Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • తెలుగు రాష్ట్రాల్లో గత వారం నుంచి థియేటర్లు పెద్దగా సందడిగా కనిపించడం లేదు. ఇటీవల విడుదలైన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌కు ఊపిరి పోయేలా రేపు (శుక్రవారం) ఒకేసారి దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా చిన్న చిత్రాలే ఉండటం విశేషం. పెద్దగా బజ్ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

    ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో కొంతమేరకు ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం మృత్యుంజయ. హీరో శ్రీ విష్ణు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గత వారం విష్ణు విన్యాసంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన, ఈ వీకెండ్ మృత్యుంజయతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉంటుందని, ఇందులో కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కంటే థ్రిల్లింగ్ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలిపారు.

    మరో చెప్పుకోదగ్గ సినిమా సరస్వతి. ఈ చిత్రాన్ని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్వయంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. అంతేకాదు, ఈ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రముఖ రచయిత బుర్రా సాయి మాదవ్‌ కథ అందించగా, తమన్‌ సంగీతాన్ని సమకూర్చారు. కథ బలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది.

    ఇవే కాకుండా సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని అనే చిత్రం కూడా ఈ వారం విడుదలవుతోంది. ఇందులో శివాజీ , లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కామెడీ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

    ఇవి కాకుండా కాన, మాన్షన్ హౌజ్ మల్లేష్, కాక్రోచ్, విధాత వంటి మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. మరోవైపు ప్రభాస్‌ నటించిన మున్నా సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నటి లావన్య త్రీపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి సినిమా మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మొత్తానికి పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ ఒకేసారి పది సినిమాలు విడుదలవుతుండటంతో ఈ వారం బాక్సాఫీస్‌లో కొంత కదలిక కనిపిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ప్రేక్షకులు ఈ సినిమాలను ఎలా స్వీకరిస్తారో చూడాలి. 

  • కోలీవుడ్‌ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్‌  బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. 

    ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్‌లోనే విజయ్‌ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. విజయ్‌ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్‌ అయింది. ఇప్పుడు విజయ్‌, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్‌ అవుతుంది.

  • దుబాయ్‌ సహా పశ్చిమాసియాలో చిక్కుకున్న బాలీవుడ్‌ నటీనటులు కావచ్చు ఇతర సెలబ్రిటీలు అందరూ ఇండియాకు వచ్చేదారులు ఎక్కడా అని వెదుక్కుంటుంటే...హాయిగా ఇండియాలో కూర్చుని సినిమాలు చేసుకుంటున్న ఓ బాలీవుడ్‌ నటి మాత్రం ఇక తాను ఇక్కడ ఉండలేనంటోంది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువైన ఇరాన్‌కే వెళ్లిపోతానంటోంది. ఇంతకీ ఎవరా నటి ఎందుకీ విరక్తి?

    ఆమె పేరు మందనా కరిమి, ఇరాన్‌కు చెందిన సినీ తార.  కొన్నేళ్ల క్రితమే ఫ్యాషన్‌ రన్ వేలపై అడుగులతో మన దేశంలో ప్రారంభమై అక్కడ నుంచి బాలీవుడ్‌ దాకా సాగింది.  భారత మోడలింగ్‌ రంగంలో స్థిరపడిన తర్వాత, ఆమె భాగ్‌ జానీ  క్యా కూల్‌ హై హమ్‌ 3 వంటి చిత్రాలలో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంది.  ఫ్యాషన్, ప్రకటనలు రియాలిటీ టెలివిజన్‌ ద్వారా కూడా ఇండియా ఆమెను ఆదరించింది. మరొవైపు ప్రస్తుత ఇరాన్‌–అమెరికా –ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల తర్వాత తన చుట్టూ పరిస్థితి మారిపోయింది అంటోందీమె.  ఇరాన్ లో జన్మించిన ఈ నటి ఇప్పటిదాకా తన చుట్టూ స్నేహితులుగా ఉన్నవారిలో వచ్చిన మార్పులు తనకు అంతుపట్డడం లేదని వాపోతోంది. 

    ఈ పరిస్థితుల్లో తనకు ఇండియాలో ఉండడం నచ్చడం లేదని, ఇక పెట్టేబేడా సర్ధుకుని ఇరాన్‌కి వెళ్లిపోవడమే శరణ్యం అనీ స్పష్టం చేస్తోంది. తనకు ఇండియా ఎంతో ఇచ్చింది. కానీ...వాయిస్‌ మాత్రం ఇవ్వలేదంటోంది. అదే విధంగా మరో  ఇరాన్‌ నటి ఎల్నాజ్‌ నొరౌజీ  ఇరాన్‌ నేత తాజా దాడుల్లో మృతి చెందిన అహ్మద్ ఖొమేని మృతి పట్ల భారత్‌లో కొందరు ముస్లింలు  చేపట్టిన నిరసన ప్రదర్శనలను ఆక్షేపిస్తోంది. మతం పేరుతో  ఖొమేని సాగించిన అరాచకాల గురించిన అవగాహన లేకపోవడమే దీనికి కారణం కావచ్చునని ఆమె అభిప్రాయపడుతోంది. ఈ నటి  దాదాపు దశాబ్దం క్రితం భారతదేశానికి వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌ సేక్రెడ్‌ గేమ్స్‌ ద్వారా వేగంగా పాప్యులారిటీ అందుకుంది. 

    వీరు కాకుండా భారత్‌లోని మరికొందరు ఇరానియన్‌ మూలాలున్న నటీనటులు ఎవరంటే...

    • ఇరానియన్‌ నటుడు సజ్జాద్‌ డెలాఫ్రూజ్‌ సల్మాన్‌ ఖాన్‌ సరసన టైగర్‌ జిందా హైలో శక్తివంతమైన పాత్ర ద్వారా  బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు.  తరువాత గూఢచర్య థ్రిల్లర్‌ స్పెషల్‌ ఆప్స్‌లో కనిపిస్తాడు.

    • బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం తన తల్లి, ఇరానియన్‌ జొరాస్ట్రియన్‌ ద్వారా ఇరానియన్‌ మూలాలను కలిగి ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

    • ఇడియట్స్‌  మున్నా భాయ్‌ ఎంబిబిఎస్‌ చిత్రాల్లోని పాత్రలతో పేరొందిన ప్రముఖ నటుడు బోమన్‌ ఇరానీ కూడా ముంబైలోని ఇరానియన్‌ జొరాస్ట్రియన్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి..

  • కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఆంటోనీ మేనల్లుడు అజయ్‌ ధీషన్ హీరోగా నటించిన చిత్రం 'బూకి'.. ఫిబ్రవరి 20న విడుదలైన  ఈ చిత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. గణేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని విజయ్‌ ఆంటోనీ సమర్పణలో శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ధనుషా హీరోయిన్‌గా నటించగా సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో మెప్పించారు.

    రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బూకి' (Bookie) చిత్రం.. మార్చి 13న జీ5 (Zee 5) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.   తమిళ్‌ వర్షన్‌లో అందుబాటులో ఉండనుందని ప్రకటించింది. అయితే, తెలుగు వర్షన్‌ కూడా అదేరోజున విడుదల కావచ్చని సమాచారం. ‘మార్గన్‌’ సినిమాతో నటుడిగా అజయ్‌ ధీషన్ మంచి గుర్తింపు తెచ్చకున్న విషయం తెలిసిందే.  జెన్‌జీ లవ్‌స్టోరీ అంటూ కొందరు ఈ మూవీని ప్రశంసించినా.. మరికొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని తెలిపారు. మరి ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.

  • సంగీత దర్శకుడిగా భారీ బడ్జెట్‌ సినిమాలతో బిజీగా ఉన్న సాయి అభ్యంకర్‌ తాజాగా ఒక ఆల్బయ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో డ్రాగన్‌ బ్యూటీ కయాదు లోహర్‌తో ఆయన స్టెప్పులు వేశాడు. తను క్రియేట్‌ చేసిన కొత్త ఆల్బమ్‌    'పావఝ మల్లి ' సాంగ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సాంగ్‌ను సాయి అభ్యంకర్‌, శ్రుతి హాసన్ ఆలపించారు.  ఈ సాంగ్‌ థీమ్‌ పెళ్లి వేడుక కాన్సెప్ట్‌తో భాగమై ఉంది.   తమిళ్‌ వర్షన్‌లో ఉన్న ఈ పాటకు సాయి అభ్యంకర్‌తో సాయి కూడా పోటీపడి డ్యాన్స్‌ చేశారు.

    గతంలో కచ్చి సేరా, ఆశ కూడా, చిత్తిర పుత్తిరి వంటి హిట్‌ ఆల్బమ్‌ సాంగ్‌లతోనే సంగీతం రంగంలో తనకంటూ ప్రత్యేకతను    సాయి అభ్యంకర్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, అట్లీ సినిమాతో పాటు  ధనుష్, సూర్య, కార్తీ, లారెన్స్‌‌ వంటి భారీ సినిమాలు సాయి అభ్యంకర్‌ చేతిలో ఉన్నాయి.
     

  • సౌత్‌ ఇండియా ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కార్మేని సెల్వం. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దర్శకుడు రామ్ చక్రి తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో  విడుదల కానుంది. ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు గౌతమ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో  గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించారు.  

    ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రానికి అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది.  దేశవ్యాప్తంగా పీవీఆర్ సంస్థ తమ విస్తరణను మరింత బలపరుచుకుంటున్న నేపథ్యంలో  ‘కార్మేని సెల్వం’ సినిమాను  భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో విడుదల కాబోయే టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని  పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    ఈ చిత్రం నిజాయితీతో జీవించే ఒక సాధారణ కార్ డ్రైవర్ సెల్వం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్ల మధ్య అతడు ఎలా ముందుకు సాగుతాడు అనే అంశాన్ని భావోద్వేగభరితంగా చూపించనున్నారు.  ఒక సాధారణ మనిషి మనసులోని మాటగా ప్రారంభమయ్యే ఈ కథ, నిజాయితీ మరియు జీవన పోరాటం మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యాన్ని ప్రతిబింబించే హై స్టేక్స్ డ్రామాగా మారుతుంది.

    ఈ చిత్రంపై దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ .. “కార్మేని సెల్వం’ ఒక సాధారణ మనిషి కథ. ఈ కథను తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ మా చిత్రానికి థియేట్రికల్ పార్ట్‌నర్‌గా ఉండటం వల్ల ఈ కథ మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతున్నాం’ అని తెలిపారు.

  • టాలీవుడ్‌ కొత్తజంట విజ‌య్ దేవ‌ర‌కొండ-ర‌ష్మికల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారనేది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన ఈ  జంట దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అతికొద్దిమంది సమక్షంలో పెళ్లి జరిగినప్పటికీ ఖర్చు భారీగానే అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జరిగిన వీరి వివాహం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగింది.

    ఉదయ్‌పూర్‌లోనే అత్యధికంగా వారిద్దరూ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విజయ్‌ సొంతూరులో సత్యనారాయణ వ్రతంతో పాటు గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు ఏర్పాట్లు.. సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు విందు, దేశవ్యాప్తంగా స్వీట్స్‌ పంపిణీ, పలు దేవాలయాల్లో అన్నదానం, చివరిగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో భారీగానే ఖర్చు అయినట్లు టాక్‌.

    విజయ్‌, రష్మికల పెళ్లి కోసం సుమారు రూ. 15 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దేశంలోనే ప్రముఖ  ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి పెళ్లి బాధ్యతను అప్పజెప్పారట. అయితే ఏ కార్యక్రమం ఎలా జరగాలనేది విజయ్‌ పక్కా ప్లాన్‌తో వారికి వివరించారట. అయితే, ఈ ఖర్చును కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి భరించారని తెలుస్తోంది. పెళ్లి కోసం సుమారు 3కేజీల బంగారం వారు కొనుగోలు చేసినట్లు టాక్‌ ఉంది. అయితే, వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేయనుంది. అందుకోసం వీరిద్దరికి ఆ ఓటీటీ సంస్థ సుమారు రూ. 60కోట్లు చెల్లించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రకంగా వారికి రూ. 45కోట్ల వరకు లాభం వచ్చినట్లు అవుతుంది. పెళ్లితో ఎవరికైనా ఖర్చు అవుతుంది. కానీ, ఈ జోడీ మాత్రం తమ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను పెంచుకుంది.
     

  • తమిళ హీరో రజనీకాంత్‌ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం  'లాల్‌ సలామ్‌'.. 2024 విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, తాజాగా హిందీ వర్షన్‌ ఓటీటీలోకి వచ్చేసింది.రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించారు.

    'లాల్‌ సలామ్‌' మూవీ సన్‌ నెక్ట్స్‌(Sun NXT)లో తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీ వర్షన్‌ జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో తాజాగా హిందీ వర్షన్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ, ఈ మూవీని చూడాలంటే అదనంగా రెంట్‌ చెల్లించాల్సి ఉందని పేర్కొనడం విశేషం. ఇప్పటికే ఒక ఓటీటీలో ఉచితంగా చూసే అవకాశం ఉన్న ఈ మూవీకి అదనంగా రెంట్‌ చెల్లించేలా షరతు పెట్టడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 

    కథేంటి..?
    'లాల్‌ సలామ్‌' కథ మొత్తం  1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది.  మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్‌ (విక్రాంత్‌)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్‌ - ఎంసీసీ టీమ్స్‌ మధ్య జరిగే క్రికెట్‌ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్‌ చేతిని నరికేస్తాడు గురు అలియాస్‌ గురునాథం (విష్ణు విశాల్‌).. దాడి చేసిన గురు కూడా  మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్‌ లివింగ్‌స్టోన్‌) కుమారుడు కావడం విశేషం. 

    హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్‌ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్‌  అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్‌లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్‌ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్‌ 6న సన్‌ నెక్ట్స్‌లో లాల్‌ సలామ్‌ చూడాల్సిందే.

  • లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్‌ జోడీ తమ వివాహాన్ని  కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన  విజయ్‌ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు.  మార్చి 1న దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు కొన్ని ఆలయాల్లో అన్నదానం చేసిన ఈ జంట చాలామంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచారు. ఆపై హైదరాబాద్‌లో తన ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చింది.

    వివాహానంతరం సతీమణి రష్మిక మందన్నతో స్వగ్రామానికి విజయ్‌ తిరిగొచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తుమ్మన్‌పేటకు చెందిన దేవరకొండ మాధవి, గోవర్ధన్‌రావుల మొదటి సంతానం విజయ్‌ దేవరకొండ అని తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అక్కడ ఆయన సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుని తమ గ్రామప్రజలకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

    సత్యనారాయణ వ్రతం తర్వాత విజయ్‌ తన గ్రాండ్‌ పేరంట్స్‌(నానమ్మ-తాతయ్య) సమాధుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను విజయ్‌కి మేనమామ, స్నేహితుడు, నిర్మాత యష్ రంగినేని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు.  "ప్రపంచం ఆడంబరాన్ని చూస్తుంది. నేను వినయాన్ని చూస్తున్నాను . ఎంత ఎత్తుకు ఎదిగినా సరే తన మూలాలను మరిచిపోలేదు. అతను సాధించిన విజయాల చప్పట్లకు అతీతంగా.. అతను గొప్ప విలువలతో పాతుకుపోయాడు. తల వంచి తన పూర్వీకుల ఆశీర్వాదం కోరుకోవడానికి మా గ్రామానికి తిరిగి వచ్చాడు." అని యష్‌ రంగినేని రాసుకొచ్చారు.

    యశ్ రంగినేని ఎవరో తెలుసా..
    యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.  బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

  • ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి పని చేశాడు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్‌. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో అటు కోన వెంకట్‌కు, ఇటు రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా వీరి కాంబినేషన్‌ రిపీట్‌ అయింది. వెంకీ, భగీరథ, షాక్‌, డాన్‌ శీను, బలుపు, పవర్‌ సినిమాల్లో కలిసి పని చేశారు. అయితే రవితేజ హీరో కాకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. 

