Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికా-ఇరాన్ యుద్ధానికి సంబంధించి రెండు వారాల కాల్పుల విరమణ కొనసాగుతోంది. శాంతి ఒప్పందంలో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా వరస పోస్టులు పెట్టారు.

    మేం కొత్త మార్పు దిశగా ముందుకెళ్తున్నాం. మా నౌకల్ని అత్యుత్తమ ఆయుధాలతో లోడ్ చేస్తున్నాం. గతంలో ఉపయోగించిన వాటికంటే ఇవి శక్తివంతమైనవి. అంతర్జాతీయ జలమార్గాలని ఉపయోగించి ప్రపంచాన్ని కొన్నిరోజులు దోపిడి చేయడం తప్ప ఇరాన్ నేతలకు మరో దారి లేదు. కేవలం చర్చలు జరపడానికి మాత్రమే వాళ్లు బతికున్నారు అని ట్రంప్ వరస పోస్టులు పెట్టారు.

    ఇదంతా చూస్తుంటే ఒకవేళ ఇరాన్‌తో చర్చలు గనక విఫలమైతే భారీ సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని సంకేతాలు ఇస్తున్నట్లే. ఇప్పుడీ వ్యాఖ్యలే అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు శాంతి చర్చలకు ఏర్పాట్లు పూర్తయిన వేళ ఇరాన్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

    లెబనాన్‌లో కాల్పుల విరమణ, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల విడుదల ముందు జరగాలని.. ఈ రెండు షరతులు నెరవేరే వరకు చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని అంతకుముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ అన్నారు. ఇప్పటికే వీటిపై ఇరుపక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరినా, ఇంకా అమలు కాలేదని గుర్తుచేశారు. చర్చలు ప్రారంభమయ్యే ముందు ఈ రెండు పూర్తి కావాల్సిందేని స్పష్టం చేశారు.

  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇరాన్‌కు భారీ హెచ్చరిక చేశారు. చర్చల పేరుతో అమెరికాతో ఆటలాడవద్దన్నారు. తమకు యుద్ధాన్ని ముగించే లక్ష్యం ఉందని దాన్నిసాకుగా చూపి అమెరికాను తక్కువ అంచనా వేయద్దన్నారు. ఇస్లామాబాద్‌ చర్చలకు బయిలుదేరే ముందు  జేడీవాన్స్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. 40 రోజుల పాటు మారణ హోమం సృష్టించిన యుద్ధానికి సంబంధించిన చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల నిమిత్తం జేడీవాన్స్‌ పాకిస్థాన్‌ బయిలు దేరారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

    జేడీవాన్స్‌ మాట్లాడుతూ "చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాం, ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే తాము యుద్ధాన్ని ముగించడానికి సహకరిస్తాం. కానీ తమను బురిడీ కొట్టించాలని చూస్తే మాత్రం కఠినంగా ఉంటాం" అని అన్నారు. అమెరికాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయెుద్దని హెచ్చరించారు.

    కాగా వ్యక్తిగతంగా కూడా జేడీ వాన్స్‌కు ఈ చర్చలు ఒక అగ్నిపరీక్ష వంటివి 2028 అధ్యక్ష ఎన్నికల్లో వాన్స్ పోటీ చేసే అవకాశం ఉన్నందున, ఈ చర్చల ఫలితం ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది ఆయనకు పెద్ద ప్లస్ అవుతుందని, విఫలమైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ కోరుతుండగా ఆ దాడులకు ఈ ఒప్పందానికి సంబంధం లేదని ట్రంప్ మరియు నెతన్యాహు వాదిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ మూసివేసిన  హర్ముాజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీనిపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆయిల్ ట్యాంకర్లను అనుమతించకపోవడం ఒప్పంద ఉల్లంఘనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్చలలో ఏం జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

  • ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇస్లామాబాద్‌పైనే ఉంది. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చలకు ఆ దేశం అతిథ్యం ఇస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతం హై సెన్సిటివ్‌ జోన్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాక్‌ సైతం ఆ భేటీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇరాన్‌ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆధునాతన యుద్ధ విమానాలతో  "ఐరన్‌ ఎస్కార్ట్" ‌ ఏర్పాటు చేస్తోంది.

    మధ్యప్రాచ్యంలో గత నలబై రోజులుగా జరిగిన మహా విధ్వంసానికి తాత్కాలిక బ్రేక్‌ పడింది. రేపు (శనివారం)  అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ నాయకత్వం వహిస్తుండగా ఇరాన్ తరపున పాల్గొనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇరాన్ ప్రతినిధుల బృంధం కోసం ఇదివరకే పాక్ ఆ దేశానికి అత్యాధునిక భద్రతా విమానాలను పంపినట్లు తెలుస్తోంది.

    అమెరికాతో చర్చలకు వస్తున్న ఇరాన్ ప్రతినిధులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్, F-16 యుద్ధ విమానాలు, IL-78 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, C-130 రవాణా విమానాలతో పాటు పలు నిఘా విమానాలు గగనతలంలో పహారా కాస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఎస్కార్ట్‌ను నిపుణులు "ఐరన్ ఎస్కార్ట్" గా పిలుస్తారు. 

    ఒకవేళ ఈ చర్చలు విజయవంతంగా పూర్తయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి ముఖాముఖి సమావేశం ఇదే అవుతుంది.ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ మరియు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    అయితే ఇదివరకే చర్చలు జరిగే ఇస్లామాబాద్‌ ప్రదేశం ఆ దేశ మిలటరీ ఆదీనంలోకి వెళ్లింది. హైలెవల్‌ డెలిగేషన్ నేపథ్యంలో  కొన్ని ప్రాంతాలను లాక్‌డౌన్ చేయడమే కాకుండా గగనతలంలో వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అయితే చర్చల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తీరు ఆందోళన కలుగజేస్తోంది. సీజ్‌ఫైర్ ఒప్పందంలో లెబనాన్‌పై దాడుల నిలిపివేత కూడా ఉందని పాకిస్థాన్, ఇరాన్ భావిస్తుండగా.. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

  • సోషల్‌ మీడియాలో క్రేజ్‌కోసం ఎ లాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదు. తాజాగా  రష్యన్‌ మహిళ నిర్వాకం  ఒకటి సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

    రష్యాకు చెందిన ఒక మహిళ లగ్జరీ కారునే బాత్రూమ్‌గా మార్చేసింది.  మార్పులు చేర్పులు చేసిన మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తూ జుట్టును వాష్‌ చేసుకుంది.  నడిరోడ్డుపై పోతూ పొడవాటి తన జుట్టుకు షాంపూ పూసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం,టవల్‌ చుట్టుకోవడం లాంటి  తతంగాన్నంతా పూర్తి చేసింది. కార్లో వెడుతూనే  జుట్టు కడుక్కున్న వైనం నెట్టింట దుమారాన్ని రేపుతోంది. 

     ;

     

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

    దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేలం వెర్రి అని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద జుట్టునుఅలా వాష్‌ చేసుకుంటోంది...పొరపాటున ఆ జుట్టు టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. 

    ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే!

  • ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.

    రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

    ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్‌- అక్టోబర్‌ కాలంలో  వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.

    ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్‌ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.

    కాగా రష్యాకు భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది.

Sports

  • ఐపీఎల్‌-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

    జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు.  తొలిసారి హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొన్న వైభవ్‌.. 4 ఓవర్‌లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్‌లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 

    ఈ ఏడాది సీజన్‌లో వైభవ్‌ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్‌.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. వైభవ్‌ ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్‌ క్యాప్‌ను తన సహచరుడు జైశ్వాల్‌ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్‌ నాలుగు మ్యాచ్‌లు 266.67 స్ట్రైక్‌ రేటుతో 200 పరుగులు చేశాడు.
    చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూప‌ర్ డెలివ‌రీ.. కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్‌? వీడియో వైరల్‌



     

     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్‌లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. 

    ఆర్సీబీ త‌మ ఇన్నింగ్స్ మొద‌టి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయిన‌ప్ప‌టికి కోహ్లి మాత్రం బౌండ‌రీల‌తో రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. అయితే డేంజ‌ర్‌గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయ‌డానికి కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్‌ను రంగంలోకి దించాడు. 

    కెప్టెన్ న‌మ్మ‌కాన్ని బిష్ణోయ్ వ‌మ్ము చేయ‌లేదు. ఆ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.

    అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
    చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్‌'

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్‌ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లోని మొదటి బంతికే మూడుసార్లు అవుట్ తొలి ప్లేయర్‌గా సాల్ట్ నిలిచాడు. ఐపీఎల్‌-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి బంతికే సాల్ట్ ఔటయ్యాడు. రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మొదటి బంతికే అద్భుతమైన బౌన్సర్‌తో సాల్ట్‌ను బోల్తా కొట్టించాడు. 

    దీంతో తొలి బంతికే అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్‌గా పార్ధివ్ పటేల్‌, పృథ్వీషాను సాల్ట్ అధిగమించాడు. వీరిద్దరూ గతంలో రెండు సార్లు మ్యాచ్ తొలి బంతికే ఔటయ్యారు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఇన్నింగ్స్ పరంగా అయితే ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో పార్థివ్ పటేల్‌(4 సార్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో డ్వేన్ స్మిత్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, సాల్ట్ ఉన్నారు.

    ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ప్లేయర్లు
    4 - పార్థివ్ పటేల్
    3 - డ్వేన్ స్మిత్
    3 - పృథ్వీ షా
    3 - కేఎల్‌ రాహుల్
    3 - ఫిల్ సాల్ట్*
    చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్‌'

  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యువ సంచ‌ల‌నం ముకుల్ చౌద‌రి ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవ‌ర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచం మొత్తం అత‌డి గురించే మాట్లాడుకుంటోంది. 21 ఏళ్ల ముకుల్ చారిత్ర‌త్మ‌క ఈడెన్‌గార్డెన్స్‌లో అద్భుతం చేశాడు.

    త‌న విరోచిత బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓట‌మి త‌ప్ప‌ద‌కున్న చోట‌ చివ‌రి బంతికి ల‌క్నో గెలిపించి రియల్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముకుల్‌ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 2 ఫోర్లతో పాటు 7 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. 

    అంటే అత‌డి సాధించిన ప‌రుగుల‌లో మెజారిటీ భాగం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా మ్యాచ్ అనంత‌రం త‌న ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ముకుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని త‌న‌ రోల్‌మోడ‌ల్ ముకుల్ చెప్పుకొచ్చాడు.

    "మా నాన్న‌కు పెళ్లి కాక‌ముందే త‌న‌కు కొడుకు పుడితే క్రికెట‌ర్‌ను చేయాల‌ని క‌ల‌లు క‌నేవారు. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. అలాగే ధోనీ స‌ర్ మ్యాచ్‌ను ఫినిష్ చేసే తీరును చూస్తూ నేను పెరిగాను. ఆయ‌న నాకు రోల్‌మోడ‌ల్. ఇప్పుడు నేను కూడా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాను. 

    కాబట్టి ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు కూడా చేస్తున్నాను. శరీర త‌త్వంగా కార‌ణంగానే నేను ఆడే షాట్ల‌లో అంత ప‌వ‌ర్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి షాట్లు ఆడేందుకు నేను చాలా ఎక్కువ‌గా సాధ‌న కూడా చేశాను. ప్రతిరోజూ నెట్స్‌లో సుమారు 100 నుండి 150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. గత ఐదు, ఆరు నెలలుగా మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌మిస్తున్నాను.

    ఆ ఫ‌లిత‌మే ఇప్పుడు నా ఆట‌లో  కనిపిస్తోంది. హెలీకాప్ట‌ర్‌ షాట్ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ధోని ఫినిషింగ్ స్టైల్ కూడా నాకెంతో ఇష్టం. అతను యార్కర్ బంతిని కూడా సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని కూడా సిక్స్ కొడితే, బౌలర్ కచ్చితంగా ఒత్తిడితోకి వెళ్తాడు" అని ముకుల్ పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్ కీల‌క నిర్ణ‌యం! రూ.13 కోట్ల ఆట‌గాడిపై వేటు?



     

     

  • RCB vs RR Live Updates: ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌహతి వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.

    లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్‌.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.  అతడితో పాటు ధ్రువ్ జురెల్‌(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

    ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆర్సీబీ  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(29), షెఫర్డ్‌(22), విరాట్‌ కోహ్లి(32) రాణించారు.

    విజయానికి చేరువలో రాజస్తాన్‌
    రాజస్తాన్‌ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌(66), రవీంద్ర జడేజా(21) ఉన్నారు.

    రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్‌
    రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 62 బంతుల్లో 68 పరుగులు కావాలి.

    రాజస్తాన్‌ మూడో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో షెమ్రాన్‌ హెట్‌మైర్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    వైభవ్‌ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న వైభవ్‌, జురెల్‌
    6 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 97/1. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌(27), వైభవ్‌ సూర్యవంశీ(57) ఉన్నారు.

    వైభవ్‌ విధ్వంసం
    వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టిస్తున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో వైభవ్‌.. ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 5 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 73/1

    దూకుడుగా ఆడుతున్న వైభవ్‌
    3 ఓవర్లకు రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(23), ధ్రువ్‌ జురెల్‌(1) ఉన్నారు.

    రాజస్తాన్ తొలి వికెట్ డౌన్‌
    రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

    పాటిదార్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. రాజస్తాన్‌ ముందు భారీ టార్గెట్‌
    గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్‌ అయ్యర్‌(29), షెఫర్డ్‌(22), విరాట్‌ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌, బ్రిజేష్‌ శర్మ, జోఫ్రా ఆర్చర్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్‌ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్‌ సాధించారు.

    ఆర్సీబీ ఎనిమిదో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 63 పరుగులు చేసిన రజిత్‌ పాటిదార్‌.. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఆర్సీబీ ఏడో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రోమారియో షెపర్డ్.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 150/7. పాటిదార్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

    ఆర్సీబీ ఆరో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ ఆరో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన టిమ్‌ డేవిడ్‌.. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 94/6

    ఆర్సీబీ ఐదో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్‌ వేసిన రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా ఔట్‌ కాగా.. 8 ఓవర్‌ లో బ్రిజేస్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 82/5

    ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌
    ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసి పడిక్కల్‌ జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 45-2

    ఆర్సీబీకీ భారీ షాక్‌
    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఫిల్‌ సాల్ట్‌ ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ వచ్చాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 32/1

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌
    ఐపీఎల్‌-2026 సీజన్‌లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓ మార్పుతో బరిలోకి దిగింది. తుషార్‌ దేశ్‌పాండే స్ధానంలో బ్రిజేశ్‌ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆర్సీబీ స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఎట్టకేలకు పునరాగమనం చేశాడు. జాకబ్‌ డఫీ స్ధానంలో హాజిల్‌వుడ్‌ జట్టులోకి వచ్చాడు.

    తుది జ‌ట్లు
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హాజిల్‌వుడ్

    రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ
     

    తగ్గిన వర్షం
    అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గౌహతిలో వర్షం ఆగింది. దీంతో టాస్‌ 8:00 గంటలకు పడనుండగా.. మ్యాచ్‌ 8:15కు ప్రారంభం కానుంది.

    టాస్‌ ఆలస్యం
    ఐపీఎల్‌-2026లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. పిచ్‌ను ప్ర‌స్తుతం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్ర‌కారం 7:00 గంట‌ల‌కు ప‌డాల్సిన టాస్ ఇప్పుడు ఆల‌స్యం కానుంది.

  • ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్‌కు అప్పీల్‌ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.

    న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్‌ ఇస్తే, మైనర్‌ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్‌ బాలిక కూడా ఇదే కోచ్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్‌ గుర్తు చేసింది.  

    కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్‌ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్‌ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్‌ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్‌ వాదించింది.  

    తప్పుడు ఫిర్యాదు
    నిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్‌ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్‌ చేస్తూ బెయిల్‌ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది.  

  • ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ ధ‌న‌ధాన్ లీగ్‌లో భాగంగా శ‌నివారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో ఎస్ఆర్‌హెచ్ త‌ల‌ప‌డ‌నుంది. ల‌క్నోతో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో ఓట‌మి పాలైన సన్‌రైజ‌ర్స్‌.. ఇప్పుడు పంజాబ్‌పై ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓ కీల‌క మార్పుతో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. గ‌త మ్యాచ్‌లో విఫ‌ల‌మైన స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్‌పై వేటు వేసేందుకు ఎస్ఆర్‌హెచ్ సిద్ద‌మైంది. గ‌తేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధ‌ర‌కు లివింగ్‌స్టోన్‌ను ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.

    కానీ తొలి రెండు మ్యాచ్‌ల‌లో అత‌డికి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌లేదు. అయితే ల‌క్నో జ‌రిగిన మ్యాచ్‌కు మాత్రం లివింగ్‌స్టోన్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. కానీ త‌న‌కు దక్కిన అవ‌కాశాన్ని ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. దీంతో పంజాబ్‌తో మ్యాచ్‌కు అత‌డిని ప‌క్క‌న పెట్టేందుకు ఎస్ఆర్‌హెచ్ సిద్ద‌మైంది.

    అత‌డి స్ధానంలో మ‌రో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బ్రైడ‌న్ కార్స్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. తొలి మూడు మ్యాచ్‌ల‌కు స్వ‌ల్ప గాయం కార‌ణంగా బెంచ్‌కే ప‌రిమిత‌మైన కార్స్‌.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. అత‌డు నెట్స్‌లో కూడా తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు.

    దీంతో బ్రైడ‌న్ కార్స్ ఐపీఎల్ అరంగేట్రం దాదాపు ఖాయ‌మైన‌ట్లే. ఇదొక్క‌టి మిన‌హా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో పెద్ద‌గా మార్పులు చోటు చేసుకోపోవ‌చ్చు. మ‌రోవైపు పంజాబ్ కింగ్స్ వ‌రుస విజ‌యాల‌తో మంచి జోష్‌లో ఉంది. అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా ఉన్న పంజాబ్‌ను ఎస్ఆర్‌హెచ్ ఎలా ఎదుర్కొంటుందో ఎదురు చూడాలి.
    చదవండి: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై 12 జట్లతో!

  • అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చారిత్ర‌త్మ‌క నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తోంది. రాబోయే వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ సైకిల్‌లో అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే జ‌ట్ల‌ను చేర్చేందుకు ఐసీసీ ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీలో తొమ్మిది జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య‌ను ప‌న్నెండుకు పెంచేందుకు ఐసీసీ సిద్ద‌మైంది. దీంతో డ‌బ్ల్యూటీసీ 2027-29 సైకిల్‌లో అఫ్గాన్‌,  ఐర్లాండ్‌, జింబాబ్వే జ‌ట్లు కూడా చేర‌నున్నాయి. ఈ మూడూ టెస్టు హోదా పొందినప్పటికీ ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ సైకిల్‌లో మాత్రం చోటు ద‌క్క‌లేదు.  

    ఇప్పుడు తొలిసారి వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిష్‌లో ఈ మూడు జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. కాగా ప్ర‌స్తుత నిబంధనల ప్ర‌కారం.. డబ్ల్యూటీసీలో చేరాంటే క‌నీసం రెండు టెస్టు సిరీస్‌లైనా ఆడాలి. కానీ ఇప్పుడు 12 జ‌ట్లను చేర్చాల‌ని నిర్ణ‌యించ‌డంతో.. క‌నీసం ఒక్క టెస్టు సిరీస్ ఆడినా కూడా స‌ద‌రు జట్టుకు డబ్ల్యూటీసీలో భాగ‌మ‌య్యే అవ‌కాశం ల‌భిస్తోంది. అయితే ఈ నిబంధ‌న‌  2027-29 సైకిల్ నుంచి అమ‌లులోకి రానుంది. 

    న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రోజర్ ట్వోస్ నేతృత్వంలోని ఐసీసీ బృందం ఈ కొత్త మోడల్‌పై కసరత్తు చేస్తోంది. ఈ క‌మిటీ త్వ‌ర‌లోనే తుది సిఫార్సులను ఐసీసీ అందించే అవకాశం ఉంది. కాగా కాగా 2019లో ఐసీసీ తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టింది. రెండేళ్ల వ్యవధిలో ఆడే మ్యాచ్‌లు, వాటి ఫలితాల ఆధారంగా జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గెలిచిన జట్టుకు ఐసీసీ గద లభిస్తుంది.

    విజేతలు వీరే
    తొలి సీజన్‌లో భారత్‌- న్యూజిలాండ్‌ (2019-21) డబ్ల్యూటీసీ ఫైనల్‌ తలపడగా.. కేన్‌ విలియమ్సన్‌ బృందం విజేతగా నిలిచింది. విరాట్‌ కోహ్లి సేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో సీజన్‌లో (2021-23)లోనూ టీమిండియా ఫైనల్‌ చేరగా.. ఈసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌-2025లో ఆస్ట్రేలియాను ఓడించి సౌతాఫ్రికా విజేతగా అవతరించింది.
    చదవండి: IPL 2026: ల‌క్నో జ‌ట్టులోకి సౌతాఫ్రికా సూప‌ర్‌ స్టార్‌

  • విండీస్‌ దిగ్గజ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ మరో​ రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ విండీస్‌ వీరుడు.. తాజాగా ఓ ప్రపంచ రికార్డును సెట్‌ చేశాడు. భారత్‌ వేదికగా జరిగే ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఆడే నరైన్‌.. 2026 ఎడిషన్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్‌ (షమీ) తీయడంతో భారత్‌లో టీ20ల్లో 200 వికెట్లు (183 మ్యాచ్‌లు) పూర్తి చేసుకున్నాడు. 

    తద్వారా భారతగడ్డపై ఈ మైలురాయిని తాకిన తొలి విదేశీ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ విభాగంలో నరైన్‌ తర్వాతి స్థానాల్లో డ్వేన్‌ బ్రావో (190), రషీద్‌ ఖాన్‌ (188) ఉన్నారు.

    నరైన్‌ భారత్‌లో ప్రపంచ రికార్డు సెట్‌ చేసిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సునీల్‌ బంతితో రాణించినా (4-0-13-1) కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. రహానే (41), అంగ్క్రిష్‌ రఘువంశీ (45), కెమెరాన్‌ గ్రీన్‌ (39*), రోవ్‌మన్‌ పావెల్‌ (32*) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

    అనంతరం కేకేఆర్‌ బౌలర్లు అద్భుతంగా రాణించినా ఆయుశ్‌ బదోని (54), ముకుల్‌ చౌదరి (54 నాటౌట్‌) మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ముఖ్యంగా ముకుల్‌ చౌదరి సిక్సర్లతో విరుచుకుపడి చివరి బంతికి లక్నోను గెలిపించాడు. 

    ప్రస్తుత ఎడిషన్‌లో కేకేఆర్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడి న 4 మ్యాచ్‌ల్లో 3 ఓటములు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఓడిన 3 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఆటగాళ్లు రాణించినా, అదృష్టం వారి పంచన లేదు. 4 మ్యాచ్‌లైనా ఇంకా ఖాతా తెరవకపోవడంతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా సంక్లిష్టం కానున్నాయి. ఏప్రిల్‌ 14న జరిగే తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌ సీఎస్‌కేతో తలపడుతుంది. 

  • ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఆడుతుండగానే మరో లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అమెరికా వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లోని వాషింగ్టన్‌ ఫ్రీడం ఫ్రాంచైజీతో అతను డీల్‌ కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి స్టీవ్‌ 2024 ఎడిషన్‌లోనూ ఆడాడు. 

    ఆ సీజన్‌లో ఫ్రీడంకు కెప్టెన్‌గానూ వ్యవహరించి టైటిల్‌ గెలిపించాడు. ఆ సీజన్‌లో ఫ్రీడం​ టైటిల్‌ గెలవడంలో స్టీవ్‌ది కీలకపాత్ర (9 ఇన్నింగ్స్‌ల్లో 56 సగటున, 148.67 స్ట్రయిక్‌రేట్‌తో 336 పరుగులు). ఇతరత్రా కారణాల వల్ల గత సీజన్‌ మిస్‌ అయిన స్టీవ్‌, ఇప్పుడు (2026) మళ్లీ ఫ్రీడంతో జతకట్టాడు.

    ఈ జనరేషన్‌లో అత్యుత్తమ టెస్ట్‌ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న స్టీవ్‌, ఇప్పుడిప్పుడే టీ20ల్లోనూ తన మార్కు చూపిస్తున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ గత రెండు ఎడిషన్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిన స్టీవ్‌.. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ అదే ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. 

    పీఎస్‌ఎల్‌లో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ఆడుతున్న స్టీవ్‌.. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 154కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో స్టీవ్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌తో కలిసి ముల్తాన్‌కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నాడు. 

    స్టీవ్‌ రాణిస్తుండటంతో పీఎస్‌ఎల్‌ 2026లో ముల్తాన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగ్‌ల్లో ఆడటం మొదలుపెట్టిన స్టీవ్‌కు ఐపీఎల్‌లో మాత్రం అవకాశం దక్కలేదు. ఈ సీజన్‌ వేలంలో పాల్గొన్నా స్టీవ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

  • పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించింది. ఆద్యంతం మెరుగైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్‌ బృందం.. ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చిరకాల కోరిక నెరవేర్చుకుంది.

    రెండూ గెలిచింది
    ఇక ఇదే జోరులో ఐపీఎల్‌-2026ను విజయంతో ఆరంభించిన ఆర్సీబీ.. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడింది.

    ANIతో మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ కచ్చితంగా టైటిల్‌ నిలబెట్టుకోగలదు. గతంలో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ పని చేశాయి. ఆర్సీబీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈసారి కూడా నిలకడైన ఆటతో ముందుకు సాగుతోంది.

    మరోసారి విజేతగా
    ప్లే ఆఫ్స్‌ చేరడం వారి తొలి లక్ష్యం. అన్ని జట్లు ఇందుకోసం కృషి చేస్తాయి. ఈసారి కొత్త చాంపియన్‌ రావడం కాస్త కష్టమే. అయితే, ఆర్సీబీ మాత్రం కచ్చితంగా మరోసారి విజేతగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈసారి కూడా ఆ జట్టు కూర్పు ఎంతో బాగుంది’’ అని అంజుమ్‌ చోప్రా అభిప్రాయపడింది.

    అదే విధంగా పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కూడా బాగుందని.. వారికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని అంజుమ్‌ చోప్రా పేర్కొంది. కాగా పంజాబ్‌ ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట గెలవగా.. ఒక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోయింది.

    చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. శ్రీలంక స్టార్ ఆల్‌రౌండ‌ర్ వ‌నిందు హ‌స‌రంగ గాయం కార‌ణంగా సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. ఫ‌స్ట్ హాఫ్ సీజ‌న్ త‌ర్వాత హ‌స‌రంగ జ‌ట్టుతో చేరుతాడ‌ని ల‌క్నో మేనెజ్‌మెంట్‌ భావించింది. కానీ అత‌డు త‌న మోకాలి గాయం నుంచి కోలుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

    తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో హ‌స‌రంగ ఉత్తీర్ణ‌త సాధించలేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ 19వ సీజ‌న్ నుంచి హ‌స‌రంగా వైదొలిగాడు. ఈ విష‌యాన్ని లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ ధ్రువీకరించాడు. అయితే హ‌స‌రంగ స్ధానాన్ని సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండ‌ర్ జార్జ్ లిండేతో ల‌క్నో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

    ఇప్ప‌టికే లిండేతో ల‌క్నో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. దీనిపై తదుపరి 24 నుంచి 48 గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రోటీస్ ఆల్‌రౌండ‌ర్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో ఆడిన అనుభ‌వం ఉంది. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్  250 పైగా టీ20 మ్యాచ్‌ల్లో 218 వికెట్లు పడగొట్టాడు. 

    లిండేకు లోయార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసే స‌త్తా కూడా ఉంది. లక్నో జట్టులో ఇప్పటికే షాబాజ్ అహ్మద్, ఎం. సిద్ధార్థ్ వంటి లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. కానీ హ‌స‌రంగ లాంటి స్టార్ ఆల్‌రౌండ‌ర్ స్ధానాన్ని భ‌ర్తీ చేసేందుకు ల‌క్నో మొగ్గు చూపుతోంది. కాగా ఈ ఏడాది సీజన్‌లో లక్నో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండింట విజయం సాధించింది.
    చదవండి: నాపై కోపంతో చెత్తబుట్టలో పడేశాడు.. అతడి తండ్రి వచ్చి..: యువీ
     

  • దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్‌ అనే  ఫ్రాంచైజీ తమ ఆల్‌రౌండర్‌ బేయర్స్‌ స్వానెపోల్‌ను సస్పెండ్‌ చేసింది. ఓ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్‌ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్‌ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు. 

    చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్‌ కొనసాగించాలని లయన్స్‌ను ఆజ్ఞాపించాడు. బేయర్స్‌ మైదానం వీడే సమయానికి మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్‌ గైర్హాజరీలో లయన్స్‌ 10 మందితోనే మ్యాచ్‌ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. 

    ఆ మ్యాచ్‌లో బేయర్స్‌ ఉండి ఉంటే, ఫలితం లయన్స్‌కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్‌లో బేయర్స్‌ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్‌ను మ్యాచ్‌లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్‌ ఇచ్చి లయన్స్‌ ఓటమికి కారకుడయ్యాడు. 

    ఇంతకీ బేయర్స్‌ అంత అర్జెంట్‌గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్‌షైర్‌ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్‌ అయితే వోర్సెస్టర్‌షైర్‌తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్‌ స్వయంగా చెప్పాడు.

    బేయర్స్‌ చర్యను చాలా సిరీయస్‌గా తీసుకున్న లయన్స్‌ యాజమాన్యం అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. బేయర్స్‌ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది. 

    అతను క్రికెట్‌ సౌతాఫ్రికా నుంచి ఎన్‌వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్‌ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్‌ కౌంటీ ఛాన్స్‌ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్‌ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.

    ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్‌ స్పందించాడు. లయన్స్‌ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్‌ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్‌ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు. 

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్‌కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్‌కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

    ఐపీఎల్‌-2025 సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది.

     ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?
    ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్‌కే ఖర్చు చేసింది. వీరి ‍ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

    ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్‌ బదానీ, వేణుగోపాల్‌ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ప్రతి మ్యాచ్‌ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.

    సీఎస్‌కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్‌కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడే
    ఈ సందర్భంగా టీమిండియా స్టార్‌, దిగ్గజ పేస్‌ బౌలర్‌గా ఎదిగిన జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్‌ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్‌ కోచ్‌లుగా ఉన్నా.. జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్‌ రైట్‌. 

    ఇలాంటి విషయాల్లో సీఎస్‌కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్‌ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్‌ విమర్శించాడు.

    చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌

Movies

  • ప్రస్తుతం అంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కావడం ఆలస్యం.. నెల, నెలన్నరలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చాన్నాళ్ల తర్వాత అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి దీని సంగతి? ఎందులో ఉంది?

    స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. 'శబ్దం' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 28న తెలుగు, తమిళంలో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. గతంలో ఆదితోనే 'వైశాలి' తీసిన అరివళగన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సక్సెస్‌ని రిపీట్ చేయలేకపోయారు. ఇకపోతే ఈ మూవీ తమిళ వెర్షన్.. గత నెల 24న జీ5 ఓటీటీలోకి వచ్చింది. తర్వాత కొన్నిరోజులకు హిందీ వెర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

    'శబ్దం' విషయానికొస్తే.. మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీ. అందులోని విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు అనుమానస్పద రీతిలో చనిపోతుంటారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం.. ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో కాలేజీ మొత్తం పరిశోధిన జరిపించి దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం(ఆది పినిశెట్టి)ని తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలని తన దగ్గరున్న సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు.

    అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక(లక్ష‍్మి మేనన్)పై వ్యూమాకి అనుమానం మొదలవుతుంది.ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతిక‌పై ఓ ప్రయోగానికి సిద్ధప‌డ‌గా, అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు క‌నిపెడ‌తాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవ‌రు? వాళ్లకు కాలేజీలో జ‌రుగుతున్న చావుల‌కు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    • మాల్దీవుస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..
    • హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..
    • గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..
    • కేఫ్‌లో చిల్ అవుతోన్న బిగ్‌బాస్ దివి..
    • జిమ్‌లో హనీ రోజ్ కసరత్తులు..

     

     

     

     

     

     

     

  • టాలీవుడ్ నటి అనసూయ యాంకర్‌గా మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటోంది. అంతేకాకుండా మహిళలపై జరిగే అన్యాయాలపై పోరాడుతూ వారికి మద్దతుగా తనవంతు పోరాటం చేస్తోంది. ముఖ్యంగా మహిళలపై ట్రోల్స్ చేసేవారికి తనదైన స్టైల్లో ఇచ్చిపడేస్తుంది.

    తాజాగా అనసూయ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. యూకేలో జరిగిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ మహిళను ఆంటీ అని పిలిచిన ఓ వ్యక్తికి లండన్‌లోని కోర్టు ఏకంగా రూ.1.5 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను అనసూయ తన ట్విటర్‌లో షేర్ చేసింది. హమ్‌ అంటూ.. ఈ తీర్పును సమర్థిస్తూ అనసూయ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతంలో కొందరు నెటిజన్స్ అనసూయను సైతం ఆంటీ అంటూ ట్రోల్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 

    (ఇది చదవండి: 'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్)

    కాగా.. గతంలో నటుడు శివాజీ మహిళల దుస్తులను ఉద్దేశించి ఓ మూవీ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్‌కు అనసూయ కౌంటరిచ్చింది. మహిళలు ఎలాంటి దుస్తులైనా ధరించడం వాళ్ల వ్యక్తిగతమని పేర్కొంది. ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చని.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని అనసూయ తెలిపింది. 

     

  • ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు మూవీస్‌లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్‌ పాల్‌తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.

    తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.

    మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.

    కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు.  ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
     

  • టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.  ఈ సందర్భంగా శ్రీలీలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. హీరోయిన్ శ్రీలీలను చూసిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక శ్రీలీల సినిమాల విషయానికొస్తే చివరిసారిగా పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో మెప్పించిన కన్నడ బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్‌లోనూ మెప్పించింది. పుష్ప-2 చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతేకాకుండా ఈ ఏడాది పరాశక్తి మూవీతోనూ అలరించింది. 
     

     

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులపై ప్రశంసలు కురిపించారు. సర్వైకల్ క్యాన్సర్‌ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేపట్టడాన్ని అభినందించారు. ప్రతి ఏటా ఒక మంచి పని చేయడం.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించిన అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. మీరంతా కలిసి అద్భుతమైన పని చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు.

    అల్లు అర్జున్ తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..'ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. మీరందరూ అద్భుతమైన పని చేశారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం.' అంటూ పోస్ట్ చేశారు. 
     

     

  • పార్థ గోపాల్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘డైమండ్‌ డెకాయిట్‌’. సూర్య జి. యాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘన హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు(ఏప్రిల్‌10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

    కథేంటంటే..
    ఒక మనిషిని రక్షించేందుకు ప్రయత్నించిన గోపాల్ కుటుంబం చిన్నాభిన్నాం అవుతుంది. భయంకర డెకాయిట్‌గా పేరు తెచ్చుకున్న మునుస్వామి నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎదుగుతాడు. జైలు నుంచి విడుదలైన గోపాల్ అతని గ్యాంగ్‌లో చేరుతాడు. అయితే బయటకు అతను మునుస్వామి నాయుడికి నమ్మకస్తుడిగా కనిపించినా, లోపల మాత్రం అమాయకులను రక్షిస్తూ డబుల్ లైఫ్‌ గడుపుతుంటాడు. గోపాల్ గతంలో ఎందుకు జైలుకు వెళ్లాడు? అతని అసలు లక్ష్యం ఏమిటి? వరుస హత్యలు, మరో హత్యా యత్నం వెనుక ఉన్న నిజం ఏమిటి? గోపాల్ ఎందుకు బండిపోటుగా మారుతాడు? చివరకు బయటపడే నిజాలు కథకు కీలకం అవుతాయి.

    ఎలా ఉందంటే..
    క్రైమ్‌, యాక్షన్‌, సెంటిమెంట్ కలయికతో రూపొందిన కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా అంతర్లీనంగా ఒక హృద్యమైన ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయి. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథను నడిపించిన తీరు బాగుంది.అసలు కథను ప్రారంభించడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నా, ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగించాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా.. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. స్క్రిన్‌ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.

    ఎవరెలా చేశారంటే.. 
    హీరోగా, నిర్మాతగా పార్ధ గోపాల్ రెండు విభాగాలకు న్యాయం చేశాడు. నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరోగా బాగానే నటించాడు. యాక్షన్‌తో ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలతో సినిమాను భావోద్వేగపూరితంగా తెరకెక్కించారు.సాయి రాజు రాసిన డైలాగ్స్ సహజం ఉన్నాయి. : పీఆర్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ పాయింట్‌.గోపాల్ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయే ముందు వచ్చే పాటు బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    -రేటింగ్‌: 2.5/5
     

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్‌ సీక్వెల్‌గా తీసుకొచ్చారు. కేవలం  మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ రిలీజ్ చేశారు.

    ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్‌-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే.

     

     

  • అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్‌లో ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ మొదలైంది.  ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్‌ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్‌కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్‌కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.

    పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్  ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
     

  • వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్‌, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

    భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కాన్సెప్ట్‌ బాగున్నా.. తెరపై  ఆకట్టుకునేలా తీయడంతో దర్శకుడు విఘ్నేష్‌ విఫలం అయ్యాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు.

    కథ విషయానికొస్తే.. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన ‘లవ్‌ టుడే’ మాదిరే ఈ చిత్రం కూడా ఫోన్‌ చుట్టూనే నడుస్తుంది. అయితే ఇందులో కథను 14 ఏళ్లు ముందుకెళ్లి..అంటే 2040లో నడుస్తున్నట్లుగా చూపించారు. అప్పటి వరకు మొబైల్‌, సోషల్‌ మీడియా ప్రభావం మన జీవితాలపై  ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు విఘ్నేష్‌. 

    ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అంటూ ప్రేమకు కూడా ఒక ఇన్సూరెన్స్ ఏర్పాటు  చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన పాయింటే కానీ.దాన్ని అంతే ఆసక్తికరంగా తెరపై చూపించి ఉంటే బాగుండేదని సినిమా చూసిన నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

  • బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంతార వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంపై ఇప్పటికే దురంధర్‌ హీరో క్షమాపణలు కూడా చెప్పారు. ‍అయినప్పటికీ ఇంకా కోర్టులో ఇంకా నడుస్తోంది. రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో చెప్పిన సారీ సరిపోదంటూ బెంగళూరుకు చెందిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు  కీలక ఆదేశాలు జారీ చేసింది. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు కర్ణాటకలోని చాముండి ఆలయాన్ని సందర్శించాలని కోర్టు ఆదేశించింది.

    దీనిపై తాజాగా రణ్‌వీర్ సింగ్‌ న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. మరోసారి క్షమాపణ పత్రాన్ని సమర్పిస్తామని రణ్‌వీర్‌సింగ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముంబైలోని సింధీ కుటుంబంలో పెరగడం వల్ల తనకు ఇక్కడి ఆచారాలు, వాటి సున్నితత్వం గురించి అవగాహన లేదని తన క్షమాపణ పత్రంలో పేర్కొన్నారు. సరైన సమయంలో చాముండి ఆలయాన్ని సందర్శించి.. తన భక్తిని చాటుకుంటానని కోర్టుకు లిఖితపూర్వకంగా అందజేశారు.

    అసలు వివాదం ఎంటంటే?

    గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కాంతార మూవీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రంలోని ఒక కీలక సన్నివేశాన్ని అనుకరించారు. రిషబ్‌ నటనను ప్రశంసించే సందర్భంలో రిషబ్‌ అద్భుతమైన నటించారు.. ముఖ్యంగా ఆడ దెయ్యం(చాముండి దైవం) మీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అమోఘం అంటూ వేదికపై యాక్షన్‌ చేస్తూ చూపించారు. ఇదంతా తమ దైవాన్ని కించపరిచేలా రణ్‌వీర్ ఇమిటేట్ చేశారంటూ పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. పవిత్రమైన దైవాన్ని దెయ్యంగా సంభోధించడం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్‌వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంకర్ణాటక హైకోర్టుకు చేరింది.

Business

  • 2026 బజాజ్ పల్సర్ 180 భారతదేశంలో రూ. 1,22,490 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఈ మోటార్‌సైకిల్ బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ 220F మధ్య ఉంది. సాధారణ మోడల్ కంటే కూడా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

    పల్సర్ 180 లో 178.61cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 16.77bhp పవర్, 6,500rpm వద్ద 15Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది అన్నివిధాలా వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

    డిజైన్ పరంగా.. బజాజ్ ఐకానిక్ పల్సర్ స్టైలింగ్‌ను అలాగే కొనసాగించింది. అయితే.. 2026 మోడల్ ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉండేలా సూక్ష్మమైన కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు బ్లాక్ అవుట్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. కలర్ ఆప్షన్‌ను బట్టి కాంట్రాస్టింగ్ హైలైట్స్‌తో వస్తుంది. అదనంగా.. ముందు మడ్‌గార్డ్ కార్బన్-ఫైబర్ లాంటి ఫినిషింగ్‌ను పొందింది, ఇది దాని స్టైలింగ్‌కు మరింత స్పోర్టీ టచ్‌ను జోడిస్తుంది. హెడ్‌ల్యాంప్ డిజైన్‌లో ఎల్ఈడీ లైటింగ్‌ను పొందుపరిచారు.

  • మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ధ్రువీకరించారు. ఇప్పుడు మరో కొత్త మోడల్ రానున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా ఉంటుందని సమాచారం.

    ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, తన ప్రస్తుత ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా, చౌకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచించినప్పటికీ.. అమల్లోకి త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

    రాబోయే చిన్న, సరసమైన కారును కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే కాకుండా.. మోడల్ 3, మోడల్ వై కంటే భిన్నంగా ఉండేలా తయారు చేయనుంది. దీని బరువు 1.5 మెట్రిక్ టన్నులు ఉండేలా సిద్ధం చేయనున్నారు. ధరను తగ్గించడం కోసం.. చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చే అవకాశం ఉంది. అంటే ఈ కారు రేంజ్ కొంత తక్కువగా ఉంటుందన్నమాట.

    ఇదీ చదవండి: హ్యుందాయ్ వైబ్ ఎడిషన్‌ లాంచ్: ధర ఎంతంటే?

    టెస్లా కొత్త కారును షాంఘైలోని గిగాఫ్యాక్టరీలో ప్రారంభించనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే, చివరికి తయారీని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారు?, మొదటి ఎక్కడ విక్రయించనున్నారు? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

  • శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.

    చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.

    వెండి ధరలు
    వెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్‌లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది.

  • భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్‌లోనే రిఫైనరీస్‌కు ఆయన డైరెక్టర్‌గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్‌ పదవీ కాలం 2025 ఏప్రిల్‌30తో ముగిసింది. అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు.

    పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్‌ ఎక్స్చెంజీలకు బీపీసీఎల్‌ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి వాచినట్టు వెల్లడించింది.

    2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్‌ ఇంజనీర్‌ చదివారు. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై నుంచి ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ సైతం పూర్తి చేశారు.

  • అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్‌లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి  కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.

    ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్‌ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.

    ఇదీ చదవండి: 'యాప్‌లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ

    కొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు.

  • టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్‌స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్‌ఫోన్‌లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.

    నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్‌లు, యాప్ స్టోర్‌లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్‌లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.

    ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్‌లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్‌లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.

    ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.

    ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్‌లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.

    ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

  • హ్యుందాయ్ ఇండియా.. తన గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వైబ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. దీని ధరలు రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (O) వేరియంట్ల ఆధారంగా నిర్మితమైంది.

    గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ స్పోర్ట్జ్ వైబ్, స్పోర్ట్జ్ (ఓ) వైబ్ అనే రెండు ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఎరుపు రంగు ఇన్సర్ట్‌లతో కూడిన నలుపు రంగు ఇంటీరియర్, అలాగే నలుపు రంగులో పెయింట్ చేసిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.

    స్పోర్ట్జ్ (ఓ) వైబ్ వేరియంట్‌లో పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.

    పవర్‌ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, వైబ్ ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగుతుంది, దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.

    డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.

    గ్రాట్యుటీ అంటే ఏమిటి?

    ‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.

    గ్రాట్యుటీ పొందడానికి అర్హతలు

    గ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.

    ఎలా లెక్కిస్తారు?

    గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్‌+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.

    గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26

    ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.

    ఉదాహరణ:

    రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.

    గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.

    గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.

    ముఖ్యమైన అంశాలు

    • ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.

    • ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.

    • ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.

    ఇదీ చదవండి: రఫేల్‌ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!

Telangana

  • సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం రైతుబజార్, బస్‌స్టాప్‌ జరుగుతున్న స్కైవాక్ నిర్మాణ పనుల దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఈ రోజు (శుక్రవారం) రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు ట్రఫిక్‌ అడ్వయిజరీ జారీ చేశారు..

    ట్రాఫిక్ మళ్లింపులు జరిగే ప్రాంతం

    మాసబ్ ట్యాంక్, NMDC, ఎస్.డి.ఐ హాస్పిటల్ వైపు నుండి రేతిబౌలి-నానల్ నగర్ వైపు వెళ్లే వాహనాలను పి.వి.ఎన్.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 2 & 3 (అజీజియా మసీదు) వద్ద మళ్లిస్తారు.ఈ వాహనాలు మెరాజ్ కేఫ్ వద్ద కుడి వైపుకు తిరిగి, మెహిదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

    అదేవిధంగా నగర ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అప్‌డేట్ల కోసం మా సోషల్ మీడియా వేదికలైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ (facebook.com/ HYDTP) ఎక్స్‌ట్విట్టర్ హ్యాండిల్ @HYDTP ను అనుసరించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్  నెంబర్: 9010203626 కాల్‌చేయాలని హైదరాబాద్‌ జాయింట్ కమిషనర్‌  జోయల్ డేవిస్ ప్రకటన విడుదల చేశారు

  • హైదరాబాద్‌:  తెలంగాణలో లిక్కర్‌ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో రాష్ట్రంలో లిక్కర్‌ చార్జీలు పెరుగనున్నాయి. ఈ నెలాఖరుకల్లా చార్జీల పెంపుపై నిర్ణయం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్‌ చార్జీల పెంపును 12 నుంచి 15 శాతం వరకూ పెంచాలని కంపెనీల ప్రతిపాదనలు పంపగా, దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 

    ఇప్పటికే  బీర్ల ధరలను ప్రభుత్వం పెంచగా, మళ్లీ లిక్కర్‌ ధరలను పెంచాలని భావిస్తోంది. రెండేళ్లకొకసారి లిక్కర్‌ ధరలను పెంచే నిబంధన ఉందని అధికారులు అంటుండగా, లిక్కర్‌ ధరలు పెరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని ప్రభుత్వం అంటోంది. దాంతో లిక్కర్‌ ధరల పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందనే విషయం అర్ధమవుతోంది. 

  • హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల నుంచి రూ. 5 కోట్లు మేర వసూలు చేసింది ఓ గ్యాంగ్‌, అయితే ఎంతకీ ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వారిని నిలదీశారు బాధితులు.  

    ఈ విషయాన్ని నాన్చడంతో అనుమానం వచ్చిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సుమారు 452 మంది బాధితులు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్‌ చేయగా, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. 

     

  • సాక్షి, హైదరాబాద్: వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి, రహదారి భద్రతను మెరుగుపరచడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 03.04.2026 నుండి 09.04.2026 వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత లోపించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం మరియు వాహనదారులలో క్రమశిక్షణను పెంపొందించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు

    గడిచిన వారం రోజుల్లో నిర్వహించిన తనిఖీలలో, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్న 6,046 మంది నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో అధికంగా ద్విచక్ర వాహనదారులు 5,810 మంది, ఆటో/త్రీ వీలర్ డ్రైవర్లు  51 మంది, కార్లు మరియు ఇతర వాహనదారులు 185 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

    ఈ సందర్బంగా  హైదరాబాద్‌ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ..వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం అనేది రహదారి భద్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన నేరం. దీనివల్ల డ్రైవర్ దృష్టి పక్కదారి పడుతుంది. ఒక్క క్షణం పాటు దృష్టి మళ్లినా, అది వాహనదారుడితో పాటు ఇతర ప్రయాణికులకు మరియు పాదచారుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చార్జ్‌షీట్లు దాఖలు చేసి, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని చట్టప్రకారం జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
     

  • సంగారెడ్డి, సాక్షి: గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
  • హైదరబాద్‌: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూరులో శుక్రవారం(ఏప్రిల్‌ 10వ తేదీ) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంజనాద్రి నగర్‌లోని 204 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 

    కాగా, ఈనెల ఆరంభంలో  మైలార్‌దేవుపల్లి సర్కిల్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టి సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని కాపాడింది. మైలార్‌దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి.  ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. 

    దీంతో,  భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్‌ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్‌గా దృష్టి పెట్టింది. జీహెచ్‌ఎంసీతో కలిసి నగరంలో వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 

Family

  • నిరాశ, నిస్పృహలు అనేవి ఓటమికి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఆశ, ఆత్మవిశ్వాసం అనేవి విజయానికి క్లోజ్‌ ఫ్రెండ్స్‌. కాళ్లు, చేతులు లేని పాయల్‌ నాగ్‌ ఆశ, ఆత్మవిశ్వాసాలతో స్నేహం చేసింది. బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణం గెలుచుకొని మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...

    బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఫైనల్‌లో తన ఆరాధ్య దేవతలాంటి శీతల్‌దేవిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది పద్దెనిమిదేళ్ల పాయల్‌ నాగ్‌. ఇది కేవలం విజయం మాత్రమే కాదు. క్రీడలకు అతీతమైన అనుభూతి.

    ఒకప్పుడు శీతల్‌దేవి గురించి విని పాయల్‌ పులకించిపోయేది. ఆమె వీడియోలు అదేపనిగా చూసేది. ‘శీతల్‌దేవిలా పేరు తెచ్చుకోవాలి’ అని కల కనేది. ఆ కల నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. అయితే అది అదృష్టంతో వచ్చిన విజయం కాదు. అంకితభావం, కష్టపడేతత్వంతో వచ్చిన విజయం...

    అనాథాశ్రమంలో...
    ఒడిశాకు చెందిన పాయల్‌ తండ్రి కూలి. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో నాలుగు అవయవాలను కోల్పోయింది పాయల్‌. పోషించే స్థోమత లేక తల్లిదండ్రులు ఆమెను అనాథాశ్రమంలో చేర్పించారు. దురదృష్టం సంగతి ఎలా ఉన్నప్పటికీ పాయల్‌ నిరాశ చీకట్లో మగ్గిపోలేదు. ఎప్పుడూ చురుగ్గా ఉండేది. పాయల్‌ తన నోటితో పెయింటింగ్‌ వేస్తున్న ఒక వైరల్‌ వీడియో కోచ్‌ కుల్దీప్‌ కుమార్‌ వేద్వాన్‌ దృష్టిని ఆకర్షించింది. పాయల్‌లోని ప్రతిభను గుర్తించి కత్రాలోని తన అకాడమీకి తీసుకువచ్చాడు. పాయల్‌ కోసం ప్రత్యేకంగా విల్లు తయారుచేయించాడు. ఆర్చరీలో ఆమెను తీర్చిదిద్దాడు.

    భుజం, నోటితో...
    విల్లును పట్టుకోవడానికి కాళ్లను ఉపయోగిస్తుంది శీతల్‌దేవి. ఆమెలా కాకుండా తన భుజం, నోటిని ఉపయోగించి విల్లును సంధిస్తుంది పాయల్‌. ఇదేమీ అంత సులువైన విషయం కాదు. బోలెడు కష్టపడాలి. సహనం ఉండాలి. ఆ రెండు పాయల్‌లో ఉండడం వల్లే ఆర్చరీలో అద్భుత ప్రతిభ చూపగలుగుతోంది.

    బ్యాంకాక్‌లో పాయల్ పాల్గొన్న ఈవెంట్‌ తన మొదటి సీనియర్‌ అంతర్జాతీయ ఈవెంట్‌ అయినప్పటికీ శీతల్‌ను ఓడించడం ఇదే మొదటి సారి కాదు. జైపూర్‌లో 2025లో జరిగిన పారా ఆర్చరీ నేషనల్స్‌లో శీతల్‌ను స్వల్ప తేడాతో ఓడించింది.

    ఇక బ్యాంకాక్‌ విషయానికి వస్తే...
    శీతల్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా పాయల్‌ ప్రశాంతంగా విజయాన్ని కైవసం చేసుకుంది.

    ఇద్దరి గురువు ఒకరే...
    శీతల్‌తో పాటు, పాయల్‌ను ఆర్చరీలో తీర్చిదిద్దిన వ్యక్తి కుల్దీప్‌ కుమార్‌ వేద్వాన్‌. ఆయన ఒక రైతు కుమారుడు. ఆ రైతు ఎలాంటి వ్యక్తి అంటే... ‘నీ దగ్గర సంపద లేకపోవచ్చు. వనరులు లేకపోవచ్చు. నీ మీద నీకు మాత్రం గట్టి నమ్మకం ఉండాలి’ అని నమ్మిన వ్యక్తి.

    తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్న వేద్వాన్‌ ఇతరులకు కూడా దారి చూపుతున్నాడు. శీతల్, పాయల్‌లాంటి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.

     

  • మహిళా రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా, సుస్థిరంగా పెంపొందించే పద్ధతులపై అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) పరిశోధకుల బృందం అధ్యయనం నిర్వహించింది. ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సస్టైనబుల్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ పత్రికలో ఇటీవల ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, మన మహిళా రైతులు నిజమైన వాతావరణ మార్పులను తట్టుకునే శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటే వారికి ఏవో కొన్ని సాంకేతికతలను ఉన్నత స్థాయి నుంచి అందించటం ఒక్కటే సరిపోదు. వారికి సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేసి అందించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారత దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో విభిన్న కేస్‌ స్టడీలను ఐఆర్‌ఆర్‌ఐ విశ్లేషించి ఈ విషయాన్ని నిర్థారించింది. ఆ వివరాలు చూద్దాం...

    వాతావరణ సంక్షోభం దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయం చేసే కోట్లాది మంది మహిళలను కూడా ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలో అహరహం శ్రమించటంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళా రైతులు అడుగడుగునా ‘లింగ–వివక్ష’ను ఎదుర్కొంటున్నారు. వారు అధిగమించాల్సిన సామాజిక అడ్డంకులను పరిగణనలోకి తీసుకోకుండా, వారికి కొత్త సాంకేతికతతో కూడిన పనిముట్లను అందించటం వల్ల ప్రయోజనం ఉండటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. 

    ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సస్టయినబుల్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ పత్రికలో ఇటీవల ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిజంగా ఉపయోగపడే సామర్థ్యాలను మనం పెంపొందించుకోవాలంటే, విడివిడి సాంకేతికతలను అందించడం ఆపి, అనేక ఆవిష్కరణలను కలిపి గంపగుత్తగా అందించడం ప్రారంభించాలి. ఎక్కడో ఉండే నిపుణులు తమకు తోచినట్లు సిద్ధం చేసిన సాంకేతికతను రైతుకు బదిలీ చేసే సాంప్రదాయ అధికార కేంద్రీకృత వ్యవసాయ విస్తరణ నమూనా మహిళా రైతుల విషయంలో విఫలమవుతోందని ఈ పరిశోధన తేల్చింది. 

    దానికి బదులుగా, సామాజిక పరిస్థితులు, అవసరాల ఆధారిత సాంకేతిక విధానాన్ని అమలు చెయ్యాలని సూచించింది. అంటే, విత్తనం లేదా ట్రాక్టర్‌ కేవలం మహిళా రైతులకు, పురుష రైతులకు ఒకేలా ఉపయోగపడే ఒక తటస్థ సాంకేతికత కాదని గుర్తించడం.. సామాజిక సంబంధాలు, సాంస్కృతిక నియమాలు, ఆ సమాజంలోని సంస్థాగత అధికార స్థితిగతులపై దాని విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించటం అవసరమని అధ్యయనం పేర్కొంది. ఈ భావనను నిరూపించడానికి అధ్యయనంలో భాగంగా ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు భారతదేశవ్యాప్తంగా నాలుగు విభిన్న కేస్‌ స్టడీలను విశ్లేషించారు. సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేయడం ద్వారా మహిళా రైతులు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వైపు సమర్థవంతంగా, సుస్థిరంగా ఎలా మారగలరో ఈ అధ్యయనం వెల్లడించింది.  

    విజ్ఞాన శాస్త్రం, భూ హక్కులపై అవగాహనతో చౌడుపై పోరాటం
    గుజరాత్‌లోని భావనగర్‌ ఉప్పునీటి చిత్తడి నేలల్లో పర్యావరణ ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు విడదీయరానివని ఉత్థాన్‌ అనే సంస్థ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా) గుర్తించింది. ఈ ప్రాంతంలోని మహిళలు నేల లవణీయతతోను, చట్టపరమైన భూమి హక్కుల లేమితో కూడా పోరాడుతున్నారు. భూమి హక్కులు లేకపోవడంతో వారు ప్రభుత్వ రుణాలను లేదా దీర్ఘకాలిక వ్యవసాయ వనరులను సులభంగా పొందలేకపోతున్నారు. 

    ఉత్థాన్‌ రూపొందించిన నూతన ఆవిష్కరణల ప్యాకేజీ ప్రత్యేకమైనది. ఇది నేల పరీక్ష, సేంద్రియ ఎరువులు వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, సామాజిక–చట్టపరమైన సాధికారతతో జత చేసింది. బ్లాక్‌–స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు తోడ్పడే ‘కృషి సఖు’లు (మహిళా సామాజిక రిసోర్స్‌ పర్సన్లు), పారాలీగల్‌ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పారాలీగల్‌ కార్యకర్తలు భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చిక్కుముడులను అధిగమించడంలో మహిళా రైతులకు సహాయపడ్డారు. 

    కృషి సఖులు ప్రామాణిక పంటల సాగు పద్ధతులన్నిటినీ బోధించారు. ఈ విధానం ఒక ‘సోదరభావాన్ని‘ సృష్టించింది. దీనిలో మహిళలు తమ తోటివారి నుంచి నేర్చుకున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, వారిపై వారి భర్తలకున్న విశ్వసనీయతను గణనీయంగా పెంచింది.

    ఆవాల కోసం అనుభవజ్ఞానాన్ని, మార్కెట్లను నిర్మించటం
    ఉత్తర ప్రదేశ్‌లోని ఉత్తర మైదాన ప్రాంతాల్లో గ్రామీణ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఎఫ్‌ఐ) నీటి ఒత్తిడిని తట్టుకునే, పోషకాలు అధికంగా కలిగి ఉండే ‘పూసా మస్టర్డ్‌ 30’ అనే బయోఫోర్టిఫైడ్‌ ఆవాలు రకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఒక మహిళ తన పంటను సరసమైన ధరకు అమ్ముకోవడానికి మార్గం లేనప్పుడు, కేవలం మెరుగైన విత్తనాన్ని అందించడం నిరుపయోగమని పరిశోధకులు పేర్కొన్నారు. 
    జీఎఫ్‌ఐ ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. 

    ఈ విత్తనాలతో పాటు ఇతర ఆవిష్కరణల ప్యాకేజీని కలిపి అందించటంపై దృష్టి సారించింది. వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీల) ద్వారా మార్కెట్‌ అనుసంధానాలతోపాటు సాంకేతిక శిక్షణ ఇప్పించారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి అవగాహన పర్యటనలను నిర్వహించడం ద్వారా, వారు శాస్త్రీయ నైపుణ్యాన్ని రైతులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. 

    తద్వారా మహిళా రైతులు నిపుణులతో నేరుగా సంభాషించడానికి వీలు కలిగింది. ఈ మార్కెట్‌ అనుసంధానాలను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఎఫ్‌పీఓలు, ఎస్‌హెచ్‌జీల ద్వారా ఏర్పడిన సామూహిక భాగస్వామ్యం మహిళా రైతులకు బలాన్నిచ్చింది. మహిళలు తమ ఇళ్లలో, సమాజాలలో తమ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈ సాధికారత సహాయపడింది.

    ముందడుగు ఎలా?
    మహిళా రైతుల సాధికారత కృషిలో సజావుగా ముందుకు సాగాలంటే మనం తప్పక చేయవలసినవి ఇవేనని ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు: 

    ఎంత సమయం?: 
    అమల్లోకి తెచ్చే సేంద్రియ వ్యవసాయం వంటి నూతన వ్యవసాయ సాంకేతికతలు ఒక మహిళా రైతు వెచ్చించే సమయాన్ని, శ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో క్రమపద్ధతిలో అంచనా వేయాలి. 

    అందరికీ భాగస్వామ్యం: ఇంటి బాధ్యతలను పునఃపంపిణీ చేయడానికి పురుషులను భాగస్వాములను చేసే లింగ పరివర్తన విధానాలను అవలంబించాలి. 

    వ్యవస్థకు మద్దతు: భూమి హక్కులు, మార్కెట్‌ అందుబాటు, స్వయం సహాయక బృందాలు వంటి సామూహిక వేదికలలో సాంకేతికత వేరూనుకునేలా చెయ్యాలి. 

    సాంకేతిక, సంస్థాగత అంశాలతో సామాజిక అంశాలను అనుసంధానించడం ద్వారా, తదుపరి తరం వాతావరణ అనుకూల వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాధనాలు కేవలం ఒక షెడ్డుకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు వెన్నెముక అయిన మహిళలకు వాస్తవంగా సాధికారత కల్పించేలా నిర్థారణగా చెయ్యొచ్చు.  

    పరిశోధకులు చెప్పినట్లుగా, ‘వ్యవస్థాగత ఏర్పాట్లు (సంస్థలు, పంపిణీ యంత్రాంగాలు, ప్రోత్సాహకాలు), సామాజిక సంబంధాలు (నియమాలు, గుర్తింపులు, శ్రమ పంపిణీ, సామాజిక అభ్యసనం) ఏకకాలంలో రూపాంతరం చెందినప్పుడు మాత్రమే సుస్థిరమైన ఆవిష్కరణ ఆవిర్భవిస్తుంది’.  

    తోటివారి నుంచి నేర్చుకోవటం 
    ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటి వారి నుంచి నేర్చుకోవడం ఎంత ప్రభావవంతంగా ఉందో తేలింది. అన్ని సందర్భాల్లోనూ, తమలాంటి వారు విజయం సాధించడాన్ని చూసినప్పుడు రైతులు ఆ కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపారు.  

    గుజరాత్‌లో తమ భార్యలైన మహిళా రైతులు అమలు చేసిన ప్రత్యేక సాగు పద్ధతుల వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలను కళ్లారా చూసిన పురుషులు, తొలుత సందేహాలు లేవనెత్తినా, చివరికి వారికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తాను పాల్గొనే సమావేశాలను పట్టించుకోని తన భర్త, చివరికి ఆమెతో ‘ఇంటి పనుల గురించి చింతించకు.. నీ సమావేశంపై దృష్టి పెట్టు’ అని చెప్పినట్లు ఒక మహిళా రైతు సంబరంగా గుర్తుచేసుకుంది. నమ్మకాన్ని పెంపొందించటం, సామూహిక కార్యాచరణ, నాయకత్వ శిక్షణ వంటి సామాజిక మద్దతు వల్లనే ఈ సాంకేతికతలు వేళ్లూనుకోవడానికి దోహదపడింది. 

    భవిష్యత్తు వైపు చూస్తూ...
    వాతావరణ మార్పులను దీటుగా తట్టుకొని నిలిచే ‘క్లైమేట్‌ స్మార్ట్‌’ వ్యవసాయం నిజంగా ‘స్మార్ట్‌’గా ఉండాలంటే, దానిని స్థానిక సమాజంతో కలిసి ఏమేమి చెయ్యాల్లో ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి కేవలం సాంకేతికతను బదిలీ చేసి చేతులు దులుపుకోవటం నుండి, మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే సహాయక వ్యవస్థలను జోడించడం వైపు మార్పు రావటం అవసరం.

    విభిన్న పంటల సాగు నిర్ణయాలు
    మహారాష్ట్రలోని ధరాశివ్‌ కరువు ప్రాంతంలో స్వయం శిక్షణ ప్రయోగ (ఎస్‌ఎస్‌పీ) స్వచ్ఛంద సంస్థ మహిళల నేతృత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలిచే వ్యవసాయ నమూనా పద్ధతులను అమలు చేయించింది. ఈ ప్రాజెక్ట్‌ విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఇది అధిక పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల నుంచి రైతుల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించింది. తక్కువ నీటి వినియోగానికి సంబంధించి స్థానికంగా అమల్లో ఉన్న పద్ధతులను ఉపయోగించి చిరుధాన్యాలు, కూరగాయల వంటి వైవిధ్యభరితమైన ఆహార పంటల వైపు మళ్లించింది.  

    మహిళా రైతులకు రైతుగా ఉండాల్సిన మౌలిక గుర్తింపు సమస్యను పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. మహిళలను వ్యవసాయ నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక నిర్ణయాధికారులుగా, ఆవిష్కర్తలుగా నిలబెట్టింది. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారిని వ్యవసాయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే మహిళా రైతు నాయకులుగా మారడానికి సహాయపడింది. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సూక్ష్మ పెట్టుబడుల కోసం కమ్యూనిటీ రిసైలియన్స్‌ ఫండ్‌ ఏర్పాటు జరిగాయి. 

    రైతులు –స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు మహిళా కృషి సంవాద్‌ సహాయకుల(కేఎస్‌ఎస్‌ల)ను నియమించారు. ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మహిళలు ఆహార పంటల ఉత్పాదకతలో 10–15% పెరుగుదల సాధించారు. దీనితో పాటు మహిళా రైతు కుటుంబాల నెలవారీ పొదుపు బాగా పెరిగింది. ఇది ఇంట్లో వారి మధ్య సంబంధాలను మార్చివేసింది. పురుషులు తమ భార్యలను తమతో పాటు సమాన భాగస్వాములుగా గుర్తించటం ప్రారంభించారు.

    సమ్మిళిత శిక్షణా విధానం
    పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు గంగా మైదాన ప్రాంతంలో పనిచేసే సత్మిలే సతీష్‌ క్లబ్‌ ఓ పాతాగర్‌ (ఎస్‌ఎస్‌సీఓపీ) స్వచ్ఛంద సంస్థ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం అమలులో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులపై దృష్టి సారించింది. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ వ్యవస్థ సాంద్రతీకరణ (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఎస్‌ఐ) ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దుక్కి చెయ్యకుండా వ్యవసాయం చెయ్యటం, యంత్రంతో వరి నాట్లు, బహుళ పంటల విత్తనాలను విత్తే పరికరాలను వాడటం వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది.  

    ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్కువ దృష్టి పెట్టినప్పటికీ, దీనిలోని ఆడా మగా తేగా లేకుండా రైతులందరికీ శిక్షణ ఇచ్చే సమ్మిళిత శిక్షణా విధానం ఉపయోగపడింది. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే భారీ యంత్రాలు వంటి రంగాలలోకి మహిళా రైతులు ప్రవేశించడానికి వీలు కల్పించింది. రైతులు తాము కొనుగోలు చేయలేని ఖరీదైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పించే కస్టమ్‌–హైరింగ్‌ కేంద్రాల వ్యాపార కార్యకలాపాలపై, ఎరువులను సమర్థవంతంగా వాడటం, నీటిపారుదలలో మెళకువలపై శిక్షణ ఇచ్చారు. 

    పురుషులు ఎక్కువగా దృష్టి సారించే ఇటువంటి సాంకేతికతలలో మహిళలకు శిక్షణ ఇచ్చినప్పుడు, వారు సమాజంలో ఆదర్శప్రాయులుగా గుర్తింపు పొందారు. ఈ మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది ఏయే రకాల పంటలు సాగు చెయ్యాలనే నిర్ణయాలలో తమ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.

    • ఏవో కొన్ని సాంకేతికతలను పై నుంచి అందించటం ఒక్కటే సరిపోదు

    • వారితో కలిసి పనిచేస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలి

    • సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును సమన్వయంతో అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి∙

    • 4 రాష్ట్రాల్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) జరిపిన అధ్యయనంలో వెల్లడి

    పొంచి ఉన్న ప్రమాదాలు

    మహిళా రైతుల సాధికారతలో ఈ విజయాలు సాధించినప్పటికీ, రకరకాల వ్యవసాయ సాంకేతికతలతో కూడిన ప్యాకేజీలను అమలు చేసిన విధానంలో ఐఆర్‌ఆర్‌ఐ పరిశోధకులు అనేక లోపాలను గుర్తించారు. ఈ ప్యాకేజీల ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా కాకుండా తాత్కాలికంగా జరిగింది. సంస్థలు మొదట సాంకేతికతపై దృష్టి సారించాయి. అక్కడి రైతుల్లో సామాజిక మద్దతు పొందటాన్ని రెండో ప్రాధాన్యత గల ఆలోచనగా పరిగణించాయి. 

    చదవండి: జీవన ఎరువులతో సేద్యానికి జీవం

    వేతనం లేని సంరక్షణ పనుల భారం ఒక ప్రధాన ఆందోళన. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన 60 శాతం ప్రాజెక్టుల వల్ల మహిళా రైతులకు కొత్త బాధ్యతలను జోడించడం ద్వారా వాస్తవానికి వారి పని–జీవిత సమతుల్యతను మరింత దిగజార్చాయని ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గుజరాత్‌లో కనిపించే సేంద్రియ వ్యవసాయం వాతావరణానికి అనుకూలమైనదే అయినప్పటికీ, జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్‌ తయారీకి అధిక శ్రమ అవసరం. అప్పటికే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకుంటున్న మహిళలపై ఈ ఎరువుల తయారీ పనులు మరింత భారాన్ని మోపుతుంది. 

    అంతేకాకుండా, అంతర్లీనంగా ఉన్న పురుషాధికార నిర్మాణాలను పరిష్కరించకుండా, మహిళా రైతులకు పనులు పెంచే ఉపరితల ప్రయత్నాల వల్ల వారిని మరింత కృంగదీయటానికి దారితీసే ప్రమాదాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది. అనేక సందర్భాల్లో (ఎస్‌ఎస్‌పీ మినహా) పురుషులతో సంప్రదింపులు కొరవడ్డాయి. భర్తలు, కమ్యూనిటీ నాయకులు ఈ సంభాషణలో పాలుపంచుకోకపోతే, మహిళలు ఇంటా బయటా వారి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల శిక్షణలో పాల్గొనలేకపోవచ్చు.

    – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

  • వారు ఎంచుకున్నది కాదు.. కోరుకున్నది అంతకన్నా కాదు... కానీ భారీ మూల్యాన్ని మాత్రం చెల్లించుకోక తప్పట్లేదు. ఇరాన్‌లోని ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, అంతర్గత అశాంతి కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పిల్లలు, మహిళలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభంపై అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది...

    యుద్ధం ప్రారంభమైన నెలరోజుల్లో సుమారు 340 మంది పిల్లలు యుద్ధ దాడుల్లో మరణించగా, 1,767 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

    ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌ నగరంలో ఉన్న షజరే తయీబే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది విద్యార్థినులు అక్కడికక్కడే మరణించారు. 

    మినాబ్‌ నగరంలో కాకుండా, ఇతర ఐదు వేర్వేరు ప్రాంతాల్లోని పాఠశాలలపై జరిగిన దాడుల్లో మరో 12 మంది పిల్లలు చనిపోయారు. వీరంతా 7 నుంచి 12 ఏళ్ల మధ్య చిన్నపిల్లలే.

    మధ్యప్రాచ్య వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది గర్భిణీ స్త్రీలు యుద్ధ నీడలో ఉన్నారు. సరైన వైద్యం లేక రోడ్లపై, కార్లలో, కిక్కిరిసిన శిబిరాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి.

    చమురు ధరల్లో పెరుగుదల వల్ల వ్యాక్సిన్లు, పోషకాహార ఉత్పత్తుల తయారీ, సరఫరాలో 6 నెలల వరకు ఆలస్యం కావచ్చని యూనిసెఫ్‌ అంచనా వేస్తోంది.

    బాంబు దాడులు, తరలింపు ఆదేశాల వల్ల మొత్తం 12 లక్షల మంది పిల్లలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులయ్యారు.

    ఏ యుద్ధమైనా సరే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదు. అది ఒక దేశపు సామాజిక పునాదులను, ముఖ్యంగా మహిళలు, పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. అభద్రతా భావం మహిళల జీవితాల్ని ప్రభావితం చేస్తే, యుద్ధం నేర్పిన భయం, ఆకలి, కోల్పోయిన బాల్యం పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల పోరాటం కాదు, అది కోట్లాది మంది అమాయకుల కన్నీటి గాథ. 

    (చదవండి: అక్కడ మృతదేహాలను కాల్చరు, పూడ్చరు..! అలా గాలిలోనే..)

  • "సమోసా" అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ చిరుతిండి బయటకు కరకరలాడుతూ..లోపల కారంగా స్పైసీగా ఉంటుంది. వీధి ధుకాణాలలో ప్రధాన స్నాక్స్‌ ఐటెం ఇది. వేడి వేడి టీ తోపాటు ఒక్క సమోసా తింటే అబ్బా ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి ప్రజాదరణ కలిగిన ఈ వంటకం మన భారతదేశానికి చెందిన వంటకం కాదట. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

    ఈ సమోస మూలాలకు సంబంధించిన కథ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ సమోసా స్టోరీ గురించి చరిత్ర, పురావస్తు శాస్త్రలలో పీహెచ్‌డీ చేసిన పరిశోధకుడు, రచయితగా చెప్పుకునే డాక్టర్‌ ఎంఎఫ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేశారు. ఆయన తన పోస్ట్‌లో సమోసా మెదట ఎలా ఉండేది, మన పాకనిపుణులను దాని తయారీని ఎలా మార్చారు వంటి వాటి గురించి సవివరంగా రాసుకొచ్చారు. 1500..1510ల మధ్య రాసిన పర్షియన్‌ తాళప్రత్రం గ్రంథలో దీని గురించి సవివరంగా రాసి ఉందని చెబుతున్నాడు. 

    ఈ గ్రంథం ఆధారంగా అత్యధికంగా తినే వీధి ఆహారమైన సమోసా 500 ఏళ్ల నాటి వంటకంగా పేర్కొన్నాడు. బ్రిటీష్‌ మ్యూజియంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో పర్షియన్‌ భాషలో ఈ సమోసా వంటకం గురించి రాసి ఉందని తెలిపాడు. ఈ చిరుతిండి అప్పట్లో చాలా భిన్నమైన రూపాన్ని కలిగి ఉండేదని చెప్పాడు. నాటి పూర్వీకులు ఈ వంటకాన్ని కాల్చిన వంకాయ గుజ్జు, ఎండు అల్లం, గొర్రె మాంసం, వంటివి నూనెల వేయించి..దాన్ని లోపలి స్టఫ్‌గా పెట్టి వండేవారని పేర్కొన్నాడు. 

    కానీ మనం ప్రస్తుతం చూసే సమోసాలు అందుకు చాలా విభిన్నం. ఇప్పుడు వాటిల్లో బంగాళదుంపలు, ఉల్లిపాయల కూర వంటివి స్టఫ్‌గా పెట్టి వండేస్తున్నాం. పైగా జతగా వేయించిన పచ్చిమిర్చి ఇస్తుంటాం. నిజానికి అప్పుడు ఇలా ఈ రెండూ ఉండేవి కావని అన్నారు. ఆ తాళ్లపత్రాల ఆధారంగా మొఘల్ చక్రవర్తి అక్బర్, టిప్పు సుల్తాన్‌ చేతుల మీదుగా ప్రయాణించి..మన దేశంలోకి వచ్చిందని చెప్పారు. 

    వీధి చిరుతిండిగా దొరకక ముందు నాటి సమోసా ఇది.. అని అన్నారు. అంటే ఇది రాజరికపు వంటకంగా మొదలై వీధి దుకాణపు ఫేమస్‌ స్నాక్స్‌ ఐటెంగా మారిందని చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..అంటే ఈ సమోసా మన దేశంలోకి వలస వచ్చిందన్న మాట అని హాస్యస్పదంగా పోస్టులు పెట్టారు.

    మితంగానే మంచిది..
    ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం.. సమోసాలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉంటాయనేది వాస్తవం. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్‌ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజూ తింటే..ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

     

    (చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..)

     

  • సాధారణంగా పెద్దవారిలో కనిపించే కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు పసిపిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఏడాది వయసున్న బాలుడికి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి కోత లేకుండా కిడ్నీలోని 10 మిమీ రాయిని తొలగించి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు అద్భుత విజయాన్ని సాధించారు.

    బీదర్‌కు చెందిన ఒక ఏడాది బాలుడు విపరీతమైన ఏడుపు, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిమీ పరిమాణం ఉన్న రాయి ఉన్నట్లు తేలింది. తదుపరి చికిత్స కోసం బాలుడిని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

    అధునాతన చికిత్స - 'ఈఎస్‌డబ్ల్యూఎల్' (ESWL):
    బాలుడు చాలా చిన్నవాడు కావడం, సాధారణ సర్జరీ వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యాధునిక ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ESWL) పద్ధతిని ఎంచుకుంది.

    కోత లేని వైద్యం: ఈ పద్ధతిలో ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం 'లిథోట్రిప్టర్' యంత్రాన్ని ఉపయోగించి హై-ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా రాయిని ఇసుక రేణువులంత చిన్న ముక్కలుగా పొడి చేశారు.

    సురక్షితం: అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించడం వల్ల బాలుడికి రేడియేషన్ ముప్పు కలగకుండా జాగ్రత్త పడ్డారు.

    వేగవంతంగా కోలుకోవడం: చికిత్స జరిగిన కొద్ది గంటల్లోనే బాలుడు మామూలు స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించాడు. అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు.

    ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ మాట్లాడుతూ.. "పిల్లల విషయంలో సర్జరీ వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే మా ప్రాధాన్యత. ఈ ఆధునిక పద్ధతి వల్ల ఒక్క రక్తపు చుక్క కూడా చిందకుండా, అత్యంత సురక్షితంగా రాయిని తొలగించగలిగాము," అని తెలిపారు.

    ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున సి. మాట్లాడుతూ.. "ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చిన్నారుల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయి. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి పద్ధతులు వారి శరీర నిర్మాణానికి ఇబ్బంది కలిగించవచ్చు. 

    అటువంటి సమయాల్లో ఈఎస్‌డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గం," అని పేర్కొన్నారు. కాగా, నెల రోజుల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడి కిడ్నీలో రాయి పూర్తిగా తొలగిపోయిందని, అతను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృవీకరించారు. 
    డాక్టర్ మల్లికార్జున సి, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్
    దేశ్‌పాండ్య హేమేష్, ESWL టెక్నీషియన్
     

    (చదవండి: ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?)

  • గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్‌ న్యూరాన్‌ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్‌ ఐర్లాండ్‌ హాస్పిస్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

    మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..
    పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్‌లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.

    సింపుల్‌గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. 

    కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.

    కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.

    అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.

    మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలు

    MND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. 
    మాటలు తడబడటం
    కాళ్ళలో బలహీనత
    కండరాలు అదరడం
    బరువు తగ్గడం
    పట్టు బలహీనపడటం
    అసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది
    నిద్రకు భంగం కలగడం
    ఊపిరి ఆడకపోవడం
    గందరగోళం
    పదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడం
    ఉదయం పూట తలనొప్పి
    అలసట

    వాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.

    MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

    (చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్‌: మెరిసే చర్మం కోసం..)
     

Politics

  • సిద్ధిపేట:  ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలోనే జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

    ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్‌ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశమయ్యారు.  ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. 

    దీనిలో భాగంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. 

    నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది.  మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరాలేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి. యూపీఏ హయాంలో పునర్విభజన చేస్తే తప్పు కాదు,,  తాము చేస్తే తప్పా?, SIR ప్రక్రియ గతంలో వాళ్ళు చేస్తే తప్పు కాదు.. తాము చేస్తే తప్పా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 

    ‘మూసీ ప్రక్షాళన కోసం రంలో ట్రీట్ మెంట్ ప్లాంట్‌లకి కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్రం అడిగిన రుణాలను ఇతర సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ డెవలప్‌మెంట్‌ చేయండి. కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఎంటి..?, వాళ్ళకి ఎం కావాలో పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలను మాట్లాడమనండి. 

    చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లను అమలు చేయబోతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేం. ఏది పెట్టిన కావాలని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ కోడి గుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తుంది. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ జరుగుతుంది.  ఆర్‌ఎస్‌ఎస్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

  • తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆ‍ర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్‌గఢ్‌లో నిర్మించిన నవ రాయ్‌పూర్‌ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్‌లో బిల్డింగ్‌లు మాత్రమే ఉన్నాయని..  కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు. 

    ‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్‌ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. 

    ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్‌ సిటీ ఎలా అవుతుంది. 

    మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని..
    ‘మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మావిగన్‌  అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్‌ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్‌ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు. 

    ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?
    చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్‌ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్‌ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్‌ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?,  రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.

    చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం
    ‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్‌ చెప్తున్నారు. మావిగన్‌ ఆలోచనను పలు దఫాలుగా జగన్‌ చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు. 

    ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు  చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. 

    అవినీతికి తరగని గనిలా అమరావతి
    ‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్‌లాంటి క్యాపిటల్‌ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్‌ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది. 

    ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్‌.జగన్‌ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం. 

    పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారు

    మావిగన్‌ను ప్రజలు స్వాగతించారు
    మావిగన్‌ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్‌ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:
    మావిగన్‌ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.

    చంద్రబాబు చెప్పే రాజధాని 30 నుంచి 40 ఏళ్ళైనా పూర్తికాదు

    ఆ కృత్రిమ భావనను మావిగన్‌ బద్దలు చేసింది..
    ‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్‌ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్‌ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది. 

    అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు.  చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

    వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం
    ఏబీఎన్‌లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్‌సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. 

    పైగా ఏబీఎన్‌ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్‌ చేయాలన్నారు. 

    ఇప్పుడు వేరేరకంగా  మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయి
    రాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.

    మావిగన్‌ పేరు వింటనే చంద్రబాబుకు భయం
    మావిగన్‌ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్‌ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.

National

  • కృతికా ఖురానా  "దట్‌ బోహో గర్ల్"  (@thatbohogirl) గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ , లైఫ్‌స్టైల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రెండున్నర నెలల్లో 5 కిలోల బరువును తగ్గించుకుంది.   75 హార్డ్ ఛాలెంజ్ ద్వారా బరువు తగ్గి, తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.  దీంతో ఆమె  వెయిట్‌లాస్‌ జర్నీ వైరల్‌గా మారింది.

    ఢిల్లీకి చెందిన కృతికా తన విభిన్నమైన బోహో-చీక్ స్టైల్, ఫ్యాషన్  అండ్‌ పర్సనల్ వ్లాగ్స్‌తో  సోషల్‌ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.  ఇన్‌స్టాగ్రామ్  యూట్యూబ్‌లో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా తాను '75 హార్డ్' ఛాలెంజ్‌ను అనుసరించి కేవలం 75 రోజుల్లోనే దాదాపు 5 కిలోల బరువు ఎలా తగ్గిందో ఆమె వెల్లడించింది.కృతిక ఖురానా తాను దాదాపు 66 కిలోల నుండి 61 కిలోలకు తగ్గినట్లు  చెప్పింది. ఈ సంఖ్య చిన్నదిగా అనిపించినప్పటికీ, ఆమె కేవలం బరువుపై కాకుండా, నిలకడ  క్రమశిక్షణపైనే స్పష్టంగా ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపింది. 

    శారీరక మార్పుతో పాటు,  మానసికంగా కూడా తనలో చాలా మార్పు వచ్చిందని, టోటల్‌గా తను ‍ క్రమశిక్షణతో బలంగా మారానని వెల్లడించింది. తగినంత నీరు త్రాగడం, ప్రతిరోజూ చదవడం,   రోజుకు 10వేల అడుగులు నడవడం వంటి కొన్ని అలవాట్లు శాశ్వతంగా ఉంటాయని కూడా ఆమె పంచుకుంది.

    కృతిక పాటించిన  నియమాలు
    45 నిమిషాల వ్యాయామం
    దాదాపు 3.7 లీటర్లు) నీరు
    అనవసరమైన ఆహార నియమాలు, చీట్ మీల్స్ లేకుండా
    అస్సలు మద్యం సేవించకపోవడం
    ఒక పుస్తకంలోని 10 పేజీలు చదవడం
    ప్రతిరోజూ తన పురోగతిని ఫోటో తీసుకోవడం

    '75 హార్డ్' అంటే ఏమిటి :  ఇది మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే ఒక క్రమశిక్షణ ఆధారిత ఛాలెంజ్. ఇందులో వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం, స్వీయ-అభివృద్ధి వంటి రోజువారీ తప్పనిసరి నియమాలు ఉంటాయి.

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

    నోట్‌ : కఠినమైన ఆహార నియమాలు, జిమ్‌లో ఎక్కువ కసరత్తులు లాంటివి  గందరగోళ సలహాలు చాలా వింటాం.  కానీ వాస్తవానికి బరువు తగ్గడం అనేది నిలకడతో, నిబద్ధతతో చేయాల్సిన పని. తక్షణ పరిష్కారాలు ఆకర్షణీయంగా కనిపించి నప్పటికీ, సాధారణ వ్యాయామాలు క్రమశిక్షణ, చిన్న చిన్న పనులను ప్రతిరోజూ పునరావృతం చేసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. 

    ఇదీ చదవండి: బెంజ్‌ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు

  • లక్నో: ఉత్తర ‍ప్రదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మథుర, బృందావన్ లోని యమునా నది  కెశీఘాట్ ఘాట్ సమీపంలో పడవ నీటమునిగి 12 మంది భక్తులు దుర్మరణం చెందారు. 32 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ పాంటూన్ బ్రిడ్జిని ఢీకొట్టి నీట మునిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పర్యాటకులంతా నీటిలో గల్లంతయ్యారు. 

    దీంతో వివరాలు తెలుసుకున్న NDRF సిబ్బంది గజ ఈతగాళ్లతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా బాధితులలో ఇప్పటివరకూ 12 మంది మృతి చెందినట్లు  తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే గల్లంతవారయినంతా పంజాబ్‌లోని ముక్త్సర్‌కు చెందిన భక్తుల బృందంగా సమాచారం. 

  • Anant Ambani  Birthday  Celebrations రిలయన్స్‌ వారసుడు, వ్యాపారవేత్త  అనంత్‌ అంబానీ  31వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (ఏప్రిల్ 10)  బర్త్‌డే జరుపుకుంటున్నారు.  గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని వంతారా యూనివర్సిటీలో తండ్రి ముఖేష్‌ అంబానీ, భార్య  రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    అంబానీ కుటుంబం ఒక  వేడుకను నిర్వహిస్తే, అది చాలా ఘనంగా ఉండాల్సిందే.  దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆహార పంపిణీ కార్యక్రమాలతో ఈ సందర్భాన్ని జరుపుకోగా, అనంత్ స్వయంగా భోజనాలు వడ్డించడం దగ్గర్నించి, ఈ రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

    వంతారా యూనివర్సిటీ
    అలాగే తన తన కలల ప్రాజెక్ట్ 'వంతర'కు విస్తరణగా వంతర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయడం మరో విశేషం. తన సన్నిహిత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఈ   వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్ , తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి  విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.   

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

    స్పెషల్‌గా కేక్‌
    ముఖ్యంగా ఈ వేడుకలో కేక్‌ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రత్యేకమైన, పుస్తకం ఆకారంలో ఉన్న పుట్టినరోజు కేక్.   ఇందులో అమర్చిన   పేజీలపై "వన్యప్రాణులు, జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం," "వన్యప్రాణుల విద్యకు ఒక వారసత్వాన్ని ప్రారంభించడం," , "ప్రకృతి జ్ఞానాన్ని కలిసే చోట" వంటి పదబంధాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి పట్ల అనంత్‌కున్న దార్శనికత , నిబద్ధతకు  ప్రతిబింబంగా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు. 

     ఆన్‌లైన్‌ వైరల్‌గా మారిన  వీడియో ప్రకారం కేక్‌ కట్‌ చేసిన తరువాత  ముఖేష్ అంబానీ అనంత్‌ను ముద్దు పెట్టుకున్న తీరు మరింత హృద్యంగా  నిలిచింది.  ఈ వేడుకుల్లో బాలీవుడ్‌ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు.  జాహ్నవి కపూర్‌,  రణ్‌వీర్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు వరుణ్ ధావన్, శిఖర్ పహారియా కూడా సరదాగా గడుపుతూ కనిపించారు. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ , షెహనాజ్ గిల్ ఈ వేడుకలకు హాజరైనట్టు సమాచారం.  థ

    ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే!

  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం  మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో  పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.

    బీజేపీపై  ఘాటు విమర్శలు
    అయిదు రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా  అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు.  పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు.  

    ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ  ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్‌, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

    ఎస్ఐఆర్ వివాదం
    పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ  అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్‌ఆర్‌సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్‌ ప్రజలపై నమ్మకం  ఉందన్నారు.

    ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

    బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల  మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే  మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి  మాట్లాడాలన్నారు. 

    (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే!)

Kurnool

  • మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం భక్తులు స్వామి వారి దర్శనార్థం కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనం దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క, వెండి రథోత్సవాల పై ప్రహ్లాదరాయలు కొలువుంచి ఊరేగింపు నిర్వహించారు.

    వెండి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

  • హోమియోపతి ఏకై క లక్ష్యం ఆరోగ్య పునరుద్ధరణ. అంటే మనిషి చైతన్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండటం. దీనినే సిమిలియా సిమిలర్‌గా హనిమన్‌ వర్ణించారు. ఈ విధానంలో వ్యక్తి శారీరక, మానసిక వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకుని అవే లక్షణాలు కలిగిన హోమియో మందును ఎన్నుకుని చికిత్స చేస్తారు. ఈ వైద్యవిధానంలో వ్యాధి నివారణ శాశ్వతంగా, సమూలంగా, సత్వరంగా జరుగుతుంది.

    – డాక్టర్‌ భారతీదేవి, ప్రభుత్వ హోమియో

    వైద్యురాలు, వెల్దుర్తి డిస్పెన్సరీ

    దయాల్బాగు రాధాస్వామి చారిటబుల్‌ హోమియో డిస్పెన్సరీ ద్వారా కర్నూలు నగరంలోని ధర్మపేటలో 40 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ క్లినిక్‌ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం ధర్మపేటలో ఇంటింటికి తిరిగి పేదలకు ఒక్క రూపాయి ఫీజుతో వైద్యం అందిస్తున్నాం. ప్రతి రెండవ శనివారం ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే దాదాపు 500 మందికి ఉచితంగా వైద్యం చేస్తున్నాం.

    – డాక్టర్‌ కె.భాస్కరరెడ్డి,

    హోమియో వైద్యులు, కర్నూలు

    కర్నూలు(హాస్పిటల్‌): అవి మందులా అనిపించదు. నోట్లో వేసుకోగానే కమ్మగా, తియ్యగా, నాలుకపై ఇలాగే కరిగిపోతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా వీటిని సులభంగా వాడే అవకాశం ఉంది. ఇతర వైద్యవిధానాల వలే దుష్ప్రభావాలు ఇందులో ఉండవు. అదే హోమియోపతి వైద్యవిధానం. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులకు, మొండిరోగాలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా రోగులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య విధానానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. జర్మనీ దేశానికి చెందిన డాక్టర్‌ క్రిస్టియన్‌ ప్రెడరిక్‌ సామ్యుల్‌ హనీమన్‌ మొదటిసారిగా హోమియో విధానాన్ని కనుగొన్నారు. ఆయన జన్మించిన ఏప్రిల్‌ 10న వరల్డ్‌ హోమియో డేగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో 12 రెగ్యులర్‌తో పాటు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద మరో 10 హోమియో డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరీలో ప్రతిరోజూ 50 నుంచి 70 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లోపతి వైద్య విధానాలు ఉన్నచోటే వీటిని ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ వైద్యంగా హోమియో మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, డోన్‌లలో ఓపీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జిల్లాలోని అన్ని డిస్పెన్సరీలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుండగా ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితం. ఇటీవల కాలంలో హోమియో రంగంలో ప్రైవేటు వైద్యులు, కార్పొరేట్‌ కంపెనీలు క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో ఈ వైద్యానికి మరింత ప్రచారం, ఆదరణ పెరిగింది.

    మొండి వ్యాధులకు చక్కని పరిష్కారం

    కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, మొండి రోగాలకు హోమియో చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇతర వైద్య విధానాల్లో నయం కాని కొన్ని వ్యాధులకు రోగులు హోమియోలో చికిత్స పొంది పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పి, సయాటికా, మోకాళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, పలు రకాల అలర్జీలు, తరచూ వచ్చే చీముగడ్డలు, గజ్జి, తామర, ఎగ్జిమా, చెవిలో చీము కారడం, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, స్టాన్సిలైటిస్‌, నాజిల్‌ పాలిప్స్‌, గ్యాస్‌ట్రబుల్‌, మలబద్దకం, పైల్స్‌, ఫిషర్‌, ఫిస్టులా, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, పసిరికలు, అమీబియాసిస్‌, నరాల సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్‌ తలనొప్పి, డిప్రెషన్‌, క్రానిక్‌ ఫెటిగ్‌ సిండ్రోమ్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌, ప్రీమెన్ర్ట్‌సువల్‌ సిండ్రోమ్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలకు హోమియో మందులు బాగా ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

    హోమియోకు పట్ల ప్రజల్లో ఆదరణ

    ఉమ్మడి కర్నూలు జిల్లాలో

    22 ప్రభుత్వ డిస్పెన్సరీలు

    అన్ని చోట్లా ఉచితంగా

    చికిత్స, మందులు

    దీర్ఘకాలిక, మొండి రోగాలకు

    మెరుగైన వైద్యం

    నేడు వరల్డ్‌ హోమియో డే

  • వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోట గ్రామ సమీపంలోని లింగమయ్య కుంట పరిసరాల్లోని అరటితోట దగ్ధమైంది. గురువారం బాధిత రైతు గ్రామానికి చెందిన పెద్ద మాధవస్వామి తెలిపిన వివరాల మేరకు.. ఎకరా పొలంలోని అరటి పంట 2వ దఫా కోతకు వచ్చింది. బుధవారం దండ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో రేగిన నిప్పు రవ్వలకు మంటలు చెలరేగి పంటకు వ్యాపించాయి. అరటి బోదెలు, గెలలు అంటుకుంటూ వెళ్లి దాదాపు 4 టన్నుల అరటి కాయల దిగుబడి, చెట్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న వెళ్లిన బాధిత రైతు కుటుంబం మంటలను ఆర్పి మిగిలిన కాస్త పంటను కాపాడుకున్నారు.

    అపస్మారకస్థితిలో మహిళ

    ఎమ్మిగనూరురూరల్‌: ఆదోని రోడ్డు ఎస్‌ఎంల్‌ డిగ్రీ కాలేజీ, ఎల్లీల్సీ కాలువ మధ్యలో గురువారం తెల్లవారుజామున రక్తగాయాలతో ఓ మహిళ అపస్మారకస్థ్థితిలో కనిపించింది. పట్టణంలోని మైనార్టీ కాలనీకి చెందిన షఫీయాబీ(38) బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఆదోని రోడ్డు పై రక్తగాయాలతో కనిపించింది. వాహనదారులు 108కు సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ కైలాస్‌, పైలెట్‌ గజేంద్ర అపస్మారకస్థితిలో ఉన్న మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో మహిళ ఆచూకీ గుర్తించిన వారు బంధువులకు సమాచారం అందించారు. అసుపత్రికి చేరుకున్న షఫీయాబీ బంధువులు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

    ఎరువుల వ్యాపారి ఆత్మహత్య

    పాణ్యం: నంద్యాలకు చెందిన ఓ ఎరువుల వ్యాపారి అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాణ్యంలోని ఎస్సార్బీసీ కాల్వ సమీపంలో గురువారం గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టి ఆచూకీ గుర్తించారు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల ఎన్జీఓస్‌ కాలనీకి చెందిన ద్వారం వెంకటసుబ్బారెడ్డి(40) నూనెపల్లె లోని ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం వరకు షాప్‌లో ఉన్న అతను బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం పాణ్యం ఎస్సార్‌ర్బీసీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్య లు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. మృతదేహం పక్కన పురుగు మందు, ఆహారం డబ్బాలు ఉండడంతో పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

    వలసబాటలో మృత్యుఒడికి..

    ఎమ్మిగనూరురూరల్‌: గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలం కాటవారిపాలెంలో గురువారం సాయంత్రం పిడుగుపడి ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామానికి చెందిన సురేష్‌(21) మృతి చెందగా, జగన్‌ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. వివరాలు.. ఏనుగుబాల గ్రామానికి చెందిన బజారి, శంకరమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం బజారి చనిపోయాడు. సురేష్‌ డిగ్రీ వరకు చదువుకున్నా ఉపాధి లేకపోవటంతో తల్లితో పాటు గుంటూరు జిల్లాకు మిరప కోత పనులకు వెళ్లాడు. కాటవారిపాలెంలో గురువారం పనులు చేస్తుండగా పిడుగు పడటంతో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న జగన్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చికిత్స కోసం సత్తనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

  • కలెక్టర్‌ వాహనాన్ని అడ్డగించిన డి.బెళగల్‌ గ్రామస్తులు

    కోసిగి: ‘మేడమ్‌.. ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు.. కుళాయిలకు నీళ్లు రావడం లేదు.. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. పనులు మానుకుని తోపుడు బండ్లపై నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు’ అంటూ డి.బెళగల్‌ గ్రామస్తులు కలెక్టర్‌ డాక్టర్‌ సిరికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు నీటి కోసం మండు వేసవిలో అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. కుళాయిలకు నీరు సరఫరా కాగా నిరుపయోగంగా మారాయి. గ్రామ శివారులో ఉన్న గుమ్మీల వద్ద ట్యాంక్‌కు నీరు ఎక్కడం లేదు. మహిళలు పనులు మానుకుని దూర ప్రాంతాల నుంచి తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకుని నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలోని చెరువు, చెక్‌డ్యామ్‌లను పరిశీలన నిమిత్తం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి గురువారం గ్రామానికి చేరుకున్నారు. ఆమె పరిశీలించి వాహనంలో తిరిగి వెళ్తుండగా వాహనాన్ని ఆ గ్రామ ప్రజలు అడ్డగించారు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేశారు. అలాగే దొడ్డి గ్రామంలో ప్రజలు ఆమెను కలిసి తాగునీటి సమస్యను ఆమె దృష్టికి తెచ్చారు. ఈ మేరకు సంబంధిత నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

    రెండు నెలలుగా నీళ్ల కోసం

    ఇబ్బందులు పడుతున్నాం

    పనులు మానుకుని తోపుడు బండ్లపై

    తెచ్చుకుంటున్నాం

    జిల్లా కలెక్టర్‌ వాహనం అడ్డగించిన

    డి.బెళగల్‌, దొడ్డి గ్రామస్తులు

  • జిల్లా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

    కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టంపై తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని కర్నూలు జిల్లా బార్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. అన్నమయ్య జిల్లా పీలేరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు ధర్నా చేపట్టారు. నిరసన అనంతరం కోర్టు విధులు కూడా బహిష్కరిస్తూ న్యాయవాదికి మద్దతుగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, ఐఏఎల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది ఓంకార్‌ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదులపై ఇటీవల కాలంలో భౌతిక దాడులు అధికమయ్యాయన్నారు. న్యాయవాదులు న్యాయం కోసం కోర్టుల్లో ప్రజల పక్షాన వాదన చేస్తుంటే కేసు విషయంలో కక్షలు, కుతంత్రాలతో కొంతమంది దుండగులు నేర ప్రయత్నాలు చేయడం, హత్య చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమని విమర్శించారు. పీలేరు సంఘటనను న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సమయంలోనే ఆ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తేవడం జరిగిందని గుర్తు చేశారు. ఏపీలో కూడా న్యాయవాదులపై దాడులు, హత్యల నివారణకు తక్షణమే రక్షణ చట్టం తేవాలని కోరారు. వైస్‌ ప్రెసిడెంట్‌ మద్దిలేటి, రాజేష్‌, హుసేన్‌, ప్రసాద్‌, సురేష్‌, షఫి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

    న్యాయ వ్యవస్థకే ముప్పు..

    న్యాయం కోసం న్యాయవాదులు పోరాటం చేస్తున్న తరుణంలో వారిపై దాడులు, హత్యలు జరిగాయని, వీటిని అరికట్టకపోతే న్యాయ వ్యవస్థకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో యువ న్యాయవాది యల్లయ్యపై దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేయడాన్ని ఐలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

  • కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విద్యార్థిని జె.శివకీర్తికి అరుదైన అవకాశం లభించింది. ‘మై భారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌ –2026’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశానికి ఎంపికై ంది. ఈ మేరకు గురువారం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసవరావు శివకీర్తిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘మైభారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌ –2026’ పోటీల్లో ఫైనల్‌ రౌండ్‌కు శివకీర్తి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. దేశ యువతలో కేంద్ర బడ్జెట్‌ 2026–27 ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించడం ద్వారా విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ క్విజ్‌తో పాటు వ్యాసరచన పోటీల్లో దేశ వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అందులో తొలి రెండు దశలను విజయవంతంగా అధిగమించి శివకీర్తి ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించిందన్నారు. ఈనెల 12, 13 తేదీల్లో జరిగే ఫైనల్‌ రౌండ్‌లో పాల్గొంటుందన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వర్సిటీ విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమన్నారు. వర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎన్‌టీకే నాయక్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.విజయ్‌కుమార్‌నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్‌. భరత్‌ కుమార్‌ శివకీర్తిని అభినందించారు.

  • కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో పండించిన మామిడి కెనడా, అమెరికా దేశాలకు ఎగుమతి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. ఇక్కడ పండించిన బంగినపల్లి రకం మామిడిని కృష్ణ జిల్లా పామర్రులోని కోసూరు బాలాజీ ఆగ్రో పుడ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ద్వారా ఎగుమతులు చేయనున్నట్లు తెలిపారు. గురువారం కోసూరు బాలాజీ ఆగ్రో ఫుడ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ప్రతినిధి శ్రీనివాసరావుతో కలసి ఓర్వకల్‌ మండలం గుడుంబాయి తండాలోని మామిడితోటలను పరిశీలించారు. తోటల్లోని మామిడి ఎగుమతులకు తగిన నాణ్యతతో ఉందని గుర్తించారు. ఎక్స్‌పోర్టు నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు జిల్లా ఉద్యాన అధికారి వివరించారు. కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ కంపెనీ టన్నుకు రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎగుమతులకు అవకాశం ఉండాలంటే తగిన ఫ్రూట్‌కేర్‌ యాక్టివిటీస్‌ చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఈ పద్ధతులు పాటిస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు.

  • కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్లలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలో పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉన్నాయి. సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రాసెసింగ్‌ యూనిట్ల తనిఖీలకు జిల్లా వ్యవసాయ అధికారి సంబంధిత ఏవో, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి కల్లూరు మండల పరిధిలోని సహజ క్రాప్‌ సైన్సెస్‌, మార్క్యివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. సహజ క్రాప్‌ సైన్సెస్‌లో ప్రాసెసింగ్‌ చేసిన పత్తి విత్తనాలకు సంబంధించి మూడు లాట్లతో హెచ్‌టీ పరీక్షలు నిర్వహించారు. అయితే హెచ్‌టీ లేదని తేలింది. మహంకాలేశ్వర సీడ్స్‌లో మొక్కజొన్న విత్తనాల ప్రాసెసింగ్‌ను పరిశీలిచారు. 2026–27 సంవత్సరానికి బీటీ పత్తి విత్తన ధరలు ఖరారు కానందున ఇంకా ప్యాకింగ్‌ చేయని పరిస్థితి. ప్రాసెసింగ్‌ యూనిట్లలో రికార్డులను క్షుణంగా పరిశీలించారు.

Dr B R Ambedkar Konaseema

  • వైఎస్సార్‌ సీపీ నేతలను, వారి భార్యలను అవమానిస్తూ ఏబీఎన్‌ చానల్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. మహిళలపై జుగుప్సాకరంగా పైశాచిక రాతలు రాసిన ఆయనను తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాధాకృష్ణ క్షమాపణలు చెప్పకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

    తక్షణమే అరెస్టు చేయాలి : పొన్నాడ

    ముమ్మిడివరం: మహిళలను కించపర్చే విధంగా దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ నేతలు ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ని యోజకవర్గ కోఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు నిరసన ర్యాలీ చేశారు. పొన్నాడ మాట్లాడుతూ సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ పితాని బాలకృష్ణ, స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ కాశి బాలమునికుమారి, జెడ్పీటీసీ సభ్యుడు కుడిపూడి శంకరరావు, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు బొంతు సత్యశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

    చర్యలు తీసుకోవాలి : సూర్యప్రకాశ్‌

    రామచంద్రపురం: వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే కార్యక్రమంలో చేసిన అవమానకర, అసత్య వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పిల్లి సూర్యప్రకాశ్‌ అన్నారు. నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి సూర్యప్రకాష్‌, రామచంద్రపురం సీఐ వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. దూషణాత్మక వీడియోలను సోషల్‌ మీడియా వేదికల నుంచి తొలగించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీపీ అంబటి భవానీ, పట్టణ, మండల కన్వీనర్లు గాధంశెట్టి శ్రీధర్‌, పి.వరప్రసాద్‌ పాల్గొన్నారు.

    కొత్తపేట: నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యవహరిస్తున్న తీరు పాత్రికేయ విలువలను దిగజార్చే విధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళా కార్యకర్తలు గురువారం కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జగ్గిరెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు కొత్తపేట చేరుకోగా వారందరితో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై జీ సురేంద్రకు ఫిర్యాదు అందజేసి రసీదు తీసుకున్నారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాధాకృష్ణ తన మీడియాలో ప్రసారమైన కార్యక్రమంలో వివాహం అయిన మహిళలను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా నీచాతినీచంగా వ్యాఖ్యానించారన్నారు. వివాహ బంధాన్ని హేళన చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఆలికి, చెల్లికి తేడా తెలియని మూర్కుడు రాధాకృష్ణ అని విరుచుకుపడ్డారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీలు మార్గన గంగాధరరావు, కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్‌, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కప్పల శ్రీధర్‌, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గూడపాటి ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ నాయకుడు చల్లా ప్రభాకరరావు, మహిళా విభాగం సభ్యురాలు కొంబత్తుల మంగమ్మ పాల్గొన్నారు.

    కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ వద్ద జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు

    ఏబీఎన్‌ చానల్‌ ఎండీ రాధాకృష్ణను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

    పోలీస్‌ స్టేషన్లలో వైఎస్సార్‌ సీపీ

    నేతల ఫిర్యాదు

    జర్నలిజం విలువలను

    దిగజార్చారని ధ్వజం

    మహిళలను అవమానించడంపై నిరసన

  • కొన్నిచోట్ల స్వల్ప వివాదాలు..

    పోలీసుల రంగ ప్రవేశం

    బూత్‌ల వద్ద బారులు తీరిన ఓటర్లు

    ఓటుహక్కు వినియోగించుకున్న

    35,445 మంది

    పురుషులు 17,311,

    మహిళలు 18,134 మంది

    ఓటు వేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే అశోక్‌,

    మల్లాడి, తోటరాజు

    యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి గురువారం నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కొన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద స్వల్ప వివాదాలు తలెత్తాయి. దీంతో పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచే పలు పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటుహక్కు వినియోగించుకోవడానికి జనం బారులు తీరారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 37,972 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 42 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఎంజీజీబీ హైస్కూల్‌లో పింక్‌ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు.

    పోలింగ్‌ సరళి

    నియోజకవర్గ పరిధిలో 42 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 9 గంటలకు 16.6శాతంతో 6,032 ఓట్లు, 11 గంటలకు 36.4 శాతంతో 13,998 ఓట్లు నమోదు కాగా, మధ్యాహ్నం 1 గంటకు 57.12 శాతంతో 21,689 ఓట్లు, 3 గంటలకు 74.63 శాతంతో 28,338 ఓట్లు, సాయంత్రం 5 గంటలకు 89.80 శాతంతో 34,098 ఓట్లు పోలయ్యాయి.

    పరిశీలించిన అబ్జర్వర్‌లు

    కనకాలపేట, కురసాంపేట, అయ్యన్ననగర్‌, దరియాలతిప్ప, దొమ్మేటిపేట, సావిత్రినగర్‌, గిరియాంపేట, తదితర ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి మహిళలు, వృద్ధులు, యువతీయువకులు బారులు తీరి నిలబడ్డారు. మెట్టకూరు జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వ హైస్కూల్‌లో యూత్‌ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. వృద్ధులకు కోసం వీల్‌చైర్‌లను ఏర్పాటు చేయగా ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు వారిని పోలింగ్‌బూత్‌ల వద్దకు తీసుకువచ్చి ఓటు వేసేందుకు సహకరించారు. పోలింగ్‌బూత్‌లను పోలీస్‌ అబ్జర్వర్‌, జనరల్‌ అబ్జర్వర్‌లు రాజస్థాన్‌ ఐజీ ప్రీతిచంద్ర తదితరులు పరిశీలించారు.

    ఓటుహక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

    శాసనసభా నియోజకవర్గ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. స్థానిక వెటర్నరీ ఆసుపత్రి వద్ద ఉన్న పోలింగ్‌ బూత్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్‌ అశోక్‌, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు, జకీర్‌హుస్సేన్‌ స్కూల్‌ బూత్‌ వద్ద టీవీకే అభ్యర్థి తోటరాజు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గిడ్డి బలరాం, మెల్లం శ్రీనివాసరావు, నాటి బూరియ్య, తిరుకోటి ఆదిమూర్తి, గొల్లపల్లి లక్ష్మీస్నేహ, మల్లాడి ఉదయలక్ష్మి, సూరిమిల్లి సుబ్బారావు, జనిపల్లి వెంకన్నబాబు, కాళ్ల వెంకటరత్నం, షేక్‌ అహ్మద్‌షా ఖాదర్‌ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కురసాంపేట, మెట్టకూరు, వంశీకృష్ణ కాలనీల్లో స్వల్ప వివాదం తలెత్తింది. మల్లాడి, అశోక్‌ వర్గీయుల మధ్య వివాదం తలెత్తడంతో పోలీసు బలగాలు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

    కనకాలపేట పోలింగ్‌ బూత్‌లో బారులు తీరిన ఓటర్లు

    విజయంపై ఎవరి ధీమా వారిది!

    అత్యధికంగా పోలింగ్‌ శాతం నమోదు కావడంతో అది ఎవరి గెలుపునకు దోహద పడుతుందో అని జనంలో తర్జనభర్జన జరుగుతోంది. పట్టణంలో ఎక్కువ మంది ఓటు వేయడం, కనకాలపేట, తీర గ్రామాలైన సావిత్రినగర్‌, గిరియాంపేట, అయ్యన్ననగర్‌ల్లో అధిక ఓటుశాతం నమోదు తదితర పరిణామాల మధ్య అభ్యర్థుల మద్దతుదారులు విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.

  • కొత్తపేట: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) ఏ శ్రీసత్య రమాదేవి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో గర్‌ల్స్‌’ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (జీసీడీఓ) గా పదోన్నతి పొందారు. కలెక్టర్‌ సూచన మేరకు డీఈఓ పీ నాగేశ్వరరావు నుంచి రమాదేవి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఆమె గత ఏడాది సెప్టెంబర్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీటీ) ఉమెన్‌ విభాగం జిల్లా సెక్రటరీగా నియమితురాలై కొనసాగుతున్నారు.

    సముద్ర కోత నివారణకు తోటల పెంపకం

    అమలాపురం రూరల్‌: అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టడానికి తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ వెల్లడించారు. గురు వారం ఓఎన్జీసీ, అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి భూసేకరణ, భూపరిహారాలు చెల్లింపు అంశాలపై సమీక్షించారు. ఈ తీర ప్రాంతానికి రక్షణ కవచంలా నిలిచేలా తోటల పెంపకం కోసం 10.5 ఎకరాలు సేకరించామని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఓఎన్జీసీ అందుబాటులో ఉన్న వేరే భూమిని కొనుగోలు చేసి అప్పగిస్తుందన్నారు. జిల్లా అటవీ అధికారి ఎన్‌వీ ప్రసాదరావు, ఓఎన్జీసీ ప్రతినిధులు, భూసేకరణ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ సుబ్బరాజు పాల్గొన్నారు.

    23వ తేదీ వరకు పోషణ్‌ పఖ్వాడా

    జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎనిమిదవ పోషణ్‌ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ వెల్లడించారు. గురువారం పోషణ్‌ పఖ్వాడా గోడ పత్రికను కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సెల్‌ఫోన్‌, టీవీ స్క్రీన్‌లను చూసే సమయాన్ని తగ్గించడం ఈ ఏడాది పోషణ్‌ పఖ్వాడా ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ్‌ పఖ్వాడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐసీడీఎస్‌ పీడీ కే.నాగమణి, డీఈవో పీ నాగేశ్వరరావు, అదనపు డీఎంఅండ్‌ హెచ్‌ వీ.భరతలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, సీడీపీవోలు పాల్గొన్నారు.

    హుండీ ఆదాయం

    రూ.4.31 లక్షలు

    పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

  • డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

    మనవడు యశ్వంత్‌ అంబేడ్కర్‌

    ఎ.వేమవరప్పాడులో

    అంబేడ్కర్‌ శిలా విగ్రహావిష్కరణ

    అమలాపురం రూరల్‌: నేటి పాలకులు మనువాదాన్ని అమలు చేసే దిశగా కుట్ర చేస్తున్నారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు యశ్వంత్‌ అంబేడ్కర్‌ ఆరోపించారు. అమలాపురం రూరల్‌ వేమవరప్పాడులో అంబేడ్కర్‌ శిలా విగ్రహావిష్కరణ, 135వ జయంతి మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సింహాసనం మీద కూర్చున్న అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆర్‌పీఐ ప్రధాన కార్యదర్శి డీబీ లోక్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో యశ్వంత్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పేద ప్రజల హక్కుల కోసం అంబేడ్కర్‌ తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఆయన ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని అందరివాడు అని అన్నారు. మరో నాగపూర్‌గా పేరుపొందిన కోనసీమ జిల్లాలో వేలాది అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయనపై ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్‌, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అంబేద్కర్‌ ఆశయాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. జిల్లా దళిత ఐక్యవేదిక నాయకులు జంగా బాబురావు, ఇసుక పట్ల రఘుబాబు, ఎంఏకే భీమారావు, కొంకి రాజామణి, పుణ్యమంతుల రజిని, ఈతకోట నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ పందిరి విజయ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

  • మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి

    రాజోలు: మహిళలను కించపరిస్తే సహించమని రాజోలు నియోజక వర్గ వైఎస్సార్‌ సీపీ కో–ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి అన్నారు. మహిళలను అవమానిస్తూ ఏబీఎన్‌ చానల్‌లో కథనం ప్రసారం చేసిన ఎండీ రాధాకృష్ణపై ఆమె రాజోలు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.వి.నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు రాజోలు సర్కిల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

    మహిళలను అవమానించిన రాధాకృష్ణను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరిదేవి మాట్లాడుతూ బాధ్యత గల మీడియాలో ఉంటూ మహిళలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ప్రసారాలు చేయడం దారుణమన్నారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ తన చానల్‌ ద్వారా మహిళాలోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండల పార్టీ అధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, అడబాల బ్రహ్మాజీ, కుసుమ చంద్రశేఖరరావు, బొలిశెట్టి భగవాన్‌, రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజా, రాష్ట్ర ప్రచార విభాగ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్‌, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి గుబ్బల మనోహర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి రాంబాబు, జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి గుబ్బల రమేష్‌ పాల్గొన్నారు.

  • గన్నవరపు శ్రీనివాసరావు

    పి.గన్నవరం: మహిళలపైన, వైఎస్సార్‌ సీపీ నేతల కుటుంబాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ చానల్‌ ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌ చానల్‌లో మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను నిరసిస్తూ పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణకు గన్నవరపుతో పాటు, నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం కోఆర్డినేటర్‌ గన్నవరపు విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో మహిళలను ఎంతో గౌరవిస్తారని, కానీ ఏబీఎన్‌ రాధాకృష్ణ మాత్రం మహిళలను అవమానిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ తన అహంకారాన్ని వీడి మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మహిళలపై ఏబీఎన్‌ చానల్‌లో ప్రసారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబుకు రాధాకృష్ణ బ్రోకర్‌లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో మహిళలే అతనికి తగిన బుద్ధి చెబుతారన్నారు. రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, రాధాకృష్ణ డౌన్‌, డౌన్‌ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాల్లో మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల రాము, పార్టీ రాష్ట్ర నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్‌, ఇందుకూరి నరసింహరాజు, వాసంశెట్టి తాతాజీ, నక్కా వెంకటేశ్వరరావు, జక్కంపూడి వాసు పాల్గొన్నారు.

Karimnagar

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్‌మోడల్‌గా నిలవబోతుందని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలో వేడుకలు నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో ఎన్‌ఎస్‌యూఐ జెండా ఎగురవేసి, కేక్‌ కట్‌ చేశారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ.ఇమ్రాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా ఎన్‌ఎస్‌యూఐ తొలి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను సన్మానించారు. కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, వుట్కూరి నరేందర్‌రెడ్డి, ఎండీ.తాజ్‌ పాల్గొన్నారు.

    అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు

    కరీంనగర్‌టౌన్‌: అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు అందజేసి పారదర్శకమైన సేవలకు నాంది పలికిందని, లబ్ధిదారులు అంగన్‌వాడీసేవలను సద్వినియోగం చేసుకోవాల ని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సూ చించారు. గురువారం టీఎన్జీవో భవన్‌లో కరీంనగర్‌ అర్బన్‌ ప్రాజెక్ట్‌ అంగన్‌వాడీ టీచర్లకు మే యర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ నరేందర్‌రెడ్డితో కలిసి కొత్త ఫోన్లు, 17 మంది దివ్యాంగులకు మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేశారు. డీడబ్ల్యూవో సరస్వతి, సీడీపీవో సబిత, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ పాల్గొన్నారు.

    జాబ్‌మేళాకు స్పందన

    కరీంనగర్‌ సిటీ: విద్యార్థులు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకుని, ఉద్యోగాలు సాధించాలని ఎస్సారార్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌ తెలిపారు. కళాశాలలో టీఎస్‌కేసీ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా నిర్వహించారు. సుమారు 460 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 40 మంది ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ నితిన్‌ పాఠక్‌, అకడమిక్‌ కో– ఆర్డినేటర్‌ తాళ్లపల్లి రాజయ్య, ఐక్యూఏసీ కో– ఆర్డినేటర్‌ డాక్టర్‌ హరిజోత్‌ కౌర్‌, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.సతీశ్‌ కుమార్‌, కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సెల్‌ కో– ఆర్డినేటర్‌ కె.సుధాకర్‌ పాల్గొన్నారు.

    జైలులో వైద్య శిబిరం

    కరీంనగర్‌క్రైం: జిల్లా జైలులో డీఎంహెచ్‌వో వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. ఖైదీలకు కంటి, దంత, అర్థోపెడిక్‌, చర్మ, ఈఎన్‌టీతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. వెద్యశాఖ అధికారులు సుధా రాజేంద్ర, నవీన, జైలు అధికారులు విజయదేని, జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

    కరీంనగర్‌అర్బన్‌: మోసం.. బహిరంగ మార్కెట్‌లో స్వైరవిహారం చేస్తోంది. తూకంలో మోసం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఏటా తనిఖీలు చేసి స్టాంపింగ్‌ వేయాల్సిన తూనికలు, కొలతల శాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు కిలోకు 15 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు దండుకుంటున్నారు. గ్యాస్‌, కూరగాయల నుంచి కార్పొరేట్‌ మార్కెట్ల వరకు తూకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో తూకంలో డొల్లతనం బయటపడగా ఉన్నతాధికారుల పర్యవేక్షణను ప్రశ్నిస్తోంది. నగరంలోని ప్రకాశం గంజ్‌, పండ్ల మార్కెట్‌, శనివారం అంగడి, కశ్మీర్‌గడ్డలో గల రైతుబజార్‌, చేపల మార్కెట్‌, ప్రముఖ సూపర్‌ మార్కెట్లలో పలు వస్తువులను కొనుగోలు చేసి తూకం వేయగా వ్యత్యాసమేర్పడటం విమర్శలకు తావిస్తోంది. బహిరంగ మార్కె ట్లో, రేషన్‌ దుకాణాల్లో వినియోగదారులు మోసపోయిన సందర్భాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా యి. ఎరువులు, రైసు మిల్లులు, పెట్రోలు బంకులు, ఇతర ఉత్పత్తి కేంద్రాలు తూనికలు, కొలతలకు ఆస్కారమున్న ప్రతిచోట వినియోగదారులను ఏదో ఒక రకంగా మోసగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

    తనిఖీల్లేవు.. స్టాంపింగ్‌ లేదు

    తూనికలు కొలతలశాఖలో ఖాళీలు వెక్కిరిస్తుండగా ఉన్న అధికారులైనా విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నారా.. అంటే అదీ లేదు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం తప్ప కేసుల ప్రగతి అంతంతే. రాజకీయ ఒత్తిడులు ఉన్నాయంటూ వ్యాపారులతో ఉన్న అనుబంధంతో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయిస్తూనే తూకంలోనూ దోచుకుంటున్నారు.

    మేళాలతోనే ఫలితం

    తూకానికి వినియోగించే సామగ్రికి అర్ధ సంవత్సరం, సంవత్సరానికి సంబంధిత శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి. కాగా, క్షేత్రస్థాయిలో అలాంటివేమీ కనిపించడం లేదు. కాలంచెల్లిన తూకం సామగ్రిని వాడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. ముద్రల ద్వారా జిల్లాలో రూ.40 లక్షల వరకు ఆదాయం సమకూరే వీలుంది. ఇక లీటర్ల కొద్ది విక్రయించే వాటిలోనూ మోసాలే. ప్యాకెట్లలో ద్రవ పదార్థ రూపంలో మార్కెట్లో లభించేవన్నీ దాదాపు అక్రమ విక్రయాలే. ప్రభుత్వ గుర్తింపు పొందినవి కొన్నే ఉంటాయి. తూకం సామగ్రికి ముద్రలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మేళాలు నిర్వహిస్తే ఆదాయాన్ని పెంచుకునే వీలుంది. తద్వారా సర్కారుకు ఆదాయంతో పాటు వినియోగదారులకు తూకంలో మోసపోయే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

    వినియోగదారులకు సూచనలు

    ● వినియోగదారులు కళ్లారా చూసిన మోసాలను సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా తదుపరి చర్యలకు ఆస్కారముంటుంది.

    ● కొనుగోలు చేసిన కేంద్రంలో తూకం, కొలతల ను గమనించాలి. తేడాలుంటే ప్రశ్నించాలి. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు పొందడం ఉత్తమం.

    ● తూనికలు, కొలతల శాఖ నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచాలి.

    ● ఎలక్ట్రానిక్‌ తూకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్రోల్‌ బంకుల్లో కొలతలను సరిచూశాకే వాహనంలో ఇంధనం పోయించుకోవాలి.

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఐదు పదవులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు ప్రక్రి య కొనసాగుతుంది. కో ఆప్షన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఆశావహుల్లో సందడి నెలకొంది. అధికార బీజేపీకి పూర్తిస్థాయిలో బలం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన మాజీలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

    16వ తేదీ వరకు దరఖాస్తులు

    కో ఆప్షన్‌ ఎన్నికలకు శుక్రవారం నుంచి నగరపాలకసంస్థ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. 16వ తేదీ తరువాత రెండు,మూడు రోజుల్లో నగరపాలకసంస్థ సర్వసభ్య ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నా రు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    పాలనలో ప్రత్యేక పరిజ్ఞానం

    కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ఐదు స్థానాలకు గాను రెండు మైనార్టీలకు అందులో ఒకటి మహిళకు కేటా యించారు. ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలు మైనార్టీ కేటగిరీలోకి వస్తారు. మిగతా ముగ్గురిలో ఒకరు మహిళ ఉండాలి. పోటీచేసే అభ్యర్థులు విధి గా నగరపాలకసంస్థ ఓటరు జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి. మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న రెవెన్యూ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సంబంధించి మాజీ సర్పంచ్‌, మాజీ వార్డు సభ్యులు కో ఆప్షన్‌ పదవులకు పోటీపడేందుకు అర్హులు. వీరంతా కూడా మొత్తంగా ఐదు సంవత్సరాల పదవీ కాలం చేసి ఉండాలి. వీరితో పాటు మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా మూడు సంవత్సరాల సర్వీసు చేసిన అనుభవం ఉన్న వాళ్లు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ పోస్టు హోదాలో పనిచేసి పదవీవిరమణ పొందిన అధికారులు అర్హులు.

    పోటీకి మాజీలు సై

    ఐదు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఆ శావహుల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ కార్పొరేటర్లు పలువురు కో ఆప్షన్‌పై కన్నేశారు. నగరపాలకసంస్థలో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, కో ఆప్షన్‌ గెలవడానికి 34 మంది అవసరం. ఈ లెక్కన నగరపాలకసంస్థలో అధికార బీజేపీకే ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను గెలుచుకోగా, మేయర్‌ఎన్నిక సందర్భంగా ముగ్గురు స్వతంత్రులు బీజేపీలో చేరారు. ఆ తరువాత మరో స్వతంత్ర కార్పొరేటర్‌ చేరడంతో బీజేపీ బలం 34కు చేరుకొంది. దీనితో ఐదు కో ఆప్షన్‌ పదవులను గెలుచుకోవడం బీజేపీకి సులువుగానే ఉంది. అయినప్పటికి, బీజేపీయేతర కార్పొరేటర్లు 32 మంది ఉండడం, క్రాస్‌ ఓటింగ్‌పై ఆశలతో ఇతర పార్టీల నుంచి కూడా పోటీపడేందుకు మాజీలు సిద్ధమవుతున్నారు. పార్టీల బలాబలాలు, కార్పొరేటర్లలో తమకున్న అనుకూలత, ఆర్థిక వ్యవహారాల లెక్కలతో తలమునకలవుతున్నారు.

    కరీంనగర్‌క్రైం: ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న పోలీసుల జీతాలకు రక్షణ లేకుండా పోయింది. సొంతశాఖలోని తోటి సిబ్బంది జీతాలు కాజేసిన ఘటన కలకలం రేపింది. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేసిన భారీ కుంభకోణం కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో బట్టబయలైంది. సుమారు రూ.1,40,18,308 వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్‌ఫోర్స్‌ విచారణలో తేలింది. గతంలో పే సెక్షన్‌లో పనిచేసిన ఓ పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో ఇతరుల పేర్లను చేర్చాడు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్‌ నంబర్లను అనుసంధానం చేశాడు. తద్వారా 2022 నుంచి 2026 వరకు సదరు ఉద్యోగుల జీతాలు అక్రమంగా పొందినట్లు తెలిసింది. ఈ ఘటనపై సీపీ ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ రాంచందర్‌రావు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి? ఏఏ స్థాయివారు భాగస్వాములై ఉన్నారు? ఉన్నతాధికారులకు సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

    నగరంలోని మంకమ్మతోటలో గల సూపర్‌మార్కెట్‌లో కిలో శనగపప్పు కొనుగోలు చేయగా మళ్లీ తూకం వేస్తే 985 గ్రాములు వచ్చింది. 15 గ్రాములు తక్కువ వచ్చింది.

  • కరీంనగర్‌: ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ప్రతా పం చూపుతున్నాడు. గతేడాది కన్నా ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సీయస్‌ వరకు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రోజుల్లో వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరగనుంది. మే తొలివారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ తొలివారం నుంచే దడదడలాడిస్తున్నాయి. కొద్ది రోజులుగా జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వేసవిలో వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వైద్య సేవలు పొందాలి? తదితర అంశాలను గురించి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు.

    వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడం, చెమటపట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్‌ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడారిపోవడం వంటివి కనిపిస్తాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్నప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపి మజ్జిగ లేదా ఓఆర్‌ఎస్‌ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

    ఎండ ఎక్కువగా ఉండే ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో బయటికి వెళ్లకుండా ఉండడం మంచింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా రుమాలు, తెల్లని దుస్తులు ధరించాలి. ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వాడితే మంచిది. ఎండలో తిరిగితే వృద్ధులు, చిన్నారులు, మహిళలు, గర్భిణులు, రోగులు, శ్రమజీవులు, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది.

    ఎండాకాలంలో నీటిలోపంతో డీహైడ్రేషన్‌ అవుతుంది. దీంతో శరీరంలో శక్తి తగ్గి అలసట ఏర్పడుతుంది. ప్రతి గంటలకు ఒక గ్లాసు నీటి చొప్పున రోజు 10– 12 గ్లాసుల నీరు తాగాలి. ముఖ్యంగా, ప్రయాణం లేదా బయట పనులున్నప్పుడు నీరు తాగడం మరిచిపోవద్దు. వేసవిలో ప్రతి రోజు తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆయిల్‌ ఫుడ్స్‌, బిర్యానీలు, మసాలాలతో తయారు చేసే ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.

    శరీరంలో టెంపరేచర్‌ పెరగకూడదంటే కూలీలు వారు చేసే పనుల షిఫ్టులను మార్చుకోవాలి. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పనులు చేసుకోవాలి. మిట్ట మధ్యాహ్నం నీడపట్టున ఉండాలి. గర్భిణీ సీ్త్రలు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు హైరిస్క్‌ గ్రూపులో ఉంటారు. ఇలాంటి వారు ఎండలో ఎక్కువ సమయం ఉండకూడదు.

    జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ జరగకుండా ఉండేందుకు అన్ని పీహెచ్‌సీలలో ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ, ఉపాధిహామీ కూలీలకు పనిస్థలాల్లోనూ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరైనా పీహెచ్‌సీకి వెళ్లి తీసుకొని వాడుకోవచ్చు.

    గ్లోబల్‌ వార్మింగ్‌తో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వాడకం పెరిగి ప్రకృతి దెబ్బతినడంతో ఓజోన్‌ పొర తగ్గి ఎండల తీవ్రత పెరుగుతోంది. చెట్లను పెంచడం, నీటి వనరులను కాపాడుకోవడం ద్వారా వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది.

  • శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

    7

    సెలవులో కమిషనర్‌

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన 10, 13వ తేదీల్లో సెలవు పెట్టారు.

    క్వింటాల్‌ పత్తి రూ.8,000

    జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్‌ పత్తి రూ.8,000 పలికింది. గురువారం మార్కెట్‌కు 58 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

  • ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో గురువారం ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మైత్రి క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం, హెల్త్‌ స్క్రీనింగ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హెపటైటిస్‌–బీ, హెపటైటిస్‌–సి వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధా రాజేంద్ర, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్‌

  • చిగురుమామిడి: పదోతరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి, రికార్డు సృష్టించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా సూచించారు. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ ఆదర్శపాఠశాల, చిగురుమామిడి ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రోగులతో మాట్లాడారు. పల్లెదవాఖానాను సందర్శించారు. తమ గ్రామానికి రెండు వీవో భవనాలు మంజూరయ్యాయని, గ్రామంలోని కొందరు నాయకులు స్థలాన్ని రద్దు చేయిస్తున్నారని చిన్న ముల్కనూరు సర్పంచ్‌ సాంబారి భారతమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్‌, డీపీవో జగదీశ్వర్‌, చిగురుమామిడి తహసీల్దార్‌ ముద్దసాని రమేశ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

    డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు సిద్ధం చేయండి

    కొత్తపల్లి(కరీంనగర్‌): చింతకుంటలోని డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా సూచించారు. ఇండ్ల సముదాయాలను గురువారం పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్లను సంసిద్ధం చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించాలన్నారు.

  • విద్యుత్‌ సంస్థలోని ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్‌ కార్మికులకు సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ రెండోరోజు గురువారం తెలంగాణ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. కరీంనగర్‌లోని విద్యుత్‌ భవన్‌ ఎదుట, హుజూరాబాద్‌లో నిరసన కొనసాగించారు. ఒకే సంస్థలో రెండు విధాల సర్వీస్‌ రూల్స్‌ అమలు చేస్తూ సుమారు 19వేల మంది ఆర్టిజన్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. – కొత్తపల్లి(కరీంనగర్‌)/హుజూరాబాద్‌

Andhra Pradesh

  • తాడేపల్లి : వైఎస్సార్‌ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

    ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. 

    దారుణానికి పాల్పడిన నిందితుడిని  కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్‌ చేశారు.  అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్‌ జగన్‌.

    కాగా, వైఎస్సార్‌ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్‌కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.

    ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్‌(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్‌లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

  • విజయవాడ:  ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్‌ను టెంట్‌ల్లో నడుపుకునేందుకు  అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో  బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు టెంట్‌ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు.  

    అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వెలిసింది. సీఎం, సీఎస్‌లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్‌ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది.  రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. 

    ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..!