Archive Page | Sakshi
Sakshi News home page

International

  • బంగ్లాదేశ్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువుతీరింది. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్‌తో పాటు మంత్రులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఢాకాలోని జాతీయ పార్లమెంట్  దక్షిణ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమం జ‌రిగింది.

    అయితే కొత్త ప్రభుత్వ కేబినెట్‌లో హిందూ మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు నితాయ్ రాయ్ చౌదరికి చోటు దక్కడం విశేషం. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ నియమించిన 25 మంది క్యాబినెట్ మంత్రులలో నితాయ్ రాయ్ చౌదరి ఒక‌రు. ఆయనకు సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించనున్న‌ట్లు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

    నితాయ్ రాయ్ ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మగురా-2 నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి అయిన జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించారు

    ఎవ‌రీ నితాయ్ రాయ్ చౌదరి?
    77 ఏళ్ల నితాయ్ రాయ్ చౌదరి 1949లో బంగ్లాదేశ్‌లోని మగురా జిల్లాలో జన్మించారు. ఆయ‌న వృత్తిరీత్యా న్యాయవాది. తన ప్రాథమిక విద్యను మగురా గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం ఢాకా విశ్వవిద్యాలయం నుండి లా (న్యాయశాస్త్రం) పట్టా పొందారు.  ఢాకా యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.

    అక్క‌డే ఆయ‌న రాజకీయ జీవితానికి పునాది పడింది.  1988లో మగురా-2 నియోజకవర్గం నుండి తొలిసారిగా జాతీయ పార్లమెంట్‌కు నితాయ్ రాయ్ ఎన్నికయ్యార. ఆయ‌న ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన విద్య, యువజన, క్రీడల శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. నితాయ్ రాయ్ కుమార్తె నిపుణ్ రాయ్ చౌదరి కూడా బీఎన్‌పీలో అత్యంత క్రియాశీలక నాయకురాలగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 

  • భూమ్మీద చిట్టచివరి రోడ్డు ఎక్కడ ఉందో తెలుసా? యూరప్‌లోని European route E69 ను చాలా మంది “ప్రపంచంలోని చివరి రహదారి”గా పేర్కొంటారు. ఈ హైవే Norway దేశంలో ఉంది. ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంగా వెళ్లే రహదారుల్లో ఒకటి. సుమారు 129 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ మార్గం, నార్వే ఉత్తర భాగంలోని North Cape ప్రాంతాన్ని ఓల్డాఫెవోర్డ్ గ్రామంతో కలుపుతుంది. భూమి చివర అంచున నిలబడ్డట్టు అనిపించే ఈ ప్రదేశం సముద్రాన్ని ఎదురుగా చూస్తూ అద్భుత దృశ్యాన్ని అందిస్తుంది.

    ఈ రహదారిలో ప్రయాణం సాధారణ అనుభవం కాదు. మొత్తం ఐదు సొరంగాలు ఉండగా, వాటిలో నార్త్ కేప్ టన్నెల్ సముద్ర మట్టానికి సుమారు 212 మీటర్ల లోతులో నిర్మించబడింది. ఈ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తుంటే, మీరు సముద్రం అడుగుకు వెళ్లినట్లు ఉంటుందని అంటారు.

    ప్రకృతి పరిస్థితులు ఇక్కడ ఎప్పుడైనా మారిపోతాయి. ఒక్కసారిగా బలమైన గాలులు, మంచు తుఫానులు, తీవ్ర చలి — ఇవన్నీ సాధారణమే. వేసవిలో కూడా ఇక్కడ మంచు కురవడం ఆశ్చర్యం కాదు.

    శీతాకాలంలో అయితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. భారీ హిమపాతం కారణంగా రహదారి కొన్నిసార్లు పూర్తిగా మూసివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు. ఎందుకంటే వాతావరణ సూచనలు కూడా కొన్నిసార్లు అంచనా వేయలేని స్థాయిలో మారిపోతాయి. ఒక గంటలోనే సూర్యకాంతి నుంచి మంచు తుఫాన్‌కు మారిపోవడం ఇక్కడ సాధారణ విషయం.

    ఈ రహదారి నిర్మాణం కూడా సవాళ్లతో నిండింది. 1934లో ప్రారంభమైన పనులు దశాబ్దాల పాటు కొనసాగి, చివరకు 1992లో పూర్తయ్యాయి. మంచు, గాలి, సముద్ర తుఫానులు — ప్రకృతి ప్రతికూలతలను తట్టుకుని ఈ రహదారి నిలిచింది. అందుకే ఇది కేవలం ఒక హైవే కాదు, ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రతీకగా నిలిచింది.
     

     

  • వేడి వేడి సమోసాలు అంటే  ఎవరికైనా నోరు ఊరాల్సిందే. సప్త సముద్రాల ఆవల కూడా సమోసా తన ఉనికిని గొప్పగా చాటుకుంటోంది. హాట్ సమోసాల మాయాజాలం అలాంటిది మరి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

    యూకే రాజధాని లండన్‌ వీధుల్లో మహిళ బిహారీ సమోసాలను అందిస్తున్న క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో "గోరియా దేవి" అచ్చమైన దేశీ స్టైల్లో సమోసాలను విక్రయిస్తూ జనాన్ని ఆకర్షిస్తోంది. యాప్రాన్, టోపీ ధరించి,ధోతీ-శైలి స్కర్ట్‌ వేసుకున్న ఆమె"సమోసా సమోసా!" అంటూ ఉల్లాసంగా వీధిలో విక్రయిస్తుంది. దీంతో అక్కడున్నవారంత ఉత్సాహంగా నవ్వులు కురిపించారు.

    "గోరియా దేవి ఆజ్ లండన్ కే స్ట్రీట్స్ మే బిహారీ సమోసా బేచేగీ ( లండన్‌ వీధుల్లో గోరియా దేవి సమోసాలు అమ్ముతుంది)." అంటుంది, మరోవైపు సహోద్యోగి వైపు తిరిగి, "జల్దీ జల్దీ బనావో (త్వరగా తయారు చేయి), నేను మార్కెట్‌లో వెళ్లాలి, బాబూ" అని చెబుతుంది, ఆపై తాజాగా వేయించిన సమోసాల ట్రేలతో బయలు దేరుతుంది. "సమోసే సమోసే, బిహార్ కే సమోసే, గోరియా నే పరోసే" అంటూ నవ్వులు పూయించింది.

    ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    అంతేనా.. ఆమె ఒక ఆలయం దగ్గర ఆగి, "హర్ హర్ మహాదేవ్" భక్తితో మొక్కడం కూడా చూడొచ్చు. "మేహెనాత్ కర్తే హై జీ" ( కష్టపడి పని చేస్తున్నామండీ) అని చెబుతూ సమోసాలు అమ్మడం చూడొచ్చు.

    నెటిజన్లు ప్రశంసలు
    ఈ వీడియో సోషల్ మీడియాలో నెలిజన్ల ప్రశంసలను అందుకుంది, బిహారీగా ఉండటం గర్వంగా ఉందని ఒకరు,  వావ్‌.. చాలా రుచిగా ఉంది, మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చాలా మంచి మార్గం అని  మరో యూజర్‌ కొనియాడారు.

     

     

  • హవానా సిండ్రోమ్' ఉనికిని తప్పు అని నిరూపించడానికి ఒక ప్రయోగాత్మక ఆయుధాన్ని పరీక్షిస్తున్న శాస్త్రవేత్తకు ఊహించని పరిణామం ఎదురైంది.  నార్వేజియన్ శాస్త్రవేత్త మెదడు (Brain Damage) దెబ్బతింది. అసలేంటీ హవానా సిండ్రోమ్‌? దీనికి గురించి వివరాలు తెలుసుకుందాం.

    ది వాషింగ్టన్ పోస్ట్‌ సమాచారం  ప్రకారం దీన్ని సవాల్‌ చేస్తూ, కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేస్తున్న  నార్వే పరిశోధకుడిలో త్వరలోనే ఈ మర్మమైన వ్యాధి లక్షణాలు కనిపించాయి.దీంతో నార్వేజియన్ ప్రభుత్వం CIAని సంప్రదించింది. పెంటగాన్ , వైట్ హౌస్ అధికారులు నార్వేకు కనీసం రెండుసార్లు సందర్శించారు. ఈ విషయం తెలిసిన వారు నార్వేజియన్ శాస్త్రవేత్త లక్షణాలు 'క్లాసిక్' హవానా సిండ్రోమ్ కేసుకు సరిగ్గా సరిపోలడం లేదని పేర్కొన్నారు.

    హవానా సిండ్రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది గూఢచారులు మరియు దౌత్యవేత్తలలో కనిపించే ఒక వివరించలేని వైద్య పరిస్థితి. దీని లక్షణాలలో తీవ్రమైన తలనొప్పి, మైకం వంటివి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది గూఢచారులు  దౌత్యవేత్తలలో ఈ లక్షణాలు కనిపించినట్టు చెబుతారు.
     

    2024లో ఒక అత్యంత రహస్య పరిశోధన ప్రాజెక్టులో భాగంగా, ఆ శాస్త్రవేత్త శక్తివంతమైన మైక్రోవేవ్ రేడియేషన్ పల్స్‌లను విడుదల చేయగల పరికరాన్ని తయారు చేశారు.

    వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆ పరికరాన్ని పరీక్షించిన కొద్దిసేపటికే, పరిశోధకుడిలో ఈ రహస్య వ్యాధి లక్షణాలను అభివృద్ధి చేసుకున్నారు. ఈ విషయంపై నార్వే ప్రభుత్వం సి.ఐ.ఎ (CIA) ను సంప్రదించింది. పెంటగాన్ మరియు వైట్ హౌస్ అధికారులు కనీసం రెండుసార్లు నార్వేను సందర్శించారు. అయితే, ఆ శాస్త్రవేత్త లక్షణాలు 'క్లాసిక్' హవానా సిండ్రోమ్‌తో పూర్తిగా సరిపోలడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    అమెరికా ప్రభుత్వం వీటిని అధికారికంగా "అసాధారణ ఆరోగ్య సంఘటనలు"" (AHIs)గా వర్గీకరించి నప్పటికీ, ఇవి పల్సెడ్ ఎనర్జీ ఆయుధాల (Pulsed Energy Weapons) ద్వారా జరుగుతున్న దాడులని ఒక బలమైన సిద్ధాంతం ప్రచారంలో ఉంది.

    ఈ విషయం తొలుత 2016లో క్యూబాలోని US రాయబార కార్యాలయ సిబ్బందిలో బయటపడింది. ఉన్నట్టుండి వారు విచిత్రమైన  అనారోగ్య పరిస్థితులు కనిపించాయి. ఆ తరువాత ఈ రహస్యం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది, రష్యా, చైనా, భారతదేశం,UKతో సహా 15 కంటే ఎక్కువ దేశాలలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

    ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య

    హోమ్‌ల్యాండ్ టెస్టింగ్ డివైస్ (రహస్య పరికరం)
    జనవరిలో వచ్చిన ఒక CNN నివేదిక ప్రకారం, అమెరికా ప్రభుత్వం ఒక రహస్య ఆపరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఒక పరికరాన్ని ఏడాది కాలంగా పరీక్షిస్తోంది. ఈ పరికరమే ఆ అనారోగ్యాలకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. బైడెన్ పరిపాలన ముగింపు దశలో, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (HSI) విభాగం డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ నిధులతో మిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఈ పరికరాన్ని కొనుగోలు చేసింది.

    ఈ పరికరం 'పల్సెడ్ రేడియో తరంగాలను' ఉత్పత్తి చేస్తుంది. నిపుణులు చాలా కాలంగా వీటినే హవానా సిండ్రోమ్‌కు కారణంగా భావిస్తున్నారు. ఈ పరికరం పూర్తిగా రష్యాది కాకపోయినా, ఇందులో రష్యన్ భాగాలు (Components) ఉన్నాయని అంచనా.

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

  • అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు దివంగత జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసులో తాజాగా విడుదలైన పత్రాలు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు  రేపుతున్నాయి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్'లో వెల్లడవుతున్న అంశాలు క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. భారతదేశంలోఆధ్యాత్మికతకు చిహ్నంగా భావించే మొక్కను నేరగాడు ఇంత దారుణమైన పనుల కోసం వాడిన వైనం దిగ్భ్రాంతి  రేపింది.

    ఇటీవల విడుదలైన ఈమెయిల్స్ ప్రకారం ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో "జోంబీ ఫ్లవర్" ప్రస్తావన బహిరంగ చర్చకు గురిచేసింది.  ఎప్‌స్టీన్‌ తన నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్స్ (Trumpet Plants) పెంచేవాడని తెలుస్తోంది.  2014 - 2015  నాటి ఇమెయిల్స్‌లో తన "నర్సరీలో ట్రంపెట్ ప్లాంట్లు" గురించి అడిగినట్టు,  "స్కోపోలమైన్: మనిషి ఆలోచనా శక్తిని నశింపజేసే శక్తివంతమైన డ్రగ్" అనే శీర్షికతో ఉన్న సమాచారాన్ని ఎప్‌స్టీన్‌ ఫార్వార్డ్ చేశాడు. 

    అసలేంటీ జోంబీ ఫ్లవర్‌
    వీటిని సాధారణంగా ఏంజెల్స్ ట్రంపెట్  లేదా  డెవిల్స్ బ్రీత్ (Devil's Breath) అని పిలుస్తారు. ఇది అందమైన కానీ అత్యంత విషపూరితమైన మొక్క. వీటి పుష్పాలనే జోంబీ ఫ్లవర్ అని పిలుస్తారు. ఈ మొక్క బ్రుగ్మాన్సియా లేదా డాతురా జాతికి చెందినది. దీని ప్రభావంతో జ్ఞాపకశక్తి కోల్పోవడం, పూర్తిగా పట్టు కోల్పోవడం, మగత, కొన్నిసార్లు సంఘటనలను గుర్తుకు తెచ్చుకోలేరు కూడా.

    ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య

    స్కోపోలమైన్ ప్రభావం

    స్కోపోలమైన్ (Scopolamine)అనేదిఈ మొక్కల నుండి తీసే మందు.  దీన్నే "డెవిల్స్ బ్రీత్" లేదా "జాంబీ డ్రగ్" అని పిలుస్తారు. ఇది  తీసుకున్న మనిషిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని ప్రభావంలో ఉన్న వ్యక్తి ఎదుటివారు చెప్పినట్లు వింటాడు, వారు అడిగినవన్నీ ఇస్తారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. దీంతో ఈ డ్రగ్‌ను నేరపూరిత పనుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

    విష స్వభావం
    ఈ మొక్కలను సాధారణంగా బ్రగ్మాన్సియా (Brugmansia) మరియు దత్తూర (Datura) అని పిలుస్తారు. ఇవి పెద్ద తుత్తూరు (Trumpet) ఆకారంలో ఉండి, చూడటానికి అందంగా ఉంటాయి. కానీ వీటి ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ అత్యంత విషపూరితమైనవి. వీటిని తీసుకోవడం వల్ల తీవ్రమైన భ్రాంతులు (Hallucinations), కండరాల బలహీనత, రక్తపోటు పెరగడం, పక్షవాతం, మరణం కూడా సంభవించవచ్చు. కొలంబియాలో దీనిని 'బురుండంగా' అని పిలుస్తారు, అక్కడ నేరస్థులు బాధితులను లొంగదీసుకోవడానికి దీనిని ఎక్కువగా వాడుతుంటారు.

    శివుడికి ప్రీతి పాత్రం 
    హిందూ తత్వశాస్త్రంలో దత్తూర (ఉమ్మెత్త) చాలా భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది శివుడికి పవిత్రమైనది. హిందూ పురాణాల ప్రకారం, ఉమ్మెత్త పువ్వులు, కాయలు పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. క్షీరసాగర మథనం సమయంలో పుట్టిన విషాన్ని (హాలాహలం) శివుడు మింగి లోకాన్ని రక్షించాడు. ఆ విష ప్రభావాన్ని తట్టుకోవడానికి ఉమ్మెత్త వంటి వనమూలికలను ఆయనకు సమర్పిస్తారని చెబుతారు. మనలోని విషపూరిత మైన ఆలోచనలను, అహంకారాన్ని దేవుడికి సమర్పించి నిర్మలమైన మనస్సును పొందాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం.

    ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్‌

  • మన భూమి అందంగా ఉంటుంది… కానీ ప్రతి అందం వెనక ఒక ప్రమాదం  కూడా దాగి ఉంటుంది. ఇప్పడు  మనం ప్రపంచంలో కొన్ని డేంజరస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం..

    బ్రెజిల్ తీరానికి దగ్గర్లో ఉన్న స్నేక్‌ ఐస్‌లాండ్‌. అధికారికంగా దీన్ని క్యుమాడా గ్రాండే దీవి అంటారు. ఇక్కడ అడుగుపెట్టడం అంటే ప్రాణాలతో జూదం ఆడినట్టే. ఎందుకంటే ఈ చిన్న దీవిలో వేల సంఖ్యలో విషసర్పాలు నివసిస్తుంటాయి. ప్రతి అడుగుకీ ఒక పాము కనిపించేంత భయానక పరిస్థితి. అందుకే సాధారణ ప్రజలకు ఇక్కడికి వెళ్లడానికి పూర్తిగా నిషేధం.

    ఇప్పుడు మన ప్రయాణం హిందూ మహాసముద్రం వైపు… అక్కడ ఉంది నార్త్‌ సెంటినెల్‌ ఐస్‌లాండ్‌.. ఇది భారతదేశంలోని అండమాన్ దీవుల్లో ఒకటి. కానీ ఈ దీవి ప్రపంచానికి పూర్తిగా వేరు పడిపోయింది. ఇక్కడ నివసించే సెంటినలీస్ గిరిజనులు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం కోరుకోరు. ఎవరు దగ్గరైనా ప్రతిఘటిస్తారు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత మిస్టీరియస్, ప్రమాదకర ప్రాంతంగా మారింది.

    ఇక భూమి పై అత్యంత డేంజరస్ ప్రదేశాలలో ఒకటి దనాకిల్ లోయ. అత్యంత వేడి ప్రదేశం ఇదే.. ఇది ఎథియోపియాలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటేస్తాయి. ఆమ్లపు సరస్సులు, గంధక వాసన, పోంగే లావా … భూమి మీదనే నరకం ఉందా  అనిపించే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.

    ఆఫ్రికాలోనే మరో భయానక తీరం స్కెల్టెన్‌ కోస్ట్‌. ఇక్కడ సముద్ర అలలు, పొగమంచు కలిసి ఎన్నో నౌకలను మింగేశాయి. తీరానికి కొట్టుకొచ్చిన నౌకల శిధిలాలు, జంతువుల ఎముకలు ఈ ప్రాంతానికి “స్కెలిటన్ కోస్ట్” అనే పేరు ను తీసుకొచ్చాయి.