    భోజనం చేస్తుండగా..
    ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న ఘోర అవమానాన్ని తాజాగా కోన వెంకట్‌ బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెట్‌లో కొన్నిసార్లు కొందరు దారుణంగా మాట్లాడతారు. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భోజనం చేస్తుండగా చూసిన ఓ నిర్మాత.. లంచ్‌ టైమ్‌లో అడ్డమైనవాళ్లందరూ వచ్చి తింటారు అని చీదరించుకున్నాడు. ఎవడొస్తే వాడికి భోజనం పెడతావా? నీది కాదు కదా సొమ్ము అని వడ్డించినవాడిని తిట్టాడు. 

    లెవల్‌ చూపించమన్నా..
    ఆ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేరు చెప్తే షాకైపోతారు.. ఆయన మరెవరో కాదు, రవితేజ! అలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. కష్టాలను దాటుకుని తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు అదే నిర్మాత రవితేజ డేట్స్‌ కోసం వెంటపడ్డాడు. నిన్ను అవమానించిన అతడికి నీ లెవలేంటో చూపించు, పొరపాటున కూడా డేట్స్‌ ఇవ్వకు అని నేను సలహా ఇచ్చాను.

    అదే అసలైన విజయం
    కానీ రవితేజ నా మాట వినలేదు. ఆ నిర్మాతకు డేట్స్‌ ఇచ్చి, అతడి బ్యానర్‌లోనే హిట్టు కొడితేనే నా దృష్టిలో అసలైన విజయం అన్నాడు. చెప్పినట్లుగానే అతడి బ్యానర్‌లో సినిమా చేసి విజయం సాధించాడు. రవితేజ స్థానంలో నేనుంటే మాత్రం సినిమా చేసేవాడిని కాదు అని కోన వెంకట్‌  చెప్పుకొచ్చాడు. అయితే ఆ నిర్మాత ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు.

    చదవండి: తనూజకు గోల్డ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దువ్వాడ మాధురి

  • తమిళనాడు ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. 'ది లెజెండ్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తాజాగా లీడర్‌ అనే మూవీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా లీడర్‌ తెలుగు టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా, పాయల్‌ రాజ్‌పూత్‌, ఐశ్వర్య వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
     

  • టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నాగచైతన్య కుర్చి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. తను హీరోగా నటిస్తున్ని కొత్త సినిమా 'వృషకర్మ' ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ మూవీ గ్లింప్స్‌ విడుదలలో భాగంగా ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడేందుకు వేదికపై కుర్చీలను తీసుకొచ్చారు. నాగచైతన్యకు కేటాయించిన కుర్చిలో కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోయింది. 

    దీంతో ఆయన వెనక్కిపడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్‌ అప్రమత్తం కావడమే కాకుండా ఆయనకు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని చూశారు. అంతలోనే చైతన్య కూడా ఎలాంటి గాయం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాగచైతన్య మరో కుర్చిలో కూర్చొని మీడియా చిట్‌చాట్‌ కొనసాగించారు. ఈవెంట్‌ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఆయన మళ్లీ తన పంధాలో సరదాగా నవ్వుతూ వేదికపై కనిపించారు. 

  • నాడు రాత్రిపూట మేడ మీద మన తాతలు, అవ్వలు చెప్పిన కథలు ఎంతో వినసొంపుగా ఉండేవి. అప్పట్లో విన్న ఆ కథల ముందు ఎంతటి సినిమాలైనా దిగదుడుపే. ఇప్పుటి తరానికి ఆ అదృష్టం లేదు. కాని నేటి దర్శకులు మాత్రం అప్పటి పెద్ద వారు చెప్పిన కథలలాగే తమ సినిమాలను తీర్చిదిద్ది ఇప్పటి తరం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవకు చెందినది ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతున్న హిలేరియస్ డ్రామా అయిన హాట్ స్పాట్ 2మచ్ సినిమా. 

    ఈ సినిమా తప్పనిసరిగా నేటి తరాన్ని ఉద్దేశించినది. అందుకే వారి పరిభాషలో అర్థవంతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. నిజానికి హాట్ స్పాట్ సిరీస్ లో వచ్చిన రెండో భాగమిది. కాని మొదటిదానికి ఈ భాగానికి అస్సలు సంబంధం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ హాట్ స్పాట్ 2మచ్ సినిమా మూడు కథల సమాహారం. అభిమానం, పరువుల తో పాటు ప్రేమవంటి మూడు ప్రధానమైన అంశాలతో కూడిన కథలతో మన ముందుకొచ్చిన సినిమానే ఈ హాట్ స్పాట్ 2మచ్.

    అంతులేని అభిమానం ఎంతటి దారుణానికి దారి తీస్తుందో ఆపై వ్యక్తిగత స్వేచ్ఛ కుటుంబ పరువుకు ఎంత భారమవుతుందో అలాగే చిగురించని స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఇబ్బంది పెడుతుందో కూడా దర్శకుడు ఎంతో అందంగా ఈ సినిమాలో మలిచాడు. ప్రతి కథ ముగిసే ముందు వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసి స్ఫూర్తినిస్తాయి. మరీ ముఖ్యంగా మూడో కథ ఎక్కువ కల్పితంలా అనిపించినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు మాత్రం మతి పోగొడుతుంది. 

    అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఈ సినిమా ఇప్పటి, రేపటి తరం తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమిది. అలా అని సినిమా మొత్తం సందేశాలతో ఉండదు. నేటి, నాటి తరానికి వినోదమనే మసాలతో పసందైన సందేశాన్ని రుచికరమైన విందు రూపంలో వడ్డించాడు దర్శకుడు. మరింకెందుకాలస్యం హ్యావ్ ది డెలీసియస్ ఫన్ ఫీస్ట్ ఫర్ ది వీకెండ్

Telangana

  • దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించారు. తెలంగాణలో ఉన్న జిష్ణు దేవ్ వర్మను  మహారాష్ట్రకు బదిలీ చేశారు.  ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను.. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.

    ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధును ఎంపిక చేయగా.. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నియమించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించగా.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా నియమితులయ్యారు.

  • సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్‌ మహానగరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల వేడి మొదలవ్వక ముందే కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. విద్యార్థులు ఇంకా ఎస్సెస్సీ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండగానే  ‘ఇంటర్‌’ సీటు రిజర్వు చేసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ముందస్తు రిజర్వేషన్‌.. భారీ ఫీజు డిస్కౌంట్‌’ అనే నినాదంతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. వీకెండ్‌  వస్తే చాలు ప్రధాన కార్పొరేట్‌ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, నేరుగా ఇళ్లను సందర్శించడం సర్వసాధారణమైంది.  

    తమ క్యాంపస్‌లలో ఉన్న వసతులను చూపిస్తూ  ఏసీ క్లాస్‌రూమ్‌లు, అత్యాధునిక ల్యాబ్‌ల పేరుతో భ్రమలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జేఈఈ, నీట్‌ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే ఇప్పుడే చేరాలని, లేదంటే సీట్లు దొరకవని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పదవ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు బేఖాతర్‌ చేస్తూ అడ్మిషన్ల కోసం అడ్డదారులకు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.

    ప్రత్యేక బ్యాచ్‌ల ఆకర్షణ 
    సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైంది. ముందస్తుగా సీటు బుక్‌ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారు. పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసిన్‌ ర్యాంకుల హామీలు, క్యాంపస్‌లో  చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్‌ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

    ప్రీ–రిజిస్ట్రేషన్‌ మాయాజాలం 
    పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే  సీటు గ్యారెంటీ అంటూ తల్లిదండ్రుల నుండి ప్రీ–రిజిస్ట్రేషన్‌ అడ్మిషన్‌న్‌టోకెన్‌ పేరిట కొంత వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వస్తే ‘సీటు దొరకదు‘ అని చెప్పి తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఒకసారి ఈ సొమ్ము చెల్లిస్తే, ఒకవేళ విద్యార్థికి వేరే కాలేజీలో సీటు వచ్చినా, ఆలోచన మార్చుకున్నా ఈ డబ్బు తిరిగి రాదు. ఇది కార్పొరేట్‌ విద్యా సంస్ధల మార్కెటింగ్‌ గిమ్మిక్కుల్లో ప్రధానమైనది.

    చ‌ద‌వండి: 'మ‌మ్మ‌ల్ని పంపించండి మ‌హాప్ర‌భో'

    ఫీజుల మోత 
    మహా నగరంలోని హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కార్పొరేట్‌ విద్యా సంస్థలు క్యాంపస్‌లు బట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. మాదాపూర్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, శివారులోని డిమాండ్‌ ఉన్న ఏరియాల్లో కోర్సు ఆధారంగా ఫీజులు మారుతుంటాయి. కార్పొరేట్‌ సంస్థలు అందించే సౌకర్యాలను బట్టి ఫీజులను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు:  

  • హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం మళ్లీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది.   ఈ అనర్హత కేసు విచారణలో భాగంగా దానం నాగేందర్‌పై విచారణ పూర్తి కాలేదు. దానం నాగేందర్‌పై విచారణను శనివారానికి వాయిదా వేశారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. మరొకవైపు కడియం శ్రీహరి విచారణ పూర్తి చేశారు స్పీకర్‌. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు సూచించారు స్పీకర్. దానంపై దాఖలైన రెండు పిటిషన్లను  శనివారం విచారించనున్నారు. 

    గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది.  ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్‌ను ఆదేశించింది.  ఈ క్రమంలోనే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌..   ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను తేల్చేపనిలో పడ్డారు. 

  • హైదరాబాద్‌: మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ (AINU) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘సెంటర్ ఫర్ ఫంక్షనల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పూర్తిగా మహిళా వైద్య సిబ్బందితో నిర్వహించే ‘ఆల్-వుమెన్ ఆపరేషన్ థియేటర్ (ఓటీ)’*ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో​ ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శిఖా గోయల్‌ పాల్గొన్నారు.

    మహిళల్లో మూత్ర అసంయమనం, పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, పునరావృత మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, సామాజిక సంకోచం, అవగాహన లోపం కారణంగా చాలామంది చికిత్సకు ముందుకు రావడం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమస్యలకు సమగ్ర నిర్ధారణ, ఆధునిక చికిత్సలు ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

    ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.

    గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూ మహిళా యూరాలజీ బృందం 307 ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. మూత్ర లీకేజ్, యూరినరీ ఫిస్టులాలు, సిస్టోసీల్స్, ఫీమేల్ యూరేథ్రోప్లాస్టీ వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స అందించిన అనుభవంతోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

    సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సారికా పాండ్య మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని తెలిపారు. కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేకా మాట్లాడుతూ, మహిళలు సంకోచం లేకుండా వైద్య సేవలు పొందేలా పూర్తి మహిళా సిబ్బందితో ఈ ఓటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతుల నుంచి వృద్ధుల వరకు మహిళల యూరాలజీ సమస్యలకు రోగి-కేంద్రీకృత, సమగ్ర వైద్య సేవలు అందించడం ఈ కేంద్ర లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

  • రంజాన్‌ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు.. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం, ఆధునికత కలిసే ఒక ప్రత్యేక జీవనశైలి. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరంలో ఉన్న ఫుడ్‌ లవర్స్‌ రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఇఫ్తార్‌ టేబుల్స్‌ కొత్త ట్రెండ్స్‌తో మెరుస్తాయి. అయితే ఈ ఇఫ్తార్‌లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఖర్జూరాలది మాత్రం ప్రత్యేక స్థానం. కేవలం రంజాన్‌ మాసం కోసం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన ఖర్జూరాలను నగరానికి దిగుమతి చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నగరంలో మరిన్ని వెరైటీల ఖర్జూరాలు సందడి చేస్తున్నాయి. వీటికి తోడు ట్రెడిషనల్‌ ఇఫ్తార్‌కు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చే పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే ఈ ఏడాది రంజాన్‌ మాసం ఒకహెల్తీ లైఫ్‌ స్టైల్‌ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తోంది.  – సాక్షి, సిటీబ్యూరో

    రంజాన్‌ (Ramadan) మాసంలో ప్రతిరోజూ ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తొలి ముద్దగా తినడం తెలిసిందే.. ఈ ఖర్జూరాల్లో అంతర్జాతీయ ఆహార ప్రయాణం దాగుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనంగా పండించిన ఫలాల్లో ఒకటైన ఖర్జూరం.. ఇప్పుడు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లగ్జరీ గిఫ్ట్, న్యూట్రిషనల్‌ పవర్‌హౌస్‌ కూడా. విభిన్న దేశాల నుంచి వచ్చే ఈ ఖర్జూరాలకు ప్రత్యేక ఆదరణ, దానికి తగ్గట్టుగానే రేట్లు సైతం ఉంటున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా పండించే భారతీయ ఖర్జూరం(ఖజూర్‌) నగరంలో సులభంగా లభ్యమవుతుంది. ఈ ఖర్జూరం ఫోనిక్స్‌ సిల్వెస్ట్రీస్‌ జాతికి చెందింది. దేశంలో రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో దొరికే ఈ ఖర్జూరం గట్టిగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఈ రకం. ఫ్రెష్‌గా లేదా సన్‌–డ్రైడ్‌గా వీటిని వినియోగిస్తారు.  

    సిటీలో ‘కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌’ (King of Dates).. అధునాతన జీవనశైలికి కేంద్రమైన హైదరాబాద్‌లో ఏ దేశాలకు చెందిన ఉత్పత్తులైనా సులభంగా నగరానికి చేరుకుంటాయి. ఇదే క్రమంలో ‘కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌’గా పిలుచుకునే మొరాకో నుంచి వచ్చే మెడ్జూల్‌  ఖర్జూరం (Medjool dates )  పెద్ద పరిమాణంలో, అంబర్‌ బ్రౌన్‌ కలర్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. కారమెల్, టాఫీ, హనీ నోట్స్‌తో నిండిన ఈ రకం గిఫ్టింగ్‌కు హాట్‌ ఫేవరెట్‌. సిటీలో ప్రీమియం డ్రైఫ్రూట్‌ స్టోర్లలో దీని డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. హనీ టచ్‌తో సాఫ్ట్‌ డిలైట్‌గా ఉంటే. సౌదీ అరేబియాలో పండే సుక్కరి ఖర్జూరం కూడా నగరంలోని ముస్లింలు అమితంగా ఇష్టపడతారు. ఇవి మృదువుగా, తక్కువ ఫైబర్, 
    సహజమైన తేనె రుచితో ఉంటాయి. రంజాన్‌ గిఫ్ట్‌ హ్యాంపర్లలో ఇది తప్పనిసరి ఐటమ్‌.  

    ఈ రకం తాజాగా ఉన్నప్పుడు గోల్డెన్‌ యెల్లో, పండినప్పుడు అంబర్‌ బ్రౌన్‌గా మారుతుంది. సహజ చక్కెర ఎక్కువగా ఉండటంతో ఎనర్జీ బూస్టర్‌గా వీటిని పరిగణిస్తారు. అల్జీరియా, ట్యునీషియా ప్రాంతాల నుంచి వచ్చే డెగ్లట్‌ నూర్‌ రకాన్ని ‘క్వీన్‌ ఆఫ్‌ డేట్స్‌’గా పిలుస్తారు. ఈ రకం పాక్షికంగా ఎండిపోయి, నట్టి స్వీట్‌నెస్‌తో ఉంటుంది. బేకింగ్, కుకింగ్‌కు ఇవి అద్భుతంగా సరిపోతాయి. రంజాన్‌ డెజర్ట్స్‌లో ఇది ఫేవరెట్‌. ఇరాన్‌ నుంచి వచ్చే మజాఫతి ఖర్జూరం డార్క్‌ బ్రౌన్‌ నుంచి నలుపు రంగులో ఉంటుంది. సాఫ్ట్, జ్యూసీ టెక్స్చర్‌తో మోలాసిస్‌ లాంటి రుచి దీని ప్రత్యేకత. సౌదీ అరేబియా మదీనాలో మాత్రమే దొరికే అజ్వా రకానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఖర్జూరం మతపరమైన, సాంస్కృతిక విలువలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది.

  • హైదరాబాద్‌:  నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత  పడ్దారు. 

    ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌..  సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో  ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

    .టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్‌కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్‌ పేట్‌ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్‌ని సీజ్‌  చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు.

     

    హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
  • నాగర్‌కర్నూల్‌ క్రైం: మైనర్‌ను శారీరకంగా వాడుకుని ప్రసవానికి కారణమైన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్‌ తెలిపారు. ఈనెల 2న జిల్లాకేంద్రంలోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లోని బాత్‌రూంలో మైనర్‌ బాలిక ప్రసవమైన సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన ఓ మైనర్‌ సమీప బందువు ప్రేమపేరిట మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతో గర్భం దాల్చింది. 

    సదరు వేసవి సెలవుల అనంతరం కేజీబీవీ హాస్టల్‌కు వెళ్లి అక్కడే ఉంటుంది. గర్భిణీ అనే విషయం దాచిపెట్టి కళాశాల అధ్యాపకులు, సిబ్బందికి కాలు ఫ్యాక్చర్‌ అయిందని, హాస్టల్‌ భోజనంతోనే లావు అవుతున్నానని సమాధాం చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన బాలికకు కడుపు నొప్పి రావడంతో స్కానింగ్‌ కోసం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌కు రావడంతో అక్కడే ప్రసవం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లి తల్లి, మగ శిశువును జనరల్‌ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. 

    తొలుత ఓ మైనర్‌ బాలుడిని తీసుకొచ్చి విచారణ జరపగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు. దీంతో బాలికను మరోసారి పోలీసులు గట్టిగా నిలదీసి.. వివరాలు సేకరించారు. తన ఇంటి సమీపంలో ఉన్న బంధువు గంగరాజు కారణమని బాలిక చెప్పడంతో... అతని గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికను శారీరకంగా లోబర్చుకోవడం వల్లే తల్లి అయిందని విచారణలో తేలడంతో నిందితుడి గంగరాజుపై పోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా.. నిందితుడికి ఇది వరకే పెళ్లి అయి.. ఇద్దరు పిల్లలున్నారు.   

Sports

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.

    253 పరుగులు
    ముంబైలోని వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి ధనాధన్‌ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ అదరగొట్టాడు.

    వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.

    ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (7)​ వికెట్లు కోల్పోయింది.

    పట్టువదలని విక్రమార్కుడిలా
    ఇక టామ్‌ బాంటన్‌ (17) కాసేపు నిలబడగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్‌ బెతెల్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌) రికార్డు సమం చేశాడు.

    నరాలు తెగే ఉత్కంఠ
    అదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో  బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయ సమీకరణం  39 పరుగులుగా మారింది.

    అయితే, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్‌ బాది బెతెల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్‌ కర్రాన్‌ (18)ను అవుట్‌ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్‌ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.

    ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో
    తన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని శివం దూబేకు ఇచ్చాడు.   అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్‌ (105) రనౌట్‌ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ 22 పరుగులకే పరిమితమైంది. 

    ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.  ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్‌ సేన తలపడుతుంది.

    స్కోర్లు: 
    భారత్ - 253/7(20)
    ఇంగ్లండ్ - 246/7(20)
    ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు.
     

  • టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

    జింబాబ్వేపై 256 పరుగులు
    భారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.

    పొట్టి క్రికెట్లో తొలి జట్టుగా
    ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.

    ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్‌ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.

    పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు
    👉టీమిండియా- ఆరు సార్లు
    👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఐదు సార్లు
    👉వెస్టిండీస్‌- మూడు సార్లు
    👉జింబాబ్వే- మూడు సార్లు
    👉సర్రే- మూడు సార్లు.

    చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్‌ పదవికి అలీం దర్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.

    సెమీ ఫైనల్‌ చేరకుండానే
    గ్రూప్‌ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్‌ ఆఘా బృందం.. సూపర్‌-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్‌ ఆజం (Babar Azam), షాబాద్‌ ఖాన్‌, షాహిన్‌ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

    అలీం దర్‌ రాజీనామా
    ఈ క్రమంలో సెలక్టర్‌, మాజీ అంపైర్‌ అలీం దర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌ల దృష్ట్యా హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ (Mike Hesson), మరో సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ బాబర్‌, షాదాబ్‌లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.

    అంతేకాదు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్‌ తన పదవికి రాజీనామా చేశాడు.

    సెలక్టర్లు మాజీ కెప్టెన్లు 
    ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్‌ హక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు మెన్స్‌ సెలక్షన్‌ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్‌ జావేద్‌, అసద్‌ షఫీక్‌లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. 

    కాగా అలీం దర్‌ గతేడాది అక్టోబరులో పాక్‌ పురుషుల జట్టు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ అతి జోక్యం, ఆకిబ్‌ జావేద్‌ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్‌ వెల్లడించింది.

    గతంలో ఇలా..
    ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ గతంలో పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టు పాక్‌ షాహీన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్‌ హక్‌ గతంలో పాక్‌ జట్టు హెడ్‌కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలే నిర్వర్తించాడు. 

    అంతేకాదు.. పీసీబీ క్రికెట్‌ టెక్నికల్‌ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్‌గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్‌, షాదాబ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. 
    చదవండి: T20 WC 2026: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.

    మరోసారి సెంచరీ మిస్‌
    అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.

    అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.

    అనంతరం సూపర్‌-8 జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్‌ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ ‍క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.

    8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి
    తాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్‌ జాక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

    ఇక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌  ఇషాన్‌ కిషన్‌ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.

    చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌
    టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

    టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు
    👉సంజూ శాంసన్‌- 16 సిక్స్‌లు- 2026లో
    👉రోహిత్‌ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో
    👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో
    👉ఇషాన్‌ కిషన్‌- 14 సిక్స్‌లు- 2026లో
    👉హార్దిక్‌ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో
    👉యువరాజ్‌ సింగ్‌- 12 సిక్స్‌లు- 2007లో.

    చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

  • టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్‌ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభం నుంచి అభిషేక్‌ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్‌-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్‌ చేరిన అభిషేక్‌.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.

    పాత కథే పునరావృతం
    అయితే, సూపర్‌-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్‌ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.

    తొమ్మిది పరుగులే చేసి
    ముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్‌ జాక్స్‌ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్‌ వేశాడు. 

    ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్‌.. బంతిని గాల్లోకి లేపగా డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. మరోసారి ఆఫ్‌ స్పిన్నర్‌ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. 

    ఇప్పటి వరకు అభిషేక్‌ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి   చేస్తున్నారు.

    చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

  • టి20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వెస్టిండీస్ జ‌ట్టు త‌మ చివ‌రి మ్యాచ్ మార్చి 1న ఆడింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న విండీస్ టీమ్‌ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌లో టీమిండియాతో త‌ల‌ప‌డి ఓట‌మి పాల‌యింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో త‌మ పోరాటం ముగియ‌డంతో స్వ‌దేశానికి ప‌య‌నం కావాల్సిన విండీస్ జ‌ట్టు అనూహ్యంగా ఇండియాలో చిక్కుబ‌డి పోయింది. ఐదు రోజుల నుంచి కోల్‌క‌తాలోనే ప‌డిగాపులు కాస్తోంది. ఈ నేప‌థ్యంలో వెస్టిండీస్ క్రికెట్ ప్ర‌ధాన కోచ్ డారెన్ సామీ త‌న బాధ‌ను ఎక్స్ వేదికగా వ్య‌క్తీక‌రించాడు.

    త‌మ‌ను ఎప్పుడు స్వ‌దేశానికి పంపిస్తారో చెప్పాల‌ని డారెన్ సామీ (Daren Sammy) వేడుకున్నాడు. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఈరోజా, వచ్చే వారమా అనేదానైనా చెప్పాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. ఇప్ప‌టికే 5 రోజులు గ‌డిచిపోయింద‌ని వాపోయాడు. కాగా, త‌మ జ‌ట్టు స‌భ్యులు భార‌త దేశంలో సుర‌క్షితంగా ఉన్నార‌ని క్రికెట్ వెస్టిండీస్ (CWI) అధికారిక ప్రకటనలో వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ గగనతల నియంత్ర‌ణ‌ల కార‌ణంగా త‌మ జ‌ట్టు స్వ‌దేశానికి రాలేక‌పోయింద‌ని తెలిపింది. ఇండియాలో త‌మ టీమ్‌కు త‌గిన వ‌స‌తి క‌ల్పించార‌ని పేర్కొంది.

    ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ‌వాతావ‌ర‌ణం కార‌ణంగా గ‌గ‌న‌త‌లంలో ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో గ‌ల్ప్ దేశాల‌తో స‌హా పలు మార్గాల్లో అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. ఫ‌లితంగా విమాన ప్ర‌యాణాల‌పై అనిశ్చితి కొన‌సాగుతోంది. జింబాబ్వే క్రికెట్ జ‌ట్టు కూడా ఇదే ర‌క‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

    జ‌ట్టు కొంచెం ఆల‌స్యంగా స్వ‌దేశానికి వ‌చ్చినా ఫ‌ర్వాలేద‌ని, క్రికెటర్ల భ‌ద్ర‌త‌కే తాము ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని క్రికెట్ వెస్టిండీస్ స్ప‌ష్టం చేసింది. ఆట‌గాళ్ల‌ను సుర‌క్షితంగా తీసుకొచ్చేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో సమ‌న్వ‌యం చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది. తొంద‌ర‌లోనే వారికి స్వ‌దేశానికి తీసుకొస్తామ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది.

    చ‌ద‌వండి: 'థ్యాంక్స్ సంజు సామ్స‌న్‌.. ఇదీ రియ‌ల్ కేర‌ళ స్టోరీ'

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.

    భారత్‌ భారీ స్కోరు
    నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253  పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ భారీ హాఫ్‌ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.


    UPDATES: 

    ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు
    లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.

    ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
    దూబే బౌలింగ్‌లో బెతల్‌ రన్‌ ఔట్‌ (105) అయ్యాడు.

    పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు:  209-5
    15 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 185-5
    కర్రాన్‌ 5, బెతెల్‌ 81 పరుగులతో ఉ‍న్నారు.

    13.6: ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
    అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.
    పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 160-4
    విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్‌ 65, విల్‌ జాక్స్‌ 35 పరుగులతో ఉన్నారు.
    పది ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు:  119-4

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
    7.3: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో టామ్‌ బాంటన్‌ (5 బంతుల్లో 17) బౌల్డ్‌. క్రీజులోకి విల్‌ జాక్స్‌. స్కోరు: 95-4(7.3).బెతెల్‌ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.

    మూడో వికెట్‌ డౌన్‌
    5.5: వరుణ్‌ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్‌ (25)ను బౌల్డ్‌ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్‌ 26 పరుగులతో ఉన్నాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
    4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జేకబ్‌ బెతెల్‌ క్రీజులోకి రాగా.. బట్లర్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).

    తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
    1.1: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. క్రీజులోకి బ్రూక్‌. బట్లర్‌ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)

    భారత్‌ స్కోరు: 253-7
    ఏడో వికెట్‌ డౌన్‌
    19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్‌ (12 బంతుల్లో 27). వరుణ్‌ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్‌ పటేల్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.
    ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    18.5: తిలక్‌ వర్మ రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌. ఆర్చర్‌ బౌలింగ్‌లో తిలక్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 21). అక్షర్‌ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)

    ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    17.3: సామ్‌ కర్రాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్‌ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్‌. తిలక్‌ వర్మ క్రీజులోకి వచ్చాడు.

    నాలుగో వికెట్‌ డౌన్‌
    15.4: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్టంపౌట్‌. స్కోరు: 190-4 (16). హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.

    15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3
    సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.

    సంజూ శాంసన్‌ అవుట్‌
    13.1: సంజూ శాంసన్‌ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. 

    విల్‌ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)

    రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
    9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్‌ కిషన్‌.. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో విల్‌ జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 

    8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా

    సంజూ హాఫ్‌ సెంచరీ
    వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ హాఫ్‌ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.

    పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)
    సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

    తొలి వికెట్‌ డౌన్‌
    1.6: విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (7 బంతుల్లో 9) అవుట్‌. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)

    సైలెంట్‌ చేసేస్తాం
    టాస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాము.

    ఒక మార్పుతో బరిలోకి
    టీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఓవర్టన్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

    అదే జట్టు..
    ఇక టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్‌. బిగ్‌ గేమ్‌. మేము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్‌ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

    భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లు
    భారత్‌
    అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

    ఇంగ్లండ్‌
    ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

    చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

  • అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్‌ ఖాన్‌ స్థానంలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి ఏసీబీ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి ఇబ్రహీం జద్రాన్‌ అఫ్గన్ టీ20 జట్టు సారథిగా (T20I New Captain) వ్యవహరిస్తాడని తెలిపింది. ఈ సందర్భంగా రషీద్‌ ఖాన్‌ (Rashid Khan) కెప్టెన్సీలో జట్టు సాధించిన చిరస్మరణీయ విజయాన్ని ఏసీబీ ప్రస్తావించింది.

    గుర్తుండిపోయే విజయాలు
    ‘‘అఫ్గనిస్తాన్‌ టీ20 జట్టు కెప్టెన్‌గా రషీద్‌ ఖాన్‌ పదవీ కాలంలో జట్టు గుర్తుండిపోయే విజయాలు సాధించింది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఏకంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఏసీబీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యంలో మార్పులు తీసుకువచ్చింది.

    కొత్త హెడ్‌కోచ్‌ వచ్చారు. అదే విధంగా కెప్టెన్‌ను కూడా మార్చాలని నిర్ణయించుకున్నాం. రషీద్‌ ఖాన్‌ డిప్యూటీగా పనిచేసిన ఇబ్రహీం జద్రాన్‌కు పగ్గాలు అప్పగించాము. 

    రషీద్‌ ఖాన్‌ సేవలను మేము ప్రశంసిస్తున్నాం. అలాగే ఇబ్రహీం జద్రాన్‌ తన కొత్త,అతి ముఖ్యమైన పాత్రలో రాణించాలని కోరుకుంటున్నాం’’ అంటూ అఫ్గనిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ అహ్మద్‌ షా సలీమనిఖిల్‌ ప్రకటన విడుదల చేశాడు.

    కాగా మార్చి 13, 15, 17 తేదీల్లో అఫ్గనిస్తాన్‌- శ్రీలంక మధ్య షార్జాలో మూడు టీ20లు, దుబాయ్‌లో మార్చి 20, 22, 25 మూడు వన్డేలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు సంబంధించి జట్లను ఏసీబీ తాజాగా ప్రకటించింది.

    టీ20 ప్రపంచకప్‌-2026లో అఫ్గనిస్తాన్‌ వైఫల్యం
    గత ఎడిషన్‌ ప్రభావంతో ఓ మోస్తరు అంచనాలతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌ ఈసారి నిరాశపరిచింది. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, యూఏఈ, కెనడా జట్లతో పోటీపడిన అఫ్గన్‌ జట్టు.. నాలుగింట కేవలం రెండు విజయాలే సాధించింది. ఫలితంగా సూపర్‌-8కు చేరకుండానే నిష్క్రమించింది.

    ఈ క్రమంలో జొనాథన్‌ ట్రాట్‌ హెడ్‌కోచ్‌గా తప్పుకోగా..  స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌గా రిచర్డ్‌ పైబస్‌ను నియమించింది ఏసీబీ. శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడు.‌

    శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు
    ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), నూర్ రెహమాన్ (వికెట్‌ కీపర్‌), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, అబ్దుల్లా అహ్మద్‌జాయ్‌

    శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అఫ్గన్‌ జట్టు
    హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మత్ షా (వైస్‌ కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), ఇక్రామ్ అలీఖిల్ (వికెట్‌ కీపర్‌), ఇబ్రహీం జద్రాన్, సెదీఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటీ, జియా ఉర్‌ రహ్మాన్‌ షరీఫీ, ఫరీద్‌ అహ్మద్‌, బిలాల్‌ సమీ. 

  • జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

    ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి
    భారత్‌- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌-8 చేరింది. అయితే, కీలక దశలో  వెస్టిండీస్‌, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.

    యుద్ధం కారణంగా
    ఈ నేపథ్యంలో మార్చి 2న భారత్‌ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్‌- ఇజ్రాయెల్‌, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్‌ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

    ఈ క్రమంలో బ్యాచ్‌ల వారీగా భారత్‌ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్‌ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్‌  ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.

    అందుకే విడతల వారీగా
    ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్‌ మీదుగా ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో వెళ్లాల్సింది. 

    అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్‌ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు సైతం భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

    చదవండి: మొయిన్‌ అలీపై నిషేధం..!

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.

    అజేయంగా సూపర్‌-8కు
    ఇక టోర్నీ ఆరంభం నుంచి టీమిండియా మెరుగ్గానే ఆడింది. ముఖ్యంగా గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ గెలిచి అజేయంగా సూపర్‌-8కు చేరింది. అయితే, ఆ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికా చేతిలో డెబ్బై ఆరు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో తమ అతి పెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.

    ఫీల్డింగ్‌పై విమర్శలు 
    అనంతరం జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచిన సూర్యకుమార్‌ సేన సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, విండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఫీల్డింగ్‌ చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్‌లోనూ ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.

    కాగా విండీస్‌తో మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ చాన్స్‌ మిస్‌ చేయగా.. అభిషేక్‌ శర్మ రెండు, తిలక్‌ వర్మ ఒక క్యాచ్‌ జారవిడిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్‌ మాజీ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    తప్పుడు ఫీల్డర్‌.. సూర్య ఇలాంటి తప్పు చేస్తాడా?
    ‘‘బయటి నుంచి చూసి వరుణ్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ గురించి నేను ఏదైనా మాట్లాడవచ్చు. అయితే, ఆ బంతిని వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ కోణం నుంచి చూస్తే.. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌, డీప్‌ మిడ్‌ వికెట్‌, షార్ట్‌ ఫైన్‌ లెగ్‌ కంటే వరుణ్‌ షార్ట్‌ కవర్‌ రీజియన్‌లో ఉండటమే మంచిదని అనుకున్నారేమో!

    అయినా సూర్యలాంటి తెలివైన కెప్టెన్లు ఇలాంటి ఎలిమెంటరీ స్కూల్‌ తరహా తప్పులు చేయకూడదు. తప్పుడు ఫీల్డర్‌ను తప్పుడు ఏరియాలో పెట్టినట్లు అనిపించింది. గతంతో పోలిస్తే వరుణ్‌ ఫీల్డింగ్‌ పరంగా మెరుగయ్యాడు. అయితే, ఈసారి మరోమారు తప్పు చేశాడు. అతడు సరైన స్థానంలో ఉన్నాడు. కానీ ఫీల్డింగ్‌ మాత్రం సరిగ్గా చేయలేకపోయాడు.

    ఇక అభిషేక్‌ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి క్యాచ్‌లు జారవిడిచినట్లు అనిపించింది’’ అని ఆర్‌. శ్రీధర్‌ విమర్శించాడు. కాగా విండీస్‌ స్కోరు 13/0గా ఉన్న వేళ అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ ఛేజ్‌ కవర్‌ షాట్‌ ఆడి పరుగుకు ఉపక్రమించాడు. అయితే, షాయీ హోప్‌ మాత్రం బాల్‌ పొజిషన్‌ చూసి తిరిగి నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌కు వచ్చేశాడు.

    వరుణ్‌ వల్లే మిస్‌
    మరోవైపు.. ఛేజ్‌ పిచ్‌ మధ్య వరకు రాగా.. వరుణ్‌ వికెట్‌ కీపర్‌ వైపు కాకుండా.. బౌలర్‌ పొజిషన్‌ వైపు బంతిని విసిరాడు. దీంతో ఛేజ్‌ రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌ షాయీ హోప్‌ (32) రూపంలో ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా సంజూ శాంసన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో మెరిసి విండీస్‌పై భారత్‌ను గెలిపించాడు.

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

  • టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇంట శుభకార్యం జరిగింది. సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌తో గురువారం అతడి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    గతేడాది నిశ్చితార్థం
    కాగా గతేడాది ఆగష్టులో అర్జున్‌- సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల నడుమ గోప్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్‌ టెండుల్కర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఇటీవల అర్జున్‌- సానియా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

    అంబానీ కుటుంబం ఆధ్వర్యంలో
    ముకేశ్‌ అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేసింది. అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహం జరిగిన చోట అర్జున్‌- సానియాల పెళ్లి వేడుకలను ఆరంభించింది. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు అందజేసింది.

    ఈ సందర్భంగా నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపిన సచిన్‌ టెండుల్కర్‌.. కాబోయే కోడలిపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్‌.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకున్నాడని కొనియాడాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. కలకాలం ఇలాగే జీవించాలని ఆకాంక్షించాడు.

    ముంబైలో పెళ్లి వేడుక
    అనంతరం ముంబైలో మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు జరుగగా.. పెళ్లి వేడుక (Arjun Tendulkar- Saaniya Chandhok Wedding)గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా చందోక్‌. ఆమె కూడా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్‌ టెండుల్కర్‌ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద.

    ఇక అర్జున్‌ టెండుల్కర్‌ వివాహానికి దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు, సురేశ్‌ రైనా దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుక కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

    చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

     

Andhra Pradesh

  • తాడేపల్లి : హిందూ ధర్మంపై వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది. ప్రధానంగా తిరుమల లడ్డూ అంశంతో పాటు మరిన్ని బురదజల్లే కార్యక్రమాలతో ఏడుకొండలను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తున్న నేపథ్యంలో గోవిందుడు పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది  వైఎస్సార్‌సీపీ.

    గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే..  దానిపై చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బురదజల్లారు. హిందూ ధర్మం కోసం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత నిబద్ధతతో పని చేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశారు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. వీటిన్నింటిపైనా వైఎస్సార్‌సీపీ డాక్యుమెంటరీ రూపొందించింది.

    ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుందని, భక్తి ముసుగులో  ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా చంద్రబాబు?’ అని వైఎస్సార్‌సీపీ  ఈ  సందర్భంగా ప్రశ్నించింది. 

  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి నగరం పేకాట అడ్డాగా మారుతోంది.  కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి క్వారీ ఏరియాలో టీడీపీ నేత.. పేకాట క్లబ్బులను భారీగా నిర్వహిస్తుండగా.. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.

    జూదంలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో కోట్ల రూపాయలు దొరికితే అధికారికంగా వేల రూపాయలు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజకీయ నేతలు, పోలీసుల సహకారంతో రాజమండ్రిలో  పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన డబ్బు గోల్‌మాల్‌ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • తాడేపల్లి : నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. జాబ్ కేలండర్ అదిగో, ఇదిగో అంటూ నమ్మించి దగా చేశారని  మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన మొండితోక అరుణ్‌కుమార్‌..  చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువంటూ విమర్శించారు. 

    ‘చంద్రబాబు మాటలేమో మిలియన్స్‌లో ఉంటాయి, గ్రౌండ్‌లోనేమో అన్నీ వేకెన్సీలే కనబడుతున్నాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పారు. నారా లోకేష్ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మంత్రి 5.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. చంద్రబాబేమో ఏకంగా 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ముగ్గురూ మూడు రకాల మాటలు చెప్పారు. అందరూ కలిసి ప్రజలను మభ్యపెట్టటమే పనిగా పెట్టుకున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఆ వివరాలు ఇవ్వమంటే పారిపోతున్నారు. 

    అసలు ఈ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి?, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూడా ఎందుకు చెప్పరు?, కాకి లెక్కలతో కాలం వెళ్లబుచ్చటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. ఏపీలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. ఏపీలో నిరుద్యోగం రేటు 4.1% పెరిగిందని కేంద్రమే తేల్చి చెప్పింది. అనేక సర్వే సంస్థలు 8% నిరుద్యోగం పెరిగిందని చెప్తున్నాయి. చీఫ్ జాబ్ క్రియేటర్‌ని అని చెప్పుకునే లోకేష్ మరి 8% నిరుద్యోగం పెరుగుతుంటే ఏం చేస్తారు?, దీన్ని బట్టే లోకేష్ క్రియేటివిటీ, సమర్ధత ఏపాటిదో అర్ధం అవుతోంది. ఏపీకి పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు పెరిగితే మరి జీఎస్టీ ఎందుకు తగ్గుతోంది?, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏమయ్యాయి?, ప్రజల్లో కొనుగోలు శక్తి ఏమయ్యాయి?, మా హయాంలోని డీఎస్సీ అమలు చేసి అదికూడా తమ గొప్పగా లోకేష్ చెప్పుకోవటం సిగ్గుచేటు.

    ఉద్యోగాలు భారీగా పెరిగితే గతేడాది ప్రతి 18 గంటలకు ఒక నిరుద్యోగి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?, ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు, ఎవరెవరికి ఇచ్చామో డీటైల్స్ అన్నీ డొమైన్ లో పెట్టాం. మరి చంద్రబాబు ఇచ్చినట్టు చెప్తున్న 6.28 లక్షల ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టటం లేదు?, చంద్రబాబు హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కంటే తొలగించినవే ఎక్కువ. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే.. మరోవైపు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చంద్రబాబు సలహా ఇస్తున్నారు. ఇదేనా చంద్రబాబు విజన్?, ముందు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ తర్వాత సలహాలు ఇస్తే బాగుంటుంది’ అని సూచించారు.

  • రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నట్టు  ఉండవల్లి స్పష్టం చేశారు.

    ఉండవల్లి లేఖలో ప్రధాన అంశాలు..

    • పూర్తి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు
    • నది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది 
    • ​డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి (Cut-off wall) మాత్రమే, అది డ్యామ్‌కు పునాది కాదు .
    • పునాది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది .  
    • ఎటువంటి సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్‌ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసింది. 
    • ​ అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇంకా CWCకి అందలేదు. ఇవి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం 
    • భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని సరిచేయాల్సి ఉంది
    • భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది .  

    • చంద్రబాబు, పవన్‌కు ఉండవల్లి లేఖ
  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మహిళ మరణించింది. లాలాచెరువుకు చెందిన వెంకటలక్ష్మి (69) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే, అనధికారికంగా ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్టు సమాచారం.

    ఇక, రాజమండ్రి కల్తీ పాల బాధితులు వరుసగా నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యం పాలై ఇంకా 11 మంది నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురికి వైద్యులు..వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. 

National

  • దిస్‌పూర్‌: అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతైంది.  ఎస్‌యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం రాడార్‌ నుంచి లింక్‌లు తెగిపోయి అదృశ్యమైంది. ఈ యుద్ధ విమానం పైలట్‌ సైతం గల్లంతు కావడంతో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తక్షణ గాలింపు చర్యలు చేపట్టింది.  

    ఈ రోజు(గురువారం, మార్చి 5వ తేదీ) రాత్రి ఏడు గంటల ప్రాంతంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు కావడంతో కలవరం మొదలైంది.  ఈ యుద్ధ విమానం కూలిపోయి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

    ఎస్‌యూ-30MKI భారత వాయుసేనలో అత్యంత శక్తివంతమైన బహుళ శ్రేణి యుద్ధ విమానం. ఈ ప్రమాదం వాయుసేన భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.పైలట్ అదృశ్యం కావడం వల్ల రక్షణ చర్యలు అత్యవసరంగా కొనసాగుతున్నాయి.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పనిచేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. బెంగాల్‌ కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్‌ రవిని కేంద్రం నియమించింది.

    వ్యక్తిగత నిర్ణయంతోనే తాను రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. గవర్నర్ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపానన్న ఆనంద బోస్‌.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ పీటీఐకి ఆయన తెలిపారు. 2022లో గవర్నర్‌గా ఆనంద బోస్‌.. బాధ్యతలు చేపట్టారు.

    సుమారు మూడున్నరేళ్ల పాటు తన సేవలను అందించారు. ఆనంద బోస్‌ రాజీనామా షాక్‌కు గురిచేసిందని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. ఆర్ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేశారంటూ ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.

     

  • ఢిల్లీ: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్‌ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్‌ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. సంతాప సందేశం రాశారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే.

    శత్రు దుర్భేద్యమైన భద్రత కలిగిన అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ కోసం కొన్ని నెలలపాటు కొనసాగిన వేట చివరకు రెండు గంటల ఐదు నిమిషాల ఆపరేషన్‌తో ముగిసింది. నిఘా వర్గాలు అందించిన పక్కా సమాచారంతోనే ఆయనను అంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఏకంగా 30 క్షిపణులను ప్రయోగించాయి. దాంతో ఆయన తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తమ హిట్‌లిస్ట్‌లో ఉన్న ఖమేనీపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది.

    ఖమేనీతో జరిగిన భేటీకి ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కాప్స్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మొహమ్మద్‌ పాక్‌పౌర్, రక్షణ శాఖ మంత్రి అజీజ్‌ నజీర్‌జాదే, మిలటరీ కౌన్సిల్‌ అధినేత అడ్మిరల్‌ అలీ షామ్‌ఖనీ, ఐఆర్‌జీసీ ఏరోస్పేస్‌ ఫోర్స్‌ కమాండర్‌ సయ్యద్‌ మాజిద్‌ మౌసావీ, డిప్యూటీ ఇంటెలిజెన్స్‌ మంత్రి మొహమ్మద్‌ షిరాజీతోపాటు మరికొందరు ముఖ్యులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడుల్లో వీరంతా హతమయ్యారు. ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే మృతి చెందారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

  • న్యూఢిల్లీ: నితీశ్‌ కుమార్‌ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. నితీశ్‌ జాతీయ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అమిత్‌ షా స్వాగతించారు. రాజ్యసభ స్థానానికి ఇవాళ నితీశ్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో నితీశ్‌ వెంటే అమిత్‌ షా ఉన్నారు.  

    దీనిపై అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘ఇవాళ రాజ్యసభ స్థానానికి బిహార్‌ సీఎం కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. నితీశ్‌ కుమార్ 2005 నుంచి ఇప్పటి వరకు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం నిజంగా గొప్పది. ఈ కాలం బిహార్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వంటి పదవుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదు. ఆయన జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉంది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాల కాలంలో నితీశ్‌ కుమార్‌ బిహార్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. మోదీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమం బిహార్ ప్రజలకు చేరేలా నితీశ్‌ నాయకత్వం పనిచేసింది. ఇప్పుడు ఆయన మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. నేను, ఎన్డీఏ మిత్ర పక్షా నేతలు అందరమూ ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని అన్నారు.

    మేము ముందే చెప్పాం: తేజస్వీ  
    బిహార్‌లో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.  బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీశ్‌ కుమార్‌పై బీజేపీ కుయుక్తులు చేసిందని ఆరోపించారు. ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్‌’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని అన్నారు.

    ‘బీజేపీ, ఎన్డీఏ మిత్ర పక్షాలు కుయుక్తులు, కుతంత్రాలను వాడి, మొత్తం వ్యవస్థను వాడుకుని ఎన్నికలు ఎలా నిర్వహించాయో తెలుసు. అప్పుడే నితీశ్‌ కుమార్‌ను బీజేపీ హైజాక్ చేసిందని చెప్పాం. ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోనివ్వరని తెలిపాం. ఆయన ఆ కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని మేము చెప్పాం’ అని తెలిపారు.
     

  • చెన్నై: తమిళ స్టార్ హీరో ,టీవీకే అధినేత  విజయ్ దళపతి భార్య సంగీత సోర్నలింగంతో సెటిల్మెంట్‌కు రెడీ అవుతున్నారా?  27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్త నుండి విడాకులకు దరఖాస్తు   చేసుకున్నారన్న వార్త అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన భర్త విజయ్‌కు  నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్టు పేర్కొనడం మరింత దిగ్బ్రాంతి రేపింది.తాజాగా విజయ్ దళపతి కేసును పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

    రూ. 250 కోట్ల భరణం ఆఫర్
    తాజా నివేదిక ప్రకారం, విజయ్ దళపతి ఈ విషయాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు.  తమిళనాట తన రాజకీయ భవిష్యత్తును  పరీక్షించుకుంటున్న  విజయ్‌ తన వ్యక్తిగత  ప్రతిష్టకు భంగం రాకుండా  ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామరస్య పరిష్కారం కోసం  భార్యతో దీని గురించి పలు చర్చలు  మొదలు పెట్టారట. తన భార్యకు రూ. 250 కోట్ల భరణం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.  సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు ఈ సెటిల్మెంట్ మొత్తం చెల్లించాల్సి ఉంది. విజయ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడే నిమిత్తం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడట. ఇరు పక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటే విడాకుల పిటిషన్ ఉపసంహరించు కోనుందని కోలీవుడ్ మీడియాలో  వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.   

    ఇదీ చదవండి: ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

    విజయ్‌-సంగీత వైవాహిక జీవితం
    విజయ్ సంగీతను మొదటిసారి 1996లో కలిశాడు. ఆమె శ్రీలంక హిందూ, బ్రిటన్‌లో పెరిగింది.  అప్పటికే  స్టార్‌హీరోగా పేరుతెచ్చుకున్న  విజయ్‌కి సంగీత పెద్ద అభిమాని. ఆమె UKలోని తన ఇంటిని వదిలి చెన్నైలో తన అభిమానిని కలవడానికి వచ్చేసింది. అది ప్రేమకు దారి తీసింది. చివరకు ప్రత్యేక వివాహ చట్టం కింద  వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత 27 ఏళ్లుగా అన్యోన్య కాపురం తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. సంగీత విడాకుల పిటిషన్ కాపీ ప్రకారం, విజయ్ దళపతి వివాహేతర సంబంధం ఉన్న నటితో విదేశాల్లో  చక్కర్లు కొట్టాడనీ, అలాగే ఆ నటి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తమ విహారయాత్ర చిత్రాలను షేర్ చేస్తూనే ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఇది తనకు తన పిల్లలకు తీవ్ర బాధ కలిగించిందని కూడా ఆమె పేర్కొంది. అంతేకాదు ఈ వివాదం తరువాత విజయ్‌ కుమారుడు సోషల్‌మీడియాలో ఆయనను అన్‌ఫాలో  చేయడం కూడా వార్తల్లో  నిలిచింది.

    ఇదీ చదవండి: మూడు రోజులు ఫ్రీ ఫుడ్‌ : పోటెత్తిన జనం

  • మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. అమిత్‌ షా సమక్షంలో గణపతి లొంగిపోయేందకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్‌ నుంచి గణపతి ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గణపతి సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు సైతం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్‌గా మారింది.

    ఆడియోలో గణపతి కుమారుడు ఏమన్నారంటే..
    ‘‘తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి. తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా "నాన్నా" అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని "నాన్నా" అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ, అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో పన్నెండు రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి, మీ బంధాల్లో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.

    అమ్మ నరకం చూస్తుంది ప్లీజ్ నాన్నా.. మావోయిస్టు గణపతి కుమారుడి ఆడియో

    ..మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నాన్నా! నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీ కోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయ ఘోష మీకు వినపడదు. ప్రతీ కుటుంబపు చిరునవ్వు వెనుక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే అయి పెంచింది నన్ను కన్న తల్లి. అమ్మా! నీకు వందనం. నాన్నా! మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడూ తన గుండె చప్పుడుగా నాతో పంచుకునేది.

    ..ఈ జీవితానికి ఆ మధుర క్షణాలు చాలు అనుకుంటూ బరువెక్కిన హృదయంతో ఓ నిట్టూర్పు విడిచేది. మన బంధువులు కూడా మీరు మనసున్న మనిషి అని, మితభాషి అని, అమ్మతో అన్యోన్యంగా ఉండేవారని అంటూ ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఇద్దరి జీవితాలను జీవితకాలానికి ఎడబాటు చేసింది. మీరెంచుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తూ అజ్ఞాత జీవితం ప్రారంభించాక అమ్మ ఎన్ని సంవత్సరాలు తన కన్నీటితో ఎన్ని మెత్తాలు తడిసిపోయాయో ఎవ్వరికీ తెలియదు. ఏ బట్ట కట్టిందో, ఏ తిండి తిన్నదో కూడా ఎవ్వరికీ తెలియదు. సమాజాన్ని ఎదురు పడలేక ఇంటి గడప దాటలేదు. నన్ను పెంచుకుంటూ తన బాధను మరిచింది.

    ..నాకు తెలిసి అమ్మ పుట్టినప్పటి నుంచి ఏ సుఖమూ అనుభవించలేదు. అమ్మ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన ధైర్యాన్ని కోల్పోకుండా పోరాడుతూనే ఉంది. నాన్నా! మీరు ఎంచుకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదు. మంచో చెడో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దీర్ఘకాలిక పోరాటం చేయడం అంటే అది ఆత్మార్పణే. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారి. ఎన్నో త్యాగాలు, ఎంతో మంది యోధుల వీరమరణాలు. ఎందరో తమ తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని వదిలి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే అది అసామాన్యమే.

    ఒకప్పటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి పరిస్థితులకు చాలా మార్పే ఉంది. సమాజ అంతర్గతంగా సమస్యలు చాలానే ఉండవచ్చు. కానీ నేటితరం ఎంతో అవగాహనతో ఉంటూ సామాజిక మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ఉంటున్నారు. నేటి తరం యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం మార్గదర్శకాలుగా తోడైతే మన దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఓ కొత్త నవభారతాన్ని నిర్మిస్తారని నా నమ్మకం. మీకు చెప్పగలిగే స్థానంలో నేను లేకపోవచ్చు. కానీ ఇది నా అభిలాష’’ అంటూ గణపతి కుమారుడు ఎమోషనల్‌గా మాట్లాడారు.

  • బెంగళూరుకు చెందిన ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) ముంబై నగరంలో  గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి అవుట్‌లెట్‌ని ముంబైలోని ఈరోస్, చర్చ్‌గేట్‌లో మార్చి 2న ప్రారంభించింది ఈ సందర్భంగా ముంబై వాసుల కోసం కేఫ్ యాజమాన్యం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.రామేశ్వరం కేఫ్ పట్ల ఉన్న క్రేజ్‌తో ముంబై ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

    ముంబైలో తన అరంగేట్రాన్ని పురస్కరించుకుని, రామేశ్వరం కేఫ్ నాలుగు రోజుల పాటు ఉచిత ఫుడ్ అంటూ ఇన్‌స్టాలో ప్రకటించింది. మార్చి 2 నుండి మార్చి 5వ తేదీవరకు  ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ఫుడ్‌ అందివ్వనున్నట్టు ప్రకటించారు. రుచికరమైన భోజనాన్ని ఉచితంగా ఆస్వాదించేందుకు వందలాదిమంది బారులు తీరారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా ప్రజలు తమ వంతు కోసం ఓపికగా ఎదురుచూడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట సందడిగా మారాయి.

    ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య

     

     


    రామేశ్వరం కేఫ్
    రామేశ్వరం కేఫ్ రామేశ్వరం కేఫ్‌ను 2021లో బెంగళూరులో భార్యాభర్తల ద్వయం రాఘవేంద్రరావు , దివ్య రాఘవేంద్రరావు స్థాపించారు. సాంప్రదాయ వంటకాలతో  ప్రజాదరణ పొందింది.  దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలానికి నివాళిగా, దక్షిణ భారత రుచులను , వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కేఫ్‌కు "రామేశ్వరం" అని పేరు పెట్టారు.
     

  • తిరువనంతపురం: శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ఫైళ్లు.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం నుంచి మాయమైనట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు పాత ఫైళ్ల కోసం వెతికిన వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  

    కేసు పత్రాల కాపీలు కూడా అందుబాటులో లేవని తెలియడంతో టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్, బోర్డు ఇతర సభ్యులు షాక్‌ అయ్యారని తెలుస్తోంది.  ఆయా రికార్డులు ఏమయ్యాయో తమకు తెలియదని అధికారులు తెలిపారు. కాగా, 2007లో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించవచ్చని వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వైఖరిని తెలిపింది.

    ఆ తర్వాత 2016లో ఊమెన్ చాందీ ప్రభుత్వం, ప్రయార్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని దేవస్వం బోర్డు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి. 2016 నవంబర్‌లో పినరయి విజయన్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఆ సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక అఫిడవిట్ సమర్పించలేదు. 

  • న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎన్ఎస్ఐసీ ఓఖ్లా మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న 17వ ‘ఇండియా ఆర్ట్ ఫెయిర్ 2026’ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో అనేక వినూత్న కళాఖండాలు కొలువుదీరాయి. శిథిలాల్లో దాగున్న జ్ఞాపకాలను, వలసల తాలూకు ఆవేదనను ప్రతిబింబించేలా కళాకారుడు గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన శిల్పాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన ఇటుకలనే ముడిసరుకుగా మార్చుకుని, వాటికి అద్భుతమైన జీవం పోయడం ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ప్రదర్శనశాల ముఖద్వారం వద్దే  ఇటుకల కుప్పలా కనిపించే ఈ ఆవిష్కరణను గమనిస్తే  శిథిలాల నుంచి కొత్త జీవం మొలకెత్తుతున్నట్లుగా  కనిపిస్తుంది. ఏళ్ల తరబడి ఎందరో నివసించిన ఇళ్లు నేలమట్టమైనప్పుడు, ఆ శిథిలాల మధ్యే కొత్త మొక్కలు చిగురించడం అభివృద్ధి పేరిట జరుగుతున్న మార్పులకు ప్రతీకగా కనిపిస్తుంది. గిర్జేష్ కుమార్ సింగ్ రూపొందించిన ‘హాల్ ముకామ్: కరెంట్ అడ్రస్’ (ప్రస్తుత చిరునామా) అనే ప్రదర్శనలో భాగంగా ఈ ఇటుక శిల్పాలు ఈ భావజాలాన్ని మరింత లోతుగా వివరిస్తున్నాయి. ఇళ్లు కూల్చిన చోట సేకరించిన ఇటుకలను ముక్కలుగా చేసి, వాటిని పేర్చి, వలస వెళ్తున్న సామాన్యుల రూపాలను ఆయన మలిచారు.

    ఈ శిల్పాల్లో ముఖ్యంగా 'ఇన్ ట్రాన్సిట్' పేరుతో రూపొందించిన కళాఖండాలు చూపరులను ఆలోచింపజేస్తున్నాయి. చేతిలో సంచులు పట్టుకుని, మరో సంచిని కాళ్ల మధ్య ఉంచుకుని, వలస వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి ప్రతిమ అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇటుక అనేది కేవలం భౌతికమైన వస్తువు మాత్రమే కాదు, మానవ జీవితంలో ఏ చిరునామా కూడా శాశ్వతం కాదనే సత్యాన్ని చాటిచెప్పే ఒక ప్రతీక. సొంత ఊరుని, గూడుని వదిలి వలస వెళ్లే క్రమంలో మనుషులు తమ వెంట తీసుకెళ్లేది కేవలం సంచులను మాత్రమే కాదు, ఆ పాత ఇళ్లతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను, చేదు తీపి అనుభవాలను కూడా బరువుగా మోస్తారని ఈ శిల్పాలు నిశ్శబ్దంగా నినదిస్తున్నాయి.

    ఉత్తరప్రదేశ్‌లోని సేమ్రాలో జన్మించిన గిర్జేష్ కుమార్ సింగ్ అలహాబాద్, వారణాసిలలో విద్యనభ్యసించి, బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పట్టా పొందారు. ప్రస్తుతం వడోదరను తన నివాసంగా మార్చుకున్న ఆయన తన కళా సృజనలో వలసలు, అస్థిత్వం, నిర్వాసితుల ఇతివృత్తాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మనం చూస్తున్న వలసల సంక్షోభం, యుద్ధ విధ్వంసాల నేపథ్యంలో, గిర్జేష్ సృష్టించిన ఈ ఇటుక శిల్పాలు కేవలం కళాఖండాలుగానే కాకుండా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

    భవనాలు కేవలం ఇటుకలు, సిమెంట్ తో కట్టిన కట్టడాలు మాత్రమే కావని, వాటికి మనుషులతో ఉన్న అనుబంధమే అసలైన జీవమని ఆయన తన కళ ద్వారా చాటిచెబుతున్నారు. కేవలం ఇటుకలే కాకుండా ఈ ఆర్ట్ ఫెయిర్‌లో కళాకారులు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ, అనేక వినూత్న ప్రయోగాలు చేశారు. మహిళల రక్షణను ఉద్దేశించి బ్లేడ్లతో తయారు చేసిన ‘అన్ టచబుల్’ బ్రాలెట్, దీపావళి టపాసుల (పాపింగ్ స్ట్రిప్స్) తో సృష్టించిన కళాఖండాలు, చన్నపట్నం చెక్క బొమ్మలతో రూపొందించిన భారీ ఛాండ్లియర్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మనం నిత్యజీవితంలో చూసే వస్తువుల వెనుక ఎంతో శక్తివంతమైన కథలు ఉంటాయని ఈ 17వ ఇండియా ఆర్ట్ ఫెయిర్ నిరూపిస్తోంది.

    ఇది కూడా చదవండి: UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

Business

  • మార్చి 2నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పెట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,49,900 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,49,300 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,63,530 రూపాయల నుంచి రూ. 1,62,880 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,50,050 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,49,450 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,63,680 రూపాయల వద్ద నుంచి రూ. 1,63,030 వద్దకు చేరింది.

    ఇక చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 151200 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 164950 వద్దనే ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!

  • జీవించినంత కాలం నిరంతర ఆదాయం అందుతుందనే భరోసాతో రిటైర్ కావడాన్ని ఒకసారి ఊహించుకోండి. మీ పొదుపులు స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెరుగుతూ మీ జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అచ్చంగా ఈ ఆలోచనకే వాస్తవ రూపం ఇచ్చేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ను ఆవిష్కరించింది. మీరు ధీమాగా, సౌకర్యవంతంగా, ఆర్థిక భద్రత దన్నుతో పదవీ విరమణను ప్లాన్ చేసుకునేందుకు తోడ్పడేలా ఇది తీర్చిదిద్దబడింది.

    నేటి రిటైర్మెంట్ - సరికొత్త పరిస్థితులు
    ప్రస్తుతం రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళిక అవసరం. ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల రిటైర్ అయిన వారిపై ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది రిటైర్మెంట్ అనంతరం కూడా తమ జీవనశైలిని కొనసాగిస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కలిగిన స్మార్ట్ ఫైనాన్షియల్ పరిష్కారాల కోసం చూస్తున్నారు.

    ఇప్పటి రిటైరీలు కారు కొనడం లేదా విదేశీ పర్యటనలు చేయడం వంటి లక్ష్యాల గురించి కూడా కలలు గంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ (FIRE) తరానికి చెందిన వారు కావచ్చు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఉద్యోగ మార్పుల మధ్యలో ఉన్నవారు కావచ్చు, ఇలా చాలా మందికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవడం లేదు. అంతేకాదు, జీవితకాలం ముగిసేలోగానే, దాచుకున్న డబ్బు పూర్తిగా ఖర్చయిపోతుందనే భయం కూడా చాలా మందిలో ఉంది.

    అయితే రిటైర్మెంట్ జీవితం గురించి ఆందోళన చెందే పరిస్థితి లేకపోతే ఎలా ఉంటుంది? నిర్దిష్ట హామీతో కచ్చితమైన ఆదాయం పొందుతూ మార్కెట్ వృద్ధి అవకాశాలను కూడా పొందగలిగితే ఎలా ఉంటుంది?

    ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’ అచ్చంగా అలాగే ఉంటుంది. ఈ పథకం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతో మీరు కోరుకున్న జీవనశైలి విషయంలో రాజీపడాల్సిన అవసరం లేకుండా, ధీమాగా రిటైర్ కావచ్చు.

    రిటైర్మెంట్ ప్లానింగ్‌కు స్మార్ట్ మార్గం
    ఆయుర్దాయం పెరుగుతుండటం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం వల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతోంది. సంప్రదాయ రుణాధారిత పెన్షన్ పథకాలు భరోసా ఇస్తాయి కానీ ఆదాయం పెరిగే అవకాశం ఉండదు. మరోవైపు సూచీ ఆధారిత పెట్టుబడులు వృద్ధి అవకాశాలను ఇస్తాయి కానీ స్థిరత్వం ఉండదు. అలాంటప్పుడు ఈ రెండు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తే ఎలా ఉంటుంది?

    శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ జీవితాంతం హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈక్విటీల్లో 40 శాతం వరకు పెట్టుబడుల దన్నుతో ఇది అదనంగా మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా అందిస్తుంది. ‘ఈక్విటీ ఓరియెంటెడ్, రెగ్యులర్ పే’ సొల్యూషన్‌గా ఈ పథకం ఇలా పనిచేస్తుంది.

    జీవితాంతం హామీతో కూడుకున్న ఆదాయం
    మీరు జీవించినంతకాలం యాన్యుటీ రూపంలో ఆదాయం అందుతుంది. రిటైర్మెంట్ సమయంలో డబ్బు సరిపోదేమోనని ఆందోళన చెందనక్కర్లేదు.
    మార్కెట్ ఆధారిత వృద్ధికి అవకాశం
    వేరియబుల్ యాన్యుటీ ఆప్షన్ ద్వారా మీ ఆదాయంలో కొంత భాగాన్ని NIFTY 50 పనితీరుకు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆప్షన్లు ఉన్నాయి:
    ➤60% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 40% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
    ➤70% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 30% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
    ➤80% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 20% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)
    ➤90% గ్యారంటీడ్ ఆదాయం (డెట్) + 10% మార్కెట్ ఆధారితం (ఈక్విటీ)

    ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనగలిగేలా, మీకు ఒక స్థిరమైన ఆదాయం ఉండడమే కాకుండా మార్కెట్ పెరుగుదలతో మీ పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉండేలా చూసేందుకు ఇది సహాయకరంగా ఉంటుంది.

    “భారతదేశంలో రిటైర్మెంట్ ప్లానింగ్ విధానం మారుతోంది. ఆయుర్దాయాలు పెరగడం, ఆరోగ్య వ్యయాలు పెరుగుతుండటం, వడ్డీ రేట్లు మారడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలను కూడా అందించే సాధనాలను కోరుకుంటున్నారు. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు హామీతో కూడుకున్న ఆదాయం మరియు పొదుపు మొత్తాన్ని పెంచుకునే అవకాశం, ఇలా రెండింటినీ అందిస్తున్నాం,” అని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అపాయింటెడ్ యాక్చువరీ క్షితిజ్ శర్మ తెలిపారు.

    మీ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడినది
    ప్రతి ఒక్కరి రిటైర్మెంట్ లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమవైన లక్ష్యాలు, కాలవ్యవధులు ఉంటాయి. అందుకే శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్, వివిధ రకాల రిటైర్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా అనేక అనువైన ఆప్షన్లు అందిస్తుంది.

    ముందుగానే ప్రారంభించండి: 35 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడాన్ని ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి కావడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది.

    ఎప్పటి నుంచి ఆదాయం కావాలో మీరే ఎంచుకోవచ్చు
    ఇమిడియేట్ యాన్యుటీ: రిటైర్ అయిన వెంటనే ఆదాయం ప్రారంభం.
    డిఫర్డ్ యాన్యుటీ: చెల్లింపులు ప్రారంభమయ్యే ముందు 20 సంవత్సరాల వరకు నిధికి పెరిగే అవకాశాన్ని కల్పించడం ద్వారా మూలనిధిని పెంచుకోవచ్చు. PPTకి అదనంగా గరిష్ట స్థాయిలో 20 ఏళ్ల వరకు వాయిదా వేసే వీలు. ఉదాహరణకు పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు అనుకుంటే, గరిష్టంగా 12 + 20 = 32 ఏళ్లు డిఫర్ చేసుకోవచ్చు.

    సరళతర ప్రీమియం ఆప్షన్లు
    ఏకమొత్తంగా చెల్లించవచ్చు
    2–12 ఏళ్ల వరకు విడతలవారీగా చెల్లింపులు జరపవచ్చు

    కుటుంబానికి రక్షణ
    ఈ పథకం కేవలం మీ భవిష్యత్తు కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. “రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్” ఆప్షన్‌ని ఎంచుకోవడం వల్ల పాలసీదారు మరణించిన తర్వాత కొనుగోలు కోసం మీరు మొదట చెల్లించిన మొత్తం తిరిగి నామినీకి లభిస్తుంది.

    ఎవరికి అనుకూలం?
    శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ వివిధ వర్గాలవారందరికీ అనుకూలమైనదిగా ఉంటుంది
    ముందుగానే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలనుకునే వారు (FIRE తరం)
    ఆర్థిక స్వాతంత్య్రంతో జీవనశైలిని కొనసాగించాలనుకునే వారు
    స్థిరమైన ఆదాయం, వృద్ధి అవకాశాలను కోరుకుంటూ, రిటైర్మెంట్‌కు సమీపిస్తున్న వారు
    స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలు కోరుకునే రిటైరీలు
    యాన్యుటైజేషన్ ఆప్షన్లను కోరుకునే NPS సభ్యులు
    నిర్మాణాత్మకమైన, దీర్ఘకాలిక రిటైర్మెంట్ వ్యూహం కోరుకునే వ్యక్తులు

  • అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాలతోపాటు.. భారతీయ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన బాస్మతి బియ్యం.. ఇప్పుడు ఢిల్లీలోని గిడ్డంగుల్లో నిలిచిపోయింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి.

    ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోవడం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం ఓడరేవులు, గిడ్డంగుల్లో ఉన్నట్లు సమాచారం. సుమారు 2,00,000 టన్నుల బాస్మతి బియ్యం రవాణాలో చిక్కుకుపోయినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) అధ్యక్షుడు సతీష్ గోయెల్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు ఇప్పటికే స్టాక్‌లను పోర్టులకు తరలించారు, కానీ పెరుగుతున్న కంటైనర్ సరుకు రవాణా ఖర్చుల కారణంగా మధ్యప్రాచ్యానికి రవాణా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.

    భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కలిగిన, ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశం. మన దేశం సౌదీ అరేబియా, ఇరాన్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా మధ్యప్రాచ్యంలో సగానికి పైగా వాటా కలిగి ఉంది.

    తగ్గిన ధరలు
    2026 ప్రారంభం నుంచి బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో మాత్రమే ధరలు 5-10 శాతం పెరిగాయి. కాగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లకు రవాణా నిలిచిపోయింది. దీంతో ధరలు 10 శాతం పడిపోయింది. మన దేశంలో కూడా బాస్మతి బియ్యం రేటు 5-6 శాతం తగ్గింది. యుద్ధం ముగిస్తేగానీ.. మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

  • స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో కొత్తగా రియల్‌మీ నార్జో పవర్‌ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

    ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఎక్కువసేపు వినియోగానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

    ధర, లభ్యత
    రియల్‌మీ నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ ఒకటి కాగా మరొకటి 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్. అలాగే ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ విక్రయంలో దీని ధర రూ.23,999 నుంచి మొదలవుతుంది.

    మార్చి 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమెజాన్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి కంపెనీ రూ.3,999 వరకు బండిల్ బెనిఫిట్లు అందిస్తోంది. అదనంగా 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇస్తోంది.

    ప్రధాన ఫీచర్లు

    • ఈ ఫోన్‌లోని 10,001mAh బ్యాటరీని సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండేలా రూపొందించారు.

    • 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

    • పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8GB ర్యామ్‌తో పాటు ప్రత్యేక AI ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో స్థిరమైన పనితీరును అందించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.

    • డిస్‌ప్లే విషయానికి వస్తే ఫోన్ ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్‌తో హైపర్‌గ్లో 4డీ కర్వ్‌+ అమోల్‌డ్‌ డిస్‌ప్లే అందించారు. ఇది 1.07 బిలియన్ రంగులను సపోర్ట్‌ చేస్తుంది. గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

  • భారత్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.

    ఫిబ్రవరి 2026లోనే ఏపీలో 1.02 లక్షలు, తెలంగాణలో 22,882 లావాదేవీలు జరిగాయి. భారత్ కనెక్ట్ ద్వారా ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకుని డిజిటల్‌గా చెల్లించే వెసులుబాటు లభిస్తోంది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లో డ్రోన్ ప్రచారం కూడా నిర్వహించారు. ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఇంటరాక్టివ్ స్క్రీన్‌లను డ్రోన్‌ల ద్వారా ప్రదర్శిస్తూ ఈ-చలాన్ సేవపై ప్రచారం చేశారు. ప్రస్తుతం 700కు పైగా యాప్‌లు, బ్యాంకుల ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంది.ఢిల్లీ, గుజరాత్‌లో కూడా ఈ కేటగిరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది.

    “భారత్ కనెక్ట్‌లోని ఈ-చలాన్ సేవ, డిజిటల్ అప్‌గ్రేడ్ మాత్రమే కాదు. ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ ప్లాట్‌ఫాంలు కలిసి పని చేస్తే పౌరులకు అందించే సేవలను సరికొత్తగా నిర్వచించేందుకు వీలవుతుందని తెలియజెప్పేందుకు ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. ఈ ప్రయత్నంలో మాకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ పోలీస్, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖలకు కృతజ్ఞతలు. ప్రజలకు అవసరమైన కీలక చెల్లింపులను డిజిటల్ రూపంలో అందుబాటులోకి తేవడంలో ఇది కీలక అడుగు,” అని ఎన్‌బీబీఎల్ (NBBL) ఎండీ & సీఈఓ నూపూర్ చతుర్వేది తెలిపారు.

  • దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్‌లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

    2026 జనవరిలో కూడా అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగించింది. ఏఐకి అప్‌డేట్‌ అవుతున్న నేపథ్యంలో భారీ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. కాగా ఇప్పుడు రెండు నెలలు కూడా గడవకముందే.. మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. 2022 నుంచి కంపెనీ దాదాపు 57వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.

    గత సంవత్సరం చివరి నాటికి.. అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.58 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. ఎక్కువ మంది గిడ్డంగి & లాజిస్టిక్స్ విభాగాలలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపింది. రానున్న రోజుల్లో కూడా ఏఐ కారణంగా మరింతమంది జాబ్స్ కోల్పొయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా.

  • దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.

    ప్రభుత్వ రంగ దిగ్గజాలు అయిన ఐఓసీఎల్ (Indian Oil Corporation), హెచ్‌పీసీఎల్ (Hindustan Petroleum Corporation Limited), బీపీసీఎల్ (Bharat Petroleum Corporation Limited) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

    మార్జిన్‌లపై ప్రతికూల ప్రభావం
    స్థూల మార్కెటింగ్ మార్జిన్ అంటే ఇంధనాల రిటైల్ విక్రయ ధర, వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే వరకు అయ్యే మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసం. ప్రస్తుతం ఈ మార్జిన్ ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

    అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అదే సమయంలో రూపాయి బలహీనపడటం ఓఎంసీలపై ద్వంద్వ ప్రభావాన్ని చూపుతున్నాయి.

    రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదల
    ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు బెంచ్‌మార్క్ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 33 శాతం పెరిగి 80 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో హెచ్‌సీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ షేర్లు గణనీయంగా పడిపోయాయి.

    క్రూడ్ ధరల పెరుగుదలతో లాభాల క్షీణత
    చమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత సాధారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలకు విలోమంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1 డాలర్ పెరిగితే, ఈ సంస్థల స్థూల మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు సుమారు రూ.0.5 వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లకు మించి కొనసాగితే, మార్జిన్‌లు లీటరుకు సుమారు రూ.3.5 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కంపెనీల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

    మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా సంయుక్త వైమానిక దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

    ఇరాన్ కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే హార్మూజ్‌ జలసంధిలో నౌకల రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించడం ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలను పెంచింది.

    భారత దిగుమతులపై ప్రభావం?
    భారత్‌ రోజుకు సుమారు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగితే దేశీయ చమురు మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

  • దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.

    ఎల్గీ రబ్బర్ కంపెనీ లిమిటెడ్, మోడరన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, సెంచరీ ఎక్స్‌ట్రూషన్స్ లిమిటెడ్, ఆకాష్ ఎక్స్‌ప్లోరేషన్ సర్వీసెస్ లిమిటెడ్, ఇంటిగ్రే ఎసెన్షియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్, పిఎన్‌జిఎస్‌ రేవా డైమండ్ జ్యువెలరీ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రద్ధ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    స్టాక్ మార్కెట్స్ పెరగడానికి కారణం
    భారతీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలివేయడానికి కొన్ని షరతులతో సిద్ధంగా ఉందని వదంతులు రావడమే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చని భావించి పెట్టుబడిదారులు మార్కెట్‌లో కొనుగోళ్లు పెంచారు.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 2,500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

    ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఇటీవలే తన చరిత్రలోనే అత్యంత బలమైన ఆర్థిక సంవత్సరాల్లో ఒకటిని నమోదు చేసింది. అయినప్పటికీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఉద్యోగ కోతలను చేపడుతున్నట్లు సమాచారం.

    రికార్డు స్థాయి ఆదాయం
    2025 సంవత్సరానికి మోర్గాన్‌ స్టాన్లీ 70.6 బిలియన్ డాలర్ల పూర్తి సంవత్సర ఆదాయాన్ని నమోదు చేసింది. పెట్టుబడి బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగడంతో బ్యాంక్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా డీల్‌మేకింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పెట్టుబడి బ్యాంకింగ్ ఆదాయం 47% పెరిగింది. ఇదే సమయంలో కంపెనీలకు రుణాలు సమకూర్చడం ద్వారా వచ్చే ఫీజులు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి.

    లేఆఫ్‌ల ప్రభావం వీరిపైనే.. 
    ఈ ఉద్యోగ కోతలు బ్యాంక్‌కు చెందిన మూడు ప్రధాన విభాగాల్లో ఉండనున్నాయి. అవి ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ (ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ట్రేడింగ్), వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌. అయితే బ్యాంక్‌కు కీలకమైన ఫైనాన్షియల్ అడ్వైజర్లపై ఈ కోతలు ఉండవని సమాచారం.

    అమలు ఎప్పుడంటే.. 
    వివిధ నివేదికల ప్రకారం, ఈ ఉద్యోగ కోతలు మార్చి ప్రారంభం నుంచే దశలవారీగా అమలు కావచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై బ్యాంక్ అధికారికంగా పూర్తి కాలక్రమాన్ని వెల్లడించలేదు.

    లాభాలున్నా ఉద్యోగ కోతలు ఎందుకు?
    బ్యాంక్ లాభాల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది ఆర్థిక బలహీనత కారణంగా కాకుండా వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

    వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు, గ్లోబల్ లొకేషన్ వ్యూహంలో సర్దుబాట్లు, వ్యక్తిగత పనితీరు సమీక్షలు వంటి అంశాలు కూడా దీనికి కారణమని తెలుస్తోంది.గత సంవత్సరం కూడా మోర్గాన్‌ స్టాన్లీ సుమారు 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అప్పట్లో పనితీరు సమీక్షలు, కార్యకలాపాల్లో మార్పులు కారణమయ్యాయి.

  • టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీకి చెందిన ఒక వాచ్ కంపెనీ సియెర్రా పేరుతో లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 16999.

    టాటా సియెర్రా వాచ్‌ను కంపెనీ కేవలం 500 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. స్టైలిష్ డిజైన్ కలిగిన ఈ వాచ్.. ఢిల్లీ వాచ్ కంపెనీ లోగో, సియెర్రా పేరును పొందినట్లు తెలుస్తోంది. సాధారణ వాచ్‌లో మాదిరిగా.. ఇందులో కూడా 3,6,9, 12 గంటలను సూచించే గుర్తులు ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ స్నీకర్, టోపోగ్రాఫిక్ లైన్లు, గుర్రం చిహ్నం వంటివి ఇందులో కనిపిస్తాయి.

    సియెర్రా 10000 యూనిట్ల డెలివరీ!
    టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.

    సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.

    డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.

  • నెలకు పట్టుమని రూ.పది వేలు సంపాదించలేని ఒక సాధారణ డ్రైవర్.. వందల కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమయ్యాడు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా రూ.550 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా మార్గాల ద్వారా ఈ భారీ నెట్‌వర్క్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.

    రూ.25 వేల ఆశ జూపి..

    విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్ ఓడే, కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను రూ.25,000కు అద్దెకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను సంతకం చేసిన ప్రతి చెక్కుకు అదనంగా రూ.400 కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రదీప్ పత్రాలను ఉపయోగించి నిందితులు ‘ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో ఒక డమ్మీ సంస్థను స్థాపించారు.

    ప్రదీప్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో రెండు షెల్‌ కంపెనీలను 2024లో నమోదు చేశారు. ఈ సంస్థలకు వాస్తవంగా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. కానీ, వీటి బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూ.550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. మూడు వేర్వేరు కంపెనీలకు వరుసగా రూ.80.50 కోట్లు, రూ. 52.11 కోట్లు, రూ.22.86 కోట్ల చొప్పున డబ్బు బదిలీ అయినట్లు ఈడీ తేల్చింది.

    క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్

    ఈ భారీ మొత్తమంతా అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం బెట్టింగ్ మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్‌లో ‘సర్క్యులర్ ట్రేడింగ్’(కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచడం) ద్వారా షేర్ల ధరలను తారుమారు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. ‘సాధారణ పొదుపు ఖాతాగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు సంబంధించిన హవాలా ఛానెల్‌గా పనిచేస్తోంది’ అని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఇంపాక్ట్ గురు’ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించి వాటిని మనీ లాండరింగ్‌కు వినియోగించినట్లు తెలుస్తుంది.

    ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరికి చేరుతోంది? అనే అంశంపై ఈడీ ప్రస్తుతం మనీ ట్రయిల్‌(డబ్బు వెళ్లిన క్రమం)ను ట్రాక్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఆస్తుల అటాచ్‌మెంట్, కీలక వ్యక్తుల అరెస్టులు ఉండొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం

Politics

  • సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లో హత్యలు, అత్యాచారాలు, గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా 'పొలిటికల్ గవర్నెన్స్'(రాజకీయ పాలన) నడుస్తోందని, శిలాఫలకాలను పగలగొట్టడం నుంచి భౌతిక దాడుల వరకు విధ్వంసమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిందని మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు.

    మాజీ మంత్రి కాకాణిపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చివరకు ప్రెస్ మీట్లు పెడితే వాటిపైనా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరును డిజిటల్ డెయిరీలో నమోదు చేసి.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన శిక్షలు తప్పవు" అని  హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని.. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా గట్టి పోరాటం చేస్తామని మనోహర రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

    భక్తులకు సైతం రక్షణ లేని దుస్థితి:
    దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో అట్టడుగు స్ధానంలో నిల్చింది. చిట్టచివరి స్ధానంలో ఉన్నప్పటికీ శాంతిభద్రతలు మెరుగుపర్చడానికి కానీ, హత్యలు, అత్యాచారాలు, గంజాయి అమ్మకాలు నియంత్రణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గాల్లో ఇవే సంఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లైనా లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలు నిర్వహణ ఉండేది. ఇవాళ గుడికి వెళ్తున్న భక్తులకు సైతం రక్షణ లేకుండా పోయింది.

    అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు..
    పోలీసులు అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. కూటమి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైన దుస్థితి. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి.  మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు.

    మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేసి... దాడికి పాల్పడిన వారిని వదిలేసి, తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, హత్యాయత్నం చేస్తే, వారిపై బెయిలబుల్ సెక్షన్లు కింది అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన అంబటి రాంబాబు గారిపై నాన్ బెయిల బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.

    కాకాణిపై కక్ష సాధింపు..
    కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 20 కు పైగా అక్రమ కేసులు బనాయించింది. చివరకు గతంలో ఛార్జిషీట్ ఫైల్ చేసిన కేసుల్లో ముద్దాయి కాకపోయినప్పటికీ.. ఎవరో ఒక నిందితుడో లేక సాక్షిగా ఉన్న వ్యక్తో  వాంగ్మూలం ఇచ్చారని... నాలుగైదు సంవత్సరాలు తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో 2019లో ఎవరో మద్యం పంచారని, ఎవరినో తీసుకొచ్చి బెదిరించి, బలవంతం సాక్ష్యం ఇప్పించి.. అందులో గోవర్థన్‌రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేస్తున్నారు.

    సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరులుతో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేస్తున్నారు. విలేకరిని బెదిరించిన విషయంపై ప్రశ్నిస్తే.. దాని మీద కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు.. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొండి, టీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పిలుపునిస్తూ.. ఆ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు.

    సోషల్ మీడియాకు సంబంధించి కూడా దాదాపు 8 కేసులు నమోదు చేశారు. ఇటీవల కొవూరులో బాధిత బాలికను పరామర్శించి ప్రెస్ మీట్ పెడుతూ.. శాంతిభద్రతలు కాపాడ్డంలో పోలీసులు విఫలమయ్యారు, పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూటమి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేశారు.  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.3 లక్షలు తీసుకొంటున్నారంటూ బీజేపీ నేత శేషాచలం వాట్సప్‌లో వీడియో పెడితే.. దాన్ని ఫార్వార్డ్ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు పెట్టారు.

    చరిత్రలో ప్రెస్ మీట్ పెడితే కేసు నమోదు చేయడం ఇంతవరకు లేదు. తెలంగాణా హైకోర్టు ఇటీవల నల్లబాలు కేసులో రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలించి.. నిరాధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో కనీస భావప్రకటనా స్వేచ్చే లేకపోతే ఎలా అని తీర్పునిస్తే.. సుప్రీం కోర్టు దాన్ని యథాతథంగా అమలు చేయమని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది. అదే విధంగా బాధితులే కేసు పెట్టాలని స్పష్టం చేసింది.

    కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఒక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు చేసింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇదే తరహా కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు విలేకరులు, న్యాయవాదులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.

    న్యాయవాదులపైనా అక్రమ కేసులు..
    కడప జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతల తరపున కేసులు టేకప్ చేస్తున్నాడని భయపెట్టడానికి ఆయన మీదే కేసు పెట్టారు. చివరకు నా మీద కూడా కేసు నమోదు చేశారు. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది.  సాక్షిలో వార్తలు రాస్తున్నారని కేసులు పెడుతున్నారు. అదే టీవీ5, ఈటీవీలో ఎంత అసభ్యకరవార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై ఏ కేసులు ఉండవు. కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తే మాత్రం... సాక్షితో పాటు యూట్యూబర్స్ పైనా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది.

    అందుకే దేశంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అట్టడుగ స్ధానానికి దిగజారింది. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తల ఉన్నది టోపీ పెట్టుకోవడానికే తప్ప ఆలోచించడానికి కాదన్న ఓ కవి మాటలను పోలీసులు నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సూపర్ సిక్సి హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం. .వాటిపై మీడియాలో చర్చలు పెడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.

    మరోవైపు తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై ఇదే తరహాలో వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వీరి పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులందరి పేర్లను డిజిటల్ డెయిరీలో నమోదు చేస్తున్నాం. ఇలాంటి అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే...  వీరందరినీ భవిష్యత్తులో చట్టపరంగా శిక్షించడం ఖాయమని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు.

  • విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్‌ చేశారు.  అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. 

    ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.

    మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.

    ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్‌ చేశారు. 

    ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు.  దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. 

    ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. 

    చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి

Family

  • ‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.

    సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ,  ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన  భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.

    చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.

    స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.
    – జేతమ్‌ 

  • భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉంది. గత 27న అంకురార్పణంతో అత్యంత వైభవంగాప్రారంభమయిన ఖాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు పక్షం రోజుల పాటు సాగుతాయి. భక్తప్రహ్లాద సమేత నారసింహుని దర్శనం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు.

    హిరణ్యకశిపుని శిక్షించేందుకు, అలాగే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు ‘నర–సింహ’ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్రరూపంలో సమీపంలోని కదిరికొండ తంలో సంచరించారు. మహర్షులు ఆయనను శాంతింపజేసేందుకు ఆ కొండపై నుండి నారసింహుని వేడుకున్నారు. దీనికి గుర్తుగా ఆ కొండపై నారసింహుని ఆలయం కూడా ఉంది. అదేకొండపై శ్రీవారి పాద ముద్రికలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ఖాద్రి’ అని పిలిచారు. ‘ఖా’ అంటే విష్ణుపాదమని, ‘అద్రి’ అంటే కొండ అని అర్థం. ఖాద్రి కాస్తా ఇప్పుడు కదిరి అని పిలుస్తున్నారు. కదిరి   ప్రాంతంలో ఒకప్పుడు ఖాదిరి వృక్షాలు (చండ్ర వృక్షాలు) ఎక్కువగా ఉండేవి. వీటికింద ఒక పుట్టలో నారసింహుడు స్వయంభువుగా వెలిశాడని, అందుకే ఖాద్రీ నారసింహుడని పిలుస్తున్నారని మరో కథనం.

    రంగనాయకుడి స్వప్నం
    10వ శతాబ్దంలో అప్పటి పట్నం పాలేగారైన రంగనాయకుడికి చెందిన గోవులు ప్రతిరోజూ ఖాదిరి వృక్షం కింద ఉన్న ఓ పుట్టలో  పాలు వదిలేవి. ఆ పాలను నారసింహుడు తాగేవారని, అందువల్లనే రంగనాయకులు ఆర్థికంగా బాగా ఎదిగారని ఒక కథనం. ఓరోజు ఆయనకు శ్రీవారు కలలో కన్పించి తాను స్వయంభువుగా వెలిశానని, పుట్టలో ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి తనకు గుడి కట్టించమని కోరితే ఆలయం నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి ఆలయం కాలగతిలో అదృశ్యం కావడంతో బుక్కరాయలు, హరిహర రాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయుల కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది.

    వసంత వల్లభుడని కూడా...
    శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భృగుమహర్షి ఈ  ప్రాంతంలో తపస్సు చేశాడని, అందుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిశానని, తన విగ్రహాలను వెలికితీసి పూజాది కార్యక్రమాలు చేయాలని కోరినట్లు ఇంకో కథనం. ఉత్సవ విగ్రహాల వెలికితీత వసంత మాసంలో జరగడంతో స్వామివారిని వసంత వల్లభుడని కూడా పిలుస్తున్నారు. అందుకే కోనేరును భృగుతీర్థమని కూడా పిలుస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలనే ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో పక్షం రోజులపాటు ప్రతిరోజూ తిరువీధుల్లో ఊరేగిస్తారు.

    దేశంలోనే 3వ అతి పెద్ద బ్రహ్మరథం
    స్వామివారి బ్రహ్మ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 130 ఏళ్ల క్రితం ఈ బ్రహ్మరథం తయారు చేశారు. రథంపై సుమారు 256 శిల్పకళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని  శ్రీవిల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీశుడి బ్రహ్మరథం.

    ఏ రోజు ఏ ఉత్సవం?
    గత నెల 27వ తేదీన  బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం గావించారు. 28న శ్రీవారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 4వ తేదీన బ్రహ్మ గరుడసేవ, 5న శేషవాహనం, 6న పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న మోహినీ ఉత్సవం, 8న ప్రజాగరుడసేవ, 9వ తేదీన గజవాహనం, 10న బ్రహ్మ రథోత్సవం, 11న అశ్వవాహనం, 12న తీర్థవాది ఉత్సవం చివరగా 13వ తేదీన జరిగే పుష్పయాగోత్సవంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
    – చెరువు శ్రీనివాసరెడ్డి,  సాక్షి, కదిరి

    పక్షం రోజుల బ్రహ్మోత్సవాలు
    15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిగేది కదిరిలో మాత్రమే. ఇంకెక్కడా జరగవు. ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం కూడా ఇంకెక్కడా ఉండదు. ప్రతినెలా స్వాతినక్షత్రం రోజు మూల విరాట్‌కు అభిషేకం చేస్తాం. ఆ సమయంలో స్వామివారికి చెమట పట్టడాన్ని గమనించవచ్చు.
    – నరసింహాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి 

  • హెయిర్‌కట్‌ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్‌ కటింగ్‌ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది. చిన్నపాటి తప్పిదాన్ని పెద్దగా చేసి చూపించి వినియోగదారుల కేసులో కోట్లలో నష్టపరిహారం పొందింది. పాపం సదరు సెలూన్‌ సెంటర్‌ ఇంత చిన్నతప్పిదానికి అంత భారీ పరిహారమా అని సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే..మళ్లీ అమాంతం పరిహారం పెంచేసింది. చివరికి ఆమెకు ధర్మాసనం ఊహించని దిమ్మతిరిగిపోయే ఝలక్‌ ఇచ్చింది. 

    అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 12, 2018న, ఆమె హెయిర్ కట్ కోసం ఒక ఫైవ్ స్టార్ హోటల్ బ్యూటీ సెలూన్‌కి వెళ్లింది. కానీ వాళ్లు పొరపాటున తప్పుగా కట్‌చేశారు. దాంతో వాళ్ల సేవకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జూలై 2018లో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2021న, వినియోగదారుల కమిషన్ బ్యూటీ సెలూన్‌ను తప్పుపడుతూ బాధిత మహిళకు ఏకంగా రూ. 2 కోట్లు నష్టపరిహారం చెల్లించమని ఆదేశించింది. 

