Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి ఢిల్లీ: కేంద్ర హోం శాఖ కార్యదర్శి  గోవింద్ మోహన్ కి వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈమెయిల్  చేశారు. ప్రస్తుతం ఏపీలో విధ్యంసకర పరిస్థితులు నడుస్తున్నాయని ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేసారని  ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

    మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేశారని  రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారని తెలిపారు.  ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారని  పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రైక్షక పాత్ర వహించారని తెలిపారు.  ఫలితంగా హింస ఇంకా కొనసాగుతోందన్నారు.  దాడిని నియంత్రించేందుకు  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారని ఆరోపించారు.  ప్రజల పౌరులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.  

    పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని కనుక కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకొని శాంతిభద్రతలను చక్కదిద్దాలని విన్నవించారు.  పౌరుల ప్రాణాలను రక్షించేందుకు తగ్గిన చర్యలను తీసుకోవాలని పరిస్థితులు మరింత దిగజారకుండా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. 

  • గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్‌ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.  అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని కేసు రెండు కేసులు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్‌విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు. ఈ రోజు(శనివారం, జనవరి 31వ తేదీ) ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. టీడీపీ మూకలు.. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు..  ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు.  ఇదిలా ఉంచితే అంబటి రాంబాబును అరెస్ట్‌కు ముందే రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రాత్రి ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. అంబటిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.  ఉద్రిక్తతల నడుమే అంబటిని అరెస్ట్‌ చేశారు.

    కాగా, అంబటిని హత్య చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్‌, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.

    టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్‌సెట్‌ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.

    ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే పొద్దున్నుంచీ  ఇలా హైడ్రామా నడిపిన కూటమి ప్రభుత్వం.. చివరకు అంబటిని అక్రమంగా అరెస్ట్‌ చేయించింది.

    అసలేం జరిగిందంటే.. 
    తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు.

    అయితే.. గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు . అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్‌ హల్‌చల్‌ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై దాడికి యత్నించే సమయంలో పోలీసులు చోద్యం చూశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. అయితే  రాత్రి సమయంలో అంబటి ఇంటి వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు.. అంబటిని గుంటూరు నివాసంలోనే అరెస్ట్‌ చేశారు.

  • గుంటూరు:  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బార్య విజయలక్ష్మి హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. తమను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. తమతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

    ఈ మేరకు ఆమె హౌజ్‌ మోహస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. శాంతి భద్రతల సమస్య ఉందని, పోలీసులు రక్షన కల్పించడంలో విఫలమయ్యారని పిటిషన్‌లో స్పష్టం చేశారు.  24 గంటల పాటు తమకు రక్షణ కల్పించాలని కోరారు. 

    కాగా, టీడీపీ గూండాలు.. శనివారం ఉదయం అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు..  ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు. కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్‌, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.

    టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్‌సెట్‌ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.

    ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. 

  • గుంటూరు: తమ నేతకు ప్రాణ హాని ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పట్టించుకోవడం లేదు. పలుమార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో పాటు స్వయంగా వైఎస్సార్‌సీపీ నేతలు.. ఎస్పీని కలిసేందుకు ఆఫీస్‌కు వెళ్లారు. అయితే ఎస్పీ ఆఫీస్‌ తలుపులు కొడుతున్నా పట్టించుకోనట్లే ఉండిపోయారు. 

    ఎస్సీని కలిసేందుక వెళ్లిన వారిలో మాజీ హోంమంత్రి సుచరిత, మోదుగుల, అన్నాబత్తుని శివకుమార్‌, డైమండ్‌ బాబులు ఉన్నారు. అయితే వారు ఎస్పీ గేటు ముందే నిలబడి పిలిచినా సిబ్బంది పట్టించుకోలేదు. 

    దీనిపై సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటికి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఉదయం ఆయనపై హత్యాయత్నం జరిగింది. అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నం చేశారు. అంబటికి ప్రాణహాని ఉంది. రక్షణ ‍కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని పేర్కొన్నారు.

  • విశాఖపట్నం : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ ద్వారక నగర్ లోని ఎంఎస్‌ఎంఈ (MSME) ఫోకస్డ్ ఎన్‌బీఎఫ్‌సీ 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.

    సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై (MSME) దృష్టి సారించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) 'సారథి ఫైనాన్స్' ఆధ్వర్యంలో  విశాఖపట్నంలో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ చేపడుతున్న దేశవ్యాప్త సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

    ఈ సందర్భంగా రక్తదానం చేసేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ఆరుగురు వ్యక్తులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్ లెట్లు, ఎర్ర,తెల్ల రక్త కణాలు వంటి కంపోనెంట్లు అందించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

    దాదాపు10 లీటర్ల రక్తాన్ని సేకరించి, స్థానిక ఆసుపత్రుల్లోని రోగుల  అవసరాల కోసం రక్త నిల్వల కొరతను తీర్చడానికి అందజేశారు. స్థానిక ఆరోగ్య వ్యవస్థలకు మద్దతుగా సారథి ఫైనాన్స్ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ఇటువంటి డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

  • సాక్షి, గుంటూరు: అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటిని పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌.. రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయన్న వైఎస్‌ జగన్‌.. ఉద్దేశపూక్వకంగానే హత్యాయత్నం, దాడులకు దిగారన్నారు. ప్రజలన్నీ చూస్తున్నారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారు.  అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ విషయంలో సిట్‌ ల్యాబ్‌ రిపోర్టుల ఫలితాలతో అడ్డంగా దొరికిపోవడంతో బాబు హింసను రాజేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయన్న వైఎస్సార్‌సీపీ.. పథకం ప్రకారమే అంబటిపై హత్యాయత్నం చేశారని పేర్కొంది. అంబటిపై  హత్యాయత్నాన్ని కేంద్ర హొంశాఖ దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లనుంది. కేంద్ర హోంశాఖకు వైవీ సుబ్బారెడ్డి లేఖ రాయనున్నారు.

     

     

  • అమరావతి:  మాజీ మంత్రి అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.  అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసిన నేపథ్యంలో డీజీపీకి లేఖ రాసింది వైఎస్సార్‌సీపీ. అంంబటి ప్రాణానికి ముప్పు ఉందంటూ వైఎస్సార్‌సీపీ ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా చీఫ్‌ సెక్రటరీ, డీజీపీకి లేఖలు రాసింది. అయితే చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలు ఫోన్లు ఎత్తలేదు. 

    దాంతో అంబటికి కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని డీజీపీకి లేఖ రాయడంతో పాటు మెయిల్‌ చేసింది వైఎస్సార్‌సీపీ . అంబటి ఇంటివద్ద పరిస్థితి చాలా  దారుణంగా ఉందని, డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని లేఖలో పేర్కొంది. అంబటి ప్రాణానికి ముప్పు ఉందని,, మూడు గంటలకుపైగా అక్కడే ఉండి టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నాయని లేఖ ద్వారా స్పష్టం చేసింది. 

    ఇవీ చదవండి:

    మాజీ  మంత్రి అంబటిపై హత్యాయత్నం

    ‘ఏపీలో చట్టం లేదు.. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది’

     

  • విజయవాడ:  విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు చంద్రబాబును వదలడం లేదు. చంద్రబాబు స్కిల్ కేసును క్లోజ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఎంఎల్ఏ కోర్ట్ లో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది ఈడీ.  స్కిల్ స్కామ్‌లో పాత్రధారులైన డిజైన్ టెక్ పై ఫిర్యాదు నమోదు చేసింది.  వికాశ్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్‌తో పాటు పలువురిపై అభియోగాలు మోపింది. 

    ఈ కేసులో భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ముకుల్ చంద్ర అగర్వాల్,సురేష్ గోయల్ సహకారంతో దారిమళ్లించినట్టు పేర్కొన్న ఈడీ..స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించింది. 

    2023లోనే రూ. 31.20 కోట్లు ఆస్తులు కూడా అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా మరింత లోతుగా దర్యాప్తు చేసినట్టు వెల్లడించింది. అదనపు విచారణలో ఢిల్లీ, ముంబయి, పూణెలో ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. నిందితులకు చెందిన మరో రూ. 23.54 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మొత్తం రెండు దఫాలుగా 54.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది. తాజా దర్యాప్తు అంశాలతో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ని విచారణకు స్వీకరించింది కోర్టు.

    ‘ఏపీలో చట్టం లేదు.. రెడ్‌బుక్‌ పాలన నడుస్తోంది’

  • గుంంటూరు: ఏపీలో చట్టం లేదని, రెడ్‌బుక్‌ పరిపాలన మాత్రమే కొనసాగుతుందని  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగమే నడుస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ రోజు(శనివారం, జనవరి 31) గుంటూరు నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

    ‘లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు అన్నారు. ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నివేదిక చెప్పింది. టీడీపీ మళ్లీ దుష్ప్రచారం చేస్తూ మళ్లీ ఫ్లెక్సీలు పెట్టింది. ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పా. నన్ను బూతులు తిడుతూ నానా హంగామా చేశారు. నన్ను తిట్టిన వారిని మాత్రమే తిట్టా. నేను చంద్రబాబున బూతులు తిట్టలేదు. నేను తిట్టి ఉండాల్సింది కాదు.. కానీ ఆవేశంలో తిట్టేశా.  

    నన్ను తిట్టిన వాళ్లను తిట్టడం నా అంతరాత్మకు తప్పనిపించింది. కేసు పెట్టుకుంటే పెట్టుకోండి.. అరెస్ట్‌ చేస్తే చేసుకోండి. రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది నేను అరెస్టుకు సిద్ధం. నాపై దాడికి యత్నించిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెడ్‌బుక్‌కు నా కుక్క కూడా భయపడదు. నాపై దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం​ చోద్యం చూస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. ఏపీలో చట్టం లేదు.. రెడ్‌బుక్‌ పాలనే నడుస్తోంది’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

    Ambati : చంద్రబాబును తిట్టలేదు..  బూతులతో నన్నే తిట్టారు..

    ఇదీ చదవండి:

    అంబటి ఇంటికి పోలీసులు

    అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ

    అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి యత్నం

Sports

  • తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారత్‌ పెద్ద పండగే చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం జరిగిన ఐదో టి20లో టీమిండియా 46 పరుగులతో కివీస్‌ను ఓడించింది. 4–1 ఆధిక్యంతో సిరీస్‌ను ముగించింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. 

    ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (30 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా సిక్సర్ల మోత మోగించారు. అనంతరం న్యూజిలాండ్‌ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అలెన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 6 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. అర్ష్ దీప్ కు 5 వికెట్లు దక్కాయి.  

    మెరుపు భాగస్వామ్యం... 
    అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సిక్స్‌తో ఖాతా తెరిచిన భారత్‌ తొలి ఓవర్లో మరో 2 ఫోర్లతో 14 పరుగులు సాధించింది. రెండో ఓవర్లోనూ 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 15 పరుగులు పిండుకుంది. సొంత మైదానంలోనూ సామ్సన్‌ (6) మరో అవకాశాన్ని వృథా చేసుకొని నిరాశపర్చాడు. పవర్‌ప్లేలో భారత్‌ స్కోరు 54/2. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ దంచేయడంతో మైదానం హోరెత్తింది. 

    సాంట్నర్‌ పదో ఓవర్లో సూర్య ఓ సిక్స్‌ కొడితే స్ట్రయిక్‌ అందుకున్న కిషన్‌ 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు కూడా వంద దాటింది.  ఓ వైపు నుంచి ఇషాన్, మరోవైపు నుంచి కెప్టెన్ సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్లను నిర్దయగా బాదేశారు. 28 బంతుల్లో ఇషాన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇష్‌ సోధి వేసిన 12వ ఓవరైతే ప్రతి బంతి లైన్‌ అవతలే! 

    మొదటి బంతి వైడ్‌ అయి ఊపిరి పీల్చుకుంటే తర్వాతి బంతుల్ని కిషన్‌ 4, 4, 4, 6, 4, 6లుగా బాదేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 29 పరుగులొచ్చాయి. బౌలర్లు ఎంతమంది మారినా... కిషన్‌ ధాటి మారనేలేదు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక సూర్య నిష్క్రమించాడు. 

    హార్దిక్‌ పాండ్యా కూడా దూకుడుగా ఆడటంతో 16వ ఓవర్లోనే భారత్‌ 200 మార్క్‌ చేరుకుంది. సాంట్నర్‌ 17వ ఓవర్లో పాండ్యా 6, 2, 4, 1 ధాటిని ప్రదర్శిస్తే మిగిలిన 2 బంతుల్ని సిక్స్‌లు బాదిన కిషన్‌ 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్‌ వేసిన మూడో ఓవర్లో (2 పరుగులు, 1 వికెట్‌), సాంట్నర్‌ వేసిన 8వ ఓవర్లో మాత్రమే (5 పరుగులు) భారత్‌ బౌండరీ రాబట్టలేకపోయింది.   

    అలెన్‌ అర్ధ సెంచరీ... 
    ఆరంభంలోనే సీఫర్ట్‌ (5) అవుటైనా... అలెన్, రచిన్‌ రవీంద్ర (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌) న్యూజిలాండ్‌ స్కోరును పరుగెత్తించారు. రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అలెన్‌ దూకుడుకు అక్షర్‌ అడ్డుకట్ట వేశాడు. తర్వాత అర్‌‡్షదీప్, అక్షర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 20 పరుగుల వ్యవధిలో ఫిలిప్స్‌ (7), రచిన్, సాంట్నర్‌ (0) వికెట్లను కోల్పోవడంతో కివీస్‌ పనైపోయింది. మిచెల్‌ (26), ఆఖర్లో ఇష్‌ సోధి (15 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్‌ 200 పైచిలుకు పరుగులు దాటగలిగింది.

    తిలక్‌ వర్మ రెడీ... 
    టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన తిలక్‌... బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. అతడు మంగళవారం ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన సంజు సామ్సన్‌ స్థానంలో టి20 ప్రపంచకప్‌లో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్‌ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.  

    3 టి20ల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. గతంలో 297/6 (బంగ్లాదేశ్‌పై), 283/1 (దక్షిణాఫ్రికాపై) సాధించింది.

    3 రోహిత్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా సూర్యకుమార్‌ (3030) నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మైలురాయిని దాటిన 12 మందిలో అతి తక్కువ బంతుల్లో (1822) సూర్య ఈ ఘనతను అందుకోవడం విశేషం.

    1 అర్ష్ దీప్  కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) నమోదు చేశాడు.

    స్కోరు వివరాలు 
    భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) ఫెర్గూసన్‌ 30; సామ్సన్‌ (సి) జాకబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 6; ఇషాన్‌ కిషన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) డఫీ 103; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) సీఫర్ట్‌ (బి) సాంట్నర్‌ 63; పాండ్యా (సి) జాకబ్స్‌ (బి) జేమీసన్‌ 42; రింకూ నాటౌట్‌ 8; దూబే నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–31, 2–48, 3–185, 4–233, 5–261. బౌలింగ్‌: డఫీ 4–0–53–1, జేమీసన్‌ 4–0–59–1, ఫెర్గూసన్‌ 4–0–41–2, ఇష్‌ సోధి 3–0–48–0, ఫిలిప్స్‌ 1–0–10–0, సాంట్నర్‌ 4–0–60–1. 

    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫర్ట్‌ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్  5; అలెన్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 80; రచిన్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్  30; ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 7; మిచెల్‌ (బి) అర్ష్ దీప్  26; సాంట్నర్‌ (సి) సూర్య (బి) అర్ష్ దీప్  0; జాకబ్స్‌ (బి) వరుణ్‌ 7; జేమీసన్‌ (బి) అర్ష్ దీప్  9; ఇష్‌ సోధి (సి) అర్ష్ దీప్  (బి) రింకూ 33; ఫెర్గూసన్‌ (బి) అక్షర్‌ 3; డఫీ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 225 వికెట్ల పతనం: 1–17, 2–117, 3–131, 4–137, 5–137, 6–166, 7–179, 8–180, 9–191, 10–225. బౌలింగ్‌: అర్ష్ దీప్  4–0–51–5, పాండ్యా 2–0–15–0, బుమ్రా 4–0–58–0, వరుణ్‌ 4–0–36–1, అక్షర్‌ 4–0–33–3, అభిషేక్‌ 1–0–13–0, రింకూ సింగ్‌ 0.4–0–7–1.  

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. 

    కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్‌..  4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్‌, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.

    అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చ‌రిత్ర సృష్టించాడు. ఈ ఫీట్‌ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది. 

    తాజా మ్యాచ్‌తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్‌ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు.
     

  • తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంస‌న్ ఆరంభంలోనే ఔటైన‌ప్ప‌టికి మిగితా బ్యాట‌ర్లు మాత్రం కివీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేశారు.

    వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో మెరిశాడు. సంజూ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఓవ‌రాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 

    అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్‌, జేమిసన్‌, డఫీ తలా వికెట్ సాధించారు.

  • తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంసం సృష్టించాడు. గ్రీన్ ఫీల్డ్ మైదానం‍లో కిషన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. బౌలర్ ఎవరైనా తనకు తెలిసింది హిట్టింగ్ ఒక్కటే అన్నట్లగా కిషన్ ఇన్నింగ్స్ కొనసాగింది.

    ఈ క్రమంలో కిషన్ కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు ప్రత్యర్ధి ప్లేయర్లు సైతం ఫిదా అయిపోయారు.

    అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

  • టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయ్యాడు.

    6 బంతులు ఎదుర్కొన్న శాంసన్‌ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి  తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో జాకబ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంస‌న్ కేవ‌లం 46 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డిని నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

    తిల‌క్ వ‌ర్మ పున‌రాగ‌మ‌నం చేస్తే తుది జ‌ట్టులో సంజూ స్ధానం గ‌ల్లంతే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కార‌ణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ.. త్వ‌ర‌లోనే జ‌ట్టులో చేర‌నున్నాడు. తిల‌క్ జ‌ట్టులోకి వ‌స్తే ఇషాన్ కిష‌న్ లేదా సంజూ శాంస‌న్‌లో ఎవ‌రో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వ్వాలి. 

    అయితే ఇషాన్ త‌న రీఎంట్రీలో స‌త్తాచాటుతున్నాడు. శాంస‌న్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెన‌ర్‌గా కూడా కిష‌న్‌కు మంచి రికార్డు ఉంది. ఈ నేప‌థ్యంలో సంజూపై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. ఇషాన్‌ కిష‌న్.. అభిషేక్‌తో కలిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంది.

    అంతకుముందు శుభ్‌మన్‌ గిల్‌ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్‌కే పరిమితం చేశారు. ఆసియాకప్‌, సౌతాఫ్రికా సిరీస్‌లో ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. దీంతో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  ఈ క్రమంలో గిల్‌ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్‌ను ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉపయోగించుకోలేకపోయాడు.

  • ఆస్ట్రేలియా ఓపెన్-2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ 1 ఆర్యనా సబలెంకాపై  6-4, 4-6, 6-4 తేడాతో విజయం సాధించిన రిబకినా.. తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఈ ఫైనల్ మ్యాచ్ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది.

    తొలి సెట్‌లో నిలకడైన ఆటతో 6-4 తేడాతో రిబకినా గెలచుకుంది. అనంతరం సబలెంకా తన మార్కు పవర్ హిట్టింగ్‌తో పుంజుకుంది. ఈ సెట్‌లో రిబకినాను 6-4 తేడాతో ఓడించిన సబలెంక.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్‌లో కూడా సబలెంకా సత్తా చాటింది. 

    వరుస గేమ్‌లు గెలుస్తూ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి టైటిల్ దిశగా సాగింది. అయితే ఆదే సమయంలో ఎలెనా రిబకినా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచింది. సబలెంకా సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్ చేసిన రిబకినా, 6-4 తేడాతో సెట్‌ను సొంతం చేసుకుంది. తద్వారా తొలి ఆసీస్ ఓపెన్ టైటిల్ ఆమె ఖాతాలో చేరింది.

  • తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్‌-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

    అదేవిధంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్‌, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్‌, అలెన్‌, నీషమ్‌,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.

    తుది జ‌ట్లు
    న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

    భారత్‌: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీప‌ర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
     

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. శుక్ర‌వారం ప‌ల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 11 ప‌రుగుల తేడాతో(డ‌క్ వ‌ర్త్ లూయిస్‌) ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. తొలుత వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 17 ఓవ‌ర్లకు కుదించారు. ఈ క్ర‌మంలో మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 16.2 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

    శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండిస్(37) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. పాతుమ్ నిస్సంక (23), ష‌న‌క‌(20) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. 16 ఓవ‌ర్ వేసిన క‌ర‌న్  దాసున్ షనక, మహీష్ తీక్షణ, మతీష పతిరాణ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.

    అత‌డితో పాటు అదిల్ ర‌షీద్ మూడు, డాస‌న్ రెండు, ఓవ‌ర్ట‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు.  అనంత‌రం ల‌క్ష్య చేధ‌నలో ఇంగ్లండ్ 15 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అయితే 15 ఓవర్ల తర్వాత భారీ వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు.

    అప్పటికే డక్‌వర్త్ లూయిస్ పార్ స్కోర్ కంటే ఇంగ్లండ్ 11 పరుగులు ముందంజలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (46) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. టామ్ బాంటన్ (29), బ‌ట్ల‌ర్‌(17) రాణించాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు సాధించాడు.
     

  • ఐపీఎల్‌-2026లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ విశాల్‌ నిషాద్‌ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్‌ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.

    అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్‌ లీగ్‌ విశాల్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్‌పూర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

    గతేడాది సీజన్‌లో అతడు ఐపీఎల్‌లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం​ లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్‌మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.

    విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్‌, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. 

    మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో  ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు.
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు రంగం సిద్ద‌మైంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి భార‌త్, శ్రీలంక వేదిక‌ల‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా అన్నది? ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం త‌మ జ‌ట్టును శ్రీలంక‌కు పంపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌గా.. మ‌రోవైపు  ప్ర‌భుత్వ‌ అనుమతి కోసం ఇంకా పీసీబీ ఎదురు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.

    ఒక‌వేళ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వ‌స్తే ఫిబ్ర‌వ‌రి 2న శ్రీలంక‌కు పాక్ ప‌య‌నం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం త‌మ కొత్త జెర్సీని ఆసీస్‌తో రెండో టీ20 సంద‌ర్భంగా విడుద‌ల చేస్తామ‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు త‌మ జెర్సీ కిట్ లాంచ్‌ కార్య‌క్ర‌మాన్ని పీసీబీ ర‌ద్దు చేసింది.

    ఇందుకు  ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి లభించకపోవడమేనని తెలుస్తోంది. పాక్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొన‌డంపై తుది నిర్ణయం సోమవారం(ఫిబ్ర‌వ‌రి 2) వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ఇప్ప‌టికే త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే.

    అయితే బంగ్లాదేశ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తూ  పీసీబీ కూడా టోర్నీని బ‌హిష్క‌రిస్తుమ‌ని ఉడత బెదరింపులకు దిగింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకోవడంతో పీసీబీ వెనుక్కి తగ్గింది. కానీ టోర్నీలో పాల్గోనడంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.

    వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి పాక్ జ‌ట్టు ఇదే
    సల్మాన్ అఘా (కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్‌
     

  • ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట మార్చాడు. నైట్‌క్లబ్‌ గొడవ విషయంలో గతంలో తాను అబద్ధం చెప్పినట్లు అంగీకరించాడు. సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే తాను ఆరోజు అలా మాట్లాడినట్లు తాజాగా స్పష్టం చేశాడు.

    దెబ్బలు తిన్న బ్రూక్‌
    గతేడాది ఇంగ్లండ్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మూడో వన్డేకు ముందు (అక్టోబరు 31 రాత్రి) హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మద్యం తాగాడనే అనుమానంతో ఓ బౌన్సర్‌ అతడిని అడ్డుకున్నాడు. దీంతో బ్రూక్‌ వాగ్వాదానికి దిగగా.. సదరు బౌన్సర్‌ అతడిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి.

    హద్దుమీరి ప్రవర్తించాను
    ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత.. యాషెస్‌ టెస్టు సిరీస్‌ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆరోజు నేను హద్దుమీరి ప్రవర్తించాను. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. నా ప్రవర్తన నా జట్టు, దేశానికి తలవంపులు తీసుకువచ్చింది.

    కెప్టెన్‌గా నాకు దక్కిన గౌరవానికి భంగం కలగకుండా ఇకపై ఇలాంటి తప్పులు చేయబోను’’ అని బ్రూక్‌ మీడియా ముఖంగా తెలియజేశాడు. ఆ సమయంలో నైట్‌క్లబ్‌కు తాను ఒక్కడినే వెళ్లినట్లు పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. బ్రూక్‌కు రూ. 33 లక్షల మేర జరిమానా విధించింది. అంతేకాదు.. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

    జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడా
    అయితే, ఈ విషయంపై టెలిగ్రాఫ్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది. బ్రూక్‌తో పాటు జేకబ్‌ బెతెల్‌, జోష్‌ టంగ్‌ కూడా ఉన్నారని.. వారికి కూడా ఫైన్‌ పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో శుక్రవారం నాటి తొలి టీ20లో విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ స్పందించాడు.

    ‘‘వెల్లింగ్‌టన్‌లో నా చర్యలకు నేనే పూర్తి బాధ్యత వహిస్తాను. ఆరోజు నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారని నేను అంగీకరిస్తున్నా. గతంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా.

    గుణపాఠాలు నేర్చుకుంటున్నా
    అయితే, ఆరోజు నా సహచర క్రికెటర్లను కాపాడుకునేందుకు మాత్రమే అలా అబద్ధం చెప్పాను. వారిని వివాదంలోకి లాగవద్దని భావించాను. ఈ విషయంలో నేను మళ్లీ క్షమాపణలు కోరుతున్నా. నా కెరీర్‌లో ఇప్పుడు కఠిన, సవాలుతో కూడిన దశ నడుస్తోంది. దీని నుంచి నేను ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్‌ వెల్లడించాడు.

    చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్‌ బ్యాటర్‌ మాథ్యూ షార్ట్‌ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.

    కమిన్స్‌ స్థానంలో అతడే
    కమిన్స్‌, షార్ట్‌ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది.  ఈ విషయం గురించి సెలక్టర్‌ టోనీ డోడ్‌మేడ్‌ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్‌ కమిన్స్‌కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.

    కమిన్స్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ పేసర్‌ బెన్‌ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్‌లో రాణించడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్‌ చేయగల బెన్‌ రాక పేస్‌ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.

    మాథ్యూ షార్ట్‌కు బదులు అతడే
    అదే విధంగా.. మాథ్యూ షార్ట్‌ స్థానంలో మ్యాట్‌ రెన్షాను వరల్డ్‌కప్‌ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్‌బాల్‌ క్రికెట్‌లో, బిగ్‌బాష్‌ లీగ్‌లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.

    కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆసీస్‌ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్‌ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

    చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

National

  • ‘డంకీ రూట్' ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తూ.. రోజుకు సగటున 65 మంది భారతీయులు పట్టుబడుతున్నారు. అధికార గణాంకాల ప్రకారం గత ఏడాది (2025) జనవరి నుంచి డిసెంబర్ వరకు అమెరికన్ బోర్డర్ అండ్ కస్టమ్స్ విభాగం మొత్తం 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకుంది. గతంతో పోలిస్తే అక్రమ ప్రవేశాలు తగ్గినప్పటికీ.. ఇది పూర్తిగా ఆగలేదు. జో బైడెన్(2024) హయాంలో మొత్తం 85,119 మంది భారతీయులు పట్టుబడ్డారు.

    అయితే, ఈసారి గణాంకాల్లో మార్పు కనిపించింది. పట్టుబడిన భారతీయులందరూ ఒంటరి(సింగిల్‌)గా ప్రయాణిస్తున్నవారే. 2024లో అరెస్టయిన వారిలో దాదాపు 20 వేల మంది తమ కుటుంబంతో కలిసి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా.. కెనడా, మెక్సికో సరిహద్దుల కన్నా ఇప్పుడు టర్కీ-దుబాయ్ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే వారి సంఖ్య పెరిగింది.

    సరిహద్దుల వారీగా..
    సరిహద్దుల వారీగా గణాంకాలు పరిశీలిస్తే.. కెనడా సరిహద్దులో 6,968, మెక్సికో సరిహద్దుల్లో 1,543, ఇతర నగరాల్లో అత్యధికంగా 15,319 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. టర్కీ-దుబాయ్ రూట్ నుండి నేరుగా విమానాల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. పర్యాటక వీసాల (Vacation Visa) పేరుతో అమెరికాలోకి వెళ్లి, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతున్న (Overstay) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2025లో మొత్తం 3,254 మంది భారతీయులను డిపోర్ట్ చేశారు. 2009 తర్వాత ఇదే అత్యధికం.

    డంకీ రూట్‌ అంటే?
    విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు ఉపయోగించే మార్గాన్నే ‘డంకీ’ రూట్‌గా అంటారు. ఈ పదం.. పంజాబీ వాడుక భాషలో నుంచి  వచ్చింది. ప్లానింగ్‌ లేకుండా ఒకచోట నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం.. నకిలీ పత్రాలతో షిప్‌ కంటైనర్లు, వాహనాల సీక్రెట్‌ కంపార్టుమెంట్లలో దేశ సరిహద్దులు దాటడం అన్నమాట. మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లాలనే కోరిక.. కానీ చదువు, సరైన అర్హతలు లేకపోవడంతో చాలామంది అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు.

    డబ్బు ఆశతో  పలువురు ఏజెంట్లకు చిక్కుతున్నారు. వారి మాటలకు ఆకర్షితులవుతున్నారు. సరిహద్దు దాటాక పోలీసులకు దొరికిపోవడంతో వారిని 'ఇమిగ్రేషన్ క్యాంప్' (జైలు)కు పంపిస్తున్నారు. కొన్సి సందర్భాల్లో కోర్టు అనుమతితో వీరు అక్కడ పని చేసుకునే వీలు కలుగుతుంది. 8-10 ఏళ్లలో గ్రీన్ కార్డ్.. ఆ తర్వాత పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఈ కష్టాలను కొందరు భరిస్తున్నారు.

    మూడు ప్రమాదకర మార్గాలు:
    కెనడా మార్గం:
    ముందుగా భారత్ నుండి కెనడాకు టూరిస్ట్ వీసాపై వెళ్తారు. టొరంటో చేరుకున్నాక ఏజెంట్ పిలుపు కోసం హోటళ్లలో వేచి ఉంటారు. అక్కడి నుండి 2,100 కి.మీ దూరంలోని మనిటోబా ప్రావిన్స్‌కు, ఆపై ఎమర్సన్ గ్రామానికి చేరుకుంటారు. ఇది సరిహద్దు ప్రాంతం. ఇక్కడ 40 డిగ్రీల చలిలో, మోకాళ్ల లోతు మంచులో నడుస్తూ అమెరికాలోకి ప్రవేశిస్తారు

    దట్టమైన అడవులు.. ఎడారుల గుండా..
    దక్షిణ అమెరికా ద్వారా వెళ్లే ఈ మార్గం అత్యంత భయంకంగా ఉంటుంది. పనామా అడవులు, నదులు, కొండలను దాటాల్సి ఉంటుంది. 2025లో తిరిగి వచ్చిన హర్జీందర్ సింగ్ అనే వ్యక్తి తన అనుభవాన్ని చెబుతూ.. పనామా అడవుల్లో 10 రోజుల ప్రయాణంలో తినడానికి ఏమీ దొరకలేదని.. దారిలో దాదాపు 40 అస్థిపంజరాలను (మృతదేహాలను) చూశామని తెలిపారు.

    కొలంబియా నది మార్గం:
    పనామా అడవుల ద్వారా వెళ్లడం ఇష్టం లేని వారు కొలంబియా నుండి 150 కి.మీ పొడవైన నదిని దాటుతారు. నికరాగ్వా నుండి మెక్సికో వరకు పడవల్లో ప్రయాణిస్తారు. ఈ మార్గంలో నదిలోని ప్రమాదకర జంతువుల నుండి ప్రాణాపాయం ఉంటుంది.

     

     

  • స్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి  కూడా సబ్బు వాడుతుంటారు. ఈ సబ్బు చరిత్రేమిటో మీకు తెలుసా?  

    కొన్ని కొవ్వులు, నూనెలను ఒక బేస్‌తో కలపడం ద్వారా సబ్బులు తయారవుతాయి. మనుషులు వేల సంవత్సరాలుగా సబ్బునుపయోగిస్తున్నారని చరిత్రకారులు అంటున్నారు. సబ్బుల గురించి సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్‌ గ్రంథాలలో మొదటిసారి ప్రస్తావించారు. ఇప్పుడు మనం చూసే సబ్బులకు గతంలోని సబ్బులకు చాలా తేడా ఉండేది. 

    క్రీ.పూ 2800  ప్రాంతంలో పురాతన బాబిలోన్‌లో సబ్బు లాంటి పదార్థాల ఉత్పత్తికి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నూనె, చెక్క బూడిద మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా సబ్బులు తయారు చేసేవారు. వీటిని ఉన్ని దుస్తులను ఉతకడానికి ఉపయోగించారు. పురాతన ఈజిప్షియన్లు సబ్బును ఔషధంగా కూడా ఉపయోగించారు. జంతువుల కొవ్వులు లేదా కూరగాయల నూనెలను ట్రోనా అనే సోడా యాష్‌ పదార్థంతో కలపడం ద్వారా వీటిని తయారు చేసేవారు.  17వ శతాబ్దం నుండి యూరప్‌లో జంతువుల కొవ్వులకు బదులుగా కూరగాయల నూనెలను వాడి సబ్బులు తయారు చేయడం ప్రారంభించారు. 

    1800 నుంచి సబ్బు ధనవంతులకు తప్పనిసరి వస్తువుగా మారింది. 1853లో సబ్బుల వ్యాపారం ఊపందుకుంది. ఆపై బార్‌ సబ్బులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రకరకాల ఆకృతుల్లో సబ్బులు మార్కెట్లోకి వస్తున్నాయిస్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి కూడా సబ్బు వాడుతుంటారు. 

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : రష్యన్‌ ముద్దుగుమ్మలతో బిల్‌గేట్స్‌ ఆ జబ్బు , అంతేనా!
     

  • బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్,  సీజే రాయ్ అలియాస్‌ చిరియాంకందత్ జోసెఫ్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన నివాసంలో మృతి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్‌ రంగంలోరారాజులా వెలిగిన రాయ్‌ ఆత్మహత్యకు గల కారణాలేంటి? హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్లు, ప్రయణాలతో, చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపిన రాయ్‌ గురించి కొన్ని ఆసక్తి కర సంగతులను పరిశీలిద్దాం

    57 ఏళ్ల CJ రాయ్ మరణం బెంగళూరు రియల్ ఎస్టేట్ , వ్యాపార వర్గాల్లో  తీవ్ర అలజడి రేపింది. రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్, తమ చైర్మన్ సీజే రాయ్ పై తీవ్ర ఒత్తిడి కారణంగానే ఈ దారుణమైన చర్య తీసుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐటీ నిఘా నీడలోఉన్న బడా బడా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన మరణం వెనుక ఉన్నకారణాలపై పోలీసులు కారణాలు దర్యాప్తులో ఉన్నాయి.

    రాయ్ తన కరీర్ ప్రారంభంలో, రాయ్ టెలివిజన్ రియాలిటీ షోల డీల్స్‌,   విజేతలకు బహుమతులివ్వడం,  బ్రాండింగ్ వ్యూహంగా ఉపయోగించాడు. విజేతలకు రియల్ ఎస్టేట్ బహుమతులను అందించేవాడు. మీడియాతో ఎక్కువ సంబంధాలను కలగి ఉండేవాడు. ఇది అతని కంపెనీ పబ్లిక్ ప్రొఫైల్‌ను గణనీయంగా పెంచింది. అలా తన సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్‌ను ప్రముఖ రియల్ ఎస్టేట్‌ సంస్థగా, ముఖ్యంగా బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో పేరున్న సంస్థగా  తీర్చిదిద్దాడు. రాయ్‌  సోషల్ మీడియా ఉనికిని పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి దాదాపు 1.3 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఫీడ్‌లో కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించే పోస్ట్‌లతో పాటు,  హై-ఎండ్ లగ్జరీ కార్లు, హెలికాప్టర్ రైడ్‌లు, ఇతర ప్రయాణ స్టోరీలను క్రమం తప్పకుండా తన ఫాలోయర్లతో పంచుకునేవాడు. అతని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.

     జనవరి 30న సెంట్రల్ ఆదాయపు పన్ను శాఖకు వాంగ్మూలం ఇవ్వడానికి రాయ్ బెంగళూరులోని లాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయానికి జోసెఫ్‌తో కలిసి వచ్చారు. ఆ తర్వాత రాయ్ తన క్యాబిన్‌కు వెళ్లి తన తల్లితో మాట్లాడారు. ఆ తర్వాత  తన క్యాబిన్‌లోకి ఎవ్వరినీ అనుమతించవచ్చని  సెక్యూరిటీకి  చెప్పాడు. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపు లోపలి నుండి లాక్ చేయబడిందని గ్రహించి,బలవంతంగా క్యాబిన్‌ తలుపు బలవంతంగా తెరిచారు. తుపాకీ గాయాలతో పడిపోయి కనిపించారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.

     

    మరోవైపు కేరళకు చెందిన ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి కారణంగా రాయ్ కుటుంబం ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకారం, డిసెంబర్ 3, 6, జనవరి 28 తేదీల్లో బెంగళూరు , ఇతర ప్రాంతాలలో రాయ్ మరియు అతని వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన సోదాలు అనేక సందర్భాల్లో జరిగాయి.  దీనిపై బెంగళూరులోని అశోక్నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో, కాన్ఫిడెంట్ గ్రూప్ ఎండీ రాయ్ మరణానికి దారితీసిన సంఘటనలపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని కోరారు.  సోదాల సమయంలో జరిగిన సంఘటనల క్రమం సహా అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

    భూమి కొనండి, ఇంట్రస్టింగ్‌ రాయ్‌  సందేశం
    రాయ్, తాను 25 ఏళ్ల వయసులో 1994లో కొనుగోలు చేసిన తన తొలి కారును కనిపెట్టిన వారికి  10 లక్షల బహుమతిని ప్రకటించాడు.  ఎర్ర మారుతి 800ను చివరకు తిరిగి పొందారు.1994లో, తన సొంత డబ్బులతో ఆ కారును  రూ.1.10 లక్షలకు కొనుగోలు చేశాడట. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు 27 సంవత్సరాల తర్వాత దానిని తిరిగి సాధించాడట.  1997లో ఈ మారుతి 800 కారును అమ్మేసి, మారుతి ఎస్టీమ్ కొనుగోలు చేశాడు. అప్పటికి భారతీయ రోడ్లపై అత్యంత ఖరీదైన , ఉత్తమమైన కారు. తానెపుడూ ఎప్పుడూ కారు ప్రేమికుడినే కానీ ఫస్ట్‌ కారు ప్రేమే వేరు అని ఒక పోస్ట్‌లో వెల్లడించడం విశేషం ఈ రోజు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్లు ఉన్నప్పటికీ,  తన మొదటి మారుతి 800 అతని అత్యంత విలువైన జ్ఞాపకంగా మిగుల్చుకున్నాడు.

    ఆయన ఇంకో విషయం కూడా చెబుతారు. తన తొలి కారు కొన్నిసమయంలో ఆ డబ్బుతో సర్జాపూర్‌లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేయగలిగేవారు. ఈ రోజు, ఆ 2 ఎకరాల విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని ఒక సందర్బంగా చెప్పాడు. కారు కొనండి.. కారుతోపాటు, ఎంతో కొంత భూమిని కూడా కొనండి. భూమి కుటుంబ సంపదగా మారుతుంది అనేది ఫిలాసఫీ.

Movies

  • లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్‌ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని  పుష్పక విమానంపై ఊయలలూగించారు. జానపదాన్ని ప్రేమించడమేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుత ప్రయోగాలతో అపురూప కళాఖండాలను ఆవిష్కరించిన తెరమాంత్రికుడాయన. కేవలం దర్శకుడిగానే కాదు, సంగీతంలోను ఔరా అనుపించుకున్నారు.  ఆదిత్య 369, భైరవ ద్వీపం, పుష్పక విమానం, మయూరి, బృందావనం వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

    ప్రయోగాత్మక చిత్రాలు తీయాలంటే సింగీతం శ్రీనివాసరావు తర్వాతనే ఎవరైనా అనేలా చెరగని ముద్ర వేశారు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన ఒక కొత్త సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.‌ ఈ చిత్రాన్ని  వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తుండగా రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌  సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మూవీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ ఒక వీడియోను పంచుకుంది. అయితే, సినిమా పేరుతో పాటు నటీనటుల విషయాలను త్వరలో ప్రకటించనున్నారు.

  • నటుడు ధనుష్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కుబేర, ఇడ్లీకడై, హిందీ చిత్రం తేరేఇష్క్‌మే వంటి ప్రాజెక్ట్‌లతో పాన్‌ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటుతున్నాడు. తాజాగా తన 55వ సినిమా వివరాలను ఆయన పంచుకున్నాడు. అమరన్‌ వంటి సంచలన విజయాన్ని సాదించిన చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామితో ధనుష్‌ సినిమా ప్రకటన ఇప్పటికే వచ్చిన విషయం తెలిసిందే. 

    అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చేసింది. ఈమేరకు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఇందులో ధనుష్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్‌ పనిచేస్తున్నారు ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

    ఐసరిగణేశ్‌ తమ వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని సమ్మర్‌ ముగింపు సమయంలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. హీరోయిన్‌ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో మెప్పిస్తుంది. ఇప్పటికే  ‘పరాశక్తి’ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ధనుష్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగమైంది.

  • బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్‌ చేసినవాళ్లు ఒక్కసారిగా సెలబ్రిటీలు అయిపోతారు. కానీ ఆ ఫేమ్‌ కొంతకాలమే ఉంటుంది. పైగా దానివల్ల అవకాశాలు వస్తాయా? అంటే అదీ అంతంతమాత్రమే! చాలా తక్కువమందికి మాత్రమే బిగ్‌బాస్‌ కలిసొస్తుంది. విన్నర్స్‌తో సహా అనేకమందికి షో వల్ల ఎటువంటి ఫాయిదా ఉండదు. అదే బల్లగుద్ది చెప్తోంది నటి ఆర్జే కాజల్‌.

    బిగ్‌బాస్‌ సెలబ్రిటీస్‌
    ఈమె తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొంది. బిగ్‌బాస్‌ నిజస్వరూపం ఇదేనంటూ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. అందులో కాజల్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సెలబ్రిటీస్‌.. జనాలు వాళ్లను సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ, అసలు బిగ్‌బాస్‌ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంతమందికి వాళ్ల రెగ్యులర్‌ వర్క్స్‌, సినిమాలు, షోస్‌, అవార్డ్స్‌ బానే ఉంటాయి. కానీ చాలామంది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. 

    నెక్స్ట్‌ ఏంటి?
    ఎక్కడికి వెళ్లినా మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటనే అడుగుతారు. దానికి ఇబ్బందిగానే ఏమీ లేదని బదులిస్తారు. బద్ధకం వల్లనో, టాలెంట్‌ లేకనో కాదు అవకాశాలు రాక! బిగ్‌బాస్‌ తర్వాత ఫుల్‌ బిజీ, ఫుల్‌ వర్క్‌ అని అందరూ అనుకుంటారు, కానీ అది మూడు, నాలుగు నెలల వరకు మాత్రమే పరిమితం. దానికి తోడు బిగ్‌బాస్‌ ట్రామా, డిప్రెషన్‌! ఇంతకుముందు చేసుకున్న పని మనస్ఫూర్తిగా చేసుకోలేక, కెరీర్‌లో ఎదుగుదల లేక, ముందుకెళ్లలేక, వెనకడుగు వేయలేక సతమతమవుతూ ఉంటారు. 

    జీవితాంతం ఎదురుచూపులు
    యాక్టర్స్‌ పరిస్థితి మరీ దారుణం.. ఆ బిగ్‌బాస్‌ సీజన్‌లో నిన్ను చాలామందే చూశారు, కొత్త ముఖాలు కావాలి అంటారు. చాలామంది ప్రధాన పాత్రల కోసం జీవితాంతం ఎదురుచూస్తూనే ఉంటారు. కొంతమంది క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోతారు. ఇంకొందరు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌తో సరిపెట్టుకుంటారు. రోడ్డుమీదకెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలడుగుతారు. 

    ఫేమ్‌ వల్ల ఏదీ మారదు
    కానీ పని విషయానికి వచ్చేసరికి మాత్రం ఎంతమంది ఫాలోవర్లున్నారు? ఎంత రీచ్‌ ఉంది? అని డబ్బు దగ్గర బేరాలడతారు. బతకడం కోసం కొందరు తక్కువ డబ్బు ఇచ్చినా కాదనలేక చేసుకుంటూ పోతారు. కొంతమంది వేరే కెరీర్‌ ఎంచుకుంటారు. మరికొందరు సైలెంట్‌గా మాయమైపోతారు. బిగ్‌బాస్‌ వల్ల రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోవచ్చు కానీ ఫేమ్‌ ఒక్కటే కెరీర్‌ను నిర్మించదు. బిగ్‌బాస్‌ వల్ల ఏదీ మారిపోదు. అది కేవలం ఫేమస్‌ రియాలిటీ షో. అంతే! అని చెప్పుకొచ్చింది. 

     

     

    చదవండి: ఐశ్వర్యరాయ్‌ తొలి సంపాదన ఎంతో తెలుసా?

  • ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని మెగస్టార్‌ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను సింగర్‌ చిన్మయి విభేదించిన విషయం తెలిసిందే.. సినిమాలో ఛాన్స్‌ రావాలంటే తమ శరీరం అప్పగించాల్సిందేనని ఆమె ఓపెన్‌గానే చెప్పారు. చిరు జనరేషన్‌లో కనిపించిన పరిస్థితిలు ఇప్పుడు లేవని ఆమె అన్నారు. అందుకే మెగాస్టార్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారని ఆమె పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

    క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అన్నారు. 'పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. అయితే, అదీ వారిద్దరి అంగీకారంతోనే కొనసాగుతుంది. ఈ రకంగా చూస్తే చిరంజీవి చెప్పింది కొన్ని సందర్భాల్లో నిజమే. ఆయన చేసిన వ్యాఖ్యలను నేను తప్పబట్టను. కానీ, నా అభిప్రాయం ప్రకారం క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. అయితే, టాలెంట్‌ ఉంటే ఏ అమ్మాయి కూడా  ఇబ్బందులు పడదని చెప్పగలను.  సింగర్‌ చిన్మయి చేసిన వ్యాఖ్యలు కూడా నిజమే.. 

    ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ప్రతి ఏడాది 200 పైగా సినిమాలు వస్తున్నాయి.  అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదు. కేవలం అమ్మాయిలను లోబర్చుకునేందుకే కొందరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ, సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు, నిర్మాతలు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. లైంగిక వేధింపులను ఎదిరించినందుకు సింగర్‌ చిన్మయిని నిషేధించారు. ఆమె ఎవరికీ తల వంచలేదు. ఛాన్స్‌లు ఇవ్వకున్నా సరే ఆమె  ఎవరికీ లొంగలేదు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిరంజీవి వంటి వారు  క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని చెప్పడం వెనుక ప్రధాన కారణం టాలెంట్‌ ఉన్న వాళ్లు ధైర్యంగా ముందుకు రావాలనే చెప్పారనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.

  • మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా సెకండ్‌ సాంగ్‌ను వదిలారు. 

    'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్‌.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్‌.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్‌ జోష్‌తో కొనసాగింది. భీమ్స్‌ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్‌ పవార్‌ లిరిక్స్‌ సమకూర్చాడు. రామ్‌ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.

       

    చదవండి: నవీన్‌ పొలిశెట్టి ఆంధ్ర టూ తెలంగాణ సాంగ్‌ రిలీజ్‌

  • బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. గతకొంతకాలంగా ఆయన చేసిన సినిమాలేవీ విజయాన్ని సాధించడం లేవు. దీంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న "బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌" సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్‌ వదిలారు. అందులో ఓ సన్నివేశంలో సల్మాన్‌ లుక్‌, యాక్టింగ్‌పై ట్రోల్స్‌ వచ్చాయి.

    సల్మాన్‌పై విమర్శలు
    సైనికుడు చూపించే ధైర్యసాహసాలు అతడి ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సల్మాన్‌ తాజాగా కౌంటరిచ్చాడు. ఈ మేరకు ఐఎస్‌పీఎల్‌ (ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌) ఈవెంట్‌లో మాజీ క్రికెటర్‌, యాంకర్‌ మహ్మద్‌ కైఫ్‌తో సల్మాన్‌ సంభాషిస్తున్న వీడియో క్లిప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అందులో కైఫ్‌.. సల్మాన్‌ను బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌లో ఎలా పోజిచ్చాడో అలా ఓ లుక్కివ్వమన్నాడు. 

    నేను కల్నల్‌ని
    అప్పుడు సల్మాన్‌.. ఇప్పుడు కొంతమంది ఇది రొమాంటిక్‌ లుక్‌ అనుకుంటారు.. కానీ, ఇది కల్నల్‌ పోజ్‌. తన జట్టును, సైనికులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలిసిన కల్నల్‌ ఇలాగే ఉంటాడు అంటూ ట్రోలర్స్‌కు చురకలంటించాడు . బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌ సినిమా విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిత్రాంగద సింగ్‌, అభిలాష్‌ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన వీరజవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశభక్తి మూవీ ఏప్రిల్‌ 17న విడుదల కానుంది.

     

    చదవండి:  ఐశ్వర్యరాయ్‌ తొలి సంపాదన ఎంతంటే?

  • ప్రభాస్‌-దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కిన మూవీ ది రాజాసాబ్‌.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో ఫ్యాన్స్‌ దర్శకుడిపై ట్రోల్స్‌కు దిగారు. అయితే, మరోసారి మారుతితో ప్రభాస్‌ సినిమా చేయనున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ కోసం భారీ బడ్జెట్‌ పెట్టనుందని నెట్టింట వైరల్‌ అయింది. దీంతో ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది.

    రాజాసాబ్‌ తర్వాత ప్రభాస్‌ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్‌, కల్కి మూవీలతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభాస్‌ సినిమాల గురించి సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్‌ అని పేర్కొంది. దీంతో మారుతితో ప్రభాస్‌ మరోసారి  ప్రభాస్‌ నటించడం లేదని క్లారిటీ వచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్‌  ఎలాంటి పెట్టుబడులు పెట్టడం లేదని తేలిపోయింది. అయితే, మారుతి దర్శకుడిగా ఒక మిడ్‌ రేంజ్‌ హీరోతో హోంబలే ఫిల్మ్స్‌ ఒక మూవీ తీస్తుందని ప్రచారం జరుగుతుంది.

  • బాలీవుడ్‌లో రిచెస్ట్‌ హీరోయిన్‌, అందాలరాశి ఎవరంటే ముందు ఐశ్వర్యరాయ్‌ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఏలిన ఐష్‌ ఆస్తి విలువ దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న ఐశ్వర్య తొలి సంపాదన ఎంతో చూసేద్దాం..

    తొలి సంపాదన ఎంతంటే?
    బాలీవుడ్‌ నిర్మాత శైలేంద్ర సింగ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఐశ్వర్యరాయ్‌ను తొలిసారి చూసినప్పుడు ఆమెకు 18 లేదా 19 ఏళ్లు ఉంటాయనుకుంటా.. ఐదువేల రూపాయలకే మూడు యాడ్స్‌లో నటించింది. 

    అలా మొదలైంది
    ఒకదాంట్లో అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో ఉందంతే! కానీ ఐశ్వర్య లుక్స్‌ అందరినీ ఆకర్షించేవి. దాంతో వాణిజ్య ప్రకటనలో నటించమని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈయన ఫిరాఖ్‌, ఫిర్‌ మిలేంగే, పేజ్‌ 3 వంటి పలు సినిమాలు నిర్మించాడు.

    జర్నీ
    1994లో మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. జీన్స్‌ అనే తమిళ చిత్రంతో అందరి కంట్లో పడింది. దేవదాస్‌, జోధా అక్బర్‌, ఏ దిల్‌ హై ముష్కిల్‌, హమ్‌ దిల్‌దే చుకే సనం వంటి పలు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌ పలికిస్తూ డ్యాన్స్‌తో అద్భుతః అనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చివరగా పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమాలో యాక్ట్‌ చేసింది. 2009లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.

    చదవండి: సోషల్‌ మీడియా అకౌంట్‌ డిలీట్‌ చేయాలనుకున్నా: ఆలియా

  • నవీన్‌ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్‌ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 'ఆంధ్ర టూ తెలంగాణ' అంటూ సాగే ఈ పాటలో నవీన్ స్టెప్పులకు శాన్వీ మేఘన గ్లామర్‌తో ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను  ధనుంజయ్ సీపానా, సమీర్ భరద్వాజ్ పాడారు. సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు.
     

  • నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడు నటించిన తాజా చిత్రం ఎల్‌ ఐ కే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ). ఈయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒకదానికి మించి ఒకటి సంచలన విజయాలు సాధించాయనేది తెలిసిందే. ఇటీవల విడుదలైన డ్యూడ్‌ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రంతోపాటు ప్రారంభమైన మరో చిత్రమే ఎల్‌ఐకే. కృతిశెట్టి నాయకిగా నటించిన ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్‌ ముఖ్యపాత్రలు పోషించారు.  సెవెన్‌ స్క్రీన్స్‌ స్టూడియో, రౌడీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని దర్శకుడు విఘ్నేష్‌ శివణ్‌ తెరకెక్కించారు.అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు. 

    అయితే, ముందుగా ఈ చిత్రాన్ని గత దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు  నిర్మాతల వర్గం ప్రకటించింది. కానీ, అదే సమయంలో ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన డ్యూడ్‌ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించడంతో ఎల్‌ఐకే చిత్ర విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12 లేదా 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. ఫాంటసీ లవ్‌ కథాంశంతో  రూపొందిన ఈ చిత్ర షూటింగ్‌ను మలేషియా, సింగపూర్‌లో అధిక భాగాన్ని చిత్రీకరించినట్లు  యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా వరుస విజయాలతో జోరుపై ఉన్న నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపైన మంచి అంచనాలే నెలకొంటున్నాయి.

  • అమ్మ అన్న పిలుపుతో ఆడదాని లోకమే మారిపోతుందంటారు. హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా అందుకు అతీతురాలు కాదు. తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోయిందంటోంది ఆలియా. మాతృత్వం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గర్భిణీగా ఉన్న తొమ్మిది నెలల్లో చాలా మార్పులొస్తాయి. శరీరమే కాదు మన ఆలోచన విధానాలు కూడా మారుతుంటాయి. 

    డిలీట్‌ చేయాలన్న ఆలోచన
    ఎప్పుడైతే కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డను కళ్లారా చూస్తామో అప్పుడు పూర్తిగా మనల్ని మనమే మర్చిపోతాం. తనే ప్రపంచంగా మనకే తెలియనంతగా మారిపోతాం. మళ్లీ ఒకప్పటిలా ఉండాలనుకున్నా అది అసాధ్యం. చాలాసార్లు సోషల్‌ మీడియా డిలీట్‌ చేయాలనిపించేది. కానీ నా కెరీర్‌ ప్రారంభం నుంచి నన్ను సపోర్ట్‌ చేసినవారితో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక ఆ ఆలోచన విరమించుకున్నాను. కొన్నిసార్లు నా వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవాలనిపించడం లేదు. 

    నేను కూడా ట్రై చేయాలి
    అది నా పర్సనల్‌ అని నా అభిప్రాయం. నా ఫోన్‌లో మొత్తం రాహా ఫోటోలే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఫోటోలు దిగడానికి ప్రయత్నించాలి అని చెప్పుకొచ్చింది. ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్‌.. లవ్‌ అండ్‌ వార్‌ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా డోంట్‌ బీ షై సినిమా చేస్తోంది.

    చదవండి: సినిమాలు వర్కవుట్‌ కాకపోతే సీరియల్స్‌? చంద్రహాస్‌ ఏమన్నాడంటే?

  • ప్రభాకర్‌ బుల్లితెరపై స్టార్‌ యాక్టర్‌గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్‌ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. రామ్‌నగర్‌ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీయే బరాబర్‌ ప్రేమిస్తా. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

    అది నా లక్ష్యం కాదు
    ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్‌ సీరియల్స్‌పై ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చంద్రహాస్‌ మాట్లాడుతూ.. నేను సీరియల్స్‌ చేస్తాననాలే కానీ నాన్న ఇప్పటికిప్పుడు నాలుగైదు సీరియల్స్‌లో నన్నే హీరోగా పెట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే సీరియల్స్‌ బెటర్‌. నాకు డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు. ఒకవేళ 5, 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు వర్కవుట్‌ కావడం లేదంటే టీవీకి వెళ్లిపోవచ్చు. యాంకర్‌గా రెండు షోలు ఇప్పిస్తాడు లేదంటే సీరియల్స్‌లో హీరోగా చేయిస్తాడు.

    టీవీ చాలా ఈజీ
    నాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అవకాశాలు సంపాదించడం నాకు చాలా ఈజీ.. ఇది ఎప్పటికైనా నాకు బ్యాకప్‌లా పనిచేస్తుంది. కానీ, అంతవరకు రానివ్వను. టీవీని నేను లైట్‌ తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బుపై అంత ఆసక్తి, ఆశ లేదు. నాన్న బాగానే సంపాదించాడు. నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అని చంద్రహాస్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: చిరంజీవి ఫేవరెట్‌ హీరో ఎవరంటే?

  • చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' సినిమాలో బాగా వైరల్ అయిన పాట హుక్ స్టెప్. చిరంజీవి వింటేజ్ స్టెప్పులతో కొరియోగ్రాఫీ చేసిన ఈ సాంగ్.. మూవీ రిలీజ్‌కి ముందు నుంచే తెగ ట్రెండ్ అయిపోయింది. థియేటర్లలోనూ ఇది వస్తున్న జనాలు బాగానే ఎంజాయ్ చేశారు. అలాంటి పాట ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజైంది.

    (ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

    ఇందులో చిరు డ్యాన్స్‌లని ఆట సందీప్, జ్యోతి కలిసి కొరియోగ్రాఫీ చేశారు. వీటికి మంచి ప్రశంసలు కూడా లభించాయి. సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సంతోషంతోనే కొన్నిరోజుల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడికి లగ్జరీ రేంజ్ రేవర్ కారుని కూడా చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. ఇదే మూవీలో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ కూడా నటించడం విశేషం.

    (ఇదీ చదవండి: టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది?)

Politics

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును ట్యాగ్‌ చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు. 

