Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • పెద్ద సినిమాలు భారీ నిడివితో రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల యానిమల్ సినిమా రన్‌టైమ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇకపై వస్తున్న ధురంధర్-2 కూడా అంతకుమించిన నిడివితో వస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్‌టైమ్‌తో వస్తోందనే ప్రచారం మొదలైంది.  

    సినిమా టోటల్ ఫుటేజ్ 4 గంటలపైనే ఉందని, ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది. పెద్ది రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం కేవలం తొలి సగం మాత్రమే లాక్ అయింది. రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది.  

    ప్రస్తుతం పెద్ది నుంచి విడుదలైన రెండో పాట 'రయ్ రయ్‌ రారా'పై చర్చ జోరుగా సాగుతోంది. చరణ్ డాన్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దాంతో అభిమానుల్లో పెద్ది చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, ఆ డాన్స్ చేస్తున్న సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. షూట్ ఆపుదామని చెప్పినా వినకుండా జ్వరంతోనే డాన్స్ చేశారని గుర్తుచేసుకున్నారు.

    ప్రస్తుతం 'రయ్‌ రయ్‌ రారా' సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది.  పెద్ది సినిమా రన్‌టైమ్‌పై వస్తున్న ప్రచారాలు నిజం కావని యూనిట్ స్పష్టతనిచ్చింది. అభిమానులు మాత్రం సినిమా ఫైనల్ రన్‌టైమ్‌పై అధికారిక అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

  • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. దీని వల్ల పెట్రోలు, బంగారం ధరలు ఎక్కడ పెరిగిపోతాయోనని భారతీయులు కంగారు పడుతున్నారు. మరోవైపు ఇదే యుద్ధాన్ని చూసి టాలీవుడ్ కూడా భయపడుతోంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఇంతకీ అవేంటి? రాబోయే పాన్ ఇండియా మూవీస్‌పై ఈ యుద్ధం ప్రభావం ఎంత ఉండొచ్చు?

    (ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకే సంపాదిస్తున్న సన్నీ లియోన్ కూతురు)

    బలమైన మార్కెట్
    ఒకప్పుడు అంటే తెలుగు సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. పాన్ ఇండియా ట్రెండ్‌తో విదేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. భారతీయ చిత్రాలకు అమెరికన్ మార్కెట్ ఎంత కీలకమో.. అరబ్ దేశాల్లోని మార్కెట్ కూడా అంతే కీలకం. అరబ్ దేశాల్లో పనుల కోసం వెళ్లే చాలామంది భారతీయులు.. అక్కడ మూవీస్ బాగానే చూస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కారణంగా అటు థియేటర్లలో మూవీస్ రిలీజులు కష్టమే. ఒకవేళ విడుదల చేసినా జనాలు.. వచ్చి చూడటం కూడా కొంతవరకు అనుమానమే. రాబోయే కొన్నినెలల పాటు అరబ్ దేశాల్లో మన సినిమాలకు మార్కెట్ కాస్త తగ్గొచ్చు.

    షూటింగ్స్ బంద్
    మన దేశంలో తీసే చాలా సినిమాలని విదేశాల్లోనూ తెరకెక్కిస్తుంటారు. మరీ ముఖ్యంగా దుబాయితో పాటు మిగతా అరబ్ కంట్రీస్‌లో పాటల షూటింగ్స్ లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలావరకు చిత్రీకరణలు నిలిచిపోయాయి. కొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు. అయితే అరబ్ దేశాల్లో చాలావరకు షూటింగ్స్‌కి సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది. ఇ‍ప్పుడు మరో చోటకు వెళ్లాలి అంటే ఆయా పరికరాల్ని అన్నింటినీ మరోచోటకు తీసుకెళ్లడం లాంటివి కాస్త కష్టతరమైన విషయమే అని చెప్పొచ్చు.

    ప్రయాణ ఆంక్షలు
    ఇదే యుద్ధం వల్ల చాలావరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని వేరే వైపునకు మళ్లిస్తున్నారు. దీంతో నటీనటులు, సాంకేతిక సిబ్బంది, నిపుణులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన పాన్ ఇండియా సినిమాలకు చాలావరకు విదేశాల్లోనే విజువల్ ఎఫెక్ట్స్ చేయిస్తుంటారు. యాక్షన్ సీన్స్ లాంటి వాటికోసం విదేశాల నుంచి సంబంధిత టెక్నీషియన్స్‌ని తీసుకొస్తుంటారు. ఇప్పుడు యుద్ధం ఆగేంతవరకు ఈ విషయాల్లో సినిమా బృందాలకు ఇబ్బందులు తప్పవు.

    విడుదల వాయిదా
    ఇదే యుద్ధ ప్రభావం.. రాజమౌళి తీస్తున్న 'వారణాసి', అల్లు అర్జున్-అట్లీ చేస్తున్న సినిమాలతో పాటు పలు చిత్రాల విడుదల తేదీలపై కచ్చితంగా పడే అవకాశమైతే ఉండొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధాన్ని విరమిస్తాయనేది తెలియట్లేదు. ఒకవేళ రాబోయే కొన్నిరోజుల్లో విరమించినా సరే మన పాన్ ఇండియా సినిమాలకు అవసరమయ్యే విదేశీ సాంకేతికత, నిపుణుల విషయంలో కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు తలెత్తొచ్చు. అది పరోక్షంగా విడుదల తేదీలపై పడటం గ్యారంటీ.

    ఆర్థిక భారం
    యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే సినిమా షూటింగ్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. ప్రొడక్షన్ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగొచ్చు. అదే జరిగితే బడ్జెట్ సమస్యలతో సినిమాల ఇంకాస్త లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

    ఇదే యుద్ధం కారణంగా చాలామంది బాలీవుడ్ నటీనటులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు వాళ్లందరూ స్వదేశానికి వచ్చేసినా సరే భయమనేది కొన్నాళ్ల పాటు ఉండిపోతుంది. దీంతో షెడ్యూల్స్, షూటింగ్స్ ఆలస్యం కావొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఆయా దేశాలపైనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమపైనా పరోక్షంగా పడింది. రూ.10 వేల కోట్లకు పైనే నష్టం ఉండొచ్చని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

     

    (ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

  • ఒకప్పుడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్.. చాన్నాళ్ల క్రితమే వాటిని పక్కనబెట్టేసింది. ఓ వైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమాలు చేస్తూ బతికేస్తోంది. రీసెంట్ టైంలో అయితే సన్నీ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వీడియోలో కనిపించింది. సన్నీ ఇంటికి వెళ్లిన ఫరా ఖాన్.. చాలాసేపు ముచ్చటించింది. మిగతా వాటి సంగతేమో గానీ తన కూతురు గురించి సన్నీ లియోన్ చెప్పిన ఓ విషయం మాత్రం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

    (ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

    డేనియల్ వెబర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సన్నీ లియోన్.. లాతుర్‌కి చెందిన నిషా అనే పాపని దత్తత తీసుకుంది. తర్వాత సన్నీ దంపతులకు కవల అబ్బాయిలు పుట్టారు. నిషాకి ఇప్పుడు తొమ్మిదేళ్లు. అయితే ఈ వయసులోనే తన కూతురు.. బూ బాక్స్ అనేదాన్ని కనిపెట్టిందని సన్నీ బయటపెట్టింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని స్పష్టం చేసింది.

    సన్నీ లియోన్ మాట్లాడుతూ.. 'బూ బాక్స్' అనేది టూ ఇన్ వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా టిష్యూని ఉపయోగించిన తర్వాత ఓ డస్ట్ బిన్‌లో పడేస్తాం. లేదంటే ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. ఇది గమనించిన నిషా.. టిష్యూ బాక్స్ పక్కనే చిన్న చెత్త బుట్ట కలిపి ఉండేలా దీన్న డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే ఉన్న బిన్‌లో పడేయొచ్చు. దీంతో శ్రమ తగ్గుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది.

    అయితే దీన్ని తయారు చేయడం వెనక ఓ కారణముంది. ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు ఎప్పటికప్పుడు అలర్జీ వచ్చేది. దానికోసం టిష్యూలు వాడి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పడేసేసరికి తిట్టేదాన్ని. అప్పుడు నిషాకు ఈ ఆలోచన వచ్చింది. ఓ టిష్యూ బాక్స్‌కు ప్లాస్టర్‌తో డిస్పోజబుల్ కప్ అతికించి నాకు చూపించింది. అదే ఇప్పుడు ఓ కమర్షియల్ ప్రొడక్ట్‌గా మారి నిషాకు డబ్బులు కూడా తెచ్చిపెడుతోంది. చిన్న వయసులోనే స్వశక్తి డబ్బు సంపాదిస్తోంది అని సన్నీ లియోన్ గర్వంగా చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

  • కేరళ చీరకట్టులో అందంగా 'డెలులు' రియా షిబు

    గ్లామర్‌తో మెరిసిపోతున్న 'స్పిరిట్' తృప్తి దిమ్రి

    జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న సంయుక్త మేనన్

    అద్దం ముందు పొట్టి జీన్ స్కర్ట్‌లో ఈషా రెబ్బా

    సోయగాలతో రచ్చ లేపుతున్న జాన్వీ కపూర్

    సిల్క్ చీరలో నవ్వుతూ కావ్య కల్యాణ్ రామ్

  • కొన్నేళ్ల ముందు వరకు పాపారాజీ కల్చర్ ఎక్కువగా ముంబైలో కనిపించేది. కానీ రీసెంట్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాపారాజీ అంటే ఫొటోగ్రాఫర్స్ గుంపుగా కనిపిస్తూ సెలబ్రిటీల ఫొటోలు తీస్తుంటారు. వీళ్లలో కొందరు అనవసరమైన జూమ్ చేస్తూ హీరోయిన్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో, యూట్యూబర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల వల్ల హీరోయిన్ల ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడ కూడా ఇప్పుడు అలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంది. సదరు ఫొటోగ్రాఫర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

    (ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)

    'ఇండస్ట్రీలోని మహిళందరి తరఫున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్‌లో మా పని గురించి కాకుండా, మా శరీర భాగాలని అనుచితంగా జూమ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా అసౌకర్యంగా ఉండటంతో పాటు మమ్మల్ని అవమానించడమే అవుతుంది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం సహించలేం. నటన కోసం, వృత్తి కోసమే ఇక్కడ ఉన్నాం. అలాంటిది హద్దులు దాటి ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదు. మా హుందాతనాన్ని ఇది దెబ్బతీస్తోంది. మీడియ మిత్రులు ప్రొఫెషనలిజం పాటిస్తూ కనీస గౌరవం ఇవ్వాలని ఆశిస్తున్నాం' అని సప్తమి గౌడ.. ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.

    తమతో చాలామంది జర్నలిస్టులు గౌరవంతో వ్యవహరిస్తున్నారని చెప్పిన సప్తమి గౌడ.. అలాంటి మీడియా మిత్రులు కూడా ఈ అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. మహిళలని ఫొటోలని తీసే విధానంలో దారుణంగా వ్యవహరిస్తున్న కొందరిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకుర్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు.. ఈ తరహా ఫొటోగ్రాఫర్ల తీరుని తప్పుబట్టారు. తమని అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

    సప్తమి గౌడ విషయానికొస్తే.. 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. 2022లో రిలీజైన 'కాంతార'లో రిషభ్ శెట్టి సరసన నటించి పేరు తెచ్చుకుంది. ది వ్యాక్సిన్ వార్ అనే హిందీ మూవీ, యువ అనే కన్నడ చిత్రాలు చేసింది. నితిన్ 'తమ్ముడు'తో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇ‍చ్చింది. ఈ మూవీ ఘోరమైన డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లో మరో ఛాన్స్ రాలేదు. ఈమె నటించిన 'ద రైజ్ ఆఫ్ అశోక'.. గతవారమే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే సప్తమికి ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: యాంకర్ సుమ కూతురిని చూశారా? ఇప్పుడెలా ఉందంటే)

  • యాంకర్ సుమ గురించి తెలుసు. భర్త రాజీవ్ కనకాల గురించి తెలుసు. వీళ్ల కొడుకు రోషన్ కూడా రెండు సినిమాలు హీరోగా చేశాడు. ఇతడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికి తెలుసు. కానీ సుమ కూతురు పెద్దగా బయట కనిపించదు. అలాంటిది ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)

    టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. తర్వాత యాంకర్ అయిపోయింది. ఆ టైంలోనే నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకుంది. రాజీవ్ నటుడిగానే అడపాదడపా మూవీస్ చేస్తుంటగా.. సుమ యాంకరింగ్‌తో ఇప్పటికీ బిజీగానే ఉంది. వీళ్లకు కొడుకు రోషన్, కూతురు మనస్విని ఉన్నారు. రోషన్.. బబుల్‌గమ్, మోగ్లీ అనే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవి హిట్ అవ్వలేదు. కూతురు మనస్విని ప్రస్తుతం చదువుకుంటోంది. పెద్దగా సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించదు.

    ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో కనిపించడంతో సుమ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. సుమ అంత ఎత్తు కూడా ఉంది. మరి తల్లితండ్రి అన్నలానే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటుందా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

  • హీరోయిన్ స్నేహ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో హోమ్లీ పాత్రలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ చాలానే మూవీస్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తనకు గతంలో పెద్ద ప్రమాదం జరిగిందని, 8 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. ఓ దర్శకుడి వల్లే మళ్లీ ఇలా ఇప్పుడు మీ ముందున్నానని చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని బయటపెట్టింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

    'కెరీర్ పీక్ స్టేజీలో వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగింది. అందులో నా చేతులు, కాళ్లు, వీపు భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. కనీసం నిలబడటానికి కూడా ఎనిమిది నెలలు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నరకం అనుభవించాను. కెరీర్ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాను. ఆ టైంలో దర్శకుడు కరు పళనియప్పన్ 'పార్థిబన్ కనవు' స్టోరీతో నా దగ్గరకు వచ్చారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిసినా సరే నాపై నమ్మకం ఉంచి ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం. ఆయన ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతోనే మళ్లీ కెమెరా ముందుకు వచ్చనాను. ఆ దశ చాలా కష్టమైనది. కానీ అదే నన్ను మరింత బలంగా మార్చింది' అని స్నేహ ఎమోషనల్ అయింది.

    తెలుగు కుటుంబానికే చెందిన స్నేహ అసలు పేరు సుహాసిని. ముంబైలో పుట్టి, షార్జాలో పెరిగింది. ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈమెని చూసిన ఓ మలయాళ నిర్మాత.. హీరోయిన్‌గా అవకాశమిచ్చాడు. అలా 2000లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'ప్రియమైన నీకు' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాధాగోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, మధుమాసంతో పాటు చాలానే మూవీస్ చేసింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నని పెళ్లి చేసుకుంది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసింది. రీసెంట్ టైంలో అయితే దళపతి విజయ్ 'గోట్'లో కనిపించింది.

    (ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

  • ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే తదితర మూవీస్ స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ రెండు చిత్రాలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చాయి?

    (ఇదీ చదవండి: యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ సినిమా)

    'వంచన' అనే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. 2024 నవంబరు 8న థియేటర్లలోకి వచ్చింది. ఉమా మహేశ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. దీంతో అనుమానితుడిగా ఉన్న అతడి డ్రైవర్‌ని అరెస్ట్ చేస్తారు. అయితే సదరు డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసుని వాదించేందుకు సిద్ధమవుతాడు. దర్యాప్తులో భాగంగా లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లేంటి? హంతకుడు ఎవరు? అనేదే మిగతా స్టోరీ.

    అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేవగుడి'. జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది. 

    'దేవగుడి' విషయానికొస్తే.. వీరారెడ్డి(రఘు కుంచె) ఓ ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరుల్లో ఒకరి కొడుకు అయిన ధర్మ(అభినవ్ శౌర్య), తన కొడుకుతో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేడు. ధర్మతో తన కూతురు శ్వేత(అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు వీరారెడ్డి అనారోగ్యానికి గురవడంతో అతడిని శత్రువులు చంపేస్తారు. మరోవైపు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతని ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ-ఈమె ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

  • విజయ్‌ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్‌ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.

    (ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

    మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే  అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్‌ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్‌ వుండదు.

    రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్‌లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్‌ టీమ్‌ కోరింది.

    (ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు)

  • బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించి, నటించిన 'తన్వి ది గ్రేట్' (2025) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది విడుదలైన ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆటిజంతో బాధపడుతున్నప్పటికీ ఆర్మీలో చేరాలనే ఒక యువతి కల జీవితమే ఈ సినిమా.. ఇందులో శుభంగి దత్తా ప్రధాన పాత్ర పోషించంది. జాకీష్రాఫ్, అరవిందస్వామి, బొమన్‌ ఇరానీ, పల్లవి జోషి, నాజర్‌  వంటి స్టార్స్‌ ఈ మూవీలో నటించారు.

    ‘తన్వి ది గ్రేట్‌’ (Tanvi The Great) మూవీ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతుంది.  ఇరవై రెండేళ్ల తర్వాత అనుపమ్ ఖేర్ మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్‌’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించిన  అనుపమ్‌ ఖేర్‌.. గతేడాది ‘తన్వీ ది గ్రేట్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం.ఈ చిత్రాన్ని ఎన్‌ఎఫ్‌డీసీతో కలిసి అనుపమ్‌ స్టూడియోస్‌ నిర్మించింది.

  • సతీమణి రష్మికతో పాటు విజయ్‌ దేవరకొండ తన సొంతూరులో సందడి చేశారు. పెళ్లి తర్వాత తొలిసారి స్వగ్రామానికి తిరిగి రావడంతో స్థానికులు సంతోషించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో  తమ  ఫాంహౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో భక్తిశ్రద్ధలతో గృహ ప్రవేశ పూజలు నిర్వహించారు. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే,  గ్రామస్థులకు, అభిమానులకు ఏర్పాటు చేసిన విందులో నాన్‌- వెజ్‌ ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్‌ అయింది. సత్యనారాయణ స్వామి వ్రతం సమయంలో అతిథిలకు నాన్‌- వెజ్‌ ఆహారం పెట్టడం ఏంటి అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే, విజయ్‌ ఇచ్చిన విందుకు గ్రామస్తులు ఫిదా అయ్యారు. చాలామంచి భోజనంతో పాటుగా అందరినీ గౌరవంగా పలకరించారని చెబుతున్నారు. 

    హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి  పూజలు జరిగిన సమయంలో శాఖాహారం (వెజ్) మాత్రమే అతిథిలకు వడ్డిస్తారు. కానీ, విజయ్ దేవరకొండ  వెజ్‌తో పాటు నాన్-వెజ్ కూడా వడ్డించారు. ఈ క్రమంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అయితే, తెలంగాణ నెటిజన్లు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. హిందూ సంప్రదాయాల అందరూ పాటిస్తారంటూనే ప్రాంతాన్ని బట్టి కొన్ని పద్దతులు మారుతాయని చెబుతున్నారు. తెలంగాణలో భక్తితో పాటు తమ ఆహారం పట్ల  ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. 

    విజయ్‌ వారింట్లో  పూజ ముగిసిన తర్వాత  స్వామివారి పీఠాన్ని జరిపి ఆ కార్యక్రమాన్ని మొదట పూర్తి చేశారని చెబుతున్నారు. ఆ తర్వాతనే మాంసాహార విందును ఏర్పాటు చేశారని తెలుపుతున్నారు. తెలంగాణ‌లోని చాలా కుటుంబాల్లో ఇలాంటి ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. విజయ్‌ ఇంటికి దూరంగానే నాన్‌- వెజ్‌ ఆహారం వడ్డించారని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో  పూజ పూర్తయిన సాయంత్రం లేదా మరుసటి రోజు తప్పకుండా విందు ఉంటుందని అందులో మాంసం వడ్డించడం సర్వసాధారణ‌మ‌ని గుర్తుచేస్తున్నారు.

    సొంతిల్లు కట్టుకున్నా: విజయ్‌
    స్వగ్రామం తుమ్మన్‌పేటకు మూడు దశబ్దాలుగా దూరంగా ఉన్నప్పటికీ తమ కుటుంబానికి గ్రామస్థులతో విడదీయరాని అనుబంధం ఉందని  విజయ్‌ దేవరకొండ తెలిపారు. తన తొలి పుట్టినరోజు కూడా ఇదే గ్రామంలో నిర్వహించినట్లు అమ్మా నాన్న చెప్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కోరిక మేరకు స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకున్నానని ఆయన అన్నారు. అందుకే తన వివాహానంతరం వ్రతం చేసి గ్రామస్థులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరు భోజనం చేసి తమను ఆశీర్వదించాలని కోరారు. తుమ్మన్‌పేట  పాఠశాలలో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన  విద్యార్థులకు ఉపకారవేతనం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అచ్చంపేట పరిధిలోని 44 పాఠశాలల విద్యార్థులకు దీన్ని అమలు చేస్తానన్నారు.

Andhra Pradesh

  • సాక్షి, అమరావతి: అంగన్ వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టుపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైరయ్యారు.  ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పేలా అవుతుందని నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ, మొక్కూ లేదని  నిలదీయడం నేరం అవుతుందా? అని ప్రశ్నించారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయమని ట్వీట్ చేశారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేస్తూ, పోలీసుల చేత బలప్రయోగంచేస్తూ, ఎక్కడికక్కడ వారిని నిర్బంధించి, వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారని వెఎస్ జగన్ మండిపడ్డారు.

    ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా?

    వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే, ఈ ఉదయం చర్చలకు పిలుస్తామనిచెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు ఎగ్గొట్టి పచ్చి మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ఒక్క అంగన్‌వాడీలకే కాదు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబూ.. మీరు తక్షణం అంగన్‌వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు.
     

     

  • తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు.  తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి భట్టి విక్రమార్క ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లారు.  

    దీనిలో భాగంగా త‌న కుటుంబ స‌న్నిహితుడు విక్ర‌మార్క‌కు వైఎస్‌ జగన్‌ సాదర స్వాగతం పలికారు.అనంతరం తన కుమారుడి వివాహానికి సంబంధించి విషయాన్ని వైఎస్‌ జగన్‌కు తెలియజేశారు. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ జ‌గ‌న్‌కు అందించారు భట్టి విక్రమార్క.

  • రాజమహేంద్రవరం:  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది.  అయితే అధికారికంగా ఏడుగురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్‌లో చికిత్స పొందుతూ జి సూర్యారావు(80) మృతిచెందారు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్‌ వాసి.  కల్తీ పాల బాధితుడు జి సూర్యారావు. మరో 13 మంది ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. 

    కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్‌ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తోంది. 

    కిమ్స్‌ బొల్లినేని, రెయిన్‌బో చిల్డ్రన్‌ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్‌ ఆస్పత్రుల్లో 13 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు.  వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. 
     

  • సాక్షి, కర్నూలు: వేసవి వచ్చింది లేదో అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వరుస పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు ఆందోళన రేపుతున్నాయి.  తాజాగా కర్నూల్‌లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది.  

    కర్నూలు బాలాజీ నగర్‌లో మంగళవారం   అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి రెండుగ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్దంతో పేలాయి. ఫలితంగా చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో తీవ్ర భయాందోళలను నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్థి నష్టం లక్షల్లో ఉంటుందని  ప్రాథమిక అంచనా. 

    ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

  • ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. మంగళవారం బుగ్గన..  జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. 

    ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. అధికారపార్టీ తరపున మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడులు చేయడం ఎప్పుడైనా చూశామా?

    దాడులను మహిళలు లీడ్ చేయడం ఓ కొత్త రకం సాంప్రదాయం. ఎవరో ఒకరు వెనుక ఉండి కోచింగ్ ఇస్తే తప్ప మహిళలు ఇలా చేయరు. నిజంగా పొరపాటు జరిగితే చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు మీరు ఏం నేర్పిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేసు లేకపోయినా కేసును ...ఆధారాలను సృష్టిస్తున్నారు.

    ఈ సంస్కృతి ఇక్కడితో ఆగిపోతుందా .. అసలు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారు. మీరు చెప్పుకునే దశాబ్ధాల రాజకీయం దేనికి ఉపయోగపడుతుంది.దాడులు చేసిన వారి పై ఏం చర్యలు తీసుకున్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ మీరేం చేశారు..అంబటి పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితుల పై కేసులు పెట్టడమేంటి. ఎవరూ ఏమీ చూడటం లేదని మీరు అనుకుంటున్నారు ...కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీ అనుభవాన్ని మంచి కోసం ఉపయోగించండి తప్పుడు కేసుల కోసం కాదు’ అని సూచించారు.

    BR నాయుడు రాసలీలలుపై బుగ్గన రియాక్షన్
  • ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని నడింపల్లె ఎస్సీహాస్టల్‌లో చదువుకుంటున్న తలారి నరసింహులు (16) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, గంగాదేవి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఉంటున్న గంగాదేవి సోదరి నాగలక్ష్మికి పిల్లలు లేరు. దీంతో ఆమె మూడేళ్ల వయసు నుంచి నరసింహులును పోషించుకుంటోంది. 

    అతను 6వ తరగతి నుంచి ప్రొద్దుటూరులోని నడింపల్లె హాస్టల్‌లలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. నరసింహులు ప్రస్తుతం పదోతరగతి చదువుకుంటున్నాడు. ప్రతి ఆదివారం పోట్లదుర్తిలో ఉంటున్న తమ పెద్దమ్మ వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అతను పోట్లదుర్తికి వెళ్లాడు. రాత్రి ఇక్కడే ఉండమని పెద్దమ్మ చెప్పినా వినలేదు. స్టడీ క్లాస్‌ ఉందని చెప్పి సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చాడు.  

    రాత్రి పడుకున్నాడు.. ఉదయం శవమై కనిపించాడు
    రాత్రి అందరితో పాటు నరసింహులు చదువుకున్నాడు. భోజనం చేసి తోటి పిల్లలతో సరదాగా కొంతసేపు ఆడుకున్నాడు. అయితే అదరూ 10 గంటలకు పడుకున్నా అతను మాత్రం రాత్రి 11 గంటల వరకు పడుకోకుండా దిగాలుగా కూర్చొని ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. పడుకుందాం రారా అని పిలిచినా అతను రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విద్యార్థులు బయటికి రాగా హాస్టల్‌ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని నరసింహులు వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్‌ వార్డెన్‌ బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణం ఉంటుందేమోనని అందరూ కలిసి చెట్టుకు వేలాడుతున్న నరసింహాలును కిందికి దించారు. 

    అయితే అప్పటికే అతను చనిపోయాడు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసింహులు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. విద్యార్థులను దిక్కులేని వారిగా వదిలేశారని, రాత్రి ఒక్కరు కూడా పిల్లలను చూసువడానికి హాస్టల్‌లో ఉండలేదని వాపోయారు. ఏ ఒక్కరు రాత్రి హాస్టల్‌లో ఉన్నా నరసింహులు ప్రాణాలతో ఉండేవాడని తెలిపారు. టూ టౌన్‌ సీఐ వంశీనాథ్, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు విద్యార్థి బంధువులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.  

    విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం
    విద్యార్థి నరసింహులు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభ పేర్కొన్నారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. కాగా విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా తమ కుమారుడి మరణానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. 

  • నంద్యాల జిల్లా: మండల పరిధిలోని కౌలూరు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ పెట్రోల్‌ బంకులో ఆరు రోజులుగా ఉన్న కారు స్థానికంగా కలకలం రేపుతోంది. గత నెల 25వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తెలంగాణ రిజిస్ట్రేషన్ ( టీఎస్‌  11 ఈఎఫ్‌ 0956) కలిగిన హ్యుందాయ్‌ కారును బంకు ఆవరణలో పార్క్‌ చేసి వెళ్లారు. 

    వారం గడుస్తున్నా కారును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. వాహన వివరాల ఆధారంగా యజమాని ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Sports

  • పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్‌ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలో సూర్యకుమార్‌ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.

    అజేయంగా సూపర్‌-8
    గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి.. సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ సెమీస్‌ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్‌ చేశాడు.

    అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్‌-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్‌ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

    ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి
    అయినప్పటికీ ఆమిర్‌ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్‌ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి.

    గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్‌ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.

    టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు
    ఇక వెస్టిండీస్‌ బ్యాటర్లు వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు. వాళ్లు ఫైనల్‌ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ అతి చేశాడు. 

    ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్‌ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్‌ సూపర్‌-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక.   

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నాకౌట్‌ దశకు చేరుకుంది. ఇ‍ప్పటికే నాలుగు సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

    సఫారీ- కివీస్‌ జట్లు బుధవారం కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్‌- ఇంగ్లండ్‌ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక సూపర్‌-8లో హ్యాట్రిక్‌ విజయాలతో ఇంగ్లండ్‌ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్‌ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.

    వీరోచిత ఇన్నింగ్స్‌
    అయితే, వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో రాణించడంతో భారత్‌ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాలు.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప వేరే బౌలర్‌ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ విఫలం కావడం సెమీస్‌కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.

    సంజూకు పొంచి ఉన్న ప్రమాదం
    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్‌ పేసర్‌ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.

    సంజూకు ఆర్చర్‌ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

    ఆర్చర్‌తో పాటు అతడూ
    ఒకవేళ ఇంగ్లండ్‌ ఈసారి కూడా ఆర్చర్‌తోనే బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభిస్తే.. ఓపెనర్‌ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్‌ కర్రాన్‌ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. 

    పొట్టి క్రికెట్‌లో నాలుగేళ్లలో సామ్‌ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

    వేటు పడుతుందా?
    అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌ విండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది.

    కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్‌-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 143 పరుగులు సాధించాడు.

    వెస్టిండీస్‌తో ఆడిన భారత తుదిజట్టు
    సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అమర్‌నాథ్‌ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది. 

    ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్‌నాథ్‌.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. 

    ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.

    మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి.  మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే  క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది.

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.

    సూపర్‌-8 దశలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్‌కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..

    తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌గా
    ‘‘వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్‌ శర్మ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్‌స్టార్‌గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.

    భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. 

    బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌
    వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాట్‌ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్‌లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్‌తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్‌సెట్‌ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్‌ తివారి అభిషేక్‌ శర్మ ఆట తీరును విమర్శించాడు. 

    మరోవైపు.. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం అభిషేక్‌ ఫామ్‌లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్‌ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ మంగళవారం ధ్రువీకరించాడు.

    తీవ్ర విషాదం
    కాగా 2008లో ఐపీఎల్‌ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్‌ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.

    హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.

    ఈ క్రమంలో ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్‌లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.

    ఎంతో సంతోషిస్తున్నా
    ఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు.

    బెంగళూరులో మ్యాచ్‌లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

    అయితే కెప్టెన్‌గా టైటిల్‌ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.

    చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌: గంభీర్‌

  • ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్‌ మరోసారి నిరాశపరిచింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ‌లో‌ పేలవ ప్రదర్శనతో ‘సూపర్‌–8’ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌‌ క్రికెట్‌ బోర్డు (PCB) సీనియర్లపై గుర్రుగా ఉంది.

    ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికాలు, మ్యాచ్‌ ఫీజుల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ విషయంలో బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫీజుల్లో కోత విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు ఈ విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది’’ అని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

    చిల్లర.. సంకుచిత బుద్ధి
    ఈ విషయంపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది (Shahid Afridi) ఘాటుగా స్పందించాడు. పీసీబీ విధించే జరిమానా చిల్లరలా ఉందని.. ఇంత సంకుచిత స్వభావం పనికిరాదంటూ బోర్డు తీరును విమర్శించాడు. చెత్తగా ఆడి దేశం పరువు తీసిన వాళ్లకు ఇంతకంటే కఠినమైన శిక్షలు విధించాలంటూ పాక్‌ జట్టు తీరుపై మండిపడ్డాడు.

    ‘‘ఇది చాలా చిన్న మొత్తం. యాభై లక్షల రూపాయలతో మీరేం చేస్తారు? ఇది అసలు జరిమానాలా అనిపించడమే లేదు. ఇంత సంకుచిత బుద్ధి పనికిరాదు. సరిగ్గా ఆడని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

    రెండేళ్లు పక్కన పెట్టండి
    ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడమని చెప్పాలి. జట్టులో ‘ఇంకొందరు మహానుభావులు’ ఉన్నారు. వాళ్లనైతే మరో రెండేళ్లపాటు జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదు. వాళ్లకు ఇలాంటి శిక్ష అయితేనే సరిగ్గా ఉంటుంది’’ అని షాహిద్‌ ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

    కాగా బాగా ఆడని ఆటగాళ్లకు పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 50 లక్షలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16 లక్షలు) జరిమానా వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆఫ్రిది అన్నట్లు పాక్‌ ఆటగాళ్లకు ఇదేమీ చిన్నమొత్తం కాదు. వార్షిక కాంట్రాక్టులలో గ్రేడ్‌ సి, డిలలో ఉన్న వాళ్లకు పాక్‌ కరెన్సీలో కేవలం రూ. 10- 17 లక్షల పారితోషికం మాత్రమే ఉంటుంది.

    నానాటికీ తీసికట్టుగా
    ఇదిలా ఉంటే.. మేజర్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా జట్టు నిష్క్రమించడం వరుసగా ఇది నాలుగోసారి.

    ఈ నేపథ్యంలో బోర్డు కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. మరోవైపు.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడిన పాకిస్తాన్‌ ఆదివారం రాత్రి కొలంబో నుంచి నేరుగా లాహోర్‌ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా గప్‌చుప్‌గా ఇంటిబాట పట్టారు. 

    కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సల్మాన్‌ ఆఘా కెప్టెన్సీలో పాక్‌.. గ్రూప్‌ దశలో పసికూనలు నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియాలపై గెలిచింది. టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. తదుపరి ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఆఖరిగా శ్రీలంకపై గెలిచినా నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. 

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • యుద్ధం వేళ ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీ నుంచి ఇరాన్‌ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ఈ ఏడాది జూన్‌–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్‌ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్‌ స్పష్టం చేశాడు.

    వైమానిక దాడులు
    కాగా మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్‌ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్‌ అన్నాడు.

    ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్‌–జూలైలలో జరిగే ప్రపంచకప్‌లో ఇరాన్‌ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్‌ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్‌, ఈజిప్ట్‌లతో కలసి ఉంది ఇరాన్‌.

    గత ఆరు పర్యాయాల్లోనూ
    షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 15న న్యూజిలాండ్‌తో (కాలిఫోర్నియాలో), జూన్‌ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్‌ 26న ఈజిప్ట్‌తో (సియాటెల్‌లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్‌ అభిమానుల ప్రవేశంపై ట్రంప్‌ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. 

    ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్‌ జట్టు ఏడోసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్‌ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.

    ఇరాన్‌ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
    ఒకవేళ ఇరాన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్‌లో ఉన్న ఇరాన్‌.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్‌, యూఏఈ ఉన్నాయి. 

    భారీ జరిమానా
    అయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్‌ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే  వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

    చదవండి: FIFA World Cup 2026: అర్హ‌త సాధించిన దేశాలు ఇవే

  • ఆకిబ్‌ నబీ.. భారత క్రికెట్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో ఈ పేస్‌ బౌలర్‌ది కీలక పాత్ర.

    స్పందించిన బీసీసీఐ
    సీజన్‌ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్‌ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించాడు.

    అతడిదే కీలక పాత్ర
    త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్‌ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.

    క్వార్టర్‌ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్‌ ఫైనల్‌ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.

    రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

    అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?
    ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్‌ సెలక్టర్లే కదా!.. 

    దేశీ క్రికెట్‌లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్‌ సైకియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నాడు.

    60 వికెట్లు కూల్చాడు
    కాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. 

    తాజా రంజీ సీజన్‌లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్‌ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్‌ వికెట్లు హాల్స్‌ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. 

    చదవండి: ప్రపంచకప్‌ వైఫల్యాల తర్వాత కూడా బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. 

    ముంబైకి చేరుకున్న టీమిండియా
    ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్‌ ఆరంభంలో నేపాల్‌ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పుంజుకున్న తీరు అమోఘం.

    అందరూ మేటి ఆటగాళ్లే
    ముఖ్యంగా సూపర్‌-8లో శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ఇంగ్లండ్‌ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్‌ సాల్ట్, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్, విల్‌ జాక్స్‌ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.

    వాంఖడే పిచ్‌ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్‌ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.

    సంజూ  సత్తా ఏంటో నాకు బాగా తెలుసు
    అదే విధంగా.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. అయితే,  క్రికెట్‌ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.

    ‘‘సంజూ  సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్‌తో కీలకమైన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో శాంసన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు’’ అని గంభీర్‌ కితాబిచ్చాడు.

    అదే విధంగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. 

    అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!
    ‘క్రికెట్‌ ఎప్పటికైనా టీమ్‌ గేమ్‌. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్‌ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.

    ‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. 

    ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్‌ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్‌ (97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ మరుగున పడేది’ అని గౌతీ  వివరించాడు.

    చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌ 

  • భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.

    భయానక అనుభవం  
    సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.

    ఇంటికి చేరాను  
    మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది.  

    కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు.  ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది.

  • అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ద ప్రభావం భారత్‌, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్‌ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులకు ప్రతిగా ఇరాన్‌ పలు గల్ఫ్‌ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్‌ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంది. 

    అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్‌ జట్టు భారత్‌లోనే హాల్ట్‌ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్‌ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. 

    మరోవైపు విండీస్‌లాగే మరో జట్టు కూడా భారత్‌లోనే ఇరుక్కుపోయింది. విండీస్‌లాగే సూపర్‌-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌లో హాల్ట్‌ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్‌ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

    ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్‌లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్‌తో పాటు గ్రూప్‌-1లో ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌-4కు అర్హత సాధించాయి.

    తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

  • టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

    ఈ మ్యాచ్‌లకు అఫీషియల్స్‌ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది.  

    సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌  
    - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్  
    - థర్డ్‌ అంపైర్‌: నితిన్ మెనన్  
    - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్  
    - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్  

    భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో సెమీఫైనల్‌ 
    - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్  
    - థర్డ్‌ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్  
    - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్  
    - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్  

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో వరుస వైఫల్యాల తర్వాత కూడా పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. బాబర్ ఆజమ్ నేషనల్ టీ20 కప్ 2026లో లాహోర్ రీజియన్ వైట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 5న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ వైట్స్, పెషావర్ రీజియన్‌ను ఎదుర్కొంటుంది.  

    గత ఎడిషన్‌లో లాహోర్ వైట్స్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అబ్బొటాబాద్ రీజియన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి బాబర్ నాయకత్వంలో లాహోర్‌ వైట్స్‌ మెరుగైన ఫలితాలు సాధించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.  

    ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ 2026 ఎడిషన్‌లో పాక్‌ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినా, న్యూజిలాండ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ లేని కారణంగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆరంభ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైనందుకు బాబార్‌ ఆజమ్‌ను శ్రీలంక మ్యాచ్‌ నుంచి తప్పించారు.

    ఈ ప్రపంచకప్‌లో బాబర్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 22.75 కాగా, స్ట్రైక్ రేట్ 112.34గా ఉంది. ఈ చెత్త ప్రదర్శనలతో బాబర్‌ పాకిస్తాన్ జట్టుకు భారంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇదే తీరు కొనసాగుతుంది.

    2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత బాబర్‌ 23 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 772 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ  శతకం, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను 20 ఇన్నింగ్స్‌ల్లో 451 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 26.52, స్ట్రైక్ రేట్ 118.99గా ఉంది. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

    టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనల తర్వాత జాతీయ జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బాబర్‌కు దేశవాలీ జట్టు పగ్గాలు దక్కడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బాబర్‌తో పాటు సీనియర్లను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.

    ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో హైలైట్‌ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్లలో భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

    2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2026 ఎడిషన్‌లోనూ ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ విజేత టైటిల్‌ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్‌ రిపీటైతే భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

    ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడిస్తే.. 2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్‌ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్‌ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.

    అయితే క్రికెట్‌ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.

    సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్‌ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్‌ ఫేవరెట్‌ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. 

    ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్‌ టాపార్డర్‌ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్‌, బట్లర్‌ సహా జేకబ్‌ బేతెల్‌ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, మిడిలార్డర్‌ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్‌లో విజయాలు సాధించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్‌ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్‌ కంటే భారత్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంది. 

    ఫీల్డింగ్‌ మినహా భారత్‌ అన్ని విషయాల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్‌కు ముందు టీమిండియాను ఫీల్డింగ్‌ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్‌లు నేలపాలు చేశారు. 

    సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్‌ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్‌ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. మ్యాచ్‌కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్‌లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది.  

     

Business

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

    బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.

  • టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.

    సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.

    డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి.

  • అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్స్, తక్షణ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.

    ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.

    కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్‌గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది.

  • ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్ లేదా అడల్ట్ కంటెంట్ మీద భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు.

    భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్‌గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్‌ఫామ్‌ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

    భారతదేశంలో ఎక్స్‌లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

  • ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు నిలబడి నా కంపెనీ విలువ రూ.300 కోట్లు అని చెప్పడం ఒక సాధారణ యువకుడికి పెద్ద సాహసమే!. డిగ్రీలు పూర్తిచేసి 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తూ.. బరువు బాధ్యతలు మోసేవాళ్లే సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎలాంటి డిగ్రీ లేకుండానే.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించండం అంటే మాటలా?, అయినా అలాంటిదే నిజం చేసి చూపించారు 'శుభం గుప్తా'. ఇంతకీ ఈయనెవరు, ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ ఏది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

    2011లో ముంబైలో ఏళ్ల యువకుడిగా 12వ తరగతి పూర్తి చేసిన శుభం గుప్తా.. అందరిలా డిగ్రీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తండ్రి బట్టల వ్యాపారం దివాళా తీసింది. కష్టాలను ఎదుర్కోవడానికి.. జీవితంలో ఎదగడానికి కంకణం కట్టుకున్న శుభం, చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ.. బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.

    యువతలో స్టైలిష్, కూల్ టీ-షర్టులపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన శుభం గుప్తా.. కొంత డబ్బుతో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్లలో టీ-షర్ట్స్ కొనుగోలు చేసి, విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం గురించి బాగా తెలుసుకోవడానికి.. నేరుగా కస్టమర్లతో మాట్లాడి వారి అభిరుచులను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఆన్‌లైన్ ఆర్డర్లను పంపించడం మొదలుపెట్టాడు.

    ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

    2014లో శుభం గుప్తా చేస్తున్న వ్యాపారానికి 'బాంకర్స్ కార్నర్' (Bonkers Corner) అనే పేరు పెట్టాడు. దీనిద్వారా యువత అభిరుచికి తగిన బ్రాండెడ్ స్ట్రీట్ స్టైల్ దేశీ టచ్‌తో దుస్తులు విక్రయించాడు. పెద్ద మార్కెటింగ్, పెద్ద బడ్జెట్ లేకపోయినా.. కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేసి బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగింది. కాగా ఈయన కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

  • సుజుకి మోటర్‌సైకిల్‌ ఇండియా తమ టూవీలర్లను సరళతరమైన రెంటల్, సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా రాయల్‌ బ్రదర్స్‌ రెంటల్స్‌తో జట్టు కట్టింది.

    ముందుగా సుజుకీ ఈ–యాక్సెస్‌ వాహనంతో మొదలుపెట్టి, రాబోయే రోజుల్లో ఇతర త్విచక్ర వాహనాలకు కూడా ఈ మోడల్‌ని విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ తెలిపింది. రాయల్‌ బ్రదర్స్‌ ప్లాట్‌ఫాం ద్వారా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 24 గంటల నుంచి 1 ఏడాది వరకు వ్యధికి రెంటల్‌ ఆప్షన్లను ఎంచుకోవచ్చని పేర్కొంది. రాయల్‌ బ్రదర్స్‌ రెంటల్స్‌కి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఆగ్రా తదితర నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి.

  • 2026లోనూ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్.. తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజులో తొలగించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    బెంగళూరులో ఒక ఐటీ స్టార్టప్‌లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరు.. ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అతనితో పాటు కంపెనీ ఒకేరోజు 40 శాతం మందిని తొలగించినట్లు సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ వెల్లడించారు.

    నా స్నేహితుడు పనిచేసే ఐటీ స్టార్టప్‌లో ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కంపెనీలు ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించేస్తున్నారని అర్పిత్ గోయల్ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.

    ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని ఒకరు పేర్కొన్నారు. రూ. 92 లక్షల జీతం అంటే.. ఒక ఐదేళ్లు జీతం తీసుకున్న వ్యక్తిని కంపెనీ తొలగించినప్పటికీ.. అది అతన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేదని మరొకరు అన్నారు. రూ. 92 లక్షల జీతం, జీరో సేఫ్టీ అని ఇంకొకరు అన్నారు.

  • న్యూఢిల్లీ: మెర్సిడెస్‌ బెంజ్‌ తన లగ్జరీ ఎంపీవీ మోడల్‌ ‘వి–క్లాస్‌’ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్‌ షోరూం ప్రారంభ ధర రూ.1.40 కోట్లుగా ఉంది. ఈ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.5 లక్షలతో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ మార్చి చివరి నుంచే డెలివరీలు మొదలుకానున్నాయి.

    ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పై కంపెనీ నిబద్ధతను తెలియజేస్తూ.., నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా, మహారాష్ట్రలోని పుణెలో ఉన్న తన చాకన్‌ కర్మాగారంలోనే అసెంబుల్‌ చేయనుంది. డిజైన్‌ విషయానికి వస్తే... ఏఎంజీ లైన్‌ ప్యాకేజీని జోడించడం వల్ల మరింత స్పోర్టీ లుక్‌ వచ్చింది. విశాలమైన క్యాబిన్, మసాజ్, వెంటిలేషన్‌ సీట్లు, 64–రంగుల యాంబియెంట్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. పెంపుడు జంతువులను కూడా తమ వెంట తీసుకెళ్లే సదుపాయం ఉంది.

    ఇందులో డీజిల్, పెట్రోల్‌ రెండు వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీ300 డీ డీజిల్‌ మోడల్‌ 237 హెచ్‌పీ పవర్‌ను జనరేట్‌ చేసే 2–లీటర్‌ టర్బో ఇంజిన్‌తో వస్తుంది. ఇక వీ300 పెట్రోల్‌ మోడల్‌ 231 హెచ్‌పీ పవర్‌ను ఇచ్చే 2–లీటర్‌ ఇంజిన్‌తో పాటు మైల్డ్‌–హైబ్రిడ్‌ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ రెండు ఇంజిన్లకు 9–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు.

    సేఫ్టీ కోసం మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, 360–డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ వంటివి ఉన్నాయి. అబ్సిడియన్‌ బ్లాక్, హై–టెక్‌ సిల్వర్, ఆలై్పన్‌ గ్రే, సోడాలైట్‌ బ్లూ, క్రిస్టల్‌ వైట్‌ వంటి అద్భుతమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

  • పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్‌గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.

    మిత్రదేశాల ముసుగులో శత్రు స్థావరాలు

    ఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్‌.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకుంది.

    ప్రాంతీయ ఆధిపత్యం

    గతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని (ప్రాక్సీ వార్‌) హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

    ఇంధన మార్కెట్ అతలాకుతలం

    యుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.

    హోర్ముజ్ జలసంధి మూసివేత: ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

    అంతర్గత అశాంతి నుంచి దృష్టి మళ్లింపు

    2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు.

    అధికార మార్పు భయం

    ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం.

Telangana

  • హైదరాబాద్‌:  తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్‌ క్వార్టర్స్‌ లేకుండా హైదరాబాద్‌కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్‌. సీఎస్‌ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్‌కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్‌. 

