Archive Page | Sakshi
Sakshi News home page

Rajanna

  • పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి

    యాజమాన్య పద్ధతులు పాటిస్తే సన్నాల్లోనూ దిగుబడి

    విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి

    ‘సాక్షి’ ఫోన్‌ఇన్‌లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం

    సిరిసిల్ల: జిల్లాలో మంచి వర్షాలు ఇంకా పడలేదు.. భూమి బాగా నానాలి.. వేడి తగ్గాలి.. భూమిలో తేమ ఉంటేనే ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది.. నీరుంటే నారు పోసుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్‌లో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్‌ఇన్‌’లో రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడూ ఒకే పంటను వేయొద్దని, పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. దొడ్డు వడ్లకు బదులు సన్నవడ్లు వేసుకుంటే మంచిదన్నారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్‌ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు.

    ఆ విశేషాలు ఇవీ..

    ప్రశ్న: డీఏపీ దొరకడం లేదు. ఎరువుల కోసం షాపులకు వెళ్తే ఆన్‌లైన్‌ అంటున్నారు.. ఎలా?

    – శ్రీనివాస్‌–వేములవాడ, కట్ట తిరుపతి–తడగొండ, వినయ్‌–రుద్రంగి, బాలరాజు–ముస్తాబాద్‌.

    డీఏవో: ఇప్పుడే వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. డీఏపీ అవసరం ఇప్పుడే ఉండదు. అయినా ముందుచూపుతో రైతులు ఆలోచించడం మంచిదే. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. గాలిలో భాస్వరం ఉంటుంది. సహజంగా నేలలో లభించే పోషకాలతోనే పంటలు పండాలి. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పొలంలో పెంటతోపాటు బయో ఫెర్టిలైజర్‌ వేసుకుంటే భూమిని గుల్ల చేస్తుంది. రైతులు ఎరువుల వాడకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నాం.

    ప్రశ్న: సన్న వరి విత్తనాలు, కంది విత్తనాలు ఏమైనా వ్యవసాయశాఖ సబ్సిడీపై సరఫరా చేస్తుందా?

    – ఎగుమామిడి వెంకటరమణారెడ్డి–తంగళ్లపల్లి, దేవేందర్‌–బావుసాయిపేట, వామన్‌రెడ్డి–వంతడ్పుల, యాదగిరిరెడ్డి–ఆవునూర్‌, నరేందర్‌రెడ్డి–వేములవాడ అర్బన్‌.

    డీఏవో: వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై ఏ విత్తనాలు సరఫరా కావడం లేదు. కంది వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో విక్రయించుకోవచ్చు. మార్కెట్‌లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఏది వేసుకున్నా మంచి దిగుబడి వస్తుంది. దొడ్డు వడ్ల కంటే సన్నాలు వేసుకుంటేనే డిమాండ్‌ ఉంటుంది.

    ప్రశ్న: ఆరుతడిగా కంది, మొక్కజొన్న వేసుకోవచ్చా?

    – రవి–తంగళ్లపల్లి, తిరుపతిరెడ్డి–బండపల్లి, యామ తిరుపతి–వేములవాడ

    డీఏవో: ఆరుతడిగా మొక్కజొన్న, కంది వేసుకోవచ్చు. మార్కెట్‌లో మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఉన్నాయి. ఎక్కువ రైతులు సాగు చేస్తే పంటకు కోతుల బెడద కూడా ఉండదు. పెసర్లు, బబ్బర, అలసంద వంటివి సాగు చేయవచ్చు.

    ప్రశ్న: మా మండలంలో వ్యవసాయాధికారులు లేరు. రైతులకు సలహాలు సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు?

    – బోయిని రవి–వీర్నపల్లి.

    డీఏవో: నిజమే వ్యవసాయాధికారి లీవులో వెళ్లారు. ఏఈవోను కేటాయించాం కానీ విధుల్లో చేరలేదు. జిల్లాలో వ్యవసాయాధికారుల కొరత ఉంది. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

    ప్రశ్న: ఈ సీజన్‌లో సన్నవడ్లు వేసుకోవాలా.. దొడ్డు వడ్లు వేసుకోవాలా?

    – రాజవీర్‌–గంభీరావుపేట, దొంతరవేణి శ్రీనివాస్‌గౌడ్‌–నిమ్మపల్లి, మహేశ్‌–బోయినపల్లి, ఎ.రవి–రుద్రంగి, గాంతుల మహేశ్‌–ముస్తాబాద్‌, వెంకటేశ్‌–లింగంపల్లి, నర్సింహారెడ్డి–ఆవునూర్‌, లక్ష్మారెడ్డి–పదిర, పర్శరాంరెడ్డి–నారాయణపూర్‌, భూపతిరెడ్డి–వంతడ్పుల, ఎం.రాజు–చందుర్తి, సత్యంరెడ్డి–ఆవునూర్‌

    డీఏవో: ఈ వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడి డ్రై స్పెల్‌ మూలంగా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. 120 రోజుల్లో కోతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. సన్నవడ్లు వేసుకోవాలని చెబుతున్నాం. రైతులు తమకున్న పొలంలో 75 శాతం సన్నాలు, 25 శాతం దొడ్డు వడ్లు పెట్టుకున్నా ఫరవాలేదు. నీరు ఉంటే నారు పోసుకోవచ్చు. సన్నరకాలైన కేఎన్‌ఎం 1836, జేజీఎల్‌, జైశ్రీరాం వేసుకుంటే ప్రభుత్వం బోనస్‌ ఇస్తుంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకొని, పంట పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి.

    ప్రశ్న: ఈ వర్షాలకు పత్తిని విత్తుకోవచ్చా? పత్తిలో స్వల్పకాలిక రకాలేమిటి?

    – కట్ట తిరుపతిరెడ్డి–తడగొండ, మోతె మధుసూదన్‌రెడ్డి–నారాయణపూర్‌, పోగుల రాజిరెడ్డి–కనగర్తి.

    డీఏవో: పత్తిని ఇప్పుడే విత్తుకోవద్దు. పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. భూమి ఇంకా నానలేదు. భూమిలో వేడి ఉంటే విత్తనాలు వట్టిపోతాయి. 50 నుంచి 60 శాతం భూమి తడిసిన తరువాత, తేమ ఉన్నప్పుడే పత్తిని విత్తుకోవాలి. బీటీ కాటన్‌ విత్తుకోవాలి. పత్తిలో స్వల్పకాలిక రకాలు లేవు. ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

    ప్రశ్న: వరిలో దోమపోటును తట్టుకునే రకాలేమైనా ఉన్నాయా? మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటి?

    – బండారి శ్రీనివాస్‌–ఇల్లంతకుంట, రమేశ్‌–గంభీరావుపేట, గంగాధర్‌–రుద్రంగి, వంతడ్పుల రమేశ్‌–ఇల్లంతకుంట, మల్లేశం–మరిమడ్ల.

    డీఏవో: వరి పంటలో దోమపోటు రాకుండా వంగడాలు లేవు. కానీ ముందుగా థైరం, కార్బడిజంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు కొసలను కత్తిరించి వేరే చోట పూడ్చిపెట్టాలి. నాట్లు వేసే సమయంలో కాలిబాటలు వదిలిపెట్టాలి. ఎండ బాగా సోకి, గాలి బాగా ఆడి వరి పంటకు దోమపోటు రాకుండా ఉంటుంది.

    ప్రశ్న: కలుపుమందులు షాపుల్లో ఇవ్వడం లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు?

    – గంగారెడ్డి–కనగర్తి

    డీఏవో: కలుపు మందులను కొన్నింటిని ప్రభుత్వం నిషేధించింది. ఒక్కో పంటకు ఒక్కో కలుపు నివారణ మందు అవసరం ఉంటుంది. అవసరమైన వాటిని ఇవ్వాలని చెప్పాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా దృష్టికి తేవాలి.

  • ఆర్టీసీ బస్సు ఎదుట ఆందోళన తెలుపుతున్న దేవునితండా వాసులు

    మృగశిర వచ్చింది.. మీనం మెరిసింది !

    మృగశిర కార్తె సోమవారం ప్రవేశించింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముదిరాజ్‌ కులస్తులు 230 కుటుంబాలు గ్రామచెరువులో చేపలు పట్టాయి. కులస్తులతోపాటు చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులతో చెరువు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉబ్బసం వ్యాధి నివారణకు సంప్రదాయంగా వస్తున్న చేపమందును సిరిసిల్ల మార్కెట్‌లో చంద్రంపేటకు చెందిన రామచంద్రం పంపిణీ చేశారు. కిలో రవు చేపలు రూ.200, బొమ్మెలు రూ.400, రొయ్యలు రూ.400 ధర పలికాయి.

    – సిరిసిల్లటౌన్‌/సాక్షి ఫొటోగ్రాఫర్‌

  • ● ఖాతాల్లోనే యాసంగి వడ్ల డబ్బులు ● రోజుకు రూ.10వేలు ఇస్తున్న బ్యాంక్‌ అధికారులు ● మొదలైన వానాకాలం సాగు పనులు ● పెట్టుబడి కోసం రైతుల తిప్పలు ● ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియక అయోమయం

    డబ్బులు లెక్కపెట్టుకుంటున్న ఇతను ముస్తాబాద్‌ మండలం మద్దికుంటకు చెందిన రైతు కొరివి చంద్రయ్య. ఇతనికి ఐదెకరాల భూమి ఉంది. యాసంగిలో వచ్చిన ధాన్యం డబ్బులు ఖాతాలో జమకాగా.. ఐదు రోజులుగా రోజూ వస్తూ రూ.10వేల చొప్పున తీసుకుంటున్నాడు. ఈ డబ్బులతో గత పంట హార్వెస్టింగ్‌, హమాలీ ఖర్చులు పోను ఇప్పుడు విత్తనాలు, ఎరువులు, దున్నకాలకు సరిపోతాయంటున్నాడు.

    ముస్తాబాద్‌(సిరిసిల్ల): వానాకాలం సాగుకు రైతులకు నగదు కష్టాలు మొదలయ్యాయి. యాసంగి ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. చేతిలో నగదు లేక వానాకాలం పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులో రోజుకు రూ.10వేలకు మించి ఇవ్వకపోవడంతో నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, దుక్కి దున్నించడం వంటి వాటికి ఇప్పుడు డబ్బులు అవసరం. కానీ బ్యాంకులో సరైన నగదు లేక రైతులకు మొత్తం ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌ చెల్లింపులు తెలియక పలువురు రైతులు రోజూ బ్యాంక్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చొని రోజుకు రూ.10వేల చొప్పున తీసుకెళ్తున్నారు.

    బ్యాంక్‌లకు చేరని నగదు

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి ఆర్‌బీఐ ఆదేశాలతో ‘చెస్ట్‌’ కరెన్సీ నుంచి అన్ని బ్యాంక్‌లకు నగదు సరఫరా చేస్తారు. ఆర్‌బీఐ నుంచి నగదు సరఫరా లేకపోవడంతో బ్యాంక్‌లకూ రావడం లేదు. స్థానికంగా జరిగిన లావాదేవీలతోనే పక్షం రోజులుగా నెట్టుకొస్తున్నామని బ్యాంక్‌ అధికారి ఒ కరు తెలిపారు. ఇరువై అయిదు రోజులుగా కరీంనగర్‌ నుంచి నగదు సరఫరా కాలేదని సమాచారం. వైన్స్‌, పెట్రోల్‌బంకులు, గ్యాస్‌ కంపెనీలు జమచేస్తున్న నగదుతోనే ఖాతాదారులకు బ్యాంకర్లు సర్దుబాటు చేస్తున్నారు. జిల్లాలోని చాలా బ్యాంక్‌ల్లో నగదు లేదని బోర్డులు ఏర్పాటు చేశారు.

  • ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

    సిరిసిల్ల: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేకు 26 ఫిర్యాదులు రాగా.. ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ నేరుగా ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను ప్రజలకు మరింత దరి చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

    బోయినపల్లి(వేములవాడ): గ్రామసభలతో సమస్యలు పరిష్కారమవుతాయని వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి పేర్కొన్నారు. మండలంలోని నీలోజిపల్లి, రామన్నపేట, కొదురుపాక, వరదవెల్లి, జగ్గారావుపల్లిల్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. తహసీల్దార్‌ చిందం శ్రీనివాస్‌, ఎంపీడీవో జయశీల, ఎంపీవో శ్రీధర్‌, ఎంఏవో ప్రణిత పాల్గొన్నారు.

    సిరిసిల్ల: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ 65 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ కల్పిస్తున్నట్లు వివరించారు. వేములవాడ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు, సిరిసిల్ల పరిధిలో 13 మందికి ఉద్యోగ విరమణ కల్పించామన్నారు. ఎనిమిది మంది అంగన్‌వాడీ టీచర్లు, ఏడుగురు ఆయాలు ఉన్నారని తెలిపారు. ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో జిల్లా సంక్షేమాధికారి ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందే వారు వయసు నిర్ధారణ పత్రాలతో జూన్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రావాలని సూచించారు.

    సిరిసిల్ల: మృగశిరకార్తె ప్రవేశించిన తొలిరోజు సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఇన్నాళ్లు వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనం చిరుజల్లులతో ఊపిరిపీల్చుకున్నారు. చిరుజల్లులకే జిల్లా కేంద్రం చిత్తడయింది. పాతబస్టాండులోని నేతన్నచౌక్‌ వద్ద రోడ్డుపైకి వరదతో కలిసిన మురికినీరు చేరింది. కరీంనగర్‌–కామారెడ్డి ప్రధాన రహదారి మురికినీటితో నిండింది. వేములవాడ రూరల్‌ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 32.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 0.8 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇల్లంతకుంటలో అత్యధికంగా 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ వద్ద 33.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    తడిసిన ధాన్యం

    ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి తిమ్మాపూర్‌ కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దాదాపు 60 నుంచి 70 వడ్ల కుప్పలు నీటిలోనే మునిగిపోయాయి. వారం క్రితం రైతులు రోడ్డెక్కినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

    రోడ్లపై చెత్త వేయొద్దు

    వేములవాడ: వేములవాడలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 5, 6, 7, 8, 9, 10, 20 వార్డుల్లో సోమవారం సభలు నిర్వహించారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలను అందిస్తోందని మున్సిపల్‌ చైర్మన్‌ రాజు తెలిపారు. ఇళ్ల నుంచి వచ్చే చెత్తను ఇష్టానుసారంగా రోడ్లు, ఖాళీ స్థలాలు, మురుగు కాలువల్లో వేయొద్దన్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, మేనేజర్‌ సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

  • ● కలెక్టరేట్‌ బాట పట్టిన అర్జీదారులు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ● పెండింగ్‌ పెట్టొద్దని ఆదేశాలు

    సిరిసిల్ల అర్బన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు సోమవారం తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 154 మంది నుంచి అర్జీలను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

  • ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

    సిరిసిల్ల: నక్ష(నేషనల్‌ జియో స్పాషియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్స్‌) ప్రకారం సర్వే ప్రణాళిక పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌ అధికారులతో సోమవారం సమీక్షించారు. వేములవాడ మున్సిపల్‌ పరిధిలో నక్ష కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307 బ్లాక్స్‌ ఉన్నాయని, ఇప్పటి వరకు 49 పూర్తి చేశామన్నారు. 14,984 ఇండ్లు ఉండగా.. 6,707 ఇండ్ల సర్వే పూర్తయిందని వివరించారు. ప్రతీ ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా సర్వే చేయాలని ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే శ్రీనివాస్‌, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, టీపీవో అన్సార్‌ పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్‌ నుంచి ఇదే అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

    దివ్యాంగులకు ట్రై సైకిల్‌, వీల్‌చైర్‌ అందజేత

    దివ్యాంగులైన ముస్తాబాద్‌ మండలం గూడెంకు చెందిన చింతకింది లస్మయ్య, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన ముద్రకోల దీనలకు ట్రై సైకిళ్లు అందించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, హౌసింగ్‌ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు.

    ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్‌

    ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

  • తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన 30 మందికి గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు మంజూరు చేసింది. అందులో పది మంది మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఇండ్లు కట్టని వారి పేర్లను గ్రామపంచాయతీ తీర్మానించింది. వారితో ఇండ్లు కట్టుకున్నవారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇండ్లు కట్టుకున్నవారికి న్యాయం చేయండి.

    – గోపాల్‌రావుపల్లి గ్రామస్తులు

Mancherial

  • మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఖరీఫ్‌ సాగు సీజన్‌ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనాలు జిల్లాను తాకనున్నాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడల బెడద అధికం కావడంతోపాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం పొందవచ్చని ఆదిలాబాద్‌ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్‌ చౌహాన్‌ వివరించారు. ఆయన సూచనలు, సలహాలు..

    పత్తి, వరి పంటలే అధికం..

    జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నా రైతులు దాదాపు 15ఏళ్ల నుంచి పత్తి, వరి పంటలే సాగు చేస్తున్నారు. చీడపీడల ఉధృతి పెరగడంతో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. వానాకాలంలో 70శాతం మంది రైతులు వర్షాధారంగా ఈ రెండు పంటలే సాగు చేస్తున్నారు. కొందరు అటవీ జంతువుల బెడద ఉంటుందని, మార్కెట్‌, నీటి సౌకర్యం లేదని, వేరే పంటలు దిగుబడి రావని తదితర కారణాలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు.

