Archive Page | Sakshi
Sakshi News home page

Family

  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీహబ్ సహకారంతో 'రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం' జాతీయ మిషన్‌ను రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ లో‌ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా చిరు ధాన్యాల వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలికి దారితీసే ఉద్యమంగా రూపుదిద్దడం లక్ష్యం. 

    ఈ మిషన్‌కు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మద్దతు తెలిపారు. ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రోజు వారీ ఆహారంలో చిరు ధాన్యాలను చేర్చాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారత నిర్మాణానికి దోహదపడే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్డిన మిల్లెట్ మార్వెల్స్‌ను అభినందించారు. ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో మిల్లెట్ల వినియోగాన్ని పెంచాలని ఈ వినూత్న కార్యక్రమం పిలుపునిస్తోంది. ఇది భారతదేశ పోషకాహార రంగాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. 

    ఈ సందర్భంగా ప్రతిరోజూ ఒక మిల్లెట్ ఆధారిత భోజనాన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలని, మిల్లెట్ల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, మరో ముగ్గురిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని ప్రతిజ్ఞ చేశారు. చైన్ పద్ధతిలో జరిగే ప్రచారం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించి, తరువాత అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన లోక్‌సభ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా మద్దతు తెలిపారు.

    మిల్లెట్ మార్వెల్స్ 
    'మిల్లెట్ మార్వెల్స్'ను 2020లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, సినీ నటుడు డాక్టర్ భరత్ రెడ్డి స్థాపించారు. చిరుధాన్యాలతో తయారైన ఆహారపు ఉత్పత్తులను రుచికరంగా, అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో ఈ స్టార్ట్అప్ ప్రారంభమైంది. భారతీయ మార్కెట్‌లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. డాక్టర్ సంగీతా రెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్) కృషితో మిల్లెట్ మార్వెల్స్ ను పునరుద్ధరించారు. నూతన ఉత్సాహంతో తిరిగి అభివృద్ధి చేశారు. 

    హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఇన్‌పేషెంట్లకు ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని అందించడంపై దృష్టి సారిస్తూ ఈ సంస్థను మళ్లీ బ్రాండింగ్ చేశారు. దేశంలో ఇలాంటి చర్యలు చేపట్టిన తొలి హాస్పటల్ గా అపోలో నిలిచింది. ఈ కార్యక్రమానికి రోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. అపోలో హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లోని ఇతర హాస్పిటల్స్ లో కూడా విస్తరించేందుకు మిల్లెట్ మార్వెల్స్ సిద్ధమవుతోంది.

  • సహకార రంగానికి సంబంధించి 160కి పైగా ఆన్‌లైన్‌ డిజిటల్‌ కోర్సులను తెలుగు సహా 8 భాషల్లో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్‌ చేస్తోంది. రైతులు, ఎగుమతిదారులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సవిద్య.సీఓఓపి’ పేరిట ఒక వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చింది.

    ‘సవిద్య’ అంటే ‘సహకార విద్యాలయం’. (Sahakar Vidyalaya) ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్‌ సహకార విద్యా వేదిక. రైతులు, విద్యార్థులు, ఎగుమతిదారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించటానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ‘సహకార్‌ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణను అందిస్తుంది. 

    వ్యవసాయ పద్ధతులు, ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్‌ చేసే 160కి పైగా ఉచిత వీడియో కోర్సులు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్‌ను వ్యక్తిగతీకరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా జ్ఞానాన్ని అందించేందుకు ఏఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది.

    వినియోగదారులు తమ మొబైల్‌ పరికరాల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి, పంట దిగుబడిని మెరుగుపరచుకోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్‌ అవసరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచటం విశేషం.

    నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఈఎల్‌), క్రిబ్కో వంటి సహకార సంస్థలు ఉమ్మడి కృషితో సహకార విద్యా ప్లాట్‌ఫారమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17,000 సహకార సంఘాలను 2 కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. మీరు savidya.coopలో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకొని, సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

  • న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్‌గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్‌ బిలియనీర్‌, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్‌లో ఒకరైన  సుధారెడ్డి అద్భుతమైన లుక్‌లో అలరించారు. 

    ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్‌లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్‌కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్‌తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్‌ అందాన్ని మరింత హైలెట్‌ చేశాయి. 

    ఈ నెక్లెస్‌ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్‌ మల్హోత్రా డిజైన్‌ చేసినా ఆమె డ్రెస్‌ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. 

    అన్నింటకంటే ఆ డిజైనర్‌వేర్‌లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్‌ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన మెట్‌ గాలా లుక్‌ గురించి ఇలా షేర్‌ చేసుకున్నారు. 

    "హైదరాబాద్‌ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు".  కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    (చదవండి:  ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)
     

  • గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో మార్పులుచోటు చేసుకుంటాయి. అవి శారీరకమైనవీ, మానసికమైనవికూడా. అయితే... ప్రసవం తర్వాత అవన్నీ వెంటనే ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ప్రసవం తర్వాత ఓ మహిళమళ్లీ మామూలు స్థితికి రావాలంటే కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని బాధ్యతలు తప్పనిసరి. ఇక కాన్పు తర్వాత చాలా మంది మహిళలు తమకు పుట్టిన బిడ్డ గురించి శ్రద్ధ తీసుకుంటారు తప్ప తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కాన్పు తర్వాత మహిళలు...తమ బిడ్డ విషయంలోనే కాకుండా తన కోసం కూడా కొంత వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. ఆ టైమ్‌లో బాలింతకు వచ్చే కొన్ని సమస్యలూ... వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాలను తెలుసుకుని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులూ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం...

    గర్భం దాల్చినప్పుడు మామూలుగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తనలో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లమెల్లగా సైజు తగ్గుతూపోతూ ఆరువారాలకు తన మొదటి స్థితిని చేరుతుంది.  కాన్పు తర్వాత వారం రోజుల వరకు బొడ్డు కింది భాగంలో గర్భాశయం గట్టిగా స్పర్శకు తెలుస్తుంటుంది.  

    గర్భిణిగా ఉన్న సమయంలో లోపల గర్భాశయంతో పాటు బయట పొట్ట కండరాలూ  బాగా సాగుతాయి. ఫలితంగా కాన్పు తర్వాత కూడా పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా కనిపిస్తుండవచ్చు. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడం వల్ల కొందరిలో చర్మంపై తెల్లటి లేదా ఎర్రటి లేదా నల్లటి చారికలు (స్ట్రెచ్‌మార్క్స్‌) ఏర్పడవచ్చు. ఇవన్నీ కాస్మటిక్‌గా మహిళలకు కొంత ఇబ్బందికరంగా కనిపించవచ్చు. 

    ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ నివారణ కోసం: పొట్ట మీద, తొడల మీద ఉండే చర్మం సాగి, చిట్లడం వల్ల వచ్చే స్ట్రెచ్‌మార్క్స్‌ పూర్తిగా పోవడానికి గాని, అస్సలే రాకుండా ఉండటానికి ఎలాంటి మందులూ, క్రీములు ఉండవు. ఆలివ్‌ ఆయిల్, విటమిన్‌–ఈ, కొన్ని మాయిశ్చరైజర్స్‌ వంటి వాటిని గర్భవతిగా ఉన్నప్పటినుంచే పొట్ట, తొడల మీద రాసుకోవడం వల్ల చర్మం మెత్తబడి సాగడానికి వీలుగా ఉంటుంది. దురదలు రావు. కాబట్టి దీనివల్ల స్ట్రెచ్‌మార్క్స్‌ నివారణ కొంతవరకు సాధ్యమవుతుంది.  

    ప్రసవం అయిన తర్వాత మహిళ (బాలింత)లో  కొన్ని రకాల సమస్యలు / ఆరోగ్య సమస్యలు 
    కనిపించవచ్చు. అవి... 

    బాలింత జ్వరం : కాన్పు తర్వాత కొందరు మహిళల్లో ఒళ్లు కొంచెం వేడిగా ఉంటూ, తర్వాత మామూలుగా అవుతుంటుంది. కొంతమందిలో మాత్రం కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. 

    పరిష్కారం : కోల్డ్‌ స్పాంజింగ్‌తోనే చాలావరకు జ్వరం తగ్గిపోతుంది. అయితే ఏదైనా నిర్దిష్ట కారణం వల్ల జ్వరం వచ్చినట్లు డాక్టర్లు గుర్తిస్తే... ఆ కారణాన్ని బట్టి డాక్టర్లు మందులు సూచిస్తారు.

    బాలింత జ్వరాలకు కొన్ని కారణాలు... 
    జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌ : రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో తగినంత శుభ్రత పాటించకపోవడం, రోగకారకక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చి బాలింత జ్వరం రావచ్చు. 

    పరిష్కారం : డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్‌ వాడాలి. 

    రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్‌ : కొత్తగా తల్లి అయిన మహిళ తన బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, నిపుల్స్‌ సరిగా లేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడంతో  పాలు లోపలే గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్‌ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి దేహంలోకి రోగక్రిములు చేరవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ముల్లోకి పాకి అది తల్లిలో ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు. 

    పరిష్కారం: డాక్టర్‌ సలహా మేరకు తగిన మందులు తీసుకుంటూ, వైద్యులు సూచించే జాగ్రత్తలు పాటించాలి.

    జ్వరాలకు మరికొన్ని కారణాలు : 

    సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నప్పుడు వేసే కుట్లలో చీము పట్టడం 

    మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకే ముప్పు 

    ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా దేహమంతటా పాకి కొంత ప్రమాదాలకు తావిచ్చే అవకాశం. 

    పరిష్కారం : కారణాలను బట్టి తగిన మందులు ఇవ్వడం, ఆ మేరకు బాలింత తగిన జాగ్రత్తలు పాటించేలా కుటుంబ సభ్యులు చూసుకోవాలి. 

    నొప్పులు : కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల దగ్గర నొప్పులు రావచ్చు. కొందరిలో అవి మరీ ఎక్కువగానూ ఉండవచ్చు. గర్భాశయం బరువు మొత్తం వెన్నుపూసపై పడటం వల్లా, అలాగే కండరాలు సాగి మునపటి బలం కొద్దిగా  తగ్గడం వల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. 

    కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టంకావడంతో ఫోర్సెప్‌ సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్పుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కొంతమందిలో కాన్పు తర్వాత కాళ్లు కదల్చలేకపోవడం, స్పర్శ తగ్గడం వంటివీ కనిపించవచ్చు. 

    పరిష్కారం : వీటిని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటిలో చాలావరకు డాక్టర్ల సలహాలూ, మందులతోనూ లేదా ఇవన్నీ కొద్దిపాటి ఫిజియోథెరపీతో తగ్గిపోయే సమస్యలే. 

    మూత్రసమస్యలు : కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వంటి సమస్య కనిపించవచ్చు.అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు పట్టి ఉంచడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్‌ (యూరినరీ ఇన్ఫెక్షన్స్‌) వచ్చే అవకాశాలు ఉంటాయి. 

    కాన్పు తర్వాత ఉండే  నొప్పి వల్ల కూడా మూత్ర విసర్జన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచి మూత్రవ్యవస్థకూ ఇన్ఫెక్షన్‌ పాకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే ముప్పు కూడా ఉంది. 

    పరిష్కారం : ఈ సమస్యలు తగ్గడానికి పెల్విక్‌ఫ్లోర్‌ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. 

    మలబద్దకం : కాన్పు తర్వాత మహిళలకు పెద్దగా నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో మలబద్దకం ఏర్పడవచ్చు. 

    పరిష్కారం : తగినన్ని నీళ్లు తాగడం, ద్రవాహారం తీసుకోవడంతో పాటు ఆకుకూరలూ, కాయగూరలతో ఉన్న పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుంది. సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు చాలా కొద్దికాలం పాటు మందులు వాడాల్సి రావచ్చు. 

    రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం :  
    గర్భవతిలో కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని ఆపడం కోసం రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన పదార్థాలు (ఫ్యాక్టర్లు) ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో బాధపడేవారు, ఎక్కువ వయసున్న వారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు రక్తరాళాల ద్వారా వేరే చోట్లకు పాకి సాధారణ రక్తప్రసరణకు అడ్డుగా మారే (ఎంబాలిజమ్‌) ముప్పు ఉంటుంది. 

    ఉదాహరణకు... కొందరిలో ఇలాంటి రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రసరణకు ఆటంకం కలిగిస్తే... అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాలకే ముప్పు కలిగే అవకాశమూ లేకపోలేదు. ఈ కండిషన్‌ను ‘పల్మునరీ ఎంబాలిజమ్‌’ అంటారు. 

    పరిష్కారం : కాన్పు తర్వాత ఎక్కువగా కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. డాక్టర్‌ సలహా మేరకు చురుగ్గా ఉండటం అవసరం.  

    తీవ్రమైన రక్తస్రావం : కాన్పు తర్వాత కొంతసేపు సాధారణంగా 200 ఎంఎల్‌ నుంచి 500 ఎంఎల్‌ వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువగా రక్తస్రావం అయితే ఆ కండిషన్‌ను పోస్ట్‌పార్టమ్‌ హేమరేజ్‌ (పీపీహెచ్‌) అంటారు. 

    పీపీహెచ్‌ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మందిలో ప్రాణాలకు ముప్పు ఉండే ప్రమాదముంటుంది. దాదాపు 90 శాతం పీపీహెచ్‌ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడం (యుటరైన్‌ ఎటోనీ) వల్ల బ్లీడింగ్‌ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) చీరుకుపోవడం వల్ల, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం, రక్తం గూడుకట్టుకునే స్వభావంలో లోపాలు కూడా పీపీహెచ్‌కు కారణం కావచ్చు.

    పరిష్కారం : ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు... అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సిన రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే కొందరిలో గర్భసంచి తొలగించాల్సిరావచ్చు. 

    రక్తహీనత : అధిక రక్తస్రావం కావడం లేదా ముందు నుంచే రక్తహీనత ఉన్నవారిలో ఉండాల్సిన మోతాదులో రక్తం లేక΄ోవడం వల్ల నీరసం, నిస్సత్తువ, బలహీనంగా ఉండటం వంటివి కనిపించవచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్‌ సోకడం, అవి ఒకపట్టాన తగ్గకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

    పరిష్కారం : తల్లికి పాలకూర వంటి ఆకుకూరలూ, నువ్వుల వంటి వాటితో చేసిన రుచికరమైన పదార్థాలు... అంటే ఐరన్‌ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు పెడుతుండాలి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సిరప్, టాబ్లెట్లు వంటివి వాడాల్సిరావచ్చు. 

    ఫిట్స్‌ (హైబీపీ వల్ల) : కాన్పుకి ముందు కొంతమందిలో బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

    పరిష్కారం : నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. 

    మానసిక సమస్యలు : కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3–5 రోజుల తర్వాత డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కండిషన్‌నే పోస్ట్‌పార్టమ్‌ బ్లూస్‌ లేదా బేబీ బ్లూస్‌ అంటారు. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల తాలూకు ఆందోళనా, భయం,  నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులతో కనిపించే మానసిక సమస్యలూ, కుటుంబంలో ఉండే సమస్యలూ, కలహాల వంటి ఎన్నో కారణాల ఈ డిప్రెషన్‌  రావచ్చు. 

    కుటుంబసభ్యుల సహకారం వల్ల కొందరిలో ఇది 2–3 రోజుల్లోనే  చక్కబడుతుంది. కానీ... మరికొందరిలో పరిస్థితి మరింత తీవ్రమై సైకోసిస్‌ స్థితిలోకి వెళ్లే ముప్పు కూడా ఉంటుంది. 

    పరిష్కారం : ఈ సమస్యకు మానసిక వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అవసరం. 

    బాలింత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    కాన్పు తర్వాత అటు తల్లి విషయంలోనూ, ఇటు బిడ్డ విషయంలోనూ తగిన జాగ్రతలు పాటించి, ఎలాంటి సమస్యలూ రాకుండా చూసుకోవాలి. కాన్పు జరిగిన 24 నుంచి 48 గంటల వరకు బాలింత ఆరోగ్యంతో పాటు ఆమెలో జ్వరం, బీపీ, రక్తస్రావం వంటివి ఏవైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

    ఆహారం : కాన్పు తర్వాత బాలింతకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. మామూలుగా కంటే రోజుకు 600 కేలరీలు అధికంగా శక్తినిచ్చే ఆహారంతోపాటు బాగా పాలుపడేలా ఉండే ఆహారం తల్లికి ఇవ్వాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ధాన్యాలు,  మాంసాహారం ఇవ్వాలి. పాలు, పెరుగు, పండ్లు తీసుకోవచ్చు. 

    ఆహారంలో ఎలాంటి పథ్యం అవసరం లేదు. అయితే కారాలు, పచ్చళ్లు, మసాలాలు తినకూడదు. పప్పులు తినడం వల్ల చీము పడుతుందన్నది అపోహ మాత్రమే. రోజుకు కనీసం 10 గ్లాసులు (రెండు లీటర్ల) నీళ్లు తప్పనిసరిగా తాగించాలి. నీరు తాగడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్స్, మలబద్దకాన్ని నివారించడానికి వీలవుతుంది. నీరు తాగడం వల్ల పొట్టపెరుగుతుందని, జలుబు చేస్తుందన్నది అపోహ మాత్రమే. 

    మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కాన్పు తర్వాత కలిగే అలసట  త్వరగా తగ్గుతుంది. కుట్లు త్వరగా/తేలిగ్గా మానుతాయి. పాలు బాగా పడతాయి. (బిడ్డ... తన తల్లిపాల నుంచి ఐరన్, క్యాల్షియమ్‌ గ్రహిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెలలు తల్లి తప్పనిసరిగా ఐరన్, క్యాల్షియమ్‌ మాత్రలు వాడాలి. బిడ్డకు జలుబు చేస్తుందని పండ్లు, పెరుగు, మజ్జిగ తల్లికి ఇవ్వరు. ఇది కేవలం అపోహ మాత్రమే.

    విశ్రాంతి : కాన్పు తర్వాత తల్లి బాగా అలసిపోతుంది. ఆ అలసటను తగ్గించడానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. శారీరక, మానసిక విశ్రాంతి ఇవ్వడం వల్ల తల్లికి పాలు బాగా పడతాయి. బిడ్డను ఉయ్యాలలో కాకుండా తల్లిపక్కనే పడుకోబెట్టడం వల్ల ఆ స్పర్శతో తల్లీబిడ్డల మధ్య బంధం పటిష్టమవుతుంది. పాలు బాగా పడతాయి.

    అటు ఇటు తిరగడం : సాధారణ కాన్పు తర్వాత తల్లిని కొద్ది గంటలలోపే లేచి అటు ఇటు తిరిగేలా ప్రోత్సహించడం మంచిది. ఆపరేషన్‌ చేసిన వాళ్ల విషయంలో... ఆమె బెడ్‌ మీదే ఉన్నప్పటికీ  4–6 గంటల తర్వాత నుంచి మంచంలోనే కాళ్లు అటూ–ఇటూ కదపడం, ముడుచుకోవడం–స్ట్రెచ్‌ చేయడం వంటివి చేయవచ్చు. 

    ఆరోగ్యపరిస్థితిని బట్టి 12–24 గంటల తర్వాత మెల్లగా ఏదైనా ఆసరాతో లేచి తిరిగేలా చేయవచ్చు. ఇలా త్వరగా కదలడం వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే  ముప్పునూ... ఆ రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లోకి ప్రవేశించే (ఎంబాలిజమ్‌) రిస్క్‌ను నివారించవచ్చు.

    వ్యక్తిగత పరిశుభ్రత : కాన్పు తర్వాత జననాంగాలు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మల,మూత్ర విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధారణ కాన్పు తర్వాత కుట్లు వేయాల్సివస్తే వాటిపై యాంటీసెప్టిక్‌ పౌడర్‌ వేసుకోవచ్చు. 

    బట్టలు కాకుండా డయాపర్లు వాడుకోవడం మంచిది. తడిసినవాటిని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్‌ రాకుండా చూసుకోవచ్చు. యోనిస్రావాల  పరిమాణం, రంగు, వాసన అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.

    రొమ్ములపై శ్రద్ధ : తొమ్మిదో నెల నుంచే తల్లి తన రొమ్ములను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రొమ్ము మొనలను సాగదీస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత బిడ్డ పాలు తాగడానికి అనువుగా మారతాయి. బిడ్డ పుట్టగానే గంటలోపే బిడ్డకు తల్లి పాలు పట్టిస్తే పాలు మరింత త్వరగా ఊరతాయి. 

    బిడ్డకు అత్యుత్తమ ఆహారం తల్లిపాలే. మొదటి రెండు మూడు రోజులు నీరు లాంటి ద్రవం (కొలెస్ట్రమ్‌) ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో బిడ్డకు వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి అవసరమైన యాంటీబాడీస్, విటమిన్స్‌ ఉంటాయి. బిడ్డకు మొదటి ఆర్నెల్లూ తల్లిపాలే పట్టాలి. అవి మినహా మరేవీ ఇవ్వడం సరికాదు.

    వ్యాయామాలు : కొన్ని వ్యాయామాలతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవి నడుము నొప్పిని నివారిస్తాయి. ప్రారంభంలో కాళ్లు కదపడం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌  చేయాలి. డాక్టర్‌ సలహా మేరకు ఆరు వారాల తర్వాత క్రమేపీ పొత్తికడుపు కండరాలు, పెల్విక్‌ఫ్లోర్‌ కండరాలు, నడుము కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయవచ్చు. 

    వీటివల్ల వదులైన పొట్ట కండరాలు గట్టిపడతాయి. పొట్ట మీద బట్ట చుట్టడం వల్లనో, అబ్డామినల్‌ బెల్ట్‌ వల్లనో పొట్ట తగ్గదు. అవి కేవలం సపోర్ట్‌గా మాత్రమే పనికివస్తాయి. కాన్పు తర్వాత అలసట తగ్గాక మెల్లగా వాకింగ్‌వంటి తేలికపాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు.

    కుటుంబ నియంత్రణ : ప్రసవం తర్వాత వెంటనే గర్భం అందకుండా డాక్టర్‌ సలహా మేరకు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం మంచిది. కాన్పు తర్వాత 2–3 నెలల నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ (పీరియడ్స్‌ రాకుండానే కూడా). అందువల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల అనుకోకుండా వచ్చే, అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. 

    అంతేకాకుండా తొమ్మిది నెలల పాటు బిడ్డను మోసి, కని అలసిపోయిన శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉన్న సమయాన్ని బిడ్డకి కేటాయించడం వల్ల బిడ్డలోనూ మంచి ఎదుగుదల, వికాసం కనిపిస్తాయి. ఇక పిల్లలు వద్దు అనుకున్న వారు శాశ్వత సంతాన నియంత్రణ పద్ధతుల కోసం డాక్టర్‌ను సంప్రదించవచ్చు. 

    దాంపత్య జీవితం : బాలింతలో జరిగే మార్పులు యథాతథ స్థితికి వచ్చేందుకు, జననాంగాలు సాధారణ స్థితికి రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. ఇతరత్రా ఏ సమస్యలూ లేకుండా ఉంటే, ప్రసవం అయ్యా ఆరు వారాల తర్వాతి నుంచి దాంపత్య జీవితం గడపవచ్చు. ఒకవేళ సిజేరియన్‌ అయిన వారు కుట్లలో ఎలాంటి నొప్పులు లేకపోతే 8–10 వారాల తర్వాత దాంపత్యంలో పాల్గొనవచ్చు.

    కుటుంబ సభ్యుల పాత్ర : కాన్పు తర్వాత బాలింతకు ఇంట్లో వాళ్ల చేయూత, మద్దతు ఎంతో అవసరం. ముఖ్యంగా భర్త పోషించాల్సిన భూమిక చాలా ప్రధానం.

    డాక్టర్‌ చెకప్‌ : కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక వారం తర్వాత ఒకసారి, ఆరు వారాల తర్వాత మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. లేదా డాక్టర్‌ సూచించిన విధంగా చెక్‌అప్‌కు వెళ్లాలి. తనకు వచ్చే సందేహాలన్నింటినీ మొహమాటపడకుండా డాక్టర్‌ను అడిగి తీర్చుకోవాలి. కాన్పుకు ముందు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని డాక్టర్‌కు వివరించి, వాటి విషయంలో కాన్పు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం అవసరం.

    డాక్టర్‌ సరోజ బానోతు,కన్సల్టెంట్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌ 
    – గైనకాలజిస్ట్‌ 

    (చదవండి: మామిడి పండ్లను తినేముందు ఇలా చేయడం తప్పనిసరి..! హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు)
     

  • జాతీయ  స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష నీట్‌NEET)కు  హాజరైన అభ్యర్థులలో ఒక అభ్యర్థి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఐదుపదుల వయసులో ఈ పరీక్షకు పోటీపడటమే. లక్నోలోని చందర్‌నగర్‌ నివాసి అయిన అశోక్‌ బహార్‌ మాంటిస్సోరి పాఠశాలలో గత ఆదివారం ఈ పరీక్షక రాశారు. నీట్‌ యూజీ 2026 పరీక్ష మే 3, 2026న దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దిగ్విజయంగా నిర్వహించన సంగతి తెలిసిందే. 

    ఇక బహార్‌ గతంలో ఒక ఎరువుల తయారీ సంస్థలో మార్కెటింగ్ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన వైద్య రంగంపై ఉ​న్న మక్కువతో ఎంతో కాలంగా ఈ పరీక్ష రాయలని అనుకున్నారట. అయితే ఇన్నేళ్లకు ఆ కల నెరవేరిందని ఆనందంగా చెబుతున్నారు. ఆయన 2000వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్‌(స్వచ్ఛంద పదవీ విరమణ (VRS)) తీసుకున్నప్పటి నుంచి  నీట్‌ పరీక్ష రాయాలనే ఆలోచన ఉందట. 

    తాను సమాజానికి అర్థవంతమైన రీతీలో సేవ చేయాలంటే ఇదే సరైన రంగం అని అనిపించదట. అందుకు తనకు సరైన గుర్తింపు, అర్హత ఉండాలని భావించే నీట్‌ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఇందుకు ఒకరకంగా తన కుటుంబ ప్రభావం కూడా ఒక కారణమని చెప్పడం విశేషం. బహార్‌ భార్య డాక్టర్‌ మంజుల్‌ బహార్‌ ప్రస్తుతం అమెరికాలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ వృత్తితో దశాబ్దాల పాటు అనుబంధం ఉండటం వల్ల ఔషధాల గురించి కొంత అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. 

    కానీ వైద్యవృత్తిని చేపట్టేలా అధికారికంగా అర్హతలు లేవని చెప్పారు. నిజానికి నీట్‌ ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష. దీనికి ఎక్కువగా 17 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారే హాజరవుతారు. కానీ దాన్ని సవాలు చేసే 57 ఏళ్ల వ్యక్తి ఈ పరీక్ష రాయడం విశేషం. ఆయన ఇతర అభ్యర్థులు మాదిరిగానే ఈ పరీక్ష రాశారు. చాలాకాలం తర్వాత చదవడం వల్ల.. కాస్త కష్టమైందని, అయితే ఏకాగ్రతతో దాన్ని సాధించగలిగానని అన్నారు. 

    గతకొంతకాలంగా కొందరు పెద్దలు లేటు వయసులో తిరిగి ఉన్నత చదువుపై అడుగుల వేస్తున్న కేసులు పెరుగుతుండటం విశేషం. ఇక బహార్‌ లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు, కష్టపడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు..ఏ దశలోనైనా ముందుకు సాగొచ్చని అన్నారు. ఏదీఏమైనా కఠినతరమైన ఆ నీట్‌ పరీక్షను రెస్ట్‌ తీసుకునే వయసులో పోటీపడటం అనేది అత్యంత ప్రశంసనీయమైన విషయం. కాగా, అతనికి వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుందో లేదా అనేది నీట్‌ ఫలితాలే నిర్ణయిస్తాయి. మరి ఆ తాతగారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా..!.

     

  • నోరూరించే మసాలాలు, పుల్లని చల్లటి నీరు.. సాయంత్రం వేళ పానీ పూరీ ఇచ్చే మజాయే వేరు. అందుకే పానీ పూరీ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇది ఫేవరెట్‌ స్ట్రీట్‌ ఫుడ్‌. తాజాగా ఓ జపనీస్‌ పారిశ్రామికవేత్తకు కూడా మన పానీ పూరీ తెగ నచ్చేసిందంట. హెర్మెస్‌ అనే జపనీస్‌ మహిళ ఎక్స్‌ వేదికగా పానీ పూరీపై తనకున్న మక్కువను పంచుకోవడంతో.. సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. 

    వారంలో రెండు రోజులు పానీ పూరీ తింటున్నాననీ.. బయట ఫుడ్‌ని ఇష్టపడని తన భర్త కూడా నీ పూరీ రుచికి ఫిదా అయిపోయారని ఆమె అందులో రాసుకొచ్చారు. అందుకే తను జపాన్‌లో ఏకంగా ఓ పానీ పూరీ సెంటర్‌ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లోకి ఒక పానీ పూరీ కిట్‌ను కూడా తెచ్చుకున్నట్లు హెర్మెస్‌ వెల్లడించారు. 

    ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు భారతీయుల ఫేవరెట్‌ స్నాక్‌కు జపాన్‌లో కూడా క్రేజ్‌ రావడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పానీ పూరీ పవర్‌ అలాంటిది’ అంటూ కామెంట్లతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.  

     

    (చదవండి: Met Gala 2026: గోల్డ్‌ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్‌లో మొత్తం అమ్మ..)

  • మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. 

    కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్‌ రిటైల్ బ్రాండ్‌ స్వదేశ్‌కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్‌  చేశారు. ఆఖరికి బ్లౌజ్‌ కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌. ఎందుకంటే ఈ బ్లౌజ్‌ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. 

    దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్‌లను ఈ వస్రం(బ్లౌజ్‌)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్‌ బ్యాగ్‌లో సుబోధ్‌ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్‌కార్పెట్‌పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. 

    సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్‌గాలా 2026 థీమ్‌ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్‌కు చెందిన సౌరబ్‌ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. 

    ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్‌ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్‌ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. 

     

    (చదవండి:  ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..)

     

National

  • ఛతర్‌పూర్: ఒక దళిత కుటుంబాన్ని కర్రలతో చితగ్గొట్టారు గ్రామంలోని ఐదుగురు వ్యక్తులు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ దేవాలయానికి విరాళంగా పెద్దలు అడిగిన విధంగా ఆ దళిత కుటుంబం గోధుమలు ఇవ్వలేదని ఈ దాడి జరిగింది.

    ఛతర్‌పూర్‌లోని మహారాజ్‌గంజ్ గ్రామంలో స్థానికులు ఐదుగురు ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లి దేవాలయ విరాళం పేరుతో గోధుమలు కోరారు. అయితే, ఆ కుటుంబం గోధుమలు భారీ మొత్తంలో ఇవ్వలేమని అన్నారు. దీంతో పెద్దలు ఆ దళిత కుటుంబంపై దూషణలు చేసి, ఇంటి నుంచి బయటకు లాగి, కర్రలు, ఇనుప రాడ్లు, ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. 

    మహిళలు, పిల్లలను కొట్టారు. కుటుంబంలోని పలువురు రక్తస్రావం అయ్యి గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఆ కుటుంబం నుంచి డిమాండ్‌ చేసిన విరాళం వారి సామర్థ్యానికి మించి ఉంది. తాము చేతనైనంత ఇచ్చామని కుటుంబం తెలిపింది. "నేను గోధుమలు విరాళంగా ఇస్తే, ఏడాది మిగతా కాలం నా పిల్లలకు ఏమి తినిపిస్తాను?" అని బాధితుడు వచ్చి గోధుమలు అడిగిన వారికి చెప్పినట్లు సమాచారం.

    దీంతో జరిగిన ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు గాయపడ‍్డారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఆ తర్వాత స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. దాడికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో కుటుంబంపై నిందితులు దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

    శ్యామ్ పటేల్, హర్దయాల్ పటేల్, కృపాల్ పటేల్, రాజా భయ్యా పటేల్, రామ్‌స్వరూప్ పటేల్, భగవత్‌దయాల్ పటేల్ తదితరులు ఈ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. మిగిలిన గోధుమలను బలవంతంగా తీసుకెళ్లి అక్కడి నుంచి తరలించారని కూడా చెప్పారు. అయితే గోధుమలను తీసుకెళ్లడానికి ఉపయోగించిన వాహనాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వారు అంటున్నారు.

    పోలీసులు ఈ కేసులో చర్యలు తీసుకున్నామని తెలిపారు. సివిల్ లైన్స్ ఇన్‌స్పెక్టర్ అశుతోష్ శ్రోటి ఈ వివాదం దేవాలయ విరాళంగా గోధుమలు సేకరణ సమయంలో మొదలై, తర్వాత హింసకు దారితీసిందని చెప్పారు.

    "ఈ ఘటన దేవాలయానికి గోధుమలను విరాళం కోరడం నుంచి ప్రారంభమై, తర్వాత ఘర్షణగా మారింది. నిందితులను అరెస్ట్ చేశాం. చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం" అని శ్రోటి చెప్పారు. పోలీసులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదుగురు నిందితులపై చర్యలు ప్రారంభించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. 

  • ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పత్తి ఉత్పత్తి పెంపు మిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 5,659 కోట్ల రూపాయలతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాషన్ టు ఫారిన్ అనే లక్ష్యంతో మిషన్ ఏర్పాటు చేసింది. ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

    ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎయిర్ లైన్స్ సంస్థల కోసం 5,000 కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీకి ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎమ్ఈలు, నాన్ ఎంఎస్ఎమ్ఈలకు ఆర్థిక సహకారం కోసం పథకానికి ఆమోదముద్ర వేసింది. చెరుకు పంటకు క్వింటాలు 365 రూపాయల మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వదినారులో షిప్ రిపేర్ ఫెసిలిటీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని వల్ల 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

    రెండు నూతన సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3,936 కోట్ల రూపాయలతో గుజరాత్‌లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. 2,230 మంది నిపుణులకు ఉపాధికి అవకాశం దక్కనుంది. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

    ఇతర నిర్ణయాలు

    * 2026-27 చక్కెర సీజన్‌కు FRP (Fair & Remunerative Price) రూ. 365/క్వింటాల్‌గా నిర్ణయం
    * ECLGS-5 కింద రూ. 18,100 కోట్ల ప్యాకేజీకి ఆమోదం
    * గుజరాత్‌లో వడినార్‌లో నౌకల మరమ్మతు కేంద్రం – రూ. 1,570 కోట్లు
    * రెండు కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు ఆమోదం (రూ. 3,068 కోట్లు + రూ. 868 కోట్లు)
    * నాగ్దా–మథుర 3,4వ రైల్వే లైన్ (568 కి.మీ) – రూ. 16,403 కోట్లు
    * గుంటకల్–వాడి రైల్వే లైన్ (230 కి.మీ) – రూ. 4,758 కోట్లు
    * బుర్హ్వాల్–సీతాపూర్ రైల్వే లైన్ (103 కి.మీ) – రూ. 2,276 కోట్లు

  • తమిళనాడులో టీవీకే మద్దతు అంశంలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశమై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తొలిసారిగా స్పందించారు. విజయ్‌ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో తమిళనాడు కాంగ్రెస్‌ నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై అగ్రనాయకులు విశ్లేషణ జరిపారు.

    అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్‌ను ఇదివరకే పలుమార్లు విజయ్‌ కోరారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు లేఖసైతం రాశారు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్‌ విజయ్‌ పార్టీకి మద్ధతివ్వడం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది . 

    ఈ అంశమై ఇది వరకే  హస్తం నేతలు టీవీకేకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా టీవీకే 108 స్థానాల్లో నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌ అక్కడ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో హస్తం మద్దతు కీలకం కానుంది.  

     

  • చెన్నై: త‌మిళ‌నాడు శాస‌నస‌భ ఎన్నిక‌ల్లో స్టాలిన్ నాయ‌క‌త్వంలోని డీఎంకే కూట‌మి ప్ర‌భుత్వం పరాజయం పాలైంది. ద్వంద్వ పార్టీల సంప్ర‌దాయానికి త‌మిళులు చ‌ర‌మ‌గీతం పాడి మూడో ప్ర‌త్యామ్నాయంగా వ‌చ్చిన టీవీకే విజయ్‌వైపు మొగ్గుచూపారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల పాటు నిరాటంకంగా కొన‌సాగిన‌ ద్ర‌విడ రాజ‌కీయాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం కోసం త‌మిళ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌నే విష‌యాన్ని బీజేపీ నేత అన్నామ‌లై ముందే ప‌సిగ‌ట్టార‌ని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. ఇదే అంశంపై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ స్మితా ప్ర‌కాశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్ట‌డంతో చ‌ర్చ మొద‌లైంది.

    “తమిళనాడు ఎన్నిక‌ల ఫలితాలు వెలువడుతున్న స‌మ‌యంలో అన్నామలై చెన్నైలో కాకుండా కొలంబోలో ఉండటం ఆసక్తికరంగా మారింది. విజయ్ ఈరోజు సాధించిన గెలుపు, 2024లో అన్నామలై ఊహించినదే. ఆయన దానిని ముందుగానే పసిగట్టారు, కానీ త‌మిళులు బీజేపీకి తమ విధేయతను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు” అని ఎక్స్ పోస్ట్ పెట్టారు. దీనిపై అన్నామ‌లై మ‌ద్ద‌తుదారులు ఆయ‌న‌కు సానుకూలంగా స్పందించారు. కాగా, ఆదివారం సాయంత్రం కొలంబోలో ఉన్న అన్నామ‌లై.. సోమ‌వారం ఎన్నికల ఫ‌లితాల స‌మ‌యానికి చెన్నైకు తిరిగి వ‌చ్చిన‌ట్టు ఆమె మ‌రో పోస్ట్ ద్వారా అప్‌డేట్ ఇచ్చారు.

