Archive Page | Sakshi
Sakshi News home page

Crime

  • విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండపై  చోరీ జరిగింది. ఓ భక్తురాలి వద్ద 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.  హైదరాబాద్ నుంచి విజయవాడకు పెళ్లికి వచ్చిన మహిళా భక్తురాలు నగలు పొగొట్టుకుంది. ఇవాళ కుంభాభిషేకం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో దర్శనానికి వెళ్లిన ఆమె బ్యాగ్‌లో ఉన్న బంగారు చోరీకి గురైంది.

    దీంతో విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు మహిళా భక్తురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కుంభాభిషేకం ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో సీసీ కెమెరాలకు అడ్డంగా టెంట్స్ ఉండడంతో దొంగను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. 
     

Movies

  • శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు(మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

    కథేంటంటే..
    మల్లేష్‌(శ్రీనాథ్‌ మాగంటి) చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంటుంది. దానికి కారణం వాళ్ల నాన్న. నాన్న తాగొచ్చ అతన్ని కొట్టడంతో.. ఓ రోజు మల్లేష్‌ కూడా మద్యం సేవించి నాన్నని కొట్టి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత నాన్న చనిపోయిన విషయం తెలిసి తిరిగి వస్తాడు. ఊర్లోనే టెంట్‌ హౌస్‌ పెట్టి.. వచ్చిన డబ్బులతో తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అతని మేనమామ కొడుకు చిన్న పటేల్‌(రాజేష్‌)తో మల్లేష్‌ ఫ్యామిలీకి గొడవలు ఉంటాయి. తల్లి బలవంతం చేయడంతో జ్యోతి(గాయత్రీ రమణ)ని మల్లేష్‌ పెళ్లి చేసుకుంటాడు. ఫస్ట్‌ నైట్‌ రోజే అతనికి ఓ షాకింగ్‌ విషయం తెలుస్తుంది. అదేంటి? దాని వల్ల మల్లేష్‌కి వచ్చిన సమస్యలు ఏంటి? చిన్న పటేల్‌తో మల్లేష్‌ చేసిన ఛాలెంజ్‌ ఏంటి? జ్యోతి-మల్లేష్‌ల సంసారం ఎలా సాగింది? మందు లేనిదే ఏ పని చేయలేని మల్లేష్‌...చివరకు మద్యానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కథలో కామాక్షి భాస్కర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..
    తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ అడల్ట్‌ కామెడీ చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ సింపులే అయినా.. దాని చుట్టు అల్లిన సన్నివేశాలు బాగున్నాయి. అడల్ట్‌ కామెడీ అయినా.. అందులోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. 
    దారితప్పిన వ్యక్తిని తల్లి, భార్య ఎలా దారికి తీసుకొచ్చారు అనేది చూపిస్తూనే మద్యానికి బానిసైతే ‘సంసార’ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.

    మల్లేష్‌కు చిన్నప్పుడే తాగుడు అలవాటు ఎలా వచ్చింది అనే సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. మొదటి పది నిమిషాలు రొటీన్‌గానే సాగిపోతుంది. మల్లేష్‌, జ్యోతిల పెళ్లి తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. కానీ ‘కార్యం’ మాత్రం కాదు. ఆ విషయం దాచేందుకు హీరో చేసే ప్రయత్నాలన్నీ నవ్వులు పూయిస్తాయి. మల్లేష్‌కి ‘కార్యం’ కాలేదనే విషయం చిన్నపటేల్‌కి తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. ఇంటర్వెల్‌ ముందు ఇద్దరు చేసుకునే సవాల్‌.. సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థం ప్రారంభంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. 

    ఛాలెంజ్‌ గెలవడం  కోసం హీరో చేసే ప్రయత్నాలు.. దాన్ని తిప్పికొట్టేందుకు చిన్న పటేల్‌ చేసే కుట్రలు అన్ని రొటీన్‌గానే ఉంటాయి. తల్లి చనిపోయే సీన్‌ కూడా అనవసరమే అనిపిస్తుంది. పోలీస్‌ స్టేషన్‌లో కామాక్షీ సీన్‌ అదిరిపోతుంది. అయితే ఆ తర్వాత ఆమె పాత్రను అంతే బలంగా చూపిస్తే బాగుండేది. కానీ దర్శకుడు మాత్రం భార్య భర్తల అనుబంధంపైనే ఫోకస్‌ చేశాడు. అవి ఆకట్టుకుంటాయి. అలాగే కార్యం సమయంలో పక్కింట్లోని ముసలాయన రేడియోలో వినే పాత పాటల సీన్లన్నీ థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. రేడియో సీన్‌ రిపీట్‌ అయిన ప్రతిసారి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుతాడు. కానీ కార్యం సీన్‌తో పాటు కొన్ని బూతు డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. క్లైమాక్స్‌ బాగుంటుంది.  

    ఎవరెలా చేశారంటే.. 
    ఇన్నాళ్లు తెరపై సాఫ్ట్‌ పాత్రల్లో కనిపించిన శ్రీనాథ్‌.. ఇందులో ఊరమాస్‌ లుక్‌లో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా నటించిన గాయత్రి రమణ..తెరపై పక్కింటి తెలుగు అమ్మాయిలా కనిపించడమే కాకుండా నటన పరంగానూ మెప్పించింది. కామాక్షి భాస్కర్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు కానీ.. ఒక్క సీన్‌లో మాత్రం అదరగొట్టేసింది. పటేల్‌గా రాజేశ్‌ బాగానే నటించాడు. మురళీ ధర్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సురేశ్‌ బొబ్బిలి నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    -అంజి శెట్టే, సాక్షి వెబ్‌డెస్క్‌

  • టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్‌ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    కాగా.. అల్లు శిరీష్‌- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్‌ భార్య షాలినికి నయనిక బెస్ట్‌ ఫ్రెండ్‌ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్‌- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్‌ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ‍అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
     

  • 'డీజే టిల్లు' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈయన భార్య శశికళ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

    (ఇదీ చదవండి: నా కథని మానభంగం చేశారు.. టాలీవుడ్ స్టార్ రైటర్ షాకింగ్ పోస్ట్)

    గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ గౌడ్.. రిటైర్ అయిన తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. అలా 2018లో రిలీజైన 'రంగస్థలం'లో చిన్న పాత్ర చేశారు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత బలగం, మేం ఫేమస్, మ్యాడ్, టిల్లు స్కేర్ తదితర చిత్రాలు చేశారు. గతంలో భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. శశికళ.. గతంలో రామాయంపేట, పంచాయతీగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్‌గా కూడా పనిచేశారట.

    (ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

  • సోషల్ మీడియాలో ట్రెండింగ్.. చీరకట్టులో త్రిష

    ముక్కెర(ముక్కుపుడక)తో అందంగా ఆషికా

    చీరలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్

    గ్లామర్ చూపించేస్తున్న 'బేబి' వైష్ణవి చైతన్య

    చుడీదార్‌లో చూడముచ్చటగా ప్రియాంక మోహన్

    డ్యాన్సుతో అదరగొట్టిన రాజశేఖర్ కూతుళ్లు

  • హీరోయిన్‌ ప్రియమణి సినీ జర్నీ తెలుగు సినిమాతోనే మొదలైంది. ఎవరే అతగాడు (2003) మూవీతో కథానాయికగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. తాజాగా సరస్వతి సినిమాతో పలకరించింది.

    డైరెక్టర్‌ అడగడంతో..
    ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది ప్రియమణి. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో బికినీ ధరించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది. ప్రియమణి మాట్లాడుతూ.. స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గరకు చీర కట్టుకుని వెళ్లం కదా.. ఏది కంఫర్ట్‌గా ఉంటే ఆ దుస్తులే ధరిస్తాం. ద్రోణ సినిమాలో స్విమ్‌ సూట్‌ వేసుకోమని డైరెక్టర్‌ అడిగాడు. 

    కరీనా కపూర్‌లా..
    టషన్‌ మూవీలో కరీనా కపూర్‌లా నిన్ను డిఫరెంట్‌గా చూపించాలనుకుంటున్నా అన్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడూ స్విమ్‌సూట్‌ వేయలేదు, ఒకసారి ట్రై చేద్దాం అని ఓకే చెప్పాను. ఆ తర్వాత చాలా కామెంట్స్‌ వచ్చాయి. ట్రోలింగ్స్‌ జరిగాయి. నటిగా ఉన్నప్పుడు పరిస్థితి డిమాండ్‌ చేస్తే అలాంటి డ్రెస్‌ వేసుకోక తప్పదు. కానీ మన సౌకర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు అడిగితే మాత్రం నేను కచ్చితంగా చేయనని చెప్పేస్తాను అని ప్రియమణి పేర్కొంది.

    చదవండి: ఇది కరెక్ట్‌ కాదు.. విజయ్‌పై నటి ఫైర్‌

  • ఆర్ఆర్ఆర్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె తదితర సినిమాలకు రచయిత, డైలాగ్ రైటర్‌గా పనిచేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సాయిమాధవ్ బుర్రా. అడపాదడపా పలు చిత్రాలకు పనిచేస్తున్న ఈయన.. ఇప్పుడు తన సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇష్టమొచ్చినట్లు తన స్టోరీని మార్చేసుకున్నారని, మానభంగం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఈయన మాట్లాడేది ఏ మూవీ గురించి? అసలేంటి విషయం?

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

    సాయిమాధవ్ బుర్రా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో శుక్రవారం ఓ పోస్ట్ పెట్టారు. 'నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు. అసలా కథే వేరు' అని రాసుకొచ్చారు. అయితే ఈయన మాట్లాడేది ఈరోజే థియేటర్లలోకి వచ్చిన 'సరస్వతి' మూవీ గురించి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. వరలక్ష‍్మి శరత్ కుమార్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించింది. నిర్మాతగానూ వ్యవహరించింది.

    ఓసారి గతంలోకి వెళ్తే సాయిమాధవ్ బుర్రా దర్శకుడిగా ఓ సినిమాని మొదలుపెట్టారు. అదే 'సరస్వతి'! కొన్ని కారణాల వల్ల ఈయన బయటకు వచ్చేయడంతో మిగతా భాగాన్ని వరలక్ష‍్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించి పూర్తి చేసిందట. అయితే ఈ విషయాన్ని టీమ్ ఎక్కడా చెప్పలేదు. కానీ స్టోరీ విషయంలో ఈయనకు క్రెడిట్స్ ఇచ్చారు. కానీ రెమ్యునరేషన్ మాత్రం ఇంకా ఇవ్వలేదట. ఫోన్ చేస్తున్నా సరే టీమ్ స్పందించడం లేదట. ఈ క్రమంలోనే ఇప్పుడు సాయిమాధవ్ పరోక్షంగా పోస్ట్ పెట్టడంతో.. 'సరస్వతి' గురించేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

    'సరస్వతి' విషయానికొస్తే.. లక్ష‍్మి(వరలక్ష‍్మి) ఓ అనాథ. నర్సుగా పనిచేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురు సరస్వతిని స్కూల్‌లో దిగబెట్టి పనికి వెళ్లిపోతుంది. సాయంత్రం తిరిగొచ్చి చూసేసరికి పాప కనిపించదు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే సరస్వతి పేరుతో క్లాసులో ఎవరూ లేరని చెబుతారు. అయితే ఆ పాపని ముగ్గురు అత్యాచారం చేసి చంపేశారని, శవాన్ని పాతిపెట్టారని లక్ష‍్మి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. తర్వాత కోర్టు, కేసులు అంటూ తిరుగుతుంది. తన కూతురి చావుకు కారణమయ్యారని ఓ జడ్జిని, ఐఏఎస్, పోలీస్‌ని లక్ష‍్మి చంపేస్తుంది. తర్వతా ఏమైంది? అసలు లక్ష‍్మి ఎవరు? ఈమెకు నిజంగా కూతురు ఉందా లేదా అనేది మిగతా స్టోరీ. థియేటర్లలో ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ తేలుతుంది.

    (ఇదీ చదవండి: చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?)

  • స్టార్‌ హీరో విజయ్‌- సంగీత విడాకుల వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నేళ్లుగా ఓ నటితో ఎఫైర్‌ పెట్టుకున్నాడని, ఆ కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత తన విడాకుల పిటిషన్‌లో పేర్కొంది. దీంతో విజయ్‌- సంగీత విడాకులకు హీరోయిన్‌ త్రిష కారణమా? అన్న చర్చ మొదలైంది.

    విడాకులు
    ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ విజయ్‌- త్రిష ప్రేమాయణం నడుపుతున్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. సంగీత విడాకుల పిటిషన్‌ వేసిన తర్వాత విజయ్‌.. దర్జాగా త్రిషను తీసుకుని ఓ పెళ్లికి హాజరయ్యాడు. జంటగా నిల్చుని ఫోటోకు పోజిచ్చాడు. ఇది చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఇప్పటికే విజయ్‌- సంగీత కలిసుండాలని చాలామంది ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో భార్యతో కలిసుండే ప్రసక్తే లేదని హింటిస్తూ ఇలా త్రిషతో పెళ్లికి వెళ్లడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.

    అవతలివారి బాధను లెక్కచేయరా?
    ఈ వ్యవహారంపై విజయ్‌ అభిమాని, నటి సనం శెట్టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్‌, త్రిష పెళ్లికి హాజరైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ఇది కరెక్ట్‌ కాదు.. భార్య బాధను ఇసుమంతైనా పట్టించుకోకపోవడం విచారకరం. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటివాళ్లను మీరు తీవ్రంగా నిరాశపర్చారు అని రాసుకొచ్చింది. ఆమె కామెంట్స్‌ను కొందరు సపోర్ట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం విమర్శించారు.

    ఎవరీ సనం శెట్టి?
    కాగా సనం శెట్టి విజయ్‌కు వీరాభిమాని. కరూర్‌ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా విజయ్‌ తప్పు లేదని బాధితులే చెప్పారంటూ అతడిని వెనకేసుకొచ్చింది. కానీ, ఈసారి మాత్రం భార్య బాధను పట్టించుకోకుండా ఇలా ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సభ్యత కాదని చురకలంటించింది. సనం శెట్టి.. తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది. తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం 123 చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

    చదవండి: అప్పుడు భార్యను కొట్టి.. ఇప్పుడు అందరి ముందు క్షమాపణలు చెప్పిన మాస్క్‌ మ్యాన్‌

  • హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్‌లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్‌లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

    (ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)

    'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్‌గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అ‍ప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.

    మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్‌బుక్‌లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.

    రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్‍‌లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేసింది.

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

  • మాస్క్‌ మ్యాన్‌.. బిగ్‌బాస్‌ కంటే ముందే ఈ పేరు బాగా ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ 9లో అడుగుపెట్టాలంటే అగ్నిపరీక్ష దాటాలని సామాన్యుల కోసం ఓ షో ఏర్పాటు చేశారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ పాల్గొన్నాడు. తన పేరు హరిత హరీశ్‌ అని తెలిపాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఇల్లాలి పేరునే తన పేరులో చేర్చుకున్నట్లు తెలిపాడు. అది విని భార్యంటే ప్రేమ, గౌరవం బాగానే ఉందని అందరూ అనుకున్నారు.

    కోపమొస్తే కొట్టేస్తావా?
    కానీ, అంతలోనే ఒకసారి భార్యపై చేయి చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఎంత కోపం వస్తే మాత్రం కొట్టేస్తావా? ఆడదానిపై చేయెత్తుతావా? అని తిట్టిపోశారు. అలా నెగెటివిటీతోనే బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టాడు. తన ముక్కుసూటితనం, మొండితనం, కోపం వల్ల ఎక్కువమందిని ఆకర్షించలేకపోయాడు.

    కాళ్లు పట్టుకుని క్షమాపణలు
    అయితే ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి వస్తున్నాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే షోలో భార్య హరితతో కలిసి హరీశ్‌ పాల్గొన్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో మాస్క్‌ మ్యాన్‌ మాట్లాడుతూ.. మగాడు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాడని చెప్పి ఆడవారిపై చేయత్తడం చాలా తప్పు అంటూ భార్య కాళ్లు నమస్కరించాడు. అలా అప్పటి వివాదానికి ఇలా ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే కపుల్‌ రియాలిటీ షో మార్చి 15న ప్రారంభం అవుతోంది. ఇది మా టీవీతో పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

     

    చదవండి: తండ్రి మరణించిన పదేళ్లకు ఆయన కల నెరవేర్చిన కూతురు

  • 'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.

    రణ్‌వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్‌ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

    (ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)

    'ధురంధర్' తొలి భాగం.. భారత్‌తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.

    జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.

    (ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

  • పిల్లలు ప్రయోజకులైతే చూడాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు. కానీ ఆ ఆశ తీరకముందే తనువు చాలించాడు కళాభవన్‌ మణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2016 మార్చి 6న మరణించాడు. తండ్రి లేకపోయినా ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూతురు శ్రీలక్ష్మి. తనను డాక్టర్‌గా చూడాలన్న తండ్రి కలను నిజం చేసింది.

    తండ్రి కల సాకారం
    ఈ విషయాన్ని కళాభవన్‌ మణి సోదరుడు, డాక్టర్‌ ఆర్‌ఎల్‌వీ. రామకృష్ణన్‌ వెల్లడించాడు. మణి ఏకైక కుమార్తె శ్రీలక్ష్మి ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకుని డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఆమెను పేదలకు వైద్యం చేసే డాక్టర్‌గా చూడాలని మణి ఎన్నో కలలు కన్నాడు. అతడు కోరుకున్నట్లే తను వైద్యురాలయింది. తన కుమార్తెను డాక్టర్‌ చేయాలని, పేదలకు ఉచిత చికిత్స అందించే ఆస్పత్రి ప్రారంభించాలన్నది మణి ఆశయం.

    డాక్టర్‌ విద్య పూర్తి
    ఈ విషయాన్ని తనెప్పుడూ బయటకు చెప్తూ ఉండేవాడు. తండ్రి మరణించిన బాధలోనే శ్రీలక్ష్మి పదో తరగతి పరీక్షలు రాసింది. అయినా తనకు మంచి మార్కులొచ్చాయి. కాలేజీలోనూ అద్భుతమైన మార్కులు సాధించింది. డాక్టర్‌ కోర్సులో చేరేందుకు రెండేళ్ల శిక్షణ తీసుకుంది. అలా MBBSలో సీటు సంపాదించుకుంది. కూతురి కోసం నిమ్మి (కళాభవన్‌ భార్య) కూడా కాలేజీ దగ్గర్లో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని అక్కడే నివసించింది అని పేర్కొన్నాడు.

    ఆటో నడిపి సినిమాల్లో..
    కళాభవన్‌ మణి మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టాడు. బతుకు బండి ముందుకు సాగడం కోసం ఆటో నడిపాడు. కెప్టెన్‌ ప్రభాకరన్‌ అనే తమిళ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. 1996లో వచ్చిన సల్లప్పం అనే మలయాళ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్‌గా అనేక సినిమాలు చేశాడు. ఆ తర్వాత సహాయక పాత్రలు చేశాడు.

    తెలుగు సినిమా
    వాసంతియుమ్‌ లక్ష్మియుం పిన్నె నిజానుం సినిమాలో అంధ సింగర్‌గా నటించగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సహాయక పాత్రలకే పరిమితం కాకుండా విలన్‌గా ట్రై చేశాడు. తెలుగులో జెమిని, అర్జున్‌, ఆయుధం, నరసింహుడు, ఎవడైతే నాకేంటి, నగరం.. ఇలా అనేక సినిమాలు చేశాడు. ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ టాలెంట్‌ చూపించాడు. నటుడిగా దాదాపు 200 సినిమాలు చేసిన ఆయన అతిగా మద్యం తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు.

    చదవండి: డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసిన నయనతార దంపతులు

  • 'కాంతార' ఫేమ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్.. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం దర్శించుకుంది. చెల్లితో పాటు కలిసి సంప్రదాయబద్ధంగా చాలా సింపుల్‌ లుక్‌లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు తెలుగులోనూ సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది.

    (ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

    మూవీస్ అప్‌డేట్ గురించి అడగ్గా.. ఇప్పుడేం లేదు. త్వరలో వస్తుంది, అప్పుడు చెబుతా అని రుక్మిణి వసంత్ చెప్పుకొచ్చింది. ఈమె నటించిన 'టాక్సిక్'.. ఈ నెలలోనే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉండగా ఏకంగా జూన్ 4కి వాయిదా పడింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీస్తున్న 'డ్రాగన్'లోనూ ఈమెనే హీరోయిన్. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    రీసెంట్‌గా కన్నడ ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్లు సప్తమి గౌడ, ఆషికా రంగనాథ్ తదితరులతో పాటు తన ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచితంగా జూమ్ చేస్తూ తమని ఫొటోలు తీస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. హీరోయిన్లని ఈ విధంగా ఇబ్బందులకు గురిచేసేవారిపై చర్యలకూ తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని రుక్మిణి వసంత్‌ చెప్పింది.

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్)

  • అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ రోజే నయనికని పెళ్లి చేసుకోనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపోతే గురువారం, నయనిక ఇంట్లో పెళ్లి కూతురు వేడుక, పసుపు దంచడం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోలని నయనిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.

    (ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)

    నయనిక ఇంట్లో జరిగిన ఈ శుభకార్యానికి అల్లు అరవింద్, తన సతీమణి, అల్లు అర్జున్, స్నేహ కుటుంబం హాజరైంది. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నయనిక అక్కాచెల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ఫొటోల్లో కనిపించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగినప్పటికీ వివాహం మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా జరగనుంది.

    (ఇదీ చదవండి: విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్‌లో మరో హీరో ప్రేమ పెళ్లి)

  • గత వారం పదిరోజుల్లోనే హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా ఉదయ్‌పుర్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. సొంతూరి వాళ్లకు, అభిమానులకు, సినీ-రాజకీయ ప్రముఖులకు వేర్వురుగా రిసెప్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ సందడి అంతా అయిపోయింది. ఇకపోతే ఈరోజు అల్లు శిరీష్, నయనిక మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో హీరో కూడా ప్రేమ వివాహానికి సిద్ధమైపోయాడు.

    (ఇదీ చదవండి: రీల్స్‌ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్‌ ఫైర్‌)

    నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలానే సినిమాలు చేశాడు గానీ 'రాక్షసుడు' తప్పితే మరేవి హిట్ కాలేదు. ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు తదితర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇతడు గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం(మార్చి 8) కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.

    కావ్య రెడ్డి విషయానికొస్తే ఈమెది హైదరాబాదే. తాత జడ్జి కాదా తండ్రి లాయర్‌గా చేస్తున్నారు. ఈమెకు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఎప్పుడు ఎలా పరిచయమయ్యారో గానీ శ్రీనివాస్-కావ్య ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అనుమతితోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వేసవిలో లేదంటే ఈ ఏడాది చివరలో పెళ్లి ఉండే అవకాశముంది.

    (ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)

  • కోలీవుడ్‌ స్టార్‌ జంట నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ కొత్తిల్లు కొనుగోలు చేశారు. తమిళనాడు చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ సొంతం చేసుకున్నారు. దీని ధర దాదాపు రూ.31.5 కోట్లు అని తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, స్టార్‌ హీరో ధనుష్‌ ఉన్న ఏరియాలోనే నయన్‌ జంట ఈ ఇల్లు కొనడం విశేషం. 

     డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ 
    తేనాంపేటలోని లెగసీ ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఇది 14,369 చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాను కలిగి ఉంది. దీని ధర చదరపు అడుగుకు రూ.21,946గా ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌కు 8 కార్‌ పార్కింగ్‌ స్లాట్లు కేటాయించారు. కాగా లేడీ సూపస్టార్‌ నయనతారకు కేరళలో పూర్వీకుల ఇల్లు ఉంది. 

    సినిమా
    హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెండు ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై, కేరళలోని ఇతర ప్రాంతాల్లోనూ తనకు ప్రాపర్టీలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే నయనతార చివరగా మన శంకరవరప్రసాద్‌ గారు సినిమాతో అలరించింది. ప్రస్తుతం టాక్సిక్‌ సహా నాలుగైదు మూవీస్‌ చేస్తోంది.

    చదవండి: హీరోయిన్‌ను అవమానించిన యామీ గౌతమ్‌?

  • టాలీవుడ్‌ నటుడు శివాజీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గతేడాది కోర్ట్‌, దండోరా సినిమాలతో విజయాలందుకున్న ఆయన తాజాగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రంతో మార్చి 6న థియేటర్స్‌లోకి వచ్చారు. దర్శకుడు సుధీర్‌ శ్రీరామ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో లయ, అలీ, ప్రిన్స్, ధన్‌రాజ్‌, రిక్కీ, బబ్లూ, రోహన్, షాబుద్దీన్, చిత్రం శ్రీను, కమల్, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ తదితరులు నటించారు. ఈ మూవీకి నిర్మాత శివాజీ కావడం విశేషం. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

    కథేంటి..?
    శ్రీ‌రామ్ (శివాజి) స‌చివాల‌య కార్య‌ద‌ర్శిగా పనిచేస్తూ.. చాలా నిజాయితీప‌రుడని పేరు తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా తన ఉద్యోగ ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వం. భార్య ఉత్త‌ర (ల‌య‌), కుమారుడు మిక్కీ (రోహ‌న్‌) వీరిద్దరూ ఒకేరకమైన మనస్థత్వంతో ఉంటారు. వారిలో అమాయ‌క‌త్వంతో పాటు అతి తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా వాళ్ల జోలికెళితే ఏం చేస్తారో వారికే తెలియ‌దు. ఇలా వారి పాత్రలన్నీ టైటిల్‌కు తగ్గట్లే ఉంటాయి. ఆ కాలనీలోనే వారి ఫ్యామిలీ చాలా గమ్మత్తుగా ఉంటుంది.  

    ఎంతో సరదాగా వెళ్తున్న వారి జీవితంలోకి ఎస్‌ఐ విక్రమ్‌ (ప్రిన్స్) వస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. ఒకరోజు శ్రీరామ్‌తో గొడవ అవుతుంది. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ ఫైల్‌ను శ్రీరామ్‌  (శివాజి) అడ్డుకుంటాడు. అయితే, ఒకరోజు శ్రీరామ్‌ లేని సమయంలో ఉత్తరను చూసిన ఎస్‌ఐ ఇంట్లోకి వెళ్తాడు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఆ ఇంట్లో ఒక నేరం జరుగుతుంది. దాని నుంచి బయటపడేందుకు హీరో ఏం చేశాడు అనేది పూర్తి సినిమా. శ్రీరామ్‌ ఇంటికి ఎస్‌ఐ ఎందుకు వెళ్లాడు..? అక్కడ ఎలాంటి నేరం జరిగింది..? దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి  హీరో ఎంత దూరం వెళ్తాడు..? ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..?
    ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కథలో ఎక్కువగా దృశ్యం మూవీ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ, ఆ మూవీలో ఉన్నంత సీరియస్‌ ఇందులో కనిపించదు.  క‌థ‌లో కావాల్సినంత విషయంతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేసేలా తెరకెక్కించే అవకాశం  ఉంది. కానీ, కథ నడపడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కథలో ఓవ‌ర్ ట్విస్ట్‌లు  ఉంటాయి. కానీ, అవన్నీ ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తాయి. ఇందులో (శ్రీరామ్‌) పాత్ర సాంప్రదాయంగా ఉంటే... ఇంకొకరు( ఉత్తర) సుప్పనాతితనంతో ఉంటారు. ఇంకొకరేమో (మిక్కీ) సుద్దపూసలా కనిపించే దొంగ. ఇలా ప్రతి పాత్ర గమ్మత్తుగా ఉంటుంది. అయితే, వారు ఇచ్చే ట్విస్ట్‌లే కొంపముంచాయ్‌.  తన ఇంట్లో జరిగిన ఒక నేరం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శివాజీ అమలు చేసే ప్లాన్స్‌ కొన్ని పర్వాలేదనిపిస్తాయి.  

    అయితే, హీరో స‌మ‌స్య‌లో ప‌డిన ప్ర‌తిసారీ  ఆయ‌న‌కి అనుకూలంగా ఏదోఒకటి జ‌ర‌గ‌డంతో ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తుంది. ఆపై చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రోహన్‌ పాత్ర తిక‌మ‌క‌గా మరీ తెలివితక్కువగా ఉంటుంది. తన సీన్స్‌ వచ్చిన ప్రతిసారి ఎప్పుడు అయిపోతుందా అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అమాయ‌క‌త్వంతో ల‌య అదరగొట్టేసింది. ఫ‌స్టాఫ్ కాస్త మెప్పించినప్పటికీ.. ఇంట‌ర్వెల్ త‌ర్వాత  ఆశించినంత రేంజ్‌ కథలో విషయం కనిపించదు. కథ ప్రారంభంలో వేసిన చిక్కుముళ్లు సరైన క్రమంలో తొలగించకుంటే ప్రేక్షకుడిని మెప్పించడం కాస్త కష్టమైన పనే అవుతుంది. ప్రేక్ష‌కుడి తెలివికి ప‌రీక్ష పెట్టాలి.., కానీ ఇక్కడ స‌హ‌నానికి అగ్నిపరీక్ష దర్శకుడు పెట్టాడనిపిస్తుంది.

    ఒక మంత్రి కోసం ఎమ్మెల్యే (శ‌ర‌త్ లోహితాస్య‌) పంపిన గిఫ్ట్ చుట్టూ కాస్త స్టోరీ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు పెద్దగా బలం కనిపించదు.  సినిమా అంతా గిఫ్ట్‌ కోసం వెతకమని కేక‌లు పెట్టే ఎమ్మెల్యే  చివ‌ర్లో కూడా ఆ గిఫ్ట్‌లో ఏముందో చెప్పడు. ఈ మధ్య ఓటీటీలు వచ్చాకు ఇలాంటి కాన్సెప్ట్‌ సినిమాలు చూసిచూసి ప్రేక్ష‌కులు రాటుదేలి పోయారు. ఓటీటీలు శాసిస్తున్న  కాలంలో  వాళ్ల‌ని సుద్ద‌పూస‌ల‌నుకుంటే సినిమాకే న‌ష్టం. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా పెద్దగా మెప్పించలేదు. ఆలీ ఎపిసోడ్ కాస్త పర్వాలేదు. గుడ్‌న్యూస్‌ అంటూ లయ చేసిన సీన్‌ మెప్పిస్తుంది. శ‌వం ఎపిసోడ్‌ను ద‌ర్శ‌కుడు తను అనుకూలంగా మార్చుకున్నాడు ఏమో అనిపిస్తుంది.

    ఎవరెలా చేశారంటే..?
    దాదాపు 20ఏళ్ల తర్వాత లయ, శివాజీ కలిసి చేసిన సినిమా  కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ మూవీకి ప్రధాన బలం లయ, శివాజీల నటన మాత్రమే. రోహన్‌ పాత్ర పెద్దగా కనెక్ట్‌ అవదు. ప్రిన్స్‌ ఎస్‌ఐగా కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ మెప్పించాడు. ఆ తర్వాత ఆలీ, ధన్‌రాజ్‌, శ‌ర‌త్ లోహితాస్య‌, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ వారి పరిధిమేరకు మెప్పించారు. సినిమాకు సంగీతం, కెమెరామెన్‌ పనితీరు మరోక బలం అయ్యాయి. బడ్జెట్‌ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓటీటీలోనే విడుదల చేసింటే మరింత పేరు వచ్చేదేమో..

  • కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా సినిమా నుంచి రాజమ్మ అనే మరో పాట వదిలారు.

    బ్రేకప్‌ సాంగ్‌
    'రాజమ్మ ఇడిసిపోయిందిరో.. రాజమ్మ పొడిసిపోయిందిరో.. నన్నింకా మరిసిపోయిందిరో..' అంటూ హీరో బ్రేకప్‌ సాంగ్‌ పాడుతూ బాధతో స్టెప్పులేస్తున్నాడు. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ చేకూర్చగా రామ్‌ మిరియాల ఆలపించాడు.

    సినిమా
    బ్యాండ్‌ మేళం విషయానికి వస్తే.. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. నిజానికి ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సింది. కానీ దాన్ని పదమూడు రోజులపాటు వాయిదా వేశారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.

     

Sports

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ టైటిల్‌ పోరుకు న్యూజిలాండ్‌,  టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్‌కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.

    ఈ నేపథ్యంలో భారత్‌తో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్‌ బౌలర్‌ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.

    ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో
    కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.

    దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్‌ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్‌ ఫిలిప్స్‌ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్‌ అని అన్నాడు.

    అతడు కూడా మనిషే కదా!
    ‘‘ఇటీవల టీమిండియా సిరీస్‌లో భాగంగా బుమ్రా బౌలింగ్‌లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్‌ బౌలర్‌. వైవిధ్యభరితంగా బౌలింగ్‌ చేస్తాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్‌లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.

    బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. అయితే, అతడి మీద మాకు మంచి రోజు అయ్యేది ఫైనలే ఎందుకు కాకూడదు?’’ అని గ్లెన్‌ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. 

    కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్‌ కివీస్‌తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్‌లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్‌ అయింది. ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్‌ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

    టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా
    టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్‌ టెస్టు మ్యాచ్‌ మొదలైంది. పెర్త్‌లోని WACA స్టేడియం  వేదికగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రతికా రావల్‌ (18) సైతం నిరాశపరిచింది.

    హాఫ్‌ సెంచరీతో రాణించిన జెమీమా
    ఇక మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19) విఫలం కాగా.. లోయర్‌ ఆర్డర్‌లో కశ్వీ గౌతం (34 నాటౌట్‌) మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

    మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్‌ (11), స్నేహ్‌ రాణా (5), సయాలీ సత్‌గరే (7), క్రాంతి గాడ్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్‌ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    అనాబెల్‌కు నాలుగు వికెట్లు
    ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్‌ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్‌ రెండు, ఆష్లే గార్డ్‌నర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    ఇక తొలి రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్‌ (2)ను సయాలీ బౌల్డ్‌ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్‌ (9)ను క్రాంతి గాడ్‌ పెవిలియన్‌కు పంపింది. కెప్టెన్‌ అలెసా హీలీ (13) వికెట్‌ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్‌ పెర్రీ, అనాబెల్‌ పట్టుదలగా నిలబడ్డారు.

    నిలకడగా పెర్రీ, అనాబెల్‌
    శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్‌ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్‌ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్‌ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కంటే ఆసీస్‌ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలి రోజు ఆసీస్‌దే పైచేయి అని చెప్పవచ్చు.   

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • అభిషేక్‌ శర్మ.. తొలిసారి ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).

    విఫలమైనా..
    లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా యాజమాన్యం అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్‌గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ తేలిపోయాడు. తొందరపడి వికెట్‌ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.

    సంజూ మెరుపు ఇన్నింగ్స్‌
    మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్‌ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వైఖరిని తప్పుబట్టాడు.

    తలతిక్క బ్యాటింగ్‌
    ‘‘ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్‌ చేశాడు. నిజానికి అభిషేక్‌ గేమ్‌ప్లాన్‌కు నేను వీరాభిమానిని. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.

    నీకంత దూకుడు ఎందుకు?
    కొన్నిసార్లు బాల్‌ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్‌ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్‌ తీసి మరో ఎండ్‌కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్‌ అభిషేక్‌పై మండిపడ్డాడు.

    అదే విధంగా.. న్యూజిలాండ్‌తో ఫైనల్‌ నేపథ్యంలో.. ‘‘అభిషేక్‌ మంచి బ్యాటర్‌. న్యూజిలాండ్‌తో ఇటీవలి సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌ కనబరిచాడు. మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ బౌలింగ్‌లో గతంలో అదరగొట్టాడు.

    ఒత్తిడిలో ఉన్నాడు
    అయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.

    ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్‌మెంట్‌ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. 

    కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌.. అభిషేక్‌ కోసం లెగ్‌సైడ్‌లో ఒకే ఒక్క ఫీల్డర్‌ను ఉంచాడు. అతడికి క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ పెవిలియన్‌ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య టీ20 ప్రంచకప్‌-2026 ఫైనల్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత్‌ ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.

    ఈ క్రమంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.

    అంపైర్లు వీరే..
    టీమిండియా- కివీస్‌ (IND vs NZ Final) మధ్య టైటిల్‌ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్‌ అంపైర్లుగా రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.

    ఆ రెండుసార్లూ గెలిచినా..
    ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్‌లలో అంపైర్‌గా పని చేసిన అనుభవం ఇల్లింగ్‌వర్త్‌కు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో ఆయనే అంపైర్‌.

    అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్‌ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.

    ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదే
    అయితే, 2024లో వెస్టిండీస్‌ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్‌ (ఇల్లింగ్‌వర్త్‌), అదే వేదిక (అహ్మదాబాద్‌)పై ఫైనల్‌ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.

    టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌- న్యూజిలాండ్‌ ఫైనల్‌కు అంపైర్లు వీరే
    👉ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు- రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, అలెక్స్‌ వార్ఫ్‌
    👉థర్డ్‌ అంపైర్‌- అల్లాఉద్దీన్‌ పలేకర్‌
    👉ఫోర్త్‌ అంపైర్‌- అడ్రియాన్‌ హోల్డ్‌స్టక్‌
    👉మ్యాచ్‌ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్‌.

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్‌ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.

    టైటిల్‌ పోరుకు అర్హత
    టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

    ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 89) బ్యాట్‌తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ చిచ్చర పిడుగు జేకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్‌ చూపించాడు.

    కీలక సమయంలో రాణించి
    పద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్‌ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్‌. టీమిండియాలో ఇలాంటి బౌలర్‌ను చూడటం అరుదు.

    సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు
    యార్కర్లు, స్లో బాల్స్‌ వేస్తాడు.. అవుట్‌ స్వింగ్‌, ఇన్‌స్వింగ్‌ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్‌కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాల్సింది.

    ఈ పిచ్‌పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్‌ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్‌ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు.

    అక్షర్‌ పటేల్‌ సైతం
    కాగా ఈ మ్యాచ్‌లో సంజూకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. మరోవైపు.. అక్షర్‌ పటేల్‌ అద్భుతమైన క్యాచ్‌లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీస్‌ మ్యాచ్‌ గురువారం జరిగిన విషయం తెలిసిందే.

    సంజూ భారీ అర్ధ శతకం
    టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.

    ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్‌ పాండ్యా ఫిల్‌ సాల్ట్‌ (5) రూపంలో తొలి వికెట్‌ దక్కించుకోగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా హ్యారీ బ్రూక్‌ (7)ను అవుట్‌ చేసి కీలక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

    బెతెల్‌ విధ్వంసకర శతకం
    అయితే, జేకబ్‌ బెతెల్‌ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

    ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్‌ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.

    బుమ్రా ఏంటి బుమ్రా?
    ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్‌ బూమ్‌ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.

    బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్‌కప్‌ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్‌ ఫైర్‌ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్‌ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్‌ అభిప్రాయం.

    ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో సూపర్‌-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్‌ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్‌ మధ్యలో లేజర్‌ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.

    చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్‌

  • ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 27 పరుగులు సాధించాడు. తద్వారా తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా 250 పరుగులు మార్కు దాటడంలో సహాయపడ్డాడు.

    రెండు వికెట్లు
    ఇక బంతితోనూ హార్దిక్‌ పాండ్యా రాణించాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5)తో పాటు ప్రమాదకర ఆటగాడు సామ్‌ కర్రాన్‌ (18) వికెట్‌ను కూడా హార్దిక్‌ పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

    ఇదిలా ఉంటే.. ముంబై వేదికగా వాంఖడే మైదానంలో టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు తరలివచ్చిన విషయం తెలిసిందే. అంబానీ కుటుంబంతో పాటు దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు సహా బాలీవుడ్‌ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించారు.

    నీతా అంబానీతో కలిసి
    ఇక హార్దిక్‌ పాండ్యా ప్రేయసి మహీక శర్మ కూడా మరోసారి స్టాండ్స్‌లో సందడి చేసింది. నీతా అంబానీతో కలిసి మహీక ఒకే వరుసలో కూర్చుంది. అయితే, ఆమెతో పాటు హార్దిక్‌ కుమారుడు అగస్త్య ఉండటం విశేషం. తండ్రి బ్యాటింగ్‌ను ఆస్వాదించిన అగస్త్య.. అతడు అవుటైన తీరును మాత్రం తట్టుకోలేకపోయాడు.

    ఆ మాత్రం చూసుకోవా?
    భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి.. విల్‌జాక్స్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా పరుగు పూర్తి చేసి రనౌట్‌ అయ్యాడు. మరో పరుగుకు యత్నిస్తున్న క్రమంలో జేకబ్‌ బెతెల్‌ బంతిని అందుకుని వికెట్ల వైపు త్రో చేయగా.. వికెట్‌ కీపర్‌ బట్లర్‌ పని పూర్తిచేశాడు. 

    దీంతో హార్దిక్‌ అవుటయ్యాడు. ఈ క్రమంలో ఐదేళ్ల అగస్త్య కోపంతో ఊగిపోయాడు. ‘‘ఛ.. అంత బాగా ఆడి.. ఇంత చెత్తగా అవుటయ్యావేంటి నాన్నా.. ఆ మాత్రం చూసుకోవా?’’ అన్నట్లుగా గట్టిగా అరిచినట్లు కనిపించింది.

    ఆమె చేయి పట్టుకుని 
    ఆ సమయంలో మహీక అగస్త్య భుజాలు పట్టుకుని కూల్‌ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం మహీక తనతో పాటు అగస్త్యను తీసుకువెళ్లింది. అగస్త్య ఆమె చేయి పట్టుకుని కారు ఎక్కుతున్న వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

     

    కాగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాంకోవిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు.. ఆమె ద్వారా కుమారుడు అగస్త్య కలిగాడు. అయితే, నటషాకు విడాకులు ఇచ్చిన పాండ్యా ప్రస్తుతం మహీకతో ప్రేమలో ఉన్నాడు. ఇక సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో గెలిచి భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

    చదవండి: T20 WC 2026: ఇంగ్లండ్‌ ఆటగాళ్లను ఆకాశానికెత్తిన సూర్యకుమార్‌

  • ఇంగ్లండ్‌ కల చెదిరింది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో అడుగుపెట్టాలనుకున్న బ్రూక్‌ బృందాన్ని టీమిండియా గట్టి షాకిచ్చింది. ముంబై వేదికగా గురువారం నాటి సెమీ ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

    ఆఖరి వరకు పోరాడినా ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఇక టీమిండియా గెలుపులో అక్షర్‌ పటేల్‌ (Axar Patel)దీ కీలక పాత్రే. సంజూ శాంసన్‌ బ్యాట్‌తో రాణించగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా బంతితో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు అక్షర్‌ అందుకున్న క్యాచ్‌లే గెలుపును టీమిండియా వైపు తిప్పాయి.

    ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (Brendon McCullum) కూడా ఇదే మాట అంటున్నాడు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. అక్షర్‌ అందుకున్న అద్భుత క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాయని పేర్కొన్నాడు. స్కై స్పోర్ట్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ..

    అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని
    ‘‘నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో అక్షర్‌ అందుకున్న ఆ రెండు క్యాచ్‌ల గురించి మాట్లాడాలి. వాంఖడే మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు అంత సులువేమీ కాదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేసింది.

    ముఖ్యంగా అక్షర్‌ అద్భుత రీతిలో క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశాడు. కీలక సమయంలో అతడు రాణించాడు. నిజానికి చాన్నాళ్లుగా వాళ్ల ఫీల్డింగ్‌ అంత గొప్పగా ఏమీ లేదు.. ఈ రోజు మా వాళ్లే ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండే బాగుండేది. ఏదేమైనా వాళ్లకి (టీమిండియా) క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’’ అని మెకల్లమ్‌ చెప్పుకొచ్చాడు.

    అక్షర్‌ ఫీల్డింగ్‌.. భారత్‌ విజయానికి బాటలు
    కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్‌ పటేల్‌ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, కెప్టెన్‌, డేంజరస్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ బుమ్రా బౌలింగ్‌లో బంతిని గాల్లోకి తరలించగా.. పాయింట్‌ నుంచి చాలా దూరం పరిగెత్తి అక్షర్‌ బంతిని అందుకున్నాడు.

    అయితే, అన్నింటికంటే విల్‌ జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్నా పట్టు కోల్పోయినట్లు అనిపించగా.. అక్కడే ఉన్న దూబే వైపు విసరగా అతడు బంతిని క్యాచ్‌ పట్టాడు. ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పిన కీలక క్యాచ్‌లోనూ అక్షర్‌ భాగమయ్యాడు.

    చదవండి: టీమిండియా గెలుపునకు ప్రధాన కారణాలు ఇవే

  • టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్‌ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్‌ మినహాయించి ఒక్క మ్యాచ్‌లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.

    వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్‌తో జరుగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో అభిషేక్‌కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతుంది. మేనేజ్‌మెంట్‌ అభిషేక్‌ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం  వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్‌లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

    క్లిష్ట సమయంలో మేనేజ్‌మెంట్‌తో పాటు సహచరులు, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిషేక్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్‌పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్‌గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్‌ తిరిగి వస్తుంది. ఫైనల్‌ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.

    వాస్తవానికి అభిషేక్‌ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్‌ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్‌ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. 

    పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్‌లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్‌ భారత క్రికెట్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.

    ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ ప్రదర్శనలు..
    యూఎస్‌ఏపై 0 (1)
    నమీబియాపై ఆడలేదు
    పాకిస్తాన్‌పై 0 (4)
    నెదర్లాండ్స్‌పై 0 (3)
    సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్‌)
    జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)
    వెస్టిండీస్‌పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)
    ఇంగ్లండ్‌పై 9  (7 బంతులు; 2 ఫోర్లు)

    కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్స్‌కు చేరాయి. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను.. భారత్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమర​​ం మార్చి 8న అహ్మదా​బాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం​ వేదికగా జరుగనుంది.

     

     

Business

  • భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడానికి ఎప్పుడూ ఇతర దేశాల అనుమతిపై ఆధారపడలేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ, భారతదేశం తన జాతీయ ప్రయోజనాల ప్రకారం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

    భారతదేశం ప్రపంచంలో పెద్ద చమురు వినియోగ దేశాలలో ఒకటి. దేశంలో ఉత్పత్తి అయ్యే చమురు పరిమితంగా ఉండటంతో, ఎక్కువ భాగం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే భారత్ వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి.

    కొన్ని సందర్భాల్లో యూనిటెడ్ స్టేట్స్ ప్రభుత్వం.. రష్యాపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ భారతదేశం తన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఇటీవల అమెరికా భారతీయ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోలు చేయడానికి 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ మినహాయింపు భారతదేశ విధానాన్ని నిర్ణయించేది కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కేవలం వాణిజ్యంలో ఉన్న కొంత ఇబ్బందిని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

  • పబ్లిక్‌ ఇష్యూ ప్రయత్నాల్లో ఉన్న ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే సుమారు 1.05 బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం కంపెనీ సుమారు 9-10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 75,000 – రూ. 87,000 కోట్లు) వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించినట్లు అవుతుందని పేర్కొన్నాయి.

    మూడేళ్ల క్రితం కంపెనీ 100 మిలియన్‌ డాలర్లు సమీకరించినప్పటి 12 బిలియన్‌ డాలర్ల విలువతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ కావడం గమనార్హం. అయితే వేల్యుయేషన్‌ తగ్గినా కూడా పేటీఎం ఐపీవో తర్వాత ఫోన్‌పే ఇష్యూ రెండో అతి పెద్ద ఐపీవోగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    పేటీఎం 20 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) వేల్యుయేషన్‌తో 2021 నవంబర్‌లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫోన్‌పే ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉండనుంది. కంపెనీలో వాటాదారులైన వాల్‌మార్ట్, టైగర్‌ గ్లోబల్, మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ వాటాలు విక్రయించనున్నాయి. ఐపీవోతో మైక్రోసాఫ్ట్, టైగర్‌ గ్లోబల్‌ పూర్తిగా ని్రష్కమించే యోచనలో ఉన్నాయి.

  • మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.

    చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.

    అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

  • పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థకు సమీప కాలంలో సవాళ్లు ఎదురుకావొచ్చని.. దీర్ఘకాల వృద్ధికి ఎలాంటి విఘాతం ఉండదని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో జీడీపీని అధిక వృద్ధి క్రమంలో నడిపించేందుకు వీలుగా ద్రవ్య, పరపతి విధానాల మధ్య సమన్వయం అవసరమన్నారు.

    ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు పెరుగుదల, ఎగుమతులకు ఆటంకాలు, గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు రెమిటెన్స్‌లు (నగదు బదిలీ) వృద్ధికి తక్షణ ప్రధాన సవాళ్లుగా గుర్తించినట్టు చెప్పారు. పశి్చమాసియా ప్రాంతంతో ప్రపంచానికి ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్న దృష్ట్యా ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. ఇదే జరిగి, ఇరాన్‌పై ఆంక్షలు తొలగిపోతే చౌక చమురు సరఫరాల ద్వారా భారత్‌ ప్రయోజనం పొందుతుందని నగేష్‌ చెప్పారు.

    చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్క్లను అధిగమించొచ్చని పేర్కొన్నారు. వెనెజులా చమురు నిల్వలను భారత్‌కు తెరవడం సాయపడుతుందన్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందన్నారు. బలమైన అవకాశాలు, నియంత్రణలోనే ద్రవ్యోల్బణం భారత్‌ దీర్ఘకాలం పాటు మెరుగైన వృద్ధిని కొనసాగించే సానుకూల స్థితిలో ఉన్నట్టు చెప్పారు. 7 శాతం నుంచి 8 శాతానికి వృద్ధి రేటు మెరుగుపడేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.

  • బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని పాలి హిల్‌లో ఉన్న తన ప్లాట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది.

    ప్రీతి జింటా 2025 నవంబర్‌లో అదే భవనంలోని (రుస్తోంజీ పరిశ్రమ్ భవనం) 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14 కోట్ల కంటే ఎక్కువ ధరకు విక్రయించింది. ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే రెండో ప్లాట్‌ విక్రయించడం విశేషం.

    ఇప్పుడు ప్రీతి జింటా విక్రయించిన ప్లాట్‌కు సంబంధించిన ఒప్పందం.. 2026 మార్చి 2న నమోదు అయింది. దీనిని అమెరికా పౌరసత్వం కలిగిన భారతీయ మూలాల వ్యక్తులు ప్రియా నగర్ & రాజీవ్ నగర్ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందంలో రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది.

    సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేయడమే కాకుండా.. అవసరమైనప్పుడు విక్రయిస్తున్నారు కూడా. ఇప్పటికే అక్షయ్ కుమార్ 2025లో 100 కోట్లకు పైగా విలువైన అనేక ఆస్తులను విక్రయించారు. అమితాబ్ బచ్చన్ కూడా 2025లో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా ప్రీతి జింటా ఈ జాబితాలో చేరారు.

    ఇదీ చదవండి: ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్‌' విలన్‌

    నవంబర్‌లో విక్రయించిన ప్లాట్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రీతి జింటా మళ్లీ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కోట్ల విలువైన కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

  • మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.

    విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

    ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్‌, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు,  అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.
    ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌!

    సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.

  • అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.

    2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

    ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇంటర్నెట్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం & పనితీరును మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్టార్టప్ రంగంలో పెట్టుబడులు తగ్గడం.. లాభదాయకతపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటూ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.

    మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్లిప్‌కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.

    ఇదిలా ఉండగా.. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్‌కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!

  • ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    రూ.1748 ప్లాన్
    రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌కు యాక్సెస్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్‌ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    రూ.2025 ప్లాన్
    ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.

    రూ.3599 ప్లాన్
    ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్‌, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.

    రూ.3999 ప్లాన్
    రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది.

  • రాంచీ: అధునాతన గ్రేడ్‌ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్‌పూర్‌ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్‌ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు.  

    నెదర్లాండ్స్‌లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్‌పూర్‌లో 1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. హైడ్రోజన్‌ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్‌ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్‌లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ఏడాది కాల గరిష్టానికి పెరగడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు షెషన్‌ చివర్లో గణనీయ నష్టాలను చవిచూశాయి.

    నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 1.27 శాతం లేదా 315.45 పాయింట్ల నష్టంతో 24,450.45 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.37 శాతం లేదా 1,097 పాయింట్లు నష్టపోయి 78,918.90 వద్ద ముగిసింది.

    యూఎస్-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున హోర్ముజ్ జలసంధి షిప్పింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది సరఫరా అంతరాయం భయానికి ఆజ్యం పోసింది. దీంతో యూరోపియన్ వాణిజ్య సెషన్ లో బ్రెంట్ క్రూడ్ ను బ్యారెల్ కు 87 డాలర్ల మార్కుకు పైగా నెట్టింది.

    నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.69 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.24 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.27 శాతం క్షీణతతో అత్యంత చెత్త పనితీరు కనబరిచిన సూచీగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్‌లో నష్టపోయిన ఇతర రంగాలు. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ స్వల్ప లాభాలతో సెక్టోరల్ సూచీలను అధిగమించింది.

  • భారతదేశంలోని ప్రముఖ రియల్ఎ స్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్, హైదరాబాద్‌లోని మెడ్చల్ ప్రాంతంలో 'కాసాగ్రాండ్ క్రెస్ట్‌వుడ్‌' పేరుతో ఒక అతి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీని అధికారికంగా ప్రారంభించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో మొత్తం 130 అత్యున్నత స్థాయి 5 బీహెచ్‌కే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాల ప్రారంభ ధర రూ. 2.99 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.

    అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ విల్లాలు విశాలమైన నివాస విస్తీర్ణంతో పాటు ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసే సదుపాయం, ప్రత్యేక లిఫ్ట్ ప్రొవిజన్, విస్తృత ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్, 1,200 చదరపు అడుగుల వరకు వ్యక్తిగత తోట స్థలం & సుమారు 375 చదరపు అడుగుల బ్యాక్‌యార్డ్‌ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ప్రతి విల్లా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో రూపొందించారు.

    ఈ ప్రాజెక్ట్‌లో 55కి పైగా ఇండోర్ & అవుట్‌డోర్ లైఫ్‌స్టైల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న G+3 క్లబ్‌హౌస్‌, రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, యోగా స్టూడియో, పిల్లల ఆట స్థలాలు, మల్టీ పర్పస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, సీనియర్ సిటిజన్ జోన్, రిఫ్లెక్సాలజీ వాక్వే వంటి అనేక సౌకర్యాలు నివాసితులకు ఆరోగ్యకరమైన & సమతుల్య జీవన శైలిని అందించడానికి రూపుదిద్దుకున్నాయి.

    మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో సుమారు 67% భాగాన్ని ఓపెన్ స్పేస్ & ల్యాండ్ స్కేపింగ్ కోసం కేటాయించడం ద్వారా ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఫెంగ్ షుయ్ ప్రేరణతో రూపొందించిన ఉద్యానవనాలు, ప్రత్యేక థీమ్ గార్డెన్లు & విస్తృత హరిత ప్రదేశాలు నివాసితులకు ప్రశాంతత, గోప్యతను కల్పిస్తాయి.

    ఇంటీరియర్ రూపకల్పనలో 9’10” ఎత్తైన సీలింగ్స్, విస్తృత గాజు స్లైడింగ్ డోర్స్, సమృద్ధిగా సహజ కాంతి & గాలి ప్రసరణకు అనుకూలమైన ప్రణాళిక, వాక్-ఇన్ వార్డ్‌రోబ్‌లతో కూడిన సూట్-సైజ్ బెడ్రూమ్స్ మరియు విశాలమైన మాడ్యులర్ వంటగదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతివిల్లాకు 100% పవర్‌బ్యాకప్ సదుపాయం కల్పించారు.

    మెడ్చల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో ఉండటం వలన హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఐటీకారిడార్లు, పరిశ్రమల కేంద్రాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవా సంస్థలు & వినోద ప్రదేశాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, జీనోమ్ వ్యాలీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం దీని విలువను మరింత పెంచుతుంది.

    అదనంగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు & రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కూడా ఇది అత్యుత్తమ అవకాశంగా భావిస్తున్నారు.

  • ఎలక్ట్రిక్‌ వాహనాల దిగ్గజం టెస్లాకు ప్రిఫర్డ్‌ ఫైనాన్సర్‌గా వ్యవహరించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా టెస్లా కస్టమర్లకు ప్రత్యేక రుణ సదుపాయాలను అందించనున్నట్లు వివరించింది. ప్రధాన నగరాలు, వర్ధమాన ఈవీ హబ్‌లలో డిజిటల్‌ ఫైనాన్సింగ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

    ప్రీమియం ఈవీ కొనుగోలుదారుల కోసం అనువైన రీపేమెంట్‌ పథకాలు, గరిష్టంగా 10 ఏళ్ల రుణ వ్యవధి, డిజిటల్‌ ఆన్‌బోర్డింగ్‌ మొదలైన సౌకర్యాలతో రుణాలను అందించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఈడీ మునీష్‌ శర్దా తెలిపారు.

    ఈ భాగస్వామ్యంతో టెస్లా వాహనాల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి. కస్టమర్లు డీలర్‌షిప్‌ల వద్దే లేదా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తక్షణ రుణ ఆమోదం పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడంతో పాటు ఈవీ మార్కెట్‌ విస్తరణకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

  • రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సినీతారలు ఎప్పటికప్పుడు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. బాబీ డియోల్, ఆయన భార్య తానియా డియోల్ ముంబైలోని అంధేరీలో 3,400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఐదు కమర్షియల్ ఆఫీసులను కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.15.05 కోట్లు అని తెలుస్తోంది.

    బాబీ డియోల్ దంపతులు కొనుగోలు చేసిన ఐదు కమర్షియల్ ఆఫీసులు.. అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్‌లో ఉన్న యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2 రెండవ అంతస్తులో ఉన్నాయి. అదే భవనంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, చిత్రనిర్మాత రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్‌తో సహా రోషన్ కుటుంబ సభ్యులకు చెందిన అనేక ఆఫీస్ యూనిట్లు కూడా ఉన్నాయి.

    సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన అష్టి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. లావాదేవీ ఫిబ్రవరి 27, 2026న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి రూ. 90 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీతో పాటు దాదాపు రూ.1.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 2027 డిసెంబర్ నాటికి బాబీ డియోల్ దంపతులు స్వాధీనం చేసుకోనున్నారు. ఐదు కార్ల పార్కింగ్ స్థలాలతో పాటు.. ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.

    ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

  • ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మూడోసారి చేసిన వియత్నాం పర్యటన సందర్భంగా తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వియత్నాం యుద్ధం (Vietnam War) తర్వాత ఆయన చేసిన ఈ పర్యటనలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాసుకొచ్చారు.

    అయితే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సహ పైలట్లు, సహాధ్యాయుల జ్ఞాపకాలు తాను మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేసిన కియోసాకి, యుద్ధం వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే తాను మళ్లీ మళ్లీ వియత్నాంకు వెళ్తున్నానని తెలిపారు. “నిజాన్ని ఎంత ఎక్కువగా వెతుకుతానో, అది అబద్ధాల కింద దాగి ఉందనే విషయం అంతగా అర్థమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

    యుద్ధాలు తరచుగా ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతాయని కియోసాకి తన పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో యుద్ధాలు నడుస్తాయని, అయితే యువత, వారి కుటుంబాలే ప్రాణ నష్టాన్ని భరిస్తారని ఆయన పేర్కొన్నారు. వియత్నాం యుద్ధం కూడా చమురు ప్రయోజనాల కోసం జరిగిందని ఆయన అభిప్రాయపడుతూ, ప్రస్తుతం ఇరాన్‌ (Iran War) చుట్టూ జరుగుతున్న ఉద్రిక్తతలతో పోల్చారు.

    ఇదే సందర్భంలో, యుద్ధాల వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే ఎంపైర్‌ ఆఫ్‌ లైస్‌ (Empire of Lies) అనే పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. నిజాలను తెలుసుకోవాలనుకునే వారు ఇలాంటి పుస్తకాలను చదవాలని ఆయన పిలుపునిచ్చారు.

    సాంప్రదాయ విద్యా వ్యవస్థపై కూడా కియోసాకి ప్రశ్నలు లేవనెత్తారు. పాఠశాలల్లో సరైన ఆర్థిక విద్య అందకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక వ్యవస్థల నిజాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

    “నిజాన్ని వెతికే వ్యక్తులుగా మారండి, అబద్ధాల వల్ల మోసపోయే బాధితులుగా కాకండి” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.

National

  • బెంగళూరు: మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  మద్యం పాలసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం ధరలపై ప్రభుత్వ  నియంత్రణను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల నిర్ణయాన్ని లిక్కర్‌ కంపెనీలే నిర్ణయించేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు  2026-27 బడ్జెట్‌లో మద్యం పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కారు. 

    ఏప్రిల్1 వ తేదీ నుండి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి,  లిక్కర్‌ కంపెనీలే ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. ఆరు దశాబ్దాల నుంచి ఉన్న మద్యం ధరల నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. 

    దీంతో డిస్టిలరీలు మరియు బ్రూవరీస్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించుకోవచ్చు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది.   మరొకవైపు ఆల్కహాల్‌ శాతం ఆధారంగా ఎక్సైజ్‌ సుంకం ఉండనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరగడమే కాకుండా, పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

  • బిగ్‌బీ అమితాబ్ బచ్చన్  విలువైన  ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ అయోధ్యలో 2.67 ఎకరాల భూమిని రూ. 35 కోట్లకు దక్కించుకున్నారు. అయోధ్యలో  అత్యంత  ప్రతిష్టాత్మకంగా రామ జన్మ భూమి  ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు భారీగా ఉన్నాయి.

    ఈ ప్లాట్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని HoABL హౌస్ ఆఫ్ అభినందన్‌లో ఉంది. ఇక్కడే బచ్చన్ మరో రెండు ప్లాట్‌లను కలిగి  ఉండటం విశేషం.  HoABL  ప్రకటన ప్రకారం, ఈ అమ్మకాన్ని బచ్చన్ కుటుంబ యాజమాన్యంలోని సంస్థ AB Corp ప్రతినిధి నిర్వహించారు. HoABL తో బచ్చన్ చేసిన నాల్గవ కొనుగోలు ఇది, మహారాష్ట్రలోని అలీబాగ్ సముద్ర రిసార్ట్‌లో  సోల్ దే అలీబాగ్ ప్రాజెక్ట్‌లో అమితాబ్‌కు ఒక స్థలం ఉంది. భూమిపై పెట్టుబడుల తరతరాల విశ్వాసాన్ని బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందనీ, అయోధ్యపై విశ్వాసం అనేది తరతరాలుగా పంచుకున్న వారసత్వం  అన్నారు. HoABLలో, భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తామని HoABL చైర్మన్ అభినందన్ లోధా వ్యాఖ్యానించారు. 

    ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

    కాగా ఆయోల్య ఆలయ నిర్మాణం, అలాగే విశాలమైన రోడ్లు, మెరుగైన రైల్వే స్టేషన్లు మరియు కనెక్షన్లు మరియు నగరానికి ప్రత్యేక విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత అయోధ్యలో భూమి ధరలు గణనీయంగా పెరిగాయి. HoABL, తదితర స్థానిక డెవలపర్లు, ప్రాజెక్టులతో పాటు రానున్న రోజుల్లో టూరిజం అభివృద్ధిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే పర్యాటకుల  రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు కల్పించడానికి హోటళ్ళు,రిసార్ట్‌లను కూడా నిర్మిస్తున్నారు. HoABL ప్రస్తుత ప్రాజెక్ట్, సరయులో, బ్రూక్‌ఫీల్డ్ యాజమాన్యంలోని హోటల్ చైన్ ది లీలా ప్యాలెస్‌లు, హోటల్స్ , రిసార్ట్స్ నిర్వహించే హోటల్ కూడా ఉంది.

    ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్‌ తప్పదా? వైరల్‌ వీడియో
    (రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)


     

  • పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో పెట్రోల్‌,డీజిల్‌ రేట్లు భారీగా పెరుగుతాయనే ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు,  ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య  ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయంతో, అనేక దేశాలలో ఇంధన ధరల పెరుగుదలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ నుండి చమురు దిగుమతి చేసుకునే భారతదేశంపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ  క్రమంలో ముందస్తు  జాగ్రత్తగా  పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి డీజిల్‌ను నిల్వ చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట  వైరల్‌గా మారింది.

    ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం  పంజాబ్ కు చెందిన ఒక వ్యక్తి 1,000 లీటర్ల నీటి ట్యాంక్ లో డీజిల్ నింపుతున్నారు. ఇరాన్‌ వార్‌ కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయని ఆశించి తానీ  నిర్ణయం తీసుకున్నానని  పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

    ఒక వినియోగదారుడు, “బ్రో తన నీటి ట్యాంక్‌ను ప్రైవేట్ పెట్రోల్ పంపుగా మార్చాడు  అని  చమత్కరించగా“, మీరు చెప్పింది పూర్తిగా నిజమే, భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. సోదరుడు సరిగ్గా అర్థం చేసుకున్నాడు” అని  మరొకరు కామెంట్‌ చేశారు. మనం మధ్యప్రాచ్యంపై ఎంతగా ఆధార పడుతున్నామో  దీన్ని బట్టి తెలుస్తోంది.  గల్ఫ్‌లో ఒక వివాదంతో పంజాబ్‌లోని ప్రజలు ఇంధనంతో నీటి ట్యాంకులను నింపుతున్నారు. ఈ ఆందోళనలకు చెక్‌పెట్టడానికే ఇండియా 30 రోజుల రష్యన్ చమురు మినహాయింపు కోసం ఒత్తిడి చేస్తోంది  అన్నారు మరో యూజర్‌.

    (రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)

    ఇలా ఈ వైరల్ వీడియోకు వేలాది అభిప్రాయాలు , చలోక్తులతోపాటు, ఇంధన భద్రత, ప్రపంచ రాజకీయాలు, పెరుగుతున్నఇంధన ఖర్చుల గురించి అంతర్లీనంగా ఉన్నఆందోళనలను కూడా ప్రతిబింబించడం గమనార్హం. దేశ ప్రజల్లో చాలామందిలో ఇదే ఆందోళన కనిపిస్తోంది. అటు రేట్లు పెరిగిపోతాయనే ఆందోళనతో ఎల్‌పీజీ సిలిండర్లను కూడా ముందుగానే బుక్‌ చేసుకుంటున్న దాఖలాలు  కూడా కనిపిస్తున్నాయి. 

    ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

  • యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025 ఫలితాల్లో జిన్నియా అరోరా (Zinnia Aurora)   టాప్‌ టెన్‌లో స్థానం సంపాదించి  ఘన విజయం సాధించింది. శుక్రవారం (మార్చి 6, 2026) విడుదలైన ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. జిన్నియా అరోరా గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు:

    UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా మందికల. కానీ కొంతమంది మాత్రమే పట్టుదలతో తమ కలను సాకారం చేసుకుంటారు.  తొలి ప్రయత్నంలో  మెరుగైన ర్యాంక్ రాకపోవడంతో ఈ సారి ఆలిండియా 6వ ర్యాంకు (AIR 6). రోల్ నంబర్: 6410067. ఆమె గతంలో (UPSC 2024) 156వ ర్యాంకు సాధించారు. తన ర్యాంకును మెరుగుపరుచు కోవాలనే పట్టుదలతో మళ్ళీ పరీక్ష రాసి, ఈ సారి టాప్ 10లో నిలిచారు. అరోరా తన విజయం ద్వారా ఎంతో మంది సివిల్స్ ఆశావహులకు స్ఫూర్తిగా నిలిచారు.

    ఎవరీ జిన్నియా అరోరా 
    జిన్నియా అరోరా హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఆమె కుటుంబం ప్రస్తుతం న్యూ ఢిల్లీలో స్థిరపడింది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉండటంతో ఆమె పెరిగింది, చదువుకుంది అంతా ప్రధానంగా ఢిల్లీలోనే సాగింది. తండ్రి పంకజ్ అరోరా (Pankaj Aurora), ఈయన కూడా సివిల్ సర్వెంట్. తల్లి రీతూ అరోరా (Ritu Aurora).తన తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన జిన్నియా, చిన్నప్పటి నుండే ఐఏఎస్ (IAS) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    జిన్నియా పాఠశాల విద్య ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్కృతి స్కూల్ (Sanskriti School)లో పూర్తి చేశారు. 2018-19 బ్యాచ్‌కు గానూ పాఠశాల టాపర్‌గా నిలిచారు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ వైపు మొగ్గు చూపారు. సివిల్స్‌లో జిన్నియా తన ఎంపికగా పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ (PSIR)ను ఎంచుకుని విజయం సాధించింది.

    PeaceX  కో ఫౌండర్‌ 
    జిన్నియా పీస్ఎక్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. 2020లో కోవిడ్ సమయంలో ఆమె PeaceX అనే స్వచ్ఛంద సంస్థ (NGO)తో కలిసి పనిచేశారు. ఇది ఐక్యరాజ్యసమితి (UN),వివిధ ప్రభుత్వాలతో కలిసి పనిచేసే సంస్థ. ఆమె తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆమెకు అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం, సామాజిక మార్పులపై మంచి అవగాహన ఉంది.

    ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

  • మావోయిస్టులపై కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ కగార్‌ పేరుతో నక్సలైట్లపై పెద్దఎత్తున కేంద్ర బలగాలు విరుచుకపడుతున్న సంగతి తెలిసిందే. శరణమా.. రణమా అంటూ వారిపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 31 (మార్చి) వరకూ భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా లేకుండా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

    కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన చాలా మంది అగ్రనేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొంతమంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు. దీంతో దేశంలో ఆ పార్టీ దాదాపు కనుమరుగైనట్లేనని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి అమిత్‌షా ఈ అంశంపై స్పందించారు.

    ఒడిశాలోని CISF కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ" మార్చి 31 వరకూ దేశంలో ఎట్టిపరిస్థితుల్లో మావోయిజాన్ని అంతం చేస్తాం" అని అన్నారు. అయితే గతంలోనే ఇవే వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా తాజాగా దానికే కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. అయితే ఇప్పటికే  నక్సల్స్‌పై కేంద్ర బలగాలు దాడులు తీవ్రతరం చేశాయి. ఆపరేషన్ కగార్‌ పేరుతో కాల్పులు జరుపుతున్నాయి. 

     

  • పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నితీశ్‌ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. పట్నాలోని జేడీయూ పార్టీ కార్యాలయం ఎదుట పోస్టర్లు పెట్టి మరీ నితీశ్‌ కుమార్‌కు కార్యకర్తలు విజ్ఞప్తులు చేశారు. 

    ఎన్నికల‍్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని తక్కువ చేయడాన్ని ఇక సహించబోమని పేర్కొన్నారు. ఇన్నాళ్లు నితీశ్‌ కుమార్‌కు మద్దతు తెలిపిన వారే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్లు సైతం పెడుతుండడం గమనార్హం.  

    కాగా, నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆ సమయంలో ఆయన వెంటే ఉన్నారు. బిహార్‌లో బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విప‍క్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. 

    బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. నితీశ్‌పై బీజేపీ కుయుక్తులు చేసిందని, ‘2025 సే 30 ఫిర్ సే నితీశ్‌’ అనే ఎన్నికల నినాదానికి విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. నితీశ్‌ సీఎం కుర్చీలో 6 నెలలకంటే ఎక్కువ ఉండరని తాము ముందే చెప్పామని అన్నారు.

    మరోవైపు, నితీశ్‌ కుమార్‌ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆయన సీఎంగా పదవిలో ఉన్న కాలాన్ని బిహార్‌ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు. ఎన్నో పదవుల్లో నితీశ్‌ కుమార్‌ సుదీర్ఘ రాజకీయ జీవితం కొనసాగించినా ఆయనపై ఏ మచ్చా పడలేదని అమిత్‌ షా అన్నారు.
     

  • న్యూఢిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సీఎస్‌సీ(Union Public Service Commission Civil Services Examination)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్‌ అగ్ని హోత్రి మొదటి ర్యాంకు సాధించింది. సివిల్స్‌ ఫలితాల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

    ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ మే 25, 2025న ప్రిలిమ్స్ పరీక్షతో ప్రారంభమై, ఆగస్టు 2025లో జరిగిన మెయిన్స్ పరీక్షల ద్వారా కొనసాగింది. చివరగా ఫిబ్రవరి 27, 2026న ఇంటర్వ్యూలు విజయవంతంగా ముగిశాయి.  మొత్తం 979  భర్తీ చేసే స్థానాల్లో  ఐఏఎస్‌,  ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ సర్వీసులతో పాటు  గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బీ  సర్వీసులు ఉన్నాయి.

     యూపీఎస్సీ  సివిల్స్ ఫలితాల వివరాలు

    • అనూజ్‌ అగ్నిహోత్రికి మెదటిర్యాంకు
    • రాజేశ్వరి సువేకు రెండవ ర్యాంకు
    • ఆకాన్ష్ ధుల్ 3వ ర్యాంకు
    • రాఘవ్ ఝన్‌ఝన్‌ వాలాకు నాలుగవ ర్యాంకు
    • ఇషాన్ భట్రాగర్‌కు 5వ ర్యాంకు
    • జినియా అరోరా 6వ ర్యాంకు
    • రజా మెుహియుద్దీన్ 7వర్యాంకు
    • పక్షల్ సెక్రటరీ 8వ ర్యాంకు
    • ఆస్థా జైన్ 9వ ర్యాంకు
    • ఉజ్జ్వల్ ప్రియాంక్ 10వ ర్యాంకు
    • సృజన 55వ ర్యాంకు
    • శ్రీ కృష్ణసాయి 150 ర్యాంకు
    • డీఎస్‌కే ప్రచేత్‌ 193
    • వర్షిత్ రెడ్డి 259 ర్యాంకు
    • పవన్‌ రెడ్డి 297
    • హర్షిత 520 ర్యాంకు
    • శ్వేత 573 ర్యాంకు
    • ప్రమోద్ విష్ణు 640 ర్యాంకు
    • విజయ సింహరెడ్డి 682 ర్యాంకు
    • పి భార్గవ్ 738 ర్యాంకు
    • పి. రాహుల్ 748 ర్యాంకు 
  • న్యూఢిల్లీ: ‘జెన్-జీ’ ఉద్యమంతో గత సంవత్సరం నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆ తరువాత సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జెన్‌-జీ ఉద్యమం తర్వాత.. నేపాల్‌లో గురువారం జరిగిన ఎన్నికలు ఆ దేశ భవిష్యత్తుకు ఎంతో కీలకం. అలాగే, ఈ ఎన్నికలు భారత్‌కు కూడా కీలకంగా మారాయి. ఎన్నికల ఫలితాలను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది. భౌగోళికంగా, చరిత్ర, సంస్కృతి, ఆర్థిక పరంగా నేపాల్‌తో భారత్‌కు సత్సంబంధాలు చాలా ముఖ్యం.

    జాగ్రత్తగా వ్యవహరించిన భారత్‌
    భారత్-నేపాల్ సంబంధాల‍్లో కొన్ని సంవత్సరాలుగా అనేక సంక్లిష్ట పరిస్థితులను చూస్తున్నాం. ముఖ్యంగా 2025లో రాజకీయ పరంగా అశాంతి నెలకొంది. కొన్ని నెలల ముందు నేపాల్‌లో తీవ్ర అస్థిరత చోటుచేసుకుంది. అవినీతి, నిరుద్యోగం, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకంగా 2025 సెప్టెంబర్‌లో నేపాల్‌ వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది.

    నేపాల్‌ ఆర్థికంగా కుదేలవుతుండడం, రాజకీయ వర్గాల్లో బంధుప్రీతి ఉందనే  అంశం యువతలో ఆగ్రహాన్ని పెంచాయి. ఆ అసంతృప్తిని జెన్‌ జీ నిరసనలు ప్రతిబింబించాయి. ఈ ఎన్నికల ముందు నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా నేపాల్‌ పట్ల భారత్ జాగ్రత్తగా దౌత్య విధానాన్ని అనుసరించింది. స్థిర ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాన కార్యక్రమాలను నిలిపివేసింది.

    భారత్-నేపాల్ ఉద్రిక్తతలకు కారణాలు 
    భారత్-నేపాల్ సంబంధాల్లో పెద్ద సమస్యల్లో ఒకటి కలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై సరిహద్దు వివాదం. ఇవి భారత్‌లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా పరిపాలనలో ఉన్నాయి. 2020లో నేపాల్ విడుదల చేసిన రాజకీయ పటంలో ఈ ప్రాంతాలను తన భూభాగంగా చూపింది.

    తాజాగా 2025 నవంబర్‌లో లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన పటంలో చూపించిన కొత్త ఎన్‌పీఆర్‌ 100 నోటును విడుదల చేయాలని నేపాల్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా విమర్శించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఈ తీరును ఏకపక్ష చర్యగా పేర్కొంది. భూమి గురించిన వాస్తవాలను ఇది మార్చదని తెలిపింది.

    ‘బిగ్ బ్రదర్ ధోరణి’ ఆరోపణ 
    నేపాల్‌లో అంతర్గతంగా రాజకీయాల్లో పోటీ నెలకొంటే జాతీయవాద వాదనలు తరచూ వినిపిస్తాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలలో ఈ ధోరణి బలంగా ఉంటుంది. కొంతమంది నేతలు నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు కొంతమంది ఓటర్లలో మద్దతు ఉంది. మరోవైపు, నేపాల్ రాజకీయ వర్గాల్లో చాలా మంది భారత్ “బిగ్ బ్రదర్” ధోరణి చూపుతుందని భావిస్తున్నారు.

    లిపులేఖ్: చైనాతో వాణిజ్యం వేళ
    భారత్‌-చైనా వాణిజ్యం ‘లిపులేఖ్’ మార్గం ద్వారా పునఃప్రారంభమైనప్పుడు ( 2025 ఆగస్టులో) నేపాల్‌ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నేపాల్‌ ఈ ప్రాంతాన్ని తన భూభాగమని ప్రకటించి, భారత్‌-చైనా ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. లిపులేఖ్, లింపియాధురా, కలాపాని ప్రాంతాలను తన సార్వభౌమ భూభాగమని  నేపాల్‌ ప్రకటించింది.
     
    లిపులేఖ్ మార్గం ద్వారా భారత్-చైనా మధ్య వాణిజ్యం పునఃప్రారంభం కావడంపై నేపాల్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. నేపాల్ రాజ్యాంగంలో ఉన్న అధికారిక పటంలో లింపియాధురా, లిపులేఖ్, కలాపాని ప్రాంతాలు నేపాల్ అంతర్భాగంగా చూపించడం సరికాదని చెప్పింది.

    కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక? 
    నేపాల్‌లో జెన్‌-జీ ఉద్యమానికి ముందు భారత్‌-నేపాల్‌ మధ్య సత్సబంధాలు దెబ్బతిన్నాయి. నేపాల్‌ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షాను నిలిపింది. ఆయన జెన్‌-జీ ఉద్యమంలో పనిచేసిన నేత. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ద్వారా తెలుస్తోంది. నేపాల్‌ కొత్త ప్రభుత్వం భారత్‌లో మళ్లీ సత్సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

International

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మరణంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగింది. అయితే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌పై అటాక్ కోసం ఇజ్రాయెల్ అత్యాధునిక బ్లూస్పారో క్షిపణిని ప్రయోగించినట్లు పత్రికా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఖమేనీని అంతంచేయడం కోసం ఈ క్షిపణి అంతరిక్షం నుంచి దూసుకొచ్చి లక్షాన్ని భేదించింది.

    ఇరాన్ సుప్రీం లీడర్ హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఒక దేశాధినేతను అతని దేశంలోనే అటాక్ చేసి చంపడం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టాలా చేసింది. అయితే ఈ దాడికి సంబంధించిన ప్లాన్ గతేడాది నవంబర్‌లోనే జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఆయనపై ఈ 2026 మధ్యలో దాడి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ  ఇరాన్‌లోని నిరసనల కారణంగా ప్లాన్‌ ముందుకు జరిగిందని తెలిపారు. అయితే ఖమేనీపై అటాక్‌ చేయడానికి ఇజ్రాయెల్ వాడిని క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా తెలుస్తోంది.

    బ్లూస్పారో ప్రత్యేకత

    బ్లూస్పారోగా పిలిచే ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు 2 వేల కిలోమీటర్లు. దీని పొడవు 6.5 మీటర్లు కాగా బరువు 1.9 టన్నులు శత్రు రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్షాన్ని భేదించడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత. అయితే వేగవంతంగా లక్షాన్ని చేధించడానికి ఇవి తొలుత అంతరిక్షానికి ఎగిరి అక్కడి నుంచి టార్గెట్‌ను ధ్వంసం చేస్తాయి. బ్లూస్పారో రాకను గమనించేలోగే విధ్వంసం చేసేయడం ఈ మిస్సైల్ ప్రత్యేకత  స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

    అయితే దీనిని ఇజ్రాయెల్ ‘అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తుంది. ఎందుకంటే దీనిని ప్రయోగించేటప్పుడు మెుదటగా  ఆకాశం అంచుల వరకూ ఎగురుతుంది అనంతరం తరువాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో టార్గెట్స్‌ను ఛేదించడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత. ఇక ఇరాన్ సుప్రీం ఖమేనీని ఈ క్షిపణి వాడే ఇజ్రాయెల్ అంతం చేసింది.

     

     

  • ఇజ్రాయెల్ మరో భారీ అటాక్ చేసింది. టెహ్రాన్‌ నడిబొడ్డున ఉన్న అత్యంత రహస్యమైన బంకర్‌ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్‌ కోసం 50కి ఫైగా ఫైటర్ జెట్ వాడినట్లు తెలిపింది. అయితే ఈ బంకర్‌ మాజీ సుప్రీం ఆయుతుల్లా ఖమేనీ తలదాచుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆయన మృతితో ప్రస్తుతం ఇతర అధికారులు ఈ బంకర్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

    అయితే ఈ రహస్య స్థావరం నుంచే  ఇరాన్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది.  ఈ బంకర్‌లో ప్రవేశానికి అనేక వీధుల గుండా మార్గాలున్నాయని లోపల ఎన్నో గదులున్నాయంది. దీనిని గుర్తించడానికి ప్రత్యేక నిఘా పెట్టామని పక్కా సమాచారంతోనే దానిపై దాడి చేసినట్లు తెలిపింది. తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది.

    కాగా ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ బంకర్‌నే ప్రధానంగా వాడుతున్నారని సమాచారం.. ఇప్పుడు దానిని ధ్వంసం చేయడంతో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్‌ దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌పైకి పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి.


     

  • బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. 

    చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్‌ల్యాండ్ మీడియా అవుట్‌లెట్ జిన్‌వెన్‌ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు. 

    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు  లియూ  చెప్పాడు.

    (రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌)

    అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్‌. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం  ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు.  1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.
    ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య

  • ఇరాన్‌పై  భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్‌  తగింది.  ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌  (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.

    తాజాగా విడుదలలైన  ఈ పత్రాలు ప్రకారం ఎప్‌స్టీన్‌ ద్వారా ట్రంప్‌కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్‌స్టీన్‌ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడు. 

    ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి  గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు  పలు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆమె ఆరోపించింది.

    రాజకీయ దుమారం
    ఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్‌స్టీన్‌ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.

    అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్‌స్టీన్‌ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్‌పై తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

    ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!

Telangana

  • హైదరాబాద్‌:  నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో అడ్వర్టైజ్‌మెంట్‌ గ్యాస్‌ బెలూన్‌ పేలింది. ఓ  కన్వెన్షన్ లో  హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. 

    దీన్ని  బ్రహ్మకుమారీస్‌ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ​గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

  • సాక్షి, హైదరాబాద్:  సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన  తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగా వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

    యుపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారికి  అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని  అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మెయిన్స్ రాసే విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. 

    అయితే గతేడాది సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు  రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో  51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో  నగదుని  అందజేసింది.

  • హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోందని,  ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్‌మెంట్‌తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. 

    అందుకే ఎన్ని  ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష‌తో 2023 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా ద‌గ్గ‌ర అధికార యంత్రాంగం, అక్ర‌మ సంపాద‌న లేదు..

    చాలా కాలం నుంచి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం న‌లుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి.  ఎలా అయితే సాధించుకోవాల‌న్న త‌ప‌న‌తో కొంద‌రు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, క‌మిష‌న్లు,త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ స‌మ‌స్య‌ను ప్ర‌త్య‌క్షంగా నేను చూస్తూ వ‌స్తున్నాను.  మీరు కోట్లాడిన ప్ర‌తి సంద‌ర్భంలో నా చేత‌నైనా సాయం చేస్తూ వ‌చ్చాను. 

    క్రిష్ణ మాదిగ‌, స‌తీష్ మాదిగ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు చేత‌నైన సాయం చేసి అండ‌గా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు ఆనాటి పాల‌కులు సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, సంప‌త్ కుమార్ తో పాటు న‌న్ను బ‌య‌ట‌కు గెంటివేశారు. నాకు మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడు అనే పాత్ర‌లు ఇష్టం.  కర్ణుడికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు పోరాటం చేశారు.. మిత్ర‌ధ‌ర్మాన్ని నేర‌వేర్చాడు. నేను కూడా మిత్ర‌ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తించాను.. మాదిగ‌ల‌కు నేను అండ‌గా నిల‌బ‌డ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

  • సాక్షి, రంగారెడ్డి: కొందుర్గులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఇతరాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. 

  • తెలంగాణాలో ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ (SIR)కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు  కేంద్ర న్నికల సంఘం (సీఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో SIR తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌కు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 

    ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను, శిక్షణా కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  సిసుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. 

    కాగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దశలవారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. 

Family

  • ఓ గ్రామ నేపథ్యం నుంచి కార్పొరేట్‌ స్థాయి ఉద్యోగం చేయడమే స్ఫూర్తిదాయకం. అందులోనూ వైట్‌కాలర్‌ ఉద్యోగం అంటే చక్కగా హాయిగా ఏ మాత్రం శారీరక శ్రమ పడకుండా ఏసీ గదుల్లో కూర్చొని చేసే జాబ్‌. అలాంటి జాబ్‌ని వద్దనుకుని దేశ సేవలోకి రావడం మాటలు కాదు. పైగా ఆర్మీలో కఠినతరమైన శిక్షణను తట్టుకుని ఏకంగా ఆఫీసర్‌ స్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలిచింది భూటాన్‌కి చెందిన అమ్మాయి. యువతరం అంటే ఎంజాయ్‌మెంట్‌కి, జోష్‌కి కేరాఫ్‌ కాదు..దేశ సేవలో మనము భాగం కావాలి..మన దేశ భవిష్యత్తుకు మనమే రూపకర్తలం అని చాటి చెప్పి..జయహో సృజన అని అనిపించుకుంది

    ఆ అమ్మాయే విదేశాంగ అధికారి క్యాడెట్ సృజన ఘల్లీ. అసలు సాయుధ దళాల కుటుంబ నేపథ్యం కాకపోయినా..ఎప్పుడో చిన్నతనంలో ఒక సైనిక అధికారిని చూసి..మనం కూడా అలాంటి యూనిఫాం ధరిస్తే..అని సరదాగా అనుకుంది. అది ఆమె మనసు అంతరాళంలో ముద్రపడినా..పెద్దయ్యాక అంతగా దాన్ని పట్టించుకోలేదు సృజన. భూటాన్‌లోని సామ్ట్సే అనే గ్రామంలో పుట్టి పెరిగిన సృజన తన కెరీర్‌ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఉన్నత విద్యవైపుగా అడుగులు వేసింది. 

    అలా ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌తో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసి, భూటాన్‌లోని సెలిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలో మరిన్ని ఉన్నత హోదాల్లో పనిచేసే అవకాశం ఉన్నా..దాన్నికాదనుకుని చిన్నతనంలో ఇష్టపడ్డ ఆర్మీయూనిఫాంని ధరించేందుకు ఇష్టపడింది. సౌకర్యవంతమైన కార్పొరేట్‌ లైఫ్‌లో సంతోషం లేదని, వ్యక్తిగత సక్సెస్‌ కన్నా..దేశ సేవలో ఉన్న ఆనందమే వేరు అని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది. 

    అలా ఆమె సాఫ్ట్‌వేర్‌ కెరీర్‌ని వదిలేసి సైనికురాలిగా సేవలందించాలని భావించి..చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె ఫారిన్ ఆఫీసర్ క్యాడెట్‌గా చేరింది. అక్కడ ఆమె జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. తొమ్మిది నెలల కఠిన సైనిక శిక్షణలో ఆహోరాత్రలు శ్రమించింది. ఆ క్లిష్టతరమైన శిక్షణ శారీరకంగానూ మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉండేలా చేశాయి. కంఫర్ట్‌జోన్‌ దాటి వస్తేనే అసలైన మజా ఉంటుందని గ్రహించింది. ఆ సైనిక శిక్షణలో ఎదురైన కష్టాలు, సవాళ్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. 

    ఒకరకంగా ఆ ట్రైనింగ్‌లోనే సంకల్పం, పట్టుదల, ఓర్పు విలువల గురించి మరింతగా తెలుసుకుంది. అలా సైనిక నాయకత్వ బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకుని రాయల్ భూటాన్ ఆర్మీలో కమిషన్డ్ సభ్యురాలి పనిచేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం సృజన దేశానికి ఒక కవచం, సురకత్తిలా మారనుంది. సౌకర్యవంతమైన జీవితాన్ని కాదనుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అలాగే కఠినతరమైన ఆర్మీ శిక్షణలో నెగ్గుకురావాలంటే..అచంచలమైన ఓపిక, ధైర్యం తోపాటు దేశభక్తి ఉండాలి. నిజంగా సృజనే శక్తిమంతమైన మహిళ. ఆదర్శవంతమైన నారీ కూడా. 

    (చదవండి: రణరంగంలో నారీ శక్తి..!)
     

  • ఒకప్పుడు కేవలం వైద్య, నర్సింగ్‌ సేవలకే పరిమితమైన మహిళలు, నేడు భారత సైన్యంలో కీలక విభాగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. యుద్ధ విమానాలు నడపడం నుంచి ఫిరంగి దళాల నిర్వహణ వరకు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలోనూ మహిళల పాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. క్షేత్ర స్థాయి పోరాటంలో, అత్యున్నత స్థాయి వ్యూహ రచనలో పాల్గొని మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికే చాటిచెప్పారు. 

    ప్రస్తుతం భారత సాయుధ దళాల్లో మహిళల సంఖ్య గత ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ గణాంకాల ప్రకారం..

    భారత సైన్యంలో సుమారు 8000 (వైద్య, నర్సింగ్‌ సేవలతో కలిపి) మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. 

    2022 నుంచి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోకి మహిళా క్యాడెట్లను చేర్చుకోవడం ప్రారంభమైంది. ప్రతి ఆరు నెలలకు 19 మంది మహిళా అభ్యర్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి నేరుగా ఆఫీసర్లుగా నియమిస్తున్నారు.

    సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత, మహిళా అధికారులకు కూడా పురుషులతో సమానంగా పదవీ విరమణ వరకు ఆర్మీలో కొనసాగడమే కాకుండా ఉన్నత పదవులను అధిరోహించగలుగుతున్నారు

    సాధారణ అధికారులుగా (మెడికల్, నర్సింగ్‌ మినహా) విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య 2037. గతంలో ఇది 1732 ఉండేది. భారత ప్రభుత్వం, సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలు సైన్యంలో మహిళల సంఖ్య పెరిగేందుకు దోహదం చేశాయి.

    సుమారు 145 మందికి పైగా మహిళా అధికారులు ప్రస్తుతం కల్నల్‌ హోదాలో వివిధ యూనిట్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో 60% మంది సరిహద్దుల్లోని కార్యాచరణ ప్రాంతాలలో సేవలు అందిస్తుండటం విశేషం.

    అగ్నిపథ్‌ పథకం కింద మహిళలను అగ్నివీర్‌లుగా రక్షణ దళాలలోకి తీసుకుంటున్నారు. నావికాదళంలో 20% ఖాళీలను మహిళలకే కేటాయించారు.

    ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం, టెక్నికల్‌ విభాగాల్లో మహిళా గ్రాడ్యుయేట్లకు పెద్దపీట వేస్తున్నారు. లెఫ్టినెంట్‌ హోదాలో చేరే అభ్యర్థులకు శిక్షణ కాలంలోనే నెలకు రూ. 56,000 పైగా స్టైపండ్‌ ఇస్తూ, గౌరవప్రదమైన కెరీర్‌ను ఆఫర్‌ చేస్తున్నారు.

    కమాండింగ్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో 115 మందికి పైగా ఉండగా.. మరో 145 మంది విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరు ఆర్టిలరీ, ఇంజినీర్లు, సిగ్నల్స్‌ వంటి విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదాతి దళంలోకి సైతం మహిళలను చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు.

    మొదటిసారిగా టెరిటోరియల్‌ ఆర్మీలోని హోమ్‌ – హెర్త్‌ ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో మహిళా సైనికులను చేర్చుకోవాలని నిర్ణయించారు. దీనికోసం 110 ఖాళీలను కేటాయించారు. 

    భారత సైన్యం లక్ష్యం ప్రకారం సుమారు 1700 మంది మహిళలను దశల వారీగా  కోర్‌ ఆఫ్‌ మిలిటరీ పోలీస్‌లో చేర్చుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం ప్రతి ఏటా 100 మందిని చేర్చుకుంటూ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. 

    మహిళా క్యాడెట్లు 60 మంది ఉండగా ఏటా 20 మంది కొత్తగా చేరుతున్నారు. భారత సైన్యంలో మొత్తంగా చూసినట్లయితే మెడికల్, డెంటల్‌ విభాగాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా అంటే సుమారు 21% ఉంది.

    (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్‌ రహస్యం ఇదే..)
     

  • వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. తాను గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు. 

    రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్‌ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు. 

    అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్‌ ఫియర్‌ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు. 
    (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్‌ రహస్యం ఇదే..)

  • కొందరు వయసు గడుస్తున్న కొద్దీ.. వృద్ధుల్లా కనిపించరు. యంగ్‌లుక్‌లో యువకుల మాదిరిగా ప్రకాశవంతంగాకనిపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అస్సలు అదెలా సాధ్యం అనిపిస్తుంది కూడా. వయసు రీత్యా అంత ఏజ్‌ ఉన్నా కూడా.. ఏ మాత్రం వృద్ధాప్య ఛాయలు కనుచూపు మేరలో కూడా కానరావు. ఇక్కడ ఈ మోడల్‌ కూడా అదే కోవకు చెందినవాడు. ఎవరతను అంటే..

    సింగపూర్‌ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌, మోడల్‌ చువాండో టాన్‌కి మార్చి 03, 2026న అధికారికంగా 60 ఏళ్లు నిండాయి. కానీ దశాబ్దాలుగా టీనేజ్‌ యువకుడిలా అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అతడి యంగ్‌లుక్‌ అందర్నీ విస్మయపరుస్తుంటుంది. కనీసం మచ్చుకైనా వృద్ధాప్య ఛాయలు ఎక్కడ కానరావు. 

    అంతలా మెయింటైన్‌ చేస్తున్నా అతడి గ్లామర్‌ రహస్యం ఏంటో తెలసుకోవాలన్న కుతుహలం అందరిలోనే రేకెత్తిస్తుంటుంది. మరి అంతలా యవ్వనంగా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో తెలుసా..!?.

    లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందంటే..

    ఎలాంటి బ్యూటీ చికిత్సలు తీసుకోడు. దీర్ఘకాలిక ‍క్రమశిక్షణయుత జీవనమే మేలు

    బ్రేక్‌ఫాస్ట్‌: 
    గుడ్లు, తేనె, అవకాడోతో ప్రోటీన్ షేక్స్ లేదా ఓట్‌మీల్ అల్పాహారాన్ని తీసుకుంటానని తెలిపాడు. 

    లంచ్‌ లేదా డిన్నర్‌:
    భోజనంలో సాధారణంగా ఉడకబెట్టిన లేదా కాల్చిన చికెన్‌ లేదా చేప, రసం విత్‌ రైస్‌ ఉంటాయి. 
    తప్పనిసరిగా వర్కౌట్‌లు. ఇవి కేలరీలు బర్న్‌ చేయడానికి సమతుల్యతను బ్యాలెన్స్‌ చేసేలా డైట్‌ అత్యంత ముఖ్యమని చెబుతున్నాడు. 

    పగటిపూట చేసే కార్యకలాపాలు ఆ రోజుల్లో మీరు బర్న్ చేసే కేలరీలకు సమానంగా ఉండాలని చెబుతున్నాడు. 

    నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ఒత్తిడిలేని సానుకూల మనస్తత్వం అత్యంత ముఖ్యం. ఆరోగ్యమైన వృద్ధాప్యానికి ఇవి అత్యంత కీలకమని చెబుతున్నాడు టాన్‌. 

    అయితే తాను మద్యం, కాఫీ, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడట. 

    వారానికి మూడు నుంచి ఐదు సార్లు బల శిక్షణ, కార్డియో వ్యాయామాలు, ఈత తదితరాలు ఉంటాయట. 

    కాగా, టాన్‌ ఇటీవల కొద్దికొద్దిగా వృద్ధాప్యంలో దరిచేరే కొద్దిపాటి శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. సహజంగా కాలంతో వచ్చే వృద్ధాప్యాన్ని ఆపలేమని, కాకపోతే దాన్ని హెల్దీగా మార్చుకుంటే..ఆరోగ్యకరమైన వార్దక్య జీవితాన్ని గడపొచ్చని టాన్‌ చెబతున్నాడు. అంతేగాదు అతడి పోస్ట్‌ల్లో సైతం ఆసక్తికరమైన సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటాడు. 

    వాటిని చూస్తే అవగతమవుతోంది ఫిట్‌నెస్‌ పట్ల ఎంత కేర్‌గా ఉంటాడనేది. కాగా, టాన్‌ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.  సమయాన్ని నిజమైన సంపదగా పేర్కొన్నాడు. ప్రతి సూర్యోదయం చూసేలా, అనుభవించేలా చేస్తున్నందుకు, ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నందకు సదా కృతజ్ఞుడును. ప్రతి రోజు ప్రకృతిలో గడపడం, సూర్యకాంతిలో గడపడం మిస్‌ చేసుకోవద్దు అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే సమయం, ఆరోగ్యం అత్యంత విలువైనవని, వాటిని నిర్లక్ష్యం చేస్తే.. అన్ని దూరమైపోతాయని చెప్పకనే చెప్పాడు టాన్‌.

     

    (చదవండి: ఫ్లైట్‌ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!)

     

  • కొందరు భలే విచిత్రంగా ఉంటారు. ఒక్కరోజు వర్కౌట్లు మిస్సైతేనే ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా లబోదిబోమంటారు. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..టెన్షన్‌గా వ్యాయామాలు చేసేయాల్సిందే. అందుకోసం ఏం చేసేందుకైనా, ఎంత కష్టమైనా డోంట్‌ కేర్‌. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ టైపే. అయితే ఈ వ్యక్తి ఫిట్‌నెస్‌ పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో చూస్తే..ఓర్నీ గాల్లో కూడానా. అంటారు.

    ఇంతకీ ఏం చేశాడంటే..బెర్లిన్‌కు చెందిన ఎండ్యూరెన్స్ అథ్లెట్, కంటెంట్‌  క్రియేటర్‌ డోమ్‌ స్ట్రోహ్‌..ఫ్లైట్‌లో దాదాపు పదకొండు గంటల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఆ క్రమంలో చాలా గంటలు కూర్చోనే ఉండాల్సి ఉంటుంది. కనీస కదలికలు కాస్త కష్టమే. అందువల్ల మనోడు ఎక్కడ ఆరోగ్యం పాడవ్వుతుందని అనుకున్నాడో ఏమో గానీ. ఎలాగైనా..ఈ పరిస్థితుల్లో కూడా తన ఫిట్‌నెస్‌ని కాపాడు కోవాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యాడు. 

    అందుకని ఏకంగా ఫ్లైట్‌లో ఉండే టాయిలెట్‌నే జిమ్‌గా మార్చేశాడు. విమానంలో సాధారణంగా వాష్‌రూమ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. అంత ఇరుకైనా వాష్‌ రూమ్‌లో మనోడు ఏకంగా 5కే రన్‌ పూర్తి చేసే సాహసం చేశాడు. అసలు మనిషి ఒక్కడే పట్టేంత స్థలంలో వాకింగ్‌ అనేదే సాధ్యం కాదు..కానీ డోమ్‌ ఏకంగా రన్‌ చేయాలనుకుంటున్నాడు. ఎలా చేశాడో కూడా అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశాడు డోమ్‌. 

    అంతేకాదండోయ్‌ నిజంగానే 5.5 కిలోమీటర్లు రన్‌చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మనిషి అటు ఇటు కదలడానికి ఏ మాత్రం చోటు లేని ఆ చిన్న బాత్రూమ్‌లో మనోడు అంత వర్కౌట్‌ పూర్తి చేశాడా..? అని ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకెందుకు ఆలస్యం డోమ్‌ ఆ స్టంట్‌ ఎలా పూర్తిచేశాడో చూసేయండి మరి..!. నెటిజన్లు కూడా మీరొక్కరే బాత్రూంలో అంతసేపు ఉండిపోయి..ఎంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టారో ఏంటో అని కొందరు. పాపం గాల్లో స్టంట్‌ చేయాలనుకున్నాడు కాబోలు అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

     

    (చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్‌’)

     

Politics

  •  

    తాడేపల్లి: అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్ధాలు, కాకి లెక్కలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అన్ని బోగస్‌ లెక్కలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం, మార్చి 6వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబుకు రూ. 8 వేల కోట్ల బడ్జెట్‌ అప్పచెప్పింది. 2019లో వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు రూ. 100 కోట్ల బడ్జెట్‌ మాత్రమే అప్పచెప్పారు.

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్ధాలు చెప్పారు. వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి. కరెంట్‌ చార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాబోయే 60 రోజుల్లో 57 వేల కోట్లు సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెబుతున్నారు’ అని విమర్శించారు.

    వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలి

     

    పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

    • ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదాయాలు రాకపోగా, లోటు కనిపిస్తోంది
    • అంచనాలకు, వాస్తవ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది
    • చివరికి బడ్జెట్ కూడా దొంగతనంగా పెడుతున్నారు
    • రూ.98 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకుంటామని రూ. లక్షా 3 వేల కోట్లు గతేడాది అప్పు చేశారు
    • ఈ ఏడాది రూ. 97 వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పారు
    • వివిధ కార్పొరేషన్ల నుండి తీసుకుంటున్న అప్పులను బడ్జెట్‌లో చూపటం లేదు
    • ఈ విషయాన్ని ఎల్లోమీడియా కూడా రాసింది
    • రెండు నెలల్లో రూ. 57 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది?
    • రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతుంటే గాడిన పెట్టామంటూ అబద్దపు మాటలు ఎందుకు చెప్తున్నారు?
    • చంద్రబాబు నివాసం‌ ఉంటున్న కరకట్ట ఇల్లు ఎవరిదో ఎందుకు చెప్పటం లేదు?
    • లింగమనేని రమేష్‌దా? సీఆర్‌డీఏదా? చంద్రబాబుదా?
    • రైతుల భూమిని 22A లో ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు
    • దీనిపై రాజకీయ పార్టీలు, మీడియా ఎదుట విచారణకు సిద్దమా?
    • టాటా మోటర్స్ కి ఎకరా రూ.38 లక్షల చొప్పున గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది
    • కానీ ఎకరం రూపాయికే ఇచ్చారంటూ లోకేష్ పచ్చి అబద్దాలు చెప్పారు
    • 1100 ఎకరాలను రూ.400 కోట్లకు టాటా మోటర్స్ కొనుగోలు చేసింది
    • ప్రపంచ వ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయింది
    • కానీ విశాఖలో రూపాయి విలువ విపరీతంగా పెరిగింది
    • అందుకే విశాఖలో 99 పైసలకే భూములను ఇస్తున్నారు
    • రాష్ట్రంలో సెంటు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకున్నా వాటిని కూల్చేశారు
    • కానీ గీతం యూనివర్సిటీ ఆక్రమంచిన వేల కోట్ల విలువైన భూమిని మాత్రం క్రమబద్దీకరిస్తున్నారు
    • ఇల్లు కోల్పోయిన పేదల కన్నీటి వరదలో కూటమి ప్రభుత్వం కొట్టుకు పోతుంది
    • గీతం యూనివర్సిటీ ఓనరు నారా లోకేష్ తోడల్లుడు కాబట్టే క్రమబద్దీకరిస్తారా?
    • వెయ్యి కోట్ల విలువైన భూమినే తాను కబ్జా చేసినట్టు గీతం ఓనరు చెప్పారు
    • వెయ్యి కోట్ల భూమిని కబ్జా చేయటం అంటే ఈ ప్రభుత్వాన్ని ఏం అనాలి?
    • వైఎస్ జగన్ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో ఆరోపించారు
    • అసెంబ్లీలోనేమో జగన్ కలిపాడని లేదనీ, టీటీడీ పాలకమండలిదే బాధ్యత అంటూ మాట మార్చారు
    • బోలేబాబా, సంగం డెయిరీ, వైష్ణవి, ఏఆర్ డెయిరీ అన్నీ చంద్రబాబువే
    • 4 వేల కోట్ల టర్నోవర్ హెరిటేజ్ కు ఉందని భువనేశ్వరి చెప్పారు
    • తనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు ప్రకటించారు
    • అసెంబ్లీలో మాత్రం కుటుంబ బతుకు తెరువు కోసమే వ్యాపారం చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు
    • హెరిటేజ్ సంస్థ నుండి కొనుగోలు చేసిన మజ్జిగ ప్యాకెట్లనే ప్రజలకు పంచాలని జీవోలు ఇచ్చారు
    • కానీ తాము ప్రభుత్వానికి అసలు‌ మజ్జిగ అమ్మలేదని పచ్చి అబద్ధం చెప్పారు
    • చివరికి టీటీడీకి కూడా హెరిటేజ్ ద్వారా నెయ్యి సరఫరా చేశారు
    • దీనిపై చర్చించటానికి చంద్రబాబుకు దమ్ముందా?
    • పాలపొడి, నెయ్యి సరఫరా చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?
    • ఈ విషయాలన్నీ చెబుతుంటే హిస్టరీ వద్దంటూ పయ్యావుల కేశవ్ మాట్లాడటం సిగ్గుచేటు
    • నెయ్యితో చేసిన లడ్డూకి నెయ్యి వాసన రావటానికి నెయ్యిని స్ప్రే చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది
    • 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చంద్రబాబు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు
    • ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో ఆ వివరాలను ఆన్ లైన్ లో పెట్టే సత్తా ఉందా?
    • రాష్ట్ర అప్పులు రాకెట్ వేగంతో చేస్తూ, ఆ డబ్బును ఏం చేస్తున్నారో ఎందుకు చెప్పటం లేదు?
    • 20 నెలల్లోనే రూ. 3.20 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పాలి
    • అనిత తన శాఖను వదిలేసి జగన్ దూషణ శాఖామంత్రిగా పని చేస్తున్నారు
    • సొంత పార్టీ ఎమ్మెల్యేనే మోంథా తుపాను పరిహారం రైతులకు ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు
    • మైకులు పని చేయక అసెంబ్లీని వాయిదా వేసిన ఘనత ఈ ప్రభుత్వానిది
    • అసెంబ్లీ నడపటం చేతగానీ ప్రభుత్వ పెద్దలు తుపాను తీవ్రతను తగ్గించామని బడాయి మాటలు చెప్పారు
    • ప్రతి జనవరిలో జాబ్ కేలండర్ అంటూ లోకేష్ పిట్టలదొర మాటలు చెప్తున్నారు
    • కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేయలేదు
    • జగన్ కట్టించిన ఇళ్లని చంద్రబాబు ఉగాదికి ప్రారంభించబోతున్నారు
    • విమానయాన శాఖ మంత్రి కార్పొరేట్ సేవకుడు
    • సొంత జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ ను కనీసం పట్టించుకోవటం లేదు
    • భోగాపురం ఎయిర్ పోర్టు జీఎంఆర్ కడుతుంటే రామ్మోహన్ నాయుడు హడావుడి చేస్తున్నారు
    • ప్రభుత్వ ఎయిర్ పోర్ట్ అయిన గన్నవరం ఎయిర్ పోర్టును ఎందుకు పట్టించుకోవటం లేదు?
    • రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన మంత్రులు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు
    • హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ తర్వాత చంద్రబాబే
    • ఆయన హయాంలోనే తిరుమల వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారు
    • చంద్రబాబు హిందూ మతాన్ని పాటించే వాడైతే ఆ మంటపాన్ని కూల్చుతారా?
    • జంతువుల తోలుతో చేసిన బూట్లు వేసుకుని పూజలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు
    • తల్లి, తండ్రి చనిపోతే కనీసం పిండప్రదానమైనా చేశారా?
    • మరి ఏ రకంగా చంద్రబాబు హిందువు?
    • జంతువుల కొవ్వు, టాయిలెట్ యాసిడ్ లను లడ్డూలో కలిపితే జనం బతికేవారా?
    • తిరుమల కొండ మీద కూడా అన్యమత ప్రచారం చేసుకోవచ్చని చంద్రబాబు హామీ ఇవ్వలేదా?
    • రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశారు
    • సూపర్ సిక్స్ అని ఇప్పుడు మోసం చేశారు
    • ఇక ఆయన మాటలు విని ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి పోషణ పరిస్థితి ఏంటి?
    • చంద్రబాబు లాంటి బడాబాబుల ఇళ్లలో పని చేయించుకోవడానికి సామాన్యులు ఎక్కువ మంది పిల్లల్ని కనాలా?
    • 11 మంది ఎమ్మెల్యే మాకు ఉన్నా 11వేల మందిలాగా పోరాడుతున్నాం
    • నిజాయతీనే మాకు ధైర్యం
    • లడ్డూ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే హెరిటేజ్ అతలాకుతలం అయింది
    • చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తున్నారో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు
    • అసలు లడ్డూలో కల్తీ జరిగితే అది చంద్రబాబు హయాంలోనే
    • అందుకు చంద్రబాబే క్షమాపణ చెప్పాలి
    • కాగ్ నివేదికలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని మంత్రులు ఏపీలో ఉన్నారు
  • గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి  వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు.  సంవత్సరానికి  మూడు పంటలు పండే భూములను చంద్రబాబు తీసుకున్నాడని, అలా చేయవద్దని ఆయనకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.  రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. 

    నా సలహాలు, సూచనలను చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం వ్యవసాయ భూములను కాంక్రీట్ తో నింపేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.  భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలకు దిక్కు ఎవరు. అమరావతి రాజధానిని కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారా?, అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుండి అడ్డగోలుగా భూములు లాక్కున్నారు.రెండో విడత భూ సేకరణకు  రైతులు సిద్ధంగా లేరు’ అంటూ విమర్శించారు. 

  • సాక్షి, ప్రకాశం: తప్పు చేస్తే ఎవరికైనా దేవుడి శిక్ష తప్పదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటారన్నారు. టీటీడీ ఛైర్మన్‌పై నింద వచ్చింది కాబట్టి తప్పుకుంటే మంచిందన్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తుందన్నారు. నెయ్యి విషయంలో ఈ ప్రభుత్వంలోనే తప్పు జరిగింది. రిజెక్ట్‌ చేసిన 4 ట్యాంకర్‌లు దొడ్డిదారిలో తీసుకున్నారు. సీబీఐ కూడా రిపోర్టులో అదే చెప్పిందని వైవీ అన్నారు.

    ‘‘వెంకటేశ్వరస్వామిపై వైఎస్‌ జగన్‌కు పూర్తి నమ్మకం ఉంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి చిత్తశుద్ధితో మొక్కుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘బాలిలేని మాటలకు నేను స్పందించడం ఏంటి? జిల్లా నాయకులు ఉన్నారు. ప్రస్టేషన్‌తో బాలినేని ఏదో మాట్లాడితే నేనెందుకు దానిపై కామెంట్ చేయాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

    శ్రీవారి సన్నిధిలో పొరపాటు జరిగితే దేవుడే చూసుకుంటాడు

Andhra Pradesh

  • సాక్షి, భీమవరం: తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తెలిపిందని మాజీ మంత్రి రోజా అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పిన తర్వాత కూడా సీఎం, డిప్యూటీ సీఎం, చివరికి హోం మంత్రి కూడా దిగజారి మాట్లాడుతున్నారని చెప్పారు. వారి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

    ఇవాళ భీమవరంలో రోజా మాట్లాడుతూ.. ‘శాసన మండలిలో కూడా చైర్‌పర్సన్‌ మోషన్‌రాజు కులం గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూటమి నేతలు లేనిపోనివన్నీ మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు ఒక్కరోజు కూడా సక్రమంగా మాట్లాడారా?

    కూటమి నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాల ప్రస్థావన తీసుకురాకూడదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూటమిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నారు.. ప్రజలకు మంచి చేయండి.. లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి’ అని అన్నారు.

    గాడిదల అడ్డంగా పెరిగావ్.. చెంప పగల కొడతారు జాగ్రత్త..!
     

    ఇదీ చదవండి:  నేపాల్‌ ఎన్నికల ఫలితాలు భారత్‌కు ఎందుకింత కీలకం?

  • విజయవాడ:  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  దాంతో వైద్యుల్ని శాసనమండలికి పిలిపించిన అధికారులు.. పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. 

    ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.  బొత్స సత్యనారాయణ హైబీపీ కారణంగా ఇబ్బందిపడినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ బీపీ కంట్రోల్లోకి రాకపోతే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. దీనిలో భాగంగా బొత్సతో  సిటీన్యూరో ఆస్పత్రి వైద్యులు ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్యం విషయంలో బొత్సకు డా. చంద్రశేఖర్‌రెడ్డి జాగ్రత్తలు చెప్పారు. అనారోగ్యం కారణంగా మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు బొత్స.

    	ఏపీ మండలిలో బొత్సకు స్వల్ప అస్వస్థత
  • మార్కాపురం జిల్లా:  పశ్చిమాసియాలోని అరబ్‌ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు మార్కాపురం జిల్లాలోని వందలాది కుటుంబాలను తీవ్ర భయాందోళనకు గురిచేయడమే కాదు కన్నీళ్లు కురిపిస్తున్నాయి. జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫోన్లు, వాట్సప్‌లు, వీడియో కాల్స్‌పై అక్కడి ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతోపాటు తాత్కాలికంగా నిలిపివేయడంతో బంధుమిత్రుల సమాచారం తెలియక వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మార్కాపురం, కంభం, గిద్దలూరు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది గల్ఫ్‌ దేశాలైన దుబాయ్, కువైట్, ఖతార్‌లో ఉంటున్నారు. పొట్ట చేతపట్టుకుని కొందరు, గల్ఫ్‌లో బంధువుల వద్దకు మరికొందరు వెళ్లారు. 

    ఈ క్రమంలో ఇరాన్‌కు ఇజ్రాయేల్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్‌ దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా విమానాల రద్దుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రోజురోజుకూ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. 

    అరబ్‌ దేశాల్లో ఉంటున్న వారు సాధారణంగా ప్రతి రంజాన్‌ పండగకు స్వగ్రామాలకు వచ్చి కొద్దిరోజులు ఉండి మళ్లీ అక్కడికి వెళ్తుంటారు. ఈసారి మాత్రం పండగ 15 రోజుల్లో ఉందనగా ఇరాన్‌పై ఇజ్రాయేల్, అమెరికా క్షిపనులతో విరుచుకుపడటం, ఇరాన్‌ భీకర ప్రతిదాడులకు దిగడంతో వారి ప్రయాణానికి అవాంతరం ఏర్పడింది. తాము స్వదేశానికి రాలేమంటూ పలువురు తమ బంధువులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. గత సోమవారం మధ్యాహ్నం నుంచి అక్కడి ప్రభుత్వాలు వీడియో, వాట్సప్‌ కాల్స్‌ను నిలిపివేయడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో ఉంటున్న బంధువులు ఆందోళన చెందుతున్నారు.  

    విమానం టికెట్‌ రద్దయింది  
    నా కూతురు, అల్లుడు కువైట్‌కు సమీపంలోని ఫర్మేనియా సిటీలో ఉంటున్నారు. నేను ఫిబ్రవరి 18వ తేదీన వారి వద్దకు వచ్చాను. మార్చి 6వ తేదీన మళ్లీ మార్కాపురం వచ్చేందుకు విమానం టికెట్‌ బుక్‌ చేసుకున్నా. ఆదివారం ఉదయం ఊహించని విధంగా యుద్ధం ప్రారంభం కావడంతో విమాన టికెట్లు క్యాన్సిల్‌ చేశారు. కువైట్‌ మీద కూడా ఇరాన్‌ బాంబులు వేసింది. మా ప్రాంతంలో ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదు. బయట కూడా ఎవరూ తిరగడం లేదు. కువైట్‌ రాజు మా ప్రాంతానికి వచ్చి యోగక్షేమాలు అడిగారు. కానీ, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పరిస్థితులు త్వరగా చక్కబడితే బాగుంటుందని కోరుకుంటున్నాం.  
         – ఎన్‌.బద్రి, మార్కాపురం  

    దుబాయ్‌లో టెన్షన్‌గా ఉంది  
    నా కుమారుడు అబ్దుల్‌ రహీమ్‌ దుబాయ్‌లో ఐటీ వింగ్‌లో పనిచేస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రభుత్వం వాట్సప్, వీడియో కాల్స్‌ నిషేధించింది. అతి కష్టంమీద ఈ రోజు ఫోన్‌లో మాట్లాడాడు. ప్రస్తుతానికి వర్క్‌ఫ్రమ్‌ హోం కింద దుబాయ్‌లోని ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.  
        – అజీజ్, మార్కాపురం  

NRI

  • పవిత్ర రంజాన్‌ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి  సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్‌మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్‌లో 56 ఏళ్ల నాన్‌ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష  చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 

    2002 నుండి  సతీష్ కుమార్‌న దుబాయ్‌లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు.  రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్‌. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని  చెప్పారు.

    ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!

    దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను   పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్‌