Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్‌ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్‌ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్‌ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశాన్ని కివీస్‌ పోగొట్టుకుంది. 

    శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), టీమ్‌ సీఫెర్ట్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్‌ బాంటన్‌ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ప్రదర్శన కనబర్చారు.  

    ఓపెనర్లు మినహా... 
    తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్‌ అలెన్‌ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్‌ ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. 

    ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన రేహన్‌ అహ్మద్‌ తన తొలి బంతికే రచిన్‌ రవీంద్ర (11)ను అవుట్‌ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్‌ మిడిలార్డర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

    సమష్టి ప్రదర్శన... 
    ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు సాల్ట్‌ (2), బట్లర్‌ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెతెల్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్‌ బాధ్యత తీసుకోగా, స్యామ్‌ కరన్‌ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. 

    అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ చేసి కివీస్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్‌ అహ్మద్‌ (7 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 

    స్వదేశానికి మ్యాట్‌ హెన్రీ... 
    కొలంబో: న్యూజిలాండ్‌ ప్రధాన పేస్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్‌ ఫలితం తర్వాత కివీస్‌ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు.  

    పాక్‌ సెమీస్‌ చేరాలంటే... 
    నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే ‘గ్రూప్‌–2’ సూపర్‌–8 మ్యాచ్‌ మూడో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరుకుంటుంది. పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే మ్యాచ్‌లో గెలవడంతో పాటు రన్‌రేట్‌లో కూడా కివీస్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది. పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.  

    టి20 ప్రపంచకప్‌లో నేడు
    శ్రీలంక X పాకిస్తాన్‌
    వేదిక: పల్లెకెలె, రాత్రి 7 గంటల నుంచి    
    స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

    స్కోరు వివరాలు  
    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 35; అలెన్‌ (సి) బెతెల్‌ (బి) జాక్స్‌ 29; రచిన్‌ (సి) బెతెల్‌ (బి) రేహన్‌ 11; ఫిలిప్స్‌ (బి) జాక్స్‌ 39; చాప్‌మన్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 15; మిచెల్‌ (సి) జాక్స్‌ (బి) డాసన్‌ 3; సాంట్నర్‌ (నాటౌట్‌) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్‌ 14; హెన్రీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్‌: ఆర్చర్‌ 3–1–24–0, డాసన్‌ 4–0–32–1, కరన్‌ 1–0–10–0, రషీద్‌ 4–0–28–2, జాక్స్‌ 4–0–23–2, బెతెల్‌ 1–0–13–0, రేహన్‌ 3–0–28–2.  

    ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సీఫెర్ట్‌ (బి) హెన్రీ 2; బట్లర్‌ (సి) సీఫెర్ట్‌ (బి) ఫెర్గూసన్‌ 0; బ్రూక్‌ (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 26; బెతెల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 21; బాంటన్‌ (సి) చాప్‌మన్‌ (బి) రచిన్‌ 33; కరన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 24; జాక్స్‌ (నాటౌట్‌) 32; రేహన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117.  బౌలింగ్‌: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్‌ 2–0–14–1, సాంట్నర్‌ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్‌ 4–0–43–1, రచిన్‌ 4–0–19–3, సోధి 2–0–21–0. 

  • టీమిండియా స్టార్‌ రింకూ సింగ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్‌ సింగ్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

    తండ్రి పాడె మోస్తూ..
    దీంతో రింకూ సింగ్‌ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.

    ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్‌కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.

    రింకూ తిరిగి జట్టుతో చేరతాడు
    తన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో మ్యాచ్‌ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.

    కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్‌ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    బ్యాట్‌ ఝులిపించనేలేదు
    ఇక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్‌ దశలో నాలుగు.. సూపర్‌-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. 

    అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌!!... ముందుగా షెడ్యూల్‌ చేసినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్నట్లు సమాచారం.

    గతేడాది ఇలా
    గతేడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్‌.. జూన్‌ 3న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్‌-2026 టోర్నీ మార్చి 26న ఆరంభం కానుందని తొలుత పాలక మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది. డిసెంబరులో జరిగిన వేలానికి ముందు ఈ మేరకు సమాచారం అందించింది.

    కారణం ఇదేనా?
    అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌ మార్చి 28న మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫైనల్‌ను మే 31న నిర్వహించనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్‌ ఆరంభ తేదీకి సంబంధించి పాలక మండలి వచ్చే వారం సమావేశమై డేట్‌ ఫిక్స్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

    అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈమేరకు తేదీల్లో మార్పు చేసినట్లు పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తమిళనాడు (చెన్నై), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) హోం గ్రౌండ్స్‌గా ఉండగా.. అసోంలోని గువాహటి రాజస్తాన్‌ రాయల్స్‌కి రెండో హోం గ్రౌండ్‌.

    ఆర్సీబీకి స్టేడియం దొరికిందా?
    ఇక ఐపీఎల్‌ రెండు రోజులు ఆలస్యంగా ఆరంభం కావడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం అయితే.. గత ఎడిషన్‌ విజేత ఆర్సీబీకి ఇంతవరకు తమ హోం గ్రౌండ్‌పై ఇంత వరకు స్పష్టత రానట్లు సమాచారం. కాగా మొట్టమొదటిసారి ట్రోఫీ గెలిచిన సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు చర్య విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 

    విజయోత్సవ విషాదం
    బెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ఎలాంటి అనుమతి లేకుండా పిలుపునివ్వగా భారీ ఎత్తున అభిమానులు కదలివచ్చారు. ఈ క్రమంలో  తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేసులు నమోదు కావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

    దీంతో ఈసారి తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి తరలించాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ వేదికల కోసం ఇప్పటికే నవీ ముంబై, రాయ్‌పూర్‌, పుణెలను ఎంచుకుని ఆయా స్థానిక బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ధ్రువీకరించాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ ముందుకు సాగుతోంది. సూపర్‌-8లో తొలుత పాక్‌తో కివీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్‌ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది.

    నెట్‌ రన్‌రేటు పరంగానూ
    ఇక తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్‌ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్‌ రన్‌రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలతో కూడన గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

    రెండో బెర్తు కోసం న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్‌ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిచిందంటే న్యూజిలాండ్‌ నేరుగా సెమీస్‌ చేరుతుంది.

    ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

    రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు
    ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్‌, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

    ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.

    మ్యాట్‌తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్‌ చేరుతుందని.. అప్పటికి మ్యాట్‌ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్‌.. మార్చి 5న రెండో సెమీస్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్‌తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.

    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రేయస్‌ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

    ఇదిలా ఉంటే.. కివీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్‌ అయ్యర్‌ లోకల్‌ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్‌ టీ20 కప్‌లో ఈ ముంబైకర్‌ BPCL జట్టుకు ఆడుతున్నాడు.  

    తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌
    ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్‌ అయ్యర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

    మరోసారి ఫెయిల్‌
    ఇక రెండో మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. రిలయన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ముంబైకర్‌ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.

    ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.

    అగార్కర్‌ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లు
    ఆసియా టీ20 కప్‌-2025 ఆడిన జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శ్రేయస్‌ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్‌ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.

    ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్‌-2026 టోర్నీకి ముందు లోకల్‌ టోర్నమెంట్లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్‌ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్‌ అయ్యర్‌ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.

    తిలక్‌ ప్రదర్శన ఇలా..
    ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్‌ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లపై తిలక్‌ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.

    టాపార్డర్‌ నుంచి తీసేశారు!
    అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్‌ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.

    ఊహించినట్లుగానే టాపార్డర్‌ మారింది. అభిషేక్‌ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్‌ హ్యాండర్‌ సంజూ శాంసన్‌ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్‌ వర్మను లోయర్‌ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.

    16 బంతుల్లోనే 
    ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్‌ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్‌మెంట్‌ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్‌ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.

    డౌన్‌ ఆర్డర్‌కు పంపడం మంచిదైంది
    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తిలక్‌ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్‌ వర్మను డౌన్‌ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్‌ ఆర్డర్‌లో అతడు బ్యాటింగ్‌ చేయడం నేను ఇప్పటికే చూశాను.

    నిజానికి ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్‌ పాండ్యా ఐదు, తిలక్‌ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. 

    ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్‌, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్‌ అవకాశాలు మెరుగుపరచుకుంది.

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • టీమిండియా స్టార్‌ జితేశ్‌ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.

    భారత టీ20 జట్టులో
    మహారాష్ట్రకు చెందిన జితేశ్‌ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. 162 పరుగులు చేశాడు.

    చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 

    ఆర్సీబీ స్టార్‌
    ఇక ఐపీఎల్‌లో గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్‌.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ గైర్హాజరీలో పలు మ్యాచ్‌లకు సారథిగానూ జితేశ్‌ వ్యవహరించడం విశేషం.

    డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని
    ఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పాడ్‌కాస్ట్‌లో జితేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘నా కెరీర్‌లో క్రికెట్‌ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.

    మార్కుల కోసమే క్రికెట్‌లోకి
    అది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాను.

    అప్పుడు వికెట్‌ కీపర్‌ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్‌ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్‌ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.

    ఆ ఇద్దరిది కీలక పాత్ర
    ఆ తర్వాత ఓసారి నేను దినేశ్‌ కార్తిక్‌ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్‌ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.

    ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్‌లో గొప్ప టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పగలను’’ అని జితేశ్‌ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. 

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్‌ సేన.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది.

    తొలుత బ్యాటింగ్‌
    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (11) మాత్రం విఫలమైంది.

    హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకం
    కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్‌ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌, అలనా కింగ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్‌ షట్‌, నికోలా క్యారీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

    ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్‌ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ ఫోబే లిచిఫీల్డ్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ అదరగొట్టారు.

    జార్జియా శతకంతో..
    లిచిఫీల్డ్‌ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్‌ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్‌ (10) విఫలమైంది.

    అయితే, ఆష్లే​ గార్డ్‌నర్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక భారత్‌- ఆసీస్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్‌ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.

    చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్‌ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.

    ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్‌ రన్‌రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్‌ (-0.100) కంటే విండీస్‌ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.

    భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేది
    నిజానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్‌ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్‌రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 

    టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్‌ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

    ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.

    మా బ్యాటర్లు సూపర్‌.. కానీ బౌలర్లే
    ఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్‌ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తాము బౌలింగ్‌ పరంగా మరింత స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్‌కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్‌ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.

    అదరగొట్టిన అర్ష్‌దీప్‌
    కాగా ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌- వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్‌ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్‌లో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, శివం దూబే తలా ఒక్క వికెట్‌ తీశారు.

    భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే స్కోర్లు
    👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై
    👉భారత్‌: 256/4(20)
    👉జింబాబ్వే: 184/6(20) 
    👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

  • టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్‌.

    ఏకంగా 256 పరుగులు
    ఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్‌ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ భారత బౌలింగ్‌ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్‌ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. నోబాల్‌, వైడ్‌లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.

    ఇది బ్యాటింగ్‌ పిచ్‌
    ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్‌ పిచ్‌. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.

    ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా?
    అసలు దూబే ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్‌ స్టంప్‌ మీదకు బాల్‌ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్‌ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్‌ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్‌ చేయించాలి.

    ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్‌ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.

    చదవండి: T20 WC 2026: భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ రోజు వర్షం పడితే..?

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో నేడు (ఫిబ్రవరి 27)  కీలక సమరం జరుగనుంది. గ్రూప్‌-2 నుంచి ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌.. మరో బెర్త్‌ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

    ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. తద్వారా పాక్‌ మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

    అదే ఇంగ్లండ్‌ గెలిస్తే సెమీస్‌ రెండో బెర్త్‌ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్‌, న్యూజిలాండ్‌ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. 

    ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్‌ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌ రన్‌ రేట్‌ 3.050గా ఉంది. అదే పాక్‌ రన్‌రేట్‌ -0.461గా ఉంది. 

    పాక్‌ మైనస్‌ నుంచి ప్లస్‌ రన్‌రేట్‌లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్‌ రన్‌రేట్‌ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి,  నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా, న్యూజిలాండ్‌కు సెమీస్‌ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. 

    వాస్తవానికి న్యూజిలాండ్‌ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్‌తో జరగాల్సిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్‌ జరిగి ఉంటే, న్యూజిలాండ్‌ సునాయాసంగా పాక్‌ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకునేది.

    బలాబలాల ప్రకారం ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ సమతూకంగా కనిపించినా ఎడ్జ్‌ న్యూజిలాండ్‌వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. అదే ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌, జేకబ్‌ బేతెల్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్‌ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీ

    ఇంగ్లండ్‌: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
     

National

  • ఢిల్లీ: బిహార్‌ రాష్ట్రంలో ఐపీఎస్‌గా విధుల నిర్వరిస్తున్న సునీల్‌ నాయక్‌పై ఏపీ పోలీసుల వేధింపుల నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అధికారులపై రాజకీయ వేధింపులకు చెక్‌ పెడుతూ బిహార్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక విధులు నిర్వరిస్తున్న సమయంలో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటే తమ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బిహార్‌ ప్రభుత్వం. 

    బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ  నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు  ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్‌ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో  బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతి పై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది.

     

     

  • ఢిల్లీ: లిక్కర్‌ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులను ట్రయల్‌ కోర్టు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అభియోగాలకు తగిన ఆధారాలను సీబీఐ చూపకపోవడంతో నిందితులను స్పెషల్ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ డిశ్చార్జ్ చేశారు. 

    ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని రౌస్‌ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్‌తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలనుకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 20 మంది నిందితులందరికీ కోర్టు శుక్రవారం విముక్తి కల్పించింది.

    అలాగే సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయ మూర్తి గమనించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది.
     

  • చెన్నై:  తమిళ నటుడు, టీవీకే చీఫ్‌కు విజయ్‌కు భారీ షాక్‌ తగిలింది. పాతికేళ్లకు పైగా వివాహం బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్‌లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.

    సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడని సంగీత ఆరోపించింది. 2021లో ప్రతివాదికి నటితో అక్రమ సంబంధం ఉందని ఆమె పేర్కొంది. అయితే సంబంధాన్ని ముగించాలని హామీ ఇచ్చిన తర్వాత కూడా విజయ్‌లో మార్పులేదని పాత ధోరణే కొన సాగుతోందనేది సంగీత ప్రధాన అరోపణ. అదే భర్తనుంచి చట్టబద్ధంగా విడిపోవాలనే తన నిర్ణయానికి పునాది వేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. 

    జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్టు లేదా అవతలి వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలితే, ప్రత్యేక వివాహ చట్టం, 1954 విడాకులకు అనుమతిస్తుంది. సంగీత పిటిషన్ ఈ రెండు చట్టపరమైన కారణాలను విచారిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం జిల్లా కోర్టు ముందు ఉంది. 

    కాగా విజయ్,సంగీత  తమ విభేదాలను బహిరంగంగా అంగీకరించనప్పటికీ గత రెండేళ్లుగా విజయ్ నుండి విడిగా నివసిస్తున్న సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు మహిళా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించి కేసును కుటుంబ సంక్షేమ కమిటీకి బదిలీ చేసింది.వారి సుదీర్ఘ మౌనం అభిమానులు, మీడియాలో నిరంతర ఊహాగానాలకు ఆజ్యం పోసింది. 1999 ఆగస్టులో ప్రేమవివాహం చేసుకున్న ఈ జంటకు జాసన్ సంజయ్ (25) , దివ్య షాషా (20) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

    విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య

    సినిమా నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళగ వెట్రి కజగం(TVK) పార్టీని ప్రారంభించిన విజయ్‌ కెరీర్, ప్రజా జీవితంలో ఈ పరిణామం కీలకమైంది అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు విజయ్ బృందం లేదా సంగీత ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

    ఇదీ చదవండి: పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్‌,షాకింగ్‌ వీడియో

     

  • న్యూఢిల్లీ:  ఢిల్లీ ప్రభుత్వ మాజీ ఎక్సైజ్ (లిక్కర్) విధానానికి సంబంధించిన  స్కాంలో  మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అవినీతి కేసులో సహా నిందితులందరినీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆప్‌నేత కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

    లిక్కర్‌ స్కాం కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత, కేజ్రీవాల్ బీజేపీపై తన దాడిని ఎక్కుపెట్టారు. తనపై తప్పుడు కేసులు బనాయించి,తనను ఆమ్‌ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా ద్వయం కుట్ర  పన్నిందని  ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలకు స్పందిస్తూ, తనపై, తన పార్టీపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారమైనవని  తేలిందని  కేజ్రీవాల్ అన్నారు. ఈ కేసులో సీబీఐ ,ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పటికీ, ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే దానిపై తుది నిర్ణయం కోర్టుదేనని  స్పష్టం చేశారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, కేసును కొనసాగించ డానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు తేల్చిందని కేజ్రీవాల్ అన్నారు. 

    ఇదీ చదవండి: లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం

    కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌ రావడంతో అటు ఆప్‌ శ్రేణులు, ఇటు ఆయన భార్య సునీత ఆనందంలో మునిగి తేలారు. భర్తను ఆలించగనం చేసుకొని ఆమె  కన్నీళ్లు పెట్టుకున్నారు.

  • ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.

    పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్‌నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్‌లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.

     ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాంరాజ్‌లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్‌సైకిల్‌పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్‌, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .

    ఇదీ చదవండి:  ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్‌

    పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్‌, సుధీర్‌ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆ‍గ్రహం పెంచుకున్న ప్రదీప్‌ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

    ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?

    కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్‌ టార్గెట్‌ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.  అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.

    బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. 

  • హమీర్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో సినిమా తరహా ట్విస్ట్‌లతో ఓ ఘటన జరిగింది. పెళ్లయిన కొన్ని గంటలకే వధూవరులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ఉండటానికి వధువు నిరాకరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం, తక్షణమే విడాకులు తీసుకోవాలని దంపతులు నిర్ణయించుకున్నారు.

    అసలేం జరిగిందంటే.. పెళ్లి వేడుకలు అనంతరం వధువు మిథిలేష్ కుమారి తన అత్తవారింటికి చేరుకుంది. శోభనం రాత్రి దంపతులిద్దరూ గదిలోకి వెళ్లిన సమయంలో.. ఆమె తన భర్త ధరమ్ సింగ్ కుష్వాహాతో ఉండటానికి నిరాకరించింది. తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిపించారని మిథిలేష్ పేర్కొంది. తన కుటుంబ సభ్యులు తనను కొట్టి, బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారంటూ భర్తకు వివరించింది.

    వరుడు ధరమ్ సింగ్ కుష్వాహా స్పందిస్తూ.. వధువు ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేదన్నాడు. అలా చేసి ఉంటే ఇరు కుటుంబాలకు ఈ అవమానం తప్పేదని.. అసలు పెళ్లే జరిగేది కాదన్నాడు. ఇరు కుటుంబాలు హమీర్‌పూర్‌లోని రాత్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. పోలీసులు ఇరు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వధువు మిథిలేష్ తన నిర్ణయం మార్చుకోలేదు. తన భర్తతో ఉండటం ససేమిరా అంటూ స్పష్టం చేసింది.

    పోలీసులు మాట్లాడుతూ.. ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామని.. కాపురానికి వెళ్లడానికి వధువు ఇష్టపడటం లేదని.. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, ఆ జంట తక్షణమే విడాకులు తీసుకున్నారు. వధువు తన కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. కోల్‌కతా, దాని పరిసర జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో నమోదైంది. 10 కి.మీ లోతులో సంభవించిన ఈ భూకంపం నైరుతి బంగ్లాదేశ్‌లో కేంద్రంగా ఉంది. 

    భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని పరిసర జిల్లాల్లో కూడా భూకంపం సంభవించింది. దీని తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 5.4గా గుర్తించారు. ఇది 35 కి.మీ (21.75 మైళ్ళు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 

     

    కోల్‌కతా నగరం, పరిసర  ప్రాంతాల్లో  కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఎత్తైన నివాస సముదాయాలు, రద్దీగా ఉండే మార్కెట్‌లలో భూమి కంపించడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. తాజా సమాచారం  దీని వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టంగా జరగలేదు. స్థానికుల ప్రకారం ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు ఊగడం, ఫర్నిచర్ కంపించడం, కిటికీలు కొట్టుకోవడం లాంటివి సంభవించాయి. బహుళ అంతస్తుల భవనాలలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌గా మారాయి.

    కోల్‌కతాలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
  • లవ్‌బర్డ్స్‌ విజయ్ దేవరకొండ,  రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో   అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్‌ మీడియాలో  పంచుకోవడంతో ఫ్యాన్స్‌ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్‌ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్‌ను సెలబ్రేట్‌  చేసుకున్నారు. అయితే   సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో  రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్‌ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్‌ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో రికార్డ్‌ సృష్టించాయి.

    కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ  రాయల్‌ లుక్‌లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్  వివాహంలో  వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్‌ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్‌, సాంప్రదాయ హరామ్‌లు, స్టేట్‌మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్‌ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్,  చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి  మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు.  ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్‌తో రూపొందించారట. విజయ్‌ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒ‍క దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు  శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers)  తీర్చిదిద్దింది.

    పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టి
    న్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్‌ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.

    ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation)  దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.

    దేవతలా రష్మిక మందన్న
    వివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్‌లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.

    విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్‌కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్‌లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్‌ను క్రియేట్‌ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో  కళకళలాడుతూ అలరించారు. 

  • మధ్యప్రదేశ్‌లోని  అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో  11 మంది దివ్యాంగులైన పిల్లల  మృతిపై  ఆరాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.  ఈ మరణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతూ ఆశ్రమ నిర్వాహకులతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.

    ఉజ్జయినిలోని అంకిత్ సేవానంద్ ఆశ్రమంలో దివ్యాంగులు ( మైనర్లు)  మరణాన్ని  ఆ రాష్ట్ర కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలఫ్‌మెంట్ కమిషనర్‌లతో పాటు ఉజ్జయిని కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆశ్రమ నిర్వాహాకులకు కోర్టు నోటీసులందించింది.

    అసలేం జరిగింది?

    ఉజ్జయిని అంబోడియాలోని అంకిత్ సేవాధామ్ ఆశ్రమంలో గత 51 రోజులుగా 11 మంది పిల్లలు  అనారోగ్యకారణాలతో మృతిచెందారు. గతేడాది నవంబర్ 10 నుంచి ఈ ఏడాది జనవరి 10 వరకూ ఈ మరణాలు సంభవించాయి. చనిపోయిన పిల్లల వయసు 10-18 సంవత్సరాల మధ్యలో ఉంది. అయితే ప్రస్తుతం కూడా 50 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

    చాలా మంది ఆశ్రమానికి వివిధ రకాలైన సమస్యలతోనే వస్తారని వారిలో చాలామందికి నడవడం, తినే పరిస్థితిలో కూడా ఉండరని అన్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆశ్రమం డైరెక్టర్ సుధీర్ భాయ్  గోయల్ తెలిపారు.

    అయితే ఏడాదిన్నర క్రితం ఇండోర్‌లోని పురుష్ ధామ్ ఆశ్రమంలో ఈ పిల్లలు ఆశ్రయం పొందేవారు. ఆ సమయంలో ఇదే రీతిలో అక్కడ మరణాలు సంభవించడంతో ప్రభుత్వం ఆశ్రమం గుర్తింపు రద్దు చేసి అంకిత్ సేవాధామ్ ఆశ్రమానికి పిల్లలను తరలించింది. ఇప్పుడు ఇక్కడే ఇదే తరహా మరణాలు జరగడం ఆందోళనకు గురిచేస్తుంది. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు మార్చి 12లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది.

Movies

  • టైటిల్: సన్‌ ఆఫ్

    దర్శకుడు.. బత్తుల సతీష్ 

    నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్

    విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026

    సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..

    వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్  ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్‌మెంట్‌ టైమ్‌కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.

    ఎలా ఉందంటే..

    తండ్రీ కొడుకుల నేపథ్యంలో  గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్‌తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది.

    కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.

    ఎవరెలా చేశారంటే..

    సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్‌ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

     

  • పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు  ఆడియెన్స్‌ను మెప్పించాయి.

    తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే  ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు.  ఈ మూవీకి  షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. 
     

  • ఒకప్పుడు యాంకర్‌గా ఉర్రూతలూగించిన ఉదయభాను ఇప్పుడు సినీ నటిగా అలరిస్తోంది. గతేడాది త్రిబాణధారి బార్బరిక్‌ చిత్రంలో అలరించిన ఈ యాంకర్‌ ఇప్పుడు డాటరాఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుట లేదు వెబ్‌ సిరీస్‌లో పోలీస్‌గా కనిపించింది. ఈ సిరీస్‌ జీ 5లో నేడే రిలీజైంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఉదయభాను ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

    జాగ్రత్త అవసరం
    ఆమె మాట్లాడుతూ.. జెన్‌జీ కిడ్స్‌ వాళ్ల ప్రపంచంలో వాళ్లుంటున్నారు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు బిజీ.. పిల్లలు అయితే చదువు లేదంటే ఫోన్‌తో బిజీ అయిపోతున్నారు. కానీ, సోషల్‌ మీడియాకు పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే సోషల్‌ మీడియా టాక్సిక్‌.. అక్కడ మంచి కన్నా చెడుయే ఎక్కువగా ఉంది. ఈ ఫోన్‌ పిల్లల్ని క్రిమినల్స్‌గా మార్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

    పిల్లలంటే ప్రాణం
    నాకు పిల్లలంటే ప్రాణం. వాళ్ల కోసం ఉదయం ఐదుగంటలకే లేచి వంట చేసి పెట్టి షూటింగ్‌కు వెళ్తాను. వారికోసం ప్రత్యేక సమయం కేటాయిస్తాను. ఇకపోతే నేను తొలిసారి మైక్‌ పట్టింది హృదయాంజలి కోసం! అప్పటికి చిన్న చిన్న సీరియల్స్‌ చేశాను. కానీ హృదయాంజలి షోతోనే యాంకర్‌గా నా జర్నీ మొదలైంది అని ఉదయభాను చెప్పుకొచ్చింది.

    చదవండి: నాన్‌స్టాప్‌ షూటింగ్‌.. ఐదో రోజు ఆస్పత్రిలో హీరోయిన్‌

  • టాలీవుడ్ కొత్త జంట విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్‌ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్‌గా  జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు.  పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.

    అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్‌, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
     

     

  • రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రానికి యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్‌ థ్రిల్లర్‌లో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నారు.

    తాజాగా విలన్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నోటిలో సిగరెట్‌ పెట్టుకుని హై యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌ చూస్తుంటే విలన్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపిచనుంది.

    ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని మాఫియా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇప్పటివరకు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌  కనిపించనున్నారు.  ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రణయ్‌రెడ్డి వంగా, భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 5న  స్పిరిట్ థియేటర్లలో సందడి చేయనుంది. 
     

     

  • సాధారణంగా ఉద్యోగులు 8-9 గంటలపాటు పని చేస్తారు. కానీ సినిమా, బుల్లితెర ఆర్టిస్టులు మాత్రం కొన్నిసార్లు గ్యాప్‌ లేకుండా రోజంతా షూటింగ్‌ చేస్తూనే ఉంటారు. దీనివల్ల తాను చాలా ఇబ్బందిపడ్డానంటోంది బాలీవుడ్‌ నటి ఇషా కొప్పికర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్‌ మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాళ్లు నొప్పి పుట్టి ఇక నిలబడటం నా వల్ల కాదు అనేవరకు పని చేయించుకుంటూనే ఉంటారు. 

    ఇంటికి వెళ్లేంత తీరిక ఎక్కడిది?
    నా కెరీర్‌ మొదట్లో వెంటవెంటనే సినిమాలు చేశాను. షూటింగ్స్‌కు గ్యాప్‌ ఉండేది కాదు. కనీసం ఫిలిం సిటీ నుంచి నా ఇంటికి వెళ్లే తీరిక కూడా దొరికేది కాదు. దాంతో నిర్మాతలను షూటింగ్‌ లొకేషన్‌లోనే నాకంటూ ఒక రూమ్‌ వసతి కల్పించమని అడిగేదాన్ని. పొద్దున ఐదింటికి షూట్‌ స్టార్ట్‌ చేస్తే ఐదు గంటల వరకు కొనసాగేది. ఆ తర్వాత మళ్లీ రాత్రి ఏడింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు షూటింగ్‌ అయ్యేది. 

    సినిమా
    అలా వరుసగా ఐదు రోజులు జరిగింది. దాంతో ఆరో రోజు నేను సెట్‌లో కాకుండా హాస్పిటల్‌లో పడున్నాను అని గుర్తు చేసుకుంది. దీపికా పదుకొణె అడిగినట్లుగా 8 గంటల పని డిమాండ్‌ సబబే అని వత్తాసు పలికింది. కాగా ఇషా కొప్పికర్‌.. చంద్రలేఖ అనే తెలుగు చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తెలుగులో ప్రేమతో రా, కేశవ సినిమాల్లో నటించింది. హిందీ, తమిళంలో అనేక సినిమాలు చేసింది. చివరగా అయలాన్‌ మూవీలో తళుక్కుమని మెరిసింది.

    చదవండి: తల్లినవుతా.. కానీ పెళ్లి అవసరం లేదు: హీరోయిన్‌

  • టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విరోష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందే అఫీషియల్‌గా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్‌ కూడా అత్యంత  ప్రైవసీ పాటించిన ఈ జంట ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఎక్కడా కూడా తమ రిలేషన్‌షిప్‌ బయట పడకుండా కొన్నేళ్ల పాటు కొనసాగించారు. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించి దొరికిపోయినప్పటికీ ఎక్కడా కూడా అఫీషియల్‌గా ప్రకటించలేదు.

    అలా కొన్నేళ్లుగా వీరిద్దరి డేటింగ్ రూమర్స్‌ వస్తున్నా వాటిని అస్సలు పట్టింకోలేదు విరోష్ జంట. కేవలం తమ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అలా అత్యంత సీక్రెట్‌గా విజయ్- రష్మిక తమ బంధాన్ని కొనసాగించారు. అయితే గతేడాది ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన రష్మిక.. తన పెళ్లి గురించి ముందుగానే చెప్పేసింది. కానీ మనకే ‍అర్థం కాలేదంటూ నెటిజన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటో మనం కూడా తెలుసుకుందాం.

    గతంలో ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన రష్మికను.. అనంద్ దేవరకొండ ఆట పట్టించాడు. దీనికి రష్మిక సమాధానమిస్తూ.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా.. ఇలా నన్ను స్పాట్‌లో పెట్టి అడిగితే ఎట్లా అంటూ అప్పుడే హింట్ ఇచ్చేసింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లోనే ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిందని అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
     

     

  • యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్‌. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్‌ షానియల్‌ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్‌ లవ్‌స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.

    లవ్‌ సాంగ్‌
    మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్‌తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్‌.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్‌స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్‌ బాధను కూడా చూపించారు.

    సినిమా
    ఇదివరకు రిలీజైన టీజర్‌లో యాక్షన్‌ను ఎక్కువ హైలైట్‌ చేయగా ఈ పాటలో మాత్రం లవ్‌ టచ్‌ ఎక్కువ జోడించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

     

  • ది కేరళ స్టోరీ-2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్‌ ఇచ్చిన స్టేను డివిజన్‌ బెంచ్‌  కొట్టేసింది. దీంతో ఈ సినిమాకు రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తివేయడంతో ఈ మూవీ రిలీజ్‌ కానుంది. 

    కాగా.. గతంలో రిలీజైన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా 'కేరళ స్టోరీ 2' ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈనెల 27న రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాపై సింగిల్ బెంచ్ న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెన్సార్‌ బోర్డుపై కూడా హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.

    సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్‌ తెరకెక్కించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

  • విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్‌ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.

    ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్‌ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్‌లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్‌గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

    ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్‌గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్‌ లుక్‌తో వీరిద్దరు తమ వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.

     

  • ప్రస్తుత సమాజంలో చాలామంది పెళ్లంటేనే భయపడుతున్నారు. హీరోయిన్‌ డైసీ షా కూడా పెళ్లంటే వెనకడుగు వేస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ, డబ్బు.. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారు? అన్న ప్రశ్నకు తెలివిగా రెండూ అని బదులిచ్చింది. 

    రోజుకో వార్త..
    పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రేమలు, పెళ్లిళ్ల గురించి రోజుకో రకమైన వార్తలు వింటూనే ఉన్నాం. బ్లూ డ్రమ్‌ కేస్‌, బ్రేకప్‌ కేసులు ఎక్కువైపోతున్నాయి. అవన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అయితే పిల్లలు కనేందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటికే నేను నా అండాలను భద్రపరుచుకున్నాను. నేనెప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు పిల్లల్ని కంటాను అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించింది. భద్ర అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా మారా జైహో అనే హిందీ చిత్రంతో పేరు తెచ్చుకుంది. చివరగా రెడ్‌ రూమ్‌ వెబ్‌ సిరీస్‌తో అలరించింది. ప్రస్తుతం పలాష్‌ ముచ్చల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోంది.

  • రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.  ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. 

    తల్లిదండ్రులు, పిల్లలపై తాము పెంచుకునేది, పంచుకునేది ప్రేమ మాత్రమే. కాని పరిగెడుతున్న కాలంతో పోటీ పడతూ మారుతున్న ఈ సమాజంలో అదే ప్రేమ కాస్త తడబడుతూ తమ పిల్లలపై భయాన్ని కలుగజేస్తోంది. కన్న పిల్లల పై బాధ్యత తో కూడా ఆప్యాయత ఉండాలి కాని అనుమానంతో కూడిన భయం ఉండకూడదు అని చెప్పే సిరీస్ ఈ D/o ప్రసాదరావు కనుబడుటలేదు. నిజానికి  పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాల్సిన సిరీస్ ఇది. వాస్తవ ఘటనలపై అల్లుకుని అత్యంత వాస్తవికంగా తీసిన ఈ సిరీస్ టీనేజ్ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లితండ్రులకు ఈ సిరీస్ ఓ కనువిప్పులాంటిది అని చెప్పవచ్చు. అంతలా ఏముందో ఈ సిరీస్ లో ఓ సారి చూద్దాం. 

    ఊళ్ళో కిరాణ కొట్టు నడుపుకుంటున్నప్రసాదరావు కూతురు స్వాతి పట్టణంలోని ఉద్యోగం చేయడం కోసం భవాని హాస్టల్ లో చేరుతుంది. ప్రసాదరావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. అందుకే 20ఏళ్ళ నుండి ఎక్కడకూ పంపని కూతురుని మొట్టమొదటిసారిగా కూతురు కోసం పట్టణంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం కోసం కష్టంగా ఒప్పుకుంటాడు. అకస్మాత్తుగా స్వాతి కనిపించకుండా పోతుంది. కూతురుని వెతుక్కుంటూ ప్రసాదరావు హైదరాబాద్ కు వస్తాడు. కాని అనూహ్యంగా పోలీస్ విచారణలో స్వాతి చావుకు తన తండ్రి ప్రసాదరావే కారణమని తెలుస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకున్న స్వాతి తండ్రి ప్రసాదరావు స్వాతి చావుకు కారణమెలా అయ్యాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే జీ5లో స్ట్రీమ్ అవుతున్న D/o ప్రసాదరావు కనుబడుటలేదు చూడాల్సిందే.

    వాస్తవ ఘటనలను ప్రతిబింబించేలా, పదునైన సంభాషణలతో లోతైన భావాలతో చాలా హృద్యంగా చిత్రీకరించాడు దర్శకుడు. అంతేకాదు సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల ఊహకందనిది. జీ5 ఓటిటి వేదికగా  D/o ప్రసాదరావు కనుబడుటలేదు సిరీస్ మొత్తం 6 భాగాలలో స్ట్రీమ్ అవుతోంది. 

    ఈ సిరీస్ మొత్తం చూశాక ఆడపిల్లలున్న తండ్రులు మాత్రం తమ ఆడబిడ్డపై అనుమానం కాదు అనుబంధం ముఖ్యమని ఖచ్చితంగా భావిస్తారు. వర్త్ టు వాచ్ ఫర్ ది ఫాదర్స్ హూ హ్యావ్ డాటర్స్.
     

  • టాలీవుడ్ హీరో కిరణ్ ‍అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కిరణ్‌, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్‌ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.

    ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌ కలిసి నిర్మిస్తున్నారు.  ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్‌తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించనున్నారు.

  • విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్‌కు రానున్నారు.  ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్న తర్వాత తొలిసారిగా కలిసి కనిపించారు. తాజాగా ఉదయ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ క్రమంలో విజయ్‌, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు.  అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

    పెళ్లికి ముందు కూడా వారిద్దరూ కలిసి ప్రయాణం చేసినప్పటికీ వేర్వేరుగా ప్లాన్‌ చేసుకునేవారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అయితే, ఇప్పుడు పెళ్లి తర్వాత  ఒకరిచేయి మరోకరు పట్టుకుని సంతోషంగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇలా వారిద్దరూ కలిసి కనిపించడంతో  ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

  • కెరీర్‌ ఎంత స్పీడులో ఉన్నా సరే పెళ్లవగానే సినిమాలు తగ్గించేస్తుంటారు హీరోయిన్స్‌. కానీ కథానాయిక భాగ్యశ్రీ మాత్రం పెళ్లయ్యాకే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ మైనే ప్యార్‌ కియా చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అందుకుంది. ప్రస్తుతం సహాయక పాత్రలు పోషిస్తోంది.

    కాలక్షేపం కోసం..
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాగ్యశ్రీ మాట్లాడుతూ... సమాజాన్ని ప్రతిబింబించేవే సినిమాలు. 90'sలో జనాలకు వినోదం అంటే సినిమానే గుర్తొచ్చేది. కుటుంబంతో కలిసి సమయం కేటాయించడానికి, కాలక్షేపం చేయడానికి సినిమాకు వెళ్లేవారు. ఇప్పుడన్నీ మారిపోయాయి. చిన్న కుటుంబాలే ఎక్కువయ్యాయి. వినోదం కోసం అనేక మాధ్యమాలు వచ్చాయి. జనాలకు ఆప్షన్స్‌ ఎక్కువయ్యాయి.

    బలవంతంగా ఇరికించొద్దు
    అదే సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం అసాధ్యంగా మారింది. సినిమాల్లోనూ జానర్స్‌ వచ్చాయి. వాస్తవికతకు పెద్ద పీట వేశారు. అయితే మోడ్రన్‌ సినిమాల్లో సహజత్వం కోసం రొమాంటిక్‌ సన్నివేశాలను బలవంతంగా చొప్పించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు లేదా పిల్లలతో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అలాంటి క్లోజప్‌ సీన్స్‌ చిరాకు తెప్పిస్తాయి అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన భాగ్యశ్రీ.. ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌'లోనూ కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మూడు, నాలుగు హిందీ సినిమాల్లో నటించి వెండితెరపై చిన్న బ్రేక్‌ తీసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజా శివాజీ అనే చిత్రం చేస్తోంది. ఈ మూవీ మే1న విడుదల కానుంది.

    చదవండి: అదో చెత్త సినిమా.. ఇంత వెక్కిరించాలా?: నటుడు

  • టైటిల్‌: విష్ణు విన్యాసం
    నటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
     తదితరులు
    నిర్మాత: సుమంత్ నాయుడు జి
    రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
    సంగీతం: రధన్
    సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
    విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026

    వరస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు  శ్రీవిష్ణు. ఆ మధ్య సీరియస్‌ కంటెంట్‌ చిత్రాలు చేసినప్పటికీ..అవి బెడిసి కొట్టాయి. దీంతో తనకు అచ్చొచ్చి కామెడీ జానర్‌లోనే సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదే జోష్‌లో ఇప్పుడు విష్ణు విన్యాసం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్‌ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..
    ఈ సినిమా కాన్సెప్ట్‌ కొత్తదేమి కాదు. రాజేంద్ర ప్ర‌సాద్ ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ మొదలు మొన్నటి ప్రియదర్శి ‘సారంగపాణి’ వరకు జాతకం కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న హీరోయిన్‌ సమస్య కూడా పాతదే. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించిన ఓ సూపర్‌ హిట్‌ సినిమాలో ఆ పాయింట్‌ టచ్‌ చేశారు. ఇలా పాత కాన్సెప్ట్‌ని ఎంచుకొని.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను రాసుకొని జెంజీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు యధునాథ్ మారుతీ రావు. కథ, కథనం కంటే  శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే  ఎక్కువ దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు సినిమాకు ప్లస్‌ అయ్యాయి.  కానీ కథకి ఆడియన్స్‌ కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ కామెడీని కూడా పూర్తిగా ఎంజాయ్‌ చేయలేకపోయారు. 

    హీరోయిన్‌కి ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల సీన్‌తో హీరోని పరిచయం చేశారు. హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. ప్రతి పనికి గురువు(శ్రినివాస్‌ రెడ్డి)గారి అనుమతి తీసుకోవడం..ఇందంతా కొంతవరకు నవ్విస్తుంది. ఇక కాలేజీలో హీరోహీరోయిన్లు కలిసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌ వింతగా ప్రవర్తించడం.. దానికి తోడు శ్రీవిష్ణు వేసే వన్‌లైనర్‌ పంచ్‌లు.. కొంతమేర ఎంటర్‌టైన్‌ చేస్తాయి. హీరోయిన్‌ సమస్య ఏంటనేది ఇంటర్వెల్‌ వరకు చెప్పకపోవడంతో కథనంపై ఆసక్తి  పెరుగుతుంది. 

    కానీ ఆ సమస్య తెలిసిన తర్వాత మాత్రం ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సోష‌ల్ మీడియాలోని మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ సరైన కంటెంట్‌ లేకపోవడంతో అది కూడా పూర్తిగా వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌తో పాటు శ్రీవిష్ణు చేసే  కామెడీ అంతా కూడా ఆర్గానిక్‌గా అనిపిస్తుంది. కథలో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేయకుండా..కేవలం సంభాషణలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు.  అవి జెంజీ బ్యాచ్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. 

    ఎవరెలా చేశారంటే..
    ఎప్పటిమాదిరే శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన హవాభావాలు, సంభాషణలు అన్నీ కొంతవరకు నవ్విస్తాయి. మనీషా పాత్రకి నయ‌న సారిక న్యాయం చేసింది. కమెడియన్‌ సత్య కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆయనను సరిగా వాడుకోలేకపోయారనిపించింది. మురళీ శర్మ, గోపరాజు రమణ రెగ్యులర్‌ పాత్రల్లో కనిపించారు. బ్ర‌హ్మాజీ, స‌త్యం రాజేష్‌, శ్రీ‌నివాస‌రెడ్డితో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ మిగతా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉండడం(2:07 గంటలు)  ప్లస్‌ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

  • కేజీఎఫ్‌, కాంతారా, సలార్‌ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్‌కు పరిమితమైన ఈ బ్యానర్‌ ఇప్పడు అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసింది. 2012లో విజయ్ కిరగందూర్, చలువే గౌడ  నేతృత్వంలో మొదలైన ఈ సంస్థ  పునీత్ రాజ్‌కుమార్‌తో తొలి సినిమా తెరకెక్కించి భారీ కలెక్షన్స్‌ కొల్లగొట్టారు. ఆ తర్వాత కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందింది.

    తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఒక పోస్ట్‌ చేసింది  ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవంగా అక్కడ బలమైన మార్కెట్‌ ఉన్నప్పటికీ సరైన డిస్ట్రిబ్యూషన్ లేదని పరిశ్రమకు చెందిన వారే అంటుంటారు. ఇలాంటి సమయంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నడంతో అంచనాలు పెరిగాయి. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు ఓవర్సీల్‌లో భారీ సంఖ్యలో విడుదలయ్యే ఛాన్స్‌ రానుంది.

    హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ ఇప్పటికే పలు చిత్రాలను భారత్‌లో పంపిణీ చేసింది. మహావతార నరసింహ, మిరాయ్‌, L2: ఎంపురాన్ వంటి చిత్రాలను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి విజయం సాధించింది.  కాగా ,ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో కాంతార ప్రీక్వెల్‌తో పాటు సలార్ 2, కేజీఎఫ్‌-3, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 

  • ప్రముఖ మలయాళ స్టార్‌ జయరామ్‌ కుమారుడు, నటుడు కాళిదాస్‌ జయరామ్‌ ఓ బాలీవుడ్‌ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. కేరళ సాంప్రదాయాన్ని ఖూనీ చేశారంటూ 'పరమ్‌ సుందరి'ని చెత్త సినిమాగా అభివర్ణించాడు. అతడు‌ ప్రధాన పాత్రలో నటించిన ఆశాకల్‌ ఆయిరం అనే మలయాళ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు.

    చెత్త మూవీ
    ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నేను చూసిన చెత్త సినిమా పరమ్‌ సుందరి. ఈ మాట చెప్పడానికి కూడా నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఈ మూవీలో కేరళను చాలా చెత్తగా చిత్రీకరించారు. మన సంస్కృతిని అపహాస్యం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సినిమా చూసి చాలా అసంతృప్తికి లోనయ్యాను. పరమ్‌ సుందరి ఒక చెడ్డ అనుభవాన్ని ఇచ్చింది అని పేర్కొన్నాడు.

    సినిమా
    పరమ్‌ సుందరి విషయానికి వస్తే.. సిద్దార్థ్‌ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌  కేరళ కుట్టిగా యాక్ట్‌ చేసింది. తుషార్‌ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025 ఆగస్టు 29న విడుదలైంది. రిలీజైన నాటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది.

    చదవండి: విరోష్‌ పెళ్లి.. ఇది చూడటం నా అదృష్టం: కల్యాణి

  • ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారు.   రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో అతికొద్దిమంది సమక్షంలో ఒక్కటయ్యారు. విరోష్‌ పేరుతో తమ ఫ్యాన్స్‌ కోసం వారు కొన్ని ఫోటోలు షేర్‌ చేశారు. అయితే, తమ అభిమానులు ఈ జంటపై ప్రేమతో పాటు శుభాకాంక్షలు కురిపించారు. పెళ్లి ఫోటోలు సోషల్‌మీడియాలో సంచలనంగా మారాయి. మిలియన్ల కొద్ది లైక్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేశాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో వీరి పెళ్లి ఫోటోకు అత్యధికంగా లైక్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌ అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

    సినీ పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.  ఆ సందర్భంగా గతంలో వారు కూడా ఫోటోలు పంచుకున్నారు. బాలీవుడ్‌ నటి  కియారా అద్వానీ తమ పెళ్లి సమయంలో ఫోటోలు షేర్‌ చేస్తే 15.8 మిలియన్ల లైక్స్‌ వచ్చాయి. ఇప్పటివరకు ఇదే రికార్డ్‌. కానీ, తాజాగా విరోష్‌ జోడీ 18.5 మిలియన్ల లైక్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. విజయ్ దేవరకొండ కూడా అవే ఫోటోలను షేర్‌ చేశారు. అక్కడ కూడా 15.2 మిలియన్ల లైక్స్‌ రావడం విశేషం. మరోసారి విజయ్‌- రష్మిక జోడీ తమ ఇమేజ్‌ను చిత్రపరిశ్రమకు చూపారని ఫ్యాన్స్‌ అంటున్నారు.

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమాలో నటిస్తున్నారు. టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సీవాలా’ విజయం తర్వాత మరోసారి విజయ్‌తో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే ఏడాది సెప్టెంబర్‌ 11న ఈ మూవీ విడుదల కానుంది.

Business

  • ఐటీ సేవలు, కన్‌సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)  గ్లోబల్ కోడింగ్ పోటీ టీసీఎస్ కోడ్‌విటా (TCS CodeVita) విజేతలను ప్రకటించింది. ఇందులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన 21 ఏళ్ల జౌ జింకై మొదటి స్థానంలో నిలిచారు.

    ఈ సంవత్సరం జరిగిన గ్లోబల్ కోడింగ్ పోటీకి 1,46,922 మంది పాల్గొన్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను టీసీఎస్ సొంతం చేసుకుంది.

    విజేతలు
    బెస్ట్ ఉమెన్ కోడర్స్
    ➤తేజస్విని సింగ్ (లక్నో)
    ➤కీర్తి కె.పి. (చెన్నై)
    ➤మహాక్ లచ్వానీ (భోపాల్)

    బెస్ట్ ఏఐ కోడర్స్
    ➤జౌ జింకై (చైనా)
    ➤బెంజమిన్ ఒరెల్లానా (అమెరికా)
    ➤జార్జ్ వాల్డివియా (పెరూ)

    బెస్ట్ ఎమర్జింగ్ కోడర్స్
    ➤బాలశివ ఎస్ (చెన్నై)
    ➤జోస్ నూనెజ్ (ఈక్వెడార్)
    ➤గాబ్రియెల్లా పాడిల్లా (ఈక్వెడార్)

  • 2022-23 బేస్‌ ఇయర్‌గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) సిరీస్‌లో ఈ-వాహన్, వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) డేటాతో పాటు వంటవాళ్లు, డ్రైవర్లు, పనిమనుషులు అందించే ఇంటి పనులకు సంబంధించిన సేవల గణాంకాలు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

    గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసిన వివరణ ప్రకారం, కాలక్రమేణా ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులను ప్రతిబింబించేలా బేస్‌ ఇయర్‌ని ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తారు. అయితే కోవిడ్‌ పరిణామాలు, జీఎస్‌టీ అమలు తదితర అంశాల కారణంగా కొన్నాళ్లుగా మార్చలేదు. ప్రస్తుతం 2011-12గా ఉన్న బేస్‌ ఇయర్‌ని 2022-23కి మారుస్తున్నారు.

    కార్మిక శక్తి సర్వే, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోని సంస్థలపై నిర్వహించే అధ్యయనాలను ఈ గణాంకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, రహదారి రవాణా సర్వీసులకు సంబంధించి ప్రైవేట్‌ వినియోగ వ్యయాలను అంచనా వేసేందుకు ఈ-వాహన్‌ పోర్టల్‌ డేటాను ఉపయోగిస్తారు. జీడీపీలో రాష్ట్రాలవారీగా ప్రైవేట్‌ కంపెనీల వాటాను అంచనా వేసేందుకు జీఎస్‌టీ డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్‌–డిసెంబర్‌ 2025) సంబంధించి కొత్త సిరీస్‌ ప్రాతిపదికగా ఉండే జీడీపీ డేటాను శుక్రవారం (నేడు) విడుదల చేస్తారు.

  • భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

    జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన జెటోర్ టీ2 కారును లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది. దీనిని మహారాష్ట్రలోని దాని రాబోయే ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

    జెటోర్ టీ2 గ్లోబల్ మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) & ఆల్-ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం హైబ్రిడ్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అంటే ఇది చిన్న బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్  కూడా పొందుతుందన్నమాట

    హైబ్రిడ్ వెర్షన్ 26.7kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేసిన.. 154hp / 220Nm అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సింగిల్ మోటార్ FWD సెటప్ లేదా డ్యూయల్-మోటార్ AWD లేఅవుట్‌లో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ రేంజ్ 139 కి.మీ. కాగా పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ద్వారా ఎక్కువ మైలేజ్ లభించనుంది. కాబట్టి మొత్తం మైలేజ్ 1000 కిమీ కంటే ఎక్కువ వస్తుంది. జెటోర్ టీ2 కారు ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

    ఇదీ చదవండి: అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

  • ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ కొత్తగా 15ఆర్‌ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌ మొదలైన వాటిల్లో సేల్‌ మొదలవుతుంది.

    ఇందులో 6.59 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5, 7600 ఎంఏహెచ్‌ బ్యాటరీ, సూపర్‌ కంప్యూటింగ్‌ చిప్‌ క్యూ2, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఆరిజిన్‌ ఓఎస్‌ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

  • అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా దేశానికి చాలా సంవత్సరాలుగా.. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రజలు వలస వెళ్తున్నారు, వారిలో కొందరు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి & అనేక మార్పులు సంభవించాయి. మహా మాంద్యం తరువాత.. 2025లో దేశానికి వచ్చినవారి సంఖ్యకంటే, అమెరికా వీడి వెళ్లినవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

    2026లో పెరిగే అవకాశం
    2023లో అమెరికా దేశానికి వలస వచ్చినవారి సంఖ్య 60 లక్షలు. ఈ సంఖ్య 2025 నాటికి 26 లక్షల నుంచి 27 లక్షలకు చేరుకుంది. కాగా ఈ సమయంలో (2025లో) యూఎస్ఏ విడిచి వెళ్లినవారు 1.5 లక్షలు కావడం గమనార్హం. 2026లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    ప్రజలు అమెరికా విడిచి వెళ్లడానికి ప్రధాన కారణాలు.. పెరుగుతున్న జీవన వ్యయం,  సామాజిక హింస, రాజకీయ అస్థిరత అని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తరువాత ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పాలనలో దేశం విడిచి వెళ్తున్న అమెరికన్ల సంఖ్య పెరుగుదలను డొనాల్డ్ డాష్ అని పిలుస్తున్నారు.

    విదేశాల్లో అమెరికన్లు
    2025లో అమెరికా ప్రభుత్వం సుమారు 6.74 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించింది. కాగా మరో 22 లక్షలమంది దేశం విడిచి స్వచ్చందంగా బయటకు వెళ్లారు. కాగా కొన్ని గణాంకాల ప్రకారం.. ఇప్పటికే 40 లక్షల నుంచి 90 లక్షల మధ్య అమెరికన్లు విదేశాల్లో నివసిస్తున్నారు.

    పోర్చుగల్‌లోని లిస్బన్‌లో అనేక మంది అమెరికన్లు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేస్తున్నారు. బాలి, కొలంబియా, థాయిలాండ్‌లలో ఇళ్ల ధరల పెరుగుదలకు కూడా అమెరికన్లు ఎక్కువ కావడం అనే తెలుస్తోంది. ఒక లక్ష మందికి పైగా యువ అమెరికన్లు తక్కువ ఖర్చుతో కూడిన డిగ్రీల కోసం విదేశాలలో చదువుతున్నారు. పదవీ విరమణ చేసినవారు తక్కువ ఖర్చుతో వైద్యసేవలు, వృద్ధాప్య సంరక్షణ వంటి వాటికోసం మెక్సికోకు వెళుతున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది.

    విద్యార్థులు సైతం
    కెనడా, యూకే, మెక్సికో వంటి దేశాలు అమెరికన్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గత ఏడాది 17 శాతం తగ్గింది. అదే సమయంలో యూరప్‌కు వెళ్లే అమెరికన్ విద్యార్థుల సంఖ్య 2011తో పోలిస్తే రెట్టింపైంది. యుకేలో మాత్రం ఈ సంఖ్య గత ఏడాది 14 శాతం పెరిగింది. ఒకప్పుడు అమెరికాకు ఎగబడి వెళ్లేవారు కూడా.. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్తున్నారు.

    1935 మహామాంద్యం సమయంలో అమెరికాకు వచ్చినవారి కంటే.. యూఎస్ వీడి వెళ్లిన వారిసంఖ్య ఎక్కువగా నమోదైంది. అలాంటి పరిస్థితి సుమారు 90ఏళ్ల తరువాత ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

  • జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

    అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.

    ఏమిటీ ‘టెంపుల్’?
    ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్‌ టైమ్‌లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.

    ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం
    ‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.

    ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్‌ సరదాగా కామెంట్‌ చేశారు.

  • మెర్సిడెస్ బెంజ్ ఇండియా.. భారతదేశంలో స్వచ్ఛంద రీకాల్‌ ప్రకటించింది. ఈ ప్రభావం 149 వాహనాలపై చూపుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన రీకాల్ నోటీసును ఫిబ్రవరి 15న జారీ చేసింది.

    బెంజ్ రీకాల్ ప్రభావం.. సీఎల్ఈ క్యాబ్రియోలెట్, సీఎల్ఈ 53 ఏఎంజీ కూపే & సీ 63 ఎస్ఈ పెర్ఫార్మెన్స్ వాహనాలపై పడింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)లో సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున సంస్థ రీకాల్ జారీ చేసింది. కొన్ని సందర్భాల్లో.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫంక్షన్ పనిచేయకపోవచ్చని కూడా మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.

    రీకాల్ ప్రభావానికి గురైన వాహనాలు 2 సెప్టెంబర్ 2024 & 18 మార్చి 2025 మధ్య తయారు చేసినవని తెలుస్తోంది. రీకాల్ నోటీసు పొందిన కస్టమర్లు అధీకృత మెర్సిడెస్-బెంజ్ సర్వీస్ సెంటర్లు నేరుగా సంప్రదించి.. అవసరమైన తనిఖీ చేసుకోవచ్చు. డబ్బు చెల్లించకుండానే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

  • దేశీ​య స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.

    నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.

    విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి.

  • దక్షిణ కొరియన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ తమ ఫ్లాగ్‌షిప్‌ గెలాక్సీ ఎస్‌26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్‌26, ఎస్‌26ప్లస్, ఎస్‌ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్‌ ఉంటాయి. శాంసంగ్‌ పోర్టల్‌ ప్రకారం వేరియంట్‌ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్‌ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.

    ఈ సిరీస్‌లోని అల్ట్రా వేరియంట్‌లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్‌ మీద ఉన్న కంటెంట్‌ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్‌ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలీట్‌ జెన్‌ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్‌ అయ్యేలా సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్‌ కెమెరా, 200 ఎంపీ వైడ్‌ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.  

    దీనికి ముందు సిరీస్‌ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్‌లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్‌తో దేశీయంగా యాపిల్‌ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్లో శాంసంగ్‌ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ తమ మల్టీ–కరెన్సీ ప్రీపెయిడ్‌ ఫారెక్స్‌ కార్డుల ద్వారా 2,80,000 డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) అనధికారిక లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది. బుక్‌మైఫారెక్స్‌ భాగస్వామ్యంతో జారీ చేసిన  5,000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల ద్వారా ఫిబ్రవరి 24 తెల్లవారు ఝామున ఓ లాటిన్‌ అమెరికా దేశంలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.

    అసాధారణ స్థాయిలో లావాదేవీలు తిరస్కరణకు గురవుతుండటంతో సిస్టం దీన్ని గుర్తించినట్లు పేర్కొంది.  సదరు కస్టమర్లు నష్టపోకుండా ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా కార్డ్‌ నెట్‌వర్క్‌తో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. పటిష్టమైన నియంత్రణ విధానాల కారణంగా 688 అనధికారిక ప్రయత్నాలను సిస్టం అడ్డుకుందని, దీంతో 1,00,000 డాలర్ల నష్టాన్ని నివారించిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది.

  • బంగారం ధరలు తగ్గుతాయనుకుంటున్న పసిడి ప్రియులకు జేపీ మోర్గాన్ రిపోర్ట్ షాకిచ్చింది. 2026లో గోల్డ్ రేటు ఎంతకు చేరుతుందో అంచనా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 5200 డాలర్ల వద్ద ఉంది. ఇది 2026 చివరి నాటికి 6300 డాలర్లకు చేరుకుంటుందని జేపీ మోర్గాన్ తన నివేదికలో వెల్లడించింది. ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మాత్రమే కాదు, ఆర్ధిక అనిశ్చితి కూడా ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

    సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరగడం, యూఎస్ ట్రెజరీ ఉపసంహరణకు సంబంధించిన బహిరంగ ప్రకటనలు కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం రేటు పెరుగుతుందని జేపీ మోర్గాన్ మాత్రమే కాకుండా.. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మొదలైన బ్రోకరేజ్/ఏజెన్సీలు చెబుతున్నాయి.

    భారతదేశంలో బంగారం ధరలు
    భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,570 వద్ద, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,48,100 రూపాయల వద్ద ఉంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. ఈ ఏడాది చివరి నాటికి తులం పసిడి ధర రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    పెళ్లి  సీజన్‌లో ఊరట.. 22, 24 క్యారెట్ల బంగారం ధరలు తగ్గింపు

    బంగారం రేటు అందుకే పెరుగుతోంది
    సాధారణంగా భారతీయులు పండుగలకు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా బంగారం ధరిస్తారు. దీనివల్ల పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాగా ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైపోయింది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతోంది. బంగారం సురక్షితమైన ఆస్తిగా భావించేవారు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. ఇవన్నీ బంగారం ధరలను భారీగా పెంచేస్తున్నాయి.

    ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

  • తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణ మోటార్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ యాక్ట్‌- 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది. గత జనవరిలో గవర్నర్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రకారం, చట్టంలోని సెక్షన్ 3-సి కింద కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వన్‌టైమ్ రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు.

    వాహనాల వారీగా సెస్ ఇలా…

    • మోటార్ సైకిళ్లపై రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 2,000

    • వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రాక్టర్-ట్రెయిలర్లు మినహా లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ)పై రూ. 5,000

    • కార్లు, పెద్ద ప్యాసింజర్ వాహనాలు సహా ఇతర రవాణా, రవాణాయేతర వాహనాలపై రూ. 10,000

    • అయితే నాలుగు నుంచి ఏడుగురు సీటింగ్ సామర్థ్యం కలిగిన ఆటోరిక్షాలు వంటి ప్యాసింజర్ మూడు చక్రాల కాంట్రాక్ట్ క్యారేజీలకు ఈ సెస్ నుంచి మినహాయింపు కల్పించారు.

    పన్ను నిర్మాణంలో మార్పులు
    నాలుగు చక్రాల లైట్ గూడ్స్ క్యారేజీలపై కూడా పన్ను విధానంలో మార్పులు చేశారు. కొత్త వాహనాలపై రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధరలో 7.5 శాతం పన్ను విధించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో రిజిస్టర్ చేసే వాహనాలపై వాటి వయస్సును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్టర్ అయి వినియోగంలో ఉన్న వాహనాలకు ప్రస్తుత త్రైమాసిక పన్ను కొనసాగుతుంది. పాత మూడు చక్రాల గూడ్స్ క్యారేజీలను సవరించిన పన్ను నిబంధనల నుంచి మినహాయించారు.

    ప్రత్యేక నిధికి జమ
    రోడ్డు భద్రత సెస్ ద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక నాన్-లాప్సబుల్ ఫండ్‌కు జమ చేస్తారు. ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, రహదారి మౌలిక వసతుల అభివృద్ధి, ప్రమాదాల నివారణ చర్యలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్య ద్వారా సుమారు రూ. 250 కోట్ల ప్రత్యేక నిధి సమీకరించగలమని అంచనా వేస్తోంది.

    తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత సెస్ తరహా విధానాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే రోడ్డు సేఫ్టీ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం అదనపు సెస్సులు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రత్యేక రోడ్డు అభివృద్ధి సెస్సు అమల్లో ఉండగా, కేరళలో రోడ్డు భద్రతా ప్రాజెక్టుల కోసం అదనపు లెవీలు విధించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ప్రత్యేక రుసుములు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్సులు వసూలు చేస్తున్నారు.

  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్‌లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.

    ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?

    టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్‌లు ఇకపై వినియోగదారుడి ఫోన్‌లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్‌ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్‌టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

    ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్‌) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.

    ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలం

    టెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్‌ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.

    శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు షరతులు

    భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.

    ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట

Telangana

  • హైదరాబాద్,:  హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కెపిహెచ్ బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్ల ను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1 మరియు 2 లోని ధర్మారెడ్డి కాలనీ లోని  4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం  అపార్ట్ మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు.     

    మొత్తం 40 మంది కొనుగోలు దారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్  చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్దారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడు పోయిందని,  మరో ప్లాట్ ను చదరపు గజం  రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన  ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు (Flats) రూ .90 లక్షలను అప్ సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. 

    ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్ కు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ శ్రీ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా  (Open Plots) రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్ మెంట్  లోని  ఫ్లాట్ల (Flats) ద్వారా రూ.8.45 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. 

  • హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద తెలంగాణ రాష్ట్ర గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు  పొన్నం ప్రభాకర్ , టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  నాగి రెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్  హరి చందన దాసరి  పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా గవర్నర్   జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, జీఐ గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. తెలంగాణ యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు. సంస్కృతి సమాజానికి ఆత్మస్వరూపమని, సాంస్కృతిక అవగాహన లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఈ తరహా కార్యక్రమాలు యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంచుతాయని, కళాకారులకు గౌరవాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

    రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ, ఈ కార్యక్రమం గవర్నర్ దూరదృష్టి ఫలితమని తెలిపారు. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మార్కెటింగ్ మరియు విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలు చేయడానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

    అదేవిధంగా పోచంపల్లి ఇక్కత్ వరంగల్ , వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను బస్సులపై ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఈ కళారూపాలు తెలంగాణ కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తూ, ప్రజా రవాణా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం పొందనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను సృజనాత్మక వేదికగా మలచి, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా చేపట్టటం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు.

    టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం గవర్నర్ గారి ఆలోచనల ఫలితమని తెలిపారు. బస్సులపై జీఐ కళారూపాలను ప్రదర్శించడం ద్వారా సంస్కృతిని ప్రజలకు చేరువ చేయడంతో పాటు కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమని చెప్పారు.

    ఈ బస్సులపై ప్రదర్శించిన డిజైన్లను జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు రూపొందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు  నగదు బహుమతులు మెమొంటోలు  అందజేశారు. జీఐ గుర్తింపుల సాధనలో సేవలందించిన  సుభజిత్ సహా  ప్రత్యేకంగా సన్మానించారు. ఆరు జీఐ కళారూపాలకు చెందిన కళాకారులను కూడా ఘనంగా సత్కరించారు.తదనంతరం గవర్నర్ , మంత్రి , జిల్లా కలెక్టర్ టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు కలిసి జీఐ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

    భౌగోళిక సూచిక (జీఐ) అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఉత్పత్తి లక్షణాలు, నైపుణ్యం, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సమిష్టి మేధో సంపత్తి హక్కు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 18 జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నాయి. జీఐ గుర్తింపు ద్వారా సంప్రదాయ కళలు, వారసత్వాన్ని సంరక్షించడం, నకిలీలను నివారించడం, కళాకారులకు గుర్తింపు కల్పించడం, వారి జీవనోపాధిని స్థిరంగా నిలుపుటకు దోహదపడుతుంది. 

    ఈ కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రాజశేఖర్ ,  ఖుస్రో షా ఖాన్ , రీజినల్ మేనేజర్లు  శ్రీలత, సుధ పరిమళ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ప్రతినిధులు, కళాకారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయ్యారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.

    మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ అలియాస్‌ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్‌ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.

    గత రెండేళ్లలో ఇప్పటివరకు నలుగురు సెంట్రల్‌ కమిటీ సభ్యులు సహా మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 5,865 మంది లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. 

    తెలంగాణ నుంచి మిగిలిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, ఈస్ట్‌ డివిజనల్‌ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్‌ విభాగం ఇన్‌చార్జి పుసునూరి నరహరి అలియాస్‌ సంతోష్, ఒడిశా స్టేట్‌ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్‌ సుదర్శన్, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ, కమ్యూనికేషన్‌ విభాగం ఇన్‌చార్జి వార్త శేఖర్‌ అలియాస్‌ మంగ్తు, గణపతి భార్య.. మాడ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి జోడే రత్నాభాయ్‌ అలియాస్‌ సుజాత, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో ఎడ్యుకేషన్‌ కమిటీ ఇన్‌చార్జి లక్కా సుశీల అలియాస్‌ రేల, దేవ్‌జీతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ అనిల్‌కుమార్‌ అలియాస్‌ భగత్‌సింగ్, మాడ్‌ డిజినల్‌ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్‌ సంగీత, దేవ్‌జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్‌ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్‌ కుంజం ఇడామల్‌ ఉన్నారు.

  • హైదరాబాద్‌: ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మీసేవ ఆధ్వర్యంలోని ‘మీ టికెట్’ యాప్‌లో టీజీఎస్‌ఆర్టీసీ సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్‌పాస్‌ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులు ముగిసే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ చేసే దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.

    మీటికెట్ యాప్ ఇప్పటికే రెండు లక్షలకు పైగా డౌన్‌లోడ్లు సాధించగా, రూ.2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మీసేవ ఈ-గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు నగర బస్‌పాస్‌లు, అంతర్రాష్ట్ర టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందగలుగుతున్నారు. డిపోలకు వెళ్లడం, ఫారమ్‌లు నింపడం, క్యూలో నిలబడడం వంటి ప్రక్రియలు ఇక అవసరం లేకుండా పోతున్నాయి. దరఖాస్తు, చెల్లింపు, పాస్ జారీ అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తవుతున్నాయి. అదనపు బుకింగ్ ఛార్జీలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

    ఈ మార్పు ప్రయాణికులకు స్పష్టంగా కనిపిస్తోంది. “ప్రతి నెల పాస్ కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు నిమిషాల్లోనే పూర్తి అవుతోంది” అని ఓ విద్యార్థి తెలిపారు. మరో విద్యార్థిని “ఫోన్‌లో ఉండే క్యూ ఆర్ కోడ్ సురక్షితం. ఎవరూ కాపీ చేయలేరు” అని చెప్పారు. మీటికెట్ ద్వారా జారీ చేసే ప్రతి పాస్‌లో డైనమిక్ క్యూ ఆర్ కోడ్, లైవ్ వాలిడిటీ సూచిక, స్క్రీన్‌షాట్ నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. దీంతో పాస్‌ల దుర్వినియోగం తగ్గడమే కాకుండా, బస్సుల్లో కండక్టర్లు వెంటనే స్కాన్ చేసి ధృవీకరించగలుగుతున్నారు. దీంతో ప్రయాణం వేగవంతం అవుతోంది.

    యాప్‌లోనే పాస్ రీన్యువల్ సదుపాయం కల్పించడం ద్వారా డిపోలపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. 221 ప్రాంతాల్లోని 190 సేవా కేంద్రాలపై ఉన్న భారం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. “పారదర్శకత, సౌలభ్యం కలిగిన పౌర కేంద్రిత రవాణా వ్యవస్థను రూపొందించడం మా లక్ష్యం” అని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ టి. రవి కిరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ), పుష్పక్ ఏసీ వంటి ఐదు రకాల పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, వృద్ధులకు రాయితీ పాస్‌లను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

    టీజీఎస్‌ఆర్టీసీ సేవలను మీటికెట్‌లో విలీనం చేయడం ద్వారా మీసేవ సేవలు మరింత విస్తరించాయి. పత్రాల సేవల నుంచి ప్రజా రవాణా వరకు విస్తరించిన ఈ వేదిక, తెలంగాణను డిజిటల్ పాలనలో ముందంజలో నిలిపింది. ఇకపై ప్రయాణం కోసం కాగితం అవసరం లేకుండా, ఫోన్‌లోనే బస్‌పాస్‌తో ముందుకు సాగుతున్న కొత్త యుగానికి రాష్ట్రం నాంది పలికింది.

  • మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చ కుడు, ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎంవీ సౌందరరాజన్‌ (90) కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన ఐదేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం మధ్యా హ్నం అస్వస్థతకు గురికాగా, భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. వెంకటరాఘవాచారి– కోమలమ్మ దంపతులకు 1938 జూలై 4న సౌందరరాజన్‌ జన్మించారు. ఆయన బా ల్యం చెన్నైలో గడిచింది. 10వ తరగతి వరకు అక్కడే చదివా రు.

    ఇంటర్‌ నుంచి పై చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేశా రు. ఎంకామ్, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అనంతరం ఉపాధ్యా య వృత్తిలో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌ డీ పూర్తిచేసి అక్కడే ప్రొఫెసర్‌గా చేరారు. వర్సిటీలో కీలక పదవులు నిర్వహించారు. చివరగా వర్సిటీ రిజిస్ట్రార్‌గా 1999 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.సౌందరరాజన్‌కు లక్ష్మీనరసింహన్, రంగరాజన్, మురళీధరన్‌ కుమారులు. ఆయన భార్య వసుమతి 2018లో మరణించారు.

    ఆలయానికి ప్రత్యేక గుర్తింపు 
    సౌందరరాజన్‌ ఉద్యోగం చేసే సమయంలో సెలవులు ఉన్న ప్పుడు చిలుకూరు ఆలయానికి వచ్చి వెళ్లేవారు. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా చిలుకూరుకు వచ్చారు. 2000 నుంచి సౌందరరాజన్‌ ఈ ఆలయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చా రు. భగవంతుని సన్నిధిలో అందరూ సమానమేనని.. టికెట్లు, హుండీ, కానుకలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనే నినాదంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆలయంలో హుండీ తీసేశారు. సౌందరరాజన్‌ ప్రభుత్వంతో పోరాటం చేసి ఆలయం దేవాదాయ శాఖలోకి వెళ్లకుండా అడ్డుకొని.. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయంగా కొనసాగిస్తూ వచ్చారు. 

    దేవాలయాల పరిరక్షణ ఉద్యమంతో.. 
    సౌందరరాజన్‌ జీర్ణ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమాన్నే నడిపారు. హిందూ మత సంబంధిత సంస్థల నిర్వహణలో లోతైన జ్ఞానం, నిబద్ధత, అనుభవంతో పలు పుస్తకాలు రాశారు. పదేళ్ల పాటు అహోబిల మఠ సేవాసమితి కార్యదర్శిగా ఉన్నప్పుడు పొందిన జ్ఞానం, అనుభవాలను తాను రాసిన పుస్తకంలో పొందుపర్చారు. శ్రీనివాసనగర్‌ కాలనీలో గురువాయూర్‌ అప్పన్‌ ఆలయాన్ని స్థాపించిన కృష్ణ సమాజం సంస్థ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య ఉపాధ్యకుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

    ఆలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్‌గా వాక్‌ (వాయిస్‌ ఆఫ్‌ టెంపుల్స్‌) త్రిభాషా(తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌) మాస పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. శనివారం చిలుకూరులో సౌందరరాజన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

    సౌందరరాజన్‌ మరణవార్త తెలిసి సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా ఎంతో మంచిపేరు గడించిన సౌందరరాజన్‌ ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. 

     సౌందర రాజన్‌ మృతి హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ, తనదైన శైలిలో దైవసేవ చేయడం ద్వారా, ఆయన ప్రజా పూజారి గా ప్రసిద్ధి గాంచారని తెలిపారు.

     సనాతన ధర్మ పరిరక్షణ కోసం తుదిశ్వాస వరకు కృషి  చేసిన సౌందరరాజన్‌ ఆదర్శనీయులని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఆయన చేసిన ఉద్యమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పని చేసిన సౌందరరాజన్‌ మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. 

     బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సౌందరరాజన్‌ కుమారుడు రంగరాజన్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. సౌందరరాజన్‌ మృతి తీరని లోటని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

    ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు: వైఎస్‌ జగన్‌
    సాక్షి,అమరావతి:  సౌందర రాజన్‌  కన్నుమూయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు చిలుకూరు బాలాజీ స్వామి సేవలో అంకితభావంతో పనిచేసిన సౌందర రాజన్‌ భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని పేర్కొన్న వైఎస్‌ జగన్, సౌందర రాజన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

    చిలుకూరులో విషాదం ఆలయ ప్రధాన అర్చకులు ఇకలేరు

International

  • అప్‌డేట్స్‌

    ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై దాడి చేయడానికి అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సన్నద్ధమవుతున్నది. జనవరి నుంచి ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగడంతో పశ్చిమాసియాలో అతి పెద్ద సైనిక కేంద్రమైన ఖతార్‌లోని అల్‌-ఉదీద్‌ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా దళాలు పేట్రియాట్‌ క్షిపణులను మొబైల్‌ ట్రాక్‌ లాంచర్లలోకి ఎక్కించి తరలించాయి.  ఒకవేళ అమెరికా యుద్ధానికి సిద్ధమైతే దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్‌ సైతం అన్ని విధాలా సమాయత్తమవుతోంది.

     

    • ఇరాన్‌లో అత్యంత అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో కొంత భాగం.. ఆ దేశ మిలటరీ విభాగాలకు చేరింది. 
    • జూన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులలో  ఇరాన్‌ సొరంగ  సముదాయంలోని ప్రవేశ ద్వారం దెబ్బతిన్నప్పటికీ, అది పూర్తిగా దెబ్బ తినలేదనేది తాజా పరిస్థితిని  బట్టి అర్ధమవుతోంది.
    • ఇరాన్‌పై అమెరికా దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ గెరాల్డ్ ఆర్‌ ఫోర్డ్ ఇజ్రాయెల్ ఉత్తర తీరానికి చేరుకుంది. 

    • గతంలో వెనిజులాపై అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇరాన్‌పై జరగబోయే దాడికి కూడా సిద్ధంగా ఉందని సమాచారం.

    • ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు మోహరించాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు అమెరికా తరలించింది. 

    • ఈ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 24 బ్రిటన్‌లోని లాకెన్‌హీత్ ఎయిర్‌బేస్ నుండి బయలుదేరి దక్షిణ ఇజ్రాయెల్‌లోని  ఓ వైమానిక స్థావరానికి చేరుకున్నట్లు సమాచారం.

     

    వివిధ దేశాల్లోని బేస్‌ల నుండి యుద్ధ విమానాలు కదులుతున్నాయి. ఖతార్‌లోని 'అల్-ఉదైద్' బేస్‌కు సంబంధించి ఈ ఉదయం విడుదలైన ఫోటోల ప్రకారం.. అక్కడ ఒక్క అమెరికన్ ఇంధన నింపుకునే విమానం కూడా మిగిలి లేదు. అదే సమయంలో.. వాటిలో చాలా విమానాలు ఇజ్రాయెల్‌లోని 'బెన్ గురియన్' విమానాశ్రయంలో నిలిపి ఉంచినట్లు కనిపించాయి.

    తాజా చిత్రాల ప్రకారం.. అల్-ఉదైద్ బేస్‌లో కేవలం 12 రవాణా విమానాలు (6 C-17 మరియు 6 C-130), మూడు అటాక్ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. నిన్నటి సమాచారం ప్రకారం, అమెరికా సైన్యం అక్కడ చాలా తక్కువ విమానాలను వదిలివెళ్లింది. ఒక KC-135 ట్యాంకర్ విమానం (ఇది కూడా ఇప్పటికే టేకాఫ్ అయి ఉండవచ్చు), రెండు C-130 రవాణా విమానాలు, ఏడు సాయుధ హెలికాప్టర్లు మాత్రమే అక్కడ ఉన్నాయి.

    గ్రీస్‌లోని 'చానియా' విమానాశ్రయం నుండి యూఎస్ నేవీకి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అక్కడ సుమారు ఎనిమిది రీఫ్యూయలింగ్ విమానాలు, రెండు RC-135 నిఘా విమానాలు, F-15 యుద్ధ విమానాలు, ఒక రవాణా విమానం కనిపించాయి. బాంబర్ ఐలాండ్‌లో ఈ ఉదయం ఇక్కడ సుమారు 14 యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానాలు రికార్డయ్యాయి. ఇందులో యుద్ధ విమానాలు, ఇంధన విమానాలు, రవాణా విమానాలతో పాటు సముద్రపు నిఘా, యుద్ధతంత్రం కోసం ఉపయోగించే P-8 విమానాలు కూడా ఉన్నాయి. సౌదీలోని 'ప్రిన్స్ సుల్తాన్' బేస్‌లో కూడా భారీ సంఖ్యలో విమానాలు కనిపించాయి. వీటిలో KC-135 రీఫ్యూయలింగ్ విమానాలు, కమాండ్ అండ్‌ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే E-11A విమానాలు ఉన్నాయి.

    మరోవైపు, ఒక వేళ ఇరాన్‌పై దాడి జరిగితే.. అమెరిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతి చర్య దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్‌ మోహరించింది. పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు మోహరించారు. ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

    టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం. అమెరికా సైనిక విమానాలతో నిండిపోయింది. కాగా, ఇరాన్‌లోని పర్చిన్ (Parchin) ప్రాంతంలో ఉన్న రివల్యూషనరీ గార్డ్స్ సైనిక స్థావరం వద్ద గత కొన్ని నిమిషాల క్రితం భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్‌పై అమెరికా దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో రక్షణ చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్ సమీపంలో 'ఐరన్ డోమ్' క్షిపణి రక్షణ వ్యవస్థ బ్యాటరీని ఏర్పాటు చేశారు.

     

  • ప్రస్తుతం యెమెన్‌లోని ప్రభుత్వ అనుకూల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా హోదైదా, మారిబ్ ప్రాంతాల్లో తమ బలగాలను మళ్లీ మోహరించారు హౌతీలు.  హౌతీ నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. 

    అదే సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలు తమ క్షిపణి సామర్థ్యాలను ఉపయోగించడానికి వ్యూహం రచిస్తున్నారు. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే హౌతీలు దాడులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. 

    ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన పక్షంలో హౌతీలు ఇతర ఇరాన్ మిత్ర బలగాలతో (హిజ్బుల్లా వంటి) కలిసి ‘యూనిటీ ఆఫ్‌ ఫ్రంట్స్‌’ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, కొత్త దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అధునాతన డ్రోన్లు సిద్ధం చేస్తున్నారు హౌతీలు. మొత్తంగా, యెమెన్‌లోని అంతర్గత యుద్ధానికి మాత్రమే కాకుండా, అమెరికా–ఇరాన్ మధ్య  ఉద్రిక్తతల నడుమ భారీ స్థాయి యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో హౌతీల నియంత్రణలో ఉన్న సనాలో భయంకరమైన నిశ్భబ్ద వాతావరణం అలుముకుంది. 

    ఇరాన్‌ ఆదేశాల కోసం ఎదురుచూపులు
    ఇక హౌతీలు తమ యుద్ధ సన్నాహల్లో భాగంగా ఇరాన్‌ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.  హౌతీలకు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మరియు ఆయుధాలు సరఫరా చేస్తుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  గతంలో కూడా ఇరాన్‌ మద్దతు వల్ల హౌతీలు యెమెన్‌లో మాత్రమే కాకుండా, సౌదీ అరేబియా మరియు రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై కూడా దాడులు చేయగలిగారు.

    హౌతీల ప్రధాన లక్ష్యం యెమెన్ ప్రభుత్వాన్ని కూల్చడం మాత్రమే కాదు,. దానిని తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. వారు 2014లో సనా (యెమెన్‌ రాజధాని) ను స్వాధీనం చేసుకుని, అప్పటి అధ్యక్షుడు అబ్ద్రబ్బుహ్ మన్‌సూర్ హాదీని ఆ పదవి నుంచి దింపేశారు. ఆ సమయంలో వారు పార్లమెంట్‌ను రద్దు చేసి, తమ నియంత్రణలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రస్తుతం కూడా అదే లక్ష్యంగా మెరుపు యుద్ధానికి వారు సన్నద్ధమవుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

    యెమెన్‌లోని కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరచి, తమ ఆధిపత్యాన్ని స్థాపించడమే హౌతీల లక్ష్యంగా కనబడుతోంది. తిరుగుబాటు నుంచి రాజ్య నిర్మాణం వైపు మారి, తమను ఒక అధికారిక పాలక శక్తిగా చూపించుకోవాలనే ప్రయత్నం ముమ్మరం చేశారు.  ప్రధానంగా ఇరాన్ మద్దతుతో, యెమెన్‌లోని రాజకీయ సమీకరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు హౌతీలు.

  • మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యోచిస్తున్న నేపథ్యంలో జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఇజ్రాయిల్‌ను వదిలి వెళ్లాలంటూ అమెరికా రాయబారి మైక్ హకబీ.. రాయబార కార్యాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

    వీలైనంత త్వరగా..
    ఇవాళ(శుక్రవారం) ఉదయం.. యూఎస్ రాయబార ఉద్యోగులకు ఒక మెయిల్‌ పంపించారు. ‘ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు.. కానీ వెళ్లాలనుకునే వారు వీలైనంత త్వరగా విమానాలు బుక్ చేసుకోవడం మంచిదంటూ పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయకముందే ఇజ్రాయెల్‌ వీడాలని తెలిపారు. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతుందనే వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.

    పశ్చిమాసియా దేశాల ఆందోళన
    తమతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలను తప్పవంటూ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో అమెరికా రాయబారి ఇజ్రాయెల్‌లోని తమ ఎంబసీకి తాజా ఆదేశాలు చేయడం కలకలం రేపుతోంది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేసే అవకాశముందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    టెన్షన్‌.. టెన్షన్‌..
    మరోవైపు, ఒక వేళ ఇరాన్‌పై దాడి జరిగితే.. అమెరిక స్థావరాలపై కూడా ఇరాన్ ప్రతి చర్య దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్‌ మోహరించింది. పలు సైనిక స్థావరాల్లో దాదాపుగా 10 వేల మంది యూఎస్ సైనికులు మోహరించారు. ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్‌ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్‌హౌజ్‌ వర్గాలు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.

    ఇజ్రాయెల్‌ అప్రమత్తం
    ఇరాన్‌ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్‌ సీరియస్‌గా ఉన్నారని.. దీంతో​ ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని తాజా నివేదికలు కూడా చెబుతున్నాయి. మరో వైపు అమెరికా తమపై దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు తాము ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్‌ పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైతం అప్రమత్తమైంది.

    కాగా, అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు.

Politics

  • సాక్షి, అమరావతి : ఏపీలో పాలు, నీళ్లు కల్తీపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నించారు. ‘ఎవరైనా బతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలుచోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. 

    రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థ 
    ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దంపడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పనిచేస్తూ.. ప్రజారోగ్యం, ప్రజా రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు. 

    హాస్టళ్ల పరిస్థితిని ఎండగట్టిన జాతీయ మీడియా   
    కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యారి్థనులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చ కామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేసుకున్నా, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

    అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యా సంస్థల్లో ఫుడ్‌ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతవల్ల వ్యాధుల వంటి ఘ­ట­నలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటివల్ల 15 జిల్లాల్లో 900 మందికి పైగా విద్యార్థులు అస్వస్థత­కు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది. 

    ఐదుగురు మృతి.. 200 మంది ఆస్పత్రుల పాలు 
    రాష్ట్రంలో గడిచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దంపడుతున్నాయి. 

    గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి. 

    ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం.. రాజమహేంద్రవరం ఘటనే సాక్ష్యం 
    రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కాదు. 

    ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి, నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరిచేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. 

    ఆహార భద్రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలుచేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు. 

  • ప్రకాశం: ఒంగోలులో కూటమి నేతల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌పై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.  ఒంగోలులో భూకబ్జాలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే జనార్థన్‌ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌, ఇసుక రవాణా జరుగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే జనార్థన్‌ దందాలను ప్రశ్నిస్తూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.

    ఒంగోలులో భూకబ్జాలు,అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెప్మాలో అవినీతి కారకులెవరో తేల్చాని బాలినేని డిమాండ్‌ చేశారు. గతంలో భూ అక్రమాలపై తాను మంత్రిగా వున్నప్పుడు సిట్ వేశానని, ఇవాళ వివాదం ఉన్న రెండు పార్టీలను పిలిచి రాజీ చేసి సొమ్ము చేసుకుంటున్నారని  మండిపడ్డారు. ఒంగోలులో   దామచర్ల జనార్దన్ పేరు చెపితే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారన్నారు. ఇసుక. మైనింగ్  అక్రమ రవాణా అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. 

     

  • కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని మాత్రం నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే సర్కార్‌ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. 

    చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు,  శ్రీకాకుళంలో కల్తీ నీళ్లు అన్నట్లుగా చంద్రబాబు సర్కార్‌ పనితీరు ఉందని విమర్శించారు. కల్తీ పాలతో ప్రాణాలు పోతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు క్రికెట్‌ ఆడుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

     

     

  • హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ కేసులో చివరికి న్యాయమే గెలిచిందన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌,.  ఢిల్లీ లిక్కర్‌ కేసు సాకుతో కేజ్రీవాల్‌ సర్కారు కూల్చారని,  ఆ కేసు వల్ల బీఆర్‌ఎస్‌ నష్టపోయిందన్నారు కేటీఆర్‌. ఈ కేసులో కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలు తేటతెల్లమయ్యాయమన్నారు. రాజకీయ కుట్రలో భాగమే ఈ కేసు అని తేలిపోయిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

    ఫామ్‌హౌజ్‌కు కేటీఆర్‌ బయల్దేరి వెళ్లనున్నారు. ఎర్రవల్లి  ఫామ్‌హౌజ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో..కేటీఆర్‌ భేటీ కానున్నారు.తాజా పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు కేటీఆర్‌. ఢిల్లీ లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్‌తో పాటు కవితకు క్లీన్‌చిట్‌ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. 

    ఇవి కూడా చదవండి:

    లిక్కర్‌ కేసులో క్లీన్‌చిట్‌.. కవిత స్పందన ఇదే

    లిక్కర్‌ కేసులో కే​‍జ్రీవాల్‌కు ‍క్లీన్‌ చిట్‌, మాజీ సీఎం భావోద్వేగం

  • సాక్షి, తాడేపల్లి: కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిస్సిగ్గు రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అని దుయ్యబట్టారు. ‘‘చేసిన పాపాలు పండాయి.. ఇక శిక్ష అనుభవించటమే తరువాయి.. చంద్రబాబుకు దేవునిపై ఏమాత్రం భక్తి లేదు. దేవుడ్ని నమ్మనని 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.

    ‘‘వైఎస్ జగన్ మీద దారుణమైన విమర్శలు చేశారు. దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవర్నయినా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు. మోదీని తీవ్రంగా విమర్శలు చేసి మళ్లీ ఆయన చెంతకే చేరారు. కాంగ్రెస్‌ని విమర్శలు చేసి మళ్లీ అదే పార్టీకి చేరారు.

    ..అతి పేదరికంలో పుట్టిన చంద్రబాబుకు డబ్బు మీద విపరీతమై ఆశ ఉంది. లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు. ఏ మమకారం లేని చంద్రబాబు తన భార్యను కూడా రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్లు సంపాదించారు. ఎన్నిసార్లు సీఎం అయినా ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా?

    ..ఎవరో తెచ్చిన ప్రాజెక్టును తానే తెచ్చానని గొప్పగా చెప్పుకుంటారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతులు. హెరిటేజ్ సంస్థలోని వాటాదారులను కూడా బలవంతంగా బయటకు పంపారు. కుట్రలకు కేరాఫ్ అడ్రెస్ చంద్రబాబు. ఆయన చదువుకునే సమయంలో పరీక్షలను కూడా వేరే వారితో రాయించి పాస్ అయ్యారు. ఆయన చెప్పుకునే వయసు కూడా కరెక్టు కాదు. షూ లేకుండా దేవుని పూజలు ఎప్పడైనా చేశారా?. దేవుడ్ని రాజకీయాల్లోకి తెచ్చిన చంద్రబాబు కఠినమైన శిక్ష అనుభవిస్తారు. రాయలసీమ లిఫ్టును ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ ఉందని తేలింది.

    ఎలా ముంచావో అందరికి తెలుసు.. హేరిటేజ్ బాగోతాన్ని బయటపెట్టిన లక్ష్మి పార్వతి

    ..అసెంబ్లీలోనూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. చంద్రబాబు చేసే ఆరోపణలు చూస్తుంటే ఆయనకు మైండ్‌ పని చేయటం లేదని అర్థం అవుతోంది. అందుకే వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిలపై ఆరోపణలు చేస్తున్నారు. సుబ్బారెడ్డి భార్య మీద కూడా ఆరోపణలు చేశారంటే చంద్రబాబు అంత నీచుడు మరొకరు లేరు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ని హతమార్చి ఆయన కుటుంబాన్ని సైతం కనుమరుగు చేసిన నీచుడు చంద్రబాబు’’ అంటూ లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.

Family

  • ఇంటర్నెట్‌ యుగంలో వైరల్‌ అవుతున్న కంటెంట్‌లో చాలావరకు వినోదం, ట్రోల్స్‌ లేదా షాకింగ్‌ అంశాలే ఎక్కువ. కానీ కొన్నిసార్లు అత్యంత సాదాసీదా భావోద్వేగ క్షణం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను కదిలిస్తుంది. అలాంటి అరుదైన కథే పంచ్‌ అనే 7 నెలల జపనీస్‌ మకాక్‌ది. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉన్న ఈ చిన్న కోతి, తల్లి వదిలేయడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఒంటరితనంలో, తనకు ఏకైక సాంత్వనగా మారింది ఒక ‘స్టఫ్డ్‌ ఒరంగుటాన్‌ బొమ్మ’. దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ, భయపడినప్పుడు మరింత బలంగా ఆలింగనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు, వీడియోలుగా బయటకు రావడంతో, సోషల్‌ మీడియాలో తుఫానులా వ్యాపించాయి. ఈ ట్రెండ్‌ హైదరాబాద్‌లోనూ కనిపించింది. దీంతో ఈ బొమ్మకు నగరంలోనూ, ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. పంచ్‌ పట్టుకున్న ఆ ప్లష్‌ టాయ్‌ ప్రపంచ ప్రఖ్యాత ఫరి్నచర్‌ బ్రాండ్‌ ఐకియాకు చెందినది కాగా.. ఈ ప్రభావంతో పలు దేశాల్లోని తమ ఐకియా స్టోర్స్‌లో ఈ బొమ్మకు సోల్డ్‌ ఔట్‌ బోర్డుల పెట్టడం విశేషం.                        

    ఒక జూలో ఒరంగుటాన్‌ బొమ్మతో కోతి (మకాక్‌) వైరల్‌ పంచ్‌ వీడియోలు వైరల్‌ కావడానికి కారణం కేవలం ‘క్యూట్‌’ ఫ్యాక్టర్‌ మాత్రమే కాదు. ఈ తరం సోషల్‌ మీడియా వినియోగదారులు కూడా. ముఖ్యంగా హైదరాబద్‌ వంటి నగరాల్లో నివసించే యువత.. భావోద్వేగ అనుబంధం, మానసిక ఆరోగ్యం, ఒంటరితనం వంటి అంశాల పట్ల మరింత సున్నితంగా స్పందిస్తున్నారు. 

    పంచ్‌ కథలో కనిపించింది అదే మానవీయ కోణం. ‘కంఫర్ట్‌’ అనేది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకూ అవసరమనే భావన ఈ కథ ద్వారా బలంగా ముందుకొచి్చంది. ఈ ప్రభావంతో హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఈ ప్లష్‌ బొమ్మకు ఒక్కసారిగా భారీ డిమాండ్‌ ఏర్పడిందని ప్రముఖ ఈ–కార్ట్‌ సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా యువత, పెట్‌ లవర్స్‌ ఈ బొమ్మలను పెద్ద సంఖ్యలో ఆర్డర్‌ చేస్తున్నారని చెబుతున్నాయి. కొందరు ఈ బొమ్మలతో దిగిన ఫొటోలు, రీల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మరింత సందడి చేస్తున్నారు.

    ‘జూ’కు వెళ్లోద్దామా.. 
    హైదరాబాద్‌ యువతలో పెరుగుతున్న పెట్‌ కల్చర్, మెంటల్‌ హెల్త్‌ చర్చలు, ‘కంఫర్ట్‌ ఆబ్జెక్ట్స్‌’ పట్ల ఆసక్తి.. ఇవన్నీ పంచ్‌ కథను నగరానికి మరింత దగ్గర చేశాయి. రీల్స్, షార్ట్స్, స్టోరీల రూపంలో ఈ కథ స్థానిక సోషల్‌ మీడియా ఫీడ్స్‌లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. ఈ కారణంగా నగరంలోని జూలకు వెళ్లే వారి సంఖ్య పెరగనుందని పలువురి అభిప్రాయం. అసలు అలాంటి జంతువు నగరంలోని జూ పార్క్‌లో ఉందా అని పలువురు ఔత్సాహికులు గూగుల్‌ సెర్చ్‌లో అడగడం కొసమెరుపు. అయితే నగరంలోని జూలో ప్రస్తుతం విభిన్న రకాల కొండవానరాలు (మకాక్‌) కనిపిస్తాయి.. టఫ్టెడ్‌ మార్మోసెట్, స్క్విరెల్‌ మంకీ, క్యాపుచిన్‌ మంకీ, బోనెట్‌ మకాక్, లయన్‌–టెయిల్డ్‌ మకాక్, రేసస్‌ మకాక్‌ వంటి స్థానిక కోతులు ఉన్నాయి. కానీ జపనీస్‌ మకాక్‌ (పంచ్‌ మాదిరి) మాత్రం ఇందులో ఉండదు. ఇక ఒరంగుటాన్‌ వంటి ఏషియాటిక్‌ గొరిల్లా తరహా అడవిపిల్లి/ఏప్‌ జాతులు గురించి ప్రభుత్వ జూ వెబ్‌సైట్‌ ప్రకారం స్పష్టమైన ప్రస్తావన లేదు. పంచ్‌ కథ, ఈ డిజిటల్‌ యుగంలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది.  

    లైఫ్‌స్టైల్‌ మార్కెట్‌పై ప్రభావం.. 
    పంచ్‌ పట్టుకున్న ఆ ప్లష్‌ టాయ్‌ సాఫ్ట్‌ ఒరంగుటాన్‌ బొమ్మ వీడియోలు వైరల్‌ అనంతరం జపాన్, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు భారత్‌ వంటి దేశాల్లో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. కొన్ని దేశాల్లో ఇది స్టాక్‌ అవుట్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో వినియోగదారులు పేర్కొన్నారు. 

    సోషల్‌ మీడియా వైరల్‌ ట్రెండ్‌లు ఎలా నేరుగా లైఫ్‌స్టైల్‌ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయో చెప్పే తాజా ఉదాహరణ. ఒక భావోద్వేగ కథ, ఒక సాధారణ ఉత్పత్తిని గ్లోబల్‌ ట్రెండ్‌గా మార్చగలదన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.  

  • జెన్‌  జీ పిల్లలు ఏ వర్గం వారైనా ఇంటర్నెట్‌ లేని ప్రపంచం వాళ్ళకి తెలీదు. జెన్‌  జీ పిల్లలకి పది పన్నెండు యేళ్ళు వచ్చే సరికి ఫ్రీ మొబైల్‌ డేటా అందుబాటు లోకి వచ్చింది. దాని వల్ల ప్రపంచం వారి మునివేళ్ళ మీద తారాడటం మొదలుపెట్టి వారి జీవితంలోకి రాని సమాచారం కుప్పలు తెప్పలుగా ప్రవహించింది. ప్రవహిస్తూనే ఉంది. సమాచారాన్ని జ్ఞానంగా భ్రమించే ఈ తరం పిల్లలు సైక్లో స్టయిల్‌ అంటే అదేదో హెయిర్‌ స్టైల్‌ అనుకుంటారు. 

    1983లో భోపాల్‌లో ఏం జరిగిందో, 1985లో కారంచేడులో ఏం జరిగిందో, 1992నాటి పరిస్థితులు ఏమిటో వీళ్ళకి కర్ణాకర్ణిగా కూడా తెలియదు. సోషల్‌ మీడియాకి విలువైన వినియోగదారులైన ఈ జెన్‌ జీ తరానికీ వారి కంటే ముందు తరానికీ మధ్య ఇంటర్నెట్‌ వినియోగం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. జెన్‌  జీకి ముందుతరం వారికి సోషల్‌ మీడియా లేక΄ోయినా సామాజికంగా తెలియాల్సినవి తెలిశాయి. తెలియవలసిన పద్ధతిలో తెలిశాయి. జెన్‌ జీ ఇంటర్నెట్‌ వల్ల తెలుస్తున్నది తెలియవలసిన పద్ధతిలోనేనా అన్నది పెద్ద ప్రశ్న.

    ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి ఇచ్చే భద్రత తెలియని జెన్‌ జీ తరం ఏ రంగంలో ఉద్యోగమైనా అవుట్‌ సోర్సింగ్‌తో మాత్రమే చేస్తూ పెర్మనెంట్‌గా పని చెయ్యడంలోని స్టెబిలిటీకి అపరిచితంగా ఉన్నారు. దాంతో ఉద్యోగం చెయ్యడానికి ఒక సంస్థ నుండి మరో సంస్థకి సునాయాసంగా మారి΄ోగలిగే మానసిక స్థితి జెన్‌  జీకి వచ్చింది. ఈ స్థితి జీవితంలో మిగిలిన ముఖ్యమైన జీవన విధానాల మీద ప్రభావం చూపిస్తోంది. 

    ప్రేమ... పెళ్లి... పెళ్లి స్థానంలో సహజీవనం... సిట్యుయేషన్‌  షిప్‌... ఇలా పలు రకాలుగా స్త్రీ పురుష సంబంధాలు సాగుతున్నాయి. కాని వీరిలో పూర్వీకుల రక్తం ఉంది. ఆ రక్తం తరతరాలుగా కొనసాగుతూ వచ్చిన భావోద్వేగాలను, జీవన విలువలను ఇచ్చింది. అయితే వర్తమాన ధోరణికీ ఆ గతానికీ లంకె జెన్‌  జీకి కనిపించడం లేదు. 

    దాంతో అన్ని అనుబంధాలు, జీవన మార్గాలలో మానసికంగా వస్తున్న ఘర్షణను అడ్రస్‌ చెయ్యటానికి, దానిని బెటర్‌గా అర్థం చేసుకోవటానికి జెన్‌  జీ తరం చాలెంజ్‌ని ఎదుర్కొంటోంది. ఈ స్థితిని దాటడానికి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తమ చుట్టూ ఉండే పెద్ద వాళ్ళపై ఆధారపడి వారితో పంచుకోవడం కంటే మానసిక వైద్యులతోనో... థెరపిస్టులతోనో... కౌన్సెలింగ్‌ ఇచ్చే వారితోనో పంచుకోవడానికి... చర్చించటానికే ప్రాధాన్యమిస్తున్నారు. పెద్దల మీద కంటే ఈ నిపుణుల మీదే జెన్‌  జీకి ఎక్కువ నమ్మకం... విశ్వాసం. 

    ఈ నమ్మకం, విశ్వాసం సంగతి తెలియక, అర్థం కాక తల్లిదండ్రులు, పెద్దలు, చుట్టూ ఉండేవారు మాత్రం ఈ జెన్‌  జీ తరం తమతో ఏదీ పంచుకోవడంలేదనే ఆదుర్దాకి లోనవుతుండటం చూస్తుంటాము. అలా ఆందోళన పడటం కంటే ఈతరం పిల్లల స్వభావం ఇదని అర్థం చేసుకుంటే వారిలోని ఈ ఆదుర్దా వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపించకుండా ఉంటుంది. 

    వ్యవస్థ మీద పెద్దగా ఆశలు పెట్టుకోని జెన్‌  జీ తరం వాళ్లు సోషల్‌ కాజెస్‌కి ఇన్వాల్వ్‌ అయినా, ఒక డీప్‌ పర్సనల్‌ లెవెల్‌ కమిట్మెంట్‌తో సోషల్‌ మూమెంట్స్‌తో ఇన్వాల్వ్‌ అయినా తమకి ఓ సోషల్‌ కాంటాక్ట్‌ వస్తుందనే హోప్‌తో ఆ మేరకు మాత్రమే పని చేస్తున్నారు. 

    అంతర్జాలమే వాళ్ళ పుట్టిన ఊరు. వారి జగత్తు, ఉనికి అదే. వాళ్ళ ఉనికిని ముందుగా తల్లిదండ్రులు, పెద్దలు అర్థం చేసుకుంటే ఈ పిల్లలు మన పిల్లలే... గ్రహాంతరవాసులు కారని తెలుస్తుంది. ఒక రకంగా వాళ్ళకి మన కన్నా ఎన్నో ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కనిపించినా నిజానికి మన తరాలకు ఉన్న భరోసాలు ఏవీ వాళ్ళకు లేవు. 

    వాళ్ళు చూసిన తల్లిదండ్రులు అందరూ నయా ఆర్థిక విధానాలలో ఎదిగి అనేక అభద్రతలతో సతమతమైన వాళ్ళే. వాళ్ల కాలంలో వాళ్లు చూస్తూ ఉన్న ‘మీ టూ’, ‘కోవిడ్‌’, ‘ఇఅఅ’, ‘ఎల్‌జీబీటీక్యూ మూవ్‌మెంట్స్‌’.... వీటిని గుర్తు పెట్టుకుంటే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. 

    జెన్‌  జీ ఆడపిల్లలు తమ గుర్తింపు ప్రేమ, పెళ్లిలో మాత్రం చూసుకోవడం లేదనేది సుస్పష్టం. తమలోని తెలివి, తాము అందుకోగల అవకాశాలు, ఆకాంక్షలు... వీటి ఆధారంగా తమకు ఏ గుర్తింపు దక్కగలదో దానినే కోరుకుంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకుంటే వారి దారిలో పెద్దలు తమను తాము ఎక్కడి వరకు పరిమితం చేసుకోవాలో కూడా తెలుస్తుంది. మన పిల్లలను అందుకోవాల్సింది మనమే. 
    కుప్పిలి పద్మ

    (చదవండి: టూత్‌పిక్‌తో టవర్‌ నిర్మించి రికార్డు సృష్టించాడు..!)

     

  • ఒక రంగంపై మంచి ఆసక్తి ఎంతటి అనితరసాధ్యమైనదైనా సాధించేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ యువకుడు. అతడికి ఇంజనీరింగ్‌ పట్ల ఉన్న మక్కువ ఏకంగా అత్యంత అల్పమైన టూత్‌పిక్‌లతో టవర్‌ నిర్మించేలా చేసి, గిన్నిస్‌ రికార్డులకెక్కేలా చేసింది. ఆ కుర్రాడు ఎవరంటే..

    యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్‌లోని నేపర్‌విల్లేకు చెందిన ఎరిక్‌ కేబుల్‌ అనే యువకుడు ఇంజనీరింగ్‌ పట్ల తనకున్న ప్రేమను రికార్డు క్రియేట్‌ చేసే విజయంగా మార్చుకున్నాడు. నెలల తరబడి టూత్‌పిక్‌లు జిగురు మాత్రమే ఉపయోగించి 17 అడుగుల ఎత్తైన టవర్‌ని నిర్మించాడు. ఈ నిర్మాణం ఎత్తు 5.28 మీటర్లు. ఇది పూర్తిగా టూత్‌పిక్‌తో నిర్మించిన ఎత్తైన భవనంగా నిలిచి..గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

    ఆ యువకుడు ప్రసిద్ధ ఈఫెల్‌ టవర్‌ని ‍ప్రేరణగా తీసుకుని ఈ ఎత్తైన టవర్‌ని నిర్మించినట్లు తెలిపాడు. ఆ యువకుడు ఎరిక్‌ 2020లో పాప్సికల్ స్టిక్స్‌తో ఎత్తైన టవర్‌ని నిర్మించి రికార్డు క్రియేట్‌ చేశాడు. తాజాగా ఇప్పుడు ఈ టూత్‌పిక్‌లతో తన రికార్డుని తానే బ్రేక్‌ చేశాడు. చిన్న వయసులో రికార్డులు సృష్టించడం ఒక థ్రిల్లింగ్‌ అనుభవం అని, అందుకే మళ్లీ మళ్లీ అలాంటిదే చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంటుందంటున్నాడు ఎరిక్‌. 

    అయితే ఈసారి మరింత కఠినతరమైనది నిర్మించాలనే ఛాలెంజ్‌ తీసుకున్నానని అన్నాడు. ఆ నేథ్యంలో ఇలా టూత్‌పిక్‌లు ఎంచుకున్నానట్లు తెలిపాడు. ఇవే ఎందుకంటే పాప్సికల్ స్టిక్స్ అంత బలంగా ఉండదు కాబట్టి వీటితే నిర్మిస్తేనే కథ అసలైన టాలెంట్‌, కిక్‌ అని అంటున్నాడు ఎరిక్‌. ముందుగా చిన్న చిన్న నిర్మాణాలను నిర్మించడం సాధన చేసి..ఆ తర్వాత పెద్ద టవర్‌ని నిర్మించేందుకు ఉపక్రమించానని అంటున్నాడు. 

    ఆ టవర్‌ లోపలి ప్రత్యేక విభాగాలను ఇంటివద్ద నిర్మించి ఆ తర్వాత నేపర్‌విల్లేలోని ఒక బహిరంగ కార్యక్రమంలో దాన్ని నిర్మించినట్లు వివరించాడు. STEM (స్టెమ్) అనే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ కలయికతో కూడిన ప్రతిష్టాత్మక కోర్సుపై ఉన్న మక్కువ వల్లే రికార్డు స్థాయిలో ఈ టూత్‌పిక్‌ టవర్‌ని నిర్మించాడు. 

    (చదవండి: రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!)

     

  • టాలీవుడ్‌ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న,  విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్‌ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్‌ వేర్‌లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్‌ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..

    రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్‌ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్‌లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో  హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్‌తో డిజైన్‌ చేశారు. 

    దానికి తగ్గట్టుగా బ్లౌజ్‌ సైతం బంగారు థ్రెడ్‌వర్క్‌తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్‌ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. 

    వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్‌ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్‌ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్‌లైన్‌ నుంచి లేయర్డ్‌ ఆభరణాలు, చోకర్‌లు ఆ చీర లుక్‌ని మరింత హైలెట్‌ చేశాయి.

    అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్‌ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్‌ వేర్‌ ఐవరీ ధోతీ సిల్హౌట్‌ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్‌ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్‌ చేశాయి.

    (చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్‌..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..)

     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారన్న వైఎస్‌ జగన్‌.. సౌందరరాజన్ మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని వైఎస్‌ జగన్‌ అన్నారు.

  • శ్రీకాకుళం: జిల్లాలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు.  ఇటీవల డయేరియా ప్రబలి పలువురు ఆస్పత్రిలో చేరగా, తాజాగా రెల్లి వీధి బీసీ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. 

    ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్ల గత ఆరు రోజుల నుంచి శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అతిసారంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మంగళవారం ఒక్కరోజునే మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. 

    మరో 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలే. వాస్తవానికి డయేరియా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, నగరంలో సగం డయేరియా విషకోరల్లో చిక్కుకుందని సమాచారం.   

    డయేరియా ప్రబలుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కేసుల వివరాలు బయట పెట్టలేదు. అయితే దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మోణింగి సంతోష్(41) కూడా వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం మరణించాడు. ఆస్పత్రికి వెళ్లే వరకైనా వీరి ప్రాణాలు నిలబడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

  • సాక్షి, హైదరాబాద్‌: తాను ఆరోగ్యంగానే ఉన్నానని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. తన ఆరోగ్యంపై ఆందోళన అనవసరమన్న బొత్స.. రొటీన్‌ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రావడంతో ఆయన స్పందించారు.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.

    Health Condition : తన ఆరోగ్యంపై బొత్స క్లారిటీ