Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో ఉప్పల్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌తో బెంగళూరుతో జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 90 పరుగుల తేడాతో గెలిచి ఉంటే పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో నిలిచి ఉండేది.

    కానీ అది జరిగకపోవడంతో ఆరెంజ్‌ ఆర్మీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానంతో సరిపెట్టుకుంది. ఇక మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చే హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. 

    సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిక్‌ ధార్‌ సలామ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. సూయష్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

    అనంతరం 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజత్‌ పాటిదార్‌(56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కృనాల్‌ పాండ్యా(41), వెంకటేశ్‌ అయ్యర్‌(44) రాణించారు. విరాట్‌ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. 

    సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగ రెండు, షకీబ్‌, హెడ్‌ తలా వికెట్‌ సాధించారు. సన్‌రైజర్స్‌ మే 27 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. నాలుగో స్ధానం కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మధ్య పోటీ నెలకొంది.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో  స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. 

    ఈ సంగతి పక్కనబెడితే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌, హెనిరిచ్ క్లాసెన్‌లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్‌లో అభిషేక్‌, క్లాసెన్‌, ఇషాన్‌లు 500 పరుగుల మార్క్‌ను దాటారు. 

    తద్వారా ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఆ సీజన్‌లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్‌మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. 

    తాజా సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్‌క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. 

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

    కేకేఆర్ ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడింది. అయితే రెండో అంచె మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కిన కేకేఆర్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా, రాజస్తాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

    అయితే పంజాబ్‌, రాజస్తాన్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయి, కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంగ్‌క్రిష్ రఘువంశీ దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 146 స్ట్రైక్‌రేట్‌తో 422 పరుగులు సాధించాడు. 

    అయితే కేకేఆర్ జట్టులో రఘువంశీ కంటే నాణ్యమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ వారెవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ అంగ్‌క్రిష్ రఘువంశీ ప్రతీ మ్యాచ్‌లో స్థిరంగా రాణించి ఇవాళ కేకేఆర్‌ ప్లేఆఫ్ రేసులో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

     

  • నేపాల్ స్టార్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికీ అంపైర్ ఔట్‌గా ఇవ్వడంపై రోహిత్ పోడెల్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా అమెరికాతో మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 

    విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 38వ ఓవర్ మిలింద్ కుమార్ వేశాడు. ఆ ఓవర్‌ ఆఖరి బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ విఫలం కావడంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే మిలింద్ కుమార్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. బంతి ప్యాడ్లకు తాకలేదని ఒకవైపు రోహిత్ చెబుతూనే ఉన్నప్పటికీ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్‌కు గురైన రోహిత్ పౌడెల్ అంపైర్‌వైపు కోపంగా చూశాడు. 

    ఆ తర్వాత బ్యాట్‌ను పిచ్‌పై బలంగా కొట్టి చేసేదేం లేక నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. అయితే రిప్లేలో బంతి ప్యాడ్లను తాకలేదు, కానీ గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ నిబంధనల ప్రకారం అంపైర్ ఔట్ ఇచ్చిన తర్వాత తిట్టడం, బ్యాట్‌ను పడేయడం, బ్యాట్‌తో మైదానాన్ని కొట్టుకుంటూ వెళ్లడం, బౌండరీ లైన్‌ను కాళ్లతో తన్నడం వంటివి నిషిద్ధం. 

    అయితే రోహిత్ పౌడెల్ బ్యాట్‌ను బలంగా పిచ్‌కు కొట్టడంతో నిబంధన ఉల్లఘించినట్లయింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లఘించిన రోహిత్ పౌడెల్‌పై లెవెల్ 1 లేదా లెవెల్ 2 కింద చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే అమెరికాపై నేపాల్ 122 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. 

    తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇషాన్ పాండే (84), దీపేంద్ర సింగ్ (59) అర్థసెంచరీలతో రాణించగా.. రోహిత్ పౌడెల్ (46), ఆసిఫ్ షేక్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభమ్ రంజనే మూడు వికెట్లు తీశాడు. 

    అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 41.2 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి  (56) అర్థసెంచరీతో రాణించాడు. నేపాల్ బౌలర్లలో సందీప్ లమిచ్చానే 3 వికెట్లు తీయగా, లలిత్, దీపేంద్ర సింగ్‌, గుల్షన్ జా తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

    చదవండి: ఉగ్రవాదితో షాహిద్‌ అఫ్రిది డిన్నర్‌!

  • ఉప్పల్‌ మైదానం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. 

    బెంగళూరు బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(56) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కృనాల్‌ పాండ్యా(41), వెంకటేశ్‌ అయ్యర్‌(44) రాణించారు. విరాట్‌ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగ రెండు, షకీబ్‌, ట్రావిస్‌ హెడ్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.

    ఆర్సీబీ నాలుగో వికెట్‌ డౌన్‌
    పాటిదార్‌ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్‌.. హెడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 185/4

    ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
    దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్‌.. మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు

    8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 91/2
    8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(20), పాటిదార్‌(10) ఉన్నారు.

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    ఎస్ఆర్‌హెచ్ విధించిన 256 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 57 ప‌రుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్‌లోనే వెంకటేశ్‌ అయ్యర్‌ (44) ఔట్‌ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్‌  కోల్పోయింది. 

    ఆర్సీబీ టార్గెట్ 256 ప‌రుగులు
    హైద‌రాబాద్ వేదిక‌గా ఆర్సీబీతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్‌, ఇషాన్‌, క్లాసెన్ అర్థశ‌త‌కాల‌తో విధ్వంసం సృష్టించ‌డంతో ఎస్ఆర్‌హెచ్‌ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీల‌తో మెరిశారు. ఆఖ‌ర్లో నితీశ్‌కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 250 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ 2 వికెట్లు తీయ‌గా, సుయాశ్‌, కృనాల్ చెరొక వికెట్ తీశారు.

    • 16 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్‌ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ సాధించాడు. కిషన్‌ 65 పరుగులతో ఆడుతున్నాడు.

    దంచుతున్న ఎస్ఆర్‌హెచ్‌.. 15 ఓవ‌ర్ల‌లో 189-2
    ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ దంచికొడుతుంది. 15 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ 2 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు 56 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ సుయాశ్ శ‌ర్మ బౌలింగ్‌లో జోర్డాన్ కాక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

    6 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 63-1
    6 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (26), ఇషాన్‌ కిషన్‌ (8) పరుగులతో ఆడుతున్నారు.

    హెడ్‌ (26) ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్‌ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌ రసిక్‌సలామ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.

    టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్
    టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజ‌యాన్ని సాధించి టేబుల్‌లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్‌హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మ‌రోవైపు ఇప్ప‌టికే టాప్‌లో ఉన్న ఆర్సీబీ విజ‌యంతో లీగ్ ద‌శ‌ను ముగించాల‌ని భావిస్తోంది. మ‌రి భారీ స్కోర్ల‌కు పెట్టింది పేరైన ఉప్ప‌ల్ స్టేడియంలో ఎవ‌రిది పైచేయి కానుందో కొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. 

    ఈ సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ త‌మ సొంత మైదానంలో ఎస్ఆర్‌హెచ్‌తో త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ ద‌శ‌లో త‌మ చివరి మ్యాచ్‌ను మ‌ళ్లీ ఎస్ఆర్‌హెచ్‌తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్‌హెచ్ మాత్రం ప్ర‌తీకారం తీర్చుకునేందుకు సిద్ధ‌మైంది. 

    ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 26 సార్లు త‌ల‌ప‌డితే ఎస్ఆర్‌హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజ‌యాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇక్క‌డ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఆరింటిలో గెల‌వ‌గా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్‌కీప‌ర్‌), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.

    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.

     

  • పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదిగా ముద్రపడిన  ఉజైర్‌ బ‌లోచ్‌తో క‌లిసి అఫ్రిది డిన్న‌ర్ చేస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో క్రికెట్ అభిమానులు షాహిద్ అఫ్రిదిని ఏకిపారేస్తు న్నారు. జీషన్‌ అక్రమ్‌ మీర్జా అనే వ్యక్తి తన ‘ఎక్స్‌’ వేదికగా ఫొటోలను పంచుకున్నాడు.

    2013లో షాహిద్ అఫ్రిది ఒక  ప్రైవేటు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైనట్లు తెలుస్తోంది. అదే కార్య‌క్ర‌మానికి అప్ప‌టి ల్యారీ గ్యాంగ్ నెట్‌వ‌ర్క్‌కు కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఉజైర్ బలోచ్ కూడా వ‌చ్చాడని, ఈ సంద‌ర్భంగా ఉజైర్ బ‌లోచ్ గ్యాంగ్‌తో క‌లిసి అఫ్రిది డిన్న‌ర్‌లో పాల్గొన్నాడంటూ అభిమాని ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. 

    ఇక ల్యారీ గ్యాంగ్‌లో రెహ‌మాన్ డెకాయిట్ త‌ర్వాత రెండో అత్యున్న‌త ప‌దవిలో కొన‌సాగిన ఉజైర్ బ‌లోచ్ ల‌క్షిత హ‌త్య‌లు, దోపిడీలు, ముఠా హింస‌, మాదక‌ద్ర‌వ్యాల ర‌వాణా, గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. 2008 ముంబై ఉగ్ర‌దాడుల్లో పాల్గొన్న ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాల స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ఉజైర్ బలోచ్ కీల‌క‌పాత్ర పోషించాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2016లో పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఉజైర్ బ‌లోచ్‌ను అదుపులోకి తీసుకొని దేశంలో అత్యంత క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుల‌లో ఒక‌డిగా ముద్ర వేశారు. 

    ఇటీవ‌లే విడుద‌లైన బాలీవుడ్ చిత్రం ధురంద‌ర్‌లో ఉజైర్ బ‌లోచ్ అనే పాత్ర‌ను భార‌త‌దేశానికి వ్య‌తిరేకంగా ఉగ్ర‌వాదానికి స‌హ‌క‌రించిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా చూపించారు. అయితే తాజాగా షాహిద్ అఫ్రిది ఉగ్ర‌వాదిగా ముద్ర‌ప‌డిన ఉజైర్ బ‌లోచ్‌తో డిన్న‌ర్‌లో పాల్గొన్న ఫొటోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం వివాదానికి దారి తీసింది. పాక్ వ్య‌క్తులే ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తున్నార‌నడానికి ఇంత‌కంటే సాక్ష్యాలు ఏం కావాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

    నిజానికి మాజీ క్రికెట‌ర్‌ షాహిద్ అఫ్రిది త‌న ప్ర‌వర్త‌న‌తో ఎన్నోసార్లు అప్ర‌తిష్ట పాల‌య్యాడు. ఆట‌లో నైపుణ్యం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అత‌డు భార‌త్ వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డ్డాడు. ఈ పాక్ మాజీ కెప్టెన్ ప‌దే పదే భార‌త్ సంస్కృతికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్థించి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. 

    బ‌యట వివాదాలు ఎన్ని ఉన్నా ఆట‌లో మాత్రం షాహిద్ అఫ్రిది నిఖార్సైన ఆల్‌రౌండ‌ర్‌గా గుర్తింపు పొందాడు. పాక్ త‌ర‌ఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వ‌న్డేలు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వ‌న్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా శ‌త‌కం బాదిన తొలి బ్యాట‌ర్‌గా (37 బంతుల్లో) అఫ్రిది ప్ర‌పంచ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 2018లో అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

    చదవండి: గుజరాత్‌ ఓపెనర్‌కు అశ్విన్‌ చురకలు!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ నిల‌క‌డ ప్ర‌దర్శ‌న కొన‌సాగిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 14 మ్యాచ్‌లాడిన సాయి సుద‌ర్శ‌న్ 157 స్ట్రైక్‌రేట్‌తో 638 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో లీడింగ్‌లో కొన‌సాగుతున్నాడు. అయితే సాయి సుద‌ర్శ‌న్ ప్ర‌ద‌ర్శ‌న‌ బాగానే ఉన్న‌ప్ప‌టికీ బ్యాటింగ్‌లో ఇంకా దూకుడు పెంచాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని టీమిండియా మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ చురకలు అంటించాడు.

    ఐపీఎల్‌లో స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తున్న‌ప్ప‌టికీ ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో వేగంగా ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో సాయి సుద‌ర్శ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నాడని తెలిపాడు. అశ్విన్ మాట్లాడుతూ..'నేను శుబ్‌మ‌న్‌ గిల్ బ్యాటింగ్‌ను ప్రశంసించాలనుకుంటున్నా. గుజ‌రాత్ టైటా న్స్‌ను అటు కెప్టెన్‌గా స‌మ‌ర్థంగా న‌డిపిస్తూనే బ్యాట‌ర్‌గా రాణిస్తున్నాడు. 

    ముఖ్యంగా పవర్‌ప్లేలో గిల్ పట్టుదలతో భారీ ఇన్నింగ్స్‌లు  ఆడుతున్నాడు. కానీ సాయి సుదర్శన్ ప్ర‌దర్శ‌న మెచ్చుకునే రీతిలో ఉన్న‌ప్ప‌టికీ మోడ్ర‌న్ టీ20 క్రికెట్‌కు స‌రిపోయేలా అత‌డు ఆడ‌డం లేదు. సాయి సుదర్శన్ ఎక్కువ‌గా సంప్రదాయబద్ధంగానే క్రికెట్ ఆడతాడు, కానీ ఇన్నింగ్స్ చివర్లో వేగంగా ఆడ‌లేక‌పోతున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్‌లో వేగం పెంచితే మాత్రం సాయి సుద‌ర్శ‌న్‌కు తిరుగుండ‌క‌పోవ‌చ్చు. 

    ఆరెంజ్ క్యాప్‌లో లీడింగ్‌లో ఉన్న‌ప్ప‌టికీ  సాయి సుద‌ర్శ‌న్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను చాలా మెరుగుప‌రుచుకోవాల్సి ఉంది. అత‌డు దీనిని చేయ‌గ‌ల‌డ‌ని ఆశిస్తున్నా. ఇక గిల్ బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ త‌న‌లోని పూర్తి సామ‌ర్థ్యాన్ని వెలికి తీయ‌లేదని నాకు అనిపిస్తోంది.' అంటూ చెప్పుకొచ్చాడు. 

    గురువారం సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 89 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ (84), కెప్టెన్ గిల్ (64) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. జాస్ బ‌ట్ల‌ర్ (57 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

    అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 13.4 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. శివ‌మ్ దూబే (47) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో గుజ‌రాత్ టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌లో ఓట‌మితో సీఎస్‌కే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

    చదవండి: ఆటగాళ్లకు అవమానం.. పాక్ జ‌ట్టులో సంక్షోభం!

  • పాకిస్తాన్ హాకీ జ‌ట్టు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పాకిస్తాన్ హాకీ ఫెడ‌రేష‌న్ (పీహెచ్ఎఫ్‌) నుంచి రావాల్సిన పెండింగ్ బ‌కాయిలు రాక‌పోగా తాజాగా మ‌రో బాంబు పేల్చింది. రోజువారీ శిక్ష‌ణా శిబిర భ‌త్యం త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఆటగాళ్లకు శిక్షణా భత్యం కింద ఇస్తున్న 11 డాల‌ర్ల‌ను(రూ. 3 వేలు) 3.5 డాల‌ర్ల‌కు (రూ. 335) త‌గ్గించ‌డం గ‌మ‌నార్హం. 

    దీంతో పాక్ ఆట‌గాళ్లు శిక్ష‌ణా శిబిరం భ‌త్యం కింద ఇక‌పై కేవ‌లం 335 రూపాయ‌లు మాత్ర‌మే అందుకోనున్నారు. ఇదే విష‌య‌మై పాక్ ఆట‌గాళ్లు త‌మ‌కు న్యాయం చేయాలంటూ పీహెచ్ఎఫ్‌కు ఫిర్యాదు చేశారు.  ‘ఈజిప్టులో మేము ప్ర‌పంచ‌క‌ప్ క్వాలిఫ‌యింగ్ టోర్నీ ఆడుతున్న స‌మ‌యంలోనే విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు మాకు రోజువారీ భ‌త్యం 110 డాల‌ర్లు ఇస్తామ‌ని వారు ప్ర‌క‌టించారు. కానీ ఆ మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు మాకు అంద‌లేదు. 

    ఇప్పుడు శిక్ష‌ణా శిబిరం భ‌త్యానికి సంబంధించి ఇచ్చే మొత్తాన్ని రూ.335కు కుదించ‌డం దారుణం. దీనివ‌ల్ల మాకు ఒరిగేదేమిలేదు. ఆర్థిక న‌ష్టాల పేరుతో మాకు వ‌చ్చే అర‌కొర డ‌బ్బుల‌ను కూడా ఇలా కుదింపు పేరుతో లాగేసుకోవ‌డం దుశ్చ‌ర్య కింద‌కు వ‌స్తుంది. త‌క్ష‌ణ‌మే మాకు న్యాయం చేయాలి’ అని ఆట‌గాళ్లు పాకిస్తాన్ హాకీ స‌మాఖ్య‌కు ఫిర్యాదు చేశారు. 

    ఈ ఏడాది ఆగ‌స్టులో నెద‌ర్లాండ్స్‌, బెల్జియం వేదిక‌గా హాకీ ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 20 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, కెప్టెన్ ఎవ‌రన్న దానిపై మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేదు. గ‌తేడాది నుంచి పాకిస్తాన్ హాకీ జ‌ట్టును ష‌కీల్ అమ్మాద్ బ‌ట్ న‌డిపిస్తున్నాడు. 

    ఎఫ్ఐహెచ్ ప్రొ మూడో ద‌శ జూన్ 13 నుంచి 27 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇందులో పాకిస్తాన్ బెల్జియం, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి భార‌త్‌తోనూ త‌ల‌ప‌డ‌నుంది. ఈ టోర్నీ ముగిసిన వెంట‌నే పాకిస్తాన్ హాకీ ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌నుంది.

    చదవండి: ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ.. వైభ‌వ్‌కు ప్ర‌మోష‌న్‌!

  • భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె టెండుల్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సారా శరీరాకృతిని కించపరిచేలా ఓ పాపరాజీ ఆమె వీడియోకు చెత్త క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సారా దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది.

    అసలేం జరిగిందంటే.. సారా తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌ ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సారా, అర్జున్‌ భార్య సానియా చందోక్‌ అతడితో కలిసి ఎయిర్‌పోర్టులోకి వెళ్తున్నపుడు తాహిర్‌ జాసూస్‌ అనే పాపరాజీ వీడియో తీశాడు.

    లావుగా ఉన్న అమ్మాయి సారా అంటూ.. 
    ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘‘లావుగా ఉన్న అమ్మాయి సారా.. ఆ పక్కనే ఉన్నది ఆమె మరదలు’’ అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సారా అతడికి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.

    నువ్వొక పనికిమాలిన వ్యక్తివి
    ‘‘తాహిర్‌ జాసూస్‌.. నువ్వొక పనికిమాలిన వ్యక్తివి. ఇది నిజమైన జర్నలిజం కాదు. మమ్మల్ని ఇలా వదిలెయ్‌. ఇప్పుడు నువ్వు మా వీడియోను డిలీట్‌ చేయొచ్చు. కానీ నీ పనికిమాలినతనం మాత్రం ఎక్కడికీ పోదు’’ అని సారా చురకలు అంటించింది. 

    ఈ నేపథ్యంలో సారాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఆడవాళ్లను బాడీ షేమింగ్‌ చేయడం అందరికీ బాగా అలవాటైపోయింది. అతడికి బాగా గడ్డిపెట్టావు. ఇకనైనా వేరే వాళ్ల గురించి ఇలాంటి చెత్త రాతలు రాసేముందు అతడికి ఇది గుర్తుకువస్తుంది’’ అని కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: అఫ్గన్‌ మహిళా క్రికెటర్ల కోసం కదిలిన ఈసీబీ

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్‌ దశ ముగిసి ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్‌ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేప‌థ్యంలో ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో ఒకే జ‌ట్టుకు ఆడ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. 

    బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అగర్వాల్‌ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. 

    ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, వైభవ్‌ సూర్యవంశీ వైస్‌ కెప్టెన్‌గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిస‌ల్‌ బీహార్‌’తో కూడిన జెర్సీని కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ హోదాలో ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ క‌లిసి ఆవిష్క‌రిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం వైర‌ల్‌గా మారింది.  

    బీహార్‌కు చెందిన ఈ ఇద్ద‌రితో పాటు ఈ సీజ‌న్‌లో వేర్వేరు జ‌ట్ల‌కు ఆడుతున్న అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ (కేకేఆర్‌), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్‌హెచ్‌) కూడా అదే రాష్ట్రానికి చెందిన‌వారు కావ‌డం విశేషం.  అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న ఈ న‌లుగురు బీహార్ నుంచి వ‌చ్చిన‌వారు కావ‌డంతో సెప‌రేట్‌గా ఒక‌ ఐపీఎల్ జ‌ట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగ‌ర్వాల్ తెలిపారు. 

