Archive Page | Sakshi
Sakshi News home page

International

  • పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వేర్పాటువాద సెగలతో అట్టుడుకుతోంది. గురువారం బలోచిస్థాన్‌లోని ఖరాన్ న‌గ‌రంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. స్థానిక డిప్యూటీ కమిషనర్ ల‌క్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దళాలు మెరుపు దాడి చేశాయి. అత‌డిని అదుపులోకి తీసుకునేందుకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్ర‌య‌త్నించింది.

    కానీ డిప్యూటీ కమిషనర్ మాత్రం వారికి చిక్క‌లేదు. కానీ అక్క‌డే విధుల్లో ఉన్న ఒక లేవీస్ (స్థానిక భద్రతా దళం) అధికారిని తొలుత అదుపులోకి తీసుకున్నారు. అయితే విచార‌ణ‌ త‌ర్వాత అత‌డు స్థానిక బలోచ్ వ్యక్తి అని తెలియడంతో  బీఎల్ఏ విడిచిపెట్టింది. కాగా ఈ ఆపరేషన్ సమయంలో డిప్యూటీ కమిషనర్‌కు చెందిన రెండు అధికారిక వాహనాలను బీఎల్ఏ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 

    ఈ విష‌యాన్ని బీఎల్ఏ అధికార ప్రతినిధి ఆజాద్ బలోచ్ ధ్రువీకరించారు. ప్రస్తుత ఖరాన్ డిప్యూటీ కమిషనర్ కేవలం తన పరిపాలనా విధులకు మాత్రమే పరిమితం కావాలని, బలోచ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని బలోచ్ ధ్రువీకరించారు.  అయితే ఈ ఘ‌ట‌న‌పై పాకిస్తాన్ ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కాగా ప్ర‌స్తుత ఖరన్ డిప్యూటీ కమిషనర్‌గా మునీర్ అహ్మద్ సూమ్రో ఉన్నారు.
     

  • దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein)  కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.  ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.

    సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై  దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని  పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. 

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    అంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 

    ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

  • వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల Y క్రోమోజోమ్‌ (Y-chromosome)ను ఎక్కువగా నష్ట పోతున్నారట.  వృద్ధ పురుషుల్లో Y క్రోమోజోమ్ క్షీణించడం సాధారణమే అయినప్పటికీ కానీ తాజాగా ఈ ధోరణి బాగా పెరుగుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులతోపాటు,  తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉంది అంటున్నారు పరిశోధకులు 

    వయస్సు పెరిగే కొద్దీ పురుషులలో 'Y' క్రోమోజోమ్ కోల్పోవడం (LOY) వల్ల అనేక  ఆరోగ్య సమస్యలతో ముడిపడి  ఉందంటున్నారు. ఈ మార్పు గుండె జబ్బులు, క్యాన్సర్ , తక్కువ ఆయుష్షుకు ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. గతంలో, Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల పెద్దగా నష్టం లేదని పరిశోధకులు భావించేవారు. ఎందుకంటే ఇందులో ఇతర క్రోమోజోమ్‌ల కంటే తక్కువ జన్యువులు ఉంటాయి. దీని ప్రధాన పని పురుష లక్షణాలను నిర్ణయించడం మరియు వీర్యకణాల అభివృద్ధికి తోడ్పడటం మాత్రమే అని అనుకునేవారు. కానీ కొత్త పరిశోధనలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.

    60 ఏళ్ల పురుషులలో సుమారు 40శాతం మందిలో, 90 ఏళ్ల వారిలో 57శాతం మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ధూమపానం, రసాయనాల ప్రభావం వల్ల ఈ ముప్పు పెరుగుతుంది. Y క్రోమోజోమ్ లేని కణాలు వేగంగా పెరుగుతాయి. ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల శరీరంలో ట్యూమర్లు (గడ్డలు) వచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: 60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!

    ఆరోగ్య సమస్యలు 
    Y క్రోమోజోమ్ కోల్పోవడం వల్ల అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు ఆధారాలు లభించాయిప్రధానంగా గుండె జబ్బులు, అల్జీమర్స్ క్యాన్సర్:లాంటివి. జర్మనీలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం ప్రకారం, 60 ఏళ్లు పైబడిన పురుషులలో Y క్రోమోజోమ్ లోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రక్త కణాలలో 'Y' లేకపోవడం వల్ల గుండె కండరాలు దెబ్బతిని, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అల్జీమర్స్ రోగులలో ఈ లోపం పది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ కణాలలో Y క్రోమోజోమ్ పూర్తిగా ఉండదు.

    ఇతర వ్యాధులు: కిడ్నీ వ్యాధులు, కరోనా (COVID-19) మరణాలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆడవారితో పోలిస్తే మగవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉండటానికి ఇది ఒక కారణం కావొచ్చని కూడా అంచనా వేశారు.ఎలుకల మీద చేసిన ప్రయోగాలలో, Y క్రోమోజోమ్ లేని రక్తకణాలను ఎక్కించినప్పుడు వాటిలో గుండె వైఫల్యం ,గుండె బలహీనపడటం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.

    ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!


    'Y' క్రోమోజోమ్ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
    మానవ కణాలలో సాధారణంగా 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో ఒక జత 'లైంగిక క్రోమోజోములు'. స్త్రీలలో రెండు 'X' క్రోమోజోములు ఉంటే, పురుషులలో ఒక 'X' , ఒక 'Y' క్రోమోజోమ్ ఉంటాయి.Y  క్రోమోజోమ్ సాపేక్షంగా తక్కువ జన్యువులను కలిగి ఉంటుంది. దీని ప్రధాన పాత్ర పురుష లింగ నిర్ధారణ.ఇది సాధారణ స్పెర్మ్ అభివృద్ధికి కూడా  తోడ్పడుతుంది. దీనిలో సుమారు 51 ప్రోటీన్-కోడింగ్ జన్యువులు ఉంటాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.కొన్ని 'Y' జన్యువులు క్యాన్సర్ రాకుండా అడ్డుకునే (Cancer suppressors) గుణాన్ని కలిగి ఉంటాయి.

    Y క్రోమోజోమ్ ఎందుకు పోతుంది అంటే కణాలు విభజన చెందే సమయంలో జరిగే పొరపాట్ల వల్ల 'Y' క్రోమోజోమ్ కణాల నుండి తొలగిపోతుంది. Y' క్రోమోజోమ్ కేవలం పురుషత్వాన్ని నిర్ణయించేది మాత్రమే కాదు, అది మొత్తం శరీర ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటిది. భవిష్యత్తులో ఈ క్రోమోజోమ్ లోపాన్ని ముందే గుర్తించడం ద్వారా పురుషులలో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

    ఇదీ చదవండి: పక్షవాతంతో భర్త.. 70 ఏళ్ల మహిళ హత్య : రూ. 65 లక్షల గోల్డ్‌ చోరీ

Crime

  • సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని డిగ్రీ కాలేజ్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నారిపై ఒక మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి గురించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికులు చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.  

  • సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    పోలీసుల వివరాల మేరకు..  నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్‌ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు.  అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్‌ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.

    ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.

    ఈ  ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్‌లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.

    ఈ దర్యాప్తులో  ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ,ఎస్‌బీఐ ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

    తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది.
     
    ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్‌  డీసీపీ ఐపీఎస్‌ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు.

Sports

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భుత‌మైన విజ‌యంతో ముగించింది. చెన్నై వేదికగా కెన‌డాతో జ‌రిగిన త‌మ చివ‌రి మ్యాచ్‌లో రషీద్ సేన ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత  20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    ఓపెన‌ర్ ఇబ్రహీం జద్రాన్ మ‌రోసారి సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. జ‌ద్రాన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 95 ప‌రుగులు చేసి అజేయంగా  నిలిచాడు. అత‌డితో పాటు సెదికుల్లా అటల్(44), రెహ్మ‌నుల్లా గుర్బాజ్‌(30) రాణించారు. కెన‌డా బౌల‌ర్ల‌లో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. డిలాన్ హీలిగర్ ఓ వికెట్ సాధించాడు.

    న‌బీ మ్యాజిక్‌
    అనంత‌రం 201 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన కెన‌డా నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 118 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. అఫ్గాన్ స్పిన్న‌ర్ మ‌హ్మ‌ద్ నబీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి కెన‌డాను దెబ్బ తీశాడు. అత‌డితో పాటు ర‌షీద్ ఖాన్ రెండు, ముజీబ్‌, అజ్మ‌తుల్లా త‌లా వికెట్ సాధించారు.

    కెనడా బ్యాట‌ర్ల‌లో హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన బ్యాటర్లు ఎవరూ అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక‌పోయారు. కాగా ఇప్ప‌టికే అఫ్గాన్ జ‌ట్టు కివీస్‌, సౌతాఫ్రికా చేతిలో ఓట‌మి పాలై సూప‌ర్-8కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. మ‌రోవైపు అఫ్గానిస్తాన్ హెడ్‌కోచ్‌గా జోనాథన్ ట్రాట్ ప్ర‌యాణం ముగిసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ట్రాట్ ముందే ప్ర‌క‌టించాడు.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, కెనడా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధించింది. 

    ఓపెనర్‌ ఇ‍బ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 95 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వారిలో సెదిఖుల్లా అటల్‌ (44), రహ్మానుల్లా గుర్బాజ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. 

    గుల్బదిన్‌ నైబ్‌ (1), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దర్విష్‌ రసూల్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెనడా బౌలర్లలో జస్కరన్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. దిలన్‌ హేలిగర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

    అనంతరం​ భారీ లక్ష్య ఛేదనలో కెనడా తడబడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా (13), నవ్‌నీత్‌ ధలివాల్‌ (0) ఔట్‌ కాగా.. యువ్‌రాజ్‌ సమ్రా (17), హర్ష్‌ ఠాకూర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో ముజీబ్‌, ఒమర్‌జాయ్‌కు తలో వికెట్‌ దక్కింది.

    కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైపోయాయి. ఆఫ్ఘన్‌, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్‌ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కు చేరాయి.

     

  • మొట్ట మొద‌టి టి20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్న టీమిండియా విధ్వంక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో ఆడ‌తాడా, లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లీగ్ మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ బ్యాట‌ర్‌కు సూప‌ర్- 8 మ్యాచ్‌ల్లో ఆడే అవ‌కాశం రాక‌పోవ‌చ్చ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డి స్థానంలో సంజూ శామ్స‌న్‌ను తీసుకుంటార‌ని క్రీడా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌రుస‌గా మూడుసార్లు  డ‌కౌట్ కావ‌డంతో అభిషేక్‌పై వేటు త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు.

    లీగ్ ద‌శ‌లో న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌కు అభిషేక్ దూరం కావ‌డంతో సంజూకు అవ‌కాశం ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో 8 బంతుల్లో 22 ప‌రుగులు చేశాడు శామ్స‌న్‌. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ టీమ్‌లో చోటు ద‌క్కించుకున్న త‌ర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించ‌లేక‌పోయాడు. వ‌చ్చిన ఒక‌ అవ‌కాశాన్ని కూడా స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాడు. గ‌త కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. అయితే అభిషేక్ వైఫ‌ల్యం సంజూకు క‌లిసొచ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

    మ‌రోవైపు వ‌రుస వైఫ‌ల్యాల‌తో స‌త‌మ‌త‌వుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెట‌ర‌న్న వాద‌నలు విన్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 22న అహ్మ‌దాబాద్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే మ్యాచ్‌లో సంజూకు చాన్స్ రావొచ్చ‌ని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డ‌ర్‌లో ముగ్గురు లెఫ్టాండ‌ర్ బ్యాల‌ర్లే ఉండ‌డం స‌మ‌స్యేన‌ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డ‌ష్కాటే అంగీక‌రించడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాలి.

    అటు బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి మిన‌హా మిగ‌తా స్పిన్న‌ర్లు స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సూప‌ర్-8 మ్యాచ్‌ల్లో బౌల‌ర్లు స‌మిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త‌ర్వాతి మ్యాచ్‌కు వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ (Axar Patel) జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తే ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చ కూడా క్రీడాభిమానుల్లో న‌డుస్తోంది. బౌలింగ్‌తో పాటు లోయ‌ర్ ఆర్డ‌ర్‌గా బ్యాటింగ్ చేయ‌గ‌ల స‌త్తా వాషింగ్టన్ సుందర్‌కు ఉంది.

    చ‌ద‌వండి: అత‌డిని కావాల‌నే తొక్కేస్తున్నారా?

    భార‌త జ‌ట్టు అంచ‌నా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

  • భారత మహిళా క్రికెట్‌ జట్టు సారధి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన టీ20 మ్యాచ్‌తో ఈ ఘనత సాధించింది. 

    ఈ మ్యాచ్‌ కలుపుకొని హర్మన్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 356 మ్యాచ్‌లు ఆడింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్‌ ప్లేయర్‌ సూజీ బేట్స్‌ పేరిట ఉండేది. సూజీ తన కెరీర్‌లో 355 మ్యాచ్‌లు ఆడింది. ఈ జాబితాలో హర్మన్‌, సూజీ తర్వాతి స్థానంలో ఆసీస్‌ ప్లేయర్‌ ఎల్లిస్‌ పెర్రీ ఉంది. పెర్రీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 349 మ్యాచ్‌లు ఆడింది.

    హర్మన్‌ విషయానికొస్తే.. 2009 మార్చి 7న పాకిస్తాన్‌పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది.  ఇప్పటివరకు 6 టెస్టులు, 161 వన్డేలు, 189 T20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2016లో కెప్టెన్సీ చేపట్టిన హర్మన్‌, 2025 నవంబర్‌లో  వన్డే వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసింది. హర్మన్‌ తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000కిపైగా పరుగులు సాధించింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌ 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్‌-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

    వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు.

    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్‌నర్‌ (4-0-22-3), కిమ్‌ గార్త్‌ (3-0-16-2), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (4-0-18-2), సోఫీ మోలినెక్స్‌ (4-0-37-2) ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. 

    భారత ఇన్నింగ్స్‌కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

    భారత ఇన్నింగ్స్‌లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్‌ (19), క్రాంతి గౌడ్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ (4), అమన్‌జోత్‌ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం​ కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.

    కాగా, ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది.

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్‌-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.

    ఈ గ్రూప్‌లో జింబాబ్వే.. ఒమన్‌, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్‌ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్‌-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్‌లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (62), పవన్‌ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ పెరీరా 22, కుసాల్‌ మెండిస్‌ 14, కమిందు మెండిస్‌ 7, దసున్‌ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్‌) పరుగులు చేశారు. దుషన్‌ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్‌ ఈవాన్స్‌, గ్రేమీ క్రీమర్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్‌ బర్ల్‌ ఓ వికెట్‌ తీశాడు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్‌ సికందర్‌ రజా (45) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్‌ మరుమణి (34), ర్యాన్‌ బర్ల్‌ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్‌ తీశారు. 

  • క్రికెట్‌ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఓ ఫీల్డ్‌ అంపైర్‌ ప్రాణాలు కోల్పోయాడు. 15-20 మంది ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన కాన్పూర్‌లోని (ఉత్తర్‌ప్రదేశ్‌) శుక్లగంజ్ సప్రూ మైదానంలో బుధవారం చోటు చేసుకుంది. 

    స్థానికంగా అండర్‌-13 మ్యాచ్ జరుగుతున్న సమయం‌లో తేనెటీగల గుంపు ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అంపైరింగ్‌ చేస్తున్న 65 ఏళ్ల మాణిక్ గుప్తాను తేనెటీగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో గుప్తా ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన క్రికెట్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.  

    తేనెటీగలు అంపైర్ గుప్తాతో పాటు మరో ఫీల్డ్‌ అంపైర్ జగదీశ్ శర్మపై కూడా దాడి చేశాయి. అలాగే మ్యాచ్‌ ఆడుతున్న  15–20 మంది ఆటగాళ్లను కూడా చుట్టుముట్టాయి. గుప్తాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో అంపైర్‌ జగదీశ్ శర్మకు అత్యవసర చికిత్స అందించగా.. ప్రస్తుతం అతను ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. అస్వస్థతకు గురైన ఆటగాళ్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

    ఊహించిన ఈ ఘటనపై కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్. సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుప్తాను ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా తేనెటీగలు ఆయన ముఖం, శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నాయని ఆయన వాపోయారు. గుప్తాకు స్థానిక క్రికెట్‌లో అనుభవజ్ఞుడైన అంపైర్‌గా పేరుంది.

    తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు
    క్రికెట్లో తేనెటీగల దాడులు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి దాడులు జరిగాయి. అయితే భారత్‌లో ప్రాణనష్టం మాత్రం ఎప్పుడూ సంభవించలేదు. కాన్పూర్‌ ఘటనే తొలిసారి.

    గతేడాది తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా ‍కూడా ఇదే తరహాలో తేనెటీగల దాడి జరిగింది. ఆ ఘటనలో పలువురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు.

    2019లో త్రివేండ్రం గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఇండియా ఏ-ఇంగ్లండ్ లయన్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా కూడా తేనెటీగలు దాడి చేశాయి. ఆ సందర్భంలో స్టేడియంలోని చాలామంది ప్రేక్షకులు తేనెటీగల దాడికి గురై అసుపత్రిపాలయ్యారు.

     

  • Shikhar&Sophie టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, ప్రియురాలు సోఫీ షైన్ (Sophie Shine) పెళ్లి సందడి మొదలైంది.  అయేషా ముఖర్జీతో విడాకుల తరువాత ధావన్‌ తన జీవితంలో మరో కీలక అడుగు వేయబోత్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో తనదైన శైలిలోబ్యాటింగ్ చేస్తూ ‘గబ్బర్’గా పాపులర్‌ శిఖర్ ధావన్, వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. తన  ప్రేయసి సోఫీ షైన్‌ (ఐరిష్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్)తో కలిసి ఏడడుగులు వేసేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 19 గురువారం ధావన్ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి. అభినందనల వెల్లువ కురుస్తోంది. 

    తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో శిఖర్ ధావన్‌  సోఫీ షైన్ సంగీత్ నైట్ నుండి ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో శిఖర్ తెల్లటి షేర్వానీలో అందంగా కనిపించగా, సోఫీ బ్లింగీ గా బంగారు రంగు లెహంగాలో  కళకళలాడింది.  ఈ ఏడాది జనవరి 2న ఈ జంట నిశ్చితార్థం  చేసుకున్నారు. ఫిబ్రవరి 19న  వివాహం చేసుకోవచ్చని ముందుగా ఊహాగానాలు వచ్చాయి.  ప్రస్తుతం వెడ్డింగ్‌డేట్‌పై ధృవీకరణ లేనప్పటికీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా  జరిగిన సంగీత్ నైట్‌ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

     

    ఎవరీ సోఫీ షైన్‌
    సోఫీ షైన్ 1990 లో జన్మించిన ఐరిష్ మహిళ.  సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుంది. ప్రఖ్యాత లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది.ఆమె గ్లామర్ ప్రపంచం నుండి రాలేదు, శిఖర్ లాగా కాకుండా, కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.మమార్కెటింగ్ మరియు మేనేజ్‌మెంట్ విద్యార్థిని అయిన ఆమె తొలుత బహుళజాతి కంపెనీలో  పనిచేసింది. అనంతరం  నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో చేరింది.దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్‌లో మొదటి సారి కలిశారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సోఫీ షైన్, శిఖర్ ధావన్‌తో సన్నిహితంగా కనిపించినప్పుడు  వీరి డేటింగ్ బజ్ ప్రారంభమైంది.

    కాగా  శిఖర్ 2012లో అయేషాను వివాహం చేసుకున్నాడు.  ఈ జంటకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు. 

  • మహిళల ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు స్వదేశంలో టీమిండియాతో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ ఆడుతుంది. ఇందులో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కాగా.. భారత్‌ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టుకు షాకిచ్చి తమ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆసీస్‌ రెండో మ్యాచ్‌లోనే ప్రతీకారం తీర్చుకుంది.

    కాన్‌బెర్రా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ 19 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్‌-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

    వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు.

    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్‌నర్‌ (4-0-22-3), కిమ్‌ గార్త్‌ (3-0-16-2), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (4-0-18-2), సోఫీ మోలినెక్స్‌ (4-0-37-2) ధాటికి భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. 

    భారత ఇన్నింగ్స్‌కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్‌ హర్మన్‌ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. భారత ఇన్నింగ్స్‌లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్‌ (19), క్రాంతి గౌడ్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ (4), అమన్‌జోత్‌ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం​ కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.

    కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. 
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కి అర్హత సాధించాయి.

    సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌, జింబాబ్వే గ్రూప్‌ 1లో ఉండగా.. ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ గ్రూప్‌ 2లో ఉన్నాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్‌ 1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరుగనుండగా.. గ్రూప్‌ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్‌, ఫైనల్స్‌ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

    సూపర్‌-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్‌పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్‌-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్‌-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్‌ ఆఫ్‌ వార్‌ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.

    సూపర్‌ 8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇరు గ్రూప్‌ల్లో ఆ రెండు బెర్త్‌ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.

    గ్రూప్‌ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికా హాట్‌ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్‌, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్‌ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

    విండీస్‌ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా   గ్రూప్‌ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి జోష్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్‌ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.

    ఎందుకంటే, ప్రస్తుతం భారత్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్‌ కూడా ఉంది. కాబట్టి భారత్‌ ఫైనల్‌-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. 

    ఇక మిగిలిన రెండో బెర్త్‌ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్‌ దశలో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్‌ చేసింది. 

    మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్‌లో తృటిలో మిస్‌ అయిన టైటిల్‌ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్‌ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్‌ సాధించి, క్రికెట్‌ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. 

    గ్రూప్‌ 1 నుంచి అండర్‌ డాగ్‌ ఏ జట్టు అంటే విండీస్‌ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్‌ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్‌ హోప్‌ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్‌ సహా హెట్‌మైర్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, మోటీ, షమార్‌ జోసఫ్‌ సూపర్‌-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.

    గ్రూప్‌ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ గ్రూప్‌ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్‌ మినహా మిగతా మూడు జట్లు సెమీస్‌ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. 

    ఈ జట్టు సెమీస్‌కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్‌పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. 

    ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్‌ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్‌ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.

    ఈ గ్రూప్‌ నుంచి మరో అండర్‌ డాగ్‌గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్‌ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్‌పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ను మట్టికరిపించగల సమర్దులు. 

    కాబట్టి ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్‌ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్‌లో హాట్‌ ఫేవరెట్‌ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్‌ ఫైట్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్‌ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. 

    పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్‌-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్‌లోకి వస్తే.. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్‌లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే​. అతికష్టం మీద సూపర్‌-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.

    ఓవరాల్‌గా చూస్తే.. గ్రూప్‌ 1 నుంచి సెమీస్‌ రేసులో భారత్‌ హాట్‌ ఫేవరెట్‌ కాగా.. రెండో బెర్త్‌ కోసం​ సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్‌ 2 నుంచి ఏ జట్టునూ హాట్‌ ఫేవరెట్‌ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు.

     

  • భారత యువ క్రికెట్‌ తరంగం వైభవ్‌ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్‌ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.

    ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లోనూ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్‌ ఆరో టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు గెలుచుకున్నాడు.

    ఐపీఎల్‌-2026కు సన్నద్ధం
    ఇక వైభవ్‌ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్‌ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.

    పరీక్షలకు దూరం
    అయితే, వైభవ్‌ చదివే స్కూల్‌ డైరెక్టర్‌ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్‌ సూర్యవంశీ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్‌డే’తో మాట్లాడుతూ..

    అవును.. మాకు అదే ముఖ్యం
    ‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుతో కలిసి క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈసారి వైభవ్‌ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.

    వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్‌ ఎప్పుడూ ముందే ఉంటాడు.

    అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్‌ మాత్రమే’’ అని సంజీవ్‌ సూర్యవంశీ స్పష్టం చేశారు. 

    కాగా మంగళవారం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్‌ బిహార్‌లో ఉ‍న్న పోదార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఎగ్జామ్‌కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్‌ వేశామని పాఠశాల ప్రిన్సిపల్‌ ఎన్‌కే సిన్హా ANIకి తెలిపారు.

    చదవండి: అతడి ఖేల్‌ ఖతం.. కెరీర్‌ ముగిసినట్లే: పాంటింగ్‌

  • ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. ఆసీస్‌ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.

    తొలుత ఆసీస్‌ ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

    వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. 

    లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు. స్కోర్‌ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్‌, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్‌ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది. 

    కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. 

  • వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని, ఓ అత్యంత అరుదైన ఫీట్‌ను సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇటలీతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు కూడా పట్టిన షమార్‌.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ను నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

    పురుషుల క్రికెట్‌లోనే కాకుండా మహిళల క్రికెట్‌లోనూ ఇలాంటి ఫీట్‌ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ప్రదర్శనతో షమార్‌ మరో రికార్డు కూడా సమం చేశాడు. ఓ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు (4) పట్టిన నాన్‌ వికెట్‌కీపర్‌గా డారెన్‌ సామీ, మార్క్రమ్‌, మ్యాక్స్‌వెల్‌, జార్జ్‌ మున్సే సరసన చేరాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూన ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా గ్రూప్‌ దశలో (సి) ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసి, అజేయ జట్టుగా సూపర్‌-8 దశకు చేరింది. 

    సూపర్‌-8లో విండీస్‌.. భారత్‌, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

    రాణించిన హోప్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. షాయ్‌ హోప్‌ (46 బంతుల్లో 75; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌ (24 నాటౌట్‌), మాథ్యూ ఫోర్డ్‌ (16 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇటలీ బౌలర్లలో బెన్‌ మనెంటి, కలుగమగే తలో 2 వికెట్లు తీయగా.. అలీ హసన్‌, డ్రాకా చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఇటలీ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. షమార్‌ జోసఫ్‌ (4-0-30-4), మాథ్యూ ఫోర్డ్‌ (4-0-19-3), గుడకేశ్‌ మోటీ (4-0-24-2), అకీల్‌ హొసేన్‌ (3-0-25-1) ధాటికి ఆ జట్టు 18 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. 

    ఇటలీ ఇన్నింగ్స్‌లో బెన్‌ మనెంటి (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. మరో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో ఇటలీ ప్రయాణం ముగిసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ బరిలోకి దిగిన ఈ ఐరోపా జట్టు తమ కంటే చాలా రెట్లు మెరుగైన నేపాల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించింది.

Movies

    • రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..
    • పట్టుశారీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు..
    • అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే వైబ్స్..
    • ఈషా ఫౌండేషన్ జ్ఞాపకాల్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి..

     

     

     

     

     

     

  • సుహాస్‌ హీరోగా నటిస్తున్న హే బల్వంత్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ స్రవంతి. ఈ మూవీలో  కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 20న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో స్రవంతి మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయింది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన స్రవంతి తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందులు పంచుకుంది. ఒకానొక సమయంలో డైమండ్‌ జ్యూవెలరీ స్టోర్‌లో సేల్స్ గర్ల్‌గా కూడా ఉద్యోగం చేశానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ జాబ్‌ చేసేటప్పుడు గంటలకొద్ది నిలబడే ఉండాలని తెలిపింది. ఆ సమయంలో నిలబడలేక చాలా ఇబ్బంది పడ్డానని బోరున ఏడ్చేసింది. అయితే ఈ ఉ‍ద్యోగం నా ఇష్టంతోనే చేశానని.. నా జీతం కంటే ఇన్‌సెంటివ్స్‌ ఎక్కువగా వచ్చేదని వెల్లడించింది.

    ఇటీవల ఎక్కువగా సినిమా ప్రమోషన్స్‌లో పైకి నవ్వుతూ కనిపించే స్రవంతి.. తన కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొని ప్రస్తుతం టాలీవుడ్‌లో రాణిస్తోంది. అభిరామ్ అనే వ్యక్తి తాను ఇండస్ట్రీలోకి రావడానికి హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది. స్రవంతి చొక్కారపు స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. 2009లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నటి అవడానికి చాలా టైమ్ పట్టింది.

     

     

     

     

     

  • దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్‌ అవైటేడ్  అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విలన్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఈగ ఫేమ్, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నారని లేటేస్ట్ బజ్ హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంలో  సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి ఈగ తర్వాత మరోసారి కిచ్చా సుదీప్‌కు.. రాజమౌళి డైరెక్షన్‌లో పనిచేసే ఛాన్స్ దక్కనుంది. వారణాసిలో పవర్‌ఫుల్ రోల్‌ చేస్తే ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. మరి ఈ విషయంపై దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇస్తే తప్ప ఫ్యాన్స్‌కు డైలామా తప్పేలా కనిపించడం లేదు. కాగా.. వారణాసిలో  బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మెప్పించనుంది.
     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు కొత్త సినిమాలపై ఆడియన్స్‌లో ఆసక్తి ఓ రేంజ్‌లో ఉంటోంది. ఈ శుక్రవారం తెలుగులో సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్, నవాబ్ కేఫ్ లాంటి చిన్న చిత్రాలు సందడి చేయనున్నాయి. వీటిలో హే బల్వంత్‌పైనే ఆడియన్స్‌ కొంతమేర బజ్‌ ఉంది. నవాబ్‌ కేఫ్‌పై కూడా ఆడియన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం దాదాపు 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో తెలుగు హారర్ థ్రిల్లర్‌ ఈషా మూవీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ మూవీస్ సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్‌ మూవీ కెన్నడీతో పాటు పలు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్‌ ఫ్యామిలీతో కలిసి మీకిష్టమైన సినిమాలు చూసేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    • స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

    • పవనే(కొరియన్ మూవీ)- ఫిబ్రవరి 20

    •  ఫైర్ బ్రేక్(స్పానిష్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 20

       

      అమెజాన్ ప్రైమ్ 

    • ఈషా(తెలుగు హారర్ థ్రిల్లర్‌)-  ఫిబ్రవరి 20

    • తీర్థరూప తాండేయవారిగే-(కన్నడ సినిమా) — ఫిబ్రవరి 20

    • హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20


    జియో హాట్‌స్టార్

    •    లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20

    ఆహా

    •    హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20

    జీ5

    •    రాక్షస(కన్నడ క్రైమ్ థ్రిల్లర్‌)-  ఫిబ్రవరి 20

    •    పాతిరాత్రి(మలయాళ థ్రిల్లర్)- ఫిబ్రవరి 20

    •    కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20

    సన్‌ నెక్ట్స్..

    • అమోజ్ అలెగ్జాండర్-(మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్‌)- ఫిబ్రవరి 20

    • ఒండిమునియుమ్ నల్లపడనుమ్- (తమిళ సినిమా)- ఫిబ్రవరి 20

    లయన్స్ గేట్ ప్లే

    •    హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

    ఆపిల్ టీవీ ప్లస్

    • ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

     

  • మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గతేడాది వరుస సినిమాలతో అలరించింది. బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. అయితే ప్రస్తుతం ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఆర్జే షాన్ కాంబినేషన్‌లో మరోసారి కనిపించనుంది.

    అయితే ఇటీవల ముంబయిలో ఓ అవార్డ్ వేడుకలో పాల్గొన్న అనుపమ అందరి దృష్టిని ఆకర్షించింది. బైసన్ కో స్టార్ ధృవ్ విక్రమ్‌తో కలిసి సందడి చేసింది. ఈ వేదికపై అనుపమకు హ్యాపీ బర్త్ డే అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు. ఆ తర్వాత యాంకర్‌ అనుపమకు ఓ ప్రశ్న వేసింది. ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని ప్రశ్నించింది. దీనికి అనుపమ ఆసక్తికర సమాధానమిచ్చింది. నేను ధృవ్‌కు కాల్ చేస్తానని నవ్వుతూ ఆన్సరిచ్చింది.

    ఇది చూసిన నెటిజన్స్‌ వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన మరో అవార్డుల ఫంక్షన్‌లోనూ అనుమపతో ఉన్న సెల్ఫీని ధృవ్ విక్రమ్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి డేటింగ్‌ రూమర్స్  మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఎవరూ కూడా స్పందించలేదు. 

     

  • 'ఉయ్యాల జంపాల' సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా కనిపించింది పునర్నవి భూపాలం. కొన్ని సినిమాలు చేసినా అవేవీ వర్కవుట్‌ కాలేదు. అయితే తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. రాహుల్‌తో లవ్‌ ట్రాక్‌తో బాగా ఫేమస్‌ అయింది. కానీ షో ముగిసిన తర్వాత రాహుల్‌- పునర్నవి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు.

    పెళ్లికి వేళాయె
    కొంతకాలం క్రితం రాహుల్‌ సిప్లిగంజ్‌ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలయ్యాడు. ఇప్పుడు పునర్నవి కూడా పెళ్లికి రెడీ అయింది. ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. హేమంత్‌ వర్మ ప్రపోజల్‌కు ఎస్‌ చెప్పానంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. తాజాగా వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 

    లగ్న పత్రిక
    ఈ రోజు పునర్నవి - హేమంత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల సమక్షంలో లగ్నపత్రిక రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను పునర్నవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో నీలిరంగు చీరలో పునర్నవి అందంగా మెరిసిపోతోంది. అయితే తను సింగిల్‌గా దిగిన పిక్స్‌ మాత్రమే అభిమానులతో పంచుకుంది.

    చదవండి: 6 సార్లు శివాజీగా మెప్పించిన యాక్టర్‌.. ఒక్క సంఘటనతో సంచలన నిర్ణయం

  • ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్‌, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్‌ అనే బయాలజిస్ట్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

    సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

    కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు. 

  • ఛత్రపతి శివాజీ.. ఈ పేరు వినగానే తెలియని ధైర్యం ఒంట్లోకి వస్తుంది. తన మతాన్ని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన ధీరశాలి. నేడు (ఫిబ్రవరి 19న) శివాజీ మహారాజ్‌ జయంతి. ఈ సందర్భంగా వెండితెరపై ఆరుసార్లు శివాజీగా వేషం వేసి మెప్పించిన నటుడెవరో చూసేద్దాం..

    ఆరు సార్లు శివాజీగా..
    ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత చిన్మయ్‌ మాండ్లేకర్‌.. ఒకటీ రెండుసార్లు కాదు, ఏకంగా ఆరుసార్లు వెండితెరపై శివాజీ పాత్రను పోషించాడు. ఫర్జంద్‌, ఫత్తేశికస్త్‌, పవన్‌కైండ్‌, షేర్‌ శివరాజ్‌, సుబేదార్‌, శివరాయంచ అనే ఆరు మరాఠి సినిమాల్లో శివాజీగా వేషం కట్టాడు. కానీ ఒకే ఒక్క సంఘటన వల్ల ఇకపై ఎన్నటికీ శివాజీగా కనిపించనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

    అసలేం జరిగిందంటే?
    మరాఠి నటుడు చిన్మయ్‌ మాండ్లేకర్‌.. శివాజీ పాత్రలో నటించినందుకుగానూ ప్రత్యేక గుర్తింపు, ఆదరణ పొందాడు. కానీ ఆయన కుమారుడికి జహంగీర్‌ అనే పేరు పెట్టాడు. ఆ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తనపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. కుటుంబం మొత్తానిపై విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన చిన్మయ్‌.. ఈ ట్రోలింగ్‌ అన్యాయం అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. 

    సంచలన నిర్ణయం
    వృత్తిపరంగా విమర్శలు చేస్తే ఓకే కానీ, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేయడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశాడు. తన కొడుకు, భార్య క్యారెక్టర్‌పై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారని, ఇది తప్పని అభిప్రాయపడ్డాడు. శివాజీ మహారాజ్‌ అంటే తనకు ఎంతో గౌరవం అని, ఇకపై ఆయన పాత్రను వెండితెరపై చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

    కుమారుడికి ఆ పేరు ఎందుకంటే?
    మరి కుమారుడికి జహంగీర్‌ పేరు ఎందుకు పెట్టాడంటే? జహంగీర్‌ జంషెడ్‌ నవ్రోజ్‌లో జన్మించాడు. భారతరత్న జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా స్ఫూర్తితో కుమారుడికి జహంగీర్‌ అని పేరు పెట్టాడు. ఇక చిన్మయ్‌ మాండ్లేకర్‌.. హిందీలో తేరే బిన్‌ లాడెన్‌, సమీర్‌, ద కశ్మీర్‌ ఫైల్స్‌, గాంధీ గాడ్సే: ఏక్‌ యుధ్‌ సినిమాల్లో నటించాడు. కాలాపాణి, దల్దల్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేశాడు.

    చదవండి: ఓటీటీలో థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌... రిలీజ్‌ ఎప్పుడంటే?

  • టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌పై వారణాసి హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. రాణి ఎప్పటికీ రాణినే ఉంటూ ఓ వీడియోను షేర్ చేసింది. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియోను పంచుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు మహేష్ బాబును కూడా ట్యాగ్ చేసింది.

    కాగా.. 1993లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో నమ్రతా శిరోద్కర్‌ మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. నమ్రతా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే ఏడాది నమ్రతా ప్రపంచ అందాల పోటీల్లో మనదేశం తరఫున పాల్గొని టాప్‌-6లో ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. కాగా.. ఆ తర్వాత మిస్ వరల్డ్ -2000 పోటీల్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఏకంగా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

    నమ్రతా సినీ కెరీర్

    నమ్రతా తొలిసారిగా 1977లో శత్రుఘ్న సిన్హా నటించిన షిర్డీ కే సాయి బాబా చిత్రంలో నటించింది. 1998లో  మేరే దో అన్మోల్ రతన్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన నమ్రతా..  2000 ఏడాదిలో వంశీ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలను నమ్రతా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

    మరోవైపు ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న వారణాసిలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది.
     

     

  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025' జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో భాగంగా 'స్పెషల్ అవార్డ్స్' ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీకి చైర్మన్‌గా సీనియర్ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. చిత్ర పరిశ్రమపై తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న లోతైన అవగాహనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఈ ఏడాది అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 19, 2026న (ఉగాది పర్వదినం సందర్భంగా) ఈ పురస్కారాలను అత్యంత వైభవంగా అందజేయనున్నారు.   2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలు ఈ అవార్డులకు అర్హమైనవి.    మొత్తం 17 విభాగాల్లో ఈసారి పురస్కారాలు ఇవ్వనున్నారు. సామాజిక స్పృహ కలిగించే చిత్రాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ 'ఉత్తమ సామాజిక సందేశ చిత్రం', 'డాక్టర్ సి. నారాయణరెడ్డి' పేరుతో ప్రత్యేక అవార్డులను కూడా ప్రవేశపెట్టారు.
    ప్రస్తుతం వివిధ జ్యూరీ కమిటీల ఆధ్వర్యంలో సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే విజేతల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

  • సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

    తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్  కామాఖ్య నారాయణ్ సింగ్  సెన్సార్‌ బోర్డ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సెన్సార్‌ ఆమోదించిన కట్స్ ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులు చూడటానికి మార్గం సుగమం చేశాయని అన్నారు. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని అన్నారు.

    కామాఖ్య నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. 'మేము సెన్సార్‌ చెప్పిన కట్స్‌ను ఆమోదం తెలిపాం. అందుకే U/A సర్టిఫికేట్ వచ్చింది. మన టీనేజ్ సోదరీమణులు, మన కుమార్తెలు సినిమా హాళ్లకు వెళ్లి  చూడటానికి వీలుగా సర్టిఫికేట్ ఇచ్చినందు సెన్సార్ బోర్డుకు నా కృతజ్ఞతలు. యువకులు, తల్లిదండ్రులు కూడా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలి' అని  అన్నారు.

     కాగా.. ది కేరళ స్టోరీ 2 చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు.  మొదటి చిత్రం ది కేరళ స్టోరీలో ఆదా శర్మ, సోనియా బలానీ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ నటించారు.  ఈ చిత్రానికి సుదీప్తో సేన్ ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకోగా, ప్రశాంతను మోహపాత్ర ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డ్ అందుకున్నారు.
    .

  • సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ఫేం వేణు యెల్దండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని నానితో తెరకెక్కించాలనుకున్నారు. కానీ డేట్స్‌ కుదరకపోవడంతో  నాని నో చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత నితిన్‌ హీరోగా చేయబోతున్నట్లు  దిల్‌ రాజు అధికారికంగా ప్రకటించాడు కూడా. కానీ తమ్ముడు మూవీ రిలీజ్‌ తర్వాత నితిన్‌ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు దేవీశ్రీ ప్రసాద్‌ హీరోగా ఎల్లమ్మ పట్టాలెక్కింది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు వదిలిన గ్లింప్స్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. బీజీఎంతో పాటు దేవీ లుక్‌పై కూడా ప్రశంసలు వచ్చాయి. తనదైన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన డీఎస్పీ..ఇప్పుడు నటనతోనూ ఆకట్టుబోతున్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమైంది. అయితే హీరోగా మారినప్పటికీ.. సంగీతాన్ని వదలబోనని అంటున్నాడు డీఎస్పీ. అంతేకాదు సంగీతానికి మంచి స్కోప్‌ ఉన్న కథ కాబట్టే ‘ఎల్లమ్మ’లో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎల్లమ్మ’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    అందుకే ఒప్పుకున్నా.. 
    సినిమాల్లో నటించాలని ఎప్పుటి నుంచో అనుకుంటున్నా. చాలా మంది దర్శకులు నన్ను హీరోగా చేయమని అడిగారు. సుకుమార్‌ దర్శకత్వంలోనే నేను హీరోగా పరిచయం కావాల్సింది. కానీ నాన్న చనిపోవడంతో బాధలో ఉండి నేనే నటించడానికి ఆసక్తి చూపించలేదు. త్రివిక్రమ్‌, హరీశ్‌ శంకర్‌ కూడా సినిమా చేస్తామని చెప్పారు. కానీ కుదరలేదు. నేను చాలా స్క్రిప్టులు విన్నాను. ఒక్కటి కూడా నాకు సెట్‌ అయ్యేలా అనిపించలేదు. కానీ ఎల్లమ్మ కథ వినగానే నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పా. నెలన్నరలో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

    నెలకు పది రోజులు మాత్రమే.. 
    సినిమాల్లో నటించినప్పటికీ సంగీతానికి మాత్రం బ్రేక్‌ ఇవ్వను. మ్యూజికే  నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే నటన. ఎల్లమ్మ కథ కూడా గొప్ప సంగీతంతో ముడిపడి ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. పైగా నిర్మాత దిల్‌ రాజు కూడా నాకు మంచి ఆఫర్‌ ఇచ్చాడు. ‘నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్‌ ఉంటుంది. మిగతా రోజులన్నీ నీ సంగీతానికే కేటాయించుకో’ అని చెప్పారు. దర్శకుడు వేణు కూడా సపోర్ట్‌ చేశాడు. అందుకే ఈ సినిమా చేయాలని అనుకున్నాను.

    అప్పుడు ‘దేవి’..ఇప్పుడు ‘ఎల్లమ్మ’
    నేను సంగీతం అందించిన మొదటి సినిమా ‘దేవి’. ఎల్లమ్మకు మరో పేరు ఇది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కథతోనే హీరోగా పరిచయం అవుతున్నాను. ఇలా ఒక సంగీత దర్శకుడిగా, హీరోగా రెండూ ‘అమ్మవారి’ కథలతోనే పరిచయం అవడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా బీజీఎం పనుల్లో బిజీగా ఉన్నా. ఇది పూర్తయిపోయిన వెంటనే ‘ఎల్లమ్మ’ షూటింగ్‌లో పాల్గొంటా. ఎల్లమ్మ సినిమా అనేది నన్ను, నా సంగీతాన్నీ ప్రేమంచే ప్రతీ ఒక్కరికి నేను ఇస్తున్న బహుమతి’ అని దేశిశ్రీ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.  

  • ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాక చిన్నాపెద్ద తేడా లేకుండా నటీనటులందరూ అందులోనూ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నారు. తాజాగా సముద్రఖని తొలిసారి ఓ ఓటీటీ వెబ్‌సిరీస్‌లో బాగమయ్యాడు. ఆ సిరీస్‌ పేరు తడయం (క్లూ అని అర్థం). సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఫిబ్రవరి 27న ప్రసారం కానుంది.

    ట్రైలర్‌ రిలీజ్‌
    తాజాగా ట్రైలర్‌ వదిలారు. అందులో ఒక పాలవాడు రోజూలాగే అందరికీ పాలు పోసేందుకు బయలుదేరతాడు. అయితే ఓ ఇంటికి వచ్చాక మాత్రం ఎంత పిలిచినా ఎవరూ బయటకు రారు. దాంతో అతడే అమ్మా అని పిలుస్తూ లోపలకు వెళ్తాడు. తీరా అక్కడ రక్తపుమడుగు చూసి భయభ్రాంతులకు లోనవుతాడు. ఈ సన్నివేశంతోనే ట్రైలర్‌ మొదలైంది. వరుస హత్యలను చేధించేందుకు ప్రయత్నిస్తున్న ఎస్‌ఐ అదియమాన్‌గా సముద్రఖనిని చూపించారు.

    ఓటీటీలో తడయం
    ఇది ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ముగించేద్దాం అని తెలుగు నటుడు నవీన్‌ చంద్ర వాయిస్‌తో డైలాగ్‌ వచ్చింది. మరి ఈ సిరీస్‌లో నవీన్‌ ఉన్నాడా? లేదా? అన్నది తడయం ఓటీటీలోకి వచ్చాకే తెలియనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించినట్లు మేకర్స్‌ తెలిపారు. నవీన్‌ కుమార్‌ పలనివేల్‌ దర్శకత్వం వహించిన ఈ  సిరీస్‌కు విబిన్‌ భాస్కర్‌ సంగీతం అందించాడు.

  • చెక్‌ బౌన్స్‌ కేసులో తీహార్‌ జైలుకు వెళ్లిన ప్రముఖ హాస్య నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం జైలు సౌకర్యాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. రైల్వే స్టేషన్స్‌, విమానాశ్రాయాల మాదిరిగా జైళ్లలోనూ పొగ తాగేందుకు ప్రత్యేక ప్రాంతాలు (స్మోకింగ్‌ జోన్స్‌) ఏర్పాటు చేయాలన్నాడు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారేందుకు వీలైన సంస్కరణ కేంద్రాలుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. 

    బయట నుంచి చూసేవారికి ఎవరు కరడుగట్టిన నేరస్థులు, ఎవరు పొరొపాటున నేరం చేసి వచ్చారో అర్థం కాదని తెలిపాడు. ప్రస్తుతం తన ఇంట్లో వివాహ వేడుక ఉందని, ఆ సెలబ్రేషన్స్‌ పూర్తయ్యాక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం సింపతీ సాధించడం కన్నా డబ్బు సంపాదించమే ముఖ్యమని పేర్కొన్నాడు.

    ఏం జరిగింది?
    రాజ్‌పాల్‌ యాదవ్‌, ఆయన భార్య రాధపై మురళీ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2017లో చెక్‌ బౌన్స్‌ కేసు పెట్టింది. తమ వద్ద తీసుకున్న రూ.5 కోట్లు తిరిగివ్వడం లేదని, పైగా ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్‌ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2018లో ఈ చెక్‌బౌన్స్‌ కేసులో ఢిల్లీ మెజిస్ట్రేట్‌ కోర్టు రాజ్‌పాల్‌ దంపతులను దోషులుగా తేల్చింది. నటుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

    2019లో సెషన్స్‌ కోర్టు ఈ శిక్షను సమర్థించింది. దీన్ని సవాలు చేస్తూ రాజ్‌పాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఫిర్యాదుదారుడికి డబ్బు చెల్లిస్తానంటూ స్టే తెచ్చుకున్నాడు. కానీ, వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో న్యాయస్థానం సీరియస్‌ అయింది. కోర్టు ఆదేశాల మేరకు నటుడు తీహార్‌ జైలులో లొంగిపోయాడు. 

    ఫిర్యాదుదారునికి రాజ్‌పాల్‌ యాదవ్‌ రూ.1.5 కోట్లు డిపాజిట్‌ చేయడంతో ఢిల్లీ హైకోర్టు మార్చి 18 వరకు ఆయన శిక్షను సస్పెండ్‌ చేసింది. తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 17న నటుడు విడుదలయ్యాడు. కాగా రాజ్‌పాల్‌ యాదవ్‌.. హంగామా, భూల్‌ భూలయా, డ్రీమ్‌ గర్ల్‌ 2, బేబీ జాన్‌ వంటి అనేక హిందీ చిత్రాల్లో నటించాడు. కిక్‌ 2 సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యాడు.

    చదవండి: ఆ హీరోను చూసి నా మాజీ ప్రియుడు భయపడ్డాడు: మృణాల్‌

National

  • ఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. భారత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. భారత్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. ఐ లవ్ యువర్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో వస్తున్న విమర్శలను  తోసిపుచ్చారు. ఈ యుద్ధ విమానాలు భారత్‌ను బలీయమైన సైనిక శక్తిగా మారుస్తాయని తెలిపారు. అదేవిధంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయని చెప్పుకొచ్చారు.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్రాన్‌ మాట్లాడుతూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. వ్యూహాత్మక ప్రయోజనాలున్న అనేక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి, దసో ఏవియేషన్‌కు మధ్య జరుగుతున్న చర్చల్లో రఫేల్‌ కొనుగోళ్లు ఓ భాగం. దీనిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ డీల్‌ భారత్‌ను సైనికపరంగా మరింత శక్తిమంతం చేస్తుంది. స్థానికంగా మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.

    ఇటీవల భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలను ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని నిర్ణయించాం. ఇందులో రఫేల్‌ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుంది. 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం, భారత రక్షణ సన్నద్ధతకు వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది’ అని మాక్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరిక మేరకు.. ఈ ఒప్పందంలో ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికే పెద్దపీట వేస్తామని మాక్రాన్‌ హామీ ఇచ్చారు. గరిష్ట సంఖ్యలో భారతీయ విడిభాగాలు, కీలక పరికరాలను భారత్‌లోనే తయారు చేయడానికి, నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. 
     

  • సాక్షి, ఢిల్లీ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ లేఖ రాసింది.

    వివరాల ప్రకారం.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది.

    ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చేపట్టాలని గతేడాది జూన్‌లో నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీహార్‌లో ‘సర్‌’ పూర్తి కాగా.. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అస్సాంలో మాత్రం ఎస్‌ఐఆర్‌కు బదులు ‘ప్రత్యేక సవరణ’ పేరుతో ఓటరు జాబితా సవరణను పూర్తి చేశారు. కాగా, ఏప్రిల్‌ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్‌ రెహ్మాన్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్దరించే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం.

    భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గత రెండేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై–ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, ఆమె భారత్‌కు వెళ్లిపోవడం, ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక శక్తులు బలపడటం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024 బంగ్లాదేశ్‌లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను నిలిపివేసింది. అలాగే, డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాది మరణం తర్వాత జరిగిన భారత్ వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్‌షాహి వీసా కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్‌ కూడా తన కాన్సులేట్‌లలో వీసా సేవలను నిలిపివేసింది.

    అయితే, ప్రస్తుతం యూనస్‌ ప్రభుత్వం దిగిపోవడం.. తారిక్‌ రెహ్మాన్‌ ప్రభుత్వం కొలువుదీరడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సిల్హెట్‌లోని భారత సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ స్పందిస్తూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని పేర్కొన్నారు.

    కాగా, ఈ పరిణామం వీసా విధానాలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం. సాధారణ ప్రజలకు వైద్య, వ్యాపార, సాంస్కృతిక ప్రయాణాలు సులభం అవుతాయి. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా (2009–2024) కాలంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.

  • కాంగ్రెస్ ఎంపీ , స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం అస్సాంకు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా  అక్కడ ఆసక్తికర సన్నివేశంచోటు చేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

    కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు ఆమెకు బాబా (సన్యాసి) ఆశీర్వాదం లభించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక గాంధీ గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడినుంచి నేరుగా ప్రార్థనలు  నగరంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు  చేశారు. అస్సాం నాగరికత, సంస్కృతిని గౌరవిస్తూ, లక్షలాది మంది ప్రజల విశ్వాసంతో ముడిపడి వున్న కామాఖ్య దేవిఅమ్మవారి ఆశీర్వాదం పొందడానికి  వచ్చాననీ ప్రియాంకతెలిపారు. ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సంతోషంగా అనిపించిందన్నారు. 

    ఆలయ సందర్శన సమయంలో నాగ సాధువుతో క్లుప్తంగా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తలపై చేయి వేసి "హమారా బేటీ ప్రధాన మంత్రి బనేగా (మా కూతురు ప్రధాన మంత్రి అవుతుంది)"  అంటూ దీవించారు. దీంతో ఆమె చిరునవ్వుతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.దీనికి  సంబంధించిన వీడియో తెగ వైరల్‌అవుతోంది.

    అనంతరం ప్రియాంక గాంధీ ఎంపీ గౌహతిలోని రాజీవ్ భవన్ (కాంగ్రెస్ భవన్)కు బయలుదేరి వెళ్లారు. బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు మరియు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. మహిళా కాంగ్రెస్ మరియు NSUIతో సహా ఇతర ప్రతినిధులతో కూడా  భేటీ కానున్నారు. 

    ఇదీ చదవండి: 60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!

    అస్సాం అభ్యర్థుల స్క్రీనింగ్‌ను రాహుల్ గాంధీ పర్యవేక్షిస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం కావడంతో రాహుల్ గాంధీ రాష్ట్రంలో అనేక తదుపరి సందర్శనలు చేసే అవకాశం ఉందని అస్సాం కాంగ్రెస్ నాయకులు  తెలిపారు. కాగా రానున్న  అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా  అధికార పీఠారన్ని నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ యోచిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.  అభ్యర్థుల ఎంపికలో తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ  కాంగ్రెస్‌ మధ్య హోరీ హోరీ పోటీ జరగనుంది.

    ఇదీ చదవండి : పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి
     

  • పాట్నా: 42 మంది అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు బిహార్‌ హైకోర్టు బిగ్‌ షాకిచ్చింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యేలు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పలువురు బిహార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించింది. ఆ నోటీసులపై వివరణ ఇవ్వాలని  ఆదేశాలు జారీ చేసింది.  

    విచారణ సందర్భంగా అఫిడవిట్‌లో ఎమ్మెల్యేల తప్పుడు సమాచారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అఫిడవిట్‌ దాఖలు చేయడం తప్పని సరి. తద్వారా పోటీచేసే అభ్యర్థుల ఆస్తులు,వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది.ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్‌ దాఖలు చేయడం సరైంది కాదు’అని వ్యాఖ్యానించింది. అనంతరం, నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు న్యాయస్థానం విధించిన గడువులోగా వివరణ ఇవ్వాలని సూచించింది.  

    బిహార్‌ హైకోర్టు నోటీసులు పంపిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రేమ్‌కుమార్‌ సైతం ఉన్నారు. స్పీకర్‌తో పాటు మంత్రి విజేంద్రయాదవ్‌, మాజీ మంత్రి జివేష్‌ మిశ్రా,జేడీయూ ఎమ్మెల్యే చేతన్‌ ఆనంద్‌,ఆర్‌జేడీ ఎమ్మెల్యే అమరేంద్ర ప్రసాద్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

  • సోషల్‌ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా  వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే  మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌  అంటే  ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో  పౌర సమాజం  తక్షణమే స్పందించి  బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

    పాలక్కాడ్‌లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ   ఎక్స్‌లో ఒక  వీడియో షేర్‌ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి.  పౌరసమాజం స్పందించిన తీరు,  చూపింని ధైర్యసాహసాలను  60 సెకన్ల వీడియో చూడవచ్చు.

    థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!


     

    ​10వ సెకన్‌: బస్సు తలుపులు తెరుచుకున్నాయి.  జనం బయటకు రావడం ప్రారంభించారు.

    ​30వ సెకన్‌: స్థానికంగా ఉన్న  ఏ  ఒక్కరూ  ఈ సంఘటనను రికార్డ్‌ చేయడానికి రాలేదు. ప్రమాదంలో  ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.

    ​35వ సెకన్‌: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 

    50వ సెకన్‌: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.

    60వ సెకన్‌: మంటలు  ఆరిపోయాయి.  

    ఏం జరిగిందంటే..

    కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్‌ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది.  ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు.  అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్  ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది.  సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

    నోట్‌ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్‌తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు?

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: ప్రముఖ యూట్యూబర్ 'నా అన్వేష్' కు బిగ్‌ షాక్‌ తగిలింది.  ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ మెటా అన్వేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను డిలీట్‌ చేసింది.

    ఇటీవల అన్వేష్‌ దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్‌ మీడియా అకౌంట్లలో అన్వేష్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

    ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్‌ సోషల్‌ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కంటెంట్‌ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్‌స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్‌ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

    మెటా సైతం అన్వేష్‌ ఇన్‌స్టా అకౌంట్‌లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది

  • స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాసేవనే పరమార్థంగా భావించిన త్యాగమూర్తి, మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు లాంటి “నిజాయతీపరులకు ఇవాళ రాజకీయ వ్యవస్థలో చోటు లేకుండా పోయింది. ఎన్నికలనేవి కేవలం డబ్బుతో ముడిపడిన వ్యవహారంగా మారిపోయాయి” అని సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి వాపోయారు.

    సీనియర్ రాజకీయ నేత మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ రాజకీయ నాయకుడైన తన తండ్రికీ, మండలి వారికీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, “మండలి వంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని, ఈ తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంద”ని కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్బోధించారు.

    మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు – రాజకీయ నేత జలగం ప్రసాదరావు సభలో పాల్గొంటూ, “అత్యంత భయానకమైన 1977 నాటి దివిసీమ ఉప్పెన సమయంలో మా నాన్న గారికి క్యాబినెట్ సహచరుడైన మండలి వెంకట కృష్ణారావు ఆ ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టడం కోసం సాగించిన నిస్వార్థ సేవను మరిచిపోలేం” అని జ్ఞాపకం చేసుకున్నారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి వారు చూపిన నిరాడంబరత, గడిపిన ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు.

    మూడున్నర దశాబ్దాల పైగా నాటక రంగానికి విశేష కృషి చేస్తున్న ప్రముఖ రంగస్థల సంస్థ ‘రసరంజని’ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షత వహించారు. తొలిసారిగా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించడమే కాక, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం ఆఖరివరకు శ్రమించిన మండలి వారి సామాజిక, సాంస్కృతిక సేవలను రమణాచారి సహా హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి గ్రంథి భవానీ ప్రసాద్, ఆచార్య కొలకలూరి ఇనాక్, సినీ – నాటక రచయిత, నటుడు తనికెళ్ళ భరణి, తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడు – కవి గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తదితర అతిథులు స్మరించారు.

    జలగం వెంగళరావు సీఎంగా ఉండగా 1975 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు అహరహం శ్రమిస్తే... కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా 2012 డిసెంబర్‌లో తిరుపతిలో జరిగిన నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు మండలి వారి కుమారుడు మండలి బుద్ధ ప్రసాద్ త్రికరణశుద్ధిగా కృషి చేశారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రమణాచారి ప్రభృతులు ఆత్మీయంగా ఆ సంగతులను సభికులతో పంచుకున్నారు. మండలి బుద్ధ ప్రసాద్, ఆయన కుమారుడు రాజా సహా పలువురు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రాజకీయ నాయకులు, రంగస్థల అభిమానులు సభలో పాల్గొన్నారు.

    ‘మహాపురుషుడు... మండలి’ నాటక ప్రదర్శన
    శత జయంతి సభానంతరం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్ర పోషించిన ‘మహాపురుషుడు... మండలి’ నాటక ప్రదర్శన రెండు గంటలకు పైగా అద్భుతంగా సాగింది. మండలి వెంకట కృష్ణారావు ఆదర్శ రాజకీయ, సేవా జీవితాన్ని ప్రేక్షకులను కదలకుండా చూసేలా చేసింది. ఆ అపూర్వ ప్రదర్శన ఆద్యంతం చూసి, నట – రచయిత తనికెళ్ళ భరణి, సినీ దర్శకుడు శివనాగేశ్వరరావు సహా పలువురు ఆత్మీయంగా స్పందించడం విశేషం.

    - రెంటాల జయదేవ

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీజీఎస్పీడీసీఎల్‌లో అవినీతి ఇంజినీర్లపై వేటు పడింది. ఏకంగా ఒకేసారి ఎనిమిది మంది ఇంజినీరింగ్‌ అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అయితే, వీరంతా అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో నిరూపితమైంది.

    వివరాల ప్రకారం.. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL) అవినీతి ఇంజినీర్లను ‍ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. బుధవారం ఒకేసారి ఎనిమిది మంది ఇంజినీరింగ్‌ అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఏడీఈలు, ఏఈలు, సబ్‌ఇంజినీర్లు ఉన్నారు. కాగా, యాంటీ బ్రైబరీ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

    విచారణలో భాగంగా.. కొత్త కనెక్షన్లు, ప్యానెల్‌ బోర్డుల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు వంటి వాటికి విద్యుత్‌ ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైంది. ఫోన్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా లంచాలు స్వీకరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ అంశంలో ఇప్పటి వరకు 150 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలకు దిగింది. వారిని స‍స్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
     

Business

  • ఈ ఏడాది (2026) ఆఖరు నాటికి 10 లక్షల క్రియేటర్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆడియో సిరీస్‌ ప్లాట్‌ఫాం పాకెట్‌ ఎఫ్‌ఎం వెల్లడించింది. గత ఏడాది వ్యవధిలో 3 లక్షల మంది పైగా క్రియేటర్లు తమ తొలి స్టోరీలను ఈ ప్లాట్‌ఫాం మీద పబ్లిష్‌ చేసినట్లు వివరించింది. దీనితో తమ క్రియేటర్‌ ఎకానమీ విలువ రూ. 300 కోట్లు దాటిందని, 2026 ఆఖరు నాటికి ఇది మూడు రెట్లు పెరిగి రూ. 1,000 కోట్లకు చేరుతుందమే అంచనాలు ఉన్నట్లు పాకెట్‌ ఎఫ్‌ఎం పేర్కొంది.

    2025 నాటి కంపెనీ డేటా ప్రకారం టాప్‌ 10 శాతం మానిటైజ్డ్‌ క్రియేటర్లు 2025లో సంయుక్తంగా రూ. 50 కోట్లు ఆర్జించారు. టాప్‌ 1 శాతంలోని వారు ఏటా రూ. 50 లక్షలు పొందగా, 20 శాతం మంది పైగా క్రియేటర్లు నెలకు రూ. 1 లక్ష పైగా అందుకుంటున్నారు. తమ ఏఐ ఉత్పత్తుల శ్రేణితో కంటెంట్‌ క్రియేషన్‌కి పట్టే సమయం 90 శాతం పైగా తగ్గిందని పాకెట్‌ ఎఫ్‌ఎం తెలిపింది.

  • చాలామంది కష్టపడి కారు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తరువాత మెయింటెన్స్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు తప్పులు చేసినా.. ఆలస్యం చేసినా.. తరువాత భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో.. కారు మెయింటెన్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏవి? అనే విషయం తెలుసుకుందాం.

    • సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి
    • టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి
    • బ్రేక్స్ పనితీరు చెక్ చేసుకోవాలి
    • బ్యాటరీ & ఛార్జింగ్ సిస్టం చెకింగ్
    • ఎయిర్ అండ్ క్యాబిన్ ఫిల్టర్
  • ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.

    ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.

    యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

    ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

    ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్‌ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

  • దశాబ్ద కాలంగా డిజిటల్ వినోదం అంటే.. కేవలం బ్రౌజ్ చేయడం, క్లిక్ చేయడం, అందులోని కంటెంట్‌ను వీక్షించడం మాత్రమే. కానీ ప్రస్తుతం ఆ పద్ధతి మారుతోంది. భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ చేతులు కలిపాయి. చాట్‌జీపీటీ వాయిస్ అసిస్టెంట్‌(మల్టీలింగువల్ కాగ్నిటివ్ సెర్చ్)తో వినోదాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, సంభాషణల ద్వారా కంటెంట్‌ను వెతికే వినూత్న సదుపాయాన్ని ప్రారంభించాయి.

    ఇకపై యూజర్లు మెనూల్లో వెతకడం లేదా కీవర్డ్స్‌తో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చూడాలి? అనే తడబాటు లేకుండా కేవలం సహజమైన భాషలో మాట్లాడితే చాలు. ఓపెన్‌ఏఐ ఏపీఐలను ఉపయోగించి పనిచేసే ఈ వాయిస్ ఇంటర్‌ఫేస్ మీరు చెప్పే మూడ్, సందర్భం, భాషను అర్థం చేసుకుని కచ్చితమైన సలహాలను ఇస్తుంది.

    ఉదాహరణకు ‘మా అమ్మనాన్నలు వస్తున్నారు, మేమంతా కలిసి చూడగలిగే సినిమా ఏదైనా సూచించు’ లేదా ‘మేము కవలలం, కవలల మీద వచ్చిన సినిమాలే మాకు కావాలి’ అని మనం అడగవచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన, సాంస్కృతిక అంశాలతో కూడిన ప్రశ్నలను కూడా ఈ ఏఐ చాట్‌బాట్ సులభంగా అర్థం చేసుకొని అందుకు తగిన కంటెంట్‌ను మీ ముందు ఉంచుతుంది.

    కేవలం సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా ఈ అసిస్టెంట్ సహాయపడుతుంది. స్కోర్లు, ప్లేయర్ హైలైట్స్, కీలక అంశాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం కేవలం జియోహాట్‌స్టార్ యాప్‌కే పరిమితం కాకుండా, నేరుగా చాట్‌జీపీటీ యాప్‌లో ఎవరైనా వినోదం గురించి సెర్చ్ చేసినప్పుడు జియోహాట్‌స్టార్‌లోని కంటెంట్‌కు సంబంధించిన లింక్‌లు అక్కడ కూడా కనిపిస్తాయి.

  • భారీ జీతాలు పొందుతున్న కొంతమంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ‘నడ్జ్’ నోటీసులు అందుతున్నాయి. వెల్లడించని ఆస్తి ఆదాయం, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆదాయం వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు వీటిని జారీ చేస్తున్నారు. కఠిన చర్యలకు ముందుగా స్వచ్ఛందంగా తప్పులు సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

    ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు పన్ను చెల్లింపుదారులు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు వినియోగిస్తున్న నమూనాను శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

    బహుళజాతి సంస్థల సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ సూచనలు పంపినట్లు తెలిసింది. జరిమానాలు విధించే ముందు లోపాలను సవరించుకోవాలని శాఖ కోరుతోంది.

    ఈ అంశాల్లో వ్యత్యాసాలు
    విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని ప్రకటించకపోవడం, స్టాక్-లింక్డ్ ప్రోత్సాహకాలను తక్కువగా చూపించడం, గృహ, ప్రయాణ భత్యాలను పెంచి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, విదేశీ క్లయింట్ల నుంచి క్రిప్టో రూపంలో ద్వితీయ వేతనాలు పొందడం, గుర్తింపు లేని లేదా ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు భారీ విరాళాలు ఇవ్వడం వంటి వ్యత్యాసాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

    డేటా విశ్లేషణతో గుర్తింపు
    ప్రస్తుత అసెస్‌మెంట్ సైకిల్‌లో అధిక ఆదాయ వర్గాల ఐటీఆర్‌లను తీవ్రంగా సమీక్షించినప్పుడు ఈ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ‘గైడ్ అండ్ ఎనేబుల్’ (నడ్జ్) ప్రచారంలో భాగంగా సవరించిన ఐటీఆర్‌లు దాఖలు చేయాలని శాఖ సూచిస్తోంది.

    ఆటోమేటెడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లు, పాన్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా విదేశీ లావాదేవీల సమాచారం ప్రభుత్వానికి అందుతున్నందున తక్కువగా నివేదించడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.

    నడ్జ్ నోటీసు అంటే ఏమిటి?
    ఇది డీఐఎన్ నంబర్‌తో కూడిన అధికారిక నోటీసు కాదు. కేవలం లోపాలు ఉన్నాయేమో పరిశీలించమనే సూచన మాత్రమే. ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనని నమ్మకం ఉంటే, డీఐఎన్ నంబర్‌తో అధికారిక నోటీసు అందే వరకు ఆందోళన అవసరం లేదు.

    డేటా అనలిటిక్స్ ఆధారంగా ఐటీఆర్‌లో చూపిన ఆదాయం, టీడీఎస్ వివరాలు, ఇతర లావాదేవీ డేటా మధ్య వ్యత్యాసాలు గుర్తించబడుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ సురానా చెబుతున్నారు.

    ట్యాక్స్‌ పేయర్స్‌ ఏం చేయాలంటే..

    • సంబంధిత ఆర్థిక సంవత్సరాల రిటర్నులను సమీక్షించాలి

    • పూర్తి లావాదేవీ వివరాలు సేకరించాలి

    • అవసరమైతే సెక్షన్ 139(8A) కింద నవీకరించిన రిటర్న్ (ఐటీఆర్-యు) దాఖలు చేయాలి

    • వడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాలి

    ఇలా చేయడం ద్వారా తదుపరి విచారణ, జరిమానాలు లేదా ప్రాసిక్యూషన్ వంటి కఠిన చర్యల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  • హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ NBFCలలో ఒకటైన SMFG ఇండియా క్రెడిట్, దాని ప్రధాన పశువుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం అయిన పశు వికాస్ దినోత్సవం (పీవీడి) 8వ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. 'సర్వోత్తమ సేవ: పశు, పరివార్ ఔర్ ప్రగతి' అనే ఇతివృత్తంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. పశువుల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు & స్థిరమైన పురోగతిని బలోపేతం చేయడం ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించింది.

    2014లో ప్రారంభించిన పశు వికాస్ దినోత్సవం, ఉచిత పశువైద్య సేవలు & నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా పశువుల యజమానుల కీలకమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా.. ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఒకరోజు పశువుల సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.

    SMFG ఇండియా క్రెడిట్.. 1.55 లక్షలకు పైగా జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. వీటిలో సుమారు 1.4 లక్షల పశువులకు చికిత్స & 14,000 మందికి పైగా వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించింది. 30,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయి. ఈ కార్యక్రమం 16 రాష్ట్రాలలో, 510 SMFG గ్రామశక్తి శాఖలలో నిర్వహించబడింది, ఇది గ్రామీణ భారతదేశంలో కంపెనీ లోతైన విస్తరణను నొక్కి చెబుతుంది.

    ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో.. పశు వికాస్ దినోత్సవం 47 ప్రదేశాలలో నిర్వహించారు. మొత్తంమీద 8,350కి పైగా పశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించింది. 2,300 కంటే ఎక్కువ గృహాలకు ప్రయోజనం చేకూర్చింది.

  • న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్‌స్కేల్‌ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు అదానీ గ్రూప్‌ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్, సపోర్టింగ్‌ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది.  

    అదానీ గ్రూప్‌ (Adani Group) ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్‌ వినియోగ సామర్థ్యం, ఫైబర్‌ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్‌ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్‌ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్‌ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.

    ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్‌ తయారీ యూనిట్లు, క్లౌడ్‌ సర్వీసులు, డేటా స్టోరేజ్‌ సొల్యూషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, నిర్మాణ, ఇంజినీరింగ్‌ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్‌ను గ్లోబల్‌ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
     

  • ఆన్‌లైన్‌లో నాణ్యతా ప్రమాణాలు లేని, ప్రమాదకరమైన బొమ్మలను విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘స్పాప్‌డీల్‌’ (ఏస్‌ విక్టర్‌ లిమిటెడ్‌)పై కేంద్రం కొరడా ఝుళిపించింది.  బీఐఎస్‌ ప్రమాణాలు లేని నాసిరకం బొమ్మలను అమ్మినందుకు గాను  కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. రూ. 5 లక్షల జరిమానా విధించింది.

    వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సోమవారం సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే, కమిషనర్‌ అనుపమ్‌ మిశ్రా నేతృత్వంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    విచారణలో వెలుగుచూసిన లోపాలు ఇవే.. 
    2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘టాయ్స్‌ (క్వాలిటీ కంట్రోల్‌) ఆర్డర్‌ 2020’ను స్నాప్‌డీల్‌ ఉల్లంఘించినట్లు సీసీపీఏ సుమోటోగా గుర్తించింది. అథారిటీ జరిపిన సమగ్ర విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. యాప్‌ నుంచి తొలగించామని చెబుతున్నప్పటికీ.. 2025 డిసెంబర్‌ వరకు నాసిరకం బొమ్మలు ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోనే ఉన్నాయి.

    విక్రయిస్తున్న చాలా బొమ్మల వివరాల్లో తయారీదారుల పేరు, చిరునామా, బీఐఎస్‌ నెంబర్‌ వంటి కనీస సమాచారం లేదు. స్టాలిన్‌ ట్రేడింగ్‌ కంపెనీ, త్రిఫ్ట్‌ కార్ట్‌ అనే రెండు విక్రయ సంస్థల ద్వారా ఈ నాసిరకం బొమ్మలను అమ్మించి స్నాప్‌డీల్‌ రూ.41,032 మేర కమీషన్‌ ఫీజులు పొందింది. అమ్మకం దారులు ఇచి్చన సమాచారాన్ని విశ్వసిస్తూ.. ఎలాంటి తనిఖీలు చేయలేదు.

    సీసీపీఏ జారీ చేసిన తాజా ఆదేశాలు..
    వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాతో పాటు స్నాప్‌డీల్‌కు సీసీపీఏ పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఎలాంటి నాన్‌–బీఐఎస్‌ బొమ్మలను తమ ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబోమని, విక్రయించబోమని హామీ ఇవ్వాలి. వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ వివరాలు, సంప్రదించాల్సిన నంబర్లు, ఈమెయిల్‌ ఐడీలను వెబ్‌సైట్‌లో స్పష్టంగా, ప్రముఖంగా ప్రదర్శించాలని స్పష్టం  చేసింది. సురక్షితమైన డిజిటల్‌ మార్కెట్‌ను అందించేందుకు నిరంతరం పనిచేస్తామని సీసీపీఏ పునరుద్ఘాటించింది.

    స్నాప్‌డీల్‌ వాదనను తోసిపుచ్చిన సీసీపీఏ..
    తాము కేవలం షాపింగ్‌ మాల్‌ తరహాలో ఒక ‘ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌‘ మాత్రమేనని, అందులో అమ్మే వస్తువుల నాణ్యతకు తమకు సంబంధం లేదని స్నాప్‌డీల్‌ వాదించింది. అయితే, ఈ వాదనను సీసీపీఏ తీవ్రంగా తోసిపుచ్చింది. ‘తూఫాన్‌ సేల్‌‘ వంటి ప్రమోషనల్‌ ఈవెంట్లను నిర్వహించడం, నాసిరకం వస్తువులకు ‘గ్రేట్‌ క్వాలిటీ‘ అంటూ ట్యాగ్‌లు ఇవ్వడం, డెలివరీలు, రిఫండ్లను నియంత్రిస్తున్నందున ఆ వాదన చెల్లదని స్పష్టం చేసింది. కొనుగోలుదారులకు చేరే వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో ప్లాట్‌ఫామ్‌లదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పింది.

  • భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

    న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్‌ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.

    జియోతో కలిసి రిలయన్స్‌ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్‌ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.

    ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్‌ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్‌ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.

    ఈ లక్ష్యంతో రిలయన్స్‌ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్‌నగర్‌లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.

    ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

    ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్‌ సంఘటన

  • ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.

    MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.

    MANAV అంటే?
    M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.

    A -  Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.

    N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.

    A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.

    V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.

    మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.

    ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. భారత బెంచ్ మార్క్ సూచీలు గురువారం భారీ అమ్మకపు ఒత్తిడిని చవిచూశాయి. మార్కెట్ ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1236.11 పాయింట్లు లేదా 1.48 శాతం క్షీణించి 82,498.14 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 365.00 పాయింట్లు లేదా 1.41 శాతం నష్టపోయి 25,454.35 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి బెంచ్ మార్క్ లు అత్యంత చెత్త పతనాన్ని నమోదు చేశాయి.

    పెరుగుతున్న ముడి చమురు ధరలు, పెరుగుతున్న యుఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ హెవీవెయిట్లలో ప్రాఫిట్ బుకింగ్ మధ్య సెషన్ లో మార్కెట్ క్రాష్ వచ్చింది. ఇండిగో, ఎం అండ్ ఎం, అంట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు 3.2 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.59 శాతం, 1.27 శాతం నష్టపోయాయి.

  • ఢిల్లీలోని కీర్తి నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌లో ఒక మహిళ & ఆమె అత్త బ్యాంకు లాకర్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు పోయాయని ఆరోపించడంతో, కస్టమర్లలో భయాందోళనలు చెలరేగాయి. దొంగతనం జరిగిందనే పుకార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగింది అనేది కేవలం పుకారు మాత్రమే అని పోలీసులు వెల్లడించారు.

    ఈ తరుణంలో.. బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి? అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఇంట్లో రక్షణ ఉండదని చాలామంది తమ వద్ద ఉన్న బంగారం, ఇతర ఖరీదైన డాక్యుమెంట్స్ వంటివి బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటారు. ఒకవేళా బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఆ బ్యాంకు బాధ్యత వహించదు. ఎందుకంటే.. బ్యాంకులు తమ వస్తువులను భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం అందిస్తాయి. ఆ లాకర్‌లో ఏమి ఉంచారనే దానికి సంబంధించిన రికార్డ్ కూడా బ్యాంకు దగ్గర ఉండదు.

    రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. బ్యాంకు సరైన భద్రత కల్పించని పక్షంలో (సీసీ టీవీ పనిచేయకపోవడం, సిబ్బంది తప్పిదం, బ్యాంకు ఉద్యోగుల మోసం) నష్టపరిహారం పొందుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీరు కోల్పోయిన మొత్తం నష్టపరిహారంగా వస్తుందనుకోవడం పొరపాటే.

    2022 ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే.. లాకర్ అద్దెకు 100 రెట్లు పరిహారం లభిస్తుంది. అంటే లాకర్ అద్దె ఏడాదికి 5000 రూపాయలు ఉంటే.. రూ. 5 లక్షలు పరిహారం లభిస్తుందన్న మాట. లాకర్‌లో కోట్ల విలువైన వస్తువులున్నా అదే ఫార్ములా ప్రకారం నష్టపరిహారం లభిస్తుంది. ఒకవేళా ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగితే ఎలాంటి నష్టపరిహారం లభించదు. అటువంటి పరిస్థితులలో బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవు.

    లాకర్ ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
    బ్యాంక్ లాకర్‌లో వస్తువులను దాచుకోవాలనుకునేవారు.. లాకర్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్‌లో ఏ వస్తువులు ఉంచారో.. వాటికి సంబంధించిన ఫోటోలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఖరీదైన వస్తువులకు తప్పకుండా బీమా చేయించుకోవాలి. నష్టం జరిగిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం అందించాలి.

  • ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్‌లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యం

    టోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్‌ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.

    అపార అవకాశాలు

    2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.

    సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.

    అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలు

    • భారత్‌లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.

    • భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.

    • ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.

    • ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.

    ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు మరో కేసు మూసివేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా  ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అక్రమాల కేసు మూసివేయాలని సీఐడీ పిటిషన్‌ చేశారు. ఈ కేసులో నిందితులుగా చంద్రబాబు,నారాయణ ఉన్నారు. అయితే,ఈ కేసును క్లోజ్‌ చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు ఫిర్యాదు దారుడైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. అభ్యంతరాలు ఉంటే తెలపాలని నోటీసుల్లో పేర్కొంది.   

  • సాక్షి,విజయవాడ: తిరుమల లడ్డు అంశంపై ఎల్లో మీడియాకు విజయవాడ కోర్టు నోటీసులు జారీచేసింది. తిరుమల లడ్డూ అంశంలో ఎల్లో  మీడియా కథనాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంబంధిత కథనాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. 

    కూటమి అనుకూల ఎల్లో మీడియా తిరుమల లడ్డూ అంశంపై అనువసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై కోర్టు గురువారం విచారణ చేపట్టింది.

     విచారణ సందర్భంగా పదేపదే టీటీడీ లడ్డులో జంతు కొవ్వులు,కెమికల్స్ కలిసాయంటూ న్యూస్ చానల్స్ డిబెట్లు పెడుతున్నాయని జడ శ్రవణ్ కోర్టుకు తెలిపారు.  అనవసర డిబెట్ల కారణంగా శ్రీవారి భక్తుల్లో ఆందోళన రేకెత్తుతుందన్నారు. న్యూస్ చానల్స్ చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టడి చేయాలని కోర్టును కోరారు. జడ శ్రవణ్ కుమార్ వాదనలపై న్యాయస్థానం ఏకీభవించింది. కథనాలపై వివరణ ఇవ్వాలని సంబంధిత మీడియా ఛానెళ్లకు పంపించిన నోటీసుల్లో ఆదేశాలు జారీ చేసింది. 

  • సాక్షి, తాడేపల్లి: హెరిటేజ్‌, ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరాపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్‌ డెయిరీ ఎంటర్‌ అయ్యిందని తెలిపారు. గతంలో కేజీ నెయ్యి రూ.320కి అమ్మిన ఇందాపూర్‌ డెయిరీ ఇప్పుడు కేజీ నెయ్యి రూ.650కి అమ్ముతోందన్నారు. భోలే బాబా అసలు పేరు హర్ష్‌ ఫ్రెష్‌ డెయిరీ అని చెప్పుకొచ్చారు. అన్నీ బాబు హయాంలోనే జరిగితే వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. 2014 నుంచి చూస్తే వీరి బండారం బయటపడుతుందన్నారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఇందాపూర్‌ డెయిరీని 2026, ఫిబ్రవరి 10 వరకు హెరిటేజ్‌కు మ్యానిఫ్యాక్చరింగ్‌ సంస్థగా చూపించారు. ఈ గుట్టు బయటకు రాగానే హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి 2026 ఫిబ్రవరి 15న కోమ్యానిఫ్యాక్చరింగ్‌గా చూపించారు. అలాగే, ఫిబ్రవరి 14న హెరిటేజ్‌ ఫుడ్స్‌ హెడ్‌ రాజీనామా చేశాడు. 2015లో రూ.278కే ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్‌ డెయిరీ ఎంటర్‌ అయ్యింది. ల్యాబ్‌ రిపోర్డులు నెగిటివ్‌గా రావడంతో 2016లో ఇందాపూర్‌ డెయిరీ డిస్‌క్వాలిఫై అయ్యింది. అంటే దాని అర్థం కల్తీ జరిగిందనేగా?. డిస్‌ క్వాలిఫై అయిన మూడు నెలల్లోనే 2016 ఏప్రిల్‌ 26న ఇందాపూర్‌కు మళ్లీ అర్హత కల్పించారు. 2018 నవంబర్‌ 27న ఇందాపూర్‌కు టెండర్‌ దక్కింది. కేజీ నెయ్యి రూ.321కే ఆర్డర్‌ వేశారని వెల్లడించారు. 

    నాడు 320.. నేడు 658.. 
    2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ చక్రం తిప్పారు. ఇందాపూర్‌కు మళ్లీ 2025 డిసెంబర్‌ 16న టెండర్‌ ఖరారైంది. గతంలో కేజీ నెయ్యి రూ.320కి అమ్మిన ఇందాపూర్‌ డెయిరీ ఇప్పుడు కేజీ నెయ్యి రూ.658కి అమ్ముతోంది. కేంద్ర ఆధీనంలోని ల్యాబ్‌ రిపోర్టులతో నెయ్యి టెండర్లు టీటీడీకి రావాలి. ఇది మొదటి నుంచి టీటీడీకి ఉన్న సంప్రదాయం. భోలే బాబా అసలు పేరు హర్ష్‌ ఫ్రెష్‌ డెయిరీ. 2018 జూన్‌ 26న భోలే బాబుకు టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ ఇస్తూ బాబు హయాంలో టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. స్వయంగా భోలేబాబా ప్లాంట్‌ను పరిశీలించినట్టు టెక్నికల్‌ క్వాలిఫైడ్‌గా నిర్ధారించినట్టు టీటీడీ తీర్మానం చేసింది.

    ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

    బాబు హయాంలోనే ట్యాంకర్లు రిజెక్ట్‌..
    2018 మార్చి 6న 82వేల కేజీల నెయ్యి సరఫరా చేయడానికి చంద్రబాబు హయాంలోనే ఆర్డర్‌ చేశారు. హెరిటేజ్‌తో భాగస్వామ్యం ఉన్నట్టు భోలేబాబా తెలిపింది. చంద్రబాబు హయాంలోనే టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు హయాంలోనే నెయ్యి సరఫరా అయ్యింది. చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్లు రిజెక్ట్‌ అయ్యాయి. రిజెక్ట్‌ అయిన ట్యాంకర్లు బాబు హయాంలోనే టీటీడీకి వచ్చాయి. అన్నీ బాబు హయాంలోనే జరిగితే వైఎస్సార్‌సీపీకి ఏం సంబంధం?. వీరి హయాంలో దొరికిన, వీరితోనే వ్యాపార సంబంధం ఉన్న వీరిని గంపగుత్తిగా వైఎస్సార్‌సీపీకి ఎలా ముడిపెడతారు?.

    2014 నుంచి చూస్తే వీరి బండారం బయటపడుతుంది. అన్ని కనెక్షన్లు చంద్రబాబువైపు ఉంటే మాకేం సంబంధం?. అందుకే హెరిటేజ్‌పై శాసన మండలిలో చర్చ జరగనివ్వడం లేదు. చంద్రబాబు హయాంలోనే తప్పు జరిగింది. 2025 జూలై 25న పంపిన ఆ నాలుగు ట్యాంకర్లు ఆగస్టు, సెప్టెంబర్‌లో లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్లాయని సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో చెప్పింది. రిజెక్ట్‌ అయిన ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని సీబీఐ సిట్‌ చెప్పింది. ఇదంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. అబద్ధాలు, మోసాలతో దేవుడితో చంద్రబాబు చెలగాడమాడారు’ అని చెప్పుకొచ్చారు. 

Politics

  • సాక్షి, కరీంనగర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపేందుకు అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించిన చిట్టా, ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని త్వరలోనే బయటపెడతామని బాంబు పేల్చారు.

    కరీంనగర్ పదో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమురయ్య బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి తొలి మేయర్‌ను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కి అభినందనలు తెలిపారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహకారంతో కరీంనగర్ గెలిచాం. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమిష్టిగా అగ్రెసివ్‌గా కొట్లాడం. బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్మకైంది. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కుమ్మక్కయ్యాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారి అధిష్టానం మాట ధిక్కరించి అవసరం వస్తే మాకు సపోర్ట్ ఇస్తామన్నారు. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.  

    ప్రజల కళ్లలో ఆనందం కంటే ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని రేవంత్ అనుకుంటారు. మజ్లిస్‌ కోసమే భాగ్యనగరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మూడు ముక్కలు చేశారు. మూడు ముక్కలు ఎందుకు ఎవరి కోసం చేశారో రేవంత్ చెప్పడం లేదు. భాగ్యనగరం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలను కూడా విభజించలేదు. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ ఉన్నాయి?. వచ్చిన పెట్టుబడులు అన్ని ఏఐసీసీకి పంపి దేశంలో పార్టీని బతికేస్తున్నారు. TPCC కాదు T4C అంటే తెలంగాణ కమీషన్ కలెక్షన్ కరప్షన్ కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు మోయడానికే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు కూడా వీటికి మధ్యవర్తులుగా సహకరిస్తున్నారు. మేము ఒక్కో మంత్రి ఇంటి వద్ద అవినీతిపై ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. 

  • సాక్షి, హైదరాబాద్: బీజేపీ కోవర్టులపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న కోవర్టులు వెంటనే వెళ్లిపోవాలన్నారు. ఇదే సమయంలో బీజేపీలో పలువురు పాత నాయకులను కోవర్టులతో పోల్చడం తీవ్ర చర్చకు దారి తీసింది. చివరగా.. నిజామాబాద్‌ను కరీంనగర్‌తో పోల్చలేమని చెప్పుకొచ్చారు.

    బీజేపీ ఆఫీసులో ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ..‘ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది.. దక్షిణ తెలంగాణలో బలోపేతం కావాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. వీళ్లూ ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కుటుంబ అవినీతిని ఎవరు అడగకుండా ఉండేందుకు కొనడం మొదలు పెట్టారు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నారు. మేము ప్రక్షాళన చేయాలనుకున్నాం. అందుకే ఎవరితో కలవలేదు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో పెంచుకోవాలి. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరు.. కలిసి ఉండటం అసంభవం.

    ఇదే సమయంలో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపైన ఎంపీ అర్వింద్ స్పందిస్తూ..‘ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా?. ఆమె వ్యాఖ్యలకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని పాటించారు. బీజేపీకి భయపడి రాయకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మెట్‌పల్లిలో పార్టీ కోవర్టు వెళ్ళిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయింది. సుఖేందర్ కోవర్టు కేసు.. ఆయనకు, ఆయన భార్యకు ఇద్దరికీ టికెట్ ఇవ్వను అని చెప్పాం.

    సుఖేందర్ రెడ్డి​కి వీక్ క్యాండిడేట్‌ పెడుతామని కాంగ్రెస్ వాళ్లు కాల్ చేసి చెప్పారు. సుఖేందర్ లాంటి వారు 20 ఏళ్ల నుండి బీజేపీని మోస్తున్న అని చెప్పుకునే వారు. కానీ, అలాంటి వారు కొందరు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు. ఇప్పుడు నా చేతికి మట్టి అంటకుండా ప్రక్షాళన జరిగింది. ఇలాంటి వారు ఎక్కడ ఉన్నా బయటకు వెళ్లిపోవాలి. ఇప్పటికే ఇందూర్‌ ప్రక్షాళన జరిగింది. జగిత్యాలను కూడా ప్రక్షాళన చేస్తా. కరీంనగర్‌ను నిజామాబాద్‌తో పోల్చలేము. నిజామాబాద్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదన్నారు. పాఠశాలల్లో నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారని తెలిపారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గిందని చెప్పుకొచ్చారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి ఏడాదికి రూ.4000 కోట్లు అవసరం. రెండేళ్లలో ఆర్యోగ్రశ్రీకి రూ.3,141 కోట్లు బకాయిలు పడ్డారు. మేము పీఆర్సీ చైర్మన్‌ను నియమిస్తే.. బాబు తీసేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌.. ఐఆర్‌, పీఆర్సీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35వేలు బకాయి పడ్డారని అన్నారు. ఏపీలో ప్రభుత్వ సూల్స్‌లో నాడు-నేడుకు చంద్రబాబు ఉరేశారు. స్కూల్స్‌లో నాడు-నేడు కింద మేము రూ.8,524 కోట్లు ఖర్చు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2024-25లో ఖర్చు చేసింది రూ.285 కోట్లు మాత్రమే. 2025-26లో బాబు ఖర్చు చేసింది రూ.259 కోట్లు మాత్రమే ఉంది. నాడు-నేడును గాలికి వదిలేయడంతో కలుషిత నీరు తాగి 900 మంతి పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు. జాతీయ మీడియా ఈ కథనాలను ప్రచురించింది.

    మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామన్నాడు. రూ.3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నాడు. ఇప్పుడు వడ్డీలేని రుణాల ప్రస్తావనే లేదు. మా హయాంలో వైఎస్సార్‌ ఆసరా కింద రూ.25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.2229 కోట్లు ఇచ్చాం. ఈబీసీ నేస్తం కింద రూ.1876 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ చేయూత కింద రూ.19,198 కోట్లు ఇచ్చాం. మేము లక్షలాది అక్కాచెల్లమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణం కోసం రూ.35210 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి తగ్గింది. మా హయాంలో పొదుపు సంఘాల రుణాలు 49,926 కోట్లకు పోతే.. చంద్రబాబు హయాంలో 30,698 కోట్లకు పడిపోయింది’ అని చెప్పుకొచ్చారు. 

    పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి
  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్‌దారులను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదన్నారు. అలాగే, ఈ ఏడాది కూడా తల్లికివందనం పథక​ంలో భారీగా కోత విధించబోతున్నారని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని తెలిపారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అన్నారు. 20 లక్షల మందికి లక్షా 44వేల కోట్లు బాకీ పడ్డారు. సూపర్‌ ఫ్లాప్‌ సినిమా చూపిస్తూ.. బాబు హిట్‌ అంటున్నాడు. చంద్రబాబు ప్రతీ మీటింగ్‌కు 25వేల పెన్షన్లు కట్‌. మా ప్రభుత్వంలో మేము 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం. బాబు ప్రభుత్వంలో 18 నెలల్లోనే 5,38,636 పెన్షన్లు కట్‌ చేశారు. ఈ ఏడాది 7,45,993 పెన్షన్లు కట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అప్‌డేట్‌ అయ్యేవి. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవి. 2024 నాటికి మేము 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇచ్చాం.

    తల్లికివందనంలో మోసమే.. 
    యూడీఐఎస్‌ఈ డేటా ప్రకారం మేము దిగిపోయే నాటికి ప్రభుత్వ స్కూల్స్‌లో 87,41,885 మంది పిల్లలున్నారు. ప్రతీ పిల్లాడికి చంద్రబాబు 15000 చొప్పున ఇస్తానన్నాడు. బడ్జెట్‌ ప్రకారమే రూ.13,112 కోట్లు ఇవ్వాలి. 2024-25లో తల్లికి వందనం పూర్తిగా ఎగ్గొట్టారు. 2025-26లో కొందరికే ఇచ్చారు. అది కూడా పూర్తిగా కాదు. ఇప్పటి బడ్జెట్‌లో రూ.8456 కోట్లు మాత్రమే తల్లికి వందనానికి చూపించారు. అంటే ఈ ఏడాది కూడా భారీగా కోత విధించబోతున్నారు.

    మహిళలకు వంచనే..
    మహిళకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు?. మహిళలు ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అందులో కూడా షరతులు పెట్టారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్‌లలో సూపర్‌ 6, సూపర్‌ 7పై కించిత్‌ ప్రస్తావనలేదు. యువగళం పేరుతో నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఇలా హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు. అలా మోసం చేసిన వారిలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.

    YS Jagan: ఒక్క 2025 లోనే 2685 మంది రైతులు ఆత్మహత్య

    రైతులకు 20వేలు ఎక్కడ?
    ఎన్నికల సమయంలో ప్రతీ రైతుకు చంద్రబాబు రూ.20వేలు ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చింది కాకుండా రూ.20వేలు ఇస్తానని చెప్పాడు. 2024-25లో పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిసి 40వేలకు బదులుగా రూ.పది వేలే ఇచ్చాడు. మా ప్రభుత్వ హయాంలో 53,58,000 మందికి రైతుభరోసా ఇస్తే చంద్రబాబు మాత్రం ఏడు లక్షల మంది రైతులకు కట్‌ చేశాడు. ఏడాదికి రూ.10,717 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి 21431 కోట్లకు గాను ఇచ్చింది 4000 వేల కోట్లు మాత్రమే. ప్రతీ రైతుకు చంద్రబాబు 30వేలకు పైగా బాకీ పడ్డాడు. మేము కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇచ్చాం. పట్టాలిచ్చి మరీ గిరిజనులకు రైతుభరోసా ఇచ్చాం’ అని వెల్లడించారు. 

     

     

    రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్‌పీ లేదు...
    ఉచిత పంటల బీమాతో మేము రైతులకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు మాత్రం 2024-25 బడ్జెట్‌లో 60 లక్షలే పెట్టారు. 2025-26లో 1023 కోట్లు పెట్టారు. ఇచ్చింది మాత్రం సున్నా. 2026-27 బడ్జెట్‌లో రూ.250 కోట్లు మాత్రమే పెట్టారు. ఐదేళ్ల కాలంలో మేము 7802 కోట్లు ప్రీమియం కట్టాం. రైతులపై మేము ఎలాంటి భారం పడనివ్వలేదు. మోంథా తుపానులో 10 లక్షల ఎకరాలు నష్టపోతే చంద్రబాబు మాత్రం నాలుగు లక్షల ఎకరాలే చూపించారు. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఎంఎస్‌పీ లేదు. మేము గతంలో ఆర్‌బీకేలతో రైతులకు తోడుగా నిలబడ్డాం. ఆర్‌బీకేలతో మేము ఎప్పటికప్పుడు పంటను కొనుగోలు చేశాం. 21 రోజులలోపే రైతుకు డబ్బు జమ చేసే వాళ్లం. ధరల స్థిరీకరణ కోసం మేము రూ.7756 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు మాత్రం 900 కోట్లే బడ్జెట్‌లో పెట్టారు. దానిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది దేవుడికే తెలియాలి. ఆర్‌బీకే, ఈక్రాప్‌ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దళారీ వ్యవస్థను తీసుకొచ్చి రైతుల పొట్ట కొడుతున్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం.. 2025లో 393 మంది రైతులు, 2472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కాకుండా రికార్డుల్లో నమోదు కాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. 

  • సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ప్రతీ మహిళలకు నెలకు 1500 ఏమైంది? అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. సూపర్‌ సిక్స్‌ సక్సెస్‌ అని ఎలా చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. పథకానికి అమ్మవారి పేరు పెట్టి మహిళల్ని మోసం చేసి ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలను నెరవేర్చలేదు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ అని గోబెల్స్‌ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. బాబు పాలనలో ప్రతీ అంశంలోనూ మోసమే కనిపిస్తుంది. మోసానికి ప్యాంట్‌, షర్టు వేస్తే అది చంద్రబాబు. బాధ్యత గల పదవిలో ఉండి బాబు అబద్ధాలు ఆడుతున్నారు. ప్రతీ దాంట్లో చంద్రబాబు మోసాలే కనిపిస్తున్నాయి. అప్పుల్లో చంద్రబాబుది ఆల్‌టైమ్‌ రికార్డు. కానీ, ​ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు లేవు.

     

    ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్టుగా బాబు పాలన ఉంది.  కోవిడ్‌ వంటి సంక్షోభం లోనూ మేము మేనిఫెస్టో అమలు చేశాం. మా మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. చంద్రబాబుకు మాత్రం మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం. ఎన్నికలకు ముందు బాండ్లు ఇచ్చి మరీ ప్రజలను మోసం చేశారు. అప్పులు తెచ్చిన డబ్బు అంతా ఎక్కడికి పోతుంది?. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికీ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే చేయలేదు. నెలకు 3000 చొప్పున ఏడాదికి 36000 ఇస్తామన్నారు. కానీ, మూడు బడ్జెట్‌లో పెట్టింది మాత్రం సున్నా. నిరుద్యోగులకు రూ.21,600 కోట్లు బకాయి పడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాడు.. ఏమైంది? అని ప్రశ్నించారు. 18-60ఏళ్ల లోపు మహిళలు కోటి 80 లక్షల మంది ఉన్నారు. ఈ మూడేళ్లలో మహిళలకు 97వేల 200 కోట్లు బకాయి పడ్డారు. ఇప్పటి వరకు ప్రతీ మహిళకు రూ.54వేలు చంద్రబాబు బకాయి ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు. 

    ఇంటింటికీ వెళ్లి..! రెండు బాండ్లు.. రెండు ఫోటోలు.. 6 గ్యారెంటీలపై జగన్ సెటైర్లు

     

     

    2014 కల్లా అప్పులు రూ.లక్షా 47వేల 717 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి మూడు లక్షల 90వేల 247 కోట్లు. మేము ఐదేళ్లలో చేసిన అప్పులు మూడు లక్షల 31వేల 671 కోట్లు. కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు మూడు లక్షల 17వేల 448 కోట్లు. కూటమి అప్పులను చంద్రబాబు పారదర్శకంగా చూపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 35వేల కోట్లు బకాయిలున్నాయి. జీతాలు పెంచకుండా ఉద్యోగులతో గేమ్‌ ఆడుతున్నారు’ అంటూ విమర్శలు చేశారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ జల్సాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని అన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ చూడటానికి మంత్రి లోకేష్‌.. కొలంబోకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే వీరు మాత్రం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శలు చేశారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబుకు ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. మంత్రి నారా లోకేష్‌కు కూడా ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కూడా ఒక ప్రత్యేక విమానం, హెలికాప్టర్‌. సీఎం కొడుకు లోకేష్‌ ఒకపూట విజయవాడలో ఉంటే మరోపూట హైదరాబాద్‌లో ఉంటాడు. క్రికెట్‌ మ్యాచ్‌ కోసం కొలంబో వెళ్లాడు. ఉదయమే మళ్లీ విజయవాడకు వచ్చాడు. వీరంతా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు.

    చంద్రబాబు తీరు కుక్క తోక వంకర లాంటిది. దేశంలో బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎవరైనా జల్సాలు చేశారా?. టీవీల్లో చూస్తే మ్యాచ్‌ కనపడదా?. నేను కూడా టీవీలోనే మ్యాచ్‌ చూశాను. రాష్ట్రం​ అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్ధాలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కొలంబో పోయి మ్యాచ్ చూడాలా? టీవీలో కనపడదా?

     

Prakasam

  • డీటీ కథ నడపగా..నేతలు దోచేయగా!

    జిల్లాలో రేషన్‌ బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డేలేకుండా పోయింది. తిలాపాపం తలా పిడికెడు అన్న సామెతగా ఈ రేషన్‌ బియ్యం అక్రమ దందాలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు, అధికార యంత్రాంగం పాలుపంచుకుంటున్నారు. దీనికి గాను ప్రతినెలా లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ దందా గురించి ఇటీవల బహిర్గతమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి జిల్లాలో సంచలనంగా మారాయి.

    సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

    కందుకూరు నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలోనే రేషన్‌ దందా నడుస్తోందన్నది బహిరంగ రహస్యమే. ప్రతినెలా టన్నుల కొద్దీ రేషన్‌ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నార్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్‌ బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు రేషన్‌ బియ్యం అక్రమ దందాను వివరిస్తూ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఓ బియ్యం వ్యాపారితో ఫోన్‌లో జరిపిన సంభాషణ ఇటీవల వెలుగుచూసింది. ఆ ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. ఈ అక్రమ వ్యాపారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ పోలీస్‌ అధికారి ఎంత తీసుకుంటున్నాడు వంటి వివరాలన్నీ పూసగుచ్చినట్లు డీటీ వివరించడం సంచలనంగా మారింది.

    అధికార పార్టీ కీలక నేత ఆధ్యర్యంలోనే అంతా..

    రేషన్‌బియ్యం వ్యాపారం మొత్తం అధికారపార్టీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుడి కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీటీ వ్యాపారితో జరిపిన సంభాషణలో ఈ దందాకు కీలక సూత్రధారుల పేర్లు సైతం బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలో వచ్చే మొత్తం బియ్యాన్ని ప్రతినెలా ఒంగోలుకు చెందిన ఓ వ్యాపారికి చేర్చేలా కందుకూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా నెలకు రూ.25 లక్షల వరకు ఆ వ్యాపారి అధికార పార్టీ నేతలకు చెల్లిస్తారు. ప్రతినెలా సుమారు 10 వేల బస్తాల బియ్యాన్ని ఆ వ్యాపారికి ఇచ్చేలా ఈ డీల్‌ కుదిరినట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలోని రేషన్‌ డీలర్లంతా వారికి కేటాయించిన బియ్యాన్ని ప్రజలకు పంచకుండా నేరుగా అధికార పార్టీ నేతలకు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీనికి ప్రతిఫలంగా రేషన్‌ డీలర్‌కి కేజీకి రూ.10 నుంచి రూ.12ల వరకు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఎవరైనా బియ్యం కావాలని అడిగినా డీలర్లు ఇచ్చే పరిస్థితి లేదు. బియ్యం లేవు డబ్బులు తీసుకుని వెళ్లండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఒకరిద్దరు ఇచ్చినా తూకంలో భారీగా తేడా వస్తుందంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

    పెదపవని కేంద్రంగా...

    బియ్యం దందాకు లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలోని రైస్‌ మిల్లు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని సమాచారం. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన బియ్యాన్ని ఒంగోలుకు చెందిన వ్యాపారి పెదపవని గ్రామంలో లీజుకు తీసుకున్న రైస్‌మిల్లులో నిల్వ చేస్తున్నారని తెలిసింది. ప్రతినెలా వచ్చే బియ్యాన్ని టన్నుల కొద్దీ ఈ మిల్లులోనే నిల్వ, పాలిష్‌ చేస్తుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కావలి మీదుగా కృష్ణపట్నం పోర్టుకు, అక్కడి నుంచి విదేశాలకు బియ్యం తరలుతున్నాయి. ఇది అంతా బహిరంగ రహస్యమే. కానీ ఏ విజిలెన్స్‌ అధికారిగానీ, సివిల్‌ సప్‌లై అధికారి, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు గానీ ఆ మిల్లు జోలికి వెళ్లరు. దీనికి ప్రతిఫలంగా భారీగా అధికారులకు ముడుపులు వెళ్తున్నట్లు స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆడియో టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని కొంత మంది పోలీసులకు సైతం భారీగా ముడుపులు చెల్లిస్తున్నట్టు ఆ ఆడియో ఉండడం గమనార్హం. దీంతో పెదపవని రైస్‌మిల్లు కేంద్రంగా అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

    రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం అధికార పార్టీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటూ డీటీ ఆడియోలో ఉందని తెలిసింది. పైగా బియ్యం బండిని పట్టుకుంటే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఫోన్లు వస్తాయని, అలాంటప్పుడు ఏ అధికారి అయినా ఏం చేస్తారు అంటూ మాట్లాడడం ఈ దందా ఏస్థాయిలో జరుగుతోందో అవగతమవుతుంది. అలాగే ఏ అధికారికి ఎంత ముట్టజెబుతున్నారో అన్నది సైతం ఆడియో ఉండడం సంచలనాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సదరు డీటీ సెలవులో వెళ్లిపోయారని సమాచారం. ఈ ఆడియో బహిర్గతం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. ఆడియో వెలుగుచూసి వారం రోజులు కావస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

    రేషన్‌ బియ్యం దందాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీనే కీలక సూత్రధారన్న విమర్శలు ఉన్నాయి. దీని కోసం కొందరు బియ్యం వ్యాపారులను వేధిస్తుండడంతో డీటీ ఫోన్‌ను కొందరు వ్యాపారులు రికార్డు చేసి బహిర్గతం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు తప్ప మరోకరు బియ్యం వ్యాపారం చేయడానికి వీలు లేదంటూ వేధించారు. ఈయన మాట ధిక్కరించిన వ్యాపారుల బండ్లు పట్టుకుని కేసులు నమోదు చేయడం, పోలీసు స్టేషన్‌లకి పిలిపించి కొట్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

  • నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి

    మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దగ్గుబాటి సోమయ్య, నిర్వాసితుల సంఘ కన్వీనర్‌ గాలి వెంకటరామిరెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈనెల 25న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలన కోసం వస్తున్న నేపథ్యంలో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21న మార్కాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం జరిగే ధర్నాకు ముంపు గ్రామాల ప్రజలు, రైతులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది వరద సీజన్‌కు నీరు విడుదల చేసే నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువతకులందరికీ 2013 భూ సేకరణ చట్టప్రకారం ఆర్‌అండ్‌ ఆర్‌ పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరరెడ్డి, అశోక్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, జి బాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

  • నిష్ట దీక్ష.. ఖుదా రక్ష

    కంభం/కనిగిరిరూరల్‌ :

    స్లాం.. మానవాళిని సన్మార్గంలో నడిపేందుకు ఉద్భవించిన ధర్మం. పవిత్ర రంజాన్‌ మాసం ఆ ధర్మాన్ని నడిపించేందుకు బాటలు వేస్తోంది. ఇస్లాంను అనుసరించేవారు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు ఉండటం రంజాన్‌ ప్రత్యేకత. ఆధ్యాత్మికత, సేవాభావం, దయాగుణం పెంపొందించడమే ఉపవాస దీక్ష అంతరార్థం. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం ఇస్లామిక్‌ 12 నెలల్లో తొమ్మిదో నెల పేరు రంజాన్‌. ఏడాదిలో 11 నెలలు సొంతానికి గడిపినా రంజాన్‌ నెలలో మాత్రం దైవచింతనలో నిమగ్నమవ్వాలనేది మహ్మద్‌ ప్రవక్త ఉవాచ. పవిత్ర ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో నిష్టగా ఉపవాస దీక్ష ఆచరిస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు దహించుకుపోతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. బుధవారం నెలవంక దర్శనమివ్వడంతో గురువారం నుంచి ఉపవాస దీక్ష ఆచరించేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. రంజాన్‌ నెల ప్రారంభ సూచికగా కొన్ని ప్రాంతాల్లో సైరన్‌ మోగించారు. బుధవారం రాత్రి 9 గంటలకు మసీదుల్లో తరావీహ్‌ నమాజ్‌ చేశారు. ముస్లింలు ఒకరినొకరు శ్రీచాంద్‌ ముబారక్‌శ్రీ అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

    ఉపవాసం.. ఆరోగ్య వికాసం

    రంజాన్‌ మాసంలో ఉపవాసం ఉండేవారు రోజూ సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు తీసుకోకుండా, లాలాజలం సైతం మింగకుండా కఠోర దీక్ష ఆచరించాల్సి ఉంటుంది. తద్వారా దైవభీతి పెరుతుగుంది. సహనం అలవడుతుంది. చెడు వ్యసనాలకు దూరమై, చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందనేది ముస్లింల నమ్మకం. అంతే కాదు జీర్ణకోశ వ్యవస్థ ప్రక్షాళన జరిగి వ్యాధులు దరిచేరవనేది ఉపవాసం వెనకున్న బహిరంగ రహస్యం. శ్ఙ్రీనిష్టతో దీక్ష ఆచరిస్తే పేదల ఆకలిదప్పుల బాధలు తెలిసి వస్తాయి. రంజాన్‌ ఉపవాసాలు ధర్మనిష్టతో పాటిస్తే పాపాలు క్షమించబడుతాయి. ఉపవాసంలో ఉండి దువా చేస్తే కోరికలు ఫలిస్తాయిశ్రీశ్రీ అనేది ప్రవక్త బోధనల సారాంశం.

    తరావీహ్‌ నమాజ్‌ ప్రత్యేకత

    ఇస్లాం మత గ్రంథం ఖురాన్‌ రంజాన్‌ నెలలోనే ఉద్భవించింది. ఇస్లాం లక్ష్యం, పాటించాల్సిన విధానాలు, అల్లాహ్‌ సందేశాన్ని పొందుపరిచిన ఖురాన్‌ను రంజాన్‌ మాసంలో రోజుకు ఐదుసార్లు పఠించాలని మత పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో తరావీహ్‌ నమాజ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దివ్య ఖురాన్‌ పఠించడానికి, వినడానికి తరవీహ్‌ నమాజ్‌ దోహదపడుతుంది.

    షబ్‌ ఏ ఖద్ర్‌

    రంజాన్‌ మాసంలో షబ్‌ ఏ ఖద్ర్‌ రోజున దివ్య ఖురాన్‌ అవతరించింది. రంజాన్‌ నెల చివరి పది రోజుల్లో 21, 23, 25, 27, 29వ బేసి రాత్రుల్లో ఏదో ఒక రాత్రి షబ్‌ ఏ ఖద్ర్‌ ఆచరించాల్సి ఉంటుంది.

    ఫిత్ర్‌, జకాత్‌తో దానగుణం

    పేదలకు అండగా నిలవాలని చెప్పడమే ఫిత్ర్‌, జకాత్‌ ఉద్దేశం. సంపద కలిగిన ముస్లింలు పేదలకు రంజాన్‌ నెలలో దానధర్మాలు చేయాలని సూచిస్తోంది ఖురాన్‌. ఆరోగ్యరక్షణ పేరిట కొంత నగదును దానం చేయడాన్ని ఫిత్ర్‌గా, అలాగే తాము సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దానం చేయడాన్ని జకాత్‌ అని పిలుస్తారు. తద్వారా నిరుపేద ముస్లింలు కూడా పండగ నిర్వహించుకోగలరనేది ఖురాన్‌ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. రంజాన్‌ నెలలో చివరి రోజున ఈద్‌ ఉల్‌ ఫిత్ర్‌ పండగ నిర్వహిస్తారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పేదలకు దానధర్మాలు చేయడంతో రంజాన్‌ మాసం ముగుస్తుంది.

    నోరూరించే హలీం సిద్ధం

    రంజాన్‌ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది హలీం. పోషక విలువలతో కూడిన ఆహారమైన హలీంను రోజూ ఇఫ్తార్‌ అనంతరం తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హలీం విక్రయాల కోసం వ్యాపారులు ఏర్పాట్లు చేశారు.

    రంజాన్‌ నెల మొత్తం మసీదులు ఉపవాస దీక్షదారులతో కిటకిటలాడుతుంటాయి. గురువారం నుంచి రంజాన్‌ మాసం ఆరంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సుమారు 290 మసీదులు ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. ఉమ్మడి ప్రకాశంలో అత్యధికంగా ముస్లింలు ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పర్చూరు తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని మసీదులకు ఇప్పటికే రంగులు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. ఉపవాసం ఆచరించే వారి కోసం పలు మసీదుల్లో 30 రోజులపాటు సహర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

    కంభం పట్టణంలోని పురాతన షాహీ మసీద్‌

    వరాల వసంతం రంజాన్‌ మాసం

    నెల వంక దర్శనం.. నేటి నుంచి ఉపవాస దీక్షలు ఆరంభం

    మసీదుల్లో సహరీకి ప్రత్యేక ఏర్పాట్లు

  • వీడని తౌషిక్‌ డెత్‌ మిస్టరీ..!

    సింగరాయకొండ: సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూలులో విద్యార్థి తౌషిక్‌ డెత్‌ మిస్టరీ వీడడం లేదు. విద్యార్థి మృతి చెంది ఐదు రోజులైనా దర్యాప్తులో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని తల్లిదండ్రులు సయ్యద్‌ ఆలీ, మౌలాభి స్కూల్‌ యాజమాన్యందే బాధ్యతని, కరస్పాండెంట్‌ కుమారుడే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే స్కూల్‌ యాజమాన్యాన్ని విచారించకుండా కేసును పోలీసులు కాలయాపన చేస్తున్నారని విద్యార్థి బంధువులు మండిపడుతున్నారు.

    ఆ ఆరు నిమిషాల్లో ఏం జరిగింది..?

    తౌషిక్‌ మృతి సాంకేతిక ఆధారాల ప్రకారం..శనివారం సాయంత్రం 5.05 గంటల సమయంలో తాను తౌషిక్‌తో ఫోన్‌లో మాట్లాడానని తౌషిక్‌ తల్లి మౌలాభి చెబుతోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా 5.11 గంటల సమయంలో వార్డెన్‌ నా కుమారుడిని హాస్టల్‌ గది నుంచి రోడ్డు పక్కనే ఉన్న స్కూలు భవనం వద్దకు భుజంపై మోసుకొని తీసుకువచ్చాడని, ఆ ఆరు నిముషాల్లో ఏం జరిగితే తన కుమారుడు చనిపోయాడో చెప్పాలని ఆమె ఆ రోజు నుంచి పోలీసులను వేడుకుంటోంది. ఈ ఘటనపై ఆది, సోమవారాల్లో దర్యాప్తు చేసిన ఎస్సై బి.మహేంద్ర ఏం తేల్చారో ఇంత వరకు ప్రకటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం విద్యార్థి బంధువులు స్కూలు వద్దకు వెళ్లేసరికి కాలేజీ యాజమాన్యం మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు ఆవేశంతో దాడికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్కూలు యాజమాన్యం కారులో పరారయ్యారు. తరువాత ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని న్యాయం చేయాలని ధర్నా చేశారు.

    పాఠశాలలో విద్యార్థి మృతి చెంది ఐదు రోజులు

    కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం

    దర్యాప్తు పేరుతో కమిటీలు, విచారణ

    అధికారి మార్పు

    కుమారుడి మృతిపై నిజాలు తేల్చాలంటున్న

    తల్లిదండ్రులు

    చిన్న బాత్‌రూమ్‌లో

    టవల్‌తో ఆత్మహత్య సాధ్యమేనా?

    స్కూలులోని చిన్నబాత్‌రూమ్‌లో టవల్‌తో మెడకు ఉరేసుకొని తౌషిక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్కూలు యాజమాన్యం చెబుతోంది. అయితే దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వాదన మరోలా ఉంది. ప్రతి రోజు విద్యార్థులు స్నానానికి క్యూ సిస్టంలో వెళతారని, స్నానానికి వెళ్లేటప్పుడు టవల్‌ కట్టుకుని పోతారు తప్ప ప్యాంట్‌, షర్టు వేసుకుని ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. టవల్‌తో హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయాడని చెబుతున్నారని, కానీ హ్యాంగర్‌ తౌషిక్‌ తలకు అందే ఎత్తులో ఉంటే మెడకు టవల్‌తో ఉరేసుకుని చనిపోవటానికి ఎలా సాధ్యమని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తౌషిక్‌ ఉరేసుకొని చనిపోయాడంటున్న వీడియో ఇంత వరకు బయటకు రాలేదని, ఆ వీడియో ఎందుకు బయటపెట్టడం లేదని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. తౌషిక్‌ మృతి ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికి హత్యేనని, ఇందుకు కారుకులు ఎవరో నిగ్గు తేల్చాలంటున్నారు. తమ కుమారుడి స్నేహితులు కూడా కాలేజీ యాజమాన్యమే కారణమని చెబుతున్నారని, కానీ ఆ దిశగా విచారణ సాగడం లేదని, కేసును యాజమాన్యానికి అనుకూలంగా మార్చేందుకు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని బంధువులు పేర్కొంటున్నారు. విచారణ జాప్యంపై మృతుని తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నిస్తుండటంతో మంగళవారం కందుకూరు సీఐని విచారణాధికారిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ రాజాబాబు త్రీమెన్‌ కమిటీ వేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీలో డీఈఓ రేణుక, ఐసీడీఎస్‌ పీడీ మాధురి, తహసీల్దార్‌ రాజేష్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో త్రీమెన్‌ కమిటీ విచారణలోనైనా తౌషిక్‌ డెత్‌ మిస్టరీని ఛేదించాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

  • శింగరకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు

    అద్దంకి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శింగరకొండ తిరునాళ్లను విజయవంతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ నెల 28 నుంచి 2వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి, శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై స్థానిక టీటీడీ కల్యాణ మండమంలో అధికారులతో బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈఓ తిమ్మానాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ తిరునాళ్లకు ఈ ఏడాది 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, టాయిలెట్స్‌, క్యూలైన్లు ప్రభల వద్ద బందోబస్తు, తదితర ఆంశాలపై రెవెన్యూ, పోలీస్‌, అబ్కారీ, ఆర్‌అండ్‌బీ, పబ్లిక్‌ హెల్త్‌, విద్యుత్‌, ఆర్టీసీ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల అధ్వర్యంలో చేసే ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శాంతి భద్రఽతలకు విఘాతం కలగకుండా, చోరీలు జరగకుండా, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. ప్రధాన తిరునాళ్ల రోజున సంతమాగులూరు అడ్డరోడ్డు, మేదరమెట్ల పైలాన్‌ వద్ద అద్దంకి వైపు రాకుండా భారీ వాహనాలను దారి మళ్లిస్తామన్నారు. పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ సమాచార కేంద్రం ఏర్పాటుతో ప్రభల వద్ద పటిష్ట బందోబస్తును పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. దేవస్థాన ఆధ్వర్యంలో రూ.50, రూ.100 ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, ఉచిత దర్శన క్యూలైన్‌, స్నాన వసతి, ఉచిత తాగునీరు, మజ్జిగ, చంటి పిల్లలకు పాలు, సీ్త్రలకు విడిగా బయో టాయిలెట్స్‌, ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. తరువాత శింగరకొండపాలెం పంచాయతీ ఏర్పాట్లుతో పాటు, మిగిలినశాఖల అధికారులు చేపట్టనున్న ఏర్పాట్ల గురించి వివరించారు. సమావేశంలో ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్‌ చుండూరి మురళీ సుధాకర్‌రావు, ఏసీ తిమ్మనాయుడు, లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్‌ శ్రీనివాసరావు, తహశీల్దార్‌ శ్రీచరన్‌, ఎంపీడీఓ వరూధిని, సీఐ సుబ్బరాజు, విద్యుత్‌ శాఖ ఈఈ మస్తాన్‌రావు, ఆర్టీసీ, ఫైర్‌, హెల్త్‌, శాఖల అఽఽధికారులు పాల్గొన్నారు.

    2.5 లక్షల మంది భక్తులు వస్తారని

    అంచనా

    సీసీ కెమెరాలతో నిఘా

    తిరునాళ్లకు ప్రత్యేక బస్సు సర్వీసులు

    ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న

  • కట్టలు తెగిన నిర్లక్ష్యం

    బల్లికురవ: సాగర్‌ కాలువల ఆధునికీకరణపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రైతులతోపాటు కెనాల్‌ పరివాహక ప్రాంత ప్రజలకు సంకటంగా మారింది. బల్లికురవ మండల పరిధిలో అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌(ఏబీసీ) కోతకు గురైనా ఎన్‌ఎస్పీ అధికారులు స్పందించకపోవడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటుపల్లి మేజర్‌ నుంచి వల్లాపల్లి లాకుల వరకు ఉన్న పెద్ద కాలువకు రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఈ కాలువ కట్టలు బలహీనంగా ఉండటం.. అదే సమయంలో రోజూ 1300 క్యూసెక్కులకు తగ్గకుండా నీరు ప్రవాహిస్తుండటంతో, కెనాల్‌ బండ్‌ కోతకు గురవుతోంది. కాలువలో నీరు కట్టల మీదుగా ప్రవహిస్తుండటంతో మట్టి కొట్టుకుపోయి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆందోళన చెందిన ఆయకట్టు రైతులు ఎన్‌ఎస్పీ అధికారులకు సమస్యను వివరించారు. కానీ మూడు నెలలుగా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం కట్టలు పూర్తిగా కోసుకుపోయి, తెగే స్థితికి చేరుకున్నాయి. ఒకటీ లేదా రెండు రోజుల్లో కాలువ కట్టలు తెగి నీరంతా గ్రామాలు, పొలాల్లోకి చేరుతుందని ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అఽధికారులు స్పందించి కట్టలకు మరమ్మతులు చేయడంతోపాటు నీటి ప్రవాహాన్ని కొంత మేర తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

    గుంటుపల్లి–వల్లాపల్లి మధ్య కోతకు గురైన ఏబీసీ కెనాల్‌

    మూడు నెలలుగా పట్టించుకోని ఎన్‌ఎస్‌పీ అధికారులు

    నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కట్ట తెగే ప్రమాదం

Family

  • చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో  ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్‌ స్టాఫ్‌ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.

    ఈలోపు వధూవరులు...
    ‘క్యాటరింగ్‌ స్టాఫ్‌ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్‌?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్‌ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.

    ‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది. వధూవరులకు పాన్‌ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి.           
     

     

  • మా అక్కయ్య వాళ్ళ బాబుకు 12 సంవత్సరాలు. అన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంటాడు. బొత్తిగా లోకజ్ఞానం లేదు. చూడటానికి కూడా చాలా అమాయకంగా ఉంటాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. మొహంలో కూడా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండవు. అయితే ఆ బాబుకు ఎలా వచ్చిందో కాని, సంగీతంలో చాలా మంచి నైపుణ్యం వచ్చింది. రకరకాల రాగాలు పలికిస్తుంటాడు, పాడుతూ ఉంటాడు. టి.వి.లో, రేడియోలో సంగీత కార్యక్రమాలంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటాడు.

    వీడి టాలెంట్‌ చూసి మాకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసులు వారి కచేరీలకు వీడిని కూడా తీసుకుని తమ బృందంలో ఒక సభ్యుడిగా పెట్టుకుంటున్నారు. చదువులో పైకి రాలేదు కాని, ఇలా సంగీత వేదికల మీద పేరు తెచ్చుకుంటున్నాడు. అన్నింటిలో వెనుకబడిన మా బాబుకు ఇలాంటి సంగీత నైపుణ్యం ఎలా అబ్బిందో అర్థం కావడం లేదు! వీడి భవిష్యత్తును ఎలా మలచాలో తెలియక ఆందోళనలో ఉన్నాము. మీరే మంచి సలహా చెప్పగలరు.
    – రమణి, శ్రీకాకుళం

    రమణి గారూ! మానసిక శాస్త్రంలో చాలా అరుదైన ఒక విషయాన్ని బయట పెట్టినందుకు, మీకు నా ధన్యవాదాలు. ఇడియాట్‌ సావంట్‌ (IDIOT SAVANT) అనే అత్యంత అరుదైన, వ్యక్తులు కొందరు ఎక్కడో ఒక చోట మనకు కనబడుతారు. మీ అబ్బాయి కూడా ఈ కోవకు చెందినవాడే. బుద్ధిలో, లోకజ్ఞానంలో, చదువులో, లౌకిక విషయాల్లో మానవ సంబంధాల విషయాల్లో వీరు బాగా వెనుకబడే ఉంటారు. అయితే ఇలా ఏదో ఒక ప్రత్యేక విషయంలో, మిగిలిన వారికంటే చాలా ఎక్కువ నైపుణ్యం కలవారై ఉంటారు. ఇలాంటి పిల్లలలో కొందరు గణితంలో అద్భుత ప్రజ్ఞ ప్రదర్శిస్తే, మరికొందరు చిత్రకళలో, కొందరు సంగీతంలో మీ బాబు లాగా, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ఎవ్వరూ ఊహించలేనంత నైపుణ్యం ప్రదర్శిస్తారు. 

    వీరి మెదడు పూర్తిగా వృద్ధి చెందక పోయినా, ఏదో ఒక భాగం, మామూలు కంటే అతి తక్కువగా వృద్ధి చెంది, ఆయా మెదడు భాగాల పనితీరునుబట్టి, అటు గణితం, సంగీతం, చిత్రలేఖనం, ఇలాంటి విషయాల్లో అత్యద్భుతమైన నైపుణ్యం కలిగేటట్లు చేస్తుంది. చరిత్రలో కిమ్‌ పీక్‌ (జ్ఞాపక శక్తి) స్టీఫెన్‌ విల్ట్‌ షైర్‌ (చిత్రలేఖనం), దెరెక్‌ (సంగీతం) లాంటి వీరు ఈ కోవకు చెందినవారే! ‘ఆటిజమ్‌’ అనే ఒక మానసిక రుగ్మతకు లోనయిన పిల్లలలో ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కనపడే అవకాశముంది. 

    ఇటీవలే ‘ఇడియాటిక్ సావంట్‌’ పేరు అభ్యంతరకరంగా ఉందని, దీనిని ‘సావంట్‌ సిండ్రోమ్‌’గా (savant syndrome) పేరు మార్చారు. ఇకపోతే, బతుకుదెరువుకు, జీవితంలో పైకి రావడానికి కేవలం చదువొక్కటే ముఖ్యం కాదు. సమాజంలో చదువు తక్కువైన చాలామంది ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నారో మనకు తెలిసిందే! మీ అక్కయ్య వాళ్లను అధైర్యపడ వద్దని చెప్పండి. ఆ బాబును, తననకు అబ్బిన సంగీతం విషయంలోనే, మరింత శిక్షణ ఇప్పిస్తే, అతడు భవిష్యత్తులో మంచిపేరు తీసుకురాగలడని నా నమ్మకం! ఆల్‌ ది బెస్ట్‌!

    - డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
    మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

  • గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఒక్కోసారి  ప్రాణాంతకం కూడా. అందువల్ల గుండె పోటు నుంచి బయటపడ్డ రోగులు..మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

    కొద్ది మోతాదులో వ్యాయామాలు చేయడం

    వేళకు భోజనం చేయాలి

    అధిక కేలరీలు, కొలస్ట్రాల్‌తో కూడిన భోజనం నివారించాలి.

    డైట్‌ ఎలా ఉండాలంటే..
    1. తృణధాన్యాలు - ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, గోధుమలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి,  రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.

    2. తాజా కూరగాయలు, పండ్లు -  ఆకుకూరలు, టమోటాలు, క్యారెట్లు, బెర్రీలు, ఆపిల్స్‌, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి  ధమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

    3. ఆరోగ్యకరమైన కొవ్వులు మితంగా - నట్స్‌, ఆలివ్ నూనె, ఆవాల నూనె, కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇవి మంచి HDL కొలెస్ట్రాల్‌ను అందించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తాయి. 

    4. ప్రోటీన్  కంటెంట్‌ కోసం - పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, స్కిన్‌లెస్‌ చికెన్‌. సాల్మన్ వంటి కొవ్వు చేపలు గుండెకు రక్షణ కల్పించే ఒమేగా-3 కొవ్వులను అందిస్తాయి.

    5. ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.

    రోగులు ఖచ్చితంగా నివారించాల్సినవి..

    1. అధిక ఉప్పు: ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్, ఊరగాయలు, పాపడ్‌లు, సాస్‌లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు తదితరాలు సోడియం ప్రధానంగా ఉండే ఆహారాలు. ఇవి రక్తపోటును పెంచి,  గుండెపై భారం పడేలా చేస్తాయి.

    2. డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్స్, నామ్‌కీన్లు, వేయించిన రుచికరమైన స్నాక్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి.

    3. శుద్ధి చేసిన చక్కెరలు, చక్కెర పానీయాలు - స్వీట్లు, డెజర్ట్‌లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, తదితరాలు  అధిక బరువుకి, గుండె జబ్బులకు కారణమవుతాయి.

    4. మటన్‌ వంటి ఎర్రటి మాంసం వినియోగాన్ని తగ్గించాలి

    5. ఆల్కహాల్ - మద్యం వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి. ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది,పైగా గుండెకు నేరుగా విషపూరితమైనది కూడా.

    గుండె ఆరోగ్యం బాగుండాలంటే..కొద్దిపాటి వ్యాయామాలు, మందులు, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు.
    డాక్టర్ గిరీష్ గాడ్‌బోల్, డైరెక్టర్ అండ్‌ సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ

  • మూగజీవులు సైతం అమ్మ దగ్గరే కథే సురక్షితంగా, ధైర్యంగా ఉండగలవు. అమ్మ స్పర్శ ధైర్యం, ఆమె చెంత ఓదార్పు, నిశ్చింత అందిస్తుంది. అలాంటిది కన్నతల్లే బిడ్డను సాకేందుకు ఇష్టపడకపోతే..అంతకుమించిన దురదృష్టం ఇంకొకటి ఉండదు. పాపం ఈ కోతి పిల్లకు కూడా అలాంటి కష్టమే వచ్చింది. అ‍మ్మ వద్దంటున్నా..అమ్మే కావలంటే అల్లాడిని చిట్టి కోతి ఎంతలా..అమ్మ సహచర్యం కోసం ఎంతలా ఆరాట పడిందో తెలిస్తే..కన్నీళ్లు వచ్చేస్తాయి. 

    ఆ చిట్టి కోతి జపాన్‌కి చెందిన మకాక్‌ జాతీ కోతి. ఇది జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో పుట్టింది. ఆ కోతిపిల్ల పేరు పంచ్‌. గతేడాది జూలై 26, 2025న జన్మించింది. తక్కవు బరువుతో పుట్టడంతో తల్లిసహచర్యం అత్యంత అవసరం అయితే. చిట్టికోతి తల్లి మాత్రం దాన్ని దగ్గరకు రానివ్వలేదు,పైగా దాని బాగుగోలు చూసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. నిజానికి ఇదే తొలిసంతానం కూడా. అయినా కోతుల్లో కొన్ని ఎందుకనే మాతత్వాన్ని అంగీకరించవట. వాటి పిల్లలను సరిగా చూసుకోవట. సదరు జూ సంరక్షకులు చెబుతున్నారు. దాంతో ఆ చిట్టికోతి జూ సంరక్షకుల చేతిలోనే పెరిగింది. అయితే దానికి తన తల్లితోనే ఉండాలని చూసేది. 

    దాంతో  జూ సంరక్షకులు ఆ కోతి పిల్ల బాధను తీర్చేలా అచ్చం దాని జాతి కోతి బొమ్మని ఇచ్చారు. ఎందుకంటే ఆ బెంగతో పిల్ల కోతి చచ్చిపోకుండదని గత్యంతరం లేక అలా చేశారు జూ అధికారులు. అయితే ఆ బొమ్మతో ఆడుకున్న తీరు..దాంతో మసిలిన తీరు  చూస్తే..మనసు ద్రవించిపోతుంది. అదే తల్లి అనుకుని దాన్ని గట్టిగా కౌగించుకుని పడుకోవడం వంటి చర్చలన్ని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. 

    ఆ తర్వాత తన జాతి కోతుల్లా పెరగాల్సి కూడా ఉంటుంది. కాబట్టి అందుకోసం అని దాని జాతి కోతి దళంలోకి ఆ కోతిపిల్లను మార్చారు. పాపం మొదట్లో పెద్దపెద్ద కోతులు మందలించినా..వాటితో కలసిపోయింది. సహజంగా కోతుల ఉండే తీరులో పెరగడం, వాటితో సంభాషించడం నేర్చుకుంది. పైగా ఇప్పుడు దానికో సహచర్య స్నేహితుడు దొరికాడు. దాంతో ఎంతో సంతోషంగా గడుపుతోంది. 

    అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ మారాయి. అవి చూస్తే..ఎవ్వరికైనా..అమ్మ..అమ్మే కదా అనిపిస్తుంది. ఒక్క క్షణం అమ్మ కనిపించకపోతే..ఏ బిడ్డైన అల్లాడిపోతాడు అది మూగజీవులకు కూడా వర్తిస్తుంది కదా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి ఆ వీడియోపై.

     

    (చదవండి: డ్యామేజ్‌ని కూడా ఫ్యాషన్‌గా మార్చేశారు..!)