Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఒకప్పుడు సినిమా చివర్లో పార్ట్-2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే, ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌కు బ్రేక్ పడుతున్నట్టుంది. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా, ఆ స్థాయిలో వర్కవుట్ కాలేదు. తల బొప్పికట్టే రేంజ్‌లో కొన్ని సినిమాలు చుక్కలుచూపించడంలో పార్ట్-2 అనేది దండగ అనే ఫీలింగ్‌కు వచ్చారు మేకర్స్. కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని నిర్మాతలు భావిస్తున్నారు. బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్-2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు.  

    అసలు సీక్వెల్ ట్రెండ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దానికి దూరమయ్యాడు. తను మహేష్‌బాబుతో చేస్తున్న తాజా చిత్రం “వారణాసి” ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివర్లో పార్ట్-2 కార్డులు పడవని ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, జూ.ఎన్టీఆర్‌తో చేస్తున్న “డ్రాగన్” సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

    ఇప్పుడు వచ్చే ఏ సినిమాకైనా పార్ట్-2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్-2 ఉంది అనగానే దానికి వచ్చే హైప్ కంటే ట్రోలింగ్‌నే ఎక్కువగా జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్-2 గోల తగ్గేలానే కనిపిస్తోంది.

  • తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నోళ్లు మెల్లమెల్లగా సైడ్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొందరు మాత్రం స్టార్స్ అవుతారనుకుంటే పట్టుమని పది మూవీస్ కూడా చేయకుండా తెరమరుగైపోతుంటారు. అలాంటి బ్యూటీనే ఈమె. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్స్‌తో చేసినప్పటికీ మాయమైపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?

    పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీక్షా సేథ్. ఢిల్లీలో పుట్టిన ఈమె.. తండ్రి ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, కోల్‌కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో పెరిగింది. మంచి పొడగరి కావడంతో 2009లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మోడలింగ్ అనుభవం లేనప్పటికీ టాప్-10లో ఒకరిగా నిలిచింది. ఓ మోడలింగ్ పనిమీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమెని చూసిన దర్శకుడు క్రిష్.. 'వేదం'లో అవకాశమిచ్చాడు. ఇందులో పూజగా అల్లు అర్జున్ సరసన నటించింది. అలా టాలీవుడ్ దృష్టిలో పడింది.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

    తర్వాత రవితేజ 'మిరపకాయ్', నిప్పు, గోపిచంద్ 'వాంటెడ్', మంచు మనోజ్ 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా', ప్రభాస్ 'రెబల్' సినిమాలు చేసింది. వీటిలో హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉండేసరికి తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. అనంతరం హిందీలో రెండు, కన్నడలో ఓ మూవీ చేసింది. అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయేసరికి పూర్తిగా నటనకు దూరమైపోయింది.

    రీసెంట్ టైంలో ఈమె ఫొటోలు కొన్ని వైరల్ కావడంతో అసలు ఇప్పుడేం చేస్తుందా అని వెతకగా.. స్పెయిన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన దీక్షా, అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటోందట. అలానే ఫ్యామిలీ కూడా అక్కడే సెటిల్ అయిపోవడంతో జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. అయితే హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే క్యూట్, గ్లామర్‌గా ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

  • మెరుపుతీగలా సన్నని గ్లామర్‌తో అనుపమ

    ముద్దుముద్దుగా పోజులిచ్చేసిన మృణాల్

    అందాల జాతర చేస్తున్న డింపుల్ హయాతి

    పట్టుచీరలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్

    స్టేజీపై పాడుతూ దుమ్ములేపిన నోరా ఫతేహి

    చుడీదార్‌లో క్యూట్ 'కపుల్ ఫ్రెండ్లీ' వారణాసి

  • లోకేష్‌ కనగరాజ్‌ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్‌ సాంగ్‌గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.

    ఈ నేపధ్యంలో మన టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ ఆ పాట క్రేజ్‌కి చెక్‌ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్‌ లాంచ్‌తో వెల్లడైంది. పాల్‌ జార్జ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌ పెపే, దుసర విజయన్, కబీర్‌ సింగ్‌లతో పాటు సునీల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్‌ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ముఖ్యంగా సునీల్‌ స్టెప్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

    'మజాకో మల్లికా'లో సునీల్‌ డ్యాన్స్‌లో ఈజ్‌ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్‌ పట్టుకుని స్మోక్‌ చేస్తూ ఒకే కాలితో సునీల్‌ వేసిన స్టెప్స్‌ని చూసి ఒక నెటిజన్‌.. 'నటుడు సునీల్‌ డ్యాన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్‌ డ్యాన్స్‌ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.

    ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్‌ 2' కు వర్క్‌ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్‌ శ్రీరాజ్‌ భద్ర పాడారు, వినాయక్‌ శశికుమార్‌ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్‌ లాగే ఈ సినిమాలో కూడా సునీల్‌ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్‌ సాంగ్‌.. మోనికా రేంజ్‌లో హిట్‌ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్‌ పాటల ట్రెండ్‌ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్‌ సినిమా మే నెలలో విడుదల కానుంది.

    (ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?)

  • సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తలే. వాలంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) నాడు మృణాల్‌.. హీరో ధనుష్‌ను పెళ్లాడబోతుందని తెగ ప్రచారం జరిగింది. అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చివరకు వాలంటైన్స్‌ డేరోజు చడీచప్పుడు లేకపోయేసరికి ఇదంతా గాలిప్రచారమే అని తేలిపోయింది.

    లైఫ్‌లో సెటిలవాలి
    ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటించిన దో దీవానే షెహర్‌ మే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ యాంకర్‌.. పెళ్లి గురించి ఇంట్లో ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా మృణాల్‌ ఇలా స్పందించింది. మా ఇంట్లో వాళ్లు ముందు లైఫ్‌లో సెటిలవమంటున్నారు. అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు సినీ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంత కష్టమో ఇంట్లోవాళ్లకు తెలుసు.

    సన్యాసి జీవితమే..
    యాక్టర్‌గా ఉండటం అంటే సన్యాసిగా ఉండటంలాంటిదే! తిండి, నిద్ర.. ఇలా అన్నింటినీ వదులుకోవాలి. ఎప్పుడూ ఫోకస్‌డ్‌గా ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎటువంటి పీఆర్‌ టీమ్‌ లేదు. కాకపోతే నా ఇంటి అడ్రస్‌ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ఒక టీమ్‌ పని చేస్తుంది. బయటకు వెళ్లినప్పుడు నా సేఫ్టీ కోసం ఇంకో టీమ్‌ ఉంది. కానీ నాపై రూమర్స్‌ నాకు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. 

    అందులో డౌటే లేదు
    రూ.3 కోట్లు, రూ.6 కోట్లు, రూ.10 కోట్లు పెట్టినా కూడా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. కాకపోతే నా జీవితంలో ఏది జరిగినా అది మీ అందరితో షేర్‌ చేసుకుంటాను. అందులో డౌటే లేదు. నాపై వచ్చే రూమర్స్‌ను పట్టించుకుంటూ పోతే కెరీర్‌పై ఫోకస్‌ చేయలేను అని మృణాల్‌ చెప్పుకొచ్చింది. 'దో దీవానే షెహర్‌మే' మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

    చదవండి: మెగా ఫ్యామిలీకి తొలి పెళ్లి పత్రిక.. చిరంజీవికి ఏమైంది?

  • హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

    విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏ‍ర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.

    ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

  • ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉ‍న్నాయి?

    సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

    ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.

    గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. ద‌యాల‌న్ దర్శకుడు.

    (ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం)

  • అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు శిరీష్‌.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్‌ అన్నవదినలైన అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!

    పత్రికల పంపిణీ
    ఇప్పటికే దుబాయ్‌లో ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

    మెగాస్టార్‌కు గాయం?
    మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్‌ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్‌- నిర్మల, శిరీష్‌ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్‌ షోల్డర్‌ బ్యాగ్‌ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

    చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్‌ హీరో

  • యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌.. ప్రత్యర్థులను మట్టి కరిపించడంలోనే కాదు, వారిపై పంచులు విసరడంలోనూ దిట్ట! ఇతడు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్‌ షో వీల్‌ ఆఫ్‌ ఫార్చ్యూన్‌. ఈ షోలోని లేటెస్ట్‌ ఎపిసోడ్‌కు షార్క్‌ ట్యాంక్‌ ఇండియా సీజన్‌ 5 జడ్జిలు హాజరయ్యారు. వారిలో ఒకరైన అమన్‌ గుప్తా.. మీరు జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సంఘటన ఏది? అని అడిగాడు.

    ఎంత చెప్పినా వినడే..
    అందుకు అక్షయ్‌ ఏదైనా ఫన్నీ సంఘటన చెప్తాడనుకుంటే ఏకంగా ఒకరిని లాగి పెట్టి కొట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. నా క్లోజ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తి నా స్నేహితుడిని తిడుతున్నాడు. ఆపమని వారించినా సరే వినకుండా దుర్భాషలాడుతున్నాడు. మొదట మంచిగా చెప్పి చూశా.. తర్వాత వార్నింగ్‌ ఇచ్చా.. అయినా వినలేదు. ఇక ఆరోసారి మాటలతో కాకుండా చేతలతో సమాధానం ఇచ్చాను.

    ఆవేశం పట్టలేక..
    అందరిముందు అలా తిడుతుండేసరికి నా ఫ్రెండ్‌ ఏడుస్తున్నాడు. అది చూసి భరించలేకపోయిన నేను అతడి చెంప చెళ్లుమనిపించాను. ఒక్క దెబ్బకే అతడు కిందపడిపోయి స్పృహ కోల్పోయాడు. అయిపోయింది, నా కెరీర్‌ ఖతం అని భయపడ్డా.. అతడికి మెలకువ రావాలని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ముఖంపై నీళ్లు చల్లిన కొద్ది క్షణాలకే అతడు లేచి కూర్చో వడంతో ఊపిరి పీల్చుకున్నా..

    ఈరోజు అయితే..
    అదే సంఘటన ఈరోజు జరిగి ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని కానీ అలా కొట్టేవాడిని కాదు. అదే నాకు ఇబ్బందిగా అనిపించిన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. అక్షయ్‌ కుమార్‌ చివరగా జాలీ ఎల్‌ఎల్‌బీ 3 సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్‌ కామెడీ సినిమా భూత్‌ బంగ్లా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

    చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న నటి

  • సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.

    (ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)

    'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

  • ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో 'ఏఐ' అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తమ చిత్రాల్లో ఎలాంటి సీన్లు.. ఈ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాలేదని హీరోలు దర్శకనిర్మాతలు చెప్పుకొంటున్నారు. కష్టపడి విజువల్ ఎఫెక్ట్స్ చేయించామని అంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. యువహీరో నిఖిల్ మాత్రం ఏఐ గురించి చెబుతూనే మరో మూవీ గురించి కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

    (ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

    నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'స్వయంభు'. నాలుగు రోజుల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఏమంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు. కంటెంట్ పర్లేదు అన‍్నప్పటికీ ఎక్కువమంది 'బాహుబలి'తో పోల్చి చూస్తున్నారు. హీరోహీరోయిన్ పాత్రలు అలానే ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీజర్ క్వాలిటీపైనా కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో హెచ్‌డీఆర్ క్వాలిటీతో ఇప్పుడు మరోసారి టీజర్ అప్‌లోడ్ చేశారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో చెప్పిన నిఖిల్.. రీసెంట్‌గా వచ్చిన ఓ సినిమాలా మా దానిలో ఎలాంటి ఏఐ ఉపయోగించలేదు అని అన్నాడు.

    మరి నిఖిల్ ఏ సినిమా గురించి అన్నాడా? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సరిగ్గా నిఖిల్ ట్వీట్ చేసే సమయానికి 'నాగబంధనం' మూవీ టీజర్ రిలీజైంది. మరి ఈ చిత్రంపైనే నిఖిల్ కౌంటర్ వేశాడా అనిపిస్తోంది. ఎందుకంటే రెండు కూడా విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలే. ఈ వేసవిలోనే థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్.. కావాలనే నెగిటివ్ అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడా అనిపిస్తుంది. బహుశా ఇదో రకం పబ్లిసిటీ టెక్నిక్ కావొచ్చేమో? చూడాలి మరి దీని గురించి నిఖిల్ ఏమని క్లారిటీ ఇస్తాడో?

    (ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)

  • తమిళ నటి రోషిణి హరిప్రియణ్‌ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు కేఎస్‌ సుందర మూర్తిని ఆదివారం (ఫిబ్రవరి 15న) వివాహం చేసుకుంది. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    సినిమా
    కాగా రోషిణి హరిప్రియణ్‌ భారతి కన్నమ్మ సీరియల్‌తో పాపులర్‌ అయింది. ఆ తర్వాత 'కూకు విత్‌ కోమలి' రియాలిటీ షో మూడో సీజన్‌లోనూ పాల్గొంది. అనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. గరుడన్‌, మద్రాస్‌ మ్యాట్నీ మూవీస్‌ చేసింది. చివరగా 'తలైవా తలైవి' సినిమాలో నటించింది. ఈ చిత్రం తెలుగులో 'సార్‌ మేడమ్‌' పేరిట రిలీజైంది.

