Archive Page | Sakshi
Sakshi News home page

International

  • లండన్‌: బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌  దారుణాలను అక్కడి పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్‌ లోవ్ బహిర్గతం చేశారు. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఈ గ్యాంగులు యాక్టివ్‌గా ఉన్నాయని వారిలో అధికంగా పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.

    గ్రూమింగ్స్‌ గ్యాంగ్స్‌ ఆగడాలకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు మైనర్‌ బాలికలపై రాక్షసత్వంతో ముఠా అత్యాచారాలు  చేసినట్లు నివేదిక తేల్చింది. ఈ కేసులో పలువురు బాధితురాలను స్వతంత్ర కమిటీ విచారించింది. అందులో మైనర్ బాలికలను అత్యంత క్రూరంగా బోనులో బంధించి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.

    ఒక బాధిత  బాలిక మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనపై దాదాపు  600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు తెలిపింది. మరో బాధితురాలు .. 15 నుండి 20 మంది అమ్మాయిలను బోనుల్లో  బంధించి ఉంచడం చూశానని, వారిపై అమానవీయంగా, క్రూరంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. ఇవే కాక మరెన్నో మైనర్లపై మరెన్నో ఆగడాలు బ్రిటన్ వ్యాప్తంగా గ్రూమింగ్‌ గ్యాంగ్స్ చేశాయని ఎంపీ పేర్కొన్నారు. 

    ఈ ముఠాలలో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ దారుణాలపై ఇక మాటలు చాలు, చేతల్లో కఠిన చర్యలు కావాలి. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే మా 'రేప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్' బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుంది అని ఎంపీ రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.ఈ దారుణాలను అణచడంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


    గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే..?

    'గ్రూమింగ్ గ్యాంగ్స్' అంటే... ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని మభ్యపెట్టి, నమ్మించి, ఆపై క్రూరంగా లైంగికంగా వాడుకునే వ్యవస్థీకృత నేర ముఠాలు 'గ్రూమింగ్' అంటే ఒకరిని నమ్మించి, లొంగదీసుకోవడం. ఈ ముఠాలు సాధారణంగా పేదరికం, కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనంతో బాధపడుతున్న 11 నుండి 16 ఏళ్ల లోపు బాలికలను (ఎక్కువగా తెల్లజాతి బాలికలను) టార్గెట్ చేస్తాయి.
     

  • టెహ్రాన్‌: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో  వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.

    ఇరాన్ సుప్రీం లీడర్‌ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా  విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. 

    ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది.
     

  • గత కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) లోని వివిధ ప్రాంతాలలో సంచలనం సృష్టించిన " పాక్‌గ్రూమింగ్ గ్యాంగ్స్"  (Pakistani Grooming Gangs)పై బ్రిటీష్ ఎంపీ రూపెర్ట్ లోవ్ (Rupert Lowe) పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దారుణమైన లైంగిక దోపిడీ ముఠాల వెనుక ప్రధానంగా 'పాకిస్తానీ మూలాలు ఉన్న టాక్సీ డ్రైవర్లు , వ్యాపారులు' ఉన్నట్లు యూకే ప్రభుత్వ విచారణలో తేలింది. ఎంపీ రూపెర్ట్ లోవ్ తన వ్యక్తిగత విచారణ ద్వారా బాధితుల నుండి సేకరించిన అత్యంత ఘోరమైన, షాకింగ్ సాక్ష్యాలను బ్రిటీష్ పార్లమెంట్‌లో చదివి వినిపించారు. అధికారులు, పోలీసులు మరియు వ్యవస్థల వైఫల్యాల వల్ల దశాబ్దాలుగా ఈ దారుణం కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    600 - 700 మంది అత్యాచారం
    లోవ్ ప్రకారం, ముఠా ఆధారిత బాలల లైంగిక దోపిడీపై తాను జరిపిన స్వతంత్ర విచారణ సమయంలో బాధితుల హృదయవిదారక సాక్ష్యాలను సేకరించారు.  ఒక బాధితురాలు తాను 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక నిందితుడు తనపై మద్యం సీసాతో అత్యంత క్రూరంగా దాడి చేశాడని వివరించింది.మరో మహిళ వందల మంది చేతిలోదారుణమైన అత్యాచారానికి గురైంది. 13 ఏళ్ల వయసు నుండి మూడేళ్ల పాటు దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని పేర్కొంది.

    ముఠా సభ్యులు తమను జంతువుల కంటే హీనంగా చూసేవారని, ఒక వ్యాన్‌లో 15 నుండి 20 మంది బాలికలను కుక్కల బోనుల్లో బంధించి ఉంచడం చూశానని ఒక బాధితురాలు తెలిపింది. అలాగే తమపై కుక్కలతో కూడా దాడి చేయించి, ఆ దృశ్యాలను రికార్డ్ చేస్తూ నిందితులు నవ్వుకునేవారని మరో మహిళ వాపోయింది.

    వేధింపుల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో కొందరు పోలీసు అధికారులు కూడా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక మహిళ ఆరోపించింది. తీవ్ర గాయాలతో 15 ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్తే, భయంతో నిజం చెప్పలేకపోయానని, అక్కడి సిబ్బంది కూడా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం టాబ్లెట్లు ఇచ్చి పంపించేశారని ఒక బాధితురాలు పేర్కొంది.

    ఈ సాక్ష్యాల ప్రకారం, ఈ ముఠాలు శ్వేతజాతీయులు (White) మైనర్‌ బాలికలను, క్రైస్తవ బాలికలనే లక్ష్యంగా దశాబ్దాల పాటు సాగించిన లైంగిక దోపిడీ, అత్యాచారాల దారుణాలకు పాల్పడింది. ముస్లిం బాలికలకు గౌరవం, ఉన్నత నైతిక విలువలు ఉంటాయని, కానీ శ్వేతజాతీయులైన క్రైస్తవ బాలికలకు నైతికత తక్కువగా ఉంటుందంటూ నిందితులు వ్యాఖ్యానించేవారని ఒక బాధితురాలు గుర్తుచేసుకుంది. ఈ దారుణానికి గురైన బాలికలంతా దాదాపు శ్వేతజాతీయులే.

    ఒక ముస్లిం మత గురువు (ఇమామ్) కుమారుడి వల్ల ఒక బాధితురాలు గర్భవతి కాగా, ఆ విషయం తెలిసి కూడా అతని తండ్రి తన కొడుక్కి పెళ్లి చేసి, ఆ బిడ్డను చూడవద్దని ఆదేశించాడని, వారు తమ వర్గాన్ని మాత్రమే కాపాడుకుంటారని ఆమె పేర్కొంది. 'ఈద్' వంటి పండుగల సమయాల్లో మరియు సెలవు రోజుల్లో ఈ ముఠాల హింస, పార్టీలు మరింత ఎక్కువగా, క్రూరంగా ఉండేవని బాధితులు తెలిపారు. గతేడాది ఎంపీ రూపెర్ట్ లోవ్ నేతృత్వంలో జరిగిన ప్రైవేట్ దర్యాప్తులో.. యూకేలోని కనీసం 85 ప్రాంతాలలో ఇటువంటి "రేప్ గ్యాంగ్స్" చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న పురుషులు దశాబ్దాలుగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వ సంస్థల తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఇది ఇంతలా విస్తరించిందని ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    అసలేంటీ పాక్‌ గ్రూమింగ్ గ్యాంగ్స్
    ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ స్కాండల్ ఒక దశాబ్దం క్రితమే యార్క్‌షైర్‌లోని రోథర్‌హామ్ (Rotherham) నగరంలో వెలుగుచూసింది. 2001 ప్రాంతంలోనే శ్వేతజాతీయులైన చిన్న పిల్లలపై జరుగుతున్న ఈ క్రమబద్ధమైన లైంగిక దాడుల గురించి అధికారులకు సమాచారం అందినప్పటికీ, సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.ర్డ్ వంటి పలు నగరాల్లో దశాబ్దాలుగా వేల సంఖ్యలో బాలికలు ఈ దారుణానికి బలయ్యారు. గతేడాది జరిగిన స్వతంత్ర దర్యాప్తులో యూకేలోని దాదాపు 85 ప్రాంతాలలో ఈ 'రేప్ గ్యాంగ్స్' చురుగ్గా పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం బ్రిటీష్ పార్లమెంట్‌లో ఈ ముఠాల క్రూరత్వంపై బాధితులు ఇచ్చిన హృదయవిదారక సాక్ష్యాలను బయటపెట్టడంతో, ఈ 'పాక్ గ్రూమింగ్ గ్యాంగ్స్' వ్యవహారం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Rajanna

  • బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026
    పారదర్శకంగా

    పోలీస్‌ ఓపెన్‌ హౌజ్‌లో ఏకే 47 గన్‌ను ఎక్కుపెట్టి పరిశీలిస్తున్న విప్‌

    పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

    సిరిసిల్ల: ప్రజాపాలన పారదర్శకంగా.. జవాబుదారీతనంతో సాగుతుందని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బి గితేతో కలిసి పోలీస్‌ గౌరవవందనం స్వీకరించిన విప్‌ జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

  • గంభీరావుపేట(సిరిసిల్ల): నూతనంగా మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రీ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. గదులు, ఆటవస్తువులను పరిశీలించారు. క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌, ఎంఈవో గంగారాం, హెచ్‌ఎం శ్రీమతి తదితరులు ఉన్నారు.

    పేదల అభ్యున్నతికే పథకాలు

    ఇల్లంతకుంట: పేదల అభ్యున్నతికే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్‌బెడ్రూంలు నిర్మించినా ప్రజలకు అందజేయలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు ఆర్థికసాయం చేస్తుందన్నారు. అనంతరం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్‌ సురేశ్‌, మండల ప్రత్యేక అధికారి డీసీవో రామకృష్ణ, ఎంపీడీవో శశికళ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సర్పంచులు మామిడి రాజు, గొడుగు విట్టల్‌, నేరెళ్ల విజయ్‌గౌడ్‌, కాత మల్లేశం, నాగరాజు, వోల్లాల రజిత, పండుగ సునీత, నాయిని నవీన్‌కుమార్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీగల పుష్పలత, హౌసింగ్‌ ఏఈఈ ముజాఫర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

    అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

    బోయినపల్లి: హైదరాబాద్‌లో ఈ నెల 12న జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు మండలంలోని విలాసాగర్‌ హైస్కూల్‌ వి ద్యార్థి గోల్కొండ సృజన్‌కుమా ర్‌ ఎంపికై నట్లు పీడీ ప్రభాకర్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 1న సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ 100 మీటర్ల పరుగుపందెం అండర్‌–16 విభాగంలో సృజన్‌ ప్రతిభచాటి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు.

    రామాలయాన్ని సందర్శించిన సినీ నటుడు

    గంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలోని శ్రీసీతారామస్వామి ఆలయం, 700 ఏళ్లుగా ఆ రిపోని అఖండ జ్యోతిని సినీ నటుడు సీవీఎల్‌ నర్సింహారావు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాశస్త్యం గురించి కమిటీ చైర్మన్‌ మల్లుగారి నర్సాగౌడ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గాలిగోపురం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

    నియామకం

    సిరిసిల్లఅర్బన్‌: స్కౌట్‌, గైడ్స్‌ అర్గనైజేషన్‌(ఎస్‌జీవో) జిల్లా కమిషనర్‌గా మోతుకూరి అశోక్‌గౌడ్‌ను నియమిస్తున్నట్లు నేషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా (న్యూఢిల్లీ) ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర కమిషనర్‌ అశోక్‌రాజ్‌ తెలిపారు. జిల్లాలో స్కౌట్‌, గైడ్స్‌ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అశోక్‌ తెలిపారు.

    వరద కాలువ నిర్మించాలి

    సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలో కొత్తచెరువు వరదకాల్వను వెంటనే నిర్మించాలని ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. కొత్తచెరువు మత్తడి నీరు పోయేందుకు శ్రీనగర్‌కాలనీ నుంచి కచ్చా కాలువ తీసి నాలుగేళ్లుగా వరదను మళ్లించడం జరుగుతుందన్నారు. పట్టణంలో కాల్వలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని కోరారు. మచ్చ అనసూర్య, గుజ్జ దేవదాస్‌, ఆకిన సత్తయ్య, పంతం సుజాత, గడదాసు లత పాల్గొన్నారు.

  • సిరిసిల్ల: ‘మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిగా ఉండగా.. కొంత మేరకు అభివృద్ధి చేశాను.. 2028లో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆర్‌ నాయకత్వంలో ఇంతకు నాలుగింత అభివృద్ధిని చేస్తా’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో వీర్నపల్లి మండల కేంద్రం సర్పంచ్‌ మల్లారం జోత్స్న–అరుణ్‌కుమార్‌ మంగళవారం బీఆర్‌ఎస్‌లో చేరగా, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, సిరిసిల్ల ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను గెలిచాను. కానీ, వేములవాడ, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఇప్పుడు గోస అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పాలనలో ఆటోకు డబ్బులిస్తే యూరియా బస్తాలు ఇంటికి వచ్చి పడేవని, వ్యవసాయంతో పాటు అన్ని రంగాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే, జిల్లాలో ఎవరూ ఊహించని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన పలువురు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ చేరారు. ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్‌, బొల్లి రామ్మోహన్‌, మాడుగుల మల్లేశంయాదవ్‌, గుగులోత్‌ రేణుక, కళావతి, కుంబాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతా

    జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్‌ అన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతిలో టాప్‌ మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు మంగళవారం సిరిసిల్ల బాలికల హైస్కూల్‌లో గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు గర్వపడేలా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ ఇన్‌చార్జి కొండూరి సాంకేత్‌రావు, స్కూల్‌ హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయుడు భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • సిరిసిల్ల: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ జాతీయజెండా ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు నోట్‌బుక్‌లు అందజేశారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ మహేశ్‌ బి గితే జెండా ఆవిష్కరించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, ఏవో పద్మ, సీఐలు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, వెంకటేశ్‌, రవీందర్‌, మొగిలి, రవి, ఆర్‌ఐలు మధుకర్‌, సురేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

    బెటాలియన్‌లో..

    సిరిసిల్ల అర్బన్‌: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సిరిసిల్ల పట్టణంతోపాటు, విలీన గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి సర్థాపూర్‌లో గల 17వ బెటాలియన్‌లో కమాండెంట్‌ సురేశ్‌ జెండా ఎగరేశారు. 10వ వార్డు బోనాలలో బొల్గం వైష్ణవి, 8వ వార్డు పెద్దూరులో లింగంపల్లి భాగ్యలక్ష్మి, 9వ వార్డులో దొంతినేని కళ్యాణి, 22వ వార్డులో లింగంపల్లి గంగరాజు, 24వ వార్డులో బుర్ర మల్లికార్జున్‌, 11వ వార్డులో మామిండ్ల మహేశ్‌, 12వ వార్డులో నాగరాజు, 1వ వార్డులో బూర బాలు జెండా ఆవిష్కరించారు.

    జెండావందనం చేస్తున్న కమాండెంట్‌, సిబ్బంది

    జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ మహేశ్‌ బి గితే

    తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలు వేస్తున్న కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

Nirmal

  • నిర్మల్‌

    కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

    నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి, జాతీయ గీతపాలన చేశారు. పలువురు పాఠశాలల విద్యార్థులకు ఈ సందర్భంగా కలెక్టర్‌ బహుమతులు పంచి, మిఠాయిలు అందించా రు. అందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తె లిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌(రెవె న్యూ) కిశోర్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

    నిర్మల్‌: అమరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అమరుల స్మరిస్తూ, ఉద్యమకారులను గుర్తిస్తూ జి ల్లానూ సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని పిలు పునిచ్చారు. కలెక్టరేట్‌లో తెలంగాణ ఆవిర్భావ దినో త్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీరేశం హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల తదితరులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశాన్ని చదివివినిపించారు.

    ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక..

    ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఈదిశగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా వివిధరంగాల్లో విశేష పురోగతి సాధించామని వీరేశం పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మల్‌ జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు.

    పేదలకు ఇందిరమ్మ ఇళ్లు..

    ప్రభుత్వం ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద జిల్లాకు మొత్తం 9,292 గృహాలు కేటాయించగా, ఇప్పటివరకు 7,651 అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. ఖానాపూర్‌, ముధోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో 6,684 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 1,450 నిర్మాణం పూర్తిచేసుకున్నాయన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.142.79 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈనెల 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,091 గృహప్రవేశాలు అయ్యాయని పేర్కొన్నారు. రెండోదశలో ప్రతీ నియోజకవర్గానికి రెండువేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, పూరి గుడిసెల్లో నివసించే అర్హులైన పేద కుటుంబాలకు 1,500 ఇళ్లను ప్రాధాన్యంగా మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో ఇల్లు నిర్మించుకుని స్లాబ్‌ వేయలేకపోయిన 500 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

    మహాలక్ష్మి, గృహజ్యోతి..

    మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 6.90 కోట్లకు పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో గృహజ్యోతి విద్యుత్‌ సబ్సిడీ పథకం కింద 1.35 లక్షలకుపైగా లబ్ధిదారులకు రూ.107.62 కోట్ల సబ్సిడీ అందించామన్నారు.

    మహిళా సంఘాలకు

    చెక్కు అందజేత

    మహిళా సంఘాలకు మంజూరైన రూ.74.93 కోట్ల చెక్కును, ధాన్యం కొనుగోలు కేంద్రాల కమీషన్‌ రూ.3.94 కోట్ల చెక్కును అందించారు. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య, అడిషనల్‌ కలెక్టర్లు కిశోర్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్‌ సంకేత్‌కుమార్‌, ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్‌, డీఎఫ్‌వో సుఖ్‌దేవ్‌ బోబడే, డీఆర్‌ఓ రాథోడ్‌ రమేశ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గణేశ్‌చక్రవర్తి తదితరులతో కలిసి అల్పాహారం ఆరగించారు.

    విద్య, వైద్యరంగాల్లో..

    జిల్లాలోని 1,046 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1.34 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి 742 బడుల్లో మధ్యాహ్న భోజనంతోపాటు బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తామన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 98.96 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువడం గర్వకారణమన్నారు. ఇక వైద్యరంగంలో జిల్లాలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 11 ప్రైవేటు, 6 ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా 1,015 శస్త్రచికిత్సలు నిర్వహించగా, రూ.30.47 కోట్ల చెల్లించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,962 ప్రసవాలు చేసినట్లు తెలిపారు.

    వివిధ శాఖల ద్వారా...

  • ముధోల్‌ : చిన్నారుల విద్యా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జి ల్లాలో కొత్తగా 74 ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12 నుంచి జిల్లాలోని ఎంపికై న పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య అధికారికంగా అందుబాటులోకి రానుంది.

    ప్రతీ బడికి రూ.1.70 లక్షలు..

    ప్రైమరీ విద్యను ఆకర్షణీయంగా, ఆధునికంగా మార్చడానికి ప్రతీ పాఠశాలకు ఫర్నిచర్‌, ఇండోర్‌–అవుట్‌డోర్‌ ఆట వస్తువులు, రంగుల పెయింటింగ్స్‌తో సహా అన్ని మౌలిక సదుపాయాలకు రూ.1.70 లక్షలు కేటాయించనున్నారు.

    ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా నియామకాలు..

    ప్రతీ ప్రీప్రైమరీ సెక్షన్‌లో ఒక ఇన్‌స్ట్రక్టర్‌, ఒక ఆయాను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించనున్నారు. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేల వేతనం చెల్లించనున్నారు. నియామకాల కోసం త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసి, త్రీమెంబర్‌ కమిటీ ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

    74 పాఠశాలలు ఎంపిక

    జిల్లాలోని 19 మండలాల నుంచి మొత్తం 74 ప్రాథమిక పాఠశాలలను ప్రీప్రైమరీ సెక్షన్ల కోసం ఎంపిక చేశారు. బాసర, భైంసా, దస్తూరాబాద్‌, దిలావర్‌పూర్‌, కడెం, ఖానాపూర్‌, కుభీర్‌, కుంటాల, లక్ష్మణచందా, లోకేశ్వరం, మామడ, ముధోల్‌, నర్సాపూర్‌, నిర్మల్‌, నిర్మల్‌ రూరల్‌, పెంబి, సారంగాపూర్‌, సోన్‌, తానూర్‌ మండలాల్లోని వివిధ గ్రామాల పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త ప్రీప్రైమరీ సెక్షన్ల ప్రారంభంతో జిల్లాలోని చిన్నారులు నాణ్యమైన, ఆధునిక విద్యా వ్యవస్థను అందుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

  • భైంసాటౌన్‌: అధికార పక్షం ఒత్తిడితో పోలీసులు తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఎండీ.జాబీర్‌ అహ్మద్‌ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా జరిగిన ఘటనలో వాస్తవాలు పరిశీలించి కేసులు నమోదు చేయాలన్నారు. ఇటీవల 25వ వార్డులో జరిగిన ఘర్షణలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్‌ చేయాలని, లేనిపక్షంలో ఏఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయిస్తామన్నారు. గతంలో వెలుగుచూసిన బెట్టింగ్‌ కేసులో భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు దర్యాప్తు పురోగతి ఏదని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కానీ, తప్పుడు కేసులు పెడితే ఊరుకోమన్నారు. మున్సిపల్‌లో కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం అనుభవరాహిత్యంతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. తమ హయాంలో హిందూ పండుగలతోపాటు ముస్లిం పండుగలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుత పాలకవర్గం ఇటీవల రంజాన్‌, బక్రీద్‌ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేదని విమర్శించారు. కౌన్సిల్‌ సమావేశాల్లో తమ కౌన్సిలర్లు వార్డు సమస్యలను చైర్మన్‌ ద్వారా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తే, 14వ వార్డు కౌన్సిలర్‌ ప్రవీణ్‌ తరచూ జోక్యం చేసుకోవడంతో చర్చ సజావుగా జరగడం లేదన్నారు. పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, కనీసం ప్రజలకు సకాలంలో తాగునీరు అందించాలని హితవు పలికారు. సమావేశంలో ఎంఐఎం కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

  • నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్ధత, గ్రామసభల నిర్వహణ, తదితర అంశాలపై హైదరాబాదు నుంచి డీజీపీ సీవీ.ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పర్యావరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. రానున్న వర్షాకాలం, వాతావరణ పరిస్థితులు, పంటల సాగు వంటి అనేక విషయాలను ఈ సభలలో రైతులకు వివరించాలన్నారు. ఆకస్మిక వరదలు, విపత్కర పరిస్థితులపై అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాలు పరస్పరం సమన్వయంతో ఉండాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌ భూభారతి, సాదా బైనామా దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఎస్‌డీసీఎల్‌ఏ నాయక్వాడి జల కుమారి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, సీపీవో గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • కుంటాల: ప్రతీ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ అన్నారు. కుంటాల మండల పరిషత్‌ కార్యాలయంలో కుంటాల, నర్సాపూర్‌(జి) మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. అందరి సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ నిచ్చారు. మండలంలోని విఠాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో గృహ ప్రవేశాలు చేయించారు. పెంచికల్‌పాడ్‌ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందించారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలని, కుంటాల పంచాయతీ కార్యదర్శి రాజబాపు ఆధ్వర్యంలో తయారు చేసిన జ్యూట్‌ బ్యాగులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కమల్‌ సింగ్‌, శ్రీకాంత్‌, ఎంపీడీవో అల్లాడి వనజ, ఎంపీవో శోభన, సర్పంచ్‌లు జక్కుల గజేందర్‌, పెంటవార్‌ దశరథ్‌, చెన్న వసంత, లింగురాం పటేల్‌, హిమ్మత్‌ రావుపటేల్‌, రాజన్న, కట్ట రవి, రాణి, డీటీ కార్తీక్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈ శైలజ తదితరులు పాల్గొన్నారు.

  • నిర్మల్‌టౌన్‌:ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారి సేవలను కొనియాడారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, జిల్లా పోలీస్‌ ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఆర్‌ఐ రామ్‌నిరంజన్‌రావు జాతీయ పతాకం ఎగుర వేశారు. వేడుకల్లో నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది, డీపీవో సిబ్బంది, హోం గార్డులు పాల్గొన్నారు.

Mancherial

  • మంచిర్యాలక్రైం: రాష్ట్రాన్ని నేర రహితంగా మా ర్చేందుకు కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. మంగళవా రం రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం విధి నిర్వహణలో అత్యున్నత ప్రతి భ కనబర్చిన పోలీస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలు, సే వా పతకాలు ప్రదానం చేశారు. మంచిర్యాల సీ సీఎస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌స్టేషన్‌) ఎస్సై దుర్గం లలి తకు ఉత్తమ సేవా పతకం ఇచ్చారు. అడిషన ల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు ప్రకాశ్‌, శ్రీనివాస్‌, రమేశ్‌, నాగేంద్రగౌడ్‌, సీఐలు, ఎస్సైలున్నారు.

  • జాతీయ జెండాకు వందనం చేస్తున్న వేణుగోపాల్‌రావు, ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, డీసీపీ భాస్కర్‌, తదితరులు

    మంచిర్యాలఅగ్రికల్చర్‌: రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మా ర్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రా ములు, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య, రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డులోగల తెలంగాణ అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

    విజయవంతంగా

    ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక

    మార్చి 6నుంచి జూన్‌ 12వరకు చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సా గుతోంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పరి శుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, రహదారి భద్రత, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్‌ ని యంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత క్రీడలు, మహిళలు, పర్యావరణం తదితర 10 అంశాలతో కూడిన కార్యక్రమాలను జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం.

  • దండేపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొ న్నారు. మంగళవారం ఆయన మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశా ల సంబరంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ధర్మ య్య, ఏఎంసీ చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌, తహసీల్దార్‌ రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, హౌసింగ్‌పీడీ బన్సీలాల్‌, ఆర్‌ఐ భూమన్న పాల్గొన్నారు.

    హాజీపూర్‌ మండలంలో..

    మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మండలంలోని రా పల్లి, కర్ణమామిడి తదితర గ్రామాల్లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు కని పించాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్లకు వెళ్లి శాలువాలు కప్పి సన్మానించారు. రాపల్లిలో లబ్ధిదారులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చిత్రపటాలతో గృహ ప్రవేశం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయివెంకటరెడ్డి, ఎంపీవో సుమన్‌, గృహ నిర్మాణ శాఖ ఏఈ వాజ్మయి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

    లక్సెట్టిపేట మండలం కొత్తూరులో..

    లక్సెట్టిపేట: మండలంలోని కొత్తూరు గ్రామంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మించిన 36 ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, సర్పంచ్‌ నల్లపు రజిత–పోచమల్లు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

  • మంచిర్యాలటౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి సోమవా రం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించి మంచిర్యాలకు వచ్చినా ఎలాంటి హామీ లు ఇవ్వకపోవడంతో జిల్లా ప్రజలు తీవ్ర నిరా శకు గురయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, గాజుల ముఖేశ్‌గౌడ్‌, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామిరెడ్డి, బేర సత్యనారాయణ, మెట్టుపల్లి జయరామారావు పాల్గొన్నారు.

    నేటి నుంచి సదరం శిబిరాలు

    పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఈ నెల 3నుంచి 30వరకు సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో కిషన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మే 30వరకు మీ సేవా కేంద్రాల్లో సదరం పోర్టల్‌లో పేర్లు న మోదు చేసుకున్నవారికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 3,9,16,22,25,29 తేదీల్లో ఆర్థో/లోకోమోటా ర్‌ సమస్యలు కలవారికి, 4,8 తేదీల్లో వినికిడి, భాషాలోపం, మాట్లాడకపోవడం లాంటి సమస్యలున్నవారికి, 5న సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తుల కు, 10,23 తేదీల్లో దృష్టి లోపాలు కలవారికి, 30న మానసిక అనారోగ్యం, మేధోవైకల్యం కలవారికి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపా రు. దివ్యాంగులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలలో హాజరు కావాలని సూచించారు.

  • వేమనపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ఎదుట రోగులు మంగళవారం నిరసన తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన వైద్యాధికారి, సిబ్బంది ఆ తర్వాత ఇళ్లకు వెళ్లారు. మంగళవారం వైద్యం కో సం ఎనిమిది మంది గర్భిణులు, ఇద్దరు తేలుకాటు బాధితులు, గొర్లపల్లి కిత్తకాలనీకి చెందిన తీవ్ర అ నారోగ్యంతో ఓ వృద్ధురాలు, సాధారణ రోగులు 30 మంది వరకు వచ్చారు. స్టాఫ్‌నర్స్‌ రజిత, కాంటింజెంట్‌ వర్కర్‌ బాపు మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటల(రౌండ్‌దిక్లాక్‌) వైద్యం అమల్లో ఉండాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది వెళ్లిపోవడంపై రోగులు ఆగ్ర హించారు. రోజంతా పడిగాపులు కాచి వెళ్లి పోయా రు. జెండావిష్కరణ, విధులకు వచ్చిన వైద్యాధికారి అన్వేశ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ముగ్గురు హెల్త్‌ అసిస్టెంట్లు, ఏడుగురు ఏ ఎస్‌ఎంలు, డీఈవో ఉదయమే వెళ్లిపోయారు. వైద్యాధికారి అన్వేశ్‌ ను సంప్రదించగా.. స్టాఫ్‌నర్స్‌ మాత్రమే విధుల్లో ఉన్నారని, సిబ్బంది మధ్య గొడవలతో వెళ్లిపోయారని చెప్పడం గమనార్హం.

  • నస్పూర్‌: మాజీ సీఎం కేసీఆర్‌ పోరాటంతోనే తెలంగాణ ఏర్పాటైందని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నస్పూర్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. అంతకుముందు తె లంగాణతల్లి విగ్రహం చౌరస్తాలో జెండా ఎగు రవేశారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, నాయకుడు విజిత్‌రావు, టీబీజేకేఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, నస్పూర్‌ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు పవన్‌కుమార్‌, తిరుపతి తదితరులున్నారు.

    డీఈవోగా లలిత

    మంచిర్యాలఅర్బన్‌: డీఈవోగా లలితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంచిర్యాలలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు కు మురంభీం ఆసిఫాబాద్‌ డీఈవోగా బాధ్యతలు అప్పగించగా మంగళవారం రిలీవ్‌ చేశారు. మంచిర్యాల డీఈవో యాదయ్య బదిలీపై హై దరాబాద్‌కు వెళ్లడగా ఇక్కడ లలితకు డీఈవో గా అదనపు బాధ్యత(ఎఫ్‌ఏసీ)అప్పగించారు.

  • భీమిని: కన్నెపల్లి మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీలో ప్రొటోకాల్‌ రగడ చోటు చేసుకుంది. కార్యక్రమం రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభం కాగా ప్రొటోకాల్‌ వివాదంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం దూషణకు దిగి పెనుగులాడుకోవడంతో పోలీ సులు ఆపారు. అనంతరం సర్పంచులు, నా యకులు చెక్కులు పంపిణీ చేశారు. దీనిపై బీఆ ర్‌ఎస్‌ నాయకులు అధికారులను నిలదీశారు. అనంతరం కాంగ్రెస్‌ డౌన్‌ డౌన్‌.. అంటూ నిన దించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు. ఎస్సై భాస్కర్‌రావు వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనలో రైతువేదికలోని 20కుర్చీలు విరిగి, డోర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు ఏఈవో తెలిపారు.

Karimnagar

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌:

    భివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. 2014 జూన్‌ 2న సాకారమైన స్వప్నం నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్‌–2047’ దిశానిర్దేశక పత్రాన్ని రూపొందించిందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యాలని వివరించారు. జిల్లాలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ విజయవంతంగా అమలవుతోందని, వేలాది ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారం చేపట్టినట్లు వివరించారు.

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: తెలంగాణ ప్రజల ఆకా ంక్షను గుర్తించి, కరీంనగర్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్ర కలను సోనియాగాంధీ నిజం చేశారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్‌ సత్తు మల్లేశం, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా కోర్టులో..

    కరీంనగర్‌క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో ఏసీబీ న్యాయమూర్తి, ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నామ సంతోష్‌ కుమార్‌ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.కుమార్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మర్చిపోలేనిదని అన్నారు. అదనపు జిల్లా జడ్జి నీరజ, మేజిస్ట్రేట్లు సిబ్బంది పాల్గొన్నారు.

    కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీపీ గౌస్‌ ఆలం జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన కార్యాలయం వద్ద అడిషనల్‌ డీసీపీ (అడ్మిన్‌) వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.

  • కరీంనగర్‌ అర్బన్‌: విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్‌పుట్‌ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇన్‌పుట్‌ డీలర్లకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లొమా కోర్సు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఎక్కువగా డీలర్లని నమ్ముతారని, అందువల్ల డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకుగాను ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను పరిస్థితులను వివరించాలని తెలిపారు. అనంతరం 36మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ పీడీ చత్రునాయక్‌ తదితరులుల పాల్గొన్నారు.

    ఖేత్‌ బచావో అభియాన్‌ ప్రారంభం

    ఖేత్‌ బచావో అభియాన్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆవిష్కరించారు. ఈ నెల1 నుండి 30 వరకు వ్యవసాయ శాఖ అధికారులు నేల ఆరోగ్య పరిరక్షణ కాంపెయిన్‌ను నిర్వహించనున్నారు.

    4 నుంచి గ్రామ, వార్డు సభలు

    ఈ నెల 4నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్లలో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. 4, 6, 8, 10వ తేదీల్లో సభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.

  • కరీంనగర్‌రూరల్‌/గన్నేరువరం: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన పూర్వప్రాథమిక విద్యకు స్పందన లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి మరికొన్ని పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లాలో 58 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు అయ్యాయి. కరీంనగర్‌ మండలంలో చెర్లభూత్కూర్‌, నగునూరు, దుర్శేడ్‌ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గన్నేరువరం మండలంలో ఖాసీంపేట, మైలారం, గన్నేరువరం పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాల్లలో ఈ నెల12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మండల విధ్యాధికారులు తెలిపారు.

    ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు

    అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేరడం లేదు. ఇంగ్లిష్‌ మీడియం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాలు నిండిన విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించేవారు. ప్రస్తుతం నాలుగేళ్లు నిండిన చిన్నారుల కోసం యూకేజీ తరగతిని ప్రారంభించనున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తప్పుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించే పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు కేటాయించారు. తరగతి గదుల గోడలకు రంగులు, బొమ్మలకు రూ.50వేలు, బెంచీలు, ఇతర సామగ్రికి రూ.50వేలు, క్రీడాసామాగ్రికి రూ.50వేలు, స్టేషనరీ, యూనిఫామ్స్‌, బూట్లు, బెల్టులకు రూ.20వేల చొప్పున ఖర్చు చేస్తారు.

  • పరేడ్‌ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకల్లో జెండావిష్కరణ అనంరతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, సుడా, గ్రంఽథాలయ చైర్మన్లు, అధికారులతో కలిసి మంత్రి అమరవీరులస్తూపం వద్దకు వెళ్లారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్‌ పడాల రాహుల్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సన్న పాల్గొన్నారు.

Adilabad

  • ఆదిలాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పోరాటం, త్యాగాలు అసాధారణ మని ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులను శా లువా, పూలమాలతో సన్మానించారు. ఎమ్మె ల్యే శంకర్‌ మాట్లాడుతూ, ఉద్యమకారుల సంక్షేమాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమకారుల కు పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తవిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారులు కారింగుల దామోదర్‌, మేకల మల్లన్న, రామోజీ ఆంజనేయులు, కళాకారుడు రమేశ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, నాయకులు పాల్గొన్నారు.

  • నేరడిగొండ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా గృహ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన ఆడిగెం లక్ష్మీ–ప్రభాకర్‌ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరై ప్రారంభించారు. ‘మీ ఇంటికి వచ్చి ఇల్లు ఇస్తా.. మీరు ఎక్కడికి తిరగొద్దు’ అని అర్హులైన వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, హౌసింగ్‌ శాఖ అధికారులు, మాజీ ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, స్థానిక సర్పంచ్‌ జ్యోతి, సీనియర్‌ నాయకులు అనిల్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రాజు, నజీర్‌, రవీందర్‌ రెడ్డి, భారత్‌, శ్రీను, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేయడంపై ఫోకస్‌ పెంచుతాం.. ప్రతీ బడిలో మౌలిక వ సతుల కల్పనకు కృషి చేస్తాం.. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన పా టించేలా, నా ణ్యమైన విద్యాబోధన చేసేలా చర్యలు చేపడతామని నూతన డీఈ వో డి.మాధవి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

    సాక్షి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఎలాంటి చర్యలు చేపడతారు..?

    డీఈవో: బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పా టు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం, కంప్యూటర్‌ విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నా యి. ఈమేరకు తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.

    సాక్షి: కొంత మంది ఉపాధ్యాయులు రెగ్యులర్‌గా విధులకు ఎగనామం పెడుతున్నారు.. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు చేపడతారు..?

    డీఈవో: స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేయాలి. ఫేషియల్‌ అటెండెన్స్‌ ద్వారా సమయపాలన పాటించని వారిని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నెట్వర్క్‌ లేదని సాకులు చెప్పొద్దు. డొంగల్‌ ఏర్పాటు చేసుకోనైనా అటెండెన్స్‌ వేసుకోవాలి.

    సాక్షి: విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫాం మొదటి రోజే పంపిణీ జరుగుతుందా..?

    డీఈవో: పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఇప్పటికే మండల పాయింట్‌లకు చేరుకున్నాయి. ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా అవుతున్నాయి. మొదటి రోజే విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నాం. యూనిఫాం టెండర్లు జరుగుతున్నాయి. బడులు తెరిచే వరకు వచ్చే అవకాశం ఉంది.

    సాక్షి: ఉపాధ్యాయుల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..?

    డీఈవో: ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం వాస్తవమే. అయినప్పటికీ విద్యార్థుల చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా దృష్టి సారిస్తాం. 464 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరం ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. స్కూళ్లలో స్కావెంజర్ల సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈమేరకు చర్యలు చేపడతాం.

    సాక్షి: శిథిలావస్థ బడులపై ఎలాంటి దృష్టి సారిస్తున్నారు..?

    డీఈవో: జిల్లాలో ఎన్ని శిథిల బడులు ఉన్నాయో గుర్తించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నవాటిని తొలగించాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు చర్యలు చేపడతాం.

    సాక్షి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు న్నాయి. ఎలాంటి చర్యలు చేపడతారు..?

    డీఈవో: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు కేజీబీవీల్లో మెనూ సక్రమంగా అమలు చేసేలా చూస్తాం. ఏ రోజు ఎవరు విధుల్లో ఉన్నారనే విషయాన్ని వారి పేర్లతో సహా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. ఇష్టానుసారం వ్యవహిరించే వారిపై చర్యలు తప్పవు.

    సాక్షి: ఇటీవల కొంత మంది టీచర్లు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. వాటిని అధిగమించేలా ఎలాంటి చర్యలు చేపడతారు..?

    డీఈవో: ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. గురువు స్థానంలో ఉన్నవారు బాధ్యతలు విస్మరించవద్దు. చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే శాఖాపరంగా, చట్టపరమైన చర్యలు తప్పవు.

  • సాక్షి,ఆదిలాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం రైతు డిస్కం ఏర్పాటుపై రాజకీయంగా దుమారం నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ రైతు విద్యుత్‌ పంపిణీ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)ను మూడో విద్యుత్‌ పంపిణీ సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రత్యేకంగా వ్యవసాయ, నీటి సరఫరా కనెక్షన్ల కోసం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో టీజీఎస్‌పీడీసీఎల్‌, టీజీఎన్‌పీడీసీఎల్‌ కంపెనీలు ఉండగా, ప్రభుత్వం ఈ రైతు డిస్కంను తీసుకొస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ ఎత్తివేసేందుకే దీన్ని తీసుకొస్తుందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండిస్తుంది.

    నిర్వహణపై తర్జనభర్జన

    ఈ మూడో డిస్కం ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత, నిరసనలు ఎదురవుతున్నాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ భవిష్యత్తు, ప్రైవేటీకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ వారు వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడే డిస్కం పరిధిలోకి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ కోసం వెయ్యి మంది సిబ్బందిని తీసుకుంటున్నారనే చర్చ సాగుతుంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించి 11కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు వేలాదిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందే సమస్యలు ఏర్పడినప్పుడు నివారించలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖాళీ పోస్టులతోనే ఈ సమస్య ఎదురవుతుందని శాఖాపరమైన చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డిస్కం ఏర్పాటు చేసి సిబ్బందిని అటు ఇటుగా విభజించిన పక్షంలో పాత, కొత్త డిస్కంల పరిధిలో విద్యుత్‌ కనెక్షన్ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డిస్కం ఏర్పాటు జరుగుతుందా.. లేనిపక్షంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందోనని వేచి చూడాల్సిందే.

    ఈ విషయమై ఆదిలాబాద్‌ ఎస్‌ఈ శేష్‌రావును వివరణ కోరగా, సంస్థ నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని, ఈ దృష్ట్యా ఎలాంటి వివరాలు చెప్పలేమని స్పష్టం చేశారు.

    జిల్లాలో..

    జిల్లాలో..

    గృహ, వ్యాపార, వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్లు

    2లక్షల 65వేలు

    వ్యవసాయ, నీటిపారుదల కనెక్షన్లు

    35వేలు

    11కేవీ వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

    5,700

  • ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్‌ కార్యాలయంతో పాటు పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి జిల్లా ప్రజలు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 13 మంది పోలీస్‌ సిబ్బందికి సేవా పతకాలు అందజేసి అభినందించారు. అలాగే నేరాల నియంత్రణ, నేరస్తుల పట్టివేతలో విశేష కృషి చేసిన 35 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్‌ రావు, ఏఎస్పీ రుత్విక్‌ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్‌, ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ అధికారులు, పోలీసు ముఖ్య కార్యాలయ సిబ్బంది, రిజర్వ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

  • కై లాస్‌నగర్‌: పర్యావరణ వారోత్సవాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. రానున్న వానాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 4 నుంచి 10 వరకు గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి వివిధ అంశాలపై రైతులతో పాటు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్‌, చిత్రు, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

    పోస్టర్‌ ఆవిష్కరణ

    ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్‌ రాజర్షి షా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ రాబిన్‌సన్‌, ఎండీ జావిద్‌ అన్వర్‌ సబీమ్‌, తదితరులు పాల్గొన్నారు.

Komaram Bheem

  • కాగజ్‌నగర్‌టౌన్‌: ఉద్యమంలో అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి గుర్తిసామని ప్రకటించిందన్నారు. ఇందుకు అనుగుణంగా ఉద్యమకారులందరికీ సముచిత గౌరవం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్లు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

  • రెబ్బెన: రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని బెల్లంపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్‌ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లో మంగళవారం సింగరేణి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, ప్రొ.జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేశా రు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గోలేటిలోని ప్రధాన రహదారి, కార్మిక కాలనీల్లో తెలంగాణ రన్‌ నిర్వహించారు. ఇన్‌చార్జి జీఎం మాట్లాడుతూ రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా సింగరేణి బొగ్గు అందిస్తోందని తెలిపా రు. ఉద్యోగులంతా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి భీమన్న స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలతో సేవా సమితి సభ్యులు, అధికా రులు వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం కేక్‌కట్‌ చేశారు. ప్రతిభ చూపిన ఉద్యోగులను శాలువా లతో సన్మానించారు. సేవా సమితి ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధిలో రాణిస్తున్న సభ్యులు, చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి అధికా రుల సంఘం ప్రతినిధి వీరన్న, ఇన్‌చార్జి సేవా అధ్యక్షురాలు నళిని నరేందర్‌, ఏరియా ఇంజినీర్‌ కృష్ణమూర్తి, ఇన్‌చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్‌, పర్సనల్‌ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద నిర్వహించిన ప్రజాపాలన– ప్రగతి బాట సీఎం సభలో ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే అయిన తనపై వివక్ష చూపించారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభు త్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలా మార్చారని, ఎన్నికల హామీలు ప్రశ్నిస్తానని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేను విస్మరించి.. పక్క జిల్లా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుండి, లక్మాపూర్‌ వంతెనలు, కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టుల కాల్వల మరమ్మతులు, మెడికల్‌ కళాశాలలో బోధనా సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, రోడ్ల దుస్థితి గురించి సీఎంకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. ప్రజాధనంతో బహిరంగ సభ నిర్వహించి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని, వీటికి మళ్లీ సీఎం శంకుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నిచారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మ ద్‌, రాజంపేట సర్పంచ్‌ బుర్స పోచయ్య, కౌన్సిలర్లు బాలకృష్ణ, నాగుబాయి, పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌, నాయకులు అన్సార్‌, సాయిశ్రావణ్‌, నిసార్‌, అశోక్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌రూరల్‌: హరితదళం(ఎన్‌జీసీ) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, నీటి వనరుల సంరక్షణ, వర్థ్యాల నిర్వహణ, మొక్కల పెంపకంపై సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. సమ్మర్‌ క్యాంపుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన బాబాసాగర్‌ హెచ్‌ఎం సత్యనారాయణ, పెంచికల్‌పేట్‌ హెచ్‌ఎం నిర్మల, వాంకిడి హెచ్‌ఎం నటరాజుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రకృతిపై బాధ్యతభావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జాతీయ హరిత జిల్లాకోఆర్టినేటర్‌ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

    పోస్టర్‌ ఆవిష్కరణ

    పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11 నుంచి మాస్టర్‌ మైండ్స్‌ గూగుల్‌ మీట్‌ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఆన్‌లైన్‌ తరగతుల ప్రచార పోస్టర్‌ను జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌తో కలిసి ఆవిష్కరించారు.

  • ఆసిఫాబాద్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామ సభల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించాలని, పర్యావరణం, అటవీ శాఖలపై చర్చించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత గురించి ప్రజలకు వివరించాలన్నారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం, మురుగు కాల్వల శుభ్రత, ప్లాస్టిక్‌ వ్యర్థాల తరలింపు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, కేంద్ర ప్రకృతి విపత్తుల ప్రతిస్పందన బృందాలు, రెస్క్యూ బృందాలు సిద్ధం చేసుకోవాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల్లో నాలుగు రోజులపాటు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీఎం సభలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ దండె విఠల్‌ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కెరమెరి మండలం కోఠారిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిపా రు. ఉనికిని కోల్పోతున్నామని, పబ్బం గడుపుకొనేందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలను సీఎంకు విన్నవించామని, త్వరలోనే ఆమోదం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, కౌన్సిలర్లు శారద, జ్యోతి, విజయ్‌కుమార్‌, నాయకులు దస్తగిర్‌, శ్యాంరావు, మెహరాజ్‌ హుస్సేన్‌, శ్రీను, సంతోష్‌ పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగా లను ఎప్పటికీ మరువలేమని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. ప్రజల శాంతిభద్రతల రక్షణకు జిల్లా పోలీసుశాఖ కట్టుబడి ఉంటుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపి ప్రభుత్వ గుర్తింపు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి సేవా పతకాలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్‌) చిత్తరంజన్‌, డీఎస్పీలు అశోక్‌, వహీదుద్దీన్‌ పాల్గొన్నారు.

Peddapalli

  • 7

    బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

    ప్రజాపాలనలో

    ప్రగతి పరుగులు

    జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజరమణారావు తెలిపారు. జిల్లాలోని 547 పాఠశాలల ద్వారా సుమారు 37 వేల మందికి విద్య అందుతోందని ఆయన చెప్పారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో 96 శాతం హాజరు నమోదవుతోందన్నారు.

    రెండోవిడతలో రెండు వేల ఇళ్లు..

    ఇందిరమ్మ తొలివిడతలో జిల్లాకు మంజూరైన 6,451 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.126 కోట్లు జమచేశామని ప్రభుత్వ విప్‌ తెలిపారు. రెండోవిడతలో ప్రతీఅసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల చొప్పున 6 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నామని ఆయన చెప్పారు.

    మహిళలకు ఆర్థిక తోడ్పాటు

    మహిళాశక్తి మిషన్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా 6,851 స్వయం సహాయక సంఘాలకు రూ.454.66 కోట్ల బ్యాంక్‌ లింకేజీ, 1,642 సంఘాలకు రూ.52.90 కో ట్ల సీ్త్రనిధి రుణాలు అందించామని విజరమణారావు అన్నారు. 8,909 సంఘాలకు రూ.18.03 కోట్ల వడ్డీ రాయితీ విడుదల చేశామని, మహిళా సంఘాల ద్వారా 15 అద్దె ఆర్టీసీ బస్సులు, ఒక మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, ఒక పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. రంగంపల్లిలోని వీ–హబ్‌ ద్వా రా 376 మందికి శిక్షణ అందించామని అన్నారు.

    రైతులకు భరోసా

    వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా జిల్లావ్యాప్తంగా 456 మంది రైతులకు రూ.1.92 కోట్ల సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశామని, రైతుభరోసా ద్వారా 1,54,598 మంది రైతులకు రూ. 114.04 కోట్లు విడుదల చేశామని, 2025–26 యా సంగిలో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.767.09 కోట్ల విలువైన 3,23,773 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.

    మోడల్‌ సోలార్‌ గ్రామంగా నందిమేడారం

    పీఎం కుసుమ్‌ పథకం కింద 9.5 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభుత్వ విప్‌ విజరమణారావు చెప్పారు. పీఎం సూర్యఘర్‌ ద్వా రా 1,094 సోలార్‌ రూఫ్‌టాప్‌లను 7.287 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో 9 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, నందిమేడారాన్ని మోడల్‌ సోలార్‌ గ్రామంగా అభివృద్ధి చేస్తూ రూ.51.28 కోట్లతో 1,486 గృహా లు, 628 వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

    నిరుద్యోగులకు అండగా

    మెగా జాబ్‌మేళాల్లో 3,515 మంది యువత పాల్గొనగా 933 మందికి ఉద్యోగ అవకాశాలు లభించా యని విప్‌ అన్నారు. అగ్నివీర్‌ శిక్షణ ద్వారా 47 మంది ఎంపికై నట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి విజయరమణరావు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి పూలమాలలు వేశారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, డీఆర్వో రాజేశ్వరి, మేయర్‌ మహంకాళి స్వామి, మున్సిపల్‌ చైర్మన్లు నూగిళ్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, ఆర్డీ వో గంగయ్య, కలెక్టరేట్‌ ఏవో ప్రకాశ్‌ పాల్గొన్నారు.

    సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి: సంక్షేమం,

    అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ప్రగతిని పరుగులు పెట్టిస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. అదే లక్ష్యంగా జిల్లాను ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన వేడుకలకు విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి తదితర కార్యక్రమాల గురించి వివరించారు.

    అమరుల త్యాగఫలం

    గోదావరిఖని: అమరుల త్యాగాల ఫలితమే తె లంగాణ రాష్ట్ర ఆవిర్బావమని రామగుండం పోలీస్‌కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌లో జాతీయ జెండా ఎగరవేసిన ఆయన.. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడారు. శాంతిభ ద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తోందని అ న్నారు. ఒకప్పుడు సమస్యాత్మకంగా ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని తె లిపారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, గో దావరిఖని, మంచిర్యాల, స్పెషల్‌ బ్రాంచ్‌, ట్రాఫి క్‌ ఏసీపీలు రమేశ్‌, ప్రకాశ్‌, నాగేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, ఏవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పెద్దపల్లి: అగ్నివీర్‌ వాయు విభాగానికి ఎంపికై న యువతులను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అభినందించారు. యువశక్తి ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందిన యువతులు సిలివెరి శ్రీజ, చిప్ప శశివర్షిణి అగ్నివీర్‌ వాయు విభాగానికి ఎంపికయ్యారు. వీరిని కలెక్టరేట్‌లో ఆయన మంగళవారం స న్మానించి మాట్లాడారు. దేశ సేవకోసం భారత సైన్యం, వైమానిక దళంలో చేరడం ఎంతో గౌ రవప్రదమైన విషయమన్నారు. వీరిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో యువశక్తి ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ లెంకల మహిపాల్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

    పోలీసులకు సేవా పతకాలు

    గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనరే ట్‌లోని ఉత్తమ పోలీసు అధికారులు, సిబ్బంది కి సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పతకాలతో సత్కరించారు. ఉత్తమ సేవా పతకం సాధించిన సీసీఆ ర్‌బీ ఎస్‌ఐ మహేందర్‌రెడ్డి, సీసీఎస్‌ మంచిర్యా ల ఎస్‌ఐ డి.లలిత, బెల్లంపల్లి వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ఎస్‌.మహేంద్రపలన్‌, సేవాపతకాలు సాఽఽధించి న సీసీఎస్‌ మంచిర్యాల ఎస్‌ఐ సామ్యూల్‌పాల్‌, మందమర్రి ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌, బెల్లంపల్లి కా ర్‌ ఆర్‌ఎస్‌ఐ ఎస్‌.మల్లేశ్‌, గోదావరిఖని వన్‌టౌ న్‌ ఏఎస్‌ఐ హెచ్‌.వెంకటేశ్వరబాబు, ఏఎస్‌ఐ సీ హెచ్‌ తిరుపతిరెడ్డి, జూలపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.విజేందర్‌రెడ్డి, నీల్వాయి హెడ్‌కానిస్టేబుల్‌ బి.రాజయ్యకు సీపీ పతకాలు అందజేశారు.

    ఎన్టీపీసీ చేతికి ‘బీ–థర్మల్‌’?

    రామగుండం: రెండేళ్ల క్రితం మూతపడిన స్థానిక 62.5 మెగావాట్ల బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ బాధ్యల్ని ఎన్టీపీసీ దక్కించుకున్నట్లు సమాచారం. రామగుండం బీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఢిల్లీలోని కార్పొరేట్‌ కార్యాలయం, ఎన్టీపీసీ–నోయిడా, హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు మంగళవారం ఈ ప్లాంట్‌ను సందర్శించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోది. రామగుండంలోని జెన్‌కో ఇంజినీర్లు వారితో కలిసి పవర్‌ ప్లాంట్‌ ఏరియా, యాష్‌పాండ్‌, కోల్‌ప్లాంట్‌, మార్షలింగ్‌ యార్డు, ఉద్యోగ నివాసాలు తదితర ప్రాంతాలు సందర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై పలుమార్లు జెన్‌కో ఎస్‌ఈని వివరణ కోరగా స్పందించలేదు.

    ఫిట్‌నెస్‌ నిరాకరణ సరికాదు

    జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ – తె లంగాణ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికులను అనారోగ్య సమస్యల సాకుతో ఫిట్‌నెస్‌కు నిరాకరించడాన్ని మానుకోవాలని కాంట్రాక్టు కార్మికుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ పర్మినెంట్‌ టౌన్‌షిప్‌ ధ న్వంతరి ఆస్పత్రిలోని సీఎంవోకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్ట్‌తోపాటు పలు లొకేషన్ల లో అనేకమంది కాంట్రాక్ట్‌ కార్మికులు సంస్థ అ భివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని అ న్నారు. ఐదేళ్లుగా వైద్య పరీక్షల పేరుతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విష యం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని వారు కోరారు.

    క్షయ నిర్ధారణ పరీక్షలు

    పెద్దపల్లిరూరల్‌: కొత్తపల్లి గ్రామంలో మంగళవారం టీబీ నిర్ధారణ పరీక్షలు చేశారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెమడ, చాతీ ఎక్స్‌రే పరీక్షలు చేసి అవసరమైన వారికి పలు సూచనలిచ్చారు.

  • కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌) వైద్యులు జిల్లాలోనే తొలిసారి అత్యాధునిక ఐపీవోఎం(పొత్తికడుపు పొరలో వచ్చే హెర్నియా సమస్య) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గోదావరిఖనికి చెందిన దీప(27) కడుపునొప్పితోపాటు బొడ్డు భాగంలో ఉబ్బుగా కనిపిస్తోందని జీజీహెచ్‌ను ఆశ్రయించింది. వైద్యులు పరీక్షించగా బొడ్డు భాగం పొరలో హెర్నియా సమస్య ఉన్నట్లు తేలింది. ఈనెల 1న ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని వైద్య పరీక్షలు చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం అత్యాధునిక లాపరోస్కోపిక్‌ విధానంలో ఐపీవోఎం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. మంగళవారం డాక్టర్లు మంజూష, అనిల్‌కుమార్‌ పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతమైంది. వైద్యుల్లో లుబ్నా, సందీప్‌, శుభమ్‌, కిరణ్‌తోపాటు ఆపరేషన్‌ థియేటర్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. మత్తుమందు విభాగాధిపతి లక్ష్మీనర్సయ్య నేతృత్వంలో డాక్టర్లు శ్రీనివాస్‌, దినేశ్‌, సంజన, తేజస్విని పేషెంట్‌కు మత్తుమందు సేవలు అందించారు. సాధారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే ఈ తరహా శస్త్రచికిత్స చేస్తారు. దీనిని జీజీహెచ్‌లో విజయవంతంగా పూర్తి చేయడం విశేషమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోనే తొలిసారి ఈ విధమైన శస్త్రచికిత్స నిర్వహించడంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ అరుణ, ఆర్‌ఎంవోలు కృపాభాయి, దండె రాజు తదితరులు వైద్య బృందాన్ని అభినందించారు. ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకుని ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు వివరించారు.

  • జ్యోతినగర్‌: ప్రజల ఐక్యత, పురోగతి, ఆ కాంక్షల స్ఫూ ర్తికి ప్రతీక తె లంగాణ అని ఎన్టీపీసీ జనరల్‌ మేనేజర్‌ ముకుల్‌ రాయ్‌ అన్నారు. పీటీఎస్‌ జ్యోతి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన తెలంగాణ వేడుకల్లో కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సంస్థ పురోగతికి ఉద్యోగులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఎన్టీపీ సీ ఎన్‌బీసీ సభ్యుడు బాబర్‌ సలీంపాషా, ఎన్టీపీసీ కార్మిక యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

    తెలంగాణకు గర్వకారణం

    ఫెర్టిలైజర్‌సిటీ:

    తెలంగాణలోనే ఏకైక యూరి యా ఉత్పత్తి క ర్మాగారం రా మగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ అని ఆ సంస్థ యూనిట్‌ హెడ్‌ ఎస్‌కే జిందాల్‌ అన్నారు. ప్లాంట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు రాష్ట్రాల రైతులకు ఏటా సుమారు 12.7 లక్షల మెట్రిక్‌ టన్నుల నీమ్‌ కో టెడ్‌ యూరియా అందిస్తూ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలుస్తోందని ఆయన తెలిపారు.

    త్యాగధనులను స్మరించుకోవాలి

    పెద్దపల్లిరూర ల్‌: తెలంగాణ ఉద్యమంలో అ నేకమంది అమరులయ్యారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య అన్నారు. స్థానిక బస్టాండ్‌ సమీప అమరవీరుల స్థూపం వద్ద కమిషనర్‌ వెంకటేశ్‌ తదితరులతో కలిసి ఆయన నివాళి అర్పించారు. మున్సిపల్‌ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అనేకమంది పాల్గొన్నారని అన్నారు.

  • పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: సామర్థ్యానికి మించి మట్టి తరలిస్తున్న లారీలను నిమ్మనపల్లి సర్పంచ్‌ వేల్పుల రమేశ్‌ ఆధ్వర్యంలో మంగళవారం అడ్డుకున్నారు. సుమా రు మూడు గంటలపాటు గ్రామస్తులు రో డ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీట రుకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. సామర్థ్యానికి మించి లారీల్లో మట్టి తరలించడంతో రోడ్లు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. దెబ్బతిన్న రోడ్లను మర మ్మతు చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇళ్లకోసం సగం ధరకే ఇటుకలు సరఫరా చేయాలని బట్టీ యజమానులను డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు.

  • కోల్‌సిటీ: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా రామగుండం నగరంలో స్వచ్ఛ తీరు నేరుగా తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) ద్వారా ఇప్సోస్‌ అసెసర్‌ సంస్థ ప్రతినిధు లు ప్రదీప్‌, సాయి, మనీష్‌, ప్రదీప్‌ మంగళవారం బల్దియాకు చేరుకున్నారు. వారంపాటు వీరు పర్యటించనున్నారు. తొలిరోజు ఎస్‌ఎల్‌పీ(సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రేస్‌)పై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఎస్‌ఎల్‌పీకి 10,500 మా ర్కులు ఉంటాయి. ఇంటింటా చెత్త సేకరణ, తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న వైనంతోపాటు కంపోస్టు యార్డు, డీఆర్‌సీసీ కేంద్రాల పనితీరు, రోడ్ల పరిశుభ్రత, చెత్త వాహనాల వినియోగం తదితర అంశాల పై ఆరా తీశారు. ఇంటింటికీ వెళ్లి శానిటేషన్‌పై పౌ రుల అభిప్రాయాలూ సేకరిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే వివరా లు, ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీరి వెంట ఎన్వరాల్‌మెంట్‌ ఇంజినీరు మధూకర్‌, శ్రీకాంత్‌తోపాటు ఏకో వారియర్స్‌ ప్రతినిధులు ఉన్నారు.

  • పెద్దపల్లిరూరల్‌: యు వతకు కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఉపాధి, ఉ ద్యోగావకాశాలు క ల్పించేలా అనేక చర్య లు చేపట్టిందని పెద్దపల్లి పార్లమెంట్‌ స భ్యుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమాన్‌వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్దపీ ట వేస్తూనే వృత్తినైపుణ్యశిక్షణ ఇప్పించేలా ఏటీసీలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి వివేక్‌ ఆధ్వర్యంలో ఏటీసీల్లో శిక్షణ పూర్తిచేసుకున్న వారికి నేరు గా ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ నేతలు తమ స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని ఎంపీ ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బండారి సునీల్‌గౌడ్‌, సజ్జద్‌, బాలసాని సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

    ప్రహరీ నిర్మాణం ప్రారంభం

    మంథని: మున్సిపల్‌లోని నాలుగో వార్డులో నగరాభివృద్ధి నిధుల ద్వారా చేపట్టనున్న ఖబ్రస్తాన్‌ ప్రహరీ పనులను మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనారిటీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రహరీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఖబ్రస్తాన్‌లో మరిన్ని సౌకర్యా లు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ మద్దికట్ల స్రవంతి, మైనారిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదిరతులు పాల్గొన్నారు.

  • గోదావరిఖని: బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆర్జీవన్‌ జీఎం లలిత్‌కుమార్‌ కోరా రు. జీఎం కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆయన.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమా ల వేశారు. అనంతరం మాట్లాడారు. ఈసందర్భంగా తెలంగాణ రన్‌ నిర్వహించారు. కళకారు ల నృత్యాలు, భవానీపోతురాజుల వేషాలు, మ హిళల డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటం, బ తుకమ్మల మధ్య తెలంగాణ రన్‌ కొనసాగింది. కార్యక్రమంలో క్వాలిటీ జీఎం సుజోయ్‌మజుందర్‌, ఎస్‌వోటూ చంద్రశేఖర్‌, సీఎంవోఏఐ కోలా మల్లేశ్‌, ఏజీఎం రామ్మోహన్‌రావు, ఆంజనేయు లు, ప్రాజెక్ట్‌ అధికారి రమేశ్‌, ఏజెంట్లు రమేశ్‌, శ్రీనివాస్‌, అధికారులు ధనలక్ష్మీభాయి, జితేందర్‌సింగ్‌, వరప్రసాద్‌, పర్సనల్‌ అధికారులు రవీందర్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.

  • జ్యోతినగర్‌: ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ముదిరాజ్‌లను బీసీ ఏ జాబితాలో చేర్చాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ కోరారు. మంగళవారం ఆసిఫాబాద్‌ పర్యటన ముగించుకుని ఎన్టీపీసీ జ్యోతిభవన్‌కు చేరుకున్న ఆయన.. పలువురు నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోనే తమది అత్యధిక జనాభా అని అన్నారు. నాయకులు బల్ల సత్తయ్య, పిల్లి శివయ్య, సోమన్న, పిడుగు కృష్ణ ముదిరాజ్‌, దబ్బెట శంకర్‌ ముదిరాజ్‌, అప్పరాజు ప్రభాకర్‌ ముదిరాజ్‌, గొలుసు జ్యోతి, ముదిరాజ్‌, మంద రాజేశ్‌, రాజు ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Jagtial

  • 7

    బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

    ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించిన 99రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సాగుతోందని మంత్రి న్నారు. పరిశుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, రోడ్డుసేఫ్టీ,సంక్షేమం, పిల్లల భద్ర త, రైతు సంక్షేమం, విద్య వంటి అంశాలు చేపడుతున్నామని వివరించారు.

    మహిళా ఆర్థిక సాధికారతకు కృషి

    ఇందిరా మహిళాశక్తి కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.783.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రూ.793.74 కోట్లు మాఫీ చేశామన్నారు. సీ్త్రనిధి ద్వారా మహిళాసంఘాలకు రూ.80 కోట్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది ధాన్యం ఎక్కువగా పండిందని, అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నామని, రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు.

    సమైక్య భవనాల ఏర్పాటు

    మహిళా సంఘాల అభివృద్ధికి రూ.5 కోట్లతో సమైక్య భవనా లు ఏర్పాటు చేసి, 1,18,448 యూనిఫాం కుట్టించే బాధ్యత ఇచ్చామని తెలిపారు. మహాలక్ష్మీ పథకాన్ని 7.69 లక్షల మంది సద్వినియోగం చేసుకున్నారని, వారికి రూ.318.99 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500 సబ్సిడీతో 1,98,417 గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 2,10,376 విద్యుత్‌ కనెక్షన్లకు రూ.167.11కోట్లు చెల్లించామని వివరించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 13 వేల మందికి రూ.36.23 కోట్లు అందించామన్నారు.

    గర్భిణులకు పౌష్టికాహారం

    గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో 1065 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 11,758 మంది గర్భిణులు, బాలింతలు 30,282తోపాటు 14,102 మంది పిల్లలకు నాణ్యతా ప్రమాణాలతో పోషకాహారం అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు రిట్రో మోటా ర్‌ వాహనాలు, ల్యాప్‌ టాప్‌లు, బ్యాటరీ ఆపరేటెడ్‌ వీల్‌చైర్లు, స్మార్ట్‌ ఫోన్లు, హైబ్రిడ్‌ వీల్‌చైర్లు వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. వృద్ధుల సంక్షేమానికి 50 పడకల సదనాన్ని రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు.

    అర్హులందరికీ ఇళ్లు

    జిల్లాలో 10,860 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 7,745 మంది నిర్మాణానికి ముందుకొచ్చారని, ఇందులో 1274 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 45,617 కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా 3,52,072 కుటుంబాలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేశామన్నారు.

    మైనార్టీల సంక్షేమానికి..

    మైనార్టీల సంక్షేమంలో భాగంగా మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మందికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన కింద 76 మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. షాదీముబారక్‌ కింద రూ.5.56 కోట్లు ఇచ్చామన్నారు.

    పకడ్బందీగా భూభారతి

    భూభారతి చట్టాన్ని పకడ్బందీగా చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే నక్ష లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టామన్నారు. అనంతరం 735 స్వయం సహాయక సంఘాలకు రూ.73.50 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 46 స్వయం సహాయక సంఘాలకు రూ.6.09కోట్ల చెక్‌ అందించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, గ్రంథాలయ సంస్థచైర్మన్‌ సంగనభట్ల దినేశ్‌, ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    అర్హులందరికీ

    పథకాలు

    జగిత్యాల: రాష్ట్రాన్ని అగ్రగామిగా

    నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో ముందుకెళ్తున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్‌ ఎంటర్‌పైజెస్‌ మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే

    లక్ష్యమని తెలిపారు.

    విద్యారంగానికి పెద్దపీట

    విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రీప్రైమరి నుంచి ఇంటర్‌ వరకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరు చేశామన్నారు. షెడ్యూల్‌ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో వసతిగృహాలను నిర్వహించడంతోపాటు.. వారికి కాస్మోటిక్‌ చార్జీలు పెంచామన్నారు.

    రైతును రాజు చేస్తాం..

    రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకం కింద 2.30లక్షల మందికి 166.16 కోట్లు వారివారి ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు సలహాలు అందించేందుకు శాస్త్రవేత్తలచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు.

    ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం

    ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని, జిల్లాకేంద్ర ఆస్పత్రిలో 5,056 ప్రసవాలు కాగా.. అందులో 1384 సాధారణ, 3,672 సిజేరియన్‌ ఉన్నట్లు తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద 1,07,065 మందికి రూ.49.21కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేశామన్నారు.

  • జగిత్యాల క్రైం: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉంటూ.. సాధారణ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం అమరువీరుల స్తూపానికి నివాళి అర్పించారు. డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు పాల్గొన్నారు.

    కొండగట్టులో భక్తుల రద్దీ

    మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి ఆర్టీవోలు శ్రీనివాస్‌, రవీంద్రకుమార్‌, రంజిత్‌, ఎంవీఐలు మార్గం రవీందర్‌, కోల రవీందర్‌, కిశోర్‌ రెడ్డి, అభిలాష్‌ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

    దరఖాస్తులు ఆహ్వానం

    జగిత్యాల: జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 69 ప్రీప్రైమరీ పాఠశాలల్లో టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. 69 టీచర్లు, 69 ఆయా పోస్టులున్నాయని, టీచర్‌ పోస్టులకు ఇంటర్‌ అర్హత అని, నెలకు రూ.8వేల వేతనం, ఆయా పోస్టులకు ఏడో తరగతి అర్హత అని, నెలకు రూ.6వేల వేతనం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు మాత్రమే అర్హులని, ఈనెల ఆరో తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.

    ఉద్యోగుల ఆశ నిరాశ

    జగిత్యాల: పీఆర్సీ, పెండింగ్‌ డీఏలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల ఆశ నిరాశ అయిందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్‌, శివరామకృష్ణ అన్నారు. సంఘం కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల త్యాగాల ఫలితమే రాష్ట్రమని, నిరుద్యోగం దూరమవుతుందని, జీవితాలు మెరుగుపడతాయని ఆశపడితే నిరాశే ఎదురైందన్నారు. మూలవేతనంలో 1.5 శాతం కోత విధించడం సరికాదన్నారు. నెల జీతంలో ఉచిత కోత విధిస్తూ ఉచిత ఆరోగ్య కార్డులని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్‌ మాట్లాడుతూ స్వయాన సీఎం పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు మేకల ప్రవీణ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

    బహ్రెయిన్‌లో ఆవిర్భావ వేడుకలు

    రాయికల్‌: బహ్రెయిన్‌ ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అండాలస్‌ గార్డెన్‌లో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అధ్యక్షులు రాధారపు సతీష్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు వెంకటేష్‌ బొలిశెట్టి, జనరల్‌ సెక్రటరీలు అన్నారం సుమన్‌, చెన్నమనేని రాజేందర్‌, కార్యదర్శుల సంగేపు దేవన్న, సంకోజీ రాణాప్రతాప్‌, ప్రమోద్‌, వంశీ, రా ము, కస్తూ రి కిరణ్‌, నర్సింహచారి పాల్గొన్నారు.

  • ● కొండ్రికర్లలో పెన్షన్ల మార్పిడికి వసూళ్లు

    మెట్‌పల్లిరూరల్‌: ‘చేయూత పెన్షన్ల మార్పిడికి డబ్బులు వసూలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చేయాలి. కానీ.. మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలో ఒక్కో పెన్షన్‌దారు నుంచి పంచాయతీ సిబ్బంది రూ.200 వసూలు చేశారు. ఈ వసూళ్ల వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మెట్‌పల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ ఆరా తీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజును ఆదేశించారు. మరోవైపు వసూలు చేసిన డబ్బులను కారోబార్‌ వినోద్‌ పెన్షన్‌దారుల ఇంటింటికి వెళ్లి తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. గ్రామంలో 400కు పైగా పెన్షన్లు ఉండగా.. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

    ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు చేయూత

    రాయికల్‌: ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన మండలంలోని భూపతిపూర్‌కు చెందిన న్యాతగిరి సంజన, రాజ్‌దీపక్‌కు అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రూ.30 వేలు ఆర్థిక సహాయం పంపించారు. ఈనెల ఒకటిన ‘సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీ కటాక్షం’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అసోసియేషన్‌ సభ్యులు రూ.30వేలు పంపించగా.. వాటిని గ్రామస్తుల సమక్షంలో విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గుర్రం భావన, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు ముత్యంరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ మహేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్‌ జక్కుల చంద్రశేఖర్‌, నాయకులు జక్కుల ప్రసాద్‌, అన్నవేని వేణు, రాము, శేఖర్‌, సాగర్‌, విష్ణు, మహేశ్‌, ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణి, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, కూరగాయల సురేశ్‌ పాల్గొన్నారు.

  • జగిత్యాల: ‘సర్కారు ఆస్పత్రిలో కార్పొరేట్‌కు ధీటుగా సౌకర్యాలున్నాయి.. మెరుగైన వైద్యం పొందండి..’ అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. వైద్య సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. జగిత్యాల పట్టణానికి చెందిన గంగరాజం ఇటీవల ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి బంధువులు జిల్లాఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో వైద్యులు లేరని, ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆరోగ్యశ్రీ ఉండడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రి వేసిన బిల్లుతో ఆందోళన చెంది.. తిరిగి సర్కారు ఆస్పత్రికే చేరారు. చికిత్స చేయాల్సిన సిబ్బంది మళ్లీ పాత సమాధానమే చెప్పారు. ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గత్యంతరం లేక సదరు కుటుంబం ఓ ప్రైవేటు అంబులెన్స్‌ను మాట్లాడుకుని కరీంనగర్‌ బయల్దేరారు. అయితే జగిత్యాల శివారుకు చేరగానే అంబులెన్స్‌ను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో గంగరాజం భార్య మంజుల చేయికి గాయమైంది. వెంటనే భార్యాభర్తలిద్దరినీ మళ్లీ జిల్లా ఆస్పత్రికే తీసుకొచ్చారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్‌ఎంవో విజయ్‌రెడ్డిని వివరణ కోరగా.. గాయం పెద్దది కావడంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని ఎవరికీ సూచించలేదని, ఎవరు చెప్పారో చెబితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

  • జగిత్యాల: మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యమని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1969 నుంచి మొదలుకుని అనేక ఉద్యమాలు చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. క్రికెటర్‌గా కెరీర్‌ ప్రారంభించి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైజింగ్‌ తెలంగాణ పేరుతో ముందుకు సాగుతూ మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పారు. జిల్లాలోని మైనార్టీ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈద్గా, ఖబ్రస్థాన్‌ ఏర్పాటుపై కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయికి ఎదిగేలా కృషి చేస్తానన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అజారుద్దీన్‌ క్రీడాకారుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రులు, ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు.

  • జగిత్యాల/జగిత్యాలక్రైం: రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన మంత్రి అజారోద్దీన్‌ను మంగళవారం ఎస్పీ అశోక్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం మంత్రి డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి కుమారుడు ముస్కు సిద్దార్థ్‌ రెడ్డిని అభినందించారు. సిద్దార్థ్‌ రెడ్డి ఇటీవల జరిగిన అండర్‌–11 క్రికెట్‌ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చాడు. క్రీడలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే అద్భుతమైన ఆట తీరు కనబర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంత్రిని పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, యాళ్ల అమర్‌నాథ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

    మల్లాపూర్‌ ఏడీఈకి ఉత్తమ ప్రశంసపత్రం

    మల్లాపూర్‌: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వరంగర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో మల్లాపూర్‌ ఏడీఈ అమరేందర్‌కు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందించారు. ఇదే స్ఫూర్తితో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

Movies

  • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను సినీ హీరో విజయ్‌ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్‌కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  

    విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.  

    ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్‌ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు.  

    ‘కరుప్పు’ కథను మొదట విజయ్‌కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది.

  • టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి నారపల్లి దివ్యనగర్‌‌లోని శివ పంచాయతన సమేత హనుమదాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు పఠిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం గురించి తెలుసుకున్న తనికెళ్ల భరణి ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

  • కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో ప్రస్తుతం టాక్సిక్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ జూన్‌లో రిలీజ్‌ కావాల్సి ఉండగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న రామాయణలోనూ యశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

    సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యశ్ తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక అభిమాని సునీల్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతనిలో ధైర్యం నింపారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అభిమాన హీరో మాట్లాడడంతో క్యాన్సర్ బాధితుడు ఆనందం వ్యక్తం చేశారు. యశ్ ఆత్మీయ సంభాషణ అతనిలో కొత్త భరోసాను తీసుకొచ్చింది.

    y

    క్యాన్సర్‌తో పోరాడుతున్న సునీల్  శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు కావడం విశేషం.  అతనికి చికిత్స సమయంలో అండగా ఉంటానని కూడా యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎంత బిజీగా ఉన్నా తన అభిమానితో వీడియో కాల్ చేసి మాట్లాడటంతో యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
     

  • ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా ఇచ్చి ఇలా వెళ్తున్నాయి. థియేటర్ నుంచే మాయం కాగానే సడన్‌గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రిలీజైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలు కేవలం వారాల్లోపే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే యూట్యూబ్‌లోకి వచ్చేసింది. ఉచితంగానే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. 

    సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం అరేయ్ ఆపండ్రా.  మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించారు.  ఈ సినిమా కి ఎస్.ఎస్ వెంకటేశ్ సంగీతమందించారు.

  • బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్‌సీన్‌ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.

    ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్‌ ఎటాక్‌ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్‌లోనే అర్థమవుతోంది. కాగా..  ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్ది ప్రీమియర్స్‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచే  ప్రీయమర్ షోలు షురూ కానున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత పెద్ది మూవీపై అంచనాలు ఓ రేంజ్‌కు దూసుకెళ్లాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఈ మూవీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతులిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకునేలా జీవో జారీ చేసింది. ఈ ధరలు రిలీజైన రోజు నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. మరోవైపు ప్రీయమిర్స్ టికెట్ ధరను ఏకంగా రూ.600గా నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

    ఇక తెలంగాణ విషయానికొస్తే పెద్ది టికెట్ ధరల పెంచేందుకు అనుమతులు రానట్టేనని తెలుస్తోంది. టికెట్ రేట్లపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. రేపటిలోగా ఎలాంటి ప్రకటన రాకపోతే సాధారణ రేట్ల‌తోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని పెద్ది టీమ్ భావిస్తోంది. దీంతో రేపటి నుంచే తెలంగాణలో పెద్ది మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభించే అవకాశముంది. మరోవైపు  పెద్ది ప్రీమియర్స్ సైతం తెలంగాణలో లేనట్టేనని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. 

  • ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌ తీసుకొని ‘పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ఈ మూవీ ఈనెల 4న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    ‘పెద్ది’ ఎలా మొదలైంది?
    నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు ఐదేళ్లకు పెద్దితో వస్తున్నాను. సాధారణంగా ఇండస్ట్రీలో ఒక బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడికి ఐదేళ్ల సమయం పట్టడం జరగదు. కానీ నా విషయంలో అలా జరిగింది (నవ్వుతూ). మా గురువుగారు సుకుమార్  నన్ను చరణ్ గారి దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. చరణ్ గారికి నచ్చింది. ఉప్పెన తర్వాత చరణ్ గారి దగ్గరకు వెళ్లడానికే నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

    ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సినిమా కదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
    ఇందులో హీరో క్రికెట్‌తో పాటు మరో రెండు ఆటలు కూడా ఆడతాడు. దాని కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం.క్రికెట్ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రామ్ చరణ్  ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహల్వాన్ శిక్షణ తీసుకున్నారు.

    పెద్ది  విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం కదా?
    ఏ సినిమా సక్సెస్ అయినా ఇండస్ట్రీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్‌ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా ఇండస్ట్రీ పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్ కి వచ్చారు. పెద్ద హిట్ ఇచ్చారు.

    ‘పెద్ది’ కథ ముందు ఎన్టీఆర్‌ కోసం రాసుకున్నారా?
    లేదు. ఎన్టీఆర్ గారి కోసం అనుకున్న కథ వేరు. పెద్ది కథ వేరు. ఇది పూర్తిగా చరణ్ గారి కోసం  తయారు చేసిన కథ.

    చరణ్ ని అంత ఈజీగా ఎలా కన్విన్స్ చేశారు?
    అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్ చేశాను. చరణ్ ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్ధం చేశాం.

    జాన్వీ కపూర్‌ పాత్ర ఎలా ఉంటుంది?
    జాన్వి కపూర్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కలర్ తీసుకొచ్చారు. లవ్ ట్రాక్‌లో చాలా బాగుంటారు. జాన్వి చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్ పర్సన్. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. చాలా వినయంగా ఉంటారు.

    శివరాజ్‌ కుమార్‌, జగపతి బాబు పాత్రల గురించి చెప్పండి
    ఇందులో శివన్న  ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు  అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా చాలా క్రేజీగా ఉంటుంది.

    రెండో సినిమాకే రూ. 350 కోట్ల బడ్జెట్‌.. ఎలా అనిపిస్తోంది?
    ఇది చరణ్ గారి వల్లే సాధ్యమైంది. హీరోని బట్టి సినిమా తయారయ్యే విధానం మారుతుంది. ఇదే కథను రూ.20 కోట్లలో తీయాలనుకుంటే కథకు కావాల్సినవి జరగకపోవచ్చు.

    ఈ సినిమాలో 'అబ్బనీ తీయని దెబ్బ' పాటను రీక్రియేట్ చేశారని విన్నాం?
    లేదు. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకులు కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి దాన్ని కూడా మ్యూట్ చేసేశాం.

    ఏఆర్ రెహమాన్ గారి గురించి?
    నాకు రోజా, బొంబాయి..  రెహమాన్ గారి ఆల్బమ్స్ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలని ఎప్పటినుంచో కల కన్నాను. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం వచ్చింది. ఆయన పాటలను స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను.ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు ఉన్నాయి. ఆ రెండు కూడా అదిరిపోతాయి.

    మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు ‘పది కేజీఎఫ్‌లతో సమానం’ అన్నారు. మరి పెద్ది గురించి?
    పుష్పరాజ్ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు(నవ్వుతూ..)

    షూటింగ్‌ సమయంలో చరణ్‌కు చాలా గాయాలయ్యాయని విన్నాం?
    అవును. ముఖ్యంగా రెజ్లింగ్ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం నాకు చాలా భయమేసింది. చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఒక ఫైట్ సీన్‌లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు "బుచ్చి వీడియో పంపించు" అన్నారు (నవ్వుతూ).

    చరణ్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి?
    పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది.

    క్లైమాక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అది ఎలా ఉంటుంది?
    ఒక కమర్షియల్ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారు.

    చిరంజీవి గారు సినిమా చూశారా?
    -ఇంకా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్ ఒక సీక్వెన్స్ చూశారు. చాలా ఎమోషనల్ అయ్యారు.

    పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే?
    ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా ఉంటుంది. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో చరణ్ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.

  • పెద్ది సినిమా అనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచి అంచనాలు పెంచుతూనే ఉంది. రామ్‌ చరణ్‌ లుక్‌ రిలీజ్‌, గ్లింప్స్‌తో పాటు పాటలు కూడా ఆ అంచనాలు భారీగా పెంచాయి. అయితే ట్రైలర్‌ మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభించింది. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బుచ్చిబాబు దగ్గర ప్రస్తావించాడు ఓ విలేకరి. దానికి బుచ్చిబాబు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.

    ‘కథను ఎక్కువగా చెబితే అసలు విషయం తెలిసిపోతుంది. అందుకే ట్రైలర్‌ని అలా కట్‌ చేశాం. అసలు కంటెంట్‌ని తీసుకోలేదు కాబట్టి.. ట్రైలర్‌లో చెప్పాల్సినంత చెప్పలేకపోయాం. అయితే ఒకప్పుడు ఘన విజయం సాధించిన చిత్రాల ట్రైలర్లన్నీ యావరేజ్‌ టాకే సంపాదించుకున్నాయి(నవ్వుతూ..). ఈ లెక్కన పెద్ది కూడా సరైన దారిలోనే వెళ్తుందేమో అనిపిస్తుంది’ అని బుచ్చిబాబు అన్నారు. 

    ఇక రిలీజ్‌ దగ్గరపడుతున్నకొద్ది తనకు టెన్షన్‌ ఎక్కువైపోయిందన్నారు. మరికొన్ని గంటల్లో(జూన్‌ 4) ప్రేక్షకుల ముందుకు రానుందని, హిట్‌ టాక్‌ వస్తే హ్యాపీగా ఫీలవుతానని బుచ్చిబాబు చెప్పారు. ఇక తన కొత్త సినిమాల గురించి చెబుతూ..అల్రెడీ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. మూడో సినిమా ఎన్టీఆర్‌తోనే చేస్తారా అని అడగ్గా.. ‘ఆయన టైమ్‌ ఇవ్వాలనే కానీ క్షణాల్లో వెళ్లి కథ చెబుతా’ అన్నారు. 

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ మూవీస్‌ ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రాల ద్వారా ఎంతోమంది నటులు ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా దురంధర్‌ మూవీతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ మూవీతో ఫేమస్ అయిన నటుడు గౌరవ్ గెరా తన లైఫ్‌ గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.

    ముంబయిలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని గౌరవ్ గెరా వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఎదురైనట్లు వివరించారు. తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 84 మాత్రమే ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఆటో ఛార్జీకి కూడా డబ్బులు చెల్లించలేక రోజు చాలా దూరం నడిచి వెళ్లేవాడినని తెలిపారు. 'ధురందర్: ది రివెంజ్ సూపర్ హిట్‌ కొట్టినా.. ఆ కష్టకాలం తనను ఎలా ఒదిగి ఉండేలా చేసిందన్నారు.

    తన తండ్రి మద్దతుగా నిలిచారని గౌరవ్ గెరా గుర్తు చేసుకున్నారు. మా నాన్న జీతం తీసుకునే ఉద్యోగి.. ఆయన ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయని.. వాటిలో రూ. 2,000 పంపిస్తున్నాను.. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని రాసి ఉండేదని గెరా తెలిపారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తనకు ఎప్పుడూ పెద్ద భారంలా అనిపించలేదన్నారు. ఆటోకు డబ్బులు లేనప్పుడు.. తాను నడిచి వెళ్లడానికే ఇష్టపడేవాడినని తెలిపారు. తాను ఎప్పుడు తీసుకునేవాడిగా కాకుండా.. ఇచ్చేవాడిగా ఉండాలనుకున్నానని పేర్కొన్నారు.

    కాగా.. ధురంధర్ ఫిల్మ్ సిరీస్‌లో గౌరవ్ గేరా.. మహమ్మద్ ఆలం (ఆలం భాయ్‌)గా నటించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, మానవ్ గోహిల్, డానిష్ పండోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్‌ సినిమాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
     

  • ​సాధారణంగా ఒక సంగీత దర్శకుడి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉంటేనే గొప్ప విషయం. కానీ, తన అద్భుతమైన టాలెంట్‌తో ఏకంగా 8 సినిమాలకు ఒకేసారి సంగీతం అందిస్తూ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి దారి తీస్తున్నారు ప్రముఖ సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. వెంకటేష్. ​గతంలో ఎన్నో చిత్రాలకు తన అద్భుతమైన సౌండ్ డిజైనింగ్‌తో ప్రాణం పోసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. ఒకేసారి విభిన్న జానర్స్‌లో తెరకెక్కుతున్న చిత్రాలకు ఆయన ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం విశేషం. ​ప్రస్తుతం ఆయన చేతిలో ​ది ఫైనల్ కాల్,​హనుమ,​అపరిచిత దారి,​చెట్టు మీద దెయ్యం నాకేం భయం,​నడికట్టు,​సువార్తపురం స్టూడెంట్స్(VS -1), ​స్పిరిట్,​ప్రేమ తీరం చిత్రాలు ఉన్నాయి.

    ​బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడమే నా లక్ష్యం 
    ఈ అరుదైన లైనప్ పై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నాపై నమ్మకంతో ఏకకాలంలో ఇన్ని సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క దర్శక నిర్మాతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ప్రతి చిత్రానికీ 100% బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తాను. మంచి కంటెంట్, సినిమా మీద ప్యాషన్‌తో వచ్చే ప్రతి ఫిల్మ్ మేకర్‌కు మా స్టూడియో ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. వారికి అత్యుత్తమ టోటల్ ఆడియోగ్రఫీ సేవలను అందిస్తాం" అని ఆయన భరోసా ఇచ్చారు.

  • బాలీవుడ్ స్టార్ జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తమ బంధువుల పెళ్లి వేడుకలో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో దీపికా భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. రణవీర్ ఎరుపు రంగు కుర్తా పైజామాలో కనిపించగా.. దీపిక కలర్‌ఫుల్ సంప్రదాయ చీరలో మెరిసింది.  ఇది రణ్‌వీర్ సింగ్ కజిన్‌ వెడ్డింగ్‌ అని తెలుస్తోంది. 

    దీపిక- రణ్‌వీర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వీరిద్దరు తమ రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. ఇటీవలే తమ కుమార్తె దువాతో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ జంట నవంబర్ 2018లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు 2024లో దువాకు స్వాగతం పలికారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపిక అట్లీ దర్శకత్వం వహిస్తోన్న 'రాకా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, రణ్‌వీర్ సింగ్ సైతం కల్యాణి ప్రియదర్శన్‌తో కలిసి జాంబీ అడ్వెంచర్ చిత్రం 'ప్రళయ్'లో నటించనున్నారు. అయితే 'డాన్ 3' నుంచి రణ్‌వీర్ తప్పుకుంటున్నారనే వార్తలొచ్చాయి. ఇటీవలే దురంధర్‌ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్‌ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. 
     

     

  • ‘పెద్ది’ షూటింగ్‌ సమయంలో రామ్‌ చరణ్‌ పలు సార్లు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అవన్నీ బయటకు రాలేదు కానీ..కంటికి గాయమైన  విషయం మాత్రం క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడు ఆందోళ చెందారు. చివరకు చిరంజీవి స్పందిస్తూ.. చిన్న సర్జరీ మాత్రమే జరిగిందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆందోళన చెందాడట. అంతేకాదు ఈ విషయం చిరంజీవికి తెలిస్తే ఎంత తిడతాడేమోనని భయపడ్డాడట. కానీ చిరంజీవి మాత్రం ఒక్కమాట కూడా అనలేదని బుచ్చిబాబు చెప్పాడు.

    తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. రామ్‌ చరణ్‌ కంటికి గాయం ఎలా గాయం అయిందో వివరించాడు. ‘ఫైట్‌ సీన్‌ షూటింగ్‌ సమయంలో చరణ్‌ కంటికి గాయం అయింది. కింద ఉన్న ఫైటర్‌ ఒక్కసారిగా లేవడంతో పైన ఉన్న చరణ్‌ కంటికి దెబ్బతాకింది. చాలా రక్తం పడిపోయింది. భయపడిపోయా. ఈ విషయం చిరంజీవి తెలిస్తే ఎంత తిడతాడేమోనని టెన్షన్‌ పడ్డా. భయంతోనే చిరంజీవికి కాల్‌ చేసి మాట్లాడా. అయితే ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా ‘ఆ వీడియో ఉంటే పంపు బుచ్చిబాబు’ అన్నాడు. అది విని నేనే షాకయ్యా’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.

  • రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్‌గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్‌టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సీన్స్‌ ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  రిలీజ్ కానుంది.  దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్‌టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 
     

Politics

  • కోల్‌కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్‌కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.

    అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.

    ఎస్ప్లనేడ్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

    మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

    శోభన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.

    అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.

    మొదట ఎస్ప్లానేడ్‌లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్‌కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్‌ పాలిటిక్స్‌తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 

    “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.

    కోల్‌కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.  

  • కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ​50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్‌ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

    కోల్‌కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

    వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్‌ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్‌ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్‌లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్‌లో “మహారాష్ట్ర మోడల్‌” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్‌ను కలవనున్నారని కూడా చెప్పారు.

    బెంగాల్‌లో మహారాష్ట్ర నమూనా?
    బెంగాల్‌లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్‌దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు.
     

National

  • తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బిందు అనే మహిళకు ఉద్యోగ జీవితంలో చివరి రోజున ఊహించని అనుభవం ఎదురైంది. 2026 మే 30న ఆమె చివరి పని దినం. ఇన్నేళ్లు సేవలు అందించిన ఆమెకు సహోద్యోగులు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పదవీ విరమణకు సంబంధించిన ప్రక్రియలు పూర్తిచేసిన కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆశ్చర్యకరమైన సమాచారం అందింది.

    సాయంత్రం 5 గంటల సమయంలో కళాశాల నుంచి బయలుదేరి, 5.30 గంటలకు ఇంటికి చేరుకున్న బిందుకు వాట్సాప్ ద్వారా సందేశం వచ్చింది. అందులో ఆమెకు పదోన్నతి కల్పించి, త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా నియమించినట్టు పేర్కొన్నారు. మరుసటి రోజే విధుల్లో చేరాలని కూడా ఆదేశించారు.

    ఈ పదవి సాంకేతిక విద్యాశాఖ పరిపాలనా విభాగంలో ఉన్నత హోదా. సాధారణంగా ఇలాంటి నియామకాలు, పదోన్నతి ఉత్తర్వులు ఈ-ఆఫీస్ వ్యవస్థ ద్వారా జారీ అవుతాయి. అయితే నిర్ణయం చివరి క్షణంలో తీసుకోవడంతో వాట్సాప్ ద్వారా సమాచారం పంపించారు.

    తాను స్వస్థలం చేర్తలాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమాచారం రావడంతో ఆమె ప్రణాళికలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మరో సమస్య ఎదురైంది. మే 31 ఆదివారం కావడంతో కొత్త ఉద్యోగంలో అధికారికంగా ఎలా చేరాలనే ప్రశ్న తలెత్తింది.

    బిందు వెంటనే తిరువనంతపురంలోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్‌ను సంప్రదించారు. అనంతరం త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. అప్పటికే ఆమె నియామకంపై డైరెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు చేరాయి. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా తెలియజేశారు.

    స్వస్థలానికి వెళ్లేందుకు బిందు ముందుగానే మావేలి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే చేర్తలాలో దిగకుండా త్రిస్సూర్‌లో దిగారు. అక్కడ ఒక బంధువు రైల్వే స్టేషన్ వద్ద ఆమెను తీసుకెళ్లి బస ఏర్పాట్లు చేశారు.

    సూపరింటెండెంట్ సూచనల మేరకు ఆదివారం ఉదయం ఒక క్లర్క్ ప్రత్యేకంగా కళాశాలకు వచ్చి కార్యాలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు బిందు త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆమె ఉద్యోగ సర్వీసు అధికారికంగా ముగిసింది. దీంతో ఆ పదవి నుంచి కూడా విరమించారు.

    అలాగే, 24 గంటల్లోనే బిందు రెండు సార్లు పదవీ విరమణ చేసిన అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. మొదట కన్నూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అకౌంట్స్ అధికారిగా, ఆ తర్వాత త్రిస్సూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు.

    పదోన్నతి వస్తుందని బిందు ఆశించినప్పటికీ, ఉత్తర్వులు ఆలస్యం కావడంతో మే మధ్య నాటికే ఆశలు వదులుకున్నారు. అయితే చివరి క్షణంలో పదోన్నతి రావడంతో, ఆ హోదాతోనే పదవీ విరమణ చేయగలిగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. లలిత అంబికా దేవి, దివంగత రామచంద్ర పణిక్కర్ దంపతుల కుమార్తె అయిన బిందు, చేర్తలాలోని పట్టణక్కడ్‌లో నివసిస్తున్నారు. ఆమె భర్త అనిల్ కుమార్ రిటైర్డ్ సైనిక అధికారి. వీరికి వైశాఖ్, డాక్టర్ వైష్ణ శ్యామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

  • గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీ కొని మంటలు చెలరేగాయి. దీంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదస్థలి వద్ద పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. 

    ఘోరంగా ఢీకొన్న ఈ రెండు బస్సులు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినవే. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. సూరత్‌లోని బార్డోలీ తాలూకా ఉవా గ్రామం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.

    ఈ ప్రమాదంలో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మరో బస్సు బోల్తాపడింది. అందులో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

    ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి ధూలే-సూరత్‌ మార్గంలో నడుస్తోంది. ఈ బస్సు ధూలే నుంచి నందుర్‌బార్‌, నవాపూర్‌ మీదుగా సూరత్‌కు వెళ్తోంది. మరో బస్సు గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది. 

    ఒక బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో అది డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ప్రమాదాన్ని తప్పించుకునే ప్రయత్నంలో పక్కకు మళ్లింది. అయితే ఆ క్రమంలో బస్సు బోల్తాపడింది. బోల్తాపడగానే మంటలు అంటుకున్నట్టు సమాచారం.  

  • తిరుచ్చి: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి నలుపు-తెలుపు సూట్‌లోనే క‌న‌బ‌డుతున్నారు జోస‌ఫ్ విజ‌య్‌. ఇంత‌కుముందు ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన వారి వ‌స్త్ర‌ధార‌ణ‌కు భిన్నంగా మోడ్ర‌న్‌గా క‌నిపించ‌డంతో జ‌న‌మంతా ఆస‌క్తిక‌రంగా ఆయ‌న‌ను గ‌మ‌నిస్తున్నారు. సీఎం విజ‌య్ వ‌స్త్ర‌ధార‌ణ‌పై సోష‌ల్ మీడియాలో చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంత‌మంది నాయ‌కులు విజ‌య్ వ‌స్త్ర‌ధార‌ణ‌పై విమ‌ర్శ‌లు కూడా చేశారు. తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలకు సీఎం విజయ్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు.

    తిరుచ్చి సభలో ఆయ‌న మాట్లాడుతూ.. ‘నేను కోట్‌ సూట్‌ వేసుకోవడం పైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు, మనం సూటుకోటు వేసుకోకూడదా? కేవలం అణచివేసే శక్తులు, అధికారం చెలాయించే వారే సూటుకోటు వేసుకోవాలా? అయినా నేనేమైనా రంగురంగుల సూట్లు వేసుకుంటున్నానా? నా మనసు లాగే కేవలం రెండు రంగులు.. నలుపు, తెలుపు మాత్రమే ధరిస్తున్నాను. నన్ను ట్రోల్‌ చేసేవారికి ఒకటే విన్నపం.. దయచేసి మీ విమర్శలు ఆపకండి. అవే నాకు మరింత శక్తినిస్తాయి. మీరు విమర్శలు చేస్తూనే ఉండండి, నేను ప్రజలకు మంచి చేస్తూనే ఉంటాను’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల విమ‌ర్శ‌లు త‌న ఎదుగుల‌కు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు.

    ఇప్పుడు వార్తలు చూస్తున్నారు
    ఇదివరకు కాల‌క్షేపం కోసం సోషల్‌ మీడియాలో ‘రీల్స్‌’ చూసే జెనరేషన్ తమ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌ న్యూస్‌ ఛానళ్లు చూస్తోంద‌ని విజ‌య్ అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ‘జెన్‌–జీ’ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంద‌న్నారు. వారి కోసం ప్ర‌తిప‌క్షాలు త‌మ ప్రెస్‌నోట్‌ల‌ను తమిళం, ఇంగ్లీష్ భాష‌ల్లో ఇస్తున్నాయ‌ని తెలిపారు.  ఇప్పుడు ప్రజల్లో మార్పు స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని, వారిని త‌క్కువ చేసి చూడొద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తున్నార‌ని, అసెంబ్లీ స‌మావేశాల్లో ఎవ‌రేం మాట్లాడుతున్నారో చూస్తున్నార‌ని చెప్పారు.

Business

  • జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తరచుగా టోల్ ప్లాజాలు దాటే ప్రయాణికుల కోసం యాన్యువల్ పాస్‌తో పాటు మంత్లీ పాస్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

    ఒకే టోల్ ప్లాజా ద్వారా ప్రతిరోజూ ప్రయాణించే స్థానిక ప్రయాణికులకు ఈ మంత్లీ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ మంత్లీ పాస్ అనేది ముందుగానే నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి ఒక నెలపాటు టోల్ ఫీజులో రాయితీ పొందే విధానం. ఈ పాస్ తీసుకున్నవారు ప్రతిసారి సాధారణ టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆయా టోల్ ప్లాజా నిబంధనల ప్రకారం.. నెలలో అపరిమిత ప్రయాణాలు లేదా నిర్దిష్ట సంఖ్యలో ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

    ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌తో పోలిస్తే.. మంత్లీ పాస్ పరిమిత వినియోగానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వార్షిక పాస్ రూ.3,075కు ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా తరచుగా ప్రయాణించే వారికి అనుకూలం. అయితే మంత్లీ పాస్ మాత్రం ఒక నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే వర్తిస్తుంది.

    మంత్లీ పాస్ ఎలా పొందాలి?

    • మంత్లీ పాస్ కోసం ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు IHMCL పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు.

    • అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించిన తరువాత.. మంత్లీ ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్ ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి.

    • తరువాత టోల్ ప్లాజాను ఎంపిక చేసుకుని, క్యాప్చా ఎంటర్ చేయాలి.

    • ఆ తర్వాత FASTag ట్యాగ్ ఐడీ లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి, కావాల్సిన పాస్ రకాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయాలి.

    • చెల్లింపు అనంతరం రసీదు పొందవచ్చు.

    ఆన్‌లైన్ విధానంలో మాత్రమే కాకుండా.. ప్రయాణికులు నేరుగా టోల్ ప్లాజాలో కూడా మంత్లీ పాస్ కొనుగోలు చేయవచ్చు. అయితే పాస్ ధర, ట్రిప్‌ల పరిమితి, నిబంధనలు టోల్ ప్లాజా మరియు సంబంధిత బ్యాంకు ఆధారంగా మారుతాయి.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏది? అనే విషయాన్ని వెల్లడించారు. తనను ప్రతిరోజూ ఒక ప్రశ్న అడుగుతున్నారని, దానికి సమాధానం చాలా సులభమని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    నేను ప్రభుత్వం ముద్రించే డబ్బులో పెట్టుబడి పెట్టను. నేను స్టాక్స్,బాండ్స్, ఈటీఎఫ్స్ కొనను. నా పెట్టుబడులు మొత్తం వ్యాపారాలు, బంగారు గనులు, చమురు బావులు, పశువులపైన ఉంటాయి. నా పశువులు కూడా డబ్బు సంపాదించి పెడతాయి. అవి పిల్లలను కన్న ప్రతిసారీ, నాకు రాబడి పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు.

     
     

    ధనవంతులు ఎప్పుడూ కూడా నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు. అంటే వారు ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టతారన్నమాట. ప్రభుత్వం కేవలం డబ్బును ముద్రించగలదు. కానీ.. గోల్డ్, ఆయిల్, పశువులు వంటివాటిని ముద్రించలేదు. కాబట్టి ఇవే నిజమైన విలువైన ఆస్తులు. కాబట్టి డబ్బును నిజమైన ఆస్తుల్లో పెడుతున్నారా, లేదా ప్రతిరోజూ కొత్తగా ముద్రితమవుతున్న డాలర్లను ధనంగా పరిగణించే సిస్టమ్‌పై నమ్మకం పెడుతున్నారా? అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉందని కియోసాకి వెల్లడించారు.

    గోల్డ్, చమురు, పశువులపై పెట్టుబడి పెట్టడానికి డబ్బులేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తక్కువ డబ్బుతో ప్రారభించడం మంచిది. ఉద్యోగం కాదు.. అదనపు ఆదాయం కోసం పనిచేయడం కూడా కాదు. మీరు విశ్రాంతి తీసుకున్నపుడు కూడా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని రిచ్ డాడ్ చెబుతారు.

    ఇదీ చదవండి: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌: వివరాలు లీక్!

  • ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటైన యాపిల్ తన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతకంటే ముందు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీకయ్యాయి.

    సప్లై చైన్ వర్గాలు, సాంకేతిక విశ్లేషకుల సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లో బ్యాటరీ, కెమెరా వంటి వాటిలో మాత్రమే కాకుండా ఏఐ(AI) వంటి వాటిలో కూడా భారీ మెరుగుదలలు ఉండనున్నాయి. అయితే.. రాబోయే ఐఫోన్ గురించి యాపిల్ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

    ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొత్త 2-నానోమీటర్ ప్రాసెసర్, అధిక ర్యామ్ వంటి ఆధునిక భాగాల వలన తయారీ ఖర్చులు పెరిగినా, వాటిలో కొంత భారాన్ని ఆపిల్ స్వయంగా భరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం కెమెరా సిస్టం. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుందని సమాచారం. దీని ద్వారా వినియోగదారులు కెమెరాలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించగలరు. ఫలితంగా ఫోటోలలోని బ్యాక్‌గ్రౌండ్ మీద మరింత నియంత్రణ లభిస్తుంది.

    యాపిల్ కొత్త మూడు లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్ మీద పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ ఫోటోలలో వచ్చే నాయిస్‌ను తగ్గించి మరింత స్పష్టమైన చిత్రాలను అందించగలదు. అల్ట్రా-వైడ్, టెలిఫోటో కెమెరాలు కూడా 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉండే అవకాశముంది. ముఖ్యంగా టెలిఫోటో కెమెరా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మెరుగైన ఫోటోలను అందించేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.

    ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 5100mAh నుంచి 5200mAh వరకు సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది గత మోడల్‌లోని సుమారు 4823mAh బ్యాటరీ కంటే గణనీయమైన పెరుగుదల. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీని అమర్చేందుకు ఫోన్ మందం 8.8 మిల్లీమీటర్ల వరకు పెరగవచ్చని, బరువు సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని అంచనా. అయినప్పటికీ, ఎక్కువ బ్యాటరీ జీవితం కోసం వినియోగదారులు ఈ మార్పును స్వాగతించే అవకాశం ఉంది.

    ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉండవచ్చు. అలాగే.. ప్రస్తుతం ఉన్న డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత చిన్నదిగా చేసే ప్రయత్నంలో యాపిల్ ఉన్నట్లు సమాచారం. కొత్త చిప్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ద్వారా ఫోన్‌లో అదనపు స్థలాన్ని సృష్టించి, అంతర్గత భాగాల సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుందని సమాచారం.

  • ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. దేశీయ విఫణిలో సరికొత్త అవెంజర్ స్ట్రీట్ 220ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ తన స్ట్రీట్ 160 ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత.. ఈ 2026 మోడల్ విడుదల చేసింది.

    2026 బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 బైక్ ఎబోనీ బ్లాక్, కాక్‌టెయిల్ రెడ్ వైన్ అనే రెండు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఎత్తైన హ్యాండిల్‌బార్, ముందుకు అమర్చిన ఫుట్‌పెగ్‌లతో, ఈ మోటార్‌సైకిల్ తన రిలాక్స్డ్ డిజైన్‌ను కొనసాగిస్తూ.. సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను.. దానిపై ఫ్యూయల్ గేజ్‌తో కూడిన ఫ్యూయల్ ట్యాంక్ ప్రత్యేకమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంది.

    అవెంజర్ 220 స్ట్రీట్‌లో 220 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 19 హార్స్ పవర్, 7,000 ఆర్పీఎం వద్ద 17 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది.

    ఈ మోటార్‌సైకిల్‌కు ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన రెండు షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ విధులను ముందువైపు 280 మిమీ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ నిర్వహిస్తాయి. భద్రతను పెంచడానికి, ఈ మోటార్‌సైకిల్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్ (ABS) అమర్చారు.

Sports

  • స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను 200 పరుగులకే ఆలౌట్‌ చేసి, ఆతర్వాత సునాయాస విజయం సాధించిన పాక్‌ జట్టు.. ఇవాళ (జూన్‌ 2) జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్‌పై పట్టు బిగించింది.

    లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన పాక్‌.. ఆసీస్‌ను 231 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిన లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ అరాఫత్‌ మిన్హాస్‌ (10-2-27-2) ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు.

    అరాఫత్‌తో పాటు మరో స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ (10-1-34-2), పేసర్లు షాహీన్‌ అఫ్రిది (8-1-36-3), హరీస్‌ రౌఫ్‌ (10-1-49-2) కూడా రాణించడంతో ఆసీస్‌ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 

    ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లిస్‌ (51), కెమరూన్‌ గ్రీన్‌ (53), మ్యాట్‌ రెన్షా (43), ఒలివర్‌ పీక్‌ (31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అలెక్స్‌ క్యారీ డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ మాథ్యూ షార్ట్‌ 15, లబూషేన్‌ 5, కుహ్నేమన్‌ 5, నాథన్‌ ఇల్లిస్‌ 5 పరుగులకు ఔటయ్యారు.

     

  • భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్‌ 2) సోషల్‌మీడియాలో వైరలైంది. ఈ సిరీస్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్‌లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.

    ఈ సిరీస్‌ కోసం ఐపీఎల్‌ స్టార్లకు అధిక​ అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.

    ఐపీఎల్‌ 2026 పెను సంచలనం, రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా రాణించిన పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, సాయి సుదర్శన్‌లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.

    మిడిలార్డర్‌లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్‌ అందించిన రజత్‌ పాటిదార్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు నమన్‌ ధిర్‌, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్‌ అశుతోష్‌ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

    ఆల్‌రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్‌ పాండ్యా, రసిక్‌ సలాం దార్‌కు చోటు దక్కవచ్చని అంచనా.

    బౌలింగ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ పేరు అందరి  నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్‌తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్‌కే అన్షుల్‌ కంబోజ్‌, కేకేఆర్‌ కార్తీక్‌ త్యాగి, లక్నో ప్రిన్స్‌ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్‌ బాధ్యతలు రవి బిష్ణోయ్‌కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.

    అంచనా భారత జట్టు:
    వైభవ్‌ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, సాయి సుదర్శన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రజత్‌ పాటిదార్‌, ఇషాన్‌ కిషన్‌ (వైస్‌ కెప్టెన్‌), నమన్‌ ధిర్‌, ఆశుతోష్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, రసిక్‌ సలామ్‌, అన్షుల్‌ కంబోజ్‌, కార్తిక్‌ త్యాగి, ప్రిన్స్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

    ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్‌ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్‌, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్‌పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం మాత్రమే. 

    ఈ సిరీస్‌ విషయాన్ని పక్కన పెడితే.. జూన్‌ 6 నుంచి భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. 
     

  • ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన సాయిరాజ్‌ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్‌ స్పిన్నర్‌ను టీమిండియా ప్రత్యేక స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్‌ 2) అధికారికంగా ప్రకటించింది. 

    మాజీ టీమిండియా ఆటగాడిగా, దేశీయ క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా,  కోచ్‌గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 

    ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.

    బహుతులే భారత్‌ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 6,176 పరుగులు చేసి, 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.

    కోచ్‌గా కూడా బహుతులే విజయవంతమైన ప్రయాణం కొనసాగించాడు. విదర్భ, కేరళ, గుజరాత్‌, బెంగాల్‌ దేశవాలీ జట్లకు హెడ్‌ కోచ్‌గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘంగా స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు.

    భారత క్రికెట్‌ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022  ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 2024 అండర్‌-19 ప్రపంచకప్‌లో కూడా కోచింగ్‌ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్‌ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్‌ కోచ్‌గా పని చేశాడు.

    2021 నుంచి 2024 వరకు బీసీసీఐ నిర్వహించే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ప్రస్తుతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)లో కూడా కోచింగ్‌ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది.

    తన నియామకంపై స్పందించిన సాయిరాజ్‌ బహుతులే, భారత జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఆటగాడిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎంత గర్వకారణమో, కోచ్‌గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని అన్నాడు. 
     

  • ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ దంప‌తులు వృందావ‌నంలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్ర‌మాన్ని మంగ‌వారం సంద‌ర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన త‌ర్వాత ఆర్సీబీ బ్యాట‌ర్ కోహ్లీ త‌న భార్య అనుష్క‌తో క‌లిసి ఆధ్యాత్మిక ఆశ్ర‌మానికి వ‌చ్చాడు. ప్రేమానంద్ మ‌హారాజ్‌కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్ర‌మానికి వెళ్లారు. 

    కాగా కోహ్లీ, అనుష్క‌ దంప‌తులు ఇప్ప‌టికే అనేక సార్లు ఆశ్ర‌మాన్ని విజిట్ చేశారు. ఆశ్ర‌మానికి వెళ్లి బ‌య‌ట‌కు వ‌స్తున్న కోహ్లీ, అనుష్క‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్ద‌రూ ఆశ్ర‌మానికి వెళ్లారు. మాస్క్‌ల‌తో త‌మ ముఖాన్ని క‌వ‌ర్ చేసుకున్నారు. 

    ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధ‌న‌లు వినేందుకు త‌రుచూ అనుష్క‌, కోహ్లీ జంట ఆశ్ర‌మానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్‌సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్‌ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.

    గ‌త ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్లో గుజ‌రాత్‌పై ఆర్సీబీ విజ‌యం సాధించింది. అయితే ట్రోఫీ ప‌ట్టుకున్న స‌మ‌యంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ త‌ర్వాత ఆర్సీబీ గెలుపు సంబ‌రాల‌కు సంబంధించిన ఒక‌ ఈవెంట్‌లోనూ విరుష్క‌ జంట అదిరిపోయే స్టెప్పుల‌తో అల‌రించారు. 

    చదవండి: 'మాట త‌ప్పిన మూర్ఖుడు.. అత్యంత‌ చెత్త య‌జ‌మాని!'

  • భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వైఫల్యాల పరంపర ఐపీఎల్‌ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర బ్యాటర్‌ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్‌లో ట్రయంప్స్‌ నైట్స్‌ ఎంఎన్‌ఈకి ఆడుతున్న స్కై.. నార్త్‌ ముంబై పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.

    తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌ సైతం​ స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్‌ సూచిస్తున్నారు.

    స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌ 2026 అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్‌ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్‌ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్‌ఏపై.

    ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్‌ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్‌గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు.

    ముంబై టీ20 లీగ్‌లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్‌ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్‌లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. 

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్‌ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

    లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. 

    లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్‌లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్‌కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

    గోయెంకాపై వచ్చిన మీమ్స్‌లో అత్యధిక మంది చూసిన మీమ్‌కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది.  

    ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్‌లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 

    ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్‌కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

    చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది!

  • క్రికెట్‌లో ఆటగాళ్ల భద్రతకు గత మూడు దశాబ్దాల్లో విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. హెల్మెట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్‌, ఛెస్ట్‌ గార్డులు, ఆర్మ్‌ ప్రొటెక్టర్లు వంటి పరికరాలు ఆధునిక సాంకేతికతతో మరింత సురక్షితంగా మారాయి. అయితే పురుష క్రికెటర్లకు అత్యంత సున్నితమైన భాగాన్ని రక్షించే 'అబ్డొమినల్‌ గార్డ్‌' లేదా 'బాక్స్‌' విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు 1970ల నుంచి వాడుతున్న డిజైన్‌నే ఇప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు ఉపయోగిస్తున్నారు.

    ఇటీవల ఆటగాళ్ల భద్రతపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ టెస్టిక్యులర్‌ టార్షన్‌తో బాధపడిన ఘటన తర్వాత క్రికెటర్ల రక్షణ పరికరాలపై కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు మాజీ, ప్రస్తుత క్రికెటర్ల కుటుంబాలు అభివృద్ధి చేసిన రెండు కొత్త తరహా అబ్డొమినల్‌ గార్డులు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసక్తికర పోటీకి కారణమయ్యాయి.

    కేన్‌ విలియమ్సన్‌ తన సంస్థ 'కవర్‌' (Cover) ద్వారా కొత్త తరహా బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అల్యూమినియం మిశ్రమంతో తయారైన ఈ గార్డ్‌ పగలకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా షాక్‌ను గ్రహించే ప్రత్యేక ఫోమ్‌ను కూడా ఇందులో ఉపయోగించారు. గతంలో తాను వాడిన గార్డులు దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో మరింత బలమైన ఉత్పత్తిని రూపొందించినట్లు విలియమ్సన్‌ చెబుతున్నాడు.

    మరోవైపు మిచెల్‌ సాంట్నర్‌ సోదరుడు ఎలియట్‌ సాంట్నర్‌, ఓటాగో క్రికెటర్‌ రూబెన్‌ క్లింటన్‌ కలిసి 'ట్రూగార్డ్‌' (TruGuard) అనే ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్‌తో తయారైనప్పటికీ 'జైరాయిడ్‌ లాటిస్‌' అనే ప్రత్యేక నిర్మాణాన్ని ఉపయోగించి, విస్తృత ప్రాంతంలో  ప్రభావాన్ని విభజించేలా రూపొందించారు. తేనెగూడు ఆకృతిని పోలిన ఈ నిర్మాణం దెబ్బ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు.

    ఈ రెండు ఉత్పత్తులు ఇప్పటికే పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే అసలు పరీక్ష మాత్రం జూన్‌ 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ సందర్భంగా జరగనుంది. లార్డ్స్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఈ రెండు కంపెనీల ఉత్పత్తులను ఉపయోగించే అవకాశం ఉంది. మైదానంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీపడుతుండగా, మైదానం వెలుపల విలియమ్సన్‌ 'కవర్‌', సాంట్నర్‌ కుటుంబం 'ట్రూగార్డ్‌' మధ్య ఆసక్తికర పోటీ నెలకొననుంది.

    ఐపీఎల్‌ 2026లో కేన్‌ విలియమ్సన్‌ లక్నో మెంటార్‌గా వ్యవహరించిన సమయంలో తన ఉత్పత్తిని ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఓ మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌కు బంతి బలంగా బాక్స్‌పై తాకినా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆడటం ఈ ఉత్పత్తికి మంచి ప్రచారం తీసుకొచ్చింది. ఆ ఘటన తర్వాత విలియమ్సన్‌కు మార్ష్‌ థంబ్స్‌అప్‌ చూపించడం కూడా సోషల్‌ మీడియాలో వైరలైంది.

     

     

  • ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్‌-1000 బ్యాడ్మింట‌న్ టోర్నీలో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ మ‌హిళ‌ల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధూ 25-23, 21-16తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్‌ను మ‌ట్టిక‌రిపించిది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధూ త‌న ప్రత్య‌ర్థిపై ఆద్యంతం ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. 

    అయితే తొలి గేమ్ హోరాహోరీగా సాగిన‌ప్ప‌టికీ, రెండో గేమ్‌లో మాత్రం సింధూ త‌నలోని ఆట‌ను బ‌య‌టికి తీసి సునాయాస విజ‌యాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్‌లో సింధూ.. ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ యాన్ సే యంగ్‌ను ఎదుర్కోనుంది. గ‌త‌వారం సింగ‌పూర్ ఓపెన్‌లో యాన్ సే చేతిలో రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. 

    మరి ఈసారైనా ఆమె గండం దాటి ప్రిక్వార్ట‌ర్స్‌కు చేరుకుంటుందేమో చూడాలి. మిగిలిన మ్యాచ్‌ల విష‌యానికొస్తే మాళ‌విక బ‌న్సోద్ తొలి రౌండ్‌కే ప‌రిమిత‌మైంది. మాళ‌విక బ‌న్సోద్ 12-21, 10-21తో ఏడో సీడ్ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిబాట ప‌ట్టాడు. 

    తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 19-21, 15-21తో జ‌పాన్‌కు చెందిన యుషి త‌నాకా చేతిలో చిత్త‌య్యాడు. డ‌బుల్స్ మ్యాచ్‌ల విష‌యానికొస్తే హ‌రిహ‌ర‌న్‌-ఎంఆర్ అర్జున్ ద్వ‌యం రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.

  • ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తొలిసారి విదేశీ లీగ్‌లో కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌ బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్‌ తమ హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్‌ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ఒకసారి ఫైనల్‌.. కానీ రెండుసార్లు..
    కాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ట్రెవర్‌ బేలిస్‌ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్‌కు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలోనే 2024-2025లో జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే, 2023-24, 2025-26 సీజన్లలో మాత్రం దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

    ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్‌ బేలిస్‌పై వేటు వేసి అతడి స్థానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను తీసుకువచ్చింది. కాగా ఫ్లింటాఫ్‌ గతంలో ది హండ్రెడ్‌ లీగ్‌లో నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌కు కోచ్‌గా పనిచేశాడు.

    అత్యుత్తమ ఆల్‌రౌండర్‌
    అంతేకాదు.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్లకు 2023-24 సీజన్‌కు గానూ కన్సల్టెంట్‌గా ఫ్లింటాఫ్‌ వ్యవహరించాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుకు మార్గదర్శనం చేశాడు. కాగా ఇంగ్లండ్‌ అందించిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌ ఒకడు.

    అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌ తరఫున 1998- 2010 వరకు ఫ్లింటాఫ్‌ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3845 పరుగులు చేసిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 226 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3394 పరుగులు చేయడంతో పాటు 169 వికెట్లు కూల్చాడు.

    ఇక ఏడు టీ20లలో కలిపి 76 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ . కాగా సిడ్నీ థండర్‌ తొలుత డాన్‌ క్రిస్టియన్‌, షేన్‌ వాట్సన్‌లను సంప్రదించినట్లు సమాచారం. అయితే, వారి కంటే 48 ఏళ్ల ఫ్లింటాఫే తమ జట్టుకు సరైన కోచ్‌ అని భావించి.. అతడితో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

    చదవండి: ODI WC: రోహిత్‌ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?

  • త్వరలో (జూన్‌ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం ఎంపిక​ చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో ​కొందరు ఐపీఎల్‌ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్‌ జట్టులో కాకుండా నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు.

    బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్‌ సింగ్‌, ఆకిబ్‌ నబీ, ప్రిన్స్‌ యాదవ్‌, సరాన్ష్‌ జైన్‌, జీషన్‌ అన్సారీ, శివాంగ్‌ కుమార్‌ ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత జట్టు నెట్‌ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్‌ ప్రాక్టీస్‌లో సహాయపడతారు.

    పై బౌలర్లను టీమిండియా నెట్‌ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్‌ 2026 వల్ల రెగ్యులర్‌ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్‌ వరకు ఆడిన మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌ (రెగ్యులర్‌ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్‌ సెషన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్‌ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.

    అయితే ఈ ఎంపికలను కేవలం నెట్‌ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.

    ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్‌ నబీ దేశీయ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్‌ అన్సారీ తన లెగ్‌స్పిన్‌తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్‌ సింగ్‌, సరాన్ష్‌‌ జైన్‌ కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.

    ప్రిన్స్‌ యాదవ్‌, శివాంగ్‌ కుమార్‌లకు ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్‌ యాదవ్‌ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో చోటు సంపాదించాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్‌ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్‌ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశముంది.

    ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ కోసం భారత రెగ్యులర్‌ జట్టు..
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్‌ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్‌ జురెల్‌, హర్ష్‌ దూబే

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్‌గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా క‌ప్ న‌మ్‌దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చ‌కోర ప‌క్షిలా ఎదురుచూసింది. అప్ప‌టికీ మూడుసార్లు ఫైన‌ల్ చేరినా తుది మెట్టుపై బోల్తా ప‌డ‌డంతో ఇక ఆర్సీబీ టైటిల్ క‌ల క‌ష్ట‌మే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వ‌చ్చేశారు.

    కానీ 17 ఏళ్లలో ద‌క్క‌ని టైటిల్ గ‌తేడాది త‌మ చెంత చేర‌డంతో ఆర్సీబీ ఉబ్బిత‌బ్బిబ్బైపోయింది. ఈ సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్సీబీ రెండోసారి క‌ప్ ఒడిసిప‌ట్టడంతో ర‌జ‌త్ పాటీదార్ ల‌క్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వ‌రుస‌గా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్‌గా పాటీదార్ నిలిచాడు. ఈ క్ర‌మంలో పాటీదార్‌ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన‌ ల‌క్కీ కెప్టెన్‌ అని పొగుడుతున్నారు.

    కానీ ఆర్సీబీ రాత అంత‌కుముందే మారింద‌ని కొంత‌మంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జ‌ట్టు టైటిల్ సాధించ‌ డానికి ముందే మ‌హిళ‌ల జ‌ట్టు ఆ ఘ‌న‌త సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది.  అయితే 2023లో మొద‌లైన‌ డ‌బ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓట‌మిబాట‌లోనే న‌డిచింది. ఆ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. 

    దీంతో పురుషుల జ‌ట్టు మాదిరే మ‌హిళ‌ల జ‌ట్టు కూడా ట్రోలింగ్‌కు గురైంది. అయితే మ‌రుస‌టి సీజ‌న్‌లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ క‌మ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ సీజ‌న్ ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్‌గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజ‌న్‌లో టైటిల్ సాధించ‌డంలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ, 2026 సీజ‌న్‌లో మ‌రోసారి ఆర్సీబీ మహిళ‌ల జ‌ట్టు చాంపియ‌న్‌గా నిలిచింది. 

    ముఖ్యంగా కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా మంధాన అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో మంధాన 41 బంతుల్లోనే 87 ప‌రుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో క‌ప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియ‌న్‌గా నిల‌వ‌గ‌ల‌ద‌ని మంధాన బ‌హిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చింది. 

    మ‌హిళల జ‌ట్టును ఆద‌ర్శంగా తీసుకున్న పురుషుల జ‌ట్టు లెగ‌సీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వ‌రుస‌గా రెండోసారి చాంపియ‌న్‌గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన‌ మ‌హిళ‌ల జ‌ట్టు డ‌బ్ల్యూపీఎల్‌లో.. పురుషుల జ‌ట్టు ఐపీఎల్‌లో వ‌రుస టైటిల్స్ సాధించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

    ఆర్సీబీని మార్చిన‌ కోహ్లీ సందేశం..


    2023 డ‌బ్ల్యూపీఎల్‌లో వైఫ‌ల్యం త‌ర్వాత ఆర్సీబీ మ‌హిళ‌ల జ‌ట్టుతో కోహ్లీ ప్ర‌త్యేకంగా మాట్లాడాడు. ఈ నేప‌థ్యంలో మ‌హిళల‌ జ‌ట్టుకు 'ఫ‌లితం కోసం ఆశించ‌కుండా 110 శాతం క‌ష్ట‌ప‌డండి' అంటూ కోహ్లీ త‌న మోటివేష‌న్ స్పీచ్‌తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న మంధాన సేన 2024 సీజ‌న్‌లో టైటిల్‌ను సాధించింది. ఆర్సీబీ త‌ల‌రాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫ‌న్నీ పోస్టులు పెడుతున్నారు.

    చదవండి: ష‌కీరా కూడా ప‌నికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట!

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుబారాలో ప్రభుత్వం దూసుకుపోతూ జాతీయ మీడియాలో ప్రచారానికి నిధులు విడుదల చేసింది. జాతీయ మీడియా పొగడ్తల కోసం రూ. 45 లక్షలు ఖర్చు పెట్టింది.

    ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ప్రచారానికి 45 లక్షలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇండియా టుడే, ది వీక్, ఔట్‌లుక్, బిజినెస్ ఇండియా వంటి జాతీయ పత్రికల్లో ప్రచార ప్రకటనలతో పాటు ఫీచర్ ఆర్టికల్స్ ప్రచురించినందుకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది.

  • సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. 

    ఈ సందర్భంగా  రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

    అనంతరం, వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. 

    మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు.

  • సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.

    ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. 

     

  • సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పు చేసింది. జూన్‌ నెల మొదటి మంగళవారమే ఆర్‌బీఐ సెక్యూరిటీ వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రూ.4,400 కోట్లు అప్పు తెచ్చింది. తాజా అప్పుతో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3లక్షల 44వేల 494 కోట్లకు చేరాయి. ఫలితంగా చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 

    ఇక బాబు సర్కార్‌ గడిచిన 24 నెలల్లో రూ.3,44,494 కోట్లు అప్పు చేసింది. వాటిల్లో బడ్జెటరీ అప్పులు రూ.లక్షా 85వేల కోట్లు, బడ్జెట్‌ బయట రూ.1,15,504కోట్లు అప్పులు చేసింది. అమరావతి పేరుతో రూ.47,387కోట్ల అప్పులు ఉన్నాయి.  

Education

  • న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కొత్త ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) వ్యవస్థపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం వేగంగా చర్యలు చేపట్టి సీబీఎస్‌ఈలోని ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తా బదిలీ అయ్యారు. సీబీఎస్‌ఈ కొత్త ఛైర్మన్‌గా లోఖండే ప్రశాంత్‌ సీతారామ్‌ను ప్రభుత్వం నియమించింది. 

    అలాగే, ఓఎస్‌ఎం ఫెసిలిటీ కొనుగోలుపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సీబీసీ) చైర్‌పర్సన్ ఎస్ రాధా చౌహాన్ విచారణ కమిటీ ఏకైక సభ్యురాలిగా నియమితులయ్యారు. అవసరమైతే ఇతర అధికారుల సాయం తీసుకోవచ్చు. “చైర్‌పర్సన్‌కు అవసరమైన సందర్భాల్లో ఇతర కార్యాలయాల అధికారుల నుంచి సాయం పొందే అధికారం ఉంది. కమిటీకి సీబీసీ కార్యదర్శి సహకారం అందిస్తుంది. కమిటీ తన నివేదికను ఒక నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సమర్పిస్తుంది” అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

    సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థుల మార్కుల పునఃపరిశీలన పోర్టల్‌ను మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ ప్లాట్‌ఫాంపై సైబర్ దాడులయత్నం జరిగినట్లు బోర్డు వెల్లడించింది.

    సీబీఎస్‌ఈ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక దశలో కేవలం 2 నిమిషాల్లోనే దాదాపు 15 లక్షల హిట్లు నమోదయ్యాయి. విద్యార్థులు ప్లాట్‌ఫాంను ఉపయోగించకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగిందని బోర్డు ఆరోపించింది.

    అనధికారికంగా ఫైళ్లలోకి ప్రవేశించేందుకు జరిగిన లక్షకు పైగా ప్రయత్నాలను గుర్తించామని, సేవలకు అంతరాయం కలిగించాలనే దురుద్దేశంతో పనిచేసే వ్యక్తులే ఇందుకు కారణమని కూడా తెలిపింది. పోర్టల్ నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి “సాంకేతిక సమస్యలు” కారణమని అధికారులు తెలిపారు.

    ఈ ఆలస్యం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో జవాబు పత్రాల ప్రాప్తి ప్రక్రియలో లోపాలు తలెత్తినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆందోళనలు పెరిగాయి. మార్కుల ధ్రువీకరణ, జవాబు పత్రాల పునర్మూల్యాంకనం కోసం విద్యార్థులకు పారదర్శకమైన, అంతరాయంలేని వ్యవస్థను అందించేందుకే ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తామని సీబీఎస్‌ఈ ఇంతకుముందు తెలిపింది.
     

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.  మిస్టర్‌ పవన్‌ కళ్యాణ్‌.. ‘తెలంగాణ మా అయ్య జాగీరే’ అంటూ పొన్నం ప్రభాకర్‌ తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరే. ఆయన మాటల్లో అహంకారం కనిపించింది. పవన్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌’ అంటూ ధ్వజమెత్తారు. 

    ‘‘ఆంధ్రాలోనే గెలవలేదు. తెలంగాణకు వచ్చి చేసేదేముంది’’ అని ఆయనే వ్యాఖ్యానించారు. ఏపీలో తన పరిస్థితి ఏంటో తానే చెప్పుకున్నాడు. ఆంధ్రాలోనే తనకు దిక్కులేదు.. తెలంగాణ లో ఏముంటుంది అన్నారు. ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము అనట్లేదు. అమెరికా వాల్లే పెట్టుబడి పెట్టగా.. ఏపీ వాళ్లు పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం. పవన్ తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు పవన్. ఇక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్‌’ అని హెచ్చరించారు.

    ‘గద్దర్‌కు కార్  కొనిచ్చా అని బహిరంగంగా ప్రకటించి పవన్ తప్పు  చేశాడు. పవన్ గద్దర్‌కు క్షమాపణ చెప్పాలి ...లేదంటే దలిత సంఘాలు ప్రశ్నించాలి. తెలంగాణను పదేపదే పాకిస్థాన్‌తో పోల్చి అవమానిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కు ఎప్పుడైనా పవన్ మద్దతు ఇచ్చారా?, 

    తెలంగాణ ఏర్పాటు తో 11 రోజులు అన్నం తినలేదు అన్నది పవన్ కాదు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్డిస్ట్. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కొండగట్టుకు పవన్ వస్తే...తెలంగాణ ఛీఫ్ గెస్ట్ గా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

    కొండగట్టుకు పైసలు ఇచ్చామంటుంన్నారు.. మీ అయ్య జాగిరా ఆ పైసలు. బీజేపీ పార్టీ పవన్‌కు సరైన స్కిప్ట్ ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టి పవన్ గెలికాడు. తెలంగాణ లొ పవన్ తిరుగుతా అంటే మాకు అభ్యంతరం లేదు’ అని ‍స్సష్టం చేశారు. 

     

Family

  • ప్లాస్టిక్‌ భూతం ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ముఖ్యంగా నీటిలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను తొలగించడం అంత సులభం కాదు. అదీగాక నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌ని వేరుచేయడం అంటే కచ్చితంగా రసాయనాలు కలపక తప్పని పరిస్థితి, ఖర్చు కూడా అధికమే. ఆ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం చూపి ఎర్త్‌ప్రైజ్‌ గెలుచుకున్నారు ఈ టీనేజర్లు.

    వాళ్లే వివాన్ ఛావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా అనే భారతీయ విద్యార్థుల బృందం. ఈ విద్యార్థులు నీటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లను వేరు చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతిని అభివృద్ధి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం చింత గింజల పొడిని ఉపయోగించి  జీవవిచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని రూపొందించారు. 

    ఇది కలుషితమైన నీటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్‌ కణాలకు అంటుకుంటుంది.  ప్లాస్-స్టిక్ అని పిలువబడే ఈ ఆవిష్కరణ రసాయనాలను జోడించకుండా, సాంప్రదాయ ఫిల్టర్లు తరచుగా వదిలివేసే మైక్రోప్లాస్టిక్‌లను ఎలా  బంధించగలదో పరిశోధనలో వెల్లడైంది. అంతేందుకు ఇప్పుడు వాటర్‌ టిన్‌లు, బాటిల్స్‌ అన్ని ప్లాస్టిక్‌. అందువల్ల తాగు నీటిలో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు దాగి ఉంటాయి. కానీ అవి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వాటిని పారేసి చింతగింజలతో తయారు చేసిన ప్రత్యేక పొడితో ఈ మైక్రోప్లాస్టిక్‌ చెక్‌పెట్టారు.

    ఈ చింతగింజల పొడి అయస్కాంతం మాదిరిగా ప్లాస్టిక్‌ని ఆకర్షించి వేరు చేస్తుందట. దీనివల్ల శుభ్రమైన నీటిని సులభంగా పొందొచ్చని చెబుతోంది ఆ విద్యార్థుల బృందం. సేకరించిన ప్లాస్టిక్‌ను టైల్స్ లేదా కోస్టర్స్ వంటి చిన్న, ఉపయోగకరమైన వస్తువులుగా  మారుస్తారు. ఫలితంగా అది తిరిగి ప్రకృతిలోకి చేరదు. ఈ ఆవిష్కరణలో జంతువులు, మానవులు కనిపించన ప్లాస్టిక్‌ కాలుష్యం బారిన పడకుండా కాపాడగలుగుతామని చెబుతున్నారు. ఆ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలను సందర్శించనప్పుడే ఈ ఆలోచన తట్టిందని, అక్కడ చాలామంది ప్రజలు ప్లాస్టిక్‌ పాత్రలలోని నీటిని నిల్వ ఉంచడం చూశామని అన్నారు. 

    వెనుబడిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్లాస్టిక్‌ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగి ఈ మైక్రోప్లాస్టిక్‌ బారిన పడటం చూశాక ఈ ఆవిష్కరణకు పురికొల్పామని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రభావవంతమైనదే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పైగా స్థానికంగా లభించే వనరులతోనే దీన్ని ఆవిష్కరించడంతో ఈ టీనేజర్లపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అంతా. కలుషితమైన నీటి వనరులతో ఇబ్బంది పడుతున్న వర్గాలకు ఇది గొప్ప ఆచాణాత్మకమైనదని అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ విద్యార్తి బృందం ‘ది ఎర్త్ ప్రైజ్ గ్లోబల్ విజేతలుగా ’ ఎంపికయ్యారు. 

    ఇలా గుర్తింపు  పొందిన బృందం మాదే కావడంతో ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఆ ముగ్గురు టీనేజర్లు. కాగా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రజా ఓటింగ్ ద్వారా ప్రపంచ విజేతను ఎంపిక చేశారు. అంతేగాదు ఈ ఆవిష్కరణ సంక్లిష్టమైన కాలుష్య సమస్యలను సరళమైన, ప్రకృతి ఆధారిత ఆలోచనలు ఎలా పరిష్కరించగలవో చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది. ఈ విజయం యువత నేతృత్వంలోని విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచవ్యాప్తంగా మైక్రోప్లాస్టిక్ తొలగింపు సాంకేతికతల కోసం పెరుగుతున్న కృషికి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది.

    (చదవండి: ముంబై స్లమ్‌ నుంచి అంతర్జాతీయ కెరీర్‌ రేంజ్‌కు..! వైరల్‌గా టెకీ స్టోరీ)