    వారందరినీ భాగస్వామ్యులను చేయాలి.. 
    99 రోజుల కార్య‌క్ర‌మాల్లో వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, మున్సిప‌ల్ వార్డు స‌భ్యులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లను భాగ‌స్వాముల‌ను చేయాలన్నారు సీఎం రేవంత్‌.  వార్డు స‌భ్యులు, స‌ర్పంచులు, ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు అంద‌రికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్య‌త‌లకు సంబంధించి అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియ‌ల్ వారికి అందించాలని సూచించారు. 

    సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి

    • వ్య‌వ‌సాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలి.. సోలార్ మోటార్ల‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలను రైతుల‌కు వివ‌రించాలి.

    • ఇళ్ల‌పైన సోలార్ ప్లాంట్లు అమ‌ర్చుకోవ‌డం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవ‌గాహ‌న కల్పించాలి...

    • గ్రామ, వార్డు స‌భ‌ల్లో నూత‌నంగా ఇచ్చిన రేష‌న్ కార్డులు, స‌న్న బియ్యం, ఇందిర‌మ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌, రుణ‌మాఫీ, ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 500కే గ్యాస్ సిలిండ‌ర్ ల‌బ్ధిదారుల వివ‌రాలు తెలియ‌జేయాలి.

    • వాటితో గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా స్థాయి క‌లిగిన ల‌బ్ధిని ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాలి..

    ర‌వాణా శాఖ డాటా ఆన్‌లైన్ పూర్తి చేయాలి

    • పాఠ‌శాల‌లు బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల‌కు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి.

    • ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ల‌తో పాటు లారీలు, ఇత‌ర స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల డ్రైవ‌ర్ల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి.

    • ఎక్కువ సంఖ్య‌లో డ్రైవ‌ర్లు క‌లుసుకునే చోట్ల‌నే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి..

    • రహ‌దారుల‌పై భారీ స్థాయిలో గుంత‌లు, ప్ర‌మాదం జ‌రిగే స్థ‌లాల వివ‌రాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబ‌ర్ ను ర‌వాణా శాఖ ఇవ్వాలి.

    • ఆ నంబ‌ర్‌కు వ‌చ్చే స‌మాచారం ఆధారంగా అక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టడం, ఇత‌ర జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చేయాలి.

    • ఓఆర్ఆర్‌, ఓఆర్ఆర్ స‌ర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త‌, ఇత‌ర నిర్మాణ వ్య‌ర్ధాలు డంప్ చేస్తున్నారు.

    • వ్య‌ర్ధాల‌ను తీసుకువ‌చ్చే వాహ‌నాల‌ను ప‌ట్టుకొని జ‌రిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.

    • ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి .

  • బషీరాబాద్‌: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. 

    ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్‌ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్‌గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.    

National

  • పశ్చిమ ఆసియాలో (Iran Israel War) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చమురు నిల్వల పరిస్థితి ఏంటి? మన దగ్గరున్న నిల్వలు ఎన్ని రోజులు వస్తాయి. దేశీయంగా ఎల్‌పీజీ సరఫరాపై కూడా ఒత్తిడి పెరుగుతుందా? దీనిపై పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇంధన భద్రతపై ముందస్తు చర్యలు  తీసుకుందా? ఈ వివరాలను ఈ కథనం తెలుసుకుందాం.

    గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య భారతదేశంలో 50 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వ ఉంది. అవసరం వచ్చినప్పుడు వైవిధ్య భరితంగా కొనసాగిస్తామని భారతదేశం జాగ్రత్తగా ఆశావాదంతో కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు రాబోయే 10-15 రోజుల్లో ఇరాన్ , అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగకపోతే చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్ల వరకు పెరుగుతుందని అంచనా

    పశ్చిమాసియాలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని భారతదేశం నిరంతరం పర్యవేక్షిస్తోందని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి, ముడి చమురు సరఫరా, ప్రత్యామ్నాయ ప్రాంతాలతో సహా ఆకస్మిక ప్రణాళికలను రూపొందించడానికి గత 48 గంటల్లో భారత కంపెనీలతో బహుళ సమావేశమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఇంధన అవసరాల కొరతపై ఆందోళనలను తోసిపుచ్చాయి. భారత్ తన శక్తి వ్యూహంలో భాగంగా లభ్యత (Availability), అందుబాటు ధర (Affordability),  స్థిరత్వం (Sustainability) అనే మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నట్టు  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    చమురు ధరల అంచనా
    యుద్ధం గనుక మరో 10-15 రోజులు కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 27న  72 డాలర్లు  గా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, మార్చి 3 నాటికి 82  డాలర్లు  కు చేరుకుంది. పరిస్థితి ఇలాగే ఉంటే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

    భారత్ వద్ద సరిపడా నిల్వలు
    ప్రస్తుత యుద్ధ వాతావరణం దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇండియాలో  ప్రస్తుతం 50 రోజులకు సరిపడా ముడి చమురు మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే భారత్‌కు దాదాపు 40 శాతం ముడి చమురు దిగుమతులు జరుగుతాయి. ఒకవేళ ఈ మార్గం మూతపడితే ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణను కూడా చేస్తోంది.

    హార్ముజ్ జలసంధి  దెబ్బ- ప్రత్యామ్నాయాలు 
    హార్ముజ్ జలసంధి కాకుండా ఇతర ఎంపికలు ఉన్నాయి. వీటిలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ కూడా ఉంది, పెరిగిన ఉద్రిక్తతల మధ్య దేశం చమురు మరియు గ్యాస్ కోసం ప్రత్యామ్నాయ సరఫరాలను పరిశీలిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 1.04 మిలియన్ బ్యారెళ్లను తాకిన దిగుమతులతో దేశం రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. పశ్చిమాసియా గ్రేడ్‌లకు ప్రాప్యత తగ్గితే భారత శుద్ధి కర్మాగారాలు రష్యా చమురు సరఫరాల వైపు తిరిగి మొగ్గు చూపుతాయని విశ్లేషకులు తెలిపారు.

    ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

    కేప్ ఆఫ్ గుడ్ హోప్ (Cape of Good Hope): ఈ ప్రత్యామ్నాయ మార్గం ద్వారా చమురు తెప్పించుకునే అవకాశం ఉంది. అయితే దీనివల్ల బీమా మరియు రవాణా ఖర్చులు పెరుగుతాయి. పశ్చిమ ఆసియా నుండి సరఫరా తగ్గితే, భారత్ తిరిగి రష్యా నుండి దిగుమతులను పెంచే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో రష్యా నుండి రోజుకు 1.04 మిలియన్ బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది.

    LPG నిల్వలు
    దేశంలో 25-30 రోజులకు సరిపడా LPG స్టాక్ ఉంది. కాబట్టి ప్రజలు ఆందోళనతో ముందస్తుగా సిలిండర్లను కొనుగోలు చేయాల్సిన (Panic Buying) అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  మన దేశ అవసరాల్లో 80-85శాతం  గల్ఫ్ దేశాల నుండే వస్తాయి. ప్రస్తుతం యూఏఈ, నార్వే, అమెరికా,సౌదీఅరేబియా నుండి దిగుమతులను భారత్ పెంచుతోంది. అలాగే భారత్ తన అవసరాల కోసం 40శాతం పైగా ఖతార్ (Qatar) పైనే ఆధారపడుతుంది. ఇరాన్ డ్రోన్ దాడి కారణంగా ఖతార్‌లోని ఎగుమతి కేంద్రం తాత్కాలికంగా మూతపడింది. ఇది గనుక త్వరగా పునరుద్ధరించబడకపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది.

    ఇదీ చదవండి: సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

  • న్యూఢిల్లీ: ఇరాన్‌​ సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మౌనంగా ఉంటే ఈ తీరు ప్రపంచంలో భారత స్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. 

    ‘ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అశాంతి నెలకొన్న ఆయా ప్రాంతాలను అతిపెద్ద ఘర్షణ వైపు నడిపిస్తున్నాయి. దాదాపు కోటి మంది భారతీయులు సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతా పరమైన ఆందోళనలు వాస్తవమే అయినా, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత పెంచేస్తాయి.

    ఇరాన్‌పై జరుగుతున్న ఏకపక్ష దాడులను, అలాగే ఇతర పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. హింస హింసనే పుట్టిస్తుంది. చర్చలు, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గం. ఈ పరిస్థితుల్లో భారత్‌ నైతికంగా స్పష్టమైన రీతితో ఉండాలి. అంతర్జాతీయ చట్టాలు, మనుషుల ప్రాణాలను కాపాడడంలో భారత్‌కు స్పష్టంగా మాట్లాడే ధైర్యం ఉండాలి.

    వివాదాలకు శాంతియుత పరిష్కారం చూపడానికి కృషి చేయడం మన విదేశాంగ విధానం, సార్వభౌమత్వంలో ఉంది. అది స్థిరంగా ఉండాలి. ప్రధాని మోదీ మాట్లాడాలి. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేతను హత్య చేస్తే ఆయన మద్దతు ఇస్తున్నారా? నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచంలో భారత్‌ స్థాయిని తగ్గిస్తుంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. 

    కాగా, అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియా దేశాలపై ఇరాన్‌ ప్రతీకారదాడులకు దిగడంతో అమెరికా మళ్లీ భీకరదాడులు చేస్తామని హెచ్చరించింది. 

  • ఇటీవలి కాలంలో బేబీ షవర్‌ లేదా సీమంతం వేడుకలకు  ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి  తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు  చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.

    మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్‌లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది.  మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా,  ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది.  @maamantraventures అనే ఇన్‌స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్‌ ఇన్‌ ఇది ఎయిర్‌..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్‌తో ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది.

     
     
     
     
     
     
     
     
     
     
     
     
     
     

    A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)

    వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ  ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్‌లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. 

    ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

    నెటిజనుల స్పందన
    పురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా  చేయవచ్చు  మరొకరు వ్యాఖ్యానించారు.  మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే  బావుండేది అని  మరో యూజర్‌ కామెంట్‌ చేయడం గమనార్హం.

    (విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు)

  • Virosh Wedding సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల  పెళ్లి సందడిలోని ప్రతీ వేడుకు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తరువాత సొంత ఊరిలో కొత్త దంపతుల సత్యనారాయణ వ్రతం, భోజనాల విశేషాల సందడి ముగియముందే ఈ జంట  సంగీత్  వేడుక ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.  పదండి దాని  సంగతులేంటో తెలుసుకుందాం.

    రష్మిక ఎప్పటిలాగానే డైమండ్‌ ఆభరణాలతో నిండుగా కనిపించింది. ఇక విజయ్ దేవరకొండ తన 'సంగీత్' వేడుకలో ధరించిన స్పెషల్‌ హారం  అందరి దృష్టిని ఆకర్షించింది.  విజయ్ మెడలోని ప్రత్యేకమైన పచ్చ నెక్లెస్ దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ పెళ్ళిలో రాకుమారుడిలా నగలతో  కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌కు  నాంది పలికాడు. తన వెడ్డింగ్‌  లుక్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, తన సంగీత్ వేడుకలో అతని ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. విజయ్ ,రష్మిక ఫల్గుణి షేన్ పీకాక్ దుస్తుల్లో నాట్య మయూరాల్లా విన్యాసాలు చేశారు. విజయ్ ముదురు నీలం రంగులో ఉన్న కుర్తా-పైజామా సెట్‌ను ఎంబ్రాయిడరీ కోటుతో ధరించగా, రష్మిక  సిల్వర్‌  కలర్‌ లెహంగాను ధరించింది.

    యూనిక్‌ ఎమరాల్డ్‌  నెక్లెస్‌
    విజయ్  ప్రత్యేకమైన వజ్రాలు పొదిగిన పచ్చ నెక్లెస్ మాత్రం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. విజయ్ నెక్లెస్‌లో మధ్యలో భారీ పచ్చ లాకెట్టు అందంగా అమిరిందిన. ఆ లాకెట్టు పైన ఒక పెద్ద డైమండ్‌ క్యాప్‌ మరింత వన్నెతెచ్చింది. అలాగే ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా భావిస్తున్న  విజయ్  పదహారు రాళ్ల  డైమండ్‌ రింగ్‌ చాలా విలక్షణమైంది.ఆ ఉంగరంలో ప్రేమకు చిహ్నంగా బ్రాండ్  క్రిస్‌క్రాస్ X మోటిఫ్ కూడా ఉంది. ఈ వజ్రపు ఉంగరం ధర సుమారు రూ. 15 లక్షలు ఫిబ్రవరి 26, 2026న, తెలుగు, కొడవ సంప్రదాయల ప్రకారం వివాహ వేడుక జరిగితన తరువాత తమ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

    (విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు)

  • పట్నా: బిహార్ రాజకీయ ముఖచిత్రంలో మరో కీలక మలుపు  చోటుచేసుకోనుంది. ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జేడీయూ తరఫున ఆయనను రాజ్యసభకు పంపేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

    నిశాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, రాబోయే ఒకటి రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు. హోలీ పండుగకు ముందే ఈ నిర్ణయం వెలువడటంతో పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొన్నేళ్లుగా నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలు నిరంతరం కోరుతున్న తరుణంలో, ఈ ప్రతిపాదనకు కార్యరూపం లభించింది.

    నిశాంత్ కుమార్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని, అది రాజ్యసభ సభ్యత్వం కూడా కావచ్చని మంత్రి శ్రవణ్ కుమార్ పరోక్షంగా తెలియజేశారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించినప్పటి నుండి నిశాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలోనే నిశాంత్ ప్రవేశంపై చర్చ జరగగా, సరైన సమయం కోసం నిరీక్షించినట్లు తెలుస్తోంది. జేడీయూ మనుగడకు, పార్టీ పటిష్టతకు నితీష్ వారసుడు రావడం అనివార్యమని అటు విపక్ష నేతలు సైతం గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఈ పరిణామం బిహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
     

    ఇది కూడా చదవండి: మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

  • న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు యూట్యూబ్‌లో మోదీ మరో ఘనత సాధించారు. 30 మిలియన్ల (3 కోట్ల) సబ్‌స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నేతగా మైలురాయిని చేరుకున్నారు. ప్రపంచంలో ఏ నేతకూ ఇంతమంది సబ్‌స్క్రైబర్లు లేరు. 

    ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (6.58 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ) ఉన్నారు. అయితే, బొల్సొనారోకు ఉన్న ఫాలోవర్లు మోదీకి ఉన్న ఫాలోవర్లలో నాలుగింట ఒకవంతు మాత్రమే.

    అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్లు ఏడు రెట్లు. ఇక భారత్‌లోని నేతల విషయానికి వస్తే కూడా ఫాలోవర్ల విషయంలో మోదీదే ఆధిపత్యం. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య మూడురెట్లు ఎక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ కంటే మోదీకి ఉన్న సబ్‌స్క్రైబర్లు నాలుగేసి రెట్ల చొప్పున అధికం.

    మోదీకి యూట్యూబ్‌లో 30 మిలియన్ల (3 కోట్ల) సబ్‌స్క్రైబర్లతో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల్లోనూ భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి 100 మిలియన్ల (10 కోట్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్రపంచ నేతగా ఆయన నిలిచారు.

    మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 2014లో జాయిన్‌ అయ్యారు. డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఉన్న ఫాలోవర్ల కంటే మోదీకి రెట్టింపు మంది ఫాలోవర్లు‌ ఉన్నారు. ట్రంప్‌నకు ఇన్‌స్టాలో 43.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇండొనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 15 మిలియన్లు, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులాకు 14.4 మిలియన్లు, తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌కు 11.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత్‌లో మోదీ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు. యోగికి ఇన్‌స్టాలో 16.1 మిలియన్ల మంది, రాహుల్‌ గాంధీకి 12.6 మిలియన‍్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

  • బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో  ఫిబ్రవరి 18న  జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన  హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.

    గత ‍కొన్ని రోజులుగా టీవీ నటి  నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ ‍ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్‌ నాగేష్ తెలిపారు.

    ఇదీ చదవండి: న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌

    దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్‌ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్‌  ప్రకారం  బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్ రావుపై ఎటాక్‌ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

    అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్‌లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు  'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 

  • తమిళనాట తన రాజకీయ ఉజ్వల భవిష్యత్తుకోసం కలలు కంటున్న సూపర్‌ స్టార్‌, రాజకీయ నాయకుడు విజయ్‌ నెత్తిన మరో బాంబు పడింది. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందనీ, ఎంత చెప్పినా వినడం లేదని ఆరోపిస్తూ భార్య సంగీత  విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ వద్ద సుమారు పదేళ్లపాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సెల్వరాజ్ సెల్వం, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

    సెల్వరాజ్ సెల్వం ఆరోపణలు

    2015లో 'పులి' సినిమా షూటింగ్ సమయంలో, ఆహారంలో వెంట్రుక వచ్చిందనే నెపంతో విజయ్ తనపై దాడి చేశారని సెల్వరాజ్  ఆరోపించాడు. తనను కొట్టి, కిందపడిపోతే గుండెలపై తొక్కారని, అయితే మరుసటి రోజు తన కోపాన్ని అసిస్టెంట్‌పై చూపించినందుకు క్షమాపణలు కూడా చెప్పారని  పేర్కొన్నాడు.

    అంతేకాదు తన కూతురి పెళ్లికి విజయ్‌ను స్వయంగా పిలిచినా ఆయన రాలేదని, ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదని సెల్వరాజ్ ఆరోపించాడు. అనారోగ్య సమస్యల రీత్యా విజయ్‌ను కలవడానికి ప్రయత్నించినా, ఆయన చుట్టూ ఉన్నవారు తనను దగ్గరకు రానివ్వడం లేదని పేర్కొన్నాడు. అలాగే విజయ్ వద్ద పనిచేసే డ్రైవర్ రాజేంద్రన్ వంటి ఇతరులు తనను శత్రువులా చూసేవారని, విజయ్‌కు తాను వండిన వంటల్లో ఉప్పు కలిపి తనపై చెడ్డ పేరు వచ్చేలా చేసేవారని సెల్వరాజ్ సంచలన విషయాలు వెల్లడించడం నెట్టింట చర్చకు దారి తీసింది.

    తినడానికి తిండిలేదు, అప్పుల బాధలు
    ప్రస్తుతం తాను తీవ్రమైన పేదరికంలో ఉన్నానని సెల్వరాజ్ వాపోయారు. 'GOAT' షూటింగ్ సమయంలో తనకు గుండెపోటు వచ్చిందని, శస్త్రచికిత్స కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేశానని చెప్పారు. రెండేళ్లు అయ్యింది. సహాయం కోసం విజయ్ సర్‌ను కలవడానికి ప్రయత్నించాను, కానీ అతని వాళ్ళు నన్ను అతని దగ్గరికి రానివ్వరు. నేను వేరే చోట పని కోసం అప్పుల బాధతో కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నానని,  కడుపు నిండి తినేందుకు  కూడా ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. తన భార్య మెడలో పుస్తెల తాడు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పదేళ్ల సర్వీస్ తర్వాత, విజయ్ తండ్రి ,దర్శకుడు చంద్రశేఖర్‌తో అరవై చిత్రాలకుపైగా పనిచేసిన తాను ఈ పరిస్థితిలో ఉంటానని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  

    ఇదీ చదవండి: విజయ్‌కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు

    అయితే సెల్వరాజ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలపై విజయ్ టీమ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు.విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్న పుకార్ల నేపథ్యంలో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తండ్రిని సోషల్ మీడియాలో అన్-ఫాలో చేశారనే వార్తలు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. 

    ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

Politics

  • రాజ్యసభ ఎన్నికలకు భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబీన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ బిహార్ నుంచి బ‌రిలో ఉన్నారు. అసోం రాష్ట్రం నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్‌ల‌ను అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించింది. మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్‌ల‌ను ఒడిశా త‌ర‌పున రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా ఎంపిక‌య్యారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవ‌కాశం ద‌క్కింది. లక్ష్మీవర్మ (ఛత్తీస్‌గఢ్), సంజయ్ భాటియా(హ‌రియాణా)ల‌కు కూడా రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం దొరికింది.  

    ప్ర‌ఖ్యాత‌ భోజ్‌పురి న‌టుడు, గాయకుడు ప‌వ‌న్ సింగ్‌కు క‌మ‌లం పార్టీ మొండిచేయి చూపింది. ఎంపీ కావాల‌కున్న ఆయ‌న ఆశ‌ల‌పై బీజేపీ అధినాయ‌క‌త్వం నీళ్లు చ‌ల్లింది. దీంతో ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని వ‌స్తున్న‌ ఊహాగానాలకు తాజాగా తెర‌ప‌డింది. బిహార్ నుంచి నితిన్ న‌బీన్‌తో పాటు సీనియ‌ర్ నాయ‌కుడు శివేష్ కుమార్‌ (Shivesh Kumar) అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

    తీర‌ని ప‌వ‌న్ క‌ల‌
    ఎంపీగా పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టాల‌న్న ప‌వ‌న్ సింగ్ కోరిక ఇంకా ఫ‌లించ‌లేదు. ఈసారైనా త‌న‌కు ఎంపీ ద‌క్కుతుంద‌ని భావించినా ఆయ‌న‌కు నిరాశే మిగిలింది. రెండోసారి కూడా అవ‌కాశం ద‌క్కిన‌ట్టు ద‌క్కి చేజారిపోయింది. ఎంపీ కావాల‌న్న ఉద్దేశంతోనే బిహార్ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న రెండోసారి బీజేపీలో చేరారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌లోని అస‌న్‌జోల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీలో నిలిచారు. అయితే త‌న పాట‌ల్లో బెంగాలీ మ‌హిళ‌ల‌ను అభ్యంత‌క‌రంగా చిత్రీక‌రించార‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో పోటీ నుంచి ఆయ‌న‌ను త‌ప్పించింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన ప‌వ‌న్ సింగ్‌.. బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. ఫలితంగా బీజేపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. అయితే ప‌వ‌న్ సింగ్ కార‌ణంగా ప‌లుచోట్ల ఎన్డీఏ అభ్య‌ర్థులు ఓట‌మిపాల‌య్యార‌న్న అభిప్రాయాలు అప్ప‌ట్లో వ్య‌క్త‌మ‌య్యాయి.

    'ఎమ్మెల్యే కాదు.. ఎంపీయే'
    గ‌తేడాది అక్టోబర్ 1న తిరిగి క‌మ‌లం గూటికి వ‌చ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అప్ప‌టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ బిహార్ ఇన్‌ఛార్జ్ వినోద్ తవ్డే, క‌ర‌క‌ట్‌లో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ఉపేంద్ర కుష్వాహా సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి రావ‌డంతో.. ప‌వ‌న్ సింగ్ శాస‌న‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ప‌వ‌న్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం లేద‌ని, ఎంపీ కావాల‌న్నది ఆయ‌న కోరిక అని బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ వెల్ల‌డించారు. బిహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ త‌ర‌పున ప‌వ‌న్ సింగ్ ప్ర‌చారం సాగించారు.

    చ‌ద‌వండి: రాజ్య‌స‌భ బ‌రిలో నితీశ్ కుమార్ త‌న‌యుడు?

    అందుకే ఇవ్వ‌లేదా?
    ఎన్డీఏ కూట‌మి బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించ‌డంతో ఆయ‌నకు క‌చ్చితంగా రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుంద‌ని బాగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే బిహార్‌కే చెందిన నితిన్ న‌బీన్ (Nitin Nabin) బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌డంతో ప‌రిస్థితి మారిన‌ట్టు తెలుస్తోంది. నబీన్ పార్ల‌మెంట్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అటు ప‌వ‌న్ సింగ్ వ్య‌క్తిగ‌త జీవితంపై తీవ్ర విమ‌ర్శలు రావ‌డంతో ఆయ‌న‌కు ఎంపీ సీటు ద‌క్క‌లేద‌న్న వాద‌న‌లు కూడా విన‌బ‌డుతున్నాయి. మ‌రోవైపు ఎప్ప‌టికైనా త‌మ హీరో ఎంపీ అవుతార‌ని ప‌వ‌న్ సింగ్ అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

     

  • ఢిల్లీ: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్‌ నబీన్‌ను రాజ్యసభకు పంపనుంది పార్టీ అధిష్టానం.  ఈ మేరకు 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. బిహార్‌ నుంచి నితీన్‌ నబీన్‌తో పాటు శివేష్‌ కుమార్‌లను రాజ్యసభకు ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు మిగతా వారి వివరాలు ఇలా ఉన్నాయి. 

    • అస్సాం నుంచి తేరాష్ గోవాలా,జోగెన్ మోహన్
    • ఛత్తీసగఢ్ నుంచి  లక్ష్మి వర్మ
    • హర్యానా సంజయ్ భాటియా
    • ఒడిశా నుంచి నుంచిమన్మోహన్ సామల్, సుజిత్ కుమార్
    • పశ్చిమ బెంగాల్  నుంచి రాహుల్ సిన్హా

    సొంత రాష్ట్రమైన బిహార్‌ నుంచి నితిన్‌ నబీన్‌..
    ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్‌ నబీన్‌ ఇన్నాళ్లూ బిహార్‌లో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన్ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ బంకీపూర్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ముందున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అసెంబ్లీకి హాజరవ్వడం అంత సులభమేమీ కాదు.

     అటు ఎమ్మెల్యేగా, ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ద్వంద్వ పాత్రలు పోషించడం కష్టమని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే ఆయనను ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  గతంలో ఇదే మాదిరిగా మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాజ్యసభకు పంపారు. వచ్చే ఏప్రిల్‌లో బిహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనిలో భాగంగానే రాజ్యసభ సభ్యుల ఎంపికను షురూ చేసింది బీజేపీ. 

  • తాడేపల్లి : లడ్డూ అంశానికి సంబంధించి శాసన మండలిలో చర్చ జరగాల్సిందేని వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకూ ఆరుసార్లు వాయిదా తీర్మానం ఇచ్చామని, అయినాసరే ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతోందని ఆయన ప్రశ్నించారు. 

    ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన,.. కూటమి ప్రభుత్వ సభ్యులు శాసన సభలో ఒకరూలు, మండలిలో ఇంకో రూలు పాటిస్తున్నారని మండిపడ్డారు.  

    ‘శాసన మండలిలో మా‌పార్టీని తట్టుకోలేక అధికారపక్షం పారిపోతోంది. చివరికి ఛైర్మన్‌ని కూడా డిక్టేట్ చేస్తున్నారు. లడ్డూపై విచారణ జరిపిన సీబిఐ మీద కూడా చంద్రబాబుకు నమ్మకం‌ కలగటం లేదు. కల్తీ నెయ్యికి సూత్రధారి, పాత్రధారి హెరిటేజ్, దాని అనుబంధ సంస్థ ఇందాపూర్‌దే. తప్పు చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు చర్చకు రావటం లేదు?’ అని నిలదీశారు.

  • సాక్షి, అనకాపల్లి: కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆలయ భూమి కబ్జాను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ భూములు కబ్జా  చేస్తున్నారంటూ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘కన్యకా పరమేశ్వరి దేవాలయానికి 100 కోట్లకు పైగా విలువ చేసే భూములను దానంగా  ఇచ్చారు. వందేళ్ల క్రితం రెండు ఎకరాల 49 సెంట్లు భూములను ఇచ్చారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కోసం అందులో ఎకరా 38 సెంట్లు తీసుకున్నారు. కన్యకా పరమేశ్వరి దేవాలయానికి ఎకరా 11 సెంట్లు స్థలం మిగిలి ఉంది. ఈ భూమి 100 కోట్లకు పైగా విలువ చేస్తుంది. దేవాదాయ శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అధికారం అధికారులకు లేదు. అధికారులు దేవాదాయ భూమిని ప్రైవేటు భూములు అని నివేదిక ఎలా ఇచ్చారు?’’ అంటూ అమర్నాథ్‌ ప్రశ్నించారు.

    ‘‘రూ.100 కోట్లు భూమి ఇప్పటికే కౌలుదారుల పేరు మీద ఉంది. దేవాలయాలు గురించి మాట్లాడే సనాతన నేతలు ఏమి చేస్తున్నారు. 100 కోట్ల భూమిపై సీబీఐ విచారణ జరపాలి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో దొంగల ముఠా ఏర్పడింది. దేవాదాయ ప్రభుత్వ భూములను ఈ ముఠా దోచుకుంటుంది’’ అంటూ అమర్నాథ్‌ మండిపడ్డారు.

    పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి: ముత్యాల నాయుడు
    ఎకరా 11 సెంట్లు భూమి నీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి దానం ఇచ్చారు. దేవాలయ భూములను క్రయ విక్రయాలకు అనుమతి లేదు. దేవాదాయ శాఖ భూమిని అధికారులు జిరాయితీ భూమిగా మార్చారు. 100 కోట్ల భూ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి. దీని వెనుక ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీద చర్యలు తీసుకోవాలి.

    భూములను దోచుకుంటున్నారు: మలసాల భరత్
    అధికారులు బ్రోకర్లతో కుమ్మకై దేవాదాయ భూములను దోచుకుంటున్నారు. రూ.100 కోట్లు విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. 22సీలో ఉన్న భూములను 22ఏ లోకి కలెక్టర్ ఎలా మారుస్తారు? ఈ కుంభకోణాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రూ. 100 కోట్లు భూ వ్యవహారంపై కలెక్టర్ ఆర్డీవో వివరణ ఇవ్వాలి

    భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు: కరణం ధర్మశ్రీ
    సర్వే 1539 లో ఉన్న దేవాదాయ భూమి కాజేయాల్ని చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల భూమిని కాపాడాం. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ భూమి కొట్టేయడానికి ప్రయతిస్తున్నాడు. దేవాదాయ భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.

     

Family

  • ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్‌ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్‌ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్‌లను అందమైన డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్‌ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్‌ వీక్‌లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్‌వేర్‌ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్‌ డిజైనర్‌గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..

    ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్‌ స్కెచ్‌ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్‌వేర్లను క్రియేట్‌ చేసేస్తాడు. 

    తనలోని ఫ్యాషన్‌ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్‌వేర్‌లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్‌.  

    అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..
    ఫ్యాషన్‌ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్‌తో పని చెబితే..మాక్స్‌ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్‌ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్‌ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్‌. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్‌వేర్‌లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్‌లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స​ కూడా ఉన్నాయి. 

    అంతేగాదు తన సొంత రన్‌వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్‌ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్‌ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్‌ల నుంచి రూపొందించిన డిజైనర్‌వేర్‌లలో మెరిశారు మోడళ్లు. 

    అలాగే ఆ చిన్నారి మాక్స్‌ చదువుకుంటూనే ఫ్యాషన్‌ వీక్‌లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్‌కి పలు స్కిల్‌ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్‌బాల్‌, టెన్నిస్‌ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్‌, కారు వాష్‌ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్‌ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. 

    ఇక మాక్స్‌ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్‌కి సంబంధించిన స్కిల్స్‌లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్‌ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రతిభ మాటలకందనిది కదూ..!.

    వీడియోపై క్లిక్‌ చేయండి

    (చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్‌ అయిన మహిళ..! ఎక్కడంటే..)

     

  • ఇప్పటివరకు వినని విచిత్రమైన గ్రామం ఇది. దీనికున్న ప్రత్యేకత అంత ఇంతకాదు. ఇలాంటి పట్టణాన్ని చూడటం అత్యంత అరుదు కూడా. దాని ఉనికిని కాపాడటం కోసం  ఈ మహిళ ఎంతలా కష్టపడుతుందో వింటే విస్తుపోతారు. ఎందుకు ఆమెకు ఈ వయసులో అంత తాపత్రయం అని కూడా అనిపిస్తుంది.

    గ్రామీణ జీవితం ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందో తెలిసిందే. కానీ యువత ఉద్యోగాల కోసం, సంపాద‌న కోసం పట్టణాల బాట పట్టడంతో గ్రామాలు జనసందోహం లేక వెలవెలబోతున్నాయి. అలానే అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనోవి అనే అతి చిన్న పట్టణం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ చిన్న గ్రామం అనొచ్చు. ఒకప్పుడు చిన్నపట్టణంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్రామం.. రానురాను దెయ్యాల గ్రామంలా మారిపోయింది. 

    అంటే జనాలు లేని ఊరిలా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే అక్కడే ఉంటున్న ఏకైక నివాసి 90 ఏళ్ల ఎల్సీ ఐలర్ అనే మహిళ. ఆమె ఆ గ్రామం ఉనికిని చాటేందుకు నడుంకట్టి వార్తల్లో నిలిచింది. అక్కడ ఎవ్వరు లేకపోయినా ఐలర్‌ మాత్రం ఇక్కడే ఉంటూ తనకు తాను ఓటు వేసుకుంటూ ప్రభుత్వాన్ని నిలబెడుతోంది. మున్సిపల్‌ ఎలక్షన్స్‌ నుంచి అన్నింటిని నిర్వహిస్తుంది. తనకు తాను పన్నులు విధించుకుని కడుతుంది కూడా. 

    మద్యం లైసెన్సుల దగ్గర నుంచి గుమస్తాగా, లైబ్రెరియన్‌గా అన్ని కార్యకలాపాలను ఆమెనే నిర్వర్తిస్తుంది. అందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ని చూస్తూ ..రాష్ట్రం ఇక్కడి ప్రభుత్వాన్ని, గ్రామాన్ని గుర్తించేలా.. ప్రభుత్వ రికార్డుల్లో దాని ఉనికి ఉండేలా చేస్తోంది. చిన్న పట్టణంలా ఉండే ఈ గ్రామంలో పుష్కలంగా వ్యవసాయం, రైల్వేలైన్‌ తదితర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలామంది నివాసితులకు నిలయంగా ఉండేది. 

    ఆర్థిక అవసరాల దృష్ట్యా యువత నగరాల బాట పట్టడంతో ఆ పట్టణం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఐలర్‌ కుటుంబం మాత్రం ఆ గ్రామం ఉనికిని చాటేందుకు చాలా కష్టపడుతుండేది. కానీ అనుకోకుండా 2004లో ఐలర్‌ భర్త‌ మరణించడంతో ఆ గ్రామంలో మిగిలి ఉన్న ఏకైక నివాసిగా ఆమె మిగిలిపోయింది. 

    అయితే ఆమె పట్టణాన్ని రద్దు చేయానికి బదులు జనాభా లెక్కల రికార్డుల్లో ఆ గ్రామం ఉండాలని ఐలర్‌ మిగతా పట్టణాల్లో జరిగే అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలను స్వయంగా నిర్వర్తిస్తోంది. పైగా ఈ మోనోవి గ్రామం ఏకైవ వ్యక్తి మున్సిపాలిటీ హోదాకు అక్కడి రాష్ట్రం గుర్తింపు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ చిన్న పట్టణం అంతర్జాతీయంగా కుతుహలం పెంచేలా వార్తల్లో నిలవడమే గాక.. అమెరికన్‌ గ్రామీణ జనాభా తగ్గుదలను కూడా హైలెట్‌ చేస్తోంది. 

    చదవండి: 93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..
     

  • ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్‌ అయినా ఆమె మన భారత్‌ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..

    ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్‌ ట్రెండ్‌కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్‌ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని  అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. 

    తనకు ఆర్థరైటిస్‌ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్‌ సీక్రెట్‌ గురించి నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్‌లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్‌ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. 

    ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్‌ మేనేజర్‌ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. 

    నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్‌బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్‌ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. 

     

    (చదవండి: నడక చాలు...జిమ్‌కు వీడ్కోలు...!)
     

NRI

  • రాజంపేట : పశ్చిమాసియాలో ఇరాన్‌–ఇజ్రాయల్‌ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం ఉమ్మడి కడప జిల్లా వాసులు లక్షలాదిమంది చిక్కుకుపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.  కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా వాసులు సుమారు రెండులక్షల మంది ఉన్నట్టు సమాచారం. ప్రవాసాంధ్రులు 12 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

    ఆయా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో బాంబుల వర్షం కురుస్తుండడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బంధువులకు చేరవేస్తున్నారు. జనావాసాల మధ్య క్షిపణులు, బాంబు దాడులు జరుగుతుండడంతో భయం గుప్పెట్లో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

    గదులకే పరిమితం  
    యుద్ధ వాతవరణం నేపథ్యంలో చాలామంది ప్రవాసాంధ్రులు (Telugu NRIs) స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సామగ్రితో విమానాశ్రయాలకు వెళ్లినా ఫలితం లేకపోయిందని సమాచారం. విమానాలు రద్దవడంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది. బాంబు దాడుల నేపథ్యంలో తమ గదులకే పరిమితమవుతున్నట్టు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాల అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది.  

    ప్రవాస భారతీయుల కోసం.. 
    ప్రవాస భారతీయుల కోసం భారత రాయబార శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు గల్ఫ్‌దేశాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ఇప్పటికే వివిధ దేశాల్లో అత్యవసర హెల్ప్‌లైన్‌ (Helpline) నంబర్లను అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొటుంటే వెంటనే సంప్రందించాలని కూడా సూచించారు.  

    చ‌ద‌వండి: భార‌తీయుల‌ను రప్పించే ప్ర‌య‌త్నాలు షురూ

    దోహాలో ఉన్న మా కుమార్తెను క్షేమంగా తీసుకురండి 
    ప్రభుత్వానికి బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి

    నరసన్నపేట: ఖతర్‌ రాజధాని దోహాలో తమ కుమార్తె బంకుపల్లి సంజనా చంద్‌ ఉందని, అక్కడ బాంబు దాడుల నేప­థ్యంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సూరజ్‌ నగర్‌కు చెందిన బంకుపల్లి చంద్రశేఖర్, సుమబాల ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోహాలో తమ కుమార్తె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోందని పేర్కొన్నారు.

    జర్మనీ వెళ్తుండగా..
    బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వెంకటగౌతం కంపెనీ పనిపై జర్మనీ వెళ్తుండగా మధ్యలో ఖతార్‌ దేశ రాజధాని దోహాలో దిగి అక్కడ చిక్కుకుపోయాడు.  

International

  • ​​​పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకూ తమ ప్రాంతాలను నుండే శత్రు దేశంలోకి దాడి చేసిన  ఇజ్రాయెల్ ఇప్పుడు  గ్రౌండ్‌ లెవల్లో తమ దేశ ఆర్మీని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై పదాతిదళాల ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  గ్రౌండ్‌ ఆపరేషన్‌ వివరాలను  ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ధృవీకరించారు.  దీంతో ఇజ్రాయెల్‌ సైన్యం హిజ్బుల్లా టార్గెట్‌గా దక్షిణ లెబనాన్‌లోకి దూసుకెళుతున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. 

    మరోవైపు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అమెరికా కేవలం కంబాట్‌ దాడులే  చేసిందని అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తామని హెచ్చరించారు.  ఇరాన్‌పై మండిపడ్డారు. ఇరాన్‌ ప్రతి సారి అబద్ధం చెబుతోంది. ఇరాన్‌ దగ్గర అమెరికాను టార్గెట్‌ చేసే మిసైల్‌ వ్యవస్థ ఉంది. ఇరాన్‌ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌లో ఆపరేషన్‌ ఫ్యూరీ కొనసాగుతుంది. అణ్వాయుధాల తయారీని ఇరాన్‌ ఆపడం లేదు. ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు.

    ఇరాన్ సుప్రీం ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇరాన్‌కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశామన్నారు.  ఆ దేశంపై మరిన్ని దాడులు జరుపుతామని తెలిపారు. ఇదివరకే అమెరికా ఇరాన్‌ నావికాదళాన్ని తుడిచిపెట్టిందని ఇక  ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను నాశనం చేస్తామని తెలిపారు. అయితే ఇరాన్‌ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచిందని వాటిని చేధించడం అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారిందన్నారు. అయితే ఇరాన్‌ సైతం తీవ్రమైన ప్రతి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా విరుచుకపడుతుంది.

  • టెహ్రాన్‌: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ తీవ్రత 4.3గా నమోదైంది. 

    ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు తారాస్థాయిలో కొనసాగుతున్న వేళ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్లు ఇరాన్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ శత్రుత్వాలకు ఈ భూకంపం మరింత ఊపునిచ్చింది. భూకంపంతో ఆస్తినష్టం,ప్రాణ నష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది.  

  • ఇరాన్‌ అధికారికంగా హర్ముజ్‌ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్‌ షిప్స్‌ ఉన్నాయి. మార్చి 1 వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్‌, కార్గోషిప్‌ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

    కాగా, హర్మూజ్‌ జలసంధి పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్‌ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్‌ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

    హర్మూజ్‌ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది.

    అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్‌లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాకు అవి సరిపోవు. 1980లలో ఇరాన్-ఇరాక్ ‘ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి.

    ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్‌ మధ్య ఉండే హర్మూజ్‌ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.


     

  • బీజింగ్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌,అమెరికా దాడుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది. ఇరాన్‌కు మద్దతుగా అమెరికా,ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు చైనా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సార్వభౌమాదికారాన్ని కాపాడతామని చైనా హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేసింది. 

    ఇరాన్‌ను కాపాడుకుంటాం చైనా కీలక ప్రకటన..
     

  • జెరుసలేం : దశాబ్దాల పాటు ఇరాన్‌ను శాసించి, పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (86) కథ ముగిసింది. ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ పేరుతో గత శనివారం ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు జరిపింది. ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఖమేనీ మరణించారు.

    అయితే, ఖమేనీ ప్రాణాలు తీసేందుకు ఇజ్రాయెల్‌ నిఘూ సంస్థ మొస్సాద్‌ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలను, ఫోన్‌లను హ్యాక్‌ చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువరించాయి. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ టెహ్రాన్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాల నెట్‌వర్క్‌లోకి చొరబడి, వాటి ఫుటేజీని గోప్యంగా సేకరించినట్టు సమాచారం.  

    ఇరాన్‌లోని ఖమేనీ నివాసం ఉండే అనుమానిత ప్రాంతం టెహ్రాన్‌లోని పాశ్చర్ స్ట్రీట్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో పాటు ఖమేనీ సన్నిహితులు, ఇతర ప్రభుత్వ పెద్దల ఫోన్‌ వ్యవస్థల్లో చొరబడింది. అనంతరం,ఇజ్రాయెల్‌ ట్రాక్‌ చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఫుటేజీ, ఖమేనీ ఫోన్‌ సంభాషణతో పాటు ఇతర వివరాలన్నీ ఎన్‌క్రిప్టెడ్‌,ట్రాన్స్‌మీటర్‌ ద్వారా ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందేది.

    సీఎన్‌ఎన్‌ నివేదిక ప్రకారం, అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఖమేనీ రోజువారీ జీవనశైలిని, ఆయన ఎక్కడ నివసిస్తారో, ఎవరిని కలుస్తారో, ఎలా సంభాషిస్తారో, దాడి జరిగితే ఎక్కడికి వెళ్ళవచ్చో అన్న విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. అదేవిధంగా, ఆయనతో తరచుగా సమావేశం కాని ఇతర రాజకీయ, సైనిక నాయకుల కదలికలను కూడా గమనించారు. ఇజ్రాయెల్‌ ఒక కెమెరా సాయంతో ఖమేనీ గురించి పూర్తి సమాచారం రాబట్టినట్లు తేలింది. ఆ కెమెరా ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత వాహనాలను ఎక్కడ పార్క్‌ చేస్తారో, వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగపడింది.

    ఈ క్రమంలో గత శనివారం ఉదయం టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్‌ కార్యాలయం, అధ్యక్ష భవనం, జాతీయ భద్రతా విభాగం ఉన్న సముదాయంలో ఖమేనీతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశం కావాల్సి ఉంది. మొదట రాత్రి దాడి చేయాలని నిర్ణయించినా, చివరికి పగలు దాడి చేయాలని వ్యూహం మార్చారు. ఇజ్రాయెల్‌ కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 6 గంటలకు, యుద్ధ విమానాలు ఖచ్చితమైన లక్ష్యాలను తాకే మెషిన్లతో  దాడి ప్రారంభించాయి.

    అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపిన వివరాల ప్రకారం, ఇజ్రాయెల్‌ సైనిక అధికారి ఒకరు ఈ దాడులు 60 సెకన్లలో మూడు లక్ష్యాలను తాకాయని, ఫలితంగా ఖమేనీతో పాటు సుమారు 40 మంది ఉన్నతాధికారులు, రివల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ కూడా మరణించారని తెలిపారు. పగలు దాడి జరపడం ద్వారా ఆశ్చర్యాన్ని కలిగించగలిగామని ఆయన పేర్కొన్నారు.

  • జకార్తా: భూకంప తీవ్రత ఇండోనేషియాను మరోమారు వణికించింది. మంగళవారం ఉదయం సుమత్రా దీవి సమీప సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఇండోనేషియా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ (AFP) తెలిపింది.

    భౌగోళికంగా ఇండోనేషియా అత్యంత క్రియాశీలకమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్‌లో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఈ దీవుల సముదాయం విస్తరించి ఉండటమే ఈ వరుస భూప్రకంపనలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి సునామీ ముప్పు లేకపోయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • ఇస్లామాబాద్: సరిహద్దు వివాదంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌-పాకిస్తాన్‌ల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. తాలిబన్ దళాలు అంతర్జాతీయ సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ దాటి పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి, భీకర దాడులకు తెగబడ్డాయి. ఈ ఆకస్మిక దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఎనిమిది కీలక సైనిక అవుట్‌పోస్టులను అఫ్గాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గానిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    అఫ్గాన్ డిప్యూటీ ప్రతినిధి సెదిఖుల్లా నుస్రత్ వెల్లడించిన వివరాల ప్రకారం కందహార్ ప్రావిన్స్‌లో ఐదు, ఖోస్ట్‌లో రెండు, జబుల్ ప్రావిన్స్‌లో ఒక సైనిక పోస్టును అఫ్గాన్ దళాలు హస్తగతం చేసుకున్నాయి. ముఖ్యంగా స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో సరిహద్దు దాటిన అఫ్గాన్ సైనికులు మూడు పాక్ పోస్టులను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, ముగ్గురు పాక్ సైనికులను హతమార్చి, మరొకరిని సజీవంగా బందీగా పట్టుకున్నారు. వాయుసేన రంగంలోనూ పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. సోమవారం ఒక్క రోజే అఫ్గాన్ దళాలు పాక్‌కు చెందిన నాలుగు డ్రోన్లను కూల్చివేశాయి.

    జబుల్ ప్రావిన్స్‌లోని షాముల్జాయ్ జిల్లాలో లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక డ్రోన్‌ను అఫ్గాన్ సైన్యం నేలకూల్చగా, కందహార్ పరిసరాల్లో మరో డ్రోన్ కుప్పకూలింది. కాబూల్‌తో పాటు అఫ్గాన్ లోని ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అఫ్గాన్ వైమానిక దళం పాకిస్తాన్‌లోని రావల్పిండి, క్వెట్టా, ఖైబర్‌ పఖ్తున్ఖ్వా తదితర కీలక ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు  చేసింది.

    ఈ దాడుల్లో పాక్ సైనిక వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పక్తికా ప్రావిన్స్‌లోని అంగూర్ ఆదా బేస్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక సాయుధ ట్యాంకును అఫ్గాన్ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అఫ్గాన్ ప్రారంభించిన ఈ ఎదురుదాడిలో ఇప్పటివరకు 100 మందికి పైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, 30కి పైగా చెక్‌పోస్టులు అఫ్గాన్ వశమయ్యాయని సమాచారం. ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పుల మోత కొనసాగుతుండటంతో పరిస్థితి  మరింత ఉద్రిక్తంగా మారింది.

    ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా