Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. డిసెంబర్ 3-5 మధ్య విమాన రద్దు వల్ల ప్రభావితమైన ప్రయాణికులందరికీ రిఫండ్‌ ప్రాసెస్ చేసిందని ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా తెలిపింది.

    ‘డిసెంబర్ 3-5 వరకు కార్యకలాపాల అంతరాయాల కారణంగా బాధిత ప్రయాణీకులకు అందించే రిఫండ్‌లు, పరిహారాలకు సంబంధించి దేశీయ క్యారియర్ ఇండిగోతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది’ అని డీజీసీఏ పేర్కొంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ఇండిగో విమానాల రద్దుకు సంబంధింంచి అన్ని రిఫండ్లను పూర్తిగా ప్రాసెస్ చేసి, చెల్లింపులు క్లియర్ చేసినట్లు ఇండిగో తెలియజేసిందని వివరించింది.

    అంతేకాకుండా ఎక్కువ అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఊరట కల్పించడానికి అదనపు చర్యగా విమానయాన సంస్థ "గెస్చర్‌ ఆఫ్‌ కేర్‌’ పేరుతో ఒక్కొక్కరికీ రెండు రూ.5,000 ట్రావెల్ వోచర్లను అందించినట్లుగా తెలిపింది. వీటికి 12 నెలల చెల్లుబాటు ఉంటుందని, ఆయా తేదీల్లో ఫ్లైట్లు రద్దవడం లేదా మూడు గంటల కంటే ఆలస్యంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీటిని అందించినట్లుగా పేర్కొంది.

    బాధిత ప్రయాణికులకు రిఫండ్‌ పూర్తయినట్లు ఇండిగో, డీజీసీఏ చెబుతుంటే మరో వైపు తమకు రిఫండ్‌ అందలేదని చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇండిగోను, డీజీసీఏ ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.

  • ఎలోన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) ఈ వారం రెండోసారి పెద్ద సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా ప్రభావితం చేసింది.

    డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎక్స్‌ సేవలు అందుబాటులో లేవని సుమారు 80,000కు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

    ఇలాంటి వరుస అంతరాయాల నేపథ్యంలో ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్ స్థిరత్వం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్‌ను సమర్థవంతంగా మోడరేట్ చేయగల సామర్థ్యంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

    2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం, సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. దీని కారణంగా సాధారణ కార్యకలాపాలను నిరవధికంగా కొనసాగించడం, హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడం వంటి అంశాలపై అప్పటినుంచి సవాళ్లు తలెత్తుతున్నాయి.

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది.

    ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవడానికి క్లెయిమ్‌ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు.

    కొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత.. పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో కొంత భాగం మినహాయించి, మిగిలిన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్‌ ఖాతాకు సీడ్‌ అయిన బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చో చూడవచ్చు. అంతే కాకుండా యూపీఐ పిన్ నెంబర్ ఉపయోగించడం ద్వారా.. మీ ఖాతాలు బదిలీ చేసుకోవచ్చు. ఇలా బదిలీ చేసుకున్న తరువాత ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

  • సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం సర్వ సాధారణం. ఇందులో భాగంగానే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఒక కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.

    ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ కొనుగోలు చేసిన కొత్త అపార్ట్‌మెంట్ ధర రూ. 8.05 కోట్లు. ఇది పాలి వింటేజ్ భవనంలో 1,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఐదవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను రెండు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కొనుగోలు చేశారు. దీనికోసం రూ. 48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ లావాదేవీ నవంబర్‌లో జరిగినట్లు సమాచారం.

    ఖార్‌లో పాలి వింటేజ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసిన లెవల్ 6 అనే కంపెనీ ద్వారా ఈ అపార్ట్‌మెంట్‌ను కరణ్ జోహార్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని లెవల్ 6 గ్రూప్ చీఫ్ ప్రమోటర్ ప్రీతేష్ సంఘ్వి ధృవీకరించారు.

    ఈ కొత్త అపార్ట్‌మెంట్ మాత్రమే కాకుండా.. కరణ్ జోహార్ బాంద్రాలోని కార్టర్ రోడ్‌లోని ది రెసిడెన్సీలో సముద్రానికి ఎదురుగా ఉన్న పెద్ద డ్యూప్లెక్స్ కలిగి ఉన్నారు. అదే విధంగా 8,000 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ను 2010లో దాదాపు రూ. 32 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ప్రైవేట్ టెర్రస్ & గౌరీ ఖాన్ రూపొందించిన నర్సరీ ఉన్నాయి. ఢిల్లీలోని మెహ్రౌలిలో కూడా ఈయనకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇదీ చదవండి: రైల్వేలో పెద్ద స్కామ్: వెండి పతకాలను అమ్ముదామని వెళ్తే.. షాక్!

  • ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలోని.. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' (SOP)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆమోదం తెలిపింది.

    కొత్త ఎస్‌ఓపీ ప్రకారం.. రూ. 50వేలు కంటే తక్కువ సైబర్ మోసాల బాధితులు కోర్టు ఆదేశం లేకుండానే రీఫండ్ పొందవచ్చు. అయితే కోర్టు ఆదేశాలు లేని సందర్భాల్లో, బ్యాంకులు గరిష్టంగా 90 రోజుల్లోగా ఫ్రీజ్ చేసిన మొత్తాలపై హోల్డ్‌ను ఎత్తివేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.

    హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా అధికమయ్యాయి.

    కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గణాంకాల ప్రకారం.. గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మోసం, మభ్యపెట్టడం వంటి కేసుల ద్వారా రూ. 52,976 కోట్లకు పైగా నష్టం సంభవించింది. ఈ కొత్త విధానం ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్ద ఊరటగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని ఫిన్‌టెక్ & డిజిటల్ ఫైనాన్స్ రంగ నిపుణులు స్వాగతించారు.

    ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!

  • భారతదేశంలో టోల్ విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి 2014లో ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి వచ్చింది. ఇప్పుడు రద్దీని తగ్గించడానికి.. ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ తీసుకురావడానికి సిద్ధమైంది.

    కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేదించనుంది. ప్రయాణికులు టోల్‌లు చెల్లించడానికి ఫాస్ట్‌ట్యాగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. త్వరలోనే ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం.

    గడువు సమీపిస్తున్నందున, ప్రయాణికులు డిజిటల్ మార్పుకు సిద్ధం కావాలని మరియు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇది అమలులోకి వచ్చిన తరువాత వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపులు అన్ని లావాదేవీల పారదర్శకంగా ఉంటాయి.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

  • భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన 'ఇండియన్ రైల్వే'లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ స్కామ్ కలకలం రేపుతోంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు.. కృతజ్ఞతా సూచకంగా అందించాల్సిన వెండి నాణేలు/పతకాలు రాగితో తయారైనవిగా తేలడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ ఘటనతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయినట్లు తెలుస్తోంది.

    రైల్వే సేవల్లో దశాబ్దాలపాటు అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వెండి పతకాలు అందించడం ఒక సంప్రదాయం. ఇది వారి సేవలకు గుర్తింపుగా భావించబడుతుంది. అయితే ఈ పతకాలు నిజంగా వెండివేనా అనే అనుమానం మొదలై, కొందరు టెస్ట్ చేయించగా.. ఇందులో కేవలం 0.23 శాతం మాత్రమే వెండి ఉందని, మిగిలినది రాగి అని తెలిసింది.

    ఈ మోసం 2023 - 2025 మధ్య పదవీ విరమణ చేసిన వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని భోపాల్ డివిజన్‌లోని వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. రైల్వేస్ 2023 జనవరి 23న ఇండోర్‌కు చెందిన ఒక కంపెనీకి 3,640 నాణేలకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 3,631 నాణేలను భోపాల్‌లోని జనరల్ స్టోర్స్ డిపోకు సరఫరా చేశారు.

    ఒక్కో నాణెం కోసం రూ. 2200 నుంచి రూ. 2500 ఖర్చు అయినట్లు అంచనా. అయితే వెండి స్థానంలో రాగి ఉపయోగించడం వల్ల మొత్తం కుంభకోణం రూ. 90 లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది. రైల్వేలు ఆ కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, సరఫరాదారుని బ్లాక్‌లిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

    ఇండియన్ రైల్వేస్ ఈ నాణేలను గతంలో ప్రభుత్వ టంకశాలలో ముద్రించేది. అప్పుడు వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు వీటిని వేరే కంపెనీ తయారు చేయడం వల్ల.. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి తమ గౌరవ సూచికంగా పొందే పతకం/నాణెం కూడా నకిలీదేనా అని ఆందోళన చెందుతున్నారు.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

  • సిల్వర్ ధర పెరుగుతుందని చెప్పే రాబర్ట్ కియోసాకి మాటలు నిజమయ్యాయి. వెండి రేటు రోజురోజుకు పరుగుతూ.. చూస్తుండగానే రూ. మూడు లక్షలు దాటేసింది. ఇలాంటి సమయంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ''టెస్లా కంపెనీకి వెండి (Silver) దొరకడం కష్టం అవుతోంది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 91 డాలర్ల నుంచి 107 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది'' అని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

    ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలలో వెండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సిల్వర్ రేటు గణనీయంగా పెరగడం వల్ల, రాబర్ట్ కియోసాకి.. టెస్లా కంపెనీకి సిల్వర్ దొరకడం కష్టం అవుతోందని అన్నారు. కాగా ఈ రోజు భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 3.06 లక్షల వద్ద ఉంది.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు
    వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

    ఇదీ చదవండి: నాలుగు గంటల్లో రూ.20వేల కోట్ల బుకింగ్స్!

  • శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 187.64 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 83,570.91 వద్ద, నిఫ్టీ 28.75 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 25,694.90 వద్ద నిలిచాయి.

    అజ్మీరా రియాల్టీ & ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, హెచ్ఈసీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆసోమ్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్, వర్ధమాన్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ & యాక్సెసరీస్ లిమిటెడ్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రామా ఫాస్ఫేట్స్ లిమిటెడ్, HBL ఇంజనీరింగ్ లిమిటెడ్, L&T టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన.. XUV 7XO & XEV 9S కార్లు అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. 2026 జనవరి 14న.. నాలుగు గంటల్లో వీటి కోసం 93,689 బుకింగ్‌లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈ బుకింగ్ విలువ రూ.20,500 కోట్లకు పైగా ఉంటుందని కార్ల తయారీదారు తెలిపారు.

    కొత్త మహీంద్రా XUV 7XO ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల వరకు ఉన్నాయి. ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు లాంచ్‌కు ముందే ముగిశాయి. కాగా కొత్త బుకింగ్‌లు జనవరి 14న ప్రారంభమయ్యాయి. ఎంపిక చేసిన వేరియంట్‌ల డెలివరీలు అదే రోజున ప్రారంభమయ్యాయని, మిగిలిన వేరియంట్‌ల డెలివరీలు ఏప్రిల్ 2026లో కొనసాగుతాయని కంపెనీ ధృవీకరించింది.

    ఇక మహీంద్రా XEV 9S విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. దీని డెలివరీలు జనవరి 23 ప్రారంభం కానున్నాయి. ఇది 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. దీని రేంజ్ 679 కి.మీ వరకు ఉంటుంది.

    ఇదీ చదవండి: నిన్న క్రిస్టా.. నేడు ఫార్చ్యూనర్: భారీగా పెరిగిన ధరలు!

    టాటా మోటార్స్ లాంచ్ చేసిన సియెర్రా కారు కూడా మంచి బుకింగ్స్ పొందింది. మొదటి రోజే ఏకంగా 70000 బుకింగ్స్ పొందగలిగింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును మహీంద్రా కార్లు అధిగమించాయి. బుకింగ్లలో ఎప్పటికప్పుడు మహీంద్రా కంపెనీ కొత్త మార్క్ చేరుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే XUV700, స్కార్పియో క్లాసిక్ వంటి కార్లు కూడా గతంలో గొప్ప అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

  • దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్‌ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్ పత్రాల ముద్రణ మాత్రం పాత పార్లమెంట్‌ భవనంలోని నార్త్‌ బ్లాక్‌లోనే కొనసాగనుంది.

    కొత్త భవనంలో లేని సౌకర్యం

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమ బృందంలోని కీలక అధికారులు 2025 సెప్టెంబర్‌లోనే ఆధునిక సెంట్రల్ సెక్రటేరియట్‌లోని ‘కర్తవ్య భవన్’కు మారారు. అయితే, అక్కడ బడ్జెట్ పత్రాల ముద్రణకు అవసరమైన అత్యంత సురక్షితమైన, ప్రత్యేక ప్రింటింగ్ ప్రెస్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పాత పార్లమెంట్‌ బిల్డింగ్‌లోని నార్త్‌ బ్లాక్‌లో ఉన్న ప్రెస్‌లోనే ముద్రణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    బడ్జెట్ పత్రాల ముద్రణను 1950 వరకు రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో పత్రాలు లీక్ కావడంతో ముద్రణను మింట్‌ రోడ్డులోని ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980 నుంచి భద్రతా కారణాల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ప్రత్యేక ప్రెస్‌కు ఈ బాధ్యతలు బదిలీ చేశారు.

    రెండు వారాల క్వారంటైన్.. కట్టుదిట్టమైన భద్రత

    బడ్జెట్ ముద్రణ అనేది అత్యంత రహస్యంగా సాగే ప్రక్రియ. ముద్రణలో పాల్గొనే సిబ్బందిని సుమారు రెండు వారాల పాటు నార్త్‌ బ్లాక్‌లోని గదుల్లోనే ఉంచుతారు. ఈ సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కీలక అధికారుల ఫోన్లపై కూడా పరిమితులు ఉంటాయి. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు అక్కడే ఉంటూ ఈ పుస్తకాల తయారీని పర్యవేక్షిస్తారు.

    త్వరలో ‘హల్వా వేడుక’

    బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు సూచికగా నిర్వహించే సాంప్రదాయ ‘హల్వా వేడుక’ వచ్చే వారం జరగనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. డిజిటల్ బడ్జెట్ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, రికార్డుల కోసం  పరిమిత సంఖ్యలో పత్రాల ముద్రణ కోసం ఈ కసరత్తును పాత పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.

    ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

  • దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ వితరణ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అన్నీ కలిసి ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కోసం ఒకే విధమైన, ప్రమాణీకరించిన (Standardized) డిజిటల్ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.

    జన్‌సమర్థ్ పోర్టల్‌తో వేగంగా రుణాలు

    కేంద్ర క్యాబినెట్ సూచనల ప్రకారం, రూ.1 కోటి వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలన్నింటినీ ఇకపై ‘జన్‌సమర్థ్’ (JanSamarth) పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను వాడటం వల్ల రుణ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్లు, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్‌), జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్లను బ్యాంకులు ఆటోమేటిక్‌గా పరిశీలిస్తాయి. వ్యక్తిగతంగా పరిశీలన తగ్గడం వల్ల రుణ అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గి వేగంగా నిధులు మంజూరవుతాయి.

    క్రెడిట్ వృద్ధి

    గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి బ్యాంకులు అందించిన మద్దతు గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో సుమారు రూ.26.43 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయి. దాదాపు 13 మిలియన్ల (1.3 కోట్లు) ఖాతాల్లోకి ఈ రుణాలు చేరాయి. 2024 జనవరి-అక్టోబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన క్రెడిట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

    ఆర్థిక వ్యవస్థకు బూస్ట్

    ఈ నూతన డిజిటల్ ప్రణాళిక వల్ల చిన్న వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులైన ప్రతి చిన్న వ్యాపారికి సకాలంలో పెట్టుబడి అందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

NRI

  • అమెరికాలోని డిర్క్‌సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది.   మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్‌లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్‌కు, డాక్టర్‌ మధ్య జరిగిన వాగ్వాదం  హాట్‌టాపిక్‌గా మారి చర్చనీయాంశమైంది.

    ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్‌..
    చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్‌ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్‌ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. 

    ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు.  

    అబార్షన్ మందుల భద్రతపై ఆందోళన
    కేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్‌డీఏ లేబుల్‌పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. 

    మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె.  ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..

    ఆమె ఎవరంటే..

    నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.

    ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్‌లో ఇంటర్న్‌షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్‌ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.

    ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్‌లో ఫెలో కూడా.

    అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్‌గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తోందామె. 

     

    (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)

     

Andhra Pradesh

  • తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి విద్యార్థులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరదాగా గడిపేందుకు ఇసుకపల్లి బీచ్‌కు వెళ్లిన విద్యార్ధులు గల్లంతవడం విషాదకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్‌ పేర్కొన్నారు.

    నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌లో ఈతకెళ్లి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైనవారు అల్లూరు పంచాయతీ ఎర్రగుంటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తీరానికి ఇద్దరి మృతదేహాలు కొట్టుకు రావడంతో బయటకు తీశారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం మత్స్యకారులు గాలింపు చేపట్టారు.
     

  • తాడేపల్లి :  పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలబడింది.  సాల్మన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్‌సీపీ.  ఇఘ్పటికే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సాల్మన్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.  అదే సమయంలో సాల్మన్‌ కుటుంబానికి పార్టీ అండగా  ఉంటుందని భరోసా ఇచ్చారు.  దీనిలో భాగంగా సాల్మన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల సాయాన్ని ప్రకటించింది వైఎస్సార్‌సీపీ. 

    కాగా, టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్‌ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే..

    వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్‌ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్‌ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..  

    సాల్మన్‌ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్‌ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్‌.. చివరకు నాలుగు రోజుల తర్వాత  కన్నుమూశాడు.    

  •  గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో కోడి పందాల బరిలో టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. పందెం కోడికి కత్తి కట్టే విషయంపై గొడవ మొదలై తన్నుకునే వరకూ వెళ్లింది.  గుడ్లవల్లేరులో టీడీపీ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. 

    అయితే కోడి కత్తికి కట్టే విషయంలో రెండ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వెనుతురుమిల్లి, వసుమర్రు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. గొడవ ముదరడంతో ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఒకరి పై ఒకరు కుర్చీలు, కర్రలతో దాడి చేసుకున్నారు. 

  • సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్‌ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్‌హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

    గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
    గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.

    మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
    మాచర్ల → నాగార్జునసాగర్  → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.

    నల్లగొండ నుంచి  హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
    నల్లగొండ - మార్రిగూడ బై పాస్  -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.

    విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు
    కోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.

    ఎన్‌హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్‌ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌

    VJA To HYD: ఈ దారిలో వస్తే మంచిది
  • తాడేపల్లి: కోనసీమ వ్యాప్తంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు కోనసీమ వ్యాప్తంగా శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రభల తీర్థం ఉత్సవాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్ధంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు  వైఎస్‌ జగన్‌. 

    YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

     

Family

  •  మూడు దశాబ్దాలకు పైగా వైద్యరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కామినేని ఆస్పత్రి.. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం నిరంతర ఆధునిక వైద్యం అందేలా రూపొందించిన ప్రపంచ స్థాయి సమగ్ర మదర్ అండ్‌ చైల్డ్ కేర్ యూనిట్, ఎం’బ్రేస్ ను శుక్రవారం ప్రారంభించింది. తల్లులు, పిల్లలు, మొత్తం కుటుంబాలకు సంపూర్ణమైన, నిరంతర వైద్యం  అందించేందుకు ఈ అత్యాధునిక విభాగాన్ని ఆస్పత్రిలో రూపొందించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, వివిధ విభాగాల నిపుణుల అనుభవం, మానవీయ సంరక్షణను ఏకీకృతం చేస్తూ, మదర్ & చైల్డ్ ఆరోగ్య అవసరాలను తీర్చుతూ ఎం’బ్రేస్ పని చేస్తుంది.

    మదర్ & చైల్డ్ కేర్  కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాదని అందరూ అవగాహన చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో ఎం’బ్రేస్ అందుబాటులో కి వచ్చింది. గర్భధారణ, ప్రసవానికి సంబంధించిన వైద్య సంరక్షణలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, భావోద్వేగ, మానసిక, పోషక, అభివృద్ధి అవసరాలు తరుచుగా వేర్వేరుగా తీరుస్తున్నారు. ఈ లోటును పూరిస్తూ, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ నుంచి గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువు నుంచి పిల్లల అభివృద్ధి వరకు మదర్& చైల్డ్ కు కుటుంబాల సమక్షంలో సమగ్ర సంరక్షణను ఎం’బ్రేస్ అందిస్తుంది.

    ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీఈవో డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ, “ఎం’బ్రేస్ ద్వారా మదర్ & చైల్డ్ ఆరోగ్య సంరక్షణను అత్యాధునిక వైద్య విధానంతో కొత్త దిశలో సేవలందిస్తున్నాం. కుటుంబాన్ని సంరక్షణ కేంద్రంగా ఉంచి, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, భావోద్వేగ, పోషక అవసరాలను కూడా సమగ్రంగా చూసుకోవడమే మా లక్ష్యం. ఆధునిక ఐసీయూలు, కార్డియాక్ సపోర్ట్ వ్యవస్థ,  24/7 బ్లడ్ బ్యాంక్ సేవలతో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నాం ” అని తెలిపారు.

    'హై రిస్క్ ప్రెగ్నెన్సీలను కాపాడే నమ్మకమైన కేంద్రంగా కామినేని ఆస్పత్రికి మంచి పేరు, అనుభవం ఉండడంతో అత్యాధునిక ఎం’బ్రేస్ విభాగాన్ని ప్రారంభించాం. ఆస్పత్రిలో మోడ్రన్ క్రిటికల్ కేర్, ఆధునిక కార్డియాక్ సిస్టమ్స్, రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలు, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల పర్యవేక్షణలో మదర్ & చైల్డ్ ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడం, తల్లులకు నమ్మకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించడం, అలాగే కుటుంబాలను మదర్& చైల్డ్ సంరక్షణలో క్రియాశీల భాగస్వాములుగా మార్చడంలో  ఎం’బ్రేస్ యూనిట్ పని చేస్తోంది.' అని సీఈఓ డాక్టర్ గాయత్రి కామినేని వివరించారు.

    అనంతరం ఎం'బ్రేస్ గురించి కార్యక్రమ ముఖ్యఅతిథి, ప్రముఖ నటి భూమిక చావ్లా మాట్లాడుతూ.. “ ప్రెగ్నెన్సీ  అనేది సంరక్షణ, అవగాహన, కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు అవసరమైన ప్రక్రియ.  వైద్య చికిత్సతో పాటు తల్లుల భావోద్వేగ, మానసిక శ్రేయస్సును గుర్తించే ఎం’బ్రేస్ ఒక చక్కని అధునాతన ఆలోచనాత్మక ప్రయత్నం. ఇది కామినేని ఆసుపత్రిలో అనేక కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నాను” అని చెప్పారు.

    ఇప్పటికే ప్రజలకు నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా రూపొందిన ఎం’బ్రేస్, ఇంటికి దగ్గరలోనే నాణ్యమైన అత్యాధునిక  వైద్య సేవలను అందిస్తుంది. సంతానోత్పత్తి చికిత్స, గర్భధారణకు ముందు, తర్వాత సంరక్షణ, నవజాత శిశువులు, పిల్లలకు ప్రత్యేక సంరక్షణ (ఎన్ఐసీటీయూ సపోర్ట్ సహా).

    తల్లులు కుటుంబాల భావోద్వేగ, మానసిక ఆరోగ్యానికి కౌన్సెలింగ్. తల్లులు, పిల్లలకు వ్యక్తిగత డైట్ సలహాలు. పాలిచ్చే విధానంలో సహాయం  గైడెన్స్ అందించడం ద్వారా కుటుంబాలు అనేక ఆస్పత్రుల మధ్య తిరగాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

    ఎం' బ్రేస్ యూనిట్ టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆబ్స్టెట్రిషియన్స్ & గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, నియోనాటాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు, మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, లాక్టేషన్ కన్సల్టెంట్స్, శిక్షణ పొందిన నర్సులు, మిడ్వైవ్స్, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్టులతో కూడిన బలమైన బృందం ఉంటుంది.

    ఈ సమన్వయ విధానం ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన నిరంతర సంరక్షణతో పాటు అవసరమైనప్పుడు అత్యవసర, కార్డియాక్, రక్త మార్పిడి సేవలను వెంటనే అందిస్తోంది.

    (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..)

  • ఈ రోజుల్లో ఇంట్లో వాళ్లని, ప్రాణ స్నేహితుల్ని నమ్మడానికి వీల్లేని రోజులు.  సాయం చేసిన వాడినే నాశనం చేసే దారుణమైన గడ్డు రోజుల్లో. 'మనిషన్న వాడు కానిరాడమ్మా..' అనే ఆర్యోక్తిలా ఉన్నాయి పరిస్థితులు. అందుకు సమాజంలో జరిగిన ఎన్నో ఉదంతలే నిదర్శనం. కానీ దాన్నే తలదన్నేలా ఇ‍క్కడ జరిగిన సంఘటన హైలెట్‌గా నిలిచింది. పైగా 'నమ్మకానికి' కొండంత విలవ ఉంది అని నిరూపించే అపురూపమైన ఘటన ఇది.

    మెట్రో ప్రయాణం ఎలా ఉంటుందో తెలిసిందే. జనంతో కిటకిటలాడుతూ..అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి బెంగళూరు మెట్రో ప్రయాణంలో జరిగిన ఘటన నెట్టింట అందరి మనసులను తాకింది. రోజువారి ప్రయాణంలో కనిపించిన దయకు సంబంధించిన ఓవిషయాన్ని నెట్టింట ఒక మహిళ పంచుకుంది.  ఆ పోస్ట్‌లో  ఆ మహిళ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడూ..ఒక చిన్న అమ్మాయి మణికట్టుపై అందమైన బంగారు గాజుని గమనించింది. అయితే ఆ గాజు డిజైన్‌ ఆమెను ఆకట్టుకుంది. 

    వెంటనే ఆమె ఆ అమ్మాయిని కాస్త ఆ గాజుని ఫోటో తీసి ఇవ్వగలరా..నేను అదేలాంటి డిజైన్‌ గాజుని తయారుచేయించుకుంటానని అడిగింది. అయితే ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. పైగా ఆ మహిళను విస్తుపోయాలే చేసింది ఆ అమ్మాయి. అప్రయత్నంగా తన చేతి గాజుని తీసి ఆ మహిళ చేతిలో పెట్టేసి మీకు నచ్చినట్లుగా చేయించుకోండి అని సింపుల్‌గా అంటుంది. 

    ఆ హఠాత్పరిణామనికి ఆ మహిళ నోట మాట రాలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆ అ‍మ్మాయి.. ఇది ఒరిజనల్‌ బంగారు గాజు కాదని, ఇంది వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ బంగారు గాజు అంటూ చెప్పేసి వెళ్లిపోతుంది. ఆమె విశాల హృదయం, నిజాయితీ ఆమె మనసుని తాకడమే గాక ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మకం ఇంకా బతికే ఉందా అని ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. 

    అంతేగాదు ఆ అపురూపమైన క్షణానికి గుర్తుగా ఆ గాజుని తన వద్ద ఉంచుకుంది. పైగా అందుకు సంబంధించిన అపురూపమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ గాజు తన సొంతం ఎలా అయ్యిందో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

    (చదవండి: పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..)

     

  • మకరవిళక్కు మహోత్సవం సందర్భంగా శబరిమలలో ప్రాచీన వామ్మోళి సంప్రదాయాలతో నాయట్టు పిలుపు నిర్వహించబడుతోంది. మకరవిళక్కు దినం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు నాయట్టు పిలుపు జరుగుతుంది.

    పద్దెనిమిదవ మెట్టుకి దిగువనున్న నిలపాట్తర నుంచి దక్షిణ దిశగా చూస్తూ నాయట్టు పిలుపు నిర్వహిస్తారు. చివరి రోజు ఈ కార్యక్రమం శరంకుట్టిలో జరుగుతుంది.

    అయ్యప్ప స్వామికి కాపలాదారులైన భూతగణాలు మరియు మలదేవతలు మకరవిళక్కు మహోత్సవ సమయంలో శబరిమల నుంచి అడవుల్లోకి వెళ్తారని విశ్వాసం. వారిని అయ్యప్ప స్వామి స్వయంగా పిలిచి తిరిగి శబరిమలకి తీసుకొస్తాడని నమ్మకం ఉంది. అందుకోసమే నాయట్టు పిలుపు బృందం శరంకుట్టికి వెళ్తుంది.

    పద్యరూపంలో చక్కగా రూపొందించిన అయ్యప్ప చరిత్ర , ఇతిహాసాలను ద్రావిడ మలయాళ భాషలో తరతరాలుగా వామ్మోళి సంప్రదాయంగా అందిస్తూ వస్తున్న ఆచారమే నాయట్టు పిలుపు.

    అయ్యప్ప స్వామి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని మొత్తం 576 శీలాలు నాయట్టు పిలుపులో భాగంగా ఉంటాయి. శబరిమల దేవాలయ ప్రారంభ కాలం నుంచే కొనసాగుతున్న ఈ ఆచారంలో , నాయట్టు పిలుపు చెప్పే వ్యక్తి ప్రతి శీలం ముగించిన వెంటనే, అతనితో పాటు ఉన్నవారు “ఈ హూయి” అని ఘోషిస్తారు.

    భగవాన్ అయ్యప్ప యొక్క మకరమాస మహోత్సవం జరుగుతోందని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేయడానికే “ఈ హూయి” అనే పిలుపు. పద్దెనిమిదవ మెట్టుకి దిగువన ఉన్న అయ్యప్ప స్వామి, పైభాగంలోని శ్రీ ధర్మశాస్తా ను దర్శించుకునే సందర్భం కూడా ఇదే నాయట్టు పిలుపుగా భావిస్తారు.

    నాయట్టు పిలుపు బృందంలో నాయట్టు పిలుపు కురుప్పు సహా మొత్తం 12 మంది ఉంటారు. రాన్నీ – పెరునాడ్ ప్రాంతానికి చెందిన వెల్లాళ కులానికి చెందిన పున్నమూటిల్ కుటుంబానికి నాయట్టు పిలుపు చేసే వారసత్వ హక్కును పందళం రాజు అప్పగించినట్లు చెబుతారు. ప్రస్తుతం పున్నమూటిల్ పి.జి. మహేష్ నాయట్టు పిలుపులో శీలాలను ఉచ్ఛరిస్తున్నారు.

    (చదవండి: అయ్యప్ప స్వామి దివ్య ఆభరణాల పవిత్ర యాత్ర)

     

  • ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్‌ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్‌ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి  తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.

    రీహైడ్రేట్, టాక్సిక్స్‌ బయటకు...
    పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు  అలవాటున్నవాళ్లు ఆల్కహాల్‌ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్,  అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి.   పుష్కలంగా నీరు త్రాగాలి. 

    ఉదర వ్యవస్థను ఫ్లష్‌ చేసి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని  లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్‌గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్‌ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్‌ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్‌గా మారుస్తాయి.

    సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...
    పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్‌–రిచ్‌ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్‌  తాజా పండ్లు  సహాయపడతాయి.

    బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్‌ కూరగాయలను వంటలో చేర్చాలి.    పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

    కాయధాన్యాలు, పప్పు, కాటేజ్‌ చీజ్‌ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్‌ ఫుడ్స్‌ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

    గింజలు, విత్తనాలు  తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.

    తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి  పద్ధతిని అనుసరించాలి. 

    తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం  శరీరపు పండుగ ఓవర్‌లోడ్‌ను ప్రాసెస్‌ చేయడానికి  జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్‌ చేస్తుంది.

    పండుగ తర్వాత అలసటతో  వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది,  మరింత శక్తినిచ్చేలా చేస్తుంది.  

    జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే  స్ట్రెచ్చింగ్‌ వ్యాయామాలు ఉబ్బరాన్ని   కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.

    పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్‌లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి  ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి  మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్  వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. 

    ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే.  నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు  ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

    కొన్ని ఆయుర్వేద చిట్కాలు...
    డిటాక్స్‌ వాటర్‌: ఒక టీస్పూన్‌ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.

    భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్‌) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్‌ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి  ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.

    త్రిఫల పౌడర్‌:  పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్‌ త్రిఫల పౌడర్‌ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది  జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

    జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్‌ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి  ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.

    ఒక టీస్పూన్‌ పసుపు  చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్‌ లాట్టే (గోల్డెన్‌ మిల్క్‌)ఉపశమనం కలిగించేవి  శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం  తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

    (చదవండి: పొంగల్‌వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!)

  • కుంతీదేవి కర్ణుడి తల్లి.  ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల సూర్యుని ప్రార్థన చేస్తే కర్ణుడు జన్మించాడు. కానీ వివాహం జరగకముందే బిడ్డ పుడితే సమాజం ఏమంటుందో అనే భయంతో ఆ  బిడ్డను  కుంతీ నదిలో వదిలేసింది.  అయితే వరంతో జన్మించిన బిడ్డ కాబట్టి కర్ణుడికి ఏం కాలేదు. మహాభారతంలో  దానవీరుడిగా ప్రసిద్ధి చెందాడు కర్ణుడు.

    ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని ఓ నగరానికి మేయర్‌గా ఉన్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి పరిస్థితి కూడా దాదాపు ఇదే. మూడు రోజుల శిశువుగా  ఉన్నప్పుడే  ఓ మాతృసంస్థలో వదిలేసింది కన్నతల్లి. ఇది జరిగి ఇప్పటికి 41 ఏళ్లు అయ్యింది. 1985లో నాగ్‌పూర్‌కు చెందిన ఓ తల్లి.. తన కుమారుడిని మాతృసంస్థకు అప్పచెప్పింది. నాగ్‌పూర్‌లో  ఉన్న మాతృసేవా సంఘ్‌లో విడిచిపెట్టి పెళ్లిపోయింది.

    ఏ పరిస్థితుల కారణమో, ఎంతటి దయనీయ స్థితిలో ఆ తల్లి కుమారుడిని వద్దనుకుంది. అయితే అక్కడ ఉన్న నర్సు.. ఆ కుర్రాడికి ఫాల్గున్‌గా నామకరణం చేసింది. ఆ శిశువును తల్లి వదిలేసిన నెల వ్యవధిలో నెదర్లాండ్స్‌ నుంచి  ఒక జంట సదరు మాతృసంస్థకు వచ్చింది. ఆ శిశువును అక్కడ నుంచి తీసుకుని నెదర్లాండ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చదువుకుని ఇప్పుడు మేయర్‌ అయ్యాడు. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌కు దగ్గరగా  ఉన్న హీమ్‌స్టెడ్‌కు మేయర్‌గా ఎన్నికయ్యాడు.

    ఆ శిశువు నెదర్లాండ్స్‌లో పెరిగి.. అక్కడ మేయర్‌ కావాలని రాసి పెట్టి ఉంది కాబట్టి అలా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. పూర్వ పుణ్యమో, కారణ జన్మమమో ఆ శిశువును ఇప్పుడు మేయర్‌గా నిలిపింది.  

    తల్లిని వెతుక్కుంటూ భారత్‌కు..
    ఆ మేయర్‌కు ఇప్పుడు తన మూలాల గరించి తెలిసింది. తన పుట్టుక గురించి తెలిసింది. తాను భారత్‌కు చెందిన ఓ తల్లికి జన్మించాననే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లిని వెలికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌కు వచ్చాడు మేయర్‌ ఫాల్గున్‌.. ఈ క్రమంలోనే ఓ మాట అన్నాడు ఫాల్లున్‌. మహాభారతంలోని కర్ణుడి గురించి చెప్పుకొచ్చాడు.  తల్లి కుంతీ దేవిని కలవడానికి కర్ణుడికి హక్కు  ఉందన్నాడు. అందుకోసమే తాను తల్లి కోసం వెతుకలాట ప్రారంభించానని అంటన్నాడు. 

    దీనిలో భాగంగా 2025లో  భారత్‌కు మూడుసార్లు వచ్చాడు ఈ ‘కలియుగ కర్ణుడు’.  నాగ్‌పూర్‌ కలెక్టర్‌ సాయం తీసుకున్నాడు.  తాను పుట్టడానికి సాయం చేసిన నర్సును కలిశాడు.  నర్సును తాను  కలవడం చాలా సంతోషంగా ఉందని, తన జననం ఫాల్గుణ మాసంలో జరిగింది కాబట్టి తనకు ఫాల్గున్‌ అని పేరు పెట్టినట్లు రిటైర్డ్‌ అయ్యి ఇంటి వద్దే ఉంటున్న నర్సు తెలిపినట్ల స్పష్టం చేశాడు. తన గురించి పలు విషయాలను ఆమె  చెప్పడం ఒక మధురానుభూతిని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు నెదర్లాండ్‌ మేయర్‌,

Movies

  • మలయాళ నటుడు ఆంటోని వర్గీస్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కటాలన్‌. దుషారా విజయన్ కథానాయిక. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, సెకండ్‌ లుక్‌లో.. మలయాళ మూవీ చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేశారు. శుక్రవారం (జనవరి 16న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

    నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించగా షరీఫ్ మహమ్మద్ నిర్మించాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్-బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. 

    ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "పాంగ్" అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. అజనీష్‌ సంగీతం అందించిన ఈ మూవీలో సునీల్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, రాజ్‌ తిరందాసు, పార్థ్‌ తివారి తదితరులు కీలక పాత్రల్లో నటింనున్నారు. కటాలన్‌ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మే 14న విడుదల కానుంది.

  • హీరో మంచు విష్ణు సంక్రాంతి సందర్భంగా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఒక పోటీ పెడుతున్నట్లు తెలిపాడు. అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ - సీజన్ 1ను ప్రకటించాడు. మేరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ కీలక ప్రకటన చేసింది. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్టంగా 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చని తెలిపింది. 

    కథ చెప్పడం, దర్శకత్వ దృష్టి ఆధారంగా విజేతలను నిర్ణయిస్తామంది. ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నాడు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకు రావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం.

     

  • ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌తో వైరల్‌ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్‌గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్‌ బిలియన్‌ వ్యూస్‌ వ్యూస్‌ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్‌ కీ రాత్‌'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్‌ వ్యూ నుంచి 1 బిలియన్‌ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్‌' అని రాసుకొచ్చింది.

    సినిమా
    తమన్నా 2005లో హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్‌, బద్రీనాథ్‌, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.

    ఐటం సాంగ్‌తో మరింత క్రేజ్‌
    అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్‌ బొమ్మ' అనే ఐటం సాంగ్‌లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్‌ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్‌ డాంగ్‌', జైలర్‌లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్‌ కీ రాత్‌', రైడ్‌ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్‌తో తమన్నా ఫుల్‌ పాపులర్‌ అయిపోయింది.

     

     చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు నాలుగు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

  • Prabhas and Sandeep Reddy

    పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో స్పిరిట్‌ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌. వివేక్‌ ఒబెరాయ్‌, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా స్పిరిట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. 

    వచ్చే ఏడాది రిలీజ్‌
    2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మధ్యే స్పిరిట్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. అందులో ప్రభాస్‌ ఒళ్లంతా గాయాలై కట్టు కట్టి ఉంది. ఒంటిపై చొక్కా లేకుండా నిలబడ్డ ప్రభాస్‌.. చేతిలో మందు బాటిల్‌తో వైల్డ్‌గా కనిపించాడు. త్రిప్తి డిమ్రి అతడికి సిగరెట్‌ వెలిగిస్తూ కనిపించింది.

    సినిమా
    స్పిరిట్‌ నుంచి రిలీజైన వన్‌ బ్యాడ్‌ హ్యాబిట్‌ వాయిస్‌ ఓవర్‌ గ్లింప్స్‌ కూడా జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే స్పిరిట్‌ మూవీలో ప్రభాస్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణన్‌ కుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు.

     

     

  • ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్‌ అయిన నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు రిలీజ్‌కి ముందు సదరు సినిమా నిర్మాతలు ఓటీటీ సంస్థలతో డీల్‌ కుదుర్చుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే ఓటీటీ డీల్‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. 

    అలా తమతో డీల్‌ కుదుర్చుకొని.. ఈ ఏడాది రిలీజ్‌ కాబోతున్న తెలుగు సినిమాల జాబితాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ప్రకటించింది. అందులో పవన్‌ కల్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, రామ్‌ చరణ్‌ ‘పెద్ది’తో పాటు ‘ఛాంపియన్‌, ఫంకీ లాంటి చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.

    2026లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అలరించే చిత్రాలివే..

    టైటిల్‌:  ఉస్తాద్‌ భగత్‌ సింగ్
    నటీనటులు: పవన్కల్యాణ్‌, శ్రీలీల
    దర్శకత్వం : హరీశ్శంకర్

    టైటిల్‌: పెద్ది
    నటీనటులు: రామ్చరణ్‌, జాన్వీ కపూర్
    దర్శకత్వం : బుచ్చిబాబు

    టైటిల్‌:  ది ప్యారడైజ్
    నటీనటులు: నాని, సొనాలి కులకర్ణి, మోహన్బాబు
    దర్శకత్వం: శ్రీకాంత్ఓదెల

    టైటిల్‌: ఆదర్శ కుటుంబం: హౌస్‌‌ నెం. 47
    నటీనటులు: వెంకటేశ్‌, శ్రీనిధి శెట్టి
    దర్శకత్వం: త్రివిక్రమ్శ్రీనివాస్

    టైటిల్‌: ఆకాశంలో ఒక తార
    నటీనటులు: దుల్కర్సల్మాన్‌, సాత్విక వీరవల్లి
    దర్శకత్వం: పవన్సాదినేని

    టైటిల్‌: ఛాంపియన్
    నటీనటులు : రోషన్‌, అనస్వర రాజన్
    దర్శకత్వం: ప్రదీప్‌ అద్వైతం

    టైటిల్‌: ఫంకీ
    నటీనటులు: విశ్వక్సేన్‌, కయాదు లోహార్‌
    దర్శకత్వం : అనుదీప్కేవీ

    టైటిల్‌: రాకాస’
    సంగీత్శోభన్‌, నయనసారిక
    దర్శకత్వం: మాససా శర్మ

    టైటిల్‌:  బైకర్
    నటీనటులు : శర్వానంద్‌, రాజశేఖర్
    దర్శకత్వం : . అభిలాష్ రెడ్డి

    టైటిల్‌:  వీడీ 14(వర్కింగ్‌ టైటిల్‌)
    నటీనటులు: విజయదేవరకొండ, రష్మిక
    దర్శకత్వం : రాహుల్సాంకృత్యన్

  • 'మన శంకరవరప్రసాద్‌గారు' డబుల్‌ సెంచరీ కొట్టారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో యాక్ట్‌ చేశాడు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది.

    డబుల్‌ సెంచరీ
    రెండురోజుల్లోనే సెంచరీ (రూ.100 కోట్లు) కొట్టిన ఈ మూవీ ఇప్పుడు నాలుగురోజుల్లోనే డబుల్‌ సెంచరీ (రూ.200 కోట్లు) మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. 'థియేటర్లలో విజిళ్లు.. బయటేమో హౌస్‌ఫుల్‌ బోర్డులు.. రెండువందల కోట్ల కలెక్షన్స్‌ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు' అంటూ చిరు- అనిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఈ వీకెండ్‌ పూర్తయ్యేసరికి సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

     

     

    చదవండి: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్‌ చేసుకున్నారు: చిరంజీవి

  • ధురంధర్‌.. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్‌ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్‌ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.

    అదేరోజు టాక్సిక్‌ రిలీజ్‌
    ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్‌ టాక్సిక్‌ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్‌ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. 

    డైరెక్టర్‌ క్లారిటీ
    ధురంధర్‌ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్‌ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్‌ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) డైరెక్టర్‌, ధురంధర్‌ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్‌కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్‌కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.

    చదవండి: మల్టీస్టారర్‌ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి..

  • త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను’ అన్నారు యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి.

    నవీన్పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రంఅనగనగా ఒక రాజు’.నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం నెల 14 ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టాక్ని సంపాదించుకుంది. నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.

    సందర్భంగా నవీన్పొలిశెట్టి మాట్లాడుతూ.. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాం. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాం. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది. ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నిర్మాత నాగవంశీ హృదయపూర్వక ధన్యవాదాలుఅన్నారు.

    నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. 2020లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత ఆ స్థాయి తృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది. ఈ సంక్రాంతికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా విషయంలో మీడియా నుంచి వచ్చిన అపారమైన మద్దతుకు ధన్యవాదాలు. ఎందరో సినీ నిర్మాతలు కూడా ఈ సినిమా ఆడాలని కోరుకున్నారు. అందరి ఆశీస్సులతోనే ఈ స్థాయి విజయం లభించిందిఅన్నారు.

  • కన్నడ స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌.బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45. సంగీత దర్శకుడు అర్జున్‌ జన్య దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడలో డిసెంబర్‌ 25న విడుదలైంది. అయితే తెలుగులో మాత్రం కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెలరోజుల్లోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. జీ5లో జనవరి 23న రిలీజ్‌ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

    కథ
    వినయ్‌ (రాజ్‌. బి శెట్టి) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఓ రోజు అనుకోకుండా అతడి బైక్‌ ఢీ కొట్టి రోసీ అనే కుక్క చనిపోతుంది. ఆ కుక్క రాయప్ప(ఉపేంద్ర) అనే డాన్‌కు చెందినది. ప్రాణంగా చూసుకునే కుక్క చావుకు కారణమైన వినయ్‌ను 45 రోజుల్లో చంపాలనుకుంటాడు. అప్పటినుంచి అతడి జీవితం అయోమయంగా మారుతుంది. ఆ సమయంలో వినయ్‌ జీవితంలోకి శివ (శివ రాజ్‌కుమార్‌) వస్తాడు. అసలు ఈ శివ ఎవరు? రాయప్ప వినయ్‌ను చంపేశాడా? చివరకు ఏం జరిగిందనేది తెలియాలంటే 45 సినిమాను ఓటీటీలో చూడాల్సిందే!

     

     

    చదవండి: ది రాజాసాబ్‌ కలెక్షన్స్‌.. ఫస్ట్‌ వీక్‌ ఎంతంటే?

  • అనిల్‌ రావిపూడి సినిమా వస్తోందంటే హిట్టు గ్యారెంటీ.. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాడంటే బ్లాక్‌బస్టర్‌ పక్కా! పైగా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా అంటే బాక్సాఫీస్‌ దద్దరిల్లాల్సిందే.. అనిల్‌ రావిపూడి- చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

    స్పెషల్‌ ఇంటర్వ్యూ 
    నయనతార హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను సంక్రాంతి హిట్‌ బొమ్మగా ప్రేక్షకులు ఆల్‌రెడీ డిసైడ్‌ చేశారు. అందుకే సంక్రాంతి కానుకగా చిరు, వెంకీ, అనిల్‌ రావిపూడిల స్పెషల్‌ ఇంటర్వ్యూ రిలీజ్‌ చేశారు. అందులో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఓ జంట విడాకులు తీసుకోవాలని మూడు నెలలుగా అనుకుంటోంది. 

    విడాకులు క్యాన్సిల్‌
    ఇద్దరూ వేర్వేరుగా మన శంకరవరప్రసాద్‌గారు మూవీ చూశారు. సినిమా చూడగానే ఇద్దరూ ఫోన్‌ మాట్లాడుకుని విడాకులు రద్దు చేసుకుని కలిసిపోయారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి అని హీరో తల్లి చెప్పే డైలాగులు సినిమాలో ఉంటాయి. అవే వారిలో మార్పు తెచ్చాయి. ఇలాంటి సీన్స్‌ రాసిన అనిల్‌ రావిపూడికి హ్యాట్సాఫ్‌' అని మెచ్చుకున్నాడు.

    సినిమా కథ విషయానికి వస్తే..
    శంకర వరప్రసాద్‌(చిరంజీవి) నేషనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌. అతడి భార్య పేరు శశిరేఖ (నయనతార). ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోతారు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని శశిరేఖ తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది. ఆరేళ్ల తర్వాత పిల్లలు చదివే స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా చేరతాడు శంకర్‌. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు ఆయన ఎలా దగ్గరయ్యాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవేంటి? మళ్లీ కలిశారా? లేదా? అన్నదే కథ!

    చదవండి: భర్తతో సమంత తొలి సంక్రాంతి

  • సినిమాలకు సంబంధించి రేటింగ్‌ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్‌ వేదికగా పేరున్న ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాను ప్ర‌క‌టించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్ర‌క‌టించింది. లిస్ట్లో టాప్పొజిషన్లో షారుఖ్ఖాన్కింగ్సినిమా ఉండగా.. ప్రభాస్‌-సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్నస్పిరిట్‌’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్‌ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్‌ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. 

    ఐఎండీబీ ప్రకటించిన టాప్‌ 20 సినిమాలివే...

    1) కింగ్(హిందీ) :
    పఠాన్‌లాంటి బ్లాక్బస్టర్తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్ఖాన్హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్కూడా ఇందులో నటిస్తున్నారు.

    2) రామాయణ (హిందీ)
    రణ్‌బీర్‌ ప్రధాన పాత్రలో నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న మూవీ మొదటి పార్ట్‌ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్బీర్రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్హీరో యశ్‌.. రావణుడిగా కనిపించబోతున్నాడు.

    3) జననాయగన్‌(తమిళ్‌)
    తమిళ స్టార్ హీరో విజ‌య్ నటించిన చివరి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

    4) స్పిరిట్‌(తెలుగు)
    ప్రభాస్హీరోగా సందీప్రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

    5) టాక్సిక్‌(కన్నడ)
    యశ్హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19 చిత్రం విడుదల కానుంది.

    6) బ్యాటిల్ఆఫ్గాల్వాన్

    సల్మాన్‌ఖాన్‌ హీరోగా అపూర్వ లఖియా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’. ఇందులో సల్మాన్ ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఏడాది ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    7) ఆల్ఫా(హిందీ)
    అలియా భట్‌. శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు.

    8) దురంధర్‌ 2 (హిందీ)
    బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌ చిత్రానికి సీక్వెల్ఇది. ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన చిత్రం మార్చి 19 విడుదల కానుంది.

    9) బోర్డర్‌ 2 (హిందీ)
    1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్‌లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

    10) ఫౌజీ
    హను రాఘవపూడి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్‌) : ప్రదీప్ రంగనాథన్(హీరో)

    12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని

    13) పెద్ది(తెలుగు): రామ్చరణ్

    14) డ్రాగన్(తెలుగు)‌: ఎన్టీఆర్

    15) లవ్అండ్వార్‌(హిందీ): రన్బీర్కపూర్

    16) బూత్బంగ్లా(హిందీ): అక్షయ్కుమార్

    17) బెంజ్‌(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.

    18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ

    19) ‘పేట్రియాట్‌ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్

    20) రోమియో (హిందీ):  షాహిద్ కపూర్

  • రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్‌డ్‌ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్‌ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.

    ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా  గ్రాస్‌ వసూళ్ల పరంగా చూస్తే  రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్‌ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్‌ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

    కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్,  బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు.
     

Sports

  • తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్‌-2025 సెకండ్‌ ఎడిషన్‌’ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో మొత్తం 44 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరగనుండడం విశేషం.

    పోటీల షెడ్యూల్ ఇలా:
    గ్రామపంచాయతీ స్థాయి: జనవరి 17 నుంచి 22 వరకు
    మండల/మున్సిపాలిటీ స్థాయి: జనవరి 28 నుంచి 31 వరకు
    అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి: ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు
    జిల్లా స్థాయి: ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు
    రాష్ట్ర స్థాయి: ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు
    గ్రామ స్థాయిలో విజేతలను మండల స్థాయికి, అక్కడి నుంచి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, చివరకు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.

    గత ఏడాది గ్రాండ్ సక్సెస్‌
    2024లో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో దాదాపు మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసారి అసెంబ్లీ స్థాయి చేర్చడంతో పాల్గొనే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు లక్షల మంది క్రీడాకారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.

    క్రీడాజ్యోతి ర్యాలీలతో అవగాహన యువతలో క్రీడలపై అవగాహన పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో క్రీడాజ్యోతి ర్యాలీలు నిర్వహించారు. యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె ప్రతిభను గుర్తించడమే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సీఎం కప్ లక్ష్యమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

    2036 ఒలింపిక్స్‌లో తెలంగాణకు గర్వకారణంగా నిలిచే క్రీడాకారులను తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. గత ఏడాది సీఎం కప్ ఘన విజయాన్ని సాధించిందని, అదే స్ఫూర్తితో రెండో విడత నిర్వహిస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

    క్రీడా సంఘాలు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాభిమానుల సమన్వయంతో పోటీలు విజయవంతమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

    ఆధునిక సాంకేతిక సహకారం
    సీఎం కప్–2025కు ఏఐ కాల్ సెంటర్, వాట్సాప్ బాట్, వెబ్‌సైట్, ఏఐ చాట్‌బాట్ ద్వారా సమగ్ర సమాచారం అందించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డా. సోనీ బాలాదేవి తెలిపారు. పాల్గొనే ప్రతి క్రీడాకారి వివరాలను కంప్యూటరీకరించి భద్రపరిచే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
     

  • ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026ను ఐదుసార్లు ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో పేసర్ హెనిల్ పటేల్ కీలక పాత్ర.  ఈ మ్యాచ్‌లో హెనిల్ పటేల్ తన సంచలన బౌలింగ్‌తో అమెరికాను బెంబేలెత్తించాడు.

    ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ తన మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ అమ్రీందర్ గిల్‌ను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. మొత్తంగా హెనిల్‌ 7 ఓవర్లలో కేవలం 16 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్‌గా హెనిల్ నిలిచాడు. దీంతో ఈ యువ సంచలనం గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

    ఎవరీ హెనిల్ పటేల్‌?
    హెనిల్ ప‌టేల్‌.. ఫిబ్రవరి 28, 2007 న గుజరాత్‌లోని వల్సాద్‌లో జన్మించాడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే క్రికెట్ వైపు అడుగులు వేశాడు. అత‌డు అహ్మదాబాద్‌లోని ఓ క్రికెట్‌లో ఆకాడ‌మీలో క్రికెట్ ఓన‌మాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హెనిల్ స్దానిక టోర్నీల్లో రాణించి గుజరాత్ అండర్-19 సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

    గుజరాత్ అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 జ‌ట్ల త‌ర‌పున నిల‌క‌డ‌డంతో రాణించడంతో ఇండియా-ఎ అండ‌ర్ 19 జ‌ట్టుకు అత‌డు ఎంపిక‌య్యాడు. అక్క‌డ కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో అండర్-19 ప్రపంచకప్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నాడు. త‌న తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ మ్యాచ్‌లోనే హెనిల్ స‌త్తాచాటాడు.

    బంతిని లేట్ స్వింగ్ చేయ‌డం హెనిల్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అంతేకాకుండా బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్టే విధంగా బౌన్స‌ర్లు కూడా సంధించ‌గ‌ల‌డు.  కేవలం 18 ఏళ్ల వయసులోనే బుమ్రా వంటి దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లు కనిపిస్తున్న ఈ యువ సంచ‌ల‌నం త్వ‌ర‌లోనే సీనియ‌ర్ జ‌ట్టుకు ఆడుతాడ‌ని క్రికెట్ నిపుణులు జోస్యం చెబుతున్నారు.

    బుమ్రా వంటి స్పీడ్ స్టార్ కూడా గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హెనిన్  ఇప్పటివరకు భారత్ తరపున 3 యూత్ టెస్టులు, 12 యూత్ వన్డేలు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. గత నెలలో జరిగిన అండర్-19 ఆసియా కప్‌లోనూ 4 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు.

     

  • టీ20 ప్రపంచకప్‌-2026కు భారత్, శ్రీలంక  వేదికలగా మరో 20 రోజుల్లో తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. రిషబ్ పంత్ ప్రస్తుతం టీ20 ప్రణాళికల్లో లేకపోయినప్పటికి.. స్క్వాడ్‌లో ఉన్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలు ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారాయి.

    ప్రపంచకప్ ఆరంభ సమయానికి తిలక్ కోలుకునే అవకాశమున్నప్పటికి.. వాషింగ్టన్ అందుబాటుపై మాత్రం సందిగ్ధం నెలకొంది. సుందర్ ప్రస్తుతం ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు కివీస్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

    వాషీ కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనునున్నట్లు తెలుస్తోంది. అతడు పొట్టి ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అతడి అందుబాటుపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశముంది.

    వరల్డ్‌కప్ జట్టులోకి పరాగ్‌..
    మరోవైపు వాషింగ్టన్ సుందర్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తీసుకోవాలన్నదానిపై సెలెక్టర్లు కసరత్తలు మొదలు పెట్టినట్లు సమాచారం. అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.

    హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కూడా పరాగ్‌కు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పరాగ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంక పర్యటనలో పరాగ్ ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు.

    లంకతో ఓ టీ20 మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం వన్డే మ్యాచ్‌లో కూడా 9 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఈ పర్యటన ద్వారా రియాన్  కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, కీలక సమయాల్లో వికెట్లు తీయగలే సత్తా ఉంది అని  నిరూపించుకున్నాడు. 

    అయితే ఆ తర్వాత భుజం గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. రియాన్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. అతడు దాదాపు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు సమాచారం.  పరాగ్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు.. బంతితో అద్భుతాలు కూడా చేయగలడు. కాబట్టి చాలా మంది మాజీలు వాషీకి సరైన ప్రత్యామ్నాయం రియాన్ అని అభిప్రాయపడుతున్నారు.
    చదవండి: కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌

  • రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.

    భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్‌తో పాటు బంతితో విఫలమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.

    రాజ్‌కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో  60 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్‌తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.

    టెస్ట్ క్రికెట్‌లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్‌గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.

    2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మం‍చిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పఠాన్ పేర్కొన్నాడు.
    చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌
     

  • బిగ్ బాష్ లీగ్‌-2025లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సిడ్నీ సిక్సర్సకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్‌.. శుక్రవారం సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 190 పరుగుల లక్ష్య చేధనలో స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్మిత్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.

    సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సిడ్నీ థండర్ బౌలర్ రైన్ హాడ్లీని స్మిత్ టార్గెట్ చేశాడు. రైన్ హాడ్లీ వేసిన 12వ ఓవర్‌లో స్మిత్ వరుసగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లో తన నాలుగో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను స్మిత్ అందుకున్నాడు.

    స్మిత్ 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా వంద పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు బాబర్ ఆజం(39 బంతుల్లో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సిడ్నీ సిక్సర్‌ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. సిడ్నీకి ఇది వరుసగా నాలుగో విజయం.

    వార్నర్ సెంచరీ వృథా..
    ఇక ఇదే మ్యాచ్‌లో ఆసీస్ మాజీ ఓపెనర్, సిడ్నీ థండర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా శతక్కొట్టాడు. 65 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు చేసి వార్నర్‌ అజేయంగా నిలిచాడు. మిగితా ప్లేయర్ల నుంచి పెద్దంగా సహకరం లేకపోవడంతో సిడ్నీ 200 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. 

    తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్‌ బౌలర్లలో సామ్‌కుర్రాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్‌, స్టార్క్‌, బెన్ మనేంటి తలా వికెట్‌ సాధించారు. కాగా వార్నర్‌కు ఈ ఏడాది సీజన్‌లో ఇది రెండో సెంచరీ.

    స్మిత్ స‌రికొత్త చ‌రిత్ర‌
    ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన స్మిత్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.  బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యంత‌వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన రెండో ప్లేయర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో మిచెల్ ఓవెన్, క్రెయిగ్ సిమన్స్ అగ్ర‌స్దానంలో ఉన్నారు. వీరిద్ద‌రూ కేవ‌లం 39 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నారు.

    అంతేకాకుండా బిగ్ బాష్ లీగ్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా స్మిత్(4) రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు డేవిడ్‌ వార్న‌ర్‌, బెన్ మెక్‌డెర్మాట్‌ల పేరిట ఉండేది. వారిద్ద‌రూ త‌మ బీబీఎల్ కెరీర్‌లో మూడు సెంచ‌రీలు చేశాడు. తాజా సెంచ‌రీతో వీరిద్ద‌రిని స్మిత్ వెన‌క్కి నెట్టాడు.
    చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా ఆడించండి: అశ్విన్‌


     

     

  • రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర ప‌ర‌భావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.

    అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్‌దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.

    "బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్‌తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్‌దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.

    అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.

    అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్‌లు ఆడకుండా బెంచ్‌పై  కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: T20 WC 2026: అతడి కోసం​ బీసీసీఐ 'ప్లాన్‌ బి'.. రేసులో స్టార్‌ ప్లేయర్లు

  • టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అఫ్గానిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్ గాయం కారణగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. నవీన్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు.

    అయితే వరల్డ్‌కప్ సమయానికి అతడు కోలుకుంటాడని జట్టులో సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడి గాయం తీవ్రత మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నెలాఖరులో తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం.

    ఈ కారణంతోనే వరల్డ్‌కప్‌తో పాటు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరి కొన్ని నెలల పట్టనున్నట్లు అఫ్గాన్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ రైట్ ఆర్మ్ పేసర్ దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

    ఆసియాకప్‌-2025కు కూడా దూరంగా ఉన్నాడు. కాగా నవీన్ స్దానంలో ఇంకా అధికారికంగా ఎవరినీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించలేదు.  రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ, అల్లా గజన్ఫర్ లేదా ఇజాజ్ అహ్మద్‌జాయ్‌లలో ఒకరు ప్రధాన జట్టులోకి వచ్చే అవకాశముంది.

    టీ20 ప్రపంచ కప్ 2026కు అఫ్గాన్‌ జట్టు:
    రషీద్ ఖాన్ (కెప్టెన్‌), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెడిఖుల్లా అటల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా, రమ్‌మానులీ, రమ్‌మతుల్లా, ఉమర్‌జాయి, జద్రాన్. రిజర్వ్‌లు: అల్లా ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ
    చదవండి: T20 WC 2026: అతడి కోసం​ బీసీసీఐ 'ప్లాన్‌ బి'.. రేసులో స్టార్‌ ప్లేయర్లు
     

  • టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సుందర్ గాయపడ్డాడు.

    దీంతో ఆఖరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడు టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పాల్గోనడం కూడా అనుమానంగా మారింది. సుందర్ ప్రస్తుతం పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. తొలుత అతడిది సాధారణ వెన్ను నొప్పి అని వైద్యులు భావించారు. కానీ తర్వాత స్కాన్లలో అతడి గాయం తీవ్రమైనది తేలింది.

    దీంతో వాషింగ్టన్ మరో రెండు మూడు రోజుల్లో పునరావాసం పొందేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. అక్కడి వైద్య బృందం సుందర్ పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంపై స్పష్టత ఇవ్వనున్నారు.  అయితే సుందర్ విషయంలో బీసీసీఐ ప్లాన్ బితో ఉన్నట్లు తెలుస్తోంది.

    "వాషింగ్టన్ సుందర్ వరల్డ్‌కప్ లీగ్ దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే సూచనలు కన్పించడం లేదు. కాబట్టి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాకప్ ప్లాన్ గురుంచి కచ్చితంగా ఆలోచించాలి. మెడికల్ టీమ్ నుంచి పూర్తి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.

    భారత్ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌లు ఎక్కువగా అసోసియేట్ జట్లతో ఆడాల్సింది. కాబట్టి ప్రస్తుతానికి సుందర్ స్ధానంలో ఎవరినీ భర్తీ చేసే ఆలోచనలో సెలెక్టర్లు ఉండకపోవచ్చు. అతడు కోలుకోవడానికి తగినంత సమయం దొరికే అవకాశముంది. సుందర్ జట్టుతో పాటు కొనసాగే అవకాశముంది.

    ఒకవేళ అతడు టోర్నీ కీలక దశ సమయానికి కోలుకుంటే నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో రానున్నాడని" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా జనవరి 31 లోపు జట్లలో మార్పులు చేసుకునే అవకాశముంది. ఒకవేళ సుందర్ గ్రూప్ దశ దాటాక కూడా కోలుకోలేడని తేలితే, అతడి స్ధానంలో మరొక ఆటగాడిని బీసీసీఐ తీసుకుంటుంది. సుందర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు రియాన్ పరాగ్‌, అయూశ్ బదోని, షాబాజ్ అహ్మద్ వంటి వారు రేసులో ఉన్నారు.
    చదవండి: The Hundred 2026: స్మృతి మంధాన కీలక నిర్ణయం

National

  • తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి వేదికను ఇచ్చేదే లేదని కేరళలోని పినరయి విజయన్ సర్కారు తేల్చిచెప్పింది. ఈ నెల 23న ప్రధాని మోదీ పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తిరువనంతపురం రానున్నారు. దీంతో.. ఆయన కోసం ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావించింది. ఈ క్రమంలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం అనువైనదిగా భావించింది. ఆ మేరకు కేరళ సర్కారుకు ఓ లేఖ రాసింది.

    రైల్వే శాఖ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ స్టేడియాన్ని ప్రధాని కార్యక్రమానికి ఇచ్చేదేలేదని స్పష్టం చేసింది. ‘‘అదేంటి? గణతంత్ర వేడుకలకు మూడ్రోజుల సమయం ఉంటుంది కదా?’’ అని రైల్వే అధికారులు ప్రశ్నించగా.. రిహార్సల్స్ ఉంటాయని పేర్కొంది. దాంతో చేసేది లేక.. రైల్వే అధికారులు వెనుదిరిగారు. 

    కేరళ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. పుతారికండం మైదానంలో ప్రధాని సభను ఏర్పాటు చేస్తామని వివరించారు. అటు రైల్వే అధికారులు కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని పరిశీలించినా.. అక్కడ క్రికెట్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యి ఉండడంతో బీజేపీ సూచించిన పుతారిఖండం మైదానానికి ఓకే చెప్పారు. నిజానికి సెంట్రల్ స్టేడియం అయితే.. ఎస్పీజీ భద్రత అనుమతులు సులభమవుతాయి. మిగతా ప్రాంతాల్లో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. కాస్త ఇబ్బందికర పరిణామాలుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గుడ్‌న్యూస్..! 8వ వేతన సంఘం ఉద్యోగులకు భారీ ఊరట కల్పించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. కరువు భత్యం(డీఏ) 3-5% మేర పెరిగి.. మూలవేతనంపై 70శాతానికి చేరుకోనున్నట్లు ఆర్థిక నిపుణులు, ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. 2025 జూలైలో డీఏ 58శాతంగా ఉంది. 

    మోదీ సర్కారు 8వ వేతన సంఘం ద్వారా 3-5% మేర డీఏను రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పెంచనున్నట్లు ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. ఈ ప్రకటన వెలువడగానే.. ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఒక్కసారి డీఏను ప్రకటిస్తే.. వెంటనే అమల్లోకి వచ్చినా, ఉద్యోగుల వేతనాల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే. 

    అయితే.. ఏటా ఆ మేరకు డీఏ పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాది 63శాతానికి చేరనున్న డీఏ.. అది పూర్తిస్థాయిలో అమలయ్యేనాటికి.. అంటే.. వచ్చే ఏడాది ప్రథమార్థానికి 70శాతానికి చేరుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొత్త డీఏ అమలైతే.. కనీస వేతనాలు భారీగా పెరిగే అవకాశాలుంటాయి.  అయితే ఇది 5వ, 6వ వేతన కమిషన్‌లతో పోలిస్తే చాలా తక్కువ. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంపై 74 శాతం (1996–2006), 124 శాతం (2006–2016) డీఏ పొందారు.

  • మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు.  పురపాలిక ఎన్నికల్లో బీజేపీ కూటమికి పట్టం కట్టినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ "శక్తివంతమైన ప్రజలు ఎన్డీఏ ఎజెండాకు సుపరిపాలనకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏతో ప్రజలు ఏవిధంగా భాగస్వామ్యమయ్యారో చూపుతున్నాయి. ప్రజలందరికీ నా ధన్యవాదాలు" అని మోదీ  తెలిపారు.

    అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన ప్రతి కార్యకర్తను చూసి తాను గర్వపడుతున్నానని మోదీ అన్నారు. మహాయుతి కూటమి రాబోయే రోజుల్లోనూ ఇదే విధమైన ట్రాక్ రికార్డును మెయింటెన్ చేస్తుందని ప్రతిపక్షాల అబద్ధాలను సమర్థవంతంగా తిప్పికొడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మరోవైపు ఈ విజయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మన్సిపల్ ఎన్నికల్లో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందుత్వ ఎప్పుడు తమ ఆత్మని, హిందుత్వాన్ని అభివృద్ధి నుండి ఎవరూ దూరం చేయలేరని ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో జరిగిన 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలలో 25చోట్ల మహాయుతి కూటమి మేయర్ స్థానాన్ని ఏర్పాటు చేయచోతుందని సీఎం ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు.

     కాగా మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతీ కూటమి దూసుకపోతుంది. ముంబైతో సహా 19 కార్పోరేషన్‌లలో స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది.

  • భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ  కు సంబంధించిన ఒక శుభవార్త  ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది.  అలీబాగ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్‌ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

    మహరాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్‌లోని గాట్ నంబర్లు 157  158లోని విలేజ్ జిరాద్‌లో  ఈ  భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్‌పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు.  నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. 

    ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం

    మరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్‌లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్‌లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్‌ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్‌ను కొనుగోలు చేసినవారిలో  ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది  సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్‌లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్‌లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో  ఉండటం విశేషం.
    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

  • ఈ  కామర్స్‌ సంస్థలకు  ఇండియాలో భారీ షాక్‌ తగిలింది.  పెద్ద ఎత్తున వాకీ-టాకీల అక్రమ అమ్మకాలు చేపట్టాయంటూ మెటా ప్లాట్‌ఫామ్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సీసీపీఏ) జరిమానా విధించింది. 

    సున్నితమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లపై పనిచేసే అనధికార రేడియో పరికరాల వల్ల ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాలను గుర్తించినట్టు భారతదేశ వినియోగదారుల వాచ్‌డాగ్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తెలిపింది. జనవరి 16న 16,900 కంటే ఎక్కువ నాన్-కాంప్లైంట్ వాకీ-టాకీల జాబితాలను గుర్తించిందని (వీటినే పర్సనల్ మొబైల్ రేడియోలు (PMRలు) అని కూడా పిలుస్తారు) వీటిని తప్పనిసరి ఆమోదాలు లేకుండా విక్రయిస్తున్నట్టు  గుర్తించినట్టుపేర్కొంది.  ఈ కారణంగా  అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ , మెటా,  మీషోలపై రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే   జియోమార్ట్, చిమియా,  టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్‌లపై ఒక్కొక్కటి ఒక లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు అథారిటీ తెలిపింది. అనేక ప్లాట్‌ఫామ్‌లు జరిమానాలు చెల్లించాయని, మిగిలిన సంస్థల నుండి చెల్లింపులు వేచి ఉన్నామని తెలిపింది.

    ప్రభుత్వ అనుమతులు లేకుండా వాకీ-టాకీల , ఇతర రేడియో పరికరాలు జాబితా చేయ బడకుండా లేదా విక్రయాలు జరగకకుండా చూసుకోవాలని CCPA ఆదేశించింది. ఇందుకు ఆయా సంస్థలు క్రమం తప్పకుండా స్వీయ-ఆడిట్‌లను నిర్వహించాలని, సమ్మతి ధృవీకరణ పత్రాలను ప్రచురించాలని, నియంత్రిత వైర్‌లెస్ పరికరాలు చట్టానికి పూర్తిగా అనుగుణంగా మాత్రమే విక్రయించబడుతున్నాయని నిర్ధారించుకోవాలని కూడా ఇది కోరింది. (పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం)

    భారతదేశంలో వాకీ-టాకీల అమ్మకం, దిగుమతి ,వినియోగం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టం, 1933,  ప్రకారం తక్కువ శక్తి మరియు చాలా తక్కువ శక్తి కలిగిన షార్ట్ రేంజ్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాల వాడకం (లైసెన్సింగ్ అవసరం నుండి మినహాయింపు) నియమాలు, 2018 ప్రకారం నియంత్రించబడతాయి.

    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

  • ముంబై మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ కూటమి బృహాత్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఠాక్రేల చేతిలో ఉన్న ముంబై మేయర్  పీఠం తొలిసారిగా వారి చేజారనున్నట్లు  ఫలితాల ట్రెండ్ స్పష్టం చేస్తోంది.

    ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మెుత్తం 227 స్థానాలుండగా బీజేపీ 88 స్థానాలు, శివసేన శిండే(28 స్థానాల్లో అధిక్యంలో ఉంది. శివసేన (ఠాక్రే) 74 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో మహాయుతి కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. మెుత్తంగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగగా బీజేపీ 19 చోట్ల స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. సాయంత్రం 5 గంటలకు అందిన నివేదికల ప్రకారం మెుత్తంగా 2,869 స్థానాలలో మహాయుతి కూటమి 1600 స్థానాల్లో అధిక్యం దూసుకపోతుంది.

    • మెుత్తంగా పార్టీల వారిగా

    • బీజేపీ:1304

    • శివసేన (శిండే): 363

    • కాంగ్రెస్ : 278 

    • శివసేన (ఠాక్రే):151

    • ఎన్సీపీ : 127

    • ఎంఐఎం: 77

    • ఇతరులు: 278

    అయితే ఈ ఫలితాలపై బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని మరాఠా ప్రజలు ఆశీర్వదించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మహారాష్ట్రలో వచ్చే 20-25 ఏళ్ల పాటు బీజేపీ పాలిస్తుందని తెలిపారు. మహాయుతి కూటమిపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ ఫలితాలు ఉదాహరణ అని ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తెలిపారు. 

    మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
  • పాముతో చెలగాటం వద్దు అని చెప్పినా వినలేదు. అందులోనూ విషపూరితమైన సర్పం..జాగ్రత్త అని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెట్టాడు. చివరికి విషాదం చోటు చేసుకుంది.    దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    Ghar Ke Kalesh @gharkekalesh అనే ఎక్స్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియో ప్రకారంఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల రాజ్ సింగ్ నాగుపాము కాటుతో  ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది.  ‘నాకంటే వీరుడు ఈ ప్రపంచంలో ఉన్నాడా’ అంటూ  విన్యాసాలు మొదలు పెట్టాడు.  అది చాలా పవర్‌ ఫుల్‌.. విషనాగు, దాన్ని వదిలేయ్‌ అని చాలామంది హెచ్చరించారు. 

    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

    అయినా పట్టించుకోకుండా, ఆరడుగుల నాగుపామును మెడకు చుట్టుకుని  రోడ్డుపై విన్యాసాలు చేశాడు. పామును తన మెడలో స్కార్ఫ్ లాగా చుట్టుకుని, నవ్వుతూ, కెమెరా ముందు పోజులిచ్చాడు.  ఈ క్రమంలో ఆ పామును  అతడిని మూడుసార్లు కాటు వేసింది. విషం వేగంగా శరీరమంతా పాకింది.  ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిర్లక్ష్యానికి తన ప్రాణాన్నే బలిపెట్టాడు. 

    ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనం


     

  • పండగ వేళ బిహార్‌లోని జరిగిన ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.  ఈ ఘటనతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోగా, ఈ ప్రమాదం తరువాత  స్థానికుల అమానవీయ ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో, పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాఝీహట్ గ్రామం సమీపంలో జరిగింది.

    ఏడో తరగతి విద్యార్థి రితేష్ కుమార్ అలియాస్‌ గోలు  పొద్దున్నే ప్రైవేట్‌కు వెళుతున్నాడు. ఇంతలో వేగంగా  దూసుకు వచ్చిన ఒక పికప్ ట్రక్కు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొన్న ధాటికి, సమీపంలో ఉన్న వారు బెంబేలెత్తిపోయారు. కేకలు వేశారు. కొద్దిసేపటికే బాలుడి రితేష్ తండ్రి సంతోష్‌ దాస్‌, ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. విగతజీవిగా మారిన బిడ్డను  చూసి  తీవ్ర దుఃఖంతో కుప్పకూలిపోయారు.

     

    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

    హృదయాల్ని మెలిపెట్టే  దృశ్యాలు,  మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్న మాటలకు అక్షర సత్యాలుగా నిలిచాయి. బాలుడిని ఢీకొట్టిన ట్రక్‌ చేపల్ని రవాణా చేస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కులో చేపలు నిండి ఉన్నాయి, ప్రమాదం జరిగిన తర్వాత అవి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.  ఒక పక్క విద్యార్థి తల్లిదండ్రులు దుఃఖంతో విలపిస్తోంటే, రోడ్డుకు అవతలి వైపు దృశ్యం చాలా భిన్నంగా ఉంది.

    ఇదీ చదవండి: మరో నిర్వాకం : అటు ఇండిగో, ఇటు ప్రయాణికులు, వైరల్‌ వీడియో

    సహాయం అందించడానికి, అంబులెన్స్‌కు ఫోన్ చేయడానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి బదులుగా, సంఘటనా స్థలంలో గుమిగూడిన చాలా మంది చేపలను  అందిన కాడికి దోచుకోవడం ప్రారంభించారు. ఆ చిన్నారి మృతదేహం సమీపంలోనే పడి ఉండగా, కొందరు వ్యక్తులు సంచులలో చేపలను నింపుకుని, మరికొందరు చేతులతో చేపలను పట్టుకుని పారిపోవడం విచారకరం.

    ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పుప్రి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. రితేష్ మృతదేహాన్ని ఆధీనంలోకి తీసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు.  ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్కును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • సాక్షి బెంగళూరు: కర్ణాటకలో  కారుతో బీభత్సం సృష్టించిన ఒక ఆకతాయికి పోలీసులు తగిన శిక్ష వేశారు.  నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మాడిఫై చేసిన కారుతో సినిమా స్టంట్‌లు చేస్తూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీభత్సం సృష్టించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారి పోలీసుల వరకూ చేరడంతో రూ. లక్షకు పైగా జరిమానా విధించారు.

    ఇటీవలే  న్యూఇయర్ వేడుకలు జరుపకోవడానికి కేరళ కన్నూరుకు  చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరుకు వచ్చారు. అయితే అతను 2002కు చెందిన హోండా సిటీ కారును రూ. 70 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం దానిని రూ. లక్ష ఖర్చు చేసి ఆధునాతనంగా మాఢిపై చేయించాడు. ఈ కారుతో బెంగళూరు రోడ్లపై ప్రమాద కరంగా విన్యాసాలు చేశాడు. మంటలు విదజిమ్ముతూ కారును నడిపాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.    

    దీంతో వీటిని చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వాటి వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఆ కారును స్వాధీన పరుచుకొని అనంతరం దానిపై రూ. 1,11,500 భారీ జరిమానా విధించారు. ఆ యువకుడు ఆ మెుత్తాన్ని చెల్లించడంతో కారును అతనికి అప్పజెప్పినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ విధంగానే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

  • పైలట్ల కొరత, విమానాల రద్దు, పైలట్ల పనిగంటల తదితర అంశాలపై ఇప్పటికే చాలా విమర్శలెదుర్కొన్న ఇండిగో మరో వివాదంలో చిక్కుకుంది. డ్యూటీ సమయం ముగిసిన తర్వాత  కూడా  మరో విమానాన్ని నడపమని సంస్థ కోరడం, దీనికి  పైలట్ నిరాకరించడంతో గందరగోళం నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ముంబై నుండి థాయ్‌లాండ్‌లోని క్రాబీకి వెళ్లే ఇండిగో విమానానికి సంబంధించి గురువారం నాడు ఈ విపత్కర పరిస్థితి  ఏర్పడింది. అయితే  ఈ ఘటనపై ఇండిగో స్పందన  ఎలా ఉందంటే..

    ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఉదయం 4:05 గంటలకు బయలుదేరాల్సిన ఇండిగో విమానం, 6E 1085, మూడు గంటలకు పైగా ఆలస్యమైంది. ఉదయం 10 గంటలకు క్రాబీలో ల్యాండ్ కావాల్సిన విమానం, ఫ్లైట్‌రాడార్24 ప్రకారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి చేరుకుంది.

    విమానంలోని ప్రయాణికులకు, క్యాబిన్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదానికి దిగిన  వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. తన డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి పైలట్ విమానాన్ని నడపడానికి నిరాకరించాడని, ఈ కారణంతా తాము మూడు గంటలు పాటు ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. విమానం ఆలస్యం కారణంగా తమకు జరిగిన అసౌకర్యంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  తమ ప్లాన్ల పరిస్థితి ఏంటి అని  ఒక ప్రయాణికుడు మండిపడ్డారు. మరి కొంతమంది తీవ్ర ఆగ్రహంతో దుర్బాషకు దిగారు. 

    ముంబై-క్రాబీ విమానంలో జరిగినట్లు నివేదించబడిన ఈ సంఘటనను వీడియో తీసి రచయిత తరుణ్ శుక్లా  ఎక్స్‌లో షేర్ చేశారు. దీని ప్రకారం ‘‘ఇండిగో హాయ్ హాయ్" అని నినాదాలు చేయడం చూడవచ్చు. ఒక మహిళ "ఎలుకలా ఎందుకు దాక్కున్నాడు? బ్లడీ ఇడియట్" అని అరవడం, మరో ప్రయాణికుడు విమానం ఎగ్జిట్ డోర్‌ను తన్నడం కూడా కనిపించింది.

    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

    ఇండిగో స్పందన
    విమానం ఆలస్యంపై ఇండిగో స్పందించింది.  ఇన్‌కమింగ్ విమానం ఆలస్యంగా రావడం, విమాన ట్రాఫిక్ రద్దీ , సిబ్బంది తమ డ్యూటీ సమయ పరిమితులను మించడం వంటి అనేక కారణాల వల్ల ముంబై నుండి విమానం ప్రారంభంలో ఆలస్యమైందని ఇండిగో ప్రతినిధి తెలిపారు. వేచి ఉండే సమయంలో విమానంలోని ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించారనీ, వారిని క్రమశిక్షణ లేనివారిగా ప్రకటించామని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ వివాదంతో ప్రోటోకాల్ ప్రకారం, వారిని విమానం నుండి దించి భద్రతా సంస్థలకు అప్పగించే క్రమంలో విమానం బయలుదేరడం మరింత ఆలస్య మైందని వివరించింది.  గతంలో వెయిటింగ్‌ పీరియడ్‌లో ప్రయాణికులకు  లంచ్‌,  డ్రింక్స్‌లాంటివి అందించామని తెలిపింది. అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని అందిండచమే లక్ష్యమని, వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. 

    ఇదీ చదవండి: 5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్‌ టెక్నాలజీ

  • ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూట్‌ ప్రకటన వచ్చేసింది.  సోమవారం(జనవరి 19వ తేదీ) బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం గం. 2 నుంచి గం. 4 వరకూ నామినేషన్‌ దాఖలు ఉంటుంది. సాయంత్రం గం. 4 నుంచి నామినేషన్ల పరిశీలన, సాయంత్రం గం 6 వరకూ ఉపసంహరణ గడువు ఉంటుంది. 

    అనంతరం తదుపరి మంగళవారం(జనవరి 20వ తేదీ) మధ్యాహ్నం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 మధ్య జాతీయ అధ్యక్షుడి ప్రక్రియ పూర్తి చేస్తారు.  ఏకాభిప్రాయం కుదిరితే ఎంపిక, లేకపోతే ఎన్నిక ఉంటుందని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి డా.లక్ష్మణ్‌ ప్రకటించారు. 

    ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ
  • శబరిమల అయ్యప్ప బంగారు అభరణాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శబరిమల ప్రధాన ధ్వజస్తంభంతో  పాటు ఇతర విగ్రహాలకు సంబంధించిన బంగారం అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రావెన్ కోర్ బోర్డు మాజీ అధ్యక్షుడు పి.ఎస్ ప్రశాంత్ ను అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

    శబరిమల బంగారు అభరణాల చోరీ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇదివరకే ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుతో, ఉన్నిక్రిష్ణన్ పొట్టితో సహా ఇతరులను సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆలయ బంగారు అభరణాల పూత కేసులో మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ మరోసారి విచారణకు రావాలని సిట్ అధికారులు ఆదేశించారు.

    సిట్ అధికారులు జరిపిన విచారణలో ఆలయ ధ్వజస్తంభం నుంచి కూడా బంగారం చోరీకి గురయిందని అధికారులు భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ధ్వజస్తంభానికి ఉన్న లోహాన్ని తిరిగి  వినియోగించాలి. అయితే జెండా స్తంభానికి ఉన్న బంగారం,  వాజివాహనం(గుర్రం) వంటి ఇతర విగ్రహాలతో కూడిన రిజిస్టర్ ప్రస్తుతం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.

    అయితే 2019లో శబరిమల గోల్డ్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే తిరిగి 2025లో బంగారు పలకాల పూత కాంట్రాక్టు అప్పగించడంపై దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడి తీరుపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు విచారించగా తిరిగి మరోసారి దర్యాప్తుకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

  • ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వస్తున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా  దాడి చేశారని మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 100 మంది పోలీసులు తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆయన  ఆరోపించారు.

    ‘పోలీసులు తమ ప్రతాపం నేరస్తుల మీద చూపించాలి కానీ.. కార్యకర్తల మీద కాదు.. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. మేము దీనిపై మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ)నమోదు చేస్తున్నాం" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎల్‌ఎంసీ)ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఇక్కడ మొత్తం 18 వార్డుల్లోని 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. మేజిక్ ఫిగర్ సాధించడానికి 36 స్థానాలు అవసరం కాగా, జనవరి 15న జరిగిన పోలింగ్‌లో నగరంలో 60.07 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) మధ్య నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ లాఠీఛార్జ్ ఘటన జరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
     

    రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నాలుగేళ్ల ఆలస్యం తర్వాత, శివసేనలో చీలిక వచ్చి షిండే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరుగుతున్న తొలి బీఎంసీ ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గురువారం జరిగిన పోలింగ్‌లో ముంబైలో 52.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2017లో నమోదైన 55.53 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. 

    ఇది కూడా చదవండి: ‘బీఎంసీ’ ఓట్ల లెక్కింపు వేళ.. రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు
     

  • సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల కట్టల వ్యవహారంలో.. జస్టిస్‌ యశ్వంత్‌వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనను తొలగించాలని కోరుతూ వచ్చిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించడంతోపాటు తనపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన పార్లమెంటరీ ప్యానల్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. 

    గతేడాది మార్చిలో..  ఢిల్లీ హైకోర్టు జడ్జిగా యశ్వంత్‌ వర్మ విధులు నిర్వహిస్తున్న టైంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక గదిలో పెద్దఎత్తున నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తన వెబ్‌సైట్‌లో వీడియో, ఫొటోలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఆపై ఈ అంశంపై దర్యాప్తునకు అంతర్గత త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసింది. 

    విచారణ జరిపిన కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో పదవి నుంచి వైదొలగాల్సిందిగా సుప్రీంకోర్టు సూచించింది. కానీ, ఆయన దానికి అంగీకరించకపోవడంతో పార్లమెంటులో అభిశంసనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో.. స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్‌ వర్మకు అక్కడ మళ్లీ చుక్కెదురైంది. 

    లోక్‌సభ స్పీకర్‌ జడ్జెస్‌ (Inquiry) Act, 1968 ప్రకారం కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చట్టబద్ధం కాదని వర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదించారు. అయితే.. లోక్‌సభ సెక్రటేరియట్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ కమిటీ చట్టబద్ధమేనని కారణాలతో సహా వివరించారు. వాదనలు విన్న జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం జనవరి 8వ తేదీన తీర్పు రిజర్వ్‌ చేసింది. ఇవాళ జస్టిస్‌ వర్మ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది.

International

  • ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో కీలకంగా భావిస్తున్న ఎఫ్‌-14 ఫైటర్‌ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.

    ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్‌తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్‌ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్‌కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది.  

    అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్‌ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్‌ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.

    ఎఫ్-14 ప్రత్యేకతలు 
    ఎఫ్‌-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి.  అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్‌గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

  • టెహ్రాన్: ఇరాన్‌లో నిరసనలు చేస్తున్న వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మతాధికారి అహ్మద్ ఖటామీ ఈ మేరకు మరణ ఆజ్ఞలను విడుదల చేశారు. ‘‘ఇది దేవుని తీర్పు’’ అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టెహ్రాన్‌లో జరిగిన ప్రార్థనలకు నాయకత్వం వహించారు. 

    ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక రేడియో వెల్లడించింది. నిరసనకారులను ఉరితీయాలంటూ ఖటామీ ఫత్వాను జారీ చేయగానే.. ఆ ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఇదే వేదికపైనుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా ఖటామీ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఇరాన్‌పై దాడిని వాయిదా వేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న మర్నాడే.. ఖటామీ నుంచి ఈ తరహా ఫత్వా జారీ కావడం గమనార్హం..! గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులను తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. అటు ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో ఇరాన్ ఉప రాయబారి గులాం హుస్సేన్ దర్జీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేశారు. 

    తమ దేశంలో గందరగోళానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల వెనక అమెరికా వ్యూహాత్మక హస్తముందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మళ్లీ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీపై గుర్రుగా ఉన్నట్ల తెలుస్తోంది. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ట్రంప్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇదెలా ఉండగా.. ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) అధికారులు ప్రకటించారు. గూఢచర్యం నేరానికి ఇరాన్‌లో మరణశిక్ష ఉంటుంది. తాము అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారని, వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులని ఆరోపించారు.
     

  • బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విద్వేశజ్వాలలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నసంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి హింస చెలరేగింది. అక్కడి మత ఛాందసవాదులు సిల్హట్ జిల్లాలో  హిందూ కుటుంబం ఉన్న ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఇది గమనించిన ఆ కుటుంబ సభ్యులు హుటాహుటీన అక్కడి నుండి పరుగు తీశారు.

    బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస తీవ్రరూపం దాలుస్తుంది. షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు ఏదో రకంగా అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కడి విద్యార్థినేత ఉస్మాన్‌ సౌదీ మరణంతో అక్కడి మైనార్టీలపై దాడులు మరోసారి తీవ్రతరమయ్యాయి. అప్పట్నుంచి దాదాపు 42 ఘటనలు జరుగగా దాదాపు 12మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అక్కడి దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బంగ్లా ప్రభుత్వం స్పందించడం లేదు.

    తాజాగా మరోసారి ఆ దేశంలో మత విద్వేశం చెలరేగింది. బంగ్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓ హిందూ ఇంటికి అక్కడి అల్లరిమూకలు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిల్హాట్ జిల్లా గోవైన్ ఘాట్ ఉపజిల్లా నందిర్‌గ్రామంలో బీరేంద్రకుమార్ అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి అక్కడి మతఛాందస వాదులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన ఇంటిసభ్యులు హుటాహుటీన అక్కడి నుండి ఇంటినుండి పరుగులుతీశారు. ఈవీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఇస్లామిక్ గ్రూపులే ఈ దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఒక హిందువ్యక్తిని అక్కడి దుండగులు నరికి చంపగా, అక్కడి జగత్‌పూర్ అనే గ్రామంలోని పంటపొలాల్లో 27ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. బంగ్లాదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఘటనలు అక్కడి మైనార్టీలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

  • దక్షిణాసియాలో మరో దేశంలో రాజకీయ అస్థితరత తప్పేలా కనిపించడం లేదు. అఫ్గాన్‌ తాలిబన్ల ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పేర్కొంది. ఇటీవల ఆదేశ సుప్రీం లీడర్ ఆడియో టేప్‌లో ఇదే విషయాలు బహిర్గతమయినట్లు తెలిపింది.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. చాలా దేశాలు రాజకీయ అస్థితరతతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, సిరియా లాంటి దేశాలు అంతర్గత సంక్షోభంతో అట్టుడికిపోతున్నాయి. అయితే తాజాగా ఆ కోవలో అఫ్గానిస్థాన్ చేరునుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాలిబన్ల అగ్రనాయకత్వంలో తీవ్ర లుకలుకలున్నాయని వారి మధ్య విభేదాలు ఇటీవల ఆ దేశ తాలిబన్ లీడర్ అయతుల్లా అఖుండ్జాదా మాటల్లో తేటతెల్లమయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.

    ఇటీవల అఫ్గాన్ లీడర్  అఖుండ్జాదా ప్రసంగాన్ని బీబీసీ విడుదల చేసింది. అందులో ఆయన మాట్లాడుతూ "ప్రభుత్వంలో  విభేదాలున్నాయి. అంతర్గత విభేదాలు ఇలానే పెరుగుతుంటూ పోతే తాలిబన్ ప్రభుత్వం కూలిపోతుంది". అని ఆయన హెచ్చరించినట్లు బీబీసీ ప్రచురించింది. అంతేకాకుండా  తాలిబన్లలో ప్రస్తుతం రెండు వర్గాలున్నాయని వెల్లడించింది.

    మెుదటివర్గం అఫ్గాన్ సుప్రీం లీడర్ అఖుండ్జాదాకు విదేయులుగా ఉంటూ ఆదేశాన్ని ఇస్లామిక్ పాలనకు కేంద్ర స్థానంగా చేయాలని యత్నిస్తున్నారని తెలిపింది. వీరు కాందహార్ నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది. మరోకవర్గమేమో సిరాజ్ హుక్కానీ నేతృత్వంలో పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తూ మహిళలకు పిల్లలకు కనీస హక్కులు కల్పించాలని భావిస్తున్నట్లు బీబీసీ  తెలిపింది. వీరి కేంద్రం కాబూల్‌ అని పేర్కొంది. 

    అఫ్గాన్‌లో తాలిబన్ల పాలన 2021లో ప్రారంభమైంది. ఆసమయంలో తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి ఆదేశ అధ్యక్షుడు అష్రప్ ఘనీ దేశం విడిచిపారిపోయారు. దీంతో వారి పాలన అధికారికంగా ప్రారంభమైంది.

  • ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన పడవను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విస్కాన్సిన్‌లోని పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన ఈ పడవను గుర్తించారు. ఇక్కడ మొత్తం 16 పురాతన బోట్లను గుర్తించడం విశేషం. 

     న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం ఉత్తర అమెరికాలోని విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీ (WHS) పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన పడవను కనుగొన్నారు. మెన్డోటా సరస్సులో మొత్తం 16 పురాతన బోలు చెక్క పడవలను పరిశోధకులు గుర్తించారు. ఈ పడవలలో పురాతనమైనది ఈజిప్టులోని గిజా పిరమిడ్ ఉనికిలో ఉండటానికి ముందు కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో అనుకున్న దానికంటే చాలా ముందుగానే జీవించి వ్యవస్థీకృత సమాజాలుగా అభివృద్ధి చెందారని వెల్లడిస్తుందని చెప్పారు.

    ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి

    సహజంగా రేడియోధార్మిక మూలకం ఎంతవరకు క్షీణించిందో చూడటానికి కలపను పరీక్షించినప్పుడు, ఈ పడవలు 1300AD , 3000BC మధ్య నిర్మించబడ్డాయని తేలింది. మెండోటా సరస్సు కింద కనుగొనబడిన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు ఉత్తర అమెరికాలో ప్రారంభ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.వేల ఏళ్లకుముందే ప్రపంచవ్యాప్తంగా మానవ పడవ తయారీ నైపుణ్యాలు అభివృద్ధి గురించి వివరించింది. ఈ పడవలు 5,200 సంవత్సరాల క్రితం గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణించారు, ఎలా నివసించారో ఇది వెల్లడిస్తుంది.  ముఖ్యంగా ఆ కాలంలోనే ఇక్కడి ప్రజలు బలమైన, మన్నికైన ఓడలను నిర్మించేంత అవగాహన , సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం విశేషం.

    2021లో శాస్త్రవేత్తలు 1,200 సంవత్సరాల నాటి మొదటి పడవను కనుగొన్నారు. 3,000 సంవత్సరాల నాటి మరో పడవను 2022లో కనుగొన్నారు. ఆ తర్వాత మరో పద్నాలుగు పడవలు  గుర్తించారు. వాటిలో ఆరు 2025లో కనుగొనబడ్డాయి. 16 పడవలలో రెండు మాత్రమే నీటి నుండి బయటకు తీశారు. వీటిలో దాదాపు 3,000 సంవత్సరాల నాటి 14 అడుగుల పొడవైన పడవ కూడా ఉంది. ఇవి ఎక్కువగా ఎరుపు , తెలుపు ఓక్ వంటి గట్టి చెక్కలతో తయారు చేసినవి. పడవల పైన రాళ్లను జాగ్రత్తగా ఉంచారట. శీతాకాలంలో పడవ తయారీకి ఉపయోగించే చెక్క వంకర పోకుండా చూసుకోవడానికి ఈజాగ్రత్త తీసుకుని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే WHS బృందం ఓక్‌ను ఉపయోగించడం అసాధారణ మని  పేర్కొంది. సాధారణంగా చెట్టుకు ఉండే ఓపెన్‌ పోర్స్‌ నీటిని గ్రహిస్తాయి. ఇవి  పడవలు మునిగిపోకుండా తేలియాడేలా చేస్తుంది.

    ఇదీ చదవండి: టీనేజ్‌ లవర్స్‌ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి

  • ఇరాన్ సంక్షోభం నేపథ్యంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి.. అమెరికా సైనిక దాడులు జరపడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ముగిసిన ఈ భేటీలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 

    ప్రముఖ జర్నలిస్ట్‌, ఇరాన్‌ మహిళా ఉద్యమకారిణి మసీహ్ అలినెజాద్‌.. యూఎన్‌ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి భేటీలో పాల్గొన్న ఆమె.. ఇరాన్‌ యూఎన్‌ రాయబారి ఘోలంహోసేన్‌ డర్జీని టార్గెట్‌ చేసుకున్నారు. ‘‘మీరు(ఇరాన్‌) నన్ను మూడుసార్లు చంపాలని చూశారు. నా ఇంటి వద్దకు మనుషుల్ని పంపించారు. వాళ్లను నేను చూశాను కూడా’’ అని వ్యాఖ్యానించారామె. 

    ఖమేనీ ప్రభుత్వం ఐసిస్‌లా ప్రవర్తిస్తోందన్న మసీహ్‌..  ఇరాన్‌లో అణచివేతలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. అంతర్జాతీయ ఖండనలు ఏమాత్రం సరిపోవని, ప్రపంచ దేశాలు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. 

    ఇక ఇరాన్‌ ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ట్జ్  ఉద్ఘాటించారు. ఐరాన్‌లో జరుగుతున్న నిరసనలు గొప్ప ఉద్దేశంతో కూడుకున్నవని.. ఐరాన్‌ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని.. మా దేశం, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వాళ్లతో ఉన్నారు అని స్పష్టం చేశారు. నిరసనలు విదేశీ కుట్ర కాదని.. ఐరాన్‌ ప్రభుత్వం తన ప్రజలకే భయపడుతోందని వాల్ట్జ్‌ అన్నారు.

    యూఎన్‌ అధికారులు ఇరాన్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై సైనిక దాడులు జరిగితే ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరం చేస్తాయని హెచ్చరించారు.
    ఐరాస సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెరస్ తరఫున మార్థా పోబీ మాట్లాడుతూ.. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించాలి అని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Telangana

  • వరంగల్: జనగామ-యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ స్కామ్‌ వెలుగు చూసింది. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.72 ‍కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరక 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

    ఈ అవినీతికి పాల్పడిన నిందితుల నంచి రూ. 63 లక్షల నగద, ఒక కారు, 2 ల్యాప్‌టాప్‌లు, 5 డెస్క్‌టాప్‌లు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసుగా నిర్దారించారు.  ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారైనట్లు తెలుస్తోంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య చేశాడు. మద్యం తాగే క్రమంలో గ్లాస్‌ కోసం గొడవ జరిగింది. మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    వరంగల్‌లో..
    మరో ఘటనలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు.  బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతలించారు. దాడి చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

    నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య
  • ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంటరాగేషన్ పూర్తి చేయాలన్న ధర్మాసనం​.. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారు?కేసులో ఇంకా ఏం మిగిలింది?. అంటూ ప్రశ్నించింది.

    ‘‘ఇప్పటికే రెండు వారాలకు కస్టడీకి అనుమతించాం మే నుంచి ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాము. మీ పర్పస్ పూర్తయిందా లేదా? కేసు దర్యాప్తు దృష్టిలో ఉంచుకొని, ఆర్టికల్ 142 కింద మేము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాం. ప్రభాకర్ రావును మళ్లీ  జైలులో పెట్టాలనుకుంటున్నారా? ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన.. ఆయనను పిలవకుండా ఉండలేరు. మళ్లీ పిలిచి విచారణ చేయొచ్చు. ఆయన దర్యాప్తుకు సహకరిస్తారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

    తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించారు. తదుపరి విచారణ వరకు మధ్యంతర రక్షణ పొడిగించిన సుప్రీంకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.


     

     

     

Politics

  • అనంతపురం:  తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన ఐదేళ్ల పాలనపై, అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు.  జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘జేసీ డేట్ ఫిక్స్ చేయండి... కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం.. మీరు అనుమతులు ఇప్పించండి... నా కుటుంబం మాత్రమే వచ్చి నిజాలు చెబుతాం. 

    పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనమా జేసీ ప్రభాకర్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ విమర్శలు చేయడం హాస్యాస్పదం. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై  కలెక్టర్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేశా. విచారణ జరక్కుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినా ఎందుకు చర్యలు తీసుకోరు?’ అని ప్రశ్నించారు. 

  • సాక్షి, తాడేపల్లి: సాల్మన్ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ గూండాల చేతిలో సాల్మన్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే.. జరిగిన దారుణాన్ని వైఎస్‌ జగన్‌కు సాల్మన్‌ కుటుంబసభ్యులు వివరించారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు.

    ‘‘దళిత కార్యకర్త మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు పొట్టనపెట్టుకున్నారు. ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద, నాయకులమీద దాడులు పరిపాటిగా మారాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో మనుషుల భద్రతకు భరోసా లేని పరిస్థితి ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారు. సాల్మన్ ఘటనలో బాధ్యులను కచ్చితంగా చట్టంముందు నిలబెడతాం. వైఎస్సార్సీపీ క్యాడర్‌ ఎవరూ ఆందోళన చెందవద్దు. పార్టీ నుంచి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

    పిన్నెల్లిలో కొనసాగుతున్న హైటెన్షన్ పోలీసులకు YS జగన్ వార్నింగ్
  • సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాసు మహేష్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాసు మహేష్‌ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సాల్మన్‌ అంత్యక్రియలకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి సహా పార్టీ నేతలను అడ్డగించారు. బారీకేడ్లతో వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

    అంత్యక్రియలకు వెళ్తే పోలీసులకు వచ్చిన నష్టమేంటి? అంటూ పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బెఠాయించారు. అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వరా అంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి చూపు కూడా చూసుకోనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    కాసు మహేష్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ ఫోన్‌
    సాల్మన్‌ అంత్యక్రియలను అడ్డుకోవద్దంటూ వైఎస్‌ జగన్‌ పోలీసులను హెచ్చరించారు. పిన్నెల్లి గ్రామంలోకి వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించాలన్నారు. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘గురజాల నియోజకవర్గంలో 7 రాజకీయ హత్యలు జరిగాయి. పిన్నెల్లిలో 300 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. సాల్మన్‌పై దాడి చేసి చంపేశారు. తిరిగి బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టారు. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్తాం. మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేయిస్తాం. బాధితుల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు.

    పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్‌ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్‌కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్‌సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్‌ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్‌ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే..  

    సాల్మన్‌ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్‌ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్‌.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశారు.