Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్‌ప్రైజ్‌ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్‌ 'గాడ్ ఆఫ్ వార్‌'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్‌ హ్యాండిల్‌లో మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు.  

    ఈ పరిణామంతో తారక్‌ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్‌' ప్రాజెక్ట్‌ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్‌మీడియా హ్యాండిల్‌ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్‌' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.  ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్‌' ప్రాజెక్ట్‌ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్‌ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్‌ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు.
     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఎప్పటిలాగే ఉంటుంది. ఈ గురువారమే మోహన్ లాల్ దృశ్యం-3 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఫ్రైడే చిన్న సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ వారంలో చూస్తే నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, పురుషః లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే దురంధర్ అన్‌కట్ వర్షన్ కూడా వచ్చేస్తోంది. దీంతో పాటు హిందీ సినిమా సిస్టమ్, మధువిదు లాంటి మలయాళ సినిమా కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అంతేకాకుండా పలు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు ఓటీటీల్లో ఈ శుక్రవారమే సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్..

    •    లేడీస్ ఫస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 22

    •    దిస్ ఈజ్ నోటా టెస్ట్(హాలీవుడ్ మూవీ)- మే 22

    •    మేటింగ్ సీజన్.. సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- మే 22

    •   దురంధర్‌(అన్‌కట్ వర్షన్)- మే 22

    •   గబ్బీస్ డాల్‌హౌస్(హాలీవుడ్ మూవీ)- మే 22

    •   గోట్(యానిమేషన్ మూవీ)- మే 24

    •   బ్యాడ్ థాట్స్- సీజన్ 2- మే 24

    అమెజాన్ ప్రైమ్-

    •   సిస్టమ్(బాలీవుడ్ సినిమా)- మే 22

    •   ది బ్రైడ్(హాలీవుడ్ మూవీ)- మే 22

    సన్ నెక్ట్స్..

    •    బీష్మార్(మలయాళం సినిమా)- మే 22

    •    శేష 2016(కన్నడ సినిమా)- మే 22


    జియో హాట్‌స్టార్..

    •    స్కై ప్లస్ మెడ్ సీజన్ 4(హాలీవుడ్ సిరీస్)- మే 22

    •  దురంధర్(అన్‌కట్ వర్షన్)- మే 22

    జీ5

    •  వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విలంగ్(తమిళ సిరీస్)- మే 22

    •   మేము కాపులం(తెలుగు సిరీస్)- మే 22

    •  సత్రంగి బద్‌లే కా ఖేల్(హిందీ సినిమా)- మే 22

    సోనీలివ్..

    •    మధువిదు(మలయాళ సినిమా)- మే 22

    లయన్స్ గేట్ ప్లే..

    •    పండప్లాన్ ది మ్యాజికల్ ట్రైబ్(హాలీవుడ్ మూవీ)- మే 22

    ఎంఎక్స్ ప్లేయర్..

    • వు ఈజ్ యువర్ గైనాక్?- సీజన్ 2(బాలీవుడ్ సిరీస్)- మే 22

     

     

     

  • ఈ ఏడాది టాలీవుడ్‌లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

    అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్‌ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్‌ను ఫాలో కావాలని విరోష్‌ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్‌కు భిన్నంగా ప్లాన్‌ చేసుకున్నారని వెల్లడించారు.  వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.

    ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
     

  • మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్‌  ఎంటర్‌టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్‌ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్‌ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

    అయితే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ న్యూస్‌ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్‌ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే  బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్‌తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్  మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.

    ఏడాదిన్నర క్రితమే ప్లాన్..

    దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు.  ముఖ్యంగా తన ఫిట్‌నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. 

    కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్‌లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్‌పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది.
     

  • టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

    ఈ సినిమాకు  కమల్‌తేజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్‌ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్‌గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ  జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

  • aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో  వైరలవుతోంది.

    ఇక ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్‌ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్‌గా మేకోవర్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

     

     

     

  • వరుణ్‌ తేజ్‌ సతీమణి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన రొమాంటిక్‌ కామెడీ చిత్రం సతీ లీలావతి. పెళ్లి తర్వాత లావణ్య చేసిన మూవీ ఇదే కావడం విశేషం. మే 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో కేవలం 12 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ వేదికగా ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

    తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ ‍అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ సన్‌ నెక్ట్స్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం రెండు ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ అడియన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహించారు. ప్రేమ, పెళ్లి, విడాకుల అనే అంశాలతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    సతీ లీలావతి కథేంటంటే..

    లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్‌ డైరెక్టర్‌. ఇంట్లో పెరెంట్స్‌ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్‌ రామ్‌ సేతు(దేవ్‌ మోహన్‌)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్‌) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్‌.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.

    ప్రస్తుతం తాను  నర్స్‌ నికోలా సెబాస్టియన్‌ (మడోన్నా సెబాస్టియన్‌)తో  రిలేషన్‌లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్‌ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్‌ తమలపాకుల(వీటీవీ గణేష్‌)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి?  ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్‌(మొట్ట రాజేంద్రన్‌) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
     

     

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్‌ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉ‍ప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్‌ కాన్సెప్ట్‌  ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.

    మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్‌గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్‌ మ్యాన్‌ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్‌ సాంగ్‌లో మెప్పించనుంది. 
     

  • బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.

    ఈ నేపథ్యంలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌పై మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 22 నుంచి ఓటీటీలో అన్‌కట్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. రెండు ఓటీటీల్లోనూ ఒకేరోజు ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌తో జియోహాట్‌స్టార్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ అన్‌కట్‌ వర్షన్ దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఉండనుందని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

     

     

  • జ్యోతిక సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌ అవడానికి ముందు బాలీవుడ్‌లో ట్రై చేసింది. డోలి సజాకే రఖ్నా (1998) చిత్రంతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. అక్షయ్‌ ఖన్నా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. తొలి సినిమాయే కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌ తనకు మరో అవకాశమివ్వకుండా తలుపులు మూసేసింది. దాంతో తమిళంలో ట్రై చేసింది. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.

    ప్రేమ- పెళ్లి
    అయితే కెరీర్‌ ప్రారంభంలోనే ప్రేమలో పడింది జ్యోతిక. 'పూవెల్లం కెట్టుప్పార్‌' సినిమాలో సూర్యతో కలిసి నటించగా.. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వీరు జంటగా నాలుగు సినిమాల్లో యాక్ట్‌ చేయగా ఆ ప్రేమబంధం మరింత బలపడింది. 2006 సెప్టెంబర్‌ 11న తమ ప్రేమను వైవాహిక బంధంతో పదిలపర్చుకున్నారు. ఈ జంటకు కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం.

    ఆదరించని బాలీవుడ్‌
    పెళ్లయ్యాక కొంత గ్యాప్‌ తీసుకున్న ఈ హీరోయిన్‌ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈసారి బాలీవుడ్‌ నుంచే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు పొమ్మన్న బాలీవుడే ఈసారి రారమ్మని ఎర్ర తివాచీ పరుస్తోంది. దీని గురించి జ్యోతిక మాట్లాడుతూ.. నా ఫస్ట్‌ హిందీ చిత్రం ఆడనందుకు బాలీవుడ్‌ నా ముఖంపైనే తలుపేసింది. తమిళంలో కూడా నా మొదటి సినిమా ఆడలేదు. కానీ ఇక్కడ నా పనితనాన్ని మెచ్చి వరుస అవకాశాలిచ్చారు. అదే అక్కడికీ, ఇక్కడికీ తేడా!

    అదే ప్లస్‌, మైనస్‌
    అయితే అప్పటికీ, ఇప్పటికీ బాలీవుడ్‌లో చాలా మార్పు వచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి అంది. కాగా జ్యోతిక నటించిన సిస్టమ్‌ సినిమా మే 22న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

    చదవండి: డ్రాగన్‌ గ్లింప్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

  • మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ కాంబినేషన్‌లోని సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే రెండు భాగాలు (దృశ్యం, దృశ్యం 2) రాగా.. రెండూ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు మూడో భాగం దృశ్యం 3 ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయిగే గత రెండు భాగాలను తెలుగులో హీరో వెంకటేష్‌ రీమేక్‌ చేయగా.. పార్ట్‌ 3 మాత్రం మలయాళ చిత్రాన్నే తెలుగు డబ్బింగ్‌ చేసి నేడు(మే 21) రిలీజ్‌ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్‌ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్‌) వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్‌ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్‌. అది రిలీజై..బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి. 

    కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్‌)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్‌, ప్రభాకర్‌ మళ్లీ జార్జ్‌ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్‌ అయిన పోలీసు ఆఫీసర్‌ సహదేవన్‌ చేసిన కుట్ర ఏంటి?  వరుణ్‌ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే.. 
    అనుకోకుండా జరిగిన హత్య కేసు నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు పెద్దగా చదువులేని మధ్యతరగతి వ్యక్తి ఏం చేశాడు? అనేది ‘దృశ్యం’ కథ. ఈ ఒక్క లైన్‌తోనే ఇప్పటికే రెండు పార్టులు తీసి హిట్‌ కొట్టాడు దర్శకుడు జీతూ జోసెఫ్‌.  అందుకే పార్ట్‌ 3పై ముందుగానే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సారి ఎలాంటి ట్విస్టులు ఉంటాయి?  కేసు నుంచి తన ఫ్యామిలీని జార్జ్‌ ఎలా బయటపడేస్తాడు? అనే క్యూరియాసిటీతో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులను జీతూ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు. ట్విస్టులు, సస్పెన్స్‌ సన్నివేశాలు ఉన్నప్పటికీ..  వాటిలో కొత్తదనం కొరవడింది.  చివరి అరగంట తప్ప మిగతా కథనం అంతా రొటీన్‌గానే ఉంటుంది. ఫస్టాఫ్‌ కథనం స్లోగా సాగుతూ.. సహనానికి పరీక్షగా మారుతుంది.  

    ఇంటర్వెల్‌ సీన్‌  సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం ప్రారంభంలో కూడా కథనం నెమ్మదిగానే సాగినప్పటికీ.. ఒక్కో పాత్ర ఎంట్రీతో కథపై ఆసక్తి పెరుగుతుంది.  ఇక కూతురు పెళ్లి ఆపేదెవరని జార్జ్‌కి తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. అంజు అరెస్ట్‌ కోసం జరిగే కుట్రలు.. వాటిని తిప్పికొట్టేందుకు జార్జ్‌ వేసే ప్లాన్స్‌ అన్నీ అదిరిపోతాయి.  చివరి అరగంట అయితే మళ్లీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ తరహాలో కథనం సీరియస్‌గా సాగుతూ.. తర్వాత ఏం జరుగుతుందా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించాడు దర్శకుడు. అక్కడ వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.  

    ఎవరెలా చేశారంటే.. 
    ఎప్పటి మాదిరే మోహన్‌ లాల్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జార్జ్‌కుట్టి పాత్రలో జీవించేశాడు.  అతని భార్య రాణిగా మీనా చక్కగా నటించింది. ఇక కూతుళ్లుగా నటించిన ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర బాగానే చేశారు. సహదేవన్‌, ప్రభాకర్‌ పాత్ర ధారులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

    సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్‌ బాగుంది. తెలుగు డబ్బింగ్‌ అస్సలు బాగోలేదు. డబ్బింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Sports

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓట‌మితో ముగించింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో 89 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో సీఎస్‌కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది. 

    ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చెన్నైకు ప్లే ఆఫ్స్ రేసులో ఉండేది. కానీ ఓడిపోవ‌డంతో ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే క‌థ ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. 

    శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84), జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 57 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీల‌తో రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో స్పెన్స‌ర్ జాన్స‌న్‌, అన్షుల్ కాంబోజ్‌, ముకేశ్‌ చౌదరి త‌లా వికెట్ సాధించారు. ఆ త‌ర్వాత 230 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే.. గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

    గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, కగిసో రబాడ, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
    చదవండి: గుజరాత్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్‌-2026లో భాగంగా గురువారం నాటి ఈ పోరులో వీరిద్దరు అర్ధ శతకాలతో రాణించారు.

    కెప్టెన్‌ గిల్‌ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్‌ 53 బంతులు ఎదుర్కొని 84 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

    74 బంతుల్లో 125 పరుగులు
    ఇక చెన్నైతో మ్యాచ్‌లో సాయి- గిల్‌ కలిసి తొలి వికెట్‌కు 74 బంతుల్లో 125 పరుగులు జోడించారు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.

    ఐపీఎల్‌లో అత్యధికసార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ నిలిచారు. అంతేకాదు.. పాకిస్తాన్‌ బ్యాటర్లు బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేశారు. టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు వందకు పైగా పరుగులు జోడీగా నిలిచారు.

    ఐపీఎల్‌లో అత్యధికసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీలు
    👉సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)- ఏడుసార్లు
    👉అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)- ఆరుసార్లు
    👉శిఖర్‌ ధావన్‌- డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)- ఆరుసార్లు
    👉జానీ బెయిర్‌ స్టో- డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)ఐదుసార్లు
    👉ఫాఫ్‌ డుప్లెసిస్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) ఐదుసార్లు

    టీ20 క్రికెట్‌లో అత్యధికంగా పదిసార్లు 100కు పైగా పరుగులు జోడించిన జంటలు
    👉బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌- కరాచీ కింగ్స్‌)
    👉ఏబీ డివిల్లియర్స్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)
    👉క్రిస్‌ గేల్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)
    👉సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)

    మ్యాచ్‌ విషయానికొస్తే.. చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్లు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్‌)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

    చదవండి: మా చేతిలో పాక్‌ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్‌ కోచ్‌

  • ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సంచలన ప్రకటన చేసింది. అఫ్గనిస్తాన్‌ శరణార్థి మహిళా జట్టు తమ దేశ పర్యటనకు వస్తుందని తెలిపింది. ఈ టూర్‌ జూన్‌ 22 నుంచి మొదలుకానుందని పేర్కొంది.

    ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా
    ఇందులో భాగంగా అఫ్గన్‌ జట్టుకు టీ20 మ్యాచ్‌లకు సంబంధించి ఈసీబీ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తుందని తెలిపింది. అంతేకాదు.. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా అఫ్గన్‌ శరణార్థి జట్టు వీక్షిస్తుందని ఈసీబీ స్పష్టం చేసింది.

    గొప్ప జ్ఞాపకంగా
    ఎంసీసీ (మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌), ఎంసీసీ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఈ టూర్‌ కొనసాగుతుందని ఈసీబీ పేర్కొంది. ఈ విషయం గురించి ఈసీబీ డిప్యూటీ సీఈవో, మహిళల జట్టు మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్లేర్‌ కనోర్‌ మాట్లాడుతూ.. ‘‘2021లో అఫ్గనిస్తాన్‌ను వీడిన నాటి నుంచి..  అసాధారణ పట్టుదలతో తమ క్రికెట్‌ ప్రయాణాన్ని వారు కొనసాగిస్తున్నారు.

    ఎన్నో సవాళ్లకు ఎదురునిలిచి పోరాడుతున్నారు. ఈ పర్యటన వారికి గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుందని భావిస్తున్నాం. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా వారు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. ఈ టూర్‌కు ఆతిథ్యం ఇస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము’’ అని పేర్కొన్నారు.

    ఆస్ట్రేలియాలో
    కాగా అఫ్గనిస్తాన్‌ (2021)లో తాలిబన్ల పాలన తిరిగి మొదలైన తర్వాత.. మహిళలపై ఆంక్షలు మళ్లీ పెరిగాయి. క్రీడలు, ప్రజా జీవితం నుంచి వారిని బహిష్కరించారు. ఈ క్రమంలో అఫ్గన్‌కు చెందిన దాదాపుగా ఇరవై మంది మహిళా క్రికెటర్లు దేశం విడిచి వెళ్లిపోయారు.

    ప్రస్తుతం వారంతా ఆస్ట్రేలియాలో స్థిరపడినట్లు సమాచారం. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లోని జంక్షన్‌ ఓవల్‌ మైదానంలో 2025 జనవరిలో క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవన్‌ జట్టుతో అఫ్గన్‌ మహిళా జట్టు మ్యాచ్‌ ఆడింది. 

    అంతేకాదు.. గువాహటిలో భారత్‌- శ్రీలంక మధ్య వన్డే వరల్డ్‌కప్‌-2025 ఆరంభ మ్యాచ్‌కు కూడా ఈ జట్టు హాజరైంది. తాజాగా ఇంగ్లండ్‌ పర్యటనకు కూడా అఫ్గన్‌ శరణార్థి జట్టు వెళ్లనుండటం విశేషం.

    చదవండి: ODI WC 2027: రోహిత్‌ శర్మకు బై.. బై!.. అతడికి లైన్‌ క్లియర్‌!

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో షాన్‌ మసూద్‌ బృందం మట్టికరిచిన సంగతి తెలిసిందే. రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లా పర్యటనకు వెళ్లిన పాక్.. ఆతిథ్య ‍జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్‌ అయింది.

    చిత్తు చిత్తుగా ఓడిన పాక్‌
    తొలి టెస్టులో ఏకంగా 104 పరుగుల తేడాతో ఓడిపోయింది పాక్‌. ఇక బుధవారం ముగిసిన రెండో టెస్టులో బంగ్లా 78 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 316/7తో ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది.

    ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అతడే 
    చివరి రోజు 11.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 42 పరుగులు జోడించి చివరి 3 వికెట్లు కోల్పోయింది. మొహమ్మద్‌ రిజ్వాన్‌ (166 బంతుల్లో 94; 10 ఫోర్లు) సెంచరీ అవకాశాన్ని కోల్పోగా...లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ 6 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. లిటన్‌ దాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ముష్ఫికర్‌ రహీమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

    ఈ విజయంతో బంగ్లా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరడం విశేషం. మరోవైపు.. పాకిస్తాన్‌ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ ముస్తాక్‌ అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

    మా చేతిలో పాక్‌ ఓటమి బాధించింది
    బంగ్లాదేశ్‌ గెలుపు తనకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ.. అంతకంటే ఎక్కువగా పాక్‌ ఓటమి తనను బాధించిందని ముస్తాక్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. కాగా ముస్తాక్‌ పాకిస్తాన్‌కు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. ఈ లెగ్‌ స్పిన్నర్‌ 1992లో వరల్డ్‌కప్‌ గెలిచిన పాక్‌ జట్టులో సభ్యుడు కూడా!

    బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ముస్తాక్‌ను తమ పురుషుల జట్టు స్పిన్‌బౌలింగ్‌ కోచ్‌గా 2024లో నియమించింది. అతడి మార్గదర్శనంలో బంగ్లా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సొంతగడ్డపై తొలిసారి పాక్‌ను టెస్టుల్లో వైట్‌వాష్‌ చేసింది బంగ్లాదేశ్‌.

    గ్రూప్‌ ఫొటో కూడా దిగలేదు 
    ఈ నేపథ్యంలో విజయానంతరం ముస్తాక్‌ అహ్మద్‌ తన సొంత దేశపు జట్టు ప్రదర్శన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలెవంత్‌ అవర్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఒక కోచ్‌గా బంగ్లాదేశ్‌ ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ పాకిస్తాన్‌ ఓటమి నిరాశపరిచింది. చాలా చాలా బాధగా ఉంది.

    పాకిస్తానీగా ఇలా నేను బాధపడటం సహజమే. నిజానికి పాక్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్‌ జట్టుతో నేను గ్రూప్‌ ఫొటో కూడా దిగలేదు’’ అని ముస్తాక్‌ అహ్మద్‌ అన్నాడు. ఈ నేపథ్యంలో ముస్తాక్‌ తీరుపై బంగ్లాదేశ్‌ అభిమానులు మండిపడుతున్నారు. దేశం మీద అంత ప్రేమే ఉంటే.. అక్కడే కోచ్‌గా ఉండాల్సిందని.. బంగ్లా జట్టుతో గ్రూప్‌ ఫొటో దిగకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.

    చదవండి: ODI WC 2027: రోహిత్‌ శర్మకు బై.. బై!.. అతడికి లైన్‌ క్లియర్‌!

  • అహ్మ‌దాబాద్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 89 ప‌రుగుల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, కగిసో రబాడ, రషీద్‌ ఖాన్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి చెన్నై పతనాన్ని శాసించారు.
    Updates:
    సీఎస్‌కే ఏడో వికెట్‌ డౌన్‌
    రషీద్‌ ఖాన్‌ వేసిన 13వ ఓవర్‌లో 
    సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది.  తొలి బంతికి కాంబోజ్‌(19) అవుట్‌ కాగా.. నాలుగో బంతికి బ్రెవిస్‌(8) పెవిలియన్‌కు చేరాడు.

    శివమ్‌ దూబే(17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) రూపంలో సీఎస్‌కే ఆరో వికెట్‌ కోల్పోయింది. 11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 123/6

    దూకుడుగా ఆడుతున్న దూబే
    10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 5 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. శివ‌మ్ దూబే దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లో 41 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

    ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్‌
    2.3: సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఉర్విల్‌ పటేల్‌ (0). స్కోరు: 36-3(3.2)
    కార్తిక్‌ శర్మ 6, మాథ్యూ షార్ట్‌ 13 పరుగులతో ఉన్నారు. విజయానికి 194 పరుగులు కావాలి.
    2.2: సిరాజ్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 16)

    సంజూ శాంసన్‌ డకౌట్‌
    ఇన్నింగ్స్‌ తొలి బంతికే చెన్నై తమ ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (0) వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్‌కు తోడుగా రుతురాజ్‌ గైక్వాడ్‌ క్రీజులోకి వచ్చాడు.

    గుజరాత్‌ భారీ స్కోరు!
    ఓపెనర్లలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించి బలమైన పునాది వేశారు. వీరికి తోడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్‌)తో దుమ్ములేపాడు.

    ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో స్పెన్సర్‌ జాన్సన్‌ గిల్‌ను అవుట్‌ చేయగా.. అన్షుల్‌ కాంబోజ్‌ సాయి వికెట్‌ దక్కిచుకున్నాడు. ముకేశ్‌ చౌదరి వాషింగ్టన్‌ సుందర్‌ (7)ను పెవిలియన్‌కు పంపగా.. రాహుల్‌ తెవాటియా (0) రనౌట్‌ అయ్యాడు.

    వాషీ అవుట్‌
    19.6: ముకేశ్‌ చౌదరి బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరిన వాషీ (7).

    మూడో వికెట్‌ డౌన్‌
    18.3: రాహుల్‌ తెవాటియా (0) రనౌట్‌. మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌. స్కోరు: 207-3(18.3). వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజులోకి వచ్చాడు.

    సాయి సుదర్శన్‌ అవుట్‌
    18.2: అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్‌. 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసిన సాయి. రాహుల్‌ తెవాటియా క్రీజులోకి రాగా.. బట్లర్‌ 43 పరుగులతో ఉన్నాడు. 

    గుజరాత్‌ డబుల్‌ సెంచరీ
    17.6: గుర్జప్నీత్‌ బౌలింగ్‌లో బట్లర్‌ ఫోర్‌ తీయగా.. గుజరాత్‌ డబుల్‌ సెంచరీ మార్కు అందుకుంది. స్కోరు: 201-1(18). బట్లర్‌ 43, సుదర్శన్‌ 78 పరుగులతో ఉన్నారు.

    పదిహేను ఓవర్లలో గుజరాత్‌ స్కోరు: 159-1
    జోస్‌ బట్లర్‌ 26, సాయి సుదర్శన్‌ 57 పరుగులతో ఉన్నారు.

    తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    12.2: గిల్‌ రూపంలో గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. స్పెన్సర్‌ జాన్సన్‌ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి.. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్‌ పెవిలియన్‌ చేరాడు.

    మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న గిల్‌ ఖాతాలో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. స్కోరు: 129-1. జోస్‌ బట్లర్‌ క్రీజులోకి రాగా.. సుదర్శన్‌ 51 పరుగులతో ఉన్నాడు.

    సాయి సుదర్శన్‌ ఫిఫ్టీ
    11.1: నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్‌. ఈ సీజన్‌లో అతడికి ఇది వరుసగా ఐదో అర్ధ శతకం.

    పది ఓవర్లలో గుజరాత్‌ స్కోరు: 111-0
    ఓపెనర్లు గిల్‌ 30 బంతుల్లో 62, సుదర్శన్‌ 30 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.

    గిల్‌ అర్ధ శతకం
    6.6: నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న శుబ్‌మన్‌ గిల్‌. 23 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న గిల్‌. స్కోరు: 78-0.

    పవర్‌ ప్లేలో గుజరాత్‌ స్కోరు: 62-0 (6)
    గిల్‌ 18 బంతుల్లో 35, సుదర్శన్‌ 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు.

    హాఫ్‌ సెంచరీ
    5.1: అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ ఫోర్‌ బాదగా.. గుజరాత్‌ యాభై పరుగుల మార్కు అందుకుంది.

    తొలి ఓవర్లో గుజరాత్‌ స్కోరు: 8-0
    ముకేశ్‌ చౌదరి చెన్నై బౌలింగ్‌ ఎటాక్‌ మొదలుపెట్టగా.. గిల్‌ ఏడు, సాయి సుదర్శన్‌ ఒక పరుగుతో ఉన్నారు.

    టాస్‌ గెలిచిన చెన్నై 
    ఐపీఎల్‌-2026లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్తులు ఖరారయ్యాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ముందుగా టాప్‌-4లో అడుగుపెట్టగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి అర్హత సాధించింది. తమతో పాటు గుజరాత్‌ టైటాన్స్‌ను కూడా ప్లే ఆఫ్స్‌నకు తీసుకువెళ్లింది.

    మిగిలిన ఒక్క స్థానం కోసం
    ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఐదు జట్లు (రాజస్తాన్‌, పంజాబ్‌, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) అధికారికంగా రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై తమ లీగ్‌ దశలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో అద్భుతం జరగాలని కోరుకుంటోంది. ఇందుకు పటిష్ట గుజరాత్‌ టైటాన్స్‌తో గురువారం తలపడేందుకు సిద్ధమైంది.

    తుదిజట్లలో మార్పులు ఇవీ
    అహ్మదాబాద్‌ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సందర్భంగా చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. అకీల్‌ హొసేన్‌ స్థానంలో గుర్జప్నీత్‌ సింగ్‌, ప్రశాంత్‌ వీర్‌ స్థానంలో మాథ్యూ షార్ట్‌ వచ్చినట్లు తెలిపాడు.

    ఇక గుజరాత్‌ టైటాన్స్‌ సైతం తమ తుదిజట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు. సాయి కిషోర్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

    గుజరాత్‌ వర్సెస్‌ చెన్నై తుదిజట్లు
    గుజరాత్‌
    సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.

    చెన్నై
    సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్‌, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముకేశ్‌ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

  • టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

    ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్‌ (జూన్‌ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.

    గుర్నూర్‌ బ్రార్‌కు తొలిసారి పిలుపు 
    ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్‌ బ్రార్‌ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణతో కలిసి పేస్‌ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్‌తో టెస్టుకు ఆకిబ్‌ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.

    కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్‌ నబీ పట్ల సెలక్షన్‌ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్‌ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్‌ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.

    అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?
    అతడి బౌలింగ్‌లో తగినంత పేస్‌ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.

    ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్‌కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్‌ లభించేది.

    టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్‌తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్‌ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్‌నెస్‌ సమస్యలు కూడా లేవు.

    ఏం మెసేజ్‌ ఇస్తు న్నారు?
    దేశీ క్రికెట్లో ఓ బౌలర్‌గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్‌ కమిటీకి ఆకిబ్‌ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. 

    కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్‌లో పది మ్యాచ్‌లలో ఆకిబ్‌ నబీ జమ్మూ కశ్మీర్‌ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్‌.. 44 వికెట్లతో సత్తా చాటాడు.

    చదవండి: నితీశ్‌ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్‌.. పాపం పంత్‌!.. కొత్త ముఖాలు ఇవే

  • సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌-2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. శుక్రవారం (మే 22) జరిగే ఈ మ్యాచ్‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక. 

    ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన సన్‌రైజర్స్‌కు సొంతమైదానంలో ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.

    ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మార్పులు (డైవర్షన్లు) అమలు చేయనున్నట్లు సంబంధిత విభాగం వెల్లడించింది. ఇందుకు సంబంధించి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–II) పత్రికా ప్రకటన విడుదల చేశారు.

    ఈ వాహనదారులకు అలెర్ట్‌
    లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు మరియు ట్రాక్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సి ఉంటుంది. 

    ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు నాగోల్ నుండి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం).. అదే విధంగా బోడుప్పల్ నుండి అంబర్‌పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది.

    కాబట్టి ప్రజలు వీలైనంతవరకు ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడం శ్రేయస్కరం.

    ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు:
    👉ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద HMDA ఉప్పల్ భగ్యాత్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ – ఎల్.బి.నగర్ వైపు మళ్లించబడతాయి.
    👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద U-టర్న్ తీసుకుని నాగోల్ U-టర్న్ – HMDA భగ్యాత్ – టయోటా U-టర్న్ – బోడుప్పల్ – చెంగిచెర్ల – IOCL చెర్లపల్లి / ఘట్‌కేసర్ వైపు మళ్లించబడతాయి.
    👉తార్నాక నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ X రోడ్ వద్ద నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్‌కేసర్ వైపు మళ్లించబడతాయి.
    👉రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ X రోడ్ – నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్‌కేసర్ వైపు మళ్లించబడతాయి.

    👉ఇక ఉప్పల్ జంక్షన్లోని ఎలివేటెడ్ కారిడార్ వర్క్ పనులు జరుగుతున్నందున వరంగల్ రహదారి మూసివేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులను సర్వే ఆఫ్ ఇండియా వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డమీదుగా వరంగల్ రహదారి మీదుగా బోడుప్పల్,  ఘట్కేసర్, వరంగల్ కు పంపించబడుతున్నవి. 

    👉అలాగే వరంగల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్ వచ్చే వాహనదారులను మే ఫీల్ హోటల్ వద్ద ఉప్పల్ బగాయతు మీదుగా నాగోల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్కు పంపించబడుచున్నవి.

    👉వరంగల్ నుండి హైదరాబాద్‌కు ఉప్పల్ మార్గం ద్వారా వచ్చే హెవీ వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ORR ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ – ఎల్.బి.నగర్ – దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో ప్రయాణించాలి.

    👉హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ఉప్పల్ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు ఎల్.బి.నగర్ – హయత్‌నగర్ ద్వారా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.

    ప్రేక్షకులకు సాధారణ సూచనలు:
    👉మ్యాచ్ సందర్భంగా మొత్తం (05) ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వీటిలో (04) స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో సాధారణ ప్రజల కోసం ఉండగా, ఒకటి స్టేడియం లోపల (VVIP/VIP పాస్ హోల్డర్లకు మాత్రమే) కేటాయించబడింది.

    👉స్టేడియం బయట పార్కింగ్ (సాధారణ ప్రజలకు):
    ఉప్పల్ X రోడ్స్ నుండి హబ్సిగూడ వైపు: పెంగ్విన్ ,TGIALA

    👉ఉప్పల్ X రోడ్స్ నుండి రామంతాపూర్ వైపు:
    DSL ఓపెన్ ప్రదేశం (NSL భవనం ఎదురుగా)
    మోడర్న్ బేకరీ

    👉స్టేడియం లోపల పార్కింగ్ (పాస్ హోల్డర్లకు మాత్రమే):
    VVIP/VIP మరియు అనుమతిపత్రం కలిగినవారు మాత్రమే A గ్రౌండ్ పార్కింగ్ ఉపయోగించాలి. ప్రవేశం గేట్ 1A ద్వారానే ఉంటుంది.
    చెల్లుబాటు అయ్యే పాస్ లేని వాహనాలను EK మినార్ మరియు LG గోదాం చెక్‌పోస్టుల దాటి అనుమతించరు.

    పార్కింగ్ మార్గదర్శకాలు:
    👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ స్టేడియం:
    DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి కెమ్‌వేదా జంక్షన్ వరకు ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాలి.
    👉హబ్సిగూడ నుండి ఉప్పల్ స్టేడియం:
    సర్వే ఆఫ్ ఇండియా వద్ద U-టర్న్ తీసుకుని EK మినార్ వద్ద పెంగ్విన్ పార్కింగ్ మరియు TG IALA పార్కింగ్‌లో వాహనాలు నిలిపివేయాలి.
    👉రామంతాపూర్ నుండి ఉప్పల్ స్టేడియం:
    DSL మాల్ వద్ద U-టర్న్ తీసుకుని DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి చం వేద జంక్షన్ వరకు పార్కింగ్ చేయాలి.

    పై మార్గాలు, తేదీలు, సమయాలను గమనించి ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే, ప్రజలు RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించగలరు.

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన ముంబై.. మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

    ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌తో హార్దిక్‌ పాండ్యా ముంబై కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఈ ఆల్‌రౌండర్‌.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అయితే, వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు.

    నిజానికి కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతిని రోవ్‌మన్‌ పావెల్‌ గాల్లోకి లేపాడు. అప్పుడు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రాబిన్‌ మింజ్‌, దీపక్‌ చహర్‌ అలా చూస్తూ ఉండిపోయారే తప్ప బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.

    ఈ క్రమంలో చహర్‌ స్పందించి ముందుకు రాగా బంతి నేలమీద పడిపోయింది. దీంతో హార్దిక్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఏడవలేక నవ్వినట్లుగా చప్పట్లు కొడుతూ వ్యంగ్య రీతిలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య కోల్‌కతా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు చేసింది.

    లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. మనీశ్‌ పాండే (45), రోవ్‌మన్‌ పావెల్‌ (40) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవం చేసుకోగా.. ముంబై పదమూడింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ అనుకుల్‌ రాయ్‌కు సువర్ణావకాశం వచ్చింది. భారత్‌-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్‌ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్‌కు అనుకుల్‌ రాయ్‌ ఎంపికయ్యాడు.

    హర్ష్‌ దూబే స్థానంలో..
    ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.

    కారణం ఇదే
    కాగా హర్ష్‌ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్‌తో సిరీస్‌ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్‌ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్‌ రాయ్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    జార్ఖండ్‌కు చెందిన 27 ఏళ్ల అనుకుల్‌ రాయ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్‌-2026లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

    తిలక్‌ వర్మ సారథ్యంలో
    ఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్‌-‘ఎ’, అఫ్గన్‌-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్‌ 9- జూన్‌ 21 మధ్య ఈ సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్‌ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

    ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత్‌-‘ఎ’ జట్టు (అప్‌డేటెడ్‌)
    తిలక్‌ వర్మ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్య, వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆయుశ్‌ బదోని, నిశాంత్‌ సంధు, సూయాన్ష్‌ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), విప్రాజ్‌ నిగమ్‌, యశ్‌ ఠాకూర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌, అన్షుల్‌ కాంబోజ్‌, అర్షద్‌ ఖాన్‌, అనుకుల్‌ రాయ్‌.

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్‌ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్‌.. వన్డే వరల్డ్‌కప్‌-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.

    టైటిల్‌ గెలిచిన తర్వాత వేటు 
    ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్‌లోనే హిట్‌మ్యాన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్‌ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.

    ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్‌ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.

    ఫిట్‌నెస్‌ సమస్యలు
    ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్‌లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

    ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్‌కు లోబడి ఈ సిరీస్‌లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.

    బాగా సన్నబడ్డాడు.. కానీ 
    రోహిత్‌ భవిష్యత్‌ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు గత మూడు వారాల్లో రోహిత్‌ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్‌కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.

    జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ మాదిరి వన్డే క్రికెట్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్‌ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.

    రోహిత్‌కు బై.. బై!.. జైసూకు లైన్‌ క్లియర్‌!
    నిజానికి వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్‌ కిషన్‌ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.

    అతడు కూడా ఓపెనింగ్‌ చేయగలడు. వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్‌మన్‌ గిల్‌ లేదంటే యశస్వి జైస్వాల్‌ గాయపడినా మరో బ్యాకప్‌ ఓపెనర్‌ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది. 

    అగార్కర్‌ సంకేతాలు
    కాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ భారత వన్డే జట్టు ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

    వైభవ్‌ కంటే ముందు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్‌కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్‌ ఓపెనర్‌గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    చదవండి: హార్దిక్‌ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ

  • ఓ అంతర్జాతీయ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. క్రికెట్‌ కెనడా అధ్యక్షుడు అర్విందర్‌ ఖోసా నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్‌ వర్గాల్లో దుమారం రేపుతోంది.

    బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే నగరంలోని న్యూటన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మే 20 తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఖోసా ఇంటి వద్ద పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంటి తలుపులు, కిటికీలపై బుల్లెట్‌ గుర్తులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది.

    ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సర్రే పోలీసులు.. ఎక్స్‌టోర్షన్‌ (దందా వసూళ్ల బెదిరింపులు)కు సంబంధించిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధం ఉన్న వ్యక్తికి గతంలో ఎక్స్‌టోర్షన్‌ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

    ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కెనడా క్రికెట్‌ చుట్టూ వివాదాలు పరిపాటిగా మారాయి. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆ జట్టుపై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఓ డాక్యుమెంటరీలో బయటపడిన వివరాల ప్రకారం.. 2026 ‍ప్రపంచకప్‌లో భాగంగా కెనడా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతుంది. 

    కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిని టోర్నీకి ముందు ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్‌గా నియమించడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

    పరిపాలనా సమస్యలు, ఆర్దికపరమైన అవకతవలు, ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా ఐసీసీ ఇటీవలే క్రికెట్‌ కెనడాకు ఆరు నెలలపాటు ఫండింగ్‌ను ఆపింది. ఇలాంటి తరుణంలో బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. 

National

  • న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం గురువారం సుమారు నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. దేశ అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, “వికసిత్ భారత్” లక్ష్యాల సాధనపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

    సమావేశంలో కేంద్ర వాణిజ్య, ఆర్థిక శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను వివరిస్తూ నివేదికలు సమర్పించాయి. ప్రభుత్వ పనితీరు మరింత వేగవంతం కావాలని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు మరియు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

    క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయ మంత్రులు సమావేశానికి హాజరై తమ శాఖల పనితీరు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై వివరాలు అందించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, ప్రజలకు సేవల అందుబాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.

    అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ ఆసియా సంక్షోభం (West Asia Crisis) మరియు దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందనే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. చమురు ధరలు, దిగుమతులు, వాణిజ్యంపై వచ్చే ప్రభావాలను అధికారులు మంత్రివర్గానికి వివరించినట్లు తెలుస్తోంది.

    ఇక వచ్చే జూన్ 9 నాటికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలు, భవిష్యత్ లక్ష్యాలపై కూడా సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

  • లక్నో: ఓ యువకుడిని చెరువులోకి ఈడ్చుకెళ్లింది మొసలి. ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో ఓ మహిళ అంత్యక్రియల సమయంలో సరయూ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన దీపక్ శర్మ తన అత్త ఊర్మిళా దేవి మరణంతో గొండా జిల్లాలోని ఉమ్రీ గ్రామానికి వెళ్లాడు. 

    నది ఒడ్డున చితిని సిద్ధం చేసే పనిలో భాగంగా గుంత తవ్విన తర్వాత అతడు నదిలో స్నానానికి దిగాడు. అదే సమయంలో నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి అతడి తలను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. క్షణాల్లో ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    అంత్యక్రియలకు వచ్చినవాళ్లు నదిలోకి దిగొద్దని హెచ్చరించినా శర్మ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షి రాజేశ్ శుక్లా మీడియాకు చెప్పారు. అక్కడున్నవాళ్ల కేకలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు, స్థానిక పడవ నడిపేవారు వెంటనే గాలింపు చేపట్టారు. అయినా శర్మ ఆచూకీ దొరకలేదు. 

    ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారు. రెవెన్యూ శాఖ బృందం కూడా గాలింపు చేపట్టింది. అయినా ఫలితం రాలేదు. గాలింపును మరింత వేగవంతం చేయటానికి లక్నో నుంచి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పిలిచారు. 

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించారు. కొత్త‌గా 23 మందికి త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించారు. తమిళగ వెట్రి కళ‌గం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వ‌ర్గంలో చేర్చుకున్నారు. లోక్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వీరితో గ‌ర్న‌వ‌ర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం విజ‌య్‌,  ప్రభుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయికుమార్ పాల్గొన్నారు. 

    కొత్త‌గా చేరిన మంత్రుల‌తో త‌మిళ‌నాడు కేబినెట్‌లోని స‌భ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్త‌ర‌ణ జ‌ర‌డంతో ఇంత‌కుముందు ఉన్న మంత్రుల శాఖ‌ల్లో మార్పులు చేశారు. కొత్త‌గా చేరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. సీఎం విజ‌య్ కూడా త‌న ద‌గ్గ‌రున్న కొన్ని శాఖ‌ల‌కు కొత్త మంత్రుల‌కు బ‌దిలీ చేశారు. 

    ఎన్నిక‌ల్లో హామీయిచ్చిన‌ట్టుగానే ప్ర‌త్యేకంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖ‌ను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్ట‌ర్‌ ఆర్ కుమార్‌కు ఈ శాఖ‌ను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖ‌ను కూడా ఆయ‌నకే అప్ప‌గించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొంద‌నున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 

    కాంగ్రెస్‌కు కీల‌క శాఖ‌లు
    కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్‌. రాజేశ్‌కుమార్‌, పి. విశ్వ‌నాథ‌న్ మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల త‌ర్వాత త‌మిళనాడు కేబినెట్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం ద‌క్కింది. రాజేశ్‌కుమార్ ప‌ర్యాట‌క శాఖ‌, విశ్వ‌నాథ‌న్‌కు ఉన్న‌త‌విద్య శాఖ కేటాయించారు. 

    ఇది ఊహించ‌లేదు: ఐయూఎంఎల్
    త‌మ‌ను మంత్రి వ‌ర్గంలో చేర‌మ‌ని సీఎం విజ‌య్ ఆహ్వానిస్తార‌ని ఊహించ‌లేద‌ని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్ర‌భుత్వానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని, మంత్రి పదవుల కోసం తాము అడ‌గ‌లేద‌ని చెప్పారు. టీవీకే ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌పోతే గవర్నర్ పాలన వస్తుందని, త‌ద్వారా బీజేపీ పెత్త‌నం చెలాయిస్తుంద‌నే ఉద్దేశంతోనే విజ‌య్‌కు మద్ద‌తు ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించిన‌ట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని స‌మాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణ‌యం   వెల్ల‌డించ‌లేదు.

    చ‌ద‌వండి: యూపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం!

  • సాక్షి, న్యూఢిల్లీ:  2019 నాటి ఘోరమైన పుల్వామా ఉగ్రదాడిలో కీలక నిందితుడైన ఉగ్రవాది హంజా బుర్హాన్ (Hamza Burhan) గుర్తుతెలియని దుండగుల చేతిలో హతయ్యాడు.  40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో  దుండగులు కాల్చి చంపారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్, PoKలలో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదుల రహస్య హత్యలు చర్చనీయాంశంగా మారింది.

    పుల్వామా నుండి పాకిస్థాన్‌కు
    బుర్హాన్ జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఖర్బత్‌పోరా ప్రాంతానికి చెందినవాడు. 2017లో, అతను ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. అయితే, అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ 'అల్-బదర్' (Al-Badr)లో చేరినట్లు నిఘా వర్గాల రికార్డులు తరువాత వెల్లడించాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ  కాలక్రమేణా కమాండర్ స్థాయికి ఎదిగాడు. కాశ్మీర్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్లాన్ చేయడం, స్థానిక యువతను ఉగ్రవాదం వైపు రిక్రూట్ చేయడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. భారత కేంద్ర హోంశాఖ (MHA) ఇతడి ఉగ్రవాద కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని, 2022లో దేశ వ్యతిరేక చట్టాల కింద ఇతడిని అధికారికంగా 'ఉగ్రవాది'గా ప్రకటించింది.

    ఇదీ చదవండి: భర్తను హత్య చేసిన భార్యకు కేవలం రూ. 500 ఫైన్‌, ఎందుకలా?

    పుల్వామా దాడి 
    హంజా బుర్హాన్ హత్యతో  2019 ఫిబ్రవరిలో దేశాన్ని కుదిపేసిన పుల్వామా ఉగ్రదాడి జ్ఞాపకాలు మరోసారి తెరపైకి వచ్చాయి.  పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహుతి బాంబర్, పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సీఆర్‌పీఎఫ్ (CRPF) కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. ఈ   ఉగ్ర దాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి భారతదేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీయడమే కాకుండా భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది.

    బాలాకోట్‌ మెరుపు దాడులు 
    పుల్వామా దాడికి ప్రతిస్పందనగా, కొన్ని రోజుల తర్వాత భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేయడంతో పాటు, సరిహద్దు వెంబడి సైనిక ఉద్రిక్తతలను కూడా పెంచింది. 

    ఇదీ చదవండి: 60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

    గత కొన్ని ఏళ్లుగా పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పుల్వామా నిందితుడు హంజా బుర్హాన్ కూడా చేరాడు. ఈ తాజా కాల్పులపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రానప్పటికీ, సరిహద్దుకు ఆవలి వైపు నుండి పనిచేస్తున్న భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులు, భద్రతపై  చర్చను రాజేసే అవకాశం ఉంది.
    ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్‌ తీసుకొని ప్రియుడితో పరార్‌

     

  • బెంగళూరు: ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేను విమాన చివరి భాగం(తోక) తగలడంతో  ఒక్కసారిగా కలవరం మొదలంది. ఢిల్లీ నుంచి నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం ల్యాండ్‌ అవుతుండగా ఇది చోటు చేసుకుంది. ఆ సమయంలో విమానంలో 181 ప్రయాణికులు ఉన్నారు.  

    ఎయిర్‌ ఇండియా విమానం AI2651లో ఇది చోటు చేసుకుంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్‌ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించారు. 

    ల్యాండింగ్ కోసం సమీపిస్తున్నప్పుడు విమానం తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ అస్థిరమైన ల్యాండింగ్ ప్రయత్నం తరువాత పైలట్ గో-అరౌండ్‌ (ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి మళ్లీ గాల్లోకి ఎగిరి, మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేయడం) చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చేస్తున్నప్పుడు విమాన చివరి భాగం నేలను తాకింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణీకులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పీటీఐకి తెలిపారు. 

  • సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్‌గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ వైభవ్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు.

    ‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్‌ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్‌తో హెడ్‌బ్యాండ్‌తో డేటా కలెక్ట్‌ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్‌ టైం డేటా కలెక్ట్‌ చేసేలా ఏఐ డేటా కలెక్షన్‌ హెడ్‌ గేర్‌ను ధరించాడు. హెడ్‌గేర్‌ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్‌గేర్‌ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.

    అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్‌ గేర్‌ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్‌ టైం డేటాతో సరిపోల్చి యూజర్‌కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి.  

    ఏఐ డేటా గేర్‌ కనెక్షన్‌ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్‌ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్‌బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్‌. ఈ గేర్‌ను కంపెనీలు గిగ్‌ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

     

  • దేశంలో ఇటీవల ‘పోక్సో’ చట్టం (POCSO Act 2012) గురించిన ప్రస్తావన తరచూ వినిపిస్తోంది. ఇందుకు కారణం బాలలపై అత్యాచారాలు పెరిగి పోవడమే. 2012 నవంబర్‌ నుండి అమలులోకి వచ్చిన ఈ ప్రత్యేక చట్టం పాత విచారణ పద్ధతిని పూర్తిగా మార్చి, పిల్లల మానసిక స్థితికి ప్రాధాన్యత ఇచ్చే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. పిల్లలకు ఉండే ప్రత్యేక మానసిక, శారీరక బలహీనతలను గుర్తించి, వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్యోద్దేశం. 

    ఈ చట్టంలోని సెక్షన్‌ 29, 30ల ప్రకారం, నేరానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్‌ కోర్టుముందు ఉంచినట్లయితే, నిందితుడే తప్పు చేశాడనే చట్టపరమైన ఊహను కోర్టు చేస్తుంది. దీనివల్ల నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవలసి ఉంటుంది. ఈ విధానం నేరస్థులు చట్టపరమైన లొసుగుల నుండి తప్పించుకోకుండా అడ్డుకట్ట వేసింది.

    18 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ చట్టం కల్పించే రక్షణలు బలమైనవి, రాజీలేనివి. మొదటిది, ఈ చట్టం 18 సంవత్సరాల వయస్సును స్పష్టమైన పరిమితిగా నిర్ణయించింది. మైనర్‌ పిల్లలు లైంగిక చర్యకు సమ్మతి తెలపడానికి చట్టబద్ధంగా అర్హులు కాదనీ, అందువల్ల పిల్లల ఇష్టపూర్వకంగానే ఇది జరిగిందనే వాదనకు చట్టంలో తావులేదనీ స్పష్టం చేసింది. రెండవది, ఈ చట్టం బాలురకు, బాలికలకు సమానమైన రక్షణను కల్పిస్తూ పూర్తి లింగ సమతుల్యతను పాటించింది. 

    మూడవది, సెక్షన్‌ 19 ప్రకారం పిల్లలపై జరిగే వేధింపులను ఉపాధ్యాయులు, వైద్యులు లేదా పొరుగువారు ఎవరైనా గుర్తిస్తే వెంటనే అధికారులకు నివేదించడాన్ని తప్పనిసరి చేసింది. అలా సమాచారం ఇవ్వడంలో విఫలమైతే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. చివరగా, విచారణ సమయంలో పిల్లలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. పోలీసు అధికారులు సాధారణ దుస్తులలోనే పిల్లలను విచారించాలి, కోర్టు విచారణలు రహస్యంగా (ఇన్‌–కెమెరా) జరగాలి. పిల్లలు నిందితుడిని నేరుగా ఎదుర్కొనే అవసరం లేకుండా సాక్ష్యం చెప్పేలా ఏర్పాట్లు చేయాలి.

    ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్‌ తీసుకొని ప్రియుడితో పరార్‌

    మార్పులు, సవరణలు పార్లమెంటు ఈ చట్టానికి కాలక్రమేణా కీలకమైన సవరణలను చేసింది. 2019 సవరణ ద్వారా తీవ్రమైన లైంగిక దాడులకు పాల్పడే వారికి మరణశిక్షను విధించే నిబంధనను తెచ్చారు. కనీస జైలుశిక్షను 7 ఏళ్ల నుండి 10 ఏళ్లకు పెంచారు. డిజిటల్‌ మాధ్య మాలలో పిల్లల లైంగిక చిత్రాలను ఉంచడం లేదా నిల్వ చేయడాన్ని నేరంగా పరిగణించారు. జూలై 2024లో భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చిన తర్వాత, ఈ చట్టాన్ని డిజిటల్‌ యుగానికి అనుగుణంగా మార్చారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా సృష్టించే డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్‌ వేధింపులు, డిజిటల్‌ దోపిడీల నుండి పిల్లలను రక్షించేలా మరిన్ని కఠినమైన నిబంధన లను చేర్చారు. ఈ చట్టపరమైన మార్పులకు భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు మరింత బలాన్ని చేకూర్చాయి.

    చారిత్రాత్మక ‘ఇండిపెండెంట్‌ థాట్‌ వర్సెస్‌ యూనియన్‌ఆఫ్‌ ఇండియా (2017)’ కేసులో, 15 నుండి 17 సంవత్సరాల మధ్య ఉన్న మైనర్‌ భార్యలతో భర్తలు జరిపే లైంగిక చర్యలను అత్యాచారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా, 2021 నాటి ‘అటార్నీ జనరల్‌ వర్సెస్‌ సతీష్‌’ కేసులో (ద స్కిన్‌ టు స్కిన్‌ కేసు), బట్టలపై నుండి తాకడం వల్ల అది లైంగిక దాడి కిందకు రాదన్న బొంబాయి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చట్టంలో ముఖ్యంగా కావలసింది నేరస్థుడి ‘లెంగిక ఉద్దేశ్యం’ మాత్రమేననీ, దుస్తులు అనేవి నేరస్థుడికి రక్షణ కవచాలుగా మారకూడదనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    – ఎస్‌. అక్బర్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ. తిరుపతి జిల్లా కార్యదర్శి

     ఇదీ చదవండి : ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?

  • న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ కొరత లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ) వర్గాలు గురువారం తెలిపాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల అంతరాయాలపై ఆందోళనలు నెలకొన్న వేళ ఇంధన కొరత ఉందని చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓఎంసీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రష్యా నుంచి వస్తున్న ముడి చమురు సరఫరాలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపింది.

    ఓఎంసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల్లో ‘మిగులు’ స్థితిలోనే ఉంది. సీజనల్ డిమాండ్‌, మార్కెట్ ధరల మార్పుల వల్ల కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలో ఇంధన అమ్మకాలు పెరుగుతున్నాయి. “భారత్ నెట్ ఎగుమతిదారు కావడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్లో మిగులు స్థితిలో ఉంది. పెట్రోల్‌/డీజిల్‌/ఎల్‌పీజీ కొరత లేదు” అని ఓఎంసీ వర్గాలు తెలిపాయి. నెట్ ఎగుమతిదారు అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా చేసే దేశం లేదా సంస్థ.

    ముడి చమురు దిగుమతులపై ఓఎంసీ వర్గాలు మాట్లాడుతూ.. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రష్యా నుంచి సరఫరాలు స్థిరంగానే ఉన్నాయని తెలిపాయి. కొన్ని ఇంధన బంకుల్లో అమ్మకాలు పెరగడానికి పంట కోత సీజన్‌లో డీజిల్ డిమాండ్ పెరగడం సహా పలు కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు రూ.5 అధిక ధర తీసుకుంటుండడంతో వినియోగదారులు ప్రభుత్వ రంగ ఇంధన విక్రేతల వద్ద కొంటున్నారని కూడా వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు ఎక్కువగా ఉండటంతో సంస్థాగత, వాణిజ్య కొనుగోలుదారులు కూడా ప్రభుత్వ రంగ ఇంధన బంకుల వైపు మారుతున్నారని వర్గాలు తెలిపాయి.

    అవసరాల మేరకే వాహనాల్లో నింపుకోవాలి.. 
    ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా రిటైల్ ఔట్‌లెట్లలో పెరుగుతున్న డిమాండ్ మధ్య సరిపడా ఇంధన లభ్యత ఉండేలా తమ సరఫరా కేంద్రాలు, ఫీల్డ్ బృందాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తెలిపింది.

    “దేశవ్యాప్తంగా మా రిటైల్ ఔట్‌లెట్లలో సరిపడా ఉత్పత్తుల లభ్యత ఉండేలా మా సరఫరా కేంద్రాలు, టీమ్స్‌ సమన్వయంతో నిరంతరం పని చేస్తున్నాయి. వినియోగదారులు తమ సాధారణ అవసరాల మేరకే వాహనాల్లో ఇంధనం నింపుకోవాలి” అని ఐఓసీఎల్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది. భయంతో అధికంగా ఇంధనం కొనుగోలు చేయొద్దని కోరింది. మారుతున్న డిమాండ్ ధోరణుల వల్ల రవాణా వ్యవస్థపై ఒత్తిడి ఉన్నప్పటికీ, నిరంతర ఇంధన సరఫరా కొనసాగించే బాధ్యత తమదేనని కంపెనీ తెలిపింది.

    “పెట్రోల్‌, డీజిల్ సరఫరా వ్యవస్థను సజావుగా కొనసాగించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అయితే వాణిజ్య అమ్మకాలు, ప్రైవేట్ పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ఔట్‌లెట్ల వైపు డిమాండ్ మారడంతో రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. దాన్ని పరిష్కరించేందుకు మా టీమ్‌ ప్రయత్నిస్తోంది” అని కంపెనీ తెలిపింది.  
     

  • ప్రస్తుతం కాలంలో పెళ్లి అంటే పెద్ద హంగూ ఆర్బాటం. ప్రీవెడ్డింగ్‌ షూట్‌, మెహిందీ, సంగీత్‌, బారాత్‌, వందలకొద్దీ అతిథులు, విందు భోజనాలు  అబ్బో ఈ లిస్ట్‌  చాలా పెద్దదే.  కానీ అలాంటివేమీ లేకుండానే కేవలం 9 మంది అతిథుల సమక్షంలో, ఎలాంటి వెడ్డింగ్ ప్లానర్ సహాయం లేకుండా ఒక భారతీయ వధువు తన డ్రీమ్ వెడ్డింగ్‌ను ఇటలీలోని ప్రసిద్ధ 'లేక్ కోమో' (Lake Como) తీరాన అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. గత ఏడాది జరిగిన ఈ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు  తాజాగా నెట్టింట  వైరల్‌గా మారాయి.

    కింజల్ పటేల్, హెరిత్ వచ్హానీ జంట చేసుకున్న ఈ వివాహం... 'బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్'కి  భిన్నంగా, . విలాసవంతమైన పెళ్లి అంటే ఖర్చు, హడావుడి మాత్రమే కాదు, అది మనసుకు నచ్చిన వారితో గడిపే ఒక ప్రశాంతమైన అనుభూతి అని నిరూపించింది.అంతేకాదు ఈ పెళ్లిలోని అసలైన విశేషం ఏంటంటే.. ఇంతటి లగ్జరీ వెడ్డింగ్‌ను వధువు కింజల్ సొంతంగా డిజైన్ చేసింది. ఏ వెడ్డింగ్ ప్లానర్‌ను పెట్టుకోకుండా, ప్రదీ వెండర్‌తో ఆమె స్వయంగా మాట్లాడి  ప్లాన్‌  చేసుకుంది.

    ఇటాలియన్ వైభవం.. పూల పరిమళాలు
    ప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ 'హౌస్ ఆన్ ది క్లౌడ్స్' తీసిన పెళ్లి ఫోటోలు ఒక అందమైన పెయింటింగ్‌లా ఉన్నాయి. ఇటలీలోని చారిత్రాత్మక 'విల్లా బాల్బియానో' (Villa Balbiano) లాన్‌పై, ఆల్ప్స్ పర్వతాల నీడలో, లేక్ కోమో సరస్సు పక్కన వీరి పెళ్లి వేడుక జరిగింది.ప్రశాంతత, ఆత్మీయత, ఒక పెద్ద SUV కార్లో సరిపోయేంత మంది అతిథులతో వారు తమ పెళ్లిని జరుపుకున్నారు.

    సాంప్రదాయక భారీ వూడెన్ మండపానికి బదులుగా.. లావెండర్, పెరివింకిల్ రంగుల హైడ్రాంజియా పూలు, ఆరెంజ్ జెర్బెరాస్, బర్డ్ ఆఫ్ పారడైజ్ వంటి విదేశీ పూలతో కిందనే అద్భుతమైన పూల బాటను డిజైన్ చేశారు. ఆకాశం నుండి చూస్తే, ఈ జంట కోసం ఆ తోటలోనే పూలు పూశాయా అన్నట్లుగా ఆ డెకరేషన్ మెరిసిపోయింది.

    పింక్ శారీలో మెరిసిన వధువు
    వధువు కింజల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన సెలెరియల్ పింక్ కలర్ లెహంగా స్టైల్ శారీని ఎంచుకుంది. ఇటలీ ఆకాశం కింద ఆమె దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, వెనుకకు సాగిపోతున్న నెట్ వేల్ (veil) ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. వరుడు హెరిత్ క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా కనిపించాడు. వారు పరస్పరం పూలమాలలు మార్చుకునే (వర్మాల) క్షణాలు ఎంతో ప్రశాంతంగా, మనోహరంగా సాగాయి.లేక్ కోమో నేపథ్యంలో  క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా  వరుడు హెరిత్ చిరునవ్వుతో వెనక్కి వంగడం, కింజల్ అతనికి దండ వేయడం...ఎలాంటి  హడావిడి, గందరగోళం లేకుండా  ప్రశాంతమైన, ఆనంద క్షణాలను ఆస్వాదించారు.

     ఇదీ చదవండి : ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?

    9 మంది అతిథులు మాత్రమే!
    గత ఏడాది  అక్టోబర్‌లో 'వోగ్ ఇండియా' (Vogue India) మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట తమ నిర్ణయాన్ని పంచుకున్నారు. "పెళ్లి హడావుడిలో  మాకు మే ఎక్కడో తప్పిపోవాలని అనుకోలేదు. మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే అత్యంత ఆత్మీయుల మధ్య, మేం ఎలా ఉంటామో అలాగే ప్రశాంతంగా ఈ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాం" అని వారు చెప్పారు.

    కేవలం 9 మంది కుటుంబ సభ్యులతో ఈ పెళ్లి జరగడం వల్ల వందల మంది అతిథుల మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, మూడు రోజుల అలసట వంటి ఒత్తిళ్లేవీ వారికి లేకుండా పోయాయి. పెళ్లి తర్వాత వారంతా 'పాసాలాక్వా' (Passalacqua) అనే చారిత్రాత్మక హోటల్‌లో ఒకరినొకరు చూసుకుంటూ, హాయిగా మాట్లాడుకుంటూ ప్రైవేట్ డిన్నర్‌ను ఆస్వాదించారు. కృత్రిమమైన భారీ బ్యాక్‌డ్రాప్‌ల కంటే కోట్లాది సంవత్సరాల నాటి ఆల్ప్స్ పర్వతాలు, లేక్ కోమో సరస్సే తమ పెళ్లికి గొప్ప వేదిక అని ఈ జంట నిరూపించింది.

    అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రశాంతంగా భోజనం చేస్తూ పెళ్లిని ఆస్వాదించడం  అంటే ఇవాల్టి రోజుల్లో అరుదైన విలాసమని చెప్పవచ్చు. ఒక వెడ్డింగ్ ప్లానర్ ఇవ్వలేని గొప్ప తృప్తిని, విజయాన్ని తన కలల పెళ్లిని తానే స్వయంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సాధించానని కింజల్ గర్వంగా చెప్పింది.

    ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్‌ తీసుకొని ప్రియుడితో పరార్‌

     

  • ఎంత కష్టమొచ్చినా..కన్నీళ్లొచ్చినా.. బిడ్డల్ని కళ్లల్లో పెట్టుకొని కాపాడేది తల్లి. అలాంటి తల్లే కన్న బిడ్డలకి తీరని అన్యాయం చేస్తే.. ఇక ఆ బిడ్డలకు దిక్కెవ్వరు? సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగుచూసింది. కేవలం పిల్లలను వదిలేయడమే కాదు, తన తండ్రి డబ్బును, స్కూటర్‌ను కూడా దొంగిలించి ప్రియుడితో చెక్కేసిన  షాకింగ్‌ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

    అసలేం జరిగింది?
    పంఢరపూర్ - శంభాజీనగర్ రూట్‌లో వెళ్తున్న ఒక బస్సులో ఈ ఘటన జరిగింది.  ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సు ఎక్కించి, తన తండ్రి స్కూటర్ వేసుకుని ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. బస్సులో ఆ పిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఏడవడం గమనించిన కండక్టర్, వారి దగ్గరకు వెళ్లి పరిశీలించాడు. ఆ సమయం లోనే ఒకరి జేబులో ఉన్న చీటీని చూసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

    బస్సులో ఏడుస్తున్న ఒక చిన్నారి జేబులో  ఉన్న చీటీలో ఏముంది అంటే "ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు, దయచేసి వీరిని యావత్మాల్ వెళ్లే బస్సు ఎక్కించండి." అని ఉన్న హృదయవిదారకమైన వాక్యాలివి. ఆ నోట్ పక్కనే ఒక మొబైల్ నంబర్ కూడా ఉంది. పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్ చేసి విచారించగా నమ్మలేని ఒక షాకింగ్ నిజం బయట పడింది. 

    సరిగ్గా అదే సమయంలో, యావత్మాల్‌కు చెందిన ఒక వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఇంట్లో ఉన్న డబ్బు, స్కూటర్ తీసుకుని పారిపోయిందని ఆ ఫిర్యాదు సారాంశం. కేసు నమోదు చేసుకున్న బీడ్ (Beed) జిల్లా పోలీసులు ఆ వృద్ధుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. బస్సులో ఒంటరిగా దొరికిన ఆ ఇద్దరు పిల్లలు మరెవరో కాదు, తన స్వంత మనవడు, మనవరాలేనని అతను గుర్తించాడు. ఆ పిల్లల కన్నతల్లే వారిని నడిరోడ్డుపై వదిలేసి, తన ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిపాడు.

    మరో షాకింగ్‌ సంగతి ఏంటంటే. బిక్కు బిక్కుమంటున్న పిల్లల్ని చూశాక తాత ప్రవర్తన పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది.   ఒంటరిగా ఉన్న  పిల్లల్ని చూసి తాత మనసు కరగలేదు, కనీసం  ఓదార్చ లేదు. వారిని ఇంటికి తీసుకెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు సరికదా  పిల్లల భవిష్యత్తు కంటే, పోయిన తన స్కూటర్ గురించే అతడు ఎక్కువ ఆందోళన చెందడం మరింత విస్మయ పర్చింది. ఆ పిల్లల బాధ్యతను తీసుకోవడం తన వల్లకాదని తెగేసి చెప్పాడు. చివరకు, పోలీసులే ఆ పిల్లల రక్షణకు ఏర్పాట్లు చేశారు. బీడ్ జిల్లా శిశు సంక్షేమ కమిటీ (Child Welfare Committee), జిల్లా పరిపాలనా యంత్రాంగం సహాయంతో ఆ ఇద్దరు పిల్లలను సురక్షితమైన చిల్డ్రన్ హోమ్‌కు తరలించారు.

  • సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక  ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?

    భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న  సీజేపీ  వెనుక ఉన్న  ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్‌టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్‌లైన్‌లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్‌ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.

    యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్‌లైన్‌తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక  ప్రతిబింబిస్తోంది.


    పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే).  రోజుకు కనీసం 11 గంటలు ఆన్‌లైన్‌లోనే గడపాలి (Chronically Online).  ప్రొఫెషనల్‌గా, లాజికల్‌గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి.  

     

    ఇంతకీ ఎవరీ  అభిజీత్ దిప్కే?

    పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.

    ఆమ్ ఆద్మీ  నేపథ్యం 
    సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.  

    మేనిఫెస్టో
    కేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.  జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్‌టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం.  మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్‌ జెడ్‌ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.  

    ఇంతలోనే భారీ షాక్‌
    మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ  అభిజీత్‌ ట్వీట్‌ చేశారు.  మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ  అభిజీత్‌ ట్వీట్‌ చేశారు. ఊహించినట్టే, '  కాక్రోచ్‌ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు.
     

  • న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊహించని రీతిలో దూసుకుపోతున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (సీజేపీ)కి గట్టి షాక్ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార బీజేపీ అధికారిక ఖాతా కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించిన కొద్ది గంటల్లోనే, ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్‌ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    బీజేపీని దాటేసిన క్రేజ్!
    కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 10 మిలియన్ల (కోటి) ఫాలోవర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం 8.7 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్న బీజేపీ అధికారిక ఇన్‌స్టా ఖాతాను ఇది అధిగమించింది. కాంగ్రెస్ 13 మిలియన్ల ఫాలోవర్లతో ముందుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా వెనుకబడి ఉంది. ఈ మైలురాయిని అందుకున్న కొన్ని గంటల్లోనే ‘సీజేపీ’ ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో బ్లాక్ చేశారు. ‘మేము ఊహించినట్టే జరిగింది’ అంటూ ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ స్పందించారు.

    సుప్రీం వ్యాఖ్యల నుండి పుట్టిన ఉద్యమం
    నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, రాజకీయాలపై విసుగు చెందిన జెన్-జీ యువత ఆవేదన నుండి పుట్టిన పొలిటికల్ సెటైర్ మూవ్‌మెంట్ ఇది. గత వారం ఒక కోర్టు విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. నిరుద్యోగులు, ఆన్‌లైన్ యాక్టివిస్టులను ఉద్దేశించి ‘బొద్దింకలు’,'పరాన్నజీవులు' అని వ్యాఖ్యానించారనే వార్తలతో ఈ ఉద్యమం మొదలైంది. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ, యువత ఈ వినూత్న పార్టీని స్థాపించారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, నకిలీ డిగ్రీల వారినే తానలా అన్నానని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు.

    సెలబ్రిటీల మద్దతు.. భారీ నెట్‌వర్క్
    బోస్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మాజీ ఆప్ సోషల్ మీడియా కార్యకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే ఈ వినూత్న మూవ్‌మెంట్‌ను ప్రారంభించారు. ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ’ అనే నినాదంతో, కేవలం హాస్యం, మీమ్స్ ఆధారంగా యువతను ఇది విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వైవిధ్యమైన డిజిటల్ ప్రచారానికి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్, టీఎంసీ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా మద్దతు తెలపడం విశేషం.

    ఇది కూడా చదవండి: ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!

  • తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ సి విజయ్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్‌ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్‌ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

    సావుక్కు శంకర్‌(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్‌ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్‌ అయ్యారు ఆయన. 

    ఎవరీ సావుక్కు శంకర్‌.. 
    ఆచిముత్తు శంకర్‌ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్‌ కేసులో సస్పెండ్‌ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. 

    అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 

    డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్‌ చేశాయి. 

    డీఎంకే హయాంలో..
    2021లో స్టాలిన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్‌ యాక్ట్‌ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్‌ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్‌ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..

    2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్‌ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్‌ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. 

    సావుక్కు శంకర్‌ విజయ్‌నూ వదల్లేదు. కరూర్‌ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్‌ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది.

International

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్‌హౌస్‌లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

    Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.

    అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? 
    ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

    అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్‌లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 

    అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.

    ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? 
    ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

    ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్‌తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్‌కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.

    ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

    అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది.  - వెబ్‌ డెస్క్‌

     

  • టెహ్రాన్: ఇరాన్‌, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్‌ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన కీలక డిమాండ్‌ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.

    అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్‌కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.

    ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.

    అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన‍్నారు” అని తెలిపారు.

    అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.

    అమెరికా దాడులు చేయనుందా? 
    ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.

    ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్‌ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.

    ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు.

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 

    పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారని వైఎస్‌ జగన్‌  పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

    మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

  • గుడివాడ:  గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కేసుకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ట్రస్ట్‌ అధ్యక్షుడు పోకూరి మోహన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోహన్‌రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు,.. ఆ బంగారు కిరీటాన్ని రూ. 30 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్‌ఐర్‌లో నమోదు చేశారు. దాత సుబ్బారావు ఫిర్యాదుతో చివరకు చర్యలకు సన్నద్ధమయ్యారు పోలీసులు.

    కాగా, గత ఏడాది మాటూరు సుబ్బారావు అనే భక్తుడు గుడివాడ వెంకటేశ్వర స్వామివారికి కిరీటం కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత దాత సుబ్బారావు తిరిగి దర్శనానికి వచ్చారు. అయితే, దర్శన సమయంలో కిరీటం కనిపించకపోవడంతో ఆయన పాలకవర్గాన్ని నిలదీశారు.

    మొదట పాలకవర్గం కిరీటం బ్యాంక్‌ లాకర్‌లో ఉందని చెప్పింది. కానీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు అంగీకరించారు. దాంతో సుబ్బారావు  కిరీటం ఉందా? లేక అమ్మేశారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చిన ఆయనకు పోలీసులు షాక్ ఇచ్చారు. కిరీటంపై కోర్టుకే వెళ్లమని సూచించిన పోలీసులు.. ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.

  • ఆత్మకూరు రూరల్‌: 160 ఏళ్ల కిందట ఆచూకీ లేకుండా పోయిన ఇండియన్‌ గౌర్‌ (అడవి దున్న)లను నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకురావాలని అటవీశాఖ ప్రణాళిక వేస్తున్న తరుణంలో అనుకోని అతిథిలా ఓ అడవి దున్న పర్వత శ్రేణిలో కనువిందు చేస్తోంది.

    ప్రణాళిక దశలో ఉండగా.. 
    160 ఏళ్ల కిందట నుంచి ఆచూకీ లేని దున్నలను తిరిగి నల్లమలకు రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఇందుకోసం రూ.కోటి  విరాళంగా ప్రకటించింది. వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇందుకు సంబంధించిన సాంకేతిక సలహాలు ఇస్తోంది. మధ్యప్రదేశ్‌ నుంచి 120 అడవి దున్నలను నల్లమలకు తీసుకువచ్చే మహత్తర ప్రాజెక్ట్‌కు ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జునసాగర్‌ – శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌) నాయకత్వం వహిస్తోంది. 

    ఇందుకోసం ఎన్‌ఎస్‌టీఆర్‌ ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ అపావ్‌ మధ్యప్రదేశ్‌లోని సాత్పూరా టైగర్‌ రిజర్వ్‌ డీడీ రిషిబా సింగ్‌ నేతృత్వంలో అటవీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది.మొత్తం 120 అడవి దున్నలను బ్యాచ్‌లుగా రప్పించాలని నిర్ణయించారు. వీటికి నల్లమల వాతావరణం అలవాటు కావడానికి ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ తరుణంలో మానవ ప్రయత్నం లేకుండానే అడవి దున్న కృష్ణా నది దాటి వచ్చి ఎన్‌ఎస్‌టీఆర్‌లో ముందస్తు అతిథిగా తిరుగుతోంది.

    పులులకు మంచిరోజులు
    అడవిదున్న సుమారు 800 నుంచి 1500 కిలోలు ఉంటుంది. అలాంటి అడవి దున్నల సమూహం నల్లమలలో తిరిగితే ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న పెద్ద పులులకు సమస్య తీరినట్టేనని అటవీ అధికారులు భావిస్తున్నారు. వయోజన అడవి దున్నను వేటాడడం పెద్దపులికి అంత సులభం కాకపోయినా ఒక్కో హెర్డ్‌లో ఉండే పిల్ల దున్నలు, వృద్ధాప్యంలో ఉండే దున్నలు పులులకు  అందుబాటులో ఉండే ఆహారమే.

    డిసెంబర్‌ నాటికి తీసుకొస్తాం
    నల్లమలలో అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి  తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. డిసెంబర్‌ నాటికి తొలివిడత దున్నలను మధ్యప్రదేశ్‌ లోని సాత్పూరా టైగర్‌ రిజర్వ్‌ నుంచి నల్లమలకు తీసుకు వస్తాం. వాటిని అడవిలో ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో ఉంచి పరిశీలన అనంతరం స్వేచ్ఛగా వదులుతాం.
    – విగ్నేష్‌ అపావ్, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్‌ టైగర్, ఆత్మకూరు 

  • విజయవాడ:   ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.  అంతకంతకూ ఎండ తీవ్రత పెరిగిపోయి రికార్డు స్థాయిలో  ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయో ఎండ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 

    ఈరోజు(గురువారం, మే 21వ తేదీ) రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదు కాగా, కృష్ణా జిల్లా కంకిపాడులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

    ఏలూరు జిల్లా చింతలపూడిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

    బయటకు వెళ్లాలంటే భయం..
    భానుడి భగభగలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎండలకు హడలిపోతున్నారు. గత వారం నుంచి ఉదయం మొదలు కొని సాయంత్రం వరకూ తీవ్రమైన ఉక్కపోతతో పాటు సెగలు కక్కే ఎండే కనిపిస్తూ ఉండటంతో సాధారణమైన పనులు చేసుకోవడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

    వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఎండలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఉన్న వారు ఏసీ చాటను, ఫ్యాన్లు ఉన్నవారు ఫ్యాన్ల మాటునే సేద తీరుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు.  సాయంత్రం ఆరు దాటితే గానీ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ఈ ఎండల నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతామా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు.

  • ఇన్నాళ్లూ అక్కడ భూ ఉపరితలంపై ఉన్న గ్రానైట్‌ కొండలనే చూసి మురిసిపోయాం. దాని ద్వారా కొద్దో గొప్పో ఆదాయం, ఉపాధి లభిస్తున్నందుకు సంతోషపడిపోతున్నాం. కానీ ఆ ప్రాంతం తన గర్భంలో దాచుకున్న అతి అరుదైన, విలువైన ఇరీడియం నిక్షేపాలు వెలికి తీస్తే టెక్కలి ప్రాంతాన్ని, తద్వారా జిల్లాను సంపన్నం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

     శ్రీకాకుళం జిల్లా: ఏపీలో అరుదైన నిక్షేపాలు ఉన్నాయని, వాటి ప్రాసెసింగ్‌ నిర్వహణతో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం అందజేయవచ్చునని, దీని కోసం నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్‌ కింద సుమారు రూ.16,300 కోట్లను కేటాయిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించా రు. దీంతో టెక్కలి పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీల్లో అరుదైన నిక్షేపాల కోసం కొన్ని రకాల అంతర్జాతీయ బృందాలు శాటిలైట్‌ ద్వారా సర్వేలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కొన్నేళ్ల కిందట ఇండో జర్మన్‌ బృందాలు ఇదే మాదిరిగా రహస్యంగా సర్వేలు చేయడం, ఇప్పుడు ఏపీలో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రకటన చేయడంతో అప్పట్లో చేసిన శాటిలైట్‌ రహస్య సర్వేలు నిజమని తెలుస్తోంది. ఇప్పుడు ఐబీఎం, ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలోనే విదేశీ బృందాలు శాటిలైట్‌ ద్వారా అరుదైన నిక్షేపాల కోసం టెక్కలి పరిసర ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నట్లు సమాచారం.  

    గ్రానైట్‌కు అరుదైన గుర్తింపు 
    టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రానైట్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు గ్రానైట్‌ను ఎగుమతి చేస్తుంటా రు. అయితే ఇదే ప్రాంతంలో లభించే గ్రానైట్‌ ముడి సరుకును ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత అద్భుతమైన విధంగా వివిధ రకాల ఆకృతులు రూపుదిద్దుకోవ డంపై విదేశీయులు మక్కువ చూపుతుంటారు. ఇదే టెక్కలి పరిసర ప్రాంతాల్లో రంగు రాళ్లు ఉన్నాయంటూ కొంత మంది రహస్యంగా క్వారీల్లో అన్వేషణ చేశారు. అంతే కాకుండా అరుదైన నిక్షేపాలు ఉన్నా యంటూ గత కొన్నేళ్ల క్రితం ఇండో జర్మన్‌ కంపెనీలు చేసిన సర్వేల్లో భాగంగా క్వారీల అంతర్భాగంలో అరుదైన ఇరీడియం నిక్షేపాలు ఉన్నట్లు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు మాంగనీస్, థోరియం వంటి నిక్షేపాలను గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.  

    జర్మనీ బృందం ఆధ్వర్యంలో..  
    టెక్కలి పరిసరాల్లో కొద్దిరోజులుగా జర్మనీకి చెందిన ప్రత్యేక మైనింగ్‌ బృందాలు ఈ సర్వే నిర్వహించి నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సంస్థకు చెందిన డైటర్‌ సవాజ్, క్లాస్‌ మైకేల్‌ కూనేలు ఆధునిక క్రాఫ్ట్‌లు, అత్యాధునిక డ్రోన్‌ల సాయంతో ఈ సర్వేను రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌(ఐబీఎం), నేషనల్‌ మైనింగ్‌ కార్పొరేషన్ల సహకారంతోనే ఈ సర్వే జరిగినట్టు అనధికారిక సమాచారం. అయితే సర్వేల్లో భాగంగా ఇరీడియం, మాంగనీస్, థోరి యం వంటి నిక్షేపాలు ఉండవచ్చునని ఆశాభావం నిజమైతే గ్రానైట్‌ క్వారీ నిర్వాహకుల పంట పండుతుంది.  

    ఖనిజాల వెలికితీత 
    కేంద్రం ప్రకటించిన మేరకు ఏపీలో రేర్‌ ఎర్త్‌ మినరల్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తే మరిన్ని అరుదైన నిక్షేపాల వెలికితీత జరుగుతుంది. ప్రధానంగా టెక్కలి పరిసర ప్రాంతాల్లో లభించే ఖనిజాలు, బీచ్‌ శాండ్‌ పరిశోధనలతో విలువైన ఖనిజ సంపద బయట పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్టు ఏర్పాటులో కేంద్రం ప్రకటించిన జాబితాలో శ్రీకాకుళం పేరు కూడా ఉండడంతో గ్రానైట్‌ వర్గాల్లో విస్తృ తమైన చర్చ కొనసాగుతోంది.    


     

Business

  • ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు జూన్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి తమ వాహనాల ధరలు రూ. 30,000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

    ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్న ముడిసరుకుల ఖర్చుల నిరంతర పెరుగుదల, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ధరలు పెంచడం జరిగిందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ ప్రభావంలో కొంత భాగాన్ని భరించేందుకు గత కొన్ని నెలలుగా తాము తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ.., ప్రస్తుత ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరల భారాన్ని పాక్షికంగా వినియోగదారులపై మోపడం తప్పడం లేదని కంపెనీ తెలిపింది.

    వినియోగదారులపై భారాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి తాము ప్రయత్నించామని, అయితే తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడళ్లలో ఈ పెరుగుదల వేర్వేరుగా ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. కాగా.. మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే వాహనాల ధరల పెంపును అమలు చేశాయి.

  • భారతి ఎయిర్‌టెల్ కంపెనీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ అనుభవాన్ని అందించేందుకు ''ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్'' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. చాలామంది జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే.. మార్కెట్లు, ట్రాఫిక్ జామ్‌లు లేదా పెద్ద ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో, వీడియో కాల్స్ నిలిచిపోవడం, ఫోటోలు అప్‌లోడ్ కావడంలో ఆలస్యం, లేదా ఈమెయిల్స్ డౌన్‌లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎయిర్‌టెల్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.

    ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సర్వీస్ అనేది ప్రత్యేకంగా పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. దీనిద్వారా నెట్‌వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు స్థిరమైన.. వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది. దీనికి కారణం ఎయిర్‌టెల్ తమ 5జీ నెట్‌వర్క్‌లో చేసిన లేటెస్ట్ టెక్నికల్ అప్‌గ్రేడ్. ఈ సాంకేతికతను స్లైసింగ్ అని పిలుస్తారు.

    స్లైసింగ్ అనేది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న నెట్‌వర్క్ టెక్నాలజీ. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఎయిర్‌టెల్ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవను పొందడం చాలా సులభం. ఇప్పటికే ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులైతే ఈ సదుపాయం ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా లేదా సమీప ఎయిర్‌టెల్ స్టోర్‌కి వెళ్లి తమ కనెక్షన్‌ను పోస్ట్‌పెయిడ్‌గా మార్చుకోవచ్చు.

    అయితే.. ఈ సేవను పూర్తిగా ఉపయోగించాలంటే వినియోగదారుల వద్ద 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే ఫోన్‌లో తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉండటం అవసరం. ఫోన్‌లో అప్‌డేట్ పెండింగ్‌లో ఉంటే, సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదనంగా ఎయిర్‌టెల్ యాప్ ద్వారా కూడా ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.

  • టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్‌కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.

    ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.

    మార్క్ జుకర్‌బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.

    ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

    ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్‌ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.

  • ఢిల్లీ: బ్యాంక్‌ వినియోగదారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. లోన్‌ ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పెడుతూ ఆర్‌బీఐ కొత్త ‍డ్రాఫ్ట్‌ బిల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోనుంది.  

    • రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

    • బ్యాంకులు బోర్డు ఆమోదించిన రికవరీ, కలెక్షన్‌ పాలసీని అమలు చేయాలి

    • తప్పుగా రికవరీ చేస్తే నష్టపోయిన రుణం తీసుకున్న వారికి బ్యాంకులు పరిహారం చెల్లించాలి

    • రికవరీ ఏజెంట్లకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాకింగ్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి

    • బ్యాంకులు తమ వెబ్‌సైట్‌, యాప్‌లలో రికవరీ ఏజెన్సీల వివరాలు ప్రకటించాలి

    • మొదటి రికవరీ ఏజెంట్‌ సందర్శనకు ముందు రుణదాతలకు (లోన్‌ ఎవరైతే తీసుకుంటారో వారికి) సమాచారం ఇవ్వాలి

    • రికవరీ ఏజెన్సీ మార్పు లేదా రద్దు జరిగితే వెంటనే లోన్‌ తీసుకున్న వినియోగదారులకు తెలపాలి

    • ఫిర్యాదులు పరిష్కారం కాని పరిస్థితిలో రికవరీ కేసులు ముందుకు కొనసాగించకూడదు  

    • రికవరీ ఏజెంట్ల కాల్స్‌ రికార్డు చేసి కనీసం ఆరు నెలలు భద్రపరచాలి

    • కఠిన రికవరీ పద్ధతులను ప్రోత్సహించే ఇన్సెంటివ్‌లు నిషేధం

    • రుణగ్రహిత ఆస్తి స్వాధీనం చేసుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి

    • ఫైనాన్స్‌ చేసిన డివైస్‌ను ఫోన్‌,ల్యాప్‌ట్యాప్‌ ఇతర వస్తువులు 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే డిసేబుల్‌ చేయాలి

    • డివైస్‌ యాక్సెస్‌ పరిమితం చేయడానికి 21 రోజుల నోటీసు, అదనంగా 7 రోజుల నోటీసు తప్పనిసరి

    • తప్పుగా డివైస్‌ బ్లాక్‌ చేస్తే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలి.

    • రికవరీ ఏజెంట్లు ఐడీ కార్డు, అనుమతి డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలి.

    • రికవరీ కాల్స్‌, లోన్‌ తీసుకున్న వ్యక్తులను  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కలవాలి

    • రికవరీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి.

    • మరణం లేదా వివాహం వంటి సందర్భాల్లో రుణదాతల్ని సంప్రదించరాదు’ అని ఆర్‌బీఐ తన కొత్త డ్రాఫ్ట్‌ బిల్లులో పేర్కొంది. 

     కాగా, ఆర్‌బీఐ తాజా డ్రాఫ్ట్‌ లోన్‌ రికవరీ నియమాలు మే 20, 2026న విడుదలయ్యాయి. ఈ డ్రాఫ్ట్‌పై ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్‌హోల్డర్లు తమ అభిప్రాయాలను మే 31, 2026లోపు సమర్పించాలి. తుది అమలు జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది

  • బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'పల్సర్ ఎన్160' కొత్త వేరియంట్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,22,000 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

    బజాజ్ కొత్త పల్సర్ ఎన్160.. స్టాండర్డ్ సిరీస్ కంటే కూడా ప్రీమియం లుక్‌, మెరుగైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ వంటివి ఉన్నాయి. ఇవి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. గోల్డ్ కలర్ USD ఫోర్కులు, ABS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

    సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్‌తో పోలిస్తే.. USB ఫోర్క్‌లను జోడించడం వల్ల మోటార్‌సైకిల్‌కు మరింత ప్రీమియం ఫ్రంట్-ఎండ్ లుక్ వస్తుంది. బ్రేకింగ్, కార్నరింగ్ లోడ్‌ల కింద మెరుగైన దృఢత్వాన్ని అందిస్తుంది. ABS బ్రేకులు రైడర్‌లకు మరింత బలమైన భద్రతను అందిస్తాయి.

    ఇదీ చదవండి: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!

    ఇకపోతే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈ వేరియంట్‌లో స్టైలింగ్ అండ్ రైడర్ సౌకర్యంపై స్పష్టంగా దృష్టి పెట్టారు. ఈ వేరియంట్‌లో మీకు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు రైడర్, పిలియన్‌కు ఎక్కువ స్థలాన్ని అందించే సింగిల్-సీట్ సెటప్ కూడా లభిస్తాయి. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు.

  • న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.870 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం 42.5 శాతం తగ్గింది. ఆదాయం 57 శాతం క్షీణించి రూ.611 కోట్ల నుంచి రూ.265 కోట్లకు దిగజారింది.

    ఆదాయం తగ్గినా, స్థూల మార్జిన్లు మెరుగయ్యాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన 13.7% నుంచి 38.5 శాతానికి చేరాయి. పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు, మెరుగైన స్థూల మార్జిన్లు, కఠినమైన వ్యయ నియంత్రణ కారణంగా కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాల నగదు ప్రవాహం పాజిటివ్‌గా మారి క్యూ4లో రూ.91 కోట్లుగా నమోదైంది. ఆటోమొబైల్‌ వ్యాపారం నుంచి రూ.213 కోట్ల ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లో, రూ.173 కోట్ల ఫ్రీ క్యాష్‌ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్‌) నమోదయ్యాయి.

    మార్చి త్రైమాసికంలో మొత్తం 20,256 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇక పూర్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం రూ.2,253 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.1,833 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్‌ మొత్తం 1,73,794 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది.

  • ఐపీఎల్ (IPL) సీజన్‌ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్‌సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్‌సైట్లు, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.

    గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించిన క్లౌడ్‌సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.

    పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు

    • 1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్‌సైట్ డొమైన్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు క్లౌడ్‌సెక్ గుర్తించింది.

    • ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్‌సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్‌ఫారమ్ అడ్మిన్ ప్యానెల్‌ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్‌సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్‌డ్రా రిక్వెస్ట్‌లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.

    • రూ. 4.65 కోట్ల విత్‌డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్‌ఫారమ్‌లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్‌డ్రా రిక్వెస్ట్‌లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.

    • మనీ మ్యూల్ నెట్‌వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.

    • క్రికెటర్ల పేరిట డీప్‌ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్‌లను ఏఐ (AI) డీప్‌ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

    • ప్రభుత్వ వెబ్‌సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్‌లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.

    ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్‌ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్‌సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్‌లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్‌జీ, సెంట్రల్ బెంగళూరులో ఒక పెంట్‌హౌస్‌ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.45.71 కోట్లు.

    తారిఖ్ ప్రేమ్‌జీ పెంట్‌హౌస్‌ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్‌కీ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ద్వారా తెలిసింది. కార్పెట్ ఏరియా 7,065 చదరపు అడుగులు, సూపర్ బిల్ట్-అప్ ఏరియా 10,602 చదరపు అడుగులుగా ఉంది. చదరపు అడుగుకు సుమారుగా రూ. 43,123 చెల్లించినట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది బెంగళూరులో జరిగిన అతిపెద్ద లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని జాప్‌కీ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. నగరంలో రిచ్మండ్ టౌన్, ఇంద్రానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హై-ఎండ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది.

    ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

    అజీమ్ ప్రేమ్‌జీ భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరు మాత్రమే కాకుండా.. ప్రముఖ దాతృత్వవేత్త కూడా. ఈయన స్థాపించిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరి కుటుంబం నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్ ఆర్మ్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. తారిఖ్ కూడా కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉంటూ, వివిధ బోర్డు స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

  • హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్‌తో రివర్స్‌ మెర్జర్‌ అనంతరం హైదరాబాద్‌కి చెందిన కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్‌ .. బీఎస్‌ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్‌ వెంకటేష్‌ చల్లా తెలిపారు.

    దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్‌ బస్‌ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్‌పార్టీ (ఇన్వెస్టర్‌ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్‌ తన బ్యాంక్‌ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

    ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులకు కమీషన్‌ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్‌ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.

  • ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.

    అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు.  నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.

    ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.

    అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.

    ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకున్నారు.

    ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్‌.. 8,000 మందిపై ప్రభావం!

    ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి.

  • గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 196.63 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 75,121.76 వద్ద, నిఫ్టీ 19.10 పాయింట్లు లేదా 0.081శాతం నష్టంతో 23,639.90 వద్ద నిలిచాయి.

    ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్, వీవర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, డిజిడ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

    నిర్ణయానికి కారణాలు

    » ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 
    » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.
    » సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.
    » కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.

    భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..

    ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్‌లాండ్‌లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.

    పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

    థాయ్‌లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్‌లాండ్‌ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి.

  • ‘సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి?’-ఏదైనా ఆఫీసులో ఒక ఉద్యోగి తన పైఅధికారిని అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. కానీ, నోయిడాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సీఈవోకు మాత్రం ఈ ప్రశ్న తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంతలా అంటే, ఆ ప్రశ్న అడిగినందుకు ఏకంగా ఒక సీనియర్ ఉద్యోగినే కొలువులోంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ వేదికగా కార్పొరేట్ కార్యాలయ సంస్కృతి, నాయకత్వ లక్షణాలపై చర్చకు దారితీసింది. ఆస్ట్రాలజీ స్టార్టప్ ‘ఇన్‌స్టాఆస్ట్రో’ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ వర్మ స్వయంగా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    ‘నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది ఇందుకేనా?’

    లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో నితిన్ వర్మ ఈ సంచలన నిర్ణయాన్ని పంచుకుంటూ, తానే స్వయంగా ఆ సీనియర్ ఉద్యోగిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ‘నేను ఒక ఉద్యోగిని తొలగించాను. ఎందుకంటే అతను నా దగ్గరకు వచ్చి.. సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు’ అని వర్మ రాసుకొచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘నేను వెంటనే అతని పనితీరును, ధోరణిని ప్రశ్నించాను. దానికి ఆ ఉద్యోగి సార్, నాకంటే మీకే బాగా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు నేను.. అసలు నిన్ను ఈ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నట్లు? అని అడిగాను’ అని వర్మ పేర్కొన్నారు.

    పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా..

    సదరు ఉద్యోగిని ఒక నిర్దిష్ట విభాగానికి పూర్తి బాధ్యుడిగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి భారీ ప్యాకేజీతో నియమించుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ నియామకం జరిగిందని తెలిపారు. సదరు సీనియర్ నిపుణుడికి మొదటి రోజు నుంచే ఎలాంటి మైక్రో మేనేజ్‌మెంట్, అప్రూవల్‌ చెయిన్‌ లేకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. వ్యవస్థాపకులు లేదా మేనేజర్ల నుంచి నిరంతరం సూచనల కోసం వేచి చూడకుండా.. సమస్యలను ముందుగానే గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే సీనియర్ ఉద్యోగుల బాధ్యత అని వర్మ వాదించారు.

    అది వ్యక్తిగతంగా రావాల్సింది!

    కార్యాలయంలో ఓనర్‌షిప్ (కంపెనీని తనదిగా భావించి పనిచేసే యాజమాన్య మనస్తత్వం) అనేది కాలక్రమేణా నాయకులు ఉద్యోగులకు నేర్పించే నైపుణ్యం కాదని, అది వ్యక్తిగతంగా రావాల్సిన మనస్తత్వమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘మీరు యాజమాన్య బాధ్యతను ఎవరికీ బలవంతంగా ఇవ్వలేరు. ఉంటే వారే ఆ బాధ్యతతో ముందుకు పరిగెడతారు, లేదంటే వారు దానిని ఎప్పటికీ చేరుకోలేరు. యాజమాన్య బాధ్యత లేని స్వేచ్ఛ కేవలం గందరగోళానికి దారితీస్తుంది. ఏం ఆలోచించాలో కూడా నేనే చెప్పాల్సి వస్తే.. అలాంటి వ్యక్తులతో నేను సంస్థను నిర్మించలేను’ అని సీఈవో నితిన్ వర్మ స్పష్టం చేశారు.

    నెటిజన్ల స్పందన

    ఈ పోస్ట్ వైరల్ కావడంతో లింక్డ్‌ఇన్ వినియోగదారులు, హెచ్ఆర్ నిపుణులు సీఈవో నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక సీనియర్ నిపుణుడికి కూడా కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత అవసరమని వాదిస్తున్నారు. ఎంత సీనియర్ అయినా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వ్యవస్థాపకుడి విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉండాలని భావిస్తారు. అందుకోసమే చర్చలు జరుపుతారు అని కొందరు చెబుతున్నారు. సీనియర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రతి చిన్న విషయానికి అనుమతులు లేదా స్పష్టత కోసం వ్యవస్థాపకుడిపై ఆధారపడకూడదని ఇంకొందరు అంటున్నారు.

    ఇదీ చదవండి: భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.

    రికార్డు స్థాయి కొనుగోళ్లు
    ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.

    బీఆర్‌ఎస్ పాలనపై ఆరోపణలు
    ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

  • సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో ఘనంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు.

    పుష్కరాల్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు సరస్వతీ అంత్య పుష్కరాలు సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించారు. పవిత్ర పుష్కర స్నానం అనంతరం వారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారికి శేష వస్త్రాలు బహుకరించి, జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కూడా పాల్గొన్నారు.

    తరువాత గవర్నర్ దంపతులు కాళేశ్వరంలో నూతనంగా నిర్మించిన మ్యూజియం ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద సప్త హారతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్‌తో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన నదీ హారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

  • భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్తను కత్తితో పొడిచి చంపేసింది భార్య.  ఈకోర్టును విచారించిన కింది కోర్టు ఆమెకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను  తెలంగాణా హైకోర్టు రద్దు చేసి కేవలం రూ. 500 జరిమానాగా తగ్గిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అసలేం జరిగింది? కేసు నేపథ్యం ఏంటి తెలుసుకుందాం ఈ కథనంలో

    కేసు నేపథ్యం
    కోర్టు రికార్డుల ప్రకారం..  భార్య పిల్లలు, పుట్టింట్లో   ఉండగా  భర్త తన పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు.  ఇక్కడ  దంపతుల మధ్య అకస్మాత్తుగా  ఘర్షణ మొదలైంది.  ఆ తర్వాత బైటికెళ్లిపోయాడు. కాసేపటికి ఒంటిపై బట్టలు లేకుండా (దిగంబరంగా) తిరిగి వచ్చాడు. అంతేకాదు  భార్యను, ఆమె కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడు. ఈ తీవ్ర ఘర్షణ మధ్యలో ఆగ్రహం తట్టుకోలేక ఆ మహిళ కత్తి తీసుకుని అతడిని పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.

    మొదట పోలీసులు ఈ కేసును ఐపీసీ సెక్షన్ 302 (IPC Section 302) కింద హత్యగా నమోదు చేశారు. అయితే, విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఇది  కావాలని అనుకుని ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య కాదని తేల్చింది. చంపాలనే ఉద్దేశం ఆమెకు లేదని భావించి, దీనిని సెక్షన్ 304 పార్ట్-II  కిందకు మార్చింది. దీని కింద ఆమెకు నాలుగేళ్ల కఠిన శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 300లోని 'ఎక్సెప్షన్ 4' (Exception 4 to Section 300 IPC) ను పరిగణనలోకి తీసుకుని ఆమె జైలు శిక్షను రద్దు చేసింది.

    ఎక్సెప్షన్ 4  అంటే ఏమిటి?
    ముందస్తు ప్రణాళిక లేకుండా, ఆవేశంలో, అప్పటికప్పుడు జరిగిన గొడవ వల్ల ఒక వ్యక్తి మరణిస్తే.. అలాగే నిందితుడు ఎలాంటి అక్రమ ప్రయోజనం పొందకుండా, క్రూరంగా లేదా అసాధారణంగా ప్రవర్తించకుండా ఉంటే, ఆ మరణాన్ని 'హత్య' (Murder) గా పరిగణించకూడదు. మహిళ పథకం ప్రకారం కాకుండా, ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల తీవ్ర ఆవేశంతో (Heat of passion) ఆ ఘర్షణలో అలా ప్రవర్తించిందని కోర్టు పేర్కొంది. కత్తితో పొడవడం వల్ల ప్రాణాలు పోతాయనే కనీస జ్ఞానం (Knowledge) ఆమెకు ఉంటుందని భావించి సెక్షన్ 304 పార్ట్-II కింద నేరాన్ని సమర్థించినప్పటికీ.. ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా శిక్ష విషయంలో మానవతా దృక్పథంతో ఉదారత చూపవచ్చని కోర్టు అభిప్రాయపడింది.

    జైలు శిక్ష పూర్తిగా ఎందుకు రద్దైంది?
    క్రింది కోర్టు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షపై మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఆ సమయంలో ఘటన జరిగిన పరిస్థితులను, ఆమె ఎదుర్కొన్న మానసిక క్షోభను హైకోర్టు నిశితంగా పరిశీలించింది. ఆమెకు ఇకపై ఎలాంటి అదనపు జైలు శిక్ష విధించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. క్రింది కోర్టు విధించిన రూ. 500 జరిమానాను ఆమె అప్పటికే చెల్లించి ఉండటంతో, కేవలం ఆ జరిమానానే శిక్షగా మార్చి ఆమెను విడుదల చేసింది.

    అంటే, గొడవలో హత్య చేయడం ఎల్లప్పుడూ క్షమించదగినదేనా?  కానే  కాదు...  గొడవల్లో లేదా వాదనల్లో జరిగే ప్రతి హింసను భారతీయ చట్టం క్షమించదు. ఉద్దేశం, ప్రణాళిక, ఉపయోగించిన ఆయుధం యొక్క స్వభావం, దాడి తీవ్రత,  నిందితుడు క్రూరంగా ప్రవర్తించాడా లేదా వంటి అంశాలను న్యాయస్థానాలు నిశితంగా పరిశీలిస్తాయి. ఒకవేళ కోర్టుకు చంపాలనే స్పష్టమైన ఉద్దేశం లేదా ముందస్తు ఏర్పాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికితే.. అది ఐపీసీ సెక్షన్ 302 కింద 'హత్య'గానే పరిగణించబడుతుంది. దానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష వంటి కఠినమైన శిక్షలు ఉంటాయి.

  • సాక్షి,హైదరాబాద్‌: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్‌ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ స్పందించారు.

    బండి భగీరథ్‌ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్‌ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్‌ చేశారని అనుకోవచ్చు.

    ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్‌ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. 

    సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కార్మికులను నాలుగు విభాగాలుగా ప్రభుత్వం విభజించింది. కార్మికులకు ఇది తెలంగాణ ఆవిర్భావ కానుక అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. పెంచిన వేతనాలు జూన్‌ రెండో తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు

    ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యువతకు నా విజ్ఞప్తి. సాంకేతిక నైపుణ్యం పెంచుకోండి. నైపుణ్యం ఉన్న వాళ్లను పంపాలని.. మన ప్రభుత్వాన్ని ఎన్నో దేశాలు సంప్రదిస్తున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న కార్మికులకు కనీస వేతనం ఎక్కువగా ఉండాలి. కార్మికుల హక్కులను కాపాడటమే మా లక్ష్యం. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గడిచిన 15 ఏళ్లలో కార్మికులకు వేతన సవరణ చేయలేదు. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము అధికారంలోకి వచ్చాక కార్మికుల కోసం సబ్‌ కమిటీ ఏర్పాటు చేశాం.

    గతంలో అర్బన్‌, రూరల్‌.. రెండే జోన్లు ఉండేవి. ఇప్పుడు మూడు జోన్లు చేశాం. నాలుగు కేటగిరిలుగా కార్మికులను విభజించాం. కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల కోటీ 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారు’ అని చెప్పుకొచ్చారు.

    వేతనాల పెంపు ఇలా..

    • అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.12వేల నుంచి రూ.16వేలకు పెంపు.

    • హైస్కిల్డ్‌ కార్మికులకు రూ.14,600వేల నుంచి 20వేలకు పెంపు.

    • సెమీ స్కిల్డ్‌ కార్మికుల కనీస వేతనం రూ.13590 నుంచి రూ.15వేలకు పెంపు.

    • స్కిల్డ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.17వేల నుంచి రూ.18వేలకు పెంపు. 

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ సిగ్నల్‌ రహత నగరంగా మార్చుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో..ఈ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో ప్రస్తుతం సిగ్నల్‌ ఫ్రీ రహదారులు ఉన్నాయి. ఆ తరహాలోనే మన నగరంలోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.  

    ‘కేబీఆర్‌’తో మొదలు.. 
    800 కిలో మీటర్ల రహదారి నెట్‌వర్క్‌ ఉన్న గ్రేటర్‌లో తొలుత జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ వరకు పూర్తిగా సిగ్నల్‌ రహిత కారిడార్‌ను నిర్మించనున్నారు. రోడ్‌ నంబరు– 45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్‌ హాస్పిటల్, ముగ్ధ జంక్షన్‌తో సహా కీలక కూడళ్ల వద్ద గ్రేడ్‌ సెపరేటర్లను ప్రతిపాదించారు. రెండు వేర్వేరు ప్యాకేజీల కింద జీహెచ్‌ఎంసీ కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్, బంజారాహిల్స్‌ చుట్టూ రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తోంది. కేబీఆర్‌ పార్క్‌ భూమిని ఆక్రమించకుండా ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లన్నింటినీ ఇప్పటికే ఉన్న రోడ్డు మధ్యభాగాల్లోనే నిర్మించనున్నారు. అలాగే కాంక్రీట్‌ నిర్మాణాల కంటే స్టీల్‌ ఫ్లై ఓవర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాలలో 13.6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాల విడుదల నివారణతో వాయు కాలుష్య స్థాయిలను 72 శాతం తగ్గించొచ్చు. ఏటా 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధనం ఆదా అవుతుందని అంచనా. 

    సాధ్యమేనా? 
    రాజస్థాన్‌లోని కోటా నగరం తరహాలో గ్రేటర్‌లో ఈ విధానాన్ని అమలు చేయడం అంత సులువు కాదని, ఈ ప్రతిపాదన ఆచరణలో అనేక సవాళ్లున్నాయని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాపడుతున్నారు. 2014లో నగరంలో 42.2 లక్షల వాహనాలు ఉండగా.. తాజాగా వీటి సంఖ్య 94.16 లక్షలు దాటింది. నగరంలో సగటున ప్రతిరోజూ 1,500 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఈమేరకు మౌలిక సదుపాయాలు, రహదారుల విస్తరణ లేకపోవడంతో  ట్రాఫిక్‌ చిక్కులు తీవ్రమవుతూనే ఉన్నాయి. 

    ఇలా చేస్తే బెటర్‌.. 
    నగరం మొత్తాన్ని సిగ్నల్‌ రహితంగా మార్చడం కాకుండా కీలక కూడళ్ల వద్ద దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్‌ రద్దీని తొలగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరాలు, సెన్సార్లను ఉపయోగించి 
    ఆరి్టఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత అడాప్టివ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వినియోగిస్తే కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీని బట్టి వాహనాల వెయిటింగ్‌ సమయం ఆటోమేటిక్‌గా మారుతుంది.

    లాభమేంటంటే? 
    సిగ్నల్‌ ఫ్రీలతో ప్రధాన కూడళ్ల వద్ద నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రతీ లైన్‌కూ ప్రత్యేకంగా రహదారి ఉంటుంది. దీంతో జంక్షన్‌లో ఎలాంటి ట్రాఫిక్‌ సిగ్నల్‌ గానీ, ట్రాఫిక్‌ పోలీసులు గానీ అవసరం ఉండదు. దీంతో ప్రధాన నగరంలో రహదారి భద్రత మెరుగవడంతో పాటు ట్రాఫిక్‌ సజావుగా సాగుతుంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది.  

    ‘కోటా’ కథ ఇదీ..
    15 లక్షల జనాభా ఉన్న కోటా నగరం 2022లో దేశంలోనే తొలి సిగ్నల్‌ రహిత నగరంగా అవతరించింది. సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో వందకు పైగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రౌండ్‌ అ»ౌట్‌లు, రోటరీలు, రింగ్‌రోడ్‌లను పున
    రి్నరి్మంచారు. కోటాలోని సుమారు 12 ప్రధాన కూడళ్లలో రోజుకు 7 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.  

Family

  • భూమి సూర్యుడి చుట్టూ, తన చుట్టూ తనే తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. మనం జీవించడానికి గాలి, నీళ్లు, వెలుగు ఫ్రీగా ఇస్తుంది. మన జీవనానికి ఎంతో మేలు చేస్తున్న నేల తల్లిని రోజూ ఉదయం నిద్ర లేవగానే తాకి, కళ్లకు అద్దుకుంటే మనలో ఎంతో ప్రేమ, బాధ్యత కలుగుతాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. సునామీలు వస్తుంటాయి. కానీ, ఇక్కడ మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతుంది.

    నిర్లక్ష్యం తగదు
    భూమి మనకు రోజులో 24 గంటల సమయం ఇచ్చింది. సగం వెలుతురు, సగం చీకటి. వెలుగులో పని చేసుకోవాలి, చీకటిలో విశ్రాంతి తీసుకోవాలి. ఎంతో జీవరాశికన్నా మనకు మంచి ఆలోచనలు ఇచ్చింది. తినడానికి, ఉండటానికి ఎంతో మంచిని ఇచ్చిన భూదేవిని మనం ఎంత బాగా చూసుకోవాలి. కానీ, మనలో చాలా మంది ఏం చేస్తారు, భూమి మీద ఉమ్మివేస్తారు, కాళ్లతో తన్నుతుంటారు, చెత్త పడేస్తుంటారు.. చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు భూమి మీద ఉండే అవకాశాన్ని, హాయిగా తిరిగేలా సంతోషాన్ని ఇస్తున్న భూమిని శుభ్రంగా ఉంచుతూ, మనం కూడా మంచి చేస్తూ ఉంటే భూమితల్లి సంతోషిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తుంది.

    సరిపడే కాంబినేషన్‌
    మన చుట్టూ ఎంత నీటుగా పెట్టుకుంటామో అంత మంచిని తిరిగి ఇస్తుంది భూమితల్లి. చెట్లు మనకు ఆక్సిజన్‌ని ఇస్తాయి, మనం వాటికి కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఇస్తాం. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఎప్పుడూ కలవవు. అలాగే అందరూ భిన్నంగా ప్రవర్తిస్తారు. కానీ, ఒకదాని నుంచి ఒకటి సాయం పొందుతూ కలిసి మెలిసి ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడం అనే కాంబినేషన్‌ మన చుట్టూతా ఉంది. ఒక చెట్టు పువ్వు, కాయ, పండు ఇస్తుంది. మనం కూడా మన చుట్టూ ఉండేవారికి మనలోని మంచి పువ్వులను, ఫలాలను ఇవ్వాలి.

    ఆనందమే బహుమతి
    సూర్యోదయం వేళలలో పక్షుల కిలకిలారావాలు వినిపిస్తాయి. మొక్కలు రంగు రంగుల అందమైన పువ్వులను ఇస్తాయి. చెట్లు నీడను ఇస్తాయి. వర్షం పడితే నేల నుంచి మంచి వాసన వస్తుంది. ఇవన్నీ భూమాత మనకు ఇస్తున్న చిన్న చిన్న బహుమతులు. మన అమ్మ మనల్ని ప్రేమగా చూసుకుంటుంది కదా, అలాగే భూమాత కూడా ఎలాంటి ఫలితం ఆశించకుండా మనందరినీ చూసుకుంటోంది. చిన్నవాళ్లమా, పెద్దవాళ్లమా అని కూడా చూడదు. ప్రతి జీవికీ ఈ భూమ్మీద చోటు ఇచ్చింది. పక్షులకు గూళ్లు, జంతువులకు అడవులు, మనుషులకు ఇళ్లు.. అన్నీ భూమాత ఒడిలోనే ఉన్నాయి. ఇన్ని ఇస్తున్న భూమాతకు మనం తిరిగి ఏం ఇస్తున్నాం 

    ∙మొక్కలను నాటి, సంరక్షించాలి. చెట్లను కాపాడుకోవాలి 
    ∙ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి 
    ∙నీటి వృథాను అరికట్టాలి.  భూమితల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనమూ బాగుంటాం అనే ఆలోచనను చేయాలి. ఎంతో నేర్చుకునే అవకాశం ఇస్తున్న భూమిని మనం ఎలా చూసుకోవాలో మీ ఆలోచనల ద్వారా చూపండి. ధన్యవాదాలు చెబుతూ బాధ్యతగా నడుచుకుంటే ఎన్నో ఆనందాలను మనం అందుకోవచ్చు. ఈ విధంగా చెబితే పిల్లలు మరింతగా భూమితో కనెక్ట్‌ అవుతారు. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. అనేవి తమ సృజనతో పెద్దలకే పాఠాలు చెబుతారు.
    నిర్వహణ: నిర్మలారెడ్డి

    సినీ దర్శకుడు, నటుడు తరుణ్‌భాస్కర్‌ తల్లి గీతాభాస్కర్‌. నటిగానూ ఆమె మనకు పరిచయమే. ఇంతవరకే మనకు తెలుసు. కానీ, నలభై ఏళ్లుగా ఆర్ట్‌ టీచర్‌గా పిల్లల చేత వివిధ రకాల యాక్టివిటీస్‌ చేయిస్తూ, టీచర్లకు ఆర్ట్‌ కోర్సులను అందిస్తున్నారు ఆమె. పిల్లలకు, టీచర్లకు క్లాసులను నిర్వహిస్తున్నారు. 

    ఈ వేసవిలో పిల్లల చేత యాక్టివిటీస్‌ చేయించడానికి దాస్యం గీతాభాస్కర్‌ (Dhaassyam Geetha Bhascker) ‘సాక్షి ఫ్యామిలీ’ ద్వారా మన ముందుకు వచ్చారు. ‘ఫైవ్‌ ఎలిమెంట్స్‌’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన.. ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. 
    మెయిల్‌ ఐడి sakshisummerkids@gmail.com

  • అమెరికన్ రియాలిటీ టెలివిజన్ స్టార్, మోడల్, బిలియనీర్‌ కిమ్ కర్దాషియాన్ రోజకు 35 సప్లిమెంట్లు తీసుకుంటుందట. వాటిని రోజుకు మూడుసార్లుగా విభజించుకుని మరి తీసుకుంటానని ఇటీవల అమీ పోలర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పుడు ఆమెనే స్వయంగా తెలిపింది. దీని కారణంగా 'పిల్ ఫెటీగ్' (మాత్రల అలసట)తో బాధపడుతున్నానని కూడా తెలిపింది. అయితే ఆ ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోలేక కొన్నాళ్లు ఆపేసినట్లు తెలిపింది. అయితే కొద్దిరోజుల్లనే మళ్లీ మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఈ మందులను నేరుగా శరీరంలోకి ఎక్కించుకునేలా ఐవీ డ్రిప్‌ ఉంటే బాగుండును ప్రతిసారి వర్క్‌టైంలో గుర్తుపెట్టుకుని వేసుకోలేక అవస్థ పడుతున్నా అని బాధగా చెబుతుంది. అసలు నిజంగా ఒక మనిషి ఇన్ని సప్లిమెంట్లు తీసుకోవచ్చా? ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదా? అంటే..

    సప్లిమెంట్లు అదనపు పోషణను అందించి, పోషకాహార లోపాలను భర్తీచేయడంలో సహాయపడినప్పటికీ, రోజుకు 35 సప్లిమెంట్లు అంటే.. సురక్షితం కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్రమైన హాని అని, అవయవాలు దెబ్బతినొచ్చు లేదా జీర్ణ సమస్యలు, కణజాలంలో విషపదార్థాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

    సప్లిమెంట్లు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయం కాదని నొక్కి చెబుతున్నారు. ఇవి కేవలం పోషకాహార లోపాలకు చికిత్స చేయడానికి, ఇతర వ్యాధులకు , అనారోగ్య సమస్యల నుంచి బయపడటానికి ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, డి, ఇ, కె లను నిల్వ చేసుకోగల సామర్థ్యం కారణంగా, వాటిని అధికంగా తీసుకుంటే చాలా ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. 

    అంతేకాకుండా, కొన్ని సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయానికి నష్టం, మూత్రపిండాల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, నరాల దెబ్బతినడం, ఔషధాల మధ్య ప్రతిచర్యలు తదితరాలు సంభవిస్తాయని అన్నారు. ఇదేదో  ట్రెండ్‌లా లేదా సెలబ్రిటీలు వాడుతున్నారనో అస్సలు తీసుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు.  

    సప్లిమెంట్లను అధికంగా తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రమాదాలు

    1. విటమిన్ విషప్రభావం (విటమిన్ టాక్సిసిటీ)
    అధిక మోతాదు తీసుకోవడం వల్ల మూత్రపిండాల దెబ్బతినడం, కాలేయం దెబ్బతినడం, కడుపునొప్పి, విరేచనాలు, నరాల దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

    2. ఖనిజాల అధిక భారం (మినరల్ ఓవర్‌లోడ్)
    విటమిన్ల మాదిరిగానే, ఖనిజాల అధిక భారం కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, సప్లిమెంట్ల రూపంలో తీసుకునే అదనపు ఐరన్ తీవ్రమైన జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగించి, కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

    ప్రమాదకరమైన ఔషధ రియాక్షన్‌ (డ్రగ్ ఇంటరాక్షన్స్)
    సప్లిమెంట్లు శరీరం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని మార్చగలవు. ఉదాహరణకు, విటమిన్ కె రక్తాన్ని పల్చబరిచే మందుల (బ్లడ్ థిన్నర్స్) ప్రభావాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల పక్షవాతం (స్ట్రోక్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

    అధిక వినియోగం
    బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, ఎనర్జీ బార్‌లు,  జ్యూస్‌ల వంటి అనేక రోజువారీ ప్రాసెస్ చేసిన ఆహారాలలో విటమిన్లను అధికంగా కలుపుతారు. రోజువారీ మల్టీవిటమిన్‌ల తోపాటు నిర్దిష్ట లక్షిత సప్లిమెంట్లు తీసుకుంటే మాత్రం తెలియకుండానే అధికంగా తీసుకునే ప్రమాదం ఉంటుందట
    పరిగణించవలసిన భద్రతా చిట్కాలు

    ఏ రకమైన ఆహార సప్లిమెంట్లు అయినా వాడే ముందు వైద్యుల పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో తీసుకోవాలి. అలాగే మనం వాడే సప్లిమెంట్లు మంచి నమ్మదగిన బ్రాండ్‌వేనా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సప్లిమెంట్‌ వాడుతున్నప్పుడు వికారం, కడుపు నొప్పి, కామెర్లు, గుండె దడ లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే వైద్యులను సంప్రదించి వాడొచ్చో లేదా నిర్థారించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, నో ప్రిజర్వేటివ్స్‌..! ఈ బామ్మ చేసే ఐస్‌క్రీమ్‌కి ఫిదా అవ్వాల్సిందే..)

     

     

  • కోటి లింగేశ్వర నమఃశివాయ అనే ఉచ్చారణ వింటుంటే మనకి ఒక సందేహం కలుగుతుంది... కోటి లింగాలతో శివాలయమా అని... ఔను! నిజంగానే కోటి లింగాలతో శివాలయం ఉంది అంటే ఆశ్చర్యపోతాము. దానికి తోడు 108 అడుగుల ఎత్తు కలిగిన అతి ఎత్తయిన శివలింగం... ఎదురుగా 36 అడుగుల పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంది. శివ లింగానికి, నందీశ్వరునికి మధ్య పెద్ద త్రిశూలం స్థాపించారు. సుమారు 97 లక్షల శివలింగాల ప్రతిష్ట జరిగి ఉంటుందని లెక్క. ఇవికాక ఉపదేవతలు... దేవి పీఠాలు వెరసి భక్తితో ఓం నమఃశివాయ అనే ఉచ్చారణతో లోకమే మర్చిపోతాము.  

    కోటి లింగాల స్థాపన అంటేనే చిన్న విషయం కాదు. ఈ దేవాలయ ప్రతిష్టతో ఆ ఊరి అసలు పేరు మారిపోయి కోటి లింగేశ్వర అని చెప్తేనే తెలుస్తోంది. మరి అంతటి ప్రశస్తి పొందింది. ఈ కోటి లింగేశ్వర దేవాలయం బెంగుళూరుకి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరు కమ్మసంద్ర. ట్రైన్‌లో వెళ్తే బంగారుపెట్ట రైల్వేస్టేషన్‌లో దిగితే 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉండడానికి అంత సౌకర్యాలు లేవు. బెంగళూరు, కమ్మసంద్ర రెండు వేరు వేరు లోకాలని చెప్పొచ్చు. బెంగళూరు యాంత్రికమైన వేగంతో కూడుకున్న జీవితం అయితే కమ్మసంద్రలో ప్రశాంతమైన పల్లె వాతావరణం... భక్తితో కోటి లింగేశ్వర లోకం అని అనిపిస్తుంది. 

    మరి ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరు స్వామి సాంబశివమూర్తి. పేరులోనే శివ నామం ఉంది. అందుకేనేమో కోటి శివలింగాలను ప్రతిష్టించాలని మనసులో అనుకున్నారు. భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ అనే కేంద్ర సంస్థలో ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలి శివనామస్మరణతో కోటి లింగేశ్వర దేవాలయంలో తన శేష జీవితం గడిపారు. 

    వీరి స్వప్నమే కోటిలింగాల ప్రతిష్ట. 2018లో స్వామి సమాధి ΄పొంది శివైక్యం అయ్యారు. ఇక్కడ 17 శక్తి స్వరూపాలను ప్రతిష్టించారు. అలాగే దుర్గ, పార్వతీదేవిల ప్రతిష్ట ఉంది. ఉప దేవతలుగా అన్నపూర్ణేశ్వరి, కరుమారి అమ్మ, సుబ్రమణ్యేశ్వర స్వామి, పాండురంగస్వామి, సీతారామలక్ష్మణులు, పంచ ముఖ గణపతి, కన్యకాపరమేశ్వరి ఉపదేవతా క్షేత్రాలు ఉన్నాయి. ముందుగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులను పూజించి దర్శనానికి వెళ్ళాలి. 

    ఇక్కడ చూడదగ్గది సహస్రనామ శివలింగం. ఏకశిల మీద వేయి శివలింగాలను చెక్కి ఉంటుంది. ఒకేసారి వేయి శివలింగాల దర్శనం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే మరో పుణ్యఫలం పంచ ముఖ శివలింగం. ఇక్కడ భక్తులకి మరో మంచి పుణ్యం శివునికి అభిషేకం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయ యాజమాన్యాన్ని సంప్రదించి మనకి నచ్చిన వారి జ్ఞాపకార్ధం ఎనిమిది వేల నుండి రెండు లక్షల రూపాయలు వరకు చెల్లించి శివలింగ ప్రతిష్ట చేసుకోవచ్చు. ఆ విధంగా మనం కూడా కోటిలింగేశ్వర యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. 

    ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పేర్లు కనిపిస్తాయి. గుడిలో వినాయకుడి గుడి ముందు భారీ బిల్వపత్ర వృక్షం, నాగలింగ వృక్షాలు ఉన్నాయి. ఆలయంలో పూజించే పవిత్రమైన దారాన్ని తీసికొని ఈ చెట్లకు కడితే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయాల్లో నిత్యసేవ, అన్నదానం, పేదలకు వస్త్రదానం జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవం, జాతర జరుగుతుంది. మంజునాథుడు పరమ శివ భక్తుడు. 

    వీరి చరిత్రలో కూడా కోటి లింగేశ్వర ప్రసక్తి ఉందని అంటారు. స్వతహాగా మంజునాథుడు భక్తిభావం లేకుండా తిరిగేవాడు. ఒకరోజు అతనిలో శివుని మీద భక్తి కలిగింది ఎవరు నమ్మలేదు. అప్పుడు మంజునాథుడు పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లారు. అప్పుడు దీపాలు ఆరిపోయాయి. అది చూసి బాధతో శివ నామ స్మరణ చేసి కీర్తనలు పాడారు. అప్పుడు దీపాలు తిరిగి వెలిగాయి. అప్పుడే ఆయన తన తప్పుకి ప్రాయశ్చిత్తం కోసం కోటి లింగాలను ప్రతిష్ట చేయడానికి సంకల్పం చేశారని చెబుతారు. కోటిలింగేశ్వర యాత్రా దర్శనం అద్భుతం అని చెప్పొచ్చు. 

    – ఈఎస్‌ మాధవన్, విశాఖపట్నం

  • మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలు కలవారు ఉంటారు. సాత్వికులు, మూర్ఖులు, మధ్యస్థంగా ఉండేవారు, తెలివైన వారు, కోపిష్ఠులు... వీరందరిలోనూ ప్రత్యేకంగా కనిపించే మరొక తరహా మనుషులు  పొగగరుబోతులు! 

    పొగరు అంటే అవసరానికి మించిన ఆత్మాభిమానమే! పొగరన్న మాట విన్నప్పుడు ఓ కొండో, ఆకాశాన్ని తాకే చెట్టో గుర్తుకు రాక మానదు. ఎందుకంటే కొంతమందిలో అహంకారం ఆ స్థాయిలో ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే... ఇలాంటివారిలోనూ ఒక స్థాయిలో జ్ఞానం దాగి ఉంటుంది. పొగరుబోతులు సహజంగా గర్వంతో ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు తమకంటూ ఏదో ప్రత్యేకమైన గొప్ప విలువుందని నమ్ముతారు. ఆత్మన్యూనతా భావం లేకుండా స్వశక్తి మీద విశ్వాసం ఉండటం ఆధ్యాత్మిక జగత్తులో ఓ గొప్ప పరిణామమే! ‘ధీరులు ఆత్మవిశ్వాసంతో భాసిస్తారు’ అని గీతాకృష్ణుడు చెబుతాడు. అయితే...  పొగరు వేరు, ఆత్మవిశ్వాసం వేరు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నటి గీతను గుర్తించాలి. సాధకుడు తనను తాను శక్తిమంతుడిగా నమ్మాలి. కానీ, అది తలబిరుసుతనంగా మారకూడదు.  తనలో ఉన్న గొప్పతనాన్ని వినయపూర్వకంగా గ్రహించడం మాత్రమే ప్రగతికి పునాది వేస్తుంది.

    పొగరును వినయంగా మార్చుకోవడంతో సాధన పరిపక్వత  పొందుతుంది. జ్ఞాని మౌనంగా ఉన్నప్పటికీ వారి విజ్ఞత లోకానికి వెల్లడవుతుంది. అవసరమైనప్పుడు అతడు మాటల్లోనూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తాడు. అది అతిశయం ఎంతమాత్రం కాబోదు. అంతర్లీనంగా ఉన్న అతడి వినయాన్ని లోకం అర్థం చేసుకుంటుంది. ఏ విషయం తనలో పొగరుబోతుతనానికి ప్రేరణ కల్పించిందో దాన్ని మిథ్యగా తెలుసుకుని తొలగించుకోవాలి. విన యాన్ని సాధన చేయాలి. పండు సువాసనతో, మాధుర్యంతో తినేవారిని ఆకర్షిస్తుంది. అది పిందెగా ఉన్నప్పుడు వగరుగానో, చేదుగానో, పుల్లగానో  ఉండవచ్చు. కాలగతిన ఆ స్థానంలో మాధుర్యం చోటు చేసుకుంటుంది.  పొగరుబోతుతనం తొలుత వెగటు కలిగించినా, జ్ఞానంతో కూడిన సాధనతో అటువంటి వ్యక్తి కూడా తీయని ఫలంలాగా లోకానికి తప్పక ప్రీతి కలిగిస్తాడు. పొగరుబోతుతనం తప్పుకాదు. అదొక తెలియనితనం! అమాయకులైన పిల్లలు విద్యతో వినయాన్ని, జ్ఞానాన్ని సాధించినట్లు పొగరుబోతులు జీవితం బోధించే పాఠాలు ఒంటబట్టించుకున్నాక విలువలు నేర్చుకుని తప్పక జ్ఞానవంతులవుతారు...అవ్వాలి! 

    లోకంలో ప్రతి వ్యక్తిలోనూ కొద్దో గొప్పో అహంకారం ఉంటుంది. అహం లేకుండా మనిషి లేడు. ఆ అహం, అహంకారంగా మారకుండా చూసుకుని పరమాత్మను చేరే మార్గం సాధకుడు అన్వేషించాలి. పొగరుబోతుతనం శాశ్వతం కాదు. మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ అదే  పొగరుబోతుతనం వినయంగా మారుతుంది

  • రోజురోజుకి ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఈ ఉక్కపోతలకి నోట్లోకి చల్లగా ఐస్‌క్రీమ్‌ వెళ్తే ఉంటుంది.. ఆ ఆనందం మాటలకందనిది. అందుకే ఈ కాలంలో చిన్న, పెద్ద అంతా ఐస్‌క్రీమ్‌లు తినేందుకు మక్కువ చూపిస్తుంటారు. అలాంటి టేస్టీ.. టేస్టీ.. కూల్‌ కూల్‌ ఐస్‌క్రీమ్‌లను ఈ బామ్మ తన ఇంట్లోనే స్వయంగా తయారు చేసి అందిస్తోంది. అత్యంత సహజసిద్ధమైన వాటితో ఎలాంటి యంత్రాలను ఉపయోగించుకుండా రుచికరమైన హోమ్‌మేడ్‌ ఐస్‌క్రీమ్‌లు అందిస్తోంది. దశాబ్దాలుగా ఆమె ఇలానే కొనసాగించడం విశేషం. ఆమె అందించే ఈ రుచికరమైన ఐస్‌క్రీమ్‌లు అనతి కాలంలోనే మంచి బ్రాండ్‌గా స్థిరపడిపోయింది. ఎవరా బామ్మ? ఏమా కథ చూద్దామా..!.

    అహ్మదాబాద్‌కి చెందిన నిరంజన్‌ దేశాయ్ ఇంట్లోనే ఐసీక్రీమ్‌లు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారామె. అంతా నిరూబెన్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బామ్మ తన వంటగదిలోనే తొలిసారిగా ఐస్‌క్రీమ్‌ తయారు చేశారట. ఏ ఇతర బ్రాండ్‌లు ఆ బామ్మ తయారు చేసే ఐస్‌క్రీమ్‌ రుచికి సరితూగదట. ఆమె మామిడి, సీతాపలం, కొబ్బరి-అల్లం నిమ్మకాయ వంటి ‍ప్లేవర్లలో కృత్రిమ రుచుల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు ఉపయోగించకుండా తయారు చేయడం ఈ బామ్మ ప్రత్యేకత. 

    అంతేగాదు ఈ బామ్మ తాజాపాలు, మీగడ, స్టీవియా, పండ్లు లేదా డ్రైఫ్రూట్స్‌ వంటి నాలుగు సాధారణ పదార్థాలనే ఆమె ఉయోగిస్తారు. ఆమె తన ఐస్‌క్రీమ్‌ వ్యాపారాన్ని 1986లో ప్రారంభించింది. సాధారణ స్టవ్‌పై తయారైన ఆ వ్యాపారం దశాబ్దాలు గడిచేకొద్ది చిన్నపాటి సాంప్రదాయ కొలిమితో కూడిన పత్యేక గదిలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేయడం ప్రారంభించారు. వాణిజ్య బ్రాండ్‌లు సాధారణంగా ఉపయోగించే పెద్ద పారిశ్రామిక యంత్రాలపై ఆధారపడకుండా సాంప్రదాయ పద్ధతిలోనే డెజర్ట్‌లను తయారు చేస్తుంది ఈ బామ్మ బృందం. 

    అలాగే తన ఐస్‌క్రీం రుచిని కాపాడుకోవడం కోసం ప్రతి రోజు లిమిటెడ్‌గానే ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తుంటారు. ఆ నేపథ్యంలోనే  ఈ బామ్మ ఐస్‌క్రీమ్‌ ఓ ప్రసిద్ధ బ్రాండ్‌గా స్థిరపడటమే కాదు బల్క్‌ నుంచి టేక్‌ అవే ఆర్డర్‌ల అందించే స్థాయికి చేరువైంది. మొదటగా గులాబీ-కొబ్బరి, మిరియాలు, చాక్లెట్‌, బాదం, పిస్తా, కేసర్‌, యాలకులు వంటి రుచులతో ప్రారంభమైన ఈ నిరుబెన్‌ బామ్మ దుకాణం ప్రస్తుతం దాదాపు 27 రకాలా వైవిధ్యభరితమైన ఐస్‌క్రీమ్‌లను అందిస్తుంది. 

    అయితే ఈ బామ్మ వయసు పైబడటంతో కొన్ని రకాల పదార్థాలను సేకరించడం కష్టంగా మారి కొన్ని రకాలా ఐస్‌క్రీమ్‌ల తయారీని నిలిపివేసినప్పటికీ..కస్టమర్లు ఇష్టంగా ఆస్వాదించే కొన్ని రకాల హోమ్‌మేడ్‌ ఐస్‌క్రీమ్‌లను మాత్రం ఇప్పటికీ అందిస్తోంది. తన కాళ్లపై తాను నిలబడాలన్న తాపత్రయం ఉంటే.. ఎంత సవాలుతో కూడిన పనులైనా సునాయాసంగా జయిస్తూ ముందుకు సాగిపోతారనేందుకు ఈ బామ్మే ఉదాహరణ కదూ..!. 
     

     

    (చదవండి: కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్‌​..!)
     

  • మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్దులు తో స‌హా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు.

    ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహించనున్నారు.

    ప్రత్యేకంగా మే 29న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామిక వెత్త‌ల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభం, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది.

    మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీత‌క్క ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మహిళలకు బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు వంటి అవకాశాలను గ్రామ స్థాయికే తీసుకెళ్తున్నామని చెప్పారు. మహిళల చేతుల్లో ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. 

    మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమం మహిళల ఆర్థిక స్వావలంబన, భద్రత, నాయకత్వ వికాసానికి దోహదపడేలా రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

    కాగా, ప్రజా పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళా సంఘాలను కీలక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ వారోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. 

    (చదవండి: కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్‌​..! ఏకంగా 300 గంటలు..)

  • అలసిన క్షణాన అందరికీ గుర్తుకొచ్చేది చాయ్‌.. అందుకే ప్రతీ ఇంట్లో ప్రతీ రోజు ఉయదం చాయ్‌ ఉండాల్సిందే. ప్రయాణం ముగిసిన వెంటనే.. స్నేహితులు కలిసిన వెంటనే.. ఎవరైనా ఇంటికొచ్చిన వెంటనే అడిగే మొదటి ప్రశ్న చాయ్‌ తాగుతారా.. అని. అంత‘టీ’ ప్రాధాన్యత కలిగిన చాయ్‌కూ ఓ రోజుంది. 2005 నుంచి ప్రతీ ఏడాది మే 21న  అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

    కౌటాల: తాగాల్సిందే టీ.. పొద్దునో టీ.. సాయంత్రమో టీ.. దోస్తులతో టీ.. చుట్టాలతో టీ.. పని ఆపి ఒక టీ.. పనయ్యాకో టీ.. అని టీ ప్రియులు అంటున్నారు.  చెమటలు కక్కే వేడిలో పొగలుకక్కే చాయ్‌ తాగాల్సిందే. ఛాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌.. ఛాయ్‌ ఖరీదులో చీపురా భాయ్‌.. ఛాయ్‌ ఖు షీలనే చూపుఆ భాయ్‌ అంటూ చాయ్‌ చమక్కుల ను .. చాయ్‌ కలిగించే కిక్కులను పేద, ధనిక వ్య త్యాసం లేకుండా ఆస్వాధిస్తుంటారు. ఎంత పేదలైనా ఇంటికి వెళ్లామంటే.. ఓ గాస్లు మంచినీళ్లు, కప్పు టీ ఇవ్వాల్సిందే. ఇది అనాదిగా ఉన్న అలవాటు. 

    1793 నుంచే.. 
    ఎంతో చరిత్ర కలిగిన టీని తేనీరు, చా అని పిలుస్తారు.. దైనందిన కార్యక్రమాలు టీతోనే మొదలువుతున్నాయంటే ఆశ్చర్యం కాదు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయం అయింది. మొట్ట మొదటిసారిగా మనదేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్‌లో లార్డ్‌ మెకార్డినీ టీ మొక్కలు పెంచడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా మన దేశంలో తేనీరు సేవించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంటింటి టీ చేరింది. ప్రపంచ టీ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. అంతర్జాతీయంగా 30 శాతం టీ పొడిని ఒక్క భారతీయులే వాడేస్తున్నారు. 

    టీ తోనే రోజు మొదలు
    ప్రతీ రోజూ ఉదయం పొద్దునే న్యూస్‌ పేపర్‌ చదడం అలవాటు. అదికూడా చాయ్‌ తాగుతానే.. చాయ్‌ లేదంటే పేపర్‌ చదవడం కూడా ఇష్టం ఉండదు. సమావేశాలు, సభలకు వెళ్లిన ప్రతీ చోట టీ తప్పనిసరిగా ఇస్తున్నారు. స్నేహితులు కలిసి ప్రతిసారి టీ 
    తాగుతుంటాం. 
    – మోర్లె పాండురంగ్, కన్నెపల్లి

     

  • బాలీవుడ్‌ బుల్లి తెర నటి మౌనీరాయ్‌ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్‌, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్‌ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్‌వేర్‌లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్‌​ కూడా చేరారు. 

    చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్‌ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది. 

    ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్‌ టీజర్‌ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్‌ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్‌ అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. దీన్ని డిజైనర్‌  పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్‌పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్‌ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్‌కు చెందినది. 

    వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్‌ శరీరానికి హత్కుకుపోయే ఫిట్‌, స్క్వేర్‌ నెక్లైన్‌తో కలర్‌ఫుల్‌గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్‌ షేడ్‌తో అందంగా కనిపించింది. 

    (చదవండి: కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్‌ లుక్‌..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?)
     

Politics

  • చెన్నై: ఇటీవల తమిళనాడులో కొలువుదీరిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం.. తన క్యాబినెట్‌ను విస్తరించడంతో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మంత్రులుగా చాన్స్‌ దక్కింది.  ఫలితంగా కాంగ్రెస్‌ ‘సుదీర్ఘ’ ఘనతను సొంతం చేసుకుంది. ఇలా ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ భాగస్వామ్యం కావడం తమిళనాడు చరిత్రలో 59 ఏళ్ల తర్వాతి ఇదే తొలిసారి. 

    దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టడంతో అది కాస్తా తమిళనాడు రాజకీయాల్లో అరుదైన ఘటనగా చేరిపోయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలైన ఎస్. రాజేష్ కుమార్,  పి. విశ్వనాథన్‌లు విజయ్‌ మంత్రివర్గంలో చోటు దక్కడంతో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈరోజు(గురువారం, మే 21 వ తేదీ) జరిగింది. 

    అయితే మంత్రిగా ఎస్‌ రాజేష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాజీవ్‌ గాంధీ, రాహుల్‌ గాంధీ నామస్మరణలు చేయడం తమిళనాడులో కొత్త చర్చకు దారి తీసింది. ‘ ప్రజానాయకుడు కామరాజర్ వర్ధిల్లాలి, రాజీవ్ గాంధీ వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ వర్ధిల్లాలి’ అని ప్రమాణ స్వీకారం చివర్లో పేర్కొన్నారు. దీనిపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం చివర్లో చోటు చేసుకున్న ఈ ట్విస్టుతో గవర్నర్‌ ఒక్కసారిగా తేరుకున్న గవర్నర్‌.. ఇది ప్రమాణ స్వీకారంలో భాగం కాదంటూ రాజేశ్‌కుమార్‌కు గుర్తు చేశారు. 

     

     

     

  • ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై క‍్యాబినెట్‌ సమీక్ష జరుపుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, దాని ఆర్థిక ప్రభావాలపై చర్చ జరుగుతోంది. వివిధ మంత్రిత్వ శాఖల మంత్రుల పనితీరు, నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సమావేశంలో చర్చిస్తున్నారు. క్యాబిబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    పశ్చిమాసియా ఘర్షణ, దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్న విషయం గురువారం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ చమురు ధరలు, ఇంధన సరఫరా వ్యవస్థ, ద్రవ్యోల్బణ పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.

    “ముడి చమురు, ఇంధనం, ఎల్పీజీకి సంబంధించి ఇప్పటికీ తగిన నిల్వలు ఉన్నాయి. ప్రత్యేకంగా సమస్య ఏదీ లేదు” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఇప్పటికే తెలిపారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత పరిస్థితిని ప్రధాని మోదీ నేరుగా ఆయా అంశాలపై చర్చలు జరుపుతున్నారు.

    క్యాబినెట్ మార్పుల ఊహాగానాలు 
    క‍్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై చర్చలు వేగం పుంజుకున్నాయని గత వారం సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జూన్ రెండో వారంలో జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో మంత్రిత్వ శాఖల పనితీరు, వ్యవస్థాపక నిర్వహణపై మోదీ, అమిత్‌ షా సమీక్షిస్తున్నారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇప్పటివరకు బయట నుంచి మద్దతు ఇస్తున్న విదుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML)లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అంగీకరించాయి. దీంతో విజయ్‌ మంత్రి వర్గంపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్‌ విజయ దుందుభి మోగించారు. విజయ్‌ గెలుపే కాదు రాజకీయ సమీకరణాలు సైతం మారాయి. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఒంటరిగా నెలకొల్పే అవకాశాన్ని ఆమడ దూరంలో కోల్పోయారు. దీంతో కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంల్‌, సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాల సహకారంతో విజయ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు  

    మంత్రివర్గ విస్తరణలో వ్యూహం
    విజయ్‌ ఇప్పటి వరకు 33 మంది సభ్యులతో (ముందుగా 10 మంది, ఇప్పుడు 23 మంది చేరారు) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ వీసీకే, ఐయూఎంల్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రెండు పార్టీలు డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌లో భాగమై ఉండటంతో, టీవీకే మంత్రివర్గంలో చేరడంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. విజయ్‌ ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, మంత్రివర్గంలో మూడు స్థానాలను ఖాళీగా ఉంచారు. భవిష్యత్తులో వీరిని ఒప్పించవచ్చన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

    వీసీకే, ఐయూఎంల్ వైఖరి
    వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ‘మేము మంత్రిపదవులు కోరలేదు, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగకుండా ఉండటానికి మాత్రమే మద్దతు ఇచ్చాం’అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, పార్టీ చర్చల అనంతరం మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఐయూఎంల్ కూడా మొదట్లో సంకోచం చూపినప్పటికీ, చివరికి తమ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్‌ను మంత్రివర్గంలోకి పంపేందుకు సిద్ధమైంది.

    వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం ద్వారా విజయ్‌ ప్రభుత్వానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రివర్గంలో భాగమై ఉండటంతో, చిన్నపార్టీలకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది. ఇది అలయెన్స్ రాజకీయాల్లో సమతుల్యతను కాపాడడమే కాకుండా, విజయ్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత బలం ఇస్తుంది. మొత్తం మీద, వీసీకే, ఐయూఎంల్ మంత్రివర్గంలో చేరడం విజయ్‌ ప్రభుత్వానికి ఒక పెద్ద ఊరట. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుంది.

    సీఎం సీటొద్దులే.. మంత్రి పదవి చాలు.. 
    వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ గతంలో సీఎం కావాలనే ఆశయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్‌ ఘన విజయం సాధించడంతో ఆ అవకాశం ఆయనకు దూరమైంది. విజయ్‌ మెజారిటీకి తక్కువగా నిలిచినప్పటికీ, వీసీకే, ఐయూఎంల్‌, కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట్లో వీసీకే బయట నుంచి మాత్రమే మద్దతు ఇచ్చింది.

    విజయ్‌ వ్యూహాత్మకంగా మంత్రివర్గంలో ఖాళీ స్థానాలు ఉంచి, మిత్రపక్షాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి వీసీకే కూడా మంత్రివర్గంలో చేరేందుకు అంగీకరించింది. ఇలా, సీఎం కావాలనే కల నెరవేరకపోయినా, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా వీసీకే అధినేత తన రాజకీయ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకున్నారు.

  • తిరువనంతపురం: కేరళం కొత్త సీఎం సతీశన్‌ విషయంలో మళ్లీ ‘‘కులం’’ పేరు మీద వివాదం రాజుకుంది. సతీశన్‌ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో తన తండ్రి పేరు ‘‘దామోదర మీనన్‌’’ను మళ్లీ ప్రస్తావించారు. తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు.

    ఈ వివాదం సీఎం సతీశన్ “మీనన్” అనే కులాన్ని తన పేరు ముందు ఇంటిపేరులా వాడటంతో మొదలైన విషయం తెలిసిందే. మే 18న కేరళం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా ఆయన తన పూర్తి పేరు “వడస్సేరి దామోదర మీనన్ సతీశన్” అని చెప్పారు. దీనిపై సొంత కాంగ్రెస్‌ పార్టీలో కూడా కొందరు నేతలు అభ్యంతరాలు తెలిపారు.

    సతీశన్‌ ఇంటి పేరును వాడడం పట్ల కొందరి వాదన ఇలా ఉంది.. కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతుంది. అలాంటి పార్టీకి చెందిన నేత కులాన్ని సూచించే పేరును వాడటం సరైంది కాదని అన్నారు. “మీనన్”ను కేరళంలో ఒక ఉన్నత కుల గుర్తింపుగా భావిస్తారు. అందుకే ఇది సమానత్వ భావనకు విరుద్ధమని విమర్శించారు.

    కాంగ్రెస్ నేత జింటో జాన్.. తాను కూడా తన వర్గ గుర్తింపును పేరులో పెట్టుకోనని సోషల్ మీడియాలో తెలిపారు. మరో నేత వీఆర్ అనూప్.. అంబేద్కర్ పుస్తకాలను చదవాలని సతీశన్‌కు సూచించారు. దీనికి సతీశన్ సమాధానం కూడా ఇచ్చారు. “అది నా తండ్రి పేరు” అని చెప్పారు. తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి పేరు చెప్పానన్నారు. పాస్‌పోర్ట్‌లో కూడా అదే పేరు ఉందని వివరించారు. ఇందులో కుల గర్వం లేదని, తల్లిదండ్రుల జ్ఞాపకం మాత్రమే ఉందన్నారు.

    మరో వివాదం “వందే మాతరం” పూర్తి రూపం పాడటంపై వచ్చింది. సీపీఎం అభిప్రాయం ప్రకారం.. వందే మాతరం పూర్తి పాటలో కొన్ని భాగాలు ఒక్క మత భావజాలాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే గతంలో కొన్ని పంక్తులను అధికారికంగా తొలగించారు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో పూర్తి రూపం పాడటం బహుళ సమాజ భావనకు విరుద్ధమని సీపీఎం విమర్శించింది.

    కేరళం శాసనసభ తొలి సమావేశం షురూ 
    ఇదిలా ఉండగా, 16వ కేరళం శాసనసభ తొలి సమావేశం గురువారం తిరువనంతపురంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే వీ ఈ అబ్దుల్ గఫూర్ తొలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి సతీశన్ నేతృత్వంలోని 21 మంది సభ్యుల మంత్రివర్గం మే 18న ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసింది.

    కొత్త సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మే 22న స్పీకర్ ఎన్నిక జరగనుంది. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కేరళం అసెంబ్లీలో తొలిసారి 3 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ స్పీకర్ ఎన్నికలో తన అభ్యర్థిని నిలబెడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

    గోపకుమార్ బుధవారం అసెంబ్లీ కార్యదర్శి షాజీ సీ బేబీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్ ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పీకర్ పదవికి సీనియర్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది.

    ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముందు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజీవ్ చంద్రశేఖర్, వీ మురళీధరన్, బీబీ గోపకుమార్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లారు. కాగా, 16వ కేరళం శాసనసభకు ఎన్నికైన మొత్తం 140 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రో-టెమ్ స్పీకర్ జీ సుధాకరన్ ప్రమాణం చేయించారు. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 140 స్థానాల్లో 102 గెలుచుకుంది. లెఫ్ట్ డెమోటిక్ ఫ్రంట్ 35 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాలు సాధించింది.