Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో మార్చి 12న కొత్తగా ప్రారంభం కానున్న అల్లు సినిమాస్ ఇప్పుడు సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన అల్లు సినిమాస్‌ ఒక సినిమా హాల్‌ మాత్రమే కాదు ఇదొక విజువల్ వండర్. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ మరో లెవెల్లో ఉండనుంది.

    ఈ మల్టీప్లెక్స్‌లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకమైన డాల్బీ విజన్ స్క్రీన్. ఇది 75 అడుగుల వెడల్పుతో ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి ఇండియాలో కేవలం మూడు డాల్బీ విజన్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి పూణేలో 55 అడుగుల స్క్రీన్, రెండవది బెంగళూరులో 65 అడుగుల స్క్రీన్, ఇప్పుడు హైదరాబాద్‌లో 75 అడుగుల స్క్రీన్ రూపంలో అల్లు సినిమాస్. ఈ ప్రత్యేకత వల్ల అల్లు సినిమాస్ టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయన్నది సినీప్రియులలో పెద్ద చర్చగా మారింది.  

    పూణేలోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు సాధారణ రోజుల్లో రూ.500 లోపు, పెద్ద సినిమాల వీకెండ్స్‌లో రూ. 900 వరకు ఉంటాయి.  ఇక బెంగళూరులోని డాల్బీ స్క్రీన్‌లో టికెట్ రేట్లు క్యాపింగ్ సిస్టమ్‌కు ముందు గరిష్టంగా రూ.1000 వరకు ఉంటాయి. దాంతో హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ టికెట్ రేట్లు కూడా సాధారణ రోజుల్లో రూ.500, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు సీటింగ్ బట్టి రూ.1000 వరకు ఉండే అవకాశం.  

    తెలంగాణలో ప్రత్యేక టెక్నాలజీ, పరిమిత సీటింగ్ సామర్థ్యం ఉన్న స్క్రీన్లకు అధిక ధరలు వసూలు చేయడానికి ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. అల్లు సినిమాస్ అల్ట్రా లగ్జరీ మల్టీప్లెక్స్ సెగ్మెంట్‌లోకి వస్తుంది. దాంతోడాల్బీ విజన్ స్క్రీన్‌కు భారీగా టికెట్ రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ ప్రీమియం మల్టీప్లెక్స్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవబోతున్నాయి. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న అల్లు సినిమాస్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిగా ఉస్తాద్ భగత్ సింగ్,  ధురంధర్ 2  చిత్రాలు ప్రదర్శించబడుతాయి.

  • టాలీవుడ్ హీరో తారకరత్న.. చాలా చిన్న వయసులోనే చనిపోయారు. 2023 ఓ పాదయాత్రలో పాల్గొన్న ఈయన.. డీహైడ్రేషన్‌కి గురై అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్తే.. దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడినప్పటికీ ఫలితం లేదు. ఈయన మరణం తర్వాత భార్య అలేఖ్య పెద్దగా బయట కనిపించలేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భర్తని  తలుచుకుని పోస్టులు పెట్టేవారు. అయితే ఆస్పత్రిల్లో ఉన్న తారకరత్న చివరి రోజులు ఎలా గడిచాయి? అప్పుడు ఏమేం జరిగిందనేది అనే విషయాల్ని తొలిసారి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

    ‍'పాదయాత్రలో పాల్గొనేందుకు జనవరి 25నే వెళ్లాలి. కానీ అనుకోకుండా రెండు రోజుల తర్వాత వెళ్లారు. ఆ రోజు ఉదయమే ఫోన్ చేశారు. సాయంత్రానిక‍ల్లా వచ్చేసి పిల్లలతో కలిసి సినిమా చూస్తానని కూడా చెప్పారు. కానీ కాసేపటికే తారక్‌కి డీహైడ్రేషన్ అయిందని చెప్పి ఫోన్ వచ్చింది. మా అమ్మ కాల్ చేసి బాల బాబాయ్‌కి ఫోన్ చేయమంటే చేశా. ఆయన కూడా అదే చెప్పారు. తర్వాత విజయ్ సాయిరెడ్డి బాబాయ్ కాల్ చేసి.. నిష్క(తారకరత్న పెద్ద కూతురు)ని తీసుకుని కుప్పం వెళ్లమన్నారు. అప్పుడు చంద్రబాబు ఫోన్ చేశారు. అంతా బిజీగా ఉండే ఆయన కూడా ఫోన్ చేసేసరికి ఏదో సీరియస్ అని అర్థమైంది. దీంతో కుప్పం వెళ్లాను. అక్కడ తారకరత్నని బెడ్‌పై చూసి కుప్పకూలిపోయాను'

    'బాల బాబాయ్ నా దగ్గరుండి అన్ని చూసుకున్నారు. మా అన్నయ్య బెస్ట్ హాస్పిటల్‌కి  తీసుకెళ్దామని అంటే బెంగళూరు తీసుకెళ్లాం. అలా 23 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. చాలా పోరాడారు. నా కోసమే నాకు సమయం ఇచ్చేందుకే అన్ని రోజులు పోరాడారా అనిపించింది. నా కోసం అందరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. నేను అందరినీ వెళ్లిపోమని చెప్పా. డాక్టర్స్ వచ్చి అంతా అయిపోయింది అని చెప్పగానే మొదట బాల బాబాయ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తర్వాత అందరికీ చెప్పాను. తారకరత్నతో చివరి నిమిషం వరకు ఉన్నాను. ఆయనతో పాటు బెడ్‌పై పక్కనే పడుకుని చివరి గుండె చప్పుడు కూడా విన్నాను. చాలా నెలల వరకు ఆయన లేరని నిజాన్ని అంగీకరించలేకపోయాను' అని అలేఖ్య అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంది.  

    తారకరత్న విషయానికొస్తే.. 2002లో హీరోగా కెరీర్ ప్రారంభించారు.2023 వరకు అడపాదడపా మూవీస్ చేశారు గానీ సక్సెస్ కాలేకపోయారు. అయితే అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్యని ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు అంగీకరించకపోయినా సరే ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లకు 2013లో ఓ పాప పుట్టగా.. తర్వాత ట్విన్స్ అయిన బాబు, పాప పుట్టారు.

    (ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)

  • పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. తొలుత ఈ నెల 26న థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఓ వారం ముందే వచ్చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఉగాది సందర్భంగా 19వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే రన్ టైమ్ ఎంతనేది కూడా బయటకొచ్చింది.

    (ఇదీ చదవండి: ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్)

    'ఉస్తాద్..' చిత్రానికి విడుదలకు 9 రోజుల ముందే సెన్సార్ చేసేశారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈమేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సెన్సార్ సభ్యులు.. ఎలాంటి కట్స్ చెప్పలేదట. అలానే 2 గంటల 34 నిమిషాల నిడివితో మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

    హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రీ మూవీస్ నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ పనిచేస్తున్నాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. అయితే ఇది తమిళ సినిమా 'తెరి'కి రీమేక్ అని చాలారోజులుగా ప్రచారం నడిచింది. మూవీ టీమ్ మాత్రం పదే పదే వీటిని ఖండించింది. సెన్సార్ ముగించారు. ట్రైలర్ కూడా వదిలితే సినిమా కంటెంట్ ఏంటనేది ఓ క్లారిటీ వస్తుంది.

    (ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

  • 'అ!' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్.. టాలీవుడ్‌లో మంచి పేరుని సంపాదించుకున్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతడు.. తన సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్ ఇతడికి దక్కింది. 'దండోరా' చిత్రానికిగానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ పురస్కారం అందుకున్నాడు. సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి మరీ ముఖ్యంగా "దండోరా" టైటిల్ సాంగ్ ప్రేక్షకులని కదిలించాయి.

    టాలీవుడ్ లో మల్లేశం, జాంబీ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాలకు కూడా ఇతడే సంగీతమందించాడు. ఇప్పటివరకు దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాడు.చిన్నప్పటి నుంచి గద్దర్ పాటలు అంటే ఇష్టమని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఇప్పుడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. 

  • బాక్సర్ గెటప్ లో హీరోయిన్ నభా నటేశ్

    డస్కీ బ్యూటీ డింపుల్ గ్లామరస్ పోజులు

    బ్లాక్ డ్రస్సులో సన్నీ లియోన్ హొయలు

    మంచు కొండల్లో కావ్య థాపర్ వెకేషన్

    లంగా ఓణీలో కుందనపు బొమ్మలా కీర్తిభట్

    ఫిబ్రవరి జ్ఞాపకాలతో బ్యూటీ ఆలియా భట్

  • బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా 50 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. ఆయన భార్య లిన్ లైస్రామ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు, అభిమానులు అభినందలు చెబుతున్నారు. హిందీ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన రణ్‌దీప్‌ గతేడాది వీర్​ సావర్కర్ మూవీలో హీరోగా, జాట్ చిత్రంలో విలన్‌గా అలరించాడు. 

    ఈరోజు నేను తండ్రి అయినందుకు మా నాన్న పట్ల నా కృతజ్ఞత మరింత పెరిగిందని రణ్‌దీప్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ముఖ్యంగా నన్ను తండ్రిని చేసినందుకు.. మన చిన్న అమ్మాయిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు నా భార్య లిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ జంటకు  మొదటి బిడ్డగా పాప పుట్టడంతో ఆనందం మరింత రెట్టింపైంది.

    కాగా.. 2001లో వచ్చిన హిందీ మూవీ 'మన్‌సూన్‌ వెడ్డింగ్‌'తో నటుడిగా పరిచయమైన రణ్‌దీప్ హుడా.. తర్వాత గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, రిస్క్‌, కర్మ ఔర్‌ హోలీ, కాక్‌టైల్‌, జిస్మ్‌ 2, బాంబే టాకీస్‌, కిక్‌, భాఘీ 2, రాధే, మర్డర్ 3 తదతర చిత్రాల్లో నటించి మెప్పించాడు. కాగా.. 2023లో ప్రియురాలు లిన్ లైస్రామ్‌ని మణిపురి సంప్రదాయంలో రణ్‌దీప్ పెళ్లి చేసుకున్నాడు. 

     

  • గతకొన్ని రోజులుగా నటుడు, టీవీకే అధినేత విజయ్‌ , నటి త్రిషకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లడంతో ఆ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై సీనియర్‌ నటి,రాజకీయ నాయకురాలు ఖుష్భూ సుందర్‌ స్పందించారు. అది వాళ్ల పర్సనల్‌ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

    తాజాగా ఆమె ఓ మీడియా ఏజెన్సీతో మాట్లాడుతూ.. ‘ఈ అంశం(త్రిష-విజయ్‌ల రిలేషన్‌)తో ప్రజలకు ఏమి సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ప్రభావితం చేస్తే, మనం దాని గురించి మాట్లాడవచ్చు. వారి వ్యక్తిగత జీవితానికి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్భూ అన్నారు.

    త్రిష అంశం విజయ్‌ రాజకీయ జీవితంపై ప్రభావితం చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నలు బదులుగా.. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్‌ లైఫ్‌ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని ఖుష్భూ చెపుకోచ్చింది.
     

