Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత సతీష్ కిలారు ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

    రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఓటిటి మార్కెట్ డౌన్ కాకముందే డిజిటల్ హక్కుల డీల్‌ ఫినిష్ చేసుకోవడం నిర్మాతల అదృష్టమనే చెప్పాలి. ఆ రోజుల్లో దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టి పెద్ది(Peddi) చిత్రాన్ని కోనుగోలు చేసిందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌.

    ఆడియో హక్కులు మరో 18 కోట్ల మేరకు వచ్చాయి. శాటిలైట్ హక్కులు ఇంకా ఫైనల్ కాలేదు. కానీ మంచి మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను నేరుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అందువల్ల హిందీ డబ్బింగ్ అవసరం లేదు. కానీ హిందీ శాటిలైట్ హక్కులు వేరుగా ఉంటాయి.  

    నాన్-థియేట్రికల్ ఆదాయం మొత్తం కలిపి 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'పెద్ది' విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే చెప్పాలి.

  • టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండ- రష్మిక పెళ్లిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 26న వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారని వెడ్డింగ్ కార్డ్ నెట్టింట తెగ వైరలైంది. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ టీమ్‌ స్పందించింది. వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    'విజయ్‌- రష్మిక  పెళ్లి గురించి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పెళ్లి, రిసెప్షన్‌ వేదిక వివరాలను వెల్లడిస్తున్నారు. ఇలాంటి వాటితో అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. వీరి పెళ్లికి  టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఇలాంటి వేదికల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం సరైంది కాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్‌ నెంబర్‌ వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేస్తే.. అది కూడా పోస్ట్ చేశారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దని' విజయ్‌ టీమ్‌ పేర్కొంది.

     

    • వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్‌లో సమంత హోయలు..
    • హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్‌ లుక్..
    • సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..
    • పింక్‌ డ్రెస్‌లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..
    • పట్టుశారీలో మరింత అందంగా బిగ్‌బాస్ సోనియా...
    • ఎల్లో చీరలో కాయాదు లోహర్‌ బ్యూటీపుల్ లుక్స్..

     

     

     

     

     

     

     

     

  • లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి. ఈ మూవీకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే సతీ లీలావతి మూవీ క్రేజీ లవ్ సాంగ్ విడుదలైంది.

    రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ నుంచి మధురం అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. కార్తీక్, చారులత మణి ఆలపించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట ఆడియన్స్‌ను తెగ అలరిస్తోంది. కాగా.. ఈ సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, తాగుబోతు రమేష్, జోషి కీలక పాత్రల్లో నటించారు. 
     

  • మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ సినిమా కోసం ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది.  ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది.

    తాజాగా ప్రియాంక చోప్రా వారణాసి మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను నటించిన ది బ్లఫ్‌ మూవీ ప్రీమియర్‌ షోకు హాజరైన ప్రియాంక ఈ సినిమా గురించి మాట్లాడింది. ఎస్ఎస్ రాజమౌళి సార్ ఇండియాలోనే బెస్ట్‌ డైరెక్టర్ అని కొనియాడింది. ఈ మూవీ తన కెరీర్‌ నిర్ణయించే సినిమా అవుతుందని ప్రియాంక తెలిపింది.

    కాగా.. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

  • హీరోయిన్లు కేవలం హీరోతో జోడీ కట్టడమే కాదు కొన్నిసార్లు అదే హీరోకు తల్లిగా, కూతురిగా కూడా నటించినవాళ్లూ ఉన్నారు. అలా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి ఓ స్టార్‌ హీరోయిన్‌ తల్లిగా, కూతురిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల తార మీనా.

    స్టార్‌ హీరోయిన్‌గా
    13 ఏళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది మీనా. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టిన మీనా మలయాళ స్టార్‌ మమ్ముట్టికి మాత్రం భార్యగా, కూతురిగా, తల్లిగా నటించింది.

    మమ్ముట్టికి జోడీగా..
    ఒరు కొచ్చుకథ ఆరుం పరయత కథ మూవీలో మమ్ముట్టి కూతురిగా నటించింది. 2001లో వచ్చిన రాక్షస రాజవు మూవీలో మమ్ముట్టి ప్రేయసిగా కనిపించింది. ఆ తర్వాత కరుత పక్షికల్‌, కద పరయుంబల్‌ సినిమాల్లోనూ మమ్ముట్టితో కలిసి నటించింది. 2014లో మమ్ముట్టి ద్విపాత్రాభినయం చేసిన మూవీ బాల్యకాలసఖి. ఇందులో మమ్ముట్టి తల్లిగా, భార్యగా మీనా యాక్ట్‌ చేసింది. 

    చదవండి: జీవితంలో ఒక్క పుస్తకం చదవలేదు: స్టార్‌ హీరో

  • ఆపరేషన్‌ సిందూర్‌పై మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్‌ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఫిక్సయింది. తాజాగా మరో మూవీ సైతం రానుందని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ ఫేమ్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్‌లో టాక్. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

    అయితే తనపై వస్తున్న ఈ రూమర్స్‌పై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఆపరేషన్ సిందూర్ ఆధారంగా రూపొందిస్తారని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు.  ప్రస్తుతం తాను అతిపెద్ద జాతీయవాద ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ‍అని..  చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు వివేక్ నిరాకరించారు.

    తాజా న్యూస్ ప్రకారం టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి వివేక్ అగ్నిహోత్రి 'ఆపరేషన్ సిందూర్' తెరకెక్కించున్నారని వార్తలొచ్చాయి.  ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తారని  టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. గతేడాది అగ్నిహోత్రి  ది బెంగాల్ ఫైల్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

    మరోవైపు ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దర్శకుడు ఉత్తమ్‌ నితిన్‌ సినిమాని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కాగా.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్ పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన ఏప్రిల్ 22, 2025న జరిగింది.

     

  • మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్‌ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు.  ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్‌ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్‌కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

    ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. 

  • భార్య పుస్తకాల రచయిత్రి, కానీ తాను మాత్రం ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా చదవలేదంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌. ప్రస్తుతం ఈయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో "వీల్‌ ఆఫ్‌ ఫార్చ్యూన్‌". తాజాగా ఈ షో ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయం చెప్పాడు అక్షయ్‌. నా భార్య ట్వింకిల్‌ ఖన్నా రచయిత్రి. నాకు తెలిసి తను రోజుకొక పుస్తకం అయినా చదివేస్తుంది.

    పుస్తకం చదివిన పాపాన పోలేదు
    నేను మాత్రం ఇంతవరకు జీవితంలో ఒక్క పుస్తకం కూడా చదవలేదు. కాకపోతే అందరి ముఖాల్ని ఇట్టే చదివేయగలను. మనుషుల్ని చదవడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌ ప్రస్తతం భూత్‌ బంగ్లా అనే హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. అలాగే వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ అనే మరో ప్రాజెక్ట్‌ అతడి చేతిలో ఉంది.

    సినిమా
    అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా విషయానికి వస్తే.. బర్సాత్‌, జబ్‌ ప్యార్‌ కిస్సే హోతా హై, బాద్‌షా వంటి పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె పుస్తక రచయిత్రిగా మారింది. మిసెస్‌ ఫన్నీబోన్స్‌, పైజామాస్‌ ఆర్‌ పర్‌గివింగ్‌, వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌ వంటి ఎన్నో పుస్తకాలు రాసింది. ఇటీవల 'టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌ 'అనే షోకి సహ వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది.

    చదవండి: రెండుసార్లు గుండెపోటు, వీల్‌చైర్‌కే పరిమితమయ్యా..: అనురాగ్‌ కశ్యప్‌

  • టాలీవుడ్‌లో  షూటింగ్స్ సందడి మళ్లీ పెరిగింది. సంక్రాంతి సెలవులు, ఇతర విరామాల తర్వాత స్టార్ హీరోలందరూ మేకప్ వేసుకుని లొకేషన్లలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఏ హీరో ఎక్కడ, ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారో ఓ లుక్కేద్దాం.

    📽️ ప్రభాస్ - ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియడ్ వార్ డ్రామా ఫౌజీ. ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. ఇక్కడ భారీ సెట్లు వేసి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    📽️ రామ్ చరణ్ - పెద్ది: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం పెద్ది. ఈ సినిమా షూటింగ్  సోమవారం వరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్‌ నిన్నటి పూర్తయిపోయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ కానుంది.

    📽️ మహేష్ బాబు - వారణాసి: రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ షెడ్యూల్ ప్రస్తుతం గండిపేట పరిసరాల్లో జరుగుతోంది.

    📽️ ఎన్టీఆర్ - డ్రాగన్‌: తారక్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ డ్రాగన్.. ప్రస్తుతం జోర్డాన్ ఎడారిలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది.

    📽️ అల్లు అర్జున్ - AA22:  అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ముంబైలో మకాం వేశారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఉండబోతోంది.

    📽️ రవితేజ - ఇరుముడి: శివ నిర్వాణ డైరెక్షన్‌లో మాస్ రాజా నటిస్తున్న ఇరుముడి షూటింగ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని సీలేరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది.

    📽️ విజయ్ దేవరకొండ - రణబాలి: రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్‌హీరోగా నటిస్తున్న రణబాలి మూవీ షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది.

    📽️ నాని - ప్యారడైజ్: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ప్యారడైజ్ షూటింగ్ ముచ్చింతల్ (హెలో నేటివ్ స్టూడియోస్)లో వేసిన ప్రత్యేక సెట్స్‌లో జరుగుతోంది.

    📽️ వెంకటేష్ - ఆదర్శకుటుంబం: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) అనే సినిమా తెరకెక్కుతుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో శరవేగంగా సాగుతోంది.

    📽️ గోపీచంద్ - సంకల్ప రెడ్డి: వీరి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అజీజ్ నగర్ సమీపంలో జరుగుతోంది.

    📽️ కిరణ్ అబ్బవరం - చెన్నై లవ్ స్టోరీ: ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాండిచ్చేరిలో తన సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.
     

  • శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా విష్ణు విన్యాసం మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విష్ణు.. నీకు తెలిసిన అబ్బాయిల్లో ఎవరినైనా ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? అనే డైలాగ్‌ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధన్ సంగీతమందించారు.
     

  • వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజు(ఫిబ్రవరి 18) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. పాన్-ఇండియా రేంజ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ, ఇప్పుడు ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    గతంలో అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే హిట్ జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ఫీచర్ ఫిల్మ్‌పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. నేషనల్ లెవల్‌లో రుస్తుం, ప్యాడ్ మ్యాన్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ మరియు ఎస్ కే గీ (Ess Kay Gee) ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
     

  • బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ 2023లోనే రాసుకున్న కథ "కెనడీ". షూటింగ్‌ పూర్తయి చాలాకాలం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్‌ కశ్యప్‌ తను కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నాడు.

    2009 నుంచి..
    అతడు మాట్లాడుతూ.. మాగ్జిమమ్‌ సిటీ ప్రాజెక్ట్‌ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్‌ కోసం చాలా ఖర్చుపెట్టాం. 2009 నుంచి నా ధ్యాసంతా ఆ సినిమాపైనే! ఈ కథను నెట్‌ఫ్లిక్స్‌ చదవకుండానే ఓకే చెప్పేసింది. మీరు దేనికి ఓకే చెప్పారో ఒకసారి చూసుకోండి అంటే ఒక్కరు తప్ప ఎవరూ స్క్రిప్ట్‌ చదవలేదు.

    పక్కన పడేసిన నెట్‌ఫ్లిక్స్‌
    ఏడాదిన్నర కాలంలో నేను 900 పేజీలు రాశాను. నా స్క్రిప్ట్‌ నచ్చకపోయుంటే నెట్‌ఫ్లిక్స్‌ ముందే చెప్పొచ్చుగా! సైలెంట్‌గా ఉండిపోయింది. తర్వాత సడన్‌గా తమ పాలసీలో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ పలు వెబ్‌ సిరీస్‌, సినిమాలను రద్దు చేసింది. అందులో నా ప్రాజెక్ట్‌ ఒకటి. అయితే దానికి పరిహారంగా వేరే స్క్రిప్ట్‌ పంపించి వాటిని డైరెక్ట్‌ చేయమని అడిగింది. అవి యావరేజ్‌గా ఉన్నాయని, నాకు కొంచెం సమయం ఇవ్వండని అడిగాను. 

    రెండుసార్లు గుండెపోటు
    వాళ్లు మాత్రం మా దగ్గర 4 నెలలపాటు యాక్టర్స్‌ డేట్స్‌ ఖాళీగా ఉన్నాయని ఒత్తిడి చేశారు. నాకు కొంచెం సమయం ఇస్తే తప్ప వాటిని చేయలేనని చెప్పాను. నేను రాసిన ఒక షో వారికి బాగా నచ్చింది. కానీ దాన్ని మనీ హీస్ట్‌ ఇండియన్‌ వర్షన్‌గా మార్చి రాయమన్నారు. వాళ్ల పద్ధతి నాకసలు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఎక్కువ ఒత్తిడి, బాధ వల్ల రెండుసార్లు గుండెపోటు వచ్చింది. 

    ఆస్తమా
    దాంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడాను, కరోనా వ్యాక్సిన్‌ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవి నా శరీరంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించాయి. ఆస్తమా వచ్చింది. దానికోసం స్టెరాయిడ్స్‌ వాడాను. ఎక్కువ డోసు మందులు వాడేసరికి నాకు డ్రగ్స్‌ వాడినట్లే అనిపించింది. తాగడం మొదలుపెట్టాను. జంక్‌ఫుడ్‌ ఆర్డర్‌ పెడుతూ నచ్చినట్లు తిన్నాను. ఎనిమిది నెలల్లోనే 35 కిలోలు పెరిగాను. 

    వీల్‌చైర్‌కే పరిమితం
    నన్ను చూసి నా కూతురు భయపడిపోయింది. రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపింది. అలా మూడుసార్లు రిహాబిలిటేషన్‌కు వెళ్లాను. ఒకసారి అక్కడ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నా కుడి కాలుకి దెబ్బ తగిలింది. రక్తం పలుచబడే మందులు వాడుతున్నందున సర్జరీ చేయడం కుదరదన్నారు. కొన్ని నెలలపాటు వీల్‌చైర్‌లో ఉన్నాను. నెమ్మదిగా కోలుకుని ఇప్పుడిలా ఉన్నాను అని అనురాగ్‌ కశ్యప్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: మగవాళ్ల మందు పార్టీకి ఒంటరిగా రమ్మని పిలుపు: నటి

  • టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేకుండా పోయిందన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని... అందరూ తీసుకునేవాళ్లేనని అన్నారు.  ఈ రోజుల్లో తీసుకునేవాళ్లే.. ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్‌లో సినిమా ఇండస్ట్రీ ఉందని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్న దిల్‌ రాజు మాట్లాడారు.

    దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు. రజినీకాంత్‌ చెప్పినట్లు నిర్మాత అంటే ఇచ్చేవాడు.. అందరూ తీసుకునేవాళ్లే. అప్పట్లో అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి నిర్మాతలు ఉన్నారు. నా దిల్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటే రైట్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పా'  అని అన్నారు. 

  • తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో రిలీజైన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అక్కనేని వెంకట్, అక్కినేని నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఐకానిక్ మూవీలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది..

    నేటితో ఈ మూవీ రిలీజై నేటికి 45 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌  ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'ప్రేమకు నిర్వచనం… త్యాగానికి ప్రతీక… సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.  ఈ చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ మూవీ 45 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామని తెలిపింది. ఈ సినిమా రికార్డులు, భావోద్వేగాలు, ప్రభావం నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని ట్వీట్ చేసింది.  లక్షలాది హృదయాల్లో ఏఎన్నార్‌ ఎప్పటికీ జీవించే ఉంటారని ట్వీట్‌లో వెల్లడించింది.

  • ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న నటి వైష్ణవి మెక్‌డొనాల్డ్‌.. తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పేసింది. గత కొంతకాలంగా బుల్లితెరపైనే సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించింది. వైష్ణవి మాట్లాడుతూ.. ఒక పెద్ద సినిమాలో ప్రధాన పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారు. పోస్టర్స్‌, బ్యానర్స్‌ కూడా రెడీ అయ్యాయి. 

    అందరూ మగవాళ్లే..
    కానీ తర్వాత మాత్రం మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కారణమేంటంటే.. నేను ఎక్కడికి వెళ్లిన అమ్మను వెంట తీసుకునే వెళ్తాను. కానీ ఓ సాయంత్ర కాలం మీటింగ్‌ కోసం ఒంటరిగా రమ్మన్నారు. ఆ పార్టీలో అందరూ మగవాళ్లే ఉంటారని, కలిసి మందు తాగొచ్చని చెప్పారు. నాకది నచ్చలేదు. అమ్మ ఎల్లప్పుడూ నా వెంటే ఉండటం వాళ్లకూ నచ్చలేదు. 

    హీరోకి నాపై ఆసక్తి
    షూటింగ్‌ కోసం నేను స్విట్జర్లాండ్‌ వెళ్లాల్సి ఉంటుందని ఆ నిర్మాణ సంస్థ నాకు పాస్‌పోర్ట్‌ తీసిపెట్టింది. కానీ మా అమ్మకు మాత్రం పాస్‌పోర్ట్‌ రెడీ చేయలేదు. పైగా హీరోకు నాపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. అతడి ప్రపోజల్‌ రిజక్ట్‌ చేయడంతో హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి నన్ను సినిమా నుంచి తీసేశారు. అది చాలా పెద్ద సినిమా. నేను అందరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. నా పని నేను చేసుకుంటూ పోయేదాన్ని. 

    సినిమా నుంచి సీరియల్‌
    ఆచితూచి పాత్రల్ని ఎంపిక చేసుకునేదాన్ని. దాంతో రానురానూ ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ఆ సమయంలోనే శక్తిమాన్‌ సీరియల్‌కు ఓకే చెప్పాను. ఇది నా కెరీర్‌కు ఎంతో తోడ్పడింది అని చెప్పుకొచ్చింది. హిందీలో బాబుల్‌, సాంచా, మమ్మీ పంజాబీ, సూపర్‌ నాని వంటి పలు చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై శక్తిమాన్‌, మే ఢిల్లీ హూ, కసౌటీ జిందగీ కే, మిలే జబ్‌ హమ్‌ తుమ్‌ వంటి పలు సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

    చదవండి: నా విజయానికి నా ప్రతిభ కారణం కాదు: చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

Sports

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా భారత్‌, నెదర్లాండ్స్‌ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

    నెదర్లాండ్స్‌ బ్యాట్స్‌మెన్‌లలో బాస్ డి లీడ్ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జాచ్ లయన్-కాచెట్ 26 పరుగులు, నోహ్ క్రోస్ 25 పరుగులు, ఓపెనర్‌ మైఖేల్ లెవిట్ 24 పరుగులు, కోలిన్ అకెర్మాన్ 23 పరుగులు చేశారు. 

    భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3 వికెట్లు తీయగా, శివమ్ దూబే 2 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తలో వికెట్టు తీశారు. 66 పరుగులు చేసిన శివమ్‌ దూబేకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

    మొదట ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.  శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్‌ ఓ సిక్సర్‌ బాది అజేయంగా నిలిచాడు.

    ఈ విజయంతో భారత్‌ గ్రూప్‌ టాపర్‌గా సూపర్‌ 8లో ప్రవేశించింది. సూపర్‌ 8లో భాగంగా ఫిబ్రవరి 22 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ధక్షిణ ఆఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

    శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సిక్సర్లతో విరుచుకుపడి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్సర్లు) కూడా ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖరి ఓవర్‌లో 3 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్‌ ఓ సిక్సర్‌ బాది అజేయంగా నిలిచాడు.

    అంతకుముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్‌), తిలక్‌ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) నిదానంగా ఆడి విసుగు తెప్పించారు.   వారికి ముందు ఇషాన్‌ కిషన్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, సిక్స్‌) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆర్యన్‌ దత్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    ఈ మెగా టోర్నీలో దారుణమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు.

    నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-56-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ఆర్యన్‌ దత్‌ (4-0-19-2) కెరీర్‌లోనే అత్యుత్తమ స్పెల్‌ వేశాడు. 

    బాస్‌ డి లీడ్‌ (4-0-28-0) పొదుపుగా బౌలింగ్‌ చేసి పర్వాలేదనిపించాడు. 19వ ఓవర్‌లో మాత్రమే 21 పరుగులిచ్చిన కైల్‌ క్లెయిన్‌ (4-0-38-1) అంతకుముందు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశాడు. కొలిన్‌ ఆకెర్‌మన్‌ (3-0-36-0), వాన్‌ డర్‌ మెర్వ్‌ (1-0-15-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

    కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ సూపర్‌-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌కు సైతం ఈ మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ఉపయోగం లేదు. ఈ జట్టు ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెత్త ఫామ్‌ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తానాడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్తాన్‌) డకౌట్లైన అభిషేక్‌.. ఇవాళ (ఫిబ్రవరి 18) పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఖాతా తెరవలేక హ్యాట్రిక్‌ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.

    ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అయిన అభిషేక్‌ తన తొలి టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడినా ఖాతా తెరవలేకపోవడం శోచనీయం. అభిషేక్‌కు చివరి 7 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఇది ఐదో డకౌట్‌ కావడం మరింత శోచనీయం.

    ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను జెర్సీ మార్పు కూడా కాపాడలేకపోయిం​ది. అభిషేక్‌ తన రెగ్యులర్‌ జెర్సీ కాకుండా సిరాజ్‌ వేసుకునే 73వ నంబర్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగినా ఖాతా తెరవలేకపోయాడు.

    తాజా డకౌట్‌ తర్వాత అభిషేక్‌ ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక డకౌట్లైన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ (2024) సరసన చేరాడు. సంజూ, అభిషేక్‌ ఇప్పుడు తలో ఐదు డకౌట్లతో ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ కష్టాల్లో ఉంది. పవర్‌ ప్లేలోనే (తొలి 6 ఓవర్లలో) ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (18) వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. 6 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 51-2గా ఉంది. తిలక్‌ వర్మ (26), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా కోల్పోయిన రెండు వికెట్లు స్పిన్నర్‌ ఆర్మన్‌ దత్‌కే దక్కాయి. అభిషేక్‌, ఇషాన్‌లను దత్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడం​ విశేషం.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో పాకిస్తాన్‌ ఎట్టకేలకు సూపర్‌-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్‌-8 బెర్త్‌ దక్కించు​కుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్‌ సూపర్‌-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లతో రాణించగా.. సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్‌ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

    నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ (4-0-33-0), రూబెన్‌ ట్రంపల్మెన్‌ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్‌ చేయగా.. జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్‌ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్‌ తారిఖ్‌ (3.3-1-16-4), షాదాబ్‌ ఖాన్‌ (4-0-19-3), మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ సల్మాన్‌ మీర్జా కూడా ఓ వికెట్‌ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లారెన్‌ స్టీన్‌కాంప్‌ (23), మిడిలార్డర్‌ బ్యాటర్‌ అలెగ్జాండర్‌ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ ఇవాళ (ఫిబ్రవరి 18) తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

    నామమాత్రపు ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ స్థానాల్లో అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తుది జట్టులోకి వచ్చారు. 

    మరోవైపు నెదర్లాండ్స్‌ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. ఫ్రెడ్‌ క్లాసెన్‌ స్థానంలో నోవా క్రాస్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చాడు. కాగా, ఈ మెగా టోర్నీలో భారత్‌ ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, సూపర్‌-8కు చేరగా.. నెదర్లాండ్స్‌ 3 మ్యాచ్‌ల్లో రెండిట ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    తుది జట్లు..
    నెదర్లాండ్స్: మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), జాచ్ లయన్-కాచెట్, నోహ్ క్రోస్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్

    భారత్: ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

  • భారత దేశవాలీ క్రికెట్‌లో ప్రస్తుతం స్మరణ్‌ రవిచంద్రన్‌ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్‌ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్‌ మిడిల్డార్‌ బ్యాటర్‌ అయిన స్మరణ్‌.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.

    13 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్‌ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్‌.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్‌ ఆయుశ్‌ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్‌ భీకర ఫామ్‌ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.

    ట్విన్‌ సెంచరీస్‌
    ప్రస్తుతం ఉత్తరాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్‌ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్‌ను కొనసాగించాడు. స్మరణ్‌ సహా దేవదత్‌ పడిక్కల్‌ (232), కేఎల్‌ రాహుల్‌ (141, 70 నాటౌట్‌) శివాలెత్తడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక బంపర్‌ విక్టరీ దిశగా సాగుతోంది.  

    మొత్తం 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు
    తాజా ప్రదర్శనతో స్మరణ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో 3 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్‌ చేశాడు. అతని కెరీర్‌ సగటు 72కు పైగా ఉండటం విశేషం.

    లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ తిరుగలేని మొనగాడే..!
    స్మరణ్‌ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం​ కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్‌ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 

    సెమీఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడిన స్మరణ్‌ 96.48 స్ట్రయిక్‌రేట్‌తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.

    పొట్టి ఫార్మాట్‌లోనూ పర్వాలేదు
    ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్‌ టీ20 ఫార్మాట్‌ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో స్మరణ్‌ 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 162.45 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

    బౌలింగ్‌లోనూ మెరిపిస్తాడు
    స్మరణ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసే స్మరణ్‌ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్‌ చేయగలడు. లోకల్‌ క్రికెట్‌లో అతను బౌలింగ్‌లోనూ ప్రూవ్‌ చేసుకున్నాడు.

    అనుకోకుండా వచ్చిన ఐపీఎల్‌ అవకాశం
    స్మరణ్‌కు ఐపీఎల్‌ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా గాయపడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్మరణ్‌కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్‌కు ఆ సీజన్‌లో అవకాశాలు దక్కలేదు. 

    స్మరణ్‌పై భారీ అంచనాలు ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ అతన్ని 2026 సీజన్‌కు కూడా రీటైన్‌ చేసుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్మరణ్‌కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్‌ పండితులు అంచనా వేస్తున్నారు.  
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. సూపర్‌-8కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58 బంతుల్లో 100 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 

    ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (22 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.​ మధ్యలో కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్‌ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

    ఈ మ్యాచ్‌లో నమీబియా బౌలర్లు తమ సామర్థ్యానికి మించి రాణించారు. వికెట్లు తీయలేకపోయినా, జోరుమీదున్న పాక్‌ బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెర్నాల్డ్‌ స్కోల్జ్‌ 4 ఓవర్లలో 33 పరుగులు, రూబెన్‌ ట్రంపల్మెన్‌ 4 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి పా​్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. 

    జాక్‌ బ్రస్సెల్‌ (4-0-48-2) పరుగులు కాస్త ఎక్కువగానే సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (3-0-25-1), జేజే స్మిట్‌ (3-0-28-0) పర్వాలేదనిపించారు. మైబుర్గ్‌ (2-0-27-0) ఒక్కడే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో నమీబియా బౌలర్లు కేవలం​ 6 ఎక్స్‌ట్రాలు మాత్రమే ఇవ్వడం విశేషం. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాక్‌ జట్టుపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ యూసఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను తొలిసారి ఓడించిన తర్వాత స్టార్లుగా చెప్పుకునే కొందరు పాక్‌ ఆటగాళ్లకు అహంకారం పెరిగిందని ఆయన అన్నాడు. 

    వారి అతి విశ్వాసమే పాక్‌ పతనానికి దారి తీసిందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయంతోనే కళ్లు నెత్తికెక్కితే పరిస్థితి ఇలానే ఉంటుందంటూ పరోక్షంగా బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదిని ఉద్దేశిస్తూ చురకలంటించాడు.

    ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితిపై యూసఫ్‌ స్పందిస్తూ.. 2021లో భారత్‌పై గెలిచిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు మేము ఎవరికీ తగ్గం అనే భావనలో మునిగిపోయారు. కోచ్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌లో గేమ్స్ ఆడటం వంటి నిర్లక్ష్యపు ప్రవర్తన అప్పటి నుంచి మొదలైంది. స్టార్లుగా చెప్పుకునే కొందరి అహంకారం వల్లే పాక్‌ క్రికెట్‌ నష్టపోతుందని అన్నాడు.

    యూసుఫ్ రాజీనామా వెనుక కారణం ఇదేనేమో..!
    యూసఫ్‌ 2025లో కేవలం మూడు నెలల పాటు పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ఆతర్వాత అనూహ్యంగా ఆ పదవి నుంచి వైదొలిగాడు. అప్పట్లో యూసఫ్‌ తన అనూహ్య రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు. తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే, జట్టులో స్టార్లుగా చెప్పుకునే కొందరి ప్రవర్తన అతనికి నచ్చలేదన్న విషయం బయటపడింది. ఇదే అతని ఆకస్మిక రాజీనామాకు కారణమై ఉండొచ్చనే భావన కలుగుతోంది.

    కాగా, టీమిండియా చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుపై ఆ దేశాని​కి చెందిన చాలామంది మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. షోయబ్‌ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిది వంటి వారైతే కొందరు పాక్‌ ఆటగాళ్లపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పాక్‌ జట్టు దుస్థితికి స్టార్లుగా చెప్పుకునే ఒకరిద్దరు ఆటగాళ్లే కారణమన్నది వారి అభిప్రాయం కూడా.  

    భారత్‌ చేతిలో వరుస పరాభవాల నేపథ్యంలో పాక్‌ అభిమానులు కూడా పాక్‌ జట్టుపై విసుగెత్తిపోయారు. ఇన్నాళ్లు వెనకేసుకొచ్చిన నోళ్లతో దుర్భాషలాడుతున్నారు. భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ జట్టుకు ఇంట కూడా మర్యాద లేకుండా పోయింది. పాక్‌ దుస్థితికి స్టార్‌ ఆటగాళ్లు కారణమని కొందరంటుంటే, మరికొందరేమో పాక్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ కారణమని ఆరోపిస్తున్నారు. నఖ్వీ పాక్‌ క్రికెట్‌ను సర్వనాశనం చేశాడన్న అభిప్రాయం చాలామంది పాక్‌ జాతీయుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

  • సీఎం కప్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి ,  క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ డాక్టర్ సోనిబాలా దేవి కలిసి ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వానం అందజేశారు.

    సీఎం కప్
    GAMES (Grievance And Monitoring for Excellence in Sports) పేరుతో ఏజెంటిక్ ఏఐ కాల్ సెంటర్ కార్యక్రమం మరియు ‘నిలమణి’ అనే మొబైల్ యాప్‌ను సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రి వి. శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ సోని బాలాదేవి లతో కలిసి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గ్రామీణ క్రీడలను బలోపేతం చేయడం మరియు గ్రామీణ స్థాయిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎంకప్‌ను నిర్వహించడం తెలంగాణ క్రీడాశాఖ యొక్క ప్రశంసనీయమైన ప్రయత్నమని అన్నారు. 

    యువత, విద్యార్థులు ఇతర అసామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండి క్రీడల్లో చురుకుగా పాల్గొనాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 4.6 లక్షల క్రీడాకారులు నమోదు చేసుకున్నారని, వారిలో 22,000 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

    ఇక పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు సమయానుకూల సమాచారం మరియు నవీకరణలు అందించేందుకు “సీఎం కప్ గేమ్స్”లో నిలమణి మొబైల్ యాప్‌ను ఏఐ ఆధారిత కాల్ సెంటర్‌తో అనుసంధానం చేసి 24/7 సమాచారం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

    12 జిల్లాల్లో 44 క్రీడా విభాగాలను కలిగి ఉన్న ఈ పోటీలు ఘన విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఈ క్రీడలు ఉత్తమ చాంపియన్లను తయారు చేస్తాయని ఆయన ఆశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, ఇతర గౌరవ అతిథులు పాల్గొన్నారు.
     

  • పాకిస్తాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మద్‌ బట్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

    అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్‌బెర్రా వెళ్లేందుకు పాక్‌ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.

    అనంతరం హోటల్‌కు వెళ్లిన తర్వాత పాక్‌ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్‌ బుకింగ్‌ లేకపోవడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్‌ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. ఆసీస్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.

    మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది
    ఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అహ్మద్‌ బట్‌ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్‌ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.

    మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్‌ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్‌ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?

    మాకు విదేశీ కోచ్‌ కావాలి
    మేము పది రోజుల పాటు చీప్‌ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.

    మాకు విదేశీ కోచ్‌ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్‌ హాకీ ఫెడరేషన్‌కు ప్రాటన్‌-ఇన్‌-చీఫ్‌గా ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఉంటారు.

    ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాము
    ఈ నేపథ్యంలో పీఎస్‌బీ డైరెక్టర్‌- జరనల్‌ నూర్‌ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. 

    కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.

    చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రొటీస్‌ జట్టు వరుసగా నాలుగో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయ జట్టుగా సూపర్‌-8లోకి ప్రవేశించింది. యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన తమ చివరి గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన సౌతాఫ్రికా యూఏఈని 122 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కార్బిన్‌ బాష్‌ (4-0-12-3), అన్రిచ్‌ నోర్జే (4-0-28-2), జార్జ్‌ లిండే (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో అలీషాన్‌ షరాఫు (45) టాప్‌ స్కోరర్‌గా కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిలో కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం 22, ఆర్యాంశ్‌ శర్మ 13, ముహమ్మద్‌ అర్ఫాన్‌ 11 పరుగులు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (36), ర్యాన్‌ రికెల్టన్‌ (30), కెప్టెన్‌ మార్క్రమ్‌ (28), డికాక్‌ (14), స్టబ్స్‌ (6 నాటౌట్‌), జేసన్‌ స్మిత్‌ (3 నాటౌట్‌) తలో చేయి వేసి ప్రొటీస్‌ను గెలిపించారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ, జవాదుల్లా, అర్ఫాన్‌, ఫరూఖ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో యూఏఈ పోరాటం ముగిసింది. ఈ జట్టు కెనడాపై మాత్రమే గెలిచి న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్ల చేతుల్లో ఓడింది.  

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది శ్రీలంక. సొంతగడ్డపై అటు టీమిండియా.. ఇటు శ్రీలంక జట్టు సత్తా చాటుతూ ఇప్పటికే సూపర్‌-8కు అర్హత సాధించాయి. గ్రూప్‌-ఎలో భాగంగా మూడింట మూడు గెలిచి భారత్‌.. గ్రూప్‌-బి నుంచి హ్యాట్రిక్‌ విజయాలతో శ్రీలంక ఆయా గ్రూపు టాపర్లుగా కొనసాగుతున్నాయి.

    దసున్‌ షనక సారథ్యంలో
    ఇక పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక.. కెప్టెన్‌గా తిరిగి వచ్చిన దసున్‌ షనక సారథ్యంలో అదరగొడుతోంది. తొలుత ఐర్లాండ్‌ను.. రెండో మ్యాచ్‌లో ఒమన్‌ను అలవోక​గా ఓడించింది లంక. చివరగా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి.. సూపర్‌-8 బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంది.

    లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేతో లంక తలపడనుంది. ఇరుజట్ల మధ్య గురువారం కొలంబోలో ఈ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక శిబిరంలో ఆందోళన నెలకొంది.

    మతీశ పతిరణకు గాయం
    స్టార్‌ పేసర్‌ మతీశ పతిరణ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా పతిరణకు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు కుంటుతూనే మైదానం వీడాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో.. అతడికి దాదాపు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.

    శ్రీలంక జర్నలిస్టు అందించిన వివరాల ప్రకారం.. పతిరణ గాయం వల్ల మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో బినుర ఫెర్నాండో లేదంటే దిల్షాన్‌ మధుషాంక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

    నువాన్‌ తుషార, మిలాన్‌ రత్ననాయకే రూపంలో మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాగా ఆసీస్‌తో మ్యాచ్‌లో పతిరణ కేవలం నాలుగు బంతులే బౌల్‌ చేసి మైదానం వీడాడు. కాగా ఇప్పటికే వనిందు హసరంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంక జట్టు
    పాతుమ్‌ నిస్సాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌ (వికెట్‌ కీపర్‌), పవన్‌ రత్ననాయకే, దసున్‌ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్‌, దుషాన్‌ హేమంత, దునిత్‌ వెల్లలగే, దుష్మంత చమీర. మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరణ, కమిల్‌ మిశారా, చరిత్‌ అసలంక, ప్రమోద్‌ మధుషాన్‌, జనిత్‌ లియనగే.

    చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Crime

  • బెంగళూరు: డిప్రెషన్‌. ఈ డిప్రెషన్‌లో తాను మరణిస్తే.. తన భార్య ఒంటరైపోతుందని, ఆమెను చూసుకునేవారు ఎవరూ ఉండరని భావించిన ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.   

    ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. మాజీ ఇస్రో ఉద్యోగి నాగేశ్వరరావు (65) తన భార్య సంధ్య శ్రీ (60)ను వారి నివాసంలో తువ్వాలతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

    అయితే సాధ్యం కాలేదు. ఘటన అనంతరం నాగేశ్వరరావు  తన స్నేహితుడికి జరిగిన విషయం చెప్పాడు.  అప్రమత్తమైన ఆ వ్యక్తి వెంటనే అవలహಳ್ಳಿ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంధ్య శ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

    ప్రాథమిక దర్యాప్తులో నాగేశ్వరరావు తన భార్యను తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. భార్య భవిష్యత్తుపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తేలింది. సంధ్య శ్రీ కూడా ఇస్రోలో పనిచేశారు. ఈ దంపతులకు అమెరికాలో స్థిరపడిన ఒక కుమార్తె ఉన్నారు. ఆమెకు ఈ ఘటన గురించి సమాచారం అందించబడింది. ప్రస్తుతం నాగేశ్వరరావుపై హత్య కేసు నమోదు చేసి, అతని మానసిక స్థితి, వైద్య చరిత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra Pradesh

  • సాక్షి, విశాఖ: ఏయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏయూలో మరోసారి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ.. ‘శాఖ’ నిర్వహించాయి. పోలీసుల సమక్షంలో శాఖ నిర్వహించడం వివాదానికి దారి తీసింది. అయితే, నాన్ బోర్డర్స్‌కు క్యాంపస్‌లోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ సర్కులర్ ఇచ్చారు. అయినప్పటికీ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్కులర్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ లెక్కచేయకుండా శాఖ నిర్వహించారు. 

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రేపు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడే అవకాశం ఉంది. 
     

  • సాక్షి,రాజమండ్రి: కూటమి ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.  

    నా ఇంటిపై దాడి చేశారు. నన్ను హింసించారు. నా భార్య,పిల్లల్ని తరిమారు. నా కార్లను ధ్వంసం చేశారు. నా ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారు.  ఐ డోంట్‌ కేర్‌. బాధితుణ్ని లోపల పెట్టారు. నిందితుణ్ని వదిలారు.  పార్టీలకు అతీతకంగా దాడిని ఖండించిన వారికి నా కృతజ్ఞతలు. దేవుడున్నాడు.. ధర్మమే గెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. 

    అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల

    మరోవైపు అంబటి రాంబాబు విడుదలపై వైఎస్సార్‌సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.  

    తప్పు చేయలేదు కాబట్టి అంబటి రాంబాబుకు ఆత్మవిశ్వాసం ఉంది. వైఎస్సార్‌సీపీ నేతలు అక్రమ కేసులను, దాడులను లెక్క చేయరు. వైఎస్‌ జగన్ నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటాం -జక్కంపూడి రాజా

    ప్రశ్నించినందుకు అంబటి ఇంటిపై దాడి చేసి అయనను జైల్లో పెట్టారు. కక్ష సాధించుకోవటానికే తనకు అధికారమిచ్చారని చంద్రబాబు అనుకుంటున్నారు. అంబటి రాంబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయలేకపోయారు. నా వైపు న్యాయం ఉంది వెనక్కి తగ్గేది లేదని అంబటి చెప్పారు. ఆయన కుటుంబాన్ని కూడా హింసించారు -వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి.. 

    వైఎస్సార్‌సీపీ  నేతలపై కక్ష సాధించే తప్ప ప్రజలకు ప్రభుత్వం మంచి చేయడం లేదు. అంబటి క్షమాపణ చెప్పినా ఇంటిని ముట్టడి చేసి దారుణంగా ధ్వంసం చేశారు. మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేశారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు లేవు..అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటున్నారు. ప్రజల్లో అంతా గమనిస్తున్నారు
    అధికార పార్టీ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గర పడింది. - తానేటి వనిత ,మాజీ హోంమంత్రి 
     

  • సాక్షి,తిరుపతి: టీటీడీని ఎవరు ప్రశ్నించలేదు.. టీడీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.  బుధవారం తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఇందాపూర్‌ డైయిరీ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.  

    నెయ్యి సరఫరాకి నందిని డెయిరీకి సింగిల్‌ టెండర్‌కే ఇచ్చారు. ఇందాపూర్‌ డెయిరీకి L3 టెండర్‌కే ఇచ్చారు. మదర్‌ డెయిరీ,ఇందాపూర్‌ డెయిరీ 130కోట్లకు టెండర్‌ దక్కించుకుంది. నిబంధనలు కఠిన తరం చేశామని టీటీడీ చెబుతోంది. 1500కిలోమీటర్ల నిబంధన 800కి కుదించారు.  

    మేం పెట్టిన నిబంధనలనే ఎక్స్‌పర్ట్‌ కమిటీ కూడా కొనసాగించింది. అయితే, నిబంధనలు తుంగలో తొక్కి 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.  గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. తడుముకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. 

    Bhumana: నెయ్యి సరఫరాలో గోల్ మాల్.. 130 కోట్ల టెండర్
  • సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు జనసేన ఇంచార్జ్ టీవీ రామారావుకు చేదు అనుభవం ఎదురైంది. కొవ్వూరులో మత్స్యకారులు ఆయనపై తిరుగబడ్డారు. దీంతో, మత్స్యకారులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, చేసేదేమీ లేక అక్కడి నుంచి రామారావు వెళ్లిపోయారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొవ్వూరు శ్రీనివాస ఘాట్ వద్ద అనుమతులు లేకుండా టారిజం బోట్ పేరుతో టీవీ రామారావు కట్టడాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేని టూరిస్ట్ బోటు కట్టడాలను ఆపాలని తమ బతుకు తెరువు పోగొట్టుదంటూ మత్య్సకారులు ఆందోళనకు దిగారు. దీంతో, మత్స్యకారులకు, టీవీ రామారావు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మత్స్య కారులు.. పనులు అడ్డుకోవడంతో చేసేది ఏమీ లేక పర్మిషన్ తీసుకునే వస్తానంటూ పనులను ఆపేసి రామరావు అక్కడి నుంచి జారుకున్నారు.

    ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. తమ జీవనోపాధి దెబ్బతిసేలా తమ పడవలు పెట్టుకునే ప్రాంతంలో టూరిజం బోట్ ఏర్పాటు చేస్తామని తమపై రామారావు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపుల మధ్య టూరిస్ట్ బోటు కట్టడాలను కట్టి 100 కుటుంబాలకు జీవనోపాధి పోగొడుతున్నారని అన్నారు. అక్రమ కట్టడాలు కడుతున్నా అధికారులు అటువైపు కూడా కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

  • తాడేపల్లి,సాక్షి: క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. క్రైస్తవులకు ఆరాధ్యమైన  లెంట్, ముస్లింల పవిత్ర రంజాన్ నెల ఈరోజే ప్రారంభం కావటంపై హర్షం. ఈరోజు అద్భుతమైన ఆధ్యాత్మిక సమానత్వానికి ఇది నిదర్శనం. అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలి. ఉపవాసాలు, ప్రార్ధనలు, దానధర్మాలతో పండుగలను జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. 

    ఇవాళ అద్భుతమైన రోజు.. క్రైస్తవులు, ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

          
     

  • సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూపై రాజకీయం చేయడం తగదన్నారు.  ఇటీవల తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియాతో మాట్లాడారు.

    తిరుపతి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూలో బాత్రమ్‌ క్లీనర్‌ కలిసిందని సీఎం చెప్పడం సరికాదు. జగన్‌ను ఇరుకున పెట్టేందుకే చంద్రబాబు అలా చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగితే పరీక్షించే మిషన్‌ టీటీడీ వద్ద లేదా?. తిరుపతి లడ్డూపై కేవలం రాజకీయం చేస్తున్నారు’అని ద్వజమెత్తారు. 

    గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఎవ్వడైనా కలుపుతాడా? రఫ్ఫాడించిన ఉండవల్లి

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌లో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బాల్క సుమన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అలాగే, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

    బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ..‘క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేయించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.

    బాల్క సుమాన్‌ది పూర్తిగా అక్రమ అరెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఇది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బాల్క సుమన్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది.. అయినా స్పీకర్‌ ఎందుకు సాగదీస్తున్నారని ప్రశ్నించారు.

    ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పిటిషన్‌పై స్పీకర్ విచారణకు ఈరోజు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. స్పీకర్‌ విచారణ అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్‌లో ఎంపీగా పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనర్హత నిర్ణయంపై స్పీకర్‌ ఏడాదిన్నరగా కాలాయాపన చేస్తున్నారు. అనర్హత పిటిషన్లను నీరు గార్చాలని స్పీకర్ చూస్తున్నారు. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి.

    దానం నాగేందర్ కేసును సుమోటాగా తీసుకోని చర్యలు తీసుకునే అన్ని ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో దానంను బీఆర్‌ఎస్‌ సస్పెండ్ చేసినట్లు అఫిడవిట్ ధాఖలు చేసిన విషయం తెలుసా అని అడ్వకెట్స్ అడిగారు. కోర్టులో ఆఫడవిట్ వేసిన బీఆర్‌ఎస్‌ ఇన్ని రోజులు ఎందుకు దాచి పెట్టారు?. కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తోంది. దానంను సస్పెండ్ చేస్తే.. ఈ కేసు నిలబడదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే  బాల్క సుమన్‌ అరెస్టును ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్‌ అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని మాజీ మంత్రి హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

    ఆ ట్వీట్‌లో ‘బీఆర్‌ఎస్‌కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది. 

    హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో. జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది. తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు. రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం. 

    ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్‌ చేస్తున్నాం.’అని పేర్కొన్నారు. 

     

     

  • సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి. శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. హెరిటేజ్‌, ఇందాపూర్‌ డెయిరీపై మాట్లాడేందుకు కూటమి నేతలు భయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి సవాల్ విసిరారు. ఇందాపూర్, హెరిటేజ్ అక్రమ సంబంధంపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. అప్పుల విషయమయినా చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. చట్టసభలోనైనా, బయటైనా చంద్రబాబు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

    మాజీ మంత్రి కాకాణి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘నెయ్యి కాంట్రాక్టు కోసం ఏకంగా వెంకటేశ్వర స్వామికే చంద్రబాబు అపఖ్యాతి తెచ్చారు. ఇందాపూర్, హెరిటేజ్ గురించి అడిగితే కూటమి నేతలు భయపడుతున్నారు. ఇందాపూర్ డైరీకి అత్యధిక ధరకి నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?. దీనిపై చర్చించాలని అడిగితే శాసనమండలిలో అవకాశం ఇవ్వలేదు. మా పార్టీకి నుండి అమ్ముడుపోయిన ఇద్దరు ఎమ్మెల్సీలతో వాయిదా తీర్మానం ఇప్పించారు. ఇది నారా లోకేష్ దివాలాకోరు తనానికి నిదర్శనం. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ డైరీ దేవుని సొమ్ము దోచుకుంది. రూ.321ల నెయ్యిని రూ. 658 కొనుగోలు చేయటం దోపిడీ కాదా?.

    దేవుని సొమ్మును కూడా చంద్రబాబు ఇంత దుర్మార్గంగా దోచుకుంటారా?. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల కుట్రలు చేస్తున్నారు. సున్నితమైన విషయం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాటకాలు వేస్తున్నారు. లడ్డూలో బాత్రూమ్ యాసిడ్‌ని కలిపారంటూ పిచ్చి మాటలు మాట్లాడారు. ఎల్లోమీడియాలో వార్తలు రాయించి, దాని ప్రకారం చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడిని కూడా లాగటం సరికాదు. కుట్రలన్నీ బయట పడటంతో కుడితిలో పడిన బల్లిలాగా చంద్రబాబు పరిస్థితి మారింది. మా ఐదేళ్ల హయాంలో చేసిన అప్పును 20నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు అప్పుల్లో ఆల్ టైం రికార్డు సృష్టించారు. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారో లెక్క చెప్పటం లేదు.

    22A భూముల విషయమై చర్చకు వచ్చే దమ్ముందా?. 2014-19 మధ్య రైతుల భూమిని 22Aలో పెట్టిందే చంద్రబాబు. ఆ జీవోలన్నీ జనం చూశారు. వైఎస్ జగన్ వచ్చాకే 22A నుంచి రైతులను బయటకు తెచ్చారు. జగన్ తెచ్చిన ఆ చరిత్రాత్మక నిర్ణయంతో 15 లక్షలకు పైగా రైతులకు మేలు చేశారు.  చుక్కల భూములు, షరతుల భూములు, ఈనాం భూములకు కూడా మేలు చేసింది జగనే. దీనిపై అసెంబ్లీలో మాట్లాడటానికి కూటమి నేతలు భయపడున్నారు. చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు, మ్యానిపులేషన్‌ మాత్రమే అని ఘాటు విమర్శలు చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదన్నారు. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలే నిరూపించాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.

    టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. రేపటి మీటింగ్ అన్ని రాష్ట్రాలపై ఏఐసీసీ సమీక్ష జరుగుతుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష అయిపోయింది. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై చర్చ జరగనుంది. చిత్త శుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 67 శాతం బీసీ వార్డు మెంబర్లు గెలిచారు. 87.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది.

    ఇక్కడ జీవన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీట్లు సర్వేల ఆధారంగా మున్సిపల్ చైర్మెన్‌ కౌన్సిలర్ల ఆధారంగా ఎంపిక జరిగింది. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదు. 94 మున్సిపాలిటీలు గెలిచామంటే అభివృద్ది, సంక్షేమం పట్ల ప్రజలకు సానుకూలతే నిదర్శనం. నిజామాబాద్‌లో ఐదు సీట్లలో ఏంఐఏం అభ్యర్థుల మీద గెలిచాం. మేయర్ వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్పొరేటర్లు ఆ దిశగా ఆలోచించారు. ఈనెల 21 నుంచి 10 రోజుల పాటు వికారాబాద్ హరిత రిసార్టులో ఏపీ, తెలంగాణ డీసీసీలకు శిక్షణ తరగతులు ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఒకరోజు అటెండ్ అవుతారు.

    వరుస ఓటముల కారణంగా బీఆర్‌ఎస్‌ కేటీఆర్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడే ఆయనే చెప్పారు. దీనిపై మేము మాట్లాడటానికి ఏమీ లేదు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంపై పూర్తిగా స్పష్టతను ఇస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు.

Business

  • నిస్సాన్‌ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్‌’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్‌ ట్రైబర్‌ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్‌.. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్‌కు ప్రత్యేకతను ఇస్తాయి.

    అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్‌ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్‌ ఈ గ్రావైట్‌ను కీలక మోడల్‌గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

    వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలు
    నిస్సాన్‌ గ్రావైట్‌ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్‌-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..

    విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలు
    అసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలు
    ఎన్‌-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలు
    ఎన్‌-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలు
    టెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలు
    టెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలు
    టెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఎంటీ – రూ. 8.35 లక్షలు
    టెక్నా లాంచ్‌ ఎడిషన్‌ ఏఎంటీ – రూ. 8.93 లక్షలు

    గ్రావైట్‌ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

    ఎక్స్‌టీరియర్
    డిజైన్ పరంగా నిస్సాన్‌ గ్రావైట్‌.. రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్‌ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్‌పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

    సైడ్ ప్రొఫైల్‌లో రెనాల్ట్‌ ట్రైబర్‌ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి అమర్చారు. బంపర్‌పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.

    ఇంటీరియర్
    ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్‌ మోడల్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్‌ను అందిస్తున్నాయి.

    ఫీచర్లు, సేఫ్టీ
    గ్రావైట్‌లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ యాపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్‌తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్.

    ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్‌ కూడిన ఈబీడీ,  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్‌ ఉన్నాయి.

    ఇంజిన్, పనితీరు
    గ్రావైట్‌లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్‌ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఇవ్వగా  ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)

    పోటీ మోడళ్లు
    నిస్సాన్‌ గ్రావైట్‌ ప్రధానంగా రెనాల్ట్‌ ట్రైబర్‌తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్‌ఎల్‌6, కియా కారెన్స్‌, కియా కారెన్స్‌ క్లావిస్‌ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

  • చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవుల ప్రభావంతో ఆసియా కమోడిటీ మార్కెట్లలో లిక్విడిటీ తగ్గిపోవడంతో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు బుధవారం గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా చైనా, హాంకాంగ్‌లోని ఎక్స్ఛేంజీలు మూతపడటంతో మార్కెట్‌లో భాగస్వామ్యం సన్నగిల్లి, తాత్కాలిక అస్థిరత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

    బుధవారం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 3.51 శాతం ఎగిసి రూ.2,36,824 వద్ద ట్రేడవగా, ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.88 శాతం పెరిగి రూ.1,52,742 వద్ద నమోదయ్యాయి.

    లూనార్ న్యూ ఇయర్ అంటే ఏమిటి?
    లూనార్ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే చలించే పండుగ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన ఈ సెలవులు పూర్తి వారం పాటు కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ఇది జనవరి 28 నుంచి ప్రారంభమై జనవరి, ఫిబ్రవరి నెలల్లో విస్తరించింది.

    పండుగకు ముందు వినియోగదారులు భారీగా షాపింగ్ చేయడం, కార్మికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు కర్మాగారాలు ముందుగానే మూసివేయడం సాధారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పనిదినాలు తగ్గిపోవడం, జనవరిలో పనిదినాలు పెరగడం వంటి మార్పులు కనిపిస్తాయి.

    బంగారం, వెండి ధరలపై ప్రభావం
    చైనా లూనార్ న్యూ ఇయర్ ఎఫెక్ట్‌ బంగారం, వెండి ధరలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ కమోడిటీ & కరెన్సీ అనలిస్ట్‌ అమీర్ మక్డా ప్రకారం..  ప్రపంచంలోనే అతిపెద్ద భౌతిక బంగారం కొనుగోలుదారులలో ఒకటైన చైనా మార్కెట్ సెలవుల కారణంగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గుతాయి. దీని ఫలితంగా ధరలలో అతిశయోక్తి మార్పులు, విస్తృత బిడ్-ఆస్క్ స్ప్రెడ్లు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.

    చారిత్రాత్మకంగా ఈ కాలంలో ధరల దిద్దుబాట్లు చోటుచేసుకుంటాయని, పండుగకు ముందు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాలు తీసుకోవడం వల్ల వేగం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా వెండి ధరలు ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితమవుతాయని, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పడిపోతుందని చెప్పారు. అందువల్ల ఈ సమయంలో బులియన్ ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరమని సూచించారు.

    షాంఘై, హాంకాంగ్ వంటి ప్రధాన ఆసియా ఎక్స్ఛేంజీలు మూసి ఉండటంతో మార్కెట్ కార్యకలాపాలు తగ్గిపోతాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి చెబుతున్నారు. తక్కువ భౌతిక డిమాండ్, పరిమిత మార్కెట్ మేకర్ల కారణంగా ధరలు కొన్నిసార్లు గణనీయంగా పడిపోవచ్చని తెలిపారు. అయితే ఈ పుల్‌బ్యాక్‌లు సాధారణంగా కాలానుగుణమని, ఆసియా మార్కెట్లు తిరిగి తెరుచుకున్న తర్వాత ధరలు స్థిరపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్‌ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్‌ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్‌ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్‌ హర్గవే తెలిపారు.

    ‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్‌లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్‌లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్‌డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్‌ తదితర పాపులర్‌ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్‌ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.

    ద్రవ్యోల్బణం వల్లే.. 
    ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్‌ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు.  

    కొనుగోళ్లకూ సై.. 
    విస్తృతమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్‌ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విపిన్‌ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్‌ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు.

  • కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్‌ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.

    జియో ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రామ్‌ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

    గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు
    జియో ఏఐ స్టాక్‌లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు, డెవలప్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్‌లు, మల్టీలింగ్వల్‌ ఇంటెలిజెన్స్‌ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.

    ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.

    జియో ఏఐ స్టాక్‌ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.

    ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.

    భారతీయ భాషలకు ప్రాధాన్యం
    ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్‌ఫార్మ్‌ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

  • న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,000–1,053 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 1,900 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్‌ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 3,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 20న షేర్లను ఆఫర్‌ చేయనుంది. తొలుత 2025 ఆగస్ట్‌ దరఖాస్తులో రూ. 5,200 కోట్ల సమీకరణకు సిద్ధపడినప్పటికీ పరిమాణాన్ని కుదించింది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,125 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. మార్చి 2న లిస్ట్‌కానున్న కంపెనీ రూ. 12,325 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.

    కంపెనీ తీరిలా 
    2010లో ఏర్పాటైన రెనెవబుల్‌ ఎనర్జీ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ప్రధానంగా వాణిజ్య(కమర్షియల్‌), పారిశ్రామిక(ఇండ్రస్టియల్‌) రంగాలకు పవన, సౌర, హైబ్రిడ్‌(పునరుత్పాదక) విద్యుత్‌ సరఫరాసహా ఇంధన సరీ్వసులను అందిస్తోంది. ఆయా రంగాలకు నెట్‌ జీరో, కర్బననిర్మూలన సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. 2025 జూలై 31కల్లా కంపెనీ 2.54 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు.. మరో 2.53 జీడబ్ల్యూ కాంట్రాక్ట్‌డ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 5.07 జీడబ్ల్యూ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024–25లో ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,610 కోట్లను అధిగమించింది. నష్టాల నుంచి బయటపడి రూ. 28 కోట్ల నికర లాభం ఆర్జించింది. డేటా సెంటర్లు, ఏఐ, టెక్నాలజీ, సిమెంట్, స్టీల్‌ తది తర రంగాల క్లయింట్లకు సరీ్వసులు అందిస్తోంది.

    గౌడియం ఐవీఎఫ్‌ ఐపీవో 20న 
    ఫెర్టిలిటీ సర్వీసుల సంస్థ గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 75–79 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనుంది. దీనిలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్‌ మనికా ఖన్నా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా సంస్థ రూ. 165 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్‌ చేయనుంది. వెరసి కృత్రిమ గర్భధారణ(ఫెర్టిలిటీ) సరీ్వసులందించే సంస్థ తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను దేశవ్యాప్తంగా 19 కొత్త ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు వెచ్చించనుంది. రూ. 20 కోట్లు రుణచెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఈ నెల 27న లిస్ట్‌కానున్న సంస్థ రూ. 575 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.

    కంపెనీ తీరిలా 
    ఖన్నా ఏర్పాటు చేసిన గౌడియం ఐవీఎఫ్‌ దేశీయంగా రీప్రొడక్టివ్‌ టెక్నాలజీలలో సుప్రసిద్ధమైంది. 7 ప్రధాన కేంద్రాలుసహా 28 అనుబంధ విభాగాల ద్వారా సంస్థ సేవలు సమకూర్చుతోంది. 2024–25లో ఆదాయం రూ. 48 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ. 10 కోట్ల నుంచి రూ. 19 కోట్లకు జంప్‌చేసింది. కంపెనీ తొలుత(జనవరిలో) 1.83 కోట్ల ఈక్విటీ షేర్ల జారీసహా.. ప్రమోటర్‌ 25.31 లక్షల షేర్లు ఆఫర్‌ చేయనున్నట్లు పేర్కొంది. తదుపరి వీటి సంఖ్యను సవరించింది. ఐపీవో చేపట్టేందుకు 2025 జూలైలో గోప్యతా మార్గంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.

    కార్ల్స్‌బెర్గ్‌ ఐపీవో చూపు 
    మాల్ట్‌ పానీయాల డెన్మార్క్‌ దిగ్గజం కార్ల్స్‌బెర్గ్‌ దేశీ బిజినెస్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని యోచిస్తోంది. తద్వారా వాటాదారులకు విలువ చేకూర్చాలని చూస్తున్నట్లు గ్రూప్‌ సీఈవో జాకబ్‌ ఆరుప్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. అయితే పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. దేశీయంగా పటిష్ట వృద్ధిని సాధిస్తున్న కంపెనీ దేశీ బిజినెస్‌ను లిస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. సంస్థ వాటాదారుల విలువ పెంచేందుకు ఐపీవోసహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇంతకుమించి మాట్లాడేందుకు చట్ట సంబంధిత అంశాలు అడ్డుపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్‌ అంశంపై స్పందించలేనని, అయితే వాటాదారులకు విలువ చేకూర్చడంపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.  
     

  • భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా సెల్టోస్‌ (Kia Seltos) మరో కీలక మైలురాయిని దాటింది. దేశంలో ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఉత్పత్తి 6 లక్షల యూనిట్లను అధిగమించినట్లు కియా ఇండియా ప్రకటించింది. 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తూ వస్తోంది. సెల్టోస్.. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తొలి మోడల్ కావడం విశేషం. ప్రస్తుతం ఇది రెండో తరం వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

    కియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సెల్టోస్ అమ్మకాలలో సుమారు 29 శాతం వాటా టాప్ వేరియంట్లదే. అధునాతన భద్రతా సాంకేతికతలు, అధిక సౌకర్యాలున్న ఫీచర్ రిచ్ వెర్షన్లను కస్టమర్లు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది.

    సెల్టోస్‌ను ప్రారంభం నుంచే ప్రత్యేకతతో రూపుదిద్దినట్లు కియా ఇండియా పేర్కొంది. విభిన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలు, ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో నిండిన కేబిన్ ఈ ఎస్‌యూవీకి ప్రధాన బలాలుగా నిలిచాయి. ఈ మోడల్‌లో మూడు 1.5 లీటర్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 115 హెచ్‌పీ శక్తినిచ్చే సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 116 హెచ్‌పీ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌‌ ఉన్నాయి.

    ట్రాన్స్‌మిషన్ పరంగా కూడా విస్తృత ఎంపికలు కల్పించింది. సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ; డీజిల్‌కు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్; టర్బో పెట్రోల్‌కు 6-స్పీడ్ ఐఎమ్‌టి, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

    ఫీచర్లు.. ధర
    ప్రస్తుతం సెల్టోస్ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్). వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 64-కలర్ అంబియెంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ఏడీఏఎస్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతను మరింత పెంచుతున్నాయి.

    ఈ సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్ హాక్ పార్క్ మాట్లాడుతూ.. “6 లక్షల అమ్మకాల మైలురాయిని దాటడం వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనం. డిజైన్, భద్రత, సాంకేతికత, పనితీరు రంగాల్లో ఉన్న బలమైన పునాది కారణంగానే సెల్టోస్ ఈ స్థాయికి చేరుకుంది. మిడ్-ఎస్‌యూవీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మోడల్‌గా ఇది నిలిచింది” అని తెలిపారు.

  • భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ ఆదుకోవడంతో సూచీలు వరుసగా మూడవ సెషన్ లాభాలను విస్తరించాయి.

    మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 283.29 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 83,734.25 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 93.95 పాయింట్లు లేదా 0.37 శాతం ఎగిసి 25,819.35 వద్ద ముగిసింది

    సెన్సెక్స్ లో టాటా స్టీల్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎం అండ్ ఎం 2.8 శాతం వరకు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్టెక్, టీసీఎస్ 1.6 శాతం వరకు నష్టపోయాయి.

    విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.5 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.54 శాతం పెరిగింది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ బుధవారం 3.5 శాతం క్షీణించింది.

    రంగాలవారీగా నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.33 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 1.3 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.2 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.23 శాతం పడిపోయింది.

  • ఎంప్లాయూస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF) వడ్డీ ఈసారైనా పెరుగుతుందా? అని వేతన జీవులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈపీఎఫ్ఓ 2026 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న జరిగే కీలక సమావేశంలో తుది నిర్ణయం వెలువడనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే, వరుసగా మూడో ఏడాది కూడా చందాదారులు 8.25 శాతం వడ్డీ పొందే పరిస్థితి ఉంటుంది.

    సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్‌ను నిర్వహిస్తున్న ఈపీఎఫ్ఓ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ద్వారా సరిపడా ఆదాయం సమకూర్చుకున్నట్లు సమాచారం. దీంతో వడ్డీ రేటును కొనసాగించడానికి ఆర్థికంగా వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలపై ఒత్తిడి పెరిగితే కొత్త పెట్టుబడి మార్గాలను అన్వేషించాల్సి రావచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

    పెట్టుబడుల పంపిణీ పరంగా చూస్తే, 45–65 శాతం నిధులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 20–45 శాతం ఇతర రుణ సాధనాల్లో, 5–15 శాతం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీల్లో, మిగిలినవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడుతున్నారు. భద్రత, స్థిరత్వం, రాబడి.. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ఈ మిశ్రమాన్ని అనుసరిస్తున్నారు.

    వడ్డీ రేటు ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ అపెక్స్ బాడీ అయిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) చర్చించి ఆమోదించనుంది. ఈ బోర్డుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మండవీయ అధ్యక్షత వహిస్తున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో ఉపసంహరణలు సులభతరం చేసే పలు సంస్కరణలు ప్రకటించిన సీబీటీ, ఈసారి కూడా సభ్యుల సేవలను మరింత సులభతరం చేసే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.

    దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా చందాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు స్థిరత్వం కల్పించనుంది. ఉదాహరణకు, ఖాతాలో రూ.5 లక్షలు ఉన్న సభ్యుడికి సంవత్సరానికి సుమారు రూ.41,250 వడ్డీ లభిస్తుంది (నెలవారీ నిల్వల ఆధారంగా మారవచ్చు). మార్చి 2 సమావేశం అనంతరం తుది నిర్ణయం అధికారికంగా ప్రకటించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

  • భారతదేశ కార్పొరేట్ దిగ్గజాలు కేవలం లాభాల ఆర్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని టాప్ 50 కంపెనీలు గడిచిన ఏడాదిలో ఏకంగా రూ.8,000 కోట్లను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాయి. ఈ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందడం విశేషం.

    అగ్రస్థానంలో హిందుస్థాన్ యూనిలీవర్

    సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో హిందుస్థాన్ యూనిలీవర్ 53.9 పాయింట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో హెచ్‌యూఎల్‌ ప్రదర్శించిన సమతుల్య పనితీరు ఈ ఘనతకు కారణమైంది.

    టాప్ 5 కంపెనీల వివరాలు

    ర్యాంక్కంపెనీస్కోరు (పాయింట్లు)కీలక అంశం
    1హిందుస్థాన్ యూనిలీవర్53.9సమతుల్య ఎస్‌డీజీ పనితీరు
    2హెచ్సీఎల్ టెక్నాలజీస్53.8అత్యధిక మహిళా శ్రామిక శక్తి (67,217 మంది)
    3గ్రాసిమ్ ఇండస్ట్రీస్52.6సుస్థిర పారిశ్రామిక విధానాలు
    4టాటా మోటార్స్51.8గ్రీన్ మొబిలిటీ
    5డాబర్ ఇండియా50.3బాధ్యతాయుతమైన వినియోగం

     

    సాంకేతిక రంగంలో మహిళా సాధికారత

    ఈ జాబితాలో 53.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రగతిని కనబరిచింది. భారత సాంకేతిక రంగంలోనే అత్యధికంగా 67,217 మంది మహిళలకు ఉపాధి కల్పించి మహిళా సాధికారతలో ఆదర్శంగా నిలిచింది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల తగ్గింపు, శక్తి-సమర్థవంతమైన డిజిటల్ సొల్యూషన్ల విస్తరణలో ఈ సంస్థ ముందుంది.

    పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

    • కార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాయి.

    • జాబితాలోని 50 కంపెనీలలో 48 సంస్థలు పర్యావరణ లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలోగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    • 40 కంపెనీలు ఉత్పత్తి, వినియోగంలో పారదర్శకతను పాటిస్తున్నాయి.

    • 30 కంపెనీలు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు అడుగులు వేస్తున్నాయి.

    ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 50 కంపెనీలు కలిసి మొత్తం రూ.48.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. తమ భారీ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి.

    కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)

    సీఎస్‌ఆర్‌ ద్వారా కంపెనీలు తాము సంపాదించే లాభాల్లో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేస్తాయి. అంటే.. సమాజం నుంచి వనరులను తీసుకుంటున్న కంపెనీలు తిరిగి సమాజానికి మేలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఒక నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ లాభాలు లేదా టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ సగటు నికర లాభంలో కనీసం 2 శాతం మొత్తాన్ని సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలకు ఖర్చు చేయడం తప్పనిసరి.

    ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

National

  • ఢిల్లీ: భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ శుభవార్త చెప్పారు. భారతీయ విద్యార్థుల కోసం వీసా, అడ్మిషన్​ ప్రక్రియను సరళీకరిస్తామని అన్నారు. అలాగే, 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏడాదికి 30,000కు పెంచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

    భారత్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి విద్య, శాస్త్రీయ సమావేశంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్​, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి, 'ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) క్యాంపస్‌లో మాక్రాన్‌ మాట్లాడుతూ..‘రానున్న రోజుల్లో మా దేశానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను స్వాగతించాలనుకుంటున్నాం. అదేవిధంగా, అలాగే ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్‌కు రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి భారత్​ నుంచి ఫ్రాన్స్ వచ్చే విద్యార్థుల సంఖ్య 10వేలుగా ఉంది. ఆ సంఖ్యను 2030 నాటికి 30,000లకు పెంచాలని ప్రధాని మోదీతో చర్చించాను.

    ఫ్రాన్స్ వైపు నుంచి మేము అడ్మిషన్ల ప్రక్రియను, వీసా విధానాన్ని సరళీకరిస్తాం. విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా ఈ ప్రక్రియలను మరింత ఆచరణాత్మకంగా మారుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఫ్రాన్స్‌లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సులను పెంచుతామని మాక్రాన్‌ ప్రకటించారు. ‘మా వద్ద ఉత్తమ బోధన సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆంగ్లంలో కూడా విభిన్న కోర్సులు అందిస్తాం. ఉన్నత విద్యలో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తాం’ అని హామీ ఇచ్చారు.

    ఇదే సమయంలో రక్షణ రంగంలో సాంకేతిక బదిలీపై కూడా మాక్రాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జలాంతర్గాములు, రాఫెల్ యుద్ధ విమానాలు, ఐదో తరం విమానాల ఇంజన్లు ఇలా అనేక రంగాలలో ఫ్రాన్స్ భారత్‌తో కలిసి పని చేస్తోందని తెలిపారు. ఈ రంగంలో సాంకేతిక బదిలీని తాము కూడా విశ్వసిస్తామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని తాము కూడా ప్రతిపాదించినట్లు మాక్రాన్‌ చెప్పుకొచ్చారు. దీంతో పాటు అంతరిక్ష రంగం వంటి అనేక ఇతర విషయాల్లోనూ ఇరు దేశాల మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా అద్భుతంగా కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే జూలైలో తాము ఫ్రాన్స్‌లో నిర్వహించబోయే అంతరిక్ష రంగ సదస్సుకు భారత్‌ను ఆహ్వానించామని ఆయన స్పష్టం చేశారు.

  • ఢిల్లీ: ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో చైనా రోబోడాగ్‌ వివాదంలో అబాసుపాలైన ప్రైవేట్‌ యూనివర్సిటీ గల్గోటియాస్‌ యూనివర్సిటీ వివాదంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. చైనా రోబో డాగ్‌ తామే తయారు చేశామని ప్రచారం చేసుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. 

    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ ఇపాక్ట్‌ సదస్సును నిర్వహిస్తోంది. అయితే, ఈసదస్సులో గ్రేటర్‌ నోయిడాకు చెందిన ప్రైవేట్‌ యూనివర్సిటీ గల్గోటియాస్‌ ప్రతినిధులు  అత్యుత్సాహం ప్రదర్శించారు. అదికాస్తా వివాదం కావడంతో సదస్సు నుంచి గెంటివేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

    చైనా రోబోటిక్‌ కంపెనీ యూనిట్రీ తయారు చేసింది. యూనిట్రీ జీవో2 పేరిట విక్రయిస్తోంది. ఆ రోబోట్‌ను తామే తయారు చేశామని గల్గోటియాస్‌ యూనివర్సిటీ  ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ డీడీ న్యూస్‌తో మాట్లాడారు. యూనివర్సిటీలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో రోబోడాగ్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు.ఓరియన్ (orion) అనే పేరు పెట్టామని దానిని ప్రదర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడిన తీరు, ప్రదర్శనకు ఉంచిన రోబోటిక్‌ డాగ్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. 

    అయితే, ఆ వీడియోల్లో చైనా రోబోటిక్‌ కంపెనీ యూనిట్రీ తయారు చేసిన యూనిట్రీ జోవో2 రోబోటిక్‌ డాగ్‌గా గుర్తించారు. అందుకు కారణంగా ప్రపంచ దేశాల్లో ఆ సంస్థ రోబోటిక్‌ డాగ్‌లను పలు కార్యాక్రమాల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఏఐ ఇంపాక్ట్‌ నిర్వహిస్తున్న కేంద్ర ఐటీ శాఖ విభాగం ప్రతినిధులు సైతం స్పందించారు. వెంటనే సదస్సును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ ప్రతినిధులు సదస్సును ఖాళీ చేశారు. 

    ఈ క్రమంలో ఏఐ సదస్సులో జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతూ ఓ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్‌లో యూనివర్సిటీ గురించి వివాదం తలెత్తడానికి కారణం ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ది తప్పు. యూనివర్సిటీ తరుఫున సదస్సులో స్టాల్‌ నిర్వహిస్తున్న మా ప్రతినిధుల్లో ఆమె ఒకరు. సదస్సు గురించి, రోబోటిగ్‌ డాగ్‌ గురించి సరైన సమాచారం లేదు. మీడియాతో మాట్లాడే అధికారం కూడా ఆమెకు లేదు’అని పేర్కొంది.  

    ఇదే అంశంపై మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, రోబోట్‌ డాగ్‌ను మా యూనివర్సిటీ తయారు చేయలేదని స్పష్టం చేసింది.  

    కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీ పరువు పోవడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రొఫెసర్‌ నేహాసింగ్‌ను యూనివర్సిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. లింక్డిన్‌ ప్రొఫెల్‌ సైతం ఆమె మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతుంది. 

     

  • కార్పొరేట్  కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్‌ప్రైజ్‌  చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది.  వివరాలు ఇలా ఉన్నాయి.

    కోజికోడ్‌కు చెందిన కంపెనీ  హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ  సిబ్బందికి భారీ   బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.

    బిజినెస్‌లైన్  నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల  కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. 

    భారీ భవిష్యత్‌ ప్రణాళికలు
    హైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా  భవిష్యత్‌ ప్రణాళికలను కూడా ప్రకటించారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని  తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్‌  వెల్లడించారు.

    హైలైట్ గ్రూప్  విస్తరణ
    హైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్‌లోస్థాపించబడింది. రిటైల్ అండ్‌ కమర్షియల్‌ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్‌లో హైలైట్ మాల్‌, త్రిస్సూర్‌లోని హైలైట్ మాల్‌ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్‌లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్‌ డాలర్లు (రూ. 623.06 కోట్లు) 

    ఇదీ చదవండి: బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు

    ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

  • ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్‌లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోసం భారత్‌కి వచ్చింది. ఈ సమయంలో భారత్‌కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్‌లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్‌ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది.  

    ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది.

    అయితే, ఒక రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో జపాన్ పర్యాటకుడి పోస్ట్‌లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో​.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి.

  • క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌కు ఎదురుదెబ్బ తగిలింది.తన ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా నిషేధిత కత్తులను అమ్మకానికి అందిస్తున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు ఆయుధ చట్టం కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.

    ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం  ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కత్తులను ఉపయోగించి జరిగాయని ఆరోపించారు. ఆ సంఘటనల తర్వాత, అధికారులు అమ్మకానికి ఉన్న కత్తులను జాబితా చేస్తూ ఇ-కామర్స్ , రాపిడ్-డెలివరీ సేవలను పరిశీలించారు.

    ఇందులో  భాగంగానే కానిస్టేబుల్ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 3.43 గంటలకు ఆన్‌లైన్ లావాదేవీ ద్వారా రూ. 710 చెల్లించి కత్తి కోసం ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ చిరునామాను ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ అడ్రస్‌ ఇచ్చారు. ఆ వస్తువు అదే రోజు సాయంత్రం 4.05 గంటలకు స్టేషన్ ప్రాంగణంలో డెలివరీ  అయింది. కొనుగోలుకు సంబంధించిన పన్ను ఇన్‌వాయిస్ విక్రేతను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించిందని, పశ్చిమ ఢిల్లీలోని తిహార్ గ్రామంలోని చిరునామాతో ఉంది. దీని ఆధారంగా ఆయుధ చట్టంలోని సెక్షన్ 25, 54 మరియు 59 కింద కేసు నమోదు చేశారు.

    ఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

    బ్లింకిట్ ద్వారా ఆర్డర్  తమకు డెలివరీ అయిన ‘గరారిదార్’కత్తి  ప్రమాణాలునిర్ధిష్టప్రమాణాలకు మించి ( గరిష్ట బ్లేడ్ పొడవు 7.62 సెం.మీ  బ్లేడ్ వెడల్పు 1.72 సెం.మీ) కంటే  ఎక్కువగా ఉందని ప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (పశ్చిమ) దారాడే శరద్ భాస్కర్ తెలిపారు.కత్తి బ్లేడ్ పొడవు 8 సెం.మీ. వెడల్పు 2.5 సెం.మీ ఉది ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన చట్టవిరుద్ధమైన  చర్య అని పేర్కొన్నారు.  ఫిర్యాదు ప్రకారం, స్వాధీనం చేసుకున్న వస్తువులో స్టీల్ బ్లేడ్ ,స్టీల్ స్ట్రిప్ మెకానిజంతో అమర్చబడిన బ్లాక్ మెటల్ హ్యాండిల్ ఉన్నాయి.

    అనంతరం ఢిల్లీ అంతటా ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన  అనేక స్టోర్‌లు,ఇతర అవుట్‌లెట్‌లపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు దాడులు కొనసాగాయి. హర్యానాలోని గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌లో ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న గిడ్డంగి నుండి 32 అదనపు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి మొత్తం 50 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఆయుధాల సోర్సింగ్, నిల్వ మరియు పంపిణీకి బాధ్యతను నిర్ణయించడానికి తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
    ఈ పరిణామంపై బ్లింకిట్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
     

  • ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్‌ పవార్‌ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్‌ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

    కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున  మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్‌ పవార్‌ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్‌ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

    రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్‌తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్‌ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్‌ పవార్‌ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.

    ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

  • ఆకాశమంత మందిరి, భూదేవి అంత పీట అన్నట్టు జరుగుతున్నాయి ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు. పెళ్లి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటారు ఇందుకోసం చాలా ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పంజాబ్ పెళ్లిలో వధువుపై నోట్ల వర్షం  కురిపించిన కుటుంబం చిక్కుల్లో పడింది.

    విషయం ఏమిటంటే..తమ ఇంట పెళ్లిన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటంతో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను పెళ్లి కుమార్తెపై వెదజల్లారంటూ సోషల​ మీడియాలో ఒక  వీడియో తెగ వైరల్‌ అవుతోంది. (జస్ట్‌ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)

    పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లాలో వాలంటైన్స్ డే రోజు ఒక జంట వివాహం చేసుకుంది. వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురిపై  ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను పూలవర్షంలా కురిపించారట. ఇదిఆన్‌లైన్‌లో షేర్‌ అయిన వెంటనే దావానలంలా వ్యాపించింది. అటు వధూవరుల కుటుంబంనుంచిగాన,ఈ ఇటు వివాహంలో పాల్గొన్న ఎవరి నుండి నిజమైన నిర్ధారణ లేనప్పటికీ గ్రాండ్ క్యాష్ పార్టీ  అంటూ నెటిజన్లు  తెగ ట్రోల్‌ చేశారు.

    ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    రూ. 8.5 కోట్లు కాదు, లక్షలే
    ఈ వీడియో వైరల్‌గా మారడంతో వరుడి కుటుంబం స్పందించింది. ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు , వివాహ కార్యక్రమ నిర్వాహకులు తోసిపుచ్చారు.ఈ కార్యక్రమంలో జంటపై రూ.3–4 లక్షల నగదును మాత్రమే కురిపించామన్నారు. రూ. 8.5 కోట్లు అని జరుగుతున్న ప్రచారం అవాస్తమని వరుడి సోదరుడు సికందర్ సింగ్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ. 8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. మొత్తం నగదు సుమారు రూ. 4 లక్షలు అని కొన్ని డాలర్ నోట్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పడం  గమనార్హం

    ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!

     

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా ఇరుకుటుంబాలు పెళ్లి సందడిలో మునిగిపోయాయి.  బందు మిత్రుల ఆనందోత్సాహాల మధ్య పెళ్లిప్రమాణాలు పూర్తయ్యాయి.  సరిగ్గా అప్పగింతల తతంగానికి కొన్న క్షణాల ముందు వివాదం మొదలైంది. పరిస్థితి తీవ్రమై వివాహం రద్దైంది. ఇంతకీ ఏమైంది?  కట్న కానుకల గొడవా? మర్యాదల తక్కువయ్యాయని అలిగారా? ఏమైంది పదండి  తెలుసుకుందాం.

    యూపీలోని కోఠి థానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  ఆరు నెలల క్రితం స్థానిక అమ్మాయి,  పురే గనై గ్రామంలో నివసించే 22 ఏళ్ల అబ్బాయికి పెళ్లి నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 13న జరిగే పెళ్లికి  బారాత్‌, వివాహం ఆచారాలు,సాంప్రదాయ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. పెళ్లి తంతు అంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది.  అతిథులు ఆతిథ్యాన్ని స్వీకరించి వధూవరులను  ఆశీర్వదించాడు. అయితే, శనివారం తెల్లవారుజామున ‘బిదాయి' వేడుకకు ముందు ట్రాన్స్‌జెండర్‌ (కిన్నార్) బృందం ఆశీర్వాదం ఆచార 'నెగ్' (బహుమతి) తీసుకోవడానికి వేదికకు చేరుకుంది. వారు కొత్తపెళ్లికొడుకుని గుర్తించడంతో అనుమానం మొదలైంది.  వధువు కుటుంబం వాగ్వాదానికి దిగింది.  అసలు వరుడు మాగాడా కాదా అని స్పష్టం చేయాలని,  వెరిఫికేషన్ కావాలని వధువు బంధువులు  పట్టుబట్టారు. దీనికి వరుడు తిరస్కరించి గొడవకు దిగాడు. ఇంతలో వరుడిని తమ సంఘం సభ్యుడే ధృవీకరించడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో వధువు కుటుంబం వివాహాన్ని రద్దు చేసింది. 

    ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    అయితే తమ పరువు పోయిందని,  రూ. 23 వేలు తీసుకుని మౌనంగా ఉండాలని వరుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది. అలా  నవ వధువుతోపాటు, అప్పటిదాకా బాజా భజంత్రీలతో కళకళల్లాడిన పెళ్లి  పందిర మూగబోయింది. ఈ విషయం స్థానిక పోలీసుల దృష్టికి రావడంతో వారు  సంఘటనా స్థలానికి చేరుకుని రెండు కుటుంబాలను శాంతింపజేశారు. విషయం సున్నితమైంది గనుక, పైగా ఇరువైపుల నుంచి  ఎలాంటి ఫిర్యాదు రాలేదు కనుక  ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!

     

  • తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారంలో చోరీ కేసులో ఆలయ సీనియర్ తంత్రి (మాజీ ప్రధాన పూజారి) కందరారు రాజీవరుకు బెయిల్ మంజూరైంది. రాజీవరుకు నేడు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగారం చోరీకి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు బెయిల్‌ లభించడంతో ఆయన రిమాండ్‌ నుంచి బయటకు రానున్నారు.

    కాగా శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో ఆలయ అర్చకులు కందారారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజీవరను సిట్‌ అధికారులు జనవరి తొమ్మిదో తేదీన అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో ఆయనకు కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో, ఆయన 41 రోజులుగా పోలీసులు రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. కోర్టు ఆయనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా తేల్చలేదు.. కేవలం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజీవరు ఏ6గా ఉన్నారు. ఇక, ఈ కేసులో ఆయన అరెస్టు 11వది కావడం విశేషం. 

    ఏమిటి ఈ కేసు?
    2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్‌మాల్‌ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది.

Family

  • పది నెలల వయసున్న ఆలిన్‌ షెరిన్‌ అబ్రహం అనే పసి పాప కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. మల్లపల్లి గ్రామానికి చెందిన ఆలిన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతలతో కలిసి కొట్టాయం నుండి తిరువల్లకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆస్పత్రిలో కొన్ని రోజుల చికిత్స తరువాత ఆలిన్‌ షెరిన్‌ను బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు.

    పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి అరుణ్‌ అబ్రహం, తల్లి షెరిన్‌ ఆన్‌జాన్‌ తమ చిన్నారి అవయవాలను దానం (Organ Donation) చేయడానికి అంగీకరించారు.

    ఆలిన్‌ షెరిన్‌ అబ్రహం (Alin Sherin Abraham) గుండెను తిరువనంతపురంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు, కాలేయాన్ని, ప్రభుత్వ వైద్య కళాశాలకు, కళ్లు ఐ బ్యాంక్‌కు డొనేట్‌ చేశారు.

    ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పది సంవత్సరాల బాలిక అనిన్‌కు ఆలిన్‌ షెరిన్‌ మూత్రపిండాలను మార్పిడి చేస్తారు. తిరువనంతపురంలో చికిత్స పొందుతున్న ఆరు నెలల పాపకు ఆలిన్‌ షెరిన్‌ కాలేయాన్ని అమర్చుతారు.

    చ‌ద‌వండి: సింకోప్‌ స‌మ‌స్య‌.. ప‌డి లేచే ప్ర‌మాదం

  • నాకు పెళ్లయి 15 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను అమెరికాకు తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తీవ్రమైన ఆటిజం.. అమెరికాలో ఉండగా కూడా నా భర్త పిల్లలను పట్టించుకోకపోగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు పిల్లలను తమ రక్షణలోకి తీసుకుని నా భర్తపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే క్రమంలో తను ఇండియా పారిపోయి వచ్చాడు. చాలా కష్టాలు పడి నేను కూడా వచ్చాను. తీవ్రమైన లెవెల్‌ 3 ఆటిజంతో ఉన్న పిల్లలను పెంచడం చాలా కష్టంతో – ఖర్చుతో కూడుకున్న పని. అతను వాళ్లని వదిలించుకోవడమే కాదు, మేమిద్దరం కలిసి కొనుక్కున్న ఆస్తికి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను 24 గంటలు పిల్లల చుట్టే ఉండవలసిన పరిస్థితి కాబట్టి నేను పని కూడా చేయలేను. ఆటిజం బారిన పడిన పిల్లలకు మన దేశంలో సరైన చట్టాలు పెద్దగా లేవు – ప్రభుత్వ వసతులు కూడా లేవు అని అంటున్నారు. పరిష్కారం సూచించగలరు.
    – సుమతి, వరంగల్‌

    మీ బాధ వింటుంటే హృదయాన్ని కలచివేస్తుంది. మీరన్నది నిజమే! మన దేశంలో ఆటిజంపై పెద్దగా అవగాహన లేదు – బహుశా అందుకే ప్రభుత్వ వసతులు, పథకాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద ఆటిజంను మానసిక/మేధోవైకల్యంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద ఎటువంటి వైకల్యం కల్గిన వ్యక్తినైనా వివక్షకు గురిచేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. అలాగే జాతీయ ట్రస్ట్‌ చట్టం 1999 అనేది ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, మానసిక వికలాంగత, బహుళ వైకల్యాలున్న వ్యక్తుల సంరక్షణ, చట్టపరమైన సంరక్షకులను నియమించడం, స్వతంత్ర జీవనానికి మద్దతు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన చట్టం/సంస్థ. 

    అయినప్పటికీ ఆటిజం ఉన్నవారికి మిగతా వారిలా సరైన ఇన్సూరెన్స్‌ కూడా లేదు! అమెరికాలో ఉన్నట్టు పటిష్టమైన ప్రభుత్వ వసతులు, సంస్థలు లేనందున ఆర్థికంగా బలహీనమైన, మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వీటిపై బలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయానికి వస్తే మీ భర్తపై ముందుగా క్రిమినల్‌ కేసులు పెట్టండి. 

    మీ భర్త చేసినవి నేరాలు! బీ.ఎన్‌.ఎస్‌.లోని సెక్షన్‌ 93 (పూర్వం ఐ.పీ.సీ 317) ఇలా చెప్తుంది: ‘‘పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తండ్రి అయినా, తల్లి అయినా లేదా అలాంటి పిల్లల సంరక్షణ కలిగి ఉన్న ఎవరైనా, ఆ బిడ్డను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో – ఆ బిడ్డను వదిలించుకునే ఉద్దేశంతో బహిర్గతం చేసినా లేదా వదిలేసినా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.’’ 

    అంతేకాదు. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ 2015, సెక్షన్‌ 75 ప్రకారం: పిల్లలను శారీరకంగా, మానసికంగా క్రూరత్వానికి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడంపై కఠిన చర్యలు ఉన్నాయి. పిల్లలపై బాధ్యత లేదా నియంత్రణ ఉన్న వ్యక్తి, వారి ఆరోగ్యం లేదా భద్రతకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే 3 ఏళ్ల వరకు జైలుశిక్ష,  లక్ష వరకు జరిమానా ఉంటుంది.

    కాబట్టి పై కేసులు పెట్టండి. పోలీసులకి గానీ, శిశు సంక్షేమ శాఖవారి ద్వారా కానీ పిర్యాదు చేయవచ్చు. అదనంగా మీ పిల్లల కోసం – మీకోసం కూడా మెయింటెనెన్స్‌ కోరుతూ కేసు వేయండి. డీ.వీ.సీ. చట్టం కింద భారీ పరిహారం, గృహ వసతి కూడా కోరవచ్చు. మీకు త్వరగా ఉపశమనం కావాలి అనుకుంటే అదనంగా హై కోర్టును ఆశ్రయించి త్వరితగతిన కేసులు తేల్చవలసిందిగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com  కు మెయిల్‌ చేయవచ్చు.  

    (చదవండి: కిరణ్ రావుకు చికున్‌గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..)

  • బాలీవుడ్‌ చిత్ర నిర్మాత కిరణ్‌ రావు ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లో తనకు చికున్‌గున్యా వచ్చినట్లు తెలిపారు. దాని కారణంగా కనీసం పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాధి తన కీళ్లను ఎంతలా బలహీనపరిచిందో వివరించారామె. అసలు ఈ వ్యాధి అంతలా కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అంటే..

    ఆల్ఫావైరస్ అనే దోమ జాతి కారణంగా RNA వైరస్ అయిన  చికున్‌గున్యా మానవ శరీరం లక్ష్యంగా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గుతుందేమో కానీ..దాని తాలుకా ఇబ్బందులు శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి, ఎదుర్కొంటాం కూడా అంటున్నారు నిపుణులు. అసలు 'చికున్‌గున్యా' అంటేనే వంగి ఉండే భంగిమ అని అర్థం. అంటే మన కీళ్లను, కండరాలపై ప్రభావం చూపి..కదపలేని పరిస్థితికి తీసుకువస్తాయి.

    కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..
    ఏడిస్ ఈజిప్టి లేదా ఏడిస్ ఆల్బోపిక్టస్ వంటి జాతి దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందట. ఆ దోమకాటు కారణంగా ఈ చికున్‌గున్యా వైరస్‌ రక్తప్రవాహంలోకి ప్రవేశించి కీళ్లలోని బంధన కణజాలం సైనోవియల్ ఫైబ్రోబ్లాస్ట్‌లకు వ్యాపిస్తుంది. దాంతో మనకు శరీరమంతా విపరీతమైన నొప్పులు..నడవాలన్న వణుకు పుట్టడం వంటి సమస్యలు వస్తాయట. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై త్రీవంగా దాడి చేస్తుందట. 

    ఫలితంగా శరీరంలో పలుచోట్ల వాపులు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ వైరస్‌ చాలా దూకుడుగా ఉంటుందని, ఒక్కోసారి దీర్ఘకాలిక కీళ్ల వ్యాధిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. కొందరిలో రుమటాయడ్‌  ఆర్థరైటిస్‌ బారిన పడేలా చేస్తుందట. అంతేగాదు కొంతమందికి కోలుకున్నాక కూడా పూర్తిస్థాయిలో కదలికలను తిరిగి పొందలేరట. అలాంటి వారికి ఫిజియోథెరపీ అవసరం ఏర్పడుతుందని చెబుతున్నారు. నిరంతర కీళ్లనొప్పి ఈ వ్యాధి ముఖ్య లక్షణంగా చెబుతున్నారు నిపుణులు. 

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

    చుట్టుపక్కల నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. అంటే పూలకుండీలు, ఇంటి బయట ఉండే కంటైనర్లు లేదా డ్రమ్‌లో నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని

    పగటి పూట కుట్టే దోమల వల్ల వస్తుంది కాబట్టి..పొడవాటి చేతులు ఉన్న బట్టలు ధరించాలి. దోమల కుట్టకుండా లోషన్‌లు వంటివి రాసుకోవడం చేయాలి. 

    అవసరమైతే దోమతెరలు తదితరాలను వాడటం

    అలాగే ఇంట్లో ఎవ్వరికైనా చికున్‌గున్యా వస్తే..తక్షణమే దోమల రాకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి.

    చివరగా ఈవ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఓపికతో తగిన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. దీనికి నిర్ధిష్ట నివారిణి గానీ, టీకా వంటివి లేవని వైద్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. త్వరితగతిన కోలుకోవాలంటే మాత్రం..జ్వరం తగ్గేలా మందులు తీసుకుంటూ..వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాలు పుష్కలంగా తీసుకోవాలి. అలాగే కీళ్లు మరి బిగిసుపోకుండా ఉండేలా సాగదీయడం, ఫిజియోథెరపీ వంటివి తీసుకోవడం వంటివి చేయాని చెబుతున్నారు నిపుణులు.

    (చదవండి: ఎవరీ సరితా యోల్మా..? 146 ఏళ్లకు..)

     

  • నూట నలభై ఆరు సంవత్సరాల డార్జిలింగ్‌ హిమాలయన్‌ రైల్వే (డీహెచ్‌ఆర్‌) చరిత్రలో తొలి మహిళా టికెట్‌ కలెక్టర్‌ (టీసి)గా సరితా యోల్మో చరిత్ర సృష్టించింది.  ప్లస్‌ టు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రావడంతో పై చదువులు చదువుకోలేకపోయింది సరిత. ఆమె భర్త దవా యోల్మో కూడా రైల్వేలో పనిచేసేవారు. ఆయన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌గా రిటైర్‌ అయ్యారు.
    ‘సరిత అంకితభావం ఉన్న ఉద్యోగి మాత్రమే కాదు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను ఎలా సమన్వయం చేసుకోవాలో బాగా తెలిసిన మహిళ. డీహెచ్‌ఆర్‌లో ఫస్ట్‌ ఉమెన్‌ ట్రైయిన్‌ టికెట్‌ కలెక్టర్‌గా సరితను చూడడం గర్వంగా ఉంది’ అంటున్నాడు దవా యోల్మో.

    న్యూ జల్పైగురి నుండి నడిచే బ్రాడ్‌–గేజ్‌ రైళ్లలోటికెట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది సరిత.
    ‘డీహెచ్‌ఆర్‌లో టీసిగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొంత భయం కూడా ఉంది. న్యూ జల్పైగురి, డార్టిలింగ్‌ల మధ్య పది గంటల ప్రయాణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం నా ఉద్యోగ జీవితంలో కొత్త ఎపిసోడ్‌’ అంటుంది సరిత.
    టికెట్‌ కలెక్టర్‌ యూనిఫామ్‌లో ఉన్న సరితను ఆసక్తికరంగా చూస్తుంటారు ప్రయాణికులు. కొందరు ఆమెతో సెల్ఫీలు తీసుకుంటారు.

    ‘కుర్సియాంగ్‌లోని రైల్వే ప్రెస్‌లో పనిచేయడం నాకు సంతోషంగా ఉండేది. అయితే ఆ ప్రెస్‌ మూసివేయడంతో విధి నాకు వేరే దారి చూపింది. న్యూ జల్పైగురికి బదిలీ కావడంతో కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వచ్చింది. నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలోని వాణిజ్య విభాగంలో చేరకపోతే, నాకు కొత్త అవకాశాలు వచ్చేవి కావు. అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంది సరిత.

     

    (చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..)
     

NRI

  • ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ‌ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి.  

    వేలూరి గారంటే...
    లింక్డిన్‌లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్‌ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్‌ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు.  

    వేలూరి స్నేహాలు  
    ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్‌ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.

    వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో  ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత.  

    ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్‌ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్‌ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే  ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్‌ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.

    ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్‌గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్‌ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.

    వేలూరికి మనుషులు కావాలి!  
    వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్‌కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు.  

    వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్‌ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్‌ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని!  

    కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్‌గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు.    

    ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్‌ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 

    👉 సోల్‌మేట్ క‌థ చ‌దివారా? 

    న్యూయార్కర్‌ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్‌ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్‌ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్‌ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్‌ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న.  

    – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత 

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడా జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదల అయ్యాడు. సినిమాల పైరసీ కేసులో నవంబర్‌ 16వ తేదీన ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సుమారు 90 రోజులపాటు రవి జైలులోనే ఉన్నాడు. 

    తాజాగా 12 షరతులతో కూడిన బెయిల్‌ కోర్టు ఇవ్వడంతో రవి విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్‌ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది. అయితే, ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

    కాగా,ఇమ్మడి  రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్‌ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్‌ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్‌ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది.  

    గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్‌ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్‌ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్‌ పేరుతోనే డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.

    ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్‌ అయిన కాళీప్రసాద్‌ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్‌.ఇన్, సప్లయర్స్‌.ఇన్‌ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్‌ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు.
     

  • సాక్షి,మంచిర్యాల జిల్లా: రాళ్ల దాడి కేసులో అరెస్టయిన బాల్క సుమన్‌కు మంచిర్యాల కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌  రిమాండ్‌ విధించింది. మంచిర్యాల ఫస్ట్‌ క్లాస్‌ అడిషన్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆదిలాబాద్‌ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. 

    బాల్క సుమన్‌ అరెస్టు సమయంలో ఆయన నివాస ప్రాంతమైన క్యాతన పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు భారీగా తరలి వచ్చారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటిగేటును బలవంతంగా ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసుల రాకపై సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  బాల్క సుమన్‌ ఇంటి గేట్‌ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాల్క సుమన్‌ ఇంటి గేట్లను బలవంతంగా ఓపెన్‌ చేశారు. ఇంట్లో ఉన్న బాల్క సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

     

    మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రి వివేక్‌ కాన్వాయ్‌పై బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాల్క సుమన్‌ను అరెస్టు చేశారు. 

    సుమన్‌ను విడుదల చేయాలి: హ‌రీశ్‌రావు
    మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయ‌న ఖండించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకే ఆయ‌న‌ను అరెస్ట్ చేశార‌ని ఆరోపించారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వ‌జ‌మెత్తారు.  

International

  • ప్రముఖ న్యాయవాది (87) కోటీశ్వరుడు, దాత రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని మేరీల్యాండ్‌ లోని పోటోమాక్‌లోని కోగిర్ పోటోమాక్ సీనియర్ లివింగ్  (Cogir Potomac Senior Living)) ఫెసిలిటీలో తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు.   ఆయన్ని గుర్తు తెలియని తుపాకీతో కాల్చి చంపినట్టు అదికారులు భావిస్తున్నారు.

    న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, ఉదయం 7:34 గంటల ప్రాంతంలో ఎమర్జెన్సీ రెస్పాండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఫుల్లర్ తలకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. ఆ గాయం తుపాకీ కాల్పులదేనని, ఇది హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రస్తుతం నిఘా కెమెరాల (surveillance footage) ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదు, అరెస్టు చేయలేదు.

    యాజమాన్యం స్పందన
    ఆయన మరణంపై సంతాపం  ప్రకటించింది.  తమ నివాసితుల , సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని పేర్కొన్న కోగిర్ పొటోమాక్ యాజమాన్యం, భద్రతాపరమైన మార్పుల గురించి లేదా సిబ్బంది ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.  

    ఎవరీ రాబర్ట్ ఫుల్లర్ జూనియర్ 
    అమెరికా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మెల్విల్ ఫుల్లర్ మునిమనవడు రాబర్ట్‌ ఫుల్లర్‌.  మైనే (Maine) రాష్ట్రంలో 35 ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. యు.ఎస్. నావల్ రిజర్వ్‌లో సీనియర్ అధికారిగా పనిచేశారు.

    (జస్ట్‌ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)

    ప్రముఖదాతగా గుర్తింపు  
    ఆగస్టా నగరంలోని కోనీ హైస్కూల్ అథ్లెటిక్ సౌకర్యాల మెరుగుదల కోసం 1.64 మిలియన్‌ డాలర్ల భారీ విరాళం ఇచ్చారు. మైనే జనరల్ మెడికల్ సెంటర్, కెన్నెబెక్ హిస్టారికల్ సొసైటీ వంటి సంస్థలకు కూడా ఆయన మద్దతుగా నిలిచారు. రాబర్ట్‌ పుల్లర్‌ మరణానంతరం ఆగస్టా నగరం నివాళులర్పిస్తూ, ఫుల్లర్ కేవలం దాత మాత్రమే కాదు, ఆగస్టా ప్రజల పట్ల, నగర భవిష్యత్తు పట్ల గొప్ప  విశ్వాసం ఉన్న  గొప్ప వ్యక్తి అని కొనియాడింది. సిటీ కౌన్సిల్ , ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

    ఇదీ చదవండి: పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!