    భిన్నమైనవి ఎంచుకోవాలి

    పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటల వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా గ్రహిస్తాయి. పంట మార్పిడి చేసే రైతులు భూమి నుంచి పోషకాలను గ్రహించే ఈ పంటలకు బదులుగా భూమికే పోషకాలు అందించే అపరాల పంటలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. ఆకులను రాల్చి భూమికి సేంద్రియ పదార్థాలను అందిస్తాయి. వేరుబుడిపెలు నత్రజనిని స్థిరీకరిస్తాయి. నల్లరేగడి నేలల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు పండించిన రైతులు సోయాచిక్కుడు వేసుకుంటే మంచిది. ఈ పంట సమయానికి ఆకులు పూర్తిగా రాలిపోతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తుంది.

    చీడపీడల నివారణ కోసం..

    కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పంటలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకోవాలి. వరుసగా పత్తి, వరి పంట వేయకుండా పప్పుధాన్యపు పంటలు, నూనెగింజల పంటలు వేసుకోవాలి. మిరుప, వేరుశనగ, క్యాబేజీ పంటలను లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉధృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. దీనివల్ల ఆయా పంటల్లో కాళహస్తి తెగులు, నులి పురుగులు, ఆకుముడత, లద్దె పురుగుల ఉధృతిని నివారించవచ్చు.

    వేయకూడని పంటలు..

    బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలను ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. జొన్న వేసిన భూమిలో మిరప, పసుపు తర్వాత మిరప, టమాటా, ఆవాలు, బెండ వేయకూడదు. ఆకుముడత పురుగుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు పంటలు సాగు చేయొద్దు.

    ఏవి వేసుకోవాలి..

    గత రబీలో వేరుశనగ వేసిన రైతులు ఈ ఖరీఫ్‌లో మొక్కజొన్న పంట వేసుకుంటే పంటకు నత్రజని లభిస్తుంది. ఫలితంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల రాబోయే రబీలో మళ్లీ వేరుశనగ వేసినప్పుడు ఆ పంట నులి పురుగుల బెడద చాలా వరకు తగ్గుతుంది.

  • మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సాగు సీజన్‌ ప్రారంభం నేపథ్యంలో వ్యవసాయ అధికారులతో ‘సాక్షి’ బుధవారం ఫోన్‌ ఇన్‌ నిర్వహించనుంది. రైతుల సమస్యలు, సాగు సందేహాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సమాధానాలు ఇస్తారు. వాతావరణానికి అనుగుణంగా విత్తనాల ఎంపిక, సాగు ప్రణాళిక, ఎరువుల వినియోగం, పంట మార్పిడి తదితర సాగు సంబంధిత సందేహాలపై రైతులు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

    సమయం:

    బుధవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటలకు వరకు

    సంపదించాల్సిన ఫోన్‌ నంబర్లు :

  • దండేపల్లి: చేయూత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా అందిస్తుండగా ఇక నుంచి బ్యాంకుల ద్వారానే చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 58,254 మంది పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్నారు. ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లింపులకు చర్యలు చేపడుతుండడంతో ఖాతాలు లేని వారు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకు ద్వారా ఏ విధంగా అందజేస్తారనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఏటీఎం కార్డులు జారీ చేస్తారా లేక ప్రత్యేక రోజులు కేటాయించి బ్యాంకు సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తారా అనే విషయాలపై అధికారికంగా ఆదేశాలు వెలువడాల్సి ఉంది.

    పోస్టల్‌ విధానంలో ఇబ్బందులు..

    పోస్టాఫీసు ద్వారా పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల కొందరు పింఛన్‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో పోస్టల్‌ సేవలు అందుబాటులో ఉన్నా పంపిణీ సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ గుర్తింపు, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ సమయంలో సరిగా నమోదు కాకపోవడంతో వృద్ధులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రూ.2016, రూ.4016 పింఛన్ల మొత్తంలో చిల్లర రూ.16 చెల్లించడం లేదనే ఆరోణపణలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఇక ముఖ గుర్తింపు, బయోమెట్రిక్‌ రాని వారికి పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో చెల్లిస్తుండడంతో తపాలా కార్యాలయాల చుట్టూ తిరిగేందుకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

    ఇంకా ఆదేశాలు రాలే..

    చేయూత పింఛన్ల పంపిణీలో మార్పులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంకా అధికారికంగా ఆదేశాల రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లిస్తున్న పింఛన్లను బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.

    – కిషన్‌, డీఆర్‌డీవో, మంచిర్యాల

  • మంచిర్యాలఅగ్రికల్చర్‌: వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు సోమవారం కలెక్టరేట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రజావాణిలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కొన్ని శాఖల్లో అర్జీలు పెండింగ్‌లో ఉంటున్నాయని, పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌ పాల్గొన్నారు.

  • మంచిర్యాలఅగ్రికల్చర్‌: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ సహాయ అధికారులు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం జూన్‌, జూలైలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్‌లో గత ఐదారేళ్లతో పోలిస్తే సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అన్నారు. మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసి భూమిలో ఒకటిన్నర అడుగుల లోతు వరకు తేమ ఉన్న తర్వాతే విత్తనాలు విత్తుకోవాలని రైతులకు సూచనలు చేయాలని అన్నారు. పంటల అవశేషాలు తగులబెడితే రైతులకు గ్రామ పంచాయతీల ద్వారా రూ.2,500 నుంచి రూ.15వేల వరకు జరిమానా విధించవచ్చని తెలిపారు. ఎనిమిది రకాల సన్న ధాన్యం సాగు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాబోయే పది రోజులపాటు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి సూచనలు చేయాలని తెలిపారు.

  • చెన్నూర్‌/మంచిర్యాలఅగ్రికల్చర్‌/వేమనపల్లి/లక్సెట్టిపేట: జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సోమవారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. సోమవారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మృగశిర కార్తె రోజున తొలకరి వర్షం కురువడంతో రైతులు మురిసిపోయారు. కార్తె ప్రారంభంలో వర్షం కురిస్తే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంటున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌, వేమనపల్లి, లక్సెట్టిపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో తాడిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు వ్యాపించాయి. బలమైన ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వేమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించేందుకు భారీ సంఖ్యలో లారీలు వచ్చాయి. లోడ్‌ చేస్తున్న సమయంలో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఇప్పటికే దుక్కి దున్ని చేన్లు, పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు తొలకరి వర్షంతో విత్తనా లు వేసేందుకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.

  • మంచిర్యాలఅర్బన్‌: ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజుల వివరాలను నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాలని, ఎంఈవోలు పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్‌, డీఈవో చంద్రయ్య సూచించారు. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎంఈవో, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. బడిబాటలో గతేడాది కంటే పదిశాతం అదనంగా విద్యార్థుల నమోదు పెంచాలని తెలిపారు. తరగతి గదులు, ఆవరణ, వంటపాత్రలు శుభ్రం చేయించాలని, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం సమకూర్చుకోవాలని అన్నారు. పాఠ్య, నోటుపుస్తకాలను పాఠశాలలకు చేరవేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్‌ దశ వరకు నిరాటంకంగా చదువు కొనసాగించేలా చూడాలన్నారు. భవిత సెంటర్లను ఎప్పటికప్పుడు ఎంఈవోలు పర్యవేక్షించాలన్నారు. మధ్యాహ్న భోజనం మొదటి రోజు నుంచే అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లలిత, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారులు భరత్‌కుమార్‌, సత్తయ్య, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

  • మంచిర్యాలక్రైం: నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని 38, 39, 40, 41, 42, 43, 44, 45 డివిజన్లలో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు, జల్సాల కోసం కొందరు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్‌, మద్యానికి అలవాటు పడి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా షీ టీమ్‌ పని చేస్తోందని, వేధింపులు, మోసాలకు గురైతే 100 డయల్‌, షీ టీమ్‌కు సమాచారం అందించాలని అన్నారు. సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంచి ర్యాల సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు తిరుపతి, శ్రావణ్‌కుమార్‌, మధుసూధన్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

  • మంచిర్యాలటౌన్‌: జిల్లా వైద్యశాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు స్థానచలనం పొందారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎండి.సులేమాన్‌ను నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ప్రొఫెసర్‌గా, ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీమన్నారాయణను ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎంవోగా, ప్రొఫెసర్‌ ముసాఖాన్‌ను ఫీవర్‌ ఆసుపత్రికి ప్రొఫెసర్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి బదిలీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఇంచార్జి అధికారి డాక్టర్‌ అనితను హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో కార్యాలయానికి బదిలీ చేశారు.

    డాక్టర్‌ వేదవ్యాస్‌

    ఎండి సులేమాన్‌

    డాక్టర్‌ అనిత

    శ్రీమన్నారాయణ

  • మంచిర్యాలఅర్బన్‌: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో బాలికలకు భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందుతోందని సెక్టోరల్‌ అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కేజీబీవీలో అడ్మిషన్ల మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెసిడెన్షియల్‌ విధానంలో విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని 18 కేజీబీవీల ప్రత్యేకతను తెలిపే స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు వసతులు, విద్య, ఇతర సదుపాయాలపై వివరించారు. 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాగా 20 మంది అడ్మిషన్లు పొందారు. ప్రత్యేక అడ్మిషన్ల స్టాళ్లను ఎంఈవో మాళవీదేవి పరిశీలించారు. కార్యక్రమంలో కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌: ఆర్టీసీ కార్మికులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్యాల బారినపడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రికి వెళ్దామంటే అధికారుల నుంచి అనుమతులు రాక.. విధిలేని పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. తమకు సెలవులు మంజూరు చేయాలని విన్నవించుకుంటున్నా అధికారులు ఖరాకండీగా డ్యూటీ చేయాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. ఎవరైనా గట్టిగా వాదిస్తే వారిని టార్గెట్‌ చేసి ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. యూనియన్లు సైతం లేకపోవడంతో పైఅధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకే ఇబ్బంది అని లీవ్స్‌ ఇవ్వకపోయినా పని చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

    డ్యూటీ చేయాల్సిందే..

    అనారోగ్యం, పలు కారణాలతో సెలవుల మంజూరు కోసం అధికారులకు అర్జీ పెట్టుకుంటే పూర్తిస్థాయిలో సిబ్బంది లేరని, తప్పకుండా డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హాఫ్‌ పే సెలవులు మంజూరు చేయాలని విన్నవించినా కనికరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. పలు సందర్భాల్లో నేషనల్‌ హాఫ్‌ పేలను సైతం వాడుకునే పరిస్థితి లేక బలవంతంగా డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇలాంటి సమయాల్లోనే పనిఒత్తిడితో పలు సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

    నిబంధనలు ఇలా..

    నిబంధనలకు అనుగుణంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సంవత్సరంలో 15 సాధారణ సెలవు దినాలు ఉంటాయి. వీటితో పాటు ఏడాదికి 4 నేషనల్‌ హాఫ్‌ డేలను సైతం సెలవులుగా ఇస్తారు. జనవరి 26, అంబేడ్కర్‌ జయంతి, ఆగస్టు 15, గాంధీ జయంతి రోజున సెలవులుగా ప్రకటించారు. అయితే ఈ సెలవు రోజుల్లో సైతం ఆర్టీసీ బస్సులు నడపాల్సి ఉంటుంది. కార్మికులు డ్యూటీ చేయాల్సి వస్తున్న కారణంగా ఆ నాలుగు రోజులను ఇతర రోజుల్లో సెలవులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ప్రతీ 10 సంవత్సరాల కాలానికి 31 హాఫ్‌ పే సెలవులను ఆర్టీసీ మంజూరు చేసింది. వీటిని సైతం సెలవులుగా వినియోగించుకునే సౌలభ్యం కార్మికులకు ఉంటుంది.

    విలీన ప్రకటనతో విధిలేని పరిస్థితిలో..

    ఇటీవల ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగా రు. దిగివచ్చిన ప్రభుత్వం, వారితో చర్చలు జరిపి విలీన విషయంలో సానుకూలంగా స్పందించింది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌలభ్యాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, విలీనం నాటికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసమే పరోక్షంగా కార్మికులపై పని ఒత్తిడి పెంచి, వారు స్వచ్ఛందంగా ఉద్యోగాల నుంచి తప్పుకునేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి సంస్థలో ఉండకపోతే తీవ్రంగా నష్టపోతామనే భయంతో, సెలవులు దొరక్కపోయినా విధిలేని పరిస్థితుల్లో కార్మికులు విధులకు హాజరవుతున్నారు. కనీసం అత్యవసర సమయాల్లోనైనా సెలవులు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

    సెలవులు మంజూరు చేస్తున్నాం..

    కార్మికులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న సమయాల్లో సిక్‌ లీవ్స్‌ ఇస్తున్నాం. అన్ని సందర్భాల్లో సెలవులు మంజూరు చేస్తున్నాం. ఉద్యోగ విరమణతో సిబ్బంది సంఖ్య తగ్గుతున్నా, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేస్తున్నాం. కార్మికులకు సెలవుల మంజూరులో ఎటువంటి ఇబ్బంది లేదు. డిపోల పరిధిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకు వస్తే పరిష్కరిస్తా.

    – విజయభాను, ఆర్టీసీ ఆర్‌ఎం, ఆదిలాబాద్‌

  • సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవిపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్‌) ఆశలు పెట్టుకున్నారు. ఆయన అనుచరవర్గమూ తప్పకుండా కేబినెట్‌లో చోటు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం ఇందుకు తోడవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనను సక్సెస్‌ చేయడంతో పీఎస్సార్‌కు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ మరోసారి సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు విజయవంతం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేశారు. ఈ క్రమంలోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు జరిగితే పీఎస్సార్‌కు చోటు దక్కుతుందా..? అనే చర్చ జోరందుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సన్నిహితంగా ఉంటారు. ఈ క్రమంలో సీఎం వర్గానికి దూరంగా ఉంటారనే ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆసిఫాబాద్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే పీఎస్సార్‌కు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో సీఎం హైదరాబాద్‌కు వెళ్తూ మంచిర్యాలలోని ఎమ్మెల్యే ఇంటి వద్ద కాసేపు ఆగారు.

    ఆశించి, భంగపడి

    ఉమ్మడి జిల్లా నుంచి పీఎస్సార్‌కు మొదటి, ఆ తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినప్పటికీ చోటు దక్కలేదు. గతేడు ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణకు ముందు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్‌, జై సంవిధాన్‌’ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ ఆయన మంత్రి పదవిపై బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్ల డించారు. తర్వాత జిల్లా నుంచే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామికి అవకాశం దక్కింది. దీంతో ఇక పీఎస్సార్‌కు మంత్రి పదవి రాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండో విడతలో చోటు ఖాయం అనుకున్నప్పటికీ దక్కలేదు.

    నామినెటేడ్‌కు ససేమిరా

    మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న పీఎస్సార్‌కు నామినేటెడ్‌తో బుజ్జగించేలా కార్పొరేషన్‌ పదవిలో నియమించారు. గత అక్టోబర్‌లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం పీఎస్సార్‌ను కేబినెట్‌ హోదాతో సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టలేదు. అంతేకాక నామినేటెడ్‌ పోస్టులపై తనకు ఆసక్తి లేదని తేల్చారు.

    అవకాశం ఉంటుందా?

    కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తోంది. అన్ని సామాజిక, ప్రాంతాలకు సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులపై ఇప్పటికే రాష్ట్రంలో పలువురు సీనియర్‌ నాయకులు మంత్రి పదవిపై గంపెడాశలతో ఉన్నారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో మూడో విడతలో ఎవరికి అవకాశం ఇస్తారోనని ఎదురు చూస్తునారు. ఇప్పటికే జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం ఉంది. ఈ క్రమంలో పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే పీఎస్సార్‌ను పార్టీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తారనేది వేచిచూడాలి.

  • పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా, మండల, మున్సిపాలిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న కలెక్టరేట్ల ఎదుట ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని, పార్టీ బలోపేతం కోసం ఈ నెల 28, 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, జోగుల మల్ల య్య, చంద్రశేఖర్‌, లింగం రవి, శ్రీనివాస్‌, చంద్రకళ, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బొంతల లక్ష్మీనారాయణ, దుర్గారాజ్‌, రాజమౌళి, సమ్మయ్య, బానేష్‌ పాల్గొన్నారు.

  • పెంచికల్‌పేట్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు సాయిక్రిష్ణ అంతర్జాతీయ బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఆసియా ఇంటర్‌ ప్రైవేట్‌ నేషనల్‌ గేమ్స్‌– 2026లో పాల్గొనే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా, దేశం తరఫున బేస్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్న సాయిక్రిష్ణకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీజేపీ నాయకుడు పాల్వాయి సుధాకర్‌ రావు క్రీడాకారుడికి నగదు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పగిడె కాంతారావు, సర్పంచ్‌ పొట్టె ఉమామహేశ్‌, ఉప సర్పంచ్‌ రఘునాథ్‌, నాయకులు మీసారి కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Karimnagar

  • వేలంలో మెరిసిన ఉమ్మడి జిల్లా కుర్రాళ్లు

    అంతర్జాతీయ స్టార్స్‌ తిలక్‌వర్మ, సిరాజ్‌తో ఆడనున్న మన క్రికెటర్లు

    అత్యధికంగా రూ. 12 లక్షలు పలికిన అమన్‌రావు

    కరీంనగర్‌స్పోర్ట్స్‌: తెలంగాణ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి వేదికవుతున్న టీజీ–20 లీగ్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అరుదైన స్థానాలను దక్కించుకున్నారు. త్వరలో ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభం కానున్న మెగా లీగ్‌.. భారత క్రికెట్‌ స్టార్స్‌ తిలక్‌వర్మ, మొహమ్మద్‌ సిరాజ్‌ల ఉనికితో సరికొత్త గ్లామర్‌ను సంతరించుకుంది. ఇలాంటి హేమాహేమీలు ఆడుతున్న ప్రతిష్టాత్మక లీగ్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు యువ క్రికెటర్లు వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికవడం జిల్లా క్రికెట్‌ ఖ్యాతికి నిదర్శనం.

    గ్రామీణ క్రీడాకారులకు సరికొత్త ఆశాకిరణం

    కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల వంటి ప్రాంతాల నుంచి వచ్చిన ఈ క్రీడాకారులు కేవలం లీగ్‌కు మాత్రమే ఎంపిక కాలేదు. వేలాది మంది గ్రామీణ ప్రాంత యువకులకు సరికొత్త నమ్మకాన్ని ఇచ్చారు. టీజీ–20 లీగ్‌ కల్పించిన ఈ వేదిక ద్వారా కుర్రాళ్ల జీవితాలు ఆర్థికంగా, వృత్తిపరంగా సరికొత్త మలుపు తిరగనున్నాయి. లీగ్‌లో అద్భుతంగా రాణించి, జాతీయ స్థాయి ఐపీఎల్‌ రేసులోకి కూడా దూసుకెళ్లాలని, కరీంనగర్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

  • కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లికి చెందిన పెరాల అమన్‌రావు వేలంలో రూ.12 లక్షలకు వరంగల్‌ వారియర్స్‌ జట్టుకు ఎంపికై జిల్లాలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అమన్‌రావు ఇప్పటికే దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు రూ.30 లక్షలకు ఇతడిని సొంతం చేసుకుంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైపై శార్దూల్‌ఠాకూర్‌ ఓవర్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదడం, విజయ్‌ హజారే ట్రోఫీలో బెంగాల్‌ అంతర్జాతీయ బౌలింగ్‌ లైన్‌అప్‌ (షమీ, ఆకాష్‌దీప్‌, ముఖేశ్‌కుమార్‌) పై ఏకంగా 200 (నాటౌట్‌) పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ అండర్‌–23 జట్టుతో పాటు రంజీ జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు, టీజీ–20 లీగ్‌లో మహమ్మద్‌ సిరాజ్‌తో కలిసి వరంగల్‌ వారియర్స్‌ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలు ఉండటం విశేషం.

    రాజన్న సిరిసిల్ల జిల్లా పోత్‌గల్‌కుకు చెందిన అరవెల్లి అవనీశ్‌రావు ప్రతిభావంతమైన వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువతో కఠిన శ్రమకోర్చి, స్థానిక మైదానాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఎదిగాడు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌– 2024లో భారత జట్టు తరఫున వికెట్‌ కీపర్‌గా ఎంపికై , జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌ 2024లో సీఎస్‌కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2024లో ఐపీఎల్‌ వేలంలో చైన్నె సూపర్‌కింగ్స్‌ అవనీశ్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.7 లక్షలకు ప్రణవ రంగారెడ్డి రైజర్స్‌ జట్టు సొంతం చేసుకుంది.

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఆరుగురు యువ క్రికెటర్లు ప్రతిష్టాత్మక టీజీ20 లీగ్‌కు ఎంపికవడం అభినందనీయం. ప్రతిష్టాత్మకంగా జరిగే లీగ్‌లో పాల్గొనడంతో జిల్లా క్రికెట్‌ ఖ్యాతి పెరిగింది. మన క్రికెటర్లు లక్షల ధర పలకడం గర్వంగా ఉంది. లీగ్‌లో అద్భుతంగా రాణించి జిల్లా కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాం.

    – మనోహర్‌రావు, జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి, కరీంనగర్‌

  • కరీంనగర్‌టౌన్‌: చేనేత కార్మికుల పొట్ట కొట్టే ప్రభుత్వ సమీకృత టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు రామచంద్రం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కరీంనగర్‌ పద్మనగర్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు. 24 ఏళ్లుగా చేనేత సహకార సంఘాల్లోని కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఆప్కో, టెస్కో సంస్థలు కొనుగోలు చేసేవని గుర్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సమీకృత టెండర్ల ద్వారా వస్త్రాలను కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ద్వారా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం టెండర్‌ విధానాన్ని రద్దుచేసి కార్మికులకు చేతినిండా పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార సంఘాల్లో నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలని, పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఆప్కో మాజీ డైరెక్టర్‌ అడిగోప్పల సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు వెంకటేశం, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.

  • సిరిసిల్ల: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో ఆదివారం రాత్రి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమిరేట్స్‌ తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమ సంఘం(ఈటీసీఏ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అజ్మాన్‌లోని హ్యాబిటెట్‌ స్కూల్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో 250 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ అస్థిత్వ వేదిక చైర్మన్‌, తెలంగాణ ఉద్యమ నాయకులు వి.ప్రకాశ్‌ హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈటీసీఏ ఫౌండర్‌ కిరణ్‌కుమార్‌ పీచర, మాజీ అధ్యక్షుడు రాధారపు సత్యం, ప్రతినిధులు రాజ శ్రీనివాసరావు, ఎస్‌వీఎస్‌ రెడ్డి, రవి కటుకం, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ అలిగేటి, జాయింట్‌ సెక్రటరీ శేఖర్‌గౌడ్‌, కోశాధికారి తిరుమల్‌రావు, కల్చరల్‌ సెక్రటరీ వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల కళారూపాలు, వేషధారణలు, నృత్యాలు అలరించాయి.

  • కరీంనగర్‌: హాస్పిటల్స్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (హెచ్‌ఏఎఫ్‌) పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా సంఘాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.కిషన్‌ తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో మాట్లాడారు. హెచ్‌ఏఎఫ్‌తో ఐఎంఏ, తానాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెచ్‌ఏఎఫ్‌ వ్యవస్థాపకుడు, వన్‌ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ మహేశ్వర్‌రెడ్డి అనుచరులు మల్యాల మండలం రామన్నపేటలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ బీఎన్‌ రావు కారును అడ్డగించి దాడికి యత్నించడం, దాడికి పాల్పడినవారే కేసులు పెట్టడంపై మండిపడ్డారు. హెచ్‌ఏఎఫ్‌ ఏర్పాటును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వ్యవస్థాపకులను మందలిస్తే బీఎన్‌ రావుపై కక్షగట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రైవేట్‌ ఆర్మీ ఏర్పాటు చేసి వైద్యవృత్తిని శాసించాలనుకోవడం మూర్ఖపు చర్య అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఐఎంఏలో చర్చించి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. తానా రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ కటారి, జిల్లా అధ్యక్షుడు ఎనమల నరేశ్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, కార్యదర్శి మహేశ్‌, కోశాధికారి నీలిమ, ఆర్‌.వెంకటేశ్వర్లు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Peddapalli

  • మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026

    సాక్షి పెద్దపల్లి:

    వేసవి సెలవులు ముగిశాయి. ఆటాపాటలకు విరామం వస్తోంది. దాదాపు మూడు నెలల తర్వాత పుస్తకాలు, బ్యాగులు పట్టుకుని విద్యార్థులు సోమ వారం బడిబాట పట్టనున్నారు. పాఠశాలల్లో వసతు లు కల్పించి నాణ్యమైన విద్య అందించడానికి ప్ర భుత్వం ‘మన ఊరు.. మన బడి’, అమ్మ ఆదర్శ పా ఠశాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎంపికైన స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తయినా.. కొన్నిచోట్ల అసౌకర్యాలు వెక్కిరిస్తున్నాయి. అసంపూర్తి పనులను సెలవుల్లో పూర్తిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. శిథిలమైన భవనాలు, ప్రహరీలు, వి ద్యుత్‌, నీటి సౌకర్యం తదితర తదితర సమస్యలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా చాలాచోట్ల బడులు మద్యం ప్రియులకు అడ్డాలు గా మారాయి. తాగి పడేసిన ఖాళీ మద్యంసీసాలు చిన్నారుల భవిష్యత్‌కు ప్రతిబంధంగా మారాయి.

    కలిసొచ్చిన కార్యక్రమాలు

    గత ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు– మన బడి’ జిల్లాలోని 191, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మరిన్ని స్కూళ్లలో సుదుపాయా లు మెరుగయ్యాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లను ఏర్పాటు చేసి అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పర్యవేక్షిస్తున్నారు. రూ.17కోట్లతో 418 స్కూళ్లలో మరమ్మతు, అభివృద్ధితోపా టు, పీఎంశ్రీ ద్వారా 16 స్కూళ్లలో ఆధునిక సౌకర్యా లు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనలో మనజిల్లా 230 మార్కులకు 135.2 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది.

    14నుంచి బడిబాట

    జిల్లాలో మొత్తం 547 స్కూళ్లు ఉండగా, సుమారు 50 వేలమంది చదువుతున్నారు. బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నా.. తల్లిదండ్రులు ప్రైవేట్‌ స్కూళ్లవైపే మెగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడు ల్లో సంఖ్య తగ్గుతూ వస్తున్నది. విద్యార్థుల సంఖ్య ఈసారి ఎలాగైనా పెంచేందుకు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

    వసతుల్లో నంబర్‌ వన్‌

    జిల్లాలోని దాదాపు అన్నిపాఠశాలల్లో వసతు లు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోనే మనజిల్లా టాప్‌ వన్‌లో ఉంది. వచ్చే సోమవారం పున:ప్రారంభంకానున్నాయి. విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తుకాలు, జతయూనిఫామ్‌ అందించేందుకు అన్నీ సిద్ధం చేశాం.

    – శారద, జిల్లా విద్యాశాఖ అధికారి

    ఇది నిజం : శిథిలమైన ఈ పెంకుటింట్లోనే మంథని మండలం కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఒకటినుంచి ఐదో తరగతి వరకు ఒకేగదిలో అరకొర సౌకర్యాల మధ్య విద్యాబోధన చేస్తున్నారు. విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారు.

    ఇవి ఇటీవల నిర్మించిన ఓదెల మండలంలోని

    ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లే అయినా.. స్కావెంజర్లు

    లేక నిర్వహణ గాడితప్పి దుర్గంధం వెదజల్లుతోంది.

    ఇందులోని 70 మంది విద్యార్థులు దుర్వాసన

    భరించలేకపోతున్నారు.

  • పెద్దపల్లి: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ బదిలీ అయ్యారు. ఆయనను కమలాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. సాధారణ బదిలీల్లో భాగంగానే ఆయన ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్లు సమాచారం.

    బాయిలర్‌ భద్రతపై అవగాహన

    ఫెర్టిలైజర్‌సిటీ: ఆర్‌ఎఫ్‌సీ ఎల్‌ కర్మాగారంలో సోమ వారం బాయిలర్‌ భద్రత పై బాయిలర్ల వరంగల్‌ రీ జియన్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమారావు సోమ వారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ, బాయిలర్‌ భద్రత నిబంధనల ను కచ్చితంగా పాటించాలన్నారు. తద్వారా ప్ర మాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ జీ ఎం(ఓఅండ్‌ఎం) ప్రేమ్‌కుమార్‌, బాయిలర్‌ ఆ పరేటర్లు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

    పార్క్‌లో వ్యర్థాల సేకరణ

    రామగుండం: అటవీశాఖ అధికారులు స్థానిక అర్బన్‌ పార్క్‌లో సోమవారం వ్యర్థాలను సేకరించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, అందుకే వ్య ర్థాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపా రు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సతీశ్‌కుమార్‌, డి ప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ తిరుపతి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు నర్సయ్య, సతీశ్‌కుమార్‌, సయ్యద్‌ రహ్మతుల్లా, బీట్‌ ఆఫీసర్లు స్రవంతి, మేఘరాజ్‌, రామ్మూర్తి, మాధురి, పవన్‌కుమార్‌, వెంకటరాజం, అక్తర్‌పాషా తదితరులు ఉన్నారు.

    నియామకం

    మంథని: ఆర్యవైశ్య మహాసభ రాజకీయ క మి టీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌గా మంథని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎల్లంకీ వంశీధర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నుంచి ఆయన నియామకపత్రం అందుకున్నారు. వంశీధర్‌ నియామకంపై ఆర్యవైశ్య సామాజిక వర్గం, స్థానికులు, మిత్రులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

    చేపల మార్కెట్‌లో మృగశిర సందడి

    పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్‌: మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా జిల్లాలోని సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌తోపాటు పెద్దపల్లి మార్కెట్‌లో చేపల విక్రయాలు జోరందుకున్నాయి. కార్తె ప్రవేశం సందర్భంగా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకంతో చాలామంది కొనుగోళ్లకు వచ్చారు. డిమాండ్‌ అధికం కావడంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయించారు. బొమ్మె కిలోకు రూ.500 – రూ.600, బొచ్చె రూ.250 – రూ.350 వరకు విక్రయించారు. ధరలు పెంచినా వినియోగదారులు చేపలు కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

    ఐక్య ఉద్యమాలే శరణ్యం

    జ్యోతినగర్‌: ఐక్య ఉద్యమాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యు డు, ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా అన్నారు. ఎన్టీపీసీ ని రంకుశత్వం, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రాజెక్టు గేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, కార్మికులు తమ హక్కులు సాఽ దించేంత వరకు యూనియన్లు అండగా ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ, కాంట్రాక్టు కార్మికుల హక్కుల పరిరక్షణ తమ లక్ష్యమన్నారు. జేఏసీ నాయకులు చిలుక శంకర్‌, భూమల్ల చందర్‌, గీట్ల ల క్ష్మారెడ్డి, శంకర్‌, భూమయ్య, శ్రీనివాస్‌, సత్యం, పురుషోత్తం, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

  • పెద్దపల్లిరూరల్‌: రైతులకు సంక్షేమ పథకాల ఫలాలు అందించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రైతులకు మద్దతు ధర ఇప్పించాలనే ఆలోచనతో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని, సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించింది ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గుర్తుచేశా రు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని విమర్శించారు. ఏకకాలంలో రూ.21వేల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనన్నారు.

    అబద్ధాల హరీశ్‌రావు..

    మాజీమంత్రి హరీశ్‌రావు అంటేనే అబద్ధాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.కోట్ల విలువైన రైతుల శ్రమను కోతల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ దయతోనే మీరు మంత్రులు, మీమామ సీఎం కాగలిగారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. గతంలో ఎన్నడూ లేనిరీతిన ఈసారి వరి, మొక్కజొన్న దిగుబడి అధికంగా వచ్చినా, కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు.

    మీ జేబు నింపుకునేందుకే కాళేశ్వరం

    ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మీ జేబులు నింపుకునేందుకు.. దానికి మీ మామ కేసీఆర్‌ ఇంజినీర్‌ అయితే.. మీరు సబ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించారు.. దానిని కడితే అది మూణ్ణాళ్లకే కూలిపాయె.. ప్రపంచంలో ఇది ఎనిమిదో వింత అన్నట్టు బస్సులు పెట్టి అందర్నీ చూసిరమ్మని పంపితిరి’ అని విజయరమణారావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే తొలితడి పెద్దపల్లికే అని పలికి కనీ సం ఒక్కచుక్కనీరు కూడా ఇవ్వకుండా మీ బంధుగణం ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల కే ఎత్తుకుపోయారని ధ్వజమెత్తారు. వచ్చే ఎ న్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని, సీఎంగా రేవంత్‌రెడ్డి మళ్లీ ఉంటారని అన్నా రు. మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, మార్కెట్‌చైర్మన్‌ మల్లారెడ్డి, నాయకులు సురేశ్‌గౌడ్‌, మస్రత్‌, కొమ్ము సుధాకర్‌, సాంబిరెడ్డి, జగదీశ్‌, నల్లగొండ కుమార్‌, స్వరూప, సంపత్‌, ధర్మయ్య, నర్సింగ్‌, అవినాష్‌, నరేశ్‌, గుజ్జుల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • గోదావరిఖని: ‘కాంగ్రెస్‌ హటావో – సింగరేణి బచావో’ పేరిట ఆదివారం నగరంలో నిర్వహించిన సదస్సు విజయవంతం కావడం టీబీజీకేఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ముఖ్య నాయకులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, దివాకర్‌రావు, కోరుకంటి చందర్‌, పుట్ట మధు హాజరు కావడం, కార్మికుల సమస్యల పై స్పందించడంతో పా ర్టీ, యూనియన్‌ శ్రేణు ల్లో ఊపు వచ్చింది. సింగరేణిలో కారుణ్య ని యామకాలు నిలిచిపో యాయి. మెడికల్‌ పూర్త యిన సుమారు 400మంది కార్మిక వారుసలకు పోస్టింగ్‌ ఆ ర్డర్లు రాలేదు. కార్మికుల్లో ఆందోళన తీవ్రమైంది. మారుపేర్ల కార్మికులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వీరికి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు సరైన దారి చూపించడంలేదు. దీంతో వారిలోనూ అసంతృప్తి రగులుతోంది. కార్మికుల ముఖ్యమైన సమస్యలపై బీఆర్‌ఎస్‌ ఉద్యమానికి సిద్ధమని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రకటించడం కార్మికుల్లో భరోసా నింపినట్లయ్యింది.

    ఆకట్టుకున్న పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

    బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్మిక సమస్యలపై ఉద్యమిస్తామని చెబుతూనే సింగరేణి స్థితిగతులపై సుమారు గంటపాటు ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా వివరించారు. భవిష్యత్‌లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ మనుగడ కష్టంగా మారుతుందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకోవడమే ఇందుకు కా రణమని, చివరకు నష్టపోయేది కార్మికులేనని గ ణాంకాలతో సహా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ చే యడం ఆసక్తి రేపింది. ఈనెల 12న భూ పాలపల్లిలోనూ సదస్సు నిర్వ హించి ఉద్యమానికి కార్మికులను సన్నద్ధం చేస్తామని ప్రకటించడం చర్చకు దారితీసింది. వాస్తవానికి కారుణ్య నియామకాలు నిలిచిపోవడం, బీఆర్‌ఎస్‌ ఉద్యమానికి సిద్ధం కావడంతో సింగరేణి కార్మికుల నుంచి మద్దతు వస్తోంది.

    కార్మిక క్షేత్రమే కీలకం

    సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గడువు ముగియడం, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ పెరుగుతూ వ స్తున్న నేపథ్యంలో హరీశ్‌రావు సమక్షంలో నిర్వహించిన సదస్సు కార్మిక సంఘాల్లో ఊపుతెచ్చింది. కా ర్మిక సమస్యలపై ఉద్యమానికి అవి కూడా సిద్ధమవుతున్నాయి. గత చరిత్ర సమీక్షిస్తే.. ఇప్పవరకు సింగరేణి ఏరియాల్లో గెలిచిన ఎమ్మెల్యేల మాతృ సంస్థ లే అధికారంలోకి రావడంతో కార్మికులు కీలకంగా మారారు. ఈక్రమంలో బీఆర్‌ఎస్‌ కార్మికుల సమస్యలపై గళం విప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత సైతం ఈనెల 15న గోదావరిఖని ప్రాంతంలో పర్యటిస్తారు. దీంతో అన్నిపార్టీల దృష్టింతా కార్మిక క్షేత్రంపైకే మళ్లింది. తద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో కార్మికులు ఎదురు చూస్తున్నారు.

    సింగరేణి స్కాంలపైనే ప్రధాన దృష్టి

    సింగరేణిలో స్కాంలపైనే బీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృిష్టి కేంద్రీకరించింది. ఈవిషయంలో కార్మికులను సన్నద్ధం చేసి కార్మిక క్షేత్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది. ఈక్రమంలో బెల్లంపల్లి, రామగుండం రీజియన్‌ ఏరియా సదస్సు గోదావరిఖనిలో నిర్వహించారు. ఆతర్వాత భూపాలపల్లి, కొత్తగూడెం రీజియన్‌లో నిర్వహించి ప్రభుత్వ తీరు ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

  • పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల కోసం చేపట్టిన ఇండోర్‌ స్టేడియం పనులు చకచకా సాగుతున్నాయి. ఇందుకోసం విద్యామౌలిక వసతుల సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం రూ.2.30 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులు ప్రస్తుతం చివరిదశకు చేరుకున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం చేపట్టిన పనులను ఇంటిగ్రేటెడ్‌ స్టేడియంగా తీర్చిదిద్దేలా గతేడాది సెప్టెంబర్‌ 27న శకుస్థాపన చేశారు.

    జిల్లా కేంద్రంలో ఏర్పాటు..

    బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఆడుకునేందుకు అనువైన కోర్టులు లేక అవస్థలు పడుతున్నారు. వారికి జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతున్న ఇండోర్‌ స్టేడియం ఎంతోసౌకర్యంగా ఉంటుందని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం పనులు చేపట్టారు. మార్కెట్‌లో కన్నా ప్రస్తుత ప్రధాన కూరగాయల మార్కెట్‌నే ఆధునికీకరించేలా పనులు చేపట్టి పూర్తిచేసేలా ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పనులు చేపట్టారు. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ఎలా వినియోగించుకోవాలని ఆలోచించి ఇండోర్‌ స్టేడియంగా మార్చేలా ప్రభుత్వానికి కలెక్టర్‌ శ్రీహర్ష ద్వారా ప్రతిపాదించారు. దీంతో విప్‌ అవసరమైన నిధులు మంజూరు చేయించారు. ఇప్పటిదాకా పారిశ్రామిక ప్రాంతాలుగా ఉన్న బసంత్‌నగర్‌ అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్టీపీసీ, సింగరేణి స్టేడియంలోకి వెళ్లి క్రీడాకారులు ఆడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల్లో అందుబాటులోకి ఇండోర్‌ స్టేడియం రానుండడంతో క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు, శిక్షణ పొందేందుకు అవకాశం కలుగనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    మినీస్టేడియం అవసరమే..

    జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో మినీస్టేడియం ఏర్పాటుకు ఏనాడో ప్రతిపాదించినా అవసరమైనంత స్థలం అందుబాటులో లేనికారణంగా పనులు ముందుకు సాగడం లేదు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న పురావస్తుశాఖ స్థలం ఏళ్లకాలంగా వృథాగా ఉంటోందని, ఆ స్థలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేలా ఆ శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు.

  • గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల13న గోదావరిఖని విఠల్‌ నగర్‌ నుంచి ఆర్జీ –వన్‌ జీఎం కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కౌశిక్‌ హరి అన్నారు. సోమవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాభాల బాటలో నడిచిన సింగరేణి సంస్థను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దివాళా తీయించే ప్రయత్నం చే స్తోందని ధ్వజమెత్తారు. కార్మికుల పిల్లలు ఉపాధి అ వకాశాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలి పారు. కేసీఆర్‌ ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టి సుమారు 19వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కా ర్మికుల పిల్లల నోట్లో మట్టి కొడుతూ కారుణ్య ని యామకాలను రద్దు చేసేలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. 26 నెలలుగా మెడికల్‌ బోర్డు నిర్వహించకుండా మనోవేదనకు గురిచేస్తోందన్నారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరేందుకు ఎదురు చూస్తున్న సుమారు 400 మంది కార్మికుల పిల్లలకు జాయినింగ్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా యాజమా న్యం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పర్లపెల్లి రవి, జేవీ రాజు, నాయకులు ఐ.సత్యం, వాసర్ల జోసెఫ్‌, పున్నం శశికుమార్‌, కో దాటి ప్రవీణ్‌, చింతకింది సంపత్‌, మద్దికుంట శంక ర్‌, గడపురం కల్యాణ్‌, మహేందర్‌రెడ్డి, కల్వల సాగర్‌, కందుకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

  • కోల్‌సిటీ: ఏటా మేలో తన అందాలతో ప్రకృతి ప్రేమికులను మైమరపించే మే పుష్పం.. ఈసారి ఆలస్యంగా.. జూన్‌ నెలలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వికసించే ఈ విశిష్ట పుష్పం కోసం ప్రకృతిని ఆస్వాదించే వారు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీనిని శాసీ్త్రయంగా స్కాడోక్సస్‌ మల్టీప్లోరస్‌ అంటారని శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. సాధారణంగా ఏప్రిల్‌ చివరి వారంలో మొ గ్గ తొడిగి, మే మొదటి లేదా రెండోవారంలో వికసించడం దీని ప్రత్యేకత. అందుకే దీనికి ‘మే పుష్పం’గా పేరు వచ్చింది. ఈసారి వాతావరణ పరిస్థితుల ప్ర భావంతో ఆలస్యంగా వికసించినట్లు స్థానికులు చె బుతున్నారు. గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లోని ఊ ర్వశి థియేటర్‌లో పనిచేస్తున్న నరేడ్ల రవీందర్‌ ఇంటి ఆవరణలో మే పుష్పం సుందరంగా విరబూసి చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.

  • పెద్దపల్లి: ప్రజావాణిలో అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లావాసుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం డీఆర్వో మాట్లాడారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. పలు అర్జీలను ఆయా శాఖల అధికారులకు రెఫర్‌ చేస్తూ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • మా ఊరి సర్కారు బడిలో సౌకర్యాల్లేవ్‌. ఒక్కరే టీచర్‌ ఉన్నడు. విద్యాబోధన సరిగాలేదు. నా బిడ్డ రెండోతరగతి పూర్తిచేసింది. మూడో తరగతికి ప్రైవేటు స్కూల్‌కు పంపించాలనుకుంటున్న.

    – అంగజాల తిరుపతి, పేరెంట్‌

    కంపుకొడుతున్నయ్‌

    ఓదెల బడిలో స్కావెంజర్‌ లేరు. మూత్రశాలలు, మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతూ నిరుపయోగంగా మారుతున్నాయి. మంచినీటి వసతి లేదు. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి.

    – ఇప్పలపల్లి వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్‌

Adilabad

  • కై లాస్‌నగర్‌: జిల్లాలో యాసంగి సీజన్‌ జొన్నల కొనుగోళ్లు సోమవారంతో ముగిశాయి. ఈ సారి కేంద్రాల్లో అసౌకర్యాలు వెంటాడగా.. రైతుల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 26 పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి ప్రక్రియ పూర్తి చేసినా విక్రయించిన రైతుల ఖాతాల్లో మాత్రం నగదు జమ చేయలేదు. దీంతో ఖరీఫ్‌ పెట్టుబడి కోసం వారికి తిప్పలు తప్పని పరిస్థితి.

    పెరిగిన దిగుబడి

    జిల్లాలో రైతులు ఈ సారి పెద్ద మొత్తంలోనే జొన్న సాగు చేశారు. దిగుబడి సైతం పెరిగింది. ఎకరాకు 25నుంచి 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే పంట విక్రయించుకునేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిగుబడి చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళనలు చేపట్టాల్సి వచ్చింది. స్పందించిన ప్రభుత్వం కేంద్రాలను ఆలస్యంగా షురూ చేసింది. హమాలీలను పూర్తి స్థాయిలో నియమించలేదు. లారీల కొరత తోడవడంతో కాంటా పూర్తయినా గోదాంలకు సకాలంలో తరలించలేని పరిస్థితి. ఫలితంగా రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. నిల్వలు పేరుకుపోయాయనే కారణంతో పలు చోట్ల రెండు రోజులు కొంటే మరో రెండు రోజులు కొనుగోళ్లకు బ్రేక్‌ వేశారు. గన్నీసంచుల కొరత సైతం రైతులకు శాపంగా మారింది.

    ఈ సారి కేంద్రాలను పెంచినా..

    కొనుగోళ్లు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈసారి కేంద్రాలను పెంచింది. ఈ ఏడాది కజ్జర్ల, భీంపూర్‌, పిప్పర్‌వాడ, బేల, మేడిగూడ, ఝరి, మర్లపల్లి, తడిహత్నూర్‌, శ్యాంపూర్‌ గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేసింది. అయితే రైతుల సంఖ్యకనుగుణంగా వసతులు కల్పించలేదు. కాంటాలు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం, సరిపడా హమాలీలు అందుబాటులో లేక కొనుగోళ్లు ఆలస్యం కావడమే కాకుండా తరలింపులోనూ జాప్యం ఏర్పడింది. పంట కొన్న తర్వాత వారం వరకు తక్‌పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు కేంద్రాల్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

    పెట్టుబడి సాయానికి పడిగాపులే..

    జిల్లా వ్యాప్తంగా రూ.257 కోట్ల 16లక్షల 83వేల 512 విలువైన 6,95,237 క్వింటాళ్ల జొన్నలను పీఏసీఎస్‌ల ద్వారా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఇందులో 5,35,895 క్వింటాళ్లను గోడౌన్లకు తరలించింది. ఈ తరలింపులో జాప్యం కారణంగా పలు యార్డులు జొన్న రాశులతో నిండిపోయాయి. ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, తలమడుగు, నేరడిగొండ మార్కెట్‌యార్డుల్లో వేలాది జొన్నల బ్యాగులు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకా 1,59,342 క్వింటాళ్ల నిల్వలను గోడౌన్లకు తరలించాల్సి ఉంది. సోమవారం ఉదయం నుంచి పలు చోట్ల వర్షం కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయే అవకాశముంది. కాగా పంట విక్రయించిన రైతుల ఖాతాల్లో నగదు మాత్రం జమకాలేదు. దీంతో వానాకాలం పెట్టుబడి కోసం దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

    జిల్లాలో జొన్నల కొనుగోళ్ల వివరాలు..

    మొత్తం కొనుగోలు కేంద్రాలు 26

    ఇప్పటి వరకు కొనుగోలు చేసింది

    69,523 మెట్రిక్‌ టన్నులు

    విక్రయించిన రైతులు 24,068

    యార్డుల్లో నిల్వ ఉన్న జొన్నలు

    15,934 క్వింటాళ్లు

Komaram Bheem

  • కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహణపై సందిగ్ధంతొలగడం లేదు. కార్మిక సంఘాలు 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. యాజ మాన్యం నుంచి స్పందన లేకపోవడంతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ నిర్వహణకు జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్పీఎంలో 2014 నుంచి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగడం లేదు. 2018లో నిర్వహించాల్సి ఉన్నా యాజమాన్యం వివిధ కారణాలను సాకుగా చూపుతూ వాయిదా వేస్తోంది. ప్రస్తుతం మిల్లులో 373 మంది పర్మినెంట్‌ కార్మికులు, 600 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు, 800 మంది జాబ్‌ కార్మికులు, ఏసీఎస్‌ కంట్రోల్‌ సిస్టంలో 415 మంది పని చేస్తున్నారు. మొత్తం 1,900 మందికి పైగా కార్మికులు ఉన్నారు.

    కార్మిక సమస్యలపై పట్టింపేది..?

    2014లో మూతపడిన మిల్లును 2018లో జేకే పేపర్‌ మిల్లు యాజమాన్యం టేకోవర్‌ చేసుకుని 1,050 మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించింది. అయితే కార్మికుల హక్కుల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్దసంఖ్యలో కార్మికులు ఉన్నా ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు సంఘం లేకపోవడంతో కార్మికుల సమస్యలు పట్టించుకునేవారు కరువయ్యారు. వేతన సవరణ, బోనస్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి అంశాలపై మిల్లు ప్రతినిధులను నేరుగా అడిగే అవకాశం లేకుండా పోయింది. రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని కార్మికులు వాపోతున్నారు.

    కోర్టు పరిధిలో వివాదం

    ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ వివాదం హైకోర్టు పరిధిలో ఉంది. ఈ వివాదం తొలగితే తప్ప ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం మిల్లులోని అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యమై జేఏసీగా ఏర్పడి ఎస్పీఎం గేటు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పరిశ్రమ విస్తరణ, ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కార్మికుల ప్రజాస్వామ్య హక్కుల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు

    ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

    ఎస్పీఎంలో గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం నిర్వహించకుండా జాప్యం చేస్తుంది. ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేసింది. ఆ కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలి. రానున్న రోజుల్లో ఎస్పీఎం గేటు ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.

    – వెంకటేశం, కార్మిక సంఘం నాయకుడు

  • పెంచికల్‌పేట్‌: మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపొద్దని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌ అన్నారు. మండలంలోని చేడ్వా యి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎ దిగే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు చెప్పొద్దని సూచించారు. వాట్సాప్‌ గ్రూ పుల్లో రాజకీయ పార్టీలు, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద పోస్టులు పెట్టడం ద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని కోరారు. గ్రామాల్లో గంజాయి, నకిలీ విత్తనాల విక్రయాలు, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ నానాజీ, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలల పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షు డు ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ గతేడా ది నవంబర్‌ 12 నుంచి కెరమెరి పీహెచ్‌సీ పరిధిలోని మోడి, దేవాపూర్‌ సబ్‌ సెంటర్లు, అడ పీహెచ్‌సీ పరిధిలోని చిర్రకుంట, గుండి సబ్‌ సెంటర్లలో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రవీనా, ప్రత్యూష, స్నేహ, అనూష తదితరులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌: వర్షాకాలంలో పరసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక వార్డు సభలకు వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌తో కలిసి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రెయినేజీల్లో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెందే ప్రమాదముందని పేర్కొన్నారు. సమస్యలుంటే ప్రజలు కౌన్సిలర్ల దృష్టికి తేవాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు బాలకృష్ణ, దూడల లక్ష్మి, మున్సిపల్‌ మేనేజర్‌ సర్వర్‌, ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీరాజం, సిబ్బంది పాల్గొన్నారు.

  • మిల్లు పునః ప్రారంభం నుంచీ స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. దేవాపూర్‌, ఏసీసీ సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎస్పీఎంలో ఎందుకు నిర్వహించడంలేదు..? గుర్తింపు యూనియన్‌ వస్తే యాజమాన్యం చేస్తున్న అక్రమాలు, దుర్మార్గాలు బయటపడుతాయనే భయంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారు. కార్మికుల నిరాహార దీక్షలు, మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

    – డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌,

    బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాని కి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్‌ కె.హరిత వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని రెబ్బెన మండల కేంద్రానికి చెందిన కౌశిక్‌, కల్యాణ్‌, తుంగెడ గ్రామానికి చెందిన సంధ్య వేర్వేరుగా అర్జీలు అందించారు. వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తే కబ్జా చేశారని, తిరిగి తనకు ఇప్పించాలని సిర్పూర్‌(టి) మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం హుక్టూ విన్నవించాడు. తన భర్త మరణించిన నేపథ్యంలో ఎల్‌ఐసీ బీమా డబ్బులు ఇప్పించా లని కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌కు చెందిన కవిత మండల్‌ వేడుకుంది. ఆసరా పింఛన్‌ డబ్బులు బ్యాంకు ద్వారా ఇప్పించాలని ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామానికి చెందిన నవీన్‌ దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌ గ్రామానికి చెంది న పెరుగు కమలాబాయి అర్జీ చేసుకుంది. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్‌ను వెంటనే పునరుద్ధరించాలని చింతలమానెపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన శంకరయ్య కోరాడు. ఉపాధి కల్పించాలని బెజ్జూర్‌ మండలం రెబ్బెనకు చెందిన మల్లేశ్‌ దరఖాస్తు చేసుకున్నాడు.

    గుడిసెల్లో ఉంటున్నాం.. ఇళ్లు ఇవ్వండి

    కెరమెరి మండలం కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామాల్లో 26 ఆదివాసీ కుటుంబాలకు చెందిన వాళ్లం గుడిసెల్లో బతుకు వెల్లదీస్తున్నాం. కాలమేదైనా ఇబ్బందులు తప్పడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదు. పీఎం జన్‌మన్‌, ఇందిరమ్మ ఇళ్ల పథకాల ద్వారా సొంతిళ్లు మంజూరు చేయాలి.

    – కేస్లాగూడ, చిన్నుగూడ గ్రామస్తులు, మం.కెరమెరి

    మృతదేహాలు పాతిపెట్టడం ఆపాలి

    జిల్లా కేంద్రంలోని సిద్ధివి నాయక కాలనీ(10 వార్డు)ని ఆనుకుని ఉన్న స్థలంలో అనధికారికంగా మృతదేహాలను పాతిపెట్ట డం ఆపాలి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. కాలనీ గుండా మృతదేహాలను తీసుకెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

    – సిద్ధివినాయక కాలనీవాసులు, ఆసిఫాబాద్‌

  • ఆసిఫాబాద్‌రూరల్‌: ‘విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కానీ తక్కువ అక్షరాస్యతతో జిల్లా చదువులో వెనుకబడింది. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. సర్కారు బడులను తీర్చిదిద్ది చిన్నారులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా పని చేస్తాం..’అని నూతన జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు నిత్యం పర్యవేక్షిస్తూ.. విద్యాశాఖను బలోపేతం చేస్తామన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల హాజరు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు.

    సాక్షి: వెనుకబడిన జిల్లాలో విద్యారంగాన్ని బలోపే తం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

    డీఈవో: జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి. 2,072 మంది ఉపాధ్యాయులు ఉండగా, 39,249 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల హాజరును ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ గైర్హాజరు కాకుండా చూస్తా. విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తాం. ప్రాథమిక విద్యను బ లోపేతం చేస్తాం. 24 గంటలపాటు అందుబాటులో ఉంటాను. క్షేత్రస్థాయిలో పాఠశాలలను రోజు వారీగా తనిఖీ చేస్తూ విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

    సాక్షి: 2026– 27 విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు?

    డీఈవో: ఈ నెల 6 నుంచి బడిబాట కార్యక్ర మం ప్రారంభమైంది. 15వ తేదీ నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. బడీడు పిల్లలను ప్రభు త్వ పాఠశాలల్లోనే చేర్పించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఇంటింటికీ తిరుగుతూ సౌకర్యాలు, ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంతోపాటు ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉదయం పూట స్నాక్స్‌ గురించి వివరిస్తున్నారు. బడిబాటలో ఇప్పటివరకు 754 మందికి నూతన అడ్మిషన్లు ఇచ్చాం. గతేడాది కంటే ఈ సంవత్సరం 10 శాతం ప్రవేశాల సంఖ్య పెంచుతాం. సర్కారు బడిలో మెరుగైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలి గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. తల్లి దండ్రులు సైతం అడ్మిషన్లు పూర్తయిన తర్వాత వా రంలో ఒకరోజు పాఠశాలకు వెళ్లి తమ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి తెలుసుకోవాలి. తద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుంది.

    సాక్షి: విద్యార్థులకు అందించేందుకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం సిద్ధంగా ఉన్నాయా?

    డీఈవో: జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ తరలించాం. జిల్లాకు 1,48,880 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, 90,320 పుస్తకాలు వచ్చాయి. యూనిఫాం స్టిచ్చింగ్‌ కొనసాగుతుండగా, 50 శాతం పూర్తయ్యింది. జూ న్‌ 15న పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తాం. అలాగే జిల్లాలో రెండు విడతల్లో 212 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాం. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను పూర్వ ప్రాథమిక విద్య కోసం ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలి.

    సాక్షి: ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజు వసూలు, పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?

    డీఈవో: జిల్లాలో మొత్తం 115 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ప్రభు త్వ నిబంధనలను పాటించాలి. అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాం పేరుతో వ్యాపారం చేస్తే ఉపేక్షించేది లేదు.

  • ఆసిఫాబాద్‌: అన్నదాతలకు చల్లని కబురు అందిస్తూ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. త్వరలో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల సోమవారం ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రం వాతావరణం మబ్బులతో ఒక్కసారి చల్లబడింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి చేరడంతో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎరువులు, విత్తనాలు సమకూర్చుకుంటున్నారు. వారం రోజులుగా ఎరువులు, విత్తనాల దుకాణాలు రైతులతో సందడిగా కనిపిస్తున్నాయి. వర్షం రాగానే విత్తనాలు విత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2026– 27 సంవత్సరానికి ఖరీఫ్‌ సీజన్‌లో 4.52 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 47 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల కంది, 7,500 ఎకరాల్లో మక్క, 5,700 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలో సాధారణ వర్షపాతం 18.4 మిల్లీమీటరు నమోదు కావాల్సి ఉండగా, 15.7 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం 15 మండలాల్లో 4 మండలాల్లో సాధారణం కంటే కాస్త అధికంగా వర్షం కురవగా, రెండు మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాల్లో వర్షాలు కురవలేదు.

    కాగజ్‌నగర్‌ మండలంలో వర్షం

    కాగజ్‌నగర్‌రూరల్‌: మండలంలో సోమవా రం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో మోస్తారు వర్షం ఉరుములతో కురిసింది. గాలుల ధాటికి భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని మద్దెల జ్యోతి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. వర్షానికి ఇంటి గోడ పూర్తిగా కూలింది. ఇంట్లో జ్యోతితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. తలదాచుకునేందుకు నీడలేకుండా పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అలాగే నా మానగర్‌ వద్ద తాటిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి.

  • కాగజ్‌నగర్‌టౌన్‌: నిరుపేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజాపాలనతో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వార్డుల్లో సోమవారం వార్డు సభలు నిర్వహించారు. 15, 16 వార్డుల్లో నిర్వహించిన సభలకు ఎమ్మెల్సీ దండె విఠల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ ఫలాలను మరింత చేరువ చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వేదికగా మారిందన్నా రు. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. వార్డుల వారీగా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కారా నికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, మెప్మా అధికారులు మోతిరాం, సిబ్బంది పాల్గొన్నారు.

  • కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన మార్గం చూపాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామిని కలిశారు. ఎస్పీఎం కార్మికుల ఆందోళనల గురించి వివరించారు. 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా గుర్తింపు సంఘం ఎన్నికల గురించి పట్టించుకోకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కార్మిక శాఖ అడిషనల్‌ కమిషనర్‌ గంగాధర్‌ను పిలిపించి పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 10న కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్పీఎం యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

Nirmal

  • నిర్మల్‌

    అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

    నిర్మల్‌ టౌన్‌: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యపై పోలీసులు తక్షణం స్పందించి పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించా రు. నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజ లకు అందించడమే లక్ష్యమన్నారు. పోలీసుల సహాయం కావాలంటే నేరుగా ఠాణాలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనుమానాస్ప ద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

    నిర్మల్‌: జిల్లాలో ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా.. ఎంతమందిపై కేసులు పెడుతున్నా.. కలెక్టర్‌ వర కూ ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి మాత్రం తగ్గడం లేదు. గ్రామ పంచాయతీ మొదలుకుని కలెక్టరేట్‌ వరకూ ప్రతీ పనికో రేటు.. అన్నట్లుగా వసూళ్లరాజ్యం కొనసాగుతోంది. రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, రిజి స్ట్రేషన్స్‌ ఇలా ఆ శాఖ, ఈ శాఖ అని కాదు.. దాదాపు అన్నిచోట్లా పని కంటే.. సంపాదనపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఎక్కడికక్కడ ఓ రేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలామంది మండలస్థాయి అధికారులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు, ఫిర్యాదులూ ఉన్నాయి.

    ఫీల్డ్‌ విజిట్‌ లేకున్నా..

    జిల్లాలో ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు, పేమెంట్లు చేసే ఓ శాఖలో వాహనాల పేరిట డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత శాఖ అధికారికి ఫీల్డ్‌వర్క్‌ ఉండదు. కేవలం ఆఫీస్‌ పని మాత్రమే ఉంటుంది. అయినా ఓ ప్రైవేటు టాక్సీ కారు ను అద్దెకు తీసుకున్నట్లు అగ్రిమెంట్‌ చేసుకుని, నెలకు రూ.30 వేలకుపైగా బిల్లులు పెట్టుకున్నట్లు కలెక్టర్‌తోపాటు ఏసీబీ అధికారులకూ ఫిర్యాదు వెళ్లింది.

    ‘ఇండస్ట్రియల్‌’లో

    ఉందంటూ..

    జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌పైనా ఆ రోపణలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ అనుమతి కో సం వెళ్తే ఇందులో పనిచేసే కొంతమంది డబ్బులిస్తే కానీ రాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌పై పెద్దగా అవగాహన లేని ఓ సామాన్యుడు ఇంటి నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే ‘నీది ఇండస్ట్రియల్‌ ఏరియా’లో ఉంది. పర్మిషన్‌ రావాలంటే ఖర్చు అవుతుందని డబ్బులు డిమాండ్‌ చేయడం గమనార్హం. అలాగే.. రెవెన్యూ విభాగంలో పనిచేసే సిబ్బంది గతంలో డబ్బులు తీసుకుని ఆస్తిపన్నులనూ తగ్గించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    పని గోరంత.. బిల్లు కొండంత..

    ‘ఏం అన్నా.. గింత తక్కువ బిల్లు రాసినవ్‌.. గిట్లయితే మేమెట్ల బతకాలె. నేను చెప్పింది రాసియన్నా..’ అంటూ జిల్లాకేంద్రంలోని ఓ షాపు నుంచి వస్తువులు తీసుకెళ్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి అన్న మాటలివి. చేసే పనులకు, వారు రాసిచ్చే బిల్లులకు పొంతన ఉండటం లేదు. జిల్లాలోని చాలామంది పంచాయతీ కార్యదర్శులపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయినా చాలామందిలో మార్పు కనిపించడం లేదు.

    ప్రతినిధులదీ అదే దారి..!

    సారంగపూర్‌ మండలంలో ఓ చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసుకునే యువకుడు ఇటీవల మృతిచెందాడు. సామాన్య కుటుంబం కావడంతో అదే పనిని తన తమ్ముడికి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధిత ప్రతినిధి డబ్బులు డిమాండ్‌ చేయడం గమనార్హం. రూ.2 లక్షలు ఇచ్చుకోలేని ఆ కుటుంబం కన్నీళ్లతో వెనుదిరిగింది. జిల్లాకేంద్రంలోని మెడికల్‌కాలేజీలో అవుట్‌సోర్సింగ్‌ నియమాకాల్లోనూ డబ్బులివ్వనిదే పోస్టులు ఇవ్వలేదన్న ఫిర్యాదులు వచ్చాయి. కానీ.. వాటిని అధికారులు కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల బాసర ట్రిపుల్‌ఐటీలోనూ సెక్యూరిటీ గార్డుల నియమాకాల్లో ఇదేతంతు కొనసాగింది. చాలాచోట్ల కొంతమంది ప్రజాప్రతినిధులు, నేతలు మధ్యవర్తిత్వం పేరిట సదరు అధికారులతో కుమ్మకై ్క ఆశావహుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి.

    ఫిర్యాదులు చేస్తున్నా..

    పైసావసూళ్లు, శాఖల్లో అవినీతిపై చాలాసార్లు ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్నా.. జిల్లా అధికారులు పెద్దగా స్పందించడం లేదు. ఓ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వాహనం పేరిట బిల్లులు లేపిన విషయంపై గత కలెక్టర్‌తో పాటు ఏసీబీ అధికారుల వరకూ ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు.

    చేయి తడిపితేనే సర్టిఫికెట్‌..

    మిగతా శాఖలతో పోలిస్తే రెవెన్యూశాఖలో అవినీతి అధికంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చిన్న సర్టిఫికెట్‌ కావాలన్నా.. ఎంతోకొంత చేతిలో పెట్టాల్సిందేనని సామాన్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కాలేజీలు, పైచదువులకు వెళ్లే పిల్లలకు కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్‌ తదితర సర్టిఫికెట్లు అవసరం. వీటిని ఇవ్వడానికీ.. డబ్బులు ఆశిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

    నెలనెలా వసూలు..

    ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే ఎకై ్సజ్‌శాఖలో కొంతమంది సొంత ఆదాయాన్నీ సమకూర్చుకుంటున్నా రు. ప్రతీ వైన్స్‌ నుంచి నెలకు ఇంత చొప్పున సంబంధిత అధికారులకు మాముళ్లు వెళ్తున్నాయి. ఇందుకు వైన్సుల పరిధిలో కొనసాగే బెల్ట్‌షాపులను, మద్యం అమ్మకాలను చూసీచూడనట్లుగా వదిలేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాలతోపాటు సిట్టింగ్‌ నడిపించే హోటళ్లు, దాబాల నుంచీ రెండుమూడు నెలలకోసారి మాముళ్లు అందుతాయని, అందుకే సదరు సిట్టింగ్‌ల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి.

  • లక్ష్మణచాంద: పాఠశాలల వేసవి సెలవులు మరో ఆరు రోజుల్లో ముగియనున్నాయి. ఈనెల 15 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. పునఃప్రారంభం ఏర్పాట్లపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

    సాక్షి: జిల్లాలో పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయా?

    డీఈవో: జిల్లాలో మొత్తం 830 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈనెల 12 నాటికి పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు పొడిగించారు. దీంతో ఈనెల 15న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

    సాక్షి: పాఠశాలల్లో పారిశుధ్యం పనులు మొదలు అయ్యాయా? ఎవరు చేస్తున్నారు?

    డీఈవో: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కావేంజర్లు ఉన్నారు. వారితో పరిసరాలు, తరగతి గదులు, బెంచీలు, మూత్రశాలలు శుభ్రం చేయించాలని హెచ్‌ఎంలకు సూచించాం. ప్రారంభం నాటికి పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలని ఎంఈవోల ద్వారా ఆదేశాలు ఇచ్చాం.

    సాక్షి: కొన్ని పాఠశాలల్లో భవనాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఆ పాఠశాలల్లో ఇబ్బందులు అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు?

    డీఈవో: కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అనుమతితో అసంపూర్తి పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. నూతన నిర్మాణాలు పూర్తి చేసేలాగా ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుటాం.

    సాక్షి: 2026–27 బడిబాట కార్యక్రమంలో ఎంత మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు?

    డీఈవో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాం. నమోదు ఇంకా కొనసాగుతోంది. ప్రతీ పాఠశాల ఉపాధ్యాయులు వారి పరిధిలోని గ్రామాల్లో 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను తెలియజేస్తూ చేర్పించేలాగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంచేలా చూస్తున్నారు.

    సాక్షి: విద్యార్థులకు యూనిఫామ్‌ అందిస్తున్నారా?

    డీఈవో: విద్యార్థులకు అందించే యూనిఫామ్‌కు సంబందించిన వస్త్రం ఇప్పటి వరకు జిల్లాకు రాలేదు. ఇప్పటికే విద్యార్థుల కొలతలు స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకుని కుట్టడానికి సిద్దంగా ఉన్నారు. వస్త్రం రాగానే కుట్టుపని ప్రారంభించి ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు అందేలా చూస్తాం.

    సాక్షి: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా? ఏమైనా సర్దుబాటు చేస్తారా?

    డీఈవో: జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు ఎక్కువ ఉండి సరిపడా ఉపాధ్యాయులు లేకుంటే తక్కువ విద్యార్థులు ఉఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

    సాక్షి: విద్యార్థుల తల్లిందడ్రులకు మీరు ఇచ్చే సూచనలు ఏమిటి?

    డీఈవో:ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవం, అంకితభావం, అన్ని అర్హతలు గల ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఉచితంగా ప్రభుత్వం అంద చేస్తుంది. మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పాఠశాలల్లో అని వసతులు కల్పిస్తున్నాం. డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట పాఠశాలల హంగురు చూసి మోసపోకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి.

    సాక్షి: విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు వచ్చాయా? ఎప్పుడు పంపిణీ చేస్తారు?

    డీఈవో: అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పార్ట్‌–1 పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి. వాటిని ఆయా పాఠశాలలకు కూడా పంపిణీ చేశాం. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అందిస్తాం.

  • లక్ష్మణచాంద: నూతనంగా ఎన్నికై న సర్పంచులు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచుల గౌరవ వేతనాలు విడుదల చేసింది. 2025 డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికై న సర్పంచులు అదే నెల 20వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత డిసెంబర్‌ 10 రోజులు, 2026 జనవరి నుంచి మే నెల వరకు (5 నెలలు) మొత్తం ఆరు నెలల గౌరవ వేతనాలను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది.

    జిల్లాకు ఇలా..

    జిల్లాలో మొత్తం 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పెర్కపల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడంతో 399 మంది సర్పంచులు ఉన్నారు. ఇందులో 10 మంది సర్పంచుల గౌరవ వేతనాలకు కొన్ని కారణాలతో అప్రూవల్‌ కాలేదు. మిగిలిన 389 మంది సర్పంచుల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. 10 మంది సర్పంచుల వేతనాలు కూడా త్వరలోనే అనుమతి పొంది విడుదల అవుతాయని అధికారులు తెలిపారు.

    వేతనాల మొత్తాన్ని సర్పంచ్‌ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ట్రేజరీకి పంపినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. వేతనాలు విడుదలైన విషయం తెలిసి జిల్లా సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న సర్పంచ్‌లు ఇక ముందు మరింత ఉత్సాహంతో గ్రామాభివృద్ధి పనుల్లో పాల్గొంటారని అంటున్నారు.

    389 మంది సర్పంచులకు నెలవారీ విడుదలైన మొత్తాలు..

    డిసెంబర్‌ (10 రోజులు) రూ.8,13,010

    జనవరి రూ.25,28,500

    ఫిబ్రవరి రూ.25,28,500

    మార్చి రూ.25,22,000

    ఏప్రిల్‌ రూ.25,15,500

    మే రూ.25,15,500

    మొత్తం 1,34,27,838

    సర్పంచ్‌ల ఖాతాల్లో జమ

    రాష్ట్ర ప్రభుత్వం గ్రామ ప్రథమ పౌరుల డిసెంబర్‌ నెలలో 10 రోజులతోపాటు, జనవరి నుంచి మే నెల వరకు ఐదు నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలు విడుదల చేసింది. జిల్లాకు రూ.1,34,27,838 విడుదల అయ్యాయి. వేతనాలను సర్పంచుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నాం. – శ్రీనివాస్‌, డీపీవో

  • భైంసాటౌన్‌: జిల్లాలో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓవైపు అధిక దిగుబడులు, అకాల వర్షాలు, మరోవైపు గోదాముల కొరత వెరసి ధాన్యం సేకరణలో జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈసారి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ నేపథ్యంలో ధాన్యం సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఎట్టకేలకు అధికార యంత్రాంగం ధాన్యం సేకరణలో సఫలీకృతమైంది. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీల్లో గోదాములు, రైస్‌మిల్లులకు తరలించారు. జిల్లాలో దాదాపు 90 శాతం ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

    దొడ్డు వడ్లే ఎక్కువ..

    జిల్లాలో ఈసారి దొడ్డురకం ధాన్యమే ఎక్కువ మొత్తంలో సేకరించారు. రబీ సీజన్‌లో 1,83,980 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. 60 కేంద్రాల్లో 21.298 వేల మెట్రిక్‌ టన్నులు సన్నరకం, 235 కేంద్రాల్లో 1.43 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం ధాన్యం సేకరించారు. మొత్తంగా 1.64 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. సేకరించిన ధాన్యం విలువ రూ.394 కోట్లు కాగా, ఇప్పటివరకు 16,508 మంది రైతులకు రూ.187 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. మరో 14,282 మంది రైతులకు రూ.207 కోట్లు చెల్లించాల్సి ఉంది.

    లక్ష్యం మేరకు కొనుగోలు..

    జిల్లాలో యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ దాదాపు పూర్తయింది. 1.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉండగా, మరో 19 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తాం.

    – సుధాకర్‌, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌

  • లక్ష్మణచాంద: తన ద్విచక్ర వాహనంలో ఇతరుల డబ్బులు రావడంతో ఇంటికి వెళ్లిన తరువాత గమనించి తనవి కావని తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు మండలంలోని పార్‌పల్లి వాసి. మండల కేంద్రానికి చెందిన గంట శంకర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి పంట డబ్బులను అవసరం నిమిత్తం రూ.30 వేలు విత్‌డ్రా చేసుకుని తన బైకులో పెట్టుకున్నా అనుకుని పార్‌పల్లికి చెందిన ఒడిషెల భీమేష్‌ బైక్‌లో పెట్టాడు. ఇంటికి వెళ్లిన శంకర్‌ తన బైకు కవర్‌లో డబ్బులు లేకపోవడంతో ఆందోళన చెంది మళ్లీ బ్యాంకు వచ్చాడు. ఇదే భీమేష్‌ బ్యాంకుకు పని నిమిత్తం వచ్చి అనంతరం ఇంటికి వెళ్లాడు. తన ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్‌లో డబ్బులు చూసి షాక్‌ అయ్యాడు. తేరుకుని తనవి కావని వెంటనే లక్ష్మణచాంద బ్యాంకుకు చేరుకున్నాడు. తన బైకులో ఎవరివో రూ.30 వేలు వచ్చాయని మేనేజర్‌ రాజశేఖర్‌కు తెలిపాడు. ఆందోళనతో వచ్చిన శంకర్‌ డబ్బులుగా గుర్తించి భీమేష్‌ చేతుల మీదుగా శంకర్‌ తల్లి ముత్తవ్వకు అందచేశారు. వారు భీమేష్‌ను అభినందించారు. కృతజ్ఞతలు తెలిపారు.

    నిజాయతీ చాటుకున్న హోంగార్డు

    బాసర: బాసర ఆలయ సిబ్బంది మరోమారు నిజాయతీ చాటుకున్నారు. ఇటీవలే హైదరా బాద్‌కు చెందిన ఓ భక్తురాలి బంగారు చెవిపో గు ఆలయ ఆవరణలో పడిపోగా, వెతికి అప్పగించారు. తాజాగా కుంటాల మండలం లింబ (కే)గ్రామానికి చెందిన సునీత అనే భక్తురాలు సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవా రి దర్శనానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కో సం క్యూలైన్‌లో పర్సు పోగొట్టుకుంది. అందులో ఆధార్‌, ఏటీఎం కార్డు, సెల్‌ ఫోన్‌, రూ.2 వే ల నగదు ఉన్నాయి. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో విధులు నిర్వహిస్తున్న ఆల య హోంగార్డులు ఇందాల్‌ నారాయణ పర్సు ను వెతికి భక్తురాలికి తిరిగి అప్పగించాడు. హోం కార్డును భక్తులు అభినందించారు.

  • నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసాటౌన్‌: రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్ట ర్‌ భవేశ్‌ మిశ్రా హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీని నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై శ్రీడీఏపీపై దోపిడీశ్రీ శీర్షికన సోమవారం శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారుల విచా రణ చేశారు. నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్‌ లైసెన్సును సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. వానాకా లం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మరో నలుగురు ఎరువుల డీలర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అధిక ధరలు వసూలు చేయడం, ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, నకిలీ విత్తనాల విక్రయం వంటి చర్యలను ప్రభుత్వం సహించదన్నారు.

  • బాసర: నిజామాబాద్‌–భైంసా ప్రధాన రహదారిపై బాసర పరిసర ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించారు. పోలీస్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రధాన రహదారిని పరిశీలించి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 26 యాక్సిడెంట్‌ స్పాట్లను గుర్తించినట్లు డీఎస్పీ ఉపేంద్రారెడ్డి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగే ప్రాంతాల్లో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

National

  • ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.

    కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

    ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.

    బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనుంది.

  • కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. వ్యక్తిగత కోరికల్ని ఆశల్ని, ఆశయాల్ని  కూడా తృణ ప్రాయంగా త్యజించే వారి త్యాగం, అంతకుమించిన అంతులేని ప్రేమ నిజంగా అందరి హృదయాల్ని కదిలించక మానదు. అలాంటి కథ ఒకటి ఎక్స్‌లో  విశేషంగా నిలుస్తోంది. 

    ఎక్స్‌లో సునీల్‌ కుమార్‌ షేర్‌ చేసిన వివరాల ప్రకారం 51 ఏళ్ల శీతల్, మానసిక వికలాంగుడైన 48 ఏళ్ల సోదరుడు అశ్విన్‌ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు.  అక్కా తమ్ముళ్ల అనుబంధానికి  నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ,  ఒక అక్కగా తన సోదరుడిపై తల్లి ప్రేమకు మించి చూపిస్తున్న ఆమె ప్రేమ  నెట్టింట పలువురి ప్రశంసలు దక్కించుకుంటోంది.

    ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!

    తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత, శీతల్‌ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. తన సొంత కలల కంటే తమ్ముడి భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. సోదరుడి సంతోషానికి ప్రాధాన్యతనిచ్చి, అనుక్షణం అతనికి చంటి పిల్లాడిలా సపర్యలు చేస్తూ, అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఇందుకోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తాను పెళ్లి చేసుకోని వెళ్లిపోతే తమ్ముడు ఒంటిరి వాడైపోతానే ఆవేదనతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించు కున్నారు.

    ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్‌, చెల్లితో పెళ్లి ఫిక్స్‌, మళ్లీ ప్రియుడి లొల్లి!

    శీతల్‌ ప్రేమ, అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రేమ తల్లి ప్రేమకు ఏమాత్రం తీసిపోనిది.వారిద్దరి  విడదీయలేని అనుబంధం. వారి ప్రేమ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందంటున్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని అందంగా మార్చే నిస్వార్థమైన ప్రేమ. సోదరి  త్యాగానికి, మాతృత్వపు ప్రేమకు జోహార్లు అని కొనియాడుతున్నారు. అందరికీ ఇలాంటి సోదరి ఉండాలని అకాంక్షిస్తున్నారు.

    ఇదీ చదవండి: 27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్‌

Business

  • యెజ్డీ, BSA సంస్థలు తమ కొత్త స్క్రాంబ్లర్స్ రీటైల్ విడుదలను ప్రకటించాయి. అవి ఇప్పుడు హైదరాబాద్ తమ అథీకృత డీలర్‌షిప్‌లలో లభిస్తున్నాయి.

    యెజ్డీ స్క్రాంబ్లర్ 350, BSA స్క్రాంబ్లర్ 650లు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ ట్రైయిన్ మాత్రమే కాకుండా.. శక్తివంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ పొందుతాయి. నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి 350 సీసీ బైకులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులోని లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. యెజ్దీ స్క్రాంబ్లర్ 350 బైక్ ధర రూ.1,99,950 కాగా.. BSA స్క్రాంబ్లర్ 650 ధర రూ. 3,24,950.

    BSA స్క్రాంబ్లర్ 650 అసలైన బ్రిటిష్ స్క్రాంబ్లర్ స్టైల్ పొందుతుంది. దీని డిజైన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ స్టార్ కటాలినా, A10 స్పిట్ ఫైర్, A65 ఫైర్ బర్డ్ వంటి చారిత్రక దిగ్గజాల నుంచి స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు బైకులు.. అత్యుత్తమ పనితీరును అందిస్తాయని సంస్థ వెల్లడించింది.

  • ఆధునిక వివాహ బంధాల్లో వస్తున్న విభేదాలు, విడాకుల కేసులో ఇటీవల పుణె కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయింది. భార్య నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు భర్త భారీ మొత్తంలో భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిందేనంటూ పుణెలోని ఒక కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    అసలేం జరిగింది? కేసు వివరాలు ఇవీ..

    ఉద్యోగ రీత్యా పుణెలో స్థిరపడిన ఒక ఐటీ/కార్పొరేట్ జంటకు వివాహమైన ఆరు నెలలకే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో భార్య తరఫు న్యాయవాది కీలక వాదనను తెరపైకి తెచ్చారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలాసవంతమైన, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ.1,35,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.

    ఆదాయాల లెక్కలు ఇలా..

    కోర్టు రికార్డుల ప్రకారం ఇద్దరి ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    వివరాలుభర్త ఆర్థిక పరిస్థితిభార్య ఆర్థిక పరిస్థితి
    ప్రస్తుత నెలవారీ జీతంరూ. 2,79,499రూ. 1,41,436
    కోర్టు ఆదేశించిన భరణంరూ. 1,35,000రూ. 1,35,000
    తీర్పు తర్వాత మొత్తం ఆదాయంరూ. 1,44,499రూ. 2,76,436
  • ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్‌మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేలో నిర్వహించిన వాల్‌మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్‌లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.

    ఉత్పాదకత సాధనంగానే ఏఐ

    గత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్‌మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్‌మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.

    ‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్‌మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్‌మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.

    భిన్నాభిప్రాయాలు - ఆందోళనలు

    ఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్‌మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

  • ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్‌కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.

    ‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.

    ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?

    రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.

    సేల్స్ (అమ్మకాలు)

    వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.

    • ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.

    • ఎలా చర్చలు జరపాలి

    • ఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.

    • విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.

    ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్‌ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.

    రియల్ ఎస్టేట్

    రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.

    లెవరేజ్: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.

    క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.

    టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.

    నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్‌ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

  • హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబై-పుణె-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) అధికారికంగా ఖరారైంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని, అలాగే హైదరాబాద్‌ను ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మరో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాట్లను కూడా సమగ్రంగా సమీక్షించారు.

    12 గంటల ప్రయాణం.. ఇక 3 గంటల్లోనే..

    ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవడానికి సాధారణ రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

    ప్రాజెక్టు పేరు: ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్

    ప్రాజెక్ట్‌ అమలు చేసే సంస్థ: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)

    మొత్తం దూరం: 671 కిలోమీటర్లు

    గరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లు

    టెర్మినల్ నగరాలు: నవీ ముంబై-హైదరాబాద్

    మూడు రాష్ట్రాల మీదుగా 10 స్టేషన్లు

    ఈ హై-స్పీడ్ రైలు కారిడార్ మొత్తం మూడు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ, ఆధ్యాత్మిక పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ మొత్తం 10 స్టేషన్లను ఈ మార్గంలో ప్రతిపాదించారు.

    స్టేషన్ల వారీగా రూట్ మ్యాప్..

    1. నవీ ముంబై
    2. లోనావాలా
    3. పింప్రి-చించ్వాడ్
    4. పుణె (లోని)
    5. బారామతి
    6. పంఢరపూర్
    7. సోలాపూర్
    8. కలబురగి
    9. వికారాబాద్
    10. హైదరాబాద్

    ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు - ప్రయోజనాలు

    ఈ మెగా ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు వరదలా రానున్నాయి. గంటకు 320 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలు, కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలు, తెలంగాణలోని ఐటీ-ఫార్మా హబ్‌లకు ఈ కారిడార్ ఊతం ఇవ్వనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను భవిష్యత్తు తరాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

  • దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులతో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.8,813 కోట్ల భారీ డివిడెండ్‌ను ఎస్‌బీఐ చెల్లించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఈ డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు అధికారికంగా అందజేశారు. 

    ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ ద్వారా వెల్లడించింది. ఎస్‌బీఐ సాధించిన ఈ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పన్నుయేతర ఆదాయ వనరులకు మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు బ్యాంక్ పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    రికార్డు స్థాయి లాభాలతో..

    ఇటీవలే ముగిసిన జనవరి-మార్చి 2026 త్రైమాసికంలో ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ బలమైన ఆదాయాలే ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ డివిడెండ్ చెల్లించడానికి ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.19,684 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు అయిన నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) ఏకంగా 4 శాతం వృద్ధితో రూ.44,380 కోట్లుగా నమోదైంది.

    దలాల్ స్ట్రీట్‌లో జోరు

    స్టాక్ మార్కెట్లో ఎస్‌బీఐ షేరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. గత నెల రోజుల్లో స్వల్పంగా 4 శాతం మేర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత వారంలోనే ఈ స్టాక్ 3 శాతానికి పైగా పుంజుకుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ మార్కెట్ విలువ సుమారు రూ.9.08 లక్షల కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎస్‌బీఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

  • ప్రపంచ విమానయాన రంగాన్ని మిడిల్ ఈస్ట్ సంక్షోభం కుదిపేస్తోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా జెట్ ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయెల్‌-ఏటీఎఫ్‌) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ కారిడార్లు మూతపడటంతో విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పెరిగిన భారంతో మున్ముందు కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ (ఐఏటీఏ) హెచ్చరించింది. రియో డి జనీరోలో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విశ్లేషించారు.

    బడ్జెట్ విమానయాన సంస్థలపైనే ‍ప్రభావం..

    పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం పూర్తిస్థాయి సేవలందించే పెద్ద ఎయిర్‌లైన్స్ కంటే తక్కువ ధరలకే సేవలందించే ‘బడ్జెట్ క్యారియర్ల’పైనే ఎక్కువగా పడుతోందని ఐఏటీఏ స్పష్టం చేసింది. ‘పెద్ద విమానయాన సంస్థలకు ప్రీమియం క్యాబిన్లు, అధిక ఛార్జీలు చెల్లించే బిజినెస్ ప్రయాణికులు, క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా అదనపు మార్జిన్ ఆదాయం లభిస్తుంది. బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌కు ఇలాంటి అదనపు వనరులు ఉండవు’ అని ఐటీఏటీ తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ ‘స్పిరిట్ ఎయిర్‌లైన్స్’ గత నెలలో భారీగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని చిన్న సంస్థలు వ్యాపారాల నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద క్యారియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడమో తప్పదని విల్లీ వాల్ష్ ఆందోళన వ్యక్తం చేశారు.

    టికెట్ ధరలు తగ్గే ప్రసక్తే లేదు!

    ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ నష్టాలను/మార్జిన్లను కాపాడుకోవడానికి లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని వాల్ష్ తేల్చిచెప్పారు. ప్రస్తుత తరుణంలో అధిక ఇంధన ధరలను తట్టుకుని నిలబడటం చాలా కష్టమన్నారు. అమెరికా మార్కెట్‌లో మాత్రం యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి క్యారియర్లు చిన్న బడ్జెట్ పోటీదారులను గట్టిగా అణచివేస్తున్నాయని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

  • భారత స్టాక్ మార్కెట్‌ ఈ వారం తొలి సెషన్‌లోనే తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల మంట దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

    నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,123 వద్ద స్థిరపడింది. మరోవైపు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 719 పాయింట్లు దిగజారి 73,524 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.25% పెరిగి 16.93 మార్కుకు చేరడం మదుపరుల్లో ఉన్న తీవ్ర ఆందోళనను ప్రతిబింబిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయం, ద్రవ్యోల్బణ భయాలు కారణమయ్యాయి.

    యుద్ధ సంక్షోభం తీవ్రతరం

    మార్కెట్లను కుదిపేసిన అత్యంత కీలకమైన అంశం పశ్చిమ ఆసియా సంక్షోభం. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దాడులు, తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందాలపై ఈ పరిణామాలు నీళ్లు చల్లడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. యుద్ధ భయాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడులవైపు మదుపరులు మొగ్గు చూపడం మార్కెట్ల పతనానికి దారితీసింది.

    ముడిచమురు ధరలు

    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 4.5% పైగా పెరిగి బ్యారెల్‌కు 97.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడింది.

    టెక్‌ షేర్లలో అమ్మకాల వెల్లువ

    గత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను పరుగులు పెట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగానికి చెందిన షేర్లలో అంతర్జాతీయంగా ప్రాఫిట్ బుకింగ్ ఊపందుకుంది. ఈ ఏఐ ర్యాలీ అత్యంత వేగంగా, పరిమితికి మించి జరిగిందన్న భయాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు టెక్ షేర్లను విక్రయించారు. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత ఐటీ రంగంపైనా స్పష్టంగా కనిపించింది.

    ఆర్‌బీఐ నెమ్మదించిన వృద్ధి అంచనాలు

    ఇటీవలి ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.1%కి పెంచడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే సంకేతాలు తోడయ్యాయి.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

Sports

  • త్వరలో స్వదేశంలో భారత్‌తో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ వీక్షకుల సంఖ్య పెంచేందుకు మూడు మ్యాచ్‌ల ప్రారంభ సమయాలను మార్చింది.

    వాస్తవానికి ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బ్రాడ్‌కాస్టర్లతో చర్చల అనంతరం వాటిని సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) ప్రారంభించాలని నిర్ణయించారు.

    ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భారత ప్రేక్షకులే. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, మ్యాచ్‌లు మరింత ఎక్కువ మంది వీక్షించేలా టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బ్రిటన్‌కు చెందిన స్కై స్పోర్ట్స్‌, భారత్‌కు చెందిన సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో ECB సంప్రదింపులు జరిపింది.

    కాగా, జూలై 1 నుంచి 19 వరకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటనుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును తాజాగా ప్రకటించారు. శ్రేయస్‌ అ‍య్యర్‌ సారథ్యంలో భారత జట్టు ఈ సిరీస్‌కు సిద్ధమవుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడంతో ఈ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది.

  • త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026 సందర్భంగా రోహిత్‌ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

    తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్‌కు మూడు రోజుల పాటు ఫిట్‌నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.

    తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

    39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్‌లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్‌ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

     

  • మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమిండియా బోణీ కొట్టింది. కార్డిఫ్‌ వేదికగా విండీస్‌తో ఇవాళ (జూన్‌ 8) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.

    భారత ఇన్నింగ్స్‌లో భారతి ఫుల్మాలి (56 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించగా..  షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (39), యస్తికా భాటియా (36) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్‌ 7, రిచా ఘోష్‌ డకౌట్‌, రాధా యాదవ్‌ 1, శ్రేయాంక పాటిల్‌ 2, క్రాంతి గౌడ్‌ 4, శ్రీ చరణి 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అఫీ ఫ్లెచర్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్‌, ఆలియా అలెన్‌, డియాండ్రా డొట్టిన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డొట్టిన్‌ (49), షెర్మైన్‌ క్యాంప్‌బెల్‌ (25) శుభారంభం అందించినా, శ్రేయాంక పాటిల్‌ (4-0-36-4), రాధా యాదవ్‌ (4-0-25-3) చెలరేగడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మినహా విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. భారత్‌ జూన్‌ 10న జరగే తమ మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. 

  • కెప్టెన్సీతో పాటు టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌లో కసి రగులుతోన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ముంబై లీగ్‌లో అతడు వరుస విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. 

    ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 పరుగులు చేసిన స్కై.. తాజాగా తానాడిన రెండో మ్యాచ్‌లో (మరాఠా రాయల్స్‌) మరింతగా చెలరేగిపోయి 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలుపు తీరాలు దాటించాడు. 

    ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అవార్డును స్కై.. ఇదే మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన సహచరుడు సిల్వెస్టర్‌ డిసౌజాతో షేర్‌ చేసుకొని తన గొప్ప మనసును చాటుకున్నాడు.

    మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. సిల్వెస్టర్‌ డిసౌజా (3.5-0-21-5) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. రాయల్స్‌ జట్టులో 36 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. చిన్మయ్‌ రాజేశ్‌ సుతార్‌ (32 రిటైర్డ్‌ ఔట్‌), సాహిల్‌ జాదవ్‌ (15), కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ (24), అయాజ్‌ ఖాన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రంప్స్‌ నైట్స్‌ జట్టు.. సూర్యకుమార్‌ యాదవ్‌ అజేయ అర్ద సెంచరీతో పాటు నూతన్‌ కుమార్‌ గోయెల్‌ (56) అర్ద సెంచరీతో రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

    కాగా, త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను​ తాజాగా ప్రకటించారు. ఫామ్‌ కోల్పోయిన కారణంగా భారత సెలెక్టర్లు సూర్యను జట్టును తప్పించి, కెప్టెన్సీ నుంచి తొలగించారు. సూర్య స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ భారత టీ20 జట్టు నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

     

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును(ఆర్సీబీ) వ‌రుస‌గా రెండుసార్లు చాంపియ‌న్‌గా నిలిపిన అరుదైన కెప్టెన్‌గా ర‌జ‌త్ పాటీదార్ నిలిచాడు. వ‌రుస‌గా ఒక జట్టుకు రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ల జాబితాలోనూ (ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌) పాటీదార్ చోటు ద‌క్కించుకున్నాడు. 

    తాజాగా పాటీదార్ మొద‌ట్లో త‌న‌కు ఆర్సీబీకి ఆడ‌డం ఇష్టం ఉండేది కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. యూట్యూబ్ చానెల్‌లో రోటోరిస్ సిరీస్‌లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో పాటీదార్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. 2021లో ఆర్సీబీ జ‌ట్టులో చేరిన త‌న‌ను మొద‌ట ఒక ప్ర‌త్యామ్నాయ ఆట‌గాడిగా మాత్ర‌మే చూశార‌ని, అదే స‌మయంలో త‌న పెళ్లి ఉండ‌డంతో మొద‌ట ఆర్సీబీలో చేరేందుకు ఇష్టప‌డ‌లేద‌ని వెల్ల‌డించాడు. 

    పాటీదార్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది నిజ‌మే. ఆర్సీబీ జ‌ట్టులోకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను తొలిసారి ఆ జ‌ట్టులోకి వ‌చ్చిన స‌మ‌ యంలో ప్ర‌త్యామ్నాయంగానే చూశారు. తుది జ‌ట్టులో చోటు ఇవ్వ‌ర‌న్న విష‌యం క్లారిటీ ఉండ‌డంతో ఆర్సీబీకి ఆడేందుకు సంకోచించాను. ఆర్సీబీలో జాయిన అయిన మొద‌ట్లో కూడా అలాంటి సంకేతాలే వ‌చ్చాయి. 

    మేము నిన్ను ప్ర‌త్యామ్నాయంగా మాత్ర‌మే తీసుకున్నాం. కాబ‌ట్టి ప్ర‌శాంతంగా ఉండు. ఎవ‌రైనా గాయ‌ప‌డితే నీకు అవ‌కాశం వ‌స్తుంది అని ఆర్సీబీ యాజ‌మాన్యం క్లియ‌ర్‌గా చెప్పింది. దీంతో ఆర్సీబీలోకి రావడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే అదే స‌మ‌యంలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఒక‌వేళ ఆర్సీబీలోకి వ‌చ్చినా బెంచ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేది’ అని చెప్పుకొచ్చాడు.

    ఐపీఎల్ 2021 సీజ‌న్‌కు ముందు జ‌రిగిన మినీ వేలంలో పాటిదార్‌ను ఆర్సీబీ రూ.20 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో పెద్ద‌గా ఆడే అవ‌కాశం రాని పాటీదార్ నాలుగు మ్యాచ్‌ల్లో 71 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పాటీదార్‌ను ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు. అయితే సీజ‌న్ మ‌ధ్య‌లో ల‌వ్నిత్ సిసోడియా గాయ‌ప‌డ‌డంతో అత‌డి స్థానంలో పాటీదార్‌ను తీసుకుంది. 

    ఈసారి పాటీదార్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజ‌న్ ఎలిమినేట‌ర్‌లో ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో పాటీదార్ అజేయ సెంచ‌రీ ( 112 ప‌రుగులు నాటౌట్‌) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ఆ త‌ర్వాత పాటీదార్ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. 

    ఐపీఎల్ 2025 మెగావేలం త‌ర్వాత ఆర్సీబీ పాటీదార్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌లోనే పాటీదార్ ఆర్సీబీని చాంపియ‌న్‌గా నిలిపాడు. తాజాగా ఈ సీజ‌న్‌లోనూ మ‌రోసారి ఆర్సీబీని చాంపియ‌న్‌గా నిలిపి ల‌క్కీ కెప్టెన్ అయిపోయాడు. పాటీదార్ కెప్టెన్‌గానే గాక బ్యాట‌ర్‌గాను అద‌ర‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో పాటీదార్ 15 మ్యాచ్‌ల్లో 501 ప‌రుగులు సాధించాడు.

    చదవండి: రిటైర్డ్ హర్ట్‌, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?

  • తమ 94 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో భారత జట్టు అతి భారీ విజయం సాధించింది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో గెలవడంతో ఈ ఘనత సాధించింది. ఇన్నింగ్స్‌ తేడా పరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 1932లో తొలి టెస్ట్‌ ఆడిన భారత్‌.. ఇప్పటివరకు ఇన్నింగ్స్‌ పరంగా ఇంత భారీ విజయం సాధించలేదు.

    2018లో రాజ్‌కోట్‌ వేదికగా వెస్టిండీస్‌పై సాధించిన ఇన్నింగ్స్‌  272 పరుగుల విజయం ఈ మ్యాచ్‌కు ముందువరకు వరకు భారత జట్టు అతి పెద్ద విజయంగా ఉండింది. ఇన్నింగ్స్‌ తేడా పరంగా భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో టాప్‌-5 అతి పెద్ద విజయాలు ఇలా ఉన్నాయి.

    ఆఫ్ఘనిస్తాన్‌పై, ముల్లాన్‌పూర్‌ (2026) – ఇన్నింగ్స్‌ & 300 పరుగులు
    వెస్టిండీస్‌పై, రాజ్‌కోట్‌ (2018) – ఇన్నింగ్స్‌ & 272 పరుగులు
    ఆఫ్ఘనిస్తాన్‌పై, బెంగళూరు (2018) – ఇన్నింగ్స్‌ & 262 పరుగులు
    బంగ్లాదేశ్‌పై, మీర్‌పూర్‌ (2007) – ఇన్నింగ్స్‌ & 239 పరుగులు
    శ్రీలంకపై, నాగ్‌పూర్‌ (2017) – ఇన్నింగ్స్‌ & 239 పరుగులు

    భారత గడ్డపై ఇన్నింగ్స్‌ తేడాతో నమోదైన అతిపెద్ద విజయాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 1958లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌పై వెస్టిండీస్‌ సాధించిన ఇన్నింగ్స్‌ మరియు 336 పరుగుల విజయం ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.

    ఆసియా జట్ల పరంగా చూస్తే, 2002లో లాహోర్‌లో పాక్‌ న్యూజిలాండ్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ మరియు 324 పరుగుల విజయం తర్వాత, భారత్‌ తాజా విజయం రెండో అతిపెద్ద ఇన్నింగ్స్‌ విజయం కావడం విశేషం.

    కాగా, ముల్లాన్‌పూర్‌ టెస్ట్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చలాయించి, ఏకపక్ష విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (100), కెప్టెన్‌ శుభ్‌మన​్‌ గిల్‌ (126) సెంచరీలతో.. సాయి సుదర్శన్‌ (81), రిషబ్‌ పంత్‌ (81), వాషింగ్టన్‌  సుందర్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 564-8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

    అనంతరం​ భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగి ఆఫ్ఘనిస్తాన్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో (152, 112) అతి స్వల్ప స్కోర్లకే కుప్పకూల్చారు. ఫలితంగా ఆ జట్టు ఘోర ఇన్నింగ్స్‌  పరాభవాన్ని మూటగట్టుకుంది.

    అరంగేట్రం లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 1), వాషింగ్టన్‌ సుందర్‌ (1, 4) ఆఫ్ఘన్ల భరతం పట్టారు. వీరికి కుల్దీప్‌ (3), ప్రసిద్ద్‌ కృష్ణ (3) జత కలిశారు. తొలి టెస్ట్‌లోనే 7 వికెట్ల ప్రదర్శనతో మెరిసిన మానవ్‌ సుతార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
     

  • క్రికెట్‌లో మ‌నకు తెలియని ప‌దాలు చాలానే ఉంటాయి. అయితే ఇందులో మ‌న‌కు ముఖ్యంగా వినిపించే ప‌దాలు క్యాచ్ అవుట్‌, ర‌నౌట్‌, రిటైర్డ్ హ‌ర్ట్ అనేవి కామ‌న్‌గా ఉంటాయి. తాజాగా టీమిండియా, అఫ్గానిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన ఏకైక టెస్టులో ఆఫ్గ‌న్ రెండో ఇన్నింగ్స్‌లో ష‌రాఫుద్దీన్ అష్ర‌ఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. 

    కాలి గాయంతో బాధ‌ప‌డుతున్న అష్ర‌ఫ్ ఆబ్సెంట్ హ‌ర్ట్ (ఏబీఎస్ హ‌ర్ట్‌) అయిన‌ట్లు అంపైర్ ప్ర‌క‌టించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 9వ వికెట్ కోల్పోగానే ఆలౌట్ అయిన‌ట్లు బిగ్‌స్క్రీన్‌పై ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. దీంతో ఆబ్సెంట్ హ‌ర్ట్ అనే ప‌దం చ‌ర్చ‌కు దారి తీసింది.

    ఆబ్సెంట్ హ‌ర్ట్ అంటే?
    ఒక ఆటగాడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకముందే, అతను అనారోగ్యంతో లేదా గాయంతో బ‌రిలోకి దిగ‌క‌పోతే దీనిని ఏబీఎస్ హ‌ర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని నిరూపిస్తూ కంకషన్ అని ప్ర‌క‌టిస్తే త‌ప్ప‌, అత‌డి స్థానంలో మరొక బ్యాట‌ర్‌ను ఆడించేందుకు వీలుండదు. 

    ఆ స‌మ‌యంలో స‌ద‌రు జట్టు ఒక బ్యాటర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వ‌స్తుంది. ఆఫ్గ‌న్ బ్యాట‌ర్ అష్ర‌ఫ్ గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌డంతో జ‌ట్టు మేనేజ్‌మెంట్ అత‌డిని బ్యాటింగ్‌కు పంప‌లేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంత‌రం ఆఫ్గ‌న్ ఆలౌటైన్లు ప్ర‌క‌టించారు.

    రిటైర్డ్ హ‌ర్ట్ అంటే?
    ఇక రిటైర్డ్ హ‌ర్ట్ అంటే మ‌నంద‌రికీ తెలిసిన విష‌య‌మే. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో గాయానికి గురైతే మైదానం వీడ‌డం, ట్రీట్‌మెంట్ తీసుకున్న త‌ర్వాత తాను ఆడ‌గ‌ల‌న‌నుకుంటే మ‌ళ్లీ క్రీజులోకి రావడాన్ని రిటైర్డ్ హ‌ర్ట్ అని పిలుస్తారు. ఈ రూల్‌ క్రికెట్‌లో ఎప్పటినుంచో అమల్లో ఉంది.

    రిటైర్డ్ ఔట్ అంటే?
    మ్యాచ్‌లో ఒక ఆట‌గాడు గాయం లేదా అంపైర్ అనుమ‌తి లేకుండా త‌నంత‌ట తానుగా క్రీజు వీడ‌డాన్ని రిటైర్డ్ ఔట్ అంటారు. ఇలా చేస్తే మ‌ళ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.  జ‌ట్టు స్కోరు పెంచాల‌నుకునే క్ర‌మంలో హిట్ట‌ర్‌కు అవ‌కాశం ఇచ్చేందుకు ఈ మ‌ధ్య‌న రిటైర్డ్ ఔట్‌ను ఆయా జ‌ట్లు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాయి.

    చదవండి: ఆఖ‌ర్లో గంద‌ర‌గోళం.. ఆలౌట్ కాని అఫ్గానిస్తాన్‌!

Movies

  • నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం పోలీస్ కంప్లైంట్‌. ఈ మూవీ హరర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెంచేశాయి.

    తాజాగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్‌స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

    దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 'సూపర్‌స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కృష్ణపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. ఈ మూవీలో కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు.

     

  • పెద్ది మూవీ సక్సెస్‌తో రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ మీట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ తాము పడ్డ కష్టాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా సమష్టిగా కృషి చేశామని తెలిపారు. నిజాయతీగా, మనస్ఫూర్తిగా పని చేస్తే ఏ సినిమా అయినా హిట్‌ కావాల్సిందేనని అన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు  కృతజ్ఞతలు తెలిపారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ..' నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎవరో పుష్‌ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి చేశా. ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నా. చాలా రోజుల తర్వాత నేను థియేటర్లలో సినిమా చూశా. నేను ఊహించని సీన్స్‌కు కూడా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చాలా ఆనందం కలిగించింది.  ఇంత మంచి హిట్‌ అందించిన బుచ్చిబాబుకు, పెద్ది టీమ్‌కు థాంక్స్‌. నా లైబ్రరీలో నంబర్‌వన్‌గా పెద్ది నిలుస్తుంది. తొలిసారి ఈ కథ విన్నప్పుడే బుచ్చిబాబును హగ్‌ చేసుకున్నా. నిజాయతీగా పని చేస్తే ఏదైనా హిట్‌ కావాల్సిందే.  పెద్ది సినిమాలో జగపతి బాబుని చూసినప్పుడు.. ఒక ఆర్టిస్ట్‌గా నా కళ్లలో నీళ్లు తిరిగాయి' ‍అని అన్నారు.

    కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో పెద్ది మూవీని తెరకెక్కించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇ‍ప్పటి వరకు రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 
     

  • బిచ్చగాడు మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో అలరించేందుకు వస్తోంది. వంద దేవుళ్లు పేరుతో మరోసారి అమ్మ ప్రేమ, సెంటిమెంట్‌ చూపించేందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. 

    ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మధ్య తరగతి కుటుంలాల జీవితం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిచ్చగాడులానే అమ్మ సెంటిమెంట్‌ ఉండనుందని టీజర్‌లోనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు.

  • తమిళ స్టార్ విజయ్‌ సేతుపతి హీరోగా వస్తోన్న చిత్రం స్లమ్‌ డాగ్.. 33 టంపుల్ రోడ్. ఈ మూవీకి టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.

    'ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి.. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీ, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక సామాన్యుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో ఈ కథ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. టీజర్‌లో పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త, టబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌, బ్లాక్‌బస్టర్‌ మూవీ దురంధర్‌. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది రివెంజ్‌ సైతం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

    తాజాగా ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్‌ ఇంటర్వ్యుకు హాజరైన మాధవన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. ఎంతోమంది అందమైన హీరోయిన్లతో తాను పనిచేశానని వెల్లడించారు. అయితే ఎప్పుడు తాను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదన్నారు. ఈ విషయంలో తన వైఫ్‌ను ఎప్పుడు మోసం చేయలేదని తెలిపారు. ఎందుకంటే తన జీవితంలో వైవాహిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తానని మాధవన్ వెల్లడించారు.

    కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే తనకిష్టమని ఆర్ మాధవన్ తెలిపారు. ఇదంతా తాను పాత తరం నుంచే నేర్చుకున్నానని.. సతీమణితో విధేయతగా ఉండడం మా బ్లడ్‌లోనే ఉందన్నారు. షూటింగ్‌ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తినన సరదాగా మాట్లాడారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్‌, బ్యాంక్‌ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని పంచుకున్నారు. కాగా..  1993లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్‌.. 1999లో సరితను వివాహం చేసుకున్నారు.

  • రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది.

    తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్‌ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు. 

    గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ‍ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు. 
     

Andhra Pradesh

  • విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక అధికారులు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.

    మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.

    కాగా, ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. బాధితులకు న్యాయం చయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అంటున్నారు. అలాగే, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    మరోవైపు, క్షతగాత్రుల్లో ఆరుగురిని గుర్తించారు. వారి పేర్లు రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజు.

    మృతుల వివరాలు

    ఉద్యోగులు
    గొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)
    జి.వి. అప్పారావు
    ఎం. కృష్ణ నాగు
    కె. ప్రభాకర్ (జనరల్ ఫోర్‌మ్యాన్)
    గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్‌చార్జ్)

    కాంట్రాక్ట్ కార్మికులు
    రమణ
    త్రినాథ్
    ఎన్. అప్పల రాజు
     

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్‌లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్‌ లీకేజ్‌, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్‌ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.

    తాజాగా విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 

    2012లో ఘోర ప్రమాదం.. 
    అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్‌ ప్టాంట్‌లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్‌ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 

    ఆక్సిజన్ పైప్‌లైన్‌లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్‌లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న  పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. 

    మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం  మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .

    గతేడాది స్టీల్‌ మెల్టింగ్‌ మిషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. 

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..
    మే 22, 2012: సింటర్ ప్లాంట్‌లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.

    మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

    ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టం

    ఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్‌ఎంఎస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.

    ఏప్రిల్ 14, 2011:  ఎస్‌ఎంఎస్‌లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. 
    ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టం

    మే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్‌కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయం

    జూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్‌లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం

  • విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్‌ జగన్‌.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.  

    ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు.  ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.  బాధితులకు  విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు అండగా ఉండాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.  క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

    కాగా, ఈ దుర్ఘటనలో  9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్ర  సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్‌ -2లో హాట్‌మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..

    విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

  • సాక్షి, గన్నవరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని సోమవారం గన్నవరం విమానాశ్రయంలో నిడమనూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు. రైల్వే బ్రిడ్జి కోసం ఎంతో కాలంగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి ఎదుట వాపోయారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంతో కాలంగా అక్కడ నివాసం ఉంటున్న 100 కుటుంబాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

    అయితే బాధితుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్యపై వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలని అవసరమైతే వైఎస్సార్సీపీ తరపున  బాధితులకు అండగా కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఫ్లై ఓవర్ బాధితుల సమస్యలను కృష్ణాజిల్లా పార్టీ అధికార ప్రతినిధి శీలం రంగారావు, వైఎస్‌ జగన్‌కు వివరించారు.

International

  • టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్‌ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.

    ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు.  దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు.  

    కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్‌ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్‌, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

  • టెల్‌ అవీవ్‌: పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. భారతీయులు ఇరాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశం విడిచి వెళ్లాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాయం సూచించింది.

    గత 24 గంటల్లో పలు నగరాల్లో సైనిక చర్యలు, వ్యూహాత్మక కేంద్రాలపై వైమానిక దాడులు, భారీ క్షిపణి దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. “ఆ ప్రాంతంలో తాజా పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌కు ప్రయాణించవద్దన్న మా గత సూచనను మరోసారి తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా వెంటనే బయటకు రావాలి” అని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

    ఇక ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం 100వ రోజుకు చేరుకున్న వేళ, సోమవారం రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే సున్నితంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రాంతీయ స్థాయిలో మళ్లీ పూర్తి స్థాయి యుద్ధం చెలరేగే భయం నెలకొంది.

    ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ బలగాలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి. ఎర్ర సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక సముద్ర మార్గం. తాజా సైనిక చర్యల్లో ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్‌ సముదాయంపై దాడి జరగగా, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ మాత్రం రెండు ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

    ఇరాన్‌ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌ను కోరిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్‌ బీరూట్‌ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేపట్టింది. అనంతరం సోమవారం ఇరు పక్షాలు మళ్లీ పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    ఇజ్రాయెల్‌లోనూ.. 
    టెల్‌ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్టులో.. భారతీయులు ఇజ్రాయెల్‌ అధికారులు, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

    “ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లోని భారతీయులు అన్ని వేళలా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్‌ అధికారులు, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలు, సూచనలను కచ్చితంగా అనుసరించాలి” అని తెలిపింది.

    అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని, హోమ్‌ ఫ్రంట్‌ కమాండ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న భద్రతా సూచనలను పరిశీలించాలని రాయబార కార్యాలయం సూచించింది.

    భారతీయులు తమ నివాసాలు, కార్యాలయాల సమీపంలోని ఆశ్రయ కేంద్రాల గురించి తెలుసుకుని, వాటికి దగ్గరగా ఉండాలని తెలిపింది. తమ నివాసం లేదా ఉద్యోగ ప్రాంతం వద్ద ఉన్న ఆశ్రయ ప్రదేశాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించింది.

    తదుపరి సమాచారం వచ్చే వరకు ఇజ్రాయెల్‌లో అనవసర ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించింది. స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని భారతీయులకు సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయాన్ని 24 గంటల సహాయ కేంద్రం ద్వారా సంప్రదించాలని తెలిపింది.

Bhavita

  • న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌లో కొత్తగా చర్చనీయాంశంగా మారిన "ఫుడ్ క్రైమ్"పై కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ తనదైన శైలిలో స్పందించి నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. బెంగళూరుకు చెందిన యశ్ అనే ప్రొడక్ట్ మేనేజర్ ఇడ్లీలను పిజా ముక్కల్లా త్రిభుజాకారంలో కట్ చేసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి శ‌శిథ‌రూర్ త‌న‌దైన శైలిలో 'ఇడ్లీని పిజా ముక్కల్లా కట్ చేయడం ఏంట్రా బాబూ' అన్న‌ట్టుగా స్పందించారు.

    "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళ్లి డేటాను పార్టిషన్ చేయాలని ప్రయత్నిస్తే ఇదే జరుగుతుంది. దీనిని 'ఇడ్లీ' అంటారు, 'ఇడ్-స్లైస్' కాదు. ఇటాలియన్లు దాన్ని పిజాగా పొరబడితే తప్ప ఎవరూ ఇడ్లీని ఇలా తినరు. అయితే పిజాపై సాంబార్ పోయాలని మాత్రం ప్రయత్నించకండి" అంటూ తనదైన హాస్య శైలిలో ట్వీట్ చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఇడ్లీ సంప్రదాయాల పరిరక్షకుడిగా శశి థరూర్ మరోసారి గుర్తింపు పొందారు.

    థరూర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజ‌నులు కూడా స‌ర‌దా కామెంట్లు పెట్టారు. కొందరు నెటిజన్లు ఇడ్లీలను "యాక్షనబుల్ యూనిట్స్"గా విభజించారని చమత్కరించగా, మరికొందరు యశ్ బ్రేక్‌ఫాస్ట్‌కే ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ సూత్రాలను వర్తింపజేశాడని, అందులో సెగ్మెంటేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్, చట్నీ యాక్సెసిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. సౌకర్యం కోసం అలా చేసి ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ, చాలామంది నెటిజన్లు మాత్రం దీనిని ఇడ్లీపై జరిగిన "కార్పొరేట్ ప్రయోగం"గా అభివర్ణించారు.

    చ‌ద‌వండి: బొంగరపు ఆట నేర్పే జీవిత‌ సత్యాలు!

    ఇటీవల కూడా "చాయ్‌తో ఇడ్లీ" అనే విచిత్రమైన ఆహార కలయిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో థరూర్ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. దక్షిణ భారతీయులను ఆశ్చర్యానికి గురిచేసిన ఆ కలయికపై కూడా త‌న‌దైన స్టైయిల్లో స్పందించారు. చాయ్ కప్పులోనే ఉండాలి, ఇడ్లీ ప్లేట్‌లోనే ఉండాలి అంటూ సున్నితంగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇడ్లీపై జరుగుతున్న ఈ వినూత్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నప్పటికీ, సంప్రదాయ ఆహారాల విషయంలో ప్రజల భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో మరోసారి స్పష్టమైంది.

Telangana

  • హైదరాబాద్: ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే అంతర్-రాష్ట్ర చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కింద పనిచేసే 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ వైద్యుల బృందం ఉమ్మడిగా దాడి చేసి రట్టు చేశాయి.

    నమ్మకమైన సమాచారం మేరకు సోమవారం(జూన్‌ 8వ తేదీ) తెల్లవారుజామున ఉమ్మడి బృందాలు అంబర్‌పేట్, కుల్సుంపురా, అత్తాపూర్ మరియు రాజేంద్రనగర్ పరిధిలోని చికెన్ వ్యర్థాల రవాణా గోదాములపై ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. 

    ఈ ఆపరేషన్‌లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 7 నాలుగు చక్రాల రవాణా వాహనాలను పోలీసులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న సుమారు 90 టన్నుల పచ్చి చికెన్ వ్యర్థాలను (Poultry Waste) గుర్తించి సీజ్ చేశారు.

    పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్వాహకులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న వివిధ చికెన్ షాపుల నుండి ఈ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను చెంగిచెర్లలోని రెండరింగ్ పాయింట్‌కు తరలించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా అనుమతులు లేకుండా, వాణిజ్య చేపల చెరువుల్లో మేతగా ఉపయోగించడం కోసం వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం, ఏలూరు, భీమడోలు, ఉండి (పశ్చిమ గోదావరి జిల్లా) ప్రాంతాలకు, అలాగే నల్గొండలోని మాల్ టౌన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న సుమారు 90 టన్నుల చికెన్ వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో నిర్దేశిత నిబంధనల ప్రకారం సురక్షితంగా పారదోలారు (

    హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సుదీర్ఘ ఆపరేషన్ జరిగింది. హెచ్-ఫాస్ట్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్, ఎమ్. అంజయ్యలతో పాటు సబ్-ఇన్‌స్పెక్టర్లు, హెచ్-ఫాస్ట్ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ వెటర్నరీ వైద్యులు ఈ దాడులలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.

    ప్రజలకు,వ్యాపారులకు ముఖ్య హెచ్చరిక
    పచ్చి చికెన్ వ్యర్థాలను సేకరించడం, నిల్వ చేయడం మరియు వాణిజ్య చేపల చెరువుల్లో వాటిని ఆహారంగా వేయడం పూర్తిగా నిషేధించబడింది. ఇటువంటి అత్యంత అపరిశుభ్రమైన పద్ధతుల వల్ల ఆహార గొలుసు (Food Chain) లోకి ప్రమాదకరమైన బయోలాజికల్ బ్యాక్టీరియా/విషపదార్థాలు ప్రవేశిస్తాయి. ఈ వ్యర్థాలను తిని పెరిగిన చేపలను తినడం వల్ల మనుషులకు క్యాన్సర్ (Carcinogenic) వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యానికి అత్యంత ప్రమాదకరం.

    అందుచేత చికెన్ వ్యాపారులు, ప్రజలు ఎవరైనా ఇటువంటి అక్రమ నిల్వలు, వ్యర్థాల తరలింపులను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి ప్రజారోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కోరుతున్నారు.

Politics

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని 20 మంది టీఎంసీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు 20 మంది టీఎంసీ ఎంపీలు లేఖ రాయనున్నారు. కకోలీ ఘోష్‌ను తమ నాయకురాలిగా టీఎంసీ రెబల్‌ ఎంపీలు ఎన్నుకున్నారు. రెబల్‌ ఎంపీలు అందరూ సీఎం సువేందు అధికారి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. 

    మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న వేళే ఆమెకు తమ పార్టీ నుంచి ఇబ్బందులు మరింత పెరగడం గమనార్హం. విప్ పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీపై అసంతృప్తిగా ఉన్న కాకోలి ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ప్రకారం తమ “భవిష్యత్‌ రాజకీయ దిశ ఎన్‌డీఏతో అనుసంధానమై ఉండాలి” అని నమ్ముతున్నామని చెప్పారు.

    తనతో పాటు దాదాపు 20 మంది తృణమూల్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి, ఎన్‌డీఏలో భాగం కావాలన్న తమ కోరికను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని ఘోష్ దస్తిదార్ ఈరోజు విలేకరులతో చెప్పారు.

    తిరుగుబాటు తృణమూల్ ఎంపీ షర్మిల సర్కార్‌ మాట్లాడుతూ, “మేము 20 మంది ఎంపీలతో వేరే కూటమిని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వబోతున్నాం. కాకోలి ఘోష్ దస్తిదార్ మా ప్రధాన విప్, శతాబ్ది రాయ్ మా ఉప నాయకురాలు” అన్నారు.

    మమతాకు బిగ్ షాక్.. TMCపై సంచలన వ్యాఖ్యలు

    పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలో 58 మంది ఎమ్మెల్యేలు ఒక కూటమిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో శివసేన అనుసరించిన విధానంలోనే తమది “నిజమైన” తృణమూల్ అని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చటర్జీని పార్టీ ఎంపిక చేయడమే వారి అసంతృప్తికి కారణం.