     

     

    చదవండి: అది నా దురదృష్టం: రణ్‌బీర్‌ కపూర్‌

  • ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయిన నటి కుష్బూ హిందీలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ సంచలన నటి ఆ తరువాత తెలుగులో వెంకటేష్‌కు జంటగా కలియుగ పాండవులు చిత్రంలో కథానాయికిగా పరిచయమయ్యారు. ఆ తరువాత వరుషం– 16 చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఈమె తెలుగు, తమిళం భాషల్లో నటించిన రెండు చిత్రాలు విజయం సాధించాయి. ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, విజయకాంత్, ప్రభు, కార్తీక్‌ వంటి నటులతో జంటగా నటించారు. కథానాయకిగా బిజీగా ఉండగానే దర్శకుడు సుందర్‌.సి ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 

    ఆ తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరో పక్క నిర్మాతగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సుందర్‌.సి, కుష్బూ దంపతులకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా సినీ రంగప్రవేశం చేయడం విశేషమేమీ కాదు. చిన్న కూతురు ఆనందిత దర్శకుడు మణిరత్నం వద్ద సహాయ దర్శకురాలిగా చేరారు. పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2, థగ్‌లైఫ్‌ చిత్రాలకు పని చేశారు. 

    పెద్ద కూతురు అవంతిక హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. ఈమె లండన్‌లో నటనలో శిక్షణ పొందారన్నది గమనార్హం. ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించి తల్లి కుష్బూ ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆరంభం అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సరిత మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. సురేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. అవంతిక త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ అవుతారని ఆశించవచ్చు. 

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు సొంతంగా బట్టల బిజినెస్‌ ఉంది. అదే ఆర్క్స్‌. గతేడాది ఫిబ్రవరి 14న ఈ బిజినెస్‌ మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆర్క్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాడు. ప్రస్తుతం రణ్‌బీర్‌ లవ్‌ అండ్‌ వార్‌తో పాటు రామాయణ సినిమాలు చేస్తున్నాడు. అయితే లవ్‌ అండ్‌ వార్‌ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అయినట్లు తెలిపాడు.

    ఎదురుచూపులకు తగ్గ ఫలితం
    అదేంటో మరి దురదృష్టం. నేనెప్పుడు సినిమా మొదలుపెట్టినా త్వరగా పూర్తవవు. అందరూ ఐదారు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, నావి మాత్రం చాలా సమయం పడుతున్నాయి. అయితే అది రిలీజైనప్పుడు మాత్రం మీ ఎదురుచూపులకు తగ్గ ఫలితం లభించాలన్నదే నా కోరిక. రెండుమూడేళ్లుగా చాలా కష్టపడుతున్నాను. కొన్నింటికి సమయం తప్పదు. రామాయణ రిలీజ్‌ తర్వాతే లవ్‌ అండ్‌ వార్‌ వస్తుంది అని పేర్కొన్నాడు.

    అనుకోకుండా అలా..
    రామాయణ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. తన కూతురు రాహా పుట్టిన నెల అయిన నవంబర్‌లోనే రామాయణ రిలీజ్‌ అవుతుండటం యాదృచ్ఛికమైనప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫేవరెట్‌ సినిమా ధురంధర్‌ అని చెప్పాడు. అందులో అందరూ అద్భుతంగా నటించారని రణ్‌బీర్‌ ప్రశంసించాడు.

    చదవండి: తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు

  • జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్.  ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్‌ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్‌ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది.  అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చింది.

    అయితే  సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్‌ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్‌ యాక్టర్  తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.

    అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు  తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. 

  • సింపుల్‌ లైఫ్‌ని లీడ్‌ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్‌ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు. 

    అంతేకాదు సెట్‌లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్‌గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లి వచ్చేవారట. సెట్‌లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో  గ్యాంబ్లింగ్‌ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్‌ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్‌ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.

    బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదు
    సాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్‌ సమయంలో  ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో.. నా షూట్‌ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది.  నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్‌గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్‌ అయిపోయారు. మా హోటల్‌ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్‌లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. 
     

  • హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. భోళా శంకరుడు పార్వతీదేవిని పెళ్లాడిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 15న) చాలామంది ఉపవాసం, జాగరణ ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడి సినిమాలు చూస్తారు. పలువురు నటీనటులు వెండితెరపై మహాశివుడిగా మెప్పించారు. శివుడి వేషం వేసిన ఆ నటులెవరో చూసేద్దాం..

    ముందు గుర్తొచ్చేది ఆయనే..
    ఇప్పుడంటే భక్తి సినిమాలు తక్కువయ్యాయి.. కానీ ఒకప్పుడు పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చాయి. పురాణ కథలను వెండితెరపై చక్కగా చూపేవారు. వెంకటేశ్వరస్వామి, రాముడు, శివుడు, కృష్ణుడు.. ఇలా అందరి దేవుళ్ల వేషం కట్టేవారు. ఇక శివుడి పాత్ర వేసిన నటులు అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ, దక్షయజ్ఞం వంటి సినిమాల్లో ఆయన భోళాశంకరుడిగా ఆకట్టుకున్నారు.

    ఏఎన్నార్‌, శోభన్‌బాబు కూడా..
    మూగ మనసులు మూవీలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో అక్కినేని నాగేశ్వరరావు శివుడి రూపంలో కనిపించాడు. శ్రీ వినాయక విజయంలో కృష్ణంరాజు, పరమానందయ్య శిష్యుల కథలో శోభన్‌బాబు, మగరాయుడు సినిమాలో కమెడియన్‌ మల్లికార్జునరావు, మావూర్లో మహాశివుడు మూవీలో రావు గోపాలరావు.., భూకైలాస్‌, నాగుల చవితి సినిమాల్లో నాగభూషణం, శ్రీ సత్యనారాయణస్వామి మూవీలో సుమన్‌ శివుడిగా మెప్పించారు.

    దేవుడిగా అద్భుతాలు
    శ్రీ మంజునాథ సినిమాలో చిరంజీవి, ఢమరుకంలో ప్రకాశ్‌ రాజ్‌, కన్నప్ప మూవీలో అక్షయ్‌ కుమార్‌ శివయ్యగా ఆకట్టుకున్నారు. సీతారామ కల్యాణం సినిమాలో ఎంత నేర్చినా ఎంత చూసినా పాటలో బాలకృష్ణ కాసేపు శివుడిగా కనిపించాడు. ఇలా ఎందరో యాక్టర్స్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌తోపాటు పాటు భక్తిరస చిత్రాల్లోనూ నటించగలమని నిరూపించారు. తెరపై శివతాండవం చేసి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

  • సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అమరావతికి ఆహ్వానం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కెరీర్‌ ఆరంభంలోనే అనేక వివాదాలతో పాటు ట్రోలింగ్‌ను దాటుకుని వచ్చింది. అయితే, తమ వ్యక్తిగత జీవితం గురించి సుప్రిత పంచుకుంది.

    'కొన్ని సో కాల్డ్‌ మీడియా వారు మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతిదానికి మా గురించి తప్పుడు కథనాలు రాసేస్తున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్లాం. అయితే, ఇప్పుడు బలంగా తయారయ్యాము. ఎంతటి నెగటివిటీ చేసినా సరే పట్టించుకనేది ఉండదు. గతంలో తెలిసోతెలీకనో బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌‌ చేశాం. ఇప్పుడు అది కూడా లేదు. బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల జరిగే నష్టాల గురించి  తెలిసిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం. నిర్మాత కేపీ చౌదరితో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా సరే.. పదేపదే డ్రగ్స్‌తో లింక్‌లు అంటూ మాపై కొన్ని  మీడియా ఛానల్స్‌లలో ప్రచారం చేశారు. 

    కేపీ చౌదరిపై వచ్చిన వార్తా కథనాల వల్ల ఆయన కూడా కుంగిపోయారు. డ్రగ్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు. కానీ, మరణించిన తర్వాత కూడా తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ డబ్బు సంపాధించేకునేందుకు ప్లాన్‌ చేశాయి. అతను ఒక మంచి వ్యక్తిగా మాకు తెలుసు. కానీ, లేనిపోని రూమర్స​్‌ క్రియేట్‌ చేసి మమ్మల్ని  ఇబ్బందులకు గురిచేశారు.' అని చెప్పింది.

    తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి చేయాలనేది కేవలం తన కోరిక మాత్రమేనని ఆమె చెప్పింది. తన మదర్‌కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని  స్పష్టం చేసింది. 

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్‌ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. 

    ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్‌ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో ‍‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్‌.. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్‌ మై షోలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.

    కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్  కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.

    బుక్‌ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..

    1. ధురంధర్- 59 రోజులు

    2. ఛావా -58 రోజులు

    3. స్ట్రీ 2 -57  రోజులు

    4. ప్రేమలు- 53  రోజులు

    5. పుష్ప 2: ది రూల్-  53  రోజులు

    6. మంజుమ్మెల్ బాయ్స్-  50  రోజులు

    7. కల్కి 2898 ఏడీ-  49  రోజులు

    8. జవాన్-  48  రోజులు

    9. లోకా చాప్టర్- 1- 46  రోజులు

    10. మహావతార నరసింహ- 42  రోజులు

     

Sports

  • ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై తమ‌కు తిరుగులేద‌ని భార‌త్ మ‌రోసారి నిరూపించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా కొలంబో వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 61 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

    ఓపెనర్ అభిషేక్ శర్మ (0) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ మాత్రం సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కిష‌న్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 ప‌రుగులు చేశాడు. అయితే ఇషాన్ ఔట‌య్యాక తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం కాస్త నెమ్మ‌దించింది. కానీ చివ‌రిలో శివం దూబే (27)., రింకూ సింగ్‌(4 బంతుల్లో 11) మెరుపులు మెరిపించారు. ఫ‌లితంగా 170 పైగా భార‌త్ స్కోర్ సాధించ‌గ‌ల్గింది. పాక్ బౌల‌ర్ల‌లో సైమ్ అయూబ్ మూడు వికెట్లు ప‌డ‌గ‌ట్ట‌గా.. స‌ల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ త‌లా వికెట్ సాధించారు.

    అద‌ర‌గొట్టిన భార‌త బౌల‌ర్లు
    అనంత‌రం 176 ప‌రుగుల‌ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌కు భార‌త బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. టీమిండియా బౌల‌ర్ల ధాటికి దాయాది జ‌ట్టు 18 ఓవ‌ర్ల‌లో కేవ‌లం ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్ ఖాన్‌(44) ఒక్క‌డే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజ‌యంతో భార‌త్ సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో పాక్‌పై భార‌త్‌కు ఇది 8వ విజ‌యం కావ‌డం విశేషం.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. తొలి ఓవ‌ర్‌లోనే అభిషేక్ శ‌ర్మ ఔట్ కావ‌డంతో క్రీజులోకి వచ్చిన తిల‌క్ త‌న జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. ఓ వైపు ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుంటే తిలక్ మాత్రం నెమ్మ‌దిగా ఆడుతూ హెడ్‌కోచ్ గంభీర్ అగ్ర‌హానికి గుర‌య్యాడు.

    డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్, తిలక్ వర్మతో చాలా సీరియస్‌గా మాట్లాడాడు. వేగంగా ఆడాల‌ని, టార్గెట్ 170 దాటాలని గంభీర్ గ‌ట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొవ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డ్డాడు. మొత్తంగా 24 బంతుల్లో 104.17 స్ట్రైక్ రేటుతో 25 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

     

     

  • టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ వికెట్ కోల్పోయిన‌ప్ప‌టికి.. ఇషాన్ మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

    తిల‌క్ వ‌ర్మ‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో ఇషాన్ కేవ‌లం 27 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న కిష‌న్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 77 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన కిష‌న్ ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

    పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యంత‌వేగవంత‌మైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 27 బంతుల్లోనే ఆర్ధ శ‌త‌కం బాదిన ఇషాన్‌.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.

    కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. కిష‌న్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌(32), తిల‌క్ వ‌ర్మ‌(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌల‌ర్ల‌లో సైమ్ అయూబ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స‌ల్మాన్ అఘా, ఉస్మాన్ త‌రీఖ్, అఫ్రిది త‌లా వికెట్ సాధించారు.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్‌తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 

    గతంలో టీమిండియా మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా, బంగ్లాదేశ్‌ మాజీ ఆటగాడు ఇమ్రుల్‌ కయేస్‌ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్‌ తమ వరల్డ్‌కప్‌ కెరీర్‌లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.

    ప్రస్తుత ప్రపంచకప్‌లో యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్‌.. ఇవాళ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్‌ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్‌ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్‌కు గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగో డకౌట్‌ కావడం మరో విశేషం.

    కోహ్లి రికార్డు సమం
    పాక్‌పై డకౌట్‌ కావడంతో అభిషేక్‌ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి,  గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్‌ నెహ్రా (3) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

    సంజూతో సమానంగా..!
    తాజా డకౌట్‌తో అభిషేక్‌ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్‌ సరసన చేరాడు. అభిషేక్‌, సంజూ తమ టీ20 కెరీర్‌లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.

    భారీ స్కోర్‌ దిశగా టీమిండియా
    పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. టాస్‌ ఓడి పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్‌ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్‌ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ (21), తిలక్‌ వర్మ (25) క్రీజ్‌లో ఉన్నారు. 

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు. అమెరికాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో డ‌కౌటైన అభిషేక్‌.. ఇప్పుడు కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో అదే తీరును క‌న‌బ‌రిచాడు. భార‌త ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔట‌య్యాడు.

    అమెరికాతో మ్యాచ్ త‌ర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గుర‌య్యాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. దాయాది జ‌ట్టుకు అభిషేక్ చుక్క‌లు చూపిస్తాడు అని భార‌త అభిమానులు భావించారు.

    కానీ ఈ పంజాబీ బ్యాట‌ర్ త‌న చెత్త బ్యాటింగ్‌తో అంద‌రిని నిరాశ‌ప‌రిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు అభిషేక్‌ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ్యాచ్‌లో ఆడాల‌ని కోరుకుంటున్న‌ట్లు స‌ల్మాన్ పేర్కొన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే తొలి ఓవ‌ర్ వేసిన సల్మాన్‌.. అభిషేక్‌పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్‌ను ఔట్ చేసిన అనంత‌రం స‌ల్మాన్ సంబ‌రాల్లో మునిగితేలిపోయాడు.

    తుది జ‌ట్లు
    భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో యూఎస్‌ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్‌పై గెలుపొందిన అమెరికా.. తాజాగా (ఫిబ్రవరి 15) నమీబియాను కూడా మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. యూఎస్‌ఏకు సూపర్‌-8కు చేరే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు భారీ ఊరట కలిగిస్తాయి. 

    ఎందుకంటే ఈ జట్టు ఆడుతున్నది రెండో ప్రపంచకప్పే అయినా, పలు చిరస్మరణీయ విజయాలు సాధించి, చిన్న జట్లలో మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది. తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్‌ ఆడుతున్న నెదర్లాండ్స్‌, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్‌ఏను ప్రత్యేకంగా నిలుపుతుంది. గత ఎడిషన్‌లో (2024) ఈ జట్టు, వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

    ప్రస్తుత ఎడిషన్‌లోనూ యూఎస్‌ఏ నుంచి ఆ స్థాయి ప్రదర్శన ఆశించినప్పటికీ వీలు పడలేదు. అయితే పాక్‌తో పాటు భారత్‌కు కూడా టఫ్‌ ఫైట్‌ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఎడిషన్‌లోనూ యూఎస్‌ఏకు సూపర్‌-8కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. 

    పాక్‌.. భారత్‌, నమీబియా చేతుల్లో ఓడితే యూఎస్‌ఏకు సూపర్‌-8 బెర్త్‌ దక్కే అవకాశం ఉంది. ఇది జరిగితే పాక్‌, యూఎస్‌ఏ ఖాతాల్లో తలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంటే, యూఎస్‌ఏ  సూపర్‌-8కి అర్హత సాధిస్తుంది. 

    ఇలా జరగడం కష్టమైనా, అవకాశాలను మాత్రం తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్‌, నమీబియాకు పాక్‌ను ఓడించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నమీబియాకు గతంలో వారి కంటే మెరుగైన జట్లకు షాకిచ్చిన అనుభవం ఉంది. ఇది మరోసారి రిపీటైతే మాత్రం యూఎస్‌ఏ సూపర్‌-8కు, పాక్‌ ఇంటికి చేరతాయి.

    యూఎస్‌ఏ-నమీబియా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ 31 పరుగుల తేఆతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ (199-4) చేసిన యూఎస్‌ఏ.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. యూఎస్‌ఏ తరఫున బ్యాటింగ్‌లో కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (52), సంజయ్‌ కృష్ణమూర్తి (68 నాటౌట్‌) రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్‌, కెప్టెన్‌ ఎరాస్మస్‌ తలో 2 వికెట్లు తీశారు.

    అనంతరం నమీబియా యూఎస్‌ఏ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్‌ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. స్కాల్విక్‌ 2, శుభమ్‌ రంజనే, నేత్రావల్కర్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు. నమీబియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ స్టీన్‌కా​ంప్‌ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. 

  • India vs pakistan Match live Updates: పాకిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
    కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 61 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌.. భార‌త బౌల‌ర్ల దాటికి 18 ఓవ‌ర్ల‌లో 114 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఉస్మాన్ ఖాన్‌(44) ఒక్క‌డే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు.
     

    👉16వ ఓవ‌ర్ వేసిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో పాక్ వరుస‌గా రెండు వికెట్లు కోల్పోయింది.  17 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోర్‌: 109/7

    విజ‌యానికి చేరువ‌లో భార‌త్
    79 ప‌రుగుల వద్ద పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన షాదాబ్ ఖాన్ తిల‌క్ వ‌ర్మ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

    పీక‌ల్లోతు క‌ష్టాల్లో పాక్‌
    78 ప‌రుగుల వ‌ద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన మ‌హ్మ‌ద్ నవాజ్‌.. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
    👉ఉస్మాన్ ఖాన్‌(44) రూపంలో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.

    ఉస్మాన్ ఖాన్ దూకుడు..
    9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పాకిస్తాన్ 4 వికెట్ల న‌ష్టానికి 66  ప‌రుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 40 ప‌రుగుల‌తో దూకుడుగా ఆడుతున్నాడు.

    పాక్ నాలుగో వికెట్ డౌన్‌
    34 ప‌రుగుల వ‌ద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 ప‌రుగులు చేసిన బాబ‌ర్ ఆజం.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 6 ఓవ‌ర్ల‌కు పాక్ స్కోర్‌: 38/4
    పాక్ మూడో వికెట్ డౌన్‌
    13 ప‌రుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది.  4 ప‌రుగులు చేసిన స‌ల్మాన్ అలీ అఘా.. బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

    పాకిస్తాన్‌కు భారీ షాక్‌
    176 ప‌రుగుల ల‌క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు తొలి ఓవ‌ర్‌లోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ డ‌కౌట‌య్యాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో సైమ్ అయూబ్‌(6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 6 ప‌రుగుల‌కే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది.
    పాక్ టార్గెట్ ఎంతంటే?
    కొలంబో వేదిక‌గా పాక్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంసం సృష‍్టించాడు.  40 బంతులు ఎదుర్కొన్న కిష‌న్‌.. 10 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 77 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

    అత‌డితో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్‌(32), తిల‌క్ వ‌ర్మ‌(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌల‌ర్ల‌లో సైమ్ అయూబ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స‌ల్మాన్ అఘా, ఉస్మాన్ త‌రీఖ్, అఫ్రిది త‌లా వికెట్ సాధించారు.

    సూర్య కుమార్ ఔట్
    159 ప‌రుగుల వ‌ద్ద కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వికెట్‌ను టీమిండియా కోల్పోయింది. 32 ప‌రుగులు చేసిన సూర్య‌..  ఉస్మాన్ త‌రీఖ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 19 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 159/5

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
    టీమిండియా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 ఓవ‌ర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్‌లో తిల‌క్ వ‌ర్మ‌(25) రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోగా.. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

    నిల‌క‌డ‌గా ఆడుతున్న సూర్య‌, తిల‌క్
    ఇషాన్ కిష‌న్ ఔటైన అనంత‌రం కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌(21), తిల‌క్ వ‌ర్మ(25) ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 125/2
    ఇషాన్ కిష‌న్ ఔట్
    ఇషాన్ కిష‌న్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. 40 బంతుల్లో 77 ప‌రుగులు చేసిన కిష‌న్‌.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 9 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 89/2

    చెల‌రేగి ఆడుతున్న ఇషాన్‌
    పాక్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడుతున్నాడు. కేవ‌లం 27 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఇషాన్ 72 ప‌రుగులతో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 8 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 82/1

    దూకుడుగా ఆడుతున్న ఇషాన్‌
    5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ వికెట్ న‌ష్టానికి 41 ప‌రుగులు చేసింది. అభిషేక్ తొలి ఓవ‌ర్‌లోనే వెనుదిరిగిన‌ప్ప‌టికి కిష‌న్ మాత్రం(36) దూకుడుగా ఆడుతున్నాడు.

    అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌
    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట‌య్యాడు. స‌ల్మాన్ అలీ బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. ఇషాన్ కిష‌న్(12) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవ‌ర్ల‌కు భార‌త్ స్కోర్: 16/1

    బౌలింగ్ ఎంచుకున్న పాక్‌
    కొలంబో వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ బ్లాక్‌బాస్ట‌ర్ మ్యాచ్‌లో భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. 

    న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. దీంతో సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డింది. అదేవిధంగా అర్ష్‌దీప్ సింగ్ స్ధానంలో కుల్దీప్ యాద‌వ్‌కు అవ‌కాశం ద‌క్కింది. పాక్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

    తుది జ‌ట్లు
    భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

    పాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

    కాసేపటిలో టాస్‌
    టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుకు స‌ర్వం సిద్ద‌మైంది. మరి కాసేపటిలో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షూరూ కానుంది. ఇప్ప‌టికే మైదానానికి చేరుకున్న ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు వార్మాప్ అవుతున్నారు.

  • భారత్‌-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.

    గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్‌ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్‌ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేస్తాయి. 

    ఈ హైప్‌ భారత్‌, పాక్‌ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.

    భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్‌ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్‌ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా  పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

    అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్‌ ఈ మ్యాచ్‌ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్‌ తిరిగి కార్యరూపం దాల్చడం​ ఈ మ్యాచ్‌ హైప్‌ను పీక్స్‌కు చేర్చింది. 

    ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ హెడ్‌ టు హెడ్‌ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్‌కు పాక్‌పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్‌ ఏకంగా ఏడు సార్లు జయకేతనం​ ఎగురవేసింది. పాక్‌ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్‌లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.

    భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుత పాక్‌ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. 

    అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్‌లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం ‍కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్‌ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.

    వరుణుడి భయం
    ఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్‌ సమయంలో భారీ వర్షం​ పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్‌ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.

    ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే మాత్రం భారత్‌, పాక్‌కు చెరో పాయింట్‌ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్‌ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.

    టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్‌-పాక్‌ సమరాలు..

    తొలి ఘట్టం – 2007  
    దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్‌ స్టేజ్‌లో మ్యాచ్‌ టై అయ్యింది, కానీ బౌలౌట్‌లో భారత్‌ గెలిచింది. అదే టోర్నమెంట్‌ ఫైనల్‌లో మళ్లీ తలపడగా, ఎంఎస్‌ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్‌-పాక్‌ టీ20 వరల్డ్‌కప్‌ పోరాటాలకు ఆరంభం.  

    భారత్‌ ఆధిపత్యం  
    అనంతరం 2012, 2014, 2016 వరల్డ్‌కప్‌లలో భారత్‌ వరుస విజయాలు సాధించింది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్‌ పాక్‌పై ఆధిపత్యం కొనసాగించింది.  

    పాక్‌ చరిత్రాత్మక విజయం – 2021  
    దుబాయ్‌లో జరిగిన 2021 వరల్డ్‌కప్‌లో పాక్‌ భారత్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్‌కి వరల్డ్‌కప్‌ చరిత్రలో భారత్‌పై తొలి విజయం. బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఆ మ్యాచ్‌ పాక్‌ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది.  

    తిరిగి భారత్‌ ఆధిపత్యం  
    2022, 2024 వరల్డ్‌కప్‌లలో భారత్‌ మళ్లీ పాక్‌ను ఓడించింది. హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు. 

  • ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో ఆసీస్‌పై డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తి ప్ర‌కారం భార‌త్ 21 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భార‌త బౌల‌ర్ల దాటికి 18 ఓవ‌ర్ల‌లో 133 ప‌రుగుల‌కే కుప్పకూలింది.

    కంగారూ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో జార్జియా వేర్‌హామ్(30) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, లిచ్‌ఫీల్డ్‌(26), పెర్రీ(20) రాణించారు. భార‌త పేస‌ర్ అరుంధ‌తి రెడ్డి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి ఆసీస్ ప‌త‌నాన్ని శాసించింది. అరుధ‌తితో పాటు మ‌రో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేస‌ర్ రేణుకా సింగ్ ఠాకూర్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

    అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్యంతో బరిలోకి దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ త‌న మెరుపు బ్యాటింగ్‌తో అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చింది. ష‌ఫాలీ కేవ‌లం 11 బంతుల్లోనే 2 సిక్స‌ర్ల‌తో 21 ప‌రుగులు చేసి ఔటైంది. అయితే భార‌త్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వ‌ద్ద ఉండ‌గా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

    వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న్పించ‌క‌పోవ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో ఫ‌లితాన్ని తేల్చాల్సి వ‌చ్చింది. ఆట నిలిచిపోయే స‌మ‌యానికి 21 ప‌రుగులు ముందుంజ‌లో ఉండ‌డంతో భార‌త్‌ను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి హ‌ర్మ‌న్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్‌బెర్రా వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 19న జ‌ర‌గ‌నుంది.

  • 2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డ​క్‌వర్త్‌ లూయిస్‌ వద్దతిలో) గెలుపొందింది.

    ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్‌ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్‌ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ ప్లేయర్ల భరతం​ పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.

    ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా వేర్హమ్‌ (30) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (26), ఎల్లిస్‌ పెర్రీ (20), జార్జియా వాల్‌ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్‌ మూనీ (5), ఆష్లే గార్డ్‌నర్‌ (4), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (3), కిమ్‌ గార్త్‌ (2), డార్సీ బ్రౌన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినెక్స్‌ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.

    అనంతరం భారత్‌ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్‌ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం​ ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్‌, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. షఫాలీ వికెట్‌ మోలినెక్స్‌కు దక్కింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్‌బెర్రా వేదికగా జరుగనుంది.
     

  • క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్‌గా నిలిచాడు.

    అత‌డి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్‌ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తారిక్‌ భారత్‌పై పైచేయి సాధించాడ‌ని హఫీజ్ అన్నాడు.

    "ఉస్మాన్ తారిక్ ఇప్ప‌టికే భార‌త్‌పై సైకిలాజిక‌ల్‌గా విజ‌యం సాధించాడు. ప్ర‌త్యేక వ్యూహాలు ర‌చిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చ‌ర్చించ‌డం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్‌ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తారిఖ్‌ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

    అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయిన‌ప్ప‌టికి అత‌డిని ఎదుర్కొవ‌డానికి భార‌త్ ప్ర‌త్యేక వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ను కెప్టెన్ స‌ల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అత‌డిని 6వ ఓవర్‌లోనే రంగంలోకి దించితే బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు" అని తప్మాడ్ అనే ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు.
     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్‌-పాక్‌ మధ్య హైవోల్టేజీ మ్యాచ్‌ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్‌ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్‌ రద్దు చేసుకున్నట్లు పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్‌ ఈ మ్యాచ్‌ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్‌ తిరిగి కార్యరూపం దాల్చడం​ ఈ మ్యాచ్‌ హైప్‌ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్‌ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్‌ సమయంలో భారీ వర్షం​ పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

    మ్యాచ్‌ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే మాత్రం భారత్‌, పాక్‌కు చెరో పాయింట్‌ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్‌ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్‌లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).

    ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్న అభిషేక్‌ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్‌ రాకతో సంజూ శాంసన్‌ తిరిగి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. 

    ప్రేమదాస స్టేడియం పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం​ ఉంది. అప్పుడు అర్షదీప్‌ సింగ్‌పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.

    అభిషేక్‌, ఇషాన్‌ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. వన్‌డౌన్‌లో తిలక్‌ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌, ఐదో ప్లేస్‌లో హార్దిక్‌ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్‌ దూబే, ఏడో ప్లేస్‌లో రింకూ సింగ్‌, స్పిన్నర్లుగా కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్‌ పేసర్‌గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.   

  • ఆస్ట్రేలియా గడ్డపై తొలి మ్యాచ్‌లోనే భారత మహిళా బౌలర్లు చెలరేగిపోయారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. ఆసీస్‌ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చింది.

    పేసర్లు రేణుకా సింగ్‌ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్‌ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్‌ ప్లేయర్ల భరతం​ పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.

    ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా వేర్హమ్‌ (30) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (26), ఎల్లిస్‌ పెర్రీ (20), జార్జియా వాల్‌ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్‌ మూనీ (5), ఆష్లే గార్డ్‌నర్‌ (4), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (3), కిమ్‌ గార్త్‌ (2), డార్సీ బ్రౌన్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్‌ సోఫీ మోలినెక్స్‌ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.

    కాగా, మల్లీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు టీ20లు, ఆతర్వాత మూడు వన్డేలో, చివరిగా ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

    ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్‌

    ఫిబ్రవరి 15- తొలి టీ20 (సిడ్నీ)
    ఫిబ్రవరి 19- రెండో టీ20 (కాన్‌బెర్రా)
    ఫిబ్రవరి 21- మూడో టీ20 (అడిలైడ్‌)

    ఫిబ్రవరి 24- తొలి వన్డే (బ్రిస్బేన్‌)
    ఫిబ్రవరి 27- రెండో వన్డే (హోబర్ట్‌)
    మార్చి 1- మూడో వన్డే (హోబర్ట్‌)

    మార్చి 6- ఏకైక టెస్ట్‌ (పెర్త్‌)

  • ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టీ20 టోర్నీలో భారత్‌ పాక్‌పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్‌ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ‌ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. 

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.

    తాజా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్‌ (4-0-14-2), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (3-0-11-2), ప్రేమా రావత్‌ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్‌ (3-0-19-0) పాక్‌ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావల్‌ జుల్ఫికర్‌ (23), గుల్‌ రుఖ్‌ (21), అనోశా నాసిర్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

    స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ తొలి బంతికే వికెట్‌ (హుమైరా ఖాజీ డకౌట్‌) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్‌ వ్రింద దినేశ్‌ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్‌ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్‌ హసబ్నిస్‌ (12 నాటౌట్‌) సహకరించారు. 

    పాక్‌ బౌలర్లలో వహీదా అక్తర్‌, మొమినా రియాసత్‌కు తలో వికెట్‌ దక్కింది. భారత్‌ గ్రూప్‌ దశలో తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌, పాక్‌, యూఏఈ, నేపాల్‌ గ్రూప్‌-ఏలో ఉండగా.. థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మలేసియా గ్రూప్‌-బిలో ఉన్నాయి. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ కొలంబో వేదికగా ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఆర్‌.ప్రేమదాస స్టేడియం వేదిక కాగా.. వర్షం పడే ప్రమాదం పొంచి ఉంది.

    ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) శనివారం నాటి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సంకేతాలు ఇచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ తొలుత అమెరికాతో తలపడిన సంగతి తెలిసిందే.

    అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌
    ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచినా.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక నమీబియాతో రెండో మ్యాచ్‌కు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అందుబాటులో లేకుండా పోయాడు. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన అభిషేక్‌.. కోలుకున్నప్పటికీ యాజమాన్యం అతడికి విశ్రాంతినిచ్చింది.

    ఇక నమీబియాను చిత్తుగా ఓడించి సూపర్‌-8కు చేరువైన భారత్‌.. దాయాదిపై ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌తో ఆడే భారత తుదిజట్టు ఎలా ఉండబోతున్న చర్చ జరుగుతోంది.

    అతడు ఆడాలని కోరుకుంటున్నాం
    ఇదిలా ఉంటే.. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) మాట్లాడుతూ.. “అతడు మంచి ప్లేయర్‌. అభిషేక్‌ రేపు ఆడతాడనే అనుకుంటున్నాం. మేము అత్యుత్తమ జట్టుతో పోటీ పడాలి అని అనుకుంటున్నాం. కాబట్టి అతడు కోలుకుని తిరిగి వస్తే బాగుంటుంది’’ అని అభిషేక్‌ శర్మను ఉద్దేశించి పేర్కొన్నాడు.

    పాక్‌ కోరిక నెరవేరుస్తాం
    ఇదే విషయాన్ని సూర్య వద్ద విలేకరులు ప్రస్తావించగా.. “ఒకవేళ పాకిస్తాన్‌ మేము అభిషేక్‌ శర్మను ఆడించాలని కోరుకుంటే.. వారి కోరిక నెరవేరుతుంది. అతడు రేపు ఆడతాడు’’ అని సమాధానమిచ్చాడు. తద్వారా సంజూ శాంసన్‌పై వేటు వేయడం ఖాయమని చెప్పకనే చెప్పాడు సూర్య.

    అతడికీ చోటు
    ఇక కొలంబో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ కాబట్టి లెఫ్టార్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా తుదిజట్టులో ఉంటాడని సూర్య సంకేతాలు ఇచ్చాడు. “అతడి అవసరం ఉందనుకుంటే కచ్చితంగా ఆడిస్తాము’’ అని కుల్దీప్‌ను ఉద్దేశించి పేర్కొన్నాడు. కాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో కుల్దీప్‌ వచ్చే అవకాశం ఉంది.

    కాగా గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతున్నాయి. అయితే, ఇప్పటికే చెరో రెండు విజయాలతో భారత్‌- పాక్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. అమెరికా సైతం సూపర్‌-8 రేసులో నిలిచే ప్రయత్నంలో ఉంది.

    భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ తుది జట్లు (అంచనా): 
    భారత్‌
    సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, ఇషాన్‌ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్ పటేల్‌, కుల్దీప్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా

    పాకిస్తాన్‌
    సల్మాన్‌ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, బాబర్‌ ఆజమ్, షాదాబ్ ఖాన్‌, ఉస్మాన్ ఖాన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ నవాజ్, ఫహీమ్ అష్రఫ్‌, షాహిన్‌ అఫ్రిది, ఉస్మాన్‌ తారిఖ్, అబ్రార్‌ అహ్మద్‌. 

    చదవండి: IND vs PAK: ‘​వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’

  • ఉత్తరాఖండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (125 నాటౌట్‌), కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (111 నాటౌట్‌) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్‌ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్‌, పడిక్కల్‌ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్‌ సెంచరీల దిశగా సాగుతున్నారు.

    టాస్‌ ఓడి ఉత్తరాఖండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5) వికెట్‌ కోల్పోయింది. అయితే రాహుల్‌, పడిక్కల్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ ఆదిత్య రావత్‌కు దక్కింది.

    భీకర ఫామ్‌లో రాహుల్‌, పడిక్కల్‌
    కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్‌ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్‌ ముంబైతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్‌ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్‌కు చేరింది. అంతకుముందు పంజాబ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ రాహుల్‌ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన రాజ్‌కోట్‌ వన్డేలోనూ (112) రాహుల్‌ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.

    పడిక్కల్‌ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పడిక్కల్‌.. దానికి ముందు లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్‌పై 91, ముంబైపై 81 (నాటౌట్‌) పరుగులు చేశాడు. రాహుల్‌, పడిక్కల్‌ ఇదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్‌ గెలవడం ఖాయం. 

  • రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ మూడో టైటిల్‌ దిశగా తొలి అడుగు వేసింది. 2026 ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్‌-8కు అర్హత సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకున్న తొలి జట్టు వెస్టిండీసే. నేపాల్‌పై విజయం సాధించడంతో విండీస్‌ సూపర్‌-8 బెర్త్‌ ఖరారైంది.

    ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ 9 వికెట్ల తేడాతో పసికూనను చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో నేపాల్‌ను 133 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసిన కరీబియన్‌ జట్టు.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

    ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో (4-0-27-4) ఇరగదీసి నేపాల్‌ను దెబ్బేశాడు. మాథ్యూ ఫోర్డ్‌ (4-1-10-1) పొదుపుగా బౌలింగ్‌ చేసి నేపాల్‌ను కట్టడి చేశాడు. అకీల్‌ హోసేన్‌, షమార్‌ జోసఫ్‌, రోస్టన్‌ ఛేజ్‌ కూడా తలో వికెట్‌ తీసి నేపాల్‌ను ఇబ్బంది పెట్టారు. 

    నేపాల్‌ ఇన్నింగ్స్‌లో దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో సోమ్‌పాల్‌ కామీ (26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో నేపాల్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

    అనంతరం​ స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (61) అజేయమైన అర్ద సెంచరీతో విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. హోప్‌కు హెట్‌మైర్‌ (46 నాటౌట్‌), బ్రాండన్‌ కింగ్‌ (22) సహకరించారు. ఈ ఓటమితో నేపాల్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. 

    మెగా టోర్నీలో ఈ జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. అయితే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మాత్రం ఓడించినంత పని చేసింది. ఇదొక్కటే ఈ ఎడిషన్‌లో నేపాల్‌కు ఊరట కలిగించే విషయం. ఫిబ్రవరి 17న ఈ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌ (స్కాట్లాండ్‌) ఆడనుంది. 

  • పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లు తలపడుతున్నాయి.

    తొలుత బ్యాటింగ్‌
    బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానంలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 

    చుక్కలు చూపించిన భారత బౌలర్లు
    ఓపెనర్లలో యుస్రా ఆమిర్‌ (1)ను సైమా ఠాకూర్‌ అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైమా సొహైల్‌ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ (1)ను ఐమా, హురైనా సజ్జద్‌ (2)ను కెప్టెన్‌ రాధా యాదవ్‌ పెవిలియన్‌కు పంపించారు.

    ఎమాన్‌ నాజర్‌ (4)ను అనుష్క శర్మ రనౌట్‌ చేయగా..  వహీదా అక్తర్‌ (7)ను ప్రేమా రావత్‌, మొమినా రియాసత్‌ (4)ను మిన్ను మణి సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ షవాల్‌ జుల్ఫికర్‌ (23)తో పాటు గల్‌ రుఖ్‌ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్‌కు రాధా యాదవ్‌, గుల్‌కు ప్రేమా రావత్‌ చెక్‌ పెట్టారు.

     

    93 పరుగులకే ఆలౌట్‌
    ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్‌-ఎ జట్టు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్‌, రాధా యాదవ్‌, ప్రేమా రావత్‌ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్‌ పడగొట్టారు.

    కాగా ఆసియా కప్‌ రైజింగ్‌ టీ20 టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌- పాక్‌లతో పాటు యూఏఈ, నేపాల్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాక్‌ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్‌ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. 

    చదవండి: వైభవ్‌ సూర్యంశీ సంచలన నిర్ణయం!

  • ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్‌ బ్లెసింగ్‌ ముజరబానీకి బంపరాఫర్‌ వచ్చింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో వెస్టిండీస్‌ స్టార్‌ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది.

     షమార్‌ జోసెఫ్‌పై వేటు
    కాగా మార్చి 26న పాక్‌ సూపర్‌ లీగ్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్‌ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్‌ జోసెఫ్‌పై వేటు వేసింది. ఈ విండీస్‌ పేసర్‌ స్థానంలో జింబాబ్వే స్టార్‌ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్‌ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.

    ఇదిలా ఉంటే.. షమార్‌ జోసెఫ్‌ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ నోరు విప్పలేదు. అటు జోసెఫ్‌ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.

    కారణం అదేనా?
    కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి..  సత్తా చాటిన షమార్‌ జోసెఫ్‌ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు షమార్‌ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.

    ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీ
    ఇక జింబాబ్వే రైటార్మ్‌ పేసర్‌ బ్లెసింగ్‌ ముజరబానీకి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్‌ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

    ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్‌ ఇంగ్లిస్‌ (8), టిమ్‌ డేవిడ్‌ (0), మ్యాట్‌ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.

    చదవండి: IND vs PAK: ‘​వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’

Andhra Pradesh

  • పల్నాడు: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లాలోని కోటప్ప కొండకు భక్తులు పోటెత్తడంతో ఘాట్‌ రోడ్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండ కిందకి గాని పైకి గాని కదలకుండా వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా గంటల తరబడి అవస్థలు తప్పడం లేదు. 

    ప్రధానంగా కోటప్పకొండ నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. దాంతో నరసరావుపేట వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు భక్తులు. కొండ దిగుభాగంలో పూర్తిగా వాహనాలు ప్యాక్‌ అయిపోవడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌లో తీసుకురావడం కష్టతరంగా మారింది. ఇది క్లియర్‌ కావడానికి మరికొన్నిగంటలు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. 

     

     

     

  • విశాఖ: ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూలో 71 నౌకలు భాగస్వామ్యం అవుతున్నాయని ఈఎన్‌సీ(Eastern Naval Command) చీఫ్‌ సంజయ్‌ భల్లా స్పష్టం చేశారు. 71 నౌకలతో పాటు 19 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయన్నారు. ఆరు వరుసల్లో నౌకలను మోహరిస్తారన్నారు ఈఎస్‌సీ చీఫ్‌. 

    ‘రాష్ట్రపతి ఫ్లిట్ రివ్యూ ను సమీక్షిస్తారు. ఐఎఫ్‌ఆర్‌లో 50 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి. 1995 లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలన్ లో ఇప్పుడు 65 దేశాలు భాగం పంచుకుంటున్నాయి. అయాన్స్ కాంక్లేవ్ 2008 లో ప్రారంభమైంది. 19న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ లో 45 దేశాల నేవీ కంటెంజెంట్స్ భాగస్వామ్యం అవుతున్నాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ సహా 17యుద్ధ నౌకలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి’ అని స్పష్టం చేశారు.

     

  • తాడేపల్లి : ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  ఐలాపురం వెంకయ్య  ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. 

    వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటన్నారు. వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కోరుకుంటూ, వెంకయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    ఇలాపురం వెంకయ్య.. ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, శనివారం (ఫిబ్రవరి 14)న మరణించారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలో ఆయన వ్యాపార, రాజకీయ, సామాజిక సేవా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.

     

Politics

  • హైదరాబాద్:  మేయర్‌,  డిప్యూటీ మేయర్‌, చైర్‌ పర్సన్‌, డిప్యూటీ చైర్‌ పర్సన్‌ ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ)  మున్సిపల్‌, కార్పొరేషన్‌లకు సంబంధించి చైర్‌ పర్సన్‌, డిప్యూటీ చైర్‌ పర్సన్‌, మేయర్‌,  డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. 

    ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా  వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్‌ మీటింగ్‌లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. 

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది.

  • హైదరాబాద్:  జగిత్యాల మున్సిపల్‌ పీఠంపై నెలకొన్న సందిగ్థతకు ఫుల్‌స్టాప్‌ పడినట్ల కనిపిస్తోంది. జగిత్యాల మున్సిపల్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ జెండా మోసిన వ్యక్తికే ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లతో సంధి కుదిర్చిన తర్వాత పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

    వీరిద్దరితో మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌, ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్‌ చర్చలు జరపగా, అవి ఫలించాయనేది ప్రాథమిక సమాచారం. ఇరు వర్గాలకు నేతలు నచ్చచెప్పడంతో వారు మెట్టుదిగి వచ్చారని, ఈ క్రమంలోనే జెండా మోసిన వ్యక్తికు చైర్మన్‌ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  దీనిలో భాగంగా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరు వర్గాల నేతలకు నచ్చచెప్పారు.

    ఈ చైర్మన్‌ పీఠంపై జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌లు చెరో వర్గంగా విడిపోయారు  వార తమ పంతాన్ని నెగ్గించుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు.  దీనిలో భాగంగా కాంగ్రెస్‌ జెండా మోసిన వ్యక్తికి మేయర్‌ పీఠం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది అధి నాయకత్వం.  ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంజయ్‌ను ప్రజాభవన్‌కు పిలుపించుకుని మరీ చర్చలు జరిపారు. ఇది ఫలించడంతో జగిత్యాల ఎపిసోడ్‌కు దాదాపు ముగింపు పడినట్లే కనబడుతోంది. 


     

  • విజయవాడ:  ఏపీలో నిరంకుశ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.  కూటమి ప్రభుత్వ పాలనలో విఫలమైందన్నారు. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 

    ‘ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తెరపైకి తెచ్చారు.  ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ పాలన అమలవుతోంది.  తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది. 

    టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరినందుకు అంబటి రాంబాబుపై దాడి చేశారు. చంద్రబాబు తమ వారికి ప్రభుత్వ భూములను అన్యాయంగా తక్కువ ధరకు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ విమర్శించారు.

    బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు
  • సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్‌ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.

    ‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు.

    ..సూపర్ సిక్స్‌లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’  అంటూ శ్రీనివాసరావు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

International

  • అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో గ్రహాంతర వాసులపై తన అభిప్రాయం పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతానన్నారు. అయితే వారు ఎక్కడున్నారనేది మాత్రం తనకు తెలియదన్నారు.

    ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రముఖ యూట్యూబర్ బ్రియాన్‌ టైలర్ కోవెన్ పాడ్‌కాస్ట్ విడుదలైంది. అందులో ఏలియన్స్ గురించి కీలక సమాచారాన్ని ఒబామా పంచుకున్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని తాను నమ్ముతారన్నారు. ఆయన మాట్లాడుతూ" గ్రహాంతర వాసులు ఉండడం నిజం. అయితే వారి ఉనికి నాకు తెలియదు. వారిని ఏరియా 51లో ఉంచలేదు. అక్కడ భూగర్భ సౌకర్యం లేదు. ‍అయితే ఏదైనా కుట్ర జరిగి అమెరికా అధ్యక్షుడికే తెలియకుండా దాడిపెడితే అది వేరే విషయం" అన్నారు.

    ఏరియా 51 అనేది నెవాడాలోని గ్రూమ్ లేక్‌లో ఉన్న అత్యంత రహస్యమైన US వైమానిక దళ స్థావరం, ఇది చాలా కాలంగా ప్రభుత్వం గ్రహాంతర వాసుల  సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా అవశేషాలను దాచిపెడుతుందనే ఊహాగానాలు రేగుతున్నాయి. అయితే  ఒబామా UFOలు మరియు గ్రహాంతర జీవుల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ "గ్రహాంతరవాసుల విషయానికి వస్తే, నేను మీకు ప్రసారంలో చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి" అని ఒబామా అనడం అప్పట్లో సంచలనం రేపింది.

  • బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకార వేడుకకు భారత్ హాజరుకానుంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.  ఇండియా తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు విదేశాంగశాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ హాజరుకానున్నారు.

    ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రహ్మాన్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. మంగళవారం అక్కడి పార్లమెంటులోని సౌత్‌ప్లాజాలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్, మన దేశంలో సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు భారత్ ప్రకటించింది.

    ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో "బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ హాజరుకావడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజేస్తుంది." అని తెలిపింది. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆ దేశంలో రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి అధికారం సాధించింది. 297 స్థానాల్లో జరిగిన ఎన్నికలు జరుగగా 209 సీట్లు సాధించింది.

    అయితే బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల బీఎన్‌పీ నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు సైతం భారత్ సంఘీభావం ప్రకటించింది. ఆమె అంతిమ యాత్రకు భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. అయితే బీఎన్‌పీ విజయం సాధించిన తర్వాత కూడా ప్రధాని మోదీ బీఎన్‌పీ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు. అందుకు ఆ పార్టీ సైతం ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.

    అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు చేసి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బంగ్లాదేశ్‌తో సత్సంబంధాల దిశగా ప్రయత్నిస్తుంది.

  • అమెరికా- ఇరాన్  అణుచర్చల విషయంపై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అణుచర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఆ విషయంలో బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని అంతర్జాతీయ మీడియాకు  తెలిపారు.

    ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అణుచర్చల విషయంలో తగ్గకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో పాటు ఇరాన్ సైతం వెనక్కితగ్గేలా కనిపించకపోవడంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి మజీద్ తాక్త్‌ రావంచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని తెలిపారు.  

    విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ" అణు కార్యక్రమంపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అమెరికా దానికి సంబంధించిన ఆంక్షల విషయంపై చర్చ జరపాలి. ఆ చర్చలు టేబుల్‌పై ఉండాలి. అదే విధంగా తన వంతు బాధ్యతను నిర్వర్తించకుండానే కొన్ని పనులు చేయాలనే భావనను ఎవరూ అంగీకరించరు" అని ఆయన అన్నారు.అయితే ఈ అంశంపై ఫిబ్రవరి 6న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరఘ్ఛి  అమెరికా రాయభారి స్టీవ్ విట్‌కాఫ్ చర్చలు జరిపారు.  ఈ చర్చలు పరోక్షంగా జరిగాయి, దీనికి ఒమన్లు ​​మధ్యవర్తులుగా వ్యవహరించారు. 

    కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా భారీ విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌’ తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలిస్తోంది. ఇప్పటికే ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌’ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. ‘యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌’ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాల వాహక నౌకగా పేరుగాంచింది. 

  • అందమైన ప్రకృతిలో అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతికి, మానవ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. కానీ ప్రపంచంలోని ఏకైక విషపూరిత పక్షి ఒకటి  ఉంది తెలుసా. పైకి రంగు రంగుల్లో అందిస్తూ కనిపిస్తూ మానవులకు కీడు చేస్తుంది. అదేంటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలేంటో  తెలుసుకుందాం.

    ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పక్షి.  హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) న్యూ గినియా (New Guinea) లోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి చూడటానికి నారింజ మరియు నలుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటాయి. కానీ దీని ఈకలను తాకినా, లేదా దాని మాంసాన్ని ఆహారంగా తీసుకున్నాతీవ్రమైన నాడీ సంబంధిత ప్రభావాలు ఏర్పడవచ్చు.  సాధారణంగా  వీటిని వండుకుని తినడానికి వీలుండదు (వండితే ఘాటైన వాసన , విషం వల్ల అనారోగ్యం కలుగుతుంది)ముఖ్యంగా జలదరింపు, తిమ్మిరి లేదా తేలికపాటి పక్షవాతం వంటివి సంభవించవచ్చు.  

    విషపూరితమైన పక్షి ఎలా అయ్యింది?
    సాధారణంగా పాములు లేదా కప్పలు విషపూరితంగా ఉండటం చూస్తుంటాం, కానీ ఈ పక్షి ఈకలు, చర్మం , మాంసంలో కూడా విషం ఉంటుంది. పిటోహుయిస్ తమ సొంత విషాన్ని తయారు చేసుకోవు. హుడెడ్ పిటోహుయిస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇదొకటి. వాటి ఆహారం నుండి సీక్వెస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పాయిజన్‌ఉత్పత్తి అవుతుంది. అంటే అవితీసుకున్న ఆహారంనుంచి విషాన్ని వారి శరీరంలో నిల్వ  ఉంటుంది.

    ఇవి తినే ఒక రకమైన 'మెలైరిడ్' (Melyrid) బీటిల్స్ (పురుగులు) వల్ల వీటి శరీరంలోకి విషం చేరుతుందని జాక్ డంబాచర్‌తో సహా శాస్త్రవేత్తలు గుర్తించారు. హుడెడ్ పిటోహుయి కలిగి ఉన్న ఈ పురుగుల్లో విషాన్ని బాట్రాకోటాక్సిన్ (Batrachotoxin) అంటారు. ఇదే విషం కొలంబియాలోని 'పాయిజన్ డార్ట్' కప్పలలో కూడా కనిపిస్తుంది.అందుకే స్థానిక ప్రజలు వీటిని "చెత్త పక్షులు" అని పిలుస్తారు.

     ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం

    మనుషులపై ప్రభావం
    ఒకవేళ ఎవరైనా ఈ పక్షిని పట్టుకుంటే, ఆ విషం వల్ల చేతులు మొద్దుబారిపోవడం, మంట పుట్టడం లేదా తీవ్రమైన తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఈ విషపదార్థాలు పక్షి తనను తాను వేటాడే జంతువులు ,పరాన్నజీవుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి.పాములు లేదా ఇతర జంతువులు ఈ పక్షిని వేటాడకుండా ఈ విషం కాపాడుతుంది. అంతేకాదు వీటి ఈ ఈకల్లోని విషం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి పక్షికి సోకవు.

    ఇది విషపూరితమని ఎపుడు గుర్తించారు
    శాస్త్రవేత్త జాక్ డంబాచర్ 1980ల చివరలో న్యూ గినియాలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఈ విషపూరిత పక్షిని కనుగొన్నాడు. అతన ఈ పక్షులను తాకినప్పుడు, తన నోటిని లేదా కళ్ళను తాకిన తర్వాత, జలదరింపు, తిమ్మిరి, మండుతున్న అనుభూతిని అనుభవించాడని డిస్కవర్ వైల్డ్‌లైఫ్ తెలిపింది. తరువాత, పక్షి ఈకలు , చర్మం విషపూరితమైనవని కూడా గ్రహించాడు.  1992లో డంబాచర్, అతని బృందం హుడెడ్ పిటోహుయ్ చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం, విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయని చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ప్రచురించింది.  

    ఇదీ చదవండి: బోట్‌ రైడ్‌లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్‌

  • జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గుర్తింపు కార్డు విషయంలో ఆయన్ని దాదాపుగా అడ్డుకున్నంత పని చేశారు. మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన అసిమ్ మునీర్‌ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.

    తన బృందంతో కలిసి జర్మనీ నగరానికి అసిమ్ మునీర్‌ చేరుకున్నారు. కాన్ఫరెన్స్ ప్రవేశ ద్వారానికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది.  ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?(ముందుకి కనిపించేలా)’’ అంటూ సెక్యూరిటీ కోరడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

    మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడంపై తీవ్రంగా వ్యతిరేకించింది. కార్యక్రమ వేదిక వద్ద జెఎస్‌ఎంఎం సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ సమావేశంలో మునీర్ పాల్గొనడం పట్ల అభ్యంతరం తెలిపారు.

Business

  • ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్‌పోర్ట్స్‌ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.

    హ్యుందాయ్‌ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్‌వ్యాగన్‌ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్‌ గణాంకాల్లో వెల్లడైంది. భారత్‌ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ భారతి తెలిపారు.

    ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్‌ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్‌ చెప్పారు. పరిశ్రమ ఎక్స్‌పోర్ట్స్‌ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్‌పోర్ట్స్‌కి ఊతమిస్తోందని రాహుల్‌ తెలిపారు.

    ఇప్పటివరకు ప్రధానంగా యూరప్‌లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా ఎండీ తరుణ్‌ గర్గ్‌ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు.

  • దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

    రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.

    ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.

    ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?

    ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.

  • దేశంలోని వివిధ ప్రాంతాలలోని.. బ్యాంకు శాఖలు వచ్చే వారం మూడు రోజులు క్లోజ్‌లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 18, 19, 20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.

    ఫిబ్రవరి 18 (బుధవారం): టిబెటన్ నూతన సంవత్సరమైన లోసర్‌ను జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు. 
    ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.
    ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర దినోత్సవం/రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్ & మిజోరాంలలో బ్యాంకులకు సెలవు.

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

    ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్‌లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.

    వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.

    ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్‌కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.

    డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.

  • స్పెయిన్‌కి చెందిన ట్రెయిన్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాం అయిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సొల్యూషన్స్‌ (ట్రెనెస్‌)లో మెజారిటీ వాటాలను ట్రావెల్‌ అగ్రిగేటర్‌ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్‌ యూరోలు) ఉంటుంది.

    యూరోపియన్‌ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్‌ యాజ్‌ సరీ్వస్‌ అనే ఇంకో స్పానిష్‌ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్‌క్యూఏఏఎస్‌ సంస్థ ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంబంధ సేవలను అందిస్తోంది.

  • టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్‌లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

    టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.

    టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

    ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

    టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది.

  • అస్సాంలో గోహ్‌పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

    ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్‌పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్‌ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.

    ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.

    ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

    ఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.

  • భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్‌ 5 టోల్‌ ప్లాజాల గురించి తెలుసుకుందాం.

  • అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.

    అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్‌పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

    శాంతి చర్చలు ఫలించేనా?
    ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.

    చమురు ధరలు పెరిగే అవకాశం
    ఇదిలా ఉండగా, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

    బంగారం, వెండి ధరలపై ప్రభావం
    గత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.

National

  • న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని  ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్‌ ఎంపీ సుఖిందర్‌ సింగ్‌  రంధావా. పాకిస్తాన్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటూ అభివర్ణించారు. ఇది భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌ కాదని,  కేవలం జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ మాత్రమేనన్నారు. యావత్‌ భారతావని.. పాకిస్తాన్‌తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. 

    ‘ పాకిస్తాన్‌ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్‌ దుశ్చర్యలు బాగా తెలుసని  ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

    ఇది భారతావని కోరుకునే మ్యాచ్‌ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్‌తో మ్యాచ్‌ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్‌గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్‌ జరుగుతుంది. భారత్‌కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.

     

     

  • మహాశివరాత్రి.. కోట్లాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ పవిత్ర సమయంలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, మహా శివునికి అభిషేకాలు చేస్తారు. జాగరణ చేస్తూ ఆ  పరమశివుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. ఆధ్యాత్మిక రాజధాని కాశీలో విశ్వేశ్వరునికి గంగాజలం, బిల్వపత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తారు.

    హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరిగే ‘శివరాత్రి మేళా’లో  దేవతలు పల్లకీల్లో భూత్ నాథ్ ఆలయానికి తరలిరావడం ఒక అద్భుత ఘట్టం. ఇక కశ్మీరీ పండిట్లు ‘హేరత్’ పేరుతో శివరాత్రిని పండుగను జరుపుకుంటారు, అక్కడ నిర్వహించే ‘వటుక్ పూజ’ ప్రత్యేక వంటకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ వద్ద ‘వీరగాసె’ నృత్య ప్రదర్శనలు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో 14 కిలోమీటర్ల మేర సాగే  గిరిప్రదక్షిణ భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తాయి.

    శివారాధన కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతినాథ్ దేవాలయం వేలాది సాధువుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. మారిషస్‌లో హిందూ భక్తులు ‘గంగా తలావ్’ అనే పవిత్ర సరస్సు వరకు పాదయాత్ర చేస్తారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ‘మెలుకత్’ అనే ఆత్మశుద్ధి ప్రక్రియ ద్వారా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, ధ్యానముద్రలో శివరాత్రిని గడుపుతారు. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్, టొబాగోలో కూడా భారతీయ సంతతి వారు రాత్రంతా శివ నామస్మరణతో ఆలయాల్లో జాగరణ చేస్తారు.

     

Telangana

  •  సాక్షి నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ పీఠంపై చిక్కుముడి వీడింది.  కాంగ్రెస్‌కు మేయర్ పదవి, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి షేర్ చేసుకునేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు  కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. నగరపాలక సంస్థకు మెుత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14, బీఆర్ఎస్‌కు ఒక స్థానం లభించింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

    అయితే ఏ పార్టీకి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ సీట్లు రాకపోవడంతో నిజామాబాద్‌లో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఇందూరులో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. బీజేపీ  అత్యధిక సీట్లు గెలిచినప్పటికీ మేయర్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో కాంగ్రెస్ పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ మేయర్‌ అభ్యర్థిగా ఉన్న కాటిపల్లి శమంత 19వ డివిజన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకిలోనే మరికొందరు మేయర్‌ స్థానానికి పోటీపడుతున్నారు. 21వ డివిజన్‌ నుంచి గెలిచిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్‌ నుంచి గెలిచిన కూరగాయల ఉమారాణి, 41వ డివిజన్‌ నుంచి గెలిచిన బొంబోతుల పుజిత, 12వ డివిజన్‌ నుంచి గెలిచిన దూమాల అరుంధతి, అలాగే 9వ డివిజన్‌ నుంచి గెలిచిన కేతావత్‌ సురేఖలు మేయర్‌ రేసులో ఉన్నారు. 

    మొత్తం ఐదుగురు మహిళలు పోటీలో ఉండగా నలుగురు బీసీలు, ఒకరు ఎస్టీ ఉన్నాట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఇక్కడ హంగ్ వచ్చింది.  ఈ కార్పొరేషన్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరి్వంద్, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నా రు. దీంతో బీజేపీకి మూడు, కాంగ్రెస్‌కు రెండు ఓట్లు పెరిగినట్‌లైంది. బీఆర్‌ఎస్‌ అభ్యరి్థ ని మినహాయించినప్పటికీ కాంగ్రెస్‌–ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేయర్ పీఠం చేజిక్కించుకుంది.

  • సాక్షి, కరీంనగర్: నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికలో  సంచలనం జరగుబోతుందా అంటే దాదాపు అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరీంనగర్‌ మేయర్‌ స్థానం చేజిక్కించుకోవడం కోసం సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీనికోసం తమ ప్రధాన ప్రత్యర్థైన బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్ల మద్ధతు మంత్రి కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో సహా పలువురు  ఇండిపెండెంట్ల తో కలిసి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

    కరీంనగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మెుత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ముగ్గురు కోఆఫ్షన్ మెంబర్స్‌తో కలిసి మెుత్తం ఆసంఖ్య 69 స్థానాలకు చేరుకుంది. అయితే మేయర్ పీఠానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 35 స్థానాలు. ఇందులో బీజేపీ 30 స్థానాలు గెలువగా, కాంగ్రెస్ 14 సీట్లు సాధించింది. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత‍్రులతో కలిసి కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్ అందుకునేలా  ప్లాన్ వేసింది. దీనికి గానూ  ఒక్కో కార్పోరేటర్ సీటుకు రూ.1.5 కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకూ బేరసారాలు జరిగినట్లు తెలుస్తోంది. 

    అదే విధంగా మేయర్ పదవికోసం కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు ఆశావాహులుగా ఉండగా  మరో  ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేయర్ పీఠం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు డిప్యూటీ మేయర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపు ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో మేయర్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    ఇదీ చదవండి:
    ప్రజా తీర్పును కాలరాస్తే.. వారిని తిరగనివ్వను’

  • సాక్షి, హైదరాబాద్: బంజారాభవన్‌లోసంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..మానవ జాతి శాంతి మార్గం లో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తి ని నిప్పారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అందుకే దేశంలోని  15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా ఆయన నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి అధికారికం గా జరపడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు. 

    ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లంబాడీలు కీలక పాత్ర పోషించారని రాష్ట్రం కోసం సురేష్ నాయక్, కవిత నాయక్ ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాడీల పాత్ర మరవలేనిదన్నారు. అందుకే తండాలలో రోడ్డు లేకుండా ఏ తండా ఉండకూడదని అన్ని తండాలకు బీటీ రోడ్డు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.అదే విధంగా ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. 

    తాను zptc  అభ్యర్థి గా పోటీ చేసినప్పుడు తండా ల్లో ఉన్న యువకులు తన విజయం లో క్రియాశీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో ప్రతి సందర్భంలో లంబాడా సోదరులు తనకు అండగా నిలిచారన్నారు. పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం రేషన్ కార్డని సీఎం తెలిపారు. కార్డు ఉన్నవారందరికి  సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల  ఇళ్ళకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని 50 లక్షల పేదల ఇళ్ల లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సీఎం అన్నారు. గడిచిన 2 ఏళ్లలో  ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం రూ.9,000 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.

    ఇటీవల జరిగిన గ్రూప్‌-1పై అక్రమ కేసులు వేస్తే పోరాడి ఉద్యోగాలు ప్రకటించామన్నారు. గ్రూప్-1లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. దీనిపైన ఎవరికైనా అనుమానం ఉంటే లెక్కపెట్టుకోవాలని సీఎం సవాల్ విసిరారు. దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ఇచ్చారని, అసైన్డ్ పట్టాల రూపం లో గిరిజనులకు భూములు పంచారన్నారు. తమ ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవని అందుకే నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి గొప్పస్థానాలకు ఎదగాలన్నారు.

  • సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హంగ్  వచ్చిన ప్రతిచోటా  కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్. సీపీఐ అలయెన్స్‌లో ఉన్నాయని  సింగరేణిలో కొన్నిచోట్ల  బీజేపీ, సీపీఐ సైతం  కలిసి పనిచేస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడిని అరికట్టడానికే కొన్నిచోట్ల సీపీఐకి మద్ధతిచ్చామన్నారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. 

     

     

     

Family

  • ఏడుపదుల వయసుకు చేరుకోగానే ఎంతటి ఫిట్‌నెస్‌ కోచ్‌లు అయినా లేదా క్రమం తప్రకుండా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహ ఉన్నా కూడా..యువకుల మాదిరిగా చురుకుగా ఫిట్‌గా ఉండటం కష్టమే. కానీ ఈ బామ్మ తొమ్మిది పదుల వయసులో యువతే విస్తుపోయాలే యాక్టివ్‌గా ఉండటమే కాదు..ఫోర్స్‌తో కూడిన వ్యాయామాలు చేస్తూ భళా అనిపించుకుంటోంది. ఎవరా ఆ సూపర్‌ బామ్మ అంటే..

    ఆ బామ్మే ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల  జిల్. ఆమె కఠినమైన క్రమశిక్షణ కలిగిన జీవనశైలికి పేరుగాంచింది. ఆమె రోజుకు సగటున 12 వేల అడుగులు నడుస్తుందట. అంతేగాదు తరుచుగా సిడ్నీ హార్బర్ వంతెన మీదుగా ఒపెరా హౌస్‌కు వెళ్లే ఐకానిక్‌ ట్రెక్‌కు వెళ్తుందట. ఇది నిటారుగా ఉన్న కొండలు, అంతులేని మెట్లకు ప్రసిద్ధి చెందిన మార్గం. 

    అలాగే వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, బలాన్ని కాపాడుకునేలా యోగ, పైలేట్స్‌ వంటి సెషన్‌లు తప్పనిసరిగా చేస్తానని చెబుతోంది. అలాగే అందరితోనూ సన్నిహితంగా ఉండేలా టచ్‌లో ఉంటానని, అది శారీరక వ్యాయామం వలే మనసుకోక ఆహ్లాదకరమైన వ్యాయామం అని అంటోంది. అంతేగాదు ఈ జిల్‌ బామ్మ దీర్ఘాయువు కోసం చురుగ్గా ఉండటమే మంచిదనేది తన అభిప్రాయామని అంటోంది. అందుకు సంబంధించిన వీడియోని ఫిట్‌నెస్ కోచ్ థెరిసా మోలోనీ షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

    కాగా, శారీరక వ్యాయామం వలే దీర్ఘాయవు కోసం సామాజిక అనుసంధానం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నాయి అధ్యయనాలు. పైగా చురుకైన జీవనశైలి మంచి మానసిక ఆనందాన్ని, శారీరక శ్రమను స్థిరంగా ఉంచుతుందని పలు పరిశోధనల్లో తేలింది కూడా. నిజంగా ఈ బామ్మ సూపరో సూపర్‌ కదూ..!.

     

    (చదవండి: ఏడేళ్ల చిచ్చర పిడుగు..సముద్రాన్ని ఈదేసింది..!)

     

  • ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్‌ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్‌ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..

    అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్‌వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది. 

    ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్‌ఘాన్‌ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్  రిమ్లి, హజారికా ఫుకాన్‌ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్‌లో నివసిస్తుంది. 

    ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్‌ని అభినందించారు. అంతేగాదు  ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే. 

     

    (చదవండి: డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..)
     

  • కంటతడిపై ‘కన్నే’యండి!
    కొందరిలో కళ్లనిండా నీళ్లు ఉండటం... కళ్లు చెమ్మగిల్లినట్టుగా ఉండటం కనిపిస్తుండేదే. ఇందుకు చాలా అంశాలు కారణమవుతాయి. ఇలా కళ్లలో నీరు ఉన్నట్లు కనిపిస్తుండటం, చెమ్మగిల్లుతూ ఉండటానికికారణాలేమిటో తెలుసుకుందాం.

    కారణాలు...
    కళ్లలో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్‌ లేదా ఇన్ఫెక్షన్‌తో కళ్లుమండుతూ ఉన్నప్పుడు 

    దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి అంశాలతో అలర్జీ వల్ల 

    కళ్లకలక (కంజంక్టివైటిస్‌) వంటి ఇన్ఫెక్షన్లతో 

    కళ్లలో నీళ్లూరేందుకు ఉండే డక్ట్స్‌ మూసుకుపోవడంతో కన్నీళ్లు బలవంతంగా రావడానికి ప్రయత్నించడం 

    ‘డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ ఉన్నవాళ్లలో. ఇక్కడ ఒక సందేహం కలగడం సాధారణం. అంటే డ్రై ఐస్‌ సిండ్రోమ్‌లో కళ్లు పొడిబారాలి కదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ నిజానికి ఈ సిండ్రోమ్‌లో కళ్లుకు ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. దీన్నే ‘డ్రై ఐస్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల కళ్లలో నీరు ఎక్కువగా ఊరుతుంది.

    నివారణ, చికిత్స...
    ∙చిన్నపిల్లల కళ్లల్లో ఇలా నీరూరుతున్నప్పుడు లేదా కళ్లలోకి దుమ్మువెళ్లినప్పుడు పాతకాలపు పెద్దవాళ్లు ఓ మెత్తటి టవల్‌ లేదా మెత్తటి గుడ్డను ఉండగా చేసి, దానిపై నోటితో గాలి ఊది దాన్ని కొద్దిగా వెచ్చబడేలా చేసి కంటిపై అద్దడం అన్నది కాస్తంత మధ్యవయస్కులకూ, పెద్దవాళ్లకు తెలిసిందే. 

    అలా కాస్తంత గోరువెచ్చని ఆవిరితో గుడ్డను ఉండగా చేసి కళ్లపై అద్దడం వల్ల మంచి రిలీఫ్‌ వస్తుంది 

    అలర్జీ వల్ల ఇలా జరిగినప్పుడు డాక్టర్‌ల సూచన మేరకు యాంటిహిస్టమైన్‌చుక్కల మందు వాడాలి. అలాగే ఇన్ఫెక్షన్‌ వల్ల ఇలా జరిగితే డాక్టర్లు యాంటీబయాటిక్‌ చుక్కల మందును సూచిస్తారు 

    మాటిమాటికీ కళ్లను తాకకుండా ఉండాలి ∙ఇంతకు మించి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కళ్ల డాక్టర్‌ను సంప్రదించాలి.

    ఉబ్బు కళ్లు...
    కొందరిలో ఉబ్బుకళ్లు కనిపిస్తుంటాయి. పొద్దున్నే నిద్రలేవగానే కొద్దిసేపటి వరకు ఉబ్బుకళ్లు కనిపించడం మామూలే. కానీ కొందరిలో ఇవి చాలాసేపు అలాగే ఉండి΄ోతాయి. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘పఫ్ఫీ ఐస్‌’ అంటుంటారు. సాధారణంగా చాలామందిలో ఇది తాత్కాలిక సమస్యే. కళ్లు బాగా అలసి΄ోవడం (ఫెటీగ్‌) వల్ల కూడా ఇలా జరగవచ్చు.

    కారణాలు...
    ∙రాత్రి ఎక్కువసేపు నిద్ర΄ోకుండా ఉండటం లేదా నిద్రలేమి కారణంగా ∙క్రితం రాత్రి ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం  కొందరిలో ఉప్పుకారాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత ∙ఇక చాలామందిలో ఇలా కళ్లు ఉబ్బినట్టుగా ఉండటం లేదా కళ్ల కింద చర్మం జారినట్టుగా ఉండటమన్నది వయసు పెరుగుతుండటం (ఏజింగ్‌) వల్ల జరగవచ్చు ∙మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలోనూ, రక్తంలో ్ర΄ోటీన్‌ తక్కువగా ఉండటం వల్ల, అలాగే రక్తహీనత (అనిమియా) సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లలోనూ ఇలా ఉబ్బుకళ్లు కనిపిస్తాయి.

    నివారణ / చికిత్స...

    మెత్తటి టవల్‌ లేదా మెత్తటి గుడ్డను చల్లటి నీటిలో ముంచి కళ్లపై అద్దడం (కోల్డ్‌ కంప్రెస్‌)

    ఆహారంలో ఉప్పుకారాల  మోతాదును తగ్గించడం  కంటినిండా గాఢంగా నిద్ర΄ోవడం.

    డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి సీనియర్‌ కంటి వైద్య నిపుణులు 

    ఈ సూచనలు పాటించండి

    కళ్ల జాగ్రత్తల్లో 20 – 20 – 20 అనేది ఓ మంచి సూచన. అంటే... ప్రతి 20 నిమిషాలకోసారి మనం దృష్టిని కేంద్రీకరించి ఉన్న అంశంపైనుంచి (కంప్యూటర్‌ / ఫోన్‌) దృష్టి మరల్చి 20 ఫీట్ల దూరంలో ఉన్న మరో వస్తువును 20 సెకన్ల పాటు చూస్తుండటం. ఏకాగ్రతతో ఏదైనా పనిచేస్తున్నా లేదా వృత్తిరీత్యా కంప్యూటర్‌ స్క్రీన్‌ గానీ, టీవీ స్క్రీన్‌నుగానీ తదేకంగా చూస్తున్నప్పుడు ఇలా చేయడం మంచిది. 

    టీవీ, కంప్యూటర్‌ లేదా మొబైల్‌ ఇలా ఏదైనప్పటికీ ఆ స్క్రీన్‌ టైమ్‌ను గణనీయంగా తగ్గించడం ∙తరచూ కన్రెప్పలను కదిలిస్తూ / మూస్తూ ఉండాలి. (అంటే బ్లింకింగ్‌ చేస్తూ ఉండాలి). ఫలితంగా కన్నీరు కంటిపైన సమంగా అలముకుని కంటిని పొడిబారకుండా కాపాడుతుంది 

    ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీ చాలాసేపు నడుస్తుంటే అక్కడి వాతావరణంలోని గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇలా చాలాసేపు ఏసీలో ఉన్నవారు కాసేపు మామూలు వాతావరణంలోనూ కిసేపు గడపాలి 

    కళ్లజోడు తాలూకు గ్లాసెస్‌ లేదా కాంటాక్ట్‌ లెన్సులను తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. పవర్‌ మారిందని తెలుసుకోగానే తగిన పవర్‌ ఉన్న అద్దాలను మార్చుకోవాలి. ఈ కొద్ది΄ాటి జాగ్రత్తల తర్వాత కూడా కంటికి సంబంధించిన అసౌకర్యం తగ్గక΄ోతే వెంటనే కంటి డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. 
    నిర్వహణ యాసీన్‌ 

    (చదవండి: 14 కిలోల బరువు తగ్గిన డాక్టర్‌..! ఓపిక, స్థిరత్వంతోనే సాధ్యం..)

  • మహాశివరాత్రికి సాత్వికంగా ఉండే వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి రహిత ఆహారాలు తీసుకుంటుంటారు. ఎలాగో మహాశివరాత్రి అంటేనే ఉపవాసం. అయితే చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం ఉంటారు. అయితే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంతలా కఠిన ఉపవాసాలు ఉండటం కష్టమే. ఒక పక్క అత్యంత పవిత్రమైన రోజు, మరోవైపు శరీరం సహకరించక అవస్థలు పడే వాళ్లు..ఇలాంటి సాత్విక వంటకాలను తీసుకుంటూ..హెల్దీగా ఉపవాసం చేయొచ్చని పెద్దలు చెబుతున్నారు. 

    అంతేగాదు పురాణాలు సైతం శరీరాన్ని కష్టించేలా భక్తి అవసరం లేదని, చక్కగా తింటూనే పూజలు చేయండనే చెబుతున్నారు. పైగా ముందు భుక్తి తర్వాతే భక్తి అన్నారు. అయినా పొట్టలో కాసింత ఆహారం ఉంటేనే ఆధ్యాత్మికతవైపు, భక్తివైపుకి మనసు మళ్లేది. కాబట్టి ఈ పుణ్యప్రదమైన శివరాత్రి రోజున హాయిగా చేసుకుని తిసే సాత్విక వంటకాలేంటంటే..

    మిల్లెట్లు, దగ్గరన నుంచి సుబుదాను, కుట్టు అట్ట, సింఘార పిండి, పాలు, పండ్లు, నట్స్‌ తదితరాలను హాయిగా తీసుకోవచ్చట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి ఎక్కువసేపు ఉపవాసం ఉండేలా, పూజలు చేసుకునేందుకు సౌకర్యవంతగాను ఉంటుంది కూడా. 

    ఆరోగ్యకరమైన సాత్విక వంటకాలు..

    సబుదాన ఖిచ్డి 
    కాస్త ఓదార్పునిచ్చి..ఆకలిని నియంత్రణలో ఉంచుకునే శక్తిని అందిస్తుంది. పైగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కూడా. ఎలా చేస్తారంటే..

    కావలసినవి..
    సబుదాన – 1 కప్పు
    ఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 మీడియం
    వేయించిన వేరుశనగలు (తురిమినవి) – ¼ కప్పు
    జీలకర్ర – ½ స్పూన్
    పచ్చిమిర్చి (తరిగినవి) – 1
    సెంధా నమక్ – రుచికి సరిపడా
    నెయ్యి – 1 టేబుల్ స్పూన్

    తయారీ..
    ముందుగా సబుదానా(సగ్గుబియ్యం) కడిగి 4–5 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి,బంగాళాదుంపలు బాగా వేయించాలి. అవి ఉడికాక నానబెట్టిన సబుదాన, వేరుశెనగ పొడి, ఉప్పు జల్లి, ఓ రెండు నిమిషాలు ఉడికించండి. అంతే సబుదాన ఖిచ్డి రెడీ..!.

    సామా కే చావల్ ఖిచ్డి
    సామా కే చావల్ అని పిలువబడే బార్న్యార్డ్ మిల్లెట్ ఉపవాస భోజనాన్ని తేలికగా, పోషకంగా చేస్తుంది. ఈ సాత్విక్ ఖిచ్డి సరళంగా అనిపిస్తుంది కానీ ఓదార్పునిస్తుంది, మహాశివరాత్రి సమయంలో ఎక్కువసేపు ఉపవాసం ఉండటానికి సరైనది.

    కావలసినవి 
    సమా కే చావల్ – 1 కప్పు
    ఉడికించిన బంగాళాదుంపలు (ముక్కలుగా చేసి) – 1 చిన్నవి
    జీలకర్ర – ½ స్పూన్
    అల్లం (తురిమినది) – 1 స్పూన్
    ఉప్పు: తగినంత
    నెయ్యి – 1 టేబుల్ స్పూన్
    నీళ్ళు – 2 కప్పులు

    తయారీ: ముందుగా మిల్లెట్‌లు బాగా కడగాలి. ఆ తర్వాత బాణిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయించాలి, ఆ తర్వాత అల్లం, బంగాళ దుంప, మిల్లెట్, నీరు కలపాలి. మిల్లెట్‌ మెత్తగా ఉడికిపోతే..రెడీ అయిపోయినట్లే.

    కుట్టు అట్ట చీలా
    కుట్టు అట్ట చీలా వ్రత భోజనాలకు వెచ్చదనం తోపాటు తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎలా చేస్తారంటే..

    కావల్సినవి..
    కుట్టు అట్ట – 1 కప్పు
    ఉడికించిన బంగాళాదుంప (గుజ్జు) – 1 చిన్నవి
    పచ్చిమిర్చి (ఐచ్ఛికం) – ½ స్పూన్
    ఉప్పు: తగినంత
    నీరు – ¾ కప్పు
    నెయ్యి – 1 స్పూన్

    తయారీ విధానం..
    కుట్టు అట్ట, బంగాళాదుంప, కారం, ఉప్పు, నీరు కలపండి.నునుపైన పిండిలా కలపాలి. వాటి చిన్నసైజు బజ్జీల్లా పాన్‌లో వేయించాలి. రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయిస్తే చాలు. పెరుగుతో వడ్డించి తింటే రుచి అదుర్స్‌.

    వ్రత్ వాలే ఆలూ
    సంక్లిష్టమైన మసాలా దినుసులు లేకుండా సింపుల్‌గా చేసే వ్రత్ వాలే ఆలూ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.

    కావలసినవి :
    ఉడికించిన బంగాళాదుంపలు – 2 మీడియం
    జీలకర్ర – ½ స్పూన్
    పచ్చిమిర్చి – 1
    ఉప్పు: తగినంత
    నల్ల మిరియాలు – ¼ స్పూన్
    నెయ్యి – 1 టేబుల్ స్పూన్
    తయారీ: నెయ్యి వేడిచేసి జీలకర్ర, తరిగిన బంగాళ దుంపలు బాగా వేయించి. దించేముందు కారం, ఉప్పు, నల్లమిరియాలు, చల్లుకోవాలి. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.

    లౌకి ఖీర్
    లౌకి ఖీర్ మహాశివరాత్రి ఉపవాసానికి తీపి వంటకం ఇచ్చే శక్తి అమోఘమైంది. మరి ఇదేలా చేస్తారంటే..
    ఇక్కడ లౌకి అంటే అనపకాయ అని అర్థం.

    కావలసినవి:
    తురిమిన లౌకి(అనపకాయ ముక్కలు)- 1 కప్పు
    పాలు - 2 కప్పులు
    బెల్లం - 3 టేబుల్ స్పూన్లు
    ఏలకుల పొడి - ¼ స్పూన్
    తరిగిన గింజలు - 1 టేబుల్ స్పూన్

    తయారీ..
    తురిమిన లౌకిని పాలలో తక్కువ మంట మీద ఉడికించాలి.మెత్తగా, కొద్దిగా చిక్కగా అయ్యే వరకు మరిగించండి.బెల్లం వేసి బాగా కలపండి. ఏలకులు పొడి వేసి సర్వ్‌ చేయండి. ఇది మహాశివరాత్రి ఉపవాసానికి బెస్ట్‌ డెజర్జ్‌.

    (చదవండి: పరమ దయాళువు ఆదిభిక్షువుని అర్చించుకుందాం ఇలా..!)

     

  • ఢిల్లీలోని తీహార్‌ జైలులో మసూద్‌ అజర్, ఒమర్‌ షేక్, అహ్మద్‌ జర్గర్‌లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్‌ అన్సారీ, ఆసిఫ్‌ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్‌ అధినేత పార్థ్‌ ప్రతిమ్‌ రాయ్‌ బర్మన్‌ సహా పలువురిని కిడ్నాప్‌ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్‌ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్‌ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 2001లో ఆసిఫ్‌ రజా ఎన్‌కౌంటర్‌ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్‌... ఐఎంగా ఎలా మారిందంటే..!

    కోల్‌కతాకు చెందిన కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్‌ పెద్ద కొడుకు ఆసిఫ్‌ రజా ఖాన్‌ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్‌ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్‌ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్‌ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్‌ సలీం కూడా హాజరయ్యాడు. 

    ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్‌గఢ్‌ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్‌ సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ (2007 నాటి హైదరాబాద్‌ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్‌ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్‌ సలీంతో సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్‌ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్‌ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్‌ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్‌ మెయిల్‌ ఐడీని ఆసిఫ్‌ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్‌ పంపిన ఆసిఫ్‌– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్‌ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్‌... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 

    ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్‌ చేరిన మసూద్‌ అజర్‌ జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్‌ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్‌ గ్యాంగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. 2001 అక్టోబర్‌ 29న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్‌ రజా ఖాన్‌ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్‌ పరేఖ్, పరేష్‌ షా కిడ్నాప్‌ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్‌ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. 

    అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్‌ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్‌ రజా ఖాన్‌ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్‌ కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్‌ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్‌ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్‌ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్‌ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్‌ ఔట్‌ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్‌ రజా ఖాన్‌ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్‌ మరణించాడు.

    ఆసిఫ్‌ మృతితో అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్‌ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్‌ కోల్‌కతాలోని అమెరికన్‌ కాన్సులేట్‌ సమీపంలోని యునైటెడ్‌ స్టేట్స్‌ గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌పై (యూఎస్‌ఐఎస్‌) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్‌ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అమీర్‌ రజా ఖాన్‌ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్‌ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్‌ రజా ఖాన్‌ 2003లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. 

    అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!
    2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్‌ ముజాహిదీన్‌ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌–లుంబినీ పార్క్‌ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్‌–4 ‘అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!’ వచ్చేవారం.

  • ‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్‌కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి  కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్‌! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్‌ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని. 

    అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్‌ వేస్ట్‌ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్‌’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.

    ‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్‌ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్‌లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.

    ‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్‌ ఆల్‌!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను. 

    మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్‌పెక్ట్‌ చేయరు కూడా’’  సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్‌ క్వీన్‌ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్‌ మీ వాట్స్‌ ద మ్యాటర్‌?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్‌లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.

    ‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్‌లో చార్జ్‌ లేదని గూగుల్‌లో ఏదో సెర్చ్‌ చేయడానికి అని నాన్న మొబైల్‌ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్‌కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్‌ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్‌ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్‌డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్‌ చేస్తున్నావు. యాక్చువల్‌గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్‌ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.

    ‘‘నాన్న మొబైల్‌లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్‌ వేసుకుని, స్టైల్‌గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా వర్క్‌ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్‌ ఒకరిని లవ్‌ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్‌ చేసింది. ఆమె యాంకరింగ్‌ స్టైల్‌ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు. 

    దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్‌ పంపింది మానసగంగ, ఐ మీన్‌ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్‌ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్‌లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్‌లను కూడా నాన్న డిలీట్‌ చేయలేదు. నేను అదంతా స్క్రీన్‌ షాట్‌ తీసి నా మొబైల్‌కు ఫార్వర్డ్‌ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్‌ ఇన్‌ ఎ షాక్‌. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్‌ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.

    ‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట  మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్‌ల స్క్రీన్‌ షాట్‌ నీ మొబైల్‌కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్‌ బేసిన్‌ వైపు వెళ్ళింది.
    ∙∙ 
    సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై   లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్‌ట్రా ఇ¯Œ కమ్‌ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై,  కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు. 

    సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.

    సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్‌ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.

    ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్‌ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!
    ∙∙ 
    కూతురు తన మొబైల్‌కు పంపిన అన్ని మెసేజ్‌లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జాబ్‌ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్‌ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్‌’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది.

     అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్‌ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్‌లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్‌లో, వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్‌ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు. 

    ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్‌కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.

    ‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్‌ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్‌ మేట్‌ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి. 

    అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్‌లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్‌ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్‌ ఫీల్‌ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్‌ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్‌గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్‌ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.

    ‘‘నాన్నా, మీకు ఒక సర్‌ప్రైజ్‌. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్‌కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్‌ షెల్ఫ్‌ క్లీన్‌ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్‌ చేశాడు.

    కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్‌టాప్‌లో ఏదో వెబ్‌ సిరీస్‌ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్‌ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్‌లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.
    పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.
    ∙∙ 
    ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్‌కు షేర్‌ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును  నింపింది.మొన్న మొన్ననే  తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ!  ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్‌ కూడా చెక్‌ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్‌ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది.
     

Yadadri

  • తండ్ర

    బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ

    చౌటుప్పల్‌ : తండ్రి, కుమార్తె బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్లముందే కుమార్తె మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డగోని రమేష్‌, తన కుమార్తె రిహాన్సిక(9)తో కలిసి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. లింగోజిగూడెం గ్రామ శివారులోకి రాగానే హైదరాబాద్‌ నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమేష్‌, రిహాన్సిక రోడ్డుపై పడిపోయారు. లారీ రిహాన్సిక తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రమేష్‌కు గాయాలు కాగా.. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

    అదృశ్యమై.. చెరువులో శవమై తేలి..

    చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని చెరువులో శనివారం వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రాములమ్మ(81)కు మతిస్థిమితం సరిగా లేదు. గతేడాది డిసెంబర్‌ 19 నుంచి ఆమె కనిపించడంలేదు. డిసెంబర్‌ 22న ఆమె కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని చెరువులో శనివారం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రాములమ్మ కుటుంబ సభ్యులు వచ్చి దుస్తులు, చెప్పులు చూసి మృతదేహం ఆమెదేనని గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

    విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌

    ఇద్దరు యువకులు దుర్మరణం

    వలిగొండ : బైక్‌పై వెళ్తున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన కళ్లెం పరమేష్‌(23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు సుంకిశాలకు చెందిన పోలేపెల్లి మనోజ్‌ (18) కలిసి బైక్‌పై పని నిమిత్తం రెడ్లరేపాక గ్రామ పరిధిలోని మర్లపాడుకు వెళ్లి వస్తుండగా.. సుంకిశాలలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యుగంధర్‌ తెలిపారు.

  • పాలకవ

    ఆలేరు మున్సిపాలిటీలో 12 మంది తొలిసారి విజయం

    ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులందరూ కొత్త వారే. మొత్తం 12 వార్డుల్లో అందరూ మొదటిసారి విజయం సాధించిన వారే. కొందరు తొలి ప్రయత్నంలో, మరికొందరు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. ఇందులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు.

    చండూరులో పదికి పది కొత్త ముఖాలే..

    చండూరు : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం మొత్తం కొత్త వారితోనే కొలువుతీరనుంది. మున్సిపాలిటీలోని పది వార్డులకు గాను అన్నింట్లో కొత్తవారే ఎన్నికయ్యారు. ఈ పది మందిలో ముగ్గురు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా ఏడుగురు ఈ ఎన్నికల్లోనే మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పది వార్డుల్లో 18 మంది పోటీ చేయగా.. అందులో 11 మంది ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే తెర మీదకు రావడం విశేషం.

    27 ఏళ్లకే కౌన్సిలర్‌గా విజయం

    చండూరు: చండూరు మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి 27 ఏళ్ల యువకుడు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. 5వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో కొన్రెడ్డి మధు బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచాడు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మధు కాంగ్రెస్‌ ప్రభంజనంలో కూడా తన సమీప ప్రత్యర్థిపై 358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.

    తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు..

    కుమారుడు కౌన్సిలర్‌

    చండూరు : తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మున్సిపాలిటీలోనే కుమారుడు కౌన్సిలర్‌గా గెలుపొందాడు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి 30 ఏళ్ల బుషిపాక వాసు 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వాసు తల్లి ఎల్లమ్మ చండూరు మున్సిపాలిటీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. వాసుకు ఐదేళ్ల వయస్సులో అతడి తండ్రి భిక్షమయ్య మృతిచెందగా.. అప్పట్లో చండూరు గ్రామ పంచాయతీలో, ఇప్పుడు మున్సిపాలిటీలో అతడి తల్లి ఎల్లమ్మ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ వస్తోంది. వాసు డిగ్రీ చదువు మధ్యలోనే ఆపి చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో అనూహ్యంగా కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం సాధించాడు.

  • రాష్ట్రంలో ఉచిత విద్యనందించాలి

    మునగాల : కేరళలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ ఉచిత విద్యను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. శనివారం మునగాల మండలంలోని జగన్నాధపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారకసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునగాల చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమని, ఆనాటి మునగాల పరగణాలో కలకోవ, జగన్నాధపురం గ్రామాలకు చెందిన ఎందరో యోధులు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అమరులయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని, కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేయాలని సూచించారు. పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన స్మారక సభలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, ములకపల్లి రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్‌ సైదా, జూలకంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

  • ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం

    మోటకొండూర్‌: మైనర్‌ బాలిక, యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రేమికుల దినోత్సవం రోజునే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్‌ మండలం తేర్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేర్యాల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్‌(21) ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్‌ అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను ప్రేమించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్‌, బాలిక ఈ నెల 6న నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్‌ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

    తల్లిదండ్రులు మందలించారని ఈ నెల 6న పురుగుల మందు తాగిన ప్రేమ జంట

    ఆస్పత్రిలో చికిత్స పొందుతూ

    యువకుడు మృతి

    మైనర్‌ బాలిక పరిస్థితి విషమం

  • మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో బీసీలకు 70 శాతం ఇవ్వాలి

    భువనగిరిటౌన్‌ : మున్సిపల్‌ చైర్మన్‌ సీట్లలో బీసీలకు 70 శాతం ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవులు మూడు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలు 70 శాతం మంది పోటీ చేస్తే 60 శాతం మంది విజయం సాధించారని, ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అన్నారు. జనరల్‌ స్థానాలంటే రెడ్డి, రావులది కాదని, అందులో అందరికీ అవకాశం ఉంటుందన్నారు. బీసీలు అగ్రకులాల మాటలు నమ్మవద్దని, ‘మనమెంతో మనకు అంత’ అనే నినాదంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

    గుర్తుతెలియని వ్యక్తి

    మృతదేహం లభ్యం

    భువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ చెరువు వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పెట్రోలింగ్‌ పోలీసులు గుర్తించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, భిక్షగాడిలా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.

  • నేనున్నాను.. మీరు బాధపడొద్దు

    మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్యే ఐలయ్య భరోసా

    ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో ఓటమిపాలైన కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. శనివారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డితో కలిసి 1, 3, 4, 5, 8 వార్డుల అభ్యర్థులు చింతలఫణి సునీతాశ్రీనివాస్‌రెడ్డి, సందిల సురేష్‌, గుత్త శమంతారెడ్డి, చింతకింది మురళి, పాము అనితల నివాసాలకు ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. వారు వెళ్లగానే మహిళా అభ్యర్థులు బోరున విలపించారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడొద్దని తాను, పార్టీ అండగా ఉంటామని ఎమ్మెల్యే ఓదార్చారు. ఓడిపోయిన అభ్యర్థులు ఆయా వార్డులకు ఇన్‌ఛార్జిలుగా ఉంటారని, వార్డు ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి ద్వారా అందించేలా బాధ్యతలు అప్పగిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఐదుగురు అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను సూచనప్రాయంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానన్నారు. ఆయన వెంట నాయకులు ఇజాజ్‌, ముదిగొండ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.