    ‘‘ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు.. ఇప్పుడు  ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్‌రాజ్‌’’గా మారిపోయింది కదా. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    ‘‘మా పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబూ.. మీ  ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం.

    ..తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు.

    ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి   నిదర్శనం. ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబుగారూ. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం.

    వరుసగా మా పార్టీ సీనియర్‌ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

     

  • సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాల దాడులు అత్యంత హేయనీయం అన్నారు. అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని.. రాష్ట్రం మీ ఎస్టేట్‌ కాదు.. ప్రజలు మీ బానిసలు కాదు.. ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని.. రాష్ట్రంలో జంగిల్ రాజు ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. 1000 మందికి పైగా వెళ్లి హత్య చేయాలని ప్లాన్ చేశారు.

    రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాము. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు. కాపులను చంపడం తెలుగుదేశం పార్టీకి కొత్తమీ కాదు. గతంలో వంగవీటి రంగాను చంపించారు. నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ను చంపాలని చూశారు. మీ దాడులను చూస్తూ వైఎస్సార్‌సీపీ ఊరుకోదు’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు.

  • విశాఖ:  ఏపీలో జంగిల్‌ రాజు ప్రభుత్వం నడుస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీడీపీ గూండాలు వ్యవహరించారన్నారు. 

    ‘మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టిడిపి గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 1000 మందికి పైగా వెళ్లి హత్యా చేయాలని ప్లాన్ చేశారు. రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మీకు తిరిగి ఇచ్చేస్తాం. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు.

    కాపులను చంపడం టీడీపీకి కొత్తమీ కాదు. గతంలో ముద్రగడ పద్మనాభంను చంపాలని చూశారు.నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. మీ దాడులను చూస్తూ వైఎస్ఆర్సిపి ఊరుకోదు’ అని హెచ్చరించారు.

  • కరీంనగర్‌: కరీంనగర్‌ మేయర్‌తో పాటు మూడు చైర్మన్‌ పీఠాలు తమవేనని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 31వ తేదీ) కరీంనగర్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ ఇంచార్జ్‌లు, కన్వీనర్లు, కో కన్వీనర్లు సమావేశంలో బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

    ‘ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే మా లక్ష్యం.  గెలిచే చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నాం. గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే ప్రత్యామ్నాయ నేతలకు టిక్కెట్లుటిక్కెట్ రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులతో న్యాయం చేస్తాం. తొందరపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. తప్పుడు ప్రచారాలు నమ్మకండి.  డివిజన్లలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.

  • 31-01-2026
     

    11.12 PM
    అంబటి రాంబాబు కారుకు కూడా నిప్పు పెట్టిన టీడీపీ గుండాలు
    అంబటి రాంబాబు కారు దగ్దం

    11.04 PM
    అంబటి ఆఫీసుకు కరెంట్‌ కట్‌ చేసిన టీడీపీ గుండాలు.

    10:56PM

    • కొనసాగుతున్న టీడీపీ గుండాల అరాచకం 
    • అంబటి ఆఫీసుకు టీడీపీ గుండాల నిప్పు 

    మాజీ మంత్రి అంబటి రాంబాబు వద్ద మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు మళ్లీ రెచ్చిపోయి అంబటి ఇంటి వద్ద దాడికి యత్నించారు. కర్రలతో దాడికి యత్నించారు టీడీపీ గూండాలు. అంబటి ఇంట్లో ఉండగానే రాళ్లు విసురుతూ కర్రలతో నానా హంగామా చేస్తున్నారు. కర్రలు, రాడ్లతో మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు.  శనివారం రాత్రి 10 గంటల సమయంలో దాడులకు పాల్పడుతున్నారు.  అంబటి ఆఫీస్‌ కిటికీలను ధ్వంసం చేశాయి టీడీపీ మూకలు. సుత్తులతో గోడలు బద్దలు గొట్టేందుకు యత్నిస్తున్నారు.

    అంతకుముందు అంబటిపై హత్యాయత్నం జరిగింది. ఆయన్ని హత్య చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్‌, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.

    టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్‌సెట్‌ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.

    ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

     

    Guntur: అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి కారు.. ఫర్నీచర్ ధ్వంసం

    తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు. అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్‌ హల్‌చల్‌ చేసింది.

    మరోవైపు ప్లాన్‌ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్‌ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. 

     

  • సాక్షి, అమరావతి: గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ.. ఏమన్నారంటే..

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్‌ జగన్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ తేల్చి చెప్పాయి. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు.

    ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయం.

    కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ గుండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.

    మా పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి ఒక ఉన్మాద చర్య
    శాంతియుతంగా మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ఇంత బరి తెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఏనాడూ ఇంత దారుణమైన పాలన చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక ఆటవిక రాజ్యమా? ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం.

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్‌ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.

    ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్‌లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్‌ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్‌, లోకేష్‌ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘చంద్రబాబు, పవన్‌ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు.

    Srinivas: నువ్వు సీఎంగా ఉన్నప్పుడు తీసిన శాంపిల్స్ లోనే

     

     

  • సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. ఫోన్‌ నెంబర్లు ఇచ్చి ట్యాప్‌ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు.

    సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.

    ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. 

Business

  • ఇంధన రిటైలింగ్, మొబిలిటీ సంస్థ జియో-బీపీ తాజాగా ఇండియా ఎనర్జీ వీక్‌ సందర్భంగా వినూత్నమైన ’యాక్టివ్‌’ టెక్నాలజీ పెట్రోల్‌ని ఆవిష్కరించింది. కీలకమైన ఇంజిన్‌ విడిభాగాలను శుభ్రంగా ఉంచుతూ, పనితీరును మెరుగుపరుస్తూ, మెయింటెనెన్స్‌ వ్యయాలను తగ్గిస్తూ, అదనంగా ఖర్చులేమీ లేకుండా వాహనం ఏటా మరో 100 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడేలా ఈ ఇంధనం ఉంటుందని సంస్థ తెలిపింది.

    మోటర్‌సైకిల్‌లో నింపి, కోయంబత్తూరులోని టెస్ట్‌ ట్రాక్‌లో 4,000కు పైగా కి.మీ. మేర దీని సామర్థ్యాలను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు సంస్థ చైర్మన్‌ సార్థక్‌ బెహూరియా తెలిపారు. దేశీయంగా వాహనదారులు సాఫీగా నడిచే, విశ్వసనీయమైన, తక్కువ మెయింటెనెన్స్‌ ఉంటూ ఇంధనంపై అదనంగా వెచి్చంచకుండా ఎక్కువ మైలేజీ ఉండాలని కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే జియో–బీపీ యాక్టివ్‌ టెక్నాలజీ పెట్రోల్‌ని రూపొందించినట్లు వివరించారు. దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌ దిగ్గజం బీపీ కలిసి జియో–బీపీని జాయింట్‌ వెంచరుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • కేంద్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆదివారం(ఫిబ్రవరి 1న) స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ జరగనుంది. సాధారణ పనిదినాల మాదిరిగానే ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు మార్కెట్‌ పనిచేస్తుంది. ఎంసీఎక్స్‌లో ఉదయం 9నుంచి 5 గంటల వరకు మొదటి సెషన్‌లో ట్రేడింగ్‌ జరుగుతుంది.

    సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన.. కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు లేదన్నమాట).

  • న్యూయార్క్ సిటీ బడ్జెట్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా, నగర మేయర్ జోహ్రాన్ క్వామే మమ్దానీ ప్రజలకు బడ్జెట్ ప్రాముఖ్యతను వివరించారు. నగర బడ్జెట్ అనేది కేవలం సంఖ్యల పట్టిక మాత్రమే కాదని, అది ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు.

    “బడ్జెట్ అనేది ఒక స్ప్రెడ్‌షీట్ కాదు. లైబ్రరీలు తెరిచి ఉంటాయా లేదా, కుటుంబాలు చైల్డ్‌కేర్‌ను భరించగలుగుతాయా అనే విషయాలను ఇది నిర్ణయిస్తుంది,” అని మమ్దానీ అన్నారు. “ఇది మన విలువల ప్రతిబింబం, మనం నిర్మించాలనుకుంటున్న నగరానికి ఒక ప్రకటన.”

    న్యూయార్క్ సిటీలో రెండు రకాల బడ్జెట్లు ఉన్నాయి. ‘క్యాపిటల్ బడ్జెట్’ ద్వారా పార్కులు, పాఠశాలలు వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. ‘ఎక్స్‌పెన్స్ బడ్జెట్’ ద్వారా అద్దె సహాయం, శానిటేషన్ సిబ్బంది నియామకం, ఇతర ముఖ్యమైన నగర సేవలకు ఖర్చు చేస్తారు. ఈ వివరణలో మమ్దానీ ప్రధానంగా ఎక్స్‌పెన్స్ బడ్జెట్‌పై దృష్టి పెట్టారు.

    ఇతర నగరాలతో పోలిస్తే, న్యూయార్క్ సిటీ బడ్జెట్ ప్రక్రియ ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక్క బడ్జెట్ మాత్రమే కాకుండా నాలుగు దశల్లో బడ్జెట్‌ను విడుదల చేస్తారు. మొదటగా ప్రిలిమినరీ బడ్జెట్ విడుదల అవుతుంది. ఇందులో నగరానికి అందుబాటులో ఉన్న ఆదాయం, రాబోయే సంవత్సరాల్లో చేయాల్సిన ఖర్చుల అంచనాలు ఉంటాయి. ఈ బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, తదుపరి సంవత్సరం, ఇంకా మూడు భవిష్యత్ సంవత్సరాల అంచనాలను కూడా కలిగి ఉండాలి. ఇది 1970ల ఆర్థిక సంక్షోభం తర్వాత తీసుకొచ్చిన సంస్కరణల ఫలితం.

    ప్రిలిమినరీ బడ్జెట్ తర్వాత సిటీ కౌన్సిల్ విచారణలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను సేకరించి తమ ప్రాధాన్యాలను ప్రతిపాదిస్తుంది. మే నెలలో ‘ఎగ్జిక్యూటివ్ బడ్జెట్’ విడుదలవుతుంది. ఇందులో సవరించిన ఖర్చుల ప్రణాళిక ఉంటుంది. అనంతరం మరోసారి కౌన్సిల్ విచారణలు జరిగి, చర్చలు ప్రారంభమవుతాయి.

    జూన్ చివరికి సిటీ కౌన్సిల్ బడ్జెట్‌పై ఓటింగ్ నిర్వహిస్తుంది. మేయర్, కౌన్సిల్ మధ్య అధికారిక అంగీకారం తర్వాత బడ్జెట్ ఖరారవుతుంది.

    రాష్ట్ర బడ్జెట్ కూడా నగర బడ్జెట్‌పై ప్రభావం చూపుతుందని మమ్దానీ గుర్తు చేశారు. ఆల్బనీ (రాష్ట్ర ప్రభుత్వం) తీసుకునే నిర్ణయాలు నగరం ఏం చేయగలదో నిర్ణయిస్తాయి. ఫెడరల్ ప్రభుత్వంలా కాకుండా, న్యూయార్క్ సిటీ లోటు బడ్జెట్ నడపడానికి చట్టపరంగా అనుమతి లేదు. అందువల్ల అన్ని ఖర్చులు అందుబాటులో ఉన్న ఆదాయంతోనే కప్పబడాలి.

    బడ్జెట్ ప్రక్రియలో పెద్ద లోటులు రాకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని, సాధ్యం కాని హామీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు.

    “ఈ బడ్జెట్ మీ భవిష్యత్.. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే హక్కు మీకు ఉంది” ” అంటూ న్యూయార్క్‌ నగరవాసులను ఉద్దేశించి మమ్దానీ పేర్కొన్నారు.

  • కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటిచెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకు ఇచ్చే గౌరవంలా కనిపిస్తుంది. ఈ కథనంలో గడిచిన ఎనిమిది బడ్జెట్ సెషన్లలో (2019 నుంచి 2025 వరకు) నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు తెలుసుకుందాం.

    2019: మంగళగిరి చేనేత వైభవం
    తొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    2020: కంచి పట్టు సంప్రదాయం
    రెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారత దేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు.

    2021: పోచంపల్లి ఇక్కత్ కళ
    తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్-వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బోర్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది.

    2022: బొంకాయ్ సిల్క్
    ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయ్ శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బోర్డర్, సిల్వర్ జరీతో ఉన్న చీరను ధరించారు.

    2023: కసూతి ఎంబ్రాయిడరీ
    2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది.

    2024 (మధ్యంతర బడ్జెట్): బెంగాల్ కాంతా వర్క్
    2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. ‘రామా బ్లూ’గా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది.

    2024 (పూర్తి స్థాయి బడ్జెట్): మంగళగిరి పట్టు పునరావృతం
    మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆఫ్-వైట్ రంగులో ఉండి పర్పుల్, గోల్డ్ బోర్డర్ ఉన్న చీరను ధరించారు.

    2025: మధుబని చిత్రకళా సౌరభం
    2025 బడ్జెట్ సెషన్‌లో బిహార్‌కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా వేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు.

  • గతేడాది (2025) బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు, ప్రపంచ విధాన అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఔన్స్‌కు 2,607 డాలర్ల నుంచి 4,315 డాలర్ల వరకు పెరిగాయి.

    భారత మార్కెట్‌లో భారీ రాబడులు
    మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం ధర 2025 జనవరిలో రూ.81,028గా ఉండగా, 2026 జనవరి నాటికి రూ.1,75,231కు చేరింది. దీంతో ఒక ఏడాది కాలంలోనే పెట్టుబడిదారులకు సుమారు 116 శాతం రాబడి లభించింది.

    2026లో ధరల్లో ఒడిదుడుకులు
    అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో స్వల్ప కరెక్షన్ కనిపించింది. 2026 జనవరి 30న ఎంసీఎక్స్‌ (MCX)లో స్పాట్ గోల్డ్ ధర రూ.1,75,231 నుంచి రూ.1,67,095కు తగ్గింది. దీని ప్రభావంతో పలు గోల్డ్ ఈటీఎఫ్‌ల విలువలు కూడా సుమారు 10 శాతం వరకు పడిపోయాయి.

    కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెంపు
    ఆర్థిక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భారత్‌లో బంగారం నిల్వల విలువ 2025 మార్చి చివరిలో 78.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 జనవరి నాటికి 117.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది బంగారంపై కొనసాగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోంది.

    2026పై ఆర్థిక సర్వే అంచనాలు
    ప్రపంచ అనిశ్చితులు కొనసాగితే, వాణిజ్య యుద్ధాలు పరిష్కారం కాకపోతే బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ కొనసాగుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, 2025లో కనిపించినంత భారీ ర్యాలీ 2026లో ఉండకపోవచ్చని, ధరల్లో ఒడిదుడుకులు సహజమని కూడా హెచ్చరించింది.

    సేఫ్ హేవన్‌గా బంగారం
    మొత్తానికి, తాత్కాలికంగా ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
     

  • ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పుడు అలాంటిదే.. మరొకటి ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.

    ఒక 21 ఏళ్ల యువకుడు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తూ.. తనను తానే సరదాగా 'కార్పొరేట్ మజ్దూర్' (లేబర్) అని చెప్పుకున్నాడు. అతడికి కేటాయించిన పనులన్నింటినీ ఒక గంట ముందే పూర్తి చేశాడు. మేనేజర్ సాయంత్రం 6 గంటలకే వెళ్లిపోయారని భావించి, ఓవర్‌టైమ్ జీతం వస్తుందనే ఉద్దేశంతో ఆఫీసులోనే ఉండిపోయాడు. పని లేకపోవడంతో అతడు తన మొబైల్‌లో రెడిట్ నోటిఫికేషన్లు స్క్రోల్ చేస్తుండగా, రాత్రి 8 గంటల సమయంలో.. మేనేజర్ అతని డెస్క్ దగ్గర కనిపించాడు.

    మేనేజర్ అతన్ని చూసి ఎందుకు పని చేయడం లేదు? అని ప్రశ్నించాడు. తనకు అప్పగించిన పనులన్నీ పూర్తయ్యాయని చెప్పగానే.. అయితే ఇంకో పని అడుగు అని మేనేజర్ పేర్కొన్నారు. అక్కడితో ఆ విషయం ఆగలేదు. మేనేజర్.. సీనియర్ మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇచ్చి, ఆఫీసులో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అన్నది గమనించమని చెప్పాడట. ముఖ్యంగా తననే ఉదాహరణగా చూపిస్తూ, ఇలాగే ఖాళీగా ఉంటే ఓవర్‌టైమ్ జీతం కట్ చేస్తామని హెచ్చరించారు.

    జరిగిన సంఘటన ద్వారా.. తాను టార్గెట్ అయ్యానని ఆ యువకుడు బాధపడ్డాడు. అదే సమయంలో ఇతర ఉద్యోగులు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుండగా, వారు మాత్రం మేనేజర్ కంట పడలేదు. సహోద్యోగులు ఈ పరిస్థితిని ఆఫీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాదిరిగా తీసుకుని, కొత్తగా వచ్చిన ఉద్యోగిని క్లాస్‌లో పిల్లాడిని మందలించినట్లు మందలించడాన్ని చూసి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి: పేలిన గోల్డ్ బబుల్.. లీ మాటలు నిజమవుతున్నాయా?

  • ఎవరు ఇంటికొచ్చినా స్వాగతం పలికేవి ఇంటి తలుపులే.. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించినవి వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో అన్‌ప్లాస్టిసైజ్డ్‌ పాలీవినైల్‌ క్లోరైడ్‌(యూపీవీసీ) తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు. – సాక్షి, సిటీబ్యూరో

    సౌకర్యాలెన్నో..

    • యూపీవీసీ తలుపులు, కిటికీలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులువుగా తట్టుకోగలవు. బలమైన గాలి, భారీ వర్షం వంటి ఉపద్రవాలను తట్టుకునే గుణం వీటి సొంతం.

    • సాధారణ తలుపులు నీటిలో తడిస్తే బిగుతుగా తయారవుతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీలు నీటిలో తడిచినా కూడా బిగుతుగా మారవు. వీటి జీవితకాలం సుమారు 30 ఏళ్లు.

    • యూపీవీసీ తలుపులు, కిటికీలకు క్రమం తప్పకుండా నిర్వహణ చేయాల్సిన అవసరం లేదు. వీటికి చెదలు, తప్పుపట్టడం వంటివి ఉండవు. ఎందుకంటే వీటి తయారీలోనే చెదలు, తుప్పును నియంత్రించే గుణం ఉంటుంది. మాటిమాటికీ రంగులు వేయాల్సిన అవసరం కూడా లేదు.

    • అగ్ని ప్రమాదాల సమయాల్లో సాధారణ తలుపులు, కిటికీలు చాలా ప్రమాదంగా మారతాయి. అదే యూపీవీసీ తలుపులు, కిటికీల తయారీలో అగ్ని నిరోధక ద్రవ్యాలను వాడతారు. దీంతో మంటలను ఒక గది నుంచి వేరే గదుల్లోకి వెళ్లనీయదు. నష్టం చాలా వరకు తగ్గుతుంది.

    • యూపీవీసీ తలుపులు, కిటికీలకు శబ్దాన్ని, ఉష్ణాన్ని నిరోధించే గుణం ఉంటుంది. బయటి నుంచి 80 శాతం శబ్దాన్ని, 60 శాతం ఉష్ణాన్ని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇంట్లో విద్యుత్‌ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. కనీసం 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.

    • సాధారణ తలుపులు, కిటికీలకు వేసే రంగులు గాల్లోకి రసాయనాలు వెదజల్లుతాయి. అదే యూపీవీసీ పర్యావరణహితమైనవి. 
      అంతేకాకుండా వీటికి ఉండే స్కూలు, గ్రిల్స్‌ బయటకు కనిపించవు.

  • హెచ్‌–1బీ వీసాపై ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ప్రతికూలతలు, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల నేపథ్యంలో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్‌ హాట్‌ ఫేవరెట్‌గా మారుతోంది.  – సాక్షి, సిటీబ్యూరో  

    గత ఏడాది హైదరాబాద్‌లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 51 శాతం వాటా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ) విభాగానిదే.. 2025లో నగరంలో జీసీసీలు 65 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. 2024లో 58 లక్షల చ.అ.లావాదేవీలతో పోలిస్తే ఇది అధికం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని జీసీసీ లావాదేవీల్లో భాగ్యనగరం వాటా ఏకంగా 19 శాతంగా ఉందని వెస్టియాన్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

    గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 7.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఇక, కొత్తగా మార్కెట్‌లోకి 5.55 కోట్ల చ.అ. ఆఫీసు స్థలం అందుబాటులోకి వచి్చంది. గతేడాది ఆఫీసు స్పేస్‌ లీజులలో జీసీసీల వాటా ఏకంగా 45 శాతంగా ఉంది. 2025లో 3.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. 2024లోని 2.92 కోట్ల జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఏడాదిలో 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

    వేకెన్సీ 18.2 శాతం.. 
    ఏటేటా హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాల మార్కెట్‌ సరికొత్త రికార్డ్‌లను అధిగమిస్తోంది. గత ఏడాది నాల్గో త్రైమాసికం(క్యూ4)లో ఏకంగా 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లీజులు పూర్తయ్యాయి. అంతకు క్రితం క్వార్టర్‌ తో పోలిస్తే ఇది ఏకంగా 55 శాతం అధికం. ఇక, నగరంలో లాస్ట్‌ క్వార్టర్‌లో కొత్తగా 60 లక్షల చ.అ. కార్యాలయ స్థలాల నిర్మాణాలు పూర్తయి, మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఆఫీసు స్పేస్‌ వేకెన్సీ 18.2 శాతంగా ఉంది.

    నివాసాలకే కాదు ఆఫీసు విభాగానికీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) విభాగమే కీలకం. టెకీలతో గృహాలకు, ఐటీ సంస్థలతో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది నగరంలో నమోదైన ఆఫీసు స్పేస్‌ లీజులలో 39.9 శాతం ఐటీ, ఐటీఈఎస్‌ విభాగానిదే కావడం ఇందుకు ఉదాహరణ. అయితే అంతకు క్రితం ఏడాదిలో ఈ విభాగం వాటా 41.9 శాతంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌సైన్సెస్‌ 11.5 శాతం, ఫ్లెక్సీ స్పేస్‌ విభాగం 7.8 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

    97 శాతం ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి (పెరిఫెరల్‌ బిజినెస్ట్‌ డిస్ట్రిక్ట్‌) పీబీడీ–వెస్ట్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లోనే జరిగాయి. నగరంలో హరిత కార్యాలయ భవనాల వాటా క్రమంగా పెరుగుతోంది. నిరుడు నగరంలో గ్రీన్‌ సర్టిఫైడ్‌ ఆఫీసు స్పేస్‌ లావాదేవీల వాటా 77 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఈ విభాగం వాటా 76 శాతం. దేశంలోని గ్రీన్‌ స్పేస్‌ ఆఫీసులలో హైదరాబాద్‌ వాటా 16 శాతంగా ఉంది.

  • దేశంలో మరో రెండు ‍ప్రభుత్వ రంగ బ్యాంకుల భారీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) మధ్య విలీన ప్రక్రియ ప్రారంభమైందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు బ్యాంకులు అంతర్గత అంచనాలు, కార్యాచరణ ఏకీకరణ, డ్యూ డిలిజెన్స్ వంటి ప్రక్రియలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ విలీనం క్యాలెండర్ సంవత్సరం ముగిసేలోపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

    నాలుగైదు బ్యాంకులు చాలు
    ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వ రంగ బ్యాంకులను కుదించి నాలుగు నుంచి ఐదు బ్యాంకులకు పరిమితం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు ఒక సీనియర్ బ్యాంకింగ్ అధికారి తెలిపినట్లుగా ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది.  చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయడం ద్వారా బలమైన రుణదాతలను సృష్టించడమే ఈ విలీనాల లక్ష్యమట.

    దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌!
    ఈ విలీనంతో విస్తృతమైన బ్యాలెన్స్ షీట్, పెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్, విస్తారమైన కస్టమర్ బేస్‌తో దేశంలోని అగ్ర ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి అవతరించనుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి కలిపిన బ్యాంక్ ఆస్తులు సుమారు రూ.25.4 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. దీని ద్వారా ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండవ అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్‌గా, అలాగే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌గా నిలవనుంది.

    మార్కెట్ క్యాప్‌లో కీలక మార్పులు
    మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా, ఈ విలీన బ్యాంక్ సుమారు రూ.2.13 లక్షల కోట్ల విలువతో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను అధిగమించి ఆరో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఐదవ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరో అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంకులుగా ఉన్నాయి.

    గత విలీనాల నేపథ్యం
    2017–2020 మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెగా విలీనాల్లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏకీకృతం చేయడంతో, పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గింది. దేశంలో పెరుగుతున్న రుణ డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చడం, భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకులతో సమర్థంగా పోటీ పడగల శక్తివంతమైన రుణదాతలను రూపొందించడమే ఈ కొత్త విలీనాల వెనుక ప్రభుత్వ లక్ష్యమని విధాన రూపకర్తలు స్పష్టం చేస్తున్నారు.

  • బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. తొందరపడి కొనుగోలు చేయకండి అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆయన మాటలు నిజయమయ్యాయా అనిపిస్తోంది.

    గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో రేట్లు భారీగా తగ్గిపోయాయి. ధరల తగ్గుదల అటు పెట్టుబడిదారుల్లో.. వ్యాపారుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉందన్నారు. ఆ గోల్డ్ బబుల్ ఇప్పుడు పేలిపోయింది.

    జనవరి 30న బంగారం ధర దాదాపు 9 శాతం తగ్గిపోయి రూ. 1.67 లక్షలకు (10 గ్రాములు) చేరింది. వెండి కూడా రెండు రోజుల్లో కేజీ ధర రూ. 75వేలు తగ్గింది. దీంతో సిల్వర్ రేటు 3.50 లక్షలకు చేరింది. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    వైట్ ఓక్ క్యాపిటల్ ప్రకారం.. బంగారం & వెండి ధరలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలోని వ్యవస్థాగత ప్రమాదాలు & కరెన్సీపై ఒత్తిడి వంటివి ప్రభావం చూపుతాయి. నిజానికి వెండి.. బంగారం నిష్పత్తి 80:1గా ఉండేది. కొన్నాళ్లుగా పెరిగిన ధరలు ఈ నిష్పత్తిని 46:1కి చేర్చింది. దీన్నిబట్టి వెండి ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడం ఇదే మొదటిసారి కాదు. 2011 ఏప్రిల్‌లో కేజీ వెండి ధర రూ.73,288 వద్దకు చేరి, ఆ తరువాత 55 శాతం పడిపోయింది. తిరిగి ఆ స్థాయి నుంచి కోలుకోవడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. అదే విధంగా.. 2012 సెప్టెంబర్‌లో బంగారం 10 గ్రాములకు రూ.32,147 వద్ద గరిష్టాన్ని తాకి, 25 శాతం పడిపోయింది. మళ్ళీ మునుపటి స్థాయికి చేరుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందా? అని చాలామంది అనుకుంటున్నారు.

  • 2026 జనవరి నెల ముగిసింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా.. భారతదేశంలోని అన్ని బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.

    ➤ఫిబ్రవరి 1 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 8 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 14 (శనివారం) - రెండవ శనివారం కారణంగా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 15 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 18 (బుధవారం)- లోసర్ పండుగ సందర్భంగా.. సిక్కింలోని గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 19 (గురువారం) - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 20 (శుక్రవారం) - రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజ్వాల్ (మిజోరం), ఇంఫాల్ (మణిపూర్)లలోని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 22 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤ఫిబ్రవరి 28 (శనివారం) - నాల్గవ శనివారం కారణంగా భారతదేశం అంతటా సెలవు

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్‌360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

    ఇండియా డిజిటల్‌ రంగంలో ఇప్పటికే ఆధార్‌, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.

    ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.

    ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్‌

    వికసిత్‌ భారత్ 2047

    ‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.

    • డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.

    • పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.

    • బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌) రంగంలో సంస్కరణలు.

  • దేశీయ వెండి ధరలు ఇటీవల వారాల పాటు కొనసాగిన తీవ్ర హెచ్చుతగ్గుల అనంతరం కొంత శాంతించాయి. ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకిన వెండి ధరలు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సంకేతాల ప్రభావంతో తగ్గుదల బాట పడుతున్నాయి.

    జనవరి నెల వెండికి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. నెల ప్రారంభం నుంచే ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, బలహీనమైన అమెరికన్ డాలర్, సురక్షిత పెట్టుబడిగా లోహాలపై పెరిగిన డిమాండ్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

    జనవరి చివరి నాటికి వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరాయి. జనవరి 31 నాటికి భారతదేశంలో భౌతిక వెండి కిలోకు సుమారు రూ.3.35 లక్షల వద్ద ట్రేడవగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.3.95 లక్షల వరకు చేరింది. శనివారం (జనవరి 31) ఒక్క రోజే వెండి ధర కేజీకి రూ.55 వేలు పతనమైంది. జనవరి 30న, కామెక్స్ లో వెండి గరిష్ట ధర (ఔన్స్‌కు) 118 డాలర్ల నుండి 37 శాతం తగ్గి 74 డాలర్లకు పడిపోయింది.

    ఎందుకీ తగ్గుదల?
    వెండి ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల వెనుక ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఉన్నాయి.

    • అమెరికా డాలర్ బలపడటంతో విలువైన లోహాలపై ఆసక్తి తగ్గింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు విదేశీ కొనుగోలుదారులకు వెండి మరింత ఖరీదవుతుంది.

