Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. పెద్దిపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు లుక్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు  ఈ సినిమాలో చరణ్‌కు మూడో లుక్ కూడా ఉందని తెలుస్తోంది. కానీ దాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్‌ ఫిట్‌నెస్‌ ట్రయినర్ వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.

    పెద్ది సినిమా తొలి టీజర్‌లో చరణ్ పల్లెటూరి క్రికెటర్‌గా కనిపించాడు. ఇటీవల పెద్ది పహిల్వాన్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ రెండూ మాత్రమే కాకుండా చరణ్‌కు ఈ చిత్రంలో మరో లుక్ కూడా ఉందనేది తాజా సమాచారం. ఈ మూడో లుక్‌ మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ పెద్ద సర్‌ప్రైజ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

    ఇక ఇదిలా ఉంటే.. మరోవైపు పెద్ది విడుదల తేదీపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు జూన్ చివరి వారం రిలీజ్ అని ప్రకటించాడు. కానీ ఇప్పుడు కొత్త ఊహాగానం చెలరేగుతోంది. టాక్సిక్ విడుదల వాయిదా పడటంతో ఆ తేదీకి, అంటే జూన్ 4వ తేదీకి పెద్ది వస్తుందనే ప్రచారం మొదలైంది.

    చరణ్-జాన్వి కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. ఏఆర్‌ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
     

  • బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటేస్ట్ మూవీ కర్తవ్య. ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీకి పులకిత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షారుక్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ నిర్మించారు. తాజాగా ఈ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ డేట్‌పై రూమర్స్ రాగా.. అధికారిక ప్రకటన వచ్చేసింది. 

    ఈ చిత్రాన్ని మే 15 నుంచి ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాని విధి వర్సెస్‌ కర్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీలో పోలీసు అధికారి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.  

  • కోలీవుడ్ స్టార్ విక్రమ్ సినిమాకు దాదాపు పదేళ్ల తర్వాత మోక్షం లభించింది. ఆర్థిక వివాదాలతో వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు మార్గం సుగమమైంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ధృవనక్షత్రం రిలీజ్‌కు మద్రాస్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్‌ 15 లోపు విడుదల చేసుకునేలా వీలు కల్పించింది. కొండాడువోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని సూచించింది. దీని ద్వారానే ఈ సినిమాకి సంబంధించిన  లావాదేవీలు జరగాలని కోర్టు ఆదేశించింది.

    దీంతో 2016లో ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మొదట 2017లోనే విడుదల చేయాలని డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌  యత్నించారు. కానీ ఆర్థిక పరమైన చిక్కులతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2023లోనూ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్‌ మీనన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ సంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.  ఆ డబ్బు తమకు తిరిగి ఇవ్వలేదని.. ఆయన ధృవ నక్షత్రం సినిమా విడుదలపై నిషేధం విధించాలని నిర్మాణ సంస్థ కోర్టును కోరింది. ఈ వివాదంతో ధృవనక్షత్రం మరోసారి వాయిదా వేయాల్సి ఉంది.

    ఆ తర్వాత  కూడా 2024లో జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం మరోసారి సంకేతాలిచ్చింది. కానీ అప్పుడు కూడా ఆ విడుదల కాలేదు. అలా ఇ‍ప్పటికే పలుసార్లు పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో విక్రమ్‌, వినాయకన్, రీతూ వర్మ, పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. 
     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారం బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ నుంచి జెట్లీ బరిలో ఉన్నాడు. కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో పాటు ధనుశ్ కర సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ఈ రెండు మూవీస్ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించనున్నాయి.

    ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ నుంచి బైకర్, రాకాస లాంటి సినిమాలు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ-2 సైతం రేపటి నుంచే ఓటీటీలో అలరించనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా మరిన్ని కొన్ని సినిమాలు సడన్ స్ట్రీమింగ్ అ‍య్యే ఛాన్స్ కూడా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20 సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్

    •  బైకర్ (తెలుగు మూవీ) - మే 01

    •  రాకాస (తెలుగు సినిమా) - మే 01

    •  గ్లోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 01

    • స్వాప్‌డ్(యానిమేషన్ మూవీ)- మే 01

    • మై డియరెస్ట్ సెనోరిటా(హాలీవుడ్ సినిమా)- మే 01

    • బే బ్లాడెక్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మే 01

    • మై ఫేవరేట్ వెడ్డింగ్(హాలీవుడ్ మూవీ)- మే 01

    • సన్‌ ఇన్‌ లా(హాలీవుడ్ మూవీ)- మే 01

    • యూ ఆల్వేస్(హాలీవుడ్ సినిమా)- మే 01

    • బుబా సీజన్-6(హాలీవుడ్ సిరీస్)- మే 01

    • పార్ట్‌టైమ్ వైఫ్(హాలీవుడ్ సిరీస్)- మే 03

    • క్లీకా (హాలీవుడ్)- మే 03


    ఆహా

    • సోదర(తెలుగు మూవీ)- మే 01


    అమెజాన్ ప్రైమ్

    •   సప్నే vs ఎవ్రీవన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 01

    •  యూ ఆర్‌ డేటింగ్‌ ఏ నార్సిస్ట్(హాలీవుడ్ సినిమా)- మే 01

    జీ5

    • ద కేరళ స్టోరీ 2 (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 01

    • ఆడు 3 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 01

    • డిటెక్టివ్ ధనంజయ్ రహస్యజల్ (మరాఠీ సిరీస్) - మే 01

    సోనీ లివ్

    • ఉందేఖి సీజన్ 4 (హిందీ సిరీస్) - మే 01

    హెచ్‌బీవో మ్యాక్స్..

    • ఉథరింగ్ హైట్స్(హాలీవుడ్ సినిమా)- మే 01

    సన్ నెక్ట్స్‌

    • మనితదేయివమగలం(తమిళ సినిమా)- మే 01

    హులు..

    • హలో రోడ్(హాలీవుడ్ సినిమా)- మే 01

       

  • టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సామ్ బర్త్‌ డే సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సమంత యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టేసిందని పలువురు కొనియాడారు. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమైంది.

    ఈ సినిమా కోసం సమంత ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం వాయిదా పడనుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న కారణంగా మూవీని పోస్ట్‌పోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఫుల్ క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ టైమ్‌లో మూవీని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. అందువల్లే మా ఇంటి బంగారాన్ని జూన్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

    మరోవైపు రామ్ చరణ్ పెద్దిని కూడా జూన్ 4న రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యశ్ మూవీ టాక్సిక్ పోటీ నుంచి తప్పుకోవడంతో పెద్దిని ముందే తీసుకు రానున్నారని టాక్. టాక్సిక్ వాయిదా పడడంతో టాలీవుడ్ చిత్రాలకు లైన్ క్లియర్‌ అయినట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద పెద్ది మూవీతో సామ్ చిత్రం పోటీ పడే అవకాశముంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. 
     

  • టాలీవుడ్ కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్, ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఈ చిత్రంలో సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ రిలీజ్‌కు సిద్ధమైంది.

    ఈ నేపథ్యంలో జెట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఓ ట్రైలర్‌ రాగా.. తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఫ్లైట్‌లో వచ్చే సీన్స్‌ ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు.  ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు.
     

  • స్టార్ హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం హంట్. తెలుగులో ‘డాక్టర్ కీర్తి- ఎంబీబీఎస్ ఎంఎస్ ’అనే పేరుతో  మే 8న విడుదల అవుతుంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపద్యం గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేశారు.

     

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ - కోల్ కత్తా లో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్ గా ఉంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.


    నటి కవిత మాట్లాడుతూ - ‘మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్ లో ఒక డ్యూటీ డాక్టర్ కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్ గా ప్రతి ఎలిమెంట్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా’ అన్నారు. 
     

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్‌ డ్రామా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్‌లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్‌లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

    రిలీజ్‌ డేట్ మారే ఛాన్స్..?

    అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్‌ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్‌కు పండగే. అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
     

  • సీనియర్ హీరోయిన్ శారద ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆమెను చూసిన మెగాస్టార్ దంపతులు దగ్గరికి వెళ్లి పలకరించారు. ప్రస్తుతం ఆమె ఓ పెళ్లి వేడుకకు హాజరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి అప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో శారద అంటే కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్‌ డైలాగ్స్‌తోనూ సినిమాల్లో మెప్పించారు. 

    కాగా.. కన్యా శుల్కం’ చిత్రంతో వెండితెరకు పరిచమైన శారద..  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నటించి  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మన పెద్దలు చెబుతారు.  అయితే శారద మాత్రం ముందు రచ్చ గెలిచి.. ఆ తరువాతే ఇంట గెలిచారు. శారద తెలుగు నటి అయినప్పిటికీ.. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్‌ రేంజ్‌కు ఎదిగారు. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరుపొందిన ఆమెకు.. తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు పట్టాభిషేకం చేసింది.   తెలుగులో  అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, దాన వీర శూర కర్ణ, తెనాలి రామకృష్ణ, స్వయంవరం ,నిమజ్జనం , జస్టిస్‌ చౌదరి, సర్దార్‌ పాపారాయుడు, స్టాలిన్‌, యోగి వంటి ఎన్నో మంచి పాత్రలతో మెప్పించారు.

     

  • బాలీవుడ్ బ్యూటీ, నటి సంభావన సేథ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను సరోగసీ (అద్దె గర్భం) ద్వారా మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.  సరోగసీ ద్వారా తమ బిడ్డను ఆహ్వానించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సంభావన సేథ్, ఆమె భర్త అవినాష్ ద్వివేది తెలిపారు.

    కాగా.. ఈ జంట చాలాసార్లు ఐవీఎఫ్‌ ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాకపోవడంతో సరోగసీ ద్వారా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు.  ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. 2024లో సంభావనకు మొదటి త్రైమాసికంలోనే ఓసారి గర్భస్రావం జరిగింది. ఆ టైమ్‌లో తాను శారీరక, మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడించింది. అప్పుడు మూడు నెలల వ్యవధిలో తాను 65 ఇంజెక్షన్లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అది చాలా బాధాకరంగా అనిపించిందన్నారు. సినీ కెరీర్ పరంగా చూస్తే సంభావన సేత్  2025లో వచ్చిన 'మండల మర్డర్స్'  చిత్రంలో చివరిసారిగా కనిపించింది.

  • తమిళ హీరో ధనుష్‌కి టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే నేరుగా తెలుగులో సార్‌, కుబేర లాంటి సినిమాలు చేసి అలరించాడు. అంతేకాదు ఆయన నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్‌ అవుతుంటాయి. ఆ మధ్య ఇండ్లీ కొట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మల్టీ టాలెంటెడ్‌ నటుడు..ఇప్పుడు ‘కర’తో వచ్చాడు. విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించింది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్  ఈ చిత్రాన్ని తెలుగు రిలీజ్‌ చేశాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్‌  కర(ధనుష్‌) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర  డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని  స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్‌మెంట్‌కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్‌(సూరజ్‌ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్‌ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్‌లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్‌ పెట్టుకోవాలనుకుంటారు.

     లోన్‌ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్‌ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి  చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ  భరతన్‌ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్‌(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    తండ్రి-కొడుకుల ఎమోషన్‌తో కూడిన రాబిన్‌వుడ్‌ కథ ఇది. అంటే హీరో దొంగ..కానీ మంచి కోసం దొంగతనం చేస్తుంటాడు. కిక్‌ సినిమాలో రవితేజ కోటీశ్వర్లు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బులను కొట్టేస్తే..  ఇక్కడ ధనుష్‌ బ్యాంకుల్లోని డబ్బును మాత్రమే కొట్టేస్తాడు. అది కూడా ఒక్క బ్యాంకులోని డబ్బులు మాత్రమే. దానికీ ఓ కారణం ఉంటుంది. అదేంటనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. 

    దర్శకుడు విఘ్నేష్ రాజా ఎంచుకున్న పాయింట్‌ రాబిన్‌వుడ్‌ కథలను గుర్తు చేసినా.. దాని చుట్టు అల్లుకున్న భావోద్వేగ సన్నివేశాలు మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. అంతేకాదు బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను కూడా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా చదువురాని రైతులను వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనేది బాగా చూపించారు. 

    హీరో ఎమ్మెల్యే ఇంట్లో చివరి దొంగతనం చేసే యాక్షన్‌ సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది.  అతను పోలీసులకు దొరకడం.. డీఎస్పీ భరతన్‌ నుంచి తప్పించుకొని పారిపోవడం.. ఇదంతా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే  కథ 6 నెలల ముందుకు జరిగిన తర్వాత కొంత నెమ్మదిగా సాగుతుంది. హీరోహీరోయిన్లు కలిసి హోటల్‌ పెట్టాలనుకోవడం.. ఈ క్రమంలో హీరో సొంతూరుకి తిరిగిరావడం.. తండ్రి-కొడుకుల బాండింగ్‌..ఇదంతా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంక్ చోరీ ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ద్వితియార్థం ఆసక్తికరంగా సాగుతుంది. వరుస బ్యాంకు రాబరీలు..  డీఎస్పీ ఇన్వెస్టిగేషన్‌..మరోవైపు బ్యాంకు మేనేజర్‌ ఇచ్చే ట్విస్టు..ఇవన్నీ  ఉత్కంఠభరితంగా సాగుతాయి.  హీరో దొంగతనం కోసం బ్యాంకుకు వెళ్లిన ప్రతిసారి..ఎలా బయటపడతాడా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఎక్కడ బోర్‌ కొట్టకుండా బలమైన స్క్రీన్‌ప్లేతో సెకండాఫ్‌ కథను రాసుకున్నారు. రైతు కష్టాలతో పాటు తండ్రి కొడుకుల ఎమోషన్‌తో కథను ముగించిన తీరు బాగుంది. 

    ఎవరెలా చేశారంటే..
    ధనుష్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. తనదైన సహజ నటనతో కరస్వామి పాత్రకు ఆయన వందశాతం న్యాయం చేశాడు.  ఒక్కమాటలో చెప్పాలంటే.. ధనుష్‌ వన్‌ మ్యాన్‌ షో ఇది.  మమిత బైజు తెరపై కనిపించేంది కాసేపే అయినా.. చక్కగా నటించింది. హీరో తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన కంటతడి పెట్టిస్తుంది. డీఎస్పీ భరతన్‌గా సూరజ్ వెంజర్మూడు, బ్యాంకు మేనేజర్‌గా జయరాంతో పాటు , కరుణాస్, పృథ్వీ రాజన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. 

    సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలతో పాటు తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తేని ఈశ్వర్  సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు డబ్బింగ్‌ బాగా కుదిరింది. తెరపై తెలుగు సినిమానే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది.  ఎడిటింగ్‌ పర్వాలేదు. ఇషారి కె గణేష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

  • ప్రముఖ నటి వనితా విజయ్‌కుమార్‌ కూతురు జోవిక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. తాను నటిస్తున్న కొత్త సినిమా అగధ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. స్టార్‌ కిడ్‌గా గుర్తింపు ఉన్న జోవిక తమిళ్‌ బిగ్‌ బాస్‌ సీజన్‌- 7లో కనిపించిన విషయం తెలిసిందే.. తమిళ్‌లో గతేడాది మిసెస్ & మిస్టర్  మూవీతో అలరించిన జోవిక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

    ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో రానున్న చిత్రం అగధ.. మిస్టికల్‌ డివైన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హరిణి పాత్రలో జోవిక కనిపించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  త్వరలో విడుదల కానుంది. ఈ మూవీలో మహాదేవి పాత్రలో నటించిన కామాక్షీ భాస్కర్ల లుక్‌ని కొద్దిరోజుల క్రితమే రివీల్‌ చేశారు.

    ‘‘డర్టీ హరి’ చిత్రంతో గుర్తింపు తెచ్చకున్న శ్రవణ్‌ రెడ్డికి  ఎం.ఎస్‌. రాజు. మరోసారి ‘అగధ’లో సింహ పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. కథలోని దైవిక, ఆధ్యాత్మిక అంశాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే పాత్రను సింహ పోషించారు. 85 రోజుల షూటింగ్‌... విస్తృతమైన సెట్‌ వర్క్‌... దాదాపు 45 నిమిషాల వీఎఫ్‌ఎక్స్‌తో ‘అగధ’ ప్రేక్షకులకు ప్రత్యేకమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.
     

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ  మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన గుజరాత్‌ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.

    హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.

    అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ తడబడుతూనే బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-28-3), రొమారియో షెపర్డ్‌ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్‌ గిల్‌ (43), జోస్‌ బట్లర్‌ (39), రాహుల్‌ తెవాతియా (27 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. 

    మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 6, వాషింగ్టన్‌ సుందర్‌ 12, షారుక్‌ ఖాన్‌ 8, జేసన్‌ హోల్డర్‌ 12, రషీద్‌ ఖాన్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్‌ శర్మ (3.5-0-44-1) వికెట్‌ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్‌ చేసిన హాజిల్‌వుడ్‌ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్‌ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

     

     

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ పట్టిన ఓ క్యాచ్‌ (రజత్‌ పాటిదార్‌ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. 

    ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్‌తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో విరాట్‌పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?
    అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.

    సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.

    ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్‌లో రాణా అంపైర్‌తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్‌కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.

    కాగా, హోల్టర్‌ క్యాచ్‌ నిజంగా క్లీన్‌గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. 

    వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్‌ అంపైర్‌ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్‌ ఇవ్వడం మాత్రం కరెక్ట్‌ కాదు.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ గుజరాత్‌ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. 

    ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ఆర్సీబీ- గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఊహించిన విధంగానే గుజరాత్‌ బౌలర్లు తొలుత బౌలింగ్‌ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్‌ కోహ్లి. ఈ మ్యాచ్‌లో విరాట్‌ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

    చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్‌ కెరీర్‌ తొలినాళ్లలో విరాట్‌లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌ గుజరాత్‌ బౌలర్‌ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.

    ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో విరాట్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్‌ బౌలర్‌ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.

    పుల్ షాట్‌తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీ ఒకే ఓవర్‌లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.

    * 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)
    * 23 పరుగులు vs ఢిల్లీ (2013)
    * 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)
    * 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)

    మరో అరుదైన ఘనత
    ఐపీఎల్ చరిత్రలో క్రిస్‌ గేల్‌, షేన్‌ వాట్సన్‌ తర్వాత ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.

    రబాడ ఓవర్‌ తర్వాత సిరాజ్‌ వేసిన మరుసటి ఓవర్‌లోనూ ఓ సిక్సర్‌ బాదిన విరాట్‌.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో విరాట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

    వాస్తవానికి ఈ సీజన్‌ ప్రారంభం నుంచే విరాట్‌ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్‌ ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్‌లో విరాట్‌ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.

    కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు. 
     

  • త్వరలో ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మార్క్వెస్‌ అకెర్మన్‌ ఎంపిక కాగా.. పలువురు జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

    సౌతాఫ్రికా-ఏ జట్టు మే 22 నుంచి జూన్‌ 9 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు అనధికారిక వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.  ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టు మే 16న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.

    ఈ పర్యటనలో తొలుత నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే 22-25 వరకు అరండల్‌ వేదికగా తొలి మ్యాచ్‌, మే 29-జూన్‌ 1 వరకు బెకెన్హమ్‌ వేదికగా రెండో మ్యాచ్‌ జరుగనున్నాయి.

    అనంతరం జూన్‌ 5న లీసెస్టర్‌ వేదికగా తొలి వన్డే, జూన్‌ 7న వార్సెస్టర్‌ వేదికగా రెండో వన్డే, జూన్‌ 9న వార్సెస్టర్‌ వేదికగా మూడో వన్డే జరుగనున్నాయి.

    నాలుగు రోజుల మ్యాచ్‌లకు సౌతాఫ్రికా-ఏ జట్టు..
    మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, జుబైర్ హమ్జా, జోర్డన్ హెర్మన్, రూబిన్ హెర్మన్, న్కోబాని మొకోయెనా, డేన్ ప్యాటర్సన్, సినేతెంబా క్వెషిలే, లెసెగో సెనోక్వానే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్, టియాన్ వాన్ వూరెన్, కోడి యూసఫ్.

    వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా-ఏ జట్టు..
    మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, Gerald Coetzee, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డియాన్ ఫోరెస్టర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, న్కోబాని మొకోయెనా, న్కాబా పీటర్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, సినేతెంబా క్వెషిలే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్.
     

  • టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

    కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించాడు. కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ ఆడాల్సి ఉంది.

    యువ నాయకుడి సారథ్యంలో
    ఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.

    అయితే, గిల్‌ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.

    రేసులో ఈ ఐదుగురు
    మరోవైపు.. రోహిత్‌ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్‌ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్‌ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    ఇక సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లకు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్‌లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.

    ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్‌ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.

    తెరమీదకు ఊహించని పేరు
    కానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్‌ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్‌ కిషన్‌ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.

    కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ2025-26 సీజన్‌లో జార్ఖండ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా రాణించి ఇషాన్‌ జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్‌-2026లో అదరగొట్టాడు. 

    అదేవిధంగా.. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్‌ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

  • ఆర్సీబీపై గుజరాత్‌ గెలుపు
    156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ తడబడుతూనే బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-28-3), రొమారియో షెపర్డ్‌ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్‌ గిల్‌ (43), జోస్‌ బట్లర్‌ (39), రాహుల్‌ తెవాతియా (27 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. 

    మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 6, వాషింగ్టన్‌ సుందర్‌ 12, షారుక్‌ ఖాన్‌ 8, జేసన్‌ హోల్డర్‌ 12, రషీద్‌ ఖాన్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్‌ శర్మ (3.5-0-44-1) వికెట్‌ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్‌ చేసిన హాజిల్‌వుడ్‌ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్‌ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

    గెలుపు దిశగా గుజరాత్‌
    7 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 86-2గా ఉంది. బట్లర్‌ 33, సుందర్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

    155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీ
    ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.

    ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు. 

    ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    13.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది.రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ (40) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    8.1వ ఓవర్‌- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హోల్డర్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ (1) అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  

    హోల్డర్‌ సూపర్‌ క్యాచ్‌
    7.4వ ఓవర్‌- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్లో జేసన్‌ హోల్డర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రజత్‌ పాటిదార్‌ (19) ఔటయ్యాడు. 

    కోహ్లి ఔట్‌
    3.2వ ఓవర్‌- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (28) ఔటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    2.4వ ఓవర్‌- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి జేకబ్‌ బేతెల్‌ (5) ఔటయ్యాడు.

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగనున్న 42 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. 

    కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్‌ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. 

    తుది జట్లు..

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ 

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్

  • మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు, తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

    సిల్హెట్‌ వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్‌ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్‌), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్‌, నహిద అక్తెర్‌, రితూ మోనీ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్‌ అక్తెర్‌ (44 నాటౌట్‌) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్‌ 23, జుయారియా ఫిర్దోస్‌ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్‌ నిగార్‌ సల్తానా 7, షోర్నా అక్తెర్‌ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.

    లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్‌ వేదికగా జరుగనుంది.

     

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ దిగ్గజం షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ప్రభుత్వ తప్పిదం కారణంగా బంగ్లా క్రికెట్‌ భారీ నష్టం చవిచూసిందన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బంగ్లాదేశ్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

    అయితే, భారత్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆరంభానికి ముందు భారత్‌-బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు.

    భద్రతా కారణాలు సాకుగా చూపగా..
    ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. ఇందుకు.. బంగ్లా భద్రతా కారణాలు సాకుగా చూపగా.. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానుసారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

    ఈ అంశంపై బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ షకీబ్‌ అల్‌ హసన్‌ తాజాగా స్పందించాడు. ‘‘నిజంగా అతి పెద్ద నష్టం. మా దేశంలో క్రికెట్‌ను ప్రేమించే వాళ్ల సంఖ్య ఎక్కువ. మా ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడుతుంటే చూడాలని అంతా కోరుకున్నారు.

    కానీ చివరికి మా జట్టు టోర్నీలోనే లేకుండా పోయింది. అప్పటి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు ఇది. ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడటం కలలాంటిది. 

    బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసింది
    కానీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆటగాళ్లు ఈ సువర్ణ అవకాశాన్ని మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది’’ అని షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పటి ప్రభుత్వం, బంగ్లా క్రికెట్‌ బోర్డు తీరును విమర్శించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

    కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆతిథ్య భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది మూడో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌.

    ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్‌.. బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణ కోసం తిరిగి చర్యలు చేపట్టింది. బంగ్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ ఇందుకు కృషి చేస్తున్నాడు.
    చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి బ్యాటింగ్‌ కానీ, బౌలింగ్‌ కాని చేయలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా జరగడం​ ఇదే మొదటిసారి.

    ఈ చారిత్రక ఘటనలో పాత్రధారుడు ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 29) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్‌ ముంబై బౌలింగ్‌ సమయంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఒక్క బంతి కూడా వేయలేదు.

    244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై సారధి హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ సమయంలో శార్దూల్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా (బౌలర్‌) తీసుకున్నాడు. అయితే మ్యాచ్‌ పూర్తయ్యే వరకు హార్దిక్‌ శార్దూల్‌తో ఒక్క బంతి కూడా వేయించకపోవడం​ తీవ్ర చర్చకు దారి తీసింది.

    ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చి, ఏ విభాగంలోనూ పాల్గొనని తొలి ఆటగాడిగా శార్దూల్‌ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక తప్పిదం చేసినందుకు హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వేల, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా శార్దూల్‌ను బరిలోకి దించి బౌలింగ్‌ చేయించకపోవడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

    ఈ అంశాన్ని వూహ్యాత్మక తప్పిదంగా విశ్లేషిస్తూ హార్దిక్‌పై మండిపడుతున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ పోలార్డ్‌ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "శార్దూల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.. నేను వెళ్లి కారణం అడుగుతాను" అంటూ వ్యాఖ్యానించాడు.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 244 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ప్రతి ముంబై బౌలర్‌ను చీల్చిచెండాడి పరుగులు పిండుకున్నారు. ఫలితంగా సన్‌రైజర్స్‌ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఊదేసింది.

    ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. 

  • ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కొనసాగుతున్నాడు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, పంత్‌ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.

    వైఫల్యాల పరంపర
    గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు పంత్‌ (Rishabh Pant). సారథిగా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 189 పరుగులే చేశాడు పంత్‌. ఇక లక్నో ఎనిమిదింట కేవలం రెండు గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.

    భవిష్యత్‌ ప్రశ్నార్థకం
    ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచకప్‌-2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్‌కు.. 2026 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు.

    పంత్‌పై వేటు.. సంజూకు చోటు!
    తాజాగా ఐపీఎల్‌లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టు ఎంపికలో పంత్‌ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్‌ జాగరణ్‌ కథనం ప్రకారం.. వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌కు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీ ఫిక్సైంది.

    ధ్రువ్‌ జురెల్‌ కూడా..
    ఇక ఈ రేసులో ధ్రువ్‌ జురెల్‌ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజూ టీ20 ప్రపంచకప్‌-2026లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాకౌట్‌ మ్యాచ్‌లలో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డు గెలిచాడు. ఐపీఎల్‌-2026లో ఇప్పటికే రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు.

    ఈ నేపథ్యంలో సంజూకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కూడా సంజూ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కాగా 2027 వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది. 

    ప్రస్తుతం ఐపీఎల్‌-2026తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు జూన్‌ 14 నుంచి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ మొతలుపెట్టనున్నారు. ఇక పరిమిత ఓవర్ల జట్టులో స్థానం గల్లంతైనప్పటికీ.. టెస్టుల్లో మాత్రం పంత్‌ చోటుకు ఢోకా ఏమీలేదు.

    చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆటకు వీడ్కోలు పలకకుండానే బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. తన దేశానికే చెందిన స్టార్‌ క్రికెటర్లు ఫాఫ్‌ డుప్లెసిస్‌, జాంటీ రోడ్స్‌తో కలిసి ఓ క్రికెట్‌ ఫ్రాంచైజీకి ఓనరయ్యాడు. ఈ సౌతాఫ్రికా త్రయం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.

    ఈ లీగ్‌ తొలి ఎడిషన్‌ (ETPL 2026) ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, రోటర్‌డామ్, గ్లాస్గో నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు ఈ లీగ్‌లో పోటీపడనున్నాయి.

    యజమాని.. కెప్టెన్ కూడా..!
    రోటర్‌డామ్ జట్టుకు డుప్లెసిస్‌ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో యాజమాన్యం, నాయకత్వం రెండూ ఒకేసారి చేపట్టడం అరుదైన విషయం. అనేక టీ20 లీగ్‌లలో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన డుప్లెసిస్‌, ఇప్పుడు అదే అనుభవాన్ని తన సొంత జట్టుకు ఉపయోగించనున్నాడు. అయితే సహ యజమానిగా, కెప్టెన్‌గా ఉండటానికి రూల్స్‌ ఒప్పుకుంటాయో లేదో చూడాలి.

    భీకర ఫామ్‌లో క్లాసెన్‌
    ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2026లో క్లాసెన్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 59.14 సగటున, 157.41 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 414 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మెరుపు అర్ద శతకం చేసి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు.

    జాంటీ రోడ్స్‌ విషయానికొస్తే.. ఈ దిగ్గజం​ ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. అలాగే పలు టీ20 లీగ్‌ల్లో కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 

  • రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైన రియాన్‌ పరాగ్‌.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.

    ఇ–సిగరెట్‌తో పొగ పీల్చి..
    పరాగ్‌ కెప్టెన్సీలో రాజస్తాన్‌ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా పరాగ్‌ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్‌ రూమ్‌లో ఉన్న రియాన్‌ పరాగ్‌ ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేశాడు.

    భారత్‌లో నిషేధం
    ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్‌ స్థాయిలో ఉండి పరాగ్‌ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.

    ఈ క్రమంలో బీసీసీఐ రియాన్‌ పరాగ్‌పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్‌ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.

    మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత
    రియాన్‌ పరాగ్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్‌ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.

    ఇదిలా ఉంటే.. వేపింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.

    చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్రవిస్‌ హెడ్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో హెడ్‌ ప్రవర్తించిన తీరు ఇందుకు కారణం.

    తొలి హాఫ్‌ సెంచరీ
    తాజా ఎడిషన్‌లో ట్రవిస్‌ హెడ్‌ (Travis Head) ఎట్టకేలకు తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సహచర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 129 పరుగులు జోడించాడు.

    మొత్తంగా ఈ మ్యాచ్‌లో 30 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు. మరోవైపు.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌) రాణించగా.. ఆఖర్లో సలీల్‌ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్‌) వేగంగా ఆడాడు. ఫలితంగా 18.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని ఛేదించి.. వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిదింట ఆరో గెలుపును ఖాతాలో వేసుకుంది.

    రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నిన హెడ్‌
    ఇదిలా ఉంటే.. అభిషేక్‌ శర్మతో కలిసి హెడ్‌ బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో.. ఐపీఎల్‌ రొబోటిక్‌ మస్కట్‌ ‘చంపక్‌’ అతడికి అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అసంతృప్తికి లోనైన హెడ్‌.. ఆ రొబోటిక్‌ డాగ్‌ను కాలితో తన్నాడు. అంతేకాదు బ్యాట్‌తో కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ప్రాపర్టీని తన్నిన కారణంగా హెడ్‌పై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇటు ఐపీఎల్‌ పాలక మండలి గానీ.. అటు సన్‌రైజర్స్‌ కానీ స్పందించలేదు. కాగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియావళి ప్రకారం.. క్రికెట్‌కు సంబంధించిన పరికరాలు, క్లాతింగ్‌, ఇతర వస్తువులకు మ్యాచ్‌ సమయంలో హాని చేస్తే జరిమానా విధిస్తారు.

    చంపక్‌ ఏం చేస్తుందంటే?
    ఇదిలా ఉంటే.. రోబో కుక్క ‘చంపక్‌’ను ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టారు. ఇదొక కదిలే బ్రాడ్‌కాస్ట్‌ కెమెరా. మైదానంలో లో-యాంగిల్‌లో క్రికెట్‌ షాట్లు, ఆటగాళ్ల కదలికలను రికార్డు చేస్తుంది. అంతేకాదు అంపైర్లు, ప్లేయర్లకు సరదాగా షేక్‌హ్యాండ్లు ఇస్తూ సందడి చేస్తుంది. హెడ్‌ సైతం సరదాగానే చంపక్‌ను తన్ని ఉంటాడని అతడి అభిమానులు అంటున్నారు.

    చదవండి: IPL 2026: క్లాసెన్‌ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి?

  • ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. క్లాసెన్ మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క్లాసెన్ మ‌రోసారి త‌న క్లాస్ చూపించాడు.

    244 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో క్లాసెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.  ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 129 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అయితే అభిషేక్‌, హెడ్‌, ఇషాన్ కిష‌న్ వికెట్ల‌ను ఆరెంజ్ వెంట‌వెంట‌నే కోల్పోయింది. దీంతో ముంబై ఇండియ‌న్స్ తిరిగి గేమ్‌లోకి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన క్లాసెన్‌.. ముంబై బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ‍

    క్లాసెన్ కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడు దూకుడుగా ఆడడంతో లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలూండగానే సన్‌రైజర్స్‌ చేధించింది. ఈ నేపథ్యంలో క్లాసెన్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని పీటర్సన్ కోరాడు.

    దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ప్రపంచకప్‌ను కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా వేదికగానే జరగనుంది. ప్రోటీస్ జట్టుకు తొలి వరల్డ్‌కప్ టైటిల్ గెలిచేందుకు ఇదొక మంచి అవకాశం. కాబట్టి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే క్లాసెన్‌ను తన రిటైర్మెంట్‌ను వెనుక్కి తీసుకోవాలని కోరాలి. 

    ఒకవేళ అతడు తిరిగొస్తే సౌతాఫ్రికాకు ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని" పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.  కుటుంబానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో పాటు టీ20 లీగ్‌లపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

    అయితే ఐపీఎల్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన చేస్తుండడంతో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. క్లాసెన్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆశ్చర్యపోన్కర్లేదు. గతంలో స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ కూడా తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాడు. ఇప్పుడు క్లాసెన్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో డికాక్‌ బాటలో నడిచే అవకాశముంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ‍క్లాసెన్ 59.14 సగటుతో 414 పరుగులు సాధించాడు.
     

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం జయభేరి మోగించిన కమిన్స్‌ బృందం... ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. మొత్తంగా ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరింట గెలిచింది.

    వాంఖడే వేదికగా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. రికెల్టన్‌ (55 బంతుల్లో 123 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 46; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

    52 బంతుల్లోనే 129 పరుగులు
    అనంతరం హైదరాబాద్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. హెడ్‌ (30 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్లాసెన్‌ (30 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి జట్టును గెలిపించారు. అభిషేక్, హెడ్‌ తొలి వికెట్‌కు 52 బంతుల్లోనే 129 పరుగులు జత చేశారు.

    చారిత్రక మైలురాయి
    ఇదిలా ఉంటే.. ముంబైపై విజయం ద్వారా సన్‌రైజర్స్‌ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఇది వందో విజయం. కాగా 2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటికి 205 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో 104 ఓడిపోగా.. వంద గెలిచింది. ఒకటి ఫలితం తేలకుండా ముగిసిపోయింది.

    నిలకడైన జట్టుగానూ పేరు
    ఐపీఎల్‌లో 13 ఏళ్లుగా కొనసాగుతున్న సన్‌రైజర్స్‌ 2016లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. ఇక 2018, 2024లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు మరో నాలుగు సీజన్లలో ప్లే ఆఫ్స్‌ చేరింది. తద్వారా ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న జట్లలో ఒకటిగా ముందుకు సాగుతోంది.

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియ‌న్‌ ముంబై ఇండియన్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొనసాగుతోంది. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. ముంబై బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన‌ప్ప‌టికి, బౌలింగ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఘోరంగా విఫ‌లమైంది. 

    244 ప‌రుగుల భారీ టార్గెట్‌ను సైతం ముంబై బౌల‌ర్లు డిఫెండ్ చేసుకోలేక‌పోయారు. ముంబైకి ఇది ఆరువ ఓట‌మి. దీంతో  హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ త‌మ ప్లే ఆఫ్‌ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

    ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవ‌లం రెండింట మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ జ‌ట్టు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిద‌వ స్ధానంలో ఉంది. పాయింట్ల ప‌రంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో ముంబై స‌మానంగా ఉన్న‌ప్ప‌టికి ర‌న్‌రేట్ ప‌రంగా హార్దిక్ సేన (-0.784) వారి కంటే కాస్త మెరుగ్గా ఉంది.

    ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే?
    ప్రస్తుతం నెగటివ్ రన్ రేట్‌తో ఉన్న ముంబైకి ప్రతి మ్యాచ్ ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. ముంబైకి ఇంకా  6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ భ‌వితవ్యం ఇత‌ర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డి ఉంటుంది.

    అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల బ‌ట్టి చూస్తే ముంబై మ‌రోసారి లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ముఖ్యంగా జ‌స్ప్రీత్ బుమ్రా పేల‌వ ఫామ్ ముంబైకి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బౌల‌ర్ అయిన బుమ్రా ఈ ఏడాది సీజ‌న్‌లో త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. జూనియ‌ర్ క్రికెట‌ర్లు సైతం అత‌డి బౌలింగ్‌ను ఉతికారేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు కేవ‌లం రెండే రెండు వికెట్లు సాధించాడు. ఆఖ‌రిగా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైన అద్భుతం జ‌రగాలి.
    చదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

International

  • సింగపూర్‌లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్‌ జ్యూస్‌ వెండింగ్ మెషీన్‌ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. అతడు వెండింగ్‌ మెషీన్‌ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్‌లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్‌ జ్యూస్‌ తాగే అవకాశం ఉంది.

    వెండింగ్‌ మెషీన్‌ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

    ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్‌లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్‌ అయింది.

    అతడు క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్‌ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్‌ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్‌ కోసం పాఠశాలకు వెళ్లా‍ల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.

    మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్‌ మెషీన్‌ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్‌ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది.

  • టెహ్రాన్‌: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గల్ఫ్‌ దేశాలతో ఏకమై హర్మూజ్‌ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్‌ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్‌ కథనం తెలిపింది.

    గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.

    ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్‌ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్‌  జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.

    గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్‌ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్‌ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.

    ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.

    ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్‌ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్‌’ (ఇరాన్‌ భాషలో హూట్‌ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్‌ వెపన్‌ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్‌ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. 

    కాగా, హర్మూజ్‌ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్‌ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

  • వాషింగ్టన్‌ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

     ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్‌) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్‌ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.

    చర్చలలో ప్రధాన అంశాలు
    ట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్‌ ఆపరేషన్‌ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్‌ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

    సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్‌ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.

    మూడవ ప్రత్యామ్నాయం
    ఈ బ్రీఫింగ్‌లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.

    జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్‌ నివేదిక హైలెట్‌ చేసింది.  

Andhra Pradesh

  • మైలవరం(వైఎస్సార్‌ జిల్లా): ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్‌జిల్లాలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో జరిగింది. చిన్యం లావణ్య(23) అనే యువతి తాను బీటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని ఆవేదనతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

    ఈరోజు(గురువారం) మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్డు పక్కన పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. రైల్వే మరియు ఇతర జాబులకు దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం దక్కకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈరోజు బంధువులతో కలిసి కొన్ని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న లావణ్య.. ఆపై ఆత్మహత్య చేసుకుంది.

  • తాడేపల్లి :  ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ  శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు.  ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 30వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(SIR)పై  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల  అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. 

    దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు సంబంధించి బూత్‌ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ‘ పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలి. S.I.R పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవాలి. మోసం చేయడంలో కూటమి నేతలు సిద్ధహస్తులు. 2019 ఎన్నికలకు ముందు మన పార్టీ వారి ఓట్లు 40 నుంచి 45 లక్షలు తొలగించారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 

    1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తమిళనాడులో  ఏకంగా 97 లక్షల ఓటర్లను తొలగించారు. మన దగ్గర SIR ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్‌ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను సిద్ధం చేయాలి. S.I.R కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.

    Sir పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, మరింత జాగ్రత్తగా ఉండాలి
  • సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.

    తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

    సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్‌.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

    అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం
    అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.

    టీడీపీ ఆఫీసులకు భూ కేటాయింపు.. అమరావతి పేరుతో ఏపీ సర్కార్ మరో దుబారా

    టీడీపీ ఆఫీస్‌లకు భూముల కేటాయింపు
    ఏపీలో టీడీపీ ఆఫీస్‌లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్‌లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి  1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది.

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్‌బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

    ‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా‌ లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్‌ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్‌లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్‌తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.

    ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం  చేశారు.

    కూటమి నేతల ఆర్గనైజ్డ్ క్రైమ్! అక్షరం మార్పు లేకుండా మక్కికి మక్కీ
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో   హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి  వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.

    సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక  వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్
    టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి..  ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది చూసి  ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.  ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా  ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్‌ లెటర్‌లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.

    కాగా  ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు.  ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్‌స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్‌బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 
     

  • సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్‌సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు.  

    బెయిల్పై వచ్చిన వెంటనే స్టేషన్ బయటే మళ్లీ అరెస్ట్

     

  • శ్రీకాకుళం జిల్లా:  ఈ తల్లి భుజాలపై ఉన్నది కన్నీటి కుండ. ఉద్దానంలో ప్రతి ఇంటికీ వద్దన్నా వస్తున్న శాపమిది. శ్మశానాల్లో ఈ మట్టి కుండలు, ఊరిలో తల్లుల గుండె లు ఉద్దానంలో దశాబ్దాలుగా పగులుతూనే ఉన్నాయి. బూర్జపాడులో 15 ఏళ్ల పిల్లాడు బుంగ యోగి కిడ్నీ వ్యాధితో బుధవారం కన్నుమూశాడు. వ్యాధి ఉందని తెలిసి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, పుస్తె తాకట్టు పెట్టి చికిత్స చేసినా లాభం లేకపోయింది.

     పిల్లాడి ఆయుష్షు ఆగిపోయింది. తండ్రి కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు. కన్న కొడుకు చనిపోయాడని తెలిసినా అంత్యక్రియలకు రాలేని దీనావస్థ ఆయనది. కట్టుకున్న వాడు పక్కన లేక, కడుపున పుట్టిన వాడికి ప్రాణం లేక ఆ తల్లి పడిన వేదన ఊరందరినీ కదిలించింది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కొడుకు అంత్యక్రియలు తన చేతులమీదుగా చేయాల్సి రావడంతో ఆ అమ్మ గుండె ముక్కలైంది. ఏం చెబితే ఆ తల్లి గుండెలో బాధ తగ్గుతుంది. ఏం చేస్తే ఆ కన్నీటి వరద ఆగుతుంది. ఉద్దానంలో వీధివీధినా వినిపించే కథలివి. ఆ జాబితాలోకి ఇప్పుడు యోగి పేరు కొత్తగా పేరు చేరింది.    

National

  • జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని బర్గి డ్యామ్‌లో నర్మదా నది అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన పర్యాటకుల విహారయాత్ర ఘోర విషాదంగా మారింది. 29 మంది పర్యాటకులతో వెళ్తున్న పర్యాటక బోటు ఒక్కసారిగా మునిగిపోవడంతో నలుగురు మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు. ఖమారియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

    అధికారుల సమాచారం ప్రకారం, 15 మంది పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆకస్మిక వాతావరణ మార్పులు, ఈదురుగాలుల వల్ల బోటు అదుపు తప్పి మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని, రాత్రంతా సెర్చ్ లైట్ల సహాయంతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

    జబల్‌పూర్ జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్, ఎస్పీ సంపత్ ఉపాధ్యాయ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా, లైఫ్ జాకెట్ ధరించిన బోటు కెప్టెన్ మహేష్ పటేల్ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాకేష్ సింగ్ మాట్లాడుతూ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సుమారు 10 మందిని రక్షించాయని తెలిపారు.

  • ఖాట్మండ్‌: నేపాల్‌లోని రోల్పా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఒక కొండ ప్రాంత రహదారిపై జీపు అదుపుతప్పి సుమారు 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు.

    పోలీసుల వివరాల ప్రకారం, థావాంగ్ గ్రామీణ పురపాలక సంఘంలోని జల్జల ప్రాంతంలో వర్షం కురుస్తుండగా బురదమయమైన రహదారిపై వాహనం జారి కొండ కిందికి పడిపోయింది. జల్జలలో శుక్రవారం జరగనున్న బైశాఖ పౌర్ణమి ఉత్సవానికి హాజరయ్యేందుకు స్థానికులు ఈ ప్రైవేట్ జీపును అద్దెకు తీసుకున్నారని రోల్పా జిల్లా పోలీస్ కార్యాలయ సమాచార అధికారి, ఇన్‌స్పెక్టర్ సునీల్ థాపా నేపాలి తెలిపారు.

    ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

  • గుజరాత్‌లోని 1,600 హెక్టార్ల నాలియా గడ్డిభూముల (గ్రాస్‌ల్యాండ్) పరిధిలో నెల రోజుల క్రితం ఓ అరుదైన బట్ట మేక పిట్ట పిల్ల జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్లను రక్షించడానికి ప్రభుత్వం.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించింది. 24 గంటల పాటు 50 మందికి పైగా కాపలా కాశారు. అయినప్పటికీ ఆ బట్టమేక పక్షి పిల్ల అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

    అయితే గత ఐదు, ఆరు రోజులుగా ఇది కనిపించకపోవడంతో..  ఏదైనా క్రూర జంతువు దానికి అపాయం తలపెట్టి ఉంటుందేమో అని అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు. కనిపించకుండా పోయిన ’గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల మిస్టరీ ఏమీ కాదని.. అది ఎగరడం నేర్చుకుందంటూ అధికారులు తేల్చారు. దాదాపు నెల వయసున్న ఆ పక్షి పిల్ల ఎగరడం ప్రారంభించిందన్నారు. ఆ పక్షి జాడ కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామని తెలిపారు. పక్షి పిల్ల కావడంతో జియోట్యాగింగ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు.

    గుజరాత్‌లో దశాబ్ద కాలంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల జన్మించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో కేవలం 150 మాత్రమే మిగిలాయి, వాటిలో ఎక్కువ రాజస్థాన్‌లోనే ఉన్నాయి. గత మార్చి 26వ తేదీన కచ్ ప్రాంతంలో ఈ అరుదైన పక్షి జన్మించింది. ఈ నేపథ్యలో దీన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించింది. అలాగే, ఈ పక్షి పిల్ల కదలికలను గమనించడానికి ప్రత్యేకంగా వాచ్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు.

    పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు-నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత. అరుదైన బట్టమేక పక్షులు మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి.

    కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కని­పించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహా­రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.


     

  • ప్రతీకాత్మక చిత్రం

    న్యూఢిల్లీ:  వైద్యపరంగా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తులలో కూడా దాగివున్న గుండె సంబంధిత ప్రమాదాలపై కొత్త ఆందోళనను రేకెత్తిస్తోంది. గుండెపోటుతో  40 ఏళ్ల ఎయిరిండియా పైలట్‌ (ఫస్ట్‌ ఆఫీసర్‌)  కుప్పకూలిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఇండోనేసియాలోని బాలీలో హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే అతనికితీవ్ర గుండెపోటు  రావడంతో కుప్పకూలిపోయాడు.

    న్యూఢిల్లీ నుంచి ఇండోనేషియాలోని బాలికి బయలుదేరిన  అంతర్జాతీయ విమానానికి పైలట్‌గా వ్యవహరించారు.  డ్యూటీలో అనంతరం హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటుండగా  గుండెలో తీవ్రమైన అసౌకర్యానికి గురికాగా, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, తీవ్రమైన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 

     ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి : సీనియర్‌ నటి పిల్లలకు భారీ ఊరట

    ఎయిరిండియా స్పందన
    తమ పైలట్‌ మరణం పట్ల ఎయిరిండియా యాజమాన్యం విచారం వ్యక్తంచేసింది. ఆయన కుటుంబానికి తగిన సాయం అందిస్తామని ప్రకటించింది. బాధితుడి వివరాలను బయటపెట్టలేదు. విమానయాన సంస్థల నిబంధనల ప్రకారం పైలట్‌ ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలింది.    

  • సాక్షి, న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, నటి కరిష్మా కపూర్  మాజీ భర్త సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించి  ఢిల్లీ  హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జూన్‌లో లండన్‌లో మరణించిన సంజయ్ కపూర్ వదిలి వెళ్లిన రూ. 30,000 కోట్ల ఆస్తులను పరిరక్షించాలని హైకోర్టు ఆదేశించింది. సంజీవ్‌ భార్య ప్రియా కపూర్ వాటిని అమ్మకుండా నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అతని బ్యాంకు ఖాతాల కార్యకలాపాలను కూడా కోర్టు పరిమితం చేసింది.వారసత్వంపై ఆయన కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

    సంజయ్  కపూర్‌, కరిష్మా  పిల్లలైన కియాన్, సమైరా కపూర్‌లకు, ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవా కపూర్‌కు మధ్య నెలకొన్న తీవ్రమైన, కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. వసంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఫోర్జరీ చేసిన వీలునామాను ప్రియా కపూర్ సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు.  అంతేకాకుండా, కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్ మరియు స్థిరాస్తులను కావాలనే దాచి పెట్టారని వారు వాదించారు.

    వీరి పిటిషన్‌ను విచారించిన కోర్టు సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకుండా ప్రియా కపూర్‌పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆస్తులు కరిగిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా కోర్టు నిలిపివేసింది.

    వీలునామాపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రియా కపూర్‌పైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వీలునామా నకిలీదని తేలితే, అప్పటికే ఆస్తులు చేతులు మారి ఉంటే అది అన్యాయం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. కేవలం పిల్లలతోనే కాకుండా, సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, సోదరి మందిరా కపూర్ కూడా ప్రియా కపూర్‌తో వివాదంలో ఉన్నారు. గతంలో ఈ వివాదాన్ని ఉద్దేశించి "మురికి బట్టలను బహిరంగంగా ఉతకవద్దు" అని కోర్టు వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

    ఇదీ చదవండి: 34 ఏళ్ల మిస్టరీ : క్షుద్ర పూజలు, భూత్‌ బంగ్లాలో ఎముకలు

    కాగా 53 ఏళ్ల వయసులోనే సంజయ్ కపూర్ గత ఏడాది జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ అకస్మాత్తుగా కన్నుమూయడం దిగ్భ్రాంతి  రేపింది. ఆయన మరణానికి కారణం గుండెపోటు అని తొలుత భావించారు. తన కొడుకు మరణంలో ఏదో  అతని తల్లి  అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి  అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం రేగింది. అయితే, ఆగస్టులో బ్రిటీష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే (గుండె సంబంధిత వ్యాధి) మరణించారని ధృవీకరించారు.

    ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!

  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. అయితే, ప్రముఖ సంస్థ యాక్సిస్ మై ఇండియా (Axis My India) మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయబోమని ప్రకటించింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పింది యాక్సిస్ మై ఇండియా.

    ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. దాదాపు 60-70 శాతం మంది ఓటర్లు సర్వేలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి నిరాకరించారు. ప్రజలు తమ మనసులో ఏముందో వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో మౌనమే ప్రధాన అవరోధంగా మారిందంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో బెంగాల్ ఓటర్లు మాత్రం గుంబనంగా ఉన్నారని తెలిపారు. కేవలం 20-30 శాతం మంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడం శాస్త్రీయంగా సరైనది కాదని.. అది సరైన ఫలితాన్ని ప్రతిబింబించదని సంస్థ భావించిందని ఆయన పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్‌ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్‌ వెల్లడించింది. పి–మార్క్‌ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్‌ డైరీ’ఎగ్జిట్‌ పోల్‌ తేల్చింది.

    తృణమూల్ కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలు మరియు సంస్థాగత బలంతో బీజేపీ సవాల్‌ను తట్టుకుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని సర్వేలు బీజేపీ భారీ విజయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేస్తున్నాయి. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా ఒక అంకె (సింగిల్ డిజిట్) స్థానాలకే పరిమితం కావచ్చని మెజారిటీ పోల్స్ అభిప్రాయపడ్డాయి. యాక్సిస్ మై ఇండియా వంటి అనుభవజ్ఞులైన సంస్థ కూడా అంచనా వేయలేకపోయిందంటే.. బెంగాల్ ఓటరు తీర్పు ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.

  • అహ్మదాబాద్‌లోని వత్వా (Vatva) ప్రాంతంలో ఒక పాత "దెయ్యాల కొంప" (Haunted House) రహస్యం వెల్లడైంది. 32 ఏళ్ల క్రితం జరిగిన ఒక దారుణ హత్యను, క్షుద్రపూజలు గుట్టును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 1992 నాటి హత్యతో సంబంధం ఉన్న ఒక దెయ్యాల కొంపలో మానవ అవశేషాలు లభ్యం కావడంతో మిస్టరీ వీడింది.

    దర్యాప్తు అధికారులు అందించిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఫర్జానా రాధన్‌పురి (40)  ఆస్తి వివాదం కారణంగా 1992లో హత్యకు గురయ్యారు. ముఖ్యంగా తన ప్రియుడు షంసుద్దీన్ ఖేడావాలా ఆస్తిలో సమాన వాటా కావాలని ఆమె కోరడంతో వివాదం మొదలైంది. 1992లో జూలై లేదా ఆగస్టు నెలలో ఒక వర్షం కురిసిన రాత్రి, షంసుద్దీన్ తన సోదరుడు ఇక్బాల్, మరో అనుచరుడు అబ్దుల్ జవ్రావాలా సహాయంతో ఫర్జానాను గొంతు నులిమి చంపేశాడు. వాట్వాకు చెందిన అబ్దుల్ జవ్రావాలా ఆమె చేతులను పట్టుకోగా, కుతుబ్‌నగర్‌లోని మరో సహచరురాలైన షాలియాబీవి పఠాన్ ఇంట్లో జరిగినట్లు సమాచారం. ఆ తరువాత అందరూ కలిసి ఇంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వించి, ఆమె మృతదేహాన్ని అందులో వేసి మట్టి, ఇసుక, సిమెంట్‌తో పూడ్చిపెట్టారు. 

    ఇక్కడితో కథ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. నిందితులను అపరాధభావం, భయం వెంటాడుతూ వచ్చాయి.   దీనికి తోడు వరుస మరణాలతోఫర్జానా ఆత్మ తిరుగుతోందనే భయం నిందితుల్లో మొదలైంది.

    ముఖ్య నిందితుడు షంసుద్దీన్ 2015లో గుండెపోటుతో మరణించగా, మిగిలిన నిందితులు కూడా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో వణకు మొదలైంది.  ఆమె శాపం వల్లే వీరంతా చనిపోతున్నారని కుటుంబ సభ్యులు, ఇతరులు నమ్మారు. ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజల్ని ఆశ్రయించారు. చివరికి ఆ ఇల్లు ఖాళీ అయిపోవడంతో ఆ ఇంటిని స్థానికులు "భూత్ బంగ్లా" అని పిలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 

    నిందితుడి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన పరిణామమనని సీనియర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులకు మృతురాలి గురించి పదేపదే ఏవేవో భ్రాంతులు రావడంతో, వారిలో తీవ్ర భయాందోళనలకు, మానసిక క్షోభకు దారితీసింది. దీన్నుంచి ఉపశమనం పొందే ప్రయత్నంలో, వారు క్షుద్రపూజలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నేరానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.

    ఇదీ చదవండి: వారెవ్వా..ఆమ్లెట్లు అమ్ముతూ, ఆట కట్టించారు!

