Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు విషెస్ తెలిపారు.

    ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో మాట్లాడారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు.ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. 

    మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారు

    ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు

  • సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ గెలవడం గొప్ప విషయం అని.. ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్‌ జనం గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్‌కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్‌ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని.. ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్‌ అన్నారు.

    ‘‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు ఓటర్లు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. ఒకనాడు రెండు సీట్లతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కోట్ల రూపాయలు వెదజల్లారు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి లక్షలిస్తామన్నారు. మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం ఆల్రెడీ. ఇండిపెండెంట్స్ గా గెల్చినవారు కూడా మాకు మద్దతిస్తారు.ఎంఐఎం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురేసిన పార్టీ బీజేపీ’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

    ‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

    ‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

     

     

  • హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీదే పైచేయిగా నిలిచింది. బీఆర్‌ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది. పలు స్థానాల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM) పార్టీ సత్తా చాటింది. మధ్యాహ్నం 2:00 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. ఎంఐఎం పార్టీ వివిధ జిల్లాల్లో పలు వార్డులను కైవసం చేసుకుంది. కాగజ్‌నగర్‌లో వార్డు నంబర్ 3లో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ ముబీన్ విజయం సాధించారు.

    సంగారెడ్డిలో వార్డు నంబర్ 5 నుంచి ఎంఐఎం అభ్యర్థి ఐజాజ్ గెలుపొందగా.. జహీరాబాద్‌లో ఎంఐఎం రెండు స్థానాలను గెలుచుకుంది. జగిత్యాలలో ఎంఐఎం 31, 34 వార్డులను గెలుచుకుంది. మరో రెండు వార్డుల్లో ముందంజలో ఉంది. బాన్సువాడలొ వార్డు నంబర్ 17 నుండి ఎంఐఎం తరపున ఫరా నాజ్ విజయం సాధించారు. వికారాబాద్‌లో వార్డు నంబర్ 4లో ఎంఐఎం అభ్యర్థి షబ్బీర్ హుస్సేన్ గెలిచారు.

    నిర్మల్‌లో వార్డు నంబర్ 29 నుండి ఎంఐఎం అభ్యర్థి ముజాహిద్ అలీ విజయం సాధించారు. నారాయణపేలో వార్డు నంబర్ 23లో ఎంఐఎం అభ్యర్థి మొహమ్మద్ తఖీ చంద్ గెలుపొందారు. కొడంగల్‌లో వార్డు నంబర్ 9 నుంచి ఎంఐఎం అభ్యర్థిని సనా ఆఫ్రీన్ విజయం సాధించారు. కోహీర్‌లో వార్డు నంబర్ 8లో ఎంఐఎం తరపున రఫీ విజయం సాధించారు. భైంసాలో ఎంఐఎం ఇప్పటివరకు 8 వార్డులను గెలుచుకుంది. (స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ రెబల్స్ కూడా 6 వార్డుల్లో గెలిచారు).

    బోధన్‌లో
    ఎంఐఎం తన ఆధిపత్యాన్ని చాటుతూ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుంది. రఫీక్((వార్డు-3),  సమీర్ (వార్డు 5), అఖీల్ (వార్డు-7), రఫీ (వార్డు-8), అలీమ్ (వార్డు-12), మీర్ ఇలియాస్ అలీ (వార్డు-18), అన్సారీ కామ్ (వార్డు-27), ముజాహిద్ బాబర్ (వార్డు-28), వలీ (వార్డు-30), అల్తాఫ్ (వార్డు-31), వసీం సుల్తానా (వార్డు-32), ఖైఖషా కౌసర్ (వార్డు- 38) గెలుపొందారు.

    నల్గొండలో
    నల్గొండలో ఏఐఎంఐఎం రెండు స్థానాల్లో విజయం సాధించింది. వార్డు నంబర్ 46 నుంచి పట్టణ అధ్యక్షుడు రఫీ ఉద్దీన్ గెలుపొందగా, వార్డు నంబర్ 29 నుంచి నదీమ్ విజయం సాధించారు.

    మహబూబ్ నగర్‌లో వార్డ్ నెం.14 నుండి , ఇమ్రాన్ షరీఫ్ గెలిచారు. గద్వాల్‌లో వార్డు నెం. 15 నుంచి మొహమ్మద్ ఇలియాస్‌ గెలిచారు.

Family

  • పుల్కా కావచ్చు, చపాతీ కావచ్చు...ప్రస్తుతం  ప్రతి రోజూ రోటీలను తినడం చాలా మంది ఆరోగ్యార్ధులకు అలవాటుగా మారింది. నిజానికి సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్ల స్థానంలో రోటీలు ఆరోగ్యకర ప్రత్యామ్నాయంగా స్థిరపడుతున్న పరిస్థితుల్లో గోధుమలతో పాటు మరికొన్ని కూడా రోటీలు, దోసెల తయారీలో వినియోగిస్తున్నారు. అలాంటి వాటిలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను కూడా చేరుస్తున్నారు. సహజ ఆహారాన్ని ప్రోత్సహించే వైద్యులు కల్పిస్తున్న అవగాహన కూడా వీటి వినియోగాన్ని పెంచుతోంది.

    అయితే ఇప్పుడున్న అవగాహన ప్రకారం.. ఇవి కేవలం కేలరీలు లేదా ఫైబర్‌ గురించి మాత్రమే అనుకోకూడదు. నిజానికి శతాబ్దాల క్రితమే ఇవి మనకు ఆహారంలో భాగంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ముందు, వాతావరణానికి తగ్గట్టుగాస్థానికంగా  భూమి ఏమి అందించింది? అనేదానిపైనా,  శరీరానికి ఏమి అవసరమో దానిపైనా మాత్రమే ఆహారపు అలవాట్లు ఆధారపడి ఉండేవి. ఆ తర్వాత తర్వాత వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా  ఏడాది పొడవునా ఆహారం అందుబాటులోకి రావడంతో... కాలానుగుణంగా తినడం అనే అలవాటు తగ్గిపోయింది.

    మరోవైపు గోధుమలు  చిరుధాన్యాలు (బజ్రా, రాగి, జొన్న, మక్కీ) వంటి తృణ ధాన్యాలు పోషకాలతో నిండి ఉంటాయి పరిశోధనల ప్రకారం ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు తదితర ఆరోగ్యకరమైన సమ్మేళనాలను అందిస్తాయి, ఇవి మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని వినియోగించడంలో సీజన్‌లను దృష్టిలో పెట్టుకుంటేనే సంపూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయని సంప్రదాయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాలానుగుణ మార్పులకు అనుగుణంగా ఈ ధాన్యాలను తీసుకుంటనే శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు.

    మన శరీరాలు వేడి సీజన్‌లో లేదా చలి కాలంలో ఆహారాన్ని వేర్వేరుగా జీర్ణం చేసుకుంటాయని ఆయుర్వేదం సహా సంప్రదాయ వైవ్య విధానాలు చెబుతున్నాయి. వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా...ఇలా జీర్ణక్రియ మార్పు చేర్పులతో  శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ద్వారా, వాతావరణానికి  సరిపోయే ధాన్యాలను మనం ఎంచుకోవచ్చు.

    గోధుమలు...
    మనం నిత్యం ఇష్టపడేవి గోధుమలతో చేసిన ఆహారం.  ఇది వెచ్చదనం జీర్ణ ప్రక్రియలను సమతుల్యం చేస్తుంది. వసంతకాలంలో లేదా శీతాకాలం ప్రారంభంలో జీర్ణక్రియ నెమ్మదించినప్పుడు, గోధుమ రోటిలు కడుపుపై భారం పడకుండా శక్తిని, ఫైబర్, బి–విటమిన్లు  సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను అందిస్తాయి, బరువు పెంచకుండా  రోజువారీ కార్యకలాపాలను కొనసాగించేలా చేస్తాయి.

    సజ్జలు...
    సజ్జలు ఆరోగ్యకరమైన ధాన్యరకమే కానీ దీనిది వేడెక్కించే స్వభావం  దీని అధిక పోషక సాంద్రత, ఇనుము, మెగ్నీషియం, ప్రోటీన్‌  ఫైబర్‌ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.  వెచ్చదనం  శక్తిని అందిస్తాయి కాబట్టి చల్లని వాతావరణంలోనే వీటిని వినియోగిస్తారు.

    రాగులు
    ప్రస్తుతం ఇడ్లీల నుంచి రోటీలు, దోసెల దాకా చేసేందుకు వాడే రాగులు (ఫింగర్‌ మిల్లెట్‌) కాల్షియం  సూక్ష్మపోషకాలతో సమృద్ధికర ఆహారం. వేడి సీజన్‌లో ఉదరంలో తేలికగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది వేసవి సీజన్లలో జీర్ణ మందగమనాన్ని నివారిస్తుంది. అనేక దక్షిణ భారత ప్రాంతాలు రాగులను వేసవిలో ప్రధాన ఆహారంగా చేయడానికి కారణం దాని చల్లబరిచే గుణమే.

    జొన్నలు..
    మక్కీ లేదా మొక్కజోన్న,  జొన్న (జోవర్‌) రోటీలు తక్కువ గ్లైసెమిక్‌ ప్రభావాలు చూపిస్తూ  బలమైన ఫైబర్‌ లను కలిగి ఉంటాయి. అవి బలమైన జీర్ణక్రియ, అధిక శ్రమ కలిగిన జీవనశైలులకు సరిపోతాయి, కానీ వాటిని కొవ్వులు లేదా కూరగాయలతో జాగ్రత్తగా జతచేయడం అవసరం. వేసవిలో చల్లదనాన్ని అందించే జొన్నలు.. శీతాకాలంలో కూడా ఉపయుక్తమైనవే.

    సంవత్సరమంతా ఒకే ధాన్యాన్ని తినడానికి బదులుగా, రుతువులకు అనుగుణంగా ధాన్యాలను ఆరగించడం శరీరానికి మంచిదని సంప్రదాయ వైద్య విజ్ఞానం స్పష్టం చేస్తోంది.

  • కంటెంట్‌ క్రియేటర్‌, కమెడియన్‌, బాలీవుడ్‌ నటి ఐశ్వర్య మోహన్‌ రాజ్‌ స్లిమ్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్‌లాస్‌ డ్రగ్‌ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్‌ నటి సోహ అలీఖాన్‌ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..

    అయితే కమెడియన్‌ ఐశ్వర్య మోహన్‌ రాజ్‌ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్‌ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్‌ తన తాజా పాడ్‌కాస్ట్‌లో ఎండోక్రినాలజీ అండ్‌ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్‌, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్‌తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. 

    వాళ్లంతా ఏచెబుతున్నారంటే..
    ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. 

     

    బాడీమాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్‌లాస్‌ డ్రగ్స్‌ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. 

    ఎవరికి మంచిది కాదంటే..

    • థైరాయిడ్‌ కేన్సర్‌ చరితర ఉన్న వ్యక్తులు

    • ప్యాంక్రియాటైటిస్ చరిత్ర

    • జీర్ణశయాంతర సమస్యలు

    • మధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు 

    తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..!)

     

  • అమ్మాయిల క్రికెట్‌లో ఇప్పుడు ఆమె అతి పెద్ద అద్భుతం...వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానం...ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అగ్రస్థానం... అంతర్జాతీయ టి20ల్లో రెండో స్థానం...అన్నింటికి మించి తొలిసారి భారత జట్టుకు ప్రపంచ కప్‌ అందించడంలో కీలక పాత్ర...రెండేళ్ల వ్యవధిలో కెప్టెన్‌గా సాధించిన రెండు ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టైటిల్స్‌ దీనికి అదనం. ఈ అన్ని ఘనతలూ సాధించిన ఒకే ఒక స్టార్‌ ప్లేయర్‌ ఎవరంటే నిస్సందేహంగా స్మృతి మంధాన పేరు చెప్పవచ్చు.  

    ఒకప్పుడు మహిళల క్రికెట్‌ మాత్రమే కాదు...మహిళా ప్లేయర్లు సౌందర్య సాధనాలకు తప్ప మరో ఉత్పత్తికి ప్రచారం చేస్తే చూసేవారెవరు, కొనేవారెవరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్మృతి మంధాన క్రెడిట్‌ కార్డులు కొనమని చెప్పినా.... ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోమన్నా...ఇంజిన్‌ ఆయిల్‌ అమ్మినా, ఎనర్జీ డ్రింక్‌లు తాగమని చెప్పినా జనం వింటున్నారు. ఆట ప్లస్‌ అందం కలగలిసిన ప్రచారకర్తగా అమాంతం స్థాయిని పెంచుకున్న స్మృతి బ్రాండింగ్‌ హవా ఇప్పుడు నడుస్తోంది....

    స్మృతి మంధాన బ్రాండింగ్‌ విలువ ఇప్పుడు భారీగా పెరిగినా... ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. దశాబ్ద కాలానికి పైగా నిలకడైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కృషి దీని వెనక ఉంది. వరుసగా పలు రికార్డులు సృష్టిస్తూ అంచెలంచెలుగా ఆమె పెద్ద స్థాయిని అందుకుంది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఆమె కెరీర్‌ ఆరంభం నుంచే జోరుగా సాగింది.

    జట్టులో జూనియర్‌గానే ఉన్నా... 
    ప్రదర్శనపరంగా అందరికంటే అగ్రభాగాన నిలుస్తూ తనదైన ముద్ర వేసింది. మిథాలీ రాజ్‌ తర్వాత భారత నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఆమె అన్ని ఘనతలు సాధిస్తూ వచ్చింది. ఈ పాపులారిటీ కారణంగానే  మహారాష్ట్రలో తన సొంత పట్టణం సాంగ్లీలో ఎస్‌ఎం 18 పేరుతో స్మృతి ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం ఆమెలోని వ్యాపార కోణాన్ని చూపించింది.

    అన్ని వర్గాలు మెచ్చేలా...
    ఒక ప్లేయర్‌లో ప్రతిభను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వారు ఎంత పెద్ద స్థాయికి చేరవచ్చో అంచనా వేయడంలోనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల విజయం దాగి ఉంటుంది. స్మృతి మంధాన విషయంలో బేస్‌లైన్‌ వెంచర్స్‌ అనే మేనేజ్‌మెంట్‌ కంపెనీ చూసిన భవిష్యత్తు ఆమె బ్రాండింగ్‌ స్థాయిని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఆమెకు బ్రాండింగ్‌ అవకాశాలు తెచ్చి పెట్టాయి. 

    ‘హెల్త్, ఇన్సూరెన్స్, క్రీడా సామగ్రి, మొబైల్స్, ఫైనాన్స్‌... ఇలా ఒకటేమిటి... ఎన్నో భిన్న రంగాల్లో దాదాపు 15 రకాల ఉత్పత్తులకు స్మృతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్‌లోనే కాకుండా మైదానం బయట కూడా ఆమె వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అన్ని వర్గాలకు చేరువైనట్లుగా, అందరి మనిషి అనేలా అనిపించడమే స్మృతి బ్రాండింగ్‌ రహస్యం’ అని బేస్‌ లైన్‌ వెంచర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తుహీన్‌ మిశ్రా తమ క్లయింట్‌ గురించి గర్వంగా చెబుతున్నాడు.

    ‘సరిగ్గా చెప్పిలంటే పురుషుల జట్టులో విరాట్‌ కోహ్లి స్థాయిని ఇప్పుడు ఆమె మహిళల క్రికెట్‌లో అనుభవిస్తోంది. అందుకే ప్రీమియం, లైఫ్‌ స్టయిల్‌ బ్రాండ్‌లు, ఎనర్జీ డ్రింక్‌ ప్రకటనలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి’ అని మరో మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రతినిధి రూపేశ్‌ కశ్యప్‌ వివరించాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రచారకర్తగా ప్రస్తుత పురుషుల క్రికెటర్లు ఎంతో మందికంటే స్మృతి చాలా ముందుంది.

    మెగా టోర్నీల్లో విజయంతో...
    మూడు నెలల వ్యవధిలో స్మృతి వన్డే వరల్డ్‌ కప్‌ విజయం, ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ విజయాల్లో భాగంగా ఉంది. ఇందులో డబ్ల్యూపీఎల్‌ టీమ్‌కు ఆమె కెప్టెన్‌ కూడా. పైగా ఫ్యాన్స్‌పరంగా చూస్తే అత్యంత ప్రజాదరణ ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ కలిసి సహజంగానే స్మృతి బ్రాండింగ్‌ విలువను అమాంతం పెంచేశాయి. బ్రాండింగ్‌ వ్యవహారాలను చూస్తే సంస్థ క్రోల్‌ అంచనా ప్రకారం... గత ఏడాది కాలంలో ఆమె విలువ దాదాపు 50 శాతం పెరగడం విశేషం. 

    2023లో తొలి డబ్ల్యూపీఎల్‌ సమయంలో స్మృతి బ్రాండింగ్‌ విలువ సుమారు 12 మిలియన్‌ డాలర్లు కాగా, 2024లో అది 17 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఇప్పుడు అది ఏకంగా 25 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 226 కోట్లు) వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ఆమె రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్జనపరంగా భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సుమారు రూ. 26 కోట్లు)తో పోలిస్తే స్మృతి (సుమారు రూ. 34 కోట్లు) చాలా ముందుంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోయర్స్‌ సంఖ్య ఏకంగా 15 మిలియన్లకు చేరడం విశేషం. 

    ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపైంది. ఆటపరంగా స్మృతి తన కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని ఆమె త్వరలో హర్మన్‌ తప్పుకుంటే భారత కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రాండింగ్‌ విషయంలో మరికొంత కాలం స్మృతి హవా కొనసాగడం ఖాయం. 

    ప్రస్తుతం స్మృతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇప్పటి వరకు పని చేసిన కొన్ని సంస్థలు చూస్తే... నైకీ, ఎస్‌బీఐ, హ్యుందాయ్‌ మోటార్స్, హావెల్స్, పీఎన్‌బీ మెట్‌లైఫ్, రెడ్‌బుల్, గల్ఫ్‌ ఆయిల్, హెర్బలైఫ్, రాంగ్లర్‌ జీన్స్, మాస్టర్‌ కార్డ్, నీమ్‌ ఆయు షాంపూ, నేచురల్స్,  గవి ఎడ్‌టెక్, మ్యాడ్‌ ర్యాబిట్‌ ఆడియో ప్రొడక్ట్స్, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, ప్లేయర్స్‌ పాట్‌ ఆన్‌లైన్‌ గేమ్, రెక్సోనా.
    మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది                                                      

    (చదవండి: అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!)

     

  • ఇటీవల కాలంలో సోషల్‌మీడియా పుణ్యమా అని సీనియర్‌ సిటిజన్లు కూడా కంటెంట్‌ క్రియేటర్లు, వ్లాగర్లుగా తమ టాలెంట్‌ని చూపిస్తున్నారు. ఒకరకంగా వారికి ఇదొక వ్యాపకం, కాలక్షేపం కూడా. అలానే ఇక్కడొ వృద్ధుడు కూడా తన హోమ్‌టూర్‌ వీడియోతో నెటిజన్ల మనసుని గెలుచుకున్నాడు. తొలిసారిగా చేసిన హోమ్‌టూర్‌తో ఆ తాతగారు..జీవితం విలువని తెలియజేశారు. 

    ఆ తాతగారే కర్తార్‌ సింగ్‌. వయసు కేవలం సంఖ్యే అని తన హోమ్‌ టూర్‌ వీడియోతో చెప్పకనే చెప్పాడు. ఆ వీడియోలో హర్యానాకు చెందిన 89 ఏళ్ల రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి తన బెంగూరురు నివాసాన్ని అద్భుతంగా చూపించాడు. తన వన్‌ బీహెచ్‌కే ఫ్లాట్‌ మొత్తం అద్భుతంగా చూపించారాయన. ఆ తాత గారు నారింజ కుర్తా, సాంప్రదాయ హిమచల్‌ టోపీని ధరించి..తన ఇంటికి ఆహ్వానించిన తీరు అదుర్స్‌. 

    ఇలా హోమ్‌ టూర్‌ వ్లాగ్‌ చేయడం ఇదే తొలిసారి అని చెబుతూ..తన ఇంటి గురించి పూసగుచ్చినట్లుగా వివరించారు. ఆ వీడియోలో తన పేరు కర్తార్ సింగ్ తోమర్. హర్యానా కేడర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని. తాను దాదాపు 89 ఏళ్ల వయసులో ఉన్నానని..ఇదే తన 1 BHK ఫ్లాట్‌, ఇక్కడే రోజంతా గడుపుతానని చెబుతాడు. 

    తన ఇల్లు తనకు స్వర్గం లాంటిదని చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో.  అక్కడ  ఉండే సోఫా-కమ్-బెడ్‌, డైనింగ్-కమ్-స్టడీ సెటప్ , క్లీన్‌గా ఉన్నా  వంటగది, బాత్రూంలో స్కిడ్-నిరోధక ఫ్లోరింగ్‌, తదితరాలన్నీ చూపిస్తాడు. అలాగే ఫ్యాన్‌తో పనిలేకుండా చక్కగా గాలి వచ్చే పెద్ద అద్దాల విండోని, బాల్కనీలో చక్కగా ఆస్వాదించే పచ్చదనం తదితరాలన్నీ చక్కగా వివరిస్తూ..చూపించారు వీడియోలో. 

    సింపుల్‌గా చెప్పాలంటే.. ఓ సీనియర్‌ సిటీజన్‌కి అనుకూలమైన ఇల్లు ఎలా ఉండాలో చెబుతున్నట్లుగా ఉంటుంది. అంతేగాదు పదవీవిరమణ తర్వాత హాయిగా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియజేస్తున్నట్లుగా ఉంది.  

     

    (చదవండి: విడదీయలేని బంధం మాది..! హ హ్హ హసిని క్యూట్‌ లవ్‌ స్టోరీ..)
     

  • ప్రేమించుకోవడం కంటే దాన్ని కడదాక నిలబెట్టుకోవడం గొప్ప. ప్రేమికులు అవ్వగలిగినంత ఈజీగా..మంచి ఆలుమగలు అనిపించుకోలేరు చాలామంది. వివాహ బంధంలో మనస్పర్థలనేవి కామన్‌..వాటిని అధిగమించి అన్నివేళలా ఒకరికొకరుగా సాగడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లు ప్రేమికులుగానూ..దపంతులుగానూ గెలిచి..అందరికీ ఆదర్శంగాన నిలుస్తుంటారు. ఈ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే నేపథ్యంలో ప్రేమను కడదాక ఉంచుకుని..విజయవంత చేసుకుని..అందరిచేత గొప్ప సెలబ్రిటీ జంటగా పిలిపించుకుంటున్న రితేష్‌ జెనీలియా క్యూట్‌ లవ్‌ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.

    రితేష్‌-జెనీలియాలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెళ్లై 14 ఏళ్లు అయినా..ఏ ఈవెంట్లో అయినా..జంటగా కనిపించి సందడి చేస్తుంటారు. దపంతులంటే వీళ్లలా ఉండాలి అనేలా ఎంతో అన్యోన్యంగా అందంగా కనిపించే ఈ జంట లివ్‌ఇన్‌రిలేషన్‌షిప్‌కి దూరం అంటే ఒప్పుకుంటారా..!?. ఔను..! ఇది నిజం. సినిమా షూటింగ్‌లు నిమిత్తమైన ఇరువురు వేరుగా.. స్నేహితులతోనే ఉండేవారట. 

    అంతేగాదు అందరిలా డేటింగ్‌ చేయకుండా హద్దుల్లో ఉంటూనే ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వివాహం చేసుకున్న ఈ జంట అన్యోన్య దాంపత్యం గురించి పలు విషయాలు సానియా మీర్జా పాడ్‌కాస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు కూడా. ​తాము ఎప్పుడు పెళ్లికి ముందు ఒకే గదిలో కలిసి ఉండటం వంటివి చేయలేదని అన్నారు. కానీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఎంత దూరంలో ఉన్నా..ఒకరి జీవితంలో ఒకరు ఉండేవాళ్లం. పెళ్లి అయ్యాకే..తాము కలిసి ఉన్నామని, అంతకుమునుపు షుటింగ్‌ సమయంలో కూడా స్నేహితులతోనే ఉండేవాళ్లమని అన్నారు. 

    అయినా ఇంతలా అన్యోన్యంగా ఎలా ఉండగలరు మీరు అని అందరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య చక్కటి అవగాహన..ప్రతీది అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే..బంధం స్ట్రాంగ్‌గా ఉంటుందంటున్నారు ఇద్దరు. మధ్యలో జెనీలియా కల్పించుకుంటూ..తనకంతా రితేషేనని. తన ప్రేమ, ఇష్టం, కన్నీళ్లు ఏదైనా రితేష్‌ అని చెబుతుంది. 

    తనకు కంటనీరు రాక మునుపే రితేష్‌కి అర్థమైపోతుంది. తనతో ఉన్నవాళ్లకు ఎవ్వరైనా..రితేష్‌ ఎంతలా కనెక్ట్‌ అవ్వుతాడో ఇట్టే అర్థమైపోతుంది. అతని కేరింగ్‌ కూడా అద్భుతమని అంటోంది జెనీలియా. తనెప్పుడు నాతోనే ఉన్న అనుభూతే కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే  24/7 అనోచ్చు అని నవ్వుతూ చెప్పింది జెనీలియా. అంతేగాదు ఆ పాడ్‌కాస్ట్ చివరలో మా ఆయన బంగారం అంటూ నవ్వేసింది ఈ అందాల హాసిని..

    (చదవండి: నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..!)

     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.

    ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్‌ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

Sports

  • చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్‌ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మోనాంక్‌ పటేల్‌ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ నెగ్గిన డచ్‌ టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది. 

    ఓపెనర్లు మోనాంక్‌ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జహాంగీర్‌ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్‌ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్‌ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. బాస్‌ డి లీడె 3 వికెట్లు తీశాడు. 

    అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్‌ డి లీడె (23), కెపె్టన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్మీత్‌ సింగ్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్‌ షాల్‌విక్‌ 3 వికెట్లు, మోసిన్‌ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నమీబియాతో అమెరికా తలపడుతుంది. 

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్‌లో యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నెదర్లాండ్స్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్‌మ్‌ రంజనే (48 నాటౌట్‌) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

    మిగతా యూఎస్‌ఏ ఆటగాళ్లలో మొనాంక్‌ పటేల్‌ (36), షయాన్‌ జహంగీర్‌ (20) కూడా రాణించారు. సంజయ్‌ కృష్ణమూర్తి (1), మిలింగ్‌ కుమార్‌ (3), హర్మీత్‌ సింగ్‌ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్‌ మొహిసిన్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డి లీడ్‌ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. లొగాన్‌ వాన్‌ బీక్‌ (4-0-28-1), కైల్‌ క్లెయిన్‌ (4-0-35-1), ఫ్రెడ్‌ క్లాసెన్‌ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్‌ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్‌ లెవిట్‌ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. మ్యాక్స్‌ ఒడౌడ్‌ 13 పరుగులు చేసి హర్మీత్‌ సింగ్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన​్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి.

     

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

    వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభ ఎడిషన్‌లోనే (2007) జింబాబ్వే ఆసీస్‌కు ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రపంచకప్‌ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది ‍కూడా తొలిసారి కాదు. 

    1983 వన్డే ప్రపంచకప్‌లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్‌ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్‌ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్‌కప్‌లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్‌కు షాకిచ్చింది.

    అయితే జింబాబ్వే ఆసీస్‌పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్‌ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్‌పై విజయం సాధించిన సందర్భంలో భారత్‌ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్‌పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్‌ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.

    ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ సెంటిమెంట్‌ రిపీటైతే, భారత్‌ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్‌ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్‌పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్‌ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

    ఈ సెంటిమెంట్‌కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్‌ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్‌ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్‌కు ఈ రెండు కలిస్తే భారత్‌కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. 

    పై ఫ్యాక్టర్స్‌ అన్నీ వర్కౌటై భారత్‌ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. 

    ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్‌ గెలవలేదు. ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్‌ అందోళన చెందుతున్నారు.  

  • 2026 టీ20 ప్రపంచకప్‌-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్‌లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్‌ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్‌కీపర్-బ్యాటర్‌ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్‌లో (ఒమన్‌) టేలర్‌ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో అతను మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 

    బ్యాటింగ్‌ సమయంలో టేలర్‌ కుడి కాలి హామ్‌స్ట్రింగ్‌తో ఇబ్బంది పడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్‌ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్‌ స్థానాన్ని బెన్‌ కర్రన్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.  

    చరిత్రాత్మక ఆటగాడు
    టేలర్‌కు ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్‌ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.

    కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్‌ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్‌ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్‌ (31) విఫలయత్నం చేశారు.
     

  • భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది.

    బ్యాంకాక్‌ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ వుమెన్‌-‘ఎ’ జట్టు నేపాల్‌ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్‌థాయ్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    రాణించిన అనుష్క శర్మ, తనూజ
    ఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్‌ (16)లతో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ తేజల్‌ హసబ్నిస్‌ (1) కూడా విఫలమైంది. కెప్టెన్‌ రాధా యాదవ్‌ (7), మిన్ను మణి (8), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.

    ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్‌ తనూజ కణ్వార్‌ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్‌ (4), సైమా ఠాకూర్‌ (3 నాటౌట్‌) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్‌ కేవలం 130 పరుగులే చేసింది.

    యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్‌, కెప్టెన్‌ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.

    ఇషా ఓజా అజేయ హాఫ్‌ సెంచరీ
    ఓపెనర్లలో కెప్టెన్‌ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తీర్థ సతీశ్‌ (10) నిరాశపరిచింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్‌కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్‌ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్‌ బాది అజేయంగా నిలిచింది.

    ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్‌ ఇషా ఓజాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. 

    చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్‌ అవుట్‌

  • టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా.. హర్ష్‌ ఠాకూర్‌ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్నీత్‌ ధలీవాల్‌ (34), శ్రేయస్‌ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. 

    కెప్టెన్‌ దిల్ప్రీత్‌ బజ్వా 11, యువరాజ్‌ సమ్రా 5, నికోలస్‌ కిర్టన్‌ 4, జస్కరన్‌ సింగ్‌ 4 (నాటౌట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 5, డిలాన్‌ హేలిగర్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతనికి ముహమ్మద్‌ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్‌ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ ఆర్యాంశ్‌ శర్మ (74 నాటౌట్‌), షోయబ్‌ ఖాన్‌ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. 

    కెనడా బౌలర్లలో సాద్‌ బిన్‌ జాఫర్‌ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్‌ సనా (4-0-29-1), డిలన్‌ హేలిగర్‌ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్‌, షోయబ్‌ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. 

  • అవాంతరాలన్నీ తొలగి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) జో​క్యంతో దిగివచ్చిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.

    సాంకేతికంగా మ్యాచ్‌ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్‌- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.

    అగ్రస్థానంలో టీమిండియా
    మొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్‌ జట్టు నెదర్లాండ్స్‌, అమెరికాలపై జయభేరి మోగించింది.

    ఫలితంగా గ్రూప్‌-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్‌- పాక్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్‌ రన్‌రేటు పరంగా భారత్‌ (+3.050).. పాకిస్తాన్‌ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.

    వాన పడే అవకాశం
    శ్రీలంకలోని ​కొలంబోలో గల ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్‌- పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.

    అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్‌ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్‌ వెల్లడించింది.

    యూటర్న్‌ తీసుకున్న పాక్‌
    ఇక మ్యాచ్‌ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్‌ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. 

    కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్‌కప్‌-2026 బహిష్కరిస్తామంటూ పాక్‌ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్‌తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్‌ తీసుకుంది.

    చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్‌ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్‌ జాతీయుడు జునైద్‌ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.

    సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్‌ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్‌కప్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్‌ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్‌ క్రికెట‍ర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్‌ కెరీర్‌ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.

    యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్‌ సిద్దిఖీనే.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కెనడా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్‌ సమ్రా (5), దిల్‌ప్రీత్‌ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్‌కు పంపాడు.

    ఆతర్వాత వచ్చిన నవ్‌నీత్‌ ధలివాల్‌ (34), హర్ష్‌ ఠాకూర్‌ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. 

    చివర్లో శ్రేయస్‌ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్‌లో హర్ష్‌, ధలివాల్‌, శ్రేయస్‌ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్‌ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.

    అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి.

  • ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 అవకాశాలను ఐరిష్‌ టీమ్‌ సంక్లిష్టం చేసుకుంది.

    ఇలాంటి తరుణంలో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్‌ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్‌ క్రికెట్‌ శుక్రవారం వెల్లడించింది.

    కాగా టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌లతో కలిసి గ్రూప్‌-బి నుంచి ఐర్లాండ్‌ పోటీలో దిగింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్‌ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

    గాయపడిన కెప్టెన్‌
    కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌ సందర్భంగానే కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్‌ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు.

    యువ బ్యాటర్‌ ఎంట్రీ
    ఇక పాల్‌ స్టిర్లింగ్‌ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్‌ సామ్‌ టాపింగ్‌ (Sam Topping) ఐర్లాండ్‌ ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్‌ స్వదేశానికి పయనం కాగా.. సామ్‌ భారత్‌కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక. 

    ఇదిలా ఉంటే.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్‌-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్‌ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఐర్లాండ్‌ జట్టు (అప్‌డేటెడ్‌)
    మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

    చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్‌ మాజీ క్రికెటర్‌పై భజ్జీ ఆగ్రహం

  • ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్‌ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ట్రేడింగ్‌ ద్వారా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్‌గా యువ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.

    కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌, ధృవ్‌ జురెల్‌ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్‌వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్‌ తరఫునే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రియాన్‌ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. 

    మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్‌లు ఆడి 141.84 స్ట్రయిక్‌రేట్‌తో 1566 పరుగులు చేశాడు. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా అయిన రియాన్‌ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్‌ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్‌లో వచ్చింది. ఆ సీజన్‌లో అతను 149.21 స్ట్రయిక్‌రేట్‌తో 573 పరుగులు చేశాడు. గత సీజన్‌లో రియాన్‌ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్‌రేట్‌తో 393 పరుగులు) చేశాడు.

    గత సీజన్‌లో సంజూ గైర్హాజరీలో రియాన్‌ 8 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్‌ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్‌లో రియాన్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి.  

    కాగా, తదుపరి సీజన్‌కు రాయల్స్‌కు కెప్టెన్‌తో పాటు నూతన హెడ్‌ కోచ్‌ కూడా రానున్నాడు. గత సీజన్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌ వదవిని వదిలేయడంతో,  ఆ స్థానంలో కుమార​ సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్‌ కలిసి 2026 ఎడిషన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను నడిపిస్తారు.

    2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్‌ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్‌, కొత్త కోచ్‌తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

    2026 సీజన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు..
    రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), శుభమ్‌ దూబే, వైభవ్‌ సూర్యవంశీ, డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, రవి సింగ్‌, అమన్‌ రావు పేరాల, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, యశస్వి జైస్వాల్‌, ధృవ్‌ జురెల్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, రవీంద్ర జడేజా, సామ్‌ కర్రన్‌, జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్‌, సుశాంత్‌ మిశ్రా, యశ్‌ రాజ్‌ పంజా, విజ్ఞేశ్‌ పుతుర్‌, బ్రిజేశ్‌ శర్మ, ఆడమ్‌ మిల్నే, కుల్దీప్‌ సేన్‌, సందీప్‌ శర్మ, నండ్రే బర్గర్‌
     

  • టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    పాక్‌ క్రికెటర్ల వెంటపడతాడు
    ఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్‌లో భజ్జీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్‌ అహ్మద్‌ అనే ఓ పాక్‌ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్‌ చేశాడు.

    ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.

    ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రంలా బిల్డప్‌
    ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్‌ అహ్మద్‌ అట.

    పాకిస్తాన్‌ తరఫున అతడు 3-4 మ్యాచ్‌లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ అన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న ఉస్మాన్‌ తారిఖ్‌ను ప్రశ్నలు అడిగాను.

    ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్‌)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్‌ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.

    దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు
    చెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ‍ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

    నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్త
    ఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్‌లు ఆడిన వాడికి 100 మ్యాచ్‌లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్‌ అహ్మద్‌ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్‌ అయ్యాడు.

    కాగా టీమిండియా తరఫున హర్భజన్‌ సింగ్‌ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.

    మరోవైపు.. రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ తన్వీర్‌ అహ్మద్‌ పాక్‌ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్‌ తీశాడు.

    చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయ‌వ‌చ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆట‌గాడు

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ పెర్ఫార్మెన్స్‌తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.

    జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్‌ బౌలర్‌‌ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో  కీలక ఆటగాళ్లు జోష్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, మ్యాట్‌ రెన్‌షా, ఆడమ్‌ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్‌ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

    ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు).  

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్‌ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్‌ రెన్‌షా (65), మ్యాక్స్‌వెల్‌ (31) విఫలయత్నం చేశారు.

     

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినిస్‌ ఓ వికెట్‌ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

    ఆసీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే
    టీ20 ప్రపంచకప్‌ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

    తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్‌), బౌలింగ్‌లో బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్‌లో బెన్నెట్‌తో పాటు మరుమణి (35), ర్యాన్‌ బర్ల్‌ (35), సికందర్‌ రజా (25 నాటౌట్‌) కూడా రాణించారు.

    బౌలింగ్‌లో ముజరబానీతో పాటు బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్‌ బర్ల్‌ (1-0-9-1), గ్రేమీ క్రీమర్‌ (4-0-33-0) కూడా సత్తా చాటారు.

    ఆసీస్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్‌లో ఎల్లిస్‌ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్‌ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్‌ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌ ఒక్క ఓవర్‌కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్‌ (1.1-0-6-1), స్టోయినిస్‌ (2.5-0-17-1) తలో వికెట్‌ తీశారు. స్టోయినిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్‌ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.

    అనంతరం బ్యాటింగ్‌లో ఆసీస్‌ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్‌ 8, హెడ్‌ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్‌వెల్‌ (31), రెన్‌షా (65) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్‌ (6), డ్వార్షుయిస్‌ (6), జంపా (2), కుహ్నేమన్‌ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్‌కు వెళ్లడంతో ఆసీస్‌ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్‌లోనూ ఆ జట్టు ఆసీస్‌ను మట్టికరిపించింది.  
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో అస‌లు సిస‌లైన స‌మ‌రానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా విధ్వంస‌క‌ర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి  పాక్ మాజీ పేస‌ర్ మహ్మద్‌ ఆమిర్‌ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ కేవ‌లం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాద‌డం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేద‌ని అత‌డు విమ‌ర్శించాడు.

    "అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అత‌డు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్న‌వాళ్లు ఎప్పుడో ఒక్క‌సారి మాత్ర‌మే అత‌డు స‌క్సెస్ అవుతారు. విఫ‌ల‌మ‌య్యేందుకే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.

    ప్ర‌తీ 8 ఇన్నింగ్స్‌లలో ఒకసారి మాత్రమే అత‌డు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్‌ల‌లో త‌క్కువే ప‌రుగుల‌కే అవుట్ అవుతున్నాడు. అత‌డు ఒక చోట నిల‌బ‌డి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది ప‌డ‌తాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.

    అయితే అభిషేక్‌ను నేనేమి త‌క్కువ చేసి మాట్ల‌డడం లేదు. అత‌డి ఆట‌లో చాలా రిస్క్ ఉంద‌ని చెబుతున్నా. త‌న‌దైన ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును ముప్పు తిప్ప‌లు పెట్ట‌గ‌ల‌డు అని ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో అమీర్ పేర్కొన్నాడు. 

    అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయ‌ర్ అయినా మీ జ‌ట్టులో ఉన్నారా? అంటూ నెటిజ‌న్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల న‌మీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ దూర‌మయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌కు ఈ పంజాబీ బ్యాట‌ర్ అందుబాటులోకి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్‌-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్‌- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్‌లో తలపడ్డాయి.

    ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్‌ బెనెట్‌ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

    రజా మెరుపు ఇన్నింగ్స్‌
    వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్‌ బర్ల్‌ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ సికందర్‌ రజా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో మార్కస్‌ స్టొయినిస్‌, కామెరాన్‌ గ్రీన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

    చెలరేగిన ముజర్‌బానీ
    ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్‌ ముజర్‌బానీ జోష్‌ ఇంగ్లిస్‌ (8)ను.. బ్రాడ్‌ ఎవాన్స్‌ కెప్టెన్‌ ట్రవిస్‌ హెడ్‌ (17)ను వెనక్కి పంపించారు.

    వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్‌ డకౌట్‌ చేయగా.. ముజర్‌బానీ సైతం టిమ్‌ డేవిడ్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. పవర్‌ హిట్టర్లు ఇద్దరూ డకౌట్‌ కావడంతో ఆసీస్‌ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (31)తో కలిసి మ్యాచ్‌ రెన్షా ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

    ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్‌బానీ బౌలింగ్‌లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్‌ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్‌బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్‌ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.

    146 పరుగులకే ఆలౌట్‌
    అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్‌ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్‌ ఎల్లిస్‌ ఫోర్‌ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్‌ ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్‌ రనౌట్‌ (0) కావడంతో ఆసీస్‌ పదో వికెట్‌ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

    జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్‌ మూడు వికెట్లు కూల్చి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్‌ బర్ల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలి ఎడిషన్‌ 2007లో ఆసీస్‌ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్‌పై గెలుపొందడం ఇదే మొదటిసారి.

    చదవండి: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. నేపాల్‌పై ఇటలీ గెలుపు

  • పసికూన నమీబియాకు టీ20 వరల్డ్‌కప్‌-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్‌తో తలపడ్డ ఎరాస్మస్‌ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

    తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్‌ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    అతడు మా ‘వెన్ను’ విరిచాడు
    డెత్‌ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్‌ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా‌ విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్‌ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.

    ఈ మేరకు.. ‘‘పవర్‌ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్‌ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.

    అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్‌ చక్రవర్తి వేసిన స్పెల్‌ మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్‌ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.

    మా బ్యాటింగ్‌లో ఫైర్‌ పవర్‌ ఉంది
    ఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్‌లో ఫైర్‌ పవర్‌ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్‌ కూడా ఇక్కడే ఆడాము. పిచ్‌లో ఎలాంటి మార్పూ లేదు.

    అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన​ గెర్హాడ్‌ ఎరాస్మస్‌ చెప్పుకొచ్చాడు.

    వరుణ్‌ అద్భుత స్పెల్‌
    కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ ఎరాస్మస్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

    ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్‌ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్‌ లారెన్‌ స్టీన్‌కాంప్‌ (29), వన్‌డౌన్‌ బ్యాటర్‌ జాన్‌ నికోల్‌ లాఫ్టీ-ఈటన్‌ (13)లతో పాటు.. జేజే స్మిత్‌ (0)లను వరుణ్‌ అవుట్‌ చేశాడు.

     

    కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎరాస్మస్‌ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.  

    చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్! 

National

  • గ్రీవెన్స్‌ సెల్‌లో వేదికపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాను ఆదేశిస్తున్న ఆదేశాల్ని ఓ ఐపీఎస్‌ అధికారిణి పట్టించుకోలేదని కోపంతో ఓ మంత్రి ఊగిపోయాడు. సదరు ఐపీఎస్‌ అధికారిణిపై చిర్రుబుర్రలాడారు. మంత్రికి ఐపీఎస్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా.. దెన్‌ గెట్‌ అవుట్‌ ఆఫ్‌ హియర్‌ అంటూ హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది.  

    హర్యానా రాష్ట్రంలో శుక్రవారం జరిగిన జిల్లా ఫిర్యాదు పరిష్కార సమావేశంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి అనిల్ విజ్‌,కైతల్ జిల్లా పోలీసు అధికారి (SP) ఉపాసన ఐపీఎస్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

    టిట్రామ్ గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి, ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ (సందీప్ అనే పోలీసు ఉద్యోగి) భూసంబంధిత మోసంలో పాలుపంచుకున్నాడని ఆరోపించాడు. దీనిపై స్పందించిన మంత్రి అనిల్ విజ్, వెంటనే ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

    అందుకు కైతల్ ఎస్పీ ఉపాసన స్పందించారు. ఆ సబ్ ఇన్‌స్పెక్టర్ కురుక్షేత్ర జిల్లాకు చెందినవారని, తన పరిధిలో లేడని, అందువల్ల  అతన్ని సస్పెండ్‌ చేసే అధికారం తనకు లేదన్నారు. ఎస్సైని సస్పెండ్‌ చేసే అధికారం కురుక్షేత్ర ఎస్పీ మాత్రమే ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు డీజేపీకి రాయండి.నేను అతన్ని సస్పెండ్ చేయమని చెబుతున్నాను. మీరు నా ఆదేశాలను అమలు చేయాలి’ అని మంత్రి అన్నారు. అయితే మీకు అధికారం లేకపోతే ఇక్కడి నుండి వెళ్లిపోండి’ అని విజ్ అన్నాడు.

    అనిల్ విజ్ ఈ సస్పెన్షన్‌కు ఆదేశించాడని మీరు రాయాలి అని మంత్రి అన్నారు. నేను రాస్తాను సార్. నేను రాయగలను, కానీ నేను అతనిని నేనే సస్పెండ్ చేయలేను’ అని ఎస్పీ ప్రతిస్పందించారు.

    నేను చెప్పాను. మీరు నా ఆదేశాలను పాటించాలి.మీరు మీ సొంత ఆదేశాలు ఇవ్వకూడదు.నేను చెబుతున్నాను.అతన్ని సస్పెండ్ చేయడానికి నేను ఈ ఆదేశాలు ఇచ్చానని డీజీపీకి రాయండి. ఎవరు అలా చేయరో నేను చూస్తాను’ అని అనిల్‌ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   
     

  • ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు గోల్డెన్‌ అవర్స్‌లో సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాల్ని కాపాడేందుకు కేంద్రం మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎం రాహత్‌ పేరుతో రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో రూ.1.5లక్షల వరకు క్యాష్‌లెస్‌ ట్రీట్మెంట్‌ అందిస్తున్నట్లు మోదీ తెలిపారు. 

    శుక్రవారం పీఎంవో నూతన కార్యాలయం సేవాతీర్థ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సేవాతీర్థ్‌ నుంచి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ‘సేవాతీర్థ్‌ కొత్త చరిత్రకు సాక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం సేవాతీర్ధ్‌. స్టార్టప్‌ ఇండియా 2.0 కోసం 10 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌. సకాలంలో వైద్యం అందక ప్రాణం పోకూడదన్న ఉద్దేశ్యంతో 1.5లక్షల వరకు నగదు రహిత వైద్యం. పీఎం రాహత్‌, లక్‌పక్‌ దీదీలకు 6 లక్షలు పెంచేందుకు యత్నం. ప్రారంభం వ్యవసాయ మౌలిక సదుపాలయ నిధి రెట్టింపు’ చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 

    పీఎం రాహత్‌ ఎలా పని చేస్తోంది
    ప్రధానమంత్రి రాహత్ (PM RAHAT) పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి రూపొందించింది. ఈ పథకం ద్వారా బాధితులు డబ్బు కోసం ఆందోళన చెందకుండా, వెంటనే చికిత్స పొందే అవకాశం కలుగుతుంది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు లేకుండా చికిత్స అందుతుంది. అంటే, ఆసుపత్రి బిల్లులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నేరుగా ఖర్చును భరిస్తుంది.

    బాధితుడు ఏ ఆసుపత్రిలో చేరినా, పథకం కింద ఖర్చు నేరుగా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది చికిత్స ఆలస్యం కాకుండా, వెంటనే ప్రారంభం కావడానికి సహాయపడుతుంది. ప్రమాదం జరిగిన మొదటి గంటల్లోనే అవసరమైన చికిత్స (సర్జరీ, ICU, మెడికల్ కేర్) అందించడమే ఈ పథకం లక్ష్యం.‘గోల్డెన్ అవర్’లో చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    కుటుంబ సభ్యులు డబ్బు కోసం పరుగులు తీయకుండా బాధితుడు వెంటనే చికిత్స పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రమాదం తర్వాత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తగ్గుతుంది. ఈ పథకం వల్ల ‘డబ్బు లేకపోవడం వల్ల ప్రాణం కోల్పోవడం’ అనే పరిస్థితి తగ్గుతుంది. అంటే, ఆర్థిక స్థితి ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరికీ సమానంగా వైద్య సహాయం అందుతుంది.

  • ఇప్పడు మన భారత సైన్యం లోకి వేట పక్షులు రాబోతున్నాయి. వాటి వేగం తో ఎవర్నైనా ఆశ్ఛర్యపర్చగల .. వీటికి చాలా బాద్యతలను కూడా అప్పగిచింది మన సైన్యం ..శత్రు దేశాల డ్రోన్లని నేలకూల్చే బాద్యత వీరిదే.. రీసెంట్ గణతంత్ర దినోత్సవం లో కర్తవ్య పథ్ లో కనిపించి అందరినీ  ఆశ్చర్యపరిచాయి. అందరినీ ముక్కున వేలేయించిన ఈ సైనిక పక్షుల సంగతేంటో చూద్దామా..

    చొరబాట్లు మన దేశానికి కొత్తేమీ కాదు. మన సైనికులు కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ సరిహద్దుల్ని కాపలాకాస్తున్నాసరే .. ఇవి ఆగట్లేదు . పైగా శత్రువుల డ్రోన్లూ వచ్చాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు మన దేశం ఆథునిక పరికరాలను తయారుచేస్తూనే ఉంది .. అలాగే యుథ్థ వీరుల్ని సన్నథ్తం చేస్తుంది. అవే  ఈగల్స్ .  ఈ ఈగల్స ని , ఫాల్కన్లను, గరుడపక్షులను 6 ఏళ్ల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీటిని ఉత్తరాఖండ్ లో జరిగిన యుథ్త విన్యాసాల్లో ఈ వెల్ ట్రైన్డ్డ్ ఈగల్స్ ని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.  శత్రు డ్రోన్లు కనిపించగానే రివ్వున ఎగురుతూ వెళ్లి వాటిని కూల్చివేసిన ఆ పక్షుల తెగువా, వేగం చూపరుల్ని విస్మయానికి లోనుచేశాయి! వాటిల్లోనూ కరణ్, అర్జున్ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందలాది డ్రోన్లని కూల్చి సత్తా చాటాయి.

    ఇక ఇలా పక్షుల్ని యుధ్దాలలో వాడటం కొత్తేమీ కాదు .రెండో ప్రపంచ యుధ్దంలో బ్రిటన్ , అమెరికా లాంటి దేశాలు పావురాల్ని వాడారు. అదే సమయంలో శత్రు దేశాల కు చెందిన పావురాలను వేటాడేందుకు జర్మనీ ఈగల్స్ ను ను ఉపయోగించింది. ఆ తర్వాత వీటిని ఎవరూ పట్టించుకోలేదు కానీ .. ఇప్పుడు కొత్తగా  డ్రోన్లు వల్ల చాలా తలనొప్పిగా మారాక . కొన్ని దేశాలు మళ్లీ ఈ ఈగల్స్ ని తమ సైన్యం లోకి చేర్చుతున్నాయి.  ఇంతకీ ఈ పక్షుల్నే ఎందుకు ఎంచుకోవాలీ అంటారా... ఇవి వేటాడే తీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది కాబట్టి! ఏ పక్షినీ ఇవి నేరుగా వెళ్లి ఢీకొట్టవు...అందుకే, పక్కగా వెళుతూ ముందు వాటి రెక్కల్ని తమ బలమైన గోళ్లతో తెగ్గొట్టి కిందపడేస్తాయి. పైగా వీటిది అచ్చమైన 'డేగకన్ను'... 'ఏ అత్యాధునిక కెమెరాకీ తీసిపోనంత నిశితంగా చూడగలవు. ఈ లక్షణాలన్నీ డ్రోన్లని కూలగొట్టడానికి చక్కగా ఉపయోగపడతాయి.

    వీటికి ఏ ప్రమాదమూ జరగకుండా కాళ్లకి లెదర్ కవచాలూ తొడుగుతున్నారు. రెండు కేజీలకన్నా తక్కువ బరువున్న డ్రోన్ల కూల్చివేతకే వీటిని పంపిస్తున్నారు. వందలాది డ్రోన్లని కూల్చివేసిన ఈ పక్షులకి ఇప్పటిదాకా ఏ ప్రమాదమూ జరగకపోవడం విశేషం. అందుకే ప్రతి పక్షిపైనా శిక్షణ, ఇతర అవసరాల కోసం ఏటా రూ.5 లక్షలదాకా ఖర్చుచేస్తున్నారు. అంత ఖర్చా... అనుకోకండి! కోట్ల రూపాయల యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువే!

    ఇండియన్ ఆర్మీ లోకి వేట పక్షులు

     

  • న్యూఢిల్లీ: గడిచిన గత పదేళ్ల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్‌ న్యాయవాదులపై సుమారు 8,360 చీఫ్‌ జస్టీస్‌ ఆఫ్‌ ఇండియా  కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. 2024లో అత్యధికంగా 1,170 ఫిర్యాదులు, 2025లో 1,102 ఫిర్యాదులు నమోదయ్యాయి

    అవినీతి, లైం**పరమైన, ఇతర తీవ్రమైన అంశాల్లో సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులు,హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఫిర్యాదులు ఏమైనా వచ్చాయా? గత పదేళ్ల కాలంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి.సంబంధిత ఫిర్యాదుల విషయంలో ఎలాంటి మెకానిజం పనిచేస్తుంది?’ అంటూ లోక్‌సభలో ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ మాథేశ్వరన్‌ వీఎస్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కోరారు. అందుకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ వివరణ ఇచ్చారు.

    గడిచిన పదేళ్ల కాలంలో సుప్రీం కోర్టు ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై 8,630 ఫిర్యాదులు అందాయని తెలిపారు.ఈ సందర్భంగా ఏ సంవత్సరంలో ఎన్ని ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కాలంలో వచ్చిన ఫిర్యాదుల వివరాల్ని వెల్లడించారు.

    అనంతరం, న్యాయమూర్తులపై ఫిర్యాదులను సేకరించడానికి కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థ (CPGRAMS) కాకుండా ప్రభుత్వానికి మరేదైనా యంత్రాంగం ఉందా? జవాబుదారీతనం నిర్ధారించడానికి అటువంటి ఫిర్యాదులను క్రమపద్ధతిలో నమోదు చేసి పర్యవేక్షించేలా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రతిపాదిస్తుందా? అని కూడా అడిగారు.

    ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదును కోర్టు 'ఇన్-హౌస్ ప్రొసీజర్' ద్వారా స్వీకరిస్తారని మేఘ్వాల్ అన్నారు. అదేవిధంగా, సంబంధిత హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వీకరిస్తారని తెలిపారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? వంటి వివరాల్ని వెల్లడించలేదు. 

  • ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ  ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు  గొప్ప విజయానికి నాంది పలికింది.  ఎవరా జంట? ఏమా బిజినెస్‌ తెలుసుకుందాం.


    నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.

    నెటిజన్ల స్పందన
    హైదరాబాద్‌లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో  అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్‌లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్‌ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు,  లక్షల్లో జీతాలు అనే  చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్‌ చేశారు.  

    కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ  వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్‌  లెక్కలు చెప్పారు.

    ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్‌ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్‌!

    వైట్‌ కాలర్‌ జాబ్స్‌ అని, మంచి ఆదాయం అని మన  గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్‌టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..!

  • ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సేవా తీర్థ్‌ ప్రారంభించారు. గణపతి పూజతో పీఎంవో కార్యాలయం ప్రారంభమైంది. మహిళా, యువత, రైతులకు సంబంధించిన ఫైళ్లపై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. యాక్సిడెంట్ల బాధితులకు లక్షన్నర వరకు నగదు రహిత చికిత్స పథకానికి ఆమోదం తెలిపారు. లక్పతి దీదీ పథకం లబ్ధిదారుల సంఖ్య ఆరు కోట్లకు పెంచారు. అగ్రికల్చర్ మౌలిక సదుపాయాల నిధి 2 లక్షల కోట్లకు పెంపు ఫైళ్లపై మోదీ సంతకాలు చేశారు.

    సౌత్ బ్లాక్ నుంచి నూతన చిరునామాకు పీఎంవో మారింది. పీఎంఓతోపాటు జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్‌ సెక్రెటేరియట్‌ కూడా సేవా తీర్థ్‌లోనే కొలువుదీరాయి. సేవా తీర్థ్‌తో పాటు కర్తవ్య భవన్ 1,2ను మోదీ ప్రారంభించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి సౌత్ బ్లాక్‌లో ప్రధాని కార్యాలయంలో కొనసాగుతుంది. కార్యాలయం పాతబడడం, మారుతున్న కాలానికి అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం ఏర్పాటు చేశారు.

    కర్తవ్య భవన్‌లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్పొరేట్ వ్యవహారాలు ,విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖ, ఐఅండ్‌బి శాఖ,  వ్యవసాయం, రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ,  గిరిజన మంత్రిత్వ శాఖ సహా పలు కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేలా అధునాతన సౌకర్యాలతో నూతన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. భవన సముదాయంలో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, నిఘా నెట్వర్క్, అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాలు, సమగ్ర భద్రత సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

  • సాక్షి బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం దొబ్బాస్‌పేట-హోస్కోట్ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ పై అతి వేగంతో వస్తున్న SUV, లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

    బెంగళూరు అర్బన్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని ఎం సత్యవారా గ్రామ సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు  SUVలు, ఒక క్యాంటర్ ట్రక్ , మోటార్ సైకిల్ పరస్పరం ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఒక కాలేజ్ కు చెందిన ఆరుగురు యువకులు మహేంద్రా SUVలో అతివేగంగా వస్తున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ తొలుత బైక్ ను ఢీకొట్టి అదే స్పీడుతో అనంతరం ట్రక్కును ఢీకొట్టారు. SUV ఢీకొట్టిన వేగానికి  బైకునడుపుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆ ట్రక్కు సైతం బోల్తా పడింది.అధిక వేగంతో ఢీకొట్టడంతో SUV  గుర్తుపట్టలేకుండా నుజ్జునుజ్జయ్యింది.

    ఇదిలా ఉండగా వెనుక వస్తున్న మరో కారు వెనక వస్తున్న మరో కారు SUVని ఢీకొట్టింది. మెుత్తంగా ఈ ప్రమాద ఘటనల SUVలో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు బైక్ పై పయణిస్తున్న వ్యక్తి  మెుత్తంగా ఏడుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికంగా గల ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విపరీతమైన వేగంతో ప్రయాణించడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. . 

  • సినిమాలకు ప్రేరణ  నిజ జీవిత గాథలు. కొన్ని విజయ గాథలకు ప్రేరణ సినిమాలు.  అలా అచ్చం సినిమాలా సాగిన ఒక నిరుపేద జీవితం, ఆయన సక్సెస్‌ జర్నీ ఆ తరువాత సినిమాకు ప్రేరణగా  నిలిచింది.  పట్టుదల , కఠిన శ్రమతో, అడ్డంకులను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చనే స్పూర్తిని రగిలించింది.  మరి ఆ  విజయగాథ ఏంటో తెలుసుకుందాం పదండి.

    బిహార్‌లోని పాట్నాలోని విశున్‌పూర్ పక్రి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆదిత్య పాండే. ముగ్గురు సోదరీమణులలో అతను చిన్నవాడు.  దృఢ సంకల్పంతో UPSC పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఈ విజయం వెనుక  ఒక తిరస్కారం.. ఆ తిరస్కారంనుంచే విజయాన్ని వెదుకున్న తీరు గురించి తెలుసుకుంటే  హృదయం  ఉప్పొంగక  మానదు.

    ఆదిత్య 8 , 9 తరగతులలో  బాగానే చదివాడు. 10వ తరగతిలో ప్రేమ మొదలైంది. ఆ  మైకంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. ఫలితాల్లో వెనుకబడ్డాడు. ఫలితంగా తండ్రి అతన్ని పాట్నాకు తిరిగి పంపాడు. అటు ప్రియురాలు కూడా అవమాన పర్చింది. అది అతణ్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఎదురుదెబ్బతో తన జీవితాన్నిదిద్దుకోవడానికి వాడుకన్నాడు. ఆదిత్య తన శక్తిని కొత్త లక్ష్యం వైపు మళ్లించాలని అపుడు ప్రతిన బూనాడు. తాను కచ్చితంగా తాను  ఐఏఎస్‌ చదవాలని.

    ఇంజనీరింగ్ నుండి IAS వరకు
    12వ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయ కంకర్‌బాగ్‌లో విద్యను అభ్యసించాడు.  ఆ తర్వాత, ఆదిత్య   బాగా రాణించాడు. పంజాబ్‌లోని LPU నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పొందినప్పటికీ, తన నిజమైన అభిరుచి ఇంజనీరింగ్‌లో లేదని ఆదిత్య గ్రహించాడు. విడిపోవడం వల్ల కలిగే బాధ అతన్ని వెంటాడు తున్నప్పటికీ,  తన కోరికతో 2018లో IIT రూర్కీ నుండి MBA పట్టా పొందాడు. ICICI బ్యాంక్‌లో  ఉద్యోగంలో చేరాడు.

    2020లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. UPSC పరీక్షలో మూడుసార్లు విఫల మైనప్పటికీ, నిరాశపడలేదు. తత్వశాస్త్రం తన ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండటంతో, అతను UPSC ఫలితం 2021లో కేవలం 2.5 మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు.  ఢిల్లీలో ఐచ్ఛిక సబ్జెక్టుల తయారీ కోసం మాత్రమే కోచింగ్‌పై ఆధారపడుతూ, ఇతర సన్నాహాల కోసం పూర్తిగా స్వీయ అధ్యయనంపై దృష్టి పెట్టాడు. అలా పూర్తి అంకితభావం, కృషి, దృఢ సంకల్పంతో  తన మూడవ ప్రయత్నంలో UPSC పరీక్షలో 48వ ర్యాంకును సాధించగలిగాడు. అలా  2022లో  కృషి, దృఢ సంకల్పం ఫలించింది.

    ఆదిత్య జీవితం స్ఫూర్తిదాయకమైన కథ. కష్టాలు,నష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురుదెబ్బలు, చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చినా కలలను నెరవేర్చుకోవాలనే సంకల్పమే ధైర్యం. అదే గొప్ప విజయాలకు పునాదిని నిరూపించివాడు. అలాగే తన చదువుపై  తండ్రికున్న ఎన్నో సందేహాలను పటా పంచలు చేసినవాడు. అంతేకాదు ఆదిత్య సీరియస్‌గా చదువితే.. మీసం గీసుకుంటానని సవాల్‌ చేసిన ఉపాద్యాయుడికి తన ఐఏఎ‍స్‌ను  సగర్వంగా చూపించాడు.

    షాదీ మే జరూర్ ఆనా
    2017లో విడుదలైన షాదీ మే జరూర్ ఆనా మూవీకి  ఆదిత్య కథే స్ఫూర్తి. నటుడు రాజ్‌కుమార్ రావు సత్యేంద్ర మిశ్రా (సత్తు) పాత్రను పోషించారు, ఆర్తి శుక్లా (కృతి ఖర్బంద)తో విడిపోయిన తర్వాత   సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత IAS అధికారి అవుతాడు. 
     

Movies

  • శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ రిలీజైంది. 

    మొదలే మొదలే అంటూ సెకండ్‌ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్‌ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్‌, మధుశ్రీ ఆలపించారు.  కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు.

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

    పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్‌ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్‌పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని ‍అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు  హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్‌ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్  ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్‌ చూసి ఓ డైరెక్టర్‌గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

    కాగా.. రణ్‌ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్‌ చిత్రంలో  సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి  కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

  • మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

    అయితే ఈ చిత్రంలో కనిపించిన అన్ని పాత్రలకు ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకు ఓ సీరియల్ నడుస్తుంది. ఆ సీరియల్ హీరోయిన్‌గా సౌమ్య పాత్రలో మెప్పించింది. మన శంకర వర ప్రసాద్ కారెక్టర్‌లో చిరంజీవి ఆ సీరియల్ గురించి.. ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చెబుతూ ఉండటం.. అతని జీవితాన్ని రిప్లెక్ట్ చేస్తున్నట్టుగా ఆ సీరియల్ సాగడం.. ఇలా ఆ ట్రాక్ ఎంత ఫన్నీగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సీరియల్‌‌లో కనిపించిన నటికి కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆ నటి కోసం తెగ వెతికేస్తున్నారట.

    ఈ మూవీలోని సీరియల్‌లో సౌమ్య పాత్రలో నటించిన ఆమె పేరు సాయి ప్రియా రెడ్డి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చింది. క్షేత్రం, నందీశ్వరుడు, పూలరంగడు, రెబెల్, మిర్చి, తడాఖా, జీనియస్, లక్కీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేస్తోంది. ఆ తరువాత యూట్యూబ్‌లో సిరీస్‌లు కూడా చేసి మంచి పేరుని సంపాదించుకుంది.

    రీసెంట్‌గా వచ్చిన విశ్వక్ సేన్ లైలా చిత్రంలోనూ నటించింది. అందులో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో మంచి పాత్ర దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అవకాశాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు ప్రాజెక్టులో భాగస్వామి అయినట్టుగా సమాచారం.

  • టైటిల్: అమరావతికి ఆహ్వానం

    నటీనటులు:  శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులు

    ద‌ర్శ‌క‌త్వం: జీవీకే

    నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌

    నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు

    సినిమాటోగ్రఫీ: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి

    సంగీతం: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌

    ఎడిటింగ్‌: సాయిబాబు తలారి

    విడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026


    టాలీవుడ్‌లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.  మంచి కంటెంట్‌ ఉన్న హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్‌ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్‌గా తెలుగులోనే వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.


    అమరావతికి ఆహ్వానం కథేంటంటే..

    ఈశ్వర్‌ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్‌ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్‌ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్‌ ఛానెల్‌లో దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్‌ చేసి.. కంటెంట్ అప్‌లోడ్‌ చేస్తుంటుంది. అలా  పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెల‌బ్రిటీ అయిపోతుంది.

    అయితే సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విష‌యాన్ని లైవ్‌లో నిరూపిస్తానని..  ఈ వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా  అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్‌)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్‌ కుటుంబానికి మధ్య ఉన్న లింక్‌ ఏంటి?  సీఐగా ఈశ్వర్‌ సస్సెండ్‌ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.

    ఎలా ఉందంటే..

    దెయ్యాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్‌ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్‌ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా.

    అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్‌ సీన్‌తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేశాడు. ఫస్‌ హాఫ్‌లో భార్గవి వీడియోలు షూట్‌ చేయడం, మహేశ్ (శివ హ‌రీశ్‌)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్‌ను భయపెట్టే సీన్స్‌ పెద్దగా కనిపించవు. ఈశ్వర్‌‌ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్‌కు ఎండ్‌ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్‌ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసింది.

    సెకండాఫ్‌లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో కథనం ఆడియన్స్‌కు ఆసక్తికరంగా ‍అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హారర్ సీన్స్‌ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్‌ వ‌చ్చే ట్విస్ట్‌  థ్రిల్‌ చేస్తుంది. హారర్‌ ఎలిమెంట్స్‌ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్‌ థ్రిల్లర్‌లో సాంగ్స్‌ ఉంటే కథ సెట్ అవ్వదు.  సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో  సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ హారర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్‌ జీవీకే. తన కథకు తగినట్లుగానే ‌ క్లైమాక్స్‌  డిజైన్ చేయడంలో ద‌ర్శ‌కుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్‌ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు.   క్లైమాక్స్‌లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్‌ ఉంటుందని ప్ర‌క‌టించారు.

    ఎవరెలా చేశారంటే..

    ఈశ్వర్‌, జ‌గ‌దీష్‌ పాత్రల‌లో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్‌ పిల్లర్‌ ఏస్తేర్‌. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్‌ సీన్స్‌లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్‌, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్‌ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్‌ భరద్వాజ్‌ బీజీఎం హార‌ర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా త‌లారి తన ఎడిటింగ్‌కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

  • మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

    ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. జీ5 వేదికగా బుల్లితెర ప్రియులను ‍అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓటీటీకి వచ్చిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్‌ సాధించింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ జీ5 సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలోనే కాదు..ఓటీటీలోనూ మనశంకర వరప్రసాద్‌గారు దూసుకెళ్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
     

  • దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్‌ అవైటేడ్  అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్‌ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

    అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్‌లో మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్‌ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.

    కొందరు ఈ సినిమాను ఫిక్షన్‌ అని అంటున్నారు. మరికొందరేమో విలన్‌ పాత్రధారి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఫస్ట్‌లుక్‌ చూసి సైన్స్ ఫిక్షన్‌ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన కన్‌ఫ్యూజన్‌ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.

    ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్‌పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్‌ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్‌లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇ‍చ్చారు. దీంతో ఆడియన్స్‌ అనుమానాలకు చెక్ పడినట్లైంది. 

    కాగా.. వారణాసిలో మహేశ్‌బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ రోల్‌ కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన కొత్త సినిమా 'ఫంకీ' థియేటర్లలోకి వచ్చేసింది. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లు కాగా నాగవంశీ నిర్మించాడు. విడుదలకు ముందు కాస్త బజ్ ఉంది. అలానే రిలీజైంది. కానీ తొలి షో నుంచే మిక్స్‌డ్, నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ అంతగా పండలేదని, స్టోరీ కూడా ఏం లేదని విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ దీని గురించి ఏమంత పాజిటివ్‌గా మాట్లాడట్లేదు. ఈ క్రమంలోనే బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ పెట్టగా.. నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ విచిత్రంగా అనిపిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: చిరంజీవి 'విశ్వంభర' ఏమైపోయినట్టు?)

    'రివ్యూయర్లకి నచ్చదు అని నాకు ముందే తెలుసు. కానీ సాధారణ ప్రేక్షకులు కూడా ఎడిటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు. మేము కావాలనే అలా తీసాం. ఎడిటింగ్ సమస్య కాదది. నేను సాగర సంగమం తీసా అని చెప్పానా? ముందే చెప్పాగా సినిమా సీన్ నుంచి సీన్ ఫ్లో లేకుండా ఉంటుందని. మీరేదో సైంటిస్ట్‌లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడతారు ఏంటి? నేను అన్నీ ముందే చెప్పా. సినిమాకు కావాల్సిన గ్లామర్ అయితే లేదు. అది తెలిసే సినిమా తీశాం'.. ఇలా సాగాయి నాగవంశీ మాటలు.

    పైన స్పీచ్‌లో ఎక్కడా కూడా ఆడియెన్స్‌కి నచ్చేలా సినిమా తీశాం అనే మాట వినబడలేదు. నవ్వించాలనే ఉద్దేశంతో మాత్రమే తీశానని నాగవంశీ అంటున్నారు. కానీ కొన్నిచోట్ల తప్పితే ప్రేక్షకులు.. మూవీలో సీన్లకు అనుకున్నంతగా నవ్వట్లేదనే విషయాన్ని మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారా అనిపిస్తుంది. గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే యావరేజ్ వచ్చిన మూవీస్ పరిస్థితే థియేటర్ల దగ్గర అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది కాస్త నెగిటివ్ టాక్ కూడా వినబడుతున్న 'ఫంకీ'.. వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • టాలీవుడ్‌లో మాస్‌ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు.

    రవితేజ కీలక నిర్ణయం..

    సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్‌ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    రిస్క్‌లో షేర్..

    మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ ‍అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో నాని, సాయి ధరమ్ తేజ్,  నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.  ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. 

    రవితేజ కొత్త సినిమా..

    రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది.  జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్‌.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.
     

  • ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్నిసార్లు సినిమా కష్టాలు తప్పవు. చిరంజీవి 'విశ్వంభర' సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ ఒకటుందని జనాలు ఇప్పటికే మర్చిపోయారు. మూవీ టీమ్ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్ లేదు. అసలు ఈ చిత్రం ఈ ఏడాదైనా రిలీజ్ అవుతుందా? ఇంతకీ అసలేం జరుగుతోంది?

    'బింబిసార' లాంటి సక్సెస్ తర్వాత వశిష్ఠ.. చిరంజీవితో కలిసి కొత్త మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడు. 2023లో చిరు పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్టుని ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. 2024లో ఎ‍ప్పుడైతే గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. గ్లింప్స్‌పై విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. దెబ్బకు మూవీ టీమ్‌కి సీన్ అర్థమైపోయింది. గతేడాది ఓ పాట, కొత్త గ్లింప్స్ అని మరికొన్ని అప్‌డేట్స్ వచ్చాయి గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బజ్ రాలేదు.

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)

    మరోవైపు దీని తర్వాత చాన్నాళ్లకు అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా ప్రకటించారు. 'మన శంకరవర‍ప్రసాద్' పేరుతో గత నెలలో సంక్రాంతికి రిలీజ్ చేస్తే అద్భుతమైన హిట్ కొట్టింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త మూవీ చేసేందుకు చిరు రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్టు గురించి ఆనందపడిపోతున్నారు. దీని గురించి రూమర్స్ చాలానే వస్తున్నాయి. ఇది కూడా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా తీస్తున్నారని అంటున్నారు. అదే టైంలో 'విశ్వంభర' గురించి చిన్న సౌండ్ కూడా లేదు.

    తాజాగా 'విశ్వంభర' నిర్మాతలే తీసిన 'కపుల్ ఫ్రెండ్లీ' విడుదల సందర్భంగా నిర్మాతలు.. చిరు సినిమా గురించి మాట్లాడట్లేదు. 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వశిష్ఠ కూడా 'విశ్వంభర' రిలీజ్ గురించి త్వరలో చెబుతాం అంటున్నాడే తప్ప ఈ ఏడాది వస్తుందా కనీసం వచ్చే ఏడాది వస్తుందా లాంటివి క్లారిటీ ఇవ్వట్లేదు. చూస్తుంటే గ్రాఫిక్స్ విషయంలో ఇంకా సందిగ్దత అలానే కొనసాగుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ రిపేర్లు ఎప్పుడు పూర్తవుతాయో? బొమ్మ ఎప్పుడు బయటకు వస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది?

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్ సినిమా.. నోటిలో నుంచి రక్తమొచ్చింది: జగపతిబాబు)

  • బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ గతేడాది ధురంధర్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్‌ అవకుండా బ్యాన్‌ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.

    సీడీల అమ్మకం
    అంతేకాదు, పాక్‌లో ధురంధర్‌ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్‌ కార్ల్‌ రాక్‌ షేర్‌ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్‌బో సెంటర్‌ పైరసీ కంటెంట్‌కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్‌ సినిమా సీడీలను 50 పాకిస్తాన్‌ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్‌లో ఇండియన్‌ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్‌ ధురంధర్‌ సీడీ చూపించాడు.

    అటు బ్యాన్‌.. ఇటు పైరసీ
    ఇది చూసిన జనాలు.. పాకిస్తాన్‌ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్‌పై బ్యాన్‌ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్‌ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్‌ ఖన్నా, ఆర్‌. మాధవన్‌, సారా అర్జున్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్‌ 2 మార్చి 19న విడుదలవుతోంది.

     

     

    చదవండి: అర్జున్‌తో వివాదం.. విశ్వక్‌ ఏమన్నాడంటే?

  • టైటిల్‌: ఫంకీ
    నటీనటులు: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్ తదితరులు
    నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా
    నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
    దర్శకత్వం: అనుదీప్ కె.వి.
    సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
    ఎడిటింగ్‌: నవీన్ నూలి 
    సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం 
    విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

    విశ్వక్‌ సేన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. భారీ అంచనాల మధ్య గతేడాది రిలీజైన ‘లైలా’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ తెరకెక్కించిన చిత్రం కావడంతో ‘ఫంకీ’పై ఓ మోస్తరు అంచనాలు అయితే ఏర్పాడ్డాయి. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఇలా ఈ వారం(ఫిబ్రవరి 13) భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్‌ సేన్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్‌ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్‌ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్‌లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్‌ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    ‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్‌ సినిమాలంటే తెలుగు ఆడియన్స్‌కి ఓ అంచనా ఉంది. కథ గొప్పగా ఉండదు కానీ పంచ్‌ డైలాగ్స్‌తో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని నడిపిస్తాడనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. అయితే గొప్ప కథ లేకపోయినా సరే..చెప్పుకోవడానికైనా కొంత స్టోరీ అయినా ఉండాలి కదా. అలా కాకుండా కేవలం సింగిల్‌ లైనర్స్‌తో పంచ్‌ డైలాగులు పేలిస్తే.. సినిమా ఆడేస్తుందని భావిస్తే అది పొరపాటే. జాతి రత్నాలు కేవలం పంచ్‌ డైలాగ్స్‌ వల్లే ఆడలేదు. అందులో కొంత కథ ఉంటుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటికి తోడుగా పంచ్‌ డైలాగ్స్‌ కూడా ఉండడంతో ఆ సినిమా హిట్‌ అయింది. కానీ ‘ఫంకీ’లో పంచ్‌ డైలాగ్స్‌ తప్ప మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. ఆ డైలాగ్స్‌ కూడా కామన్‌ ఆడియన్స్‌కి పెద్దగా నవ్వు తెప్పించవు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం నవ్వుకుంటారు. 

    డైలాగ్స్‌ కోసమే సన్నివేశాలు రాసినట్లుగా అనిపిస్తుంది. కథనం మొత్తం సింగిల్‌ పాయింట్‌ చుట్టూనే తిరుగుతూ.. చూసిన సన్నివేశాలే మళ్లీ రిపీట్‌ చేస్తూ విసుగు తెప్పించారు. అసలు ఈ కథని విశ్వక్‌, నాగవంశీ ఎలా ఒప్పుకున్నారనే సందేశం సినిమా చూస్తున్నంతసేపు మన మనసుని వెంటాడుతూనే ఉంటుంది.

    ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథే లేదు. కథనం ఆసక్తికరంగా సాగదు. ఒక్కో సన్నివేశాన్ని పేర్చుకుంటూ వెళ్లారు. కొన్ని సీన్లు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. హీరో పాత్రని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉండడు. అన్ని విషయాలను లైట్‌ తీసుకునే వ్యక్తిలో కూడా ఎమోషన్లు ఉంటాయని హీరో పాత్ర ద్వారా చెప్పాలకున్నారు. కానీ దాన్ని తెరపై సరిగా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ని కూడా యాడ్‌ చేశారు కానీ అది వర్కౌట్‌ అవ్వలేదు.  సినిమా ప్రారంభంలో వచ్చే కామెడీ సన్నివేశాల్లో మొదట్లో కాస్త నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి సీన్లే మళ్లీ మళ్లీ రిపీట్‌ అవ్వడంతో నవ్వు రాకపోగా.. ఒకనొక దశలో చిరాకు అనిపిస్తుంది. కోమల్‌, చిత్ర పాత్రల పరిచయ సన్నివేశాలు బాగుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ కథనం కాస్త వేగంగా  సాగుతుంది.  అనుదీప్‌, కల్యాణ్‌ శంకర్ల గెస్ట్‌ అప్పీయరెన్స్ కూడా పెద్దగా నవ్వులు పంచలేకపోయింది. ఉన్నంతలో మదర్‌ సెంటిమెంట్‌ కాస్త ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. 



    ఎవరెలా చేశారంటే..
    విశ్వక్‌ సేన్‌ మంచి నటుడే. అయితే అనుదీప్‌ రాసిన ‘కోమల్‌’క్యారెక్టర్‌ అతనికి సరిగా సూట్‌ అవ్వలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఎప్పటిమాదిరే పాత్రలో లీనమైన నటించాడు.  కానీ పూర్తిగా నవ్వించలేకపోయాడు.  కయాదు లోహర్‌ తెరపై అందంగా కనిపించింది. నరేశ్‌ పాత్ర నిడివి తక్కువే. ఆయనను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. సంపత్‌ రాజ్‌ పాత్ర కూడా పెద్దగా ఇంపాక్ట్‌ చూపించదు. ఈశ్వరీరావు తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర నటించారు. 

    సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ మాత్రం దారుణంగా ఉంది. కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
    - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Business

  • బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.

    ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.

    ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.

    2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు
    వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

  • రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

    బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.

    రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్
    దేశ్ కా నెట్‌వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

  • ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాన్స్‌ఫర్మేషన్‌ నౌ వార్షిక కార్యక్రమం సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

    సంక్లిష్టమైన వ్యవస్థల కారణంగా మధ్య, భారీ స్థాయి కంపెనీలు బీ2బీ చెల్లింపుల విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటాయని ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఎండీ కృణాల్‌ పటేల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఏపీ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించే సంస్థల మధ్య బీ2బీ చెల్లింపులను సరళతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

    ట్రాన్స్‌ఫర్మేషన్‌ నౌ కార్యక్రమంలో 1,500 మంది పైగా సీఎక్స్‌వోలు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. డేటా సార్వ¿ౌమత్వం, బాధ్యతాయుతంగా కృత్రిమ మేథను వినియోగించడం తదితర అంశాలపై చర్చించారు. ఆటోమోటివ్, కెమికల్స్, తయారీ తదితర రంగాల్లో ఎస్‌ఏపీ ఆధారిత వ్యూహాల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎన్‌టీటీ డేటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ గ్లోబల్‌ సీఈవో నార్బర్ట్‌ రోటర్‌తో పాటు ఎన్‌పీసీఐ భారత్‌ కనెక్ట్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

  • జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఎన్‌హెచ్‌ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.

    జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్‌హెచ్‌ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్‌మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్‌తో సహా వివరాలతో అప్‌లోడ్ చేయాలి.

    సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్‌కు రూ. 1000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్‌ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది.

  • కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్‌’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.

    బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్‌నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

    ఏమిటీ  ‘అక్కా కేఫ్’?
    ‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.

    ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.

    కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో  కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్‌కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్‌ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.

    దశలవారీ అమలు
    ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్‌లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.

    ఎక్కడెక్కడ?
    ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్‌లో రెండు, కార్వార్‌లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్‌లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్‌లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.

    మెనూలో ఏమేముంటాయంటే..
    ‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది.  అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.

    లక్ష మంది మహిళలకు శిక్షణ
    కాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.

    తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది.

  • 'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్‌బీఐ నిర్వహించనుంది.

    2016 నుంచి ఆర్‌బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్‌ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్‌ ప్రాధాన్యాన్ని గవర్నర్‌ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్‌ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్‌లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్‌ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.

    ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.

    ➤బంగారం: 61.9 శాతం
    ➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం
    ➤ఫిక్స్‌డ్ డిపాజిట్లు: 13 శాతం
    ➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం
    ➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతం

    గతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.

    డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్‌ బ్రాండెడ్ షోరూమ్‌లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్‌లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

    బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.

    కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్‌ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.

  • మార్కెట్‌పై బేర్స్‌ పట్టు సాధించడంతో దలాల్ స్ట్రీట్‌లో శుక్రవారం తీవ్ర రక్తపాతం! చోటుచేసుకుంది. గ్లోబల్ టెక్ మార్కెట్లలో కొనసాగుతున్న మందగమనం ప్రభావంతో హెవీవెయిట్ ఐటీ షేర్లు భారీగా క్షీణించాయి. ఫలితంగా భారతీయ ఈక్విటీ సూచీలు దిగువన పయనించాయి.

    బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 82,626.76 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 336.1 పాయింట్లు లేదా 1.30 శాతం క్షీణించి 25,471.1 వద్ద ముగిసింది.
     
    బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మినహా అన్ని షేర్లు కుప్పకూలాయి. వీటిలో హెచ్‌యూఎల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
     
    రంగాలవారీగా   నష్టాలకు దారితీసింది. ఇది 3 శాతానికి పైగా పడిపోయింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయి 1.44 శాతం నష్టపోయింది.

    రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ నష్టపోయి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం పైగా క్షీణించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.

    విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.79 శాతం పడిపోయాయి. మార్కెట్ అస్థిరతకు సూచిక అయిన ఇండియా వీఐఎక్స్‌ 15.18 శాతం ఎగసి, పెట్టుబడిదారుల ఆందోళనలను ప్రతిబింబించింది.

  • టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.

    ఇప్పటివరకు.. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.

    ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.

    ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.

    ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!

  • అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్‌పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.

    హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.

    ప్రయాణికులకు ప్రయోజనాలు

    ఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.

    భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.

    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు..

    ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)
    1సింగపూర్192
    2జపాన్, దక్షిణ కొరియా187
    3స్వీడన్, యూఏఈ186
    4జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)185
    5ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184

     

    టాప్ 10లో ఇతర దేశాలు..

    ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.

    75వ ర్యాంకు అనేది భారత పాస్‌పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్‌పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

  • ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.

    5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనం
    తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎ‍క్స్‌’ (ట్విటర్‌)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.

    1. క్యాష్‌ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.

    2. కాలేజ్‌ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.

    3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.

    4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.

    5. క్యాష్‌(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.

    ఆస్తి కరిగిపోతుంది..
    కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: ఫేక్‌లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!

    భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితి
    రాబర్ట్‌ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.

  • బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.

    రాజ్‌పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?

    ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్‌ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

    రాజ్‌పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి.

International

  • అబుజా: ఇటీవల కాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. విమానం ప్రయాణం ఎక్కితే గమ్య స్థానానికి చేరుకోగలామా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఓ విమానం ఘోర విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. 80 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. 

    లాగోస్ నుండి పోర్ట్ హార్కోర్ట్ వెళ్తున్న అరిక్‌ ఎయిర్‌ విమానాయన సంస్థకు చెందిన బోయింగ్ 737-700 విమానం  బుధవారం ఉదయం 7:24 గంటలకు బయల్దేరింది. సుమారు 27 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమ ఇంజిన్‌లో భారీ శబ్దం వినిపించింది. ఇంజిన్‌లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు తునాతునకలయ్యాయి. ఫ్యాన్ బ్లేడ్లు విరిగిపోయాయి. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్‌పోర్ట్ వైపు మళ్లించి, ఉదయం 8:05 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు.

    80 మంది ప్రయాణికులు, సిబ్బంది ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ కవచం చీలిపోవడంతో లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌వర్క్ నివేదికల ప్రకారం.. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయింది. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’ ఘటనగా పరిగణిస్తున్నారు. ఇంజిన్ నుండి విడిపోయిన లోహపు ముక్కలు విమానం వెనుక భాగంలోని వర్టికల్ స్టెబిలైజర్‌ను కూడా దెబ్బతీశాయని పరిశీలకులు గుర్తించారు. నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. బెనిన్‌లో విమానాన్ని నిలిపి, సాక్ష్యాలను సేకరించడం, సిబ్బందిని ప్రశ్నించడం,ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలిస్తున్నారు. 

    ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ అంటే..
    ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ (Fan Blade-Off) అనేది విమాన ఇంజిన్‌లలో జరిగే ఒక తీవ్రమైన సాంకేతిక లోపాన్ని సూచించే పదం. టర్బోఫ్యాన్ ఇంజిన్‌లో గాలి పీల్చుకునే భాగంలో పెద్ద ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి.వీటిలో ఒక బ్లేడ్ విరిగి, ఇంజిన్ లోపల నుంచి బయటకు త్రోసుకుపోతే దాన్ని Fan Blade-Off (FBO) ఘటన అంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి,ఎందుకంటే విరిగిన బ్లేడ్ ముక్కలు ఇంజిన్‌ను, విమానం ఇతర భాగాలను దెబ్బతీసేయోచ్చు. 

     

  • న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత, ఆ దేశ రాజకీయాలు అనూహ్య మలుపులు  తిరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్‌ రెహ్మాన్‌  ఎన్నికల్లో విజయం సాధించి, తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పరిణామం కేవలం బంగ్లాదేశ్‌లోనే కాకుండా దక్షిణాసియా రాజకీయాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలలో సరికొత్త చర్చకు దారితీసింది.

    బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్‌ బాధ్యతలు చేపట్టాక అది పాకిస్తాన్‌కు సానుకూల అంశంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అవామీ లీగ్ హయాంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, పాకిస్తాన్‌కు దూరం పాటిస్తూ వచ్చింది. అయితే బీఎన్‌పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడతాయని ఇస్లామాబాద్ ఆశిస్తోంది. చారిత్రక నేపథ్యం, గత అనుభవాల దృష్ట్యా తారిఖ్‌ రెహ్మాన్‌నాయకత్వం తమకు వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తుందని పాక్ అంచనా వేస్తోంది.

    తారిఖ్‌ రెహ్మాన్‌ గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్‌పై వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారనే  ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద గ్రూపులకు మద్దతు లభించిందనే మాట కూడా వినిపించింది. ఇప్పుడు ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య, భద్రతా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    బంగ్లాదేశ్‌ను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్‌ను దౌత్యపరంగా ఇబ్బందులకు గురిచేయవచ్చని పాక్ యోచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రధానమంత్రిగా అయ్యాక పాకిస్తాన్‌, చైనాల ప్రభావం బంగ్లాదేశ్‌పై పెరుగుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత్‌కు వ్యూహాత్మక సవాలుగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరత నేపథ్యంలో తారిఖ్‌ రెహ్మాన్‌ ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తారు? పాకిస్థాన్‌తో ఎంతవరకు సన్నిహితంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే. 

    ఇది కూడా చదవండి: మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ

Politics

  • ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్‌ ఉత్కంఠ రేపుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌ ఏర్పడగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెంలో సీపీఐ తన సత్తా చాటింది. మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 20, సీపీఐ 24 చోట్ల గెలుపు సాధించాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ హంగ్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ట్వీస్ట్‌ ఇచ్చింది. సీపీఐకి బీఆర్‌ఎస్‌ (9) బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఐ.. బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకుంటుందా? కాంగ్రెస్‌తో జత కడుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెంలో  బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నాయి.

    ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు. ‘‘కేటీఆర్‌ మాకు ఫోన్‌ చేసి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటాం, మేయర్‌ పదవిని గిరిజనులకే ఇస్తాం. మేం కాంగ్రెస్‌తో చర్చలు జరపలేదు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని.. మేయర్‌ సీట్‌ను త్యాగం చేయటం కుదరదంటూ కూనంనేని తేల్చి చెప్పారు. 

    మరోవైపు, కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ చేశామని.. సీపీఐ తమ మిత్ర పక్షం అని కాంగ్రెస్‌ అంటోంది. మాకు, సీపీఐకి కలిసి 44 స్థానాలు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 8 స్థానాలు అత్యంత కీలకంగా మారాయి.

     

     

     

     

  • నిజామాబాద్:  తమ పార్టీపై ఎన్నో విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారని పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయని, అదే ఇంతటి ఘన విజయానికి కారణమైంద్నార.  మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా నిజమాబాబ్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. 

    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలు మళ్ళీ ఈ ఎన్నికల్లోనూ గెలిపించారు. మంత్రులు, నేతలు, కార్యకర్తల కృషితో 70 శాతం మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. ఎన్ని విమర్శలు, వెటకారాలు మాట్లాడినా ప్రజలు కాంగ్రెస్‌ని ఆదరించారు. 75 శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. 

    బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇంకా అన్ని పార్టీలు కలిసి కనీసం 25 శాతం కూడా గెలవలేదు. నిజమాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టిన బీజేపీ, ఎంఐఎంలు లబ్ధిపొందాయి. సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రజల కోరికలను నెరవేర్చేలా పాలిస్తున్నారు. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్‌ వంటి పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం. రానున్న రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల ద్వారా కక్ష సాధించాలనుకుంటే వైఎస్సార్‌సీపీ నేతలు భయపడరన్నారు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇలాంటి సంస్కృతి చాలా ప్రమాదకరమన్నారు.

    ‘‘ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం గాలికివదిలేసింది. ఈ రోజు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇదే సంస్కృతి కొనసాగిస్తే మనశాంతిగా ఎవరైనా ఉండగలరా?. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇలాంటి సంస్కృతిని తెచ్చింది. ఇలాంటి సంస్కతిని చూశాక ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.

    ‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులకు భద్రత లేదు. ఇక పెట్టుడులు పెట్టడానికి వచ్చే వ్యాపారులకు భద్రత ఎక్కడ?. పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఇలాంటి అక్రమ కేసులు, దాడులు, ఇళ్లు తగలబెడితే భయపడతారనుకోవడం అమాయకత్వం’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఆరు మున్సిపాలిటీలో సింగల్ లార్జెస్ట్ గా అవతరించామని.. మొదటిసారి రెండు కార్పొరేషన్లు కైవసం చేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మొత్తం కలిపి 300 పైగా వార్డు, కార్పొరేటర్లు గెలిచారు. నారాయణపేటలో గెలిచాం. గతం కంటే ఇపుడు మెరుగయ్యాం. ఎన్నికల్లో మేము మేనిఫెస్టో ఇచ్చాం. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జీ షీట్ కూడా ప్రకటించాం. చాల చోట్ల స్వల్పంగా ఓడిపోయాం. త్రిముఖ పోటీలో నష్టం జరిగింది’’ అని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

    ‘‘ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం సాధించాం. ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా ఒకటి గెలిచాం. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి ఇది క్లియర్ మెజారిటీ కాదు. బీఆర్‌ఎస్‌ కూడా గతం కంటే వెనకబడింది. బీఆర్ఎస్‌ది రెండో స్థానం అనుకోవడం కాదు.. గతం కంటే వెనుకబడ్డారు. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. బీజేపీ ఓటింగ్ ప్రాంతాల్లోనే మజ్లీస్ పార్టీ, బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. ఉత్తర తెలంగాణలో ముస్లిం పాపులేషన్ ఉంది. వాళ్ల ఓట్ల వల్లనే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అక్కడ గెలిచింది, కాంగ్రెస్ బీఆర్‌ఎస్, మజ్లీస్ ఒక్కటి అయ్యాయి’’ అని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.

    	మేము ఓడిపోలేదు ముగ్గురూ కలిసి ఓడించారు
  • సాక్షి,తెలంగాణ భవన్‌: కొత్తగూడెం కార్పొరేషన్‌ హంగ్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. సీపీఐకి బీఆర్‌ఎస్‌ బహిరంగ మద్దతు ప్రకటించింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు విడుదల నేపథ్యంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మాజీ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో  మీడియాతో మాట్లాడారు.

    మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపాలిటీల్లో 2,500 స్థానాల్ని గెలుచుకోబోతున్నాం. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విరోచిత పోరాటం చేశారు. కలిసొచ్చే లౌకిక పార్టీలను కలుపుకుని పోతాం.

    కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ నేతల నోళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మంచి ఫలితాలొచ్చాయి. 

    కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్యం,డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టింది.సింగరేణిలో జరుగుతున్న కుంభకోణణాన్ని బయటపెట్టాం. కొత్తగూడెం సింగరేణి బెల్ట్‌లో భాగం. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇస్తాము. ఇదే విషయంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మాట్లాడాం. కాంగ్రెస్,బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లౌకిక పార్టీలతో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది. కాంగ్రెస్,బీజేపీ కుయుక్తులు పన్నుతున్నాయి.

    కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి ,బీజేపీ అడ్డుకునే శక్తి బిఆర్ఎస్ పార్టీకే ఉంది. మున్సిపాలిటీల్లో  బీఆర్ఎస్ ఫలితాలు సంతృప్తినిచ్చాయి.
    హైదరాబాద్ కార్పోరేషన్ , ఎంపీటీసీ,జెడ్పీటీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం కనబరుస్తాం. ఈ దేశం చాల గొప్పది, ఇందిరా గాంధీ, ఎన్‌టీఆర్‌ లాంటి వారే ఓడిపోయారు. రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ సఫలం అవుతుంది. 2029లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.

    అధికార పార్టీ చాలా రకాలుగా సామ దాన దండోపాయలు ప్రదర్శించినా..ప్రజల మనస్సులు గెలుచుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి 40శాతం సర్పంచులు గెలిపించారు. నోరు మూసుకునేలా పురపోరులో ఫలితాలు సాధించాం.750 వరకు వార్డుల్లో BRS గెలుస్తుంది. వీరోచిత పోరాటం చేశాం.అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని వార్డుల్లో గెలిచి ప్రయత్నం చేస్తున్నారు.

    15 మున్సిపాల్టీలను సింగిల్ గా కైవసం చేసుకున్నాం.. మరో 15 మున్సిపాలిటీల్లో కూడా ఇతరుల సాయంతో అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బులు, మద్యం, అక్రమాలు తారా స్తాయికి చేరాయి.రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు గులాబీ జెండా పట్టుకొని తిరగాల్సి వస్తుంది.కాంగ్రెస్,బీజేపీ కలిసి పని చేస్తున్నట్లు అందరు చూస్తున్నారు.

    సింగరేణిలో దోపిడీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్‌,బీజేపీ నుంచి సమాధానం లేదు. కాంగ్రెస్‌,బీజేపీలను నిరోధించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మా నాయకులు,కార్యకర్తలు విరోచితంగా పోరాడారు. గద్వాలలో అధికారులను అడ్డం పెట్టుకుని గెలిచారు’అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 

  • తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. ప్లాప్‌ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవాలు చేసినట్లుగా ఉందని ఏపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) తాడేపల్లి నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్‌.. ‘ఈ రెండేళ్ళలో సంతృప్తికరమైన అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు. 

    రాష్ట్రంలో పరిస్థితి క్యాష్, సూట్‌కేసు, రాజేష్, లోకేష్.. అన్నట్టుగా మారింది. సంపద సృష్టిని చంద్రబాబు తన కుటుంబానికి చేసుకుంటున్నారు. మద్యం ఆదాయాలు ప్రభుత్వానికి రావటం లేదు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏఎంఆర్ సంస్థ చెక్‌పోస్టులు పెట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల భూములను తమ బినామీలకు దోచి పెడుతున్నారు. 

    గీతం యూనివర్సిటీకి అక్రమంగా ఐదు వేల కోట్ల విలువైన భూములను దోచి పెట్టారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్న చంద్రబాబు ఆ పేర్లు బయట పెట్టాలి. కుప్పానికి నీళ్లు ఇవ్వటం చేతగాని వ్యక్తి చంద్రబాబు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల మీద పెట్రోలు బాంబులు దాడులు చేశారు’అంటూ ధ్వజమెత్తారు.

  • విజయవాడ: కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టడానికా? అని ప్రశ్నించారు శాసన మండలివ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 13వ తేదీ) శాసనమండలిలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స. 

    ‘ అంబటి రాంబాబు పై దాడి చేస్తే...ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తరువాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యల పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విజ్ఞత కలిగిన వ్యక్తి...అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు. ప్రజా స్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా..??, మరోమాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. 

    రాజకీయాల్లో మహిళలను తీసుకు వచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారు. అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా...??, అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి... మీ తల్లిని అంటే ఒకటా...?, తల్లి ఎవరికైనా తల్లే. మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టమనా..?, మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే. అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు. అంబటి రాంబాబు తల్లిని దూషించిన వీడియోలు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు బొత్స.

    Botsa: అంబటి తల్లి కూడా తల్లే మీ తల్లిని తిడితే ఊరుకుంటారా?