    బీజేపీ ఒంట‌రిగా పోటీచేసి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని అన్నామ‌లై మ‌ద్ద‌తుదారులు వ్య‌క్తం చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మూడో ప్ర‌త్యామ్నాయం కోసం చూస్తున్నార‌ని రెండేళ్ల క్రిత‌మే అన్నామ‌లై ప‌సిగ‌ట్టార‌ని అంటున్నారు. డీఎంకే వ్యతిరేక ప్రచారాలు, పాదయాత్రలు, అవినీతి బట్టబయలు చేయడం ద్వారా తమిళనాడులో మార్పు కోసం ఉన్న ఆకాంక్షను అన్నామ‌లై ముందుగానే గుర్తించార‌ని చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం.. క్షేత్రస్థాయి మద్దతు ఉన్న అన్నామ‌లైని ప‌క్క‌న పెట్టింద‌ని ఆయ‌న సానుభూతిప‌రులు అభిప్రాయ‌ప‌డ్డారు.

    పొత్తుతో చిత్తు
    'అన్నామ‌లై గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే.. విజ‌య్ స‌క్సెస్ అయ్యారు' అన్న‌ట్టుగా ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. ''త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయార‌ని అన్నామలై ముందే చెప్పారు. ఈ రెండు పార్టీల‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాల‌ని సూచించారు. ఆయ‌న మాట‌ల‌ను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం పెడ‌చెవిన పెట్టింది. ఇప్పుడు విజ‌య్ సాధించిన విజ‌యంతో అన్నామ‌లై మాట‌లు నిజ‌మ‌య్యాయ''ని ఒకరు పేర్కొన్నారు. అన్నామలై మూడేళ్లకు పైగా క‌ష్ట‌ప‌డి డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా సాగించిన పోరాటంతో విజ‌య్ ఫ‌లితం పొందార‌ని మ‌రొక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ త‌ప్పు చేసింద‌ని ఎక్కువ మంది పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: అన్నాడీఎంకే మాజీ నేత‌కు టీవీకే ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి!

    రిస్క్ తీసుకోవాలి
    2024, ఫిబ్ర‌వ‌రి 16న‌ జ‌రిగిన పార్టీ స‌మావేశంలో అన్నామ‌లై మాట్లాడిన వీడియోను తాజాగా వెలుగులోకి తెచ్చారు. 2026 ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాదు. క‌చ్చితంగా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డుతుంది. త‌మిళ‌నాడులో మొట్ట‌మొద‌టి సారిగా ప్యూర్ అల‌యెన్స్ గ‌వ‌ర్న‌మెంట్ ఏర్ప‌డ‌బోతోంది. ఈ రెండేళ్లలో ప‌క్కా వ్యూహంతో ప్ర‌ణాళికాబ‌ద్దంగా ప‌నిచేసి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు త‌యారు చేసి ఎన్నికల నోటిఫికేష‌న్ వెలువ‌డానికి 500 రోజుల ముందే 234 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాలి. వారం, ప‌ది రోజుల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. బీజేపీ రిస్క్ తీసుకుని ఈ విధంగా చేస్తే క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంద‌ని అన్నామ‌లై అప్ప‌ట్లో అన్నారు. 

     

  • చంఢీగడ్‌: ఓ ప్రయాణికుడి పవర్‌ బ్యాంక్‌ నుంచి మంటలు రావడంతో చంఢీగఢ్‌ విమానాశ్రాయంలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.  ఇండిగో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే ప్రయాణికుడి పవర్‌బ్యాంక్‌ నుంచి మంటలు వచ్చి పొగ తీవ్రంగా వ్యాపించింది. దాంతో ప్రయాణికుల్ని అత్యవసర తరలింపు చేపట్టారు.  విమానాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ)  హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.

     హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 108 ల్యాండింగ్ తర్వాత నిలిచి ఉన్నప్పుడు, ఒక ప్రయాణికుడికి చెందిన పవర్‌బ్యాంక్‌కు నిప్పంటుకున్న ఘటన చోటు చేసుకున్నట్లు, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. 

    భద్రతా దృష్ట్యా, వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించామని,, సంబంధిత అధికారులందరికీ తక్షణమే సమాచారం అందించడం జరిగిందని ఆ ప్రకటనలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్‌కు తరలించామని, వారి ఆరోగ్య పరిస్థితిని  నిర్ధారించడానికి మా బృందం వారిని పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. 

     

  • సాక్షి, చెన్నై:  తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో  టీవీకే పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత సి. జోసెఫ్ విజయ్ 'జన నాయగన్' (Jana Nayagan)గా సీఎం పీఠం అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శాసనపక్ష నేతగా ఎంపికయ్యారు.  ఈ సందర్భంగా విజయ్‌ ఆస్తులు, ఆర్థిక వివరాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2026 మార్చి 30న భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 27 పేజీల అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలు విశేషంగా నిలుస్తున్నాయి.

    దీని ప్రకారం విజయ్ ప్రకటించిన నికర విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ. 404 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ. 220 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు; ఈ ఆదాయం స్వయం ఉపాధి, అద్దె ఆదాయం , వడ్డీ ఆదాయం ద్వారా సమకూరింది.ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి నాలుగు బకాయి డిమాండ్లు పెండింగ్‌లో ఉండగా, వాటి మొత్తం విలువ రూ. 3 కోట్లకు పైగా ఉంది.

     ఒకే  సేవింగ్స్‌  ఖాతాలో  రూ. 213 కోట్లు
     విజయ్‌ పేర్కొన్న అఫిడవిట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మార్చి 27, 2026 నాటికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సాలిగ్రామం శాఖలోని ఒకే ఒక పొదుపు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉండటం. ఇది ఏదో ఒక నిర్దిష్ట పెట్టుబడి పథకం గానీ, మార్కెట్‌తో అనుసంధానమైన ఉత్పత్తి గానీ కాదు; కేవలం ఒక సాధారణ పొదుపు ఖాతా మాత్రమే. ఆయన ప్రకటించిన మొత్తం నికర విలువలో మూడో వంతుకు పైగా వాటా ఈ ఖాతాదే కావడం విశేషం.

    స్థిర డిపాజిట్లు (Fixed Deposits): నాలుగు బ్యాంకుల్లో కలిపి రూ. 100 కోట్లు
    Axis Bank : ఇందిరా నగర్ శాఖ : రూ. 40 కోట్లు
    Indian Overseas Bank, కోడంబాక్కం శాఖ : రూ. 25 కోట్లు
    HDFC Bank, బసంత నగర్ శా ఖ: రూ. 20 కోట్లు
    State Bank of India, శాస్త్రి నగర్ శాఖ : రూ. 15 కోట్లు
    IOB పొదుపు ఖాతాలోని నిల్వను కూడా కలిపి చూస్తే, ఆయన ప్రకటించిన సంపదలో రూ. 313 కోట్లకు పైగా మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉంది. ఇవి ఎటువంటి మార్కెట్ రిస్క్ లేని, హామీతో కూడిన రాబడినిచ్చే పెట్టుబడి సాధనాలు.

    ఈక్విటీలో షేర్ల విలువ రూ. 19.37 లక్షలు
    స్టాక్ మార్కెట్‌లో ఆయన పెట్టుబడులు చాలా స్వల్పంగా ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఆర్కైవ్ చేసిన అఫిడవిట్ ప్రకారం, జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 19.03 లక్షల విలువైన షేర్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో రూ. 9,600 విలువైన షేర్లు, మరియు సన్ పేపర్ మిల్ లిమిటెడ్‌లో రూ. 25,000 విలువైన షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీటి మొత్తం ఈక్విటీ వాటా రూ. 19.37 లక్షలు, ఇది ఆయన ప్రకటించిన నికర ఆస్తి విలువలో 0.04 శాతం కంటే తక్కువ. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా డిబెంచర్లను ప్రకటించలేదు.

    స్థిరాస్తులు: విజయ్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం స్థిరాస్తులు విలువ రూ. 220 కోట్లు. ఇవి నాలుగు వర్గాలలో విస్తరించి ఉన్నాయి. నీలన్‌కరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ , సమీప ప్రాంతాలలో ఉన్న నివాస ఆస్తులు, వీటి విలువ పది ఆస్తులలో సుమారుగా రూ. 115 కోట్లు.

    • పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగనల్లూర్ మరియు కొప్పూర్‌లలో ఉన్న వాణిజ్య ఆస్తులు, వీటి విలువ సుమారుగా రూ. 82.8 కోట్లు. అతిపెద్ద ఏకైక వాణిజ్య ఆస్తి కొప్పూర్ గ్రామంలోని 2.30 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2023లో నవంబర్ 2023లో రూ. 35.81 కోట్లకు కొనుగోలు చేశారు.

    • పోరూర్, సాలిగ్రామం మరియు నీలన్‌కరైలలోని వ్యవసాయేతర భూమి విలువ రూ. 22 కోట్లు. ఒక్క ఆయన పోరూర్ ప్లాట్ మాత్రమే 33,955 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

    • కొడైకనాల్‌లోని విల్పట్టి గ్రామంలో ఉన్న 0.25 ఎకరాల చొప్పున రెండు వ్యవసాయ ప్లాట్లను 1997లో ఒక్కొక్కటి రూ. 15,000కు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఒక్కొక్కటి రూ. 10 లక్షలుగా ప్రకటించారు.

    ఇదీ చదవండి : విజయ్‌(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?

    ఈ ఆస్తుల నుండి వచ్చే అద్దె ఆదాయాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రియాశీల ఆదాయ వనరుగా ప్రకటించారు. విజయ్ తన వ్యక్తిగత ఆస్తులకు అతీతంగా, అధికారిక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ అయిన జయ నగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్‌ : ఫ్యాషన్‌ వరల్డ్‌ షాక్‌!
     

    అదిరిపోయే వాహనాలు: విజయ్‌ గ్యారేజ్‌లో కొలువు దీరిని   లగ్జరీ  కార్ల విలువ రూ. 13.52 కోట్లకు పైమాటే.

    2024 Toyota Lexus 350: రూ. 3.01 కోట్లు
    2015 Tata Caravan: రూ. 6 కోట్లు
    2024 BMW i7: రూ. 2 కోట్లు
    2014 Toyota Vellfire: రూ. 1.63 కోట్లు
    2020 BMW 530: రూ. 80.54 లక్షలు
    2024 Maruti Swift: రూ. 5.35 లక్షలు
    2025 TVS XL Super: రూ. 67,400

    ఆభరణాలు: విజయ్ వ్యక్తిగతంగా 883 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 1.20 కోట్లు) మరియు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులను ప్రకటించారు. ఆయన సతీమణి సంగీత, విడిగా 3,132 గ్రాముల బంగారాన్ని (విలువ రూ. 4.07 కోట్లు), 2 కిలోల వెండిని (విలువ రూ. 4.75 లక్షలు), మరియు 134.91 క్యారెట్ల వజ్రాలను (విలువ రూ. 1 కోటి) ప్రకటించారు.ఇవి కాకుండా రుణాలు ,అడ్వాన్సుల రూపంలో : రూ. 75.5 కోట్లున్నాయని  ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

    ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్‌ రహస్య ప్రేమ, వీకెండ్‌లో ఔటింగ్‌... కట్‌ చేస్తే!

    సంగీత ఆస్తులు రూ. 15.76 కోట్లు
    విజయ్‌ భార్య( విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది) సంగీత విజయ్ తన మొత్తం ఆస్తులను రూ. 15.76 కోట్లుగా విడిగా ప్రకటించారు. ఇందులో రూ. 15.51 కోట్ల చరాస్తులు (HDFC బ్యాంక్, బసంత నగర్ శాఖలో ఉన్న రూ. 10 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ మరియు రూ. 43.41 లక్షల పొదుపు నిల్వతో కలిపి) , రూ. 25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా

  • హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఓడిపోవడానికి కారణం కేంద్రం నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియే అన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించడం ద్వారే స్టాలిన్, మమతా బెనర్జీ ఓడిపోయారన్నారు.

    ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ "మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌ల నియోజకవర్గాల్లో వరుసగా ఎస్ఐఆర్ నిర్వహించగా, ఇద్దరూ ఓడిపోయారు. పౌరసత్వాన్ని ఎస్ఐఆర్‌తో ముడిపెట్టడం తప్పు అని నేను పార్లమెంటులో కూడా ఇదే  చెప్పాను. పౌరసత్వానికి హోం మంత్రిత్వ శాఖకు నియమాలు ఉన్నాయి; ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ నియమాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఓటు వేయడం గురించే కాదు, మీ పౌరసత్వాన్ని కాపాడుకోవడం గురించి కూడా. తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి." అని అన్నారు.

    SIR ద్వారా ఓక వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించడం. మరణించిన వారి వివరాలను ఓట్లర్ల జాబితా నుండి తీసివేయడం వలస వెళ్ళిన వారు శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారిని గుర్తించి ఓట్ల తొలగింపు చేస్తారు. అదే విధంగా  18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చుతారు. 

    వివాదం  ఏంటంటే? 
    పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ) మరియు తమిళనాడు (ఎం.కె. స్టాలిన్) ముఖ్యమంత్రులు ఈ SIR ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్‌ఐఆర్ పేరుతో తమకు మద్దతు ఇచ్చే వర్గాల ఓట్లను (ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు) కావాలనే తొలగిస్తున్నారని వారు ఆరోపించారు. బెంగాల్‌లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించారని, ఇది ఫలితాలను తారుమారు చేసిందని మమతా బెనర్జీ అన్నారు.

    ఎంఐఎంకు ఘోర ఓటమి

    కాగా ఎంఐఎం పార్టీ ఇటీవల జరిగిన బెంగాల్‌ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులను దింపగా ఘోర పరాజయం మూటగట్టుకుంది. 12 చోట్ల తమ అభ్యర్థులకు ఎక్కడా కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మాల్దా, ముర్షీదాబాద్, బీర్బుమ్, పశ్చిమ్ బర్ధమాన్, ఉత్తర 24 పరగణాలు, ఉత్తర దినాజ్‌పూర్‌ ఏడు జిల్లాలోని 12 నియోజక వర్గాల్లోని మోథాబరి, సుజాపూర్, సుతి, రఘునాథ్‌గంజ్, కండి, నలహతి, మురారయ్, అసన్‌సోల్ నార్త్, హబ్రా, బరాసత్, బసిర్‌హట్ సౌత్, కరిందిఘిలో తన అభ్యర్థులను పోటీకి దింపింది. 
     

  • ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు,  గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్‌ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రెస్‌తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్‌గా మారాయి. 

    రెడ్ కార్పెట్  అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్‌లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్‌ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.

    స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకత

    • అనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్‌లెస్ స్టీల్‌ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో  ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.

    • ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.

    • ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది.

    ఈ డ్రెస్‌ డిజైనర్లు

    బాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్  రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్‌ఫిట్ ఇంత పవర్‌ఫుల్‌గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.

    ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా

    అనన్య బిర్లా  గురించి  క్లుప్తంగా
    అనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్‌సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు.  బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్‌లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్‌ ఇప్పించే  లక్ష్యంతో 
    అమ్మతో కలిసి ‘Mpower’ అనే  సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్‌’ పేరుతో   సినీ నిర్మాణ  రంగంలోకి ఎంట్రీ  ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. 

    ఇదీ చదవండి: విజయ్‌(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?

  • సినీ స్టార్‌ విజయ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. వీసీకే చీఫ్ తిరుమావళన్ డీఎంకేను వీడేది లేదని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్‌ ఇ‍బ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కావడంతో టీవీకే ప్రధానంగా స్వతంత్ర ‍అభ్యర్థులతో పాటు అక్కడి చిన్న పార్టీల అభ్యర్థుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో  అక్కడి వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

    "మేము టీవీకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచించడం లేదు. మేము ఇప్పటికీ డీఎంకేతోనే ఉన్నాము. మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మేము ఈ పొత్తుతో ముందుకెళ్లాము. టీవీకే నుండి ఎలాంటి ఆహ్వానాన్ని ఆశించడం లేదు. తమిళనాడులో సంఘ్ పరివార్ నేతృత్వంలోని మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పుకు మేము చాలా కృతజ్ఞులం." అని అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ రెండు స్థానాలు గెలిచింది. 

    ఇది వరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తమకు తగినంత సంఖ్యాబలం ఉందని రెండు వారాల గడువు ఇవ్వాలని తమిళనాడు గవర్నర్‌ని విజయ్‌ కోరారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగనుందా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

  • సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్‌  సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్‌ పవర్‌తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు.  కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని  విజయ్‌ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్‌. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.

    విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.

    రూ. 42,000 కోట్ల అదనపు భారం
    మహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్‌ తన  మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది  తేలాల్సి ఉంది.  గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా  భావిస్తున్నారు.

    మరీ ముఖ్యంగా
    ప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.

    వృద్ధాప్య పింఛన్‌ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద  రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.

    పరిమిత ప్రభావం
    మరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది.  అంటే విజయ్‌ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన  8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.

    ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా

    ప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.

    తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే 
    దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. 


     కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ,  పొలిటికల్‌ డ్రామా ఆడుతున్న  సినిమా స్టార్‌ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
     

    ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్‌ రహస్య ప్రేమ, వీకెండ్‌లో ఔటింగ్‌... కట్‌ చేస్తే!

Movies

  • ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు.  

    విశాల్ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని విశాల్‌ తన సంతాపాన్ని ప్రకటించారు.

    ఆర్‌బీ చౌదరి స్థాపించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు నిర్మించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతి భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

  • సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. ఆయన సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ అనే బ్యానర్‌ స్థాపించారు. పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోలు సంతాపం ప్రకటించారు.

    ఆర్‌బీ చౌదరి ప్రస్థానం..

    రాజస్థానీ కుటుంబానికి ఆర్‌బీ చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. ఆయన మొదట ఉక్కు, ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మలయాళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా అడుగుపెట్టారు. సూపర్ పేరుతో బ్యానర్ ప్రారంభించి సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత 1989లో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.

    గుడ్‌ నైట్‌తో భాగస్వామ్యం..

    గుడ్ నైట్ అనే దోమల నివారణ మ్యాట్‌లను తయారు చేసే ఆర్‌ మోహన్‌ను తన భాగస్వామిగా చేర్చుకున్నారు. ఇద్దరు కలిసి సూపర్ బ్యానర్‌లోనే సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇద్దరు విడిపోయే సమయంలో గుడ్ నైట్ అనే బ్రాండ్‌లోని గుడ్ అనే పదాన్ని తీసుకుని సూపర్ గుడ్ ఫిల్మ్స్‌గా పేరు మార్చేశారు. ఆ తర్వాత ఇదే పేరుతో చిత్రాలు నిర్మించారు ఆర్‌బీ చౌదరి. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో చివరిసారిగా మెగాస్టార్ నటించిన గాడ్‌ ఫాదర్‌ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

    స్వతహాగా రాజస్థానీ అయిన ఆర్‌బీ చౌదరి తమిళ్ అయిన మహజబీన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన కుమారుడు సురేష్ వారి సొంత నిర్మాణ సంస్థ అయిన 'సూపర్ గుడ్ ఫిల్మ్స్' కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. మరో కుమారుడు జీవన్ ఒక స్టీల్ కంపెనీని నడుపుతున్నారు. మూడో కుమారుడు జితన్ రమేష్ నటుడిగా రాణిస్తున్నారు. ఆయన చిన్న కుమారుడు జీవా హీరోగా చాలా సినిమాలు చేశారు. జీవా రంగం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. జీవాకు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. జీవ తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్‌ అయ్యారు. 

  • ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ఈ ఆకస్మిక, విషాదకరమైన  సంఘటన నా హృదయాన్ని కలిచివేసిందన్నారు. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. గాడ్‌ ఫాదర్ మూవీ కోసం ఆర్‌బీ చౌదరితో కలిసి పనిచేశానని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

    ఆయన ఎందరో ప్రతిభావంతులైన దర్శకులు, నటుల కెరీర్‌లను తీర్చిదిద్దారని మెగాస్టార్ కొనియాడారు. ఒక నిర్మాతగా ఆయన లెక్కలేనన్ని కథలకు జీవం పోశారని తెలిపారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవను మాటల్లో వర్ణించలేమన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి, మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నట్లు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. 

    సినీ ప్రముఖుల సంతాపం...

    ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్, విశాల్ తమ సంతాపం వ్యక్తం చేశారు.  కాగా.. ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో చిత్రాలు నిర్మించారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం, నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించారు.  
     

     

     

     

  • తమిళనాట ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి మూవీ జన నాయగన్. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదాలతో వాయిదా పడింది. ఎలక్షన్ ముందు అడ్డంకులు రావడంతో జన నాయగన్ వివాదం కోర్టుకు చేరింది. ఎన్నికల ముందు రిలీజ్ కాకుండా ఆగిపోయింది.  ఈ మూవీలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించింది. ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌  ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

    ఈ సినిమా సంగతి పక్కన పెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ.. విజయ్‌ను చూపిస్తూ కనిపించింది. ఈ వీడియో జన నాయగన్ మూవీ షూటింగ్‌ టైమ్‌లో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విజయ్ సిగ్గుపడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్‌ సూపర్ అంటూ కొనియాడుతున్నారు. 

     

  • సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం చెందారు. ఆయన దాదాపు 90కి పైగా సినిమాలు నిర్మించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ అనే బ్యానర్‌ స్థాపించిన ఆయన పలు భాషల్లో సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో రాజా, సూర్యవంశం , సుస్వాగతం, నువ్వు వస్తావని, సంక్రాంతి, నవవసంతం లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. 

    అంతేకాకుండా తెలుగులో నిన్నే ప్రేమిస్తా, గోరింటాకు, అన్నవరం, గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మించారు. తమిళ హీరో విజయ్‌తో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. విజయ్‌తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో చివరిసారిగా చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాని నిర్మించారు.

    అర్‌బీ చౌదరి సినీ ప్రస్థానం..

    ఆయన పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. మొదట మలయాళం సినిమాలతో నిర్మాతగా ప్రవేశం చేశారు. 1989లో తమిళ సినిమాల్లో ప్రవేశించి, "సూపర్" బ్యానర్ కింద సినిమాలు నిర్మించారు.  అటు తరువాత "గుడ్ నైట్" బ్రాండ్ నుండి "గుడ్" అనే పదాన్ని తీసుకుని, "సూపర్ గుడ్ ఫిల్మ్స్" అనే పేరుతో స్వతంత్రంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

    ఆయన జన్మించింది తమిళనాడులోని చెన్నై.  ఆయనకు నలుగురు కుమారులున్నారు. జీవన్(స్టీల్ కంపెనీ యజమాని), జితన్ రమేష్ (నటుడు, నిర్మాత),సురేష్(నిర్మాత), జీవా(ప్రముఖ నటుడు). 

    సూపర్ గుడ్ ఫిల్మ్స్ దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఆయన కుమారులు, ముఖ్యంగా జీవా మరియు జితన్ రమేష్, సినీ పరిశ్రమలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమాలు కుటుంబ విలువలు, భావోద్వేగాలు, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.

    ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
    1990 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) –వసంతం
    1999 – బెస్ట్ ఫిల్మ్ (తెలుగు) – రాజా
    2001 – బెస్ట్ ఫిల్మ్ (తమిళం) – ఆనందం

    తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్:
    నాటామై (1994), సూర్యవంశం (1997), తుల్లాధ మనముమ్ తుల్లుం (1999) వంటి చిత్రాలకు ఉత్తమ చిత్ర అవార్డులు.
     

  • తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయంపై నటుడు సత్యరాజు స్పందించారు. ఈ గెలుపు పట్ల విజయ్‌కు అభినందనలు తెలిపారు. అదే సందర్భంలో మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. మీరు పెరియార్, అంబేద్కర్‌ను తనకు ఆదర్శమని ప్రకటించారని గుర్తు చేశారు. మీరు వారి విలువలను నిలబెట్టి, సామాజిక న్యాయాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. డీఎంకే స్టాలిన్ ఓటమి పట్ల బాధగా ఉందన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తన సపోర్ట్‌ డీఎంకేకే ఉంటుందని సత్యరాజ్ స్పష్టం చేశారు.

    కాగా.. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే చీఫ్, హీరో విజయ్ ఏకంగా వందకు పైగా సీట్లు సాధించారు.  తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ్ గెలుపొందారు. తొలిసారి ఎన్నికల్లో నిలిచిన విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లు సాధించింది. ఇంకా అధికారం చేపట్టాలంటే మరో పది సీట్లు కావాలి. ఇతర పార్టీల సహకారంతో విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. 
     

     

  • ప్రస్తుతం ఎక్కడా చూసిన విజయ్ పేరే వినిపిస్తోంది. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ గెలుపు గురించి చర్చించుకుంటున్నారు. ఈ అసాధారణ విజయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్‌ హీరోలు సైతం దళపతికి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రవితేజ, నాని లాంటి స్టార్స్‌ కూడా విజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో గెలుపు వెనక ఎవరెవరు కృషి చేశారా అన్న విషయాలంపై చర్చ నడుస్తోంది.

    ఈ విజయంలో ముఖ్యంగా విజయ్‌కు ఉన్న క్రేజ్‌ ఒక కారణం అయినప్పటికీ.. మరెన్నో సానుకూల అంశాలున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంగ్స్ కూడా ప్రత్యేక పాత్ర పోషించనట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో పాటలు కూడా గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయి. పొలిటికల్ సాంగ్స్‌కు మ్యూజిక్ కంపోజ్ చేయడం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

    అయితే విజయ్ అరంగేట్ర ప్రచారంలో వచ్చిన సాంగ్స్ అభిమానులను, ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్స్‌కు టాలీవుడ్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించడం మరో విశేషం. టాలీవుడ్‌లో బీజీఎం కింగ్‌ పేరున్న తమన్‌యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మూడు ప్రచార పాటలను కంపోజ్ చేశారు. అప్పట్లో ఈ సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. విజయ్ కోసం తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్  కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా చేశాయి. దీంతో విజయ్ విజయం వెనక తమన్ మ్యూజిక్ పాత్ర కూడా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • తెలుగు దర్శకుల్లో చాలామంది తాము తీసేదే అద్భుతమైన కళాఖండం అనుకుని భ్రమపడుతున్నారు. బాగోలేదని ఒప్పుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావట్లేదు. రొటీన్ ఫక్తు కమర్షియల్ అంశాలతో బోర్ కొట్టిస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చేలా తీయడం సంగతి అటుంచి ఏ జానర్ ట్రెండ్ అవుతుంటే దాని వెంట పడుతున్నారు. అయినా గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంతకీ డైరెక్టర్స్ అప్డేట్ అవ్వట్లేదా? లేదంటే ప్రేక్షకులు అడ్వాన్స్ అయ్యారా? అసలేం జరుగుతోంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    టాలీవుడ్ అనగానే చాలామందికి కమర్షియల్ సినిమాలే గుర్తొస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ తరహా చిత్రాలే దాదాపుగా వచ్చేవి. అప్పట్లో మొబైల్, టెక్నాలజీ లాంటివి పెద్దగా లేకపోవడంతో సినిమా ఒక్కటే వినోద సాధనంగా ఉండేది. దీంతో లాజిక్స్ పట్టించుకోకుండానే మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్స్ ఎక్కువపోయాయి. మొబైల్, టీవీ, క్రికెట్ ఇలా కళ్లముందు చాలానే కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని సినిమా చూడాలంటే అందులో కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో అదే మిస్ అవుతోంది.

    ఒకప్పుడు తెలుగు చిత్రాల్లో కొన్ని అంశాలైనా ప్రేక్షకులు తమని తాము రిలేట్ చేసుకునేలా ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి వాటిని డైరెక్టర్స్ మిస్ చేస్తున్నారు. కథల్లో సహజత్వం పెద్దగా కనిపించట్లేదు. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. కొత్తగా కామెడీ, డ్రామా సృష్టించడం లాంటివి చేయకుండా వింటేజ్ పేరు చెప్పి పాత సినిమాల్లో పాటలు, కామెడీని, డ్రామాని వాడేయాలని చూస్తున్నారు. అవి ఎందుకో సరిగా కుదరట్లేదు.

    (ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)

    ఈ ఏడాదే తీసుకుంటే సంక్రాంతికి వచ్చిన 'మన శంకరవరప్రసాద్' సినిమా తప్పితే ఒక్కటి కూడా సరైన సక్సెస్ అందుకోలేదు. బైకర్, డెకాయిట్ లాంటివి కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి గానీ వీటిలో కథ ఉన్నప్పటికీ అనవసరమైన కమర్షియల్ అంశాలు చేర్చి సూపర్‌హిట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇకపోతే 'నారీ నారీ నడుమ మురారి', 'యుఫోరియా', 'శ్రీ చిదంబరం గారు', 'కపుల్ ఫ్రెండ్లీ' లాంటి కొన్ని మూవీస్ మంచి కంటెంట్‌తో వచ్చాయి గానీ వీటికి థియేటర్లలో సరైన సపోర్ట్ దొరకలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత జనాదరణ పొందాయి.

    మొత్తంగా చూస్తే చాలామంది దర్శకులు.. తెలుగు ప్రేక్షకుల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏం తీసినా చూస్తారులే అనుకుంటున్నారు. మరికొందరైతే ప్రమోషన్లలో నవ్విస్తున్నారు గానీ సినిమాలో తీసికట్టు కంటెంట్‌తో విసుగు తెప్పిస్తున్నారు. అందుకే ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న మలయాళ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాల‍ని చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే, అవి కూడా బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వెళ్తాడు. రొటీన్ కంటెంట్‌తో ఇంకా బోర్ కొట్టిస్తే వాటికి కూడా వెళ్లాలా వద్దా అని సందేహపడతాడు! అప్పుడు టాలీవుడ్‌కే కష్టకాలం!

    (ఇదీ చదవండి: ‘జన నాయగన్‌’.. నాడు శాపం నేడు వరం)

  • టాలీవుడ్ నటుడు, హీరో మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇటీవలే మోహన్ బాబు క్యారెక్టర్‌ సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు లుక్ అదిరిపోయింది. దాదాపు 32 ఏళ్ల తర్వాత విలన్ పాత్రలో కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.

    సినిమా సంగతి పక్కనపెడితే మోహన్ బాబు డైరెక్టర్స్‌ డే 2026 ఈవెంట్‌కు హాజరయ్యారు. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాసరి నారాయణరావును తలచుకుని ఎమోషనలయ్యారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

    ఆయన బర్త్‌ డేను మనం సెలబ్రేట్ చేసుకున్నప్పటీకీ.. చాలా బాధకరమైన రోజేనని అన్నారు. తండ్రి లాంటి వ్యక్తిని నేను కోల్పోయాననే బాధ నాకు జీవితమంతా ఉంటుందని తెలిపారు. ఎక్కడో ఉన్న నన్ను ఇండస్ట్రీకి తీసుకువచ్చి మోహన్‌బాబుగా ఈ స్థాయికి తీసుకొచ్చారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ జనరేషన్‌ వాళ్లకు చాలామందికి డైరెక్టర్‌ అనే పదానికి అర్థం తెలియదు.. దర్శకుడు అనే పదానికి సరైన అర్థం చెప్పిన ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావుగారే అన్నారు.

     

  • క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ.  ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్‌లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.

    (ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)

    ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్‌సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.

    ట్రైలర్‌ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 

    (ఇదీ చదవండి: ‘జన నాయగన్‌’.. నాడు శాపం నేడు వరం)

  • తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఆమెపైనే అందరి దృష్టి పడింది. ఎన్నికల ముందు నుంచే ఆమెపై రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయినా తాను ఎక్కడా స్పందించకుండా సైలెంట్‌గానే ఉండిపోయింది. తాజాగా ఎన్నికల్లో విజయ్ విజయంతో అందరు త్రిష పేరునే జపిస్తున్నారు. ఫలితాల రోజే త్రిష బర్త్ డే కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విజయం త్రిషకు విజయ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం విజయ్- త్రిష రిలేషన్‌ కన్‌ఫామ్ చేసింది. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. వాట్ ఏ గిఫ్ట్ అంటూ రాసుకొచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. దర్శకుడు పూరి జగన్నాధ్, త్రిషతో దిగిన ఫోటోను షేర్ చేసింది. మీ ప్రత్యేకమైన రోజున ప్రత్యేక వేడుక.. మీరు మా అదృష్ట దేవత.. ఈ పుట్టినరోజు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు కూడా త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డబుల్ సెలబ్రేషన్ అంటూ పోస్ట్ చేసింది.

    కాగా.. త్రిష తన పుట్టినరోజు ఉదయాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆ తర్వాత నేరుగా ఆమె చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లారు.  టీవీకే విజయం సాధించడంతో విజయ్‌ను ప్రత్యేకంగా కలిశారు. దీంతో విజయ్-త్రిష రిలేషన్‌పై అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే విజయ్ సతీమణి విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు  చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో జూన్ 15న విచారణకు రానుంది. కాగా.. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ స్థాపించిన టీవీకే 108 స్థానాలను గెలిచింది. 
     

  • ఏది జరిగినా  మన మంచికే అనుకునే మనసు ఉంటే…ప్రతి కష్టం ఒక పాఠం అవుతుంది… ప్రతి ఓటమి ఒక అవకాశంగా మారుతుంది. ఇప్పుడు దళపతి విజయ్‌ విషయంలో ఇదే జరిగింది. ఎన్నికల ముందు ఆయనకు వరుస ఇబ్బందులు ఎదురయ్యాయి. భార్య సంగీతతో విడాకులు వివాదం.. మరోవైపు ప్రచారంలో తొక్కిసలాటలు, ఇంకోవైపు తన చివరి చిత్రం విడుదల వాయిదా పడడం.. ఇవన్నీ తట్టుకొని అలుపెరగకుండా ప్రచారం చేసి.. చివరకు రాజకీయ ప్రభంజనం సృష్టించాడు. తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం అయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న ఏకైక సినిమా ‘జన నాయగన్‌’ కాబట్టి.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురవడం కూడా ఖాయమే.

    ఆలస్యమే ఆమృతం..
    ఆలస్యం అయితే అమృతం కూడా విషం అవుతుందంటారు. నిజమే కానీ ‘జన నాయగన్‌’ విషయంలో మాత్రం ఆలస్యమే అమృతం అయ్యేలా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. ఎన్నికల ముందు రిలీజ్‌ అయితే.. కొంతవరకు పొలిటికల్‌ కెరీర్‌కి కూడా ప్లస్‌ అవుతుందని విజయ్‌ భావించాడు. కానీ అది జరగలేదు. వాయిదా పడడమే కాదు.. అందులోని కొన్ని సన్నివేశాలు కూడా లీకయ్యాయి. 

    ఓటీటీ బిజినెస్‌ కూడా చేజారిపోయింది. ఇక జన నాయగన్‌ రిలీజ్‌ అవుతుందో లేదో అని చాలా మంది అనుకున్నారు. కానీ నిన్నటి ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేసింది. 108 స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. విజయ్‌ సీఎం అయిన తర్వాత జననాయగన్‌ విడుదల అవ్వడం ఖాయం. అప్పుడు ఈ సినిమాకు వచ్చే హైప్‌, క్రేజ్‌ వేరే లెవెల్‌ ఉంటుంది.

    బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వాల్సిందే..
    ఎన్నికల ముందు రిలీజ్‌ అయి ఉంటే..టాక్‌ని బట్టి కలెక్షన్స్‌ ఉండేవి. హిట్‌ టాక్‌ వస్తే కానీ ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ వచ్చేవి. కానీ ఇప్పుడు టాక్‌తో సంబంధం లేదు. సినిమా ఎలా ఉన్నా.. తొలి మూడు రోజులు థియేటర్స్‌ కిక్కిరిసిపోతాయి. సీఎం సినిమా కాబట్టి.. ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేస్తాయి. ఎన్నికల ముందు ఎలా ఉండేదో కానీ..ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్‌ షేక్‌ అవ్వడం ఖాయం. ఈ సినిమాతో భారీగా నష్టాలు తప్పవని భావించిన  కెవీఎన్ సంస్థ ఇప్పుడు ఊపిరిపీల్చుకుంది. మొన్నటిదాక జన నాయగన్‌కి శాపంగా మారినవన్నీ ఇప్పుడు వరంగా మారాయి.  మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. 

  • తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ విజయకేతనం ఎగరేశాడు. పోటీ చేసిన తొలిసారే అత్యధిక సీట్లు సాధించిన సినీ గ్లామర్‌ పర్సన్‌గా చరిత్ర సృష్టించాడు. సింగిల్‌గా పోటీ చేసి.. గత 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా మారిన పార్టీలకు చెక్ పెట్టాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను ఓడించి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే వందకు పైగా సీట్లు సాధించి తానేంటో నిరూపించాడు. ఇక మిగిలింది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే.

    అయితే విజయ్ సీఎం అవుతాడాని ముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. గతంలో విజయ్ సహనటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా విజయ్ సీఎం అవుతాడని చెప్పారు. 2026లో నేను అతనికే ఓటు వేస్తాను.. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని నేను మీకు హామీ ఇస్తున్నానని మాట్లాడారు. అతను అన్నట్లుగానే విజయ్ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కనున్నారు.

    విజయ్ కూడా ముందే హింట్‌..

    టీవీకే అధినేత, హీరో విజయ్ సైతం తాను సీఎం అవుతానని పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరలవుతోంది. తాను హీరోగా నటించిన గోట్‌ మూవీలో TN 07 CM 2026 అనే నంబర్‌ ఉన్న కారును నడుపుతూ కనిపించారు. టీఎన్ అంటే తమిళనాడు.. 2026లో సీఎం అంటూ కారు నంబర్‌తోనే ముందే చెప్పేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని విజయ్ ముందే ఫిక్సయ్యారు. తాజా ఎన్నికల్లో అదే చేసి చూపించాడు. ఈ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఆ కారు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

    కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది. 108 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ పార్టీకి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకి కేవలం 10 స్థానాలు మాత్రమే కావాలి. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్  రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. తిరుచ్చి (తూర్పు), పెరంబూరులో గెలిచారు. 
     

     

  • తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ‍ట్రెండింగ్‌లో త్రిష)

    తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ‍ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్‌కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సంజూ శాంసన్ (87 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

    ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స్ట‌బ్స్ (38), స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

    కాగా టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది.

    సీఎస్‌కే ఆడుతూ పాడుతూ..
    156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగింది. కెప్టెన్‌ రుతురాజ్‌, వన్‌డౌన్‌లో వచ్చిన ఉర్విల్ పటేల్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. కానీ మరో ఎండ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు శాంసన్‌కు జత కలిసిన కార్తిక్ శర్మ తోడయ్యాడు. ఈ ఇద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లు బాది సీఎస్‌కేకు విజయాన్ని కట్టబెట్టారు. 

    శాంసన్ సునామీ ఇన్నింగ్స్‌తో అలరిస్తే.. కార్తిక్ తన హిట్టింగ్‌ను ఢిల్లీ బౌలర్లకు రుచి చూపించాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది ఐదో విజయం కాగా పట్టికలో ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఆరు ఓటములతో పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
     

  • క్రికెట్‌లో ఒక‌ప్పుడు బ్యాట‌ర్ల‌కు భ‌యం పుట్టించిన‌ యార్క‌ర్లు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. చేజింగ్ స‌మ‌యంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే న‌మ్ముకునేవారు. అదే సంప్ర‌దాయ యార్క‌ర్‌. ముఖ్యంగా డెత్ ఓవ‌ర్ల‌లో మ‌లింగ‌, బుమ్రా లాంటి యార్క‌ర్ల స్పెష‌లిస్టులు విసిరే యార్క‌ర్ల‌కు బ్యాట‌ర్లకు ఫ్యూజులు ఎగిరేవి. 

    ఐపీఎల్‌లోనూ యార్క‌ర్ల‌కు స్వ‌ర్ణ‌యుగం న‌డిచింది. ఆఖరి బంతి దాకా విజ‌యం దోబుచులాడే టీ20 క్రికెట్‌లో ఇటీవ‌లే కాలంలో మ్యాచ్‌ల‌న్నీ వ‌న్‌సైడ్‌గా మారిపోవ‌డం చూస్తున్నాం. ఐపీఎల్‌లోనూ ఈ త‌ర‌హా మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ అన్ని జ‌ట్లు 200 ప‌రుగుల టార్గెట్‌ను అవ‌లీల‌గా ఛేదించేస్తున్నాయి. 

    తాజాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో యార్క‌ర్ బంతులు క‌నిపించ‌క‌పోవ‌డంతో అటు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒక‌టే చ‌ర్చ జ‌రుగుతుంది. అదేంటంటే ఒక‌ప్పుడు భ‌యం పుట్టించిన యార్క‌ర్ల‌కు క్ర‌మంగా క‌నుమ‌రుగవుతున్నాయా అని ప్ర‌శ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజ‌న్‌లో ముంబై త‌ర‌ఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆడుతున్న న‌ట‌రాజన్ వీరంతా యార్కర్ల స్పెష‌లిస్టులే. కానీ ఈ సీజ‌న్‌లో ఒక్క‌సారి కూడా వీరు త‌మ యార్క‌ర్ల‌తో ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

    బ్యాటర్లు ఫినిషింగ్‌ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.

    2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్‌కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధ‌న‌పై కూడా సీనియ‌ర్ క్రికెట‌ర్లు, బౌల‌ర్లు వ్య‌తిరేకిస్తున్నారు. మొత్తంగా ఒక‌ప్పుడు యార్క‌ర్లు బ్యాట‌ర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్క‌ర్లు క‌నిపించ‌కుండా పోతున్నాయి.

    చదవండి: బెదిరింపులకు దిగిన టెన్నిస్ స్టార్‌!

  • మ‌హిళ‌ల ప్రపంచ నంబ‌ర్‌వ‌న్, స్టార్ క్రీడాకారిణి అరీనా స‌బలెంకా బెదిరింపుల‌కు దిగింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో త‌మ‌కు ఎక్కువ మొత్తంలో షేర్ ఇవ్వ‌క‌పోతే ఆ టోర్నీల‌ను ఆట‌గాళ్లు బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఇటీవ‌లే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్‌మ‌నీ విష‌యంలో ఇట‌లీ స్టార్ జానిక్ సిన్న‌ర్.. 'ప్రైజ్‌మ‌నీ విష‌యంలో పూర్తి నిరాశ‌తో ఉన్నా' అంటూ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 

    తాజాగా సిన్న‌ర్‌కు స‌బలెంకా మ‌ద్ద‌తుగా నిలుస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 'ఆట‌గాళ్ల‌కు ఆదాయంలో వాటా పెర‌గక‌పోతే మేము గ్రాండ్‌స్లామ్ టోర్నీల‌ను బ‌హిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆట‌గాళ్లు అందుకున్న షేర్‌కు, చూపెడుతున్న లెక్క‌ల‌కు సంబంధం ఉండ‌డం లేదు. అందుకే ఆట‌గాళ్ల‌కు ప‌క్క‌గా ఆదాయంలో ఎక్కువ వాటాను ఇవ్వాలి. ఒక‌వేళ మేము బ‌హిష్క‌రిస్తే టోర్నీలు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. 

    అదే జ‌రిగితే మా నుంచి వ‌చ్చే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్ష‌కులు మిస్ అవుతారు. క‌నీసం మాతో చ‌ర్చ‌లు జ‌రిపి ఆట‌గాళ్లు సంతోషప‌డే విధంగా ఆదాయంలో వాటా విష‌య‌మై ఒక ముగింపు ఇస్తార‌ని ఆశిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ప్రైజ్‌మ‌నీపై అగ్ర‌శ్రేణి ఆటగాళ్లు జానిక్ సిన్న‌ర్‌, కోకో గాఫ్‌, స్వియాటెక్‌, జొకోవిచ్‌, జ్వెరెవ్‌, మెద్వెదెవ్ స‌హా ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

    మొత్తం ప్రైజ్‌మ‌నీ సుమారు ప‌ది శాతం మేర పెరిగి 61.7 యూరో మిలియ‌న్లకు చేరుకుంద‌ని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. అయితే ఆట‌గాళ్లు మాత్రం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆట‌గాళ్ల‌కు ఆదాయంలో అందించే వాటా 15.5 నుంచి 14.9 శాతానికి త‌గ్గింద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇక ఈ సీజ‌న్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్ మే 18 నుంచి జూన్ 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది.

    చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఫీట్‌ సాధించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఢిల్లీ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేకపోయారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకున్నప్పటికీ వీరిలో ఏ ఒక్కరు 20 పరుగుల మార్క్‌ను దాటకపోవడం గమనార్హం.

    నిస్సాంక (19), రాహుల్‌ (12), నితీశ్‌రానా (15), కరుణ్‌ నాయర్‌ (13).. ఈ నలుగురు 20 పరుగుల్లోపే ఔటయ్యారు.  ఇలా ఒక మ్యాచ్‌లో టాప్‌ నలుగురు బ్యాటర్లు డబుల్‌ డిజిట్‌ మార్క్‌ను అందుకున్నప్పటికీ 20 పరుగులు దాటకపోవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 

    మొదటిసారి కూడా ఈ ఫీట్‌ను సాధించింది ఢిల్లీ జట్టే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున టాప్‌ నలుగుల బ్యాటర్లు సెహ్వాగ్‌ (15), వార్నర్‌ (13), నమన్‌ ఓజా (13), యోగేశ్‌ నగర్‌ (18) 20 పరుగుల మార్క్‌ దాటకుండానే ఔటయ్యారు.

    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌), స్ట‌బ్స్ (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. 

    అయితే టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. 

    చదవండి: తృణముల్‌ చాప్టర్‌ ముగిసింది: మాజీ క్రికెటర్‌

  • తృణ‌ముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి తృణ‌ముల్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. మ‌మతా బెన‌ర్జీ నేతృత్వంలోని టీఎంసీ త‌న‌కు హౌరాలోని షిబ్‌పుర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌డానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన‌ట్లు ఆరోపించాడు. ఇక రాజ‌కీయంగా తృణ‌ముల్ కాంగ్రెస్‌తో త‌న‌ అధ్యాయం ముగిసింద‌ని మ‌నోజ్ తివారి పేర్కొన్నాడు. 

    సోమ‌వారం వెలువ‌డిన ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో 15 ఏళ్ల మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడిన‌ బెంగాల్ ప్ర‌జ‌లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై మ‌నోజ్ తివారి స్పందించాడు. ఈ సంద‌ర్భంగా తృణ‌ముల్ అవినీతి, పార్టీ చేసిన అరాచ‌కాల‌ను మ‌నోజ్ తివారి ఎండ‌గ‌ట్టాడు.  

    ‘హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. 

    పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ‌లేదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను.

    ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది. క్రీడా మంత్రి బిస్వాస్‌కు క్రీడలపై క‌నీస‌ అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్‌లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు.

    ఇక త‌న రాజ‌కీయ జీవితం ముగిసింద‌ని ప్ర‌క‌టించిన మ‌నోజ్ తివారి త్వ‌ర‌లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు. అయితే ఈసారి ఆట‌గాడిగా కాకుండా కోచ్ పాత్ర‌లో వ‌స్తున్న‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బీసీసీఐ లెవెల్ 2 కోచ్ ప‌రీక్ష‌ను కూడా పాసైన‌ట్లు తెలిపాడు. ఇప్ప‌టికే బెంగాల్ క్రికెట్ హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు పేర్కొన్నాడు. 

    బెంగాల్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన మ‌నోజ్ తివారి దేశ‌వాలీ క్రికెట్‌లో బెంగాల్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు (10,195 ప‌రుగులు) చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక టీమిండియా త‌ర‌ఫున 2008 నుంచి 2015 మ‌ధ్య ఆడిన మనోజ్‌ తివారి 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మనోజ్‌ తివారి కేకేఆర్‌, పంజాబ్‌, రైజింగ్‌ పూణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్రాతినిధ్యం వహించాడు. 

    చదవండి: చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌!

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో రేపు (మే 6) జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా కేకేఆర్‌ మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కోలుకున్నాడని తెలుస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ విషయంపై జట్టు కోచ్‌ డేనియల్‌ వెటోరీ క్లారిటీ ఇచ్చాడు.

    కాగా, నితీశ్‌ స్థానంలో కేకేఆర్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్మరణ్‌ రవిచంద్రన్‌ (4) ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో నితీశ్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచి ఉంటే, ప్లే ఆఫ్స్‌ రేసులో మిగతా జట్లకంటే ముందుండేది.

    ప్రస్తుతం ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పంజాబ్‌ (13), ఆర్సీబీ (9 మ్యాచ్‌ల్లో 12) తర్వాత  పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌కు  సైతం తలో 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ పరంగా సన్‌రైజర్స్‌ కాస్త మెరుగ్గా ఉంది. ప్రస్తుతం పంజాబ్‌, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-5లో ఉండి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఇకపై ఈ జట్లకు ప్రతి మ్యాచ్‌ కీలకంగా ఉంటుంది. 

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 156 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 17.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్ (87 నాటౌట్‌) విధ్వంసం సృష్టించగా.. కార్తిక్ శర్మ (41 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. 

    విజ‌యం దిశ‌గా సీఎస్‌కే
    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే విజ‌యం దిశ‌గా కొన‌సాగుతోంది. 16 ఓవ‌ర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 138 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (84), కార్తిక్ శ‌ర్మ (23) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. 

    శాంస‌న్ హాఫ్ సెంచ‌రీ.. సీఎస్‌కే 96/2
    ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్కే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 32 బంతుల్లో అర్థ‌సెంచరీ మార్క్ అందుకున్న శాంస‌న్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతం సీఎస్‌కే 12 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది.

    రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
    8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి సీఎస్‌కే రెండు వికెట్ల న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (22), కార్తిక్ శ‌ర్మ (5) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. అంత‌క‌ముందు 17 ప‌రుగులు చేసిన ఉర్విల్ ప‌టేల్ అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో వెనుదిరగ‌డంతో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది.

    రుతురాజ్‌ ఔట్‌..
    ఆరు పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎన్గిడి బౌలింగ్‌లో స‌మీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగ‌డంతో సీఎస్‌కే 24 ప‌రుగుల వ‌ద్ద‌ తొలి వికెట్ కోల్పోయింది.

    156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 22  పరుగులు చేసింది. శాంసన్ (10), గైక్వాడ్ (6) పరుగులతో ఆడుతున్నారు.

    సీఎస్‌కే టార్గెట్‌ 156 పరుగులు
    సీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్‌), స్ట‌బ్స్ (38) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్లలో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, అకిల్ హొసేన్‌, ముకేశ్ చౌద‌రీ, గుర్జ‌ప్‌నీత్ సింగ్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అయితే టాపార్డ‌ర్ వైఫ‌ల్యం ఢిల్లీ కొంప‌ముంచింది. సీఎస్‌కే బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఢిల్లీ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో స్ట‌బ్స్‌, స‌మీర్ రిజ్వీ ఆరో వికెట్‌కు 65 ప‌రుగులు జోడించ‌డంతో ఢిల్లీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది. 

    16 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (30), స‌మీర్ రిజ్వీ (16) ప‌రుగుల‌తో ఆడుతున్నారు. 

    ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పరంపర కొనసాగుతోంది. 2 పరుగులు చేసిన కెప్టెన్ అక్షర్ పటేల్ గుర్జ్‌ప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో అకిల్ హొసేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (4), ట్రిస్టన్ స్టబ్స్ (12) పరుగులతో ఆడుతున్నారు.

    4 వికెట్లు డౌన్‌
    నితీశ్‌ రాణా, కరుణ్‌ నాయర్‌ ఔటయ్యారు. నితీశ్‌ రాణా 15 పరుగులు చేసి.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కార్తీక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. కరుణ్‌ నాయర్‌ 13 పరుగులు చేసి.. నూర్‌ అహ‍్మద్‌ బౌలింగ్‌లో గుర్జప్‌నీత్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..
    12 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ అకిల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

    తొలి వికెట్ డౌన్‌
    సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన పాతుమ్ నిస్సాంక ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 29 ప‌రుగులు చేసింది. రాహుల్ (10) క్రీజులో ఉన్నాడు.

    టాస్‌ నెగ్గిన ఢిల్లీ 
    టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కైల్‌ జేమీసన్‌ స్థానంలో లుంగి ఎన్గిడి జట్టులోకి వచ్చాడు. మరోవైపు సీఎస్‌కే రెండు మార్పులు చేసింది. అకిల్‌ హొసేన్‌, గుర్జప్‌నీత్‌ సింగ్‌ జట్టులోకి వచ్చారు. 

    సీజ‌న్ తొలి అంచె పోటీలో ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 23 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై విజ‌యాన్ని అందుకుంది. మ‌రి ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ సొంత‌గ‌డ్డ‌పై చెన్నైని ఓడించి ప్ర‌తీకారం తీర్చుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి. ముఖాముఖి పోరులో మాత్రం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌దే పైచేయి. 32 మ్యాచ్‌ల్లో 20 సార్లు సీఎస్‌కే, 12 సార్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ నెగ్గింది. 2022 నుంచి చూసుకుంటే సీఎస్‌కే నాలుగుసార్లు నెగ్గితే, ఢిల్లీ రెండు సార్లు మాత్ర‌మే విజ‌యం సాధించింది.

    తుది జట్లు:
    ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, లుంగీ ఎంగిడి, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్.

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, గుర్జప్‌నీత్‌ సింగ్.
     

  • ఐపీఎల్‌-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియ‌న్స్ స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొన‌సాగుతోంది. సోమవారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా విఫ‌ల‌మ‌య్యాడు. త‌న శైలికి విరుద్దంగా భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 

    జ‌స్ప్రీత్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 11.20 ఏకాన‌మీ రేటుతో ఏకంగా 45 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ సీనియ‌ర్ పేస‌ర్ క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించలేక‌పోయాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో బుమ్రా మొత్తంగా కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు.

    ప్ర‌తీ సీజ‌న్‌లో ప‌ర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్ర‌ద‌ర్శన చేయ‌డం క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చానీయాంశ‌మైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్‌లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్‌లోడ్‌ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు.

    "బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్‌లోడ్‌తో అతడు ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి. 

    రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది.  పలు టెస్టు సిరీస్‌లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్‌మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.
    చదవండి: IPL 2026: 'వావ్‌ వాట్ ఏ ప్లేయర్‌.. ఏ మాత్రం మారలేదు'

  • సౌతాఫ్రికా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ సైమన్‌ హార్మర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ను నియంత్రిస్తుందని ఆరోపించాడు. భారత్‌ వాణిజ్య శక్తి కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌పై భారీ ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లో శక్తి సమతౌల్యం ఇంకా మారలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్‌లోని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    ఆ విజయం తర్వాత కూడా మారని సమీకరణలు
    గతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్‌ ఛాంపియన్‌గా అవతరించింది. 1991-92లో క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇది తొలి  రెడ్‌బాల్ టైటిల్.

    అయితే ఈ విజయం తర్వాత కూడా ప్రపంచ క్రికెట్‌లో శక్తి సమతౌల్యత మారలేదన్నది సైమన్‌ అభిప్రాయం. ఐసీసీపై ఇంకా భారత్ పెత్తనమే కొనసాగుతుందన్నది అతని వాదన. బీసీసీఐ ధనబలంతో ఐసీసీని నియంత్రిస్తోందన్నది అతని వాదన. 

    బవుమా, కాన్రాడ్‌పై ప్రశంసలు
    ఇదే సందర్భంగా సైమన్‌ తన సొంత జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోచ్ షుక్రి కాన్రాడ్‌, కెప్టెన్‌ టెంబా బవుమాను ఆకాశానికెత్తాడు. వారి జట్టు ఒకరిద్దరి స్టార్‌ ప్లేయర్ల జట్టు కాదని.. కోచ్ ప్రతి విషయాన్ని నేరుగా మాట్లాడటం చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు.

    ఇంగ్లండ్ వ్యవస్థపై కూడా విమర్శలు
    సైమన్‌ ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్‌ జాతీయ జట్టులో స్పిన్నర్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించాడు. కౌంటీ క్రికెట్ నిర్మాణం వల్ల వారు లీడర్‌షిప్ పాత్రలో ఎదగలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.

    మొత్తంగా సైమన్‌ తన వ్యాఖ్యల్లో బీసీసీఐ పెత్తనం చేస్తోందని, ఇంగ్లండ్‌ క్రికెట్‌ వ్యవస్థలో లోపాలున్నాయని అన్నాడు. సైమన్‌ గతేడాది స్వదేశంలో టీమిండియాను ఓడించిన (టెస్ట్‌ సిరీస్‌) జట్టులో సభ్యుడు.

  • వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్‌నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    మే 1న యూరప్‌లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు.  క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. 

    కాగా  మిలింద్ సోమన్ ఫిట్‌నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్‌. సోమన్ తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు.  గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.

    ఇక సోమన్‌ 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్‌గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్‌ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్,, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు  సిరీస్‌లలో తన నటనతో మొప్పించారు.


     

     

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ప్రాంచైజీగా ఉన్న‌ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్య హక్కులు ఇటీవ‌లే చేతులు మారిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. 

    అయితే కొనుగోలు మురిపెం తీర‌కుండానే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిక్కుల్లో ప‌డింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. 

    తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్‌తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. 

    పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్‌తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. 

    అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.

    ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది.  

    మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.

    చ‌ద‌వండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్‌!

  • ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝూళిపించాడు. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 

    మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్‌.. తన తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న 8 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

    ఐపీఎల్ చరిత్రలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. పూరన్ ఇప్పటివరకు 5 సార్లు 20 కంటే తక్కువ బాల్స్‌లోనే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇంత‌క‌ముందు ఈ రికార్డు వైభ‌వ్ సూర్య‌వంశీ(4) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో వైభ‌వ్‌ను పూర‌న్ అధిగ‌మించాడు. ఈ జాబితాలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ అభిషేక్ శ‌ర్మ(6) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..లక్నోపై  6 వికెట్ల తేడాతో ముంబై ఘ‌న విజయం సాధించింది. 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. ఈ విజ‌యంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు.
    చదవండి: 'ఐపీఎల్‌లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్‌'

  • ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్‌లో త‌న‌కు ప‌రిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావ‌ని తెలిపాడు. బీసీసీఐ త‌న‌ను టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ ఆట‌గాడిగా ప‌రిగ‌ణించ‌లేదని, కేవ‌లం ఒక టెస్టు ప్లేయ‌ర్‌గానే త‌న‌పై ముద్ర వేశారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు చెందిన సూప‌ర్‌స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. 

    ‘ప‌దేళ్ల క్రితం టీ20 జ‌ట్టులో భాగం కావ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించాను. కానీ న‌న్ను ఎప్పుడూ ఒక టీ20 ఆట‌గాడిగా ప‌రిగ‌ణించ‌లేదు. క‌నీసం ఒక మంచి వైట్‌బాల్ ఆట‌గాడిగా కూడా చూడ‌లేదు. కేవ‌లం ఒక టెస్టు ప్లేయ‌ర్‌గానే నాపై ముద్ర‌ను వేశారు. అయితే ఐపీఎల్‌ ద్వారా టెస్టు ప్లేయ‌ర్ అనే ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డి వైట్‌బాల్ క్రికెట్‌లో నా ఆట‌ను మ‌రింత మెరుగుప‌రుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేర‌డం గ‌ర్వంగా ఉంది.

    అయితే ఈ ప్ర‌యాణంలో ఎన్నో త‌ప్పులు చేసిన‌ప్ప‌టికీ వాటిని సరిదిద్దుకునే ప్ర‌య‌త్నం కూడా చేశాను. జ‌ట్టుకు ఆడిన‌ప్పుడ‌ల్లా సాధ్య‌మైనంత వ‌ర‌కు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంటాను. ఫ‌లితంతో సంబంధం లేకుండా నా ఆట‌ను నేను ఆడుకుంటూ స‌మ‌తుల్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాను. అయితే ఆట‌గాడిగా నాకు ఇంకా స‌మ‌యం మిగిలి ఉంది. 

    కాబ‌ట్టి నేను నా వంతుగా జ‌ట్టుకు త‌ర‌ఫున మ్యాచ్‌లు ఆడుతూ స్కోర్లు చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నా. ఇక గ‌తేడాది నేను తండ్రి కావ‌డం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్‌కు కూడా ఎంతో స‌హాయ‌ప‌డింది. నా కూతురు న‌వ్విన‌ప్పుడు అప్ప‌టివ‌ర‌కు నేను బాధ‌ప‌డిన క్ష‌ణాల‌న్నీ మాయ‌మౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.

    ఇక కేఎల్ రాహుల్ ప్ర‌స్తుతం ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. సూప‌ర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ 64 బంతుల్లోనే 152 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 ప‌రుగులు సాధించాడు. 

    ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 2022లో టీమిండియా త‌ర‌ఫున చివ‌రి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్ప‌టినుంచి కేవ‌లం టెస్టులు, వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాడు.

    చదవండి: మాట త‌ప్పిన రిషబ్‌ పంత్‌!

  • ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 5) కీలక సమరం జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది. మ్యాచ్‌కు కొన్ని గంటలకు ముందు (సాయంత్రం 4 గంటల ప్రాంతంలో) ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది.

    మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్సింది. దీంతో మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో వాష్‌ ఔట్‌ అయ్యే ప్రమాదం ఉందని అంచనా. 

    ఒకవేళ ఈ మ్యాచ్‌ రద్దైతే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఇరు జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సీఎస్‌కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పోలిస్తే సీఎస్‌కే రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించబడుతుంది. అప్పుడు ఇరు జట్లకు అది సంకటంగా మారే ప్రమాదం ఉంది.

    ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ రేసు రంజుగా సాగుతుంది. 13 పాయింట్లతో పంజాబ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ తలో 12 పాయింట్లతో వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే, ఢిల్లీ తలో 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

    సీజన్‌ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్‌,  ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌  అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్‌ సైతం తాజాగా ఓ విజయం సాధించి అధికారికంగా రేసులో కొనసాగుతుంది. 

    ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ ఆశలను దాదాపుగా వదులుకున్న జట్టు ఏదైనా ఉందా అంటే, అది లక్నో మాత్రమే. తాజాగా ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. అధికారికంగా రేసులో ఉన్నప్పటికీ.. అది జరిగే పని కాదు. 
     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్న వైభ‌వ్ సూర్య‌వంశీపై భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వైభ‌వ్ అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌టికి, టెక్నిక‌ల్‌గా మాత్రం ఇంకా చాలా మెరుగుప‌డాలి అని మంజ్రేక‌ర్ అన్నాడు. 

    అంతేకాకుండా భార‌త‌ టీ20 జ‌ట్టులోకి వ‌చ్చేందుకు సూర్య‌వంశీకి అన్ని ర‌కాల అర్హ‌త‌లు ఉన్నాయ‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. కాగా వైభవ్ సూర్య‌వంశీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం ఈ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం విడిచిపెట్ట‌లేదు.

    ఐపీఎల్ సీజన్‌కు ముందు జ‌రిగిన అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ వైభ‌వ్ దుమ్ములేపాడు. దీంతో సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్ర‌మే కాకుండా సునీల్ గ‌వాస్క‌ర్ వంటి దిగ్గ‌జాలు సైతం వైభ‌వ్‌ను భార‌త టీ20 జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని సూచిస్తున్నారు.

    "వైభ‌వ్ సూర్య‌వంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ‌హారాష్ట్ర‌పై సెంచ‌రీ, ఐపీఎల్‌లో ఫామ్‌ను బ‌ట్టి చూస్తే భార‌త టీ20 జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అతడు అర్హుడు. ఐపీఎల్ వంటి మ‌హా వేదిక‌పై  ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే, కచ్చితంగా జాతీయ జట్టు అరంగేట్రానికి సిద్దంగా ఉన్నట్లే.

    ఇప్పుడు వైభవ్ కూడా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుత భారత టీ20 జట్టులో ఇప్పటికే ఓపెనింగ్ స్ధానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి వారు కూడా ఓపెనర్లగా రాణిస్తున్నారు.

    ఈ క్రమంలో వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైభవ్‌కు మంచి టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్‌గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్‌సైడ్‌లో షాట్లు కొడుతున్నాడు. 

    ఇది కేవలం టీ20ల మాత్రమే సరిపోతుంది. టెస్టులకు సరిపోదు. ముఖ్యంగా  ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి పిచ్‌లపై రాణించాలంటే బంతికి దగ్గరగా వెళ్లి ఆడాలి. ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడితే పరుగులు సాధించలేరు. టీ20 క్రికెట్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు మీకు మంచి పేరును తీసుకురావచ్చు. కానీ నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్‌లో రాణిస్తానే దక్కుతుందని" మంజ్రేక‌ర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

  • ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత్, తాజా ర్యాంకింగ్స్‌లో 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

    ఈ జాబితాలో ఇంగ్లండ్‌ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య తేడా స్వల్పంగా తగ్గినప్పటికీ, భారత్‌ టాప్‌ ర్యాంక్‌ను నిలుపుగోగలిగింది.

    గత రెండు సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో భారత్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుసగా 2024, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు, ఈ మధ్యకాలంలో ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లలో అజేయంగా నిలిచింది. ఈ విజయాలే భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాయి.

    ఇక ర్యాంకింగ్స్‌లో నాలుగో నుంచి ఏడో స్థానాల వరకు పెద్ద మార్పులు లేవు. న్యూజిలాండ్‌ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్‌ (240), వెస్టిండీస్‌ (233) వరుస స్థానాలు దక్కించుకున్నాయి.

    దిగువ స్థానాల్లో మాత్రం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌ జట్టు ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, శ్రీలంక తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 220 పాయింట్లతో పదో స్థానాన్ని నిలబెట్టుకుంది.

    పసికూన అమెరికా జట్టు మంచి పురోగతి సాధిస్తూ 13వ స్థానానికి చేరుకోగా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు ఒక్కో స్థానం దిగజారాయి. 2026 ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న ఇటలీ జట్టు గణనీయంగా మెరుగై 23వ స్థానానికి ఎగబాకింది.

    మొత్తంగా తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఇతర జట్లు కూడా క్రమంగా పోటీని పెంచుతున్నాయి.
     

  • క్రికెటర్‌గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో చాలా మందికి ఈ కల అందని ద్రాక్ష లాంటిదే. రంజిత్‌ విషయంలోనూ ఇదే జరిగింది. క్రికెటర్‌ కావాలన్న ఆశయానికి మధ్యలోనే గండిపడింది. కారణాలు ఏవైనా.. ప్రతిభ ఉన్నా సరే అతడు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.

    అయినప్పటికీ క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేకపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా అతడికి కొత్త దారి చూపించింది. ఆట, ఆటగాళ్లతో మమేకమయ్యే వీలు కల్పించింది. హైదరాబాద్‌ మేటి క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, తిలక్‌ వర్మలతో పాటు.. అమన్‌ రావు వంటి వర్ధమాన క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ మెళకువలు నేర్పే స్థాయికి చేర్చింది.

    ‍తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలంలోని అగ్రహారం రంజిత్‌ కుమార్‌ స్వస్థలం. తల్లిదండ్రులు ఏనుగుల బీరయ్య, ఏనుగుల భాగ్య. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉపాధి నిమిత్తం రంజిత్‌ తండ్రి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న రంజిత్‌.. తండ్రికి మనసులోని మాట చెప్పాడు.

    ఎంబీఏ చదివాడు
    ఆర్థికంగా కష్టంగా ఉన్నా కుమారుడి ఆశయానికి ఆయన అడ్డుచెప్పలేదు. జూనియర్‌ లెవల్లో హైదరాబాద్‌ తరఫున కొడుకు సత్తా చాటుతుంటే మురిసిపోయారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.. ప్రతిభ ఉన్నా కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల క్రికెటర్‌ కావాలన్న రంజిత్‌ కల ముగిసిపోయింది.

    ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టిన రంజిత్‌.. ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే, భవిష్యత్తుపై అప్పుడు అతడికి ఎలాంటి స్పష్టతా లేదు. మనసంతా క్రికెట్‌ మీదే ఉంది. ఆ సమయంలోనే స్నేహితుడొకరు ఫిట్‌నెస్‌ ఇండస్ట్రీ గురించి రంజిత్‌కు చెప్పాడు. అసలు తనకు ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి వెళ్లడం సరైందేనా అని అతడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు.

    అవగాహన లేని రంగంలోకి వెళ్లి.. సక్సెస్‌
    ఏం జరిగినా మన మంచికే అనుకుని రంగంలోకి దిగాడు. కొన్నాళ్లపాటు దారీతెన్నూ లేకుండా రంజిత్‌ ప్రయాణం సాగింది. అయితే, కఠిన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందంటారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రంజిత్‌..  స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎదిగాడు.

    ఆటగాళ్ల జీవితంలో అత్యంత కీలక పాత్ర స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌దేనన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ల ఫిట్‌నెస్, బలం, వేగం, చురుకుదనాన్ని పెంచడం.. అదే విధంగా గాయాల బారిన పడకుండా వారి ఆట తీరును మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతలు.

    తిలక్‌ వర్మ, సిరాజ్‌ వంటి ఆటగాళ్లతో
    ఇక ఒక్కో మెట్టు ఎక్కిన రంజిత్‌ కుమార్‌.. హైదరాబాద్‌ సీనియర్‌ మెన్స్‌ జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో తిలక్‌ వర్మ, సిరాజ్‌ వంటి ఆటగాళ్లతో నిండిన జట్లకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

    బీసీసీఐ-ఎన్‌సీఏ అక్రిడేషన్‌ పొందిన రంజిత్‌ కుమార్‌.. ప్రస్తుతం పెర్ఫామెన్స్‌ కోచింగ్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాడు. ఇటీవలే BCCI COE అండర్‌-19 బాయ్స్‌ క్యాంప్‌నకు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

    చిన్ననాడు కలలు కన్నట్లుగా తానొక స్టార్‌ క్రికెటర్‌ కాలేకపోయినా.. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్‌ సజావుగా కొనసాగించేందుకు కోచ్‌గా రంజిత్‌ తన ప్రతిభను ఉపయోగిస్తున్నాడు. విధి తనకు ఓ దారి మూసివేసినా.. కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో మరో దారిలో తన గమ్యాన్ని చేరుకున్న రంజిత్‌ కుమార్‌ యువతకు ఆదర్శం.

    చదవండి: హార్దిక్‌ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్‌గా తొలగింపు?

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో సోమ‌వారం ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు  మ్యాచ్‌ల త‌ర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ త‌న లోని క్లాస్‌ను మ‌రోసారి చూపించాడు.

    229 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో హిట్‌మ్యాన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. మ‌రో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌తో క‌లిసి స్కోర్ బోర్డును రోహిత్ ప‌రుగులు పెట్టించాడు. రోహిత్ కేవ‌లం 44 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేశాడు. 

    39 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అత‌డి బ్యాటింగ్ త‌గ్గ‌లేద‌ని ఈ ఇన్నింగ్స్ చూస్తే మ‌నకు అర్ధ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గాఈ సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, 174.01 స్ట్రైక్ రేటుతో 221 పరుగులు సాధించాడు. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

    "వాట్ ఏ ప్లేయ‌ర్‌.. వాట్ ఏ ప్లేయ‌ర్‌. రోహిత్ శ‌ర్మ ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. గతంలో ఆస్ట్రేలియా కోచ్‌గా ఉన్నప్పుడు ప్రత్యర్థిగా అత‌డి స‌త్తాను చూశాను. ఇప్పుడు ఎల్ఎస్‌జీ కోచ్‌గా అదే చూస్తున్నాను. అత‌డి బ్యాటింగ్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్ర‌పంచంలోని గొప్ప ప్లేయ‌ర్లు అంద‌రిని చూసేందుకు ఐపీఎల్ ఒక వేదిక" అని లాంగ‌ర్ పేర్కొన్నాడు.

    కాగా రోహిత్ శ‌ర్మ‌కు ఆస్ట్రేలియాపై గొప్ప రికార్డు ఉంది. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌కు రోహిత్ చుక్క‌లు చూపించేవాడు. ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్‌ల‌పై సైతం రోహిత్ త‌న‌దైన శైలిలో చెల‌రేగిపోయేవాడు.
    చదవండి: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన కెప్టెన్‌?
     

  • పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్‌ దిండా.

    దిండా పూర్వ మిడ్నాపూర్‌ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్‌ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.

    2021లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్‌ (మనోజ్‌ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్‌ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.

    42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్‌ అయిన దిండా ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.

    దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్‌ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 420 వికెట్లు, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 151 వికెట్లు పడగొట్టాడు. 

Politics

  • అది ఎన్నికల ప్రచారం కాదు..  విజయోత్సవ ర్యాలీ అంతకన్నా కాదు.  తాను ప్రజల మనిషినే అని చెప్పుకునే ఎంకే స్టాలిన్‌ ర్యాలీ అది. ఆయన ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాట  ఎన్నికల్లో అటు అభ్యర్థిగానూ, ఇటు పార్టీని విజయపథంలో నడిపించడంలోనూ విఫలమయ్యారు స్టాలిన్‌. టీవీకే విజయ్‌ దెబ్బతో  డీఎంకే, అన్నాడీఎంకేలు  ఘోరంగా చతికిలబడ్డాయి. 

    ఇది స్టాలిన్‌  కలలో కూడా ఊహించి ఉండరు. కచ్చితంగా గెలుస్తామని, అటు సర్వేలు కూడా డీఎంకేకు పట్టం కట్టిన వైనం.  అయితే ‘ఛేంజ్‌’ చేసేశారు ప్రజలు. తమ ఓటుతో విజయ్‌కు జైకొట్టారు. 

    ఇదిలా ఉంచితే,. ఎవరైనా ఓడిపోతే పూర్తిగా చతికిలబడిపోయి కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం ఆవుతారు. కానీ స్టాలిన్‌ అలా చేయలేదు. ఓడిపోయిన రెండో రోజే రోడ్‌ షో పేరుతో ప్రజల ముందుకు వచ్చారు స్టాలిన్‌. తనను ఓడించిన కొళత్తూరు ప్రజల ముందుకే వచ్చి.. అభివాదం చేశారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) స్టాలిన్‌ తాను పరాజయం పాలైన కొళత్తూరులో పర్యటించారు. 

    తాను ఓడిపోయిన చాయలు ముఖంలో కనిపిస్తున్నప్పటికీ స్టాలిన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తనను ఓడించిన ప్రజలను కలవాలని ఇలా రోడ్‌ షోలో పాల్గొన్నారా.. లేక తనకు ఓట్లు వేసిన జనానికి ఒకసారి రోడ్‌ షో రూపంలో థాంక్స్‌ చెబుదామనుకున్నారో కానీ ‘మీతోనే ఉంటానని, మీ వాడిగానే ఉంటాననేది’  ఆయన ముఖంలో మాత్రం కనిపించింది. 

     

     

     

     

     

  • పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్‌ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు.

    "ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్‌ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు.

    "మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్‌ఐఆర్‌ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.

    కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్‌కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.

    గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు.

  • కోల్‌కతా:  పశ్చిమబెంగాల్‌లో తాము ఓడిపోలేదని,  నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై  ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత సువేందు అధికారి స్పందించారు.  సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని,  ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు. 

    కాగా, బెంగాల్‌లో నైతిక విజయం తమదేనని అన్నారు  మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

    పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ  మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు.  100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు.

  • తమిళనాడు రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభమైంది. అసెంబ్లీలో ఇప్పుడు ప్రధానంగా కనిపించబోయే పోరు టీవీకే నేత విజయ్‌, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ మధ్యనే సాగనుంది. ఒకరు కాబోయే సీఎం, మరొకరు కాబోయే ప్రతిపక్ష నేత. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన విజయ్‌ ఒకవైపు, ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించబోయే ఉదయనిధి మరోవైపు ఉండటంతో సభ చర్చలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది. ఉదయనిధికి ఉన్న పాలనా అనుభవం ముందు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారనేది కీలకం.

    అసెంబ్లీలో జరిగే వాగ్వివాదాలు ఈ ఇద్దరు నేతల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చవచ్చు. పాలన, సంక్షేమం, చట్టం, వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ ఇద్దరు నేతలే. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఎంతవరకు విజయవంతం అవుతుంది? ప్రతిపక్షం ఎంత బలంగా నిలబడుతుంది? అన్నదే ముందున్న రాజకీయ దిశను నిర్ణయిస్తుంది. ఆ వ్యవహారాలే భవిష్యత్తులో విజయ్‌ను మరోసారి సీఎంగా నిలబెడతాయి. ఇక, ఉదయనిధి స్టాలిన్‌ బలంగా పనిచేస్తేనే విజయ్‌ను సీఎం పీఠం నుంచి దించి, మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తోంది. మొత్తంగా చూస్తే, విజయ్‌-ఉదయనిధి మధ్య ఈ రాజకీయ పోరు తమిళనాడు రాజకీయాలకు కొత్త శక్తిని తీసుకురానుంది. సభలో ప్రతి చర్చ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉండటం ఖాయం.

    తమిళనాట ఓ ఆశగా విజయ్‌
    బాలనటుడి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు టీవీకే విజయ్‌. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే విజయ్‌ ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ ఏర్పాటు, పొత్తులపై చర్చలు ఉండనున్నాయి. పాత పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ రెండు పార్టీలే తప్ప మరో పార్టీ లేదా? అనుకుంటున్న సమయంలో తమిళనాట ఓ ఆశగా వెలిగారు విజయ్‌. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని కొందరు అంటున్న సమయంలో పార్టీని పెట్టి.. పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి తీసుకొచ్చారు.  

    డీఎంకే ఆశ అంతా ఉదయనిధిపైనే..
    మరోవైపు, తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ ప్రతిపక్ష నేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా తనను నియమించే నిర్ణయం పార్టీ నాయకత్వానిదేనని ఉదయనిధి స్టాలిన్ మంగళవారం తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసిన ఉదయనిధి స్టాలిన్‌.. ఈ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గంలో గెలిచారు. శాసనసభా పక్ష నేత విజయ్‌తో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలినే.

    ఇద్దరిదీ ఒకే వయసు.. ఇరువురూ సినీనటులే
    ఉదయనిధి స్టాలిన్‌ వయసు 49 సంవత్సరాలు. విజయ్‌ వయసు 51. దాదాపు ఒకటే ఏజ్‌. తమిళనాడు భవిష‍్యత్తు రాజకీయాలు అంతా వీరిద్దరి కేంద్రంగానే జరిగే అవకాశం ఉంది. ఒకరు సీఎంగా, మరొకరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తమిళనాడులో ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు కూడా తమ సినీ పాపులారిటీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. 

    కాగా, దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముఖచిత్రం మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ నాయకులుగా గుర్తింపు పొందిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య భవిష్యత్తులో జరగబోయే రాజకీయ పోరు అసెంబ్లీ వేదికగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. విజయ్‌, ఉదయనిధి ఇద్దరూ సినీనటులే. అయితే, విజయ్‌ సినిమాల్లో హిట్స్‌ అధికంగా ఉండడంతో ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన‍్నారు. విజయ్‌ జననాయగన్ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెబుతానన్నారు. ఉదయనిధి కూడా సినిమాలకు గుడ్‌బై చెప్పి, నటనకు విరామం తీసుకుంటున్నట్లు 2023లోనే తెలిపారు.

    ఒకరు కొత్త.. మరొకరిది వారసత్వ రాజకీయం
    విజయ్‌ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా రాజకీయాల్లో ఇంతగా రాణించడం ఓ అద్భుతం. ఉదయనిధి స్టాలిన్‌ రాజకీయాల్లోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. తాత, తండ్రి వారసత్వం నుంచే స‍్వతహాగా రాజకీయాలను నేర్చుకున్నారు. అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టొచ్చో ఆయనకు తెలుసు. అయితే, విజయ్‌ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రజలను ఆకర్షించే తత్వం ఉంది. 

    ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధానాలు ఆయనకు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన పాలనలో విజయ్‌ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులోని లోపాలు, లొసుగులను ఎత్తి చూపుతుంది. వీటన్నింటి ఆధారంగా విజయ్‌పై విమర్శలు చేసే పాత్ర పోషించాల్సింది ఉదయనిధి స్టాలినే. 

    ఉదయనిధి స్టాలిన్‌కు ఇది కీలక దశ. అధికారంలో ఉన్న సమయంలో పొందిన అనుభవాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. సభలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావించడం ఆయన ప్రధాన బాధ్యతగా మారనుంది. డీఎంకే వారసుడిగా, కరుణానిధి మనవడిగా, ఉదయనిధికి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు, పార్టీకి సంబంధించిన అనుభవం ఆయనకున్న ప్రధాన బలాలు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) ప్రభంజనం సృష్టించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో విజయ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

    ప్రధాని మోదీ ట్వీట్‌కు టీవీకే చీఫ్‌ విజయ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్క్ష్యం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తాం. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

     

  • కోల్‌కతా:  బెంగాల్‌లో నైతిక విజయం తమదేనని అంటున్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

    పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ  మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు.  100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు. మా నాయకులపై వేధింపులు మొదలయ్యాయి. ఇండియా బ్లాక్ కోసం మరింత గట్టిగా పని చేస్తా. 

    ఈసీ బీజేపీ ఏజెంట్‌గా పనిచేసింది. ఎన్నికలకు రెండురోజుల ముందే టీఎంసీ నేతల్ని అరెస్ట్‌ చేశారు. బెంగాల్‌లో మాది ఓటమి కాదు. బీజేపీ చోరీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మా పాలిట విలన్‌. మేం విలన్లపై పోరాటం చేశాం. కౌంటింగ్‌ సెంటర్లలో మా ఏజెంట్లను అనుమతించలేదు. SIR ప్రక్రియలో మోదీ, అమిత్‌ షా తలదూర్చారు. బీజేపీ ఓట్ల చోరీపై పోరాడుతాం. సీఆర్పీఎఫ్‌ బలగాలు మా పాలిట గూండాల్లా మారాయి. బీజేపీకి ప్రతిపక్ష నేతల్ని టార్గెట్‌ చేయడం అలవాటే. మాకు ఇండియా బ్లాక్‌ మద్దతు ఉంది’ అని స్పష్టం చేశారు. 

    కాగా, నిన్న(సోమవారం) వెలువడిన బెంగాల్‌ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 200పైగా సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. బీజేపీ ప్రభంజనంతో   మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. 

  • సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్‌ ఎల్లుండి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

    విజయ్‌ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్‌ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్‌ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

    మిత్రపక్షాల ప్రతిపాదనలు
    సీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్‌కు తమ ప్రతిపాదనలు పంపాయి.
    పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.
    సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
    సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
    వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.

    విజయ్ వ్యూహం
    కేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.

    వినూత్న మంత్రివర్గం
    మిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

    ముఖ్యమంత్రి పదవికి విజయ్
    అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

     

  • పశ్చిమ బెంగాల్.. దశాబ్దాల పాటు వామపక్షాలకు అండగా నిలిచింది. ఆ తర్వాత 'దీదీ' మమతా బెనర్జీని అక్కున చేర్చుకుంది. కానీ, నిన్నటి సోమవారం వెలువడిన ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ, అసాధ్యమనుకున్న బెంగాల్ కోటను బద్ధలు కొట్టింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో మార్చాలనుకుంటున్న బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం.

    పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు 294 స్థానాలకు గాను 208 సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన కుప్పకూలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కోల్పోయి దెబ్బతిన్న బీజేపీకి, ఈ విజయం సంజీవనిలా మారింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి, బెంగాల్ విజయం కిరీటంలో మణి లాంటిది.

    ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. ఎన్నికల కంటే ముందే దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం పెను దుమారం రేపింది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్లను లూటీ చేసింది.. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని 100కు పైగా సీట్లలో మోసానికి పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

    రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా.. మమత ఓటమి ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుక ఇప్పుడు మూగబోయింది. చివరకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో కూడా మమత ఓడిపోవడం శోచనీయం. తన పాత మిత్రుడు, ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఆయనే ఇప్పుడు బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అవినీతి. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు, ఇతర కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని నింపాయి. రెండోది భద్రత. గతేడాది కోల్‌కతా ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ రేప్, హత్య ఉదంతం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఆ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా తనవైపు తిప్పుకుంది. దీదీ మంచిదే కానీ, ఆమె పార్టీ అవినీతిమయం.. పరిశ్రమలను తరిమేశారు అన్న సామాన్యుడి మాటలే బెంగాల్‌లో ప్రతిధ్వనించాయి. 

    సెక్యులరిజం వర్సెస్ హిందూత్వ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా, లౌకికవాదానికి,  కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్, ఇప్పుడు హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. మమత బెంగాలీ సంస్కృతిని రక్షించాలని పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం ఉద్యోగాలు మరియు అభివృద్ధికే ఓటు వేశారు.

    దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన ప్రయోగశాలే. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత శూన్యంగా మారిన ఆ గడ్డపై, ఇప్పుడు 'దళపతి' విజయ్ ఒక ఆశగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ నూతన విదేశీయుడిగా అడుగుపెట్టి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులను కదిలించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ విజయం వెనుక విజయ్ పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. గ్లామర్, అధికారం మధ్య ఆయన నలిగిపోలేదు. అటు ప్రజల ఆకాంక్షలకు, ఇటు తన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతపై నడుస్తూ ఈ ఘనత సాధించారు. సొంత కుటుంబం తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి, పేరు ప్రఖ్యాతుల గొడవలు బహిరంగమైనప్పుడు, శత్రువులు ఆయనను విమర్శించడానికి అస్త్రాలుగా వాడుకున్నారు. కానీ, తన ఇంట్లో రగులుతున్న ఆ వేదనను దిగమింగుకుని, బయట ప్రజల కోసం నిలబడ్డ విజయ్ తీరు చూసి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. ఆయన గెలుపు వెనుక కేవలం స్టార్‌డమ్ మాత్రమే లేదు, ఒంటరిగా నిలబడి పోరాడిన ఒక వ్యక్తి తాలూకు నిశ్శబ్ద ఆవేదన కూడా ఉంది.

    ఇక చివరగా, కేరళం,అక్కడ రాజకీయాల గురించి చెప్పాలంటే అది ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్, యు.డి.ఎఫ్ మధ్య సాగే హోరాహోరీ పోరాటం. కానీ, ఈసారి దేవుడి సొంత గడ్డపై కమలం పువ్వు వికసించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న కేరళలో, బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అంటే అది ఒక భావజాల విప్లవమే అని చెప్పాలి. క్రైస్తవ మైనారిటీలతో చేతులు కలుపుతూ, మోదీ గ్యారంటీ ని కేరళంలో ఇంటింటికి తీసుకెళ్లడంలో ఆ పార్టీ సఫలమైంది. పశ్చిమ బెంగాల్‌లో సాధించిన భారీ విజయంతో పోలిస్తే కేరళలో వచ్చిన ఓట్ల శాతం అతి తక్కువే కావొచ్చు, కానీ కేరళ ఓటరు మదిలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడం మాత్రం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. అజేయమైన కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా బిజెపి ఓట్ల శాతం పెరగడం చూస్తుంటే, కేరళలో మార్పు మొదలైందని స్పష్టమవుతోంది.

    మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాయి. అజేయమని భావించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడం, అస్సాం నుంచి కేరళ దాకా బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.. అది దేశంలో మారుతున్న సామాన్యుడి ఆకాంక్షలకు నిదర్శనం. ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి పేరుతో చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, భద్రత, అవినీతి రహిత పాలనే ముఖ్యమని ఓటరు తీర్పునిచ్చాడు. అటు తమిళనాడులో విజయ్ వంటి కొత్త తరం నాయకుల రాక, ఇటు బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలు.. వెరసి 2026 నాటి ఈ రాజకీయ చిత్రం దేశ భవిష్యత్తును సరికొత్త తీరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పాత వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం పెరిగేలా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పక్షాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాలి.

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌బీ చౌదరి మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

    ఆర్‌బీ చౌదరి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని వైఎస్‌ జగన్ గుర్తుచేశారు. కుటుంబ సమేతంగా చూసే విధంగా మంచి కథలతో, విలువలతో కూడిన చిత్రాలను అందించడం ఆయన ప్రత్యేకత అని అన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఆర్‌బీ చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్‌ జగన్‌.

  • సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నినందుకుగాను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.  కేంద్ర ప్రభుత్వం పంపిన రూ. 1,120 కోట్లను ‘ఏమైంది’  అని అడిగినందుకు నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు చేశారు కాకినాడ జిల్లా తిమ్మాపురం పోలీసులు. డిసెంబర్ 16, 2024 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు 244 రోజుల పాటు స్థానిక సంస్థలకు వచ్చిన నిధులను విడుదల చేయకుండా, ఆ డబ్బులను ఏమి చేశారు?అని ప్రశ్నించారు. 

    నిధులు దారి మళ్లించారా?, అలా అయితే, ఏ శాఖకు ఎంత మళ్లించారు?, ఎప్పుడు మళ్లించారు?, ఏ అవసరాలకు మళ్లించారో చెప్పలేరా?, ఎందుకు చెప్పడం లేదు?’ అని సాక్షి KSR లైవ్ షోలో నిలదీశారు.  దీనిపై కేసు పెట్టి, 7 రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరులో నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చి.. ఆయనకు నోటీసులిచ్చారు తిమ్మాపురం పోలీసులు.

  • తాడేపల్లి :  మార్గదర్శి బాధితులకు న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు  ఈనాడు కిరణ్‌కు చెంపపెట్టులాంటిదన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌. మార్గదర్శి బాదితులకు న్యాయం జరగాలని సుప్రీం ఇచ్చిన తీర్పు అద్భుతమైనదన్నారు. రామోజీరావు చనిపోయినందున కేసు కొట్టేయాలంటూ కిరణ్‌ కోర్టును అడగటం సిగ్గుచేటన్నారు. 

    ‘రూ.600 కోట్లు ప్రజల నుండి అక్రమంగా డిపాజిట్టు తీసుకున్నారు. ఆ డబ్బంతా ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ లాంటి వాడినే మానసికంగా చంపేశారు. మద్యపాన నిషేధాన్ని తనకు అవసరమైనట్టుగా వాడుకున్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలనే బెదిరించారు. మార్గదర్శి ద్వారా అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో ఇష్టానుసారం చేశారు. 

    తనకు నచ్చని నేతల వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. అలాంటి కిరణ్‌కు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది.  నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలకు బలం చేకూరింది. ఆర్బిఐతో సహా రెండు తెలుగు రాష్ట్రాల వివరణ కోరటం అభినందనీయం. మార్గదర్శి బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Business

  • ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.

    ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందన

    మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘ఏఐ కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్‌వేర్, సహాయక ఎకోసిస్టమ్‌ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.

    ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?

    హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.

    భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!

    ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్‌కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.

    ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

  • భారత బయోటెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన బయోకాన్ సంస్థలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోనుంది. సుమారు నాలుగు దశాబ్దాలుగా తన మేధస్సుతో ప్రపంచ స్థాయి బయోటెక్ సామ్రాజ్యాన్ని నిర్మించిన సంస్థ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా తన వారసురాలిని ఖరారు చేశారు. తన మేనకోడలు క్లైర్ మజుందార్ బయోకాన్ పగ్గాలు చేపట్టనున్నారని ప్రకటించారు.

    క్లైర్ మజుందార్

    37 ఏళ్ల క్లైర్ మజుందార్ ప్రస్తుతం అమెరికాకు చెందిన ఆంకాలజీ (క్యాన్సర్) పరిశోధన సంస్థ ‘బికారా థెరప్యూటిక్స్’కు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 2018లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె సంస్థను ఒక నూతన స్థాయికి తీసుకెళ్లారు. సంస్థను పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మార్చడంతోపాటు లిస్టింగ్ తర్వాత దాని విలువను రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. క్లైర్ నాయకత్వంలో బికారా సంస్థ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నిర్మూలించే ‘బై-స్పెసిఫిక్ యాంటీబాడీస్’ వంటి అత్యాధునిక చికిత్సలపై దృష్టి సారించింది.

    క్లైర్ విద్యా నేపథ్యం

    మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ రంగాల్లో ఆమె పట్టా పొందారు. ఆమె కుటుంబ నేపథ్యం కూడా సైన్స్, టెక్నాలజీతో ముడిపడి ఉంది. ఆమె సోదరుడు ఎరిక్ మజుందార్ కాల్టెక్‌లో ఏఐ నిపుణుడిగా పనిచేస్తుండగా ఆమె భర్త థామస్ రాబర్ట్స్ ప్రముఖ క్యాన్సర్ నిపుణులు.

    భవిష్యత్తు కార్యాచరణ

    కిరణ్ మజుందార్-షా తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఫార్చ్యూన్ ఇండియాకు వివరించారు. ‘ఏకైక యజమానిగా సంస్థను సురక్షితమైన చేతుల్లో ఉంచడం నా బాధ్యత. క్లైర్ సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. తన వారసురాలిగా క్లైర్‌ను ప్రకటించినప్పటికీ తాను వెంటనే బయోకాన్ ఛైర్‌పర్సన్ బాధ్యతల నుంచి వైదొలిగే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. బాధ్యతలను ఒకేసారి కాకుండా దశలవారీగా తనకు అప్పగిస్తానని ఆమె తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. వారసురాలి ప్రకటనపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సంస్థపై, తన పదవిపై ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు.

    ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

  • ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ లీప్’ పేరుతో భారీ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 నుంచి 15,000 మంది ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.

    రూ.2,600 కోట్ల పైచిలుకు వ్యయం

    ఈ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం కాగ్నిజెంట్ 230 మిలియన్ డాలర్ల నుంచి 320 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,900 కోట్ల నుంచి రూ.2,600 కోట్లు) నిధులను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 200 మిలియన్ల నుంచి 270 మిలియన్ డాలర్లను ఉద్యోగులకు సంబంధించిన ఇతర ఖర్చుల కోసం కేటాయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కంపెనీ అధికారికంగా తొలగింపుల సంఖ్యను వెల్లడించనప్పటికీ అంతర్గత వ్యయ అంచనాలు, వివిధ ప్రాంతాల్లోని జీతభత్యాల ప్రమాణాల ఆధారంగా ఈ గణాంకాలను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    భారత్‌పైనే తీవ్ర ప్రభావం?

    కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3,57,000 మందికి పైగా సిబ్బందిని కలిగి ఉండగా ఇందులో 2,50,000 మందికి పైగా భారత్‌లోనే పనిచేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇక్కడ జీతభత్యాల వ్యయం తక్కువగా ఉండటం, ఉద్యోగ విరమణ/తొలగింపు ప్రక్రియకు సంబంధించిన ఖర్చులు సాపేక్షంగా తక్కువ కావడంతో ఈ కోతలు భారత్‌లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

  • ప్రస్తుత కాలంలో అగ్రశ్రేణి టెక్ కంపెనీలు చేపడుతున్న సామూహిక తొలగింపులు (లేఆఫ్స్‌) ఉద్యోగ రంగంలో అనిశ్చితిని పెంచుతున్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం ఏ ఉద్యోగికైనా ఒత్తిడితో కూడిన విషయమే. అయితే, తొలగింపునకు గురైనప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. తమకు ఎటువంటి సమయం లేదా బేరసారాలు ఆడే అవకాశం లేదని భావించడం. కానీ, చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకుంటే మీకు కొన్ని అవకాశాలున్నాయని ఉపాధి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

    40 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక రక్షణ

    ముఖ్యంగా 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులకు ‘ఓల్డ్ వర్కర్స్ బెనిఫిట్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఓడబ్ల్యూబీపీఏ)’ కింద ఫెడరల్ చట్టం(యూఎస్‌) ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం.. సెవెరెన్స్‌ అగ్రిమెంట్‌ పరిశీలించడానికి మీకు కనీసం 21 రోజులు (సామూహిక తొలగింపులైతే 45 రోజులు) గడువు ఇవ్వాలి. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా మనసు మార్చుకోవడానికి మీకు 7 రోజుల సమయం ఉంటుంది.

    కంపెనీలు హడావిడిగా సంతకం చేయమని ఒత్తిడి చేయడం సరికాదు. పైన పేర్కొన్న గడువును ఎవరూ తప్పించలేరు. బలవంతపు సంతకాలు చేయించుకోకూడదు.

    ప్యాకేజీని చర్చించడం ఎలా?

    చాలామంది ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన మొదటి ఆఫర్‌ను అంగీకరిస్తుంటారు. కానీ, ఆ గణాంకాలు వేరేలా చెబుతున్నాయి. నోలో/మార్టిన్ డేల్-నోలో డేటా ప్రకారం, బేరసారాలు జరిపిన ఉద్యోగులు సగటున 41,500 డాలర్లు వరకు అందుకుంటే, నేరుగా సంతకం చేసిన వారు సగటున 19,200 డాలర్లు పరిహారం మాత్రమే పొందగలిగారు.

    చర్చించాల్సిన అంశాలు

    • సాధారణంగా సర్వీసులో ఉన్న సంవత్సరానికి ఒకటి లేదా రెండు వారాల వేతనం ప్రాతిపదికగా ఉంటుంది. దీన్ని పెంచే అవకాశం ఉంటుంది.

    • కోబ్రా వంటి ఆరోగ్య బీమా కవరేజీని కంపెనీయే చెల్లించేలా బేరమాడవచ్చు.

    • స్టాక్ ఆప్షన్లను వేగవంతం చేయమని చర్చించవచ్చు.

    • రెజ్యూమ్ సపోర్ట్, జాబ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్, పాజిటివ్ రిఫరెన్స్ లెటర్లు అడగడం మర్చిపోవద్దు.

    సంతకానికి ముందు..

    చాలా ఒప్పందాల్లో వేధింపులు, వివక్ష లేదా తప్పుడు తొలగింపులకు వ్యతిరేకంగా మీరు పోరాడే హక్కులను వదులుకోవాలంటూ క్లాజ్‌లుంటాయి. ఈ క్లాజులపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీపై అకస్మాత్తుగా ఏదైనా ఒక కారణంచేత తొలగించామని ముద్ర వేస్తే అది మీ కెరీర్‌కు ఆటంకం కావచ్చు. మీ పనితీరు బాగున్నప్పటికీ ఇలా జరిగితే రికార్డులను సవరించమని కోరండి. కంపెనీ సిస్టమ్‌ల నుంచి యాక్సెస్ కోల్పోయేలోపే.. మీ పనితీరు సమీక్షలు, ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోండి.

    న్యాయ సలహా అవసరమా?

    న్యాయవాదిని సంప్రదించడం ఖరీదైన వ్యవహారమని భావించకండి. చాలామంది న్యాయవాదులు నిర్ణీత ఫీజుతో సర్వీసులు అందిస్తారు. మీ కంపెనీతో ఉన్న ఒప్పందంలోని లొసుగులను గుర్తించి చర్చల ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందడంలో వారి సలహా ఎంతో కీలకం. కంపెనీలు పెట్టే గడువుల కంటే మీ హక్కులు గొప్పవి. తొలగింపునకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.

    ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

  • అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం సామాన్యుడి వంటగదిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరడం హోటల్, రెస్టారెంట్ రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు ఊరటనిస్తోంది.

    గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలు

    మే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.993 పెరిగి రూ.3,071.50కు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక ధర. కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు రూ.1,303 మేర పెరగడం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

    గత మూడు నెలల గణాంకాలు

    మార్చి: రూ.114.50 పెంపు

    ఏప్రిల్: రూ.195.50 పెంపు

    మే: రూ.993 పెంపు

    చిన్న సిలిండర్లు: 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.549 నుంచి రూ.810.50కి పెరగడంతో చిన్న వ్యాపారులకు కూడా భారం పెరిగింది.

    డిమెస్టిక్‌ వినియోగదారుల పరిస్థితి ఏమిటి?

    ప్రస్తుతానికి డొమెస్టిక్‌ గ్యాస్ (14.2 కేజీలు) ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    సబ్సిడీతో ఉపశమనం.. రూ.300 ఆదా ఇలా!

    ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్లకు వర్తిస్తుంది. 5 కిలోల సిలిండర్ వాడే వారికి దామాషా పద్ధతిలో సబ్సిడీ అందుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, ఇన్‌స్టలేషన్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్, స్టవ్‌ను కూడా ఉచితంగా అందిస్తూ సామాన్యులు క్లీన్ ఫ్యూయెల్‌ ఎల్పీజీ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.

    వాణిజ్య సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో కొంత రక్షణ ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు గ్యాస్ ధరలను ఎలా శాసిస్తాయనేది వేచి చూడాలి. ఈ తరుణంలో ఉజ్వల పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సామాన్యులకు ఊపిరినిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

  • వేగవంతమైన జీవనశైలిలో 60 ఏళ్ల వరకు పనిచేయడం అనేది ఒకప్పుడు సాధారణం. కానీ, ఇప్పటి యువతరం 40 ఏళ్లకే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటోంది. 30 ఏళ్ల యువకుడు నెలకు రూ.1.5 లక్షల ఆదాయంతో ముంబై వంటి నగరంలో ఉంటూ 45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా చేయాలి? ఈ ప్రశ్నపై ఏఐ దిగ్గజం చాట్‌ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక లెక్కల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలియే ముందస్తు పదవీ విరమణకు కీలమని ఏఐ స్పష్టం చేస్తోంది.

    పెట్టుబడి కంటే పొదుపే ముఖ్యం!

    త్వరగా రిటైర్‌ అవ్వాలంటే చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది? ఏ స్టాక్‌లో లాభాలు వస్తాయి? అని వెతుకుతుంటారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన సలహా ఆశ్చర్యకరంగా ఉంది. దీని ప్రకారం, ముందస్తు పదవీ విరమణకు పెట్టుబడి రాబడి ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామనేదే కీలకం.

    ఏఐ సూచించిన ప్రాథమిక సూత్రం

    60:40 నిష్పత్తి: ఉదాహరణకు నెలకు వచ్చే మీ రూ.1.5 లక్షల ఆదాయంలో రూ.60,000 మాత్రమే ఖర్చు చేయాలి. మిగిలిన రూ.90,000ను కచ్చితంగా పెట్టుబడిగా మార్చాలి.

    • ముంబైలో జీవనశైలి పెరిగే ప్రమాదం ఉంది. ఎంత జీతం పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని కూడా పెట్టుబడికే మళ్లించాలని ఏఐ సూచిస్తోంది.

    • కేవలం డబ్బు దాచడమే కాకుండా దానిని సరైన మార్గాల్లో మళ్లించడం ద్వారా 15 ఏళ్లలో మెరుగైన కార్పస్‌ను నిర్మించవచ్చని ఏఐ విశ్లేషించింది.

    విభాగంనెలవారీ కేటాయింపుసూచన
    ఈక్విటీ/ఇండెక్స్ ఫండ్స్రూ. 75,000దీర్ఘకాలిక కాంపౌండింగ్ కోసం డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవాలి.
    డెట్/ఎమర్జెన్సీ ఫండ్రూ. 15,000లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆర్థిక భద్రత.
    నిర్వహణ వ్యయంరూ. 60,000అద్దె, ఆహారం, బీమా, ఇతర ఖర్చులు.

     

    సెబీ నిబంధనల ప్రకారం, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఖర్చు తక్కువ. కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయని ఏఐ గుర్తుచేస్తోంది.

    వ్యూహాత్మక మార్పు

    ముంబైలో పెరుగుతున్న జీవన వ్యయం మీ పొదుపు లక్ష్యానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి 45 ఏళ్ల వయసులో పదవీ విరమణ తర్వాత ముంబై నుంచి ప్రశ్న అడిగిన వ్యక్తి స్వస్థలమైన లఖ్‌నవూకు మారిపోవాలనే ఆలోచన చాలా తెలివైనదని ఏఐ అభినందించింది. లఖ్‌నవూలో నివసించడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ కార్పస్ మరింత కాలం మన్నేలా చేస్తుంది.

    చాట్ జీపీటీ మాటల్లో చెప్పాలంటే, 10 నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు విషయంలో కాస్త విసుగుగా అనిపించినా సరే, క్రమశిక్షణ తప్పకూడదు. ఏఐ చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే మీ 45వ ఏట ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు. అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని, ఏదైనా పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.

    ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

  • భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఇన్వెస్టర్లలో ఆందోళనను పెంచగా, దేశీయ సూచీలు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నిఫ్టీ ఒకానొక దశలో 23,882 పాయింట్లకు పడిపోయి, ఆ తర్వాత కోలుకుని 24,032 పాయింట్ల వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్ కూడా 76,515 పాయింట్ల డే కనిష్టాన్ని తాకి చివరకు 77,017 పాయింట్ల వద్ద స్థిరపడింది.

    మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు(అంచనా)

    పశ్చిమాసియా యుద్ధం

    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న వివాదం, ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద నెలకొన్న ప్రతిష్టంభన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్‌లో భయాన్ని పెంచాయి.

    క్రూడాయిల్ ధరల సెగ

    చమురు సరఫరాలో అంతరాయాల భయం క్రూడాయిల్ ధరలను రికార్డు స్థాయిలకు చేర్చింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

    ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల భయం

    అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండదని, పైగా అవి మరింత పెరగవచ్చనే ఆందోళనలు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో కనిపిస్తున్నాయి. ఇది పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది.

    లాభాల స్వీకరణ, అప్రమత్తత

    గత కొద్ది రోజులుగా మార్కెట్ స్వల్పంగా కోలుకోవడంతో లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు అప్రమత్తమై లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా కీలకమైన ప్రతిఘటన స్థాయిల వద్ద (రెసిస్టెన్స్‌ లెవల్స్‌) ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని పెంచడం వల్ల సూచీలు ఒక దశలో బలహీనపడ్డాయి.

    నెక్ట్స్‌ ఏంటి?

    ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ కాన్సాలిడేషన్‌లో ఉందని తెలుస్తుంది. నిఫ్టీ 23,800-24,300 శ్రేణిలో కదలాడుతోంది. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు సద్దుమణిగి, క్రూడాయిల్ ధరలు స్థిరీకరణ చెందితే తప్ప మార్కెట్ పురోగతిని సాధించడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భౌగోళిక పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని మార్కెట్ నిపుణుల సూచన.

    ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్‌)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

    అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందన

    నియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.

    అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు

    2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.

    • క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను  సమర్థవంతంగా నిర్వహిస్తారు.

    • రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.

    • మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.

    తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.

    భారతదేశంతో అనుసంధానం

    భారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.

    అలబ్బార్ భరోసా

    భారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.

    ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్, ఓపెన్‌ఏఐ మధ్య న్యాయ పోరాటం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. కోర్టు విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు మస్క్, ఓపెన్‌ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్‌మన్‌కు పంపిన సందేశాలు ప్రస్తుతం ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఏమిటా సందేశం?

    సీఎన్‌బీసీ నివేదికల ప్రకారం, విచారణకు కేవలం రెండు రోజుల ముందు ఎలాన్ మస్క్, గ్రెగ్ బ్రోక్‌మన్‌కు సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు తమ వాదనలను విరమించుకుని కేసును పరిష్కరించుకుందామని బ్రోక్‌మన్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనకు మస్క్ ఇచ్చిన స్పందన అత్యంత తీవ్రంగా ఉంది. ‘ఈ వారం చివరి నాటికి మీరు, సామ్ ఆల్ట్‌మాన్ అమెరికాలోనే అత్యంత అసహ్యించుకునే వ్యక్తులుగా మారుతారు. మీరు పట్టుబట్టి ముందుకు వెళితే అలాగే ఉంటుంది’ అని మస్క్ హెచ్చరించినట్లు న్యాయస్థానంలో దాఖలు చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.

    ఓపెన్‌ఏఐ వాదన

    ఈ సందేశాన్ని ఓపెన్‌ఏఐ న్యాయ బృందం చాలా సీరియస్‌గా పరిగణించింది. మస్క్ తన పోటీదారులను, ఆ సంస్థల్లోని కీలక వ్యక్తులను వ్యక్తిగతంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఓపెన్‌ఏఐ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మస్క్ ఈ దావాను కేవలం ఒక పోటీ వ్యూహంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

    వివాదం నేపథ్యం

    2024లో మొదలైన ఈ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 2015లో ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఎలాన్ మస్క్, ఆ సంస్థకు దాదాపు 38 మిలియన్‌ డాలర్ల విరాళం అందించారు. ఆ సంస్థ లాభాపేక్ష లేని (నాన్‌ ప్రాఫిట్‌), అందరికీ అందుబాటులో ఉండేలా పనిచేయాలని మస్క్ అప్పట్లో ఆకాంక్షించారు. అయితే, సంస్థ ప్రస్తుతం లాభాపేక్ష దిశగా మళ్లడంపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత వారం కోర్టులో సాక్ష్యం చెబుతూ సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లు ఒక స్వచ్ఛంద సంస్థను తీరునే మారుస్తున్నారని ఆరోపణలు చేశారు.

    తదుపరి పరిణామాలు

    మస్క్ ఆరోపణలను ఓపెన​్‌ఏఐ వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని, మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐకి మరింత వ్యాపారం లభించేందుకు, మార్కెట్ పోటీని దెబ్బతీయడానికి ఆడుతున్న నాటకమని సంస్థ వాదిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ తయారీలోకి ఓపెన్‌ఏఐ ఎంట్రీ?

  • ప్రపంచవ్యాప్తంగా టెక్ విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ సంస్థ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించనుందనే వార్తలొస్తున్నాయి. యాపిల్‌, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ తన సరికొత్త ఏఐ ఏజెంట్ ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం యాప్‌ల మీద ఆధారపడకుండా కృత్రిమ మేధ ద్వారా నేరుగా పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ అంశాలను అధికారికంగా కంపెనీ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

    ఏమిటీ ఏఐ ఏజెంట్ ఫోన్?

    ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ల్లో మనం ఒక పని కోసం వివిధ యాప్‌లను ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేస్తున్న ఈ ఏజెంట్ ఫోన్ ఆ పద్ధతినే మార్చేయనుంది. ఇందులో యూజర్లు పనులను పూర్తి చేయడానికి ఏజెంట్ పైన ఆధారపడతారు. అంటే, ఫోన్‌లోని ఏఐ యూజర్ తరఫున వివిధ యాప్‌ల మధ్య నావిగేట్ చేస్తూ పనిని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మొబైల్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చనుంది.

    లీక్ అయిన స్పెసిఫికేషన్స్‌

    ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కుయో వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఈ స్మార్ట్‌ఫోన్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. అందుకోసం మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది డైమెన్సిటీ 9600 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. టీఎస్‌ఎంసీ అధునాతన N2P (2nm) నోడ్ సాంకేతికతతో ఈ చిప్ తయారవుతుంది. ఇందులో డ్యూయల్-ఎన్‌పీయూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ఏఐ గణనలను వేగంగా పూర్తి చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం ఎల్‌పీ డీడీఆర్‌6 ర్యామ్‌ యూఎఫ్‌ఎస్‌ 5.0 స్టోరేజ్ సాంకేతికతను వాడుతున్నారు. ఇన్-లైన్ హ్యాషింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి’ అన్నారు.

    ఎందుకు ఈ ఫోన్ అవసరం?

    ఓపెన్‌ఏఐ ఈ ఫోన్‌ను తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వ్యాపార వ్యూహం. రాబోయే కాలంలో కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి బలమైన ప్రొడక్ట్ స్టోరీ అవసరం. రెండు.. మార్కెట్ ఆధిపత్యం. యాపిల్, గూగుల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు ఏఐ ఫీచర్లను తమ ఫోన్లలో వేగంగా ప్రవేశపెడుతున్నాయి. ఈ పోటీలో వెనుకబడకుండా ఉండాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిపై నియంత్రణ ఉండాలని ఓపెన్‌ఏఐ భావిస్తోంది.

    ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ 2027 మొదటి అర్ధభాగంలో భారీ ఉత్పత్తి దశలోకి వెళ్లనుంది. 2027-2028 మధ్య సుమారు 30 మిలియన్ల యూనిట్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఓపెన్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు లేదా సామ్ ఆల్ట్‌మాన్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏదేమైనా ఒక సాఫ్ట్‌వేర్ దిగ్గజం సొంత హార్డ్‌వేర్‌తో వస్తుందంటే అది మొబైల్ పరిశ్రమలో పెను సంచలనమే కానుంది. టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏఐ ఏజెంట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్ వినియోగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందో లేదో చూడాలి.

    ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు

International

  • అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ‍ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.

    ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్‌ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. 

    అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్  ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం"  అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.

    గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.

    చైనాపై ఆరోపణలు
    కాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్‌ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది.  ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

    ఇరాన్‌ దగ్గర సత్తా లేదు
    యుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు.  వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు.

  • వాషింగ్టన్‌: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.

    ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.

    విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్‌కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.

    ఈ ఘటనపై ఇరాన్‌ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్‌ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు ‍అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ షమీమ్‌ అక్తర్‌ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

    వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్‌ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.

    తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.

    ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది.

  • హైదరాబాద్‌: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్‌ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్‌ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.

    ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్‌కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

    బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.

    జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు.

     కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ను గుర్తించారు.

    ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.

    నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్‌లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్‌లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.