Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సూపర్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఝలక్ ఇచ్చింది. ముంబయి నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో నదినే డి క్లార్క్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కేవలం 44 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది.   

    కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలింగ్ ఎంచుకుంది.  ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి క్రికెటర్ సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది.  25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది. 
     

  • ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ముంబైని బ్యాటింగ్‌కు అహ్హనించింది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు.

    ముంబై జట్టు 11 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగుల‌కే 4 కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.  ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది.

    ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు.

    అయితే ముంబై ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సజన రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచే తప్పించుకుంది. రెండు సునాయస క్యాచ్‌లను ఆర్సీబీ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
    చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ
     

  • టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌కు రావడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరిన సంగ‌తి తెలిసిందే.

    అయితే  అందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ విముఖ‌త చూపించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఇక ఈ విష‌యంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు.

    ఈ మీటింగ్‌లో బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీయ‌స్ లక్ష్మణ్ పాల్గోన్నారు. అయితే ఈ స‌మావేశంలో కేవ‌లం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించిన విష‌యాలు మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్లు దేవజిత్ సైకియా స్ప‌ష్టం చేశారు.

    "కేవ‌లం సీఓఈ, క్రికెట్ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. దానిపై ఐసీసీయే తుది నిర్ణ‌యం తీసుకుంటుంది" సైకియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

    కాగా ఇటీవ‌ల భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన ఉద్రిక్తలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే బంగ్లా స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. బంగ్లా అభ్యర్ధను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం.
     

  • భారత్‌, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ వ్యవహరించనున్నాడు.

    అయితే ఈ జ‌ట్టులో అన్నదమ్ముల జోడీలు ఉన్నాయి. మార్క్ అడైర్‌, రాస్ అడైర్‌తో పాటు హ్యారీ టెక్టర్‌, టిమ్ టెక్టర్‌ బ్రదర్స్‌ వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్, ఆల్ రౌండర్ కర్టిస్ కాంఫర్ స్టార్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు.

    ఈ మెగా టోర్నీలో  ఐర్లాండ్.. ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌లతో పాటు గ్రూపు-బిలో ఉంది. ఐరీష్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కోలంబో వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఐర్లాండ్.. న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించింది.  ఇక ఈ పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.

    టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్‌ జట్టు
    పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.
    చదవండి: BBL 2025-26: ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..
     

  • ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. యాషెస్ సిరీస్ ముగియడంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ ఇప్పటికే బ్రిస్బేన్ హీట్ జట్టులో చేరారు.

    ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్‌గా ఖవాజా వ్యవహరించనున్నాడు. జనవరి 10న సిడ్నీ థండర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లబుషేన్, ఖవాజా ఆడనున్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌, స్పిన్నర్ టాడ్ మర్ఫీ సిడ్నీ సిక్సర్స్ తరపున బరిలోకి దిగనున్నారు.

    హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌కు వీరద్దరూ అందుబాటులో ఉండనున్నారు. యాషెస్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' నిలిచిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత జనవరి 16న సిడ్నీతో జరిగే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ తరపున స్టార్క్ ఆడనున్నాడు.

    స్టార్క్ బీబీఎల్‌లో ఆడనుండడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.  అలెక్స్ కారీ (అడిలైడ్ స్ట్రైకర్స్), జోష్ ఇంగ్లిష్‌ రిచర్డ్‌సన్ (పెర్త్ స్కార్చర్స్), బ్రెండన్ డాగెట్ (మెల్బోర్న్ రెనెగేడ్స్) కూడా తమ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.

    హెడ్‌, గ్రీన్ దూరం...
    అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్‌, కామెరూన్ గ్రీన్ దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి హెడ్‌ అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, గ్రీన్‌ పెర్త్‌ స్కార్చర్స్‌ తరపున ఆడాల్సి ఉండేది. కానీ వర్క్‌లోడ్‌ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరూ విశ్రాంతి తీసుకోనున్నారు. నేరుగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. హెడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో హెడ్  629 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
    చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?
     

  • మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026 సీజ‌న్‌కు తెర‌లేచింది. తొలి మ్యాచ్‌లో న‌వీ ముంబై వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి ‍మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

    అయితే తొలి మ్యాచ్‌కు ముంబై స్టార్‌ ప్లేయర్‌ హీలీ మాథ్యూస్‌ దూరమైంది. అదేవిధంగా ఆసీస్‌ ప్లేయర్‌ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్‌ అరంగేట్రం చేసింది. ఆర్సీబీ తరపున అయితే ఏకంగా ఆరుగురు అరంగేట్రం చేశాఉరు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్,  అరుంధతి రెడ్డి వంటి స్టార్‌ ప్లేయర్లకు ఆర్సీబీ తరపున ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.

    తుది జట్లు
    ముంబై ఇండియన్స్: నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్‌), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్

    ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్‌..
    ఇక  డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకను బీసీసీఐ ఘనం‍గా నిర్వహించింది. తొలుత మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు మహిళా సాధికారతపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్‌తో, యో యో హనీ సింగ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.
    చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?
     

  • భార‌త పురుష‌ల‌ క్రికెట్ జ‌ట్టు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డే వ‌డోద‌ర వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.

    కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ తిరిగి రావ‌డంతో జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. అదేవిధంగా వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.  ఇటీవ‌ల జ‌రిగిన అన్ని ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో అత‌డు ఉత్త‌ర్ణీత సాధించాడు. దీంతో అత‌డు కూడా కివీస్‌తో సిరీస్‌లో ఆడ‌నున్నాడు. 

    బ్రేస్‌వెల్ సార‌థ్యంలో కివీస్‌ జ‌ట్టు కూడా భార‌త్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. సిరీస్‌ను విజ‌యంతో ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే ప‌ర్యాట‌క జ‌ట్టుతో పోలిస్తే టీమిండియా ప‌టిష్టంగా ఉంది. ఈ సిరీస్ కివీ స్టార్ ప్లేయ‌ర్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియ‌మ్స‌న్ దూర‌మ‌య్యారు. భార‌త్ మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త తుది జ‌ట్టు కూర్పుపై ఓ లుక్కేద్దాం.

    య‌శ‌స్వికి నో ఛాన్స్‌..?
    సౌతాఫ్రికా సిరీస్‌కు శుభ్‌మ‌న్ గిల్ దూరంగా ఉండ‌డంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి య‌శ‌స్వి జైశ్వాల్ ఆరంభించాడు. గిల్ తిరిగి రావ‌డంతో ఓపెన‌ర్  జైశ్వాల్ బెంచ్‌కే ప‌రిమితం కానున్నాడు. మూడు, నాలుగు స్ధాన‌ల్లో విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్‌కు రానున్నారు.

    అయితే తుది జ‌ట్టులో ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. కాగా హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వ‌డంతో నితీశ్‌కు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్కింది. అదేవిధంగా రిష‌బ్ పంత్ మ‌రోసారి తుది జ‌ట్టులో చోటు ద‌క్కే సూచ‌న‌లు క‌న్పించ‌నున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.

    సౌతాఫ్రికా సిరీస్‌లోనూ పంత్ బెంచ్‌కే ప‌రిమతం కావాల్సి వ‌చ్చింది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌గా ర‌వీంద్ర జడేజా చోటు ద‌క్కించుకోనున్నాడు. ఫాస్ట్ బౌల‌ర్ల కోటాలో హ‌ర్షిత్ రాణాపై జ‌ట్టు మెనెజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డితో పాటు అర్ష్‌దీప్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ బంతిని పంచుకోనున్నారు. స్పెష‌లిస్టు స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ఉండ‌నున్నాడు.

    కివీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
    రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాదవ్‌, సిరాజ్‌
    చదవండి: WPL 2026: గుజరాత్‌ జెయింట్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌

  • భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య వివాదం ముదురుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చినట్లుగా కనిపించిన.. బంగ్లా క్రికెట్‌​ బోర్డు (BCB) నిజ స్వరూపం తాజాగా తేట తెల్లమైంది. తమ ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ పట్ల బీసీబీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.

    బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైనారిటీ హిందూలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తొలగించారు.

    తెగేదాకా లాగొద్దు
    ఇందుకు ప్రతిగా టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు తాము హాజరు కాబోమని బీసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించి భద్రతా కారణాలు చూపిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి లేఖ రాసింది. ఈ విషయంలో తెగేదాకా లాగొద్దని మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ బీసీబీని హెచ్చరించాడు.

    ఐసీసీ నుంచే బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు భారీ మొత్తంలో ఆదాయం వస్తోందని.. సున్నితమైన ఈ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఐసీసీతో సంబంధాలు చెడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లు, బంగ్లా క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు.

    ఇండియన్‌ ఏజెంట్‌ అంటూ..
    ఈ విషయంపై బీసీబీ ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్‌ ఎం. నజ్ముల్‌ ఇస్లాం సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమీమ్‌ ఇక్బాల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి బంగ్లాదేశ్‌ ప్రజలు.. తాను ఇండియన్‌ ఏజెంట్‌ను అని నిరూపించుకున్న వ్యక్తి నిజ స్వరూపాన్ని కళ్లారా చూశారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

    ఈ నేపథ్యంలో ‘క్రికెటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌’ (CWAB) ఘాటుగా స్పందించింది. ‘‘బీసీబీ డైరెక్టర్‌ నజ్ముల్‌ ఇస్లాం.. జాతీయ జట్టు మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.

    తీవ్రంగా ఖండిస్తున్నాం
    ఈ మాటలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఆందోళనకు గురిచేశాయి. పదహారేళ్లు జాతీయ జట్టు తరఫున ఆడిన, విజయవంతమైన ఆటగాడి పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఏ కారణంగానూ ఇవి ఆమోదయోగ్యనీయం కాదు. సామాజిక మాధ్యమం వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

    ఇది చాలా అవమానకరం. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాము. సదరు అధికారి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని CWAB డిమాండ్‌ చేసింది. బంగ్లాదేశ్‌ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం తమీమ్‌ ఇక్బాల్‌కు మద్దతుగా.. బీసీబీ అధికారి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

    చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!

  • మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్ ఆరంభానికి ముందు గుజ‌రాత్ జెయింట్స్‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ యస్తికా భాటియా గాయం కార‌ణంగా సీజ‌న్ మొత్తానికి దూర‌మైంది. డ‌బ్ల్యూపీఎల్‌-2026 వేలంలో య‌స్తికాను రూ.50 ల‌క్ష‌ల‌కు గుజ‌రాత్ కొనుగొలు చేసింది. అయితే వేలానికి ముందే యస్తికా మోకాలి గాయంతో బాధపడతోంది

    కానీ డ‌బ్ల్యూపీఎల్ ఆరంభ స‌మ‌యానికి య‌స్తిక ఫిట్‌నెస్ సాధిస్తుంద‌ని గుజ‌రాత్ భావించింది. కానీ ఆమె పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రో నాలుగు వారాల స‌మ‌యం పట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే డ‌బ్ల్యూపీఎల్ నుంచి భాటియా వైదొలిగింది. ఈ విష‌యాన్ని గుజ‌రాత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌రించింది.

    ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు గుజరాత్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. కాగా య‌స్తికా గాయం కారంణంగా వన్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025కు కూడా దూర‌మైన సంగతి తెలిసిందే. ఆమో స్ధానంలో ఉమా ఛెత్రీని జట్టులోకి తీసుకున్నారు. అయితే గుజరాత్‌ జెయింట్స్‌కు యస్తికా స్ధానాన్ని మరొక ప్లేయర్‌తో భర్తీ చేసే అవకాశం లేదు. 

    బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ప్లేయర్ వేలానికి ముందే గాయపడి ఉన్నప్పటికి జట్టులోకి తీసుకుంటే.. తర్వాత గాయం కారణంగా దూరమైతే వారి స్ధానంలో వేరే ప్లేయర్‌ను ఎవరినీ తీసుకోవడానికి వీలుండదు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది.

    స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఇక డబ్ల్యూపీఎల్‌ నాలుగో సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ ఉమెన్స్‌ జట్లు తలపడనున్నాయి.

    గుజరాత్ జెయింట్స్ జట్టు
    యాష్లే గార్డనర్, డానీ వ్యాట్-హాడ్జ్, భారతి ఫుల్మాలి, అనుష్క శర్మ,సోఫీ డివైన్, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, కనికా అహుజా, తనూజా కన్వర్‌,యుషి సోని, బెత్ మూనీ, యస్తికా భాటియా, శివాని సింగ్‌, రేణుకా సింగ్ ఠాకూర్, కాశ్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, టైటాస్ సాధు, హ్యాపీ కుమారి

     

  • భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య నెల‌కొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించ‌డంతో ర‌గిలిపోతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది.

    ప్రముఖ భారత క్రికెట్ ప‌రికాల సంస్థ సాన్స్పరీల్స్ గ్రీన్లాండ్స్ (SG).. బంగ్లాదేశ్ క్రికెటర్లతో తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్ట‌న్ దాస్‌, మాజీ కెప్టెన్ మోమినుల్ హక్, యాసిర్ అలీ వంటి స్టార్ ప్లేయ‌ర్లకు ఎస్‌జీనే స్పాన్స‌ర్‌గా ఉంది. 

    ఇప్పుడు రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మ కాంట్రాక్ట్‌ల‌ను పొడిగించేందుకు ఎస్‌జీ స‌ముఖ‌త చూప‌లేదు. దీంతో బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు తమకు అలవాటైన కస్టమ్-మేడ్ బ్యాట్లను కోల్పోవడమే కాకుండా భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కొనున్నారు.

    అయితే దీనిపై ఇంకా ఎస్‌జీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే  బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన స్పాన్సర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో భారత దిగ్గజ సంస్థ ఎస్‌ఎస్ కూడా ఎస్‌జీ బాటలో నడిచే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్, సబ్బీర్ రెహమాన్, నాసిర్ హొస్సేన్ వంటి స్టార్ ఆటగాళ్లకు ఎస్‌ఎస్ స్పాన్సర్ ఉంది.

    కాగా ఈ వివాదం కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌మ జ‌ట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను విడుద‌ల చేయ‌డంతో మొదలైంది. ఐపీఎల్‌-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఆ త‌ర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై దాడులు పెరిగిపోవ‌డంతో ముస్తాఫిజుర్‌ను జ‌ట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

    ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జ‌ట్టు నుంచి రీలీజ్ చేయాల‌ని కేకేఆర్‌ను అదేశించింది. దీంతో అత‌డిని కేకేఆర్ విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత భార‌త్‌లో భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. 

    బీసీబీ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారం భారత్‌కు వచ్చి ఆడకపోతే పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం త‌మ దేశంలో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను సైతం బ్యాన్ చేసింది.
    చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!

  • ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం డేవిడ్‌ బెక్‌హామ్‌ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. కన్న కొడుకే వారికి లీగల్‌ నోటీసులు పంపించినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో ఇంకోసారి తనను ట్యాగ్‌ చేస్తే చట్టపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందేశం పంపినట్లు తెలుస్తోంది.

    కాగా మాజీ పాప్‌ స్టార్‌ విక్టోరియా ఆడమ్స్‌ను ప్రేమించి డేవిడ్‌ బెక్‌హామ్‌ (David Beckham) 1999లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు కుమారులు బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌ (Brooklyn Beckham), రోమియో బెక్‌హామ్‌, క్రూజ్‌ బెక్‌హామ్‌.. కూతురు హార్పర్‌ సెవెన్‌ బెక్‌హామ్‌ సంతానం. వీరిలో పెద్దవాడైన బ్రూక్లిన్‌ మోడల్‌, చెఫ్‌, ఫొటోగ్రాఫర్‌గా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

    పెళ్లైన నాటి నుంచి విభేదాలు
    బ్రూక్లిన్‌... అమెరికాకు చెందిన బిలియనీర్‌ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి బ్రూక్లిన్‌కు తల్లిదండ్రులు డేవిడ్‌- విక్టోరియాలతో విభేదాలు తలెత్తాయి. ఇందుకు నికోలా వెడ్డింగ్‌ గౌనులో మార్పే కారణం అని సమాచారం.

    ఈ క్రమంలో భార్య వైపు మొగ్గు చూపిన బ్రూక్లిన్‌.. తల్లిదండ్రులను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. భార్యతో కలిసి అతడు అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే డేవిడ్‌ బెక్‌హామ్‌ 50వ పుట్టినరోజు వేడుకలకు కూడా అతడు హాజరుకాలేదు. అంతేకాదు తండ్రి ‘సర్‌’ బిరుదును అందుకున్న వేళా అతడు అక్కడ లేడు.

    నిన్ను మిస్‌ అవుతున్నాం
    అయితే, డేవిడ్‌- విక్టోరియా దంపతులు మాత్రం సోషల్‌ మీడియా పోస్టులలో బ్రూక్లిన్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘నిన్ను మిస్‌ అవుతున్నాం’ అంటూ క్యాప్షన్లు పెట్టారు. బ్రూక్లిన్‌కు ఇది ఎంతమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. తనతో ఇకపై లాయర్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుందని ఇప్పటికే తల్లిదండ్రులకు అతడు ఓ లేఖ రాసినట్లు సమాచారం.

    ఈ క్రమంలో ఇటీవల బ్రూక్లిన్‌కు సంబంధించిన చికెన్‌ రోస్ట్‌ వీడియోను తల్లి విక్టోరియా లైక్‌ చేయడంతో.. అతడికి కోపం వచ్చిందట. దీంతో తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులందరినీ బ్రూక్లిన్‌ బ్లాక్‌ చేశాడు. తాజాగా ఇకపై సోషల్‌ మీడియాలో తనను ట్యాగ్‌ చేయవద్దంటూ లాయర్ల ద్వారా నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

    తనతో మాట్లాడవద్దంటూ
    బెక్‌హామ్‌ కుటుంబ సన్నిహిత వర్గాలు.. ‘ది సన్‌ యూఎస్‌’తో మాట్లాడుతూ.. ‘‘ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి గల అసలు కారణమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బ్రూక్లిన్‌ తన తల్లిదండ్రులను బ్లాక్‌ చేశాడు. తనతో మాట్లాడవద్దంటూ ఇటీవల ఓ లేఖ పంపాడు.

    అయినా సరే సోషల్‌ మీడియాలో తనను ట్యాగ్‌ చేస్తున్నారనే కోపంతో తాజాగా నోటీసులు పంపాడు. పబ్లిక్‌గా కాకుండా ప్రైవేటుగానే తల్లిదండ్రులతో తేల్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అయితే, డేవిడ్‌- విక్టోరియా తన మాటను ఖాతరు చేయలేదని భావించి చట్టపరంగా ముందుకు వెళ్తున్నాడు.

    డేవిడ్‌- విక్టోరియా మాత్రం తమ పెద్ద కుమారుడి కోసం ఇంకా తలుపులు తెరిచే ఉంచారు. అయితే, ఈ పరిణామాలు వారిని తీవ్రంగా కలచివేశాయి. మున్ముందు ఏం జరుగుతుందోనని కుమారుడి విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు’’ అని పేర్కొన్నాయి.

    చదవండి: IND vs NZ: తిలక్‌ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!

  • 2026 అండర్‌-19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇవాళ (జనవరి 9) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మహబూబ్ ఖాన్ నియమితుడయ్యాడు. స్టార్‌ బ్యాటర్లు ఉజైరుల్లా నియాజై, ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, అజీజ్ మియా ఖిల్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. నియాజై ఇటీవలి బంగ్లాదేశ్‌ పర్యటనలో, ఆసియా కప్‌ 2025లో సత్తా చాటాడు.

    బౌలింగ్ విభాగంలో నూరిస్తానీ ఓర్మాజీ (ప్రధాన పేస్ బౌలర్‌), స్పిన్ విభాగంలో జియాతుల్లా షాహీన్, హఫీజ్‌ఉల్లా జద్రాన్, వహీద్‌ఉల్లా జద్రాన్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అండర్‌-19 విభాగంలోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు స్పిన్ బౌలింగే ప్రధాన ఆయుధం. 

    ఈ జట్టులో ఖతీర్ స్టానిక్‌జై, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్ పరిశీలించదగ్గ ఆటగాళ్లు. రిజర్వ్‌ ప్లేయర్లుగా అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్ ఎంపికయ్యారు.

    ఈ మెగా టోర్నీ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ఇండియా, యూఎస్‌ఏ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 

    ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రయాణం​ జనవరి 16న సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం 18న వెస్టిండీస్‌తో, 21న టాంజానియాతో తలపడనుంది. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఆసియా క్వాలిఫయర్‌లో నేపాల్‌పై నెట్ రన్ రేట్ ఆధారంగా ముందంజ వేసి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.  

    అండర్‌19 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తి జట్టు..  
    మహబూబ్ ఖాన్ (c), ఖాలిద్ అహ్మద్‌జై, ఉస్మాన్ సదత్, ఫైసల్ ఖాన్, ఉజైరుల్లా నియాజై, అజీజ్ మియా ఖిల్, నజీఫ్ అమిరి, ఖతీర్ స్టానిక్‌జై, నూరిస్తానీ, అబ్దుల్ అజీజ్, సలామ్ ఖాన్, వహీద్ జద్రాన్, జియాతుల్లా షాహీన్, రోహుల్లా అరబ్, హఫీజ్ జద్రాన్

    రిజర్వ్స్: అఖిల్ ఖాన్, ఫహీమ్ ఖాసిమీ, ఇజాత్ నూర్

  • టీమిండియా స్టార్‌, హైదరాబాద్‌ క్రికెటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ అనూహ్య రీతిలో జట్టుకు దూరమయ్యాడు. పొత్తి కడుపునకు సంబంధించిన సమస్య కారణంగా ఇటీవల అతడు తీవ్ర నొప్పితో బాధపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అత్యవసరంగా తిలక్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.

    వేగంగా కోలుకుంటున్నాడు
    దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తిలక్‌ వర్మ (Tilak Varma) .. రాజ్‌కోట్‌ వేదికగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అయితే ఆ తర్వాతే.. మైదానం బయట సమస్య మొదలైంది. ‘పొత్తి కడుపు సమస్యతో తిలక్‌కు ఇబ్బంది ఎదురైంది. దాంతో రాజ్‌కోట్‌లో బుధవారం తిలక్‌వర్మకు శస్త్రచికిత్స జరిగింది.

    గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తిలక్‌ శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వెళతాడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు’ అని బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది.

    సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతే
    తాజా పరిణామం కారణంగా న్యూజిలాండ్‌ (IND vs NZ)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తిలక్‌ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే చివరి రెండు మ్యాచ్‌ల విషయంపై కూడా బోర్డు ఇంకా స్పష్టతనివ్వలేదు.

    ‘తిలక్‌ ప్రస్తుతం సమస్య నుంచి కోలుకొని సమస్య పూర్తిగా తగ్గిన తర్వాతే ట్రైనింగ్‌ మొదలు పెడతాడు. ఆపైనే అతని ప్రాక్టీస్‌ ఉంటుంది. అతని ఆరోగ్యం, కోలుకునే విషయంలో పురోగతిని బట్టి చివరి రెండు మ్యాచ్‌లలో ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’ అని బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో టీ20లు ఆడే భారత జట్టులో తిలక్‌ వర్మ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరన్న చర్చ మొదలైంది.

    ‘సర్పంచ్‌’ సాబ్‌ రావాల్సిందే
    ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఎక్స్‌ వేదికగా.. ‘‘తిలక్‌ వర్మ గాయపడ్డాడు. అతడు టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

    మరి టీమిండియాలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?... నా అభిప్రాయం ప్రకారం.. ఆ ఆటగాడు మరెవరో కాదు.. శ్రేయస్‌ అయ్యర్‌. అవును.. ‘సర్పంచ్‌’ సాబ్‌ ఆటోమేటిక్‌గా జట్టులోకి రావాల్సిందే.

    అప్పుడు అతడికి అన్యాయం
    దేశీ టీ20 టోర్నీలోనే కాదు.. వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ పొట్టి క్రికెట్‌ తరహాలో అతడు అదరగొడుతున్నాడు. నిజానికి తన ఫామ్‌ దృష్ట్యా అతడు ఆసియా టీ20 కప్‌ టోర్నీ-2025 కూడా ఆడాల్సింది. కానీ సెలక్టర్లు అతడికి అన్యాయం చేశారనిపించింది. ఆ టోర్నీకి అతడిని ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పటికీ అర్థం కాలేదు.

    అయితే, ఇప్పుడు మిడిలార్డర్‌లో ఆడేందుకు శ్రేయస్‌కు ఓ అవకాశం దొరికింది. అతడొక అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఐపీఎల్‌లో అతడి క్రేజే వేరు. తన అద్భుత ఆట తీరుతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి తిలక్‌ స్థానంలో నేనైతే శ్రేయస్‌ అయ్యర్‌కే ఓటు వేస్తా’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

    ఊహించని పేరు కూడా
    ఇక శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు.. తన సెకండరీ ఆప్షన్‌గా ఆకాశ్‌ చోప్రా.. అసోం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు జితేశ్‌ శర్మ కూడా పోటీలోకి రావచ్చొన్న ఈ మాజీ ఓపెనర్‌.. ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌కే చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఇక ఓపెనర్లతో ఇప్పుడు టీమిండియాకు పనిలేదు కాబట్టి.. శుబ్‌మన్‌ గిల్‌ టీ20 జట్టులోకి వచ్చే ఛాన్స్‌ లేదన్నాడు.

    చదవండి: అతడో గ్యాంబ్లర్‌.. కొంచెం కూడా భయం లేదు: ఇంగ్లండ్‌ క్రికెట్‌ దిగ్గజం ఫైర్‌

Movies

  • తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్‌ల పోటీలకు ఎంపికైంది.  బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఈ మూవీ పోటీ పడనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ సిమ్రాన్‌ మెరిసింది. కాగా.. ఈ నెల 22న ఆస్కార్ చిత్రాల తుది జాబితాను ఆస్కార్ అకాడమీ ప్రకటించనుంది.

    అయితే ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన రెండు చిత్రాలు పోటీపడనున్నాయి. ఆస్కార్ అవార్డుల రేసులో కాంతార: చాప్టర్‌-1 , మహావతార్‌ నరసింహ చిత్రాలు జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్‌తో పాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి కేటగిరీల్లోనూ పోటీపడనున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హోంబలే ఫిల్మ్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

    ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్‌ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన సినిమాలను ఎంపిక చేయనున్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది ఆస్కార్‌కు భారత్‌ నుంచి ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. టూరిస్ట్‌ ఫ్యామిలీతో పాటు తన్వీ ది గ్రేట్‌, సిస్టర్‌ మిడ్‌నైట్‌ సినిమాలు ఆస్కార్‌ బరిలో నిలిచాయి. 
     

     

  • ఓటీటీలోకి మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా 'కాలమ్‌కావల్‌' రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. డిసెంబరు 5న  థియేటర్లలో రిలీజై హిట్ అయింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.

    మలయాళ బ్లాక్‌ బస్టర్‌ సినిమా 'కాలమ్‌కావల్‌' జనవరి 16న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీలో విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జితిన్‌ కె.జోసే దర్శకత్వంలో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. 2025లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన జాబితాలో ఈ చిత్రం టాప్‌-5లో ఉంది.

    'కాలమ్‌కావల్‌' విషయానికొస్తే.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కేరళ - తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురౌతుంటారు. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కేసు సినిమాతో మరోసారి వెలుగులోకి వచ్చింది. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్‌ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.

  • మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌ నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’  చిత్రానికి టికెట్‌ ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ముందు రోజు వేసే స్పెషల్‌ ప్రీమియర్‌ టికెట్‌ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయని తెలిపింది.

    ఆపై తొలి పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.

    మనశంకర్‌ వరప్రసాద్‌ విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. దీంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయింది.

  • చీరలో అనసూయ.. ఫన్నీగా ఫేస్ పెట్టి వయ్యారాలు

    మేకప్ లేకుండా శ్రద్ధా కపూర్ మార్నింగ్ వైబ్స్

    కేరళ బ్యూటీలా మారిపోయిన రుక్సార్ ధిల్లాన్

    గ్లామరస్ పోజులిచ్చేసిన యాంకర్ రష్మీ గౌతమ్

    'మా ఇంటి  బంగారం' టీజర్ రెస్పాన్స్‌కి సామ్ ఫన్నీ థ్యాంక్స్

  • బాలీవుడ్‌ నటుడు కార్తిక్‌ ఆర్యన్‌ తెలుగువారికి కూడా బాగా పరిచయమే.. నటి శ్రీలీలతో ఆయన డేటింగ్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను వారు ఖండించారు. అయితే, తాజాగా కార్తిక్‌ ఆర్యన్‌ డేటింగ్‌ గురించి బాలీవుడ్‌లో బిగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. UKకి చెందిన టీనేజ్ అమ్మాయి కరీనా కుబిలియుటే(18)తో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. దీంతో అతను సోషల్‌మీడియాలో ఆమెను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.

    35ఏళ్ల కార్తిక్‌ ఆర్యన్‌ టీనేజ్‌ అమ్మాయితో గోవా బీచ్‌లో కెమెరా కంటపడ్డారు. ఈ నెల ప్రారంభంలో ఇద్దరూ గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్‌లో దాదాపు ఒకే సమయంలో బస చేశారని, కానీ.. వేర్వేరు గదుల్లో వారిద్దరూ ఉన్నారని సమాచారం.  సోషల్‌మీడియాలో వారు షేర్‌ చేసిన ఫోటోలలో సారూప్యత ఉండటంతో ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే, UKకి చెందిన  కరీనా కుబిలియుటే వయసు 17ఏళ్లు మాత్రమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మైనర్‌ అమ్మాయితో డేటింగ్‌ చేయడం ఏంటి అంటూ కార్తిక్‌ ఆర్యన్‌కు మెసేజ్‌లు పెడుతున్నారు.

    బాలీవుడ్‌ మీడియా నివేదిక ప్రకారం, కార్తీక్‌తో పాటు ఆ అమ్మాయి కూడా గోవాలోని సెయింట్ రెగిస్ హోటల్‌లో ఒకే సమయంలో అతిథులుగా ఉన్నారని ప్రకటించాయి. అయితే, ఇద్దరూ వేర్వేరు గదుల్లో బస చేశారని కథనాలు వచ్చాయి. డేటింగ్ పుకార్లు వెలువడిన తర్వాత, కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో, "నాకు కార్తీక్ తెలియదు, నేను అతని ప్రియురాలిని కాదు, నేను నా కుటుంబంతో సెలవులో ఉన్నాను" అని పేర్కొంది.  కొంత సమయం తర్వాత ఆమె తన బయోను "నాకు కార్తీక్ తెలియదు" అని రాసింది. ఆపై కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లకు కామెంట్స్‌ను ఆపేసింది. కానీ, కార్తిక్‌ ఆర్యన్‌ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

    సండే గార్డియన్ నివేదిక ప్రకారం, కరీనా UK లోని కార్లైల్ కాలేజీలో చదువుతోంది. ఆమె చీర్లీడర్ కూడా. ఆమె వయస్సు ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. కరీనాకు 18 సంవత్సరాలు, కార్తీక్ ప్రస్తుతం 35 సంవత్సరాలు అని అందులో తెలిపింది. గతంలో, కార్తీక్ ఆర్యన్ సారా అలీ ఖాన్, అనన్య పాండే, పష్మీనా రోషన్, శ్రీలీల, జాన్వీ కపూర్‌లతో సహా పలువురు నటీమణులతో డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వచ్చాయి.

    కార్తీక్‌ ఆర్యన్‌ విషయానికి వస్తే.. ప్యార్‌ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్నీ ఔర్‌ ఓ, భూల్‌ భులయ్యా 2, భూల్‌ భులయ్యా 3, షెహజాదా(అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌), లూకా చుప్పి, ధమాకా.. ఇలా అనేక సినిమాలతో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల కార్తీక్‌ 'తూ మేరీ మైన్‌.. తేరా మైన్‌ తేరా తు మేరీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాక్సాఫీస్‌ వద్ద ధురంధర్‌ హవా కారణంగా ఈ సినిమా నిలదొక్కుకోలేకపోయింది.

  • బిర్యానీ వండాలంటే పక్కా ప్లానింగ్ ఎంత అవసరమో.. దాన్ని తినాలన్నా అలాంటి ప్లానింగే ముఖ్యం. 'రాజాసాబ్' పరిస్థితీ ఇలానే తయారైంది. రిలీజ్ పలుమార్లు వాయిదా పడినప్పటికీ.. చివరకు జనవరి 9న అని పక్కాగానే ప్లాన్ చేసుకున్నారు. తీరా థియేటర్లలోకి వచ్చే చివరి నిమిషం వరకు అంతా గందరగోళమే. మొత్తం ఆదరాబాదరానే. ఇంతకీ 'రాజాసాబ్' విషయంలో ఏమేం తప్పిదాలు జరిగాయి?

    (ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)

    తెలంగాణలోని ప్రీమియర్స్ ప్లానింగ్ ఘోరంగా ఫెయిలైంది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు జీవో ముందే వచ్చేసింది. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది ఏ‍ర్పడలేదు. తెలంగాణకు వచ్చేసరికి రిలీజ్ రోజు(జనవరి 09న) వేకువజామున జీవో జారీ అయింది. 8వ తేదీ సాయంత్రమే ప్రీమియర్స్ ఉంటాయని ప్రకటించారు. కానీ అటు జీవో రాకపోవడంతో విడుదలకు కొన్ని గంటల ముందు వరకు నిర్మాతలు.. బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. సెన్సార్ త్వరగానే పూర్తి చేసుకుని సిద్ధమయ్యారు గానీ నైజాంలో ప్రీమియర్స్, రెగ్యులర్ బుకింగ్స్ విషయంలో ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది.

    ప్రమోషనల్ కంటెంట్ విషయంలోనూ 'రాజాసాబ్' టీమ్ సరైన ప్లానింగ్ చేసుకోలేదా అనిపించింది. ఎందుకంటే రెండు ట్రైలర్స్ రిలీజ్ చేసి కాస్తోకూస్తో హైప్ వచ్చేలా చేశారు కానీ పాటలు మాత్రం ఎందుకనో పెద్దగా జనాలకు రీచ్ కాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ విడుదలకు చాలా రోజులు ముందుగానే చేసేశారు. ప్రభాస్ పాల్గొన్న ఒకే ఒక్క ఇంటర్వ్యూని విడుదలకు ముందురోజు వరకు ఆన్‌లైన్‌లో వదల్లేదు. 'నాచో నాచో' అనే పాట కేవలం హిందీ, తమిళంలోనే రిలీజ్ చేశారు. తెలుగులో సినిమా చేస్తూ తెలుగు వెర్షన్ పాట లేకపోవడం ఏంటో?

    (ఇదీ చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ)

    'రాజాసాబ్' కోసం దాదాపు నాలుగున్నర గంటల ఫుటేజీ చిత్రీకరించామని స్వయంగా దర్శకుడి మారుతినే బయటపెట్టారు. తీరా చూస్తే మూడు గంటల సినిమాకే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. ప్రభాస్.. ముసలి గెటప్‌లో కనిపించి, చేసే ఫైట్ సీక్వెన్స్ పూర్తిగా తీసేశారు. కథకు అవసరమా లేదా అని ముందే ఆలోచించి ఉంటే ప్రేక్షకుల నుంచి నిట్టూర్పులు ఉండేవి కాదుగా! అసలు ప్రభాస్ ఓల్డ్ గెటప్ వల్లే మూవీపై కాస్త హైప్ ఏర్పడింది. ఇప్పుడు అదే లేదని తెలిసి అందరూ నిరుత్సాహపడుతున్నారు.

    తెలంగాణలో టికెట్ రేట్ల విషయంలోనూ మూవీ టీమ్ ప్లానింగ్ బెడిసికొట్టిందనే చెప్పొచ్చు. సింగిల్ బెంచ్‌కి వెళ్లి అనుకూలంగానే ఉత్తర్వులు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల పంపు మెమోని తెలంగాణ హైకోర్టు ఇప్పుడు సస్పెండ్ చేసింది. పాత ధరలకే టికెట్లు అమ్మాలని బుక్ మై షోని ఆదేశించింది. గత నెలలో 'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు హంగామా జరిగినప్పుడే.. 'రాజాసాబ్' టీమ్ అలెర్ట్ అయి, సరైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. కానీ అలా చేయలేకపోయారు. 

    (ఇదీ చదవండి: 'రాజాసాబ్' ఓటీటీ డీటైల్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండొచ్చు?)

  • తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?

    (ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)

    2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.

    2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.

    2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.

    (ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)

    2018లో 'సర్కార్' విడుదలకు ముందే అ‍డ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్‌లో ఓకే ఓకే అనిపించుకుంది.

    2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.

    2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.

    2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.

    (ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!)

  • ఓటీటీలో 'జిగ్రీస్' సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. థియేటర్స్‌లో చూడాలనుకుని వెళ్లలేని వారందరూ ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ మూవీని చూస్తున్నారు. టాలీవుడ్ యువ న‌టులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్‌.. నవంబర్‌ 14న విడుదలైన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో  స్ట్రీమింగ్‌ అవుతుంది.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించ‌గా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. యువ నటీనటులతో తెరకెక్కించిన జిగ్రీస్‌ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్‌ చేశారు. దీంతో మూవీకి బజ్‌ వచ్చింది.

    ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు మణి వక్కా, ధీరజ్ ఆత్రేయ, రామ్ నితిన్ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. కృష్ణ వోడపల్లి నిర్మాణంలో, చిత్తం వినయ్ కుమార్ సహ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా గారి సపోర్ట్ పెద్ద బలాన్ని ఇచ్చింది. సయ్యద్ కమ్రాన్ సంగీతం, ఈశ్వరదిత్య డీవోపీ, చాణక్య రెడ్డి తూరుపు ఎడిటింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ వీకెండ్‌లో ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌ని అస్సలు మిస్ అవ్వకండి!

  • ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన వస్తోంది. మరోవైపు టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు, నిర్మాతలకు షాకిచ్చింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోని ఆదేశించింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నం.120 ప్రకారం 350లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ పేర్కొంది.

    అలానే పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని, అలానే అధికారుల తీరుపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని అడిగింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని మండిపడింది. కొద్దిరోజుల క్రితం టికెట్‌ ధరలు పెంచబోమని స్వయంగా మంత్రి చెప్పినా మళ్లీ ఎందుకు పెంచారంటూ  కోర్టు, అధికారుల్ని ప్రశ్నించింది.

    టికెట్‌ ధరల పెంపు కోసం మనశంకర్‌ వరప్రసాద్‌ గారు, రాజాసాబ్‌ నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి భారీ ఊరట లభించింది. టికెట్‌ రేట్లను పెంచాలని సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పుడు టికెట్‌ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.

  • భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ కథతో తీసిన సినిమా 'పురుష:' పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ప్రాముఖ్యం ఏంటనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బత్తుల కోటేశ్వరరావు కోటేశ్వరరావు నిర్మించారు. పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. వీరు వులవల దర్శకుడు. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. 

    ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ వదిలారు. 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే అంశానికి కామెడీ జోడించి ఈ సినిమాని తీసినట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ తదితర కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

  • దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇ‍ప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్‌డేట్ ఏంటంటే?

    సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సెన్సార్‌ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్‌ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు.

  • నివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

    ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నాగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లె అద్భుతంగా ఆలపించారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

    ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

  • సుమారు నాలుగేళ్ల తర్వాత   కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్‌ నుంచి యశ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్‌ ఇంటిమేట్‌  అయ్యే సీన్‌ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్‌గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్‌తో రొమాన్స్‌ చేసిన నటి  ఎవరు అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.

    ఈ టీజర్‌లో యశ్‌తో కలిసి సన్నిహిత సీన్‌లో కనిపించింది హాలీవుడ్‌ నటి 'నటాలియా గుస్లిస్టాయా' (Natalia Guslistaya)..  తన అసలు పేరు నటాలి బర్న్ (Natalie Burn). ఉక్రెయిన్‌కు చెందిన ఈ బ్యూటీ  అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. ది ఎక్స్పెండబుల్స్ 3 చిత్రంతో పాటు హాలీవుడ్‌లో సుమారు 20కి పైగా సినిమాల్లో నటించింది. నిర్మాతగా 5 భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించింది. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తన నెట్‌ వర్త్‌ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..

    అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్‌లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్‌ సినిమాతో ఆమె ఇండియన్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్‌తో బోల్డ్‌ సీన్‌లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్‌ అవుతుంది.

  • ప్రభాస్‌- మారుతి కాంబినేషన్‌ సినిమా 'రాజాసాబ్‌' జనవరి 9న విడుదలైంది. అయితే, తెలంగాణలో టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అధికారుల తీరును తప్పబట్టింది. న్యాయస్థానం చెప్పినా సరే పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయింది. కొద్దిరోజుల క్రితం టికెట్‌ ధరలు పెంచబోమని మంత్రి చెప్పినా కూడా మళ్లీ ఎందుకు పెంచారంటూ  కోర్టు ప్రశ్నించింది.

    టికెట్‌ ధరల పెంపు కోసం ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’, ప్రబాస్‌ ‘ది రాజాసాబ్‌’ సినిమాల నిర్మాతలు కొద్దిరోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వారికి భారీ ఊరట లభించింది.  టికెట్‌ రేట్లను పెంచాలంటూ సినీ నిర్మాతలు చేసిన వినతులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.  అయితే, ఇప్పుడు టికెట్‌ ధరల పెంపు విషయంలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాశంగా మారింది.

    తెలంగాణలో ‘ది రాజాసాబ్‌’ సినిమా టికెట్‌ ధరలను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెంచారు.  జనవరి 9 నుంచి ఈ నెల 11 వరకు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.105, మల్టీప్లెక్స్‌ల్లో రూ.132 పెంపునకు ప్రభుత్వం అనుమతి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అయితే, 12 నుంచి 18వ తేదీ వరకు  ఆ ధరలను సడలించింది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌ల్లో రూ.89 పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. టికెట్‌ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు అందించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలిపింది.
    సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
     

  • ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తేనే గౌరవం. కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌కు కావాల్సినంత టాలెంట్‌ ఉంది. కానీ విజయం మాత్రం ఆవగింజంత కూడా లేదు. చాలాఏళ్లుగా ఆ సక్సెస్‌ కోసమే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కొంతకాలం క్రితం డ్యాన్స్‌ స్టూడియో ప్రారంభించి భార్యతో కలిసి స్టూడెంట్స్‌కు డ్యాన్స్‌ క్లాసులు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల కిందట కెరీర్‌ మొదలుపెట్టిన సందీప్‌కు ఎట్టకేలకు సక్సెస్‌ దొరికింది. రోషన్‌ 'ఛాంపియన్‌' మూవీలో 'గిరగిర గింగిరానివే..', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌'లో 'హుక్‌ స్టెప్‌' పాటలతో ఒక్కసారిగా సెన్సేషన్‌ అయ్యాడు. అతడి జర్నీ ఓసారి చూసేద్దాం..

    సోషల్‌ మీడియాలో ఫేమస్‌
    ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు సందీప్‌. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్‌గా స్థిరపడింది. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లోనూ పార్టిసిపేట్‌ చేశాడు. సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌ కూడా డ్యాన్స్‌ మాస్టరే.. వీరిద్దరూ సోషల్‌ మీడియాలో చేసే రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఈ జంట టాలెంట్‌కు బోలెడన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులు అభిప్రాయపడ్డారు.

    గిరగిర గింగిరానివే.. పాటతో క్లిక్‌
    సందీప్‌.. కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలు చేశాడు కానీ మంచి సక్సెస్‌ అందుకోలేకపోయాడు. ఆమధ్య హీరోగా లవ్‌ యూ టూ అని ఓ మూవీ కూడా చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. ఇక సందీప్‌ డ్యాన్స్‌ రీల్‌ చూసి ఛాంపియన్‌ మూవీ నిర్మాత స్వప్నదత్‌ ఓసారి అతడికి కాల్‌ చేసింది. తన సినిమాలో కొరియోగ్రఫీ చేయమని అడిగింది. అలా అతడి హిట్‌ లిస్ట్‌లో మొదటి పాటగా గిరగిర గింగిరానివే.. వచ్చి చేరింది. సందీప్‌ దంపతుల టాలెంట్‌ చిరంజీవికి కూడా తెలిసింది. వెంటనే ఆయన వీరిని ఇంటికి పిలిచి మరీ ఛాన్స్‌ ఇచ్చాడు.

    ఫేవరెట్‌ హీరోకి కొరియోగ్రఫీ
    మన శంకర వరప్రసాద్‌ మూవీలో హుక్‌ స్టెప్‌ సాంగ్‌ చేయమని వరం ప్రసాదించాడు. అసలే సందీప్‌ ఫేవరెట్‌ హీరో ఆయన.. అలాంటిది పిలిచి మరీ అవకాశం ఇచ్చాక నిరూపించుకోకుండా ఉంటాడా? సింపుల్‌గా ఉంటూనే గ్రేస్‌ కనిపించేలా స్టెప్స్‌ క్రియేట్‌ చేశాడు. చిరు కూడా.. అంతే గ్రేస్‌గా, స్టైలిష్‌గా స్టెప్పులేశాడు. ఆ వీడియో వైరల్‌ అవడంతో సందీప్‌కు ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత ఇంత మంచి విజయం రావడంతో.. ఇన్నేళ్లుగా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయాడు. అనుకున్నది సాధించానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మరి అతడికి మున్ముందు కూడా మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం..

     

     

    చదవండి: ది రాజాసాబ్‌లో ఆ సీన్స్‌ డిలీట్‌

  • ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. సినిమా బాగుందా బాగోలేదా అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు టాక్ ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ డీటైల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

    'రాజాసాబ్' విడుదలకు కొన్ని నెలల ముందే ఓటీటీ హక్కుల్ని జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. రూ.160 కోట్లకు అన్ని భాషల హక్కుల్ని దక్కించుకుందని సమాచారం. నాలుగు వారాలకే డీల్ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది భాషలకు సంబంధించి ఫిబ్రవరి తొలివారంలో స్ట్రీమింగ్ ఉండొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం కాస్త ఆలస్యంగానే అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఇంత మోసమా? 'రాజాసాబ్‌'లో ఆ సీన్స్‌ డిలీట్‌)

    'రాజాసాబ్' విషయానికొస్తే.. దేవనగర సంస్థానానికి జమీందారు గంగాదేవి(జరీనా వహాబ్). కానీ కొన్ని కారణాల వల్ల మనవడు రాజుతో(ప్రభాస్) కలిసి సాధారణంగా బతికేస్తూ ఉంటుంది. మతిమరుపు సమస్య ఈమెకు ఉన్నప్పటికీ భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. తనకు కలలో కనిపిస్తున్న తాతని ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని కోరుతుంది. దీంతో రాజాసాబా.. నర్సాపుర్ అడవిలోని రాజమహల్‌కి వెళ్తాడు. మార్మిక విద్యలు తెలిసిన కనకరాజుని రాజాసాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? ముగ్గురమ్మాయిలతో భైరవి(మాళవిక), బెస్సీ(నిధి అగర్వాల్), అనిత్ (రిద్ధి కుమార్) రాజాసాబ్‌కి సంబంధమేంటి? అనేది మిగతా స్టోరీ.

    ఇకపోతే 'రాజాసాబ్'కి సీ‍క్వెల్ కూడా ఉందని ప్రకటించారు. 'రాజాసాబ్ సర్కస్ 1935' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. మరోవైపు ప్రమోషన్లలో చూపించిన ప్రభాస్ వృద్ధుడి గెటప్, దానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ మొత్తాన్ని సినిమా నుంచి తీసేశారు. కావాలని తీసేశారా? లేదంటే సీక్వెల్ కోసం దాచుంచారా అనేది తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ)

  • టాలీవుడ్‌లో సంచలనం క్రియేట్‌ చేసిన డ్రగ్స్‌ కేసులో నటుడు నవదీప్‌కు రిలీఫ్‌ దక్కింది. అతనికి మాదకద్రవ్యాల ముఠాతో సంబంధం ఉన్నట్టు సుమారు మూడేళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. అయితే, తాజాగా నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసును  హైకోర్టు కొట్టివేసింది.  నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని న్యాయవాది వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించి తీర్పు వెళ్లడించింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే నవదీప్‌ పేరును చేర్చారని ఆయన పేర్కొన్నారు.

    మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు 12మందిని అరెస్టు చేశారు. నవదీప్‌ను కూడా విచారించేందుకు పోలీసులు నోటీసులు పంపారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు  పరిచయాలు ఉన్నాయని నార్కోటిక్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో అతన్ని 39వ నిందితుడిగా చేర్చారు. అయితే, ఈ కేసులో నవదీప్‌కు వ్యతిరేఖంగా పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదు. దీంతో తాజాగా ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. 

  • ప్రభాస్‌ను వింటేజ్‌ లుక్‌లో చూడాలని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. వారి కోరికలను ఆలపించిన ది రాజాసాబ్‌ టీమ్‌.. ప్రభాస్‌ను మోస్ట్‌ హ్యాండ్సమ్‌ లుక్‌లో చూపించారు. సినిమాలో డార్లింగ్‌ ఆటలు, పాటలు, కామెడీ, రొమాన్స్‌.. ఇలా అన్ని ఎమోషన్స్‌ చూపించాడు. అయితే ఒక్కటి మాత్రం జనాలకు అంతు చిక్కడం లేదు.

    అటు వింటేజ్‌ లుక్‌.. ఇటు ఓల్జ్‌ ఏజ్‌ లుక్‌
    టీజర్‌, ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్‌ ఏజ్‌ లుక్‌లో చూపించారు. సినిమాకు హైప్‌ తీసుకొచ్చిందే ఈ ఓల్డ్‌ ఏజ్‌ క్యారెక్టర్‌. ఈ సన్నివేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. తీరా సినిమా చూస్తే ఆయా సీన్స్‌ మచ్చుకైనా లేవు. దీంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అటు వింటేజ్‌ లుక్‌, ఇటు ఓల్జ్‌ ఏజ్‌ లుక్‌లో ప్రభాస్‌ను చూడాలని ఆశపడ్డవారికి భంగపాటే ఎదురైంది.  

    సినిమా
    అయితే ఈ సీన్స్‌ అన్నీ సెకండ్‌ పార్ట్‌లో ఉండచ్చని భావిస్తున్నారు. రాజాసాబ్‌ విషయానికి వస్తే ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. తమన్‌ సంగీతం అందించాడు. జనవరి 9న రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటోంది.

     

     

     

     

    చదవండి: ది రాజాసాబ్‌ మూవీ రివ్యూ

International

  • మతాధికారి నుంచి ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్‌ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్‌ బంద్‌ చేయడం, అంతర్జాతీయ కాల్స్‌ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. 

    డిక్టేటర్‌ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్‌ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్‌ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్‌  ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 

    👉ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్‌ ఈస్ట్‌ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.

    👉ఇరాన్‌లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్‌ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.

    👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.

    👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్‌ కల్చర్‌ మేఘాలు ఇరాన్‌ను ఆవరించాయి. హిజాబ్‌ నిషేధంతో.. మహిళలు  పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా ​స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 

    👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్‌పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్‌ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 

    👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్‌లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.

    👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్‌ SAVAK అనే షా రహస్య పోలీస్‌.. విపక్షాన్ని అణచివేసింది.
    ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.

    👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్‌ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్‌లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.

    👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.

    👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్‌లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్‌ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 



    👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. 

    “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. 
    :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌  

    రేజా పహ్లవి ప్రొఫైల్‌
    - రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు
    - 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.
    - రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
    - ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్‌గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.

    అధికారం వద్దంటూనే,. 
    - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.
    - ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.
    - ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.
    - ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.
    - ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.
    - “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.
    - ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.
    - అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.
    - 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది.

  • ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత.  ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే  భారతదేశానికి  చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా  రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు.  నెలకు జీతం ఎంతో తెలుసా?

    రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.   వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే  సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన  వారి  వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .

    గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్‌స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. 

    ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్‌ కౌంటర్‌
    వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్‌ చెప్పాడు.

    మండల్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్‌కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా  చెప్పాడు.  ఏడాది కాలం  రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు.

     

    ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్‌ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
     టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

     

  • ఎడాపెడా గ్రోక్‌ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్‌ పెద్ద షాకే ఇచ్చింది.  బూతు కంటెంట్‌ వివాదం నేపథ్యంలో గ్రోక్‌ చాట్‌బాట్‌పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

    ఎక్స్‌ ఫ్లాట్‌ఫారమ్‌లో(పూర్వపు ట్విటర్‌)లో ‘గ్రోక్‌’ కృత్రిమ మేధ చాట్‌బాట్‌ వినోదం కోసం తీసుకొచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందజేయడం.. తొలినాళ్లలో నవ్వులు పూయిచింది ఇది. అయితే రాను రాను గ్రోక్‌ వికృత రూపం దాల్చింది. 

    గ్రోక్‌లో అశ్లీల, అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం అవుతుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల ఫొటోలను అశ్లీల, అసంబద్ధ ప్రాంప్ట్‌లతో ఎడిట్‌లు చేస్తున్నారు పలువురు యూజర్లు. అటు గ్రోక్‌ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. 

    ఈ అంశంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం సీరియస్‌ అయ్యింది. వివరణ కోరుతూ ఎక్స్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో  ఎక్స్‌ చర్యలు చేపట్టింది. ఈ చాట్‌బాట్‌లోని ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌పై పరిమితులు విధించింది. అయితే.. 

    గ్రోక్‌ (Grok) అనేది xAI రూపొందించిన AI అసిస్టెంట్. ఇది 2023 చివర్లో మొదటి వెర్షన్‌గా వచ్చింది. అప్పటి నుంచి పలు అప్‌డేట్లు, కొత్త వెర్షన్లు విడుదలయ్యాయి. 2025 చివర్లో Grok 4.1 Thinking విడుదల కాగా, 2026 జనవరి నాటికి Grok ఇప్పటికే X ప్లాట్‌ఫారమ్‌లో భాగమైంది.

    తీవ్ర విమర్శల వేళ ఇకపై Grok (గ్రోక్) చాట్‌బాట్‌ ఫీచర్‌ Xలో కేవలం సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉండనుంది. ఫ్రీ యూజర్లకు యాక్సెస్‌ నిలిపివేయడం మొదలుపెట్టింది. గ్రోక్‌ను ఉపయోగించాలంటే ఎక్స్‌ ప్రీమియం X Premium లేదా ప్రీమియం ఫ్లస్‌ Premium+ ప్లాన్‌ తీసుకోవాలి. ప్రీమియం ప్లాన్‌ ధర నెలకు రూ.650 ( 8 డాలర్లు), ప్రీమియం ఫస్ల్‌ ధర నెలకు రూ.1,300 (16 డాలర్లు)గా ఉంది. సంవత్సరం ప్లాన్‌ ప్రీమియం ధర రూ.6,800, ప్రీమియమ్‌ ఫ్లస్‌ ప్లాన్‌ ధర రూ.13,600గా ఉంది. అయితే ప్రీమియం వెర్షన్‌లో అందుబాటులో ఉండడమూ ఆందోళన కలిగించే అంశమే కదా అని అంటున్నారు పలువురు. 

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్‌బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌-హోజ్‌బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

    ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్‌బొల్లా షెల్టర్‌లను టార్గెట్‌ చేశాయి. సాజ్‌, అల్-రయ్‌హాన్‌, మౌంట్‌ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్‌ అల్-జహ్రాని, హౌమిన్‌ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. 

    మరోవైపు.. దీర్‌ అల్-జహ్రాని–హౌమిన్‌ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్‌ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్‌లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్‌హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. 

    హెజ్‌బొల్లాకి చెందిన మిసైల్‌ ప్లాట్‌ఫారమ్‌లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్‌ఫైర్‌ తర్వాత కూడా ఇజ్రాయెల్‌ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్‌లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.

  • తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్‌ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్‌లో ఖమేనీ స్పందిస్తూ..

    మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్‌ ఇచ్చారు. 

    తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్‌ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్‌ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.

    మీ సంగతి చూస్కోండి
    నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్‌ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్‌కు ఖమేనీ హితవు చెప్పారు.

    ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్‌ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్‌ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్‌ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 

    2026 ఆర్థిక బడ్జెట్‌పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్‌ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్‌లో నూతన సంస్కరణలను డిమాండ్‌ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.

    డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్‌ గ్యాస్‌, షాట్‌గన్స్‌, వాటర్‌ కేనన్‌లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. 

    పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్‌ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. 

National

  • సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హిమాచల్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడి దాదాపు 14 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

    వివరాల ప్రకారం.. హిమాచల్‌లోని సిమ్లా నుంచి కుప్వికి వెళ్తున్న బస్సు హరిపుర్‌ధర్‌ దగ్గర అదుపుతప్పి 500 అడుగుల లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు లోపల నుంచి బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

    మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి సంగ్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) సునీల్ కాయత్ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయిందని తెలిపారు. జిల్లా కేంద్రం నాహన్ నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిపుర్‌ధార్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారందరినీ సమీపంలోని సంగ్రా, దదాహు ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.

  • రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో అతిపెద్ద లొంగుబాటు జరిగింది. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్‌ ఎదుట 63 మంది మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోహన్ కడ్డీతో పాటు 18 మంది మహిళా మావోయిస్టులు లొంగిపోయిన వారిలో ఉన్నారు. వారిపై రూ.1.17కోట్ల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. 

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘లోన్ వర్రాటు’ పునరావాస కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్నారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 

    2025లో దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగిపోయిన సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత ఐదేళ్లలతో పోలిస్తే.. ఇదే రికార్డు స్థాయి కూడా. మావోయిస్టు పార్టీ అంతం లక్ష్యంగా.. కేంద్రం చాలెంజింగ్‌గా తీసుకుని చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ కూడా లొంగుబాటుకు ఓ ప్రధాన కారణం అని తెలిసిందే.

     

  • సాక్షి, ఢిల్లీ: దేశ రాజకీయ చరిత్రలో 2026 ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్‌ కానున్నారు. వాళ్ల వివరాలను రాజ్యసభ సచివాలయం పార్లమెంటరీ బులిటెన్‌ ద్వారా వెల్లడించింది. వీళ్లలో దశాబ్ధాలుగా రాణిస్తూ.. రాజకీయ ధురంధరులుగా పేర్లున్న నేతలు కూడా ఉన్నారు.

    ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్‌ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌, మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్(నామినేటెడ్ ఎంపీ) టర్మ్‌లు ముగుస్తాయి. పెద్దల సభలో ప్రతిపక్ష నేత కావడంతో ఖర్గేకు మళ్లీ అవకాశం ఉండే ఛాన్స్‌  ఉంది. అయితే ఈ మధ్య ఆయన పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్‌ జరిగింది. దీంతో అనుమానాలు నెలకొన్నాయి. 

    మిగతా వాళ్లలో.. వయసు రిత్యా వీళ్లలో తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి..  ఏపీ నుంచి నలుగురు ఉండగా, అందులో జూన్ 21వ తేదీన వైఎస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని.. తెలుగు దేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు ఉన్నారు. తెలంగాణ నుంచి రిటైర్ కానున్న ఇద్దరు ఎంపీలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ  సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ రిటైర్‌ కానున్నారు.

    మొత్తం 73 సీట్లలో 72 సీట్లకుగాను ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతో ఎన్డీఏ (NDA) కూటమి స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని.. మొత్తం 145 సీట్లు వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అలాగే.. విపక్ష ఇండియా బ్లాక్‌ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.  ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని సమాచారం. ఏప్రిల్లో తొలి విడత, నవంబర్‌లో రెండు విడతలలో జరిగే అవకాశం ఉంది.

    రాష్ట్రాల వారీగా రిటైర్ కానున్న ఎంపీల సంఖ్య

    మహారాష్ట్ర :4 ఎంపీలు 
    ఒడిశా :4 
    తమిళనాడు :6
    పశ్చిమ బెంగాల్ :5
    అస్సాం :3 
    బీహార్ :5 
    చత్తీస్గడ్ :2 
    హర్యానా: 2 
    హిమాచల్ ప్రదేశ్ :1 
    గుజరాత్ 4 
    జార్ఖండ్ 2 
    మధ్యప్రదేశ్ 3 
    మణిపూర్ :1 
    మేఘాలయ :1 
    రాజస్థాన్ :3 
    అరుణాచల్ ప్రదేశ్ :1 
    కర్ణాటక: 4 
    మిజోరం :1 
    యూపీ :10 
    ఉత్తరాఖండ్ : 1

  • వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు  అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన  పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వాదనలు  వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉన్నాయని అభివర్ణించింది.

    ప్రజా ప్రదేశాలలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు ఉత్తమమైన విధానం కాకపోవచ్చని షర్మిలా వాదించారు. తన వాదనలకు మద్దతుగా ఠాగూర్ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చారు. 

    వాస్తవదూరంగా ఆలోచిస్తున్నారు  :  సుప్రీం
    కొన్నేళ్లుగా ఎయిమ్స్‌లో స్నేహపూర్వకంగా ఉంటున్న కుక్క 'గోల్డీ' గురించి ఉదాహరించారు. కొన్ని కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అయితే దూకుడుగా ప్రవర్తించే వాటిని ముందుగా ఒక కమిటీ గుర్తించాల్సి ఉంటుందని, కుక్కల ప్రవర్తనను పరిశీలించేందుకు కమిటీ ఉండాలని, దూకుడుగా ఉండే కుక్కలకు, సాధారణ కుక్కలకు మధ్య తేడాను చూడాలంటూ షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అలాగే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి సైన్స్ మనస్తత్వశాస్త్రం సహాయం అవసరమని ఠాగూర్ తన పిటిషన్‌లో అన్నారు. ABC నియమాలు ఫూల్‌ప్రూఫ్ కాకపోవచ్చు, కాబట్టి దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదించారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు ఒక్కొక్కటిగా ఖండించింది.

    ఆసుపత్రులలో కుక్కల్ని కీర్తించడానికి ప్రయత్నించవద్దు అంటూ సుప్రీం గట్టిగానే వాదించింది. ఆ కుక్కను ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా తీసుకు వెళ్తున్నామా? వీధుల్లో తిరిగే ఏ కుక్కకైనా పేలు ఉంటాయి. అలాంటి వాటిని థియేటర్లలోకి అనుమతిస్తే ఇన్‌ఫెక్షన్లు, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు అర్థమవుతోందా? మీవాదనల వెనుకున్న వాస్తవికత ఏమిటో మే మీకు తెలియజేస్తాంఅంటూ మండిపడింది.

    ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్‌​ ఫ్లైట్‌ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!

    చెవులకు రంగులు
    మరోవైపు ప్రజలను కరిచిన కుక్కలను గుర్తించడానికి కాలర్ల (చెవులకు)కు రంగులు వేయాలని ఠాగూర్ తరపు న్యాయవాది సూచించారు. జార్జియా  అర్మేనియా వంటి దేశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సూచనపైనా కూడా సుప్రీం ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఆ దేశాల జనాభా ఎంత? సుప్రీంకోర్టు ఆ వాదనను కూడా కొట్టిపారేసింది.

    సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కల్పించుకుని కమిటీలో నిపుణులు లేకుండా వచ్చిన ఆరావళి విషయంలో వచ్చిన తీర్పు  ఉదహరించారు.. "న్యాయ జోక్యం అనేది ఖాళీలు ఉన్న అంతరాలలో మాత్రమే తప్ప, శాసనసభ ఉద్దేశపూర్వకంగా చట్టం చేయకూడద’’ని  అనుకున్న విషయాల్లో కాదన్నారు.

    ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్‌ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?

    దాడిచేసే వారి మీద కేసు పెట్టుకోండి
    కుక్కలకు  ఆహారాన్నదిస్తున్న మహిళలపై దాడులు, దుర్భాషలాడుతున్న వారి గురించి  సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి లేవనెత్తినప్పుడు, కూడా సుప్రీం ఇదే వ్యాఖ్యాచేసింది. ప్రజలు ఎవర్నైనా,  ఎలా అయినా అవమానించవచ్చు. మమ్మల్ని కూడా అంటున్నారు. అలాంటి వాళ్లమీద చర్య తీసుకోండని సూచించింది. ఫీడర్ వ్యతిరేక విజిలెంట్స్" మహిళలపై దాడి చేస్తున్నారని, అధికారులు దాని గురించి మౌనంగా ఉన్నారని పావని ఆరోపించారు. ఇలాదేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. హర్యానాలో, సొసైటీలు బౌన్సర్లను నియమించుకుని మరీ దాడిచేస్తున్నాయన్నారు. దీనికి వీధి కుక్కల సమస్యలతో సంబంధం లేదని సుప్రీం స్పష్టం చేసింది. స్ట్రీట్‌ డాగ్స్‌ అంశంపై, సూచనలు ఉంటే, ఇవ్వవచ్చు అని చెబుతూ మహిళలపై దాడి చేస్తున్నవారిపై FIR దాఖలు చేయండి. హైకోర్టుకు వెళ్లండి  అని సుప్రీంకోర్టు పేర్కొంది.

    వీధుల నుండి ప్రతి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు చికిత్స చేయాలని ఆదేశించిందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పబ్లిక్‌ ప్లేసెస్‌నుంచి కుక్కల్ని తొలగించడం వల్ల ప్రభుత్వానికి రూ.26,800 కోట్ల వరకు ఖర్చవుతుందని సుప్రీంకిచ్చిన  నివేదికలో  పేర్కొన్నారు. 

    ఇదీ  చదవండి: టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

  • గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ  కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా  నిందితులుగా పేర్కొనవచ్చా?  చట్టం ఏ చెబుతోంది?  దీనిపై   కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?

    సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A  ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ  భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి   మూడేళ్ల  వరకు  జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం  ఉంది.

    అయితే ఒక కేసులో  తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది.  ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు,  పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె  హైకోర్టును ఆశ్రయించింది. 

    పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.

    ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త  అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.

    ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్‌ కౌంటర్‌

    అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ  ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి  రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

    ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్‌​ ఫ్లైట్‌ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!

    అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా  హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

    ఇదీ  చదవండి: టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

  • ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా, భారత్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ప్రధాని మోదీ గతేదాడి.. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఎనిమిది సార్లు ఫోన్లు చేశారని గుర్తు చేశారు.

    డొనాల్డ్‌ ట్రంప్‌ 500 శాతం టారిఫ్‌ల బిల్లుపై భారత్‌ స్పందించింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..‘ప్రతిపాదిత బిల్లు గురించి మా దృష్టికి వచ్చింది. బిల్లుకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దేశీయ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత ఆయిల్‌ కొనుగోళ్లు ఉంటాయి. ఈ బిల్లు విషయమై ప్రధాని మోదీ.. ఇప్పటికే ట్రంప్‌తో ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడారు. గతేడాది ఫిబ్రవరి 13 నాటికే భారత్‌, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడానికి కట్టుబడి ఉన్నాయి. ఇప్పటికే పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఇరుపక్షాలు అనేక రౌండ్ల చర్చలు జరిపాయి. చాలా సందర్భాలలో మేము ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాము’ అని తెలిపారు.

    ఇదిలా ఉండగా.. అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుట్నిక్.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వెల్లడించారు. ఇది ఆయన (ట్రంప్) ఒప్పందం.  దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్‌నకు మోదీ కాల్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు.

    మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్‌తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్‌స్టార్మర్ ట్రంప్‌నకు కాల్ చేశారు (Donald Trump). ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు’’ అంటూ భారత్, బ్రిటన్‌ మధ్య పోలిక తెచ్చారు. మోదీ ఫోన్‌ చేయడానికి నిరాకరించినప్పటికీ.. ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    అయితే, ఒకవైపు ట్రేడ్‌ డీల్ చర్చలు జరుపుతూనే.. భారత్‌పై అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేలా 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

  • నలభై ఏళ్ల ప్రేమ అరవై ఏళ్ల వయసులో నెరవేరడం నిజంగా  అదృష్టం. 65 ఏళ్ల వయసులో జయప్రకాష్‌  అనే వ్యక్తి, తన టీనేజ్ ప్రియురాలు యాభై తొమ్మిదేళ్ల రష్మిని పెళ్లాడాడు. ఇది కేవలం ప్రేమకథ కాదు. అనేక ట్విస్టు అండ్‌ టర్న్‌ మధ్య  వారి చిరకాల  ప్రేమసంతోషం, ఆనందం గెలిచిన రోజు. 

    ఒకనాడు విధికి తలవంచిన ఈ జంట, మళ్లీ ఆ విధి చేసిన వింతలో భాగంగానే పిల్లల అనుమతితో ఒకటయ్యారు. అలనాటి ప్రేమికులు జయప్రకాష్ , రష్మిల అందమైన, అరుదైన ఈ పెళ్లి కథ గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి! కేరళలో జరిగిన ఆసక్తికరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి:-


    కేరళలోని కొల్లం ముందక్కల్‌కు చెందినవారు జయప్రకాష్‌, రష్మి. వీరిద్దరూ పొరుగువారే. చాలా చిన్న వయసులోనే ప్రేమించు కున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. విధి వారిద్దరినీ మరొకరి జీవితంలోకి ప్రవేశించేలా చేసింది. దీంతో ఇద్దరూ తమ ప్రేమను త్యాగం చేసి, పెద్దలు చెప్పిన పెళ్లిళ్లు చేసుకొని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. రష్మికి ఆమె తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు.

    ప్రేమ విఫలం కావడంతో జయప్రకాష్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు, రష్మికి ఇద్దరు కుమార్తెలున్నారు. పిల్లలు, మనవరాళ్ళు, మునిమనవళ్లు వారి కుటుంబాలు నిండుగా సంతోషంగా ఉన్నాయి. అయితే జయప్రకాష్‌, రష్మి ఇద్దరూ కూడా తమతమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రష్మి భర్త పదేళ్ల క్రితం అకస్మాత్తుగా మరణించగా, జయప్రకాష్ భార్య 5 సంవత్సరాల క్రితం మరణించింది. అప్పటి నుంచి వారు తమ పిల్లలే తమ ప్రాణమని భావించి తిరిగి వివాహం చేసుకోకుండానే జీవించారు.  దీంతో వారిద్దరూ ఒంటరిగా మారారు.  
     

    షార్ట్‌ ఫిలిం కలిపిన ప్రేమ
    భర్తను కోల్పోయిన బాధను మర్చిపోయేందుకు రష్మి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది. ఆమె షార్ట్ ఫిల్మ్‌లలో కూడా నటించేది. ఈలోగా జయప్రకాష్ రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. తన చిన్ననాటి ప్రియురాలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించినట్టు తెలిసి సంబరపడిపోయారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వద్ద రష్మి కుమార్తె సెల్ ఫోన్ నంబర్ తీసుకుని, రష్మితో మాట్లాడారు. ఈ క్రమంలోనే జీవిత భాగస్వాములు చనిపోయారని పరస్పరం తెలుసుకున్నారు. 

    మరోవైపు భార్య చనిపోవడంతో పిల్లల పట్టుబట్టడంతో జయప్రకాష్‌ కూడా తిరిగి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.  తాను తిరిగి వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని జయప్రకాష్ రష్మికి చెప్పాడు. అలా ఇద్దరిమధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది.  పిల్లల అంగీకారంతో ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చని కూడా ప్రపోజ్ చేశాడు. రష్మి తన కూతురు, అల్లుడికి ఆ విషయం చెప్పింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారు. ఇంకేముంది పెళ్లి  సందడి వేళ అయ్యింది.

    పిల్లలే పెద్దలుగా జయప్రకాష్-రష్మి  సమీప బంధువుల సమక్షంలో దంపతులుగా మారారు. యవ్వనంలో ప్రేమలో పడిన ఈ జంట 60 ఏళ్ల తర్వాత కలిసి "నిజమైన ప్రేమ ఒకరోజు తప్పకుండా గెలుస్తుంది" అని నిరూపించారు. నూతన వధూవరులు రష్మి, జయప్రకాష్ మలేషియాకు హనీమూన్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు. జయప్రకాష్, రష్మిల వివాహ ఫోటోను రష్మి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేసి, "ఈ అదృష్టం ఏ పిల్లలకు లభిస్తుంది?"  అని పేర్కొనడం విశేషంగా నిలిచింది.

    ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్‌​ ఫ్లైట్‌ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!

  • కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఐప్యాక్‌ చీఫ్‌ ప్రతీక్‌ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్‌లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనార్జీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ నేతలు. సీఎం మమత చేపట్టిన ర్యాలీలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    మరోవైపు.. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తోందని అమిత్‌షాపై టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్‌ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.

    ఈ నిరసనల్లో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్‌, కీర్తి ఆజాద్‌, డెరెక్‌ ఓబ్రియన్‌ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం, ఎంపీలు మాట్లాడుతూ.. ‘‘ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోంది’’ అని డెరెక్‌, మహువా వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనలకు తావులేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. నిరసనకారులను జైలుకు పంపి.. రేపిస్టులకు బెయిల్ ఇస్తున్నారు. ఇది బీజేపీ విధానం. దీనిని బెంగాల్ అంగీకరించదు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం’ అని అభిషేక్‌ బెనర్జీ ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఇక, సోదాలు అడ్డుకున్నారని ఈడీ.. వాటిని ప్రశ్నిస్తూ ఐప్యాక్‌ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాయి.

    ఇదిలా ఉండగా.. కోల్‌కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐ-ప్యాక్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) గురువారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. ఈడీ సోదాల సందర్బంగా అధికారుల వద్ద నుంచి సీఎం మమతా బెనర్జీ పలు ఫైల్స్‌ను తీసుకెళ్లారు. దీంతో, ఈడీ దాడుల ఘటన బెంగాల్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

  • ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్‌ షాప్‌కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కల్యాణ్‌ జువెలర్స్‌ షోరూమ్‌లో డిసెంబర్‌ 31 2025న ఈ ఘటన జరిగింది.

    ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్‌ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్‌ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

    డిస్‌ప్లే ప్యాడ్‌ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది.  జువెలర్స్‌   సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

    ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్‌మన్‌ను దృష్టి మళ్లించి, షాప్‌లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్‌తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్‌  వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్‌నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్‌ పెట్టారు.

  • సంచలనం రేపిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు(తంత్రి) కందరారు రాజీవరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అరెస్ట్‌ చేసింది. వరుస నోటీసులకు స్పందించని ఆయన్ని.. శుక్రవారం విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. 

    శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ప్రధాన అర్చకుడు రాజీవరు అరెస్టుతో ఆ సంఖ్య 11కి చేరింది.  

    ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పద్మకుమార్, ఉన్నికృష్ణన్ పొట్టి వాంగ్మూలాల మేరకు సిట్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి తంత్రి రాజీవరును ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వీలైనంత త్వరగా.. కొల్లంలోని కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన తంత్రిని ప్రశ్నించడం ఇదేం తొలిసారి కాదు. గత ఏడాది నవంబరులో కూడా సిట్‌ ఆయన్ని విచారణ జరిపింది. అయితే..

    ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టులకు తీసుకొచ్చింది కందరారు రాజీవర్ అని పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ వాంగ్మూలాల ఆధారంగా ఈ రోజు ఉదయం రాజీవర్‌ను సిట్ కార్యాలయానికి పిలిపించారు. రెండున్నర గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు సిట్ అధికారికంగా ప్రకటించింది.

    ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారు

    1. ఉన్నికృష్ణన్ పొట్టి (స్పాన్సర్)
    2. మురారిబాబు (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దేవస్వం బోర్డు)
    3. డి.సుధీష్ కుమార్ (మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)
    4. కెఎస్ బైజు (తిరువాభరణం మాజీ కమిషనర్)
    5. ఎన్.వాసు (మాజీ దేవస్వం కమిషనర్, అధ్యక్షుడు)
    6. ఎ.పద్మకుమార్ (మాజీ దేవస్వం బోర్డు అధ్యక్షుడు)
    7. ఎస్.శ్రీకుమార్ (మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)
    8. పంకజ్ భండారి (సీఈవో, స్మార్ట్ క్రియేషన్స్)
    9. బళ్లారి గోవర్ధన్ (ఆభరణాల వ్యాపారి)
    10. ఎన్.విజయకుమార్ (మాజీ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు)
    11. కందరారు రాజీవరార్ (శబరిమల తంత్రి)

    ఎప్పుడు ఏం జరిగిందంటే.. 
    బంగారం తాడపం పనులు పూర్తయ్యాక బరువులో వ్యత్యాసం బయటపడడంతో ఈ కేసు మొదలైంది. 2019లో.. ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. ఆ సమయంలో తిరిగి ఇచ్చిన బంగారం బరువులో వ్యత్యాసం బయటపడింది.
    ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు మొదలైంది. 

    శబరిమల బంగారం చోరీలో పురోగతి అర్చకుడు అరెస్ట్..

    అయితే ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో కేరళ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఆ దర్యాప్తు వేగవంతం చేయాలని అక్టోబర్‌లో కేరళ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ కేసును అత్యున్నత న్యా‍యస్థానం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కూడా. 

    బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ప్రదాన సూత్రధారిగా సిట్‌ పేర్కొంది. అతనితో పాటు మాజీ అధికారిగా ఉన్న బి. మురారి బాబు అరెస్టు అయ్యారు. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ కూడా చేశారు.  ఆపై మరికొందరిని విచారించి.. అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రధాన అర్చకుడి అరెస్టుతో కేసు మరో మలుపు తిరిగింది. అయితే.. మరిన్ని బంగారు తాపడం ప్లేట్లు తొలగించి బంగారం దోచుకోవాలని పెద్ద కుట్ర జరిగిందని కోర్టుకు సిట్‌ ఇప్పటికే నివేదించింది. శబరిమల బంగారం చోరీ కేసులో సిట్‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా మనీ లాండరింగ్(Prevention of Money Laundering Act) అభియోగాల కింద దర్యాప్తు జరుపుతోంది.

  • సగటు భారతీయ కుటుంబాలకు విమాన ప్రయాణం అంటే విలాసవంతమైందే.  ఆకాశంలో విహరించేందు కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండటం,  అందుకనుగుణంగా డబ్బులు దాచుకోవడంతోపాటు  కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. అలా నెటిజనులలో భావోద్వాగాన్ని కలిగించిన  వీడియో ఒకటి నెట్టింట వైరల్‌వుతోంది.

    విష్ణు అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం తన తల్లిదండ్రులను తొలిసారి విమానం ఎక్కించాడు.  ఈ అనుభవాన్ని  రికార్డ్‌ చేశాడు.  ప్రతీ కొడుకు  స్వప్నం  నెరవేరిన క్షణం  ఇదీ అంటూ ఎలాంటి ఫిల్టర్లు, సౌండ్‌ట్రాక్‌లు లేకుండా చాలా సాదా సీదాగా, అత్యంత హృద్యంగా ఈ క్షణాలను వీడియో తీశాడు.   సెక్యూరిటీ చెకప్‌నుంచి, గేటులోకి ఎంట్రీ ఇవ్వడం, విమానం ఎక్కడం, చివరగా విమానంలో కూర్చునే దాకా   తల్లిదండ్రుల  ముఖాల్లో  ఆనందాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు 

    ఈ సెంటిమెంట్‌తో సోషల్ మీడియా వినియోగదారులు  త్వరగా కనెక్ట్ అయ్యారు. "స్వచ్ఛమైన ప్రేమ మరియు కృతజ్ఞత  అంటూ విష్ణుకు అభినందనలు తెలిపారు.  గ్రేట్‌ బ్రో.. ఇది కదా  ఆనందం అంటే  అని మరొకరు, "ఇది ప్రతి మధ్యతరగతి  మనిషి కల"  చిన్నప్పటినుంచీ  కష్టపడి పెంచి, చదివించినందుకు వారికి  మనం చాలా రుణపడి ఉంటాం  అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. 

  • తిరువనంతపురం: రండి బాబు రండి అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారా? మీకు విద్యార్థత లేదు. మరేం ఫర్లేదు. డబ్బులు ఉంటే చాలు.. అమెరికాకు కాదు.. అంతరిక్షానికైనా పంపిస్తామంటూ పలువురు కేటు గాళ్లు అమాయకులకు వల వేస్తున్నారు. కోరుకున్న జీవితం, కోరుకున్న జీతం రావడంతో పలువురు నమ్మి మోసపోతున్నారు. వలసదారులపై ట్రంప్‌ విధిస్తున్న ఆంక్షలకు బలవుతున్నారు. కాళ్లు,చేతులకు సంకెళ్లు వేయించుకుని మరీ స్వదేశాలకు వస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉదంతమే అందుకు ఉదాహరణ

    నల్లగొండ జిల్లా పరేపల్లిగూడేనికి చెందిన పకీర్‌ గోపాల్‌రెడ్డి నకిలీ విద్యార్హత పత్రాలతో అమెరికా వెళ్లి ఉద్యోగం పొందాడనే ఆరోపణలపై అక్కడి అధికారులు అతడిని డిపోర్ట్ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆర్‌జీఐఏ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గోపాల్‌రెడ్డి మధురై కామరాజ్‌ యూనివర్శిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్‌ పూర్తి చేశానని నకిలీ సర్టిఫికెట్‌ పొందాడు. దీని ఆధారంగా స్టూడెంట్‌ వీసా తీసుకుని 2023 సెప్టెంబర్‌లో అమెరికా వెళ్లి, డల్లాస్‌లోని వెబ్‌స్టర్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌లో చేరాడు. కానీ అతడు సమర్పించిన డిగ్రీ నకిలీదని తేలడంతో అమెరికా అధికారులు అతడిని తిరిగి పంపించారు. విచారణలో గోపాల్‌రెడ్డి ఆ సర్టిఫికెట్‌ను రూ.80 వేలకే కొనుగోలు చేశానని అంగీకరించాడు.

    ఈ కేసు తీగ లాగిన సైబరాబాద్‌ పోలీసులు కేరళలోని మలప్పురం జిల్లా పొన్నానిలో ఉన్న మార్క్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి చేశారు. అక్కడి పోలీసులు వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌ విలువ దాదాపు రూ.750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మార్క్‌ సంస్థ నిర్వాహకుడు అర్షద్‌ను పట్టుకున్న పోలీసులు విచారించగా, ఈ సర్టిఫికెట్లు తిరుర్‌లోని ఫోర్సా మాల్‌లో ఉన్న ఎడుహబ్‌ కన్సల్టెన్సీ నుంచి వస్తున్నాయని బయటపెట్టాడు. అక్కడి నుంచి వందల సర్టిఫికెట్లు సీజ్‌ చేశారు. ఈ తయారీలో పయ్యనంగడికి చెందిన అబ్దుల్‌ నిస్సార్‌ కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో అతడినీ అరెస్టు చేశారు.

    ఈ ముఠా దేశవ్యాప్తంగా వేల మందికి నకిలీ విద్యార్హత పత్రాలు సరఫరా చేసింది.ఎస్సెస్సీ, ప్లస్‌ టూ, బీఏ, బీకాం, ఎంబీఏ, ఎంకామ్, బీఎస్సీ, బీఈడీ, బీటెక్‌లతో పాటు ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సులు, పీహెచ్‌డీ  వరకు అన్ని స్థాయిలలో సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు అమ్మారు. తిరూర్ ఈస్ట్‌లోని చెంబ్రాకు చెందిన ధనీష్ ధర్మన్ ఈ రాకెట్‌కు నాయకుడు. అతడు ‘డానీ’ అనే పేరుతో నకిలీ సర్టిఫికెట్ల వ్యాపారం నడిపాడు. తమిళనాడులోని శివకాశీలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి, ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు, పీఎఫ్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాడు. శివకాశీ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన జైనుల్ అబీదీన్ అరెస్టుతో డానీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధనీష్ 2011లో కూడా నకిలీ సర్టిఫికెట్ల కేసులో పట్టుబడ్డాడు. అప్పట్లో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా మొదలుపెట్టాడు.

    ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తూ, ధనీష్ 10 ఏళ్లలో రూ.100 కోట్లకు పైగా సంపాదించాడు. ఈ సంపాదనతో పుణే, దుబాయ్‌లో వ్యాపారాలు ప్రారంభించాడు. చివరకు కారవాన్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మొత్తంగా, ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ కేరళ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి, వందల కోట్ల రూపాయల స్కామ్‌గా మారింది. గోపాల్‌రెడ్డి కేసు ద్వారా ఈ భారీ నెట్‌వర్క్ గుట్టు రట్టు కావడం, విద్యార్హత పత్రాల మోసంపై పెద్ద ఎత్తున దర్యాప్తుకు దారితీసింది.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.

    దీంతో, కూకట్‌పల్లి-మియాపూర్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌, కార్లతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్‌ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అందించనున్నట్టు తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది.

    అయితే, ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులకు కోటికి పైగా బీమా అందుతోంది. అదే తరహాలో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు బీమా ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేర్చే ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ, వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. అదే.. 'సీ-మిత్ర' (C-Mitra). దీని ద్వారా ఫిర్యాదు చేయడం మొదలుకొని, ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకూ అంతా ఇంటి నుంచే పూర్తవుతుంది. సాంకేతికత ద్వారా పోలీసులే మీ వద్దకు వచ్చే అద్భుతమైన 'వర్చువల్' పరిష్కారమిది.

    సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఒక 'వర్చువల్ హెల్ప్‌డెస్క్' ఈ సీ-మిత్ర. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియను పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా సైబర్ మోసం జరిగినప్పుడు బాధితులు '1930' నంబర్‌కు ఫోన్ చేసి గానీ, జాతీయ సైబర్ పోర్టల్ (https://www.cybercrime.gov.in/) లో గానీ ఫిర్యాదు చేస్తారు. అయితే, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు కోసం కచ్చితంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ 'సీ-మిత్ర' రాకతో ఇక ఆ అవసరం ఉండదు. సమస్త ఫిర్యాదు ప్రక్రియ ఇంటి నుంచే పూర్తవుతుంది.

    చాలామంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి 'సీ-మిత్ర' బృందమే స్వయంగా ఫోన్ చేసి, వివరాలు సేకరించి, ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తుంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి  సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్‌బాగ్, హైదరాబాద్ - 500029  అనే అడ్రస్ కు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి. అంతేకాదు, సైబర్ క్రైం పీఎస్ వద్ద  డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీలను అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్‌ను సైబర్ క్రైం పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సీ-మిత్ర సేవలను పొందేందుకు అర్హులు.

    సీ-మిత్ర విధానం వల్ల పౌరుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, స్టేషన్ సిబ్బందికి దర్యాప్తుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. 1930కి, జాతీయ సైబర్ పోర్టల్‌కు వచ్చే ఫిర్యాదుల్లో కేవలం 18% మాత్రమే ఎఫ్ఐఆర్‌లుగా మారుతున్నాయి. సీ-మిత్ర ద్వారా దీనిని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్ర‌స్తుతం లక్ష రూపాయలకు మించిన సైబర్ మోసాలను సైబర్ క్రైమ్ స్టేషన్‌లోనూ, అంతకంటే తక్కువైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లోనూ నమోదు చేస్తున్నారు. అయితే, ఇకపై 'సీ-మిత్ర' విధానం ద్వారా 3 ల‌క్షల లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్ఐఆర్ చేసి, తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయడం జరుగుతుంది. 3 ల‌క్ష‌ల పైన ఉన్న ఫిర్యాదుల‌ను సైబ‌ర్ క్రైం పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోదు చేయ‌డం జ‌రుగుతుంది.

    సీ-మిత్ర సేవలను పొందాలంటే బాధితులు 1930కి కాల్ గానీ, లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే సీ-మిత్ర బృందంలోని వర్చువల్ పోలీస్ ఆఫీసర్లు బాధితులకు కాల్ చేసి, వర్చువల్ పద్ధతిలో ఫిర్యాదు చేసే విధానాన్ని వివరిస్తారు. సిద్ధం చేసిన ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను బాధితులకు పంపిస్తారు. బాధితులు దానిని ప్రింట్ తీసుకుని, సంతకం చేసి పోస్ట్/కొరియర్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్ సంతకం ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను సందేశరూపంలో బాధితులకు పంపిస్తారు.

    ఈ వర్చువల్ హెల్ప్‌డెస్క్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం, ఏఐ పరిజ్ఞానంతో బాధితులకు సేవలు అందిస్తుంది. సీ-మిత్ర అధికారిక ల్యాండ్‌లైన్ నంబర్: 040-4189-3111 నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. వాట్సాప్ ద్వారా సమాచారం కేవలం 87126 సిరీస్ నంబర్ల నుంచే వస్తుంది. సి-మిత్ర పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సి-మిత్ర సిబ్బంది ఎప్పుడూ ఓటీపీ గానీ, డబ్బులు గానీ అడగరు. సీ-మిత్ర కేసును దర్యాప్తు చేయదు. పోయిన డబ్బును వెనక్కి ఇప్పిస్తామని హామీ ఇవ్వదు. చట్టపరమైన సలహాలు కూడా ఇవ్వదు. కేసు స్టేటస్ తెలుసుకోవాలంటే సంబంధిత పోలీస్ స్టేషన్‌నే సంప్రదించాలి.

  • సాక్షి, హైదరాబాద్‌: బహుళ ప్రజా సేవలకు ఒకే వేదికగా డిజిటల్ టికెటింగ్ అందిస్తున్న మీ టికెట్ యాప్‌ విజయవంతంగా తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో యాప్‌ను సుమారు 2 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, రూ.2.5 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. 3.5 లక్షలకుపైగా టికెట్లు జారీ అయినట్లు అధికారులు తెలిపారు.

    సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రారంభమైన ఈ యాప్‌ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రజా ప్రదేశాల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్ మెట్రో, పార్కులు, దేవాలయాలు, మ్యూజియంలు, కోటలు, బోటింగ్ కేంద్రాలు, నేచర్ క్యాంపులు, కమ్యూనిటీ సౌకర్యాలకు డిజిటల్ టికెటింగ్‌ను ఒకే యాప్‌లో అందిస్తోంది.

    త్వరలో మీటికెట్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగర, ఉపనగర ప్రయాణికుల కోసం క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు, అంతర్‌నగర బస్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రారంభ దశలో సాధారణ పాస్, మెట్రో డీలక్స్ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఏసీ) పాస్, పుష్పక్ ఏసీ పాస్‌లను యాప్‌లో పొందుపరచనున్నారు.

    జనవరి 2026 నాటికి మీ టికెట్ పరిధిలో సుమారు 123 పార్కులు, 50 బోటింగ్ కేంద్రాలు, 16 దేవాలయాలు, 6 మ్యూజియంలు, 4 కోటలు/స్మారకాలు, 4 జలపాతాలు, 11 జీహెచ్ఎంసీ పార్కులు, 5 నేచర్ క్యాంపులు, ఒక హైదరాబాద్ మెట్రో ఇంటిగ్రేషన్, ఒక ఫంక్షన్ హాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, పర్యావరణ, సాంస్కృతిక, ధార్మిక ప్రాంతాలకు ఒకే యాప్ ద్వారా చేరువ చేసే ‘సూపర్ యాప్’గా మీటికెట్ నిలుస్తోందని వారు పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ పేరుతో ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్‌ అనుచితంగా ప్రవర్తించింది. తోటి విద్యార్థుల ముందే తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. దీంతో, తీవ్ర మనస్థాపానికి, మానసిక వేదనకు గురైన విద్యార్థిని అనూహ్యంగా అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  చోటుచేసుకుంది.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజ్‌గిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెస్ట్‌ మారేడుపల్లికి చెందిన విద్యార్థిని వర్షిణి (17) ఇంటర్‌ చదువుతోంది. అయితే, వర్షిణి (Varshini) ఒక రోజు కాలేజీకి కొంచెం ఆలస్యంగా వచ్చింది. అదే సాకుగా తీసుకున్న లెక్చరర్లు శ్రీలక్ష్మి (Sri Lakshmi), మధురిమ (Madhurima)లు ఆమెను తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి దూషించారు. కాగా, వర్షిణి తనకు నెలసరి రావడం వల్ల ఆలస్యం అయిందని చెప్పింది. పీరియడ్స్ వచ్చాయా? నాటకాలు ఆడుతున్నావా.. ఏది చూపించు? అంటూ అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో, తోటి విద్యార్థులు ముందు ఇలా చేయడం పట్ల వర్షిణి తట్టులేకపోయింది. దీంతో, వర్షిణి  మానసికంగా కుంగిపోయింది. ఇంటికి వెళ్లి తల్లితో విషయం చెప్పి ఏడ్చింది. అయితే తల్లి ఓదార్చి తర్వాత వెళ్లి మాట్లాడదామని తల్లి కుమార్తెను సముదాయించింది.

    ఇంతలోనే విద్యార్థినికి తలనొప్పి రావడంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. దీంతో, వర్షిణిని వెంటనే మల్కాజ్‌గిరి ఆసుపత్రికి తరలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడ  సిటీ స్కాన్ చేయించారు. విద్యార్థిని ఎడమ చేయి, కాలు కూడా పనిచేయడం మానేశాయి. స్కానింగ్ చేసిన వైద్యులు.. తీవ్ర మనస్తాపానికి గురికావడంతో బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. అనంతరం అదే రాత్రి బాలిక మృతి చెందింది. వర్షిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లెక్కరర్లు చేసిన ఓవరాక్షన్‌ వల్లే తమ కూతురు ఇలా చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం ఉదయం కళాశాల ముందు ఆమె తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. వెంటనే సదరు లెక్చరర్స్, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. డీజీపీ నియామకాన్ని సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ ప్రాసస్‌ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

    డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించిన కోర్టు.. యూపీఎస్సీకి పంపిన తరువాత కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి తెలిపింది. డీజీపీ నియామక ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలన్న IA(ఇంట్రిమ్ ఆప్లికేషన్)ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.

    రాష్ట్ర డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌ రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2025 సెప్టెంబర్‌లో సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులు.. 2018 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ నిన్న (గురువారం జనవరి 8) మరోసారి విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌ రెడ్డి, కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నరసింహ శర్మ, యూపీఎస్సీ కౌన్సెల్‌ అజయ్‌కుమార్‌ కులకర్ణి వాదనలు వినిపించారు.

    కోర్టు ఆదేశాల మేరకు తాము యూపీఎస్సీకి జాబితాను పంపామని, కమిషన్‌ దాన్ని తిప్పి పంపిందని ఏజీ అన్నారు. కోర్టు ఉత్తర్వులు యూపీఎస్సీకి కూడా వర్తిస్తాయని, రాష్ట్ర జాబితాను తిరిగి పంపకూడదన్నారు. పిటిషనర్‌ లేవనెత్తిన ప్రశ్న సరైంది కాదన్నారు. రాష్ట్ర సిఫార్సులను పునఃపరిశీలించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోరారు.

    తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

    ఈ విషయంలో కేంద్ర హోం శాఖకు ఎలాంటి పాత్ర లేదని ఏఎస్‌జీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి, యూపీఎస్సీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల అంశమని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి జరిగిన జాప్యం, డీజీపీల నియామకానికి సంబంధించి సుప్రీం ఆదేశాల దృష్ట్యా అటార్నీ జనరల్‌ను న్యాయ సలహా కోరామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నుంచే స్పష్టత కోరాలని ఆయన సూచించారన్నారు. వాదనలు విన్న జడ్జి.. ఇవాళ(శుక్రవారం) తీర్పు వెల్లడించారు.

Business

  • శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 24 గంటలు పూర్తి కాకూండానే మరింత పెరిగాయి. దీంతో గోల్డ్ రేట్లలో గంటల వ్యవధిలోనే గణనీయమైన మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో రూ. 1,27,150 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి మరో 550 రూపాయలు పెరిగింది. దీంతో రేటు రూ. 1,27,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 600 పెరగడంతో రూ. 1,39,310 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబై మొదలైన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

    చెన్నై నగరంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,28,000 వద్ద.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,640 వద్ద ఉంది.

    దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. సాయంత్రానికే పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,27,850 వద్ద (1200 రూపాయలు పెరిగింది) .. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,39,460 వద్ద (1310 రూపాయలు పెరిగింది)కు చేరింది.

  • కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

    బీహార్‌కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.

    ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.

    ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

    ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  • ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసే వారైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో లోన్స్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. పర్సనల్ లోన్ & టాప్-అప్ లోన్లలో ఏది బెస్ట్. మీ సందేహానికి.. ఈ కథనమే సమాధానం.

    పర్సనల్ లోన్
    పర్సనల్ లోన్ గురించి దాదాపు అందరికీ తెలుసు. విద్య, పెళ్లి, వైద్య ఖర్చులు, ట్రావెల్ వంటి వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువమంది ఈ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ లోన్‌కు అప్రూవల్ ప్రక్రియ కొంత వేగంగా ఉంటుంది. అంతే కాకుండా డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా కొంత తక్కువే.

    పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 11 శాతం నుంచి 24 శాతం వరకు ఉంటుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కూడా కొంత ఎక్కువే. మొత్తం మీద మీరు తీసుకున్న లోన్ మీద కొంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

    టాప్ అప్ లోన్
    టాప్ అప్ లోన్ విషయానికి వస్తే.. ఇది మీరు ఇప్పటికే తీసుకున్న లోన్‌పైనే అదనంగా ఇచ్చే లోన్ అన్నమాట. ఒక వ్యక్తి లోన్ తీసుకుని సక్రమంగా చెల్లిస్తున్న సమయంలో.. బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తాయి.

    టాప్ అప్ లోన్ తీసుకోవడం వల్ల.. వడ్డీ రేటు కొంత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్ మీద తీసుకునే టాప్-అప్ లోన్‌కు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఈఎంఐ కూడా పర్సనల్ లోన్‌తో పోలిస్తే చాలా తక్కువే. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టాప్ అప్ లోన్ కావాలంటే.. మీరు ఇప్పటికే లోన్ తీసుకుని ఉండాలి. సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి.

    పర్సనల్ లోన్ అనేది అత్యవసరంలో ఉపయోగపడుతుంది. ఇది దాదాపు అందరికీ అందుబాటులో ఉంటుంది. టాప్ అప్ లోన్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు. లోన్ తీసుకుని, సమయానికి చెల్లించేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. మీ సౌలభ్యం, అవసరాన్ని బట్టి.. ఏ లోన్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి.

  • కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

    రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్‌లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్‌టెల్‌ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.

    ఏ కంపెనీ ఎంత టారిఫ్‌లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్‌టెల్ 28 రోజుల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్‌ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.

    ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!

    జూన్ 2026 నుంచి టారిఫ్‌లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది.

  • సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 'ఈ-యాక్సెస్' పేరుతో భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనిని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనుంది.

    బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్న సుజుకి ఈ-యాక్సెస్.. 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ద్వారా 95 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇందులోని 4.1 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారు 15 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

    సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మూడు రైడింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్‌ మొదలైనవి పొందుతుంది. ఇందులో బ్లూటూత్/యాప్ కనెక్టివిటీ & USB ఛార్జింగ్ పోర్ట్‌ కూడా లభిస్తాయి. ఇది నాలుగు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విస్తరిస్తున్న తరుణంలో.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఒక ట్వీట్ చేశారు. కృత్రిమ మేధస్సు (AI).. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని ఇందులో ఒక ఉదాహరణతో వివరించారు.

    సంస్థలోని R&D బృందంలో పనిచేసే ఇంజనీర్.. నెల రోజుల తన ఖాళీ సమయంలో తయారు చేసిన ఒక పరికరాన్ని నాకు చూపించారు. అతను దానిని తయారు చేస్తున్నట్లు నాకు తెలియదు. కానీ దానిని చూడగానే నేను ఆశ్చర్యపోయాను.

    మూడు లేదా నలుగురు వ్యక్తులు.. ఆ పరికరాన్ని తయారు చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పడుతుంది. కానీ అతను కేవలం నెల రోజుల్లోనే దాన్ని అభివృద్ధి చేశారు. ఇంత వేగంగా దీనిని రూపొందించడానికి ప్రధాన కారణం Opus 4.5 అనే AI మోడల్ అని ఆ ఇంజనీర్ చెప్పారు.

    ఒకప్పుడు ఏఐ ద్వారా రాసే కోడ్‌పై అతనికి (ఇంజినీర్) అంతగా నమ్మకం లేదు. కానీ Opus 4.5 వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెంబు వివరించారు. అంతే కాకుండా జోహో కంపెనీలో ప్రయోగాత్మక సంస్కృతిని ప్రస్తావించారు. మేము సంస్థలో తెలివైన వాళ్లకు స్వేచ్ఛ ఇస్తాం, వాళ్లే కొత్త మార్గాలు కనుగొంటారని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.

    ఇంతవరకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేతితో నేసే చేనేత (Handloom) లాంటిదైతే, ఇప్పుడు AI రూపంలో శక్తివంతమైన యంత్ర మగ్గాలు (Machine Looms) వచ్చేశాయని అన్నారు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద పెద్ద ప్రభావం చూపిస్తుంది. జోహో కూడా దీనికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను చీఫ్ సైంటిస్ట్‌గా ఉన్నందున ఈ మార్పులను ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని వెంబు వెల్లడించారు.

  • శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 604.72 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 83,576.24 వద్ద, నిఫ్టీ 193.55 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 25,683.30 వద్ద నిలిచాయి.

    ఆసోమ్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, యాషో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆకాష్ ఇన్ఫ్రా-ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎలెకాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రాజ్‌రతన్ గ్లోబల్ వైర్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, అహ్లాదా ఇంజనీర్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల్లో నిలిచాయి.

    Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • కొత్త ఏడాదిలో దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి.. రాశి కన్నా వాసికే ప్రాధాన్యమివ్వనున్నాయి. పేరుకి పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేసుకోవడం కాకుండా ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి. సిబ్బంది సంఖ్యను ఊరికే పెంచుకోవడం కన్నా ఆయా విభాగాల్లో సామర్థ్యాలున్న వారినే మరింతగా తీసుకోవాలని భావిస్తున్నాయి.

    ఉద్యోగాల కల్పన తీరుతెన్నులను ఈ ధోరణులు ప్రభావితం చేస్తాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో 1,800 జీసీసీలు ఉండగా, వాటిలో సుమారు 1.04 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే వారి జీతభత్యాలు 25–30 శాతం అధికంగా ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో 120 పైచిలుకు మధ్య స్థాయి జీసీసీలు ఏర్పాటవుతాయని టీమ్‌లీజ్‌ వర్గాలు తెలిపాయి. ఇవి కొత్తగా సుమారు 40,000 వరకు ఉద్యోగాలను కల్పించవచ్చని వివరించాయి. భారీ జీసీసీల్లో దాదాపు 90 శాతం సెంటర్లు ప్రస్తుతం ఇన్నోవేషన్‌ హబ్‌లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపాయి.

    కొత్త ఏడాదిలో ఐటీ హైరింగ్‌ అప్‌..
    కొత్త సంవత్సరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో మొత్తం మీద హైరింగ్‌ 12–15 శాతం పెరగవచ్చని ఐటీ స్టాఫింగ్‌ సంస్థ క్వెస్‌ కార్ప్‌ అంచనా వేస్తోంది. జీసీసీల్లో ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్‌ ప్లాట్‌ఫాంలకి డిమాండ్‌ నెలకొనడం ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, కొత్తగా రాబోయే వాటితో పాటు ఇప్పుడున్న జీసీసీలు కూడా విస్తరణ చేపట్టనున్నాయని ఏఎన్‌ఎస్‌ఆర్‌ అంచనా వేసింది. నూతన సంవత్సరంలో 80–110 కొత్త జీసీసీలు రావొచ్చని, 2,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపింది.

    పరిశ్రమ ఏటా 12–15 శాతం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆదాయాలు 75 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. జీసీసీల్లో నియామకాలకు సంబంధించి వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేసుకోవడానికి చేపట్టే హైరింగ్‌ వాటా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. 2025లో నికరంగా 1,50,000 మందిని తీసుకోగా, 2026లో మరో 2,00,000 మందిని తీసుకోవచ్చని వివరించారు. అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలసలు) 14–18 శాతం ఉంటోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జీసీసీల్లో స్థూల నియామకాలు 5,00,000 స్థాయికి చేరొచ్చని  వివరించారు.

    ద్వితీయ శ్రేణి నగరాలు కీలకం..
    జీసీసీ విస్తరణ ప్రణాళికల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 13–15 శాతం వాటా వీటిది ఉంటుందని భావిస్తున్నారు. దీనితో కొత్త నిపుణులు లభించడంతో పాటు వ్యయాలు మరీ పెరగకుండా చూసుకోవడానికి కూడా కంపెనీలకు వెసులుబాటు లభిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే 7 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా మార్కెట్లలో జాబ్‌ పోస్టింగ్స్‌ వార్షికంగా 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు 20–30 శాతం తక్కువగా ఉండటంతో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, మంగళూరులాంటి నగరాలు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయని వివరించారు.

  • అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్‌ వైటల్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్‌ లింక్డ్, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ప్లాన్‌. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్‌లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.

    పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.

    ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్‌ అష్యూర్డ్‌ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్‌ ఆధారంగా నిర్ణయిస్తారు.

    పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్‌ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్‌ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్‌ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.

  • జర్మనీ వాహన సంస్థ బీఎండబ్ల్యూ, మనదేశంలో గతేడాది రికార్డు స్థాయిలో కార్లు విక్రయించినట్లు తెలిపింది. 2025లో మొత్తం 18,001 కార్లను విక్రయించామని, ఇందులో 730 యూనిట్లు మినీ బ్రాండ్‌కు చెందినవని ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది(2024)15,723 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 14% అధికం.

    నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలు, సులభతర ఫైనాన్సింగ్‌ అంశాలు విక్రయాలకు దన్నుగా నిలిచాయని కంపెనీ తెలిపింది. దేశీయ లగ్జరీ ఎలక్ట్రిక్‌ విభాగంలో అత్యధిక వాటా కలిగిన ఈ సంస్థ గతేడాదిలో 3,573 ఈవీ కార్లను విక్రయించింది.

        గ్రూప్‌ మొత్తంగా 2025లో 23,842 వాహనాలను విక్రయించామని.. ఇందులో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్లు 18,001 ఉండగా, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ బైక్‌లు 5,841 ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్, బీఎండబ్ల్యూ మోటరాడ్‌ మూడు బ్రాండ్లలో కలిపి మొత్తం 20 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది.

        ‘‘మునుపెన్నడూ లేనంతగా 2025లో 18,001 కార్లను విక్రయించి రికార్డు సృష్టించాము. వార్షిక ప్రాతిదికన అమ్మకాలు 14% వృద్ధి నమోదు కావడం లగ్జరీ కార్లపై కస్టమర్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది’’ అని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్మదీప్‌ సింగ్‌ బర్‌ తెలిపారు.

  • దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంత మంది ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) నిబంధనలను గత త్రైమాసికాల్లో పాటించని వారికి వార్షికోత్సవ ఆధారిత పనితీరు శాలరీ అప్రైజల్స్‌ను నిలిపివేసినట్లు సమాచారం.

    దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్‌లో, ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్‌ పూర్తి చేసిన అనంతరం వార్షిక సైకిల్‌ ప్రకారం అప్రైజల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అలాగే సంస్థ అంతర్గత పోర్టల్ ‘అల్టిమాటిక్స్’లోనూ ఈ అప్‌డేట్‌ కనిపిస్తుంది.

    ఈమెయిల్‌లో ఏం చెప్పిందంటే..
    “మీ వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, Q2 FY26 (జూలై 2025 – సెప్టెంబర్ 2025) వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించకపోవడంతో కార్పొరేట్ స్థాయిలో తదుపరి ప్రాసెసింగ్ జరగలేదు. జనవరి 2025లో మీ వార్షికోత్సవం ఉన్నప్పటికీ Q3లోనూ WFO పాటించకపోతే, మీరు FY26 బ్యాండింగ్ సైకిల్‌కు అనర్హులవుతారు. పనితీరు బ్యాండ్ విడుదల చేయబడదు” అని ఓ ఉద్యోగికి పంపిన ఈమెయిల్‌లో టీసీఎస్‌ యాజమాన్యం పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది.

    ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తొలి ప్రధాన భారతీయ ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఇతర ఐటీ సంస్థలు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే కార్యాలయ హాజరును తప్పనిసరి చేస్తుండగా, టీసీఎస్ ఆఫీస్‌ హాజరును వేరియబుల్ పే, అప్రైజల్స్‌తో అనుసంధానించింది.

    టీసీఎస్‌లో వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదట కంపెనీ లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం సూపర్‌వైజర్ ఉద్యోగి గోల్ షీట్‌ను సిద్ధం చేస్తారు. సదరు ఉద్యోగి దానిని సమీక్షించి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రైజర్‌తో చర్చలు జరుగుతాయి. సంవత్సరంలో సాధించిన లక్ష్యాల ఆధారంగా పనితీరు మూల్యాంకనం నిర్వహించి, తుది బ్యాండింగ్ ఫలితాలను విడుదల చేస్తారు.

    కాగా 2022లో లేటరల్‌ నియామకాల (లాటరల్ హైర్స్) కోసం టీసీఎస్ చివరి వార్షికోత్సవ అప్రైజల్స్‌ను నిలిపివేసింది. ఇక గతేడాది టీసీఎస్ తన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మినహాయింపు విధానంలో మార్పులు చేసింది. భారతదేశంలోని ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం గరిష్టంగా ఆరు రోజుల వరకు మినహాయింపులు పొందవచ్చు. ఉపయోగించని రోజులను తదుపరి త్రైమాసికానికి మళ్లించుకునే అవకాశం లేదు.

    ఇది చదివారా? ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!

    కార్యాలయ స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్‌వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు మాత్రమే నివేదించవచ్చు. అయితే హాజరు మినహాయింపుల కోసం బల్క్ అప్‌లోడ్లు లేదా బ్యాకెండ్ ద్వారా సబ్‌మిట్‌ చేయడాన్ని కంపెనీ నిషేధించింది.

Family

  • ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. అత్యంత రద్దీగా ఉండే హైద‌రాబాద్‌ నగరం ఖాళీ అయిపోతుంది. ఉద్యోగాలు, చదువులు, జీవన పోరాటాలతో నగరంలో స్థిరపడిన లక్షలాది మంది రెండు తెలుగు రాష్ట్రాల గ్రామాల వైపు ప్రయాణం చేస్తారు. అంతటి విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయ, అస్థిత్వపు పండుగ సంక్రాంతి. బస్సులు, రైళ్లు నిండిపోతాయి.. రోడ్ల మీద ఊర్లకు వెళ్లే వాహనాల వరుసలు కనిపిస్తాయి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు.. ఇది మూలాలకు వెళ్లే భావోద్వేగ ప్రయాణం. కానీ ఈ అందమైన సంప్రదాయంలో అందరూ భాగస్వాములు కాలేకపోతున్నారు.

    పని ఒత్తిడి, సెలవుల లేమి, కుటుంబ పరిస్థితులు, గ్రామాల్లో బంధాలు సడలిపోవడం వంటి అనేక కారణాల వల్ల కొందరికి సంక్రాంతి ప్రయాణం (Sankranti Journey) కుదరక నగరంలోనే ఉండాల్సి వస్తోంది. అప్పుడు ఆ పండుగ వారికి సెలవు దినంలా మారిపోతుంది. సంబరాల్లేని సంక్రాంతిగా మిగిలిపోతుంది. ఇలాంటి వారికోసమే ఇప్పుడు సిటీలో కొత్త ట్రెండ్‌ మొదలైంది. అవే ‘రెడీమేడ్‌ సంక్రాంతి సంబరాలు’.  
    – సాక్షి, సిటీబ్యూరో

    ఈ వేడుకలకు నగరంలోనే కాదు, నగర శివార్లలోని ఫామ్‌ హౌస్‌లు, ప్రకృతి వనాలు, రిసార్ట్స్‌లు వేదికలుగా మారి పల్లెటూరి సంక్రాంతిని అచ్చంగా మళ్లీ సృష్టిస్తున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ముగ్గుల పోటీలు, పిండి వంటల రుచి, భోగి మంటల (Bogi Manta) వేడి, పతంగుల సందడి అన్నీ ఒకేచోట. పల్లెల్లో కనిపించే ఆ సౌందర్యాన్ని, ఆ సువాసనను నగరవాసులకు దగ్గర చేస్తున్నాయి ఈ ఈవెంట్స్‌.

    ఎక్స్‌పీరియన్స్‌ ఈవెంట్స్‌.. 
    ఇవి కేవలం సంప్రదాయాలను చూపించే కార్యక్రమాలే కాదు. నగర జీవనానికి (City Life) అవసరమైన ఓ భావోద్వేగ విశ్రాంతి కేంద్రాలు కూడా. రోజంతా ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే ఐటీ ఉద్యోగులకు, చిన్నపిల్లలతో ఇంటికే పరిమితమయ్యే కుటుంబాలకు, ఒంటరిగా ఉండే యువతకు ఈ సంబరాలు ఒక రకంగా మానసిక రిలీఫ్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ వేడుకల్లో తరం మారుతున్న సంక్రాంతి సంస్కృతి స్పష్టంగా కనిపిస్తోంది.

    ఒకప్పుడు పండుగ అంటే ఊరు, పొలం, చెరువు, తాతమ్మల ఇల్లు. ఇప్పుడు అదే భావనను నగర పరిసరాల్లో ‘ఎక్స్‌పీరియెన్స్‌ ఈవెంట్స్‌’ రూపంలో ఆస్వాదిస్తున్నారు యువత. ఎడ్లబండ్ల దగ్గర ఫొటోలు, ముగ్గుల ముందు రీల్స్, భోగి మంటల చుట్టూ సెల్ఫీలు (Selfies) ఇవన్నీ సోషల్‌ మీడియా యుగంలో సంక్రాంతికి కొత్త గుర్తింపునిస్తున్నాయి.

    సిటీలో సాంస్కృతిక పునరుజ్జీవనం..  
    మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సంబరాలు కేవలం వెళ్లలేని వారి కోసమే కాదు, వెళ్లదలుచుకోని వారి కోసమూ మారుతున్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు ‘‘ఇంత దూరం ప్రయాణం చేసి అలసిపోవడం కంటే, పిల్లలతో ఇక్కడే ప్రశాంతంగా పండుగ జరుపుకోవడం బెటర్‌ అని భావిస్తున్నారు. వారికి అవసరమైన ఆహారం, వినోదం, సంప్రదాయం.. అన్నీ ఒకేచోట దొరుకుతున్నాయి. ఈ ఈవెంట్స్‌లో ఇంకో ప్రత్యేకత సాంస్కృతిక పునరుజ్జీవనం. గ్రామాల్లో తగ్గిపోతున్న కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు నగరంలో కొత్త ఊపిరి తీసుకుంటున్నాయి. హరిదాసుల బృందాలు, గంగిరెద్దుల కళాకారులు, జానపద గాయకులు వీరందరికీ ఈ సంబరాలు ఒక కొత్త వేదికగా మారుతున్నాయి. కళకు గౌరవం, కళాకారులకు ఆదాయం.. రెండూ కలిసి వస్తున్నాయి.

    సాంస్కృతిక రూపాంతరం.. 
    ఈ సంక్రాంతి ఈవెంట్స్‌ ఒక ఫ్యామిలీ బాండింగ్‌ స్పేస్‌గా కూడా మారాయి. చిన్నపిల్లలు పల్లెటూరి ఆటలను తొలిసారి చూస్తున్నారు. తల్లిదండ్రులు తమ బాల్యంలోని జ్ఞాపకాలను మళ్లీ జీవిస్తున్నారు. తాతమ్మలు, నానమ్మలు పిల్లలకు సంప్రదాయాల కథలు చెబుతున్నారు. ఈ మూడు తరాల కలయికే ఈ సంబరాల అసలైన అందం. ఎంట్రీకి రుసుము తీసుకుంటున్నారు. కానీ అనివార్య కారణాలతో దూరమయ్యే పండుగను మళ్లీ దగ్గర చేసుకునే అవకాశం దొరికితే, అది ఖర్చు కాదు.. ఒక అనుభవంలో పెట్టుబడి.

    చ‌ద‌వండి: పండక్కి ఊరెళుతున్నారా.. ఇలా చేయండి..

    ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రోజుల్లో సంక్రాంతి కేవలం గ్రామాల్లోనే కాదు.. నగరంలో కూడా పల్లెటూరి హృదయంతో పండువగా మారుతోంది. పల్లెను మరిచిపోయిన నగరవాసులకు, నగరంలోనే పల్లెను పరిచయం చేస్తున్నాయి ఈ రెడీమేడ్‌ సంక్రాంతి సంబరాలు. ఇది ట్రెండ్‌ మాత్రమే కాదు.. మారుతున్న జీవనశైలికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న సంప్రదాయం. 

  • చాలామంది పండక్కి ఊరు వెళుతుంటారుగానీ, ఇలా వెళ్లి అలా తిరిగి వస్తుంటారు. ఈసారి మీరు పండక్కి వెళుతున్నట్లయితే అలా చేయకండి... ఇలా చేయండి...

    హైస్కూల్‌లో మీతో చదివిన వారు ఎక్కడెక్కడో ఉండి ఉంటారు. అయితే వారిలో కొందరైనా ఊళ్లో ఉంటారు. వారిని కచ్చితంగా కలుసుకొని మాట్లాడండి. ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లండి

    మీకు చదువు చెప్పిన మాస్టర్లను తప్పనిసరిగా కలుసుకోండి. యోగక్షేమాలు కనుక్కోండి

    చాలామంది హైస్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ విషయాలను, నిన్న మొన్నటి విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి వాట్సాప్‌ గ్రూప్‌ లేకపోతే అర్జంటుగా ఏర్పాటు చేసుకోండి

    ‘స్నేహాలు ఆ సమయానికే’ అన్నట్లుగా ఉంది ఈనాటి ఉరుకుపరుగుల జీవితం. దీని నుంచి బయట పడాలంటే పాత స్నేహాల జాడలను వెదుక్కుంటూ తిరిగి వెళ్లాల్సిందే!

    చ‌ద‌వండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం

  • 'ఏంటీ ఇంత రెంటా' అని అవాక్క‌య్యారా?. అవును మీరు చ‌దివింది నిజ‌మే. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ ఒక్క నెల కిరాయి అక్ష‌రాలా 8 ల‌క్ష‌ల రూపాయ‌లు. మామూలుగా సిటీలో సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ నెల అద్దె 10 వేల రూపాయ‌ల‌ వ‌ర‌కు ఉండొచ్చు. ప్రైమ్ ఏరియా అయితే ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. మ‌రీ 8 ల‌క్ష‌లంటే చాలా చాలా ఎక్కువ క‌దా! ఈ వార్త గురించి తెలిసిన వారంతా ఇలాగే ఫీల‌వుతున్నారు. ఇంత‌కీ ఈ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ ఎక్క‌డ‌నేగా మీ డౌటు? ఇంకెందుకు ఆల‌స్యం తెలుసుకుందాం రండి.

    దీపాంషి చౌదరి అనే మ‌హిళ షేర్ చేసిన 1 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ (1BHK Flat) హోం టూర్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ (Viral) అయింది. అన్ని స‌దుపాయాల‌తో కూడిన సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్‌ను ఆమె త‌న వీడియోలో చూపింది. లాబీ, లివింగ్‌రూం, వాష్‌రూం, బెడ్‌రూం, కిచెన్‌తో చూడ‌టానికి ఫ్లాట్ మామూలుగానే ఉంది. కానీ ఏకంగా 8 ల‌క్ష‌లు అద్దె అంటేనే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. అయితే అపార్ట్‌మెంట్ ఉన్న ఏరియాను బ‌ట్టి చూస్తే అంత అద్దె క‌రెక్ట్ అంటున్నారు దీపాంషి చౌదరి.

    తాను చూపించిన ఫ్లాట్‌ సెంట్రల్ లండన్‌లో (Central London) ఉంద‌ని ఆమె వెల్ల‌డించారు. ఈ ఫ్లాట్‌లోంచి ప్ర‌ఖ్యాత సెయింట్ పాల్స్ కేథడ్రల్ చ‌ర్చిని ప్ర‌త్య‌క్షంగా చూడొచ్చ‌ని చెప్పారు. క్రిస్మస్ సీజన్‌లో నెల రోజులకు మాత్ర‌మే బుక్ చేసుకున్నందున అద్దె ఎక్కువ అని వివ‌రించారు. “అవును, అద్దె చాలా ఎక్కువగా ఉంది. కానీ లోకేష‌న్‌ను బట్టి చూస్తే కిరాయి విలువ క‌రెక్టేన‌ని అనిపిస్తుంద‌ని అన్నారామె. ఈ వీడియో చూసిన వారంతా “ఇది చాలా ఎక్కువ” అంటున్నారు. “లండన్‌లో చాలా మంది ఇంత అద్దె భరించలేరు. ఇంత ఖ‌రీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారంటే.. మీరు ఏం ఉద్యోగం చేస్తార”ని ఒక నెటిజ‌న్ ప్ర‌శ్నించారు.

    చ‌ద‌వండి: మ‌న‌కు 2026.. వారికి 2018!

    హాంప్‌స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండంతస్తుల ఇళ్లు నెలకు 2 నుంచి 3 వేల ఫౌండ్ల‌ (సుమారు 3 ల‌క్ష‌లు) కిరాయికి అందుబాటులో ఉన్నాయని కొంత‌మంది తెలిపారు. లండ‌న్‌లో డ‌బుల్‌  బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు 4 నుంచి 5 వేల ఫౌండ్ల అద్దెకు దొరుకుతాయని కూడా వెల్ల‌డించారు. తాను ఉంటున్నత్రిబుల్ బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌కు నెలకు 3,200 ఫౌండ్లు చెల్లిస్తామని లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ప్రాంతంలో ఉంటున్న నెటిజ‌న్ ఒక‌రు తెలిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ సెంట్రల్ లైన్‌కు కేవలం 10-15 నిమిషాల దూరంలో ఈ ఫ్లాట్‌ ఉందన్నారు. 

     

  • చీరకట్టు ఆత్మవిశ్వాసానికి, హుందాతనానికి ప్రతీకగా చూపుతూ సెలబ్రిటీలు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు. కార్పొరేట్‌ ఉద్యోగమైనా పార్టీలో ప్రత్యేకత కోరుకున్నాచీరకట్టుకు బిగ్‌ బెల్ట్‌ జత చేసి బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. తమదైన మార్క్‌ను పవర్‌ఫుల్‌గా చూపుతున్నారు. 

    ఇటీవల అంబానీ కుటుంబ సభ్యుల నివాసంలో జరిగిన ఓ వేడుకలో క్రికెట్‌ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ వేడుకలో డిజైనర్లు శంతను అండ్‌ నిఖిల్‌ చేసిన కస్టమైజ్‌డ్‌ శారీ డ్రేప్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కొత్తగా మెరిశారు. చీర కట్టు కూడా ఆమెనో క్రీడాకారిణిగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చూపుతోందా అనిపించేలా ఉంది. 

    నారింజ, నలుపు రంగు కాంబినేషన్‌లో గల చీరను ఫిటెడ్, హైనెక్‌ మోడర్న్‌ బ్లౌజ్‌తో స్టైల్‌ చేసింది. నల్లని కార్సెట్‌ బెల్ట్‌తో లుక్‌ని శక్తిమంతంగా మార్చింది. జుట్టును బన్‌గా సెట్‌ చేసి, ఆభరణాలను తక్కువగా ధరించి లుక్‌ను పూర్తి చేసింది. ఈ లుక్‌ ఆధునిక పవర్‌ డ్రెస్సింగ్‌లో ఒక మాస్టర్‌ పీస్‌ అని చెప్పొచ్చు.  

    (చదవండి: అందానికే అందం ప్రియాంక చోప్రా బ్యూటీటిప్స్‌..!)

  • బాలీవుడ్‌ ప్రముఖ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని గ్లోబల్‌స్టార్‌గా వెలుగొందుతోందామె. ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె సరదా ఫన్నీ విషయాలు, బ్యూటీ అండ్‌ ఫిట్‌నెస్‌ టిప్స్‌ని తన అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారామె. అలానే ఈసారి ఓ చక్కటి బ్యూటీ టిప్‌తో మన ముందుకు వచ్చారు. ఏజ్‌ పెరిగే కొద్ది ముఖంపై ఏర్పడి రంధ్రాలను టైట్‌ చేసేలా ముఖం అందాన్ని కాపాడుకోవడటం ఎలాగో షేర్‌ చేశారామె. మరి ఆ అద్భుతమైన సౌందర్య చిట్కా ఏంటో చూద్దామా..!.

    ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్‌, అందానికి కేరాఫ్‌ అడ్రస్‌గా పేరుగాంచిన ప్రియంకా చోప్రా రెడ్‌కార్పెట్‌ ప్రదర్శనలో అయినా, మ్యాగ్జైన్‌ కవర్‌పైన సాధారణ సెల్ఫీలు అయినా..స్టన్నింగ్‌ లుక్‌తో మెరిపోతుంటుంది. చర్మ సంరక్షణ విషయంలో చాలా కేర్‌గా ఉంటుందామె. మేకప్‌ కంటే నేచురల్‌ అందానికే ప్రాధాన్యత ఇచ్చే ప్రియాంక చాలా సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలనే అనుసరిస్తుందామె. తాజాగా షేర్‌ చేసని టిప్‌ ఏంటంటే..

    చర్మంపై ఉండే రంధ్రాలు పెద్దగా కనిపంచకుండా..ముఖం వాపుని తగ్గించే చక్కటి కోల్డ్‌ ఫేషియల్‌ని పరిచయం చేస్తుంది. ఇది అందరికీ తెలిసందే గానీ ఆమె ఓ ప్రత్యేకమైన డివైజ్‌తో చాలా సులభంగా చేసుకోవచ్చంటూ సరికొత్తగా చూపించారామె. నిజానికి చల్లటి నీటిలో ముఖం డిప్‌ చేయడం కాస్త ఇబ్బందికరంగానూ..శ్వాసకు సంబంధించి ఊపిరాడనట్లుగా కూడా ఉంటుంది. అదే ప్రియంక షేర్‌ చేసిన వీడియోలో బీతింగ్‌ అటాట్‌మెంట్‌తో ఉన్న ఐస్‌ వాటర్‌ డింకింగ్‌ చక్కటి సౌకర్యవంతమైన శ్వాసకు అనుమతిస్తుంది. 

    ముఖం పూర్తిగా మునిగిపోయేలా కొద్దిసేపు ఉంచగలుగుతాం. ఈ ఫేస్‌టబ్‌ కోల్డ్‌ఫ్లంజ్‌ అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి రూపొందించిన ప్రత్యేక సాధనం. కోల్డ్‌ ఫేషియల్‌గా ఇది అద్భుతమైన డివైజ్‌గా చెప్పొచ్చు. అలాగే ఇలా చేయడం వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మంతా రక్తప్రసరణ జరుగుతుంది. ముఖం తాజాగా గ్లో గా ఉంటుందని సెలబ్రిటీలు తప్పకుండా పాటించే టిప్‌ ఇంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

    (చదవండి: వలస వచ్చి.. ప్రేమ ‘నరకం’లో పడి.. ఇప్పుడు ‘కరోడ్‌పతి’గా..)

     

  • బాల్యం అంత బాధలమయం, చెప్పుకోదగ్గ సంతోషభరిత విషయాలేం లేవు. పోనీ వైవాహిక బంధమైన బాగుంటుందా అనుకుంటే..అది కూడా వెక్కింరించింది. ఏం పాలుపోలేని స్థితిలో నేనున్నానంటూ అక్కున్న చేర్చుకున్న ప్రేమ బంధం నరకాన్ని చవిచూపించి..తేరుకునేలోపే చేతిలో బిడ్డను పెట్టేసింది. నా వల్ల కాదంటూ పసికందుతో దేశం కానీ దేశంలో వలసదారిగా బిక్కు బిక్కుమంటూ కారునే నివాసంగా చేసుకుని గడిపింది. లోలోన.. ఏదో కసి, ఏదో బాధ..అదే ఆమెను మొండి ధైర్యంతో ముందుకు నడిపించి.. ఏకంగా 9 కోట్ల కంపెనీని రన్‌చేసే రేంజ్‌కి తీసుకొచ్చింది. దురదృష్టవంతురాలివి అని పదే పదే అంటున్న అంతరాత్మ మాటల్ని బేఖాతారు చేస్తూ తన సక్సెస్‌తో అదృష్టవంతురాలిని అని నిరూపించుకుని అందరిచేత శెభాష్‌ అనిపించుకుంది. ఎమరామె..? ఏమా కథ..

    అసామాన్య ధీరురాలు వియాత్నంకి చెందిన జియా హుయిన్. ఆమె కడు దయనీయమైన స్థితిని నుంచి కోట్లకు పడగలెత్తే రేంజ్‌కు చేరుకున్న తన ప్రస్థానం గురించి ఓ ఇంటర్వూ​లో ఆమెనే స్వయంగా వెల్లడించారు. 20 ఏళ్ల ప్రాయంలో అమెరికాకు వచ్చానని, వారానికి ఏడు రోజులు పాటు ఉదయ నుంచి రాత్రి వరకు దాదాపు 14 గంటల పాటు ఒక నెయిల్‌ సెలూన్‌లో పనిచేనినట్లు తెలిపింది. 

    అమెరికాలో నిరాశ్రయురాలైన వలసదారిగా చేతిలో బిడ్డతో ఆ సెలూన్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని అని బాధగా చెప్పింది. ఇక తన బాల్యం అంతా కష్టాలు, వేధింపులేనని వేదనగా చెప్పుకొచ్చింది. తన తండ్రి వెదురు కలప నరికి అమ్మడానికి అడవిలోకి వెళ్లేవాడని, నిజంగా ఎప్పుడొస్తారో తెలిసేది కాదని చెప్పుకొచ్చింది. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు, అమ్మ మాకు తిండి పెట్టడానికి తన వల్ల అయ్యే ప్రతి పనిచేసేదని చెప్పుకొచ్చారు. 

    తన బాల్యం చాలా బాధలమయం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టీనేజ్‌ వయసుకే పెళ్లి చేసుకుని 2016లో వియత్నాం నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాం, దాంతో తాను కూడా చేతనైనిది చేస్తూ సంపాదించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే అదంతా తమ కుటుంబం అవసరాలకు అక్కరకు వచ్చేది కాదని నాటి సంఘటనలను గుర్తు చేసుకుందామె. 

    ఇక తన భర్త తనకు విడాకులు ఇచ్చేయడంతో రోడ్డుపై పడిపోయానని, అప్పుడే ఒకవ్యక్తి అక్కున చేరుకుంటానంటూ ప్రేమను చూపిస్తే పిచ్చిదానిలా నమ్మేశానని బావురమంది. తీరా అతడి వద్దకు వెళ్లాక నరకం అంటే తెలిసిందని వాపోయింది. నిజంగా ఆ రిలేషన్‌ ఒక నరకకూపం అని బాధగా చెప్పిందామె. ఆ వ్యక్తితో తనకు కొడుకు పుట్టగానే..ఐదువారాల శిశువుని తీసుకుని బయటకు వచ్చేసి నిరాశ్రయురాలైన వలసదారిగా మళ్లీ రోడ్డునపడ్డానంటూ గద్గద హృదయంతో చెప్పుకొచ్చింది నాడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని. 

    తాను కొనుకున్న కారునే నివాసంగా చేసుకుని కొడుకుతో కలిసి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తన సోదరి నెయిల్ సెలూన్‌లో ఉద్యోగంలో చేరి..మంచి జీవితాన్ని సృష్టించుకోవాలని తపన పడినట్లు చెప్పుకొచ్చింది. 

    ఈ రేంజ్‌కి ఎలా చేరుకుందంటే..
    నెయిల్ సెలూన్‌లో ఉద్యోగం చేస్తూనే, తన కొడుకును చూసుకుంటూ, జియా వివిధ వ్యాపార ఆలోచనలతో ప్రయోగాలు చేస్తూనే ఉండేది. ప్రారంభంలో వైఫల్యాలు ఎదురైనప్పటికీ, తన క్రిస్టల్ క్యాండీల వ్యాపార ఆలోచన మాత్రం విజయవంతమైంది. అలా రూ. కోట్లు టర్నోవర్‌ చేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఈ క్యాండీ గురించి ఆమెకు ఎలా తెలిసిందటే..సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంది. అయితే ఈ క్యాండీ తన చిన్నప్పుడు నానమ్మతో కలిసి ఇంట్లో తయారు చేసిందే కావడంతో..దీన్నే మళ్లీ పిల్లలకు పరిచయం చేయాలనుకుంది. 

    దాంతో దాని తయారీపై రకరకాలుగా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. అందుకోసం రూ. 40 వేలు ఖర్చు చేసి..మరి ప్రయోగాలు చేసిది. అంతేగాదు ఈ వంట ప్రయోగాలను నెయిల్‌ సెలూన్‌ నుంచి తిరిగి వచ్చి..బిడ్డను నిద్రపుచ్చాక చేస్తుండేది. మొదటి మూడు నెలలు చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత రానురాను వ్యాపారం పుంజుకోవడం లాభాలు అందుకోవడం మొదలైంది. అలా ఇవాళ ఏకంగా రూ. 9 కోట్లు టర్నోవర్‌ చేసే క్రిస్టల్‌ క్యాండీ కంపెనీని రన్‌ చేసే స్థాయికి చేరుకోగలిగానని అంటోంది. 

    ఈ విజయంతో అప్పటి వరకు తనపై తనకు ఉన్న అభిప్రాయం నిజంగా మారిందని అంటోంది. ఎందుకంటే తాను చూసిన కష్టాలు, అనుభవించిన బాధలకు తనంత పనికిమాలినిది, నిరుపయోగమైనది మరొకరు ఉండరనే భావన బలంగా ఉండేదట ఆమెకు. కనీసం తన వద్ద స్కిల్స్‌ లేవు, చదువు లేదు..కేవలం తన కష్టాలే తనలోని సామర్థ్యాన్ని తట్టిలేపి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటోంది జియా. 

    ఐదో తరగతి కూడా చదవని తానే సాధించగలిగానంటే..బాగా చదువుకున్న యువత ఇంకెంత సాధించాలి అని అడుగుతోందామె. అంతేగాదు మన వద్ద చదువు, నైపుణ్యం లేకపోయినా..మనసుపెట్టి నేర్చుకుంటే..ఏదైనా ఇట్టే నేర్చుకుని సక్సెస్‌ అందుకోగలమని చెబుతోంది జియా.

    (చదవండి: రెస్టారెంట్‌ మేనేజర్‌గా ఇస్రో శాస్త్రవేత్త..! సరదా సంభాషణ..)

     

     

Politics

  • కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోరించారు. ఇదే సమ​యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు మమత వార్నింగ్‌ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అమిత్‌ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    బెంగాల్‌లో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చ్‌లో పాల్గొన్నారు. హజ్రాలో మార్చ్ ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ మేల్కొంది, ప్రజల మద్దతు లభిస్తోంది. కార్యకర్తలే దగ్గరుండి ఆందోళనలను నడిపించారు. గతంలో ఇలాంటి ఘటనలు చూశాం. రక్తం వచ్చేలా లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ హజ్రాలోనే నేను కూడా దెబ్బలు తిన్నాను. నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను, శరీరమంతా గాయాలతోనే పని చేశాను. నన్ను ఎవరైనా కొట్టిన రోజున నేను పునర్జన్మ పొందుతాను. 

    నాపై, నా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకండి. నేను ఏం చేస్తానో మీకు తెలుసు. మేము చేస్తే చాలా చేయగలం. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బు అమిత్ షా తింటారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది. దేశద్రోహుల ద్వారా ఆ డబ్బు వెళుతుంది. బీజేపీకి చెందిన జగన్నాథ్ బొగ్గు స్కాంలో  ఉన్నారు. జగన్నాథ్ ద్వారా బీజేపీ సువేందు అధికారి నుంచి డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది. నా దగ్గర అన్ని పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి, అన్నీ బయటపెడతాను. నేను చేపట్టిన పదవికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. నాపై మరీ ఎక్కువ ఒత్తిడి తేకండి' అని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.

    అంతటితో ఆగకుండా..‘ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడిన పులి ప్రమాదకరం. దేశ డబ్బును బయటకు తీసుకెళ్లారు, కానీ గ్రామస్తులకు డబ్బు ఇవ్వలేదు. నా డబ్బు నాకు ఇవ్వండి, ఇది పశ్చిమ బెంగాల్ డబ్బు. నాలుగు సంవత్సరాలుగా ఆవాస్, నీరు, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఒకరిని ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి కేంద్ర హోంమంత్రి కింద పనిచేశారు. ఢిల్లీలో మా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు, పోలీసులు వారిని తీసుకెళ్లారు. అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లను బలవంతంగా ఆక్రమించారు, ఇప్పుడు బెంగాల్‌ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పేరును భరించలేకపోతున్నారు, బెంగాల్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లో కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హిందీ మాట్లాడే వారిపై దాడి జరగలేదు, మేము ఎప్పుడూ చేయలేదు. మేము ఈ బీజేపీకి మర్యాద ఇస్తున్నాము, లేకపోతే చేతల్లో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

    ఈడీపై ఆగ్రహం.. 
    ఈడీని ఉద్దేశించి.. ‘మా పార్టీ పత్రాలను, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను’ అని మమత తెలిపారు. అయితే, చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది. అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
     

  • సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. అందుకే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

    పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉంది. ఒక్క పాసు పుస్తకం ఇవ్వటానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లారు. రాయవరంలో పాస్‌ పుస్తకాల పంపిణీ పేరిట చంద్రబాబు హంగామా చేశారు. కానీ, చివరకు ఏమైంది.. పరాభవం ఎదురైంది. పాస్‌ బుక్‌లు ఇవ్వలేదని స్వయంగా సీఎంకే రైతులు చెప్పారు. అయినా కూడా వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌లు జగన్‌ కోటి రాస్తూ.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అందుకే వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. 

    చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారు. రైతులను జగన్ ఏం ఇబ్బంది పెట్టారు?. 2018లో చంద్రబాబు కొత్త నిబంధనలు తెచ్చారు. 22(A)లో భూముల్ని పెట్టి రైతులని ఇబ్బంది పెట్టారు. చుక్కల భూమిని సైతం 22Aలో చంద్రబాబు పెట్టారు. ఆయన హయాంలోనే రైతులకు ఇబ్బందుల ఎదురయ్యాయి. జగన్ ఒక్కరి భూమిని కూడా అలా పెట్టలేదు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధం అని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతులంతా చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. వాటిని జగన్ పరిష్కరిస్తే ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు‌ను ఏం అనాలో తెలుగులో పదాలు దొరకటం లేదని అన్నారాయన. 

    జగన్ వచ్చాక జేసీతో పనిలేకుండా త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా చేశారు. చంద్రబాబు హయాంలోనే భూ రికార్డుల్లో చాలా అక్రమాలు జరిగాయి. ఆయన చెప్పే మాటలకు ఆయనకే నమ్మకం ఉండదు. బంధువులతో గొడవలు పెట్టుకో వద్దని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఎన్టీఆర్ దగ్గర్నుంచి జూ.ఎన్టీఆర్ వరకు అందరితో గొడవలు పెట్టుకున్నదే చంద్రబాబు. కుటుంబ సభ్యులతో ఆయనకే తగాదాలు ఉన్నాయి. ఎన్డీఆర్‌ ఆస్తుల్ని లాక్కున్నది ఎవరు?. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ భూములు తీసుకున్నది ఎవరో చెప్పాలి?. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఆయన ఇల్లు, బ్యాంకు అకౌంటను లాగేసుకున్నది ఎవరు?. క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది?.. అంటూ పేర్ని నాని మండిపడ్డారు. 

    వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన భూసర్వే ఒక చరిత్ర. కొలతలతో సహా పొలం మ్యాప్‌ను కూడా జగనే తెచ్చారు. జగన్‌ చేపట్టిన భూ సర్వేనే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాస్‌ బుక్కులపై క్యూఆర్‌ కోడ్‌ సిస్టమ్‌ తీసుకొచ్చిందే వైఎస్‌ జగన్‌. దానిని కూడా కూటమి కొనసాగిస్తోంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక.. భూ సర్వేలు, పాస్‌ బుక్కుల విషయంలో ఏం మార్పులు చేశారో చెప్పాలి. ఈ విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. పాసు పుస్తకాల ప్రింటింగ్‌లో కూడా కూటమి నేతలు కక్కుర్తి పడి కమీషన్లు తీసుకుంటున్నారు. పాస్ పుస్తకం మీద ఫోటో వేసుకుంటే నేరమా?. పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ తొలగించటం తప్ప చంద్రబాబు ఏం చేశారు?. అనేక ప్రభుత్వ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఫొటోలు పెట్టారు కదా.  

    చంద్రబాబు ఆరు అడుగుల గురివింద గింజ. 18 నెలలకే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు. రేపు వేసవి కాలానికే మా వైఎస్సార్‌సీపీ హయాంనాటి అప్పుల్ని దాటి పోతారు. త్రిబుల్‌​ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రానికి ఏం ఒరిగిందో చెప్పాలి?. పూర్తి కాని పోలవరం దగ్గర జయం జయం చంద్రన్నా అంటూ ఎందుకు భజన చేయించారు?. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు మిగిలాయి. కూటమి నేతలు రికార్డు స్థాయిలో అప్పులు చేశామని సంబురాలు చేసుకోవచ్చు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

    👉నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజి కి నీళ్లు రాకపోతే కృష్ణాడెల్టా ఏం కావాలి?. మా హక్కులను కాలరాయటానికి చంద్రబాబు ఎవరు?. తన స్వార్ధానికి పొరుగు రాష్ట్రానికి మా హక్కులు కాలరాస్తారా?. ముచ్చుమర్రిలో 0.33tmc ల నీటితో కుప్పం వరకు నీళ్లు ఎలా వెళ్తాయి?. రాయలసీమకు లిఫ్టు అవసరం లేదంటూ చంద్రబాబు పాపం మూట కట్టుకుంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు విద్వేషం

    👉2018 నాటికే పోలవరం పూర్తి చేస్తానన అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించటం లేదు. పోలవరం పూర్తి చేయలేని వారు నల్లమల సాగర్ ఎలా పూర్తి చేస్తారు?. ఈ ప్రాజెక్టు చేయటానికి లక్ష కోట్లు కావాలి. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలి. ఈ సొమ్మంతా ఎక్కడినుండి తెస్తారు?. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ వెళ్తే చంద్రబాబు రచ్చ చేశారు. అలా ఎలా వెళ్తారనీ.. తెలంగాణతో గొడవ పడాలని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే చంద్రబాబు నీతులు ఎలా చెప్తారు?. రాజధానిలో వెయ్యి కోట్లతో లిఫ్టులు కడతారా?. ఆ ఖర్చు చేస్తే రాయలసీమ ఎత్తిపోతల పూర్తవుతుంది కదా

    రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

    రాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలి. ఆ‌ తర్వాత రెండో విడత గురించి మాట్లాడాలి. సీఎంగా ఉన్న చంద్రబాబుకు వారం వారం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించమని జగన్ కోరారు. అమరావతి మీద జగన్ కు మమకారం లేకపోతే ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారు?. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదు. లింగమనేని రమేష్ ఇంటిలో ఎందుకు ఉంటున్నారు?

    ఏపీలో కులం, మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్. ఆయన్ని జనం కాపు కాయాలంట. ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంట. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలి?. దళితులను వెలి వేస్తుంటే ఎవరు కాపు కాయాలి? అని పేర్ని నాని ఫైర్‌ అయ్యారు.

  • సాక్షి, హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన.. అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

    మరో వైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైఎస్‌ జగన్‌కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు.

    అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైఎస్‌ జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్‌ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

    తప్పును సరిదిద్దుకోని చంద్రబాబు..
    కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము  చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు  అత్యంత దుర్మార్గం.

    ఈ తరహా వార్తలు రాసే వారు ముందు పూర్తిగా అవగాహన కలిగించుకుని.. జరుగుతున్న నష్టాన్ని తెలియజేయాలే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని కనీసం అంచనా వేయడం లేదు. కేవలం వైయస్సార్సీపీ, వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పుదోవ పట్డిస్తూ అసత్యాలు ప్రచురించడం శ్రేయస్కరం కాదు.

    మచ్చుమర్రి సహా ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌ చలువే..
    మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కింద స్థాయిలో నీళ్లు తోడేస్తున్న నేపథ్యంలో.. 834 అడుగులకి  చేరడం కష్టం అవుతుంది కాబట్టి.. దివంగత నేత డాక్టర్ వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డే కేసీ కెనాల్‌కు, హంద్రీనీవాకు వేసవిలోనే, తాగునీరు  ఇచ్చేందుకు మచ్చుమర్రికి జీవో ఇచ్చారు. మచ్చుమర్రి పనులు ప్రారంభమైన తర్వాత  అందులో నాలుగు పంపులుకే సీ కెనాల్‌కు, మిగిలిన పంపులు హంద్రీ నీవా ద్వారా జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.

    అవేవీ తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి  క్యూసెక్కులుకు, టీఏసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. 790 అడుగుల్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు 0.31 టీఎంసీ సామర్ధ్యం అంటే దాదాపు 3వేల క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది. దాన్ని 3 టీఎంసీలు అని మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచురించారు. దాదాపు 33 వేల క్యూసెక్కులు వస్తే తప్ప... 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు, అది కూడా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం ముచ్చుమర్రి ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండూ సేమ్ అన్నట్టు వార్తలు రాశారు.

    సీమకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం..
    చంద్రబాబుకి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంతగా... అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ఆయన ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆయను రాలేదు.  మల్లెల, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పోతిరెడ్డుపాడు, ముచ్చుమర్రి, గండికోడ, తెలుగుగంగ ముందుకు తీసుకెళ్లే యోచన, హంద్రీనీవా చేపట్టే ఆలోచన కానీ, చివరకు పోలవరాన్ని చేయాలన్న తలపు కూడా మీకు లేదు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్టులు, నెల్లూరుకు చెందిన సోమశిల, నెల్లూరు బ్యారేజీ ఈ ప్రాజెక్టులు వేటి మీద మీరు ఆలోచన చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి,కొత్త రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసానని చెప్పుకోవడానికి తప్ప... రాయలసీమకు, రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదు.

    అన్ని ప్రాంతాలు బాగుండాలన్న తపనతోనే..
    మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు సమానమని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు 825 అడుగులులోపే 8 టీఎంసీలు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి... రాయలసీమలో కూడా వ్యవసాయానికి మేలు చేస్తూ.. స్టెబిలైజ్ చేయడానికి వాళ్లతో పాటు మనకూ సమాన అవకాశం ఉంటే భవిష్యత్తులో కలిసి నీటిని పంచుకునే ఆవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. మీరు మాత్రం ఆ ప్రాజెక్టును బలహీనపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ ను అర్ఱం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

    ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరగకూడదనే..
    శ్రీశైలం రిజర్వాయర్ పుల్ లెవల్ కి రావాలంటే ఎన్ని క్యూసెక్కులు నీళ్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా నీళ్లు  రాని పరిస్ధితులలో ఎగువనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి ఎస్ ఎల్ బీ సీ, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తెలంగాణా 820 అడుగులు లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మరీ అన్యాయంగా 780 వరకు పవర్ జనరేషన్ కోసం 4 టీఎంసీలు రోజూ కిందకు వదిలేస్తున్నారు.

    ఇవన్నీ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నీటి ప్రవాహం తక్కువగా 70వేలు, 80 వేలు క్యూసెక్కులు వచ్చినప్పుడు ఒకేసారి వాళ్లు 8 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మనకు అదే లెవల్ లో 3 టీఎంసీలు కెపాసిటీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంతిమంగా అన్ని ప్రాంతాలు బాగుంటాయి. కానీ చంద్రబాబు గారూ మీకు ఆ ఆలోచన లేదు.

    పోలవరాన్నీ నిర్వీర్యం చేసిన చంద్రబాబు..
    ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో వైయస్సార్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారు.  రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా  మీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం కట్టకుండా అడ్డుకుని బలవంతంగా లాక్కుని ప్రాజెక్టుని అవినీతి మయం చేశారు.
    కాపర్ డ్యామ్ మందు కట్టి.. నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే  నాణ్యతతో వచ్చేది. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టడంతో కాపర్ డ్యాంలో నీళ్లు ప్లో అరికట్టలేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పోలవరం ఆలస్యమయ్యేలా చేసింది మీరు కాదా చంద్రబాబూ?

    దివంగత నేత వైయస్సార్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆ తర్వాత వైయస్.జగన్ హయాంలో ప్రాజెక్టు నిధులు, ఆర్ అండ్ ఆర్ కోసం కేంద్రాన్ని ఒప్పించి జీవో సైతం విడుదల చేయించి, స్పిల్ వే సహా నిర్మాణం చేపట్టారు. మీ అనాలోచిత నిర్ణయం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు. మీ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారకులయ్యారు. కమిషన్ల కోసం మీ కక్కుర్తే ఇందుకు కారణం.

     3 వేలకు 33 వేల క్యూసెక్కులకు తేడా తెలియదా?
    మచ్చుమర్రి చంద్రబాబు చేశాడు.. దాని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న పత్రికలు అసులు ఆ ప్రాజెక్టు జీవో ఎప్పుడు వచ్చిందో చూడాలి. దానిలో ఎంత నీరు తీసుకోవచ్చో చూడండి. 834 అడుగులు వద్ద మల్లెల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే... మచ్చుమర్రికి మాత్రం 790 అడుగుల వద్ద కేవలం 0.31 టీఎంసీ అంటే 3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే 33 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. ముచ్చుమర్రి అనేది కేసీ కెనాల్, హంద్రీనీవాకు సమాంతర కాలువ ఉంది. అదే రాయలసీమ లిఫ్ట్‌లో 33 వేల క్యూసెక్కుల కోసం జరిగిన కాలువలు ఎలా ఉన్నాయి?

    పనులెంత జరిగాయో చూడండి? నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత 33వేల క్యూసెక్కుల నీరు పోవడానికి కాలువలు ఉండాలి. ఈ కాలువలు కూడా పోతిరెడ్డిపాడు దాటిన తర్వాత బనకచర్ల క్రాస్ ముందు కలుస్తుంది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్లాస్ వరకు ఉన్న కాలువ కూడా 80వేలక్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా కాలువలు వెడల్పు చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టు చేసినప్పుడు..  హంద్రీనీవా స్థాయిని పెంచాలని కాలువల సామర్ధ్యం 3300 క్యూసెక్కులుంటే దాన్ని 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా వెడల్పు చేశారు.

    ఉద్యమానికి సిద్ధమైన రాయలసీమ..
    విధ్వంసం చేయాలన్న ఆలోచనే మీది. ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఖరీఫ్ లో వేగంగా నీళ్లు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఇక్కడ రైతుల పంటలను కాపాడ్డం కోసం, వాళ్లు కూడా సరైన సమయంలో పంటలు పెట్టుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ పని జరుగుతుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ గుండె చప్పుడు. దయచేసి ఈ ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు కూడా హేళనగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ, అమరావతి, గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతం ఏదైనా  రైతులందరూ బాగుండాలన్నదే మా విధానం.

    మేం రైతుల పక్షాన నిలబడతాం. ఇవా అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా, గుంటూరు రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్చి ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్మాణ పనులు మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అంతే తప్ప కేవలం వ్యక్తిగత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరైన విధానం కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పనిచేస్తోంది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు.  ఉప్పెనలా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాయలసీమ నుంచి చంద్రబాబు తరలించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

    రాజధాని పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..
    దీంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ మరలా రాజధాని అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అక్కడ రైతులకు మంచి జరగాలన్నదే మా విధానం. తొలివిడతలో రాజధానికి భూమిలిచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన ఓరైతు మంత్రి సమక్షంలో గుండాగి చనిపోయారు. వారికి అండగా నిలబడాలన్నదే మా విధానం. వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండో విడత  భూసేకరణకు వెళ్లడాన్ని మేం తప్పుపడుతున్నాం.

    దయచేసి రాజకీయ కోణంలో విమర్శలు చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ను రద్దు చేయడం ముమ్మాటికీ తప్పు. ఏడాదిలోగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి.. తక్షణమే పూర్చి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి చేస్తుందన్ని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలను మాత్రం అబద్దాలతో తప్పుదోవపట్టించొద్దని హెచ్చరించారు. అలా చేస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులను చరిత్ర క్షమించదని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

  • సాక్షి, విజయవాడ: ప్రజల ఆస్తిని దోచుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తామని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని హితవు పలికారు.

    మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘మచిలీపట్నంలో మా పార్టీ ప్లాన్ పెట్టుకుంటే కాగితాలే ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అధికారులు పార్టీ టీడీపీ నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కోర్టులు తీర్పునిచ్చినా.. నాకు మంత్రి కొల్లు రవీంద్రే ఎక్కువ అన్నట్లుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ జైలులో వేస్తా జాగ్రత్త అని మండిపడ్డారంటే మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరు అర్ధం అవుతుంది.

    ఎవరైతే అధికారులు పొగరుగా వ్యవహరిస్తారో వారికి కోర్టు తీర్పు ఒక​ హెచ్చరిక. ప్రజల పన్నులతో మీరు బ్రతుకుతున్నారు. పాలేరులా పని చేయవద్దు. బ్రిటీష్ వాళ్లకు తొత్తులుగా మారినప్పుడు ఏం చేశారో రేపు ప్రజలే తీసేస్తారు ఇలాంటి వాళ్లని. ప్రజల ఆస్తిని దోచుకోవడానికి చంద్రబాబు, లోకేష్ విచ్చలవిడిగా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. నిన్న లోకేష్ 99 రూపాయలు కాదు.. అర్ధ రూపాయికైనా భూములు ఇస్తాననడం సిగ్గుచేటు. జనం ఆస్తి కాబట్టి మదం ఎక్కి మాట్లాడుతున్నారు.. హెరిటేజ్ ఆస్తులను అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తారా?. లోపల ప్రోడక్ట్స్ పావలాకి ఇస్తారా?. ప్రజల సొమ్ము పంచుకొని తినేస్తారా?. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.

    అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

    వైఎస్‌ జగన్ మాటలను అసహ్యంగా వక్రీకరిస్తున్నారు. మీ సొమ్ము కాదు కాబట్టి జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. మీ ఆస్తులు ఎక్కడైనా హైవేలపైనే ఎందుకు కడుతున్నారు. రెట్టింపు అయ్యేందుకా?. జనం సొమ్ము నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టి తగలేసే బదులు విజయవాడ గుంటూరు మధ్య కడితే ప్రజలే నిర్మాణం చేసుకుంటారని జగన్ అన్నారు. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. అమరావతిలో వర్షాలు రాగానే తుమ్మ చెట్లు తీసేయడం నీటిని తోడే దానికి వందకోట్లు ఖర్చు పెడుతున్నారు. వెయ్యి కోట్లతో మిషన్లు కొంటామంటున్నారు.. మరి దాని కోసం కోట్లు తగలేసే బదులు విజయవాడ గుంటూరు మార్గంలో నిర్మిస్తే బావుంటుందని జగన్ అన్నారు. జగన్ మాట్లాడితే టీడీపీ నేతలు నోరు తెరుస్తారా?. చంద్రబాబు, లోకేష్, మంత్రులు అబద్దాలు మాట్లాడితే నోరు మెదపరా?. ప్రజలే వాతలు పెట్టే రోజు ప్రభుత్వానికి దగ్గరలో ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh

  • సాక్షి, తిరుపతి: టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. బాలాజీనగర్‌ ఫ్లాట్‌ నంబర్‌ 2 రద్దు విషయంలో కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన రాజీనామా చేశారు.

    ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాలు.. మనస్తాపానికి గురిచేశాయన్న కృష్ణమూర్తి.. కనీసం తనను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. స్వామి వారికి సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నందుకు ఆ భగవంతుని క్షమించమని కోరుకుంటున్నానంటూ జంగా కృష్ణమూర్తి లేఖలో పేర్కొన్నారు.

  • తాడేపల్లి : ఏపీలో పోలీసుల వైఖరి వింతగా ఉందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి విమర్శించారు. కేక్‌ కట్‌ చేసినా, కోడిని కోసుకున్నా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 9వ  తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. చివరికి జగన్‌ ఫ్లెక్సీలను చూసినా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

    ‘ఇది రెడ్‌ బుక్‌ పాలనకు నిదర్శనంగా ఉంది. జగన్ పుట్టినరోజున కోడిని కోశారని తిరుపతిలో కేసు పెట్టి అపహాస్యానికి గురయ్యారు.  నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. వారిని కోర్టులో హాజరుపరిస్తే కోర్టు సైతం దిగ్భ్రాంతికి గురైంది. కేక్ ను కత్తితో కట్ చేశారని ఇంకో కేసు కూడా పెట్టారు. అసలు రాష్ట్రంలో పోలీసుల వైఖరి దారుణంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా కోళ్ల పందేలు జరుగుతున్నాయి. కోళ్ల పందేలు చట్టరిత్యా నేరం.మరి సంక్రాంతి సందర్భంగా జరిగే కోళ్ల పందేలపై పోలీసులు ఏం చేయబోతున్నారు?. 

    కనుమ రోజు అందరూ నాన్ వెజ్ తింటారు అప్పుడు కూడా జనం మీద కేసులు పెడతారా?, జగన్ ఫ్లెక్సీలను జనం చూస్తే వారి మీద కూడా కేసులు పెట్టేలా ఉన్నారు, నిందితులకు ముసుగులు వేయకూడదు, కొట్టకూడదు, రోడ్లమీద ఊరేగించ కూడదు, చేతులకు సంకెళ్లు వేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టులు చాలాసార్లు చెప్పాయి. చట్టప్రకారం పని చేయకపోతే తర్వాత పోలీసులే ఇబ్బంది పడతారు. అధికరం శాశ్వతం కాదు, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలి’ అని హెచ్చరించారు.

    పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్
  • బొబ్బిలి (విజయనగరం జిల్లా): ‘మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్‌ సౌకర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు.

    పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పందించాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం’ అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావలస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు.

    వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించుకుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పలరాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.

    Vizianagaram: మెడకు ఉరితాళ్లతో..! గిరిజనుల సంచలన వీడియో