విజయవాడ: కృష్ణలంకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శిశుభవన్ సమీపంలో తండ్రీకొడుకులపై బ్లేడ్ బ్యాచ్ దాడి చేసింది. చెక్క శివకుమార్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. శివకుమార్ దాడిలో తండ్రీకొడుకులకు గొంతు భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
తాడేపల్లి: సాయికృష్ణ కేసుపై చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబూ.. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే, ఆయన డెడ్ బాడీ ఎక్కడ ఉంది? నాలుగు రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటికీ ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్లో గాదె సాయికృష్ణ కేసు పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అతడి అదృశ్యంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్న తర్వాత అదృశ్యమయ్యాడు. పోలీసులు కస్టడీలో టార్చర్ చేసి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు.
Mr. @ncbn Garu, is Sai Krishna dead or alive? If he is dead, where is his body? An FIR was registered four days ago. Why aren't any arrests made yet ?
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2026
సాక్షి, కాకినాడ: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు. తను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానన్నారు. పంతం నానాజీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీచేయాలన్నారు. ఒకవేళ నానాజీపై తాను గనుక ఓడిపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను కూడా నానాజీ కంటే ఎక్కువగా మాట్లాడగలనని కానీ తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు.
సాక్షి, కాకినాడ: ఒక వ్యక్తిని చంపి అతని బూడిదకూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. సాయికృష్ణ కేసుపై కాకినాడలో ఆయన ఈ రోజు ( సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సొంత రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు.
సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఇటీవల జరిగిన ఐదుగురి హత్యలు పోలీసుల చేసిన హత్యలేనన్నారు. సాయికృష్ణపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎమ్మెల్యే పంతం నానాజీ సంస్కార హీనంగా దిగజారి మాట్లాడుతున్నారన్నారు. పంతం నానాజీ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు.? కాపుల గురించి మాట్లాడిన నేతలపై నీచంగా మాట్లాడితే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని ఆవిషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, రైతో భరోసా బాధితులు అధికంగా కాపు నేతలే ఉన్నారని ఈ అంశంలో కాపు నేతలంతా కలిసి మాట్లాడుకుంటే మీకొచ్చిన నొప్పేంటి అని ప్రశ్నించారు. కాపులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూటమి నేతలు ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.
వైఎస్సార్,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై టీడీపీ నేత బీటెక్ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్21) నాడు చక్రాయిపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు. అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీటెక్ రవి అక్రమ దందాలో
కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్
అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు.అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
సాక్షి, విశాఖ : వాతావరణ శాఖ నేడు ( సోమవారం) రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. కాకినాడ,అల్లూరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వానలు ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వానలు లేని చోట ఎండల తీవ్రత సైతం అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది.
సాక్షి, తాడేపల్లి: తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యస్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.
సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ..
సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.సాక్షులను బెదిరిస్తున్నారు..
సాయికృష్ణ లాకప్ డెత్పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.
పవన్ కల్యాణ్కు ఏం తెలియదు..
వైఎస్సార్సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా: మండలంలోని వత్తాడ గ్రామంలో సోమవారం కింగ్ కోబ్రా(గిరినాగు) ఆందోళన సృష్టించింది. ఈమేరకు గ్రామానికి చెందిన ఆలుగు పొట్టిందొర సోమవారం ఉదయం నిద్రలేచిన కొద్దిసేపటికి శబ్దం వినిపించగా బీరువావైపు చూడడడంతో ఏ సమయంలో దూరిందోగానీ బీరువాపై భాగంలో కింగ్ కోబ్రా ముడుచుకుని (చుట్టుకుని) కనిపించింది. దీంతో భయాందోళన చెందిన పొట్టిందొర కుటుంబీకులతో పాటు బయటికి వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో..పాముకు ఎటువంటి హాని చేయకుండా స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.
స్పందించిన అటవీశాఖ అధికారులు వత్తాడ గ్రామానికి వెళ్లి కింగ్కోబ్రాగా గుర్తించి..స్నేక్క్యాచర్స్కు సమాచారం అందించారు. విశాఖపట్నం నుంచి వత్తాడ గ్రామానికి మధ్యాహ్నం చేరుకున్న స్నేక్ క్యాచర్స్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఇంతలో కింగ్కోబ్రా తన నోట్లోంచి మరో చచ్చిన పాము (జెర్రిపాము)ను బయటకు కక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కింగ్ కోబ్రా మరోపామును అమాంతం మింగడం వల్లనే ఎవరికీ హాని చేయకుండా బీరువాపై తనంతటతాను చుట్టుకుని ఉండిపోయిందని, లేకుంటే పెనుప్రమాదమే జరిగుండేదంటూ స్థానికులంతా వాపోయారు. కింగ్ కోబ్రాను పట్టుకున్న స్నేక్క్యాచర్స్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ముసోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదైన వేళ.. ఇప్పుడు రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ బయటకు రావడం సంచలనంగా మారింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్లోని ముసోరీ హిల్ స్టేషన్లో ఉన్న ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో క్లిప్ కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఆడియోలో రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడుతూ.. “నా మనసు పూర్తిగా విరిగిపోయింది.. నా మీద అనుమానం పెంచుకుంటూ, నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. నేను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని మా అత్తయ్యతో కూడా చెప్పాను. నేను ఇక నా భర్తతో మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా ఉంటే మా అమ్మవాళ్లతో మాట్లాడమని ఆమెతో అన్నాను. ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను.. కానీ అన్ని హద్దులు దాటిపోయాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది.
తల్లి సంచలన ఆరోపణలు
రాధా గాయత్రి తల్లి సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. తన కుమార్తె మరణానికి భర్త శ్రీచరణ్నే కారణమని ఆమె మరోసారి ఆరోపించారు. పెళ్లైనప్పటి నుంచి రాధా గాయత్రిపై తీవ్ర అనుమానం పెంచుకున్న శ్రీచరణ్.. ఆమె బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎక్కడికి వెళ్తుందో గమనించేవాడని తెలిపారు. ఆఫీస్కు వెళ్లినప్పటికీ తరచూ వీడియో కాల్స్ చేస్తూ నిఘా పెట్టేవాడన్నారు. “బెడ్పై ఎవరు పడుకున్నారో చూపించు” అంటూ వీడియో కాల్స్ చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అయినప్పటికీ ఆమె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కలిసి మద్యం సేవించినట్లు అసత్య కథనాలు సృష్టించి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత ఫొటోలను అర్ధరాత్రిళ్లు తమకు పంపడం ఏమిటని ప్రశ్నించిన సత్యవతి.. తన కుమార్తెను శ్రీచరణ్ హత్య చేశాడని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.తండ్రి అనుమానాలు
ఇదిలా ఉండగా, తన కుమార్తె మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాధా గాయత్రి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైనప్పటి నుంచి శ్రీచరణ్ మానసిక వేధింపులకు గురిచేసేవాడని, ఆమెపై నిఘా పెట్టేందుకు బ్యాగులో ట్రాకర్ కూడా అమర్చాడని ఆరోపించారు. భర్త వేధింపుల గురించి గాయత్రి గతంలో పలుమార్లు తమకు చెప్పిందని వివరించారు.అంతేకాకుండా, రాధకు లోబీపీ సమస్య ఉందంటూ ప్రచారం చేస్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజున శ్రీచరణ్ రక్త నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించిన ఆయన.. హోటల్లో మత్తు పదార్థాలు కలిపిన మద్యం ఇచ్చారా? అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఘటనకు ముందు 48 గంటల కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, హోటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని కోరిన కుటుంబ సభ్యులు.. కేసును ఫోరెన్సిక్ ఆధారాలతో పూర్తిస్థాయిలో విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన భార్య మృతికి..తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీచరణ్, అతని కుటుంబం వాదిస్తోంది.
రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు, తాజాగా బయటకు వచ్చిన ఆడియో క్లిప్ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Movies
నటి భాగ్యశ్రీ బోర్సే మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరో రామ్ పోతినేనితో ఆమె డేటింగ్లో ఉందనే వార్తలు గతంలోనే వినిపించాయి. ఇప్పుడు ఆ పుకార్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. తాజాగా లెనిన్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. 'ఔరంగాబాద్ నా మొదటి ఇల్లు, కానీ హైదరాబాద్ నా రెండో ఇల్లుగా మారిపోయింది' అని ఆమె చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్లో ఇప్పటికే ఒక ఇల్లు కూడా ఉందని చెప్పడం నెటిజన్లను ఆకర్షించింది.
ఈ విషయంలో భాగ్యశ్రీ తన నివాసం గురించే మాట్లాడినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం 'అది రామ్ పోతినేని ఇల్లు కావచ్చు' అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. యాంకర్ 'తెలుగు హీరోల్ని పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్లు హైదరాబాద్లోనే శాశ్వతంగా స్థిరపడతారు' అని అంటే.. దానికి భాగ్యశ్రీ సిగ్గుపడటం పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైంది. రామ్, భాగ్యశ్రీ కలిసి నటించిన ‘ఆంధ్ర కింగ్’ సినిమా సమయంలోనే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.

అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరూ కలిసి అమెరికా కూడా వెళ్లారు. అయితే అప్పట్లో ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ స్పందించారు. రామ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఒక నటుడిగా ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పింది. ఆయన డెడికేషన్ చూసి ఎంతో నేర్చుకున్నాను. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఇన్నాళ్లకు మళ్లీ ఈ ప్రేమ పుకార్లు తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. భాగ్యశ్రీ బోర్సే చేసిన 'హైదరాబాద్ నా రెండో ఇల్లు' వ్యాఖ్యతో రామ్తో ఉన్న ప్రేమ పుకార్లు మళ్లీ హాట్టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో ఈ జంటపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ దాదాపు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. కోలీవుడ్ భామ శృతి హాసన్ ప్రత్యేక సాంగ్లో మెరిసింది.
ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన టాక్ వినిపిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. జూలై 2 నుంచి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా తన సేవలందించారు.
టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా.. సామ్ తన సొంత బ్యానర్లోనే నిర్మించింది. ఈ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇదిలా ఉంటే సామ్పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
గత ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళంటే నాకెంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు లగ్జరీ జీవితాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు నేను కూడా అదే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా' అని అన్నారు.
కాగా.. సామ్ ఇటీవల మూవీ ప్రమోషన్స్లో శారీలో కనిపించారు. బేబీ బంప్తో ఉండడం వల్లే ఆమె అలా ఈవెంట్స్కు హాజరయ్యారని నెటిజన్స్ భావిస్తున్నారు. సమంత- రాజ్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. ఇప్పటికే రెండు సీజన్స్ సినీ ప్రియులను ఫుల్గా ఎంటర్టైన్ చేశాయి. మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్లు కడుప్పుబ్బా ఆడియన్స్ను నవ్విస్తున్నాయి. సేవ్ ది టైగర్స్ 3’ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ భారీ స్థాయిలో వ్యూయర్షిప్ను సాధించింది. ప్రస్తుతం ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఇలా వరుస విజయాలతో మహి వి రాఘవ్ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్నారు. సేవ్ ది టైగర్స్ మొదటి రెండు సీజన్లతో పాటు ‘సైతాన్’ వంటి థ్రిల్లర్ ప్రాజెక్టులతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. తాజా సిరీస్తో తన హిట్ రికార్డ్ను కొనసాగిస్తున్నారు. ఓ కథను కమర్షియల్గా, ఆకట్టుకునేలా రూపొందించటం అంత ఈజీ కాదు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో మహి సక్సెస్ అయ్యారు. దీంతో ఆయన లాంగ్-ఫార్మ్ స్టోరీ టెల్లింగ్ దర్శకుడిగా మరోసారి నిరూపించుకున్నారు.
‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’లాంటి సినిమాలు చేసిన మహి వి రాఘవ్కు ఒక ఫ్రాంచైజీని ఎలా నడిపించాలో బాగా తెలుసు. అదే సమయంలో అసలు ఎంటర్టైన్మెంట్ను ఏమాత్రం తగ్గించకుండా రూపొందించగల సత్తా ఆయన సొంతం. ముఖ్యంగా, అమెరికన్, కొరియన్ టీవీ లాంటి బలమైన సంప్రదాయం లేని ఈ ఫార్మాట్లో కొత్తదనం తీసుకురావడానికి మహి ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో టెలివిజన్ సిరీస్లకు మన ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదని ఆయన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు.
సంక్రాంతికి హిట్ కొట్టే మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి వెంకీమామతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న మరో చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ గ్రాండ్గా ప్రారంభమైంది. త్వరలోనే సెట్స్పైకి వెళ్లనున్న ఈ మూవీలో కల్యామ్ రామ్ కూడా నటిస్తున్నారు. కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు.
అయితే ఈ మూవీ ప్రారంభమైందో లేదో మూవీ యూనిట్కు కొత్త చిక్కులొస్తున్నాయి. అప్పుడే కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో మోసానికి తెరలేపారు. అనిల్ రావిపూడి- వెంకీ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొత్త ప్రకటనలు ఇస్తున్నారు. సినిమా అవకాశాల పేరిట మోసం చేసేందుకు కేటుగాళ్లు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మూవీ మేకర్స్ స్పందించారు.
దీనిపై నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటన విడుదల చేసింది. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు దయచేసి ఎవరూ కూడా అలాంటివీ నమ్మవద్దని ప్రకటనలో తెలిపింది. ఆ కాస్టింగ్ కాల్కు.. మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. మా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదించే వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పత్రాలు, డబ్బులు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది. మా చిత్రానికి సంబంధించిన ఏవైనా అధికారిక కాస్టింగ్ ప్రకటనలు ఉంటే.. మా అధికారిక, ధ్రువీకరించిన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రకటిస్తామని తెలిపింది. దయచేసి మోసగాళ్ల ఉచ్చులో పడకండని నిర్మాణ సంస్థ హెచ్చరించింది.
⚠️ FAKE CASTING ALERT ⚠️
Any casting call currently being circulated in the name of #VenkyAnil5 - #NKRAR2 is FAKE and unauthorized.
We urge aspiring artists and the general public not to fall prey to such scams.
Any official casting-related announcements will be made only… pic.twitter.com/NlLunpq20k— Shine Screens (@Shine_Screens) June 22, 2026
సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పెద్ది మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ అచ్చియమ్మ పాత్రలో మెప్పించింది బాలీవుడ్ భామ. అయితే ఆమె రోల్పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆమె సీన్స్ను కొన్నింటిని తొలగించారు. పెద్ది మూవీతో తన గ్లామర్తో అభిమానులను ఆకట్టుకుంది.
ఇక సినిమా సంగతి పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ తన ప్రేమ, ప్రియుడి గురించి హింట్ ఇచ్చింది. తాను ధరించిన టీ షర్ట్పై క్యూట్ కొటేషన్ రాసుకొచ్చింది. ఒకవేళ నేను తప్పిపోతే నా ప్రియుడికి అప్పజెప్పండి ప్లీజ్.. శిఖర్ పహారియా పేరు రాసిన టీ షర్ట్ను ధరించింది. చూసేందుకు ఇదంతా ఫన్నీగా ఉన్నా.. ఈ ముద్దుగుమ్మ తన లవ్ గురించి ఓపెన్గానే చెప్పినట్లు ఉందంటున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో జాన్వీ కపూర్.. ప్రియుడు శిఖర్ పహారియానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్లు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం లాంటి మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 'ప్రేమలు' మూవీలో సహాయ నటిగా చేసిన అఖిల ఇందులో లోడ్ రోల్ చేయడం విశేషం. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది)
మలయాళంలో తీసిన లేటెస్ట్ సిరీస్ 'ముతశ్శి'. కేపీఏసీ లీల, అఖిల భార్గవన్, రాజేశ్ శర్మ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు వెర్షన్ గురించి ప్రస్తుతానికైతే సమాచారం లేదు గానీ డబ్బింగ్ చేసే అవకాశమైతే ఉంది.
'ముతశ్శి' విషయానికొస్తే.. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఊరిలో రాజన్ దంపతులు నివసిస్తుంటారు. వీళ్లకు శ్రీ కుట్టన్ అనే కొడుకు కూడా ఉంటాడు. చాన్నాళ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి వెళ్లాలని వీళ్లు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడికెళ్లిన తర్వాత వింత సంఘటనలు జరుగుతాయి. కుట్టన్.. దెయ్యం పట్టిలా వాడిలా ప్రవర్తిస్తాడు. దీనికి రాజన్ తల్లి గతంలో చేసిన క్షుద్రపూజలే కారణమని తెలుస్తుంది. మరి కుట్టన్ని దెయ్యం బారి నుంచి తల్లిదండ్రులు ఎలా రక్షించుకున్నారనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
ఏదైనా సినిమా సరిగా ఆడకపోతే పలువురు తెలుగు దర్శకనిర్మాతలు.. నెపం ప్రేక్షకులు మీద లేదంటే రివ్యూయర్ల మీద తోసేస్తుంటారు. అంతే తప్పితే తాము సరిగా తీయలేదు, అందుకే ఆడలేదు, కలెక్షన్స్ రాలేదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ సమంత చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే బంగారం ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో బరువెక్కుతోంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?
(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్)
ఒకప్పుడు సమంత స్టార్ హీరోయిన్. ప్రస్తుతానికి వస్తే హీరోయిన్గా ఓ సినిమా చేసి మూడేళ్లయింది. అది(ఖుషి) కూడా ఏమంత సరిగా ఆడలేదు. దీంతో 'మా ఇంటి బంగారం' ఆడుతుందా లేదా అనే విడుదలకు ముందు చాలా సందేహాలు. మరోవైపు జూన్ నెల మధ్యలో రిలీజ్, స్కూల్స్ తెరిచేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అని డౌట్స్. దీనికి తోడు రివ్యూలు కూడా యావరేజ్గానే వచ్చాయి. కానీ సమంత తన మూవీపై అందరి అంచనాల్ని తారుమారు చేసింది. వీకెండ్ అయ్యేసరికి రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఏం బాగోలేదు. ఓ మాదిరిగా ఆడిన మూవీస్ రూ.20-30 కోట్లు కూడా రాబట్టుకోలేకపోతున్నాయి. అలాంటిది హీరోలెవరూ లేకుండా సమంత మాత్రమే లీడ్ రోల్ చేసిన చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పొచ్చు. ఇది చూసి చాలామంది మిడ్ రేంజ్ హీరోలు కచ్చితంగా కళ్లుకుంటారేమో. ఎందుకంటే తమకు సాధ్యం కానిది ఓ హీరోయిన్ చేసి చూపించింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే కంటెంట్ ఓ మాదిరిగా ఉన్నా జనాలు ఆదరిస్తారు. కాకపోతే అవసరం ఆర్భాటాలు లేకుండా కరెక్ట్గా తీయాలంతే. దర్శకనిర్మాతలు ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.
మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ అంటే అనుష్క 'అరుంధతి'కి రూ.68 కోట్లు వచ్చాయి. 'మా ఇంటి బంగారం' జోరు చూస్తుంటే ఈ నంబర్ దాటేసేలా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే రికార్డ్ అవుతుంది. ఈ మూవీతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. అధికారికంగా చెప్పనప్పటికీ బేబీ బంప్ వీడియోలు వైరల్ కావడంతో ఈ సంగతి బయటపడింది.
(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్కి మెమో)
Sports
తెలంగాణ టీ20 లీగ్ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.
ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు.
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా వరంగల్ వారియర్స్తో మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు.
స్వదేశంలో భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు.
అతడితో పాటు ఆదిల్ రషీద్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, సామ్ కరన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జోర్డాన్ కాక్స్, సన్నీ బేకర్, సాకిబ్ మహమూద్లు తిరిగి జట్టులోకి వచ్చారు. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ కూడా తమ స్ధానాలను నిలబెట్టుకున్నారు.
అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్లు బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్లు ఇద్దరూ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ససెక్స్ ఆల్రౌండర్ 22 ఏళ్ల జేమ్స్ కోల్స్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. టీ20 క్రికెట్లో కోల్స్కు అద్భుతమైన రికార్డు ఉంది. 71 టీ20 మ్యాచ్లు ఆడిన కోల్స్.. 1,373 పరుగులతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు. వైటాలిటీ బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నీలతో పాటు సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం ఉంది.
భారత్తో సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు:
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.
అఫ్గాన్తో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమైంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు భారత సీనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మెన్ ఇన్ బ్లూ బరిలోకి దిగనుంది.
అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఐర్లాండ్ టూర్కు వెళ్లే భారత జట్టులో ఉండడంతో అందరి దృష్టి ఈ సిరీస్పైనే ఉంది. జూన్ 26న బెల్ఫెస్ట్ వేదికగా ఐరీష్ జట్టుతో జరగనున్న తొలి టీ20లో వైభవ్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
గంభీర్కు కొత్త తలనొప్పి
అయితే వైభవ్ను తుది జట్టులోకి తీసుకువాలంటే భారత రెగ్యులర్ ఓపెనర్లైన సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుంకటే వీరిద్దరూ ఇప్పటికే ఓపెనర్లగా తమను తాము నిరూపించుకున్నారు. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ పవర్ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించగలే విధ్వంసకర వీరుడు. అలాంటి ప్లేయర్ను డ్రాప్ చేయడం అంత సులువు కాదు.మరోవైపు ఇటు ఓపెనర్గా, అటు వికెట్ కీపర్గా జట్టుకు వెన్నముకగా ఉన్న సంజూను తప్పించడం కూడా అసాధ్యం. అయితే గంభర్ ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్ చిన్నది సంజూ శాంసన్కు మొదటి మ్యాచ్లో విశ్రాంతినిచ్చి వైభవ్ను ఆడించడం.
లేదా లేదా సంజూను మూడో స్థానానికి పంపి, అభిషేక్ - వైభవ్ లతో లెఫ్ట్-లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనింగ్ చేయించడం. సంజూ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు పంపితే ఇన్ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను పక్కన పెట్టాల్సిందే. మరి గంభీర్ అండ్ కో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ అరంగేట్రం చేస్తే మాత్రం భారత జట్టు తరపున ఆడిన అతి పిన్నవయష్కుడిగా సచిన్(16)ను అధిగమిస్తాడు.
తెలంగాణ టీ20 లీగ్లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు.
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా అమన్రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను నెట్స్లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్లో అమన్ దుమ్ములేపుతున్నాడు.
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.
మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం
ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.
విజయం దిశగా మెదక్
మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీ
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు
15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్
19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్లో ఔటయ్యాడు.మొదక్ మూడో వికెట్ డౌన్
మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీ
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ
259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్
ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్
వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్
వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్రావు పేరాల.. రాహుల్ బౌలింగ్లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీ
అమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్
వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీ
వరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్ప్లేలోనే వంద పరుగులు దాటింది.
దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లు
వరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.
మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తుదిజట్లు
వరంగల్ వారియర్స్ అమన్రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె.
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సత్తా చాటాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో వైఫల్యాలకు చెక్ పెడుతూ.. శ్రీలంక -‘ఎ’తో ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉపమానాలే ఈర్ష్య పడేలా... అలంకారాలే అసూయపడేలా... బిరుదులే చిన్నబోయేలా... 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆదివారం దంబుల్లాలో విధ్వంస రచన చేశాడు.
లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్స్లతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు దాన్ని స్టాండ్స్లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్లు విరుచుకుపడ్డాడు.
కేవలం 11 బంతుల్లోనే
కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్... ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) తో పోటు మిగిలినవాళ్లు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టును ఓడించి భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది.నిజానికి శ్రీలంకతో గత మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లో పరాజయం పాలైన వేళ.. వైభవ్ను లంక ప్లేయర్ విశేన్ రెచ్చగొట్టాడు. అందుకు ఫలితంగా ఫైనల్లో ఆ జట్టు మొత్తాన్ని తన ఆట తీరుతో శిక్షించాడు వైభవ్. మొత్తంగా 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 324కు పైగా స్ట్రైక్రేటుతో 94 పరుగులు సాధించాడు.
ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తాను బయటి విషయాలేమీ పట్టించుకోనని.. వన్డేల్లోనూ ఆడగల సత్తా తనకు ఉందని పేర్కొన్నాడు.
పరుగులు చేయలేదని తెలుసు
‘‘ఓపెనర్గా మొదటి పది ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనేది నా ఆలోచన. ఈరోజు ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. సిరీస్ మొదట్లో ఆశించినంతగా పరుగులు చేయలేదని తెలుసు. అప్పుడు కోచ్లతో చర్చించాను.లోపాలు సరిదిద్దుకుని.. గట్టిగానే ప్రాక్టీస్ చేశాను. అందుకు తగ్గ ఫలితం ఫైనల్లో వచ్చింది. ఈ సిరీస్ నుంచి చాలానే నేర్చుకున్నాను. అయితే, చాలా మందికి నేను 50 ఓవర్ల మ్యాచ్లు ఆడినట్లు తెలియదు. ఏదేమైనా విభిన్నమైన పిచ్ల మీద ఆడటం కాస్త సరదాగా.. మరికాస్త సవాలుగా అనిపించింది.
ఈ సిరీస్ నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో భారత్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొనగా భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక ఈ సిరీస్లో వైభవ్ చేసిన పరుగులు వరుసగా.. 14, 44, 21, 38, 94.
తెలంగాణ టీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ శుభారంభం చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం సాధించింది.
నల్గొండ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. రైజర్స్ కెప్టెన్ తన్మయ్ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేశాడు. నల్గొండ బౌలర్లలో వరుణ్ గౌడ్, అనికేత్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
That's one way to finish a game! 💥
Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026
ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026లో కడప వేదికగా కాకినాడ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్ , కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కడప మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వారిని ఆపడం కాకినాడ బౌలర్ల తరం కాలేదు.
అభినవ్ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. అశ్విన్ హెబ్బార్ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభినవ్, అశ్విన్ విధ్వంసం ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి ఏకంగా 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక టోటల్ కావడం విశేషం.
291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మనీష్ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, అర్జున్ టెండూల్కర్ (17), అభిషేక్ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్ చేరారు.
మిడిలార్డర్లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్ కృష్ణ (30), మిట్టా లేఖాజ్ రెడ్డి (31), హరిశంకర్ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్, సిద్ధార్థ, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు.
సూపర్ ఫామ్లో అశ్విన్
ఇక ఈ ఏడాది సీజన్లో విజయవాడ సన్షైనర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కేవలం 6 ఇన్నింగ్స్ల్లోనే 79.67 సగటుతో ఏకంగా 478 పరుగులు సాధించాడు. ఈ పరుగులను అతడు 216.29 స్ట్రైక్ రేట్తో రాబట్టడం విశేషం. ఇందులో రెండు భారీ సెంచరీలు ఉన్నాయి. వైట్బాల్ క్రికెట్లో అశ్విన్కు మంచి రికార్డు ఉంది. ఆంధ్ర జట్టులో కీలక సభ్యునిగా అతడు కొనసాగుతున్నాడు. 58 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 2019 పరుగులు చేశాడు.ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 69 టీ20 మ్యాచ్ల్లో 131.60 స్ట్రైక్ రేట్తో 1803 పరుగులు చేశాడు. కాగా 30 ఏళ్ల అశ్విన్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఐపీఎల్-2027 మెగా వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. నెల్లూర్కు చెందిన అశ్విన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం అశ్విన్ హెబ్బార్కు జాక్పాట్ తగిలే అవకాశముంది.
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రెండో విజయంపై కన్నేసింది. గ్రూప్-జెలో ఇవాళ రాత్రి ఆస్ట్రియాతో అర్జెంటీనా తలపడుతోంది. ఈసారి ఫిఫా ప్రపంచకప్లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్తో మెరిసిన సంగతి తెలిసిందే. అల్జీరియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి 200వది కావడం గమనార్హం. తన 200వ మ్యాచ్ను అద్భుతంగా మలుచుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్లో పలు రికార్డు లను బద్దలు కొట్టిన మెస్సీ ఆస్ట్రియాతో మ్యాచ్లోనూ పలు రికార్డులు సవరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకసారి వాటిని పరిశీలించి చూద్దాం.
👉38 ఏళ్ల మెస్సీ వరుసగా ఐదు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ఆడుతున్న మెస్సీ మరొక గోల్ చేస్తే, వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన ఆటగాళ్ల సరసన చేరనున్నాడు. గతంలో ఫ్రాన్స్కు చెందిన జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్కు చెందిన జైర్జిన్హో సంయుక్తంగా ఆరు ప్రపంచకప్పుల్లో ఆరు గోల్స్ చేశారు. ఆల్ టైమ్ రికార్డు అందుకోవడానికి మెస్సీ మరొక గోల్ చేస్తే సరిపోతుంది.
👉ఆస్ట్రియాతో మ్యాచ్లో మెస్సీ గోల్ కొడితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మెస్సీ 16 గోల్స్తో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్లో ఒక్క గోల్ చేసినా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించినట్లే.
👉ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం సాధిస్తే మెస్సీకి మరో చారిత్రాత్మకం కానుంది. ఇప్పటివరకు 16 ఫిఫా మ్యాచ్లు గెలిచిన మెస్సీ, ఇవాళ ఆస్ట్రియాపై గెలుపుతో 17 విజయాలతో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ రికార్డు సమం చేసే అవకాశముంది.
👉అల్జీరియాతో మ్యాచ్లో మెస్సీ 38 సంవత్సరాల 357 రోజుల వయస్సులో, అతను 2018 టోర్నమెంట్లో క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్లో కలిపి చేసిన గోల్స్ మరియు అసిస్ట్ల రికార్డును కూడా 24కు (16 గోల్స్, ఎనిమిది అసిస్ట్లు) పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా కెప్టెన్ ఇప్పటికే అత్యధిక ప్రపంచ కప్ ప్రదర్శనలు (27), అత్యధిక నిమిషాలు ఆడిన (2,394), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (12) ,అత్యధిక విజయవంతమైన డ్రిబుల్స్ (125) రికార్డులను కలిగి ఉన్నాడు.
👉అయితే ఆస్ట్రియా జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఈసారి ఫిఫాలో ఆస్ట్రియా తమ తొలి మ్యాచ్లో జోర్డాన్ను 3-1తో మట్టికరిపించింది. అంతేకాదు గత 12 మ్యాచ్ల్లో ఆస్ట్రియా 10 విజయాలు, ఒక డ్రా సాధించి ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పర్వాలేదని పించినప్పటికీ బౌలింగ్లో పూర్తిగా తేలిపోవడం హర్మన్ సేన కొంపముంచింది. ఇక మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి హర్మన్ సేనకు పలు కీలక సూచనలు చేసింది.
జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీరాజ్ మాట్లాడింది. ‘భారత జట్టుకు ఇది చాలా నిరుత్సాహపరిచే గేమ్. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే హర్మన్ సేన పట్టికలో టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు చేసుకుంటే ఆసీస్పై విజయం అంత కష్టమేమి కాకపోవచ్చు.
కెప్టెన్ హర్మన్ప్రీత్ గత రెండు మ్యాచ్ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది. మంచి ఫామ్లో ఉన్న ఆమె తన పాత స్థానమైన నాలుగులో బ్యాటింగ్కు రావాలి.. ఆ స్థానంలో వస్తున్న జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జెమిమా ఐదో స్థానంలో ఆడిన అనుభవముంది. స్పిన్నర్లను బాగా ఆడగలదనే పేరు కలిగిన జెమిమా ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల, ఆ సమయానికి ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం వస్తోంది.
దీనివల్ల ఆమె వేగంగా పరుగులు చేయగలదు. స్పిన్ బౌలింగ్లోనే జెమీమా స్కూప్స్, స్వీప్ షాట్లు కచ్చితంగా ఆడగలదు. మరోవైపు హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల చివరి ఓవర్లలోనే ఆమె వేగంగా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఇక బౌలింగ్లో శ్రీచరణి తన ప్రదర్శనతో అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్నప్పటికీ అక్కడి పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో విజయవంతమవుతోంది.
తన బౌలింగ్లో పేస్ వైవిధ్యం కనిపిస్తోంది. లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేస్తున్నశ్రీచరణి రాబోయే రోజుల్లో జట్టుకు కీలక బౌలర్గా మారనుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ జూన్ 25న (గురువారం) బంగ్లాదేశ్తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న (ఆదివారం) ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండింట గెలిస్తే భారత్ నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా నెట్ రన్రేట్ కీలకం కానుంది.
చదవండి: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే!
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్లో భాగంగా రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ సోమవారం ముఖాముఖి ఎదురుపడ్డాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది.
నల్గొండ స్కోరెంతంటే?
ఈ క్రమంలో రంగారెడ్డి బౌలింగ్ ధాటికి నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి మెరుపులు (19 బంతుల్లో 30) మెరిపించాడు.మిగిలిన వారిలో వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్, హర్షవర్దన్ సింగ్ నల్గొండ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
దివేశ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది.
రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు వికెట్లతో చెలరేగగా.. కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు.
తుదిజట్లు
రంగారెడ్డి రైజర్స్
తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృద్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్
రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నివాంత్ శరణు.
Update: తనయ్ కెప్టెన్ ఇన్నిం గ్స్.. రంగారెడ్డి ఘన విజయంThat's one way to finish a game! 💥
Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.
శ్రేయస్ అయ్యర్..

ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్కు అప్పగించారు. ఐర్లాండ్తో సిరీస్ కెప్టెన్గా అయ్యర్కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్తో తేలిపోనుంది.
వైభవ్ సూర్యవంశీ..

ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
అంతకముందు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్తో టూర్కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు.
ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన వైభవ్కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్తో సిరీస్లో రాణిస్తే ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
నితీశ్కుమార్ రెడ్డి..

హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్కుమార్ ఐర్లాండ్తో టీ20 సిరీస్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.
రవి బిష్ణోయి..

ఐర్లాండ్తో టీ20 సిరీస్కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో సిరీస్లో రవి బిష్ణోయి ఫ్రంట్లైన్ స్పిన్నర్గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది.
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో ఖమ్మం ఏసెస్.. పాలమూరు స్ట్రైకర్స్పై గెలుపొందగా.. తాజాగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది.
నల్గొండ స్కోరెంతంటే?
నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి వేగంగా (19 బంతుల్లో 30) ఆడాడు. వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఫెయిలయ్యారు.ఇలాంటి దశలో దివేశ్ సింగ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది.
రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
రంగారెడ్డి ఘన విజయం
నల్గొండ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేయగా.. తనయ్ త్యాగరాజన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితిన్ సాయి యాదవ్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.తుదిజట్లు
రంగారెడ్డి రైజర్స్
తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్
రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.
న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్కు మరో గట్టి షాక్ తగిలింది. కివీస్తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్లలో 12 పాయింట్లు కోత విధించింది. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈసారి ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడాలన్న ఇంగ్లండ్ కల నెరవేరేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పాయింట్స్ పర్సంటేజీ మాత్రం 34.72 నుంచి 26.38కి పడిపోయింది. ఇంగ్లండ్ 12 టెస్టులాడి 4 విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 9 టెస్టులు ఆడి 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
2027లో జరగనున్న ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ పైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఒక ఓటమితో పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా 4 టెస్టుల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండో టెస్టు విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 463 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాట్ హెన్రీ ధాటికి 209 పరుగులకే కుప్పకూలింది. మాట్ హెన్రీ ఆరు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
చెరో విజయంతో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టెస్టు ట్రెంట్బ్రిడ్జి వేదికగా జూన్ 25 నుంచి మొదలుకానుంది. నైట్క్లబ్ వివాదంతో రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లు మూడో టెస్టుకు జట్టుతో చేరనున్నారు.
England have been fined 50% of their match fees and docked 12 WTC points for maintaining slow overrate against New Zealand. pic.twitter.com/YgnKhbdPcH
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 22, 2026
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పాకిస్తాన్కు షాకిచ్చింది. సమ్మర్లో పాక్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2027కు ముందు ఈసీబీ.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.
యూటర్న్
ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, ఈసీబీ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ను కాదని బంగ్లాదేశ్తో ఈ ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది మే నెలలో ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు నిర్వహణకు ఈసీబీ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వేదికను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.
ఒప్పందం ప్రకారం..
కాగా మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో ఈసీబీకి ఓ ఒప్పందం ఉంది. దీని ప్రకారం.. ప్రతీ ఏడాది వేసవిలో లార్డ్స్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ వేదికను లార్డ్స్ నుంచి తరలిస్తున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్కు బంపరాఫర్
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో నిర్వహించే టెస్టుకు లార్డ్స్ను వేదికగా ఎంపిక చేయాలనే యోచనలో ఈసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బంగ్లాదేశ్కు బంపరాఫర్ వచ్చినట్లే!.. బంగ్లా జట్టు చివరగా 2010లో ఇంగ్లండ్లో పర్యటించింది. తాజాగా మరోసారి ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది.నిజానికి పాకిస్తాన్తో నిర్వహించాలనుకున్న ఏకైక టెస్టుకు ఈసీబీ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేసింది. అయితే, తాజా నిర్ణయం నేపథ్యంలో బంగ్లాకు చారిత్రాత్మక లార్డ్స్లో టెస్టు ఆడే అవకాశం రానుంది. ఇక ఇప్పటి వరకు ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య ఐదు టెస్టు సిరీస్లు జరిగాయి. అయితే, సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్లో బంగ్లా.. ఇంగ్లండ్ను టెస్టు మ్యాచ్లో ఓడించగలిగింది.
పాకిస్తాన్కు ఊరట
అయితే, ఈసీబీ పాకిస్తాన్కు ఓ ఊరట కూడా ఇచ్చింది. ఈ ఏడాది ఆగష్టులో పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా హెడింగ్లీ, లార్డ్స్, ఎడ్జ్బాస్టన్ వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. కాగా 2020 తర్వాత పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. నాడు అజర్ అలీ కెప్టెన్సీలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్.. బాబర్ ఆజం సారథ్యంలో మూడు టీ20 మ్యాచ్లు ఆడింది.
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ రోవ్మన్ పావెల్ తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. ఈ లీగ్లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించే అతడు.. సియాటిల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 11 బంతుల్లో 37 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనక వేసిన ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
We promise there was a fifth one too. 😭
Rovman Powell | #SOvLAKR | #WeAreLAKR | #LAKnightRiders | #MLC26 pic.twitter.com/WQF9eORvd2— Los Angeles Knight Riders (@LA_KnightRiders) June 21, 2026
డల్లాస్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్కు కొలిన్ మున్రో (30), ఆండ్రే ఫ్లెచర్ (40) శుభారంభం అందించారు. అయితే పవర్ప్లే తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 16 ఓవర్లు ముగిసే సమయానికి 138/5 స్కోర్తో కష్టాల్లో పడింది. ఈ దశలో భారీ స్కోరు సాధించాలంటే చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో క్రీజులో ఉన్న పావెల్ తనలోని విధ్వంసకర రూపాన్ని బయటపెట్టాడు. 17వ ఓవర్ బౌలింగ్కు వచ్చిన దసున్ షనకపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తొలి బంతినే డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా మలిచిన పావెల్ అక్కడితో ఆగలేదు. వరుసగా మరో నాలుగు బంతులను కూడా స్టాండ్స్లోకి పంపించాడు. మొత్తంగా తొలి ఐదు బంతుల్లోనే ఐదు సిక్సర్లు బాది, ఆరో బంతికి ఔటయ్యాడు.
ఈ ఇన్నింగ్స్లో పావెల్కు హోల్డర్ (14 బంతుల్లో 23 పరుగులు) జత కలవడంతో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓర్కాస్ ఎప్పుడూ పోటీలో కనిపించలేదు. వరుస వ్యవధుల్లో వికెట్లు కోల్పోయి 16 ఓవర్లు పూర్తికాకముందే 115 పరుగులకు కుప్పకూలింది. దీంతో నైట్ రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఫిఫా ప్రపంచకప్లో చాలా మ్యాచ్లు వన్సైడ్గా ముగుస్తున్నాయని ఫుట్బాల్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఫిఫా అంత కిక్ ఇవ్వడం లేదని కూడా కొందరు వాపోతున్నారు. కానీ అది తప్పని మరోసారి నిరూపితమైంది. చాలా మ్యాచ్లు డ్రాగా ముగుస్తున్నప్పటికీ, పెద్ద జట్లను నిలువరిస్తూ చిన్న జట్లే ఈసారి ఫిఫాలో హైలైట్గా మారిపోయాయి. కేప్ వర్డె, కురాకావో వంటి చిన్న దేశాలు టోర్నీలో తమ పోరాటంతో ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ దేశాలు తమ మ్యాచ్లను డ్రా చేసుకోవడంలో గోల్ కీపర్లదే కీలకపాత్ర. 40 ఏళ్ల వోజిన్హా (కేప్ వర్డె), 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ (కురాకావో) అద్భుత గోల్కీపింగ్ విన్యాసాలతో పెద్ద జట్లను నిలువరించి తమ జట్లకు డ్రా రూపంలోనే విజయాలు సాధించి పెట్టారు. తాజాగా వీరి సరసన ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్వాండ్కు కూడా చోటు కల్పించాల్సిందే.
ఫిఫా ప్రపంచకప్లో భాగంగా సోమవారం గ్రూప్-జీలో ఫిఫా 9వ ర్యాంకర్ బెల్జియంను ఇరాన్ నిలువరించిందంటే అదంతా అలీరెజా చలువే. మ్యాచ్లో బెల్జియం ఒక్క గోల్ కూడా కొట్టకపోవడంలో అలీరెజాదే కీలకపాత్ర. ఇరాన్ గోల్పోస్ట్ వద్ద అడ్డుగోడలా నిలబడిన అలీరెజా బెల్జియం పటిష్టమైన డిఫెన్స్ను సమర్థంగా ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా నిలబడ్డాడు.

మ్యాచ్లో ఏడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరు అడుగులు నాలుగు అంగుళాల పొడవున్న అలీరెజా బెయిరాన్వాండ్ తన రెండు చేతులను చాపి బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొత్తం ఏడు సేవ్స్ చేసిన అలీరెజానే ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా వరించింది.అంతేకాదు, క్రీడా నియమాల ప్రకారం ఒక క్లీన్షీట్ను కూడా అలీరెజా సొంతం చేసుకున్నాడు.
గొర్రెలకాపరి కుటుంబం నుంచి..
అలీరెజా గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాడు. అలీరెజా 12 ఏళ్ల వయసులో యూరోప్ ఉన్నత వర్గాల ఆధిపత్య పోరుకు తట్టుకోలేక అతడి తల్లిదండ్రులు బీరన్వంద్ నుంచి లోరెస్తాన్ కొండల్లోకి పారిపోయారు. ఆ కొండల్లోనే తీవ్ర పేదరికంలో అలీరెజా బాల్యం గడిచింది.చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ ఆటపై అమితాసక్తి పెంచుకున్న అలీరెజా ఈ విషయంలో ప్రతీరోజు తండ్రితో గొడవపడేవాడు. ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి ఆ కొండ ప్రాంతం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నాడు.
టెహ్రాన్ చేరుకున్న సమంలో అలీరెజా జేబులో రూపాయి లేదు. నెలల తరబడి, అతడు స్థానిక ఫుట్బాల్ క్లబ్ల బయటే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం గడిపాడు. ఆ క్లబ్లో జరిగే మ్యాచ్లను చూస్తూ ఫుట్బాల్ ఆటను పూర్తిగా అవగతం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ పనులు చేస్తూ స్థానిక ఫుట్బాల్ క్లబ్లో మెంబర్షిప్ సాధించాడు. ఆ క్లబ్కు డబ్బులు కట్టడం కోసం రాత్రిళ్లు పిజ్జా దుకాణాల్లో పిండిని కలపడం, పిజ్జాలు చేయడం వంటి పనులు కూడా చేశాడు.
అయితే కొండ ప్రాంతం నుంచి రావడంతో అలీరెజా బలిష్టంగా ఉండడంతో అతడికి గోల్ కీపింగ్ కరెక్ట్ అని స్థానిక ఫుట్బాల్ క్లబ్ కోచ్ నిర్ణయించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇరాన్ ఫుట్బాల్ జట్టుకు గోల్కీపర్గా సేవలందిస్తున్నాడు అలీరెజా.
రెండు గిన్నిస్ రికార్డులు..
ఇక మోడ్రన్ ఫుట్బాల్లో అలీరెజా బెయిరాన్వాండ్ తన పేరిట రెండు గిన్నిస్ రికార్డులు కూడా లిఖించుకున్నాడు. 2016 అక్టోబర్లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో బంతిని దాదాపు 200.14 అడుగులు (61.002 మీటర్లు) విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫుట్బాల్ చరిత్రలో అత్యంత సదూర త్రో రికార్డు ఇప్పటికీ అలీరెజా పేరిటే ఉంది.
ఇక ఫుట్బాల్లో అత్యంత పొడవైన డ్రాప్ కిక్ (255.95 అడుగులు-78.014 మీటర్లు) కూడా అలీరెజాదే కావడం విశేషం. ఇక బెల్జియం, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లను డ్రా చేసుకున్న ఇరాన్ రెండు పాయింట్లు సాధించి నాకౌట్ అర్హత అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇరాన్ తన తర్వాతి మ్యాచ్ జూన్ 27న పటిష్టమైన ఈజిప్ట్తో ఆడనుంది.
Alireza Beiranvand🧤💚 pic.twitter.com/HlVeDsHoXo
— Iman🇵🇹🇫🇷 (@i4emi) June 21, 2026
International
ఖతార్ గ్యాస్ పోర్టులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.
ఆదివారం రాత్రి ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్లో భారీ పేలుడు జరిగింది. ఖతార్ అధికారులు సోమవారం మృతుల వివరాలను ధ్రువీకరించారని అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్లో తెలిపింది.
"రాస్ లఫాన్ ఘటనలో నిన్న రాత్రి 12 మంది భారతీయులు దురదృష్టవశాత్తు మరణించినట్టు ఖతార్ అధికారులు ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని రాయబార కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
కాగా, మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ కూడా సోమవారం మీడియాకు చెప్పారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందుతోందని, వారిలో ఎవరి ప్రాణాలకూ ప్రమాదం లేదని సాద్ అల్-కాబీ తెలిపారు. మార్చిలో ఖతార్పై ఇరాన్ దాడి తర్వాత నిలిపివేసిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని, 66 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు.
Qatari authorities have confirmed that 12 Indian nationals have unfortunately passed away in the Ras Laffan incident yesterday night. We extend our deepest condolences to the bereaved families and prayers for the departed souls.
Qatari authorities have also confirmed that all…— India in Qatar (@IndEmbDoha) June 22, 2026
జెనీవా: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నుండి పరిశీలకులను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్లో బర్గెన్స్టాక్ రిసార్ట్ వేదికగా నిన్న అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగిన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భేటీపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ " చర్చల్లో చాలా మంచి పురోగతి లభించింది. అంతకుముందు రోజు జరిగిన చర్చలు కూడా చాలా సానుకూలంగా సాగాయి. అణు తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించింది. అణు పరిశీలకులతో చర్చలు శుక్రవారం నుంచే ప్రారంభం అయ్యే అవకాశంఉంది. ఇరుపక్షాల సాంకేతిక బృందాలు తమ పనిని కొనసాగిస్తాయి " అని వాన్స్ అన్నారు.
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి తెరిచే ఉందని ఈ కీలకమైన రవాణా మార్గం నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్చల ప్రతినిధులు ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్పై కాల్పులు ఆపాలని అమెరికా కోరుకుంటోందన్నారు. అదే విధంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించే లక్ష్యంతో లెబనాన్ కోసం ఒక ఘర్షణ నివారణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని వాన్స్ అన్నారు.
ఇరాన్తో చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపిందని వాన్స్ అన్నారు. అలాగే, వాషింగ్టన్ ఈ ప్రాంతంలోని దేశాలపై ఎలాంటి ఒప్పందాన్ని రుద్దడం లేదని ఆయన నొక్కి చెప్పారు. ఒకవేళ దౌత్యం విఫలమైతే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇంకా చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయని వాన్స్ పరోక్షంగా ఇరాన్ను హెచ్చరించారు.
లండన్: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 24గంటల్లో కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2024లో బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ ప్రధానిగా రాజీనామా చేశారు. కీర్ స్టార్మర్తో కలిపి పదేళ్లలో ఆరుగురు ప్రధానులు తమ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
రాజీనామాకు ముందు స్టార్మర్ తన భార్యతో కలిసి 10డౌనింగ్ స్ట్రీట్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఆయన మద్దతు దారులు హర్షధ్వానాలు, చప్పట్లుతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెట్టిన క్షణాన్ని తన జీవితంలో అత్యంత గర్వించదగిన క్షణంగా కీర్ స్టార్మర్ గుర్తుచేసుకున్నారు.
స్టార్మర్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతో ప్రారంభించానని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ సాధించిన అఖండ విజయాన్ని గుర్తుచేసుకుంటూ, తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న వేతనాలు, పెరిగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, తగ్గుతున్న ఎన్హెచ్ఎస్ నిరీక్షణ జాబితాలు, కార్మికులు, అద్దెదారుల హక్కులు, రక్షణ వ్యయం పెరుగుదల వంటి అంశాలను వివరించారు.
నేను తీసుకున్న ప్రతి నిర్ణయం తొలి ప్రాధాన్యత దేశానికే. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అభివృద్ధిలో మా సహచర దేశాల కంటే వేగంగా వృద్ధి సాధించాం. మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా ద్రవ్యోల్బణం కంటే వేగంగా వేతనాలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో తమ విధానాల వల్ల ఐదు లక్షల మంది పిల్లలను పేదరికం నుండి బయటకు తీసుకువచ్చామని కూడా పేర్కొన్నారు.
అయితే, వరుస వివాదాలు, విధాన మార్పులు, తగ్గుతున్న ప్రజా మద్దతు కారణంగా స్టార్మర్ ప్రధాని పదవి నుంచి వైదొలగాలనే డిమాండ్లు వినిపిస్తూ వచ్చాయి. 2024 ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జీవన ప్రమాణాల మెరుగుదలను అందించడంలో ఆయన ప్రభుత్వం విఫలమైందని అంతర్గతంగా లేబర్ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి.
దీనికితోడు లేబర్ పార్టీ ప్రత్యర్థి ఆండీ బర్న్హామ్ పార్లమెంటరీ సీటు గెలుచుకోవడంతో కీర్ రాజీనామాపై మరింత ఒత్తిడి పెరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్లో 100 మందికి పైగా లేబర్ చట్టసభ్యులు ఆయన రాజీనామా చేయాలని లేదా ఆయన నిష్క్రమణకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు.
ప్రజా సేవలపై ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, అక్రమ వలసలు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో వరుస ప్రభుత్వాల అసమర్థతపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తిని ఈ తరచూ జరుగుతున్న మార్పులు ప్రతిబింబిస్తున్నాయి.
Telangana
సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి అశ్విణీ వైష్ణవ్తో చర్చలు సానూకూలంగా సాగాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోజు( సోమవారం) రైల్వేశాఖ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. రేపు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఖట్టర్తో తాను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ అవుతామని అనంతరం మెట్రో విషయంలో ఒక క్లారీటీ వస్తుందన్నారు.
కాగా కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రెండుగంటలకు పైగా సాగింది. మెట్రో- ఫేజ్- 2 పనులు, ఐఆర్ఏఫ్సీ రుణాల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కేంద్రమంత్రితో భేటీ ఏర్పాటు చేశారు.
కిషన్ రెడ్డిపై విమర్శలు
కాగా ఇటీవల మెట్రో ఫేజ్-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు.కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మెట్రో అంశమై కేంద్ర మంత్రితో కీలక భేటీ జరిగింది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి భూముల వేలానికి సన్నద్ధమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన స్థలాలను ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించనున్నారు. బంజారాహిల్స్లోని 102/1, టీఎస్ నంబర్ 1/పిఅండ్ 3/పిలోని 8.24 ఎకరాల భూములను జూలై 2న వేలం వేయనున్నారు. ఈ భూములపై ఈ నెల 24వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ భూములకు ఈ నెల 12న ప్రీబిడ్సమావేశాన్ని ఏర్పాటు చేసి 19న బిడ్డింగ్ నిర్వహించాలని మొదట నిర్ణయించారు. కానీ యమునా నగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించిన తర్వాతే వేలం వేయాలని కోరడంతో బిడ్డింగ్ తేదీలను హెచ్ఎండీఏ సవరించింది. ఈ భూములకు ఎకరానికి రూ.99 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు.
మోకిలలో 100 ప్లాట్లు..
అలాగే మోకిలలోని మరో 100 ప్లాట్లకు ఈ నెల 29, 30 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాట్ కనిష్టంగా 300 చదరపు గజాల నుంచి గరిష్టంగా 500 చ.గ.ల వరకు ఉన్నాయి. కనీస ధర గజానికి రూ.50 వేలుగా ప్రతిపాదించారు. మేడిపల్లిలో ఉన్న 68 ప్లాట్లకు ఈ నెల 24వ ఈ–బిడ్డింగ్ నిర్వహిస్తారు. కనిష్టంగా 231.66 చ.గ. నుంచి గరిష్టంగా 643.22 చ.గ. విస్తీర్ణంతో ప్లాట్లు ఉన్నాయి. గజానికి రూ.45 వేల చొప్పున నిర్ణయించారు. మోకిల ప్లాట్లకు ఈ నెల 22న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నారు.చదవండి: కొత్త రేషన్ కార్డులు హుళక్కే!
విక్రయించనున్న హెచ్ఎండీఏ భూములపై ఎలాంటి వివాదాలు లేవని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. మేడిపల్లిలోని భూములను నిషేధిత జాబితా నుంచి డీ–నోటిఫై చేసిన అనంతరమే హెచ్ఎండీఏ స్వా«దీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మూడుచోట్ల భూముల అమ్మకాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారుల అంచనా. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్లు మేడిపల్లి ప్లాట్ల కోసం ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోకిలా ప్లాట్లకు 27 వరకు, బంజారాహిల్స్ భూములకు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
సాక్షి,నల్లగొండ: తెలంగాణ కాలనీలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతులు మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రక్కనే ఉన్న స్థానికులకు ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఏంటా అని ఆరా తీయగా.. మృతదేహాలు ఉన్న సంగతి తెలిసింది.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. అయితే మృతులలో భర్త సుల్తాన్ ప్రకాశం బజార్లో బ్యాగుల వ్యాపారం చేస్తుండగా భార్య హసీనా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిని చంపడానికి గల కారణాలు ఏంటా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్కు భారీ వర్షహెచ్చరిక ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం దృష్ట్యా విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలు త్వరగా విధులు ముగించి ముందు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సంక్షోభం తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే లేడని.. పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ప్రజల కోసం ఒక్క మంచి పని చేసిన దాఖలా లేదన్నారు.
హైదరాబాద్: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారానికి చెందిన పెంట శ్రీను తన భార్య రమాదేవి ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని మందలించాడు.
దీంతో మనస్థాపం చెందిన భార్య ఈ నెల 19న హెచ్బీకాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మరుసటి రోజు భర్త శ్రీను హెచ్బీకాలనీకి వెళ్లి చూడగా, భార్య అక్కడే ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరకి చెప్పకుండా బయటకు వెళ్లిన రమాదేవి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికిన ఫలితం లేకపోవడంతో ఆదివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భర్తతో గొడవపడి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దోమలగూడ పీస్ పరిధిలోని దోమల గూడ అడ్వొకేట్స్ కాలనీలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదనరావు వివరాల ప్రకారం..
కాలనీలో నివాసం ఉండే గౌసియా బేగం (32) మణికంఠ రాజు తొమ్మిదేళ్ల క్రితం (2015)లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి విక్రాంత్(9) కుమారుడు ఉన్నాడు. గౌసియా వృత్తిరీత్యా న్యాయవాది. కొంత కాలం క్రితం హందూజా ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మణికంఠ బజాజ్ ఫైనాన్స్లో రికవరీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్య భర్తలు తరచూ గొడవలు పడేవారు. ఆరు నెలల నుంచి గొడవల కారణంగా మణికంఠ రోజూ మద్యం తాగివచ్చి గౌసియాను వేదిస్తూ ఉండేవాడు.
ఇదే క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన గౌసియా ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌసియా కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. డబ్బుల కోసం తన కూతురిని నిత్యం వేదించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు కారణమైన ఆమె భర్త మణికంఠపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి ఆమీదా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ తెలిపారు.
విదేశీ పళ్లు.. ప్రస్తుతం సూపర్ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్
3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రం
పండ్లపై ఉండే ప్రైస్ లుక్–అప్ (పీఎల్యూ) కోడ్లోనే అసలు రహస్యం ఉంది.
4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.
5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.
5 అంకెలు.. 8తో మొదలు: జన్యు మార్పిడి (జీఎమ్వో) పండ్లు. భారత్లో నిషేధం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్ వస్తాయి. అమెరికా యాపిల్ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్ అమైన్’ వాడతారు. ఇది యూరప్లో నిషేధం.స్టిక్కర్ కోడ్ చెక్ చేయండి
కొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్ చూడండి. 9తో మొదలయ్యే కోడ్ ఉంటేనే కొనండి. స్టిక్కర్ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్ పండ్లు వద్దని నిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఏవి?
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే.
Business
రెనాల్ట్ ఇండియా తన సరికొత్త డస్టర్ ఎస్యూవీ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో 750 డస్టర్ వాహనాలను చెన్నై ప్లాంట్ నుంచి సౌత్ ఆఫ్రికాకు పంపించింది. రాబోయే నెలల్లో మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఈ మోడల్ను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త డస్టర్ భారతదేశంలో తొలిసారిగా రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్ఫామ్పై నిర్మితమైంది. ఈ ప్లాట్ఫామ్ వివిధ రకాల పవర్ట్రెయిన్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా.. అన్ని వేరియంట్లు, పవర్ట్రెయిన్లలో 5-స్టార్ భారత్ NCAP భద్రతా రేటింగ్ను పొందడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడే సామర్థ్యాన్ని నిరూపించింది.
2030 నాటికి భారత్ నుంచి సంవత్సరానికి 2 బిలియన్ యూరోల ఎగుమతులను సాధించాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డస్టర్ ఎగుమతుల ప్రారంభం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు కూడా ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది.
ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 'బాస్ స్కామ్' అనే కొత్త రకమైన సైబర్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ మోసంలో సైబర్ నేరగాళ్లు కంపెనీల్లో ఉన్న సీఈఓలు, ఉన్నతాధికారుల పేరుతో నటిస్తూ ఆర్థిక లావాదేవీలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మోసగాళ్లు సాధారణంగా ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) లేదా ఇతర నియంత్రణ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఏదో నియమం ఉల్లంఘించిందని లేదా తక్షణమే సెక్యూరిటీ అప్డేట్ అవసరమని చెప్పి అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భయపెడతారు.
ఇలా నమ్మిస్తూ ఒక జిప్ ఫైల్ పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే కంప్యూటర్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ముఖ్యంగా విండోస్ కంప్యూటర్లను టార్గెట్ చేస్తూ, ఆ సిస్టమ్ను హ్యాక్ చేసి, ఆఫీసు వాట్సాప్ వెబ్ అకౌంట్లను కూడా నియంత్రణలోకి తీసుకుంటారు. దీని ద్వారా నేరగాళ్లు నిజమైన సీఈఓ అకౌంట్లా నటించి ఫైనాన్స్ విభాగానికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు పంపుతారు.
కొన్ని సందర్భాల్లో వారు కాంటాక్ట్ లిస్ట్ను కూడా మార్చి, దానిలో ఒక నెంబర్ను సీఈఓ పేరుతో సేవ్ చేస్తారు. దీంతో ఆ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ నిజమైనదే అని ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంటుంది. ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బును మోసపూరిత ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు.
ఫైనాన్స్ విభాగాలు ఈ మోసానికి ఎక్కువగా గురవుతున్నాయని ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. ఎందుకంటే వారు తరచుగా సీనియర్ మేనేజ్మెంట్ ఆదేశాలను నేరుగా పాటిస్తారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంస్థ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇలాంటి స్కామ్ నుంచి బయటపడటానికి ముందుగా నిర్దారించుకోవడం మంచిది. ఏదైనా ఎమర్జెన్సీ డబ్బు ట్రాన్స్ఫర్ అభ్యర్థన వచ్చినప్పుడు, అది నిజమా కాదా అని తప్పనిసరిగా ఫోన్ కాల్ లేదా ప్రత్యక్షంగా ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద ఫైళ్లను ఎప్పుడూ డౌన్లోడ్ చేయకూడదు. అలాగే అధికారిక సంస్థలు వాట్సాప్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్లు పంపవనే విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.
అంతే కాకుండా.. సిస్టమ్లలో సెక్యూరిటీ పాలసీలు అమలు చేయడం, వాట్సాప్లో లాగిన్ అయిన పరికరాలను తరచూ చెక్ చేయడం, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచడం అవసరం. ఈ తరహా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రజలకు సూచించింది.
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న సమయంలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ. 51కే సరసమైన ప్లాన్ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
మైళ్ల దూరంలో ఉన్నా లేదా దగ్గర్లో ఉన్నా BSNLతో మీకు కనెక్ట్ అయి ఉంటుంది అని ట్వీట్ చేస్తూ.. కంపెనీ రూ.51 ప్లాన్ గురించి వివరించింది. ఇది కేవలం ప్రారంభ కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. దీని ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. కాగా ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే అని తెలుస్తోంది. తేదీని మళ్లీ పెంచుతారా?, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Miles apart or just around the corner—stay connected to what matters most with BSNL.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #TechUpdates #BSNLServices #SmartIndia #EverydayConnectivity #offer51@CMDBSNL @robertravi21 pic.twitter.com/KtiQXVrKCf
— BSNL India (@BSNLCorporate) June 19, 2026
ఇండియన్ రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించడంతో పాటు, క్రమశిక్షణ, నియమాల అమలు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశ పెట్టడమే కాకుండా.. పాత నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి.
స్మోకింగ్ చేస్తే..
రైళ్లలో స్మోకింగ్ పూర్తిగా నిషేధం. రైల్వే ప్రాంగణం, కోచ్లలో స్మోకింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఇటీవల కొన్ని ఘటనల్లో ప్రయాణికులు రైలులో స్మోకింగ్ చేయడం లేదా ప్రమాదకర పదార్థాలు తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. కొత్త చట్టాల ప్రకారం, స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తే..
మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లో (లేడీస్ కంపార్ట్మెంట్) పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతను పెంచడం, వేధింపులు, అనవసర ప్రవేశాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈ నియమాన్ని అమలు చేశారు. రైల్వే భద్రతా సిబ్బంది (RPF), టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE) రాత్రి వేళలు, రద్దీ సమయాల్లో మరింత కఠినంగా తనిఖీలు నిర్వహించనున్నారు.రైళ్లలో అక్రమంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం కూడా చట్ట విరుద్ధమే. ఇలాంటివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరికి జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే..
టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.२०/०६/२०२६ पासून दंडाच्या रकमा वाढविण्यात आल्या आहेत. तपासणीदरम्यान टीटीई (TTE) व आरपीएफ (RPF) यांना सहकार्य करण्याची प्रवाशांना विनंती आहे.
१) तिकीटाशिवाय प्रवास – ₹५००/-
२) दुसऱ्याच्या तिकीटावर प्रवास – ₹५००/-
३) बेकायदेशीर फेरीविक्री (हॉकिंग) – ₹२०००/-
४) मद्यधुंद अवस्थेत… pic.twitter.com/NgooB891AJ— DRM Mumbai CR (@drmmumbaicr) June 22, 2026
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై కూడా పడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
గ్లోబల్ మార్కెట్లో ఏఐ అభివృద్ధికి అవసరమైన మెమరీ, స్టోరేజ్ చిప్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వాటి కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితి కారణంగా.. భవిష్యత్తులో గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం భారీ స్థాయిలో మెమరీ చిప్లు అవసరమవుతున్నాయి. ఈ చిప్లను స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం.. ఈ మార్కెట్ను ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాగా.. ఏఐ కంపెనీల భారీ కొనుగోళ్లతో చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి.
మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరలు పెరగనున్నట్లు టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే చిప్ల ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని, ఈ భారాన్ని కంపెనీలు భరించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ తయారీ ఖర్చులో 8 నుంచి 12 శాతం వరకు మెమరీ చిప్ల కోసం ఖర్చు చేస్తున్నారు. డిమాండ్-సప్లై అసమతుల్యత కారణంగా తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప మరో మార్గం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారతీయ వినియోగదారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చిప్ల ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై అదనపు భారం పడుతోంది.
రాబోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చిప్ తయారీ సంస్థలు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, కొత్త తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చిప్ల కొరత కొనసాగవచ్చని, ఫలితంగా గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో గ్యాడ్జెట్స్ ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులను ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆధార్లో ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి వసూలు చేస్తున్న రూ.75 ఫీజును, ఆరు నెలల పాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
యూఐడీఏఐ ప్రకారం.. ఈ సదుపాయం 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ చిరునామాను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం లభించింది.
ఆధార్కు ఈమెయిల్ ఐడీ లింక్ చేసి ఉంటే, ఆధార్కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్స్, సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం, ఇటీవల ప్రారంభించిన ఆధార్ మొబైల్ యాప్లో మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, బయోమెట్రిక్ లాక్/అన్లాక్, ఈ ఆధార్ డౌన్లోడ్, అథెంటికేషన్ హిస్టరీ చెక్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఉచిత ఈమెయిల్ అప్డేట్ సదుపాయం కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్లైన్లో ఈమెయిల్ను ధృవీకరించుకోవడానికి ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి.. వెరిఫై ఈమెయిల్ అడ్రెస్స్ ఎంపికను ఎంచుకోవాలి.
అయితే.. ఆరు నెలల తర్వాత ఈ ఫీజు మినహాయింపును కొనసాగించాలా? లేదా మళ్లీ ఫీజు అమలు చేయాలా అనే విషయంపై యూఐడీఏఐ నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేయనివారు నిర్ణీత సమయం లోపల ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 291.17 పాయింట్లు లేదా 0.38 శాతం లాభంతో 77,094.07 వద్ద, నిఫ్టీ 89.80 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో 24,102.90 వద్ద నిలిచాయి.
నోసిల్ లిమిటెడ్, మెనన్ పిస్టన్స్ లిమిటెడ్, థెమిస్ మెడికేర్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈఎమ్ఎస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి రబ్టెక్ లిమిటెడ్, బాన్స్రాస్ సింటెక్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
స్కోడా కంపెనీ తన సరికొత్త కొడియాక్ ఆర్ఎస్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ.3 లక్షల టోకెన్ మొత్తంతో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే సంస్థ 50 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్ఎస్ బ్యాడ్జ్ 50 సంవత్సరాల వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని స్కోడా ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసింది.
సరికొత్త స్కోడా కొడియాక్ ఆర్ఎస్ విండో ట్రిమ్స్, రూఫ్ రైల్స్ వంటివి పొందుతుంది. ఇది మూన్ వైట్, మ్యాజిక్ బ్లాక్, వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే అనే రంగులలో లభిస్తుంది. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఎకో, కంఫర్ట్, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్, స్నో అనే డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 2.0 TSI పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇంజిన్ 265 bhp పవర్, 400 Nm టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 231 కిమీ/గం. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఫాదర్స్ డే సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ తండ్రి కాలేకపోయినా, జీవితంలో ఇద్దరు తండ్రుల ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. ఒకరు తన "పూర్ డాడ్", మరొకరు "రిచ్ డాడ్" అని తెలిపారు.
వారి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలే తన ఆలోచనా విధానాన్ని మార్చాయని, ఆ అనుభవాలను ప్రపంచానికి "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకం ద్వారా అందించగలిగానని కియోసాకి చెప్పారు. ఆ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు.
"తండ్రిగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. మీరు తండ్రి అయినా కాకపోయినా, ఈ రోజు మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి" అని కియోసాకి తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం జీవిత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సందేశం ద్వారా గుర్తు చేశారు.
HAPPY FATHER’S DAY TO ALL FATHERS💥
Being a father is your most important job.
I have never been a father, yet I was blessed with having two fathers, my poor dad and my rich dad.
By telling the story of their lessons to me, millions of lives have been changed….enriched,…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 21, 2026
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా ‘గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’ని ప్రవేశపెట్టింది. దీని కింద 555 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వార్షికంగా 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ పౌరులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ. 3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.
కోటక్ ఇన్ఫినిటీ లాంగ్ షార్ట్ సిఫ్..
కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ఇని్ఫనిటీ లాంగ్ షార్ట్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 29తో ముగుస్తుంది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, అధునాతన పీఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కి మధ్య అంతరాన్ని భర్తీ చేసేలా సిఫ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి.ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్–షార్ట్ ఫండ్.. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ, నిర్దిష్ట డెరివేటివ్ వ్యూహాలను ఉపయోగిస్తూ, ఆర్బిట్రేజ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మెరుగైన రాబడులను అందించే విధంగా ఉంటుందని ఫండ్ మేనేజర్ కల్పేష్ జైన్ తెలిపారు. ఒడిదుడుకుల పరిస్థితుల్లో నష్టాల రిస్కులను తగ్గిస్తూ, మార్కెట్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఇది పని చేస్తుందని వివరించారు.
సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోటీశ్వరులను చేశారు. ఎవరాయన.. ఎక్కడ.. ఆ కంపెనీ ఏంటి.. చూద్దాం ఈ కథనంలో..
అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన కుటుంబ యాజమాన్య సంస్థ ఫైబర్బాండ్ (Fibrebond) తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిర్మాణాలను తయారు చేసే ఈ సంస్థను పవర్ మేనేజ్మెంట్ దిగ్గజం ఈటన్ (Eaton) 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,045 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే ఈ ఒప్పందంలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే.. సంస్థ మాజీ యజమాని గ్రాహం వాకర్ ఉద్యోగుల కోసం 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,265 కోట్లు) కేటాయించాలనే షరతును పెట్టడం.
ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న 540 మంది పూర్తి కాల ఉద్యోగులు ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగికి 4.43 లక్షల డాలర్లు (సుమారు రూ.4.18 కోట్లు ) లభించనున్నాయి. కంపెనీలో వాటాలు లేకపోయినా, సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్రను గుర్తించి ఈ బహుమతిని ఇవ్వాలని వాకర్ నిర్ణయించారు.
బోనస్ చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే పూర్తి మొత్తాన్ని పొందాలంటే ఉద్యోగులు ఐదేళ్లపాటు సంస్థలో కొనసాగాల్సి ఉంటుంది. 65 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడు చాలా మంది ఉద్యోగులు తొలుత నమ్మలేకపోయారని, కొందరు ఇది సరదా ప్రకటనేమోనని భావించారని అమెరికా మీడియా పేర్కొంది.
అగ్నిప్రమాదం నుంచి ఏఐ బూమ్ వరకు...
1982లో క్లాడ్ వాకర్ స్థాపించిన ఫైబర్బాండ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం, డాట్కామ్ సంక్షోభం, ఆర్థిక మందగమనం కారణంగా ఒక దశలో ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320కు పడిపోయింది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు యాజమాన్యం కృషి చేసింది.
తరువాత డేటా సెంటర్ రంగంలో సుమారు 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం సంస్థకు టర్నింగ్ పాయింట్గా మారింది. కోవిడ్ అనంతరం క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఫైబర్బాండ్ వ్యాపారం వేగంగా విస్తరించింది. కేవలం ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు దాదాపు 400 శాతం పెరిగాయి.
ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు
ఈ భారీ బోనస్తో అనేక మంది ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి. కొందరు గృహ రుణాలను పూర్తిగా తీర్చగా, మరికొందరు చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. 1995లో గంటకు కేవలం 5.35 డాలర్ల వేతనంతో కంపెనీలో చేరిన ఉద్యోగిని లెసియా కీ తన ఇంటి రుణాన్ని క్లియర్ చేసి దుస్తుల దుకాణం ప్రారంభించింది. మరో ఉద్యోగి హాంగ్ బ్లాక్వెల్ పదవీ విరమణ చేసి తన కుటుంబ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించింది.
కంపెనీ విక్రయం ద్వారా వాకర్ కుటుంబానికి 1 బిలియన్ డాలర్లకు పైగా లభించినప్పటికీ, ఆ సంపదలో కొంత భాగాన్ని ఉద్యోగులతో పంచుకోవడం కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా సంస్థ విజయానికి భాగస్వాములుగా భావించిన ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
కోర్టుకు అల్లు అర్జున్ డుమ్మా
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
సుగాలి ప్రీతి కేసులో భౌ భౌ అని మొరిగి.. ఇప్పుడు ఆధారాలు లేవంటే.. ప్రజలు నమ్మాలా
ఇన్నాళ్లు ఓపిక పట్టా.. నా వల్ల కావడం లేదు అమ్మ.. గాయత్రి చివరి ఫోన్ కాల్
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
పవన్ కామెంట్స్ పై పచ్చి బూతులు తిడుతున్న యువత!
11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. బుడ్డోడి దెబ్బకు యువీ, ఏబీ డివిలియర్స్ రికార్డులు బద్దలు
వాహనాలు తనిఖీ చేస్తుండగా DTOపైకి దూసుకెళ్లిన లారీ
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
పులివెందుల పర్యటనకు YS జగన్
ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ఆ పాపను ఎన్ని చిత్రహింసలు పెట్టాడంటే.. CI నాగరాజుపై జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు
National
ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
అసలేం జరిగింది?
శాను అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు.రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్ చేశారని, అప్పుడు అబ్యాక్గ్రౌండ్లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు.
ఇదీ చదవండి: లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
చివరికి ఆ యువకులు బ్రతిమిలాడి, బేరసారాల తరువాత డిరూ. 2,400 చెల్లించడానికి అంగీకరించడంతో ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. ఆ యువకుల వద్ద అంత నగదు లేకపోవడంతో యూపీఐ (UPI) ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఇంజనీర్ శాను ఆ యూపీఐ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ, ఈ డిజిటల్ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు. మరి బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
Bangalore auto walas are brutal to innocent people!
Hoping to earn their livelihood, two young boys from a village just reached SMVT railway station. They took an auto to Attibele as they wanted to go to Hosur.
After the ride, the auto driver demanded ₹3000 just for 35 km???…— Sanu (@SanuThink) June 22, 2026
నెటిజన్ల ఆగ్రహం
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుండి బెంగళూరుకు వచ్చే విద్యార్థులు, యువతకుఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తాయని, ఇది నగరం పేరును చెడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.
అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.
కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.
Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb
— IANS (@ians_india) June 21, 2026
యూపీ: లక్నోలోని కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.
ప్రమాదం ఎలా జరిగింది?
ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance.
An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 22, 2026
హిమాలయాల్లో ఓ పవిత్రమైన సరస్సు ఉంది. దాని అడుగు భాగంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అపారమైన బంగారు, వెండి ఆభరణాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆధ్యాత్మికతకు ఆలవాళంగా ఉన్న ఆ సరస్సులో.. నాగుపాము పడగను పోలిన పువ్వులుండే మొక్కలు ఎందుకున్నాయి..? సరస్సు అడుగుభాగంలోని నిధులను కాపాడేందుకు యక్షులు స్వయంగా ఈ మొక్కల రూపంలో నిఘా పెడతారా? లేక.. మరేమైనా విశేషాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే..
హిమాలయ రాష్ట్రాల్లో కీలకమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో.. సముద్రమట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రమే కమ్రూనాగ్. ఇక్కడి కమ్రూనాగ్ సరస్సు ఎన్నెన్నో వింతలను తనలో ఇముడ్చుకుంది. మహాభారత కాలంలో రత్నాయుధుడు ఓ గొప్ప వీరుడు, యోధుడు. ఇతణ్నే కమ్రూనాగ్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి వ్యూహం ప్రకారం కమ్రూనాగ్ తన తలను త్యాగం చేయాల్సి రాగా.. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో నువ్వు భక్తులతో పూజలందుకుంటావని కృష్ణుడు వరమిచ్చాడు. అలా.. కమ్రూనాగ్ ఈ ప్రాంతంలో కొలువుదీరాడు..కమ్రూనాగ్ ఒక యక్షుడు. ఆయనను పూజించే భక్తులు భక్తిభావంతో కమ్రూనాగ్ సరస్సులో బంగారు, వెండి నాణేలను వేయడం ఆనవాయితీగా మారింది. ద్వాపరయుగాంతం నుంచి మొదలుకుని.. కలియుగారంభం.. ఆ తర్వాతి కాలంలో భక్తులు వేసిన కానుకలతో ఈ సరస్సు అడుగు భాగం లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నాణేలకు నిలయంగా మారిపోయింది. ఈ నిధిని తస్కరించడానికి ఎవరూ సాహసించరు. అలా ప్రయత్నిస్తే.. ఇక్కడి నాగుపాములు, యక్షులు వారిని ఊరికే వదిలి పెట్టరని భక్తుల విశ్వాసం.
ప్రపంచంలో ఎక్కడా కనిపించని నాగుపాము పడగను పోలిన అరుదైన పుష్పాలు కమ్రూనాగ్ సరస్సు వద్ద దర్శనమిస్తాయి. వీటిని హిమాలయన్ కోబ్రాలిల్లీ అని పిలుస్తారు. స్థానికులు వీటిని బిషర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం అరిసెమా ప్రోపింక్వమ్. పువ్వు పైభాగం పడగ విప్పిన నాగుపాము ఆకారాన్ని పోలిఉంటుంది. అంతేకాదు.. పాము నాలిక బయటకు వచ్చినట్లుగా.. ఈ పువ్వు అగ్రభాగం కనిపిస్తుంది. ఈ పుష్పాలు గోధుమ, ఊదా, ఆకుపచ్చ రంగులతో చారలను కలిగి ఉంటాయి. మొదటిసారి ఈ పుష్పాలను చూసేవారు.. నిజంగానే అక్కడ పాము ఉందని భ్రమపడడం ఖాయం. కమ్రూనాగ్ ట్రెకింగ్ మార్గంలో, సరస్సు వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే.. యక్షులు ఈ పువ్వుల రూపంలో ఉంటూ కమ్రూనాగ్ సరస్సులోని నిధులను కాపాడుతారని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఈ సరస్సును చేరుకనేందుకు నేరుగా రోడ్డుమార్గం లేదు. మండి నుంచి రోహండా అనే గ్రామానికి చేరుకుని.. అక్కడి నుంచి నిటారైన కొండమార్గంలో 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. అలా కఠినమైన ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణించి, కమ్రూనాగ్ సరస్సును చేరుకోవచ్చు. మే నెల మొదలు.. అక్టోబరు వరకు ఈ మార్గం ట్రెకింగ్కు అనుకూలంగా ఉంటుంది. ప్రతీఏడాది జూన్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు
రోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
जाको राखे साइयाँ मार सके ना कोई
A mother and child had a miraculous narrow escape
📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026
నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే..
ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఇంతకీ నోటీసులో ఏముంది?
ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది.If your management writes policies like this, don't be surprised when your best employees write resignation emails. pic.twitter.com/3v5jZGA3XS
— Nalini Unagar (@NalinisKitchen) June 22, 2026
ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
నెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని చేయడం, ఓకే మరి, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం ఎక్కువ పనిచేసినా ఒక గంట అదనపు జీతం ఇస్తారా . సాయంత్రం 6:01 వరకు ఉంటే గంట జీతం ఇవ్వాలి అంటూ కొంతమంది కౌంటరిచ్చారు.ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
ఇలాంటి వేధింపుల వల్లే తాము రిమోట్ ఉద్యోగాల (Work from home) వైపు మొగ్గు చూపుతామని, ఆఫీస్ ఉద్యోగాలను వదులుకుంటామని మరికొందరు పేర్కొన్నారు. కొందరు మాత్రం వ్యాపార యజమానులు కూడా రాత్రింబగళ్లు కష్టపడతారని, ఉద్యోగులలో క్రమశిక్షణ కోసమే ఇలాంటివి పెడతారంటూ యజమానులు కొంతమంది స్పందించారు.
ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
నోటీసు నిజమేనా?
ఈ నోటీసుపై కంపెనీ పేరు గానీ, ఎలాంటి లోగో గానీ లేకపోవడంతో ఇది నిజమైనదేనా లేక కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "ఒకవేళ 5 నిమిషాలు త్వరగా లంచ్ ముగించుకుని వస్తే.. 5 గంటల లీవ్ ఇస్తారా?" అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రీటా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట ఆడవాళ్ల బట్టలపై చర్చను లేవనెత్తింది. భారతీయ మహిళలు బీచ్కు వెళ్లి, స్విమ్సూట్ లేదా బికినీలో వేలకొద్దీ ఫోటోలు తీసుకున్నా, వాటిని ఫోన్ మెమోరీలోదాచుకోవడం తప్ప, సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయరు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ ఎలా కామెంట్ చేస్తుంది? ఆ వీడియో లేదా ఫోటో చూసి మిమ్మల్ని అవమానకరమైన పేర్లతో పిలిస్తే? అని భయం వెంటాడుతుంది అంటూనే కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం అగ్గి రాజేసింది.
తాను కూడా బికీనీలు వేసుకుని ఫోటోలు దిగినా, వాటిని ఇన్స్టాగ్రామ్లో పెట్టనని రీటా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే భారత్లో ఉన్న 24 ఏళ్ల జీవితం తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో,దుస్తుల విషయంలోఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిందన్నారు. కానీ భయపడుతూ, ఎన్నాళ్లుంటాం అని ప్రశ్నించింది. అందుకే తన మైండ్ సెట్ మార్చుకుని ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నా అన్నారు.
‘‘ఒక భారతీయ మహిళగా ఇలాంటి వీడియోను పోస్ట్ చేస్తానని తానెపుడూ అనుకోలేదు. అలా అని నేనెపుడూ బికినీ వేసుకోలేదని కాదు. థాయ్లాండ్ , ఇండోనేషియాలో చాలాసార్లు బికినీ ధరించా. అక్కడ బీచ్లలో ఇది చాలా కామన్. అయితే పూర్తిగా దుస్తులు కప్పుకున్నప్పుడు కూడా, ఏదో ఒకటి విమర్శిస్తారు. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూనే ఉంటారు. సో.. జనం ఏదో అంటారనే రెండో ఆలోచన కూడా చేయకుండా తాను ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా’’ అని చెప్పింది.
బికీనీలో ఫోటో పెడితే ఏమవుతుందని చాలా కాలం ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా అక్కడ తగ్గట్టు ఉండాలని గ్రహించాను. నేను ఫరీదాబాద్లో బికీనీ వేసుకోను కదా, బీచ్లోనే వేసుకుంటాను. అలాగే బీచ్కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకోలేము కదా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఇండియన్ అంకుల్స్ కేవలం షార్ట్స్ వేసుకుని, సరిగ్గా స్విమ్సూట్ కూడా లేకుండానే సముద్రాలు, పూల్స్లోకి దిగుతుంటారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో తాను బికీనీ వేసుకున్నప్పుడు అక్కడెవరూ తనను వింతగా చూడలేదని, ఎవరి పని వారు చూసుకుంటారని రీటా చెప్పారు.
నిజానికి మన భయమంతా సమాజం గురించే. చిన్నప్పటి నుండి మనకు అలవాటు చేసిన ఆలోచనా విధానం వల్లే వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను మాట్లాడేది కేవలం బికీనీల గురించి కాదు, మన బాడీతో కంఫర్టబుల్గా ఉండటం, భయంతో మన ఫీలింగ్స్ను అనుభవాలను కోల్పోకపోవడం గురించి అని చెప్పారు.
ఈ వీడియోపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను జడ్జ్ చేస్తూ, నానా మాటలు అన్నారు. ‘నీ బాడీ. నీ యిష్టం’ అని కొందరు మహిళలు ఆమెను సమర్ధించారు. థాయిలాండ్లో గుడ్లప్పగించి చూడకపోవడం వల్ల స్వేచ్ఛగా ఫీలవుతాం అంటూ చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
మహిళల దుస్తుల ఎంపికను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సంకుచిత స్వభావం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. మహిళలు ఏం వేసుకోవాలో నియంత్రించే కంటే,ఇలాంటి పురుషాధిక్య, వివక్షతోకూడిన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.
రీటాను విమర్శించిన వారిలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. ఈమెకు దూరంగా ఉండండి అని కొందరంటే, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా కాపీ కొడుతూ, మళ్లీ దానికి సమర్థన ఒకటి అని మండిపడ్డారు. పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులకున్నట్టు కాదు మరికొరు విమర్శించారు.
ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకే ప్రమాదంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం మరింత కలచివేసింది.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుండి దూకే క్రమంలో తొక్కిసలాటలో మరణించారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న వెంటనే లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో 14 అగ్నిమాపక వాహనాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఐదారు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతుల సంఖ్య 14కి చేరింది.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు, స్త్రీ 2, ఓఎమ్జి-2 మిమి, మీర్జాపూర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న పంకజ్ త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిగా వచ్చిన ఆస్తి తాగాదాలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ తీవ్రంగా గాయపడిన సంగతి కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం నటుడు పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన బరౌలీ పట్టణంలోని బెల్సంద్ వద్ద ఈ దాడి జరిగింది. భూ వివాదానికి సంబంధించిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు బీజేంద్రనాథ్ తివారీపై కర్రతో దారుణంగా దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన అతడిని గోపాల్ గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి దాడికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి జుడీషియల్ కస్టడీకి పంపినట్లు గోపాల్గంజ్ ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందనందున పూర్తి స్థాయి చట్టపరమైన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
ఈ దాడి ఘటనపై జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Gopalganj, Bihar: Brother of actor Pankaj Tripathi, Bijendra Nath Tiwari, sustained critical injuries in a sharp-weapon attack linked to an old dispute. He was shifted to Patna for advanced treatment, while police formed a special team and launched raids to apprehend the accused. pic.twitter.com/uZRLUN3WNs
— IANS (@ians_india) June 21, 2026
ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది..
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన అభిజిత్ దీప్కే.. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్మంతర్లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నిరసనలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

అంతేకాకుండా నిరసనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్ పేర్కొన్నారు.
జంతర్మంతర్లో నిరసనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
నీట్-యూజీ లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమానికి తాజాగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.
మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ఈ నిరసనల్లో చేరడం హైలైట్ అయ్యింది. “విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్ట్ను కూడా ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్మంతర్ వేదికగా కొనసాగుతున్న నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.
వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.
చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.
ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు.
జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు.
కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు.
"వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బడ్జెట్లోని ముఖ్యాంశాలు:
లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.
ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.
పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.
ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.
వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.
కోల్కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.
ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.
- AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానం
- సివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు
రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్ను తీసుకురావడం మరో విశేషం.
ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం
న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.
గవర్నర్తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలు
శ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు.
In Srinagar! Had the honour of an excellent meeting with Lieutenant-Governor Shri @manojsinha_ at Lok Bhavan today. We discussed the situation in the state and the encouraging progress towards normalcy. When I arrived he was chatting to the President of the Kashmiri Writers’… pic.twitter.com/hm1lz3qDGF
— Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2026
సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్
థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదం
శశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు.
Family
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అంతేగాదు ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాస్పదురాలిగా ముద్రవేయించుకుంది. ఎవరేమన్నా..తన ఆలోచన, తనదైన నిర్ణయం ఫైనల్ అని కరాఖండీగా చెప్పేస్తుందామె. కెరీర్లో ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా..అధిగమించి నిలబడిన వ్యక్తి రాఖీ సావంత్. అయితే ఆమె ఇటీవల క్వీనీ సింగ్ పోడ్కాస్ట్లో తాను అందం కోసం ఎంతలా ఖర్చు చేసిందో బయటపెట్టింది. అన్నింట్లకంటే డబ్బే ముఖ్యమని, అది లేకుండా జీవితంలో ఏ ఒక్క పని జరగదని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్తుపోయాలా చేసింది. ఆమె అందం కోసం డబ్బుని ఎలా ఖర్చు పెడుతుందో వింటే నోటమాటరాదు.
బ్యూటీ బ్రాండ్ BiE వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన రాఖీ పేదరికాన్ని ద్వేషిస్తానని అంటోంది. ప్రతీదానికి డబ్బే పరిష్కారమని అంటోంది. ఆమె డబ్బు ఎంత కావాలని కోరుకుంటుందంటే..తన బెడ్పై పరచినంత డబ్బు సంపాదించాలని ఉందట ఆమెకు. పైగా ఆ డబ్బుని స్టైలింగ్ కోసం ఖర్చు చేస్తానని తేల్చి చెప్పింది. తన యాక్సెసరీలను చూపిస్తూ..తన జుట్టుని పట్టుకుని ఇది రష్యన్ హెయిర్ అని ఒక్కసారికే రూ. 12 లక్షలు ఖర్చు అవుతాయని అంటోంది.
దీన్నిదుబాయ్, లండన్, కెనడా, అమెరికాలో మాత్రమే చేస్తారని అంటోంది. గోళ్లు, కనురెప్పల అందం కోసం ఆఫ్రికా వెళ్తానని, ఆఖరికి దవడ, బుగ్గలు, పెదవులు వీటన్నింటికీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టానంటోంది. తాను ఎన్నటికీ పేదరికంలోకి రానంతగా డబ్బు సంపాదిస్తానని..అదంతా కూడా తన ఫ్యాషన్ కోసమే ఖర్చు చేస్తానని పేర్కొంది.
ఆఖరికి మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా డబ్బే పరిష్కారం అని చెబుతుండటం విశేషం. తనకు నిరాశ కలిగినప్పుడూ కూడా మనీ టన్, మనీ సెటమాల్, మనీ సింగ్ అనే మందులు తన దగ్గర ఉంటాయని నవ్వుతూ చెబుతోంది. తాను డబ్బు సంపాదించడానికి చేయగలిగిందంతా చేస్తానని, కేవలం జీవనోపాధి కోసం కెమెరా ముందు ధైర్యంగా మారిన ఒక అమాయక బాలికనని ఆవేదనగా చెప్పుకొచ్చింది.
కాగా, గతంలో రాఖీ తన తల్లి అనారోగ్యానికి వైద్యం చేయించడానికి, అలాగే తన గర్భాశయంలో కణితిని తొలగించుకోవడానికి పడ్డ ఆర్థిక కష్టాలే ఆమె ఆలోచన తీరుకి కారణమని తెలుస్తోంది. అయితే ఒక మనిషి తాను ఎదుర్కొనే పరిస్థితి అతడిని ఎంతలా మార్చేస్తుందనడానికి రాఖీనే నిదర్శనం కదూ..!.
(చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..)
ఒక పారిశ్రామిక వేత్త అత్యంత అధిక బరువుతో నరకం చూశాడు. బరువు తగ్గేందుకు ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఒక రోజు తీవ్ర అనారోగ్యం పాలవ్వడమే మేల్కోలుపుగా మారి..అతడి వెయిట్లాస్ పరివర్తను నాంది పలకింది. అలా ఓపికతో ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి సఫలమవ్వడమే గాక తనలా ఇబ్బంది పడుతున్నవాళ్లు కూడా స్లిమ్గా మారాలని '3ఈ' ఫిట్నెస్ సెంటర్ని కూడా స్థాపించాడు. అంతేగాదు అందరు ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటూ తన వెయిట్లాస్ స్టోరీని షేర్ చేస్తూ..ఆరోగ్య స్పృహ కలిగిస్తున్నాడు.
అతడే 'ADSMITH' వ్యవస్థాపకుడు నీరజ్ ఝూ. తన సంస్థ బాధ్యతలతో తలామునకలవ్వుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దాంతో అతడు ఏకంగా 144 కిలోల బరువుతో ఊబకాయంతో ఇబ్బందిపడేవాడు. అలాంటి వ్యక్తి కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 65 కిలోలు తగ్గి.. సుమారు 79 కిలోల బరువుకు చేరుకున్నాడు. అయితే దీని కోసం ఎలాంటి వెయిట్లాస్ మందులు, సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, జిమ్ వంటి వాటి జోలికి పోకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తన బరువుని తగ్గించుకుని ఆదర్శంగా నిలిచాడు. అతడు తన పాత అలవాట్లకు స్వస్తి పలకాలనే దృఢమైన సంకల్పంతోనే స్లిమ్గా మారానని చెబుతున్నాడు.
తాను వృత్తిపరంగా సక్సెస్ అందుకున్నా..అందుకు మూల్యం తన శరీరం చెల్లించాల్సి వచ్చిందంటాడు. తనకు ఆ అధిక బరువుతో అస్సలు నిద్ర పట్టేది కాదని, పైగా వొంట్లో అస్సలు శక్తి ఉండేది కాదని, చాలా ఆయాసంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. అయితే తాను కూడా అందరిలా బరువు తగ్గే ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసేవాడినని చెప్పుకొచ్చాడు. శరీరం బాగా అలిసిపోయినట్లుగా అనిపించి, మధ్యలో స్కిప్ చేసేవాడినని అన్నాడు. కానీ బయట వాళ్ల నుంచి వచ్చే ఛీత్కారాలకు భయపడి మళ్లీ బరువు తగ్గే ప్రయత్నాలు చేసేవాడినని చెప్పుకొచ్చాడు.
ఐసీయూ తెచ్చిన మేల్కొలుపు..
ఒకరోజు తీవ్రం అనారోగ్య బారినపడి, ఆస్పత్రిలో చేరినప్పుడు నరకం చూశానని, నాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఆస్పత్రిలో చేరాను కానీ ఆవేళ మాత్రం తన పరిస్థితి ఘెరంగా ఉందని, తీవ్రమైన ఎల్ఆర్టీఐ(దిగువ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) కారణంగా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు.వైద్యులు బైపాప్ యంత్రాన్ని అమర్చారు. అది తనకు ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలనే కనువిప్పుని కలగజేసిందన్నారు. అంతేగాదు చాలా ఏళ్ల తర్వాత హాయిగా నిద్రపోయినట్లు పేర్కొన్నారు. అప్పుడే తెలిసింది ఏళ్లుగా తాను ఊపిరాడక సతమతమయ్యాననని తెలుసుకున్నానని అన్నాడు. అసలు బరువు తగ్గించుకుంటే తనకు ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని తెలిసి వచ్చిందని అంటాడు నీరజ్.
అయితే అందరిలా జిమ్, ట్రైనర్ల జోలికిపోకుండా ..
చాలామందిలా జిమ్లో జాయినవ్వడం, ఫిట్నెస్ ట్రైనర్లను పెట్టుకోవడం వంటివి చేయకుండా..ప్రాథమికంగా తాను చేయగలిగే వాటిపై దృష్టిపెట్టాడు. ముందు నిలకడగా వ్యాయామాలు చేసేలా చిన్నగా ప్రారంభించాడు. అలాగే ఆహారపరంగా కేలరీలోటు మంత్రని అనుసరించాడు.చిన్నగా వాకింగ్ మొదలుపెట్టి..నెమ్మదిగా అధిక దూరాలకు నడిచేలా కేర్ తీసుకున్నాడు. అలాగే పదే పదే వెయిట్ చెక్ చేయడం వంటివి కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఒత్తిడి మనల్ని ఆహారం తినేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు. మంచి లేదా చెడు జరిగినా కూడా..నిశబ్దంగా పరిస్థితిని అంగీకరిస్తూ..ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉన్నట్లు తెలిపాడు. దాంతో దాదాపు 120 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు నీరజ్.
అయితే ఆ తర్వాత మాత్రం తన శరీరంలో అంగుళం కడా మార్పు రాకపోవడంతో షుగర్కి సంబంధించిన వాటన్నింటిని దూరం పెట్టి, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకున్నట్లు తెలిపాడు. అలా గుడ్లు, చికెన్, చేపలు, పనీర్, గ్రీక్ యోగర్ట్, కూరగాయలు తీసుకోవడం వంటి మార్పులు చేసినట్లు తెలిపాడు. అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని తగ్గించి రెండు పుల్కాలు వంటివి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే బిస్కెట్లు, అధిక చక్కెర ఉండే పండ్లకు, మద్యంకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. అలా 18 నెలలు కష్టపడగా చివరకు 79 కేజీల బరువుకి చేరుకున్నట్లు తెలిపారు. తాను పూర్తిగా ఇదివరకటి నీరజ్లా రూపుదిద్దుకున్నట్లు చెప్పుకొచ్చారు
ఆ మూడు సూత్రాల ఆధారంగా..
అలా తనలా మరింత మంది చక్కగా స్లిమ్గా అవ్వాలనే ఉద్దేశ్యంతో 3E ఫిట్నెస్ను స్థాపించాడు. తన జీవితాన్ని మార్చిన మూడు సూత్రాలపై ఈ వెల్నెస్ ఫ్లాట్ఫామ్ని ప్రారంభించాడు. ఆ మూడు Eలు – చెప్పేది..సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మానసికంగా స్ట్రాంగ్గా ఉండటం. వైద్యులు సైతం ఆయన అనుసరించిన వెయిట్లాస్ జర్పీపై ప్రశంసల జల్లులు కురిపించారు. నెమ్మదిగా, స్థిరంగా బరువు తగ్గడం వల్ల శరీరం జీవక్రియ, హార్మోన్ల స్థాయి మెరుగ్గా ఉండటమే కాకుండా కండర ద్రవ్యరాశిని నిలుపుకోవడానికి సహాయపడుతుందని అన్నారు.అలాగే మళ్లీ తిరిగి బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ఎప్పుడైనా బరువు తగ్గడం అనేది మానసిక భారంలా కాకుండా..చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెడితే సునాయాసం బరువు తగ్గగలరని చెబుతున్నాడు నీరజ్. ఇక్కడ కేవలం వదులుకోకుండా నిలకడతో క్రమం తప్పకుండా చేస్తే.. తప్పక సత్ఫలితాలను అందుకోగలమని, అందుకు నిదర్శనం తానేనని చెబుతున్నాడు.
హైదరాబాద్లోని కొత్తపేటలో ఎస్బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్ ఫ్లోర్లో ఓ నాలుగు గదుల ఇంటికి ‘అందరి ఇల్లు’ అని బోర్డు ఉంటుంది. తలుపులు తెరిచే ఉంటాయి. లోపలికి వెళితే ఆకలిగొన్నవారు వండుకుంటూ కనబడతారు. వండింది ఉంటే తినేవారు కనిపిస్తారు. పక్కనే బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, అన్ని దినుసులు ఉంటాయి. కిచెన్లో స్టవ్, వంట పాత్రలు, ప్లేట్లు ఉంటాయి. ఈ ఇంటిలోకి వచ్చినవారు వండుకొని తినడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఏవి తక్కువ పడినా వెంటనే సమకూరు తాయి. అంతా ఉచితమే. మీ ఇల్లే అనుకోవచ్చు. దీనిని పిల్లల డాక్టరు వింజమూరి సూర్యప్రకాష్, గైనకాలజిస్టు సామవేదం కామేశ్వరి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీతో అందరి ఇల్లు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.
నిరాటంకంగా సాగుతున్న ఈ అన్న వసతికి వారు ఒకరి దగ్గర చేయి చాపలేదు, తామేదో ఘనకార్యం చేస్తున్నట్లు ప్రచారాన్ని కోరుకోలేదు. ఈ భోజన వసతి గురించి తెలిసిన గ్రామీణ పేద యువత అందరి ఇల్లుకు రావడం మొదలైంది. వారిలో ఎక్కువ మంది పోటీ పరీక్షల తయారీకి ఇల్లు వదిలి వచ్చినవారని తెలుసుకొని వారికోసం మరిన్ని వసతులు కల్పించారు. 2011లో వారు చదువుకోవడానికి లైబ్రరీ, కుర్చీ బల్లలు సమకూర్చారు. రాత్రుళ్లు ఇక్కడే ఉండిపోవడానికి కొన్ని బెడ్స్ కూడా వేశారు. ఇందులో ఆరు నెలలు, ఏడాది పాటు ఉండి ఉద్యోగ ప్రయత్నం కొనసాగించినవారు ఎందరో! పై అంతస్తులో కామేశ్వరి క్లినిక్ ఉంటుంది. వైద్యం కోసం వచ్చిన పేదలకు ఆహారానికి, నివాసానికి బెంగ అక్కర లేదు. పేద మహిళలు ప్రసూతి అయ్యే దాకా ఇక్కడే గడిపిన సందర్భాలు ఉన్నాయి. సూర్యప్రకాష్ రోజు ఉదయమే స్వయంగా వచ్చి సరుకులు, సదుపాయాలు సరిపడా ఉన్నాయా అని చూసుకుంటారు.
ఈ ఆలోచన (Andari Illu) ఎలా వచ్చిందని అడిగితే ‘సృష్టిలో ప్రతి జీవికి ప్రకృతి ఏదో రూపంలో ఆహారాన్ని అందిస్తోంది. మనుషులు మాత్రమే డబ్బులు వెచ్చించి తిండిని సమకూర్చు కోవాలి. దినమంతా ఏమి తినకుండా రాత్రి గడిపేవారి పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా ఆరంభించాం’ అంటారు.
చదవండి: మా నాన్న ఎవరో తెలుసా?
ఎలాగైనా ఖాళీ కడుపు నింపాలి అనే ఆలోచన ఈ వైద్య దంపతులకు 2001లో వచ్చింది. ముందుగా తోపుడు బండిలో అరటిపండ్లు పంచడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళు రాత్రి భోజనాన్ని అందించారు. ఇవేవీ తృప్తి నీయక 2006 జూన్ 15న ‘అందరి ఇల్లు’ను ఆరంభించారు. ఎలాంటి ప్రారంభోత్సవ హంగామాలు చేయకుండా స్వయంగా వారే పేదలు ఉండే అడ్డాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. 24 గంటలు ఇక్కడ సేవలు లభిస్తాయి. తమలాగే ఎవరైనా ముందుకొస్తే ఆ ఆలోచన కార్యరూపం అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ దంపతులు చెబుతున్నారు.
– బద్రి నర్సన్
కవి, కథకుడు
మిస్ యూనివర్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఇటీవల అనీ శర్మను మిస్ యూనివర్స్ 2026కి అధికారిక జాతీయ ఫైనలిస్ట్గా ప్రకటించింది. దాంతో ఆమె జాతీయ కిరీటం గెలుపొందే ప్రయాణంలో చేరి.. మిస్ యూనివర్స్ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది అని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించింది. అయితే ఇంత పెద్ద విజయం తనకు అంత సులభంగా రాలేదంటూ దాని వెనుకున్న బాధను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పంచుకుంది అనీ శర్మ.
తాను మిస్ యూనివర్స్ ఢిల్లీ పోటీల్లోకి వెళ్లేముందుకు కాలు విరగొట్టుకున్నట్టు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..తాను మిస్ యూనివర్స్ ఢిల్లీగా వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంగా నడవడమే చూశారు. దాని వెనుక మాటల్లో చెప్పలేనంత బాధను చవిచూశానని పేర్కొంది. ఇది అందరు చూడనిది, తెలియని నిజం అని చెప్పింది. అస్సలు నడవగలనా తెలియని బాధ..పోటీల్లో పాల్గొనలా? మానేయాలో తెలియని గందరగోళం మధ్య నరకం చూశానని చెప్పుకొచ్చింది.
పోటీల్లో పాల్గొనడానికి కొద్ది రోజుల ముందే ఇలా జరగడంతో చాలా భయపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తాను చేతులెత్తేయడం కంటే ఓపికతో ఎలాగోలా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకే ప్రయత్నించినట్లు వెల్లడించింది. అందుకోసం ఆ విరిగిన కాలుతోనే కసరత్తులు చేశా. ఆ క్రమంలో తన కోచ్ డైసీ ఎంతో చక్కగా మార్గనిర్దేశం చేసి..ధైర్యంగా పాల్గొనేలా ప్రోత్సహించారంటూ ఆమెకు ధన్యవాదాలు చెప్పింది.
అంతేగాదు నొప్పితో ఉన్న పాదాన్ని స్ట్రాంగ్గా మార్చుకునేలా వ్యాయామాలు చేస్తూ..భరించలేని నొప్పిని పంటికింద ఎలా అదిమిపట్టిందో వివరించింది. అలాగే ఆ హైహీల్స్ ధరించేందుకు ఎంతో ఇబ్బంది పడిందో ఆ తాలుక వీడియోలను పంచుకుంది. చివరకు మిస్ యూనివర్స్ ఢిల్లీ 2026 గ్రాండ్ ఫినాలేలో కూడా ఎంతో హుందాగా నడుస్తూ రన్నరప్గా కిరీటం గెలుచుకున్న వీడియోలను కూడా షేర్ చేసిందామె. నెటిజన్లు శర్మ కథను పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనం అని అన్నారు. అడ్డంకులు అధిగమించడమే విజయానికి కీలకం అని మీ కథ ద్వారా చూపించారని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్ శారీలో నటాషా..! హస్తకళే..)
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ప్రపంచాన్ని శాసిస్తున్నదని, భవిష్యత్ ఉద్యోగాలన్నీ దానివేనని అంతా భావిస్తున్న తరుణంలో దేశంలోని ఐఐటీ ప్రవేశాల్లో సరికొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఐఐటీ టాపర్లు మాత్రం కంప్యూటర్ సైన్స్కు బదులుగా ‘సివిల్ ఇంజనీరింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, భవనాలు, నగరాల నిర్మాణం వైపు ఈ టాలెంటెడ్ విద్యార్థులు ఎందుకు అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఏఐ భయాలు.. మౌలిక వసతుల జోరు
గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ)ఐఐటీ అడ్మిషన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ సెకన్ల వ్యవధిలో క్లిష్టమైన కోడింగ్ను పూర్తి చేస్తుండటంతో, రాబోయే 10-15 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందోననే అనిశ్చితి ఐఐటీ టాపర్లలో మొదలైంది. ఇదే సమయంలో భారతదేశంలో ఎక్స్ప్రెస్వేలు, మెట్రో లైన్లు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్వహణకు వేలాది మంది ఇంజనీర్ల అవసరం ఉండటంతో, సివిల్ ఇంజనీరింగ్ను టాపర్లు సురక్షితమైన కెరీర్ ఆప్షన్గా భావిస్తున్నారు.జీతాల తేడాలున్నా మారని ట్రెండ్
ప్లేస్మెంట్ల పరంగా చూస్తే ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాలదే పైచేయిగా ఉంది. ఉదాహరణకు 2026 క్యాంపస్ సెలక్షన్స్ లో ఐఐటీ రూర్కీకి చెందిన డేటా సైన్స్, ఏఐ మొదటి బ్యాచ్ విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్స్ సాధించారు. ఐఐటీ మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల సగటు ప్యాకేజీ రూ. 46 లక్షలుగా ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 17.2 లక్షలు మాత్రమే దక్కింది. అయినప్పటికీ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐ శాసించే ప్రమాదం ఉండటంతో, లాంగ్ టర్మ్ భద్రత కోసం టాపర్లు సివిల్ వైపే మొగ్గు చూపుతున్నారు.రెండు రంగాల జీవనశైలి.. విభిన్నం
సివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే వారు ప్రాజెక్ట్ సైట్లలో తిరుగుతూ, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. తాము నిర్మించిన వంతెనలు, రోడ్లు కళ్లముందే సాకారం కావడం వీరికి ఒక తృప్తిని ఇస్తుంది. అదే సమయంలో ఏఐ ప్రొఫెషనల్స్ పూర్తిగా ఆఫీస్ లేదా రిమోట్ వర్క్ చేస్తూ, రోజంతా కంప్యూటర్ల ముందే గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి సరికొత్త రంగాలతో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సొంతంగా స్టార్టప్లు పెట్టుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి.
Politics
దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై(సర్) రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి రెండు, మూడు చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎమ్ల టాంపరింగ్ అవకాశం, వివిపాట్ స్లిప్ల లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ విఫలం అవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజలలో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రంగం సిద్ధం అయింది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశం అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నందున, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపునకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీభవన్లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను కూడా ఒక నియోజకవర్గం బాధ్యతలు తీసుకుని ఓటర్ల జాబితా తీరుపై దృష్టి పెడతామని అనడాన్ని బట్టి ఆ పార్టీ ఎంత సీరియస్గా ఉంది అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్భంలోనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ వహించడం లేదని, జమిందార్ల మాదిరి వ్యవహరిస్తున్నారని కూడా ఘాటు వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే కొన్ని ఇళ్లలో నలభై, ఏభై ఓట్లు ఉన్న విషయాన్ని గుర్తుచేసి కాంగ్రెస్పై విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు.
ఏపీ విషయానికి వస్తే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్ లో వైఎస్సార్సీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గంవారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాలలో ఉన్న అనుభవం రీత్యా వైఎస్సార్సీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపు ఇచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైఎస్సార్సీపీ కుట్రలు చేయవచ్చని ఆయన అన్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నా, పార్టీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్సీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలచుకుంటే, తొలుత ప్రత్యర్థులపై ఆ బురద చల్లుతారని రాజకీయపార్టీలలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారు.
నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవా మిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే యత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్నాటకలలోని సరిహద్దు గ్రామాలకు చెందినవారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు ముప్పైవేల నుంచి నలభైవేల బోగస్ ఓట్లు అక్కడ ఉన్నాయని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుంటుంది.
గతంలో చంద్రబాబుపై పోటీచేసిన వైఎస్సార్సీపీ నేత, దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి 17వేల ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితిని తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిలేరని గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు.
చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్కు వినతిపత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయినవారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాలవారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి, ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళుతుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. దానిని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు.
ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసినప్పుడు వేలు ముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకు పట్టించుకోడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా, తమకు ఏది ప్రయోజనమో దానిపైనే అధికార పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్న భావన లేకపోలేదు.
పశ్చిమబెంగాల్, బీహారు రాష్ట్రాలలో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదం అయింది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు తొలగించారని అన్నారు. మమత బెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 45982 ఓట్లు తొలగిస్తే 15వేల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీచేసిన కొలత్తూరులో 71 వేల ఓట్లు తీసివేస్తే, ఆయన 8వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారని ఉదాహరించారు. బెంగాల్లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టి.ఎమ్.సి,డి.ఎమ్.కె.లు ఓడిపోయాయని ఆయన వివరించారు.
ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే, ఆ రాష్ట్రాలలో ఓట్లు తీసివేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహరం ఒక హిస్టరీ మిస్టరీ అని అన్నారు. ఒక్కో బూత్ పరిధిలో ఏభై చొప్పున వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించినా ఐదువేల ఓట్ల వరకు పోయినట్లే అని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేరకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్కు పిలుపునిచ్చారు. అయితే మరో రెండేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున, ఒకవేళ మరీ తేడా ఉంటే దానిపై పోరాటం జరిపి, సరిచేసుకునే అవకాశం ఉండవచ్చు.
ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేత పేర్నినాని చేసిన సూచనలు కూడా గమనించదగినవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3500 బూత్లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన, 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోల్ అయ్యాయన్నదానిపైన ఇంతవరకు ఎన్నికలసంఘం వివరణ ఇవ్వలేకపోయింది.
వివిపాట్ స్లిప్లతో ఈవీఎమ్లను సరిపోల్చి చూపడంలో ఎన్నికల సంఘం విఫలం అయింది. వివిపాట్ స్లిప్లను కౌంటింగ్ జరిగిన పది రోజులకే దగ్దం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎమ్ల బాటరీ చార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై జవాబు ఇవ్వలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్సార్సీపీ సన్నద్ధం అయింది. అయినా పలుచోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ నిత్యం ఫిర్యాదు చేయవలసి వస్తోంది. ఏది ఏమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది!

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Cartoon
మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!
