Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.

    ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్‌ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్‌ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది.  

    ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.  

    డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

  • టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్‌లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ‍అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.

    అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్‌లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.

    ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్‌, హెయిర్‌ స్టైల్‌పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.

    ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి  రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

     

  • అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్‌ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

    ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ‍వైరల్‌గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్‌ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్‌షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్‌కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.

    అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు.  ఈ విషయంపై  షారుక్‌ టీమ్‌ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్‌ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్‌పై చూసే అవకాశం ఆడియన్స్‌కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది.

     

  • చీరలో కాదు గ్లామరస్ లుక్స్‌లో లావణ్య త్రిపాఠి

    తమిళ న్యూఇయర్.. అమృత అయ్యర్ వీడియో

    రాజస్థాన్ ట్రిప్‌లో రుక్మిణి వసంత్ హ్యాపీస్

    నల్ల చీరలో నవ్వుతూ మాయ చేస్తున్న మృణాల్

    కొంటె చూపులతో రచ్చ చేస్తున్న డింపుల్

    మత్తెక్కించేలా శ్రీముఖి పోజులు.. చూస్తూ అలా

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్‌ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్‌లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.

    ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్‌ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేశాయి. దురంధర్‌, దురంధర్‌-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.

    గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్‌ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.

    గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్‌ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్‌ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2:  ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.

    ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్‌ దాటలేదు. ఈ విషయంలో దురంధర్‌ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్‌లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్‌లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్‌తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. 

    మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్‌కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్‌ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్‌ చేసిన దురంధర్‌ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
     

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్‌ బంగ్లా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్‌ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్‌కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.

    మంజులిక అనుకొని.. 
    2007లో విడుదలైన భూల్‌ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్‌ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్‌ భులయ్యలో విద్యాబాలన్‌ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్‌ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్‌ అన్నారు.

    అదే తేడా
    భూత్‌ బంగ్లా, భూల్‌ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్‌ చేస్తారు’ అని అక్షయ్‌ చెప్పుకొచ్చాడు. 

  • సినిమాలోకి ఎంతోమంది వస్తుంటారు. అంతేమంది మెల్లగా తెరమరుగైపోతుంటారు. అయితే గుర్తింపు రాక సైడ్ అయిపోతే ఓకే గానీ ఫేమస్ అయినా సరే కొందరు మూవీస్ చేయడం తగ్గించేస్తుంటారు. ఈమె కూడా అలాంటిదే. ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించి నటిగా అరంగేట్రం చేసింది. ఇప్పుడు యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మరి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?

    (ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)

    పైన కనిపిస్తున్న నటి పేరు శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఈమె ఐదారేళ్లకే పలు యాడ్స్ చేసింది. అలా దర్శకుల దృష్టిలో పడి ఎనిమిదేళ్లకే నటిగా మారింది. చిరు 'జై చిరంజీవ' సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసింది. తర్వాత తమిళ, కన్నడ, హిందీలోనూ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగులో అయితే మహేశ్ 'దూకుడు', రామ్ చరణ్ 'రచ్చ', నాని 'ఎటో వెళ్లిపోయింది మనసు' తదితర  మూవీస్‌లో కనిపించింది.

    అయితే గాయకుడు, నిర్మలా కాన్వెంట్ సినిమాల్లో హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకున్న శ్రియ.. ఇవి ఫ్లాప్ అయ్యేసరికి యాక్టింగ్ పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. 2016లో చివరగా 'నిర్మలా కాన్వెంట్' మూవీలో కనిపించింది. అప్పటినుంచి కొత్తగా ఏ మూవీ లేదా యాడ్ గానీ చేయలేదు. ఇదే టైంలో రచయితగా మారి 'కర్మ బ్యాక్ ఫైర్డ్' అనే బుక్ రాసింది. రీసెంట్‌గా 29వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమె, తన ఫొటోలని పోస్ట్ చేసింది. అలా మరోసారి సోషల్ మీడియా డిస్కషన్‌లోకి వచ్చింది. 20 ఏళ్ల పాటు సినిమాలు చేసిన శ్రియ.. భారతీయ భాషల్లో 150కి పైగా యాడ్స్‌లో నటించడం విశేషం.

    (ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • కోలీవుడ్ హీరో, పార్కింగ్‌ ఫేమ్‌ హరీశ్‌ కల్యాణ్‌ గతనెల తండ్రిగా ప్రమోషన్‌ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు.  తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు  హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు.  తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్‌ కల్యాణ్‌- నర్మద ఉదయకుమార్‌ 2022 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు.

    సినిమా కెరీర్.. 

    2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్‌, ప్యార్‌ ప్రేమ కాదల్‌, లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌, పార్కింగ్‌, లబ్బర్‌ పండు, డీజిల్‌ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్‌, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్‌ తొలినాళ్లలో తమిళ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. 
     

     

  • ఓటీటీకి మరో మలయాళ క్రైమ్‌ అండ్ మిస్టరీ థ్రిల్లర్‌ రానుంది.  మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 

    థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్‌లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.  తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మాల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. మార్చి  మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మిస్ట‌రీ హార‌ర్‌కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్‌ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. 

     

  • యూట్యూబర్‌గా అందరికీ తెలిసిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో గతేడాది హీరోగా హిట్ కొట్టాడు. అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. మౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఇతడు తర్వాత ఎవరితో ఎలాంటి చిత్రం చేస్తాడా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై కాస్త క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)

    టాలీవుడ్‌లో ప్రస్తుతం బడా హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్.. మౌళి రెండో మూవీని నిర్మిస్తోందట. శ్రీను అనే కొత్త దర్శకుడు.. ఈ చిత్రాన్ని తీయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు రిజిస్టర్ కూడా చేయించినట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం సోషల్ మీడియా జమానాలో ట్రెండీ జనరేషన్‌కి ఈ టైటిల్‌తో పెద్ద సమస్య లేకపోవచ్చేమో గానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ టైటిల్‌కి ఆదరణ దక్కుతుందా అంటే సందేహమే. ఈ టైటిల్‌పైనా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మరి అంతా అనుకుంటున్నట్లు ఇదే టైటిల్ పెడతారా? లేదంటే ఏమైనా మారుస్తారా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

    ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

    దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి  ప్రేక్షకుల ముందుకు  రాబోతున్నారు. అందరూ వీరిని  ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

    ‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్‌రాజ్ శంకరాపు  అన్నారు. 

  • ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్‌ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్‌ టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

    రూ.250 కోట్ల ఆఫర్..!

    ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్‌పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

    మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల  థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది.

     

  • టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్‌ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్‌లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.

    రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్‌కి గురైంది. ఇప్పుడీ సిరీస్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)

  • ఇటీవల విడుదలైన మలయాళ  చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్‌-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్‌ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.

    ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. 

    హిట్‌ మూవీకి సీక్వెల్‌..

    2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్‌ దాస్‌ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. 

     

  • కన్నడ హీరో యశ్..  గీతూ మోహన్‌ దాస్‌ డైరెక్షన్‌లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్‌’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్‌గా ఉండడంతో మేకర్స్‌పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.

    ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్‌లో మరో ఆందోళన కలిగిస్తోంది.

    తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

    కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
     

  • దగ్గరవాళ్లు చనిపోతే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపు పుట్టిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. సింగర్ చిత్ర కూడా అలాంటి వేదనని గత 15 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తన కూతురు ఇక లేదనే విషయాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా కుమార్తెని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)

    'నువ్వు మాతో పాటు లేవనే నిజం నన్ను బాధపెడుతూనే ఉంది. కానీ మళ్లీ మనం కలుసుకునేంత వరకు నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావ్' అని కుమార్తె నందన ఫొటోని చిత్ర.. బాధతో పోస్ట్ చేశారు.

    కేరళకు చెందిన చిత్ర.. భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్‌తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఈమెకు 2002లో కూతురు పుట్టింది. ఆమెకు నందన అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి కన్నుకుట్టిందో ఏమో గానీ పాపకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2011లో దుబాయిలో జరిగిన ఓ ప్రమాదంలో ఈత కొలనులో పడి నందన చనిపోయింది. అప్పటినుంచి వేదన అనుభవిస్తున్నప్పటికీ.. మరోవైపు గాయనిగానూ చిత్ర కొనసాగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ పెట్టి కూతురిని చిత్ర మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

    (ఇదీ చదవండి: మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్)

  • పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇప్పుడు ఆయన‍కు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్‌ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ రివీల్‌ ఆ అంచనాలను మరింత  పెంచేశాయి. 

    ఇందులో  బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్‌ విలన్‌ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్‌ చాలా స్టైలీష్‌గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. 

    మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్‌, జాన్నీ కపూర్‌ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్‌, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్‌ చేసుకుంటున్నారు.  ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్‌లోనే తొలిసారి. కథ డిమాండ్‌ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్‌ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం.  ఈ న‌లుగురూ బ‌న్నీతో ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌ పండగ చేసుకోవడం ఖాయం. 

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. సీజన్‌లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్‌, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్‌కే సునాయాస విజయాన్ని అందుకుంది. 

    మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. 

    ఆఖర్లో పావెల్ (31 నాటౌట్‌), రమణ్‌దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో సీఎస్‌కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు.

     

  • రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లోమూడో స్థానంలో కొన‌సాగుతుంది.  ఈ నేప‌థ్యంలో బుధవారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడేది అనుమానంగానే క‌నిపిస్తోంది. 

    అయితే సోమ‌వారం ట్రైనింగ్ సెష‌న్‌లో కోహ్లీ కాలికి బ్యాండేజ్‌తో క‌నిపించాడు. ప్రాక్టీస్ అనంర‌తం కోహ్లీ మాజీ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్‌, కెప్టెన్ రిష‌బ్ పంత్‌ల‌ను న‌వ్వుతూ ప‌ల‌కరించాడు.  దీనికి సంబంధించిన వీడియోను ల‌క్నో ఫ్రాంచైజీ త‌మ ఎక్స్‌లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపించింది. 

    దీంతో చీల‌మండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అందుకే ల‌క్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్న‌ది అనుమానంగా మారింది. ఒక‌వేళ ఆడినా ఇంపాక్ట్  ప్లేయ‌ర్‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇక ఈ సీజ‌న్‌లో కోహ్లి నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 179 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ కేవ‌లం బ్యాటింగ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

    చదవండి: ‘రుతురాజ్‌ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్‌ ఇవ్వు’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతూనే ఉంది. వ‌రుస‌గా ఐదో మ్యాచ్‌లోనూ రుతురాజ్ త‌క్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు ప‌రుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు మ్యాచ్‌ల్లో 12.6 స‌గ‌టుతో 63 పరుగులు మాత్ర‌మే చేశాడు. 

    బ్యాట‌ర్‌గానే గాక కెప్టెన్‌గానూ రుతురాజ్ ఫెయిల‌వుతున్నాడు.  సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించి మూడింట ఓట‌మి చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ స‌హా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌పై విమ‌ర్శ‌లు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చుకుంటే బాగుంటుంద‌ని క్రీడా పండితులు సూచిస్తున్నారు. 

    వ‌న్‌డౌన్‌లో వ‌స్తున్న ఆయుశ్ మాత్రేకు ప్ర‌మోష‌న్ ఇచ్చి ఓపెన‌ర్‌గా పంపితే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి రాబోయే మ్యాచ్‌ల్లోనైనా రుతురాజ్ త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. 

    శాంస‌న్ (48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయ‌గా, వైభ‌వ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

     

    చదవండి: IPL 2026: న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి.. కార‌ణ‌మ‌దే!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా 22వ మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ త‌ల‌ప‌డుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం ఆస‌క్తి క‌లిగించింది. అయితే ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఏకకాలంలో న‌ల్ల రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగ‌డం వెనుక ఒక కార‌ణ‌ముంది. గ‌త వారం (ఏప్రిల్‌ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 

    ఆయ‌న మృతికి సంతాపంగా సీఎస్‌కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్‌ మరణం పట్ల గౌర‌వ‌సూచ‌కంగా ఆట‌గాళ్లంతా న‌ల్ల రిబ్బ‌న్లు ధరించి బ‌రిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ త‌న కెరీర్‌లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. 

    ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌ద్రాస్‌ త‌ర‌పున ఆడ‌న 83 మ్యాచ్‌లు ఆడారు. గోపీనాథ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే మెరుపుగలు మెరిపించాడు.  తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొదటి ఇన్నింగ్స్‌లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయ‌న 8 మ్యాచ్‌ల‌లో 242 ప‌రుగులు చేశారు. 

     

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది.  

    పేస్ అటాక్‌లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్‌మెంట్‌కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్  కార్స్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మ‌ధుషంక‌ను ఎస్ఆర్‌హెచ్ రూ. 75 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కే జాయిన్ అవ్వ‌నున్నాడు. 

    ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్‌ఆర్‌హెచ్ క్యాంప్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్‌లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్‌గా పవర్‌ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.

    గతంలో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు పలు లీగ్‌లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మ‌ధుషంక లంక త‌ర‌ఫున 28 వ‌న్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్ర‌ఫుల్ హింగే, సాకిబ్‌హుస్సేన్ వంటి యంగ్ బౌల‌ర్ల‌కు తోడుగా మ‌ధుషంక జ‌త‌వ్వ‌డం జ‌ట్టుకు అద‌న‌పు బ‌లం. మరి మ‌ధుషంక చేరిక‌తో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బ‌ల‌పడిన‌ట్లే.

     

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్‌దీప్‌ సింగ్‌ (35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీయగా, అన్షుల్‌ కంబోజ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. 

    • సీఎస్‌కేతో మ్యాచ్‌లో కేకేఆర్‌ కష్టాల్లో పడింది. నూర్‌ అహ్మద్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్‌ 85 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్‌ మరుసటి బంతికి కామెరున్‌ గ్రీన్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (5), పావెల్‌ (2) క్రీజులో ఉన్నారు.

    • అంతకముందు కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్‌క్రిష్‌ రఘువంశీ అకిల్‌ హొసేన్‌ బౌలింగ్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    • సునీల్‌ నరైన్‌ (24) రూపంలో కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన నరైన్‌ స్లిప్‌లో గుర్జన్‌పీత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 6 ఓవర్లలో  రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.

    ఫిన్‌ అలెన్‌ ఔట్‌..
    193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (1) శివమ్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    కేకేఆర్ టార్గెట్ 193 ప‌రుగులు
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై సూప‌ర్‌కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 ప‌రుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. శాంస‌న్ (48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయ‌గా, వైభ‌వ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

    • 16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37), సర్ఫరాజ్‌ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్‌ కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

    సంజు క్లీన్‌ బౌల్డ్‌
    111 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. 11.2 ఓవర్‌లో కార్తిక్‌ త్యాగీ బౌలింగ్‌లో సంజు శాంసన్‌ క్లీన్‌ బ్లౌల్డ్‌ అయ్యాడు.  ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. 

    రెండో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే  రెండో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్‌ మాత్రే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్‌ (23 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.

    రుతురాజ్‌ (7) ఔట్‌..
    కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్‌రాయ్ బౌలింగ్‌లో రోవ్‌మెన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్‌ ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్‌ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్‌కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.

    ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్‌కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు నెగ్గాయి.

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్‌కీపర్‌), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

     

  • ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్‌లాండ్‌లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్‌ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. 

    ‘టూ వరల్డ్స్ కొలైడ్‌’ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ..  ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. 

    అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. 

    నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్‌లో తేలడం అప్ప ట్లో  ఆసక్తిగా మారింది.

    2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తొలి ఎడిషన్‌ను షేన్‌ వార్న్‌ నేతృత్వంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో వార్న్‌ 55 మ్యాచ్‌లాడి 57 వికెట్లు పడగొట్టాడు.

    చదవండి:  ‘సోకుల‌కే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు శుభవార్త. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్‌ బౌలర్‌ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.

    ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్‌ (Pat Cummins).. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్‌.. గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.

    కమిన్స్‌ లేని లోటు సుస్పష్టం
    మరోవైపు.. సన్‌రైజర్స్‌ జట్టులో సైతం కమిన్స్‌ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌, ప్రధాన పేసర్‌గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2026లో కమిన్స్‌ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం రెండు మాత్రమే గెలిచింది.

    గెలుపు బాట 
    తొలుత కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలిచిన ఇషాన్‌ కిషన్‌ బృందం.. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ అందడం ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

    ఆరోజే హైదరాబాద్‌కు
    క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. కమిన్స్‌ బుధవారం (ఏప్రిల్‌ 15) ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్‌ 17 నాటికి అతడు హైదరాబాద్‌కు చేరుకుంటాడు. 

    ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్‌నెస్‌ టెస్టు క్లియర్‌ చేసి త్వరలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్‌ స్థానంలో టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

    చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్‌ హుస్సేన్‌?
    BCCI: సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు!

  • జింబాబ్వే క్రికెటర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీపై నిషేధం పడింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. చాలా మంది ఆటగాళ్ల మాదిరే ముజర్‌బానీ ఇటు ఐపీఎల్‌.. అటు పీఎస్‌ఎల్‌ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.

    కానీ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫ్రాంఛైజీలలో ఒక్కటి కూడా ముజర్‌బానీని కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో జింబాబ్వే అదరగొట్టింది.

    ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు
    ఏకంగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఇందులో ముజర్‌బానీది కీలక పాత్ర. ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానంలో ముజర్‌బానీతో ఒప్పందం కుదుర్చుకుంది.

    అయితే, అనూహ్యంగా ముజర్‌బానీకి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) నుంచి ఆఫర్ వచ్చింది. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌  తమ జట్టు నుంచి బంగ్లా స్టార్‌ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. అతడి స్థానంలో మరో ఫాస్ట్‌బౌలర్‌​ ముజర్‌బానీని జట్టులో చేర్చుకోవాలని భావించింది.

    పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో
    ఇందుకు సమ్మతించిన ముజర్‌బానీ.. పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో కేకేఆర్‌తో చేరాడు. దీంతో పాక్‌ బోర్డు అతడిపై చర్యలు చేపట్టింది. ‘‘ఫ్రాంఛైజీ ఆధారిత క్రికెట్‌ ఆడేవాళ్లు పారదర్శకత ప్రదర్శించాలి. ప్రొఫెషనల్‌గా వ్యవహరించాలి.

    ఒకేసారి రెండు జట్లతో ఒప్పందం చేసుకోవడం.. ఒక జట్టు కోసం మరో జట్టును వీడటం సరికాదు. ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయలేము. ఫ్రాంఛైజీల విశ్వసనీయత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. 

    నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’’ అని పీఎస్‌ఎల్‌ పేర్కొంది. కాగా ముజర్‌బానీతో పాటు దసున్‌ షనక, స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై కూడా నిషేధం పడే అవకాశం ఉంది.

    చదవండి: BCCI: సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు!

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌పై మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్‌లో సోకుల‌కే ఉన్నాడు త‌ప్ప బ్యాట్‌తో పెద్ద‌గా ఆడింది లేదంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా సోమ‌వారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ 57 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. 

    అయితే ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సాధించిన‌ప్ప‌టికీ అందులో రియాన్ ప‌రాగ్ పాత్ర శూన్యం. బ్యాటింగ్‌లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాడు. కెప్టెన్‌గా ఉన్నాడు కాబ‌ట్టి జ‌ట్టులో ఉన్నాడు లేదంటే డ‌గౌట్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేదని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

    ఈ నేప‌థ్యంలో క్రిష్‌ శ్రీకాంత్ మాట్లాడుతూ... 'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్‌గా బ్యాటింగ్‌‌కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్‌కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్‌నే సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. 

    లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం. ఎస్ఆర్‌హెచ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని కొనియాడాడు.

    చదవండి: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్‌ హుస్సేన్‌?

  • టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా భారత క్రికెట్‌ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.

    ఒలింపిక్స్‌-2028లో ఆడటమే లక్ష్యం
    ఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్‌గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.

    సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్‌ కాబోనని.. ఒలింపిక్స్‌-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్‌గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

    స్ట్రైక్‌రేటు మరీ దారుణం
    కాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్‌.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్‌రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒ‍క్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

    ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్‌పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 11, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.

    ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్‌-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో సూర్య బ్యాటింగ్‌ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.

    ఇంగ్లండ్‌లో విఫలమతే అంతే సంగతులు
    ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్‌. అయితే, బ్యాటర్‌గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్‌ టూర్‌లో అతడే కెప్టెన్‌.

    అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు. 

    ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్‌పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.

    చదవండి: రాయల్స్‌ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్‌

  • ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే గ్రౌండ్‌లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తే క్రమంలో స్పైక్ షూ ఉంటే మరింత బాగా పరిగెత్తగలవని ఎవరో చెబితే విన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అక్కడ వాలిపోయేవాడు. 

    ఎందుకంటే వాళ్లిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు స్పైక్ షూ కొనుగోలుకు ఉపయోగపడుతాయని ఆ కుర్రాడి ఆరాటం. అయితే తల్లికి విషయం తెలిసి తనకున్న నగలు అమ్మి స్పైక్ షూ కొని కొడుకు కోరిక తీర్చింది. ఇలా కష్టాల సుడిగుండాలను చిన్నతనంలోనే అనుభవించి, ఇవాళ వాటిని దాటుకొని ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకొని రైజింగ్ స్టార్ అయ్యాడు సాకిబ్ హుస్సేన్‌.

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) రెండో విజ‌యాన్ని న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. 217 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల ధాటికి 159 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి ప‌రాజ‌యాన్ని మూటగ‌ట్టుకుంది. రాజ‌స్తాన్ ఓట‌మికి ఇద్ద‌రు బౌల‌ర్లు ప్రధాన కార‌ణంగా నిలిచారు. వారిలో ఒక‌రు ప్ర‌ఫుల్ హింగే అయితే.. రెండో వ్య‌క్తి సాకిబ్ హుస్సేన్‌.  

    ఇద్ద‌రికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావ‌డం, ఈ ఇద్ద‌రు చెరో నాలుగు వికెట్లు తీయ‌డం విశేషం. అయితే ప్ర‌ఫుల్ హింగేతో పోలిస్తే ఎకాన‌మీ ప‌రంగా సాకిబ్ హుస్సేన్ ఒక మెట్టు పైనే ఉంటాడు. జైస్వాల్‌, ఆర్చ‌ర్‌, ఫెరీరా, బిష్ణోయ్ వికెట్ల‌ను ఖాతాలో వేసుకున్న సాకిబ్ హుస్సేన్ 4  ఓవ‌ర్ల‌లో 24 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 

    ఇక ప్ర‌ఫుల్ హింగే 4 ఓవ‌ర్ల‌లో 34 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్లోనే మూడు వికెట్లు తీసి సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేసిన ప్ర‌ఫుల్ హింగే గురించి సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా చ‌ర్చించుకున్నారు. కానీ అత‌నితో స‌మానంగా సాకిబ్ హుస్సేన్ ప్ర‌ద‌ర్శ‌న‌ను కూడా గుర్తించాల్సిన అవ‌స‌ర‌ముంది.

    సైన్యంలో చేరాలనుకొని..
    బీహార్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్‌, సుబుక్తారా ఖతాన్ దంపతులకు సాకిబ్ హుస్పేన్ 2004లో జన్మించాడు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే సాకిబ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని సాకిబ్ పరితపించేవాడు. సైన్యంలో చేరేందుకు సమీప గ్రౌండ్‌లో రన్నింగ్‌కు వెళ్లేవాడు. 

    అప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు.  రన్నింగ్ బాగా చేయాలంటే స్పైక్ షూ అవసరమని గుర్తించిన సాకిబ్ తన ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉండడంతో ఇంట్లోవాళ్లను అడగడం ఇష్టం లేక టెన్నిస్ బాల్ క్రికెట్‌ టోర్నీల్లో పాల్గొనేవాడు. వారిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు దాచుకునేవాడు. 

    తల్లి నగలు అమ్మి..
    అయితే స్పైక్ షూ కొనడానికి డబ్బులు చాలా కావాలని భావించిన సాకిబ్ తన మనసులోని మాటను కన్నతల్లికి చెప్పడం, ఆ తల్లి తనకున్న కొద్దిపాటి నగలు అమ్మి కొడుకు కోరికను తీర్చింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించడంతో సాకిబ్ హుస్సేన్‌కు 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం లభించింది. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున రైట్ ఆర్మ్ పేసర్‌గా అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సాకిబ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

    ఇక 2025-26 రంజీ సీజన్‌లో బీహార్ తరఫున ఆడిన సాకిబ్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యచ్‌లో 41 పరుగులకే 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తొలిసారి సాకిబ్ వేలంలోకి వచ్చినప్పటికీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో 140 ప్లస్‌కు తగ్గకుండా బౌలింగ్ వేస్తున్న విషయాన్ని గుర్తించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలిపెట్టింది. 

    వరుణ్‌ ఆరోన్‌ దృష్టిలో పడి..
    అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనను తాను మరింత సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ లైనప్‌లో కుర్రాళ్లు కావాలని వరుణ్ ఆరోన్ తన వేటను ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్ల సంచలన ప్రదర్శన నమోదు చేసిన సాకిబ్ హుస్సేన్ వరుణ్ ఆరోన్‌ను ఆకర్షించాడు. 

    అలా గతేడాది మినీ వేలంలో సాకిబ్ హుస్సేన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు సాకిబ్ హుస్సేన్‌.

    చదవండి: తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఎవ‌రీ ప్ర‌ఫుల్ హింగే!

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహ్సిన్‌ నఖ్వీపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గులేదా’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌, భారత్‌పై పడి ఏడ్వటం మానేసి పాకిస్తాన్‌ సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.

    అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌కు దరిదాపుల్లో కూడా లేకపోయినా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)ను అదే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐపీఎల్‌కు పోటీగా మార్చిలోనే ఈ లీగ్‌ను నిర్వహిస్తుండగా.. ప్రసార హక్కుల విషయంలో ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.

    నాలుగు సీజన్లకు సమానం
    ఐపీఎల్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల మీడియా హక్కుల విలువ పీఎస్‌ఎల్‌ నాలుగు సీజన్లకు సమానంగా ఉంటుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్‌తో పోలుస్తూ పాక్‌ మాజీ క్రికెటర్లు, పీసీబీ చీఫ్‌ నఖ్వీ పీఎస్‌ఎల్‌ను పొగుడుకుంటూ ఉంటారు.

    ఇక తాజా సీజన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో పాక్‌లో చమురు సంక్షోభం తలెత్తగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే కేవలం కరాచీ, లాహోర్‌లో మాత్రమే పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఐపీఎల్‌ అన్ని వేదికల్లోనూ సజావుగా మ్యాచ్‌లు సాగుతుండగా.. ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు.

    అర్థం చేసుకోవాలి
    ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులను స్టేడియానికి ఎప్పుడు అనుమతిస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మొహ్సిన్‌ నఖ్వీ ఇచ్చిన సమాధానం వైరల్‌ అవుతోంది. ‘‘ఈరోజే నేను పీఎస్‌ఎల్‌ జట్ల యజమానులు, ఆటగాళ్లతో మాట్లాడాను.

    కరాచీ కింగ్స్‌ కూడా ఈ విషయం గురించి మమ్మల్ని రిక్వెస్ట్‌ చేసింది. నేను ప్రధానిని కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరతాను. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.

    అంతటా ఇంధన సంక్షోభం ముదిరింది. ఓవైపు మా ప్రధాని మాత్రం ఇరాన్‌- అమెరికా యుద్ధానికి చరమగీతం పాడి శాంతివైపు మొగ్గుచూపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.

    ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది
    మా ప్రధాని అదే పనిమీద ఉన్నారు. ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ చమురు సంక్షోభం ఎక్కువైంది. పెట్రోల్‌ పంపుల్లో బారులు తీసిన వాహనాలను చూస్తుంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు’’ అని నఖ్వీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు.

    ‘‘అవును.. పాకిస్తాన్‌లో అసలు ఎలాంటి సంక్షోభం లేదు. ఇండియాలో అయితే నేను ఈరోజు సాయంత్రం.. 45 లీటర్ల పెట్రోల్‌ కొట్టించుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద సంక్షోభమో’’ అంటూ నఖ్వీకి కౌంటర్లు ఇస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

    చదవండి: ఐసీసీ చైర్మన్‌గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటన

  • టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సంజూ శాంసన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అందించే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి నెలకు గానూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’గా ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు, ప్రపంచస్థాయి పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను కాదని ఈ అవార్డు సంజూను వరించడం విశేషం.

    ఆరంభంలో జట్టులో చోటే కరువు
    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభంలో సంజూకు భారత తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే, సూపర్‌-8 మ్యాచ్‌లలో అనూహ్య రీతిలో మేనేజ్‌మెంట్‌ అతడికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. ముఖ్యంగా నాకౌట్‌ మ్యాచ్‌లలో వెస్టిండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో దుమ్ములేపాడు.

    ఫైనల్లోనూ ఇరగదీసిన సంజూ
    ఇక ఫైనల్లో న్యూజిలాండ్‌ మీద కూడా 89 పరుగులతో రాణించిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. మొత్తంగా మార్చిలో మూడు మ్యాచ్‌లలో కలిపి సంజూ 275 పరుగులు సాధించాడు. స్ట్రైక్‌రేటు 199.38. మరోవైపు.. బుమ్రా సైతం ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 14 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

    సంజూకే దక్కిన అవార్డు
    ఈ క్రమంలో సంజూ, బుమ్రాలతో పాటు సౌతాఫ్రికాకు చెందిన నయా ఆటగాడు కన్నార్‌ ఎస్తెరుజియెన్‌ కూడా మార్చి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. అయితే, వీరిద్దరిని ఓడించి సంజూ శాంసన్‌ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్‌ వుమెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికైంది. 

    చదవండి: రాయల్స్‌ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్‌

  • వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.

    ఇషాన్‌ కిషన్‌ (44 బంతుల్లో 91) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (40), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28), సలీల్‌ అరోరా (24 నాటౌట్‌) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి సన్‌రైజర్స్‌కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    అయితే, అనూహ్య రీతిలో సన్‌రైజర్స్‌ పేసర్‌ ప్రఫుల్‌ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్‌ బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్‌ విధ్వంసకరవీరుడు వైభవ్‌ సూర్యవంశీని గోల్డెన్‌ డకౌట్‌గా వెనక్కి పంపడంలో ఎస్‌ఆర్‌హెచ్‌ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.

    ఆ సమయంలో సన్‌రైజర్స్‌ జట్టు యజమాని కావ్యా మారన్‌ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రఫుల్‌ ఊహించని రీతిలో బ్రేక్‌ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్‌.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఇక వైభవ్‌తో పాటు రాజస్తాన్‌ కీలక బ్యాటర్లు ధ్రువ్‌ జురెల్‌ (0), లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ (0), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (4)లను కూడా ప్రఫుల్‌ హింగే వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్‌ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

    సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్‌ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్‌ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్‌ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి.

  • టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టు స్వదేశంలో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 17- 27 మధ్య ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సౌతాఫ్రికా (CSA) భారత్‌తో తలపడే తమ జట్టును ప్రకటించింది.

    పదిహేను మంది సభ్యులకు చోటు
    ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు CSA తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మహిళా జట్టుతో సిరీస్‌ కోసం టొబొగొ మచికేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయపడిన కరాబో మెసో స్థానంలో 25 ఏళ్ల మచికేకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.

    తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక
    అదే విధంగా మసబటా క్లాస్‌ స్థానాన్ని ఎలిజ్‌ మేరీ మార్క్స్‌ భర్తీ చేసిందన్న CSA.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ఇద్దరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్‌ మహిళా జట్టు హెడ్‌కోచ్‌ మండ్లా మషింబియ్‌ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది.

    ఎలిజ్‌, టొబొగొలను జట్టుకు ఆడించడం కోసం మేము ఆతురతగా ఎదురుచూస్తున్నాం. వాళ్లిద్దరు గొప్పగా ఆడతారని విశ్వసిస్తున్నాం. కొత్త ముఖాలకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు జట్టుతో ఉంటే నూతనోత్సాహంతో ముందుకు సాగగలం’’ అని పేర్కొన్నారు. కాగా భారత్‌తో టీ20 సిరీస్‌కు లారా వొల్వర్ట్‌ సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించనుంది.

    భారత్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా మహిళా జట్టు
    లారా వొల్వర్ట్‌ (కెప్టెన్‌), అనికె బాష్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌, నదినె డి క్లెర్క్‌, ఆనెరి డెర్క్‌సన్‌, అయాండా హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్‌, టొబొగొ మచికె, ఎలిజ్‌ మేరీ మార్క్స్, నొంకులులెకో మలబ, కాయ్‌లా రెయ్‌నికె, తుమి సెఖుఖునె, క్లో ట్రియాన్‌.

    సౌతాఫ్రికా- భారత్‌ మహిళా జట్ల టీ20 సిరీస్‌ షెడ్యూల్‌- 5 మ్యాచ్‌లు
    👉తొలి టీ20- ఏప్రిల్‌ 17- డర్బన్‌
    👉రెండో టీ20- ఏప్రిల్‌ 19- డర్బన్‌
    👉మూడో టీ20- ఏప్రిల్‌ 22- జొహన్నస్‌బర్గ్‌
    నాలుగో టీ20- ఏప్రిల్‌ 25- జొహన్నస్‌బర్గ్‌
    👉ఐదో టీ20- ఏప్రిల్‌ 27- బెనోని.

    చదవండి: సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి తర్వాత రియాన్‌ పరాగ్‌ వ్యాఖ్యలు

  • ఐపీఎల్‌ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ట్రెవర్‌ పెన్నీ స్వయంగా వెల్లడించారు.  

    రాయల్స్‌కు ఫీల్డింగ్‌ కోచ్‌ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్‌ 13) సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్‌కు ఫీల్డింగ్‌ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్‌ ఫెరియెరా ఫిట్‌నెస్‌ పాస్‌ చేశాడు. అతను గన్‌ ఫీల్డర్‌. అందుకే అతనిని మెయిన్‌ XIలో ఉంచాం. 

    వైభవ్‌ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్‌ మంచి ఫీల్డర్‌ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్‌ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిస్తున్నామని అన్నాడు.

    కాగా, ప్రస్తుత ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్‌లుగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఇంపార్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా (బ్యాటర్‌గా మాత్రమే) ఆడాడు. రాయల్స్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకోవడంతో అతను డగౌట్‌కే పరిమితమయ్యాడు. 

    217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ అరంగేట్రం పేసర్‌ ప్రఫుల్‌ హింగే అద్భుతమైన బంతితో వైభవ్‌ను బోల్తా కొట్టించాడు. 

    ఈ మ్యాచ్‌లో హింగే వైభవ్‌తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్‌ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్‌లోనే హింగే వైభవ్‌తో పాటు జురెల్‌, ప్రిటోరియస్‌లను కూడా డకౌట్‌ చేసి ఐపీఎల్‌ చరిత్రలో తొలి ఓవర్‌లోనే ముగ్గురిని ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు ముందు వైభవ్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో సగటు 40, స్ట్రైక్‌ రేట్‌ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్‌ స్కోరర్‌గా ఉన్నాడు. సీఎస్‌కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు.  
     

National

  • మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు.

    ఈ నిరసనల సమయంలో.. కుకీ తిరుగుబాటు గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్నారని అనుమానంతో ఒక కారును నిరసనకారులు ఆపి దానికి నిప్పంటించారు. ఈ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి, నిరసనకారులు.. భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కారులో ఉన్నవారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

    నిరసనలు జిల్లా వ్యాప్తంగా విస్తరించాయి. చురాచాంద్‌పూర్కు వెళ్లే రహదారులు, అలాగే ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లే హైవేలను నిరసనకారులు బ్లాక్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

    ఏప్రిల్ 7న బిష్ణుపూర్‌లోని ఒక గ్రామంలో.. ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు దాడి జరగడంతో  మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

    ఈ దాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు పేలడంతో మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

    పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బిష్ణుపూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, కాక్చింగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తప్పుడు సమాచార వ్యాప్తి, గుంపుల సమీకరణను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.

    ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఈ సంఘటన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యాల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.

  • ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ నాసిక్‌ క్యాంపస్‌ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్‌లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 

    మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి. 

    ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్‌వాష్‌ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    హెచ్‌ఆర్‌ మేనేజర్‌ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్‌ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.

    ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్‌ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్‌ఆర్‌ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.

    నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్‌ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్‌ఆర్‌ మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు 

    ‘లేడీ కెప్టెన్‌’గా పేరున్న హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నిదా ఖాన్‌ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్‌ చేయడం, హిజాబ్‌ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్‌ నాసిక్‌ క్యాంపస్‌ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది.  

  • రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ సింగ్‌హితరాయ్‌లో వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సక్తి జిల్లాలోని సింగ్‌హితరాయ్ గ్రామం ఉంటుంది.

    పేలుడు తర్వాత కార్మికులు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసే ప‍్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది . గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణం ఏంటన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.

    సక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. “సక్తి జిల్లా సింగ్‌హితరాయ్ ప్రాంతంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడులో 9 మంది మృతి చెందారు.  గాయపడిన వారిని రాయగఢ్ ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు. 

    సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్‌, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. పేలుడు సమయంలో కార్మికులు ప్లాంట్‌లోపల పని చేస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన పేలుడుతో అక్కడి ప్రాంతం మొత్తం భయాందోళనలు సృష్టించింది. 

    ప్రాథమిక నివేదికల ప్రకారం బాయిలర్‌ లోపల ట్యూబ్ పగిలిపోవడం పేలుడుకు కారణంగా ఉండవచ్చని తెలుస్తోంది. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి కచ్చిత కారణం తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. 
     

  • మ‌న‌దేశంలో ఇటీవ‌ల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌వ‌నే ఉద్దేశంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజ‌స్థాన్‌లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుష‌న్ స‌ర్టిఫికెట్ లేద‌ని జ‌రిమానా విధించిన వింత ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. నాగౌర్ నగరంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    టాటా టియాగో ఎల‌క్ట్రిక్ కారు నడుపుతున్న వ్య‌క్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్‌షేడ్ అమ‌ర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయ‌ల జ‌రినామా విధించారు. అక్క‌డితో ఆగ‌కుండా పొల్యుష‌న్ అండ‌ర్ కంట్రోల్ (పీయూసీ) స‌ర్టిఫికెట్ చూపించాల‌ని వాహ‌న‌దారుడిని పోలీసు అధికారి అడిగారు. అత‌డు చూపించ‌క‌పోవ‌డంతో మ‌రో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహ‌నానికి పీయూసీ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని ఎంత చెప్పినా స‌దరు పోలీసు ప‌ట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌డం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌లేద‌ని, సాక్ష్యం చూపించాల‌ని కోరినా ప‌ట్టించుకోలేదు. త‌నకు అకార‌ణంగా జ‌రిమానా  వేసినందుకు కోర్టులో వేస్తాన‌ని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్క‌చేయ‌లేదు. 

    ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌నులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును త‌ప్పుబ‌డుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ స‌ర్టిఫికెట్ అడ‌గడం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని.. ఇది కాలిక్యులేటర్‌ను వాతావ‌రణం గురించి అడిగిన‌ట్టుగా ఉంద‌ని సెటైర్ వేశారు. తెలియ‌ని విష‌యాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించ‌డాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజ‌నులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని చాలా మంది పోలీసుల‌కు తెలియ‌ద‌ని, ఇలాంటి విష‌యాల‌పై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.

    "ఇలాంటి పోలీసు అధికారుల‌ వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియ‌ని విషయాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌ర''ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌లోని తెలివితక్కువ వారి వ‌ల్లే దేశం నాశ‌నం అవుతుంద‌ని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తార‌ని మ‌రో నెటిజ‌న్ మండిప‌డ్డారు. ఈవీకి క‌చ్చితంగా పీయూసీ వ‌ర్తించ‌ద‌ని, ఒక‌వేళ డ్రైవింగ్ స‌మ‌యంలో కారు కిటికీల‌కు క‌ర్టెన్లు వేసివుంటే చ‌లానా విధించే అవ‌కాశం ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ అన్నారు. 

    చ‌ద‌వండి: వాళ్ల త‌ల‌ల్ని 'త‌లారీ'కి అప్ప‌జెప్ప‌వ‌ద్దు!

  • ‘పదిహేను అడుగుల లోతు బావిలో పడ్డ సింహం.. గంటపాటు సాగిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..’ గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బావిలో చిక్కుకున్న ఒక సింహాన్ని అటవీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఏప్రిల్ 13న నవబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది.

    అటవీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ సింహం ఆహారం వేటలో తన నివాసం నుండి బయటకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీటి బావిలో పడిపోయింది. బయటకు రాలేక.. తీవ్రంగా పోరాడింది. సింహం గర్జనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జసాధర్ అటవీ శాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దిగింది. సింహం బావిలో పడిందన్న వార్త తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

    అటవీ సిబ్బంది బలమైన తాళ్లను బావిలోకి దించారు. సింహం వాటిని పట్టుకుంటుందని పైకి లాగడానికి వీలుగా ఉంటుందని భావించారు. అయితే, భయపడిపోయిన ఆ సింహం దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఆ తాళ్లను పళ్లతో కొరికేసింది. దాదాపు 30 నిమిషాల పాటు రక్షణ సిబ్బందికి, సింహానికి మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగింది.

    చివరకు శ్రమ, సమన్వయంతో అధికారులు ఒక తాడు ఉచ్చును ఉపయోగించి సింహాన్ని బంధించగలిగారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి.. బావి అంచున ఒక బోనును సిద్ధంగా ఉంచారు. ఆపై సిబ్బంది మొత్తం కలిసి సింహాన్ని పైకి లాగడం ప్రారంభించారు. బావి నుంచి పైకి రాగానే.. సింహం సహజంగానే పక్కనే ఉన్న బోనులోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది బోను తలుపులు వేశారు. సింహం సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

    ఈ రెస్క్యూ వీడియోను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘సమన్వయం, అసాధారణమైన ధైర్యంతో, అటవీ శాఖ బృందం గంటపాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి. సింహానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రక్షించారు’’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.

  • మధ్యప్రదేశ్‌లోని సత్నాలో దారుణం చోటు చేసుకుంది.  ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు సర్జరీ చేయాల్సిన వైద్యుడు తప్పిదంగా కారణంగా ఏకంగా రెండు కిడ్నీలను తొలగించారు.  చివరికి పరిస్థితి విషమించడంతో  యువకుడు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతతను రాజేసింది.

    పన్నా జిల్లాలోని దేవేంద్రనగర్‌కు చెందిన రవి రాజక్‌కు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. అతని కుటుంబ సభ్యులు చికిత్స కోసం సత్నాలోని ముఖ్తియర్‌గంజ్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 4న పాఠక్ నర్సింగ్ హోమ్‌లో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి విషమించడంతో, అతడిని రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు రెండవ మూత్రపిండాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత రోగి పరిస్థితి నిరంతరం విషమించి, చివరికి మరణించాడు .మరోవైపు పొరపాటున కిడ్నీలను తొలగించామని  డాక్టర్  కూడా ఒప్పుకున్నారు.

     > 
     

    రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అక్షయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ రోగిని యూరాలజీ విభాగంలో చేర్పించే సమయానికే  అతని కిడ్నీ పనిచేసే స్థితిలో లేదని తెలిపారు.  చికిత్స ఎక్కువ సత్నాలోనే జరిగిందని, రేవాలో కేవలం డయాలసిస్ మాత్రమే నిర్వహించినట్టు తెలిపారు.

    మరోవైపు  వైద్యులు నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి గిర్ధారిలాల్ రజక్ ఆరోపిస్తూ, తన కుమారుడికి కేవలం మూత్రపిండంలో రాయి సమస్య మాత్రమే ఉందని, కానీ చికిత్సలోనిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. డాక్టర్ పుష్పేంద్ర సింగ్, డాక్టర్ రాజీవ్ పాఠక్ ,డాక్టర్ రాజీవ్ సింగ్‌ అనే ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.

    మృతదేహాన్ని కోల్గావాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచి హైవేను దిగ్బంధించారు. ఆ తర్వాత  పాఠక్ ఆసుపత్రి బయట మరో నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను మోహరించారు. సుమారు 4 గంటల పాటు సాగిన నిరసన అనంతరం వైద్యులు , మృతుడి కుటుంబ సభ్యుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా, 5 లక్షల రూపాయల చెక్కు , 50 వేల రూపాయల తక్షణ నగదు సహాయం అందించే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దీనితో నిరసన ముగిసింది.రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుండి పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు  తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి:  అమెరికాకు చైనా వార్నింగ్‌ : నాలుగు కీలక ప్రతిపాదనలు

  • న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్‌సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.

    ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ జరగనుంది.

    ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది.

  • వివాహ  వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్‌.అలాగే  పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ  ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.  

    అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్‌ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్  సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్‌, ఆపిల్స్‌ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు.  రొటీన్‌గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు  ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

     ఒక మేరకు పళ్లు  వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్‌ ప్యాకెట్లతో  డెకరేట్‌ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట  సందడి చేస్తోంది.   2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు.  ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్‌ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. 
     

     

  • భోపాల్: భోపాల్‌లో 'బ్లడ్ కిక్' కలకలం రేపుతోంది. నగరంలో ఒక భయంకరమైన కొత్త వ్యసనానికి అలవాటు పడుతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధం లేదు.. కానీ అంతే వేగంగా ప్రాణాలను తీసే కొత్త వ్యసనం వెలుగులోకి వచ్చింది. దీనిని "బ్లడ్ కిక్" అని పిలుస్తున్నారు. యువకులు తమ సొంత రక్తాన్ని తీసి, తిరిగి తమ శరీరంలోకే ఎక్కించుకునే (ఇంజెక్ట్) ఈ వింత ధోరణి ఆందోళన కలిగిస్తోంది.

    విదేశాల్లో మొదలైన ఈ వికృత ధోరణి ఇప్పుడు నిశ్శబ్దంగా మధ్యప్రదేశ్ రాజధానిలోకి ప్రవేశించింది. ఇది వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఏడాది(2026) జనవరి నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులందరూ 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో మార్పును గమనించి.. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తీవ్ర ఆగ్రహంతో గొడవలకు దిగుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వారిని సైకియాట్రీ విభాగానికి తీసుకువస్తున్నారు.

    మాదక ద్రవ్యాలు తీసుకోరు. వీరిలో మద్యం వాసన  కానీ.. డ్రగ్స్ ఆనవాళ్లు గానీ కనిపించవు. బదులుగా, శరీరంపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉంటాయి. ఇలాంటి  వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని హమీడియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తక్షణ శక్తి, ప్రశాంతత, నియంత్రణ లభిస్తుందని  వ్యసనానికి అలవాటుపడిన యువకులు నమ్ముతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

  • ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక  కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్‌ పెట్రోల్‌ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.

    పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల  ధరలు ఈ సీజన్‌లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్‌ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్‌లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్‌ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో  మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

    ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్‌  కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ.  సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది,  వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.

    అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో  ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్‌ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి.  ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన  ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్‌  కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.

    ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో  మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు.

  • న్యూఢిల్లీ: ఢిల్లీ-డెహ్రాడూన్ మ‌ధ్య ఎక్స్‌ప్రెస్‌వే(Delhi-Dehradun Expressway)ను ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రారంభిస్తారు. సుమారు 11,868 కోట్ల‌తో  చేపట్టిన ఆ ప్రాజెక్టులో భాగంగా 212 కిలోమీట‌ర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు.  ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక‌నామిక్ కారిడార్‌గా కూడా పిలుస్తున్న ఈ మార్గం చార్‌ధామ్ యాత్రికుల‌కు కీల‌క‌మార్గం కానున్న‌ది. 

    ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్‌ ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటలకు పైగా నుండి సుమారు 2.5 గంటలకు తగ్గిస్తుంది. మానవ-జంతు సంఘర్షణను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో దీనిని అనేక అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. ఈ ప్రాజెక్టులో 12 కిలోమీటర్ల పొడవైన వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన వాటిలో ఒకటి.  దీని ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి డెహ్రాడూన్ సమీపంలోని మా దాత్ కాళీ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రార్థనలు చేశారు.

    వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లతో కొత్తగా ప్రారంభించిన ఈ కారిడార్ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ గుండా వెళుతుంది. ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించిన ఈ కారిడార్‌ సులభమైన, హై-స్పీడ్ ప్రయాణాన్ని అందిస్తుంది. 

     

  • న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.   

NRI

  • ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్‌విల్లేలోని ఎవాన్స్‌బర్గ్ స్టేట్ పార్క్‌లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు.  ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.

    తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.

    ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

    ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.

    మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. 

    తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.

    ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Business

  • నోవా సిరీస్‌లో భాగంగా తమ సరికొత్త డివైస్‌ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్‌ఫోన్‌ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

    Ai+ నోవా 2 ధరలు
    4జీబీ + 64 జీబీ: రూ.8,999
    6 జీబీ + 128 జీబీ: రూ.10,999

    మొదటిసారి అప్‌గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్‌ఫోన్ సీఈఓ, నెక్స్ట్‌ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్‌ అన్నారు.

    6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్‌ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్‌తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్‌ప్లేతో వినియోగదారులు కంటెంట్‌ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్‌, నిరంతరాయమైన స్క్రోలింగ్‌ అందిస్తుంది.

    ఈ స్మార్ట్‌ఫోన్‌లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్‌ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది.

  • నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

    తనిఖీలో వెలుగుచూసిన లోపాలు

    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్‌) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్‌ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్‌బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.

    ఆర్‌బీఐ చర్యల నేపథ్యం

    నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్‌బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్‌బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

    ‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

    ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

  • చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్‌జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్‌ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.

    ప్రమాదం జరిగిన తీరు

    సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.

    ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలు

    సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    • ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.

    • గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.

    • ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.

    ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరిక

    సాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

    ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్‌లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్‌యూవీలను రీకాల్‌ చేసింది.

    ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

  • పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

    దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    కంపెనీల నెత్తిన నష్టాల భారం

    అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.

    మాక్వారీ నివేదిక విశ్లేషణ

    ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్‌కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్‌లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.

    దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్

    భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.

    అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.

    ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

  • ప్రపంచ ఆర్థిక గమనానికి దిక్సూచిగా భావించే చైనా వాణిజ్య రంగం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపడంతో మార్చి నెలలో చైనా ఎగుమతుల వృద్ధి ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే, దీనికి విరుద్ధంగా దిగుమతులు మాత్రం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట వృద్ధిని నమోదు చేయడం విశేషం. చైనా కస్టమ్స్ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.

    ఎగుమతుల్లో బ్రేక్.. దిగుమతుల్లో జోరు

    రాయిటర్స్ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ చైనా ఎగుమతులు మార్చిలో కేవలం 2.5% మాత్రమే వృద్ధి చెందాయి. ఏడాది మొదటి రెండు నెలల్లో నమోదైన 21.8% వృద్ధితో పోలిస్తే ఇది భారీ పతనం. విశ్లేషకులు కనీసం 8.6% వృద్ధిని ఆశించినప్పటికీ, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ డ్రాగన్ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు, దిగుమతుల రంగం అనూహ్యంగా పుంజుకుంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి దిగుమతులు 27.8% పెరిగాయి. నవంబర్ 2021 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. 11.2% పెరుగుదల ఉంటుందన్న అంచనాలను మించి ఈ వృద్ధి నమోదు కావడం గమనార్హం.

    ఇంధన షాక్‌ను తట్టుకునే వ్యూహం

    మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. హార్మూజ్‌ జలసంధి వంటి కీలక రవాణా మార్గాల్లో ఆటంకాలు ఎదురైతే ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఈ ముప్పును ఎదుర్కోవడానికి బీజింగ్ పటిష్టమైన బఫర్‌ను సిద్ధం చేసుకుంది. చైనా వద్ద ప్రస్తుతం 120 రోజులకు పైగా సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం చమురుపైనే ఆధారపడకుండా బొగ్గు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది.

    అమెరికాతో తగ్గిన వాణిజ్యం..

    అమెరికాతో పెరుగుతున్న సుంకాల యుద్ధం, ఉద్రిక్తతల ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో అమెరికాకు చైనా ఎగుమతులు ఏకంగా 26.5% పడిపోయాయి. ప్రపంచ సరఫరా గొలుసులో ఇబ్బందులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా చైనా మొత్తం వాణిజ్య మిగులు 264.3 బిలియన్ డాలర్లకు (3% తగ్గుదల) పరిమితమైంది.

    ముందున్న సవాలు

    చైనా తన మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది 4.8% గా ఉండొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటా కలిగిన చైనా ఎగుమతులు మందగించడం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

    ఇదీ చదవండి: నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!

  • ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?

    బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఫ్రెషర్ల ఆవేదన

    ‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్‌తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.

    వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!

    జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

    టెక్ వర్గాల్లో తీవ్ర నిరసన

    ఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్‌పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్‌ఫైర్‌లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.

    కంపెనీ స్పందన కోసం నిరీక్షణ

    ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

  • ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్‌ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్‌షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్‌కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్‌షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

    విలువే ప్రాణం.. కానీ..

    వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్‌ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.

    స్తంభించిన వృద్ధి

    ఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్‌-ఎర్నింగ్‌ పర్‌ షేర్‌) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్‌లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్‌లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?

    యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్‌) కోసం 2013 నుంచి 841 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.

    ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?

    గ్రెగ్ అబెల్ యాపిల్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్‌షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.

    గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

    ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

  • భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.

    వచ్చే జీతం చాలడం లేదు

    మునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.

    చదువు, వైద్యం, ఇల్లు

    మధ్యతరగతి బడ్జెట్‌ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్‌ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.

    ‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’

    పొదుపు మాయం.. అప్పులే శరణ్యం

    ఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.

    ఆశలు నీరుగారుతున్నాయి

    మధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.

    ‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’

    ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?

International

  • వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య రెండు రోజు‍ల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.

    “మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్‌ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
     
    కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప‍్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్‌ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్‌ తిరిగి ఇస్లామాబాద్‌ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.

    పాకిస్థాన్‌లోని సోర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్‌ ప్రతినిధులు మాట్లాడుతు‍న్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

    పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్‌ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార‍్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి.

  • ఇస్లామాబాద్‌: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్‌-అమెరికా చర్చలకు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్‌ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్‌ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.

    అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్‌లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్‌ పేర్యొంది.  అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

    ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్‌ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్‌.. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్‌ బిల్లుల భారం మాత్రం మిగిలింది.

    మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్‌కు మరో సమస్య వచ్చి పడింది.  యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.

    మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్‌ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో  ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

  • న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఫోన్‌ చేశారు. మోదీతో ట్రంప్‌ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్‌ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.

    యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.  

    కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్‌ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 

    ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్‌కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్‌ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది.  

    మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో 
    ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్‌ చాలా యాక్టివ్‌గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్‌లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు.

  • కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ప‍్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారి ఆర్మీ చీఫ్‌గా ఓ మహిళను నియమించింది. దేశ రక్షణ దళ నాయకత్వంలో మార్పుల‍్లో భాగంగా ఆర్మీకి ఒక మహిళ నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జాయింట్ కెపాబిలిటీస్‌ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కాయిల్ జూలై నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది. 

    ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ ఆండ్రూ స్టువర్ట్  స్థానంలోకి ఆ‍ర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆస్ట్రేలియా సైన్యంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచే ప్రయత్నాల మధ్య కోయిల్ నియామకం జరిగింది. సైన్యంలో వ్యవస‍్థాపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు ఎదురవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఆర్మీ 125 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఆర్మీ చీఫ్‌గా ఉండనున్నారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్‌ అన్నారు. 

    రక్షణ మంత్రి రిచర్డ్‌ మాట్లాడుతూ.. కోయిల్ నియామకాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. “ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో సేవ చేస్తున్న మహిళలకు, భవిష్యత్తులో చేరాలని ఆలోచిస్తున్న మహిళలకు ఇది ప్రేరణగా ఉంటుంది” అని తెలిపారు.

    కోయిల్‌కు 55 ఏళ్లు. 1987లో సైన్యంలో చేరి అనేక ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. సైన్యంలో ఏ శాఖకైనా నాయకత్వం వహించే తొలి మహిళగా నిలుస్తారని మార్లెస్ చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో మహిళలు సుమారు 21% మంది ఉండగా, ఉన్నత నాయకత్వ స్థానాల్లో 18.5% మంది ఉన్నారు. 2030 నాటికి మొత్తం 25% మహిళలు ఉండాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. 

    మహిళను ఆర్మీ చీఫ్‌గా నియమించడానికి ప్రధాన కారణాలు

    • సైన్యంలో మహిళల ప్రాతినిధ్యం పెంచడం
    • మహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండడంతో, నాయకత్వ స్థాయిలో మహిళను నియమించి ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యం
    • లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణల నేపథ్యంలో మార్పు అవసరం
    • సైన్యంలో వ్యవస్థపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు రావడంతో, నాయకత్వంలో మార్పు ద్వారా సానుకూల సంకేతం ఇవ్వాలనే ఉద్దేశం
    • సుసాన్ కోయిల్‌కు దీర్ఘకాల సైనిక అనుభవం, ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించిన నేపథ్యం ఉంది
    • మహిళలు కూడా ఉన్నత స్థాయికి చేరగలరని చూపించడం. ఇది ప్రస్తుత సైనిక మహిళలకు, భవిష్యత్తులో చేరే వారికి ప్రేరణ.
    • దేశంలో 2030 నాటికి సైన్యంలో మహిళల భాగస్వామ్యం 25%కి పెంచాలనే లక్ష్యానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు
  • వాషింగ్టన్‌:  అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) . ఇప్పుడీ ఎఫ్‌బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్‌ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో  ప్రజల సాయం కోరుతూ ట్వీట్‌ చేసింది. మయూషీ భగత్‌ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్‌ చేసింది.

    అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్‌ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్‌షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.

    ఈ క్రమంలో ఏప్రిల్‌ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్‌ నెంబర్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్‌ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. 

     

     

  • వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప‍్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. 

    దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్‌ తిరిగి ఇస్లామాబాద్‌ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.

    అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర‍్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.

    పాకిస్థాన్‌లోని సోర్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్‌తో పాక్‌ ప్రతినిధులు మాట్లాడుతు‍న్నారు. “మేము ఇరాన్‌తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

    పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్‌ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార‍్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి.

     

  • టెహ్రాన్‌ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్‌ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్‌నకు ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. 

    అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. 

    పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్‌ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్‌ఎస్‌ అబ్రహీం లింకన్‌ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. 

    ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్‌లో ఇరాన్‌ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్‌ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్‌కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. 

  • పశ్చిమ ఆసియా  (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా  దౌత్యపరమైన  జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా  చైనా  ఈ ప్రతిపాదన  చేసింది. 

    చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలు
    జిన్హువా  వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు  భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు  ఈ ప్రతిపాదనలు  నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సమావేశంలో  జిన్‌పింగ్‌ ఈ ప్రణాళికను సమర్పించారు.

    శాంతియుత సహజీవనం , సంయమనం
    సార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది.  దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.

    సార్వభౌమాధికారానికి గౌరవం
    ఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొంది

    భద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధి
    సుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.

    అంతర్జాతీయ చట్టాల అమలు
    చివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్‌పింగ్‌ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. 

    ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్‌ : తీవ్ర ఘర్షణ, కట్‌ చేస్తే!

    అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని  చైనా అమెరికాను గట్టిగానే  హెచ్చరించింది. ఇరాన్‌తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్‌తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.

    అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. 

    ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్‌

  • ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెంది విద్యార్థిని 23 ఏళ్ల నవ్య నీలకుడిటి   అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గతేడాది మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమె అమెరికా వెళ్లారు. జీవితం స్థిరపడుతుందని ఆశపడుతున్న తరుణంలో   రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

    మిచిగాన్‌లో ఒక ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా పిట్స్‌బర్గ్‌లో నవ్య  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్‌బర్గ్‌లోని UPMC ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయి.  అయినా ఫలితం లేకపోయింది.  చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న ఆమె మరణించారు.

    నవ్య భౌతికకాయాన్ని భారతదేశానికి  తరలించేందుకు ఆసుపత్రి ఖర్చుల కోసం  టెక్సాస్‌లో నివస్తున్న ఆమె  సమీప బంధువు  శిరీష నీలకుడిటి నిధుల సేకరణ (Fundraising) చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 85వేల డాలర్లు పైగా సాయం అందింది. నవ్య తల్లిదండ్రులు సాధారణ రైతులు. కుమార్తె ఉన్నత చదువుకోసం తమ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు.  మంచి  ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశపడిన ఆమె  కలలు ఆవిరై పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.

    కాగా  ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన  తెలుగు విద్యార్థుల అకాల మరణం  వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో విషాదకర సంఘటనలో, 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు మిస్సౌరీలో మరణించారు. ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్న హరికృష్ణ, ఏప్రిల్ 11న తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చదువుకుని ఉన్నత స్థితికి చేరుతారనుకున్న బిడ్డలు ఇలా విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

    ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్‌ : తీవ్ర ఘర్షణ, కట్‌ చేస్తే!

  • పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్‌ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్‌, విద్యుత్‌ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.

    ఇరాన్‌ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై  ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్‌పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్‌కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.

    అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.

    శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి వైఎస్‌ జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.

    కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్‌ బాబు కలిశారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్‌ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

    దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్‌ జగన్‌కు తనీష్‌ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్‌ జగన్‌కు ఆయన వివరించారు.

    తనీష్‌బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.

    తనీష్‌బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ అందిస్తుందని.. తనీష్‌ కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో తనీష్‌ బాబు భార్య అనూష, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్‌ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్‌, అంబటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి  మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్‌కుమార్‌ అక్రమంగా స్టేషన్‌లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్‌ జగన్‌కు కృష్ణార్జునరెడ్డి చూపారు.

    టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్‌ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్‌ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్‌పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

Family

  • లైంగిక అంశాలపై సమాజంలో అందరికీ ఆసక్తే. కానీ, లైంగిక విజ్ఞానమంటే పచ్చి బూతు, పరమ రోత అనుకొనే చిత్రమైన కుహనా విలువలతో కూడిన వ్యవస్థ మనది. విచిత్రం ఏమిటంటే, అసలు భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఓ అవిభాజ్యమైన భాగం. ధర్మ, అర్థ, కామములనే త్రివర్గాల ద్వారానే నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలమని నమ్మిన సనాతన భారతీయ ధర్మం మనది. ధర్మ మార్గంలో అర్థాన్ని (ధనాన్ని) సంపాదించాలనీ, ఆ ధర్మబద్ధమైన అర్థం ద్వారా కామాన్ని (కోరికలను) తీర్చుకోవాలనీ, వెరసి ఆ త్రివర్గ సాధనే... మోక్షానికి మార్గమనీ మన ఋషిసత్తముల మాట. అలా క్రీ.శ. మూడో శతాబ్ద కాలంలోనే వాత్స్యాయనుడు ‘కామసూత్ర’ గ్రంథాన్ని అందించిన నేల మనది. అలాంటి కామసూత్ర విశేషాలను వేదికపై సంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించే సాహసం చేస్తే?

    నాట్య, యోగశాస్త్రాల మేలు కలయికగా...
    హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 13, సోమవారం సాయంత్రం అదే జరిగింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య గురువు స్వాతీ సోమనాథ్ తన శిష్య బృందంతో ‘అర్ధనారీశ్వరమ్’ (Ardhanareeswaram) పేరిట ఆ విలక్షణ సాహస ప్రయోగం చేశారు. ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ బి.పి. రావు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, కళాపోషకురాలు ప్రవీణా యజ్ఞంభట్, ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, దేవదాసీ సంప్రదాయ నాట్యంలో దిట్ట యశోదా ఠాకూర్, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ సహా వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై, ప్రశంసించారు.

    ఆనందమయ జీవితం గడపాలంటే, లైంగిక జీవితం ఆహ్లాదంగా సాగాలన్నది మొదటి మెట్టు. అయితే, ఆ కోరికను సైతం ధర్మబద్ధమైన మార్గంలో తీర్చుకోవడమే అసలు కీలకం. ఆ విషయాన్నే వివరిస్తూ... స్త్రీ పురుషులు ప్రకృతి – పరమేశ్వరులకు ప్రతీకలని గుర్తు చేస్తూ, వారి సంయోగం అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతిబింబమంటూ సాగిన అపురూప కూచిపూడి నృత్య రూపకం ‘అర్ధనారీశ్వరమ్’. భరతుని ‘నాట్యశాస్త్రం’లోని నృత్తాన్ని ఆసరాగా చేసుకొని, అటు ‘వాత్స్యాయన కామసూత్రాల’లోని కొన్ని ప్రధానాంశాలనూ, ఇటు ‘పతంజలి యోగశాస్త్రం’లోని యోగ భంగిమలనూ సమ్మిళితం చేసి, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సప్తస్వరాలు ఆలంబనగా, కూచిపూడి నృత్య శైలిలో ఎంతో శ్రమించి, స్వాతీ సోమనాథ్ ఈ డ్యాన్స్ బ్యాలేను రూపొందించారు.

    రెంటాల వారి ఆ ప్రామాణిక రచనే ఆధారంగా...
    వాత్స్యాయన కామసూత్రాలంటే ((Vatsayana Kamasutra) అదో అశ్లీల గ్రంథంగా పొరబడుతుంటారు. లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించిన ఆ ప్రాచీన కామశాస్త్రానికి ఉన్నవీ లేనివీ చేర్చి, చౌకబారు నకిలీ అనుకరణలతో వచ్చిన చిల్లర పుస్తకాలే ఆ అపప్రథకు కారణం. “ప్రముఖ అభ్యుదయ కవి, ద్విశతాధిక గ్రంథకర్త, జర్నలిస్టు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ (1920 – 1995) మాత్రం వాత్స్యాయనుడు రాసిన సంస్కృత సూత్రాలను యథాతథంగా అందిస్తూ, సులభంగా అందరికీ అర్థమయ్యేలా 1980లలోనే ఈ కామశాస్త్ర గ్రంథాన్ని తేటతెలుగులో ‘వాత్స్సాయన కామసూత్రాలు’ పేరిట అందించారు. ఈ నాట్య రూపక రచనకు ప్రామాణికమైన ఆ రచననే ఆధారంగా చేసుకున్నాం. ప్రఖ్యాత రచయిత – చిత్రకారుడు బ్నిమ్ గారు అలా ఈ నృత్య రూపక రచన చేశారు” అని నృత్య దర్శకురాలైన స్వాతీ సోమనాథ్ వివరించారు.“సృష్టికి మూలం సంయోగ భోగం... ప్రకృతీ పురుషుల మధుర సంగమం” అని బ్నిమ్ అందంగా చెప్పిన ఈ సాహసోపేత ప్రయోగానికి గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీతం అందించగా, ఎన్. సురేశ్ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.



    కూచిపూడి నాట్య కళాకారిణిగా స్వాతీ సోమనాథ్ (Swathy Somanath) మొదటి నుంచి రంగస్థలంపై ఓ అగ్గిబరాటా. ‘ద్రౌపది’, ‘ఆది శంకరాచార్య’ లాంటి వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఆలోచన రేపాలనుకోవడం ఆమె శైలి. నిజానికి, ఇప్పటికి 23 ఏళ్ళ క్రితం 2003లోనే ఆమె తొలిసారిగా ఈ వాత్స్యాయన కామసూత్రాలను సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా, కూచిపూడి నృత్యశైలిలో వేదిక మీదకు తెచ్చారు. ఆ ‘కామసూత్ర’ నృత్య రూపకం అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి శృంగారభరిత అంశాలను రంగస్థలంపై నర్తించవచ్చా, అది కళకూ – సమాజానికీ ఏ రకంగా మేలు చేస్తుందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. 

    అయితే, అసభ్యతకు తావివ్వని తన నృత్య రూపకంతోనే ఆ విమర్శలకు దీటుగా బదులిస్తూ, దేశ విదేశాల్లో అనేక చోట్ల స్వాతి ఆ ‘కామసూత్ర’ను ప్రదర్శించారు. “అప్పట్లో ఈ నాటకానికి సుశిక్షితులైన కూచిపూడి పురుష కళాకారులు నాకు అందుబాటులో లేరు. దాంతో, సినీ – టీవీ నటులు జె.ఎల్. శ్రీనివాస్, హీరో జాకీ లాంటి వారితో ప్రదర్శించి, రక్తి కట్టించాం. ఇప్పుడు దానికే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి, మరింత అందంగా తీర్చిదిద్ది, అందరూ సుశిక్షితులైన కూచిపూడి కళాకారులతోనే ‘అర్ధనారీశ్వరమ్’ పేరిట అందించాం. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన మా ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకులం ట్రస్ట్‌లో నా వద్ద ఎనిమిదేళ్ళుగా శిక్షణ పొందిన యువ శిష్య బృందంతోనే ఈ డ్యాన్స్ బ్యాలేను ప్రదర్శించాం” అని స్వాతి వివరించారు.

    మద్రాసుకు నాటి ‘కళాక్షేత్ర’... మనకు నేటి ‘సంప్రదాయం’
    దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ లలిత కళా శిక్షణకు విశిష్ట కేంద్రాలున్నాయి. మన తెలుగు నాట అలాంటివి కొంత అరుదే. అయితే, తమిళనాట మద్రాసు (నేటి చెన్నై)లోని రుక్మిణీ అరండేల్ ‘కళాక్షేత్ర’, కేరళలోని ‘కళామండలం’ లాగా కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అపురూప లలితకళా కేంద్రం ‘సంప్రదాయం’. శ్రీకాకుళంలోని కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుందీ గురుకుల శిక్షణ సంస్థ. ప్రపంచంలో గురుకుల పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ఇది. జిల్లా కలెక్టరే చైర్మన్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానమ్ కార్యనిర్వహణాధికారి సహా పలువురు ట్రస్టీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 

    2015 నుంచి సాగుతున్న ఈ యజ్ఞంలో భాగంగా శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులే ఇప్పుడీ ‘అర్ధనారీశ్వరమ్’ రూపకాన్ని ప్రదర్శించారు. వారంతా అరకు, సీతంపేట సహా చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఉండే గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలబాలికలే. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ పిల్లల్ని చాలీచాలని నిధులు, పేరుకుపోయిన బకాయిల మధ్యనే ఆ కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దింది. సామాన్య స్థాయి నుంచి వచ్చి మెరికల్లా తయారైన ఆ పిల్లలు ఇప్పుడు కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు.

    ఆలుమగలను ఆనందతీరాలు చేర్చే సూత్రాలు
    ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆ యువ కళాకారులు తాజాగా హైదరాబాద్‌లో సోమవారం చూపిన నృత్య కౌశల ప్రదర్శనే అందుకు సజీవ సాక్ష్యం. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో నిండిన రవీంద్రభారతి ప్రాంగణం ఈ యువ కళాకారుల ‘అర్ధనారీశ్వరమ్’ ప్రదర్శనను ఆద్యంతం కరతాళ ధ్వనులతో అభినందించింది. “దాంపత్య ధర్మ నిర్దేశనం కామసూత్ర కథనం” అని పేర్కొంటూ, “ఇహమందు మోక్షమునిచ్చే సూత్రము... కామసూత్రమ”ని ఈ రూపకం ద్వారా రచయిత – నృత్య దర్శకులు ఢంకా బజాయించారు. “అధోగతికి చేర్చు వ్యామోహం ఇదే కదా” అంటూ వాత్స్యాయన మహర్షితో రాజు విభేదించి, కామశాస్త్ర అవసరమేమిటని సంవాదించినట్టుగా ఈ రూపకాన్ని మొదలుపెట్టారు. ధర్మం తప్పి కామంతో చరించిన రావణాసురుడు, కీచకుడు లాంటివారికి పట్టిన దుర్గతిని కళ్ళకు కడుతూ, సాక్షాత్తూ జగద్గురు ఆదిశంకరులు సైతం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఓ భాగంగా కామాన్ని గుర్తించిన తీరును బ్యాలేలో ప్రస్తావించారు. “ఏమిది మైకము... ఏమిది తమకము... ఏదో తెలియని వ్యామోహము” అంటూ తృతీయ పురుషార్థ ప్రతిపాదన చేశారు. ఈ ధర్మార్థానంతర పురుషార్థ సాధనలో “ఆలుమగలను ఆనంద తీరాలు చేర్చే సూత్రాలు” కామసూత్రాలు అన్నది నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. సమయ, సందర్భోచితంగా ‘భర్తృహరి శృంగార శతకం’లోని అంశాలను సైతం రూపకంలో చేర్చారు.

    “చంద్రహారాలు... ప్రేమ కలాపపు ప్రియచిహ్నాలు... మగని తలపించు తీయని గురుతులు”గా నఖ క్షతాలు, అలాగే దంత క్షతాలు, ఆలింగనాలు, సంయోగ భంగిమలను యువ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ‘ఉత్సాహానికి ఉత్పలకం’, ‘విశృంఖలతకు విజృంభితకం’, ‘ఇష్టరాగమునకు ఇంద్రాణికం’ తదితర సంక్లిష్టమైన సంభోగ బంధనాలను అంతే సమర్థంగా నర్తకులు చూపడం విశేషం. ఎక్కడా అసభ్యత, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తేవడం కత్తి మీద సామే! దాన్ని ఓ సవాలుగా తీసుకొని, సంప్రదాయ శైలి నృత్య ముద్రలు, దరువులతో... నృత్య సంయోజనం చేయడంలో నాట్యాచారిణిగా స్వాతి తన అసమాన ప్రతిభ కనబరిచారు. అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వాత్స్యాయనుడిగా రవితేజ, రాజుగా – శివుడిగా మెహర్ ప్రభాకర్, పార్వతిగా దూసి వైష్ణవి, సూత్రధారిణులుగా హేమాంజలి, శ్రుతి కొంజర్ల, గీతిక, యశస్విని, కవలలైన అక్కాచెల్లెళ్ళు భానుశ్రీ – భవ్యశ్రీ, తదితరులు ఉత్తమ ప్రదర్శన అందించారు.

    ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు... అద్భుత సమన్వయం
    ముఖ్యంగా కథానాయకుడిగా అరకు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు కొర్రా బలరామ్ అలుపూ సొలుపూ లేకుండా గంటన్నర పైగా ఈ అపురూప నాట్యవిన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రూపకానికి మూలస్తంభంగా నిలిచారు. ఇంగ్లీషులో సాగిన నేపథ్య వ్యాఖ్యానం, రూపకంలో అడుగడుగునా సందర్భోచిత వాద్య సంగీతం, గాత్ర మాధుర్యం, వేణునాదం సహా పలు వాద్య పరికరాల వినియోగం... ప్రదర్శనను ఆసక్తిగా మలిచి, ఆహ్లాదభరితం చేశాయి.

    చ‌ద‌వండి: మ‌న‌కు తెలియ‌ని మ‌న‌ భీముడి కోణంలో భార‌తం

    “సిగ్గే సుదతికి సింగారం... అది చెలికానికి ఆకర్షణం” అనే అంశంలో తొలి కథానాయికగా సీతంపేటకి చెందిన నిమ్మల అంజలి ముద్దరాలి సిగ్గును అభినయించిన తీరు ఆకట్టుకుంది. నాయికను ప్రేరేపించే సఖిగా లిఖిత అభినయం అంశానికి నిండుదనం తెచ్చింది. ఇక, ఈ రూపకంలో ద్వితీయ కథానాయికగా చేరడేసి కళ్ళు, చెరగని చిరునగవు మోముతో, అణువణువునా అభినయం నింపుకొని నర్తించిన యామినీ కసిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. నృత్యపరిశోధనకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొందిన యామిని రానున్న రోజుల్లో నర్తకిగా మరింత రాణించడం ఖాయం.

    ఆద్యంతం లోపరహితంగా, అత్యంత సమన్వయంతో, అతి ప్రసన్న వదనంతో సాగిన ఈ నాయకా, నాయికల ముగ్గురి ప్రదర్శన నిస్సందేహంగా వారి పట్టుదల, కఠోరశ్రమ, నిత్యం గంటలకొద్దీ వారు చేసిన నిరంతర సాధన ఫలితమే. గూఢకమ్, బిందుమాల, ప్రవాళమణి, మణిమాల లాంటి పలు వాత్స్యాయన ప్రయోగాల ప్రదర్శన చూసి, ప్రేక్షకులు అచ్చెరువొందారంటే అతిశయోక్తి కాదు. నాట్య బృందమంతా కేవలం వేదికపై నటిస్తున్నట్టు కాకుండా, ఆ పాత్రలు తామే అయినట్టుగా ఇహం మరిచి ఆ క్షణంలో జీవించి, రససిద్ధి కలిగించడం ఈ ప్రదర్శనకు పంచప్రాణాలైంది. ఇలా ఈ శిష్యులందరినీ తీర్చిదిద్దడానికి సమస్త శక్తియుక్తులూ ధారపోసిన స్వాతీ సోమనాథ్ అంకితభావానికి పదే పదే వినిపించిన సభికుల హర్షధ్వానాలు తరగని కితాబులుగా నిలిచాయి.

    దాదాపు పాతికేళ్ళ క్రితమే... స్వాతి సంచలన ప్రయోగం
    ఒకప్పుడు 1980లో రవీంద్రభారతి వేదికపైనే అరంగేట్రం చేసి, 2003లో తాను స్వయంగా అదే వేదికపై ‘కామసూత్ర’ డ్యాన్స్ బ్యాలే ప్రదర్శనతో సంచలనం రేపి, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తన శిష్యులతో దాన్నే  ‘అర్ధనారీశ్వరమ్’గా అందించిన కళాకారిణి స్వాతీ సోమనాథ్‌కు ఇది అక్షరాలా ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితంలో మరపురాని అపురూప జ్ఞాపకం. “ఈ పిల్లల కౌశలం వెనుక ఎనిమిదేళ్ళ నిరంతర కృషి, సుదీర్ఘ సాధన దీని వెనక ఉంది. నిజానికి, ఈ ‘సంప్రదాయం’ ఏర్పాటుకు ముందు స్వాతి వేరు. తరువాతి స్వాతి వేరు. నా జీవితమే మొత్తం మారిపోయింది. పన్నెండేళ్ళుగా శ్రీకాకుళానికే పరిమితయ్యాను. అపరిమిత అవకాశాలకు కేంద్రమైన హైదరాబాద్ నగరాన్నీ, కుటుంబాన్నీ వదిలి శ్రీకాకుళానికి వెళ్ళి పనిచేయడం కష్టమే. ‘సంప్రదాయం’ ట్రస్ట్ వ్యవస్థాపనకు ప్రభుత్వ కృషిలో భాగమై, నాట్యగురువుగా అక్కడ జీతానికి పనిచేస్తున్నఇన్నేళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాను. వ్యక్తిగతంగా మరెన్నో త్యాగాలూ చేశాను. కానీ, ఇవాళ అద్భుతంగా తయారై, నాట్యంలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగిన ఈ నవతరం పిల్లల్ని చూసినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతుంటాను. కళాజీవితంలో నా కృషికి అర్థం, పరమార్థం సిద్ధించినట్టు భావిస్తుంటాను” అని నీళ్ళు నిండిన కళ్ళను అదుపు చేసుకుంటూ స్వాతీ సోమనాథ్ వ్యాఖ్యానించారు.

    అభివృద్ధిలో వెనుక.. అసమాన ప్రతిభలో ముందు... 
    అర్ధనారీశ్వర స్తోత్రంతో నర్తకీ నర్తకులు ప్రస్తుతించగా, శివపార్వతుల కేళీ విలాసంతో ముగిసిన తాజా ‘అర్ధనారీశ్వరమ్’ నృత్యరూపక ప్రదర్శనను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ప్రేక్షకులు రావడం ప్రత్యేకించి గమనార్హం. ముఖ్య అతిథిగా హాజరైన ‘భారత్ బయోటెక్’ మేనేజింగ్ డైరెక్టర్ ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, తదితర ప్రముఖులు కళాకారులను అభినందించారు. తమిళనాట నైవేలిలో పుట్టి పెరిగి, మద్రాసులో చదువుకున్న తనకు బాల్యం నుంచి సంగీతం, నాట్యం తదితర లలితకళలతో ఉన్న అనుబంధాన్ని సుచిత్ర పంచుకున్నారు. “మా ఊరికి కేవలం గంట ప్రయాణంలో చిదంబరం పట్టణం, ప్రపంచానికి కేంద్రబిందువుగా భావించే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళితే చిదంబరం దర్శిస్తుంటాను” అని ఆమె తెలిపారు. ఇలాంటి నృత్యరూపక ప్రదర్శనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం, సంస్కృతి ఘనతను ప్రపంచానికి చాటతాయని అభిప్రాయపడ్డారు.

    ఇక, స్వాతి సమకాలికురాలు – కూచిపూడి శిక్షణలో ఒకప్పటి సహాధ్యాయి అయిన యశోదా ఠాకూర్, “పదం, జావళీలతో దేవదాసీ నృత్యం ద్వారా స్వయంగా శృంగార రసాభినయాన్ని విద్యార్థులకు బోధిస్తున్న నేను స్వాతికి వీరాభిమానిని. సాహసించి, ఎన్నో ప్రయోగాలు చేసే ఆమె నాకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యస్ఫూర్తి” అని అభినందించారు. “ఆద్యంతం కళ్ళకూ, చెవులకూ విందు”గా బి.పి. రావు అభివర్ణించిన ఈ రూపకానికి మూలస్తంభాలుగా నిలిచిన వారంతా శ్రీకాకుళం ప్రాంత వాసులే కావడం విశేషం. స్వయానా శ్రీకాకుళం ప్రాంతమే పురిటిగడ్డ అయిన స్వాతీ సోమనాథ్‌తో పాటు ఆమె శిష్యబృందం, బ్యాలే ప్రదర్శనకు లైటింగ్, కాస్ట్యూమ్స్, సంగీతం అందించిన అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. అభివృద్ధిలోనే తప్ప అసమాన ప్రతిభలో ఉత్తరాంధ్ర వెనుకబడలేదనడానికి ఇది నిదర్శనమని అతిథులు అభిప్రాయపడ్డారు.

    కూచిపుడి నాట్యచరిత్రలో కొత్త అధ్యాయం
    స్వాతీ సోమనాథ్ తొలి గురువైన భాగవతుల రామకోటయ్య కుమారుడూ – కూచిపూడి సంప్రదాయంలోనే పుట్టి పెరిగి, స్వయంగా నాట్యాచార్యుడైన భాగవతుల సేతురామ్ అన్నట్టు, “కూచిపూడి నాట్యచరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయం”. సాహిత్యం, సంగీతం, నృత్యసంయోజనం త్రివేణీ సంగమమై, వేదికను రసప్లావితం చేసిన అరుదైన ఘట్టం. అదీ ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్ర నుంచి, వెనుకబడిన ప్రాంతంగా భావించే చోట నుంచి, వెనుకబడిన గిరిజన వర్గాల నుంచి ఇలాంటి అపురూప ప్రతిభావంతులైన యువ కళాకారులు పైకి రావడం అపూర్వం. సముద్రపుటొడ్డున శాంతినికేతనంలా ఉండే ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల ట్రస్ట్ చేసిన ఓ అద్భుతం. ఇలాంటి ప్రతిభా సుమాలు మరిన్ని పల్లవించాలంటే, ఆర్థికంగా ఇప్పటికీ అస్తుబిస్తుగా ఉన్న ‘సంప్రదాయం’కి ప్రభుత్వంతో పాటు కళాభిమానులు, దాతలు కాపుగా నిలవాలి. ‘అర్ధనారీశ్వరమ్’ లాంటి ప్రదర్శనలు ఊరూరా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రదర్శించాలి. సుచిత్రా ఎల్లా తదితరులు పేర్కొన్నట్టు, ‘మన తెలుగువారి కూచిపూడి ఘనతనూ, మన భారతీయ కళా, సాంస్కృతిక ప్రాభవాన్నీ ప్రపంచానికి చాటడానికి’ అదే సరైన మార్గం!

    - రెంటాల జయదేవ

  • పట్టణాల్లో, నగరాల్లో మారథాన్‌, అధిక ఫోర్స్‌తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్‌. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్‌నెస్‌ సెంటర్‌ ఈవెంటే. 

    ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్‌ ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్‌. అందుకు సంబంధించిన పోస్ట్‌ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్‌నెస్‌ ఈవెంట్‌లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. 

    ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్‌. మారథాన్‌లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్‌ చేస్తున్నారంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు కేడియా. 

    ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్‌నెస్‌ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్‌నెస్‌ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్‌నెస్‌ ప్రియులు. 

     

    (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)

     

  • అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్‌ బాక్స్‌లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్‌ బ్యాగ్‌లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్‌ రియాక్షన్‌. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.

    అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

    పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? 
    ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో  పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. 

    అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.

    ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...
    మజిల్‌ క్రాంప్స్‌ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్‌ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్‌ పడుతుంది. 

    అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్‌కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్‌క్రాంప్స్‌ అంటారు. ఈ మజిల్‌క్రాంప్స్‌ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.

    వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్‌కు తీసుకురావడం అవసరం.

    ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్‌ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్‌ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్‌ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

    వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలు

    గుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్‌క్రాంప్స్‌ వంటి సమస్యలూ నివారితమవుతాయి.

    పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.

    సూప్‌లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్‌లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్‌లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.

    వెజిటబుల్‌ సూప్స్‌ : అన్ని రకాల సూప్‌లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్‌లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్‌)ల్లోంచి సూప్‌లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్‌లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్‌పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్‌రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్‌రూమ్స్‌)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్‌లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.

    పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...
    జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్‌) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్‌. జావ/పారిజ్‌ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్‌గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.

    రకరకాల పానీయాలు...
    అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...

    నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. 

    బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్‌ జ్యూస్‌ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. 

    సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్‌లో లేదా ఆ వేర్ల పౌడర్‌లో నీళ్లు లేదా సోడా కలపాలి. 

    ఒక టీస్పూన్‌ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్‌పన్నా అనే సీజనల్‌ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు. 

    ఇవేకాకుండా... ఖస్‌ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్‌ షర్బత్‌లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్‌ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్‌ కలపకుండా తాగడమే మేలు.

    తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్‌...
    పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్‌ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్‌ చీజ్‌ సలాడ్స్‌... తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.

    కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడా, ఐస్‌క్రీమ్‌లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్‌... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌ని తీసుకోవడమే మంచిది. ఇవి  ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. 

    బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. 

    కుకుంబర్‌... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. 

    మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి.  ఇందులో బీటా కెరొటిన్, విటమిన్‌ సి, ఫైబర్లు ఉంటాయి. 
    వాల్‌నట్స్‌...  ఆక్రోట్ల (వాల్‌నట్‌)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

    చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్‌ చేపలు ఇవ్వడం మేలు. 

    ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెప్పర్‌... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

    పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్‌ మిల్క్, ఫ్రూట్‌ మిల్క్‌ షేక్‌లు (మ్యాంగో మిల్క్‌ షేక్‌) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. 

    పనీర్‌... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్‌డ్‌ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్‌ రోల్స్‌ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.

    ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్‌ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్‌ గోల్స్‌... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.  

    ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... 

    ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.

    ఎండవేళల్లో ఇన్‌డోర్‌ గేమ్స్‌కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. 

    ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. 

    పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. 

    ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్‌ఎస్‌ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.

    కొన్ని జాగ్రత్తలు ఇవి... 
    పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్‌ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్‌ల కలర్‌ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.

    బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్‌ బాటిల్‌ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్‌ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్‌ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్‌ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్‌ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్‌ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్‌’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. 

    అందుకే ప్లాస్టిక్‌ బాటిల్‌కు బదులు మంచి గాజు బాటిల్‌ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్‌లు, వాటర్‌బాటిల్స్‌నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్‌ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. 

    పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ / క్రీమ్స్‌’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్‌ రాస్తుండాలి. 

    పిల్లలను కారులో ఉంచి షాపింగ్‌ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్‌ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. 

    పిల్లలకు ఇవ్వకూడనివి... 
    దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్‌ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్‌లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్‌క్రాంప్స్‌ను తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. 

    అలాగే ఆయిల్స్‌ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్‌ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్‌ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్‌సలాడ్స్‌ వంటివి ఇవ్వవచ్చు. 
    డాక్టర్‌ కంచన్‌ ఎస్‌ చన్నావర్‌కన్సల్టెంట్‌ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్‌ ఇంటెన్సివిస్ట్‌
    నిర్వహణ: యాసీన్‌ 

    (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!)

  • భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్‌ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్‌ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న​ కృషి గురించి సవివరంగా చూద్దామా.

    ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్‌. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్‌కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్‌ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్‌లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్‌గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. 

    ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్‌ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్‌. 

    ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్‌కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్‌కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్‌కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ కళ, గుజరాత్‌కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. 

    ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్‌ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్‌ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్‌ బ్రాండ్‌ “ఆరా పెన్సిల్స్”  ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్‌సైట్‌ని కూడా క్రియేట్‌ చేసింది. అక్కడ ఆన్‌లైన్‌లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్‌ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. 

    తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్‌ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్‌.

    (చదవండి: ఆ గాయం ఆమె లైఫ్‌నే టర్న్‌ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..)

     

  • ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్‌ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.

    ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్‌ అగర్వాల్‌గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్‌నెస్‌, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. 

    ఆమె పెద్ద కార్పొరేషన్‌ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌గా డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ హెడ్‌గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్‌ని నిర్వహిస్తూనే మారథాన్‌లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. 

    దాంతో మీరా ఆ గాయం క్యూర్‌ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. 

    అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్‌స్టైల్‌ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్‌గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. 

    అలాగే రకరకాల వంటకాలప ‍ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్‌ లడ్డూలు, నట్స్‌, వివిధ సీడ్స్‌ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్‌లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. 

    అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్‌ బటర్లు, కోల్డ్‌ప్రెస్‌ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్‌' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్‌ స్పెషలిస్ట్‌ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. 

    ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్‌ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్‌లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్‌ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌లకు ట్రెక్కింగ్‌ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్‌షిప్ పీక్‌ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్‌ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.

    (చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్‌..! ఆ శారీ ప్రత్యేకతలివే..)
     

  • సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్‌ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

    ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్‌ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. 

    దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్‌ సృష్టించే ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రాయ్‌ చౌధురి  ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్‌ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్‌ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్‌ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను.  

    "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. 

    ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్‌రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్‌లో వెల్లడించారు రాయ్‌.

    స్పెషాల్టీ..
    కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం  'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. 

    కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్‌ డైయింగ్‌ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్‌ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. 

    ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్‌లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం.

     

    (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్‌)

     

     

     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్‌.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.

    ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌ సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్‌.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్‌ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

    జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్‌లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’  అని సీఎం రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

    తమిళనాడు సీఎంకు లేఖ: 
    తమిళనాడు సీఎంకు కూడా రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. లోక్‌సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌కు  లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

    లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే  రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

  • హైదరాబాద్‌: ఖాల్సా పంథ్ స్థాపనకు గుర్తుగా జరుపుకునే “వైశాఖి” పండుగను తెలంగాణ సిక్కు సమాజం మంగళవారం భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. అమీర్‌పేట్‌లోని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య కార్యక్రమాలను అమీర్‌పేట్‌లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో నిర్వహించారు. 

    రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సిక్కు భక్తులు, ఇతర మతాల ప్రజలు “విశాల్ దీవాన్” (మహా సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు, కథాకారులు గురుబాణీ కీర్తనలు, ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు.

    వారు గురు గ్రంథ్ సాహిబ్ బోధనలు, ఖాల్సా పంథ్ స్థాపన విశిష్టత, జీవన విలువల ప్రాముఖ్యతపై వివరించారు. జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం, సామరస్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాయ్ ఎస్.గురుదేవ్ సింగ్ (ఆస్ట్రేలియా), జ్ఞాని గగన్‌దీప్ సింగ్ జీ (పట్నా సాహిబ్), భాయ్ ఎస్. మన్ప్రీత్ సింగ్ జీ (ఢిల్లీ), భాయ్ వీర్ సింగ్ (హైదరాబాద్‌) తదితర ప్రముఖులు గురుబాణీ కీర్తనలు, కథలు వినిపించారు.

    గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎస్.దర్శన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. సురేందర్ సింగ్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులను ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ సంప్రదాయ “గురు కా లంగర్” (ఉచిత భోజనం) వడ్డించారు.

    రంగురంగుల నగర్ కీర్తన్ నిర్వహణ
    సాయంత్రం గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ నుంచి భారీగా నగర్ కీర్తన్ (పవిత్ర ఊరేగింపు) ఉంటుంది. ఈ ఊరేగింపు గ్రీన్‌లాండ్స్, బేగంపేట్, పంజాగుట్ట ప్రధాన మార్గాల మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌ను అలంకరించిన వాహనంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్తారు. నిశాన్ సాహిబ్ పతాకదారులు ముందుండగా, యువత గట్కా (సిక్కు యోధ కళ) ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. కీర్తన బృందాలు శబ్ద కీర్తనలు ఆలపిస్తారు.
      
    బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 1.30 గంటల వరకు అమీర్‌పేట్‌లోని గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో “వైశాఖి రేన్ సబాయ్ కీర్తన్ దర్బార్” నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు శబ్ద కీర్తనలు ఆలపించనున్నారు.
     

  • సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్‌ఎఫ్‌ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్‌కామ్‌లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.

    కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్‌పోర్ట్‌లో హల్‌చల్‌ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.

    కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్‌లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్‌, పెట్రోల్‌బంక్‌, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్‌ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.

    అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్‌కుమార్‌ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్‌కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

     

     

     

     

Politics

  • పట్నా: బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.

    సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

    సామ్రాట్‌ చౌదరి ఎవరు? 
    సామ్రాట్‌ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.

    సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్‌ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

    సీఎం రేసులో కీలక నేతలు

    సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్‌లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే.
     

  • సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్‌బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్‌ ప్రశ్నించారు.

    ‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్‌ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్‌లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్‌ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్‌ దుయ్యబట్టారు.

    ‘‘కొన్ని ఫేక్ ఛానల్స్‌తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది.

    ..అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్‌, గాంధీనగర్‌ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్‌లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్‌ వ్యాఖ్యానించారు.

    ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి
  • పట్నా: బిహార్‌ సీఎం పదవికి నితీశ్‌ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్‌కు ఆయన రాజీనామా సమర్పించారు. క్యాబినెట్‌ను రద్దు చేస్తూ నితీశ్‌ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీశ్‌. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 

    అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేసిందని నితీశ్‌ కుమార్‌ రాజీనామా తర్వాత ఎక్స్‌లో తెలిపారు. “హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్ణాలు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు.. ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసింది. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరిగాయి. మహిళలు, యువత కోసం ఎంతో చేశాం” అని నితీశ్ చెప్పారు. కాగా, నితీశ్‌ కుమార్ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశం. 

    సీఎంగా సామ్రాట్‌ చౌదరి? 
    బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15న) బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉంది. నితీశ్‌ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.

    జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. జేడీయూ వర్కింగ్ ప‍్రెసిడెంట్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా ఇటీవల మాట్లాడుతూ.. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్‌ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు.  

    సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
     

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్‌ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

    మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డినే. వైఎస్సార్‌సీపీ హయాంలో పది ఫిషింగ్‌ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. 

    ఆంధ్రా మత్స్యకారులు పాక్‌, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్‌ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్‌ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. 

    మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్‌ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్‌ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్‌జగన్‌ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. 

    ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

Guest Columns

  • అంబేడ్కర్‌ ఒక సజీవ ప్రభాతం. సాంస్కృతిక రాజకీయ దార్శనికుడు. ప్రపంచ పరిణామానికి ఆయువు పోసిన జ్ఞాని. ఆకాశపుటంచులు దాటిన కీర్తి పతాక. కేవలం ఒక నాయకుడిగానే కాదు, ప్రపంచ పరిణామాన్ని ప్రవహింపజేసిన జ్ఞాన సింధువుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అంబేడ్కర్‌ మరో బుద్ధుడు. నవయాన బోధిసత్వుడు. ప్రపంచ వైతాళికుడు. ప్రపంచ గమనానికి నిర్దేశకుడు.

    ఆయన సంఖ్య మూలాన్ని తెలుసుకున్న జ్ఞాని. సమాజంలో సంఖ్యలన్నీ నిస్తేజమై, నిర్వీర్యమై, అబద్ధాలతో నిండిన వేళ... సత్యపూర్ణమైన సంఖ్య కోసం వెతికి పట్టుకొని, ఆ గణాంకాలను పేర్చి రాజ్యాంగ హక్కుల్ని రూపొందించారు. నిజానికి భారత రాజ్యాంగం ఒక గణిత శాస్త్రం. 1931లో ఉన్న జనాభా లెక్కలే కాకుండా, 2025 నాటికి జనాభా నిష్పత్తి ఎలా ఉండబోతుందో అప్పుడే అంచనా వేయగలిగిన అద్భుత ప్రణాళికాకర్త ఆయన. మనుషులను ప్రభావితం చేసే శక్తులు, వారిని నిర్జీవం చేసే శక్తుల మధ్య జరిగే యుద్ధాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన గణితజ్ఞుడు.

    భారత స్త్రీ వ్యక్తిత్వ శిల్పాన్ని అపురూపంగా చెక్కి, ప్రతిభను వెలికి తీసి, హిందూ కోడ్‌ బిల్లు ద్వారా వారికి హక్కులు పొందుపర్చిన మహోన్నతుడు. నేటి ఐటీ రంగంలో ఒక వ్యక్తి వంద మంది చేసే పనిని ఎలా చేయగలడో, ఆనాడు అంబేడ్కర్‌ ఒక పక్క రాజ్యాంగ రచన, మరోపక్క రాజకీయ నిర్మాణం, ఇంకోవైపు బౌద్ధ సంస్కృతి వికాసం ద్వారా నిరూపించి చూపారు. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పాళీ, పారశీకం, గుజరాతీ, జర్మన్, ఫ్రెంచ్‌ వంటి  భాషలపై పట్టు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

    నేడు ఆయన వేసిన బాటలో నడుస్తూనే దళితులు, అణగారిన వర్గాల వారు ఐటీ రంగంలో, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎదుగుతున్నారు. సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటూ, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంబేడ్కర్‌ అక్షరం ఒక ‘అణు విచ్ఛేదన కేంద్రం’. ఎన్నో చీకటి గుహల్లాంటి జీవితాల్లో ఆయన ఆలోచనలు వెలుగులు నింపుతున్నాయి. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు, ఇంగ్లాండ్‌ నుండి జర్మనీ వరకు... ఆయన విగ్రహం లేని ఖండం లేదు. నేటి కాలంలో సమాచారం అంటే ఒక భ్రమగా, టెక్నాలజీ ఒక అల్లికగా మారుతోంది. ఈ మాయాజాలం నుండి సత్యాన్ని వెలికితీసి, అంకెకు, అక్షరానికి సత్యనిష్ఠను అద్ది... మనల్ని బతికించిన మహోన్నతుడు అంబేడ్కర్‌. భారత దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వ భావనలను పరిచయం చేసిన మరో రూసో. హెగెల్‌ శిష్యుడిగా ఆజన్మాంతం కుల, మత నియంతృత్వాలను ఎదిరించిన యోధుడు.

    చ‌ద‌వండి: వాళ్ల త‌ల‌ల్ని 'త‌లారీ'కి అప్ప‌జెప్ప‌వ‌ద్దు!

    ‘జై భీమ్‌’ అనేది కేవలం నినాదం కాదు. శక్తితో నడవడం, స్వచ్ఛమైన జీవితంతో సాగడం, సంపదను సృష్టించడం. అయితే అంబేడ్కర్‌ ఆలోచనలకు భిన్నంగా ఈనాడు రిజర్వేషన్లను దళితులకు పూర్తిగా చెందకుండా చేయడమే గాక వారి ప్రతిభపైనా, ఉనికిపైనా నిరంతర దాడులు చూస్తున్నాము. డీలిమిటేషన్‌ పేరుతో దక్షిణ భారతంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తగ్గించి రాజకీయాల్లో వీరిని నామమాత్రం చెయ్యాలనే భావనలు కూడా అంబేడ్కర్‌ ఆలోచనలకు వ్యతిరేకం. అంబేడ్కర్‌ ఒక్కొక్క సందర్భంలో ప్రతివాదిగా, విప్లవ కారుడిగా, పోరాట వీరుడిగా, మహర్‌ బిడ్డగా, రాజనీతిజ్ఞుడిగా మనకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయన జీవితమే మనకు అధ్యయన కేంద్రం. ఈనాడు బహుజన రాజ్యాధికారాన్ని కుల నిర్మూలనా సిద్ధాంత దీక్షతో సాధించాలి. ఇదే అంబేడ్కర్‌ జయంతికి ఇచ్చే ఘనమైన నివాళి.

    డాక్ట‌ర్‌ కత్తి పద్మారావు 
    వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు
    (నేడు అంబేడ్కర్‌ జయంతి)

Cartoon