    • బంగారం ధరలు పడిపోవడం కూడా వెండిపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం–వెండి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

    • అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్‌లో మార్పు వచ్చింది.

    ఈ పరిణామాలన్నీ కలసి వెండి ధరలను ఇటీవలి గరిష్ఠాల నుంచి వెనక్కి నెట్టేశాయి.

    ఇది చదివారా? కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?

Family

  • నిజమైన అభ్యాసం అంటే పరీక్షలు రాసి గ్రేడ్లు సాధించడం కాదు.. జీవితాన్ని కనుగొనడం, సృష్టించడం అని తొమ్మిదేళ్లకే అర్థం చేసుకున్నాడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వేదార్థ్‌. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తరగతి గది గోడలుగా మార్చుకున్నాడు. ప్రతి క్షణాన్ని ఏదో అన్వేషించడానికి, సృష్టించడానికి.. తద్వారా ఉన్నతస్థాయికి ఎదగడానికే వినియోగిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 100కి పైగా పుస్తకాలు చదివాడు. రోబోటిక్స్, ఎల్‌ఈజీవో నిర్మాణం వంటి అంశాలపై వర్క్‌ షాపులకు వెళుతుంటాడు. ఏ సవాల్‌నైనా ఉత్సాహంతో ఎదుర్కొంటాడు. ప్రతిరోజూ ఏదో ఒక పుస్తకం చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. వాటిని జీవితంలో ఎలా వినియోగించుకోవాలా అని ఆలోచించడం.. అతడి నిత్యకృత్యంగా మారిపోయింది.

    విద్యాభ్యాసాన్ని సరికొత్తగా పునర్‌ నిర్వచించుకున్న వేదార్థ్‌ (Vedarth) అక్కడితో ఆగిపోలేదు. సొంతగా కప్‌కేక్స్‌ తయారు చేసి విక్రయిస్తుంటాడు. చాక్లెట్‌ స్టాల్‌ ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు. ఆ సొమ్మును సిప్‌ల (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌)లో పెట్టుబడులు కూడా పెడుతున్నాడు. ఇలా ఇప్పటివరకు అతడు రూ.10 వేల వరకు పొదుపు చేశాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన బాలుడిగా వేదార్థ్‌ గుర్తింపు పొందాడు.

    తల్లే తొలి గురువు... 
    వేదార్థ్‌ తల్లి విశ్రుతి తన తొలి గురువు. ఆమె వేదార్థ్‌ జీవితానికి నిజంగా కావాల్సింది ఏమిటో ఓనమాల నుంచే నూరిపోశారు. స్కూల్‌లో బట్టీ పట్టడం ద్వారా వచ్చిన జ్ఞానం తన జీవితంలో పెద్దగా ఉపయోగపడలేదని గ్రహించిన విశ్రుతి.. తన కొడుకుకు ఉత్సుకత, వాస్తవ ప్రపంచ అనుభవంతో నిండిన బాల్యాన్ని అందించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. దీంతో అన్‌ స్కూలింగ్‌ అని పిలిచే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు.

    చ‌ద‌వండి: హీరోయిన్ హోట‌ల్ ముందు క్యూ క‌ట్టిన జ‌నం 

    అన్‌ స్కూలింగ్‌ (unschooling) విధానంలో నిర్ణీత పాఠ్యాంశాలు, షెడ్యూల్‌ లేదా పరీక్షల వంటివి ఉండవు. ఇక్కడ కేవలం ఆసక్తి ఆధారిత అభ్యాస విధానం, విద్య సహజమైన ఉత్సుకత, స్వీయ–నిర్దేశిత అన్వేషణ ఆధారంగా సాగుతుంది. ఇందులో భాగంగా విశ్రుతి డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం గురించి ఆచరణాత్మక అవగాహన కల్పించడంతో వేదార్థ్‌ తల్లి ప్రోత్సాహంతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించడానికి సిద్ధమవుతున్నాడు. వేదార్థ్‌.. నువ్వు వెరీవెరీ స్పెషల్‌..

    – గౌతమి గిద్దిగాని, సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

  • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ‘పీస్‌’ ప్రైజ్‌ వరించిందనే వార్త ప్రపంచాన్ని అయోమయంతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు ట్రంప్‌ ఆనందానికి అవధులు, ఆనకట్టలు, డ్యామ్‌లు, కాలువలు లేవు.

    ‘ఈసారి కచ్చితంగా నాకే’ అని గన్‌షాట్‌ ఆశ పెట్టుకున్న ట్రంప్‌ను గతంలో ఎస్నో సార్లు ‘పీస్‌’ ప్రైజ్‌ వెక్కిరిస్తూ వచ్చింది.

    పరాభవానికి గురైన ట్రంప్‌ ‘శాంతి’ బహుమతిపై అశాంతి, కసి, కోపం, పగ, ప్రతీకారం, రివేంజ్‌.. ఇలాంటివి ఎన్నో పెట్టుకున్నాడు. అంతేకాదు...‘పి’తో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానేశాడు. ‘పి’తో  మొదలయ్యే వంటకాలను తినడం మానేశాడు.‘పి’తో మొదలయ్యే డ్రింక్స్‌ తాగడం మానేశాడు.

    అలాంటి ట్రంప్‌ను ‘పీస్‌’ ప్రైజ్‌ వరించడంతో... ఆ ప్రైజ్‌పై అతడికి అభిమానం, అనురాగం, ఆనందం,  ఆప్యాయత, ప్రేమ, మమత, సమత... ఇలాంటి భావాలెన్నో కలిగాయి. ఆ ఆనంద కిక్‌లో వైట్‌హౌజ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టాడు.

    ‘అరచేయి అడ్డుపెట్టి అప్పడం కాలకుండా చేయగలరా? నో... నెవర్‌! పీస్‌ ప్రైజ్‌ నాకు రావడం కూడా అలాంటిదే. ఈ శుభ సందర్భంగా ప్రపంచశాంతిని ఆశిస్తూ ఒక పాట పాడుతాను’ అని గొంతు సవరించాడు ట్రంప్‌. ఆ పాట వినడానికి సభాసదుల చెవుల వైశాల్యం రెట్టింపు అయ్యింది. ‘నేను విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ’ అని పాడడం ప్రారంభించాడు శ్రీ ట్రంప్‌.

    ‘సోడా బుడ్డికి ప్రపంచ శాంతికి సంబంధం ఏమిటి?’ అని అడగబోయిన ‘వాషింగ్టన్ పోస్ట్‌’ పత్రిక విలేఖరికి వెజెజువెలా ప్రెసిడెంట్‌ గుర్తుకు వచ్చాడు. ‘అంత పెద్ద ప్రెసిడెంట్‌నే మాయం చేసిన వాడికి నేనొక లెక్కా’ అని జాగ్రత్తగా లెక్కలు వేసుకొని నీట్‌గా రూట్‌ మార్చాడు.

    చ‌ద‌వండి: చుక్క‌ల్లో ప‌సిడి ధ‌ర‌లు.. చ‌దివింపుల గుబులు

    ‘మీరు పాడిన పాట ఏ భాషదో తెలియదుగానీ... ఎంత అద్భుతంగా పాడారు సర్‌!’ అని మెలికలు తిరిగిపోయాడు. ‘థ్యాంక్యూ మిత్రమా’ అని చెప్పిన ట్రంప్‌కు తన పాట ఎంత బ్లడ్‌పాతం సృష్టించిందో తెలియదు. దీనికి సాక్ష్యం... వాషింగ్టన్ పోస్ట్‌ విలేఖరి చెవిలోని నుంచి ఆగకుండా కారుతున్న రక్తం!!!!

    కసి మెరుపు:  
    ఇంతకీ... ట్రంప్‌కు ‘పీస్‌’ ప్రైజ్‌ ప్రకటించింది నోబెల్‌ కమిటీ కాదు.
    ‘హారిబుల్‌’ కమిటీ! అర్జెంటీనాలోని ఫాక్స్‌నక్కపాలెన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కమిటీ... మూర్ఖత్వం, అహం మూర్తీభవించిన ప్రతిభా‘వాంతు’లకు ప్రతి యేటా ‘పీస్‌’ ప్రైజ్‌ ప్రకటిస్తుంది. ఇంతకీ... ఈ ‘పీస్‌’ ప్రైజ్‌లో శాంతి పిసరంత కూడా ఉండదు.
    – యాకుబ్ భాష

    ఇంతకీ... వీరి ‘పీస్‌’ ఫుల్‌ఫామ్‌...
    ‘పి’ ఫర్‌    పెయిన్‌–మేకర్‌: బాధలు తయారుచేసే వ్యక్తి
    ‘ఇ’ ఫర్‌    ఎంప్టీ హెడ్‌: ఖాళీ బుర్ర
    ‘ఎ’ ఫర్‌    ఆరగెంట్‌: గర్వం మూర్తిభవించిన వ్యక్తి
    ‘సి’ ఫర్‌    క్రేజీ: తెలివితక్కువ–సెన్స్‌లెస్‌కు ఎక్కువ
    ‘ఇ’ ఫర్‌    ఇగోయిస్టిక్‌: అహంకారి 

International

  • బంగారం.. బంగారం.. బంగారం.. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలతో ఇప్పుడు గోల్డ్ హెడ్‌లైన్స్ అవుతోంది.. బ్రేకింగ్ న్యూస్‌గా మారుతోంది. కానీ, ఓ చోట సమాధుల్లో కుప్పలు తెప్పలుగా బంగారం దొరికిందంటే మీరు నమ్ముతారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6,600 సంవత్సరాల క్రితమే.. ఆ సమాధుల్లో బంగారాన్ని పెట్టారని, ఆ కాలంలోనే బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చారని తెలిస్తే.. షాకవుతారు కదా? ఆ విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చాం. వివరాలను చదవాల్సిందే.

    62 సమాధులు.. కిలోల కొద్దీ బంగారం..
    అది బల్గేరియాలోని వర్ణా అనే నగరంలో ఉన్న శ్మశానం..! ప్రాంతం. 1972లో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు చేపట్టారు. ఓవైపు పారిశ్రామిక ప్రాంతం, మరో వైపు, కార్మికుల నివాస సముదాయాలు ఉండే ఆ ప్రాంతంలోని శ్మశానంలో జరిపిన తవ్వకాలతో శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. అక్కడ మొత్తం 300 సమాధులు బయటపడగా.. వాటిల్లో 62 సమాధుల్లో కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు లభించాయి.

    పరిశోధనల్లో ఏం తేలిందంటే..
    అందమైన నగలే కాకుండా.. రాజదండం, ఇతరత్రా రాచముద్రల రూపంలోనూ బంగారం లభ్యమైంది. కార్బన్ డేటింగ్ వంటి తదనంతర పరిశోధనల్లో తేలింది ఏమిటంటే.. ఆ సమాధుల్లోని మృతదేహాలు క్రీస్తు పూర్వం 4600 నుంచి 4300 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవి. అంటే.. మనముంటున్న కాలంతో పోలిస్తే.. దాదాపు 6 వేల సంవత్సరాల కిందటివన్నమాట. అంటే.. అప్పట్లోనే బంగారంపై మోజు ఉన్నట్లు తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు.

    ఏకంగా మృత కళేబరానికి..
    ఈ సమాధుల్లో ‘గ్రేవ్ 43’ ఏకంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆ సమాధిలో కిలోన్నరకుపైగా బంగారం ఓ మృతదేహం వద్ద లభ్యమైంది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అతను మృతిచెందినప్పుడు 60 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. అంతలా బంగారం లభించడాన్ని బట్టి.. అతను సంబంధిత తెగకు నాయకుడై ఉంటారని భావించారు. గ్రేవ్ 43లో ఏకంగా మృత కళేబరానికి బంగారు గొలుసులు, చేతి కంకణాలు, చెవిపోగులున్నాయి. దీంతోపాటు.. బంగారు రాజదండం, బంగారు పూత పూసిన ఆయుధం ఆ సమాధిలో లభించాయి.

    అబ్బురపరిచే అద్భుత శైలి
    ఇప్పుడు ఈ సమాధులు ఎందుకు హాట్ టాపిక్ అయ్యాయంటే.. మీకు తెలిసిందే..? బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుక్కారణం ప్రజల్లో బంగారంపై మోజు పెరగడమే..! భారత్‌లో బంగారు ఆభరణాలు స్టేటస్‌కి నిదర్శనమైతే.. విదేశాల్లోనూ వేల ఏళ్ల క్రితమే అంతటి క్రేజ్ ఉందని ఈ సమాధులు స్పష్టం చేస్తున్నాయి. మెషీన్‌లతో కాకుండా.. పూర్తిస్థాయిలో చేతితో చేసిన బంగారు ఆభరణాలు అంత అద్భుత శైలిలో తయారు చేయడం ఇప్పటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి.

    6,600 ఏళ్ల క్రితమే..
    అంటే.. 6,600 ఏళ్ల క్రితమే బంగారాన్ని కనుక్కొన్నారనే విషయం ఒక ఎత్తయితే.. దాన్ని శుద్ధి చేసి, హ్యాండీక్రాఫ్ట్ మాదిరిగా చేతితోనే ఆభరణాలుగా మార్చడం మరో విశేషం. అంతేకాదు.. ఆ కాలంలోనే సంపద అనేది సమాజంలో విభజనకు కారణమనే విషయం స్పష్టమైంది. వర్ణా శ్మశానంలో బయటపడ్డ 300 సమాధుల్లో కేవలం 62 గ్రేవ్స్‌లో మాత్రమే బంగారు ఆభరణాలుండడం ఇందుకు నిదర్శనం. సింధూనాగరికత సమయంలో కోటల్లో ఎగువ వర్గాలు.. కోట బయట దిగువ స్థాయి వర్గాలుండేవని చదువుకున్న విషయం తెలిసిందే..! ఈ సమాధులను పరిశీలిస్తే.. 6,600 ఏళ్ల క్రితమే బల్గేరియాలో కూడా ఇలాంటి సామాజిక ఆంతర్యాలున్నట్లు స్పష్టమవుతోంది. ఆ సమాధుల్లోంచి వెలికి తీసిన ఆభరణాలు ప్రస్తుతం బల్గేరియాలోని వర్ణా ఆర్కియాలజికల్ మ్యూజియంలో సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి.

  • ప్లాటిపస్‌ అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన జంతువుల్లో ఒకటి. ఇది గుడ్లు పెడుతుంది, తన పిల్లల కోసం పాలు ఉత్పత్తి చేస్తుంది, నీటిలో విద్యుత్‌ సంకేతాలను గుర్తించగలదు. ఆశ్చర్యంగా అనిపిస్తుందా?  అంతే కాదు, అల్ట్రావయలెట్‌ కాంతిలో ఇది వెలుగుతుంది కూడా!

    ప్లాటిపస్‌లు ఆస్ట్రేలియాలోని తూర్పు  ప్రాంతాల్లో ఉన్న నదులు, వాగుల్లో నివసిస్తాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇవి విషం కలిగిన స్తన్యజంతువులు కావడం. సాధారణంగా మనం విషం అంటే  పాములు, తేళ్లను  గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ మగ  ప్లాటిపస్‌ కూడా విషాన్ని కలిగి ఉంటుంది.

    మగ ప్లాటిపస్‌ల వెనుక కాళ్ల దగ్గర పదునైన ముళ్లు ఉంటాయి. ఆడవాటితో జతకట్టే కాలంలో, ఈ ముళ్లు విష గ్రంథులతో కలుస్తాయి. అప్పుడు అవి చాలా శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి. 

    శాస్త్రవేత్తలు ఈ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు (పెప్టైడ్లు) ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే జంతువులోనూ లేవు. ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు. కానీ చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ప్లాటిపస్‌ విషానికి గురైనవారు ‘ఎముక విరిగిన దానికంటే కంటే ఎక్కువ నొప్పి’ అని చెబుతారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాల పాటు లేదా నెలల పాటు కొనసాగుతుంది. దీనికి ఇప్పటివరకు ప్రత్యేక విరుగుడు మందు (యాంటీ వెనమ్‌) లేదు. ఈ విషం భవిష్యత్తులో మనుషులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటిస్‌ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.

    ఇదీ చదవండి: హైఎండ్‌ కార్లు,చాపర్‌ రైడ్స్‌ : ఎందుకు సీజే రాయ్‌ ఆత్మహత్య?

  • చైనాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిన చైనా ఇప్పుడు జనాభా క్షీణతతో సతమతమవుతోంది. ప్రభుత్వం ఎన్ని ఆఫర్లు ప్రకటించినా అక్కడి యువత పిల్లలను కనేందుకు సుముఖంగా లేరు.  చైనాలో ప్రస్తుతం ‘హ్యూమన్ బేబీస్’ కంటే ‘ఫర్ బేబీస్’ (బొచ్చు ఉన్న పెంపుడు జంతువులు) సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తల్లిదండ్రులుగా మారడం కంటే కుక్కలు, పిల్లులను పెంచుకోవడమే మేలని అక్కడి యువత భావిస్తోంది.

    రికార్డు స్థాయిలో పడిపోయిన జనన రేటు
    గత కొన్నేళ్లుగా చైనాలో జననాల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2023 నాటికే చైనా జనాభా 1.405 బిలియన్ల((140.5 కోట్లు)కు పడిపోయింది. 2015లో 16.55 మిలియన్లు((1,65,50,000)గా ఉన్న జననాలు, గతేడాదికి కేవలం 7.92 మిలియన్ల((79,20,000)కు పరిమితమయ్యాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఇది సగం మాత్రమే. పెళ్లిళ్ల రేటు కూడా 20 శాతం వరకు తగ్గడం అధికారులను కలవరపెడుతోంది. 1979లో అమలు చేసిన ‘ఒక్కరు ముద్దు’ విధానం ప్రభావం ఇప్పుడు దేశ భవిష్యత్తుపై తీవ్రంగా కనిపిస్తోంది.

    పిల్లల కంటే పెంపుడు జంతువులే బెస్ట్‌ అంటూ..
    చైనాలోని యువత ప్రస్తుతం పిల్లల కంటే పెంపుడు జంతువుల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అక్కడి ఆర్థిక పరిస్థితులు. చైనాలో పెరిగిపోతున్న జీవన వ్యయం, విపరీతమైన పోటీతత్వం కలిగిన వాతావరణంలో పిల్లలను పెంచడం భారమని వారు భావిస్తున్నారు. ‘పెంపుడు జంతువులు మనకు ఆనందాన్ని ఇస్తాయి. పిల్లల పెంపకం అనేది చాలా అలసిపోయే పని’ అని బీజింగ్‌కు చెందిన గ్వో జిన్యి అనే యువతి అభిప్రాయపడ్డారు. పెంపుడు జంతువులకు పిల్లల లాగా విద్యాభ్యాసం, పోటీ పరీక్షల టెన్షన్ ఉండదని ఆమె తెలిపింది.

    కెరీర్‌పై ఆందోళన
    చైనా యువతలో ముఖ్యంగా మహిళల్లో కెరీర్ పట్ల ఆందోళనలు పెరిగాయి. పిల్లలు పుడితే తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అన్న భయం వారిని వెంటాడుతోంది. చైనాలో 35 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామకాల్లో వివక్ష అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. పిల్లలను పెంచుతూ కెరీర్‌లో రాణించడం అసాధ్యమని భావిస్తున్న మహిళలు, తమ సమయాన్ని, ప్రేమను పెంపుడు జంతువులకే పంచుతున్నారు.

    ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఫలితం సున్నా
    జనాభాను పెంచడానికి చైనా ప్రభుత్వం ముగ్గురు పిల్లల వరకు అనుమతి ఇచ్చింది. పిల్లల పెంపకం కోసం పన్ను రాయితీలు, నగదు సబ్సిడీలు కూడా ప్రకటించింది. మరోవైపు గర్భనిరోధక సాధనాలపై పన్నులను పెంచి వినూత్న ప్రయోగాలు చేస్తోంది. అయితే ఈ ఆఫర్లు యువతను ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల కంటే పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

    మారుతున్న కుటుంబ విలువలు
    ఒకప్పుడు చైనాలో తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువత తమ జీవితంపై పూర్తి స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ కంటే వ్యక్తిగత ఆనందానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యులుగా చూస్తూ, వాటికి కూడా మనుషుల లాగే దుస్తులు, ఆహారం సమకూరుస్తున్నారు.

    పెరిగిన పెంపుడు జంతువుల జనాభా
    గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం చైనాలో 4 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కంటే పెంపుడు జంతువుల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2030 నాటికి చైనాలో సుమారు 70 మిలియన్ల పెంపుడు జంతువులు ఉంటాయని అంచనా. అదే సమయంలో పసిపిల్లల సంఖ్య 40 మిలియన్లకు పడిపోవచ్చు. 2017లో ఉన్న పరిస్థితికి ఇది పూర్తిగా వ్యతిరేకం. నాటి రోజుల్లో పిల్లలే పెంపుడు జంతువుల కంటే రెట్టింపు సంఖ్యలో ఉండేవారు.

    బాధ్యతాయుతమైన నిర్ణయం?
    చైనా యువత పిల్లలను వద్దు అనుకోవడం బాధ్యతారాహిత్యం కాదని, అది ఒక రకమైన ‘బాధ్యతాయుతమైన నిర్ణయం’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. పిల్లలకు మెరుగైన జీవితాన్ని, తగినంత సమయాన్ని ఇవ్వలేనప్పుడు వారిని కనడం కంటే, ఒక కుక్కనో, పిల్లినో పెంచుకోవడం ఉత్తమమని వారు భావిస్తున్నారు. పెంపుడు జంతువులను పెంచి పోషించడాన్నివారు ‘నొప్పి లేని మాతృత్వం’ అని అంటున్నారు. 
     
    ఇది కూడా చదవండి: పాదచారుల ప్రాణాలకు గ్యారెంటీ ఏది?

  • ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరిగిన బిజినెస్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్‌ ప్రసంగించారు. అయితే..

    రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్‌ను నిరాశ పరచలేదని షరీఫ్‌ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్‌కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

    మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్‌ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.

    ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్‌ పరువు పోయిందిగా!

Telangana

  • హైదరాబాద్: దశాబ్దాలుగా ఆంకాలజీ రంగానికి అనేక సేవలందిస్తున్న ప్రముఖ ఆంకాలజిస్ట్‌ నోరి దత్తాత్రేయుడిని... భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్‌’ వరించిన సందర్భంగా సింధు హాస్సిటల్స్‌ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్స్‌ ఆవరణలో ఈరోజు(శనివారం,జనవరి 31న) కన్నులపండువగా జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్‌ నోరి సుదీర్ఘకాలంగా చేసిన సేవలను సింధు హాస్పిటల్స్‌లోని డాక్టర్లు, పరిశోధకులు, నిష్ణాతులైన పలువురు వైద్యప్రముఖులు ఆయనను ప్రస్తుతించారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ రంగంలో చోటు చేసుకున్న పురోగతిని బాధితులకు అందేలా విశేష కృష్టి చేశారంటూ ఆయనను  కొనియాడారు.  

    ఈ సందర్భంగా సింధు హాస్పిటల్స్‌ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని వరించిన పద్మభూషణ్‌ పురస్కారం మొత్తం వైద్యరంగానికీ, భారతదేశంలోని డాక్టర్లందరికీ దక్కిన అరుదైన గౌరవమ’ని తెలిపారు. ‘ఆ అద్భుతమైన వ్యక్తి తమతో కలిసి పనిచేస్తుండటం తమకూ, తమ సంస్థకూ గర్వకారణమ’ని పేర్కొన్నారు. డాక్టర్‌ నోరితో తనకు మూడు దశాబ్దాలకు పైబడిన ఆత్మీయబంధం ఉందనీ, దాదాపు 30 ఏళ్ల కిందట తాను తమ హెటెరో సంస్థను యూఎస్‌లో ప్రారంభించాలనుకున్న   నాటి నుంచీ తమ స్నేహబంధం అప్రతిహతంగా కొనసాగుతోందం’టూ ఈ సందర్భంగా తమ అనుబంధాన్ని డాక్టర్‌ పార్థసారథి గుర్తు చేసుకున్నారు. ‘డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు తమ సింధు హాస్పిటల్స్‌కు ప్రధాన సలహాదారుగా పనిచేయడం తమకెంతో  గర్వకారణమం’టూ ఆయన తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

    ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘హెచ్‌ఆర్‌డీ బ్రాకీథెరపీ’ అని సంక్షిప్తంగా పిలిచే ‘హై డోస్‌–రేట్‌ బ్రాకీథెరపీ’ ప్రక్రియకు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆద్యులు. గర్భాశయ ముఖద్వార (సర్విక్స్‌) కేన్సర్, మూత్రవిసర్జక వ్యవస్థ (యూరినరీ సిస్టమ్‌), ఛాతీ, తల–మెడ ప్రాంతాల్లో వచ్చే అనేక రకాల కేన్సర్లకు ఇదో ప్రభావంతమైన మంచి చికిత్స ప్రక్రియ.

    ఈ వేడుకలో డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ ‘మన సంస్థలోని నర్స్‌లూ, డాక్టర్లు, ఇతర సహాయ సిబ్బందినీ, వారి తాలూకు ఆ బృందస్ఫూర్తిని చూసినప్పుడు... నాకు వీళ్లందరూ ఓ హాస్పిటల్‌ సిబ్బందిలా కాకుండా పేషెంట్లను సంరక్షించే ఆపన్నహస్తాలుగా కనిపిస్తారు. పేషెంటుకూ... వ్యాధికీ మధ్య కవచంలా నిలబడి బాధితులను పూర్తిగా కోలుకునేలా చేస్తారు. పేషెంట్లను వారి ఉద్విగ్న స్థితి నుంచి ఉపశమనానికి తీసుకువస్తారు’ అంటూ వారి సేవలను కొనియాడారు.

  • సాక్షి, హైదరాబాద్‌: రేపు సిట్‌ విచారణకు కేసీఆర్‌ హాజరుకానున్నారు. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్‌.. విచారణకు హాజరుకావాలని నిర్ణయించారు. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ నుంచి నందినగర్‌ నివాసానికి కేసీఆర్‌ రానున్నారు.

    సిట్‌కు కేసీఆర్‌.. ఆరుపేజీల లేఖ రాశారు. సిట్‌ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు(ఫిబ్రవరి 1, ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానన్న కేసీఆర్‌.. తన స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకోవచ్చన్నారు. ఇంటి గోడకి సిట్‌ నోటీసులు అంటించడంపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. ‘‘ఎర్రవల్లిలో విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాను. కానీ హైదరాబాద్‌ పరిధిలోనే విచారణ జరపాలని మీరు పేర్కొన్నారు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్‌ పరిధిలో నివసించడం లేదు.

    ..హరీష్‌రావు ఆఫిడవిట్‌లో సిద్ధిపేట అడ్రస్‌ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా కరస్పాండెంట్‌ అడ్రస్‌గా నందినగర్‌ పెట్టుకున్నా. గత రెండేళ్లుగా నేను ఎర్రవల్లిలోనే ఉంటున్నాను. స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయడానికి పరిధులు అవసరం లేదు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్‌ సహకరిస్తా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా చట్టానికి సహకరిస్తాను. పోలీసుల చర్యలు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: రేపు రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. కేసీఆర్‌ను సిట్‌ విచారణను పిలవడంపై బీఆర్‌ఎస్‌ నిరసనలు చేపట్టనుంది. రేపు  అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ ఆందోళనలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ తెలిపింది. బైక్‌ ర్యాలీలు, నల్లజెండాలతో నిరసనలు, రాస్తారోకోలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. న్యాయ నిపుణులతో చర్చించాక విచారణకు హాజరుకావాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రేపు సిట్‌ విచారణకు కేసీఆర్‌ హాజరుకానున్నారు.

    కాగా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన తీరుపై కేటీఆర్‌ మండిపడ్డారు. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అంటూ సంచలన విమర్శలు గుప్పించారు.

    మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?. స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?.

    65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.9.5 కోట్ల విలువైన 27 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయిని సీజ్‌ చేశారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల బ్యాగులో గుర్తించారు. ఏడుగురిని  డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

    కాగా, నిన్న శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ గంజాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురి అరెస్టు చేశారు.

    హైడ్రోపోనిక్‌ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్‌తో సమానమైన మత్తు కలిగిస్తుంది.

    హైడ్రోపోనిక్‌ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా భారత్‌కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్‌ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు.
     

  • నల్లగొండ జిల్లా: నాంపల్లి మండలం కేతేపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడి భార్యను ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నగేష్‌తో సుజాత అనే మహిళకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. భార్య మమతను పక్కకు తప్పించేందుకు హత్య చేయాలని‌ సుజాత, నగేష్  ప్లాన్ వేశారు. మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. తీవ్ర గాయాలతో మమత మరణించింది. మంటలు అంటుకుని ఐదు నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని ఆసుపత్రికి తరలించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కరీంనగర్ సీపీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తెలంగాణా ఐపీఎస్ అసోసియేషన్ నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా కౌశిక్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

    ‘‘కరీంనగర్‌ సీపీపై మత మార్పిడి ఆరోపణలు నేను చేయలేదు. నేను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నాకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రివిలేజ్‌ మోషన్‌ వేస్తా’’ అంటూ కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.

    కాగా, పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. సీపీ గౌస్‌ మత మార్పిడులపై పాల్పడుతున్నారంటూ కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

    గురువారం కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కరీంనగర్‌ సీపీ గురించి కౌశిక్‌రెడ్డి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఐపీఎస్‌ అధికారుల సంఘం మండిపడింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.