Archive Page | Sakshi
Sakshi News home page

National

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(పీఏ) చంద్రనాథ్ రాథ్ హత్యకు గురయ్యారు. కోల్‌కతా సమీపంలోని మధ్యంగ్రాంలో జరిగిన ఈ ఘటనలో చంద్రనాథ్ రాథ్‌పై రెండు సార్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అతనితో పాటు ఉన్న బుద్ధదేవ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. దాంతో బుద్ధదేవ్‌ను ఆసుపత్రికి తరలించారు.  

    ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన రెండు రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. మధ్యంగ్రాం నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రథిన్ ఘోష్, ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2,399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.  

    తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో సువేందు అధికారి, భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000 పైగా ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్' అనే పేరును సంపాదించారు. దాంతో సువేందు అధికారిని ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. ఈ హత్య ఘటనతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • నయాగఢ్: ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో ఓ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోవడంతో పాటు.. పక్కనే  భారీ కొండచిలువ(విషసర్పం) కూడా ఉండటంతో తీవ్ర టెన్షన్‌ నెలకొంది. ఎనిమిది గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు బాలుడిని క్షేమంగా రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    వివరాల్లోకి వెళ్లితే. బాలుడు శిబా ప్రధాన్‌ తన మామతో కలిసి తేనె సేకరించడానికి కనిపాడ అడవికి వెళ్లాడు. అక్కడ పెద్ద రాళ్ల సందులో తేనెతుట్టెలను చూసి.. వాటిని సేకరించేందుకు శిబా ప్రయత్నించాడు. ఆ క్రమంలో సందు లోపలి భాగంలో ఉన్న తేనెను తీయడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ బాలుడి తల రాళ్ల సందులో ఇరుక్కుపోయింది. శిబా మామ అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో.. గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వారు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

    సమాచారం అందుకున్న ఒడగావ్, నయాగఢ్ నుండి రెండు అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. రక్షణ చర్యల్లో స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. అయితే, శిబాకు సమీపంలోనే ఒక పెద్ద విషసర్పం ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు కొంత ఆటంకం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది మొదట బాలుడికి ధైర్యం చెప్పి.. ఆపై వివిధ పరికరాలను ఉపయోగించి అతన్ని విజయవంతంగా బయటకు తీశారు. ఎనిమిది గంటల శ్రమ తర్వాత శిబాను సందులోంచి సురక్షితంగా బయటకు తీసి.. ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన ప్రకటన చేసింది. సీఎంగా తాను ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయనని అవసరమైతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలిపింది. ఎన్నికల్లో విపరీతంగా అక్రమాలు జరిగాయని అందుమూలంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ రాజకీయాలు మారోసారి హాట్‌టాఫిక్‌గా మారాయి.  

    ఫలితాలు వచ్చిన అనంతరం మమతా మాట్లాడుతూ "ప్రజాతీర్పుతో మేం ఓడిపోలేదు. కుట్ర చేసి మమ్మల్ని తక్కువ సీట్లకు పరిమితం చేశారు. అలాంటప్పుడు నేను రాజీనామా చేయాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? నేను ఓడిపోలేదు. లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామాలేఖ సమర్పించే ప్రసక్తే లేదు". అంది. 

    అయితే మమతా బెనర్జీ పలుమార్లు ఇలా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి సభలో (అసెంబ్లీలో) మెజారిటీని కోల్పోతే, గవర్నర్ వారిని తొలగించవచ్చు లేదా రాజీనామా చేయాలని కోరవచ్చు.

    ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయబోనని మొండికేస్తే రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ తదుపరి కార్యాచరణను అమల్లోకి తీసుకురావచ్చు. ఆ అధికారం రాజ్యాంగం గవర్నర్‌కు ప్రసాదించింది. శాసనసభ అనేది శాశ్వతసభ కాదు. ఐదేళ్ల కాలపరిమితి ముగియగానే శాసనసభ రద్దవుతుంది.

     పాత ముఖ్యమంత్రి తనకు కొత్త ఎమ్మెల్యేల్లో సరిపడా బలం ఉందని విశ్వసిస్తే బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశించవచ్చు. అయితే తాజా ఎన్నికల్లో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య సాధారణ మెజారిటీకి సరిపడా లేదు కాబట్టి బలనిరూపణలో మమత ఓడిపోవడం ఖాయం. మెజారిటీ సీట్లు సాధించిన పార్టీనే గవర్నర్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.

    కాగా ఇదివరకే టీఎంసీ ప్రభుత్వ కాలపరిమితి ముగిసింది . దీంతో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం చూసినా టీఎంసీ పాలన ముగిసినట్లే. మమత ఆటోమేటిక్‌గా సీఎం పదవిని కోల్పోయినట్లే లెక్క. గవర్నర్‌ కోరనిది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం కూడా మమతకు లేదు.

     

  • చెన్నై: భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదంటూ డీఎంకే తేల్చి చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని డీఎంకే తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందన్న డీఎంకే.. కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిచాం. అందుకు తాము భారీ మూల్యాన్ని చెల్లించామంటూ డీఎంకే పేర్కొంది.

    సోనియా, మన్మోహన్‌ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం. రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం. అయితే ఇప్పుడు డీఎంకేతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం.. మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం. మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది. ఇది ప్రజలను మోసం చేయడమే. బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదు. 

    రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా స్టాలిన్‌ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండి కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్‌ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం. ఓటమి మాకు కొత్తేమి కాదు.. వెన్నుపోటు కొత్త కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతాం’’ అంటూ డీఎంకే హెచ్చరించింది.

  • చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ  ఆ రాష్ట్ర గవర్నర్‌  రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

    డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్‌ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది  ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. 

    బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్‌ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్‌ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్‌ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్‌ జతకట్టింది". అని డీఎంకే ‍ప్రకటన విడుదల చేసింది.

    టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా..

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత.. ఎం.కే స్టాలిన్‌ను రజనీకాంత్ ఆయన నివాసంలో ఇవాళ(బుధవారం) కలిశారు. మర్యాద పూర్వకంగానే రజనీకాంత్‌.. స్టాలిన్‌తో భేటీ అయ్యారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్‌.. స్టాలిన్ కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకోగా, డీఎంకే 59 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.

    స్టాలిన్ తన కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డీఎంకే, మిత్రపక్షాలు రెండో అతిపెద్ద కూటమిగా నిలిచినందున.. కొత్త అసెంబ్లీలో అవి ప్రతిపక్ష స్థానంలో కూర్చోనున్నాయి. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

    గతంలో రజనీకాంత్‌.. డీఎంకేకు అందించిన మద్దతు దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 1995లో రాజకీయాల్లోకి వస్తారని భావించిన సమయంలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీకి అండగా నిలిచారు. ఆ తర్వాత 2017లో రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించినప్పటికీ, 2021లో అనారోగ్య కారణాలతో రజనీకాంత్ వెనక్కి తగ్గారు. విజయ్ విజయం తర్వాత.. ఆయనకు అభినందనలు తెలుపుతూ రజనీకాంత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

    కాగా, విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. ఆయన పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉప ఎన్నికలు జరగవచ్చు. మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకు ఇంకా 10 స్థానాల మద్దతు అవసరం.

  • చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌కు మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత గోపాలకృష్ణ గాంధీ బహిరంగ లేఖ రూపంలో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. కొన్ని పనలు చేయాలని, కొన్నింటిని చేయకూడదని సూచించారు.

    ‘కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ పర్యాయం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర ఓటరును. కానీ, ఏప్రిల్ 23 రోజు మీకు ఓటు వేసిన దాదాపు 35 శాతం మందిలో నేను లేను. మీకు ఓటు వేయని 65 శాతం మందిలో నేనున్నాను. విజయ్ యువతను ఆకర్షిస్తున్నారని, కానీ అది సీట్లు తెచ్చిపెట్టదని అనుకున్నాను. ఓట్లు ఎప్పటిలాగే వెళ్లే చోటికే వెళ్తాయనే అభిప్రాయంతో నేను ఉన్నాను. కాబట్టి 4 మే రోజు ఫలితాలు వరుసగా వెలువడుతుండగా నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విజయ్‌ కొత్తవాడు, అంటే అనుభవం తక్కువ’ అన్నారు.

    ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థను రక్షించాలి 
    అదే సమయంలో ఆయన అవినీతిపరుల ప్రభావం లేకుండా ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్నికైన ఎం.కె.స్టాలిన్ ముందు కొన్ని ఆలోచనలను ఉంచినట్లే, ఇప్పుడు మీ ముందూ అటువంటి వాటిని ఉంచాలనుకుంటున్నానని చెప్పారు. ‘మీరు ఎన్నికల్లో గెలిచారు. సభలో అత్యంత కీలకమైన ఫ్లోర్ టెస్ట్ ఇంకా గెలవాల్సి ఉంది. భారత ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థ రక్షణను మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీ నాయకత్వంలో రాష్ట్రం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ గౌరవాన్ని నిలబెట్టాలి. పదవి కాపాడుకోవాలనే ఆందోళన దానిపై రాజీ పడేలా చేయకూడదు. మీ సిద్ధాంతం ఏమిటి అని అడగవచ్చు. అది మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ‘నా సిద్ధాంతం.. సిద్ధాంతం లేదు’ అని చెప్పండి. అలాగే ‘నా మనసాక్షిని అనుసరించడం’ అని అనండి.

    మీరు కొత్త నాయకుడు. గత భారాలు లేకుండా కొత్తగా పాలనను ప్రారంభించే అవకాశం ఉంది. ఎం.కె.స్టాలిన్ వద్ద ఈ అవకాశం లేదు. అలాగే, ఆయనకు ఉండి మీకు లేనిది అనుభవం. ఆయన మీకు ముందున్న నాయకుడు, శత్రువు కాదు. మీరు ఆయన తరువాతి నాయకుడు, స్థానభ్రంశం చేసే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలపై విభేదాలు ఉన్నా, ఫెడరల్ స్వభావం, సెక్యులర్ సమానత్వం విషయంలో మీరు ఇద్దరూ ఒకే దిశలో ఉన్నారు. ఆ దిశలో ఆయన మాట వినండి’ అని చెప్పారు.

    ఉదయనిధితో పోటీ పడొద్దు 
    ‘సభలో ఉదయనిధి స్టాలిన్ ఉనికి మీకు పోటీ కాకుండా మంచి జంటగా ఉండాలి. మీరు ఇద్దరూ యువకులు, ఆకర్షించే స్వభావం ఉన్నవారు. మీ 108 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇంతకుముందు శాసనసభలో అనుభవం ఉంది. మిగతావారు ఆ ముగ్గురి దగ్గర నుంచి, ఎదుటి సీనియర్ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త సభలో కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కర్మయోగి పెరుంతలైవర్ కామరాజ్ నేతృత్వం వహించిన పార్టీకి చెందినవారని గుర్తుంచుకోండి. సెక్రటేరియట్‌లో అధికారులను మీ సహచరులుగా చూడండి, కిందివారిగా కాదు.

    చివరిగా, తమిళనాడులో మంచి, స్వచ్ఛమైన, సమర్థ పాలన కొనసాగించండి. పర్యావరణ రక్షణను ప్రధాన ప్రాధాన్యంగా ఉంచండి. రాష్ట్రం దాటి ద్వేషం లేని, భయం లేని, న్యాయమైన భారతానికి మార్గదర్శకంగా నిలవండి. ఒక వ్యక్తిగత వ్యాఖ్యతో ముగిస్తాను.. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నడిపించడం ఇదే మొదటిసారి. ఆ విధిని తమిళనాడు సెక్యులర్ గుర్తింపుకు దైవ హస్తంగా భావించండి’ అని గోపాలకృష్ణ గాంధీ రాసుకొచ్చారు.

  • ఢిల్లీ: ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్యమంత్రి ప‌ద‌వి నుంచి మమతా బెనర్జీని గెంటేయాల‌ని సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఎన్‌డిటీవీకి చెందిన పద్మజా జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాతీర్పును అప‌హాస్యం చేసేలా మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మ‌మ‌త వైఖ‌రి క్షమించరానిదని, ఆమె వ్య‌వ‌హార‌శైలి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలుగా మారింద‌న్నారు. రాజీనామా చేయ‌క‌పోతే గ‌వ‌ర్న‌ర్ త‌న అధికారాలను ఉప‌యోగించి ప‌ద‌వి నుంచి మ‌మ‌త‌ను తొల‌గించాల‌ని అన్నారు.

    ''మ‌మ‌తా బెన‌ర్జీ వ్య‌వ‌హార‌శైలి అవమానకరంగా ఉంది. ఆమెకు క‌చ్చితంగా గుణపాఠం నేర్పాలి. ఆమె ఇలా చేసినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే త‌న‌కు తాను రాజీనామా చేసివుంటే హుందాగా ప‌దవి నుంచి త‌ప్పుకునేవారు. రాజీనామా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల గ‌వ‌ర్న‌రే ఆమెను తొల‌గించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె ఇప్పుడు గవర్నర్ దయ మీద ఆధారపడి పదవిలో ఉన్నారు కాబట్టి, వెంట‌నే గవర్నర్ ఆమెను అధికారికంగా తొలగించాలి. అప్ప‌టికీ సీఎం కుర్చీ వ‌ద‌ల‌ను అంటే నిర్దాక్షిణ్యంగా ఆమెను గెంటేయాల‌''ని మహేష్ జెఠ్మలానీ అన్నారు.

    ఒకవేళ మ‌మ‌తా బెనర్జీ సీఎం కార్యాలయంలోనే తిష్ట వేస్తే, గవర్నర్ పోలీసులను పంపి ఆమెను ఖాళీ చేయించవచ్చని చెప్పారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఇచ్చిన‌ తీర్పును మ‌మ‌త గౌర‌వించాల‌ని, ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందేన‌ని అన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలను ఎన్నిక‌ల సంఘం ధ్రువీక‌రించిన క్షణం నుంచే ఓట‌ర్ల తీర్పు అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని, ఇప్పుడు సీఎం కార్యాల‌యంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిగానే మ‌మ‌త‌ను ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

    ఎన్నిక‌ల సంఘ‌మే అస‌లైన విల‌న్‌: మ‌మ‌త‌
    ముఖ్యమంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోన‌ని మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆమె కోల్‌క‌తాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జాతీర్పుతో ఓడలేద‌ని, కుట్ర కార‌ణంగా ఓడిపోయామ‌ని చెప్పారు. తాము బీజేపీతో పోరాటం చేయ‌లేద‌ని, ఎన్నిక‌ల సంఘంతో పోరాడామ‌ని అన్నారు. ''నేను ఓడిపోలేదు. లోక్‌స‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామా లేఖ స‌మ‌ర్పించే ప్ర‌సక్తే లేదు. మా ఓట్ల‌ను చోరీ చేశారు. చ‌రిత్ర‌లో ఇదో చీక‌టి అధ్యాయం. ఇందులో ఎన్నిక‌ల సంఘ‌మే అస‌లైన విల‌న్'' అంటూ మ‌మ‌తా బెన‌ర్జీ మండిప‌డ్డారు. 

    చ‌ద‌వండి: త‌మిళ‌నాడులో విజ‌య్ గెలుపు.. ట్రెండింగ్‌లో అన్నామ‌లై!

    మ‌మ‌త‌ను తొల‌గించాల్సిందే: హిమంత బిస్వ‌శ‌ర్మ
    మ‌మ‌తా బెన‌ర్జీ వ్యవ‌హార‌శైలిపై బీజేపీ నేత‌, అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వ‌శ‌ర్మ స్పందించారు. ఆమెను ప‌ద‌వి నుంచి తొల‌గించాల్సిందేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీతో ఆయ‌న మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి మ‌మ‌తా బెన‌ర్జీ రాజీనామా చేయకపోతే, ఆమెను బ‌ల‌వంతంగా తొలగించాల్సి ఉంటుంది. దేశం ఆమె ఇష్టానుసారం నడవదు. గవర్నర్ కొంత కాలం వేచి చూస్తారు, ఆ తర్వాత ఆమెను తొలగిస్తారని అన్నారు. 

  • టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన పెట్టుబడి పెట్టే విధానం చూసి నెటిజన్లు, ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆశ్చర్యపోతున్నారు. విజయ్‌ విజన్‌ ఉన్నవాడు, వారెన్‌ బఫెట్‌లాంటోడు అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.

    27 పేజీల అఫిడవిట్‌లో విజయ్ ప్రకటించిన నికర ఆస్తి విలువ రూ. 624 కోట్లు. ఆయన చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆయన ప్రకటించిన ఆదాయం రూ. 184.53 కోట్లు. ఇందులో   ఒక సేవింగ్‌బ్యాంకు ఖాతాలో రూ. 213.36 కోట్ల నిల్వ ఉన్నట్లు, ఇతర డిపాజిట్లు, కోట్ల విలువ చేసే షేర్లను  ప్రకటించారు.దీంతో విజయ్ పెట్టుబడి విధానంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరో అయి ఉండి కూడా, సామాన్యుడిలా బ్యాంకు డిపాజిట్లనే నమ్ముకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    జీతం తీసుకునే ఉద్యోగులు తమ పొదుపును మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో ఎస్‌ఐపీల రూపంలో పెట్టుబడి పెట్టాలని చెబుతున్న ఈ రోజుల్లో, విజయ్ ఆస్తులు ఫిన్‌ఫ్లూయెన్సర్లకు కంటగింపుగా మారాయని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. వారెన్ బఫెట్ లాగే నగదు నిల్వలు కలిగి ఉన్నందుకు, ఫన్నీగా 'దార్శనికుడు' అని కూడా కీర్తిస్తున్నారు.

    ఇదీ చదవండి: 'దళపతి' 10th మార్క్స్‌ వైరల్‌, విజయ్‌ విద్యార్హత ఏంటి?

    ఇదీ చదవండి: సింగిల్‌ ఖాతాలోనే రూ. 213 కోట్లు, హాట్‌ టాపిక్‌గా విజయ్‌ ఆస్తి
     

    నెటిజన్ల కామెంట్స్‌

    • "మ్యూచువల్ ఫండ్స్ గురించి పాఠాలు చెప్పే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు విజయ్ ఒక పీడకల (Nightmare)" అని కొందరు అంటుంటే.. మరికొందరు  పెట్టుబడి సలహాలు కూడా ఇచ్చారు.

    • "వంద కోట్ల రూపాయలను ఎఫ్‌డీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) దృష్ట్యా నష్టమే. అదే పీఎస్‌యూ స్టాక్స్‌లో పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేవి" అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.  వంద కోట్లను బ్యాంకు FDలో పెట్టుబడి పెట్టారు... ఇది అతని మొత్తం ఆస్తులలో 17 శాతం. ఇంత చెత్త పెట్టుబడి సలహా ఎవరు ఇచ్చారో నాకు నిజంగా అర్థం కావడం లేదన్నారు.

    • ఆ 100 కోట్లలో 50 శాతం అంటే 50 కోట్లను ప్రభుత్వ బాండ్లలో, డెట్ ఫండ్లలో లేదా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి ఉండవచ్చు అని  వ్యాఖ్యానించారు.  (టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్‌ వ్యాఖ్యలు)

    • ముఖ్యంగా "టాప్‌ PSUలలో అధిక డివిడెండ్ రాబడినిచ్చే స్టాక్‌లలో పెట్టుబడి పెడితే, మూలధనం సేఫ్‌. క్రమం తప్పని ఆదాయం వచ్చేది. అలాగే మూలధన విలువ కూడా పెరుగుతుంది," అని @RakJhun అనే ఒక  ఎక్స్‌ యూజర్  వివరించారు.

    •  "తమిళులకు బంగారం, ఆస్తుల మీద ఉన్న నమ్మకం స్టాక్ మార్కెట్ మీద ఉండదు" అని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.
       

  • చెన్నై: తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. తాను ‍ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని టీవీకే అధినేత సినీస్టార్‌ విజయ్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందించారు. అయితే మెజార్టీ మార్కుకు కేవలం పదిసీట్ల దూరంలో ఆగిపోయిన టీవీకేకు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో టీవీకేకు సపోర్టు చేసే ముందు కాంగ్రెస్‌ విజయ్‌తో ఒక విషయంలో కీలక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది.

    ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు తుదిదశకు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారానికి దాదాపు ముహుర్తం సైతం సిద్ధమైంది. రేపు లేదా ఎల్లుండో  ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే  విజయ్‌ సీఎం కావడానికి అక్కడి కాంగ్రెస్‌ మద్దతు తప్పనిసరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకేతో కీలక ఒప్పందం చేసుకొని అనంతరం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

    ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ గిరీశ్ చౌడాంకర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు." ప్రస్తుతం మేము టీవికేకు మద్దతిస్తున్నాం. రాజ్యాంగాన్ని నమ్మని మతతత్వ రాజకీయ పార్టీలకు టీవీకే పార్టీ దూరంగా ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఒకవేళ వారు మతతత్వ శక్తులతో కలిస్తే మా మద్దతు ఉపసంహరిస్తాం. అని అన్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ ‍విజయ్‌ పార్టీకి మద్దతు ‍ప్రకటించింది.

    కాగా మెజార్టీ మార్కు రావాలంటే కాంగ్రెస్‌ ఐదు స్థానాలతో కలిపి టీవీకేకు మరో ఐదు స్థానాల మద్దతు అవసరం ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఇతర చిన్న పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో మెజార్టీమార్కుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

  • చెన్నై: టీవీకే  ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రేపు(గురువారం) విజయ్‌ ప్రమాణ స్వీకారం అనుమానమే?. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి విజయ్‌కు గవర్నర్‌ అనుమతి లభించలేదు. మెజార్టీపై గవర్నర్‌ను విజయ్‌ ఒప్పించలేకపోయారు. విజయ్‌కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలంటూ గవర్నర్‌  స్పష్టం చేశారు.

    మరో వైపు, విజయ్‌కు మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించారు. మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పి వామపక్ష పార్టీలు..  కూటమిలోనే ఉంటామని ప్రకటించాయి. ఇప్పటికే మద్దతు ఇవ్వబోమని ముస్లిం లీగ్‌ చెప్పేసింది. ఇదిలా ఉండగా, లోక్‌ భవన్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రేపు విజయ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం జరుగుతుందా? లేదా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్‌ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి అడ్డేలేదని.. రేపే ప్రమాణ స్వీకారం, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను విజయ్‌ కోరారు.

    తక్కువ సమయం ఉన్నందున ఆహ్వానాలకు సమయం ఉందా? అంటూ ఆరా తీసిన గవర్నర్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, మెజార్టీ సంఖ్య చూపించాలంటూ గవర్నర్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. 112  మంది ఎమ్మెల్యేల పేర్లతో జాబితాను గవర్నర్‌కు విజయ్‌ అందించారు. గవర్నర్‌ నిర్ణయంపై టీవీకే నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే విజయ్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    విజయ్‌కు బిగ్ షాక్ TVKప్రభుత్వ ఏర్పాటులో ట్వీస్ట్

    కాగా, ప్రభంజనంలా దూసుకొచ్చిన టీవీకే చీఫ్‌ విజయ్‌ తమిళనాట నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అడుగుదూరంలో ఆగిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భావసారూప్య పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు టీవీకే పార్టీ అధికారికంగా ఈ–మెయిల్‌లో లేఖ పంపింది. తమకు ఇప్పటికే 108 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, రెండు వారాల గడువు ఇస్తే ఆలోపు మరో 12 మంది బయటి ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ఆ లేఖలో పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
     

     

  • తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు దెబ్బమీద దెబ్బ పడుతుంది.  ఇదివరకే  అధికారం కోల్పోయి తీవ్ర ఇ‍బ్బందుల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఆ రాష్ట్ర ట్రాఫిక్‌ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయన సీఎంగా వినియోగించిన కారుపై గత రెండేళ్లుగా 18 ఫైన్‌ చలాన్లు పడ్డాయని ఆ రాష్ట్ర ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాటి జరిమానాలు సైతం ఇదివరకూ చెల్లించలేదని పేర్కొన్నారు.

    ఇటీవల జరిగిన కేరళం ఎన్నికల్లో పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ కూటమికి కేవలం 35 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో పదేళ్లపాటు సీఎంగా ఉన్న పినరయి విజయన్‌ సీఎంకు పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన కారు 18 సార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు గురైందని రూ.13,750 జరిమానాలు విధించబడ్డాయని పేర్కొన్నాయి.

    అందులో అధికంగా సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల 12 సార్లు జరిమానాలు పడ్డాయని పేర్కొన్నారు. జనవరి 2025లో కోవలం- కరోడే జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించారని దానికి కూడా జరిమానా విధించబడిందని తెలిపారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ గోవిందన్ ప్రయాణించిన కేఎల్‌ 7 ఆర్‌ గల కారుపై సైతం 18 చలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు నివేదికలు అందించారు.

    తాజాగా ఈ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. అయితే పినరయి విజయన్‌ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రాఫిక్‌ నిబంధనలు అత్యంత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ రాష్ట్రంలో ఏఐ కెమెరాలు అమర్చారు. ఇప్పుడు ఆ కెమెరాలలోని మాజీ సీఎం కారు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన చిత్రాలు ఉండడం విశేషం.

  • పంజాబ్‌లోని  అమృత్‌సర్, జలంధర్‌లలో  రెండు గంటల్లో రెండు వరుస పేలుళ్ల ఘటన రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుళ్లకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి సంబంధం ఉందని, 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ పన్నుతున్న పన్నాగాల్లో భాగమే ఇవని ఆయన ఆరోపించారు.  

    ప్రజల్లో హింసను, భయాన్ని వ్యాపింపజేసి బీజేపీ ఓట్లు దండుకుంటుంది. కానీ పంజాబ్ ప్రజలు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారు, కనుక బీజేపీ ఇలాంటి చర్యల్ని మానుకోవాలని  సీఎం హితవు పలికారు. బీజేపీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే, అక్కడికి వెళ్లి గొడవలు సృష్టించడం పరిపాటి  అని మాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ఈ  పేలుళ్లను 2027 ఎన్నికలతో ముడిపెట్టడంపై విపక్షాలు మండిపడ్డాయి. నిష్పక్షపాత విచారణ జరగకముందే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు విమర్శించారు.

     జంట పేలుళ్ల కలకలం
    మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బిఎస్ఎఫ్ (BSF) పంజాబ్ ఫ్రాంటియర్స్ ప్రధాన కార్యాలయం వెలుపల పార్క్ చేసిన స్కూటర్‌లో పేలుడు సంభవించింది. మరో ఘటనలో రాత్రి 10.50 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ ఏరియా సమీపంలో మరో పేలుడు జరిగింది.ఈ పేలుడు ప్రభావం దాదాపు 300 మీటర్ల దూరం వరకు వ్యాపించింది.

    జలంధర్ బిఎస్ఎఫ్ కార్యాలయం వెలుపల జరిగిన పేలుడుకు ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (KLA) బాధ్యత వహించింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో గురుదాస్‌పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది రంజిత్ సింగ్ మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పేలుళ్ల తీవ్రతను,  దాని వెనుకున్న కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Movies

  • “ఇప్పటికి 1200కు పైగా సినిమాల్లో నటించిన నేను నా తొలి రోజుల్లో పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ రోజుల్లో నా లాంటి ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టి ఆదరించి, అవకాశాలిచ్చి ఆదుకున్న పెద్ద వ్యక్తి దాసరి” అని ప్రముఖ నటుడు అలీ గుర్తు చేసుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తెలుగు దర్శకుడిగా వినుతికెక్కిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘వంశీ ఇంటర్నేషనల్’ సంస్థ, దాని అధినేత వంశీ రామరాజు హైదరాబాద్‌లో తెలుగు ‘డైరెక్టర్స్ డే’ జరిపారు. త్యాగరాయగానసభలో జరిగిన ఆ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న అలీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.

    అప్పట్లో మద్రాసులో ఏటా డిసెంబర్ 31న దాసరి గారు అయ్యప్ప పూజ నిర్వహించేవారు. సినీ రంగంలోని ప్రముఖుల మొదలు సామాన్యుల దాకా అందరూ దాసరి ఇంట్లోని ఆ పూజకు హాజరయ్యేవారు. పూజయ్యాక అక్కడే అందరికీ భోజన ప్రసాదాలు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరికీ రూ. 2 నుంచి రూ. 5 వేల దాకా వేర్వేరు మొత్తాల్లో డబ్బులున్న కవర్లు పంచేవారు. ఎవరికి ఏ మొత్తం ఉన్న కవర్ అందుతున్నది అదృష్టం. కొత్త సంవత్సరం రాబోయే ముందు దాసరి చేతుల మీదుగా అలా డబ్బులు అందుకోవడం శుభసూచకంగా అందరూ భావించేవారు. ముఖ్యంగా, జరుగుబాటు కష్టంగా ఉన్న సామాన్య సినీ కార్మికులు, కళాకారులు అందరూ అధిక మొత్తం డబ్బులున్న కవర్ తమ చేతికి వస్తే బాగుండని ఆశ పడుతుండేవారు.

    ‘వంశీ – దాసరి… ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు అందుకున్న నటుడు అలీ మాట్లాడుతూ, “పరిశ్రమలో అవకాశాల కోసం కష్టపడుతున్న తొలి రోజుల్లో నేను కూడా దాసరి గారి అయ్యప్ప పూజకు వెళ్ళాను. ప్రసాదం తీసుకున్నాక, దాసరి గారి చేతుల మీదుగా నూతన సంవత్సర శుభాకాంక్షల కవర్ తీసుకున్నాను. బయటకొచ్చి చూస్తే, ఏకంగా రూ.5 వేలున్నాయి అందులో అలా అదృష్టం నన్ను వరించింది. అప్పట్లో నెలకు రెండు పూటలా భోజనానికి మెస్ టికెట్ల కార్డు రూ. 170 కట్టాలి. దానికి కూడా కష్టపడుతున్న నాకు దాసరి వరాలిచ్చిన దేవుడిలా కనిపించారు. ఆ డబ్బుల్లో రూ. 4 వేలు తీసుకెళ్ళి, అప్పటికప్పుడు మెస్ లో కట్టేసి, ఆ డబ్బులకు సరిపడా మెస్ టికెట్ల కార్డులు తీసుకున్నాను. అంటే, ఆ రూ. 4 వేలకు సరిపడా రోజుల దాకా నాకు మద్రాసులో భోజనానికి ఢోకా లేకుండా చేసింది – గురువు గారు దాసరి గారి చేతి చలవే! నాలుగు వేలు పోగా, మిగిలిన వెయ్యి రూపాయలు ఊళ్ళో ఉన్న మా అమ్మ గారికి పంపించాను. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను” అన్నారు.

    హీరోగా అలీ డేట్లడిగిన దాసరి!
    నటుడిగా ఎదిగి, హీరోగా ‘యమలీల’తో ఘన విజయం అందుకున్న తర్వాత దాసరితో ఎదురైన మరో అనుభవాన్ని కూడా అలీ పంచుకున్నారు. “కమెడియన్‌గా గుర్తింపు పొందాక ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో హీరోగా ‘యమలీల’తో కమర్షియల్ హిట్ సాధించడం మరో పెద్ద విజయం. ఆ సినిమా సూపర్ హిట్టయిన రోజుల్లో ఒకసారి హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో దాసరి నన్ను చూశారు. ప్రత్యేకంగా నన్ను పిలిచి, అభినందించారు. దాసరి గారి మాతృమూర్తి కన్నుమూసి అప్పటికి కొద్ది కాలమైంది. మదర్ సెంటిమెంట్ నిండిన ‘యమలీల’కు ఆయన బాగా కనెక్టయ్యారు. ‘పిక్చర్ చాలా బాగుందయ్యా. ముఖ్యంగా, అమ్మ పాత్రతో నీ సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నీలో ఇంత మంచి నటుడున్నాడనీ, హీరో మెటీరియల్ ఉందని నేను గుర్తించలేదు. నువ్వు డేట్స్ ఇస్తే, నిన్ను హీరోగా పెట్టి ఓ మంచి సినిమా చేస్తా’ అన్నారు దాసరి గారు. నా ఆనందానికి అవధులు లేవు. ఉబ్బితబ్బిబ్బై ‘మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం గురువు గారూ’ అన్నాను. కానీ, ఆ తరువాత ఆయన రాజకీయాలు వగైరాతో బిజీ అయిపోవడంతో ఆ ఛాన్స్ తప్పిపోయింది. అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు” అని అలీ ఆ సంగతులు వివరించారు.

    “తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీలతో పాటు నేపాలీ భాషలోనూ నటించే అదృష్టం నాకు దక్కింది. తెలుగు నటులమైన నన్ను, బ్రహ్మానందం గారిని అక్కడి నేపాలీ ప్రేక్షకులు గుర్తుపట్టి, అభిమానించడం మరపురాని విషయం. ఇప్పటికి 1200కి పైగా సినిమాల్లో నటించాను. మరో రెండేళ్ళలో 2028లో సినీ రంగంలో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. గతంలో బెస్ట్ కమెడియన్, బెస్ట్ హీరో, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఇలా అనేక అవార్డులు వంశీ సంస్థ నుంచి అందుకున్నా, ఇప్పుడు ఇలాంటి సమయంలో వంశీ సంస్థ నుంచి దాసరి గారి పేరిట ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అని గుర్తింపు పొందడం సంతోషంగా ఉంది” అని ఆయన తన ఆనందానుభూతిని పంచుకున్నారు.

    ఇద్దరు కమెడియన్లను కలిపిన అమ్మ ప్రేమ!
    మరో ప్రముఖ నటుడు శివారెడ్డి సైతం ఈ సందర్భంగా దాసరి గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. “సినీ రంగానికి గురువు లాంటి పెద్దాయన పేరు మీద నాకు ‘నవరస నటుడు’ అంటూ అవార్డుతో అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది. అలీ గారికి వారి అమ్మ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. అలీ గారినీ, నన్నూ కలిపిన అతి పెద్ద బంధం కూడా అమ్మ ప్రేమ. అమ్మ అనేది రెండక్షరాలే అయినా, ఆ పదంలోని ఆత్మీయత, అనుబంధం అందరికీ ఒకటే. ఆయన నాకు అన్న లాంటివాడే కాదు... సినీ రంగంలోనూ, వ్యక్తిగతంగానూ దేవుడు. నాకు ఆదర్శప్రాయుడు. ఇవాళ ఆయన ఇంటి పక్కనే నేనూ నివసిస్తున్నాను. అది అక్షరాలా అలీ అన్న చలవే” అని శివారెడ్డి వ్యాఖ్యానించారు.

    ప్రముఖ సాహితీవేత్త వోలేటి పార్వతీశం సభాధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 35 మంది ప్రతిభావంతులను అవార్డులతో సముచిత రీతిన సత్కరించడం విశేషం.

    వివిధ రంగాల్లోని ప్రతిభకు పట్టం!
    ‘ఆపరేషన్ సిందూర్’ లాంటి అంశాన్ని తీసుకొని, ‘వందే భారత్’ చలనచిత్రాన్ని రూపొందించిన దర్శక – నిర్మాత మల్లం రమేశ్‌కు ‘సెన్సేషనల్ ఫిల్మ్’ అవార్డు అందజేశారు. తెలుగునాట రాష్ట్ర ప్రభుత్వాల నంది, గద్దర్ అవార్డులు రెంటినీ పొందిన తొలి జర్నలిస్టు అయిన డాక్టర్ రెంటాల జయదేవకు ప్రత్యేకంగా ‘ఉత్తమ సినీ విమర్శకుడు – చరిత్రకారుడు’ అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేసి, గౌరవించారు. అలాగే, మరో సీనియర్ జర్నలిస్ట్, సినీ గ్రంథ రచయిత, సినీ రచయిత పులగం చిన్నారాయణకు ‘బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్’ అవార్డునిచ్చారు.

    సినీ రంగంతో పాటు సంగీతం, సాహిత్యం, విద్య, వైద్యం, సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ‘వంశీ – దాసరి గ్లోబల్ అవార్డు’లను అలీ, శివారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అలాగే, ప్రవాస రాష్ట్ర – భారతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, ఆదర్శ దంపతులను సైతం ప్రత్యేకంగా గుర్తించి గౌరవించారు.


    డైరెక్టర్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శక సమ్రాట్!
    1972లో స్థాపితమైన వంశీ సంస్థ ఇప్పటికి 54 ఏళ్ళుగా సాంస్కృతిక రంగంలో ఉంటూ, వివిధ దేశాలకు సైతం విస్తరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికే 3 విశ్వవిద్యాలయాల్లో తమ సంస్థ పక్షాన ప్రతిభావంతుల్ని గుర్తించేలా స్వర్ణపతకాలు ఏర్పాటుచేసినట్టు వంశీ రామరాజు వివరించారు. సాహితీ, సినీ రంగాల్లో మరపురాని సేవలు అందించిన మహామహుల్ని క్రమం తప్పకుండా స్మరించుకోవడానికి సంస్థ సాగిస్తున్న కృషిని వోలేటి పార్వతీశం ప్రశంసించారు. “దాసరి కన్నా ముందు ఎందరో దిగ్గజ దర్శకమూర్తులు లేకపోలేదు. వారు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించనూ లేకపోలేదు. కానీ, దర్శకుడికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చి, డైరెక్టర్ పేరు మీద సినిమా చూడాలనే ఆసక్తిని ప్రేక్షకులలో కలిగించిన దిగ్దర్శకుడు దాసరి. కౌటుంబిక కథలు, సన్నివేశాలు, సామాన్యంగా అనిపించే, వినిపించే టైటిల్స్‌తోనే అఖండ విజయాలు సాధించిన దర్శక సమ్రాట్ ఆయన” అని పార్వతీశం విశ్లేషించారు.

    కళాత్మకత... కమర్షియాలిటీల మేళవింపు!
    ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి డాక్టర్ వెలుదండ నిత్యానందరావు సోదాహరణ పూర్వక  విశ్లేషణ సాగిస్తూ, “కుటుంబ ఇతివృత్తాలు, వ్యంగ్యం నిండిన డైలాగులు, నూతన ప్రతిభాన్వేషణ, వేగవంతమైన సినీ రూపకల్పన... దాసరి ప్రత్యేకత. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ లాంటి చిత్రాల్లో కథావస్తు స్వీకరణలో ఆయన చూపిన కొత్తదనం కనిపిస్తుంది. ‘మేఘసందేశం’ చిత్రంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన ‘ఆకులో ఆకునై...’ లాంటి గీతాన్ని సందర్భోచితంగా వాడుకోవడం దర్శకుడి కళాత్మకతను తెలియబరుస్తుంది. అందుకే దాసరి అటు కళాత్మకతకు, ఇటు వాణిజ్య అంశాల్ని మేళవించిన అపురూప దర్శకుడు. ఒకప్పుడు ‘వంశీ – బర్కిలీ’ అవార్డు పొందిన ఆయన ఆ పైన తన పేరు మీదే ‘దాసరి – వంశీ’ అవార్డులిచ్చే స్థాయికి ఎదగడం, 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అసాధారణం” అని పేర్కొన్నారు. 1987లో ‘ఉదయం’ పత్రికతో దాసరి సృష్టించిన సంచలనాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎం.ఏ. విద్యార్థిగా ఉన్న రోజుల్లో తన తొలినాళ్ళ సాహితీ వ్యాసాలెన్నో ఆ పత్రికలోనే వచ్చాయని వైస్ – ఛాన్సలర్ గుర్తు చేసుకున్నారు.

    ఈ అవార్డుల ప్రదానోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని, వివిధ రంగాల ప్రతిభావంతులను గుర్తించడానికి ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం ఎప్పుడూ ముందుంటాయని నిత్యానందరావు తెలియజేయడం విశేషం. ఎంతైనా, ఆయనే అన్నట్టు “యోగ్యులనూ, అర్హులనూ గౌరవించి, సత్కరిస్తే... అది వారిని గౌరవించినట్టు కాదు... మనల్ని మనం గౌరవించుకున్నట్టు!”
    - రెంటాల జయదేవ

  • రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు లుక్స్ విడుదలయ్యాయి. మొదట పల్లెటూరి క్రికెటర్‌గా, ఆ తర్వాత పహిల్వాన్ గెటప్‌లో కనిపించిన చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండింటికీ అదనంగా మూడో లుక్ కూడా ఉందన్న విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని మాత్రం చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది.  

    తాజా సమాచారం ఏంటంటే పెద్ది సినిమా ట్రయిలర్ కట్ ఇప్పటికే రెడీ అయింది. దాన్ని ఈ నెల మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ట్రయిలర్‌లో మూడో లుక్‌ను చూపిస్తారా లేక సినిమా విడుదలయ్యాక థియేటర్‌లోనే చూడాలా అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్‌. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటివరకు ఈ సినిమా కథాంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ట్రయిలర్‌లో మాత్రం కథను కొంతవరకు టచ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శృతిహాసన్ ఓ ఐటెం సాంగ్ చేసింది.  

    ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ‘పెద్ది’పై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రయిలర్‌పైనే ఉంది. ముఖ్యంగా చరణ్‌ మూడో లుక్‌  ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

  • సంధ్య థియేటర్ బాధిత కుటుంబాన్ని అల్లు అరవింద్, అల్లు స్నేహరెడ్డి పరామర్శించారు. బాధితుడు శ్రీతేజ్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదేనని  అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. కాగా.. పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి మరణించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న శ్రీతేజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. 
     

     

  • టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఇ‍ప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం మే 15న విడుదల కానుందని ప్రకటించారు.ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్‌ చేసిన టీజర్‌లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. 

    జూన్‌కు వాయిదా..

    అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ముందుగా ఊహించినట్లుగానే మా ఇంటి బంగారాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఈ మూవీని ఏకంగా నెల రోజుల పాటు వాయిదా వేశారు. వచ్చేనెల అంటే జూన్‌ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ నడుస్తుండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
     

  • ప్రముఖ నిర్మాత అధినేత ఆర్‌బీ చౌదరి భౌతికకాయానికి హీరో, టీవీకే అధినేత విజయ్ నివాళులర్పించారు. చెన్నైలోని నిర్మాత నివాసానికి వెళ్లిన విజయ్‌ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‍అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ విజయ్‌ స్వయంగా వెళ్లి నివాళులర్పించడం విశేషం.

    కాగా... ఆర్‌బీ చౌదరితో విజయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలకు ఆర్‌బీ చౌదరి నిర్మాత వ్యహరించారు. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారు.

    మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌బీ చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు. కాగా.. గురువారం చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
     

     

  • ప్రముఖ దక్షిణాది నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన మృతితో దక్షిణాది సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్‌తో పాటు టాలీవుడ్ హీరోలంతా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించగా కోలీవుడ్ స్టార్స్ నివాళులర్పించారు.

    ఆర్‌బీ చౌదరి మరణం వేళ ఓ వీడియో వైరల్‌గా మారింది. నిర్మాతగా ఆయన దాదాపు 99 సినిమాలు నిర్మింంచారు. నిర్మాతగా ఆయన హాజరైన చివరి ఈవెంట్‌ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆయన కుమారుడు జీవా హీరోగా నటించిన తలైవాన్ మూవీ ఈవెంట్‌లో చివరిసారిగా కనిపించారు. ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఆర్‌బీ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవా కుమారుడు సైతం కనిపించారు. తన మనవడితో ఆర్‌బీ చౌదరి ఈవెంట్‌లో సందడి చేశారు. 
     

     

  • యానిమల్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్‌. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

    అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. షెడ్యూల్‌లో మార్పుల వల్ల పోస్ట్‌పోన్ కానుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ మేకర్స్ స్పందించారు. ఈ చిత్రాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి 5న విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై పాన్ వరల్డ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
     

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.

    ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్‌ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.  ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్‌పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    ‌టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్‌ అభినందిస్తూ పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్‌ టైటిల్‌ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో  గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్‌ విజయ్‌.. అంటూ జననాయగన్‌ టైటిల్‌ కార్డు వేసింది. పోలీసు డ్రెస్‌లో నడుచుకుంటూ వస్తున్న విజయ్‌ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్‌ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది.
     

     

  • సినిమాలు వేరు.. రాజకీయం వేరు.. అవును ఇది ముమ్మాటికీ నిజమే. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రూవ్ అయింది కూడా. సినీ గ్లామర్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అధికారం చేపట్టలేకపోయారు. తమిళనాడులోనూ కమల్ హాసన్, విజయ్ కాంత్‌ లాంటి వాళ్లు కూడా నెగ్గలేకపోయారు. కానీ ఊహించని విధంగా దళపతి విజయ్ మాత్రం సక్సెస్ అయ్యాడు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా అత్యధిక సీట్లు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా విజయ్ పేరు మార్మోగిపోతోంది.

    ఈ నేపథ్యంలో త్రిష పేరు కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికల ముందే వీరిద్దరిపై రూమర్స్ వచ్చాయి. విజయ్ భార్య సంగీత సైతం విడాకుల పిటిషన్ వేయడంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని టాక్ వినిపించింది. విజయ్-త్రిష కలిసి పెళ్లికి హాజరు రావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా విజయ్ గెలిచాక త్రిష నేరుగా ఇంటికెళ్లి మరి అభినందనలు తెలిపింది. దీంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన ఓ స్థానంలో నిలబడుతుందని తమిళనాట హల్‌చల్‌ చేస్తోంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ ఇస్తే విజయ్ పతన ఖాయమని అంటున్నారు. అదేలాగో తెలుసుకుందాం.

    త్రిష ఎంట్రీతో విజయ్‌కి దెబ్బ..

    రాజకీయాల్లో సీఎం కుర్చీ అనేది అంత ఈజీ కాదు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విషయాలను తీసుకురాకపోవడమే మంచింది. త్రిషతో రిలేషన్ ఉన్నంత మాత్రాన ఆమెను రాజకీయాల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకవేళ అదే జరిగితే విజయ్‌పై చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. ఎందుకంటే విజయ్‌కు మాత్రమే తమిళ ప్రజలు ఓటేశారు. అంతేకానీ త్రిషను చూసి కాదు. ఆమెను తీసుకొస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఇదంతా పాలన ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  గతంలో బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు  తీవ్ర దుమారానికి దారితీశాయి. అప్పట్లో త్రిషకు మద్దతు లభించినా.. ఆమెను విజయ్  రాజకీయంగా ప్రమోట్ చేస్తే మాత్రం ప్రజా వ్యతిరేకతకు కారణమవుతుంది. ఈ విషయంలో విజయ్ చాలా అప్రమత్తంగా ఉండాలి.

    వ్యక్తిగతం వేరు.. రాజకీయ జీవితం వేరు

    తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సిందే. ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం.  అక్కడ విజయ్‌ను చూసి మాత్రమే ఓటేశారు. అదే స్థానంలో త్రిషను నిలబెడితే ఆదిలోనే విజయ్‌కు దెబ్బపడే అవకాశముంది. అధికారం చేపట్టిన పార్టీ తొలి ఉపఎన్నికలోనే ఓడిపోతే ఆ ప్రభావం పాలనపై పడుతుంది.  ఈ ప్రయోగం విఫలమైతే.. అది కేవలం ఒక సీటు ఓటమి మాత్రమే కాదు.. విజయ్ రాజకీయ పతనానికి సంకేతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ద్రవిడ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని విజయ్ ముందుకెళ్లాలి. రాజకీయాలతో పర్సనల్‌ లైఫ్‌ను ముడిపెట్టకుండా పాలన సాగిస్తే విజయ్‌కే మంచిదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
     

  • 'నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం'.. ఈ సామెత మీలో చాలామంది వినే ఉంటారు. కానీ మీలో ఎంతమంది మనస్పూర్తిగా ఓ సినిమా చూసి నవ్వుతున్నారు? అని అడిగితే చాలామంది దగ్గర సమాధానముండదు. ఎందుకంటే జీవితంలో ఎవరికి వాళ్లు బిజీ అయిపోతున్నారు. నవ్వడం అనే విషయాన్ని రోజురోజుకీ మర్చిపోతున్నారు. ఒకప్పుడు బాధల్ని కాసేపు పక్కనబెట్టి మనసారా నవ్వుకునేందుకు సినిమాకు వెళ్లేవాళ్లు. ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో కామెడీ అరుదుగా మారిపోయింది. దాదాపు కనుమరుగైపోయే స్థితికి వచ్చేసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

    ఒకప్పుడు తెలుగులో ఏడాదికి కనీసం 20-30 సినిమాలైనా కామెడీవి వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి అంటే ఒకటో రెండో అని వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి. దీనికి చాలా కారణాలున్నాయి. హీరోల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఎందుకంటే స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తమ తమ సినిమాల్లో కొంత మేర అయినా కామెడీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కత్తి పట్టి విలన్లని నరకడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. దర్శకులు కూడా అలానే తయారవడం ఆందోళన కలిగిస్తోంది.

    అహ నా పెళ్లంట, జంబలకడిపంబ, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు.. కామెడీ కోసం ఇప్పటితరం కూడా పాత సినిమాల్నే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాటిలో సరైన కామెడీ ఉండట్లేదు. ఉన్నా సరే క్రింజ్, సిల్లీ కామెడీ ఉంటున్నాయి. వాటికి జనాలు నవ్వకపోగా దాన్ని చూసి కామెడీ ఇలా ఉందేంటి అని మరోలా నవ్వుకుంటున్నారు.

    ఒకప్పుడు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవన్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఈవీవీ, సునీల్.. ఇలా చెప్పుకొంటూ పోతే పదుల సంఖ్యలో హాస్య నటులు ఉండేవారు. వీళ్ల కోసం రచయితలు.. ఆయా సినిమాల్లో సెపరేట్‌గా కామెడీ ట్రాక్స్ రాసేవాళ్లు. అవి ఎంతలా వర్కౌట్ అయ్యేవి అంటే ఇప్పటికీ 'సొంతం' మూవీ అంటే సునీల్ మాత్రమే గుర్తొంచేంతలా. ఇందులో సునీల్ హీరో కాదు గానీ అంతలా అందరికీ గుర్తుండిపోయాడు.
    దూకుడు లాంటి సినిమాల్లోనూ హీరోకి సరిసమానంగా బ్రహ్మానందం పాత్ర ఉండే విషయం మర్చిపోకూడదు. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు తమ సినిమాల్లో దాదాపు కమెడియన్లు అందరినీ పెట్టి అద్భుతంగా నవ్వించేవాళ్లు.

    కానీ ఇప్పటి దర్శకులకు సరైన కామెడీ రాయడం చేతకావట్లేదు! ఒకవేళ రాసినా సరే ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని భయపడి చస్తున్నారు. ఎందుకీ బాధ అని ప్రతిఒక్కరూ రక్తపాతం టైపు స్టోరీలే తీస్తున్నారు. ఒకప్పుడు కోన వెంకట్ లాంటి రచయితలు శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న దర్శకులంతా క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తూ రైటర్స్‌ని పెద్దగా ప్రోత్సాహించకపోవడం కూడా కామెడీ తగ్గిపోవడానికి కారణమని చెప్పొచ్చు.

    ప్రేక్షకుల విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలో కామెడీని కామెడీగా మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఏమైనా తేడా అనిపిస్తే ట్రోల్ చేసిపడేస్తున్నారు. లేదంటే క్రింజ్ కామెడీ అని ముద్రవేస్తున్నారు. మరోవైపు మొబైల్‌లోని యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్‌లో కనిపించే ఫాస్ట్ కామెడీకి అలవాటు పడిపోయి సినిమాల్లో నిదానంగా బిల్డ్ అయ్యే కామెడీని ఓపికతో చూడలేకపోతున్నారు. ఇలా అన్నివైపుల నుంచి పలు సమస్యల వల్ల హాస్యం అనేది ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై తెలుగు దర్శకనిర్మాతలు కాస్త దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే కొన్నాళ్లకు పూర్తిగా కామెడీ ఇక కనిపించదేమో?

  • మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ పేరుతో జరుగుతున్న మోసాలపై మా స్పందించింది. తమ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మాకు తెలిసింది. ఇలాంటి ఎవరు కూడా నమ్మవద్దని మా సూచించింది. ఏపీ మా, మా ఏపీ పేర్లతో ఈ దందాకు తెరతీశారని వెల్లడించింది. అలాంటి అసోసియేషన్స్‌ ఏవీ లేవని.. రెండు తెలుగు రాష్ట్రాలకుల ఉన్నది కేవలం మా మాత్రమేనన పేర్కొంది.

    తప్పుడు పేర్లతో కొందరు అనధికార వ్యక్తులు కళాకారులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని మా స్పష్టం చేసింది. ఇలా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని కోరింది. మా పేరుతో ఎవరూ డబ్బులు వసూలు చేయడానికి అధికారం లేదని తెలిపింది. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ విషయంలో కళాకారులు అప్రమత్తంగా ఉండాలని మా విజ్ఞప్తి చేసింది. కాగా.. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు కొనసాగుతున్నారు. 
     

  • చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికీ ఇష్టముండదు. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే అవే గుర్తుకొస్తాయి. 90స్‌ కిడ్స్‌కు మొబైల్ కెమెరాలు లేక సరిపోయింది కానీ.. ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేవాళ్లం. ఎంత గొప్పవారికైనా అలాంటి అరుదైన ఫోటోలు, వీడియోలు చూస్తే ఒక్కసారిగా చిన్నపిల్లల్లా మారిపోతాం. మనల్ని మనం చూసుకుంటూ అప్పుట్లో ఇలా ఉన్నామా  అని సంబరపడిపోతాం. అలా తన పాత ఫోటోలను షేర్ చేసింది బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇండోర్‌లో జరిగిన లైవ్‌ షో ఫోటోలు  అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చంది. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె మన తెలుగింటి కోడలు ‍అన్న సంగతి తెలుసు. ఆమె సిస్టర్ శిల్పా శిరోద్కర్‌ గురించి చాలామందికి తెలియదు. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకైతే సుపరిచితమే. గతేడాది బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇటీవల బాగానే ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సుధీర్ బాబు హీరోగా వచ్చిన జటాధర్ మూవీలోనూ నటించింది. గతంలో టాలీవుడ్‌లో బ్రహ్మ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా 90స్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

     

     

  • టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై నటుడు, నిర్మాత  షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని తీవ్ర ఆరోపిణలు చేశారు. మంచి సినిమాలను కిల్ చేస్తున్నారని.. చిన్న సినిమాలను నలుగురు రాక్షసులు చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

    నైజాం ఏరియాలో ఓ అందాల రాక్షసి సినిమాకు ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదని మెహదీ ఆరోపించారు. ఈ విషయంపై లీగల్‌గా పోరాటం ప్రారంభించామని.. ఇండస్ట్రీ పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చామని షెరాజ్ మెహదీ  వెల్లడించారు.   చిన్న సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన ఇండస్ట్రీలో ఉందని.. బాలీవుడ్‌లో కూడా ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డు నిబంధనలు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయని.. ఏడీసీసీ వంటి చార్జీలు కూడా నిర్మాతలను కుంగదీస్తున్నాయని తెలిపారు.

    ‘చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి’..

    ప్రొడ్యూసర్, నటుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ… 'ఇండస్ట్రీలో పెద్దల ధోరణి చిన్న సినిమాల పాలిట శాపంగా మారింది. చిన్న నిర్మాతలకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. త్వరలో నిరాహార దీక్షలు చేస్తాం. ఈ మాఫియాపై ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం” అని హెచ్చరించారు. చిన్న సినిమాలే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని.. వాటినే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    మీడియా సపోర్ట్ అవసరం..

    నటి మధు మాట్లాడుతూ… 'నేను ఢిల్లీ నుంచి వచ్చాను. టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయి. కానీ చిన్న సినిమాలకు మీడియా సపోర్ట్ చాలా అవసరం, చిన్న సినిమాల‌ను బ‌తికిస్తేనే మా లాంటి న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు వ‌స్తాయి” అని అన్నారు.

    డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు దెబ్బ..

    నటుడు, మూవీ మూవీ మేక‌ర్ కాళీ చరణ్ మాట్లాడుతూ.. 'చిన్న సినిమాల విడుదలకు డిస్ట్రిబ్యూషన్ సిండికేట్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సెన్సార్ నిబంధనలు కూడా ఆర్థిక భారంగా మారాయి. అనేక మంది చిన్న‌ నిర్మాతలు తనలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నటుడు, నిర్మాత ఉప్పు రమేష్ మాట్లాడుతూ… “వీడే మన వారసుడు అనే మా సినిమాను అవార్డులకు అప్లై చేశాం. 25 వేల రూపాయ‌ల ఫీజు కూడా చెల్లించాం. కానీ, క‌నీసం అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానం లేదు. ప్రభుత్వం, ఇండస్ట్రీ రెండూ చిన్న సినిమాలను తొక్కెస్తున్నాయి” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తానికి, చిన్న సినిమాలకు థియేటర్లు, సరైన అవకాశాలు కల్పించకపోతే కొత్త ప్రతిభ ఎదగడం కష్టమవుతుందని చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న సినిమాలను కాపాడాలని, పరిశ్రమలో సమాన అవకాశాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని, ఇండస్ట్రీ పెద్దలను కోరారు.
     

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దళపతిపై పడింది. ఈ ఎలక్షన్స్‌లో అత్యధిక సీట్లు సాధించాడు. పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే  ఏకంగా 108 స్థానాలు గెలిచాడు. దీంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి షాకిచ్చిన టీవీకే అధినేత విజయ్‌ సీఎం పీఠ ఎక్కనున్నారు. ఈ గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
     
    ఈ నేపథ్యంలోనే విజయ్ ఫ్యామిలీ గురించి మళ్లీ చర్చ మొదలైంది. ఎన్నికల ముందే ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకొచ్చింది. విజయ్ గెలుపుతో  జేసన్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడా లేదా అనే దానిపై నెట్టింట చర్చ నడుస్తోంది.

    ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  జేసన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 38 మందిని ఫాలో అవుతున్నారు.  ఇటీవల కొంతమంది నెటిజన్స్ జేసన్ విజయ్‌ను అన్‌ఫాలో చేశాడని చెబుతున్నారు. అయితే మరికొందరేమో అతను మొదటి నుంచే విజయ్‌ను ఫాలో అవ్వలేదని అంటున్నారు. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందే ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాల్లో తన తండ్రిని ఫాలో అవకపోవడం చర్చనీయాంశంగా మారింది.

    కాగా విజయ్‌- సంగీత 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. రెండున్నర దశాబ్దాలుగా కలిసున్న ఈ జంట మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ విడాకుల పిటిషన్‌పై జూన్‌లో విచారణ జరగనుంది.
     

  • 2020లో వచ్చిన 'భీష్మ' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది నితిన్‌కి దక్కట్లేదు. గతేడాది వచ్చిన 'తమ్ముడు' మూవీ ఘోరమైన డిజాస్టర్ అయ్యేసరికి లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. ఎట్టకేలకు కొత్త చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.

    (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి జ్యోతిక కోర్ట్ రూమ్ సినిమా)

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. నారి-సోము దర్శకులుగా పరిచయమవుతున్నారు. నితిన్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా చేస్తోంది. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. ఈ నెల రెండో వారం నుంచి షూటింగ్ మొదలవనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

    (ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్‌కి ఊహించని అవకాశం?)

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. 

    కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్‌, శివాంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. 

    అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

    ఇషాన్‌, క్లాసెన్ మెరుపులు
    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్‌కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్‌, నితీశ్‌రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.

    కొంపముంచిన టాపార్డర్‌..
    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. 

    ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్‌లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.

    పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌కు
    ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభం ఇవ్వ‌గా.. ఆ త‌ర్వాత మిడిలార్డ‌ర్‌లో ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్‌, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

    ఇక ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌ జంట ఒక అరుదైన ఫీట్‌ సాధించింది. ఈ సీజ‌న్‌లో అభిషేక్‌, ట్రావిస్ హెడ్ జంట 627 ప‌రుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 ప‌రుగులు జోడించ‌డం ద్వారా 600 ప్ల‌స్ మార్కును దాటింది. త‌ద్వారా ఒక సీజ‌న్‌లో 500కు పైగా ప‌రుగులు సాధించిన జోడీగా అభిషేక్‌-హెడ్ నిలిచారు. 

    రెండో స్థానంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌-వైభ‌వ్ సూర్య‌వంశీ (457 ప‌రుగులు), గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌-సాయి సుద‌ర్శ‌న్ జంట (402 ప‌రుగులు) సాధించి మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 ప‌రుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.

    ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థ‌శ‌త‌కం కాగా.. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచ‌రీల‌తో కేన్ విలియ‌మ్స‌న్ మూడో స్థానంలో, 19 అర్థ‌శ‌త‌కాల‌తో శిఖ‌ర్ దావ‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొద‌టి స్థానంలో డేవిడ్ వార్న‌ర్ 42 అర్థ‌శ‌త‌కాల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు.

    అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మ‌రో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి దాకా 5 హాఫ్ సెంచ‌రీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్‌లు నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

    ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

     చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రోసారి చెల‌రేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచ‌రీతో భారీ స్కోరు సాధించిన‌ప్ప‌టికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంత‌గ‌డ్డ‌పై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాల‌ని భావిస్తున్న ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు చేసింది. 

    ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌కర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మ‌రోసారి చెల‌రేగాడు.  పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా చెల‌రేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిల‌వ‌న‌ప్ప‌టికీ  ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ద‌డ‌ద‌డ‌లాడించాడు. 

    👉 ఈ నేప‌థ్యంలో పంజాబ్‌పై గ‌త నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అభిషేక్ వ‌రుస‌గా 66, 141, 74, 35 ప‌రుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్ల‌స్ స్కోరు సాధించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఎనిమిదోసారి. 

    👉ముంబై ఇండియ‌న్స్ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు సాధించ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.

    👉 ఇక ఐపీఎల్‌లో 220 ప్లస్‌ స్కోరు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.

    మ్యాచ్ విష‌యానికొస్తే.. ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

    చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌, గౌత‌మ్ గంభీర్‌లు విజ‌య‌వంత‌మైన కెప్టెన్లుగా ముద్ర‌ప‌డ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సార‌థ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి స‌ర‌స‌న చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. 

    2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయ‌స్ ల‌క్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జ‌ట్లు మారిన‌ప్ప‌టికీ త‌న కెప్టెన్సీ, ఆట‌తీరుతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా అయ్య‌ర్ పేరు సంపాదించాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్య‌ర్ విజేతగా నిల‌బెడితే ధోని, రోహిత్ శ‌ర్మ‌ను కూడా అధిగ‌మిస్తాడ‌ని మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

    జియో హాట్‌స్టార్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చిన ప‌ఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్‌, గంభీర్ వంటి అత్యుత్త‌మ ఐపీఎల్ కెప్టెన్ల‌ను దాటుకొని మ‌రీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్‌, గంభీర్‌లు ఒకే జ‌ట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్య‌ర్ మాత్రం ఇప్ప‌టికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. 

    ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జ‌ట్ల‌కు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్య‌ర్ నిల‌వ‌నున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కేకేఆర్‌, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జ‌ట్ల‌ను కూడా ఐపీఎల్‌లో ఫైన‌ల్ చేర్చిన ఘ‌న‌త అయ్య‌ర్ సొంతం. ఒక‌వేళ అయ్య‌ర్ ఈ సీజ‌న్‌లో అది సాధిస్తే మాత్రం అత‌డి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని ప‌ఠాన్ పేర్కొన్నాడు.

    ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న అయ్య‌ర్ 2020 సీజ‌న్‌లో ఆ జ‌ట్టును ర‌న్న‌ర‌ప్‌గా నిలిపాడు. ఆ త‌ర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్‌లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 

    2025 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్‌లోనూ ఆ జట్టును టైటిల్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.

    చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌!’

  • పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్‌లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది.

    ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్‌
    ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన సూర్యాంశ్ క‌మిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవ‌ర్లు ముగిసేసరికి 5 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులుచేసింది.

    నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

    శ్రేయ‌స్ (5) ఔట్‌.. మూడో వికెట్ డౌన్‌
    భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌స్తోంది. 5 ప‌రుగులు చేసిన‌ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో ఔట్ అవ్వ‌డంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.

    పంజాబ్‌కు షాక్‌.. ఓపెన‌ర్లిద్ద‌రు ఔట్‌
    236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో క‌మిన్స్ బౌలింగ్‌లో ఒక్క ప‌రుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మ‌లింగ‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవ‌ర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్ర‌బ్‌సిమ్ర‌న్ (3) ఔట్ అయ్యాడు.

    పంజాబ్ టార్గెట్ 236 ప‌రుగులు
    ఉప్ప‌ల్ వేదిక‌గా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు.

    అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.

    క్లాసెన్ అర్థ‌సెంచ‌రీ.. ఎస్ఆర్‌హెచ్ 212-3
    పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు దిశ‌గా సాగుతోంది. 18 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. క్లాసెన్ అర్థ‌సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. నితీశ్‌కుమార్ (26) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

    అర్ధ శతకం బాది ఇషాన్‌ ఔట్‌ 
    ఇషాన్‌ కిషన్‌ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్‌ కుమార్‌ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.

    9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 107-2
    పంజాబ్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్‌ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.

    రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    పంజాబ్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

    దంచికొడుతున్న హెడ్‌
    6 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిష‌న్ (7) ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

    అభిషేక్ శర్మ (35) ఔట్‌
    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

    టాస్‌ పంజాబ్‌దే
    టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజ‌ట్లు ఒక్కో మార్పుతో బ‌రిలోకి దిగాయి. ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వ‌గా.. పంజాబ్ జ‌ట్టులోకి శ‌శాంక్ సింగ్ తిరిగి వ‌చ్చాడు. ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్‌హెచ్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 

    మ‌రి ఎస్ఆర్‌హెచ్ ప్ర‌తీకారం తీర్చుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 25 సార్లు త‌ల‌ప‌డితే ఎస్ఆర్‌హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైద‌రాబాద్‌లో పంజాబ్‌తో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒక‌సారి మాత్ర‌మే గెలిచింది.

    తుదిజ‌ట్లు:
    పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీప‌ర్‌), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్

    పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: 
    ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: 
    అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్

  • తమ తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం నెదర్లాండ్స్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా బాబెట్ డి లీడేను ఎంపికైంది. బాబెట్కు క్రికెట్ వారసత్వం ఉంది. ఆమె మామ టిమ్‌ డి లీడే, కజిన్ బాస్‌ డి లీడే ఇప్పటికే పురుషుల వరల్డ్ కప్‌లలో నెదర్లాండ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాబెట్‌ డి లీడే మహిళల టీ20 ప్రపంచకప్‌ జట్టుకు నాయకత్వం వహించనుండటం విశేషం.

    కాగా, మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 జూన్‌ 12 నుంచి ఇంగ్లండ్‌లోని వివిధ వేదికల్లో జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్‌ జట్టు భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ లాంటి పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్‌-ఏలో ఉంది. 

    ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 14న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌లతో ఆడనుంది. కాగా, నెదర్లాండ్స్‌ జట్టు ఈ ఏడాది నేపాల్‌లో జరిగిన గ్లోబల్ క్వాలిఫయర్‌లో కీలక విజయాలు సాధించి, తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది.

    నెదర్లాండ్స్ జట్టు: బాబెట్ డి లీడే (సి), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్, హన్నా లంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోర్, రాబిన్‌ రిజ్కే, రోస్లీ లారెన్స్‌, సాన్యా ఖురానా, సిల్వర్‌ సీగర్స్, స్టెర్రే కాలిస్

  • బ్యాడ్మింట‌న్‌లో థామ‌స్ క‌ప్‌కు ఉండే ప్ర‌త్యేకత వేరు. చైనా, మ‌లేషియా, జ‌పాన్ లాంటి దేశాల్లో బ్యాడ్మింట‌న్ ఆట‌కు ఉన్న క్రేజ్ కూడా వేరు. భారత్‌లోనూ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, ల‌క్ష్య‌సేన్‌, కిడాంబి శ్రీకాంత్‌, డ‌బుల్స్ జోడి చిరాగ్‌-సాత్విక్ జోడి బ్యాడ్మింటన్‌లో అంచ‌నాలు అందుకుంటూ ప‌త‌కాలు సాధించిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. 

    అయినా కూడా భార‌త్‌లో క్రికెట్‌ను మిన‌హాయించి ఏ క్రీడ‌ను అంత‌గా ప‌ట్టించుకోరన్న‌ది చాలాసార్లు రుజువైంది. తాజాగా జ‌ర్మ‌నీ వేదిక‌గా జ‌రిగిన థామ‌స్ క‌ప్‌లో భార‌త పురుషుల బృందం కాంస్య ప‌త‌కం గెలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే థామస్ క‌ప్‌లో ప‌త‌కం సాధించి భార‌త్‌కు తిరిగి వ‌స్తే త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదంటూ భార‌త ఆట‌గాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

    జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో భారతీయులు ఉన్నా కూడా త‌మ ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని, ఇక భార‌త్‌లో అయితే క‌నీసం త‌మ ముఖాలు కూడా చూడ‌లేద‌ని డబుల్స్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ బాధ‌ను వ్య‌క్తం చేశాడు. దేశానికి ప‌త‌కాలు సాధించినా త‌మ‌కు త‌గిన గుర్తింపు లేక‌పోవ‌డం ష‌ట్ల‌ర్లుగా త‌మ‌కు నిరాశ క‌లిగించింద‌న్నాడు. ఇలాంటి అవ‌మానాల‌తో భార‌త్‌లో బ్యాడ్మింట‌న్ వంటి క్రీడ‌ను వృత్తి ప‌రంగా  కొన‌సాగించాలా వ‌ద్దా అనేది ఆలోచించుకునే ప‌రిస్థితిలో ఉన్న‌ట్లు తెలిపాడు. 

    సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. ‘జ‌ర్మ‌నీ నుంచి ఏడు గంట‌ల పాటు విమాన ప్ర‌యాణం చేసి హైద‌రాబాద్ చేరుకున్నాం. మేము జ‌ర్మ‌నీ ఎయిర్‌పోర్టులో ఉన్న‌ప్పుడు మా కాంస్య‌ ప‌త‌కాలు చూసిన కొంద‌రు.. ఎవ‌రు మీరు, ఎక్క‌డి నుంచి వ‌చ్చారు అని అడ‌గ‌లేదు. అందులో భార‌తీయుల‌తో పాటు చాలా మంది తెలుగువాళ్లు కూడా ఉన్నారు. 

    మేమంతా థామ‌స్ క‌ప్ జెర్సీలు ధ‌రించి ఉన్న‌ప్ప‌టికీ, వాళ్లంతా ఐపీఎల్‌, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. 2022లో ఇదే థామ‌స్ క‌ప్‌లో స్వ‌ర్ణం సాదించిన‌ప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘ‌న‌తలు సాధించిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోవాలి. ఇలాంటి అవ‌కాశాలు త‌ర‌చూ రావ‌ని మ‌న అభిమానుల‌కు తెలియ‌డం లేదు. థామ‌స్ క‌ప్ గెల‌వ‌డం చాలా క‌ష్టం, ప‌త‌కాలు సాధించ‌డం కూడా క‌ష్ట‌త‌రం. ఎయిర్‌పోర్టులో దిగిన త‌ర్వాత ప్ర‌ణ‌య్‌, శ్రీకాంత్‌, ధ్రువ్ క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డం చూశాను. 

    అభినందించ‌డానికి ఒక్క‌రు కూడా మా ద‌గ్గ‌రికి రాలేదు. నా స్నేహితులు న‌న్ను పిక్ చేసుకునేందుకు వ‌చ్చారు. కానీ ఎయిర్‌పోర్ట్‌లో నా స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు క్యాబ్‌లు బుక్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు సాగించ‌డం బాధ‌గా అనిపించింది. టోర్నీల్లో బరిలోకి దిగి గాయపడితే.. మన బదులు ఆడేందుకు ఎవరూ ఉండరు. టీమ్ ఈవెంట్స్‌లోనూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. 

    బయట నుంచి పెద్దగా సపోర్ట్ లేకుండా ఆడతాం. పతకాలు గెలిచినా సరిపోవడం లేదు. ఓ సందర్భంలో ప్రణయ్‌తో.. 'ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపులేదు. నేను నా పిల్లలను బ్యాడ్మింటన్ వైపు రానివ్వను' అని చెప్పా. మానసికంగా దృఢంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే మనం ఎంత ప్రదర్శన చేసినా గుర్తించకపోతే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ అకాడమీలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకోవడం వరకే ఆశిస్తున్నాం’అని సాత్విక్ బాధాతప్త హృదయంతో వెల్లడించాడు.

    చదవండి: పాక్‌తో ఆడేది లేదు.. వాళ్ల‌కు మాత్రం మిన‌హాయింపు!

  • అంతర్జాతీయ వేదికపై భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్‌తో వన్డే ట్రై సిరీస్‌ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం​ పాక్‌తో క్రికెట్‌ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. 

    పాక్‌ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్‌ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్‌ చేసుకున్నట్లు పాక్‌ క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్‌  దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.

    ఇదిలా ఉంటే, పాక్‌లో ట్రై సిరీస్‌ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్‌ జరుగనుంది. ట్రై సిరీస్‌ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్‌ సిరీస్‌ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

    బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న పాక్‌
    రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్‌ మే 16 నుంచి సిల్హెట్‌ వేదికగా జరుగనుంది.

    బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్‌ అలీ, సల్మాన​ అఘా, సౌద్‌ షకీల్‌, షాహీన్‌ అఫ్రిది

  • ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీలో గత మ్యాచ్‌లో (లక్నో) కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌ను వీడాడని సమాచారం. హార్దిక్‌ గాయం కారణంగా ఆర్సీబీతో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు (మే 10న) కూడా దూరమయ్యాడని తెలుస్తోంది. హార్దిక్‌ ఇవాళ (మే 6) జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు (ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక) వెళ్లే ఫ్లైట్‌ ఎక్కలేదు. దీంతో అతను ఆర్సీబీ మ్యాచ్‌లో ఆడే అవకాశం కనిపించడం​ లేదు.

    మరోవైపు ఆర్సీబీ మ్యాచ్‌కు సూర్యకుమార్‌ కూడా అందుబాటులో ఉండడని సమాచారం. సూర్యకుమార్‌ త్వరలో తండ్రి కానున్న నేపథ్యంలో భార్యకు దగ్గరగా ఉండేందుకు జట్టును  వీడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కెప్టెన్లు ఒకేసారి జట్టుకు అందుబాటులో లేకపోవడం మినుకుమినుకుమంటున్న ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేయనుంది.

    వీరి గైర్హాజరీలో కెప్టెన్సీ ఎవరు చేపడతారన్న అంశం ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ అభిమానులను సందిగ్దంలో పడేస్తుంది. రోహిత్‌ శర్మ కాకుండా బుమ్రా, తిలక్‌ వర్మ, రికెల్టన్‌ రూపంలో మూడు ఆప్షన్లు ఉన్నా, ఎవరన్నదే ప్రశ్నార్థకం.

    ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌ గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచినా, ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా లేనట్లే అనుకోవాలి. టెక్నికల్‌గా రేసులో ఉన్నా, ముంబై ప్లే ఆఫ్స్‌ చేరాలంటే చాలా అద్భుతాలు జరగాలి. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ఇప్పటికే 6 జట్ల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది. 

    ప్రస్తుతం టేబుల్‌ టాపర్‌గా ఉన్న పంజాబ్‌ సహా ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కొసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను దాటి తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్‌ రేసులోకి రావడం​ దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. 

  • పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేద‌ని క్రీడాశాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ తెలిపారు. అయితే భార‌త్‌లో జ‌రిగే  మ‌ల్టీ నేష‌న‌ల్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో మాత్రం పాకిస్తాన్ అథ్లెట్లు పాల్గొనేందుకు  అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. 

    ఈ మేర‌కు జాతీయ క్రీడా స‌మాఖ్య‌, ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్‌, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) సంయుక్తంగా స‌ర్క్యుల‌ర్‌ విడుద‌ల చేసింది. 2030 కామ‌న్‌వెల్త్ గేమ్స్‌తో పాటు 2036 ఒలింపిక్స్‌ను నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో ఒలింపిక్ చార్ట‌ర్‌, అంత‌ర్జాతీయ క్రీడా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. 

    అయితే పాకిస్తాన్‌తో మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు ఉండ‌వ‌ని, అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసీసీ, ఒలింపిక్స్‌, కామ‌న్‌వెల్త్, ఆసియా గేమ్స్ వంటి టోర్నీల్లో మాత్రమే భార‌త్, పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డుతుంద‌ని క్రీడాశాఖ పున‌రుద్ఘాటించింది. 

    తాజాగా విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌తో పాకిస్తాన్‌తో ప్ర‌స్తుతం ఉన్న క్రీడా విధానం య‌థాత‌థంగా కొన‌సాగ‌నుంది. దీంతో స‌మీప భ‌విష్య‌త్తులో అటు భార‌త్‌లో కానీ, ఇటు పాకిస్తాన్‌లో కానీ ఇరు దేశాల మ‌ధ్య క్రికెట్‌, హాకీ స‌హా ఇత‌ర క్రీడా సిరీస్‌లు జ‌ర‌గ‌వు. 

    అయితే పాకిస్తాన్ అథ్లెట్ల‌కు మాత్రం ఇందుకు మిన‌హాయింపు ఉంటుంద‌ని, ఎందుకంటే వారి వ్య‌క్తిగ‌త కెరీర్‌ను దెబ్బ‌తీసే ఉద్దేశం త‌మ‌కు ఎంతమాత్రం లేద‌ని పేర్కొంది. భార‌త్‌లో జ‌రిగే అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లు ఏవైనా పాక్ అథ్లెట్లు పాల్గొనడాన‌కి అవ‌కాశమిస్తామ‌ని కేంద్ర క్రీడాశాఖ నొక్కి చెప్పింది. 

    గ‌తేడాది ఏప్రిల్‌లో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌లో 26 మంది అమాయ‌క ప్రాణాలు బ‌లిగొన్న త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత క్షీణించాయి. నిజానికి 2008 ముంబై ఉగ్ర‌దాడుల త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కేవ‌లం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డుతున్నాయి. చివ‌రగా 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడిన భార‌త్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

    చదవండి: బ్యాటర్ల వెన్నులో వణుకు.. కనుమరుగవుతున్న యార్కర్లు!

  • ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ క్రికెటర్, బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అండర్‌ 19 జట్టు సహచరుడు, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ (పంజాబ్‌ కింగ్స్‌) మాజీ ఆటగాడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా కన్నుమూశాడు. ఆతని వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. గిల్‌ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

    చండీగఢ్‌లో జన్మించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత అండర్‌-19 జట్టు తరఫున కూడా ఆడాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభ దశలో పంజాబ్‌ కింగ్స్‌ (అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌) జట్టులో భాగంగా ఉన్నాడు.క్రికెట్‌కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

    కోహ్లీతో కలిసి అండర్-19లో
    అమన్‌ప్రీత్ గిల్, బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లితో కలిసి 2007లో అండర్-19  ప్రపంచకప్‌లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటాడు.

    అమన్‌ప్రీత్ గిల్ మృతిపై పంజాబ్‌ క్రికెట్‌ అసోసిచయేషన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "పంజాబ్ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించిన అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరం" అని పేర్కొంది. అమన్‌ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (మే 6) చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్‌ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది.

     

  • ఐపీఎల్‌ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు సంబంధించి బిగ్‌ న్యూస్‌ అందుతుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుతో కలిసి తదుపరి మ్యాచ్‌కు (ఆర్సీబీ) వేదిక అయిన రాయ్‌పూర్‌కు వెళ్లలేదు. ఈ విషయం ఐపీఎల్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హార్దిక్‌ ఉద్దేశపూర్వకంగా జట్టుకు దూరంగా ఉన్నాడా.. లేక యాజమాన్యమే అతన్ని దూరం పెట్టిందా అని ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు.

    కాగా, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక జట్టు ప్రదర్శన దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై ప్రదర్శన మరీ ఘోరంగా ఉంది. 

    కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్‌ పూర్తిగా చేతులెత్తేశాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా అసాధ్యం చేశాడు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

    వ్యక్తిగతంగానూ హార్దిక్‌ దారుణ ప్రదర్శనలు చేశాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. వరుస పరాజయాల తర్వాత హార్దిక్‌ గత మ్యాచ్‌లో (లక్నో) ఆడలేదు. 

    ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును గెలిపించాడు. టాస్‌ సమయంలో స్కై హార్దిక్‌ గురించి మాట్లాడుతూ.. అనారోగ్యం అని సర్ది చెప్పాడు. అయితే అప్పుడు హార్దిక్‌ గైర్హాజరీకి కారణం వేరని తెలుస్తుంది.

    మేనేజ్‌మెంట్‌ ఘాటుగా మందలించడంతో హర్ట్‌ అయ్యి జట్టుకు దూరంగా ఉంటున్నాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా హార్దిక్‌ జట్టుతో కలిసి ప్రయాణించకపోవడం పై ప్రచారానికి మరింత బలాన్నిస్తుంది. హార్దిక్‌ త్వరలో జట్టుతో కలుస్తాడని సహచరులు చెబుతున్నా, అనుమానంగానే ఉంది. 

    ఎందుకంటే ఈ సీజన్‌లో ముంబై పని దాదాపుగా అయిపోయినట్లే. అధికారకంగా ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. దీంతో హార్దిక్‌ ముందే జట్టు నుంచి తప్పుకుని ఉండవచ్చు. కాగా, మే 10న రాయ్‌పూర్‌ వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.

     

  • ఐపీఎల్‌ 2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనూహ్యంగా విజయాల బాట పట్టి, అమాంతం ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకొచ్చింది. తాజాగా ఢిల్లీపై విజయానంతరం ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా మెరుగయ్యాయి. ప్రస్తుతం సీఎస్‌కే మెరుగైన రన్‌రేట్‌ కలిగి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ధీమాగా ఉంది. ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది.

    అన్నీ సవ్యంగా సాగుతున్న తరుణంలో సీఎస్‌కే అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడు ధోనిని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. తలైవా ఇంకెప్పుడు బరిలోకి దిగుతాడంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలు వస్తాడా..? అని చర్చించుకుంటున్నారు. పరిస్థితిపై వాకబు చేస్తే వారనుకున్నదే నిజమయ్యేలా కనిపిస్తుంది.

    సీఎస్‌కేలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు, ధోనీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతను జట్టుతో ప్రయాణించలేదు. ధోనీ స్వయంగా చెప్పిన మాట ప్రకారం​.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే వరకు బరిలోకి దిగడు. అనధికారికంగా ధోని మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తుంది. జట్టు మంచి లయలో ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టనని  అన్నట్లు సమాచారం.

    పైనున్న సమాచారం మేరకు.. ధోని ఈ సీజన్‌లో ఆడటం కష్టమే అని తేలిపోయింది. కేవలం జట్టులో స్పూర్తి నింపేందుకే అతను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు సమాచారం. సీజన్‌ మొదలై ఐదు వారాలైనా రిటర్న్‌ డేట్‌పై ఎలాంటి క్లూ లేకపోవడం ధోని ఐపీఎల్‌ కెరీర్‌ ఎండింగ్‌పై కూడా సంకేతాన్ని ఇస్తుంది. ఒకవేళ ధోని ఇదే సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటే మాత్రం, ఈ సీజన్‌లోనే ఏదో ఒక మ్యాచ్‌లో అతన్ని చూడవచ్చు.

     

  • వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ భారత ద్వితీయ శ్రేణి టీ20 జట్టును ఎంచుకున్నారు. తన ఎంపిక చేసిన జట్టులో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి బిషప్‌ చోటు ఇచ్చారు.

    ఐపీఎల్‌-2026లో అద్భుతంగా రాణిస్తున్న మరో రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు కాదని వైభవ్ వైపు ఆయన మొగ్గు చూపుడం గమనార్హం.వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్‌గా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఆయన ఛాన్స్ ఇచ్చారు.

    ఈ బ్యాకప్ ఓపెనర్‌గా పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు చోటు దక్కింది. ఓ ఇంటర్వ్యూలో బిషప్ మాట్లాడుతూ.. "నా జట్టులో ముగ్గురు ఓపెనర్లను తీసుకుంటాను. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం లెఫ్ట్ హ్యాండర్‌గా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేస్తాను. అతడు అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్దంగా ఉన్నాడని నేను నమ్ముతున్నాను" చెప్పుకొచ్చారు.

    ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్‌, దేవ్‌దత్త్ పడిక్కల్‌, రజిత్ పాటిదార్ వంటి స్టార్ ప్లేయర్లకు బిషప్ అవకాశమిచ్చారు. ఆల్‌రౌండర్లగా కృనాల్ పాండ్యా, నితీశ్ కుమార్‌ల‌ను ఆయన ఎంచుకున్నారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ధ్రువ్‌ జురెల్‌కు ఛాన్స్‌ లభించింది.

    ముఖ్యంగా 35 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం విశేషం. దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న చాహల్‌ను, రవి బిష్ణోయ్‌ను పక్కన పెట్టి మరి ఛాన్స్‌ ఇచ్చారు. ఇక చివరగా ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఉన్నారు.

    ఐర్లాండ్‌ టూర్‌కు వైభవ్‌!
    కాగా ఐపీఎల్‌-2026 సీజన్‌ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు వైభవ్‌ సూర్యవంశీ, ప్రియాన్ష్‌ ఆర్యలకు సీనియర్‌ జట్టులో చోటు దక్కే అవకాశముంది. వైభవ్‌ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 237.65 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేశాడు.

    ఇయాన్ బిషప్ ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు: శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మొహ్సిన్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

     


     

Politics

  • తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వని గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ తీరుపై మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. 

    ‘‘తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ ఇప్పటికీ టీవీకే నాయకుడు విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించకపోవడం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా తమిళనాడు గవర్నర్ వెంటనే టీవీకే నాయకుడిని రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటుకు ఆహ్వానించి, ఆయనను ముఖ్యమంత్రిగా నియమించి, సభలో మెజారిటీ నిరూపించుకునేలా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను’’ అని అన్నారు.

    కాగా, గురువారం (ఏప్రిల్‌ 7న) ప్రమాణ స్వీకారం చేద్దామని టీవీకే విజయ్‌ భావించి అందుకు ప్లాన్‌ వేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందుగా మెజారిటీ మద్దతుకు ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. దీంతో టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది.

    తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్‌ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. మెజారిటీ మార్క్‌ కోసం ఇంకా సీట్లు అవసరం.  

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడుతున్న డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పొత్తు చర్చలు ప్రారంభమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

    ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నాడీఎంకే 47 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం 106సీట్లు. ఇతర చిన్న పార్టీలను కలుపుకుని  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే,అన్నా డీఎంకేల మధ్య జరిగిన చర్చల్లో చెరో రెండున్నరేళ్లు పాలించేలా ఒప్పందం కుదిరినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

    ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నో సార్లు పరస్పరం తీవ్రంగా విమర్శించుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం కోసం చేతులు కలపాలని ఆలోచిస్తున్నాయి.  

    డీఎంకే, అన్నాడీఎంకే మధ్య విభేదాలు 1970ల నుండి కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడులో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి వచ్చి, రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు హంగ్ అసెంబ్లీ పరిస్థితి కారణంగా, దశాబ్దాలుగా శత్రువులుగా ఉన్న ఈ పార్టీలు ఒకే వేదికపై చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ పొత్తు జరిగితే, తమిళనాడు రాజకీయాల్లో ఇది చారిత్రక మలుపు అవుతుంది. అయితే, ఇరుపార్టీల కేడర్‌, నాయకత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అంగీకరిస్తారన్నది చూడాలి. మరోవైపు, కొత్తగా ఎదుగుతున్న పార్టీలు కూడా ఈ సమీకరణల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. తమిళనాడులోని 234 సభ్యుల సభలో టీవీకే 108 స్థానాలు గెలిచింది. మెజారిటీ మార్క్‌ (118)కి 10 సీట్లు తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో 5 స్థానాలు పెరిగాయి. మొత్తం 113కి చేరింది. 

    మెజారిటీ మార్క్‌ కోసం ఇంకా సీట్లు అవసరం. పీఎంకే, సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే వంటి చిన్న పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే ముందు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మెజారిటీ మద్దతు నిరూపించాలని కోరారు. 

    ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటే ముందు మెజారిటీ మద్దతుకు పత్రాలరూపంలో ఆధారాలు సమర్పించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పట్టుబట్టారు. ఈ పరిణామం వల్ల టీవీకే ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రణాళిక దెబ్బతింది. ప్రమాణ స్వీకారంలో విజయ్ సహా నలుగురు సీనియర్ నేతలు ప్రమాణం చేసి, సభలో మెజారిటీ నిరూపణకు రెండు వారాలు గడువు కోరాలని భావించారు.

    కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చింది. దీంతో తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్‌కు ఉన్న దీర్ఘకాల మైత్రి చెడిపోయింది. టీవీకే-కాంగ్రెస్‌ స్నేహబంధం ప్రభుత్వ ఏర్పాటు వరకు మాత్రమే కాకుండా.. స్థానిక సంస్థల ఎన్నికలు, లోక్ సభ, రాజ్య సభ ఎన్నికలు సహా భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతుందని చెప్పాయి. టీవీకే తన ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఓ ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్‌కు తరలించింది.

    అనుమతి కోసం మరో ప్రయత్నం
    టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునా ఇవాళ రాత్రి గవర్నర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై అనుమతి తీసుకోవడానికి మరో ప్రయత్నం చేశారు. సమయాన్ని ఇస్తే 118 సంపూర్ణ మద్దతు కూడగడుతామని హామీ ఇచ్చారు. మొదట ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచిన టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ నెలకొంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు. ఈ భేటీలో తన వద్ద 112 ఎమ్మెల్యేల మద్దతు ఉందని వివరించారు. అయితే, ఆ సంఖ్యపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని సూచించారు.

    సంఖ్యాబలం నిరూపించుకునేందుకు గవర్నర్ నేటి అర్ధరాత్రి వరకు గడువు ఇచ్చారు. ఫలితంగా, విజయ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న టీవీకే శ్రేణుల ఆశలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీకే–కాంగ్రెస్ పొత్తు కుదిరినా, సంఖ్యాబలం సరిపోలేదు. దీంతో టీవీకే నేతలు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్‌)తో భేటీ అయ్యి, తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చర్చలు జరిపారు. అయితే, ఈపీఎస్‌ ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.

    అన్నాడీఎంకేలో కొంతమంది (సుమారు 30కిపైగా) ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మాజీ మంత్రి సీవీ షణ్ముగం, ఈపీఎస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. టీవీకేతో కలిస్తే పార్టీకి మళ్లీ శక్తి వస్తుందని, అధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు కావడం, అంతర్గత చర్చలు కొనసాగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.

    ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీవీకేకి సంఖ్యాబలం సరిపోలలేదు. నేటి అర్ధరాత్రితో తమిళనాడు అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. అదే సమయంలో తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళకు వెళ్లనున్నారు.

    ఈ నేపథ్యంలో, టీవీకే అధినేత విజయ్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం తక్కువగా ఉండటం, గవర్నర్ సూచించిన మెజారిటీ నిరూపణ చేయాల్సిన అవసరం ఆసక్తికరంగా మారింది. దీంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ(మే 6, బుధవారం) జూమ్ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మెంబర్లతో ఆయన సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సవరణ)పై మరింత అప్రమత్తంగా ఉండాలని.. 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్‌ను పెంచుకోవాలని సూచించారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షలకు పైగా(బెంగాల్‌, తమిళనాడు)లో తొలగించడం జరిగింది. మనం వైఎస్సార్సీపీ ఓటర్లు, సానుభూతిపరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరం’’ అని సజ్జల పేర్కొన్నారు.

    ‘‘వైఎస్సార్‌సీపీ ఓటర్లపై చంద్రబాబు, ఆయన టీమ్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. బీఎల్ఓలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కావున మన తరుపున ఉండే బీఎల్ఏలు కూడా సమర్థుడై, బీఎల్వోతో సమన్వయం చేసుకోవాలి. మనం ఎస్ఐఆర్‌ను అవకాశంగా తీసుకుని మన ఓటర్లను కాపాడుకోవాలి. బీఎల్ఓలు ఇప్పటికే మ్యాపింగ్‌ చేశారు.. కావున మనం ఏర్పాటుచేసుకున్న బీఎల్ఏలు కూడా అందుకు సన్నద్దంగా ఉండాలి. ఎస్ఐఆర్‌ మొదలయ్యోలోగా మనం అందుకు అవసరమైన విధంగా సిద్దంగా ఉండాలి. 

    బీఎల్ఏలు సాంకేతికపరంగా ఎక్స్‌పర్ట్‌ అయి ఉండి అందరితో సమన్వయం చేసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ సిద్దంగా ఉంటుంది. బీఎల్ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌ కూడా ఇద్దాం. మనం నిరంతరం దీనిపై దృష్టిపెడితే సార్వత్రిక ఎన్నికలను సులువుగా గెలవచ్చు. అంతేకాక స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనం విజయం సాధించవచ్చు. ఎస్ఐఆర్‌ పై చర్చ అనంతరం రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈ వారంలో వచ్చేవారం ఆసుపత్రుల సందర్శన, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం వంటి కార్యక్రమాలను మనం షెడ్యూల్ చేసుకున్నాం. అందరితో సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి.

    కమిటీల వెరిఫికేషన్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నడుస్తోంది, మీరు మరింత వేగవంతం చేయాలి. అందుకు అవసరమైన సపోర్టింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. మనకు సంబంధించి ప్రతి కార్యక్రమం కూడా మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మంచి, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ, ఉన్మాదం, అవినీతి, రెడ్ బుక్ పాలనపై కూడా నియోజకవర్గాల్లో మీరు కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ విషయంలో జిల్లా అధ్యక్షులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.

    ఈ సమావేశంలో మాట్లాడిన కన్నబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, వరికూటి అశోక్ బాబు, అబ్బయ్య చౌదరి, కొరుముట్ల శ్రీనివాసులు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మల్లాది విష్ణు ఎస్‌ఐఆర్‌పై తమకు ఉన్న అవగాహన, అనుమానాలపై చర్చించి పార్టీ క్యాడర్‌ అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎస్ఐఆర్‌ పూర్తయ్యేవరకు ఏ మాత్రం అజాగ్రత్త లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

  • లక్నో:ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్‌ కిషోర్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ప్రశాంత్‌ కిషోర్‌ సంస్థ ఐపాక్‌ సేవలు ఇకపై తమకు అవసరం లేదని ఉత్తర ప్రదేశ్‌ ప్రతిపక్ష సమాజ్‌వాద్‌ పార్టీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాజా నిర్ణయం చర్చాంశనీయంగా మారింది.  

    సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ 2027 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్‌ (I-PAC)తో సంబంధాలు తెంచుకున్నారు. పార్టీ ఇకపై ఐపాక్‌తో పనిచేయదు. ‘మాకు నిధులు లేవు. మీరు (మీడియా) నిధులు ఇస్తే మరో సంస్థను కూడా పెట్టుకుంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఐపాక్‌ గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి 2022 ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో వ్యూహాలు రూపొందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయింది. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం మరో సంస్థ షోటైమ్‌తో ఒప్పందం కొనసాగిస్తుందని తెలిపారు.

    టీఎంసీ, డీఎంకే ఓటమి
    అఖిలేష్‌ యాదవ్‌కు ఈ నిర్ణయానికి కారణంగా పశ్చిమ బెంగాల్‌ బొగ్గు అక్రమ రవాణా కేసులో ఐపాక్‌ సహ వ్యవస్థాపకుడు వినేష్‌ చాందెల్‌ అరెస్టు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఐపాక్‌ సేవలందించిన పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

    విస్మయంలో మమతా బెనర్జీ, ఎంకే  స్టాలిన్‌ ఓటమి
    పశ్చిమ బెంగాల్‌ బొగ్గు అక్రమ రవాణా కేసు. ఈ కేసులో ఐపాక్‌ సహ వ్యవస్థాపకుడు వినేష్‌ చాందెల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ఐపాక్‌కి తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఐపాక్‌ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను బీజేపీ 207 సీట్లతో చిత్తు చేసింది. తమిళనాడులో డీఎంకే గద్దె దిగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఎంకే  స్టాలిన్‌ తమ బలమైన నియోజకవర్గాల్లోనే ఓడిపోవడం విస్మయానికి గురి చేసింది. వెరసీ ఐపాక్‌తో కలిసి పని చేయడం కంటే దూరం పెట్టడమే మంచిదని భావించే అఖిలేష్‌ యాదవ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

    అఖిలేష్‌ మాత్రం ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అవును, మాకు వారితో సంబంధం ఉంది. కొన్ని నెలలు పనిచేశారు. కానీ మాకు ఆ స్థాయి నిధులు లేవు కాబట్టి కొనసాగించలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు.

    అఖిలేష్‌ యాదవ్‌కు డూ ఆర్‌ డైగా ఎన్నికలు
    అయితే ,ఐపాక్‌ వైఫల్యం, వినేష్‌ చాందెల్‌ అరెస్టు, ఈడీ దర్యాప్తు అన్నీ కలిపి సమాజ్‌వాదీ పార్టీకి ఆలోచన కలిగించాయి. ఇప్పటికే ఐపాక్‌ ఉత్తరప్రదేశ్‌లో తన కార్యకలాపాలను తగ్గించిందని, అందులో ఉద్యోగుల సంఖ్యను సగానికిపైగా తగ్గించినట్లు సమాచారం. ఇది పార్టీ ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసింది.  2027 ఎన్నికలు అఖిలేశ్‌ యాదవ్‌కి డూ ఆర్‌ డై అన్నచందంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో ఏకైక బలమైన ప్రత్యామ్నాయం సమాజ్‌వాదీ పార్టీగా భావిస్తున్నారు. కానీ ఐపాక్‌ విడిపోవడం, ఈడీ కేసులు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పరాజయాలు ఇవన్నీ అఖిలేష్‌కి పెద్ద సవాళ్లుగా మారాయి.

  • చెన్నై: అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో నిరూపించాయి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు. అన్ని వర్గాలకు చెందిన వారూ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సామాజిక న్యాయం దిశగా వెళ్లాలంటే ఇటువంటి ఫలితాలు అవసరమని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో అన్ని లెక్కలను సరి చేశారు టీవీకే విజయ్‌. ఎందరో ఉద్ధండులకూ సాధ్యం కానిది సాధించి చూపించారు. ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత వంటి వారూ చూపించని మార్పును చూపించారు. ఓటర్లలో మార్పు తీసుకొచ్చారు.

    వృత్తులను చూడలేదు 
    వీధుల్లో ఆటో డ్రైవింగ్ చేసుకునే పని నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ప్రవేశం వరకు ఎదిగారు ఓ ఆటోడ్రైవర్‌. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు.  

    రాయపురం ఆటో డ్రైవర్ కేవీ విజయ్‌ దామూ అదే నియోజక వర్గం నుంచి గెలిచారు. అలాగే, విజయ్ కారు డ్రైవర్ కుమారుడు కూడా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. విజయ్‌కు దీర్ఘకాలికంగా సహాయకుడిగా ఉంటున్నారు కారు డ్రైవర్‌ రాజేంద్రన్. ఆ డ్రైవర్‌ కుమారుడు ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ స్థానంలో టీవీకే తరఫున గెలిచారు.

    ఇద్దరు సాధారణ వ్యక్తులు సాధించిన ఈ అతి పెద్ద విజయం.. గొప్ప సందేశాన్ని ఇచ్చింది. రాజకీయాలు ఇకపై కేవలం శక్తిమంతమైన కుటుంబాలకే పరిమితం కాదని నిరూపించింది. ఓటర్లు అన్ని వర్గాల వారినీ ఆదరిస్తారని చాటి చెప్పింది.

    కులాలను చూడలేదు
    ఎవరికి ఓటు వేస్తావని అడిగితే ‘మా కులం వాళ్లకే ఓటు వేస్తా’మని అంటారు చాలామంది. తమిళనాడులోనూ కుల వ్యవస్థ బలంగా ఉంది. ఈ కుల అడ్డుగోడలను దాటి మరీ ఈ సారి ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారి నుంచి టీవీకే సామాజికంగా భారీ మద్దతు సంపాదించింది. అసెంబ్లీలో బ్రాహ్మణ ప్రాతినిధ్యాన్ని మళ్లీ తీసుకువచ్చింది. ఇది ప్రధాన ద్రావిడ పార్టీల దృష్టికి ఎక్కువగా రాని అంశం, రాష్ట్ర ఎన్నికల విధానంలో మార్పును సూచిస్తోంది.

    టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వ్యక్తి. ఆయన నేతృత్వంలో పార్టీ సాంప్రదాయ కుల సమీకరణాలను దాటేసి.. అభ్యర్థుల ఎంపిక, స్థానికుల నుంచి నమ్మకాన్ని పెంపొందించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ గిరిజనుల (ఎస్టీ) నుంచి 20కి పైగా ఎమ్మెల్యేలు, మైలాపూర్, శ్రీరంగం నుంచి ఇద్దరు బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

    మైలాపూర్‌లో పి.వెంకటరమణన్, శ్రీరంగంలో రమేశ్‌ గెలుపును రాజకీయంగా ప్రాధాన్యంగా భావిస్తున్నారు. బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రధాన ద్రావిడ పార్టీలు వెనకడుగు వేస్తాయి. వారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఓటింగ్‌లో ఆధిపత్య కులాల ప్రభావంతో ఓడిపోవచ్చు అనే భయం పార్టీల్లో ఉంటుంది. అయినప్పటికీ, టీవీకే వారిని అభ్యర్థులుగా నిలబెట్టింది. వారు గెలవడం ఇప్పటి వరకు ఉన్న ఎన్నికల విధానానికి భిన్నంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 46 రిజర్వు స్థానాలు ఉన్నాయి. టీవీకే అభ్యర్థులు వాటిలో 24 స్థానాల్లో గెలిచారు. మిగిలిన 22 రిజర్వు స్థానాల్లో డీఎంకే కూటమి (13), ఏఐఏడీఎంకే (9) గెలిచాయి. సంప్రదాయ కూటములు కొన్ని ప్రాంతాల్లో బలాన్ని నిలబెట్టుకున్నా, టీవీకే భారీ ప్రభావాన్ని చూపించింది.

    టీవీకే అభ్యర్థి విరుధునగర్‌లో షెడ్యూల్డ్ కుల అభ్యర్థి పి.సెల్వం జనరల్‌ స్థానంలో పోటీ చేసి వి.విజయ్ ప్రభాహరణ్‌ను ఓడించారు. ఎస్సీ అభ్యర్థి జనరల్‌ స్థానంలో గెలవడం వల్ల ఈ ఎన్నికలో కుల లెక్కలు పనిచేయలేదని స్పష్టమవుతోంది.

    రిజర్వు, సాధారణ స్థానాల్లో రెండింట్లోనూ వెనుకబడిన వర్గాల అభ్యర్థులు టీవీకే తరఫున గెలిచారు. ఇది కుల, మత గీతలను దాటిన సమీకరణాన్ని సూచిస్తోంది. భవిష్యత్తు రాజకీయాల్లోనూ ఇదే ధోరణి కనపడితే మనం కోరుకుంటున్న సమసమాజం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    టీవీకే నుంచి 13.. డీఎంకే నుంచి 0  
    తమిళనాడు శాసనసభకు 23 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. గత శాసనసభలో కేవలం 12 మందే ఉండేవారు. తమిళనాడు చరిత్రలో 23 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నికైన సందర్భాలు గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీవీకే నుంచి 13 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఏఐఏడీఎంకే నుంచి ఆరుగురు ఉన్నారు. డీఎంకే 19 మంది మహిళలను పోటీకి దింపినా ఒక్కరు కూడా గెలవలేదు.

Telangana

  • హైదరాబాద్: శస్త్రచికిత్సలు, తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 'ట్రాన్సిషనల్ కేర్' (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్  డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్' సెంటర్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జగదీష్ గౌడ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్ మౌనికా రెడ్డి అట్ల తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. "సాధారణంగా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి నిలకడగా ఉంచుతాయి. కానీ, వారు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకోవడానికి ప్రత్యేక పునరావాస కేంద్రాల అవసరం ఉంది. మన దేశంలో ఇటువంటి ప్రత్యేక కేంద్రాల కొరత ఉంది. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయం" అని అన్నారు.

    ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత, స్వదేశంలో ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. పక్షవాతం (స్ట్రోక్), వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందిస్తామని వివరించారు. వైద్యులు, స్థానిక నేతలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి అత్యాధునిక వసతులను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రం అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

    కేంద్రం ప్రత్యేకతలు:
    అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ మరియు స్పెషలైజ్డ్ థెరపీ జోన్లు
    డిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విభాగాలు
    అమెరికా దేశపు ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్.
     

  • హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార‍్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‎కు బయలుదేరతారు. 

    మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‎లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 

    తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్‏లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్‎కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత  6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్‌కు తిరిగి వెళ్తారు.

    ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నామినేటెడ్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 17 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, వైఎస్‌ ఛైర్మన్లను  పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొమ్మ శ్రీనివాస్‌, కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బండి రమేష్‌, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌గా బస్వరాజు శ్రీనివాస్‌..

    ..హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గూడెం వెంకటరమణ, పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌గా శ్రీనివాస్‌, పెరికి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొంగర వెంకటేశ్వర్లు, వెలమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జువ్వాడి నర్సింగ్‌రావు, యాదవ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రఘునాథ్‌ యాదవ్‌, వాషర్ మెన్ - డాక్టర్ అజయ్ కుమార్, గీత కార్మిక - చంద్ర శేఖర్ గౌడ్, మేర-సంగ వెంకట్ రాజం, వాల్మీకి బోయ - గట్టు తిమ్మప్ప, వడ్డెర ఫెడరేషన్-గుంజా రేణుక, లైవ్ స్టాక్ - చరణ్ కౌశిక్ యాదవ్‌లను ప్రభుత్వం నియమించింది.

     

     

  • సాక్షి, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విద్యారంగం, స్పోర్ట్స్ మెడిసిన్‌లో కీలక మైలురాయిని సాధించింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడా గాయాలు ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ సాధారణ ఆర్థోపెడిక్ శిక్షణ, క్రీడాకారులు, శారీరకంగా చురుకైన వ్యక్తులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది. 

    ఆర్థ్రోస్కోపీ అనే ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స పద్ధతి చిన్న జాయింట్ స్థలాల్లో అధునాతన పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కెమెరా సహాయంతో పని చేసే నైపుణ్యాన్ని కోరుతుంది. ఏసీఎల్ (ACL) పునర్నిర్మాణం, లాబ్రల్ రిపేర్, కార్టిలేజ్ రీస్టోరేషన్ వంటి శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వైద్యులకు ఈ నైపుణ్యాలపై  సమగ్ర శిక్షణ అందుతుంది.

    ఈ కార్యక్రమంలో మోకాలి, భుజం, నడుము జాయింట్ల రీకన్‌స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ అందింస్తారు. ప్రాక్టికల్ శస్త్రచికిత్స అనుభవంతో పాటు సైద్ధాంతిక బోధనను కలిపి, ఖచ్చితమైన శస్త్రచికిత్స, క్రీడలకు సంబంధించిన గాయాల అంచనా, పునరావాస విధానాలు మరియు ఆధారిత వైద్య విధానాలపై ప్రత్యేకమైన ఫోకస్‌ ఉంటుంది. 

    కిమ్స్ హాస్పిటల్స్ మెుదటి నుంచే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెరుగైన చికిత్స ఫలితాలతో పాటు నిపుణుల తయారీకి కట్టుబడి ఉంది. ఈ ఫెలోషిప్‌కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, సంస్థ యొక్క వైద్య నైపుణ్యం మరియు గ్లోబల్ ప్రమాణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం దేశంలో ఆధునిక ఆర్థోపెడిక్ శిక్షణకు మార్గదర్శిగా నిలవనుంది.

    ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి  డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ, ఈ ఫెలోషిప్ ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో వైద్యులను శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంతంలో క్రీడా గాయాల చికిత్స నాణ్యతను మరింత మెరుగుపరచగలమని తెలిపారు. ఈ కార్యక్రమంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక వైద్య విద్య మరియు ప్రత్యేక శస్త్రచికిత్స సేవలలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.

Business

  • అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్‌లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.

    ''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.

    ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.

    సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.

    స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.

    చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్‌లో బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.

    ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

  • బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడమనేది పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య బీమా రంగ దిగ్గజం స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ఆనంద్‌ రాయ్‌ తెలిపారు. దీనితో మరిన్ని పెట్టుబడులు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, ఇన్సూరెన్స్‌ రంగ విస్తృతి మరింత పెరుగుతుందని మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,000 కోట్ల మేర స్థూల రిటెన్‌ ప్రీమియం (జీడబ్ల్యూపీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఇది సుమారు రూ.20,400 కోట్లుగా ఉండగా, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయ్‌ వివరించారు. చిన్న పట్టణాల్లో మరింతగా విస్తరించడం ద్వారా దీన్ని సాధించనున్నట్లు చెప్పారు. బీమాను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా చిన్న పట్టణాల్లోని వారి కోసం తక్కువ ప్రీమియంలతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.  

    తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం వాటా లక్ష్యం
    సంస్థ వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 10 శాతంగా ఉన్నట్లు రాయ్‌ చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దీన్ని 12–15 శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,254 కోట్లు విలువ చేసే 1.8 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించామని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం అధికమని రాయ్‌ వివరించారు. జాతీయ స్థాయిలో 30.6 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 11,903 కోట్లు సెటిల్‌ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీపై ఏటా రూ. 200–250 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. బీమా ప్రీమియంలు గరిష్ట సింగిల్‌ డిజిట్‌ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

  • బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.

    కాలిఫోర్నియా నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల  కలయికతో రూపొందింది.

    EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.

    ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.

    భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.

    ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

  • భారత ఆటోమొబైల్‌ రంగం 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్‌ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డును సృష్టించాయి. గత నెలలో మొత్తం 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో నమోదైన 23,12,221 యూనిట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం వృద్ధి అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఫాడా) మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ 2.0 అమలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, రబీ పంటల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నగదు లభ్యత, వివాహాల సీజన్‌ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఫాడా వివరించింది.

    రికార్డుల జోరుతో ఆటో రంగం బోణీ: ఫాడా ఉపాధ్యక్షుడు
    భారత ఆటో రిటైల్‌ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించిందని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్‌ తెలిపారు. 2026 ఏప్రిల్‌లో మునుపెన్నడూ లేని విధంగా 26,11,317 యూనిట్ల విక్రయాలతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషమన్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావని, భారత వినియోగ మార్కెట్‌లో వస్తున్న కీలక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొన్నాళ్లుగా మెట్రో నగరాలకే పరిమితమైన వాహనాల జోరు ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణ ప్రాంతాల్లో 7.11 శాతం వృద్ధి నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 20.40 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. వినియోగదారులు కేవలం పెట్రోల్, డీజిల్‌పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విక్రయాల్లో సీఎన్‌జీ (సీఎన్‌జీ) వాటా 22.62% ఉండగా, ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వాటా 5.77 శాతానికి మెరుగుపడటం సానుకూల పరిణామం’’ అని వెల్లడించారు.

    అప్రమత్తతతో కూడిన ఆశావాదం: ఫాడా అంచనాలు
    రాబోయే మూడు నెలల్లో వాహన విక్రయాల వృద్ధిపై సగానికి పైగా (50.90 శాతం) డీలర్లు ధీమాతో ఉన్నారని ఫాడా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు లభ్యత, ఖరీఫ్‌ సీజన్‌ సానుకూలతలు ద్విచక్ర వాహన విభాగానికి ఊతమిస్తాయని అంచనా వేసింది. మే నెలలో వివాహాల సీజన్‌ కారణంగా ప్యాసింజర్‌ వాహనాల బుకింగ్‌లు బలంగా ఉంటాయని, జూన్‌–జూలై నెలల్లో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, తీవ్రమైన వడగాల్పులు, పశి్చమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు మరియు వాణిజ్య వాహనాల విభాగంలో నగదు లభ్యత (లిక్విడిటీ) వంటి సవాళ్లను నిశితంగా గమనించాల్సి ఉంటుందని ఫాడా స్పష్టం చేసింది.

  • బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 940.73 పాయింట్లు లేదా 1.22 శాతం లాభంతో 77,958.52 వద్ద, నిఫ్టీ 298.15 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 24,330.95 వద్ద నిలిచాయి.

    రేమండ్ రియల్టీ లిమిటెడ్, మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్, హెచ్‌బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, బీఎన్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, రేమండ్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. షిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, మనాక్సియా కోటెడ్ మెటల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
     

  • ఆర్ధిక విషయాలకు సంబంధించిన విషయాలను, పెట్టుబడులకు సంబంధించిన సమాచారం గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki), తాజాగా బేబీ బూమర్స్ గురించి చెప్పారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ''1974లోనే నేను బేబీ బూమర్ల (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారిని బేబీ బూమర్స్ అంటారు) పదవీ విరమణ విపత్తు రాబోతోందని ఊహించాను. 2026 చివరి నాటికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. చాలామంది నిరాశ్రయులవుతారు'' అని కియోసాకి హెచ్చరించారు.

    ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కాస్త కఠినంగా మారుతున్నాయి. చాలా మంది వృద్ధులు ఉద్యోగాలు కోల్పోయి, సరిపడా పొదుపులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది సమాజానికి పెద్ద సవాలు. అందుకే ముందుగానే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమని కియోసాకి చెబుతున్నారు.

    మన మెదడు మనకు ఉన్న గొప్ప ఆస్తి. సరైన జ్ఞానం, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైనా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సంపదను సృష్టించడం అంత కష్టం కాదు, సరైన మార్గం తెలుసుకుంటే సరిపోతుంది.

    ఇదీ చదవండి: ఇప్పటి ప్రపంచానికి అవి సరిపోవు: కియోసాకి హెచ్చరిక

    కొంతమంది నిపుణులు.. భవిష్యత్తు కోసం బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, అలాగే డిజిటల్ ఆస్తులు అయిన బిట్‌కాయిన్, ఎథీరియం లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు వెళ్లడం అవసరం అని రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. మొత్తం మీద.. రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలంటే ముందుగానే ప్రణాళిక అవసరం అని ఆయన పేర్కొన్నారు.

  • సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ బిజినెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘ఫ్రెష్‌వర్క్స్’ తాజాగా తన ఉద్యోగుల్లో 11 శాతం మందిని, అంటే దాదాపు 500 మందిని తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న తరుణంలో తాజా నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

    ఎందుకు ఈ నిర్ణయం?

    ఏఐ రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే క్రమంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డెన్నిస్ వుడ్‌సైడ్ స్పష్టతనిచ్చారు. ‘మా కోడింగ్ ప్రక్రియలో ఇప్పటికే సగానికి పైగా ఏఐ ద్వారానే జరుగుతోంది. ఆటోమేషన్ వల్ల సాంకేతిక విభాగాల్లోని సాధారణ పనులు గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులను సమర్థవంతంగా నిర్వహించడానికి లేఆఫ్స్‌ అవసరం ఏర్పడింది’ అని ఆయన వివరించారు.

    పునర్నిర్మాణ వ్యూహం

    ఈ తొలగింపుల వల్ల కంపెనీపై సుమారు 8 మిలియన్ డాలర్ల భారం పడనుందని అంచనా. అయితే, ఈ పొదుపు ద్వారా వచ్చిన నిధులను కంపెనీ తన ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్ అయిన ‘ఫ్రెష్‌సర్వీస్’ వంటి వ్యాపార విభాగాల్లో తిరిగి పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

    ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన

Andhra Pradesh

  • వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు ఏడాదిన్నరగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు దాన్ని పక్కదోవ పట్టించేందుకు ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

    ‘జావా డిస్కవరీ డాక్యుమెంటరీ ద్వారా కొల్లం గంగిరెడ్డి అనే ఎర్ర చందనం స్మగ్లర్‌తో మా నాయకుడికి ముడిపెడుతున్నారు. తొలుత ఉడుముల సుధాకర్‌రెడ్డి రాసిన బ్లడ్‌ శాండర్స్‌ బుక్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు, ఫొటో లేదు. ఆ తర్వాత అదే బుక్‌ ఆధారంగా తయారైన డాక్యుమెంటరీలోనూ వైఎస్‌ జగన్‌ ప్రస్తావన లేదు.

    కానీ, ఈ జావా డాక్యుమెంటరీలో మాత్రం జగన్‌కు ముడిపెడుతూ మార్ఫింగ్‌ ఫొటోలతో కథనాలు రాస్తారు. వాటిని పట్టుకుని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్లు పెడతారు. వైఎస్‌ జగన్‌కు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం ఉందనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

    కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తికి.. మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ నేను ఉన్నా. ఏనాడూ అతడిని మా పార్టీలో చూడలేదు. సుండుపల్లికి చెందిన మహేశ్‌ నాయుడు అనే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ ఎవరు? చెప్పలేనన్ని ఎర్రచందనం కేసుల్లో ఉన్న ఈ అంతర్జాతీయ స్మగ్లర్‌ మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదా? 

    నకిలీ స్టాంపుల నేరస్తుల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు, హత్యలు చేసిన వారు మీ చుట్టూనే తిరుగుతుంటారు. ఎమ్మెల్సీ ఒకరు మాట్లాడుతూ వివేకా కేసులో గంగిరెడ్డి, ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డి ఒకరేనంటున్నారు. కనీస అవగాహన లేకుండా టీడీపీ ఆఫీసు ఏ స్క్రిప్ట్‌ ఇస్తే అది చదువుతూ వైఎస్‌ జగన్‌పై విషం కక్కుతున్నారు. కడపలో దస్తగిరి అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చనిపోతే.. వివేకా కేసులో దస్తగిరి అంటారు మరో మంత్రి. 

    వీళ్ల కళ్లకు బైర్లు కమ్మి... ఎక్కడ ఏది జరిగినా పేరు మ్యాచ్‌ అయితే చాలు వైఎస్‌ జగన్‌కు అంటగట్టడమేనా? పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఈ కొల్లం గంగిరెడ్డి ఆ పార్టీలో చేరారు. పురందేశ్వరి సాక్షిగా విజయవాడలో సమావేశాల్లో కూడా పాల్గొన్నాడు. అలా బీజేపీకి దగ్గరైన వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌కు అంటగట్టడం ఎంతవరకు సమంజసం. మీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేశ్‌ నాయుడు అంతర్జాతీయ స్మగ్లర్‌.. అతని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? 

    అనేక హత్యలు, కుంభకోణాలతో సంబంధం ఉన్న వ్యక్తులు వందల సంఖ్యలో చంద్రబాబు చుట్టూ ఉన్నారు. వారి గురించి మాట్లాడటానికి మీకు నోరు రావడం లేదా? అసలు మొదటి డాక్యుమెంటరీలో లేని వైఎస్‌ జగన్‌ పేరు, ఫొటో రెండో డాక్యుమెంటరీలోకి ఎలా వచ్చింది? 

    డాక్యుమెంటరీకి మూలమైన బ్లడ్‌ శాండర్స్‌ బుక్‌లో నేను వైఎస్‌ జగన్‌ ప్రస్తావనే తీసుకురాలేదని రచయిత సుధాకర్‌రెడ్డి చెబుతున్నారు. తన రచనను ఉపయోగించి తయారుచేసిన డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారం పెట్టారని రచయిత లీగల్‌ నోటీసులు కూడా పంపారు. ఇదంతా చూస్తే ఈ పచ్చ మూక ఎంత బరితెగించిందో ప్రజలకు అర్ధం అవుతోంది. మా పార్టీ నుంచి కూడా తప్పుడు కథనాలపై న్యాయపరమైన చర్యలకు దిగుతాం’ అని చెప్పారు. 
     

  • ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ యువ న్యాయవాదిపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్‌రావు.. ఓ యువ న్యాయవాది చేసిన చిన్నపాటి తప్పిదం కారణంగా పోలీసు కస్టడీకి పంపాలంటూ ఆదేశించిన ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బీసీఐ.. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు బార్‌ అండ్‌ బెంచ్‌ పేర్కొంది. ఆ యువ న్యాయవాది చేతులు జోడించి సారీ.. క్షమించాలంటూ వేడుకుంటుండగా.. న్యాయమూర్తి ఆగ్రహంతో పోలీసులను చర్య తీసుకోవాలని ఆదేశిస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది.. ఆ కస్టడీ ఉత్తర్వు అమలులోకి రాకముందే బార్ అసోసియేషన్ జోక్యంతో దానిని ఉపసంహరించుకున్నారు.

    ఇది యువ న్యాయవాదులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అన్నారు. చివరికి బార్ అసోసియేషన్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

     

     

  • వైఎస్ఆర్(కడప)జిల్లా : ఒంటిమిట్ట మండలంలో ఓ దినపత్రిక (సాక్షి కాదు) విలేకరి రవిబాబు(పుచ్చకాయల వ్యాపారి) నాలుకను ఓ మహిళ కొరికి వేసిన సంఘటన ఒంటిమిట్ట హరిత హోటల్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులు విచారణ చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే వివరాలు ఏమీ వెల్లడించలేదు. స్థానికుల సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. 

    కర్బూజ కాయల వ్యాపార క్రమంలో విలేకరి, ఆటో యజమానిలకు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. విలేకరి రవి, ఆటో యజమాని ఒకరు ఆ మహిళతో కలిసి హరిత హోటల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా, గది అద్దె తీసుకోకుండానే అక్రమంగా ప్రవేశించడానికి వీల్లేదని హరిత హోటల్‌ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే విలేకరి పరపతితో ఎట్టకేలకు గదిలోకి ముగ్గురు వెళ్లారు. ముగ్గురూ మద్యం తాగారు. ఈ క్రమంలో శృంగార కార్యక్రమం నేపథ్యంలో విలేకరి నాలుకను మహిళ కొరికివేసింది. అయితే ఆ మహిళ ఇద్దరి చేతిలో జరుగుతున్న అఘాయత్యం నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా కొరికి వేసిందా, కామక్రోధంతోనా అనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. 

    ఆ ప్రాంతం కొంత రక్తమయం అయింది. తీవ్ర భయాందోళనకు గురైన రవి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అక్కడికి వైద్యులు 108 ద్వారా కడప రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఆటో డ్రైవర్‌ హరి ఆ తర్వాత మహిళతో శృంగారం పూర్తి అయిన తర్వాత ఆమెను ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టారు. ఇక ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఒంటిమిట్టలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆటో డ్రైవర్‌ హరిని అదుపులో తీసుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఆటో డ్రైవరు హరి సంఘటన తర్వాత ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌లో విడిచిపెట్టిన మహిళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలియాల్సి ఉంది.

    వరుస వివాదాల్లో హరిత హోటల్‌
    ఒంటిమిట్ట హరిత హోటల్‌ వరుస వివాదాలయమంగా మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలోని హరిత హోటల్‌ భక్తులు, యాత్రీకులు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తే, ఆ క్రమం ఇప్పుడు దారి తప్పింది. వరుస ఘటనలతో రచ్చకెక్కుతోంది. గత ఏడాది అధికార పారీ్టకి చెందిన కొందరు అక్రమ మట్టి తవ్వకాల కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకున్న సంగతి తెలిసిందే. మందుబాబులకు నిలయంగా మారిన క్రమంలో మద్యం మత్తులో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాగే హరిత హోటల్‌లో పని చేస్తున్న దళిత యువకుడిపై, హోటల్‌ పక్కన కొంత మంది అగ్రవర్ణాలకు చెందిన యువకులు దాడి చేసిన సంగతి విదితమే.

    డివిజనల్‌ మేనేజరు ఏమంటున్నారంటే..
    ఇన్‌చార్జి మేనేజరు రాజశేఖర్‌రెడ్డిని జరిగిన సంఘటనపై డివిజనల్‌ మేనేజరు మల్లికార్జున గౌడ్‌ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజరుకు మోమో ఇచ్చామన్నారు. సిబ్బంది పాత్రపై ఆరా తీశామన్నారు. విచారణలో అలాంటిది ఏమీ లేదన్నారు. స్థానికంగా ఉన్న వారిని దరిచేయనీయవద్దని హెచ్చరించారు. 

  • సాక్షి,విజయవాడ: పచ్చపార్టీ కుట్రలు విఫలమయ్యాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. జావా డిస్కవర్ ఛానల్‌లో తప్పుడు కథనాలు ప్రసారమయ్యాయి. ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ డాక్యుమెంటరీని మార్చి, వక్రీకరించి జావా డిస్కవరీ ప్రసారం చేసింది.

    2021లో ‘బ్లడ్‌ శాండర్స్‌’ పేరుతో ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది. అయితే తాను చెప్పని, పుస్తకంలో లేని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థపై లీగల్‌ చర్యలు తీసుకుంటానని ఆయన ట్వీట్‌ చేశారు.

    ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ డాక్యుమెంటరీ వెనుక ఎల్లో బ్యాచ్‌ ఉన్నట్లు బయటపడింది. అసలు రచయితే డాక్యుమెంటరీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీడీపీ కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

    YS జగన్ పై తప్పుడు కథనం జావా డిస్కవరీకు లీగల్ నోటీసులు?

     

     

  • సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు.‌ మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్‌ మండిపడ్డారు.

    రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది..‌ చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ  చింతా  మోహన్‌ ధ్వజమెత్తారు.

International

  • ప్రస్తుతం ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్‌ఫైర్‌ ‍అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్‌ కామికేజ్‌ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్‌ హెగ్సెత్‌ స్పందించారు.

    ప్రస్తుతం హర్ముజ్‌ జలసంధి విషయంలో ఇరాన్‌- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్‌ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్‌  అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్‌ నౌకశ్రయాలను బ్లాకేడ్‌ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్‌స్ట్రీట్‌ జనరల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారింది.

    ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్‌లను వాడడం పూర్తిగా అవాస్తవం  ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను  ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.

    ఇరాన్  వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా

    ఇరాన్‌ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్‌లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

    అమెరికా  
    అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్‌లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి  బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

    డాల్ఫిన్ల ప్రత్యేకత

    సైనిక అవసరాల కోసం డాల్ఫిన్‌లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్‌ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్‌సైట్ పేర్కొంది.

    కామికేజ్ అనే పేరు

    సాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను  అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్‌మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి.

  • దక్షిణాఫ్రికాలోని కోమటి నది (Komati River) తీరాన వరద నీటిలో కొట్టుకుపోయిన  59 ఏళ్ల వ్యాపారవేత్త ఆచూకీ కోసం వెతుకుతుండగా వెలుగులోకి వచ్చిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. అనూహ్యమైన, అత్యంత భయంకరమైన విషాదం వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలో మొసళ్లు ఎక్కువగా ఉండే నది తీరాన  విషాదం చోటు చేసుకుంది.

    అసలేం జరిగింది?
    ఒక వ్యాపారవేత్త తన కారుతో లోతట్టు వంతెన దాటుతుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఆయన నీటిలో కొట్టుకు పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారు ఖాళీగా ఉంది. పోలీసులు కోమటి నది ప్రాంతంలో గాలిస్తూనే ఉన్నారు, తమకు ఏమి దొరుకుతుందో లేదా అసలు ఏమైనా దొరుకుతుందో లేదో కూడా  తెలియని అయోమయం నెలకొంది.

    కోమటి నది ఏదో మామూలు నది కాదు, స్థానికులు  చాలా ప్రమాదకరమైనదిగా భావించే నది. అత్యంత భయంకరమైన ఆ జలాల్లోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ ద్వారా దించారు.  డ్రోన్‌లను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. మొదట అంతా మామూలు గానే కనిపించింది.  కానీ  తనిఖీల సమయంలోనదిలోని ఒక చిన్న ద్వీపం దృష్టిని ఆకర్షించింది. ఆ పరిశీలనే ఆపరేషన్ దిశను పూర్తిగా మార్చేసింది.  

    fy"> 
    అనుమానం తెప్పించిన మొసలి ప్రవర్తన
    గాలింపు సమయంలో నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై కొన్ని మొసళ్లు ఎండకు కాచుకుంటూ కనిపించాయి. అయితే, అక్కడ ఉన్న ఒక 4.5 మీటర్ల పొడవు, సుమారు 500 కిలోల బరువున్న భారీ మొసలి మాత్రం వింతగా ప్రవర్తించింది. హెలికాప్టర్ల శబ్దం వస్తున్నా అది కదలలేదు. సాధారణంగా భారీ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మొసళ్లు నిశ్చలంగా ఉంటాయని గుర్తించిన అధికారులు, ఆ మొసలిని చంపి పరీక్షల కోసం క్రూగర్ నేషనల్ పార్క్‌కు తరలించారు.

    భయంకరమైన నిజాలు
    మొసలి కడుపును కోసి చూడగా అధికారులకు గుండె ఆగిపోయే దృశ్యాలు కనిపించాయి మొసలి ప్రేవులలో మానవ అవశేషాలు లభించాయి.  ఆ అవశేషాలు గతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల గాబ్రియేల్ బాటిస్టావిగా అనుమానిస్తున్నారు.

    అంతేకాదు మొసలి కడుపులో 6 రకాల వేర్వేరు బూట్లు లభించాయి. అయితే మొసళ్లు ఏది పడితే అది మింగుతాయి కాబట్టి, ఇతర బాధితులు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.కానీ గతంలో కూడా  ఆ మొసలికి గతంలో కూడా బాధితులు ఉన్నారేమోనన్న ఆందోళన తలెత్తుతోంది.

    ప్రాణాలకు తెగించి డేంజరస్‌ రెస్క్యూ ఆపరేషన్
    ఈ ఆపరేషన్‌లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం కెప్టెన్ జోహన్ పాట్‌గీటర్ చేసిన రెస్క్యూ. మొసళ్లు నిండి ఉన్న ఆ ప్రమాదకర నదిలోకి హెలికాప్టర్ నుండి ఆయన కిందకు దిగారు. మొసలి అప్పటికే చనిపోయి నప్పటికీ, ఆ నది ప్రవాహం, చుట్టుపక్కల ఉన్న ఇతర మొసళ్ల వల్ల, ఎంతో ఒత్తిడి మధ్య అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా అవి ఎవరివో నిర్ధారిస్తారు. అయితే, నిపుణులు తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, అనేక బూట్లు లభించడం ఆందోళనకు తావిచ్చింది. దొరికిన అదనపు బూట్ల ఆధారంగా, ఈ మొసలికి గతంలో మరేవైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నది ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన అధికారులను సౌత్ ఆఫ్రికా పోలీస్ చీఫ్ అభినందించారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలను మిగిల్చింది.

    ఇదీ చదవండి: టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్‌ వ్యాఖ్యలు

Family

  • నా భర్త ఇటీవలే ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం పొందారు. కుటుంబ కారణాల వల్ల నేను ఇక్కడే నా కూతురిని చదివించుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము.  సమస్య ఏంటంటే ఇప్పుడు మా ఆయన భారత పాస్‌పోర్టు తిరిగి ఇచ్చేసి ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవగా ముందు సెక్షన్‌ 8 కింద పౌరసత్వాన్ని రినన్సియేట్‌ (తిరిగి వదిలేయటం) చేయాలని చెప్తున్నారు. మరోదేశం పౌరసత్వం తీసుకున్నాక భారత పౌరసత్వం రద్దవదా? భారత ప్రభుత్వ వెబ్సైట్లో సెక్షన్‌ 8 ప్రక్రియ చేస్తే గనక ఆ పౌరుని సంతానానికి కూడా భారతీయ పౌరసత్వం పోతుందని చదివాను. నా కూతురికి పౌరసత్వం పోతే ఇబ్బంది అవ్వచ్చు. మా ఆయన ఓసీఐ పొందాలంటే వారు చెప్పినట్టు సెక్షన్‌ 8 ప్రకారం పౌరసత్వం వదిలేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనా?
    – మనోజ్ఞ, చిత్తూరు

    భారత పౌరసత్వం చట్టం 1955లోని సెక్షన్‌ 9(1) ప్రకారం, మీరు ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం పొందిన రోజునుంచే మీ భారత పౌరసత్వం దానంతట అదే రద్దవుతుంది. దీనికి ఎటువంటి ప్రత్యేక ప్రకటన లేదా అనుమతి అవసరం లేదు. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్‌ 8 (రినన్సియేషన్‌) ప్రక్రియ మీకు వర్తించదు, అవసరం లేదు. 

    ఇప్పటికీ భారత పౌరుడిగా ఉన్న వ్యక్తి స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని వదులుకునే సందర్భంలో మాత్రమే సెక్షన్‌ 8 ఉపయోగించబడుతుంది. మీలాగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే అసలు ఆ ప్రక్రియ – సందర్భం రెండూ అప్రస్తుతం. పౌరసత్వ చట్టం లేదా పాస్‌పోర్టు నిబంధనల ప్రకారం, సెక్షన్‌ 9 కింద పౌరసత్వం రదై్దన సందర్భంలో సెక్షన్‌ 8 తప్పనిసరి అని ఎక్కడా లేదు.

    సరైన విధానం ఏమిటంటే...
    (జీ) భారత పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయడం,
    (జీజీ) సరండర్‌ ధ్రువీకరణ పత్రం ΄పొందడం,
    (జీజీజీ) ఓసీఐ కోసం దరఖాస్తు చేయడం. 

    ఇకపోతే, మీరు భయపడుతున్నట్లు సెక్షన్‌ 8 ప్రక్రియ చేస్తే మీ కూతురి భారతీయ పౌరసత్వం పోయే ప్రమాదం లేకపోలేదు. అలా చేయాల్సిందే అని ఎవరైనా అంటే, ఫ్రాసెస్‌లోని భారతీయ ఎంబసీ ను సంప్రదించండి. వారు కూడా అలాగే అంటే, మీ భర్తను భారతదేశానికి వచ్చి ఇక్కడ ఓసీఐ కోసం దరఖాస్తు చేయమని చెప్పండి. ఇతర దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు ఎవరూ ఇప్పటివరకూ సెక్షన్‌ 8 ప్రక్రియ చేయమని అడిగిన దాఖలాలు లేవు. 

    పైగా అలా చెయ్యొద్దు అన్న సూచనలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఉన్నాయి. పైన సూచించిన విధంగా పాస్‌పోర్ట్‌ సరెండర్‌ ప్రక్రియను కొనసాగించమని ఫ్రాన్స్‌లోని రాయబారి కార్యాలయానికి అధికారికంగా తెలియజేయండి. ఏదైనా సమస్య వస్తే, విదేశాంగ శాఖకు ఫిర్యాదు/దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. లేకుంటే హై కోర్టులో వ్యాజ్యం వేసే అవకాశం మీకు ఉంది.
    శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    (మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు.  )

    (చదవండి: సంగీతానికి వయసుతో పనిలేదు..! వాహ్వా అనిపించుకున్న రిటైర్డ్‌ టీచర్‌)

  • కలలను నెరవేర్చుకోవడానికి వయసు పరిమితి లేదు. జీవితంలో ఏ దశలోనైనా వాటిని సాకారం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్‌ టీచర్‌ తన గాన ప్రస్థానాన్ని లేటుగా ప్రారంభించినా ‘వాహ్వా’ అనిపిస్తున్నారు.

    తాజా విషయానికి వస్తే...
    రవీంద్రనాథ్‌ బిస్వాస్‌ ట్రెండింగ్‌లో ఉన్న ‘ఖత్‌’ అనే పాట పాడి వాహ్వా అనిపిస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది.

    ఈ వీడియో క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉన్నా అదేమీ ఆయన గాన ప్రతిభకు అడ్డుగోడ కాలేదు. విశేషం ఏమిటంటే, ఈ రీల్‌ సోషల్‌ మీడియా ప్రేక్షకులనే కాదు సంగీతపరిశ్రమ దృష్టిని కూడా ఆకర్షించింది.నవజోత్‌ అహుజా ఆనంద బాష్పాలతో కూడిన ఇమోజీతో స్పందించారు.

    ‘దాదూ, ఆప్‌తో ఛా గయే’ (తాతా మీరు అదరగొట్టేశారు) అని జియోసావన్‌ స్పందించింది. ‘అంకుల్, మాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం’ అన్నది అమెజాన్‌ మ్యూజిక్‌ ఇండియా. ‘ప్రతిభ విషయానికి వస్తే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే’. ‘ఈ వయసులోనే వీరి గాత్రం ఇలా ఉందంటే... యవ్వనంలో ఇంకా ఎంత బాగుండేదో’... ఇలాంటి కామెంట్స్‌ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. 

     

    (చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)

  • ఫ్రెండ్స్, చాలామంది పిల్లలలాగే మీకూ మ్యాథ్స్‌ అంటే భయమా? అయితే ఈ వేసవి సెలవులు మీకు గుర్తుండిపోతాయి. మీరు ‘ఊ’ అనాలేగానీ ఆ భయాన్ని పోగొట్టడం వెరీ వీజీ. మీలోని ఆ భయం పారిపోతే మ్యాథ్స్‌ అంటే  మీకు ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. ప్రామిస్‌...

    మీకు టింకు గురించి ఒక విషయం చెప్పాలి. మనం హారర్‌ సినిమాలు చూసినప్పుడు కాస్తో కూస్తో భయపడతాము కదా...అయితే మన ఫ్రెండ్‌ టింకు మాత్రం కొం...చెం కూడా భయపడడు. ‘ఆ హారర్‌ సినిమా చూసి పెద్దవాళ్లే భయపడ్డారు. నువ్వేమిటీ కొంచెం కూడా భయపడలేదు!’ అని అడిగితే...‘నేను మ్యాథ్స్‌కు తప్ప దేనికీ భయపడను’ అన్నాడట. టింకు జవాబుకు మనం నవ్వుకున్నా... మ్యాథ్స్‌ అనేది చాలామంది పిల్లలకు సీరియస్‌ ప్రాబ్లం. మీకు కథలు వినడం, చదవడం చాలా ఇష్టం కదా! మరి కథలు అనేవి టైమ్‌పాస్‌ కోసమే కాదు కదా....మన జీవితంలో ఎన్నో సమస్యలు, వాటి పరిష్కారాలు కథలలో ఉంటాయి. అందుకే మ్యాథ్స్‌ను కథలతో పోలుస్తారు.

    గణిత కథలు
    మ్యాథ్స్‌ అంటే బోలెడు భయం ఉన్న పిల్లల్లో ఆ భయాన్ని పోగొట్టడానికి బెంగళూరులోని దిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌ గణిత విభాగం ‘మ్యాథ్స్‌ స్టోరీస్‌ రైటింగ్‌’ పేరుతో కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సూపర్‌గా సక్సెస్‌ అయింది. ఎప్పుడూ చురుగ్గా, హుషారుగా ఉండే అమిత్‌ మ్యాథ్స్‌ క్లాస్‌లో మాత్రం సైలెంటై΄ోతాడు. రాక్షసుడు ఉన్న గుహలో కూర్చున్నట్లు భయం భయంగా కనిపిస్తాడు. అయితే ‘కథలతో గణితం’ ప్రయోగం అమిత్‌లో ఎంతో మార్పు తెచ్చింది.

    ‘సంకలనాలు అంటే ఏమిటి?’
    ‘సంఖ్యలకు ఎందుకు అంతం లేదు?’‘ఆకారాలకు(షేప్స్‌) నిర్దిష్టమైన పేర్లు ఎందుకు పెట్టారు?’... ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు అడుగుతున్నాడు అమిత్‌. అంతేకాదు చిన్న చిన్న బొమ్మలు గీయడం, పదవినోదాలను సరైన వాక్యాలతో పూర్తి చేయడం ద్వారా మెల్లగా మ్యాథ్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్డాడు.

    కాన్సెప్ట్‌లే కథలుగా....
    దిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌ స్కూల్‌ ఇన్‌–హౌజ్‌ పబ్లికేషన్‌ ‘అసైన్‌మెంట్‌ బుక్‌లెట్‌’లో స్టూడెంట్స్‌ కోసం మ్యాథ్స్‌ స్టోరీస్‌ ఉంటాయి. మ్యాథ్స్‌ కాన్సెప్ట్‌ను ఉపయోగించి కథ రాయాల్సిందిగా పిల్లలకు చెబుతుంటారు. గణిత కథల ద్వారా చాలామంది విద్యార్థులలో మార్పు వచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఇవ్వగానే భయపడ కుండా నింపాదిగా ఆలోచిస్తున్నారు. మ్యాథ్స్‌ ప్రాబ్లమ్‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారు. 

    ఉదాహరణకు...వైశాల్యం ఆధారిత సమస్యలను (ఏరియా–బేస్డ్‌ ప్రాబ్లమ్స్‌) పరిష్కరించాల్సి వస్తే చిన్న చిన్న బొమ్మలు గీస్తారు. వాటిని కథలలోని క్యారెక్టర్‌లుగా ఊహించుకుంటారు. నిజజీవిత పరిస్థితులకు అన్వయించుకుంటూ వాటిని సాల్వ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. టి.వి. పద్మ ‘మ్యాథెమా‘ట్విస్ట్‌’: నంబర్‌ టేల్స్‌ ఫ్రమ్‌ అరౌండ్‌ ది వరల్డ్‌’, అర్చన శరత్‌ ‘టేల్స్‌ ఫ్రమ్‌ ది హిస్టరీ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌’... కథలతో మ్యాథ్స్‌ను ఆసక్తికరంగా పరిచయం చేసే పుస్తకాలు.

    భాంజు... ట్రబుల్‌ షూటర్‌
    మ్యాథ్స్‌ యాంగ్జయిటీ అనేది ఎంతోమంది పిల్లలు ఎదుర్కొంటున్న సమస్య. ఆ ఆందోళనను పిల్లల నుంచి దూరం చేయడానికి తన ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ‘భాంజు’తో శ్రీకారం చుట్టారు నీలకంఠ భానుప్రకాష్‌. పాత రికార్డ్‌లు బద్దలు కొట్టి కొత్త రికార్డ్‌లు సృష్టించడం ఆయన ఘనత. ‘గణితం కొందరి కోసం కాదు అందరి కోసం’ అనే లక్ష్యంతో నీలకంఠ ప్రారంభించిన ‘భాంజు’ గణిత అభ్యాస వేదిక. ఇంటరాక్టివ్‌ టీచింగ్, పజిల్స్, మెంటల్‌ కాలిక్యులేషన్‌ టెక్నిక్స్‌... మొదలైన వాటి ద్వారా సరదా సరదాగా మ్యాథ్స్‌ నేర్చుకోవడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ‘భాంజు’ ఉపయోగపడుతుంది. ‘భాంజు’కు సంబంధించి...

    లైవ్‌ ఆన్‌లైన్‌ క్లాసులు: కథలు, రియల్‌లైఫ్‌ ఎగ్జాంపుల్స్, చాలెంజెస్, ఆటల ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా గణిత పాఠాలు చెబుతారు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. భాంజు బడ్డీ: ఇన్‌స్టంట్‌ ఎక్స్‌ప్లనేషన్స్, రియల్‌–టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఏర్పాటైన 24/7 ఏఐ–పవర్డ్‌ అసిస్టెంట్‌. భాంజు ప్లే యాప్‌: గేమిఫైడ్‌ డైలీ ప్రాక్టిస్, పోటీలు, లీడర్‌ బోర్డులు, కాయిన్స్‌ అండ్‌ రివార్స్‌ కోసం. పేరెంట్‌ యాప్‌: షెడ్యూల్స్, టీచర్‌ ఫీడ్‌బ్యాక్, కాంగ్రెస్‌ను మానిటరింగ్‌ చేస్తుంది.

    సరదా సరదాగా...
    బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలిక రీమ అయిదు సంవత్సరాల వయసులో తండ్రి ద్వారా ఒకటి నుంచి ఇరవై వరకు లెక్కించడం నేర్చుకుంది. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయికి అంకెలే లోకం అయ్యాయి. తమ పెరటితోటలో వికసించే పువ్వుల సంఖ్య, ఆ పువ్వుల దగ్గరకు వచ్చే సీతాకోక చిలుకల సంఖ్య, కిందపడిన రొట్టెముక్కల చుట్టూ పాకే చీమల సంఖ్య... మొదలైనవి రోజూ లెక్కించేది. కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘ఇప్పటి వరకు 50 కిలోమీటర్‌ల దూరం వచ్చాం. 

    ఇంకా ఎన్ని కిలోమీటర్‌లు ప్రయాణం చేస్తే మనం చేరాల్సిన ఊరుకు చేరుతాం’ లాంటి ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచేది. మీకు చెప్పేదేమిటంటే... మ్యాథ్స్‌ను సీరియస్‌గా కాదు, సరదా సరదాగా నేర్చుకోవాలి. మ్యాథ్స్‌ కాన్సెప్ట్‌లు బాగా గుర్తుండి పోవాలంటే... రీమలాగే మీరు కూడా ఎక్కడో ఒకచోట కూడికలు, తీసివేతలు, గుణకారాలు... మొదలైన వాటిని ఉపయోగిస్తుండాలి. 
    – యాకూబ్‌

    (చదవండి: వేసవి సెలవులను ఇలా వినియోగించుకుందామా..!)

  • ట్రాప్‌ స్టోరీకి టాప్‌ ప్రైజ్‌ భారతీయ మహిళా జర్నలిస్టు 2026 పులిట్జర్‌ ప్రైజ్‌ విజేతగా నిలిచారు. గుర్‌గ్రామ్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ సుపర్ణా శర్మ తన గ్రాఫిక్‌ నవల ‘ట్రాప్డ్‌’తో  ఈ ఘనత సాధించారు. భారత్‌లో చోటు చేసుకుంటున్న ‘డిజిటల్‌ అరెస్ట్‌’లపై ప్రఖ్యాత అమెరికన్‌ మీడియా బ్లూమ్‌బర్గ్‌ కోసం తయారు చేసిన ‘ట్రాప్డ్‌’ గ్రాఫిక్‌ స్టోరీ పులిట్జర్‌ కమిటీని మెప్పించడంతో సుపర్ణా శర్మ పేరు భారత జర్నలిజంలో మార్మోగుతోంది.

    ఒక మహిళా డాక్టర్‌కు డిజిటల్‌ స్కామ్‌స్టర్స్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. ‘మీ పేరు మీద అకౌంట్స్‌ చాలా ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్‌లో ఫ్రాడ్‌ జరుగుతోంది. మిమ్మల్ని

    డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’...
    ఆమె భయభ్రాంతం అవుతుంది. సీట్‌లో నుంచి కదలడానికి కూడా వీల్లేదు. అధికారులు స్క్రీన్‌ మీద కనపడుతుంటారు. ఆమె ఫోన్‌ మోగితే ఎత్తాలో కూడదో చెప్తుంటారు. స్క్రీన్‌ మీదే కోర్టు వస్తుంది. ఆ తర్వాత సి.బి.ఐ. ఆఫీసర్లు మాట్లాడతారు. ఆమె శిక్ష నుంచి తప్పించుకోవడానికి డబ్బు డి΄ాజిట్‌ చేయాల్సి వస్తుంది. నిరంతరం ఫోన్లు. క్షోభ. భయం. భీతి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు... పది రోజుల నరకం తర్వాత ఆమె ΄ోలీసుల దగ్గరకు వెళితే అది ఫ్రాడ్‌ కాల్‌ అని అర్థం అవుతుంది. 

    దేశంలో ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఉదంతాన్ని కళ్లకు కట్టినట్టుగా మాటలతో బొమ్మలతో చూపిన గ్రాఫిక్‌ స్టోరీ ‘ట్రాప్డ్‌’కే ఇప్పుడు పులిట్జర్‌ ప్రైజ్‌ అవార్డ్‌ వచ్చింది. దీనికి పని చేసిన జర్నలిస్టు సుపర్ణా శర్మ, బొమ్మలు వేసిన చిత్రకారుడు ఆనంద్‌ ఆర్‌.కె. ఈ అవార్డును ఉమ్మడిగా పొందారు.

    న్యూరాలజిస్ట్‌ ‘ట్రాప్‌’ 
    మన దేశంలో జరుగుతున్న డిజిటల్‌ మోసాలపై సుపర్ణా శర్మ సిద్ధం చేసిన 'trAPPed' { గ్రాఫిక్‌ స్టోరీలో టైటిల్‌లో 'APP' అక్షరాలను హైలైట్‌ చేసి అనేక యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు అమాయకులను ఎలా మోసం చేస్తున్నారో హెచ్చరించారు. ఒక మహిళా న్యూరాలజిస్ట్‌కు కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆమెను డిజిటల్‌ అరెస్ట్‌ చేశామని భయభ్రాంతం చేసి డబ్బు లాగేసిన వైనాన్ని అమెరికా మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ వీక్‌ కోసం సుపర్ణా శర్మ గ్రాఫిక్‌ స్టోరీగా మలిచారు. ఇందుకు బొమ్మలను జర్నలిస్టు–ఇలస్ట్రేటర్‌ అయిన ఆనంద్‌ ఆర్‌.కె. సమకూర్చారు. 

    కాబట్టి పులిట్జర్‌ ప్రైౖ జ్‌ సుపర్ణా శర్మ, ఆనంద్‌ ఆర్‌.కె.కి దక్కింది. ప్రైజ్‌లో భాగమైన 15,000 డాలర్లు ఇద్దరికీ సమంగా చెందుతాయి. బ్లూమ్‌బర్గ్‌ జర్నలిస్ట్‌ నటాలీ ఓబికో పియర్సన్‌  ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా పనిచేశారు. డిజిటల్‌ మోసాలతో పెరుగుతున్న ప్రపంచ సవాళ్లను బొమ్మలు, మాటల మేళవింపుతో ఈ గ్రాఫిక్‌ స్టోరీ హైలైట్‌ చేస్తుందని పులిట్జర్‌ కమిటీ పేర్కొంది.  పులిట్జర్‌ విజేతల ఫొటోలను కొలింబియా యూనివర్సిటీలో పెట్టి గౌరవించడం ఆనవాయితీ.

    ఎవరు సుపర్ణా శర్మ?
    సుపర్ణా శర్మ గత రెండు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. ‘ది ఏషియన్‌  ఏజ్‌’ ఢిల్లీ, కోల్‌కతా, లండన్‌  ఎడిషన్లకు ‘రెసిడెంట్‌ ఎడిటర్‌’గా, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో సీనియర్‌ పొజిషన్లలో పని చేశారు. ప్రస్తుతం రోలింగ్‌ స్టోన్‌  ఇండియా, అల్‌ జజీరా, బ్లూమ్‌బర్గ్‌ బిజినెస్‌ వీక్‌లకు కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు. 

    బాలీవుడ్‌లో పెయిడ్‌ రివ్యూ మాఫియాపై, చైల్డ్‌ కిడ్నాపింగ్‌ రాకెట్లపై ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్లు జర్నలిజం వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆర్ట్స్, కల్చర్‌ బీట్‌లో ఉంటూనే, వ్యవస్థలోని లో΄ాలను ఎత్తి చూపడంలో సుపర్ణాశర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ విధానాలపై, న్యూఢిల్లీలో రైతుల నిరసన ఉద్యమంపై ఆమె విమర్శనాత్మక కథనాలు రాశారు. ‘మీటూ’ ఉద్యమ సమయంలో తన వృత్తిలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా బయటపెట్టారు.        

    ఆనంద్‌ ‘గీత’...
    గ్రాఫిక్‌ స్టోరీకి బొమ్మలే జీవం. సుపర్ణా శర్మ రూపొందించిన  trAPPed' M కథనంలో  పోలీసుల వేషంలో వచ్చి సామాన్యులను బెదిరించి డబ్బు లాగేసే ముఠాల మోసాలను కళ్లకు కట్టినట్టు చూపించడం లో ఇలస్ట్రేటర్‌ ఆనంద్‌ ఆర్‌.కె. కీలక పాత్ర పోషించారు. సుపర్ణా శర్మతోపాటు పులిట్జర్‌ గెలిచిన ఆనంద్‌ ఆర్‌.కె. ముంబైకి చెందినవారు. 2011 లో సర్‌ జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ నుంచి పట్టభద్రుడైన ఆనంద్, 2021లో ‘బ్లూ ఇన్‌ గ్రీన్‌’  గ్రాఫిక్‌ నవలకు గాను కలరిస్ట్‌ జాన్‌ పియర్సన్‌తో కలిసి ప్రతిష్టాత్మక ‘ఐస్‌నర్‌ అవార్డు’ను బెస్ట్‌ పెయింటర్‌/మల్టీమీడియా ఆర్టిస్ట్‌ విభాగంలో గెలుచుకున్నారు. Grafity's Wall', 'Radio Apocalypse', 'Resurrection Man' వంటి ఇంటర్నేషనల్‌ గ్రాఫిక్‌ బుక్స్‌ను తన ఖాతాలో కలిగి ఉండటంతో పాటు హ్యుందాయ్, ఇండియన్‌ నేవీ వంటి సంస్థలకు కూడా ఆయన విజువల్స్‌ అందించారు. 'trAPPed'  స్టోరీకి ఆనంద్‌ అందించిన విజువల్సే పులిట్జర్‌ కమిటీని ఆకట్టుకున్నాయి. 

  • వేసవి సెలవులు అంటే పిల్లలు సరదాగా గడుపుతూ, సేదతీరుతూ కొత్త విషయాలను అన్వేషించడానికి ఉద్దేశించిన సమయం. వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కాలం ఇదే, ఎందుకంటే ఇది వారికి వారి దైనందిన జీవితం నుండి ఒక విరామాన్ని అందిస్తుంది.

    ఉత్సాహంగా మొదలైనది త్వరలోనే అంతులేని స్క్రీన్ సమయంగా, చంచలమైన శక్తిగా, మరియు పిల్లలను అర్థవంతంగా నిమగ్నంగా ఉంచడానికి చేసే రోజువారీ పోరాటంగా మారిపోతుంది. కానీ వేసవిని నిర్వహించాల్సిన విషయంగా కాకుండా, గరిష్టంగా సద్వినియోగం చేసుకునే విషయంగా మారితే ఎలా ఉంటుంది?

    ప్రేమియా అకాడమీలో, 'రైజ్' (RAISE) అనే విధానమే మా మార్గదర్శక సూత్రం. ఇది పిల్లలు సృజనాత్మకతను పునఃసృష్టించుకోవడం, కొత్త నైపుణ్యాలను సంపాదించడం, అర్థవంతంగా ఇతరులతో మమేకమవడం, సామాజిక-భావోద్వేగ ఎదుగుదలను బలోపేతం చేసుకోవడం, మరియు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడం వంటి అంశాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఈ దృక్పథంతో, వేసవి సెలవులు కేవలం విరామ సమయంగా కాకుండా, ఎదుగుదలకు ఒక అవకాశంగా మారతాయి.

    సృజనాత్మకతను పునఃసృష్టించండి (భావవ్యక్తీకరణను వెలికితీయండి)
    చాలా సందర్భాలలో, పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో మమేకమవ్వడంలో సృజనాత్మకత అనేది వారు వేసే మొదటి అడుగు. వేసవి సెలవుల్లో వారిని పరిసరాలతో స్వేచ్ఛగా మమేకమవ్వనివ్వడం వల్ల, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి అవసరమైన సృజనాత్మక సామర్థ్యాలను కనుగొనే అవకాశం లభిస్తుంది.

    సృజనాత్మకత వెల్లివిరిసే వాతావరణాన్ని సృష్టించండి:
    పెయింటింగ్, స్కెచింగ్, లేదా DIY క్రాఫ్ట్స్
    కథలు చెప్పే సెషన్‌లు లేదా కామిక్ సృష్టి
    రీసైకిల్ మెటీరియల్స్ ఉపయోగించి బిల్డింగ్ మోడల్స్

    చిన్న వయసులోనే సృజనాత్మకతను పెంపొందించుకుంటే అది ఎంత శక్తివంతంగా ఉంటుందో గుర్తుచేసే అవకాశాన్ని 'తారే జమీన్ పర్' వంటి సినిమాలు సైతం వదులుకోవు. లక్ష్యం పరిపూర్ణత కాదు, భావవ్యక్తీకరణ.

    నూతన యుగ నైపుణ్యాలను పొందండి (భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే అభ్యాసం)

    సమకాలీన ప్రపంచంలో వేగంగా జరుగుతున్న పురోగతితో, విద్య తరగతి గది నాలుగు గోడలు మరియు పాఠ్యపుస్తకాల పరిధిని దాటి చాలా ముందుకు సాగింది. వేసవి సెలవులు పిల్లలకు ఒత్తిడి లేని వాతావరణంలో అత్యాధునిక నైపుణ్యాలను సంపాదించడానికి అనువైన వేదికను అందిస్తాయి, ఇక్కడ నేర్చుకోవడం విసుగు పుట్టించేలా కాకుండా సరదాగా ఉంటుంది.

    వారికి ఇవి పరిచయం చేయండి:
    ప్రాథమిక కోడింగ్ (స్క్రాచ్, ప్రారంభకులకు అనుకూలమైన ప్లాట్‌ఫారమ్‌లు)
    రోబోటిక్స్ కిట్లు మరియు సాధారణ ఎలక్ట్రానిక్స్
    డిజిటల్ ఆర్ట్, యానిమేషన్ లేదా వీడియో క్రియేషన్
    పిల్లల కోసం రూపొందించిన AI-ఆధారిత సృజనాత్మక సాధనాలు
    ఈ కార్యకలాపాలు సమస్య పరిష్కారం, తార్కిక ఆలోచన మరియు అనుకూలత వంటి నైపుణ్యాలను పెంపొందిస్తాయి, ఎందుకంటే నేటి ప్రపంచంలో నిజంగా ముఖ్యమైన నైపుణ్యాలు ఇవే.

    పరస్పర చర్య, ఆట ద్వారా నేర్చుకోవడం (సామాజిక జ్ఞానాత్మక ఎదుగుదల)
    నేర్చుకోవడం అనేది కేవలం బోధన ద్వారానే కాకుండా, భాగస్వామ్యం, పరస్పర చర్య మరియు ప్రతిస్పందన ద్వారా కూడా జరుగుతుంది. ఆట అనే భావన ఆలోచన, సంభాషణ మరియు సహకారానికి ఒక పరిపూర్ణమైన వాతావరణాన్ని అందిస్తుంది; నిజానికి, పిల్లలు నేర్చుకోవడానికి ఆట అనేది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.

    వినోదాన్ని, ఆలోచనను మిళితం చేసే కార్యకలాపాలను ప్రోత్సహించండి
    వ్యూహం ఆధారిత బోర్డు ఆటలు
    పజిల్ పరిష్కరించే సవాళ్లు
    రోల్ ప్లే లేదా గ్రూప్ స్టోరీ టెల్లింగ్
    మోనోపోలీ, చదరంగం ఆటలు ప్రణాళిక, సహనం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రోత్సహించి, మెరుగుపరుస్తాయి.

    రోజువారీ కార్యకలాపాల ద్వారా జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోండి
    పిల్లలు చేసే ప్రతీదీ నియమబద్ధంగా, పద్ధతిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన విషయాలు రోజూ చేసే సాధారణ పనుల ద్వారానే నేర్పబడతాయి. అటువంటి పనులు వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు నిత్యకృత్యాల నుండే అత్యంత విలువైన పాఠాలు లభిస్తాయి.

    పిల్లలను ఇందులో చేర్చండి:
    సాధారణ భోజనం వండటం (ఓర్పును, స్వాతంత్ర్యాన్ని నేర్పుతుంది)
    తోటపని (బాధ్యతను మరియు ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందిస్తుంది)
    వారి స్థలాన్ని నిర్వహించడం లేదా చిన్న కార్యకలాపాలను ప్లాన్ చేయడం
    ఈ క్షణాలు నిశ్శబ్దంగా ఆత్మవిశ్వాసాన్ని, స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తాయి.
    మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించండి (జిజ్ఞాస + ఆవిష్కరణ)

    జిజ్ఞాస అనేది అన్ని రకాల అభ్యాసాలకు నాంది. స్వేచ్ఛగా తిరగడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి అనుమతించబడిన పిల్లలు తమ పరిసరాలను గమనించడం, ప్రశ్నించడం మరియు వాటితో సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. పిల్లలు పుట్టుకతోనే అన్వేషకులు, కాబట్టి కొత్త విషయాలను కనుగొనడానికి వారికి స్వేచ్ఛ ఇవ్వండి ప్రయత్నించండి:

    పెరటిలో విహారయాత్రలు లేదా ప్రకృతి నడకలు
    స్కావెంజర్ వేట
    నక్షత్రాలను చూడటం. నక్షత్రరాశుల గురించి తెలుసుకోవడం

    ఫైండింగ్ నెమో వంటి సినిమాలు సైతం ప్రకృతి ప్రపంచం గురించి, దానికి ఆవల ఉన్న విషయాల గురించి ఉత్సుకతను రేకెత్తించగలవు.

    ప్యూర్ ఫన్‌తో బ్యాలెన్స్ చేయండి
    క్రమశిక్షణకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, బాల్యంలో ఆనందం, నవ్వులు కూడా ఉండాలి. ఎల్లప్పుడూ ఒక అభ్యసన లక్ష్యం ఉండవలసిన అవసరం లేదు, కొన్నిసార్లు సంతోషంగా ఉన్నా చాలు.

    సరళమైన, సంతోషకరమైన క్షణాలను సృష్టించండి:
    హోమ్ అలోన్, స్టువర్ట్ లిటిల్ & స్పై కిడ్స్ వంటి క్లాసిక్ చిత్రాలతో సినిమా రాత్రులు.
    ఇండోర్ క్యాంపింగ్ సెటప్‌లు
    వేడి మధ్యాహ్నాలలో నీటి ఆటలు
    పిల్లలు తమతో పాటు ముందుకు తీసుకువెళ్లే జ్ఞాపకాలు ఇవే.

    వేసవి సెలవులు ఒక స్వేచ్ఛా క్షేత్రం వంటివి. ఇక్కడ సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, అన్వేషణ మరియు ఆట వంటి వాటిని ప్రదర్శించడం పిల్లలను నిమగ్నం చేయడమే కాకుండా, వారిని ఆత్మవిశ్వాసం గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. వివిధ కార్యకలాపాల మధ్య సరైన సమతుల్యతను సాధించడం ద్వారా, వేసవి సెలవులు జీవితాంతం నేర్చుకోవడానికి ఒక వేదికగా మారగలవు.

    (చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)

  • కాలేయ వ్యాధి నివారణకు విశ్రాంతి మాత్రమే ఏకైక మార్గం అనేది ఒక సాధారణ అపోహ. కానీ అధ్యయనాలు,ఆధారాలు అందుకు విరుద్ధంగా చెబుతున్నాయి. సిర్రోసిస్‌ ఉన్నవారిలో, ఏరోబిక్,స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌లను కలిపి చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తగ్గుతాయి జీవన నాణ్యత అవకాశాలు మెరుగుపడతాయి. ఇది వ్యాధి పురోగతికి ఒక ప్రధాన కారణమైన కండరాల క్షీణత నుంచి కూడా రక్షిస్తుంది.

    కాలేయ పనితీరుకు తీవ్రమైన వర్కవుట్స్‌ అవసరం లేదు. నడవడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని సాగదీయడం  చిన్నపాటి శ్రమ వంటివి అన్నీ అది కోలుకోవడానికి సహాయపడే సంకేతాలను పంపుతాయి. అయితే తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. ఒక వారం పాటు మాత్రమే సాగే పరిపూర్ణ ప్రణాళిక కంటే, నెలల తరబడి పాటించగలిగే దినచర్య ఎల్లప్పుడూ ఉత్తమమైనది.

    ఆహారాన్ని జీర్ణం చేయడం, రక్తం వడపోతతో పాటు కాలేయం  మరెన్నో  పనులు చేస్తుంది. అది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటుంది. దానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన కండరాలు క్రమం తప్పకుండా సంకోచించినప్పుడు, అవి కొన్ని సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలేయం కొవ్వును సరైన విధంగా నిర్వహించడానికి   వాపును నియంత్రించడానికి సహాయపడతాయి. కండరాల కదలిక తగ్గినప్పుడు, ఆ మద్దతు కూడా తగ్గిపోతుంది, 

    కాలేయంపై పనిభారం పెరిగి దాని విధుల నిర్వహణ   కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హెపటాలజిస్ట్, ‘ది లివర్‌ డాక్టర్‌గా పేరొందిన  సిరియాక్‌ అబ్బీ ఫిలిప్స్‌ ఒక వివరణాత్మక పోస్ట్‌లో తెలియజేశారు.  

    వివిధ రకాల వ్యాయామాలు కాలేయానికి నిర్దిష్ట సంకేతాలను ఎలా పంపుతాయో,  ప్రతి వ్యాయామానికి క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా నిరూపితమైన ప్రయోజనాలు ఏవేం ఉంటాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... మనం ప్రతిరోజూ కండరాలను ఉపయోగించే విధానమే, కాలక్రమేణా కాలేయం పనితీరును తీర్చిదిద్దుతుంది. కండరాలు కేవలం బలం లేదా అందం కోసం మాత్రమే కాదు. అవి జీవక్రియకు యంత్రంలా పనిచేస్తాయి. అవి సంకోచించినప్పుడు, ఇన్సులిన్‌ సున్నితత్వాన్ని మెరుగుపరిచే కాలేయంలో కొవ్వు నిల్వను తగ్గించే అణువులను విడుదల చేస్తాయి.  

    ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కాలేయ ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది.  ఇద్దరిలో బలమైన, చురుకైన కండరాలు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యకరమైన కాలేయం ఉంటుంది. రోజువారీ కదలిక పెరగడం వల్ల ఫ్యాటీ లివర్‌ ప్రమాదం బాగా తగ్గుతుందని యూకేలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం  దృవీకరిస్తోంది.

    నడక: అత్యంత సులభమైన ఔషధం. వేగంగా నడవడం ఒక మంచి అలవాటు. వారానికి సుమారు 150 నిమిషాలు అలా నడిస్తే, కాలేయంలోని కొవ్వును దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చుననేది ఎంఆర్‌ఐ స్కాన్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న మార్పులు కూడా ముఖ్యమైనవే. రోజుకు 1,000 అదనపు అడుగులు వేయడం వల్ల ఫ్యాటీ లివర్‌ ప్రమాదం సుమారు 12 శాతం తగ్గుతుంది. దీనికి జిమ్‌ అవసరం లేదు, పరికరాలు అవసరం లేదు. కేవలం నిలకడ ఉంటే చాలు.

    కార్డియో...కూడా...
    స్థిరమైన వేగంతో జాగింగ్, సైక్లింగ్‌ లేదా ఈత కొట్టడం వంటివి  కార్డియోలో ఉంటాయి. మనం సరైన వేగంతో చేస్తున్నామా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ సులభమైన పరీక్ష ఏమిటంటే... చేసే సయమంలో మాట్లాడటం సులభంగా అనిపించాలి, పాడటం మాత్రం కష్టంగా అనిపించాలి.
    వారానికి కొన్ని రోజులు, 30–45 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించి, కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను మెరుగుపరచవచ్చు. బరువు తగ్గకపోయినా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనిపించడం గమనార్హం. ఇది మన ఆలోచనల్ని కేవలం బరువు తగ్గడం  నుంచి అత్యంత కీలకమైన జీవక్రియ ఆరోగ్యం వైపు మళ్లిస్తుంది.

    స్ప్రింట్‌ ఇంటర్వెల్స్‌
    స్ప్రింట్‌ ఇంటర్వెల్‌ శిక్షణ సెష¯Œ లు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. కేవలం ఆరు వారాల పాటు దీనిని చేయడం వల్ల,  ఫ్యాటీ లివర్‌ వ్యాధి ఉన్నవారిలో, కాలేయ కొవ్వు అంతర్గత అవయవాల కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సమయం దొరక్క ఇబ్బందిపడేవారికి, అలాగే  కఠిన శ్రమను తట్టుకోగలవారికి ఇది సరిపోతుంది.

    హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్, (హెచ్‌ఐఐటి)  అంటే చిన్న విరామాలలో తీవ్రమైన శ్రమ చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం. సుమారు 12 వారాలలో ఈ పద్ధతి కాలేయంలోని కొవ్వును 37 శాతం వరకు తగ్గించగలదు. ఇది గుండెను కూడా బలపరుస్తుంది   కార్డియోతో సమానమైన ప్రయోజనాలు, దానికి పట్టే సమయంతో పోలిస్తే దాదాపు సగం సమయంలోనే లభిస్తాయి.

    స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌
    బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్‌ వ్యాయామాలు చేయడం కండరాలను పెంచుతాయి, అది నేరుగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.శరీర బరువు మారకపోయినా స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సిర్రోసిస్‌ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనది. ఇది కండరాల క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది,

    రెండింటినీ కలపడం ఓ చక్కని విజయ సూత్రం
    కార్డియో  స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌లను కలపడం ఉత్తమమైన మార్గం. ఈ కలయిక, కొలెస్ట్రాల్‌ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది  కాలేయం కోలుకోవడానికి మరింత బాగా తోడ్పడుతుంది. ఇది గుండె, కండరాలు  కాలేయం అన్నీ కలిసి మెరుగుపడే సంపూర్ణ పరిస్థితిని శరీరంలో కల్పిస్తుంది.

    యోగా...
    సూర్య నమస్కారం మరికొన్ని యోగా పద్ధతులు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఇన్సులిన్‌ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి  ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో యోగా ద్వారా కాలేయ కొవ్వును తగ్గించవచ్చు. అయితే, కేవలం తేలికపాటి స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు  ఏరోబిక్‌ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. హార్ట్‌ బీట్‌ను పెంచే కదలికలు ఎప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తాయి

  • మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ విదేశీయుడిని చూస్తే నిజంగా నోటమాట రాదు. అతడి విధానం, ఆహార్యం అన్ని మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. వామ్మో శారీర దృఢత్వాన్ని, ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసిన ఆ వ్యక్తిని చూస్తే.. సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయం. ఎందుకంటే..

    ఇజ్రాయెలీలో జన్మించిన తమల్ కృష్ణ కృపా దాస్ 2009లో భారతదేశానికి వలస వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను భారత్‌కి వచ్చి ఇక్కడి హిందూ మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన వేషధారణ, ఆహారం తదితరాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వీడియోని కూడా షేర్‌ చేశారు. ఆ వీడియోలో తమల్‌ తనకు పోషకాహారం అంటే కేవలం స్థూల పోషకాలే కాదని స్వచ్ఛత, 'భగవంతునికి సమర్పణ' అని చెప్పారు. 

    తాను స్వచ్ఛమైన శాకాహార బాడీబిల్డర్‌నని చెప్పారు. తాను సనాతన ధర్మ అనుచరుడిగా అల్పాహారంగా ఏం తీసుకుంటాడో వివరించాడు. తమల్‌ తన రోజులో మొదటి భోజనాన్ని శుభ్రంగా ఉంచడంతో ప్రారంభిస్తాడు. ప్రతీదీ చాలా శుభ్రంగా కడుగుతూ తయారు చేసే విధానం అత్యంత ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దుకాణంలో లేదా బయటి నుంచి వచ్చే ప్రతీదానిపై ఎలా దుమ్ము, బ్యాక్టీరియాలతో నిండి ఉంటుందో  సవివరంగా చెప్పాడు. 

    పరిశుభ్రతకు మించి.. భోజనం కంటికి అందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కనిపించడమే ముఖ్యమని చెబుతుండటం విశేషం. మామిడి, నారింజ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్షలను చాలా అందంగా అమర్చిన విధానం గురించి వివరిస్తూ..దీనిని దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా అందంగా పరిశుభ్రంగా తయారు చేయాలని అంటున్నాడు. పెరుగుని చక్కగా తయారు చేయాలి. కప్పులలో గడ్డకట్టిన పెరుగు, పిస్తా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. 

    అతడు ఒక్క ముద్ద కూడా తినకముందే పూజ చేసి ఆహారానని భగవంతుడికి నివేదిస్తాడు. తాను ఏం తయారు చేసినా.. భగవంతుడు దానిని స్వీకరించాలని ప్రార్థిస్తాను. అన్నింటికన్నా..ముఖ్యమైన విషయం ఆహారాన్ని తినేముందు భగవంతునికి సమర్పిస్తే ప్రసాదమవుతుంది. అది మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయండంలో సహాయపడుతుందని చెబుతున్నాడు. 

    వేషధారణ..
    తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్‌ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు. 
    ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..

    డబ్ల్యూహెచ్‌ఓ కూడా..
    తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.

    WHO మార్గదర్శకాల ప్రకారం: "అల్పాహారం రోజులో మొదటి భోజనం; అందువల్ల, సమతుల్యంగా ఉండేలా కేర్‌ తీసుకోవలి. కనీసం రెండు రకాల పదార్థాలు అందించాలి: ఒకటి ప్రధాన ఆహార పదార్థాలు, మరొకటి ప్రోటీన్. అందువల్ల అల్పాహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా చేర్చాలి." ఇక్కడ తమల్‌కు, అతని ఆధ్యాత్మిక సాధనతో బలపడిన ఈ పోషకాహార పునాది, అతని ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ కెరీర్‌కు చోదక శక్తిగా పనిచేస్తోంది.

     

    (చదవండి: కుమారుడి ఊహించని సర్‌ప్రైజ్‌..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు)

     

  • తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా..

    "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!

    తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా  అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్‌గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.

    సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?
    లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. 

    అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్‌ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.

    పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?
    హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.
    పంచాయతన 
    'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.
    దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.
    ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.

    పంచాయతన సమేత
    పైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. 

    తంత్రం అంటే..
    తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.

    కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?
    కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. 

    అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే  చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.

    శ్వేత పాతాళ వారాహి అంటే..?
    హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. 

    అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. 

    అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు.  

    దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?

    ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?
    అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే  అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. 

    పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇ‍క్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.

    శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?
    యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. 

    అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.

    క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?
    ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్‌ వైబ్రేషన్స్‌తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. 

    ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్‌గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.

    వామాచారం అంటే..
    ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామె

    డాక్టర్‌ కమ్‌ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?
    ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. 

    మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్‌ చేయండి.
     

    (చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!)