Archive Page | Sakshi
Sakshi News home page

Rajanna

  • అనగనగా ఒక ఊరిలో కనకయ్య మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఆ కొడుకు పేరు నారాయణ. అతడు పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువును ఆశ్రద్ద చేసేవాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం నారాయణను బాగా చదివించాలనే కోరిక ఉండేది. ఒకరోజు కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నారాయణ కనకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఏమీ కాదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలి అని చెప్పారు. దానికి రూ. 30 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ.. వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో డబ్బు ఏర్పాటుకు చాలా మందిని అడిగారు. కానీ.. ఈలోగ కనకయ్యకు మళ్లీ గుండెపోటు వచ్చి మరణించాడు. అప్పుడు నారాయణ చాలా బాధపడ్డాడు తన వద్ద డబ్బు ఉంటే తన తండ్రిని బతికించుకునే వాడిని అని చాలా ఏడ్చాడు. నాలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ చెప్పినట్టు విని బాగా చదివాడు. పదవ తరగతి లో జిల్లా మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభను చూసి ఒక మంచి కాలేజ్‌ వాళ్లు నారాయణకు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత నారాయణ బాగా చదివి డాక్టర్‌ అయ్యాడు. నారాయణ వాళ్ల నాన్న కోరుకున్నది జరిగినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషపడింది. నారాయణ ఒక ఆసుపత్రిని నిర్మించి అందరికీ ఉచితంగా వైద్యం చేశాడు.

    – హాసిని

    తరగతి: 7వ తరగతి

    పాఠశాల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

    గ్రామం: చింతకుంట, కరీంనగర్‌

    దుర్గం భైతి,

    ప్రభుత్వ ఉపాధ్యాయులు,

    రామునిపట్ల, సిద్దిపేట జిల్లా

    గాలి గాలి ఓ చిరుగాలి

    పవనాలుగా నీవిక తేలి

    నీవస్తావులే మా ఇంటికి

    నచ్చావులే మా కంటికి !

    నీ వల్లే మాకు ఊపిరి ఉంది

    నీవు లేకుంటే కలుగు ఇబ్బంది

    మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ?

    నీ సమాధానం ఇక ఏదైనా

    నీవు లేకుండా పోదు పొద్దైనా

    ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి

    నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి

    చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు

    అట్లనే చేయకు నీవిక అలుసు

    బొగ్గు పులుసు గాలి నీలో ఉంది

    దానితో మాకు కలుగు ఇబ్బంది !

    గాలి తల్లి మా చిరుగాలి మల్లి

    మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి

    నీవు లేకుండా ఉండదు ఏ గల్లి

    నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ !

    గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి

    హోరుగాలితో చేయకు లొల్లి

    చల్లగా తగిలితే కలుగు హాయి

    మెల్లెగ మది ఉప్పొంగు నోయి !

    – గుర్రాల లక్ష్మారెడ్డి

    కవి రచయిత

    గ్రామం:

    కల్వకుర్తి,

    నాగర్‌ కర్నూల్‌ జిల్లా

    గాలి ఓ మా చిరుగాలి

    మన ఊరు మన బడి

    మనదే ఈ జీవితం

    అక్షర జ్ఞానం పొంది

    అవుదాం ఉన్నతం

    ఒకే మాట ఓకే పాట

    ఒకటే మన బడిబాట

    అమ్మ నాన్న కలలు కన్న

    అక్షరాల పూల తోట

    చక్కని క్రమశిక్షణతో

    చదువుకుని ఎదుగుదాము

    ఆచార్యుల మాట విని

    అవనికి వెలుగవుదాము

    ఆట పాటలు కంప్యూటర్‌

    అవలీలగా నేర్చుకుని

    అన్ని రంగాల్లో మనమే

    ముందడుగులు వేద్దాము

    విలువైన విషయాలతో

    విజ్ఞాన విద్యనందుకుని

    విశ్వసేవ పథాన మనం

    వీరత్వం చూపుదాము

    వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్‌ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...

  • పుస్తకం చేతిలో ఉంటే

    భవిష్యత్తు వెలుగులో ఉంటుంది.

    అక్షరం నేర్చిన చిన్నారి

    ఆకాశాన్ని తాకే విజేత అవుతాడు.

    విద్య అనే అమూల్య ధనం

    ఎవ్వరూ దోచుకోలేరు ఎన్నడూ.

    గురువు చూపిన మార్గంలో,

    జ్ఞాన దీపం వెలిగించాలి.

    నేటి చదువు రేపటి బలం

    దేశానికి అది గొప్ప సంపద.

    ప్రతి బిడ్డ చదువుకోవాలి

    ప్రతీ కల నిజం కావాలి.

    విద్యతో ఎదిగి ఉన్నత శిఖరాలు చేరి

    భారత మాతకు కీర్తి తేవాలి.

    – పిల్లల విద్యే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది

    – దూపాటి

    హరిప్రసాద్‌

    షాపూర్‌ నగర్‌,

    హైదరాబాద్‌.

  • కరీంనగర్‌కల్చరల్‌: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు లేని యుగంలో ప్రపంచానికి లెక్కల దారి చూపిన అద్భుత పరికరం అబాకస్‌. చిన్నచిన్న గుళికలను కదిలిస్తూ పెద్దపెద్ద గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించే ఈ పురాతన సాధనం నేటికీ తన ప్రాధాన్యం కోల్పోలేదు. ముఖ్యంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వేగవంతమైన ఆలోచనాశక్తిని అభివృద్ధి చేయడంలో అబాకస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లెక్కల పరికరం ఆధునిక విద్యాప్రపంచంలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాలభవన్‌లో చిన్నారులు అబాకస్‌లో శిక్షణ తీసుకుంటూ.. సులువుగా లెక్కులు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

    అబాకస్‌ నిర్మాణం

    అబాకస్‌ సాధారణంగా ఒక చట్రంలో(ఫ్రేమ్‌) ఉండే కడ్డీలు, వాటిపై కదిలే ముత్యాల్లాంటి గుళికలతో తయారవుతుంది. ప్రతీ కడ్డీ ఒక స్థాన విలువను సూచిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు గుళికలను కదిలించడం ద్వారా లెక్కలు చేస్తారు. అబాకస్‌ సుమారు 2000 సంవత్సరాల కంటే పాతది. చైనా, జపాన్‌, రోమ్‌ ప్రాంతాల్లో ఉపయోగించారు. జపాన్‌లో ఉపయోగించే అబాకస్‌ను సోరోబన్‌ అంటారు.

    అబాకస్‌ విశిష్టత

    వేగంగా లెక్కలు చేయగలగడం, కాలిక్యులేటర్‌ లేకుండా పెద్ద లెక్కల్ని కూడా త్వరగా చేయొచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. గణితంపై భయం తగ్గుతుంది. వేగంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక లెక్కలు కొంతకాలం సాధన తర్వాత పిల్లలు అబాకస్‌ను ఊహలో చూసుకుంటూ మెంటల్‌ మ్యాథ్స్‌ చేయగలుగుతారు. చేతి, మెదడు సమన్వయంతో గుళికలను కదిలించడం వల్ల చేతి కదలికలు మెదడు పని కలిసి మెరుగుపడతాయి.

    సులభంగా లెక్కల సాధన మెదుడుకు చురుకుదనం.. జ్ఞాపకశక్తి పెరుగుదల

    బాలభవన్‌లో ఆరేళ్లుగా క్లాసికల్‌ డాన్స్‌, మ్యూజిక్‌ నేర్చుకుంటున్నా. గతేడాది నుంచి అబాకస్‌ నేర్చుకుంటున్నా. ముందుకన్నా ఫాస్ట్‌గా లెక్కలు చేయగలుగుతున్నా. దీనివల్ల మైండ్‌ షార్ప్‌ అవుతుంది.

    – వనజాక్షి, రాంనగర్‌

    గణితంలో మెళకువలతో ప్రాబ్లమ్స్‌ తొందరగా సాల్వ్‌ చేస్తున్నా. అబాకస్‌తో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంతో కష్టమనిపించేది. అబాకస్‌ శిక్షణతో సులువైంది.

    – నిర్వాణ, హనుమాన్‌నగర్‌

  • సిరిసిల్ల అర్బన్‌: పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని జేఎన్‌టీయూ–యూసీఈఆర్‌ ప్రిన్సిపాల్‌ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్లలో విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. నోడల్‌ అధికారి, ప్రిన్సిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

    పర్యావరణంపై అవగాహన

    వేములవాడఅర్బన్‌: అగ్రహారంలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ కళాశాల ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్‌ పోటీ నిర్వహించి ప్రశంస పత్రాలు అందజేసినట్లు ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ తెలిపారు. అధ్యాపకులు తదితరులున్నారు.

    ఇంధన డిపో సందర్శన

    రామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) ఇంధన డిపోను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్‌ మనీశ్‌ తదితరులు ఉన్నారు.

  • 1. పొద్దస్తమానం పనిచేస్తూనే ఉండే బానిస నోరు అనే భూస్వామి వద్ద వెట్టి చేస్తోంది

    ఆయన ఇంట్లోకి ఎన్నెన్ని తెచ్చి పడేసినా నోరు మెదపక దంచి, మెత్తగా నూరుతుంది.

    2. మనిషి జాతకమే నాదగ్గరుందని

    పోసుకోలు కబుర్లు చెప్తుంది

    ప్రమాణ సాక్షిగా నిజమే చెప్తున్నానంటూ

    మాటిమాటికీ ఓట్లు వేస్తుంది.

    3. పిడికెడంత చిన్న ఇల్లు

    దాన్లో నాలుగు గదులు

    క్షణం తీరిక లేదు

    దమ్మిడి ఆదాయం లేదు.

    4. పటిష్టమైన భద్రత మధ్య

    ప్రధానమైన అవయవం

    అందరితో పని చేయిస్తూ

    అన్నీ చూసుకునే పెద్దబాస్‌

    ముడతల శరీరమే గానీ

    మహా తెలివిమంతురాలు

    5. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ

    తాను నోరిప్పి ఒక్కమాటా మాట్లాడదుఅంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా

    లోలాకులు, రింగులు, జూకాలు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది.

    6. ప్రాణవాయువును పీల్చుకుంటుంది

    కార్బన్‌ డైయాకై ్సడ్‌ను వదుల్తుంది

    వాసనలను చక్కగా చెపుతుంది

    దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది.

    7. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది.

    ఇంత గారాబమైతే ఎలాగమ్మా!

    8. శరీరం రాజులా మీద ఎక్కి కూర్చుంటే సేవకుల్లా ఇవి మోసుకుంటూ తిరుగుతాయి.

    ముల్లు గుచ్చుకున్నా, ఎదుర్రాయి కొట్టుకున్నా బాధలు, నొప్పులు, కన్నీళ్లు, రక్తాలు వీటికే

    – కందేపి రాణీప్రసాద్‌

    రచయిత్రి, సిరిసిల్ల

    జిల్లా: రాజన్నసిరిసిల్ల

    జవాబులు: 1.జీర్ణాశయం,

    2.అరచేయి, 3.గుండె,

    4.మెదడు, 5.చెవి, 6.ముక్కు, 7.నోరు, 8.కాళ్ళు

  • వేములవాడ: మంత్రాలు కాదు.. మోసాలే! అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కపట బాబాలు వశీకరణ పేరుతో వల వేస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికత పేరుతో అమాయక ప్రజలను మోసం చేసే కపట బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ బొంబాయిలో ఉంటూ కొద్ది సంవత్సరాల క్రితం తన మకాంను వేములవాడకు మార్చుకుంది. తనను తాను ఆధ్యాత్మిక శక్తులు కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటూ బాబా అవతారమెత్తింది. ఓ కుటుంబాన్ని వలలో వేసి రూ.కోట్లు కాజేసిన ఘటన వేములవాడలో కలకలం రేపుతోంది. బాధితుడు చిమ్మల మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య శ్రావణిని ఆ మహిళ మానసికంగా ప్రభావితం చేసి కుటుంబ సభ్యుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేసిందన్నారు. భవిష్యత్‌ కష్టాలు తొలగిస్తానని, ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తానని నమ్మించి దశలవారీగా భారీ మొత్తంలో నగదు, బంగారం, ఆస్తులను తీసుకుందని ఆరోపించారు. మొత్తం రూ.2.14కోట్ల వరకు తమ కుటుంబం నష్టపోయినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • ‘టీవీ వద్దు.. ఫోన్‌ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’

    ఆదివారం పొద్దున్నే బన్నీ టీవీ ఆన్‌ చేశాడు.రామ్‌ ఫోన్‌లో గేమ్‌ పెట్టాడు.

    చుక్క, స్వప్న కూడా వాళ్ళ పక్కన కూర్చుని స్క్రీన్‌కే చూస్తున్నారు.

    తాతయ్య వచ్చి కరెంట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ‘ఇవాళ కరెంట్‌ కట్‌’ అని నవ్వాడు.

    ‘బోర్‌ కొడుతుంది తాతయ్య’ అని చుక్క ముఖం చిట్లించింది.

    తాతయ్య అలమారలో నుంచి ఒక పాత సంచి తీశాడు. నిండా కథల పుస్తకాలు.

    ‘తెనాలి రామ, పంచతంత్రం, చందమామ – ఇవి చదివితే బుర్రకు బూస్ట్ఙ్‌ అన్నాడు.

    స్వప్న ఒక పుస్తకం తీసి చదివింది. ‘అరె, ఇది బాగుంది’ అని నవ్వింది.

    రామ్‌, బన్నీ కూడా ఒక్కో పుస్తకం తీసుకున్నారు. గది అంతా నిశ్శబ్దం అయింది.

    తాతయ్య చెప్పాడు: ‘టీవీ, ఫోన్‌ కళ్ళకు నొప్పి. పుస్తకం మెదడుకు పదును.’

    చుక్క లేచి అంది: ‘ తాతయ్యా ... రోజూ అరగంట కథలు చదువుతాం.’

    పిల్లలకి మాట:

    స్క్రీన్‌ చూస్తే సమయం పోతుంది. పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది.

    డాక్టర్‌ కోట లక్ష్మణ్‌

    ప్రభుత్వ ఉపాధ్యాయులు

    గ్రామం: కాకర్లపల్లి, మంథని

    జిల్లా: పెద్దపల్లి

Karimnagar

  • అనగనగా ఒక ఊరిలో కనకయ్య మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఆ కొడుకు పేరు నారాయణ. అతడు పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువును ఆశ్రద్ద చేసేవాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం నారాయణను బాగా చదివించాలనే కోరిక ఉండేది. ఒకరోజు కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నారాయణ కనకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఏమీ కాదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలి అని చెప్పారు. దానికి రూ. 30 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ.. వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో డబ్బు ఏర్పాటుకు చాలా మందిని అడిగారు. కానీ.. ఈలోగ కనకయ్యకు మళ్లీ గుండెపోటు వచ్చి మరణించాడు. అప్పుడు నారాయణ చాలా బాధపడ్డాడు తన వద్ద డబ్బు ఉంటే తన తండ్రిని బతికించుకునే వాడిని అని చాలా ఏడ్చాడు. నాలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ చెప్పినట్టు విని బాగా చదివాడు. పదవ తరగతి లో జిల్లా మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభను చూసి ఒక మంచి కాలేజ్‌ వాళ్లు నారాయణకు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత నారాయణ బాగా చదివి డాక్టర్‌ అయ్యాడు. నారాయణ వాళ్ల నాన్న కోరుకున్నది జరిగినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషపడింది. నారాయణ ఒక ఆసుపత్రిని నిర్మించి అందరికీ ఉచితంగా వైద్యం చేశాడు.

    – హాసిని

    తరగతి: 7వ తరగతి

    పాఠశాల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

    గ్రామం: చింతకుంట, కరీంనగర్‌

    దుర్గం భైతి,

    ప్రభుత్వ ఉపాధ్యాయులు,

    రామునిపట్ల, సిద్దిపేట జిల్లా

    గాలి గాలి ఓ చిరుగాలి

    పవనాలుగా నీవిక తేలి

    నీవస్తావులే మా ఇంటికి

    నచ్చావులే మా కంటికి !

    నీ వల్లే మాకు ఊపిరి ఉంది

    నీవు లేకుంటే కలుగు ఇబ్బంది

    మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ?

    నీ సమాధానం ఇక ఏదైనా

    నీవు లేకుండా పోదు పొద్దైనా

    ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి

    నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి

    చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు

    అట్లనే చేయకు నీవిక అలుసు

    బొగ్గు పులుసు గాలి నీలో ఉంది

    దానితో మాకు కలుగు ఇబ్బంది !

    గాలి తల్లి మా చిరుగాలి మల్లి

    మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి

    నీవు లేకుండా ఉండదు ఏ గల్లి

    నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ !

    గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి

    హోరుగాలితో చేయకు లొల్లి

    చల్లగా తగిలితే కలుగు హాయి

    మెల్లెగ మది ఉప్పొంగు నోయి !

    – గుర్రాల లక్ష్మారెడ్డి

    కవి రచయిత

    గ్రామం:

    కల్వకుర్తి,

    నాగర్‌ కర్నూల్‌ జిల్లా

    గాలి ఓ మా చిరుగాలి

    మన ఊరు మన బడి

    మనదే ఈ జీవితం

    అక్షర జ్ఞానం పొంది

    అవుదాం ఉన్నతం

    ఒకే మాట ఓకే పాట

    ఒకటే మన బడిబాట

    అమ్మ నాన్న కలలు కన్న

    అక్షరాల పూల తోట

    చక్కని క్రమశిక్షణతో

    చదువుకుని ఎదుగుదాము

    ఆచార్యుల మాట విని

    అవనికి వెలుగవుదాము

    ఆట పాటలు కంప్యూటర్‌

    అవలీలగా నేర్చుకుని

    అన్ని రంగాల్లో మనమే

    ముందడుగులు వేద్దాము

    విలువైన విషయాలతో

    విజ్ఞాన విద్యనందుకుని

    విశ్వసేవ పథాన మనం

    వీరత్వం చూపుదాము

    వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్‌ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...

  • పుస్తకం చేతిలో ఉంటే

    భవిష్యత్తు వెలుగులో ఉంటుంది.

    అక్షరం నేర్చిన చిన్నారి

    ఆకాశాన్ని తాకే విజేత అవుతాడు.

    విద్య అనే అమూల్య ధనం

    ఎవ్వరూ దోచుకోలేరు ఎన్నడూ.

    గురువు చూపిన మార్గంలో,

    జ్ఞాన దీపం వెలిగించాలి.

    నేటి చదువు రేపటి బలం

    దేశానికి అది గొప్ప సంపద.

    ప్రతి బిడ్డ చదువుకోవాలి

    ప్రతీ కల నిజం కావాలి.

    విద్యతో ఎదిగి ఉన్నత శిఖరాలు చేరి

    భారత మాతకు కీర్తి తేవాలి.

    – పిల్లల విద్యే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది

    – దూపాటి

    హరిప్రసాద్‌

    షాపూర్‌ నగర్‌,

    హైదరాబాద్‌.

  • కరీంనగర్‌కల్చరల్‌: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు లేని యుగంలో ప్రపంచానికి లెక్కల దారి చూపిన అద్భుత పరికరం అబాకస్‌. చిన్నచిన్న గుళికలను కదిలిస్తూ పెద్దపెద్ద గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించే ఈ పురాతన సాధనం నేటికీ తన ప్రాధాన్యం కోల్పోలేదు. ముఖ్యంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వేగవంతమైన ఆలోచనాశక్తిని అభివృద్ధి చేయడంలో అబాకస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లెక్కల పరికరం ఆధునిక విద్యాప్రపంచంలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాలభవన్‌లో చిన్నారులు అబాకస్‌లో శిక్షణ తీసుకుంటూ.. సులువుగా లెక్కులు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు.

    అబాకస్‌ నిర్మాణం

    అబాకస్‌ సాధారణంగా ఒక చట్రంలో(ఫ్రేమ్‌) ఉండే కడ్డీలు, వాటిపై కదిలే ముత్యాల్లాంటి గుళికలతో తయారవుతుంది. ప్రతీ కడ్డీ ఒక స్థాన విలువను సూచిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు గుళికలను కదిలించడం ద్వారా లెక్కలు చేస్తారు. అబాకస్‌ సుమారు 2000 సంవత్సరాల కంటే పాతది. చైనా, జపాన్‌, రోమ్‌ ప్రాంతాల్లో ఉపయోగించారు. జపాన్‌లో ఉపయోగించే అబాకస్‌ను సోరోబన్‌ అంటారు.

    అబాకస్‌ విశిష్టత

    వేగంగా లెక్కలు చేయగలగడం, కాలిక్యులేటర్‌ లేకుండా పెద్ద లెక్కల్ని కూడా త్వరగా చేయొచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. గణితంపై భయం తగ్గుతుంది. వేగంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక లెక్కలు కొంతకాలం సాధన తర్వాత పిల్లలు అబాకస్‌ను ఊహలో చూసుకుంటూ మెంటల్‌ మ్యాథ్స్‌ చేయగలుగుతారు. చేతి, మెదడు సమన్వయంతో గుళికలను కదిలించడం వల్ల చేతి కదలికలు మెదడు పని కలిసి మెరుగుపడతాయి.

    సులభంగా లెక్కల సాధన మెదుడుకు చురుకుదనం.. జ్ఞాపకశక్తి పెరుగుదల

    బాలభవన్‌లో ఆరేళ్లుగా క్లాసికల్‌ డాన్స్‌, మ్యూజిక్‌ నేర్చుకుంటున్నా. గతేడాది నుంచి అబాకస్‌ నేర్చుకుంటున్నా. ముందుకన్నా ఫాస్ట్‌గా లెక్కలు చేయగలుగుతున్నా. దీనివల్ల మైండ్‌ షార్ప్‌ అవుతుంది.

    – వనజాక్షి, రాంనగర్‌

    గణితంలో మెళకువలతో ప్రాబ్లమ్స్‌ తొందరగా సాల్వ్‌ చేస్తున్నా. అబాకస్‌తో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంతో కష్టమనిపించేది. అబాకస్‌ శిక్షణతో సులువైంది.

    – నిర్వాణ, హనుమాన్‌నగర్‌

  • బీపీఈడీకి 1,788, డీపీఈడీకి 648 మంది అభ్యర్థులు హాజరు

    ఎండను సైతం లెక్క చేయకుండా హాజరైన అభ్యర్థులు

    6న ఫలితాలు

    కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీపీఈసెట్‌)–2026 శారీరక, నైపుణ్య పరీక్షలు 4 రోజుల నుంచి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ మైదానంలో జరుగుతుండగా.. బుధవారంతో ముగిశాయి. శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో నిర్వహించిన శారీరక, నైపుణ్య పరీక్షల్లో భాగంగా బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100, 400(మహిళలు), 800(పురుషులు) రన్నింగ్‌, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌తోపాటు 11 క్రీడల్లో అభ్యర్థులు ఎంచుకున్న వాటిలో పరీక్షలను నిర్వహించారు. జాతీయస్థాయిలో రాణించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వాటికి వచ్చే మార్కులను సైతం నిర్వాహకులు కేటాయించారు. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా 4 రోజుల్లో 2,436 మంది హాజరవడం విశేషం. జూన్‌ 6న ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్‌–2026 చైర్మన్‌, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌, కన్వీనర్‌ రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

    ఆత్మవిశ్వాసంతో గెలుపు

    ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభ్యర్థులందరూ క్రమశిక్షణతో శారీరక నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవాలని, ఆత్మవిశ్వాసమే అభ్యర్థులను గెలుపు తీరాలను చేరుస్తుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేశ్‌కుమార్‌ అన్నారు. అభ్యర్థులను పరిచయం చేసుకొని టీజీపీఈసెట్‌ నైపుణ్య పరీక్షలను ప్రారంభించారు. కన్వీనర్‌ రాజేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అభ్యర్థులకు అన్ని వసతులతో పరీక్షలు నిర్వహించామన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,386 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,788 మంది హాజరయ్యారన్నారు. డీపీఈడీ కోర్సుకు 976 మందికి గాను 648 మంది హాజరయ్యారని తెలిపారు. రిజిస్ట్రార్‌ సతీశ్‌కుమార్‌, ఓఎస్డీ హరికాంత్‌, జాఫర్‌, నజీముద్దీన్‌ మునవర్‌, శ్రీధర్‌రావు, శాతవాహన పీడీ విజయ్‌కుమార్‌, వివిధ విశ్వవిద్యాలయ వ్యాయామ అధికారులు పాల్గొన్నారు.

  • 1. పొద్దస్తమానం పనిచేస్తూనే ఉండే బానిస నోరు అనే భూస్వామి వద్ద వెట్టి చేస్తోంది

    ఆయన ఇంట్లోకి ఎన్నెన్ని తెచ్చి పడేసినా నోరు మెదపక దంచి, మెత్తగా నూరుతుంది.

    2. మనిషి జాతకమే నాదగ్గరుందని

    పోసుకోలు కబుర్లు చెప్తుంది

    ప్రమాణ సాక్షిగా నిజమే చెప్తున్నానంటూ

    మాటిమాటికీ ఓట్లు వేస్తుంది.

    3. పిడికెడంత చిన్న ఇల్లు

    దాన్లో నాలుగు గదులు

    క్షణం తీరిక లేదు

    దమ్మిడి ఆదాయం లేదు.

    4. పటిష్టమైన భద్రత మధ్య

    ప్రధానమైన అవయవం

    అందరితో పని చేయిస్తూ

    అన్నీ చూసుకునే పెద్దబాస్‌

    ముడతల శరీరమే గానీ

    మహా తెలివిమంతురాలు

    5. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ

    తాను నోరిప్పి ఒక్కమాటా మాట్లాడదుఅంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా

    లోలాకులు, రింగులు, జూకాలు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది.

    6. ప్రాణవాయువును పీల్చుకుంటుంది

    కార్బన్‌ డైయాకై ్సడ్‌ను వదుల్తుంది

    వాసనలను చక్కగా చెపుతుంది

    దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది.

    7. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది.

    ఇంత గారాబమైతే ఎలాగమ్మా!

    8. శరీరం రాజులా మీద ఎక్కి కూర్చుంటే సేవకుల్లా ఇవి మోసుకుంటూ తిరుగుతాయి.

    ముల్లు గుచ్చుకున్నా, ఎదుర్రాయి కొట్టుకున్నా బాధలు, నొప్పులు, కన్నీళ్లు, రక్తాలు వీటికే

    – కందేపి రాణీప్రసాద్‌

    రచయిత్రి, సిరిసిల్ల

    జిల్లా: రాజన్నసిరిసిల్ల

    జవాబులు: 1.జీర్ణాశయం,

    2.అరచేయి, 3.గుండె,

    4.మెదడు, 5.చెవి, 6.ముక్కు, 7.నోరు, 8.కాళ్ళు

  • ‘టీవీ వద్దు.. ఫోన్‌ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’

    ఆదివారం పొద్దున్నే బన్నీ టీవీ ఆన్‌ చేశాడు.రామ్‌ ఫోన్‌లో గేమ్‌ పెట్టాడు.

    చుక్క, స్వప్న కూడా వాళ్ళ పక్కన కూర్చుని స్క్రీన్‌కే చూస్తున్నారు.

    తాతయ్య వచ్చి కరెంట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ‘ఇవాళ కరెంట్‌ కట్‌’ అని నవ్వాడు.

    ‘బోర్‌ కొడుతుంది తాతయ్య’ అని చుక్క ముఖం చిట్లించింది.

    తాతయ్య అలమారలో నుంచి ఒక పాత సంచి తీశాడు. నిండా కథల పుస్తకాలు.

    ‘తెనాలి రామ, పంచతంత్రం, చందమామ – ఇవి చదివితే బుర్రకు బూస్ట్ఙ్‌ అన్నాడు.

    స్వప్న ఒక పుస్తకం తీసి చదివింది. ‘అరె, ఇది బాగుంది’ అని నవ్వింది.

    రామ్‌, బన్నీ కూడా ఒక్కో పుస్తకం తీసుకున్నారు. గది అంతా నిశ్శబ్దం అయింది.

    తాతయ్య చెప్పాడు: ‘టీవీ, ఫోన్‌ కళ్ళకు నొప్పి. పుస్తకం మెదడుకు పదును.’

    చుక్క లేచి అంది: ‘ తాతయ్యా ... రోజూ అరగంట కథలు చదువుతాం.’

    పిల్లలకి మాట:

    స్క్రీన్‌ చూస్తే సమయం పోతుంది. పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది.

    డాక్టర్‌ కోట లక్ష్మణ్‌

    ప్రభుత్వ ఉపాధ్యాయులు

    గ్రామం: కాకర్లపల్లి, మంథని

    జిల్లా: పెద్దపల్లి

  • ఏమో.. తెలియదు సార్‌!

    సుబోధ్‌సింగ్‌ నెట్‌వర్క్‌లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్‌ పోలీసులు వేసిన ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌ను సవాలు చేస్తూ సుబోద్‌ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూపిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సుబోధ్‌సింగ్‌ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్‌ను తరలించడంలో సీపీ గౌస్‌ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయనిపుణులు, బిహార్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ ఆఫీసర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్‌లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్‌ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు.

    సుబోధ్‌ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్‌ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్‌ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్‌కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్‌క్రా్ట్‌గా సీఐ తిరుమల్‌, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్‌లో దిగాక సీపీ గౌస్‌ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    సుబోధ్‌ను బిహార్‌ నుంచి

    తీసుకొస్తున్న సీఐ తిరుమల్‌, ఎస్సై రాజన్న (ఫైల్‌)

    సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసు మాస్టర్‌మైండ్‌ సుబోధ్‌ సింగ్‌ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకి పాల్పడిన సుబోధ్‌ గ్యాంగ్‌.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్‌సింగ్‌గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్‌ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్‌కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్‌ నుంచి సుబోధ్‌ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్‌ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్‌ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్‌సింగ్‌ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సుబోద్‌తో పాటు రఘునాథ్‌ కర్మాకర్‌, రావేశ్‌కుమార్‌లను కలిపి విచారించారు. ఇప్పటికే పోలీసులు పట్టుకున్న మరో నిందితుడు మేహతాబ్‌(సిమ్‌ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి)ని కస్టడీకి దూరంగా ఉంచారు.

    వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ కరీంనగర్‌ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్‌కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్‌ కర్మాకర్‌, రావిశ్‌కుమార్‌, మెహతాబ్‌ఖాన్‌ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్‌ సింగ్‌ను మాస్టర్‌మైండ్‌గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్‌ వెళ్లారు. అక్కడ సుబోధ్‌ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది.

  • కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని ధాన్యం సేకరణ ప్రక్రియ 96 శాతం పూర్తయిందని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్‌ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా రైతులకు రూ.628 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 236 కేంద్రాలను అధికారులు మూసివేశారని, ఈ నెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తంగా మరో మూడు రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో, మానకొండూర్‌ నియోజకవర్గంలోని మానకొండూర్‌, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నూరుశాతం పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 3,16,926 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95 శాతం తరలింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని వివరించారు.

    ‘ప్రజాపాలన’ పకడ్బందీగా నిర్వహించాలి..

    జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బౌండరీలు ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్‌ రెడ్డి, డీఆర్వో జె.స్వామి, సీపీవో రామ్‌దత్తరెడ్డి, డీపీవో జగదీశ్వర్‌, ఇన్‌చార్జి సీఈవో పవన్‌ కుమార్‌, డీఈవో ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూపరాణి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

  • తిమ్మాపూర్‌: మండలంలోని దిగువమానేరు జలాశయం పరిశీలనకు కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌస్‌ ఆలం బుధవారం అకస్మాతుగా వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు డ్యామ్‌ను వివిధ భాగాల్లో కలయతిరిగారు. డ్యామ్‌ కట్టపై నుంచి నీటి ప్రవాహం ఉన్నంతవరకు నడుచుకుంటూ లోపలికి వెళ్లిన సీపీ, నీటి విడుదల, నీటి నిలువను సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏవైనా ప్రమాదాలు ఉంటాయా, నీటి కొరత ఎలా ఉంటుందనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

    మట్టి తరలింపు పరిశీలన..

    మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల కోసం తరలిస్తున్న మట్టి లారీల వివరాలు సీపీ తెలుసుకున్నారు. ఈ వాహనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్యామ్‌లో తిరగడం స్థానికులు, అధికారులలో ఆశ్చర్యం కలిగించింది. మట్టి మాఫియా ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసినట్లు సమాచారం. అదేవిధంగా సాయంత్రం వేళలో డ్యామ్‌ కట్టపై పెట్రోలింగ్‌ మరింత పెంచాలని డ్యామ్‌ పరిసరాలకు విద్యార్థులు పిల్లలు రాకుండా చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్‌ సీఐ రమేశ్‌, ఎస్‌ఐ అన్వర్‌లకు సూచించారు.

  • చొప్పదండి: తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌ చేస్తున్న దొంగలతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొంతకాలంగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతుండగా... తాళం వేసిన ఇండ్లలోనే చోరీలు జరుగుతున్నాయి. తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేశం కుటుంబ సభ్యులతో తిరుమల దర్శనానికి వెళ్ళి రాగా చోరీ ఘటన చోటు చేసుకుంది. నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు స్థానికంగా సీసీ కెమరాల్లో కనిపిస్తోంది. పోలీసుల ఉనికిని గమనిస్తు దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం. ముఖానికి గుడ్డ కట్టుకొని, నెత్తిన టోపీ పెట్టుకొని చోరీ అనంతరం దర్జాగా నడుచుకుంటు వెళ్ళినట్లు సీపీ పుటేజీల్లో కనిపిస్తోంది. పగటి పూట రెక్కీ నిర్వహిస్తూనే రాత్రి పూట చోరీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పైగా సీసీ కెమరాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకుంటు నంబర్‌ లేని వాహనంపై దొంగలు సంచరిస్తు ఫోన్‌లలో మాట్లాడటం గమనార్హం. కాగా చోరీ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని, పలు క్లూల ఆధారంగా దొంగలను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నామని ఎస్‌ఐ నరేశ్‌ రెడ్డి తెలిపారు.

Peddapalli

  • ఫెర్టిలైజర్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ 22వ డివిజన్‌ గౌతమిన గర్‌ చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, కాంట్రాక్టర్‌ గోపు ఐలయ్య యాదవ్‌(70) గుండెపోటుతో కోల్‌కతాలో మృతి చెందారు. వ్యాపార పనుల నిమిత్తం కోల్‌క తాకు వెళ్లిన ఆయన.. మంగళవారం మ ధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. కు టుంబ సభ్యులు వెంటనే అక్కడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. గోపు ఐలయ్య యాదవ్‌ రామగుండం నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. ఆయనకు భార్య గోపు పద్మావతి, ముగ్గురు కుమార్తెలు రూప, రేఖ, రమ్య ఉన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కౌశిక హరి, లత బుధవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • పెద్దపల్లి: మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరు చేస్తామని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈనెల 4 నుంచి 15 వరకు కార్మికుల సంతకాలతో లేఖలు రాయాలని, 18, 19వ తేదీల్లో మున్సిపల్‌ కార్యాలయా ఎదుట నిరాహార దీక్ష చేపట్టాలని, 22న చలో కలెక్టరేట్‌ చేపట్టాలని, 29, 30వ తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలని, అయినా, సమస్యలు పరిష్కారం కాకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు ముత్యంరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సావనపల్లి వెంకటస్వామి, నాయకులు సింగారపు గట్టయ్య, చిప్పకుర్తి చందు, బొంకూరి సాగర్‌, దూడపాక చుక్కమ్మ, బొంకూరు శంకర్‌, మంచినీళ్ల భారతి తదితరులు పాల్గొన్నారు.

    వరి విత్తనాల పేర్ల ప్రకటన

  • గోదావరిఖని: పాలనాపరంగా పట్టు సాధించేందుకు సింగరేణి సీఎండీ, ఐఏఎస్‌ అధికారి దృష్టి సారించారు. ఒకవైపు సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేస్తూనే, మరోవైపు ఉద్యోగులతో నేరుగా భేటీ అవుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారుల ఆకస్మిక బదిలీతోనూ వారిపై పట్టు బిగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సంస్థ సీఎండీగా బాఽ ద్యతలు చేపట్టిన బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి సంస్థపై పూర్తిస్థాయిలో పట్టుసాధించేందుకు అన్నిఏరియాల్లో పర్యటించి కార్మికులతో మమేకం అవుతున్నారు.

    రామగుండంపై ప్రత్యేక దృష్టి..

    రామగుండంలో ఇటీవల పర్యటనకు వచ్చిన క్ర మంలో ఆర్జీ–1 జీడీకే–11గనిలో కార్మికులతో నేరు గా సమావేశమయ్యారు. సంస్థ పరిస్థితులు, కార్మికులకు సంస్థ నుంచి కావాల్సిన అవసరాలు, ఉద్యోగులు చేయాల్సి పనివిధానంపై దిశానిర్దేశం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి గనులు, ఓసీల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. రాబోయే రోజుల్లో సంస్థ ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగుల నుంచి అందాల్సి సహకారం గురించి చర్చించారు.

    అధికారుల బదిలీలపై చర్చ

    సింగరేణిలో తన మార్కు చూపించేందుకు సీఎండీ అధికారుల బదిలీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చాలాఏళ్లుగా ఒకేఏరియాలో పనిచేయడం, రిక్వెస్ట్‌ బదిలీలు, పదోన్నతి బదిలీలు ఎక్కువగా జరిగాయి. మైనింగ్‌, ఈఅండ్‌ఎం, హెల్త్‌, ఐఈడీ, పర్సనల్‌ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున బదిలీలు కావడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో మరికొంత మంది అధికారుల బదిలీలు కూడా ఉండచ్చొనే చర్చ సాగుతోంది. పాలనాపరంగా పట్టుబిగించేందుకు పెద్దఎత్తున బదిలీలు జరిగినట్లు చర్చ సాగుతోంది.

    క్షేత్రస్థాయి పర్యటనతో మరింత లోతుగా

    సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులపాటు కార్యాలయంలో ఉంటూనే సంస్థ స్థితిగతులపై అధ్యయనం చేశారు. అన్ని ఏరియాల్లో పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, సంక్షేమ కార్యక్రమాలపై దృషి సారిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత లోతుగా ముందుకెళ్లి ఉద్యోగులను కార్మోణుఖుల ను చేసి సంస్థను లాభాల బాటలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

  • జ్యోతినగర్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పౌరుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల పంపిణీ విధానంలో ఒక విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఒకే ఒక మల్టీపర్పస్‌ యూనిఫైడ్‌ కార్డును జారీ చేసేందుకు ఐటీ శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది.

    అన్ని శాఖల సంక్షేమం ఒకేచోట..

    ప్రస్తుతం లబ్ధిదారులకు వేర్వేరు పథకాల కోసం విడివిడిగా కార్డులున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త ఏఐ ప్రొఫైలింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఆరోగ్యశ్రీ, చేయూత పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ముఖ్యమంత్రి సహాయ నిధి, కార్మిక శాఖ పరిధిలోని అన్ని ప్రయోజనాలు ఒకే డిజిటల్‌ కార్డు కిందకు రానున్నాయి. దీనికోసం ఇటీవల సేకరించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే డేటాను కూడా ఈ కార్డుతో అనుసంధానించనున్నారు.

    ఒకే కార్డు.. బహుళ ప్రయోజనాలు

    ఒకే డిజిటల్‌ కార్డు ద్వారా రేషన్‌, పెన్షన్‌, ఫ్రీ హెల్త్‌ కేర్‌ వంటి అన్ని రకాల సంక్షేమ ప్రయోజనాలను అర్హులు పొందొచ్చు.

    పారదర్శకత..

    ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడడం వల్ల ఒకే లబ్ధిదారుడు ఒకేరకమైన లబ్ధిని రెండుసార్లు పొందకుండా అరికట్టడం సులువవుతుంది.

    గల్ఫ్‌ వలసదారులకు ప్రత్యేక ప్రొఫైల్‌

    కేరళ రాష్ట్ర ఉత్తమ విధానాల తరహాలోనే తెలంగాణ నుంచి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే కార్మికుల నైపుణ్యాలు, పాస్‌పోర్ట్‌, వీసా వివరాలను కూడా ఈ కేంద్రీకృత వ్యవస్థలో చేర్చనున్నారు.

    రాష్ట్రస్థాయి ప్రత్యేక గుర్తింపు సంఖ్య

    ఈ ప్రాజెక్టును మరింత పటిష్టం చేయడానికి జాతీయస్థాయి గుర్తింపు కార్డుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒక వ్యక్తి మరణించినప్పుడు జారీ అయ్యే డెత్‌ సర్టిఫికెట్‌ డేటా ఆటోమేటిక్‌గా చేయూత పెన్షన్‌ డేటాబేస్‌కు లింక్‌ అయ్యేలా ఏఐ రూటింగ్‌ సిస్టమ్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రొఫైలింగ్‌ను కూడా ఇందులో చేర్చడం ద్వారా అర్హులైన నిజమైన పేదలకు మరింత వేగంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

  • కరీంనగర్‌స్పోర్ట్స్‌: శారీరక విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు కరీంనగర్‌లో నిర్వహించిన టీజీపీఈసెట్‌ –2026 బుధవారంతో ప్రశాంతంగా ముగిసింది. భానుడి భగభగలను లెక్కచేయకుండా అభ్యర్థులు శారీరక, నైపుణ్య పరీక్షల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,436 మంది హాజరయ్యారు. ఇందులో బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వ్యాయామ విద్యా రంగంలో స్థిరపడాలనే పట్టుదలతో క్రీడాకారులు శారీరకదారుఢ్య పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పరీక్షల ఫలితాలను ఈనెల 6న విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్‌ 2026 చైర్మన్‌, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌ కుమార్‌, కన్వీనర్‌ రాజేష్‌ కుమార్‌ తెలిపారు.

    ఇంధన డిపో సందర్శన

    రామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) ఇంధన డిపోను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్‌ మనీశ్‌ తదితరులు ఉన్నారు.

    నియామకం

    పెద్దపల్లి: జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఆకుల స్వామి వివేక్‌ పటేల్‌ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సోషల్‌ మీడియా జిల్లా ఇన్‌చార్జిగా నియమించారు. ఈమేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఒరగంటి ఆనంద్‌ బుధవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆకుల స్వామి వివేక్‌ పటేల్‌ విశిష్ట పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయనను పలువురు అభినందించారు.

  • కోల్‌సిటీ: స్వశక్తి మహిళలు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడేలా వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. ధనశ్రీ పట్టణ మహిళా సమాఖ్యలో భాగమైన ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు కొత్తగా ఎన్నికై న అధ్యక్షులతో బుధవా రం బల్దియా కార్యాలయంలో సమావేశమయ్యారు. స్వశక్తి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ లు, తక్కువ వడ్డీరేట్లతో రుణాలు ఇప్పించి వ్యాపార యూనిట్లు స్థాపించుకునేందుకు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ సహకకారం అందిస్తున్నారని తెలిపా రు. పట్టణ ప్రాంత స్వశక్తి మహిళలతో సోలార్‌ ప్లాంట్లు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించే యోచనలో ఉన్నారని వెల్లడించారు. ధనశ్రీ పట్టణ సమాఖ్య కార్యకలాపాలు ఆరేళ్లుగా స్తంభించిన నేపధ్యంలో పునరుద్ధరించేందుకు ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపా రు. త్వరలో పట్టణ సమాఖ్యకు కూడా కొత్త కార్యవ ర్గం ఎన్నుకోవాలని సూచించారు. కమిషనర్‌ అరుణ శ్రీ మాట్లాడారు. టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత పాల్గొన్నారు.

  • రామగుండం: అంతర్గాం మండలం ముర్మూర్‌ గ్రామానికి చెందిన గోపు అయిలయ్య యాదవ్‌ తన ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. అప్పట్నుంచే కష్టాన్ని నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో చదువుకున్నారు. ఉపాధి, కుటుంబ బాధ్యతలు సమన్వయం చేస్తూ పారిశ్రామికవేత్తగా, కాంట్రాక్టర్‌గా ఎదిగారు. కాంట్రాక్టరుగా తన జీవితంలో 1990ల్లోనే విజయవాడ బస్టాండ్‌ నిర్మాణం చెప్పుకోదగ్గ విషయమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. అంతేకాదు.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో తన భాగస్వామ్యంతో, గోపు వంశీయుల సహకారంతో శ్రీమల్లికార్జునస్వామి ఆలయం నిర్మించారు. గత ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో కుటుంబసమేతంగా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించి తన తండ్రి ఆశయం నెరవేర్చారు.

  • సాక్షి పెద్దపల్లి:

    జిల్లాలో ఇటుకబట్టీల అవసరాల కోసం చెరువుల నుంచి మట్టి తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ట్లు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. చెరువుల్లోంచి మట్టి రవాణాపై కలెక్టర్‌ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా అమలుకాకపోవడం గమనార్హం. జిల్లాలోని కొదురుపాక, ఇందుర్తి, ముత్తారం చెరువుల నుంచే మట్టి తవ్వకాలకు అనుమతులు జారీచేశారు. ప్రతీ వాహనానికి ఫొటోగ్రఫీ, రసీదు తప్పనిసరి చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మట్టి రవాణా చేయాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిపోతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు.

    దందాకు ఊతం ఇలా..

    నిబంధనల ప్రకారం చెరువు మట్టి తవ్వకానికి క్యూ బిక్‌ మీటర్‌ లెక్కన అనుమతి ఇవ్వాల్సిన అధికారులు.. టిప్పర్ల లెక్కన పర్మిషన్లు ఇస్తూ అక్రమాలకు బీజం వేశారు. అదికూడా ఎన్నిౖ టెర్ల వాహనం అనే ది స్పష్టత లేదు. మట్టి తరలించేది 12 లేదా 14 లేదా 16 టైర్ల లారీ కావచ్చు. ఈ లోపాన్ని అదనుగా తీసుకున్న అక్రమార్కులు.. వే బిల్లులు లేకుండానే ఓవర్‌లోడ్‌తో చెరువు మట్టి తవ్వుతూ, తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.

    ‘చెరువు మట్టి గ్రామానిది.. ఆదాయం ఎవరికి?

    మట్టి రవాణా కోసం 12 టైర్ల వరకు ఉన్న వాహనాలకే అనుమతి ఉన్నా.. కొన్నిప్రాంతాల్లో 16 టైర్ల టి ప్పర్లనూ వినియోగిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వీటి రాకపోకలతో రోడ్లు దెబ్బతింటుండగా, దుమ్ము, ధూళి సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్ల మరమ్మతుకు భారీగా ప్రజాధనం వెచ్చించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

    మట్టి అక్రమ రవాణా, చెరువుల పరిరక్షణ, గ్రామీణ రోడ్ల ధ్వంసం వంటి అంశాలపై పలు గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. చెరువుల్లో మట్టి తీసినందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకు ఇటుకలు ఇస్తారని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చెబుతన్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలుకావడం లేదు. వ్యవసాయం, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమైన వనరులని, వాటిసహజ స్వరూపం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

    చోద్యం చూస్తున్న యంత్రాంగం

    జిల్లాలో విచ్చలవిడిగా, ఇష్టారీతిన మట్టి అక్రమ దందా కొనసాగుతున్నా రెవెన్యూ, మైనింగ్‌, నీటిపారుదల, ఆర్టీఏ, పోలీస్‌ విభాగాలు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అను మానాలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరోకీలక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ తతంగం కొనసాగుతోందని, అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

  • గోదావరిఖని: తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) చీఫ్‌ కల్వకుంట్ల కవిత కోల్‌బెల్ట్‌ పర్యటన ఖరారైంది. ‘బాయిబాట’ పేరిట సింగరేణి అండర్‌ గ్రౌండ్‌, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో కార్మికులతో ఆమె సమావేశమవుతారు. కల్వకుంట్ల కవిత పర్యటన సింగరేణిలో పొలిటికల్‌ హీటెక్కిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బొగ్గు గనుల్లో పర్మినెంట్‌ కార్మికులు సుమారు 40వేల మంది, కాంట్రాక్టు కార్మికులు దాదాపు 30వేల మందికిపైగా ఉన్నారు. పరోక్షంగా మరో 20 వేల కుటుంబాలు సింగరేణి సంస్థపై ఆధారపడి జీవిస్తున్నాయి.

    కార్మికుల ఓట్లే కీలకం..

    ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటర్లు పట్టంకట్టారు. గతంలో బీఆర్‌ఎస్‌ను ఆదరించారు. ఈక్రమంలో సింగరేణి ఉద్యోగుల ఓ ట్లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ప్ర స్తుతం సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కాలపరిమితి ముగియడం, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ నిలిచిపోవడం, మెడికల్‌ పూర్తయిన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం, విజిలెన్స్‌ విచారణ పేరిట మారుపేరు ఉద్యోగుల డిపెండెంట్ల ఉద్యోగాలు ని లిపివేయడంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘంతోపాటు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి తీరుపై ఆందోళన చేపట్టాయి. అన్నిగనులపై టీబీజీకేఎస్‌ నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించింది. సీఐటీయూ నాయకులు జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేసింది.

    టీబీజీకేఎస్‌ కార్యాచరణ

    సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ఆందోళనకు సిద్ధమైంది. యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్‌ రెండ్రోజు క్రితం సమావేశమై యూనియన్‌ శ్రేణులను అప్రమత్తంచేశారు. ఇందులో భాగంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో గనులపై నిరసన ప్రదర్శన నిర్వహించారు.

    ఆందోళన బాటలో కార్మిక సంఘాలు

    ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యాజమాన్యం హా మీతో కొంత మెత్తబడినా మిగతా కార్మిక సంఘాలు ఉధ్యమానికి సిద్ధమయ్యాయి. సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌ తమ పోరాటానికి పదును పెడుతున్నాయి. ఈక్రమంలో ప్రతినెల రెండు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

    డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినా..

    సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశమై కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా.. కార్యాచరణలో ముందుకు సాగకపోవడంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మారుపేర్ల మార్పు, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కార్మికుల పిల్లలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసు మాస్టర్‌మైండ్‌ సుబోధ్‌ సింగ్‌ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకి పాల్పడిన సుబోధ్‌ గ్యాంగ్‌.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్‌సింగ్‌గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్‌ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్‌కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్‌ నుంచి సుబోధ్‌ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్‌ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్‌ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్‌సింగ్‌ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది.

    పోలీసులకు సవాల్‌..

    వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ కరీంనగర్‌ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్‌కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్‌ కర్మాకర్‌, రావిశ్‌కుమార్‌, మెహతాబ్‌ఖాన్‌ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్‌ సింగ్‌ను మాస్టర్‌మైండ్‌గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్‌ వెళ్లారు. అక్కడ సుబోధ్‌ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది.

    ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు..

    సుబోధ్‌సింగ్‌ నెట్‌వర్క్‌లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్‌ పోలీసులు వేసిన ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌ను సవాలు చేస్తూ సుబోద్‌ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూ పిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సు బోధ్‌సింగ్‌ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్‌ను తరలించడంలో సీపీ గౌస్‌ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయని పుణులు, బిహార్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ ఆఫీ సర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్‌లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్‌ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు.

    బేడీలు తీసి విమానంలోకి..

    సుబోధ్‌ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్‌ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్‌ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్‌కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్‌క్రా్ట్‌గా సీఐ తిరుమల్‌, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్‌లో దిగాక సీపీ గౌస్‌ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • గోదావరిఖని: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్‌, పెట్రో సిబ్బంది పాత్ర అత్యంత కీలక మని రామగుండం కమిషనరేట్‌ అడిషనల్‌ డీ సీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌ అన్నారు. కమిషనరేట్‌ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌, అనిల్‌కుమార్‌, బాబురావు, సిబ్బంది పాల్గొన్నారు.

    క్రమశిక్షణే బీజేపీకి బలం

    సుల్తానాబాద్‌రూరల్‌: బీజేపీ కార్యకర్తల క్రమశిక్షణే పార్టీకి బలమని ఆ పార్టీ ఎమ్మెల్సీ చిన్న మల్‌ అంజిరెడ్డి అన్నారు. నర్సయ్యపల్లిలోని విజయ గార్డెన్‌లో రెండురోజుల పాటు జరిగే జి ల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. కార్యకర్తలు క్రమశిక్షణ, నిబ ద్ధతతో పనిచేయాలని సూచించారు. ఇన్‌చార్జి రాజమౌళిగౌడ్‌, ప్రశిక్షణ జిల్లా ఇన్‌చార్జి పరినీత, మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత, జిల్లా ప్రశిక్షణ కన్వీ నర్‌ గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి, నాయకులు గోమాస శ్రీనివాస్‌, నల్ల మనోహర్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు

    గోదావరిఖనిటౌన్‌: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సు నడిపిస్తామని డీఎం నాగభూషణం తెలిపారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరిఖని నుంచి బస్సు బయలు దేరుతుందని పేర్కొన్నారు. ఈయాత్రలో హంపీ, గోవా, గోకర్ణ, మురుడేశ్వర్‌, ఉడిపి, ధర్మస్థల, కుక్కేసుబ్రహ్మణ్య, మంత్రాలయం పుణ్య క్షేత్రాల సందర్శన ఉంటుందన్నారు. సీటు రిజర్వేషన్‌, వివరాలకు 70135 04982, 73828 47596 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

    ప్రీప్రైమరీ ఇన్‌ స్ట్రక్టర్ల నియామకం

    పెద్దపల్లి: జిల్లాలోని 48 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి ఆసక్తి, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో శారద తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన 10 నెలల గౌరవ వేతనం చెల్లిస్తారన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 9వతేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

    మట్టి దందాపై చర్యలేవి?

    పెద్దపల్లి: జిల్లాలో వివిధ చెరువుల నుంచి మట్టి తరలించే టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేదాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్‌ ఎదుట రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ప్రకాశ్‌కు ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల అండతో సాగుతున్న మట్టి మాఫియా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట సాగుతున్న మిల్లర్ల దోపిడీని అరికట్టాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచి అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఠాకూర్‌ రఘువీర్‌సింగ్‌, ఉప్పు రాజ్‌కుమార్‌, గుణపతి, వంగల తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, సందీప్‌రావు, కొయ్యడ సతీశ్‌గౌడ్‌, పెంచాల శ్రీధర్‌, వెన్నం రవీందర్‌, రాజ కొమురయ్య, దేవయ్య, మార్కు లక్ష్మణ్‌, సలేంద్ర రాములు యాదవ్‌, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, బైరెడ్డి రాంరెడ్డి, బాలసాని ఈశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌ ముదిరాజ్‌, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పెద్దపల్లి: జిల్లాలో స్వచ్ఛ గావ్‌, సురక్షిత జలవాయు కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గావ్‌, సురక్షిత జలవాయు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈనెల 5వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. తొలివిడతలో 150, రెండోవిడతలో 305 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మూడో విడతలో మరింతమందికి వచ్చేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో నరేందర్‌, డీఆర్డీవో కాళిందిని, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఐజేయూ – టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్ర సంపత్‌ కుమార్‌, డీపీఆర్వో జగన్‌, అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు నారాయణదాసు అశోక్‌, కుమార్‌ యా దవ్‌, రంజిత్‌ కుమార్‌, అంకరి ప్రకాశ్‌, హాకిం, మోహన్‌, కుమార్‌ తదితరులుపాల్గొన్నారు.

    ప్రభుత్వ సందేశం ప్రతీఇంటికి చేరాలి

    జ్యోతినగర్‌/పెద్దపల్లి: జిల్లాలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల సందేశం ప్రతీ ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. ఎన్‌టీపీసీలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక– 99 రోజుల కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఎఫ్‌ఐఆర్‌, పోస్టుమార్టం, మరణధ్రవీకరణ పత్రం ఉండాలని ఆయన పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, నీటి నిర్వహణ, విద్యుత్‌ రంగ అవసరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీశుక్రవారం చేపట్టే డ్రైడేలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్‌, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, ఏసీపీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • గోదావరిఖని: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నూతన కమిటీ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన తొలిసారి సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

    రామగుండం నవీకరణ లక్ష్యం

    రామగుండం: పట్టణ నవీకరణ తన ప్రధాన లక్ష్య మని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. పట్టణంలోని 25, 26, 27, 28వ డివిజన్‌కాలనీల్లో ఆయన పర్యటించారు. మేయర్‌ మహంకాళి స్వా మి, కమిషనర్‌ అరుణశ్రీ, కార్పొరేటర్లు సిరిశెట్టి సతీశ్‌, ఇసంపెల్లి అంజయ్య, డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, టీపీఎస్‌ నవీన్‌, ఏఈ తేజస్విని, శా నిటరీ జవాన్‌ తిరుపతి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్‌ తదితరులు ఉన్నారు. కా గా, ఈసాలతక్కళ్లపల్లిలో హార్టికల్చర్‌ అధికారులు నిర్వహించిన ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఉద్యానవన అధికారులు శ్యామ్‌ప్రసాద్‌, జ్యోతి, తిరుమల ఆయిల్‌కేన్‌ కంపెనీ సీఈవో కేషు కల్యాణ్‌, ఏఎంసీ చైర్మన్‌ గడ్డం తిరుపతి, సర్పంచ్‌ బండి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ వొడ్నాల జ్యోతి పాల్గొన్నారు.

  • పెద్దపల్లిరూరల్‌: నేరాలను కట్టడి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. దాతల సహకారంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలు, ప్రహరీ అభివృద్ధి పనులను రామగుండం పోలీస్‌ క మిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, డీసీపీ రాంరెడ్డినాయక్‌తో కలిసి బుధవారం విప్‌ ప్రారంభించారు. సీసీ కె మెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటైన పట్టణాల్లో పెద్దపల్లి అగ్రస్థానంలో ఉందని సీపీ అన్నారు. కరీంనగర్‌ నగల దుకాణంలో చోరీకి వచ్చినవారు తొలుత పెద్దపల్లినే ఎంచుకున్నా.. ఇక్కడి పటిష్ట నిఘా వ్య వస్థను అంచనా వేసి తమ ప్రణాళిక మార్చుకున్నా రని తెలిపారు. పెద్దపల్లిలోని రూరల్‌, మహిళా, ట్రా ఫిక్‌, ఎలిగేడులోని పోలీస్‌స్టేషన్లకు సొంత భవనా లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయానికి సైతం భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లిలో చందపల్లి, రాంపల్లిరోడ్డులో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్‌ పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రిక్రియేషన్‌క్లబ్‌ ప్రధానకార్యదర్శి కొట్టె సదానందం, కౌన్సిలర్‌ రజనీకృష్ణమూర్తితోపాటు రంగు శ్రీనివాస్‌ను అభినందించి సత్కరించారు. అనంతరం పోలీసులకు హెల్మెట్లు అందజేశారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్‌, శ్వేతతోపాటు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

  • పెద్దపల్లి: ఒడిశాలో నిర్వహించిన జూనియర్‌ నేషనల్‌ కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పెద్దపల్లి బీఎంఆర్‌ కరాటే, కిక్‌బాక్సింగ్‌ అకాడమీ విద్యార్థి గురువీర్‌సింగ్‌ బంగారు పతకం సాధించాడు. 51 కేజీల కె–1 ఫైట్‌ విభాగంలో పోటీపడి అద్భుత ప్రతిభ కనబర్చాడని కోచ్‌ కర్ర వెంకటేశ్‌ తెలిపారు. వాకోఇండియా కిక్‌బాక్సింగ్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ అగర్వాల్‌, తెలంగాణ కిక్‌బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్‌ సెక్రటరీ మహిపాల్‌, జిల్లా కార్యదర్శి కుమార్‌, బీఎంఆర్‌ అకాడమీ వ్యవస్థాపకుడు సంతోష్‌, కోచ్‌ వెంకటేశ్‌ తదితరులు గురువీర్‌సింగ్‌ను అభినందించారు.

Nirmal

  • నిర్మల్‌ఖిల్లా: జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు, సంస్కృత పద్యకవి బి.వెంకట్‌ రాష్ట్ర సాహితీ సన్మానాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోగల కళాలలిత కళావేదికలో శ్రీత్యాగరాయ గానసభ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రపంచ శాంతి’ పేరిట నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయనను సన్మానించారు. త్యాగరాయ గానసభ అధ్యక్షుడు శ్రీకళా వీఎస్‌ జనార్దన్‌ మూర్తి, ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్‌, సినీ గేయకవి మౌనశ్రీ మల్లిక్‌, పెద్దూరి వెంకటదాసు, కవయిత్రి శైలజామిత్ర వెంకట్‌ను ప్ర శంసాపత్రం, శాలువాతో సత్కరించారు. 51 మంది కవులు, కవయిత్రులు పాల్గొన్న సమ్మేళనంలో జిల్లా నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొన్న వెంకట్‌ ప్రపంచ శాంతి, తెలంగాణ సంస్కృతి అంశాలపై కవితాగానం చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కవులు ఆయనకు అభినందనలు తెలిపారు.

  • నిర్మల్‌టౌన్‌: మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాల యం నుంచి ప్రారంభమైన ర్యాలీ మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్‌ ఎక్స్‌ రోడ్‌, బస్టాండ్‌ మీదుగా చించోలి అర్బన్‌ పార్క్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. అటవీశాఖ అధికారులు నాగిని భాను, శివకుమార్‌, రామకృష్ణారావు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

  • ఉద్యమ జ్ఞాపకాలు

    తెలంగాణ సాధనకు పదేళ్లపాటు జరిగిన మలి దశ ఉద్యమంలో సబ్బండ వర్గాలు భాగస్వాము లయ్యాయి. జిల్లాలో ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నేపథ్యంలో కథనం..

    వరి కొయ్యలను కాల్చొద్దు

    లక్ష్మణచాంద: వరి కొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ సూచించారు. బుధవారం సోన్‌ మండలంలోని న్యూవెల్మల్‌ గ్రామంలో వరి కొయ్యలు కాల్చితే కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కొయ్యలు కాలిస్తే సూక్ష్మజీవులు నశించి నేలలో సారం తగ్గుతుందని, పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పంట అవశేషాలను నేలలోనే కలియ దున్నితే భూసారం పెరిగి రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని తెలిపారు. సోన్‌ ఏవో వినోద్‌కుమార్‌, ఏఈవో రాజ్‌కుమార్‌ తదితరులున్నారు.

    నిర్మల్‌: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతంగా చేపట్టాల్సిన అవసరముంది. ధాన్యం సేకరణ లక్ష్యం లక్షా 89వేల మెట్రిక్‌టన్నులు కాగా, ఇప్పటివరకు దాదాపు లక్షా 8వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నా రు. కానీ, అనధికారికంగా ఇంకా లక్ష మెట్రిక్‌ టన్ను ల వరకు ధాన్యం కేంద్రాలు, రోడ్లపై కుప్పలుకుప్పలుగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మణచాంద మండలంలో కాస్త వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నా.. సారంగపూర్‌, దిలావర్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఇంకా పెద్దమొత్తంలో ధాన్యం అలాగే ఉంది. నిర్మల్‌తో పాటు ఈసారి భైంసా డివిజన్‌లోనూ ధాన్యం దిగుబడి పెరగడంతో రోడ్ల పొడవునా ఇప్పటికీ వడ్ల కుప్పలే కనిపిస్తున్న పరిస్థితి ఉంది.

    కొరత.. రైతన్నకు వెత

    వరి ధాన్యం రైతులకు సరిపడా గన్నీ సంచులు లేకపోవడం, హమాలీలు అందుబాటులో ఉండకపోవడం, సమయానికి సరిపోయే లారీలూ రాకపోవడం మరింత ఆలస్యానికి కారణాలవుతున్నాయి. మక్క రైతులు సంచికి అదనంగా డబ్బులు ఇస్తుండటంతో చాలావరకు హమాలీలు, లారీలు వాటిని ఎత్తడానికే మొగ్గుచూపుతున్నారు. అలా వెళ్లిన లారీల్లోని మక్కలను గోదాముల్లో అన్‌లోడింగ్‌ చేయడం ఆలస్యమవుతోంది. దాదాపు మక్కలను పూర్తిచేస్తే గాని వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మక్కలు దాదాపు పెద్దసగం పూర్తికాగా, రెండువారాల్లో ధాన్యం పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.

    వానస్తే పరేషానే..

    కేంద్రానికి వడ్లు తెచ్చి నైలెతంది. వెంటవెంట కొంటలేరు. 120బస్తాల వడ్లకు రోజూ కేంద్రంలనే కాపలా కాస్తున్న. వానస్తే వడ్లు తడుస్తయేమోనని భయపడుతున్న. సార్లు జెర వడ్లు కొని మా ఇబ్బందులు తీర్చాలె.

    – లక్ష్మణ్‌, జామ్‌, సారంగపూర్‌ మండలం

    ‘పంట పండించుడు ఒకెత్తయితే, అమ్ముకునే దాకా కాపాడుకోవడం ఒకెత్తయితోంది. రోజూ ఆరబోసుడు, కుప్పలు చేసుడున్నది. ఎప్పుడు వానస్తదో.. ఎక్కడ పంట తడిసిపోతదో.. అని పరేషానవుడున్నది. ఎక్కడున్నా.. ఉరుక్కుంట పోయి టార్పాలిన్‌ కప్పి, పంట కాపాడుకోవాల్సి వస్తోంది. మాదగ్గర మక్కలయిపోయే దాకా వడ్లు కొనేటట్టులేరు. సార్లు.. ఎట్లన్న జేసి వానలు రాకముందే వడ్లెత్తాలె..’

    అని సారంగపూర్‌ మండల రైతు భోజన్న వేడుకుంటున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి వేచిచూస్తున్న రైతులంతా ఇదేవిషయం చెబుతున్నారు. ఎప్పడొస్తుందో తెలియని అకాలవర్షంతో పాటు మరో వారం, పదిరోజుల్లో నైరుతి రుతుపవనాలూ రానుండటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మక్కల కొనుగోలు వేగవంతం చేసినట్లే వడ్ల తరలింపునూ త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.

    వానలు రాకముందే..

    ‘ఇప్పటికే నెలరోజులకంటే ఎక్కువనే ఆగినం. ఇంకొన్నొద్దులు ఆగమా..! కానీ.. యాడ వర్షాలు వస్తాయోనని భయపడాల్సి వస్తోంది. అడపాదడప చెడగొట్టు గాలివానలు వస్తున్నయి. ఇంకో వారమైతే వానాకాలం చాలైతది. అందుకే అప్పటిలోపు వడ్లు ఎత్తాలని కోరుతున్నం..’ అని రైతులు అంటున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటివారంలో కేరళ తీరాన్ని దాటితే.. రెండుమూడు రోజుల్లో తెలంగాణకు చేరుకోవచ్చు. ఆలోపే ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం ధాన్యం తరలింపు జూన్‌ రెండోవారం దాటేలా కనిపిస్తోంది. మరోవైపు కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులు నిత్యం కొనుగోళ్లపైనే దృష్టిపెట్టి వేగవంతం చేస్తున్నారు.

  • లక్ష్మణచాంద: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థినులు వేధింపులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి భద్రతకు భరోసా కల్పిస్తూ అభయహస్తాన్ని అందించేందుకు నిర్ణయించింది. ప్రతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని (చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌) సీపీవోగా నియమించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ అమల్లోకి రానుంది. వేధింపులకు గురై లోలోన కుమిలిపోయేవారు సీపీవోకు ఫిర్యాదు చేయవచ్చు. దీనితో ఇకపై పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా విద్యార్థినుల రక్షణ బాధ్యతలూ పర్యవేక్షించనున్నారు.

    వారానికి ఒక క్లాస్‌ చొప్పున..

    ప్రతీ పాఠశాలలో చట్టాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు వారానికి ఒక క్లాస్‌ తప్పనిసరిగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందులో రాజ్యాంగ విలువలు, పోక్సో యాక్ట్‌ తదితర కీలక చట్టాల గురించి విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించనున్నారు. ప్రతీ స్కూల్‌లో లీగల్‌ లిటరసీ క్లబ్‌ లేదా చైల్డ్‌ రైట్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి సెమినార్‌లు, పోటీల ద్వారా విద్యార్థినులను చైతన్య వంతులుగా తీర్చిదిద్దుతారు.

    జిల్లా, మండల స్థాయిలో నోడల్‌ ఆఫీసర్లు

    జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి, మండల స్థాయిలో మండల విద్యాధికారిని నోడల్‌ ఆఫీసర్లుగా ని యమించనున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి వా రు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో నమోదైన కేసులను పరిష్కరిస్తూ.. విద్యార్థినుల రక్షణ చ ర్యలు పర్యవేక్షిస్తారు. దీని అమలుకు అందుబాటులో ఉన్న వనరులతోపాటు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను వినియోగించుకో వాలని డైరెక్టర్‌ తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. పాఠశాలల్లో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్ల నియామకంతో వి ద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని విద్యార్థినులు, పోషకులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు భావిస్తున్నారు.

    ఇవీ.. సీపీవో విధులు

    జిల్లాలోని పాఠశాలల వివరాలు

    ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 165

    మొత్తం విద్యార్థులు 37,019

    నియమించనున్న సీపీవోలు 165

  • వడ్లపై మక్కల ప్రభావం

    వరి ధాన్యం కొనుగోళ్లపై ఈసారి మొక్కజొన్న ప్రభావం పడుతోంది. ప్రైవేట్‌ మార్కెట్‌తో పోలిస్తే మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వమిచ్చే ధర అధికంగా ఉంది. క్వింటాల్‌కు మార్కెట్‌లో రూ.1,800 వరకు వస్తుండగా, ప్రభుత్వం రూ.2,475పైనే చెల్లిస్తోంది. దాదాపు రూ.600 అధికంగా వస్తుండటంతో రైతులు ప్రైవేట్‌ వైపు చూడటం లేదు. ఇక్కడ కొనుగోలు పరిమితి దాటితేనే ఆ వైపు వెళ్తున్నారు. వరి ధాన్యం కంటే ముందు ధర ఎక్కువగా ఉన్న మక్కలు అమ్ముకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. సంచికి రూ.30–40 అదనంగా ఇస్తూ లారీని తామే తీసుకువచ్చి మక్కలు తరలిస్తున్నారు. చాలాచోట్ల మార్క్‌ఫెడ్‌ సంచులూ ఇవ్వకపోవడంతో రైతులే ఒక్కో సంచిని రూ.35పెట్టి మరీ కొనుక్కున్నారు.

  • దస్తురాబాద్‌: వైద్యానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రేవోజీపేటలో రూ.20లక్షలతో నిర్మించిన హెల్త్‌ సబ్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నాణ్యమైన వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పా రు. కార్యక్రజుమంలో సర్పంచ్‌ కోల మహేశ్‌, తహసీల్దార్‌ యాదవరావ్‌, ఎంపీడీవో రమేశ్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యుడు నాగరాజు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షడు రమేశ్‌రావ్‌, ఆయా గ్రామాల సర్పంచులు గోపాల్‌, నరేశ్‌రెడ్డి, గంగన్న, నరేశ్‌, సురేందర్‌, హెల్త్‌సూపర్‌వైజర్లు లలిత, పల్లవి, పంచాయతీ కార్యదర్శి కల్ప న తదితరులు పాల్గొన్నారు.

    భూమిపూజ.. ప్రారంభోత్సవాలు

    ఖానాపూర్‌: మండలంలోని పాత ఎల్లాపూర్‌లో పా ఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బొజ్జు భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని అధికారులు, స్థానికులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం దిలావార్‌పూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం బాదన్‌కుర్తిలో నూతన పాఠశాల భవనం, కొత్తపేటలో నూతన పంచాయతీ భవనా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు శంకర్‌, ప్రశాంత్‌రెడ్డి, లోహిత, శ్రీనివాస్‌, మల్లేశ్‌, పల్లవి, నరేశ్‌, స త్యం, మాజిద్‌, పెద్దిరాజు, నవీన్‌, రాజేశ్వర్‌, రాజ న్న, పెద్దులు, రాజేందర్‌, రమేశ్‌, కుతుబొద్దీన్‌, సంతోష్‌గౌడ్‌, సచిన్‌, సాగర్‌, హరి, చరణ్‌, శోభన్‌, ధర్మరాజు, గంగన్న, శంకర్‌ తదితరులున్నారు.

    పార్టీ కార్యాలయం ప్రారంభం

    కడెం: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జు ప్రారంభించారు. ఇటీవల పలువురు మృతి చెందగా బాధి త కుటుంబాలను పరామర్శించారు. ఆయా కార్య క్రమాల్లో ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, సర్పంచ్‌ విజ య్‌కుమార్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌రెడ్డి, పా ర్టీ పట్టణాధ్యక్షుడు వాజీద్‌ఖాన్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు భవాని, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామీణ ప్రజలకు తొలి వైద్య ఆశ్రయంగా నిలిచే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఏటా ఆస్పత్రుల నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ బిల్లులు, ఫ ర్నిచర్‌, అత్యవసర ఔషధాల కొనుగోలు తదితర అ వసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్‌) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఏటా హెచ్‌డీఎఫ్‌ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొనడంతో పేదల వైద్యసేవలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా నిధులు విడుదల కావడం లేదు. దీంతో ప్రతీ చిన్న పనికీ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వసతులు సమకూర్చుకునేందుకు వై ద్యులు, సిబ్బంది తంటాలు పడుతున్నారు. వైద్య పరికరాలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఔషధాల కొరత, ల్యాబ్‌ పరీక్షలు, విద్యుత్‌, తాగునీటి బి ల్లుల భారం, పారిశుద్ధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలి తంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభు త్వ వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది.

    మూడేళ్లుగా పెండింగ్‌లో

    రూ.90లక్షలు

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.50 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో 17 పీహెచ్‌సీలు, మూడు యూపీహెచ్‌సీలున్నాయి. ఈ లెక్కన 20 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.30లక్షల చొప్పున మూడేళ్లకు రూ.90 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లభించడం లేదు.

  • లోకేశ్వరం: సనాతన ధర్మం గొప్పదని నందిపే ట్‌ పలుగుట్ట మహారాజ్‌ కేదార నంద స్వామీజీ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కిష్టాపూర్‌, మన్మద్‌ గ్రామాల్లో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని చె ప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దోమల భోజ న్న హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, నాగేశ్‌, సుమన్‌కుమార్‌, శైలజ, భరత్‌గౌడ్‌, ప్రణీత, గంగాప్రసాద్‌ పాల్గొన్నారు.

    ‘కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి’

    నిర్మల్‌టౌన్‌: రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో కార్యకర్తలు కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అబ్జర్వర్‌ సమతా సుదర్శన్‌ సూచించారు. పార్టీ ఎస్సీ సెల్‌ నియామకాల కోసం బుధవారం జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దళిత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్‌, ప్రధాన కార్యదర్శి కొంతం గణేశ్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి తదితరులున్నారు.

  • ముధోల్‌: ఉపాధిహామీ పథకం కింద పానాది రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలుసార్లు చెప్పినా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదని ఎమ్మెల్యే రామారావుపటేల్‌ పేర్కొన్నారు. బుధవారం ముధోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని మండలాల ఉపాధిహామీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ మండలానికి రోడ్ల నిర్మాణానికి రూ.కోట్లాది నిధులు మంజూరైనా టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్లక్ష్యం ప్రదర్శించడం సరికాదన్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తి చేయించిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. రెండేళ్లుగా పానాది రోడ్లపై దృష్టి పెడితే 25శాతం పనులే పూర్తయ్యాయని.. 15 రోజుల్లోనైనా గ్రావెల్‌ రోడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కింద రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని పనులు పూర్తి చేశారు? మిగతా పనుల పరిస్థితిపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించారు. డీఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.

Mancherial

  • మందమర్రిరూరల్‌: పట్టణంలోని రామన్‌ కాలనీకి చెందిన రామటెంకి రాధమ్మ, సమ్మయ్య దంపతుల కుమారుడు శ్రీకాంత్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాదే చివరి ఆత్మహత్య కావాలని 2011, ఆగస్టు 6న ఉరేసుకున్నాడు. దీంతో అతని తల్లి పక్షవాతంతో మంచాన పట్టింది. తండ్రి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు వారి ఇంటికి వచ్చి అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, మందమర్రిలో తమ కుమారుడి విగ్రహం ఏర్పాటు చేయాలని, రామన్‌కాలనీలో సమ్మయ్య సింగరేణి ఉద్యోగం చేసినప్పుడు ఉన్న క్వార్టర్‌ తమకే కేటాయించాలని ఆ దంపతులు కోరుతున్నారు.

  • మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించడంలో ముందు వరుసలో నిలిచాడు వెంపల్లి గ్రామానికి చెందిన ఆరె శ్రీనివాస్‌ (టవర్‌ శ్రీను). తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఐక్యంగా ఉద్యమించాలని డిమాండ్‌ చేస్తూ 2011 సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో హోర్డింగ్‌ పైకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించి 14 గంటల పాటు ఉత్కంఠకు తెరతీశాడు. తెలంగాణ ఐకాస నేత కోదండరామ్‌, గద్దర్‌ హామీతో కిందకు దిగివచ్చాడు. ఫిబ్రవరి 22న మంచిర్యాలలో ఐబీ వద్ద హోర్డింగ్‌ ఎక్కి రోజంతా పైనే ఉన్నాడు. అప్పట్లో నిజామాబాద్‌కు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. వీటితో పాటు మంచిర్యాలలో రైల్‌రోకో నిర్వహించి కేసుల పాలయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో చురుకై న పాత్ర పోషించాడు టవర్‌ శ్రీనివాస్‌.

  • మంచిర్యాలఅర్బన్‌: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో క్రియశీలకంగా వ్యవహరించారు మంచిర్యాలకు చెందిన కవి మలయశ్రీ. తన కవితాగానంతో ఉద్యమ కారుల్లో ఉత్తేజాన్ని నింపారు. పెన్నుతోనే కాకుండా ప్రజలతో మమేకమై క్రియశీలకంగా ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనే కవులు అరుదు. 65 ఏళ్ల వయస్సుల్లో కూడా తెలంగాణ జేఏసీలో చురుకై న బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా నుంచి హస్తీనా వరకు జరిగిన ధర్నా, పోరుబాటలో పాలుపంచుకున్నారు. జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ పిలుపుమేరకు రైలురోకో చేపట్టి అప్పటి టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పురాణంతో కలిసి అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో ప్రొఫెసర్‌ కోదండరాంతో పాల్గొని తన యొక్క ఉద్యమ స్ఫూర్తిని చాటారు.

  • బెల్లంపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బెల్లంపల్లికి ఎంతో ప్రత్యేకత ఉంది. 2009 నవంబర్‌ నుంచి 2012 వరకు అలుపెరగని పోరాటాలు చేశారు. హైదరాబాద్‌–న్యూఢిల్లీ ప్రధాన రైల్వే మార్గం బెల్లంపల్లి మీదుగా వెళ్తుండటంతో రైల్వేస్టేషన్‌ పోరాట కేంద్రమైంది. జేఏసీ పిలుపుతో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఎదురెల్లి నిరసనలు తెలిపారు. కన్నాల బస్తీ నుంచి మొదలుకుని బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌ వరకు దాదాపు 4 కిలోమీటర్ల దూరం వరకు రైలు పట్టాలపై బైఠాయించారు. ఘటనలో 19 మందిపై 12 రైల్వే కేసులు నమోదయ్యాయి.

  • చెన్నూర్‌: చెన్నూర్‌ ఎస్బీఐ బ్రాంచ్‌–2 గోల్డ్‌లోన్‌ బా ధితులు తొమ్మిది నెలలుగా చేస్తున్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. బ్యాంకులో గతేడాది ఆగస్టు 20న బంగారు ఆభరణాలు చోరీకి గురికాగా దొంగలను పట్టుకుని రికవరీ చేసిన విషయం తెలిసిందే. బంగారం ఇవ్వడంతో బ్యాంకర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత నెల 30న బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చే పట్టారు. ఈ నెల 1న కోర్టు ఇంటీరియం కస్టడీ ఆ ర్డర్‌ వెలువరించింది. సొంత పూచీకత్తుతో ఆభరణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు.

    శుభపరిణామమే..

    కోర్టు ఇంటీరియం కస్టడీకి ఇవ్వడం శుభపరిణామమేనని, ఇప్పటికై నా మా బంగారం మాకు రావడం సంతోషంగా ఉందని బాధితులు నల్లకుంట అశోక్‌, బాలరాజు హర్షం వ్యక్తం చేశారు.

  • మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్‌ పోలీస్‌లది కీలక పాత్ర అని రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌ అన్నారు. కమిషనరేట్‌ ఆవరణలో బుధవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్‌ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత తక్కువ సమయంలో ఘటన స్థలానికి చేరుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనుమానితులు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ కోల్ట్ప్‌, పెట్రో కార్ల, వర్టికల్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, సీసీ ఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌, బాబురావు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 జూలైలో ఖానాపూర్‌ నుండి ఆదిలాబాద్‌కు ఒంటరిగా పాదయాత్ర చేపట్టా. పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి పాలకుల నుండి అనేక బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురయ్యాయి. జేఏసీ సంపూర్ణ మద్దతు తెలుపడంతో ఉద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొన్నా. ఉద్యమకారులను గత ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి పెన్షన్‌, ఇళ్లస్థలాలు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.

    – ఆమ్టే శ్రీమతి, ఉద్యమకారిణి, ఆసిఫాబాద్‌

  • లక్సెట్టిపేట: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు కొత్తూరు గ్రామానికి చెందిన సునారికారి మహేష్‌ (41) మున్సిపల్‌ పరిధిలోని ఆంధ్రకాలనీ సమీపంలో బిర్యాని పాయింట్‌ నడుపుతున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌లో గేమ్‌లు ఆడి రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. మంగళవారం లోన్‌కు సంబంధించిన వ్యక్తి వచ్చి డబ్బులు చెల్లించాలని నిలదీయడంతో రేపు ఇస్తానని చెప్పి అతన్ని పంపించాడు. విషయం కుటుంబ సభ్యులతో చెప్పి బాధపడ్డాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు హోటల్‌కి వెళ్లి చూసేసరికి ఉరేసుకుని కనిపించాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    భూమిని స్వాధీనం చేసుకున్న రైల్వే అధికారులు

    తాండూర్‌: మండలంలోని రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌, బో యపల్లి బోర్డు ప్రాంతంలో బుధవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే జేసీబీలు, రైల్వే అధికారులు, పెద్దయెత్తున రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, సివిల్‌ పోలీసులు, రైల్వే సిబ్బంది వంద మందికి పైగా చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక స్థానికులు అయోమయానికి గురయ్యారు. రేచిని రోడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వేశాఖ, ఓ ప్రైవేటు సంస్థ మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమిని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో చుట్టూ ఉన్న ప్రహరీ, కట్టడాలు తొలగించారు. జాతీయ రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని కూల్చివేశారు. భూమిని రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఇంజనీరింగ్‌ విభాగం అధికారిని ఫోన్‌లో సంప్రదించగా.. కోర్టు స్టే ఆర్డర్‌ తొలగించడమే కాక స్వాధీనానికి ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. తాండూర్‌ సీఐ దేవయ్య, తాండూర్‌, తాళ్లగురిజాల ఎస్సైలు ప్రసాద్‌రావు, రామకృష్ణ, బెల్లంపల్లి రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

    ఏకపక్షంగా కూల్చివేతలు సరికాదు

    తాండూర్‌: తాండూర్‌ శివారులోని స్టీపీల్‌ ఇన్‌ఫ్రాకేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భూమి హద్దులు, కట్టడాలను రైల్వే అధికారులు ఏకపక్షంగా తొలగించడం సరికాదని ఆ సంస్థ అడ్వకేట్‌ ఉదయ్‌కిరణ్‌ అన్నారు. తాండూర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021లో సంస్థ కొనుగోలు చేసిన భూమికి అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. కోర్టులో వివాదంపై కేసు నడుస్తోందని, రైల్వే అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ ఘటనపై తాండూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజర్‌ కిషోర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

  • మంచిర్యాలఅర్బన్‌: ప్రయాణికుల భద్రత దృష్యా బస్‌ డ్రైవర్లకు మెడికల్‌ రెన్యూవల్‌ తప్పనిసరి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్‌ డ్రైవర్లు నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన డ్రైవర్లకు ఏడాదికి ఒకసారి, 40 లోపు ఉన్నవారికి మూడేళ్ల మెడికల్‌ రెన్యూవల్‌ చేయించుకోవాలి. సదరు డ్రైవర్లు ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆర్టీసీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ అద్దెబస్సు డ్రైవర్లు ప్రైవేట్‌ ల్యాబ్‌లో టెస్టులు చేయించుకోవాలని ఓ అధికారి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలు పక్కనపెట్టి ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌తో ఒప్పందం చేసుకుని కొంతమంది డ్రైవర్‌లను పంపించడం చర్చనీయాంశంగా మారింది.

    మెడికల్‌ రెన్యూవల్‌ ఇలా..

    మెడికల్‌ రెన్యూవల్‌ అనేది ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి నిర్ధారించటానికి నిర్థిష్ట కాలానికి చేసే వైద్యపరీక్ష. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కంటి, గుండె, బీపీ, షుగర్‌, సాధారణ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వైద్యుని నిర్ధారణ తర్వాత ఫిట్‌గా ఉంటేనే మెడికల్‌ రెన్యూవల్‌ అవుతుంది.

    జరుగుతున్నది ఏమిటి?

    మంచిర్యాల ఆర్టీసీ ఆస్పత్రిలో ఉన్న ల్యాబ్‌ పరికరాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నెలరోజులు ల్యాబ్‌లో టెస్ట్‌కు సంబంధించిన పరికరాలు సరఫరా కాలేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా ప్రైవేట్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షలు లెటర్‌ప్యాడ్‌పై తీసుకువచ్చినా అభ్యంతరం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న కొందరు అద్దె బస్సుల డ్రైవర్‌లు మాత్రం ఆస్పత్రి వర్గాల వైపు వేలెత్తి చూపుతున్నారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్షలకు రూ.1400 ఉంటే రూ.1200కు మేం చేయిస్తామని ‘మాములు’గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ తతంగంపై లిఖితపూర్వకంగా విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

  • శ్రీరాంపూర్‌: ‘అమెరికాలో పెద్ద చదువులు చదివి గొప్పగా తిరిగొస్తదని ఆశించా ం. కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి బిడ్డను చదువు కోసం అంతదూరం పంపించాం. అక్కడ జరిగిన ప్రమాదంలో గాయపడ్డది. అపస్మారక స్థితికి చేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. బిడ్డను చూసేందుకు వెళ్లేదెట్లా..’ అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నస్పూర్‌ షిర్కే ప్రాంతానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్‌, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్పందన, సౌమ్య ఉన్నారు. శ్రీనివాస్‌ వ్యాన్‌డ్రైవర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతోపాటు అప్పు చేసి పెద్ద కూతురు స్పందనను అమెరికాలోని చికాగోకు పంపించాడు. అక్కడి కాలేజీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 31న కాలేజీకి వెళ్లి వస్తుండగా మెట్రోస్టేషన్‌లో మెట్లపై 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తు తం కోమాలో ఉందని, పరిస్థితి విషమంగా ఉందని తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పోగు చేసిన డబ్బులతో కూతురిని అమెరికా వరకు పంపించారు. ఇప్పుడు ఆమె ను చూడడం కోసం అక్కడికి వెళ్లాడానికి వారికి ఆర్థి క ఇబ్బందులు అడ్డుగా మారాయి. పాస్‌పోర్టు కూ డా లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌ పోర్టు, వీసా వస్తే అక్కడికి వెళ్లడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని, ఎవరైన దాతలు సహాయం చేయాలని శ్రీనివాస్‌, సునీత అభ్యర్థిస్తున్నారు. శ్రీనివాస్‌ను 98498 32243 నంబరులో సంప్రదించి సహాయం అందించాలని కోరుతున్నారు.

  • మంచిర్యాలఅర్బన్‌: 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో చురుకై న కార్యకర్తగా ఉంటూ విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఉద్యమంలో పోరు సాగించాడు మంచిర్యాలకు చెందిన సోహైల్‌ఖాన్‌. అతనిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా 14 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. 2009, నవంబర్‌ 29న కేసీఆర్‌ను కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసినప్పుడు ఉపాధ్యాయులతో నిరసన తెలిపే క్రమంలో అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి వస్తుండగా మొదటి కేసు నమోదైంది. ఉద్యమకారులపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మంచిర్యాలలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టాడు. పోలీసులు అభ్యంతరం చెప్పటంతో రోడ్డుపై బైటాయించారు. గుండు గీయించుకుని నిరసన తెలపటంతో మరో కేసు నమోదైంది. సీమాంధ్ర నాయకుల పిండ ప్రదానాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం, రహదారుల దిగ్బంధనం, రైలురోకో, వంటవార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాడు.

  • జన్నారం: వరి కొయ్యలు కాలిస్తే భారీ జరిమానా విధిస్తామని ఏడీఏ కృష్ణ అన్నారు. మండలంలోని చింతగూడ రైతువేదికలో బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొయ్యలు, పంట అవశేషాలు కా ల్చడం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు మృతి చెందుతాయని, సేంద్రియ ఆకర్షణ శాతం తగ్గి పంట దిగుబడిలో రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. పంట పొలాల్లో మంట పెట్టడం ద్వారా నేల కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. పంట పొలాల్లో మంటలు పెట్టిన వారిపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరి మానా విధించనున్నట్లు తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అజిత్‌కుమార్‌, చింతగూడ ఏఈవో లవన్‌ కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

    నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌కు ఎంపిక

    ఆసిఫాబాద్‌రూరల్‌: ఆసిఫా బాద్‌ మండలంలోని బాబా పూర్‌ గ్రామానికి చెందిన శ్రీ చంద్‌ నాయక్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌కు ఎంపికై నట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఇటీవల హైదరాబాద్‌లోని సెంచూరియన్‌ మైదా నంలో నిర్వహించిన అండర్‌ 16 క్రికెట్‌ పోటీల్లో సదరు విద్యార్థి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీచంద్‌ నాయక్‌ను అభినందించారు.

  • చెన్నూర్‌రూరల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మండలంలోని సుబ్బరాంపల్లికి చెందిన బిల్కి మహేశ్‌ అమరుడయ్యాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే మహేశ్‌ 2010, ఫిబ్రవరి 5న చెన్నూర్‌లో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తీసిన ర్యాలీలో పాల్గొని ఒక్కసారిగా జైతెలంగాణ అంటూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. అతని తండ్రి మల్లేశ్‌ అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని మహేశ్‌ తల్లి కౌసల్య తెలిపారు.

    బావురావుపేటలో

    బావురావుపేటకు చెందిన ముత్యాల రాజాగౌడ్‌ 2009, డిసెంబర్‌ 8న ఉరేసుకున్నాడు. అతనికి భార్య సుశీల, కుమారుడు సత్యనారాయణ, కూతురు స్వప్న ఉన్నారు. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, తెలంగాణ అమరులుగా గుర్తించి అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.

    మహేశ్‌ ఫొటోతో తల్లి కౌసల్య

  • మంచిర్యాలటౌన్‌: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే మున్సిపల్‌ పరిపాలన కమిషనర్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ టి.కె.శ్రీదేవి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మే, జూన్‌ నెలలకు గానూ జిల్లాకు రూ.5,40,81,451 నిధులు విడుదల చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నిధుల విడుదలతో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది. ఆస్తిపన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే జరగడం, మున్సిపాలిటీలకు వచ్చే నిధులు సరిపోక పోవడం, పాలకవర్గాలు లేవనే సాకుతో ఏడాదికాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జరిగిన జాప్యంతో మౌలిక వసతుల కల్పనకు జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలక వర్గాల ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది.

    చేపట్టనున్న పనులు ఇవే..

    రాష్ట్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులను కేవలం కొన్ని నిర్దేశించిన పనులకు మాత్రమే ఉపయోగించాలని కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలతో పాటు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, ఇతరత్రా చట్టబద్ధత కలిగిన చెల్లింపులను చేపట్టడంతో పాటు, భవిష్యత్‌ అవసరాలకు కనీసం ఆరు నెలల జీతాలకు సరిపడా నిధులను రిజర్వ్‌ చేసి ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, నీటిశుద్ధి, ప్రజా టాయిలెట్లు, ప్రజా ఉపయోగకరమైన ఆస్తుల నిర్వహణ చేపట్టాలని, డంపింగ్‌యార్డుల చుట్టూ కంపౌండ్‌ వాల్స్‌, షెడ్లు, సీసీ ప్లాట్‌ఫాంలు, విద్యుత్‌, నీటి సరఫరా, వాచ్‌మెన్‌ గదుల నిర్మాణం చేపట్టేందుకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్‌ చేపట్టేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, బయోమైనింగ్‌ కోసం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.

    జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలకు విడుదలైన ఎస్‌ఎఫ్‌సీ నిధులు

    నగరం/మున్సిపాలిటీ నిధులు(రూ.ల్లో)

    మంచిర్యాల నగరం రూ.2.44 కోట్లు

    బెల్లంపల్లి 81.28 లక్షలు

    మందమర్రి 81.79 లక్షలు

    చెన్నూర్‌ 38.36 లక్షలు

    క్యాతన్‌పల్లి 57.30 లక్షలు

    లక్సెట్టిపేట్‌ 37.71 లక్షలు

    అవసరం మేరకు ఖర్చు

    రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరుగుతుంది. మంచిర్యాల నగర పాలక సంస్థ నూతనంగా ఏర్పడడంతో, వచ్చిన నిధులను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఖర్చు చేస్తాం.

    – అన్వేష్‌, మంచిర్యాల మున్సిపల్‌

    కార్పొరేషన్‌ కమిషనర్‌

  • రామకృష్ణాపూర్‌: అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ పోటీలు(సైక్లోథాన్‌) నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలను జిల్లా జడ్జి వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ 15నిమిషాలపాటు సైక్లింగ్‌ చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. వాహనాల వినియోగా న్ని తగ్గించి సైకిళ్ల వాడకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని సూచించారు. ఐఎఫ్‌ఎస్‌ అధికా రులు, జడ్జి కూడా సైక్లింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌ఎస్‌, ఎఫ్‌డీపీటీ శాంతారామ్‌, డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, ఎఫ్‌ఆర్‌వో రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన అమృత్‌ 2.0 గోదావరి నీటి పథకం పనులు సత్వరంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం ఆయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతి, కమిషనర్‌ తన్నీరు రమేష్‌తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నీటి పథకం పనులు నత్తనడకన సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు కోసం రెండు చోట్ల స్థలాలు పరిశీలించారు. పట్టణ సమస్యలపై చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ ఎల్‌.కృష్ణ, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

  • మంచిర్యాలటౌన్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4నుంచి 10వరకు ప్రభుత్వం వార్డు సభలు నిర్వహించనుంది. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం రూపొందించింది. ప్రతీ వార్డులో అధికారులు సభలకు హాజరై ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమై వర్షాకాలంలో ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గురువారం ప్రతీ గ్రామం, వార్డులో సభలు ఏర్పాటు చేసి పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌, విపత్తు నిర్వహణ అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. 5న పర్యావరణంపై అవగాహన, 6, 8న గ్రామ/వార్డు సభల నిర్వహణ, 9న క్రీడలపై చేపట్టాల్సిన చర్యలు, పలు క్రీడల్లో రాణిస్తున్న వారికి ప్రోత్సాహం అందించడం, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10న వార్డు సభల అనంతరం, 12న విద్యాసంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మాదకద్రవ్యాలను వినియోగించబోమని ప్రతిజ్ఞ చేయిస్తారు. వీటితోపాటు ప్రతీ వార్డు సభలో తడి, పొడి చెత్త వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సేకరణ కోసం ప్రతీ ఇంటికి అనుమతి ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవడం చేస్తారు. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుని, ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు.

  • పాతమంచిర్యాల: తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని జనసేన పార్టీ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని.. అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ ఇప్పుడు తెలంగాణపై ప్రేమ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్రం హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్‌కల్యాన్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఎందుకు స్పందించలేదని అన్నా రు. ఆత్మగౌరవాన్ని అవమానించిన ప్రతీ సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయేనని, ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడదని, హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.

  • వేమనపల్లి: వైద్య సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేసినా, సమయపాలన పాటించకపోయినా శాఖాపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌నాయక్‌ హెచ్చరించారు. ‘పీహెచ్‌సీ ఎదుట రోగుల నిరసన’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. వేమనపల్లిలోని పీహెచ్‌సీని సందర్శించి సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ అవుతున్న సందర్భంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని అన్నారు. సిబ్బంది కొరతను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలం వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాజేష్‌, అన్వేష్‌, సీహెచ్‌ఓ పుట్టా సత్తయ్య, హెచ్‌ఏఒ శ్రీనివాస్‌, హెచ్‌ఎస్‌ అపరంజి పాల్గొన్నారు.

  • జైపూర్‌: ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఓం, అన్నపూర్ణ రైస్‌మిల్లులు, సుముఖ గోదాం సందర్శించారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం దిగుమతులు పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. బెజ్జాల, కిష్టాపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించారు. జాప్యం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ ఏడాది లక్షా 60వేల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. హమాలీల సమస్యను అధిగమించడానికి స్థానికంగా హమాలీలను తీసుకుని ధాన్యం ఎగుమతి, దిగుమతి వేగవంతం చేయాలని తెలిపారు. తహసీల్దార్‌ వనజారెడ్డి పాల్గొన్నారు.

Adilabad

  • నిర్మల్‌: ప్రత్యేక తెలంగాణ కోసం 1998లో మాజీమంత్రి పి.ఇంద్రారెడ్డి ‘జై తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. అప్పట్లోనే ఆ పార్టీ బహిరంగసభ నిర్వహించడంలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఉద్యమకారుడు అల్లూరి మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. 2003 డిసెంబర్‌ 21న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కె.జయశంకర్‌, ప్రము ఖ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, తదితరులతో కలిసి స్థానిక స్టార్‌ ఫంక్షన్‌ హాల్‌లో అవగా హన సదస్సు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 2007లో వెయ్యిఉరుల మర్రి స్మారకస్థూపం ఏర్పాటులో చురుకుగా పాల్గొన్నారు. గద్దర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారీ బహిరంగసభను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలమైన సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

  • తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు అవుతోంది. 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. అయితే ఇందుకోసం దశాబ్దానికిపైగా మలిదశ పోరాటం జరిగింది. ఈ ఉద్యమంలో సబ్బండవర్గాలు భాగస్వాములయ్యాయి. పడుచు పోరగాండ్ల నుంచి పండు ముసలి వరకూ అందరూ జైతెలంగాణ అంటూ పోరాటంలో పాల్గొన్నారు. పలువురిపై కేసులు నమోదయ్యాయి. జైలుశిక్షలు సైతం అనుభవించారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఉద్యమ జ్ఞాపకాలు కొన్ని..
    తెలంగాణ తల్లి

    పార్టీలకు అతీతంగా..

    నిర్మల్‌: తెలంగాణ ఉద్యమంలో ప్రతిఒక్కరూ కలిసి వచ్చారు. నిర్మల్‌ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా జేఏసీ కార్యాచరణకు అనుగుణంగా ఉద్యమంలో భాగమై స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. – కూచాడి శ్రీహరిరావు,

    డీసీసీ మాజీ అధ్యక్షుడు

    స్వరాష్ట్రమొచ్చేదాకా..

    నిర్మల్‌: ఎంతోమంది అమరుల ప్రాణత్యాగాల స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించాం. స్వరాష్ట్రం వచ్చేదాకా ఆపేది లేదంటూ ముందుకు సాగినం. నిర్మల్‌ ప్రాంతమంతా ఉద్యమంలో భాగమైంది.

    – కొట్టె శేఖర్‌, రాజకీయ జేఏసీ కన్వీనర్‌

    ఒకే వాదం..ఒకే నినాదం..

    నిర్మల్‌: ఉద్యమ సమయంలో అందరిదీ ఒకటే వాదం, ఒకే నినాదం. డాక్టర్‌ దామెర రాములు, మేమందరం కలిసి తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆరో రాష్ట్ర మహాసభలు నిర్మల్‌లో పెట్టినం. – డాక్టర్‌ అప్పాల చక్రధారి

    పలుమార్లు జైలుకెళ్లా..

    ఆదిలాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నోసార్లు జైలుకు వెళ్లా. ఉద్యమకారుల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. నీళ్లు, నిధులు, నియామకాలు సమపాలలో అందరికీ అందినప్పుడే ప్రత్యేక తెలంగాణకు సార్ధకత వస్తుంది. – చందు, ఉద్యమకారుడు

    కేసులకూ భయపడలేదు..

    నిర్మల్‌: ఉద్యమంలో విద్యార్థి నాయకులుగా ముందుండి నడిచాం. ముధోల్‌ మండలం కిర్గుల్‌(బి)లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభలో జై తెలంగాణ నినాదా లు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. – కూస వనిత, భైంసా

    నిరవధికంగా దీక్షలు చేశాం..

    ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో 2010 జనవరి 4న జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ప్రారంభించాం. 2014 మార్చి 6 వరకు 1,523 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఆదిలాబాద్‌ వేదికగా ఎక్కువ రోజులు నిరవధిక దీక్షలు

    నిర్వహించిన చరిత్ర ఉంది. – కారింగుల దామోదర్‌

  • నిర్మల్‌టౌన్‌: వేసవి సెలవులను చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపుల్లో చేరి వివిధ క్రీడల్లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నారు. ఏ గల్లీలో చూసిన అంతా ఒకచోట చేరిపోయి బ్యాట్‌, బంతి పట్టుకొని క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తున్నారు. ఇటీవల ఐపీఏలో అద్భుత ప్రతిభ కనబర్చి అందర్నీ ఆకర్షించిన యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీని స్ఫూర్తిగా తీసుకుని శిక్షణలో ముందుకెళ్తున్నారు.

    చిన్ననాటి నుంచి ఇష్టం

    నేను పదోతరగతి చదువుతున్నా. చిన్ననాటి నుంచి క్రికెట్‌ అంటే నాకు ఇష్టం. వేసవిలో క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నా. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో నైపుణ్యం మెరుగుపర్చుకుంటున్నా. క్రమశిక్షణతో సాధన చేస్తున్నా. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో ఆడి నా ప్రతిభను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. – సోఫియాన్‌, నిర్మల్‌

    క్రికెట్‌ శిక్షణ పొందుతున్నా

    నేను నాలుగోతరగతి చదువుతున్నా. వేసవి సెలవుల్లో నిర్మల్‌ పట్టణంలో టీసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపులో క్రికెట్‌ శిక్షణ పొందుతున్నా. ప్రతీరోజు సాధన చేయడం వల్ల నా ఆటతీరు మెరుగుపడుతోంది. భవిష్యత్‌లో మంచి క్రికెటర్‌గా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాలని నా లక్ష్యం. – గణేశ్‌, నిర్మల్‌

    సూర్యవంశీ స్ఫూర్తితో..

    చిన్న వయసులోనే సూర్యవంశీ పెద్ద వేదికపై రాణించడం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అందుకే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ.. క్రికెట్‌ కోచింగ్‌లో చేరా. క్రమశిక్షణతో సాధన చేస్తే విజయం సాధించగలమనే నమ్మకం ఉంది. ఎప్పటికై నా జాతీయస్థాయిలో ఆడాలన్నదే నా కోరిక.

    – రోహన్‌, నిర్మల్‌

    జాతీయ స్థాయిలో ఆడాలని..

    క్రికెట్‌ అంటే నాకు, మానాన్నకు ఎంతో ఇష్టం. క్రికెట్‌పై మక్కువతో ఎన్నోసార్లు టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. తాను అనుకున్న గోల్‌ క్రికెట్‌లో రీచ్‌ కాలేకపోయాడు. మా ఇద్దరి కోరిక ఒకటే కావడంతో ఎలాగైనా క్రికెట్‌లో జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రోజు ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌ చేస్తున్నా.

    – యువన్‌ మోడీ, నిర్మల్‌

    భారత జట్టులో చేరాలని..

    ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తూ క్రికెట్‌పై మరింత ఆసక్తి పెంచుకున్నా. ప్రస్తుతం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నా. ఏదో ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్నా. – ఉదయ్‌కిరణ్‌, నిర్మల్‌

    అమ్మ కోరిక మేరకు..

    నేను ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. చదువుతోపాటు ఆటల్లో రాణించాలని అమ్మ కోరిక మేరకు క్రికెట్‌ శిక్షణ శిబిరంలో చేర్పించింది. నెల రోజుల్లో ఆటలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నా. క్రీడల్లో రాణించి, జాతీయస్థాయిలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తా.

    – ఆర్‌.విష్ణుప్రియ, నిర్మల్‌

    యువతలో ఆసక్తి పెరిగింది

    ప్రస్తుతం యువతలో క్రికెట్‌ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లు రాణించడం వల్ల చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో శిబిరాలకు వస్తున్నారు. క్రికెట్‌లో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన చాలా ముఖ్యం. తన లక్ష్యంపై దృష్టి పెట్టి శ్రమిస్తే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం ఉంటుంది.

    – సుదర్శన్‌, క్రికెట్‌ కోచ్‌

    క్రమశిక్షణతో సాధన చేయాలి

    క్రికెట్‌ అనేది ఆట మాత్రమే కాదు, క్రమశిక్షణ, ఏకాగ్రత, జట్టు భావనను పెంపొందించే క్రీడ. క్రమశిక్షణతోనే సాధన చేస్తే క్రికెట్‌లో ఉన్నత శిఖరాలకు చేరుతాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. చిన్న వయసులోనే సరైన శిక్షణ తీసుకుంటే భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశాలు ఉంటాయి.

    – రామరాజు, క్రికెట్‌ కోచ్‌

  • కడెం: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో సాగవుతున్నాయి. జపాన్‌ దేశపు మియజాకీ మామిడి సాధారణంగా శీతల వాతావరణంలో సాగవుతుంది. అయితే ఇంతటి ఖరీదైన, అరుదైన మామిడి రకం కడెం మండలం నవాబ్‌పేట్‌ గ్రామంలోని సత్యం ట్రెడిషనల్‌ యోగాశ్రమంలో సాగవుతోంది. ఆశ్రమ వ్యవస్థాపకుడు రాపెల్లి సత్యం 2024 జూలైలో కలకత్తా నుంచి ఒక్కో మొక్కకు రూ.10 వేలు వెచ్చించి పది మొక్కలు తెప్పించి ఆశ్రమంలో నాటాడు. వర్మికంపోస్ట్‌, గోమూత్రం, కషాయాలు, వంటి సేంద్రియ ఎరువులు వేసి మొక్కలను సంరక్షించాడు. రెండేళ్ల తర్వాత మొదటి కాత వచ్చింది. ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 కాయాలు కాసాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మియజాకీ పండ్లు కిలోకు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు ధర పలుకుతాయి. గతేడాది మరో పది చెట్లను తెప్పించి నాటినట్లు పేర్కొన్నాడు. మియజాకీ పండ్లకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండడానికి కారణం అందులో ఉండే ఔషధ గుణాలేనని ఆయన వెల్లడించారు. శరీరానికి రక్షణనిచ్చే రోగ నిరోధకశక్తి అత్యధికంగా ఉంటుందని, శరీరంలోని వ్యర్థాలను (యాంటి ఆక్సిడెంట్స్‌) తొలగించే ఔషధ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయన్నారు. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుందన్నారు. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందన్నారు. ఏ, బీ, సీ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయన్నారు.

  • ● ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

    ఆదిలాబాద్‌రూరల్‌: ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు. బుధవారం రాత్రి ఆదిలాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్‌ (కార్డన్‌ అండ్‌ సెర్చ్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ మంది ప్రజలు వాహన నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. యువత గంజాయి బారిన పడవద్దని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌ జీవన్‌రెడ్డి, సీఐలు కె.నాగరాజు, రహీంపాషా, కె ఫణిధర్‌, ఎస్సైలు విష్ణువర్ధన్‌, దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

    నలుగురు ఎఫ్‌ఆర్వోల బదిలీ

    ఆదిలాబాద్‌టౌన్‌: అటవీశాఖలో పనిచేస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్వో)లకు స్థానచలనం జరిగింది. ఆదిలాబాద్‌లో పనిచేస్తున్న గులాబ్‌సింగ్‌ కామారెడ్డిలోని మాచరెడ్డికి బదిలీకాగా అతని స్థానంలో నిర్మల్‌ జిల్లా మామడ నుంచి అవినాష్‌ రాథోడ్‌ బదిలీపై వచ్చారు. ఇంద్రవెల్లి ఎఫ్‌ఆర్‌వో సంతోష్‌ మంచి ర్యాల జిల్లాలోని దేవాపూర్‌కు బదిలీ కాగా, అతని స్థానంలో ఎవరిని కేటాయించలేదు. సిరిచెల్మ పోస్టు ఖాళీగా ఉండగా మంచి ర్యాలలో టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తు న్న కారెం శ్రీనివాస్‌ బదిలీపై వచ్చారు. ఇచ్చోడలో పనిచేస్తున్న పుండలిక్‌ నిజామాబాద్‌ జిల్లా వర్ణికి బదిలీ కాగా, అతని స్థానంలో బాన్సువాడలో పనిచేస్తున్న సంతోష్‌ బదిలీపై వచ్చారు. నేరడిగొండలో పనిచేస్తున్న బి.గణేశ్‌ మెదక్‌కు బదిలీ కాగా, అతని స్థానంలో రాజన్న సిరిసిల్లలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా పనిచేస్తున్న వై.గంగాధర్‌ బదిలీపై వచ్చారు.

  • ఆదిలాబాద్‌రూరల్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నష్టపోయింది బీసీ వర్గాలేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 18 శాతానికి తగ్గిందన్నారు. బుధవారం బీసీ సంఘ భవనం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రం రాలేదని, 1,200 మంది యువకుల బలిదానాలతో సాకారమైందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. రేవంత్‌ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అటు బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించుకుంటూ పోతే బీసీలకు రాజ్యాధికారం దక్కేదెపుడని ప్రశ్నించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి అస్తిత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడు నర్సాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

  • నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2011 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమం పరాకాష్టకు చేరిన రోజులు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచాయని నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు సాధు రాంరెడ్డి పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన ఉద్యమ సహచరులతో కలిసి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవాలు జీవితాంతం మరువలేనివని చెప్పారు. బాసరలో చేపట్టిన రైల్‌రోకో నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ ఘటనలు, ఉద్యమంలో ఎదుర్కొన్న సవాళ్లు, సహచరులతో కలిసి సాగించిన పోరాటం తన జీవితంలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులను ఇప్పటికై నా గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • సాత్నాల: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన భోరజ్‌ మండలం కామాయిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మే రకు గ్రామానికి చెందిన కోల దేవన్న (53) బుధవారం తెల ్లవారుజామున రేకుల పైన ఉన్న చీపురు తీసేందుకు చేతులు పెట్టడంతో షాక్‌కు గురయ్యాడు. గమనించిన భార్య గంగుబాయి, కుమారుడు చిన్నయ్య అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరికీ షాక్‌ తగిలి కిందపడ్డారు. గమనించిన స్థానికుడు నర్సింగ్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన దేవన్నను అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పవర్‌ గౌతమ్‌ తెలిపారు. కాగా పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాధను దిగమింగుతూ మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో దేవన్న నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు.

  • కై లాస్‌నగర్‌: మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా అందించే ఈ బైక్‌ లబ్ధిదారుల ఎంపికకు గాను మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం లక్కీడ్రా నిర్వహించారు. వీటి కోసం పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన 747 మంది మైనార్టీలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 65 రిజెక్ట్‌ అయ్యాయి. 682 దరఖాస్తుల నుంచి 27 మందిని ఎంపిక చేసేందుకు చైర్‌పర్సన్‌ అనూష ఆధ్వర్యంలో లక్కీడ్రా చేపట్టారు. ఎంపికై న వారి వివరాలను కార్యాలయ నోటీసుబోర్డుపై ప్రదర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగదీష్‌ గౌడ్‌, మెప్మా పీడీ సీవీఎన్‌. రాజు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కలీం అహ్మద్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి,ఆదిలాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అవినీతిని అరికట్టడం, పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా గల రవాణాశాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ గతేడాది అక్టోబర్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాహనాల రాకపోకలకు భౌతిక తనిఖీలు అవసరం లేదన్న కేంద్రం సూచనల మేరకు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆ శాఖలో పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టారు. జిల్లాలో భోరజ్‌ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును కూడా అప్పట్లోనే ఎత్తివేశారు. ఎంవీఐ, ఏఎంవీఐ పోస్టులు ఇక్కడ పదుల సంఖ్యలో ఉండేవి. రద్దు చేసిన తర్వాత ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులు కేటాయిస్తూ ఇంతకాలం కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా చేపట్టిన బదిలీల్లో వారిని రాష్ట్రంలోని రవాణాశాఖ కార్యాలయాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు మళ్లించారు.

    ఇటీవల బదిలీలు ఇలా..

    రెండు రోజుల క్రితం రవాణా శాఖలో ఇన్‌స్పెక్టర్లతో పాటు ఆఫీస్‌ సిబ్బంది బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు ఎంవీఐలకు ఇతర జిల్లాలకు స్థానచలనం కల్పించారు. ఒకరిని మాత్రం జిల్లాకు కేటాయించారు. ఏడుగురు ఏఎంవీఐలను ఇతర జిల్లాలకు బదిలీ చేయగా, ఇక్కడికి మాత్రం ఎవరిని కేటాయించలేదు. భోరజ్‌ చెక్‌పోస్టు ఎత్తివేసిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఆ పోస్టులు ప్రాధాన్యత కోల్పోయాయి. పదుల సంఖ్యలో వారి సేవలు అవసరం లేకుండా ఉండడంతో ఆ పోస్టులను ఇతర చోటకు మళ్లించారు. అందులో భాగంగానే జిల్లా నుంచి పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీపై వెళ్లినప్పటికీ కేవలం ఒక్కరు మాత్రమే ఇక్కడికి రానుండటం గమనార్హం.

    డీటీవోగా కిశోర్‌బాబు..

    రవాణాశాఖ ఆదిలాబాద్‌ కార్యాలయం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రవీందర్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. కాగా, సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో ఎంవీఐలుగా విధులు నిర్వహిస్తున్న సీపెల్లి శ్రీనివాస్‌, అల్లి శ్రీనివాస్‌, అశ్వంత్‌ కుమార్‌, ప్రదీప్‌ కుమార్‌, కోల రవిందర్‌లు జిల్లా నుంచి బదిలీ అయ్యారు. సీనియర్‌ ఎంవీఐ సీపెల్లి శ్రీనివాస్‌ ఇన్‌చార్జి డీటీవోగా కొనసాగారు. హన్మకొండలో ఎంవీఐగా పనిచేస్తున్న కిశోర్‌ బాబును జిల్లాకు కేటాయించారు. సీనియర్‌ ఎంవీఐగా ఆయన ఇన్‌చార్జి డీటీవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదివరకు జిల్లాలో భోరజ్‌ చెక్‌పోస్టుతో పాటు జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌, ఉద్యోగులు, సిబ్బంది పోస్టులతో రవాణాశాఖలో సందడి కనిపించేది. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా చెక్‌పోస్టును ఎత్తివేయడం, పలువురు ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ఇక్కడి నుంచి మళ్లించడంతో ఇదివరకు ఉన్న సందడి తగ్గిపోయింది.

    కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డీటీవో

    కై లాస్‌నగర్‌: జిల్లా రవాణా అధికారి(డీటీవో)గా బాధ్యతలు స్వీకరించిన బి.కిశోర్‌బాబు బుధవారం కలెక్టర్‌ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ సూచించారు.

  • కై లాస్‌నగర్‌: బోగస్‌ పెన్షన్‌దారులకు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పింఛన్‌దారుల లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియ జిల్లా కేంద్రంలో నత్తనడకన సాగుతోంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి ఫొటోలను క్యాప్చర్‌ చేయాల్సిన వా ర్డు అధికారులు, మెప్మా ఆర్పీలు పట్టించుకోవడం లేదు. ప్రత్యేక యూజర్‌ ఐడీలు కేటాయించి పక్షం రోజులు గడిచినా సదరు అధికారులు ఒకరి ద్దరి ఫొటోలను మాత్రమే క్యాప్చర్‌ చేస్తున్నారనే వి మర్శలున్నాయి. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయకుంటే బోగస్‌గా పరిగణించి పింఛన్లు రద్దు చేసే అవకాశమున్నట్లుగా సెర్ప్‌ అధికారులు చెబుతున్నారు.

    రోజుకు ఒకరిద్దరినే విచారణ

    అనర్హుల ఏరివేతపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇందుకోసం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని ఆదేశించింది. పింఛన్‌దారులు బతికే ఉన్నారనే దాన్ని నిర్ధారించేందు కోసం లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో 18 రోజుల క్రితం మున్సిపల్‌ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, మెప్మా రిసోర్సు పర్సన్లకు కలిపి 131మందికి ప్రత్యేక లాగిన్లు క్రియేట్‌ చేసి యూజర్‌ ఐడీలు కేటాయించారు. వీరు లబ్ధి దారుల ఇళ్లకు వెళ్లి వారి ముఖ గుర్తింపు(ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం) ద్వారా వివరాలు ప్రత్యేక యాప్‌లో న మోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 26 మంది మాత్రమే 100–232 మంది పింఛన్‌దారుల అథెంటికేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. మరో 25 మంది 10 నుంచి 50 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు.32 మంది కేవలం ఒకే ఒక్క అథెంటికేషన్‌ చేయగా ఆరుగురు ఇద్దరిని, ఐదుగురు ముగ్గురిని, ఇద్దరు నలుగురిని, నలుగురు ఆరుగురిని, పది మంది ఏడుగురిని, మరో ముగ్గురు తొ మ్మిది మందిని విచారించారు. శంకర్‌, రవనీత అనే ఇద్దరు ఆర్‌పీలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేపట్టకపోవడం గమనార్హం.

    సగం మాత్రమే విచారణ..

    ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 14,115 మంది చేయూత కింద వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 8,409 మంది అథెంటికేషన్‌ మాత్రమే పూర్తిచేశారు. ఇంకా 5,706 మందివి చేయాల్సి ఉంది. ఒక్కోదానికి కేవలం రూ.5 చొప్పున ఇస్తుండటంతో తమకు లాభసాటిగా లేదనే ఉద్దేశంతో ఆర్‌పీలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వార్డు ఆఫీసర్లలో కొంతమంది బాధ్యతతో ప్రక్రియ చేపడుతుండగా మరికొంతమంది పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రక్రియ నత్తనకడన సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

    రేపటిలోగా పూర్తి చేయాలి

    చేయూత లబ్ధిదారులకు సంబంధించిన లైవ్‌ అథెంటికేషన్‌ ప్రక్రియను ఈ నెల 5లోపు పూర్తి చేయాల్సి ఉంది. త్వరితగతిన చేపట్టాలనే ఉద్దేశంతో వార్డు ఆఫీసర్లు, ఆర్‌పీలకు ప్రత్యేక లాగిన్‌ ఐడీలను క్రియేట్‌ చేశాం. కానీ వారిలో చాలా మంది పట్టించుకోవడం లేదు. గడువులోపు అథెంటికేషన్‌ చేయించుకోకుంటే పింఛన్‌ రద్దయ్యే అవకాశముంటుంది.

    – జాదవ్‌ శేష్‌రావు, డీపీఎం

  • సాక్షి,ఆదిలాబాద్‌: రైతులు తమ చేలల్లో సారవంతం పెంచేందుకు ప్రాజెక్టు, చెరువుల మట్టిని పూడిక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాటికి స్పందించిన అధికారులు నిబంధనల మేరకు తవ్వుకునేందుకు అనుమతులిస్తూ, ఎక్కడ ఆ పూడికతీత చేపట్టాలో సూచిస్తున్నారు. దీంతో చెరువుల వద్ద సందడి కనిపిస్తోంది.

    రైతుకు లాభం.. పెరగనున్న నీటి నిల్వ

    ప్రభుత్వం ఆధ్వర్యంలో పూడికతీత చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్నది. జిల్లా కేంద్రానికి శివారులో ఉండే మావల చెరువులో పూడికతీత చేపట్టాలని గతేడాది యంత్రాంగం ప్రణాళిక రూపొందించినప్పటికీ దాన్ని అంచనా వ్యయం భారీగా ఉండడంతో పనులు ముందడుగు పడలేదు.ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు, చెరువుల్లో పేరుకపోయిన పూడికను తీయలేని పరిస్థితి. ప్రస్తుతం పలు గ్రామాల్లో రైతులు చెరువు మట్టి కోసం విజ్ఞప్తులు చేస్తున్నారు. తమ పంట పొలాల్లో వేసుకుంటామని అధికారులను కోరుతున్నారు. వాటిని పరిగణలోకి ఉన్నతాధికారులు నిబంధనల మేరకు అనుమతిస్తున్నారు. ఇది రైతుకు లాభం చేస్తుండగా, మరోవిధంగా ప్రాజెక్ట్‌, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

    బజార్‌హత్నూర్‌లో చెరువు మట్టిని తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా కొద్ది రోజులుగా పూడిక తీత పనులు ఊపందుకున్నాయి. ఈ మట్టి ద్వారా చేను సారవంతం కానుండగా, పూడిక తీసిన చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగనుంది.

  • కై లాస్‌నగర్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ఈనెల 12 వరకు నిర్వహించే గ్రామ, వార్డుసభలను అధికారులు సమన్వయంతో సాగుతూ విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఈమేరకు జిల్లా, మండలస్థాయి అధి కారులతో కలెక్టరేట్‌ వీసీ హాల్‌ నుంచి బుధవారం గూగుల్‌ మీట్‌ ద్వారా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. జనగణన, భూభారతి పనులు వేగవంతం చేయాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా వర్షాలు, వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్‌ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, విరిగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను వెంటనే సరిచేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశాల నమోదు పెంచాలన్నారు.ఇందులో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు కలెక్టర్లు చిత్రు, రాజేశ్వర్‌, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఆర్డీవో జగదీశ్వర్‌ రావు, డీపీవో రమేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషారావు, డీఈవో మాధవి తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌తో కలిసి డీఎఫ్‌వో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ఇంధన సంక్షోభం నేపథ్యంలో సైకిల్‌ వాడకం అత్యుత్తమమైనదని తెలిపారు. అలాగే జూన్‌ 7న స్టేడియంలో నిర్వహించనున్న 5కే రన్‌లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అంతకుముందు స్టేడియంలో మానవ హారంగా ఏర్పడ్డారు. ఇందులో డీవైఎస్‌వో శ్రీనివాస్‌, ఎఫ్డీవో అరవింద్‌ కుమార్‌, చిన్న భూష రెడ్డి, ఎఫ్‌ఆర్వోలు అవినాష్‌, షీలానంద, అరుణ, కవిత, సవిత, ఎఫ్‌ఎస్‌వోలు, డీఆర్‌ఓలు పాల్గొన్నారు.

Jagtial

  • జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంగా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తోంది. కానీ అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది. గతంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్య మొక్కలు నాటారు. జంక్షన్ల వద్ద అత్యంత ఖరీదైన బొమ్మలు, లాన్‌ నిర్మించారు. కానీ.. అవన్నీ కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. గత పాలకవర్గంగానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళావిహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టాయి. లాన్‌ ఎండిపోయింది.

    కొత్త పాలకవర్గంపైనే ఆశలు

    కొత్త పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్నా.. పట్టణ సుందరీకరణపై పట్టింపులేదని ఆరోపణలున్నాయి. జంక్షన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయకపోవడంతో పనిచేయడం లేదు.

    ప్రజాధనం దుర్వినియోగం

    జిల్లాకేంద్రానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లు, జంక్షన్లు పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో గతంలో రూ.35లక్షలతో బొమ్మలు, లాన్‌, ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. నెమలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు పెట్టించారు. కనీసం రెండు నెలలైనా ఫౌంటేన్ల నిర్వహణ సాగలేదు. రూ.35 లక్షల నిధులు వృథా అయ్యాయి. ఫౌంటేన్లు పనిచేయాలంటే మోటార్లు ఉండాలి. అవి చెడిపోవడంతో బాగు చేసే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు మరమ్మతు చేపడితే రెండు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. మొక్కుబడిగా ట్యాంకర్ల ద్వారా నీరు పడుతున్నారుగా తప్ప మోటార్లు బాగుచేసి ఫౌంటేన్‌ పనిచేసేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి బల్దియాల్లో జంక్షన్ల ఊసే ఎత్తడం లేదు. అక్కడ కూడా జంక్షన్లు ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

    ఖర్జూర చెట్ల స్థానంలో ఈత చెట్లు

    గత పాలకవర్గం హయాంలో కొత్తబస్టాండ్‌ నుంచి పార్క్‌ వరకు డివైడర్ల మధ్య సుందరీకరణ పేరుతో దాదాపు రూ.12 లక్షలు వెచ్చించి ఖర్జూర మొక్కలు నాటారు. వాస్తవానికి అవి ఈత చెట్లు. ఇది పలు విమర్శలకు దారితీసింది. ఖర్జూర మొక్కల స్థానంలో ఈత మొక్కలు తెప్పించారని, వాటి ఖరీదు తక్కువగా ఉంటుందని, ఇందులో అవినీతికి పాల్పడ్డారని అప్పటి పాలకవర్గంపై విమర్శలు చేస్తున్నారు.

    ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని పాతస్టాండ్‌ చౌరస్తా. ఇక్కడి జంక్షన్‌ వద్ద సుందరీకరణ పేరిట అందమైన బొమ్మలు, లాన్‌, ఫౌంటేన్‌ ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటివరకు పనిచేయడం లేదు. వేసవి కావడంతో పది రోజుల క్రితం మరమ్మతు చేపట్టారు. ఫౌంటేన్‌ ఒకరోజు మాత్రమే నీరు పోసింది. సుందరీకరణ చేపడతామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని గాలికొదిలేశారు. లాన్‌ ఎండిపోయింది. బొమ్మలు శిథిలావస్థకు చేరాయి.

  • ఫౌంటేన్లను బాగుచేయాలి. బొమ్మలు, ఇతరత్రా లేకపోవడంతో కళావిహీనంగా మారాయి. వివిధ రకాల బొమ్మలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్య నీరు పోస్తుంటే చల్ల దనంగా ఉంటుంది.

    – మచ్చ శంకర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

    నిత్యం పనిచేయాలి

    ఫౌంటేన్లు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌లో అత్యధికంగా జనసంచారం ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఆహ్లాదం లేకపోవడం ఇబ్బందిగా మారింది.

    – వీరబత్తిని అనిల్‌కుమార్‌, బీజేపీ నాయకుడు

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ కేసు మాస్టర్‌మైండ్‌ సుబోధ్‌ సింగ్‌ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకి పాల్పడిన సుబోధ్‌ గ్యాంగ్‌.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్‌సింగ్‌గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్‌ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్‌కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్‌ నుంచి సుబోధ్‌ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్‌కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్‌ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్‌ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్‌సింగ్‌ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది.

    పోలీసులకు సవాల్‌..

    వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్‌గా మారింది. అయినప్పటికీ కరీంనగర్‌ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్‌కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్‌ కర్మాకర్‌, రావిశ్‌కుమార్‌, మెహతాబ్‌ఖాన్‌ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్‌ సింగ్‌ను మాస్టర్‌మైండ్‌గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్‌ వెళ్లారు. అక్కడ సుబోధ్‌ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది.

    ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు..

    సుబోధ్‌సింగ్‌ నెట్‌వర్క్‌లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్‌ పోలీసులు వేసిన ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌ను సవాలు చేస్తూ సుబోద్‌ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూ పిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సు బోధ్‌సింగ్‌ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్‌ను తరలించడంలో సీపీ గౌస్‌ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయని పుణులు, బిహార్‌కు చెందిన పలువురు ఐపీఎస్‌ ఆఫీ సర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్‌లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్‌ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు.

    బేడీలు తీసి విమానంలోకి..

    సుబోధ్‌ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్‌ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్‌ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్‌కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్‌క్రా్ట్‌గా సీఐ తిరుమల్‌, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్‌లో దిగాక సీపీ గౌస్‌ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  • కథలాపూర్‌: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని బొమ్మెన, గంభీర్‌పూర్‌, దూలూర్‌, తాండ్య్రాలలో బుధవారం పర్యటించారు. కులసంఘాల భవనాలు, అభివృద్ధి పనులకు రూ.1.40కోట్ల ప్రొసీడింగ్‌ కాపీలు అందించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు చెదలు సత్యనారాయణ, పిడుగు తిరుపతిరెడ్డి, పంజాల సత్యనారాయణ, భూపెల్లి రాజగంగారాం, ఉరుమల్ల కృష్ణాచారి, గోపిడి ధనుంజయ్‌రెడ్డి, లింగంగౌడ్‌, పానుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

    సైక్లింగ్‌తో ఆరోగ్యం

    మల్యాల: సైక్లింగ్‌తో శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి పాలనలో భాగంగా బుధవారం మండలంలోని కొండగట్టు అర్బన్‌ ఫారెస్టు పార్క్‌లో అటవీశాఖ అధికారులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడేశారు. డీఎఫ్‌ఓ మాట్లాడుతూ సైకిల్‌ పోటీలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఓ గులామోద్దీన్‌, డీఆర్‌వో శ్రీనివాస్‌, బి.దేవదాస్‌, ఎం.సుబ్బారావు, శ్రీకాంత్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్స్‌ ప్రవీణ్‌కుమార్‌, అశ్విని, ఎండీ.ఫిరోజ్‌, జి.రాజేశం పాల్గొన్నారు.

    ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

    మల్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో రాము అన్నారు. మండలంలోని రాజారం గ్రామంలో విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నామని, అనుభవం, అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం విజయ్‌, ఎంఈవో నీలగిరి జయసింహారావు, ఉప సర్పంచ్‌ కె.శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు అశోక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    అంజన్న సన్నిధిలో యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజలు

    మల్యాల: రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ రఘునాథ్‌ యాదవ్‌ బుధవారం కొండగ ట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి తీర్థ, ప్రసాదాలు అందించారు.

    నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ

    జగిత్యాల: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం కొత్తబస్టాండ్‌లోని కార్మికుల అడ్డా వద్ద క్షయవ్యాధి నిర్ధారణ, రక్త పరీక్షలు నిర్వహించారు. రాత్రి సమయంలో జ్వరం, తదితర లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు శ్రీనివాస్‌, ఎస్టీఎస్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ రవీందర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ శరత్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ అనూష తదితరులు పాల్గొన్నారు.

  • 40.0/30.0

    7

    గరిష్టం/కనిష్టం

    పెద్దమ్మతల్లికి బోనాలు

    కథలాపూర్‌: మండలంలోని బొమ్మెనలో పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ద్యావతుల విన్యాసాలు, డప్పుల చప్పుళ్లు ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

    వాతావరణం

    వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది.

    నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ

    ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.

    గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026

  • కథలాపూర్‌: ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేక.. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత పైచదువులకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఆర్థికంగా భారమవుతోంది. సరిపడా రవాణా సదుపాయం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ఫలితంగా చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కథలాపూర్‌ మండలంలో ఏటా పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు.. ఇంటర్‌, డిగ్రీ చదువులకు వెళ్లేవారి సంఖ్యకు చాలా తేడా కనిపిస్తోంది.

    ఏటా 500కు పైగా టెన్త్‌ విద్యార్థులు..

    మండలంలో 19 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఏటా 500కు పైగా విద్యార్థులు పదోతరగతి పాస్‌ అవుతున్నారు. గతేడాది 511 మంది విద్యార్థుల్లో బాలురు 240 మంది, బాలికలు 271 మంది ఉన్నారు. అయితే కథలాపూర్‌లో ఒక్కటే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉంది. ఇందులో ఇంటర్‌లో 150 మందికి మాత్రమే అడ్మిషన్‌ ఇస్తున్నారు. మోడల్‌ స్కూల్‌లో సుమారు 120 మంది విద్యార్థులు ఇంటర్‌లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోలు, జీపులకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో విద్యార్థినులు ఇంటర్‌లో చేరేందుకు భయపడుతున్నారు. ఫలితంగా ఇంటర్‌లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతోనూ పై చదువులకు దూరంలో ఉన్న కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు వెళాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

    గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దూరభారం

    మండలకేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తుర్తి, పోతారం, ఇప్పపెల్లి, అంబారిపేట గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల విద్యార్థులు ఉదయం జూనియర్‌ కళాశాలకు చేరుకోవడం.. సాయంత్రం ఇంటికి చేరడానికి నరకయాతన పడుతున్నారు. మారుమూల గ్రామాలైన చింతకుంట, రాజారాంతండా, పెగ్గెర్ల, ఊట్‌పెల్లి, భూషణరావుపేట గ్రామాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీరోజు ఆటోల్లో ఒకొక్కరు రూ. 60 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి రావడం విద్యార్థులకు భారంగా మారుతోంది. మండలంలో పలు గ్రామాలకు కూడలిగా ఉన్న తాండ్య్రాల చౌరస్తా, గంభీర్‌పూర్‌ గ్రామాల్లో ఏదో ఒకచోట కొత్తగా జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కథలాపూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మండల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుందని విద్యాభిమానులు అంటున్నారు. అధికారులు చొరవ చూపి కళాశాలల సమయానికి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

    కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులు

    ఆటోలో సామర్థ్యానికి మించి

    ప్రయాణిస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

  • కోరుట్ల: మామిడి రైతుల ఆశలను నల్లమచ్చ మరక ముంచేసింది. ఫలితంగా ఈ సీజన్‌లో మామిడి రైతులు, స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయాల్సిన దుస్థితి వచ్చింది. మామిడికి ప్రత్యేకమైన బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న జిల్లాలో ఈయేడు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేల టన్నులు రావాల్సిన దిగుబడి సగానికి దిగజారింది. తెగుళ్లతో మార్కెట్‌లోనూ ధర పలకకపోవడం మరో దెబ్బగా మారింది.

    పూత.. కాత దశలోనే

    మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, మల్యాల, రాయికల్‌ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 17వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. ఈసారి పూత దశలోనే తేనెమంచు తెగులు వ్యాపించడతో చాలామేర పూత రాలిపోయింది. సగం వరకు పూత రాలిపోయి కాయగా మారలేకపోయింది. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల కాయ వచ్చే పరిస్థితి నుంచి 2 నుంచి 3 టన్నులకు పడిపోయింది. మళ్లీ పిందె దశలో మసి మంగు మచ్చ తెగులు విస్తరించింది. ఈ తెగులు నుంచి కాయను రక్షించేందుకు కాయలకు తొడుగులు వేయాల్సి ఉండగా.. ఆ దిశలో రైతులను అప్రమత్తం చేసేవారు లేకుండా పోయారు. సబ్సిడీ కింద ప్రభుత్వం అందించే తొడుగులను కాయలకు అమర్చడంలో జరిగిన నిర్లక్ష్యం ఫలితంగా అనేక తోటల్లో నల్లమచ్చ తెగులు విస్తరించింది.

    కనిపించని ఇతర ప్రాంతాల వ్యాపారులు

    జగిత్యాల మామిడి బ్రాండ్‌ ఇమేజ్‌ ఫలితంగా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌ టోకు వ్యాపారులు సీజన్‌ మొదలు కాగానే వ్యాపారం కోసం వచ్చారు. అయితే నల్లమచ్చలతో కూడిన మామిడి కాయలు రావడంతో నాణ్యత సరిగా లేదని చెప్పి సదరు వ్యాపారులు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఈ ప్రాంతంలో మామిడి తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారులు పండ్లు కొనుగోలు చేసే వారు లేక తీవ్ర నష్టాలకు గురయ్యారు. అదే సమయంలో గుత్తదారులు రైతులకు ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించలేకపోయారు. మొత్తంగా రైతులు అమ్ముడు కాని పండ్లను నిల్వ ఉంచలేక.. కుళ్లిపోయేవాటిని కాపాడలేక తెగనమ్ముకుంటున్నారు. కిలో రూ.5 నుంచి రూ.15లోపే విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ సీజన్‌లో రైతులతో పాటు మామిడి పంటను నమ్ముకున్న స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టపాలయ్యారు.

    కోరుట్లలో మామిడి వ్యాపారుల వద్ద

    నిల్వ ఉన్న మామిడి కాయలు

    మామిడిపై నల్లమచ్చలు

  • జగిత్యాల: గోదావరి పుష్కరాలకు బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. పుష్కరఘాట్లను విస్తరించడంతోపాటు, అవసరమైన చోట్ల కొత్తవి నిర్మించాలన్నారు. ధర్మపురి ఆలయం సమీపంలో హెలిప్యాడ్‌, రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కోటిలింగాలు, ధర్మపురిలో పుష్కరాల కోసం ప్రభుత్వం మొదటి విడత రూ.117 కోట్లు విడుదల చేసిందని, ఇరిగేషన్‌ శాఖ ద్వారా రూ.16.10 కోట్లు, పంచాయతీ శాఖ ద్వారా రూ.8 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, మొత్తం రూ.34.10 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీవో మధుసూదన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి వీరేంద్ర నాథ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. రాష్ట్రంలో 181 హాస్టళ్లు అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నామని, పక్కా భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు.

    రూ.వంద కోట్లతో పుష్కర పనులు

    వెల్గటూర్‌: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి కోటిలింగాల వద్ద పుష్కర ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. వెల్గటూర్‌ నుంచి రాజక్కపల్లె వరకు బైపాస్‌ నిర్మించాలన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బోటింగ్‌ సౌకర్యం కల్పించాలని, కోటిలింగాల నుంచి పాశిగామ వరకు రోడ్డు నిర్మించాలని సూచించారు. ఏడాది ముందు నుంచే పనులు పూర్తి చేయాలని తెలిపారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రావు, మురళి, ఉదయ్‌, శ్రీకాంత్‌రావు, మేరుగు నరేష్‌, పూదరి రమేష్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య పెంచాలి. మండలంలో ఎనిమిది గ్రామాలు.. భీమారం మండలంలోని నాలుగు గ్రామాలకు తాండ్య్రాల చౌరస్తా కూడలిగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు రవాణాపరంగా సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలి.

    – మామిడిపెల్లి ప్రవీణ్‌,

    యువకుడు, తాండ్య్రాల

    ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి

    మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బాలికలు ఇంటర్‌, డిగ్రీ చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు ప్రత్యేక వాహనాల సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలి. అప్పుడే గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతుంది.

    – అందె రాణి, వార్డుసభ్యురాలు, చింతకుంట

  • రాయికల్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో సీ టు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మండలంలోని భూపతిపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థులు న్యాతగిరి సంజన, రాజ్‌దీపక్‌కు దుబా య్‌ లోని ఎమ్రెడ్స్‌ తెలంగాణ సంఘం ఫౌండర్‌ పీచర్ల కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రూ.50 వేలు సమకూర్చారు. నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఈ నెల ఒకటిన సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీకటాక్షం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఈటీసీఏ అధ్యక్షుడు చీటి జగదీశ్వర్‌రావు, కో–ఆర్డినేటర్‌ పునుగోటి సురేందర్‌రావు స్పందించారు. బుధవారం గ్రామస్తుల సమక్షంలో రూ.50 వేలు అందించారు. విద్యార్థులకు ఇప్పటివరకు రూ.1.30 లక్షలు సమకూరాయి. సర్పంచ్‌ గుర్రం భావన, మాజీ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, నా యకులు అన్నవేని వేణు, జక్కుల ప్రసాద్‌, మహేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, గంగాధర్‌, ప్రసా ద్‌, లక్ష్మీనారాయణ, శంకర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Komaram Bheem

  • ● కలెక్టర్‌ కె.హరిత

    ఆసిఫాబాద్‌: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో కీలక అంశాలపై చర్చించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్‌ ప్రక్రియ నిరంతరం జరిగేలా చూడాలని ఆదేశించారు. డ్రెయినేజీలు, వీధులు నిత్యం శుభ్రం చేయాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల నివారణకు ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ చర్యలు చేపట్టాలని సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నందున రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో బూత్‌లెవల్‌ అధికారులు ఓటరు నమోదు, సవరణల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్‌ ఆదా, సమస్యల పరిష్కారాలపై ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రోత్సాహంతోపాటు నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

  • రెబ్బెన: కారుణ్య నియామకాల్లో భాగంగా మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని టీబీజీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. గోలేటి సీహెచ్‌పీలో బుధవారం టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి డీవైజీఎం కోటయ్యకు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఏడాదిగా మెడికల్‌ బోర్డు నిలిపివేసి మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగ నియామకపత్రాలు అందించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. స్పందించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ కమిటీ నాయకులు శ్రీనివాస్‌, ఏరియా నాయకులు విద్యాసాగర్‌, మురళీ, అజాబ్‌, శ్రీని వాస్‌, చిరంజీవి, జ్యోతి పాల్గొన్నారు.

  • రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగి న మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హా మీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అజ్మీర బా బురావు అన్నారు. ఉద్యమకారులు అజ్మీర బాబురావు, బోగే ఉపేందర్‌, కోట రాజయ్య, దుర్గం రవీందర్‌, సోగాల వామన్‌లను బుధవారం గోలేటిలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిందన్నారు. హామీ మేరకు పెన్షన్‌, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ దుర్గం తిరుపతి, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు అరుణ్‌, సాంబగౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌, కారోబార్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఈ నెల 20న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ వీరయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు కార్యాలయంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సంకేత్‌ మిత్రతో కలిసి బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడే క్రిమినల్‌, సివిల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులు, బ్యాంకు, ఎలక్ట్రిసిటి, భూతగాదాలు, వివా హ, కుటుంబ తగాదాలు, మోటార్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ కేసులు, చిట్‌ఫండ్‌, చెక్‌బౌన్స్‌ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్‌ మేనేజర్‌గా బదిలీపై వచ్చిన శ్రీరమేశ్‌ బుధవారం గోలేటిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జీఎంగా పనిచేసిన విజయ భా స్కర్‌రెడ్డి పదవీ విరమణ పొందగా.. ఆయన స్థానంలో మణుగూరు ఏరియా నుంచి బది లీపై వచ్చిన శ్రీరమేశ్‌కు అధికారులు స్వాగ తం పలికారు. జీఎం మాట్లాడుతూ గతంలో ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందన్నా రు. ఉత్పత్తిలో ఏరియాను మొదటిస్థానంలో నిలిపేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్‌, ఏరియా ఇంజినీర్‌ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్‌, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇంటర్మీడియట్‌ కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచితంగా చదివించేందుకు కార్పొరేట్‌ విద్యాపథ కం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్యూషన్‌ ఫీజు, పాకెట్‌ మనీ అందిస్తూ విద్యార్థుల చదువుకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తోంది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

    ప్రభుత్వ విద్యార్థులు అర్హులు

    జిల్లాలో పదో తరగతి విద్యార్థులు మొత్తం 6,932 మంది వార్షిక పరీక్షలు రాయగా, ఇందులో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. కార్పొరేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యను అభ్యసించేందుకు జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్‌, కేజీబీవీలు, నవోద య, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో చదివిన వారు అర్హులు. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదా యం రూ.2 లక్షలు, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించొద్దు. దరఖాస్తుకు మీసేవ కేంద్రాల నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువపత్రాలు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి మెమో, ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌, దివ్యాంగులైతే సంబంధిత ధ్రువపత్రాలు జతపరచాలి. పదో తరగతిలో 400కు పైగా మార్కులు సాధించిన వారిని అధికారులు ఎంపిక చేస్తారు.

    ఈ నెల 5 వరకు గడువు

    జిల్లాలో స్థానికంగా మెరుగైన విద్యా అవకాశాలు లేవు. ఎక్కువ మంది సమీపంలోని మంచిర్యాలతోపాటు కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి నగరా లకు వెళ్తుంటారు. పేద విద్యార్థులు కొంతమంది ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. కార్పొరేట్‌ విద్యా పథకం కింద ఎంపికై న ఒక్కో విద్యార్థికి ట్యూషన్‌ ఫీజు కింద ప్రభుత్వం రూ.35 వేలు, పాకెట్‌ మనీగా రూ.3 వేలు చెల్లించనుంది. మీసేవ కేంద్రాల ద్వారా https://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 5వ తేదీ వరకు గడువు ఉంది. జిల్లాలోని అర్హులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

    సద్వినియోగం చేసుకోవాలి

    కార్పొరేట్‌ కళాశాలల్లో చదివేందుకు పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యాపథకం ద్వారా అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం జూన్‌ 5లోగా అర్హులైన విద్యార్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏ కార్పొరేట్‌ కళాశాలనైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.

    – అశోక్‌ మదిరె,

    జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి

  • ● ఎస్పీ నితిక పంత్‌

    ఆసిఫాబాద్‌: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లతో రక్షణ ఉంటుందని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. కంచుకోట, గాంధీచౌక్‌, ప్రభుత్వ ఆస్పత్రి, పైకాజీనగర్‌ మీదుగా మెయిన్‌ రోడ్‌ వరకు రోడ్డు భద్రతా పరిస్థితులు పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్‌ ధరించాలని సూచించారు. మ ద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణపాయం ఏర్పడుతుందని, కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా హెల్మె ట్‌ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ‘బెస్ట్‌ సిటిజన్స్‌ ఇన్‌ ఆసిఫాబాద్‌’గా కొని యాడారు. మెరుగైన సేవలందించేందుకు సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ కార్యాలయాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపా రు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు, సమస్యలను అధి కారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్‌, సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌, వేణుగోపాల్‌, ఎస్సైలు మధుకర్‌, రవికుమార్‌, విక్రమ్‌, మహేందర్‌, ఉల్లాస్‌, శ్యా మ్‌రావు, మోహన్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

    సిబ్బంది సమయపాలన పాటించాలి

    ఆసిఫాబాద్‌: ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్‌ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల కార్యాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్‌ రిజిస్టర్లు పరిశీలించారు. ఇరిగేషన్‌ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ చెరువులు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

  • కెరమెరి: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది. తొలిరోజు హాస్టళ్లలో పాడైన వస్తువులు తొలగించి ఆవరణ, తాగునీటి ప్రాంతం, ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు శుభ్రపరిచారు. గ్రామ సభలు నిర్వహించి బడిబాట ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో గిరిజన ప్రాథమిక పాఠశాలలు 332 ఉండగా ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 46 ఉన్నాయి. ఇందులో 13,126 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఐటీడీఏ పీవో మంద మకరందు ప్రత్యేక షెడ్యూల్‌ రూపొందించారు. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే కార్యక్రమాలు ఉండగా, ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    ఆశ్రమాల షెడ్యూల్‌..

    ఈ నెల 4న వంటశాలలు, డార్మెటరీలు, 5న తరగతి గదులు, కార్యాలయ గదులు, 6న సైన్స్‌ ల్యాబ్‌లు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు శుభ్రం చేస్తారు. 8 నుంచి 10 వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల స్వీకరణ, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తారు. 11, 12 తేదీల్లో సిబ్బందితో సమావేశం, రికార్డుల నవీకరణ, విధుల కేటాయింపు, 17న సమగ్ర విద్య, బాలిక విద్యా దినోత్సవం, 18న డిజిటల్‌ తరగతి గదులపై అవగాహణ, 19న క్రీడాదినోత్సవం నిర్వహిస్తారు.

    ప్రతిరోజూ సమీక్షించాలి

    గతేడాది ఉన్న విద్యార్థులను వందశాతం నిలుపుదల చేయడంతోపాటు కొత్త వారిని బడిలో చేర్పించాలి. షెడ్యూల్‌ ప్రకారం ఉపాధ్యాయులు కార్యక్రమాలు నిర్వహించాలి. ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఎస్సీఆర్‌పీలు ప్రతిరోజూ కార్యక్రమాలను సమీక్షించాలి.

    – పి.రమాదేవి, గిరిజనశాఖ సంక్షేమ అధికారి

  • రెబ్బెన: జిల్లాకు వస్తే న్యాయం జరుగుతుంది.. అభివృద్దికి నిధులు మంజూరవుతాయని ఎదురుచూసిన జిల్లా ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన నిరాశపర్చిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. గోలేటిలోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి సభకు అధ్యక్షతన వహించాల్సి ఉన్నా.. కనీసం మాట్లాడే అవకాశం కల్పించకుండా పక్కన పెట్టి అవమానపర్చడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రెండు నియాజకవర్గాలకు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. ఆసిఫాబాద్‌– ఆదిలాబాద్‌ రోడ్డు అధ్వానంగా మారిందని, అలాగే కాగజ్‌నగర్‌– సిర్పూర్‌, సిర్పూర్‌ –బెజ్జూర్‌, కాగజ్‌నగర్‌ –పెంచికల్‌పేట్‌ రోడ్లు దారుణంగా ఉన్నా నిధులు కేటాయించలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెబుతున్నారని, ముందుగా డీపీఆర్‌ను సిద్ధం చేయాలని హితవు పలికారు. వరిధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు.

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: క్యాన్సర్, ఇతర అరుదైన రోగాలను నయం చేసే బయోలాజిక్స్, వ్యాక్సిన్లు, సెల్ అండ్ జీన్ థెరపీ వంటి అత్యంత అధునాతన వైద్య పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

    పరిశోధన దశ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ దాకా అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే చోట కల్పించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా సమగ్ర కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామన్నారు.

    సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం బోర్పట్ల గ్రామంలో రూ.1200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘థెరానిమ్ బయోలాజిక్స్(Theranym Biologics)’ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఫార్మా రాజధాని హైదరాబాద్‌ను బయో టెక్నాలజీ రంగంలోనూ గ్లోబల్ లీడర్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

    రాబోయే రోజుల్లో బయోటెక్నాలజీ రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్‌డ్ జెనెటిక్స్ వంటి సాంకేతికతలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయన్నారు. ఫలితంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా.. తలెత్తే సవాళ్లను అధిగమించేలా.. దిగ్గజ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ పాలసీ, వన్ బయో హబ్, గ్రీన్ ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్ తదితర విప్లవాత్మక అడుగులు లైఫ్ సైన్సెస్ రంగంలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడతాయన్నారు.

    ఓ వైపు లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు వారికి కావాల్సిన ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ను తయారు చేసే బృహత్తర బాధ్యతను తాము తీసుకున్నామన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ ఫార్మా కంపెనీలకు పిలుపునిచ్చారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చే ప్రయాణంలో ‘థెరానిమ్ బయోలాజిక్స్’ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మరొక కీలక మైలురాయి అని.. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.

    క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఇక్కడ ఉత్పత్తి చేసి... యూఎస్ సహా పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్టుగా వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా... కొత్తగా సుమారు1500 మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహా, టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కంపెనీ ప్రతినిధులు కె. నిత్యానంద రెడ్డి, డా. మదన్ మోహన్ రెడ్డి, డా. శాతకర్ణి ఎమ్., డా. ఐ.ఎస్.ఆర్. రావు, సనత్ ఛట్టోపాధ్యాయ, డేవ్ మరాల్డో తదితరులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌: శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE)లో నిర్వహించిన "అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి మరో మంత్రి వివేక్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఆ అనుభవాన్ని నైజీరియాలోని టరాబా రాష్ట్ర యువతతో పంచుకోవడం సంతోషకరమన్నారు. ఈ శిక్షణ ద్వారా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక పరిజ్ఞానం పొందారని తెలిపారు.

    టరాబా రాష్ట్ర ప్రభుత్వం తమ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించేందుకు చూపుతున్న చొరవ అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టరాబా రాష్ట్రంతో వ్యవసాయం, విత్తన సాంకేతికత, రైతు శిక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

    తెలంగాణ-టరాబా రాష్ట్రాల మధ్య "సిస్టర్ స్టేట్" భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది ఇరు ప్రాంతాల మధ్య పరస్పర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. టరాబా రాష్ట్ర యువత ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.  

    ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నైజీరియాలోని టరాబా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అగ్బు కెఫాస్, టరాబా సీడ్స్ లిమిటెడ్, ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు, శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.

  • హైదరాబాద్‌: తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఏటీఎంలా వాడుకుంటోందంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల‍్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అవినీతి ముఖ్యమంత్రా? లేక బీజేపీ 'కోవర్ట్' మిత్రుడా? అని నిలదీస్తూ ట్వీట్‌ చేశారు.

    ‘‘ఒకవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ వేదికగా బహిరంగంగానే రేవంత్ రెడ్డిని "ఛోటే భాయ్" (తమ్ముడు) అని సంబోధిస్తూ, “హమ్సే జుడ్ జావో" (మాతో కలిసిపోండి) అంటూ అప్యాయంగా ఆహ్వానిస్తారు. మరోవైపు, అదే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో కూర్చుని.. "రేవంత్ రెడ్డి అవినీతిపరుడు, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా వాడుకుంటోంది" అంటూ ఒక పొలిటికల్ స్క్రిప్ట్ చదువుతారు!

    అసలు ఇది మీ జాతీయ విధానమా? లేక రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌తో కలిసి మీరు ఆడుతున్న కుమ్మక్కు రాజకీయ నాటకమా (మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా)? పరస్పర విరుద్ధంగా పదే పదే మారుతున్న ఈ ప్రకటనలు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, బీజేపీ- తెలంగాణ కాంగ్రెస్ లోపాయికారీగా ఒకరితో ఒకరు చేతులు కలిపారనే నిజాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తున్నాయి.

    ఇది ఒక ప్రమాదకరమైన రాజకీయ వ్యూహానికి అద్దం పడుతోంది. బయట ప్రపంచానికి తాము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ, నాటకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం ఆయనను రేపు పొద్దున తమ వైపు తిప్పుకోబోయే ఒక సంభావ్య ఫిరాయింపుదారుడిగా (Turncoat), అస్సాంలో హిమంత బిస్వా శర్మ లేదా పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి తరహా నాయకుడిగా బీజేపీ సిద్ధం చేస్తోంది.

    తెలంగాణ సమాజం, ఈ దేశ ప్రజలు బీజేపీని సూటిగా ఒకే ఒక్క స్పష్టమైన సమాధానం కోసం డిమాండ్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి మీ దృష్టిలో జైలుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ముఖ్యమంత్రా? లేక మీ పార్టీలో చేరాల్సిందిగా మీరు బహిరంగంగా ఆహ్వానిస్తున్న (హమ్సే జుడ్ జావో) మీ 'కోవర్ట్ మిత్రుడా ' (Covert Friend)? దేశ ప్రజలు ఈ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు!’’ అని అన్నారు. 

Andhra Pradesh

  • తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ‍్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.

    ఏ కమిటీల్లో ఎవరు?
    సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌, మంగళగిరి ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి,  వనమా బాలవజ్రబాబు  

    సీఆర్‌డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్

    డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత,  పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర

    డీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి,  ఎం.మనోహర్ రెడ్డి,  జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్‌

     

Business

  • హైదరాబాద్‌: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్‌ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్‌ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్‌ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్‌డీ ప్రధాన కస్టమర్‌గా చేరింది.

    ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్‌డీ సీనియర్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్‌ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్‌ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్‌ కాంట్రాక్ట్‌ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్‌, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్‌ చికిత్సల డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Movies

  • ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. థియేటర్లలో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీల్లో అదరగొట్టేస్తుంటాయి. తాజాగా మరో మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దృశ్యం చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ధృడం'.  ఈ మూవీ జూన్ 12 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది.

    ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో యంగ్ హీరో షేన్ నిగమ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఓటీటీలో మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.

    ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్‌మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.