    వినియోగదారుల కమిషన్ ఆదేశంతో అసంతృప్తి చెందిన బ్యూటీ సెలూన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పరిహారం మొత్తం అంచనా వేసేందుకు ఆ కేసుని తిరిగి వినియోగదారుల కమిషన్‌కు పంపింది ధర్మాసనం. దాంతో ఆ మహిళ తన క్లైయిమ్‌ను అమాంతం రూ.2 కోట్లు నుంచి రూ. 5.2 కోట్లుకు పెంచేసింది. పైగా అందుకోసం కమిషన్‌ ముందు పలు పత్రాలను కూడా సమర్పించింది. వినియోగదారుల కమిషన్‌ ఆ పత్రాలను పరిశీలించి ఆమె ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లింపు జరిగే రోజుకి రూ. 9 వడ్డీతో కలిపి మళ్లీ రూ. 2 కోట్లు పరిహారంగా మంజూరు చేసింది. 

    దాంతో మనస్తాపం చెంది బ్యూటీ సెలూన్‌ మళ్లీ సుప్రీంకోర్టులో మరో అప్పీల్‌ దాఖలు చేసింది. దీంతో ఆ మహిళ సుప్రీంకోర్టు ముందు, ఆమె తాను ఉన్నత విద్యావంతురాలైన మహిళనని, కలకత్తాలోని ఐ.ఐ.ఎం. నుంచి మేనేజ్‌మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా కూడా చేశానని పేర్కొంది. ఆ సెలూన్‌లో హెయిర్‌ కటింగ్‌ చేసుకోకముందు తనకు మంచి కెరీర్‌ ఉందని చెప్పింది. కానీ బ్యూటీ సెలూన్‌ దానిని ఖండించింది. 

    హెయిర్‌ అనేది ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉన్న అంశంగా వాదించింది. పైగా ఎగ్జిక్యూటివ్‌ పదవుల్లో ఉన్నవాళ్లు సినీ సెలబ్రిటీలు లేదా మోడలింగ్‌ వాళ్ల మాదిరిగా జుట్టు కత్తిరించుకోకూడదని వాదించింది. అందువల్ల జాబ్‌ కెరీర్‌ పాడైందని, ఉన్నతి పదవులు కోల్పోయానని, భారీ వేతనం అదుకోవాల్సిన తాను తక్కువ మొత్తంలో జీతం పొందుతున్నానని తన గోడును వినిపించింది. అంతేగాదు హెయిర్ కట్ కోసం వెళ్ళినప్పుడు, మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో పనిచేస్తున్నానని, కానీ జూన్ 2018లో తన ఉద్యోగాన్ని ఈ కారణంగా కోల్పోయానని పేర్కొంది. 

    అయితే ఈ సంఘటనకు ముందు, తర్వాత ఆదాయ పన్ను రిటర్న్‌లను సమర్పించడంలో విఫలమైందని సెలూన్‌ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే అంత భారీ మొత్తంలో నష్ట పరిహారం పొందేలా సరైన ప్రామాణిక పత్రాలు ఏమి సమర్పించ లేదని కోర్టు గుర్తించింది. దాంతో కోర్టు కేవలం బాధతురాలి అంచనాలు, ఆమె ఇష్టాఇష్టాలను అనుసరించి పరిహారం ఇవ్వరని స్పష్టం చేసింది. 

    అలాగే ఈ న్యాయపోరాటంలో గతంలో సదరు సెలూన్‌ 25 లక్షలు కోర్టులో డిపాజిట్‌ చేసిందని గుర్తుచేస్తూ..అంతమొత్తం మీరు సమర్పించిన పత్రాలకు అనుగుణంగా సరిపోతుందని స్పష్టం చేసింది. అంతేగాదు ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో పరిహారం పొందాలంటే..అతనికి జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేస్తారు. అందుకు తగిన డాక్యుమెంట్స్‌, సాక్షాధారాలు కూడా ఉండాలంటూ సదరు మహిళకు చురకలు అంటించింది.

    (చదవండి: అర్జున్‌-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్‌ లుక్‌..!)

     

  • సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌, యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్‌ దిగ్గజాలు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్‌-రాధిక మర్చంట్‌ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్‌ సానియాల వివాహం జరగడం విశేషం. 

    ఆ నేపథ్యంలో ఆ సచిన్‌ టెండూల్కర్‌ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్‌ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉండే రిలయన్స్‌ ఛైర్మన్‌, తన సిగ్నేచర్‌స్టైల్‌తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్‌ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్‌ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్‌ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. 

    ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్‌ అత్యంత హైలెట్‌గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్‌ ఐవరీ బంగారు సిల్క్‌ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్‌లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్‌ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్‌ బోర్డర్లు చీర లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. 

    ఆ చీరకు సింపుల్‌గా స్టేట్‌మెంట్‌ డైమండ్‌ నెక్లస్‌ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్‌ స్టడ్‌ పోగులు ధరించి స్టైల్‌ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్‌ అంబానీ కూడా క్లాసిక్‌ బ్లాక్‌ బంధ్‌ గలా సూట్‌లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్‌ లుక్‌లో అందరి మనసులను దోచుకున్నారు.

     

    (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్‌ మహీంద్రా)

     

  • కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్‌ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. 

    ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్‌ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్‌ బుక్‌ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. 

    పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్‌ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. 

    ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. 

    అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం పోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్‌ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. 

    స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.

    ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్‌ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.
    (ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్‌ పొంగాల్‌ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).
    – ఇ.ఎస్‌. మాధవన్, విశాఖపట్నం 

    చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!

  • హోలీ వేడుకును అందరు పలు విధాలుగా జరుపుకుంటారు. సహజసిద్ధమైన రంగులతో కొందరు..ప్రకృతిని ఆస్వాదించేలా కొందరు సెలబ్రేట్‌ చేసుకున్నారు. కానీ వాటన్నింటికంటే మన పుడమి తల్లి జరుపుకునే హోలీ వేడుకకు మించిన రంగుల పండుగ మరొకటి ఉండదు. సరిగ్గా చూస్తే దానిలో దాచుకున్న అద్భుతం హే రంగులే.. హే రంగులే ..అన్నట్లుగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియోని పారిశ్రామిక దిగ్గజం షేర్‌ చేస్తూ అందర్నీ ప్రకృతి రమ్యత గూర్చి ఆలోచింపచేసేలా చేశారు.

    ఆ వీడియోలో మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా "హోలీ వేళ తప్పక వీక్షించాల్సిన వీడియో" అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌  చేశారు. ఆకాశం నుంచి చూస్తే..రంగుల వస్త్రాన్ని కప్పుకున్న నేల తల్లిలా అందంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అద్భుతమైన ఎర్రమిరప పంట వైమానిక క్లిప్‌. రైల్వేలైన్‌ ఇరువైపులా ఎండబెట్టిన మిరపకాయలు షీట్‌లు కనిపిస్తాయి. 

    అది చూస్తే ఒకవైపు పచ్చదనం..మరోవైపు ఎరుపు రంగు కలగలసి అద్భుతమైన పెద్ద కాన్వాస్‌ని పోలి ఉంటుంది. భారతదేశంలోని వ్యవసాయ రంగం నుంచి పుట్టుకొచ్చే రంగులే వేరు. బెలూన్‌ రైడ్‌, స్థానిక సంగీతం, నృత్య ప్రదర్శనలకు మించిన సహజసిద్ధమైన రంగుల ప్రదర్శన అని, తానెప్పుడు దీన్ని చూడలేదని రాసుకొచ్చారు మహీంద్రా పోస్ట్‌లో. పర్యాటకులను ఆకర్షించేలా తమ ఆదాయాన్ని పెంచుకునేలా స్థానిక రైతులు చేస్తే బాగుండనని, అయితే ఆ దిశగా ఎవ్వరూ ఆలోచించడం లేదని కూడా అన్నారు. 

    నెటిజన్లు కూడా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ..ఇలా పోస్టలు పెట్టారు. గుంటూరు మిర్చి పొలాలు ఇప్పటికే భారతదేశ సహజ హోలీ కాన్వాస్‌లు. సరైన ప్రణాళికతో రైతులకు మద్దతు ఇచ్చేలా..ఆంధ్రుల గర్వాన్ని ప్రదర్శించే ప్రపంచ స్థాయి వ్యవసాయ-పర్యాటక ఉత్సవంగా మార్చొచ్చు అని పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: తొలి మహిళా తవిల్‌ కళాకారిణి..! ఏ ఆర్‌ రెహమాన్‌ సైతం..)

     

     

International

  • అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్‌ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్‌ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్‌ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్‌ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.

    ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్‌పై ఇంకా ఆపరేషన్‌ ముగియలేదన్నారు.

    మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్‌ పోర్టుపై ఇరాన్‌ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్‌కుమార్‌, దిలీప్‌ సింగ్‌ మృతిచెందారు.

    ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్‌లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్, నేవీ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్‌ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్‌ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు.


     

  • ఇరాన్‌పై  అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.

    ఇరాన్‌లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభమై, భారీ దాడులను కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సమన్వయంతో ఇరాన్‌పై తన దాడులకు అమెరికా సైన్యం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.

    అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ : అమెరికా-ఇజ్రాయెల్  ద్వయం ఇరాన్‌లోని టెహ్రాన్‌ తదితర నగరాల్లో భారీ దాడులు చేపట్టింది. దాడులు మొదలు  పెట్టిన తొలిరోజే  ఇరాన్‌ సుప్రీం అయతుల్లా ఖమేనీని మట్టు బెట్టినట్టు సమాచారం. ఇవి చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత సంక్లిష్టమైన ,అత్యంత ఖచ్చితమైన వైమానిక ఆపరేషన్‌గా అమెరికా అభివర్ణించింది.గత అర్థ శతాబ్ద కాలంగా అమెరికన్లకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన ఇరాన్‌ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

    ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య

    ఈ ఆపరేషన్‌లో, అమెరికన్ దళాలు అనేక అధునాతన విమానాలు, ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని వాడింది.  వీటిల్లో B-2 స్టెల్త్ బాంబర్లు & F-35 ఫైటర్లు  ఉన్నాయి.  ఇవి శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించి నాశనం చేయడానికి రూపొందించిన అధునాతన అమెరికన్ యాంటీ-బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) కూడా అమెరికన్ దళాలు ఉపయోగించాయి. 

    ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌

    అంతేకాదు ఈ యుద్ధంలో మొదటిసారిగా LUCAS (Low-cost Unmanned Combat Attack System) అనే సరికొత్త డ్రోన్లను అమెరికా ప్రయోగించింది. ఇవి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడిన ఇరాన్ 'షాహెద్ 136' డ్రోన్ల నమూనాలో రూపొందించినవి.నిఘా ,ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి MQ-9 రీపర్ డ్రోన్లను వినియోగించింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి విడుదలైన వీడియోలో  "మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు... కానీ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో మేము దీనిని ముగిస్తున్నాము" అని  ఒక స్వరం, అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన దూకుడును సూచిస్తోంది. 

  • అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్‌ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్‌.. యూఎస్‌, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్‌ తేల్చి చెప్పింది.

    హర్మూజ్‌ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్‌.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్‌.. యూఎస్‌, ఇజ్రాయెల్‌, యూరప్‌ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్‌ ప్రకటనతో భారత్‌ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.

    కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్‌ గల్ఫ్, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.

    మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్‌ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌’గల్ఫ్‌ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్‌ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

  • టోక్యో: జపాన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ వన్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఆ సంస్థకు చెందిన కైరోస్ నం.3 రాకెట్‌ ప్రయోగించిన 69 సెకన్ల తర్వాత గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం వరుసగా మూడోసారి. ప్రైవేటు రంగంలో అంతరిక్ష రంగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న జపాన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ.

    కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పని చేస్తుంది. దాని ఎత్తు 18 మీటర్లు. పశ్చిమ జపాన్‌లోని స్పేస్‌పోర్ట్ కీ అనే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఇవాళ ఉదయం 7:40 గంటలకు జరిపారు.

    రాకెట్ నిర్వహణ బాధ్యత జపాన్ సంస్థ స్పేస్ వన్‌ది. ఇందులో 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి. టోక్యోకు చెందిన ఆర్క్ ఎడ్జ్ స్పేస్ సంస్థ తయారు చేసిన పరికరాలు, తైవాన్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాకెట్ విజయవంతంగా ఎగిరినప్పటికీ కొద్ది సమయంలోనే పేలిపోయింది. అందువల్ల కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. ప‍్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ అస్థిర మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రం పైభాగంలో 29 కిలోమీటర్ల ఎత్తులో దాని ప్రయాణం ఆటోమేటిక్‌గా ముగిసింది.

    స్పేస్ వన్ ఉపాధ్యక్షుడు నోబుహిరో సెకినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయోగం ప‍్రారంభించిన సమయంలో, రాకెట్ పరికరాల్లో తమకేమీ లోపాలు కనిపించలేదని తెలిపారు. అయితే, ఆటోనొమస్‌ టెర్మినేషన్‌ సిస్టమ్‌ వ్యవస్థలో లోపం జరిగి ఉండవచ్చని చెప్పారు.

    వరుసగా మూడో వైఫల్యం
    స్పేస్ వన్ కైరోస్ రాకెట్‌కు ఇది వరుసగా మూడో వైఫల్యం. ఇదే రాకెట్ 2024లో జరిగిన రెండు ప్రయోగాల్లో కూడా విఫలమైంది. స్పేస్ వన్ సంస్థ జపాన్ కంపెనీల సంయుక్త ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కానన్, ఏరోస్పేస్ సంస్థ ఐహెచ్ఐ, నిర్మాణ సంస్థ షిమిజు వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

    గత ఏడాది జపాన్ మొత్తం 3 రాకెట్ ప్రయోగాలు మాత్రమే చేసింది. 2030 నుంచి ప్రతి సంవత్సరం 30 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, ఆ దిశగా విజయాలు సాధించడం లేదు.

    రక్షణ అవసరాలు పెరుగుతున్న పరిస్థితి, చైనా అంతరిక్ష ప్రోగ్రాం వేగంగా విస్తరించటం కారణంగా జపాన్‌పై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా రాకెట్లు అభివృద్ధి చేసి అమెరికా రాకెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని జపాన్ ప్రయత్నిస్తోంది.  

    ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ వన్ సహా దేశీయ రాకెట్ స్టార్టప్ సంస్థలకు మిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇచ్చింది. ఇప్పటివరకు జపాన్‌లో ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాణిజ్య రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేయలేకపోయింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో స్పేస్ వన్ ఇంకా ప్రకటించలేదు.

     

  • బీజింగ్: ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, జియోపాలిటికల్ విశ్లేషకుడు షూఏచిన్ జియాంగ్ (Xueqin Jiang) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై కొనసాగుతున్నప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికా ఓటమి తప్పదని అంచనా వేశారు.

    జియాంగ్‌ ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ప్రాచీన గ్రీకు చరిత్రలోని అథెన్స్‌ సిసిలీ యాత్రతో పోల్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అధిక ఖర్చులు, వ్యూహపరమైన తప్పిదాలు కారణంగా అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతుందని చెప్పారు.

    1976లో చైనాలో జన్మించిన జియాంగ్, యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీజింగ్‌లోని మూన్‌షాట్ అకాడమీలో చరిత్ర, తత్వశాస్త్రం బోధిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన సంస్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రయత్నాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024లో ఆయన ఇచ్చిన ఒక లెక్చర్‌లో, అమెరికా-ఇరాన్ యుద్ధం తప్పనిసరిగా జరుగుతుందని, అది అథెన్స్‌ సిసిలీ యాత్ర లాంటి ఘోర పరాజయానికి దారితీస్తుందని చెప్పారు. ఆయన అంచనాలు ఇప్పటివరకు నిజమవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ఆయనను చైనాకు చెందిన నోస్ట్రాడమస్‌గా అభివర్ణిస్తున్నారు. 

    ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జియాంగ్ చేసిన విశ్లేషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్ర ఆధారంగా భవిష్యత్తు అంచనా వేసే ఆయన విధానం, గేమ్ థియరీ వినియోగం, జియోపాలిటికల్ విశ్లేషణలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, షూఏచిన్ జియాంగ్ ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, చరిత్రను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు అంచనా వేసే విశ్లేషకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.

     

Cartoon