Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తిరుపతి నుంచి వినుకొండకు వెళుతున్న ఈ బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 

    సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

     

  • సాక్షి,తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రకు తెరలేపింది.

    వైఎస్‌ జగన్‌ శుక్రవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసానికి వెళ్లనున్నారు. జోగిరమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చాలని పోలీసుల నోటీసులు జారీ జారీ చేశారు.  విజయవాడ సీపీ స్వయంగా వైఎస్‌ జగన్‌కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. 

    టీడీపీ గూండాల దాడితో భయాందోళనకు గురవుతున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల్ని బుధవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఇందుకోసం తాడేపల్లి నివాసం నుంచి గుంటూరు పట్టాభిపురంలో అంబటి నివాసానికి వైఎస్‌ జగన్‌ వెళ్లారు. నిన్నటి వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనకు కదలి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి కూటమి ప్రభుత్వ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

    రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్న జగన్.. కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. రెండు రోజుల కిందటే పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చినా, హఠాత్తుగా పోలీసులు ఆంక్షలు విధించడంతో పర్యటనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయి. 

  • సాక్షి,ఒంగోలు: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకీ శృతిమించిపోతున్నాయి. అధికార మదంతో రెచ్చిపోతున్నారు. యజమానులను బెదిరించి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రశ్నిస్తే ‘నువ్వు కట్టుకున్న ఇల్లు నాదే.. నీ దిక్కున్న చోట చెప్పుకో పో’.. అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

    తాజాగా, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం బాలాజీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శివకుమార్ అనే వ్యక్తి ఇంటిపై టీడీపీ నేత కాట్రగడ్డ రఘు కన్నుపడింది. అంతే అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్‌ను రఘు అనుచరులు ఇంట్లోకి ప్రవేశించి, ఆయనను బలవంతంగా బయటకు గెంటివేశారు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి.. ‘ఇల్లు మాది’ అంటూ బెదిరింపులకు దిగారు.  

    బాధితుడు శివకుమార్ మాట్లాడుతూ.. తాను స్థలం కొనుగోలు చేసి, కష్టపడి ఇల్లు నిర్మించుకున్న తర్వాతే ఈ సమస్యలు మొదలయ్యాయని వాపోయాడు. రఘు,ఆయన అనుచరులు తమను టార్గెట్ చేస్తూ, ఇల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దిక్కున చోటు చెప్పుకో పో’ అంటూ రఘు అనుచరులు బెదిరింపులకు దిగారని మీడియా ఎదుట వాపోయారు. తమకు న్యాయం చేయాలని, దాడులకు తెగబడుతున్న రఘును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

  • సాక్షి,విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అంబటి రాంబాబుపై కేసును క్వాష్‌ చేయాలని రిమాండ్‌ చట్ట విరుద్ధమని అంబటి న్యాయవాది కోర్టులో వాదించారు.పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదిపరి విచారణ ఈనెల 11కు వాయిదా వేసింది. 

    అంబటి రాంబాబు అరెస్టు
    అంతకుముందు అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. గత శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్‌ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించారు. అంబటి రాంబాబు కేసును సమోటోగా తీసుకొని బీఎన్‌ఎస్ 126(2),132, 196(1), 352, 351(2),292 రెడ్‌విత్ 3(5),-BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

    హైకోర్టులోఅంబటి సతీమణి హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ 
    అరెస్టుపై అంబటి సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి భద్రతల సమస్య ఉందని పిటిషన్‌లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరిన విషయం తెలిసిందే.

  • సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఘోరంగా మాట్లాడారని వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్‌పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించింది. లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని  భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    వైఎస్సార్‌సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘సిట్  విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది. సీబీఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ మళ్లీ విషప్రచారం చేస్తోంది. ఫ్లెక్సీలు పెట్టి వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సీఎఫ్‌టీఆర్‌ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచే ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఉంది. టీటీడీలో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. ఎలాంటి ప్రమాణం చేయడానికైనా నేను సిద్ధం.

    దేవుడు ముందే ప్రమాణం చేస్తా.. నేనే ఏ తప్పు చేయలేదు. సత్య శోధన పరీక్షకి సిద్ధంగా ఉన్నాను. ఎన్‌డీడీబి నుంచి కన్ఫర్మేషన్ లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. పరీక్షలు జరపాలని  సీఎఫ్‌టీఆర్ఐకు లేఖ రాసిందే నేను. అలాంటప్పుడు నేను నివేదిక ఎలా తొక్కి పెడతాను. నివేదికపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి సప్లయ్ పెంచడం కోసమే నిబంధనలు సవరించాం. నిపుణుల కమిటీ సిఫారసుల ప్రకారమే నిబంధనలు సడలించాం. నాణ్యత విషయంలో రాజీ పడలేదు. నిబంధనల సవరణకు ముందే బోలె బాబా కంపెనీ టీటీడీకి సరఫరా చేసింది. చిన్న అప్పన్న నా పీఏ కాదు. ఏపీ భవన్‌లో లైజన్ ఆఫీసర్ అని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై బురద చల్లడానికే ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. నేను తప్పు చేస్తే సుప్రీంకోర్టుకు, సీఎఫ్‌టీఆర్‌ఐకు ఎందుకు వెళ్తాను. దేవుడిపై రాజకీయాలు చేయొద్దు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదని సిట్ తేల్చి చెప్పింది. వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా మళ్ళీ విచారణ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంక్వయిరీ కమిటీ వేయడం కుట్రలో భాగమే. వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా కమిటీ వేశారు. దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటాం’ అని అన్నారు. 

    వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు.  ఘోరమైన తప్పులు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పింది. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్‌పై దాడి చేశారు.  చంద్రబాబు చెప్పిన తప్పులే.. నిజమని చెప్పేందుకు మళ్లీ కమిటీ వేశారు. తప్పు చేసిన వ్యక్తి అయితే.. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారు?. సత్యశోధన పరీక్షకు సిద్ధమని చెప్పారు. సుబ్బారెడ్డి వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు. ఆయనపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. రాజకీయ ఆరోపణ చేయడం తోక ముడవడం చంద్రబాబుకు పరిపాటి. టీడీపీ హయాంలో కూడా ట్యాంకర్లు తిరస్కరించారు’ అని తెలిపారు. 

    ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీబీఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టు లాంటిది. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారు. ఈ కుట్రలకు దేవుడు.. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. టీడీపీ హయాం నుంచి బోలే బాబా కంపెనీ నెయ్యి సరఫరా చేస్తోంది.  అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే బోలె బాబాను బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి పైన మాపై ఎందుకు రుద్దుతున్నారు. ఆ ట్యాంకర్లను బ్యాక్ డోర్ ద్వారా వాడుకున్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ కోసం లడ్డు విషయాన్నీ వాడుకుంటున్నారు. గత జనవరి నుంచి టీటీడీ పూర్తిగా అప్రతిష్ట పాలైంది’ అని మండిపడ్డారు. 

    వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్ల బాబూరావు మాట్లాడుతూ..‘లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సత్యశోధన పరీక్షకు సిద్ధమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే మీరు సత్యశోధన పరీక్షలు చేయండి.. విషయాలు తేల్చండి అని సవాల్‌ విసిరారు. 

  • సాక్షి, అమరావతి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీమంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6న పరామర్శించనున్నారు. ఆ రోజు ఉ.10.30 కు తాడేపల్లి నివాసం నుంచి జగన్‌ ఇబ్రహీంపట్నం బయల్దేరుతారు.

    కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శి­స్తారు. వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Movies

  • ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

    అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

     

    ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.

    అభిషేక్ బచ్చన్‌కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్‌ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

    ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్‌కు వీరిద్దరూ మరోసారి చెక్‌ పెట్టారు.

    మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. 

    • జిమ్‌లో చిల్ అవుతోన్న వరలక్ష్మీ శరత్‌కుమార్..

    • స్విమింగ్‌ పూల్‌లో నటాషా స్టాంకోవిచ్ చిల్...

    • పింక్ శారీలో బిగ్‌బాస్ దివి గ్లామరస్ లుక్స్..

    • బ్లూ డ్రెస్‌లో బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ హోయలు..

    • ట్రేడిషనల్ డ్రెస్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత అందాలు..

     

     

     

     

     

     

     

  • 'లవ్ టుడే', 'మామన్నన్' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫేమస్ అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ,మలయాళం సినిమాలకు ఆమె తన వాయిస్‌ ఇచ్చింది. తెలుగులో  ఓకే బంగారం, ప్రేమమ్‌, 2.0, నవాబ్‌ వంటి సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. చెన్నైకి చెందిన రవీనా రవి మొదట డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాల్లో కూడా నటించింది.

    అయితే తాజాగా తాను వేధింపులకు గురైనట్లు రవీనా వెల్లడించింది. సోషల్ మీడియాలో మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

    తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రాస్తూ.. "ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్నా.. దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. మూడేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడానికి ఈ పోస్ట్ చేస్తున్నా. పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై  వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారు. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా స్నేహితులుస, కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.

    అతను పలు నకిలీ ఖాతాల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టులను కూడా వేధిస్తున్నాడని రవీనా రవి ఆరోపించింది. మేము ఇప్పటికే కలిశాం..మాకు పెళ్లి కుదిరింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని తెలిపింది. ఈ నీచుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అందరూ కూడా బ్లాక్‌ చేయాలని సన్నిహితులకు విజ్ఞప్తి చేసింది. చెన్నై నగరం మహిళలకు అత్యంత సురక్షితమైందిగా భావిస్తారని.. ఇది నిరూపించాలంటే ఈ నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా సీఎం స్టాలిన్‌తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్‌ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

    కాగా...రవీనా రవి జవాన్‌ సినిమాలో దీపికా పదుకోన్‌కు తెలుగు వాయిస్‌ అందించింది. లవ్ టుడే, మామన్నన్ వంటి సినిమాల్లో కీలకమైన పాత్రలలో మెరిసింది. నయనతార, త్రిష,నిధి అగర్వాల్‌.మాళవిక మోహన్‌,శ్రీనిధి శెట్టి, అమలా పాల్‌,రాశీ ఖన్నా,కాజల్‌ అగర్వాల్‌, సమంత వంటి స్టార్‌ హీరోయిన్లకు వివిధ భాషలలో డబ్బింగ్‌ చెప్పింది. 

     

  • సందీప్‌రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్‌రెడ్డి సినిమాతోనే తన టాలెంట్‌ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. కొంత గ్యాప్‌ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్‌. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్‌లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్‌లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.

    భయపడ్డా..
    ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ పాత్రలే చేశాను. యానిమల్‌ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్‌రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్‌విజయ్‌ పాత్ర భయంకరంగా ఉంటుంది. 

    అది బాగా నచ్చింది
    కాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్‌ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్‌ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్‌లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్‌గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్‌ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్‌ అయింది అని చెప్పుకొచ్చాడు.

    ఎప్పుడో ఫిక్సయ్యా..
    సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్‌బీర్‌కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్‌ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్‌బీర్‌ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్‌కు సీక్వెల్‌గా యానిమల్‌ పార్కింగ్‌ 2028లో రానుంది.

  • ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్‌ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్‌ డేట్లను ముందుగానే అనౌన్స్‌ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్‌ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్‌, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.

    తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్‌ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ ‍మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.

    అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్‌ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్‌కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    దురంధర్-3 దెబ్బకేనా?

    ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్‌పోన్ కావడం వల్ల ఫ్యాన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్‌ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్‌ పెండింగ్‌ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి కెరీర్‌, జీవితం చిన్నాభిన్నమైంది. సుశాంత్‌ మృతి, డ్రగ్స్‌ కేసులో రియా అరెస్టయి జైలు జీవితం కూడా గడిపొచ్చింది. 5 ఏళ్లపాటు ఎన్నో నిందలు మోసింది. చివరకు సుశాంత్‌ మృతి కేసుకు, రియాకు ఎటువంటి సంబంధం లేదని 2025లో సీబీఐ కేసు క్లోజ్‌ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. 

    రీఎంట్రీ
    కానీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన కెరీర్‌ క్లోజ్‌ అయినట్లేనని రియా ఎంతో దిగులుచెందింది. అలాంటి సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ నుంచి పిలుపొచ్చింది. ఫ్యామిలీ బిజినెస్‌ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం అందుకుంది. రెండు రోజుల క్రితమే సిరీస్‌ టీజర్‌ వదిలారు. తన రీఎంట్రీ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది రియా. 7 ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను.

    కెరీర్‌ ముగిసిందనుకున్నా
     అంతా ఒక కలలా ఉంది. మళ్లీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్‌ అవ్వాలని 17 ఏళ్ల వయసులో బలంగా అనుకున్నాను. నా జర్నీ మొదలుపెట్టాను, కానీ మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. నటనకు చరమగీతం పాడక తప్పదనుకున్నాను. ఇంతలోనే మళ్లీ యాక్ట్‌ చేసే అవకాశం.. ఈ మధ్యకాలంలో ఎన్నో మార్పులు. అయినా ఇదెంత బాగుందో అని చెప్పుకొచ్చింది.

    నా జీవితంలో రెండో చాప్టర్‌
     ఈ వీడియోకు సెట్‌కు వెళ్లి ఏడేళ్లవుతోంది. నటి అవ్వాలన్న కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను. ఇది నా జీవితంలో ఇది రెండో చాప్టర్‌. నా ప్లాన్స్‌లో నేనుంటే జీవితం నన్నిలా సర్‌ప్రైజ్‌ చేసింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కంగ్రాచ్యులేషన్స్‌, నీకు అంతా శుభమే జరగాలి అని కామెంట్లు చేస్తున్నారు.

    సినిమా
    రియా చక్రవర్తి వీడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టింది. తూనీగ తూనీగ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేరే డాడ్‌కీ మారుతి, సోనాలి కేబుల్‌, బ్యాంక్‌ చోర్‌, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌, జిలేబి వంటి పలు హిందీ చిత్రాల్లో నటించింది. రియా చివరగా 2019లో వచ్చిన చెహ్రె మూవీలో కనిపించింది.

     

     

    చదవండి: రాత్రంతా నిద్ర పట్టలేదు.. ఏడ్చేసిన భూమిక

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్‌ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.

    ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్‌ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు   డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్

    •    క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06

    •    సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06

    •    ట్రాన్స్‌ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06

    •    యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06

    అమెజాన్ ప్రైమ్

    • ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06

    •    ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06

    •    వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06

    జియో హాట్‌స్టార్

    •    ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

    జీ5

    •    షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

    •    పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07

    సన్ నెక్స్ట్

    •    నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

    సోనీ లివ్

    •    జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

    టెంట్‌ కోట్టా

    • కోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06

    హెచ్‌బీవో మ్యాక్స్

    • బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06

    ముబీ..

    • లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

    హులు..

    • స్పిట్స్‌విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

     

     

  • ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్‌ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

    నివిన్‌ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు.
     

     

  • ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అ‍య్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

    తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్‌ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. 

  • హీరోయిన్‌ భూమిక చావ్లా చాలాకాలం తర్వాత యుఫోరియా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్‌ మీనన్‌, సారా అర్జున్‌, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈక్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో భూమిక భావోద్వేగానికి లోనైంది. 

    ఏడుపు ఆపుకోలేకపోయిన భూమిక
    యుఫోరియాలాంటి సినిమాను తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. నిన్ననే సినిమా మొత్తం చూశాను. రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటల సమయంలో లేచి ఆ పాత్ర గురించే ఆలోచించా.. అంటూ ఏడ్చేసింది. దాంతో అక్కడే ఉన్న గుణశేఖర్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అయితే దుఃఖంతో గొంతు కూరుకుపోవడంతో ఆమె ఇక మాట్లాడలేకపోయింది. 

    ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీశా..
    తర్వాత గుణశేఖర్‌ మాట్లాడుతూ.. 1992లో వచ్చిన లాఠీ నా మొదటి సినిమా. యుఫోరియా నా పద్నాలుగో సినిమా. కొత్త కథ చెప్పాలని సాయశక్తులా ప్రయత్నించాను. ప్రేక్షక దేవుళ్ల సమయం, డబ్బు, విజ్ఞతకు విలువిస్తాను. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశాను. మీ సమయం, డబ్బు.. ఏదీ వృథా చేయను. 

    తొలిసారి చూస్తున్నా..
    మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ కథకు వెన్నెముక భూమిక. తను చాలా స్ట్రాంగ్‌ లేడీ. తనలా ఎమోషనల్‌ అవడం తొలిసారి చూస్తున్నాను. సినిమా చూసిన కొందరు భయపడ్డామన్నారు. యుఫోరియా అనే టైటిల్‌ ఎందుకు పెట్టామో రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: కాబోయే భార్యపై అల్లు శిరీష్‌ ప్రేమ వర్షం

  • బిగ్‌బాస్‌ అమర్‌దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్‌ఎమ్‌ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్‌ సమర్పణలో సాయి సుధాకర్‌  నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్ ‍నిర్వహించారు మేకర్స్.

    ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్‌గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్‌ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్‌దీప్‌ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.

     

  • వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం శ్రీ చిదంబరంగారు.ఈ మూవీకి వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్‌ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్‌తో పాటు నటులపై కొనియాడారు. మరి ముఖ్యంగా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. సినిమా నిర్మించడం అనేది అంత సులభం కాదని అన్నారు. కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమా నా వీపు మీద వేసుకున్నందుకు.. ఒక నిర్మాతకు ఉండే స్ట్రెస్‌ ఎలాంటిదో నాకు కూడా తెలుసన్నారు. మీలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వస్తేనే సినిమా ఊపిరి తీసుకుంటుందని  నా నమ్మకమని అన్నారు. ఎవరికైనా సరే మొదటి సినిమా ఫీలింగ్ ‍అనేది లైఫ్‌లో ఎప్పటికీ రాదని మూవీ టీమ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

     

     

  • అల్లు కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ గతేడాది అక్టోబర్‌ 31న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి రెడీ అయింది. శిరీష్‌- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఆరోజు అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు కావడం విశేషం!

    బ్యాచిలర్‌ పార్టీ
    పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఉండకపోతే ఎలా? సింగిల్‌ లైఫ్‌కు చెక్‌ పెట్టబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్‌ పార్టీ ఇవ్వాలిగా! అందుకే దుబాయ్‌లో శిరీష్‌- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చారు. ఓ పడవలో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. తాజాగా ఆ వీడియోను శిరీష్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అందులో అల్లు అర్జున్‌, స్నేహతో పాటు మిగతా అందరూ నచ్చిన ఫుడ్‌ ఆస్వాదిస్తూ, డ్యాన్స్‌ చేస్తూ, ఫోటోలు దిగుతూ సంతోషంగా గడిపారు. శిరీష్‌ కాబోయే భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. దుబాయ్‌లో జనవరి 30, 31 తేదీల్లో ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయన్నాడు శిరీష్‌.

    అలా మొదలైంది.
    2023 అక్టోబర్‌లో వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. వీరి పెళ్లి సందర్భంగా హీరో నితిన్‌- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్‌ ఫ్రెండ్‌ నయనిక వచ్చింది. అదే పార్టీకి శిరీష్‌ కూడా వెళ్లగా.. అక్కడ నయనికను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో పెద్దలు కూడా ప్రేమకు పచ్చజెండా ఊపారు. అలా ఈ ప్రేమకథ వచ్చే నెలలో పెళ్లిపుస్తకంగా మారనుంది.

     

     

    చదవండి: 36 తులాల బంగారం.. చెత్త శుభ్రం చేసే మహిళ కాళ్లు మొక్కిన నటుడు

  • సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ప్రమోషన్స్‌ది కీలక పాత్ర. కానీ, ప్రమోషన్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా రిజల్ట్‌ దెబ్బతింటుంది. అందుకు దండోరా సినిమాయే సాక్ష్యం. సినిమా బాగున్నప్పటికీ శివాజీ ఆడవారి వస్త్రధారణపై చేసిన నీచపు కామెంట్స్‌ వల్ల జనాలు దండోరాను లైట్‌ తీసుకున్నారు. ఇదంతా చూశాక కూడా జాగ్రత్తపడకపోతే మొదటికే మోసం వస్తుంది.

    బూతు పాట
    విషయమేంటంటే.. బుల్లితెర హీరో ప్రభాకర్‌ కుమారుడు చంద్రహాస్‌ హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్‌ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చంద్రహాస్‌ తనలో సింగింగ్‌ టాలెంట్‌ బయటపెట్టాడు. అయితే అత్యుత్సాహంతో అసభ్య పదాలున్న పాట పాడాడు. స్టేజీపై అందరిముందు ఇలా బూతు పాట పాడటంతో అతడిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రహాస్‌పై పోలీస్‌ కేసు కూడా నమోదైంది.

    పొరపాటుకు చింతిస్తున్నాం
    ఈ క్రమంలో బరాబర్‌ ప్రేమిస్తా టీమ్‌ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. నిర్మాత చిన్ని మాట్లాడుతూ.. హీరో చంద్రహాస్‌ సినిమాలో తన క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పాలన్న ఉద్దేశంతో ఒక పాట పాడాడు. ఆ పాటలో కొంచెం పొరపాటు జరిగింది. దానిగురించి ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ తెలియదు. అతడు కావాలని చేయలేదు. ఏదేమైనా పొరపాటు జరిగినందుకు మేము బాధపడుతున్నాం అన్నాడు.

    సినిమాలో అలాంటి పాటల్లేవ్‌
    దర్శకుడు సంపత్‌ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్‌ పాటలో తప్పులు దొర్లాయి. అందుకు చింతిస్తున్నాం. సినిమాలో మాత్రం అలాంటి పాటలు లేవు అని వెల్లడించాడు. అటు జేడీ చక్రవర్తి కూడా ఆ పాట పాడినప్పుడు తాను అక్కడినుంచి వెళ్లిపోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. సినిమా ప్రమోషన్స్‌ డిఫరెంట్‌గా చేయడం తప్పు కాదని, కానీ, అవి అసభ్యంగా, ఆడవారిని కించపర్చేలాగా ఉండకూడదన్నాడు.

    చదవండి: మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. ఆరుసార్లు  రక్తమార్పిడి: ప్రియాంక భర్త ఎమోషనల్‌

  • 'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్‌ దేశం చప్పట్లు కొడుతోంది.

    నిజాయితీ
    జనవరి 11న చెన్నైలోని టీ నగర్‌లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్‌ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.

    ఘనంగా సన్మానం
    అప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్‌ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్‌కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశాడు.

    అందుకే పాదపూజ చేశా..
    బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్‌కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. 

    సినిమా
    ఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్‌.పార్తీబన్‌ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించాడు.

     

     

    చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్‌ ఎమోషనల్‌

Sports

  • ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అవ‌త‌రించింది. గురువారం వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన ఆర్సీబీ.. రెండో డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

    కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్డ్(25 బంతుల్లో 44 పరుగులు),  చినెల్ హెన్రీ(15 బంతుల్లోనే 35) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో అరుంధ‌తి, స‌త్ఘ‌రే, న‌డైన్ డిక్లార్క్ త‌లా వికెట్ సాధించారు.

    మంధాన మెరుపులు, వోల్ విధ్వంసం
    అనంత‌రం 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఓపెన‌ర్ గ్రేస్ హ్యారిస్ త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్  (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు.

    వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి-వాల్ జోడీ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్‌, రిచా ఘోష్‌, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.

    కానీ 19 ఓవర్‌లో రాదా యాదవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవ్వగా రాదా యాదవ్‌ వరుసగా రెండు ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్‌గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్‌లో ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం.

  • ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండ‌గా ఓ రాకాసి బంతి అత‌డి మొఖానికి బ‌లంగా తాకింది.  ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోను స్టోక్స్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. త‌ను షేర్ చేసిన ఫోటోలో అతడి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

    స్టోక్స్ కుడి కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు స్టోక్స్ 'ఆ బంతి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి'అని నవ్వుతూ ఉన్న ఎమోజీ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అయితే స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండ‌గా కాకుండా.. తన సహచర ఆటగాళ్లతో పక్కన నిలబడి ఉన్న సమయంలో బంతి త‌గిలి గాయ‌మైన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

    కాగా యాషెస్ సిరీస్‌లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చిన స్టోక్స్‌.. కౌంటీ సీజ‌న్ కోసం సిద్ద‌మ‌వుతున్నాడు. స్టోక్స్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆ త‌ర్వాత అత‌డు తిరిగి ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌నున్నాడు.

    అయితే స్టోక్స్ కేవ‌లం టెస్టుల్లో మాత్ర‌మే ఆడుతుండ‌డంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉండ‌నున్నాడు. ఇంగ్లండ్ జట్టు జూన్ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో స్టోక్స్ తిరిగి జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఇంగ్లండ్‌కు ఈ సిరీస్ చాలా కీలకం.
     

  • క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం 20 జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగుతుండ‌గా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు టైటిల్ ఫేవ‌రేట్‌గా ఉన్నాయి. 

    ఈ నేప‌థ్యంలో టోర్నీ విజేత ఎవ‌రన్నదిపై భారత మాజీ క్రికెట‌ర్ సునీల్ గవాస్క‌ర్ త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించాడు. టీమిండియా తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంటుందని స‌న్నీ థీమా వ్య‌క్తం చేశాడు. "భార‌త్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జ‌ట్లు సెమీ ఫైన‌ల్స్‌కు అర్హ‌త సాధిస్తాయి అని భావిస్తున్నాను. ఫైన‌ల్లో మాత్రం ఇంగ్లండ్‌, భార‌త్ త‌ల‌ప‌డ‌డం ఖాయం. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంక‌తో జ‌రిగిన సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లీష్ జ‌ట్టు సొంతం చేసుకుంది.

    అలాగే టీమిండియా కూడా టీ20ల్లో అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. కాబ‌ట్టి ఫైన‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి మెన్ ఇన్ బ్లూ టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయని" గవాస్క‌ర్ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన  ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. భార‌త్ తమ తొలి మ్యాచ్‌లో టోర్నీ ఆరంభం రోజునే ముంబై వేదిక‌గా అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది.
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్‌ ఖరారైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్‌ రూపొందించారు.

    ఈ వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా,  ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.

    గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇటలీ ఉండగా.. గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్‌ టైమింగ్స్‌... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!

    గ్రూప్‌-ఎ
    భారత్‌
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.

    యూఎస్‌ఏ
    మోనాంక్ పటేల్ (కెప్టెన్‌), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.

    నమీబియా
    గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్‌), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్‌, రూబెన్ ట్రంపెల్‌మన్, జెజె స్మిత్‌, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్‌, మాక్స్‌ హీంగో
    రిజర్వు ప్లేయర్‌: అలెగ్జాండర్‌ వోల్షెంక్‌

    నెదర్లాండ్స్‌
    స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), కోలిన్ అకెర్‌మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్‌ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్‌ వాన్‌ మెకరెన్‌, సకీబ్‌ జుల్ఫికర్‌

    పాకిస్తాన్‌
    సల్మాన్ అలీ అఘా (కెప్టెన్‌), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్‌.

    గ్రూప్‌-బి
    ఆస్ట్రేలియా
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

    శ్రీలంక
    దసున్ షనక (కెప్టెన్‌), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్‌ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్‌ మలింగ

    జింబాబ్వే
    సికందర్ రజా (కెప్టెన్‌), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్‌ మేయర్‌స​, రిచర్డ్‌ ఎంగరవ, బ్రెండన్‌ టేలర్‌

    ఐర్లాండ్‌
    పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

    ఒమన్‌
    జతీందర్ సింగ్ (కెప్టెన్‌), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్

    గ్రూప్‌-సి
    ఇంగ్లండ్‌
    హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్

    వెస్టిండీస్‌
    షాయ్ హోప్ (కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.

    ఇటలీ
    వేన్ మాడ్సెన్ (కెప్టెన్‌), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా

    నేపాల్‌
    రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్

    స్కాట్లాండ్‌
    రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.
    ట్రావెలింగ్‌ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్
    నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్

    గ్రూప్‌-డి
    సౌతాఫ్రికా
    ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్

    న్యూజిలాండ్‌
    మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.

    అఫ్గనిస్తాన్‌
    రషీద్ ఖాన్ (కెప్టెన్‌), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్‌ రహ్మాన్, డార్విష్‌ రసూలీ, ఇబ్రహీం జద్రాన్‌, జియా ఉర్‌ రెహమాన్‌ షరీఫీ
    రిజర్వ్స్: AM గజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్

    కెనడా
    దిల్‌ప్రీత్ బజ్వా (కెప్టెన్‌), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్‌ సమ్రా

    యూఏఈ
    ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్‌), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.

    వేదికలు
    👉భారత్‌- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌ 
    👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె
    👉ఫైనల్‌- అహ్మదాబాద్‌

    మ్యాచ్‌ ఆరంభ సమయం
    👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం
    👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం
    👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభం

    లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు
    👉టీవీలో స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రసారం
    👉డిజిటల్‌ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
    👉తెలుగు, హిందీ, తమిళ్‌, ఇంగ్లిష్‌, కన్నడ భాషల్లో జియో స్టార్‌ టీవీలో కామెంట్రీ
    👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.

    చదవండి: IND vs PAK: పాక్‌ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్‌

  • RCB vs DC Women Final live updates and highlights:  డ‌బ్ల్యూపీఎల్‌-2026 ఛాంపియ‌న్స్‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. వ‌డోద‌ర వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఆర్సీబీకి ఇది రెండో డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌. 

    ఢిల్లీ విధించిన 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆర్సీబీ  4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఓపెన‌ర్ గ్రేస్ హ్యారిస్ త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్  (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు. ఆఖ‌రిలో రాదా యాద‌వ్‌(5 బంత‌ల్లో 12) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది.

    వాల్ అవుట్‌
    174 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 79 పరుగులు చేసిన వాల్‌.. మిన్ను మణి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఆర్సీబీ విజయానికి 18 బంతుల్లో 27 పరుగులు కావాలి.

    13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 135/1
    13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది. జార్జియా వాల్‌(67), కెప్టెన్‌ మంధాన(56) దూకుడుగా ఆడుతున్నారు.
    దంచి కొడుతున్న వాల్‌, మంధాన
    9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్టానికి 91 ప‌రుగులు చేసింది. క్రీజులో వాల్(46), స్మతి మంధాన(32) ఉన్నారు. ఆర్సీబీ విజయానికి 66 బంతుల్లో 113 పరుగులు కావాలి.
    దూకుడుగా ఆడుతున్న వాల్‌
    4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. క్రీజులో వాల్‌(17), మంధాన(5) ఉన్నారు.

    ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
    204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆర​ంభంలోనే భారీ షాక్‌ తగిలింది. 9 పరుగులు చేసిన గ్రేస్‌ హ్యారిస్‌.. హెన్రీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యారు.

    ఢిల్లీ బ్యాట‌ర్ల జోరు.. ఆర్సీబీ టార్గెట్ 204 ప‌రుగులు
    ఆర్సీబీతో జ‌రుగుతున్న ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3  వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్లలో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌( 57)టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. లారా వోల్వ‌డ‌ర్ట్‌(44), లీ(37), హెన్రీ(35) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో న‌డైన్ డిక్లార్క్‌, స‌త్ఘ‌రే , అరుంధ‌తి రెడ్డి త‌లా వికెట్ సాధించారు.

    రోడ్రిగ్స్ ఔట్
    148 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. కేవ‌లం 37 బంతుల్లో 57 ప‌రుగులు చేసిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌.. స‌త్ఘ‌రే బౌలింగ్‌లో ఔటైంది. క్రీజులో లారా వోల్వ‌ర్డ్‌(30), హెన్రీ(2) ఉన్నారు. 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 155/3

    రోడ్రిగ్స్ దూకుడు..
    12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులు చేసింది. క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్‌(20 బంతుల్లో 34) దూకుడుగా ఆడుతోంది.

    లీ ఔట్..
    72 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 37 ప‌రుగులు చేసిన లెజ్‌లీ.. న‌డైన్ డిక్లార్క్ బౌలింగ్‌లో ఔటైంది. 8 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 74/2

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
    49 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన షెఫాలీ వర్మ.. అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 53/1

    4 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్: 29/0
    4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 29 ప‌రుగులు చేసింది. క్రీజులో లీ(17), షెఫాలీ వ‌ర్మ‌(6) ఉన్నారు.

    మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026లో తుది పోరుకు తెరలేచింది. వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు గ‌త మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవ‌న్‌తోనే బ‌రిలోకి దిగాయి. 

    ఇక వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. ఈసారి ఎలాగైనా జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్సీలో కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. మ‌రోవైపు డ‌బ్ల్యూపీఎల్‌-2024 ఫైన‌ల్ నాటి ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

    తుది జ‌ట్లు
    ఆర్సీబీ: స్మృతి మంధాన (కెప్టెన్), గ్రేస్ హారిస్, జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నడైన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్, సయాలీ సత్ఘరే.

    ఢిల్లీ క్యాపిటల్స్: లిజెల్ లీ, షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజన్ కాప్, షినెల్ హెన్రీ, నికి ప్రసాద్,స్నేహ రాణా, మిన్ను మణి, నందిని శర్మ, శ్రీ చరణి, 

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు మ‌రో రెండు రోజుల్లో తెర‌లేవ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ నుంచి షురూ కానుంది.  ఈ నేప‌థ్యంలో ఐసీసీ తాజాగా కెప్టెన్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా అఫ్గానిస్తాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్‌కు ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. "ఈ ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ ఏ జట్టును ఓడిస్తే అది సంచ‌లనం అవుతుంది?" అని విలేకరులు ప్రశ్నించారు.

    ర‌షీద్ వెంట‌నే త‌డ‌బ‌డ‌కుండా  "ఫైనల్‌కు ఎవరు వచ్చినా, వారిని ఓడించడమే మా లక్ష్యం" అని బదులిచ్చాడు. అంటే ఈ మెగా ఈవెంట్‌లో అఫ్గానిస్తాన్ క‌చ్చితంగా ఫైన‌ల్ చేరుతుందాన్న థీమాతో ర‌షీద్ ఉన్నాడు. గ‌త కొంత‌కాలంగా అఫ్గానిస్తాన్ ప్ర‌పంచ మేటి జ‌ట్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2024లో అఫ్గానిస్తాన్ అద్బుతాలు చేసింది.

    పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి జ‌ట్ల‌ను ఓడించి అఫ్గాన్‌కు సెమీస్‌కు చేరింది. కానీ దురదృష్టవశాత్తూ సెమీస్‌లో రషీద్ సేన బోల్తా పడింది. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్‌కు చేరి టైటిల్ గెలవడమే అఫ్గాన్ పట్టుదలతో ఉంది. అప్గాన్ జట్టులో అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. అఫ్గాన్ ఈసారి గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి వరల్డ్‌క్లాస్ జట్లు ఉన్నాయి.

  • టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్‌ జట్టు జోరు కనబరుస్తోంది. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్‌.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేతో ఒమన్‌ గురువారం తలపడింది.

    బెనెట్‌, ముసేకివా హాఫ్‌ సెంచరీలు
    కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఒమన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్‌ బెనెట్‌ (28 బంతుల్లో 56) మెరుపు అర్ధ శతకం బాదగా... బ్రెండన్‌ టేలర్‌ (20 బంతుల్లో 26) రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

    వన్‌డౌన్‌లో వచ్చిన డియాన్‌ మేయర్స్‌ 26 పరుగులు చేయగా.. ర్యాన్‌ బర్ల్‌ (1), టోనీ మున్యోంగ (0), క్లైవ్‌ మండాడే (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోయర్‌ ఆర్డర్‌లో తషింగ ముసేకివా (28 బంతుల్లో 54 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

    ఇక ఒమన్‌ బౌలర్లలో సూఫియాన్‌ మెహమూద్‌ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్‌ రెండు, షా ఫైజల్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్‌ 19.2 ఓవర్లలో పూర్తి చేసింది. 

    జతిందర్‌, రామనంది ధనాధన్‌
    ఓపెనర్లలో ఆమిర్‌ కలీమ్‌ (23) ఫర్వాలేదనిపించగా.. జతిందర్‌ సింగ్‌ హాఫ్‌ సెంచరీ (33 బంతుల్లో 55) చేసి రిటైర్డ్‌ అవుట్‌ అయ్యాడు. మిగిలిన వాళ్లలో హమాద్‌ మీర్జా (35), జితేన్‌ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టారు. 

    ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయి ఒమన్‌ 188 పరుగులు సాధించింది. ఫలితంగా జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే పన్నెండో స్థానంలో ఉండగా.. ఒమన్‌ది ఇరవయ్యవ ర్యాంకు.  

    కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి ఒమన్‌ గ్రూప్‌-బిలో ఉంది.

    చదవండి: పాక్‌తో మ్యాచ్‌.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

  • ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన‌ బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో లాహోర్ ఖలందర్స్ త‌ర‌పున ముస్తాఫిజుర్ ఆడ‌నున్నాడు. పీఎస్ఎల్ వేలానికి ముందు అత‌డిని రూ. 2.08 కోట్లకు (పీకేర్‌ 6.44 కోట్లు) లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ విష‌యాన్ని లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రానా ధ్రువీక‌రించాడు. "ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ ఫ్యామిలీలో ఎల్ల‌ప్పుడూ భాగ‌మే. అత‌డు తిరిగి మా జ‌ట్టులో చేరినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని" సమీన్ రానా పేర్కొన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిథ్యం వహించ‌డం ఇదే మూడవసారి కావ‌డం గ‌మ‌నార్హం. 

    రూ. 7.12 కోట్ల నష్టం
    కాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీల‌పై దాడుల నేపథ్యంలో అత‌డిని జ‌న‌వ‌రి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో అప్ప‌టి నుంచి బంగ్లా-భార‌త్ మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్త‌మ‌య్యాయి.

    భ‌ద్ర‌తా కార‌ణాల‌ను సాకుగా చూపుతూ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు బంగ్లాదేశ్ నిరాక‌రించింది. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ బీసీబీ మాత్రం త‌మ ప‌ట్టును వీడలేదు. ఫ‌లితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. 

    ఏదేమైన‌ప్ప‌టికి రెండు దేశాల ఉద్రిక్త‌ల‌కు ముస్తాఫిజుర్ బ‌లైపోయాడు. అత‌డు ఐపీఎల్‌లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు ద‌క్కేవి. కానీ ఇప్పుడు పీఎస్ఎల్ ఒప్పందం కార‌ణంగా ముస్తాఫిజుర్‌కు కేవ‌లం రూ. 2.08 కోట్లు ల‌భించ‌నున్నాయి. దీంతో అత‌డు దాదాపు రూ. 7.12 కోట్ల‌ను కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.

  • భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. తాము అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకుంటామని.. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్తామని కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం ఈ టోర్నీలో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తప్పించిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.

    బంగ్లా అవుట్‌.. అండగా ఉంటామంటూ పాక్‌ డ్రామా
    తమ వేదికను కూడా శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పట్టువీడని బంగ్లాను టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ పాకిస్తాన్‌ ప్రకటించింది. అయితే, షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ తలపడాల్సి ఉంది.

    మేము కొలంబో వెళ్తున్నాం
    ఈ పరిణామాలపై గురువారం నాటి కెప్టెన్ల మీడియా సమావేశంలో టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో స్పందించాడు. “మా మైండ్‌సెట్‌ క్లియర్‌గా ఉంది. మేమేమీ ఆ మ్యాచ్‌ ఆడమని చెప్పలేదే!.. వాళ్లే అలా చెప్పారు. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

    మా ప్రయాణానికి విమాన టికెట్లు కూడా బుక్‌ అయ్యాయి. కాబట్టి మేము కొలంబో వెళ్తున్నాం. ఆతర్వాత ఏం జరుగుతుందో అక్కడే మాకు తెలుస్తుంది’’ అని సూర్య స్పష్టం చేశాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌ రద్దు కావడం ఎలాంటి ‍ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ..  

    నా చేతుల్లో ఏమీ లేదు
    “వాళ్ల నిర్ణయం నా ఆధీనంలో ఉండదు కదా!.. ఫిబ్రవరి 15న మ్యాచ్‌ ఆడాలని మాకు చెప్పారు. ఇప్పటికే తటస్థ వేదిక మీద ఆసియా కప్‌ టోర్నీలో వాళ్లతో మూడు మ్యాచ్‌లు ఆడాము. కొలంబోనూ ఆడే అవకాశం వస్తే ఆడతాం. ఆడటం.. ఆడకపోవడం నా నిర్ణయం కాదు. ఇదొక సంక్లిష్ట సమయం’’ అని సూర్య పేర్కొన్నాడు. 

    చదవండి: ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు!

  • పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశీయలు తమ సోదరులు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పాకిస్తాన్‌కు కూడా సరైన సమాధానం ఇవ్వాలని సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

    భారత్‌- బంగ్లా ఉద్రిక్తతలు
    కాగా 1971లో బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్‌ ఆగడాలు తట్టుకోలేక విలవిల్లాడిన తూర్పు ప్రజలకు భారత సైన్యం అండగా నిలిచింది. ఫలితంగా బంగ్లాదేశ్‌కు స్వతంత్రత వచ్చింది. ఈ యుద్ధంలో సుమారుగా 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు.

    ఇలా బంగ్లాదేశ్‌కు ఆది నుంచి భారత్‌ అండగా ఉంటోంది. అయితే, ఇటీవల కొంతమంది బంగ్లా నేతలు భారత్‌ భూభాగాల గురించి అవాకులు చెవాకులు పేలడమే కాకుండా.. ఉగ్రవాదులకు తాము ఆశ్రయమిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనారిటీ హిందువులపై బంగ్లాలో హత్యాకాండ జరిగింది.

    టోర్నీ నుంచి అవుట్‌
    ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉండదంటూ టీ20 ప్రపంచకప్‌-2026లో తమ వేదికను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా ఐసీసీని కోరింది.

    పాక్‌ ఓవరాక్షన్‌
    అయితే, బంగ్లా ఆరోపణలను కొట్టిపారేసిన ఐసీసీ.. తుదినిర్ణయం చెప్పాలని గడువు​ ఇచ్చింది. అయినప్పటికి బంగ్లా పట్టువీడకపోవడంతో టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న పాక్‌ సైతం టోర్నీ బహిష్కరిస్తామని తొలుత.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో ‘థాంక్యూ పాకిస్తాన్‌’ అని బంగ్లాదేశ్‌ యువజన, క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌నకు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌పై ప్రేమ ఒలకబోశాడు.

    చరిత్ర గుర్తు చేసుకో
    ‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటాము. కానీ వాళ్లు ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీ ఆడకపోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సల్మాన్‌ ఆఘా పేర్కొన్నాడు. 

    ఈ నేపథ్యంలో చరిత్రను ఒ‍క్కసారి గుర్తు చేసుకోవాలంటూ భారతీయ నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు. కాగా శనివారం నుంచి భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానుంది. పాక్‌ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

    చదవండి: IND vs PAK: పాక్‌ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్‌.. పొట్టకొట్టేలా..

  • టీ20 ప్రపంచకప్- 2026 ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే అనారోగ్యం బారిన ప‌డ్డారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో గురువారం అమెరికాతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌కు వారిద్ద‌రూ దూరమయ్యారు.

    ఈ విష‌యాన్ని కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్ట‌ర్ ధ్రువీక‌రించారు. ర‌చిన్‌, కాన్వే ప్ర‌స్తుతం తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని అతడు తెలిపాడు. ఫిబ్రవరి 8న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మొదటి మ్యాచ్ నాటికి వీరిద్దరూ కోలుకుంటారని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కేవలం అనారోగ్యం మాత్రమే కాకుండా, గాయాలు కూడా కివీస్ జట్టును కలవరపెడుతున్నాయి.

    విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా భుజం గాయం కారణంగా యూఎస్‌ఎతో వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. స్టార్ పేసర్‌ ఆడమ్ మిల్నే ఇప్పటికే గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో కైల్ జేమీసన్ జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు కీలక ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ కాళ్ల కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు.

    బ్రేస్‌వెల్ మొదటి మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే స్పీడ్ స్టార్ లాకీ ఫెర్గూసన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం సానుకూల అంశంగా చెప్పుకోవాలి.

    టీ20 ప్రపంచకప్ టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఇదే
    మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్,డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర,డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్,టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్),మార్క్ చాప్‌మన్, మైఖేల్ బ్రేస్‌వెల్,జేమ్స్ నీషమ్,ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియాతో తమ జట్టు మ్యాచ్‌ ఆడబోదని పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ పునురుద్ఘాటించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో ఫెడరల్‌ క్యాబినెట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..

    అందుకే టీమిండియాతో మ్యాచ్‌ ఆడము
    ‘‘టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇండియాతో మ్యాచ్‌ ఆడవద్దని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే.. క్రీడా మైదానంలో రాజకీయాలకు తావు ఉండకూడదనేది మా వాదన. అందుకే మేము కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.

    బంగ్లాదేశ్‌కు మద్దతుగా మేము ఈ పని చేస్తున్నాం. ఇది అత్యంత గొప్ప, సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను’’ అని షెబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) పేర్కొన్నారు. కాగా పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌గా పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) ఉన్న సంగతి తెలిసిందే.

    మీ వేషాలు మామూలుగా లేవండి!
    ఇప్పుడు వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ గురించి ఏకంగా ప్రధాని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను క్రీడలతో కలగలిపి దౌత్యపరంగా లబ్ది పొందాలని చూస్తుంది మీరేనంటూ షెబాజ్‌ షరీఫ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

    బంగ్లాదేశ్‌కు లేని బాధ మీకు ఎందుకని.. ఉద్దేశపూర్వకంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే నష్టపోయేది మీరేనంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా.. ‘‘మీ వేషాలు మామూలుగా లేవండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

    తటస్థ వేదికపై దాయాదుల పోరు
    కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నీకి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో అప్పుడే భారత్‌- పాక్‌లలో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. తటస్థ వేదికను ఏర్పాటు చేయాలనే ఒప్పందం జరిగింది. అందుకు తగ్గట్లే టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్‌ శ్రీలంకతో తమ మ్యాచ్‌లు ఆడనుంది.

    ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ కొన్నాళ్లుగా భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో భారత్‌తో తమకు భద్రత లేదని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీ దగ్గర పట్టుపట్టింది.

    బంగ్లాదేశ్‌కు గట్టిగానే షాక్‌ తగిలింది
    అయితే, భారత్‌లో భద్రత విషయంలో బంగ్లా జట్టుకు వచ్చిన ఎలాంటి ముప్పేమీ లేదని ఐసీసీ చెప్పగా.. బంగ్లా మొండివైఖరి వీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. అయితే, పాకిస్తాన్‌ మాత్రం తమకు తటస్థ వేదిక ఉన్నా.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ కొత్తరాగం ఎత్తుకుంది.

    అయితే, లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్‌ ప్రధాని స్వయంగా మరోసారి ఈ విషయం గురించి ప్రకటన చేయడం విశేషం. 

    ఒకవేళ పాక్‌ టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఐసీసీ ఆదాయం తగ్గి.. ఇతర సభ్య దేశాల బోర్డులపై కూడా ప్రభావం పడుతుంది.

    చదవండి: IND vs PAK: పాక్‌ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్‌.. పొట్టకొట్టేలా..

  • క్రికెట్‌ అభిమానులను ఇది కన్‌ఫ్యూజ్‌ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్‌ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంత​​కుముందు వార్త కూడా నిజమే.

    వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్‌-పాక్‌ మధ్య రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. పాక్‌ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో ​మ్యాచ్‌ మహిళల ఏసీసీ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.

    ఈ మ్యాచ్‌కు పాక్‌ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్‌ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్‌తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉమ్మె-హాని ఎంపికైంది.

    ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది.  

    రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.

    ఈ టోర్నీలో పాక్‌ షెడ్యూల్‌ ఇలా ఉంది. 
    ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30)  
    ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00)  
    ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00)  

    అన్ని మ్యాచ్‌లు బ్యాంకాక్‌లో జరగనున్నాయి.  

    ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేసియా, థాయ్‌లాండ్‌ గ్రూప్‌-బిలో ఉండగా.. పాక్‌, భారత్‌, యూఏఈ, నేపాల్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. గ్రూప్‌ దశలో భారత్‌ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్‌తో, 17న నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ రాధా యాదవ్‌ వ్యవహరించనుంది.

     

  • భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ ప్రకటనపై బంగ్లాదేశ్‌ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

    బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలు
    అయితే, భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్‌ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.

    పాక్‌ బోర్డు డ్రామాలు
    కానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.

    తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత క్రేజ్‌ ఉన్న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

    పాక్‌ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్‌తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదు
    ఈ నేపథ్యంలో పాక్‌ ప్రకటనపై బంగ్లాదేశ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్‌ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగకపోతే క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్‌ స్పష్టం చేశారు. పాక్‌ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.

    అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్‌కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్‌ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్‌ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్‌ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.

    కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్‌ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    వ్యవస్థ అతలాకుతలం
    ఇలాంటి తరుణంలో పాక్‌ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ వివాదం ఐసీసీ సెంట్రల్‌ రెవెన్యూ పూల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

    మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు. 

    చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్‌!

  • టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసుకున్న విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్‌పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్‌ అభిమానులకు ఓ బంపరాఫర్‌ ఇచ్చింది.

    ప్రపంచకప్‌లో పాక్‌ ఆడే మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్‌ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్‌ స్థానిక ఛానల్‌ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులో ఉంచనుంది. 

    ఇప్పటి వరకు పాక్‌ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్‌పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్‌ ఆడబోయే వార్మప్‌ మ్యాచ్‌కు కూడా వర్తిస్తుంది.

    ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్‌ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్‌కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. 

    ఒప్పందాలకు విరుద్దంగా భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్‌పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్‌ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.

    కాగా, భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ మినహా మిగతా ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్‌ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. 

    ఈ మ్యాచ్‌ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్‌ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.

     

     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ గాయం వల్ల న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. ఇటీవల యూఎస్‌తో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. భారత- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లోనూ టీమిండియా తరఫున అదరగొట్టాడు.

    ఇక తిలక్‌ వర్మ (Tilak Varma) కోలుకోవడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. 

    లీగ్‌ దశ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా గాయం వల్ల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు బుధవారం సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే.

    దంచికొట్టిన ఇషాన్‌, తిలక్‌
    నవీ ముంబై వేదికగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 53; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో కదంతొక్కగా... హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టాడు.

    ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షాట్‌లతో ఆకట్టుకున్నారు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ చూడచక్కటి షాట్‌లతో చెలరేగారు.

    మరోవైపు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన వికెట్‌కీపర్‌ సంజూ శాంసన్‌ ఈమ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో ఆడిన ఇషాన్‌ కిషన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌ ప్రారంభపోరులో శనివారం అమెరికాపై అభిషేక్‌తో కలిసి ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించడం దాదాపు ఖాయమే.

    210 పరుగులు
    అనంతరం భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (19 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్‌ (21 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జాసన్‌ స్మిత్‌ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్టబ్స్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. 9 మంది భారత బౌలర్లు బౌలింగ్‌ చేయగా... అభిషేక్‌ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.

    మోకాలి నొప్పి?
    అయితే, ఈ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా ఒక్క ఓవర్‌ మాత్రమే వేసి నిష్క్రమించాడు. తన ఓవర్లో పదహారు పరుగులు సమర్పించుకున్న ఈ రైటార్మ్‌ పేసర్.. బౌలింగ్‌ చేసే సమయంలో అసౌకర్యానికి గురయ్యాడు. మోకాలి నొప్పితో అతడు బాధపడినట్లు కనిపించింది. తన ఓవర్‌ పూర్తి చేసుకున్న వెంటనే హర్షిత్‌ రాణా మైదానం వీడాడు. అతడు కోలుకోవడానికి ఇంకో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    అయితే, హర్షిత్‌ గాయం గురించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కాగా లోయర్‌ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానంలో చక్కగా బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సమయంలో హర్షిత్‌ రాణా సేవలు అందిస్తున్నాడు. ప్రధాన మ్యాచ్‌లలో బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా రొటేషన్‌ పద్ధతిలో తుదిజట్టులోకి వస్తున్నారు. 

    చదవండి: భారత్‌ను పదోసారి ఫైనల్‌కు చేర్చిన ఈ 'ఆరోన్‌ జార్జ్‌' ఎవరు..?

National

  • ఢిల్లీ: కమల్ హాసన్ రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల అర్హులైన సుమారు కోటి మంది ఓటర్లు చనిపోయిన వారి జాబితాలో చేరే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

    మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు, కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా తన తొలి ప్రసంగంలోనే ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన దీన్ని ఒక వ్యాధిగా అభివర్ణిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీసే చర్య అని అన్నారు.

    సవరణ ప్రక్రియలో తప్పుగా పేర్లు తొలగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫలితంగా, నిజంగా జీవించి ఉన్న ఓటర్లు కూడా జాబితాలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘం ఈ విధమైన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. ప్రజలకు ఉన్న ఓటు హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతత్వం కోసం ప్రయత్నించకూడదని ఆయన స్పష్టం చేశారు.

    తమిళనాడులో ఇటీవల జరిగిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో 97.4 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. ఈ తొలగింపులపై ఇప్పటికే వివాదం చెలరేగింది.

    తన ప్రసంగంలో కమల్ హాసన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజల హక్కులను గౌరవించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. “ప్రజాస్వామ్యం శాశ్వతం, కానీ ప్రభుత్వాలు తాత్కాలికం. ప్రజల హక్కులను దెబ్బతీయడం ఎప్పటికీ అంగీకారయోగ్యం కాదు’అని వ్యాఖ్యానించారు.

    కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల హక్కుల పరిరక్షణపై ఆయన చేసిన ఆందోళన, భవిష్యత్తులో రాజకీయ వేదికపై మరింత చర్చకు దారితీయనుంది.

  • షిల్లాంగ్‌: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలో పేలుడు సంభవించడంలో 16 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో సాయంత్రం ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో సమయంలో కూలీలు అందులో చిక్కుకుపోయారు. ప్రమాదం ధాటికి 16 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

  • న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోదీపై దాడి చేసేలా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారు. అందుకే ప్రధానిని సభకు రావొద్దని చెప్పాను. పార్లమెంట్‌ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. విపక్షాలు సభా మర్యాదలను ఉల్లంఘించారు’అని ఆయన అన్నారు.

    పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారం నాకు అందింది. అందుకే ప్రధానిని సభకు రావొద్దని విజ్ఞప్తి చేశాను’అని స్పీకర్‌ తెలిపారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడంపై  ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఆయన స్పందించారు.

    బుధవారం ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు సభలో జరిగిన గందరగోళం, వాయిదాపై ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ..‘ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని మోదీ కుర్చీని చుట్టుముట్టారు. లోక్‌సభలో కొంతమంది సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధానమంత్రి ప్రసంగం సమయంలో గందరగోళం సృష్టించవచ్చని నాకు ముందస్తు సమాచారం వచ్చింది’ అని ఆయన వెల్లడించారు.
     

  • తిరువనంతపురం: కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టికి కేరళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని అరెస్టు జరిగిన 90 రోజులలోపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో ఈ బెయిల్ లభించింది. దీంతో, అతడి బెయిల్‌ అంశం చర్చనీయాంశంగా మారింది.

    కాగా, శబరిమలలో శ్రీకోవిల్ (గర్భగుడి) తలుపుల ఫ్రేముల నుండి బంగారం అదృశ్యం కావడానికి సంబంధించిన రెండో కేసులో ఉన్నికృష్ణన్‌ పొట్టికి బెయిల్ మంజూరైంది. అంతకంటే ముందు.. సంబంధిత ద్వారపాలక విగ్రహం కేసులో కూడా అతనికి బెయిల్ లభించింది. కొల్లాంలోని విజిలెన్స్ కోర్టు గురువారం అతడికి బెయిల్‌ మంజూరు చేసింది. ఫలితంగా శబరిమల బంగారం చోరికి సంబంధించిన రెండు ప్రధాన కేసులలో ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. బెయిల్ షరతులలో భాగంగా పొట్టి ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలి. కేరళ విడిచి వెళ్లకూడదు. శబరిమల ఆలయం ఉన్న పతనంతిట్ట జిల్లాలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. అతను ప్రతి మంగళవారం, శుక్రవారం దర్యాప్తు అధికారులకు రిపోర్ట్ చేయాలి.

    ఇదిలా ఉండగా, ఉన్నికృష్ణన్‌కు బెయిల్ మంజూరు కావడం కేరళలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత, ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ ‍స్పందిస్తూ.. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై పదేపదే ఆరోపణలు చేశాం. సిట్‌ కేసును తప్పుదోవ పట్టించే విధంగా దర్యాప్తు పద్ధతిని అనుసరిస్తోందని ముందే చెప్పాం. పలుమార్లు హెచ్చరించాం. మా ఆరోపణ ఇప్పుడు నిజమైంది. వారందరికీ బెయిల్ వస్తుందని మేము చెప్పాం. సరిగ్గా అదే జరుగుతోంది. వారు కనీసం ప్రాథమిక చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు అని మండిపడ్డారు. ఇప్పుడు సీపీఐ(ఎం) నాయకులు జైలు నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. మాజీ దేవస్వం మంత్రి, ప్రస్తుత దేవస్వం మంత్రి సహా చాలా మంది ఇప్పటికే క్యూలో ఉన్నారు. వారిని అరెస్టు చేయాలి. మేము ఇప్పటికే మంత్రి రాజీనామాను డిమాండ్‌ చేశాం అని వ్యాఖ్యలు చేశారు.

     

  • ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్‌కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్‌కు వాహనం బలంగా తగలడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. 

    అశీశ్‌ మృతదేహం స్ట్రెచ్చర్‌ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.

    హనీమూన్‌ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన సోనమ్‌. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్‌ మర్డర్‌ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్‌గా పని చేసే తేజేశ్వర్‌ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్‌ స్కెచ్‌తో మర్డర్‌ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్‌ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే.. 

    రాజస్థాన్‌ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్‌ మర్డర్‌ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్‌ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా క్లోజ్‌ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది. 



    జనవరి 30వ తేదీ సాయం‍త్రం జరిగింది ఇదే.. 
    అశీష్‌-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్‌ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్‌పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్‌ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్‌ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ. 

    అక్కడే దొరికింది.. 
    అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది.  అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్‌ కలిశాక ఆ కాల్స్‌ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు. 

    అశీశ్‌తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్‌ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్‌ అండ్‌ రన్‌గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్‌ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్‌ను అరెస్టు చేశారు. 

    సోనమ్‌ కూడా..
    కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్‌ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్‌ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్‌ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

  • జాజ్‌పూర్: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. జఖపురా రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ - న్యూ జల్పాయ్‌గురి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలులోని మూడు బోగీలు ఒక్కసారిగా ట్రాక్ పైనుంచి పక్కకు జరిగాయి. భువనేశ్వర్ నుండి కోల్‌కతా మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి.

    ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 8:51 గంటలకు ప్రమాదం జరగగా, భువనేశ్వర్, ఖుర్దా రోడ్ నుండి ప్రమాద సహాయక రైళ్లు ఘటనా స్థలానికి బయలుదేరాయి. వీటితో పాటు ఖుర్దా రోడ్ నుండి అత్యాధునిక వైద్య పరికరాల బృందాన్ని కూడా పంపించారు. భద్రక్ నుంచి వచ్చిన ప్రత్యేక సహాయక బృందం కూడా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేసింది.

    ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. భద్రక్ నుండి వచ్చిన ఇంజనీరింగ్ బృందాలు పట్టాలను సరిచేసి, రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు  ఘటనా స్థలంలో ఉండి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

    ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని  నిర్ధారించారు. కాగా, ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఢిల్లీ-ముంబై మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం.

    ఇది కూడా చదవండి: ఉత్తరాదిపై పన్నీర్‌సెల్వం వివాదాస్పద వ్యాఖ్యలు

International

  • అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటకకు చెందిన వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన రూ.49 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.  

    అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంతను శెట్టిగర్‌ అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన టికెట్ నంబర్ ఎంపిక కావడంతో రూ.49 కోట్లను(AED 22 మిలియన్) సొంతం చేసుకున్నారు.

    కర్ణాటకకు చెందిన శంతను గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తూ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అనుకోకుండా ఆయన టికెట్ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది.

    విజయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు. ఇది మా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. ఈ డబ్బుతో కుటుంబానికి భద్రత కల్పిస్తాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం’అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.

    1992లో అబుదాబి విమానాశ్రయంలో ప్రారంభమైన ఈ లాటరీ, గల్ఫ్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతి నెలా కోట్ల రూపాయల విలువైన జాక్‌పాట్‌తో పాటు లగ్జరీ కార్లు, ఇతర బహుమతులు అందజేస్తారు.గతంలో కూడా అనేక భారతీయులు ఈ లాటరీలో భారీ మొత్తాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఎక్కువగా పాల్గొంటారు.

    ఈ విజయం కర్ణాటకలోని ఆయన గ్రామం ఉడిపికి గర్వకారణమైంది. స్థానికులు మన ప్రాంతం నుంచి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకోవడం గొప్ప విషయం  అని ఆనందం వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఇది ఒక ఆశాకిరణంలా మారింది.

  • ఇస్లామాబాద్‌: అమెరికా-భారత్‌ ట్రేడ్‌ డీల్‌ పాకిస్థాన్‌ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్‌ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్‌ డీల్‌ పాకిస్థాన్‌ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?

    ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్‌ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్‌-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్‌లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు  భారత్‌ గ్లోబల్‌ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్‌ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

    ట్రంప్‌ సేవలో అసిమ్‌ మునీర్‌
    ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్‌ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది.  గతేడాది ట్రంప్‌ను కీర్తిస్తూ పాక్‌ ఆర్మీచీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.

    ఆర్ధిక ఇబ్బందులతో సతమతం
    అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం పాక్‌పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్‌ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. 

    తాజాగా, అమెరికాతో ట్రేడ్‌డీల్‌ కుదుర్చుకున్న భారత్‌పై పాక్‌ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్‌ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్‌ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు.  

    మాజీ పాకిస్తాన్‌ తహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్‌ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్‌ను మరింత విస్తరించడం. భారత్‌ ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు.  

    ట్రంప్‌ను నోబెల్‌ ప్రైజ్‌కి నామినేట్‌ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్‌ అది సాధించింది. ట్రంప్‌ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్‌ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్‌ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.

    మొత్తానికి భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు పాక్‌ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. 

  • పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీసం ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది .అయితే, ఇప్పుడు సింధు నదిలో బంగారు నిల్వలు కనుగొనడంతో ఆ దేశానికి గడ్డు రోజులు పోతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్‌ దేశంలో భారీ బంగారు నిల్వలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. 

    పంజాబ్ ప్రావిన్స్‌లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి. కానీ నదుల్లో బంగారు నిల్వలను కనుగొనడం వల్ల ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నట్లుగా కొత్త సమస్యలు వస్తాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కానీ కథ ఇక్కడితో ముగియదు. 

    గతంలో ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే బంగారు నిల్వలు కనుగొన్నారు.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ లాంటి దేశాల్లో బంగారం బయటపడింది. అయితే ఆ దేశాలు అభివృద్ధి దిశగా వెళ్లక పోగా  అక్కడ బంగారం మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీవ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాయి. గత 15ఏళ్ల  కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాల్లో బంగారం, విలువైన లోహాల నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. తీవ్రవాద గ్రూపులు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం, నెట్‌వర్కింగ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాయి. బంగారం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కలలు కంటున్న స్థానిక ప్రజలను బంగారం తవ్వకం పనిలోకి దింపారు. జీతాలు స్థానికులే చెల్లిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం ఉగ్రవాదులకు వెళ్తోంది. అన్ని వనరులను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి యువతను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.

    ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మన పొరుగుదేశం చైనా కూడా ఇటీవలే భారీ బంగారు నిల్వలను కనుగొంది. అక్కడి పాలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే ఆశతో ఉంది. కానీ బంగారం దొరకడం ఒక్కటే కాదు… వాటిని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనానికి ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి చివరికి ప్రశ్న ఒక్కటే—ఈ బంగారం పాకిస్థాన్‌కు వరమా? లేక భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ ఆటకు వేదిక అవుతుందా? దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతుందా? లేక అంతర్గత సమస్యలను మరింత పెంచుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.

    సింధు నదిలో దొరుకుతున్న బంగారం హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి. 

  • సాక్షి,ఢిల్లీ: భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అమెరికాతో జరిగిన ట్రేడ్‌ డీల్‌లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిఫలంగా అమెరికా.. భారత్‌కు విధించే ప్రతీకార పన్నును 18 శాతం తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.

    అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌ సైతం 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రకటనపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పష్టత ఇచ్చారు. సీనియర్ అమెరికా అధికారులు వచ్చే వారం ఢిల్లీలో ఒప్పందంపై సంతకం చేయడానికి రానున్నట్లు చెప్పారు.  

    కాగా, ఈ ఫిబ్రవరి 3న భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది రూపం దాల్చింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా భారతీయ వస్తువులపై విధిస్తున్న సుంకాలను 50శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించి, భారత ఎగుమతులకు కొత్త అవకాశాలు కలిగేందుకు దోహదం చేయనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగకు 160 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి నెలలో ప్రయాణించనున్నాయి.

    కాగా, హోలీకి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్టేషన్ల నుంచి విశాఖపట్నం, పాట్నా, రాజ్‌కోట్, సోలాపూర్, బిలాస్‌పూర్, దానాపూర్, రక్సౌల్, నహర్‌లగున్, హజ్రత్ నిజాముద్దీన్, షాలిమార్, హిసార్, లక్నో, సంత్రాగచి, మాల్డా టౌన్, ఛప్రా, అనేక ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లనున్నాయి. అక్కడి నుంచి రిటర్న్‌ సర్వీసులు కూడా ఉన్నట్టు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. పండుగకు ప్రయాణీకులు రద్దీ తగ్గించేందుకు స్పెషల్‌ రైళ్లు ఉపయోగపడుతాయని అన్నారు. 

    మరోవైపు.. దేశవ్యాప్తంగా భారత రైల్వే హోలీ పండుగకు రికార్డు స్థాయిలో దాదాపు 1500 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొంది. 

     

  • సాక్షి,హైదరాబాద్‌: ఉద్యోగుల జీతాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీతాలు విడుదల చేసే విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఏప్రిల్‌ నెల నుంచి IFMIS (Integrated Financial Management and Information System) పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయబడతాయి. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, కార్పొరేషన్‌ ఉద్యోగులు అందరూ ఐఎఫ్‌ఎంఐఎస్‌ పరిధిలోకి వస్తారు. అంటే, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగుల జీతాలు ఇకపై ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా మాత్రమే విడుదల అవుతాయి.

    ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని వచ్చే కేబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

    కాగా, ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా జీతాల విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అకౌంటబిలిటీ పెరుగుతుంది. జీతాల చెల్లింపులో ఆలస్యం తగ్గి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, విజయ కుటుంబం మృతి మిస్టరీపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. విజయ భర్తను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. కానీ, వారి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు.

    చర్లపల్లి ఐటీ ఉద్యోగి విజయ(విజయశాంతి రెడ్డి) కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకునే రోజు.. కొడుకు, కూతురిలో సహా కారులో విజయ రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత తాము ఫంక్షన్‌ వచ్చినట్టు తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. చనిపోయేందుకు ముందు రోజే కూతురిని హాస్టల్‌ నుంచి ఇంటి తీసుకువచ్చిన విజయ. ముగ్గురూ రైల్వే స్టేషన్‌లో ప్రశాంతంగా మాట్లాడుతూ తిరిగినట్టు సీపీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు పట్టాల మధ్యలో నుంచి నడుచుకుంటూ విజయ, పిల్లలు వెళ్లారు. ఈ క్రమంలో వారిని రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

    అయితే, పిల్లలను రైల్వేస్టేషన్‌కు ఏమని చెప్పి తీసుకువచ్చారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇలా చనిపోవడానికి సిద్దమై ముగ్గురు వచ్చారా? లేక తల్లి విజయే బలవంతంగా తీసుకువచ్చిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ద​ర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. తన ఉద్యోగం ద్వారా విజయకు లక్ష రూపాయల జీతం వస్తోంది. ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయ అకౌంట్‌లో జమ అవుతోంది. పిల్లలకు ఐఐటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్న దంపతులు. పిల్లల చదువులకు అధిక డబ్బుల కోసమే విజయ భర్త దుబాయ్‌కు వెళ్లినట్టు తెలిసింది.

    కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్‌ రెడ్డి
    తమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్‌ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్‌ ఫోన్‌ ద్వారా సురేందర్‌ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్‌ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.

    సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను 
    విజయశాంతి రెడ్డి హైటెక్‌ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్‌ లీడర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్‌ ఫోన్‌లో ఒక నంబర్‌ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్‌ మార్నింగ్‌ మేడం అని మరో మెసేజ్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్‌కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు.  

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. 

    నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురికి అనర్హత వివాదంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. 

    కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్‌ఎస్‌ తెలంగాణ స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ తప్ప మిగతా 8 మందికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. ఇంకా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు. ఈ తరుణంలో.. నెక్ట్స్‌ ఏం జరగనుందో చూడాలి.

  • సాక్షి, ముషీరాబాద్‌: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉమెన్స్‌ హాస్టల్‌లో అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వాష్‌రూమ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో గీజర్‌ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు.. మంటలు వ్యాపించిన సమయంలో హాస్టల్‌లో ఉన్న ఇద్దరు అమ్మాయిలను స్థానికులు నిచ్చెన సాయంతో కిందకు తీసుకువచ్చినట్టు సమాచారం. 

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీనగర్‌లో ‘సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్’ హాస్టల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా, వాష్‌రూమ్‌లో షార్ట్‌ సర్య్కూట్‌తో గీజర్‌ పేలి మంటలు చెలరేగినట్టు తెలిసింది.  ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లో విద్యార్థినులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, హాస్టల్‌లో మంటలు వేగంగా వ్యాపించి భవనం నుండి భారీగా పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో హాస్టల్‌లోని ఫర్నిచర్, దుస్తులు, ఇతర వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇక, హాస్టల్ యజమాన్యం నుండి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

  • సికింద్రాబాద్‌: నాలుగు రోజులుగా రైల్వే పోలీసుల ఉరుకులు పరుగులు... పలువురి విచారణలు పూర్తిచేసినప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పిన్నింటి విజయశాంతిరెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ వీడలేదు. ఆమె ఎనిమిదేళ్లుగా నివసిస్తున్న కాలనీ, పనిచే స్తున్న కార్యాలయం, పిల్లలు చదువుతున్న విద్యా సంస్థల్లో సుమారు 200 మందిని కలిసి జీఆర్‌పీ పోలీసులు విచారించారు. తల్లీ పిల్లలను ఢీ కొట్టిన రైలు లోకోపైలట్‌ను కూడా విచారించారు. ఎక్కడా ఘటనకు సంబంధించిన వివరాలు రాలేదు.

    ఘటనకు కొద్దిరోజుల ముందు నుంచి ఆమె కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించిన సమాచారం రాబట్టలేక పోయారు. ఘటన రోజు ఆమె ఇంటి దగ్గరి నుంచి ఇరువురు పిల్లల కళాశాలలు తిరిగి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ చేరుకునే వరకు 100 సీసీ కెమెరా పుటేజీలను తెప్పించి పరిశీలించారు. వాటన్నింటిలోనూ తల్లి వెళ్లడం.. ఇరువురు పిల్లలను తోడుకుని రావడం మినహా మరెవ్వ రితోనూ కలిసిన దాఖలాలు కనిపించలేదు.

    ఆ ఒక్క రోజుపైనే దృష్టంతా....
    గత నెల 27న కూతురు చైతన్యరెడ్డిని విజయశాంతిరెడ్డి (Vijayashanti Reddy) పటాన్‌చెరు హాస్టల్‌ నుంచి ఔటింగ్‌ తీసుకొచ్చారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం 29న తిరిగి హాస్టల్‌లో డ్రాప్‌ చేసి వచ్చారు. 30న రాత్రి 8 గంటల ప్రాంతంలో కుమారుడిని వెంట తీసుకుని మళ్లీ ఔటింగ్‌ కావాలని చైతన్యరెడ్డి హాస్టల్‌కు వెళ్లారు. ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్‌ ఎందుకని హాస్టల్‌ నిర్వాహకులు ప్రశ్నించగా.. బంధువు చనిపోయారని చెప్పారు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

    కొద్ది రోజులు ముందే బలవన్మరణం నిర్ణయం తీసుకుని ఉంటే కూతురిని ఐఐటీ పరీక్ష (IIT Exam) అనంతరం తిరిగి హాస్టల్‌లో డ్రాప్‌ చేసేవారు కాదని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయం వెనుక కారణాలు ఏంటన్న విషయాలు విచారణలో తేలడం లేదు. కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాల కోణంలోనూ బలమైన అంశాలేవీ కానరావడం లేదు.

    అందుకే పిల్ల‌లు ఆమె వెంట వెళ్లారు: విజయశాంతిరెడ్డి భ‌ర్త‌

    ఆత్మహత్యల సమయంలో భర్త సురేందర్‌రెడ్డి (Surendar Reddy) దుబాయ్‌లో ఉన్నందున ఆయన పాత్ర ఉండక పోవచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ దశదిన కర్మ అనంతరం సురేందర్‌రెడ్డి ద్వారా కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఫోరెన్సిక్‌ నివేదిక అందితే ఏదైనా క్లూ దొరుకుతుందని భావిస్తున్నారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ సాయీశ్వర్‌గౌడ్‌ నేతృత్వంలోని బృందం గురువారం చెంగిచెర్లలోని విజయశాంతి నివాసంలో సోదాలు చేసేందుకు వెళ్లనుంది.  

Business

  • సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

    నిస్సాన్ టెక్టెన్‌: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్‌పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.

    బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

    మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.

    ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

    టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.

  • సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..

    బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్‌లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి.  పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్‌లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.

    రంగు
    ఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్‌ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.

    సాంప్రదాయం
    చాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.

    ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!

    వ్యాపారం
    ఇతర పేపర్‌లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.

    మానసిక ప్రభావం
    ప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు.

  • ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.

    ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్‌గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

    సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.

    ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

    సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్‌ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.

    ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.

  • ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్‌ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా లేటెస్ట్‌ ఐఫోన్ 17 సిరీస్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

    ఈ సేల్‌లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది.  ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులపై వర్తిస్తాయి. చెక్‌అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్‌ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.

    ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధర
    ఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
    ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

    • వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

    ఐఫోన్ 17 ప్రో స్పెక్స్‌.. ఆఫర్లు ఇలా..
    ఐఫోన్ 17 ప్రోలో  6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది  120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో వస్తుంది. ఈ మోడల్‌లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

    • వాలెంటైన్స్ డే సేల్‌లో ఈ ఫోన్  రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.

    ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధర
    ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్‌తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్,  8K వీడియో సపోర్ట్  ఉన్నాయి.

    • వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

  • ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం 2026లో మరోసారి చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఆయుర్దాయం, పెన్షన్ బాధ్యతల భారం నేపథ్యంలో ఈ విషయం విధాన నిర్ణేతలు, ఉద్యోగులు, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 58–60 సంవత్సరాల మధ్య ఉన్న పదవీ విరమణ వయస్సును సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలు, రంగాల వారీగా వస్తున్న ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా వర్తించే ఏకరీతి నిర్ణయం ఇప్పటివరకు అధికారికంగా తీసుకోలేదు.

    సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు!
    దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు సంప్రదాయ పదవీ విరమణ నిబంధనలను పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలా వద్దా అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 64 నుంచి 65 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

    కార్మికుల పదవీ విరమణ వయస్సును పొడిగించాలా అనే అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక పని జీవితం, పెరుగుతున్న పెన్షన్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని దానిని 62 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలా అనే దానిపై విధాన, మేధావి  వర్గాలు చురుకుగా చర్చిస్తున్నాయి.

    నిరుద్యోగ సమస్య
    పదవీ విరమణ వయస్సు పెంపు ప్రభావం కేవలం పెన్షన్ వ్యయాలకే పరిమితం కాదు. ఇది మొత్తం శ్రామిక శక్తి సమీకరణంపైనా ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కువకాలం సేవలో కొనసాగించడం ద్వారా కొన్ని రంగాల్లో నైపుణ్యాల కొరతను తగ్గించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

  • అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకబడింది. రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టెస్లా జనవరి 2026 నుంచి మోడల్ వై కార్లను కేవలం 62 మాత్రమే విక్రయించింది. ఇది మొత్తం కొత్త కార్ల అమ్మకాలలో 2.8 శాతం మాత్రమే.

    టెస్లా ఈ ఏడాది మొత్తం 83 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ. ఇప్పుడు అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ అగ్రస్థానంలో ఉంది. టెస్లా కంటే ఐదు రేటు ఎక్కువ అమ్మకాలు సాధించింది.

    టెస్లా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. నార్వేలోని ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల టెస్లా అమ్మకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో నార్వేలో జరిగిన అన్ని కొత్త వాహనాల అమ్మకాలలో 94 శాతం ఈవీలు ఉన్నాయి. డీజిల్ కార్లు 98 కాగా, పెట్రోల్ కార్ల అమ్మకాలు కేవలం 7 మాత్రమే.

    మోడల్ ఎక్స్, ఎస్ నిలిపివేత!
    అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.

    2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు.

  • బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.

    బిట్‌కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్‌కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్‌కాయిన్‌లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    బిట్‌కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్‌కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్‌కాయిన్‌ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్‌లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్‌ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.

    బిట్‌కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్‌కాయిన్‌పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్‌కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.

    బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్‌కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్‌కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.

    ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.

    ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

  • గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద,  నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.

    మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
     

  • దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్‌ గోల్డ్‌ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.

    ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్‌ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్‌), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్‌ బాండ్‌లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.

    గోల్డ్‌ బాండ్‌ కొత్త ట్యాక్స్‌ ఫ్రేమ్‌వర్క్
    ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్‌లపై పన్ను విధానం ఇన్వెస్టర్‌ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి  మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.

    అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.

    2015లో ప్రారంభమైన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ పథకం ఇప్పటివరకు  67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్‌లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో  సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.

    మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్‌ఫోలియో XIRRలు (ఎక్స్‌టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్‌లతో పోలిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్  వాదిస్తున్నారు.

  • ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.

    ''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

    సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్‌స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్‌బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్‌బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.

    అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు

    గత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్‌ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.

    ప్రపంచ ఆర్థిక అనిశ్చితి

    అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.

    అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలు

    అమెరికాలో లేబర్‌ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

    రూపాయి ఒడిదుడుకులు

    గత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.

    ద్రవ్యోల్బణం

    ద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్‌ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

    పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

  • ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్‌టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.

    రోజుకు 16 గంటల పని
    టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

    తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్‌టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కూడా ఆయన ఆశ్రయించారు.

    అనారోగ్యంలోనూ పనిభారం
    తాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.

    సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్‌లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్‌ ఆరోపిస్తున్నారు.

    చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్‌లో ఉన్న ఓవర్‌టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.

    హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళన
    హైదరాబాద్‌కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్‌టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.

    దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.

    పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలు
    పని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Politics

  • సాక్షి, కరీంనగర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు రెండేళ్ల కాలంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రేవంత్‌ అని సవాల్‌ విసిరారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

    మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్నర్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్‌కు రూ.1400 కోట్లు విడుదల చేశానని రేవంత్‌ రెడ్డి చెప్పడం పెద్ద జోక్. రెండేళ్ల పాలనలో కరీంనగర్‌కు నయాపైసా కూడా ఇవ్వలేదు. నన్ను కోసినా నయాపైసా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయని అబద్దాలు చెబుతున్నారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?.

    కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా?. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు పెంపు తథ్యం. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. రోడ్డుపై నడిస్తే కూడా పన్ను వేస్తారు జాగ్రత్త. కమలం లక్ష్మీ అమ్మవారి పువ్వు.. స్వస్తిక్ శుభసూచికం. బ్యాలెట్‌లో పువ్వుపై స్వస్తిక్ గుర్తు గుద్దితే అన్నీ శుభ సూచకాలే అంటూ వ్యాఖ్యలు చేశారు. 

  • కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి అర్జెంట్‌గా సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా జనంలోకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేసిన పవన్ ఇప్పుడు లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక తికమకపడుతున్నారు.

    దీంతో ఇప్పుడు తాను లడ్డు విషయంలో ఆనాడు చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని, తాను ఫలానా వాళ్లు అందులో కొవ్వు కాలిపారని అనలేదని ఏదేదో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూశారు. వాస్తవానికి  పవన్ తనకు తానూ ఓ కమ్యునిస్ట్‌ అని, తనకు దేవుడిపై నమ్మకం లేదని పలుమార్లు రాజకీయ వేదికల మీద చెప్పారు. తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్ట్ అని, తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో సిగరెట్‌ వెలిగించుకునేవారని రాజకీయ వేదికలమీద చెప్పారు. ఇక తిరుమల లడ్డులో కొవ్వు కలిసింది అని, సనాతని గెటప్ వేసుకుని మెట్లు కడిగేశారు. తీరా ఇప్పుడు సీబీఐ నివేదికలో ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపునకు తిప్పుకునేందుకు యాతనపడుతున్నారు. ఇన్నాళ్లు అబద్ధాల మిషన్ సినిమాల్లో చూడటమే కానీ ఇలా మానవరూపంలో చూడడం ఇదే మొదటి సారి అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

    ఇక ఎమ్మెల్సీ నాగబాబు అయితే మరింత ఎక్కువ యాక్టింగ్‌కు దిగిపోయారు. గతంలో అసలు దేవుడే లేడు.. అదొక మిథ్య.. ప్రజలు.. తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు. నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన నాగబాబు ఇప్పుడు తానూ సనాతన వాదిని అని, హిందూ ధర్మానికి రక్షకుడిని అని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుత్తకు తీసుకుని మరబొమ్మను ఆడించినట్లు ఆడిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

    మరోవైపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిలదీయడంతో ఇక ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. గురువారం చంద్రబాబు.. మంత్రులు.. నాయకులు కలసికట్టుగా మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుకు లడ్డు అంశం ఒక ఆయుధంగా మారిందని.. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్లుగా ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.  
    -సిమ్మదిరప్పన్న.

  • సాక్షి, తిరుపతి: కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌పై విష ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి. పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెప్పిన అబద్ధమే చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. భోలే బాబాను తీసుకువచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు.

    టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రజల ముందు నటిస్తున్నారు. కెబినెట్‌ సమావేశంలోనే మంత్రి పార్థసారథి పచ్చి అబద్దాలు చెప్పారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ మమ్మల్ని దోషులుగా ప్రకటించలేదు. మమ్మల్ని దోషులుగా చూపించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తప్పు చేసి, తప్పుగా మాట్లాడి దొరికిపోయి.. మళ్లీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్‌ అంటున్నారు. 2014-2019 మధ్య అధిక శాతం నెయ్యి సరఫరా ప్రిమియర్‌ డెయిరీనే. 2018లోనే భోలే బాబాను చంద్రబాబు తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?. ఇప్పుడు ఉన్న అధికారులే చంద్రబాబు హయాంలో ఉన్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

    పదేళ్లలో పవన్‌ చెప్పినవి ఇవే.. 
    జగన్ రాజకీయ జీవితాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఏదైనా వాడుకోవడానికి సిద్దంగా ఉన్నారు. మీడియా సమావేశంలో నంగిలా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం భయంతో చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారు. చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికి నవ్వు తెప్పిస్తుంది. పదేళ్ల కాలంలో పవన్‌.. అనేక మార్లు బాప్టజం తీసుకున్న, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించేవారు, గొడ్డు మాంసం తింటే తప్పేంటి అన్న వ్యక్తి. కానీ, నేడు సనాతన ధర్మం అంటున్నారు. చంద్రబాబు తనంత భక్తుడే లేడని అంటారు. భగవంతునికి చంద్రబాబు ఒక్కడే భక్తుడు కాదు, రోజుకు లక్షమంది వస్తారు. చంద్రబాబు హయాంలో కొండపై మద్య మాంసాలు అనేమార్లు దొరికాయి. మత్తులో ఘర్షణలకు పాల్పడ్డారు. తొక్కిసలాటలో భక్తులు మరణించారు.

    చంద్రబాబుది దైవ ద్రోహం.. 
    చంద్రబాబు అలిపిరిలో జరిగిన దాడికి మొదట బాధపడిన వ్యక్తి వైఎస్సార్‌, నేను. వైఎస్సార్‌ అలిపిరి వద్ద నిరసన కూడా చేశారు. దేవుడి దయవల్ల చంద్రబాబు బతికారు. ఆయన ఏం చెప్పినా నమ్మించడానికి పచ్చ పత్రికలు ఉన్నాయి. నెయ్యిలో నెయ్యే లేకుండా జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు చీవాట్లు పెట్టి సిట్ వేసింది. సిట్ రిపోర్టులో క్లియర్‌గా ఉంది. ఎక్కడ కూడా జంతువుల కొవ్వుతో లడ్డులు తయారు కాలేదని రిపోర్ట్ చెప్పారు. దైవ ద్రోహానికి పాల్పడే పరిస్థితిలో ఈ ఘటన ఉంది. అయోధ్య పంపిన లడ్డులో నెయ్యి కలిసిందని అంటున్నారు పవన్‌. ప్రస్తుతం పాలకమండలి సభ్యులుగా ఉన్న వారు విరాళంగా ఇచ్చిన నెయ్యితో అయోధ్య లడ్డు తయారు చేశారు.

    వైవీ సుబ్బారెడ్డి హయాంతో నెయ్యి టెస్ట్ రిపోర్ట్ దాచేసారని మరో అబద్దం ఆడుతున్నారు. కరుణాకర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే, నాకు ఎటువంటి హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిబంధనలు మార్పు చేసాము, అందులో మా దురుద్దేశం ఏమీ లేదు. మమ్మల్ని ఇరికించడానికే ఏకసభ్య కమిషన్‌ వేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, కూటమి నేతలకు ఉంది. చంద్రబాబు పచ్చ అబద్దం చెప్తారు. వేంకటేశ్వరస్వామిని మీ రాజకీయాలకు వాడుకుంటారా?. పచ్చ పత్రికలలో ఎన్ని తూటాలు ఎక్కుపెట్టినా మమ్మల్ని భయపెట్టలేరు. మేము ఒక్క తప్పు కూడా చేయలేదు. చంద్రబాబు లాంటి వాళ్లను దేవుడు క్షమించరు’ అని అన్నారు.  

  • సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్‌ కల్యాణ్‌ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

    మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రం​ చేస్తున్న అప్పులను మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రజలకు చెప్పరు. ఆర్థిక శాఖపై కేశవ్‌కు పట్టింపు లేదు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భోలే బాబా డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది చంద్రబాబు హయాంలోనే. భోలే బాబా నుంచి రూ.291కి నెయ్యి ఎలా కొనుగోలు చేశారో చెప్పాలి. హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలి. గతంలో అనేకసార్లు పవన్‌ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. రాజకీయాల కోసం పవన్‌ కల్యాణ్‌ దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

     

  • సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్‌ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

    రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్‌ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.

    మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..​‘ఎన్డీయే హయాంలో భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్‌తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్‌ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఒక విజన్‌ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.

    భారత్‌ తొమ్మిది దేశాల్లో ట్రేడ్‌ డీల్‌ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్‌ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. 

    రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అ‍త్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్‌సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్‌ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్‌ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్‌ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు. 

  • సాక్షి,రాజన్న: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు.  

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్‌ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

    ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్‌కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.

    మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.

    కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు. 

  • సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారంపై సీబీఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు నేతలకు పవన్‌, చంద్రబాబు హుకూం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో భారీ ప్రెస్‌మీట్‌తో ఇప్పుడు మరో నాటకానికి తెర తీశారు. 

    తిరుమల లడ్డూ ప్రసాదంపై దర్యాప్తు వ్యవహారంలో కూటమి పెద్దలు గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్‌ కో.. తాము చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ.. దొంగే దొంగా దొంగా అన్నచందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు.  

    మీడియాపై చంద్రబాబు అసహనం
    తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతుకొవ్వు కలవలేదని..  కూటమి సర్కార్‌ ఆధ్వర్యంలో ఉన్న సీబీఐ, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ, ఎల్లో మీడియా మాత్రం సీబీఐ విచారణ, ఆ నివేదికలపైనా బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నివేదికలనే ఆయన తప్పుబట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక ఇచ్చిందని.. ఇప్పటిదాకా వచ్చిన నివేదీకలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని.. సీబీఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. 

    ఊగిపోయిన పవన్‌
    జంతు కొవ్వు లేదని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసినా.. ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందంటూ ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఇష్టానుసారం మాట్లాడారు. ఏ నివేదికలోనూ వైఎస్సార్‌సీపీ నేతలకు క్లీన్‌ చిట్‌(అసలు ఎవరి పేరు లేదు కూడా) ఇవ్వలేదు. తాను, చంద్రబాబు ఒక్కటేనని.. మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటామని.. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడారు. 

    తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీతో మహా పాపం జరిగిందంటూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీ కీలక నేతలు వైవీసుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డిని బద్నాం చేయాలనే కూటమి కుట్రలు సీబీఐ నివేదికతో పటాపంచలు అయ్యాయి. దీంతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్న కూటమి బ్యాచ్‌.. ఈ విషయంలో తప్పుడు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావించింది. అందుకే సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ నిర్వహించి.. ఆపై మీడియా ఎదుట ప్రకటనలు చేసింది. ఇది చూసి అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

    ముందే చెప్పిన వైఎస్‌ జగన్‌
    చంద్రబాబు ఏకసభ్య కమిషన్‌ డ్రామా గురించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముందే చెప్పారు. బుధవారం అంబటి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్‌ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్‌ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు’’ అంటూ మాట్లాడారు. జగన్‌ చెప్పినట్లే.. ఇవాళ చంద్రబాబు ఏకసభ్య కమిషన్‌ సీబీఐ సహా నివేదికలన్నింటిపైనా విచారణ జరుపుతుందంటూ ప్రకటించారు. 

  • సాక్షి, నంద్యాల: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్‌సీపీ నిర్వహించిన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

    రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునేవాళ్లు కూడా గత రెండు మూడు రోజులుగా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వేస్ట్‌ అని మాట్లాడుతున్నారు. మద్ధతు ఇవ్వమని కోరితే.. టీఎంసీ, క్యూసెక్కులు అంటే ఏంటో చెప్పాలంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. అవే చదువుకుని కుంటే ఏ ఇంజినీర్లు అయ్యి ఉండేవాళ్లు కదా. ఇదంతా కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే. 

    తెలుగు దేశం వాళ్లు ఒక్క పని చేయరు. చంద్రబాబుకు తెలిసిందల్లా రెండే.. ఒకటి శిలాఫలకం వేయడం, రెండోది పని ఎవరైనా పూర్తి చేశాక వచ్చి తనదే ఆ క్రెడిట్‌ అని చెప్పుకోవడం.. అందుకే ఇప్పుడు వేటగాడి కథ చెప్పుకోవాలి..

    ఒక వేటగాడు ఉన్నాడు. భయంకరమైన యుద్ధం చేసి పులిని చంపాడు. ఆ నొప్పులు తట్టుకోలేక మందు కోసమని వెళ్లాడు. ఈలోపు చంద్రబాబు లాంటోడు వచ్చాడు. పులి గోళ్లు, పళ్లు ఎత్తుకెళ్లి.. నేనే చంపాను అంటూ చెప్పుకుని తిరిగాడు. హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) పనులు తానే చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, ఆ పనులు ఎన్టీఆర్‌ కాలం నాడే మొదలయ్యాయి. పూర్తి చేసింది రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం. దానికి.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదు అని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు.  

    లడ్డూ గురించి అడిగితే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. యూరియా కొరత గురించి అడిగితే.. ఆ వాడకం మంచిది కాదు కేన్సర్‌ వస్తుందటారు. మహిళలకు ఎన్నికల్లో ఇస్తానన్న భృతి గురించి అడిగితే.. నా దగ్గర భద్రంగా ఉంటుందని అంటున్నారు. ఇంక పవన్‌ కల్యాణ్‌ తిరిగేది రెండు మూడు నియోజకవర్గాలే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. చంద్రబాబు అండ్ కో పదే పదే అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారు అని అన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ చంద్రబాబు జాగీరు కాదని.. మెడలు వంచైనా సరే సాధించుకుంటామని ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజా , రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపాయి.

Family

  • డాక్టర్‌గారూ నాదొక చిత్రమైన సమస్య. అసలు ఇది సమస్య అవునో కాదో కూడా తెలియడం లేదు. మీరే దీనికి పరిష్కారం చెప్పాలి. నేను ఒక బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాను. నాది చాలా కలివిడి స్వభావం. అందరితో స్నేహంగా ఉంటాను. ఎవరినీ నొప్పించను. నా మూలాన ఎవరూ బాధపడకూడదనుకునే స్వభావం వల్ల చాలాసార్లు నేను పరిస్థితులతో రాజీపడుతూ వచ్చాను. ఈ లక్షణాన్ని ఆసరాగా తీసుకుని చాలామంది నన్ను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి.

    కొన్ని సంవత్సరాలుగా నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. మా మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చి బ్రేకప్‌ అవుతూ మళ్లీ కలిసిపోతూ ఉండటం కామన్‌. మేం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాం. అతను కూడా బ్యాంక్‌ ఉద్యోగే. ప్రస్తుతం అతనికి వేరే రాష్ట్రంలో పోస్టింగ్‌ రావడం వల్ల నెలకు ఒకసారి మాత్రమే కలుసుకుంటున్నాం. ఆరునెలల క్రితం ఒకబ్బాయి నేను పని చేసే బ్యాంకులో ప్రొబేషన్‌ కోసం జాయిన్‌ అయ్యాడు. అనుకోకుండా అతనికీ నాకూ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కలిసి సినిమాలకు వెళ్లినా మేమెప్పుడూ హద్దులు దాటలేదు. అయితే నాకు ఇటీవల కొంతకాలంగా అతనిపై ఫీలింగ్స్‌ వస్తున్నాయి.

    ఈ విషయం గురించి నా భర్తకు చెబితే మేమిద్దరం దూరంగా ఉండటం వల్లే అలా వస్తూ ఉండి ఉండచ్చని, అందువల్ల నేను ఉద్యోగం మానేసి అతని దగ్గరకు వెళ్లడం గానీ లేదా తనే ఉద్యోగం మానేసి ఇక్కడకు వచ్చి వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిదనీ అన్నాడు. నాకు నా భర్తను వదిలేయాలన్న ఉద్దేశ్యం లేదు. అలాగని ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్‌ను చంపుకోలేకపోతున్నాను. అతనికీ నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం నా భర్తకు కూడా తెలిసింది. ఒకవేళ నాకు తనతో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అబ్బాయితోనే ఉండమని కూడా అన్నాడు. దీంతో నేను చాలా గందరగోళంలో ఉన్నాను. దయచేసి నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
    – ఓ సోదరి, విశాఖపట్నం

    మీ ఉత్తరం చదివాక నాకు అర్థం అయిందేమంటే మీరు చెడ్డవారు కానే కాదు, ఇతరుల కోసం మీ అవసరాలను కూడా వెనక్కినెట్టే మనిషని. ఇది చాలామంది మహిళల్లో కనిపించే గుడ్‌ గర్ల్‌ సిండ్రోమ్‌ (Good Girl Syndrome). చిన్న వయసులోనే ఎవరినీ బాధ పెట్టకూడదు, అందరినీ నచ్చాలి. మనవల్ల ఎవరికైనా కష్టం వస్తే అది మన తప్పే అనే భావనతో పెరిగారు. ఇలాంటివారు పెద్దయ్యాక కూడా ఇదే అలవాటును కొన సాగిస్తారు. అది రిలేషన్‌షిప్‌కు కూడా వర్తింపచేసుకోవడం వల్ల ఎప్పుడూ ఇతరుల కోసం అడ్జస్ట్‌ అవుతూ ఉండటంతోనే సరిపోతుంది. మీ గత రిలేషన్‌షిప్‌ అన్నింటిలోనూ ఒక ప్యాటర్న్‌ కనిపిస్తోంది. మీరు ఎదుటి వారికి నచ్చినట్టుగా ఉన్నంత కాలం మీ బంధం బాగుంటుంది. మీరు మీ అప్రాయం చెప్పినప్పుడో, మీరు అవసరాలు ఉన్నాయని గుర్తు చేసినప్పుడో ఆ బంధం కూలిపోతుంది. దీనివల్ల మీరు మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. నాలాగా నేను ఉంటే నన్ను వదిలేస్తారేమో... ఒంటరి అవుతాననే భయం మిమ్మల్ని పదే పదే కాంప్రమైజ్‌ అయ్యేలా నడిపించింది.

    ఇక మీ ప్రస్తుత సమస్య విషయానికొస్తే మీ ఎమోషనల్‌ సైకిల్‌ మీ వివాహ బంధంలో కూడా కొనసాగింది. అయితే మీ భర్త మెచ్యూరిటీ వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఒక స్థిరత్వం ఏర్పడింది. అదే సమయంలో తను మీకు దూరంగా ఉండటం మీలో ఒక శూన్యాన్ని తీసుకొచ్చింది. ఆ ఖాళీని పూడ్చుకోవడం కోసం మీకు ఆఫీసులో పరిచయం అయిన అబ్బాయికి దగ్గరయ్యారు. ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఎమోషనల్‌గా ఆధారడపడటం అనే మీ గుణం వల్ల మీరు అతనికి ఆకర్షితులయ్యారు. కాని అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. మీలో బార్డర్‌లైన్‌ పర్సనాలిటీ లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీలో చిన్న వయసు నుంచి ఎప్పుడూ ఒక రకమైన ఎమోషనల్‌ ఎంప్టీనెస్‌ ఉంది. దీన్ని ఎవరోఒకరి తో భర్తీ చేస్తున్నారు. దీనికోసం ఎవరో ఒకర్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నారా అనేది ప్రశ్న! మీ మనసు ఇప్పుడు ఒక అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలా ఉంది.

    ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తర్వాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకండి. వెంటనే ఒక మంచి సైకియాట్రిస్ట్‌ని, ఒక క్లినికల్‌ సైకాలజిస్టును కలిస్తే మీలోని ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో నేర్పిస్తారు. మీ జీవితం మీద ఒక స్పష్టత వచ్చేలా సహాయపడతారు. విష్‌ యు ఆల్‌ ది బెస్ట్‌!

    - డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
    మీ సమస్యలు, సందేహాలు 
    పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com
     

  • ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాఘవ్ చద్దా రాజ్యసభలో ఆహారకల్తీపై ధ్వజమెత్తారు. భారతదేశంలో అతిపెద్ద అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం: ఆహార కల్తీనే అంటూ మండిపడ్డారు. పాలు దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు, వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహారాలు, పానీయాల్లో హానికరమైన రసాయనాలు, అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు, చక్కెర లేదా ఉప్పు వంటివి ఉన్నాయని అన్నారు. 

    అవి అనారోగ్య కారకాలని, పైగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. పైగా దాన్ని స్వచ్ఛత ముసుగులో ఉన్న నకిలీగా అభివర్ణించారు. మార్కెట్లోకి విషాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా కల్తీకి సంబంధించిన వాటిని జాబితా చేశారు కూడా.

    • పాలలో యూరియా

    • కూరగాయలలో ఆక్సిటోసిన్

    • పనీర్‌లో కాస్టిక్ సోడా

    • సుగంధ ద్రవ్యాలలో ఇటుక పొడి

    • తేనెలో పసుపు రంగు

    • పౌల్ట్రీలో స్టెరాయిడ్లు

    • ఐస్‌క్రీమ్‌లో డిటర్జెంట్

    పార్లమెంటులో పాలకల్తీ సమస్యను లేవనెత్తుతూ..చద్దా ఇలా అన్నారు. పరిశోధనల ప్రకారం పాల నమూనాలలో 71%  యూరియా, 64 శాతం సోడియం బైకార్బోనేట్ వంటి న్యూట్రలైజర్లు ఉన్నాయి. ఈ దేశంలో అమ్ముడవుతున్నంత పరిమాణంలో పాలు ఉత్పత్తి కావడం లేదు.

    ఆక్సిటోసిన్ ఒక హానికరమైన రసాయనమని, ఇది తలతిరగడం, తలనొప్పి, గుండె వైఫల్యం, వంధ్యత్వం, క్యాన్సర్‌కు కారణమవుతుందని అన్నారు.

    పరీక్షించిన ప్రతి నాలుగు ఆహార నమూనాలలో ఒకటి కల్తీ అయినట్లు తేలింది
    2014-15 నుంచి 2026 వరకు, పరీక్షించిన అన్ని నమూనాల్లో 25 శాతం కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు . అంటే ప్రతి నాలుగు నమూనాలలో ఒకటి కల్తీకి గురవ్వుతుందని అర్థం. దీనివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవ్వడమే కాదు ప్రాణాలు కూడా కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యకం చేశారు చద్దా.

    అంతేగాదు చద్దా అంతర్జాతీయంగా నిషేధించిన భారతీయ ఆహార ఉత్పత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలోని రెండు అతిపెద్ద గరం మసాలా కంపెనీలను అమెరికా, యూకే, యూరప్ అంతటా నిషేధించారు. ఎందుకంటే వాటిలో కేన్సర్‌కు కారణమయ్యే పురుగులమందులు ఉన్నాయి. కానీ అవే సుగంధ ద్రవ్యాలు భారతదేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో అమ్ముడవుతుండటం బాధకరం అని అన్నారు.

    రాఘవ్ చద్దా దిద్దుబాటు చర్యలను కూడా సూచించారు
    ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కోరుతూ, ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ ఈ చర్యలను సిఫార్సు చేశారు:

    1. మానవశక్తిని పెంచి..ప్రయోగశాల పరీక్షా సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI)ని బలోపేతం చేయడం.
    2. నేరస్థులను అరికట్టడానికి కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టడం.
    3. కల్తీ ఉత్పత్తుల పేర్లు, బహిరంగంగా  వెల్లడించడం మార్కెట్ నుంచి తక్షణమే తొలగించేలా చర్చలు తీసుకోవడం వంటివి చేయాలి. 

     

    (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)

  • ఆలస్యంగా తల్లికావడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం మహిళలు.  కెరీర్‌కే తొలి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం. ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం, చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించే సామర్థ్యం వచ్చాకే మాతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు.

    2024లో 37 శాతం మంది తల్లులు 25–29 ఏళ్ల మధ్య వయసువారే. మాతృత్వానికి ఇదే సరైన వయస్సుగా నేటి మహిళలు భావిస్తున్నారు.

    19 ఏళ్ల లోపు తక్కువ వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య అభివృద్ధి చెందిన దేశాలలో గణనీయంగా తగ్గింది. అయితే కొన్ని వర్గాలలో గతంలోలాగే ఉంది.

    30–34 ఏళ్ల వయస్సులో తల్లులయ్యే వారి సంఖ్య 2.5 రెట్లు పెరిగింది. 2005లో 9.9 శాతం ఉండగా 2024లో 24.6 శాతానికి చేరుకుంది.

    గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మహిళల్లో 34.8 శాతం మందికి ఒక్కరే సంతానం, 31.4 శాతం మందికి ఇద్దరు పిల్లలు, 15.9 శాతం మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విద్యావంతులైన మహిళలు చిన్న కుటుంబాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

    2005లో 25 ఏళ్ల లోపు తల్లులు 48.9 శాతం ఉన్నారు. ప్రస్తుతం 29.7 శాతం ఉన్నారు. 30 ఏళ్ల పైబడిన మహిళల్లో తల్లులు అయినవారు గతంలో 21.6 శాతం, ఇప్పుడు 33 శాతం ఉన్నారు. ఇప్పుడు ప్రతి ముగ్గురు తల్లులలో ఒకరు 30 ఏళ్లు పైబడిన వారే.

    ఈ రెండు దశాబ్దాల కాలంలో 20–24 ఏళ్ల వయస్సులో తల్లులయిన వారి సంఖ్య 46.6 శాతం నుండి 27.1 శాతానికి తగ్గింది.

    (చదవండి: పార్లమెంట్ సమావేశాల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కంగానా..!)

  • బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ యాక్టింగ్‌ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్‌ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్‌గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్‌ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా  బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్‌ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్‌తో అత్యంత అందంగా కనిపించారామె. 

    అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్‌హ్యాండ్స్‌​ జాకెట్‌తో పార్లమెంట్‌ రేంజ్‌కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్‌ మేకప్‌, బ్యాక్‌సన్‌గ్లాస్‌, చేతిలో హెర్మెస్‌ బ్యాగ్‌తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె.  

     

    (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు)

     

  • ఓ వృద్ధ మహిళ దీర్ఘకాలికంగా విపరీతమైన తలతిరగడం సమస్యతో బాధపడుతోంది. ఎన్నో ఆస్ప్రతులు, పలు స్కానింగ్‌ పరీక్షలు చేసినా..ఎందువల్ల ఈ సమస్య అనేది ఎవ్వరు చెప్పలేకపోయారు. వెద్యులకే అంతుపట్టని మిస్టరీ వైద్య సమస్యలా మారింది ఆమె బాధ. అయితే చివరికి న్యూరాలజిస్ట్‌లు ఎందువల్ల ఆమెకు ఈ సమస్య వచ్చిందో తెలిసి విస్తుపోయారు. పైగా ఆ వైద్యుడు ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

    70 ఏళ్ల మహిళకు విపరీతమైన తలతిరడం సమస్యతో బాధపడుతుంది. ఒంటిరిగా వెళ్లాలన్నా..కాసేపు నుంచొన్న పడిపోతానేమో అనే భయంతో విలవిలలాడింది. ఆ సమస్యతో తాళ్లలేక పలు ఆస్పత్రులు సందర్శించినా..ఎలాంటి సమస్యల లేదని తేల్చి చెప్పారు. ఎమ్మారై నుంచి ప్రతి స్కాన్‌లో రిపోర్టు నార్మల్‌గానే రావడంతో వైద్యలు సైతం ఇదొక అంతుపట్టని మిస్టరీ సమస్యగా పేర్కొన్నారు. బ్రెయిన్‌లో కణితి లేక స్ట్రోక్‌ వల్ల వస్తుందేమోనని బ్రెయిన్‌కి సంబంధించిన టెస్ట్‌లు చేసినా..ఫలితం శూన్యం. 

    దాంతో చివరికి ఆమె న్యూరోలజిస్ట్‌ని సంప్రదించగా..ఆయన ఆమె సమస్యను క్షణ్ణంగా పరిశీలించారు. ఆయన ఆమె ఎదుర్కొంటుంది సాధారణ తలతిరుగుడు సమస్య కాదని గుర్తించారు. దాంతో ఆమెను లేచి నిలబడి ఉండమని చెప్పినప్పుడూ..కొంచెం సేపు నుంచోలేకపోవడం గమనించారు. ఆ తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు గురించి విచారించగా..అసలు సమస్య ఎక్కడ ఉందో ఆయన గుర్తించి సవివరంగా చెప్పారు. పైగా ఇలాంటి సమస్యను చాలామది ఫేస్‌ చేస్తున్నారని. అయితే వాళ్లే తేలిగ్గా తీసుకోవడంతోనే వెలుగులోకి రాలేదన్నారు. 

    ఎందువల్ల అంటే..
    ఆ మహిళ దీర్ఘకాలం పాటు పూర్తిగా శాకాహారం, పాల ఉత్పత్తులను నివారించడంతోనే పోషకాహారం లోపం ఏర్పడి.. నరాలు, కీళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఆమె నుంచొన్నప్పుడు కాలి వేళ్ల స్పర్శను అనుభూతి పొందలేకపోయిందని చెప్పారు. కాలి చీలమండలం దాక ఎలాంటి సెన్సేషన్‌ లేకపోవడం గుర్తించారు వైద్యులు. 

    నిలబడుతున్నప్పుడూ ఆ మహిళ బ్యాలెన్స్‌ చేసుకోలేనట్టుగా ఊగిపోవడం గమనించారు. అది సాధారణ తలతిరగడం సమస్య కిందకు రాదని అన్నారు న్యూరాలజిస్ట్‌ వైద్యులు. కఠిన శాకాహారిగా తక్కువ పాల ఉత్పత్తులు తీసుకోవడంతో వచ్చిన సమస్యగా వెల్లడించారు. అంతేగాదు దీన్ని బీ12 లోపంగా పేర్కొన్నారాయన. 

    బీ12 లోపం అంటే..
    నరాలను రక్షించే మైలిన్‌ తొడుగును నిర్వహించడానికి బీ12 చాలా అవసరం. అది లేకపోతే మెదడుకి సంకేతాలు పంపే పెద్ద ఫైబర్‌ నరాలు పనిచేయడం మానేస్తాయి. సదరు మహిళకు శరీరంలో బీ12 స్థాయిలు 153 pg/mL  ఉన్నాయి . అంటే సాధారణ మనిషికి ఉండాల్సిన దానికంటే అత్యంత తక్కువ. దాంతో వైద్యులు ఆమెకు కండరాల ద్వారా బీ12 ఇంజెక్షన్లు అందించినట్లు తెలిపారు. 

    దాంతో ఆమెకు కొన్ని వారాల్లోనే నడక బ్యాలెన్స్‌ అయ్యిందని, అలాగే పడిపోతాననే భయం మాయమైందని చెప్పారు. ఆమెకు ఇదివరకటిలా గోడలను పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యను రోగ నిర్థారణ స్కాన్‌లతో గుర్తించలేమని చెప్పారు. అంతేగాదు పాల ఉత్పత్తులు, లేదా సప్లిమెంట్లు లేకుండా దీర్ఘకాలం పాటు శాకాహారం తీసుకుంటే బీ12 విటమిన్‌ లోపం వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ఇలాంటి సమస్యని(బీ12 లోపం) ముందుగా గుర్తిస్తేనే నయం చేయగలమని లేదంటే శాశ్వత వైకల్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు న్యూరాలజిస్ట్‌లు.

     

    (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్‌ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)

     

  • స్ట్రాబెర్రీలు ఈ సీజన్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిని మాత్రమే కాదు ఆరోగ్యం, అందాన్నివ్వడంలోనూ మేలు చేస్తాయి. 

    • వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్‌ ఇ, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరిచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

    • స్ట్రాబెర్రీలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

    • వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపిక.

    • వయస్సు తోపాటు వచ్చే కంటి సమస్యలను నివారించడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.

    • అనేక సౌందర్య సాధనాల్లో ఉపయోగించే స్ట్రాబెర్రీ గుజ్జును ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 

    • ఇందులోని ఎల్లాజిక్‌ యాసిడ్‌ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది

    • స్ట్రాబెర్రీలలో ఉండే మాలిక్‌ యాసిడ్‌ దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి, దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.

    • స్ట్రాబెర్రీలలో ఉండే విటమిన్‌ సి శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్‌ అనే హార్మోన్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

    (చదవండి: ప్లీజ్‌ కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండండి..!)

  • శీతల పానీయాలు తాగొద్దని వైద్యులు పదేపదే సూచిస్తుంటారు. ఈ కార్బోనేటెడ్‌ డ్రింక్స్‌ ఫ్యాటీ లివర్‌, కిడ్నీ సంబంధిత అనారోగాల బారిన పడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణుల సదా హెచ్చరిస్తుంటారు. అయినాసరే ఏం కాదులే అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ..తాగేస్తుంటారు చాలామంది. అయితే అది ఎలా ఆరోగ్యాన్ని సమస్యల కోరల్లో చిక్కుకునేలా చేస్తోంది అస్సలు గ్రహించం అంటూ ఇక్కడొక వ్యక్తి కన్నీరుమున్నీరు విలపిస్తున్న కథ వింటే కచ్చితంగా విస్తుపోతారు. అంతేగాదు ఈ కూల్‌డ్రింక్స్‌ తాగాలా వద్దా అనే సందేహం కచ్చితంగా ఎదురవ్వుతుంది. 

    ఎందుకంటే..నెట్టింట వైరల్‌ అవ్వుతున్న ఓ వీడియో అందర్నీ ఆలోచింపచేశాలా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి శీతల పానీయాలు తాగడం మానేయండి అంటూ వేడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. తన తముమ్మడు అలాంటి పానీయాలు తాగే ఆరోగ్యం పాడుచేసుకున్నాడంటూ భావోద్వేగం మాట్లాడటం చూడొచ్చు. అతడి ఆరోగ్యం దారుణంగా పాడైందని, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపాడు. 

    దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులో పడిందని పేర్కొన్నాడు. తన తమ్ముడిలా ఎవ్వరూ ఆరోగ్యం పాడుచేసుకోకండి అని కోరడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అంతేగాదు ఈ శీతల పానీయాన్ని విషంగా పేర్కొన్నాడు. దీని కారణంగా తన సోదరుడు జీవితం పాడైందంటూ కన్నీరుమున్నీరు విలపించాడు ఆ వ్యక్తి వీడియోలో. 

    చాలామంది నెటిజన్లు అవును ఇది మంచిది కాదని తెలిసి విషాన్ని తాగుతున్నామని అంగీకరించారు. ఈ ఘటన అందరికి కనువిప్పు అని పేర్కొంటూ కొందరు  పోస్టులు పెట్టగా, మరికొందరు మాత్రం అతను రోజు కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నాడని తెలిసినప్పుడూ ఎందుకు అదుపుచేయలేకపోయారు అని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: 'బరువు తగ్గించే జైలు'..! ఏకంగా మిలటరీ రేంజ్‌ శిక్షణ..12 గంటల వ్యాయామాలు..)

     

NRI

  • సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.

    ‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు

    ..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు.