Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్‌ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. 

    మార్కరమ్‌ (42 ), రిషబ్‌ పంత్‌ (43), మార్ష్‌ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో  లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్‌ యువ బ్యాటర్లు ప్రియాన్ష్‌ ఆర్య, కూపర్‌ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. 

    ప్రియాన్ష్‌ (93), కన్నోలి (87) తమ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో స్టోయినిస్‌ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌,మణిమరన్‌ సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్‌ ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్‌ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే సీజన్‌లో కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. రాజస్తాన్‌పై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. 

    రింకూ సింగ్‌, అనుకుల్ రాయ్‌ల వల్లే కేకేఆర్ గెలిచిందంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మాట్లాడుతూ.. 'నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఫీలింగ్ ఇది. ఈ మ్యాచ్‌లో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. రింకు సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. రింకు, అనుకుల్ ఇద్దరూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. 

    ఇద్దరి బ్యాటింగ్ సూపర్బ్. నాకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం. పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది.  కార్తీక్ త్యాగి అద్భుతంగా ఆడుతున్నాడు. తన సామర్థ్యం గురించి అతనికి స్పష్టత ఉంది. ఇలాంటి యువ ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. 

    అతను ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. అది చూడటం చాలా ఆనందంగా ఉంది. త్యాగి బౌలింగ్ చేస్తున్న వేగం అద్భుతం. ప్రతి మ్యాచ్‌ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అదే క్రికెట్ అవగాహనను పెంచుతుంది. కొన్నిసార్లు స్ట్రైక్‌రేట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నాకు అనిపిస్తుంది. కానీ మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లడం ముఖ్యం. ఈరోజు ఏమి జరిగిందో మనం చూశాం. 

    ఈ విజయం మాకు ఒక పెద్ద ఉపశమనం లాంటిది. జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. జట్టు సభ్యుల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ విజయం వాళ్లకే అంకితం. జట్టులో చాలా సానుకూల వాతావరణం ఉంది' అని రహానే చెప్పుకొచ్చాడు.

    చదవండి: కేకేఆర్‌ రాత మార్చిన రింకూ సింగ్‌!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యాన్ని సాధించింది. ఐదు ప‌రాజ‌యాల‌తో అట్ట‌డుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక ద‌శ‌లో 85 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓట‌మి చ‌విచూస్తుంద‌ని అంతా భావించారు. 

    కానీ జ‌ట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ త‌న స‌హ‌చ‌ర బ్యాట‌ర్ అనుకుల్ రాయ్‌తో క‌లిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాత‌ను మార్చాడు. 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద త‌న‌కు ల‌భించిన లైఫ్‌ను రింకూ సింగ్ చ‌క్క‌గా వినియోగించుకున్నాడు.  రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బ‌ర్గ‌ర్ వ‌దిలేయ‌డం మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్‌ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి  ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

    త‌న‌కు లైఫ్ వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది రింకూ సింగ్ రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు రుచి చూపించాడు.ఈ సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌ని రింకూ సింగ్ రాజ‌స్తాన్‌తో  మ్యాచ్‌లో త‌న విలువ‌ను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వ‌చ్చేస‌రికి కేకేఆర్ 6 వికెట్ల న‌ష్టానికి 85 ప‌రుగుల‌తో ఉంది. విజ‌యానికి ఆరు ఓవ‌ర్ల‌లో 69 ప‌రుగులు కావాలి. 

    అనుకుల్ రాయ్ నుంచి మంచి స‌హ‌కారం అంద‌డంతో రింకూ సింగ్ స్వేచ్ఛ‌గా బ్యాట్‌ను ఝ‌లిపించాడు. ఈ ఇద్ద‌రు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 ప‌రుగుల విన్నింగ్ భాగ‌స్వామ్యం న‌మోదు చేసి కేకేఆర్‌కు సీజ‌న్‌లో మొద‌టి విజ‌యాన్ని అందించారు. మ్యాచ్ అనంత‌రం రింకూ సింగ్ మాట్లాడాడు. 

    ‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. 

    తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. 

    ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్‌లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్‌ ఇచ్చిన అనుకుల్‌ రాయల్‌ (16 బంతుల్లో 29 నాటౌట్‌) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

    చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్‌కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 

    13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్‌ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. 

    దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.

    ఇక 2026 సీజ‌న్‌లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ కూడా మార్క‌ర‌మ్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌లోనూ ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవ‌ర్ అని చెప్పొచ్చు. 2025 సీజ‌న్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ (సీఎస్‌కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 ప‌రుగులు, మొయిన్ అలీ (కేకేఆర్‌) రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో 32 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.

    చదవండి: 'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆదివారం కేకేఆర్ చేతిలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 4 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసింది. మ్యాచ్‌ ఓటమిపై పరాగ్‌ స్పందించాడు. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం త‌మ కొంప ముంచింద‌ని రాజ‌స్తాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు. 

    మ్యాచ్ ముగిసిన అనంత‌రం ప‌రాగ్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో తొలి నాలుగు ఓవ‌ర్లు ముగిసేసరికి ఈ పిచ్‌పై 170 ప‌రుగులు చేస్తే విజ‌యం సాధించొచ్చు అని భావించాం. కానీ 10 ప‌రుగులు వెనుక‌బ‌డ్డాం. మా బౌల‌ర్లు క‌ష్ట‌ప‌డ్డారు. కానీ ఫీల్డింగ్‌లో కొన్ని త‌ప్పులు చేశాం. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంపముంచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంది. 

    కానీ మా జ‌ట్టులో ఇవాళ పేస‌ర్లు ఎక్కువ‌గా ఉండడం, బిష్ణోయ్ మాత్ర‌మే రెగ్యుల‌ర్ స్పిన్న‌ర్‌గా ఉండ‌డం మాకు ప్ర‌తికూలంగా మారింది. బ్రిజేశ్ శ‌ర్మ ఇవాళ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 14, 16వ ఓవ‌ర్లో అత‌ను సూప‌ర్‌గా బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ పూర్తైన త‌ర్వాత క్రీజులో ఇద్ద‌రు ఎడమ‌చేతి బ్యాట‌ర్లు ఉండ‌డం, ఆ స‌మ‌యంలో మా వ‌ద్ద స్పిన్ బౌల‌ర్ లేక‌పోవ‌డం కూడా ఓట‌మికి దారి వేసింద‌ని చెప్పొచ్చు. 

    ఇవాళ బ్యాటింగ్‌లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించ‌లేక‌పోయాం. రెండు ఓట‌ములు వ‌చ్చినంత మాత్రాన వెన‌క్కి తగ్గిన‌ట్లు కాదు. మ‌ళ్లీ ఫుంజుకుంటాం. ఇక ’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది.

  • ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

    ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46), యశస్వి జైశ్వాల్(39) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టుకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వరుణ్‌ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కార్తీక్‌ త్యాగి మూడు, సునీల్‌ నరైన్‌ రెండు వికెట్లు సాధించాడు.

    గెలిపించిన రింకూ, అనుకుల్‌
    అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్‌, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గ్రీన్‌(27) కాస్త దూకుడుగా ఆడి రాజస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.

    దూకుడుగా ఆడిన గ్రీన్ కూడా బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. వెంటనే రఘువంశీ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్‌, పావెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పావెల్(23) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్(10) ప్రభావం చూపలేకపోయాడు.

    దీంతో కేకేఆర్‌కు మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్‌(53 నాటౌట్‌), అనుకుల్ రాయ్‌(29 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 6 వి​కెట్లు కోల్పోయి చేధించింది.

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్‌ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్‌ (42 ), రిషబ్‌ పంత్‌ (43), మార్ష్‌ (40) పరుగులు సాధించారు. అంతకముందు పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్‌ (93), కూపర్‌ (87) పరుగులు చేశారు. 

    18 ఓవర్లలో లక్నో 179/4
    18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మార్కరమ్‌ 28, ముకుల్‌ 16 పరుగులతో ఆడుతున్నారు.

    పంత్ (43) ఔట్‌.. మూడో వికెట్ కోల్పోయిన లక్నో
    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 128  పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన పంత్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

    8 ఓవర్లలో లక్నో 89/1
    8 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. మార్ష్‌ (35), పంత్‌ (18) క్రీజులో ఉన్నారు.

    తొలి వికెట్‌ కోల్పోయిన లక్నో
    పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 35 పరుగులు చేసిన ఆయుశ్‌ బదోని విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది.

    • 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఛేదనను ధాటిగానే ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. మార్ష్‌ 23, ఆయుశ్‌ బదోని 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    లక్నో ముంగిట 255 పరుగుల లక్ష్యం
    ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అత్యధిక స్కోరు సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోలి (87) విధ్వంసం సృష్టించారు. చివర్లో స్టోయినిస్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి లక్నో బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రిన్స్ యాదవ్‌, మనిమరన్ సిద్దార్థ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో పంజాబ్‌దే అత్యధిక స్కోరు. ఇంతకముందు ఇదే సీజ‌న్‌లో సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ 250 ప‌రుగులు చేసింది.

    18 ఓవర్లలో పంజాబ్ 230/5
    18 ఓవ‌ర్లు ముగిసేస‌రికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. స్టోయినిస్ 19 ప‌రుగులు, శ‌శాంక్ సింగ్ 6 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

    • శ్రేయస్ అయ్యర్ (5) రూపంలో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అంతకముందు 93 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య సిద్దార్థ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో పంజాబ్ 187 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

    కూపర్‌ (87) ఔట్‌
    పంజాబ్‌ కింగ్స్‌ 185 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కూపర్‌ 46 బంతుల్లో 7 సిక్సులు 8 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మణిమరన్‌ సిర్థార్థ్‌కు క్యాచ్‌ ఇచ్చుకున్నాడు.

    9 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రియాన్ష్‌ ఆర్య 19 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కన్నోలి 40 పరుగులతో ఆడుతున్నాడు.

    ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ 63/1
    పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆరు ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్టానికి 63 ప‌రుగులు చేసింది. ప్రియాన్ష్ 40, కూప‌ర్ క‌న్నోలి 23 ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    5 ఓవర్లలో పంజాబ్ 43/1
    5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి పంజాబ్ కింగ్స్ వికెట్ న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. కూప‌ర్ క‌న్నోలి 15, ప్రియాన్ష్ ఆర్య 21 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

    ప్ర‌బ్‌సిమ్ర‌న్ డ‌కౌట్‌.. 
    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ఓపెన‌ర్ ప్ర‌బ్‌సిమ్ర‌న్ సింగ్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ల‌క్నో
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా 29వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్‌ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు లక్నో ఒక మార్పు చేసింది.  దిగ్వేశ్‌ రాఠీ స్థానంలో సిద్దార్థ్‌ మణిరమన్‌  జట్టులోకి  వచ్చాడు.

    పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌ కీపర్‌), ప్రియాన్ష్‌ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

    లక్నో సూపర్‌జెయింట్స్‌: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్‌(కెప్టెన్‌), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్

  • ఫార్ములావన్ రేసింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం జర్మనీలోని నుర్బుర్గ్ రింగ్‌లో జరిగిన నుర్బుర్గ్ రింగ్ లాంగ్‌స్రెకెన్ సిరీస్ (ఎన్‌ఎస్‌ఎల్) క్వాలిఫయింగ్ రేసు విషాదాంతమైంది. ఏడు రేసింగ్ కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో వెట‌ర‌న్‌ రేసింగ్‌ డ్రైవర్ 66 ఏళ్ల జుహా మియెట్టినెన్ ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం జుహా మియెట్టియెన్ బీఎండ‌బ్ల్యూ 325ఐ రేసింగ్ కారుకు డ్రైవ‌ర్‌గా ఉన్నాడు. 

    ఇక ఇదే రేసులో పాల్గొన్న నాలుగుసార్లు ఫార్ములా వన్ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ సహా మిగతా డ్రైవర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నాలుగు గంట‌ల‌పాటు జ‌ర‌గాల్సిన ఈవెంట్‌లో రేస్ ప్రారంభ‌మైన 25 నిమిషాల‌కే ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. ట్రాక్‌లోని క్లోస్ట‌ర్‌టాల్ వ‌ద్ద ఎత్తులో ఉన్న‌ప్పుడు సెక‌న్ల వ్య‌వ‌ధిలో ఏడు కార్లు ఒక‌దానితో ఒక‌టి ఢీకొట్టాయి. 

    దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే రేసును నిలిపేశారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పారా మెడిక‌ల్ సిబ్బంది  జుహా మియెట్టియెన్‌ను కారులో నుంచి బ‌య‌టికి తీసిన‌ప్ప‌టికీ అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. మిగ‌తా వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇందులో వెర్‌స్టాపెన్ కూడా ఉన్నాడు. 

    కాగా మియెట్టియెన్ మ‌ర‌ణంపై ఎన్‌ఎస్‌ఎల్ నిర్వాహకులు విచారం వ్య‌క్తం చేశారు. ఇక మోటార్ స్పోర్ట్స్ నియంత్ర‌ణ సంస్థ (ఎఫ్ఐఏ) విచారం వ్య‌క్తం చేసింది. మియెట్టియెన్ మృతికి సంతాపం తెలిపిన ఎఫ్ఐఏ అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలిపింది. ఇక షెడ్యూల్ ప్ర‌కారం ఆదివారం రేస్ జ‌రుగుతుంద‌ని ఎన్ఎస్ఎల్ తెలిపింది. 

    అయితే రేస్ ప్రారంభానికి ముందు మియెట్టియెన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించ‌నున్నారు. ఈ రేసులో మాక్స్ వెర్‌స్టాపెన్‌తో పాటు మెర్సిడెస్ రేస‌ర్ లుకాస్ ఆర్ కూడా పాల్గొన‌నున్నాడు. కాగా జుహా మియెట్టియెన్‌ మరణంపై మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ స్పందించాడు. ‘మియెట్టియెన్‌ మరణం నన్ను తీవ్ర  దిగ్భ్రాంతికి గురి చేసింది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని పోస్టు పెట్టాడు.

     

  • ఐపీఎల్‌-2026లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ అజింక్య ర‌హానే త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ర‌హానే ఖాతా తెవ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. రాజ‌స్తాన్ పేస‌ర్ నండ్రీ బ‌ర్గ‌ర్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ర‌హానే ఔట‌య్యాడు.

    అంత‌కుముందు గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా ర‌హానే గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఈ వెట‌ర‌న్ ఆట‌గాడు ఓ అవాంఛ‌నీయ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఓపెన‌ర్‌గా ర‌హానే నిలిచాడు. ర‌హానే ఇప్ప‌టివ‌ర‌కు 12 సార్లు ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పార్ధివ్ ప‌టేల్‌(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పార్ధివ్‌ను ర‌హానే అధిగ‌మించాడు.

    ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌటైన ఓపెన‌ర్లు వీరే
    12 - అజింక్య రహానే*
    11 - పార్థివ్ పటేల్
    10 - శిఖర్ ధావన్
    10 - గౌతమ్ గంభీర్
    9 - డేవిడ్ వార్నర్
     

  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌న స్ట్రైక్‌రేట్‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు క్లాసెన్ గ‌ట్టిగానే బ‌దులిచ్చాడు. త‌న ప‌ని బ్యాటింగ్ చేయ‌డం మాత్ర‌మేన‌ని, స్ట్రైక్‌రేట్ ఇత‌ర విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్‌రేట్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఐపీఎల్‌ 2026 సీజ‌న్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 283 ప‌రుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో ఉండ‌డం కొస‌మెరుపు. 

    ఈ నేప‌థ్యంలోనే సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయ‌డ‌మే. ఆ బాధ్య‌త‌లు స‌క్ర‌మంగా నిర్వ‌ ర్తిస్తున్నా. అయితే ఈ సీజ‌న్‌లో నా స్ట్రైక్‌రేట్ విష‌యంలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్‌తో జ‌ట్టుకు ఎంత ఉప‌యోగ‌పడుతున్నాన‌నేదే నాకు ముఖ్యం. స్ట్రైక్‌రేట్‌పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే ప‌రుగుల వ‌స్తాయి. 

    అంతేకానీ కేవ‌లం స్ట్రైక్‌రేట్‌పైనే దృష్టి సారిస్తే ప‌రుగులు చేయ‌డం సంగ‌తి అటుంచితే జ‌ట్టుకు న‌ష్టం చేకూరుతుంది. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆడుతానే త‌ప్ప ప్ర‌తీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే క‌ష్ట‌మే. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బాధ్య‌త‌గా ఆడాలి. ఆ ప‌నిని నేను స‌రిగ్గానే చేస్తున్నా. 

    అయినా నేను ఆడందే ఆరెంజ్‌క్యాప్‌ రేసులో టాప్‌లో ఉంటానా? ఇక కేప్‌టౌన్‌లోని ఐ జిమ్‌లో కండ్ల‌కు సంబంధించి నేను తీసుకున్న శిక్ష‌ణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా శిక్ష‌ణ తీసుకోవ‌డం చాలా ఉప‌యోగ‌ప‌డింది.' అని చెప్పుకొచ్చాడు. 

    సీజ‌న్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్‌ మూడో విజయాన్ని న‌మోదు చేస‌కుంది. శనివారం సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 10 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. అభిషేక్‌, క్లాసెన్‌లు అర్థ‌సెంచ‌రీల‌తో రాణించారు. 

    అనంత‌రం బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్‌కింగ్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్‌హెచ్ త‌న త‌ర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది.

    చదవండి: బుడ్డోడి వికెట్‌తో మిస్ట‌రీ స్పిన్న‌ర్‌ అరుదైన రికార్డు!

  • ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. శ‌నివారం (ఏప్రిల్ 18) చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్‌ది కీల‌క పాత్ర‌. త‌న 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచ‌రీతో ఆకట్టుకున్నాడు.

    34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.

    గతంలో 2021 సీజన్‌లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్‌డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌.. 168 పరుగులు సాధించాడు.

    ఐపీఎల్‌లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లు
    మైక్ హస్పీ
    డేవిడ్ వార్నర్‌
    కేఎల్ రాహుల్‌(రెండు సార్లు)
     

  • టీ20 క్రికెట్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మ‌రో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ వికెట్ తీయ‌డం ద్వారా ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ త‌న ఖాతాలో 200వ వికెట్ జ‌మ చేసుకున్నాడు. 

    కాగా టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 155 మ్యాచ్‌లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న రెండో భార‌త బౌల‌ర్‌గా వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేస‌ర్‌ అర్ష్‌దీప్ సింగ్ (151 మ్యాచ్‌లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తొలుత పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. 

    ఆ త‌ర్వాత కేకేఆర్‌కు మారిన ఈ మిస్ట‌రీ స్పిన్న‌ర్ అప్ప‌టి నుంచి అదే జ‌ట్టులో కొన‌సాగుతున్నాడు.  అయితే వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి ఈ సీజ‌న్‌లోనే గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ త‌ర‌ఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ త‌ర‌ఫున వంద వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా నిలిచాడు. 

    గ‌తంలో సునీల్ న‌రైన్‌, ఆండ్రీ ర‌సెల్‌లు ఈ ఘ‌న‌త సాధించారు. ఓవ‌రాల్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఐపీఎల్‌లో 89 మ్యాచ్‌ల్లో 105 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక టీమిండియా త‌ర‌ఫున వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు ప‌డ‌గొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు.

     చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్‌!

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై వేటు ప‌డ‌నుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వ‌ర్గాలు. సార‌థిగా టీమిండియాకు అద్భుత‌మైన విజ‌యాలు అందించిన సూర్య‌.. బ్యాట‌ర్‌గా మాత్రం అత‌డి ప్ర‌ద‌ర్శ‌న  రోజు రోజుకు దిగ‌జారుతోంది. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ కొన‌సాగిన సూర్య‌కుమార్.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక మాత్రం బ్యాటర్‌గా అతడు విఫలమవవుతున్నాడు.

    గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్య కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్‌పై పడుతున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. 

    లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకొని బోర్డు జట్టును సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సూర్య  స్ధానంలో మ‌రో ముంబై ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కెప్టెన్‌గా నియ‌మించేందుకు భార‌త క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టీ20ల్లో నంబర్ 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

    శ్రేయస్ అయ్యర్‌కు బంపరాఫర్‌!
    శ్రేయ‌స్ అయ్య‌ర్‌ ఇప్ప‌టివ‌ర‌కు జాతీయ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించన‌ప్ప‌టికి.. దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత‌డికి అనుభ‌వం ఉంది. శ్రేయ‌స్ ప్ర‌స్తుతం పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్‌-2024 సీజన్‌లో కేకేఆర్‌ను అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. 

    గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా శ్రేయ‌స్‌ డొమాస్టిక్ క్రికెట్‌లో కూడా ముంబై జట్టుకు ఎన్నో సంచలన విజయాలను అయ్యర్ అందించాడు. దీంతో అయ్య‌ర్‌కు జాతీయ జ‌ట్టును న‌డిపించే స‌త్తా కూడా ఉంద‌ని క్రికెట్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ప్ర‌స్తుత టీ20 సెటప్‌లో అత‌డు లేడు. కానీ అతడిని తిరిగి తీసుకొచ్చి నేరుగా కెప్టెన్సీ ఇచ్చే అవ‌కాశ‌ముందని బీసీసీఐ వ‌ర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి.

    అయ్య‌ర్ ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే జ‌ట్టులో మాత్ర‌మే భాగంగా ఉన్నాడు. అయితే శ్రేయ‌స్ పొట్టి క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. కాబ‌ట్టి అత‌డిని భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకున్న ఆశ్చ‌ర్య‌పోనక్క‌ర్లేదు.

  • IPL 2026 KKR vs RR Live updates: ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్‌ గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది.

    కేకేఆర్‌ విజయంలో రింకూ సింగ్‌(53 నాటౌట్‌), అనుకుల్‌ రాయ్‌(29 నాటౌట్‌) కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్‌,బర్గర్‌, బిష్ణోయ్‌, యశ్‌రాజ్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

    తీవ్ర ఉత్కంఠ
    కేకేఆర్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో  21 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్‌(37), అనుకుల్‌ రాయ్‌(19) ఉన్నారు.
    కేకేఆర్‌ స్కోరెంతంటే?
    16 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 116/6. కేకేఆర్‌ విజయానికి 24 బంతుల్లో 40 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్‌(26), అనుకుల్‌ రాయ్‌(13) ఉన్నారు.

    కేకేఆర్‌ ఆరో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రమణ్‌దీప్‌.. యశ్‌రాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 87/6
    కేకేఆర్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    70 పరుగుల వద్ద కేకేఆర్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పావెల్‌.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్‌ విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి. 11 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌: 74/5
    కేకేఆర్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 ప‌రుగులు చేసిన ర‌ఘువంశీ.. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వ‌చ్చాడు.

    కేకేఆర్‌ మూడో వికెట్‌ డౌన్‌
    37 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కామెరూన్‌ గ్రీన్‌.. రవి బిష్ణయ్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే(0) మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్‌
    రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

    చెలరేగిన కేకేఆర్‌ బౌలర్లు.. రాజస్తాన్‌ స్కోరెంతంటే?
    ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ(46) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జైశ్వాల్‌(39) రాణించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో కార్తీక్‌ త్యాగి, వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్‌ నరైన్‌ రెండు వికెట్లు సాధించాడు.

    ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు
    18 ఓవర్‌ వేసిన కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత రవీంద్ర జడేజా(9), షిమ్రాన్‌ హెట్‌మైర్‌(15), బిష్ణోయ్(0) ఔటయ్యాడు.

    రాజ‌స్తాన్ ఐదో వికెట్ డౌన్‌
    124 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన ఫెరీరా..  సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
    రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌
    117 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్తాన్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన రియాన్ ప‌రాగ్‌.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

    రాజస్తాన్‌ మూడో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. సునీల్‌ నరైన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 109/3

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    97 పరుగుల వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ధ్రువ్‌ జురుల్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
    81 పరుగుల వద్ద రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్‌ జురెల్‌ వచ్చాడు.

    6 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 63/0
    6 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), యశస్వి జైశ్వాల్‌(21) ఉన్నారు.

    3 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 20/0
    3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ వికెట్‌ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్‌ సూర్యవంశీ(11), యశస్వి జైశ్వాల్‌(9) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్‌మైర్‌, బ్రిజేష్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. కేకేఆర్‌ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తి

    ఇంపాక్ట్ సబ్‌లు: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ

    రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్

    ఇంపాక్ట్ స‌బ్స్‌: సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా

  • ఎస్‌ఆర్‌హెచ్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యావత్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు హాఫ్‌ సెంచరీలు చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా అభిషేక్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. 

    ఈ రికార్డుతో పాటు అభిషేక్‌ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్‌లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే.

    తాజాగా అభిషేక్‌ ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 18) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్‌ కెరీర్‌లో ఇది అత్యంత వేగవంతమైనది. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌ కారణంగానే సీఎస్‌కేపై సన్‌రైజర్స్‌ గెలుపొందింది.

    అభిషేక్‌ ఇచ్చిన మెరుపు ఆరంభం​ ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి పునాది వేసింది. అతను అర్ద సెంచరీ తర్వాత ఔటైనా క్లాసెన్‌ స్కోర్‌ను 200 మార్కు​ దగ్గరికి (194-9) తీసుకెళ్లాడు. అనంతరం ఛేదనలో సగం​ మ్యాచ్‌ వరకు గెలుపు దిశగా సాగిన సీఎస్‌కే, ఆతర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు చెలరేగడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి, 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

    ఎషాన్‌ మలింగ (4-0-29-3), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4-0-31-2), సాకిబ్‌ హుస్సేన్‌ (4-0-32-1), శివాంగ్‌ కుమార్‌ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కే గెలుపును అడ్డుకున్నారు.

    ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ చేసిన హాఫ్‌ సెంచరీకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (15). ఇదే ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ ఐపీఎల్‌లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్‌ (1120 బంతులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. 

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజులపాటు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్‌ ఆఫీస్‌లో వైఎస్ జగన్‌ ప్రజాదర్భార్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేయనున్నారు. 

  • ఒంటిమిట్ట: వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. గత అర్ధరాత్రి ఎస్సీ కులానికి చెందిన హర్షవర్ధన్ పై  మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. 10 మంది టీడీపీకి చెందిన నాయకులు దాడి చేసి హర్షవర్థన్‌ను తీవ్రంగా గాయపరిచారు. నోట్లో గుడ్డలు కుక్కి మరీ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు హర్షవర్థన్‌ పేర్కొన్నాడు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారన్నాడు. 

    ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్‌ను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు బంధువులు. దాడికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు బాధితులు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

    దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  అలా చేయకుంటే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అవసరమైతే రాస్తారోకో చేసేందుకైనా వెనుకాడమని హెచ్చరికలు పంపాయి. 

  • సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జల్లికట్టు పోటీలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఊర్ల ఓబనపల్లిలో టీడీపీ నేతల కనుసన్నల్లో పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోటీల పేరుతో మూగజీవాలను చిత్రవదకు గురిచేస్తున్నారు. ఈ సందర్బంగా పోటీలలో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీలలో పాల్గొన్న ఎద్దు వ్యవసాయ బావిలో పడి  మృతిచెందింది. అనంతరం క్రీడలో పాల్గొన్న పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

     

     

     

  • గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

    ‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?

    మావిగన్‌ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్‌ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. మావిగన్‌పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.

    అమరావతి అసాధ్యమనే మావిగన్‌ ప్రతిపాదన
    హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్‌ హోటల్‌ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? 

    అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. 

    ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్‌ రెడ్డి మావిగన్‌ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్‌ మీద బూతులతో ట్రోలింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్‌ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్‌ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు.

  • విజయవాడ: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్ష సమావేశం జరిగిందని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. అసెంబ్లీలో చట్టం చేసిన మొదటి వ్యక్తి వైఎస్‌ జగన్ అని తెలిపారు.

    ఓబీసీ రిజర్వేషన్ల కోసం వైసీపీ కట్టుబడి ఉందని జోగి రమేష్‌ తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని నిలదీశారు. ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఈరోజు మీటింగ్‌కు టీడీపీ నేతలు వచ్చుండేవారని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

    బీసీలను మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లను చేశారని జోగి రమేష్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా అవకాశం కల్పించారని అన్నారు. రాజ్యసభలో బలహీన వర్గాల వ్యక్తులను అడుగుపెట్టేలా చేశారని తెలిపారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. బీసీలు బలహీనులు కాదని, బలవంతులని నమ్మిన వ్యక్తి వైఎస్‌ జగన్ అని చెప్పారు.

  • సాక్షి, చిత్తూరు: చిత్తూరులో చిరుత పులి మృతి కలకలం రేపుతుంది. ముళ్లపొదల్లో ఇరుక్కొని చిరుతపులి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే ‍అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దాని కాలికి గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ముళ్లపొదల్లేనే ఇరుక్కొని చిరుత మృతిచెందిందా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

     

International

  • టెహ్రాన్‌: అమెరికా ప్రతినిధులు ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు సోమవారం (ఏప్రిల్‌ 20) సాయంత్రం వెళ్తున్నారని యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా ఇరాన్‌ మాత్రం కనీసం ఇస్లామాబాద్‌కు వెళ్తున్నామా? లేదా? అన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు.  

    ఇరాన్ ఇప్పటి వరకు పాకిస్థాన్‌కు చర్చల కోసం తమ టీమ్‌ను పంపే విషయంలో నిర్ణయం తీసుకోలేదని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. నౌకాదళ నిర్బంధం కొనసాగుతుండడంతో ఇస్లామాబాద్‌కు చర్చల బృందాన్ని పంపే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ తెలిపింది.  

    “ట్రంప్ ప్రకటించిన నౌకాదళ నిర్బంధం కొనసాగుతున్నంత వరకు ఎలాంటి చర్చలు ఉండవు అని ఇరాన్ టీమ్‌ స్పష్టం చేసింది” అని తస్నీమ్ ప్రతినిధి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో రెండో దఫా చర్చలు సోమవారం పాకిస్థాన్‌లో జరుగుతాయని మొదటి నుంచి చెబుతున్నారు.

    అమెరికా ప్రతినిధులు ఇప్పటికే ఇస్లామాబాద్ వెళ్తున్నారు. సోమవారం సాయంత్రంలోగా అక్కడికి చేరుకుంటారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే సీరియస్‌గా ఉన్నారు. ఈ రెండో దశ చర్చలు సఫలం కాకపోతే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్‌ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్‌ చెప్పారు. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్‌లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు.

  • అమెరికాలోని  అ‍క్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా థర్డ్‌ కంట్రీ ప్రోగ్రామ్‌ కింద లాటిన్‌ అమెరికా దేశాలకు చెందిన వలసదారులను ఆఫ్రికా దేశమైన కాంగోకు తరలించారు. దీనిపై మానవహక్కులు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

    వివాదాలకు కేరాఫ్ అడ్రసైన డొనాల్డ్‌ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే  చేసిన మెుదటి పని అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం. వీరు ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో ఉండేది లేదంటు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి అమెరికా నుంచి వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న లాటిన్ అమెరికా దేశస్థుల కోసం ట్రంప్ ప్రత్యేక ఒప్పందం చేసుకున్నారు.  

    ఇందులో భాగంగా 15 మంది వలసదారలతో  కూడిన మెుదటి బృందాన్ని కాంగో రాజధాని కిన్షాసాకు తరలించారు. అక్కడ హోటళ్లలో వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన ఖర్చులను అమెరికా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు. అయితే ఈ తరలింపును మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలే అంతర్యుద్ధం, మానవహక్కుల ఉల్లంఘన తరచుగా జరిగే దేశంలోకి వలసదారులను పంపడమేంటని ప్రశ్నిస్తున్నాయి. 

    తమ సొంత దేశం కాని, ఎప్పుడూ చూడని దేశానికి వలసదారులను పంపడం వల్ల వారి భద్రతకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే  రానున్న రోజుల్లో నెలకు సుమారు 50 మంది చొప్పున మరికొంత మందిని కాంగోకు పంపే అవకాశం ఉందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి.

    ఏమిటి ఒప్పందం 
    అమెరికాలోని లాటిన్ దేశాలకు చెందిన అక్రమ వలసదారులలో తమ స్వదేశాలకు తిరిగివేళ్లేందుకు కోర్టుల ద్వారా రక్షణ పొందిన వారిని తరలించడం కోసం ట్రంప్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కాంగోతో పాటు  ఆఫ్రికాలోని ఇతర దేశాలైన ఘనా, ఉగాండా, రువాండా, దక్షిణ సూడాన్ మరియు ఎస్వాతిని లతో కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకుంది.

    దీనిని "థర్డ్-కంట్రీ డిపోర్టేషన్ అగ్రిమెంట్" గా పిలుస్తారు. ఈ తరలింపులో భాగంగా వలసదారుల వసతికి, భోజనానికి మరియు ఇతర ఖర్చులకు అయ్యే ప్రతి పైసాను అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఆశ్రయం ఇచ్చే దేశాలకు ఎటువంటి ఖర్చు ఉండదు.

     

  • సనా: అమెరికాకు యెమెన్‌ హౌతీలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యూహాత్మక బాబ్ అల్-మండెబ్ జలసంధిని మూసివేస్తామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర దేశాలు.. శాంతికి అడ్డుగా ఉన్న చర్యలు, విధానాలను ఆపకపోతే తాము జలసంధిని మూసేస్తామని హెచ్చరించారు.

    శాంతికి ఆటంకం కలిగించే పనులను ఆపకపోతే ముఖ్యమైన సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు. విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వారు (ప్రాక్సీ ఫోర్సెస్) బాబ్ అల్-మండెబ్ నియంత్రణకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని తెలిపారు.

    హౌతి ఉప విదేశాంగ మంత్రి హుస్సేన్ అల్-ఎజ్జీ ఎక్స్‌లో ఈ మేరకు ఓ పోస్ట్‌ చేశారు. యెమెన్‌ ప్రభుత్వం ఆ జలసంధిని మూసేయాలని నిర్ణయిస్తే, ఎవరూ దాన్ని మళ్లీ తెరవలేరని తెలిపారు. అమెరికా, ఇతర దేశాలు వెంటనే తమ తీరును మార్చుకుని యెమెన్ ప్రజల హక్కులను గౌరవించాలని చెప్పారు.

    ప్రపంచానికి ఎంతో కీలకం

    • ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కాలువ దారిలో వెళ్లే నౌకలకు చాలా ముఖ్యమైన మార్గం బాబ్ అల్-మండెబ్ జలసంధి.

    • ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది. కేవలం 29 కిలోమీటర్ల వెడల్పు, రెండు చిన్న మార్గాల ద్వారానే నౌకలు వెళ్లాలి.

    • ఇది ప్రపంచంలో అత్యంత బిజీ సముద్ర మార్గాల్లో ఒకటి. చమురు, ఇంధనం వంటి వస్తువులు గల్ఫ్ నుంచి యూరప్, ఆసియా దేశాలకు ఇక్కడి ద్వారానే వెళ్తాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.

    • ఇతర దేశాల మద్దతుతో పనిచేసే గ్రూపులు ఈ మార్గాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ప్రపంచ భద్రతకు ముప్పు ఉంటుందని యెమెన్‌ సర్కారు వార్నింగ్‌ ఇచ్చింది.

    • ఎర్ర సముద్రంలో సమస్యలు వస్తే ప్రపంచ వాణిజ్యం, నౌకల రాకపోకలు నేరుగా ప్రభావితం అవుతాయి.

    • అమెరికా చర్యలకు ప్రతిగా ఇప్పటికే ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధిని మూసేసింది. 

    • బాబ్ అల్-మండెబ్ జలసంధి ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. సుయూజ్ కాలువ ద్వారా ఆసియా-యూరప్ మధ్య నేరుగా వాణిజ్యాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 10 శాతం ఈ మార్గం గుండా వెళ్తుంది. దీంతో దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ.

    • ఈ జలసంధి ఎర్ర సముద్రం దక్షిణ చివరలో ఉంది. యెమెన్ జిబౌటి, ఎరిట్రియా (ఆఫ్రికా ఖండం) మధ్యలో ఉంది.

    • గేట్‌ ఆఫ్‌ టియర్స్‌ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా నౌకా ప్రమాదాలు జరిగాయి.

    • సుయజ్ కాలువ (1869లో ప్రారంభం) తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఆసియా-యూరప్ వాణిజ్యం ఆఫ్రికా చుట్టూ తిరగకుండా నేరుగా ఈ మార్గం గుండా సాగుతుంది.

    • చమురు, గ్యాస్, వాణిజ్య సరుకులు సరఫరా అవుతాయి. ప్రపంచంలో మూడవ అత్యంత రద్దీగా ఉండే చమురు రవాణా మార్గం.

    ఈ నేపథ్యంలోనే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలు ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇది జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లకు పెద్ద దెబ్బ తగులుతుంది, అలాగే సుయేజ్ కాలువ ఆదాయం కూడా తగ్గిపోతుంది.

    ఆసియా–యూరప్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం ఇదే. చమురు రవాణాలో కీలక పాత్ర దీనిది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్ దేశాల భద్రత, ఆర్థిక వ్యవస్థలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి. బాబ్ అల్-మండెబ్ జలసంధి ఒక “లైఫ్‌లైన్” లాంటిది. ఇది మూసివేస్తే, ఆసియా-యూరప్ మధ్య వాణిజ్యం, చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది.


    భారత్‌కు ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

    • భారత్ దిగుమతి చేసే చమురు పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ఈ మార్గం మూసితే సరఫరా ఆలస్యం అవుతుంది.
    • మార్గంలో ఆటంకాలు ఎదురైతే రవాణా ఖర్చు పెరుగుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయి.
    • యూరప్, ఆఫ్రికా దేశాలతో భారత వాణిజ్యం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. దీన్ని మూస్తే సరుకు రవాణా దెబ్బతింటుంది.
    • నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. సమయం, ఖర్చు పెరుగుతుంది.
    • ఈ ప్రాంతంలో కాల్పులు, దాడులు ఉంటే భారత నౌకలు ప్రమాదంలో పడతాయి.
    • భారత సముద్ర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ మార్గాల్లో పనిచేస్తారు. వారి భద్రత సమస్యగా మారుతుంది.
       
  • వాషింగ్టన్‌: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. హార్మూజ్‌ విషయంలో కొనసాగుతున్న నిర్బంధం, పాకిస్థాన్‌లో ఇరాన్‌తో అమెరికా రెండో దశ చర్చలు వంటి అంశాలపై ఆయన ట్రూత్‌ సోషల్‌లో ప్రస్తావించారు. ఇరాన్‌ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. హార్మూజ్‌ విషయంలో ఇరాన్‌పై సెటైర్లు వేశారు. 

    ‘ఇరాన్ నిన్న హార్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని నిర్ణయించింది. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన. చాలావరకు ఫ్రాన్స్ నౌకపై, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చిన సరుకు నౌకను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. అది మంచిది కాదు, కదా?

    నా ప్రతినిధులు చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం అక్కడ ఉంటారు. ఇరాన్ ఇటీవల జలసంధిని మూసేస్తున్నామని ప్రకటించింది.. ఇది విచిత్రం.. ఎందుకంటే మా నిర్బంధం (బ్లాకేడ్) ఇప్పటికే దాన్ని మూసేసింది.

    వారు తెలియకుండానే మాకు సాయం చేస్తున్నారు, మూసిన మార్గంతో నష్టపోయేది వారే, రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతారు. అమెరికాకు ఏ నష్టమూ లేదు. నిజానికి, చాలా నౌకలు ఇప్పుడే అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు వెళ్తున్నాయి. మేము చాలా న్యాయమైన, సరైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. 

    ఇరాన్‌ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్‌లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. వారు త్వరగా దిగివస్తారు, సులభంగా దిగివస్తారు, వారు ఒప్పందాన్ని అంగీకరించకపోతే చేయాల్సిన పనిని చేయడమే నాకు గౌరవంగా ఉంటుంది. గత 47 సంవత్సరాలుగా ఇతర అధ్యక్షులు చేయలేని పని అదే. ఇరాన్ హత్యాకాండ ఆగాల్సిన సమయం వచ్చింది’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. 


     

  • ఇరాన్‌- అమెరికా మధ్య సీజ్‌ ఫైర్‌ ఒప్పందం మరో రెండు రోజుల్లో ఏప్రిల్‌ 21తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగేర్‌ గాలిభాప్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలలో ప్రాథమిక అంశాలలో చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. తుదిదశ చర్చలకు రెండు దేశాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయన్నారు.

    ఇటీవల అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సరైన సయోధ్య కుదరకపోవడంతో చర్చలు ఎటువంటి సానూకూల ఫలితాలు లేకుండానే ముగిశాయి. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్‌ఫైర్‌ ఒప్పందం ఈ నెల 21తో ముగుస్తోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మరో దపా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ స్పీకర్‌ తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నారు.

    మహ్మద్‌ గాలిఫ్‌ మాట్లాడుతూ " ప్రస్తుతం రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. తుదిదశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నాం. ఇరాన్‌ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది. అందుకే కాల్పుల విరమణకు అంగీకరించాం". అన్నారు. శత్రుదేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్‌పై రుద్దే ప్రయత్నం చేసింది. కానీ మేము వాటిని ఎదుర్కొన్నాం. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమే అని మహ్మద్‌ గాలిఫ్‌ అన్నారు.

    తదుపరి చర్చల మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్‌ వర్క్‌ రూపొందిస్తున్నామని ఇరాన్‌ ప్రతినిధులు ఈ అంశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందిస్తూ ‍ప్రస్తుతం రెండు దేశాల మధ్య చాలా మంచి సంభాషణలు జరుగుతున్నాయి.

    ట్రంప్‌ వ్యాఖ్యలు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అంశంపై మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగానే ఉన్నాయని, అయితే ఇరాన్ తమను "బ్లాక్‌మెయిల్" చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల దాడి మొదలుపెడతామని అంతకుముందు  ఆయన హెచ్చరించారు.


    ఇస్లామాబాద్ భేటీ

    ఏప్రిల్ 11న ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ , గాలిబాఫ్ నేతృత్వంలోని బృందం మధ్య చర్చలు జరిగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. అనంతరం మరోదఫా చర్చలు పాకిస్థాన్‌ వేదికగా రేపు ( సోమవారం) జరగనున్నట్లు సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది.

    మరోసారి టెన్షన్

    అయితే ఇరు దేశాల మధ్య సానూకూల వాతావరణం వచ్చినట్లే వచ్చి మరోసారి ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌ తొలుత హర్ముజ్‌పై విధిస్తున్న దిగ్భందం తీసివేస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఇరాన్ మరోసారి జలసంధిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలలో ఏం జరగనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

     

  • టెహ్రాన్‌: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్‌ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.

    ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

    మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్‌ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

    1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్‌ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్‌ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.

    ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్‌ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్‌ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.

    అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్‌ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

  • నిన్న (శనివారం) హర్ముజ్‌ జలసంధి దాటుతున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్‌ నావికా దళం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి సమయంలో ఆ నౌకకు సంబంధించిన ఆడియో టేప్‌ బయిటకు వచ్చింది. అందులో నౌక కెప్టెన్‌ ఇచ్చిన ఎమర్జెన్సీ సందేశం ఇప్పుడు వైరల్‌గా మారింది.

    పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం నుంచి ఇరాన్‌ హర్ముజ్‌ జలసంధిని దిగ్భందనం చేసింది.  ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు రవాణా సరఫరా స్తంభించిపోయింది. అయితే భారత్‌తో పాటు ఇతర మిత్ర దేశాలకు చెందిన కొన్ని నౌకలకు మాత్రం  జలసంధి గుండా ప్రయాణానికి ఇరాన్‌ అనుమతించింది. అయితే నిన్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకపైన ఇరాన్‌ నావిక దళ సిబ్బంది దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఎమర్జెన్సీ మేస్‌జ్ ఆడియో టేప్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.

    ఆ ఆడియోలో " సెపా నేవీ. సెపా నేవీ. ఇది సన్మార్ హెరాల్డ్ మోటార్ ట్యాంకర్. మీరు నాకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో నా పేరు రెండవది. మీరు ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. నన్ను వెనక్కి తిరగనివ్వండి" అని ఆ నౌకలోని వ్యక్తి అంటున్నట్లు సందేశం ఉంది. మరోవైపు భారత్‌ సైతం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్‌ రాయబారిని పిలిపింది ఈ విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్‌ ఇది వరకూ భారత్‌కు చెందిన నౌకలకు హర్ముజ్‌ గుండా వెళ్లడానికి అనుమతులిచ్చిందని ప్రస్తుతం సైతం ఆ సేవలను పునరుద్ధరించాలని కోరినట్లు సమాచారం.

    అయితే ప్రస్తుతం యుద్ధంపై మరోసారి ఆందోళన కర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా - ఇరాన్‌ చర్చలు పురోగమిస్తున్నాయనే తరుణంలో ట్రంప్‌ విద్వేశపూరిత వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ మెుదటికి వచ్చింది. హర్ముజ్‌ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్‌ ఒకరోజు తిరగకుండానే దానిని మూసివేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరిగే రెండోదఫా చర్చలలో ఏం జరగనుందా అని సర్వత్రా టెన్షన్‌ నెలకొంది.


    ఏం జరిగింది?

    శనివారం హార్మూజ్ జలసంధిని దాటే ప్రయత్నంలో దాదాపు రెండు వాణిజ్య నౌకలపై తుపాకీతో కాల్పులు జరిగాయని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఈ సమాచారం సముద్ర భద్రత సిబ్బంది, షిప్పింగ్ వర్గాల నుంచి అందిందని పేర్కొంది. ఈ కాల్పుల ఘటన ఒమాన్‌కు ఈశాన్య దిశగా 20 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిందని యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ట్యాంకర్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కూడా పేర్కొంది.

    షిప్పింగ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ నౌకాదళం నుంచి రేడియో సందేశం అందింది. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేసినట్లు ప్రకటించారు. ఎలాంటి నౌకలు దాటడానికి అనుమతి లేదని తెలిపారు. ఇది ఇరాన్ ముందుగా వాణిజ్య నౌకలకు జలసంధిని తెరిచి ఉంచుతామని చెప్పిన ప్రకటనకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం. అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్‌ నుంచి స్పష్టత కోరుతున్నాయి.

    కాగా, తమకు సంబంధించిన నౌకలపై ప్రయాణ స్వేచ్ఛను అమెరికా పునరుద్ధరించే వరకు హర్మూజ్ జలసంధిలో పరిస్థితి కఠిన నియంత్రణలో ఉంటుందని ఇరాన్‌ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదిరే వరకు అమెరికా నౌకాదళ నిర్బంధం పూర్తిగా కొనసాగుతుందని తెలిపారు.

  • న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్‌ గన్‌ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్‌లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్‌ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్‌ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

    భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. 

    ప్రస్తుతం భారత్‌కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్‌ఎన్‌జీ నిల్వలు, 40 రోజుల ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.

    ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్‌ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్‌కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

  • బెర్గామో ప్రావిన్స్‌: ఇటలీలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు భారతీయుల మృతి చెందారు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో ప్రాంతంలో వైశాఖీ పండుగ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రార్థనా స్థలం(గురుద్వారా) నుండి బయటకు వస్తుండగా ఇద్దరు భారతీయ వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రికి ఈ ఘటన చోటుచేసుకుంది.

    పారిశ్రామిక ప్రాంతంలోని గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ ముందున్న చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతులను కోవో నివాసి రగిందర్ సింగ్ (48), అగ్నాడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ (48)గా గుర్తించారు. సంఘటనా స్థలంలో సుమారు 10 బుల్లెట్ కేసింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఈ కాల్పులకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయుడేనని అతను కూడా తరచుగా ఆ గురుద్వారాకు వస్తుంటాడని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ కాల్పుల్లో మరో మూడో వ్యక్తికి కూడా బుల్లెట్లు తగిలి గాయపడినట్లు సమాచారం.

     

Movies

  • సినిమా, రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధముంది. నటీనటులుగా రాణించిన వాళ్లు చాలామంది ప్రస్తుతం పాలిటిక్స్‪లోనూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా నటిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైంది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరామె? ఏంటా సినిమా?

    (ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ట్రాన్స్‌జెండర్ తమన్నా)

    గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా చేస్తున్న ఆనందీ బెన్ పటేల్ మనవరాలు సంస్కృతి జయానా నటిగా పరచయమవుతోంది. మే 7న తెలుగులోనూ రిలీజ్ కాబోతున్న 'కృష్ణావతారం పార్ట్ 1'లో శ్రీ కృష్ణుని ప్రియురాలు సత్యభామ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా, రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసిని కృష్ణన్ నటించారు. ఈ మూవీ మొత్తం సత్యభామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఉండనుంది.

    ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంస్కృతి జయానా.. ఇప్పటికే పారిశ్రామికవేత్తగా రాణిస్తోంది. లండన్, అమెరికాలోని ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ చేసిన ఈమె.. 16 ఏళ్ల వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. మరి ఇప్పుడు సత్యభామ పాత్రలో నటిగా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: యుద్ధాన్ని ముందే అంచనా వేసిన ధనుష్ సినిమా)

  • ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతోంది. పెట్రోలు ఉత్పత్తి అయ్యే చోట్ల ఇరాన్ దాడులు చేయడం లాంటివి చూశాం. ఈ అంశాన్ని ఓ పాయింట్‌గా చూపించి తీసిన సినిమా 'కర'. ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంటూ మూవీపై అంచనాల్ని పెంచేస్తోంది.

    (ఇదీ చదవండి: '‍పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)

    ట్రైలర్ బట్టి చూస్తే పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఓ పల్లెటూరిలో ఉండే హీరో.. బ్యాంకు దొంగతనాలు చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో వాటిని ఆపేసి పెళ్లి చేసుకుని సాధారణంగా బతుకుతుంటాడు. అలాంటి ఇతడు మళ్లీ ఎందుకు దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇతడిని అడ్డుకునేందుకు పోలీస్(సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.

    గతంలో 'పొర్ తొళిల్' అనే థ్రిల్లర్ తీసి అద్భుతమైన హిట్ కొట్టిన విఘ్నేశ్ రాజా.. ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ఇది థియేటర్లలోకి రానుంది. ఆ తేదీకి రావాల్సిన 'పెద్ది' వాయిదా పడింది. మరి ధనుష్ 'కర'తో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి? ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగుది కూడా వదులుతారు.

    (ఇదీ చదవండి: షాకింగ్.. తల్లి కాబోతున్న 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా)

  • కొడుకు బర్త్ డే వేడుకల్లో భర్తతో కాజల్ ఇలా

    మెరిసిపోతున్న జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా

    'పల్లి చట్టంబి' షూటింగ్ జ్ఞాపకాలతో కాయదు

    స్విట్జర్లాండ్ ట్రిప్ వేసిన జాన్వీ కపూర్

    బీచ్ వెకేషన్ ఎంజాయ్‌లో మానుషి చిల్లర్

    చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ మెహ్రీన్

  • తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వరస షాకులిస్తోంది. చాన్నాళ్లుగా పెద్దగా బయట కనిపించని ఈమె.. 20 రోజల క్రితం తనకు పెళ్లయి ఏడాది పూర్తయిందని చెబుతూ భర్త ఫొటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటో చేసింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా.. భర్త ఎవరంటే?)

    విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్‌ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. రెండు వారాలే ఈ షోలో ఉన్నప్పటికీ తోటి కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖితో స్నేహం కుదిరింది. షో అయిపోయి దాదాపు ఆరేళ్లు అవుతున్నా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో తమన్నా ఒకరు.

    అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. ఈమె నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గాలో మొక్కుకున్నారు. అమ్మాయి లక్షణాలతో ఉన్న అబ్బాయి పుట్టాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబై వెళ్లి లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని తమన్నా సింహాద్రిగా మారింది.

    ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అలా 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో, 2024లో పవన్ కల్యాణ్‌పై పిఠాపురంలో పోటీగా నిలబడింది. కానీ ఓడిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నానని, స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అని చెప్పేసరికి అసలు ఇది ఎలా సాధ్యం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: '‍పెద్ది' ఐటమ్ కోసం ఊహించని హీరోయిన్?)

  • టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ప్రముఖ సినీ ఎడిటర్‌ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న 'అగ్ని నక్షత్రం' లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి.

    కేవలం ఫీచర్ ఫిలిమ్స్‌కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు మామూలు కష్టాలు లేవు. మార్చి, ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటే రెండుసార్లు వాయిదా పడింది. జూన్‌లో కచ్చితంగా వస్తుందని నిర్మాత ప్రకటించారు కానీ తేదీ ఎప్పుడు అనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 'పెద్ది'తో కాలు కదిపేందుకు ఐటమ్ సాంగ్ హీరోయిన్ దొరకట్లేదు. మృణాల్, మానస అని పలువురు బ్యూటీస్ పేర్లు గతంలో వినిపించగా ఇప్పుడు ఊహించని భామ పేరు తెరపైకి వచ్చింది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)

    మలయాళ భామ సంయుక్తని ప్రస్తుతం 'పెద్ది' ఐటమ్ కోసం పరిశీలిస్తున్నారట. ఈమె అయినా ఫిక్సవుతుందా లేదా అనేది పక్కనబెడితే సంయుక్త పేరు మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. కెరీర్ ప్రారంభం నుంచి పెద్దగా గ్లామర్ చూపించని ఈమె.. గత చిత్రం 'అఖండ 2'లో జాజికాయ అంటూ సాగే పాటలో మాత్రం అందాలన్ని ఆరబోసింది. అటు డ్యాన్స్, ఇటు అందంతో ఆకట్టుకుంది. బహుశా ఆ సాంగ్ చూసి 'పెద్ది' కోసం అడిగారేమో అనిపిస్తుంది.

    సంయుక్త హీరోయిన్‌గా చేసిన 'స్వయంభు'.. పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'బ్లాక్ గోల్డ్' అనే లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ చేస్తోంది. విజయ్ సేతుపతితో చేసిన 'స్లమ్ డాగ్' కూడా రిలీజ్ కావాల్సి ఉంది. హిందీ, తమిళ, మలయాళంలో తలో చిత్రం చేస్తోంది.

    భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష, నారీ నారీ నడుమ మురారీ తదితర చిత్రాలతో సక్సెస్‌లు అందుకున్న సంయుక్త.. 'పెద్ది'లో ఐటమ్ సాంగ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది.

    (ఇదీ చదవండి: లెజెండరీ డైరెక్టర్ ఇలా అయిపోయారేంటి? వైరల్ వీడియో)

  • హాలీవుడ్‌ ప్రముఖ ర్యాపర్ ఐస్ స్పైస్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజిల్స్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో ఆమెపై ఓ అభిమాని భౌతిక దాడికి పాల్పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

    హాలీవుడ్‌ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.., ఐస్ స్పైస్ తన స్నేహితురాలితో కలిసి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్లింది. అక్కడికి ఓ యువతి వచ్చి.. అభిమానిని అని మాట్లాడడం ప్రారంభించిది. మొదట సాధారణంగానే అనిపించినప్పటికీ, ఆ అభిమాని అతిగా ప్రవర్తిస్తూ ఐస్ స్పైస్‌ను అసౌకర్యానికి గురిచేసింది. దీంతో ఐస్ స్పైస్, ఆమె స్నేహితురాలు సదరు యువతిని తమ టేబుల్ వద్ద నుండి వెళ్ళిపోవాలని కోరారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన ఆ అభిమాని ఒక్కసారిగా ఐస్ స్పైస్ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి గందరగోళంగా మారింది.

    చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఆ అభిమానిని ఆమె స్నేహితుడు బయటకు లాక్కెళ్తుండగా, ఐస్ స్పైస్ వారిని వెంబడించింది. రెస్టారెంట్‌లోని బల్లలపై  దూకుతూ వెళ్లి ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించింది. రెస్టారెంట్‌ డోర్‌ ముందు కూడా కాసేపు వాగ్వాదం జరిగింది. కోపంలో కింద పడిపోయిన ఒక ఫోన్‌ను ఐస్ స్పైస్ పగలగొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, అవి నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ఈ దాడి అకారణంగా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఐస్‌ స్పైస్‌ న్యాయవాది తెలిపారు. అయితే సదరు యువతి మాత్రం.. తన తప్పు ఏమి లేదన్నారు. అభిమానిగా కలిసేందుకు వెళ్తే.. ఐస్ స్పైస్ తనతో అమర్యాదగా ప్రవర్తించి, అభ్యంతరకర భాష వాడటం వల్లే తాను చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
     

  • తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నారు. నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేర్చగా తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని ఒకప్పటి హీరోయిన్ రాధిక వెళ్లి పరామర్శించింది. భావోద్వేగానికి గురవుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

    రాధిక రీసెంట్‌గా లీడ్ రోల్ చేసిన 'తాయ్ కిళవి' సినిమాని భారతీ రాజా చూశారు. దీని గురించి రాధిక ఆయన మధ్య చర్చ కూడా జరిగింది. సినిమా చూశారా అని రాధిక అడగ్గా.. చూశానని చెప్పిన భారతీరాజా, ఈ చిత్రానికి మీకు జాతీయ అవార్డ్ అందుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన రాధిక.. అదే జరిగితే, ఆ అవార్డుని మీ పాదాల దగ్గర అర్పిస్తానని స్పందించింది.

    ఇన్ స్టాలో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోని పోస్ట్ చేసిన రాధిక.. ఆయన ఆశీర్వాదం, అవార్డు కంటే గొప్పది. ఆయనని ఈ స్థితిలో చూస్తాననుకోలేదు. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమే ఆయనని ముందుకు నడిపిస్తోంది అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన చాలామంది.. ఎలా ఉండే భారతీరాజా ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఈయన చివరగా గతేడాది రిలీజైన 'దేశియా తలైవర్' సినిమాలో నటించారు.

    (ఇదీ చదవండి: బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్: అనన్య నాగళ్ల)

  • రీసెంట్ టైంలో ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో యాంకర్ విష్ణుప్రియ లాంటి వాళ్లు లక్షలు సంపాదిస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఇందులో భాగంగా రూ.399 కడితే అర్థ నగ్న వీడియోలు పోస్ట్ చేస్తుందనే ఆరోపణలతో ఈమెపై విజయవాడలో కేసు కూడా పెట్టారు. ఈ ఫిర్యాదు మాటేమో గానీ ఈ వివాదం జరగక ముందు విష్ణుప్రియకు ఉన్న సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగారు. ఈమె సంగతి పక్కనబెట్టి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లపై పడ్డారు.

    (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

    వకీల్‌సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ పేరిట లక్షల సంపాదించేస్తుందని విష్ణుప్రియని వదిలేసి ఈమెపై పడ్డారు. దీంతో తప్పక ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను ఈ సబ్‌స్క్రిప్షన్‌ని మొదలుపెట్టింది అంతా ఓ కమ్యూనిటీలా కలిసి ఉండేందుకే అని చెప్పుకొచ్చింది.

    అలానే తన దినచర్యలో చేసే వాటి గురించి చెప్పేందుకే ఈ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టానని చెబుతూ.. గతేడాది ఏప్రిల్ 7వ తేదీన పోస్ట్ చేసిన వీడియోని ఇప్పుడు షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య.. ఓం నమః శివాయ మంత్రాన్ని 21 రోజులు 108 సార్లు చదివితే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతూ కనిపించింది.

    అలా 2025లోనే సబ్‌స్క్రిప్షన్‌ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ అనన్య క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని, అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ద్వారా తను సబ్‌స్క్రిప్షన్‌లో గ్లామరస్ ఫొటోలు గానీ, బూతు కంటెంట్ గానీ పోస్ట్ చేయట్లేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడైనా ఈమెపై విమర్శలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ)

  • ఆ యువకుడి తండ్రి ఓ స్టార్‌ హీరో. కోట్ల ఆస్తి ఉంది. సినిమాల్లోకి వస్తానంటే.. దర్శకనిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. కానీ ఇవన్నీ వదులుకోని ఓ సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకు అరవ్‌ భాటియా. 

    24 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడు.. అనుకుంటే ఈ పాటికే హీరో అయిపోయేవాడు. కానీ నటన అంటే ఆయనకు ఇష్టం లేదు. ఫ్యాషన్‌ రంగంలో రాణించాలనేది ఆయన కల. అందుకే ప్రస్తుతం ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అక్షయ్‌ కుమార్‌ వెల్లడించారు.

    ‘అరవ్‌కి పని చేయడం ఇష్టం. సినిమా రంగంలోకి రావాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి అతనికి ఎలాంటి ప్లాన్స్‌ లేవు కానీ ఫ్యాషన్‌ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ ఫీల్డ్‌లో రూ. 4500 జీతానికి పని చేస్తున్నాడు. గ్రామాలు తిరుగుతూ ఫ్యాషన్‌పై అధ్యయనం చేస్తున్నాడు. హీరో కొడుకునని ఎక్కడ చెప్పుకోడు. నేను కూడా వాడిని సినిమాల్లోకి రావాలని ఫోర్స్‌ చేయను. తనకు నచ్చిన పని చేసుకోమని చెబుతాను. తండ్రిగా వాడికి ఎలాంటి క్లాసులు తీసుకోని కానీ.. ‘ఎవరికీ హానీ చేయొద్దు.. బాధ పెట్టొద్దు’ అని మాత్రం చెబుతాను’ అని అక్షయ్‌ చెప్పుకొచ్చాడు.

  • విరాట్‌ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్‌ ప్రధానపాత్రల్లో వస్తోన్న మూవీ నాగబంధం. ఈ మూవీకి అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌తో పాటు టీజర్‌ కూడా చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై కిషోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. సుర సుర అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ, నల్గొండ గద్దర్‌, అనురాగ్‌ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సాహితి చాగంటి ఆలపించారు. ఈ పాటను జునైద్‌ కుమార్‌, అభే కంపోజ్ చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.

     

  • సీనీ తారల్లో చాలా మంది తమ సంపాదనను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెడుతున్నారు. స్టార్‌ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు విలాసవంతమైన భవనాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత మంచి ధర వస్తే..వాటిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మరో చోట పెట్టుబడి పెడుతున్నారు. తాజాగా సీనియర్‌ నటి టబు కూడా ముంబైలో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. ముంబైలోని వెర్సోవా ఏరియాలో ఉన్న ఆ అపార్ట్‌మెంట్‌ విలువ దాదాపు రూ. 10.40 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. కేవలం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసమే టబు రూ. 60 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందంట.  

    ఆ అపార్ట్‌మెంట్‌ సముద్ర తీరానికి సమీపంలోనే ఉండడమే కాదు.. నగరం మొత్తం అందంగా కనిపించేలా  ఉంటుందట.  ఆ వెంచర్‌లో మొత్తం 2 టవర్స్‌ ఉన్నాయట. ఒక్కో టవర్‌ 24 అంతస్తులు ఉంటుంది. మొత్తం 126 నివాసాలు ఉండగా..అందులో ఒకటి టబు కొనుగోలు చేసింది. జిమ్‌, స్వీమ్మింగ్‌ పూల్‌తో పాటు రెండు కార్లు పార్కింగ్‌ చేసుకునేలా పార్కింగ్‌ స్తలం వచ్చిందట. ముంబైలో టబుకి ఇప్పటికే ఓ ఫ్లాట్‌ ఉంది. ఇది రెండోది. హైదరాబాద్‌లో కూడా టబుకి సొంతిల్లు ఉంది.

    టబు సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బూత్‌ బంగ్లా’ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే విజ‌య్ సేతు ప‌తి క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `స్ల‌మ్ డాగ్ 33 టెంపుల్ రోడ్` లో న‌టిస్తోంది.

Telangana

  • హైదరాబాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లిలో  ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐడీఎల్‌ చెరువులో దూకేసింది ఓ డిప్లొమో విద్యార్థిని.  వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆమె చెరువులో దూకినట్లు సమాచారం. కేపీహెచ్‌బీ ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటోంది 20 ఏళ్ల విద్యార్థిని. 

    అయితే వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఆమె.. ఐడీఎల్‌లో చెరువులో దూకేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెరువు మధ్యలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయిన ఆ విద్యార్థిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. 

  • వికారాబాద్‌: జిల్లాలోని కుల్కచర్లలో డ్రోన్‌ ట్రయల్‌రన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. డ్రోన్‌ ఎగరేసే సమయంలో అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కాలికి గాయమైంది. డ్రోన్‌ రెక్కలు తెగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్  కాలుకు , రాంపూర్ సర్పంచు తిరుపతయ్యకు చేతికి గాయాలయ్యాయి. 

    ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ట్రాయల్ రన్ చేస్తుండగా ఒక్కసారిగా డ్రోన్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. నేరుగా ఎమ్మెల్యే మీదకి వచ్చేసింది డ్రోన్‌. దాంతో ఎమ్మెల్యే కాలికి డ్రోన్ రెక్కలు తగలగా, మరొకరికి చేతి బ్రొటన వేలు తెగిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి కాలికి తీవ్ర రక్తగాయమైనట్లు సమాచారం.

    సబ్సిడీపై పంట పొలాలకు మందులు పిచికారి చేసే డ్రోన్‌ను నిరుద్యోగ యువకుడు తెచ్చుకున్నాడు. ఆ డ్రోన్‌ను ప్రారంభించడానికి వెళ్లారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.  డ్రోన్‌ ఆపరేటింగ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. 

     


     

  • నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌  రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వాన కురిసింది.  నిజామాబాద్‌లో పలు చోట్ల గంట పాటు వడగండ్ల వాన కురిసింది. 

    నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోట్ , చిన్న వాల్గోట్, భీం గల్‌లో వడగండ్ల వానతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది.  అకాల వర్షంతో అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

    ఇక హైదరాబాద్‌లో పలు చోట్ల వడగండ్ల వాన పడింది.  ప్రధానంగా సుచిత్రా సర్కిల్‌, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.  సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అ‍ల్వాల్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, చందానగర్‌, చింతల్‌, సూరారం, దుండిగల్‌లో కూడా వడగండ్ల కురిసింది.  భారీ వర్షానికి కొన్ని చోట్ల వడగండ్లు ఇంట్లోకి సైతం వచ్చి పడ్డాయి. 

     

    వాతావరణ మార్పులతో తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు పడతాయని ముందుగానే అధికారులు హెచ్చరించారు. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారుల ప్రకటన బట్టి తెలుస్తోంది. 

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. 

    సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

    రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...
    సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్‌ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేత బీఆర్‌ఎస్‌లో చేరిక ఆ పార్టీకి మోరల్‌ బూస్ట్, కాంగ్రెస్‌కు పరీక్షగా మారనుంది. 

    ఒక్కటవుతున్న ప్రత్యర్థులు
    తెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్‌.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్‌ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్‌లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్‌ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్‌ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్‌ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.

    ఆసక్తికరంగా సీఎం పర్యటన
    ఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్‌ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్‌ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్‌ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్‌ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్‌ఎస్‌పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. 

National

  • జమ్ముకశ్మీర్‌: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టువద్ద షాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్నారనే నెపంతో ఒక అమెరికా దేశస్థునితో పాటు కోల్‌కతాకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారణ నిమిత్తం కస్టడీకి తరలించారు.

    పోలీసుల విచారణలో శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్న వారిలో ఒకరు అమెరికాకు చెందిన జేప్రీ స్కాట్‌ ప్రాథర్‌గా గుర్తించారు. మరోకరు కోల్‌కతా నివాసైన హల్దార్‌ కౌశిక్‌గా తెలిపారు. జమ్మూకశ్మీర్‌ ప్రాంతం పాకిస్థాన్‌కు సరిహద్దుల్లో ఉండడం ఉగ్రవాద ముప్పు పొంచి ఉండడంతో భద్రతా బలగాలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నాయి. దానిని ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    శాటిలైట్‌ ఫోన్ అంటే ఏమిటి?

    మనం సాధారణంగా వాడే మెుబైల్‌ఫోన్ సిగ్నల్స్  భూమిపై ఉండే సెల్ టవర్ల (సెల్ టవర్స్) మీద ఆధారపడతాయి. ఒకవేళ మీరు టవర్లు లేని అడవిలోనో లేదా సముద్రం మధ్యలోనో ఉంటే సాధారణ ఫోన్‌లకు సిగ్నల్ రాదు. కానీ, శాటిలైట్ ఫోన్ నేరుగా ఆకాశంలోని ఉపగ్రహంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది కనుక దీనికి ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా కాల్స్ మాట్లాడుకోవచ్చు. సాధారణంగా మిలిటరీ యుద్ధ సమయాల్లో లేదా మారుమూల ప్రాంతాల సమాచార మార్పిడి కోసం దీనిని ఉపయోగిస్తారు. పర్వతారోహకులు ఎవరెస్ట్ వంటి శిఖరాలు అధిరోహించేటప్పుడు లేదా దట్టమైన అడవుల్లోకి వెళ్ళినప్పుడు దీనిని అధికంగా వాడుతుంటారు.

    ఎందుకు నిషేదం

    అయితే వీటిని ట్రాక్‌ చేయడం చాలా కష్టమైన పని కనుక భారత్‌లో వీటి వాడకంపై నిషేదం విధించారు.  ఒకవేళ ఎవరైనా దానిని వాడాలంటే టెలికాం డిపార్ట్‌మెంట్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విదేశీయులు దానిని తీసుకరావాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

     

  • కోల్‌కతా: బెంగాల్‌ సీఎం ‍మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్‌లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‍ఆదివారం బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. 

    బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్‌ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్‌ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్‌ బ్రాండ్‌ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్‌సభలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. 

    దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని  దేశ మహిళలకు  ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని  బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది

  • చెన్నై: తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. విరుధునగర్ జిల్లా కట్టనార్‌పట్టి ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వనజ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

    పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. కర్మాగారంలోని నాలుగు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.

    సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మొదట నలుగురు మరణించినట్లు సమాచారం వచ్చినా, కొద్ది సమయంలోనే మరణాల సంఖ్య భారీగా పెరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Politics

  • రాజమహేంద్రవరం:  టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు.  బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుచ్చయ్యకు వయసు అయిపోయి ఏదో మాట్లాడుతున్నారన్నారు. బుచ్చయ్య ఇప్పుడు కేబినెట్‌లో ప్లేస్‌కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. హింసా రాజకీయాలు అంటూ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలకు వేణుగోపాల్‌ కృష్ణ కౌంటరిచ్చారు. ఎవరివి హింసా రాజకీయాలు అందరికీ తెలుసని చురకలంటించారు.

    చంద్రబాబు వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందడమే రాధాకృష్ణ లక్ష్యమని, రాధాకృష్ణ బ్రోకర్‌గా  మారిపోయారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జర్నలిజం విలువ కోల్పోయేటట్లుగా రాధాకృష్ణ రాతలు ఉన్నాయన్నారు.  ఏపీ ప్రజలకు రాధాకృష్ణతోనే హాని ఉందన్నారు మాజీ మంత్రి వేణు.

    మీ పాత కథలు ఒక్కసారి గుర్తుచేసుకోండి
    బుచ్చయ్య చౌదరికి వయసు పెరిగే కొద్దీ మతిస్థిమితం లేకుండా పోతుందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా., ఆయన భాషా చాలా దారుణంగా ఉందని, మానసిక వైద్యులకు చూపించుకుంటే మంచిదని సూచించారు. హత్యా రాజకీయాలకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని, గడిచిన రెండేళ్లలో ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఘోరం జరుగుతూనే ఉందన్నారు. ఇసుక సరఫరాకు  ఎక్కడకక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, బుచ్చయ్య చౌదరి పాత కథలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు జక్కంపూడి రాజా.

  • కోల్‌కతా:  ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్‌ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని,  కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 

    ఆదివారం(ఏప్రిల్‌ 19వ తేదీ)  హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. 

    మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు.  తాము మహిళా రిజర్వేషన్‌ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్‌ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్‌ అంశం మోదీ పొలిటికల్‌ అజెండాగా మమతా అభివర్ణించారు.

    శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా  ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. 

    ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్‌ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. 

Business

  • అంతర్జాతీయ మార్కెట్‌లో అల్యూమినియం ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో గత నాలుగేళ్ల గరిష్ట స్థాయిని తాకడమే కాకుండా, భారత మార్కెట్‌లో కూడా అల్యూమినియం ధర కేజీకి రూ.375 వద్ద ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించింది. 2026లో గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో బెస్ట్ పెర్ఫార్మర్‌గా అల్యూమినియం నిలుస్తోంది. దీంతో తక్కువ ధరలో ఉన్నప్పుడు అల్యూమినియంపై పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు అదృష్టవంతులని చెప్పవచ్చు.

    ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
    » నిర్మాణ, ఆటోమొబైల్ రంగాల డిమాండ్: ఇళ్లు, వాహనాలు మరియు ప్యాకేజింగ్ పరిశ్రమల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం.
    » ఇంధన ధరల ప్రభావం: అల్యూమినియం తయారీకి భారీగా విద్యుత్ అవసరం. చమురు ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారమై, ఆ భారం వినియోగదారుడిపై పడుతోంది.
    » సరఫరా లోటు: పర్యావరణ నిబంధనల వల్ల ఉత్పత్తి తగ్గడం, మరోవైపు గోదాముల్లో నిల్వలు అడుగంటడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

    భౌగోళిక రాజకీయాల ఎఫెక్ట్
    మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. యుద్ధ భయాల వల్ల షిప్పింగ్ మార్గాల్లో అంతరాయం కలగడం, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా లోహాల వైపు మొగ్గు చూపడంతో 'రిస్క్ ప్రీమియం' పెరిగి ధరలను పైకి నెట్టాయి.

    చైనా, అమెరికా వ్యూహాత్మక డిమాండ్
    ప్రపంచ అల్యూమినియం వినియోగంలో సగానికి పైగా వాటా కలిగిన చైనా, తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భారీగా కొనుగోళ్లు చేస్తోంది. మరోవైపు రక్షణ రంగం, ఆయుధాల తయారీ కోసం అమెరికా తన సైనిక అవసరాలకు అల్యూమినియంను పెద్ద ఎత్తున సేకరిస్తోంది.

    మరింత పెరుగుతాయా?
    ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ఏడాది పొడవునా అల్యూమినియం ధరలు బుల్లిష్‌గానే (పెరుగుదల ధోరణి) ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరఫరా మెరుగుపడకపోయినా లేదా చైనా ఆర్థిక వ్యవస్థ మందగించకపోయినా, ధరలు మరింత కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: బంగారం ధరలు.. వారంలో రూ.3 వేలు..

  • ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) మరింత పెరగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. బ్యాంకుల్లో రుణ రేట్లు తక్కువగా ఉండడమే కారణమని పేర్కొంది.

    ఎన్‌బీఎఫ్‌సీ నిధుల సమీకరణలో బ్యాంకుల వాటా 2026 మార్చి నాటికి 43 శాతానికి చేరిందని, 2027 మార్చి నాటికి 45 శాతానికి పెరగొచ్చని తెలిపింది. 2025–26 మొదటి ఆరు నెల్లలో క్యాపిటల్‌ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లపై నిధుల సమీకరణకు ఎన్‌బీఎఫ్‌సీలు మొగ్గు చూపించగా, తదుపరి ఆరు నెలల్లో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంకుల వైపు మొగ్గు చూపించినట్టు వివరించింది.

    ‘‘బ్యాంకు రుణ రేట్లు గత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మాత్రం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తగ్గగా, తర్వాతి కాలంలో మళ్లీ పెరగడం మొదలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కరెన్సీ మారకం విలువల్లో అనిశ్చితుల ఫలితంగా ఎక్స్‌టర్నల్‌ కమర్షియల్‌ బారోయింగ్‌ (ఈసీబీ) జారీ వాటా కూడా సమీప కాలంలో స్దబ్దుగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణకు సెక్యూరిటైజేషన్‌ (చెల్లింపుల్లేని రుణాలను విక్రయించడం) కొంత మద్దతునివ్వొచ్చు. స్థూల ఆర్థిక అనిశి్చతుల నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు), కార్పొరేట్‌ బాండ్‌ ఈల్డ్స్‌ సమీప కాలంలో గరిష్టాల్లోనే ఉండొచ్చు. కార్పొరేట్‌ బాండ్‌ వడ్డీ రేట్లు బ్యాంక్‌ రుణ రేట్ల కంటే అధికంగానే కొనసాగొచ్చు’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ వివరించింది.

Family

  • లండన్‌కు చెందిన ఫుడ్‌ వ్లాగర్‌ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్‌?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..

    యూకేకు చెందని వ్లాగర్‌ జూలియస్‌ ఫ్లీడర్‌ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి  సాంబార్‌ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.

    జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.

    ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్‌లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .

    పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్‌ వ్లాగర​ జూలియస్‌ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు.

     

    (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం)

     

  • ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్‌ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్‌ విదియాధర్‌ సూరజ్‌ పర్సాద్‌ నైపాల్‌. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్‌ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్‌ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్‌ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం! 

    ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్‌ను మనవాళ్ళు ‘నోబెల్‌ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్‌ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్‌ తనను ట్రినిడాడియన్‌–బ్రిటిష్‌ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!

    అంచేత, సాహిత్యానికి నోబెల్‌ ప్రైజ్‌ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్‌ టాగోర్‌. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్‌ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్‌ అరైవల్‌’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్‌ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్‌ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్‌– బ్రిటిష్‌ ప్రపంచాలు మాత్రమే!

    ట్రినిడాడ్‌ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్‌కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిశ్వాస్‌’తోనే నైపాల్‌కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్‌ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్‌ మ్యాగజీన్‌ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్‌లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్‌ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌’ అనే నవల అదే యేడాది బుకర్‌ ప్రైజ్‌ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం. 

    ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్‌బరీ టేల్స్‌ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్‌కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్‌ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్‌’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్‌ రాజరికం ఈ ట్రినిడాడియన్‌– బ్రిటిష్‌ రచయితకు నైట్‌హుడ్‌ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్‌ విదియాకు 2001లో నోబెల్‌ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్‌ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!

    కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్‌ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్‌ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్‌ ఏరియా ఆఫ్‌ డార్క్‌నెస్‌’, ‘ఇండియా–ఎ వూండెడ్‌ సివిలిజేషన్‌’, ‘ఇండియా– ఎ మిలియన్‌ మ్యూటినీస్‌ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్‌ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!
    అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్‌ నిపుణులు’ కొందరు అంటారు.

    నైపాల్‌ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్‌గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్‌ వలస ట్రినిడాడ్‌–టొబాగోకు నైపాల్‌ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్‌’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్‌ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్‌ దేవ్‌ కూడా వున్నారు. 

    ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్‌ లేబర్‌ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్‌ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్‌ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్‌ నైపాల్‌’ను ఇంగ్లిష్‌ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్‌ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్‌ పెంపకంలో విదియాధర్‌ సూరజ్‌ పర్సాద్‌ నైపాల్‌ నోబెల్‌ లారియెట్‌ కావడంలో విడ్డూరమేముంది?                   ∙                 _ - మందలపర్తి కిషోర్‌ 

  • తకిట తధిమి తకిట తధిమి తందానా పదహేల మొండిమాను వేదికపై ఉడుతగారి నృత్యలీల అమెరికా–కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన డచ్‌ ఫొటోగ్రాఫర్‌ స్టాన్‌ బౌమన్‌ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం ఇది. సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌–2026 బహుమతి గెలుచుకున్న ఈ ఫొటో కోసం బౌమన్‌ ఏకంగా నలభై గంటలు శ్రమించి, దాదాపు నాలుగువేల సార్లు కెమెరాను క్లిక్‌మనిపించాడు. 

    చివరకు ఉడుత ప్రదర్శించిన ఈ అద్భుత భంగిమను కెమెరాలో బంధించగలిగాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సింగిల్ ఇమేజ్‌లకు బహుమతులు ప్రధానం చేస్తారు. ఈ పోటీలో ప్రవేశం ఉచితం. అలాగే గరిష్టంగా మూడు సింగిల్ చిత్రాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జేతగా నిలిచిన ఒకరికి ' ఓపెన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్' బిరుదు లభిస్తుంది కూడా. 

    (చదవండి: ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా సాధ్వి సతీష్‌ సైల్‌)
     

  • ఎండా కాలంలో వడదెబ్బ (సన్‌స్ట్రోక్‌), డీ హైడ్రేషన్‌ వంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. వీటికి సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఈ సీజన్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తెలుసుకుందాం. 

    తీసుకోవలసిన జాగ్రత్తలు.. 

    • ఎండలు ఉండే సమయంలో ఎక్కువగా తిరగరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయట పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలి.  

    • రోడ్లమీద అమ్మే రంగు రంగుల డ్రింక్స్‌ సేవించకూడదు. వీటిలో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.  

    • జంక్‌ఫుడ్‌ తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవడం మంచిది 

    • ఎండల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంటుంది. కనుక ఎప్పటికప్పుడు నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.  

    • రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగడం ఈ సీజన్‌లో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. 

    • పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  
      తేలికైన కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది. 

    • ఎండాకాలం రాత్రివేళల్లో చాలా మంది ఆరుబయట పడుకుంటుంటారు. ఇటువంటి సందర్భాల్లో దోమతెరల వంటివి ఉపయోగించాలి 

    • ఎండలు అధికంగా ఉండే సమయంలో ఇంటి దగ్గరే ఉండాలి. మరీ అత్యవసరమైతే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లాలి.

    వడదెబ్బతో జాగ్రత్త 
    ఎండ వేడిమికి ఎక్కువగా ఎదుర్కొనే సమస్య వడదెబ్బ (సన్‌స్ట్రోక్‌). ఎండలో బయటికి వెళ్లడం వలన శరీరంలో నీరు తరిగిపోవడం వల్ల వెంటనే శరీరం నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో మళ్లీ శరీరం మామూలు స్థితికి వచ్చే వరకు కొన్ని ప్రాథమిక విషయాలు పాటించాలి.  

    వడదెబ్బ తగిలినట్లయితే అటువంటి వ్యక్తిని వెంటనే నీడ గల ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో శరీరం తుడవాలని, శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే వరకు అలా చేస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి తగిలే చోట వారిని పడుకోబెట్టాలి.  

    ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రావణాలు తాగించాలి 

    వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

    వేసవిలో పానీయాలే రక్షిస్తాయి 
    వృద్ధులు, చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మరీ అవసరమైతే ఉదయం 7లోపు పనులు ముగించుకోవాలి. ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకు కూల్‌ డ్రింక్స్‌ జోలికి పోకుండా మన ఇంట్లోనే దొరికే సహజమైన మజ్జిగ, కొబ్బరినీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోసకాయ, తాటిముంజలు, సబ్జాగింజలు, రాగి అంబలి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. వేసవిలో మనం తీసుకునే పానీయాలే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి గంటకు మంచినీరు తాగాలి.  
    – డాక్టర్‌ వెలగపూడి ఉమామహేశ్వర్రావు, 
    లయన్స్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌

    త్వరగా నిద్ర పోవాలి
    వేసవిలో సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. ఆలస్యంగా పడుకోవడం వల్ల ఆలస్యంగా లేచి ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. త్వరగా బ్రేక్‌ ఫాస్ట్‌ పూర్తి చేయాలి. ఈ సీజన్‌లో వాకింగ్, జాగింగ్‌కు వెళ్లే వారు ముందుగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొంచెం నీరు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి తాగుతుండాలి. ఏమీ తాగకుండా నడవడం, పరిగెత్తడం వల్ల త్వరగా నీరసం వస్తుంది. ఎండలో ప్రయాణించేవారు, ఉద్యోగాల నిమిత్తం బయట పనులు చేసుకునే వారు తమతో పాటు మంచినీరు తీసుకువెళ్లడం మంచిది. గంటకు కనీసం ఒకసారి నీరు తాగడం వల్ల అలసట తగ్గుతుంది. 
    – డాక్టర్‌ శైలేష్‌ మోడి, సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్, 
    కిమ్స్‌ ఐకాన్‌ హాస్పిటల్, సీతమ్మధార

    పిల్లలు, వృద్ధులు జాగ్రత్త
    వేసవిలో పిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వీరు త్వరగా రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. పిల్లలను ఎక్కువ సేపు ఎండలో తిరగనీయకూడదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పిల్లలను బయట ఆటలకు అనుమతించాలి. 

    సాధ్యమైనంత వరకు ఈ సీజన్‌లో ఇంట్లోనే ఉండి ఆడుకునే చెస్, క్యారమ్స్, లూడో వంటి ఇండోర్‌ గేమ్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్‌ వంటివి అలవాటు చేస్తే మంచిది. వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత కూడా మెరుగవుతుంది. ఎక్కువగా మొబైల్, టీవీలకు అతుక్కుపోకుండా పిల్లలను వేరే సమ్మర్‌కోచింగ్‌ వంటి వాటిలో చేరి్పంచినా మంచిది.  
    – శంకర్‌ నీలు భాగవతుల, రచయిత, పరిశోధకుడు 

Crime

  • కాన్పూర్‌: కన్న కుమార్తెలన్న ప్రేమ కూడా లేదు. అభం శుభం తెలియని పసివాళ్లన్న జాలి కూడా లేకుండాపోయింది. రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. ఆ తర్వాత, పోలీసులకు ఫోన్‌ చేసి తన కూతుళ్లను హత్య చేశానని పోలీసులకు చెప్పాడు.

    ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ భయానక ఘటన చోటుచేసుకుంది. శశి రంజన్ మిశ్రా (48) తన 11 సంవత్సరాల కవల కూతుళ్లను పదునైన ఆయుధంతో గొంతులు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున అతని ఫ్లాట్‌లో జరిగింది. శశి రంజన్ మిశ్రా మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు.

    బిహార్‌కు చెందిన అతను భార్య రేష్మా, జంట కూతుళ్లు రిద్ధి, సిద్ధి, కుమారుడు (6)తో నివసిస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని శశి రంజన్‌ మిశ్రా అనుమానించాడు. తరచుగా ఆమె కుమారుడితో ఉండాలని, తాను కూతుళ్లను చూసుకుంటానని చెప్పేవాడు.

    రేష్మా తెలిపిన వివరాల ప్రకారం.. శశి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. ఇంట్లో అనేక సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. కూతుళ్ల గదుల్లోకి ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. శనివారం రాత్రి భోజనం తర్వాత శశి కూతుళ్లను నిద్రపొమ్మన్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో ఒక కూతురిని బాత్రూమ్‌కు తీసుకెళ్లి, తిరిగి గదికి వచ్చి లైట్లు ఆపేశాడని ఆమె తెలిపింది. రెండు గంటల తర్వాత అతను పోలీసులకు కాల్ చేసి తాను హత్య చేశానని తెలిపాడు. 

    ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు ఇద్దరు బాలికలు రక్తపు మడుగులో కనపడ్డారు. కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మా కాన్పూర్‌లో బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ శశిని కలిసింది. 2014లో వారి వివాహం జరిగింది. “శశిని అరెస్ట్ చేశాం, కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం‌కు పంపించారని చెప్పారు.
     

Rangareddy

  • మహేశ్వరం: పరిశ్రమల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి జి.మురళీ మనోహర్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మండల పరిధిలోని కేసీ తండా సమీపంలో ఉన్న ఎలక్ట్రానిక్‌ పార్కులో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఆందో ళన చెందకుండా వెంటనే 101 నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించాలన్నారు. అంతకు ముందు అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై కంపెనీ యజమానులు, కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు అవగాహన కల్పించారు.

  • శంకర్‌పల్లి: ప్రభుత్వం అప్పగించిన పనిని సిబ్బంది నిబద్ధతతో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని శంకర్‌పల్లి డిప్యూటీ తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిఽషత్‌ కార్యాలయంలో శనివారం జనగణనకు సంబంధించి ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేటర్స్‌, సూపర్‌వైజర్లు తమకు అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయాలని, గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సేవకుల సాయం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్స్‌ కరుణాకర్‌ రెడ్డి, మహేశ్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

  • కందుకూరు: పంటలకు అవసరమయ్యే పోషకాలు, సేంద్రియ రూపంలో సమర్థవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే పొలంలో ముందుగా వేసుకుంటే లబ్ధి పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచించారు. మే చివరి వారం తొలకరి వానలు పడిన వెంటనే పచ్చిరొట్ట సాగు చేసుకోవాలన్నారు. పచ్చిరొట్ట సాగుపై రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు.

    రెండు నెలల ముందే..

    తక్కువ వనరులతో బాగా పెరిగే పచ్చిరొట్ట పంటలను ప్రధాన పంటల సాగుకు సూమారు రెండు నెలల ముందే మడిలో విత్తుకోవాలి. నేలకు తగినంత సేంద్రియ పదార్ధాన్ని అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం సులువైన, చౌకై న పద్ధతి. పప్పుజాతి(లెగ్యూమ్‌)పైర్లు పచ్చిరొట్టకు బాగా పనికొస్తాయి. వీటిలో మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి పైర్లు ముఖ్యమైనవి. ఈపంటలు పూత దశకు వచ్చిన సమయంలో నేలలో కలియదున్ని, ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారు. ఈ పైరు పెరగడానికి తగినంత తేమ, నేలలో కలియదున్నిన తర్వాత మురగడానికి తగినంత నీటి వసతి ఉండాలి. వీటి వేర్ల బుడిపెలలో సూక్ష్మజీవుల ద్వారా నత్రజని స్థాపక చర్య జరుగుతుంది. నేలలో మిగిలిపోయిన మొక్కల భాగాల నుంచి అందే నత్రజని తర్వాత పైర్లకు ఉపయోగపడుతుంది. వీటిని నేలలో కలియదున్ని, బాగా నీరు పెట్టి 2నుంచి 3 వారాల పాటు మురగనివ్వాలి. ఈ సమయంలో కొన్ని హానికరమైన సేంద్రియ ఆమ్లాలు తయారవుతాయి. కనుక మురుగు నీటిని తీసేసి కొత్త నీరు అందించి, ప్రధాన పంటలను నాటుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల నుంచి విడుదలయ్యే పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.

    ప్రధాన పంటలకు పోషకాలు అందించే పైర్లు

    మినుము, అలసంద, జీలుగ, పెసర, ఉలవ, పిల్లి పెసర, జనుము, వెంపలి

    క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ సలహాలు

  • బడంగ్‌పేట్‌: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నిండుకుండ అనురాధ(33) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. భర్త శ్రీనుతో కలిసి ఆర్‌ఎన్‌రెడ్డి నగర్‌ ద్వారకామయికాలనీలో మూడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఉదయం రూమ్‌ నుంచి వాసన రావడంతో ఇంటి ఓనర్‌ అనుమానంతో కిచెన్‌ కిటికి నుంచి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో పోలీసులకు ఇంటి ఓనర్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

    ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు దగ్ధం

    తప్పిన ప్రాణనష్టం.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

    ఆల్విన్‌కాలనీ: కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ కూతవేటు దూరంలో మెట్రో పిల్లర్‌ నెంబర్‌ 734 వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దుర్గా మల్లేశ్వరి ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తం చేయడంతో బస్సులోని 18 మంది ప్రయాణికులు వెంటనే ఎమర్జెన్సీ డోర్‌ నుంచి కిందికి దూకారు. ఏపీలోని పాలకొల్లు వెళ్లాల్సిన ఈ బస్సు కొండాపూర్‌ నుంచి మియాపూర్‌ మీదుగా కేపీహెచ్‌బీ చేరుకుంది. బస్సు ఆగి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. అయితే తనిఖీ చేసిన రిపోర్టు ఉంటేనే బస్సులను అనుమతించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.

    పెళ్లిపేరిట సహచర

    కానిస్టేబుల్‌ మోసం

    బంజారాహిల్స్‌: సహచర కానిస్టేబుల్‌ ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుంటానని మోసగించడంతో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ విభేదాల కారణంగా భర్తతో వేరుగా ఉంటోంది. కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతుంది. ఆమెకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లోనే సహచర కానిస్టేబుల్‌ కప్షా స్వప్నిల్‌(27)తో 2024లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సన్నిహితంగా మెలిగాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. కొద్దిరోజులుగా ఆమెను మతపరంగా అవమానించడం, దుర్భాషలాడటమే కాకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడు. విష యం తెలిసిన బాధితురాలు ఈ నెల 14న శ్రీకృష్ణానగర్‌లోని తన గదిలో స్వప్నిల్‌తో గొడవ పడింది. పెళ్లి చేసుకునేది లేదని నిందితుడు తెగేసి చెప్పడమేకాకుండా నిద్రమాత్ర లు వేసుకోవాలని ఒత్తిడి చేశాడు. దీంతో పెద్దమొత్తంలో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి వెళ్లింది. ఈ నెల 16న ఆస్పత్రిలో చేర్చగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని స్వప్నిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • ఇబ్రహీంపట్నం రూరల్‌: మైనర్లకు గుట్కా, మసాల లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఆదిబట్ల పోలీసులు హెచ్చరించారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 11 గంటలకు ఏక కాలంలో ఏడు చోట్ల పోలీసులు పాన్‌ షాపులపై దాడులు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి షాపుల్లో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా విక్రయించే మత్తు పదార్థాలను, గుట్కా, పాన్‌ మసాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు విద్యార్థులకు అలవాటుగా మారే అవకాశం ఉందన్నారు. అందుకే వారికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిఽధిలో కఠినమైన నిబంధనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, వెంకటేశ్‌, నోయల్‌రాజు, వెంకటేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    ‘ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌’తో సోదాలు

    పహాడీషరీఫ్‌: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ ఆదేశాల మేరకు బాలాపూర్‌ పోలీసులు విద్యా సంస్థల పరిసరాలలోని కిరాణ దుకాణాలు, పాన్‌ షాప్‌లలో శనివారం సోదాలు నిర్వహించారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలతో విద్యార్థుల మత్తు పదార్థాలకు బానిసలవుతున్న దృష్ట్యా పోలీసులు ‘ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా షాహిన్‌నగర్‌, ఎర్రకుంట, కొత్తపేట, బా లాపూర్‌, మల్లాపూర్‌, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల లోని పాఠశాలల సమీపంలోని షాప్‌లలో తనిఖీలు చే పట్టారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ మాట్లాడు తూ.. పాఠశాలల పక్కనే ఉన్న పాన్‌ షాప్‌లలో విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్న విద్యార్థులు క్రమేణా సిగరేట్‌, గంజాయి లాంటి వాటికి బానిసలవుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు విక్రయించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    ఆదిబట్ల పీఎస్‌ పరిధిలో ఏడు చోట్ల తనిఖీలు

  • మంచాల: మహాత్మా బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వీర శైవ లింగాయత్‌ బలిజ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం మండల కార్యాలయంలో సూపరింటెండెంట్‌ అజీమ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తూరు శేఖరప్ప మాట్లాడుతూ.. ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో మహాత్మా బసవేశ్వరుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అదే విధంగా అన్ని మండలాలు, గ్రామాల్లో సైతం కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమాజంలో మార్పు కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు జక్క హరీశ్‌, ప్రధాన కార్యదర్శి రాజు, సలహాదారులు రాజప్ప, పెంటప్ప, కోటప్ప తదితరులు పాల్గొన్నారు.

Medak

  • మెదక్‌జోన్‌: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్‌ డీఎస్పీ రంగనాథ్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్‌ రూరల్‌ సీఐ జార్జ్‌, ఆర్‌ఐలు శైలేందర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    పకడ్బందీగా జనగణన

    కౌడిపల్లి(నర్సాపూర్‌): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్లు మహిపాల్‌, రామకృష్ణ, తహసీల్దార్‌ కృష్ణ, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.

    సర్కారు బడిలో

    సకల వసతులు

    హవేళిఘణాపూర్‌(మెదక్‌): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్‌, శశికుమార్‌, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    ప్రజలకు మెరుగైన

    వైద్య సేవలు

    చిన్నశంకరంపేట(మెదక్‌): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్‌, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ యాదగిరిరావు, ఎంఎల్‌హెచ్‌పీ కుమారి, సూపర్‌వైజర్‌ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు.

  • జోగిపేట(అందోల్‌): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్‌, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్‌ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, అదనపు కలెక్టర్‌ పాండు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌.కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

    మంత్రి దామోదర రాజనర్సింహ

  • చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్‌, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

    మాజీ మంత్రి హరీశ్‌రావు

  • కౌడిపల్లి(నర్సాపూర్‌): నిర్లక్ష్యం వల్లే వందశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండలంలోని రాయిలాపూర్‌లో ‘అరైవ్‌– అలైవ్‌’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 350 మంది చనిపోయారని తెలిపారు. వాహనాల తనిఖీ, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరం చేయడంతో ప్రమాదాలు తగ్గాయన్నారు. జీరో యాక్సిడెంట్‌, జీరో డెత్‌గా జిల్లాను మారుద్దామని పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన గంటలోపు గోల్డెన్‌ అవర్‌లో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ‘రా వీర్‌’ (రహదారి వీరుడు)గా గుర్తించి ప్రభుత్వం రూ. 25 వేల నజరానా ఇస్తుందన్నారు. మైనర్లకు డ్రైవింగ్‌ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ తరఫున హెల్మెట్‌ ధరిస్తాం.. జాగ్రత్తలు పాటిస్తామని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, సర్పంచ్‌ స్వప్న, సీఐ జాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కృష్ణ, మాజీ సర్పంచ్‌ శేఖులు, ఉపసర్పంచ్‌ సంతోష్‌కుమార్‌, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Siddipet

  • సిద్దిపేటఅర్బన్‌: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూఓ శారద సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాలలో పోషణ్‌ పక్వాడ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిస్తే పౌష్టికాహారం అందుతుందన్నారు. చిన్నారులను ఫోన్‌కు అలవాటు చేయడంతో వారిలో మానసిక ఎదుగుదల లోపించి మాటలు సరిగా రాకపోవడం, ఇతర పిల్లలతో కలిసి మెలిసి ఉండకపోవడం, ఒంటరితనంకు అలవాటు పడుతారన్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారానికి సంబంధించి పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్‌ వంటి వాటిని ప్రదర్శిస్తూ గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పొన్నాల సర్పంచ్‌ అమ్ముల వెంకటయ్య, పోషణ్‌ అభియాన్‌ డీసీ వెంకటప్రసాద్‌, బీసీ శ్రీనివాస్‌, పంచాయతీ సెక్రటరీ నరేష్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

    డీడబ్ల్యూఓ శారద

  • జోగిపేట(అందోల్‌): రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి సి.దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం చౌటకూర్‌, అందోలు మండలాల్లో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, బాలికలు ఉన్నత విద్యనభ్యసించాలని ఆయన సూచించారు. గ్రంథాలయాన్ని డిజిటల్‌ లైబ్రరీగా మారుస్తామన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు నూతనంగా సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా సమీకృత భవానాన్ని నిర్మిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంజయ్య, అదనపు కలెక్టర్‌ పాండు, మున్సిపల్‌ చైర్మన్‌ ఎస్‌.కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఆకుల చిట్టిబాబు, సంగమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

    మంత్రి దామోదర రాజనర్సింహ

  • ములుగు(గజ్వేల్‌): ములుగు కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్‌ అటవీ శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్‌ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు. జీవన్‌ పీహెచ్‌డీ సాధించడంపై కళాశాల డీన్‌ ప్రవీణ, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌రావు, డిప్యూటీ డైరెక్టర్‌ కవిత, అధ్యాపకులు అభినందించారు.

    పరీక్షా కేంద్రాల వద్ద

    పటిష్ట బందోబస్తు

    పోలీసు కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌

    సిద్దిపేటకమాన్‌: జిల్లాలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ (తె లంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. జిల్లాలోని 9 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 20నుంచి 27వరకు పరీక్షలు జరగనున్నందున ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. పరీక్షలకు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

    సర్కారు బడిలో

    సకల వసతులు

    హవేళిఘణాపూర్‌(మెదక్‌): బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చూడాలని డీఈఓ విజయ అన్నారు. శనివారం మండల పరిధిలోని కూచన్‌పల్లిలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, శివరాజ్‌, శశికుమార్‌, కృష్ణవేణి, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

    ప్రజలకు మెరుగైన

    వైద్య సేవలు

    చిన్నశంకరంపేట(మెదక్‌): వైద్యారోగ్యంపై ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ సిబ్బందికి సూచించారు. శనివారం చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్టులు, ల్యాబ్‌, ఫార్మసీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ యాదగిరిరావు, ఎంఎల్‌హెచ్‌పీ కుమారి, సూపర్‌వైజర్‌ బుజ్జి, అనిత, నర్సింహులు పాల్గొన్నారు.

    పకడ్బందీగా జనగణన

    కౌడిపల్లి(నర్సాపూర్‌): జనగణన పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మాట్లాడారు. జనగణనపై ఆర్థిక, సామాజిక, విద్య తదితర అంశాలు ఆధారపడి ఉంటాయన్నారు. కరోనాతో 2021లో జనగణన జరగలేదని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని లెక్కించాలని చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు ఉండి, తక్కువ జనాభా ఉంటారని, మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఇళ్లు ఉంటాయని తెలిపారు. దీంతో జాగ్రత్తగా గణన చేయాలన్నారు.

  • సాక్షి, సిద్దిపేట: పసిడి పండుగ రానే వచ్చింది. ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతుంటారు. దీంతో జిల్లాలోని ప్రముఖ బంగారం షాప్‌లన్నీ కొత్త మోడళ్ల ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో తక్కువ బరువు ఉండే నగలను రూపొందించారు. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో పనిలో పనిగా ఈ రోజు నగలు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆదివారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా రూ. 50 కోట్ల బంగారు నగల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు బంగారం షాపులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి

    ధర ఎక్కువ ఉన్నా..

    బంగారం ధరలు పెరిగినా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకుని గ్రాము నుంచి 5 గ్రాముల కాయిన్‌లను అందుబాటులో ఉంచారు. ఆదివారం షాపులన్నీ రద్దీగా ఉంటాయని భావించి కొంత మంది ఇప్పటికే నగలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్‌లు సైతం ఇచ్చారు. అక్షయ తృతీయ రోజు అభరణాలు తీసుకెళ్లేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కాగా పలు బంగారం షాపులు ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని షాపుల నిర్వాహకులు తరుగులో తగ్గింపు, గోల్డ్‌, వెండి కాయిన్స్‌ అందజేయనున్నారు. వివిధ బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డులకు క్యాష్‌ బ్యాక్‌ను రూ. 1,000 నుంచి రూ.5 వేలు ప్రకటించారు.

    నేడే అక్షయ తృతీయ

    ప్రత్యేక ఆఫర్లతో హడావుడి

    జిల్లాలో రూ.50 కోట్ల

    వ్యాపారం జరిగే అవకాశం

    అందుబాటులోకి మోడల్స్‌

    అక్షయ తృతీయను దృష్టిలో ఉంచుకొని అనేక మోడల్స్‌ ఆభరణాలను అందుబాటులో ఉంచాం. ఎంతో కొంత బంగారమైన కొనుగోలు చేయాలని ప్రజల భావిస్తారు. బంగారు ఆభరణాలపై ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

    – రాజేశ్‌, సేల్స్‌ మేనేజర్‌,

    మలబార్‌ జ్యువెల్లర్స్‌, సిద్దిపేట

  • సిద్దిపేట ఎడ్యుకేషన్‌: తనను కవిగా నిలబెట్టిన కళాశాల సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలేనని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని ిసిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించిన సందర్భంగా శనివారం కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ..సిద్దిపేట కళాశాల విద్యార్థిగా తాను కవిత్వంలోకి అడుగు పెట్టానని కళాశాల వాతావరణం తనను కవిగా తీర్చిదిద్దిందన్నారు. బాల్యంలోని బంగారం జ్ఞాపకాలను యువకుడిగా డిగ్రీ కాలేజీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని వాటి ప్రేరణలను విద్యార్థులకు వివరించారు. ‘కట్టువోతల బందారం– బాల్య జ్ఞాపకాలు’‘సిద్దిపేట కాలేజీలో తన విద్యార్థి జీవితం’ఇవి రెండు తనను కవిగా పరిశోధకుడిగా నిలబెట్టాయన్నారు. సిద్దిపేట గడ్డ బందారం గడ్డ ఆనాటి రైతాంగ ఉద్యమాలు తనకు ఉద్యమస్ఫూర్తిని ఉగ్గుపాలతోనే నేర్పించాయని గుర్తు చేసుకున్నారు. కళాశాల తనను ఆత్మీయంగా సత్కరించటం గొప్ప గౌరవమని కళాశాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల పూర్వ విద్యార్థి పూర్వాధ్యాపకులు సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సునీత అభినందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జి.పాపయ్య, సిధారెడ్డి బాల్య స్నేహితులు, అధ్యాపక మిత్రులు బాల నరసయ్య, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, రవికుమార్‌, శ్రీహరి యాదవ్‌, బాలమణి, తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మట్ట సంపత్‌ కుమార్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.అయోధ్యరెడ్డి, డాక్టర్‌ మధుసూదన్‌, డాక్టర్‌ గోపాల సుదర్శనం, తెలుగు విభాగం అధ్యాపకులు పిట్ల దాసు, నారోజు వెంకటరమణ, విద్యార్థులు, పాల్గొన్నారు.

    డాక్టర్‌ నందిని సిధారెడ్డి

  • హుస్నాబాద్‌: గతంలో పనికి రాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి, ఇప్పుడు మరమ్మతులు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ నాయకుల మాటలన్నీ అబద్ధాలని తెలిపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. హుస్నాబాద్‌ శివారులోని పోతారం(ఎస్‌) శుభం గార్డెన్‌లో శనివారం బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొద్ది కాలంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్‌ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర విభజన అంశంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని చెప్పారు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌ గెలిచిందని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

    మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌

  • దుబ్బాకటౌన్‌: ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్యను కనీసం 100 మందికి పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి జయదేవ్‌ ఆర్య అధికారులను ఆదేశించారు. శనివారం రాయపోల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, మురుగు కాలువల శుభ్రత, చెత్త నిర్వహణ, రహదారి పక్కన మట్టి పనులు చేపట్టడం ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, సమయానికి వేతనాలు చెల్లించేలా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని హెచ్చరించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను క్రమం తప్పకుండా సేకరించి, డంపింగ్‌ షెడ్డులకు తరలించాలని సూచించారు. వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బోర్లు, ట్యాంకులు, పైపులైన్లకు సకాలంలో మరమ్మతులు చేయించాలని సూచించారు.

    డీఆర్డీఓ జయదేవ్‌ ఆర్య

  • చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వంతో పోరాడి పొద్దు తిరుగుడు, మొక్కజొన్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని పెద్దకోడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులు పండించిన పొద్దు తిరుగుడు, మొక్కజొన్నలు కొనడం లేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రభుత్వం కొత్త రోడ్లు ఇవ్వకపోయినా, కనీసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తి చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సామల సునీత, నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్‌, పాపయ్య, కనకరాజు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

    మాజీ మంత్రి హరీశ్‌రావు

  • నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలంలోని ర్యాకల్‌ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు.

    క్రమశిక్షణ తప్పనిసరి

    మెదక్‌జోన్‌: పోలీసులు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఏఆర్‌ డీఎస్పీ రంగనాథ్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు శరీర దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజూ వ్యాయామం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.

Sangareddy

  • ● 45రోజుల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ● సర్వే నిర్వహణకు ఆరు ప్రత్యేక బృందాలు ● పనుల పురోగతిపై రోజు వారీగా సమీక్ష

    రూ.2,369 కోట్ల నిధులతో

    అభివృద్ధి పనులు

    హైదరాబాద్‌–నాగపూర్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ఇంప్లిమెంటేషన్‌లో భాగంగా ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రహదారులు, వాటర్‌ ట్యాంకులు, గ్రీనరీ, పరిశ్రమల ఏర్పాటుకు స్థలం, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక అభివృద్ధి పనులు చేపట్టారు. మొదటి దశలో సేకరించిన భూమిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2,369 కోట్ల నిధులతో పనులు చేపడతారు.

    మారనున్న రూపురేఖలు

    నిమ్జ్‌ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్న స్మార్ట్‌ సిటీ పనులు పూర్తయితే ఇక్కడి ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. 12,500 ఎకరాల విస్తీర్ణంలో నిమ్జ్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. పరిశ్రమల రాకతో సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

    సంగారెడ్డి జోన్‌: జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ పనులు మరింత వేగవంతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరిలో టెండర్‌ ప్రక్రియ ముగిసింది. స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనుల నిర్వహణకు మాస్టర్‌ ప్లాన్‌ను కూడా రూపొందించారు. భూ సేకరణ పూర్తయినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేస్తున్న సమయంలో రైతుల నుంచి వివిధ కారణాలతో వ్యతిరేకత రావటంతో పనులు అంతంతమాత్రంగానే సాగాయి. స్థానిక అధికారులు సరైన చొరవ చూపకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

    పనుల జాప్యంపై సీఈఓ అసంతృప్తి

    దురోజుల క్రితం నేషనల్‌ ఇండస్ట్రియల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ప్రాంతంలోని స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులను నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈవో రజత్‌కుమార్‌ సైని, టీజీఐఐసీ, జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. టెండర్‌ ప్రక్రియ ముగిసి మూడు నెలలు పూర్తి కావస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగకపోవడం పట్ల స్థానిక అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు సాగకపోవడం పట్ల గల కారణాలను తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించి పనులు వేగవంతం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

    ప్రత్యేక బృందాలతో భూముల సర్వే

    స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన భూములలో సర్వే పనులు ముమ్మరం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. రెండురోజుల క్రితం కలెక్టర్‌ ప్రావీణ్య కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీస్‌, సర్వేయర్‌ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో సేకరించిన భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. 45 రోజుల్లో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ వైపు అధికారులు సర్వే పనులు చేస్తుండగా మరోవైపు కాంట్రాక్టర్‌ భూమిని పూర్తిగా చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పంటలు సాగులో ఉంటే కోత పూర్తి చేసేందుకు గడువు ఇవ్వనున్నారు. ఎక్కువ నెలలపాటు సాగయ్యే పంటలు ఉంటే గుర్తించి పరిహారం అందించి స్వాధీన పరుచుకోనున్నారు. సర్వే నిర్వాహణపై రోజువారీగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

    చదును చేస్తున్న గుట్ట

    భూ సేకరణకు నోటిఫికేషన్‌

    నిమ్జ్‌ మొదటి విడతలో గుర్తించిన 3,245 ఎకరాల్లో ఎల్గోయి గ్రామ పరిధిలో 194 ఇంకా సేకరణ పూర్తి కాలేదు. అందుకుగాను ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి, భూ సేకరణకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

    న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని ముంగి గ్రామ శివారులో కొనసాగుతున్న నిమ్జ్‌ ఏర్పాటు పనులను శనివారం ముంగి తండా వాసులు అడ్డుకున్నారు. తండా సమీపంలో నిమ్జ్‌ ఏర్పాటులో భాగంగా అందుకు సంబంధించిన హద్దులు ఏర్పాటు, కంచె నిర్మాణం తదితర పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న తండా వాసులు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పనులు చేస్తున్న వారితో పాటు అధికారులతో తండా వాసులు వాగ్వావాదానికి దిగారు. తహసీల్దార్‌ ప్రభు, ఆర్‌ఐ శ్యామ్‌రావు తదితరులు వారికి ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా అధికారులకు తండా వాసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో చాందీబాయి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోగా వెంటనే 108లో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్‌ డీఎస్పీ సైదా నాయక్‌ అక్కడకు చేరుకుని తండా వాసులతో మాట్లాడారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే రాసి ఇవ్వాలని, పనులను మాత్రం అడ్డుకోవద్దని నచ్చజెప్పారు. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ వెంట హద్నూర్‌ ఎస్‌ఐ దోమ సుజిత్‌ సిబ్బంది ఉన్నారు.

  • వేసవి తాపం తగ్గేలా..
    వారం రోజులుగా సంగారెడ్డిలోఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫ్యాన్‌ వేసుకున్నప్పటికీ కూడా వేడిగాలి వస్తుండటంతో ఉష్ణతాపం భరించలేక కూలర్లు కొంటున్నారు. సంగారెడ్డిలో పలువురు కూలర్లు కొనుక్కుని తీసుకువెళ్తుండగా ‘సాక్షి’క్లిక్‌ మనిపించింది.
    – సాక్షిస్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌,సంగారెడ్డి

    పరిమళాలు వెదజల్లకపోయినా విరబూసిన గుల్‌మోహర్‌ పూలను చూస్తే మనసు పరవశించాల్సిందే. అల్లాదుర్గం–మెటల్‌కుంట రోడ్డుకిరువైపులా హద్నూర్‌, ముంగి గ్రామాల శివారులోని గుల్‌మోహర్‌ చెట్లకు కాసిన ఎర్రటి పుష్పాలు రోడ్డుపై రాకపోకలు సాగించే వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండి మొక్కలు, చెట్లు ఎండి ముఖం పడుతుండగా ఇక్కడ మాత్రం చెట్లకు పూసిన గుల్‌మోహర్‌ పూలను చూస్తూ దారిన పోయే వారు పరవశించిపోతున్నారు.

    న్యాల్‌కల్‌(జహీరాబాద్‌):

  • మక్కలకు ప్రైవేట్‌లో రూ.1,800కు మించని ధర
    ఎంఎస్‌పీ రాకపోతే నష్టమంటున్న రైతులు

    వట్‌పల్లి(అందోల్‌): ప్రభుత్వం మొక్కజొన్న (మక్కలు) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందా? తమ పంటకు మద్దతు ధర దక్కుతుందా? లేదా? అని మొక్కజొన్న రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. రెండేళ్ల క్రితం వరుసగా యాసంగి, వర్షాకాలాల్లో ఒకే వరి పంటను సాగుచేయగా పంట దిగుబడిపై ప్రభావం చూపడంతో గతేడాది నుంచి రైతులు బోరుబావుల వద్ద మొక్కజొన్న పంటను సాగుచేశారు. ప్రభుత్వ మద్దతు ధర దక్కకపోయినా రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతో ఈ ఏడాది కూడా అందోల్‌ మండలంలో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. జోగిపేట ఏడీఏ పరిధిలో సుమారుగా 550పైగా ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు.

    మద్దతు ధర కోసం ఎదురుచూపు..

    ఈ ఏడాది దిగుబడులు బాగున్నా సరైన మద్దతు ధర దక్కుతుందా లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాళుకు రూ.2,400 ఉండగా ప్రస్తుతం వ్యాపారులు ఏ మేరకు ధరను చెల్లిస్తారోనని రైతులు మధన పడుతున్నారు. గతేడాది నుంచి రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ప్రైవేట్‌ ధరకు విక్రయిస్తే మాత్రం తాము నష్టపోతామంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల మండలాల రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు మద్దతు ధర దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో సదాశివపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా అక్కడికి పంటను తరలించడంలో దూరాభారం పెరగడంతో అనేక ఇబ్బందులు పడాల్సివచ్చిందని గుర్తు చేస్తున్నారు.

    విన్నవించేందుకు రైతులు సిద్ధం

    అందోల్‌ మండలంలో అత్యధికంగా కన్‌సాన్‌పల్లి గ్రామంలో మొక్కజొన్న పంట సాగువుతోంది. ఇప్పటికే అదే గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు సంగారెడ్డిలోని మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లగా అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.

    కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

    ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. ప్రైవేట్‌లో రూ.1,800 మించడం లేదు. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. ప్రైవేట్‌లో విక్రయిస్తే నష్టపోతాం. జోగిపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి.

    – రామన్నగారి కిష్టయ్య,

    రైతు,కన్‌సాన్‌పల్లి

    మంత్రిని కలిసి వినతి..

    జోగిపేటలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహకు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. అందోల్‌ మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ రైతులు శనివారం జోగిపేటలో మంత్రి పర్యటన సందర్భంగా ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో అధికంగా మొక్కజొన్న పంటను సాగుచేశామని ప్రైవేట్‌లో తక్కువ ధరకు విక్రయించడం ద్వారా తాము నష్టపోతామని కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా మద్దతు ధరను కల్పించాలని మంత్రిని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్ర ఏర్పాటుపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

  • పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లోని కాలనీల మధ్య ఎస్టీపీ (స్యూవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) నిర్మాణం ఆపివేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాభీష్టం మేరకు ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని మెట్రో వాటర్‌ వర్క్స్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గానికి మొత్తం ఏడు ఎస్టీపీలు మంజూరయ్యాయని కానీ కాలనీవాసుల ఇబ్బందులను, నిరసనను దృష్టిలో పెట్టుకుని వేరే చోటుకు తరలిస్తామని అమీన్‌పూర్‌ వాసులకు ఎమ్మెల్యే హామీనిచ్చారు. అమీన్‌పూర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆకుల తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో అమీన్‌పూర్‌ పట్టణంలో ముమ్మర నిరసన కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్టీపీ ఆవశ్యకత, దానిపై ప్రజల్లో ఉన్న అపోహల తొలగింపు కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఉన్నతాధికారులతో, అమీన్‌పూర్‌ గుట్టలో శనివారం అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి హాజరైన వేలమంది ప్రజలు అక్కడ ఎస్టీపీ ఏర్పాటు చేయవద్దని కోరారు. దీంతో ఎమ్మెల్యే గూడెం కల్పించుకుని కాలనీ వాసుల కోరిక మేరకు ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు.

    తిరుమల్‌రెడ్డి పోటీ చెయ్‌ రూ.10కోట్లు ఇస్తా

    ఇదిలాఉండగా సమావేశంలో తొలుత ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తప్పులేదని అయితే అనవసర రాజకీయాలు చేయవద్దని తిరుమల్‌రెడ్డిని హెచ్చరించారు. దీంతో కాలనీ వాసులకు విస్మయానికి లోనయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గ పునర్విభజనలో ఎమ్మెల్యే ఇక్కడ ఉండరని పక్షపాతం చూపుతున్నారని తనపై దుష్ప్రచారం చేశారంటూ వ్యా ఖ్యానించారు. తిరుమల్‌రెడ్డి! ఎన్నికల్లో పోటీ చెయ్‌.. రాజకీయాలు ఎక్కువ చేస్తున్నవ్‌ చేయ్‌వయ్యా ఎన్నికల్లో పోటీచెయ్‌. రూ.పది కోట్లు ఇస్తా’’అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ..తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తండ్రి సమానులైన ఎమ్మెల్యే వ్యాఖ్యలను తాను తప్పుగా భావించడం లేదన్నారు. ఆ తరువాత ఎస్టీపీ రద్దు ప్రకటన చేసిన తర్వాత ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తారు. అమీన్‌పూర్‌ మాజీ కౌన్సిలర్లు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, వివిధ కాలనీ సంఘాల అధ్యక్షులు, మెట్రో అధికారులు, జీహెచ్‌ ఎంసీ అధికారులు ఇంజనీర్లు పాల్గొన్నారు.

    జనారణ్యంగా అమీన్పూర్‌ గుట్టలు

    అమీన్‌పూర్‌ 993 గుట్టలు జనారణ్యంగా మారాయి. అమీన్‌పూర్‌ కాలనీల నుంచి వందలాది మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కొద్దిరోజులుగా ఎస్టీపీ నిర్మాణం కోసం నేల చదును పనులు చేస్తున్నారు. ఎస్టీపీని ఇక్కడ నిర్మించవద్దని అమీన్‌పూర్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. నెల రోజులుగా నిత్యం ఏదో ఒక కాలనీలో రాత్రి పూట లేదా తెల్లవారుజామున ర్యాలీలు జరిగాయి. ఈ ప్రాంతంలోని కాలనీల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఉండటంతో వారికి అవకాశం చిక్కినప్పుడల్లా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే చొరవతో మెట్రో అధికారులతో కాలనీవాసులు తమ ఆవేదన చెప్పుకునే అవకాశం కల్పిస్తూ సమావేశాన్ని ఏర్పా టు చేయగా..అనూహ్యంగా వేలాది మంది ప్రజలు ఆ గుట్టల్లోకి తరలి వచ్చారు. వచ్చిన వారిలో అందరూ టెకీలే కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం నివ్వెరపోయారు. సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఉద్యమాలకు దూరంగా ఉండే తత్వం. బ్యాంకు లోన్‌ తీసుకుని ఇండ్లు కట్టుకుని ప్రశాంత జీవితాలు సాగించాలనుకునే ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు పిడుగులా ఎస్టీపీ ఏర్పాటు వార్త వచ్చి పడింది. ఎస్టీపీ ఏర్పాటైతే ఇండ్లు అమ్ముకుని, తా ము కాలనీలు ఖాళీ చేయడం మినహా ఏమీ ఉండద ని భావించారు. దీంతో పిల్లా పాపలతో ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి తరలి వచ్చారు.

    ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

  • నారాయణఖేడ్‌: త్వరలోనే ఖేడ్‌లో శాశ్వత ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ‘అరైవ్‌.. అలైవ్‌’లో భాగంగా శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో లయన్స్‌ క్లబ్‌ సౌజన్యంతో ఖేడ్‌ పోలీసు ఠాణాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన రక్తదాతలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖేడ్‌లో లైసెన్స్‌ డ్రైవ్‌, ఇన్సూరెన్స్‌ మేళాలను నిర్వహించునున్నా మని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. తాగునీటి విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎస్సైలు శ్రీశైలం, రామకృష్ణ, వెంకటేశ్వర్‌రావు, దుర్గారెడ్డి, లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు, కౌన్సిలర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    రక్తదానం మరో

    ప్రాణాన్ని కాపాడుతుంది

    ఎమ్మెల్యే మాణిక్‌రావు

    జహీరాబాద్‌ టౌన్‌: రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు హితవు పలికారు. బసవ జయంతి పురస్కరించుకుని లింగాయత్‌ సమాజ్‌లో శనివారం పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. బసవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 73 మంది రక్తదానం చేయగా వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నిర్మలారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, సమాజ్‌ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్‌ షెట్కార్‌,ఆర్‌.సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

    కుస్తీమే సవాల్‌

    నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలంలోని ర్యాకల్‌ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. పోటీలను తిలకించేందుకు జనాలు తరలివచ్చారు.

  • సంగారెడ్డి జోన్‌: ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ సూచించారు. శనివారం తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలకు వెళ్తున్న హోంగార్డులకు మెడికల్‌, ప్రాథమిక అవసరాల కిట్టులను ఎస్పీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ నరేందర్‌, పోలీసు డ్యూటీ డాక్టర్‌ జ్యోతి, డానియెల్‌, తదితరులు పాల్గొన్నారు.

  • అవమానిస్తున్నాడని సర్పంచ్‌ నిరసన

    పెద్దశంకరంపేట(మెదక్‌): పెద్ద శంకరంపేట మేజర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళా సర్పంచ్‌ జంగం రేణుక శనివారం నిరసనకు దిగారు. తనను ఉపసర్పంచ్‌ రాజుగౌడ్‌ పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. మహిళగా తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రేణుక మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రతి కాలనీలో తనకు నచ్చిన వ్యక్తులకు పంచాయతీ నల్లా కలెక్షన్లు ఇష్టానుసారంగా ఇస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దోమల మందు స్ప్రే చేసి సదరు వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టి అంతా తానే చేస్తున్నట్లు చెబుతున్నాడని ఽఆరోపించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ఆమె అక్కడే భోజనాలు చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉప సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, నాయకులు సురేశ్‌ గౌడ్‌, సుభాష్‌ తదితరులున్నారు.

  • మెదక్‌ పట్టణానికి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో మెదక్‌–బోధన్‌ రహదారి పక్కనే పోచారం అభయారణ్యం ఉంది. ఈ అడవిలో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతుంది. ఇందులో కృష్ణజింకలతో పాటు, వేలాదిగా కొమ్ముల జింకలు ఉన్నాయి. ఆ అడవిలో నెమళ్లు, నీల్గాయిలు, కొడగొర్లు, జంతువులతో పాటు పక్షులు ఉన్నాయి. పర్యాటకులు తిలకించేందుకు అడవిలో 4.5 కిలో మీటర్లమేర మట్టిరోడ్డు వేశారు. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి, వీటిని తిలకించేందుకు పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 50 చొప్పున చెల్లించాలి. పక్కనే నిజాంపాలనలో పోచారం ప్రాజెక్టును సహజసిద్ధంగా వెలసిన గుట్టల మధ్య నిర్మించారు.

  • ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి

    మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్‌ఐ చర్చి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ అద్భుత కట్టడాలను కనులారా చూసి తీరాల్సిందే. రోజ్‌వుడ్‌ కలప, స్పెయిన్‌ గ్లాస్‌పై కరుణామయుని జీవన వృత్తాంతం, అద్భుతమైన రాతికట్టడం దీని ప్రత్యేకత. దీని నిర్మాణం 1914 నుంచి 1924 వరకు పదేళ్లపాటు కొనసాగింది. ఇంగ్లాండ్‌ దేశస్తుడైన చార్లేస్‌ వాకర్‌ పాస్నెట్‌ ఆధ్వర్యంలో ఈ అద్భుత కట్టడం ఆవిష్కతమైంది. దీన్ని నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2023 డిసెంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

    మెదక్‌ ఖిల్లా చారిత్రక అద్భుత కట్టడం. దీన్ని శత్రుదుర్భేద్యంగా నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నాటి 2వ ప్రతాపరుద్రుడు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. దానిపై పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కాటేజీలు నిర్మించారు. ఇది పోలీస్‌ పహారాలో కొనసాగుతుంది. ఇది రాచరికపు చరిత్రకు నిలువుటద్దంగా విరాజిల్లుతోంది. ఇది హైదరాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో హైదరాబాద్‌, రంగారెడ్డి తదితర దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

    తుంబురేశ్వరాలయం

    మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలంలోని వెల్పుగొండలో వెయ్యేళ్ల క్రితం వెలసిన తుంబురేశ్వర (శివాలయాన్ని) కాకతీయుల ఏలుబడిలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ గుడి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రతి ఏటా ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

  • నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలంలోని అబ్బెంద గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సీహెచ్‌ విఠల్‌ ‘తెలుగు సాహిత్యంలో రుద్రమదేవి‘ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్‌ పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం కోహీర్‌ మండలంలోని గురుజువాడ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను స్థానిక ప్రజలు, మిత్రులు, బంధువులు, ఉపాధ్యాయులు అభినందించారు.

    జనగణన పకడ్బందీగా నిర్వహించాలి

    జెడ్పీ సీఈఓ ఎల్లయ్య

    కొల్చారం(నర్సాపూర్‌): వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే జన గణన–2027 పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో జన గణనపై ఎన్యుమిరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. జన గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించి సమాచారం అందజేయాలని ప్రజలను కోరారు. తహసీల్దార్‌ శ్రీనివాసాచారి మాట్లాడుతూ శిక్షణ శిబిరం ఈనెల 25వరకు కొనసాగుతుందన్నారు. మే 1 నుంచి ఇళ్ల జాబితా, గణనతో పాటు స్వీయ గణన ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ నాగవర్దన్‌, ఎంఈఓ ఉమారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

    షార్ట్‌ సర్క్యూట్‌తో

    కిరాణాషాపు దగ్ధం

    రూ.8 లక్షల ఆస్తి నష్టం

    కౌడిపల్లి(నర్సాపూర్‌): ప్రమాదవశాత్తు కిరాణాషాపు దగ్ధం కావడంతో ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్‌ వద్ద శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆర్‌ఐ విజయలక్ష్మి, బాధితుడి వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేట గ్రామానికి చెందిన గుండ వీరేశంగుప్తకు వెంకట్రావ్‌పేటగేట్‌వద్ద వేంకటేశ్వర హోల్‌సేల్‌, రిటైల్‌ కిరాణాషాపు ఉంది. రోజుమాదిరిగా శనివారం షాపు తెరిచి మధ్యాహ్నం 12గంటల తరువాత కిరాణా సామగ్రి తీసుకొచ్చేందకు షాప్‌ బంద్‌చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు షాపు ఓపెన్‌చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలార్పారు. అప్పటికే షాపులో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్‌ఐ విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సుమారు రూ.8లక్షలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు.

  • హత్నూర(సంగారెడ్డి): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం... పటాన్‌ చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన మంగలి జోగేందర్‌ (40) కొంతకాలంగా అత్తగారు గ్రామమైన తెల్లాపూర్‌ ఇంద్రనగర్‌లో భార్యాపిల్లలతో కలిసి జీవనం కొనసాగిస్తూ కులవృత్తిని చేసుకొని బతుకుతున్నాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సైతం భార్య లావణ్యతో గొడవపడిన జోగేందర్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. బైక్‌పై మండలంలోని షేర్‌ఖాన్‌పల్లి గ్రామ శివారులోని పలుకుమీది నల్ల పోచమ్మ ఆలయం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీధర్‌ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త మృతి

    కొండపాక(గజ్వేల్‌): పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతుల్లో భర్త శనివారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా... కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడెం తార, తాడెం మల్లేశంలకు పదేళ్ల కింద వివాహం కాగా సంతానం కలుగలేదు. దీంతో పాటు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇటీవల భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలించగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో తెల్లవారుజామున భర్త మృతి చెందగా, భార్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న గజ్వేల్‌ కోర్టు జడ్జి ఆస్పత్రిలో మరణ వాంగ్మూలం సేకరించిన విషయం పాఠకులకు తెలిసిందే.

  • చేగుంట(తూప్రాన్‌): ఇంటర్‌ విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శిగా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని ఇంటర్‌ విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

    ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ అదృశ్యం

    వర్గల్‌(గజ్వేల్‌): ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని గౌరారంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం... కుకునూర్‌పల్లికి చెందిన పోల్కంపల్లి సత్యనారాయణ కూతురు అక్షిత(24) గౌరారంలోని ప్రైవేట్‌ స్కూలులో టీచర్‌గా పనిచేస్తుంది. రోజు మాదిరిగా ఆమె సోదరుడు శనివారం ఉదయం 9 గంటలకు స్కూల్‌ ఎదుట దింపి వెళ్లాడు. కానీ ఆమె స్కూల్‌కు గాని, తిరిగి ఇంటికి గాని వెళ్లలేదు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    డ్రగ్‌ పట్టివేత

    జహీరాబాద్‌ టౌన్‌: రాష్ట్ర సరిహద్దులో గల చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద డ్రగ్‌ను పట్టుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ.శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. వాహనాల తనిఖీలో భాగంగా గోవా నుంచి వస్తున్న ట్రావెల్‌ బస్సుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ ప్రాంతానికి చెందిన బుద్ధరాం వద్ద 1.052 కిలోగ్రాముల డ్రగ్‌(చరాస్‌) లభించింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

    పేకాటరాయుళ్ల అరెస్ట్‌

    చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం... చిలప్‌చెడ్‌ చర్చి వెనుక పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 వేలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

  • ఏడుపాయల దేవస్థానం

    మెదక్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల దేవస్థానం ఉంది. ఒకప్పుడు భీకరమైన కీకారణ్యం అది. రుషులు తప్పస్సు చేసిన వేదభూమి, పుణ్యభూమిగా చరిత్ర చెబుతోంది. రాతిగుహల మధ్య సహజసిద్ధంగా వనదుర్గామాత వెలిసింది. కొలిసిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏటా మహాశివరాత్రికి మూడు రోజుల పాటు జాతర కన్నుల పండువగా జరుగుతుంది. అలాగే మాఘ అమావాస్య, ఉగాది పర్వదినాల్లో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడికి తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఆది, మంగళవారాల్లో వచ్చి దర్శనం చేసుకుంటారు.