    ఈ అంశం క్రీడ‌ల ప‌రంగా బీహార్‌ను ప్ర‌పంచ స్థాయి మౌలిక స‌దుపాయాల‌ను అందించ‌డంతో పాటు త‌ర్వాతి త‌రం క్రికెట‌ర్ల‌కు ఇది స్ఫూర్తినిచ్చే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న‌ తెలిపారు. అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. 'చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లాగే బీహార్‌కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాల‌నుకోవ‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే బీహార్ గ‌డ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెట‌ర్ల‌ను అందించింది. 

    ప‌ట్నాలో జ‌న్మించిన ఇషాన్ కిష‌న్ వ‌న్డేల్లో అత్యంత వేగ‌వంత‌మైన డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ఇక బీహార్‌లోని స‌మ‌స్తిపూర్‌కు చెందిన సూర్య‌వంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతిపిన్న వ‌య‌స్కుడిగా  నిలిచాడు. గోపాల్‌గంజ్‌లోని ఒక సాధార‌ణ కుటుంబం నుంచి వ‌చ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ త‌న బౌలింగ్‌తో యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తున్నాడు. 

    ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ త‌న డైన‌మైట్ ఇన్నింగ్స్‌ల‌తో అల‌రిస్తున్నాడు. వీరంద‌రిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. 

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బ్యాటింగ్‌లో మెరిసిన వాళ్ల‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వైభ‌వ్ సూర్య‌వంశీతో పాటు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వైస్‌కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ సీజ‌న్‌లో వైభ‌వ్ 13 మ్యాచ్‌ల్లో 579 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండ‌గా, ఇషాన్ కిష‌న్ 13 మ్యాచ్‌ల్లో 490 ప‌రుగుల‌తో రేసులో 10వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

    కాగా అనిల్ అగ‌ర్వాల్ ప్ర‌తిపాద‌న‌తో బీహార్ నూత‌న ముఖ్య‌మంత్రి స‌మ్రాట్ చౌద‌రీ ఏకీభ‌వించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన దార్శ‌నిక‌తో ఒక మిష‌న్ మోడ్‌లా ప‌నిచేస్తోంది. మీరు ప్ర‌తిపాదించిన విష‌యంతో ఏకీభ‌విస్తూ ఒక సానుకూల నిర్ణ‌యం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. 

    ఇక ఐపీఎల్‌లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవ‌లే ఆర్సీబీ, రాజ‌స్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధ‌ర‌కు చేతులు మారాయి. ఒక‌వేళ బీసీసీఐ ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల సంఖ్య‌ను విస్త‌రించాల‌నుకుంటే మాత్రం బీహార్‌కు చెందిన అనిల్ అగ‌ర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.

    చదవండి: పంత్ డిమోష‌న్ వెనుక అతడిదే కీల‌క‌పాత్ర‌!

  • టీమిండియా సెలక్షన్‌ కమిటీ తీరుపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ మండిపడ్డాడు. ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. రంజీల్లో సత్తా చాటిన వారికి జట్టులో చోటు ఇవ్వనపుడు.. అసలు ఇలాంటి టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో ఏకైక టెస్టు, మూడు వన్డేలకు భారత జట్టును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బౌలింగ్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద​ కృష్ణ, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబేలకు చోటిచ్చారు.

    60 వికెట్లు కూల్చిన ఆకిబ్‌ నబీ
    అయితే, 2025-26 రంజీ సీజన్‌లో జమ్మూ కశ్మీర్‌ తరఫున ఏకంగా 60 వికెట్లు కూల్చిన ఆకిబ్‌ నబీని మాత్రం పక్కనపెట్టారు. జమ్మూ జట్టు తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలపడంలో ఈ ఫాస్ట్‌ బౌలర్‌దే కీలక పాత్ర. దీంతో సర్వత్రా ప్రశంసలు కురవగా.. అఫ్గన్‌తో టెస్టు జట్టుకు ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    అతడికి అన్యాయం చేశారు
    అయితే, అనూహ్య రీతిలో సెలక్టర్లు ఆకిబ్‌ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌.. సెలక్షన్‌ కమిటీ నాయకుడు అజిత్‌ అగార్కర్‌ తీరుపై మండిపడ్డాడు. ‘‘ఈ సెలక్టర్లు ఆకిబ్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అసలు ఇదేం సెలక్షన్‌?..

    ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వీళ్లంతా కలిసి అతడికి అన్యాయం చేశారు. నిజంగా అతడిని పక్కనపెట్టడం అర్థంలేని చర్య. ప్రస్తుతం అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహింగచలరా?

     బీసీసీఐ వెంటనే వీటిని తీసేయాలి
    రంజీ ట్రోఫీలో ఒక సీజన్‌లో 60 వికెట్లు తీశాడు. అయినా సరే అతడిని ఎంపిక చేయలేదు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటడం పనికిరాదని సెలక్టర్లు భావిస్తే.. బీసీసీఐ వెంటనే ఈ టోర్నీలను తీసేయాలి.

    వికెట్లు తీసే బౌలర్లను పక్కనపెట్టడం ఏమిటి? అతడి వేగం తక్కువగా ఉండొచ్చు. కానీ నిలకడగా వికెట్లు తీయడంలో అతడు దిట్ట. టీమిండియాలోకి వస్తే కోచ్‌లు అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దవచ్చు. కానీ మీరేం చేస్తున్నారు?’’ అని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

    అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా
    శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

    అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా
    శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

    చదవండి: సన్‌రైజర్స్‌కు తప్పని గండం.. అలా అయితేనే టాప్‌-2లో చోటు!

International

  • ఇరాన్ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ చమురు నిల్వ కేంద్రాలను రక్షించుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త రక్షణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యూఈఏ ప్రభుత్వం చమురు నిల్వ కేంద్రాల చుట్టూ డ్రోన్ నిరోధక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరలవుతున్నాయి. భారీ డ్రోన్లు దాడి చేసినా, అవి నేరుగా చమురు ట్యాంకులను తాకకుండా అడ్డుకోవడమే ఈ 'యాంటీ-డ్రోన్' వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో నడుస్తున్న యుద్దం వాతావారణంలో ఇరాన్‌.. వ్యూహాత్మకంగా యూఏఈను టార్గెట్‌ చేస్తూ తమ హెచ్చరికల తీవ్రతను పెంచింది. 

    చమురు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, చివరికి ఒక అణు రియాక్టర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో మరోసారి దాడి చేస్తామని టెహ్రాన్‌ హెచ్చరిస్తోంది.  ఈ క్రమంలోనే తమ చమురు నిల్వ కేంద్రాలను కాపాడుకునేందుకు యూఏఈ పటిష్ట చర్యలను మొదలు పెట్టింది.

    మరోవైపు తమపై నిఘా పెట్టేందుకు, ఉమ్మడి వ్యూహాలు రచించేందుకు యూఏఈ తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా, ఇశ్రాయేల్ రక్షణ సంస్థలతో పంచుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  ఇజ్రాయెల్‌తో కలిసి ఒక భారీ నిధిని ఏర్పాటు చేస్తున్నాయి.

    ఈ రెండు దేశాలు కలిసి అత్యాధునిక యాంటీ-డ్రోన్ ఆయుధాలను తయారు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఏఈని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగినట్లు తెస్తోంది.
    చదవండి: స్టార్ ప్లేయ‌ర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ‌!

  • ఇస్లామాబాద్‌: భారత్‌లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

    పాకిస్థాన్‌లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్‌మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్‌లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.

    లోగోలు,బ్రాండింగ్
    పాకిస్థాన్‌లోని ఈ అకౌంట్‌ లోగోలు భారతీయ వెర్షన్‌లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.

    యువతలో ప్రభావం
    ఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్‌లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్‌ యువత కూడా ఆకర్షితులవుతున్నారు. 

Movies

  • నందు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'అగ్లీ స్టోరీ'. ప్రణవ స్వరూప్ దర్శకుడు. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. సైకో భర్త పాత్రలో నందు కనిపించగా, అమాయకమైన భార్య పాత్రలో అవికా గోర్ నటించింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

    కథేంటి? 
    చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన నేహా(అవికా గోర్)ని ఆమె మావయ్య(శివాజీ రాజా)తన ఇంటికి తీసుకొస్తాడు. మామయ్య కొడుకు కార్తీక్ (నందు).. ఆమెపై మోజు పెంచుకుంటాడు. నేహా మాత్రం గౌతమ్ (రవితేజ మహాదాస్యం)ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఆవేశంతో సైకోలా మారిపోతాడు. తనకు ఇష్టం లేకపోయినా నేహా కార్తీక్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంది? పెళ్లి తర్వాత ఆమె జీవితం ఎలా మారింది? కార్తీక్ టార్చర్ ఎంత వరకు వెళ్లింది? చివరకు జరిగిన రక్తపాతం ఏంటనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే? 
    టాక్సిక్ రిలేషన్‌షిప్స్, సైకో మెంటాలిటీ గురించి ఇందులో చూపించారు. భార్యాభర్తల మధ్య సమ్మతి ఎంత ముఖ్యమో చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఫస్టాప్‌లో హీరో సైకోయిజం గురించి ఎక్కువ సన్నివేశాలు ఉండటంతో స్టోరీ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్ ప్రేక్షకుడికి కొంత సంతృప్తిని ఇస్తుంది. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని బాధపడుతున్న అమ్మాయిలకు ఎలాంటి కష్టాలు పడుతున్నారనేది ఇందులో చూపించారు. ఈ తరహా మహిళలకు కొన్ని సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి.

    ఎవరెలా చేశారు?
    సైకో భర్తగా నందు ఆకట్టుకున్నాడు. పాత్రలో పూర్తిగా లీనమైపోయాడు. అవికా గోర్ ఎమోషనల్ పాత్రలో నటన కనబరిచింది. శివాజీ రాజా తనకు అలవాటైన తండ్రి పాత్రలో కనిపించారు. రవితేజ మహాదాస్యం ప్రేమికుడి పాత్రలో పర్లేదనిపించారు. ప్రజ్ఞ నయన్ పోలీస్ పాత్రలో ఓకే. దర్శకుడు ప్రణవ స్వరూప్ కథను సీరియస్ టోన్‌లో చెప్పాడు. ముఖ్యంగా సమ్మతి అనే సున్నితమైన అంశాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం బాగుంది. మిగతా టెక్నికల్ అంశాలు కూడా తమవంతు న్యాయం చేశారు.

    (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

  • చిరంజీవితో 'విశ్వంభర' తీసిన దర్శకుడు వశిష్ట సోదరుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తక్షక'. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నాడు. డా.లతారాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర పోస్టర్‌ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు.

    (ఇదీ చదవండి: లేడీ యూట్యూబర్‌పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ)

    చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయి దర్శకుడిగా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. సీజీ వర్క్ పూర్తిచేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం అని డైరెక్టర్ కృష్ణ మల్లిడి అన్నారు.

    (ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు)

  • ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సిస్టమ్, మధువిధు, టీఎన్ 2026 తదితర డబ్బింగ్ మూవీస్‌తోపాటు 'మేం కాప్‌లం' ‍అనే తెలుగు సిరీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఒకే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?

    (ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌)

    గతేడాది జూలై 5న థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా '14'. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకుడు కాగా నోయల్ సీన్, రామ్ రతన్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడిది ఆహా ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కొడుకు రతన్, జూనియర్ డాక్టర్ నేహా ప్రేమలో ఉంటారు. ఓ రోజు నేహా ఫ్లాట్‌లో ఇద్దరూ శవాలై కనిపిస్తారు. ఆత్మహత్య అని పోలీసులు తేలిస్తే.. సుబ్బు అనే జర్నలిస్ట్, తన మిత్రులతో కలిసి ఇది హత్య అని దర్యాప్తు చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

    గతేడాది జూలై 19న థియేటర్లలోకి వచ్చిన 'రాజు గాని సవాల్' కూడా ఆహా ఓటీటీలోకి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. లెలిజాల రవీందర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. చిన్న మొబైల్ రిపేర్ షాపు నడుపుకొనే రాజు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి తన బస్తీలో గణేష్ ఉత్సవాలు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఉత్సవాల వల్ల స్థానిక నాయకుడితో రాజుకు విభేదాలు వస్తాయి. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబాన్ని, బస్తీని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా స్టోరీ.

    గతేడాది సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ సినిమా 'లవ్ యూ రా'. చిన్ను, గీతికా రతన్ జంటగా నటించారు. ఇందులో ప్రధానంగా స్నేహితుల మధ్య జరిగే పందెం, దాని చుట్టూ తిరిగే హారర్, నవ్వులు పుట్టించే అంశాలే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

  • అందంగా మెరిసిపోతున్న రానా భార్య మిహీక

    మేకప్ లేకుండా భాగ్యశ్రీ.. మే నెల జ్ఞాపకాలు

    బ్లాక్ డ్రస్‌లో గ్లామరస్‌గా ఐశ్వర్యా రాజేశ్

    మెరుపుతీగలా మారిపోయిన ఫరియా అబ్దుల్లా

    పలుచని చీరలో కుందనపు బొమ్మలా వైష్ణవి

    గౌరి కిషన్ హాట్‌నెస్.. చూపు తిప్పడం కష్టమే

  • దాదాపు నెలరోజుల క్రితం ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ కారణంగా వార్తల్లో నిలిచిన యాంకర్ విష్ణుప్రియ.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయిపోయింది. తోటి యూట్యూబర్‌పై హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. తన వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై నిజాలు వక్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొంది.

    (ఇదీ చదవండి: అమ్మకానికి 'ఐమాక్స్'?)

    అసలేం జరిగింది?
    యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ప్రస్తుతానికైతే కొత్తగా ఎలాంటి సినిమాలు చేస్తున్నట్లు లేదు. పలు షోల్లో అడపాదడపా కనిపిస్తోంది. అయితే ఈమె అసభ్య వీడియోలతో యువతని పెడదారి పట్టిస్తోందని, సబ్‌స్క్రిప్షన్ పేరిట లక్షల రూపాయలు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది.

    అయితే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని సోనాలి అనే తెలుగు యూట్యూబర్.. విష్ణుప్రియపై రోస్టింగ్ వీడియో చేసింది. ఈ క్రమంలోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సదరు యూట్యూబర్‌పై నాలుగు రోజుల క్రితం మియాపుర్ పోలీస్ స్టేషన్‌లో విష్ణుప్రియ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇకపై ఏ యూట్యూబర్ అయినా తనని వేధించేలా వీడియోలు చేస్తూ ఇలానే కేసులు నమోదవుతాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ కేసు పెట్టగానే సదరు యూట్యూబర్.. ఈమెకు సంబంధించిన వీడియోని డిలీట్ చేసింది!

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

  • అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలంటే ప్రపంచంలో చాలామందికి గుర్తొచ్చేది 'ఐమాక్స్'. భారత్‌లో ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్లు పెద్దగా లేవు. గుజరాజ్‌లో ఒకటి మాత్రమే ఉంది! దాదాపు 60 ఏళ్ల క్రితం స్థాపించిన ఐమాక్స్ సంస్థ.. ఇప్పుడు అమ్మకానికి సిద్ధమైందనే వార్త సంచలనంగా మారింది. ఇది ప్రపంచ ఎగ్జిబిషన్ రంగంలో భారీ మార్పులకు నాంది పలకనుందని మాట్లాడుకుంటున్నారు. ఈ విక్రయానికి సంబంధించిన విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది.

    (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

    ప్రముఖ సినిమా టెక్నాలజీ సంస్థ ఐమాక్స్.. అమ్మే అవకాశాలు పరిశీలిస్తోందని.. ఇప్పటికే ప్రారంభ దశ చర్చలు కూడా మొదలైపోయినట్లు టాక్. ఈ క్రమంలోనే పలు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఐమాక్స్ మార్కెట్ విలువ సుమారు 1.85 బిలియన్ డాలర్లుగా ఉంది.

    కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. కానీ వాటి నుంచి నెమ్మదిగా బయటపడ్డాయి. ఇప్పటికీ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ థియేటర్లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఐమాక్స్ లాంటి ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్లలో సినిమా చూసేందుకు ఎక్కువ రేటు పెట్టి టికెట్ కొనేందుకు ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. అలాంటిది ఐమాక్స్ ఎందుకు అమ్మకానికి సిద్ధమైందనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐమాక్స్‌కి సంబంధించిన ఈ వార్త బయటకు రాగానే ఈ సంస్థ షేర్లు దాదాపు 17 శాతం వరకు పెరగడం విశేషం.

    1967లో కెనడాలో ఐమాక్స్ సంస్థని స్థాపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు సొంత టెక్నాలజీ ఫ్లాట్‌ఫార్మ్‌గా కొనసాగుతోంది. ప్రత్యేక కెమెరాలు, అధునాతన ఆడియో వ్యవస్థలు, ప్రత్యేక థియేటర్ డిజైన్‌లతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం విక్రయ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, నిజంగానే అమ్మేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందని నిపుణులు మాట్లాడుకుంటున్నారు. తెలుగులో ప్రస్తుతం మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో తీస్తున్న 'వారణాసి' సినిమాని ఐమాక్స్ ఫార్మాట్‌లోనే తీస్తున్నారు. ఇదే ఫార్మాట్‌లో తీసిన క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' విడుదలకు సిద్ధమైంది. 

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

  • గతేడాది నుంచి ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వీరిద్దరు న్యూయార్క్‌లో జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కూడా వీరిద్దరి గురించి నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకీ ఎవరా ఇద్దరని అనుకుంటున్నారా? గతేడాది నుంచి వైరలవుతోన్న ఆ జంట మరెవరో కాదు.. ఒకరు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్.. మరొకరు ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్య మారన్.

    గతంలో కావ్య మార‌న్-  అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత అనిరుధ్ అదేం లేదంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా మరోసారి ఈ జంట పెళ్లి టాపిక్ వైరల్‌గా మారింది. ఈ సారి ఏకంగా వేదికలను కూడా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్‌ నడుస్తోంది.

    k

    తాజాగా ఓ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఇద్దరి కుటుంబాలు స్పెయిన్‌లో వీరి వివాహం జరిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  అయితే ఈ వివాహానికి సంబంధించి అనిరుధ్ కానీ.. కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. గతంలో చాలాసార్లు రూమర్స్‌ రావడంతో ఇది కూడా అలాంటిదేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిరోజులు ఆగితే ఈ జంట రిలేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ఇద్దరి కెరీర్ పరంగా చూస్తే అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నారు. కావ్య సైతం ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా ఉంది.
     

  • వడ్డే నవీన్.. ఇ‍ప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్‌కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

    1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు,  స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

    అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ  జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    హిట్ కొడతాడా?

    దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్‌ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్‌ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్‌ కూడా కమ్ బ్యాక్‌ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం.

     

     

  • టైటిల్‌ :  ఫస్ట్‌ టైం
    నటీనటులు: సౌరబ్ ధింగ్ర, అఖిల్‌ సార్థక్‌, అనిక్క విక్రమన్‌,గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం తదితరులు
    నిర్మాత:  హేమంత్ ఇప్పలపల్లి
    రచన-దర్శకత్వం: హేమంత్‌ ఇప్పలపల్లి
    సంగీతం: శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్
    సినిమాటోగ్రఫీ : వేణు మురళీధర్, రామ్
    విడుదల తేది: మే 22, 2026

    టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరభ్ ధింగ్ర హీరోగా పరిచయమైన తెలుగు సినిమా 'ఫస్ట్ టైం'. హేమంత్ ఇప్పలపల్లి.. దర్శక నిర్మాతగా వ్యవహరించారు. 'బిగ్‌బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ కీలక పాత్ర చేశాడు. అనిక విక్రమన్ హీరోయిన్. శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించారు. వీఎఫ్ఎక్స్ ఆధారంగా తీసిన ఈ మూవీ నేడు (మే 22) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)

    కథేంటి?
    2304 ఏడీలో ఏలియన్స్‌తో మొదలయ్యే ఈ సినిమా.. అసలు ఈ కలియుగం ఎలా అంతమైంది? కొత్త భారతదేశం ఎలా తయారైంది అనే పాయింట్‌తో తెరకెక్కించారు. ఏలియన్లకు అప్పటి మానవులు ఈ కలియుగంలో జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ ఉంటారు.  ఆద్య(అనికా విక్రమన్‌) ఇంజనీరింగ్‌ చదువుతుంటుంది.  అదే కాలేజీలో చదువుతున్న రాహుల్‌(శివ కుమార్‌) ఎలాగైన ఆమెకు దక్కించుకోవాలనుకుంటాడు. మరోవైపు ఆద్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె బావ అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అతనితో బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ జరిపిస్తారు. సోల్‌మేట్‌ దొరికితే ఈ పెళ్లి నుంచి తప్పించుకోవచ్చని ఆద్య ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఆమెకు ఆది(అఖిల్‌ సార్థక్‌) పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఆద్య బావకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?  ప్రేమించిన ఆద్యను ఆది ఎందుకు కిడ్నాప్‌ చేయాల్సి వచ్చింది? భూమి మీద ఉన్న మనుషులంతా ఎందుకు చనిపోతుంటారు? ఆద్య, ఆదిలు మాత్రమే ఎలా బతుకుతారు? ఏలియన్స్‌కి ఈ కథలో ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో సౌరభ్ ధింగ్రని పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే?
    ఇదొక డిఫరెంట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా. 2304లో అంటే దాదాపు 300 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న కలియుగం అంతం అయితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  అంతేకాదు మళ్లీ మానవజాతిని సృష్టించడానికి భారతీయులు..అందులోనూ మన తెలుగువాడు కారణం అయితే ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ అద్భుతంగా ఉంది. కానీ దాన్ని తెరపై చూపించడంతో మాత్రం కాస్త తడబడ్డాడు.  ఒకవైపు ఏలియన్లు, సైంటిస్టుల ప్రయోగాలు, మరోవైపు ఆద్య జీవితంతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఫస్టాఫ్‌ కాస్త గందరగోళంగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉండడంతో బోరింగ్‌గా అనిపిస్తుంది.  అసలు కథ ఏంటి అనేది సెకండాఫ్‌ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది.   

    ఎవరెలా చేశారంటే.. 
    హీరోగా పరిచయమైన సౌరభ్ ధింగ్రకి ఇదే తొలి సినిమా అయినా సరే బాగానే చేశాడు.అనికా విక్రమన్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భూపాల్ రాజు శివకుమార్‌గా అఖిల్ సార్థక్ పర్లేదనిపించాడు. మైమ్ గోపి, అజయ్ రత్నం, అన్నపూర్ణమ్మ, గాయత్రి గుప్తా కూడా ఓకే. సాంకేతికగా సినిమా బాగుంది.  ఈ సినిమాలో ఏఐ ఉపయోగించకుండా హ్యూమన్ ఇంటలిజెన్స్ మాత్రమే వాడడం ప్రత్యేకం. దర్శకనిర్మాత హేమంత్ ఇప్పలపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. గతంలో విఎఫ్ఎక్స్ అనుభవం ఉండటంతో హేమంత్ చక్కగా తీశారు. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వెంకట్  అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ పర్లేదనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్రసీమలో స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి, దర్శన రాజేంద్రన్, కుంచకో బోబన్  తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది?

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)

    మలయాళ టాప్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి.. దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన సినిమా 'పేట్రియాట్'. మహేశ్ నారాయణన్ దర్శకుడు కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ఓ మాదిరి హైప్ తెచ్చుకుంది. ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేయబోతుంది. జూన్ 5 నుంచి జీ5లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుందని తాజాగా ప్రకటించారు.

    'పేట్రియాట్' విషయానికొస్తే.. డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డీఆర్‌డబ్ల్యూలో సైంటిస్ట్. దేశ రహస్యాలు వేరేవాళ్లకు ఇచ్చేశాడని ఇతడిపై దేశద్రోహి ఆరోపణలు వస్తాయి. దీంతో లండన్‌కి పారిపోతాడు. విమదన్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి వీడియోలు చేస్తుంటాడు. ఓసారి డేనియల్ బయటపెట్టిన ఓ రహస్యం వల్ల మంత్రి తనయుడు, శక్తి కార్పొరేషన్ అధినేత శక్తి సుందరం (ఫహాద్ ఫాజిల్) చిక్కుల్లో పడతాడు. దీంతో డేనియల్‌పై హత్యాప్రయత్నం జరుగుతుంది. ఇంతకీ ఇదెవరు చేశారు? 

    శక్తి కార్పొరేషన్‌లో పనిచేసే జ్యోతి (దర్శన రాజేంద్రన్), నళిని హత్యలకు కారణమెవరు? శక్తి కార్పొరేషన్ వల్ల జరిగే డేటా చోరీతో ఎలాంటి అనర్ధాలు ఏర్పడ్డాయి? పేదలు ఎలా మోసపోతున్నారు? శక్తిని డేనియల్ జేమ్స్ ఎలా ఎదుర్కొన్నాడు? ఆయనకు కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్ లాల్) నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది? లాయర్ లతిక (నయనతార), శక్తి సొల్యూషన్స్ ఉద్యోగి మైఖేల్ (కుంచుకో బోబన్) ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‌)

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

    అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కూడా ఉంది. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. చెర్రీ సరసన కనిపించనుంది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేశారు.

    తాజాగా ఈ పాటకు సంబంధించి గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం 50 రోజులు కష్టపడ్డానని అన్నారు. ఈ పాటలోని ప్రతి పదం అర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ బాణీలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఆయన బాణీలను అర్థం చేసుకోవడానికే కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫుల్ సాంగ్ మే 23న విడుదల కానుంది. 
     

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. సూపర్ హిట్ ఖాయమంటూ మెగా ఫ్యాన్స్‌ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

    అంతేకాకుండా ఈ మూవీ ఓ స్పెషల్ సాంగ్‌ కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పరిశీలించిన మేకర్స్.. చివరికీ కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్‌ను ఎంపిక చేశారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హల్లల్లో హల్లల్లో అంటూ సాగే ఈ పాట ప్రోమో చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫుల్ సాంగ్‌ను మే 23న భోపాల్‌లో జరగనున్న ఈవెంట్‌లో రిలీజ్ చేయనున్నారు. 
     
     

  • గత నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీవీకే పార్టీ అధికారం దక్కించుకోగా.. హీరో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈయన్ని టార్గెట్ చేస్తూ సెటైరికల్‌గా ఓ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడిది ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా)

    'టీఎన్ 2026' పేరుతో తీసిన ఈ మూవీలో సినిమాటోగ్రాఫర్ కమ్ నటుడు నటరాజన్ ప్రధాన పాత్ర చేశాడు. కమెడియన్ తంబి రామయ్య.. స్టోరీ అందించడంతో పాటు కీలక పాత్ర చేశాడు. ఈయన కొడుకు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకుడు. హీరో విజయ్‌ని టార్గెట్ చేసేలా ఉన్న ఈ మూవీ.. జనాల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వ్యర్థ ప్రయత్నంగా మిగిలింది. గత నెల చివరి వారంలో ఐదు ఓటీటీల్లోకి తమిళంలో మాత్రమే అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు.

    'టీఎన్ 2026' విషయానికొస్తే.. ప్రముఖ సినిమా హీరో, రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కొత్తగా పార్టీ స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే అంశంతో పొలిటికల్ సెటైరికల్‌గా ఈ సినిమా తీశారు. అయితే విజయ్‌ని టార్గెట్ చేస్తూ తీశారని అతడి అభిమానులు కామెంట్స్ చేయగా.. ఇది పూర్తిగా కల్పిత కథ అని తంబి రామయ్య చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'డ్రాగన్'.. ఒక్క సినిమాలో ఎనిమిది మంది విలన్స్)

  • బాలీవుడ్ ‍ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్. కేవలం సినిమాలే కాదు.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ బాలీవుడ్ భామకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె మెడలో నల్లపూసలు, చేతులకు మట్టిగాజులు ఉండడంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. కంగనా ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? అని తెగ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.

    ఈ వీడియో చూసిన నెటిజన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. కంగన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఒకరు కామెంట్‌ చేయగా.. ఒకవేళ ఆమె  పెళ్లి చేసుకుంటే గ్రాండ్‌గానే చేసుకుంటారని మరొకరు రాసుకొచ్చారు. అయితే ఏదైనా సినిమా షూటింగ్‌ కోసం అలా వేసుకున్నారా? మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కంగనా నల్లపూసల దండ, మట్టిగాజులతో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ పెళ్లి గురించి చర్చ ఆగేలా కనిపించడం లేదు.

    ఇక కంగనా సినిమాల విషయానికొస్తే తన సూపర్‌ హిట్‌ చిత్రం ‘క్వీన్‌’ సీక్వెల్‌లో నటిస్తున్నారు. ‘క్వీన్‌ 2’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని క్యారెక్టర్ లుక్ కోసమే ఆమె ఇలా తయారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న కంగనా..  మళ్లీ బాలీవుడ్‌లోకి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 
     

     

  • మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ నటించిన లేటేస్ట్‌ మూవీ దృశ్యం-3. సూపర్ హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ఈ నెల 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండ‍స్ట్రీలో రెండో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా ఘనత సాధించింది. 

    ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చినప్పటికీ మొదటి రోజే మంచి వసూళ్లు సాధించింది. రిలీజైన తొలి రోజే రూ. 15.85 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 18.37 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది. ఓవర్‌సీస్‌లో రూ. 25 కోట్లు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 43.37 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది.

    ఈ ఓపెనింగ్‌ డే వసూళ్లతో  మలయాళ సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దృశ్యం-3 రెండోస్థానంలో నిలిచింది. ఈనెల 1వ తేదీన విడుదలై మొదటి రోజు రూ. 28.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన  స్పై థ్రిల్లర్ పేట్రియాట్‌ను అధిగమించింది. ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు.  మలయాళ సినిమాలో అత్యధిక ఓపెనింగ్-డే రికార్డు వసూళ్లతో 'ఎల్2: ఎంపురాన్' చిత్రం కొనసాగుతోంది.  పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 67 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. 

    ఇక దృశ్యం సినిమాల విషయానికొస్తే.. 2013లో  'దృశ్యం' రిలీజైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, తెలుగు, తమిళంతో సహా పలు భాషలతో పాటు  సింహళ, చైనీస్ భాషల్లో కూడా రీమేక్ చేశారు.  ఆ తర్వాత 2021లో 'దృశ్యం 2' నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీని సైతం కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ దృశ్యం సిరీస్ చిత్రాలకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ కీలక పాత్రల్లో నటించారు.

     

Business

  • మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్‌లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.

    మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.

    మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

    ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!

    ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి.

  • మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చే వారం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే 23 (శనివారం) నుండి దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజుల పాటు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వారాంతపు సెలవులు, సిబ్బంది సమ్మె, బక్రీద్ పండుగలు వరుసగా రావడం దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.

    అయితే, నిజంగానే 6 రోజులు బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా, తాజా పరిస్థితుల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.

    మే 23 నుండి మే 28 వరకు బ్యాంకుల పరిస్థితి ఇదీ..

    మే 23 (నాల్గవ శనివారం):  దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి.
    మే 24 (ఆదివారం):సాధారణ వారాంతపు సెలవు.
    మే 25 & 26 (సోమ, మంగళవారాలు): సిబ్బంది సమ్మెతో ఎస్‌బీఐ శాఖల్లో అంతరాయం 
    మే 27 (బుధవారం): బక్రీద్ సెలవు. హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైతో పాటు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
    మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (రెండవ రోజు/కొన్ని ప్రాంతాల్లో) బెంగళూరు, చెన్నై, జైపూర్, పాట్నా వంటి కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.

    అయితే బక్రీద్ సెలవు అనేది తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మే 27న ఉంటుంది. మే 28న ఇక్కడ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మే 25, 26 తేదీల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో క్లెరికల్ సేవలకు అంతరాయం ఉంటుంది. ఇతర బ్యాంకులు (డిజిటల్ సేవలు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు) యథావిధిగా పనిచేస్తాయి.

    సమ్మెకు కారణాలు ఏమిటి?
    ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) వివిధ డిమాండ్ల సాధనకై ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సబ్-స్టాఫ్, ఆర్మ్‌డ్ గార్డుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే కస్టమర్లకు బీమా ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే ("మిస్-సెల్లింగ్") విధానాన్ని నిరసిస్తూ 16 డిమాండ్లతో ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మె నోటీసు ఇచ్చింది.

    ఎస్‌బీఐ విజ్ఞప్తి

    సిబ్బంది స‍మ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్‌ సేవల కోసం ప్రత్యామ్నాయంగా కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు, ఏంటీఎం, యోనో, యూపీఐ వంటి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు ఉపయోగించుకోవాలని సూచించింది. అదే సమయంలో ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ బ్యాంక్‌ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

  • ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే తమ రెండు ఎస్యూవీలు GLE, GLS కార్లను నైట్ ఎడిషన్‌ పేరుతొ లాంచ్ చేసింది. ఇవి లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి చూడటానికి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.

    జీఎల్ఈ నైట్ ఎడిషన్ 300డీ 4మ్యాటిక్ ధర రూ. 1.05 కోట్లు, 450 4మ్యాటిక్ ధర రూ. 1.14 కోట్లుగా ఉంది. అయితే జీఎల్ఎస్ నైట్ ఎడిషన్ 450 4మ్యాటిక్ ధర రూ. 1.41 కోట్లు, 450d 4మ్యాటిక్ ధర రూ. 1.43 కోట్లు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఈ ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ.

    బెంజ్ నైట్ ఎడిషన్స్ రెండూ కూడా అబ్సిడియన్ బ్లాక్, ఆల్పైన్ గ్రే అనే రంగుల్లో లభిస్తుంది. లోపల రెండు మోడళ్లలోనూ బ్లాక్ నాప్పా లెదర్ అప్‌హోల్స్టరీ.. ఆంత్రాసైట్ ఓపెన్ పోర్ ఓక్ వుడెన్ ట్రిమ్ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ హెడ్స్ అప్ డిస్‌ప్లే స్టాండర్డ్‌గా వస్తుంది. కాగా ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.

    కేవలం బెంజ్ కంపెనీ మాత్రమే కాకుండా.. ఇతర ఆటోమొబైల్ సంస్థలు కూడా అప్పుడప్పుడు స్పెషల్స్ ఎడిషన్స్ లాంచ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కార్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది.
     

  • ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు రూ. 921 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 903 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ. 8,382 కోట్ల నుంచి రూ. 8,853 కోట్లకు ఎగిసింది. సమీక్షాకాలంలో వ్యయాలు రూ. 7,150 కోట్ల నుంచి రూ. 7,677 కోట్లకు చేరాయి.

    పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 3,503 కోట్లుగా నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 3,484 కోట్లు. ఆదాయం రూ. 31,724 కోట్ల నుంచి రూ. 33,653 కోట్లకు చేరింది. యూరప్‌ వ్యాపార విభాగం 1 బిలియన్‌ యూరోల పైగా ఆదాయం నమోదు చేసినట్లు సంస్థ తెలిపింది. 2030 నాటికి క్యూరాటెక్‌ విభాగం ప్రధానంగా ఆంకాలజీ ఉత్పత్తులపై దృష్టితో అగ్రగామి బయోసిమిలర్స్‌ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పేర్కొంది.

    పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 400 కోట్లు కంపెనీ వెచ్చించింది. త్రైమాసికంతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్, ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. నిర్వహణ సామర్థ్యాలతో పాటు అమ్మకాల పరిమాణం మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు.

  • మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

    గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.

    అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..

    బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.

    ఆదాయంలో భారీ వృద్ధి

    మే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.

    రిస్క్ బఫర్ పెంపు

    ప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్‌ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.

    ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్‌గా) ఉపయోగపడనుంది.

    ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?

    సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి.

  • ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్ధిక అస్థిరత నెలకొన్న సమయంలో.. 'దేశీ బ్లింగ్' అనే షో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు ప్రారంభమైన వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ప్రసారం కావడం చాలామంది విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొత్తం అతి విలాసవంతమైన జీవితం, బంగారం, డబ్బు, ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంది.

    దేశీ బ్లింగ్ కార్యక్రమంలో కనిపించే వ్యక్తులలలో సతీష్ సన్పాల్, ఆయన భార్య తబిందా సన్పాల్ కూడా ఉన్నారు. వీరి జీవితం చాలా విలాసవంతం. నిజానికి సతీష్ భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ.. దుబాయ్ వెళ్లి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి దుబాయ్‌కు వెళ్లినప్పుడు తనదగ్గర చాలా తక్కువ మొత్తం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను దుబాయ్‌లో బిలినీయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

    40 కేజీల బంగారం!
    ఈ కార్యక్రమంలో సతీష్ సన్పాల్ బంగారం పట్ల వారికున్న అభిరుచిని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 40 కిలోల బంగారం తనవద్ద ఉందని టబిందా సన్పాల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన భర్త తనకు 3 కిలోల బంగారం కొనిస్తాడని కూడా వెల్లడించింది. వారి ఇంట్లో బంగారు ఆభరణాలతో నిండిన ప్రత్యేక గది ఉందని, అది ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్‌లా కనిపిస్తుందని చెప్పారు.

    తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు పాత్రలు వాడటం, మొదటి పుట్టినరోజుకు 24 క్యారెట్ బంగారంతో ప్రత్యేక దుస్తులు తయారు చేయించడం వంటి విషయాలు వెల్లడించారు. వీరు బుర్జ్ ఖలీఫాలో నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

    ఏడాది కుమార్తె కోసం రోల్స్ రాయిస్
    తమ ఏడాది పాప కోసం గులాబీ రంగులో ఉన్న కస్టమైజ్ రోల్స్ రాయిస్ కొన్న విషయం కూడా ఈ షోలో వెల్లడించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా విలాసానికి ప్రతీకగా మార్చడం ఈ కుటుంబ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సతీష్ తన స్నేహితులతో గడపడానికి ప్రత్యేకంగా యాచ్ కొనుగోలు చేసి పార్టీలకు ఉపయోగించడం కూడా షోలో వెల్లడించారు.

    ఎవరీ సతీష్ సన్పాల్?
    సతీష్ సన్పాల్ వ్యాపార జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి ఈయన ఎనిమిదో తరగతి వరకే చదివి, చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట తన తల్లి నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం ప్రారంభించాడు. అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది.

    ఆ తరువాత దుబాయ్ వెళ్లి.. ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత దీని గురించి అవగాహన పెంచుకున్నాడు. ఇలా.. 2018లో అనక్స్ హోల్డింగ్ ప్రారంభించాడు. ఇది క్రమంగా భారీ వ్యాపార సమ్మేళనంగా మారింది. ఈ సంస్థకు దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. కాగా ఈయన నికర విలువ మొత్తం రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.

    ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

  • హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో.. 2026 సిటీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే.. ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.

    2026 హోండా సిటీ కారు వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, హనీకూంబ్ గ్రిల్‌కు ఇరువైపులా కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, ఒక లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఈ కారులో హుడ్, గ్రిల్ మధ్యలో బ్రాండ్ యొక్క కొత్త లోగో కూడా ఉంది. అయితే డోర్ హ్యాండిల్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ సెడాన్ తన సిల్హౌట్‌ను అలాగే నిలుపుకుంది.

    సెడాన్ వెనుక భాగం స్మోక్డ్ టెయిల్‌లైట్స్, వర్టికల్ రిఫ్లెక్టర్ యూనిట్లతో అప్‌డేట్ అయింది. అంతేకాకుండా.. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్‌తో బూట్ లిడ్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంది. బంపర్ వెనుక భాగాన్ని కూడా రీడిజైన్ చేశారు. ఈ అప్‌డేట్‌లకు అనుగుణంగా క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్ వంటి రంగులలో 2026 హోండా సిటీ అందుబాటులో ఉంది.

    ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హోండా సిటీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ పొందుతుంది. స్టీరింగ్ వీల్ డిజైన్, అలాగే ఫిజికల్ బటన్స్ అమరిక మునుపటి మాదిరిగానే ఉన్నాయి. సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఫుట్‌వీల్ లైటింగ్ వంటివాటితో పాటు.. 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

    హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో కొనసాగుతోంది. ఇది 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్‌లో ఎలక్ట్రిక్ సపోర్ట్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజన్ ఉంది, ఇది 126 hp పవర్, 253 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ 27.26 కిమీ/లీ వరకు మైలేజీని అందిస్తుంది.

  • ప్రయివేట్‌ రంగ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌ వెంచర్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 79 కోట్లకు చేరింది. సౌందర్య విభాగం అమ్మకాలు పుంజుకోవడం, ఫ్యాషన్‌ బిజినెస్‌ నష్టాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 19 కోట్లు ఆర్జించింది.

    నైకా బ్రాండ్‌ ఈరిటైల్‌ కంపెనీ మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 2,648 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,062 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నైకా నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ. 204 కోట్లను తాకింది. 2024–25లో రూ. 72 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,950 కోట్ల నుంచి రూ. 10,022 కోట్లకు బలపడింది. సౌందర్య విభాగ ఆదాయం 26 శాతం ఎగసి రూ. 9,139 కోట్లను దాటింది.

    ఓ మహిళ 50 ఏళ్ల వయసులో ప్రారంభించిన బిజినెస్‌

    కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించిన ఫాల్గునీ నాయర్ (Falguni Nayar), 2012లో తన 50 ఏళ్ల వయసులో ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేశారు. భారతదేశంలో విశ్వసనీయమైన బ్యూటీ రిటైలర్ అవసరమని గుర్తించి, ఎంతో రిస్క్‌తో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకుంటూ 'నైకా' (FSN E-Commerce Ventures) సంస్థను స్థాపించారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చేసిన ఎంబీఏ చదువు, బ్యాంకింగ్ రంగంలో సంపాదించిన లోతైన మార్కెట్ అవగాహన ఆమె వ్యాపార విజయానికి బలమైన పునాదిగా నిలిచాయి.

    నైకా మొదట ఆన్‌లైన్ బ్యూటీ స్టోర్‌గా ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న కాలంలో "100% ఒరిజినల్" అనే హామీతో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు, ట్యూటోరియల్స్, రివ్యూల వంటి 'కంటెంట్ + కామర్స్' వ్యూహంతో కస్టమర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 'నైకా ఫ్యాషన్' పేరుతో దుస్తులు, యాక్సెసరీల రంగంలోకి కూడా వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించింది.

    2021లో నైకా ఐపీఓ (IPO) భారత మార్కెట్‌లో ఒక సరికొత్త రికార్డు సృష్టించడంతో, ఫాల్గునీ నాయర్ భారతదేశంలోనే స్వయంకృషితో బిలియనీర్ అయిన ఇద్దరు మహిళల్లో ఒకరిగా నిలిచారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న వ్యాపార రంగంలో బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆమె కథ.. సొంత కలలను నిజం చేసుకోవడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఎంతోమందికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. 

  • ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి ప్రధాని నరేంద్ర మోదీ ’మెలొడీ’ టాఫీలను బహుకరించడం వైరల్‌ కావడంతో వాటికి డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. దీనితో ఉత్పత్తిని కూడా పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లే ప్రోడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ షా తెలిపారు. బ్రాండ్‌ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.

    స్వదేశీ బ్రాండ్‌ వృద్ధి చెందేందుకు మోదీ ఒక చక్కని అవకాశం కల్పించారన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మెలొడీని మరింత ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మెలొడీ ప్రస్తుతం దాదాపు 100 దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపిణీదారుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ బట్టి చూస్తుంటే మెలొడీకి వినియోగదారుల్లో డిమాండ్‌ అనూహ్య స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోందన్నారు.

  • దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు కార్పొరేట్, ప్రభుత్వ రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధాని విజ్ఞప్తి చేసిన పక్షం రోజుల వ్యవధిలోనే, ప్రముఖ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) తమ జూనియర్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేడ్ 'ఎ' నుండి గ్రేడ్ 'సి' వరకు ఉన్న ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని సెబీ కల్పించినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఇంధన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, తాత్కాలిక చర్యల్లో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇంధన పరిరక్షణ చొరవలో భాగంగా సెబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అంతర్గతంగా నిర్వహించే పలు కార్యక్రమాలను వాయిదా వేయాలని భావిస్తోంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలను, హోటల్ బస ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన సెబీ మాత్రమే కాకుండా, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం ప్రధాని పిలుపునకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ట్రెజరీ కార్యకలాపాలు, క్రెడిట్ అండర్ రైటింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక విభాగాల్లోని ఎంపిక చేసిన సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ (HDFC Securities) కూడా ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం 'హైబ్రిడ్ వర్కింగ్ మోడల్'ను అమలుల్లోకి తెచ్చింది.

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 326.42 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 75,509.78 వద్ద, నిఫ్టీ 64.60 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,719.30 వద్ద నిలిచాయి.

    జాన్ కాకరిల్ ఇండియా లిమిటెడ్, మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్ఎమ్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, గణేశ ఎకోస్ఫియర్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన పొదుపు (Savings) పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసే క్రమంలో సరికొత్తగా రెండు బీమా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - సింగిల్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Single Premium), ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - లిమిటెడ్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Limited Premium) పేరుతో వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు ప్లాన్లు కూడా  జూన్ 1 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

    ప్లాన్ల ప్రత్యేకతలు, ప్రయోజనాలు

    ఈ రెండు పాలసీలు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు పథకాలు. అంటే, వీటికి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ నష్టాల భయం లేకుండా స్థిరమైన, కచ్చితమైన ముందస్తు అంచనాతో కూడిన ఆర్థిక ప్రణాళికను (Guaranteed Savings) కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక.

    పాలసీ ముగిసిన తర్వాత (Maturity) లేదా పాలసీదారునికి ఏదైనా జరిగితే (Death Benefit) వచ్చే ప్రయోజనాలు ముందే నిర్ణయించబడి, గ్యారెంటీగా అందుతాయి. కస్టమర్ల నగదు ప్రవాహం, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రీమియం చెల్లించేందుకు రెండు వేరియంట్లను తెచ్చారు. ఈ ప్లాన్లను కేవలం భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు.

    ప్రీమియం చెల్లింపు ఇలా..

    పాలసీదారులు తమ వీలును బట్టి రెండు రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. 
    సింగిల్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ తీసుకునే సమయంలోనే ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే కట్టే అవసరం ఉండదు.

    లిమిటెడ్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ కాలపరిమితి  అంతా కాకుండా, నిర్ణీత పరిమిత సంవత్సరాల పాటు (ఉదాహరణకు 5 లేదా 10 ఏళ్లు) మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

    పాలసీదారు వయస్సు, ఎంచుకునే హామీ మొత్తం (Sum Assured) ఆధారంగా నిర్దిష్ట ప్రీమియం ధరలు జూన్ 1న ఎల్ఐసీ అధికారికంగా విడుదల చేస్తుంది.

  • నిబద్దతతో.. కష్టపడి పని చేస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అందరూ చెబుతుంటారు. కొందరు దీనిని నిజం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన పూణేకు చెందిన టెకీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువ టెకీ.. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల, నమ్మకంతో ఎలా జీవితాన్ని మార్చుకున్నాడో వెల్లడించారు. ఇందులో రూ.3.8 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభమైన అతని ప్రయాణం చివరకు రూ. 27 లక్షల ప్యాకేజీ వరకు చేరిందని స్పష్టం చేశారు.

    పూణేలోని ఒక  కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన టెకీ.. కాలేజీ ప్లేస్‌మెంట్ల సమయంలో దాదాపు 30 నుంచి 35 ఇంటర్వ్యూలలో విఫలమయ్యాడు. వరుసగా ఎదురైన తిరస్కారాలు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ.. అతనికి కోడింగ్‌పై ఉన్న ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. చివరకు అతనికి ఒక కంపెనీలో రూ.3.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చింది.

    జాబ్ వచ్చింది కానీ.. కరోనా కారణంగా జాయినింగ్ చాలా ఆలస్యమైంది. 2020లో వచ్చిన ఆఫర్‌కు 2021 ఫిబ్రవరిలో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం దొరికింది. మొదటి ఆరు నెలలు జీతం సుమారు రూ.20 వేలు ఉండేది, చేరే తేదీ వరకు కూడా పని చేసే ప్రదేశం గురించి స్పష్టంగా తెలియదని టెకీ పేర్కొన్నారు.

    మొదటి ఉద్యోగంలోనే ఒకటిన్నర సంవత్సరాలు పని చేసి, చివరికి 6 లక్షల వార్షిక ప్యాకేజీతో మరో కంపెనీకి మారాడు. ఆ సంస్థలో ఒక సంవత్సరం తర్వాత నాకు 25 శాతం జీతం పెంపు లభించింది. కంపెనీ స్థిరంగానే ఉండేది, కానీ కొత్త విషయాలను నిర్మించడంలో పెద్దగా ఉత్సాహం లేదని నేను గ్రహించాడు. అలాంటి సమయంలోనే నెలకు రూ.45 వేల జీతంతో తన స్నేహితుడి స్టార్టప్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ జీతం అంతకు ముందు వచ్చేదానికంటే చాలా తక్కువ.

    What Helped Me Grow from 3.5 to 27 as a Flutter Developer
    by u/Presence_Small in developersIndia

    స్నేహితులతో కలిసి మొదటి నుంచి ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచన తనకి బాగా నచ్చింది. నిజానికి.. అక్కడ ఉద్యోగిగా చేరకముందే, తాను ఆ పనిని ఇష్టపడటం వల్ల రాత్రిపూట వారి స్టార్టప్ కోసం పార్ట్‌టైమ్‌గా పని చేసేవాడు. ఆ దశలోనే చాలా నేర్చుకున్నాడు. సున్నా నుంచి ఉత్పత్తి వరకు ఉత్పత్తులను ఎలా నిర్మించాలి, క్లయింట్‌లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒత్తిడి, గడువులను ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వం, యాజమాన్యం వంటి వాటితో పాటు.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా తెలుసుకున్నాడు.

    కొంతకాలం తర్వాత.. మళ్లీ ఉద్యోగ మార్పు కోసం సిద్ధమయ్యాడు. ఈసారి అతను ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యాడు. అయినప్పటికీ.. మొదట్లో రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షలు వేతనంతో ఆఫర్లు ఇచ్చే కంపెనీల్లో తిరస్కరణ ఎదురైంది. కారణం కొన్ని టెక్నికల్ విషయాల్లో లోతైన అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం. కానీ ఈసారి అతను నిరుత్సాహపడలేదు. తన తప్పులను గుర్తించి మరింత కష్టపడ్డాడు. మరో 10 నుంచి 15 ఇంటర్వ్యూలు ఇచ్చి చివరకు మూడు కంపెనీల ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఆఫర్లు పొందాడు.

    ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!

    ఇదిలా ఉండగా.. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు నా ప్రొఫైల్ చూసి నేరుగా సంప్రదించాడు. చివరకు రూ.27 లక్షల జీతంతో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఆప్టిట్యూడ్ రౌండ్స్ కూడా క్లియర్ చేయలేక ఇబ్బంది పడ్డ వ్యక్తి, తర్వాత కంపెనీ వ్యవస్థాపకులే సంప్రదించే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. దీన్నిబట్టి చూస్తే.. విజయానికి పట్టుదల, కృషి, నేర్చుకునే తపన ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది.

  • ప్రపంచ అంతరిక్ష రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్‌ డాలర్లు (రూ.165 లక్షల కోట్ల పైమాటే) మైలురాయిని తాకే అవకాశం ఉంది. సాధారణంగా స్పేస్ ఎక్స్ అనగానే ప్రపంచమంతా ఎలాన్ మస్క్ పేరే వినబడుతుంది. కానీ, లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ ఆధునిక సాంకేతిక చరిత్రలోనే అతిపెద్ద సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారిన ఒక భారతీయ సంతతి వ్యక్తి కథ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆయనే ఆంటోనియో గ్రేసియాస్.

    ఎవరీ ఆంటోనియో గ్రేసియాస్?

    సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేయడం గ్రేసియాస్ శైలి కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉండే వ్యూహకర్త. స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓ ఫైలింగ్స్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గ్రేసియాస్, ఆయన పెట్టుబడి సంస్థ ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’ సంయుక్తంగా స్పేస్ ఎక్స్‌లో 7.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ అంచనాల ప్రకారం 2 ట్రిలియన్లకు చేరితే గ్రేసియాస్ వాటా విలువ మాత్రమే 128 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు) అవుతుంది. ఈ సంపద ప్రపంచంలోని ఎన్నో బ్లూ-చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్‌ కంటే, పలు చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

    ఆ మూలాలు గోవాలోనే..

    ఆంటోనియో గ్రేసియాస్ తండ్రి భారతదేశంలోని గోవా నుంచి అమెరికాకు వలస వెళ్లి డెట్రాయిట్‌లో న్యూరో సర్జన్‌గా స్థిరపడ్డారు. తల్లి స్పానిష్ ఫార్మసిస్ట్. అమెరికాలోనే పుట్టి పెరిగిన గ్రేసియాస్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, చికాగో యూనివర్సిటీలో లా చదివారు. జపాన్‌లోని వాసెడా యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. 1995లో లా స్కూల్‌లో ఉన్నప్పుడే ‘ఎంజీ క్యాపిటల్’ను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’గా రూపాంతరం చెందింది.

    మస్క్ - గ్రేసియాస్ బంధం

    2008 కాలంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంపై పెట్టుబడి పెట్టడం అంటే అప్పట్లో అదొక పిచ్చి ప్రయోగం. రాకెట్లు వరుసగా పేలిపోతున్న తరుణంలో నాసా ఒప్పందాలు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వని రోజుల్లో గ్రేసియాస్ మస్క్‌ను నమ్మి పెట్టుబడి పెట్టారు. టెస్లా, స్పేస్ ఎక్స్, తాజాగా ఎక్స్‌ఏఐ... ఇలా మస్క్ సామ్రాజ్యంలోని ప్రతి కీలక మలుపులోనూ గ్రేసియాస్ భాగస్వామ్యం ఉంది.

    ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు వాలోర్ ఈక్విటీ భారీగా నిధులు సమకూర్చింది. అత్యంత ఖరీదైన ఏఐ చిప్స్, డేటా సెంటర్ పరికరాలను తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని ఎక్స్‌ఏఐ సంస్థకు లీజుకు ఇచ్చే వినూత్న వ్యూహాన్ని గ్రేసియాస్ అమలు చేశారు. ఈ ఆర్థిక ఒప్పందాల ద్వారానే 2025, 2026 ప్రారంభ త్రైమాసికాల నాటికి వందల మిలియన్ల డాలర్ల లీజు చెల్లింపులు వాలోర్ ఖాతాలోకి చేరడం విశేషం.

    ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్‌!

  • కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగుల తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు అన్నీ హ్యూమన్‌ రిసోర్సెస్ (హెచ్‌ఆర్‌) విభాగం పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. కానీ, ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో మాత్రం సీఈఓ ఏకంగా మొత్తం హెచ్‌ఆర్ విభాగానికే షాక్ ఇచ్చారు. ఉనికిలో లేని సమస్యలను సృష్టిస్తూ, కంపెనీ ప్రగతిని అడ్డుకుంటున్నారనే సంచలన ఆరోపణతో ఆ విభాగంలోని సిబ్బంది మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ పేమెంట్స్ ఫిన్‌టెక్ స్టార్టప్ ‘బోల్ట్’లో జరిగిన ఈ ఊహించని పరిణామం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ర్యాన్ బ్రెస్లో స్పష్టం చేశారు.

    11 బిలియన్ల నుంచి 300 మిలియన్లకు పతనం!

    ఒకప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్‌గా వెలిగిన ‘బోల్ట్’ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీ మార్కెట్ విలువ క్షీణించడమే ఈ భారీ మార్పులకు ప్రధాన కారణం. 2022 నాటికి కంపెనీ విలువ గరిష్ఠంగా సుమారు 11 బిలియన్‌ డాలర్లు (రూ.91,000 కోట్లకు పైగా)కు చేరింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం 300 మిలియన్‌ డాలర్లు (దాదాపు 97% పతనం)గా ఉంది. ఈ తీవ్ర పతనం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకు సీఈఓ ర్యాన్ బ్రెస్లో కఠిన సంస్కరణలను ప్రతిపాదించారు.

    ఉనికిలో లేని సమస్యలు

    కంపెనీ నుంచి హెచ్‌ఆర్ విభాగాన్ని పూర్తిగా తొలగించడంపై ర్యాన్ బ్రెస్లో ఘాటుగా స్పందించారు. హెచ్‌ఆర్ బృందం లేనిపోని సమస్యలను సృష్టించిందని, విచిత్రంగా ఆ విభాగాన్ని తొలగించిన మరుక్షణమే ఆ సమస్యలన్నీ మాయమైపోయాయని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఆర్ విభాగానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బోల్ట్ సంస్థ కేవలం ఒక చిన్న పీపుల్ ఆపరేషన్స్ బృందాన్ని మాత్రమే నిర్వహిస్తోందని ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది.

    చర్చనీయాంశంగా మారిన సీఈఓ వ్యాఖ్యలు

    ‘కంపెనీ వృద్ధి దశలో ఉన్నప్పుడు ఉద్యోగులు చాలా సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీనివల్ల ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. సంస్థ అంతటా తాము దేనికైనా అర్హులమనే భావన పెరిగిపోయింది. నైపుణ్యం ఉన్నట్లు నటించేవారే కానీ, వాస్తవానికి కష్టపడి పనిచేసేవారు కాదు. నేను మొదట పోరాడాల్సింది ఈ అసమర్థ సంస్కృతిపైనే. అందుకే చాలా మందికి లేఆఫ్స్‌ ఇచ్చాం’ అని బోల్ట్‌ సీఈఓ ర్యాన్ బ్రెస్లో చెప్పారు.

    లీడర్‌షిప్ టీమ్ కూడా అవుట్!

    కంపెనీని తిరిగి పాత స్టార్టప్ తరహా వేగవంతమైన పని సంస్కృతిలోకి తీసుకురావడానికి బ్రెస్లో పాత యాజమాన్యం నియమించిన ఉద్యోగులకు 60 రోజుల గడువు ఇచ్చారు. కొత్తగా మారుతున్న ఏఐ ఆధారిత నిర్మాణానికి అనుగుణంగా మారాలని సూచించారు. అయితే, ఈ పరివర్తనలో దాదాపు 99 శాతం మంది ఉద్యోగులు, మేనేజర్లు విఫలమయ్యారని బ్రెస్లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కష్టపడకుండా, భారీగా డబ్బులు ఖర్చు పెట్టే కార్పొరేట్ లగ్జరీకి వారు అలవాటు పడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ దగ్గర అంత బడ్జెట్ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో దాదాపు మొత్తం లీడర్‌షిప్ బృందాన్ని తొలగించి స్క్రాచ్ నుంచి కొత్త యాజమాన్యాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్‌!

Telangana

  • సాక్షి,ఆదిలాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన 224వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 396 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 163, రెవెన్యూ శాఖకు సంబంధించి 47, ఇందిరమ్మ ఇండ్ల కోసం 113, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందాయి.

    సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.పీ. ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సమన్వయ మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  • సాక్షి,ఆదిలాబాద్ : తల్లిదండ్రులు చనిపోయి అనాధలుగా మారిన గిరిజన ‘తోటి’ కులానికి చెందిన ఇద్దరు చిన్నారులకు సీఎం ప్రజావాణి అండగా నిలిచింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో జరిగిన సీఎం ప్రజావాణికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనాధ పిల్లలను వారి బంధువులు తీసుకువచ్చారు.

    రెండేళ్లు, మూడు నెలల చిన్నారుల పోషణ కష్టంగా ఉందని వారి సంరక్షణ చూస్తున్న పెదనాన్న పెద్దమ్మ ఆత్రం సునీత, వెంకటిలు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్‌ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకొని  చలించిపోయిన చిన్నారెడ్డి ఇద్దరు చిన్నారులకు స్పాన్సర్షిప్ అందించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టర్ కు లేఖ రాశారు.

    ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం రాంజీ గోండు నగర్ గ్రామానికి చెందిన ఆత్రం విఠల్, గంగుబాయి ఆరు నెలల కాలంలో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. దీంతో ఆ చిన్నారుల బాధ్యతలు వారి పెదనాన్న పెద్దమ్మ చూస్తున్నారు. కనీసం డబ్బా పాలు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నామని వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతినెల ఆర్థిక సాయంతో పాటు డబ్బా పాలను చిన్నారులకు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్‌కు చిన్నారెడ్డి సూచించారు.

  • సాక్షి, సిటీబ్యూరో (హైద‌రాబాద్‌): దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు క్యాబ్‌ డ్రైవర్‌. ఓలా, ఉబెర్‌ అగ్రిగేటర్‌ సంస్థలతో అనుసంధానమై క్యాబ్‌ నడుపుతున్నాడు. రోజుకు సగటున 150 కి,మీ చొప్పున అతని క్యాబ్‌ తిరుగుతుంది. రూ.1800 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తుంది. రోజుకు రూ.1000 డీజిల్‌ ఖర్చు పోను మరో రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుబాటయ్యేది. ఆ డబ్బులతోనే  బండి ఈఎంఐ, ఇంటి కిరాయి, నిత్యావసరాలు, ఫోన్‌ రీచార్జ్, తదితర అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు డీజిల్‌ ధర పెరగడంతో  రోజుకు రూ.1,275 వరకు ఖర్చవుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా 25 శాతం ఆదాయం తగ్గింది. ‘రోజు రోజుకు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ.. క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు ఇచ్చే పేమెంట్స్‌ మాత్రం పెరగడం లేదు. ఈఎంఐ కట్టడం కష్టంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశాడు.  

    భారం రూ.30 కోట్లు 
    అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావం భాగ్యనగర వీధుల్లో ఆటోలు, క్యాబ్‌లు, బైక్‌లు నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న సామాన్యుల కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. మే నెలలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ. 4 పైనే పెరగడంతో నగరంలోని సుమారు 1.25 లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లు, 4 లక్షల మంది గిగ్‌ వర్కర్ల (డెలివరీ బాయ్స్, బైక్‌ టాక్సీ రైడర్స్‌) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్‌ నగర రవాణా, డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రెండు వర్గాలపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.

    ధరలు పెరిగిన ప్రతిసారి ఓలా, ఉబెర్, స్విగ్ని, జొమాటో తదితర సంస్థలు రైడ్‌ ఛార్జీలు, డెలివరీ ఫీజులు పెంచుతున్నప్పటికీ,  పెరిగిన లాభాలను డ్రైవర్లకు, డెలివరీ బాయ్స్‌కు ఆశించిన స్థాయిలో బదిలీ చేయడం లేదు. సుమారు 1.25 లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లు రోజుకు సుమారు  12.5 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నట్లు అంచనా. పెరిగిన ధరల కారణంగా ఈ ఒక్క క్యాబ్‌ కమ్యూనిటీపైనే నెలకు ఏకంగా రూ.15.94 కోట్ల అదనపు భారం పడుతోంది.  నగరంలోని సుమారు 4 లక్షల మంది గిగ్‌ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే, వీరంతా రోజుకు 10.68 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నారు.

    చ‌ద‌వండి: ఒంటి చ‌క్రం సైకిల్‌పై సాహ‌స‌యాత్ర‌!

    గ్రేటర్‌లోని సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్ల దయనీయ పరిస్థితి ఇది. కేవలం పెట్రోల్, డీజిల్‌ కాకుండా సీఎన్జీ, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. చాయ్, టిఫిన్‌ సహా అన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌  మళ్లీ మొదలైంది. క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇది పిడుగుపాటుగా మారింది. మరోవైపు సుమారు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్‌అండ్‌ ప్లాట్‌ ఫామ్‌ వర్కర్స్‌ (డెలివరీబాయ్స్‌) కూడా పెరిగిన పెట్రోల్‌ ధరలతో విలవిలలాడుతున్నారు.

    చెల్లింపులు పెంచాలి
    పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా బండి బయటికి తీయాలంటేనే భయంగా ఉంది. ధరలకు అనుగుణంగా క్యాబ్‌ సంస్థలు చెల్లింపులను పెంచాలి.      
    – సంతోష్‌

    ఆర్డర్లు తగ్గాయి 
    డెలివరీబాయ్స్‌ బాగా పెరగడంతో ఆర్డర్లు తగ్గాయి. ఆదాయం కూడా తగ్గింది. గతంలో ఒక బుకింగ్‌పైన రూ.30 నుంచి రూ..40 లభించేది.ఇప్పుడు రూ.10, రూ.20  చొప్పున వస్తున్నాయి.   
    – ఖలీల్‌ 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) చైర్మన్‌ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్‌కు పంపించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మేము విద్యపై సిఫార్స్‌లతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాము. నాకు అప్పగించిన పనిని పూర్తిచేసినందున తెలంగాణ విద్యా కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

    తెలంగాణ విద్యా రంగంలో కీలక పాత్ర పోషించిన ఆకునూరి మురళి 2024లో  టీఈసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండు సంవత్సరాలు కాగా ఇవాళ (మే22)సమగ్ర నివేదిక సమర్పించి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

    ఆకునూరి మురళి రాష్ట్రంలోని ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టారు. ఆయన కరికులం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బోధన పద్ధతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. దీర్ఘకాలిక విద్యా విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును పర్యవేక్షించారు.

    ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలో 100 మోడల్ స్కూల్స్ ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రయత్నం చేశారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యా రంగంలో సేవ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు.

  • దుగ్గొండి: కూతురు పుట్టిన రోజు వేడుక కోసం ఓ మహిళ కొత్త దుస్తులు కొనడానికి వరంగల్‌ వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాలేదు. తెల్లవారేసరికి గ్రామానికి సమీపంలోని ఎస్సారెస్పీ ఉప కాల్వలో శవమై కనిపించింది. ఆమెను గొంతుకోసి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత(35) భర్త మహేందర్‌ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటినుంచి ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది.

    గురువారం తన కుమార్తె తేజస్విని పుట్టినరోజు ఉండటంతో కొత్త బట్టలు కొనడానికి బుధవారం(20న) వరంగల్‌కు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయాన్నే ఉపాధి పనులు చేయడానికి వెళ్లిన కూలీలకు లక్ష్మీపురం– ఎలుకుర్తి గ్రామాల మధ్య ఉన్న ఎస్సారెస్పీ ఉప కాల్వలో మహిళ శవం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రావుల రణదీర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాల్వ గట్టున మహిళ చెప్పులు, కొంత దూరాన హ్యాండ్‌బ్యాగ్‌, రక్తపు మరకలు, పదునైన కత్తి, కాలువలో సగం వరకు గొంతు కోసి ఉన్న మహిళ మృతదేహం కనిపించాయి. మృతురాలు తాళ్లపెల్లి సుమలతగా గుర్తించారు. మహిళను కాల్వ గట్టుపై గొంతుకోసి చనిపోయిన అనంతరం కాల్వలోకి తోసి వేసినట్లు గుర్తించారు.

    సంఘటన స్థలాన్ని డీసీపీ అంకిత్‌కుమార్‌, నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ సాయిరమణ పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. మృతురాలి తండ్రి చిలువేరు కట్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు. ఒంటరిగా ఉంటున్న సుమలతను దుండగులు అత్యాచారం చేసి హత్యచేశారా.. లేక ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులు చేశారా.. లేక వివాహేతర సంబంధాలే కారణమా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సుమలతతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో పాటు ఆమెకు గతంలో ఇదే గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Andhra Pradesh

  • తిరుపతి:  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు విడుదల చేసిన తాజా వీడియో సంచలనంగా మారింది.  ఇప్పటికే అరవ శ్రీధర్‌కు సంబంధించి పలు వీడియోలు విడుదల చేసిన బాధితురాలు.. తాజాగా మరో కీలక వీడియోను బహిర్గతం చేశారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అరవ శ్రీధర్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.

    ఆ వీడియోలో ‘చంద్రబాబు వేస్ట్‌’ అంటూ అరవ శ్రీధర్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వేస్ట్‌ అని, ఆయన చెప్పింది.. ఏనాడు చేయలేదని శ్రీధర్‌ వ్యాఖ్యానించిన వీడియోను బయటపెట్టింది. ఆ వీడియోలో చంద్రబాబును అరవ శ్రీధర్‌ ఏకవచనంతో సంబోధించినట్లు తెలుస్తోంది.

  • గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం మాయం వ్యవహారంలో కొత్త డ్రామాకు తెరలేపింది ఆలయ ట్రస్టు. తాకట్టు పెట్టిన బంగారు కిరీటాన్ని రాత్రికి రాత్రే రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ట్రస్టు.. మీడియా ముందు ప్రదర్శించింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టలేదంటూ ట్రస్టు సభ్యులు కొత్త డ్రామాకు తెరలేపారు. కిరీటం గురించి ప్రశ్నించిన మీడియాపై ట్రస్టు సభ్యులు దౌర్జన్యం చేశారు. అయితే మీడియా ప్రతినిధులకు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సర్ధిచెప్పి పంపించారు. 

    కాగా, కిరీటం తాకట్టు వ్యవహారంలోదాత మాటూరి సుబ్బారావు పోరాటం  ఫలించింది. గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బంగారు కిరీటం మాయం కావడంపై దాత సుబ్బారావు ట్రస్టును ప్రశ్నించారు. చివరకు పోలీసుల జోక్యంతో ఆ కిరీటం తాకట్టు పెట్టినట్లు తేలింది. దీనిపై ఇప్పుడు బుకాయిస్తున్నారు ట్రస్టు సభ్యులు.  తాము కిరీటం తాకట్టుపెట్టలేదంటూ.. హుటాహుటీనా రాజస్థాన్‌ నుంచి తెప్పించి మరీ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టారు.  

    రూ. 75 లక్షలకు పైగా ఉండే ఆ బంగారు కిరీటాన్ని  మాటూరి సుబ్బారావు దంపతులు గతేడాది స్వామి వారికి సమర్పించారు. అయితే స్వామి వారి దర్శనానికి వచ్చిన దాత సుబ్బారావు.. ఆ కిరీటం కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ట్రస్టు సభ్యుల్ని సైతం నిలదీశారు. 

    తమ పరిధిలో లేకపోయినా  దేవాదాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సుబ్బారావు  దీనిలో భాగంగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ,ఇతర సభ్యుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. దాంతో  ట్రస్టు సభ్యులు కంగారుపడ్డారు.  తాకట్టు వ్యవహారం పై తీవ్ర దుమారం రేగడంతో టీడీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు.  తాకట్టు పెట్టుకున్న వ్యాపారి ఆ కిరీటంతో రాజస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఆ బంగారు కిరీటాన్నిఅక్కడ నుంచి పరుగ పరుగు పరుగున తెప్పించి మీడియా ముందు ప్రదర్శించారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలపై చిందులు వేశారు ట్రస్టు సభ్యులు.

  • సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరోసారి దుబారా ఖర్చులకు తెరతీశారు. తన కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను తానే అమలు చేయడం లేదు. వచ్చే నెల జూన్ 13 నుండి 16 వరకు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు లోకేష్ కూడా సింగపూర్‌కి వెళ్లనున్నారు.

    ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పొదుపు సూచనలపై చంద్రబాబు స్పందించారు. కేబినెట్‌లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించాలని, నేతలు వినియోగిస్తున్న వాహనాల సంఖ్యను తగ్గించాలని, ఏడాది పాటు విదేశీ పర్యటనలు వద్దని అన్నారు.

    కానీ చంద్రబాబు మోదీ సూచనలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌, లోకేష్‌తో పాటు ఇతర నేతలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలను వినియోగిస్తూ దుబారా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు, లోకేష్‌లు సింగపూర్‌ పర్యటనతో మేమింతే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పాటించని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్‌కు వెళ్లనున్నారు. సింగపూర్‌ పర్యటన నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓవైపు చంద్రబాబు,నారా లోకేష్‌ ఇలా ఉంటే.. కూటమి ఎమ్మెల్యేలు సైతం సోకుల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.  

    రాష్ట్రంలో ‘నో వెహికల్ డే’పై విమర్శల మోత
    ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో చంద్రబాబు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటించాలని ఆదేశించినా, ఆ నిర్ణయం అమలులోనే అభాసుపాలు అవుతున్నాయి.

    కర్నూలు జిల్లా
    కర్నూలు జిల్లాలో భూగర్భ ఘనంగా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్‌తో ప్రయాణించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. పత్తికొండ నుండి జియో మైసూర్ గోల్డ్ పరిశ్రమకు ఆయన కాన్వాయ్ వెళ్ళగా, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాం బాబు కూడా ఆయనతో పాటు ఉన్నారు.  ఇదేనా పొదుపు?అంటూ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

    తూర్పుగోదావరి జిల్లా
    రంపచోడవరంలో టీడీపీ ఎమ్మెల్యే శిరీషా రాణి అధికారిక పర్యటన సందర్భంగా కాన్వాయిలో ఒక్క వాహనం కూడా తగ్గకుండా ప్రయాణించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. తిమ్మాపురం గ్రామంలో పలు పార్టీ కార్యక్రమాలకు ఆమె వాహనాల కాన్వాయ్‌తోనే హాజరయ్యారు. సీఎం ఆదేశాలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాన్వాయ్‌తో రావడం చూసి ప్రజలు ఇదేనా పొదుపు?అని ప్రశ్నిస్తున్నారు.

    నంద్యాల జిల్లా
    డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కూడా ‘నో వెహికల్ డే’ ఆదేశాలను తుంగలో తొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు ప్రయాణం చేస్తానంటూ పోస్టర్లు వేయించి, వాస్తవానికి కార్లలోనే తిరుగుతున్న ఆయన ప్రవర్తన ప్రజల్లో అసంతృప్తిని రేపింది. ఇంధన పొదుపు పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ, అమలులో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

  • విశాఖ:  విశాఖ వెస్ట్‌లో ఉన్న గోపాలపట్నం కాపు భవన్‌ ప్రారంభోత్సవానికి ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఆహ్వానం అందలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తైన కాపు భవన్‌ను.. రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గణబాబు. అయితే ఈ కార్యక్రమానికి కాపు నాయకులకు గానీ,  ఎమ్మెల్యేలకు గానీ ఆహ్వానం అందలేదు. 

    కాపు భవన్‌ ప్రారంభోత్సవం సందర్భం కనీసం కాపు నాయకుడైన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఫోటో కూడా పెట్టలేదు. కాపు భవన్ ప్రారంభోత్సవాన్ని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఎంపీ భరత్‌లే చేసేశారు. దీనిపై కాపు ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గ భవన్‌ ప్రారంభోత్సవానికి కాపు నేతలను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కనీసం పవన్‌ కళ్యాణ్‌ ఫోటో పెట్టకపోవడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. 

     

     

  • కూరగల్లు:  పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత భూములిచ్చిన తమకు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ది చేయకుండానే ఇచ్చారని,  లోన్‌ కోసం బ్యాంకులకు వెళ్తే అవి ఎందుకు పనికిరావని వారు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం(మే 22వ తేదీ) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్‌డీఏ గ్రామసభ నిర్వహించారు.  

    ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ్‌ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్‌ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్‌ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. 

  • సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. తప్పుడు, రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేసి.. వ్యాప్తికి కారణమైన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కాకినాడ అర్బన్ జయేంద్ర నగర్‌కు చెందిన నల్లం శ్రీరాములు ఫిర్యాదు చేశారు.

     ఈ నెల 19న ఒక చానల్‌లో  ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో హోం మంత్రి అమిత్ షా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై ఆధా రాలు లేకుండా మాట్లాడారని, అవి ఇతర మీడియా వేదికలపై ప్రముఖంగా వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 'సాక్షి' మీడియా నిర్వహించిన చర్చల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని కూటమి రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలను ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం ఏర్పడేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

    కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐఐ కె.ఏసుబాబు తెలిపారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లపై అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసిన 99 టీవీ యాజమాన్యం, చర్చ నడిపిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. 

    ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, పార్టీ నాయకులపైన అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీసు కేసులు పెట్టడంతోపాటు న్యాయ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

  • గుంటూరు: పొన్నూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి అంబటి మురళీకి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. మొక్కజొన్న రైతుల పరామర్శ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులిచ్చారు పోలీసులు. 

     ఇదిలా ఉంచితే, రెండు రోజుల క్రితం మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ చేశారు. బుధవారం(మే 20వ తేదీ) ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి  బుధవారం ఉదయం పొన్నరూ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. 

    అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించడంతో మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. 

  • సాక్షి,అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరు జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్‌ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

    దక్షిణ కోస్తా జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బాపట్లలో సాధారణం కంటే ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధికారులు మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని హెచ్చరించారు.
     

National

  • ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా వినియోగించే మాంసాలలో కోడి మాంసం లేదా చికెన్‌  ఒకటి. చికెన్‌లో  ప్రోటీన్‌  పుష్కలంగా లభిస్తుంది.   అందుకే ఫిట్‌నెస్ ప్రియులకు ఫస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది మాంసాహారులు  చికెన్‌ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. కానీ కోడిలో ఏ భాగం అత్యధిక ప్రోటీన్‌ను అందిస్తుందనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు.  ఆ వివరాలేంటో తెలుసుకుందామా?


    చికెన్‌లోని అన్ని భాగాల్లో ఒకే రకంగా ప్రోటీన్ ఉండదు. కొన్ని భాగాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటే మరికొన్ని భాగాల్లో   తక్కువగా  కొవ్వు ఎక్కువగా ఉంటుంది.  చికెన్‌ బ్రెస్ట్‌, చికెన్‌  లెక్స్‌ ఇలా  ఏ భాగంలో ఎంత  ప్రొటీన్‌,  ఎంత   కొవ్వు ఉంటుందో  తెలుసుకోవాలి.   

    చికెన్ బ్రెస్ట్ : అత్యధిక ప్రోటీన్ ఉండే భాగం చికెన్ బ్రెస్ట్. 100 గ్రాముల బ్రెస్ట్ సుమారు 30–32 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని “లీన్ మీట్”గా కూడా పరిగణిస్తారు. జిమ్‌కు వెళ్లేవారికి,   బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

    చికెన్‌ లెగ్‌ :  సుమారు 25–27 గ్రాముల ప్రోటీన్‌కు మంచి మూలం. అయితే, ఇందులో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మరింత రుచికరంగా ఉంటుంది. అందుకే చాలా మంది తొడ భాగాన్ని ఇష్టపడతారు. అయితే, డైట్‌లో ఉన్నవారు దీని వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి.

    చికెన్ వింగ్స్‌: ఇందులో మూడు భాగాలు ఉంటాయి. డ్రమెట్, వింగెట్ , వింగ్ టిప్. వీటిని తరచుగా స్నాక్స్‌గా లేదా బార్ ఫుడ్‌గా తింటారు. ఒక చికెన్ వింగ్‌లో (85 గ్రాములు) 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ప్రతి 100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌కు సమానం.

    డ్రమ్‌ స్టిక్స్‌ : దీన్నిఒక మధ్యేమార్గపు ఎంపికగా భావించవచ్చు. ఇది 23–25 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, రుచి మధ్య మంచి సమతుల్యత ఉండటం వల్ల దీనిని తరచుగా కుటుంబ భోజనాలలో ఉపయోగిస్తారు. ఇది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు.  స్కిన్‌ లెస్‌ డ్రమ్‌స్టిక్‌లో (95 గ్రాములు) 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 100 గ్రాములకు 24 గ్రాముల ప్రోటీన్‌కు సమానం.మరోవైపు, చికెన్ వింగ్స్‌లో ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. అవి కేవలం 20–22 గ్రాముల ప్రోటీన్‌ను మాత్రమే అందిస్తాయి. వాటిని సాధారణంగా వేయిస్తారు కాబట్టి, వాటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కండరాలను పెంచుకోవాలనుకునే లేదా బరువు పెరగాలనుకునే వారికి ఇవి మరింత మంచివి. తక్కువ కార్బోహైడ్రేట్లు లేదా కీటో డైట్ పాటించేవారు కూడా ఎక్కువ కొవ్వు తినవలసి ఉంటుంది కాబట్టి వారికి మేలు. 

    ఆరోగ్యకరమైన ఆహారం కోసం వాటిని తినకుండా ఉండటం లేదా మితంగా తీసుకోవడం ఉత్తమం. అత్యధిక ప్రోటీన్‌కోసం చికెన్‌ ఎంత ముఖ్యమో, దాన్ని ఆరోగ్యకరమైన పద్ధతిలో వండటం కూడా అంతే ముఖ్యం. రుచితోపాటు, గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వేయించడానికి బదులుగా దానిని గ్రిల్  ,బేక్  చేసుకోవడం మంచిది.

    అలాగే స్కిన్‌ లెస్‌ చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది.  మొత్తంగా ఎలా, ఏ భాగాన్ని తీసుకోవాలి అనేది పూర్తిగా మన ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలనుకుంటే బ్రెస్ట్ ముక్కలు , టేస్ట్ కోసం చూస్తే రెక్కలు, డ్రమ్‌స్టిక్‌, లెగ్ ముక్కలు బెస్ట్‌. ఏదైనా మితంగా భోంచేయడం అన్నింటికన్నా ఉత్తమం. 
     

  • పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌కు చెందిన ఝాల్‌మురి (మరమరాల చాట్) విక్రేత విక్రమ్ సౌ గుర్తున్నాడా? అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన దుకాణం వద్ద ఆగి  ఝూల్‌మురి తినడంతో విక్రమ్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఇపుడు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రాణాపాయ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.

    ప్రధాని మోదీకి స్నాక్స్ విక్రయించిన విక్రమ్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నంబర్ల నుండి వరుసగా బాంబు దాడులు, చంపేస్తామని బెదిరింపు కాల్స్  రావడంతో కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది.

    ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా  ఏప్రిల్ 19న ఝార్గ్రామ్‌లో జరిగిన బహిరంగ సభ ముగించుకుని వస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సాధారణ వీధి వ్యాపారి స్టాల్ వద్ద ఆగి ఝాల్‌మురి తిన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో షేర్‌ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో విక్రమ్‌ రాత్రికి రాత్రే  ఫేమస్ అయ్యాడు. అయితే, ఈ పాపులారిటీ ఇప్పుడు అతడికి, అతడి కుటుంబానికి పెద్ద శాపంగా మారింది.ఒక్క రోజులో వచ్చిన గుర్తింపు ఆ కుటుంబానికి ఇలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

     

    ఈ ఘటన కాస్తా బెంగాల్ ఎన్నికల సమయంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మధ్య పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిని "ముందుస్తుగా ప్లాన్ చేసిన డ్రామా" అని కొట్టిపారేశారు. దీదీ విమర్శలపై స్పందించిన మోదీ  తాను కారంగా ఉండే ఝాల్‌మురి తింటే, టీఎమ్‌సీకి సెగ తగులుతోందని ఎద్దేవా చేశారు.

    మరోవైపు మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మళ్లీ ఈ ఘటనను గుర్తుచేకోవడం విశేషం.

     

  • ఢిల్లీ: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసింది

    రిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్‌కు, క్రిమిలేయర్‌కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ క్రిమిలేయర్‌, రిజర్వేషన్లపై నమోదైన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై వ్యాఖ్యానించింది.  
     
    ఓబీసీ క్రిమిలేయర్‌కు సంబంధించిన రిజర్వేషన్ ప్రయోజనాలపై పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయన్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులు.ప్రభుత్వ సేవలో ఉన్నారు. బాగా స్థిరపడ్డారు. ఇప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్ అవసరమా?’అని ప్రశ్నించింది. జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ..‘విద్యా, ఆర్థిక శక్తివంతతతో సామాజిక స్థితి మార్పు వస్తుంది. కానీ మళ్లీ పిల్లలకు రిజర్వేషన్ కోరితే, ఈ వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటకు రాలేము’అని అన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో సామాజిక వెనుకబాటు ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటు మాత్రమే ఉంటుందని తెలిపారు.

    ఈ కేసులో వాదించిన అడ్వకేట్ శశాంక్ రత్నూ మాట్లాడుతూ..‘క్రిమీ లేయర్‌లో వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా, వారి స్థాయి ఆధారంగా తప్పించారు. కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించాలి’అని వాదించారు. ఆయన,ఈడబ్ల్యూఎస్‌, క్రిమీ లేయర్‌ను ఒకే విధంగా చూడకూడదని, క్రిమీ లేయర్ ప్రమాణాలు మరింత సడలింపుగా ఉండాలని సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, సుప్రీం కోర్టు పిటిషనర్లు, ప్రతివాదులు వంటి సంబంధిత పక్షాల నుంచి సమాధానాలు కోరుతూ నోటీసులు జారీ చేసింది.

  • న్యూఢిల్లీ: అత్తవారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ట్విషా శర్మ  కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ట్విషా శర్మ మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ రెండవ పోస్ట్‌మార్టంను ఎయిమ్స్ ఢిల్లీ బృందం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

    ప్రాథమిక పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ, ఆమె కుటుంబం ఈ నిర్ధారణలను తిరస్కరిస్తూ, ఇందులో కుట్ర ఉందని ఆరోపిస్తోంది. తమ బిడ్డను అత్తింటివారే ఆత్మహత్యకు పురికొల్పారని ఆరోపిస్తూ ట్వీషా తల్లిదండ్రులు మృతదేహానికి ఎయిమ్స్ ఢిల్లీ బృందంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించాలని దిగువ కోర్టును ఆశ్రయించారు. దీన్ని కోర్టు తిరస్కరించడంతో, తిరిగి వారు  హైకోర్టును ఆశ్రయించారు.  విచారణ అనంతరం జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మృతదేహాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడమా, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఏర్పాటు చేసిన,  నిపుణుల బృందాన్ని విమానంలో పిలవడమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమమైన మార్గమని ఈ కోర్టు అడగగా, అడ్వకేట్ జనరల్ తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఏ కమిటీని ఏర్పాటు చేసినా వీలైనంత త్వరగా వారు భోపాల్‌కు వచ్చి పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని తెలిపారు. 

    మొదటి పోస్ట్‌మార్టంలో లోపాలున్నాయని, ట్విషా మరణించిన మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేశారని, అలాగే ఉరి వేసుకోవడానికి ఉపయోగించినట్లు చెబుతున్న బెల్ట్‌ను మొదటి పోస్ట్‌మార్టం పరీక్ష సమయంలో అందించలేదని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. మరోసారి పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేసింది. అలాగే పోస్ట్‌మార్టం సమయంలో నమోదు చేసిన ట్విషా ఎత్తు, పోలీసు నివేదికలో పేర్కొన్న ఎత్తుతో సరిపోలడం లేదని బాధితురాలి న్యాయవాదివాదించారు. ఆమె శరీరంపై ఉన్న గాయాల గురించి పోస్ట్‌మార్టం నివేదికలో ఎందుకు వివరంగా ప్రస్తావించలేదని  కూడ ప్రశ్నించారు.

    కాగా మోడల్,నటి ట్విషా 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా న్యాయవాది సమర్థ్ సింగ్‌తో పరిచయమైంది. ఆ తరువాత  2025 డిసెంబర్‌లో పెళ్లాడింది. పెళ్లైన ఐదు నెలలకే (మే 12న)  ట్విషా అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. దీంతో భర్త, అత్తమామలు తమబిడ్డను శారీరక హింసతో సహా వివిధ రకాల వేధింపులకు గురి చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. 

    ఈ డిమాండ్‌ను ట్విషా అత్తగారైన గిరిబాల సింగ్ తరఫు న్యాయ బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిమ్స్‌లోని నిపుణులచే ఇప్పటికే తొలి పరీక్ష పూర్తి అయిందికాబట్టి  రెండో  పరీక్ష అవసరం ఏముందని ప్రశ్నించారు. మరో పోస్ట్‌మార్టం కోరడం అంటే వృత్తిపరమైన వైద్యుల సామర్థ్యాలపై అవిశ్వాసాన్ని చూపడ మేనని వారు వాదించారు.

    మరోవైపు గత పదిరోజులుగా పరారీలో ఉన్న ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో తనమ  ముందస్తు బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకుని, విచారణకు ముందే లొంగిపోవడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శుక్రవారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలియజేశారు
     

    ఇదీ చదవండి: ‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే

  • వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్‌ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో  దారుణ ఘటన  వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.

    వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్‌తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్‌పురికి మకాం మారారు.  మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి  చేసుకున్న మరిది రాజ్‌కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను   మానసికంగా, శారీరకంగాహింసించేవారు.  ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.


    దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్  బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే  ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా  సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం  జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  

    7 నిమిషాల్లో అంతా
    రాత్రి  పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్‌  చేసింది.  ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

    దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.

    అత్తవారింటి వాదన
    వీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.

    ఇదీ చదవండి: వర్క్‌ ఫ్రం హోం కాదు.. వర్క్‌ ఫ్రం బీచ్, అదీ గోవాలో

  • చెన్నై: తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు వారాలవుతున్నా ఇంకా అక్కడ రాజకీయం ఏ మాత్రం చల్లారటం లేదు. డీఎంకే, వీసీకే పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండుపార్టీలు తమిళనాడు  సాహిత్యంతో  విమర్శలు చేసుకుంటున్నాయి.

    ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎ‍న్నికల్లో అత్యంత ఉత్కంఠతో నడిచిన రాజకీయం ఏదంటే.. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలే అని చెప్పుకోవాలి. విజయ్‌ టీవీకే పార్టీ అధికారానికి పది సీట్ల దూరంలో నిలిచిపోవడం.. గవర్నర్‌ ఎట్టిపరిస్థితుల్లో సరైన మద్దతు చూపాలనడం.. మెుదట సపోర్టు చేస్తానని చెప్పిన చిన్న పార్టీలు తరువాత మెుండి చేయడంతో ఆ రాష్ట్ర రాజకీయం సస్పన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఎట్టకేలకు అక్కడి కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు వీసీకే సపోర్టు చేయడంతో విజయ్‌ పార్టీ గండం గడిచి అధికారం చేజిక్కించుకుంది.

    ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు వీసీకే సపోర్టు ఇచ్చింది. కాగా దీనిపై తాజాగా డీఎంకే, వీసీకే నేతలు తమిళ సాహిత్యంలోని కవిత్వంతో విమర్శలు చేసుకున్నారు. డీఎంకే ఎంపీ రాజా వంకరగ పెరిగిన కొబ్బరి చెట్టు తనను పెంచిన భూమికి కాకుండా ప్రక్కకు వంగి వేరే ప్రాంతానికి కొబ్బరికాయలు ఇస్తుందని తెలిపారు. అంటే పరోక్షంగా వీసీకే డీఎంకే కూటమిలో గెలిచే విజయ్‌ పార్టీతో చేరిందని చురకలుంటించారు.

    రెండవ ట్వీట్‌లో పెరియార్ ద్రవిడియన్‌ సిద్ధాంతమే  తమిళనాడు రాజకీయ, సాంస్కృతిక, సామాజిక గుర్తింపును ముందుకు తీసుకెళుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారే వరకూ ఎదురుచూస్తాం.. పోరాడటాన్ని కొనసాగిస్తాం విజయం సాధిస్తాం అని అన్నారు.

    వీసీకే రీకౌంటర్‌

    అయితే ఈ కామెంట్స్‌కు వీసీకే పార్టీ నేత వీ బాలాజీ స్పందించారు. "వినయవంతులకు అధికారం.. అందులో ఆగ్రహం ఏముంది" అనే తమిళ పద్యంతో కౌంటరిచ్చారు.

    సామాజిక న్యాయం కోసం పని చేసే వారిపై ఆగ్రహంతో ఉన్నారని డీఎంకే వ్యాఖ్యలలో కుటుంబ పాలన కూలిపోతుందే భయం కనిపిస్తోందనే  కుటుంబపాలన కూలిపోతుందనే భయం కనిపిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలతో డీఎంకే పార్టీ అసలు స్వరూపం బయిటపడిందన్నారు.
     

Family

  • స్పేస్‌కు సంబంధించి పిల్లల క్రియేటివిటీ చూస్తే ఇన్ని అద్భుతాలు  వీరి మైండ్‌లో ఉన్నాయా అని మనకే ఆశ్చర్యమేస్తుంది.

    వేసవి రాత్రులు
    వేసవి సెలవుల్లో అమ్మమ్మతాతయ్య ఇంటికి వెళ్లినప్పుడు, రాత్రిళ్లు ఆరు బయట పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఉండటం.. బోలెడన్ని కబుర్లు చెప్పుకోవడం.. ఇప్పటి పెద్దవారికి కూడా అందమైనæమధుర జ్ఞాపకాలు. నక్షత్రాలు మెరుస్తుండగా ఆకాశాన్ని చూస్తుంటే పిల్లల్లో ఆశ్చర్యాన్ని, సందేహాలను, ఊహాశక్తిని పెంచుతుంది.  ప్రకృతి వేసిన అతి పెద్ద పెయింటింగ్‌ లాంటిది ఆకాశం. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, వర్షం, ఇంద్రధనస్సు.. ఇవన్నీ ఆకాశంలోనే కనిపిస్తాయి.

    ‘నక్షత్రం ఎందుకు మెరుస్తోంది?’, ‘చంద్రుడు మనకోసం ఎందుకు వస్తాడు?’, ‘స్పేస్‌లో ఎవరు ఉంటారు?’, ‘పగటి పూట నీలంగా కనిపించే ఆకాశం, రాత్రి అయితే నల్లగా ఎందుకు అవుతుంది? అని అడగవచ్చు... అలాంటి ప్రశ్నలే పిల్లలలో విజ్ఞానానికి తొలి అడుగులు అవుతాయి.

    స్పేస్‌ అంటే ...
    భూమి బయట ఉన్న అంతులేని విశ్వంలో.. ఏమేం ఉంటాయి? గ్రహాలు,. నక్షత్రాలు, గెలాక్సీలు.. ఎంత చెప్పినా తరగని గని స్పేస్‌ పిల్లల సృజనకు మాటల్లో చెప్పలేనన్ని అద్భుతాలకు కేంద్రం అవుతుంది. రాకెట్ల తయారీ, వాటి ప్రయాణం, భూమి స్పేస్‌లో ఒక చిన్న గ్రహం, చంద్రుడు భూమికి దగ్గరలో ఉన్న సహజ ఉపగ్రహం, సముద్ర అలలపై చంద్రుడి ప్రభావం.. వ్యోమగాములు స్పేస్‌లో ప్రయాణించి చేసే పరిశోధనలు, రాకెట్ల గురించి, ఇప్పటివరకు వెళ్లిన వ్యోమగాముల గురించి, భారతదేశం స్పేస్‌లో సాధించిన గొప్ప విజయాలు.. ఇలా ఎన్నో చెప్పవచ్చు.

    ఆసక్తిని పెంచే యాక్టివిటీస్‌...
    నక్షత్రాలు లెక్క పెట్టమని చెప్పండి. ఆకారాలు ఊహించమని అడగండి. చందమామ కథలు, నక్షత్రాల కథలు, రాకెట్‌ కథలు చెబితే పిల్లలకు బాగా గుర్తుంటాయి. కాగితంతో రాకెట్‌ తయారు చేయడం. గ్రహాల మోడల్‌ చేయడం. గ్లోబు చూపించడం, స్పేస్‌లో భూమి విలువ, ప్రకృతిని కాపాడుకోవడం, ఎన్నో రహస్యాలకు పెద్ద గని స్పేస్‌. మనిషి బ్రెయిన్‌ కూడా స్పేస్‌. అందులో పుట్టుకువచ్చే అద్భుతాలను తమదైన శైలిలో పిల్లల్ని ఆవిష్కరించమని చెప్పండి. 

    పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. సైన్స్‌ మీద ఆసక్తి కలుగుతుంది. ప్రశ్నలు అడిగే అలవాటు పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. ఒక చిన్న నక్షత్రాన్ని చూసి కూడా పిల్లలు పెద్ద కలలు కనగలరు. స్పేస్‌ గురించి తెలుసుకునే విషయాలతో వారి సెలవు రోజులన్నీ పూర్తిగా నిండిపోతాయి.

    ‘పిల్లల మెదళ్లలో ఎన్నో సృజనాత్మక ఆలోచనలకు ఆకాశమే హద్దు అవుతుంది. రాత్రిపూట చుక్కల ఆకాశం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చంద్రుడు, సూర్యుడు ఆకాశంలో ఎలా ఉంటారు? విశ్వం అద్భుతం గురించి తెలియజెబితే.. పిల్లలు ఎంత ఆసక్తిగా వింటారో చాలా క్లాసుల్లో నేను గమనించాను’ అంటారు నటి, ఆర్ట్‌ టీచర్‌ గీతా భాస్కర్‌ (Dhaassyam Geetha Bhascker).

    చ‌ద‌వండి: అన్నీ ఇచ్చే నేలమ్మకు ఏమిద్దాం? 

    ‘ఫైవ్‌ ఎలిమెంట్స్‌’పై పిల్లల చేత డ్రాయింగ్, కార్టూన్, నాటకం, పాట, కవిత్వం, రచన..ఇలా వారి వయసును బట్టి ఎవరెవరు ఏమేం చేస్తారో చేయమనండి. ఆ వి‘చిత్రాల’ను మాకు పంపించండి. ఊరు, పేరు, ఫొటోతో సహా ప్రచురిద్దాం. మెయిల్‌ ఐడి sakshisummerkids@gmail.com

    నిర్వహణ: నిర్మలారెడ్డి

  • ప్రపంచవ్యాప్తంగా మే 22న పాటించే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా పనిచెయ్యటం’ అనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సచివాలయం సమన్వయంతో ఈ సంవత్సరం జీవవైవిధ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం కున్మింగ్‌–మాంట్రియల్‌ గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో ΄పొందుపరిచిన 23 ప్రతిష్టాత్మక లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎక్కడికక్కడ స్థానికంగా చేసే అనేక రోజువారీ పనులు నేరుగా దోహదపడతాయి. వీటిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. 

    ఎందుకంటే ప్రపంచంలోని నివాసయోగ్యమైన భూమిలో వ్యవసాయం దాదాపు సగభాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడికి ప్రాథమిక చోదకంగానూ, పర్యావరణ పునరుద్ధరణకు కీలక పరిష్కారంగానూ పనిచేస్తుంది.

    ముఖ్యాంశాలు:
    ప్రపంచంలోని 75% పైగా ఆహార పంటలు, 35% ప్రపంచ పంట దిగుబడులు తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మేలుచేసే వాటి ద్వారా జరిగే పరాగ సంపర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

    వ్యవసాయంలో అధిక స్థానిక రకాల విత్తనాలు, పశు జాతుల వైవిధ్యం ద్వారా తీవ్ర వాతావరణ సంఘటనలు, తెగుళ్ల వ్యాప్తి, మారుతున్న వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని పెంపొందుతుంది.

    భూమిలోని ఎన్నెన్నో విభిన్న సూక్ష్మజీవుల సమూహాలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసి, కార్బన్‌ను సంగ్రహించి, దీర్ఘకాలంలో నేల సారాన్ని పెంపొందిస్తాయి.

    విభిన్నమైన దేశవాళీ లేదా స్థానిక విత్తన రకాలను పరిరక్షించడం ఎందుకు అవసరమంటే.. ఏదో ఒకటే పంటను నిరంతరం సాగు చేసే ఏక పంటల వైఫల్యాల ముప్పు నుంచి తరతరాల పంట పొలాలను కాపాడుతుంది.

    2026 థీమ్‌కు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ), ఆహార – వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)లు ప్రకృతి/ సేంద్రియ/ బయోడైనమిక్‌/ ఆగ్రోఫారెస్ట్రీ తదితర స్థానిక సుస్థిర వ్యవసాయ మార్గాలను ప్రోత్సహించమని వివిధ దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.

    రైతులు, స్థానిక సంఘాలు స్థానికంగా అనుసరిస్తున్న తేనెటీగల పరిరక్షణ చర్యలను పెంపొందించటానికి విషపూరిత రసాయన వ్యవసాయంపై ఆధారపడటాన్ని తగ్గించటం,  సామూహిక విత్తన బ్యాంకులను స్థాపించటం అవసరమని ఎఫ్‌ఏవో నొక్కి చెబుతోంది.

    స్థానిక ప్రజలను వైవిధ్యమైన సంప్రదాయ ఆహారోత్పత్తుల వినియోగం వైపు ప్రోత్సహించటం జీవవైవిధ్య పరిరక్షణకు ముఖ్యం. శాకాహారపు అలవాట్ల వైపు మళ్లించడం, అలాగే స్థానిక పంటలను ప్రోత్సహించటం వల్ల బహుళ పంటల సాగు పెరిగి, ఆ మేరకు జీవవైవిధ్యానికి నష్టం చేసే ఏక పంట(మోనోకల్చర్‌) వ్యవసాయాన్ని తగ్గిస్తుంది.

    ఈ సంవత్సరం చివర్లో ఆర్మేనియాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు (కాప్‌17)లో పర్యావరణంలో జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు పునరంకితం కావాల్సిన అవసరం ఉంది.

    నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్‌

    ( చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!)
     

  • బిజినెస్‌ ఐడియా ఉన్నప్పటికీ  పెట్టేందుకు పెట్టుబడి లేదు. డబ్బులు ఉన్నాయి, ఎలాంటి బిజినెస్‌ పెడితే సక్సెస్‌ అవుతాం?  ఒక బిజినెస్‌ను స్టార్ట్‌ చేశాం దానిని ఎలా ముందుకు తీసుకు΄ోవాలి? అని తర్జన భర్జన చెందుతుంటారు. ఇలాంటి వారి కోసమే ‘సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ’ పేరుతో ఒక వేదికను సిద్దిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఏర్పాటు చేశారు. చిన్నకోడూరుకు చెందిన రామిని మధు సిద్దిపేటలో  కెరీర్‌ సర్వీస్‌ను నిర్వహిస్తున్నాడు. సిద్దిపేటకు చెందిన ఆచి విజయ్‌ ఐటీ రంగంలో పనిచేస్తున్నాడు...

    వాక్‌ అండ్‌ టాక్‌
    సిద్దిపేట పట్టణంలో ‘సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ’ ఆధ్వర్యంలో వాక్‌ అండ్‌ టాక్‌ కార్యాక్రమాన్ని చేపట్టారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునేవారికి ఎలాంటి కంపెనీ ప్రారంభిస్తే సక్సెస్‌ అవుతారో ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటున్నారు. కొత్త ఇన్వెస్టర్లు, వివిధ రంగాల నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 

    ముగ్గురికి ఉచితంగా ప్రమోషన్‌
    ప్రతీ వారం హాజరైన వారిలో నుంచి ముగ్గురిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రమోషన్‌  చేస్తున్నారు. వారి స్టార్టప్‌లకు ఉచితంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేటకు చెందిన నాగహర్ష  సిద్దిపేట క్విక్‌ డెలివరీ యాప్‌ తయారీకి ఇన్వెస్టర్‌గా ముందుకువచ్చాడు. అరవింద్‌ రెడ్డి వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. నిర్వాన్‌  ఆర్గానిక్‌ ఫాం ద్వారా మార్కెట్‌లోకి వచ్చేందుకు అవకాశం లభించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన భవాని అబాకస్‌ శిక్షణ ఇచ్చేవారు. ఈ కమ్యూనిటీ ద్వారా ఎక్స్‌ ఎల్‌ అబాకస్‌ వారి ్ర΄ాంఛైజీ లభించింది. ‘వాక్‌ అండ్‌ టాక్‌’ కార్యక్రమం ఇస్తున్న ఫలితాలకు ఇవి కొన్ని ఉదాహరణలు.

    ఆలోచన ఉంటే డబ్బు ఉండదు...  డబ్బు ఉంటే ఆలోచన ఉండదు
    ప్రతి ఒక్కరికీ బిజినెస్‌ చేయాలని ఉంటుంది. కానీ వారికి ఇన్వెస్ట్‌ చేసేంత డబ్బు ఉండదు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండి సరిౖయెన ఫ్లాట్‌ఫాం ఉండదు. ఈ నేపథ్యంలోనే యువతకు గైడెన్స్‌ ఇవ్వాలని సిద్దిపేట స్టార్టప్‌ కమ్యూనిటీకి శ్రీకారం చూట్టాం. మా కమ్యూనిటీ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. మా ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.
    – మధు, విజయ్‌

    – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట  

  • మీరు ఎప్పుడైనా రెండు చ‌క్రాల‌ సైకిల్  తొక్కారా? ఏమిటీ పిచ్చి ప్ర‌శ్న‌.. సైకిల్‌కు రెండు చ‌క్రాలు కాక‌పోతే నాలుగు ఉంటాయా? సింగిల్ వీల్ సైకిల్ ట్రై చేశారా? తొక్క‌డం మాట అటుంచి కనీసం ఎప్పుడు చూడ‌లేదు అంటారా? ఒంటి చ‌క్రం సైకిల్ కూడా ఉంటుందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అయితే మీరు యువ రైడర్‌ స‌నీద్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవ‌రిత‌డు, ఏమిటి అత‌డి ప్ర‌త్యేక‌త?

    కేర‌ళం రాష్ట్రానికి చెందిన స‌నీద్ సైకిల్‌పై నేపాల్‌కు యాత్ర చేప‌ట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అత‌డు ఒక చ‌క్రం ఉన్న సైకిల్‌పై (one wheel cycle) ఈ సాహ‌స‌యాత్ర చేస్తున్నాడు. ప్రత్యేకంగా మార్పులు చేసిన సింగిల్ వీల్ సైకిల్ తొక్కుతూ జాతీయ ర‌హ‌దారులు, పబ్లిక్ రోడ్లపై అత‌డు దూసుకుపోతుంటే జ‌నాలంతా వింత‌గా వీక్షిస్తున్నారు. తాజాగా అత‌డి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చ‌ర్యంతో పాటు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

    సంక‌ల్పానికి సెల్యూట్‌
    సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి, సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో స‌హ‌నంతో స‌నీద్ సాహ‌స‌యాత్ర కొన‌సాగిస్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో సామాను పెట్టుకున్నాడు. ముందు-వెనుక‌ కేర‌ళ టు నేపాల్ బోర్డు త‌గిలించుకుని, జాతీయ జెండాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇది చూసిన వాళ్లంద‌రూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. పిచ్చిత‌నం అని కొంద‌రు, సాహ‌సం అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. మామూలు మ‌నుషులు ఇలాంటి సాహ‌సాలు చేయ‌లేర‌ని చాలా మంది పేర్కొన్నారు. అత‌డి అంకితభావం, సంక‌ల్పాన్ని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ర‌హ‌దారుల‌పై వెళ్లేట‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు.

    సాహ‌సాల‌తో సావాసం
    ఇలాంటి సాహ‌స యాత్ర‌లు సనీద్‌కు కొత్త కాదు. స్టంట్ పెర్ఫార్మర్ అయిన ఈ యువ రైడ‌ర్ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒంటి చ‌క్రం సైకిల్‌పై 5,000 కిలోమీటర్ల దూరం ప్ర‌యాణించి త‌న గురించి లోకానికి చాటాడు. ఇదే విధంగా  అతను కేరళ అంతటా దాదాపు 900 కిలోమీటర్లు ప్ర‌యాణించిన‌ట్టు త‌న సోషల్ మీడియా బయోలో పేర్కొన్నాడు. సింగిల్ వీల్ సైకిల్ దేశమంతా చుట్టిరావాల‌న్నది త‌న క‌ల అని వెల్ల‌డించాడు. సనీద్ త‌న క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని మ‌న‌మంతా కోరుకుందాం.

  • ఓ వ్యక్తి ఆహార్యంలో హుందాతనం, స్టైలిష్‌ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసే వాటిలో కురులది ప్రధాన పాత్ర. ఆ హెయిర్‌స్టైలే పెద్ద మనిషిలా హుందాగా చూపించడం, అలాగే పాతికేళ్ల కుర్రాడి లుక్‌ చూపించడంలోనూ కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్‌ చాలా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అయిన హెయిర్‌స్టైల్స్‌ యువతను ఎంతలా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగానే తన ఆహార్యం మొత్తం మార్చుకుని ఓ పెద్ద తరహా లుక్‌తో కనిపించే హెయిర్‌స్టైల్‌తో ముందుకొచ్చి ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇంతలా హీరో దళపతిని అందంగా హెయిర్‌ని స్టైల్‌ చేసి చూపించే వ్యక్తి ఎవరంటే..

    తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టిపెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి చర్రిత సృష్టించారు దళపతి విజయ​. హీరోగా మొదలై..ఓ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కూడా. నటనలోనూ నాయకుడిగా తనదైన మార్కుని చూపిస్తూ..ప్రజలకు మంచి పాలన అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఒక నాయకుడిగా పెద్దతరహాలో కనిపించే ఆయన ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించేది హెయిర్‌. అంత అందంగా ఆయన హెయిర్‌ని తీర్చిదిద్దే వ్యక్తి జగదీష్ అవస్థి. 

    30 ఏళ్ల ఈ హెయిర్‌ స్టైలిస్ట్‌ దళపతి అభిమానులను అలరించేలా రకరకాల హెయిర్‌ని తీర్చిదిద్దడంలో దిట్ట. బిగిల్' సినిమా నుంచి 'లియో', 'గోట్ (GOAT)' వరకు విజయ్‌కి హెయిర్ స్టైలింగ్‌గా వ్యవహరిస్తున్నాడు. జగదీస్‌ విజయ్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ను సీఎంగా చూడటం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తనకు పదోతరగతి నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది. 

    ఆ నేపథ్యంలోనే సెలూన్‌కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి, ఒక సెలూన్‌లో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన హెయిర్‌స్టైలిస్ట్‌ల ద్వారా విజయ్‌ బిగిల్‌ మూవీ కొత్త హెయిర్‌స్టైల్‌ కోరుకుంటున్నారని తెలిసింది. అలా ఆయన్ను తనకు కలిసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతీ మూవీకి తనే హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జననాయగన్‌కు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపాడు. విజయ్‌ హెయిర్‌స్టైల్‌లో బాగా పాపులర్‌ అయ్యింది 'బీస్ట్' స్టార్ హెయిర్‌స్టైల్‌. అయితే హీరో విజయ్‌ది సహజంగా ఒత్తుగా హెల్దీగా ఉండే జుట్టు కావడంతో ఈ హెయిర్‌స్టైల్‌ బాగా నప్పిందని చెప్పుకొచ్చాడు. 

    అదీగాక సులభంగా రకరకాల హెయిర్‌స్టైల్‌లోకి మార్చగలమని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రతి మూవీలోని ఆయన పాత్రకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆయన జుట్టుకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు బాగా చేశావ్‌ అబ్బాయ్‌ అని ప్రశంసించన క్షణం ఇప్పటికీ మరువలేను అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 

    ఇక 2023లో లియో జుట్టుతో చేసిన వైరల్ లుక్ గురించి మాట్లాడుతూ..ఆ లుక్‌ల సాల్ట్-అండ్-పెప్పర్ (ఉప్పు-మిరియాల) జుట్టు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. అయితే ఈ స్టైల్‌లో నుదుటిపై  జుట్టు పడే స్టైల్ మాత్రం ఆయన ఆలోచననే అని క్రెడిట్‌ మొత్తం హీరో విజయ్‌కే ఇచ్చాడు. అంతేగాదు ఆయ హెయిర్‌ని సరిచేస్తున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉంటారని అన్నాడు. అలాగే సెట్‌లో ప్రతిఒక్కర్ని శ్రద్ధగా చూసుకుంటారని, అందరితోటి చాలా సౌమ్యంగా మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. చివరగా యవతరం హెయిర్‌స్టైలిస్ట్‌లకు చక్కటి చిట్కాలే కూడా సూచించాడు

    కేవలం హెయిర్‌స్టైల్స్ మాత్రమే నేర్చుకోకండి , మనుషులను అర్థం చేసుకోవడం, వారి వ్యక్తిత్వం, కెమెరా కోణాలు, ఫ్యాషన్ ఉనికిని క్యాచ్‌ చేయడం వంటి వాటిపై  పట్టు తెచ్చుకుంటేనే మన నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతీ సీజన్‌లో ట్రెండ్‌లు మారుతుంటాయి కానీ మీ ప్రత్యేకత, వృత్తి నైపుణ్యమే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టేలా పేరుని తెచ్చుపెడుతుందని అన్నాడు. 

    (చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్‌)
     

  • పేదింటి బిడ్డ ప్రమీలాకు చదువు అంటే ఇష్టం. తన మాతృభాష బంజార భాష అంటే ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను లిపి లేని బంజార భాష వ్యాకరణంపై పరిశోధన చేసేలా చేసింది. నల్గొండ జిల్లా, తిరుమలగిరి నేతపురి ధన్సింగ్‌ తండాకు చెందిన మేగవత్‌ ప్రమీల ‘బంజారా భాషకు తెలుగులో రాసిన వర్ణనాత్మక వ్యాకరణం’పై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన తొలి వ్యక్తి కావడం విశేషం. మారుమూల తండాలో పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ప్రమీల చిన్నతనం నుంచే కూలీపనులు చేసేది. 

    ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించి ఇంటర్‌ కాలేజీ టాపర్‌గా నిలిచింది. కోఠి మహిళా కాలేజీలో(వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ)లో డిగ్రీ, ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసింది. 2017లో యూజీసి నెట్, జేఆర్‌ఎఫ్‌ సాధించింది. 

    ‘తెలంగాణ జిల్లాలలోనే బంజార భాషల్లో ఎంతో వైవిధ్యం ఉంది. ఆయా జిల్లాలలోని బంజారాలు మాట్లాడే భాషను తెలుగులో రాసుకుని వాటికి వ్యాకరణం రాయాల్సి వచ్చింది. అంతరించి పోతున్న బంజార భాష సంరక్షణకు నా వంతుగా కృషి చేయాలనే ఉద్దేశంతో నా మాతృభాషకు సంబంధించిన పరిశోధన అంశాన్ని ఎంచుకున్నాను. 

    బంజార భాషలోని విభిన్న శైలులను  ఏకం చేసేందుకు చేసిన చిన్న ప్రయత్నం ఇది. బంజారాలు మాట్లాడే భాష, యాసలకు ఒక రూపాన్ని ఇవ్వడం ద్వారా దాని సంరక్షణకు నా పరిశోధన కొంత మేరకు ఉపయోగపడనుంది’ అంటుంది ప్రమీల.
    – సుధాకర్‌ కంతి, సాక్షి, లాలాపేట  

  • శిశువులను సరిగ్గా ఎత్తుకోవడం నుంచి వారి ఆలనాపాలన వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ‘అది చెబితే అర్థమయ్యే కష్టం కాదు. స్వయంగా తెలుసుకోవాలి’ అంటూ తూర్పు చైనాలోని యువాన్‌జోంగ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ వినూత్నమైన ప్రయోగం చేసింది. శిశువులను చూసుకోవడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించే ప్రయత్నంలో భాగంగా రోజంతా బొమ్మ శిశువును చూసుకోవాలని అసైన్‌మెంట్‌ ఇచ్చింది. 

    అల్లరి పనులు చేసే, గేమింగ్‌ వ్యసనానికి బానిసైన, చదువుపై ఆసక్తి లేని విద్యార్థులను సరిౖయెన దారిలోకి తీసుకురావడం ఈ పాఠశాల ప్రత్యేకత.స్కూల్‌లో విద్యార్థులు బొమ్మ శిశువులను తమ వీపుపై మోస్తారు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పట్టుకొని ఉంటారు. నిజమైన శిశువులలాగే వాటిని చూసుకోవాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. 

    శిశువులకు సంబంధించి తల్లిదండ్రులు ఎదుర్కొనే శారీరక శ్రమను విద్యార్థులకు అర్థం చేయించడానికి ఒక్కొక్కరికి 2.5 కిలోల బరువు ఉన్న బొమ్మ ఇచ్చారు. ‘ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు యువాన్‌ జోంగ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌.

    (చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్‌)


     

  • ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్‌ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ చేరిపోయారు. ఏకంగా తమ దేశీయలు భారత్‌నుంచి ఈ విలవలు నేర్చుకోవాలంటూ ఓ లిస్ట్‌ చెప్పారామె. ఏంటా విలువలంటే..

    ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న లిథువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువలు గురించి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మోనికా కుంజేశ్వరి దాసి భారత్‌లో నివశించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాలు గురించి మాట్లాడారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టిపారేస్తారు. 

    కానీ భారత్‌లోని చిన్న చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల్లో ఉన్న విలువలు యూరప్‌ చాలా వేగంగా కోల్పోతోందని అన్నారామె. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ ఇదే ముమ్మాటికీ నిజం అని అంటున్నారామె. "ఏళ్ల తరబడి భారత్‌లో నివసించాక తెలుసొచ్చిందేంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి నుంచి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి" అంటూ క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌లో ఆ విలువల జాబితాను పంచుకున్నారామె

    యూరోపియన్లు తప్పక నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు..

    ఆతిథ్యం: 'అతిథి దేవో భవ' అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు దాసి. దీని అర్థం 'అతిథి దేవుడితో సమానం'. భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారామె.

    కమ్యూనిటీ: యూరప్‌లో కమ్యూనిటీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువ ఇస్తారని దాసి అన్నారు. "ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగుపొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే, సహాయం చేయడానికి సాధారణంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారామె.

    ఆహారం, వంట: ఆహారం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడమే సర్వసాధారణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఇష్టపడతారు.

    పరిశుభ్రత: భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారని ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, పైగా చుట్టపక్కల వారిపట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామె.

    ఆనందం: భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక కారణం ఏదీ అవసరం లేదని ఆ లిథువేనియన్ మహిళ నొక్కి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్‌ వేని, యూరప్‌ అది పూర్తిగా మర్చిపోయి.. గంభీరంగా అయిపోయిందని అన్నారు. 

    కాగా, నెటిజన్లు ఆమె పోస్టుని చూసి భారతదేశంలోని సానుకూల అంశాలను అందంగా చెప్పినందుకు ధన్యవాదాలు. మా విలువల పట్ల మీ సూక్ష్మమైన పరీశీలనకు గౌరవాభినందనలు అంటూ పోస్టులు పెట్టారు.

    (చదవండి: 

     

  • వాడుక భాషలో అడవి ద్రాక్షకు వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లున్నాయి: అస్సామీలో గోవాలియా లత, పానిలత అని, ఇంగ్లీష్‌ లో వైల్డ్‌ గ్రేప్, జంగల్‌ అంగూర్, దిబ్రోలి అని, ఒరియాలో పనికచో, పానినోహ, దిబ్రోయి, కంజినోయి, పానిపరు అని, కన్నడలో చితహంబు, కడుద్రాక్ష, కట్టుకోడి మిండ్రి అని, గుజరాతీలో జంగ్లీ డ్రక్‌ అని, తెలుగులో అడవి ద్రాక్ష, అడవి తీగ ద్రాక్ష, బెడసతివ్వ, దొబ–తీగ, పుల్ల తీగ, బెంగాలీ లో గొవాలియా–లత అని, మరాఠీలో ఒకేల, నడెన, రాన్‌ ద్రాక్ష గోలింద్‌ అని, మలయాళంలో వియ–పిర–పిటిచ, కరంట వల్లీ, చంబ్రవల్లీ అని, హిందీలో గొలిండ, కట్టిబేల్, పనిబేల్‌ అని, సంస్కృతంలో ఆమ్ల వెటసహ, వన ద్రాక్ష అని అంటారు. నేపాలీలో పురేని అంటారు. 

    పూత : మే – ఆగస్టు పండ్లు : డిసెంబర్‌ – జనవరి

    దీనికి 1824లో ‘విటిస్‌ లాటి ఫోలియా’ అనే శాస్త్రీయ పేరు పెట్టిన 60 ఏళ్ల తర్వాత ‘అంపెలోస్పిస్‌ లటిఫోలియా’గా పేరు మార్చారు. వీటి పండ్లు ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉంటాయి. పండిన తర్వాత ఎరుపు నలుపు రంగుకు మారుతాయి.

    English Name:
    Wild Grape/Jungal Angoor
    శాస్త్రీయ నామం: అంపేలో సిస్సన్‌ లటిఫోలియా

    Scientific Name: 
    Ampelocissus latifolia (Roxb.) Planch.

    Synonym (s): 
    Vitis latifolia Roxb. 
    Cissus latifolia (Roxb.) Walp.

    కుటుంబం: విటేసి
    Family: Vitaceae

    ఉనికి: 
    ద్రాక్ష మాదిరిగానే దీనికి కూడా పాకుడు గుణం ఉంది. వీటికి వేరు గడ్డలు ఉంటాయి. గడ్డలు నాటుకోవచ్చు లేదా∙విత్తనం కూడా వేసుకోవచ్చు. ఎంతో విలువైన తీగ చెట్టు. ఈ పండ్లలో 2–4 గింజలు ఉంటాయి. ఈ తీగ చెట్టు స్వస్థలం భారత ఉపఖండం, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మాల్దీవులు మొదలగు దేశాలలో గుర్తించారు.

    మన దేశంలో ఎక్కువగా అస్సాం, ఈస్ట్‌ హిమాలయాల వరుస, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో అడవి ద్రాక్ష కనిపిస్తుంది. అధిక వర్షపాతం ఉన్న అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. నల్లమల అడవుల్లో ఒకప్పటి సాంద్రత ప్రస్తుతం లేదు. దీనిపై ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగినప్పటికీ దీని ప్రయోజనాలు ప్రజల చెంతకు చేరలేదు.

    ప్రయోజనాలు

    అడవి ద్రాక్ష పండ్లు తినదగినవే. ఇవి సాధారణ ద్రాక్ష గుత్తుల్లాగే మొదట ఆకుపచ్చగా ఉండి ఎరుపునకు మారి ఆ తరువాత నలుపు రంగుకు మారతాయి. వగరు తీపితో కూడుకొని ఉంటాయి.

    ఈ తీగ చెట్టుకు ఔషధగుణాలు ఉన్నాయి.

    ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటిని తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

    వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. 

    ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి.

    అనేక రోగాలను తగ్గించటానికి నాటు వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, గౌట్, టీబీ అజీర్తి, శరీరపు వీక్‌ నెస్‌ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.

    ఎముకల పటిష్టతకు ఉపయోగిస్తారు.

    ఆయుర్వేద, హోమియో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. 

    ఈ తీగ చెట్ల వినియోగం తప్ప భద్రపరచడం తక్కువ కాబట్టి రానున్న రోజుల్లో ఈ జాతి అంతరించే ప్రమాదం ఉంది.

    దీనిపై నిర్దిష్టమైన పరిశోధనలు చేసి ఫలితాలను రైతుల చెంతకు చేర్చితే అనేక విధాలుగా లబ్దిపొందవచ్చు. అంటు ద్రాక్ష మొక్కల తయారీకి వీటి కొమ్మలను రూట్‌ స్టాక్‌గా వాడవచ్చు.ఈ పండ్లలో ఆల్కేన్‌ ఈస్టర్స్, అమెన్స్‌, కిటోన్స్‌, హల్డే హైట్స్‌ తదితర ఆమ్లాలు ఉంటాయి. 

    డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
    విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
    ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
    రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
    మొబైల్‌: 94407 08924 

    నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్‌ 
     

    (చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!)
     

Politics

  • తాడేపల్లి : తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు చంద్రబాబు వద్ద  సమాధానమే లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలే చేశారని, చంద్రబాబు మాదిరి ఎప్పుడూ హత్యా రాజకీయాలు జగన్‌ చేయలేదన్నారు జూపూడి.  వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌ పేరు వింటే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. 

    ఈరోజు(శుక్రవారం, మే 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జూపూడి.. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్న బాబు.. ఇప్పుడేమో పిల్లల్ని కని సంపద సృష్టించండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

    ‘ఈ రెండేళ్లలో జగన్ అనేక ప్రజా సమస్యలను ఎత్తిచూపారు. చంద్రబాబు మాత్రం ప్రజలను వదిలేసి  పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవటం మానేశారు. జగన్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. వాళ్ళు ఎలా గెలిచారో పరకాల ప్రభాకర్‌ను అడిగితే చెప్తారు.  ఎన్నికల ముందు సంపద సృష్టిస్తాం అన్నారు. ఇప్పుడు పిల్లల్ని కని సంపద సృష్టించండి అంటున్నారు..

    కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. జగన్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో అచ్చెన్నాయుడు ఆయన సొంత పార్టీ గురించి ఎలా మాట్లాడారో అందరూ చూసారు. ప్రజలకి ఇచ్చిన మానిఫెస్టో అమలు చేయమని చెప్పటం తప్పా. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసినందుకు జగన్ అబద్ధాల కోరు అవుతారా ?, జగన్ క్యారెక్టర్‌ను దెబ్బతీయటం కోసం అనేక కథలు అల్లటం మీకు అలవాటు. జగన్ సూచించిన మావిగన్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వ పెద్దల గుండెలు జారిపోతున్నాయి’ అని పేర్కొన్నారు.

NRI

  • డాలస్‌లోని తెలుగు ప్రజల సగౌరవ వేదిక ‘తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD)’.. స్ప్రింగ్ ఫెస్ట్‌ను వైభవంగా నిర్వహించింది. డాలస్ మెట్రోప్లెక్స్ మధ్యలో ఉన్న ‘ది కాలనీ’ నగరంలోని గ్రాండ్‌స్కేప్‌లో జరిగిన ఈ వేడుక రెండు వేలకుపైగా జనంతో సందడిగా సాగింది. వెండర్ బూత్‌లు, ఉచిత 360 స్టూడియో, ఫేస్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలతో పిల్లలు, యువత థ్రిల్ ఫీలయ్యారు. కళాశాల విద్యార్థుల డ్యాన్స్ షోకు చప్పట్లు మారుమోగాయి. లైవ్ బ్యాండ్ మ్యూజిక్, రకరకాల ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఈ స్ప్రింగ్ ఫెస్ట్ ను ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేశారు.

    గ్రాండ్ స్కేప్ లో ఫుడ్ స్టాల్స్, ఐస్‌క్రీమ్ షాపులు ప్రత్యేకంగా కనిపించాయి. పలు ఆటలు, టాయ్ షాపుల వద్ద  పిల్లలు ఉత్సాహంగా కనిపించారు. టీపాడ్ స్పెషల్ అయిన రాఫెల్ డ్రా బహుమతులతో జోష్ నింపింది.

    జాతీయ గీతాలతో ప్రారంభం
    అమెరికా, భారత జాతీయ గీతాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), రవికాంత్ మామిడి (BOT చైర్మన్), రఘువీర్ బండారు (ఫౌండేషన్ చైర్మన్), లింగారెడ్డి అల్వా (కోఆర్డినేటర్) స్వాగతం పలికారు. యాంకర్ వీణ యలమంచిలి కార్యక్రమాన్ని షోను రన్ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు, మీడియా సంస్థలకు టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. స్ప్రింగ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

    (చదవండి: తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా)

Yadadri

  • శాలిగౌరారం : శాలిగౌరారం పోలీస్‌ స్టేషన్‌కు తృటిలో ముప్పు తప్పింది. గురువారం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పంట పొలాల్లో వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా.. ఆ మంటలు స్టేషన్‌ వర కు సమీపించాయి. గమనించిన ఎస్‌ఐ సైదులుతో పాటు పోలీసు సిబ్బంది, స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలు ఆర్పివేయకుంటే పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు దగ్ధమయ్యేవి. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సైదులు పేర్కొన్నారు.

    స్టేషన్‌ సమీపంలో వరి కొయ్యలకు

    నిప్పుపెట్టడంతో సమీపించిన మంటలు

    సకాలంలో స్పందించి మంటలు

    ఆర్పేసిన పోలీసులు

  • క అడవిలో ఒక సింహం చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చి, సరదాగా సింహం శరీరంపైకి ఎక్కి అటు ఇటు పరుగెత్తసాగింది. దాంతో సింహానికి నిద్రభంగం కలిగి, కోపంతో ఆ ఎలుకను తన పంజాతో గట్టిగా పట్టుకుంది. ఎలుక భయంతో వణుకుతూ, ‘మహారాజా! నన్ను క్షమించండి. తెలియక తప్పు చేశాను. నన్ను చంపకండి, నన్ను వదిలేస్తే ఎప్పటికై నా మీ ఆపదలో నేను మీకు సహాయం చేస్తాను’ అని వేడుకుంది. అంత చిన్న ఎలుక తనకు సహాయం చేయడం ఏమిటని సింహం నవ్వి, జాలితో దాన్ని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత, ఆ సింహం ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. వల నుంచి బయటపడలేక అది గట్టిగా గర్జించసాగింది. ఆ గర్జన విన్న ఎలుక వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరికేసింది. అలా సింహం వల నుండి విముక్తి పొందింది. ఆ రోజు నుండి సింహం, ఎలుక మంచి స్నేహితులయ్యాయి.

    నీతి : ఎవరినీ వారి పరిమాణాన్ని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. మనం చేసే చిన్న సహాయం కూడా ఎప్పటికై నా మనకు మేలు చేస్తుంది.

  • భూదాన్‌పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన వ్యక్తి 45 రోజుల తర్వాత గురువారం మృతిచెందాడు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు గుండ్ల నర్సింహ (42) జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 45 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బంధువుల పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి ఇంటికి వస్తుండగా రాయపోల్‌ గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపిన కారు డ్రైవర్‌ అకస్మాత్తుగా డోరు తెరవడంతో నర్సింహ తగిలి కిందపడ్డాడు. అతడి తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సుమారు రూ.8 లక్షలు అప్పు చేసి చికిత్స చేయించినా నర్సింహ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో వారం క్రితం అతడిని ఇంటికి తీసుకొచ్చారు. గురువారం నర్సింహ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

  • నాగార్జునసాగర్‌ : భూమిపై ఉన్న అన్ని జీవరాశులు, వాటి జన్యువులు, జీవావరణ వ్యవస్థల సమాహారమే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం వల్లనే మానవ మనుగడ సాగుతుంది. కానీ ఆ మనిషి చేసే తప్పిదాల వలనే జీవ వైవిధ్యం ఎన్నడూ లేనంత ముప్పును ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ప్రకృతి సహజంగా సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే అంతరించేదని, కానీ ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి కనుమరుగవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు తదితర కారణాలతో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. పురుగు మందులు, పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నదుల్లో కలువడం వల్ల జలచరాలు నశిస్తు్‌ాన్నయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. భూమి కాలుష్యం కారణంగా వానపాముల వంటి ఉపయోగకర జీవులు కూడా కనుమరుగవుతుతన్నాయి.

    జీవ వైవిధ్యానికి పులి ఒక సంకేతం..

    అడవుల్లో పులుల ఉనికి అక్కడి జీవ వ్యవస్థ సమతుల్యతను సూచిస్తుంది. పులుల సంఖ్య తగ్గిపోవడం జీవ వైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తారు. అడవుల నరికివేత, అక్రమ వేట, గనుల తవ్వకాలతో పులుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. పులుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా టైగర్‌ రిజర్వ్‌లు ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపట్టింది.

    నల్లమల టైగర్‌ రిజర్వ్‌..

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌గా ఉన్న నాగార్జునసాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యం నల్లమల అడవుల్లో విస్తరించి ఉంది. ఇది జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఈ అభయారణ్యం 3,568 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇది అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌గా పేరు మారింది.

    మానవ తప్పిదాలతో దెబ్బతింటున్న

    జీవ వ్యవస్థ సమతుల్యత

    ప్రకృతిని కాపాడుకుంటేనే

    మానవ మనుగడ సాధ్యమంటున్న

    పర్యావరణవేత్తలు

    నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

    అతిపెద్ద అభయారణ్యం తెలంగాణలోనే..

    తెలంగాణలో అటవీ ప్రాంతం 2,611.39 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో కోర్‌ ఏరియా 2,166.37 చదరపు కిలోమీటర్లు కాగా.. బఫర్‌ జోన్‌ 445.02 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. కోర్‌, బఫర్‌ ఏరియాలో అడవిని వ్యవసాయ భూములుగా మార్చిన చోట ప్రభుత్వాలు గిరిజనులకు పట్టాలు ఇస్తూ వచ్చారు. వేల ఎకరాల్లో అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చారు. గత ప్రభుత్వం హరితహారం పేరుతో చాలా చోట్ల మొక్కలను నాటి ప్రకృతి వనాలను పెంచింది. కానీ అవి సరిపోయే పరిస్థితితో లేవు. ప్రతి వ్యక్తి ఏడాదికో మొక్కను నాటి సంరక్షిస్తేనే అడవులు అంతరించినా గ్రామాలు, పట్టణాల్లో చెట్లు పెరిగి జీవ వైవిధ్యం సాధ్యమవుతుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడి, ప్రకృతిని రక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు సురక్షిత జీవనం సాధ్యమవుతుంది. ఇందు కోసం విద్యార్థులు మొక్కలు నాటేలా పాఠశాలల్లో అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, అడవులను సంరక్షించడం మనమందరం భాగస్వాములు కావాలి. అప్పుడే మానవ మనుగడ సాధ్యమవుతుంది.

  • నడిగూడెం : మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో సాగర్‌ ఎడమ కాల్వ కట్టపై రైతులు ఏర్పాటు చేసుకున్న నాలుగు విద్యుత్‌ మోటార్లను బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గురువారం ఉదయం గమనించిన బాధిత రైతులు చిన్న రామయ్య, చెన్నయ్య, రామ్మూర్తి, ప్రకాశం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక్కో విద్యుత్‌ మోటారు విలువ రూ.40 వేలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు.

    మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

    కొండమల్లేపల్లి : మండలంలోని చింతకుంట్ల గ్రామం నుంచి ఎర్ర మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను గురువారం కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఎర్ర మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించి వాహనాలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ తెలిపారు.

    బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

    సూర్యాపేటటౌన్‌ : బైక్‌ను ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన చెరుకు శ్రీను కుమారుడు చెరుకు గణేష్‌(19) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం పని నిమిత్తం గణేష్‌ బైక్‌పై ఖమ్మం క్రాస్‌ రోడ్డులోని అమ్మ గార్డెన్‌ వైపు వెళ్తుండగా.. ఖమ్మం నుంచి సూర్యాపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న గణేష్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్‌కు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట పట్టణ పోలీసులు తెలిపారు.

    గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

    అనంతగిరి : కోదాడ సమీపంలోని తమ్మర గ్రామ శివారులో కోటేశ్వరమ్మ చేపల మార్కెట్‌ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని, తెల్ల పూలు కలిగిన బూడిద రంగు చొక్కా, నీలం రంగు జీన్స్‌ ప్యాంట్‌, తెలుపు రంగు బనియన్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు కోసం ఎదురుచూస్తూ మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 86046 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

  • నాకు నచ్చిన పుస్తకం

    హాయ్‌ ఫ్రెండ్స్‌.. నా పేరు మునం ఫాతిమా. మాది నల్లగొండ. నేను 8వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో నేను డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆత్మకథ ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ పుస్తకాన్ని చదువుతున్నాను. ఈ పుస్తకం నాకు బాగా నచ్చింది. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి, మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన ఆయన ప్రయాణం మానవీయ విలువలకు అద్దం పడుతుంది. కలాం తన చదువు కోసం ఎన్ని కష్టాలు పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు. తన చదువుకు, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం చిన్నప్పుడే ఆయన పత్రికలు పంచారు. విద్యార్థి అద్భుతాలు సృష్టించడంలో, ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో ఈ పుస్తకంలో ఉంది. తన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్‌ .. పక్షులు ఎలా ఎగురుతాయో సముద్ర తీరంలో ప్రాక్టికల్గా చూపించి ఆయనలో సైన్స్‌ పట్ల ఆసక్తిని ఎలా రగిలించారో కలాం ఇందులో రాసుకున్నారు. ఉన్నత పాఠశాలలో అయ్యాదురై సోలమన్‌ లాంటి గురువులు తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపారో చదివితే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రామేశ్వరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాల మధ్య ఉన్న సోదరభావం, మనుషుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాలు కలాం వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో ఈ ఆత్మకథలో అద్భుతంగా ఆవిష్కరించారు. సమాజంలోని మంచి వ్యక్తుల ప్రభావం ఒక గొప్ప పౌరుడిని ఎలా తయారు చేస్తుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇస్రోలోఎస్‌.ఎల్‌.వి–3 ప్రాజెక్టు మొదటి సారి విఫలమైనప్పుడు అప్పటి చైర్మన్‌ సతీష్‌ధావన్‌ ఆ వైఫల్యం బాధ్యతను తాను తీసుకొని మరుసటి ఏడాది అదే ప్రాజెక్టు విజయవంతమైనప్పుడు ఆ క్రెడిట్‌ కలాం బృందానికి ఎలా ఇచ్చారో వివరించారు. ఫ్రెండ్స్‌ మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవుతారు కదూ..

  • నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీకి చెందిన మొహరున్నీసా బేగం(34)కు పురిటి నొప్పులు రావడంతో బుధవారం రాత్రి 10 గంటలకు ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరైన డాక్టర్‌ అందుబాటులో లేడని చెప్పి ఆస్పత్రి సిబ్బంది కనీస వైద్య పరీక్షలు చేయకుండానే నల్ల గొండ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. చేసేదేమీ లేక 108 అంబులెన్స్‌లో నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రాకేష్‌, పైలెట్‌ గణేష్‌ కలిసి ప్రసవం చేయడంతో మొహరున్నీసా బేగం మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే వారికి అక్కడి సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండానే నల్లగొండ లేదా హైదరాబాద్‌కు ఎక్కువగా రెఫర్‌ చేస్తున్నారని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

    విచారణ చేపడతాం : ఆస్పత్రి సీఎంఓ హరికృష్ణ

    రాత్రి సమయంలో గర్భిణికి ప్రసవం చేయకుండా నల్లగొండకు ఎందుకు రెఫర్‌ చేశారో విచారణ చేపడతాం. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

    అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ

  • మిర్యాలగూడ అర్బన్‌ : చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నలుగురు దొంగలను మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం డీఎస్పీ రాజశేఖర రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 28న మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెంలో బైసిని లక్ష్మమ్మ నిర్వహిస్తున్న కిరాణా దుకాణం వద్దకు హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన సూరోజు భార్గవచారి, మిట్టగూడెం గ్రామానికి చెందిన పఠాన్‌ అశ్రఫ్‌ వచ్చారు. వారిద్దరు లక్ష్మమ్మ దుకాణంలో మద్యం సేవించి రూ.500 నోటు ఆమెకు ఇచ్చారు. చిల్లర కోసం లక్ష్మమ్మ ఇంట్లోకి వెళ్లగా.. వెనకాలే ఇద్దరు నిందుతులు కూడా వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అప్పటికే గ్రామ శివారులో బైక్‌పై వేచి చూస్తున్న హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారం గ్రామానికే చెందిన దండగల వినోద్‌కుమార్‌, శివనాగ మల్లికార్జునరావుతో కలిసి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన బంగారు గొలుసును విక్రయించేందుకు గురువారం నలుగురు నిందితులు మిర్యాలగూడకు వస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు గొలుసుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందుతులు మార్చి 21న చింతపల్లి గ్రామంలో గుంపుల సైదులు అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగిలించినట్లు పేర్కొన్నారు. డీఎస్పీ వెంట రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మయ్య ఉన్నారు.

  • నల్లగొండ : మానసిక స్థిఽతి సరిగ్గా లేని ఓ యువకుడు గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం నల్లగొండ–శ్రీరాంపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగింది. నల్లగొండ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ అభినవ్‌కుమార్‌, రైల్వే ఎస్‌ఐ బి. రామకృష్ణ తెలిపారు. చండూరుకు చెందిన ఇడుకుడి శ్రవణ్‌ (23) మానసిక స్థితి సరిగ్గా లేదు. అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న అతడు నల్లగొండ–శ్రీరాంపూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

    నీటి కుంటలో పడి గల్లంతు

    మర్రిగూడ(చింతపల్లి) : నీటి కుంటలో పడి యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ముసరాంబాగ్‌కు చెందిన సయ్యద్‌ బుఖారి సఫ్ఫాన్‌(17) తన ఇద్దరు స్నేహితులో కలిసి కిష్టరాయినిపల్లి గ్రామ శివారులోని నీటి కుంట వద్ద ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బుఖారి సఫ్ఫాన్‌ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. అతడి స్నేహితులు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తన సిబ్బందితో కుంట వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

  • వేసవికాలంలో ఒకరోజు ఎండ మండిపోతోంది. ఒక కాకికి విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం అది ఎగరని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు. ఎంత వెతికినా దానికి ఎక్కడా చుక్క నీరు దొరకలేదు. ఎండ వేడికి నీరసంతో ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది. అలా ఎగురుతూ ఉండగా, ఒక ఇంటి పెరటిలో దానికి కుండ కనిపించింది. ఆశగా వెళ్లి చూసింది. కుండలో నీళ్లు ఉన్నాయి కానీ, అవి చాలా అడుగు భాగాన ఉన్నాయి. కాకి ముక్కు ఆ నీటి వరకు చేరడం లేదు. నీరు ఎలా తాగాలా అని కాకి తీవ్రంగా ఆలోచించింది. కుండను వంచడానికి ప్రయత్నించింది, కానీ కుండ బరువుగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. చుట్టూ చూస్తే దానికి కొన్ని చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. వెంటనే కాకికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక్కొక్క రాయిని తన ముక్కుతో కరుచుకుని తెచ్చి, ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది. రాళ్లు పడుతున్న కొద్దీ కుండలోని నీరు నెమ్మదిగా పైకి రాసాగింది. ఎంతో ఓపికగా చాలా రాళ్లు వేసిన తర్వాత, నీళ్లు పైకి వచ్చాయి. కాకి సంతోషంగా ఆ నీటిని తాగి, దాహం తీర్చుకుని హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది.

    నీతి : పట్టుదల, సరైన ఉపాయం ఉంటే ఎంత కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చు. ప్రయత్నం ఎన్నటికీ వృథా పోదు.

Rangareddy

  • సాక్షి, సిటీబ్యూరో/ఎల్‌బీనగర్‌/నాగోలు: జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఎంఎంసీ కమిషనర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం నాగోలులో నిర్వహించిన ఎంఎంసీ టౌన్‌హాల్‌ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధుల డిమాండ్‌కనుగుణంగా శుక్రవారం అన్నిపార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును పరిశీలించనున్నట్లు తెలిపారు. డంపింగ్‌యార్డు సమస్య పరిష్కారానికి నగరానికి నాలుగువైపులా స్థలాల్ని గుర్తించామన్నారు. అందరూ సహకరిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. గతంలో మల్కాజిగిరి ఎంపీగా చేసిన ముఖ్యమంత్రికి డంపింగ్‌యార్డు సమస్య తెలుసని, ప్రస్తుతం మున్సిపల్‌శాఖ కూడా ఆయన వద్దే ఉన్నందున సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. చీఫ్‌విప్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి పరిధిలో సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి తగిన నిధులివ్వాల్సిందిగా సీఎంను కోరతానన్నారు. మూడు కార్పొరేషన్ల చెత్త ఒకేచోట వేయడం అన్యాయమని మాజీ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.

Sangareddy

  • కంగ్గి(నారాయణఖేడ్‌): డీలర్లు నాణ్యమైన ఉత్పత్తులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు, విత్తనాలు రైతులకు విక్రయించాలని ఖేడ్‌ ఏడీఏ నూతన్‌ కుమార్‌ సూచించారు. మండల కేంద్రం కంగ్టిలోని రైతు వేదికలో గురువారం ఏర్పాటు చేసిన డీలర్ల సమావేశంలో ఏఓ హరీశ్‌ పవార్‌తోపాటు ఆయన పాల్గొని మాట్లాడారు. నిషేధిత పత్తి విత్తనాలు అమ్మినా, నిల్వలు ఉంచినా, అనధికార ఎరువుల నిల్వలు ఉన్నా సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సైతం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.

    నారాయణ కళాశాలను

    సీజ్‌ చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

    సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పర్మిషన్‌ లేకుండా అడ్మిషన్స్‌ తీసుకుంటున్న నారాయణ కళాశాలను సీజ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్‌, సతీశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల యాజమాన్యం బిల్డింగ్‌ పూర్తి కాకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్‌లు తీసుకుంటున్నారన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారులు జోక్యం చేసుకుని సదరు కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వాణి నాయకులు సాయి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

    కుల సంఘం పేరిట

    సంపాదన సరికాదు

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): కురుమ సంఘం పేరుతో కొందరు పదవులు, ఆస్తులను సంపాదించడం సరికాదని రాష్ట్ర కురుమ సంఘం ప్యానల్‌–2 హితవు పలికింది. రామచంద్రాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు శ్రీనాథ్‌, బీర్ల శ్రీనివాస్‌, కరికే సత్యనారాయణ, సురేశ్‌ మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ మల్లేశం కురుమ సంఘాన్ని తన సొంత లాభాల కోసమే వాడుకున్నారని ఆరోపించారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం కురుమ సంఘానికి పదెకరాల భూమి, రూ.10కోట్ల నిధులను కేటాయించిందని గుర్తు చేశారు. అయితే పదవుల కోసం ఐదెకరాల భూమిని, రూ.5కోట్లను ఇతరులకు ధారాదత్తం చేశారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న రాష్ట్ర కురమ సంఘం ఎన్నికల్లో ప్యానల్‌2 నుంచి తాము బరిలో ఉంటామని వారు తెలిపారు.

    వేగంగా ధాన్యం కొనుగోళ్లు

    వెల్దుర్తి(తూప్రాన్‌): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. గురువారం మాసాయిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై వివిధశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏ ర్పాట్లు, రైతులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం గ్రామ శి వారులోని ఓ రైస్‌మిల్లును సందర్శించారు. కా ర్యక్రమంలో తహసీల్దార్‌ జ్ఞానజ్యోతి, ఎంపీడీ ఓ విఘ్నేశ్వర్‌, గిర్దావర్‌ ధన్‌సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.