Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం.  

    అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్‌, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.  

    ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి  బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కి వస్తాడు.  

    ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు.  

  • సినీ ఇండస్ట్రీలో మరోసారి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఆమె పెళ్లి గురించి రూమర్లు గట్టిగా వినిపించాయి. అయితే ఆ సమయంలో సంయుక్త స్వయంగా స్పందించింది. తన పెళ్లి వార్తలను పక్కన పెట్టాలని, నటిగా తన పనిని మాత్రమే గమనించాలని కోరింది.  

    అయితే తాజాగా మళ్లీ సంయుక్తపై పెళ్లి పుకార్లు గుప్పుమంటున్నాయి. 30 ఏళ్ల ఈ మలయాళీ నటి ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ కెరీర్ పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇక ఈ సమయంలోనే తను పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కానీ కొంతమంది మాత్రం రష్మిక మందన్న తరహాలో సంయుక్త కూడా పెళ్లి చేసుకొని తన కెరీర్ కొనసాగిస్తుందని అంటున్నారు. త్వరలోనే ఆమె నిఖిల్‌తో కలిసి నటించిన ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతోపాటు ‘బ్లాక్ గోల్డ్’ అనే మరో ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది. కాగా తాజా పెళ్లి పుకార్లపై సంయుక్త మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  • సీతారామం ఫేమ ‍మృణాల్ ఠాకూర్ ఇటీవలే డకాయిట్ మూవీతో ప్రేక్షకులను అలరించింది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్‌ గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ ధనుశ్ డైరెక్షన్‌లో ఆమె పని చేయనున్నారని లేటేస్ట్ టాక్. ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ కోసం మృణాల్‌ను సంప్రదించనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. 

    ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండగా.. 1960 లేదా 1970ల కాలానికి సంబంధించిన ఒక 'పీరియడ్ డ్రామా'గా రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

    అయితే తాజాగా వీరిద్దరి సినిమా గురించి టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు వీరి రిలేషన్‌పై చర్చ మొదలైంది. గతంలో మృణాల్‌- ధనుశ్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. గతేడాది ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ప్రీమియర్ వేడుకలో ధనుశ్ కనిపించడంతో రూమర్స్ మొదలయ్యాయి. అంతకుముందు ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' సినిమా ముగింపు వేడుకలో మృణాల్ ఠాకూర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.

    అంతేకాకుండా సోషల్ మీడియాలో ధనుష్ కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో అవ్వడంతో వీరిద్దరు రిలేషన్‌కు మరింత బలం చేకూరింది. అయితే తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరు ఎక్కడా నోరు విప్పలేదు. గతంలో తన మూవీ 'దో దీవానే షహర్ మే' ఈవెంట్‌లో  పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై మృణాల్ ఠాకూర్ స్పందించారు. తనపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. ఇటువంటి వార్తలు చాలా సందర్భాల్లో నిరాధారంగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ధనుశ్ నటించిన 'కారా' మూవీ విడుదల కానుంది. 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యాంకర్ జోర్దార్‌ సుజాత. బిగ్‌బాస్‌ షోలో పాల్గొని మరింత పాపులారిటీని ఫేమస్ అయింది. తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.  జబర్దస్త్ కమెడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ ప్రేమలో పడిన సుజాత.. పెళ్లితో బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉన్నారు.

    ఇదిలా ఉంటే తాజాగా జోర్దార్‌ సుజాతకు మా సభ్యత్వం దక్కింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా అసోసియేషన్‌లో  సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ఇంతవరకు వచ్చానంటే మీ అందరి ఆశీర్వాదం, బలమేనని తెలిపింది.  ఇకముందు కూడా ఇలాగే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు సభ్యత్వ గుర్తింపు కార్డ్ అందజేశారు. 
     

     

  • టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో తన అందచందాలతో స్టార్‌ హీరోయిన్‌గా మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, బోజ్‌పురి ఏకంగా ఎనిమిది భాషల్లో 100కుపైగా చిత్రాల్లో నటించారు.

    ఇదిలా ఉంచితే తాజాగా రంభ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఏడాది వస్తానని తెలిపారు. నేను విజయవాడలోనే పుట్టాను.. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారని హీరోయిన్ రంభ తెలిపింది. చిన్నప్పటి దుర్గమ్మ గుడికి వస్తున్నానని వెల్లడించింది.

    సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు రంభ స్పందించింది. ఇప్పుడైతే ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదని వెల్లడించింది. కొన్ని కథలు విన్నానని.. నాకు సరిపోయే రోల్స్‌ రాలేదని రంభ చెప్పింది. ఆ కథల్లో ఏవీ తనకు నచ్చలేదని పేర్కొంది. కాగా.. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఇంద్రకుమార్‌ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
     

  • తెలుగమ్మాయిలా లంగా ఓణీలో కాయదు

    ఒంపు సొంపులతో మాయ చేస్తున్న అదితీ

    'కాక్‌టెయిల్ 2' మూవీ కోసం కృతి సనన్

    సింపుల్‌గా మెరిసిపోతున్న సారా అర్జున్

    స్టైలిష్ పోజులిచ్చేస్తున్న అనన్య నాగళ్ల

    మహారాణి లుక్‌తో జెనీలియా రాజసం

  • చాలామంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు గానీ నయనతార మాత్రం చాన్నాళ్లుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది. ఇద్దరు పిల్లలు తల్లిగా మారిన తర్వాత కూడా ఈమె జోరు తగ్గట్లేదు. ఇదే కాదు మరో అంశంలోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    (ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?)

    హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏ తరహా పాత్రలు చేస్తారో చాలావరకు వాటికి తగ్గట్లే అవకాశాలు వస్తుంటాయి. ఉదాహరణకు సీనియర్ హీరోలతో చేస్తే వాళ్ల సినిమాల్లో.. యంగ్ హీరోలతో చేస్తే వాళ్లతోనే అవకాశాలొస్తాయి. కానీ ఇలాంటి వాటికి నయనతార అతీతం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సీనియర్, జూనియర్ అని తేడా ఉండదు. అందరూ హీరోలతోనూ కలిసి నటించేస్తుంటుంది. విచిత్రం ఏంటంటే అందరితోనూ ఈమె కెమిస్ట్రీ కూడా అలానే వర్కౌట్ అయిపోతుంటుంది.

    మూడు నెలల క్రితం 70 ఏళ్ల చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్' సినిమాలో చేసింది. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన తమిళ హీరో కవిన్‌తో జోడీ కట్టింది. 'హాయ్' పేరుతో తీస్తున్న మూవీలోనే వీళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే వీళ్ల కాంబో ఎలా ఉంటుందా అనే సందేహాలకు తొలి పాటతో సమాధానమిచ్చారు. కవిన్-నయన్ జంట చూడటానికి బాగానే ఉంది. పాట కూడా బాగుంది.

    తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర హీరోలతో చేసిన నయనతార.. తమిళంలో రజనీకాంత్ జనరేషన్ హీరోలతో చేసింది. విజయ్, అజిత్ తదితరులతోనూ నటించింది. ప్రస్తుత జనరేషన్ హీరోలతోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. చూస్తుంటే నయనతారకు మాత్రమే ఇలాంటివి సాధ్యమేమో అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' ఇంకెన్నాళ్లు? అప్‌డేట్ ఇచ్చిన బుచ్చిబాబు)

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. బన్నీ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, ఫోటోలు ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ గొంతు, హావభావాలను అనుమతి లేకుండా అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడటకూడదని  నిషేధం విధించింది.  ఎవరైనా సరే సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

    కాగా.. గతంలో చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. తమ వ్యక్తగత హక్కులు కాపాడాలంటూ కోర్టుకు వెళ్లారు. తమ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు వాడుతున్నారని సినీతారలు పిటిషన్స్ దాఖలు చేశారు. వీరందరి హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్ట్ ఊరట కల్పించింది.

    ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతే కాకుండా రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్‌ కూడా రాకాలో కనిపించనున్నట్లు సమాచారం. 

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్ సాగుతూ..నే ఉంది. లెక్క ప్రకారం గత నెలలో రిలీజ్ అని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. తీరా డేట్ దగ్గరపడేసరికి నెల తర్వాత అంటే ఏప్రిల్ 30 పక్కా విడుదల చేస్తామని ఏకంగా పోస్టర్ వదిలారు. కొన్నిరోజుల ముందు మళ్లీ వాయిదా అని షాకిచ్చారు. జూన్‌లో వస్తుందని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. జూన్ కూడా వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలో దర్శకుడు బుచ్చిబాబు.. షూటింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. పోస్ట్ పెట్టాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)

    మరో ఆరు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు.. 'మై పెద్ది' అని క్యాప్షన్ ఇచ్చి రామ్ చరణ్‌తో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ చివరలో పెట్టుకున్నారనమాట. ఈ పాటలో చరణ్‌తో డ్యాన్స్ చేసేందుకు హీరోయిన్ సంయుక్తని తీసుకున్నారని రూమర్స్ వచ్చాయి. బహుశా ఈమెనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయితే రెహమాన్ వర్క్ మొదలవుతుంది. ఈయన టైంకి ఔట్‌పుట్ డెలివరీ చేస్తేనే జూన్‌కి సినిమా వస్తుంది. లేదంటే మళ్లీ వాయిదా తప్పదు.

    విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా తీస్తున్న 'పెద్ది'లో చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లు. శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులోని ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకుర్, మానస వారణాసి తదితరుల పేర్లు వినిపించాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం బ్యూటీ దొరక్కే షూటింగ్ ఇన్నాళ్ల పాటు ఆలస్యమైందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఏదైతేనేం ఎట్టకేలకు షూటింగ్ అయితే ముగించేస్తున్నారనమాట.

    (ఇదీ చదవండి: అందరూ ఫెయిల్! మలయాళీ సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?)

  • సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్‌ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

    గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్‌కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. 
     

     

  • టాలీవుడ్ రేంజు పెరిగిపోయింది. అబ్బో పాన్ ఇండియా సినిమాలు తీసేస్తున్నాం అని చాలామంది సంబరపడిపోతున్నారు గానీ గ్రౌండ్ లెవల్ పరిస్థితి అస్సలు బాగోలేదు. మిగతా విషయాల్ని కాసేపు పక్కనబెడితే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఒకటి రెండు సినిమాలు తప్పితే తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాపులే. కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి. గత మూడు నెలలుగా టాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. అలాంటిది మలయాళంలో మాత్రం చిన్న చిత్రాలు వరసపెట్టి వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి? ఇంతకీ ఇదెలా సాధ్యం? వాళ్ల సినిమాలే ఎందుకు ఆడుతున్నాయి?

    (ఇదీ చదవండి: ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి)

    ఒకప్పుడు మలయాళ సినిమా అంటే చిన్నచూపు ఉండేది కానీ గత కొన్నేళ్లుగా ఈ ఇండస్ట్రీకి రీచ్ బాగా పెరిగింది. లాక్‌డౌన్ తర్వాత అన్ని భాషల ప్రేక్షకులు ఈ భాష చిత్రాల్ని చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే మలయాళీ దర్శకులు.. అందరరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్‌లతో సినిమాలు తీస్తున్నారు. గత నెలలో 'ధురంధర్ 2'తో పాటు రిలీజై 'ఆడు 3' ‍అనే చిత్రం సెన్సేషన్ సృష్టించింది.  రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. తాజాగా 'భరతనాట్యం 2', 'వాలా 2' అనే చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా వరసగా రూ.100, రూ.200 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాయి.

    తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో రీసెంట్ టైంలో సక్సెస్ కోసం అందరూ ఇబ్బంది పడుతుంటే మలయాళంలో మాత్రం వరస హిట్స్ కొడుతున్నారు. దీనికి కారణాలు ఏంటా అని చూస్తే చాలా సింపుల్. మలయాళీ దర్శకులు.. అనవసర ఆర్భాటాలు పేరిట గిమ్మిక్కులు చేయరు. వందల కోట్ల బడ్జెట్ పెట్టి ఏళ్లకు ఏళ్లు మూవీస్ తీయరు. పరిమిత బడ్జెట్, తక్కువ వర్కింగ్ డేస్‌లో ఎలాంటి చిత్రాన్ని అయినా పూర్తి చేస్తారు. కథను నమ్మి, వైవిధ్యమైన ఐడియాలతో ప్రేక్షకులకు కొత్తదనం పంచాలని చూస్తారు. సహజమైన వాతావరణంలోనే ఎక్కువగా సినిమాలు తీయడం ఇంకో ప్లస్. అందుకే ఆ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి

    మరోవైపు టాలీవుడ్ పరిస్థితి చూస్తే.. ఓటీటీ మార్కెట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. దీంతో భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కొందరు మిడ్ రేంజ్ హీరోలకు పెద్ద మార్కెట్ లేకపోయినా వీళ్లపై కొందరు నిర్మాతలు.. భారీతనం పేరిట, హంగులు, ఆర్భాటాల పేరిట కోట్లకు కోట్లు ఖర్చు చేసేస్తున్నారు. బిజినెస్ మాత్రం దానికి తగ్గట్లు జరగట్లేదు. సరేలే ఎలాగోలా కానిచ్చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తే.. చూసేందుకు ప్రేక్షకులు రావట్లేదు. వీటిలో ప్లానింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

    తెలుగు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కాకుండా పాన్ ఇండియా పేరిట గిమ్మిక్కులు చేద్దామని చాలామంది దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. అలాంటివి పసిగట్టేస్తున్న ఆడియెన్స్.. సదరు సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. అందుకే తెలుగు దర్శకులు ఇకపై కంటెంట్‌ని నమ్ముకుని మూవీస్ తీస్తే బెటర్. లేదంటే ముందుముందు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మలయాళం లాంటి పరభాషా చిత్రాలకు ఆదరణ పెరగడం గ్యారంటీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు డిస్ట్రబింగ్ సినిమా)

  • టాలీవుడ్ యంగ్‌ హీరో తీరువీర్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించిన తీరువీర్‌.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఆయన పాపం ప్రతాప్‌ మూవీతో ఆడియన్స్‌ను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

    సినిమాల సంగతి పక్కన పెడితే తిరువీర్ గతేడాది డిసెంబర్‌లో తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు కుమారుడు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేశారు. వీరిద్దరి రెండో పెళ్లి రోజు సందర్భంగా కొడుకు పేరు రివీల్ చేశారు. అథర్వ్‌ రెడ్డిగా తమ ముద్దుల కుమారుడికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    కాగా.. తిరువీర్ తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. 2016 నుంచి మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. తిరువీర్ 2024లో కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 
     

     

  • పీరియాడిక్ సినిమాలు తీస్తూ వచ్చిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రూటు మార్చి ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు తీసిన సినిమా కొన్నాళ్ల క్రితమే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు మరో దానిలో స్ట్రీమింగ్‌కి సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటి మూవీ? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

    ప్రస్తుతం చాలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న యువత డ్రగ్స్ వాడకం, మైనర్లపై అత్యాచారాలు తదితర అంశాలతో గుణశేఖర్.. 'యుఫోరియా' సినిమా తీశారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ లీడ్ రోల్ చేయగా భూమిక, గౌతమ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి తొలివారంలో థియేటర్లలోకి రాగా రేపటి(ఏప్రిల్ 22) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

    'యుఫోరియా' విషయానికొస్తే.. చైత్ర(సారా అర్జున్) పెద్దింటి అమ్మాయి. చదువులో టాపర్. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంటుంది. ఓ రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్‌కి వెళ్తుంది. అక్కడ ఈమెకు వికాశ్(విఘ్నేశ్ గవిరెడ్డి), అతడి ఫ్రెండ్స్ పరిచయమవుతారు. పబ్ నుంచి తిరిగి వెళ్తున్న టైంలో వికాశ్ గ్యాంగ్.. చైత్రని తమ కారులో ఎక్కించుకుని డ్రగ్స్ మత్తులో దారుణంగా అత్యాచారం చేస్తారు. పేరు మోసిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పిల్లలు నిందితులుగా ఉన్న ఈ కేసు చివరకు ఏమైంది? చైత్రకు న్యాయం దక్కిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలని స్పూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ క్రమంలోనే కొడుకు.. వావివరసలు మరిచి తల్లిపైనే దారుణానికి ఒడిగట్టడం, అత్యాచార సీన్ రీ క్రియేషన్ లాంటి కొన్ని సన్నివేశాలు డిస్ట్రబింగ్‌గా అనిపించాయి. అలా ఈ చిత్రం చర్చనీయాంశమైంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

  • టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.

    ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్  మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్‌ టీ తాగుతూ ఇండియన్‌ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్‌.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.

    దీనికి డొనాల్డ్ ట్రంప్‌ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్‌లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్‌సీస్‌లో ఎస్‌వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
     

     

  • సుబ్బా మాధవరపు దర్శకత్వంలో చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సూర్య బీ పాజిటివ్'. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. 'దండోరా' దర్శకుడు మురళీకాంత్, 'కిష్కింధపురి' దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.

    హీరో చరణ్ మాట్లాడుతూ.. మా దర్శకులు అమెరికాలో ఉంటారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది నాలుగో మూవీ. ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

  • సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.

    (ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్‌ ఇంటర్నేషనల్‌.. సాయి వ్యాఖ్యలు వైరల్‌)

    'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.

    ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్‌కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. 

    నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిల‌వ‌గా.. స‌మీర్ రిజ్వీ 41 ప‌రుగులు సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. 

    ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (68 బంతుల్లో 135 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించ‌డంతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజ‌న్‌లో తొలిసారి 240 ప‌రుగుల ప్ల‌స్ మార్కును దాటింది. చివ‌ర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. హెడ్ 37, ఇషాన్ కిష‌న్ 25 ప‌రుగులు చేశారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచ‌రీతో ఢిల్లీ ప‌ని ప‌ట్టిన అభిషేక్ శర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.

    242లో స‌గం స్కోరు అభిషేక్‌దే..
    టాస్ గెలిచి ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించ‌డంతోనే ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శ‌ర్మ‌, హెడ్‌లు పోటీప‌డి బౌండరీలు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. ఆ త‌ర్వాత జ‌ట్టు స్కోరు 97 ప‌రుగుల వ‌ద్ద హెడ్ వెనుదిర‌గ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌ తొలి వికెట్ కోల్పోయింది. 

    మ‌రో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శ‌ర్మ త‌న విధ్వంసాన్ని కొన‌సాగించాడు. గ‌త రెండు మ్యాచ్‌ల్లో అర్థ‌శ‌త‌కాలు సాధించిన‌ప్ప‌టికీ వాటిని సెంచ‌రీలుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌల‌ర్ల‌ను చీల్చి చెండాడి సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 

    చివ‌రి వ‌ర‌కు నిలిచిన అభిషేక్ క్లాసెన్‌, ఇషాన్‌ల‌తో క‌లిసి మంచి భాగ‌స్వామ్యాలు న‌మోదు చేశాడు. అయితే జ‌ట్టు సాధించిన 242 ప‌రుగుల్లో అభిషేక్ ఒక్క‌డివే 135 ప‌రుగులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అత‌డి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం.

    త‌డ‌బ‌డిన ఢిల్లీ..
    భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ప్ప‌టికీ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 ప‌రుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. అయితే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఈ ఇద్ద‌రు వెనుదిర‌గ‌డం ఢిల్లీని క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మిల్ల‌ర్ గోల్డెన్ డ‌కౌట్ కావ‌డంతో మ‌రింత క‌ష్టాల్లో ప‌డింది. 

    ఈ ద‌శ‌లో స‌మీర్ రిజ్వీ, స్ట‌బ్స్ (27) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయ‌డంతో ఢిల్లీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా, సొంత‌గడ్డ‌పై మాత్రం హ్యాట్రిక్ విక్ట‌రీ. ఈ గెలుపుతో ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మ‌రోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో ప‌రాజ‌యం. దీంతో ఆ జ‌ట్టు ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో కొన‌సాగుతోంది.

     

  • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సెంచరీతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 47 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.

    ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న టీ20 సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లి తర్వాత పొట్టి క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

    అభిషేక్‌ ధనాధన్‌..
    కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆది నుంచి అభిషేక్‌ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి శతక మార్కు అందుకున్నాడు.

    కాగా ఐపీఎల్‌లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో తొమ్మిదవ సెంచరీ. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున ఐదు శతకాలు బాదిన అభిషేక్‌.. టీమిండియా తరఫునా రెండుసార్లు శతక్కొట్టాడు.

    క్లాసెన్‌ ఫటాఫట్‌
    ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 37 పరుగులతో దుమ్ములేపాడు.

    టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీల వీరులు
    🏏క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 22 సెంచరీలు
    🏏బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)- 12 సెంచరీలు
    🏏డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)- 10 సెంచరీలు
    🏏క్వింటన్‌ డికాక్‌ (సౌతాఫ్రికా)- 9 సెంచరీలు
    🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 9 సెంచరీలు
    🏏రిలీ రొసోవ్‌ (సౌతాఫ్రికా)-  9 సెంచరీలు
    🏏సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (పాకిస్తాన్‌)- 9 సెంచరీలు
    🏏అభిషేక్‌ శర్మ (ఇండియా)-9 సెంచరీలు.

    చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

  • ముంబై ఇండియన్స్‌కు శుభవార్త. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ అందుబాటులోకి వచ్చాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అతడు ముంబై తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విల్‌ జాక్స్‌ అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

    వరల్డ్‌కప్‌లో సూపర్‌హిట్‌
    ఇంగ్లండ్‌ తరఫున ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 226 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌ (Will Jacks).. తొమ్మిది వికెట్లు కూల్చాడు. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ సెమీస్‌ ప్రయాణానికి దోహదం చేసిన ఈ ఆల్‌రౌండర్‌ నాలుగుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు గెలిచాడు. ఈ పవర్‌ హిట్టర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది.

    వ్యక్తిగత సెలవు
    అయితే, వరల్డ్‌కప్‌ తర్వాత వ్యక్తిగత సెలవుపై వెళ్లిన విల్‌ జాక్స్‌ ముంబై ఆరంభ మ్యాచ్‌లకు మాత్రమే దూరమవుతాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆరు మ్యాచ్‌లు పూర్తైనా అతడు జట్టుతో చేరలేదు. తాజా సమాచారం ప్రకారం విల్‌ జాక్స్‌ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడు భారత్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. ​

    కాగా ముంబై ఇండియన్స్‌ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇలాంటి తరుణంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ జట్టుతో చేరనుండటం సానుకూలాంశం. కాగా ముంబై గురువారం చెన్నై జట్టుతో తలపడనుంది. ఇందుకు వాంఖడే వేదిక.

    చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

  • విరాట్‌ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, రన్‌మెషీన్‌గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్‌..  క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.

    ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ లిజ్‌లాజ్‌ ఫొటోకు కోహ్లి లైక్‌ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్‌లైక్‌ చేసినట్లు తెలిసింది.

    ఈ విషయంపై లిజ్‌లాజ్‌ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్‌ కౌర్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఫొటోకు కూడా కోహ్లి లైక్‌ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్‌ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.

    అభ్యంతరకర కామెంట్‌
    ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో బ్రెజిల్‌ మోడల్‌ ఇసబెల్ల లియట్‌, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్‌ కౌర్‌, లిజ్‌లాజ్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్‌ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్‌ పెట్టారు.

    ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్‌ చేశాడనే వదంతులు ఉన్నాయి.

    కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్‌ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్‌ ఇచ్చింది.

    ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్‌లోని ప్రేమానంద్‌జీ మహరాజ్‌ను దర్శించి ఆశీసులు తీసుకుంది.

    చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. 

    నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు అభిషేక్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది.

    • 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపటల్స్‌ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సమీర్‌ రిజ్వీ 38, అక్షర్‌ పటేల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

    ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు
    ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ష్టాల్లో ప‌డింది. ఇషాన్ మ‌లింగ‌ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు  కోల్పోయింది. తొలుత 57 పరుగుల చేసిన నితీశ్ రానాను వెన‌క్కి పంపిన మ‌లింగ మ‌రుస‌టి బంతికి డేవిడ్ మిల్ల‌ర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్ 4 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది.

    8 ఓవర్లలో ఢిల్లీ 86-1
    8 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్‌ (27), నితీశ్‌ రానా (47) క్రీజులో ఉన్నారు.

    పవర్‌ ప్లేలో ఢిల్లీ స్కోరు: 59-1(6)
    రాహుల్‌ 22, నితీశ్‌ 27 రన్స్‌తో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 184 పరుగులు అవసరం.

    ఐదు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 54-1
    కేఎల్‌ రాహుల్‌ 21, నితీశ్‌ రాణా 23 పరుగులతో ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 189 పరుగులు కావాలి.

    ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
    2.1: దిల్షాన్‌ మధుషాంక బౌలింగ్‌లో తొలి వికెగ్‌గా వెనుదిరిగిన పాతుమ్‌ నిస్సాంక (6 బంతుల్లో 8). కేఎల్‌ రాహుల్‌ 12 పరుగులతో ఉండగా.. నితీశ్‌ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-1(2.1).

    ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242  పరుగులు చేసింది. 

    ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ (13 బంతుల్లో 37 నాటౌట్‌) ఆడాడు. ట్రవిస్‌ హెడ్‌ 37, ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్‌ విధించిన 243 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బరిలోకి దిగింది. 

    సన్‌రైజర్స్‌ స్కోరు: 242-2(20)
    సన్‌రైజర్స్‌ డబుల్‌ సెంచరీ: స్కోరు: 202-2(17)
    అభిషేక్‌ 127, క్లాసెన్‌ ఆరు పరుగులతో ఉన్నారు

    16 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 189-2
     రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌ 
    14.4: ఇషాన్‌ కిషన్‌ రనౌట్‌ (13 బంతుల్లో 25). అభిషేక్‌ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)

    అభిషేక్‌ శర్మ సెంచరీ
    47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ

    13 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 151-1
    అభిషేక్‌ 86, ఇషాన్‌ 23 రన్స్‌తో ఉన్నారు.

    పది ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 104-1
    అభిషేక్‌ 60, ఇషాన్‌ 4 పరుగులతో ఉన్నారు.

    తొలి వికెట్‌ డౌన్‌
    8.5: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో సమీర్‌ రిజ్వీకి క్యాచ్‌ ఇచ్చి ట్రవిస్‌ హెడ్‌ (26 బంతుల్లో 37) అవుట్‌. స్కోరు: 97-1(8.5). అభిషేక్‌ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.
    👉25 బంతుల్లో అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ

    రఫ్పాడించిన అభిషేక్’‌‌ 
    పవర్‌ ప్లేలో ‘అభిషేక్’‌‌ రఫ్పాడించారు. హెడ్‌ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్‌ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)

    ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు: 56-0
    ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్‌హెడ్‌ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్‌’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.

    టాస్‌ గెలిచిన ఢిల్లీ
    ఐపీఎల్‌-2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచింది. తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఇషాన్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదిక. 

    తుదిజట్టు మార్పులు
    ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. ఆకిబ్‌ నబీ స్థానంలో నితీశ్‌ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. హర్ష్‌ దూబేను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు తెలిపాడు.  

    అదే విధంగా ప్రఫుల్‌ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్‌ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్‌రైజర్స్‌ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్‌ హింగే.. గత మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.
     

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తుదిజట్లు
    సన్‌రైజర్స్‌
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీశ్‌ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగ

    ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: స్మరణ్‌ రవిచంద్రన్‌, ప్రఫుల్‌ హింగే, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దిల్షాన్‌ మధుషాంక, హర్షల్‌ పటేల్‌

    ఢిల్లీ
    పాతుమ్ నిస్సాంక, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), సమీర్ రిజ్వీ, నితీశ్‌ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్‌ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడి
    ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌: కరుణ్‌ నాయర్‌, దుష్మంత చమీర, అశుతోశ్‌ శర్మ, త్రిపురాణ విజయ్‌, ఆకిబ్‌ నబీ.

  • జస్‌ప్రీత్‌ బుమ్రా విషయంలో తనను విమర్శిస్తున్న వారికి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఎవరి సేవలను ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు అన్నాడు. బుమ్రా వికెట్లు తీయకపోతే తనను విమర్శించడం ఏమిటని ప్రశ్నించాడు.

    ఐపీఎల్‌-2026లో ముంబై ప్రధాన పేసర్‌ బుమ్రా (Jasprit Bumrah) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల వరకు ఒక్క వికెట్‌ తీయలేకపోయిన అతడు.. గుజరాత్‌ టైటాన్స్‌ (MI vs GT)తో సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మెరుగ్గా రాణించాడు. తొలి ఓవర్లో రంగంలోకి దిగి గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ను గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు.

    బుమ్రా తొలి వికెట్‌.. హార్దిక్‌పై విమర్శలు
    తద్వారా ఈ సీజన్‌లో బుమ్రా తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చిన అతడు కీలక వికెట్‌ తీశాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. బుమ్రాకు కొత్త బంతిని ఇచ్చి ఆరంభంలో రంగం దించితే ఫలితం ఇలా ఉంటుందని.. కానీ పాండ్యా అతడిని నిర్లక్ష్యం చేస్తూ మూల్యం చెల్లిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    బుమ్రా ఎప్పుడూ అంతేగా
    ఈ నేపథ్యంలో గుజరాత్‌పై విజయానంతరం హార్దిక్‌ పాండ్యా ఘాటుగా స్పందించాడు. ‘‘చాలా మంది జస్‌ప్రీత్‌ బుమ్రాకు తొలి ఓవర్లోనే బంతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది నాకు కూడా ఆసక్తికరంగానే ఉంది. 

    అయితే, ఇప్పటికి ముంబై తరఫున 151 మ్యాచ్‌లు ఆడితే అందులో ఎనిమిది లేదంటే తొమ్మిదిసార్లు మాత్రమే బుమ్రా తొలి ఓవర్‌ బౌల్‌ చేయడం మీరు గమనించాలి.

    నా వల్ల ఎలాంటి సమస్యా లేదు
    ఇందులో నా వల్ల వచ్చిన సమస్య ఏమీ లేదు. జస్‌ప్రీత్‌ ప్రత్యేకమైన బౌలర్‌. జట్టుకు అవసరమైన వేళ అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు. ఈరోజు అతడి సేవలు ఆరంభంలోనే అవసరం అని భావించాము. కొత్త బంతితో ప్రభావం చూపగలడని భావించాము. జట్టులో అతడి కంటే ఉత్తమమైన బౌలర్‌ ఎవరూ లేరు’’ అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.

    కాగా అహ్మదాబాద్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై గుజరాత్‌ జట్టును 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 100 పరుగులకే ఆలౌట్‌ అయి చిత్తుగా ఓడింది. కాగా ఈ సీజన్‌లో ముంబైకి ఆరింట ఇదే రెండో గెలుపు.

    చదవండి: తిలక్‌ వర్మపై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌.. స్పందించిన స్టార్‌

  • క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్‌ పిచ్‌ మొత్తాన్ని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్‌ అర్ధంతరంగా ముగిసిపోయింది.

    ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగింది. జలగావ్‌ రూరల్‌ ఎంఎల్‌ఏ కప్‌ టోర్నమెంట్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్‌పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.

    నిస్సహాయంగా
    ఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్‌ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్‌తో పిచ్‌ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.

    కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్‌ మ్యాచ్‌కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్‌ రద్దైపోగా.. పిచ్‌ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్‌ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

    ఎవరిది బాధ్యత
    ‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్‌నే మ్యాచ్‌కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్‌తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు.

     

  • వరుస ఓటములతో నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలి​ంది. ఆ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ఆయుశ్‌ మాత్రే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    టోర్నీ మొత్తానికి దూరం
    ‘‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌ 18 నాటి మ్యాచ్‌ సందర్భంగా ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) తొడ కండరాలు పట్టేశాయి. ఆయుశ్‌ ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు 6-12 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఐపీఎల్‌-2026లో మిగిలిన సీఎస్‌కే మ్యాచ్‌లన్నింటికీ అతడు దూరమయ్యాడు’’ అని సీఎస్‌కే తమ ప్రకటనలో పేర్కొంది.

    కాగా తాజా ఎడిషన్‌లో సీఎస్‌కే తరపున వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆయుశ్‌ మాత్రే.. ఆరు మ్యాచ్‌లు ఆడి 201 పరుగలు సాధించాడు. అత్యధిక స్కోరు 73. ముంబైకి చెందిన ఆయుశ్‌ మాత్రే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఇటీవలే వరల్డ్‌కప్‌ అందించాడు.

    గతేడాది రీప్లేస్‌మెంట్‌ ప్లేయర్‌గా సీఎస్‌కేలో చేరిన ఆయుశ్‌ మాత్రే ఓపెనర్‌గా రాణించాడు. ఈ ఏడాది సంజూ శాంసన్‌- రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓపెనర్లుగా రాగా.. ఆయుశ్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి అదరగొట్టాడు. చివరగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 30 పరుగులతో దుమ్ములేపాడు.

    ఆయుశ్‌ స్థానంలో ఎవరు?
    అయితే, ఆ సమయంలోనే అతడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ కాసేపు క్రీజులో ఉన్న ఆయుశ్‌.. ఆ తర్వాత నొప్పి తాళలేక మైదానం వీడాడు. ఇక మంచి ఫామ్‌లో ఉన్న ఆయుశ్‌ సేవలను కోల్పోయిన సీఎస్‌కేకు.. అతడి బ్యాటింగ్‌ స్థానాన్ని భర్తీ చేయడం అంత తేలికేమీ కాదు. ఆయుశ్‌ స్థానంలో ఉర్విల్‌ పటేల్‌ లేదంటే కార్తిక్‌ శర్మను తుదిజట్టులో ఆడించే అవకాశం ఉంది. 

    ఇదిలా ఉంటే.. ఎంఎస్‌ ధోని ఫిట్‌నెస్‌ లేక ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ఖలీల్‌ అహ్మద్‌ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఆయుశ్‌ కూడా జట్టును వీడటంతో సీఎస్‌కేకు భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికి ఈ సీజన్‌లో సీఎస్‌కే.. ఆరు మ్యాచ్‌లు ఆడి రెండే గెలిచింది.

    చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌!

  • గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ తిలక్‌ వర్మ అదరగొట్టాడు. విధ్వంసకర అజేయ సెంచరీ (45 బంతుల్లో 101)తో రాణించి తమ జట్టుకు విజయం అందించాడు. 

    అయితే, అహ్మదాబాద్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో పేలవ ఆరంభం... పవర్‌ప్లేలో సాధారణ స్కోరు... గత మ్యాచ్‌ల తరహాలోనే మరోసారి ముంబై ఇన్నింగ్స్‌ పతనం దిశగా సాగిపోతున్నట్లుగా అనిపించింది... ఇలాంటి స్థితిలో తిలక్‌ వర్మ ఒక్కసారిగా ఆటను మార్చేశాడు.

    తీవ్ర ఒత్తిడి మధ్య నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ తొలి సెంచరీతో కదం తొక్కాడు. 19 సీజన్ల ఐపీఎల్‌ చరిత్రలో ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని రీతిలో చివరి 6 ఓవర్లలో ఒక్కడే 82 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 

    అనంతరం ఛేదనలో మొదటి బంతికే వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో తిలక్‌ స్కోరును కూడా అందుకోలేక మూడు వరుస విజయాల తర్వాత ఓటమిని ఆహ్వానించింది.

    తిలక్‌ వర్మపై హార్దిక్‌ సీరియస్‌
    ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో ఈ మ్యాచ్‌ను కూడా జాగ్రత్తగా మొదలు పెట్టిన తిలక్‌ వర్మ వేగంగా ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డాడు. 14వ ఓవర్‌ ముగిసేసరికి అతను 22 బంతులు ఆడితే చేసింది 19 పరుగులే... ఒక్క బౌండరీ కూడా లేదు!.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఎండ్‌లో ఉన్న ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తిలక్‌ వర్మపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.  

    ‘‘ఇలా ఆడితే ఎలా? అసలేం ఏం చేస్తున్నావు? ఇలా ఆడితే గెలుపు సాధ్యమేనా?’’ అన్నట్లుగా హార్దిక్‌ బాగా సీరియస్‌ అయినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఎంతో సంయమనం పాటించిన తిలక్‌ వర్మ..  ప్రసిధ్‌ వేసిన 15వ ఓవర్‌తో గేమ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ ఓవర్లో తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదిన తిలక్‌... రషీద్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు.

    దంచికొట్టిన తిలక్‌
    ఆ తర్వాత యువ పేస్‌ అశోక్‌ శర్మ ఓవర్లో తిలక్‌ చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ బాది 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అతను... ఇదే ఓవర్‌ తర్వాతి నాలుగు బంతుల్లో వరుసగా 4, 4, 6, 6తో ఆధిపత్యం ప్రదర్శించాడు. 

    19వ ఓవర్‌ ముగిసేసరికి అతను 80 పరుగుల వద్ద ఉన్నాడు. ఐపీఎల్‌లో తిలక్‌ మొదటి సెంచరీ సాధిస్తాడా అనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో దూకుడైన బ్యాటింగ్‌తో తిలక్‌ దానిని చేసి చూపించాడు.

    ప్రసిధ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన అతను ఆఖరి రెండు బంతుల్లో కూడా మళ్లీ 6, 4 బాదాడు. షార్ట్‌ బంతికి స్క్వేర్‌ లెగ్‌ దిశగా బౌండరీకి తరలించడంతో తిలక్‌ శతకం పూర్తయింది. ఒక్క ప్రసిధ్‌ బౌలింగ్‌లోనే అతను 43 పరుగులు రాబట్టాడు. తాను ఆడిన చివరి 23 బంతుల్లో తిలక్‌ ఏకంగా 82 పరుగులు బాదడం విశేషం.

    నాలో కసి పెంచేందుకే అలా
    ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా తనతో వ్యవహరించిన తీరుపై తిలక్‌ వర్మ తాజాగా స్పందించాడు. ఐపీఎల్‌ వైబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ భాయ్‌ ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. మరోవైపు.. నేనేమో ప్రశాంతంగా పనిచేసుకుపోయే రకం.

    అందుకే భాయ్‌ అప్పుడు నాలో కసిని పెంచాలని అలా చేశాడు. ‘నువ్వు చేయగలవు. నువ్విది చేస్తేనే మనం గెలుస్తాము’ అని నన్ను ఉత్సాహపరిచాడు. అందుకు నేనేమో.. ‘పర్లేదు.. ఇది జరిగితీరుతుంది. జట్టు కోసం చేయగలిగినదంతా చేస్తాను.. కచ్చితంగా చేస్తాను’ అని భాయ్‌కు చెప్పాను’’ అని తిలక్‌ వర్మ పేర్కొన్నాడు. 

    కాగా ఐపీఎల్‌-2026లో తొలి ఐదు మ్యాచ్‌లలో తిలక్‌ వర్మ వరుసగా 20, 0, 14, 1, 8 స్కోర్లు చేశాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సమష్టి వైఫల్యంలో భాగంగా ఉన్న తిలక్‌పై కూడా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సెంచరీ ఇన్నింగ్స్‌తో తిలక్‌ బదులిచ్చినట్లు అయింది.

    చదవండి: టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

  • ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన మహారాష్ట్ర రెజ్లర్‌ ఖషాబా దాదాసాహెబ్‌ (కేడీ) జాదవ్‌కు ‘పద్మవిభూషణ్‌’ పురస్కారం అందించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి గడువునిస్తూ మే 4లోగా తేల్చాలని స్పష్టం చేసింది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన జాదవ్‌ 1984లో మృతి చెందారు.

    మరణాంతరం 2001లో ప్రభుత్వం ఆయనకు ‘అర్జున అవార్డు’ను ప్రకటించింది. అయితే దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్‌’ను ఆయనకు ప్రకటించాలని కోరుతూ కుస్తీవీర్‌ ఖషాబా జాదవ్‌ ఫౌండేషన్‌ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసింది. జాదవ్‌ కుమారుడు రంజిత్‌ ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు.

    గతంలో పలుమార్లు అవార్డు విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారించిన బాంబే హైకోర్టు (కొల్హాపూర్‌ బ్రాంచ్‌) న్యాయమూర్తులు జస్టిస్‌ మాధవ్‌ జామ్‌దార్, జస్టిస్‌ ప్రవీణ్‌ పాటిల్‌ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచనలు చేస్తూ కేసును మే 5కు వాయిదా వేశారు. 

  • సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే వాళ్లు... ‘రోల్‌ మోడల్స్‌’ను ఆదర్శంగా తీసుకోవడం పరిపాటి! కానీ భారత యువ రెజ్లర్‌ సుజీత్‌  కల్కల్‌ మాత్రం తన అభిమాన ఆటగాడు తానే అని అంటున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా ఇతర సీనియర్‌ రెజ్లర్ల వీడియోలకు బదులు తన వీడియోలే చూసి స్ఫూర్తి పొందుతానని చెబుతున్నాడు. 

    కాగా 2025 జూన్‌లో జరిగిన అండర్‌–23 ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 65 కేజీల విభాగంలో పరాజయం ఎరగకుండా ముందుకు సాగుతున్న సుజీత్‌... బరిలోకి దిగిన ప్రతి టోర్నమెంట్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు.

    ఇటీవల కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో జరిగిన ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన సుజీత్‌... తనను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో మాత్రం లేనని వెల్లడించాడు.

    ఆ వివరాలు అతడి మాటల్లోనే...
    ‘‘నేను ఎవరినీ అభిమానించను. ఇంకా చెప్పాలంటే నా అభిమాన రెజ్లర్‌ను నేనే. నా వీడియోలే ఎక్కువ చూస్తాను. ఆదివారం మొత్తం అదే పని పెట్టుకుంటా... నా ప్రాక్టీస్‌ బౌట్‌ల వీడియోలు చూసి స్వీయ విశ్లేషణ చేసుకుంటా. అప్పుడప్పుడూ యోగేశ్వర్‌ దత్, బజరంగ్‌ పూనియా, అమిత్‌ ధన్‌కర్‌ వంటి సీనియర్‌ల బౌట్‌లను పరిశీలిస్తా. 

    వారి వేగం, బలం గమనిస్తా. కానీ ఎక్కువ శాతం మాత్రం నా బౌట్‌ వీడియోలే చూస్తా. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ప్రాక్టీస్‌కే అధిక సమయం పోతుంది. ఆదివారం మాత్రమే వీలు దొరకుతుంది. అప్పుడు నా బౌట్‌లు చూసి అందులో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తుంటా.  

    నన్ను ఎవరూ ఓడించలేరు అనే భ్రమలో లేను. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఆ రోజు పోటీలో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబర్చారు అనేదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. నా వరకైతే ఈ జోరు కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు అందించాలనుకుంటున్నా.  

    గత రెండేళ్లుగా భారత రెజ్లర్ల చేతిలో ఒక్క బౌట్‌లోనూ ఓడలేదు. కానీ ఆసియా క్రీడల్లో ఇరాన్, జపాన్‌ రెజ్లర్లతో గట్టి పోటీ ఎదురవడం ఖాయం. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. మెరుగవ్వాల్సిన అంశాలపై దృష్టి పెట్టా. 

    రెజ్లింగ్‌లో డిఫెన్స్‌దే కీలకపాత్ర. నా ప్రధాన బలం కూడా అదే. అటాకింగ్‌ గేమ్‌ పెంపొందించుకునేందుకు సాధన చేస్తున్నా. ఓర్పు పెంచుకుంటూ ప్రతిదాడిలో మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నా.  

    భారత ఫ్రీస్టయిల్‌ హెడ్‌ కోచ్‌ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని జాతీయ శిబిరం ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ప్రతి అంశంలో మరింత మెరుగయ్యేందుకు కోచ్‌లు అనునిత్యం సాధన చేయిస్తున్నారు. దాని ఫలితాలు మున్ముందు మీరంతా చూస్తారు.  

    నా బరువు కేటగిరీ రెజ్లర్లతోనే కాకుండా... నా కంటే ఎక్కువ బరువున్న వారితోనూ సాధన చేస్తున్న. దాని వల్ల శక్తిని పెంపొందించుకోవడంతో పాటు... మరిన్ని మెలకువలు నేర్చుకోవచ్చు.  

    ఈ ఏడాది ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనున్నాయి. ఆ రెండు నాకు ఎంతో ముఖ్యం. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో వంద శాతం కష్టపడతా. ఇక గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో త్రుటిలో పతకం కోల్పోయా. ఈసారి అలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పతకంతో తిరిగి వస్తా.  

    అండర్‌–23 విభాగానికి సీనియర్‌ స్థాయికి పెద్ద తేడా ఏమీ లేదు. అందులోనూ ఇలాంటి పోటీనే ఉంటుంది. అయితే ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్థాయి అన్నిటికంటే పెద్దది. అక్కడ పోటీ తీవ్రత అధికం. మామూలుగా ఎవరైనా మట్టిలో రెజ్లింగ్‌ ప్రారంభిస్తారు. కానీ నేను కెరీర్‌ ప్రారంభం నుంచే మ్యాట్‌పై పోటీపడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. మా నాన్న నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. 

    దాని వల్ల నా డిఫెన్స్‌ మెరుగైంది.  
    సీనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో 10–15 సెకన్లు చేసిన చిన్న తప్పిదం వల్ల పతకం దక్కలేదు. కొన్నిసార్లు ఒత్తిడి కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక మీదట అలాంటి తప్పులు చేయను.   

    అభిమానుల ఆదరణ అమోఘం. వారు నా నుంచి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు. తప్పక వారి కోరిక నెరవేరుస్తా. నా వరకైతే నేను పతకాలు సాధించగలనని వంద శాతం నమ్ముతున్నా. కానీ భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు కదా!

    సంగీతంతో సేదతీరుతా...
    రోజులో ఎక్కువ శాతం మ్యాట్‌పై కుస్తీ పట్టడంతోనే సరిపోతుంది. అయితే ఖాళీ దొరికితే మాత్రం సంగీతం వింటాను. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. అయితే అవన్నీ రెజ్లింగ్‌ తర్వాతే. కొన్ని సార్లు రిఫ్రెష్‌ అవడానికి పాటలు ఉపయోగపడతాయి. దేశానికి పతకాలు సాధించాలనే లక్ష్యంతో జీవితంలో ఎన్నో ఇష్టమైన విషయాలను పక్కన పెట్టా. 

    కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం చాలా తక్కువ. కెరీర్‌ కోసం నచ్చిన ఆహారాన్ని కూడా వదులుకున్నా. ఇవన్నీ రెజ్లింగ్‌ కోసమే. నాన్న దయానంద్‌ రెజ్లింగ్‌ కోచ్‌ కావడంతో ఇంట్లో కూడా ఆటకు సంబంధించిన చర్చ నడుస్తుంది. ఏ క్రీడలోనైనా నిలకడ ముఖ్యం. అదే ఇతరులతో మనల్ని భిన్నంగా చూపుతుంది’’ అని  సుజీత్‌  కల్కల్‌ పేర్కొన్నాడు.
    – సాక్షి క్రీడా విభాగం 

  • ఐపీఎల్‌ 2026 ముగిసిన తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. సీనియర్ల జాబితాలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నట్లు సమాచారం.

    ఒకవేళ గిల్‌ ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో కెప్టెన్‌ ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్రత్యామ్నాయంగా ముగ్గురి పేర్లు పరిశీలను రావచ్చు. వీరిలో ముందుగా రిషబ్‌ పంత్‌ పేరు ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా పేర్లు కూడా పరిశీలనలో ఉంటాయి.

    రిషబ్‌ పంత్‌ విషయానికొస్తే.. ‍ప్రస్తుతం అతను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ కారణంగా గిల్ స్థానంలో అతడే సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. దూకుడు నాయకత్వం, మ్యాచ్‌ను ఒంటరిగా మలుపు తిప్పగల సామర్థ్యం పంత్ ప్రత్యేకత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లోని కఠిన పిచ్‌లపై సెంచరీలు సాధించడం అతని స్థాయి తెలియజేస్తుంది. ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉండటం కూడా అతనికి అదనపు బలం.

    కేఎల్ రాహుల్
    భారత సెలెక్టర్లు ఒకవేళ పంత్‌కు కూడా విశ్రాంతినివ్వాలని భావిస్తే, తదుపరి ప్రత్యామ్నాయంగా కేఎల్‌ రాహుల్‌ ఉంటాడు. రాహుల్‌కు గతంలో భారత టెస్ట్‌ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది. 2022 బంగ్లాదేశ్ పర్యటనలో జట్టును విజయవంతంగా నడిపించడం అతని నాయకత్వ నైపుణ్యాన్ని నిరూపించింది.

    గిల్‌కు మూడో ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా రవీంద్ర జడేజా ఉంటాడు. జడ్డూ జట్టులో అత్యంత అనుభవజ్ఞుల్లో ఒకరు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించే ఆల్‌రౌండర్‌గా జడేజా ఎప్పుడూ జట్టుకు ఆధారంగా ఉంటాడు. గతంలో వైస్ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 21) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.

    అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.

    ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ చేయడానికి మొగ్గు చూపవచ్చు.

    వాతావరణ నివేదిక
    ఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది.

     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లో ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది. మంగ‌ళ‌వారం ఆర్టీసీ జేఏసీ నాయ‌కుల‌తో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిటీ జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత స‌మ్మెకు దిగింది. దీంతో ఆర్టీసీ బ‌స్సులు డిపోల‌కే ప‌రిమితం కానున్నాయి. బుధ‌వారం ఉదయం నుంచి రాష్ట్రంలో ప్ర‌జా ర‌వాణా స్తంభించనుంది. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.

    ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ..  ప్రభుత్వం కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి కనీసం 4 వారాల గడువు ప్రభుత్వం కోరిందని, దశలవారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు లోనుకాకూడదని, కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని,  దినసరి కూలీలు, సామాన్య ప్రజల ప్రయాణం దృష్టిలో పెట్టు కోవాలన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు సహకరించాలని నాగిరెడ్డి కోరారు. 

    మ‌రోవైపు స‌మ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల త‌ర్వాత ప్ర‌భుత్వం ఆర్టీసీ జేఏసీని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన త‌ర్వాత ఆర్టీసీ జేఏసీ నాయ‌కులు మీడియాతో  మాట్లాడారు. 'ప్రభుత్వానికి మా సమస్యలను వివరించాం. మా డిమాండ్లు అన్ని పాతవే.ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదు.

    ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులు ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలోనే న‌డ‌పాల‌న్న‌దే మా ప్ర‌ధాన డిమాండ్‌. కానీ కార్మిక జేఏసీ మా డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు అటు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. దీంతో అర్ధ‌రాత్రి నుంచే రాష్ట్రంలో సమ్మె కొనసాగుతుంది ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గేది లేదు' అని పేర్కొన్నారు.

    బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. ఫలితంగా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ తో పాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    అయితే.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుండటంతో ఏం జరుగుతుందన్నది? అనేది ఉత్కంఠగా మారింది.

  • హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీ నేతలతో  తెలంగాణ ప్రభుత్వం చర్చలు విఫలమయ్యాయి.  ఈరోజు(మంగళవారం) ఆర్టీసీ జేఏసీ నేతలతో మూడు గంటల పాటు జరిగిన చర్చలు విఫలయత్నంగానే ముగిశాయి. దాంతో  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిద్ధమవుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం అర్ధరాత్ని నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. 

    ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్‌కు సిద్థమైన తరుణంలో ప్రభుత్వం హుటాహుటీనా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చించింది.   ఇందులో తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సదరు కమిటీ.. ఆర్టీసీ జేఏసీకి విన్నవించింది. అయితే దీనికి ఆర్టీసీ జేఏసీ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ సమస్యలపై తక్షణమే ప్రకటన చేయాలనే డిమాండ్‌తో ఆర్జీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు.   నేటి అర్థరాత్రి వరకూ ప్రభుత్వానికి సమయం ఉందని కూడా జేఏసీ మరోసారి స్పష్టం చేసింది. 

    కాగా, ప్రధానంగా పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. అర్థరాత్రి వరకూ ఎటువంటి స్పషటత రాకపోతే ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు. ఈ సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు.

  • హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె సైరన్‌కు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ చర్చలు కొనసాగిస్తోంది. సమ్మెను విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీని అధికారుల కమిటి కోరింది. తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని సదరు కమిటీ స్పష్టం చేసింది. 

    కాగా, టీజీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జీవో నంబర్‌ 66 విడుదల చేసింది. 

    కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్),  ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడు), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఆర్థిక శాఖ - సభ్యుడు), వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్(టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్)లు ఉన్నారు. కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి. ఈ క్రమంలోనే నాలుగు వారాల సమయం ఇవ్వాలని అధికారుల కమిటీ.. ఆర్టీసీ జేఏసీని కోరుతోంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తి అయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. టూ బీహెచ్‌కే ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే, వారికి ఇచ్చిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన ఇళ్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. సంబంధిత ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

  • ఢిల్లీ: తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు కూడా ఉ‍న్నాయి.

    కొత్త సర్వీసులు బయలుదేరే సమయం, వారం, గమ్యస్థానం 

    •  17607/17608 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.

    •  17601/17602 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జులై 14 నుంచి ప్రారంభం కానుంది.

    •  17047/17048 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7  నుంచి ప్రారంభం కానుంది.

    •  17441/17442 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 14 నుంచి ప్రారంభం కానుంది.

    •  17443/17444 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది.

    •  17059/17060 నెంబరు: ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది.

    •  17067/17068 నెంబరు: ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5 నుంచి ప్రారంభం కానుంది.

    •  17079/17080 నెంబరు: ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనుంది.
       

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ పరిచయం అవసరం లేని పేరు. ఓఆర్‌ఎస్ (Oral Rehydration Solution-ORS)  పేరుతో,  హై షుగర్‌ ఉన్న ఫేక్‌ ఓఆర్‌ఎస్‌ విక్రయాలకు వ్యతిరేకంగా 8 ఏళ్లపాటు అలుపెరగని పోరు  సల్పి, వాటి అమ్మకాలను నిలిపివేయించిన వైద్యురాలిగా అందరికీ సుపరిచితం. చిన్న పిల్లల వైద్యురాలిగా వృత్తిపరమైన నిబద్ధతను, చిన్నపిల్లల ఆరోగ్యంపై తనకున్న ప్రేమను చాటుకున్న తీరు అందరి మనసులను దోచుకుంది. 

    అయితే ఈ మొత్తం వ్యవహారంపై  గుర్రుగా ఉన్న కొన్ని ప్రధానమైన ఫార్మా కంపెనీలు  ఇటీవల డాక్టర్ శివరంజని సంతోష్‌కు లీగల్ నోటీసులు ఇచ్చాయి. ఈ విషయంలో ఆమె మరోసారి ఉద్యమానికి దిగారు. కార్పొరేట్ కంపెనీల తప్పుడు మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా వైద్యులు, ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. 

    ఫార్మసీలలో eRZLను ORSLకు కొనసాగింపుగా లేదా ప్రత్యామ్నాయంగా మార్కెటింగ్ ,ప్రచారం చేస్తున్న తీరుపై డా. శివరంజని  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఆందోళనలను లేవనెత్తినిందుకు తనకు  జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ , కెన్‌వ్యూ నుండి ఒక లీగల్ నోటీసు అందిందని తెలిపారు.   ఈ నేపథ్యంలో  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సంతకాల  సేకరణ చేపట్టారు. తన ఈ పిటిషన్‌ ఎవరితోనో గొడవ పడటానికి కాదు;  ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న చర్య మాత్రమేనని స్పష్టం చేశారు.

     eRZL అనేది  ORSLకు కొత్త రూపం తప్ప మరొకటి కాదని ఇది ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు విరుద్ధమని  స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటం eRZL సురక్షితమైనదా కాదా అనే దాని గురించి మాత్రమే కాదు. ఇది ఆ ఉత్పత్తిని మార్కెట్‌లో ఎలా ప్రదర్శిస్తున్నారు, ప్రజలు దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా అన్నారామె.

    ఈ పిటిషన్  దేనికి అనేదానిపై ఆమె  వివరణ

    • ఆరోగ్య సంరక్షణ సమాచారంలో స్పష్టత

    • వినియోగదారులలో గందరగోళాన్ని నివారించడం

    • బాధ్యతాయుతమైన బ్రాండింగ్ , ప్రకటనలను నిర్ధారించడం

    • ప్రజారోగ్య సమస్యలను వైద్యులు సంకోచం లేకుండా లేవనెత్తడానికి అనుమతించడం

     

    ఆమె లేవనెత్తిన ప్రధాన అంశాలు

    • eRZL తన ప్రచారంలో ORSL పేరును ప్రస్తావించకూడదు. ఎందుకంటే ORSL అనేది అసలైన వైద్య సిఫార్సు చేయబడిన ORS కాదు.

    • eRZLను ORSL కు కొనసాగింపుగా చూపడం వల్ల, తల్లిదండ్రులు దీనిని వైద్యపరమైన ORS అని పొరబడే అవకాశం ఉంది. ఇది నియంత్రణ సంస్థల చర్యల ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తుంది.

    • ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులు ఫార్మసీలలో తెలిసిన పేర్లను చూసి త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. eRZL బ్రాండింగ్ వల్ల అది ఒక మెడికల్ సొల్యూషన్ అని వారు నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆ పాత పేరుతో ఎలాంటి సంబంధం లేకుండా దీనిని రీబ్రాండ్ చేయాలి.

    • మెడికల్ షాపుల్లో వీటి అమ్మకాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలి.

    • అలాగే వైద్యులు సిఫార్సు చేసే ORS కు, ఈ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌కు మధ్య స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలి.

    • ప్రజారోగ్యం కోసం గొంతెత్తే ఆరోగ్య నిపుణులకు రక్షణ కల్పించాలి.

    • వైద్యరంగంలో చిన్న గందరగోళం కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తుంది. సరైన సమాచారం ప్రాణాలను కాపాడుతుంది.

    • ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, పిల్లలలో 'సుక్రలోజ్' (sucralose) వంటి పదార్థాల వాడకంపై ఆందోళనలు ఉన్నాయి. అందుకే స్పష్టమైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం.


    ప్రజారోగ్యం కోసం అండగా నిలవండి. క్లిష్ట సమయాల్లో ప్రతి కుటుంబం సరైన నిర్ణయం తీసుకునేలా చూడటానికి ఈ పిటిషన్‌పై సంతకం చేయండి  దీనిని అందరికీ షేర్ చేయండి అంటూ  ఆమె ఎక్స్‌లో లింక్‌ను షేర్‌ చేశారు.

     

    ప్రజారోగ్యం కోసం సంతకం పెట్టడానికి ఇక్కడ క్లిక్ చేయండి

     

     

  • హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  టీజీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జీవో నంబర్‌ 66 విడుదల చేసింది. 

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.

    వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, టీజీఆర్టీసీ  ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది..

    • కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్

    • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడు

    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడు

    • వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్

    కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ప్రభుత్వోద్యోగుల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు దాటిన వారు బదిలీ కావడానికి అనుమతిని మంజూరు చేసింది. 

    కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల  సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ ఫైల్‌పై సీఎం రేవంత్  రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెల్లడించింది. ఇక, 2024లో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. 

  • సాక్షి, హైదరాబాద్‌: వినియోగదారులు కొనకముందే వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా వ్యాపారులు ధరలు పెంచేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి వంటనూనెల ముడిసరుకు దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల వినియోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని అంటున్నారు. వంటనూనెల వినియోగంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌దే అగ్రస్థానం. ఆ తర్వాత వేరుశనగ, ఇతర నూనెలు ఉన్నాయి. 

    రెండు వారాల క్రితం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.175–185 ఉంది. వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి 220కి ఎగబాకింది. మనదేశంలోకి థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు సంబంధించిన ముడిసరుకు దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న ఆయిల్‌ను రిఫైనరీలు శుద్ధిచేసి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. 

    రోజుకు వందల టన్నుల విక్రయం 
    నగరంలో రోజుకు వందల టన్నులకుపైగా వంటనూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటళ్లు, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధ రకాల వంటనూనెలు వినియోగిస్తుంటారు. హోల్‌సెల్‌ మార్కెట్‌ అన్ని రకాల నూనెలపై రూ.10 నుంచి రూ.15 పెరగడంతో ఇక రిటైల్, బహిరంగ మార్కెట్‌లో ప్రతీ లీటర్‌పై రూ.20 నుంచి రూ.25 పెరిగాయి.    

    ఇదీ చదవండి: 99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్‌మా సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh

  • పులివెందుల:  వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వేద పండితుల ఆశీర్వచనాలు అందాయి. పులివెందులలోని వైఎస్‌ జగన్‌ నివాసంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం వేద పండితులు.ఆశీర్వాదాలు అందించారు 

    ఈ మేరకు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అందించారు వేద పండితులు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఏప్రిల్‌ 21) వైఎస్‌ జగన్‌ పులివెందులకు వచ్చారు. 

  • తాడేపల్లి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరినవారిని వేధిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయటంపై మండిపడ్డారు. ఇదెక్కడి పరిపాలన అంటూ ట్వీట్ చేశారు వైఎస్‌ జగన్.

    ‘చంద్రబాబూ.. ఇటీవ‌ల మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.  ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్, సూప‌ర్ సెవెన్‌ అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు కూడా చెబుతున్నారు.  

    ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి, ఉద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక ప్ర‌శ్నించే గొంతుక‌ల‌పై బ్ర‌హ్మాస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారు. అంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నే క‌దా దీని అర్థం. ప్ర‌జ‌లు, ఉద్యోగుల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయంటేనే మీ ప‌రిపాల‌న బాగా లేద‌నే క‌దా అర్థం. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేద‌నే క‌దా దాని అర్థం. మ‌రి అవి ఎప్పుడు నెర‌వేరుస్తార‌ని అడ‌గ‌డం త‌ప్పా?’ అని ప్రశ్నించారు.

    తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? 
    రెండేళ్లు అవుతున్నా, మూడో బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించ‌డం నేర‌మా? అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘రూ.3.50 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా అప్పులు చేశారు.. అవేమ‌వుతున్నాయ‌ని నిల‌దీయ‌డం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా?

    మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే అత‌నిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి అత‌న్ని డిస్మిస్ చేశారంటే మీరు భ‌య‌ప‌డిపోతున్నార‌నే క‌దా? ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వ‌స్తూనే ఇస్తామ‌న్న ఐఆర్ ఇవ్వాలని అడ‌గ‌డంలో త‌ప్పేముంది? 

    అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే క‌దా? ఉద్యోగుల విష‌యంలో మీరు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మీ మోస‌పూరిత వైఖ‌రిని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు. సీఐ శంక‌ర‌య్య విష‌యంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు.  మా చిన్నాన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి గారి హ‌త్య కేసులో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబ‌ద్ధాలు చెప్పార‌ని, అది త‌న‌ను బాధించింద‌ని శంక‌ర‌య్య అంటే అత‌న్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం మీ నిరంకుశ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా?  మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నీ క‌దా అర్థం’ అని అన్నారు.

    వారి క‌డుపుకొట్టింది నువ్వు కాదా? 
    ‘ఎన్నిక‌ల ముందు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3వేల చొప్పున‌ భృతి ఇస్తామ‌ని చెప్పింది వాస్త‌వం కాదా?  ప్ర‌తి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్త‌వం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగుల‌పై క‌క్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున  మీ జీతాలు డ‌బుల్ చేస్తామ‌ని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారి క‌డుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 ల‌క్ష‌ల మందిని రోడ్డున ప‌డేసి, ఆ వ్య‌వ‌స్థే లేకుండా చేసిన అరాచ‌క‌త్వం నీదేక‌దా?  

    మీ క‌క్ష సాధింపుల‌కు, మీరు ఉద్యోగుల‌పై పెట్టే ఒత్తిడుల‌కు ఒక్క స‌చివాలయ‌ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆక‌స్మిక మ‌ర‌ణం పొందింది నిజం కాదా?  చంద్ర‌బాబూ.. సూటిగా ఒక ప్ర‌శ్న, మీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌లేదా?  బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపు ఇవ్వ‌లేదా? మ‌రి ఎందుకు అత‌న్ని డిస్మిస్  చేయ‌లేదు? అంటే మీ వాళ్ల‌కు ఒక న్యాయం, ప‌క్క వాళ్ల‌కు మ‌రో న్యాయ‌మా? చంద్ర‌బాబూ.. మీరు త‌ప్పు చేస్తున్నారు. అందుకే ప్ర‌జ‌ల‌కు, ప్ర‌శ్నించే గొంతుక‌ల‌కు, భ‌య‌ప‌డుతున్నారు’ అని వైఎస్ జగన్ ట్వీట్‌ చేశారు. 

  • కడప: మూడు రోజుల వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు చేరుకున్నారు.  వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.  నేటి నుంచి(ఏప్రిల్‌ 21వ తేదీ) మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం, ఏప్రిల్‌ 22వ తేదీ) ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేత దివంగత సుధాకర్‌రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు వైఎస్‌ జగన్‌. 

    9.45గంటలకు  సుధాకర్‌రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి తిరగుపయనమవుతారు.

  • సాక్షి, విజయవాడ: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో రికార్డులు నమోదు చేసిన ఆయన మళ్లీ భారీ అప్పు చేశారు. ఈ మంగళవారం(ఏప్రిల్‌ 21వ తేదీ)  రూ.4,600 కోట్లు అప్పు తెచ్చారు.

    గడిచిన 23 నెలల్లో మొత్తం అప్పులు రూ.3,56,655 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రూ.9,000 కోట్లు, ఈ నెల 7వ తేదీన రూ.4,400 కోట్లు అప్పు చేశారు.

    ఘోర పాలనా వైఫల్యంతో అప్పుల రికార్డు నెలకొల్పిన చంద్రబాబు రూ.1,98,564 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ కింద రూ.1,10,704 కోట్లు, రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు చేశారు.

    ఇలా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు రికార్డులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలో 60 నెలల్లో రూ.3,32,000 కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు కేవలం 23 నెలల్లోనే రూ.3,56,655 కోట్ల అప్పులు చేయడం గమనార్హం.

  • విజయవాడ:  అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో ప్రభుత్వం నిర్బంధ భూసేకరణ చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కొంతమంది గొంతెమ్మ కోర్కెల కోసం ఇంతమంది రైతుల పొట్ట కొట్టడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు(మంగళవారం, ఏప్రిల్‌ 21వ తేదీ), అమరావతి రింగ్‌ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐదు జిల్లాలకు చెందిన రైతులతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. 

    దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నగరాలకు లేని ఔటర్‌ రింగ్‌ రోడ్డు అమరావతిలో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని సూచించారు. 

    ‘భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. అమరావతి 29 గ్రామాల్లో జనాభా ఎంత?, ఈ 12 ఏళ్లలో ఎంత జనాభా పెరిగింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోనే లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ అవసరమా?, ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎవరిని సంప్రదించారు.. అసలు ఎవరికి చెప్పారు?, కనీస ఆలోచన లేకుండా రూ. 24,700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, మొక్కజొన్న కొనమంటే మంత్రి అచ్చెన్నాయుడు డబ్బుల్లేవన్నాడు.  

    189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా చంద్రబాబు. మీ హెరిటేజ్ కంపెనీ విస్తరణ అనుకున్నారా చంద్రబాబు. రైతులు... రైతుల భూములు మీకు చీమలు...దోమలు మాదిరి కనిపిస్తున్నాయా?, విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా కొత్తగా రింగ్ రోడ్డు అవసరమా?, జాతీయ రహదారులకు 70 మీటర్లు చాలని కేంద్రం చెబుతోంది. కానీ ప్రభుత్వం 140 నుంచి 250 మీటర్లు తీసుకోవాలని చూస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పై పోరాటం చేయాల్సిందే’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోందంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

    ‘‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏని అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకపడి పోయింది.

    ..ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వలనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

    MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

Business

  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచిన యాపిల్ కంపెనీ ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. 2026 సెప్టెంబర్‌లో ప్రస్తుత సీఈఓ 'టిమ్ కుక్' తన పదవి నుంచి వైదొలగి.. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

    టిమ్ కుక్ 1998లో యాపిల్‌లో చేరి.. కంపెనీ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎదిగారు. స్టీవ్ జాబ్స్ ఆరోగ్య కారణాల వల్ల తప్పుకున్న తర్వాత, 2011లో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.

    టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఐఫోన్ తయారీకి అవసరమైన ఉత్పత్తి కేంద్రాలను చైనాలో విస్తరించడం ద్వారా గ్లోబల్ సరఫరా వ్యవస్థను బలపరిచారు. ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం యాపిల్ విజయానికి ప్రధాన కారణమైంది.

    టిమ్ కుక్ సంపద - ఆదాయం
    టిమ్ కుక్ సంపద సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.27 వేలకోట్లు) ఉంటుందని అంచనా. కాగా ఈయన వద్ద యాపిల్ కంపెనీ షేర్లు 3 మిలియన్లకు పైగా ఉన్నాయి.

    ప్రారంభంలో సీఈఓగా టిమ్ కుక్ జీతం 9,00,000 డాలర్లుగా ఉండేది. తర్వాత ఇది 3 మిలియన్ డాలర్ల బేస్ సాలరీగా స్థిరపడింది. అయితే ఆయన మొత్తం ఆదాయం స్టాక్ అవార్డులు, బోనస్‌ల ద్వారా భారీగా పెరిగింది. 2022లో ఆయన మొత్తం ఆదాయం సుమారు 99.4 మిలియన్ డాలర్లకు చేరింది. 2023లో షేర్‌హోల్డర్ల అభిప్రాయాలను గౌరవిస్తూ తన వేతనాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. కానీ కంపెనీ పనితీరు, స్టాక్ పెరుగుదల కారణంగా 2024లో మళ్లీ ఆయన ఆదాయం సుమారు 74.6 మిలియన్ డాలర్లకు పెరిగింది.

    ఆపిల్ వృద్ధిలో టిమ్ కుక్ పాత్ర
    టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 416 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం సాధించింది. ఐఫోన్, మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. దీన్నిబట్టి చూస్తే కుక్ సారథ్యంలో కంపెనీ ఎంతగా ఎదిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    ఇదీ చదవండి: '2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': రాబర్ట్ కియోసాకి

  • భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో ఎక్కువగా ఆసియా దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నట్లు ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇప్పటి యువత, ముఖ్యంగా Gen Z తరం, కొరియన్ డ్రామాలు, జపనీస్ సంస్కృతి, ఆసియన్ స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఆసియా టూరిజం మీద ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.

    ఎయిర్‌బీఎన్‌బీ గణాంకాల ప్రకారం.. ఈ వేసవిలో 40 శాతం కంటే ఎక్కువ జెన్ జీ వర్గానికి చెందిన వారు ఆసియా దేశాలకు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు కేవలం కేవలం విశ్రాంతి కోసం కాకుండా అనుభవాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత కచేరీలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన అనుభవాలు వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

    జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓసాకా, టోక్యో, బుసాన్ వంటి నగరాల్లో సెర్చ్‌లు గణనీయంగా పెరిగాయి. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా తమ సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు, పరిచయంతో కూడిన వాతావరణం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి.

    ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే అనుభవంగా మారుతోంది. దాదాపు 60 శాతం మంది గ్రూప్ లేదా ఫ్యామిలీ ట్రావెల్‌ చేసినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. దేశీయంగా కూడా కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. ప్రజలు సాధారణంగా వెళ్లే ప్రదేశాలకంటే భిన్నమైన, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కలిగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తిరువనంతపురం, పూరి, జైపూర్, మేఘాలయ వంటి ప్రదేశాలు ఉన్నాయి.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.

    కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.

    ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.

    కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులు
    బంగారం (Gold)
    వెండి (Silver)
    చమురు (Oil)
    ఆహారం (Food)
    బిట్‌కాయిన్ (Bitcoin)
    ఈథీరియం (Ethereum)

    కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.

    బంగారం, వెండి
    బంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.

    క్రిప్టో కరెన్సీ
    కియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.

    చమురు, ఆహారం
    చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.

    కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.

    ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!

  • లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు.

    డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఆ దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ‘తెలంగాణ - నార్వే’ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించింది.

    రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆఫ్‌షోర్ విండ్, క్లైమేట్ ఇన్నోవేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో ‘నార్వే’ గ్లోబల్ లీడర్ గా కొనసాగుతోందని కొనియాడారు.

    ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసే పని చేసేందుకు గల అవకాశాలపై ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ - నార్వే వర్కింగ్ గ్రూప్’ను ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.

    ‘తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా అడుగు ముందుకేస్తాం. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం’ అని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు.

  • మన రోడ్లపై ఇక హ్యుందాయ్‌–టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ ఆటోలు పరుగులు తీయనున్నాయి. దేశంలో చివరి గమ్యస్థాన రవాణా (లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ) అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ–త్రీవీలర్‌ విభాగంలో హ్యుందాయ్‌ మోటార్, టీవీఎస్‌ మోటార్‌ సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి.

    దీని ప్రకారం ఉత్పత్తి రూపకల్పన, సాంకేతికాభివృద్ధిలను హ్యుందాయ్‌ అందించనుంది.  టీవీఎస్‌ తన ఎలక్ట్రిక్‌ ప్లాట్‌ఫారమ్, తయారీ సామర్థ్యం, మార్కెట్‌ నైపుణ్యంతో భాగస్వామ్యం కానుంది. అలాగే దేశీయ తయారీ, డిస్ట్రిబ్యూషన్, విక్రయాలను టీవీఎస్‌ నిర్వహించనుంది. ‘భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో–2025’లో ఈ–త్రీ వీలర్‌ కాన్సెప్ట్‌ విజయవంతంగా ప్రదర్శన అనంతరం ఇరు సంస్థలు ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి.  

    ఈ సందర్భంగా హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ కార్పొరేట్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జూన్సన్‌ కో మాట్లాడుతూ, భారతదేశం తమకు కీలక మార్కెట్‌గా ఉన్నందున రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావడం లక్ష్యమని తెలిపారు.

    ఇదీ చదవండి: పోర్స్చే కారుపై సిమెంట్ కలిపిన వ్యాపారవేత్త: వీడియో

  • బెంగళూరులో జరిగిన ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వ్యాపారవేత్త అఖిల్ హేమాద్రి రోడ్డుపై గుంతను పూడ్చడానికి చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

    వీడియోలో గమనించినట్లయితే.. కోట్ల రూపాయల విలువైన పోర్షే (Porsche) కారులో అఖిల్ హేమాద్రి అక్కడికు వచ్చి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చడానికి సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రిని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించిన విషయం ఏమిటంటే.. సిమెంట్ మిశ్రమాన్ని కారు బానెట్ మీద కలిపాడు. ఖరీదైన కారుపై ఇలా చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ ఆయన తన కారుపై రక్షణ పొర (PPF) ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగదని చూపించడానికి ఈ విధానం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    సిమెంట్ మిశ్రమం కలిపిన తరువాత గుంతను పూడ్చేస్తాడు. చివరగా బానెట్‌పై ఉన్న షీట్‌ను తొలగిస్తారు. దీంతో కారుకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా కార్ల రక్షణ కోసం ఉపయోగించే పీపీఎఫ్ బలాన్ని చూపించడమే ఈ వీడియో ఉద్దేశ్యం అయినప్పటికీ.. ఈ చర్య ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారని పేర్కొన్నారు.

    వీడియో షేర్ చేసిన హెచ్1 కార్ డీటైలింగ్.. ''మన పరిసరాలను పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మనం ప్రతిదానికీ ఎల్లప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడకూడదు. మన దేశంలో జనాభా చాలా ఎక్కువ, కేవలం ప్రభుత్వ ప్రయత్నాలతో మాత్రమే మార్పు రాదు. మనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది'' అని వెల్లడించింది.

  • మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.

    శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్‌స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.

    ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    భారీ పెట్టుబడులు
    టెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్‌ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.

    తయారీ రంగంలో టెస్లా
    టెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

    ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం
    పీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్‌మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.

    ఆపరేషన్స్, రిటైల్
    ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.

    ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

Crime

  • బెంగళూరు: టెలికాం స్టోర్‌లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.  

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.

    ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27).  కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్‌లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్‌ను పిలిచింది. 

    ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్‌ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది. 

    కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు.

International

  • వాషింగ్టన్‌ డీసీ: ఇరాన్‌ను ఇన్నాళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం మాత్రం ఆ దేశాన్ని ఓ కోరిక కోరారు. ఇరాన్ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.

    ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య చర్చలకు గొప్ప ఆరంభం అవుతుందని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన చర్చలు అనిశ్చితిలో ఉన్న సమయంలో.. సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్‌ చాలా కూల్‌గా విజ్ఞప్తి చేస్తూ ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

    ‘నా ప్రతినిధులతో త్వరలో చర్చల్లో పాల్గొనబోయే ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఈ మహిళలను విడుదల చేస్తే నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తాను. మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ మహిళలు గౌరవంగా భావిస్తారు, దానికి విలువ ఇస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి వారికి ఎలాంటి హాని చేయవద్దు. ఇది మా చర్చలకు గొప్ప ఆరంభం అవుతుంది. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

    కాగా, ఎక్స్‌లో ఒకరు ఆ ఎనిమిది మంది మహిళల ఫొటోలను పోస్ట్‌ చేశారు. ‘ఈ ఎనిమిది మంది మహిళలను ఉరితీయాలని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్జాతీయ సమాజం నుంచి, మానవ హక్కుల సంస్థలవారిమని చెప్పుకునే వారి నుంచి దీనిపై ఒక్క మాట కూడా రావడం లేదు’ అని అన్నారు. ఈ పోస్టుపైనే ట్రంప్‌ స్పందించారు.

    కాగా, ఇరాన్‌-అమెరికా మధ్య రెండో దశ చర్చలు ఇప్పటికే జరగాల్సి ఉండగా పాకిస్థాన్‌కు ఇరాన్‌ రాకపోవడంతో జరగలేదు. అసలు రెండో దశ చర్చలు జరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇరాన్‌-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం రాత్రిలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ యుద్ధం జరుగుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి.

  • చికెన్‌ వంటకాలంటే  ఇష్టపడే వారికి ఇంట్రస్టింగ్‌ న్యూస్‌. ప్రముఖ ఫుడ్‌ అండ్‌ గైడ్  టేస్ట్‌ అట్లాస్ ప్రపంచంలోని టాప్ 100 చికెన్ వంటకాల ఏప్రిల్ 2026 ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. భారతదేశానికి చెందిన క్రీమీ  అండ్‌ టాంగీ చికెన్ గ్రేవీ వంటకం  బటర్ చికెన్, ఈ ప్రపంచ జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది.

    ఈ  ఏడాది ర్యాంకింగ్స్‌లో, కొరియన్ ఫ్రైడ్ చికెన్‌  ‘చికిన్‌’అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఫిలిప్పీన్స్ ఇనాసల్ చికెన్‌కు మూడవ స్థానం  దక్కింది. వెనిగర్, మసాలాలు , అన్నాటో నూనెల యొక్క ప్రత్యేకమైన మిశ్రమం దీనికి  చక్కటి రంగులు, విలక్షణమైన రుచిని ఇస్తుంది.గత కొన్నేళ్లుగా యూఎస్, యూకే ఇతర దేశాలలో అపారమైన ప్రజాదరణ పొందిన, ఐకానిక్  బటర్‌ చికెన్‌  గత  ఏడాది నవంబరులో జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.


    టేస్ట్ అట్లాస్ ప్రకటించిన టాప్ 10 చికెన్ వంటకాలు 
    చికిన్ (కొరియన్ ఫ్రైడ్ చికెన్) - సౌత్ కొరియా
     పోలో ఎ లా బ్రసా (పెరూవియన్ రోస్ట్ చికెన్) - పెరూ
    ఇనాసల్ నా మనోక్ - ఫిలిప్పీన్స్
     పిలిక్ తోప్కపి - టర్కీ
    ముర్గ్ కరాహీ (చికెన్ కరాహీ) - పాకిస్థాన్
    ముర్గ్ మఖానీ (బటర్ చికెన్) - ఢిల్లీ, ఇండియా
    రఫిస్సా - మొరాకో
     కరాగే - జపాన్
    పౌలెట్ రోటీ (ఫ్రెంచ్ రోస్ట్ చికెన్) - ఫ్రాన్స్
    సిట్సిలా టబాకా (చికెన్ టబాకా) - జార్జియా

    కొరియన్ ఫ్రైడ్ చికెన్ ప్రత్యేకత ఏమిటి?
    కొరియన్ ఫ్రైడ్ చికెన్  ముఖ్య లక్షణాలలో ఒకటి డబుల్-ఫ్రైయింగ్ పద్ధతి. ముందుగా చికెన్‌ను తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు, దీనివల్ల మాంసం  అంతా సమానంగా ఉడుకుతుంది. ఆ తర్వాత దానిని మళ్లీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు, దీని ఫలితంగా దానికి ప్రత్యేకమైన లేత, క్రిస్పీ , కరకరలాడే పైపొర వస్తుంది. కొరియన్ ఫ్రైడ్ చికెన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టే  విషయం ఏమిటంటే.. దానికి జోడించే  అనేక రకాల సాస్‌లు , మసాలాలు. కారానికి పాపులర్‌అయిన గోచుజాంగ్, సోయా గార్లిక్, హనీ బటర్,తీపి-పులుపు కలగలిసిన గ్లేజ్‌లు ఉన్నాయి. వంటకాన్ని బట్టి, ఫ్రైడ్ చికెన్‌ను ఈ సాస్‌లలో ముంచి తినవచ్చు లేదా పైన సాస్‌తో కూడా  వడ్డించవచ్చు.

    కొరియన్ ఫ్రైడ్ చికెన్‌ను సాధారణంగా ఊరగాయ ముల్లంగి, కోల్‌స్లా లేదా చల్లని పుచ్చకాయ ముక్కల వంటి వాటితో కలిపి వడ్డిస్తారు. దీనిని ఎక్కువగా బీరుతో ఆస్వాదిస్తారు. దీనికి 'చిమాక్' అనే ప్రత్యేక పేరు కూడా ఉంది. 

  • వాషింగ్టన్‌ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. హర్మూజ్‌ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు. 

    ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్‌పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్‌ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ‌లో ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు. 

    అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ  ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.

    మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

     

  • అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. చర్చలకు అమెరికా సిద్ధంగానే ఉన్నా.. ఇరాన్‌ ముందుకు రాకపోవడంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. యుద్ధం గనుక మళ్లీ మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా కూడా తగ్గబోమని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఇరాన్‌ కూడా అంటోంది. అయితే..

    చర్చల విషయంలో సానుకూలంగానే ఉన్నా ఇరాన్‌ బెట్టు చేయడం సరికాదని అమెరికా అంటోంది. కొత్త ఒప్పందం అమలు అయితే అన్నీ సర్దుకుంటాయని.. ఆ ఒప్పందం ఓ కొలిక్కి రావాలంటే ఇరాన్‌ చర్చలకు దిగి రావాల్సిందేనని.. అప్పుడే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో ఇరాన్‌ చర్చలకు వచ్చినా తుది ఒప్పందం కుదురుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఆ ‘ఒక్క’ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేకపోవడమే ఇందుకు కారణంగా చూపిస్తున్నారు. 

    శుద్ధి యురేనియం.. సాధారణంగా యురేనియం శుద్ధి 3–5 శాతం వరకు చేస్తే అది విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఇరాన్‌ ఏకంగా 20 శాతం పైగా శుద్ధి చేస్తోందని(60 శాతం దాకా చేసిందని కూడా!).. ఇది అణు ఆయుధాల తయారీకి దగ్గర స్థాయిలో ఉందని అమెరికా ఆరోపణ. ఇరాన్‌ మాత్రం ఇదంతా వైద్య పరిశోధన, అణు శక్తి ఉత్పత్తి కోసం మాత్రమే అని చెబుతోంది.

    2015లో కుదిరిన Joint Comprehensive Plan of Action (JCPOA) ప్రకారం.. ఇరాన్‌ యురేనియం శుద్ధి 3.67% వరకు మాత్రమే పరిమితం చేయాలి. అలా చేస్తే ఇరాన్‌ మీద ఆర్థిక ఆంక్షలను తొలగిస్తామని అమెరికా పేర్కొంది. అయితే.. 2018లో ట్రంప్‌ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం  తప్పుకుంది. తమ దేశ జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ డీల్‌ కాపాడలేదని.. పైగా ఇరాన్‌కు ఆర్థిక లాభాలు కట్టబెట్టిందని ఆయన ఆ టైంలో ఆరోపించారు. ఒప్పందం తొలగిపోవడంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అయితే..

    అదే విషయమై.. అదే ట్రంప్‌ ఇప్పుడు కొత్త డీల్‌ కుదుర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం మిడిల్‌ ఈస్ట్‌ భద్రతకు కీలకమని అంటున్నారాయన. యుద్ధం కన్నా ఒప్పందం మంచిదని పదేపదే పాట పాడుతున్నారు. ఇరాన్‌కు మరో దారి లేదని హెచ్చస్తూనే.. అవసరమైన సడలింపులు కూడా ఇచ్చేందుకు రెడీ అంటూ బుజ్జగిస్తున్నారు. అవసరమైతే.. డీల్‌ కుదుర్చుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటున్నారు. అయితే.. ఇక్కడ ప్రధాన సమస్య యురేనియం శుద్ధి (uranium enrichment) కాలపరిమితి విషయంలోనే కనిపిస్తోంది.

    ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం(20 ఏళ్లపాటు) నిలిపివేయడానికి అంగీకరించిందని, ఇది కొత్త ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్‌ చెబుతున్నారు. అయితే, అమెరికా ఏ రకమైన సడలింపులు ఇవ్వగలదో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇరాన్ మాత్రం చాలా తక్కువ కాలం (5–7 సంవత్సరాలు) మాత్రమే అంగీకరించేందుకు సిద్ధంగా ఉంది. తమకు ఇచ్చే సడలింపులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. అలాగే ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలని షరతు పెడుతోంది. ఇక్కడే చర్చలు ముందుకు సాగడం లేదు.


    అమెరికా ఏం కోరుకుంటోంది

    • యురేనియం శుద్ధి, అణు ఆయుధాల అభివృద్ధి పూర్తిగా ఆపడం.

    • బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై నియంత్రణ.

    • లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గించడం.

    • దేశీయ నిరసనలపై కఠిన చర్యలు తగ్గించడం.


    ఇరాన్‌ ఏం ఆశిస్తోందంటే..

    • ఆంక్షలు ముందుగా ఎత్తివేయాలి. అమెరికా ఆర్థిక ఆంక్షలు తగ్గించకపోతే, అణు కార్యక్రమంపై పెద్ద సడలింపులు ఇవ్వలేమని ఇరాన్‌ అంటోంది.
    • అణు శుద్ధి అవసరం కూడా.  అణు శక్తి ఉత్పత్తి కోసం అవసరమని వాదిస్తోంది.
    • తక్కువకాల పరిమితి మాత్రమే: అమెరికా కోరుతున్న 20 సంవత్సరాలపాటు అణు కార్యక్రమం నిలిపివేయడం సాధ్యం కాదని, గరిష్టంగా 5–7 సంవత్సరాలు మాత్రమే అంగీకరించగలమని చెబుతోంది.
    • ప్రాంతీయ ప్రభావం తగ్గించలేం. లెబనాన్, సిరియా, యెమెన్‌లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం తమ భద్రతా వ్యూహంలో భాగమని ఇరాన్‌ అంటోంది.
    • దేశీయ విధానాల్లో జోక్యం వద్దు. నిరసనలపై చర్యలు తమ అంతర్గత వ్యవహారమని, అమెరికా లేదంటే ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం అంగీకరించలేమని చెబుతోంది.
    • సమాన ఒప్పందం కావాలి: అమెరికా మాత్రమే లాభపడే ఒప్పందం కాకుండా, ఇరాన్‌కు కూడా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కలిగేలా ఉండాలని కోరుతోంది.

    సాధ్యమైన సడలింపులు  

    • ఆర్థిక ఆంక్షల సడలింపు: చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తగ్గించడం లేదా ఎత్తివేయడం.

    • వాణిజ్య అవకాశాలు: అంతర్జాతీయ మార్కెట్లలో ఇరాన్‌కు తిరిగి ప్రవేశం కల్పించడం.

    • మానవతా మినహాయింపులు: ఔషధాలు, ఆహారం వంటి అవసరమైన వస్తువులపై ఆంక్షలు తగ్గించడం.

    • సైనిక ఒత్తిడి తగ్గింపు: ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు మద్దతు తగ్గిస్తే.. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించడం.

    ఒప్పందం కుదిరితే

    1. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గవచ్చు: మధ్యప్రాచ్యంలో యుద్ధం అవకాశాలు తగ్గి, స్థిరత్వం పెరుగుతుంది.
    2. ఆర్థిక లాభం: ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు సడలితే, చమురు ఎగుమతులు పెరుగుతాయి.
    3. చమురు మార్కెట్‌పై ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
    4. రాజకీయ సంబంధాలు మెరుగుపడవచ్చు. అమెరికా–ఇరాన్ సంబంధాలు సానుకూల దిశలో కదిలి, ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపవచ్చు.


    ఒప్పందం కుదరకుంటే

    1. ఉద్రిక్తతలు పెరుగుతాయి: మిడిల్‌ ఈస్ట్‌లో మళ్లీ ఘర్షణలు.. సైనిక చర్యలు పెరిగే అవకాశం
    2. ఆంక్షలు కొనసాగుతాయి: ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.
    3. చమురు ధరలు పెరిగే అవకాశం: సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి.
    4. ప్రాంతీయ అస్థిరత: లెబనాన్, సిరియా, యెమెన్ వంటి ప్రాంతాల్లో మిలిటెంట్ గ్రూపులకు మద్దతు పెరిగి.. ఘర్షణలు మరింత తీవ్రమవుతాయి.
    5. చర్చలు విఫలమైతే.. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరింత దూరమవుతాయి. 


    రెండువారాల యుద్ధ విరమణ బుధవారంతో(భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి దాటాక) ముగియనుంది. అంటే.. ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. చర్చల్లో ఏదో ఒక పురోగతి కనిపిస్తేనే.. అది పొడిగింపు ఉండొచ్చు. అంటే.. ఈ చర్చలు మిడిల్‌ ఈస్ట్‌ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • ఇటీవల యుఎస్‌ సుప్రీంకోర్టు ట్రంప్‌కు భారీ ఝలక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ వస్తువులపై ట్రంప్ వేసిన అధిక పన్నులు చెల్లవని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రీఫండ్‌ పాసెస్‌ మెుదలుపెట్టింది. దీంతో భారత్‌కు 10 నుంచి 12 బిలియన్ డాలర్లు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

    అధిక పన్నుల పేరుతో ప్రపంచ దేశాలని హడలెత్తించిన ట్రంప్‌నకు.. అక్కడి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. దిగుమతులపై పన్నులు వేసే అధికారం అమెరికా అధ్యక్షుడికి గానీ వైట్‌హౌస్‌కు గానీ లేవని తేల్చిచెప్పింది. అంతేకాకుండా అంతవరకూ వేసిన సుంకాలు దిగుమతిదారులకు చెల్లించాల్సి కూడా రావచ్చని పేర్కొంది. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో అమెరికా ఆ అధిక పన్నులను తిరిగి చెల్లించడం ప్రారంభించింది..

    అమెరికా కస్టమ్స్ విభాగం టారిఫ్‌ల ద్వారా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించింది. మెుత్తంగా అమెరికా 166 బిలియన్‌ డాలర్లు భారత కరెన్సీలో సూమారుగా  ₹13,86,100 కోట్లు తిరిగి  చెల్లించడానికి అంగీకరించింది. అయితే ఈ మెుత్తంలో భారత్‌కు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు భారత్‌కు సంబంధించిన దిగుమతులపై వసూలైనవిగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక వెల్లడించింది. దీంతో ఆ మెుత్తం భారత్‌కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్ రంగాల్లో ఈ రిఫండ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

    అయితే  ఈ మొత్తాన్ని నేరుగా భారత కంపెనీలు పొందలేవు. అమెరికాలో వస్తువులు దిగుమతి చేసిన కంపెనీలకే రిఫండ్ దరఖాస్తు చేసే హక్కు ఉంటుంది. దీంతో భారత ఎగుమతిదారులు తమ అమెరికా భాగస్వాములతో చర్చలు జరిపి రిఫండ్‌లో వాటా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వేలాది కంపెనీలు రిఫండ్ కోసం నమోదు చేసుకున్నాయి. ఈ ప్రక్రియ ద్వారా 60 నుంచి 90 రోజుల్లో చెల్లింపులు పూర్తయ్యే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

  • ఇరాన్‌ అమెరికా మధ్య చర్చల విషయంలో ప్రస్తుతం తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. ఇరాన్‌ చర్చలకు ససేమిరా అనడంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో జరిగే రెండో విడత చర్చలకు ట్రంప్ స్వయంగా పాల్గొనే అవకాశం ఉందని రాయిటర్స్‌ కథనం పేర్కొంది.

    ఇటీవల పాకిస్థాన్‌ ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. అయితే ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరకపోవడంతో ఎటువంటి ఒప్పందం లేకుండానే భేటీ ముగిసింది. అయితే మరో దఫా చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తుండగా ఇరాన్‌ మాత్రం అంగీకరించట్లేదు. యుఎస్‌ఏ పెట్టే డిమాండ్లకు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది.

    ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జరిగే శాంతి చర్చలకు ట్రంప్ నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్‌తో రాయబారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కీలక సమాచారం అందుతుంది. ఇరాన్ సైతం తొలుత చర్చలు జరపమని పట్టుబట్టినప్పటికీ ప్రస్తుతం సానూకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ నేరుగా హాజరైతే చర్చల అంశం ఆశాజనకంగా  ముగిసే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.    

    చర్చలు విఫలానికి కారణం

    ట్రంప్..  ప్రధానంగా ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని, హర్ముజ్‌ దిగ్భందనం తొలగించాలని కోరుతున్నారు. అయితే దీనికి ఇరాన్‌ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని, ఇరాన్‌ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని విదేశాల్లో ఫ్రీజ్‌ చేసిన ఇరాన్‌ డబ్బులు చెల్లించాలని కోరుతుంది. ఈ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది.

    సెక్యూరిటీ నీడలో ఇస్లామాబాద్

    చర్చల జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం ప్రస్తుతం సెక్యూరిటీ నీడలో ఉన్నట్లు తెలుస్తోంది. చర్చల కోసం పాకిస్థాన్ సుమారు 20,000 మంది భద్రతా సిబ్బందిని ఇస్లామాబాద్‌లో మోహరించింది. తొలిదశ చర్చల సమయంలో సైతం ఇరాన్ అమెరికా ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

  • ప్రస్తుతం హర్ముజ్‌ విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. అమెరికా, ఇరాన్ రెండు దేశాలు పట్టు వదలకుండా భీష్మించుకొని కూర్చువడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారు. హర్ముజ్‌ జలసంధిలో రవాణాను పునరుద్ధరించాలని ఇరు దేశాలు యుద్ధాన్ని వీడి శాంతి బాట పట్టాలని హితవు పలికారు.

    ప్రస్తుతం యుద్ధం విషయంలో చైనాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూఎస్‌ఏ నిఘా ఏజెన్సీలు ఇరాన్‌కు చైనా ఆయుధాల తరలింపు చేస్తోందని సమాచారం అందించాయి. వాటిలోనూ మ్యాన్‌పాడ్‌ (భుజంపై మోసుకెళ్లగలిగే ఆయుధాలు) తరలింపు చేపడుతుందని వీటితోనే అమెరికా క్షిపణులపై ఇరాన్‌ దాడి చేయగలిగిందని పేర్కొన్నాయి. అయితే దీనిని చైనా ఖండించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా హర్ముజ్‌ విషయంలో స్పందించారు.

    ఈ మేరకు సౌదీ యువరాజు  మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి కోసం వివాదాలను, రాజకీయ మరియు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తక్షణమే సమగ్ర కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్ కోరినట్లు బీజింగ్‌ కథనాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అంతర్జాతీయ సమాజంతో పాటు ఎంతో ప్రయోజనకరమని కోరినట్లు తెలుస్తోంది.

    ఈనేపథ్యంలో జిన్‌పింగ్‌ మధ్యప్రాచ్య కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని జిన్‌పింగ్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో పరోక్షంగా భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే సూచించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు స్పందించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును (LNG) దిగుమతి చేసుకునే చైనాకు ఈ జలసంధి అత్యంత కీలకం.

    హర్ముజ్‌ చైనాకు కీలకం

    అయితే ప్రపంచంలోనే చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. తన చమురుఅవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతులు ద్వారానే సమకూర్చుకుంటుంది. దిగుమతుల్లో రష్యా తొలిస్థానంలో ఉండగా తదుపరి సౌదీ అరేబియా ఉంది. అయితే యుద్ధం కారణంగా  మార్చి నెలలో ఆ ప్రాంతానికి చైనా ఎగుమతులు 43 శాతం పడిపోయాయని కథనాలు పేర్కొన్నాయి.
     

Politics

  • కాకినాడ:  జనసేన నాయకులకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు వర్మ. ‘ వెనుక నుండి టీడీపీ గిల్లితే  ఎవరు ఊరుకుంటారు. టీడీపీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు. టీడీపీ బలంగా ఉంది కనుకే పవన్‌కు 70 వేల మెజార్టీ ఇచ్చాం. టీడీపీ బలహీనంగా లేదు.. రేపటి నుండి తామేంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు వర్మ.

    కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోజనసేన, టీడీపీల మధ్య చిచ్చు రాజుకుంది. ఫ్లెక్సీ గొడవతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచా‍ర్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మని జనసేన నేత పెండెం దొరబాబు దాదాపు కొట్టినంత పని చేశారు. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేదు. పవన్‌ కల్యాణ్‌ ఫొటో మాత్రం హైలైట్‌ అయ్యింది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేని అక్కడున్న నేతల్ని నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత తుమ్మలబాబు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరు నేతల మధ్య మాటామాటా పెరిగింది.   అక్కడే ఉన్న పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. వర్మపైకి దూసుకొస్తూ దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. అది గమనించిన తోటి నేతలు ఆయన్ని నిలవరించారు. ఈలోపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

    దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ.. తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్‌ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ జనసేన నాయకుల్ని తీవ్రంగా హెచ్చరించారు. 

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్‌ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్‌ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల‍్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.

    రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.

    తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులు
    నందిగ్రామ్‌లో సువేందు అధికారి vs పబిత్ర కర్
    బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్‌లో ఏప్రిల్ 29న పోలింగ్‌ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.
    ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.

    బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రా
    అధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.

    ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీ
    అగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

    ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్
    దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్‌పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.

    మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్లు బర్మన్
    కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.

    డోంకల్‌లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్
    మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.

    పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్
    ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్‌ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.

    కరీంనగర్‌లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్‌- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.

    రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..
    ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.

    జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్  నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.

    తేజస్వీ సూర్య కామెంట్స్‌పై.. 
    తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Guest Columns

  • ‘అద్రక్‌ కే పంజే’ నాటకానికి అన్నీ తానే అయి దేశదేశాల్లో ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందిన బబ్బన్‌ ఖాన్‌ హైదరాబాద్‌లో ఈ నెల 17న కన్నుమూశారు. 1980–90 కాలంలో ‘దక్కన్‌ క్రానికల్‌’లో సినిమా ప్రకటనలతో పాటు ‘అద్రక్‌ కే పంజే’ ప్రదర్శన సమాచారం వచ్చేది. రవీంద్ర భారతిలో నెల రోజుల పాటు రోజుకు రెండు షోలు ఉంటాయనీ, షో వేళలు, టికెట్ల రేట్లు, తదితర వివరాలు ఆ ప్రకటనలో ఉండేవి. 60 దేశాల్లో 14 భాషల్లో 10 వేలకు పైగా ఈ నాటక ప్రదర్శనలు కొనసాగాయి.

    అంతగా ఈ నాటకం ప్రజాదరణ పొందడానికి కారణం సమకాలీన సామాజిక అంశాలపై బబ్బన్‌ పేల్చే వ్యంగ్య సంభాషణలే. ముందస్తు స్క్రిప్ట్‌ లేకుండా ఏ రోజుకారోజు కొత్త విషయాలను చేర్చుకుంటూ ప్రేక్షకులను అలరించడమే దీని ప్రత్యేకత. అల్లపు కొమ్ములు అడ్డదిడ్డంగా పెరగడాన్ని నేటి సమాజపు పోకడకు అన్వయించేలా నాటకానికి ఆ పేరు పెట్టారు. బ్యాంక్‌ క్లర్క్ కుటుంబ నేపథ్యంలో సాగే ఈ నాటకంలో బబ్బన్‌ ప్రధాన పాత్రధారి. భార్య, పిల్లలు, ఇంటికి వచ్చిపోయేవాళ్ల పాత్రలను ఆయన కుటుంబ సభ్యులే వేసేవారు. ఇంటి కిరాయి, పాల బిల్లు,  పిల్లల ఫీజులు, కిరాణా వస్తువులకు ఆదాయం సరిపోక పడే ఇబ్బందులే ప్రధాన అంశాలు.

    హైదరాబాద్‌లో 1943లో జన్మించిన బబ్బన్‌ ఖాన్‌ (Babban Khan) బాల్యం నుండే పేదరికాన్ని అనుభవించాడు. ఆయన కన్నా ముందు పుట్టిన పిల్లలు పౌష్టికా హార లోపంతో చనిపోయారు. ఇతను కూడా బతుకుతాడనే నమ్మకం లేక ఆయనకు పేరు పెట్టలేదు. ముద్దుగా బబ్బన్‌ అని పిలుచుకొనేవారు. పదేళ్లు బతికాక అదే పేరు ఖాయం అయింది. ఆరేళ్లకే తండ్రిని కోల్పోయిన బబ్బన్‌ ఇంట్లో కరెంటు లేనందువల్ల వీధి దీపం కింద కూచొని 22వ ఏట ఈ నాటకాన్ని మూడు గంటల వ్యవధిలో రాశాడు.

    చ‌ద‌వండి: 'మూసీ న‌ది బాగుప‌డాలంటే చేయాల్సింది ఇది'

    తల్లి మెడలో ఉన్న ఒకే ఒక బంగారు నగని అమ్మేసి, వచ్చిన సొమ్ముతో తొలి ప్రదర్శనను 1965లో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. పేదరికంలో పుట్టిన బబ్బన్‌ను ఈ నాటక విజయం బంగళాలు, ఖరీదైన కార్లు కొనే స్థాయికి తీసికెళ్ళింది. 1984లోనే అయిదు వేలకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకొని గిన్నిస్‌ బుక్‌లో చేరింది. మార్గరెట్‌ థాచర్, నెల్సన్‌ మండేలా, ఇందిరా గాంధీ వంటి ప్రముఖులు దీన్ని తిలకించారు. బబ్బన్‌ ఖాన్‌ ఒక్కరే చేయగల నాటకం అద్రక్‌ కే పంజే!

    – బద్రి నర్సన్‌ 
    కవి–కథకుడు 

National

  • గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఒక  పెళ్లి వేడుక  దుమారాన్ని రాజేసింది.పెళ్లి  విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 400 మందికి పైగా అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 400 మందికి పైగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పందించింది.

    దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.  రాత్రి విందు భోజనం చేసిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు కావడంతో  ఆందోళన మొదలైంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.  దాహోద్ కలెక్టర్ యోగేష్ నిర్గుడే తెలిపిన వివరాల ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉంది. పెళ్లి విందులో వడ్డించిన మామిడి రసం (Mango Juice) తాగడం వల్లే ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 

    ఇదీ చదవండి: కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి

    FSSAI  సీరియస్‌
    కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్‌ను ఆదేశించింది. విందులో వడ్డించిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఆహార నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర అధికారులకు సహాయం చేస్తోంది. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI స్పష్టం చేసింది.
     

  • ఢిల్లీ: వాహనదారులకు అలెర్ట్‌. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి అమ్మకాలు నిర్వహించేలా డ్రాఫ్ట్ బిల్లు (ప్రతిపాదిత చట్టం) సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, ఆ  డ్రాఫ్ట్‌ బిల్లులో గతంలో చెప్పినట్లుగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్మకాలు నిర్వహించేలా కాకుండా.. 85శాతం ఇథనాల్‌.. 15శాతం పెట్రోల్‌ మాత్రమే వాహనాల్లో వినియోగించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.  

     ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. భారత్‌ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90శాతం విదేశాల నుంచి ఎక్కువగా గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రానున్న రోజుల్లో చమురు దిగుమతులు  తగ్గించుకునేలా ప్రయత్నాలు ప్రారంభించింది

    ఇదే అంశంపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు సంబంధం ఉన్న సీనియర్‌ ప్రభుత్వ అధికారులు జాతీయ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ప్రభుత్వం ఇథనాల్‌ 85 (ఈ85) అంశాన్ని డ్రాఫ్ట్‌ రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఇథనాల్‌ 85పై ఇటు  ప్రభుత్వంలో అటు మార్కెట్‌లో సైతం ఏకాభిప్రాయం ఉంది  ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ85 కోసం ఇంజన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌లో విడుదలయ్యేందుకు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.  

    మరో అధికారి మాట్లాడుతూ..ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ వర్గాలు సైతం 15శాతం పెట్రోల్,85శాతం ఇథనాలు కలిపి అమ్మకాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న డ్రాఫ్ట్‌‌ బిల్లుపై అంగీకారం తెలిపాయని,త్వరలో అధికారిక ప్రకటన చేస్తాయన్న ఆయన.. ‘మార్కెట్ ఏకాభిప్రాయం ఇప్పటికే కుదిరింది. ఈ85 కోసం వాహనాల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తయ్యాయి’అని చెప్పారు.  

    ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్‌కు భిన్నంగా, ఈ85ను ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెట్టనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ20 వేరియంట్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 27శాతం వరకు కలపవచ్చు. 

    ఇంధన సంక్షోభం మధ్య కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశానికి కీలక మలుపు కానుంది. పెట్రోల్‌పై ఆధారాన్ని తగ్గించి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు మద్దతు లభించనుంది. పర్యావరణానికి ప్రయోజనం కలిగించడమే కాకుండా, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే, కొత్త ఇంజిన్లు, మౌలిక సదుపాయాలు, వినియోగదారుల అవగాహన వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఈ85 ప్రవేశం భారత ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
     

  • పాట్నా:  ఒకవైపు మహిళల రాజకీయ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విపరీతంగా చర్చలు నడుస్తున్న వేళ.. బిహార్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు పప్పూ యాదవ్‌. 90 శాతం మహిళల రాజకీయ జీవితం.. నాయకుల బెడ్‌రూమ్‌ నుంచే  మొదలవుతోందంటూ అసభ్యంగా మాట్లాడారు. 

    రాజకీయ నాయకులంతా మహిళలపై కన్నేసి వారిని హింసిస్తున్నారని కొత్త వివాదానికి తెరలేపారు. మహిళల పట్ల రాజకీయ నేతల ప్రవర్తనకు సంబంధించి నిత్యం ఏదో ఒక నాయకుడి సీసీ టీవీ ఫుటేజ్‌ బయటపడుతూనే ఉందని, అమెరికా నుంచి భారత్‌ వరకూ అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోందని అసహ‍్యంగా మాట్లాడారు. 

    ఎంపీ పప్పూ యాదవ్‌ వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది, ఇది మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్‌ కోరింది.  మరొకవైపు పప్పూ యాదవ్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పప్పు యాదవ్‌ను పార్లమెంట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. 

    2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి పప్పూ యాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

     

     


     

  • కేరళంలోని త్రిస్సూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

    తిరువంబడి డివిజన్‌కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో  ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది.  పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.

    కొనసాగుతున్నసహాయక చర్యలు
    అగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.

    గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్‌లతో సహా, తగినన్ని అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు.
     

  • ప‌ట్నా: కేంద్రంలో ప్ర‌తిప‌క్ష ఇండియా కూటమిని న‌డిపించే స‌త్తా రాహుల్ గాంధీకి లేద‌ని లాలూ ప్ర‌సాద్ పెద్ద కొడుకు, జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ వాద్రాను ఇండియా కూట‌మి ఫేస్‌గా ఆయ‌న వ‌ర్ణించారు. ప్రియాంక మాత్ర‌మే స‌మ‌ర్థ‌వంతంగా విప‌క్ష కూట‌మిని న‌డప‌గ‌ల‌ర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చారు.

    ''కేంద్రంలోని ప్రతిప‌క్ష ఇండియా కూట‌మిని ప్రియాంక గాంధీ మాత్రమే నడపగలరు. ఆమె ఇందిరా గాంధీ లాంటివారు. యాత్రకు వెళ్లడం, బుల్లెట్‌పై కూర్చోవడం ద్వారా రాహుల్ గాంధీ కూట‌మిని నడపలేరు. బిహార్ నుంచి నితీశ్‌ కుమార్ వెళ్లిపోయారు, మ‌రొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విష‌యంలో రాహుల్ గాంధీ ఉద్దేశ్యం ఏమిటి?" అని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్ర‌శ్నించారు.

    ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవ‌డం ద్వారా నితీశ్ కుమార్ రాజీప‌డ్డార‌ని రాహుల్ గాంధీ ఆరోపించిన నేప‌థ్యంలో తేజ్ ప్రతాప్ స్పందించారు. ''రాహుల్ గాంధీ ఇప్పుడు నితీశ్‌ కుమార్ గురించి మాట్లాడుతున్నారు. నితీశ్ తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన (రాహుల్ గాంధీ) మరో రాష్ట్రంలో ఉన్నారు. అలాంటప్పుడు బిహార్ సీటు విషయంలో ఎందుకు అత్యాశ పడుతున్నారు?”  అని తేజ్ ప్రతాప్ యాదవ్ నిల‌దీశారు.

    యాదవ్‌పై రాజ్ ఫైర్‌
    తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఉదిత్ రాజ్ స్పందించారు. లాలూ కుమారుడికి రాజ‌కీయ ప‌రిజ్ఞానం లేద‌ని, ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోర‌ని అన్నారు. అన‌వ‌స‌ర‌పు మాట‌లు క‌ట్టిపెట్టి తన సొంత పనిపై దృష్టి పెట్టాలని హిత‌వు పలికారు. కాగా, ఇండియా కూట‌మిని న‌డిపే స‌త్తా రాహుల్‌కు లేద‌ని గ‌తంలోనూ ప‌లువురు నాయ‌కులు వ్యాఖ్యానించారు. 

    చ‌ద‌వండి: హ‌మ్మ‌య్య‌! అమిషాను న‌వ్వించాం.. రాహుల్ స‌ర‌దా వ్యాఖ్య‌లు

    రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే..
    త‌మిళ‌నాడు ఎన్నికల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''బిహార్ తరహా రాజకీయాలు తమిళనాట‌ కుదరవని అన్నారు. కొద్ది రోజుల క్రితం బిహార్‌లో ఏం జ‌రిగిందో చూడండి. బిహార్ ముఖ్యమంత్రిని తొల‌గించి బీజేపీ నాయ‌కుడిని సీఎం సీటులో కూర్చొబెట్టారు. ఎందుకంటే సీఎం రాజీప‌డ్డారు. ప‌ద‌వి నుంచి ఎందుకు తొల‌గించార‌ని ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా, మౌనంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. బీజేపీ ఆయ‌న‌ను కంట్రోల్ చేసింది. ఇదే విధానం తమిళనాడులో అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. కాషాయ పార్టీ క‌ల‌ల‌ను ఇండియా కూట‌మి భ‌గ్నం చేస్తుంద‌''ని అన్నారు. 

  • ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొన్నారు. దక్షిణాది హక్కులను మోదీ హరిస్తున్నారని అటువంటి ఉగ్రవాదితో ఏఐడీఎంకే ఏలా పొత్తుపెట్టుకుందని ప్రశ్నించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాటలు  ఇప్పుడు తీవ్రదుమారం రేపుతున్నాయి.

    తమిళనాడులో ఈ నెల 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు సాగుతుండగా మరోవైపు ఏఐడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సినీస్టార్‌ విజయ్‌ టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్‌ 21న జహాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్‌ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన ఝల్‌మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

    ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్‌ కుమార్‌ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారాను అని విక్రమ్‌ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్‌కాల్స్‌ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్‌ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.

    ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్‌మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్‌ వెల్లడించాడు. మోదీ షేర్‌ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్‌, ఫేస్‌బుక్‌లో 11 కోట్ల వ్యూస్‌ దాటింది. అంతేకాదు, ఝల్‌మురి కోసం గూగుల్‌లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్‌లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

    ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్‌ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్‌ వద్ద ఆగారు. ఝల్‌మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్‌ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్‌ మీడియాలో ‘జహాగ్రామ్‌లో మసాలా ఝల్‌మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

    ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్‌ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్‌ నుంచి జహాగ్రామ్‌కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్‌ కాలేజ్‌ మోర్‌ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్‌మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్‌లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్‌ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

     

     

  • పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్‌ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం  ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. 

    గురువారం తొలి దఫా పోలింగ్‌ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్‌ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్‌ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

    ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్‌లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్‌(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్‌ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.  నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. 

    అయితే.. పగటి పూట  పిలియన్‌ రైడింగ్‌ విషయంలో టూవీలర్స్‌ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్‌ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.  పోలింగ్‌కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. 

    బెంగాల్‌లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్‌లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. 

    బెంగాల్‌ ఎన్నికల కోసం ఈసీ  ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్‌ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. 

  • దాహోద్‌: పెళ్లి వేడుకను సాధారణంగా స్నేహితులు, కుటుంబం సభ్యులు, బంధువులతో ఎంతో హుషారుగా, రుచికర వంటకాలతో జరుపుకుంటాం. వివాహం అంటే బాగా గుర్తుకువచ్చేది పెళ్లి వంటకాలు కూడా. అదే ఆహారం వందల మంది అనారోగ్యానికి కారణమైతే? 

    గుజరాత్‌లోని దాహోడ్‌, అబ్లోడ్ గ్రామంలో బాజా భజంత్రీల మధ్య ఎంతో సందడిగా ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సుమారు 300-400 మంది హాజరయ్యారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారము, కడుపు నొప్పి, డయేరియాతో బాధపడ్డారు. వారిలో 50-60 మందిని స్థానికులు జైడస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    జైడస్ ఆసుపత్రి ఆర్ఎమ్‌వో డాక్టర్ రాజీవ్ దామోర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోగులకు గత రాత్రి 11 గంటల సమయంలో లక్షణాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ముందుగానే సమాచారం రావడంతో 150-200 మంది రావచ్చని అంచనా వేసి పడకలు, అత్యవసర సేవలు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 50-60 మంది రోగులు చేరారని, చికిత్స పొందుతున్నారని చెప్పారు. అధికారులు అత్యవసర దర్యాప్తు ప్రారంభించి ఆరోగ్య బృందాలను అప్రమత్తంగా ఉంచారు.

    పెళ్లి కార్యక్రమానికి వచ్చివారికి ఇలాంటి అనుభవం ఏర్పడడంతో ఆ గ్రామంలోని వారంతా షాక్‌ అయ్యారు. పెళ్లిలో అందించిన ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. ఆహారం తయారీ, వడ్డించే సమయంలో పాటించిన పరిశుభ్రత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూపొందించిన ఆహార భద్రత ప‍్రమాణాలు పాటిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. పరిశుభ్రతను గాలికి వదిలేసి వండితే సమస‍్యలు తప్పవు.

    ‘దాహోద్‌లో 400 మందికిపైగా పెళ్లి భోజనం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన ఆందోళనకర విషయం. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

     

  • సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్‌కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్‌చల్‌ చేశారు. ముంబైలోని స్టోర్‌లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    తమ ఉద్యోగుల కోసం  లెన్స్‌కార్ట్‌ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. 

    ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్‌కార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్‌కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.

    లెన్స్‌కార్ట్ వివరణ
    సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్'  తీవ్రం కావడంతో , లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు.
     

  • చెన్నై: సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

    స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?
    ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
     

    కెమెరా ఎఫెక్టా, ఎండ ప్రభావమా?
    ఒకవైపు ఈ 'తమిళనాడు మేకప్' వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. తీవ్రమైన ఎండలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కెమెరా ఎక్స్‌పోజర్, లైటింగ్ లోపాలు లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల సహజంగానే చర్మం రంగు అలా కనిపించి ఉండొచ్చని వారు  అంటున్నారు. వీడియోలు తీసిన కోణం లేదా పోస్ట్-ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి కారణం కావొచ్చని విజువల్ మీడియా నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.
     

    ఉత్తర-దక్షిణ వివాదంగా మారిన రాజకీయం
    వాస్తవ నిర్ధారణ జరగకముందే ఈ వివాదం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీసే స్థాయికి చేరుకుంది. ఆన్‌లైన్ వేదికగా రెండు వర్గాలు తీవ్రంగా వాదించుకుంటూ సోషల్ మీడియాను రెండుగా చీల్చాయి. ఎన్నికల వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలు కూడా ఎంత వేగంగా పెద్ద చర్చకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    ఇది కూడా చదవండి: తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా?

  • లక్నో: ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారుల కుర్చీలపై తళతళలాడే తెల్లటి టవల్స్‌ను ఎప్పుడైనా గమనించారా? ఇవి కేవలం పరిశుభ్రతకు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లో ‘అధికారానికి నిదర్శనం’గా కూడా మారాయి. ఇంటర్నెట్‌లో నెటిజన్లను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘తెల్ల టవల్’ సంస్కృతి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, వాస్తవిక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

    అధికారానికి కేరాఫ్ అడ్రస్
    ప్రభుత్వ ఆఫీసుల్లో తెల్ల టవల్స్‌ను కేవలం ఒక వస్త్రంగా కాకుండా, ఒక అధికారిక చిహ్నంగా భావిస్తారు. కేతన్ అనే ఒక నెటిజన్ పెట్టిన ట్వీట్‌తో ఆన్‌లైన్‌లో ఈ చర్చ మొదలైంది. ఉన్నతాధికారులు  తెల్లని టవల్స్ వేసిన కుర్చీలలో కూర్చుని దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, చట్టసభలకు ఎన్నికైన తమకు  అలాంటి ఆ గౌరవం దక్కలేదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేసినట్లు ఆ నెటిజన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో  చర్చకు దారి తీసింది.

    టవల్స్ కోసం  అత్యవసర సమావేశం
    ఈ టవల్స్‌ వ్యవహారం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే, 2024లో యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ దీనిపై ఏకంగా ఒక అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రొటోకాల్స్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా జరిగే అధికారిక సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం అధికారులతో సమానంగా తెల్లటి టవల్స్ కప్పిన కుర్చీలనే ఖచ్చితంగా కేటాయించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

    వారానికి వెయ్యికి పైగా టవల్స్ మార్పు
    ఈ తెల్ల టవల్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో లక్నోలోని ఉత్తరప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏకంగా వారానికి రెండు సార్లు (సోమవారం, గురువారం) కుర్చీలపై ఉన్న దాదాపు 1,000 టవల్స్‌ను మారుస్తుంటారని సమాచారం. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలకు టవల్ వేసే ఆచారం కొనసాగుతుండటం ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

    ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ

Family

  • పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను ప్రభావితం చేస్తోంది. దీనికారణంగా మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటుంటారు. సంతానోత్పత్తి వయసు ఉన్న ప్రతి ఐదుగురి అమ్మాయిల్లోఓ ఒకరు ఈ సమస్య బారినపడతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అని చెబుతున్నారు నిపుణులు. ఈ సమస్యను చక్కటి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో చక్కదిద్దొచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.

    పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నమహిళలు తీసుకోవాల్సిన ఆహారాలు గురించి వెల్లడించారు. అవేంటంటే..వాటిలో గుడ్లు మంచి ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ప్రోటీన్లతో నిండి ఉంటుంది. మిమ్మల్ని ఎక్కువసేపు కడుపునిండుగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవకాడోలు హార్మోన్ల నియంత్రణకు సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయట. అలాగే బెర్రీలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా, తీపి తినాలనే కోరికను నివారించేలా తక్కువ చక్కెర, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.

    చియా గింజలు మెరుగైన జీర్ణక్రియకు, మంచి ఫైబర్‌కు ఉపయోగపడతాయని అన్నారు. అలాగే పెరుగు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే గాక జీవక్రియకు మద్దతిస్తుందని అన్నారు. దీంతోపాటు ఈ సమస్యను తీవ్రతరం చేసే ఆహారాలకు దూరంగా ఉండేలా కేర్‌ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా  శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ తరచుగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. 

    అలాగే హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని చెప్పారు. కాబట్టి సాధ్యమైనంతవరకు వాటిని పరిమితం చేయాలని అన్నారు. ఆహారం తోపాటు చక్కటి జీవనశైలిని పాటించాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..సమతుల్య భోజనం చేసేలా స్థిరత్వాన్ని పాటించాలన్నారు. చిన్నచిన్నగా పాటిస్తే..మెత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పులోను, మెరుగుదలను చూడగలమని అన్నారు.    

    డాక్టర్ ఆదర్శ గౌడ
    చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)
    అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)
    ICAR-నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
    AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్


     

  • కడుపులో ఉన్న బిడ్డకు వచ్చే సమస్యలను పిండదశలోనే సరిచేయగలిగేంత పరిజ్ఞానం ఇప్పుడుంది. జన్యుసమస్యల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ... ఒకప్పటితో పోలిస్తే ‘ఫీటల్‌ మెడిసిన్‌’ అనే వైద్యవిభాగంలోని పురోగతితో బిడ్డ పిండదశలో ఉన్నప్పుడు కనిపించే సమస్యలకు పరిష్కారాలు అందించగలగడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.  కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు కాబోయే తల్లిదండ్రులకు ఉండే భయాలూ, ఆందోళనలకు ఎలాంటి పరిష్కారాలు దొరుకుతున్నాయో తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం.

    ఒక కొత్త జీవి ఆవిర్భవించే ప్రక్రియ ఎంత సంక్లిష్టమో, ఎంతగా అబ్బురం కలిగించే అంశమో తెలుసుకోవడం ప్రతినిత్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ బిడ్డ ఉద్భవించేప్పుడు మొట్టమొదట జరిగేదే ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పురుషుడి శుక్రకణం, అలా మహిళ అండంతో కలిసిన ఆ క్షణంలో అక్కడ ఓ అద్భుతమైన వెలుగు ఓ ఫ్లాష్‌లైట్‌లా తటాల్న వెలుగుతుందంటారు వైద్య నిపుణులు. అలా ఫ్లాష్‌లా వెలిగే ఆ లైట్‌ను ‘జింక్‌ స్పార్క్‌’ అని పిలుస్తారు. అలా మొదటి అద్భుతం నుంచి ఇక పిండం పెరుగుతుండే అనుక్షణం కడుపులోపల అబ్బురాల వరస అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

    46 క్రోమోజోముల సంఖ్య కొనసాగేందుకు... 
    స్త్రీ, పురుషులిద్దరి అండ, శుక్రకణాల్లో చెరిసగాలే...ఓ జీవి ఫలానా జీవిగానే కొనసాగేందుకు జీవిలోని క్రోమోజోముల సంఖ్య కీలకమవుతుంది. ఆ జీవిలోని క్రోమోజోముల సంఖ్యను బట్టే అది ఏ జీవి అన్నది తెలుస్తుంది. ఇలా మనిషి కణంలోని క్రోమోజోముల సంఖ్య 46. ఈ సంఖ్య అన్నది ఎన్ని తరాలు గడుస్తున్నా క్రమబద్ధంగా కొనసాగుతూ ఉండటం కోసం మహిళలోని అండం 23 క్రోమోజోములుగా, పురుషుడిలోని శుక్రకణం 23 క్రోమోజోములుగా విడిపోతాయి. 

    మళ్లీ శుక్రకణాలూ, అండమూ మహిళలో సంయోగం చెంది, 46 క్రోమోజోములున్న ఒకే ఒక్క కణమున్న పిండం నుంచి అనేకానేక కణాలు (సెల్స్‌)గా విడిపోయి, ఆ కణాలు మళ్లీ అనేక రకాల కణజాలాలు(టిష్యూస్‌)గా, ఆ కణజాలాలన్నీ ప్రత్యేక అవయవాలుగా, ఆ అవయవాలు ఒకదానితో మరొకటి అనుసంధానితమవుతూ ప్రత్యేక వ్యవస్థలు (సిస్టమ్స్‌)గా రూపుదిద్దుకుంటూ ఉంటాయి. 

    పిండం పెరుగుదల అన్నది ఇంతటి సంక్లిష్టమైనది. ఉదాహరణకు గుండె కణాలూ, కణజాలాలూ కలిసి గుండెగా రూపొంది, రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడతాయి. అదే జీర్ణకోశం, కాలేయం, పేగులూ లాంటి కణాలు, కణజాలాలూ కలిసి జీర్ణవ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇలా మనదేహంలోని రకరకాల వ్యవస్థలన్నీ రూపుదిద్దుకుంటాయి.

    లోపరహితంగా జరిగే ప్రక్రియ ఇది... అయితే ఒకవేళ లోపమే జరిగితే... 
    ఇంతటి సంక్లిష్టమైన పిండం పెరుగుదల ప్రక్రియ దాదాపు పూర్తి లోపరహితంగా జరుగుతుంటుంది. అలా లోపరహితంగా జరిగినప్పుడే ఒక ఆరోగ్యకరమైన బిడ్డ ఆవిర్భవిస్తుంది. అయితే ఈ సమయంలో ఎక్కడైనా చిన్నపాటి లోపం జరిగినప్పుడు అది పుట్టబోయే బిడ్డకు వైకల్యాన్నో, ఆరోగ్య సమస్యనో తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలను పిండ దశలో తెలుసుకోవడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే. 

    ఇందుకు ఉపయోగపడే వైద్య శాస్త్ర విభాగమే ‘ఫీటల్‌ మెడిసిన్‌’. గర్భవతికి సంబంధించిన అధ్యయనాలతో కూడిన  ‘ఆబ్‌స్టెట్రిక్స్‌’కు కొనసాగింపుగా ఇటీవల ఈ ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం కొత్తపుంతలు తొక్కుతూ చాలా చాలా వినూత్న విషయాలను తెలుసుకుంటోంది. పిండదశలో వచ్చే ఎన్నో ఎన్నో సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటోంది. పుట్టుకతో రాబోయే కొన్ని సమస్యలు... ఉదాహరణకు కొన్ని గుండె సమస్యలు వస్తే... దాన్ని కడుపులోని పిండానికే శస్త్రచికిత్స చేసి మరీ చక్కదిద్దేంత పరిజ్ఞానం, నైపుణ్యం ఇప్పుడు అభివృద్ధి అయ్యాయి.

    కొన్ని లోపాలేమిటి... ఆ లోపాలతో వచ్చే సమస్యలేమిటి...?
    సాధారణంగా 90 శాతం ప్రెగ్నెన్సీలలో అంతా సజావుగా జరిగిపోయినా, కొందరిలో మాత్రం మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఆ బిడ్డకు పిండదశలోనే  కొన్ని సమస్యలు కనిపించవచ్చు. పుట్టుకతోనే వచ్చే ఆ సమస్యలను కంజెనిటల్‌ సమస్యలుగా పేర్కొంటారు. 

    అందులో కొన్నింటికి చికిత్స అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు గ్రహణం మొర్రి (క్లెఫ్ట్‌ పాలెట్‌) వంటి చిన్న సమస్యలను చిన్నపాటి శస్త్రచికిత్సతో సరిదిద్దవచ్చు. మరికొన్ని పెద్ద సమస్యలను ఇలా బిడ్డ పుట్టిన వెంటనే చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డకు హెర్నియా సమస్య (కంజెనిటల్‌ డయాఫ్రమాటిక్‌ హెర్నియా) ఉంటే పుట్టిన వెంటనే  వెంటిలేటర్‌పై ఉంచి మరీ శస్త్రచికిత్స చేయాలి. కాకపోతే కాస్తంత కష్టసాధ్యమైన ఈ విషయానికి మంచి నైపుణ్యంతో కూడిన చికిత్స అవసరం.  

    పరిష్కారం లేని సమస్యలూ ఉండవచ్చు... 
    ఈ క్రమంలో పిండానికి ఉన్న మరికొన్ని సమస్యలు సరిదిద్దలేనంత సంక్లిష్టంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు అనెన్‌సెఫాలీ అనే కండిషన్‌లో బిడ్డలో తల సరిగా రూపొందదు. తలలోని ఎముకలు సరిగా ఏర్పడవు. ఇలాంటి సందర్భాల్లో ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకుంటే సమస్య తీవ్రతను బట్టి తీసుకోవాల్సిన నిర్ణయమేమిటి అన్నది జన్యుపరీక్షల నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ తర్వాత తెలిసే అవకాశాలున్నాయి. అయితే ఇది త్వరగా జరగాలి. 

    ఎందుకంటే... ఒకవేళ బాగా ఆలస్యమైతే... పిండం బాగా పెరిగాక ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే... ఇది పెద్దప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఫీటల్‌ మెడిసిన్‌ విభాగంలోని డయాగ్నసిస్‌ (సమస్య నిర్ధారణ)పై ఆధారపడి ఉంటాయి. ఆయా సమస్యలను అనుసరించి, పిండదశలోనే చికిత్స చేయాలా లేక పుట్టిన వెన్వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అన్నది నిర్ణయం తీసుకుని, ఆ ప్రకారం ప్రసవాన్నీ, అటు తర్వాత బిడ్డకు అవసరమైన చికిత్సలనూ డాక్టర్లు ప్లాన్‌ చేస్తుంటారు.

    పిండం పెరుగుదల – నిరంతర పర్యవేక్షణ...
    ఓ మహిళ గర్భందాల్చాక డాక్టర్లు (సాధారణంగా ఆబ్‌స్టెట్రీషియన్‌లు / గైనకాలజిస్టులు) నిర్ణీత వ్యవధుల్లో మహిళను చెకప్‌కు రమ్మని చెబుతూ ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిండం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న కొద్దీ... ఏయే వారానికి లేదా ఏయే త్రైమాసికానికి (ట్రైమిస్టర్‌కు) ఎంత పెరగాలో, ఏయే వారాల్లో ఏయే అవయవాలు రూపుదిద్దుకోవాలన్న అంశాలను బట్టి...  పిండం పెరుగుదల అన్నది ఆయా వారాల్లో  అలాగే జరుగుతోందా లేదా అని డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. బిడ్డలో ఆ ఎదుగుదల అన్నది నార్మల్‌గానే ఉంటే ఇక దాని గురించి ఆలోచించాల్సిందేమీ ఉండదు. అంతా సజావుగా జరిగి, నెలలు నిండాక ప్రసవం తర్వాత నార్మల్‌ బిడ్డ పుడతాడు.

    ‘కలర్‌ డాప్లర్‌’ సాంకేతికతతో... కడుపులోనే బిడ్డ సమస్యలు తెలుసుకునే అవకాశం...
    ఒకవేళ కడుపులోని బిడ్డలో నార్మల్‌ పెరుగుదల కనిపించకపోయినా లేదా ఏవైనా అవంతరాలూ అవకరాలూ (అనామలీస్‌) కనిపిస్తుంటే... దానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరముంటుంది. దాని ప్రకారం తగిన  నిర్ణయాలు తీసుకునేందుకు ‘ఫీటల్‌ మెడిసిన్‌’ సహాయపడుతుంది. 

    ఇప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానంతో కడుపులోని బిడ్డ బరువునూ తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందుకు సహాయపడే అత్యాధునిక వైద్య విజ్ఞానమే ‘కలర్‌ డాప్లర్‌’ సాంకేతికత! దీని సహాయంతో బిడ్డలోని ఎదుగుదల ఏయే సమయాల్లో ఎంత ఉండాలో, ఆయా టైములో  అలా కొనసాగుతోందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా బిడ్డ పుట్టబోయే సమయాన్ని కూడా దాదాపుగా సరిగానే అంచనా వేయడమూ జరుగుతుంది.

    డాక్టర్లు తెలుసుకునే మరికొన్ని సమస్యలూ... పరిష్కారాలు...
    ఓ మహిళ గర్భవతి అని తెలియగానే  ప్రతి డాక్టరూ ఆమెకు తొలుత సూచించే టాబ్లెట్లు... ‘ఫోలిక్‌ యాసిడ్‌’ మాత్రలు. పాలకూరలాంటి మామూలు ఆకుకూరల్లో ఉండే ఒక రకం పోషకమే ఈ ‘ఫోలిక్‌ యాసిడ్‌’. ఈ పోషకం వల్ల పుట్టబోయే బిడ్డలో... మున్ముందు వెన్నుపాముగా రూపొందబోయే ‘న్యూరల్‌ ట్యూబ్‌’ సరిగ్గా ఏ లోపమూ లేకుండా రూపుదిద్దుకుంటుంది. ఇలా న్యూరల్‌ ట్యూబ్‌ ఏర్పడటాఇకి అవసరమైన ఆ సంకేతాన్ని తీసుకెళ్లాల్సిన ఒక ‘డీఎన్‌ఏ’ సరైన రీతిలో ఆ సంకేతాన్ని తీసుకెళ్లేలా ఈ పోషకం సహాయపడుతుంది. 

    మామూలు ఆకుకూరలతోనే అందే ఈ పోషకం ఒకవేళ తగినంతగా అందకపోతే బిడ్డలో న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌ (లోపం) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అందుకే డాక్టర్లు తల్లికాబోతోందన్న విషయం తెలియగానే ఈ లోపాన్ని ముందే నివారించేందుకు ఈ ‘ఫోలిక్‌ యాసిడ్‌’ మాత్రలను సూచిస్తుంటారు. ఒకవేళ ఆ పోషకం లోపం ఉండి... సదరు డీఎన్‌ఏ ఆ నిర్దిష్టమైన సంకేతాలను సరిగా అందించకపోతే... పుట్టబోయే బిడ్డలో వెన్నుపాముకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీటినే వైద్య పరిభాషలో ‘స్పైనా బైఫిడా’ అంటారు. ఈ సమస్య వల్ల బిడ్డ పురిటిలోనే చనిపోయే అవకాశం ఉంది. ఒకవేళ బతికితే శారీరకంగానూ, మానసికంగానూ వైకల్యం వచ్చే అవకాశం ఉంది.

    క్రోమోజోమల్‌ సమస్యలు...
    ముందుగా చెప్పినట్టుగా ప్రతి జీవిలోని ప్రతి కణంలోనూ నిర్దిష్టంగా నిర్ణీత క్రోమోజోముల సంఖ్య ఉంటుంది. వాటిని బట్టే అది ఏ జీవి అన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మానవుల్లోని క్రోమోజోముల సంఖ్య 46 అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ క్రోమోజోముల సంఖ్యలో మార్పు వస్తే... పుట్టబోయే బిడ్డలో జన్యులోపాలు ఏర్పడటాయి. 

    దాంతో అలా జన్యులోపంతో పుట్టే బిడ్డలకు  బుద్ధిమాంద్యమూ, అవయవలోపాలూ వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’. ఇలా డౌన్స్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలను తెలుసుకోడానికి ‘ద కంబైన్‌డ్‌ టెస్ట్‌’ అనే పరీక్షను చేయాల్సి ఉంటుంది. ఇందులో తల్లి రక్తాన్ని, పిండం విడుదల చేసే ప్రోటీన్లను కలిపి పరీక్షిస్తారు. అందుకే దీన్ని కంబైన్‌డ్‌ టెస్ట్‌ అని పిలుస్తారు. ఈ పరీక్షను గర్భధారణ జరిగిన 11వ వారం, 13వ వారంలో నిర్వహిస్తారు. 

    ఈ లోపాలను తెలుసుకునేందుకు పరీక్షలు...  
    స్పైనా బైఫిడా లాంటి లోపాలు వచ్చే మరికొన్ని అవకాశాలను తెలుసుకునేందుకు కొన్ని స్క్రీనింగ్‌ పరీక్షలను తప్పనసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ ‘ఫీటల్‌ మెడిసిన్‌’లో భాగమే. ఉదాహరణకు ఈ  వెన్నుపాము సమస్య అయిన ‘స్పైనా బైఫిడా’ను నిర్ధారణ చేసేందుకు ట్రిపుల్‌ లేదా క్వాడ్రపుల్‌ పరీక్ష చేస్తారు. ఇందులో ఆల్ఫా ఫీటో అనే ప్రోటీన్‌ను పరిశీలిస్తారు. దాంతో పాటు బీటా హెచ్‌సీజీ పాళ్లు, ఎస్ట్రాడోయిల్, ఇన్హిబిన్‌ మోతాదులను తెలుసుకుంటారు. 

    ఈ పరీక్షను గర్భం ధరించిన 15వ వారం నుంచి 20 వ వారం మధ్యన చేస్తారు. అయితే ఈ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినంతనే బిడ్డకు తప్పనిసరిగా అంగవైకల్యం కలుగుతుందని చెప్పడానికి ఉండదు. కాకపోతే ఇలా ΄పాజిటివ్‌ ఫలితం వచ్చినప్పుడు ఆ తర్వాత గర్భం దాల్చిన 16వ వారంలో తప్పనిసరిగా సీవీఎస్‌ అనే పరీక్ష„ý నూ, యామ్నియోసెంటైసిస్‌ అనే పరీక్షలను నిర్వహించి, తొలుత కనిపించిన పాజిటివ్‌ ఫలితం నిజంగా వాస్తవమైనదేనా లేక తప్పుడు పాజిటివా (ఫాల్స్‌ పాజిటివ్‌నా) అన్నది నిర్ధారణ చేస్తారు.

    జెనెటిక్‌ సోనోగ్రామ్‌ పరీక్షలతో...
    పుట్టబోయే బిడ్డ అవయవ నిర్మాణంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అన్న సంగతి ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇందులో క్రోమోజోమల్‌ సమస్యలతో పాటు... బిడ్డలోని అంతర్గత అవయవాలైన గుండె, మెదడు, మూత్రపిండాలు, కాళ్లూ–చేతులు, ముఖం, కళ్లు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ఆబ్డామినల్‌ అవయవాల (కడుపులోపలి భాగాల) గురించి తెలుసుకోవచ్చు.

    జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ అంటే...
    ఇలా అవసరమైనప్పుడుగానీ లేదా డాక్టర్లు ఫలానా పరీక్ష చేయాలని భావించినప్పుడుగానీ... నిర్వహించే పరీక్షల్లో పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన సమస్యలున్నాయని తెలిస్తే... అప్పుడవి మున్ముందు జరగబోయే గర్బధారణల్లో (అంటే తొలిచూలు బిడ్డ తర్వాతి ప్రెగ్నెన్సీలలో)  తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. దాన్ని బట్టి తల్లిదండ్రులు తమ గర్భం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఒకవేళ అలాంటి జన్యుపరమైన సమస్యలేమీ లేవని  తేలితే అప్పుడు తల్లిదండ్రులు నిర్భయంగా తమ ప్రెగ్నెన్సీని కొనసాగించవచ్చు. 

    కొన్ని సందర్భాల్లో ఫీటల్‌ మెడిసిన్‌ విభాగపు నిపుణులు... తల్లిదండ్రులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఒకవేళ తొలిచూలు బిడ్డకు ఏవైనా క్రోమోజోమల్‌ సమస్యలు ఉన్నప్పుడు... ఆ తల్లిదండ్రులిద్దరూ దగ్గరి రక్తసంబంధీకులా అన్న విషయాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా రెండో గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. తొలిచూలు బిడ్డకు కొన్ని రక్త పరీక్షలు చేయించి వాటిలో వచ్చిన ఫలితాల ఆధారంగా మలిచూలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మొదటి నాలుగు నెలల్లోనే కొన్ని పరీక్షలు చేయించాలని సూచిస్తారు. ఆ బిడ్డకు ఏవైనా సమస్యలు రాబోతున్నాయా అని పరీక్ష చేసి, ఆ పరీక్షల ఫలితాలను బట్టి కొన్ని వైకల్యాలు వచ్చే అవకాశం ముందే తెలుసుకుంటే, దానికి అనుగుణంగా తల్లిదండ్రులకు సలహాలు ఇస్తారు.

    ఒకవేళ దంపతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారైతే... 
    సాధారణంగా వారిద్దరి జన్యువులూ ఒకేలా ఉండే అవకాశాలు ఎక్కువ. అంటే ఇద్దరిలోనూ రిసెసివ్‌ జీన్సే ఉంటాయి. దాంతో ఆటోజోమల్‌ రెసెసివ్‌ జెనెటిక్‌ డిసీజెస్‌ అని పిలిచే జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులిద్దరి జన్యువుల్లోనూ ఒకే తరహా లోపాలు ఉన్నప్పుడు ఆ లోపాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్‌ జన్యువు లేక΄ోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే రక్తసంబంధీకుల్లోనే పెళ్లిళ్లు జరిగితే జన్యుపరమైన లోపాలు వచ్చే ముప్పు (రిస్క్‌) ఎక్కువనీ,  అందుకే వీలైనంత వరకు రక్తసంబంధీకుల్లో వివాహాలు వద్దంటూ ఆధునిక ‘ఫీటల్‌ మెడిసిన్‌’ నిపుణులు సూచిస్తుంటారు.  

    రక్తసంబంధీకుల బిడ్డల్లోనే జన్యుసమస్యలు ఎందుకు ఎక్కువ? 
    చాలా సందర్భాల్ల రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (కన్‌సాంజియస్‌ మ్యారేజెస్‌) జరిగితే... వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది చెబుతుంటారు. ఇలా ఎందుకు  జరుగుతుందో చూద్దాం. 

    ఓ కొత్త జీవి ఆవిర్భవించడానికి తల్లికి సంబంధించిన 23 క్రోమోజోములు, తండ్రికి చెందిన 23 క్రోమోజోములు కలిసి ఒక పిండం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రోమోజోములు ‘జన్యువుల’తో రూపొందుతాయి. జన్యువులు అంటే తల్లిదండ్రుల నుంచి వివిధ అంశాలను బిడ్డలకు చేరవేసే కణంలోని లోపలి భాగాలు అని అర్థం. దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాకుండా, ఒకరికొకరు సంబంధం లేని వేర్వేరు కుటుంబాల వారైతే... అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఫలానా ఓ జన్యువు దంపతులిద్దరిలోనూ ఒకరిలో లోపంతో ఉందని అనుకుంటే ఆ జన్యువును ‘రిసెసివ్‌ జీన్‌’ అంటారు. 

    ఉదాహరణకు తండ్రిలోని ఓ జన్యులో లోపం ఉందనుకుందాం. అప్పుడు ఆ జన్యులోపాన్ని నివారించడానికి తల్లిలో ఉండే అదే జన్యువు...  లోపంతో కూడిన తండ్రి తాలూకు జన్యువును డామినేట్‌ చేస్తుంది. ఇలా డామినేట్‌ చేసే జన్యువును ‘డామినెంట్‌ జీన్‌’ అంటారు. దాంతో ఈ డామినెంట్‌ జీన్‌ కారణంగా బిడ్డకు రాబోయే ఆ లోపాన్ని అధిగమించడానికి వీలవుతుంది.

    ఫీటల్‌ థెరపీస్‌ అంటే...?
    పుట్టబోయే బిడ్డకు పిండ దశలోనే ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా అన్న విషయాన్ని ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టులు మొదటే నిర్ధారణ చేస్తే... అప్పుడు ఆ  బిడ్డకు పుట్టీపుట్టగానే అవసరమైన చికిత్స అందించేందకు వీలుంటుంది. (అందుకే ఇలాంటివేవైనా సమస్యలు ఉన్నట్టు పిండ దశలో ఉన్నప్పుడు చేసే వైద్య పరీక్షల్లో తెలిస్తే... అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో (టెరిషియరీ సెంటర్‌)లో ప్రసవం జరిగేలా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది). ఇక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కడుపులో ఉండగానే, ఆ పిండ దశలోనే చికిత్స చేయాల్సి రావచ్చు. ఇలా చేసే చికిత్సను ‘ఫీటల్‌ థెరపీ’గా పేర్కొంటున్నారు.  

    (చదవండి: కండలు తిరిగిన దేహంతో నిర్మాణ కార్మికుడు..! కేవలం ఆ ఆహారంతోనే..)
     

  • సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలను పలకరించగా..ఇంకా ఆ దృశ్యం కళ్లముందు మెదులుతూనే ఉందంటున్నారు. ఆ ఘటన మిగిల్చిన కన్నీళ్లని అంతతేలిగ్గా మర్చిపోలేమంటున్నారు భర్తలను పోగోట్టుకున్న మహిళలు. అంతేగాదు తమ కళ్లలోని కన్నీటి చెమ్మ తడి ఆరదు అని గద్గద హృదయంతో చెబుతోంది ఆ పహల్గామ్‌ బాధితుల్లో ఒకరైన డాక్టర్ సుజాత. గుండెల్ని పిండేసే ఆమె మనో వ్యథ వింటే ప్రతి ఒక్కరి మనసు ద్రవించిపోవడమే కాదు ఈ ఉగ్రవాదం సమూలంగా పోయేదెప్పుడూ అన్న ఆక్రోశం కట్టలుతెచ్చుకుంటుంది.

    నాటి పహల్గామ్‌ దాడిలో డాక్టర్‌ సుజాత ఎంబీఏ పట్టభద్రుడైన భర్త భరత్‌ భూషణ్‌ని పోగొట్టుకుంది. అతడికి ప్రపంచం గురించి తెలిస్తే..ఆమెకు రోగుల గురించి తెలుసు. అలా ఒకరికొకరం బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉండేవాళ్లం అని భోరున విలపిస్తున్నారు సుజాత. ఆ దాడిని తన నాలుగేళ్ల కుమారుడు ప్రత్యక్ష్యంగా చూశాడంటూ నాటి భయంకర ఘటనను గుర్తుచేసుకున్నారు. నాన్నకు దెబ్బ తగిలింది, చాలా రక్త కారింది అన్నమాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయంటున్నారు. ఆ దాడి నీలి నీడలా వెంటాడుతూనే ఉందంటున్నారామె. 

    ఆ బాధను తట్టుకోవడం అంత ఈజీకాదు. ఆ ఘటన తన భావోద్వేగాల నుంచి చిరునవ్వు వరకు అన్నింటి దూరం చేసిందని, కేవలం శూన్యమే మిగిలిందని చాలా నిర్వేదంగా చెప్పుకొచ్చారామె. అంత తేలిగ్గా మర్చిపోలేను ఆ విషాదకరమైన రోజుని, తాను, తన కుమారుడు రక్తంతో తడిచిపోయిన ఆ భయంకపితమైన క్షణాలు బతుకున్నంత వరకు మర్చిపోలేనంటున్నారామె. ఆ కన్నీటి దృశ్యం ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉందన్నారామె. అందుకే తాను ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యేలా చూసుకుంటూ ఆ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారామె. 

    కాస్త ఖాళీ దొరికినా..ఆ బాధ వెన్నాడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎంత భయానకమైనవంటే..మనం అనుభవించిన సంతోషకరమైన క్షణాల కంటే ..ఆ బాధే అత్యంత భారంగా అధికంగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నేసి గంటలు ఆస్పత్రిలో పనిచేసినా..ఒక్క ఆదివారం మాత్రం కొడుకు కోసం కేటాయించుకుంటానని చెప్పారు. భతవంతుడి దయవల్ల తన కొడుడు చాలా మంచివాడని అంటున్నారు. 

    ఎందుకుంటే ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారి కూడా తండ్రి గురించి అడగలేదు. ప్రశాంతంగా ఉన్నాడని అన్నారు. పైగా తాను లేనప్పుడూ అస్సలు అల్లరి చేయడు, తాను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాతో అల్లరి చేస్తుంటాడని నవ్వుతూ చెప్పారు. ఈ విషయంలో భగవంతుడికి సదా కృతజ్ఞతతో ఉంటానని అన్నారు. అంతేగాదు తన కొడుకుకి తండ్రిన కోల్పోయినట్లు తెలుసు, కానీ ఆ లోటు వాడికి కనపడకుండా అన్నీతానై పెంచుకుంటున్నానని చెప్పారామె. 

    నిజానికి ఏప్రిల్‌ నెల ఎప్పుడూ పండుగ మాసం, కానీ అది మాకు సర్వం కోల్పోయేలా చేసిన విషాదకరమైన మాసంగా మిగిలిందన్నారు. "ఈ పహల్గామ్‌ దాడికి కొన్ని రోజుల ముందు తన భర్త పుట్టినరోజు వేడుకులు చేసుకున్నాం  అని అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 14న విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాం. నిజానికి తాము ఎప్పుడు గుడికి వెళ్లి..ఆ తర్వాత బయటకు వెళ్లేవాళ్లం. 

    ఆరోజు తన తల్లిదండ్రలు కూడా కాశ్మీర్లో గట్టి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పుడూ కూడా అంతగా ఆందోళన చెందలేదు. పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తుంటే టపాసులు అనుకున్నా..భద్రతా సిబ్బంది అంతా చూసుకుంటారిని అనుకున్నా. కానీ ఆ ప్రాంతంలో భద్రత లేదు, ఒక్క మనిషి గానీ, సాయుధగార్డు గానీ ఉంటే ఆ ఘటనను నివారించి ఉండేవారంటూ". ఆ విపత్కర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. 

    బహుశా తీవ్రవాద భావజాలం ఈ దాడులు చేసేవాళ్ల మెదడులను పూర్తిగా బ్రెయిన్‌ వాష్‌ చేశారన్నారు. తాము చేస్తుంది తప్పు కాదు సరైనదే అన్నంత క్రూరంగా మార్చేశారన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టుపెట్టాలో తనకు తెలియదు గానీ..ఇక్కడితో ఈ మారణకాండ ఆగిపోవాలి అని ఉద్విగ్నంగా అన్నారామె. 

    ఆ దాడి జరిగిన రోజు తమ పెళ్లిరోజు అని, ఆయనతో తనకు అదే చివరి భయానక జ్ఞాపకమని కన్నీళ్లుపెట్టుకున్నారామె. కాగా, పహల్గామ్ సంఘటన జరిగినప్పుడు ఆ దంపతులకు పెళ్లై ఆరేళ్లయింది. ప్రస్తుతం ఆమె తనను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నా..కానీ ఈ నష్టం ఏ స్త్రీకైనా పూడ్చలేనది అని గద్గద స్వరంతో అన్నారు డాక్టర్‌ సుజాత.

     

    (చదవండి: ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ)

     

     

  • వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్‌ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

    వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్‌ ప్రెషర్‌(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..

    వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్‌సైడ్‌ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.

    ఎవరికీ ఎక్కువ ప్రమాదం?

    వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్‌(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్‌ వాడేవాళ్లలో  డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

    వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలు

    • తగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగా

    • కాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్‌ను పెంచుతాయి.

    • ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.

    • తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.

    • తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.

    • ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.

    • వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.

    • హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి.

  • వయసు పైబడిన..చిన్నవాళ్లలా యంగ్‌లుక్‌లో కనిపించాలని పరితపిస్తుంటారు చాలామంది. అయితే అందుకు తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకోరు. అలాగే శరీరానికి కావాల్సినంత వ్యాయామాలు వంటి వాటిపై దృష్టిసారించరు. యంగ్‌ లుక్‌ అటుంచి..ఆరోగ్యంగా ఉండటం కోసం అయినా చేయరు..ఇక యవ్వనంగా ఎలా కనిపిస్తారు అని అంటోంది ఈ చెన్నైకి చెందిన వృద్దురాలు. 67 ఏళ్ల వయసున్న ఆమెని చూస్తే జస్ట్‌ 40 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆ వృద్ధురాలి ఆహార్యం. మరి ఆమె చెప్పే పిట్‌నెస్‌ రహస్యలేంటో సవివరంగా చూద్దామా..!.

    కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళరసన్ ఆ వృద్ధరాలి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఆయన ఆమెను ఫిట్‌నెస్‌ రొటీన్‌ గురించి అడగడం చూడొచ్చు.

    మంచి ఆరోగ్యానికి వ్యాయామమే కీలకం
    వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది; ఇది సాధారణ జీవశాస్త్రం. అయితే, క్రమం తప్పని వ్యాయామంతో మన శరీరానికి శిక్షణ ఇస్తే..న క్రియాత్మక బలం, సామర్థ్యాలను నిలుపుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని అంటోందామె. ఆమె ఉదయం 5:30 నుంచి 5:45 గంటల మధ్య నిద్రలేచి, ఇంటి పనులు ముగించుకుని, యోగాతో రోజుని ప్రారంభిస్తానని అంటోంది. ఇక ఉదయం 7:30 గంటలకు పార్కులో వాకింగ్‌ చేస్తానని చెప్పారు. 

    ఆరోగ్యంగా ఉండటానికి కేవలం వాకింగ్‌ సరిపోదని అన్నారు. శక్తినిచ్చే వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు. అలాగే తానేమి సప్లిమెంట్లని ఉపయోగించనని అన్నారు. అల్పాహారంగా కేవలం మజ్జిగ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో మాత్రం అవసరమైన పోషకాలు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం ప్రోటీన్‌ కోసం చికెన్, మటన్ లేదా గుడ్లతో కూడిన చాలా మంచి భోజనం చేస్తాను. 

    ప్రత్యేకంగా పాటించే డైట్‌ అంటూ ఏమి లేదని అన్నారామె. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతానని అన్నారు. భోజనం మధ్యలో ఆకలి వేస్తే నచ్చిన పండ్లను తీసుకుంటానని చెప్పారు. కానీ వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటానని అన్నారు. మంగళవారం, శనివారాలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటానని చెప్పారు. గృహిణిగా ఉంటూనే ఆరోగ్యం పట్ల ఇంత కేర్‌ తీసుకుంటున్నా ఆమె అందరికీ స్ఫూర్తి. 

    మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే సరైన ఆహారం తీసుకోవడం, శరీరానికి తగిన వ్యాయామం చేయడం తదితరాలే అత్యంత ముఖ్యమని అని చెబుతున్నారామె. ఎక్కువగా మానసిక ఆరోగ్యంపై దృష్టిపెడితేనే ఏదైన సాధ్యమని అన్నారు. ఆడవాళ్లు, ఇంట్లో శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడం ప్రధానమని అన్నారు. అలాగే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలని అన్నారు. అలాగే విషయాలను  పట్టుకుని వేలాడకుండా..జీవితంలో ఏది వచ్చినా..యథాతథంగా స్వీకరించడం అత్యంత ముఖ్యం అని అన్నారు. అప్పుడే మనం శారీరకంగా ఫిట్‌గా ఉండగలుగుతామని అన్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: Jhaal Muri: మోదీ మెచ్చిన చిరుతిండి..! ఇన్ని పేర్లతో పిలుస్తారా..)

Health

  • మునగ భారతదేశానికి చెందిన మొక్క. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీని ఆకులు, గింజల పోషక విలువల కారణంగా ఆహారంగా బాగా వినియోగిస్తారు. నీటి శుద్ధిలో ఇది ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా ఈ గింజలపై పరిశోధనలు చేస్తున్నారు.

    మునగ గింజలు నీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను బయటకు తీయడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సాధారణ రసాయన చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మొక్క ఆధారిత సారం ప్లాస్టిక్ కణాలను ఒకదానికొకటి అంటుకునేలా చేసి వడపోతలో సులభంగా తొలగించేలా చేస్తుంది.

    కొన్ని పరిస్థితుల్లో ఇది సంప్రదాయ రసాయనాల కంటే మెరుగ్గా పనిచేసింది. తక్కువ ఖర్చుతో సహజ పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది. తాగునీటి శుద్ధి విషయంలో ఇది పెద్ద మార్పు తీసుకురావచ్చు. బ్రెజిల్ సావో పాలో స్టేట్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఐసీటీ యునెస్ప్ సావో జోసే డోస్ కాంపోస్‌లో పరిశోధకులు మోరింగా ఒలీఫెరా (సాధారణంగా మునగ లేదా వైట్ అకేషియా అని పిలిచే మొక్క) నీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ఫలితాలు అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఏసీఎస్ ఒమెగాలో ప్రచురితమయ్యాయి.

    రసాయన చికిత్సలా మునగ గింజల సారం  
    ‘ఈ గింజల ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ లాగా పనిచేస్తుంది. ఇది మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తుంది క్షార స్వభావం ఎక్కువగా ఉన్న నీటిలో ఇది రసాయన ఉత్పత్తి కంటే మెరుగ్గా పనిచేసింది’ అని శాస్త్రవేత్త గాబ్రియెల్లే బాటిస్టా తెలిపారు. ఆమె పీజీ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ పీపీజీఈసీఏలో మాస్టర్స్ సమయంలో ఈ పరిశోధన చేశారు.

    ఈ పరిశోధనకు ఐసీటీ యునెస్ప్ ప్రొఫెసర్ ఆడ్రియానో గోన్కాల్వెస్ డోస్ రైస్ నాయకత్వం వహించారు. ఆయన మైక్రోప్లాస్టిక్స్ తొలగింపు ప్రాజెక్ట్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఫాపెస్ప్ మద్దతుతో నడుస్తోంది.

    అల్యూమినియం సల్ఫేట్‌లో ప్రధాన లోపం కరిగిన సేంద్రీయ పదార్థం పెరగడం. దీన్ని తొలగించే ప్రక్రియ ఖర్చును పెంచుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని తక్కువ ఖర్చుతో సమర్థంగా ఉపయోగించవచ్చని రైస్ తెలిపారు.

    మైక్రోప్లాస్టిక్స్ తొలగింపులో కోగ్యులేషన్ కీలకం
    కోగ్యులేషన్ అంటే చిన్న చిన్న కణాలు ఒకదానికొకటి అతుక్కుని పెద్ద గుంపులుగా మారే ప్రక్రియ. సరళంగా చెప్పాలంటే నీటిలో తేలియాడే సూక్ష్మ కణాలు విడిగా ఉండకుండా ఒకచోట చేరేలా చేయడం. నీటి శుద్ధిలో ఇది ముఖ్యమైన దశ. ఈ ప్రక్రియలో కణాలపై ఉన్న విద్యుత్ ఛార్జ్ తగ్గించి వాటిని కలిసేలా చేస్తారు. దీంతో అవి పెద్ద ముద్దలుగా మారి సులభంగా వడపోతలో తొలగించవచ్చు

    మైక్రోప్లాస్టిక్స్ ఇతర కాలుష్య కణాలకు నెగటివ్ విద్యుత్ ఛార్జ్ ఉంటుంది. అందువల్ల అవి ఒకదానిని మరొకటి తోసుకుంటాయి. వడపోతలో వాటిని పట్టడం కష్టమవుతుంది. కోగ్యులెంట్లు మునగ ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ ఈ ఛార్జ్‌ను తటస్థం చేస్తాయి. దీంతో కణాలు పెద్ద గుంపులుగా మారతాయి.. సులభంగా తొలగించవచ్చు. గత పరిశోధనలో మునగ గింజలు ఫ్లోక్యులేషన్ సెడిమెంటేషన్ ఫిల్ట్రేషన్ వంటి పూర్తి శుద్ధి ప్రక్రియలో సమర్థంగా పనిచేస్తాయని నిరూపించాయి.

    ప్రయోగశాల పరీక్షలు
    పరిశీలన కోసం బృందం ట్యాప్ నీటిలో పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ మైక్రోప్లాస్టిక్స్ కలిపింది. పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ ఇది. జన్యు మార్పులకు క్యాన్సర్‌కు కారణమయ్యే లక్షణాలు ఉంటాయి. ఇది నీటి ఉపరితలాల్లో సాధారణంగా కనిపిస్తుంది. సంప్రదాయంగా మనం చేసే నీటి శుద్ధి తర్వాత కూడా మిగిలి ఉండవచ్చు. 

    పీవీసీపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రయోగించారు. తర్వాత కలుషిత నీటిని జార్ టెస్ట్ విధానంతో కోగ్యులేషన్ ఫిల్ట్రేషన్ చేశారు. ఇది చిన్న స్థాయి నీటి శుద్ధి ప్రక్రియ. ఫలితాలను కొలవడానికి స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఎస్ఈఎం ఉపయోగించారు. ఇది సూక్ష్మ కణాలను పెద్దగా చూపించే సాంకేతిక పద్ధతి. కణాల పరిమాణం గుంపులను హై స్పీడ్ కెమెరా లేజర్ కొలతలతో విశ్లేషించారు. రెండు విధానాలు సమానంగా మైక్రోప్లాస్టిక్స్ తొలగించాయి.