విషాదం, కళ్లముందే..!

  • ముంబైలో జరిగిన  ఒక ఘోర  బస్సు ప్రమాదం  ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది.  ఒక మూవీ ఆడిషన్‌కోసం వెళ్లిన  13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా  తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి  ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది.  పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని  కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

    పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్‌లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్‌ కోసం దాదార్‌ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ తమవైపు  దూసుకు రావడాన్ని గ్రహించిన  తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.

    క్షణాల్లో  అంతా జరిగిపోయింది.
    తల్లి  పక్కకు నెట్టివేయడంతో  బాలనటి ప్రమాదం నుంచి  స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని,  వేరే వారి  ఫోన్ ద్వారా తండ్రి సందీప్‌కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న  బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

    ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్‌లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్‌లను మేనేజ్‌ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్‌, సెట్స్‌కు తీసుకెళుతూ ఇంటిని  చక్కబెట్టుకొనేదని చెప్పారు. 

    కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

    చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు

    రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
    ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు  మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌  రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

    ఇదీ చదవండి: లిఫ్ట్‌ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
     

  • అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం అంటే, మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప విగ్రహానికి పందళ మహారాజు పంపిన దివ్య స్వర్ణాభరణాలను అలంకరించి, ఆ అద్భుతమైన రూపంలో స్వామిని దర్శించుకోవడం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దర్శనం మకర జ్యోతి దర్శనానికి ముందు జరుగే తంతు. 

    ఇక పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ ఇవాల్టి (డిసెంబర్ 31) నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి  జనవరి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు భక్తులు తిరువాభరణాలను దర్శించుకోవచ్చు. అలాగే జనవరి 12న తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పందలం వలియ కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర క్షేత్రంలో తిరువాభరణాల దర్శనం ఉంటుంది. 

    అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంటకు రాజప్రతినిధి నేతృత్వంలో తిరువాభరణాల పేటికలు శబరిమలకు పయనమవుతాయి. సాధారణంగా మండల కాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) భక్తులు ఈ ఆభరణాలను దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు, ప్రత్యేకించి డిసెంబర్ 31 నుండి జనవరి 11 వరకు దర్శనం ఉంటుంది.

    పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ అంటే..
    అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలు (Thiruvabharanam) భద్రపరిచే ప్రదేశం, దీని సంరక్షణ భాద్యత పందలం రాజకుటుంబం వారిది. ఆ ఆభరణాలు మకరజ్యోతి పండుగ సమయంలో శబరిమలకి ఊరేగింపుగా తీసుకెళ్లి..ఆ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాయి. ఈ మాళిగను మండలకాలంలో భక్తులు దర్శించుకోవచ్చు.

    (చదవండి: మండల పూజ సీజన్‌లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు)

     

     

  • ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్‌ (Union Cabinet) ఇవాళ( బుధవారం, డిసెంబర్‌ 31) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 20, 668 కోట్ల రూపాయలతో రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్  చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో  45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి  చేరుకునే అవకాశం ఉంది.

    చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్ కడప  మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు  హై స్పీడ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది.

    ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల  ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను  కేబినెట్‌ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల నిర్మాణానికి 2, 18,312 కోట్ల రూపాయలు కేటాయించింది.

    8 మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1,31,542 కోట్లు, నాలుగు ఏర్పాట్లు నిర్మాణానికి 7339 కోట్లు, మేజర్ పోర్టు నిర్మాణానికి రూ.1,45,945 కోట్లు, రెండు కొత్త రోప్ వేల నిర్మాణానికి రూ.6811 కోట్లు, మూడు హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.28,432 కోట్లు, 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు రూ.28, 602 కోట్లు, పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేంద్రం కేటాయించింది.

    వొడాఫోన్‌-ఐడియాకు ఉపశమనం
    కేంద్ర కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్‌-ఐడియాకు ఉపశమనం కల్పించింది. రూ.87,695 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు ఫ్రీజ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • ఢిల్లీ: నూతన సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది. రాజస్థాన్ టోంక్‌ జిల్లాలో పేలుడు పదార్థాలు ఉన్న కారును  స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ సంచులతో ఉన్న కారును సీజ్‌ చేశారు. 200 కాట్రేడ్జిలు, ఐదు బండిల్స్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నిందితులు బుండీ నుండి టోంక్‌కు పేలుడు పదార్థాలను తరలిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సురేంద్ర మోచి, సురేంద్ర పట్వాలను అరెస్ట్ చేసిన పోలీసులుపలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

    డీఎస్పీ మృత్యుంజయ మిశ్రా మాట్లాడుతూ.. నిఘా వర్గాల సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ చేపట్టామని.. వాహనం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని.. కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, అమోనియం నైట్రేట్‌ను పేలుడు పదార్థాలతో కలిపి వాడతారు. గత నెల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో ఉపయోగించారు. ఆ ఘటనలో 15 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • మరికొన్ని గంటల్లో యావత్‌ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. కోటి ఆశలతో, మరింత నూతనోత్తేజంతో 2026 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఉవ్విళూరుతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, సకల శుభాలు, ప్రేమ, ఉత్సాహంతో నిండిన  సరికొత్త ప్రారంభానికి స్వాగతం చెబుతాం. అలాగే రాబోయే సంవత్సరంలో మహిళలు మరిన్ని అవకాశాలు రావాలని, సాధికారత దిశగా మరింత సాహసోపేతమైన  అడుగులు పడాలని యావత్‌ మహిళా లోకం కలలు గంటోంది.

    కొత్త అడుగు వేసే ముందు, మునుపటి అడుగును, అనేక రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళలను గుర్తు చేసుకోవడం కూడా అవసరం.2025 సంవత్సరం సినిమా, రాజకీయం, సామాజిక రంగాలకు తీరని లోటును మిగిల్చింది. ఈ ఏడాది కన్నుమూసిన దేశీయ , అంతర్జాతీయ ప్రముఖ మహిళల వివరాలు చూద్దాం


    భారతీయ ప్రముఖులు
    బీ సరోజా దేవి (నటి): "అభినయ సరస్వతి"గా పేరుగాంచిన లెజెండరీ నటి సరోజా దేవి జూలై 14, 2025న కన్నుమూశారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో  పోటా పోటీగా నటించి  సినీ అభిమానులు గుండెల్లో సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయిన  గొప్ప నటి.

    సీ కృష్ణవేణి (నటి ): తొలితరం తెలుగు నటి,  నిర్మాత అయిన కృష్ణవేణి గారు ఫిబ్రవరి 16, 2025న తన 100వ ఏట మరణించారు. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతలలో ఒకరు.

    కామినీ కౌశల్ (నటి): బాలీవుడ్ స్వర్ణయుగపు నటి కామినీ కౌశల్ నవంబర్ 13, 2025న మరణించారు. 'నీచా నగర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె ప్రసిద్ధి చెందారు.

    సిమోన్ టాటా (వ్యాపారవేత్త): భారతీయ సౌందర్య సాధనాల బ్రాండ్ 'లాక్మే' (Lakme) ,  'ట్రెంట్/వెస్ట్‌సైడ్' అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా డిసెంబర్ 5, 2025న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

    యువ నటి షెఫాలీ:  'కాంటా లగా' గర్ల్‌గా గుర్తింపు పొందిన షెఫాలీ జూన్ 27, 2025న గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో అకాల మరణం చెందడం ఆమె అభిమానులును తీవ్ర విషాదంలో ముంచేసింది.

    సంధ్యా శాంతారామ్ (నటి): సీనియర్ నటి సంధ్య ఈ  ఏడాది అక్టోబర్ 4, మరణించారు. ఆమె 'జనక్ జనక్ పాయల్ బాజే' వంటి క్లాసిక్ సినిమాల్లో నటనతో నభూతో నభవిష్యతి అనుపించుకున్నారు. 

    అంతర్జాతీయ ప్రముఖులు
    ఖలీదా జియా (రాజకీయవేత్త): బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30 న మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30, 2025న మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో పుట్టి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక శక్తివంతమైన మహిళా నేతగా నిలిచారు.

    జేన్ గుడాల్ (శాస్త్రవేత్త): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రైమాటాలజిస్ట్ మరియు పర్యావరణ కార్యకర్త జేన్ గుడాల్ అక్టోబర్ 1, 2025న 91 ఏళ్ల వయసులో మరణించారు. చింపాంజీల ప్రవర్తనపై ఆమె చేసిన పరిశోధనలు విప్లవాత్మకమైనవి.

    డయాన్ కీటన్ (హాలీవుడ్ నటి): ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ అమెరికన్ నటి డయాన్ కీటన్ అక్టోబర్ 11న మరణించారు.

    డేమ్  అన్నెట్ బ్రూక్: UKలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా లిబరల్ డెమొక్రాట్ MP ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. 2001లో డోర్సెట్‌లో సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన తొలి మహిళా MPగా ఆమె రికార్డ్‌ సృష్టించారు. 

    బ్రిజిట్ బార్డోట్ (నటి) ఫ్రెంచ్ సినిమా ఐకాన్ మరియు జంతు హక్కుల పోరాట యోధురాలు బ్రిజిట్ బార్డోట్ డిసెంబర్ 28, 2025న 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

    కిమ్ సే-రాన్ (దక్షిణ కొరియా నటి): ప్రముఖ కొరియన్ నటి కిమ్ సే-రాన్ ఫిబ్రవరి 16, 2025న కేవలం 24 ఏళ్ల వయసులో మరణించడం ఆ దేశ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.

    బార్బీ హ్సు (తైవానీస్ నటి): 'మెటియోర్ గార్డెన్' సీరీస్ ద్వారా ఆసియావ్యాప్తంగా గుర్తింపు పొందిన బార్బీ హ్సు ఫిబ్రవరి 2, 2025న మరణించారు.

    వీరితోపాటు 2025 అనేక రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కోల్పోయాం.  ముఖ్యంగా సినీ రంగంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, గోవర్దన్‌ అస్రానీ, సతీష్ షా, పంకజ్ ధీర్, జుబీన్‌  గార్గ్‌ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ చకుర్కర్‌ ఈ ఏడాదిలోనే మరణించారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా, టి.టి.కె. ప్రెస్టీజ్ కిచెన్ మొగల్ టి.టి. జగన్నాథన్ 77 ఏళ్ళ వయసులో మరణించారు ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకుడు , రచయిత కొన్ని దశాబ్దాల పాటు తన జీవితాన్ని పులుల సంరక్షణకు అంకితం చేసిన  వాల్మిక్ థాపర్ క్యాన్సర్‌తో పోరాడుతూ 73 ఏళ్ళ వయసులో మే నెలలో  కన్నుమూశారు.

  • ఈ రోజు(డిసెంబర్‌ 31, బుధవారం)తో 2025 ముగియబోతోంది. దీంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో, సోషల్ మీడియా వేదికలలో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది. ప్రతి ఏటా జనవరి ఒకటిన శుభాకాంక్షలు చెప్పుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి నెటిజన్లు ఒక వినూత్నమైన ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. అదే ‘ఫైనల్ ఇమేజ్‌ ఆఫ్ 2025’ (2025 చివరి చిత్రం). పాత జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, ఈ ఏడాదిలో తాము దిగిన ఆఖరి ఫోటోను షేర్ చేస్తూ, నెటిజన్లు సందడి చేస్తున్నారు.

    ఈ వైరల్ ట్రెండ్ ప్రధానంగా ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర ప్లాట్‌ఫారమ్‌లలో విరివిగా కనిపిస్తోంది. యూజర్స్‌ తమ వ్యక్తిగత ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన చిత్రాలు లేదా ప్రకృతి దృశ్యాలను ‘My Final Image of 2025’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ ట్రెండ్‌లో భాగస్వాములవుతున్నారు. గడిచిన ఏడాదిలో తాము సాధించిన విజయాలను, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం.

    ఈ ట్రెండ్ కేవలం ఫోటోల షేరింగ్‌కే పరిమితం కాలేదు. ఇది నెటిజన్లలో ఒక రకమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతోంది. ఒక వైపు ఈ ఏడాది ముగిసిపోతున్నదనే బాధ, మరోవైపు కొత్త ఏడాదిపై ఉన్న ఆశలు.. ఈ పోస్ట్‌లలో ప్రతిబింబిస్తున్నాయి. లక్షలాది మంది ఈ ట్రెండ్‌ను అనుసరించడంతో సోషల్ మీడియా సర్వర్లు బిజీగా మారాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, భవిష్యత్తుపై సానుకూల దృక్పథాన్ని నింపడంలో ఈ చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్నే చూపుతోంది.

    ఇలాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో సరదాను నింపుతున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసేటప్పుడు లొకేషన్ వివరాలు లేదా సున్నితమైన సమాచారం బయటపడకుండా చూసుకోవడం ముఖ్యం.  ఏదిఏమైనప్పటికీ 2026 నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది.

    ఇది కూడా చదవండి: ఎయిర్‌వేస్‌లో జాత్యహంకారం? .. ప్రయాణికురాలి మండిపాటు

  • ఫరీదాబాద్‌/చండీగఢ్‌: భారతావనిలో మహిళలకు రక్షణలేదని చాటిన అత్యంత దారుణమైన ‘నిర్భయ’ఉదంతాన్ని 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్మరణకు తెస్తూ హరియాణాలోని ఫరీదాబాద్‌లో మృగాళ్లు యువతిని గ్యాంగ్‌రేప్‌ చేసి రోడ్డుపై పడేసి వెళ్లారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వ్యాన్‌ను పోనిస్తూ అందులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసపర్వం సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి మంగళవారం తెల్లవారుజాము మూడు, నాలుగింటిదాకా కొనసాగింది. 

    ఈ హేయమైన అత్యాచారం తర్వాత యువతిని వేగంగా వెళ్తున్న వ్యాను నుంచి రోడ్డు మీదకు విసిరేసి వెళ్లారు. దీంతో తల, ముఖం, భుజానికి తీవ్రమైన గాయాలై యువతి నడిరోడ్డుపై రక్తమోడింది. జీవచ్ఛవంలా పడి ఉన్నా బలాన్ని కూడదీసుకుని ఎలాగోలా తన సోదరికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో హుతాశురాలైన సోదరి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాద్‌షా ఖాన్‌ పౌర ఆస్పత్రిలో చేరి్పంచింది. పరిస్థితి విషమించడంతో వెంటనే అక్కడి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

    వేగంగా రోడ్డుపైపడటంతో తల, ముఖం, భుజం దెబ్బతిన్నాయి. ఇప్పటికే 12కుపైగా కుట్లు వేశారు. ముఖంలో ఎముకలు విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని సూచించారు. విషయం తెల్సుకున్న హరియాణా పోలీసులు రంగంలోకి దిగి ఇంతటి దారుణానికి పాల్పడిన మృగాళ్లను అరెస్ట్‌చేశారు. వీరిలో ఒకరికి ఉత్తరప్రదేశ్‌కాగా మరొకరిది మధ్య ప్రదేశ్‌. వీళ్లిద్దరూ ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారు.  

    లిఫ్ట్‌ అడిగితే... 
    బాధితురాలి సోదరి, ఫరీదాబాద్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతికేళ్ల బాధితురాలు వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా ఫరీదాబాద్‌లోని తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి 8.30 గంటలప్పుడు తల్లితో గొడవపడి సెక్టార్‌23 పరిధిలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి కాస్తంత ఆలస్యమయ్యాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు న్యూ ఇండ్రస్టియల్‌ టౌన్‌షిప్‌–2 వరకు ఆటోలో వచ్చింది. అక్కడి నడుచుకుంటూ మెట్రో చౌక్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ప్రజారవాణా బస్సులో ఇంటికెళ్లేందుకు రోడ్డు మీద ఎదురుచూసింది. అదే సమయంలో అటుగా వ్యానులో వచ్చిన ఇద్దరు నిందితులు తాము కూడా అదే కళ్యాణ్‌పురికి వెళ్తున్నామని నమ్మబలికారు. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి వ్యానులో ఎక్కించుకున్నారు. బాధితురాలిని గమ్యస్థానంలో దిగబెట్టకుండా వేరే మార్గంలో గురుగ్రామ్‌ సిటీ వైపు వ్యానును పోనిచ్చారు. 

    కదులుతున్న వ్యానులోనే ఇద్దరూ ఆమెను గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఆ వ్యాను రాజ్‌చౌక్‌ రోడ్డులో మంగళవారం రాత్రి 3 గంటలప్పుడు వెళ్తున్నప్పుడు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సీసీటీవీ వీడియోలో రికార్డయింది. రేప్‌ చేశాక ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ములా హోటల్‌ వద్ద రహదారిపై విసిరేసి వెళ్లారు. కాపాడండంటూ సాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా అర్ధరాత్రి రోడ్లు నిర్మానుష్యంగా ఉండటం, దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ఒక్కరూ స్పందించలేదని బాధితురాలు సోదరితో చెప్పినట్లు తెలుస్తోంది. 

    గాయాలపాలైన యువతి ఎలాగోలా తన సోదరికి ఫోన్‌ చేయడంతో ఆమె వచ్చి ఆస్పత్రిలో చేర్పించింది. సోదరి ఇచ్చిన ఫిర్యాదులో కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు వెంటనే నిందితుల కోసం వేట మొదలెట్టి ఇద్దరినీ బుధవారం మధ్యాహ్నం అరెస్ట్‌చేసి సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఇద్దరినీ జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలిచ్చారు. నేరాన్ని నిందితులిద్దరూ జడ్జి ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘‘ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించేదాకా నిందితుల వివరాలను వెల్లడించబోము.

     తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు ఆస్పత్రిలో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదు’’ అని ఫరీదాబాద్‌ పోలీస్‌ ప్రజాసంబంధాల అధికారి యశ్‌పాల్‌ యాదవ్‌ బుధవారం మీడియాతో చెప్పారు. దారుణోదంతంలో కీలకంగా మారిన వ్యానును మారుతి సుజుకీ ఎకోగా గుర్తించారు. దానిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ బృందాలు వ్యాను నుంచి బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. భారతీయ న్యాయ సంహితలోని 70(1) (యువతిపై గ్యాంగ్‌రేప్‌), 351(3) (నేరపూరిత లైంగికదాడి), 3(5) (మూకుమ్మడి దురుద్దేశం) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు.  

    ఇదీ చదవండి: అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి

Politics

  • న్యూఢిల్లీ:  ఎలక్షన్‌ కమిషన్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) మరోసారి ధ్వజమెత్తింది. కొత్త ఏర్పాటైన ‘సర్‌’తో  ఓటర్ల జాబితాలో తారుమారు జరుగుతుందంటూ మండిపడింది. ఈరోజు(బుధవారం, డిసెంబర్‌ 31) సీఈసీని టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ.. కలిసి పశ్చిమబెంగాల్‌ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించారు. అనంతరం సీఈసీతో చర్చించారు. 

    అయితే ఆపై బయటకొచ్చిన అభిషేక్‌ బెనర్జీ.. సీఈసీ టార్గెట్‌ తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్‌ కుమార్‌ను.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటుందని ఘాటు వ్యాఖ్యలుచేశారు. 

    దేశాన్ని విచ్చిన్నం శక్తిగా జ్ఞానేష్‌ కుమార్‌ను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. తమకు ఈవీఎంల ఓటింగ్‌తో ఎటువంటి సమస్యా లేదని, కానీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉందన్నారు. ‘ మా ప్రశ్నలకు దేనికి కూడా సీఈసీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 20 ప్రశ్నల వరకూ సీఈసీని అడిగాం. కానీ వాటిలో స్పష్టత లేదు.  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ను ఓటర్ల జాబితా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను ప్రజల ముందు బహిర్గతం చేయండి. కనీసం అది కుదరకపోతే.. దాన్ని లాజికల్‌గానైనా నిరూపించండి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదనేది మా అనుమానం’ అని విమర్శించారు. 

     

  • సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.

    ‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్‌కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్‌కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.

    ‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్‌ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం

    నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

    ..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్‌లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

  • సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్‌ నిలదీశారు.

    ‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి‌ ఇదే నిదర్శనం

    ..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

    అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్
  • సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద 144 సెక్షన్‌ విధించారు. జనవరి 5న వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించగా.. వైఎస్సార్‌ విగ్రహం చుట్టూ రెవెన్యూ అధికారులు ఇనుక కంచె వేశారు.

    ఎట్టిపరిస్థితుల్లోనూ వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తామన్న కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. విగ్రహం వద్ద పోలీసులు పహారా కొనసాగుతుంది.

    కాగా, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తణుకు ప్రాంతం రాష్ట్రంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తణుకు వై.జంక్షన్‌లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీ కట్టి టీడీపీ సానుభూతిపరులు చేసిన నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

    వైఎస్సార్‌ విగ్రహానికి చంద్రబాబు ఫ్లెక్సీ కట్టడంపై ప్రజలు దుమ్మెత్తి పోశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనకు దిగడం, తమ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆపై రెండు ఫ్లెక్సీలు పోలీసులు తొలగింపచేయడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

    తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

Family

  • కొద్దిసేపటిలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ తరుణంలో నగరాలు, పట్టణాలు  ఏ రేంజ్‌లో సందడిగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎటు చూసిన ఆధునిక హంగులతో, డీజే మోతలతో అదరహో అనిపించే రేంజ్‌లో దద్దరిల్లిపోతాయి. అయితే ఈ గ్రామంలోని న్యూ ఇయర్‌ వేడుకలు నాటి కాలంలోకి, మరుపురాని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిపోయేలా అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో దూసుకుపోతున్న  ఈ కాలంలో ఇలా న్యూ ఇయర్‌ వేడుకలు చేసుకోవడం అస్సలు చూసుండరు. ముఖ్యంగా పర్యాటకులను సైతం ఆకర్షించేలా న్యూ ఇయర్‌ వేడుకలుకు అత్యంత ముగ్ధమనోహరంగా సిద్ధమైంది ఆ గ్రామం.

    ఆ గ్రామమే మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా దేవ్‌గఢ్ గ్రామం ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మధ్యప్రదేశ్‌ పర్యాటక బోర్డు పర్యాటకుల్ని ఆకర్షించేలా ఇలా విన్నూతన మార్గంలో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అక్కడ మూడురోజులు పాటు న్యూ ఇయర్‌ వేడుకలు అత్యంత సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి

    ఆ మూడు రోజుల కార్యక్రమాల్లో గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా సంప్రదాయ భారతీయ ఆటలు, విందు వినోదాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నాటి అనుభవాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

    ఎలా జరుగుతాయంటే..
    సందర్శకులు గాలిపటం ఎగరవేయడం, స్కిప్పింగ్‌(తాడాట), కర్రబిళ్ల, పిట్టు, గోళీలు, లట్టు, ఎద్దుల బండి సవారీలు, వంటి నాటి జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చేలా సాంస్కృతిక కార్యకలాపాలతో అలరించనుంది. అక్కడ సుందరమైన పరిసరాల మధ్య ఈ ఏర్పాట్లు చేశారు పర్యాటక నిర్వాహకులు. ముఖ్యంగా నారింజ తోటలలో టీ ఆస్వాదిస్తూ..ఈ ఆటపాటల్లో ఆడిపాడి సందడి చేయొచ్చు. అయితే ఈ ఆటల్లో పాల్గొనడం, ఎంజాయ్‌ చేయడం అన్ని ఉచితమేనట. 

    ఇది కేవలం సందర్శకులకు గ్రామీణ జీవితాన్ని పరిచయం చేస్తూ..అందులో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఈ న్యూ ఇయర్‌ని వేడుకలను ఇలా అసాధారణమైన రీతిలో జరుపుతోంది అక్కడి ప్రభుత్వం. దీన్ని అక్కడి పర్యాటక బోర్డు, జిల్లా పురావస్తు పర్యాటక శాఖ,  జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సాంస్కృతిక ప్రదర్శనలు, స్థానిక క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2026ని స్వాగతించడానికి అసాధారణమైన సాంస్కృతిక  మార్గాన్ని ఎంచుకుని పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించనుంది.

    చరిత్రకు, ప్రకృతికి నెలవైన గ్రామం
    దేవ్‌గఢ్ ఒకప్పుడు 18వ శతాబ్దంలో గోండ్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పురాతన దేవాలయాలు, కోటలు, సుందరమైన బెత్వా నది ఉన్నాయ. ఇవి చారిత్రక సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. పర్యాటకులకు సాంప్రదాయ ఆతిథ్యంతో స్వాగతం పలుకుతూ..దీనిని ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విహార కేంద్రంగా మార్చే యోచనలో ఉండి అయక్కడ యంత్రాంగం.
     

    (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..)

     

  • భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్-ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ చిత్ర సంతే. ఈ ఫెస్టివల్ ఈ న్య ఇయర్‌లో జనవరి 4, 2026న  ఆదివారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో సుమారు 22 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా కళాకారులు పాల్గొంటారు. అంతేగాదు ఏడు లక్షలకు పైగా సందర్శకులు ఆకర్షిస్తారనేది అంచనా. ఈ ఏడాది ఈ ఫెస్టివల్‌ థీమ్‌ పర్యావరణంపై దృష్టి సారించడం. ఇంతకీ ఏంటి చిత్ర సంతే అంటే..

    చిత్ర సంతే అంటే 
    చిత్ర అంటే కన్నడలో పెయింటింగ్/డ్రాయింగ్, సంతే అంటే గ్రామ మార్కెట్‌. ప్రొఫెసనల్‌ కళాకారులు, విద్యార్థులు, అభిరుచి గలవారు తమ రచనలను ప్రదర్శించి, విక్రయించే వీధి కళా ఉత్సవం. ఈ రోజున బెంగళూరు వీధులు భారీ ఓపెన్‌ ఎయిర్‌ ఆర్ట్‌ గ్యాలరీగా మారిపోతుంది. దీన్ని బెంగళూరులోని ఒక ప్రముఖ కళా సంస్థ కర్ణాటక చిత్రకళా పరిషత్ (CKP) దీన్ని నిర్వహిస్తోంది. 

    (చదవండి: గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..)
     

  • ఈరోజుతో 2025కి గుడ్‌ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్‌ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్‌ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్‌లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్‌ 31 రాత్రి ఉండే సందడి, జోష్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్‌ వేరేలెవెల్‌. దీనికి మించి బ్యూటిఫుల్‌ స్పాట్‌ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్‌కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్‌ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.

    అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్‌ నేషనల్‌ పార్క్‌ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్‌ ప్లేష్‌. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్‌లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్‌ మరింత జోష్‌ఫుల్‌గా ఉంటుంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్‌ స్పాట్‌గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో సవాయి మాధోపూర్‌కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం. 

    ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్‌ స్టార్‌ రిసార్ట్‌లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా  తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్‌ వేడుకలు మరింత స్పెషల్‌ ప్రియాంక గాంధీ కుటుంబానికి.  

    ప్రత్యేకతలు..
    పెద్దపులులకు నిలయం ఈ పార్క్‌. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్‌ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్‌లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి. 

    అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్‌లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్‌ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్‌ కండిషనింగ్‌, వైఫై, వాలెట్‌ సేవలు, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్‌లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది.  కాగా న్యూఇయర్‌ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్‌ ఉద్యానవనంని రాహుల్‌ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.

    (చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..!)

     

  • 2025కు గుడ్‌బై పలికేశారా? కొత్త ఏడాదికి స్వాగతం అనేస్తున్నారా?. ఓకే.. గుడ్‌. 2026లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారా?.. అయితే ఈ ఈజీ టిప్స్‌ మీకోసమే. 2025లో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలివి! ఆలస్యమెందుకు?.. చదివేయండి.. 

    తెలివిగా తినండి.. గుండె ఆరోగ్యంతోపాటు మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు, నిద్ర, మూడ్‌ సమస్యలు అధిగమించేందుకు, రకరకాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం కొంచెం తెలివిగా తినాలని, తాగాలని 2025లో జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.  ఇంతకీ ఆ తినడం ఎలా ఉండాలంటే.. 

    ➡️వారంలో ఒకటి నుంచి ఆరు వరకూ కోడిగుడ్లు తినడం గుండెజబ్బులతో చచ్చిపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్న వారికీ కూడా ఇది వర్తిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగని అతిగా తినడం మంచిది కాదు.

    ➡️అధిక రక్తపోటు నుంచి తప్పించుకునేందుకు ఉప్పు తినడం తగ్గించడం కాకుండా.. ఆహారంలో మరింత పొటాషియం ఉండేలా చూసుకోవడం మేలు. అరటిపండ్లు, ఆప్రికాట్స్‌, చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది.

    పొటాషియం అధికంగా ఉండేవి.. 
    •     అరటిపండ్లు
    •     ఆప్రికాట్స్‌ (జారదాలు)
    •     చిలగడదుంపలు (Sweet potatoes)
    •     పాలకూర, గోంగూర, కూరగాయలు
    •     బీన్స్‌, పప్పులు
    •     కొబ్బరి నీరు
    •     కలబంద (Avocado)

    గమనిక.. కిడ్నీ సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకోవడం ప్రమాదకరం కావొచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకుని ఆహారంలో పొటాషియం బ్యాలెన్స్‌ తప్పకుండా చూసుకోవాలి

    ➡️రోజంతా కూర్చునే ఉంటున్నారా? అయితే మీ రక్తనాళాలను కాపాడుకోవాలంటే... కోకోలోని ఫ్లేవనాల్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇవి ‘సిట్టింగ్‌ డిసీజ్‌’తో వచ్చే సమస్యల తీవ్రతను తగ్గిస్తాయి. పరిశోధనల ప్రకారం.. 

    రోజుకు కోకో పౌడర్ లేదా డార్క్ చాక్లెట్ (70% పైగా కోకో ఉన్నది) తీసుకోవడం రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫ్లేవనాల్స్‌ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలిస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది, గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

    ఎలా తీసుకోవాలంటే.. 

    • డార్క్ చాక్లెట్ (చక్కెర తక్కువగా ఉండే)

    • కోకో పౌడర్ (unsweetened)

    • కాకా నిబ్స్

    • కోకో డ్రింక్స్ (చక్కెర లేకుండా)

    • అధిక చక్కెర, పాలు కలిపిన చాక్లెట్‌ తీసుకుంటే ప్రయోజనం తగ్గిపోతుంది.

    • మితంగా తీసుకోవాలి (రోజుకు 10–20 గ్రాముల డార్క్ చాక్లెట్ సరిపోతుంది).

    కొన్ని రకాల కొవ్వులు కేన్సర్‌ కణితులతో మన రోగ నిరోధక వ్యవస్థ పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అయితే మొక్కల ఆధారిత కొవ్వులు (plant-based fats) అలాంటి ప్రతికూల ప్రభావం చూపవు. 

    మంచి కొవ్వులు
    •     ఆలివ్ ఆయిల్
    •     కొబ్బరి నూనె
    •     పామ్ ఆయిల్ (మితంగా)
    •     అవకాడో, డ్రైఫ్రూట్స్

    👆 ఇవి ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీయవు. కొన్ని సందర్భాల్లో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం చూపుతాయి.

    ➡️మలబద్ధకాన్ని తొలగించేందుకు పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పండ్లు ఉపయోగపడతాయి. అయితే కీవీ పండ్లు ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ➡️ఆలివ్‌ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు, శాఖాహార ప్రధానమైన మెడిటరేనియన్‌ ఆహారం ఐబీఎస్‌ (ఇరిటెబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌) సమస్యను తగ్గిస్తుంది.

    ➡️అరటి పండు స్మూతీల్లో వాడే పదార్థాల్లోని మంచి పోషకాలు సరిగ్గా జీర్ణం కానివ్వదు. అరటిలో సహజంగా ఉన్న పోషకాలు, ఇతర పదార్థాల కలయిక వల్ల శరీరానికి పూర్తిగా అందకపోవచ్చు. కాబట్టి.. అరటితో పాలు / బాదం పాలు(ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి), పీనట్ బట్టర్ / బాదం బట్టర్ (ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తుంది), ఓట్స్ (ఫైబర్, శక్తినిస్తుంది), కాకా పొడి (unsweetened cocoa) యాంటీఆక్సిడెంట్లు, చియా సీడ్స్ / ఫ్లాక్స్ సీడ్స్ (ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు), బెర్రీలు (స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ) (విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు),  తేనె / ఖర్జూరం (సహజమైన తీపి) అందిస్తాయి. 

    అలాగే.. అరటితో కలపకూడనివి కొన్ని ఉన్నాయి. సిట్రస్ ఫలాలు (కమలపండు, మొసంబి, నిమ్మ) వీటివల్ల ఆమ్లత్వం(యాసిడిటీ) పెరిగి అరటిలోని పోషకాలు శోషణ తగ్గుతుంది. అధిక చక్కెర / ఐస్‌క్రీమ్ వల్ల ఫైబర్ దక్కకపోగా.. విటమిన్ ప్రయోజనం తగ్గిపోతుంది.
    ప్రాసెస్‌డ్ ప్రోటీన్ పౌడర్ల వల్ల కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చాక్లెట్ సిరప్ (అధిక చక్కెర) సహజంగానే పోషకాలను తగ్గిస్తుంది. కాఫీ / టీ పొడి చేరిస్తే.. ఐరన్, కాల్షియం శోషణకు ఆటంకం కలుగుతుంది. 

    ➡️చక్కెరల కంటే కృత్రిమ చక్కెరలతో కూడిన పానీయాలు మధుమేహం వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఆ రకమైన పానీయాలు తీసుకోకపోవడం మేలు.

    పునరుత్తేజానికి వ్యాయామం..
    సరైన నిద్ర + సరైన వ్యాయామం= ఆరోగ్యం. అయితే హై-ఇంపాక్ట్ వ్యాయామాలు (జంపింగ్, రన్నింగ్) కీళ్ల సమస్యలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి నడక, సైక్లింగ్‌, ఈత వంటివి మేలు. సుఖ నిద్రతో మన వ్యాయామ అలవాట్లు మెరుగవుతాయి. అయితే.. సాయంత్రాలు వ్యాయామం చేయడం అంత మంచిదేం కాదు. హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలగొచ్చు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే వ్యాయామం ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి.. నిద్రకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ సాయంత్రమే చేసే వీలుంటే గనుక.. తేలికపాటి వ్యాయాయాలు (నడక, యోగా, స్ట్రెచింగ్) చేసుకోవచ్చు. ఇవి నిద్రకు ఆటంకం కలిగించవు.

    మానసిక సంతోషానికి.. 
    జీవనశైలిలోని చిన్న చిన్న అలవాట్లు మన మానసిక ఆరోగ్యంపై, పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి.

    క్రియాటిన్‌ సాధారణంగా కండరాల శక్తి పెంపు కోసం ఉపయోగించే పోషక పదార్థం. కానీ, ఇది మెదడు శక్తి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్‌ (మనోవ్యాకులత) చికిత్సలో సహాయక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదెలాగంటే..  క్రియాటిన్‌ తీసుకోవడం వల్ల మెదడు కణాలు శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటాయి, ఫలితంగా మూడ్‌ స్థిరంగా ఉండేలా చేసి చికిత్సలో మెరుగైన ఫలితాన్ని చూపిస్తుంది. 

    తిట్టుకోవడం.. పనితీరు పెంపు
    తిట్టుకోవడం అనేది.. ప్రతికూలంగా భావించే అంశమే. కానీ..  శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే తీవ్ర ఒత్తిడి లేదంటే కష్టమైన పనిలో మనల్ని మనం కాస్త ఘాటు పదాలతో తిట్టుకోవడం వల్ల శరీరం ఎక్కువ శక్తి ఇస్తుంది. ఇది నొప్పి తట్టుకునే సామర్థ్యాన్ని పెంచి.. పనితీరు మెరుగుపరుస్తుంది. క్రీడల్లో, కఠినమైన వ్యాయామాల్లో ఇది సహజ రీతిలో కనిపించే అంశమే.

    ఉదయాన్నే కాఫీ.. మూడ్‌ మెరుగుదల
    కాఫీలోని కెఫిన్‌ మెదడులో డోపమైన్‌, సెరోటోనిన్‌ వంటి రసాయనాల స్థాయిని పెంచుతుంది. ఫలితంగా, రోజంతా ఉత్సాహం, ఏకాగ్రత, మూడ్‌ మెరుగుపడతాయి. ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పనితీరు పెరిగి, జీవనశైలి ఉల్లాసంగా ఉంటుంది. ఇది మేం చెబుతున్నమాట కాదు.. పరిశోధనల్లో తేలిన అంశమే.

  • పేదవాడిగా పుట్టడం తప్పు కాదు..అలానే చనిపోవడం మాత్రం ముమ్మాటికీ నీ తప్పే అన్న కవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఈ వ్యక్తిని చూస్తే. ఒకప్పుడు కడు దారుణమైన స్థితిలో ఉండేవాడు. తిండి కోసం అడుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇవాళ్ల ఏకంగా కోట్ల వ్యాపారాన్ని నడుపుతూ బిలియనీర్‌గా అవతరించాడు. ఇవాళ యువత ఏవేవో చిన్న కష్టాలకు, అనుకున్న డ్రీమ్‌ నెరవేరలేదనో జీవితాన్ని అంతం చేసుకుంటున్నవాళ్లకు ఇతడి కథ ఓ కనువిప్పు. కష్టాలు కలకాలం కాదు.. సత్తా ఉన్నవాడిని కష్టపెట్టలేవు అనేందుకు అతడొక ఉదాహరణ. అలాంటి అసామాన్యుడి సక్సెస్‌ జర్నీ ఎలా మొదలైంది వంటి వాటి గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!.

    జీవితం ఎవ్వరికీ గోల్డెన్‌ స్పూన్‌తో ప్రారంభం కాదు. కొందరికి ఖాళీ గిన్నెలతో, కన్నీళ్లతో ప్రారంభమవుతుంది. అగమ్య గోచరం లాంటి దుర్భర జీవితం నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ.. ఎదిగి.. బురద నుంచి పుట్టిన కలువ పువ్వుల్లా ప్రకాశవంతంగా వెలుగొందుతారు. ఇది కదా జీవితం అనిపించేలా ఉంటుంది వారి విజయ ప్రస్థానం. ఎక్కడి నుంచి వచ్చాం కాదు..ఎలా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నామ్‌ అన్నది ముఖ్యం అనే ఆర్యోక్తిలా ఉంటుంది వారి లైఫ్‌. 

    అందుకు నిదర్శనమే బెంగళూరుకి చెందిన రేణుకా ఆరాధ్య.  కర్ణాటకలో ఓ చిన్నగ్రామంలో కటిక పేదరికంలో జన్మించాడు. తండ్రి కుటుంబాన్ని పోషించలేక బియ్యం గింజలు కోస యాచన చేసే పూజారి. రేణుకా తరుచుగా తండ్రి తోపాటు బెంగళూరులో సందడిగా ఉండే ఎలక్ట్రానిక్‌ సిటీ గుండా బిక్షాటన చేస్తూ తిరిగేవాడు. ఆరోతరగతి తర్వాత తండ్రి ఒక ఇంటికి పనిమనిషి పనికి కుదిర్చాడు. పాఠశాలల ఫీజులు ఉపాధ్యాయులు చెల్లిస్తే..అతడు పనిమనిషిగాఇంటి పనులు చేసి..స్కూల్‌కి వచ్చి చదువుకునేవాడు. 

    ఆ తర్వాత ఒక చర్మవ్యాధితో బాధపడుతున్న వ్యక్తి సహాయకుడిగా కూడా పనిచేశాడు. ఇక అక్కడ నుంచి బాలుర హాస్టల్‌ జాయిన్‌ అయ్యాడు.అయితే అక్కడ ఆకలి అత్యంత ఘోరంగా ఉండేది. కడుపు నిండా భోజనం తినాలంటే..సంస్కృతం నేర్చుకుంటే కుదురుతుందని.. ఆ కోర్సులో జాయిన్‌ అయ్యాడు. అయితే పదిలో ఫెయిల్‌ అయ్యాడు. కానీ సంస్కృతంలో పాసవ్వడం విశేషం. ఇంతలో తండ్రి మరణం మొత్తం కుటుంబం బాధ్యతలు అతడిపై పడిపోయాయి. 

    చిన్నచితక ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ముఖ్యంగా ఫ్యాక్టరీలో, ప్లాస్టిక్ యూనిట్‌లో, ఐస్ ప్లాంట్‌లో స్వీపర్‌గా, మండుతున్న ఎండలో సూట్‌కేసులతో నిండిన హ్యాండ్‌కార్ట్‌లను నెట్టడం, సెక్యూరిటీ గార్డుగా ఇలా రకరకాల పనులు చేస్తూ పొట్ట పోషించుకునేవాడు. ఇదేమంత సరిపోదు ఇంకా బాగా సంపాదించాలి కానీ అదెలా అనేది అర్థంకాక రకరకాల ఉద్యోగాలు చేస్తూనే ఉండేవాడు. 

    అప్పుడే డ్రైవింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొంత డబ్బు అప్పుచేసి మరి డ్రైవింగ్‌ నేర్చుకున్నాడు. ఇంతలో అతడికి పెళ్లికూడా అయ్యింది. ఇప్పుడు మరిన్ని బాధ్యతలు అతడిపై పడ్డాయి. అయితే డ్రైవింగ్‌కే అప్పుచేయాల్సిన పరిస్థితి..ఇక లైసెన్స్‌ ఎలా అనే సమయంలో తన పెళ్లి ఉంగరాన్ని తాకట్టుపెట్టి పొందాడు. అలా కారు డ్రైవర్‌గా కొత్త ఉద్యోగంలో చేరాడు. అయితే తొలిరోజే కారుని ఢీ కొట్టాడు, దాంతో మళ్లీ ఇదివరకటిలా గార్డుగా పనిచేయమని సూచించడంతో అవమానంతో కుంగిపోయాడు. 

    అయితే తన యజమానిని బతిమాలుకుని ఒక్క అవకాశం అంటూ ప్రాథేయపడటంతో..ఈసారి రాత్రిపూట డ్రైవింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కొండలపై రాళ్లను అడ్డుపెట్టుకుంటూ..జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తూ నేర్చుకున్నాడు. అలా గోకర్ణకు సాగిన తొలి టూర్‌ ఒక విలువైన పాఠాన్ని నేర్పించింది. నెమ్మదిగా తక్కువ సయంలోనే మంచి డ్రైవర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కేవలం పర్యాటకులను మాత్రమే కాదు, అంబులెన్స్‌ మాదిరిగా 300 మృతదేహాలను కూడా తరలించేవాడు. 

    ఇలా రెండు రకాలుగా పని చేస్తూ..డబ్బులు గడించేవాడు. చివరకి విదేశీ పర్యాటకులను తీసుకువెళ్తు డాలర్లు టిప్‌లు అందుకునేవాడు. అలా పొదుపు చేసిన మొత్తంతో ఓ ట్రెవెల్‌ సంస్థను నడపాలన్నది తన ఆకాంక్ష. సరిగ్గా ఆటైంలోనే అమ్మకానికి సిద్ధంగా ఉన్న టాక్సీ వ్యాపారాన్ని రూ. 6.5 లక్షలకు కొనుగోలు చేశాడు. అందుకోసం తన సొంత కార్లను కూడా అమ్మక తప్పలేదు. దానికి 'ప్రవాసీ క్యాబ్స్‌' అని పేరు పెట్టాడు. ఈ వ్యాపారాన్ని రన్‌ చేయడానికి అప్పులు పొందాల్సి వచ్చేది, వాటికి అధిక రుణాలు చెల్లించాల్సి వచ్చినా..వెనక్కి తగ్గలేదు రేణుక. కేవలం తన సంస్థ టర్నోవర్‌పైనే ఫోకస్‌ పెట్టాడు. 

    అలా అమెజాన్‌, వాల్‌మార్ట్‌, జీఎం వంటి దిగ్గజాలకు తన క్లయింట్లను విస్తరించాడు. అంతేగాదు తన కార్లను వెయ్యికి పైగా పెంచాడు. పర్యాటకులను తీసుకువెళ్లడం వల్ల వార్తపత్రికలు చదువుతూ ఇంగ్లీష్‌ నేర్చుకున్నాడు. తన నెట్‌వర్కింగ​ ఈవెంట్లకు హాజరవ్వుతూ వ్యాపారంలో మెళ్లుకువలు నేర్చుకున్నాడు. అంతేగాదు అందివచ్చిన టెక్నాలజీని కూడా స్వీకరించాడు. 

    ప్రస్తుతం అతడి కంపెనీ మూడు నగరాల్లో విస్తరించింది. స్కూల్ బస్సులను నడుపుతూ.. అతడ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక్కడ రేణుకా ఆరాధ్య కథ గతం ఎప్పుడు మన భవిష్యత్తుని నిర్ణయించదు. దార్శినికత, కృషి, పట్టుదల, దృఢసంకల్పం, క్రమశిక్షణాయుతమైన జీవనం అసాధారణ విజయాలను సాధించేందుకు దారితీస్తుందనేందుకు రేణుకా ఆరాధ్యనే ఓ ఉదాహరణ.

    (చదవండి: అక్కడ కాఫీ షాప్‌కి వెళ్లాలంటే హెల్మెట్‌ ధరించాల్సిందే..! ఎందుకో తెలుసా?)

     

  • కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్‌ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు.  

    ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. 

    దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది.