Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: జమ్మూ కాశ్మీర్‌లో మార్చి 7 నుంచి 13 వరకు జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్ (కబడ్డీ క్లస్టర్)లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి షేక్ ఫౌజియా (PC 13109) విశేష ప్రతిభ కనబరిచారు. భోంగిర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆమె మహిళల ఫోయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకొని రజత పతకం సాధించారు.  

    ఈ విజయంపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆమెను, కోచ్ ఎస్.ఆర్. అర్జున్‌ను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఐజీపీ (స్పోర్ట్స్) డాక్టర్ గజారావు భూపాల్, ఏసీపీ & స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు సమక్షంలో ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. షేక్ ఫౌజియా సాధించిన ఈ రజత పతకం తెలంగాణ పోలీస్ క్రీడా విభాగానికి గర్వకారణంగా నిలిచింది.  

  • నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో మరో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని(17) అనారోగ్యంతో మృతి చెందారు. లుకేమియాతో బాధపడుతున్న ఆమె.. క్యాంపస్‌లో అనారోగ్యానికి గురై.. ఇంటికి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు.

    అట్టుడికిన పరిపాలన భవనం
    తేజస్విని మృతి వార్త తెలిసిన వెంటనే క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు పరిపాలనా భవనాన్ని (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్) ముట్టడించారు. 'వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటాక కూడా ఆందోళన చేశారు.

    ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి!
    ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాంపస్ ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేరని విద్యార్థులు మండిపడ్డారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని, పరిస్థితి విషమించిన తర్వాతే ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు.సకాలంలో సరైన చికిత్స అందకపోవడం వల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    కార్యాలయం వద్దే భోజనాలు
    రాత్రి వరకు ఆందోళన కొనసాగడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో అధికారులు దిగివచ్చి, పరిపాలనా భవనం వద్దనే విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. విద్యార్థిని మృతి పట్ల అధికారులు సంతాపం ప్రకటించినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

    ఉద్రిక్తత.. పోలీసుల అప్రమత్తత
    బాసర ట్రిపుల్‌ ఐటీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 9000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యాసంస్థలో, కేవలం కొందరు విద్యార్థులు నాయకులుగా ముందుకు వచ్చి ఆందోళనలు చేపట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చినట్లు పోలీసులు ఆరోపించారు.

    విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆందోళనలు, కొన్నిసార్లు నియంత్రణ దాటే ప్రమాదముండడంతో పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలను కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం తమ ప్రధాన బాధ్యత అని నిర్మల్ జిల్లా SP జానకి షర్మిల తెలిపారు. తాను స్వయంగా విశ్వవిద్యాలయాన్ని చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు ‘సాక్షి వెబ్‌డెస్క్‌’తో చెప్పారు.

    “ప్రతి విద్యార్థికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉంది. అయితే అది చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. కొందరి చర్యల వల్ల మిగతా విద్యార్థులకు, సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలగకూడదు” అని ఆమె పేర్కొన్నారు. కొందరి ఆందోళనల కారణంగా సంస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత విద్యార్థిని ముందు నుంచే అనారోగ్యంతో బాధపడ్డారని, మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లారని చెప్పారు.

    ఆర్‌జీయూకేటీ సంతాపం
    తేజస్విని మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ‘మెదక్ జిల్లా రామచంద్రాపురం నివాసి అయిన తేజస్విని (తండ్రి: నారాయణ), గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలల నుంచి తేజస్విని ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటున్నారు’ అని వివరించింది. తేజస్విని మృతి పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు మీడియాకు వాట్సాప్ ద్వారా ప్రకటనలను విడుదల చేసింది.

  • "ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు" అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా  యాడ్స్ కనపడుతున్నాయి. అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడొచ్చని అనగానే చాలా మంది అబ్బాయిలు ఆ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. అయితే, అటువంటి యాడ్స్‌ వెనుక నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు ఉంటుందని అంటున్నారు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌.

    ‘యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.

    ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్‌మెయిలింగ్‌ సెక్స్‌టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం.

    యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి.

    ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్’ అని సజ్జనార్‌ సూచించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రెండు కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇరువురిని అరెస్టు చేయగా.. సుమారు రూ.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురా నగర్‌, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

    బోరబండలోని మధురా నగర్‌లో 'A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరుతో ఈ అక్రమ తయారీ సాగుతోంది. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్ నేతృత్వంలోని బృందం, GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ జంగారెడ్డితో కలిసి ఈ దాడి నిర్వహించారు.  నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో పేస్ట్‌ను నిల్వ చేస్తున్నారు. నాణ్యత లేని ముడిసరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు,  వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా షాపులకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు.

    సుమారు రూ. 4,50,000 విలువైన నిల్వలను, యంత్రాలను సీజ్ చేశారు. 4275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు (95 బస్తాలు), 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్, 800 కిలోల ఉప్పు, పసుపు, ప్యాక్ చేసిన వివిధ పరిమాణాల పౌచ్‌లు, మిక్సర్, గ్రైండర్, పీలింగ్ మెషీన్, ప్యాకింగ్, వెయిట్ మెషీన్లు  స్వాధీనం చేసుకున్నారు.

    టప్పాచబుత్రాలో..
    టప్పాచబుత్రాలో మరో కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం దాడి చేసింది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడు మొహమ్మద్ జాఫర్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో సిట్రిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు వంటి రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు.

    ఈ పేస్ట్‌ను దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో, బహిరంగంగా నిల్వ చేస్తున్నారు. సుమారు రూ. 2,50,000 విలువైన నిల్వలను, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ఈ కల్తీ పేస్ట్‌ను నగరంలోని వివిధ హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు అక్రమంగా లాభాలు గడిస్తున్నాడు. FSSAI లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామాకు, ప్రస్తుతం తయారీ సాగుతున్న చిరునామాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు.

  • సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌ బాపూజీ నగర్‌లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్‌ను స్థానిక ప్రజలకు, చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

    దీంతో ఇవాళ మధ్యాహ్నం సమయంలో వారసిగూడ సబ్ ఇన్‌స్పెక్టర్ కే.రామచంద్రారెడ్డి తన సిబ్బందితో చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. కాగా, సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది.

  • హైదరాబాద్‌: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, ఇన్సాపూర్‌లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.

    కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్‌. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది.

    తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

  • సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) #OnlineButUnafraid థీమ్‌తో మహిళా జర్నలిస్టుల కోసం సైబర్ హైజీన్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ వర్క్‌షాప్ ద్వారా మీడియా వృత్తి నిపుణులకు డిజిటల్ ప్రపంచంలో భద్రతగా ఉండెందుకు అవసరమైన అవగాహన , ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీజీసీఎస్‌బీ తెలిపింది.

    తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి,  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్,  శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  వివిధ మీడియా సంస్థల నుంచి మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలను సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్‌ చేయడం అత్యంత అవసర మని సూచించారు. మీడియా వృత్తి నిపుణులు తమను తాము రక్షించుకోవడమే కాకుండా, తమ వేదికల ద్వారా ప్రజలకు సైబర్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనపై అవగాహన కల్పించాలని సూచించారు.

    డిజిటల్ ప్రపంచం ఎన్నో అవకాశాలను అందిస్తున్నప్పటికీ, ముఖ్యంగా ప్రజల ముందుకు వచ్చే వృత్తుల్లో ఉన్న మహిళలకు కొత్త రకాల ముప్పులను కూడా తెస్తుందని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సైబర్ భద్రతలో అవగాహన సైబర్ హైజీన్ మొదటి రక్షణ రేఖలని, అవగాహన ఉన్న వ్యక్తులు సైబర్ నేరాలకు తక్కువగా గురవుతారని తెలిపారు. అలాగే జర్నలిస్టులు సమాజంలో సైబర్ నేరాలపై  అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

    #OnlineButUnafraid కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమం డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు, ఆన్‌లైన్లో  బాధ్యతాయుతంగా ఉండేలా చూడటం,  సైబర్ భద్రతా చర్యలను అలవాటు చేయించడం లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రయత్నంలో భాగమన్నారు. సైబర్ ముప్పు ఉన్నప్పటికీ, అవగాహన, అప్రమత్తత, సమయానుకూల చర్యల ద్వారా వాటిని సమర్థంగా తగ్గించవచ్చన్నారు.  వీటిపైస్పష్టమైన అవగాహన ఉన్నపుడు డిజిటల్ ప్లాట్‌ఫారంలను భయపడకుండా, అవగాహనతో, అప్రమత్తంగా  భద్రంగా వినియోగించు కోవచ్చని ఆమె సూచించారు.

    ఈ వర్క్‌షాప్‌లో  వేటిన్స్ (Vatins)  సీఈవో ఎన్‌వీ సన్నీ ఎన్‌వీ సైబర్ హైజీన్, అభివృద్ధి చెందుతున్న సైబర్ ముప్పు,ఆన్‌లైన్ భద్రతపై వివరణాత్మక ప్రజెంటేషన్‌ అందించారు. సైబర్ నేరాల ధోరణులు, జర్నలిస్టులు ఎదుర్కొనే డిజిటల్ ముప్పులు, మహిళలను లక్ష్యంగా చేసుకునే సాధారణ సైబర్ నేరాలు వంటి అంశాలు చర్చించారు. ముఖ్యంగా సైబర్ స్టాకింగ్, ఆన్‌లైన్‌ వేధింపులు, లైంగిక బెదిరింపులు, వేధింపులు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఫోటో మోర్ఫింగ్ , మ్యాట్రిమోనియల్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల్లో నమ్మకం, వ్యక్తిత్వం మరియు డిజిటల్ ప్రవర్తనను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరించేందుకు వాస్తవ సంఘటనల ఆధారంగా కేస్ స్టడీస్‌ను కూడా వివరించారు.పాల్గొన్న వారికి సైబర్ నేరాలకు సంబంధించిన సందేహాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం, వ్యక్తిగత, వృత్తిపరమైన డిజిటల్ భద్రతను కాపాడుకోవడం, ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కోవడం మరియు సైబర్ ఘటనలకు సమర్థంగా స్పందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడంప్రాముఖ్యతను కూడా వివరించారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్‌ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్‌ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

    నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.

    గత మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్‌లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు.

  • హైదరాబాద్‌: నగర శివారులోని మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర‍్వులు జారీ చేసింది. సిట్‌ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ ఉంటారు. సిట్‌ సభ్యులుగా గ్రేహౌండ్స్‌ కమాండర్‌ ఎం.రవీందర్‌, షాద్‌నగర్‌ డీసీపీ శిరీష, ఈగల్‌ ఫోర్స్‌ ఆఫీసర్లు సి.హరీష్‌ చంద‍్రారెడ్డి, ఎన్‌.బుచ్చయ్య, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో మల్లికార్జున రెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్‌ అలీని ప్రభుత్వం నియమించింది. 
     

    మరోవైపు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సోదారుడు రితేష్‌ రెడ్డి గన్‌లైసెన్స్‌ను రద్దు చేయాలని సీపీకి సిట్‌ అధికారులు లేఖ రాశారు. రితేష్‌రెడ్డికి 2017లో గన్‌ లైసెన్స్‌ జారీ చేశారు సైబరాబాద్‌ పోలీసులు. రివాల్వర్‌ మిస్‌ యూజ్‌పై చర్యలు తీసుకోవాలని సీపీని సిట్‌ అధికారులు కోరారు. అలాగే, అసాంఘిక కార్యక్రమాలకు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌ అడ్డాగా మారిందని, దాన్ని సీజ్‌ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. 

    కాగా, మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసు రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. పలువురికి డ్రగ్స్‌ టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది.  టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కూడా ఈ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. 

Crime

  • సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.  

    సమాచారం ప్రకారం.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మోటేషన్ ఫైల్ కోసం ఆర్ఐ రిచర్డ్ సైమన్ వద్ద పని చేయించుకోవడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా రూ.15,000 లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Family

  • నూరు వసంతాలు దాటిన తెలుగు నాటక ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. మరెన్నో నేర్చుకున్న పాఠాలున్నాయి. ఉత్తుంగ తరంగమై నిలిచి, ఉత్థాన పతనాలెన్నో చూసిన ఈ రంగస్థల స్రోతస్విని ప్రయాణంలో ఎందరో మహానుభావులు... తమ జీవితాన్నే కళకు దివ్య సమర్పణం చేసిన ఎందరెందరో మహామహులు.

    రంగస్థలం, ఆ వెనుక దాన్ని అనుసరించి వచ్చిన వెండితెర రంగుల ప్రపంచం... ఉభయత్రా తమ ప్రతిభా సంపత్తులతో ఆ రంగాలకు కొత్త కాంతులు జోడించిన ఆ దివ్యమూర్తులను నేటి తరానికి పరిచయం చేస్తే? వారిని స్మరిస్తూ, వారి గానం, అభినయాలను శ్రవ్య – దృశ్య రూపంలో కళ్ళ ముందు నిలిపితే? ఆ రూపంలో కొత్త తరానికి మన ‘అలనాటి నాటక ప్రస్థానం’పై స్థూలంగా అవగాహన కలిగిస్తే? అదిగో.... అలాంటి విశిష్ట ప్రయత్నమే ‘అలనాటి నాటక ప్రస్థానం’.

    పరిశోధన, పరిశ్రమల మేళవింపు
    గమనిస్తే... 1880ల నుంచి ఇప్పటి వరకు ఎందరో నటులు, నాటక కర్తలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభాపాటవాల వల్లే తెలుగు నాటక రంగం ఇప్పటి అత్యున్నత స్థితిని చేరుకుంది. అయితే, తెలుగునాట నాటక విమర్శ, పరిశోధన... రెండూ తక్కువే. మన తెలుగు నాటక చరిత్రను కూలంకషంగా గ్రంథస్థం చేసినదీ అతి స్వల్పమే. బళ్ళారి రాఘవ నుంచి నిన్న మొన్న దివంగతులైన వందలాది నటీనటుల అభినయ వైదుష్యం అరకొరగా అయినా అక్షరాల రూపంలో ఉందేమో కానీ, వారి గాన మాధుర్యం, నట వైదుష్యాలను ప్రత్యక్షంగా చూసినవారు నేడు అరుదు. అలాంటి పరిస్థితుల్లో... అంతకంతకూ చదవడం తగ్గిపోతున్న నవతరాన్ని సైతం దృష్టిలో పెట్టుకొని, మన నాటక రంగ శ్రవ్య, దృశ్య వైభవాన్ని రూపకంగా అందించేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ తరానికి అలవాటైన, అందరికీ అందుబాటులో ఉన్న యూ ట్యూబ్ వేదికగా ‘అజో... విభో... కందాళం ఫౌండేషన్’ ఈ అరుదైన కానుకను సమర్పించింది.

    అలా... నాటి మేటి నటీనటుల శ్రవ్య – దృశ్య కళారూపకం ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’. మొత్తం 8 భాగాలుగా దీన్ని అందించారు. అన్ని భాగాలూ కలిపి దాదాపు 10 గంటల నిడివి గల సిరీస్ ఇది. ఒక్కమాటలో ఈ సిరీస్ ఎంతో శ్రమతో సాగించిన యజ్ఞం. ప్రముఖ నాటక రంగ పరిశోధకుడు – రచయిత డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు ఈ రూపకం కోసం అనేక నెలల పాటు పరిశోధించారు. సంబంధిత నటీనటుల దృశ్య, శ్రవ్య ఖండికల సేకరణ నిమిత్తం చాలానే పరిశ్రమించారు. ఆ పరిశోధన, పరిశ్రమ... ఈ రూపకాన్ని చూస్తున్నప్పుడు కళ్ళకే కాదు... మనసుకు కూడా తడతాయి.

    మూడేళ్ళ క్రితమే... మరో మహత్తర అక్షర కృషి
    కొద్దిగా వెనక్కి వెళితే... ‘అజో-విభొ- కందాళం ఫౌండేషన్’ వారే మూడేళ్ళ క్రితం ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ పేరిట అపూర్వమైన గ్రంథాన్ని ప్రచురించారు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి కృషి చేసిన తొలి, మలి తరాల రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంక్షిప్త పరిచయాలతో కూడిన వ్యాస సంకలనం అది. తెలుగు రంగస్థలంపై వారి ప్రాథమిక కృషితో పాటు అరుదైన వారి ఛాయాచిత్రాలను కూడా గుదిగుచ్చిన దాదాపు వెయ్యి పేజీల బృహత్ గ్రంథమది. ఆ రచన కూడా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చేసినదే! మరో రచయిత వాడ్రేవు సుందరరావు ఆ కృషిలో ఆయనకు భాగస్వామిగా వ్యవహరించారు. అందులో 120 మంది నాటక రచయితలు, 117 మంది నటులు – దర్శకులు, 24 మంది సాంకేతిక నిపుణులు... వెరసి 261 మంది దివంగత మహనీయమూర్తుల గురించిన సమాచారం, అపురూపమైన ఫోటోలతో అందించారు.

    ఒక రకంగా ఆ బృహత్ రచన సమయంలోనే కందిమళ్ళకు ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ శ్రవ్య – దృశ్య రూపకం ఆలోచన వచ్చి ఉండాలి. ‘తెలుగు నాటకరంగ మూలస్తంభాలు’ బృహత్ ప్రయత్నాన్ని అక్షర రూపంలో అందించిన ఆయన ఈసారి ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ అనే ఈ కొత్త ప్రయత్నానికి ఆడియో – విజువల్ పద్ధతిని ఎంచుకున్నారు. బుక్ కల్చర్ కన్నా లుక్ కల్చర్ లోకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న నవతరాన్ని ఆకట్టుకొనేలా, అలనాటి నటీనటుల కృషి తెలిసేలా వారే పాడిన గ్రామఫోన్ రికార్డులు, నటించిన సినిమాలలోని దృశ్యాలు కష్టపడి సేకరించి, ఈ అరుదైన రూపకాన్ని రూపొందించారు. 

    అందమైన మాలగా గుదిగుచ్చారు. ఈ ప్రయత్నం రంగస్థల అభిమానులందరికీ అమితమైన ఆనందం పంచుతుంది. పేర్లు చదవడమే తప్ప, ప్రత్యక్షంగా తాము చూడని అమరులైన దాదాపు 84 మంది అలనాటి సుప్రసిద్ధ నటీనటులను మళ్ళీ కళ్ళ ముందు ఉంచుతుంది. అప్పటి వారి మాట, పాట, అభినయాలను ఈ తరం మళ్ళీ మళ్ళీ చూసుకొనే అవకాశం కల్పిస్తుంది.

    కళ్ళ ముందు... నాటి అపూర్వ కళాప్రతిభ
    బళ్ళారి రాఘవ, బలిజేపల్లి లక్ష్మీకాంతం, యడవల్లి సూర్యనారాయణ, వేమూరి గగ్గయ్య, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తుంగల చలపతిరావు, బందా కనకలింగేశ్వరరావు, అద్దంకి శ్రీరామమూర్తి, దాసరి కోటిరత్నం లాంటి 1920 – 30ల తరం ఈ రూపకంలో కనిపిస్తారు. అలాగే, ఆధునికులైన గరికపాటి రాజారావు, కె. వెంకటేశ్వరరావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలు జమునా రాయలు వరకు పలువురి పాటలు, పద్యాలు, నటన నిండిన వీడియోలు కూడా ఇందులో ఉన్నారు. ఎంతో శ్రమ, ఖర్చుతో కూడిన ఈ బృహత్తర యజ్ఞానికి ‘అజో- విభొ- కందాళం ఫౌండేషన్’ పక్షాన ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆర్థికంగానూ, అన్ని విధాల గానూ అండగా నిలిచారు. ఈ పదిగంటల రూపకాన్ని పూర్తిగా ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంచారు.

    యూ ట్యూబ్ వేదిక కావడం ఈ శ్రవ్య – దృశ్య కళారూపకానికి ఉన్న ప్రధానమైన వెసులుబాటు. ఎందుకో తెలియని పరుగుపందేలతో, ఎప్పుడూ తీరిక దొరకని ఈ ఆధునిక కాలంలో... ఎవరి వీలును అనుసరించి వారు ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ భాగాలను చూసే సౌకర్యం లభిస్తుంది. దేశ విదేశాలలోని నాటక రంగ ప్రియులకూ, పరిశోధకులకూ అలా ఇది ఓ అయాచిత వరం.


    తొలిసారిగా... జంట నగరాల్లో!
    ఇటీవలే గుంటూరులో లాంఛనంగా ఆవిష్కరణ జరుపుకొన్న ఈ రూపకాన్ని ఇప్పుడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంటనగరాల్లోని కళాభిమానులకు తొలిసారిగా పరిచయం చేయనున్నారు. ‘అజో-విభొ-కందాళం ఫౌండేషన్’, ప్రముఖ రంగస్థల వేదిక ‘రసరంజని’ సంయుక్తంగా ఆ పరిచయ సభను నిర్వహిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సర కానుకగా ఈ మార్చి 23, సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ పరిచయ సభ జరగనుంది. 

    హైదరాబాద్‌ రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్‌లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో నాటక రంగ ఆచార్యులు డాక్టర్ డి.ఎస్.ఎన్. మూర్తి, కళాపోషకులు – ప్రభుత్వ మాజీ సలహాదారు కె.వి. రమణాచారి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, రూపకాన్ని రూపొందించడానికి శ్రమించిన కందిమళ్ళ సాంబశివరావు, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. పది గంటల నిడివి గల ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకాన్ని ఆనాటి సభలో ఒక గంట నిడివికి కుదించి, ముఖ్యాంశాలను సభికులందరికీ ప్రదర్శించనుండడం విశేషం.  

    “ఉజ్జ్వలమైన మన గత చరిత్ర, కళారంగంలో మనవాళ్ళు చేసిన ఘనమైన కృషి... నేటికీ సరైన రీతిలో రికార్డు కాలేదు. మన తెలుగు నాటక రంగ పరిణామ క్రమాన్ని వివరిస్తూ, మన సాంస్కృతిక ఘన వారసత్వాన్ని తరువాతి తరాలకు పదిలంగా అందించడం కోసం చేయాల్సింది చాలా ఉంది. ఆ భగీరథ ప్రయత్నంలో నా వంతుగా కళాసరస్వతికి సభక్తికంగా సమర్పించిన చంద్రునికో నూలుపోగు... ఈ ‘అలనాటి నాటక ప్రస్థానం’ రూపకం” అని రంగస్థలంపై అనేక పరిశోధనాత్మక రచనలు చేసిన కందిమళ్ళ సాంబశివరావు వివరించారు.

    ఒక్కమాటలో... తెలుగు నాటకం, సినిమాలు రెంటితోనూ ముడిపడ్డ అలనాటి మహామహుల కృషిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేందుకు, వినేందుకు ఈ రూపకం ఓ అద్భుత అవకాశం. నాటక రంగ అభిమానులకే కాదు... మన ఘన చరిత్రపై ఆసక్తి ఉన్నవారందరికీ ఈ కళారూపకం మృష్టాన్నభోజనం. దృశ్య – శ్రవ్య వేదికల్లో నాటి ప్రయోగాల నుంచి నేటి వరకు వచ్చిన మార్పులను తులనాత్మకంగా అధ్యయనం చేయదలుచుకున్నవారికైతే... ఇది సిద్ధాన్నం. తాజా పరిచయ సభ సాక్షిగా పెద్దల మాటలు వింటూ, మన రంగస్థల కళా చరిత్రను దృశ్యరూపంలో ఆస్వాదించే అపూర్వ అవకాశానికి అందరూ ఆహ్వానితులే.
    - రెంటాల జయదేవ

  • వ్యాపారవేత్త, కంటెంట్‌ క్రియేటర్‌ అంకుర్‌ వారికూ సోషల్‌ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్‌కట్‌లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్‌ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్‌గా స్టోర్‌ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్‌2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. 

    పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్‌ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్‌ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్‌ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..

    T3 ఫార్ములా:

    T1 - ట్రాక్ 
    వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. 

    డైట ప్లాన్‌..

    ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్‌నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలు

    ఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.

    మధ్యాహ్నం 1 గంటకు - పండ్లు

    సాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగు

    సాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్

    అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్‌గా ఉండేలా కేర్‌ తీసుకున్నారట.


    T2 - శిక్షణ
    గుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.

    వ్యాయామ దినచర్య:

    టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)

    వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలు

    ప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు
    10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.

    T3 - రూపాంతరం
    మార్పులను నమోదు చేయడానికి  రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్‌కు పంపిచినట్లు చెప్పారు.

    చాలామటుకు అదే డైట్‌ ప్లాన్‌ ఫాలో అయినట్లు తెలిపారు.

    సెలవులకు టూర్‌కి వెళ్లేముందు లేదా బ్రేక్‌ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. 

    శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్‌ వారికూ.

    మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. 

    (చదవండి:  వెల్‌నెస్‌ కొత్త ట్రెండ్‌..ఒత్తిడిపై 'ఎత్తు')
     

  • ఒకప్పుడు ‘సక్సెస్‌’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్‌.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్‌ జనరేషన్‌ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్‌నెస్‌ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్‌నెస్‌ అనగానే కేవలం యోగా క్లాస్‌/ డైట్‌ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్‌నెస్‌ అని లైఫ్‌స్టైల్‌ కోచ్‌ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. 

    కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్‌ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్‌నెస్‌ ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే హైదరాబాద్‌ అవుట్‌స్కర్ట్స్‌లో చిన్న గెస్ట్‌హౌస్‌లు, నేచర్‌ గార్డెన్లు, వీకెండ్‌ రిట్రీట్స్‌ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్‌ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్‌ కల్చర్‌లోనూ వెల్‌నెస్‌ కీలకాంశంగా మారుతోంది. 

    ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్‌ఆర్‌ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. 

    కాన్షియస్‌.. మ్యాడ్‌ నెస్‌.. 
    హైదరాబాద్‌ అంటే ఫుడ్‌ లవర్స్‌ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్‌ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్‌ క్లినిక్స్‌ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. 

    అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్‌ చేస్తుంది. యువతపై సోషల్‌ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్‌ లెర్నింగ్, స్టార్ట్‌ అన్‌లెర్నింగ్‌’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్‌ మ్యాడ్‌ నెస్‌’ కాన్సెప్ట్‌కు బలం ఇస్తోంది. 

    ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్‌ వాటర్‌ సైడ్‌లో యోగా, మెడిటేషన్, భజన్‌ జ్యూమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్‌ లైఫ్‌స్టైల్‌లో వెల్‌నెస్‌ కేవలం ట్రెండ్‌ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్‌ నుంచి స్ట్రెంగ్త్‌కి ప్రయాణమే నేటి హైదరాబాద్‌ కొత్త లైఫ్‌స్టైల్‌.  

  • ఏఐ వచ్చేసింది ఇంకేముంది ఉద్యోగాలు ఉష్‌కాకి అంటూ మేధావులు, నిపుణులు పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ​నెట్టిట వైరల్‌ అవుతున్న ఈ విషయం గురించి తెలుసకున్నాక ఆ నిర్ణయం తప్పని ఒప్పుకుంటారు. ఎంత ఏఐ వచ్చినా..శ్రామిక జీవుల పనితనాన్ని ఎంతటి అత్యున్నత సాంకేతికత అయినా భర్తీ చేయలేదని తేటతెల్లమవుతుంది.

    నెట్టింట 'ముంబైలో ఒక ప్లంబర్ రూ. 18 లక్షలు సంపాదిస్తున్నాడు' అనే క్యాప్షన్‌తో చేసిన పోస్ట్‌ అందర్నీ ఆలోచించేలా చేసింది. ఆ పోస్ట్‌ల ముంబై ప్లంబర్‌తో జరిగిన సంభాషణను షేర్‌ చేసుకున్నాడు. అతను తన టౌన్‌షిప్‌లోని సోసైటీలో ఒక ప్లంబర్‌తో మాటమంతి కలిపినట్లు తెలిపాడు. తాము చాలా విషయాలు మాట్లాడుకుంటూ..అతడి సంపాదన గురించి ఆరా తీశాడు. కాంట్రాక్టుల ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 18 లక్షల దాక ఉంటుందని ప్లంబర్‌ చెప్పాడు. 

    అయితే తాను తమాషాగా అంటున్నాడేమో అనుకున్నా..కానీ తర్వాత అతను సంపాదిస్తున్న మొత్త లెక్కించడంతో అప్పుడు అర్థమైంది. పైగా ఆ వ్యక్తికి హ్యుండాయ్ క్రెటా (2023 మోడల్) కారు ఉంది, ఇల్లు కూడా కట్టుకున్నాడట, ఓ పొలం కూడా కొన్నానని చెబుతున్నాడు. అతను రిచ్‌ ప్లంబర్‌ అని అప్పుడే నాకు తెలిసంది. అంటే తానెంతలా సంపాదించాలి అని ఆలోచిస్తు ఉండిపోయా అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. 

    ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు సైతం ఏఐ బ్యూకాలర్‌ ఉద్యోగాలను అమాంత మిగిసింది అన్నది ఎవరూ అని ఒకరు, శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది అని మరొకరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. 

    (చదవండి: స్ట్రాంగెస్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆమె..! ఏకంగా పదిమంది మగవాళ్లను..)
     

  • గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్‌ వల్లగానీ  వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్‌ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్‌ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్‌ సర్జరీ, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు  వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.

    గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్‌ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె  డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్‌ అంటే ఏమిటో చూద్దాం.

    స్టెంట్‌ అంటే ఏమిటి...? 
    గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్‌ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్‌ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్‌ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్‌ స్టెంట్‌ అమర్చడంగా చెబుతారు.

    నిజానికి ఇలా స్టెంట్‌ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్‌ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్‌ను పంపడమూ జరుగుతోంది.  

    గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి...  తొలుత యాంజియోగ్రామ్‌ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే...  బైపాస్‌ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే  స్టెంట్‌ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.  నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

    గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే...  
    గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్‌ సర్జరీ. రెండోవి వాల్వ్‌ సర్జరీలు. వీటిల్లో... బైపాస్‌ సర్జరీలోనే... ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్‌ కార్డియాక్‌ సర్జరీ, టోటల్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్‌క్‌ సర్జరీ, హైబ్రిడ్‌ సర్జరీ, రొబోటిక్‌ బైపాస్‌ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...

    బైపాస్‌ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్‌ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా  రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్‌ శస్త్రచికిత్స. 

    అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని)   నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్‌ గ్రాఫ్ట్‌ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్‌ గ్రాఫ్ట్‌ అంటారు.

    బైపాస్‌ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... 
    గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్‌ మెయిన్‌లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్‌ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి.  

    ఓపెన్‌హార్ట్‌ సర్జరీ అంటే...? 
    బైపాస్‌ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్‌ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్‌ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా  గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా  కొనసాగేందుకు హార్ట్‌లంగ్‌ మెషిన్‌ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్‌ మెషిన్‌ను వాడతారో... దాన్ని ‘ఓపెన్‌హార్ట్‌ సర్జరీ’ పరిగణించవచ్చు.

    బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ అంటే...? 
    దీన్ని ‘ఆఫ్‌ పంప్‌ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్‌ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్‌ అనే ఒక ప్రత్యేక  పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్‌ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్‌ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.

    మినిమల్లీ ఇన్వేజివ్‌ కార్డియాక్‌ సర్జరీ అంటే..? 
    గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్‌ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. 

    చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్‌ ఆపరేషన్‌ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్‌కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.

    టీసీఆర్‌ఏటీ : ఈ ‘టీసీఆర్‌ఏటీ’ అనేది ‘టోటల్‌ కొరనరీ రీవాస్క్యులరైజేషన్‌ బై యాంటీరియర్‌ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్‌గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన  ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్‌ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. 

    దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్‌ (కార్డియోపల్మునరీ బైపాస్‌ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్‌ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్‌ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.

    కంప్లీట్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులరైజేషన్‌ అంటే..? 
    బైపాస్‌ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్‌ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్‌ చేస్తారని అర్థం.  చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్‌లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్‌ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్‌ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్‌) చేస్తారు. 

    కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్‌ ఆర్టీరియల్‌ రీవాస్క్యులరైజేషన్‌లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.

    ఎండోస్కోపిక్‌ సర్జరీ అంటే...? 
    ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ...  లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ...  పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా  చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్‌ చాలా త్వరితంగా  కోలుకోవడం సాధ్యమవుతుంది.

    హైబ్రీడ్‌ సర్జరీ అంటే...? 
    కొన్నిసార్లు బై΄ాస్‌ శస్త్రచికిత్సలో పేషెంట్‌ చాలా సీరియస్‌గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్‌ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్‌ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్‌ బై΄ాస్‌ సర్జరీ’ అంటారు.

    రొబోటిక్‌ బైపాస్‌ సర్జరీ అంటే...?
    ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్‌ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీ లేదా ఎండోస్కోపిక్‌ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.  అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్‌ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.

    బైపాస్‌ సర్జరీ తర్వాత... 
    బైపాస్‌ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్‌ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. 

    అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్‌ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్‌ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.

    త్వరగా కోలుకోవడం కోసం... 
    పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది.  ఇక ఈ ఆపరేషన్‌ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...

    పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.

    చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను  తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.
    నిర్వహణ: యాసీన్‌

    డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

    డాక్టర్‌ టి. వంశీధర్‌, సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ 

    (చదవండి: పైల్స్‌ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!)

  • ఓ మహిళ ఎంత శక్తి స్వరూపిణి అని చెప్పే ఘటన ఇది. అందరు నిర్ఘాంతపోయేలా మగవాళ్లను చిటికెలో ఎత్తిపడేసింది. నిజానికి ఆమె శారీరక బలం, ఓర్పుకి సలాం అనాల్సిందే. అంతలా సులభంగా మగవాళ్లను ఎత్తిపడేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించిందామె. ఎవరా ఆ మహిళ అంటే..

    సినా రుప్పెంతాల్ అనే అథ్లెట్‌  ఈ ఘనతను సృష్టించింది. ఒక మహిళ ఎంత బలవంతురాలు అనేది చెప్పకనే చెప్పింది తన అసాధారణమైన సాహసంతో కేవలం 37.44 సెకన్లలో సుమారు 10 మంది పురుషులను ఎత్తి విసిరి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుని నెలకొల్పింది. 

    ఈ క్రీడాకారిణి తన అసాధారణమైన శక్తి, వేగం, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ ఛాలెంజ్‌లో ఆ మహిళ ప్రతి ఒక్కర్ని ఎత్తి వారిని తన భుజంపై నుంచి వేగంగా ఒకరి తర్వాత ఒకరిని నిర్ధిష్ట సమయంలో విసిరి పూర్తి చేస్తింది. ఇక్కడ శారీరక బలం తోపాటు కచ్చితమైన సమన్వయం, ఓర్పు అవసరం. ఇక్కడ ఆమె ప్రతి ఒక్కరిని చాలా సురక్షితంగా ఎత్తి నియంత్రిత కదలికలతో విసిరింది. ఆమె అలా అలవోకగా అంతమంది మగవాళ్లను ఎత్తిపడేస్తున్న విధానం చూసి ప్రేక్షకులు సైతం విస్తుపోయారు. 

    ఈ రికార్డు వాస్తవానికి  ఆగష్టు 2025లో మ్యూనిచ్‌లో జరిగిన 'డై గ్రోస్సే షో డెర్ వెల్ట్‌రికోర్డే' అనే టీవీ కార్యక్రమంలో నెలకొల్పింది సినా రుప్పెంతాల్. ఈ ఛాలెంజ్‌ సాంప్రదాయ స్ట్రాంగ్‌మ్యాన్‌ ఈవెంట్‌లను పోలి ఉంటుంది. అయితే ఇక్కడ అథ్లెట్లు బరువైన రాళ్లను ఎత్తడం, వాహనాలను లాగడం, భారీ బరువులను మోయడం, వంటి విన్యాసాలతో తమ బలాన్ని ప్రదర్శిస్తారు. కానీ సినా రుప్పెంతాల్ రికార్డు మాత్రం అత్యంత విలక్షణమైన రికార్డుగా వార్తల్లో నిలిచింది. 

    ఎవరీ సినా రుప్పెంతాల్
    సినా రుప్పెంతాల్ ఒక జర్మన్ స్ట్రాంగ్‌వుమన్. ఆమె ఉన్నత స్థాయి అథ్లెట్, స్పోర్ట్స్ సైంటిస్ట్. ఆమె ప్రపంచంలో నాల్గవ అత్యంత బలవంతురాలైన సహజ మహిళగా ర్యాంక్ పొందింది. అంతేగాదు స్ట్రెంత్ స్పోర్ట్స్‌లో అనేక జర్మన్ రికార్డులను కలిగి ఉంది. 

    సింపుల్‌గా చెప్పాలంటే రుప్పెంతాల్ STRONGESTకు బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించొచ్చు. అంతేకాదండోయ్‌..ఆమె మహిళా స్ట్రెంత్ అథ్లెట్లకు ఒక వేదికను అందించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ స్ట్రాంగ్‌వుమెన్ జర్మనీ వ్యవస్థాపక సభ్యురాలు కూడా.

     

    (చదవండి: ఎల్పీజీ గ్యాస్‌ కొరత..ఆ స్టవ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌)
     

International

  • ఇరాన్‌తో యుద్ధంలో తాము పాలు పంచుకోవాలనుకోవడం లేదని నాటో (NATO) మిత్రదేశాల్లో మెజారిటీ దేశాలు తమకు సమాచారం అందించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదంటూ తన ట్రూత్ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ తేల్చి చెప్పారు.

    "మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా మేము చేపట్టిన సైనిక చర్యలో పాలుపంచుకోవడం తమకు ఇష్టం లేదని మెజారిటీ నాటో (NATO) 'మిత్ర దేశాలు చెప్పాయి. వాస్తవానికి మేము చేస్తున్న పనిని దాదాపు ప్రతి దేశం గట్టిగా అంగీకరించింది, అలాగే ఇరాన్ ఏ రూపంలోనూ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని అవి భావిస్తున్నాయి. అయినప్పటికీ అవి వెనకడుగు వేశాయి.

    ..వారి చర్య నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే నాటో అనేది ఒక 'వన్ వే స్ట్రీట్' (ఏకపక్ష ప్రయోజనం) అని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. ఈ దేశాల రక్షణ కోసం మేము ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాము. మేము వారిని రక్షిస్తాము, కానీ అవసరమైన సమయంలో వారు మా కోసం ఏమీ చేయరు’’ అంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

    ‘‘మేము ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. వారి నౌకాదళం అంతమైంది. వైమానిక దళం పోయింది, వారి యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్. రాడార్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా, దాదాపు అన్ని స్థాయిలలోని వారి నాయకులు అంతమొందించబడ్డారు. వారు ఇకపై మనల్ని కానీ, మన మధ్యప్రాచ్య మిత్రదేశాలను కానీ, ప్రపంచాన్ని కానీ ఎప్పటికీ భయపెట్టలేరు. మేము అపారమైన సైనిక విజయాన్ని సాధించినందున మాకు ఇకపై నాటో దేశాల సహాయం 'అవసరం' లేదు. అటువంటి కోరికా లేదు. నిజానికి మాకు అది ఎప్పుడూ అవసరం పడలేదు! అదేవిధంగా జపాన్, ఆస్ట్రేలియా లేదా దక్షిణ కొరియా సహాయం కూడా మాకు అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను, మాకు ఎవరి సహాయమూ అవసరం లేదు!’’ అంటూ ట్రంప్‌ ఘాటుగా రాసుకొచ్చారు.

  • ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి నుంచి ఇరాన్  కొత్త సుప్రీం లీడర్‌ మోజ్తబా ఖమేనీ లిప్త పాటులో ప్రాణాలతో బయట పడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ కాంపౌండ్‌పై జరిగిన భయంకరమైన దాడి,  ఖమేనీ తృటిలో ప్రాణాలతో బైటపడిన వైనం కొత్తంకథనం సంచలనంగా మారింది.

    తృటిలో తప్పిన ప్రమాదం
    ది టెలిగ్రాఫ్ నివేదించిన లీకైన ఆడియో రికార్డింగ్ ప్రకారం, 56 ఏళ్ల  ఖమేనా టెహ్రాన్‌లోని తన నివాసంపై క్షిపణులు దాడి చేయడానికి కొన్ని క్షణాల ముందు బయటకు వచ్చారు. ఫిబ్రవరి 28 ఉదయం 9:32 గంటలకు టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ నివాసంపై ఇజ్రాయెల్ 'బ్లూ స్పారో' బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో మోజ్తబా ఏదో పని మీద నివాసం నుండి బయటకు వచ్చి ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లారు. అదే సమయంలో క్షిపణులు భవనాన్ని తాకాయి. ఆయన తిరిగి లోపలికి వెళ్లేలోపే ఈ విధ్వంసం జరిగింది.

    అలీ ఖమేనీ కార్యాలయంలో ప్రోటోకాల్ విభాగాధిపతి  మజాహెర్ హొస్సేనీ, మార్చి 12న టెహ్రాన్‌లోని ఖోల్హాక్ ప్రాంతంలో ఉన్నత మత పెద్దలను, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లను ఉద్దేశించి ప్రసంగించగా, లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని 'ది టెలిగ్రాఫ్' తెలిపింది.

    (బంగారం, డాలర్‌ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!)

    హొస్సేనీ ప్రకారం, ఒకేసారి పలు ప్రాంతాలపై దాడి చేసేలా ఈ దాడులు ప్లాన్‌ చేశారు.మోజ్తబా నివాసం, అతని బావమరిది మిస్బా అల్-హుదా బఘేరీ కనీ ఇల్లు, అతని సోదరుడు ముస్తఫా నివాసం ఇలా మూడు క్షిపణులతో దాడి చేశారు. ఈ దాడిలో మోజ్తబా ప్రాణాలతో బయటపడినప్పటికీ, తండ్రి మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, తల్లి, ఆయన భార్య (హద్దాద్) కుమారుడు అక్కడికక్కడే మరణించారు. పలువురు ఉన్నత ఇరాన్ అధికారులు మరణించారు.

    సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ మహమ్మద్ షిరాజీ ఈ దాడిలో శరీర భాగాలు ఛిద్రమై అత్యంత దారుణంగా మరణించారు. చివరకు కొన్ని కిలోల మాంసం దొరికిందని హోస్సేని ఆ రికార్డింగ్‌లో చెప్పారు. క్షిపణుల తాకిడికి భవనాలు పూర్తిగా ధ్వంస మయ్యాయి.

    (కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్‌ సుప్రీం)

    ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు, షికార్లు
    ఈ దాడి తరువాత  మోజ్తబా ఖమేనీ కొత్త సుప్రీంగా ఎన్నికైనప్పటికీ బహిరంగంగా కనిపించలేదు. దీనితో ఆయన తీవ్రంగా గాయ పడ్డారని లేదా మరణించి ఉంటారనిఊహాగానాలకు ఆజ్యం పోసింది. తరువాత తీవ్రగాయాలతో, కాలు కోల్పోయి కోమాలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే కేవలం కాలికి చిన్న గాయం మాత్రమే అయ్యిందని అంతర్గత వర్గాల ఆడియో రికార్డింగ్ ద్వారా తెలుస్తోంది.

    ఇదీ చదవండి: సంచలన ఆరోపణలు : ట్రంప్‌నకు భారీ షాక్‌

  • ఇరాన్‌పై యుద్దం గత 18 రోజులుగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) అధిపతి జోసెఫ్ కెంట్, ఇరాన్-అమెరికా యుద్ధానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. మనస్సాక్షిని చంపుకొని ఇరాన్‌పై వార్‌కు మద్దతుగా నిలవలేను అంటూ లేఖ రాయడం సంచలనం రేపింది. యుద్ధం జరుగుతున్న తరుణంలో అత్యున్నత స్థాయి భద్రతా అధికారి  కీలక ఆరోపణలు చేస్తూ తప్పుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశ మైంది.

    ఇరాన్వల్ల అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారని కెంట్ తన లేఖలో పేర్కొన్నారు. "నా అంతరాత్మ సాక్షిగా ఈ యుద్ధానికి నేను మద్దతు ఇవ్వలేను" అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఒక పథకం ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఇరాన్ వల్ల ముప్పు ఉందని అధ్యక్షుడు ట్రంప్‌ను నమ్మించారని ఆయన విమర్శించారు. ఇరాన్‌పై దాడి చేస్తే విజయం త్వరగా లభిస్తుందని ట్రంప్‌ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుదోవ పట్టించారని ఆయన లేఖలో రాశారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయని ట్రంప్‌కు గత జూన్ నాటికే  తెలుసని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: కాల్పుల విరమణ ప్రసక్తే లేదు : ఇరాన్‌ సుప్రీం

    కాగా అతివాద మితవాద వ్యక్తులతో, కుట్ర సిద్ధాంతాలతో గతంలో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ, కెంట్‌ నియామకాన్ని డెమోక్రాట్లు  తీవ్రంగా వ్యతిరేకించారు. 2022 కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమయంలో, కెంట్ 'ప్రౌడ్ బాయ్స్' అనే అతివాద మితవాద సైనిక బృందంలో సభ్యుడైన గ్రాహం జోర్గెన్‌సన్‌కు కన్సల్టింగ్ పని కోసం డబ్బు చెల్లించారని ఆరోపణలెదుర్కొన్నారు. అయినప్పటికీ, గత ఏడాది జూలైలో 52-44 ఓట్ల తేడాతో ఆయన పదవిలో నియమితులయ్యారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ దాడి వెనుక ఫెడరల్ ఏజెంట్ల హస్తం ఉందనే కుట్ర సిద్ధాంతాలను, అలాగే 2020 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారనే తప్పుడు వాదనలను కూడా కెంట్ గతంలో సమర్థించారు.
    ఇదీ  చదవండి: బంగారం, డాలర్‌ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!

  • టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రతీకారదాడులను కొనసాగిస్తోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో పదేపదే డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అమెరికా దౌత్యకార‍్యాలయం ఉండే బాగ్దాద్‌ కాంప్లెక్స్‌ లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తుండడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఆకాశంలో పక్షులు హాయిగా ఎగురుకుంటూ వెళ్తుంటాయి. బాగ్దాద్‌లో అచ్చం పక్షిలా ఓ డ్రోన్‌ ఎగురుకుంటూ దాడి చేయడానికి వెళ్తున్న వీడియోను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పోస్ట్‌ చేసింది. 

    బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీపై ఆ డ్రోన్‌ ఎగిరింది. డ్రోన్ ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) వీడియో ఇది. ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే డ్రోన్ కెమెరా చూపిన దృశ్యం, డ్రోన్ చూస్తున్నట్టు కనిపించే వీడియో.

    ఈ ఘటనకు ముందు ఇవాళ తెల్లవారుజామున బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ, ఒక హోటల్ పై డ్రోన్లతో ఇరాన్‌ దాడికి యత్నించిందని నివేదికలు వచ్చాయి. ఎంబసీ దగ్గర గగనతల రక్షణ వ్యవస్థ ఒక ప్రాజెక్టైల్‌ను అడ్డుకున్నట్టు వీడియోలో కనిపించింది. ఇరాక్ దక్షిణాన ఉన్న మజ్నూన్ ఆయిల్ ఫీల్డ్ కూడా దాడికి గురైందని ఇరాక్ సాయుధ దళాల సేనాధిపతి ప్రతినిధి తెలిపారు.

    ప్రెస్ టీవీ ఎక్స్ పోస్టులో డ్రోన్ “స్వేచ్ఛాయుత పక్షిలా” ఎంబసీపై ఎగిరిందని పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించకుండా డ్రోన్ ఎంబసీపై ఎగిరిన దృశ్యాలను ఇరాకీ రెసిస్టెన్స్‌ గ్రూప్ (ఇరాన్‌కు మద్దతిచ్చే మిలీషియా గ్రూప్‌) విడుదల చేసిందని తెలిపింది.

    కాగా, నాలుగు డ్రోన్లు అమెరికా ఎంబసీపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇరాక్ గగనతల రక్షణ వ్యవస్థలు అన్ని డ్రోన్లను కూల్చేశాయని వార్తలు వస్తున్నాయి.  ఒక డ్రోన్ అబూ నవాస్ వీధిలో పడిందని, మరొకటి గ్రీన్ జోన్‌లో ఎంబసీ దగ్గర పడిందని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అల్-రషీద్ హోటల్ పై ఒక డ్రోన్ పడిందని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రయెల్‌ దాడులతో  మొదలైన  యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కాల్పుల విరమణ ప్రతిపాదను మోజ్తబా తిరస్కరించినట్టు తెలుస్తోంది.


    అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ తిరస్కరించారని సమాచారం. అమెరికా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌ తమ కాళ్లమీద పడి ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.  

    ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!

    ఇజ్రాయెల్‌ చేసిన దాడిలో ఇరాన్‌ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబ సభ్యులు దారుణంగా హత్య గావించబడిన తరువాత ఆయన కుమారుడు మోజ్తబా సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా  ఇరాన్ ఎప్పటికీ వెనకడుగు వేయదని, పూర్తి శక్తితో ప్రతిఘటిస్తుందని, దివంగత అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి మాత్రమే కాకుండా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి పౌరుడికి ప్రతీకారం తీర్చుకుంటుందని, శత్రువు మూల్యం చెల్లించాల్సిందేనని మోజ్తాబా ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే.

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరి
    మరోవైపు, ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఇదీ  చదవండి: బంగారం, డాలర్‌ కాదు : దీని దూకుడు మామూలుగా లేదు!

    ఖమేనీ మాస్కో ఆసుపత్రిలో కోలుకుంటున్నారా?
    ఫిబ్రవరి 28న తన తండ్రిని బలిగొన్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడిన 56 ఏళ్ల ఖమేనీని వైద్య చికిత్స కోసం రష్యాకు తరలించి ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి.కానీ  అంచనాలను ధృవీకరించడానికి గానీ, ఖండించడానికి గానీ రష్యా నిరాకరించింది.
     

  • ఇరాన్‌ పై అమెరికా- ఇజ్రాయెల్‌ ఫిబ్రవరి 28న  మొదలు పెట్టిన దాడులు 18వ రోజుకు చేరుకున్నాయి. సాధారణంగా యుద్ధం, లేదా సంక్షోభ సమయాల్లో చమురు, బంగారం, అమెరికన్‌ డాలర్‌ బాగా పెరుగుతాయి. అలాగే స్టాక్‌మార్కెట్లు కూడా పెట్టుబడుదారుల ప్యానిక్‌ అమ్మకాలతో కుప్పకూలుతాయి. కానీ ప్రస్తుత ఇరాన్‌ యుద్ధ సమయంలో మాత్రం మార్కెట్ సమీకరణాలు మారుతున్నాయి. బంగారం, డాలర్‌ను మించి దూసుకుపోతోంది. అదేంటో తెలుసుకుందాం ఈ కథనంలో  


    మారుతున్న పెట్టుబడి ధోరణికి అనుగుణంగా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుండి  బిట్‌కాయిన్ విలువ 74 వేల  డాలర్ల మార్కును దాటింది.  అంటే సుమారు 10 శాతం వృద్ధిని నమోదు చేసింది.  బంగారం ఔన్సుకు దాదాపు 5,035 డాలర్ల వద్ద ఉంది. గతంలో బిట్‌కాయిన్‌ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారంగా భావించేవారు. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ఇది సేఫ్‌గా మారుతుండటం విశేషం.

    బిట్‌ కాయన్‌పై ఎందుకింత ఆసక్తి?

    INRGrid స్టేబుల్ వ్యవస్థాపకుడు అనుజ్ చౌదరి అభిప్రాయం ప్రకారం.. బిట్‌కాయిన్‌ను బ్యాంకులు లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తక్షణమే సరిహద్దులు దాటించి తరలించ వచ్చు. యుద్ధం వంటి సమయాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించినా, బిట్‌కాయిన్ నియంత్రణ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటుంది. బంగారం లేదా సాంప్రదాయ మార్కెట్‌ల వలె కాకుండా, బిట్‌కాయిన్ 24/7 ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్‌లు మూసి ఉన్నప్పుడు, భౌగోళిక రాజకీయ పరిణామాలకు  అనుగుణంగా పెట్టుబడిదారులు తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచ సంఘటనల సమయంలో ఇదొక ప్రాధాన్య సాధనంగా నిలుస్తుంది.

    ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌ ప్రకటన : ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ?!

    ఇన్వెస్ట్‌పీడియా నివేదిక ప్రకారం, ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచీ  ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్ ,ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ బిట్‌కాయిన్ ఫండ్‌తో సహా బిట్‌కాయిన్‌కు  1.1 బిలియన్‌ డాలర్లకు మించి పెట్టుబడులు వచ్చాయంటేనే బిట్‌కాయన్‌ క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

    బిట్‌కాయిన్ నిజంగా సురక్షితమేనా?
    ఇరాన్ యుద్ధం సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడంతో, కొంతమంది పెట్టుబడిదారులు క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లవచ్చు. అయితే, ఒక రక్షణ సాధనంగా (హెడ్జ్‌గా) బిట్‌కాయిన్‌ను బంగారంతో పోల్చడంపై నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు అంత సులువు కాదు. దీనిపై నిపుణులు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం భౌతికంగా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని జప్తు చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బిట్‌కాయిన్ డిజిటల్‌గా ఉండటం వల్ల దాన్ని ఎవరూ సీజ్ చేయలేరు. కానీ అయితే, దీని ధరల్లో ఉండే  తీవ్రమైన హెచ్చుతగ్గుల (Volatility) చాలా తీవ్ర స్థాయిల్లో ఉంటుంది.  అందుకే   లాభనష్టాలను బేరీజు వేసుకోనొ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం, లేదా కోవిడ్-19 సంక్షోభం వంటి భౌగోళిక-రాజకీయ సంక్షోభాల సమయంలో క్రిప్టోకరెన్సీ పెరగవచ్చు. అయినా వ్యాపారులు/ పెట్టుబడిదారులు బిట్‌కాయిన్‌ను నమ్మదగిన సురక్షిత ఆశ్రయ ఆస్తిగా పరిగణించ కూడదని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర బ్యాంకులు బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసే అవకాశం లేనందున, రిజర్వ్ ఆస్తిగా దాని పాత్ర పరిమితం. మరోవైపు, గత కొన్నేళ్లుగా అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకున్నాయనేది గమనించాలి.

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా గత 18 రోజులుగా ఇరాన్‌ పోరాడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ, టెహ్రాన్ బసిజ్ పారామిలిటరీ దళాల కమాండర్‌ సోలేమానీ హతమయ్యారని  ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం తెలిపారు.
     

    కీలక నేత అలీ లారిజానీ మృతి
    ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులలో ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ చనిపోయారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.. ఈ దాడుల్లో బాసిజ్ రెసిస్టెన్స్ ఫోర్స్ అధిపతి సులేమానీ లక్ష్యంగా ఈదాడి జరిగిందని వెల్లడించాయి.అయితే లారిజాని ఈ దాడిలో మరణించారా లేదా గాయపడ్డారా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.

    ఇంకా స్పందించని ఇరాన్‌ 
    ఈ నివేదికలపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. లారిజానిని ఇరాన్ అధికార వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా  భావిస్తారు. ఈ వార్త నిజమైతే, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్‌లో మరణించిన అత్యంత కీలకమైన వ్యక్తి లారిజానీ. లారిజానీ గతంలో అణు చర్చల ప్రతినిధిగా కూడా పనిచేశారు.

    మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ, ఇరాన్ ప్రజల పోరాటం కొనసాగుతుందని తమ పోరాటంలో టెహ్రాన్ "దృఢంగా" ఉంటుందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి లారిజాని ముస్లిం ఐక్యతకు పిలుపునిచ్చిన మరునాడు ఈ వార్తలు  వెలువడ్డాయి. 
     

Business

  • రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.

    చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది.

  • బీవైడీ కంపెనీ భారతదేశంలో తన సీలియన్ 7 కారును లాంచ్ చేసి ఏడాది కాలం అయింది. ఈ సందర్భంగా సంస్థ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.70000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని బీవైడీ వెల్లడించింది.

    బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, కాగా ప్రీమియం వెర్షన్ అదే వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లు 82.56 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందినప్పటికీ.. NEDC ప్రమాణాల ప్రకారం, పెర్ఫార్మెన్స్ మోడల్ డ్రైవింగ్ రేంజ్ 542 కిలోమీటర్లు కాగా.. ప్రీమియం వేరియంట్ 567 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

    బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్‌ ప్రీమియం, పెర్ఫామెన్స్ ధరలు వరుసగా.. రూ. 49.40 లక్షలు, రూ. 54.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ముందు బుక్ చేసుకున్న 1100 మందికి ఇన్‌స్టాలేషన్‌తో పాటు 11 kW హోమ్ ఛార్జర్‌ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాకేజీలో రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కూడా లభిస్తాయి.

  • ఈవీ చార్జర్లు తదితర ఉత్పత్తుల సంస్థ ఎగ్జికామ్‌ టెలీసిస్టమ్స్‌ హైదరాబాద్‌లో తమ కొత్త సమగ్ర తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీనిపై రూ. 216 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు సంస్థ సీఈవో అనంత్‌ నహతా తెలిపారు. 18.4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు తొలి దశతో ఉత్పత్తి సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, ప్రాంతీయంగా 750 పైగా ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.

    దేశీయంగా ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, లిథియం అయాన్‌ బ్యాటరీ సిస్టమ్స్, క్రిటికల్‌ పవర్‌ సొల్యూషన్స్‌కి పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని నహదా చెప్పారు. ఇందులో ట్రై–ఫ్లక్స్‌ లిక్విడ్‌ కూల్డ్‌ పవర్‌ మాడ్యూల్స్‌ని కూడా తయారు చేయనున్నట్లు, అలాగే దేశీయంగా తొలి ఈవీ చార్జర్‌ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్‌ సెంటర్‌ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

  • ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్‌టైల్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.

    ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.

    కనీస పెన్షన్‌పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.

    ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!

  • రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.

    ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్‌పూర్‌ చెరువులో తమ లేఔట్‌ మునిగిపోయిందని సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ సొసైటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వాపోయారు.

    కాప్రా జీఆర్‌ రెడ్డి నగర్‌ హెచ్‌ఎండీఏ లే ఔట్‌లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్‌ శోభనా కాలనీలోని అక్షయ ఎన్‌క్లేవ్‌ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్‌ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

  • సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.

    బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్‌కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.

    ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.

  • దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరిలో నిరుద్యోగిత రేటు (యూఆర్‌) 5 శాతంగా ఉండగా, గత నెల 4.9 శాతానికి నెమ్మదించినట్లు కార్మిక శక్తి సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.6 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది.

    గత నెలలో మహిళల్లో (15 సంవత్సరాలు పైబడిన వారు) యూఆర్‌ జనవరిలో 5.6 శాతంగాను ఉండగా, గత నెల 5.1 శాతానికి దిగివచి్చంది. పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 8.7 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,74,879 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రజల్లో ఉద్యోగాలు, నిరుద్యోగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే పీఎల్‌ఎఫ్‌ఎస్‌ని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) నిర్వహిస్తుంది.

  • మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.

    డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్‌మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • 2026 గణతంత్ర దినోత్సవం రోజు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ కారు.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఐదు వేరియంట్లు, మూడు ఇంజిన్ ఎంపికలతో లభించే ఈ కారు.. ఆరు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    రెనాల్ట్ కంపెనీ 2026 డస్టర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

    ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 2026 రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్‌లో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసి E-టెక్ 160 హైబ్రిడ్ సెటప్‌తో రూపొందించారు. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్‌ అందిస్తుంది.

    160 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (టర్బో TCe 160) కూడా ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ రెండింటితోనూ అందుబాటులో ఉంది. బేస్ మోడల్‌ విషయానికి వస్తే.. ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

    కొత్త రెనాల్ట్ డస్టర్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

    భద్రతకు సంబంధించిన ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ SUVకి లెవెల్ 2 ADAS కూడా లభిస్తుంది.

  • మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

    ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్‌-ఫుడ​్‌ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్‌లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.

    రసాయన ఎరువుల సెగ

    ప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్‌ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.

    శాస్త్రీయ వాస్తవాలు

    ఐపీసీసీ(ఇంటర్‌గవర్న్‌మెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ చేంజ్‌) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.

    రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్‌సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.

    మార్పు కోసం వ్యూహం

    ప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.

    • రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.

    • నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.

    • ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.

    • ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.

    యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి.

  • భారతీయ శాటిలైట్‌ ఇంటర్నెట్ కమ్యునికేషన్‌ (శాట్‌కామ్‌) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్‌’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్‌)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

    అనుమతుల కోసం..

    భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్‌) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.

    స్టార్‌లింక్ వర్సెస్ కూపర్‌

    ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో పాగా వేయడమే కాకుండా భారత్‌లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్‌లింక్‌తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్‌లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.

    భారీ కెపాసిటీతో సవాలు

    స్టార్‌లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్‌వర్క్ భారత్‌లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

    టెలికాం రంగంలో కొత్త విప్లవం

    కేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్‌ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

    భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్‌ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!

    బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్‌డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.

    కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.

    కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితి

    సాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్‌ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.

    బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్‌డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.

National

  • షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్లు, కమిషన్ల ఛైర్‌పర్సన్లు, వైస్-ఛైర్‌పర్సన్లు, డిప్యూటీ ఛైర్‌పర్సన్లు, ప్రిన్సిపల్ అడ్వైజర్లు,  బోర్డులు, రాజకీయ సలహాదారులకు ఇచ్చిన ‘కేబినెట్ ర్యాంక్’ హోదాను ఉపసంహరించుకుంది. 

    పరిపాలనా ప్రోటోకాల్‌ను సరళీకరించేందుకు తీసుకున్న ఈ నిర్ణయంలో సంబంధిత అధికారుల జీతం, నెలవారీ భత్యాలపై 20 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నట్లు చెప్పింది. ఇది 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు.

    ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకుంటోంది. క‍్యాబినెట్ ర్యాంక్ హోదా రద్దు నిర్ణయాన్ని భద్రతా కవర్లు, అధికార వాహనాలు, సిబ్బంది హక్కులు వంటి ప్రోటోకాల్ వ్యయాలను తగ్గించే చర్యగా కూడా భావిస్తున్నారు.

  • న్యూఢిల్లీ: ఓ యువకుడు హీరోలా తుపాకీ పట్టుకుని పోజులు ఇస్తూ వీడియో తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో తుపాకీని లోడ్‌ చేసి, గుండెకు గురి పెట్టుకున్నాడు. అనుకోకుండా అది పేలడంతో బుల్లెట‍్టు అతడి శరీరంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

    ఎలా జరిగింది? 
    ఢిల్లీకి చెందిన పవన్‌ అనే ఓ యువకుడు చిరునవ్వులు చిందిస్తూ నిలబడి తుపాకీతో వీడియో తీసుకుంటున్నాడు. అతడి స్నేహితుడు వీడియో చిత్రీకరిస‍్తున్నాడు. తుపాకీ పట్టుకున్న పవన్‌ ట్రిగ్గర్‌ను స్వల్పంగా తాకాడు. “చలానా మత్ భాయ్ (కాల్చవద్దు అన్నా)” అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి హెచ్చరించాడు. అయినప్పటికీ తుపాకీని పవన్‌ తన చాతీపై పెట్టాడు. అకస్మాత్తుగా అది పేలింది. ఆ వెంటనే పవన్‌ కుప్పకూలిపోయాడు. పవన్‌ను ఆసుపత్రికి తరలించినా, చికిత్స సమయంలో అతడు మృతి చెందాడని అధికారులు తెలిపారు.

    ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని దల్లుపురాలో జరిగింది. తుపాకీకి లైసెన్స్ ఉంది. అది వీడియో చిత్రీకరించిన యువకుడిదే అని పోలీసులు తెలిపారు. వీడియో తీస్తున్న వ్యక్తి పవన్‌కు తుపాకీ ఎలా లోడ్ చేయాలో సూచనలు ఇస్తూ, కాల్చవద్దని హెచ్చరించాడని పోలీసులు చెప్పారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పవన్ తుపాకీతో స్టంట్లు చేస్తూ రీల్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. పవన్ తుపాకీ లాక్‌లో ఉందని నమ్మాడని పోలీసులు తెలిపారు. 

  • పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది.  2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను  అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు.  ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా  టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.

    సై అంటే  సై అంటున్న దీదీ
    బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.

    గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్‌పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు.  బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.

    కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.  

    2021లో ఇలా
    2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్  గెలుపు సాధించింది.  నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది.   2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ  2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా  నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల  వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది.
     

  • చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌పై టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున పలు కామెంట్లు చేయడంపై తమిళనాడులో రాజకీయ వివాదం మొదలైంది. తాజాగా, ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకేలో అత్యధిక ప్రభావం చూపిస్తున్న కుటుంబ బెదిరింపుల వల్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా మానుకున్నారని అన్నారు. అర్జున ఈ వ్యాఖ్యను తమ నాయకుడు విజయ్ మానసికంగా ఎంతగా బలంగా ఉన్నారో చెప్పడానికి చేశారు. విజయ్‌ ఏ బెదిరింపులకు లొంగలేదని చెప్పాలన్న ఉద్దేశంతో అన్నారు.  అర్జున చేసిన ఈ కామెంట్‌ వివాదానికి దారితీసింది. అన్ని పార్టీల నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి.

    దీనిపై రజినీకాంత్‌ స్పందించారు. అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్జున చేసిన కామెంట‍్లలో నిజం లేదని పేర్కొంటూ  తమిళంలో ఓ ప్రకటన చేశారు. "సమయం ఇప్పుడు సమాధానం చెప్పకపోవచ్చు.. చివరికి నిజాన్ని బయటపెడుతుంది. సరైన సమాధానం ఇస్తుంది" అని అందులో అన్నారు.

    కాగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందిస్తూ ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. ‘రజినీకాంత్ రాజకీయాలకు అతీతంగా ఉంటారు. ఆయనను అందరూ గౌరవిస్తారు. ఆయన కీర్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అలాగే, దానికి దూరంగా ఉండే హక్కు అందరికీ ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మర్యాద అనిపించుకోదు" అని ఎక్స్‌లో చెప్పారు.

    రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై దశాబ్దాలుగా ఊహాగానాలు కొనసాగాయి. 2020లో ఆయన ఆరోగ్య సమస్యలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజకీయాల్లోకి రావద్దని నిర్ణయం తీసుకున్నారు. టీవీకే నాయకుడి వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఎస్ రెగుపతి కూడా విమర్శలు గుప్పించారు. అర్జున చేసిన వ్యాఖ్యలు అసత్యాలని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా టీవీకే రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు.

    కాగా, తమిళనాడులో రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌ ఇప్పటివరకు పొత్తుల గురించి ప్రకటన చేయలేదు. ఎన్డీఏతో కలిసి టీవీకే పోటీ చేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, దాన్ని టీవీకే కొట్టివేసింది. సినీరంగం నుంచి గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటివారు వచ్చి సక్సెస్‌ అయ్యారు. కమల్ హాసన్ వంటి వారు అంతగా రాణించలేదు. మరికొందరు సినీనటులు రజినీకాంత్‌లా రాజకీయాలకు దూరంగా నిలిచారు. 
     

  • పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు మరోసారి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఒకరకంగా చెప్పాలంటే ‘సర్‌’కు ముందు, తర్వాత అన్నట్టుగా పరిణమించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియకు ముందు వరకూ సీఎం మమతా బెనర్జీయే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలుగొందారు. కానీ ఓటర్ల జాబితా సవరణతో అధికార తృణమూల్‌ పార్టీ ఓటు బ్యాంకు భారీగా ప్రభావితమైనట్టు కన్పిస్తోంది. దాంతో ఈ ఎన్నికల్లో ‘సర్‌’ప్రక్రియనే ప్రధాన ప్రచారాంశంగా చేసుకోవాలని దీదీ నిర్ణయించారు! ‘సర్‌’సాకుతో బెంగాలీల అస్తిత్వంపైనే దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. దాంతో సర్‌ ప్రక్రియ బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసేలా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర అంశాలు, సమస్యలు ఎన్నున్నా ఈసారి కూడా రాష్ట్రంలో ఎన్నికలు మరోసారి ‘మమత వర్సెస్‌ మోదీ’అన్నట్టుగానే జరగనున్నాయి.

    ఇద్దరు పాపులర్‌ నేతల పోరులో అంతిమంగా పైచేయి సాధించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దూకుడుకు మరోసారి ముకుతాడేసి వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించాలని తృణమూల్‌ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యలు, పలు రంగాల్లో మమత సర్కారు వైఫల్యాలు తదితరాలను అస్త్రాలుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2021 ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా చొచ్చుకుపోయి బెంగాల్‌పై తొలిసారిగా కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో సున్నా చుట్టి పూర్తిగా చతికిలపడ్డ లెఫ్ట్‌ ఫ్రంట్, కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.

    పశ్చిమబెంగాల్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మమత దూకుడుకు ముకుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయఢంకా మోగించాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి బెంగాల్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. త్వరలో వారిద్దరూ రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి తెర తీయనున్నారు. మోదీ కరిష్మా రాష్ట్రంలో ఈసారి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. 15 ఏళ్లుగా సాగుతున్న తృణమూల్‌ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బాగా కలిసొచ్చే అంశమన్నది ఆ పార్టీ భావన. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న ప్రచారం కూడా తృణమూల్‌కు గట్టిగానే చేటుచేసేలా కన్పిస్తోంది.

    ముఖ్యంగా మహిళలకు భద్రతే లేకుండా పోయిందంటూ బీజేపీ ఇప్పటికే హోరెత్తిస్తోంది. హిందూత్వవాదంపై కూడా కాషాయ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. తద్వారా ముస్లిమేతర ఓట్లు సంఘటితం అవుతాయని, పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. మొండితనానికి, పోరాటానికి మారుపేరైన దీదీ కూడా కాషాయ దళానికి దీటుగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. సర్‌ ప్రక్రియను వ్యతిరేకించే క్రమంలో ఆమె ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వంటివి కలిసొస్తాయని తృణమూల్‌ భావిస్తోంది. మమతకున్న ‘సామాన్యురాలి’ ఇమేజీపైనే మరోసారి నమ్మకం పెట్టుకుంది. అయితే మంత్రులు, నేతల అవినీతి బాగోతాలు అధికార పార్టీకి తీవ్రంగా చేటుచేసేలా కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణల మచ్చను ఏ మేరకు చెరుపుకోగలదన్నది ఆసక్తికరం.

    లెఫ్ట్, కాంగ్రెస్‌ నేల చూపులు 
    1977 నుంచి 2011 దాకా బెంగాల్‌ను సుదీర్ఘంగా పాలించిన వామపక్ష కూటమి పరిస్థితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓట్ల శాతం కేవలం 4.73కి పడిపోయిన పరిస్థితి! కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. లెఫ్ట్‌ ఫ్రంట్‌కు, హస్తం పార్టీకి గత ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు! దాంతో అవి ఈసారి ఎంతోకొంత పుంజుకుని ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి.

    బీజేపీకి ‘ఎల్పీజీ’దడ 
    ఎన్నికలు సమీపించిన తరుణంలో పశ్చిమాసియా యుద్ధం బీజేపీకి అనుకోని సమస్య తెచ్చిపెట్టింది. నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పరిస్థితి తక్షణం చక్కబడకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రతికూలాంశంగా మారగలదని బీజేపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. మరోవైపు మమతకు మాత్రం ఈ అంశం అనుకోకుండా అందివచ్చిన అస్త్రంగా మారేలా కనిపిస్తోంది. పోలింగ్‌కు మరో నెల రోజులున్నందున ఈలోపు సమస్యను మోదీ సర్కారు ఏ మేరకు చక్కదిద్దగలదన్నది చూడాల్సిందే.

    కీలకంగా ‘సర్‌’ 
    కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ ప్రక్రియ బెంగాల్లో కీలక ఎన్నికల అంశంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్లకు తగ్గింది. ఏకంగా 1.2 కోట్లకు పైగా ఓట్లు తొలగింపుకు గురవడంతో పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరణాలే అనూహ్యంగా తారుమారయ్యే పరిస్థతి నెలకొంది! ముఖ్యంగా 60 లక్షలకు పైగా ముస్లిం ఓట్ల తొలగింపు తృణమూల్‌ను గట్టిగా దెబ్బతీయనుంది.

    రాజధాని కోల్‌కతాతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాని ఓటు బ్యాంకు తగ్గడం బీజేపీకి లాభించేలా కన్పిస్తోంది. ఆయాచోట్ల తమ ఓట్లు భారీగా తొలగింపుకు గురైనట్టు తృణమూల్‌ ఇప్పటికే పలుమార్లు ఆరోపించింది. అందుకే సర్‌ ప్రక్రియను కీలక ప్రచారాస్త్రంగా మలచుకోవాలని మమత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని బెంగాలీల అస్తిత్వంపై కేంద్రం దాడిగా చిత్రిస్తున్నారు. సర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు విన్పించారామె! ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆమె ఇమేజీని మరింత పెంచిందని తృణమూల్‌ అంటోంది.

    అయితే 24 పరగణాలు, నాదియా వంటి బంగ్లా సరిహద్దు జిల్లాల్లో బీజేపీ ఓటుబ్యాంకుకు కూడా సర్‌ ప్రక్రియ కొంతమేరకు గండి కొట్టింది. అక్కడ బీజేపీకి పట్టున్న మథువా, రాజ్‌బన్షీ సామాజిక వర్గాల ఓటర్లు భారీగా తొలగింపుకు గురయ్యారు. అయినా సరే, అక్రమ వలసదారుల ఓట్లతోనే మమత అధికారం చేపడుతూ వస్తున్నారని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.  

    బీజేపీ సానుకూలతలు 
    డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ నినాదం 
    మమత ప్రభుత్వంపై వ్యతిరేకత 
    సర్‌ ప్రక్రియతో పలు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగవడం 
    టీచర్లు, ఆశా వర్కర్లు తదితరుల దన్ను 
    ప్రతికూలతలు 
    చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడం 
    తృణమూల్‌తో పోలిస్తే క్షేత్రస్థాయిలో బలహీనం 
    కేంద్ర నాయకత్వంపై ఆధారపడటం 
    సర్‌ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం 
    నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత

    తృణమూల్‌ కాంగ్రెస్‌ సానుకూలతలు 
    మమత పాపులారిటీ  
    మహిళల్లో ఆదరణ 
    క్షేత్రస్థాయిలో పార్టీకున్న పట్టు 
    లక్ష్మీర్‌ బంధర్, స్వాస్థ్య సాథి, యువ సాథి వంటి పథకాలు 
    సర్‌ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం 
    ఎన్నికలను రాష్ట్రం వర్సెస్‌ కేంద్రంగా మలచడంలో విజయం 
    ప్రతికూలతలు 
    15 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత 
    నేతలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు 
    రాష్ట్రంలో పెచ్చరిల్లిన నేరాలు 
    సర్‌ ప్రక్రియతో పలుచోట్ల ఓటు బ్యాంకుకు గండి  

Sports

  • హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో సన్‌రైజర్స్‌ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ సన్‌రైజర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. 

    అయితే సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలను పాక్‌ సంతతికి చెందిన ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అజీమ్‌ రఫిక్‌ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్‌ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. 

    అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు.  అయితే అజీమ్‌ రఫిక్‌ వ్యాఖ్యలపై సోషల్‌  మీడియాలో క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

    పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్‌ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్‌ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్‌పై పడి ఏడ్వడం మానండి. సునీల్‌ గావస్కర్‌ ఒక దిగ్గజ క్రికెటర్‌ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్‌లో ఆ జట్టు బోర్డు చైర్మన్‌ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.

    చదవండి: క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద నోబాల్‌!

  • క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద నోబాల్‌ వేసిన ఘనతను పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అసద్‌ అక్తర్‌ ‌ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్‌ దేశవాలీ టీ20 క్రికెట్‌ పోటీల సందర్భంగా పెషావర్‌ వేదికగా కరాచీ బ్లూస్‌, లాహోర్‌ బ్లూస్‌కు మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో కరాచీ బ్లూస్‌ తరఫున ఆడిన అసద్‌ అక్తర్‌ అతిపెద్ద నోబాల్‌ వేశాడు. 

    క్రీజు లైన్‌ దాటిన అసద్‌ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్‌ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్‌ రెండు నోబాల్స్‌, రెండు వైడ్స్‌ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. 

    అయితే చాలా మంది అసద్‌ అక్తర్‌ వేసిన నోబాల్‌ను 2010లో ఇంగ్లండ్‌పై పాక్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ వేసిన నోబాల్‌తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్‌ ఫిక్సింగ్‌లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్‌ సహా అప్పటి కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆసిఫ్‌లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్‌ అక్తర్‌ వేసిన నోబాల్‌తో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. 

    ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు.

    "లండన్‌లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్‌టైమ్‌గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్‌ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్‌ను బాగు చేసిన తర్వాత అందులో మజార్‌కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్‌లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.

    చదవండి:  ఫ్యాన్‌ ఆర్మీ భారత క్రికెట్‌ను నాశనం చేస్తోంది!

  • భారత క్రికెట్‌లో ఇటీవలి కాలంలో ఫ్యాన్‌ ఆర్మీ,సూపర్‌ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్‌ (పబ్లిక్‌ రిలేషన్స్‌) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్‌వార్‌ పెరిగిపోతుందన్నాడు. 

    కోల్‌కతాలో జరిగిన రేవ్‌ స్పోర్ట్స్‌ కాన్‌క్లేవ్‌ కార్యక్రమానికి హాజరైన అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు  జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్‌ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం. 

    కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్‌ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. 

    కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది కాబట్టి లక్ష్మణ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్‌ ‍వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్‌రూమ్‌లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్‌ వెల్లడించాడు. 

    చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!

  • టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బ్రాండ్‌ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్‌ లాంటి ‍క్రికెటర్‌ సీఎస్‌కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్‌కు ఉందని తెలిపాడు. 

    ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్‌ అని చెప్పొచ్చు. సీఎస్‌ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో లోయర్‌ ఆర్డర్‌ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్‌తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. 

    కానీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయాలని కోరుకుంటున్నా. 

    గత సీజన్‌ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 3న ఆర్సీబీతో, ఏప్రిల్‌ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

    చదవండి: పెషావర్‌కు వెళ్లొద్దు.. ఆసీస్‌ ఆటగాళ్లకు హెచ్చరిక!

  • పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో మార్చి 26 నుంచి మొదలుకావాల్సిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2026 సందిగ్ధంలో పడింది. తాజాగా అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 

    ఒకవైపు ఇరాన్‌, ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య యుద్ధంతో పశ్చిమాసియా ఇప్పటికే రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా పాల్గొనాల్సి ఉంది. స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహా చాలా మంది ఆసీస క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలపై నిషేధముంది. 

    తాజాగా ఆసీస్‌ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. అయితే పెషావర్‌ జాల్మీ పేరుతో పీఎస్‌ఎల్‌లో ఒక జట్టు ఉండడంతో కచ్చితంగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 

    అయితే పాక్‌-ఆఫ్గన్‌ యుద్ధం కారణంగా పెషావర్‌ ప్రస్తుతం ‘నో ట్రావెల్‌ జోన్‌’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్‌లు ఆడేందుకు పెషావర్‌కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు భయపడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 28న పెషావర్‌ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 

    పెషావర్‌ జాల్మీ జట్టులోనే ఆరోన్‌ హర్డీ ఉండగా, రావల్పిండి జట్టులో జేక్‌ ప్రేజర్‌ మెక్‌గుర్క్‌ ఉన్నాడు. అంతేకాదు ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్‌ో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్‌ఎల్‌ సీజన్‌కు తెరలేవనుంది.

    చదవండి: ఇరాన్‌ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!

  • పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ జట్టు జూన్‌లో జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనాలా వద్దా అనే సంశయంలో ఉంది. జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే వరల్డ్‌కప్‌ ఆడేందుకు ఇరాన్‌ మా దేశంలో అడుగుపెడితే ఆ దేశ ఆటగాళ్లకు తాము భద్రత కల్పించలేమని, కాబట్టి ఇరాన్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలగడమే మంచిదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు చేశారు. 

    అయితే ట్రంప్‌ కంటే ముందే అమెరికాలో వరల్డ్‌కప్‌ ఆడబోయేది లేదని ఇరాన్‌ ముందే భీష్ముంచుకుంది. తాజాగా ఫిఫా వరల్డ్‌కప్‌లో భాగంగా ముందస్తుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అమెరికాలో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను మెక్సికోకు తరలించాలని ఇరాన్‌ ఫిఫా సమాఖ్యకు అర్జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

    యుద్ధం సమయంలో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, ఏక్షణం ఏమైనా జరిగే అవకాశముంటుందని, అందుకే మా మ్యాచ్‌లను అమెరికా నుంచి మెక్సికో లేదా కెనడాకు మార్చాలని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఫిఫా సమాఖ్యను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్‌ ప్రతిపాదనపై ఫిఫా సమాఖ్య ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

    ఇరాన్‌ ప్రతిపాదనకు అంగీకరిస్తూ మ్యాచ్‌ వేదికలను మార్చాలా లేక ఇరాన్‌ స్థానంలో వేరే జట్టుకు అవకాశమివ్వాలా అన్నది ఆలోచిస్తుంది. ఇదంతా గమనించిన క్రీడాభిమానులు ఇరాన్‌ ప్రతిపాదనను క్రికెట్‌ టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఐసీసీకి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చేసిన అభ్యర్థనతో పోలుస్తున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. 

    అయితే టోర్నీ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారత్‌తో సంబంధాలు సఖ్యతగా లేవు. అప్పటికే బంగ్లాదేశ్‌ అ‍ల్లర్లతో అట్టుడికిపోయింది. దీంతో భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉందని  ఈ కారణంగా భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆడలేమని, తమ మ్యాచ్‌ వేదికలను లంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు చేసింది. 

    కానీ ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా తాము చూసుకుంటామని తెలిపిన ఐసీసీ వేదికలను మార్చే ప్రసక్తే లేదని బంగ్లా క్రికెట్‌ బోర్డుకు తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్‌ జట్టు మూర్కత్వానికి పోయి టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించింది. తాజాగా అమెరికాతో యుద్ధం కారణంగా ఇరాన్‌ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అమెరికాలో ఆడబోమని ఇప్పటికే స్పష్టం చేసిన ఇరాన్‌ .. ఫిఫా సమాఖ్య వారి ప్రతిపాదనకు అంగీకరిస్తే తప్ప ఈసారి సాకర్‌ ప్రపంచకప్‌లో వారి ఆటను చూడలేమనుకుంటా!

    చదవండి: ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

  • పాకిస్తాన్‌ స్టార్‌ మహ్మద్‌ రిజ్వాన్‌పై ఆ దేశ వెటరన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెజాద్‌ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

    చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తు
    టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్‌ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్‌ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్‌కు సిరీస్‌ కోల్పోయింది.

    షాహిన్‌ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్‌ ఆడిన పాకిస్తాన్‌ జట్టులో రిజ్వాన్‌ ఒక్కటే సీనియర్‌ మోస్ట్‌ ప్లేయర్‌. అయితే, ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.

    అసలు టెక్నికే సరిగ్గా లేదు
    ఈ నేపథ్యంలో  అహ్మద్‌ షెజాద్‌ రిజ్వాన్‌ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్‌ సాబ్‌. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.

    అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్‌ సైడ్‌ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్‌ జట్టులో నీకు స్థానమే లేదు.

    బుద్ధి రావడం లేదు
    వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్‌ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని  అహ్మద్‌ షెజాద్‌ ఘాటు విమర్శలు చేశాడు. 

    ​కాగా 2015లో పాకిస్తాన్‌ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్‌.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.

    చదవండి: కోహ్లి, గేల్‌ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్‌ అతడే: డివిలియర్స్‌

  • తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్‌-2026లో రన్నరప్‌గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో బిజీగా ఉంది.

    ఇందులో భాగంగా ఆదివారం మౌంట్‌ మౌంగనీ వేదికగా ప్రొటిస్‌తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్‌.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కివీస్‌.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    డెవాన్‌ కాన్వే అర్ధ శతకం
    టాపార్డర్‌లో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (11), వన్‌డౌన్‌ బ్యాటర్‌ టిమ్‌ రాబిన్సన్‌ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్‌ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్‌ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్‌ క్లార్క్‌సన్‌ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్‌ కోయెట్జి, ఒట్నీల్‌ బార్ట్‌మాన్‌,  కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, జార్జ్‌ లిండే తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    ఆదిలోనే ఎదురుదెబ్బలు
    లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్‌ ఎస్తరూజెన్‌ (8)ను బెన్‌ సియర్స్‌ వెనక్కి పంపగా.. వియాన్‌ ముల్డర్‌ (16)ను సాంట్నర్‌ అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

    107 పరుగులకే ఆలౌట్‌ 
    మిగిలిన వారిలో రూబిన్‌ హెర్మాన్‌ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్‌ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ అయింది. ఫలితంగా న్యూజిలాండ్‌ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.

    కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ సియర్స్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్‌ రెండు, మెకాంచి, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదిక.

    చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

  • టీ20 ప్రపంచకప్‌ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్‌ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్‌ కరన్‌లను రిలీజ్‌ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. 

    మరో 10 రోజుల్లో ఐపీఎల్‌ 18వ సీజన్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్‌ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. 

    శాంసన్‌ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్‌ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. 

    రాజస్థాన్‌ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. 

    ఇక సంజూ శాంసన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్‌ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన శాంసన్‌ ఆ సీజన్‌లో రాజస్థాన్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 

    2023 సీజన్‌లో రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్‌ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్‌ నేతృత్వంలో రాజస్థాన్‌ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 

    అయితే క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్‌ బెస్ట్‌ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్‌లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్‌ స్థానంలో రియాన్‌ పరాగ్‌ జట్టును నడిపించాడు.

    చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి

  • న్యూజిలాండ్‌ పర్యటనలో సౌతాఫ్రికా మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం హామిల్టన్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 

    ఓపెనర్‌ తజ్మిన్‌బ్రిట్స్‌ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా, లారా వోల్వర్ట్‌ (33 బంతుల్లో 41) పర్వాలేదనిపించింది. ఆఖర్లో కయ్‌లా రెనెకె (9 బంతుల్లో 28 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అమెలియా కెర్‌, జెస్‌ కెర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్‌ అయింది. అమెలియా కెర్‌ (18 బంతుల్లో 32) టాప్‌ స్కోరర్‌గా నిలవగా ఇజీ షార్ప్‌ (29) పరుగులు చేసింది. అయితే  సౌతాఫ్రికా బౌలర్లలో అయోబంగా ఖాకా 4 వికెట్లతో చెలరేగితే, లాబా 3 వికెట్లు తీసింది. కయ్‌లా రెనెకెకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. 

    చదవండి: కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్‌ అతడే: డివిలియర్స్‌

  • ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఒకడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్‌లలో ఆడిన ఘనత ఈ బ్యాటర్‌కు ఉంది.

    ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో ఏబీడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, ప్రస్తుత లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితోనూ డివిలియర్స్‌ బంధం విడదీయలేనిది. ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వంటి ఐదేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్లతో ఏబీడీ మ్యాచ్‌లు ఆడాడు.

    ఇది వివాదాస్పదం కావొచ్చు
    టీ20 ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ఏబీ డివిలియర్స్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్‌టైమ్‌ టీ20 క్రికెటర్‌ ఎవరన్న ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబు వైరల్‌గా మారింది. ‘‘ఇది వివాదాస్పదం కావొచ్చు.. కాదు కాదు.. వివాదానికి తావులేదు. ఇదొక చర్చనీయాంశమైన జవాబు కావొచ్చు.

    ఎందుకంటే.. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్‌ప్రీత్‌ బుమ్రా అని నేను అనుకుంటున్నా. కానీ అతనెప్పుడూ నాకు బౌలింగ్‌ చేయలేదు. అయితే, నిలకడైన ఆటకు అతడు మారుపేరు. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కొత్త బంతి లేదంటే పాత బంతితో అతడు అద్భుతాలు చేయగలడు.

    గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా
    సూపర్‌ ఓవర్‌ అయినా.. మరి ఇంకేదైనా బంతి అతడికి చేతికి ఇస్తే గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా అతడికి ఉంది. దటీజ్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా’’ అని డివిలియర్స్‌ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    పదిహేను పరుగులే ఇచ్చి  నాలుగు వికెట్లు
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో బుమ్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా మరోసారి వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలవడంలో అతడి పాత్ర కీలకం. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో బుమ్రా.. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పద్నాలుగు వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కొనసాగుతుండగా.. డివిలియర్స్‌ సైతం ఈ మేరకు కొనియాడటం గమనార్హం. 

    సత్తా చాటుతున్న బుమ్రా
    ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీలో మరో భారత బౌలర్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా పద్నాలుగు వికెట్లు తీసి బుమ్రా సరసన నిలిచాడు. 

    కాగా బుమ్రా ఇప్పటికి 95 అంతర్జాతీయ టీ20లలో కలిపి 121 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ తరఫున మరోసారి సత్తా చాటేందుకు బుమ్రా సిద్ధయ్యాడు.

  • వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా నిలిచి టీమిండియా సరికొత్త రికార్డు సాధించింది. మొత్తంగా మూడోసారి, సొంతగడ్డపై తొలిసారి పొట్టి క్రికెట్‌ కప్‌ ట్రోఫీని ముద్దాడిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది.

    ఇక ఈ విజయంతో భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరాడు సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే, ఈ టోర్నీ అనంతరం అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతాడని.. ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వచ్చాయి.

    ఒలింపిక్స్‌-2028లో ఆడటమే లక్ష్యం
    అయితే, న్యూజిలాండ్‌పై ఫైనల్లో విజయం తర్వాత ఒలింపిక్స్‌-2028లో ఆడటమే తన లక్ష్యమని చెబుతూ సూర్య.. ఈ రూమర్లకు చెక్‌ పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎవరూ ఊహించని పేరును అతడు ప్రతిపాదించాడు. జట్టులో చోటే లేని ఆటగాడు సారథి కాగలడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడటం గమనార్హం.

    ఐపీఎల్‌లో సారథిగా సత్తా
    కాగా ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌కు మారిన ఈ ముంబైకర్‌.. ఆ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సారథిగా, బ్యాటర్‌ అదరగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్‌ అయ్యర్‌ను సెలక్టర్లు కనికరించలేదు.

    శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ... జట్టులో స్థానం లేనందునే అతడికి చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్వయంగా వెల్లడించాడు. ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీకి జట్టు ప్రకటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 జట్టులోనూ శ్రేయస్‌కు స్థానం దక్కలేదు.

    టీ20 కెప్టెన్‌ ఎందుకు కాకూడదు?
    దేశీ టీ20 క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటినప్పటికీ శ్రేయస్‌ అయ్యర్‌ వేచిచూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆకాశ్‌ చోప్రా మాత్రం అయ్యర్‌ టీమిండియా టీ20 కెప్టెన్‌ ఎందుకు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    ‘‘ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణిస్తే శ్రేయస్‌కు మరో అవకాశం దక్కుతుంది. అతడు టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని నేను భావించాను. మిడిలార్డర్‌లో ఒకవేళ చోటు ఖాళీ అయితే కచ్చితంగా అది అతడికే దక్కుతుంది.

    కాబట్టి త్వరలోనే శ్రేయస్‌ భారత టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే.. టీమిండియా తదుపరి కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎందుకు ఉండకూడదు? అందుకు అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

Movies

  • చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈషా రెబ్బా

    నాభి అందాలతో హీరోయిన్ నయన సారిక

    అందాలతో మాయ చేస్తున్న నభా నటేశ్

    గ్లామర్ డోస్ పెంచేసిన యాంకర్ శ్రీముఖి

    బ్లాక్ చీరలో రచ్చ లేపుతున్న సోనాల్ చౌహాన్

    'ఉస్తాద్..' ఈవెంట్ కోసం రాశీఖన్నా ఇలా

  • తెలుగు, తమిళ, కన్నడలో చాలా సినిమాలు చేసిన నటుడు అర్జున్ సర్జా.. ప్రస్తుతం వేగం తగ్గించేశాడు. కొన్నాళ్ల క్రితం కూతురు ఐశ్వర్యని హీరోయిన్‌గా పెట్టి ఓ మూవీ మొదలుపెట్టాడు. తెలుగు హీరో విశ్వక్ సేన్‌ని హీరోగా తీసుకున్నాడు. అనుకోని కారణాలతో విశ్వక్.. ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. తర్వాత మరో హీరోతో చిత్రాన్ని పూర్తి చేశారు. గత నెలలోనే థియేటర్లలోకి కూడా తీసుకొచ్చేశారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

    నటుడు అర్జున్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'సీతా పయనం'. ఇతడి కుమార్తె ఐశ్వర్య హీరోయిన్. కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్.. ఈ చిత్రంలో హీరో. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఉగాది కానుకగా ఈ గురువారం (మార్చి 19) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

    'సీతా పయనం' విషయానికొస్తే.. సీత (ఐశ్వర్య)చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో తండ్రి(సత్యరాజ్)లోనే తల్లిని చూసుకుంటూ ఉంటుంది. తాను లేకపోతే తండ్రి ఏమైపోతడోనని పెళ్లి కూడా చేసుకోదు. ఓసారి ఒంటరిగా కారులో హైదరాబాద్‌కి ప్రయాణమవుతుంది. దారి మధ్యలో అభి(నిరంజన్) లిఫ్ట్ అడిగితే.. కండీషన్స్ పెట్టి ఊరి దగ్గర దించేస్తుంది. అయితే ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు? సీత.. మళ్లీ అభిని ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)

  • యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌నకు చెందిన యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా.. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుక్వెర్క్ రికార్డ్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుక్వెర్క్ రికార్డ్స్, అనిరుధ్ రూపొందించే  పాప్, హిప్-హాప్ సంగీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్‌లో అనిరుధ్ పాల్గొనగా, వచ్చే నెల ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    (ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

    2012లో అరంగేట్రం చేసిన అనిరుధ్.. 'వై దిస్ కొలవెరి డి' ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించాడు. తర్వాత విడుదలైన తన 770కి పైగా పాటల ద్వారా మొత్తం 13 బిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్ సాధించాడు. దీంతో మొత్తం స్ట్రీమ్స్ పరంగా స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ పొందిన దక్షిణ భారతీయ కళాకారుడిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తమిళ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ (ఓఎస్టీ) రంగంలో ఎక్కువగా కోరుకునే సంగీత దర్శకుల్లో ఇతడొకరు. హుకుమ్, వాతీ కమింగ్, అరబిక్ కుతు, మోనికా, ఏ23 థీమ్, ఆజా రాజా, అయా షేర్ తదితర గ్లోబల్ హిట్లు ఇతడి ఖాతాలో ఉన్నాయి.

    (ఇదీ చదవండి: బూతు పాటపై కేంద్రం సీరియస్)

  • సినిమాల్లో ఈ మధ్య హింస పెరిగిపోతోంది. రక్తపాతం, వయలెన్స్ లాంటి వాటిని కాస్త ఎక్కువగానే చొప్పిస్తున్నారు. ఇది సమాజంపై చూపి ప్రభావం చూపే చాలానే ఉండొచ్చు. ఇప్పుడు దీనికి తోడు పాటలు కూడా హద్దులు దాటేస్తున్నాయి. రీసెంట్‌గా అలా నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఓ గీతం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది. సోషల్ మీడియాలో లెక్కకు మించిన విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాటపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా)

    కన్నడ హీరో ధ్రువ సర్జా లేటెస్ట్ మూవీ 'కేడీ:ది డెవిల్'. ఎప్పటినుంచో సెట్స్ మీదున్న ఈ చిత్రం విడుదలకు నానా తంటాలు పడుతోంది. సంజయ్ దత్, శిల్పా శెట్టి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. త్వరలో రిలీజ్ చేద్దామనుకుని రీసెంట్‌గానే 'సర్కే చునర్' అని సాగే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఈ పాట సాహిత్యానికి సంబంధించి దక్షిణాదిలో ఓ దశ వరకు రాశారు. హిందీలో మాత్రం డబుల్ మీనింగ్ వచ్చేలా పచ్చిబూతులు రాసేశారు. దీనికి తోడు డ్యాన్స్ కూడా అసభ్యంగా ఉండేసరికి వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

    ఈ పాటపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. స్పందించిన కేంద్రం.. అన్ని చోట్ల నుంచి పాటని తొలగించాలని సెన్సార్ అధికారుల్ని ఆదేశించింది. సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఈ తరహా అభ్యంతరకర కంటెంట్ పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని సూచించింది. ఇప్పటికే హిందీ వెర్షన్ పాటని యూట్యూబ్ నుంచి తొలగించేశారు.

    పాన్ ఇండియా మూవీగా తీసిన 'కేడీ ది డెవిల్'ని.. రీసెంట్ టైంలో 'జన నాయగణ్'తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇప్పటికే విజయ్ సినిమా రిలీజ్ నిరవధిక వాయిదా పడేసరికి సతమవుతున్న ఈ నిర్మాణ సంస్థకు 'టాక్సిక్' వాయిదా మరో దెబ్బ కాగా.. ఇప్పుడు ఈ పాటపై కూడా సర్వత్రా విమర్శలు, కేంద్రం సీరియస్ కావడం లాంటివి మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.

    (ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

  • లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: బ్యాడ్‌ సెంటిమెంట్‌.. టెన్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌!)

    గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.

    'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్‌లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్  చూడనున్నారనమాట. రిలీజ్ 19నే ‍అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్‌తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్)

  • సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.  సినిమా అనౌన్స్‌మెంట్‌ మొదలు రిలీజ్‌ వరకు అన్నింట్లోనూ సెంటిమెంట్‌ ఫాలో అవుతుంటారు. ఇక హీరో-డైరెక్టర్‌, హీరో, హీరోయిన్ల కాంబినేషన్‌ విషయంలోనూ సెంటిమెంట్‌ చూస్తుంటారు. ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి ఎవరినైనా గెస్ట్‌గా పిలవాలంటే.. దానికి కూడా ఓ సెంటిమెంట్‌ ఉంది. ఫలానా హీరో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తే సినిమా హిట్‌ అవుతుందని నమ్మే దర్శకనిర్మాతలు చాలానే ఉన్నారు. ఇదంతా పాజిటివ్‌ సెంటిమెంట్‌. ఇదే ఇండస్త్రీలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. పలాన హీరో.. పలానా దర్శకుడితో సినిమా తీస్తే ఫ్లాప్‌ గ్యారెంటీ.. ఆ ఇద్దరు స్టార్స్‌ రెండోసారి కలిస్తే.. అపజయం తప్పదు అనే నమ్మేవాళ్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా అభిమానులు ఎక్కువగా ఈ నెగెటివ్‌ సెంటిమెంట్లను నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలలో వారి నమ్మకం నిజం అవుతుంటాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక బ్యాడ్‌ సెంటిమెంట్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులను టెన్షన్‌ పెడుతుంది. అదేంటో చదివేయండి..

    రెండోసారి ఫ్లాప్‌
    పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ఒక డైరెక్టర్‌తో రెండో సినిమా తీస్తే ప్లాప్‌ గ్యారెంటీ. ఒక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మినహా..ఆయన కెరీర్‌ మొత్తంలో రెండోసారి సినిమా చేసిన దర్శకులందరికీ అపజయమే ఎదురైంది. పవన్‌ కల్యాణ్‌కి ‘తొలిప్రేమ’తో తొలి హిట్‌ అందించిన దర్శకుడు కరుణాకరన్‌. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాలు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. అలాగే ‘సుస్వాగతం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పవన్‌, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నవరం’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

    పవన్‌-పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘బద్రి’ సూపర్ హిట్‌ అయితే.. రెండో చిత్రం ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ డిజాస్టర్‌ అయింది. ‘ఖుషీ’ తర్వాత ఎస్‌ జే సూర్య దర్శకత్వంలో నటించిన ‘కొమరం పులి’ సినిమా  కూడా ప్లాప్‌ అయింది. కిషోర్ పార్ధసాని (డాలీ), పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘గోపాల గోపాల’ ఓ మోస్తరు విజయం సాధిస్తే.. ‘కాటమ రాయుడు’ డిజాస్టర్‌గా నిలిచింది.  

    త్రివిక్రమ్‌ ఒక్కడే.. 
    పవన్‌తో రెండోసారి సినిమా తీసిన దర్శకులంతా అపజయాలనే అందించారు. ఒక త్రివిక్రమ్‌ మాత్రం వరుసగా రెండు హిట్లు(జల్సా, అత్తారింటికి దారేది) ఇచ్చాడు. ఇదే  జోష్‌లో ముచ్చటగా మూడో సినిమాగా ‘అజ్ఞాతవాసి’ తీస్తే..అది అతిపెద్ద డిజాస్టర్‌ అయింది.

    ఉస్తాద్‌ రిలీజ్‌..టెన్షన్‌లో ఫ్యాన్స్‌
    ఇప్పుడు ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ చూసే పవన్‌ అభిమానులు భయపడుతున్నారు. హరీశ్‌ శంకర్‌- పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌(Ustad Bhagat Singh). అంతకు ముందు వీరిద్దరి  కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’బ్లాక్‌ బస్టర్‌ అయింది. సెంటిమెంట్‌ ప్రకారం చూస్తే.. మార్చి 19న రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రం ఫ్లాప్‌ కావాలి. ఇప్పుడు అదే అభిమానులను కలవర పెడుతుంది. 

    ఇప్పటీకీ ఈ సినిమాపై పెద్దగా బజ్‌ లేదు. ఈ చిత్రానికి పోటీగా వస్తున్న ‘ధురంధర్‌ 2’ బుకింగ్స్‌  విషయంలో దూసుకెళ్తుంది. ట్రైలర్‌ కూడా అదిరిపోయింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడం.. బ్యాడ్‌ సెంటిమెంట్‌ కూడా ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. మరి సెంటిమెంట్‌ ప్రకారం సినిమా ప్లాప్‌ అవుతుందా  లేదా సెంటిమెంట్‌ని బద్దలు కొట్టి హిట్‌ అవుతుందా అనేది రెండు రోజుల్లో తేలిపోతుంది. 

  • తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్‌ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.

    (ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)

    మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

    అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.

    'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్‌ ఇచ్చిన త్రిష తల్లి!)

  • టాలీవుడ్ దర్శకుల్లో చాలామందికి చిరంజీవితో సినిమా చేయాలని ఆశ. కానీ ఎప్పటికప్పుడు చిరంజీవి మూవీస్ లైనప్ మారిపోతూనే ఉంది. ప్రస్తుతానికైతే యంగ్ డైరెక్టర్స్‌కే ఎక్కువగా అవకాశమిస్తున్నారు. సంక్రాంతికి అనిల్ రావిపూడితో వచ్చి హిట్ కొట్టారు. 'విశ్వంభర' కోసం వశిష్ఠతో పనిచేశారు. ప్రస్తుతం బాబీతో, శ్రీకాంత్ ఓదెలతో తలో ప్రాజెక్ట్ చేయనున్నారు. తర్వాత ఎవరితో చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు హరీశ్ శంకర్.. చిరుతో మూవీ చేయాలని ఆశపడుతున్నాడు.

    (ఇదీ చదవండి: రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!)

    పవన్‌తో కలిసి గతంలో 'గబ్బర్ సింగ్' చేసి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న హరీశ్ శంకర్.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' చేశాడు. ఈ గురువారమే సినిమా థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే చిరంజీవితో మూవీ చేయడం గురించి హరీశ్ శంకర్ మాట్లాడాడు. రౌడీ అల్లుడు, దొంగ మొగడు లాంటి ఎంటర్‌టైనర్ తీయాలని ఉందంటూ తన ఆశని బయటపెట్టాడు.

    'ఈ (ఉస్తాద్ భగత్ సింగ్) ట్రైలర్ చూసి చిరంజీవి నాతో 20 నిమిషాలు మాట్లాడారు. డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. పవన్ అందంగా ఉన్నారని చెప్పారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత నాకో విషయం అర్థమైంది. చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు కొడుకు కూడా అనిపించింది. నేను చిరంజీవిని చాలాసార్లు కలిశాను. కలిసి కొన్ని యాడ్స్ కూడా తీశాను. ఆయనతో నా మూవీ ప్రాసెస్‌లో ఉంది. కచ్చితంగా మెగాస్టార్‌తో గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా చేసి తీరతాను' అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చాడు.

    హరీశ్ శంకర్ చెప్పడం వరకు బాగానే ఉంది గానీ చిరంజీవి యస్ చెబతారా అనేది ప్రశ్న. ఎందుకంటే హరీశ్ శంకర్ దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ లేవు. అప్పుడెప్పుడో వచ్చిన గబ్బర్ సింగ్ మాత్రమే పెద్ద హిట్. తర్వాత చేసిన వాటిలో ఒకటి రెండు హిట్స్ ఉన్నప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర ఓకే ఓకే అనిపించాయి. గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. 'ఉస్తాద్' సంగతేంటనేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇది హిట్ అయి, హరీశ్ శంకర్ ఆశ నిజమవుతుందో లేదో చూడాలి? ఎందుకంటే గతంలోనే చిరు-హరీశ్ మూవీ అంటూ రూమర్స్ వచ్చాయి.

    (ఇదీ చదవండి: త్వరలోనే విజయ్‌తో పెళ్లి.. ఇలా హింట్‌ ఇచ్చిన త్రిష తల్లి!)

  • టీవీకే పార్టీని స్థాపించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్‌కి ఆయన సతీమణి సంగీత భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. విజయ్‌తో విడాకులు ఇప్పించాలంటూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం..  ఒక నటితో ఆయన సహజీవనం చేస్తున్నాడని ఆరోపించడంతో త్రిష పేరు బయటకు వచ్చింది. విజయ్‌ సహజీవనం చేస్తున్నది త్రిషతోనే అని తమిళ మీడియా కోడై కూసింది. అది నిజమే అన్నట్లుగా త్రిష, విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై, తమ బందాన్ని బహిరంగం చేశారు.

     అప్పటి నుంచి విజయ్‌, త్రిషల పెళ్లిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇదంతా పుకార్లే అని అంతా భావిస్తున్న తరుణంలో త్రిష తల్లి చేసిన ఓ పని.. మరోసారి వీరిద్దరి పెళ్లిపై చర్చకు దారి తీసింది.

    అలా హింట్‌ ఇచ్చిందా?
    త్రిష,విజయ్‌ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైనప్పటి నుంచి వీరిద్దరి పెళ్లిపై నెట్టింట రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అయితే ఏఐని ఉపయోగించి పెళ్లి వీడియో క్రియేట్‌ చేసి..సోషల్‌ మీడియాలో వదిలారు. ఆ వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి. అలా విజయ్‌ అభిమాని ఒకరు ఏఐ టెక్నాలజీతో విజయ్‌, త్రిషల పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులంతా హాజరైనట్లు వీడియో క్రియేట్‌ చేశాడు. అది నెట్టింట తెగ వైరల్‌ అయింది. ఆ వీడియోకి త్రిష తల్లి ఉమా కృష్ణన్‌  లైక్‌ కొట్టారు. దీంతో విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ..ఆమె లైక్‌ కొట్టిన పోస్ట్‌ని వైరల్‌ చేస్తున్నారు. 

    ఎన్నికల తర్వాత పెళ్లి
    విజయ్‌ ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా తమిళనాడు ఎన్నికలపైనే పెట్టాడు. పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపుతున్నా.. ఈ సారి ఒంటరిగానే బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై ఇరు కుటుంబాలలో చర్చలు కూడా జరిగాయట. ఇక సంగీత విషయానికొస్తే.. ఓ అభిమానిగా పరిచయం అయితే ఈమెను.. విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో వీరిద్ద వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే గత కొంతకాలంగా విజయ్‌, సంగీత వేరు వేరుగా ఉంటున్నారు. 
     

  • కోలీవుడ్‌లో విజయ్- త్రిష ఎపిసోడ్‌ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు నటీనటులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదం తర్వాత విజయ్- త్రిష జంటగా పెళ్లిలో కనిపించడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వరుస కథనాలొచ్చాయి.

    అయితే అందరూ ‍అనుకుంటున్నట్లుగానే  ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలా చేయడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. విజయ్- త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొంటూ అభిమానులు ఓ రీల్‌ రూపొందించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఆసక్తిగా ఉన్నారని ‍అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక భారీ ప్రకటన వెలువడుతుందని వీడియోను పోస్ట్ చేశారు.  అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన త్రిష మదర్‌ ఉమా కృష్ణన్‌ ఆ వీడియోను లైక్‌ కొట్టింది.

    ఈ రీల్‌కు త్రిష తల్లి ఉమా కృష్ణన్ లైక్ కొట్టడంతో వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ల బంధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఉమా కృష్ణన్ కూడా ఆసక్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది చూసిన కొందరు త్రిష అభిమానులు సైతం ఉమా కృష్ణన్ పొరపాటున ఈ రీల్‌కు లైక్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో కూడా త్రిష మదర్‌ 'థగ్ లైఫ్' మూవీ రిల్స్‌కు లైక్స్‌ కొట్టారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా విజయ్- త్రిష పెళ్లిపై క్లారిటీ రావాలంటే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్‌సీపీ నిర్వహించే ఇఫ్తార్‌ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్‌ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.

    రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్‌ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్‌ జగన్‌ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు.

  • సాక్షి, విజయవాడ: టీడీపీకి ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు షాకిచ్చారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గురించి డబ్బా కొట్టడానికి వెళ్లిన  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడ్డంగా బుక్కయ్యారు. గొల్లపూడిలో ఎంపీపీ పాఠశాల తనిఖీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. మీ కోసమే మధ్యాహ్నభోజనంలో మంచి ఆహారాన్ని అందిస్తున్నామంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు.

    ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం నాసికరంగా ఉందన్న విద్యార్థులు.. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే మైలవరంలోని తారకరామా నగర్ ఎంపీపీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు రాగా, స్కూల్ హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్‌ను మార్చింది. తాజాగా మరో స్కూల్‌లో చిక్కీలపై ఫిర్యాదు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారు.

     

Politics

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అనే రీతిలోనే ఇప్పటికీ చంద్రబాబు ఆలోచిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

    ‘‘సగటున రోజుకు 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభమే ఈ ఆత్మహత్యలకు కారణం. విపత్తులు వచ్చినా ప్రభుత్వం మాటలు తప్ప.. లబ్ధి చేకూర్చడం లేదు. ఎన్నికల ముందు రైతులకు, రైతు కూలీలకు అనేక హామీలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అరకొర మినహా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు.

    ..మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చినా ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు కూడా కేటాయించలేదు. వైఎస్సార్, జగన్ పరిపాలనలో రైతే రాజు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించక రైతులు విపత్తులతో నష్టపోయారు. అన్నంపెట్టే రైతుల సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించాలి. చిన్న, సన్నకారు రైతాంగాన్ని ఆదుకోవాలి’’ అని సాకే శైలజానాథ్ డిమాండ్‌ చేశారు.

     

  • సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్‌ నాయుడు చెంత  చేరారంటూ వైఎస్సార్‌సీపీ నేత,  టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ నాయుడిని టీటీడీ ఛైర్మన్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

    ‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్‌ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్‌ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్‌ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్‌తో మొదలై... పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

    ‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మీద నో యాక్షన్‌.

    ..మహిళలతో అశ్లీల వీడియో కాల్స్‌ చేసిన గుంటూరు ఈస్ట్‌ ఎమ్మెల్యే మీద నో యాక్షన్‌. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ మీదా నో యాక్షన్‌. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్‌. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్‌. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

    లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

    ‘‘తన కొడుకు స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చూస్తే నో యాక్షన్‌. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్‌. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్‌ సెట్‌ లేదు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నానని చెబుతున్న సంజయ్‌.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. 

    మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?.  

    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు.  నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్‌ ఇవ్వడానికి సంజయ్‌ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్‌ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్నారని స్పీకర్‌ అంటున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని సంజయ్‌ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.  

    కాంగ్రెస్‌కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం

    ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.