Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 

    ఈ పాటను లాటిన్ స్టయిల్‌లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.

    నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్‌లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్‌కి తిరిగొచ్చాడు. ఎయిర్‌పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

    త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. 

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు సంగతి పక్కనబెడితే ఓటీటీల్లోనూ నేరుగా కొన్ని మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గత వీకెండ్ వచ్చిన హాలీవుడ్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'వార్ మెషీన్'. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ దృష్టిలో పడింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)

    కథేంటి?
    అది అఫ్ఘానిస్తాన్‌లోని ఓ ప్రాంతం. పాడపోయిన తన తమ్ముడి ఆర్మీ కాన్వాయ్ బాగు చేసేందుకు అమెరికన్ ఆర్మీకి చెందిన స్టాఫ్ సార్జెంట్ (అలెన్ రిచ్‌సన్) వస్తాడు. సరిగ్గా అప్పుడే తాలిబన్లు వీరిపై దాడి చేస్తారు. దీని నుంచి సార్జెంట్ మాత్రమే ప్రాణాలతో బయటపడతాడు. తర్వాత అమెరికన్ ఆర్మీలోని అత్యంత కష్టమైన రేంజర్ కావాలనుకుంటాడు. నాలుగుసార్లు తిరస్కరణకు గురైనా సరే చివరకు ట్రైనింగ్‪‌కి ఎంపికవుతాడు. శిక్షణలో భాగంగా చివరి దశకు చేరుకుంటాడు. చిట్టచివరి పరీక్షలో పాసైతే చాలు అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? సార్జెంట్.. ఏలియన్ షిప్‌తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు గానీ దీన్ని థియేటర్‌లో విడుదల చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అలాంటి అనుభూతిని ఇచ్చింది. ఎందుకంటే 100 నిమిషాలున్న ఈ మూవీ.. మొదటి సీన్ నుంచి చివరవరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అదరగొట్టేసింది. ఓవైపు యాక్షన్ చూపిస్తూనే.. మరోవైపు ఏలియన్ షిప్ చేస్తున్న దాడి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనే పాయింట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

    అసలు అమెరికన్ ఆర్మీ ఎలా ఉంటుంది? ఆర్మీలోని రేంజర్ కావాలంటే ఎలాంటి పరీక్షలు పెడతారు? ఎంతలా కష్టపడాల్సి వస్తుందనే విషయాల్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. హీరోతో సహా మిగతా పాత్రధారులు ఎవరూ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అయినా సరే చివరివరకు ఆపకుండా చూసేంత ఎంగేజింగ్‌గా మూవీని తెరకెక్కించారు.

    సింపుల్‌గా తేల్చేయొచ్చు అనుకునే పరిస్థితుల్లో ఊహించని విధంగా ఏలియన్ షిప్ దాడి చేసి.. కనిపించిన వాళ్లని కనిపించినట్లు చంపేస్తుంటే.. హీరో తను బయటపడటంతో పాటు మరో వ్యక్తిని ఎలా రక్షించాడు. చివరకు బతికి బట్టకట్టడంతో పాటు రేంజర్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ మూవీ చూసేయాల్సిందే.

    మిలటరీ కాన్సెప్ట్, యాక్షన్-సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ అంటే ఆసక్తి ఉంటే మాత్రం దీనిపై లుక్కేయండి. కచ్చితంగా నచ్చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రధాన పాత్ర చేసిన రిచ్‌సన్ తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓటీటీలో ఏదైనా ఓ మంచి యాక్షన్ మూవీ చూద్దానుకుంటే మాత్రం ఇదో బెస్ట్ ఆప్షన్.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)

  • తమిళనాడు రాష్ట్ర అవార్డుతో సాయిపల్లవి పోజులు

    కోలీవుడ్ హీరో ఆర్యతో వైష్ణవి చైతన్య జిమ్ స్టిల్స్

    పద్ధతిగా లంగా ఓణీలో 'బలగం' హీరోయిన్ కావ్య

    షూటింగ్స్‌లో తెర వెనక సంయుక్త మేనన్ ఇలా

    బ్లాక్ డ్రస్‌లో గ్లామర్ చూపించేస్తున్న శ్రుతి హాసన్

    చుడీదార్‌లో కుందనపు బొమ్మలా రకుల్ ప్రీత్

  • ఇండస్ట్రీలో సమస్యలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లని.. దర్శకనిర్మాతల దగ్గర నుంచి నిర్మాణ సంస్థలు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలానే నిర్మాణ సంస్థ తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)

    రన్ రాజా రన్, టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2 తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన సీరత్ కపూర్.. చివరగా 2024లో మనమే, ఉషా పరిణయం చిత్రాల్లో కనిపించింది. మరి ప్రస్తుతం ఏ మూవీ చేస్తుందో ఏమో గానీ షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు అవుతున్న తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వట్లేదని చెప్పి ఓ ట్వీట్ చేసింది.

    'షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలు గడిచినా సరే సంబంధిత ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని చెప్పినా స్పందించలేదు. చాలా సహనంతో ఎదురుచూస్తున్నా. నా టీమ్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీమ్‌కు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని సీరత్ కపూర్ రాసుకొచ్చింది. ఇలాంటి విషయాల్లో కాస్త బాధ్యతతో వ్యవహరించాలని హితవు చెప్పింది. మరి ఈమెని ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాణ సంస్థ పేరు బయటపెట్టలేదు.

    (ఇదీ చదవండి: మిషన్‌ నొక్కితే డబ్బే డబ్బు.. తెలుగు సినిమా టీజర్‌)

  • డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్న డైలాగ్‌ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఆ మాట నిజమైతే బాగుండు అనుకునేవాళ్లూ లేకపోలేదు. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ సినిమా "కాన్‌ సిటీ". కాకపోతే ఇక్కడ డబ్బులు చెట్లకు కాకుండా ఓ మిషన్‌కు కాస్తున్నాయి. అవును, బటన్‌ నొక్కితే చాలు లిమిట్‌ అనేదే లేకుండా ఎన్నిసార్లంటే అన్నిసార్లు డబ్బులు ప్రింట్‌ చేస్తూనే ఉంది.

    డబ్బులు ప్రింట్‌ చేసే మిషన్‌
    సోమవారం సాయంత్రం కాన్‌సిటీ తెలుగు టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో.. డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని ఓ గంభీర స్వరం ఫోన్‌లో హీరోను నిలదీస్తుంది. దాంతో అసహనానికి లోనైన హీరో వస్తువులన్నింటినీ కిందపడేస్తాడు. అప్పుడే ఒక మిషన్‌ను సైతం కిందపడేయబోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పిడుగు పడి యంత్రం ఆన్‌ అవుతుంది, అందులో నుంచి రూ.500 నోటు బయటకు వస్తుంది. ఇంకేముంది.. నొక్కిన ప్రతిసారి నోట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.

    చేతులు మారిన యంత్రం
    దాంతో ఆ డబ్బంతా బ్యాగులో సర్దుకున్న హీరో ఆ యంత్రాన్ని  జాగ్రత్తగా అల్మారాలో పెడతాడు. కట్‌ చేస్తే బట్టలు సర్దే సమయంలో భార్యకు ఆ మిషన్‌ కనిపిస్తుంది. బటన్‌ నొక్కితే డబ్బు వస్తుండటంతో దాన్ని తీసుకెళ్లి వంటగదిలో దాచేస్తుంది. అక్కడి నుంచి అది హీరో తల్లి చేతికి వెళ్తుంది. ఆమె దాన్ని పూజగదిలో దేవుడి ఫోటో వెనకాల భద్రపరుస్తుంది. తర్వాత సడన్‌గా మిషన్‌ కనిపించకుండా పోతుంది. 

    వీధిలో నోట్ల వర్షం
    ఇంటిల్లిపాది అంతా వెతుకుతారు. తీరా చూస్తే హీరో కొడుకు ఆ యంత్రంతో బాల్కనీలో ఆడుకుంటాడు. ఇంకేముంది, నడిరోడ్డులో డబ్బుల వర్షం.. దాన్ని దక్కించుకునేందుకు వీధిలో జనం ఎగబడుతుంటారు. మరిం తర్వాతేం జరిగిందో తెలియాలంటే కాన్‌ సిటీ చూడాల్సిందే! హరీశ్‌ దురైరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్‌ మూవీకి సేన్‌ రోల్డన్‌ సంగీతం అందించాడు. అర్జున్‌ దాస్‌, అన్నాబెన్‌, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ చిత్రాన్ని టీ సిరీస్‌ తెలుగులో తీసుకురానుంది.

     

  • టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఆదివారం ఉదయం కావ్యరెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి కూడా. అయితే తామిద్దరి మధ్య జరిగింది ఎంగేజ్‌మెంట్ కాదని చెప్పి ఈ హీరో షాకిచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు తనకు కాబోయే భార్య ఫొటోలని కూడా పంచుకున్నాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

    నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ హిట్ రాలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. గతేడాది 'కిష్కింధపురి', 'భైరవం' చిత్రాలతో వచ్చాడు. ప్రస్తుతం ఓ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ చాన్నాళ్ల నుంచి హైదరాబాద్‌కి చెందిన కావ్యరెడ్డితో ప్రేమలో ఉన్నాడని, ఎంగేజ్‌మెంట్ అంటూ వార్తలొచ్చాయి. అంతా అదే అనుకున్నారు. కానీ ఇది కేవలం తమ ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ అని, నిశ్చితార్థం-పెళ్లి లాంటి శుభకార్యాలన్ని త్వరలో జరుగుతాయని తాజా ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చాడు.

    'నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన టైమ్ ఉంటుంది. నా జీవితంలోకి ఆ సమయం నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన టైంలో నా లైఫ్‌లోకి వచ్చి నన్ను నమ్మి, నా రోజులని ఎంతో ఆనందంగా, పాజిటివ్‌గా చేసినందుకు థ్యాంక్స్. నీ ముఖంపైనున్న ఆ నవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసుండే ఆ జీవితం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ రాసుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు: మంచు లక్ష‍్మీ)

  • ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన రాధిక శరత్‌కుమార్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే 'తాయ్‌ కిళవి' కోసం ఆమె ముసలమ్మగా నటించింది. ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసినప్పటినుంచి మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. 75 ఏళ్ల బామ్మగా రాధిక నటించడం, హీరో శివకార్తికేయన్‌ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాకు పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. శివకుమార్‌ మురుగేశన్‌ దర్వకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    హాఫ్‌ సెంచరీ
    పాజిటివ్‌ రివ్యూలతో తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌పై మంచి పట్టు సాధించింది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా తాయ్‌ కిళవి రూ.50 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇక సినిమా రిలీజైనప్పటినుంచి టాప్‌ హీరోలు, దర్శకుడు, హీరోయిన్లు అందరూ సినిమాను, ముఖ్యంగా రాధికను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.

     

     

    చదవండి: వానిటీ వ్యాన్స్‌, వాష్‌రూమ్స్‌ ఏవీ లేవు: నటి

  • మంచు లక్ష‍్మీ మైక్ పట్టిందంటే చాలు.. ఏదో ఒకలా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా అలానే తమ సినిమాని మగాళ్లు చూడకపోయినా పర్లేదని చెప్పి విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈమెతో పాటు అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'లేచింది మహిళా లోకం'. ఈనెల 26నే థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మంచు లక్ష‍్మీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు)

    'మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమాలు చేశామనమాట. ఇందులో ఇంతలా కామెడీ చేస్తానని అనుకోలేదు. నేను రెచ్చిపోయాను. కొన్ని డైలాగులు ఉండవని అనుకున్నా కానీ ఉన్నాయి. సీరియస్ సబ్జెక్ట్‌లని కామెడీగా చెబితేనే జనాలు వింటారు. సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఉంటుందేమో! మహిళలందరూ తమ తల్లి, నానమ్మ, అమ్మమ్మలతో వచ్చి మా సినిమా చూడండి. మగాళ్లు చూడకపోయినా పర్వాలేదు' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది.

    అలానే ట్రైలర్‌లో వినిపించిన 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', 'లెట్ దెం నో' అనే డైలాగులు తన ప్రమేయం లేకుండానే సినిమాలో పెట్టేశారని లక్ష‍్మీ క్లారిటీ ఇచ్చింది. ఈ రెండు డైలాగుల్లో ఒకటి మోహన్ బాబుది కాగా రెండోది మంచు విష్ణుది. ఇక ట్రైలర్‌లోని వైల్డ్ ఫైర్ డైలాగ్ గురించి ప్రస్తావించిన ఈమె.. 'పుష్ప 2' రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. సుకుమార్ కంటే ఫైర్, వైల్డ్ ఫైర్ డైలాగ్ నేను మొదట ఈ సినిమాలో వాడాను. ప్రస్తుతం సినిమాలు నిర్మించడం మానేశాను. కాబట్టి నా దగ్గరకు కథలు తీసుకురాకండి. యాక్టింగ్ కోసం మాత్రమే సంప్రదించండి అని చెప్పింది. ఒకప్పుడు మీడియా ముందు ఎలా ఉండాలా అని ఆలోచించేదాన్ని? ఇప్పుడు ఎలాంటి విమర్శలను, ట్రోలింగ్‌ని పట్టించుకోవడం లేదని తెలిపింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

  • కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా వస్తోన్న మూవీ జన నాయగన్. పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ నటించిన చివరి చిత్రం ఇదే. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్‌ బోర్డ్ వివాదంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్‌ రివైజింగ్ కమిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో జన నాయగన్ రిలీజ్ మరింత ఆలస్యమవుతోంది. 

    అయితే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివైజింగ్ కమిటీ ఈ మూవీని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రివ్యూ చేయాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా జన నాయగన్ రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ వాయిదా పడింది. కమిటీలోని ఓ సభ్యుడు అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ప్రదర్శన రద్దు చేశారు. దీని వల్ల సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న జన నాయగన్‌ మేకర్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దీనిపై సెన్సార్ బోర్డ్ సభ్యులు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే స్క్రీనింగ్ కోసం మరో తేదీని కేటాయిస్తారో? లేదో తెలియాల్సి ఉంది. 

    కాగా.. ఈ చిత్రంలో మమిత బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే, నరైన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సిన ఉన్నా వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే గతేడాది రివ్యూ చేసిన సెన్సార్‌ బోర్డ్‌ కొన్ని సవరణలు సూచించింది. అయినప్పటికీ కొన్ని మతపరమైన అంశాలు, సాయుధ దళాల లోగోలను ఉపయోగించడంపై సెన్సార్‌ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మూవీని మరోసారి సెన్సార్‌ చేయాలని రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్‌కు పంపారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.

  • 'బేబి' సినిమా జోడీ ఆనంద్‌ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌". 90's సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్‌ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్‌ అందుకున్నాడు. 

    గోరేటి వెంకన్న నోట..
    వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్‌మెంట్‌ను పాటలో చూపించారు. ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

     

    చదవండి: అప్ప ట్లో వాష్‌రూమ్స్‌ కూడా లేవు: బాలీవుడ్‌ నటి

  • హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు, హీరోగా చేసిన రణ్‌దీప్ హుడా శుభవార్త చెప్పేశాడు. ఇతడి భార్య లిన్ లైస్రామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఈమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలని స్వయంగా రణ్‍‌దీప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు తోటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    (ఇదీ చదవండి: తల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్)

    2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్‌, కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2, బాంబే టాకీస్‌, కిక్‌, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ టైంలో అయితే వీర్​ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు.

    అసలు విషయానికొస్తే.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇతడి వయసు 47 ఏళ్లు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అంటే 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. గత నెలలోనే లిన్‌కి సీమంతం జరిగింది. ఆ ఫొటోలని లిన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

  • ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్‌, వాష్‌రూమ్స్‌ లేనేలేవంటోంది సీనియర్‌ నటి సుప్రియ పాఠక్‌. 1980వ దశకంలో సెట్‌లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్‌ మాట్లాడుతూ.. మేము ప్యాషన్‌తో యాక్ట్‌ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది. 

    బాత్రూమ్స్‌ తప్పనిసరి
    షూటింగ్‌ గ్యాప్‌లో కూర్చోవడానికి కొంత ప్లేస్‌ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్‌ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్‌లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్‌ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు వాష్‌రూమ్స్‌ వసతి అనేది ఉండదు.

    కనీస వసతి అవసరం
    చలిలో లేదా ఎండలో షూటింగ్‌ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్‌ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్‌ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్‌లో పాల్గొన్నారు. 

    రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..
    అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్‌తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    సుప్రియ పాఠక్‌.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్‌, బజార్‌, రామ్‌లీలా, మాసూమ్‌, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్‌లో హీరో తల్లిగా యాక్ట్‌ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది.

  • రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

    అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్‌ ది రివెంజ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ ‍స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్‌లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.

    పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..

    ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. మూడు రోజుల క్రితం తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు. అయితే తొలుత ఈ కారు వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో తమ్ముడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా భార్య స్నేహకు బన్నీ దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు తల్లికి కూడా ఖరీదైన కారుని ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

    ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ఖరీదైన లెక్సెస్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ధర రూ.70 లక్షల నుంచి రూ. కోటి మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. భార్యకు ఇచ్చిన బెంజ్ కారు ఖరీదు మాత్రం రూ.కోటిన్నర మేర ఉంటుందని సమాచారం.

    ఇకపోతే బన్నీ పెళ్లిరోజునే తమ్ముడు శిరీష్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డి మెడలో మార్చి 06న మూడు ముళ్లు వేశాడు. మెగాహీరో వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ సందర్బంగా కలిసి వీళ్లిద్దరూ.. తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. శిరీష్ పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

  • మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్‌ చిదంబరానికి ఊరట లభించింది.  లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో  ఆయన బెయిల్ లభించింది. కొన్ని కఠినమైన షరతులతో ఎర్నాకుళం జిల్లా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 2022లో దర్శకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    దీంతో మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్‌పై ఎర్నాకుళం పోలీసులు కేసు నమోదు చేశారు. 2022లో కొచ్చిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో చిత్రనిర్మాత తనతో అనుచితంగా ప్రవర్తించాడని  మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది అయితే చిదంబరం మంజుమ్మెల్ బాయ్స్ తెరకెక్కించే సమయంలో ఆమెను కలిశానని.. కేవలం ఆమెను ఒక పాత్ర కోసం మాత్రమే పరిగణించారని చెప్పారు. ఆమె ప్రవర్తన తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో చిదంబరం తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

     

  • వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేప‍థ్యంలో ఈ వారం బాక్సాఫీస్‌ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10

    • మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12

    • వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12

    • ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12

    అమెజాన్ ప్రైమ్

    • ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13

    • లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13

    హాట్‌స్టార్

    • రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13

    • ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09

    • జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13

    • ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

    జీ5

    • పూకీ (తమిళ సినిమా) - మార్చి 13

    • భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13

    • అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14

    లయన్స్ గేట్ ప్లే

    • ద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13

    ఎమ్ఎక్స్ ప్లేయర్

    • సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11

    సన్ నెక్స్ట్

    • నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13

    • ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13

    (ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్)

  • బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. నేరం అనే ద్విభాషా(తమిళ, మలయాళ) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. రాజా రాణి సినిమాతో ఎక్స్‌ప్రెషన్స్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది నజ్రియా నజీమ్‌. ఈ ఒక్క మూవీతో సౌత్‌లో సెన్సేషన్‌ అయిపోయింది. ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమాలు చేసింది. 2014వ సంవత్సరంలో నాలుగు మలయాళ మూవీస్‌లో మెరిసింది.

    పెళ్లి తర్వాత సినిమాలకు దూరం!
    అదే ఏడాది ఆగస్టులో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. పన్నెండేళ్ల కాలంలో మలయాళంలో కేవలం నాలుగంటే నాలుగే సినిమాలు చేసింది. అందులోనూ ఒకటి గెస్ట్‌ రోల్‌! నజ్రియా మలయాళంలో అదే స్పీడుతో సినిమాలు చేసుంటే బాగుండేదంటోంది సీనియర్‌ నటి ఊర్వశి.

    ఫహద్‌ గొప్ప యాక్టర్‌
    తాజాగా ఊర్వశి మాట్లాడుతూ.. నా ఫేవరెట్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌. అతడెప్పుడూ హీరోయిజం చూపించే పాత్రలు చేయడు. తన గుండును విగ్గుతో కవర్‌ చేయడానికీ ప్రయత్నించడు. తను తనలాగే ఉంటాడు. ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో చాలా బాగా నటిస్తాడు. ఇంకాస్త గట్టిగా కష్టపడితే తనకు మంచి కెరీర్‌ ఉంది. బసిల్‌ జోసెఫ్‌ కూడా గొప్ప నటుడే!

    నజ్రియా గొప్ప నటి
    హీరోయిన్స్‌ విషయానికి వస్తే మీరా జాస్మిన్‌, నవ్య నాయర్‌.. ఇలా చాలా మంది మంచి పర్ఫామెన్స్‌ ఇస్తారు. కానీ, నజ్రియా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండుంటే తనంత గొప్ప నటి మరొకరు ఉండేవారు కాదు. పల్లెటూరి అమ్మాయి, మోడ్రన్‌ గర్ల్‌, తెలివైన యువతి.. ఇలా అన్ని రకాల పాత్రలు ఇట్టే చేయగలదు. తనకు మంచి టాలెంట్‌ ఉంది.. అయినా ఇలా సినిమాలను వదిలేయడం కాస్త విచారకరంగా అనిపిస్తుంది అని ఊర్వశి చెప్పుకొచ్చింది. నజ్రియా అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చింది.

    చదవండి: ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమాకు సంతకం చేసిన సారా అర్జున్‌?

  • ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అలరించిన సారా అర్జున్‌ ఇప్పుడు హీరోయిన్‌గా అదరగొడుతోంది. తను కథానాయికగా నటించిన తొలి చిత్రం ధురంధర్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! అనంతరం యుఫోరియా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ధురంధర్‌ 2తో ముందుకు రాబోతోంది.

    రూమర్స్‌పై క్లారిటీ
    అయితే ఈ 20 ఏళ్ల బ్యూటీ "హీర్‌ రాంఝా" (పంజాబీ జానపద విషాద కథ) అనే మూవీ చేస్తున్నట్లు బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సారా.. హీర్‌ పాత్రలో నటించనుందని సదరు వార్తల సారాంశం. ఈ రూమర్స్‌పై కాస్టింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ చాబ్రా స్పందించాడు. సారా అర్జున్‌ ఏ సినిమాకి సంతకం చేయలేదు. నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదు, ఎవర్నీ కలవలేదు. 

    నేనే చెప్తా..
    ప్రస్తుతం మేమంతా ధురంధర్‌ 2 కోసం ఎదురుచూస్తున్నాం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. తను నెక్స్ట్‌ ఏదైనా సినిమా ఒప్పుకుంటే నేనే స్వయంగా మీకు వెల్లడిస్తాను. అప్పటివరకు వచ్చే ఏ వార్తనూ మీరు నమ్మకండి అని ఎక్స్‌ (ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. అంటే ధురంధర్‌ 2 తర్వాతే సారా తన నెక్స్ట్‌ సినిమాపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 

    సినిమా
    ధురంధర్‌ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ధురంధర్‌ 2 వస్తోంది. అర్జున్‌ రాంపాల్‌, సంజయ్‌ దత్‌, ఆర్‌.మాధవన్‌, రాకేశ్‌ బేడీ, సారా అర్జున్‌ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 19న పాన్‌ ఇండియావైడ్‌గా విడుదల కానుంది.

     

     

    చదవండి: విడాకులు, తాగుడుకు బానిసయ్యా: మలయాళ నటుడు

  • ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లాడిన హీరోయిన్ రష్మిక తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు స్పందించింది. విజయ్- రష్మిక ప్రేమ, పెళ్లి, వాళ్లద్దరి ప్రయాణం గురించి ఓ కథనం రాసుకొచ్చారు. ఇది చూసిన రష్మిక ఆ ఆర్టికల్‌కు రిప్లై ఇ‍చ్చారు. చాలా రోజులుగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంతగా భావోద్వేగానికి గురి కాలేదని తెలిపింది.

    రష్మిక తన ట్వీట్‌లో రాస్తూ..' చాలా కాలంగా నా గురించి రాసిన కథనం చదివి నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి గురి కాలేదు. నేను చెప్పాలనుకున్నది చాలా ఉంది.. కానీ మాటలు రావడం లేదు. ఇప్పుడు నేను ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నా. నా ప్రయాణం గుర్తించినందుకు ధన్యవాదాలు. ప్రేమ గురించి నేను చెప్పగలిగేది ఒక్కటే. మిమ్మల్ని ‍స్వేచ్ఛగా ఉంచే ప్రేమను వెతకండి' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఫిబ్రవరి 26న విజయ్- రష్మిక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి వేడుక ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది.
     

     

  • ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి' మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను అలరించింది. దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ మూవీని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో సునీల్, సత్య, మురళీధర్ గౌడ్, రోహన్, సోనియా సింగ్, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు.

    'భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి' జీ5(Zee5)లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో ఆ సంస్థ చేర్చింది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళంలో విడుదల కానుందని పేర్కొంది. సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 30 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో మంచి రెస్పాన్స్‌ రావచ్చని మేకర్స్‌ అంచనా వేస్తున్నారు.

    కథేంటంటే..
    రామ సత్యనారాయణ అలియాస్‌ రామ్‌(రవితేజ) ఓ వైన్‌యార్ట్‌ ఓనర్‌. తాను కొత్తగా రెడీ చేసిన ‘అనార్కలి’ వైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్‌ చేస్తారు.  కారణం తెలుసుకునేందుకు స్పెయిన్‌ వెళ్లిన రామ్‌.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్‌)తో ఫిజికల్‌గా దగ్గరవుతాడు. ఈ విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్‌ హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్‌తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్‌ తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్‌ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. ఈ విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్‌ ఏం చేశాడు? స్పెయిన్‌లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్‌.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్‌ విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్‌), సుదర్శన్‌(సునీల్‌)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2011లో రిలీజైన ఈ హీరర్ థ్రిల్లర్‌ అభిమానులను ఓ రేంజ్‌లో భయపెట్టేసింది. ముని సిరీస్‌లో వచ్చిన  రెండో చిత్రమే కాంచన. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సరికొత్త 4కె వర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 13న కాంచన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హార్రర్- కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు.  ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.  ఈ మూవీ రీ రిలీజ్‌కు సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.  
     

     

International

  • టెహ్రాన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.  ఇరాన్‌ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.

    ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్‌ తెలిపింది.

    ఈ దాడి ఇరాన్‌లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్‌ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

    ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి.

  • ఓ వైపు అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణించుకుంటూ ఉన్న అమెరికాలో ప్రస్తుతం ఆహార అభద్రత అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా మారింది. మాట వినని వారిపై కయ్యాలకు కాలు దువ్వుతూ ఇతర దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపిస్తూ ఏ అంతర్గత సమస్యలూ లేనట్టు పైకి కనిపిస్తున్న ఆ దేశంలో కనీసపాటి నాణ్యమైన భోజనం పొందలేకపోతున్నవారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని  ఫుడ్‌ రీసెర్చ్‌ – యాక్షన్‌ సెంటర్‌ అందించిన 2024 డేటా నిర్ధారించింది.

    ఈ అధ్యయనం ప్రకారం ఆ దేశంలోని ఏడు ఇళ్లలో కనీసం ఒక ఇల్లు  ఆహార అభద్రతను ఎదుర్కుంటోంది.  అంటే దాదాపుగా 47.9% మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని అంచనా.  దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం  దేశవ్యాప్తంగా ఇళ్లలో తృప్తికరమైన భోజనాలు ఆస్వాదించడాన్ని కష్టతరం గా మార్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

    ఈ నేపధ్యంలో పలువురు వ్యక్తులు  సంస్థలు అవసరార్ధులకు రుచికరమైన, ఉచిత భోజనాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అలాంటి వారిలో జన్మతః భారతీయుడైన  గోవింద దత్తా కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోని లాస్‌ ఏంజిల్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణ లంచ్‌ అనే సంస్థ ఒక ఫుడ్‌ ట్రక్‌ను నిర్వహిస్తోంది.  ఇది వెస్ట్‌వుడ్‌లోని లే కాంటే అవెన్యూలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వెలుపల కొలువుదీరిన ఓ ఫుడ్‌ ట్రక్‌. ఈ కృషగోవింద దత్తా... ఆధ్వర్యంలో ఈ ట్రక్‌ విద్యార్ధులు, కార్మికులకు నామమాత్రపు ధరకే శాఖాహార భోజనాలను అందిస్తోంది.

    ‘ ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో ఇక్కడి సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం‘ అని దత్తా మీడియాతో అంటున్నారు.  ఆయన శృకృష్ణుని  ఆదర్శాల వ్యాప్తికి వెలసిన  హిందూ భక్తి ఉద్యమం ఇస్కాన్‌లోని  హరేకృష్ణ కు దీర్ఘకాల సభ్యుడు,  కర్మ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాను అంటున్న ఆయన  భగవద్గీతను వ్యాప్తి చేయాలనే  లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నానంటారు.

    అతి తక్కువగా,  చిన్న పాటి విరాళానికి (షుమారు 5 డాలర్లు) ప్రతిగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఈ ట్రక్‌ అందిస్తుంది. అయితే, ఆ కనీస  విరాళం మొత్తాన్ని ఇవ్వలేని వారు కూడా ఇక్కడ భోజనానికి అర్హులే. తమ ట్రక్‌ లో వడ్డించే వంటకాల కోసం రూపొందిన మెనూ ఆయుర్వేద పురాతన వంట శైలులపై ఆధారంగా ఉందని ఆయన వెల్లడించారు, ‘కూరగాయలు, ధాన్యాలు,  బీ¯Œ ్స‘ కలయిక గా ఈ ఆహారపదార్ధాలు రూపొందుతాయి.

    ఆయన తో పాటు మరొక స్వచ్ఛంద సేవకుడు శాంతాత్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటారు.. అక్కడ నుంచి తమ ట్రక్‌ పనులను చూసుకుని సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు.  వారానికి ఐదు రోజుల పాటు ఈ ప్రాజెక్టును అందించగలుగుతారు. ఈ ఫుడ్‌ ట్రక్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థిరమైన మెనూ షెడ్యూల్‌ను అనుసరిస్తుంది.

    ‘ఆహారం ఒక బహుమతి, అదే మా ప్రేరణ‘ అని దత్తా అంటున్నారు. దేశంలో 20% మంది విద్యార్థులు డబ్బు కారణంగా ఆహార స్వీకరణను వాయిదా వేస్తున్నారని, మొత్తంగా  42% మంది ఆహార అభద్రతతో ఉన్నారని అంటున్న వీరు తమ వంతుగా ఈ సమస్య పరిష్కారంలో భాగం అవుతున్న తీరు హర్షణీయం.

  • టెహ్రాన్‌: ‘ట్రంప్‌ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్‌ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్‌ టైమ్స్ ఫ్రంట్‌ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్‌ దాడిలో మరణించిన ఇరాన్‌ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్‌ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు తీసింది.

    ‘ట్రంప్‌ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్‌ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్‌పై దాడి ఘటనపై ట్రంప్‌ మాట్లాడుతూ, “ఆ స్కూల్‌పై ఇరాన్‌ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్‌ స్కూల్‌ విషాదాన్ని ఇరాన్‌పై నెట్టే ప్రయత్నం చేశాడు.

    ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్‌ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్‌ పేజీలో ఇనాబ్‌ స్కూల్‌లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్‌, ఇటు ఇరాన్‌ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్ విచారణలో మినాబ్‌లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త దాడి జరగగా, స్కూల్‌లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్‌లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్‌ టైమ్స్ హైలైట్‌ చేసింది.



    గత ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని ఇనాబ్‌ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్‌ ట్రెవర్ బాల్ తెలిపారు.

    అంతేకాదు, తొలిసారి ఐఆర్‌జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్‌ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్‌ స్కూల్‌ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు.

  • వాషింగ్టన్‌: న్యూయార్క్‌ తొలి ముస్లిం మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ (34)ఇంటిపై దాడి జరిగింది. అగంతకులు మమ్దానీ ఇంటిపై పేలుడు పదార్ధాలు విసిరారు.అయితే, పేలుడు పరికరాన్ని వెలిగించినప్పటికీ ఫ్యూజ్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రమాదం తప్పింది.

    ఒకవేళ పేలి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. మమ్దానీ ఇంటిపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు ఎమీర్‌ బాలాట్‌ (18), ఇబ్రహీం కయూమి(19)ని అదుపులోకి తీసుకున్నారు.

    కేసు నమోదు చేసుకుని ఎఫ్‌బీఐకి చెందిన జాయింట్‌ టెర్రరిజం టాస్క్‌ ఫోర్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తును ఉగ్రవాద కోణంలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

  • టెహ్రాన్‌: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.

    మొజ్తబాకు పుతిన్‌ ఓ సందేశం పంపారు. “ఇరాన్‌కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్‌లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్‌కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.

    తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్‌లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. 

    యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..
    కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్‌లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.

    దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.

    ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు. 

  • బీరూట్‌: లెబనాన్‌లో రాజకీయ, భద్రతా సంక్షోభం నెలకొంది. మే నెలలో జరగాల్సిన పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ లెబనాన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌,హిజ్బుల్లా మధ్య యుద్ధం వల్ల అస్థిరత నెలకొంది. హిజ్బుల్లా పట్ల దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలోని రాజకీయ మిత్రుల మద్దతు కోల్పోయింది. 

    ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో లెబనాన్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. 

    హిజ్బుల్లా ఈ యుద్ధంలో కలగజేసుకోవడం లెబనాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్‌లో 128 మంది సభ్యుల్లో 76 మంది ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు హిజ్బుల్లా ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.

    చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్‌
    హిజ్బొల్లా దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ లెబానాన్‌పై విరుచుకుపడింది. గతవారం జరిపిన దాడుల్లో ‌ 83మంది పిల్లలు మృతి చెందగా 200మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల రక్షణ, ఆరోగ్యం, విద్య, పోషణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్‌ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్‌ను ఆపన్న హస్తం అందించేందుకు ఫ్రాన్స్‌ ముందుకు వచ్చింది. 6.9బిలియన్‌ డాలర్లు అత్యవసర ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పడింది.  

  • కాఠ్మాండు: నేపాల్‌తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి  నేపాల్‌లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.

    ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్‌పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

    నేపాల్‌లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్‌), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్‌ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. 

    బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ 
    బాలేంద్ర షా నేపాల్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో విద‍్యనభ్యసించారు.

    తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.

    రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్‌లో బాగా పాపులర్‌ అయ్యారు. అయినా క్యాంపస్‌లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్‌ ఇవ్వలేదు. ఆయన మ‍్యూజిక్‌, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.

    బాలేంద్ర షాకు నేపాల్‌ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర‍్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్‌కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. 

    బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు.  ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది.
     

  • టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ దేశ పౌరులకు వార్నింగ్‌ ఇచ్చింది. శత్రుదేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. దేశంలోని వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించింది.

    ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్‌ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఐఆర్ఐబీ వార్తా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. విదేశాల్లో నివసిస్తూ సొంత దేశానికి శత్రువుల‍్లా పనిచేస్తున్న వారి ఆస్తులు స్వాధీనం చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని ఇరాన్‌ న్యాయ వ్యవస్థ సైతం స్పష్టం చేసింది.

    ఈ ప్రకటన న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థలో కూడా ప్రచురితమైంది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా అమెరికా ప్రభుత్వాల కోసం జరిగే ఏదైనా ఇంటెలిజెన్స్ లేదా ఎస్పియోనాజ్ కార్యకలాపాలు జరిగితే ఆయా పౌరుల ఆస్తులు స్వాధీనం చేయడం పాటు మరణదండన కూడా విధించవచ్చని హెచ్చరించింది.  

    ఇరాన్‌కు వ్యతిరేకంగా తప్పులు చేసినట్లు నిర్ధారణ అయితే వదిలేది లేదని ఇరాన్‌ చెప్పింది. గత అక్టోబర్‌లో అమలు చేసిన చట్టం గురించి ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు లేదా సంస్థలకు అనుకూలంగా తమ పౌరులు పనిచేస్తే చేస్తే ఆస్తుల స్వాధీనంతో పాటు ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఇతర చట్టపర శిక్షలు వర్తిస్తాయని తెలిపింది.

    పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నగరాలపై సైనిక దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి.. విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులపై కూడా ఇరాన్‌ దృష్టి పెట్టింది. 

    అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. 10,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.

Andhra Pradesh

  • సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్‌ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్‌ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఖండించారు.

    గత 30ఏళ్లుగా రథోవ్సవంలో పాల్గొంటున్నా. నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణువర్ధన్‌రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.   

  • ఎన్టీఆర్‌ జిల్లా: అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటే ఒకేసారి చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒకరు ఉదయం భూమి చేస్తే.. అదే కార్యక్రమానికి సాయంత్రం మరొకరు భూమి పూజ చేస్తారు. ఇలా భూమి పూజతో అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమిలో వర్గ విభేదాలు రోడ్డెక్కాయి.  

    ఎన్టీఆర్‌ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించారు కూటమి నేతలు. కోడూరు మండలం కోడూరు ఎస్సీ కాలనీ రోడ్డుకు భూమి పూజలో రగడ నెలకొంది.  

    ఉదయం జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ భూమి పూజ చేశారు. మధ్యాహ్నం అదే రోడ్డుకు కోడూరు మండల టిడిపి నాయకులు మళ్లీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌పై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

  • ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం  పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి  సమాధానం ఇచ్చారు. 

    రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా,  టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల  రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.

    ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది.  చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. 

  • సాక్షి, విశాఖపట్నం: గీతం వర్సిటీ భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వందలాది ప్రజలు ఈరోజు (సోమవారం) కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అక్రమంగా కబ్జా చేసిన భూములలో నిర్మాణాలు ఆపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకేరాజు, మాజీ ఎమ్మెల్యే  వాసుపల్లి గణేశ్ కుమార్ కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ప్రజల ఫిర్యాదులను స్వీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టరేట్‌లో బైఠాయించారు.

    విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ రూ, 5 వేల కోట్లు దోచుకున్నారని వైఎస్ఆర్సీపి కార్పొరేటర్ల పై దాడి చేసి జీఎంసి కౌన్సిల్ సమావేశంలో అక్రమంగా భూమిని క్రమబద్ధీకరించుకున్నారని కేకే రాజు ఆరోపించారు. వందలాది మంది ప్రజ ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చినా ఎంపీ భరత్ ఆదేశాల మేరకు  ఫిర్యాదులు  తీసుకోలేదన్నారు. కోర్టులో కేసులు ఉండగానే అక్రమ నిర్మాణాలు గీతంలో చేపడతారని ప్రశ్నించారు. పోలీసుల జూలంతో తమ పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్నారు.

    టీడీపీ నాయకుల అవినీతి బీజేపి నాయకులకు కనిపించట్లేదా అని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నారు. భూకబ్జాలు చేసిన ఎంపీ భరత్ ను జైల్లో పెట్టాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే  గీతం భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాలను కూలదొస్తమని హెచ్చరించారు.  గీతం భూబ్జాలపై ఫిర్యాదులు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఆ‍ధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

National

  • చెన్నై: తమిళనాడులో మరో 2 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు.

    తమిళనాడులోని సిరుగనూరులో స్టాలిన్‌ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో గెలవడానికి అన్నాడీఎంకేను బీజేపీ క్రమంగా నాశనం చేస్తోంది. తమిళనాడులో బీజేపీ బిహార్‌ ఫార్ములాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ను పక్కనపెట్టేసి తమ పార్టీకి చెందిన నేతను సీఎం చేయడానికి ఏర్పాటు చేసుకుంది. 

    బిహార్‌లో ఎప్పుడూ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి లేరు. నితీశ్‌ను ముందు నిలబెట్టి చూపిస్తూ ఎన్నికలు గెలిచిన తరువాత ఇప్పుడు ఆయనను పక్కకు నెట్టారు. ముఖ్యమంత్రి కావాలన‍్న స్వార్థంతో పళనిస్వామి బీజేపీకి బానిసగా మారారు.

    ఈ ఎన్నికలు తమిళనాడుకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్నాయి. ఢిల్లీ టీమ్‌ గెలుస్తుందా? తమిళనాడు టీమ్‌ గెలుస్తుందా? అన్న అంశంపై ఆధారపడే 2026 ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ కుతంత్రాలు తమిళనాడులో పనిచేయవు. ఇక్కడ మేమే ఉంటాం, మా నేలపై గెలుపు మాదే, గెలిచేది మేమే. 

    మీరు పల్టీలు కొట్టినా, ఏ ముసుగు వేసినా, ఏ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించినా, తమిళనాడు ఎప్పటికీ మీకు లొంగదు. నేను ఉన్నంత కాలం, నా పార్టీ పనిచేస్తున్నంత కాలం బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రావడం అసాధ్యం’ అని స్టాలిన్‌ తెలిపారు. 

    ఇదీ చదవండి: ‘మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే యుద్ధం మొత్తం‘

  • న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ ఇష్యూ మొత్తం ముగియవచ్చని భారత్‌లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా అన్నారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో మిర్జా మాట్లాడారు. యూఏఈకి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. మోదీ అంటే గల్ఫ్ నాయకులకు మాత్రమే కాదని,. ఆయా దేశాల ప్రజలు, వ్యాపార వర్గాల్లో కూడా ఆయనకు చాలా గౌరవం ఉందని మిర్జా చెప్పారు.  

    “ఇరాన్, ఇజ్రాయెల్ అధినేతలకు మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య ముగుస్తుంది. ఒక ఫోన్ కాల్ చాలు” అని మిర్జా చెప్పారు. ప్రస్తుతం యుద్ధం చేస్తున్న ఇరాన్‌- ఇజ్రాయెల్‌ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.

    ‘ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలో  చేరాలన‍్న ఆసక్తి యూఏఈకి లేదు. మా భూభాగాన్ని దాడుల కోసం వాడుకోవడానికి ఇరు పక్షాలకు అనుమతి ఇవ్వము. నిజంగా చెప్పాలంటే ఇందులో మేమెందుకు చేరుతున్నామో నాకు స్పష్టంగా తెలియదు. ఈ ఘర్షణలో యూఏఈ జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ లేదు” అని మిర్జా వ్యాఖ్యానించారు. రెండు పక్షాలతో తాము చర్చలు జరపగలమని అన్నారు.

    యూఏఈ సున్నితమైన భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో ఉంది. అది ఇరాన్ పక్కన ఉన్న దేశం. అలాగే అబ్రహామ్ ఒప్పందాల కింద ఇజ్రాయెల్‌తో యూఏఈ పార్ట్‌నర్‌షిప్‌ కొనసాగిస్తోంది. అబ్రహామ్ ఒప్పందాలు అంటే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణం చేసుకోవడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలు.

    “వాళ్లు మా భూభాగంగాపై పరస్పరం యుద్ధం చేస్తున్నారు. దీన్ని మేము అంగీకరించలేం” అని మిర్జా చెప్పారు. ఇప్పటివరకైతే నష్టం తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు.

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మరోసారి దాడులు చేసింది. బీరూట్‌లో హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి చెప్పిన వివరాల ప్రకారం యుద్ధంగా వల్ల ఇప్పటివరకు ఇరాన్‌లో 1,332 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. 

     

  • సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్‌కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్‌ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్‌ ఘటనలో విజయ్‌ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే.  

    ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.

    ఇక, తమిళనాడులో కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. 

Business

  • వంటగ్యాస్‌ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.

    గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

    మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతల ప్రభావం

    ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్‌పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    పెరిగిన ధరల భారం

    మరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్‌పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

    ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!

  • డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వారి కోసం రిలయన్స్‌ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఆదేశాల మేరకు వినియోగదారులపై అనవసరమైన డేటా భారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

    చాలా కాలంగా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్‌ను డేటాతో కలిపి విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడకం లేని వారు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ‘వినియోగదారులకు తమకు నచ్చిన సర్వీసులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అన్న ట్రాయ్ సూచనతో జియో రూ.1,178, రూ.448 ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.

    రూ.1,178 ప్లాన్..

    దీర్ఘకాలిక వాలిడిటీని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగమని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, కేవలం కాల్స్ కోసం ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపికని తెలిపింది. దీని వాలిడిటీ 336 రోజులు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం వాలిడిటీ కాలానికి 3,600 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు.

    రూ.448 ప్లాన్..

    మూడు నెలల కాలపరిమితితో తక్కువ బడ్జెట్‌లో కాలింగ్ సేవలు పొందాలనుకునే వారికి ఇది అనుకూలమని కంపెనీ చెప్పింది. వాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. అందులో ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి యాడ్ ఆన్ సేవలకు యాక్సెస్ ఉంటుంది.

    డేటా కావాలంటే ఏం చేయాలి?

    ఈ ప్లాన్లలో ప్రాథమికంగా డేటా ఉండదు. అయితే, ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జియో తెలిపింది. నేరుగా కంపెనీ అందిస్తున్న డేటా వోచర్లతో రీఛార్జ్‌ చేసుకోవచ్చని చెప్పింది.

    ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

  • పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్‌ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. బహ్రెయిన్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ‘అల్-మామీర్’పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో బహ్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ‘బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ’ (బాప్కో) తన చమురు రవాణాపై ‘ఫోర్స్ మేజర్’(అదుపు చేయలేని అసాధారణ పరిస్థితులు) ప్రకటించింది.

    బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ అధికారిక సమాచారం ప్రకారం.. అల్-మామీర్ చమురు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడిలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రక్షణ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

    ‘ఫోర్స్ మేజర్’ అంటే ఏమిటి?

    చమురు వ్యాపార ఒప్పందాల్లో ఫోర్స్ మేజర్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా నియంత్రించలేని అసాధారణ పరిస్థితులు సంభవించినప్పుడు.. ఒక కంపెనీ తన క్లయింట్లకు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వస్తువులను (చమురు) సరఫరా చేయలేకపోతే ఈ నిబంధనను వాడుకుంటుంది. దీనివల్ల డెలివరీలో జాప్యం జరిగినా లేదా సరఫరా ఆగిపోయినా కంపెనీ(బాప్కో)పై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు పడే అవకాశం ఉండదు.

    అంతర్జాతీయ సరఫరాలకు అంతరాయం కలిగినప్పటికీ బహ్రెయిన్ అంతర్గత మార్కెట్‌కు ఇంధన కొరత లేకుండా అత్యవసర ప్రణాళికల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

    స్తంభించిన హార్ముజ్ జలసంధి..

    ఈ దాడి ప్రభావం కేవలం బహ్రెయిన్‌పైనే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఐదో వంతు రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్యాంకర్లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. ఇది ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి ధరల కంటే 60 శాతం అధికం కావడం గమనార్హం.

    ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

  • పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతకంతకూ క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఇంధన భద్రత, కోటి మంది ప్రవాస భారతీయుల జీవనానికి ముప్పుగా పరిణమించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలి రోజైన సోమవారం ఆయన రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై మాట్లాడారు.

    క్షీణించిన భద్రత.. ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థ

    పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు దిగజారాయని మంత్రి పేర్కొన్నారు. ‘మేము అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనాన్ని, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఇప్పటికే పొరుగు దేశాలకు వ్యాపించి విధ్వంసానికి దారితీస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సభ తరఫున ఆయన సంతాపం ప్రకటించారు.

    సరఫరా గొలుసుపై ప్రభావం

    భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ప్రధానంగా మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని జైశంకర్ అన్నారు. ముడిచమురుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉండటంతో సరఫరా గొలుసు దెబ్బతినడం భారత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని పేర్కొన్నారు.

    కోటి మంది భారతీయుల భద్రత

    పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు అత్యంత ప్రధానమైన అంశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారతీయుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు.

    ఇరాన్ నౌకల అభ్యర్థనపై స్పష్టత

    సముద్ర లాజిస్టిక్స్ విషయంలో ఇరాన్ ఇటీవల భారతదేశాన్ని సంప్రదించిందని జైశంకర్ వెల్లడించారు. భారత తీరాల్లో మూడు ఇరాన్ నౌకలు లంగరు వేయడానికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తన జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ నిబంధనలను బేరీజు వేసుకుంటూ నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

    చర్చలు ముఖ్యం

    ‘ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ నమ్ముతోంది. ఇటీవల కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారతదేశ ఆర్థిక పురోగతికి, ప్రాంతీయ భద్రతకు అత్యవసరమని సభకు వివరించారు.

    ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!

  • మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో మారుతున్న యుద్ధ సమీకరణాలు సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపే దశకు చేరాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, వంటగ్యాస్ కొరత పెరిగినట్లు కొందరు భావిస్తున్నారు.

    వేచి ఉండే సమయం పెంపు.. పెరిగిన ఆందోళన

    గ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వినియోగదారులు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సరుకు రవాణాలో ఆలస్యం కారణంగా బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే డీలర్ల వద్ద బుకింగ్‌లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో డీలర్ అవుట్‌లెట్ల వద్ద క్యూ కడుతున్నారు.

    కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేత

    హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేశారు. ‘కనీసం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లు అయినా అందుబాటులో ఉన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్స్‌ తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి’ అని ఒక సబర్బన్ డీలర్ పేర్కొన్నారు. దీనివల్ల హోటల్ యజమానులు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    పెరిగిన ధరలు.. కొత్త నిబంధనలు

    సంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం మోపినట్లయింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై దేశీయ వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో ఇది 15 రోజులుగా ఉండేది. గతంలో ఉన్న సరళమైన బుకింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం నియంత్రించడం గమనార్హం.

    క్షేత్రస్థాయిలో భయాందోళనలు

    ముంబయిలోని అంధేరీ వంటి రద్దీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే వినియోగదారులు డీలర్ల కార్యాలయాలకు పరుగులు తీశారు. ‘గ్యాస్ అయిపోకముందే ఒక సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. యుద్ధం ఎటు దారితీస్తుందో, సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’

  • దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 449 పాయింట్లు నష్టపోయి 24,001 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1424 పాయింట్లు దిగజారి 77,494 వద్దకు చేరింది.

    భారత స్టాక్ మార్కెట్‌లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పేకమేడల్లా కూలిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల సెన్సెక్స్, నిఫ్టీలను పాతాళానికి నెట్టేశాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు దాదాపు ఒకనొక సమయంలో రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

    మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలు

    • గత వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ కాల్పుల విరమణకు నిరాకరించడం, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగింది.

    • యుద్ధ భయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 26% పెరిగింది. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

    • డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.33 కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.

    • అమెరికాలో 10 ఏళ్ల బాండ్ యీల్డ్స్ 4.20% స్థాయికి చేరడం, డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులు సురక్షితమైన అమెరికా బాండ్ల వైపు మళ్లుతున్నాయి.

    • వడ్డీ రేట్లు తగ్గుతాయనే ఆశలు ఆవిరి కావడంతో బ్యాంకింగ్ స్టాక్స్ కుదేలయ్యాయి.

    ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నాను రూ. 10.98 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ అప్డేటెడ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పొందుతుంది.

    ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు.. మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేసిన రెండు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది. 

    2026 వెర్నాలో ఇప్పుడు బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు & 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, కో-డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ వాక్-ఇన్ పరికరం, వెనుక విండో సన్‌షేడ్, డాష్‌క్యామ్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. సరౌండ్-వ్యూ కెమెరా, లెవల్ 2 ADAS సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ & బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఇతర ఫీచర్లు ఆఫర్‌లో ఉన్నాయి.

Sports

  • తాము సంయుక్తంగా (భారత్‌తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్‌-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్‌స్టన్‌. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్‌ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్‌ కోచ్‌గా) నిలిపాడు.

    పొట్టి ప్రపంచకప్‌ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్‌ కోచ్‌గా ఉండిన సనత్‌ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్‌ బోర్డు కిర్‌స్టన్‌ను ఎంపిక​ చేసింది. కిర్‌స్టన్‌ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా లంక క్రికెట్‌ కిర్‌స్టన్‌ నియామకం చేపట్టింది.

    కిర్‌స్టన్‌ను హెడ్‌ కోచ్‌గా మంచి ట్రాక్‌ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్‌లో అతను విజయవంతమైన జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి కూడా చేర్చాడు. 

    అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్‌లో ఏదైనా ఫెయిల్యూర్‌ ఉందా అంటే అది పాకిస్తాన్‌ వైట్‌ బాల్‌ జట్టుకు కోచ్‌గా సేవలందించడమే. పాక్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).

    ఐపీఎల్‌లో కిర్‌స్టన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్‌స్టన్‌ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్‌ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్‌ను ( జేమీ సిడ్డన్స్‌) కూడా మార్చింది. 

  • టీమిండియా సొంత‌గ‌డ్డ‌పై టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిల‌వ‌డంతో హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ పేరు మారుమోగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు అత‌డిని తిట్టిపోసిన వారు కూడా ఇప్పుడు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీమిండియా క్రెడిట్ అంతా గౌతీదేన‌ని పొగుడుతున్నారు. గంభీర్ మాత్రం ఇద్ద‌రు దిగ్గజాల పేర్లు చెప్పాడు. మెన్ ఇన్ బ్లూ విజ‌యాల వెనుక వీరిద్ద‌రూ ఉన్నార‌ని మీడియా ముఖంగా ప్ర‌క‌టించాడు.

    మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడాడు గంభీర్‌. టీమిండియా టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యాన్ని ఎవరికి అంకితం చేస్తార‌ని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు గంభీర్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానం ఇచ్చాడు. ఎవ‌రూ ఊహించ‌ని పేర్లు చెప్పాడు. వారే రాహుల్ ద్ర‌విడ్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. టీమిండియా విజ‌యాల్లో వీరిద్ద‌రి పాత్ర ఎంతో ఉంద‌ని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.

    "టి20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీని రాహుల్ ద్రవిడ్, వీవీఎస్  లక్ష్మణ్‌లకు అంకితం చేస్తున్నాను. భారత జట్టును ద్రవిడ్ ఒక స్థానంలో ఉంచారు. అలాగే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను లక్ష్మణ్ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నడిపిస్తూ జ‌ట్టుకు విలువైన సేవ‌లు అందిస్తున్నార‌"ని గంభీర్ పేర్కొన్నాడు. రాహుల్ ద్ర‌విడ్.. గంభీర్ కంటే టీమిండియా హెచ్‌కోచ్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

    వారిద్ద‌రికీ కృతజ్ఞతలు
    ఐసీసీ ప్ర‌స్తుత‌ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్య‌ద‌ర్శి జైషా త‌న‌కు క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచార‌ని వెల్ల‌డించారు. గ‌తేడాది స్వ‌దేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ప్పుడు జైషా ద‌న్నుగా నిలిచార‌ని తెలిపాడు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా నిజాయితీగా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోయార‌ని బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్‌ను పొగిడారు. వీరిద్ద‌రికీ గంభీర్ కృతజ్ఞతలు చెప్పాడు.

    భయాన్ని వ‌దులుకోవాలి
    తాను త‌న జ‌ట్టుకు జ‌వాబుదారిగా ఉంటాన‌ని, సోషల్ మీడియాలోని వ్యక్తులకు కాదని గంభీర్ స్ప‌ష్టం చేశాడు. టీమ్ వ‌ల్లే తాను కోచ్ కాగ‌లిగాన‌ని అన్నాడు. ఓడిపోతామనే భయాన్ని ముందుగా వదులుకోవాలని అభిప్రాయ‌ప‌డ్డాడు. సెమీస్‌, ఫైన‌ల్లో 250 పరుగులు చేయాలంటే ధైర్యం చూపించాల్సిందేన‌న్నారు. ఆట‌గాళ్లు వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే ట్రోఫీలు గెల‌వ‌డానికే ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించాడు. తానేప్పుడు న‌మ్మ‌కం ఆధారంగానే  జ‌ట్టు స‌భ్యుల‌ను ఎంపిక చేస్తాన‌ని చెప్పాడు. 

    చ‌ద‌వండి: సంజు, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే!

  • నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.

    ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్‌ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ న్యూజిలాండ్‌ బౌలర్లను ఊచకోత కోశారు.

    వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్‌ అనంతరం అభిషేక్‌ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అతను సహచరుడు శివమ్‌ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడినట్లు పేర్కొన్నాడు.

    అభిషేక్‌ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్‌తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు.  

    ప్రస్తుత ప్రపంచకప్‌లో అభిషేక్‌ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్‌ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చి భారత్‌ భారీ స్కోర్‌ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్‌తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ దశనే మార్చేసింది. 

    ఇలాంటి కీలక ఇన్నింగ్స్‌ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో ఆడటం విశేషం. అభిషేక్‌కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్‌లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్‌లో సిరాజ్‌ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ బ్యాట్‌తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్‌గా ఫైనల్‌లో అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అరిపించి, భారత్‌ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. 

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026 ముగిసిన నేపథ్యంలో టీమిండియా తదుపరి షెడ్యూల్‌ ఎంటని అభిమానులు చర్చించుకుంటున్నారు. 20 రోజుల గ్యాప్‌ తర్వాత (మార్చి 28) ఐపీఎల్‌ 2026 ప్రారంభమవుతుంది. ఈ లీగ్‌ మే 31 వరకు కొనసాగుతుంది. ఆతర్వాతే టీమిండియా షెడ్యూల్‌ మొదలవుతుంది.

    జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్‌, వన్డే సిరీస్‌ జరుగుతుంది. టెస్ట్‌ మ్యాచ్‌ న్యూ చంఢీఘడ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జూన్ 6–10 వరకు జరుగుతుంది. అనంతరం జూన్‌ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి.

    ఆతర్వాత భారత్‌ జులైలో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్  వేదికలుగా జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో.. వన్డేలు ఎడ్జ్‌బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జులై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి.

    అనంతరం భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో 2 టెస్ట్‌లు, 2 టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో ఏషియన్‌ గేమ్స్‌ జరుగుతాయి. దాని తర్వాత భారత జట్టు స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. అనంతరం  స్వదేశంలోనే వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతుంది.  

    అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి. 

  • పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన కోసం 15 మంది సభ్యుల వన్డే జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ లేకపోవడం అభిమానులకు ఆశ్చర్యానికి కలిగించింది. బాబర్‌ ఇటీవలికాలంలో మిగతా ఫార్మాట్లతో పాటు వన్డేల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అందుకే అతనిపై వేటు పడిందని అంతా అనుకున్నారు. అయితే దీనిపై పాక్‌ కోచ్‌ మరోలా వివరణ ఇచ్చాడు.

    బంగ్లా సిరీస్‌ నుంచి బాబర్‌ను తప్పించలేదు.  ఈ సిరీస్‌ను యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే వేదికగా చూస్తున్నాము. బాబర్‌తో పాటు సైమ్ అయూబ్, నసీమ్ షా కూడా జట్టులో లేరని గుర్తు చేశాడు. మొత్తంగా బాబర్‌పై పడింది వేటు కాదని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే అతనికి విశ్రాంతినిచ్చారని స్పష్టతనిచ్చాడు.

    కాగా, బంగ్లా సిరీస్‌కు దేశీయంగా సత్తా చాటుతున్న అబ్దుల్‌ సమద్‌, సాద్‌ మసూద్‌, షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్ వంటి  యువ ఆటగాళ్లతో పాటు టీ20 వరల్డ్‌కప్‌ 2026లో చెలరేగిపోయిన (2 సెంచరీల సాయంతో 383 పరుగులు) సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది కొనసాగాడు. కొత్తగా ఆరుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు.

    బంగ్లా పర్యటనలో పాక్‌ మూడు వన్డేలు ఆడనుంది. ఢాకాలోని షేక్‌ ఏ బంగ్లా స్టేడియం వేదికగా మార్చి 11, 13, 15 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

    జట్లు.. 
    పాకిస్తాన్: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్ఱం, హారిస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, మొహమ్మద్ ఘాజీ ఘోరి, సాద్ మసూద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షమైల్ హుస్సేన్.  

    బంగ్లాదేశ్: మెహిదీ హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తంజిద్ హసన్, నజ్ముల్ హొసైన్ షాంటో, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ఆఫిఫ్ హొసైన్, మహిదుల్ ఇస్లాం భుయాన్, రిషాద్ హొసైన్, తాన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నాహిద్ రానా.  
     

  • భారత క్రికెట్ చరిత్రలో సంజూ శాంసన్‌ తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు.  తన అద్భుత ప్రదర్శనలతో భారత జట్టుకు మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2026లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. తిరిగి టైటిల్‌ను రిటైన్ చేసుకుంది.

    అయితే ఈ మెగా టోర్నీలో ఎవరూ ఊహించని విధంగా శాంసన్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్'  గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు దక్కకపోయిన అతడు ఎక్కడ నిరాశ చెందలేదు. తిరిగి జట్టులోకి వచ్చి సింహంలా గర్జించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ నుంచి తుది పోరు వరకు సంజూ దుమ్ములేపాడు. 

    వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కి పైగా పరుగులు చేసి సత్తాచాటాడు. వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంజూ.. ఆ తర్వాత వరుసగా సెమీస్‌, ఫైనల్లో 89 పరుగులు చేశాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. సంజూ మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. అయితే సంజూ శాంసన్ సక్సెస్ వెనక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని సంజూ వెల్లడించాడు.

    "అంతా కలలా ఉంది. ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. కివీస్‌తో సిరీస్‌లో వైఫల్యం తర్వాత నా కలలు చెదిరిపోయాయి. నేనేం చేయలేనా అని చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అండగా నిలిచాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సహకరించారు.

    గత రెండు నెలలుగా సచిన్‌ సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాను. సచిన్ చాలా సలహాలు ఇచ్చారు.  ఆయనతో మాట్లాడటంతో మార్గనిర్దేశనం లభించింది. ఇది చాలా పెద్ద ఘనత. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు" సంజూ పేర్కొన్నాడు.

  • నిన్న (మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో ఎడిషన్‌లో (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.  

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. సంజూ శాంసన్‌ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో శివమ్‌ దూబే (8 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో నీషమ్‌ 3, మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. బుమ్రా (4-0-15-4), అక్షర్‌ పటేల్‌ (3-0-27-3), హార్దికా​ పాండ్యా (4-0-26-1), వరుణ్‌ చక్రవర్తి (3-0-29-1), అభిషేక్‌ శర్మ (1-0-5-1) ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటై, 96 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

    కివీస్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ (52), మిచెల్‌ సాంట్నర్‌ (43) మాత్రమే నామమాత్రపు ప్రదర్శనలు చేశారు. 4 వికెట్లతో న్యూజిలాండ్‌ వెన్ను విరిచిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌.. సూపర్‌-8 నుంచి భారత విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు లభించాయి.

    ఇదిలా ఉంటే, టోర్నీ పూర్తయ్యాక ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత ఆటగాళ్ల హవా కొనసాగింది. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు సికందర్‌ రజా ఎంపికయ్యాడు. భారత్‌ నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా) ఎంపికయ్యారు. 12వ ఆటగాడు కూడా భారత ఆటగాడే (హార్దిక్‌ పాండ్యా) కావడం విశేషం.

    ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ టీ20 వరల్డ్‌కప్ 2026: సంజూ శాంసన్ (wk), టిమ్ సీఫెర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రాన్ హెట్మైర్, సికందర్ రజా (c), శివమ్‌ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజారబాని, జస్ప్రీత్ బుమ్రా
    12వ ఆటగాడు: హార్దిక్ పాండ్యా

  • టీమిండియా దాదాపు 15 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై మరో ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. వన్డే ప్రపంచకప్‌-2023లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. టీ20 వరల్డ్‌కప్‌-2026లో మాత్రం ఎలాంటి పొరపాటు చేయలేదు. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే ఊహించని పరాభవం చవిచూసిందో.. ఇప్పుడు అదే వేదికలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

    ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని.. మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్‌లో మూడు సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచిన ఏకైక జ‌ట్టుగా భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. అయితే చారిత్రత్మక విజయంలో స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర.

    టోర్నీ ఆరంభంలో తుది జట్టులోనే లేని సంజూ.. ఆ త‌ర్వాత అనుహ్యంగా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వ‌రుస‌గా మూడు కీల‌క మ్యాచ్‌ల‌లోనూ హాఫ్ సెంచ‌రీలు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచాడు. సెమీఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై 89 పరుగులు చేసిన.. ఫైనల్లో కివీస్‌పై కూడా అదే తరహా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు.

    అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లోనూ 97 పరుగులతో సత్తాచాటాడు. దీంతో సంజూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్‌తో పోలుస్తున్నారు. యువరాజ్ కూడా అప్పుడు తన అద్బుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే యువీతో సంజూ పోలుస్తున్నారు.

    అయితే ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "యువరాజ్ సింగ్‌తో సంజూను పోల్చడం సరికాదు. కానీ సంజూ ఏమి చేశాడో మనందరికి తెలుసు. నిజంగా అతడు అద్భుతాలు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 80కు పైగా పరుగులు చేయడం అంత సులువైన విషయం కాదు.

    ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమై, టోర్నీ ప్రారంభంలో బెంచ్‌కే పరిమితమై,  ఆ తర్వాత ఈ తరహా ఇన్నింగ్స్‌లు ఆడడం నిజంగా గ్రేట్‌. ఇది అతడిలోని ధైర్యానికి నిదర్శనం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. సంజూ ఒక స్పెషల్ ప్లేయర్" అని గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
    చదవండి: T20 WC 2026: ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
     

  • 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎదురైన నిరాశను భారత జట్టు 2026 పొట్టి ప్రపంచకప్‌లో తుడిచిపెట్టేసింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇది భారత్‌కు మూడో టీ20 టైటిల్. మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ (రెండు వన్డే, మూడు టీ20). 

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న (మార్చి 8) జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించింది.

    కాగా, టీమిండియా వరల్డ్ కప్ విజయాల వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 1983 వన్డే వరల్డ్‌కప్‌ విజయం నుంచి తాజాగా సాధించిన 2026 టీ20 ప్రపంచకప్‌ వరకు భారత్ గెలిచిన ప్రతి వరల్డ్ కప్‌లో ఒక సర్దార్ (పంజాబీ), ఒక కేరళ ఆటగాడు జట్టులో భాగమయ్యారు. 

    1983లో బల్విందర్ సంధూ (సర్దార్), సునీల్ వాల్సన్ (కేరళ)తో ఈ సంప్రదాయం మొదలైంది. 2007 (టీ20), 2011 (వన్డే) ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ (కేరళ), హర్భజన్ సింగ్ (సర్దార్) కీలక పాత్ర పోషించారు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లలో సంజూ శాంసన్ (కేరళ), అర్ష్‌దీప్ సింగ్ (సర్దార్) ఈ ప్యాటర్న్‌ను కొనసాగించారు.  

    రాకింగ్‌ సంజూ  
    2026 టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై అజేయమైన 97 పరుగులు (50 బంతుల్లో) చేసిన సంజూ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై, ఫైనల్లో న్యూజిలాండ్‌పై తలో 89 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు సాధించాడు. 2024 ఎడిషన్‌లో సంజూ పూర్తిగా బెంచ్‌పైనే గడిపాడు. ఇది 1983లో వాల్సన్ పరిస్థితిని గుర్తు చేసింది.  

    షేకింగ్‌ సర్దార్‌
    2024 ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా (17 వికెట్లు) నిలిచి భారత్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన అర్షదీప్‌ సింగ్‌.. తాజా ఎడిషన్‌లోనూ (2026) ఇంచుమించు అదే తరహా ప్రదర్శనలతో (9 వికెట్లు) షేకింగ్‌ సర్దార్‌ అనిపించుకున్నాడు. అర్షదీప్‌ తన నిలకడ ప్రదర్శనలతో భారత్‌కు వరుసగా రెండు టీ20 టైటిళ్లు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.  

     

  • టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్‌ది కీల‌క పాత్ర‌. అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

    కేవ‌లం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 54 ప‌రుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.

    ఏమి జరిగిందంటే?
    ఫైన‌ల్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిష‌న్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిష‌న్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భ‌ర్త రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్‌క‌తాలో ఓ  వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించ‌ని సంఘ‌ట‌న జ‌రిగింది. వారిద్ద‌రి మ‌ర‌ణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.

    ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విష‌యంపై కిష‌న్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జ‌రిగిపోయింది. మేము చాలా బాధ‌లో ఉన్నాము అని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌ అహ్మ‌దాబాద్‌లో జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌కు హాజ‌రావ్వాల్సి ఉండేది. కానీ త‌మ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కార‌ణంగా ప్ర‌ణ‌వ్ కోల్‌క‌తాలో ఉండిపోయారు. 

    మ్యాచ్ అనంత‌రం కిష‌న్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాల‌ని కోరుకునేది. ఇప్పుడు న‌న్ను ఛాంపియ‌న్‌గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధ‌గా ఉంద‌ని కిష‌న్ భావోద్వేగానికి లోన‌య్యాడు. కాగా దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.
    చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్ద‌రూ కూడా హీరోలే

  • టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. అహ్మదాబాద్‌లో కివీస్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్‌ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ..

    తుదిజట్టులో లేకపోయి ఉంటే..
    ‘‘ఈ ‍ప్రపంచకప్‌ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్‌ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్‌తో సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

    ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్‌ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్‌ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.

    అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్‌వర్క్‌కు లభించిన స్వీటెస్ట్‌ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.

    నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం
    కాగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఆడాడు.

    అయితే, నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. 

    చదవండి: సంజూ, ఇషాన్‌ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్‌ మాజీ క్రికెటర్‌

  • ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. దిగ్గజ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. టీమిండియాతో జరిగిన ఏకైక టెస్టు తర్వాత హీలీ ఆట నుంచి తప్పుకొంది. మ్యాచ్‌ ముగిశాక సహచరులు అలీసాను తమ భుజాలపై ఎత్తుకొని మైదానం చుట్టూ తిరిగారు. 

    కాగా 35 ఏళ్ల అలీసా 11 టెస్టుల్లో 502 పరుగులు... 126 వన్డేల్లో 3777 పరుగులు... 162 టి20ల్లో 3054 పరుగులు సాధించింది. మూడు ఫార్మాట్‌లలో కలిపి అలీసా 173 క్యాచ్‌లు తీసుకొని, 103 స్టంపింగ్‌లు చేసింది.

    మిచెల్‌ స్టార్క్‌ సతీమణి
    తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీలీ.. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సతీమణి కూడా!.. భర్త మైదానంలో బ్యాటర్లను హడలెత్తిస్తుంటే.. భార్యేమో బౌలర్ల పాలిట విలన్‌ అయిన సందర్భాలు కోకొల్లలు. ఇక హీలీ చివరి మ్యాచ్‌ చూసేందుకు స్టార్క్‌ మైదానానికి వచ్చి ఆమెను చీర్‌ చేశాడు.

    ఇదిలా ఉంటే.. ఆరుసార్లు ఐసీసీ మహిళల టీ20 ప్రంపచకప్‌ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా హీలీ రికార్డు సాధించింది. అంతేకాదు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత ఆమె సొంతం. అదే విధంగా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు కూడా హీలీ పేరిటే ఉండగా.... అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్‌గానూ గుర్తింపు దక్కించుకుంది.

    రికార్డుల మోత
    అంతేకాదు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌గానూ.. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గానూ హీలీ అరుదైన ఘనత సాధించింది. ఇక ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే హీలీ రికార్డుల జాబితా పెద్దగానే ఉంది.    

    మూడో రోజే
    ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించిన భారత మహిళల జట్టు ఓవరాల్‌ చాంపియన్‌ఫిప్‌ను ఘోరంగా ముగించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌ను 2–1తో వశం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ బృందం... మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యింది. 

    ఏకైక డే అండ్‌ నైట్‌ టెస్టులో పూర్తిగా చేతులెత్తేసింది. 4 రోజుల పింక్‌బాల్‌ టెస్టును కనీసం రెండున్నర రోజులైనా ఆడలేక మూడో రోజే ప్రత్యర్థి ముందు మోకరిల్లింది.

    ఓవర్‌నైట్‌ స్కోరు 105/6తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 48.2 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. క్రితం రోజు బ్యాటర్‌ ప్రతీక రావల్‌ (137 బంతుల్లో 63; 8 ఫోర్లు) చేసిన అర్ధసెంచరీ భారత్‌ను ఇన్నింగ్స్‌ పరాజయం నుంచి తప్పించింది కానీ పరాభవం నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయింది. ప్రతీక, స్నేహ్‌ రాణా (54 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.

    ఏకైక టెస్టు విజయంతో
    ఈ కాస్త పోరాటం చేస్తున్న వీరిద్దరిని యాష్లే గార్డ్‌నర్‌ (2/8) అవుట్‌ చేయగా, అలానా కింగ్‌ (2/23) టెయిలెండర్ల పనిపట్టింది. కేవలం 25 పరుగుల నామమాత్రమైన లక్ష్యాన్ని ఆతిథ్య జట్టుకు నిర్దేశించగా, ఓపెనర్లు జార్జియా వోల్‌ (16 నాటౌట్‌; 4 ఫోర్లు), ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (11 నాటౌట్‌; 1 ఫోర్‌) 4.3 ఓవర్లలోనే అజేయంగా ముగించారు. 

    శతకం సహా రెండు ఇన్నింగ్స్‌ల్లో (4/46, 2/15) ఆరు వికెట్లు తీసిన అనాబెల్‌ సదర్లాండ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

    టీ20లు, వన్డేలు, ఒక టెస్టు కలిపి సాగిన ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను 12–4 పాయింట్ల తేడాతో ఆసీస్‌ జట్టు చేజిక్కించుకుంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ విజయానికి 2 పాయింట్లు, టెస్టు గెలుపునకు 4 పాయింట్లు కేటాయించారు. రెండు టీ20లు నెగ్గిన భారత్‌ ఖాతాలో 4 పాయింట్లే ఉండగా, ఒక టి20, మూడు వన్డేలు, ఏకైక టెస్టు విజయంతో ఆసీస్‌ డజను పాయింట్లను సాధించింది. 

     

  • సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్‌, జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ త్రయం గురించే మాట్లాడుకుంటున్నారు. టీ20 వరల్డ్‌కప్-2026 వీరివల్లే భారత్ గెలిచిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవును నిజమే. కానీ వీరితో పాటు మ‌రో ఇద్ద‌రు సైలెంట్ హీరోలు కూడా ఉన్నారు. 

    భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో వారిద్ద‌రూ పోషించిన పాత్ర వెలకట్టలేనిది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతితో వికెట్లు తీయడం, బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం వారి స్పెషాలిటీ. ఒకరెమో తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగా.. మరొకరు తన స్పిన్ మయాజాలంతో కివీస్ అగ్రశ్రేణి బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. వారే ఆల్‌రౌండర్లు శివమ్ దూబే, అక్షర్ పటేల్‌.

    సిక్సర్ల దూబే
    ఈ టోర్నీ అసాంతం దూబే అద్భతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. సంజూ శాంసన్‌, ఇషాన్ కిషన్ వంటి వారు ఆరంభంలో దూకుడుగా ఆడితే, దూబే చివరిలో బ్యాటింగ్‌కు వచ్చి తనపని తాను చేసుకోపోయేవాడు. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం విఫలమైనా.. దూబే మాత్రం రాణించాడు. 

    కీలకమైన సెమీఫైనల్‌, ఫైనల్‌లోనూ తన మార్క్‌ను చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో సెకెండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ముంబై ఆటగాడు తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా దూబే బ్యాట్ ఝూలిపించాడు. 

    భారత్‌ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి తడబడుతున్న సమయంలో దూబే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముఖ్యంగా నీషమ్ వేసిన చివరి ఓవర్‌లో అతడు ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ 255 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. దూబే మొత్తంగా 9 మ్యాచ్‌ల‌లో 235 ప‌రుగులు చేశాడు. దూబే ఆడిన చిన్న చిన్న ఇన్నింగ్స్‌లు ఈ రోజు భార‌త్‌ను విశ్వ‌విజేత‌గా నిలిపింది.

    అక్ష‌ర్ అదుర్స్‌
    భార‌త్ ఫైన‌ల్‌కు చేరి క‌ప్ కొట్ట‌డంలో అక్ష‌ర్‌ది కీల‌క పాత్ర‌. వాంఖ‌డే వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీస్‌లో ప‌టేల్ బంతితో రాణించ‌క‌పోయిన‌ప్ప‌టికి ఫీల్డింగ్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. అక్ష‌ర్ సంచ‌ల‌న క్యాచ్‌ల‌తో హ్యారీ బ్రూక్‌, విల్ జాక్స్ వంటి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్లను పెవిలియ‌న్‌కు పంపాడు.

    ఒక‌వేళ అక్ష‌ర్ ఆ క్యాచ్‌ల‌ను అందుకోపోయింటే క‌థ మ‌రోలా ఉండేది. అప్ప‌టికే ఇంగ్లండ్ భార‌త్‌ను ఓడించే అంత ప‌నిచేసింది. ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అక్ష‌ర్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఫిన్ అలెన్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మిచెల్ వంటి డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ల‌ను ఔట్ చేసి భార‌త్‌కు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఈ ప్రపంచ కప్‌లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు.
    చదవండి: T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?


     

     

Family

  • ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్‌ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్‌యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్‌నెస్, సైక్లింగ్‌ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్‌నెస్‌ అడ్వొకేట్‌ కాంతి దత్‌ ముందుకు కదులుతున్నాడు. 

    ఫియర్‌ ప్రాజెక్ట్‌ పేరిట స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్‌నెస్‌ ప్రేమికులు పాల్గొని కాంతి దత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్‌ యాత్రను ప్రారంభించారు. 

    ఎనిమిది రోజుల పాటు.. 
    మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత, సైక్లింగ్‌ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. 

    ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్‌ తెలిపారు.  

    (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడైనా..)

  • కొన్ని క్షణాల్లో ఎంతటి బలంగా ఉండే వ్యక్తికైనా..ఒక్కసారిగా చేతులు వణుకుతాయి. అప్పుడే మనకు ధైర్యం విలువ గొప్పదనం తెలుస్తుంది కూడా. ప్రతి తండ్రికి ఎదురయ్యే ఈ గొప్ప మధుర క్షణాల్లో చేతులు వణుకుతాయోమో!?..ఇలానే భయపడతారేమో..!?. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

    ఈ వీడియోని డాక్టర్ సుగన్య శరవణకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్‌ చేశారు. డాక్టర్‌ శరవణ కుమార్‌ నవజాత శిశువుని తండ్రికి అప్పగిస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చాలా భయపడిపోయాడు. తన బిడ్డను పట్టుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. డాక్టర్‌ అతనికి భరోసా ఇస్తూ చేతుల్లోకి ఇచ్చినవప్పుడూ తీవ్రమైన భావోద్వేగంలో మునిగిపోతూ..చేతుల్లోకి శిశువుని తీసుకున్నాడు. 

    అయినప్పటికీ బిగిసుకుపోతున్నట్లుగా షాక్‌లోనే ఉన్న అతన్ని డాక్టర్‌ ప్లీజ్‌ టెన్షన్‌ పడొద్దు ఫ్రీగా ఉండండి అని సూచనలిస్తూ..తండ్రైన క్షణాన్ని అనుభవించేలా చేశారు. అంతేగాదు ఆ క్షణాలను కెమెరాలో బంధించి "బలమైన వ్యక్తి చిన్న ఆనందాన్ని పట్టుకున్నప్పుడు చేతులు వణుకుతాయి. 

    కొత్త ఆనందం కుటుంబంలో చేరినప్పుడు క్షణాలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైంది". అనే క్యాప్షన్‌ని జోడించి మరి పోస్ట్‌ చేశారు. ప్రతి తండ్రికి ఈ అనుభూతి తెలుసు, ఆ క్షణం భయంతో కూడిన ప్రేమ బయటకొస్తుంది అని పోస్టులు పెట్టారు.

    (చదవండి: ఎండిపోయిన నదికి ప్రాణం పోసిన మహిళా శక్తి..!)

     

  • ‘ఇంతింతై.. వటుడింతయై’ పోతన భాగవతంలోని వామనావతార ఘట్టానికి చెందిన ప్రసిద్ధ పద్యం తెలిసిందే.. వామనుడు విశ్వరూపం దాల్చి భూమి, ఆకాశం, నక్షత్రలోకాలను ఆక్రమించిన దృశ్యాన్ని ఈ పద్యం వరి్ణస్తుంది.. అలాగే సమాజాభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న మహిళా శక్తి కీర్తి ప్రతిష్టలు ఇంతై.. ఇంతింతై.. అన్నట్లు విశ్వవ్యాప్తమవుతున్నాయి. ఓ వైపు కుటుంబాన్ని నడిపించే శక్తిగా, మరోవైపు ప్రతి రంగంలోనూ ప్రతిభను చాటుతూ ఇంతులు కొత్త కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్నారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, స్వీయ సాధికరాతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘సాక్షి’ గ్రూప్‌ మరో ముందడుగు వేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆల్‌ ఫర్‌ హర్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  

    హైదరాబాద్‌లోని రాజపుష్ప అట్రియా వేదికగా జరిగిన వేడుకలు మహిళల సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, స్వయం అభివృద్ధి సందేశాన్ని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్‌ ఆరి్టస్ట్‌ తమన్నా రూజ్‌ మేకప్‌ మాస్టర్‌ క్లాస్‌ సెషన్‌ ప్రత్యేక ఆకర్షణ కాగా..ఈ సెషన్‌లో మహిళలకు ట్రెండీ మేకప్‌ పద్ధతులు, సేఫ్టీ మేకప్‌ టెక్నిక్స్, స్కిన్‌ కేర్‌ సంబంధిత సూచనలు అందించారు. 

    తమన్నా రూజ్‌ హైదరాబాద్‌లో మేకప్‌ స్టూడియోను ప్రారంభించిన తొలి మేకప్‌ ఆరి్టస్ట్‌గానే కాకుండా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేకప్‌ నుంచి పట్టభద్రురాలు.. రష్యా, లెబనాన్, దుబాయ్‌ వంటి పలు దేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. రాజపుష్ప అట్రియా అసోసియేషన్‌ సభ్యులతో పాటు కమ్యూనిటీకి చెందిన మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

    సాధికారత..సమన్వయం.. 
    మహిళల ఆత్మవిశ్వాసం, స్వీయ సాధికారత ప్రదర్శించేలా నిర్వహించిన ‘ఫేస్‌ ఆఫ్‌ సాక్షి కమ్యూనిటీ’ క్రౌన్‌ సెర్మనీ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా సూపర్‌ మామ్‌ క్రౌన్‌ను మధు, బ్యాలెన్సింగ్‌ చాంప్‌ కిరీటాన్ని సంగీత, గ్రేస్‌ ఫుల్‌ సీనియర్‌ లేడీ క్రౌన్‌ను సుమతి గెలుచుకున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాప్‌ డ్యాన్స్‌ యాక్టివిటీలో మహిళలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ఉమెన్స్‌ డే కేక్‌ కట్టింగ్‌ చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు జోయాలుక్కాస్‌ జ్యువెల్స్‌ ప్రోత్సాహక బహుమతులు 
    అందించారు. 

    పాఠకులతో సాక్షి మమేకం.. 
    సాక్షి మీడియా గ్రూప్‌ 18 సంవత్సరాలుగా ప్రజలకు, పాఠకులకు కొత్త ఆలోచనలు, కొత్త ఫార్మాట్లను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని, సమాజంతో మమేకమవుతూ ప్రజలతో సాన్నిహిత్యాన్ని బలోపేతం చేయడం సాక్షి గ్రూప్‌ లక్ష్యమని సంస్థ డైరెక్టర్‌ రాణీ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే మహిళలతో నేరుగా కలిసేందుకే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

    వ్యక్తిత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌.. 
    నేటి తరం మహిళల్లో అందంగా కనబడాలనే ఆసక్తి పెరుగుతోందని తమన్నా రూజ్‌ పేర్కొన్నారు. సాక్షి టీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న తాను మేకప్‌ ఆర్టిస్ట్‌ కెరీర్‌కు ముందు ‘సాక్షి’ టీవీలో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. సెల్ఫ్‌ మేకప్, సెల్ఫ్‌ గ్రూమింగ్‌ పట్ల అవగాహన కల్పించడమే ఈ సెషన్‌ లక్ష్యమని, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారని, మహిళల దైనందిన జీవితంలో అందం, వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. 

    మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. నేటి తరం పురుషుల ఆలోచనా విధానంలో మార్పువచి్చందని, అమ్మ, భార్య, చెల్లి, ఇలా కుటుంబంలోని మహిళలను వారు ఎన్నుకున్న రంగంలో ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. నగరంలో బ్యూటీ రంగం ఎంతో మార్పు చెందిందని, ముఖ్యంగా దక్షిణ భారత సమాజంలో మేకప్‌పై ఉన్న సంప్రదాయ భావనలు క్రమంగా మారుతున్నాయని పేర్కొన్నారు.

    వెల్‌ డన్‌ ‘సాక్షి’.. 
    ఉమెన్స్‌ డే రోజున సాక్షి ఆధ్వర్యంలో మా కోసం స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ ‘ఆల్‌ ఫర్‌ 
    హర్‌’ వేడుకలు అభినందనీయం. ఈ వేడుకలు మా అందరికీ సరికొత్త అనుభూతిని, స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి గ్రూప్‌కు ప్రత్యేక అభినందనలు.  
    – జానకి (పార్టిసిపేషన్‌ ప్రైజ్‌ విన్నర్‌)   

    (చదవండి: వసంతాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలనుకుంటే.. అక్కడకు వాలిపోవాల్సిందే..!)

  • తమిళనాడులో కాలానుగుణ నది నాగనది. గత 20 ఏళ్లుగా ఎండిపోయి నిర్జీవంగా మారిపోయింది. చక్కగా నీటితో కళకళలాడే నది కాస్తా..బీడు వారిపోయింది. ఈ నదే అక్కడ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు ఆధారం. అలాంటి నదికి నారీ శక్తి ప్రాణం పోసి 365 రోజులు నీటితో పారేలా చేస్తోంది. అదెలా ఈ మహిళామణులకు సాధ్యమైందో తెలుసుకుందామా..!.

    సరిగ్గా ఆ టైంలోనే  గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ దార్శనికతతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాలను పునరుద్ధరించడానికి నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో నీటి కొరత నిర్వహణలో భాగంగా నాగనది నది పునరుజ్జీవన పనిని అమలు చేసే నిమిత్తం 2014లో వెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సర్వే చేసేందుకు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు స్వచ్ఛంద సేవకులతో సహా సాంకేతిక నిపుణుల బృందం కదిలివచ్చింది. 

    ఈ నదిని తిరిగి పునరుజ్జీవింప చేయాలంటే బావులు, బండరాళ్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించాలన్సి అవసరం ఉంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన నదులను పునరుద్ధరించేందుకు దాదాపు 20 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త దావానలం ఆ చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద స్వచ్ఛంద సేవకులుగా ఈ పనుల్ల పాలుపంచుకునేవాళ్ల సంఖ్య అనుహ్యంగా 40 వేలకు పైగా చేరింది. వారంతా మహిళామణులే కావడం విశేషం. 

    ఈ మహిళా స్వచ్ఛంద సేవకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్గదర్శకత్వంలో బావులు తవ్వడం, సిమెంట్ రింగులు నిర్మించడం వంటి వాటితో అవిశ్రాంతంగా పనిచేశారు. ఫలితంగా భూగర్భజల మట్టాలు ఒక మీటర్‌ నుంచి ఎనిమిది మీటర్లకు పెరిగాయి. దెబ్బతో నదికి తిరిగి జీవం వచ్చినట్లైంది. ఇదంతా కేవలం మహిళా శ్రామిక శక్తి వల్ల సాధ్యం కావడం విశేషం. ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన వందవ 'మన్ కీ బాత్' ఎపిసోడ్‌లో చెప్పి..ఆ నారీ శక్తి జట్టు కృషిని ప్రశంసించారు. 

    ఒకరకంగా సమాజం కోసం అందరూ నడుబిగించాలని చెప్పడమే కాదు..ఐక్యతను సైతం చాటి చెప్పింది ఈ నారీ శక్తి. మహిళ తలుచుకుంటే భూమిని స్యశ్యామలంగా ఉంచగలరు. అలాగే ప్రకృతి సైతం పులకరించిపోయేలా అందంగా అపురూపంగా మార్చగలరు. అలాంటి మహిళామణులకు, మహిళా శక్తికి సదా జోహార్లు అని కీర్తిద్దాం, గౌరవిద్దాం. కేవలం విమెన్‌ డే ఒక​ రోజున మాత్రమే కాదు..ప్రతి సందర్భంలోనూ అవకాశంలోనూ మహిళలను పురుషులతో సమానంగా చూస్తే చాలు. అంతకుమించి ఇంకేమి ఆశించరు అని గుర్తిస్తే చాలు కదూ..!.

     

    (చదవండి: చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..! టెక్‌ ఉద్యోగం వద్దనడానికి కారణం అదే..)

     

NRI

  • అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

    ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్‌లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్‌లు ఆహా అనిపించాయి. 

    నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్  ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.

    కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

    (చదవండి: లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

  • ఐఐటీ విద్యార్థి చాయ్‌ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. 

    అతడే చాయ్‌వాలా లేదా చాయ్‌గుయ్‌గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్‌ ప్రసాద్‌. బిహార్‌  పాట్నా సమీపంలోని బార్‌ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్‌ ఈ ఫిబ్రవరి 2025లో టెక్‌ లేఆఫ్‌లు నేపథ్యంలో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో చాయ్‌స్టాల్‌ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న  అతడి కథ నెట్టింట వైరల్‌ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్‌ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. 

    ఎక్కడో బిహార్‌ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్‌ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. 

    ప్రభాకర్‌ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్‌ చిన్నతనంలో బిహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్‌  క్లాస్‌ ఫస్ట్‌, లీడర్‌ కూడా. క్రికెట్‌ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్‌. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. 

    తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్‌ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్‌లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్‌ బోర్డు స్కూల్‌ నుంచి ఇంగ్లీష్‌ సీబీఎస్‌ఈ స్కూల్‌ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. 

    ఐఐటీ అడ్మిషన్‌ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉ‍ద్యోగాన్నిపొందాను, అయితే టెక్‌ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్‌ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్‌ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్‌లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్‌ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు.  దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్‌ ఆడిషన్‌లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. 

    అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్‌ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్‌ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. 

    దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్‌ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్‌ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్‌ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్‌వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్‌​ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్‌ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్‌. 

    అయితే కార్పొరేట్ జాబ్‌లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్‌ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్‌ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్‌ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.

    (చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..)
     

Politics

  • తాడేపల్లి : కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ విమర్శించారు.  ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు.  ‘నిరుద్యోగుల జీవితాలను  అన్యాయం చేశారు. 

    వ్యవసాయ రంగాన్ని మరింత నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలను రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు.. ఎస్సీ,ఎస్టీలకు వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చిన రుణాలను భేషరతుగా మాఫీ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

  • సిరిసిల్ల:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా రాహుల్‌ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.  రైతుబంధు పథఖం బంద్‌ చేసి.. కొత్తగా రాహుల్‌ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్‌ గాంధీకి పంపించడమే రాహుల్‌ బంధు పథకం అంటూ విమర్శించారు. 

    ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్‌ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..  కేసీఆర్‌ హయాంలో నాట్లు వేసే టైమ్‌లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. 

    సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్‌నగర్‌లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. 

    అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ  కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్‌.

  • సాక్షి,తాడేపల్లి: 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. మన ఓటర్లను మనమే కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

    సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా, జోనల్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. 

    ‘ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌లా ఏర్పడి పని చేయాలి. ఈ విషయంలో బూత్‌ కమిటీలదే  కీలకపాత్ర. 2019 ఎన్నికలకు మందు టీడీపీ ప్రభుత్వం 40 లక్షల ఓట్లు తొలగించింది. ఇంటింటికి వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులని తెలియగానే ఓట్లు తీసేశారు.

    దీనిపై అప్పట్లో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మన ఓటర్లను కాపాడుకోవాలి. వారి ఓట్లు గల్లంతు కాకుండా చూసుకోవాలి.అందుకు అవసరమైతే టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేసుకుందాం. బూత్‌ లెవెల్‌ పరిధిలో నాయకులను ఈ ప్రక్రియలో ప్రమేయం చేయాలి’ అని సూచించారు. 

    టాస్క్ ఫోర్స్ లా ఏర్పడి పని చేద్దాం ఓటర్ల జాబితా సవరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
  • తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో మహా దగా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి.. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు.

    ‘మూడు జనరేషన్‌లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోపెట్టుకుని మహిళా దినోత్సవం జరుపుకుంటారా?, మహిళా ద్రోహి పార్టీ టీడీపీ. జగన్ తెచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికీ రాయితీలు ఇవ్వలేదు. డ్రాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులే ఇవ్వకుండా వారిని కూడా పారిశ్రామిక వేత్తలను చేస్తానంటున్నారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా గ్రూపుల పరపతి తగ్గింది. బ్యాంకర్లు రుణాలను ఇవ్వటం తగ్గించారు. మరి పారిశ్రామిక వేత్తలను చేస్తానంటూ ఎలా మాట్లాడతారు?, జగన్ సున్నావడ్డీ కింద దాదాపు రూ.5 వేల కోట్లు మహిళలకు ఇచ్చారు. చంద్రబాబు వలన డ్వాక్రా గ్రూపులన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఫ్రీ బస్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాలు ఎవరికిచ్చారు?, సగం మందికి కూడా ఇవ్వకుండా సక్సెస్ చేశామని ఎలా చెప్పుకుంటారు?, అసెంబ్లీలో, బయటా డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అన్నీ చంద్రబాబే

    మంత్రులు, ఎమ్మెల్యేలు కేరక్టర్  ఆర్టిస్టులుగా మిగిలి పోయారు. చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనకు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్ అన్ని వర్గాల మహిళలకూ మేలు చేశారు. చంద్రబాబు అందరినీ నిలువునా మోసం చేశారు. మహిళా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మహిళలకు కనపడకుండా తిరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తారని భయపడుతున్నారు. రాష్ట్రంలో రోజూ మహిళలపై   లైంగిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?, కాల్ సెంటర్‌కు కాల్ చేసినా ఏపీ పోలీసులు స్పందించటం లేదని సాక్షాత్తూ కేంద్ర మంత్రి అమిత్‌షానే లెటర్ రాశారు

    దేశంలోనే అట్టడుగు స్థానంలోకి ఏపీ పోలీసు వ్యవస్థ వెళ్లిపోయింది. మహిళలు, చిన్నారులకు ఏపీలో అసలు రక్షణే లేదు. హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయి పండించటం సిగ్గుచేటు. మహిళను వేధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?, లోకేష్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త‌ మహిళల ఫోటోలు తీస్తూ దొరికాడు. మహిళలు అర్ధరాత్రి వరకు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు విజనరీ కాదు.. పాయిజనరీ. మూడు జనరేషన్‌లను ఛీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని కనమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

  • హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్‌ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్నారని  ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్‌దా.. లేక ఓవైసీదా? అని   ట్వీట్‌ చేశారు.

     

    ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారు
    తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు.