Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • విశాఖపట్నం: సింహాచలం సింహపురి కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

    ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేలోపే ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • మచిలీపట్నం: కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది  సీఎం చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్‌సీపీ నేత, పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్‌ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. 

    తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని తేల్చి చెప్పారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని  మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. 

    పేర్ని నాని  ఏమన్నారంటే..

    అది కచ్చితంగా సీఎం వైఫల్యమే
    సీఎం చంద్రబాబుగారు రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను పిలిచి వారిని దాదాపు 20 గంటలు కూర్చోబెట్టారు. ఈ సమావేశంలో పాలనా సమీక్ష జరగాల్సిన చోట, అధికారులు ఎలా ఉండాలి. ఎలా ఉద్యోగం చేయాలి. ఎవరైనా లావుగా ఉంటే బరువు ఎలా తగ్గాలి. ఫిట్‌గా ఎలా ఉండాలి. వంటి అంశాలపై కాలక్షేప బఠానీ కబుర్లు చెప్పారు. ఆ కాలక్షేపాన్ని కూడా ప్రజలు చూసేలా టీవీల్లో ప్రసారం చేయించారు. ఇంకా ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘మీరు గొప్పగా పని చేస్తున్నామని అనుకుంటున్నారు. 

    నేనూ అలా అనుకుంటున్నాను. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు’ అంటూ కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై నిందలు వేశారు. రెండేళ్లు పూర్తి అవుతున్న సందర్భంలో ఆయన సూక్తిముక్తావళి చెబుతూ అధికారులను దోషులుగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వారిని పని చేయనివ్వకుండా అనేక ఆంక్షలు విధించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు.

    మొట్టమొదటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా భిన్నంగా మాట్లాడారు. ‘మనది పొలిటికల్‌ గవర్నెన్స్‌. మా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు వస్తారు. వారికి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాకుండా చూసుకోండి’  అంటూ అప్పట్లో ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు చెప్పిన మాటలకు, ఇవాళ చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ‘మీరు సరిగ్గా పని చేయడం లేదు, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు’ అంటూ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. 

    నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ప్రభుత్వాన్ని నడిపించడం, విధానాలు రూపొందించడం, అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం సీఎం బాధ్యతేనని పేర్ని నాని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి బాధ్యత. కలెక్టర్లు, ఎస్పీలు సరిగ్గా పని చేయడం లేదంటే దాని అర్థం ముఖ్యమంత్రి పనితీరు బాగోలేదన్నదే. తన వైఫల్యాలను దాచుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై నిందలు వేయడం అన్యాయం. ప్రజల ముందు మాత్రం మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తుల్లా, ప్రతివ్రత కబుర్లు చెబుతూ అధికారుల పనితీరును తప్పు బట్టడం చేతకాని పాలనకు నిదర్శనం. అధికారుల పనితీరు ప్రజలకు నచ్చలేదంటే, ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలకు నచ్చనట్లేనన్న సత్యాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి అని పేర్నినాని ధ్వజమెత్తారు.

    దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి లేరు
    ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నడపడం ప్రపంచమంతా జరుగుతోందని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అయితే ప్రపంచంలో జరుగుతున్నదంతా ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా జరుగుతుందా? అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రధాని లేదా ముఖ్యమంత్రి తప్పులు చేసి జైలుకు వెళ్లి, ఆరోగ్యం బాగోలేదని బెయిల్‌పై బయటకు వచ్చి, మళ్లీ ముఖ్యమంత్రి అయి తనపై ఉన్న కేసులన్నీ మూయించుకున్న ఉదాహరణ ఉందా? ఈ తరహా చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక్క చంద్రబాబు విషయంలో కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

    ‘మీరు ముద్దాయిగా ఉండి, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కేసులు మాఫీ చేయించుకున్న ముఖ్యమంత్రి మీరే కదా?. దేశ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి మరెవరూ లేరన్న వాస్తవాన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైయస్‌ జగన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించడం కాదు, ముందు మీ గతాన్ని, మీ పాలనను మీరు పరిశీలించుకోవాలి.

     66 ఏళ్ల పాటు ప్రైవేట్‌ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే..
    పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే, వారు నిర్వహించి మళ్లీ ప్రభుత్వానికి అప్పగిస్తారని చంద్రబాబు వివరిస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ మెడికల్‌ కాలేజీలను మొత్తం 66 ఏళ్ల పాటు ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. 

    ఈ 66 ఏళ్లలో మీరు, మీ లోకేష్, మీ పవన్‌ కళ్యాణ్, సత్యకుమార్‌ ఎవరు ఉంటారు? మేము కూడా అప్పటికి ఉండం కదా? అని ప్రశ్నించారు. ఎకరానికి రూపాయి అద్దెకు ప్రభుత్వ భూములను 66 ఏళ్ల పాటు ప్రైవేట్‌ వారికి ఇవ్వడం అంటే అమ్మేయడమే. పీపీపీ ఆస్పత్రి బయట ‘ప్రభుత్వ ఆసుపత్రి’’ అని పెద్ద బోర్డు పెట్టి, కింద చిన్న అక్షరాల్లో ప్రైవేట్‌ వ్యక్తి పేరు రాస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. 

    రాష్ట్రంలో ఉన్న మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వండి. 66 ఏళ్ల తర్వాత మళ్లీ దేవాన్ష్‌ లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు. చంద్రబాబు తత్వం మొత్తం గాలిలో మేడలు కట్టడం, పిట్టల దొర కబుర్లు చెప్పడం, అసాధ్యాన్ని సాధ్యమని చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలే.

    ఏఐ డాక్టర్‌ ఎలా అవుతుంది?:
    చంద్రబాబుకు జ్వరం వస్తే ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నారు? మొన్న డాక్టర్లకు ఏం తెలుసు అని, ఏఐని అడగాలని చంద్రబాబు చెప్పడం కూడా అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారంతోనే ఏఐ ఒక నాలెడ్జ్‌ హబ్‌గా, డేటా సెంటర్‌గా తయారవుతుందని, ఏఐ డాక్టర్‌ కాదని స్పష్టం చేశారు. జ్వరం వస్తే చంద్రబాబు కంప్యూటర్‌ ఎదుట కూర్చొని ఏఐని అడుగుతారా? లేక వెంటనే నాగార్జున ఆసుపత్రికి పరుగెత్తుకెళ్తారా? అని ప్రశ్నించారు.

    ప్రైవేటులో ఫ్రీగా వైద్యం అందుతుందా?:
    2015లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్‌కు ఇచ్చారు కదా అని గుర్తు చేస్తూ, మీరు ఒక్కరోజైనా ఆ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారా? ఒక్క ఇంజక్షన్‌ అయినా వేయించుకున్నారా? ఒక్క మందు బిళ్ల అయినా తీసుకున్నారా? ప్రైవేట్‌ ఆసుపత్రులకు పేదలు ఎలా వెళ్తారు. పీపీపీ వల్ల మెడికల్‌ సీట్లు పెరుగుతాయి, 

    ఫీజులు అలాగే ఉంటాయని జర్నలిస్టులను చంద్రబాబు దబాయిస్తున్నాడు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఒక విద్యార్థికి ఏడాదికి కేవలం రూ.15 వేలే ఫీజు ఉంటుంది, స్కానింగ్, ఎంఆర్‌ఐ, రక్త పరీక్షలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. ప్రైవేట్‌ నిర్వహణలో ఇవన్నీ ఉచితంగా ఇస్తారా. డయాలసిస్, చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితం కదా?

    బసవ తారకం ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా?
    చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రిలో 70 శాతం ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం వద్ద భూమి తీసుకున్నప్పుడు అంగీకరించారని గుర్తు చేశారు. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క పేదవాడికైనా ఉచితంగా చికిత్స ఇచ్చారా? పేదలు ఆ ఆసుపత్రికి వెళ్లగలుగుతున్నారా? అని ప్రశ్నించారు. 

    అక్కడ పేదల్ని పట్టించుకునే పరిస్థితే లేదని తీవ్రంగా విమర్శించారు. వరి సాగు తగ్గిస్తే యూరియా రూ.800 ఇస్తానని, ఏడాదిలో నేరాలు తగ్గాలంటూ చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మాట్లాడుతున్నాడు. ఆయన పాలనలో నేరాలు తగ్గలేదు–ఘోరాలు మాత్రమే పెరిగాయి. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, హింస, హత్యలు 19 నెలల పాలనకు నిదర్శనంగా మారాయి.

    డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు?
    డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తన శాఖలను నిర్లక్ష్యం చేసి హోం శాఖలో జోక్యం చేసుకుంటూ మాటలకే పరిమితమయ్యారు. భీమవరం, పిఠాపురం వంటి ప్రాంతాల్లో పేకాట, ల్యాడ్‌ సెటిల్‌మెంట్లు, రాజకీయ జోక్యంతో పోలీసు–రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దళితులపై కుల వివక్ష, జర్నలిస్టులపై దాడులు జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చేతకాని పాలనకు స్పష్టమైన నిదర్శనం.

    మా ప్రభుత్వం వచ్చాక వారందరిపై చర్యలు తప్పవు
    పీపీపీ పేరుతో మెడికల్‌ కాలేజీలను 66 ఏళ్ల పాటు ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం అంటే వాటిని అమ్మేయడమే. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పేదలపై భారం పడకూడదని పారదర్శకంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల విధానం తీసుకొస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి వంద శాతం ప్రైవేటీకరణ చేసింది. దీనికి వ్యతిరేకంగా కోటి మందికిపైగా ప్రజల మనోభావాలను వారి సంతకాల రూపంలో నిన్న (గురువారం) శ్రీ వైయస్‌ జగన్‌ గవర్నర్‌ గారికి అందించారు. కాలేజీలు ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్తే వైద్యం వ్యాపారమవుతుంది. ఈ పాపానికి బాధ్యులైన వారందరిపై మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

    ఎయిమ్స్‌ను ఎందుకు పీపీపీ పద్ధతిలో ఇవ్వడం లేదు?
    లోకేష్‌ ఇచ్చిన కాగితం చదవడానికి హడావిడిగా వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, బీజేపీ ప్రతినిధిలా కాకుండా చంద్రబాబు–లోకేష్‌ ఆదేశాలతో పని చేసే వ్యక్తిగా మారిపోయారు. పీపీపీ పేరుతో మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్ముతున్నది తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిని బెదిరించడం ఆయన అవివేకానికి నిదర్శనం. పేదలకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం  దొరుకుతుందనడం అబద్ధం. ఉచిత, నాణ్యమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధ్యం. ఎయిమ్స్‌ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీకి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని మంత్రి, అధికార మదంతో మాట్లాడుతున్నారు.

    సుష్మా స్వరాజ్‌ ఏమన్నారో తెలుసా?
    వైఎస్ జగన్‌పై కేసుల విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడే నైతిక హక్కు సత్యకుమార్‌కు లేదు. ఎందుకంటే ఆయన పని చేస్తున్నది సుమారు 150 కేసులు ఎదుర్కొన్న చంద్రబాబునాయుడు చేతి కింద ఆయన పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు రాలేదా అన్నది రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాస్తవం. 

    పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌ స్వయంగా, వైయస్‌ జగన్‌పై కేసులు రాజకీయ ప్రతీకారమేనని స్పష్టం చేశారు. అధికార మదంతో మాట్లాడడం సత్యకుమార్‌ అవివేకానికి నిదర్శనం అని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

  • సాక్షి,అమరావతి: ఇంటర్మీడియట్ బోర్టు 2026 ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియల్ తొలి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ‍ప్రారంభంకానున్నట్లు బోర్టు ప్రకటించింది. రెండవ సంవత్సరం ఎగ్జామ్స్ ఫిబ్రవరి 24 నుంచి మెుదలు కానున్నట్లు పేర్కొంది. పరీక్షలు ఉ.9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ జరగనున్నాయి.  

    మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2ఏ మార్చి 21న.. మార్చి3న జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ పేపర్ 2లను మార్చి 4వతేదీకి మారుస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. మిగతా పరీక్షలలో ఏటువంటి మార్పులు లేనట్లు తెలిపింది.

    ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్వూస్ పరీక్ష జనవరి 21వ తేదీన ఉండగా, ఇన్విరాల్‌మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్‌ జనవరి 21వ తేదీన జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి. ప్రాక్టికల్స్ పరీక్షల అనంతరం హాల్‌టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు బోర్టు అధికారికంగా వెల్లడించింది. 

  • తాడేపల్లి: కూటమి ‍ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మారుస్తుందని  మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు ద్వజమెత్తారు.  కూటమి ప్రభుత్వ కేవలం 18 నెలల కాలంలోనే రూ.2.70లక్షల కోట్ల అప్పులు చేసిందని, సరాసరిన రోజుకు రూ. 550 కోట్లు అప్పు ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం, డిసెంబర్‌ 19వ తేదీ) ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్‌ కాలేజ్‌ పూర్తి చేయొచ్చన్నారు.

    ఇటీవల జరిపిన ఒక గంట యోగా కార్యక్రమం కోసం రూ. 330 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరుతో ఇదివరకే రూ.వేల కోట్లు దుబారా చేయగా  ఇప్పుడు మళ్లీ వేల కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేవేటీకరణను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.

    కూటమి ప్రభుత్వం తమను వెన్నుపోటు పొడిచిందని జనమంతా ఆగ్రహంతో ఉన్నారని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జనానికి అర్థం అయిందని తెలిపారు.అందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతాకాలు చేశారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం దాగి ఉందని మాజీ మంత్రి అప్పల్రాజు పేర్కొన్నారు. 

    భూమి ప్రభుత్వానిది ఆదాయం మాత్రం ప్రైవేట్‌వారికా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెండేళ్ల జీతాలు ప్రభుత్వమే చెల్లించాలా ఆ జీతాల సొమ్ముతో మరో రెండు వెద్యకళాశాలలు కట్టవచ్చని తెలిపారు.108, 104లను అనర్హులకు కట్టబెట్టిన వైనంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చూశారని తెలిపారు..

    అందుకోసమే కరోనా సమయంలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు వైద్యం అందకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేపడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ప్రైవేటీకరణను రద్దు చేసి తీరాతం అని మాజీ మంత్రి సీదిరి అప్పల్రాజు తెేల్చిచేప్పారు. 

    Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు

    రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.. పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని పరిశ్రమలపై దాడులు చేసి మూసివేసేలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం లేదని తెలిపారు. సనాతనవాదని అని గొప్పలు చెప్పుకుతిరిగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోమాంసం దొరికితే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

    పరకామణి విషయంలో కోర్టు పరిధిలో సెటిల్మెంట్ జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయటం ఆయన సంకుచిత బుద్దికి నిదర్శనమని తెలిపారు. 

  • సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.

    టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్‌ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.

    టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

     

Sports

  • టెస్టు సిరీస్‌లో 0–2తో ఓటమి, వన్డేల్లో 2–1తో గెలుపు, ఇప్పుడు టి20ల్లో 3–1తో ఘన విజయం...సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత జట్టు ప్రదర్శన ఇది. చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో జరిగిన  సిరీస్‌లలో టీమిండియా పైచేయి సాధించింది. టెస్టు సిరీస్‌ ఫలితం బాధపెట్టేదే అయినా ఓవరాల్‌గా 5–4తో మన జట్టు పైచేయి  సాధించింది. 

    సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం లేని స్థితిలో చివరి టి20లో బరిలోకి దిగిన భారత్‌  భారీ స్కోరుతో ప్రత్యరి్థకి చెక్‌ పెట్టింది. పాండ్యా అద్భుత బ్యాటింగ్, తిలక్‌ మెరుపులు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డికాక్‌ జోరుతో సఫారీలు ఛేదన వైపు సాగినట్లు అనిపించినా అది కొన్ని ఓవర్లకే పరిమితమైంది. చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయి ఒత్తిడిలో జట్టు చిత్తయింది. టి20ల్లో భారత్‌కు ఇది వరుసగా 8వ సిరీస్‌ విజయం కావడం విశేషం. 
     
    అహ్మదాబాద్‌: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌ను భారత్‌ 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్‌ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. క్వింటన్‌ డికాక్‌ (35 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, వరుణ్‌ చక్రవర్తికి 4 వికెట్లు దక్కాయి.  

    రాణించిన సామ్సన్‌... 
    భారత్‌కు సంజు సామ్సన్‌ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. అభిషేక్‌ తనదైన శైలిలో దూకుడుగా మొదలు పెట్టగా, గిల్‌ గైర్హాజరులో దక్కిన అవకాశాన్ని సామ్సన్‌ సమర్థంగా వాడుకున్నాడు. యాన్సెన్‌ ఓవర్లో తొలి మూడు బంతులను అభిషేక్‌ ఫోర్లుగా మలచగా, చివరి బంతికి సామ్సన్‌ సిక్స్‌ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బార్ట్‌మన్‌ ఓవర్లో సామ్సన్‌ మూడు ఫోర్లు కొట్టాడు. 

    అభిషేక్‌ వికెట్‌ కోల్పోయి పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 67 పరుగులు చేసింది. తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టిన తిలక్‌ కూడా తన ధాటిని ప్రదర్శించడంతో స్కోరు దూసుకుపోయింది. సామ్సన్‌ వెనుదిరిగాక మరో సారి సూర్యకుమార్‌ (5) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో జత కలిసిన తిలక్, హార్దిక్‌ ద్వయం దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. చూడచక్కటి ఫోర్లు కొట్టిన తిలక్‌ 30 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించి స్కోరును 200 దాటించారు. చివర్లో దూబే (10 నాటౌట్‌) కూడా సిక్స్, ఫోర్‌తో తాను ఓ చేయి వేశాడు.  

    డికాక్‌ అర్ధ సెంచరీ... 
    భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు డికాక్‌ మెరుపు ఆరంభాన్ని ఇస్తూ అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. అర్ష్ దీప్‌ తొలి ఓవర్లో వరుసగా  మూడు ఫోర్లు కొట్టిన అతను...అతని తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు, సిక్స్‌ బాదడం విశేషం. పవర్‌ప్లే సఫారీ టీమ్‌ కూడా సరిగ్గా 67 పరుగులే సాధించింది. హెన్‌డ్రిక్స్‌ (13) వెనుదిరిగాక 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌కు మరో ఎండ్‌లో బ్రెవిస్‌ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. పాండ్యా బౌలింగ్‌లో బ్రెవిస్‌ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. 10.1 ఓవర్లలో 120/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డికాక్, బ్రెవిస్‌ రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. మిగతా బ్యాటర్లలో ఎవరూ నిలవలేకపోయారు.

    ఆ 16 బంతులు... 
    తొలి బంతికే సూపర్‌ సిక్స్‌...మెరుపు వేగంతో దూసుకొచి్చన బంతి భుజానికి తగలడంతో కెమెరామన్‌ అల్లాడిపోయాడు. టీమ్‌ ఫిజియో వెళ్లి చికిత్స చేయాల్సి వచి్చంది. అలా మొదలైన హార్దిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ అంతే విధ్వంసకరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తర్వాతి రెండు బంతుల్లో సింగిల్, ఫోర్‌ కొట్టిన పాండ్యా... లిండే వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాదాడు. ఇంత పెద్ద మైదానంలో అతను కొట్టిన భారీ సిక్స్‌లు బౌండరీకి దగ్గర్లో కాకుండా ఎక్కడో గ్యాలరీల్లో పడ్డాయంటే ఆ వాడి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాతి ఐదు బంతులు కాస్త జాగ్రత్తగా ఆడుతూ 7 పరుగులే రాబట్టినా...బాష్‌ ఓవర్లో మళ్లీ జోరు కనిపించింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అదే ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ బాదడంతో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తయింది.   

    స్కోరు వివరాలు
    భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (బి) లిండే 37; అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) బాష్‌ 34; తిలక్‌ (రనౌట్‌) 73; సూర్యకుమార్‌ (సి) మిల్లర్‌ (బి) బాష్‌ 5; పాండ్యా (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 63; దూబే (నాటౌట్‌) 10; జితేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 231.  
    వికెట్ల పతనం: 1–63, 2–97, 3–115, 4–220, 5–227. 
    బౌలింగ్‌: ఎన్‌గిడి 4–0–29–0, యాన్సెన్‌ 4–0–50–0, బార్ట్‌మన్‌ 3–0–39–1, బాష్‌ 3–0–44–2, ఫెరీరా 2–0–20–0, లిండే 4–0–46–1. 

    దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) అండ్‌ (బి) బుమ్రా 65; హెన్‌డ్రిక్స్‌ (సి) దూబే (బి) వరుణ్‌ 13; బ్రెవిస్‌ (సి) సుందర్‌ (బి) పాండ్యా 31; మిల్లర్‌ (సి) సామ్సన్‌ (బి) అర్ష్ దీప్‌ 18; మార్క్‌రమ్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 6; ఫెరీరా (బి) వరుణ్‌ 0; లిండే (బి) వరుణ్‌ 16; యాన్సెన్‌ (సి) సామ్సన్‌ (బి) బుమ్రా 14; బాష్‌ (నాటౌట్‌) 17; ఎన్‌గిడి (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201.  
    వికెట్ల పతనం: 1–69, 2–120, 3–122, 4–135, 5–135, 6–154, 7–163, 8–177. 
    బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–47–1, సుందర్‌ 4–0–30–0, బుమ్రా 4–0–17–2, వరుణ్‌ 4–0–53–4, పాండ్యా 3–0–41–1, 1–0–13–0.

    2: భారత్‌ తరఫున టి20ల్లో పాండ్యా రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (16 బంతుల్లో) సాధించాడు. యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో) పేరిట టాప్‌ రికార్డు ఉంది.  

  • దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

    ఇక మరో టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్‌ డిప్యూటీగా ఆయుశ్‌ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్‌ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.

    2010లో చివరిసారిగా
    కాగా 2010లో చివరిసారిగా విరాట్‌ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్‌ బరిలో దిగనున్నాడు. 

    ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్‌ సెలక్టర్‌ సంజయ్‌ పాటిల్‌ తాజాగా వెల్లడించాడు.

    విజయ్‌ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు
    రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని (వైస్‌ కెప్టెన్‌), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్‌ కీపర్‌), హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, ఆయుశ్‌ దొసేజా, దివిజ్‌ మెహ్రా, వైభవ్‌ కంద్పాల్‌, రోహన్‌ రాణా, అనూజ్‌ రావత్‌. 

    చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

  • సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

    ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ
    తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్‌ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మను అధిగమించి.. యువరాజ్‌ సింగ్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.

    తిలక్‌ వర్మ విధ్వంసం
    ఇక శుక్రవారం అహ్మదాబాద్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 37), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు.

    నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్‌లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు.

     

    అనూహ్య రీతిలో
    మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలంగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. 

    ఇక తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73)  అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి రనౌట్‌ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ రెండు వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే
    🏏యువరాజ్‌ సింగ్‌- 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ
    🏏హార్దిక్‌ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ
    🏏అభిషేక్‌ శర్మ- 2025లో ఇంగ్లండ్‌ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ
    🏏కేఎల్‌ రాహుల్‌- 2021లో స్కాట్లాండ్‌ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ
    🏏సూర్యకు​మార్‌ యాదవ్‌- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.

    చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

  • టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్‌ ఇయర్‌లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఈ ఘనత సాధించాడు.

    కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ తరఫున అదరగొట్టిన అభిషేక్‌ శర్మ 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 304 పరుగులు సాధించాడు.

    ఇక టీమిండియా తరఫున  ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్‌ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్‌లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ.. కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

    2016లో విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్‌ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్‌ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.

    కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్‌ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్‌ నాలుగో బంతికి కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ అవుటయ్యాడు. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు. 

  • ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో భారత్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ఖండాంతర టోర్నీలో ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత జట్టు గ్రూప్‌-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్‌, మలేసియా జట్లను ఓడించి అజేయంగా సెమీస్‌కు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకతో తలపడింది.

    దుబాయ్‌లో వాన పడిన కారణంగా టాస్‌ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించినా.. అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా ఉన్న కారణంగా ఈ యూత్‌ వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఇక టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది.

    లంక ఓపెనర్లు విరాన్‌ చముదిత (19), దుల్‌నిత్‌ సిగెరా (1) విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ విమత్‌ దిన్సారా (32) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 42 పరుగులతో లంక తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. లోయర్‌ ఆర్డర్‌లో సెత్మిక సెనెవిరత్నె 30 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కవిజ గమాగే (2), కిత్మా వితనపతిరన (7), ఆధమ్‌ హిల్మీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు.

    భారత బౌలర్లలో హెనిల్‌ పటేల్‌, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. దీపేశ్‌ దేవేంద్రన్‌, కిషన్‌ కుమార్‌, ఖిలన్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు.. ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ శర్మ (7), వైభవ్‌ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. రసిత్‌ నిమ్సారా వీరిద్దరిని పెవిలియన్‌కు పంపాడు.

    అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌, విహాన్‌ మల్హోత్రాతో కలిసి ధనాధన్‌ దంచికొట్టాడు. ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు బాదారు. ఆరోన్‌ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 58 పరుగులతో.. విహాన్‌ 45 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్‌ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆరోన్‌, విహాన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు పంచుకున్నారు.

    అండర్‌-19 ఆసియా కప్‌-2025 సెమీ ఫైనల్‌-1 స్కోర్లు
    👉టాస్‌: భారత్‌.. తొలుత బౌలింగ్‌
    👉వాన వల్ల ఆలస్యంగా పడిన టాస్‌.. వెట్‌ఫీల్డ్‌ కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌
    👉శ్రీలంక స్కోరు: 138/8 (20)
    👉భారత్‌: 139/2 (18)
    👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్‌ 

  • దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. 
    స్కోర్లు: భారత్ 231/5(20), దక్షిణాఫ్రికా 201/8(20)

    దక్షిణాఫ్రికాకు 12 బంతుల్లో 47 పరుగులు అవసరం. విజయానికి చేరువగా భారత్‌.

    180 పరుగులకు 8 వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా ఓటమికి దగ్గర్లో ఉంది.

    వరుసగా మరో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా. 177 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా 8వ వికెట్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు 19 బంతుల్లో 55 పరుగులు అవసరం.

    దక్షిణాఫ్రికా ఏడోవ వికెట్‌ కోల్పోయింది.  15.2 ఓవర్లకు 163 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మరో వికెట్‌ కోల్పోయింది. 

    దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ కోల్పోయింది. 15 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 33 బంతుల్లో 78 పరుగులు అవసరం.

    దక్షిణాఫ్రికా విజయానికి 38 బంతుల్లో 85 పరుగులు అవసరం.

    టీమిండియాతో ఐదో టీ20లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 231 పరుగులు చేసింది. 

    భారత్‌ విధించిన 232 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. హైలైట్స్‌
    👉10 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 118-1
    విజయానికి 60 బంతుల్లో 114 కావాలి. బ్రెవిస్‌ 14 బంతుల్లో 29, డికాక్‌ 34 బంతుల్లో 65 పరుగులతో ఉన్నారు.
    👉6.3 తొలి వికెట్‌ డౌన్‌: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌ (13) అవుట్‌. స్కోరు: 70-1(7). డెవాల్డ్‌ బ్రెవిస్‌ క్రీజులోకి వచ్చాడు.

    👉ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 60-0
    హెండ్రిక్స్‌ 10, డికాక్‌ 42 పరుగులతో ఉన్నారు.

    భారత్‌ భారీ స్కోరు: 231-5(20)
    ఓపెనర్లు సంజూ శాంసన్‌ (37), అభిషేక్‌ శర్మ (34) రాణించగా.. తిలక్‌ వర్మ (42 బంతుల్లో 73), హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో మెరిశారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) మరోసారి విఫలం అయ్యాడు.

    ఆఖర్లో శివం దూబే 3 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ రెండు వికెట్లు తీయగా.. జార్జ్‌ లిండే, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ చెరొక వికెట్‌ పడగొట్టారు. ప్రొటిస్‌ జట్టు లక్ష్యం 232 పరుగులు.

    భారత్‌ బ్యాటింగ్‌.. హైలైట్స్‌
    👉19.3 నాలుగో వికెట్‌ డౌన్‌: బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)
    19.3 నాలుగో వికెట్‌ డౌన్‌: బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన హార్దిక్‌ పాండ్యా (25 బంతుల్లో 63). క్రీజులోకి వచ్చిన శివం దూబే. స్కోరు: 226-4(19.4)
    👉16 బంతుల్లో హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకం
    బాష్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది 50 పరుగులు పూర్తి చేసుకున్న హార్దిక్‌

    👉15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 170-3
    తిలక్‌ 57, హార్దిక్‌ 8 బంతుల్లో 32 పరుగులతో ఉన్నారు.

    👉14.4 తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీ: ఎంగిడి బౌలింగ్‌లో ఫోర్‌ బాది.. ఆరో టీ20 హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన తిలక్‌ వర్మ (30 బంతుల్లో).

    👉12.1 మూడో వికెట్‌ డౌన్‌: బాష్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్య (5) అవుట్‌. క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా. స్కోరు: 115-3(12.1)

    👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 101-2
    తిలక్‌ 24, సూర్య 2 పరుగులతో ఉన్నారు.

    👉9.1 రెండో వికెట్‌ డౌన్‌: లిండే బౌలింగ్‌లో శాంసన్‌ బౌల్డ్‌ (22 బంతుల్లో 37; 4ఫోర్లు, 2 సిక్సర్లు). రెండో వికెట్‌ డౌన్‌. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. 

    👉8.4: సంజూ బాదిన షాట్‌తో అంపైర్‌కు గాయం
    ఫెరీరా బౌలింగ్‌లో స్ట్రెయిట్‌ షాట్‌ ఆడేందుకు సంజూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఇచ్చిన క్యాచ్‌ను ఫెరీరా డ్రాప్‌ చేయగా.. అంపైర్‌ రోహన్‌ పండిట్ మోకాలికి తలిగింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోగా.. ఫిజియోలు వచ్చి చెక్‌ చేశారు.

    👉పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)
    సంజూ 27, తిలక్‌ వర్మ 4 పరుగులతో ఉన్నారు.

    👉5.4- తొలి వికెట్‌ డౌన్‌: కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 34; ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌) అవుట్‌. తొలి వికెట్‌ డౌన్‌. క్రీజులోకి తిలక్‌ వర్మ. స్కోరు: 63-1(5.4)

    👉ఐదు ఓవర్లలో భారత్‌ స్కోరు: 56-0
    👉అభిషేక్‌ శర్మ 17 బంతుల్లో 28, సంజూ శాంసన్‌ 13 బంతుల్లో 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    తుదిజట్లలో మార్పులు ఇవే
    ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. అన్రిచ్‌ నోర్జే  స్థానంలో  జార్జ్‌ లిండేను ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చేర్చింది. 

    మరోవైపు.. టీమిండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగింది. జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి రాగా.. హర్షిత్‌ రాణా బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు.. కుల్దీప్‌ యాదవ్‌, శుబ్‌మన్‌ గిల్‌ గాయాల బెడదతో దూరం కాగా.. వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌ వారి స్థానాలను భర్తీ చేశారు.

    కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కటక్‌లో భారత్‌, ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలవగా.. ధర్మశాలలో భారత్‌ మరోసారి జయకేతనం ఎగురవేసింది. లక్నోలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దైపోగా.. అహ్మదాబాద్‌లో గెలిచి 3-1తో సిరీస్‌ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

    టీమిండియా వర్సెస్‌ సౌతాఫ్రికా ఐదో టీ20 తుదిజట్లు
    టీమిండియా
    అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్దీప్ సింగ్

    సౌతాఫ్రికా
    క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవాన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.
     

  • టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికెట్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా చరిత్‌ అసలంకను తప్పించింది. మాజీ సారథి దసున్‌ షనకకే మరోసారి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది.

    అందుకే కెప్టెన్‌ని చేశాం
    కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచకప్‌ టోర్నీకి లంక క్రికెట్‌ బోర్డు శుక్రవారం తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఇందులో భాగంగా దసున్‌ షనకకు సారథిగా పెద్ద పీట వేయడంపై చీఫ్‌ సెలక్టర్‌గా తిరిగి వచ్చిన ప్రమోదయ విక్రమసింఘ స్పందించాడు.

    ‘‘షనక ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తాడు. నేను సెలక్టర్‌గా దిగిపోయేనాటికి షనకనే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు చరిత్‌ మా దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఒకడిగా ఉన్నాడు. కెప్టెన్‌ అయిన తర్వాత చరిత్‌ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు.

    సనత్‌ జయసూర్యతో చర్చించిన తర్వాతే
    ఇటీవల అతడు బ్యాటింగ్‌లో ఫామ్‌ కోల్పోయాడు. త్వరలోనే తిరిగి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తున్నాం. హెడ్‌కోచ్‌ సనత్‌ జయసూర్యతో చర్చించిన తర్వాతే ఈ జట్టును ఎంపిక చేశాము. వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీకి ముందు పెద్దగా మార్పులు చేయాలని మేము అనుకోలేదు’’ అని ప్రమోదయ విక్రసింఘ తెలిపాడు.

    ఇక నిరోషన్‌ డిక్‌విల్లాను తిరిగి జట్టుకు ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఓపెనర్‌గా.. రిజర్వు వికెట్‌ కీపర్‌గా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌గా అతడు బహుముఖ పాత్రలు పోషించగలడు’’ అని విక్రమసింఘ తెలిపాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో చివరగా డిక్‌విల్లా లంక టీ20 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.  

    తిరిగి సారథిగా..
    కాగా 2021- 24 వరకు శ్రీలంక వన్డే, టీ20 జట్లకు దసున్‌ షనక సారథిగా ఉన్నాడు. అయితే, కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌ టోర్నీలో విఫలం కావడంతో అతడిని తప్పించి.. అసలంకకు బాధ్యతలు ఇచ్చారు. అయితే, అసలంక సారథ్యంలో ముఖ్యంగా టీ20లలో శ్రీలంక చెత్త ప్రదర్శన నమోదు చేసింది. ఆసియా టీ20 కప్‌-2025లోనూ తేలిపోయింది. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు.

    ఈ పరిణామాల నేపథ్యంలో అనుభవానికి పెద్ద పీట వేస్తూ.. సెలక్షన్‌ కమిటీ దసున్‌ షనకపైనే మరోసారి నమ్మకం ఉంచింది. కాగా గత ఆసియా కప్‌ (టీ20) టోర్నీలో లంకను అతడు చాంపియన్‌గా నిలిపాడు. కాగా ఇటీవల పాకిస్తాన్‌ పర్యటన సందర్భంగా అసలంక భద్రతా కారణాలు చూపి మధ్యలోనే తప్పుకొన్నాడు. ఈ క్రమంలో షనక తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. 

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి శ్రీలంక ప్రకటించిన ప్రాథమిక జట్టు
    దసున్‌ షనక (కెప్టెన్‌), పాతుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్‌, కామిల్‌ మిశారా, కుశాల్‌ పెరీరా, ధనంజయ డి సిల్వ, నిరోషన్‌ డిక్‌విల్లా. జనిత్‌ లియానగే, చరిత్‌ అసలంక, కమిందు మెండిస్‌, పవన్‌ రత్మనాయకే, సహాన్‌ అరాచిగే, వనిందు హసరంగ, దునిత్‌ వెల్లలగే, మిలన్‌ రత్ననాయకే, నువాన్‌ తుషార, ఇషాన్‌ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్‌ మదూషాన్‌, మతీశ పతిరణ, దిల్షాన్‌ మధుషాంక, మహీశ్‌ తీక్షణ, దుషాన్‌ హేమంత, విజయకాంత్‌ వియస్కాంత్‌, త్రవీణ్‌ మాథ్యూ.

    చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

  • ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కువగా ఖర్చు పెట్టకుండానే మెరుగైన ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్నారని కొనియాడాడు.

    రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో
    అబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 21.80 కోట్ల పర్సు వాల్యూతో ఢిల్లీ క్యాపిటల్స్‌ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో అత్యధికంగా జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆఖిబ్‌ నబీ కోసం రూ. 8.40 కోట్లు ఖర్చు చేసిన యాజమాన్యం.. అతి తక్కువగా సాహిల్‌ పరాఖ్‌ కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.

    చవక ధరకే బెస్ట్‌ ప్లేయర్లు
    ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ ఎస్‌. బద్రీనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈసారి వేలంలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ (కోట్లలో)తోనే వాళ్లు ఆటగాళ్లందరినీ కొనుగోలు చేశారు. ఒక్కరి కోసం అంతకుమించి ఖర్చుపెట్టలేదు. అంటే.. వారు ఈసారి వేలంపాటలో మంచి ప్రదర్శన ఇచ్చారని అర్థం.

    వేలంలో చవక ధరకే డేవిడ్‌ మిల్లర్‌, బెన్‌ డకెట్‌, ఆఖిబ్‌ నబీ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన తీరు నిజంగా అద్భుతం. దీనిని బట్టే వారు వేలం కోసం ఏ స్థాయిలో సన్నద్ధమయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పేపర్‌ మీదైతే వాళ్ల జట్టు సమతూకంగా ఉంది.

    ఇక మైదానంలో దిగిన తర్వాత ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. 13-14 మంది ప్లేయర్లతో బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికే తరచూ అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాలి. ఈ జట్టుతో ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఢిల్లీ ఈసారి టాప్‌-4లో ఉండటం ఖాయం’’ అని పేర్కొన్నాడు. కాగా ఆఖరి నిమిషంలో ఢిల్లీ తమ మాజీ ఆటగాడు పృథ్వీ షాను రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడం విశేషం.

    వేలంలో ఢిల్లీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు- ధర
    ఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), పాతుమ్‌ నిసాంక (రూ.4 కోట్లు), కైలీ జేమీసన్‌ (రూ.2 కోట్లు), లుంగీ ఎన్‌గిడి (రూ.2 కోట్లు), బెన్‌ డకెట్‌ (రూ. 2 కోట్లు), డేవిడ్‌ మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు)

    వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు
    అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌, అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌.

    చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!

  • వెంకటేశ్‌ అయ్యర్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్‌ వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025 సీజన్‌లో అతడు మధ్యప్రదేశ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా 2015లో మధ్యప్రదేశ్‌ తరఫున దేశీ క్రికెట్లో అడుగుపెట్టిన వెంకీ.. ఇప్పటికి ఫస్‌క్లాస్‌ క్రికెట్‌లో 20, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 48, టీ20లలో యాభైకి పైగా మ్యాచ్‌లు ఆడాడు.

    పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటుతూ పరుగులు రాబట్టడంతో పాటు ఆయా ఫార్మాట్లలో వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టిన వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer).. ఇప్పటి దాకా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో కొనసాగాడు. 2024లో ట్రోఫీ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. ఈ నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను 2025 వేలానికి ముందు రిలీజ్‌ చేసిన కేకేఆర్‌.. ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు తిరిగి కొనుగోలు చేసింది.

    రూ. 7 కోట్లకు ఆర్సీబీ సొంతం
    అయితే, తాజా ఎడిషన్‌లో వెంకటేశ్‌ బ్యాట్‌, బంతితో పూర్తిగా తేలిపోయాడు. చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు అతడిని విడిచిపెట్టగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది.

    ఇదిలా ఉంటే.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లోనూ వెంకటేశ్‌ అయ్యర్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. అయినప్పటికీ ఆర్సీబీ ఈ మేర భారీ మొత్తమే చెల్లించగా.. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సైతం మరోసారి నమ్మకం ఉంచి ఏకంగా కెప్టెన్‌గా నియమించింది.

    పాటిదార్‌ అవుట్‌..  కెప్టెన్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌
    అయితే, ఆర్సీబీకి తొలి ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన సారథి, మధ్యప్రదేశ్‌కు గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీ అందించిన రజత్‌ పాటిదార్‌ ఈ జట్టులో లేడు. కెప్టెన్‌గా అతడి స్థానాన్ని వెంకటేశ్‌ అయ్యర్‌ భర్తీ చేశాడు. 

    ఇక ఈ ఇద్దరు ఆర్సీబీ బాయ్స్‌తో పాటు జట్టులో కొత్తగా చేరిన మరో మధ్యప్రదేశ్‌ ఆటగాడు మంగేశ్‌ యాదవ్‌ కూడా దేశీ వన్డే టోర్నీ ఆడబోతున్నాడు. కాగా పాటిదార్‌ గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు.

    ఈ క్రమంలో కోలుకున్న అతడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కూడా పొందాడు. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌ జట్టుకు దూరమయ్యాడు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా డిసెంబరు 14- జనవరి 8 మధ్య విజయ్‌ హజారే ట్రోఫీ లీగ్‌ దశ నిర్వహించనున్నారు.

    విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26కు మధ్యప్రదేశ్‌ జట్టు
    వెంకటేశ్‌ అయ్యర్ (కెప్టెన్), హర్ష్ గావ్లీ, హిమాన్షు మంత్రి (వికెట్‌ కీపర్‌), యశ్ దూబే, శుభమ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్, రిషబ్ చౌహాన్, రితిక్ తడా, కుమార్ కార్తికేయ, సారాంశ్ జైన్, శివంగ్ కుమార్, ఆర్యన్ పాండే, రాహుల్ బాథమ్, త్రిపురేష్ సింగ్, మంగేశ్‌ యాదవ్, మాధవ్‌ తివారి (ఫిట్‌నెస్‌ ఆధారంగా).

    చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'

  • టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఊహించని షాకిచ్చాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025 సీజన్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ పాటిల్‌ స్వయంగా వెల్లడించాడు.

    కాగా ప్రస్తుత టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్‌ విజయ్‌ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఆడాలని.. లేదంటే తమ దేశవాళీ జట్ల తరఫున కనీసం రెండు మ్యాచ్‌లైనా ఆడాలని ఆదేశించింది.

    ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాల్సిందే
    డిసెంబరు 24 నుంచి ఈ దేశీ వన్డే టోర్నీ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) సహా ప్రతి ఒక్కరు ఈ నిబంధన పాటించాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి అన్‌ఫిట్‌ అన్న సర్టిఫికెట్‌ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.

    ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రాబబుల్స్‌ జట్టులో కోహ్లి పేరు కనిపించింది. మరోవైపు.. తాజాగా ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) మాత్రం టీమిండియా సీనియర్లలో చాలా మంది విజయ్‌ హజారే ట్రోఫీకి అందుబాటులో లేరని తెలిపింది. ముఖ్యంగా భారత జట్టు దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ప్రశ్న ఎదురుకాగా ఎంసీఏ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ పాటిల్‌ మాట దాటవేశాడు.

    అందుబాటులో లేరు
    టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై జట్టుకు చెందిన టీమిండియా ఆటగాళ్లలో ప్రస్తుతానికి ఎవరూ మాకు అందుబాటులో లేరు. అలాంటపుడు వారిని జట్టులో చేర్చడం సరికాదు కదా!.. వారికి బదులు యువ ఆటగాళ్లకు జట్టులో చోటునిస్తాం’’ అని సంజయ్‌ పాటిల్‌ తెలిపాడు.

    కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా.. మనుపటి కంటే సన్నబడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, విజయ్‌ హజారే ట్రోఫీకి అతడు ఎందుకు అందుబాటులో లేడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు శివం దూబే కూడా ముంబై జట్టులో ఉండటం లేదు.

    వారికే సడలింపు
    టీ20 ప్రపంచకప్‌-2026 నాటి వీరు పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండటం.. గాయాల బారిన పడకుండా ఉండటం అత్యంత ముఖ్యం. అందుకే వీరికి సడలింపు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడిన టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అనారోగ్యం వల్ల ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

    ఇక గాయం నుంచి కోలుకుంటున్న ముంబై మాజీ సారథి అజింక్య రహానే సైతం ఈ టోర్నీకి దూరం కానుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌దీ ఇదే పరిస్థితి అని సమాచారం. ఈ నేపథ్యంలో శార్దూల్‌ ఠాకూర్‌ కెప్టెన్సీలోని ముంబై జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌, అతడి తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇషాన్‌ ముల్‌చందానికి తొలిసారిగా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా డిసెంబరు 24- జనవరి 8 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ గ్రూప్‌ దశ జరుగనుంది.

    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

  • యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. తన హోమ్ గ్రౌండ్ అయిన అడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 

    హెడ్ 142 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు ఓపెనర్ వెథరాల్డ్ (1) ఔట్ కావడంతో ఆదిలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ సమయంలో హెడ్‌.. వెటరన్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా(40) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 

    అనంతరం ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో హెడ్‌తో పాటు అలెక్స్ కారీ(52) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హెడ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

    హెడ్‌ సాధించిన రికార్డులు ఇవే..
    👉అడిలైడ్ ఓవల్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ సరసన హెడ్‌ నిలిచాడు. ఈ మైదానంలో హెడ్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో హెడ్ కంటే ముందు మైఖేల్ క్లార్క్ (7), రికీ పాంటింగ్ (6) ఉన్నారు.

    👉ఆస్ట్రేలియాలోని ఒకే వేదిక‌లో వ‌రుస‌గా నాలుగు టెస్టు సెంచ‌రీలు చేసిన ఐదో ప్లేయ‌ర్‌గా హెడ్ నిలిచాడు. అడిలైడ్‌లో హెడ్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో టెస్టు సెంచ‌రీ. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మాన్, వాలీ హమ్మండ్, మైఖేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ వంటి లెజెండ్స్ ఉన్నారు.
     

Telangana

  • హైదరాబాద్:  సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్‌ 19వ తేదీ) రాత్రి ఇస్లామియా హైస్కూల్‌ ఎదురుగా ఉన్న శ్రీరామ ఎంటర్‌ప్రైజస్‌ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

    దీనిపై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటీనా అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. పక్క షాపులకు సైతం మంటలు వ్యాపించాయి. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది తెలియరాలేదు. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీలు)పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ తొమ్మిది జిల్లాల డీసీసీబీలను రద్దు చేస్తూ.. వాటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ తొమ్మిది జిల్లాల డీసీసీబీలకు పర్సన్‌ ఇన్‌ఛార్జులుగా జిల్లా కలెక్టర్లను నియమించింది. వారు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు పూర్తయ్యే వరకు బాధ్యతలు కొనసాగిస్తారు. డీసీసీబీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టర్లే తాత్కాలిక నిర్వాహకులుగా వ్యవహరించనున్నారు.

    పునర్వ్యవస్థీకరణ
    కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య ద్వారా సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైతులు, సహకార సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సేవలు అందించే డీసీసీబీలను కొత్త జిల్లాల ప్రకారం పునర్నిర్మించనున్నారు. 

    ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వం సహకార రంగంలో శక్తివంతమైన నియంత్రణను కొనసాగించాలనే ఉద్దేశ్యం స్పష్టమవుతోంది. కలెక్టర్ల నియామకం ద్వారా తాత్కాలికంగా రాజకీయ ప్రభావం తగ్గి, పరిపాలనా నియంత్రణ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం రైతాంగం, సహకార సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. కొత్త జిల్లాల ప్రకారం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు కలెక్టర్లే డీసీసీబీలను నడిపించనున్నారు.

  • హైదరాబాద్: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) శ్రీ జ్ఞానేశ్ కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం సందర్శన కూడా ఉంది.

    మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఈసీకి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శ్రీ సి. సుదర్శన్ రెడ్డి సహా ఎన్నికల విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయలుదేరి, సాయంత్రం 6.30 గంటలకు భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకోనున్నారు.

    హైదరాబాద్ పర్యటనలో భాగంగా శ్రీ జ్ఞానేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు)తో రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం వంటి ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించనున్నారు. శ్రీశైలం పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక, భక్తి పరమైనదిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అధికారిక సమావేశాలు లేవని అధికారులు తెలిపారు. ఈ పర్యటనను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • హైద‌రాబాద్: ఈఎస్‌జీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా లేక‌పోతే అంత‌ర్జాతీయ పోటీలో మ‌నుగ‌డ సాధించ‌లేమ‌ని, అందువ‌ల్ల యాజ‌మాన్య స్థానాల్లో ఉంటున్న ప్ర‌తి ఒక్క‌రూ వీటి గురించి అర్థం చేసుకుని, త‌మ ఉత్ప‌త్తుల‌న్నీ వాటికి క‌ట్టుబ‌డేలా చూసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ అన్నారు. హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో బేగంపేట‌లోని హోట‌ల్ ప్లాజాలో శుక్ర‌వారం నిర్వ‌హించిన ఈఎస్‌జీ లీడ‌ర్‌షిప్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌యేష్ రంజ‌న్ మాట్లాడుతూ, ‘‘కొన్ని రోజుల క్రిత‌మే మేం తెలంగాణ రైజింగ్ పేరుతో ఇటీవ‌లే గ్లోబల్ సమ్మిట్ అనే పెద్ద స‌ద‌స్సు నిర్వ‌హించాం. 

    అందులో భాగంగా విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల చేశాం. 2047 నాటికి..l. భార‌త‌దేశం 30 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎద‌గాలంటే మ‌న రాష్ట్రం వాటా అందులో ఎంత ఉండాల‌న్న‌ది ఒక ల‌క్ష్యం రూపొందించుకున్నాం.  చాలా లోతుగా చ‌ర్చించి దీన్ని రూపొందించాం. మీరు కూడా మ‌న రాష్ట్రంలోని స్టార్ట‌ప్‌లు ఏం చేస్తున్నాయి, ఏం సాధించాయ‌న్న వివ‌రాల‌తో ఒక మంచి ప‌త్రం రూపొందించండి. వాటికి మేం ప్ర‌భుత్వ‌ప‌రంగా ఏం చేయగ‌ల‌మో చూసి త‌ప్ప‌క చేస్తాం. ఒక్కో దేశానికి ఒక్కో త‌ర‌హా రిపోర్టింగ్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఆ దేశ చ‌ట్టాల‌ను బ‌ట్టి మ‌నం మ‌న రిపోర్టులు ఇవ్వాలి. వాటిని ఆడిట్ చేయ‌గ‌లిగేలా ఉండాలి. హెచ్ఎంఏ ఆధ్వ‌ర్యంలో స‌ర్టిఫికేష‌న్ కోర్సు ప్రారంభించ‌డం చాలా బాగుంది. మీరు చేస్తున్న‌దానివ‌ల్ల‌ ఈ న‌గ‌రం, రాష్ట్రం, దేశం కూడా బాగుప‌డ‌తాయి. అందువ‌ల్ల మ‌న‌మంతా హృద‌య‌పూర్వ‌కంగా దీన్ని స్వాగ‌తించాలి. 

    ఫార్మా, లైఫ్ సైన్సెస్, బ‌యోటెక్నాల‌జీ రంగాలు తెలంగాణ‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. 93 దేశాల‌కు ఇక్క‌డినుంచి ఉత్ప‌త్తులు వెళ్తాయి. కానీ, ఇటీవ‌ల యూర‌ప్ నుంచి ఒక అల్టిమేటం వ‌చ్చింది. మీరు ఈఎస్‌జీకి అనుగుణంగా లేక‌పోతే మీ ఉత్ప‌త్తులు నిషేధిస్తామ‌ని చెప్పారు. ఇది చాలా తీవ్ర‌మైన ముప్పు. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు ఇది అవ‌స‌రం. అమెరికా పెద్ద మార్కెట్ అయినా, అక్క‌డి సుంకాల కార‌ణంగా మ‌నం యూరోపియ‌న్ మార్కెట్ల‌పై దృష్టిపెట్టాలి. అందుకు ఈఎస్‌జీకి క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. అందుకే మీరు చేస్తున్న కార్య‌క్ర‌మం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎగుమ‌తుల ద్వారానే తెలంగాణ 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను సాధించ‌గ‌ల‌దు. రాబోయే 22 ఏళ్ల‌లో మ‌న ఎగుమ‌తులు ప‌దిరెట్లు పెరుగుతాయి. 

    ఈఎస్‌జీ అంటే ఎన్విరాన్‌మెంట‌ల్, సోష‌ల్, అండ్ గ‌వ‌ర్నెన్స్.. అంటే మ‌న ఉత్ప‌త్తులు ప‌ర్యావ‌ర‌ణానికి చేటు చేయ‌కూడ‌దు, స‌మాజానికి మంచి చేయాలి, పాల‌నాప‌ర‌మైన నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండాలి. స‌రిగ్గా ఈ విష‌యంలోనే హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈఎస్‌జీ లీడ‌ర్‌షిప్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం బాగుంది. ఇప్పుడు చాలా కంపెనీల్లో మ‌హిళ‌లు అగ్ర‌, నాయ‌క‌త్వ స్థానాల్లో ఉంటున్నారు. వీరంద‌రూ కూడా ఈఎస్‌జీ నిబంధ‌న‌ల‌ను అర్థం చేసుకుని, వాటికి త‌గిన‌ట్లుగా త‌మ ఉత్ప‌త్తులు ఉండేలా చూసుకుంటే అంత‌ర్జాతీయ పోటీలో మ‌నం నిల‌బ‌డ‌గ‌లం. ఇలాంటి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డం ద్వారా హైద‌రాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేష‌న్ స‌భ్యులు కాలానికి త‌గిన‌ట్లుగా రూపాంత‌రం చెంది.. త‌మ‌ను తాము నిరూపించుకుంటార‌ని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.

    న‌లంద‌లో నెట్ జీరో ల‌క్ష్యం ఇలా సాధించాను: ప్రొఫెస‌ర్ సున‌య‌నా సింగ్ 
    న‌లంద విశ్వ‌విద్యాల‌య మాజీ వైస్ ఛాన్స్‌ల‌ర్ ప్రొఫెస‌ర్ సున‌య‌నా సింగ్ మాట్లాడుతూ, ‘‘నేను న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో బాధ్య‌త‌లు చేప‌ట్టేస‌రికి అదంతా బంజ‌రు భూమిలా ఉండేది. ఒకే ఒక్క అంత‌ర్జాతీయ విద్యార్థి ఉండేవారు, మొత్తం విద్యార్థుల సంఖ్య కేవ‌లం 28 మాత్ర‌మే. నేను వెళ్లేస‌రికి వెయ్యి మంది విద్యార్థుల‌య్యారు. మొత్తం 455 ఎక‌రాల భూమిని ప‌చ్చ‌గా మార్చ‌గ‌లిగాం. అందులో 300 ఎక‌రాలు కేవ‌లం మొక్క‌లే ఉంటాయి. మొద‌ట్లో నాకు చిన్న గ‌ది ఉండేది. 2017లో నేను చేరాను, 2019 నాటికి కొత్త ప్రాంగ‌ణంలో ఉన్నాము. కొవిడ్ స‌మ‌యంలో కూడా త‌గిన‌న్ని నిర్మాణాలు చేశాం. ఇవ‌న్నీ నెట్ జీరో విధానంలోనే ఉంటాయి. అస‌లు ముందు అప్ప‌టి రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ నేరుగా న‌న్ను సంప్ర‌దించారు. ఈ మొత్తం ప్రాంగ‌ణాన్ని పున‌ర్నిర్మించాల‌న్నారు. ఆయ‌న న‌మ్మ‌కం న‌న్ను చాలా భ‌య‌పెట్టింది. 

    అయినా ఒక ప్ర‌య‌త్నం చేయాల‌ని.. అక్క‌డ చేరి, ముందుగా నెట్ జీరో క‌మిటీ ఏర్పాటుచేశాను. వ‌రుస‌గా వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వాల్లో నాకు చాలా మ‌ద్ద‌తు ల‌భించింది. ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ గానీ, త‌ర్వాత వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్, ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి లాంటివారు నెట్ జీరో ల‌క్ష్యం చూసి ఎంతో ప్రోత్స‌హించారు. తర్వాత నేను ఇఫ్లూకు రాక‌ముందు లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి గారి పేరుతో ఉన్న ఒక రెండు దేశాల ప‌రిశోధ‌న సంస్థ‌కు నాయ‌క‌త్వం వ‌హించాను. 

    భార‌త్, కెన‌డాల‌కు చెందిన దాదాపు 98 ఉన్న‌త‌స్థాయి విద్యాసంస్థ‌లు దానికి అనుబంధంగా ఉండేవి. అందులో ప్ర‌ధానంగా ఇంగ్లీషు భాష‌లో పీహెచ్‌డీలు చేసేవారు. దానికి అప్ప‌టి కేంద్ర మాన‌వ‌న‌రుల శాఖ మంత్రి ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి ఎంత‌గానో ప్రోత్సాహం క‌ల్పించారు. యాజ‌మాన్యాలు ఎప్పుడూ ఒక విష‌యం ప్రాక్టీసు చేయాలి. మ‌న‌కు ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. అవి విజ‌న్, విధానాలు. ఏదో సాధించాల‌న్న ల‌క్ష్యం లేక‌పోతే మ‌నం ముందుకు వెళ్ల‌లేం. అది సాధించాలంటే మ‌న‌కు కొన్ని స్ప‌ష్ట‌మైన విధానాలు ఉండాలి. ముందుగా భాగ‌స్వాములంద‌రినీ ఒక తాటిమీద‌కు తెచ్చి, స‌రైన విధానాలు ఏర్ప‌రుచుకోవాలి. అప్పుడే మ‌న రంగంలో మ‌నం విజ‌యాలు సాధించ‌గ‌లం’’ అని తెలిపారు.

    ప్రపంచవ్యాప్తంగా ఈ ఎస్ జి పైన జరుగుతున్న ఈ చర్చలు నేపథ్యంలో మనము 2% టెంపరేచర్ తగ్గించడం చేస్తున్నాము ఇందులో భాగంగా భారతదేశ ప్రభుత్వం కూడా 2070కి కార్బన్ నెట్ జీరో ది గూగుల్ తీసుకోండి తెలంగాణ ప్రభుత్వము తమ రైసింగ్ తెలంగాణ గ్లోబల్ సిమెంట్ లో 2047 కే కార్బన్ 80 గోల్ తీసుకుంది , 3 ట్రిలియన్ ఎకనామితో పాటు అందరినీ ఇంక్లూజివ్ గా సోషల్ గా అందరిని తెలుసుకోవాలని తీసుకొని దాంతోపాటు 2047 కి కార్బన్ నెట్ 0 వైపు తీసుకెళ్తుంది ఇందులో ప్రతి తెలంగాణ పౌరుడు కూడా వారి రూల్ ప్లే చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా హెచ్ఎం వాళ్ళు చేసింది ఈ సదస్సు ఈ ఆక్టివిటీ ఆ దృక్పథం వైపు తీసుకెళ్తుంది,  గ్రీన్ అనేది జీవన విధానంగా ఉండాలి అనే దానిపై హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి గారు చెప్పారు

    వ్యక్తుల గ్రీన్ ప్రయత్నాలకు బహుమతులు ఇచ్చే వ్యక్తిగత గ్రీన్ స్కోర్ కార్డ్. సుస్థిరతపై పనిచేసే నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు విద్యార్థులను గ్రీన్ జాబ్స్ వైపు మార్గనిర్దేశం చేయడానికి HMA ESGపై సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌తో ముందుకు వస్తోందని ఉపాధ్యక్షుడు శరత్ చంద్ర మరోజు అన్నారు.

    ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా.. ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ అధిప‌తి మ‌నీషా సాబూ, ఐఎంటీ హైద‌రాబాద్ డీన్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌హ‌ర్ష‌రెడ్డి, స్వ‌తంత్ర మీడియా, క‌మ్యూనికేష‌న్స్ నిపుణుడు సురేష్ కొచ్చాటిల్, మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ హైదరాబాద్‌కు చెందిన అనిర్బ‌న్ ఘోష్‌, ధ్రుమ‌తారు క‌న్స‌ల్టెంట్స్ సీఈఓ, హెచ్ఎంఏ యాజ‌మాన్య క‌మిటీ  స‌భ్యురాలు చేత‌నా జైన్ త‌దిత‌రులు పాల్గొని త‌మ విలువైన అభిప్రాయాలు వెల్ల‌డించారు.

  • హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా స్థల సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు, ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాలు మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంటాయని తెలిపారు. నిర్వహణ, పర్యవేక్షణ పనులు కూడా మరింత సులభంగా నిర్వహించగలిగే అవకాశం ఉంటుందన్నారు.

    సాంప్రదాయంగా దిమ్మెల మీద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే కనీసం 30–35 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుందని, కాంక్రిట్ దిమ్మెల నిర్మాణం, క్యూరింగ్ ప్రక్రియకు సుమారు వారం రోజుల సమయం పడుతుందని సీఎండీ వివరించారు. అదనంగా హెచ్‌జీ ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, ఏబీ స్విచ్ వంటి ఉపకరణాలను ప్రత్యేకంగా మరో పోల్ పై ఏర్పాటు చేయాల్సి రావడం వల్ల పీటీఆర్‌ దిమ్మె శుభ్రత లోపించి పోల్ చుట్టూ చెత్త పేరుకుపోయే అవకాశం ఉండటంతో నిర్వహణ పనులు సిబ్బందికి కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.

    దీనికి ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్న ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో, కేవలం 377 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన 11 మీటర్ల గుండ్రటి పోల్‌పై 6-9 అడుగుల ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయవచ్చు. HG ఫ్యూజ్ సెట్, డిస్ట్రిబ్యూషన్ బాక్స్, AB స్విచ్ వంటి అన్ని ఉపకరణాలను పోల్‌పైనే అమర్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విధానంలో కేవలం ఒక్క రోజులోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పూర్తి చేయవచ్చు. బకెట్ లాడర్ సహాయంతో కేవలం ఒక్క సిబ్బంది సులభంగా మరియు సురక్షితంగా నిర్వహణ పనులు చేపట్టగలడని తెలిపారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న UG కేబుల్స్‌ను కూడా ఈ పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎంతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు.

    ప్రస్తుతం ఈ విధానంలో 63 కేవీఏ, 100 కేవీఏ, 160 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను 11 మీటర్ల ఎత్తు గల పోల్‌లపై ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇవి ప్రధాన రహదారులపై రవాణాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇరుకైన గల్లీల్లో రవాణా చేయడంలో కొంత ఇబ్బంది ఎదురవుతున్నదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు 9.5 మీటర్ల ఎత్తు గల తక్కువ ఎత్తైన పోల్‌లపై కూడా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ తెలిపారు. అదేవిధంగా అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఈ విధానంలో ఏర్పాటు చేసే అవకాశాలపై పరిశీలన జరుగుతోందని వెల్లడించారు.

    ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 304 ప్రాంతాల్లో ఈ ఆధునిక పోల్ మౌంటెడ్ విధానంలో ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 100కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లను ఈ విధానంలో విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్థ చేపడుతున్న ‘కరెంటోళ్ల ప్రజాబాట’ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రమాదకరంగా లేదా రోడ్లపై అడ్డుగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, రానున్న రోజుల్లో ఈ నూతన విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు. ఈ నూతన విధానం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆధునీకరణ, భద్రత, విశ్వసనీయత మరింతగా పెరుగుతాయని ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.

Movies

  • బిందుమాధవి, నవదీప్‌ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దండోరా.  ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.  స‌మాజంలో ప్రజల మధ్య అసమానతలను తెలియజేసే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లకు రానుంది.

    మూవీ రిలీజ్‌ దగ్గర పడడంతో దండోరా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దండోరా టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు చైతూ. ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వివక్షను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చివర్లో 'కల్లు మత్తు కాదు కదా సార్.. రాత్రి తాగింది దిగడానికి.. కులం మత్తు.. అందుకే టైమ్ పట్టింది' అనే డైలాగ్‌ వింటే కథేంటో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీ, నందు, రవికృష్ణ, మణిక, మౌనిక కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

     

     

     

  • టైటిల్: గుర్రం పాపిరెడ్డి
    దర్శకత్వం: మురళీ మనోహర్‌
    నటీనటులు: నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులు
    విడుదల తేదీ: డిసెంబర్ 19, 2025

    హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్‌పైనే కాస్తా బజ్‌ నెలకొంది. నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

    గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..

    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్‌ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్‌ దోపిడీకి పాల్పడతాడు. ‍అది విఫలం కావడంతో  మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్‌ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.

    ఎలా ఉందంటే..

    డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌ స్టోరీలు మన టాలీవుడ్‌లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్‌కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్‌ ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో  పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్‌తోనే అలరించాడు.ఫస్‌ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు.

    సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది.  స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్‌కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ  ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ‍అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్  అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్‌ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్‌పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్‌లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.

    సింపుల్‌ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది.  కోర్టు రూమ్‌ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్‌నెస్‌ కనిపించదు. ప్రీ క్లైమాక్స్‌ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్‌ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.

    ఎవరెలా చేశారంటే.

    లీడ్‌ రోల్‌లో నరేశ్‌ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్‌కుమార్‌.. చిలిపిగా వంశీధర్‌గౌడ్‌, గొయ్యి పాత్రలో జీవన్‌  తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్‌ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్‌ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

    రేటింగ్: 2.75/5

  • రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్‌టీరియస్‌’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయ్ వల్లందాస్ నిర్మాతగా వ్యవహరించాడు. నేడు(డిసెంబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

    కథేంటంటే.. 
    కొండాపూర్‌ ఎస్సై రాంఖీ అలియాస్‌ రామ్‌ కుమార్‌(అబిద్‌ భూషన్‌) మిస్‌ అవుతాడు. 15 రోజులు అయినా అతని ఆచూకీ లభించదు. దీంతో రాంఖీ మిస్సింగ్‌ కేసును చేధించడానికి ఏసీపీ ఆనంద్‌ సాయి(బలరాజ్‌ వాడి) రంగంలోకి దిగుతాడు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్చర్‌ విరాట్‌(రోహిత్‌ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్‌)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? విరాట్‌ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను ఇల్లీగల్‌గా  ఓ గన్‌ని ఎందుకు కొన్నాడు? ఇంతకీ రాంఖీ బతికే ఉన్నాడా? చనిపోయాడా? ఈ కేసును ఏసీపీ ఆనంద్‌ ఎలా సాల్వ్‌ చేశాడు? ఈ కథలో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


    ఎలా ఉందంటే..
    సస్పెన్స్ థ్రిల్లర్ కథలన్నీ ఒకేలా ఉంటాయి. ఓ వ్యక్తి మిస్‌ అవ్వడం.. ఆ కేసును చేధించే క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవ్వడం.. చివరిలో అసలు హంతకులను పట్టుకోవడం.. ఈ సినిమా కథనం కూడా అలానే సాగుతుంది. అయితే పోలీసు మిస్‌ అవ్వడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంత సేపు… మనం గతంలో వచ్చిన కొన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. ట్రయాంగ్‌ లవ్‌స్టోరీకి కొన్ని ట్విస్ట్‌లు ఆధ్యాంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. 

    ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్‌లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్‌కు అసలు కిల్లర్ ఎవరూ అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ఆడియన్‌ను కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత వరకు సక్సెస్ అయినట్టే. ఇంటర్వెల్‌ వరకు పెద్దగా ట్విస్టులు ఉండవు. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది. ఒక్కొక్కటి ట్విస్ట్ రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశారు. హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్… సినిమాను మలుపుతిప్పుతుంది. అయితే సస్పెన్స్‌  థ్రిల్లర్‌ రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈ ట్విస్ట్‌ని ఊహించొచ్చు. ఫస్టాఫ్‌ని కాస్త బలంగా రాసుకొని..సాగదీత లేకుండా జాగ్రత్త పడితే కథనం మరోలా ఉండేది.

    ఎవరెలా చేశారంటే..
    మెయిన్ లీడ్‌లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళికి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్‌ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బానే చేశాడు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ML రాజా నేపథ్య సంగీతం, పరవస్తు దేవేంద్ర సూరి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి.

  • సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్‌ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సినిమా గురించి ఓనమాలు తెలియనివాళ్లు కూడా ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నారు. టాలీవుడ్‌ చిత్రాలపై ఎలా పడితే అలా కామెంట్స్ చేసి చాలామంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి యూట్యూబ్ రివ్యూవర్స్‌పై టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ ఫైరయ్యారు. 

    తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పెద్ది మూవీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మండిపడ్డారు. ఇండస్ట్రీని ప్రయోజనం పొందుతూ కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లను పరాన్నజీవి అని పిలవడం సమంజసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ ద్వారా తనతో పాటు కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఒక సినిమా రిలీజ్‌ కాకముందే నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే తాను తినే పళ్లెంలోనే ఉమ్మేసినట్లు ఉందని విశ్వక్ సేన్‌ ఫైరయ్యారు.

    ఈ వీడియో ఓ వ్యక్తి రామ్ చరణ్ పెద్ది సినిమాను ఉద్దేశించి అవహేళన చేస్తూ మాట్లాడారు. పెద్ది మూవీ స్టోరీ మీకు తెలుసా? నాకు తెలుసంటూ దర్శకుడిని కించపరిచేలా కామెంట్స్‌ చేశారు. ఇలాంటి స్టోరీ సినిమాకు చికిరి చికిరీలు అవసరమా? అంటూ ఎగతాళి చేశాడు. ఇది చూసిన విశ్వక్ సేన్‌ తనదైన స్టైల్లో వీరికి ఇచ్చిపడేశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

     

  • అందాల అపరంజిలా హీరోయిన్ నిధి అగర్వాల్

    బ్లాక్-వైట్ బార్బీ బొమ్మలా రుక్మిణి వసంత్

    హీరోయిన్ కృతి సనన్ చెల్లి బర్త్ డే సెలబ్రేషన్

    చీరలో వయ్యారాలు పోతున్న దీపిక పిల్లి

    వింటేజ్ హాలీవుడ్ బ్యూటీలా దిశా పటానీ

    మూడ్ ఇదే.. క్యూట్ అండ్ స్వీట్ సంయుక్త 

     

  • నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్‌గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు సడన్‌గా మూవీలో మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిన్నపాటి షాకిచ్చారు.

    'ద ప్యారడైజ్' మూవీలో నానితో పాటు మోహన్ బాబు నటిస్తున్నారు. హిందీ నటుడు రాఘవ్ జూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇది తప్పితే మిగతా నటీనటుల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడు ఈ మూవీలో తెలుగు కమెడియన్ సంపూర్ణేశ్ బాబు కూడా ఉన్నట్లు బయటపెట్టారు. బిర్యానీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

    సంపూ ఇప్పటివరకు కామెడీ సినిమాల్లో హీరోగా, సహాయ నటుడిగా చేశాడు. మధ్యలో ఓసారి బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. గత కొన్నాళ్ల నుంచి అయితే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేదు. అలాంటిది ఇప్పుడు 'ప్యారడైజ్'లో మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన చేయి, భుజంపై గొడ్డలి చూస్తుంటే అసలు ఇది సంపూర్ణేశ్ బాబుయేనా అని సందేహం రాకమానదు.

  • రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ నటించిన తాజా చిత్రం ‘ఓహ్‌!’. జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    ఈ సినిమా కథంతా కృష్ణ, రాజు, కావ్య, దృశ్య నలుగురు ఫ్రెండ్స్  మధ్య కథ సాగుతుంది. కృష్ణ (రఘురామ్)కి క్రోమోఫోబియో అనే వింత వ్యాధి ఉంది. దాని వల్ల దృశ్య(నైనా) అనే అమ్మాయితో ఉన్న సంబంధం గుర్తించుకోలేకపోతాడు. అంతేకాదు కొత్తగా కావ్య(శృతి శెట్టి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ - ఈ రెండింటి మధ్య కృష్ణ పడే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మన భారతీయ గ్రంథాలలోని అంశాలను ఉపయోగించి అతను ఈ సమస్యను ఎలా అధిగమించాడు అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం.

    ఎలా ఉందంటే.. 
    ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణంలా ఈ సినిమా కథనం సాగుతుంది. చక్కటి ప్రేమకథతో పాటు భారతీయ గ్రంథాలలోని గొప్పతనాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. క్రోమోఫోబియా వంటి కొత్త పాయింట్‌ కూడా టచ్‌ చేశారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పొంతనలేని సన్నివేశాలు వచ్చి వెల్లడంతో ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినట్లుగా అనిపిస్తుంది. పైగా అసలు కథ ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ద్వితియార్థంలోనే మెయిన్‌ స్టోరీ ఉంటుంది. ప్రేమ, భావోద్వేగాలను  బ్యాలెన్స్ చేస్తూ సన్నివేశాలను రాసుకున్నాడు.మనదేశ సంస్కృతిని చిత్రంలో గొప్పగా చూపించారు.  సైన్స్‌ను - మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు బాగుంది. కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం సినిమాకు మారింతా అందాన్ని తెచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

    ఎవరెలా చేశారంటే..
    కృష్ణ పాత్రలో రఘు రామ్ బాగా నటించాడు. గందరగోళానికి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా తన నటనతో మెప్పించాడు.శృతి శెట్టి & నైనా పాఠక్ ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో వీరి నటన ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నవనీత్ చారి అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తాజ్ మహల్ నేపథ్యంలో వచ్చే సాంగ్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

  • ఈ వారం థియేటర్లలోకి 'అవతార్ 3' వచ్చింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇదేమంత కొత్తగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటిలో సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, డొమినిక్ ద లేడీస్ పర్స్, మఫ్టీ పోలీస్, దివ్యదృష్టి చిత్రాలతో పాటు నయనం, ఫార్మా సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.

    (ఇదీ చదవండి: ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ మూవీ రివ్యూ)

    ఇ‍ప్పుడు తమిళ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. గత నెల 21న థియేటర్లలో రిలీజై హిట్ అయిన మూవీ 'మిడిల్ క్లాస్'. సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మునిష్ కాంత్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. విజయలక్ష‍్మీ ఇతడి సరసన నటించింది. మిడిల్ క్లాస్ కష్టాలపై దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ మూవీ వచ్చే బుధవారం (డిసెంబరు 24) నుంచి జీ5 ఓటీటీలోకి రానుంది.

    'మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. నిత్యం ఆర్థిక ఇబ్బందులు, నెల తిరిగేసరికి కట్టాల్సిన ఈఎంఐలు, బడ్జెట్ లెక్కలు.. ఇలా సగటు మధ్యతరగతి కష్టాలతో బాధపడే ఓ కుటుంబానికి.. తమ సమస్యలన్నీ ఒకేసారి తీరిపోయే అరుదైన అవకాశం వస్తుంది. మరి అప్పుడు ఆ ఫ్యామిలీ ఏం చేసింది? తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటి? అనేదే మిగతా స్టోరీ. కిశోర్ రామలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ఎమోషనల్ చేస్తుంది. ఇప్పటికైతే తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని చెప్పారు. త్వరలో తెలుగు డబ్బింగ్‌ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.

    (ఇదీ చదవండి: దురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!)

  • ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనం ‘అవతార్‌’. హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్‌ వండర్‌ ఇది. 2009లో రిలీజైన ఈ చిత్రం.. అతిపెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు వెండితెరపై చూడని విజువల్స్‌ని చూపించి..సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లాడు కామెరూన్‌. ఈ సినిమాకు కొనసాగింపుగా నాలుగు సీక్వెల్స్‌ ఉంటాయని అప్పుడే ప్రకటించిన కామెరూన్‌.. పార్ట్‌ 2 అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ ని 2022లో రిలీజ్‌ చేశాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్‌ పరంగా మాత్రం రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు అవతార్‌కి రెండో సీక్వెల్‌గా ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’(Fire And Ash Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    పెద్ద కొడుకు నితాయాం చనిపోయిన తర్వాత జేక్‌ సల్లీ(శ్యామ్‌ వర్తింగ్టన్‌), నేతిరి(జో సల్డానా) జంట తీవ్రమైన విషాదంలో కూరుకొనిపోతుంది. మిగిలిన పిల్లలు లోక్‌(బ్రిటన్‌ డాల్టన్‌), టూక్‌(ట్రినిటీ జో-లి బ్లిస్), కిరి (సిగౌర్నీ వీవర్)తో పాటు దత్తపుత్రుడు స్పైడర్‌(జాక్‌ ఛాంపియన్‌)ని కాపాడుకుంటూనే.. కొడుకు చావుకు కారణమైన మానవ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవుతారు. 

    అదే సమయంలో అవతార్‌ 2లో చనిపోయిన కల్నల్‌ క్వారిచ్‌(స్టీఫెన్‌ లాంగ్‌).. నావి తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని వస్తాడు. అతనికి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్‌(ఊనా చాప్లిన్‌) సహాయం చేసేందుకు ముందుకు వస్తుంది. వరంగ్‌కి జేక్‌ సల్లీ ప్యామిలీ కొలిచే ఈవా దేవత అంటే నచ్చదు. అదే కోపంతో కల్నల్‌ క్వారిచ్‌తో చేతులు కలుపుతుంది. మరోవైపు పండోరా గ్రహాన్ని నాశనం చేయాలనుకున్న ఆర్డీఏ బృందం కూడా వీరికి తోడుగా నిలుస్తుంది. బలమైన ఈ ముగ్గురు శత్రువుల నుంచి జేక్‌ సల్లీ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే అవతార్‌ 3(Avatar 3 Review) కథ. 

    ఎలా ఉందంటే..
    ‘అవతార్‌’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను చూపించిన జేమ్స్‌ కామెరూన్‌.. పార్ట్‌ 2 సముద్ర గర్భంలోని సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అయితే అవతార్‌ 2 సమయంలోనే కథ-కథనంపై  విమర్శలు వచ్చాయి. కానీ విజువల్స్‌ అద్భుతంగా ఉండడంతో సినిమాకు భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక మూడో భాగంగా వచ్చిన ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’లోనూ కథ- కథనమే మైనస్‌ అయింది.  విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. కానీ కథ-కథనంలో మాత్రం కొత్తదనం లేదు. విజువల్స్‌ చూడడానికి బాగున్నా.. వావ్‌ ఫ్యాక్టర్‌ మాత్రం మిస్‌ అయింది. 

    అవతార్‌, అవతార్‌ 2లో చూసిన సన్నివేశాలే.. పార్ట్‌ 3లోనూ కనిపిస్తాయి. అగ్నితెగ ఒక్కటి ఇందులో యాడ్‌ చేశారు. అంతకు మించి పార్ట్‌ 2కి, పార్ట్‌ 3కి పెద్ద తేడా లేదు. పైగా నిడివి చాలా ఎక్కువగా (దాదాపు 3 గంటల 17 నిమిషాలు) ఉండడంతో .. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ ప్రేక్షుకుడి సహనానికి పరీక్షలా మారుతుంది. చూసిన సన్నివేశలే మళ్లీ మళ్లీ రావడం.. కథ అక్కడక్కడే తిరగడంతో ‘విరామం’ పడితే బాగుండేది కదా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

    ఉన్నంతలో సెకండాఫ్‌లో కథ కాస్త పరుగులు పెడుతుంది. వరంగ్‌, కిరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. అలాగే స్పైడర్‌ పాత్ర నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లు హృదయాలను హత్తుకుంటాయి.  బంధీ అయిన జేక్‌ సల్లీని విడిపించేందుకు నేతిరి రావడం..ఈ క్రమంలో వచ్చే పోరాట ఘట్టాలు బాగుంటాయి. క్లైమాక్స్‌ విజువల్స్‌ పరంగా బాగున్నా.. అవతార్‌ 2లోని క్లైమాక్స్‌ని గుర్తు చేస్తుంది. మొత్తంగా జేమ్స్ కామెరూన్ మార్క్ ఎమోషన్, స్క్రీన్‌ప్లే ఈ చిత్రంలో మిస్‌ అయింది. వీఎఫెక్స్‌ పనితీరు మాత్రం ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టుల కంటే బాగుంటుంది. కథ పరంగా చూస్తే.. అవతార్‌ 3 రొటీన్‌ చిత్రమే కానీ.. సాంకేతికంగా మాత్రం అవతార్‌ 3 ఓ అద్భుతమే. విజువల్ గ్రాండియర్ కోసమే అయినా ఈ సినిమాను తెరపై ఒక్కసారి చూడొచ్చు. 

    ఎవరెలా  చేశారంటే.. 
    జేక్‌ సెల్లీ పాత్రకు  సామ్‌ వర్తింగ్టన్‌ పూర్తి న్యాయం చేశాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్‌ సీన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేతిరి పాత్రలో జో సల్డానా ఒదిగిపోయింది. పార్ట్‌ 2తో పోలిస్తే..ఇందులోనే ఆమెకు ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ పడ్డాయి. ఇక ఈ సినిమాకు కొత్తతనం తెచ్చిన పాత్ర వ‌రంగ్. ఆ  పాత్రలో ఊనా చాప్లిన్ జీవించేసింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలలో ఆమె నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.  సిగర్నీ వీవర్‌, బ్రిటన్‌ డాల్టన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

    సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. , రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మరో ప్రధాన బలం. సైమన్ ఫ్రాంగ్లెన్ నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో కట్‌ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను తొలగించినా.. అసలు కథకు ఇబ్బందేమి లేదు. అలాంటి సీన్లను తొలగించి నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్‌లో ఏం మాట్లాడుకుంటున్నారు?

    'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్‌ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?

    హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.

    ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్‌ని చాలా పవర్‌ఫుల్‌గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్‌ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్‌గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్‌ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.

    బాలీవుడ్‌లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్‌కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్‌తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.

    'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.

    దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్‌కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది! 

  • మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ ‍బ్యూటీ ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ మూవీ రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్‌ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్‌ ఫ్యాన్స్‌ను ‍అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

  • బిగ్‌బాస్‌ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్‌మేట్స్‌ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్‌ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. 

     మాట మార్చేసిన సుమన్‌
    ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్‌ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్‌. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్‌ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 

    4 రోజులు ఏడుస్తూనే..
    మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్‌ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్‌ విన్న జనాలు.. ఎపిసోడ్‌లో అందరం చూశాం.. ఎందుకు కవర్‌ చేయాలని చూస్తున్నావ్‌? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా

  • సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్‌ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. నటి శివాలిక ఓబెరాయ్‌ను పెళ్లాడిన ఆయన ఇవాళ శుభవార్తను పంచుకున్నారు. బేబీ పాఠక్ 2026లో వస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    ఈ జంట ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. అభిషేక్ పాఠక్‌ నిర్మించిన ఖుదా హాఫిజ్ మూవీతో శివాలిక నటించారు. అదే సమయంలో  వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అభిషేక్ పాఠక్ టర్కీలో  శివాలికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వచ్చే ఏడాదిలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా.. అభిషేక్ పాఠక్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన భార్య శివాలికి ఓబెరాయ్ మూడు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. 

     

  • పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్‌బాస్‌. 

    అరగంటలో వస్తానని..
    ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. టాప్‌ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్‌ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్‌ 9 మొదటి కెప్టెన్‌గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.

    తనకంటూ ఓ మార్క్‌
    ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్‌)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.

    మొండిధైర్యం
    ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్‌పై ఆసక్తి క్రియేట్‌ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్‌ ఇవ్వాల్సిందే!

     

  • అభిమాన హీరో ఆటోగ్రాఫ్‌ ఇస్తే ఆనందంలో మునిగి తేలుతారు. సెల్ఫీ ఇస్తే సంతోషంతో ఉప్పొంగిపోతారు. కానీ, ఆ హీరో ఏకంగా తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో భాగమైతే.. ఇంకేమైనా ఉందా? అది జీవితంలో మర్చిపోలేని బహుమతి అవుతుంది. నటుడు చరణ్‌కు ఇలాంటి సర్‌ప్రైజే ఇచ్చాడు హీరో సూర్య. చరణ్‌​ కుమారుడి చర్విక్‌ మొదటి బర్త్‌డేను వారి కుటుంబానికి లైఫ్‌లాంగ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు. బుడ్డోడిని ఎత్తుకుని ఆడించాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

    బంగారు గొలుసు కానుక
    పిల్లవాడి మెడలో బంగారు గొలుసును వేశాడు. చర్విక్‌ను అతడి తల్లి ఎత్తుకుని ఉండగా సూర్య ఎంతో ఉత్సాహంగా గోల్డ్‌ చైన్‌ను బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో చరణ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. లెజెండరీ యాక్టర్‌ సూర్య ఇచ్చిన సర్‌ప్రైజ్‌ చూసి మా దిమ్మ తిరిగిపోయింది. మా బాబు చర్విక్‌ ఫస్ట్‌ బర్త్‌డే పురస్కరించుకుని బంగారు చైన్‌ను గిఫ్టిచ్చాడు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం అని చరణ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

    తెలుగులో సినిమా
    ఇకపోతే సూర్య చివరగా రెట్రో మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఒకటి (#Suriya46) ఆయన తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమిత బైజు హీరోయిన్‌. రవీనా టండన్‌, రాధికా శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించాడు. 

    సూర్య 47వ మూవీ
    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి 'విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే సూర్య.. రోమాంచమ్‌, ఆవేశం సినిమాల ఫేమ్‌ జీతూ మాధవన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా (#Suriya47) చేస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తోంది.

     

     

  • బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్‌పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్‌గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. 

     

     

  • బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు నటీనటులు అత్యంత విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ ఉంటారని తెలిసిదే.. వారు "రాజులా జీవించడం" అనే పదబంధానికి నిజంగా ప్రాణం పోసుకుంటారు. వారికి సంబంధించిన ఖరీదైన ఆస్తులు తరచుగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కనీసం ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణించాలనే కోరిక ప్రతి సామాన్యుడిలో ఉంటుంది. కానీ, సినిమా నటీనటులకు సొంతంగానే కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌లు కూడా ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, నయనతార వంటి వారికి లగ్జరీ జెట్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వీరందరూ ఒక్కోసారి పబ్లిక్‌ విమానంలోనే ప్రయాణం చేస్తుంటారు. కానీ, ప్రభాస్‌ మాత్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ జెట్లలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అందుకు సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి.

    ప్రభాస్ వాణిజ్య విమానాల్లో కాకుండా ప్రైవేట్ జెట్లలో మాత్రమే ప్రయాణించడానికి ఇష్టపడతారని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ అంశంలో కొందరు తనని తప్పుగా కూడా అనుకుంటూ ఉంటారు. ఇటీవల, ఒక నిర్మాతను ప్రభాస్ తన టీమ​్‌ కోసం USAకి ప్రైవేట్ జెట్ బుక్ చేయమని అడిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక కారణాలు ఊహాగానాలు వచ్చినప్పటికీ, మరికొందరు కొన్ని ప్రధాన అంశాలను తెలిపారు. ప్రభాస్‌ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదీ ఆశించరు. తన వ్యక్తిగత ప్రయాణాలు ఉంటే అందుకు కావాల్సిన డబ్బు తనే సమకూర్చుకుంటారు. సినిమాకు సంబంధించి ఏదైనా షెడ్యూల్‌ ఉంటే ఆయా నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేకానీ నిర్మాతల చేత అవసరం లేని ఖర్చులు పెట్టించరు అనే మంచి పేరు తనకు ఉంది.

    ప్రభాస్ చేతిలో ప్రస్తుతం స్పిరిట్‌, రాజాసాబ్‌, సలార్‌2, కల్కి2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, ఒక్కో చిత్రంలో ఒక్కో గెటప్‌లో ఆయన కనిపించనున్నారు. ఈ కారణం వల్లే  తన లుక్‌ను  బహిరంగంగా వెల్లడించకూడదని మేకర్స్‌ సూచిస్తారు. యాదృచ్ఛికంగా పబ్లిక్‌లో ఆయన  కనిపిస్తే అతని లుక్‌ను లీక్ చేసి వైరల్‌ చేస్తారు. గతంలో ఆది పురుష్ విడుదలకు ముందు ప్రభాస్‌ బహిరంగ ప్రదేశంలో కనిపించగానే కొందరు ఫోటోలు తీసి వైరల్‌ చేశారు. దీంతో జాతీయ స్థాయి ట్రోలింగ్‌కు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి, వాణిజ్య విమానాల్లో ప్రయాణం చేసేందుకు ఆయన ఇష్టపడరని సమాచారం. 

    వాస్తవంగా ప్రభాస్‌ జీవనశైలి ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. ఉదార ​​స్వభావంతో పలు సందర్భాల్లో భారీగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలాంటి విషయంలోనైనా సరే పూర్తిగా రాజీ పడకుండా జీవిస్తారు. స్నేహితులతో కలిసి ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సినిమా సెట్స్‌లో అందరికీ భోజనాలు తెప్పించి వారితో కలిసి  సంతోషంగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. ఎప్పుడు కూడా ఒక రాజులాగే ఉండాలని తన జీవనశైలిని ఆస్వాదిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన పేరులోనే రాజు ఉంది.. ప్రభాస్‌ జీవితం కూడా రాజులాగే ఉంటుందని తన సన్నిహితులు కూడా చెబుతుంటారు.

  • ప్రముఖ కమెడియన్‌ భారతీ సింగ్‌ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈసారి ఆమెకు మగబిడ్డ పుట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రోజు ఆమె లాఫ్టర్‌ చెఫ్‌ షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ, సడన్‌గా నొప్పులు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మరోసారి కొడుకు పుట్టాడు.

    2017లో పెళ్లి
    కాగా భారతి సింగ్‌.. యాంకర్‌, నిర్మాత, రచయిత హార్ష్‌ లింబాచియాను 2017లో పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమానురాగాలకు గుర్తుగా 2022లో కుమారుడు లక్ష్య జన్మించాడు. ఇతడిని ముద్దుగా గోల అని పిలుచుకుంటారు. గోలతో ఆడుకునేందుకు మరో బుజ్జాయి రాబోతోందన్న విషయాన్ని దంపతులిద్దరూ అక్టోబర్‌లో వెల్లడించారు. 

    ప్రెగ్నెంట్‌ అని తెలియక..
    స్విట్జర్లాండ్‌లో ట్రిప్‌లో ఉన్న సమయంలో భారతికి తాను ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసింది. అప్పటికి ఆమెకు ఏడు వారాలు. ఈ విషయం గురించి భారతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంట్‌ అని తెలియక నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్‌ చేశా.. మందు కూడా తాగాను. ఓసారి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కిట్‌ కనిపించేసరికి ట్రై చేశా.. ఆశ్చర్యంగా అది పాజిటివ్‌ వచ్చింది. 

    ఇటీవలే సీమంతం
    నా భర్తకు చెప్తే అసలు నమ్మలేదు. ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే గర్భం దాల్చానని నిర్ధారణ అయింది అని చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్‌ అని తెలియగానే ఉన్నపళంగా ఇండియా వచ్చేశారు. కానీ బేబీ పుట్టాక మిగిలిన ట్రిప్‌ కచ్చితంగా పూర్తి చేస్తానంది. నవంబర్‌లో తను బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. వారం రోజుల క్రితమే తన సీమంతం జరిగింది.

    కమెడియన్‌గా, యాంకర్‌గా..
    భారతీ సింగ్‌.. ద గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ షోలో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. కామెడీ సర్కస్‌ షోలలోనూ పాల్గొంది. ఇండియాట్‌ గాట్‌ టాలెంట్‌ 5, 7, 8వ సీజన్స్‌, కామెడీ నైట్స్‌బ చావో, ద ఖాత్ర షో,డ్యాన్స్‌ దీవానే మూడో సీజన్‌, సరిగమప లిటిల్‌ చాంప్స్‌ 2022, లాఫ్టర్‌ చెఫ్స్‌ వంటి పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. 

     

     

  • అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాడ్ తదితరులు నటించిన సినిమా 'జిన్'. చిన్మయ్ రామ్ దర్శకుడు. నిఖిల్ ఎం. గౌడ నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూవీ తాజాగా (డిసెంబరు 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    ఓ కాలేజీలోని లైబ్రరీలో ఓ కుర్రాడికి వింత అనుభవం ఎదురవుతుంది. రాత్రి ఒక్కడే ఉండటంతో అతనికి వింత శబ్దాలు, వింత ఘటనలు తారసపడతాయి. ఓ నలుగురు కుర్రాళ్లు ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు దాటి జ్ఞాన వికాస్ కాలేజీకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎదురైన సంఘటనలేంటి? ఆ బిల్డింగ్‌లో వీళ్లు ఎలా చిక్కుకున్నారు? చివరకు బయటపడ్డారా? ఇంతకీ 'జిన్' సంగతేంటనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఫస్ట్ హాఫ్ అంతా కూడా నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి, కాలేజీ సీన్లతో టైమ్ పాస్ అయిపోతుంది. కాసేపటికి తమకు ఏర్పడిన ప్రమాదం గురించి తెలుస్తుంది. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ద్వితీయార్దంలో జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, కాలేజీ బిల్డింగ్‪‪‌లో ఉన్న ఆత్మల గురించి రివీల్ చేస్తూ వెళ్లారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ని బాగా ముగించారు.

    అమిత్ రావ్ ఆకట్టుకున్నాడు. పర్వేజ్ సింబా బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పర్లేదనిపించారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. సునీల్ కెమెరా పనితనం, అలెక్స్ ఆర్ఆర్ మంచి అనుభూతి ఇచ్చింది. నవ్విస్తూనే భయపెట్టడంలో టీమ్ సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
    - రేటింగ్‌: 2.5/5

Business

  • ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. మరో ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో వాటా పెంచుకునేందుకు తాజాగా వీలు చిక్కింది. ఇందుకు ఆర్‌బీఐ అనుమతించింది. దీంతో ఇండస్‌ఇండ్‌లో వాటాను 9.5 శాతంవరకూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పెంచుకోనుంది. వాటా పెంపునకు వీలుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పెట్టుకున్న దరఖాస్తును ఆర్‌బీఐ తాజాగా ఆమోదించినట్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ 9.5 శాతంవరకూ వాటా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలియజేసింది.

    వెరసి ఇండస్‌ఇండ్‌లో మొత్తం 9.5 శాతానికి మించకుండా చెల్లించిన మూలధనంలో వాటా లేదా వోటింగ్‌ హక్కులను హెచ్‌డీఎఫ్‌సీ సొంతం చేసుకోవచ్చునని పేర్కొంది. కాగా.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అనుమతి లభించిన ఏడాదిలోగా వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుందని, లేకుంటే అనుమతులు రద్దవుతాయని వివరించింది. తాజా అనుమతికి ముందు 5 శాతంకంటే తక్కువ వాటా కలిగి ఉంటే.. మరో 5 శాతం(9.5 శాతంవరకూ) వాటాను సొంతం చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ బోర్డులో దరఖాస్తుదారు(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌) రిప్రజెంటేషన్‌కు అనుమతించరు. 

  • ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.

    బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలు

    అంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలు
    కాలుష్యంఎక్కువచాలా తక్కువ
    NOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువ
    PM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువ
    ఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppm
    డీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరి
    రియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుంది
    నిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువ
    వాహన ధరతక్కువకొంచెం ఎక్కువ
    నగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతి
    పర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలం

    BS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?
    మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్‌లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.

    ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!

  • ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.

    ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

    లక్షల వాహనాలపై ప్రభావం!
    ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.

    బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరి
    ఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.

    మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

    ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్

  • రైలు ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ట్రైన్ జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టమే. అయితే కొంతమంది మాత్రం కొన్ని రెంటర్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి.. టికెట్స్ బుక్ చేస్తున్నట్లు ఒక జాతీయ వార్తాపత్రిక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సాఫ్ట్‌వేర్‌లు ఏవి?, వాటిని ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?

    రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్‌సీటీసీ లేదా బుక్‌మైట్రిప్ వంటి కొన్ని నిర్దిష్ట యాప్స్ లేదా రైల్వే కౌంటర్స్ ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఏజెంట్స్ రెంటర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా 50 సెకన్లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. అంటే ప్రయాణికుడు IRCTC యాప్‌లోకి లాగిన్ అయ్యే సమయానికి, వాళ్లు(ఏజెంట్స్) టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట..!

    సాఫ్ట్‌వేర్ డెవలపర్లు.. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను క్రియేట్ చేస్తున్నారు. వాటి అద్దె నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్‌లను కూడా మార్చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్‌ల మార్పు కోసం మరికొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఎక్కువ మంది టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ వంటి రెంటర్ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.

    సాధారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రయాణికుడు మాన్యువల్‌గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. లాగిన్, రైలు ఎంపిక, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా, చెల్లింపు వంటి ప్రక్రియలను స్వయంగా పూర్తిచేయాలి. ఈ సమయంలో, వేలాది మంది వినియోగదారులు సిస్టమ్‌లో ఏకకాలంలో యాక్టివ్‌గా ఉంటారు, ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు ఈ ప్రక్రియలో టిక్కెట్లు పొందలేకపోతున్నారు.

    అయితే ఏజెంట్లు మాత్రమే ఇందుకు భిన్నంగా.. ఆటోమేషన్/AI సాఫ్ట్‌వేర్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సాధారణ వినియోగదారులతో పోలిస్తే చాలా రెట్లు వేగంగా సర్వర్‌కు అభ్యర్థనలను పంపుతుంది. ఈ కారణంగా సాధారణ ప్రయాణికులు టికెట్స్ వేగంగా పొందలేరు. అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రయాణికులు.. ఈ తరహా అక్రమ సాఫ్ట్‌వేర్లను వినియోగించే ఏజెంట్స్ సాయం తీసుకుంటున్నారు.

    ఐఆర్‌సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?
    ఐఆర్‌సీటీసీ ఏజెంట్స్ ఉపయోగించే రెంటల్ సాఫ్ట్‌వేర్‌లను ఆరికట్టకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన లొసుగులు. ఆటోమేషన్ అండ్ ఏఐ బేస్డ్ టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి పూర్తిగా నిషేధించే కఠినమైన చట్టాలు లేవు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టం, రైల్వే చట్టాలు, నిబంధనలు దీనిని పాక్షికంగా మాత్రమే నియంత్రిస్తున్నాయి. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే వీలు లేకుండా పోతోంది. 

    దీంతోపాటు.. టెక్నాలజీ మరో కారణంగా చెప్పవచ్చు. వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే ఐపీ అడ్రస్‌లను భారతీయ రైల్వేలు బ్లాక్ చేస్తాయి. కానీ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీలను మారుస్తారు. వీపీన్‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఈ సాఫ్ట్‌వేర్లను అరికట్టడం ఐఆర్‌సీటీసీకి సాధ్యం కావడం లేదు.

    ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్

  • భారత్‌ అంతర్జాతీయంగా నాణ్యమైన ఔషధాలను చౌక ధరలకే అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్‌ ఎగుమతులు 10 శాతం వృద్ధితో 30.47 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు చెప్పారు.

    చండీగఢ్‌లో ఫార్మా ఎగుమతులపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లడారు. ఔషధాల ఉత్పత్తిలో (పరిణామం పరంగా) భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని, విలువ పరంగా 14వ స్థానంలో ఉందన్నారు. భారత ఔషధాలు 200కు పైగా దేశాలకు వెళుతున్నట్టు తెలిపారు. ఇందులో అమెరికాకు 34 శాతం, యూరప్‌కు 19 శాతం ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ యూనిట్లతో కార్యకలాపాలు నిర్వరహిస్తున్నట్టు వెల్లడించారు.

    సుంకాలేతర అవరోధాల పరిష్కారం, నియంత్రణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, పటిష్టమైన లైఫ్‌ సైన్సెస్‌ ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ ఏర్పాటుపై దృష్టి సారించినట్టు చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్‌ పరిమాణం 60 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని, 2030 నాటికి రెట్టింపై 130 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

  • సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్‌ ఎస్‌యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ వివేక్‌ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్‌ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్‌ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్‌ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.

    మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

    సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్‌కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్‌తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్‌యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.

    ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండి

    వాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్‌టీరియర్‌, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్‌లలో వస్తోంది.

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.

    ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్‌షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.

    ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.

    ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం కొనండి.

    ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?

    గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

  • కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్‌ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీఎక్స్‌), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో 6.4 కోట్ల ఎంఎస్‌ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.

    నివేదికలో మరిన్ని అంశాలు..

    • కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్‌ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.

    • ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు.  

    • ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్‌లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్‌లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.

    • ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.

    • 2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.

    ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ

  • కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఏఎల్‌) మాజీ ఉద్యోగులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.312 కోట్ల వేతన బకాయిలను కంపెనీ మాజీ ఉద్యోగులకు చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అధికారిక లిక్విడేటర్‌కు ఈడీ బదిలీ చేసింది.

    గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఈడీ అప్పగించిన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. సెక్యూర్డ్ క్రెడిటర్ల (బ్యాంకుల) క్లెయిమ్‌ల కంటే కార్మికుల బకాయిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎస్‌బీఐ అంగీకరించింది.

    మనీలాండరింగ్ కేసు నేపథ్యం

    వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ, మాల్యాను జనవరి 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ ఇప్పటివరకు మాల్యా, కింగ్‌ఫిషర్ సంస్థలకు చెందిన దాదాపు రూ.5,042 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అదనంగా రూ.1,695 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

    రికవరీలో..

    ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో జప్తు చేసిన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియానికి అప్పగించింది. వీటి విక్రయం ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు దాదాపు రూ.14,132 కోట్లు వసూలు చేసుకున్నాయి. ‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల బకాయిలను పరిష్కరించడానికి మేము వాటాదారులతో సమన్వయం చేసుకున్నాం. ఎస్‌బీఐ అధికారులతో చర్చించి పునరుద్ధరించిన ఆస్తుల ద్వారా ఉద్యోగుల క్లెయిమ్‌లను చెల్లించేలా చొరవ తీసుకున్నాం’ అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన తర్వాత జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.

    ఇదీ చదవండి: సత్య సారథ్యంలో సమూల మార్పులు!

Politics

  • సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల జిల్లా):  బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎటువంటి నోరు విప్పకుండానే  33శాతం సీట్లను గెలుచుకున్నామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లను సిరిసిల్లలో కేటీఆర్‌ సన్మానించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు లేనట్లయితే జనవరి మాసంలో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో తమ పాత్ర పోషించాలి. రాష్ట్రంలో 66 శాతం గెలిచాం అని ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు. 66 శాతం ప్రజలు నీవైపు ఉంటే పార్టీ మారిన  పదిమంది ఎమ్మెల్యేలతోని దమ్ముంటే రాజీనామా చేయించు.

    పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరామని గతంలో బాహటంగానే చెప్పారు, ఇప్పుడేమో కాంగ్రెస్లో చేరలేదంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరియు స్పీకర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. 

    ఇది కూడా ఒక బతుకేనా?, గడ్డి పోచలాంటి పదవి కోసం సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్లు వేలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బెదిరించినా రాజ్యాంగ బద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు వచ్చే నిధులు ఎవరు ఆపలేరు. రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి మల్లీ కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుపుకుందాం’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

  • సాక్షి,తాడేప‌ల్లి: చంద్ర‌బాబు మార్క్ దోపిడీకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణే నిద‌ర్శ‌నమ‌ని, క‌మీషన్ల క‌క్కుర్తితో చంద్ర‌బాబు ప్ర‌జారోగ్యాన్ని, వైద్య విద్య అభ్య‌సించాల‌న్న పేద విద్యార్థుల క‌ల‌ను ప‌ణంగా పెడుతున్నాడ‌ని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ జ‌రిగితే యూజర్ చార్జీల రూపంలో ప్ర‌జ‌ల‌పై పెనుభారం మోప‌డం ఖాయ‌మ‌ని, వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవ‌ల‌న్నీ రాబోయే రోజుల్లో డ‌బ్బులు చెల్లించి పొందాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వివ‌రించారు. 

    మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వ‌హించిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ ప్ర‌జా ఉద్య‌మం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని, ఈ ఉద్య‌మంతో కూట‌మి నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌లైంద‌ని చెప్పారు. కాబ‌ట్టే దాన్ని త‌క్కువ చేసి చూపించేలా కూట‌మి నాయ‌కుల‌తో సంత‌కాలు చేసిన ప్ర‌జ‌ల‌ను సైకోలు అని తిట్టిస్తూ చంద్ర‌బాబు రోజురోజుకీ దిగజారిపోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వ‌స్తే  ప్రైవేటీక‌ర‌ణ‌పై విచార‌ణ జ‌రిపి అవినీతికి పాల్ప‌డిన వారిని చ‌ట్టం ముందు దోషులుగా నిల‌బెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

    ఆమె ఇంకా ఏమ‌న్నారంటే...
    మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వ‌హించిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ ప్ర‌జా ఉద్యమానికి వ‌చ్చిన స్పంద‌న చూసి కూట‌మి నాయ‌కుల గుండెల్లో వ‌ణుకు పుడుతోంది. అందుకే చంద్ర‌బాబు అండ్ కో ప్ర‌జా స్పంద‌న‌ను త‌క్కువ చేసి చూపించేందుకు ఆప‌సోపాలు ప‌డుతున్నారు. పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ సైతం మెడిక‌ల్ కాలేజీల ఆవ‌శ్య‌క‌తను నొక్కి వ‌క్కాణిస్తూ చెప్పినా ఈ ప్ర‌భుత్వం తీరులో మార్పు క‌నిపించ‌డం లేదు. క‌మీష‌న్ల పేరుతో దోచుకోవ‌డ‌మే లక్ష్యంగా ప్రైవేటీక‌ర‌ణ ముద్దు- ప్ర‌భుత్వ కాలేజీలు వ‌ద్దు అనేలా ముందుకు సాగుతున్నాడు. కోటికిపైగా సంత‌కాలు చేసిన విద్యార్థులు, యువ‌త, మేథావుల‌ను సైకోలు, దొంగ‌లు అని కూట‌మి పార్టీ నాయ‌కుల‌తో చంద్ర‌బాబు తిట్టిస్తున్నాడు. మెడిక‌ల్ కాలేజీలు వ‌ద్ద‌ని సంత‌కాలు చేసిన 1,04,11,136 మంది ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీసేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

    ప్ర‌జా పాల‌న ప‌ట్ల బాధ్య‌త మ‌రిచి నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు చెంప చెళ్లుమ‌నిపించేలా, కూట‌మి ప్ర‌భుత్వాన్ని బండ‌కేసి బాదిన‌ట్టు ప్ర‌జ‌లు సంత‌కాలు చేశారు. సంత‌కాల రూపంలో త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌జాభిప్రాయాన్ని పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది. పీపీపీ ముసుగులో జ‌రుగుతున్న ప్ర‌జా దోపిడీని ఆయ‌న‌కు వివ‌రించారు. గ‌వ‌ర్న‌ర్ కూడా ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను అర్థం చేసుకున్నారు. పీపీపీ మోడ‌ల్లో చంద్ర‌బాబు తీసుకున్న మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం కోట్లాదిమంది ప్ర‌జ‌ల ఆరోగ్యానినికి గొడ్డ‌లిపెట్టు లాంటిది. ఇప్ప‌టికైనా సీఎం చంద్ర‌బాబు ప్ర‌జాభిప్రాయాన్ని గ్ర‌హించి ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోక‌పోతే దీనిపై న్యాయ‌స్థానాల్లో వైఎస్సార్‌సీపీ  పోరాడుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నాం. విద్య‌, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథ‌మిక హ‌క్కు. దాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కాల‌రాస్తోంది. మాకొద్దు బాబోయే అని కోటి మందికిపైగా సంత‌కాలు చేసి చెప్పినా, ఇప్ప‌టికీ పీపీపీ గొప్ప అన్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకోవ‌డం నిరంకుశ‌త్వానికి నిద‌ర్శ‌నం.

    లా అండ్ ఆర్డ‌ర్ కూడా ప్రైవేటుప‌రం చేస్తారా?
    రాష్ట్రంలో అతి ముఖ్య‌మైన మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేసిన చంద్ర‌బాబు.. శాంతి భ‌ద్ర‌త‌ల విభాగాన్ని ప్రైవేటుప‌రం చేస్తారేమో చెప్పాలి. పీపీపీ మోడ‌ల్‌లో రోడ్లు నిర్మాణం చేసి టోల్ ట్యాక్స్ వ‌సూలు చేసిన‌ట్టుగానే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ త‌ర్వాత హెల్త్ ట్యాక్స్ వ‌సూలు చేయకుండా ఉంటారా?  అందులో భాగంగానే ప్ర‌భుత్వ వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. యూజ‌ర్ చార్జీల రూపంలో ప్ర‌జ‌ల మీద భారం మోప‌డానికే చంద్ర‌బాబు ఈ పీపీపీ మోడ‌ల్ తీసుకొచ్చి ప్రైవేటు వ్య‌క్తుల‌కు ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను అప్ప‌గించేస్తున్నాడు. ఇదే జ‌రిగితే రాబోయే రోజుల్లో పేద‌వాడికి వైద్యం అంద‌ని ద్రాక్ష‌గా మారే ప్ర‌మాదం ఉంది. 

    గ‌త టీడీపీ పాల‌నలోనూ ప్రైవేటుమ‌యం
    ప్ర‌జల ఆరోగ్య భ‌ద్ర‌త విష‌యంలో వైఎస్సార్‌సీపీ  ప్ర‌భుత్వం ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. గ‌తంలో రాష్ట్రంలో 260 అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్స్ ఉండగా వాటి నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తినెలా రూ. 4.50 ల‌క్ష‌ల చొప్పున కేటాయించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రైవేటుకి అప్ప‌గించింది. అయినా వాటి ద్వారా ప్ర‌జ‌ల‌కు అందిన వైద్య సేవ‌లు ఏమాత్రం ఉండేవి కాదు. 2019లో వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక యూహెచ్‌సీల సంఖ్య‌ను 560కి పెంచ‌డంతోపాటు నాడు- నేడు ద్వారా వాటిని ఆధునికీక‌రించి ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకురావ‌డం జ‌రిగింది. 24 బై 7 ప‌నిచేసేలా వైద్యులను అందుబాటులో ఉండ‌టంతోపాటు అన్నిర‌కాల వైద్య‌ప‌రిక‌రాలు, మందులను స‌మ‌కూర్చ‌డం జ‌రిగింది.

    రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తి గ్రామంలో 10,032 వైయ‌స్సార్ విలేజ్ హెల్త్ క్లీనిక్‌ల‌ను ఏర్పాటు చేశాం. ఫ్యామిలీ డాక్ట‌ర్ కార్య‌క్ర‌మం ద్వారా నేరుగా డాక్ట‌ర్‌నే ప్ర‌జ‌ల ఇంటికి పంపించ‌డం కూడా వైఎస్ జ‌గ‌న్ వైద్యారోగ్య రంగాన్ని బ‌లోపేతం చేయ‌డానికి తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల్లో ఒక‌టి. నాడు మా ప్ర‌భుత్వ హ‌యాంలో ఉచితంగా రక్త ప‌రీక్ష‌లను నిర్వ‌హిస్తే నేడు చంద్ర‌బాబు వాటిని ప్రైవేటుప‌రం చేశాడు. ఏడాదికి రూ. 1000 కోట్లు చెప్పున రూ. 5 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే మెడిక‌ల్ కాలేజీల నిర్మాణాలు పూర్త‌వుతాయ‌ని తెలిసినా అందుకు పూనుకోకుండా ప్రైవేటీక‌ర‌ణ‌కే మొగ్గుచూప‌డానికి ప్ర‌ధాన కారణం కూడా క‌మీష‌న్ల కోస‌మే.

    ఇదేం తెలివిత‌క్కువ విశ్లేష‌ణ చంద్రబాబూ..
    పీపీపీ మోడ‌ల్ ను స‌మ‌ర్థించుకోవ‌డానికి చంద్ర‌బాబు చెబుతున్న మాట‌లు చూస్తే ఎవ‌రికైనా అనుమానాలు క‌లగ‌కుండా ఉండ‌వు. ప్ర‌భుత్వ పెత్త‌నం అని తెలుగులో చెప్పి ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అని ఇంగ్లిష్‌లో చెబుతున్నాడు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకత వ‌చ్చింద‌ని తెలిసినా అడ్డ‌గోలు విశ్లేష‌ణ‌ల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 50 ఎక‌రాల మెడిక‌ల్ కాలేజీల భూముల‌ను ఎక‌రం వంద రూపాయల‌కు 66 ఏళ్లపాటు లీజుకివ్వ‌డాన్ని ప్ర‌జ‌లెవ‌రూ హ‌ర్షించ‌డం లేదు. దీంతోపాటు మెడిక‌ల్ కాలేజీల పెత్త‌నం ప్రైవేటుకిచ్చి నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చును మాత్రం ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని చెప్ప‌డం ఎన్నో అనుమానాల‌కు తావిస్తోంది. ఇలా స్కాంల మీద స్కాంలు చేస్తూ వైద్య‌విద్యార్థుల ఆశ‌ల‌ను, పేద ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని అంద‌ని ద్రాక్ష‌గా మార్చేస్తున్నాడు. చంద్ర‌బాబు మార్క్ ఆస్తుల దోపిడీకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఇవ‌న్నీ చూస్తుంటే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ ముసుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయ‌ని ఎవ‌రికైనా స్ప‌ష్టంగా 
    అర్థ‌మైపోతుంది.

    అందుకే మా నాయ‌కులు వైఎస్ జ‌గ‌న్   దీన్ని మ‌ద‌ర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక దీనిపై విచార‌ణ జ‌రిపి అవినీతికి ఎవ‌రు పాల్ప‌డినా ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఎవ‌రిని వ‌దిలే ప్ర‌స‌క్తే ఉండ‌దు. త‌ప్పు చేసిన వారిని చ‌ట్టం ముందు దోషులుగా నిల‌బెట్టి తీరుతామని విడదల రజిని హెచ్చరించారు.

  • తాడేప‌ల్లి : 35 రోజుల పాటు వైఎస్సార్‌సీపీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్‌ 19వ తేదీ) ,వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షలు, జిల్లా ప్రధాన కార్యదర్శలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..  సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకాలపై స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. 

    ‘ రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ కమిటీలు పూర్తవ్వాలి. అప్పుడు పార్టీకి 16 నుంచి 18 లక్షల సైన్యం రెడీ అవుతుంది. కమిటీల నిర్మాణం పూర్తికాగానే  ఐడీ కార్డులు ఇస్తాం. కమిటీలలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉత్సాహంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలి. కార్య‌క‌ర్త‌ల క‌ష్టంతోనే కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ అయింది’ అని స్పష్టం చేశారు. 

  •  

    సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల  బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు.

    అందరినీ నరికేస్తాం.. యూనివర్సిటీలో జనసైనికుల రచ్చ

Medak

  • కర్షకులకు కరెంట్‌ కష్టాలు

    నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు

    ఆందోళనలో అన్నదాతలు

    మెదక్‌జోన్‌: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు, బోరు బావు లు ధ్వంసం అయ్యాయి. స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బాధితులను వెంటనే ఆదుకోవాలని నిధులు విడుదల చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. ఫలితంగా బోరు బావులకు నేటికీ విద్యుత్‌ పునరుద్ధరించలేదు. యాసంగి నారుమల్లు పోసే పుణ్య కాలం దాటిపోతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

    రూ. 6.5 కోట్లు మంజూరు

    జిల్లాలో ఈఏడాది ఆగస్టులో పెద్ద ఎత్తున వరదలు వ చ్చాయి. అత్యధికంగా హవేళిఘణాపూర్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్‌ తదితర మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 10,671 ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా 1,344 విద్యుత్‌ స్తంభాలు, 460 ట్రాన్స్‌ఫార్మర్లు, మెదక్‌ పట్టణంలో ఓ సబ్‌స్టేషన్‌ నీట మునగింది. కిలోమీటర్ల మేర తీగలు కొట్టుకుపోయాయి. పోచమ్మరాల్‌ గ్రామ శివారులో గల పో చారం ప్రాజెక్టు దిగువన వరద ఉధృతికి వందలాది బోరు బావులు ధ్వంసం అయ్యాయి. బోరుపైపులు విరిగిపోయాయి. స్తంభాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా విద్యుత్‌శాఖకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం ఆశాఖకు రూ. 6.5 కోట్లు మంజూరు చేసింది. వీటితో నూతనంగా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కొత్త తీగలు ఏర్పాటు చేయడం, నీటి మునిగిన సబ్‌స్టేషన్‌ను మరోచోట నిర్మించాలని నిర్ణయించారు. కాగా పనులను పలువురు కాంట్రాక్టర్లకు అప్పగించి అధికారులు చేతులు దులుపుకున్నారు. పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్లు అక్కడక్కడ కొన్ని విద్యుత్‌ స్తంభాలను నాటి వదిలేశారు. నష్టం జరిగి మూడు మాసాలు గడిచి పోతున్నా, పనులు పూర్తిస్థాయిలో చేయలేదు. ఫలితంగా బోరుబావులు మూలన పడ్డాయి. యాసంగి నారు ఎలా పోయాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్‌ను త్వరగా పునరుద్ధరించాలని వారు వేడుకుంటున్నారు.

    పట్టించుకోవడం లేదు

    రదలతో సర్వం కోల్పోయాం. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పటివరకు రాలేదు. కనీసం విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినా బోరుబావుల కింద తుకాలు పోసుకుంటాం. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనికరించటం లేదు.

    – శ్రీనివాస్‌, రైతు, పోచమ్మరాళ్‌

    త్వరలో పనులు పూర్తి చేస్తాం

    రద నష్టంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ. 7 కోట్ల మేర నష్టం జరిగింది. పనుల పునరుద్ధరణ కోసం రూ. 6.5 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు చేశాం. మిగితా పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.

    – నారాయణ నాయక్‌, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ

  • నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి

    నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని కాగజ్‌మద్దూర్‌లో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పై సల లొల్లి మొదలైంది. పంచాయతీ ఈసారి మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు వారి భార్యలను బరిలో నిలిపారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఓ మండల స్థాయి నాయకుడు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా రెండు కుల సంఘాలకు 1.50 లక్షల చొప్పున ముట్ట జెప్పినట్లు తెలిసింది. మరికొన్ని కుల సంఘాలకు వ్యక్తిగతంగా వారి వారి కుటుంబంలో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చారు. దీనికి తోడు మద్యం, బిర్యానీ పొట్లాలు సైతం పంపిణీ చేశారు. ఇంత చేసినా ఓటమి చెందటంతో ఆ నాయకుడు, అతడి వర్గీయులు కలిసి కుల సంఘాలను దుర్భాషలాడుతూ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రెండు కుల సంఘాలకు చెందిన వారు తిరిగి డబ్బులు వాపస్‌ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఓట్ల కోసం డబ్బులు తీసుకున్న మరికొంత మంది సైతం తిరిగి డబ్బులు వాపస్‌ ఇచ్చినట్లు సమాచారం.

    అప్పుడు తల్లి, తండ్రి.. ప్రస్తుతం కొడుకు

    నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని జక్కపల్లికి చెందిన దుప్తల భ రత్‌ బీటెక్‌ పూర్తి చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందాడు. అయితే గత సర్పంచ్‌గా అతడి తల్లి వెంకటలక్ష్మి గెలుపొందింది. అంతకు ముందు తండ్రి శ్రీనివాస్‌ గ్రామ సర్పంచ్‌గా పని చేశాడు. వరుసగా మూడుసార్లు ఒ కే కుటుంబానికి సర్పంచ్‌ గిరి వరించింది.

    అన్నపై.. తమ్ముడి గెలుపు

    కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని కూకుట్లపల్లిలో సర్పంచ్‌ పదవికి అన్నదమ్ములు పోటీపడ్డారు. కాంగ్రెస్‌ మద్దతుదారుగా అన్న నీరుడి అశోక్‌, బీఆర్‌ఎస్‌ తరపున తమ్ముడు కుమార్‌ పోటీ చేశారు. గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. చివరికి అన్నపై తమ్ముడు కుమార్‌ 197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు.

    చిన్న కోడలును వరించిన పదవి

    కౌడిపల్లి(నర్సాపూర్‌): సర్పంచ్‌ పదవికి తోటికోడళ్లు పోటీపడగా, చివరికి చిన్న కోడలును గెలుపు వరించింది. మండలంలోని పంచాయతీలో గత ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్‌ జీవుల ఈసారి తన భార్య జమ్కి బీఆర్‌ఎస్‌ మద్దతుదారు గా పోటీ చేసింది. అతడి తమ్ముడు చెన్న భార్య లక్ష్మి కాంగ్రెస్‌ తరపున పోటీ చేశారు. దీంతో తండాలో తోటి కోడళ్ల పోరులో చివరికి చిన్న కోడలు లక్ష్మి గెలుపొందింది.

    ఓటమి ఎరుగని కుటుంబం

    నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని లింగాపూర్‌కు చెందిన బోర్లపు శ్రీనివాస్‌గుప్తా కుటుంబం 1988 నుంచి రిజర్వేషన్‌ కలిసి వచ్చిన ప్రతీసారి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గుప్తా భార్య రాజకళ సర్పంచ్‌గా గెలుపొందారు. గతంలో సైతం రాజకళ సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాస్‌గుప్తా రెండు పర్యాయాలు లింగాపూర్‌ సర్పంచ్‌గా, రెండుసార్లు లింగాపూర్‌ ఎంపీటీసీగా, 2006లో నర్సాపూర్‌ జెడ్పీటీసీగా గెలుపొందారు. అతని తండ్రి సైతం లింగాపూర్‌ సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి ఆశయ సాధనలో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే బోర్లపు కుటుంబం కొనసాగుతూ వస్తోంది.

    మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలి

    మెదక్‌ కలెక్టరేట్‌/చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): కౌడిపల్లి మండలం తునికి సర్పంచ్‌ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని సర్పంచ్‌ అభ్యర్థి స్వాతి డిమాండ్‌ చేశా రు. ఈ మేరకు గురువారం డీపీఓ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు బీఆర్‌ఎస్‌కు వత్తా సు పలికారని ఆరోపించారు. ఓట్లను లెక్కించే సమయంలో ఫిజికల్‌గా తమకు చూపించలేదని ఆరోపించారు. ఫలితాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని బండపోతుగల్‌ బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్ధి రామయ్యగారి రజిత తన మద్దతుదారులతో కలిసి ఎంపీడీఓ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. మొత్తం 786 ఓట్లు పోల్‌ కాగా, తనకు 386 ఓట్లు, ప్రత్యర్థికి 389 ఓట్లు వచ్చాయని తెలిపారు. మిగితా 11 బ్యాలెట్‌ పేపర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. ఫలితాలపై విచారణ చేయాలని కోరారు.

    సర్పంచ్‌ పీఠంపై పట్టభద్రుడు

    కొల్చారం(నర్సాపూర్‌): పోతంశెట్టిపల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పాతూరి దయాకర్‌గౌడ్‌ విజయం సాధించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన దయాకర్‌ పార్లమె ంట్‌ ఎన్నికలకు ముందు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సమీప స్వతంత్ర అభ్యర్థిపై 256 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.

  • పల్లె ప్రగతిపై కోటి ఆశలు

    పాలకవర్గాలు లేక నిలిచిన నిధులు

    22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం

    రామాయంపేట(మెదక్‌): పంచాయతీలకు సుమారు రెండేళ్ల పాటు పాలకవర్గాలు లేక పాలన గాడి తప్పింది. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అర్థిక సంఘం నిధులు రాక కార్యదర్శులు కొట్టుమిట్టాడారు. చెత్త సేకరణ ట్రాక్టర్లలో డీజిల్‌ పోయించడానికి సైతం డబ్బులు లేక చేతులెత్తేశారు. ఇక ఇలాంటి సమస్యలకు తెరపడనుంది. మరో నాలుగు రోజుల్లో పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. పల్లెల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి.

    గ్రామాల్లో ప్రధాన సమస్యలు

    ● జిల్లాలో 90కి పైగా జీపీలకు పక్కా భవనాలు లేవు. అద్దె ప్రాతిపదికన కొన్ని, పంచాయతీ కార్యాలయాల్లో మరికొన్ని కొనసాగుతున్నాయి.

    ● గ్రామాల్లో 350కి పైగా అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె, పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి.

    ● కొన్ని పంచాయతీల్లో రేషన్‌ దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.

    ● గ్రామాల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. చెత్త పేరుకపోయి దుర్వాసన వెదజల్లుతుంది.

    ● చిన్న పంచాయతీలు, గిరిజన తండాల్లో రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు.

    ● పశువులు నీరు తాగడానికి వీలుగా పశువుల తొట్లు నిర్మించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

    ● గ్రామాలను ఆనుకొని ఉన్న చెరువులు ప్రమాదకరంగా మారాయి. జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

    ● ముఖ్యంగా తండాల్లో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో గిరిజనులు ఇబ్బందుల పాలవుతున్నారు.

    ● కొన్ని పంచాయతీల్లో బురుజులు పాక్షికంగా శిథిలమై ప్రమాదకరంగా మారాయి.

    ప్రజల ఆశలు వమ్ము చేయను

    న్నో ఆశలతో గ్రామస్తులు గెలిపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా. ముందుగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించి ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా.

    – తార్యానాయక్‌,

    సర్పంచ్‌, పర్వతాపూర్‌

    మంచి పేరు తెచ్చుకోవాలి

    కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు నిస్వార్థంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఇందుకు ప్రజలు కూడా వారికి సహకరించాలి. ఎల్లవేళలా గ్రామస్తులకు అందుబాటులో ఉండాలి. ప్రధానంగా తాగు నీటి సరఫరా, పారిశుద్ధ్యం విషయమై దృష్టి సారించాలి.

    – యాదయ్య,

    జిల్లా పంచాయతీ అధికారి

  • సాగు నీటిపై స్పష్టత ఇవ్వాలి
    మాజీ మంత్రి హరీశ్‌రావు

    మెదక్‌మున్సిపాలిటీ: యాసంగి సాగుపై జిల్లా రైతాంగం తీవ్ర అయోమయంలో ఉందని, సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వా లని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం మెదక్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ బ లపరిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగూరు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, నీటిని ఖాళీ చేయటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. సాగునీరు ఇవ్వకపోతే క్రాప్‌ హాలిడే ప్ర కటించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది, పంటను కాపాడుతూనే మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల రైతుల హక్కును కాపాడాలన్నారు. ఓట్ల కోసం పోలింగ్‌ బూత్‌ల దగ్గర కుర్చీలు వేసుకుని వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. యూరియా కష్టాలపై, గురుకులాల్లో పురుగుల అన్నంపై ఎందుకు కుర్చీ వేసుకుని నిలదీయలేదని ప్రశ్నించారు. పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్‌రెడ్డి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

    నీళ్లు, విద్యుత్‌, ఎరువులు కావాలి

    అన్నదాతలకు కావాల్సింది యాప్‌లు, మ్యాపులు కాదు.. నీళ్లు, విద్యుత్‌, ఎరువులని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడు తున్నారన్నారు. అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్‌ఫోన్లు లేని మహిళా రైతులు యాప్‌లు, మ్యా పులు ఎలా వాడతారని ప్రశ్నించారు.

  • యూరియా కోసం బారులు

    నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలో యూ రియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. గురువారం నిజాంపేట సొసైటీతో పాటు మరో రెండు ఫర్టిలైజర్‌ దుకాణాలకు 3 లారీల యూరియా వచ్చింది. రైతులు భారీగా తరలివచ్చా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని కోరారు. భూమి లేని వారు సైతం వచ్చి యూరియా తీసుకొని బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు వాపోయారు. పట్టాపాస్‌ పుస్తకం ఆధారంగా అవసరం మేరకు అధికారులు పంపిణీ చేయాలన్నారు. యూరియాను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Siddipet

  • వికసించని కమలం
    ● జిల్లాలో 30 మంది సర్పంచ్‌లే గెలుపు ● ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాల కంటే తక్కువే.. ● తీవ్ర నిరాశలో కార్యకర్తలు

    పల్లెల్లో కమలం వాడిపోయింది. ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాలు సైతం గెలవలేక చతికిలపడింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలో చాలా మండలాలు ఉన్నప్పటికీ ఉనికి చాటలేదు. ఎన్నికల ఫలితాలను చూస్తే పార్టీ పట్టుకోల్పోయిందన్న చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 5.90శాతం సీట్లు మాత్రమే బీజేపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. సంస్థాగతంగా గ్రామ స్థాయిలో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరిన బీజేపీ సత్తా చాటడంలో విఫలమైంది. – సాక్షి, సిద్దిపేట

    ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ డీలా

    జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో 26 మండలాల్లోని 508 గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికలు జరగాయి. కేవలం 30 సర్పంచ్‌ స్థానాలు మాత్రమే బీజేపీకి దక్కాయి. మొదటి విడతలో 10, రెండో విడతలో 13, మూడో విడతలో 7 సర్పంచ్‌ స్థానాలలో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఈ మూడు విడతల్లో ఇండిపెండెంట్‌లు 52 మంది విజయం సాధించారు. ఇండిపెండెంట్లు గెలుపొందిన సంఖ్య సైతం బీజేపీకి దక్కలేదు.

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లా నాయకత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపాధి హామీ పథకంతో పాటు పలు పథకాలు కొనసాగుతున్నా.. వాటిని ప్రచారం చేయడంలో పార్టీ నేతలు విఫలమయ్యారని తెలుస్తోంది. పలు గ్రామ పంచాయతీల పరిధిలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటమి చెందారు. సిద్దిపేట నియోజకవర్గంలో మూడు చోట్ల మాత్రమే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘ఎన్నికల సమయంలో పట్టించుకోలేదని.. ఇప్పుడు గెలుపొందిన తర్వాత మేము కావాల్సి వచ్చామా? అని పలువురు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

    వర్గపోరును కట్టడి చేస్తేనే..

    పార్టీలో వర్గపోరును కట్టడి చేసి నేతలను ఏకం చేస్తే తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడం కష్టమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఒక వర్గం నేతలు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇప్పటికై నా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి అందరిని ఒక్కతాటి పైకి తీసుకవచ్చి పార్టీని ముందుకు తీసుకవెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు.

    మెదక్‌, కరీంనగర్‌ ఎంపీలుగా రఘునందన్‌ రావు, బండి సంజయ్‌లు గెలుపొందడంతో పార్టీలో జోష్‌ కనిపించినా.. ప్రస్తుత సర్పంచ్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపొవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుంది. రాబోయే కాలమంతా ఎన్నికల కాలం.. ఇలాంటి సమయంలో కేడర్‌ అంతా నిరుత్సాహంలో ఉంటే ఎలా అని కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. పరిస్థితి ఇలానే కొన సాగితే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశాలున్నాయి.

    తొగుటలో ఖాతా తెరిచి..

    తొగుట(దుబ్బాక): మండలంలో ఎట్టకేలకు బీజేపీ ఖాతా తెరించింది. పంచాయతీ ఎన్నికల్లో మొదటి సారిగా ఆ పార్టీ నాయకులు సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీకి దిగారు. వరదరాజుపల్లిలో పార్టీ నాయకుడు ఎర్వ గోపాల్‌రెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. తొగుట, తుక్కాపూర్‌, లింగాపూర్‌, కాన్గల్‌, గుడికందుల, గోవర్ధనగిరి, వర్దరాజుపల్లి గ్రామాల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థులు బరిలోకి దిగారు. గుడికందుల, లింగాపూర్‌, గోవర్ధనగిరిలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చారు. రెండు చోట్ల ద్వితీయ స్థానంలో నిలవగా మిగతా చోట్ల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపినట్లు మండలంలో చర్చజరుగుతోంది. తుక్కాపూర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం తన భార్యను రంగంలోకి దింపారు. కారణమేంటో తెలియదుగాని బరిలో నుంచి అర్ధంతరంగా తప్పుకున్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో ఖాతా తెరిచిన బీజేపీ త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఏమేరకు సత్తా చూపుతారో వేచిచూడాలి.

  • పల్లె దశ మారేనా?

    జిల్లాలోని 26 మండలాల్లో 508 పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 163, రెండో విడతలో 182, మూడో విడతలో 163 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 22న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈనేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే అందరి దృష్టి నెలకొంది. గత 2024 ఫిబ్రవరి నెలలో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. దీంతో 20 నెలలకుపైగా పంచాయతీలకు నిధులు నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఎఫ్‌ఎసీ, ఉపాధిహామీ తదితర పథకాల అమలు ఆగిపోయింది. ఫలితంగా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రత్యేకించి గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చాలా గ్రామాల్లో పంచాయతీలకు కేటాయించిన చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజీల్‌ పోయించుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల పారిశుద్ధ్య నిర్వహణ గాలికొదిసినట్లయ్యింది. దాదాపు అన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. ఈ బిల్లులు అందక ఇప్పటికీ నానా తంటాలు పడుతున్నారు.

    వ్యాధుల విజృంభణ

    పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తి పెరిగిపోయింది. ఊర్లకు ఊళ్లు.. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి భయంకరమైన జ్వరాలు బారిన పడ్డాయి. వందల సంఖ్యలో రోగులు మంచాన పడ్డారు. గత ఆగస్టు నెలలో జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లో ఇద్దరు, అనంతసాగర్‌లో ఒకరు డెంగీ బారిన పడి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ రెండు గ్రామాల్లోనే కాదు.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో విష జ్వరాలు విజృంభించాయి. ఈ పరిస్థితి మార్చాల్సిన అధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు వేసి చేతులు దులుపుకొన్నారు.

    కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే..

    పంచాయతీలకు మార్చిలోగా రెండేళ్ల 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉన్నది. 20నెలలుగా సర్పంచ్‌ల ఎన్నికలు జరగకపోవడం ఈ నిధులు రాలేదు. 2026మార్చిలోగా ఈ నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల జనాభా దామాషా ప్రకారం ఒక్కొక్కరికి రూ.900–1400చొప్పున నిధులు రానున్నాయి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో.. అన్ని నిధులు రాష్ట్రం నుంచి కూడా రావాల్సి ఉంది. ఉదాహరణకు 3వేల జనాభా ఉన్న గ్రామాలకు కేంద్రం నుంచి రూ.27లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. రెండేళ్ల నిధులు ఇస్తే.. ఇది రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన గ్రామాలకు దండిగా నిధులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాగా నిధులు విడుదల చేయడంతోపాటు ఎస్‌ఎఫ్‌సీ నిధులు కూడా ఇస్తే గ్రామాలకు మహర్దశ పట్టనుంది.

    ప్రభుత్వ సహకారం కీలకం

    గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాల సహకారమే కీలకం. గ్రామాల్లో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్యలు కొత్త సర్పంచ్‌లకు సవాలుగా మారాయి. ప్రభుత్వాలు నిధులు విడుదల చేసి ప్రజల ఇబ్బందులను తీర్చడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం.

    – ప్రభాకర్‌, ఆహ్మదీపూర్‌ సర్పంచ్‌, గజ్వేల్‌ మండలం

    పడకేసిన పారిశుద్ధ్యం

    పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో.. ఇక అందరి దృష్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే కేంద్రీకృతమై ఉంది. ప్రత్యేకించి కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. కొత్త సర్పంచ్‌లు కొలువుతీరిన వెంటనే వస్తే.. మేలు జరిగే అవకాశం ఉంది.

    –గజ్వేల్‌

  • సర్పంచ్‌.. జాతీయ అథ్లెటిక్స్‌ క్రీడాకారుడు

    హుస్నాబాద్‌రూరల్‌: గురుకుల పాఠశాలలో చదివిన వేల్పుల సంపత్‌ క్రీడల్లోనూ రాణించారు. అదే పట్టుదలతో గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌ సర్పంచ్‌ వేల్పుల సంపత్‌ డిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐ ఇన్సూరెన్స్‌లో పని చేస్తున్నారు. పాఠశాల దశ నుంచి అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌ జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన క్రీడల్లో పాల్గొని బహుమతులు పొందారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. క్రీడల్లో రాణించినట్లే పట్టుదలతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని సంపత్‌ తెలిపారు.

    విద్యావంతులు.. గ్రామ పాలకులు

    అక్కన్నపేట(హుస్నాబాద్‌): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో విద్యావంతులు సర్పంచ్‌లుగా గెలిచారు. మండలంలోని మైసమ్మవాగుతండా సర్పంచ్‌గా గెలిచిన కృష్ణనాయక్‌ బీఈడీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. పెద్దతండా సర్పంచ్‌గా గెలిచిన గుగులోతు తిరుపతినాయక్‌ ఎంఏ, ఎంఈడీ, పీహెచ్‌డీ ఓయూలో చేశారు. సేవా లాల్‌ మహరాజ్‌తండా సర్పంచ్‌గా గెలిచిన జరుపుల సునీత డిగ్రీ చదివారు. ఈమె వయస్సు 22 ఏళ్లు. చిన్న వయస్సులో సర్పంచ్‌ కావడంతో తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యావంతులై ప్రథమ పౌరులుగా, ప్రజా సేవకు సిద్ధమవుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

    నాడు భర్త.. నేడు భార్య

    కొమురవెల్లి(సిద్దిపేట): మొన్నటి వరకు భర్త సర్పంచ్‌గా ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో భార్య సర్పంచ్‌గా గెలిచారు. మండలంలోని రసులాబాద్‌ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్‌ మద్దతుదారు పచ్చిమడ్ల స్వామి అనూష సర్పంచ్‌గా గెలుపొందారు. ఇప్పటి వరకు ఆమె భర్త పచ్చిమడ్ల స్వామి సర్పంచ్‌గా ఉండగా ఈసారి భార్యను పోటీలో ఉంచారు. స్వతంత్ర అభ్యర్థిపై 50 ఓట్లతో గెలుపొందారు.

    ఆకునూరు.. రవి జోరు

    చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని మేజర్‌ గ్రామ పంచాయతీ ఆకునూరులో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. సర్పంచ్‌, 11 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో 3,592 ఓట్లు పోలయ్యాయి. భోజన విరామ అనంతరం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగడంతో గెలుపుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఓట్లు ఎక్కవ కావడం, బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో లెక్కింపునకు సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. ఉత్కంఠ భరిత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొమ్ము రవి 856 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

    సర్పంచ్‌ అభ్యర్థికి ఒక్కటే ఓటు

    చేర్యాల మండల పరిధిలోని శభాష్‌గూడెం సర్పంచ్‌గా బరిలో నిలిచిన దాసరి శ్రీశైలం అనే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. సర్పంచ్‌గా పోటీ చేయాలంటే అదే గ్రామానికి చెందిన ఒక ఓటరు బలపర్చాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటే వచ్చింది. అంటే బలపర్చిన వ్యక్తి కూడా ఓటు వేయలేదా? అన్న చర్చ జరుగుతోంది.

  • ‘ప్రజా పాలన’ను ఆశీర్వదించారు
    సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

    హుస్నాబాద్‌: ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. అంతకు ముందు ఉదయం కార్యకర్తలతో కలిసి బైక్‌ నడుపుతూ గల్లి గల్లి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో సర్పంచ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో 171 సర్పంచ్‌ స్ధానాలకు ఎన్నికలు జరిగితే 108 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారన్నారు. మరో 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే అత్యధిక స్ధానాల్లో గెలిచామన్నారు. నియోజకవర్గంలో 80 శాతం పైగా పోలింగ్‌ జరిగిన గ్రామాలకు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో పోలింగ్‌ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, వ్యవసాయం, టూరిజం అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తామన్నారు. అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో నేషనల్‌ హైవేస్‌ అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, అధికారులు పాల్గొన్నారు.

  • ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం చేరాలి
    ● రైతులకు అవగాహన కల్పించాలి ● అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి ● కలెక్టర్‌ హైమావతి

    సిద్దిపేటరూరల్‌: జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యాన్ని సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఉద్యాన శాఖ, ఆయిల్‌ ఫెడ్‌, మైక్రో ఇరిగేషన్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 13,576 ఆయిల్‌ పామ్‌ మొక్కలు ప్లాంటేషన్‌ జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల లక్ష్యానికి 1,536 ఎకరాల్లో మాత్రమే ప్లాంటేషన్‌ పూర్తి చేశారన్నారు. ఆశించిన స్థాయిలో సాగు లేదని అసహనం వ్యక్తం చేశారు. రబీ సీజన్‌కు సన్నద్ధమయ్యే లోపు ప్రతి రైతుని కలిసి ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ వారం మొత్తం స్పెషల్‌ డ్రైవ్‌ గా తీసుకుని ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. మీకు ఇచ్చిన టార్గెట్‌ తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

    మెరుగైన వైద్యసేవలు అందించండి

    పీహెచ్‌సీకి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ హైమావతి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. రికార్డులు చక్కగా నిర్వహించాలని, మొక్కుబడిగా రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

  • గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
    ● పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ● నూతన సర్పంచ్‌లతో మంత్రి వివేక్‌

    ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ పరిధిలోని సర్పంచ్‌, వార్డు మెంబర్లు మంత్రి వివేక్‌ను కలిశారు. గురువారం గాడిపల్లి రఘువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని హైదరాబాద్‌లో కలిసినట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు మంద పాండు తెలిపారు. నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు సదాశివరెడ్డి, మంద వనజ, తదితరులు ఉన్నారన్నారు.

National

  • కర్ణాటక రాజకీయాలు కొంతకాలం పాటు దేశవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా నడిచాయి. ఆ రాష్ట్ర సీఎం మార్పు జరగనుందంటూ ఊహాగానాలు రేగడం దానిని బలపరూస్తూ  సీఎం, డిప్యూటీ సీఎంలు పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడంతో కొద్దికాలం పాటు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఆ రాష్ట్రంపైనే ఉంది. అయితే సీఎం మార్పు అంశంలో  తాజాగా కర్ణాటక  సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రాష్ట్రంలో సీఎం షేరింగ్ ఒప్పందమే జరగలేదన్నారు.

    కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కొద్దికాలం పొలిటికల్ వార్ జోరుగానే సాగింది. ఐదేళ్లకు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని సిద్ధరామయ్య అనగా ఇచ్చిన మాట కంటే గొప్పది మరోటి లేదని శివకుమార్ పేర్కొన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంట్రీతో ఇద్దరు నేతలు కొంత తగ్గి హైకమాండ్ నిర్ణయమే ఫైనల్‌ అని తెలపడంతో సీఎం కుర్చీ వార్‌కు కొద్దిగా చల్లబడిందని పొలిటికల్ వర్గాలు భావించాయి.

    అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆర్.అశోకా సీఎం మార్పుపై అసెంబ్లీలో సిద్ధరామయ్యను ‍ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. "ప్రజలు మమ్మల్ని దీవించారు. అనంతరం ఎమ్మెల్యేలలంతా నన్ను నాయుకుడిగా ఎన్నుకున్నారు.ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని. హైకమాండ్ నిర్ణయిస్తే తదనంతరం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను" అని సిద్ధరామయ్య అన్నారు. అసలు తానేప్పుడు రెండున్నర సంవత్సరాల సీఎం ఒప్పందం గురించి చెప్పలేదని అసలు అలాంటి అగ్రిమెంటే జరలేదన్నారు.

    అయితే ఇటీవల సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమ వర్గం నాయకులకు ప్రత్యేక వింధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ అగ్ర నాయకత్వంతో భేటీ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎం పదవిపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం జరిగిందని ప్రచారం జరిగింది. గత నెలతో రెండున్నరేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం మారనున్నారని జోరుగా ప్రచారం నడిచింది. 

  • ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBet కేసులో ప్రముఖులు, క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారం.

    ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రముఖ క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకులు, మోడల్స్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.

    అటాచ్ చేసిన ఆస్తులు

    • యువరాజ్ సింగ్ (క్రికెటర్): రూ.2.5 కోట్లు

    • రాబిన్ ఉతప్ప (క్రికెటర్): రూ.8.26 లక్షలు

    • సోనూసూద్‌ (నటుడు): రూ.1 కోటి

    • నేహా శర్మ (నటి): రూ.1.26 కోట్లు

    • మిమి చక్రబోర్తి (మాజీ TMC MP): రూ.59 లక్షలు

    • అంకుష్ హజ్రా (బెంగాలీ నటుడు): రూ.47 లక్షలు

    • ఉర్వశి రౌతేలా తల్లి: రూ.2.02 కోట్లు

    • మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది.

    కేసు నేపథ్యం
    1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉందని ఈడీ అంచనా వేసింది. కేసు విచారణలో భాగంగా పీఎంఎల్‌ఏ కింద ఈ ఆస్తులను అటాచ్‌ చేసినట్లు సమాచారం.

  • బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది.  దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో  వైరల్‌గా మారింది.

    డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది.  త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో   ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.

     ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తరువాత బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది.  తన కొడుకును "ఫుట్‌బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి  చెందిన రంజిత్‌గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం.  నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం,  దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.

    ఇవీ చదవండి:  ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీ
    బెట్టింగ్‌ యాప్స్‌ : యూట్యూబర్‌ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్‌!



     

  • న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్‌ మీడియాలో తన హవాను చాటుకున్నారు. ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్వీట్లతో టాప్‌లో నిలిచారు. ఎక్స్‌ లాంచ్‌ చేసిన కొత్త ఫీచర్‌ మోస్ట్‌ లైక్‌డ్‌ ప్రకారం ఆయన ట్వీట్లు ఇండియాలో ఎక్కువ లైక్స్‌ సాధించిన ట్వీట్ల జాబితాలో నిలిచాయి. దేశాల వారీగా ఫీచర్ ప్రధాని గత నెలలో భారతదేశంలో అత్యధికంగా లైక్ చేయబడిన పది ట్వీట్లలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్నారు. మరే పొలిటికల్‌ నేత పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.

    గత 30 రోజుల్లో వ్యక్తిగత దేశాలలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్‌లను హైలైట్ చేసే కొత్త ఫీచర్‌ను ఎక్స్‌ తాజాగా విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వెలువడిన డేటా ప్రకారం,  నరేంద్ర మోదీ హైయ్యస్ట్‌ ఎంగేజ్‌మెంట్‌ కంటెంట్‌ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా లైక్ చేయబడిన టాప్ పది ట్వీట్‌లలో ఎనిమిదింటిలో పీఎం మోదీ కావడం విశేషం.  టాప్ టెన్‌లో మరే ఇతర రాజకీయనాయకుడు లేడు.  మిగిలిన రెండు స్థానాల్లో రాజకీయేతర ఖాతాలున్నాయి. 

     దేశ-నిర్దిష్ట ర్యాంకింగ్ వినియోగదారులకు ఎంగేజ్‌ చేసిన టైం విండోలో అత్యధికంగా లైక్స్‌ సాధించిన ట్వీట్ల స్నాప్‌షాట్‌ను అందించడానికి  ఎక్స్‌  ఈ ఫీచర్‌ను లాంచ్‌ చేసింది.  అంతర్జాతీయ పర్యటనలు, దౌత్యపరమైన సంభాషణలు,  పర్యనటల్లో  కొన్ని ముఖ్యమైన అంశాలను షేర్‌  చేస్తూండటం  మోదీని టాప్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత  రష్యన్ భాషా కాపీని మోదీ అందిస్తున్నట్లు చూపించిన పోస్ట్,   ఈ నెలలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. ఈ పోస్ట్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక గ్రంథంగా గీతను ప్రధాని అభివర్ణించారు. మోదీ అధ్యక్షుడు పుతిన్ న్యూఢిల్లీకి వచ్చినప్పుటి ట్వీట్‌ రెండో స్థానంలో ఉంది. అయితే వీటిన నిర్దిష్టంగా మోదీ ట్వీట్లకు ఖచ్చితమైన లైక్ కౌంట్‌లు లేదా రీచ్ వంటి వివరణాత్మక కొలమానాలను   ఈ ఫీచర్‌ వివరించలేదు.

     

     

  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్‌ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ఈ సమగ్ర ప్రణాళిక. ప్రస్తుతం, వర్చువల్ క్యూలు మరియు ప్రసాదాల బుకింగ్ మాత్రమే ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. సాంకేతిక వ్యవస్థలు ఏయే ప్రాంతాల్లో అవసరమో, వాటిని ఏ విధంగా అమలు చేయాలో తెలుసుకోవడానికి RFPని సిద్ధం చేయనున్నారు. 

    విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి సంస్థల సహాయంతో దీనిని తయారు చేస్తారు. దీంతోపాటు దేవస్వం బోర్డు అన్ని కార్యాలయాలను డిజిటల్‌గా మార్చనున్నారు. కాగా, శబరిమల వద్ద రద్దీని నియంత్రించడానికి శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని, తదుపరి తీర్థయాత్ర నిమిత్తం మౌలిక సదుపాయాలు, జనసమూహ నిర్వహణ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్యక్షుడు కె. జయకుమార్ అధ్యక్షతన జరిగిన దేవస్వం బోర్డు సమావేశం తదనంతరం ఈ సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

    (చదవండి: శబరిమలకు రికార్డు స్థాయిలో ఆదాయం)

     

  • న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య సాగాయి. ఈ సమావేశాలు ముగింపును పురస్కరించుకొని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ టీ పార్టీకి ప్రతిపక్ష సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా స్నేహపూర్వకంగా సాగిన సరదా ముచ్చట్లు నవ్వుల పువ్వులు పూయించాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ స్పీకర్ టీ పార్టీకి హాజరు కావడం విశేషంగా నిలిచింది.  

    ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  జర్మన్‌పర్యటనలో ఉన్న కారణంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన పార్టీకి ప్రాతినిధ్యం వహించారు.  సుమారు  20 నిమిషాలు పాటు జరిగిన  ఈ సమావేశంలో స్పీకర్‌ బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పక్కన ఆమె ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అలెర్జీలను నివారించడానికి తన నియోజకవర్గం వయనాడ్‌పై చర్చతోపాటు, ఇక్కడి మూలికను తీసుకుంటానని ప్రియాంక గాంధీ చెప్పారట. అలాగే ఇటీవల ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన వివరాల గురించి అడగగా, బావుందని ప్రధాని బదులిచ్చారు. ఇంకా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సిపి (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, సిపిఐ నేత డీరాజా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌తో సహా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు సభకు బాగా సిద్ధమైనందుకు ప్రధాని ప్రశంసించారు.

     

    అంతేకాదు ఈ సమావేశాలను మరికొంతసేపు కొనసాగించచ్చు కదా యాదవ్ సూచించినపుడు, తన గొంతు నొప్పి రాకుండా సెషన్‌ను ఇక్కడితే ముగించా రంటూ ప్రధాని మోదీ సరదాగా బదులిచ్చినట్టు సమాచారం. మరోవైపు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీల కోసం పాత భవనంలో ఉన్న విధంగా సెంట్రల్ హాల్‌ను చేర్చాలని ప్రధానిని కోరారు. ఇక్కడ ఎంపీలు, మాజీ ఎంపీలు తరచుగా చర్చల కోసం సమావేశ మవుతారు. అది పదవీ విరమణ తర్వాత కూడా,ఇంకా చాలా సేవ చేయాల్సి ఉందా అంటూ ప్రధాని సరదా సంభాషణ ఎంపీలలో నవ్వులు పూయించిందట

    చదవండి: లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాదన్న హైకోర్టు : ఆ 12మందికి భారీ ఊరట

    కాగా ప్రతీ పార్లమెంటు సెషన్ ముగిసిన తర్వాత స్పీకర్ టీ పార్టీ ఇవ్వడం ఆనావాయితీగా వస్తుంది. ఈ శీతాకాల సమావేశాల్లో స్పీకర్‌ న్యాయంగా వ్యవహరించినందున, ప్రతిపక్ష ఎంపీలందరూ టీ పార్టీకి హాజరు కావాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించినట్టు సమాచారం.  అయితే గతంలో రాహుల్ గాంధీతో పాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా గత టీ పార్టీని బహిష్కరించారు. ప్రతిపక్ష ఎంపీలను సభలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతించడం లేదనేది ప్రధాన ఆరోపణగా వస్తోంది.  దీనిపై ప్రధాని మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి.

    చదవండి: ఒమన్‌ పర్యటనలో ప్రధాని మోదీ ‘చెవి రింగు’ స్టోరీ ఏంటో తెలుసా?
    బెట్టింగ్‌ యాప్స్‌ : యూట్యూబర్‌ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్‌!

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్‌ పర్యటన సందర్బంగా  కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట  ఆసక్తికరంగా మారాయి. ఒమన్‌లో  ప్రధాని మోదీకి అక్కడి అత్యున్నత పౌర గౌరవం  గార్డ్ ఆఫ్ హానర్  లభించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ పర్యటనలో  ప్రధాని ఎడమ చెవికి ఒక చిన్న, రత్నం లాంటి  పరికరం అందరి దృష్టినీ  ఆకర్షించింది. అది ఇయర్‌ రింగ్‌ అని కొందరు, ట్రాన్సలేటర్‌ కొందరు ఇలా ఆన్‌లైన్‌లో పలు ఊహాగానాలకు దారితీశాయి. అసలు ఇదేంటి? తెలుసుకుందాం.

    ప్రధాని మోదీ తన ఇటీవలి పర్యటనల్లో బాగంగా జోర్డాన్, ఇథియోపియా తర్వాత   ఒమన్‌లో అడుగుపెట్టారు.  ఈ సందర్బంగా ఆయనకు  ఒమన్ రక్షణ వ్యవహారాల మంత్రి డిప్యూటీ పీఎం సయ్యద్ సాహిబ్ బిన్ తారిక్ అల్ సయీద్ ఘనస్వాగతం పలికారు. రిసెప్షన్ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్‌ అయిన వెంటనే ప్రధాని కొత్త స్టైల్‌ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి అయితే, నిశితంగా పరిశీలిస్తే ఆ వస్తువు చెవిపోగు కాదని,  రియల్‌ టైం ట్రాన్సలేషన్‌కు ఉపయోగించే  పరికరమని తేలింది. అధికారులు వివిధ భాషలలో సంభాషించేటప్పుడు కమ్యూనికేషన్‌కు సహాయం చేయడానికి అంతర్జాతీయ, దౌత్య కార్యక్రమాలు, చర్చల సందర్భంలో ఇలాంటి డివైస్‌లను ఉపయోగిస్తారు. అరబిక్ ఒమన్ అధికారిక భాష. స్థానికులతో సంభాషించేటపుడు ఎప్పటికప్పుడు, మనకు తెలిసిన భాషలో అది తర్జుమా చేసి వినిపిస్తుంది.  ఇటీవల భారత్‌ పర్యటన్‌ సందర్బంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాంటి ట్రాన్స్ లేటర్లు వినియోగించడం గమనార్హం.

    > కాగా అధికారిక కార్యక్రమాలు,మోదీ పర్యటనల సమయంలో అక్కడి వారితో మమేకమవుతూ, తన వస్త్రధారణ,  తనదైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించడం ప్రధానికి అలవాటు. అలా మోదీ ధరించిన టైలర్డ్ జాకెట్లు , విలక్షణమైన రంగుల పాలెట్లు చర్చల్లో నిలిచాయి. గతంలో ఆయన పేరుతో ఎంబ్రాయిడరీ చేయబడిన బంధ్‌గలా సూట్ కూడా  ఇందులో ఒకటి.

     

     

  • రూల్స్ ఉండేవే బ్రేక్ చేయడానికి అన్న వాదన నుంచి పుట్టిన సిద్ధాంతం మనది. అందుకే ఎప్పుడు రూల్స్  గురించి మాట్లాడినా.. రాద్ధాంతం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ అంటారా.. ఇది మరీ విడ్డూరం. దేశంలో ట్రాఫిక్ రూల్స్ సక్రమంగా పాటిస్తూ అందరితో శభాష్ అనిపించుకున్న.. అందరూ కాకపోయినా ట్రాఫిక్ పోలీసుల మెప్పు పొందిన వారిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. 

    రూల్స్ పాటించడమంటేనే చేతకాని తనానికి నిదర్శనమని త్రికరణశుద్ధిగా నమ్ముతుంటాం. అందుకే ఎదుటి వారికి చెప్పేటందుకే రూల్స్ ఉన్నాయి.. డోంట్ కేర్ అంటూ ఏఎన్నార్ లెక్కన పాటలు పాడుకుంటూ నిర్లక్ష్యంగా తిరిగే వారే ఎక్కువ. ఏదైన రూల్ ఉందంటే అది రాజుగారి గదిలాంటిది. రాజుగారి గదిలోకి మాత్రం వెళ్లకండి అంటే.. కచ్చితంగా అందులోకే వెళ్లడం సగటు భారతీయుని నైజం. ఇదీ అంతే.. రూల్స్ అంటూ ఎవరైనా మాట్లాడితే.. ఆ చెప్పొచ్చావులే పేద్ద.. రూల్స్‌ అంట రూట్స్‌.. అని ఆరున్నొక్క రాగాల దీర్ఘం తీయడం మనకు అలవాటై పోయింది.

    గీ ట్రాపిక్ పురాణం పొద్దుపొద్దులా మాకెందుకు బై అంటే.. జర ఆగుండ్రి మరి.. మన సివిక్ సెన్స్ చూసి విదేశీయులే నోరెల్ల బెడ్తుండ్రంట. పుణెలో ఓ విదేశీయుడు మనోళ్లు ఫుట్‌పాత్‌ల మీదికెళ్లి మోటార్‌ బైకులు చెలాయిస్తూంటే వారిని ఆపి.. ఏందిది? అని అడుగుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందుకే.. ఇక్కడే కాదు.. దేశంలో చాలా చోట్ల విదేశీయులు మన భారతీయుల ఉల్లం‘ఘనుల’ను చూసి.. అరే ఎంత దర్జాగా రూల్స్ వదిలేసి తిరుగుతుండ్రని నోళ్ళు నొక్కుకుంటుండ్రు. మన దేశ రాజధాని ఢిల్లీలో సైకిల్ తిరగాల్సిన చోట వాహనాలు హల్ చల్ చేస్తుంటే.. చూస్తున్న విదేశీయులు రంగప్రవేశం చేసి జనాలకు బాబూ దీన్ని బైసైకిల్‌ లేన్ అంటారు. ఇక్కడ కేవలం సైకిల్స్ తిరగాలి అంతేకానీ.. ఎడాపెడా పెద్ద వాహనాలు రాకండి అంటూ నిలబడి మరీ చెప్పడం ప్రారంభించారు.

    కొందరు వీరి మాటలు వింటున్నట్లు నటించినా.. మరి కొందరు బేఫికర్‌గా వారి మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అరే మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ గురించి విదేశీయులు అర్థం చేసుకుని ఇలా పాటించాలి బాబూ అంటున్నా.. వినకుండా వారు అలా చెబుతున్నందుకు విసుక్కొంటున్నారట. పాపం విదేశీయులకు మన థియరీ అర్థం కాలేదు. అరే వీరేందిర బై రూల్స్ అన్నాక ఫాలో కావాలి కదా. పనిగట్టుకుని మరీ  రూల్స్ బ్రేక్ చేస్తే వీరికి మాత్రం ఒరిగేదేంటి? అని లోలోపల మదనపడుతున్నారట. విదేశీయులు మన భారతీయులకు ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.

    మనవాళ్ళదంతా ఎడ్డెమంటే తెడ్డెమనే రకం.. ఫర్ ఎగ్జాంపుల్.. వన్ వే ట్రాఫిక్ అన్నారనుకోండి.. సరిగ్గా అదే రూట్ లోనే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా అని పాటలు పాడుకుంటూ మరీ వెళుతుంటారు. పోలీసులు చూసి విజిల్ వేసినా.. పెద్దగా పట్టించుకోరు. ఒకరు అలా రావడం షురూ చేస్తే పది మందిదీ అదే దారి అవుతుంది. ఎంతైనా మనది గొర్రెదాటు కదా. సిగ్నల్ లైట్ల విషయం సరే సరి ఎర్రలైట్ ఆన్ కాగానే మనం బండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే రష్ ఉండదు.. ఇలా ఉంటుందండి సగటు వాహనదారుడి సైకాలజీ.

    అరే ఇదేందిర బై వన్ వే అంటూ రాసిండు గదా.. ఇట్టే వస్తున్నవేంది? అని ఎవరైనా అడిగితే... చుట్టూ ఎలితే లంబా అవుతది గందుకే షార్ట్ గా ఈ తొవ్వలో వస్తుండ అంటూ యమ కూల్ గా సమాధానం చెబుతారు. హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు జర ఫోర్స్ చేసిండ్రు అంటే.. గదేంది సర్ పొద్దునే ఈ రూట్ లో ఇట్టే వెళ్ళా.. గప్పుడు కూడా లేదు.. ఇప్పుడు అడుగుడేంది అంటూ ఉల్టా ప్రశ్న వేస్తుంటే సదరు పోలీసు నోరెళ్ళబెట్టాల్సిందే. ఇగ హారన్ కొట్టుడు అంటే మనకు మస్త్ మజా వస్తది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా.. హారన్ దంచుతునే ఉంటం.. అరె బై ఆ సప్పుడేంది.. ట్రాఫిక్ ఉంది కదా అని విసుక్కొన్నారో.. హారన్ సౌండ్ మరింత పెరుగుతుంది. అదే విదేశాల్లో హారన్ కొట్టడం అంటే న్యూసెన్స్ గా భావిస్తారు.

    విదేశాల్లో ఇలా అంటే చాలు ఆ మా బాగా చెప్పొచ్చావులే.. అక్కడికే వెళ్ళలేకపోయావా అంటూ వ్యంగ్యం దట్టించి మరీ మాటలు వదులుతుంటారు. కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే.. యూరోపియన్ దేశాల్లో అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ పట్టింపు చాలా ఎక్కువ. రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ తోపాటు సైకిల్ పై వెళ్లే వారికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. ప్రభుత్వ బస్సులు నడపడానికి కూడా ప్రత్యేక లైన్లుంటాయి. పాదచారులకు వారు అత్యధిక ప్రాధాన్యమిస్తారు. పెడస్ట్రియన్ సిగ్నల్ పడిందంటే.. ఎన్ని వాహనాలైనా సరే అటూ ఇటూ నిలిచి వేచి చూడాల్సిందే. 

    అలాగే స్కూల్ జోన్ వద్ద సైలంట్ జోన్ అని ఉంటుంది. అక్కడ హారన్ మోగిస్తే ఫైన్ కట్టాలి. అలాగే స్కూల్, హాస్పిటల్ వద్ద స్పీడుగా వెళ్ళినా పెనాల్టీ డబుల్ ఉంటుంది. టొరంటోలో ట్రాఫిక్ ఎప్పుడూ హెవీగానే ఉంటుంది. కానీ ప్రమాదాల శాతం చాలా తక్కువ. మనకూ ట్రాఫిక్ రూల్స్ బోలెడన్ని ఉన్నాయ్.. పాటించేవారి సంఖ్యే తక్కువ. రూల్స్ బ్రేక్ చేయడమంటే మనకు వెన్నతో పెట్టిన విద్య. అది తప్పని కూడా అనుకోం. పాపం ఢిల్లీలో విదేశీయులు మన అరాచకం చూసి అల్లాడిపోయారు. కనీసం రూల్స్ చెబితే పాటిస్తారేమోనని అనుకుని చెప్పడం ప్రారంభించారు. వారిది ఎంత దురాశో కదా.
    -ఆరెం.

Family

  • వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్‌ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్‌ గౌరీ అగర్వాల్‌.

    ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్‌లో ఏఐలో బగ్‌ ప్రాబ్లమ్‌’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్‌టాప్‌ తీసుకొని క్రిటికల్‌ బగ్‌ను పది నిమిషాల్లో సాల్వ్‌ చేసింది గౌరీ అగర్వాల్‌.

    ‘ఎక్స్‌’లో ఆమె తమ్ముడు మెహుల్ అగ‌ర్వాల్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ బోలెడు లైక్‌లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్‌ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్‌ (Gauri Agarwal) సోదరుడు మెహుల్‌.

    అయితే సోషల్‌ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 
    కొందరు గౌరీ అగర్వాల్‌కు జై కొట్టారు.
    కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్‌ పెట్టారు.

    ‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. 

    చ‌ద‌వండి: 20 ఏళ్ల‌కే రీసైకిలింగ్ కింగ్‌..!

     

  • ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కరణ్‌ తన ‘ఫినోబాదీ’ స్టార్టప్‌ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేశాడు. 3,318 మొక్కలను నాటాడు. డైబ్భై మందికి పైగా కార్మికులకు స్థిరమైన, గౌరవప్రదమైన ఆదాయాన్ని కల్పిస్తున్నాడు...

    ‘స్టెబిలిటీ–క్లారిటీ–డిగ్నిటీ’ నినాదంతో ‘ఫినోబాదీ’ అనే రీసైకిలింగ్‌ కంపెనీని ప్రారంభించాడు కరణ్‌ కుమార్‌. కరణ్‌ తండ్రి అయిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆస్తిపాస్తులు లేవు. కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషించాడు. ‘నాన్నకు చదువు లేదు. ఆస్తి లేదు. అయినా సరే ఏదో రకంగా జీవనోపాధిని సృష్టించుకోగలిగాడు. ఇది చూసిన తరువాత శూన్యం నుంచి అవకాశాన్ని సృష్టించుకోవచ్చు’ అనే విషయాన్ని నేర్చుకున్నాను అంటాడు కరణ్‌.

    ఎందుకు? ఏమిటి? ఎలా?
    రకరకాల గాడ్జెట్స్‌కు సంబంధించి  ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆసక్తి కరణ్‌లో ఉండేది. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవాలనుకునేవాడు. చేతికి దొరికిన ప్రతి గ్యాడ్జెట్‌ను విడదీసి, తిరిగి వాటిని యథాతథ స్థితిలోకి తీసుకువచ్చేవాడు. ఇది సరదా కోసం చేసిన పని కాదు. 

    వాటి అంతర్గత పనితీరు తెలుసుకోవడానికి చేసింది. ఏదైనా గ్యాడ్జెట్‌ పనిచేయకపోతే దాన్ని బాగు చేసి పనిచేసేలా చేసేవాడు. దీంతో ఇరుగు పొరుగు వారు రిపేర్‌ పని ఏదైనా ఉంటే కరణ్‌ దగ్గరికి వచ్చేవారు. పాకెట్‌ మనీకి కరణ్‌కు లోటు ఉండేది కాదు.

    నేర్చుకున్న తొలిపాఠం
    కోవిడ్‌ టైమ్‌లో తండ్రి వర్క్‌షాప్‌ మూతబడడంతో తమ్ముడితో కలిసి చిన్నపాటి ‘డోర్‌–టు–డోర్‌ మిల్క్‌ డెలివరీ సర్వీస్‌’ ప్రారంభించాడు కరణ్‌. అయితే దీంతో నష్టమే తప్ప లాభం రాలేదు. ‘వ్యాపారం అనేది సమస్యను పరిష్కరించేలా ఉండాలి. సమస్యను కొని తెచ్చుకునేలా ఉండకూడదు అనే పాఠాన్ని ఆ అనుభవం నుంచి నేర్చుకున్నాను’ అంటాడు కరణ్‌.

    ఇంటర్మీడియెట్‌ చేస్తున్నప్పుడు దిల్లీ ప్రభుత్వ భాగస్వామ్యంతో, ఉద్యమ్‌ లెర్నింగ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘ఉద్యమ్‌ శిక్ష’ అనే కార్యక్రమంలో చేరాడు కరణ్‌. నిజజీవిత సమస్యలు పరిష్కరించడానికి విద్యార్థులకు ఉపకరించే శిక్షణా కార్యక్రమం ఇది.

    ‘ఉద్యమ్‌ శిక్షలో చేరిపోవడం నా జీవితాన్ని మార్చేసింది. నేను కొత్త వారితో మాట్లాడేవాడిని కాదు. మాట్లాడడానికి ఇబ్బంది పడేవాడిని. అయితే ఉద్యమ్‌ శిక్ష నాలోని బెరుకును పోగొట్టింది. బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోమని చెప్పింది. ఈ క్రమంలోనే నాలో చిన్నగా ఆత్మవిశ్వాసం మొదలైంది’ అంటాడు కరణ్‌.

    ఫిన్‌ ప్లస్‌ కబాదీ
    ఢిల్లీలో చెత్తకుప్పల సమస్య తీవ్రంగా ఉండేది. చెత్తకుప్పలను కాల్చడం వల్ల విషపూరిత పొగలు విడుదలయ్యేవి. ఇది చూసి షాక్‌ అయ్యాడు కరణ్‌. ఈ చెత్త కుప్పలను కాల్చడం ద్వారా విషవాయువులు విడుదలవుతాయి అనేది ఒక కోణం అయితే, మరో కోణం వాటిని పునర్వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోవడం. 

    సమస్య తీవ్రతను తెలుసుకోవడానికి కబాదీవాలాస్‌(స్క్రాప్‌ డీలర్లు)తో మాట్లాడాడు కరణ్‌. వారి పని విధానం ఎలా ఉంటుందో, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకున్నాడు. ‘విలువ లేని వస్తువులను విలువైన వస్తువులుగా మారుస్తాం’ అని వారు చెప్పిన మాట కరణ్‌ను ఆకట్టుకుంది. వారి మాటల స్ఫూర్తితో ‘ఫినోబాదీ’ పేరుతో రీసైక్లింగ్‌ కంపెనీ మొదలు పెట్టాడు కరణ్‌. ఫిన్‌ (ఫైనాన్స్‌), కబాదీ(స్క్రాప్‌) అనే రెండు మాటలు ఒక దగ్గర చేర్చి తన కంపెనీకి ‘ఫినోబాదీ’ అనే పేరు పెట్టాడు.

    ఆ మొక్కలు లక్ష్యాన్ని గుర్తు తెస్తాయి
    స్కూలు ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీలోని చంచల్‌ పార్క్‌లో పునర్వినియోగపరచదగిన వస్తువులను సేకరించడం మొదలుపెట్డాడు కరణ్‌. అయితే వారు పనికొస్తాయనుకున్న వస్తువులలో పనికిరాని వస్తువులే ఎక్కువ! ‘ఈ అనుభవంతో ప్లాస్టిక్, మెటల్, పేపర్‌కు సంబంధించి సూక్ష్మస్థాయిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఏ వస్తువు పనికొస్తుంది, ఏది పనికి రాదు అనే విషయంలో స్పష్టత తెచ్చుకున్నాం’ అంటాడు కరణ్‌. ఉద్యమ్‌ లెర్నింగ్‌ ఫౌండేషన్‌ ‘బిజినెస్‌ బ్లాస్టర్స్‌ ప్రోగ్రాం’ ద్వారా సీడ్‌ క్యాపిటల్‌ సంపాదించాడు.

    కంపెనీ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించాడు. యాప్‌ తీసుకువచ్చాడు. గల్లీలో మొదలైన ‘ఫినాబాదీ’ ఢిల్లి అంతటా విస్తరించింది. నోయిడా, గురుగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. వంద కిలోల వ్యర్థాలను రీసైకిల్‌ చేసిన ప్రతిసారి ఒక మొక్క నాటడం సంప్రదాయంగా చేసుకుంది ఫినోబాదీ. ‘మనం ఈ పని ఎందుకు చేస్తున్నామో ఆ మొక్క గుర్తు తెస్తుంది’ అంటాడు కరణ్‌ కుమార్‌.

    (చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్‌లు..! అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌​ ఏంటంటే..)
     

  • ఈ పిల్లి రైలులో స్టేషన్‌మాస్టర్‌. ఔను మీరు వింటుంది నిజం. ఇదేంటి పిల్లి స్టేషన్‌మాస్టర్‌ అనుకోకండి. అది చక్కగా విధులు నిర్వర్తించి శెభాష్‌ అనిపించుకోవడమే కాదు..ఏకంగా నష్లాల్లో ఉన్న రైల్వేని లాభాల బాట పట్టించిందట. అంతేకాదండోయే ఈ పిల్లి క్రేజ్‌కి నోటమాటరాదు. విధులు నిర్విర్తిస్తూ అనారోగ్యంతో చనిపోతే..దానికి వీడ్కోలు పలికేందుకు ఏ రేంజ్‌లో జనాలు వచ్చారో తెలిస్తే..కంగుతింటారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేద్దామా..!.

    ఇప్పుడు చెప్పుకోబేయే పిల్లి పేరు  నిటామా. జపాన్‌లోని వాకాయామా కిషి స్టేషన్‌కు స్టేషన్‌మాస్టర్‌గా ఉండేది. వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే కోలో స్టేషన్‌ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉండేది. ఈ ఏడాది అక్టోబర్‌ చివరిలో ఆరోగ్య క్షీణించడంతో ఇటీవలే కన్నుమూసింది. 15 ఏళ్ల వయసులో మరణించింది.

    పిల్లి ఎలా విధులు నిర్వర్తిస్తుందంటే..
    వాకాయామా నగరంలో జన్మించిన ఈ పిల్లిని  ఓ వర్షం కురిసిన రోజు కారు కింద నుంచి రైల్వే వారు రక్షించారట. అప్పటి నుంచి దీని బాగోగులు అన్ని ఆ రైల్వేనే చూసుకునేదట. అంతకుముందు ఈ రైల్వేలో స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేసిన టామా నుంచి నేరుగా శిక్షణ తీసుకుందట ఈ నిటామా. అంతేకాదండోయ్‌ టామా వారసురాలిగా దాని స్థానంలో రానున్న ఈ నిటామా పిల్లికి అత్యంత స్ట్రిట్‌గా ట్రైనింగ్‌ ఇచ్చేదట ఆ టామా పిల్లి. 

    ఎవ్వరితోనైనా సౌమ్యంగా ఉడే ఆ టామా..నిటామా పిల్లి వద్దకు వచ్చేటప్పటికీ..సరిగా పని నేర్చుకోవాలని సీరియస్‌ ఉండేదట. అలా ఆ టామా తదనంతర స్టేషన్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తించిందట. అయితే ఈ కిషి స్టేషన్‌లో పనిచేయడాని కంటే ముందు  అదే ట్రాక్‌లో ఇడాకిసో స్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసేదట. 

    ఆర్థికంగా నష్టాల్లో ఉన్నఈ  రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా వీటిని స్టేషన్‌ మాస్టార్‌లుగా నియమించిందట జపాన్‌ ఎలక్ట్రిక్‌ రైల్వే కో లిమిటెడ్‌. అంతేగాదు ఆ రైల్వేలో సెలబ్రిటీ మాదిరిగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ నిటామా పిల్లి అంత్యక్రియలకు ఏకంగా 500మంది దాక హాజరయ్యారట కూడా. 

    అంతేగాదు ఆ పిల్లిచివరి కార్యక్రమాలన్నింటిని ఆ వాకాయామా ఎలక్ట్రిక్‌ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కోజిమా చూసుకున్నారట. అయితే ఈ నిటామా ఎంతమేరకు ఈ రైల్వే మార్గానికి రైడర్‌షిప్‌ అందించిందనేది రహష్యంగా ఉన్నా..గతంలో టామా అనే పిల్లి మాత్రం ఏకంగా రూ. 82 కోట్లు పైనే ఆదాయాన్ని ఇవ్వడమే గాక ఏకంగా 17% రీడర్‌షిప్‌ని కూడా అందించిందట.

    (చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?)

     

  • మనలో చాలా మందికి క్రిస్మస్‌ పండుగ వేడుక అనగానే క్రిస్మస్‌ చెట్టు లేదా శాంతా క్లాజ్‌  మాత్రమే కావచ్చు కానీ పలు దేశాల్లో ప్రజలకు మాత్రం ఇంకా చాలా చాలా  గుర్తొస్తాయి. కొందరికి దెయ్యం దహనం గుర్తొస్తే మరికొందరికి వీధుల్లో భోగి తరహాలో వేసే మంటలు గుర్తోస్తాయి. ఈ అంతర్జాతీయ పండుగను ప్రపంచవ్యాప్తంగా  అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారం ఇది..

    ఐస్‌లాండ్‌లో క్రిస్మస్‌ జానపద కథలు   సంప్రదాయాలతో నిండి ఉంటుంది. ఇక్కడి శాంతా క్లజ్‌ లాగానే అనిపించే  దుష్ట సోదరుల సమూహం అయిన యూల్‌ లాడ్స్‌ చిన్నారులను అలరిస్తారు. మొత్తం 13 రోజుల పాటు ప్రతి చిన్నారికి రాత్రి వేళల్లో  చిన్న చిన్న బహుమతులు అందిస్తారు అది కూడా కిటికీల దగ్గర ఉంచిన బూట్లలో వాటిని పెట్టి వెళ్లిపోతారు.   వారి రాక పండుగ సీజన్‌ అంతటా ఉత్సాహాన్ని సృష్టిస్తుంది.

    జపాన్‌లో క్రిస్మస్‌ ఉల్లాసంగా చాలా ఆధునికంగా ఉంటుంది. నగరాలన్నీ విద్యుత్‌ కాంతులతో మెరుస్తాయి  క్రిస్మస్‌ ఈవ్‌ను ఒక రొమాంటిక్‌ అకేషన్‌గా భావిస్తారు. దాంతో జంటల సందడి కనిపిస్తుంది. అలాగేక్రిస్మస్‌ విందులో భాగంగా కెఎఫ్‌సిని ఆస్వాదించడం అనేది 1970లలో ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా కెఎఫ్‌సి బకెట్ల కోసం కుటుంబాలు ముందస్తుగా భారీ ఆర్డర్‌లు ఇస్తాయి. అలాగే క్రీమ్‌  స్ట్రాబెర్రీలతో అలంకరించిన క్లాసిక్‌ క్రిస్మస్‌ కేక్‌ను కూడా వీరు ఆస్వాదిస్తారు.

    ఇండోనేషియా దేశం ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ, అక్కడి క్రై స్తవ సమాజాలు ఈ పండుగను గొప్పగా వైభవంతో జరుపుకుంటాయి. ఆ దేశంలోని ఉత్తర సుమత్రాలో, బటాక్‌ జాతీయులు ఈ పండుగ సందర్భంగా మార్బిండా అనే సంప్రదాయాన్ని  పాటిస్తారు దీనిలో భాగంగా జంతు బలి కూడా ఉంటుంది.   బంధుత్వాన్ని గౌరవించడానికి విందును పంచుకుంటారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రమైన బాలిలో,  పెంజోర్‌ బాంబూ పోల్స్‌తో వీధుల్ని అలంకరిస్తారు.   కుటుంబాలు ఇంట్లో తయారుచేసిన వంటకాలను బహుమతిగా పంచుకునే న్గేజోట్‌ అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.

    గ్వాటెమాలాలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా లా క్వెమా డెల్‌ డయాబ్లో పేరిట దెయ్యాన్ని దహనం చేయడం అనే విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. డిసెంబర్‌ 7న, కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దుష్టశక్తులను తరిమికొట్టడానికి  అదృష్టాన్ని స్వాగతించడానికి పాత చెత్తతో పాటు దెయ్యం ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. వీధులు భోగి మంటల తరహాలో మంటలు, సంగీతం  సమావేశాలతో వీధులన్నీ కళకళలాడతాయి.  ఈ సీజన్‌ అర్ధరాత్రి వేడుకల్లో బాణసంచా కుటుంబ విందులతో కొనసాగుతుంది,

    గ్రీస్‌ పండుగ పడవ సంప్రదాయం గ్రీస్‌లో కరవాకి అని పిలిచే రంగురంగుల చెక్క పడవలు గ్రీస్‌ సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే పండుగ చిహ్నాలుగా వెలిగిపోతాయి. క్రిస్మస్‌ సందర్భంగా, పిల్లలు ఇంటి నుంచి ఇంటికి వెళ్లి కలంద అనే సాంప్రదాయ కరోల్‌లను పాడుతూ, త్రిభుజాలు లేదా డ్రమ్స్‌ వాయిస్తారు. ఇళ్ళు మెలోమకరోనా (సాంప్రదాయ గ్రీకు క్రిస్మస్‌ కుక్కీలు) వంటి తేనె బిస్కెట్ల సువాసనతో నిండిపోతాయి, కుటుంబాలు క్రిస్టోప్సోమో (క్రీస్తు రొట్టె)ను ప్రతీకాత్మక విందు గా కాలుస్తాయి

    (చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?)

International

  • బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.

    బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్‌ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్‌ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.

    ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

    అనంతరం పోస్టుమార్టమ్‌ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్‌కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా  స్క్వేర్ మాస్టర్‌ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

    ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి.

     

  • వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన గ్రీన్‌కార్డ్‌ లాటరీను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  

    ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. అదే సమయంలో ఎంఐటీ ప్రొఫెసర్‌ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటనకు కారణం పోర్చుగీస్ జాతీయుడు క్లాడియో నేవెస్ వాలెంటే (48)నని అమెరికా పోలీసులు గుర్తించారు. వాలెంటే అమెరికాలోకి ప్రవేశించేందుకు  గ్రీన్ కార్డ్ లాటరీని అస్త్రంగా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. 

    ఈ క్రమంలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులు అమెరికాలో అడుపెట్టేందుకు అనర్హులు. అందుకే, అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు USCIS గ్రీన్ కార్డ్ లాటరీని నిలిపివేస్తోంది’ అని తెలిపారు. 

    గ్రీన్‌కార్డ్‌ కేటాయింపులు ఇలా
    ప్రతి సంవత్సరం 50వేల గ్రీన్‌కార్డులను అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల అభ్యర్థులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాల అభ్యర్థులు ఉంటారు. 2025 లాటరీకి దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో కుటుంబ సభ్యులను కలుపుకొని 1,31,000 మందిని ఎంపిక చేశారు. పోర్చుగీస్ పౌరులకు కేవలం 38 స్లాట్లు మాత్రమే లభించాయి. ఈ ప్రోగ్రామ్‌ను అమెరికా కాంగ్రెస్ సృష్టించింది. కాబట్టి దీని నిలిపివేతపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీకి వ్యతిరేకంగా ఉన్నారు. తాజాగా  బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల ఘటనతో గ్రీన్‌కార్డ్‌ లాటరీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్‌ నిర్ణయం హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ ప్రకటించారు.

    ఇదిలా ఉండగా..ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వలస విధానాలపై చర్చకు దారితీశాయి. భద్రతా కారణాల వల్ల తీసుకున్న ఈ చర్య.. అమెరికాలో స్థిరపడాలనుకున్న విదేశీయులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

      

  • బ్రస్సెల్స్: యూరప్‌ రాజధాని బ్రస్సెల్స్‌ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.

    ఇటీవల యురేపియన్‌ యూనియన్‌  బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు.  

    కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్‌లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్‌ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.   

    రైతుల తిరుగుబాటుకు కారణం
    యురేపియన్‌ యూనియన్‌ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.

     

    రణరంగంగా గ్రీస్‌
    మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్‌ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్‌లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

    తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది.  ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

  • అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ ఇమేజ్‌ మరోసారి దెబ్బ తింది. ఆ దేశ పౌరులను అరబ్‌ దేశాలు బలవంతంగా వెనక్కి పంపించేస్తున్నాయి. పైగా వాళ్ల మీద బిచ్చగాళ్లు.. నేరగాళ్లు అనే ముద్ర వేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది ఇప్పుడు.. 

    ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడుతోంది. వలస వెళ్లిన తమ పౌరులను ఆ దేశాలు వెనక్కి పంపించేస్తున్నాయి. పాక్‌ పౌరుల వల్ల తమ దేశాల్లో నేరాలు పెరుగుతున్నాయని.. పైగా భిక్షాటనతో తమ దేశ పర్యాటక రంగాన్ని దెబ్బ తీస్తున్నారని ఆయా దేశాలు భావిస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ల నుంచి పెద్ద సంఖ్యలో పాక్‌ పౌరులను వెనక్కి పంపించేస్తున్నారు. యూరప్‌-ఆసియా సరిహద్దులోని.. కాకేసస్‌ దేశం అజర్‌ బైజాన్‌ కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. 

    ఇందులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 24,000 మంది ఉన్నారు. దుబాయ్ నుంచి 6,000 మంది, అజర్‌బైజాన్ నుంచి వచ్చిన 2,500 మందిని పాక్‌కు తిప్పి పంపించారు. ఆర్గనైజ్డ్‌ బెగ్గింగ్‌ మాఫియాలో భాగంగా ఆయా దేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే వీళ్ల వల్ల విద్య, ఉద్యోగాల నిమిత్తం ఆయా దేశాలకు వెళ్లిన వాళ్లను కూడా వెనక్కి పంపుతున్నారని పాక్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

    హెచ్చరించినా కూడా.. 
    2024లో సౌదీ అరేబియా పాక్‌కు ఓ ప్రకటన జారీ చేసింది. ఉమ్రా వీసాలను భిక్షాటన కోసం దుర్వినియోగం చేయొద్దని తమ పౌరులకు గట్టిగా చెప్పాలని పాకిస్తాన్‌ను హెచ్చరించింది. నియంత్రించకపోతే హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అయినా కూడా ఆ వ్యవహారం కొనసాగుతూ వస్తోంది. 

    ఇక యూఏఈ ఏమో అదనంగా ఇంకో వాదనను తెరపైకి తెచ్చింది. తమ దేశంలో జరుగుతున్న నేరాల్లో పాక్‌ పౌరుల వాటా కూడా ఉంటోందని.. వివిధ ఉద్దేశాలతో వచ్చి చాలామంది నేరాలకు పాలపడుతున్నారని యూఏఈ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది ఆ పాక్‌ పౌరులపై వీసా పరిమితులు విధించింది. 

    అరబ్‌ దేశాలు మాత్రమే కాదు.. ఆఫ్రికా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో.. ఆసియాలో కాంబోడియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పాక్‌ పౌరులు బిచ్చగాళ్లుగా అక్కడి ప్రభుత్వాలకు తలనొప్పులుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఆర్గనైజ్డ్ భిక్షాటన గ్యాంగ్‌లను అడ్డుకోవడం, అక్రమ వలసలను నిరోధించడం కోసం వాళ్లను వెనక్కి పంపించేస్తున్నాయని ఆయా దేశాలు. అయితే.. పశ్చిమాసియాలో పట్టుబడ్డ ముఠాల్లో 90 శాతం బిచ్చగాళ్లు పాక్‌కు చెందిన వాళ్లే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికారి జీషాన్ ఖంజాదా చెబుతుండడం గమనార్హం.  

    వేల మంది ముఠాగా..
    ఈ ఏడాదిలో ఇప్పటిదాకా పాకిస్తాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(FIA) విమానాశ్రయాల్లో 66,154 మందిని విదేశాలకు వెళ్లకుండా ఆపగలిగింది.  మక్కా, మదీనా పవిత్ర స్థలాల వద్ద కూడా పాకిస్తానీ భిక్షాటనకారులు యాత్రికులను వేధిస్తున్నారని పాక్‌కు చెందిన డాన్‌ పత్రిక ఈ మధ్యే ఓ కథనం ప్రచురించడం గమనార్హం.  ఈ పరిణామాలపై ఎఫ్‌ఐఏ డీజీ స్పందిస్తూ.. ఈ నెట్‌వర్క్‌ల వల్ల పాక్‌ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైన్యం సాయంతో ఇలాంటి ముఠాలను అడ్డుకోవాలని షెహబాజ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.

Cartoon