    ఇప్పుడు దక్షిణ అమెరికా వైపు… బొలీవియాలోని డెత్‌ రోడ్‌(. సన్నని రహదారి, ఒకవైపు లోయ, మరోవైపు కొండచరియలు… చిన్న తప్పిదం ప్రాణాలను తీసేస్తుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రహదారి అంటారు.

    మిస్టరీ అంటే గుర్తుకొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్‌. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నో నౌకలు, విమానాలు అదృశ్యమయ్యాయని కథలు ఉన్నాయి. నిజమో కాదో అనుమానాలే కానీ… బెర్ముడా ట్రయాంగిల్‌ వైపు ఎటువంటి ఫ్లైట్‌లు కానీ .. షిప్ లు గానీ వెళ్లవు ..

    రష్యాలోని మంచు రాజ్యం ఒయ్మ్యాకాన్. ప్రపంచంలోనే అత్యంత చలికాలం నమోదు అయిన గ్రామం ఇది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50°C కంటే తక్కువకు పడిపోతాయి. ఊపిరి కూడా మంచుగా మారేంత చలి!

    చివరిగా అమెరికాలోని డెత్‌ వాలీ. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం. ఇక్కడ వేసవిలో జీవించడం అంటే అగ్నిపర్వతం మధ్య లో నిలబడ్డట్టే.

    ఇలా చూస్తే… భూమి మనకు స్వర్గంలా అనిపించినా, కొన్ని ప్రాంతాలు మాత్రం నరకం కన్నా భయంకరంగా ఉంటాయి. ప్రకృతి అందం ఎంత గొప్పదో… అలాగే ప్రకృతి  అంతే భయంకరం కూడా. 

     

  • ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ ఈ దేశం పేరు వింటే చాలు సీమాంతర ఉగ్రవాదం, హింస, మతతత్వవాదం ఇవే గుర్తుకొస్తాయి. భారత్‌తో సమకాలీకంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఆ దేశం హింసనే నమ్ముకుంది. పక్క దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ హింసతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేసే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అభివృద్ధిని మరచిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు కండోమ్‌లు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

    పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బపడుతోంది. ఇటీవల భారత్‌, ఈయూతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అక్కడి ఎగుమతులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వార్త ఆ దేశాన్ని కలవర పెడుతోంది. పాకిస్థాన్‌లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా జననాలు పెరుగుతున్నాయని.. తద్వారా పేదరికం సంభవిస్తుందని.. అందుకే పేదరికాన్ని నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.

    అందుకోసమే గర్భనిరోధాకాలైన కండోమ్‌ల ధర తగ్గించాలని భావించింది. అయితే ప్రస్తుతం పాక్‌కు ఐఎ‌ంఎఫ్‌ ఆర్థిక సాయం అందిస్తుండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో దాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ధరలు తగ్గించాలని ఐఎ‌ంఎఫ్‌ను కోరగా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా పన్నులు తగ్గించడం సాధ్యం కాదని అవసరమైతే వచ్చే ఏడాది బడ్జెట్‌లో కోతలు విధించాలని తెలిపింది. దీంతో కండోమ్‌ల ధర తగ్గించలేకపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు మీడియాకు తెలిపారు. దీంతో.. ‘పాక్‌లో ప్రజల వద్ద కండోమ్‌లు కొనేంత డబ్బు కూడా లేదు’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతోంది.

    ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో పాకిస్థాన్ అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాలని సర్వే తెలిపింది. పాక్‌ జనాభా త్వరలో 40 కోట్లకు చేరుకుంటుంది. అయితే  అభివృద్ధిలో ఆ దేశం వెనుకబాటులో ఉంది. ఆ దేశ మెుత్తం ఐటీ ఎగుమతులు మన కేరళతో పోలిస్తే తక్కువ ఉ‍న్నాయంటే టెక్నాలజీలో పాక్‌ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Politics

  • తాడేపల్లి: రాష్ట్రంలో చిన్నారులపై జరుగుతున్న వరుస దారుణ ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మదనపల్లి, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో చిన్నారులపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.

    మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి, ఆపై హత్యచేసి, డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా? బాలిక కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారు? నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య. వైయస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం ఆపై హత్య.తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం. ఆపై హత్య. చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన  ఘటనలు జరిగినా, వాటిని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం. ఎల్లోమీడియాను వాడుకుని హడావిడి ప్రకటనలు చేయడం ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేయడం.. మీకు రొటీన్‌ అయిపోయింది.

    మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయిన వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం,  వారిపై హత్యాయత్నాలు చేయించడంపై మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.


    మీ ప్రభుత్వంలో హోంమంత్రిగారు లా అండ్‌ ఆర్డర్‌కు బాధ్యత వహించరు. మీ కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ,  అందరి శాఖల్లో వేలుపెడతాడు. ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరు. ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే.

    మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు? మీరు సృష్టించిన పొలిటికల్‌ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా?

    పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురుకేసులు పెట్టి, అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నాయకడు మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం చేస్తే, కేసు కట్టి, అరెస్టు చేయాల్సిన పోలీసులు, 3 రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి, జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి ఇక రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. తక్షణం లా అండ్‌ ఆర్డర్‌పైన, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడంపైన, వారి ప్రాణాలు కాపాడడంపైన దృష్టిపెట్టండి.
     -వైఎస్ జగన్

  • తాడేపల్లి: ఏపీలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. పదే పదే అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని  హత్య చేసి డ్రమ్ములో కక్కేసినా ప్రభుత్వం చోద్యం చూస్తుందోని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు కూడా ఇలాంటి నేరాలకు కారణమన్నారు. 

    హోంమంత్రి అనిత బిల్ గేట్స్‌తో ఫోటోలు దిగటం మీద చూపే శ్రద్ద నేరాల నిరోధానికి చూపటం లేదని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వరుదు కల్యాణి మాట్లాడుతూ.. ఏపీలో రోజుకు 70 నుంచి 80 శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నారా లోకేష్ కొలంబో వెళ్ళి క్రికెట్ చూస్తున్నాడు. హిందూపురంలో బాలకృష్ణ అనుచరుడు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. 

    అనపర్తిలో ఆరో తరగతి బాలిక మీద టీడీపీ కార్యకర్త లైంగిక వేధింపులకు దిగితే నేరస్తుడుకే పోలీసులు వత్తాసు పలికారు. పోలీసులను ఈ ప్రభుత్వం ఎందుకు వాడుకుంటోంది?, ఇన్ని‌ సంఘటనలు జరుగుతున్నా హోంమంత్రి ఒక్క చోటకు కూడా ఎందుకు పరామర్శకు వెళ్లలేదు?, మదనపల్లె కేసులో నిందితుడి మీద గతంలో కేసులు ఉన్నాయి. అప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కావు కదా?, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ నేరాలకు ఏం సమాధానం చెప్తారు?, భవిష్యత్తు మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం అప్పులు తెచ్చింది. దాంతో జనంతో బలవంతంగా తాగిస్తున్నారు. అంటే రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు ఇక రక్షణ లేనట్టే. కూటమికి ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వ పెద్దలు చేసేది ఇదేనా?’ అని నిలదీశారు.

     

  •  

    మహబూబాబాద్:  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్‌ ఎన్నికల ఉద్రిక్తల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావును పీఎస్‌కు తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎర్రబెల్లి దయాకర్‌ రావు. మీడియతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. చైర్మన్‌ ఎన్నిక తీరును ఎర్రబెల్లి తప్పుబటట్టారు ‘ కష్టపడి పనిచేసిన కార్యకర్తలక నేనేం సమాధానం చెప్పాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్‌ పని చేస్తుంది. .  నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం వ్యవహరించింది. నన్ను, నా భార్యను ఎందుకు అరెస్ట్‌ చేశారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.

    కాగా, మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు  అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి.  బీఆర్‌ఎస్‌ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ 7 వార్డులను దక్కించుకుంది. బీజేపీకికానీ, ఇతరులకు కానీ ఇక్కడ విజయం సాధించలేద. దాంతో  బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య పోరు ఖాయమైంది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలు మారాయి. 

    బీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్‌ పీఠం చేజారిపోవడంతో  ఎర్రబెల్లి దయాకర్‌రావు భావోద్వాగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.  చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  ప్రధానంగా తొర్రూర్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లతో ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఎర్రబెల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బేటాయించిన ఎర్రబెల్లి దయాకర్ రావు  ధర్నా చేశారు. ఆపై ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేశారు.  ఈ క్రమంలో లాఠీచార్జి వంటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

    కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్.. నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • కాకినాడ:  కూటమి నేతలు కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పిఠాపురం వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వంగా గీతా. మహా శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ సాక్షిగా ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ తిరుమల పవిత్రతను రోడ్డెక్కించారని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు వంగా గీతా. 

    రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్‌సిక్స్‌ పథకాలకు పంగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం.. పథకాలకు నిధులు కేటాయించకుండా గుడ్డి సున్నా చూపించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులక పాల్పడి అక్రమ కేసుల పెట్టడమేనా పరిపాలన అంటే? అని ఆమె నిలదీశారు.

     

  • సాక్షి, తూర్పుగోదావరి: అంబటి ఇంటిపై జరిగిన దాడి.. కక్ష పూరిత రాజకీయ పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాంబాబును హతమార్చాలని జరిగిన దాడిలో బాధితులను జైల్లో పెట్టారు.. దాడికి పాల్పడినవారు ప్రేరేపించినవారు.. బయట తిరుగుతున్నారు... ఇది రాష్ట్రంలో రాజ్యాంగం’’ అంటూ మండిపడ్డారు.

    ‘‘రాష్ట్రంలో రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం పబ్లిసిటీ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ మాత్రమే రాష్ట్రంలో చేస్తున్నారు. బడ్జెట్‌లో కనీస అవగాహన ఉన్న కూర్పు కూడా లేదు. రాష్ట్ర చరిత్రలో దారుణమైన బడ్జెట్ ఇదే.. అప్పు మాత్రమే కనబడుతుంది. అప్పు తీసుకొచ్చిన సొమ్ము ఏమయిపోయిందో చంద్రబాబుకు, లోకేష్‌కు తప్ప ఎవరికి తెలియదు’’ అంటూ అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

    ‘‘గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో రెండు లక్షల 70 వేల కోట్లు డీబీటి కింద పేదల అకౌంట్‌లో వేశారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి చంద్రబాబు వివరణ ఇవ్వాలి. సరాసరిన రోజుకు 500 కోట్లు  ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఏ ఒక్క రంగానికి సరైన కేటాయింపులు లేవు. యూరియా కోసం రైతుల రోడ్లమీద కొట్టుకుంటున్నారు. 6000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.  అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు సిలిండర్లు వంటి ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కాలేదు.

    ఒక్క పథకం అమలు చేయకుండా అంబటి వంటి నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్ రెడ్‌బుక్‌ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు బిల్ గేట్స్‌ని కాదు కదా ఎవరు తీసుకొచ్చినా ఏమంటుంది?.  జైల్లో పెడితే మా పార్టీ నేతలు భయపడరు’’ అని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

    పులిని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్య పెట్టారు జాగ్రత్త

    ఏపీలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది: కరణం ధర్మశ్రీ
    రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తుంది. చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. కేవలం తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించేందుకే అంబటి రాంబాబును జైలు పాలు చేశారు. బడ్జెట్ బుక్ అంతా వట్టి డొల్ల. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో సమాధి కడతారు

  • పశ్చిమ గోదావరి: సైకో ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు నుంచి ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. తనను చంపించేందుకు రఘురామ కుట్ర పన్నారని చెప్పారు. తనను చంపాలని కుటుంబ సభ్యుల ఎదుటే అనుచరుడిని ఆదేశించారని తెలిపారు.

     ఆయన సోమవారం పశి్చమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ చలవ వల్లనే రఘురామకు అధికారయోగం లభించిందని, ఇప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అసహ్యం అయ్యారని విమర్శించారు. ఆయన పక్కన ఉండి వ్యవహారాలు చక్కబెట్టే మరో సైకో కొత్తపల్లి నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎమ్మెల్యేను ఎదిరించి మాట్లాడినా, చెప్పిన మాట వినకపోయినా వారు టీడీపీ, జనసేనకు చెందిన వారైనా సరే అక్రమంగా కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. అటువంటి వారిలో తాను ఒకడినన్నారు.  

    నన్ను చంపించేయమన్నారు  
    కొత్తపల్లి నాగరాజు సహకారంతో తనను చంపించేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వరరాజు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుపై గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తే.. ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే వెళ్లి శివరామరాజు కార్యాలయం ముందు తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని రచ్చచేసినట్లు చెప్పారు. ఇంత సాయం చేస్తే ఎమ్మెల్యే కార్యాలయంలో తాను, తనతోపాటు ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నిలబడాలని, ఎవరినీ అసలు గౌరవించరని పేర్కొన్నారు. అనుచరుడు నాగరాజు సహకారంతో ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ బయటపెడతానని చెప్పారు. 

    నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సొసైటీ పదవులు అగ్రవర్ణాలకే అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదేంటని అడిగితే రూ.40 కోట్లు ఖర్చుచేసి గెలిచానని, అవి తిరిగి ఇచ్చేస్తే నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అధిష్టానానికి సైతం చెబుతున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలో అది తగదని చెప్పిన తనను చంపించేయాలని తన కుటుంబసభ్యుల ముందే అనుచరుడు నాగరాజును ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు చంపించేస్తారన్నారు. 

    తనను చంపేందుకు దమ్ముంటే రఘురామకృష్ణరాజు రావాలని తొడగొట్టి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే దోపిడీ, దౌర్జన్యాలను రికార్డులతో సహా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లకు త్వరలోనే అందిస్తానని చెప్పారు. పేదలంటే రఘురామకృష్ణరాజుకు అసలు గిట్టదని, రోడ్డు పక్కన ఇల్లు కనబడితే చాలు పడగొట్టేయాలని ఆదేశాలు ఇస్తారని చెప్పారు. నియోజకవర్గంలో మత సామరస్యం లేకుండా పోయిందని, చర్చిలు, మసీదులు కూలదోస్తున్నారని చెప్పారు. అవన్నీ రఘురామకృష్ణరాజు ఆదేశాలతోనే జరుగుతున్నాయని వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు.   

Movies

  • దర్శకుడు మారుతికి ‘రాజాసాబ్’ సినిమా ఫలితం పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఆ సినిమా పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ విమర్శల బాణాలు మాత్రం మారుతి వైపే ఎక్కువగా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరో కొత్త స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు. మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మారుతి కేరళలో ప్రశాంతంగా కూర్చుని తన దగ్గర ఉన్న ఒక పాయింట్‌ను పూర్తి స్క్రిప్ట్‌గా మార్చారు. అయితే ఆ కథకు హీరో ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దృష్టి మాత్రం హీరో రామ్, హీరో వరుణ్ తేజ్‌లపై ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

    ఈ సినిమా నిర్మాణం మైత్రీ మూవీస్‌తో జరగనుంది. మైత్రీలో మారుతి సినిమా ఎప్పటి నుంచో ప్లాన్‌లో ఉంది. కానీ ఇప్పటివరకు ఫైనల్ మాత్రం కాలేదు. చూస్తుంటే ఇప్పుడు ఆ అవకాశం నిజమయ్యేలానే ఉంది. ప్రస్తుతానికి రామ్ చేతిలో సినిమా లేదు. రెండు స్క్రిప్ట్‌లు వర్క్‌లో ఉన్నాయి. ఒకవేళ అవి కాకపోతే మారుతి స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఒకసారి మారుతి స్క్రిప్ట్ విన్న తర్వాత రామ్ లేదా వరుణ్ తేజ్‌ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో స్పష్టత వస్తుంది.

    అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మైత్రీ మూవీస్- మారుతి కాంబినేషన్ ఫైనల్ అయితే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

    • ఈషా ఫౌండేషన్ ఈవెంట్‌ జ్ఞాపకాల్లో తమన్నా..
    • జిమ్‌లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..
    • శారీలో సింగర్ మధు ప్రియ..
    • బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..
    • హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్..

     

     

     

     

     

     

     

     

  • సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్  పోలాడి, సాయి  కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో  సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్  బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని  టీమ్‌ను అభినందించారు.

    ఈ సందర్భంగా   ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి  విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.

    హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది.  ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది.  జెన్యూన్‌ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్‌ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.

    దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో  చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే  అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్‌ వచ్చింది'అని అన్నారు.  కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్
    సంగీతమందించారు.

     

  • ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే తీరు పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లోపే కొత్త సినిమాలు సందడి చేస్తుండడంతో ఆడియన్స్ ఇంట్లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందించడంలో ఓటీటీలు సైతం పోటీ పడుతున్నాయి.

    తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాదిలో ఇండియా స్ట్రీమింగ్‌ సినిమాల జాబితాను ప్రకటించింది.  2026లో నేరుగా ఓటీటికీ వచ్చే చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల జాబితాను వెల్లడించింది. వీటిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి.

    తెలుగు సినిమాలు..

    • తక్షకుడు (మూవీ)

    • సూపర్‌ సుబ్బు (తెలుగు వెబ్ సిరీస్‌)

    హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

    • హమ్‌ హిందుస్థానీ(మూవీ)

    • హలో బచ్చో..(మూవీ)

    • ఇక్కా..(మూవీ)

    • టోస్టర్‌..(మూవీ)

    • మా బెహన్‌..(మూవీ)

    • గాంధారి..(మూవీ)

    • కర్తవ్య..(మూవీ)

    బాలీవుడ్ వెబ్ సిరీస్‌లు

    • ఫ్యామిలీ బిజినెస్‌..(వెబ్ సిరీస్)

    • తలాశ్: ఎ మదర్స్‌ సెర్చ్‌..(వెబ్ సిరీస్)

    • మిస్‌ మ్యాచ్‌డ్ : సీజన్‌4..(వెబ్ సిరీస్)

    • ముజాఫర్‌ కేఫ్‌..(వెబ్ సిరీస్)

    • లస్ట్ స్టోరీస్ సీజన్ 3..(వెబ్ సిరీస్)

    • చుంబక్‌..(వెబ్ సిరీస్)

    • ఖుస్కోర్ పండిట్..(వెబ్ సిరీస్)

    •  మామ్లా లీగల్‌ హై -సీజన్‌2..(వెబ్ సిరీస్)

    • గ్లోరీ.. (వెబ్ సిరీస్)

    • ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌..(వెబ్ సిరీస్)

    కోలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు..

    • మేడ్‌ ఇన్‌ కొరియా (మూవీ)

    • లవ్‌ (తమిళ వెబ్ సిరీస్‌)

    • లెగసీ (తమిళ వెబ్ సిరీస్‌)

    టాక్‌ షో

    గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో- సీజన్‌-5
     

  • సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం కొచ్చాడయాన్. 2014లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించింది. గతంలో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ సాయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ‍అప్పట్లో ఈ మూవీపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కార్టూన్‌ సినిమాను తలపించేలా ఉందంటూ ఆడియన్స్ ట్రోల్స్ చేశారు.

    అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో రూపొందించిన టీజర్‌ తలైవా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తాన్ని ఏఐ సాయంతో రీ జనరేట్‌ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రజినీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 
     

  • సినీ తారలు కూడా సాధారణ మనుషులే. వాళ్లకు బాధలు ఉంటాయి. అయితే ఆ బాధలను కప్పిపుచ్చుకుని స్క్రీన్ మీద అందాలతో, నవ్వులతో అభిమానులను అలరిస్తుంటారు. అందరిలాగే తారల జీవితాల్లోనూ ఎవరికీ తెలియని వేదనలు, విషాదాలు దాగి ఉంటాయి. అలాంటి హృదయవిదారక కథే నటి ప్రత్యూషది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ప్రేమ పోటుకు బలైపోయింది. ఈ విషాద ఘటన జరిగి రెండు దశాబ్దాలు దాటిన తర్వాత సుప్రీం కోర్టు నేడు(మంగళవారం) తన తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. నాలుగు వారాల్లో లొంగిపోవాలని  ఆదేశాలు జారీ చేసింది.

    అలా సినిమాల్లోకి.. 
    ప్రత్యూష సొంతూరు భువనగిరి. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉండేది. చిన్నప్పటి నుంచి హీరోయిన్‌ కావాలని గోల్‌ పెట్టుకొని..ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఆమెకు సిద్ధార్థరెడ్డితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇంటర్‌ అయిపోగానే ఆమె సినిమాల్లోకి వెళ్లగా.. సిద్ధార్థ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో జాయిన్‌ అయ్యాడు. అప్పట్లో జరిగిన ‘మిస్‌ లవ్లీ స్మైల్‌’ పోటీలో  ప్రత్యూష్‌ పాల్గొని.. విజయం సాధించింది. దీంతో ఆమెకు 1998లో ‘రాయుడు’ సినిమాలో నటించే చాన్స్‌ వచ్చింది.  అది రిలీజ్‌ అయిన తర్వాత ప్రత్యూషకు వరుస అవకాశాలు వచ్చాయి. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని.. ఇలా నాలుగేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ్‌లో కలిసి 12 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

    ఫిబ్రవరి 23న ఏం జరిగింది?
    ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సిద్ధార్ధ్‌తో స్నేహాన్ని కంటిన్యూ చేసింది. కొంతకాలం పాటు బాగానే ఉన్నా..తర్వాత విబేధాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న  సాయంత్రం ఓ బ్యూటీ పార్లర్‌లో ప్రత్యూష, సిద్ధార్థ్‌ కలిశారు. అనంతరం ఇద్దరు కలిసి కారులో బయటకు వెళ్లి.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరూ కూల్‌డ్రింక్‌లో విషయం కలుపుకొని తాగారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా.. సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రేమికుల ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముగించే సమయంలో కీలక విషయం బయటకు వచ్చింది.

    ఆత్మహత్యా?  హత్యా?
    ప్రత్యూషది ఆత్మహత్య కాదని.. ఎవరో ఆమె గొంతు నులిమి చంపారని ఓ ఫోరెన్సిక్‌ నివేదిక బయటకు వచ్చింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తు కోసం వైద్యుల బృందాన్ని నియమించింది. ఈ బృందం చేసిన విచారణలో ప్రత్యూషది ఆత్మహత్యేనని తేలింది. పురుగులమందు కారణంగానే ప్రత్యూష మరణించారని.. ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదంటూ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేరం కింద సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ శిక్షను మూడేళ్లకు కుదిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని కూడా సవాల్‌ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు. అయితే సుప్రీంలో అతనికి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులకు లొంగిపోవాల్సిదేంటూ మంగళవారం సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. 

  • రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్‌ విషెస్ తెలిపారు. దర్శకుడితో షూట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా పెద్ది మూవీ నటుడు శివరాజ్‌కుమార్‌ డైరెక్టర్‌ బుచ్చికి బర్త్‌ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా బుచ్చిబాబు వెల్లడించారు. ట్విటర్ వేదికగా శివరాజ్‌కుమార్‌తో ఉన్న ఫోటోను పంచుకున్నారు. థ్యాంక్‌ యూ సో మచ్‌ ఫర్ లవ్‌లీ గిఫ్ట్ అంటూ బుచ్చిబాబు ట్వీట్ చేశారు.

     

  • కోలీవుడ్ హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో విశాల్‌కు చుక్కెదురైంది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో మొదట లైకాకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

    ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. విశాల్ రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లు చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు ధర్మాసనం అందుకు విముఖత వ్యక్తం చేస్తూ విశాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.  కాగా.. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని.. ఆ డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేద‌ంటూ 2022లో లైకా ప్రొడక్షన్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 

  • కోలీవుడ్ హీరో విజయ్‌ ఆంటోని అక్క కొడుకు అజయ్‌ దీషన్‌ కథానాయకుడిగా నటించిన లేటేస్ట్ మూవీ బూకీ(తమిళంలో పూకీ). ఈ సినిమాకు గణేశ్‌ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగులో బూకీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్‌ ఆంటోని నిర్మించడంతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో కూడా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఈవెంట్‌ నిర్వహించారు.

    ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై హీరో అజయ్‌‌ దీషన్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగారు. రిలేషన్‌షిప్‌ విషయంలో విజయ్ ఆంటోనీ మీకు ఎలాంటి సలహా ఇచ్చారని హీరోను అడిగింది. రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్రెండ్‌గా ఉండమని చెప్పాడని.. ఆ స్నేహం ఒక ఐదేళ్ల పాటు కొనసాగితే అప్పుడు ఆలోచించాలని సలహా ఇచ్చాడని అన్నారు. ఇది విన్న మంచు లక్ష్మీ కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పకు ‍‍అని సలహా ఇచ్చింది.

    అంతేకాకుండా ఈ మూవీ టైటిల్‌ గురించి కూడా మంచు లక్ష్మీ మాట్లాడింది. పూకీ అనే పదం తమిళంలో క్యూటీ అని అర్థమని చెప్పుకొచ్చింది. యంగ్‌స్టర్స్‌ ఎ‍క్కువగా ఈ పదాన్ని వాడతారని తెలిపింది. సినిమాల వల్ల డబ్బులు పొగొట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ స్పందించింది. అవునండి.. అప్పులు అనేవి వందశాతం నిజం.. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు  ఇంకా  కట్టుకుంటున్నానని తెలిపింది. 

    కాగా.. ఈ చిత్రంలో ధనుషా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్‌ ప్రసన్న, బ్లాక్‌ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు నటించారు.
     

     

  • తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్‌ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

    ఈ సందర్భంగా అర్జున్ సర్జా మాట్లాడుతూ.. 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.

    కాగా.. అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ సీతాపయనం. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయన్‌గా మెప్పించింది. ఈ మూవీ ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా కీలక పాత్రలో మెప్పించారు. 
     

     

  • నా కెరీర్‌ మొత్తంలో అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా ‘హే బల్‌వంత్‌’. కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది’ అన్నారు యంగ్‌ హీరో సుహాస్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హే బల్‌వంత్‌' (హే భగవాన్‌ చిత్రం టైటిల్‌ మార్పు) . శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌  మంగళవారం  పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హేబల్‌వంత్‌గా మార్చాం. సినిమాలో  నరేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.

    చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ మూవీతో నాకు విజయం అందుతుందనే నమ్మకం ఉంది.

    ప్రతి సినిమా కోసం మీ ఎఫర్ట్‌ పెడుతున్నాను. కానీ సరైన విజయం అందడం లేదు.  విజయం కోసం ఎదురుచూడటమే కాస్త బాధగా అనిపిస్తుంది. కానీ వెంటనే తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాను.

    వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత అందరూ  కంట్రోల్‌గా ఆలోచించి సినిమా చేయమని చెప్పారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్‌ ఇచ్చి హేబల్‌వంత్‌ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ‘మంచి యాక్టర్‌. మంచి సినిమా పడాలి’ అనే సానుభూతి అందరిలో ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

    తమిళ్‌ సినిమా మందాడిలో మెయిన్‌ విలన్‌గా చేస్తున్నా. సినిమా రిజల్ట్‌ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్‌ చేసిన లుక్‌ అండ్‌ క్యారెక్టర్‌. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్‌ అయ్యారు.

    నా కెరీర్‌ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్‌స్‌లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.

    కెరీర్‌ పట్ల సంతోషంగా ఉ‍న్నాను. ఈ సినిమా హిట్‌ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్‌ కాన్పిడెంట్‌గా ఉన్నారు. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్‌ కూడా చూసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది.

    ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్‌ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్‌ అవుతాయి.
     

  • మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. గతేడాది వచ్చిన 'కూలీ'తో మిగతా దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. అలా ఇతడి పోలీస్ కానిస్టేబుల్‌గా చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. దాదాపు నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి వస్తుంది?

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

    2000-10 మధ్య హీరోయిన్‌గా ఫేమస్ అయిన నవ్య నాయర్ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్లు ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ సినిమా 'పాతిరాత్రి'. ఈ టైటిల్‌కి అర్థరాత్రి అని అర్థం. గతేడాది అక్టోబరు 17న థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం చాన్నాళ్ల తర్వాత అంటే ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

    'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

  • మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్‌ ఇటీవలే రోటిన్‌ భిన్నంగా కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ డైరెక్షన్‌లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్‌ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్‌ మీట్‌లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్‌ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్‌ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు.  దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్‌స్ట్రక్షన్‌ ఫీల్డ్‌లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్‌ ఎడ్యుకేషన్‌కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.

    నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్‌లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ బ్యాంక్‌లో పడే వరకూ తన అకౌంట్‌లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్‌నుమా దాస్‌ రిలీజ్‌ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్‌లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్‌ సినిమాకు అడ్వాన్స్‌ రూ.50 వేలు బ్యాంక్‌ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు.
     

  • ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఎన్ని విమర్శలు, వివాదాలు ఎదురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కేరళలోని అమ్మాయిలను మత మార్పిడి చేసి గల్ఫ్‌ దేశాలకు తీసుకెళ్లిన రియల్‌ స్టోరీతో ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. . సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది.

    తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ వస్తోన్న ది కేరళ స్టోరీ-2 గోల్ బియాండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే మనదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను లవ్ పేరుతో మత మార్పిడి చేసి చిత్ర హింసలకు గురి చేసే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రియల్ సంఘటనల ఆధారంగానే రూపొందించారు. ఈ చిత్రాన్ని ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 

    కాగా.. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌లో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఈ సినిమాకు మన్నన్ షా సంగీతం అందించారు. ఈ సీక్వెల్‌ ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది.

    కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు.

     

  • నటి ప్రత్యూష కేసులో ఎట్టకేలకు తుదితీర్పు వెలువడింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని పేర్కొంది. అలానే అతడి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన రెండున్నరేళ్ల జైలుశిక్షని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు అనంతరం స్పందించిన ప్రత్యూష తల్లి సరోజిని దేవి.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)

    'హైకోర్డు తీర్పునే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎక్కడున్నా సరే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి లొంగిపోవాలని తీర్పులో పేర్కొన్నారు. రెండున్నరేళ్లని ఖరారు చేశారని అనుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా కూతురిపై అత్యాచారం జరిగిందని నేను నమ్ముతున్నా. చంపేశారని కూడా నమ్ముతున్నా. నా కూతురు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఎవరేం చెప్పినా ఈ రెండింటి గురించి వేరేది నమ్మే పరిస్థితిలో లేను'

    'నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం దక్కలేదు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాది సుప్రీంకోర్టులో 14 ఏళ్ల పోరాటం. 2011 నుంచి పోరాడుతూనే ఉన్నాను. హైకోర్టులో ఇచ్చిన రెండున్నరేళ్ల శిక్షని.. ఇక్కడ రెట్టింపు చేస్తారని భావించాను. కానీ సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డ ఆత్మకు శాంతి కలగదలేదని అనుకుంటున్నాను' అని సరోజిని దేవి చెప్పుకొచ్చారు.

    ప్రత్యూష ఎవరనేది ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90స్ ప్రేక్షకులని అడిగితే చెప్తారు. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు తన ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది. సిద్ధార్థ్ కుటుంబం.. ఈ ప్రేమని అంగీకరించకపోవడంతో వీళ్లిద్దరూ 2002 ఫిబ్రవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా.. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రత్యూషని ఆత్మహత్యకు ప్రేరేపించాడని చెప్పి సిద్ధార్థ్ రెడ్డికి తొలుత ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే 2011లో ఈ శిక్షని రెండేళ్లకు తగ్గించింది హైకోర్టు.

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

  • సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ స్టార్‌ హోదా వచ్చాకా..బాలీవుడ్‌కి వెళ్లి సత్తా చాటాలని అనుకుంటారు. సౌత్‌లో రెండు, మూడు హిట్లు పడితే చాలు.. బాలీవుడ్‌పై ఫోకస్‌ చేస్తారు. అలా దక్షిణాది నుంచి వెళ్లిన తారల్లో కొంతమంది బాలీవుడ్‌లోనూ రాణిస్తే.. మరికొంతమంది అవకాశాలు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి వచ్చారు. చాన్స్‌ల సంగతి పక్కన పెడితే.. సౌత్‌ వాళ్లకు సరైన గౌరవం కూడా ఇవ్వరని అంటోంది నటి రేజీనా  కసాండ్రా. 

    16 ఏళ్లకే కెరీర్‌ని ప్రారంభించిన రెజీనా.. తెలుగులో రవితేజ, గోపీచంద్‌, సాయిదుర్గు తేజ్‌, సందీప్‌ కిషన్‌ లాంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఇక్కడ వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్‌ ప్రయత్నాలు చేసింది. ‘ఏక్ లడ్కీకో దేఖా తో ఐసా లగా’ అనే చిత్రంలో ఆమె నటించింది. ఆ మూవీతో రెజీనాకు కూడా అంత పేరేమీ రాలేదు. తర్వాత మరి కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ సినిమా ఫలితాల సంగతి పక్కన పెడితే.. అసలు బాలీవుడ్‌కి దక్షిణాది నటీనటులు అంటే చిన్నచూపు అని.. వాళ్ల ప్రవర్తననే వెరైటీగా ఉంటుందని రెజీనా అంటోంది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనకు ఎదురైన అనుభవాల గురించి రెజీనా చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్ లో నా ప్ర‌యాణం  ఊహించినంత సుల‌భంగా సాగ‌లేదు. హిందీ భాష‌పై నాకు పూర్తి ప‌ట్టు ఉన్నా, మాట్లాడ‌టంతో పాటూ హిందీ రాయ‌గ‌లిగినా, వేరే సినిమాల్లో ఇత‌ర హీరోయిన్ల‌లాగా  డ‌బ్బింగ్ ఆర్టిస్టుల‌ను వినియోగించుకోక‌పోయినా బాలీవుడ్ లో నేను పూర్తిగా క‌లిసిపోయాన‌నే ఫీలింగ్ క‌లగ‌లేదు. 

    సౌత్‌ నుంచి వచ్చిన నన్ను కొందరు వేరేలా చూశారు. నా నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన, మాట తీరు అసౌకర్యానికి గురి చేసింది. అవన్నీ చూశాక నాలో ఒక రకమైన భయం మొదలైంది’ అని రెజీనా చెప్పుకొచ్చింది.ఇలాంటి అనుభవం అందరికి ఎదురవుతుందని కూడా చెప్పలేమన్నారు. అంతేకాదు బాలీవుడ్ మొత్తం అలాంటిదే అని చెప్పడం కూడా కరెక్ట్‌ కాదని రెజీనా అన్నారు. అంద‌రూ ఒకేలా ఉండ‌రని, త‌న‌కు మ‌ద్దతుగా నిలుస్తూ, గౌర‌వించిన వాళ్లు కూడా ఉన్నార‌ని రెజీనా చెప్పింది. 
     

  • అత్యధికశాతం మంది భారతీయులకు నచ్చే టూరిస్ట్‌ డెస్టినేషన్‌ కావచ్చేమో కానీ గత కొన్నేళ్లుగా దుబాయ్‌ భారతీయ సినీ సెలబ్రిటీలకు  పెట్టుబడులకు కేంద్రంగా కూడా మారింది.  ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ ప్రముఖ నటులు దుబాయ్‌లో ఇళ్లు, స్థలాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఎంటర్టైన్మెంట్‌ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి అక్కడ స్థిరనివాసాలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.

    కారణాలివే...
    అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, విలాసవంతమైన జీవనశైలి, అలాగే గ్లోబల్‌ బిజినెస్‌ అవకాశాలు సెలబ్రిటీలను దుబాయ్‌ వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాకుండా, సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమైన లొకేషన్లు, వరల్డ్‌ క్లాస్‌ ఎంటర్టైన్మెంట్‌ వేదికలు కూడా దుబాయ్‌ను ఫేవరెట్‌ డెస్టినేషన్ గా మార్చాయి. ఇటీవలే దుబాయ్‌లో స్టూడియో సిటీ పేరుతో ఒక అత్యాధునిక షూటింగ్‌ వేదికను కూడా ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా సినిమా అవార్డుల వేడుకలు దుబాయ్‌లో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం వల్ల  ఎంటర్‌టైన్‌ మెంట్‌ షోలు, మూవీ ప్రమోషన్లు  నిర్వహించడానికి దుబాయ్‌ అనువైన వేదికగా మారింది. అది సెలబ్రిటీలకు మరో ప్లస్‌ పాయింట్‌గా మారింది. అంతేకాక ప్రపంచంలోని అనేక దేశాలకు  కేవలం 8 గంటల్లోనే దుబాయ్‌ నుంచి రాకపోకలు సాగించవచ్చు కూడా. నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్‌ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్‌ స్టైల్‌...వంటివన్నీ ఆకర్షణలే.

    పన్ను తక్కువ భధ్రత ఎక్కువ...
    దుబాయ్‌లోని పన్నుల వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అనేది విశ్లేషకుల మాట. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించనక్కర్లేదు. అలాగే  అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్‌ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరుగా పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు.  రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా దుబాయ్‌కు మకాం మారుస్తున్నారు. దుబాయ్‌లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు. ఇలా ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, భద్రత కూడా సెలబ్రిటీలను దుబాయ్‌కి రా రమ్మంటున్నాయ్‌.  

    బాలీవుడ్‌ పాగా...
    ఈ నేపధ్యంలో దుబాయ్‌లో పలువురు బాలీవుడ్‌ నటులు పాగా వేస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా పేరొందిన దుబాయ్‌లోని పామ్‌ జుమైరా ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఉంది. ఇది అక్కడి ఆయన అభిమానులకు  ఓ ప్రత్యేక ఆకర్షణగా కూడా. ఇదే ప్రదేశంలో మన దేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు అంబానీ కుటుంబీకులకు కూడా నివాసాలు ఉన్నాయి.  అలాగే సల్మాన్‌ ఖాన్, సంజయ్‌ దత్‌ లాంటి నటులు కూడా దుబాయ్‌లో ఖరీదైన రెసిడెన్షియల్‌ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్‌లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్‌ కోసం అని చెబుతూ ప్రముఖ నటుడు మాధవన్‌ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు అడ్రెస్‌ మార్చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మాజీ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా విడాకుల అనంతరం  దుబాయ్‌లోనే నివసిస్తున్నారు.  బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాప్‌ స్టార్‌ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్‌ కూడా దుబాయ్‌లోనే సెటిలైపోయారు. కార్‌ రేస్‌ల గురించి తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ తరచుగా దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.

    టాలీవుడ్‌ నుంచి కూడా పలువురు నటులు దుబాయ్‌లో అపార్ట్‌మెంట్లు, హాలిడే హోమ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ల సమయంలో ఉండేందుకు, కుటుంబంతో విహారానికి వీలుగా  వీటిని ఉపయోగిస్తున్నారు.  నివాసాలకే కాకుండా, కొంతమంది సెలబ్రిటీలు దుబాయ్‌లోని అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు, కమర్షియల్‌ స్పేస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. పర్యాటక పరంగా దూసుకుపోతున్న ప్రాంతం కావడంతో భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉండటంతో,  సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.

    వినోదానికి లోటు లేదు...
    ఇస్లామిక్‌ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే దుబాయ్‌ చాలా సరళమైన  విధానాలను అనుసరిస్తుంది. అక్కడి ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్‌ పర్సనల్‌ స్టేటస్‌ చట్టం అమలులో ఉంది. అలాగే ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న  లివ్‌–ఇన్‌ రిలేషన్‌ షిప్స్‌ను  నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. అంతేకాదు దుబాయ్‌కి సమీపంలో ఉన్న యూఏఈ లోని రస్‌ ఉల్‌ ఖైమా ప్రాంతంలో త్వరలోనే క్యాసినో కూడా రానుంది. దీంతో మరింతగా ఈ ఎడారి దేశం సెలబ్రిటీలు ఎంచుకునే రహదారిగా మారడం తధ్యంగా కనిపిస్తోంది.

  • ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. ఇప్పుడు జోరు తగ్గిపోయింది గానీ 90స్, 20స్ టైంలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. అయితే గత కొన్నాళ్ల నుంచి కాపీరైట్ పేరుతో కోర్టులో కేసులు వేస్తూ పలువురు దర్శకనిర్మాతలని ఇబ్బంది పెడుతూ వచ్చారు. వీటిలో చాలావరకు ఈయన అనుకూలంగా తీర్పులే వచ్చాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈయనకు పెద్ద షాకిచ్చింది.

    (ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)

    గతేడాది 'అగత్యా' అనే సినిమా విడుదల సందర్భంగా ఇళయరాజా, ఆడియో సంస్థ 'సరిగమ'కు మధ్య వివాదం మొదలైంది. ఇదికాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వచ్చేంతవరకు 'సరిగమ'కు సొంతమైన 134 సినిమాల్లో పాటలని ఇళయారాజా ఉపయోగించడానికి ఏ మాత్రం వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

    1976 నుంచి 2001 వరకు ఇళయరాజా స్వరపరిచిన 134 సినిమాల పాటల హక్కులని ఆయా నిర్మాతలు.. శాశ్వత ప్రాతిపదికన సరిగమ ఆడియో సంస్థకు విక్రయించారు. అయితే అందులోని కొన్ని పాటలని ఉపయోగించుకోవచ్చని.. ఇళయరాజా కొన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కి అనుమతి ఇచ్చారు. దీంతో సరిగమ.. కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ఇళయారాజాకు షాకిచ్చేలా తీర్పు వచ్చింది. నిర్మాత నుంచి కొనుగోలు చేసిన ఆడియో సంస్థకే సర్వ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా సాంగ్స్ ఉపయోగించడానికి వీల్లేదని పేర్కొంది. దీనిబట్టి ఇకపై సదరు పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు కుదరదు. అలానే సదరు పాటలకు ఈయనకు హక్కు లేనట్లే.

    (ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత)

  • ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్‌ స్ట్రాటజర్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఆమె తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో యాడ్‌ షూటింగ్‌ అంటే చాలా ప్రోటోకాల్స్‌ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి..? ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు.

    కొన్ని రోజుల తర్వాత కావేరి క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్‌ విడుదల చేసింది. అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది.  42 నిబంధనలకు సంబంధించిన లిస్ట్‌ ఎవరు విడుదల చేశారో తనకు తెలీదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. తన వ్యాఖ్యలను వాస్తవమని ఎవరూ తీసుకోకూడదని విన్నవించుకుంది.  

    బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాని కావేరి తెలిపింది. అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్‌గా బన్నీ గురించి వైరల్‌ అయిన 42 నిబంధనలు అనేవి తాన కల్పితమేనని కావేరి బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్‌ అయ్యేందుకే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.

    ఈ ఇంటర్వ్యూ పాడ్‌కాస్టర్  స్వీకృతి కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్  గురించి కావేరి మాట్లాడిన పూర్తి పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌తో పాటు ఇన్‌స్టా రీల్‌ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్‌పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది.

Sports

  • టీ20 ప్రపంచ కప్ 2026ను నేపాల్ అద్భుత‌మైన విజ‌యంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా మంగ‌ళ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో నేపాల్ గెలుపొందింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో నేపాల్‌కు ఇదే తొలి విజయం.

    ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స్కాటిష్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది.  స్కాట్లాండ్ జట్టుకు ఓపెనర్ మైఖేల్ జోన్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. అతను 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అత‌డితో పాటు జార్జ్ మున్సే (27), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (25) రాణించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్ కామీ 3 వికెట్లు పడగొట్టగా, నందన్ యాదవ్ 2 వికెట్లు సాధించాడు.

    అనంత‌రం లక్ష్య చేధ‌న‌లో నేపాల్‌కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్(43), ఆసిఫ్ షేక్ (33) మంచి అరంభం ఇచ్చారు. అయితే మిడిల్ ఓవ‌ర్ల‌లో నేపాల్ వికెట్లు కోల్పోవ‌డంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో స్టార్ ఆల్ రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీపేంద్ర సింగ్ కేవ‌లం 23 బంతుల్లోనే 50 ప‌రుగులు చేసి నేపాల్‌కు చారిత్రత్మ‌క విజ‌యాన్ని అందించాడు. అత‌డితో పాటు గుల్షాన్ జా కూడా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మైఖేల్ లీస్క్ ఒక్క‌డే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 17) రాత్రి 7 గంటలకు మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో స్కాట్లాండ్‌, నేపాల్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది.

    ఓపెనర్‌ మైఖేల్‌ జోన్స్‌ (45 బంతుల్లో 71; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ద సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్కాటిష్‌ ఇన్నింగ్స్‌లో జోన్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. 

    మరో ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (27), బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (25), కెప్టెన్‌ రిచీ బెర్రింగ్టన్‌ (10), మార్క్‌ వాట్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో టామ్‌ బ్రూస్‌ (5), మాథ్యూ క్రాస్‌ (4), మైఖేల్‌ లీస్క్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

    నేపాల్‌ బౌలర్లలో సోమ్‌పాల్‌ కామీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇతను 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. మరో బౌలర్‌ నందన్‌ యాదవ్‌ కూడా పర్వాలేదనిపించాడు. ఇతను 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

    కుషాల్‌ భుర్టెల్‌, కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ తలో వికెట్‌ తీశారు. ఓ దశలో భారీ చేస్తుందనుకున్న స్కాట్లాండ్‌ చివర్లో త్వరితగతిన వికెట్లు కోల్పోయి ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది.

    అనంతరం​ ఛేదనకు దిగిన నేపాల్‌ ఆచితూచి ఆడుతుంది. తొలి 4 ఓవర్లలో ఆ జట్టు వికెట్లు కోల్పోకుండా 26 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు కుషాల్‌ భుర్టెల్‌ 14, ఆసిఫ్‌ షేక్‌ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 145 పరుగులు చేయాలి.

  • ప్రపంచ మేటి క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆ జట్టు వరుసగా నాలుగు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన ఈ 2021 ఎడిషన్‌ జగజ్జేత.. గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టింది.

    ఆతర్వాత జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో మట్టికరిచిన ఈ 2021-23 ఎడిషన్‌ ఛాంపియన్‌.. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే పలాయనం చిత్తగించింది.

    పలు దశాబ్దాలుగా ప్రపంచ క్రికెట్‌ను మకుటంలేని మారాజుగా శాశిస్తున్న​ ఆస్ట్రేలియాకు ఉన్నట్టుండి ఈ దుస్థితి ఏంటని పరిశీలిస్తే.. పలు ఆసక్తికర విషయాలు బయటకి వస్తాయి. ఇందులో మొదటిది, అతి ముఖ్యమైనది ఆ జట్టుకు వెన్నతో పెట్టిన తలపొగరు. అనాదిగా ఆసీస్‌ ఆటగాళ్లు ఇదే తలపొగరుతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లను తక్కువ చేస్తూ వచ్చారు.

    ఇటీవలికాలంలో వారికి ఆ తల పొగరు మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే, ప్రతి క్రికెటర్‌ జీవితంలో ఒక్కసారైనా తన చేతులతో పైకెత్కుకోవాలని భావించే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టి, కెమెరాలకు ఫోజులిచ్చేంతలా. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచిని తర్వాత ప్రస్తుత ఆసీస్‌ టీ20 జట్టు కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ బీరు తాగుతూ ప్రపంచకప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టాడు. ఆ క్షణమే ఆసీస్‌ పతనం ప్రారంభమైనట్లుంది.

    విజయగర్వం తలకెక్కి మార్ష్‌ చేసిన ఆ పనికి ఆసీస్‌ క్రమంగా మూల్యం చెల్లించుకుంటూ వస్తుంది. తాజాగా అదే మార్ష్‌ సారథ్యంలోని ఆసీస్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ 2026లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో దారుణంగా ఓడి, గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    ఆసీస్‌ జట్టు ఐసీసీ టోర్నీల్లో ఇటీవలికాలంలో పలచన పడటానికి మరో కారణం ఆ జట్టు స్టార్‌ ఆటగాళ్లు. ప్రపంచ మేటి ఆటగాళ్లుగా చెప్పుకోబడే ఆ స్టార్‌ ఆటగాళ్లకు ఐసీసీ టోర్నీలంటే చులకన భావం. వారు యాషెస్‌ సిరీస్‌ లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు కానీ, ప్రపంచ దేశాలనీ​ పాల్గొనే మెగా టోర్నీలకు ఇవ్వరు. కారణం ఎంటో వారికే తెలియాలి. 

    గాయాలు చిన్నవైనా వారు ఇటీవలికాలంలో వాటి బూచిని చూపించి ఐసీసీ టోర్నీల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా ఇదే జరిగింది. ప్రస్తుత ఆసీస్‌ జట్టులోని స్టార్లు పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల పేరు చెప్పి, పొట్టి ప్రపంచకప్‌కు డుమ్మా కొట్టారు. వీరు లేని లోటు ఆసీస్‌ జట్టులో సుస్పష్టంగా కనిపించింది.

    ఇటీవలికాలంలో ఆసీస్‌ పతనానికి మరో కారణంగా ఆ జట్టు ఆటగాళ్లకు భారత​ ఉపఖండంపై ఉన్న చిన్నచూపు. మొదటి నుంచి వారు ఉపఖండంలో పర్యటించాలంటే ఎక్కువగా ఇష్టపడే వారు కాదు. ఇటీవలికాలంలో అది కాస్త ఎక్కువైంది. 

    ఐపీఎల్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్‌ల్లో దండిగా డబ్బులు ముట్టజెప్పినా, ఎందుకో వారు ఉపఖండంలో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడినా కేవలం కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటారు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లో ఇది చాలా స్పష్టంగా బయటపడింది. ఈ విషయంలో వారి సమస్య ఏమిటో వారు స్వయంగా నోరు విప్పితే కానీ తెలీదు.

    పై విషయాల్లో వాస్తవాస్తవాలు పక్కన పెడితే.. ఆసీస్‌ జట్టు 2026 టీ20 ప్రపంచకప్‌ నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడానికి మాత్రం వారి తలపొగరే కారణమని మెజారిటీ శాతం ​క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

    కాగా, ఆస్ట్రేలియా జట్టు ఓసారి (2021-23) వరల్ట్‌ టెస్ట్‌ ఛాంపియన్‌గా.. ఆరు సార్లు (1987, 1999, 2003, 2007, 2015, 2023) వన్డే ప్రపంచకప్‌ విజేతగా.. ఓసారి (2021) పొట్టి ప్రపంచకప్‌ జగజ్జేతగా నిలిచి ‍ప్రపంచ క్రికెట్‌పై ఏకఛత్రధిపత్యం చలాయించిన విషయం తెలిసిందే.

  • టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్‌-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్‌-8 గ్రూప్‌-1లో భారత్‌తో పాటు జింబాబ్వే,  సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.

    • భారత్‌ తమ తొలి సూపర్‌-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

    • భారత రెండో సూపర్‌-8 మ్యాచ్‌ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్‌ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

    • భారత్‌ తమ మూడో సూపర్‌-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.

    గ్రూప్‌-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా..
    -ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్‌ వెస్టిండీస్‌ (ముంబై, రాత్రి 7 గంటలకు)
    -ఫిబ్రవరి 26- వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌, మధ్యాహ్నం 3 గంటలకు)
    -మార్చి 1- జింబాబ్వే వర్సెస్‌ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)

    మరోవైపు సూపర్‌-8 గ్రూప్‌-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్‌ నాలుగో బెర్త్‌ దక్కించుకుంటుంది.  సూపర్‌-8 గ్రూప్‌-2లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్‌-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్‌-2కు సంబంధించి కూడా పలు సూపర్‌-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.

    -ఫిబ్రవరి 22న ఇంగ్లండ్‌-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)
    -ఫిబ్రవరి 25న న్యూజిలాండ్‌-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)
    -ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)

    గ్రూప్‌-1, గ్రూప్‌-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.  సెమీస్‌ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

  • జమ్మూ అండ్‌ కశ్మీర్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చేరువలో ఉంది. రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరేందుకు ఆ జట్టు మరో 83 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది.

    బెంగాల్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తున్న జమ్మూ టీమ్‌.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. శుభమ్‌ పుండిర్‌ (23), వన్ష్‌రాజ్‌ శర్మ (9) క్రీజ్‌లో ఉన్నారు. 

    చివరి రోజు జమ్మూ లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త చరిత్ర అవుతుంది. రంజీ చరిత్రలో జమ్మూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఇంకా చెప్పాలంటే సెమీస్‌కు చేరడం​ కూడా ఇదే మొదటిసారి.

    తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు వెనుకపడి కూడా అనూహ్యంగా పుంజుకొని, బెంగాల్‌ను 99 పరుగులకే (రెండో ఇన్నింగ్స్‌)  కుప్పకూల్చిన జమ్మూ జట్టు, సరికొత్త చరిత్రకు అద్భుత పునాది వేసింది. అనంతరం స్వల్ప ఛేదనలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా ఏమాత్రం జంక లేదు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించింది.

    మరోసారి చెలరేగిన నబీ
    తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన ఆకిబ్‌ నబీ మరోసారి విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటి బెంగాల్‌ను మడత పెట్టడంతో పెద్ద చెయ్యి వేశాడు. అతనికి సునీల్‌ కుమార్‌ (4-27), యుద్ధ్‌వీర్‌ చరక్‌ (5-0-29-2) సహకరించారు. వీరి ధాటికి బెంగాల్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. షాబాజ్‌ అహ్మద్‌ (24) ఒక్కడే 20కి పైగా పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో సుదిప్‌ ఘరామీ సహా సుదిప్‌ చటర్జీ, ఆకాశ్‌దీప్‌ డకౌట్లయ్యారు.

    విజృంభించిన షమీ
    అంతకుముందు టీమిండియా ప్లేయర్‌ మహ్మద్‌ షమీ 8 వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. బౌలింగ్‌లో చెలరేగిన నబీ బ్యాట్‌తోనూ రాణించడంతో జమ్మూ టీమ్‌ ఈ స్కోర్‌ చేయగలిగింది. నబీ (42).. యద్ద్‌వీర్‌ చరక్‌తో (33) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించి, తన జట్టును 300 పరుగుల మార్కును దాటించాడు. అంతకుముందు కెప్టెన్‌ పరాస్‌ డోగ్రా (58), అబ్దుల్‌ సమద్‌ (82) అర్ద సెంచరీలతో రాణించారు.

    ఘరామీ అద్భుత శతకం
    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌.. సుదిప్‌ ఘరామీ అద్భుత శతకంతో (146) కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. ఆకిబ్‌ నబీ 5, సునీల్‌ కుమార్‌ 3 వికెట్లతో సత్తా చాటారు. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీద ఉంది. గ్రూప్‌-ఎ నుంచి అమెరికా, నమీబియా వంటి పసికూనలపై గెలుపొందిన భారత్‌.. చివరగా దాయాది పాకిస్తాన్‌ను మట్టికరిపించిది.

    ‘చిరకాల ప్రత్యర్థి’ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి.. లీగ్‌ దశలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఇక గ్రూప్‌-ఎలో భాగంగా నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బుధవారం రాత్రి (ఫిబ్రవరి 18) మరో పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

    అభిషేక్‌ శర్మ డకౌట్‌ అయినా..
    కాగా ఇప్పటికే సూపర్‌-8కు చేరిన తరుణంలో నెదర్లాండ్స్‌తో ఆడే తుదిజట్టులో భారత్‌ మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ (0,0) రెండు మ్యాచ్‌లు ఆడి డకౌట్‌ అయినా.. అతడిని కొనసాగించడం ఖాయమే. దీంతో మరోసారి సంజూ శాంసన్‌కు మొండిచేయి తప్పదు.

    ఇక ఇప్పటికే ఓపెనర్‌గా ఇరగదీస్తూ.. పాక్‌పై భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ స్థానానికి ఢోకా లేదు. సూర్యకుమార్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్‌ వర్మ, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి కొనసాగటం లాంఛనమే.

    బుమ్రాకు రెస్ట్‌.. అతడిపై వేటు
    అయితే, పాక్‌తో మ్యాచ్‌ ఆడిన ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ రావడం పక్కా. అదే విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ను తప్పించి.. అతడి స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను తుదిజట్టులో ఆడించే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు సమాచారం.

    కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు గాయపడిన వాషీ.. నమీబియాతో మ్యాచ్‌ నుంచి అందుబాటులోకి వచ్చాడు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ అతడి విషయంలో మేనేజ్‌మెంట్‌ రిస్క్‌ తీసుకోలేదు. అయితే, నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఆడించి తదుపరి మ్యాచ్‌లకు అతడిని సన్నద్ధం చేయనున్నట్లు సమాచారం.

    నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
    ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

    చదవండి: T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే

  • ఊహించిందే జరిగింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టింది. గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌- జింబాబ్వే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దయిపోయింది.

    ఆస్ట్రేలియా ఎలిమినేట్‌
    శ్రీలంకలోని పల్లెకెలెలో వర్షం తెరిపినివ్వక పోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది. దీంతో జింబాబ్వే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా... ఆస్ట్రేలియా ఎలిమినేట్‌ అయింది.

    మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ఇందులో భాగంగా గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్‌, ఒమన్‌ వంటి పసికూనలతో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి.

    ఐదు పాయింట్లతో అర్హత 
    ఇక ఆది నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

    తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ చిత్తుగా ఓడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

    మ్యాచ్‌ రద్దు కావడంతో
    మరోవైపు.. జింబాబ్వే ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్‌ రద్దు కావడంతో జింబాబ్వేకు మరో పాయింట్‌ వచ్చింది. నెట్‌రన్‌రేటు పరంగానూ జింబాబ్వే పటిష్ట స్థితి (+1.984)లో నిలిచింది. ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధించగా.. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలోని  ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది.

    ఇక గ్రూప్‌-బి తదుపరి నామమాత్రపు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆఖరిగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. మరోవైపు జింబాబ్వే గురువారం శ్రీలంకను ఢీకొడుతుంది.

    ఆఖరి బెర్తు ఎవరిదో?
    ఇదిలా ఉంటే.. గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా సూపర్‌-8కు చేరగా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ అర్హత సాధించాయి. ఆఖరి బెర్తు కోసం గ్రూప్‌-ఎ నుంచి పాకిస్తాన్‌, అమెరికా బరిలో ఉన్నాయి. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాక్‌ను వెనక్కి నెట్టి అమెరికా సూపర్‌-8కు చేరిన విషయం తెలిసిందే.

    చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు

  • ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్టార్‌ స్పిన్నర్‌ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్‌ ప్లేస్‌కు పాక్‌ స్పిన్నర్‌ సదియా ఇక్బాల్‌ ఎగబాకింది. 

    గత వారం ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. 

    ఆసీస్‌ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్‌ ర్యాంక్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది.

    టాప్‌-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్‌
    తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ టాప్‌-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్‌పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.

    అరుంధతి అదుర్స్‌
    ఇదే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్‌ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్‌లో రాణించిన స్పిన్నర్‌ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.

    బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్‌ మూనీ, హేలీ మాథ్యూస్‌, స్మృతి మంధన టాప్‌-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. 

    పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్‌ అనెరీ​ డెర్క్‌సన్‌ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్‌ బ్యాటర్‌ జార్జియా వేర్హమ్‌ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.

    ఆల్‌రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్‌, అమేలియా కెర్‌, దీప్తి శర్మ టాప్‌-3లో కొనసాగుతుండగా.. పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది.

  • బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్‌, పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌ల్లో భారత-ఏ జట్టు నేపాల్‌పై.. పాకిస్తాన్‌-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్‌ ఫోర్‌లోకి ప్రవేశించాయి. సెమీస్‌లో భారత్‌, పాక్‌ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్‌-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ మ్యాచ్‌లతో తెలుస్తుంది.

    ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, పాక్‌ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్‌లో యూఏఈ.. భారత్‌, పాక్‌కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్‌, పాక్‌తో సమానంగా మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో మరో జట్టు నేపాల్‌, ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది.  

    గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌-ఏ సెమీస్‌ బెర్త్‌ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్‌లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్‌ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్‌-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్‌ ఫలితం డిసైడ్‌ చేస్తుంది. 

    గ్రూప్‌-బిలో మరో సెమీస్‌ బెర్త్‌ కోసం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్‌ బెర్త్‌ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్‌ గెలిచి బంగ్లాదేశ్‌-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మలేషియా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.

    ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్‌లో భారత్‌, పాక్‌ పోటీపడతాయి. సెమీస్‌లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 22న జరుగనుంది.

    నేపాల్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్‌ 4, మిన్నూ మణి 3, కెప్టెన్‌ రాధా యాదవ్‌ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్‌ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో సమ్జానా ఖడ్కా (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.

    మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈని పాక్‌ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 11 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.

    దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్‌ అదే జోరు కొనసాగించలేకపోయింది.

    జింబాబ్వే చేతిలో ఓటమి.. లంక చేతిలోనూ చిత్తు
    తమ రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.

    ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

    గ్రూప్‌-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్‌-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు (+1.984).

    పటిష్టస్థితిలో జింబాబ్వే.. అదే జరిగితే ఆసీస్‌ ఇంటికే
    మరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.414) తదుపరి ఒమన్‌తో ఆసీస్‌ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.

    అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్‌ కంటే పాయింట్లు, నెట్‌రన్‌రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్‌-8 చేరితే ఆసీస్‌ ఇంటి బాటపడుతుంది.

    ఒకవేళ ఐర్లాండ్‌ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు టాస్‌ ఆలస్యమైంది.  ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్‌ రద్దైపోతుంది.

    ఓడినా మరో అవకాశం కూడా!
    అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్‌గా జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్‌ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తుంది. 

    అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్‌ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట. 
    UPDATE: T20 WC: ఆస్ట్రేలియా అవుట్‌.. సూపర్‌-8కు జింబాబ్వే

    చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో సూపర్‌-8 బెర్త్‌ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సూపర్‌-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్‌లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం​ పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.

    గ్రూప్‌-సి,డి నుంచి సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్‌ల్లో ఓ బెర్త్‌ ఖరారైనా, మరో బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ సూపర్‌-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

    గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి.

    గ్రూప్‌-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్‌ ఒక్కటే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌ నుంచి మరో బెర్త్‌ కోసం​ టెక్నికల్‌గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్‌ఏ, పాకిస్తాన్‌ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్‌ టెక్నికల్‌గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్‌-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.

    పాక్‌, యూఎస్‌ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్‌కే సూపర్‌-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్‌ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే.. నేరుగా సూపర్‌-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్‌ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని, పాక్‌తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.

    యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరాలంటే పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్‌, యూఎస్‌ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా యూఎస్‌ఏ సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది.

    గ్రూప్‌-ఏ నుంచి టెక్నికల్‌గా సూపర్‌-8 లైన్‌లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్‌. ఈ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించింది. 

    ఒకవేళ నెదర్లాండ్స్‌ భారత్‌పై ఘన విజయం సాధించి, పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్‌ఏ, పాక్‌, నెదర్లాండ్స్‌ జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది.

    గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక ఇదివరకే సూపర్‌-8కు చేరిపోగా.. ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్‌ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. 

    ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్‌-8కు, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి. 

    ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్‌-8 బెర్త్‌ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి. 

    ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనా, జింబాబ్వే సూపర్‌-8కు వెళ్తుంది. ఆసీస్‌, ఐర్లాండ్‌ ఇంటిముఖం పడతాయి. 

    ఐర్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్‌కు సూపర్‌-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్‌ అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే. 

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచారు. ఇమ్రాన్‌ పట్ల పాక్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాకిస్తాన్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన లెజెండరీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.

    ఇమ్రాన్‌ సారథ్యంలో 1992లో పాక్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఇప్పటి వరకు మరే ఇతర పాక్‌ కెప్టెన్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించిన ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. పాకిస్తాన్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో అతడు జైలు పాలయ్యాడు.

    జైలు జీవితం
    ఈ క్రమంలో 2023 సెప్టెంబరు నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం ఇటీవల క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కంటిచూపు 85 శాతం పోయినట్లు ఆయన న్యాయవాది చెప్పారు. సరైన వైద్య సదుపాయం అందించాలని.. లేని పక్షంలో ఆయన పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

    అండగా పద్నాలుగు మంది మాజీ కెప్టెన్లు
    ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ తదితరులు ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పద్నాలుగు మందితో మాజీ కెప్టెన్లతో కూడిన బృందం పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పిటిషన్‌ పంపింది.

    ప్రభుత్వానికి లేఖ
    ‘‘పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ లెజెండ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్‌కు అతడు అందించిన సేవలు ప్రశంసనీయం. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు తొలి వరల్డ్‌కప్‌ అందించిన వ్యక్తి అతడు.

    మాలో చాలా మంది అతడి ప్రత్యర్థిగా మైదానంలో దిగాము. అయితే, పోటీ ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆల్‌రౌండర్‌గా చరిష్మా ఉంది. అంతేకాదు పాక్‌ ప్రధాని గానూ ఇమ్రాన్‌ పనిచేశారు.

    సంక్షోభ సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయ స్థాయి వైద్యులను పిలిపించి ఆయనకు వైద్యం చేయాలని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సైతం పక్కనే ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నాం.

    గావస్కర్‌, కపిల్‌ దేవ్‌లతో పాటు
    చట్టపరంగానే వైద్య సదుపాయం అందించండి. కానీ ఆలస్యం చేయవద్దు’’ అని మాజీ కెప్టెన్లు పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై భారత దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌తో పాటు మైకేల్‌ ఆథర్టన్‌, అలెన్‌ బోర్డర్‌, మైకేల్‌ బ్రేర్లీ, గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, బెలిండా క్లార్క్‌, డేవిడ్‌ గోవర్‌, కిమ్‌ హ్యూస్‌, నాజర్‌ హుసేన్‌, సర్‌ క్లైవ్‌ లాయిడ్‌, స్టీఫెన్‌ వా, జాన్‌ రైట్‌ సంతకాలు చేశారు.

    చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

  • కెనడా క్రికెటర్‌, భారత మూలాలు ఉన్న యువరాజ్‌ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్‌లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ ఈ ఘనత సాధించడం విశేషం.

    58 బంతుల్లోనే
    టీ20 వరల్డ్‌కప్‌-2026లో భాగంగా గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కెనడా ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్‌ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్‌ నిలిచాడు.

     173 పరుగులు 
    ఇక కివీస్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్‌ ధలీవాల్‌ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్‌ కిర్టాన్‌ (2) విఫలమయ్యాడు. హర్ష్‌ థాకర్‌ 3, దిలాన్‌‌ హెలిగర్‌ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.

    ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కైలీ జెమీషన్‌, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ తీయగా.. యువరాజ్‌ రూపంలో జేకబ్‌ డఫీ కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.

    టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు
    🏏యువరాజ్‌ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో
    🏏అహ్మద్‌ షెహజాద్‌ (పాకిస్తాన్‌)- మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో
    🏏సురేశ్‌ రైనా (ఇండియా)- గ్రాస్‌ ఐస్‌లెట్‌ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో
    🏏అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)- ఛట్టోగ్రామ్‌ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో
    🏏గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.

    కివీస్‌ గెలుపు
    ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్‌ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్‌ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.

    చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Family

  • భారత పౌరులకు తాజ్‌ మహల్‌ అంటే కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు ఒక ఎవర్‌ గ్రీన్‌ ఎమోషన్‌. జీవితంలో ఒక్కసారైనా ఆగ్రా వెళ్లి తాజ్‌ మహల్‌ని సందర్శించాలని వీలైతే తన సోల్‌మేట్‌తో కలిసి వెళ్లాలని ఆశించని వారు అరుదే. పర్యాటకాభిరుచి ఉన్నవారైతే తాజ్‌ని తమ జాబితాలో అగ్రస్థానంలో చేరుస్తారు. అయితే ఆగ్రాకు వెళ్లే సందర్శకులకు తాజ్‌ వీక్షణ మాత్రమే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అంతకు మించి అక్కడ దానికి అనుబంధ కార్యక్రమాలు ఏమీ ఉండవు. అయితే అలాంటి ఏకైక సందర్భం  ఆగ్రాలో నిర్వహించే తాజ్‌ మహోత్సవం. తాజ్‌కు తోడయే మరో వైవిధ్యభరిత అనుభూతి ఇది అంటున్నారు  మహోత్సవ్‌ నిర్వాహకులు

    చలికి ముగింపు ఉత్సవానికి ఊపు...
    ప్రతి సంవత్సరం, శీతాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నప్పుడు ఆగ్రా తన ఓ గొప్ప పండుగకు సిద్ధమవుతుంది. దాని పేరే తాజ్‌ మహోత్సవ్‌ ఆగ్రా నగర  సందర్శకులు  తప్పనిసరిగా గుర్తుంచుకోదగిన సందర్భం.  

    గత కొంత కాలంగా దీనిని నిర్వహిస్తున్నప్పటికీ మరీ ఎక్కువగా ప్రచారానికి నోచుకోలేదు. సాంప్రదాయ చేతి వృత్తులను ప్రోత్సహించడానికి  తాజ్‌ మహల్‌ తో పాటు ఇతర ప్రాంతాలకు సైతం పర్యాటకులను ఆకర్షించడానికి, తాజ్‌ మహోత్సవ్‌ పేరిట గత 1992లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఉత్సవం ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక కార్యక్రమాలతో  క్రమ క్రమంగా కళాకారులు తమ ప్రతిభా నైపుణ్యాలను సాధారణ ప్రజలకు ప్రదర్శించే పండుగగా స్థిరపడింది. ఈ ఏడాది తాజ్‌ మహోత్సవ్‌ ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 27, 2026 వరకు జరుగుతుంది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌ రోడ్‌. లోన ఉన్న విండ్‌హామ్‌ గార్డెన్‌ హోటల్‌లో దీనిని నిర్వహిస్తారు.

    ప్రవేశం ఇలా...
    ది తాజ్‌ మహోత్సవ్‌లో పాల్గొనేందుకు ప్రవేశ ధర రూ.50 కాగా,  3 సంవత్సరాల వయస్సు లోపు చిన్నారులకు ప్రవేశః ఉచితం. అంతేకాదు విదేశీ పర్యాటకులకు కూడా ప్రవేశం ఉచితమే.  స్కూల్‌ యూనిఫాంలో ఉన్న 50 మంది విద్యార్థుల బృందానికి మొత్తంగా కలిపి ప్రవేశ రుసుము రూ.700, వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం అందిస్తున్నారు.  ప్రవేశ ద్వారాల వద్ద ఉంచిన  వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

    సాంస్కృతిక కార్యక్రమాలను ఇష్టపడితే ఈ కార్యక్రమం ఆగ్రా పర్యటనను గడపడానికి ఒక ఆహ్లాదకరమైన, సుసంపన్నమైన అనుభూతులను ఈ మహోత్సవ్‌ అందిస్తుంది. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులతో కూడిన హస్తకళా ఉత్పత్తులతు,  స్థానిక ప్రాంతీయ వంటకాలతో పాటు పేరొందిన స్ట్రీట్‌ ఫుడ్‌తో కూడిన ఫుడ్‌ కోర్ట్‌ లు ఇక్కడ కొలువుదీరుతాయి.  రోజంతా సంగీత నృత్య ప్రదర్శనలను సమర్పించే ప్రధాన  వేదిక కూడా ఉంటుంది.

  • ఫెయింట్‌ అయిపోవడం అనే మాట చాలామంది వినే ఉంటారు. తెలుగులో చెప్పాలంటే స్వాధీనం తప్పిపోవడం. ఇది స్పహతప్పి అలాగే ఉండిపోవడం కాదు...కాసేపట్లో మళ్లీ మామూలైపోవడం. ఇలా స్వాధినం తప్పిపోయి... కొద్దిక్షణాల్లోనే మళ్లీ మామూలైపోవడాన్ని వైద్యపరిభాషలో ‘సింకోప్‌’ అంటారు. అయితే కొద్దిసేపట్లోనే మళ్లీ మామూలైపోయినప్పటికీ ఇలా జరగడం కొన్నిసార్లు ప్రమాదాలకూ దారితీయవచ్చు. ఉదాహరణకు ఏ వాహనం నడుపుతున్నప్పుడో ఇలా జరిగితే అది పెను ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్యకు చాలా కారణాలుంటాయి. సింపుల్‌గా దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గిపోవడం (డీహైడ్రేషన్‌) మొదలుకొని వేగస్‌ నరం అతిగా స్పందించడం వరకు అనేక కారణాలతో వచ్చే ఈ ‘సింకోప్‌’ సమస్యపై అవగాహనతో పాటు దీనికి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం.

    కొందరు ఏదైనా తట్టుకోలేని దృశ్యం చూడగానే స్పృహ తప్పినట్లుగా అయిపోతారు. మరికొందరిలో వారి ఆందోళన స్థాయి మితిమీరిపోతే వెంటనే స్వాధీనం తప్పి పడిపోతారు. ఎందుకిలా అవుతుంది. ఎందుకంటే... గుండె స్పందనల లయ (రిథమ్‌)లో ఏమాత్రం తేడా రాకూడదు. స్పందన పెరిగినా, తగ్గినా అది ప్రమాదకరమే. గుండె స్పందనలు తగ్గడంతో... మన దేహంలో అత్యంత కీలక అవయవమైన మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. అలా తగ్గినప్పుడు స్పృహ తప్పి పడిపోయే కండిషన్‌ను సింకోప్‌ అంటారు. ఇది సాధారణంగా చాలాసార్లు నిరపాయకరమే అయినప్పటికీ... కొన్నిసార్లు మాత్రం అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. సింకోప్‌ లక్షణాలు, నివారణ, చికిత్సలేమిటో చూద్దాం.

    సింకోప్‌లో రకాలు
    న్యూరల్లీ మీడియేటెడ్‌ : బాగా తీవ్రమైన నొప్పి రావడం లేదా చాలా ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం, అత్యంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల.  సింకోప్‌ కండిషన్‌ రావచ్చు. 
    ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్‌ : దేహంలో నీళ్లు / ద్రవాలు తగ్గడం వల్లగానీ లేదా ఏవైనా మందులు వాడుతున్నప్పుడు వాటి వల్ల అకస్మాత్తుగా ఒక్కసారిగా రక్తపోటు (బ్లడ్‌ప్రెషర్‌) తగ్గిపోవడం వల్ల. 
    కార్డియాక్‌ సింకోప్‌ : గుండె రిథమ్‌లో తేడా రావడం వల్ల (అరిథ్మియా అనే కండిషన్‌లో) గుండెవేగం పెరగడమో లేదా తగ్గడమో జరిగినప్పుడు.  

    సిచ్చువేషనల్‌ సింకోప్‌ : గట్టిగా దగ్గడం లేదా మింగడం లేదా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్వాధీనం తప్పిపోవడం.

    సింకోప్‌ కారణమయ్యే మెకానిజమ్‌ 
    1) మెదడుకు గుండెనుంచి తగినంత రక్తం అందకపోవడం / గుండె తగినంత రక్తాన్ని మెదడుకు అందించలేకపోవడం.

    2) గుండె పంపింగ్‌ సరిగా ఉన్నప్పటికీ మెదడుకు ఆ రక్తం అందడానికి అవసరమైన  బ్లడ్‌ప్రెషర్‌ను మెయిన్‌టెయిన్‌ చేయడానికి సదరు రక్తనాళానికి తగినంత సామర్థ్యం  లేకపోవడం.

    3) రక్తనాళానికి సామర్థ్యం ఉన్నప్పటికీ రక్తనాళంలో తగినంత రక్తం లేకపోవడం... ఈ మూడింటిలో ఏదో ఒకటిగానీ, లేదా ఒకటి కంటే ఎక్కువగా అంటే... ఏవైనా రెండు కారణాల వల్ల గానీ ఇలా జరగవచ్చు.

    ఎందుకిలా జరుగుతుందంటే... 
    గుండె ఒక కండర నిర్మితమైన ఒక ఎలక్ట్రిక్‌ పంపు లాంటి అవయవం అన్న విషయం తెలిసిందే. ఎస్‌ఏ నోడ్‌ (సైనో ఏట్రియల్‌ నోడ్‌) అనే ఒక కీలకమైన చోటి నుంచి గుండె స్పందించడానికి అవసరమైన కరెంటు మన శరీరంలోనే నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ సరఫరాలో తేడాల వల్ల ఒక్కోసారి గుండె కండరాలు వేగంగానైనా కొట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా స్పందనలు తగ్గవచ్చు.  కార్డియాక్‌ సింకోప్‌లో ఇలా జరుగుతుంది.

    వేగం పెరిగితే... 
    కొన్ని సార్లు గుండె స్పందనల్లో వేగం బాగా పెరిగిపోయి ‘టాకికార్డియా’ అనే కండిషన్‌ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పై గదుల్లోగాని, కింది గదుల్లోగాని వేగం పెరుగుతుంది. అంటే గుండెలో పంప్‌ చేయడానికి అవసరమైన రక్తం చేరుకోకముందే గుండె ముడుచుకోవడం... అంటే గుండె స్పందన జరుగుతుందన్నమాట. దాంతో గుండె నుంచి కీలకమైన అవయవాలకు అందాల్సినంత రక్తం రక్తనాళాల్లోకి వెలువడదు. ఈ టాకికార్డియా అనే కండిషన్‌ ఏ వయసు వారికైనా రావచ్చు.

    వేగం తగ్గితే... 
    గుండె స్పందనల్లో వేగం తగ్గితే ఆ కండిషన్‌ను బ్రాడికార్డియా అంటారు. బ్రాడి... అంటే నెమ్మదించడం (స్లో కావడం). ఇక ‘కార్డియా’ అంటే గుండె అని అర్థం. గుండె స్పందనల వేగం తగ్గడం వల్ల కూడా కీలకమైన అవయవాలకు రక్తసరఫరా తగ్గుతుంది. మనుషుల్లో తమ వయసు పెరుగుతున్న కొద్దీ వారి గుండె స్పందనలకు అవసరమైన ఎలక్ట్రికల్‌ సరఫరాల్లో తేడాలు వస్తుండవచ్చు. లేదా కొందరిలో పుట్టుకతోనే గుండెలో బ్లాక్స్‌ ఉండవచ్చు. గుండెకు అవసరమైన ఎలక్ట్రిసిటీలో తేడాలు రావడం వల్ల వచ్చే సమస్య అన్నది గుండెలో బ్లాక్స్‌ ఉండటం వల్ల వచ్చే సమస్య కంటే వేరుగా ఉంటుంది.

    సింకోప్‌కు కారణాలు
    గుండె నిర్మాణపరమైనవి : కొన్నిసార్లు గుండెలో నిర్మాణపరంగా ఏవైనా తేడాలు ఉండటం వల్ల మెదడులాంటి కీలక అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్‌ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు గుండె కండరాలు బలహీనంగా మారడంవల్లనో, లేదా కార్డియోమయోపతి అన్న కండిషన్‌లో సింకోప్‌ రావచ్చు.

    గుండె కవాటాల్లో మార్పులు : గుండె కవాటాలు రక్తాన్ని నిర్దిష్టంగా ఒకే దిశలో ప్రవహించేలా చూస్తుంటాయి. కొన్నిసార్లు గుండె కవాటాలు సన్నబడవచ్చు. ఇలా జరగడాన్ని ‘స్టెనోసిస్‌’ అంటారు. కొన్నిసార్లు అవి లీక్‌ కావచ్చు. ఇలా జరగడాన్ని ‘ఇన్‌సఫిషియెన్సీ’ లేదా ‘రీ–గర్జిటేషన్‌’ అంటారు. ఈ కండిషన్స్‌లో దేనివల్లనైనా సింకోప్‌ రావచ్చు.

    మితిమీరిన వ్యాయామం : కొందరు వ్యక్తుల్లో... అంటే మరీ ముఖ్యంగా క్రీడాకారులు / అథ్లెట్లలో గుండె కండరాలు మందం కావడం వల్ల కూడా సింకోప్‌ రావచ్చు. అతి వ్యాయామంతో గుండెపై విపరీతమైన భారం పడేలా పనిచేయించడం వల్ల ఈ కండిషన్‌ ఏర్పడే అవకాశముంది.

    పోష్చురల్‌ హైపోటెన్షన్‌ : కొన్ని సందర్భాల్లో పక్క మీద పడుకున్న వ్యక్తి స్థిమితంగా కాకుండా హాడావుడిగా లేదా అకస్మాత్తుగా నిల్చునప్పుడు... అతడి కదలికలకు  తగ్గట్లుగా గుండె తన స్పందనలను అంతే వేగంగా పెంచుకోలేదు. దాంతో వేగంగా జరిగే శరీర కదలికకు అనుగుణంగా గుండె స్పందనవేగం పెరగకపోవడంతో... కీలక అవయవాలకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇలా జరగడాన్ని పోష్చురల్‌ హైపోటెన్షన్‌’  అంటారు.

    వేసోవేగల్‌ సింకోప్‌ : నరాల పనితీరు వ్యవస్థలో మన సంకల్పం లేకుండా దానంతట అవే జరిగేపోయేవి, మన సంకల్పంతో జరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండిటికీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ‘సింకోప్‌’ కండిషన్‌  వస్తుంది. వేగస్‌ అనే నరం గుండె వేగాన్ని నెమ్మదించేలా చేస్తుంది. అది ఒక్కోసారి గుండె వేగాన్ని బాగా తగ్గిస్తుంది. ఇలా వేగస్‌ నరం వల్ల గుండె వేగం మందగిస్తే దాన్ని వేసోవేగల్‌ సింకోప్‌ అంటారు.

    తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి ఆ విపరీతమైన నొప్పి వేగస్‌ నరాన్ని ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన / విపరీతమైన ఒత్తిడులు (సివియర్‌ స్ట్రెస్‌) కూడా వేగస్‌ నరాన్ని ప్రేరేపిస్తాయి. ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కొందరు స్పృహ తప్పడానికి కారణం కూడా ఈ సింకోపే. కొందరు రక్తం చూసినప్పుడు లేదా కత్తులు– కటార్ల వంటి మారణాయుధాలు చూసినప్పుడు కూడా ఇలా స్పృహ తప్పడం దీనివల్లనే.

    పేగుల కదలికలు తగ్గడం : కొందరిలో జీర్ణక్రియలో జరుగుతుండే పేగుల కదలికలు (బవెల్‌ మూవ్‌మెంట్స్‌), విపరీతంగా తగ్గడం కూడా వేగస్‌ నరం మీద ఒత్తిడి కలిగింవచ్చు. అప్పుడు కూడా  సింకోప్‌ కండిషన్‌ వస్తుంది.

    అకస్మాత్తుగా తల తిప్పడం వల్ల...
    కొందరు అకస్మాత్తుగా తలతిప్పడం వల్ల వేగస్‌ సరం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ వెంటనే అది మళ్లీ సింకోప్‌ కండిషన్‌కు దారితీస్తుంది.

    రక్తహీనత.. 
    అనీమియా అనే రక్తహీనత కండిషన్‌ కూడా సింకోప్‌కు కారణం. అనిమియా కండిషన్‌లో రక్తంలో తగినన్ని ఎర్రరక్తకణాలు లేకపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవడంతో కూడా సింకోప్‌ రావచ్చు. 

    శరీరంలో నీరు / ద్రవాలు తగ్గడం : ఒక్కోసారి దేహంలో నీరు / ద్రవాలు తగ్గడం   (డీ–హైడ్రేషన్‌) వల్ల కూడా సింకోప్‌ రావచ్చు. కొందరిలో చాలా ఎక్కువగా వాంతులు కావడం వల్లగానీ లేదా నీళ్ల విరేచనాల (డయేరియా) వల్ల గానీ లేదా విపరీతంగా చెమటలు పట్టడం వల్ల శరీరంలో దేహంలో నీటి / ద్రవాల మోతాదులు తగ్గవచ్చు. డయాబెటిస్‌ సమస్య ఉన్న కొందరిలో వారు మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సిరావడం వల్ల కూడా వాళ్ల శరీరం డీ హైడ్రేషన్‌కు లోనుకావచ్చు. 
    ఈ కండిషన్లు కొందరిలో సింకోప్‌కు దారితీసేందుకు అవకాశముంది.  

    చికిత్స
    సింకోప్‌ అన్న కండిషన్‌ నిజానికి అంత సీరియస్‌ కాదు. కానీ ఇలా ఫెయింట్‌ కావడం తరచూ జరుగుతుంటే మాత్రం సింకోప్‌ను నిర్లక్ష్యం చేయడమన్నది ఏమాత్రం తగదు. ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సమస్యల (అండర్‌లైయింగ్‌ కాజెస్‌) వల్ల ఇలా జరుగుతుందేమో చూసేందుకు అవసరమైన వైద్యపరీక్షలు జరపాలి. ఇందుకోసం తొలుత  డాక్టర్‌ సలహా తీసుకుని, బాధితుడికి చికిత్స అవసరమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇతరత్రా సమస్యలతో (అండర్‌లైయింగ్‌ కాజెస్‌తో) ఇలా జరుగుతుంటే మాత్రం బాధితుడికి అవసరమైన చికిత్స అందించాలి.  

    సింకోప్‌ అన్నది ఒకసారి స్వల్పంగా వచ్చి, దాని వల్ల ఎలాంటి గాయాలు జరగకపోతే ప్రైమరీ మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో డాక్టర్లు కూడా సాధారణ చికిత్స అందించవచ్చు. అయితే సరిగ్గా నాడిగానీ, శ్వాసగానీ అందని పరిస్థితిని మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణించి పరిగణించి వెంటనే పెద్ద హాస్పిటల్స్‌కు (టెరిషియరీ హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు) తరలించాల్సి ఉంటుంది.

    గుండె స్పందనల లయ (రిథమ్‌)లో మార్పులు వచ్చిన వారికి, గుండె స్పందనల వేగం తగ్గిన వారిలో కొందరికి పేస్‌ మేకర్‌ అమర్చాల్సి   రావచ్చు. ఈ పేస్‌మేకర్‌ అనేది గుండె స్పందనల వేగం తగ్గడాన్ని... అంటే ‘బ్రాడీకార్డియా’ను ముందుగానే పసిగట్టి... గుండె స్పందనల వేగం తగ్గిపోకుండా చూస్తుంది. ఇలా పేస్‌ మేకర్‌ అన్నది తగ్గిపోయే గుండె స్పందనలను మళ్లీ మామూలయ్యేలా (నార్మల్‌గా స్పందించేలా) చేసేందుకు వాడే ఒక ఉపకరణం. అలాగే టాకీకార్డియా కండిషన్‌లో ఒక షాక్‌ ద్వారా గుండె స్పందనలు మళ్లీ నార్మల్‌ అయ్యేలా చూడటం; అలాగే ఇది  గుండెలో పైన, కింద ఉండే గదులు కదలికలు సమన్వయంతో జరిగేలా చూడటం; గుండెలోని ఎడమ, కుడి భాగాలు స్పందనల్లో సమన్వయం ఉండేలా చూడటం వంటి పనులనూ చేస్తుంది.

    చ‌ద‌వండి: గుండె జ‌బ్బుల రిస్క్ ఎవ‌రికి ఎక్కువ‌?

    ఈ పనులన్నింటినీ పేస్‌ మేకర్‌ సహాయంతో జరిగేలా చూసే/ చేసే చికిత్సను ‘కార్డియాక్‌ రీ–సింక్రనైజేషన్‌ థెరపీ’ (సీఆర్‌టీ) అని అంటారు. గుండె లయలో వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రమాదాలను నివారించడానికి ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పేస్‌ మేకర్లలో కూడా తాత్కాలికంగా అమర్చేవి, శాశ్వతంగా అమర్చేవి అని రెండు రకాలుగా ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు అవసరమైనవారు (సాధారణంగా ‘బ్రాడీ–కార్డియా’ సమస్య ఉన్నవారు) దీన్ని వాడాల్సి ఉంటుంది. పేస్‌మేకర్‌ అమర్చాక పేషెంట్స్‌ తాము అంతకుమునుపు చేసే రోజువారీ పనులన్నింటినీ నార్మల్‌గానే చేసుకోవచ్చు.

    తక్షణం అందించాల్సిన సపర్యలు

    ∙సింకోప్‌కు గురైన వ్యక్తిని కాస్తంత చల్లగా ఉన్న ప్రదేశంలోకి తీసుకెళ్లి సౌకర్యంగా పడుకోబెట్టాలి. లేదా అతడి తల రెండు మోకాళ్ల మధ్య ఉండేలా చూస్తూ రిలాక్స్‌డ్‌గా కూర్చోబెట్టాలి.

    ∙అలా పడుకోబెట్టడం / కూర్చోబెట్టడం జరిగాక... అతడు స్పృహలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కాస్తంత ఉప్పు కలిపిన ద్రవాన్నిగానీ లేదా ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని గానీ నెమ్మదిగా తాగించాలి. ఒకవేళ రక్తపోటు పడిపోవడం (హైపోటెన్షన్‌) వల్ల  సింకోప్‌ ఏర్పడితే... ఇలా చేయడం వల్ల బాధితుడు మామూలుగా మారిపోతాడు.

    నివారణ : నిజానికి సింకోప్‌కు దారితీసే అసలు కారణాలను కనుగొంటే అందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవచ్చు. ఉదాహరణకు... 
    వేసోవేగల్‌ నరం అతి స్పందన వల్ల ఈ సమస్య వస్తుంటే దానికి కారణాలు కనుగొని చికిత్స అందించడం వల్ల ఆ తర్వాత వచ్చే సింకోప్‌లను నివారించవచ్చు. 

    అకస్మాత్తుగా లేవడం, అకస్మాత్తు కదలికల వల్ల వచ్చే పోష్చురల్‌ హైపోటెన్షన్‌ సింకోప్‌ను అకస్మాత్తు కదలికలు లేకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. ఉదాహరణకు పక్క మీద నుంచి లేచేప్పుడు మెల్లగా లేవడం, వెంటనే నిలబడకుండా కొద్ది సేపు కూర్చోవడం.. ఇలా కదలికలు క్రమంగా ఉండేలా చూసుకోవడంతో ఈ తరహా సింకోప్‌ రాకుండా చూసుకోవచ్చు. 

    ఇది డీ హైడ్రేషన్‌ సమస్య వల్ల వస్తే తగినన్ని ద్రవాలు అందేలా చూసుకోవడం వల్ల కూడా సింకోప్‌ను నివారించవచ్చు.

    చివరగా...
    ప్రతినిత్యం తగినన్ని నీళ్లు తాగుతూ, అన్ని రకాల పోషకాలనూ తీసుకుంటూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉన్నవారిలో సింకోప్‌ సమస్య చాలా అరుదు. అందుకే అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ ఉండటం అన్నది కేవలం సింకోప్‌ నివారణకు మాత్రమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండటానికీ దోహదపడుతుందని గుర్తుంచుకోవాలి.

    నిర్వహణ: యాసీన్‌ 

  • వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడం అంటే..రెస్ట్‌ తీసుకునే వయసు అనే భావిస్తారు చాలామంది. ఆ వయసుకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కాబట్టి..ఏదో ఒక కాలక్షేపంతో కాలన్ని గడిపేయడం అనుకుంటుంటారు చాలామంది పెద్దలు. కానీ ఈ మహిళ అందుకు విభిన్నం. పైగా స్వార్జితంలో ఉన్న ఆనందం, సంతృప్తి వేరు అని చెబుతోంది. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఒరిగేది ఏముండదని కొట్టిపారేస్తోంది. గ్రామీణ భారతదేశంలో వృద్ధ మహిళల ఆలోచనలకు, భావాలకు విరుద్ధంగా బతికి చూపించటమే కాదు..'సాధికారత'కు అసలైన అర్థం చెప్పింది ఈ బామ్మ. ఎవరామె అంటే..

    ఆ బామ్మే..మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల మంగళ ఆజీ. రెస్ట్‌ తీసుకునే వయసులో చీరకట్టులో డ్రైవింగ్‌ చేస్తోంది. చక్కగా ఆటో వేసుకుని రైడ్‌లకు వెళ్తోంది ఈ బామ్మ. ప్రయాణికులను గమ్యస్థానాల్లో దింపుతూ..ఆదాయం గడిస్తోంది. అది కూడా చక్కగా గ్రామీణ నేపథ్యానికి చెందిన మహిళ కట్టుతీరుతో ఏ మాత్రం భయపడకుండా మహారాష్ట్రలోని రద్దీగా ఉండే రోడ్లపై రెయ్‌..రెయ్‌..మని ఆటో నడిపిస్తుండటం విశేషం. నిజానికి ఆమె నిశబ్ద ధైర్యానికి చిహ్నంగా మారింది. 

    ఈ వయసులో అంత అవసరం ఏంటీ అంటే..
    ఆమె చిన్నతనంలోనే వితంతువుగా మారి నలుగురి పిల్లలను ఒంటిరిగా పెంచి పెద్ద చేసింది. వారికి మంచి చదువులు చెప్పించి, తమ కాళ్లపై నిలబడే వరకు కూలి పనులు చేస్తుండేది. ప్రస్తుతం కొడుకు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) డ్రైవర్‌గా పనిచేస్తుండగా, కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేసింది. ఏళ్ల తరబడి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడింది. కానీ ఇప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే..ఈ బామ్మ మంగళ ఏమంటుందో తెలిస్తే..విస్తుపోతారు. బామ్మకు షుగర్‌ కూడా ఉంది. 

    అయినా సరే తన పిల్లలపై ఆర్థిక భారం పడటం ఇష్టం లేదని, తన సొంత వైద్య ఖర్చుల కోసం కష్టపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఆటో డ్రైవర్‌గా ఎంతో కొంత ఆర్జించి.. తన ఖర్చులకు అలాగే తన కొడుకు కుటుంబానికి ఎంతో కొంత చేదోడువాదోడుగా ఉంటుందని చెబుతుంది.అయినా ఇంట్లో ఖాళీగా కూర్చొంటే ఏం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోంది . 

    ఎలా ఆటో నడపడం నేర్చుకుందంటే..
    కొడుకు మార్గదర్శకంలో కేవలం 15 రోజుల్లో ఆటోనడపడం నేర్చేసుకుందట ఆమె. తొమ్మిదేళ్లుగా ఆటో నడుపుతు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారామె. మహారాష్ట్రలోని కరాడ్‌-ఉండేల్‌ మార్గం గుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతానని చెబుతోంది ఈ బామ్మ. తనకు డ్రైవింగ్‌ అస్సలు భయం కలిగించదని, పైగా ఇతర డ్రైవర్లు తనను చాలా అర్థం చేసుకుంటారని ధీమాగా చెబుతోందామె. 

    అంతేగాదు వాళ్లు ముందు ఆజీని వెళ్లనివ్వండి అని పక్కకు తొలిగి మరి దారిచ్చేస్తారని సంతోషంగా చెబుతోంది. అలాగే తన ఆటోడ్రైవర్‌ జర్నీలో సవాళ్లు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. ఈ వయసులో డ్రైవింగ్‌ చేయడం చూసి..రవాణ అధికారులు పూర్తిగా లైసెన్సింగ్‌ నిబంధనలను పాటిస్తేనే లైసెన్స్‌ మంజూరు చేస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిపింది. తాను ఆ అధికారిక ప్రక్రియని పూర్తిచేసి మరి లైసెన్స్‌ పొందానంటోంది బామ్మ. 

    సాధికారతే గౌరవం, ఆత్మగౌరవం అని మంగళ బామ్మ కథ చెబుతోంది. తరతరాల అంతరాన్ని చేధించి..వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలో సైతం సామాజిక ప్రజా జీవితంలో చురుకుగా ఉండొచ్చని చెప్పింది. అనారోగ్యం అంటూ మూలన కూర్చోవడం కంటే..ఇలా ప్రజల్లో తిరిగితేనే ఇంకా ఉషారుగా ఆయురారోగ్యాలతో ఉండొచ్చని మంగళ బామ్మ కథ చెప్పకనే చెబుతోంది కదూ..! అంతేగాదు ఈ బామ్మ ధైర్యం..తన రైడ్‌ని బుక్‌చేసుకున్న ప్రయాణికులను ప్రేరేపించడమే గాక వారిలో స్థైర్యాన్ని నింపుతోంది కూడా. 

     

    (చదవండి: ప్రెండ్స్‌..నా స్నేహితుడిలా అలాంటి పొరపాటు చెయ్యొద్దు..!)
     

  • విదేశాల్లో చదవాలని..ఒక వ్యక్తి బంగారంలాంటి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ని కాలదన్నాడు. చివరికి అప్పులపాలై..ఎంత తక్కవ వేతనానికి పనిచేసేందుకైనా సై అంటున్నాడు.అలా కాకుండా జాబ్‌ చేస్తూనే లేకా కాస్త ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్నాక..ఆ దిశగా అడుగులు వేసిన బాగుండేది. కానీ అత్యాసతో తీసుకున్న ఈ నిర్ణయం..అతడిని ఎంతటి దయనీయ స్థితిలోకి నెట్టేసిందో చూస్తే..విదేశీ మోజులో ఉండే యువతకు అడకి కథ ఓ గొప్ప కనువిప్పు అని చెప్పొచ్చు. 

    ఓ వ్యక్తి సోషల్‌ మీడియా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ పెను దుమారం రేపి వివిధ చర్చలకు దారితీసింది. ఆ పోస్ట్‌లో ఇలా ఉంది. "నా స్నేహితుడు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఏడాదికి ఏడు లక్షలు వేతనమిచ్చే జాబ్‌ ఆఫర్‌ని కాలదన్నాడు. విదేశాల్లో ఎంఎస్‌ చేస్తే..అంతకుమించి సంపాదించాలనే అత్యాశతో వద్దనుకున్నాడు. చివరకి తను అనుకున్నట్లుగానే యూఎస్‌లో విజయవంతంగా ఎంఎస్‌ పూర్తిచేశాడు. 

    కానీ రూ. 40 లక్షల అప్పుతో రోడ్డుపై నిలబడ్డాడు. దాంతో ఇప్పుడు కనీసం ఏడాదికి రూ. 3లక్షల వేతనమిచ్చే జాబ్‌లో అయినా చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూశారా..! దురాశ ఎంతటి పరిస్థితికి తీసుకొచ్చేస్తుందో తెలుసుకోండి..ఇది బంగారంలాంటి ఆఫర్లను, నిర్ణయాలను నాశనం చేసేస్తుంది తస్మాత్‌ జాగ్రత్త." అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. 

    ఈ పోస్ట్‌ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు..చాలామంది నెటిజన్లు తమ స్నేహితులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ఇబ్బందులు పడ్డారని, అమెరికాలో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: బేబీ కేర్‌పై పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..! జీవితంలోనే..)

     

Business

  • ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.

    ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.

  • కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ఫేక్‌ కంటెంట్‌ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్‌కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్‌పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. 

    ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. 

    తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చూసిన ఫేక్‌ కంటెంట్‌ గురించి సంబంధిత ఫ్లాట్‌ఫామ్‌ యాజమాన్యానికి నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్‌బుక్‌లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే,  ఫేస్‌బుక్‌ గ్రివెన్సెస్‌ ఆఫీసర్‌కి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి.  ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్‌ఫామ్‌ నుంచి తొలగిస్తుంది. 

    అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్‌ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.

    మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్‌ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. 

    ఏఐ కంటెంట్‌పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్‌ఫేక్‌లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ అప్‌లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.

    ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్‌ హార్బోర్‌ ప్రొటెక్షన్‌ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్‌పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్‌కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. 

  • ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

    ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.

    ఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

    ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్‌కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి.

  • చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు.

    మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.

    మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

    ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

  • ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో.. జియో పెవిలియన్‌ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.

    వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.

    రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్‌కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.

    ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

  • బ్యాంకుల్లో బీమా సహా ఇతర ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని (మిస్‌ సెల్లింగ్‌) నిరుత్సాహపరిచే నిబంధనలను ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ‘‘ఉత్పత్తులు/సేవల విక్రయాలను పెంచుకునేందుకు గాను, మిస్‌ సెల్లింగ్‌ లేదా ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా బ్యాంక్‌ విధానాలు, పద్దతులు లేకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఆర్‌బీఐ తన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది.

    ఉత్పత్తులు/సేవల విక్రయాలకు సంబంధించి వివిధ యూనిట్ల మధ్య పోటీలను నిర్వహించడాన్ని ఉదాహరణగా ఆర్‌బీఐ పేర్కొంది. థర్డ్‌ పార్టీ (బ్యాంకు సొంతం కానివి) ఉత్పత్తులు/సేవల మార్కెటింగ్‌/విక్రయాలపై ఉద్యోగులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండరాదని స్పష్టం చేసింది. అలాగే, బ్యాంక్‌లు తన ఉత్పత్తికి జోడింపుగా (బండిల్డ్‌) థర్డ్‌ పార్టీ ఉత్పత్తి విక్రయాన్ని చేపట్టరాదని కోరింది.

    ఈ విషయంలో కస్టమర్లకు ఒకటికి మించి ఆప్షన్లు అందించాలని నిర్దేశించింది. ఒకవేళ కస్టమర్‌ను తప్పుదోవ పట్టించి ఉత్పత్తిని విక్రయించినట్టు తేలితే.. అంత మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అదనంగా కస్టమర్‌కు ఏదైనా నష్టం కలిగితే అంత మేర పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

  • మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద, నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద నిలిచాయి.

    యూనికామర్స్ ఈసొల్యూషన్స్ లిమిటెడ్, కొఠారి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండోవిండ్ ఎనర్జీ లిమిటెడ్, కామధేను వెంచర్స్ లిమిటెడ్, సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, యుకెన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయు.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.

    ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.

    ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.

    ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

    ఇదీ చదవండి: డేంజర్‌లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?

  • పోటీని దెబ్బతీసే విధానాలను పాటించినందుకు ఇంటెల్‌ కార్పొరేషన్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) రూ. 27.38 కోట్ల జరిమానా విధించింది. డెస్క్‌టాప్‌లో ఉపయోగించే బాక్స్‌డ్‌ మైక్రోప్రాసెసర్లకు (బీఎంపీ) సంబంధించి భారత్‌కి మాత్రమే పరిమితమయ్యే వారంటీ పాలసీని వర్తింప చేయడం ద్వారా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని సీసీఐ పేర్కొంది.

    చైనా, ఆస్ట్రేలియా, ఇతరత్రా ప్రపంచదేశాల్లో కంపెనీల పాటించే వారంటీ పాలసీలతో పోల్చినప్పుడు భారత్‌లో అమలు చేస్తున్న విధానం వివక్షపూరితమైనదని తెలిపింది. భారత్‌లోని అధీకృత పంపిణీదారు నుంచి కొనుగోలు చేస్తేనే బీఎంపీలకు వారంటీ చెల్లుబాటయ్యేలా, మిగతా ఎక్కడా లేని విధంగా ఇండియాకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పాలసీని ఇంటెల్‌ అమలు చేయడం సరికాదంటూ మ్యాట్రిక్స్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ చేసిన ఫిర్యాదుపై సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది.

  • రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..

    కొత్త కేలండర్‌ ఏడాదిలోనూ 2025 బాటలో పబ్లిక్‌ ఇష్యూల జోరు కొనసాగుతోంది. తాజాగా సెబీ ఐదు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. జాబితాలో విరూపాక్ష ఆర్గానిక్స్, డ్యురోఫ్లెక్స్, ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్, ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్‌– అక్టోబర్‌ కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. కాగా.. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే.  

    ఆర్‌అండ్‌డీ ఫార్మా

    హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్‌ ఐపీవోకు వస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అయితే ఐపీవోకు ముందుగా రూ. 148 కోట్ల విలువైన ప్లేస్‌మెంట్‌కు వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పరిశోధన– అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఆధారిత ఫార్మాస్యూటికల్‌ కంపెనీగా నిలుస్తోంది. సంబంధిత ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్‌ తయారీ చేపడుతోంది.

    పరుపుల తయారీ

    పరుపుల తయారీలో సుప్రసిద్ధమైన డ్యురోఫ్లెక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 184 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.25 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ముంబై కంపెనీ 120 సొంత, నిర్వహణా స్టోర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. అంతేకాకుండా ప్రస్తుత కోకో స్టోర్ల లీజ్, రెంట్, లైసెన్స్‌ ఫీజులతోపాటు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు సైతం వినియోగించనుంది. 1963లో ఏర్పాటైన డ్యురోఫ్లెక్స్‌ మార్కెట్‌ వాటా రీత్యా దేశీయంగా పరుపుల తయారీలోని టాప్‌–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఫర్నీచర్‌సహా బెడ్డింగ్‌ సంబంధిత ప్రొడక్టులను సైతం తయారు చేస్తోంది.

    విస్తరణపై దృష్టి

    వెల్డింగ్‌ కన్జూమబుల్స్‌ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీ చేపట్టే ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 2.25 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను హోనడ్, ఖాలాపూర్‌(మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌) వద్ద కొత్తగా వైర్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు.. వాడా, పాల్ఘర్‌(మహారాష్ట్ర)లోగల యూనిట్‌ విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది.  

    వెల్‌నెస్‌ ప్రొడక్టులతో

    విభిన్న మైక్రోన్యూట్రియంట్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. 1993లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా వివిధ మైక్రోన్యూట్రియంట్‌ ప్రీమిక్స్‌లతోపాటు.. బ్రాండెడ్‌ వెల్‌నెస్, క్లినికల్‌ న్యూట్రిషన్, థరెప్యూటిక్‌ ఫార్ములేషన్స్, వినియోగానికి సిద్ధంగా ఉండే(రెడీ టు యూజ్‌) ఆహారోత్పత్తులను తయారు చేస్తోంది.

    పెట్టుబడి వ్యయాలకు

    హైవోల్టేజీ, ఎక్స్‌ట్రా హైవోల్టేజీ విద్యుత్‌ ప్రసార లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసే ఓమ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా 90 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 10 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లతోపాటు.. భూగర్భ కేబుళ్ల ప్రాజెక్టులు, సమీకృత నిర్వహణా సర్వీసులు తదితర కార్యకలాపాలు సైతం చేపడుతోంది.

    ఇదీ చదవండి: ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?

Telangana

  • సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడల మండలం హారిక డ్రగ్స్ పరిశ్రమలో  రియాక్టర్ పేలింది. గుమ్మిడదల కేంద్రంలోని హారిక డ్రగ్స్‌ పరిశ్రమలో మంగళవారం రాత్రి రియాక్టర్‌ పేలింది. పేలుడు తీవ్రతతో  పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఘటన సమయంలో పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం



    పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. సమాచారం  అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయాల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

  • హైదరాబాద్‌:  ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్,హెచ్ ఎం డి ఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరుల హాజరయ్యారు. 

    దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జి లను ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటు పైన జాగ్రత తీసుకోవాలి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి. 

    ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలి. జంక్షన్‌ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు.

  • సాక్షి,హైదరాబాద్‌: ఐబొమ్మ రవికి బెయిల్‌ లభించింది. సినిమా పైరసీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్‌ ఇమ్మడి రవి నాంపల్లి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయడంతో పాటు ప్రతీరోజు సీసీఎస్‌ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశ విడిచి వెళ్లొద్దని తెలిపింది. ఇంటర్నెట్‌ వినియోగించుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పని సరి చేసింది. 

    పైరసీ కేసులో అరెస్టైన బెయిల్‌ పొందిన ఇమ్మడి రవి ఇప్పటికైనా అతని తండ్రి అప్పారావు దగ్గరికి వెళతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది కుమారుడు అరెస్టును తండ్రి అప్పారావు సమర్ధించారు.

    ఇమ్మడి రవి తండ్రి ఏమన్నారంటే?
    ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను. పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా.. నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. తాజాగా బెయిల్‌ వచ్చిన ఇమ్మడి రవి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా? లేదంటే ఉద్యోగం చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

    కాగా,ఇమ్మడి  రవి విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు, వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్థారించారు. వెల్లెల ప్రహ్లాద్‌ కుమార్‌తో పాటు అంజయ్య, కాళీప్రసాద్‌ పేర్లు, వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్‌ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది.  

    గతంలో రవి అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్‌తో పరిచయమైంది. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్‌ 2017లో అమీర్‌పేటలోని హాస్టల్‌ రూమ్‌లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్‌కు సంబంధించిన పదో తరగతి మార్కుల లిస్టు, ఆధార్‌ కార్డు కలర్‌ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్‌ పేరుతోనే డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌కార్డు తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్‌ అకౌంట్‌ తెరిచాడు. కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపుకార్డులు తయారు చేశాడు.

    ఇతడితో పాటు తన పదో తరగతి క్లాస్‌మేట్‌ అయిన కాళీప్రసాద్‌ పేరుతో రూపొందించాడు. ఈ ముగ్గురి పేర్లు, వివరాలు వాడే వెబ్‌సైట్ల నిర్వహణకు అవసరమైన డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్‌.ఇన్, సప్లయర్స్‌.ఇన్‌ తదితర వెబ్‌సైట్లను ఇలానే ఏర్పాటు చేశారు. ఈ రెండూ విజయం సాధించకపోవడంతోనే రవి ‘ఐబొమ్మ’ను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల్లో ఇప్పటికి రూ.13 కోట్లు గుర్తించారు. వీటిలో రూ.3 కోట్లు పోలీసులు ఫ్రీజ్‌ చేయగా.. మిగతా రూ.10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడు.

  • హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)-2026 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అగ్రి కల్చర్‌, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకూ ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.  

    ఉదయం , మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిప్టులో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రెండో షిప్ట్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.

     

  • హైదరాబాద్‌: ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

    ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే "తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026- 2030)" రూపొందించామని మంగళవారం హెచ్ఐఐసీ లో నిర్వహించిన "బయో ఏషియా 2026" సదస్సు ఆయన వివరించారు. ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు.

    ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ(mRNA), జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో "రెడీ టూ వర్క్ ఫోర్స్"గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. సీబీఆర్ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని అన్నారు.

    అందుకే... కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. అలాగే... గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గానూ మార్చేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ, ఆటోమేషన్ ఇన్ బయోలాజిక్స్ మాన్యుఫాక్చరింగ్, డేటా ఆధారిత ప్రెసిషన్ మెడిసిన్ , కంప్యూషనల్ బయాలజీ, బయో మాన్యుఫాక్చరింగ్ 4.o తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

National

  • న్యూఢిల్లీ:  భారత్‌ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు పన్నాగం పన్నారనే నిఘా వర్గాల సమాచారంలో సెక్యూరిటీ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ జరిగే ఈ సదస్సును సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారనే వార్తల నేపథ్యంలో సైబర్‌ సెక్యూరిటీ అధికారులు హై అలర్ట్‌ అయ్యారు. ప్రధానంగా డీఫేక్‌ టెక్నాలజీ ఆధారంగా సోషల్‌ మీడియాను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్‌ చేసుకుని ఈ పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం.

    ప్రభుత్వాధికారులు చెబుతున్నట్లుగా, ప్రపంచ నాయకులపై తప్పుడు లేదా ఫేక్‌ ప్రకటనలను వ్యాప్తి చేయడానికి డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడానికి పథక రచన చేశారనే వార్తలు  ప్రధాన సవాల్‌గా మారింది. అలాగే, హ్యాకర్లు ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా లోపాలను కనుగొని వైరస్‌లను ప్రవేశపెట్టే  మాల్వేర్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. 

    ప్రతినిధుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల సెషన్ టోకెన్లు దొంగిలించే అవకాశం ఉంది. నకిలీ వై-ఫై హాట్‌స్పాట్‌ల ద్వారా సమాచారం లీక్ చేసే ప్రమాదం ఉంది.  ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను స్థంభింపజేయడానికి DDoS దాడులు జరగవచ్చు. కీలక మౌలిక వసతులను దెబ్బతీయడానికి రాన్సమ్‌వేర్ దాడులు జరిగే అవకాశం ఉంది. 

    ఈ నేపథ్యంలో సోమవారం(ఫిబ్రవరి 16వ తేదీ) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సదస్సుపై తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి పలు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు క్షుణ్ణంగా పర్యవేక్షణలో నిమగ్నమయయాయి. 

     

  • ఢిల్లీ: భారత్‌ నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ హాజరుకాకపోవడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో బిల్‌గేట్స్‌ హాజరుకానున్నట్లు గేట్స్‌ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధులు వెల్లడించారు. 

    కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఢిల్లీలో ‘భారత్‌ మండపం’లో ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తుంది. అయితే, ఈ సమ్మిట్‌ అధికారిక వెబ్‌సైట్‌ అతిథుల లిస్టులో బిల్‌గేట్స్‌ పేరు లేదు. కేంద్రం సైతం ఆయన్ను ఆహ్వానించే విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అందుకు  దుమారం రేపుతున్న ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు ఉండడమే కారణమని తేలింది. 

    దీంతో సమ్మిట్ వెబ్‌సైట్‌లో గేట్స్ పేరు లేకపోవడం వల్ల ఆయనకు ఆహ్వానం రద్దయిందంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో సైతం వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘బిల్ గేట్స్‌ ఫిబ్రవరి 19న  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొని తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు’ అని వెల్లడించారు.

    ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు.. 
    తాజాగా అమెరికాలో బయటపడిన ఎప్‌స్టిన్‌ ఫైల్స్ వివాదం నేపథ్యంలో  బిల్‌గేట్స్‌ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌కు రష్యా మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని, ఈ కారణంగా సుఖవ్యాధులకు గురైన ఆయన.. తన భార్యకు అవి సంక్రమించకుండా వ్యాక్సిన్లు కూడా ఇచ్చేవారని బయటపడింది. ఈ వివాదం కారణంగానే తాను బిల్ గేట్స్‌కు విడాకులు ఇచ్చినట్లు.. ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు వెలుగులోకి వచ్చిన వేళ ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్‌ వెల్లడించారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా బిల్‌గేట్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 

  • అనుమానమే పెనుభూతమైంది. ఫలితం వాలెంటైన్స్ డే వేడుక దారుణ  హత్యకు దారి తీసింది. ఆ తరువాత తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు దోపిడీ నాటకం ఆడాడు. అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగితే అసలు విషయం బైటపడింది. స్టోరీ ఏమిటీ అంటే..

    హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందినచార్టర్డ్ అకౌంటెంట్ అన్షుల్ ధావన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగి మహాక్‌  ఇద్దరూ దంపతులు. ఆదివారం రాత్రి 11:00 గంటల ప్రాంతంలో, గురుగ్రామ్‌లో పనిచేస్తున్న అన్షుల్, గుర్తుతెలియని దుండగులు తమను దోచుకోవడానికి ప్రయత్నించారని తన భార్య గొంతు కోశారని పోలీసులకు ఫోన్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్షుల్‌ చెబుతున్న దాంట్లో ఏదో తేడా ఉందని గమనించారు. దీంతో పలు విధాలుగా ప్రశ్నించారు. అతను పొంతన లేని సమాధానాలు విన్న తరువాత పోలీసుల అనుమానం మరింత బలపడింది. దీనికి తోడు మహక్ తండ్రి కృష్ణ కతురియా కూడా తన అల్లుడిపై అనుమానం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్‌

    చివరికి మహాక్‌ హత్య వెనుక ఉన్నరహస్యాన్ని ఝజ్జర్ పోలీసులు కేవలం 18 గంటల్లోనే ఛేదించారు.   మొదటినుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అన్షుల్ చేసిన దారుణమైన పథకంగా తేల్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అన్షుల్‌.

    పోలీసుల వివరాల ప్రకారం భార్యను ప్రేమికుల రోజునే మట్టు బెట్టాడు. సాయంత్రం దాకా భార్యతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు నటించి  భార్యను గొంతు కోసి చంపేశాడు. వేలిముద్రలు పడకుండా ఉండటానికి చేతి తొడుగులు ధరించాడు. గురుగ్రామ్‌లోని HDFC బ్యాంక్‌లో పనిచేసే మహక్‌పై నుమానం పెంచుకున్నాడని, ఇదే వారిద్దరి మధ్య తరచూ గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఆ అనుమానమే చివరికి అతన్ని నేరగాడిగా ​మార్చేసింది. గత సంవత్సరం సెప్టెంబర్ 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు గర్భవతి కూడా అని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

  • న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు రెండో రోజు(మంగళవారం) అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుడి సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

    అందుబాటులోకి ఏఐ కళ్లద్దాలు
    ఈ సందర్భంగా భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘సర్వం కాజే’ (Sarvam Kaze) అనే ఏఐ వేరబుల్ పరికరాన్ని ధరించి ఆయన స్వయంగా పరీక్షించారు. ఇది చూడడానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యాధునిక ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. రాబోయే మే నెల నుంచి ఈ స్వదేశీ పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని సదస్సులో ప్రతినిధులు వెల్లడించారు.

    విద్యా రంగంలో సరికొత్త విప్లవం
    భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాబోయే  కాలంలో డేటా సెంటర్ల రంగంలో సుమారు 200 బిలియన్ డాలర్ల(రూ.18.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. మరోవైపు, విద్యా రంగంలో ఏఐ పాత్రపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, రాబోయే తరానికి ఏఐ ఆధారిత విద్యను అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

    చాట్ జీపీటీతో భారత్‌కు అత్యధిక ప్రయోజనం
    జోహో (ZOHO) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏఐ ఒక అద్భుతమైన ‘లెర్నింగ్ బూస్టర్’లా పనిచేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇది గొప్ప సాధనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిలో సమానత్వం ఉండాలని, లేకపోతే ప్రపంచ సమాజంలో తీవ్ర అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ హెచ్చరించారు. చాట్ జీపీటీ (ChatGPT) వంటి సంస్థలకు అమెరికా కంటే భారత్ 33 శాతం ఎక్కువ డేటాను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు.
     

    ఏఐతో మరిన్ని ఉపాధి అవకాశాలు
    గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం డేటాను అందించే వనరులుగా మాత్రమే మిగిలిపోకూడదని, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాల్లో వీరికి సమాన వాటా దక్కాలని ప్యానెల్ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ సాంకేతికత కొత్త తరహాలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమితాబ్ కాంత్ అన్నారు.
     

    చిన్నారుల భద్రతపై కీలక చర్చలు
    ఈ మెగా సమిట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. బిల్ గేట్స్ ఈ సదస్సులో పాల్గొంటారని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేయగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా హాజరుకానున్నారు. సుమారు 20 దేశాల అధినేతలు, 60 మందికి పైగా మంత్రులు ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సదస్సులో భాగంగా చిన్నారుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి. వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని నిపుణులు సూచించారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అయితే డిజిటల్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.

    ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ
     

  • తమిళనాడు: తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న ఆగ్రహంతో ఓ యువకుడు న్యాయమూర్తిపైనే కత్తి విసిరిన ఘటన తమిళనాడులో సోమవారం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ కత్తి న్యాయమూర్తికి తగలలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో సెంగుళం ప్రాంతానికి చెందిన బాలమురుగన్, తంగామునీశ్వరి దంపతుల మధ్య విభేదాల కారణంగా విడాకులు కోరుతూ గత ఏడాది కోర్టును ఆశ్రయించారు. 

    విచారణ పూర్తయిన నేపథ్యంలో న్యాయమూర్తి సుధాకర్‌ సోమవారం తీర్పును చదివి వినిపించారు. ఆ తర్వాత విడాకుల కేసుకు సంబంధించి భార్యకు భరణం చెల్లించాలని బాలమురుగన్‌ను ఆదేశించారు. ఇది విన్న బాలమురుగన్‌ నిరసన వ్యక్తం చేస్తూ అరిచాడు. అక్కడితో ఆగకుండా వెంట తెచ్చుకున్న కత్తిని న్యాయమూర్తిపైకి విసిరాడు.  

Andhra Pradesh

  • తాడేపల్లి :  ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనబడుటం లేదా అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్‌.  ఈ అఘాయిత్యాల గురించి అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం చెప్పారన్నారు.  మరి మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హతమార్చి డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తందని నిలదీశారు. ఇది హోంమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటం లేదని మండిపడ్డారు. 

    ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్‌.. ‘ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానంటున్న చంద్రబాబు.. అసెంబ్లీలో తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారు. బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన అనుచరుడు మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి?, నేరస్తులంతా క్యాష్‌ను సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్‌కి పంపుతారు. దాంతో కేసులు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లలను చెరబడుతుందే చంద్రబాబు, హోంమంత్రి తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

    కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కోటప్పకొండ దగ్గర కూడా పోలీసుల సమక్షంలో మద్యం విక్రయాలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రభ కడితే పోలీసులు లాఠీలతో కొట్టారు. కరెంటు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారు. నియంత పోకడలు ఎల్లకాలం పని చేయవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇవ్వమని అడిగితే స్పీకర్ నన్న బెదిరించారు. చంద్రబాబు హెరిటేజ్‌దే ఇందాపూర్ డైరీ. ఊరుకొక‌ మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్‌లు పెట్టారు’ అంటూ విమర్శించారు.

     ఇదీ చదవండి: 

    మదనపల్లిలో మైనర్‌ బాలిక హత్య కేసు.. ఉద్రిక్తత
     

  • అన్నమయ్య : మదనపల్లిలో అదృశ్యమైన ఓ మైనర్‌ బాలికను దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతోంది.  కొన్ని గంటలుగా కదిరి- మదనపల్లి  హైవే దిగ్బంధించి స్థానికులు ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి. ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ స్థానికులు మాత్రం నిందితుడ్ని ఉరి తీయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టారు. 

    కాగా, మదనపల్లిలో అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతమైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచాడు నిందితుడు. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా(7)ను హత్య గావించబడింది. తొలుత బాలిక కన్పించకపోవడంపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 

    దీనిలో భాగంగా బాలిక ఆచూకీ తెలపాల్సిందిగా పత్రికా ప్రకటన ఇచ్చారు పోలీసులు.  ఆపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సీఐ మహమ్మద్ రఫీ, సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక హత్యగావించబడినట్లు తేలింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి, హత్య జరిగినట్లు నిర్ధారించారు. 

    అనుమానితుడి ఇంటిని చుట్టిముట్టి..
    మదనపల్లెలో  ఆందోళన  కొనసాగుతోంది. అనుమానితుడి ఇంటిని స్థానిక గ్రామస్తులు చుట్టుముట్టారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాంఢ్‌ చేస్తున్నారు. ఎస్పీతోపాటు పోలీసులు ఎంత సర్ది చెబుతున్న బాధితులు మాత్రం వినడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బాలిక శవాన్ని బయటకి తీయలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క నిందితుని కఠినంగా శిక్షించాలంటూ అన్నమయ్య సర్కిల్లో కొనసాగుతున్న రాస్తారోకో కొనసాగుతోంది.పాప తల్లితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హోంమంత్రి చెప్పారు. అనుమానితుడి ఇంటి చుట్టూ ప్రజలు ,హిజ్రాలు, ప్రజాసంఘాల నాయకులు భారీగా చుట్టుముట్టారు.  కర్నూలు డీఐజీ సైతం ఘటనా స్థలికి బయల్దేరి వస్తున్నట్లు తెలుస్తోంది.

    >

     

  • సాక్షి,తాడేపల్లి: జేఈఈ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించి టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

     కఠినమైన పోటీ పరీక్ష అయిన జేఈఈలో ప్రతిభ కనబరిచి ఉన్నత ర్యాంకులు సాధించడం విద్యార్థుల ప్రతిభ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.

    రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు ప్రయాణం విజయవంతంగా కొనసాగాలని వైఎస్‌ జగన్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర యువత ఇలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

    JEE టాపర్స్ కు YS జగన్ అభినందనలు
  • సాక్షి,అమరావతి: మంత్రి నారా లోకేష్‌ విలాసవంతమైన టూర్‌ సంచలనంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌ కోసం కోట్లు వెచ్చించి ప్రత్యేక విమానంలో ప్రయాణించిన లోకేష్‌ చక్కెర్లు కొట్టారు.

    ఇటీవల జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షిస్తున్న లోకేష్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు నారా లోకేష్‌ కేవలం 24 గంటల్లోనే కొలంబో–విజయవాడ–ఢిల్లీ ప్రయాణాలు చేసినట్లు సమాచారం. 

    మ్యాచ్‌ చూసేందుకు విజయవాడ నుంచి ఢిల్లీ.. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. ఇలా వెళ్లిన లోకేష్‌  విమానం అద్దెకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లోకేష్‌ ఈ మెరుపు ప్రయాణాలతో ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

    పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం లోకేష్ క్రికెట్ మ్యాచ్ ఖర్చు కోటి పైనే

NRI

  • అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు  అక్రమ వలసదారు  అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని  వెల్లడించింది.

    సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని  చైల్డ్‌ రేపిస్తూ  అని పేర్కొంది.  అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ (ఈసీఇ)  ఎక్స్‌లో  ప్రకటన విడుదల చేసింది. 

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    మైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.

     

    ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య

Crime

  • ఢిల్లీ: ఓ అక్కా, ఆమె తమ్ముడు కలిసి  ఓ యువకుడి ప్రాణం తీశారు.  డ్రైవింగ్ సీట్లో తమ్ముడు కారు నడుపుతుండగా, అక్క అతడితో రీల్స్ చేస్తోంది. రీల్స్ చేస్తుండగా కారు అదుపు తప్పింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు కొన్ని గంటల్లోనే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాడు. కారణం నిందితుడు పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఢిల్లీకి చెందిన సాహిల్ ధనేశ్రా (23). గుండె నిండా ఆశలు, కళ్ల నిండా కోరికలు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు. ఫిబ్రవరి 3న సాహిల్ తన ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరాడు. ఉదయం 11:57 గంటలకు ద్వారకాలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల సమీపంలో ఉండగా సాహిల్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమయంలో అక్క రీల్స్‌ చేస్తుండగా డ్రైవింగ్‌ సీట్లు ఉన్న ఆమె తమ్ముడు ఎదురుగా బైక్‌పై వస్తున్న సాహిల్‌ను బలంగా డీకొట్టాడు. అతడి బైక్ నుజ్జునుజ్జైంది. మూడు భాగాలుగా విడిపోయింది. 

    ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, స్కార్పియో, స్విఫ్ట్ డిజైర్ టాక్సీ, అలాగే సాహిల్ బైక్ చెల్లాచెదురుగా పడినట్లు గుర్తించారు. రోడ్డు పక్కనే రక్తమోడుతూ సాహిల్ పడి ఉన్నాడు. అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

    కేసు నమోదు చేసుకున్న ద్వారకా సౌత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, రాంగ్ రూట్‌లో వచ్చిన స్కార్పియో ఎదురుగా వస్తున్న సాహిల్ బైక్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత అక్కడే నిలిపి ఉంచిన టాక్సీని ఢీకొట్టినట్లు తేలింది. టాక్సీ డ్రైవర్ అజిత్ సింగ్ కూడా గాయపడి ఐజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతని వాంగ్మూలం పోలీసులు నమోదు చేశారు.

    నిందితుడికి తాత్కాలిక బెయిల్‌
    స్కార్పియో నడిపిన వ్యక్తి మైనర్. అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ప్రమాదం అనంతరం అదుపులోకి తీసుకుని, జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు హాజరుపరిచారు. కోర్టు మొదట అబ్జర్వేషన్ హోంకి పంపారు. కానీ ఫిబ్రవరి 10న జేజేబీ ఆ బాలుడికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కారణం అతడు 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండటమేనని తెలిపింది.    

    అటాప్సీ రిపోర్టులో ఏముందంటే?
    తాజాగా విడుదలైన ఆటాప్సీ రిపోర్టులో కూడా ప్రమాద తీవ్రత కారణంగానే సాహిల్ మరణించినట్లు తేలింది. అక్కా–తమ్ముడు రీల్స్ పిచ్చి కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ తల ఎడమ వైపు కపాలం పగిలింది. తలలో రక్తం గడ్డకట్టింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మెదడు వాసింది. ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరింది. గుండెకు రక్షణగా ఉండే ఎముకలు విరిగాయి. గుండె లోపల తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గాయాల కారణంగానే సాహిల్ మరణించినట్లు ఆటాప్సీ రిపోర్టులో తేటతెల్లమైంది. 

    స్టంట్స్‌ చేస్తూ రీల్స్‌ 
    సాహిల్ మరణంపై అతని తల్లి ఇన్నా మకాన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీ ఆనందం కోసం నా కొడుకు బలితీసుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాహిల్ మరణంపై ఇన్నా మకాన్  మాట్లాడుతూ... ప్రమాదం జరిగే సమయంలో స్కార్పియోలో ఉన్న నిందితుడు అతని సోదరి రీల్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలే కారణమని అన్నారు. ‘నా కొడుకు ఫిబ్రవరి 3న ఆఫీసుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మైనర్‌ నిందితుడు తన సోదరితో కలిసి సరదా రీల్స్ చేయడానికి స్కార్పియోలో బయటకు వచ్చాడు.  స్కార్పియోను నడుపుతున్న నిందితుడు వేగంగా డ్రైవింగ్‌ చేస్తున్నాడు. బస్సు వస్తుంటే.. ఎదురుగా వెళ్లి కట్‌ కొట్టాడు. మీ ఆనందం కోసం నా కొడుకును బలితీసుకుంటారా? అని ప్రశ్నించారు. సాహిల్‌ మరణంలో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.