    పోలీసుల ఎంట్రీ
    ఆత్మ శాంతి కోసం నిందితుల కుటుంబ సభ్యులు  ఈఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారనే సమాచారం అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందింది. దీనిని కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా, పోలీసులు రహస్యంగా నిఘా పెట్టారు. 1992లో అక్కడ ఒక హత్య జరిగిందని, ఆ పాపం కడుక్కోవడానికే వారు ఈ పూజలు చేస్తున్నారని ఇన్ఫార్మర్ల ద్వారా నిర్ధారించు కున్నారు. బుధవారం ఉదయం క్రైమ్ బ్రాంచ్ బృందం ఆ పాడుబడిన ఇంటిపై దాడి చేసి, అనుమానిత స్థలంలో తవ్వకాలు చేపట్టింది. సాయంత్రానికి సుమారు 5-6 పళ్ళు, 7-8 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఫర్జానావేనని భావిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది. 

    ఇదీ చదవండి: భార్యను నమ్మించి గొంతు కోశాడు.. తర్వాత!

  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్‌లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్‌.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. 

    తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్‌ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్‌ పార్టీ డబుల్‌ డిజిట్‌ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. 

    విజయ్‌ పార్టీలో జోష్‌ క‌న‌బ‌డుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్‌షేరింగ్‌ కోసం విజయ్‌ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్‌ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.

    వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్‌ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. 

    బీజేపీ, కాంగ్రెస్‌లు విజయ్‌తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే  కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్‌ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. 

  • న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో  కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో, అక్కడ ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మెజారిటీ సర్వేలు అంచనా వేస్తున్నాయి. అసలు ఈ హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి? మెజారిటీ రాకపోతే బెంగాల్ రాజకీయాల్లో జరగబోయేది ఏమిటి?

    హోరాహోరీ పోరు: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
    అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే, అందరి దృష్టీ పశ్చిమ బెంగాల్ పైనే పడింది. ఇక్కడ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి స్వల్ప ఆధిక్యం వస్తుందని అంచనా వేస్తుండగా, రెండు పార్టీల మధ్య నరాలు తెగే ఉత్కంఠ పోరు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన పోటీ కారణంగా, పశ్చిమ బెంగాల్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి తలెత్తవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

    హంగ్ అసెంబ్లీ అంటే ఏమిటి?
    ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లేదా ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ రాకపోవడాన్ని ‘హంగ్ అసెంబ్లీ’ అంటారు. నిబంధనల ప్రకారం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మొత్తం సీట్లలో సగానికంటే కనీసం ఒక్క సీటు అయినా అదనంగా (సింపుల్ మెజారిటీ) గెలుపొందాలి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికార పీఠం దక్కించుకోవాలంటే ఏ పార్టీ అయినా కనీసం 148 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది.

    ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏమవుతుంది?
    హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో రాష్ట్ర గవర్నర్ పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి 10 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ మెజారిటీ నిరూపించుకోలేకపోతే, అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. అయితే, గడువులోపే చిన్న పార్టీల మద్దతు కూడగట్టడం, పోస్ట్-పోల్ (ఎన్నికల అనంతర) పొత్తులు పెట్టుకోవడం వంటి వ్యూహాలకు పార్టీలు పదును పెడతాయి. బయటి మద్దతుతో ఏర్పడే ఇలాంటి మైనారిటీ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉంటాయి. అవి ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ద్వారా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Bihar: ఎన్‌కౌంటర్‌తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Telangana

  • హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్ట్‌కు అక్రిడిటేష‌న్లు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం కృత‌ నిశ్చ‌యంతో ఉంద‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.  ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచ‌న మేర‌కు పాత్రికేయుల‌కు ఆరోగ్యంతోపాటు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని అన్నారు.  గురువారం నాడు స‌మాచార శాఖ ఆధ్వ‌ర్యాన జ‌ర్న‌లిస్టుల‌కు కొత్త అక్రిడిటేషన్ కార్డుల‌ను మంత్రిగారు అంద‌జేశారు. 

    ఈ సంద‌ర్బంగా మంత్రిగారు మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన అక్రిడిటేష‌న్ కార్డుల‌ను ఇంత‌వ‌ర‌కు పొడిగించామ‌ని, దేశంలో, ఇతర రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తున్న ఉత్త‌మ విధానాల‌ను ఇక్క‌డ అనుస‌రించాల‌న్న ఆలోచ‌న మేర‌కు ప‌రిశీల‌న సాగింద‌ని అందువ‌ల్లే ఈ కార్డుల జారీలో ఆల‌స్యం చోటుచేసుకుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం 32,500 మందికి  అక్రిడిటేష‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉన్నా 23,352 కే ప‌రిమితం చేసింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా  అక్రిడిటేష‌న్లు ఇచ్చేలా మార్పులు చేసింద‌ని   తెలిపారు. ఇప్ప‌టికే సుమారు 2800 వ‌ర‌కు కార్డుల‌ను ఆమోదించ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు.  

    జ‌ర్న‌లిస్టుల సూచ‌న‌ల మేరకు జీవోల‌లో మార్పులు చేర్పులు చేశామ‌ని, అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కార్డుల మంజూరులో వెన‌క‌డుగు ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు. మే 1వ తేదీన అన్ని జిల్లాల్లో  అక్రిడిటేష‌న్ కార్డుల పంపిణీ చేయాలంటూ క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు.

    ఈ ప్ర‌క్రియ‌లో మే 10 వ‌తేదీని ఒక క‌టాఫ్ డేట్‌గా పెట్టుకొని ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని, ఆ తేదీలోగా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో  అక్రిడిటేష‌న్లు సంఖ్య తేలితే  జ‌ర్న‌లిస్టుల‌కు ఆరోగ్యం ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఒక ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌చ్చున‌ని అన్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దిశ‌గా ప‌లు సూచ‌న‌లు చేశార‌ని వెల్లడించారు. 

    అంతేగాక జ‌ర్న‌లిస్టులు వివిధ సంస్ద‌లలో ఉద్యోగాలు మారిన‌ప్ప‌టికీ  అక్రిడిటేష‌న్ల మంజూరు ఓ నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగుతుంద‌ని ఈ విష‌యంలో ఎటువంటి సందేహాలు వ‌ద్ద‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో జర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామ‌ని త్వ‌ర‌లో పాత్రికేయ సంఘాల‌తో భేటీ అవుతామ‌ని తెలిపారు. 

    ఏప్రిల్ 30తో కొంత‌మంది జ‌ర్న‌లిస్టుల  బ‌స్సుపాస్‌ల గడువు ముగుస్తున్నందున మ‌రో 15 రోజుల పాటు పొడిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు పాత్రికేయుల‌కు అక్రిడిటేష‌న్ కార్డుల‌ను అంద‌జేసి అభినందించారు.  ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, స‌మాచార శాఖ స్పెషల్ క‌మీష‌న‌ర్  ముకుంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ఆయిల్‌ సంస్థలకు తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టకూడదని.. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని.. 21,295 కిలో లీటర్లు పంపిణి  చేసినట్లు తెలిపారు.

    పెట్రోల్ సరఫరా 118 పెంచామని తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందన్న  స్టీఫెన్ రవీంద్ర.. బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రజావాణి కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి వ్యవస్థను ప్రభుత్వం విస్తరించనుంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలకు ప్రజావాణి విస్తరణకు ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో, ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నారు. రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించనున్నారు.

    ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సర్కార్‌.. అన్ని ఫిర్యాదులు ప్రజావాణి పోర్టల్‌లో నమోదు తప్పనిసరి అని స్పష్టం చేసింది.​ ఫిర్యాదుదారులకు యూనిక్ రిఫరెన్స్ నంబర్‌తో రసీదు ఇవ్వనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గరిష్టంగా 30 రోజులు గడువును ప్రభుత్వం నిర్ణయించింది. గడువు లోపల పరిష్కారం కాకపోతే పైస్థాయికి ఎస్కలేషన్ ఇవ్వనున్నారు.

    ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్థితి ట్రాకింగ్ సౌకర్యం, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ (ATR) ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజలతో పారదర్శకత, బాధ్యత పెంచే చర్యలు చేపట్టనుంది. రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.. ప్రతి విభాగంలో ప్రత్యేక ప్రజావాణి విభాగాల ఏర్పాటు చేయనుంది. అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. ప్రజల అభ్యర్థనలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

  • నిర్మల్‌ జిల్లా: మండల కేంద్రం పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో పదెకరాల మొక్కజొన్న దగ్ధమంది. స్థానికులు తెలిపిన వివరా ల మేరకు పెంబి శివారులో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్‌ తీగలు తాకి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో గోస్కూల శ్రీనివాస్‌, గోస్కూల తిరుమల, ఎలిగేటి అనిల్‌ కుమార్‌, కోప్పుల జ్యోతి, ఒద్నాల ఉమకు చెందిన పదెకరాల మొక్కజొన్న పూర్తిగా కాలి బూడిదయ్యింది.

    విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌ని వివరణ కోరగా.. సంఘటన స్థలాన్ని పరిశీలించా మని, షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిన ఆనవాళ్లు లేవన్నా రు. సంఘటన స్థలాన్ని ఎంఆర్‌ఐ శ్రావణ్‌ రెడ్డి, ఏఈవో నాగమణి, జీపీవో భాస్కర్‌ పరిశీలించారు. రూ.7.56 లక్షలనష్టంవాటిల్లినట్లు అంచనా వేశారు.

    మాలేగాంలో..
    కుభీర్‌: మండలంలోని మాలేగాంలో మంగళవారం ఉదయం బండారి భోజన్న అనే రైతుకు చెందిన 2ఎకరాల 30 గుంటల్లో మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. సుమారు రూ.2లక్షల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు భోజన్న కోరుతున్నాడు.

    స్పందించిన సీఎం..
    షార్ట్ సర్క్యూట్ కారణంగా నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయి రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆ సంఘటన పూర్తి వివరాలు పరిశీలించి నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని.. ఆర్థిక సహాయం అందించాలని సీఎం..  సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు.

  • మిర్యాలగూడ అర్బన్‌ : కారు అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన మెగావత్‌ మంగ్తా (45) మిర్యాలగూడ పట్టణంలోని ఐసీసీఐ బ్యాంకు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం అతడు ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు వద్ద అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి దాటుతుండగా.. గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. అంతేకాకుండా కారు రోడ్డు పక్కన ఆపి ఉన్న మరో రెండు బైక్‌లను, ట్రాక్టర్‌ను ఢీకొని ఆగిపోయింది. 

    ఈ ప్రమాదంలో మంగ్తా అక్కడికక్కడే మృతిచెందగా.. కురియా తండాకు చెందిన ధనావత్‌ భాస్కర్, కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో పనిచేసే సన్నీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత కారులో ప్రయాణిస్తున్న వారు కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. క్షతగాత్రులను స్థానికులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగ్తా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్‌ సీఐ సోమనర్సయ్య పేర్కొన్నారు. మృతుడికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

    వాహనాలపైకి దూసుకెళ్లిన కారు.. ఒళ్ళు గగుర్పొడిచే విజువల్స్ ..

     



    న్యాయం చేయాలని రాస్తారోకో..
    మంగ్తా కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, మైసమ్మకుంట తండా గ్రామస్తులు ఘటనా స్థలంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై బైఠాయించారు. మూడున్నర గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. పోలీసులు బైపాస్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ పట్టణం గుండా దారి మళ్లించి కొంతవరకు ట్రాఫిక్‌ను నియంత్రించారు. 

    ఆర్డీఓ హామీతో ఆందోళన విరమణ.. 
    మిర్యాలగూడ ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో పార్టీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆమె కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. 

    తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ లోపించిందని.. అందుకే తాను కొత్త పార్టీ పెట్టానని ఆమె ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. అయితే.. ఆ ప్రకటన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఒరిజినల్‌.. ఒరిజినలేనంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సెటైర్లు వేసింది. అదే సమయంలో ఆమె పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. 

    ఈ క్రమంలో ఆ అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు మీద కాకుండా.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు సంబంధిత లేఖను అందజేసినట్లు సమాచారం. 

Business

  • నరెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో.. 'ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' అండ్ యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్ తెలంగాణలో భద్రమైన సమాజ నిర్మాణానికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ కార్యక్రమం కే.ఎల్.ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నాయకులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs), ఫెసిలిటీ మేనేజర్లు, న్యాయ, భద్రత నిపుణులు పాల్గొన్నారు.

    ఈ వర్క్‌షాప్ ఉద్దేశ్యం గృహ సముదాయాలు, వాణిజ్య ప్రాజెక్టులకు సంబంధించిన చట్టపరమైన నియమాలు, భద్రత ప్రమాణాలు, నిర్వహణ బాధ్యతలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడం. ముఖ్యంగా స్టాట్యుటరీ రిన్యూవల్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్, లిఫ్ట్ మెయింటెనెన్స్, పర్యావరణ నియమాలు, భవనాల స్థిరత్వ పరీక్షలు వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.

    తెలంగాణలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ఈ కార్యక్రమం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భద్రతా నియమాలు పాటించకపోతే జరిమానాలు, కార్యకలాపాల నిలిపివేత, ప్రాణాపాయాలు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

  • బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగిన సిల్వర్ రేటు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు మరోమారు వెండి ధరలు పెరిగాయి.

    హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు వెండి రేటు రూ.10,000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలకు చేరింది. ఈ ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. అయితే ఢిల్లీలో మాత్రం వెండి రేటు రూ.5000 తగ్గింది. కాబట్టి.. ఇక్కడ సిల్వర్ రేటు రూ.2.50 లక్షలకు చేరింది.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు
    మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.

    పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.

    అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.

    వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.

    ఇదీ చదవండి: పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

  • రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) సంస్థ.. ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ 'అనోమలి'(Anomaly)ని, దాని ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

    అనోమలి కొనుగోలు.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్‌లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది.

    అనోమలి బ్రాండ్‌ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్‌కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది.

    ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్‌వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలీ కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.

    రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. అనోమలి తమ బ్యూటీ పోర్ట్‌ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్‌పై దృష్టి పెట్టి.. జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా ప్రియాంక చోప్రా బ్రాండ్‌ క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని వెల్లడించారు.

  • న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ దిగ్గజం అదానీ పవర్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి.

    అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం  రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్‌(1,600 మెగావాట్లు), రాయ్‌పూర్‌(1,600 మెగావాట్లు), రాయ్‌గఢ్‌(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86–47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.

    సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్‌ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031–32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్‌ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు ఎల్‌వోఏను అందుకుంది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

    భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

    ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.

    కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్‌పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.

    ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ లీప్’ (Project Leap) ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుండటంతో, భారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.

    రూ. 2000 కోట్లకు పైగా ఖర్చు..
    ప్రాజెక్ట్ లీప్‌ను ఒక పరివర్తన కార్యక్రమంగా కాగ్నిజెంట్ అభివర్ణిస్తోంది. దీనికోసం 2026 నాటికి 230 నుంచి 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 - రూ.2,600 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సింహభాగం అంటే 200 నుంచి 270 మిలియన్ డాలర్లు కేవలం ఉద్యోగుల విడదీత (Severance pay), సిబ్బందికి సంబంధించిన ఇతర ఖర్చులకే కేటాయించడం గమనార్హం.

    ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే.. తొలగింపుల ప్రభావం కొన్ని వేల మందిపై ఉండబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేదు.

    ‘పిరమిడ్’ రివర్స్‌.. జూనియర్లకే ప్రాధాన్యం!
    కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఈ మార్పులపై స్పందిస్తూ.. సంస్థను ‘విస్తృత, చిన్న’ (Broad and Small) పిరమిడ్ ఆకృతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే నిర్వహణ విభాగంలో (Management layers) ఉన్న సీనియర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం.. ఎక్కువ మంది ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా సంస్థ అట్టడుగు భాగాన్ని బలోపేతం చేయడం.. క్లిష్టమైన ఏఐ నైపుణ్యాలను యువ శ్రామిక శక్తి ద్వారా వేగంగా నిర్మించడం చేస్తారు.

    భారీ పొదుపు.. ఏఐపై పెట్టుబడి
    ఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 నాటికి 200 నుంచి 300 మిలియన్ డాలర్ల వ్యయాన్ని ఆదా చేయాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి ఏఐ సామర్థ్యాల పెంపుదల, ఉద్యోగుల రీస్కిల్లింగ్,  మార్జిన్లను పెంచడం కోసం వినియోగించనున్నారు.

    కాగ్నిజెంట్‌కు ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్తేమీ కాదు. 2023లో సుమారు 300 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో అమలు చేసిన 'నెక్స్ట్ జెన్' ప్రోగ్రామ్ 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. అంతకు ముందు 2020లో 'ఫిట్ ఫర్ గ్రోత్' దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపింది.

    ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300. ఒకవైపు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయని చెప్తూనే, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తుండటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

  • పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్‌ వాల్ట్‌ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫాం ధన్‌ వెల్లడించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల్లో ట్రేడ్‌ చేయడంతో పాటు అవే లైవ్‌ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

    ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్‌సీసీఎల్‌ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్‌ గ్రేడ్‌ వాల్ట్‌లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్‌ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్‌ జాదవ్‌ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.

    డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్‌ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.

    భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత.

  • టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో.. వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా స్పీడ్, వాయిస్ క్వాలిటీ, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదు కాగా.. కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఫలితాలు తెలంగాణ టెలికాం వినియోగదారుల అనుభవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ పనితీరును అంచనా వేయడంలో డ్రైవ్ టెస్ట్‌లు అత్యంత విశ్వసనీయ పద్ధతి.

    ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జియో నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ 161.18 Mbps, వోడాఫోన్ ఐడియా 27.83 Mbps, బీఎస్ఎన్ఎల్ 8.32 Mbps వద్ద నిలిచాయి. అంటే ఒక వినియోగదారుడు వీడియో స్ట్రీమింగ్ లేదా గేమింగ్ చేస్తే జియో వినియోగదారుడు మిగతా నెట్‌వర్క్‌లతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా సేవలు పొందుతున్నాడని అర్థం.

    నగరంలోని హాట్‌స్పాట్ ప్రాంతాల్లో వేగం మరింత పెరిగింది. హనుమకొండ బస్ స్టాండ్ వద్ద 471.60 Mbps పీక్ స్పీడ్ నమోదు కాగా రెడ్డి కాలనీలో 456.67 Mbps నమోదైంది. ఈ సంఖ్యలు కేవలం టెక్నికల్ డేటా కాదు, రోజువారీ డిజిటల్ జీవితంలో వేగవంతమైన మార్పుకు సూచికగా నిలుస్తున్నాయి.

    ట్రాయ్ అధికారిక నివేదిక ప్రకారం.. వాయిస్ కాల్ నాణ్యతలో కూడా జియో ముందంజలో ఉంది. మీన్ ఓపీనియన్ స్కోర్ 4.46గా నమోదైందని మార్చి 2026 పరీక్షలో వెల్లడైంది. ఎయిర్‌టెల్ 3.98, వోడాఫోన్ ఐడియా 3.76, బీఎస్ఎన్ఎల్ 2.97 వద్ద నిలిచాయి. అంటే పది కాల్‌లలో ఎక్కువ భాగం జియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.

    ట్రాయ్ డేటా ప్రకారం జియో లేటెన్సీ 21.94 msగా ఉండగా ఇతర నెట్‌వర్క్‌లు 38 ms పైగా నమోదయ్యాయి. లేటెన్సీ తగ్గడం వల్ల గేమింగ్, వీడియో కాలింగ్ అనుభవం మెరుగుపడుతుంది. 20 మిల్లీసెకన్లకు దగ్గరగా ఉండే లేటెన్సీ వినియోగదారుడికి రియల్ టైమ్ అనుభూతి ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం వేగం మాత్రమే కాకుండా స్థిరత్వం కూడా పెరిగిందని సూచిస్తున్నాయి. కాల్ డ్రాప్ రేటు 0%గా నమోదు కావడం నెట్‌వర్క్ విశ్వసనీయతకు నిదర్శనం.

    తెలంగాణలో 5జీ విస్తరణ గత రెండు సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. 2024లో ప్రారంభమైన సేవలు 2026 నాటికి ప్రధాన నగరాల్లో స్థిరపడ్డాయి. వరంగల్ వంటి టియర్-2 నగరాల్లో కూడా హైస్పీడ్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడం డిజిటల్ విస్తరణకు కీలక సూచనగా మారింది. ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థలు ఈ పరీక్షలను కొనసాగించడం వల్ల నెట్‌వర్క్ నాణ్యతపై కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. వినియోగదారుల కోసం ఇది ప్రయోజనకరం. భవిష్యత్తులో 5జీ ఆధారిత సేవలు పెరగడంతో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.

    ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5జీ విస్తరణపై దృష్టి పెట్టింది. టెలికాం కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో నమోదైన ఈ ఫలితాలు ఒక నగరానికి మాత్రమే పరిమితం కావు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల దిశను సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరీక్షలు జరిగితే పోటీ మరింత స్పష్టమవుతుంది.

  • చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.

    గణాంకాలు ఏం చెబుతున్నాయి?
    బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్‌"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.

    దిగ్గజ సంస్థల పతనం
    చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్‌గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్‌గా నిలిచింది.

    భారత్‌లో ఆందోళన అవసరమా?
    చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్‌లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.

    భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలు

    • చైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్‌లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.

    • భారత్‌లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇస్తుంది.

    • చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్‌లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది.

  • గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 582.86 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 76,913.50 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 23,997.55 వద్ద నిలిచాయి.

    సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీసీపీఎల్ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్‌పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, వేదాంత లిమిటెడ్, వారీ ఎనర్జీస్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పదించింది.

    పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ''ఇంధన ధరల పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వు నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'X' లోని ఒక పోస్ట్‌లో పేర్కొంది.

    పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఉన్న సమయంలో.. ఫ్యూయెల్ ధరల పెరుగుదల వార్త, ప్రజల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిజమే అని చాలామంది భావించారు. అయితే ధరల పెరుగుదల నిజం కాదని, పీఐబీ అధికారికంగా వెల్లడించింది.

    కాగా.. మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయని తెలిపారు. నిత్యావసర ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఆమె వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఎల్‌పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు కూడా పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దని శర్మ అన్నారు.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ తన భాగస్వామ్య సంస్థ ఓపెన్‌ఏఐతో కుదుర్చుకున్న సవరించిన ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓపెన్‌ఏఐ సాంకేతికతను, మేధో సంపత్తిని (ఐపీ) అత్యున్నత స్థాయిలో వినియోగించుకోవడమే తమ తదుపరి లక్ష్యమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. టెక్‌ విశ్లేషకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యూహాత్మక మార్పులపై వివరణ ఇచ్చారు.

    విజేతల్లా నిలిచే ఒప్పందం

    ఓపెన్‌ఏఐతో కుదిరిన తాజా మార్పుల గురించి నాదెళ్ల మాట్లాడుతూ, ఇది ఇరు సంస్థలకు ప్రయోజనకరమైన విన్-విన్ ఒప్పందమని అభివర్ణించారు. ‘ఏదైనా భాగస్వామ్యంలో రెండు పక్షాలకు సమాన ప్రయోజనం ఉండాలని నేను కోరుకుంటాను. ఓపెన్‌ఏఐతో మా అనుబంధం విషయంలో కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం 20 శాతం వాటాను కలిగి ఉంది. సవరించిన ఒప్పందం ప్రకారం ఈ వాటా 2032 వరకు కొనసాగుతుంది. ఇది సంస్థకు దీర్ఘకాలిక ఆర్థిక, సాంకేతిక భద్రతను కల్పిస్తుంది.

    2032 వరకు ప్రత్యేక హక్కులు

    ఓపెన్‌ఏఐ ఇకపై తన మోడళ్లను కేవలం మైక్రోసాఫ్ట్‌కే పరిమితం చేయకుండా అమెజాన్ వంటి ఇతర దిగ్గజ సంస్థలతోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. దీనిపై వస్తున్న ఆందోళనలను నాదెళ్ల తోసిపుచ్చారు. 2032 వరకు ఓపెన్‌ఏఐ రూపొందించే సరిహద్దు నమూనాలు (ఫ్రంటీర్‌ మోడల్స్‌), ఏజెంట్ టూల్స్, అన్ని ఐపీ హక్కులపై మైక్రోసాఫ్ట్‌కు పూర్తి అవకాశం ఉంటుందన్నారు. ‘మా దగ్గర అత్యాధునిక మోడల్స్ ఉన్నాయి. 2032 వరకు మాకు లభించిన ఈ సాంకేతిక హక్కులను వ్యాపార పరంగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని నాదెళ్ల ధీమా వ్యక్తం చేశారు.

    పెరుగుతున్న పోటీ

    ఓపెన్‌ఏఐ తన సేవలను అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు కూడా విస్తరించడం వల్ల మైక్రోసాఫ్ట్ ఆధిపత్యం తగ్గుతుందా? అన్న ప్రశ్నకు నాదెళ్ల ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఏదో ఒక సంస్థే దీనిని శాసించే రోజులు పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కంప్యూటింగ్ అవసరాలకు సంబంధించి ఓపెన్‌ఏఐ మాకు అతిపెద్ద కస్టమర్. వారికి అత్యుత్తమ సేవలు అందించడం మా బాధ్యత’ అని ఆయన గుర్తుచేశారు.

    ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్

  • డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు ఎంత పెరిగినా నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇలా ఈ మే నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నవారి కోసం ఈ కథనం. ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2026 నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. మే నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, జయంతి కార్యక్రమాలు, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు.

    తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు
    ఈ మే నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు వారాంతపు సెలవులు, పండుగలతో కలిపి మొత్తం 9 రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించే బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ముందస్తు ప్రణాళిక లేకపోతే మీ అత్యవసర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి, సెలవుల జాబితాను ఒకసారి పరిశీలించండి..

    సెలవుల వివరాలు
    మే 1 - శుక్రవారం - మే డే (కార్మిక దినోత్సవం) / బుద్ధ పూర్ణిమ
    మే 3 - ఆదివారం - సాధారణ సెలవు
    మే 9 - శనివారం - రెండో శనివారం
    మే 10- ఆదివారం- సాధారణ సెలవు 
    మే 17- ఆదివారం - సాధారణ సెలవు
    మే 23 - శనివారం - నాలుగో శనివారం
    మే 24 - ఆదివారం - సాధారణ సెలవు
    మే 27 - బుధవారం- బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా)
    మే 31 - ఆదివారం - సాధారణ సెలవు
    అయితే చంద్రుని దర్శన ఆధారంగా బక్రీద్ సెలవు తేదీలో మార్పు ఉండవచ్చు.

    డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..
    బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు (ATM) యధావిధిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధుల బదిలీ (NEFT/RTGS/IMPS) చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.

Politics

  • ఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్ని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తర్వాత విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై గురువారం ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఢీలా పడ్డ టీఎంసీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోశారు.

    ఆ వీడియోలో దీదీ మాట్లాడాతూ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఫలితాలు దానికి సాక్ష్యం చెబుతాయి’అని అన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బీజేపీ తరఫున ఎగ్జిట్ పోల్స్‌లో చూపిన ఆధిక్యం కేవలం మానసిక ఒత్తిడి సృష్టించడానికే అని ఆమె ఆరోపించారు.

    ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవైపు బీజేపీకి ఆధిక్యం చూపుతున్నప్పటికీ,మమతా బెనర్జీ ధైర్యవంతమైన ప్రకటన మరోవైపు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఫలితాలు వెలువడే వరకు ఈ పోటీ ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది.

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎ‍న్నికల్లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరుగనున్న కౌంటింగ్‌కు సంబంధించి టీవీకే అధినేత విజయ్‌.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఆ రోజు జరిగే కౌంటింగ్‌కు సంబంధించి అభ్యర్థులు,  ఏజెంట్లు ఉదయం ఆరుగంటల కల్లా  ఆయా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. 

    అలాగే ఒకసారి లోపలికి వెళ్లిన ఏజెంట్‌ కడవరకూ అక్కడే ఉండాలని, అత్యంత జాగ్రత్తగా కౌంటింగ్‌ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఏమాత్రం ఏమరపాటుకు గురైనా అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, అందుకుని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు.  

    ప్రధానంగా అభ్యర్థులు  గెలిచిన తర్వాత తన వద్దకు నేరుగా రావాలన్నారు. గెలిచిన అభ్యర్థుల కోసం తాను నిరీక్షిస్తూ ఉంటానని, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ పార్టీ ఆఫీస్‌కే రావాలన్నారు.  ఎన్నికల ఓట్ల లెక్కింపులో కీలకమైన ఫారమ్‌ 17C(పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన ఓట్ల సంఖ్య, లెక్కింపులో చూపిన ఓట్లతో సరిపోతుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించే పత్రం)ని అభ్యర్థులు కచ్చితంగా సరిపోల్చుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండి మభ్య పెట్టడానికి యత్నించే వారికి చెక్‌ పెట్టాలన్నారు. 

  • ఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్‌ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.

    ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్‌తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్‌తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్‌తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.

    అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్‌ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్‌తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్‌ పార్టీ 30 శాతం ఓటు షేర్‌తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్‌లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్‌ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్‌తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది.

  • తాడేపల్లి : జగనన్న కాలనీలపై ఎల్లీ మీడియా తప్పుడు ప్రచారం చేయడంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ మండిపడ్డారు. జగన్‌ 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఎల్లో మీడియా వాటిపై విషం చిమ్ముతోందని ‍ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఒక్కరికి కూడా స్థలం ఇవ్వలేదని విమర్శించారు. 

    ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 30వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్‌..  స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్‌పై రోత రాతలు ఎందుకని నిలదీశారు. జగన్‌ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. కోటి మందికి నివాసం కల్పించారన్నారు. 

    చంద్రబాబు 16 సంవత్సరాలు సీఎంగా చేసినా ఒక్క కాలనీ కూడా కట్టించలేదు. 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం జగన్‌ది.చంద్రబాబు, లోకేష్, ఎల్లో మీడియా ఎవరొచ్చినా వాటిని చూపిస్తాం. కొత్తగా ఊర్లనే ఏర్పాటు చేశాం. 

    చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నేటికీ ఒక్క సెంటు స్థలం ఇచ్చారా?, ఇళ్ల స్థలాలు ఇవ్వని చంద్రబాబును ప్రశ్నించని ఎల్లో మీడియాకు జగన్ విమర్శించే అర్హత ఉందా?, జగనన్న కాలనీల్లో కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. జగన్ కట్టించిన ఇళ్లను చంద్రబాబు ఓపెన్ చేసి ఫోటోలు దిగారు. జగన్ క్రెడిట్‌ని చంద్రబాబు చోరీ చేస్తున్నారు’ అని విమర్శించారు. 

    అది జగనన్న బ్రాండ్. మీరు ఎంత గింజుకున్నా అది అవ్వదు
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచే వారని బీఆర్ఎస్  ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని రెండో సిట్ వేశారు’’ అంటూ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

    ‘‘ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్‌రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్‌రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు

    ..కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. ఇస్రో సైంటిస్ట్‌ నంబి నారాయణన్‌పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిశాంక్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు.

    ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

    కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్‌ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను దైర్యంగా ఎదుర్కొంటాము. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్‌ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను’’ అని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Family

  • వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించింది శ్రీనగర్‌కు చెందిన జైనబ్‌ బిలాల్‌. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ 10వ తరగతి ఫలితాల్లో ఈ దృష్టి లోపం ఉన్న విద్యార్థిని ఏకంగా 95 శాతం మార్కులతో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 500 మార్కులకు గాను జైనబ్‌ 475 మార్కులు సాధించింది. మరీ ముఖ్యంగా, ఆమెకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్‌ అయిన కంప్యూటర్ సైన్స్‌లో 100కు 100 మార్కులు సాధించడం విశేషం.

    శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, లెర్నింగ్‌ రిసోర్స్‌ సెంటర్‌ విద్యార్థిని అయిన జైనబ్, ఈ విజయం ద్వారా ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సహాయకునిపై ఆధారపడతారు. కానీ జైనబ్‌ ఎవరి సహాయం తీసుకోలేదు. నేరుగా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి పరీక్షలు రాసిన మొదటి అంధ విద్యార్థినిగా సరికొత్త చరిత్ర సృష్టించింద‌ని పీటీఐ వార్తా సంస్థ వెల్ల‌డించింది.

    అంతేకాదు జైనబ్‌ బిలాల్‌ (zainab bilal) ఇతర రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తన 12వ ఏటనే రేడియో డీపీఎస్‌ కోసం మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేను సాధించగలిగినప్పుడు, ఎవరైనా సాధించగలరు. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి, వారికి అండగా నిలబడితే చాలు’ అంటూ తన ఉత్తీర్ణత సందర్భంగా జైనబ్‌ ఇచ్చిన సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం.

    మాటలు రావ‌డం లేదు
    త‌న‌కు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్లాలని ఉంద‌ని జైనబ్‌ బిలాల్ తెలిపింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు ఆమె పీటీఐతో చెప్పింది. కాగా, చదువు పూర్తయ్యేంత వరకు అండగా నిలిచినందుకు తన పాఠశాలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. అడుగ‌డుగునా తోడుగా నిలిచిన త‌న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు రావ‌డం లేద‌ని పేర్కొంది.

     చ‌ద‌వండి: సీబీఎస్ఈ టెన్త్ టాప‌ర్లు వీరే