  • మలయాళ చిత్రాలకు ఓటీటీలో ఫుల్ డిమాండ్ ఉంటోంది. అక్కడ సూపర్ హిట్ ‍అయినా సినిమాలను డబ్ చేసి అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో మలయాళ హిట్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన మూవీ పెన్నుమ్ పోరాట్టమ్.

    తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

    ఈ సినిమాకు  రాజేశ్‌ మాధవన్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రాజేశ్‌ మాధవన్‌, రైనా రాధాకృష్ణన్‌, సుభాష్‌ చంద్రన్‌ కీలక పాత్రలు పోషించారు.  కేరళలోని ఓ గ్రామం చుట్టూ తిరిగే కథాంశంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ గ్రామంలోని రూల్స్‌ను ఓ యువతి, ఓ కుక్క ఎలా బ్రేక్ చేశారనే కోణంలో సెటైరికల్‌గా తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
     

     

  • డార్లింగ్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ, కల్కి: పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. వీటన్నింటి షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత సలార్ 2 ఉంది. కానీ ఇదెప్పుడు ఉంటుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇవి కాకుండా నెక్స్ట్ ఎవరితో చేస్తారా అనేది తెలియదు. ఇంతలోనే పలువురు దర్శకులు ప్రభాస్‌ని కలుస్తున్నారు. తాజాగా మలయాళ డైరెక్టర్ ఒకరు ప్రభాస్‪‌ని కలిశారు. ఓ సాయంత్రం అద్భుతంగా గడిపానని పోస్ట్ కూడా పెట్టారు.

    (ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

    గతేడాది మలయాళంలో వచ్చిన హిట్ సినిమాల్లో 'ఎకో' ఒకటి. ఓటీటీ డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్‌ని కూడా పలకరించింది. దీని కంటే ముందు 'కిష్కిందకాండం' అనే మరో మూవీ కూడా తీసిన దర్శకుడు దింజిత్ అయ్యతన్.. సోమవారం సాయంత్రం ప్రభాస్‌ని కలిశాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని, మరీ ముఖ్యంగా డిన్నర్‍‌లో తిన్న రొయ్యల బిర్యానీ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు.

    ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన హోంబలే నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌కి కూడా దింజిత్.. ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. అయితే దింజిత్, ప్రభాస్‌ని కొత్త ప్రాజెక్ట్ కోసమే కలిశాడా అనిపిస్తుంది. ఎందుకంటే హోంబలే సంస్థలో ప్రభాస్ మూడు మూవీస్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ఒకటి సలార్ సీక్వెల్ కాగా మిగతా రెండు ఏంటనేది క్లారిటీ రాలేదు. బహుశా దింజిత్-ప్రభాస్ కాంబోని ఏమైనా ఫిక్స్ చేశారా లేదా అనేది త్వరలో క్లారిటీ రావొచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ఊహించని కాంబో అవుతుంది. మరి దింజిత్.. తనకు సూటయ్యే థ్రిల్లర్ తీస్తాడా? లేదా ప్రభాస్‌కి తగ్గ స్టోరీని రెడీ చేస్తాడా చూడాలి.

    (ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)

  • ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

    ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్  ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు. 
     

  • ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' తదితర మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా చూడొచ్చనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.

    (ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)

    ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రవం'(Ravam Movie). శ్రీరామ్ మన్నార్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గానే ఇది ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా సరే ఈ మూవీ చూడొచ్చు. 'రవం' విషయానికొస్తే.. ఓ ఈఎన్‌టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయమని, తర్వాత నేను మీ సినిమాని నిర్మిస్తానని యువ దర్శకుడు మౌళికి చెప్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీ లైన్.

    (ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ)

  • గతేడాది బాలీవుడ్ స్టార్‌ అమిర్ ఖాన్ నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ  సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. 

    అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేయనని అమిర్ ఖాన్ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత నేరుగా యూట్యూబ్‌లోనే విడుదల చేశారు. రెంట్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్లు చెల్లించేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. కానీ ఈ బిగ్‌ డీల్‌ను అమిర్ ఖాన్‌ తిరస్కరించారు. ఈ సినిమా కేవలం థియేటర్లలోనే ఆడుతుందని.. ఓటీటీలో విడుదల ఉండదని అమిర్ ఖాన్‌ స్పష్టం చేశారు.

    అయితే  తాజాగా అమిర్ ఖాన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సోనీ లివ్‌ వేదికగా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.  కాగా.. ఈ చిత్రంలో ఆరోష్‌ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్‌ దేశాయ్, వేదాంత్‌ శర్మ, ఆయుష్‌ భన్సాలీ, ఆశిష్‌ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్‌ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు.

    మహేశ్ బాబు ప్రశంసలు...

    ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ప్రశంసలు కురిపించాడు. సితారే జమీన్‌ పర్‌.. అందరి మనసులు దోచుకుంటోంది. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
     

     

  • టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష‍్మీ నటించిన తాజా చిత్రం లేచింది మహిళా లోకం. ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

    ఈ సినిమా పుష్ప-2 రిలీజ్‌కు కంటే పూర్తి చేశామని మంచు లక్ష్మీ తెలిపింది. పుష్ప చిత్రంలో వాడినా ఫ్లవర్‌ కాదు.. ఫైర్ అనే డైలాగ్ తాను ఈ చిత్రంలో వాడానని వెల్లడించింది. అయితే నా డైలాగ్ బయటికి రాలేదని పేర్కొంది. కానీ సుకుమార్‌ గారు ఈ డైలాగ్‌ను పుష్పలో వాడేశారని తెలిపింది. పుష్ప చూసినప్పుడు ఈ డైలాగ్‌ చూసి చాలా ఫీలయ్యానని మంచు లక్ష్మీ అన్నారు. ఆ డైలాగ్‌ ముందే వచ్చిందన్న విషయం అందరికీ తెలియజేస్తున్నానని మాట్లాడింది. కాగా.. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 26నే థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

  • ఇండస్ట్రీలో నటీనటులు అందరూ ఒకేలా ఉండరు. కొందరు వచ్చామా పనిచేశామా వెళ్లిపోయామా అన్నట్లు ఉంటారు. మరికొందరు మాత్రం తమ చర్యలతో తోటి నటీనటుల్ని చాలానే ఇబ్బందులు పెడుతుంటారు. తాజాగా తమిళ నటి సోనా.. ప్రముఖ కమెడియన్ వడివేలు గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన వల్ల నరకం చూశానన చెప్పుకొచ్చింది. అందుకే 16 సినిమాల్లో ఆయనకు జంటగా నటించే అవకాశమొచ్చినా తిరస్కరించినట్లు మరోసారి స్పష్టం చేసింది.

    (ఇదీ చదవండి: మరోసారి నోరుజారిన రాజేంద్ర ప్రసాద్‌)

    'కుశేలన్ (తెలుగులో 'కథానాయకుడు') తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16కు పైగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అయితే వాటిని మర్యాదపూర్వకంగా తిరస్కరించాను. ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే ఆయనని నేను తట్టుకోలేనేమో అనిపించింది. ఓ రకంగా నరకం చూశాను. అందుకే ఆయనతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడకపవడమే మంచిదని అనుకుంటున్నాను' అని సోనా చెప్పుకొచ్చింది.

    తమిళంలో నటి, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సోనా.. ఎక్కువగా శృంగార తరహా పాత్రలే చేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన కుశేలన్ చిత్రం తెలుగులో కథానాయకుడు పేరుతో రిలీజైంది. మూవీ ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ.. ఇందులో కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. సోనా-వడివేలు కాంబినేషన్‌లోని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అయితే సెట్‪‌లో సోనాని వడివేలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఏమో గానీ ఇలా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

    వడివేలుపై గతంలోనూ పలువురు నటీనటులు ఇలాంటి ఆరోపణలే చేశారు. అందుకే చాన్నాళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల క్రితమే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి టైంలో సోనా, వడివేలుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోనా తెలుగులోనూ ఆయుధం, వీడే, విలన్, ఆంధ్రావాలా తదితర సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే తమిళ, మలయాళ మూవీస్‌లోనే కనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన)

  • ఇటీవల ప‌ద్మ‌శ్రీ పురస్కారం దక్కించుకున్న టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు డా.రాజేంద్రప్రసాద్‌ మరోసారి నోరు జారారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ కాగా.. రాజేంద్రప్రసాద్‌పై తమిళ సినీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అసలేం జరిగింది?
    ఇటీవల రాజేంద్రప్రసాద్‌కు క‌ళా ప్ర‌పూర్ణ కాంతారావు జాతీయ అవార్డును ప్రకటించారు. సోమవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ తన జర్నీతో పాటు కాంతారావు గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రసంగించారు. అయితే కాంతారావు నటనను పొగిడే క్రమంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎంజీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    కాంతరావు పేరు చెబితేనే భయపడిపోయేవాడు
    జానపద చిత్రాలతో దూసుకెళ్తున్న కాంతారావుని చూసి ఎంజీఆర్‌ భయపడిపోయాడు అని రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ‘తమిళ గ్రేటెస్ట్‌ హీరో ఎంజీఆర్‌ కూడా కాంతారావుని చూసి ఉ** పోసుకున్నాడు. కాంతరావు పేరు చెబితేనే ‘అమ్మ బాబోయ్‌..’ అనేవాడు. కారణం జానపదాలు. కాంతరావుగారి జానపదాలు చూసి.. ‘వాడెవడురా బాబోయ్‌..ఇండియన్‌ సినిమాలను లేపుకెళ్లిపోతున్నాడు’ అని ఉ** పోసుకునేవాడు’ అని పదే పదే ఎంజీఆర్‌పై రాయడానికి వీల్లేని పదాన్ని వాడడంతో రాజేంద్రప్రసాద్‌పై తమిళులు ఫైర్‌ అవుతున్నాడు. తాము దేవుడిగా కొలిచే గొప్ప నటుడిని పబ్లిక్‌  ప్లేస్‌లో ఇలా అవమానించేలా మాట్లాడడం సరికాదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ గొప్ప న‌టుడిని ప్ర‌శంసించ‌డానికి ఓ రాష్ట్రం అంతా దైవం క‌న్నా మిన్న‌గా ఆరాధించే ఎమ్జీఆర్‌ను ఇలా చుల‌క‌న‌గా చేసి మాట్లాడ‌డం స‌బ‌బు కాదంటూ సీరియ‌స్ అవుతున్నారు.

    పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్‌!
     

  • మెగా డాటర్ సుస్మిక కొణిదెల నిర్మాతగా కూడా రాణిస్తోంది. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీతో నాన్నకు సూపర్ హిట్ అందించిన కూతురిగా ఘనత సాధించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే బ్యానర్‌లో పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇవాళ సుస్మిత బర్త్ డే కావడంతో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా ఫ్యాన్స్‌ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

    ఈ ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా ఈ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మిత పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా ఇంట్లో మహిళలకు ప్రత్యేకమైన రోజు అవసరం లేదని.. ఎప్పుడూ గౌరవం, ప్రోత్సాహం ఎల్లప్పుడు లభిస్తూనే ఉంటాయని తెలిపింది. ప్రతి బర్త్‌ డేకు నాన్న చిరంజీవి, రామ్ చరణ్ తనకు గిఫ్ట్స్‌ ఇస్తారని వెల్లడించింది. కానీ ఆ బహుమతుల కంటే తనపై వారు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద గిఫ్ట్ అని పేర్కొంది. తాను ఏ పని అయినా చేయగలననే విశ్వాసం వారికి ఉందని సుస్మిత సంతోషం వ్యక్తం చేసింది. తనకు కుటుంబం మద్దతు కలిగి ఉండడం నా జీవితంలో గొప్ప బహుమతి అన్నారు.

     

Business

  • ప్రపంచ ఇంధన మార్కెట్లలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో దేశీయంగా వంటగ్యాస్‌ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న తన రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌ సముదాయాల్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ఉత్పత్తిని పెంచుతున్నట్లు మంగళవారం వెల్లడించింది.

    ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ కీలక ఇంధనాలకు నిరంతర సరఫరా కొనసాగడం జాతీయ ప్రాధాన్యతగా ఉందని పేర్కొంది.

    అలాగే కేజీ-డీ6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువును ప్రాధాన్య రంగాలకు మళ్లించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జాతీయ ఇంధన అవసరాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

    “భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది భారతీయ కుటుంబాల సంక్షేమం మా సంస్థకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జాతీయ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాం. అవసరమైన రంగాలకు ఇంధన సరఫరా నిరంతరం అందేలా చర్యలు కొనసాగిస్తాం” అని కంపెనీ తెలిపింది. అవసరమైన సమయంలో దేశానికి అండగా నిలబడటం రిలయన్స్‌ బాధ్యతగా భావిస్తుందని కూడా పేర్కొంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఇంధన భద్రతకు మద్దతుగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

    ఇదిలా ఉండగా దేశంలోని అన్ని రిఫైనరీలు ప్రొపేన్‌, బ్యూటేన్‌, ప్రొపైలిన్‌, బ్యూటెన్స్‌ వంటి సి3, సి4 స్ట్రీమ్‌లను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తికి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే వంటగ్యాస్‌ను దేశీయ వినియోగదారులకు మాత్రమే అందించాలని స్పష్టం చేసింది.

    ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే నిత్యావసర వస్తువుల చట్టం–1955చ పెట్రోలియం ఉత్పత్తుల (ఉత్పత్తి, నిల్వ, సరఫరా నిర్వహణ) ఆర్డర్–1999 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

  • మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కోసం మరోమారు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం 7 నిమిషాల్లో అన్ని కార్లు అమ్ముడైపోయాయి. డెలివరీలు ఏప్రిల్ 10 మొదలవుతాయి.

    మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో 999 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అన్ని కార్లు 7 నిమిషాల్లో అమ్ముడైపోయాయి. అంటే మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    మహీంద్రా బీఈ6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర రూ. 28.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధర లాంచ్ చేసిన సమయంలో ప్రకటించిన ధర కంటే రూ. 70వేలు ఎక్కువ. ధర పెంచినప్పటికీ.. డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

    మహీంద్రా బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో.. ఒకే ఫుల్ ఛార్జ్‌పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

    మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్‌బోర్డ్‌పై ఆల్కెమీ గోల్డ్‌లో నంబర్ ఉన్న బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్‌కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్‌తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్‌లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.

  • ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో.. 8వ పే కమీషన్ అనేది ప్రతిసారీ ఒక కీలక పరిణామాన్ని సూచిస్తుంది. ఇది కేవలం జీతం పెంపు మాత్రమే కాదు, ఉద్యోగ జీవన విధానాన్ని, ప్రమోషన్స్, పెన్షన్‌లను కూడా ప్రభావితం చేసే నిర్ణయం అవుతుంది. ప్రతి కొత్త పే కమీషన్ ప్రవేశపెట్టబడినప్పుడు, ఉద్యోగులు & పింఛన్ గ్రహీతల ఆకాంక్షలు పెరుగుతాయి.

    ఈసారి కూడా 8వ పే కమీషన్ పరిణామాలపై ఉద్యోగులలో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడినట్లు తెలుస్తోంది. జీతం, ప్రమోషన్లు, పెన్షన్లపై ముఖ్యమైన మార్పులు రావచ్చని ఊహలు వినిపిస్తున్నాయి.

    ఇటీవలి ఒక ముఖ్యమైన సమావేశంలో.. ఉద్యోగ సంస్థలు స్పష్టం చేసిన విధంగా, ఈసారి జీతమే కాకుండా ఉద్యోగుల కెరీర్ వృద్ధి కూడా అత్యంత ప్రాముఖ్యం కలిగిందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు అనేక సంవత్సరాలు ఒకే పదవిలో కొనసాగుతుండటం, వారి మానసిక శక్తిని తగ్గిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, కనీసం ఐదు ప్రమోషన్లను నిర్ధారించాలన్న డిమాండ్ ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల కెరీర్‌లో కొత్త ఉత్సాహాన్ని పుంజగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

    సమావేశంలో.. ప్రమోషన్లతో పాటు, కనీస మూల జీతం, వార్షిక జీతం పెంపు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఉద్యోగ సంస్థలు అభిప్రాయపడుతున్న విధంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, జీతం నిర్మాణం సౌకర్యవంతంగా ఉండే విధంగా సర్దుబాటు చేయడం అవసరం.

    పే కమీషన్ ప్రభావం కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులకే పరిమితం కాదు. పింఛన్ గ్రహీతల పైన కూడా ప్రభావం ఉంటుంది. కొత్త సిఫార్సులు జీతాలు & భత్యాలను మెరుగుపరిస్తే, పింఛన్ కూడా పెరుగుతుంది. అందువల్ల, రిటైర్డ్ ఉద్యోగులు కూడా దీనిని శ్రద్దగా గమనిస్తారు.

    ఉద్యోగ సంస్థలు త్వరలో తమ డిమాండ్లను ఒక ప్రపోజల్ రూపంలో కమీషన్‌కు సమర్పించనున్నారు. ఆ ప్రపోజల్ ఆధారంగా మరింత చర్చలు జరగటం, ఆఖరికి తుది సిఫార్సులు రూపొందించబడటం జరుగుతుంది. ఆ తర్వాతే ఉద్యోగులు & పింఛన్ గ్రహీతలు ఎంత లాభం పొందతారో స్పష్టత ఏర్పడుతుంది.

  • భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్.. తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటీసు పీరియడ్‌ను మినహాయించాలని అభ్యర్థించారు. ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా వెల్లడించబడింది.

    ఇండిగో తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు స్వీకరిస్తూ.. సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.

    2025 డిసెంబరులో కొత్త నియమాలను అమలు చేయడంలో ఎదురైన సమస్యల వల్ల భారీ ఆపరేషనల్ సంక్షోభం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు 2,500 పైగా విమానాలు రద్దు కావడం, 1,900 పైగా విమానాలు ఆలస్యం కావడం వల్ల 3 లక్షలకి పైగా ప్రయాణికులు ప్రభావితులు అయ్యారు. DGCA ఈ ఘటనపై రూ. 22.20 కోట్ల రికార్డు జరిమానా విధించింది. అంతే కాకుండా ఎల్బర్స్‌కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.

  • ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.

    ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్‌లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

    నెలవారీ ఖర్చులు
    ఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.

    ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.

    ఎక్కువ సంపాదిస్తే
    రూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్‌ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.

    చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.

    వన్ మంత్ రూల్
    ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్‌ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.

    మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక

  • భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ ఎనేబుల్డ్ రిపేర్ షాప్ నెట్‌వర్క్ ఆటోరాక్స్.. ఆఫ్టర్‌మార్కెట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి బూడ్మోతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా రిపేర్ షాపులు, స్పేర్ పార్ట్స్ క్యాటలాగ్‌లు, అమ్మకందారులు & ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు అన్నీ ఒకే డిజిటల్ వ్యవస్థలో రియల్ టైమ్‌లో అనుసంధానిస్తుంది.

    ఆటోరాక్స్ ప్రస్తుతం భారతదేశంలో 2000కిపైగా వర్క్‌షాప్‌లతో దేశంలో అతిపెద్ద డిజిటల్ గ్యారేజ్ నెట్‌వర్క్‌గా ఉంది. ఇది ఇప్పటికే 40 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ స్వతంత్ర గ్యారేజీలకు డీలర్‌షిప్ స్థాయి డిజిటల్ టూల్స్ అందించి వాటి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతోంది.

    ఇప్పటి వరకు ఆటోమొబైల్ రిపేర్ రంగంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినప్పటికీ సరైన స్పేర్ పార్ట్‌ను కనుగొనడం అనే దశలో మాత్రం చాలా సమస్యలు ఉండేవి. టెక్నీషియన్లు పని మధ్యలో ఆపి వేరే సిస్టమ్‌లలో పార్ట్స్ వివరాలు చూసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల సమయం వృథా కావడం, తప్పులు జరిగే అవకాశం పెరగడం వంటి సమస్యలు ఉండేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆటోరాక్స్ మరియు బూడ్మో కలిసి పనిచేస్తున్నాయి. దీంతో రిపేర్ ఆర్డర్ ఒక సాధారణ డాక్యుమెంట్‌గా కాకుండా.. డయాగ్నోసిస్, పార్ట్స్ కనుగొనడం, కొనుగోలు ప్రక్రియలను కలిపే ఒక తెలివైన డిజిటల్ హబ్‌గా మారుతుంది.

  • అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదలతో ఇంధనాల కొనుగోలు కోసం భారత్‌ ప్రతి నెలా 7–8 బిలియన్‌ డాలర్ల మేర అదనంగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి రానుందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ముందు 66 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 120 బిలియన్‌ డాలర్లకు ఎగిసిందని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రేట్లు దాదాపు రెట్టింపై యూనిట్‌కి (ఎంబీటీయూ) 24–25 డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. ఇలా ఇంధనాల రేట్లు ఎగియడం వల్ల రవాణా, తయారీ, ఆహారోత్పత్తులు, కమోడిటీల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేఠి చెప్పారు.

    భారీ రేట్లు కొనసాగే వ్యవధి, డిమాండ్, పాలసీపరమైన చర్యలను బట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక క్రూడ్‌ రేటు సగటున 10 డాలర్లు పెరిగితే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్‌) 30–40 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ చెప్పారు. ముడిచమురు ధర సగటున 100–105 డాలర్లుగా ఉంటే జీడీపీలో క్యాడ్‌ 1.9–2.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.

    క్రూడాయిల్‌ ధరలు 10 శాతం పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 80–100 బేసిస్‌ పాయింట్లు, వినియోగదారుల ద్రవ్యోల్బణం 40–60 బేసిస్‌ పాయింట్లు పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. దేశీయ అవసరాలకు సంబంధించి భారత్‌ 85 శాతం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకొంటుండగా, ప్రతి రోజూ 50 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ వినియోగం ఉంటోంది.

    ఐఈఏకి ఇండియా నో..
    ఆయిల్‌ ధరలకి కళ్లెం వేసేందుకు వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసేలా ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) చేపట్టిన కార్యక్రమంలో భారత్‌ భాగం కాబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షోభాన్ని సృష్టించిన వారిపైనే, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉందనేది ప్రభుత్వ అభిప్రాయమని పేర్కొన్నాయి.

    దేశీయంగా 5.33 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ని నిల్వ చేశారు. సరఫరాపరమైన సవాళ్లు తలెత్తితే, వాటిని ముందుగా దేశీయంగా ప్రజల అవసరాల కోసమే వినియోగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 2021లో అమెరికా సారథ్యంలో ఇలాంటి కార్యక్రమమే చేపట్టినప్పుడు భారత్‌ 5 మిలియన్‌ బ్యారెళ్ల ఆయిల్‌ను విడుదల చేసింది.

  • ఒకవైపు ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, మరోవైపు భారీగా పతనమవుతున్న మార్కెట్లు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం వస్తుందని ఇందులో హెచ్చరించారు.

    చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం గురించి నేను రిచ్ డాడ్స్ ప్రాఫసీ (2013)లో హెచ్చరించాను. అది రాబోతోంది. 2008లో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనిని గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని పిలుస్తారు. ఆ సమయంలో చాలా బ్యాంకులు & ఆర్థిక సంస్థలు కూలిపోయాయి. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెట్టుబడి బ్యాంక్ అయిన లెమాన్ బ్రదర్స్ దివాళా తీసింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద సంక్షోభం వచ్చే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు.

    కియోసాకి అభిప్రాయం ప్రకారం.. 2026లో మరో పెద్ద ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉంది. ఈ పతనం ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థలలో ఒకటైన 'బ్లాక్ రాక్'తో సంబంధం ఉన్న.. ప్రైవేట్ క్రెడిట్ వ్యవస్థ కారణంగా రావచ్చని ఆయన భావిస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భారీ అప్పుల్లో ఉన్నాయని, ఆ అప్పులను తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుందని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్ అయిన వృద్ధుల సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం.. డబ్బును కాపాడుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం, ఆయిల్ వెల్స్ వంటి సహజ వనరులలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం అని చెబుతున్నారు.

    నాకు వెండి అంటే చాలా ఇష్టమని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఎందుకంటే తక్కువ డబ్బుతో కూడా వెండిని కొనుగోలు చేయవచ్చని ఆయన అభిప్రాయం. కాబట్టి మీరు కూడా కేవలం 10 డాలర్లతో వెండి నాణేలు లేదా చిన్న ముక్కలు కొనుగోలు చేయండి. అవసరమైతే ఒక రోజు తినడం ఆపేసి.. వెండిపై పెట్టుబడి పెట్టండి. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారని, జాగ్రత్త వహించండి, అని కియోసాకి తన ట్వీట్ పూర్తి చేశారు.

  • మంగళవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 639.82 పాయింట్లు లేదా 0.82 శాతం లాభంతో 78,205.98 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 24,261.60 వద్ద నిలిచాయి.

    ఆటమ్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్, డీసీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, డీసీఎం నౌవెల్ లిమిటెడ్, అక్షర్‌కెమ్ (ఇండియా) లిమిటెడ్, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • రాజకీయ, భౌగోళిక సవాళ్లు ఎదురైనప్పుడు ఆందోళనకు లోనుకావద్దని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంతా పాండే ఇన్వెస్టర్లకు సూచించారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయాలకు లోనుకాకుండా వ్యవహరించవలసిందిగా సలహా ఇచ్చారు. దేశీయంగా ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

    ప్రస్తుత సవాళ్లు సద్దుమణిగేవరకూ వేచిచూడమని సూచించారు. దీర్ఘకాలంలో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ పటిష్టత కొనసాగుతుందని, తద్వారా భారత్‌ వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ–50.. 30 వసంతాల వేడుక సందర్భంగా పాండే ఇన్వెస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.

    పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయంగా స్టాక్‌ మార్కెట్లు అత్యధికస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక నౌకా మార్గాలలో ఎదురవుతున్న అవాంతరాల కారణంగా చమురు, గ్యాస్‌ సరఫరాలకు విఘాతం ఏర్పడుతున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ సరఫరాలమధ్య సమతౌల్యం దెబ్బతింటున్నట్లు వివరించారు.  

  • అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.

    నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితి

    దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏఆర్‌) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.

    సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.

    హైదరాబాద్‌లో గ్యాస్‌ పంపిణీదారులు ఉన్నస్టాక్‌ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్‌లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్‌లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.

    అసలు కారణం ఏమిటి?

    భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్‌ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.

    రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖ

    వాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.

    ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: డబుల్‌ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు

NRI

  • న్యూయార్క్: అమెరికాలోని ప్ర‌ముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్ట‌ర్‌ల‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.

    గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుక‌ల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సంద‌ర్భంగా సత్కరించారు.

    FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.

    కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.

    నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్‌ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.

    ఈ సంద‌ర్భంగా పురస్కార గ్రహీతలు త‌మ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ స‌తీమ‌ణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.

    కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.

    ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది.

International

  • టెహ్రాన్‌: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. “నిన్ను మించిన వారికి కూడా ఇరాన్‌ను నాశనం చేయడం సాధ్యం కాలేదు. జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వే ఖతం అవుతావు” అని అన్నారు.

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీని డొనాల‍్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని పై విధంగా స్పందించారు.

    కాగా, ‘హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్‌ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గత దాడుల కంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ మళ్లీ ఎప్పటికీ పునర్నిర్మాణం కాలేదు. అంతలా ఆ దాడులు ఉంటాయి’ అని తెలిపారు. కానీ, అలా జరగకూడదని తాను ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని అని ట్రంప్ అన్నారు.

    మొజ్తాబాను కూడా ట్రంప్‌ హెచ్చరిస్తూ ఆయన ప్రశాంతంగా జీవించలేరని చెప్పారు. ఇరాన్ ఎంచుకున్న లీడర్‌ తనకు నచ్చలేదని ట్రంప్‌ చెప్పారు. అలీ ఖమేనీ రెండో కుమారుడిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

    మోజ్తబా ఖమేనీ నియామకానికి ముందు ట్రంప్ స‍్పందిస్తూ.. ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గతంలో వెనెజువెలా విషయంలో అమెరికా జోక్యం ఉన్నట్లే ఇప్పుడూ ఇరాన్‌ విషయంలో ఉండాలని అన్నారు.

    ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది.

    హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హోర్ముజ్ జలసంధి నుంచి ఒక లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పింది. పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి ప్రపంచానికి చమురు రవాణా జరిగే అత్యంత కీలక సముద్ర మార్గమే హోర్ముజ్ జలసంధి.

    ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. మంగళవారం ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరిగింది.

    బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇరాన్ దాడి ఒక నివాస భవనాన్ని తాకింది. 29 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా తూర్పు చమురు ప్రాంతంపై వచ్చిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కువైట్ నేషనల్ గార్డ్ 6 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రువైస్ పారిశ్రామిక సిటీలో డ్రోన్ దాడి తర్వాత అగ్ని ప్రమాదం చెలరేగింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పని చేశాయి.

  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తీసుకుంటుందని ప్రకటించారు. ఇదే జరిగితే చమురు సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది.

    పశ్చిమాసియాలో పరిస్థితులు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ ఏ మాత్రం తగ్గకుండా అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. గల్ఫ్ కంట్రీస్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా హర్మూజ్ జలసంధిని ఆధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ముడిచమురు రవాణాలో 20 శాతం వరకూ ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీనిని ఇరాన్‌ బ్లాక్ చేసింది. నౌకలు కదిలితే పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో భారత్‌తో పాటు చాలా దేశాలకు ముడిచమురు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికసంక్షోభం తలెత్తే అవకాశం తలెత్తే అవకాశం ఉందని పలు సంస్థలు హెచ్చరించాయి.ఈ నేపథ్యంలోనే ట్రంప్ హర్మూజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా తలెత్తిని చమురు సంక్షోభానికి పులిస్టాప్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అమెరికా స్థావరాలపై దాడులు తీవ్రతరం చేస్తున్న ఇరాన్‌.. హర్మూజ్‌ను స్వాధీనం చేసుకుంటే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. ఈ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

  • వైట్‌ ఫాస్ఫరస్‌.. ప్రాణవాయువుతో కలిస్తే ప్రాణం తీసేంత స్థాయి ప్రమాదకారిణి. సాగుభూముల్లో పంట మొదలు జనావా సాలు, జనం మధ్య పడితే భగ్గున మండి శాశ్వత వినాశనం చేసే శక్తి ఈ వైట్‌ ఫాస్ఫ రస్‌కు ఉంది. ఇంతటి ప్రమాదకర రసాయ నాన్ని ఇజ్రాయెల్‌ వాయుసేన విచ్చల విడిగా లెబనాన్‌పై ప్రయోగిస్తోందని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ అనే లాభా పేక్షలేని స్వచ్ఛంద సంస్థ తాజాగా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మార్చి నెల మూడో తేదీన దక్షిణ లెబనాన్‌లోని యోహ్మోర్‌ నగరంపై ఇజ్రాయెల్‌ వాయు సేన వైట్‌ ఫాస్ఫరస్‌తో దట్టించిన మందుగుండును ప్రయోగించి స్థానికుల జీవితాలను గాల్లో దీపంలా మార్చేసింది. వైట్‌ ఫాస్ఫరస్‌ను ఉపయోగించారంటూ వేర్వేరు ప్రదేశాల్లో తీసిన ఏడు ఫొటోలను సంస్థ సోమవారం బయటపెట్టింది.

    గాలి తగలగానే వైట్‌ ఫాస్ఫరస్‌ (White Phosphorus) సెకన్ల వ్యవధిలో మండిపోతుంది. సగటు పౌరునికి జరిగే నష్టం గురించి చెప్పక్కట్లేదు. కళ్లు మండిపోతాయి. శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక చిన్నారులు, వృద్దులు, గర్భిణుల అవస్థ చెప్పనక్కర్లేదు. ఫాస్ఫరస్‌ను యుద్ధంలో వినియోగించడం చట్టవిరుద్ధం. ముఖ్యంగా జనావాసాలపై ప్రయోగించడం అత్యంత ప్రమాదకరం. ఇది తగిలితే లోతైన గాయాలు కావడం ఖాయం’’ అని లెబనాన్‌లో హెచ్‌ఆర్‌డబ్ల్యూ సంస్థలో పరిశోధకుడు రామ్జీ కైస్‌ అన్నారు.

    ‘‘అన్నీ తెలిసి యుద్దంలో రసాయనాలను వినియోగించడం అనేది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అవహేళన చేయడమే అవుతుంది. ఇలాంటి రసాయనాల వినియోగంతో జనాలను అప్రమత్తంచేసే ముందస్తు రక్షణాత్మక విధానాల అమలుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఇజ్రాయెల్‌ వెంటనే వైట్‌ ఫాస్ఫరస్‌ వాడకాన్ని ఆపేయాలని దాని మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీలను హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థ డిమాండ్‌చేసింది.

    ఏమిటీ వైట్‌ ఫాస్ఫరస్‌?
    ఇదొక రసాయన మిశ్రమం. శతఘ్నుల నుంచి దూసుకొచ్చే ఫిరంగి గుళ్లు, విమానాల నుంచి ప్రయోగించే బాంబులు, రాకెట్ల నుంచి వెలువడే పేలుడు పదార్థాల్లో వైట్‌ ఫాస్ఫరస్‌ను కొన్ని సార్లు దట్టిస్తారు. ఇది గాల్లో ఆక్సిజన్‌తో చర్య జరిపి వెంటనే మండుతుంది. ఇది మనుషులపై పడితే ఒళ్లు కాలిపోతుంది. శాశ్వత గాయాలు జీవితాంతం నరకం చూపిస్తాయి. దాడితోపాటు ఇతర రకాలుగా సైనిక చర్యల్లో దీనిని ఉపయోగిస్తారు. నిర్దేశిత ప్రాంతంలో పొగమేఘాలు ఏర్పడేలా చేయడం, ఒక లక్ష్యాన్ని పొగ ద్వారా గుర్తుపెట్టుకోవడం, ఒకరకమైన సైగలాగా దీనిని ఉపయోగిస్తారు. ఇది పేలుడు పదార్థం నుంచి వెలువడగానే దాదాపు 250 మీటర్ల విస్తీర్ణంలో విశాలంగా పరుచుకుంటుంది. వెంటనే ఆక్సిజన్‌తో చర్య జరిపి సమీప వస్తువులను కాల్చేస్తుంది.

    ఎం825 రకం 155ఎంఎం శతఘ్నుల ద్వారా ఈ వైట్‌ ఫాస్పరస్‌ గుళ్లను ప్రయోగించారని హ్యూమన్‌ రైట్‌ వాచ్‌ సంస్థ ఫొటోలతో సహా సాక్ష్యాధారాలను బయటపెట్టింది. యోహ్మోర్‌లో స్థానికులు తమ ఫేస్‌బుక్‌ ఖాతాల్లో పెట్టిన ఫొటోల్లోనూ ఇవే ధూళి మేఘాలు కన్పించడం గమనార్హం. దీనికితోడు కచ్చితంగా ఫలానా ప్రదేశాలను ఖాళీ చేయాలని బీరుట్‌ దక్షిణ ప్రాంతాల వాసులను తొలుత ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. వీటిల్లో హెజ్‌బొల్లా అధీనంలోని ప్రాంతాలూ ఉన్నాయి. ఈ లెక్కన ఇక్కడ భారీస్థాయిలో దాడి జరగబోతోందని ఇజ్రాయెల్‌ పరోక్షంగా ప్రకటించింది. ఆ తర్వాతే వైట్‌ ఫాస్ఫరస్‌ మేఘాలు గాల్లో కన్పించాయని సంస్థ పేర్కొంది.

    మూడేళ్ల క్రితమూ  ఇదే ధోరణి
    గాజాలోనూ ఇజ్రాయెల్‌ ఇదే తరహాలో వైట్‌ ఫాస్ఫరస్‌ను అన్యాయంగా ప్రయోగించి పాలస్తీనియన్లకు నరకం చూపించిందని ఆనాడు కథనాల వెలువడ్డాయి. 2023 అక్టోబర్‌ 10, 11వ తేదీల్లో గాజాతోపాటు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్‌ ఈ రసాయనాన్ని విరివిగా వాడినట్లు వీడియోలను హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ విడుదలచేసింది. గాజా సిటీ పోర్ట్‌తోపాటు ఇజ్రాయెల్‌–లెబనాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.

    చ‌ద‌వండి: తొలిసారిగా బయటపడిన ఇజ్రాయెల్‌- అమెరికా విబేధాలు

    తాజా దాడుల ధాటికి 5,00,000 మంది లెబనాన్‌వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముఖ్యంగా ఘోబియెరీ, హరేట్‌ హ్రియిక్, సఫిర్‌ ప్రాంతాల్లో జనం ప్రాణభయంతో వలస పోతున్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో 394 మంది చనిపోయారు. 1,000 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్, 2024 మే మధ్య సైతం వైట్‌ ఫాస్ఫరస్‌ను ఇజ్రాయెల్‌ వినియోగించిందని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థ వెల్లడించింది.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

  • వాషింగ్టన్‌: ఇరాన్‌పై ఉమ్మడిగా సమరశంఖం పూరించిన అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయి. ఇరాన్‌కు చెందిన వైమానిక స్థావరాలను పేల్చేస్తూ, యుద్ధనౌకలను ముంచేస్తూ దేశ సైనికశక్తిని అమెరికా నిర్వీర్యంచేస్తుంటే ఇజ్రాయెల్‌ పనికట్టుకుని ఇరాన్‌ చమురునిల్వలపై బాంబులేసి అగ్నికి ఆహుతిచేస్తోంది. ఆయిల్‌ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇజ్రాయెల్‌పై అమెరికా అంతెత్తున లేచి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏ రకంగా చూసినా చమురు క్షేత్రాలపై దాడి అనేది ఏమాత్రం మంచి ఆలోచన కాదని అమెరికా అభిప్రాయపడింది. ఈ మేరకు బూతు ధ్వనించేలా ‘డబ్ల్యూటీఎఫ్‌’ అంటూ ఒక మాటను సందేశంగా పంపించింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి మొదలెట్టాక ఇజ్రాయెల్, అమెరికా బహిరంగంగా అభిప్రాయబేధాలను వ్యక్తపరచడం ఇదే తొలిసారి.

    శనివారం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని పలు చమురు మౌలికసదుపాయాలపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల ధాటికి ఆయిల్‌ కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా కిలోమీటర్ల పరిధిలో నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఆయిల్‌ డిపోలపై తమ దాడులను ఇజ్రాయెల్‌ సమర్థించుకుంది. తమ జనావాసాలపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఆయిల్‌ డిపోలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోరెస్సెస్‌ (ఐడీఎఫ్‌) పేర్కొంది. ఈ చమురు డిపోల నుంచి ఇరాన్‌ సైనికబలగాలకు ఇంధనం సరఫరా అవుతోందని వెల్లడించింది.

    అయితే దైనందిన జీవితంలో భాగమైన ఇంధన అవసరాలు తీర్చే చమురు డిపోలపై దాడి చేసి అనవసరంగా అంతర్జాతీయ చమురుధరల పెరుగుదలకు ఇజ్రాయెల్‌ ఆజ్యంపోస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి గురైనవి చమురు ఉత్పత్తి కేంద్రాలు కావు. కానీ సాధారణ వినియోగదారుల అవసరాలు తీర్చే చమురు డిపోలు తగలబడితే జనాల్లో ఆగ్రహావేశాలు పెరిగి మళ్లీ పరోక్షంగా ఇరాన్‌ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుందని అమెరికా భావిస్తోంది. ఇది జరక్కుండా ఉండాలంటే పౌరులకు ఇబ్బందుల్లోకి నెట్టేసే పనులు చేయొద్దని అమెరికా నిర్ణయించుకుంది. అందుకే ఇజ్రాయెల్‌కు సైతం ఇవే సూచనలు చేసినా వాటిని బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్‌ ఇష్టారీతిన దాడులు చేస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

    ‘‘దాడుల విషయాన్ని ఇజ్రాయెల్‌ మాకు ముందే తెలియజేసింది. కానీ ఇంతటి విపరీతమైన స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు మాట మాత్రమైనా చెప్పలేదు’’అని ఉన్నతాధికారి ఒకరు అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఇంతటి దాడులను మా అధ్యక్షుడు ట్రంప్‌ అస్సలు అంగీకరించడు. చమురును భద్రపర్చుకోవడమే ఆయనకు కావాలి. ఇలా తగలబడితే ఏమొస్తుంది?. అసలు చమురు నిల్వలపై దాడులెందుకు?. ఇది చివరకు ధరల పెరుగుదలకు కారణమవుతుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వివరాలతో యాక్సియస్‌ వార్తాసంస్థ వెలువర్చిన కథనంపై ఇటు వైట్‌హౌస్‌ అటు ఐడీఎఫ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  

    చమురు జోలికొస్తే ఊరుకోం: ఇరాన్‌ 
    చమురును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ఊరుకునేది లేదని ఇరాన్‌ మిలటరీ వ్యవహారాలు చూసుకునే ఖాటమ్‌ అల్‌–అన్బియా ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి హెచ్చరించారు. ‘‘పశ్చిమాసియాలోని ఇతర దేశాలపై దాడులు చేయొద్దని భావిస్తున్నాం. మా చమురు డిపోలపై దాడులు కొనసాగితే మా నిర్ణయాన్ని పునర్‌పరిశీలించాల్సి ఉంటుంది. పొరుగుదేశాల చమురుడిపోలపై మేం గనక దాడులు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 200 డాలర్ల(దాదాపు రూ.18,461)కు పెరగడం ఖాయం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    చ‌ద‌వండి: ఈ క్షిప‌ణుల‌ను ఇరాన్ ధ‌నాధ‌నా వేసింద‌నుకో..

    మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దెబ్బకు గత మూడున్నరేళ్లలో ఎన్నడూలేనంతగా సోమవారం బ్యారెల్‌ క్రూడ్‌ ధర 100 డాలర్లకు చేరడం తెల్సిందే. హార్మూజ్‌ జలసంధి గుండా చమురునౌకల రాకపోకలు స్తంభించిపోవడం ధరల ఉరవడికి మరో కారణమైంది. 100 మార్కును దాటడంపై ట్రంప్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘కొన్ని సందర్భాల్లో మనం భారీ మూల్యం చెల్లించుకుంటాం. ఇప్పుడు ప్రపంచశాంతి కోసం చేసే యుద్ధం వేళ అన్ని దేశాలూ ఇలాంటి చిన్న చిన్న మూల్యాలను చెల్లించాల్సిందే. ఇరాన్‌ సంక్షోభం ముగిసిన వెంటనే ధరలు మళ్లీ ఉన్నపళంగా కిందకు దిగొస్తాయి. తెలివితక్కువ వాళ్లు మాత్రమే ఈ విషయాన్ని విభిన్నంగా ఆలోచిస్తారు’’అని వ్యాఖ్యానించారు.     

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాను యుద్ధ భయాలు వీడడం లేదు. అయితే, ఇప్పుడు ఇరాన్ వద్ద ఉన్న ఓ శక్తిమంతమైన ఆయుధం పలు దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఆ ఆయుధాన్ని నాశనం చేసేందుకే.. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భూతల దాడులకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న ఆ ఆయుధం ఏమిటి? ఇరాన్ దాచిన ఆ ఆయుధాన్ని వెలికి తీయడం అమెరికా, ఇజ్రాయెల్ బలగాలకు సాధ్యమవుతుందా?

    భూ గర్భంలో దాచిన ఇరాన్‌
    ఆ ఆయుధాన్ని ఇరాన్‌ భూ గర్భంలో దాచింది. ఇరాన్ వద్ద ఉన్న ఆ శక్తిమంతమైన క్షిపణి గురించి, దాని విధ్వంసక సామర్థ్యం, పరిధి ఏమిటన‍్న విషయాలపై పాశ్చాత్య, పశ్చిమాసియా దేశాల నెటిజన్లు సెర్చింజన్లను జల్లెడపడుతున్నారు. ఇరాన్ వద్ద గగనతల దాడులకు కేవలం రెండు సుఖోయ్-14 యుద్ధ విమానాలుండగా.. వాటిని నాశనం చేసినట్లు ఖతార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. మిగ్-29 విమానాలు 24 దాకా ఉన్నాయి. 

    పాత తరం ఫాంటమ్ జెట్లు 60 వరకు, ఎఫ్-14 యుద్ధ విమానాలు 40 దాకా ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఇరాన్ తన యుద్ధ విమానాలతో దాడులు జరిపిన దాఖలాలు పెద్దగా లేవు. ఇరాన్ వద్ద భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. వీటిని కూడా ఇరాన్ ఈ యుద్ధంలో ఇప్పటి వరకు వినియోగించలేదు. అందుకే, అమెరికా వైమానిక దళం ఇరాన్ గగనతలంపై ఆచితూచి ముందుకు సాగుతోంది. ఇరాన్ వద్ద భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.

    క్షిపణులపైనే ఆధారపడి యుద్ధ తంత్రం 
    యుద్ధంలో ఇరాన్‌ క్షిపణులనే నమ్ముకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు సహకరించే దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ దగ్గర 3,000కు పైగా పెద్ద క్షిపణులున్నాయి. వీటిల్లో 27 రకాల బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం ఇప్పటి వరకు వినియోగించినట్లు అంచనా. క్రూయిజ్ క్షిపణులను పెద్దగా వినియోగించిన దాఖలాలు లేవు. షహబ్-1 వంటి క్షిపణుల పరిధి 300 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అయితే.. 3,000 నుంచి 4,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే ఖైమ్ వంటి క్షిపణులను ఇరాన్ ఇంకా తన అమ్ముల పొది నుంచి తీయలేదని తెలుస్తోంది. 2,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సత్తా ఉన్న క్రూయిజ్ క్షిపణులు ఇప్పుడు ఇరాన్ శత్రుదేశాల పాలిట ముప్పుగా ఉన్నాయి.

    వీటిని పావ్, ఖుద్స్, రాద్ నగరాలను లక్ష్యంగా చేసుకునేలా ప్రయోగించే ప్రమాదాలు లేకపోలేదు. అయితే.. ఇరాన్ వద్ద ఉన్న భారీ బాలిస్టిక్ క్షిపణులు ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. వీటిని ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని లేదా దిశను మార్చడం సాధ్యం కాదు. హైపర్ సోనిక్ వేగం కారణంగా నిలువరించడం అసాధ్యమేనని తెలుస్తోంది. దిశ, లక్ష్యాన్ని మార్చగలిగే క్రూయిజ్ క్షిపణులను ఇప్పటికీ ఇరాన్ వాడకపోవడంతో.. ఏ క్షణమైనా యుద్ధం మరింతగా ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇరాన్ క్షిపణుల నిల్వపై అమెరికా దృష్టి
    అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ భూగర్భంలో ఉన్న క్షిపణుల నిల్వపై దృష్టి సారించాయి. అందుకే.. ఇరుదేశాల సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దుల నుంచి భూతల దాడులను ప్రారంభించకుండా.. క్షిపణుల స్థావరాలుగా భావించే ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా తమ సైన్యాన్ని దింపి, గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇరాన్ తన అమ్ములపొదిలోని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించకముందే.. వాటిని గుర్తించి, ధ్వంసం చేయాలని అమెరికా అడుగులు వేస్తోంది.  - సాక్షి వెబ్‌డెస్క్‌
     

  • మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల మద్య  దుబాయ్‌లో భారతీయ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య జరుగుతున్న భీకరపోరులో చిక్కుకున్న భారతీయ పౌరులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వారికోసం  తన 64-యూనిట్ అపార్ట్‌మెంట్‌ను వసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించారు.

    అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి మానవతా దృక్పథంలో స్పందించిన తీరు ప్రశంసలందుకుంది. నగరంలో చిక్కుకున్న భారతీయులకు 64 అపార్ట్‌మెంట్‌లతో కూడిన తన నివాస భవనాన్నివసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది.ఈ ప్రక్రియను ఇండియన్ పీపుల్స్ ఫోరం UAE, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమన్వయంతో నిర్వహిస్తున్నామని  తెలిపారు. పిల్లలతో ఉన్న కుటుంబాలతో సహా 125 మందికి పైగా భారతీయులకు క్లిష్ట కాలంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించడంలో సహాయం చేశామని దోషి చెప్పారు. కీలకమైన సమయంలో ఈ సహాయం లభించడం చాలా ఊరటనిచ్చిందని  బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

    రియా మకాడియా, పరాస్ భలోడియా మరియు గ్రిష్మా భలోడియాతో పాటు మోహిత్ వచ్చానీ, వారి హోటల్ బుకింగ్‌లు ముగియడంతో, పొడిగింపులు సాధ్యం కాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. నిరంతరం ఫోన్లో అలర్ట్‌లు  రావడం కూడా ఆందోళనను పెంచిందని వారు చెప్పారు.

    UAEలో భారతీయ వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌ను ఆశ్రయం
    దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం, యుఎఇకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మాన్‌లోని  పెద్ద ఫామ్‌హౌస్‌ను వారికోసం తాత్కాలిక వసతిగా మార్చారు. అనేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉచిత వసతి భోజనం అందించారు. హోటళ్ళు, వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చేందుకు ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో సహా 11 కార్లను కూడా వినియోగించడం విశేషం. 

    ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్, రెండు మిత్రదేశాలు ఇరాన్‌పై సంయుక్త దాడులు చేసి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత మార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఇరాన్ గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్, యుఎస్ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.

    (International Women's Day ప్రతీ అడుగు కన్నీటి మడుగు)

  • న్యూయార్క్: కార్పొరేట్ ప్రపంచంలో నిశ్శబ్ద విప్లవం మొదలైంది. నిన్నటి వరకు కేవలం మన సందేహాలకు సమాధానాలిచ్చే ‘చాట్‌బాట్‌’లుగా ఉన్న కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు, ఇప్పుడు నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, కెనడాల్లోని అనేక దిగ్గజ కంపెనీల్లో సాగే కార్యకలాపాలను సమూలంగా మార్చేస్తున్నాయి. కేవలం సహాయకులుగా కాకుండా, పనులను ప్లాన్ చేస్తూ, తోటి ఉద్యోగులకు బాధ్యతలు కేటాయించే ‘ఏఐ ఏజెంట్లు’గా ఇవి అవతరిస్తున్నాయి.

    సాధారణ ఏఐ చాట్‌బాట్‌లకు, ఏఐ ఏజెంట్లకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటి ‘స్వయంప్రతిపత్తి’. చాట్‌బాట్‌లు మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే స్పందిస్తాయి. కానీ ఏఐ ఏజెంట్లు ఒక అడుగు ముందుకు వేసి, సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా క్యాలెండర్లు, సమావేశాల ట్రాన్స్‌క్రిప్ట్‌లు, అంతర్గత డేటాబేస్‌లను విశ్లేషించి, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు. అమెరికన్ క్లౌడ్ డేటా సంస్థ ‘స్నోఫ్లేక్’ వంటి చోట్ల ఇంజనీర్లు గతంలో గంటల తరబడి చేసే కోడింగ్ సమీక్షలు, సిస్టమ్ పర్యవేక్షణ వంటి పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి.

    కొన్ని సందర్భాల్లో ఒక ఏఐ ఏజెంట్ రాసిన కోడ్‌ను మరో ఏఐ ఏజెంట్ తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుతోంది. మానవ పర్యవేక్షణ కేవలం తుది ఆమోదానికే పరిమితమవుతోంది. మేనేజర్లు చేసే పనుల కేటాయింపు, పనితీరు పర్యవేక్షణ వంటి బాధ్యతలను ఇప్పుడు సాఫ్ట్‌వేర్లే చూసుకుంటున్నాయి. అమెజాన్, యూపీఎస్, టార్గెట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధిస్తూ, ఆటోమేషన్ ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. అమెరికాలో దాదాపు 6 నుంచి 7 శాతం మంది ఉద్యోగులు ఏఐకు ప్రభావితం కావచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ముఖ్యంగా అకౌంటెంట్లు, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు.

    కాగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్ల సంస్థలో సహకారం క్షీణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్ని సంస్థలు ఏఐ ద్వారా పెరిగిన ఉత్పాదకతను ఉద్యోగులకు పంచుతూ, వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశపెడుతున్నాయి. మరోవైపు మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉండే కౌన్సెలింగ్, వెల్నెస్ వంటి రంగాల్లో ఏఐ ఏజెంట్ల వినియోగానికి వినియోగదారులు విముఖత చూపుతున్నారు. సామర్థ్యం కంటే సామాజిక అనుబంధానికే విలువనిస్తూ, కొన్ని కంపెనీలు ఇప్పటికీ మనుషులకే పెద్దపీట వేస్తున్నాయి.

    ఇది కూడా చదవండి: ‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0 పేరుతో సైబర్ సెక్యూరిటీ దాడులు జరుగుతున్నాయి. సైబర్ మోసాలకు సహకరిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 512 మంది సిబ్బందితో 137 పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి.

    రాష్ట్రవ్యాప్తంగా 137 బ్యాంక్ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు పోలీసులు. దేశ వ్యాప్తంగా 9,451 సైబర్ నేరాలకు లింక్ ఉన్న 1,888 ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో 549 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా, 626 మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు. అందులో 208 మంది అరెస్ట్ అయ్యారు. 

    అరెస్టయిన వారిలో 15 మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, ఒక ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ఉన‍్నారు. బ్యాంక్‌ ఖాతాలను అద్దెకు ఇచ్చి ప్రతి ట్రాన్సాక్షన్‌పై 5 శాతం కమిషన్ ఇస్తోంది సైబర్ క్రైమ్ ముఠా. 208 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లను పోలీసులు సీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్ అ‍య్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో సహకరించారు బ్యాంక్ అధికారులు.  

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యవసర సమయంలో యువతను తొలి స్పందనకారులుగా తీర్చిదిద్దేందుకు “సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక బలగాలు సంఘటన స్థలానికి చేరుకునేలోగా ఎటువంటి నష్టం తలెత్తకుండా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇవనున్నట్లు అధికారులు తెలిపారు.

    ఈ శిక్షణ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అరుణ బహుగుణ ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. మార్చి 10 నేటి  నుంచి మార్చి 16 వరకు మొత్తం 7 రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతకు రెస్క్యూ ఆపరేషన్స్ (రక్షణ చర్యలు), అగ్నిమాపక చర్యలు ,ఫస్ట్ ఎయిడ్ చికిత్స, గుంపుల నియంత్రణ, సహాయ సామగ్రి పంపిణీ తదితర రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

    అంతేకాకుండా యుద్ధ పరిస్థితులు, ఎయిర్ రైడ్స్, రసాయన దాడులు, అణు దాడులు వంటి విపత్తుల సమయంలో ఈ వాలంటీర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు సహాయపడతారని తెలిపారు. ఈ వాలంటీర్లు పోలీసులు, ఫైర్ సర్వీసులు, NDRFమరియు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాలంటీర్ల సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

    ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్‌ఎఫ్‌ఓ బి. సుధాకర్ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియప్పన్ అకాడమిక్స్ డీన్ డా. కళ్యాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ రహీమ్ డీఎఫ్‌ఓ దాస్ తో పాటు ఫైర్ శాఖకు చెందిన ఇతర అధికారులు  పాల్గొన్నారు

  • 'తుక్కు' సాధారణంగా ఈ పదం ఎందుకు పనికి రాకుండా వృథాగా ఉన్న వస్తువుల విషయంలో వాడుతుంటాం.. అయితే అదే కోట్ల వర్షం కురిపిస్తే.. తుక్కేంటి..కోట్లేంటి అనుకుంటున్నారా.. లేదండి ఇది అక్షరాల నిజం దక్షిణ మధ్య రైల్వే గతేడాదికి సంబంధించిన స్క్రాప్‌ను అమ్మితే వందల కోట్లు సంస్థకు వచ్చాయి.

    దక్షిణ మధ్య రైల్వే (SCR) “మిషన్ జీరో స్క్రాప్” అనే కార్యక్రమంలో స్క్రాప్‌ను విక్రయిస్తుంది. ఈ కార్యక్రమం ప్రకారం ఒక నెలకు మించి స్క్రాప్ (పాత లోహ వస్తువులు) నిల్వ ఉండకుండా వెంటనే విక్రయించాలని నియమం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు రూ. 510.00 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే రికార్డు స్థాయిలో   లక్ష్యాన్ని అధిగమించి, ₹602.06 కోట్ల ఆదాయం స్క్రాప్ విక్రయాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఆదాయం పొందింది.

    మొత్తంగా  132,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్ ను సేకరించి, దేశం నలుమూలల నుంచి వచ్చిన కొనుగోలుదారులకు e-Auction ద్వారా పూర్తిగా పారదర్శకంగా విక్రయించింది. దీని వల్ల స్వచ్ఛ భారత్ మిషన్‌కు సహకారం అందడంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాంగణాలు శుభ్రంగా మరియు పచ్చగా మారాయి. అంతే కాకుంజా అలాగే ఇప్పటివరకు భారతీయ రైల్వేలలో  స్క్రాప్ విక్రయాల ద్వారా అధిక ఆదాయం పొందిన  మెుదటి రైల్వేజోన్‌గా రికార్డు సాధించింది. 

  • హైదరాబాద్‌: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. మూసాపేట సర్కిల్-53, కూకట్‌పల్లి జోన్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న ఏవో కె.మురళిని ఆర్ఆర్‌ఆర్‌ రేంజ్ యూనిట్ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

    మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల బృందానికి 20 లక్షల రూపాయల రుణం మంజూరు ప్రక్రియను పూర్తిచేసినందుకు 18,000 రూపాయల లంచాన్ని డిమాండ్‌ చేశాడు కె.మురళి. ఫిర్యాదుదారుల నుంచి ఆ డబ‍్బును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురళిని అరెస్ట్ చేసిన అధికారులు, కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

    ఏ ప్రభుత్వ ఉద్యోగైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ సూచించింది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ తెలిపింది.మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశం నిర్వహించింది.సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.

    ‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది.  పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం  మంత్రులు మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో... మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

    2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలి  వచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే  గోదావరి ప్రవహించే జిల్లాల్లో... ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ... 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.

    తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ – 1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

  • హైదరాబాద్‌: భారత్‌లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్‌, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్‌)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం.  

    టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్‌కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

    వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది.  

    అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ  ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్‌ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.

    మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద‍్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్‌లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్‌లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.

    వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్‌కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.

    టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  
     

  • సాక్షి హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న ప్రభాకర్‌ రావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని  పాస్‌పోర్టు ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టులో ఇది వరకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజుూరు చేసింది. పాస్‌పోర్టు సరెండర్  చేయాలని ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది.

    కేసు నేపథ్యం 
    ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్‌ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది.  అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్‌ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్‌ ట్యాపింగ్‌ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్‌ కేసుగా మారింది.

    ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు

    ట్యాపింగ్‌ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీ­పీ పర్యవేక్షణలో ట్యాపింగ్‌ జరిగినట్లు ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ట్యాప్‌ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్‌ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడి­న కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

  • హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.  కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు. అని తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు బహిరంగ లేఖ రాశారు.

    ‘పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాకి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు చర్చించాలి. ఎన్నికలు, రాజకీయాలు వేరు. రాష్ట్ర అభివృద్ధి పై వివక్ష వద్దు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలి. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు.

Sports

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్వాగతం పలి​కింది. ఇటీవల సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్‌'లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ దకైత్’ పాత్రను పోలి ఉండేలా ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించి సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేసింది. 

    84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. 'ఖమ్మా ఘనీ, రాజస్థాన్' అంటూ అభిమానులను పలకరించాడు. ఇది ధురంధర్‌ సినిమాలో రెహ్మాన్ దకైత్ 'అస్సలాం వాలేకుం, లియారీ' అన్న సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

    జడేజాను 2026 ఐపీఎల్‌ వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 14 కోట్లకు సీఎస్‌కే నుంచి ట్రేడ్‌ చేసుకుంది. ఈ మూవ్‌ జడేజాకు హోం కమింగ్‌ లాంటిది. జడ్డూ తన ఐపీఎల్‌ కెరీర్‌ను 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. ఆతర్వాత సీఎస్‌కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్‌తో 2 సీజన్లు ఆడి తిరిగి రాయల్స్‌ గూటికే చేరాడు.  

    2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్‌ తొలి ఐపీఎల్‌ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్‌కు ప్రాతినిథ్యం​ వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు తీశాడు.  

    ప్రస్తుత రాయల్స్‌ జట్టు జడేజా చేరికతో మరింత బలపడింది. సంజూ శాంసన్‌ రాయల్స్‌ను వీడటంతో ఈ సీజన్‌తో రియాన్‌ పరాగ్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జడేజాతో పాటు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ కూడా సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. మరో ఆల్‌రౌండర్‌ డొనొవన్‌ ఫెరియెరా ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి రాయల్స్‌లోకి వచ్చాడు.

    అప్పటికే యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, షిమ్రోన్‌ హెట్‌మైర్‌, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, ధృవ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌ లాంటి విధ్వంసకర వీరులతో రాయల్స్‌ బ్యాటింగ్‌ విభాగం కలకలలాడుతుండింది. జోఫ్రా ఆర్చర్‌, నండ్రే బర్గర్‌, రవి బిష్ణోయ్‌, సందీప్‌ శర్మ, క్వేనా మఫాకా లాంటి బౌలర్లతో సమతూకంగా ఉంది. 

  • ఢిల్లీ క్యాపిటల్స్‌ (ఐపీఎల్‌ ఫ్రాంచైజీ) హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్‌ లీగ్‌లోని సదరన్‌ బ్రేవ్‌ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్‌ కోచ్‌గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్‌ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్‌ కోచ్‌) ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బెల్‌ను ఎంపిక చేసింది.

    GMR గ్రూప్‌కు ఐపీఎల్‌ హండ్రెడ్‌ లీగ్‌తో పాటు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (Seattle Orcas), ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.

    సదరన్‌ బ్రేవ్ గత ప్రదర్శనలు
    సదరన్‌ బ్రేవ్‌ ఫ్రాంచైజీ హండ్రెడ్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లో మాత్రం సగం మ్యాచ్‌లు ఓడి, నాకౌట్స్‌కు కూడా చేరలేకపోయింది.

    కాగా, హండ్రెడ్‌ లీగ్‌ 2026 ఎడిషన్‌ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్‌ బ్రేవ్‌ వెల్ష్‌ ఫైర్‌తో తలపడుతుంది.

    తొలిసారి వేలం
    హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి. 

  • భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్‌ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.

    2007 పొట్టి ప్రపంచకప్‌ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్‌కు రూ. 1 కోటి  అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్‌లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు  ఇచ్చింది.

    అదే 2026 ప్రపంచకప్‌కు వచ్చేసరికి.. సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.

    ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన రోహిత్‌ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.

    భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..
    - 2007లో రూ. 12 కోట్లు
    - 2024లో రూ. 125 కోట్లు
    - 2026లో రూ. 131 కోట్లు

    ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.  

     

  • టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్‌లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్‌ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్‌ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్‌ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.

    జహూర్‌ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్‌లో లెండిల్ సిమ్మన్స్‌కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్‌ క్యాంప్‌లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను.  

    జహూర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్‌కు అంత సీన్‌ లేదని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్‌గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.

    వాస్తవానికి స్లో బాల్‌‌ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్‌ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్‌ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. 

    తాజాగా జరిగిన ప్రపంచకప్‌లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్‌ బేతెల్‌ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. 

    ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్‌ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్‌ సాధించింది. ఈ ప్రపంచకప్‌లో బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్‌ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. 

  • పశ్చియాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రికెట్‌కు కూడా తగిలింది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ల మధ్య దుబాయ్‌ వేదికగా వన్డే సిరీస్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమానాల రాకపోకలపై నిషేధంతో సిరీస్‌ రద్దు అయినట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా షార్జా వేదికగా మార్చి 13 నుంచి అఫ్గానిస్థాన్‌, శ్రీలంక మధ్య మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే సిరీస్‌ నిర్వహించే అవకాశాల్లేవు.  దీంతో సిరీస్‌ రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు ఇరుజట్ల క్రికెట్‌ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.

    ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు నిరాశ పరిచాయి. అఫ్గానిస్థాన్ గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టగా.. ఆతిథ్య హోదాలో సూపర్‌-8కు పరిమితం కావాల్సి వచ్చింది.  పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అటు ఇరాన్‌, ఇటు ఇజ్రాయెల్‌, అమెరికాలు మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. 

  • భారత నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్‌ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అర్షదీప్‌ డారిల్‌ మిచెల్‌పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్‌ మిచెల్‌పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్‌లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్‌ను బలంగా తాకింది. 

    ఆ సమయంలో మిచెల్‌ సైతం​ సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్‌ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్‌-మిచెల్‌ కరచాలనం చేసుకున్నారు.

    అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్‌ చెల్లించుకున్నాడు.

    కాగా, ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.   

  • సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం ప్రపంచప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్‌ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. 

    ధోనీ, రోహిత్‌లు కెప్టెన్‌లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియాకు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌, 2021 టీ20 ప్రపంచకప్‌ వంటి మేజర్‌ టోర్నీల్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ టైటిల్‌ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. 

    మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్‌ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ వీక్షించేందుకు అహ్మదాబాద్‌కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.  ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు.  కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచి తన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

    చదవండి: ఐపీఎల్‌ 2026పై బిగ్‌ అప్‌డేట్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 సెమీఫైనల్లో భారత్‌పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్‌ యువ కెరటం జేకబ్‌ బేతెల్‌కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్‌ కోసం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో బేతెల్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్‌ యాజమాన్యం ప్రకటించింది.  

    22 ఏళ్ల బేతెల్‌కు గతంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్‌ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన రికార్డు బేతెల్‌ వశమైంది.

    ఫీనిక్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బేతెల్‌ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త  బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.  

    బేతెల్‌ తాజాగా భారత్‌తో జరిగిన పొట్టి ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

    ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో బేతెల్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.

    ఐపీఎల్‌లో సవాలు
    హండ్రెడ్‌ లీగ్‌లో బేతెల్‌కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్‌ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్‌లో బేతెల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్‌లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి. 

  • క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌పై బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. మార్చి 12న లీగ్‌ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.

    దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు.  

    కాగా, ఐపీఎల్‌ 2026 ఎడిషన్‌ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్‌ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.

    ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎవరెవరు..? 
    సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్‌ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్‌ కింగ్స్‌ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు.  

    అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఐపీఎల్‌ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్‌ అనే సాంప్రదాయానికి బ్రేక్‌ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే. 

  • భారత క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్‌ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్‌లోని ముసోరిలో ఒక రిసార్ట్‌ వేదికగా జరగనుంది. గతేడాది జూన్‌ 4న లక్నోలోని ఒక హోటల్‌లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్‌ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. 

    ఇక మార్చి 17న లక్నోలోని హోటల్‌ సెంట్రమ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా  ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే  వాస్తవానికి కుల్దీప్‌ వివాహం గతేడాని నవంబర్‌లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి కుల్దీప్‌ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్‌ యాదవ్‌ టీ20 ప్రపంచకప్‌లో కేవలం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్‌ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 

    చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!

  • భారత మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్‌ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్‌ మిశ్రా భారత్‌ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఆడాడు.

    2013-14 రంజీ సీజన్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున రెండో మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్‌ మిశ్రాను 2014 ఐపీఎల్‌ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్‌లో చేరినా, కెరీర్‌ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు.  

    ఈ అమిత్‌ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది.  

    మోడల్‌ అయిన గరిమాకు 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమిత్‌ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్‌ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు.  

    మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్‌ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్‌ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు.  

    కాగా, గరిమా అమిత్‌ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది. 

  • అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌తో భారత టి20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాంధీనగర్‌ సమీపంలోని మోనుమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్‌ వారసత్వ కట్టడం ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ వద్ద అధికారిక ఫొటో సెషన్‌ నిర్వహించగా.. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రపంచకప్‌తో సందడి చేశాడు. అతను కప్‌తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్‌ కట్టడం వద్ద కప్‌ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్‌... కిస్సిక్‌...’ మోత మోగాయి.

    సుప్రసిద్ధ ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ (Adalaj Stepwell) 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్‌ను నిర్మించింది. ఆమె వాఘెలా సంస్థానధీశుడు రాణా వీర్‌ సింగ్‌ భార్య. రాణా వీర్‌ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్‌ స్టెప్‌వెల్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్‌ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా విన్నర్స్‌ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఫొటోలు దిగారు.

      

    ట్రోఫీతో ఆలయంలో పూజలు 
    అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్‌ గంభీర్, కెప్టెన్‌ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్‌ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్‌ ఆలయానికి ప్రపంచకప్‌ను తీసుకువెళ్లి పూజలు చేశారు. పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్, వరుణ్‌ చక్రవర్తి తదితరులు ప్రపంచకప్‌తో దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

     

National

  • రైలు ప్రయాణం  అనేక ప్రాంతాలను పరిచయం చేస్తుంది. అందమైన ప్రకృతి.. పచ్చని చెట్లు,  ఏపుగా ఎదిగిన పైరులు..ఇలా చాలా అనుభవాలను మిగులుస్తుంది. దీంతో పాటు ఒక్కోసారి కొన్ని చేదు అనుభవాలు కూడా తప్పవు. అలా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి భయంకరమై అనుభవం ఎదురైంది.   చివరికి రైల్వే హెల్ప్‌ లైన్‌కి కాల్‌ చేసేంతగా ఆయన ఓపిక నశించింది. దీనికి సంబంధించి ఆయన   షేర్‌ చేసిన నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.  తన ప్రయాణాన్ని "లైవ్ రియాలిటీ షో"గా  మార్చేసారని అభివర్ణిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.

    ఇంతకీ ఏమి జరిగిందంటే మన్మోహన్ వర్మ అనే ప్రయాణీకుడు చేసిన వివరాల ప్రకారం  ఇటీవల ఆయన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో  బిలాస్‌పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తున్నారు.  ఈయన ప్రయాణిస్తున్న బోగీలోనే 20-30 మంది సభ్యులు గల ఒక కుటుంబం కూడా  చేరింది.   రైలు ఎక్కింది మొదలు ఒకటే గోల. బోగిని అరుపులు, కేకలు, పాటలతో  "రీల్ స్టూడియో"గా మార్చింది.  కోచ్ లోపల డ్యాన్స్ చేస్తూ రీల్స్‌తో రచ్చ రచ్చ చేశారు.  వ్యక్తి తన తలపై రైల్వే బెడ్‌షీట్ పెట్టుకుని ఇతరులతో కలిసి డ్యాన్స్ చేశాడు.  ఇతర ప్రయాణీకుల అసౌకర్యాన్ని అస్సలు పట్టించుకోకుండా, వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తూ గంటల తరబడి ఇలా నానా యాగీ చేశారు. దీంతో చిర్రెత్తు కొచ్చిన వర్మ రైల్వే హెల్ప్‌లైన్‌కు (139)ను సంప్రదించారు. దీంతో  రైల్వే పోలీసులు ఫిర్యాదుపై స్పందించి, కోచ్‌లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

     ‘‘రైల్వే కోచ్‌ అనేది పబ్లిక్‌ ప్లేస్‌.  మన సొంత స్థలం కాదు..  కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ప్రయాణీకుల్లో కనీస సివిక్‌  సెన్స్‌ లేకుండా పోయిందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కోచ్‌ ఒక ప్రైవేట్ లివింగ్ రూమ్ కాదూ,  రీల్-మేకింగ్ సెట్ అంతకన్నా కాదన్నారు. పెద్ద పెద్దగా శబ్దాలు చేయకుండా కనీస మర్యాదతో  మెలగాలి. తోటి ప్రయాణీకులను గౌరవించాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అపుడు మాత్రమే ప్రయాణం ఆనందంగా ఉంటుందంటూ తన పోస్ట్‌లో  చెప్పారు.

     

     

    నెటిజన్లు స్పందన
    దీనిపై నెటిజన్లు కూడా స్పందించి తన అనుభవాలు పంచకున్నారు.  రైళ్లలో  పుట్టిన రోజు జరుపుకోవడం,  
    బిగ్గరగా ఆడిపాటం లాంటి భయంకరమైన అనుభవం  తనకూ ఎదురైందంని ఒక యూజర్‌ పేర్కొన్నారు.

    ఇలాంటి అనుభవాలు రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఎదురవుతూ ఉంటాయి. తాజా వీడియో పబ్లిక్‌ ప్రదేశాల్లోఎలా ప్రవర్తించాలి, ఇతర ప్రయాణీకులను ఎలా గౌరవించాలి అనేదానిపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

     (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్‌ గైడ్‌)


     

  • న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌ను మార్చి 15న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు మంగళవారం సమన్లు పంపారు.

    విజయ్‌ను సీబీఐ జనవరిలో రెండు సార్లు విచారించింది. మరోసారి మార్చి 9న హాజరుకావాలని చెప్పింది. అయితే, 15 రోజుల పాటు తన విచారణను వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు.

    తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ విచారణ చెన్నైలో లేదా తమిళనాడులోని ఇతర ఏ కార్యాలయంలోనైనా నిర్వహించాలని విజయ్‌ కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే, సీబీఐ మాత్రం తమ ప్రధాన కార్యాలయం ఉన్న ఢిల్లీలో మార్చి 15న హాజరుకావాలని సూచించింది.

    కరూర్ నుంచి ద్రావిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా బాలాజీ స్పందిస్తూ.. మార్చి 17న సీబీఐ ముందు హాజరై కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.

    కాగా, 2025 సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లాలో విజయ్ ర్యాలీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో సీబీఐ నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.

    గత సంవత్సరం అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. అదే సమయంలో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించేలా సీనియర్ అధికారిని నియమించాలని సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశించింది.

    న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ తొక్కిసలాట దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసిందని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగితేనే న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం తిరిగి ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది.

  • దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. LPG,CNG సంస్థలు పదిశాతం మేర ఉత్పత్తి పెంచాల్సిందిగా కంపెనీలకు ఆదేశించారు. అదేవిధంగా వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలుంటాయని సంస్థలకు హెచ్చరించారు. కాగా చమురు కేంద్రాలు ఇదివరకే ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాయని తెలిపారు. 

    దేశంలో చమరు కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌తో చర్చలు జరిపారు.  ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. దీంతో దేశంలో వంటగ్యాస్ లభ్యతపై సందిగ్ధత ఏర్పడింది. 

    అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడడంతో ఇప్పటికే పలు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరుల తదితర నగరాల్లో హోటళ్లు మూసివేశారు. మావద్ద కొద్ది మేరకే ఎల్‌పీజీ నిల్వలున్నాయని అవి పూర్తయితే తాము సైతం హోటళ్లు మూసివేయాల్సిందేనని పలు హోటళ్ల యజమాన్యాలు కేంద్రం ముందు గోడు వెళ్లగక్కాయి. అయితే త్వరలో ఈ సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు చేరే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తత్తిని పెంచాలని కీలక ఆదేశాలిచ్చింది.

  • పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.  అంతర్జాతీయంగా  చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్‌పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్‌ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

    ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్‌పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్‌ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్‌ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.

    గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన 
    యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం.
     

    దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?

    హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
     

    ఆటో ఎల్‌పీజీ

    మహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్‌పీజీ స్థానాన్ని అధికస్థాయిలో  సీఎన్‌జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్‌పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్‌పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్‌పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్‌పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్‌పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది.

    తీవ్రస్థాయిలో గ్యాస్ కొరత మూతపడుతున్న హోటళ్లు


    మరెంత కాలం సంక్షోభం?

    పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ ఇంధన సరఫరా చైన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్‌పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్‌తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

    భారత్‌లో ఎల్‌పీజీ డిమాండ్

    ఒకప్పటితో పోలిస్తే.. భారత్‌లో ఎల్‌పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ  చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్‌పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్‌పీజీ వినియోగం ఉంటుంది. 

    దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి ద్వారా  కొరతను అధిగమించలేమా?

    భారతదేశ ఎల్‌పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే  ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్‌పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్‌లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

  • మనకు ఇప్పుడు రైలు ప్రయాణం ఎంతో ఈజీ, అసలు రైలు ప్రయాణమంటేనే సౌఖ్యవంతమైన జర్నీగా భావిస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చనేది మనకు తెలిసిన విషయం. అయితే రైలు.. నది ఒడ్డున ఆగితే పరిస్థితి ఏమిటి.. ప్రయాణికులు ఎలా దిగి గమ్యస్థానాలకు వెళతారు?, ఈ తరహా పరిస్థితులు కూడా ఉంటాయా?, అంటే ఉన్నాయి అనక తప్పదు. 

    పూర్వకాలంలో నది ఒడ్డున ఆగే రైలు.. ఆపై పడవల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరే సంఘటనలు కూడా ఉన్నాయట. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘాజీపూర్‌లో తారీ ఘాట్ రైల్వే స్టేషన్  ఇందుకు నిదర్శనం. గంగా నదిపై ప్రయాణించే రైలు తారీ ఘాట్‌ రైల్వే స్టేషన్‌లో నది ఒడ్డు వరకే ట్రాక్‌ ఉంటుంది. దాంతో ప్రయాణికులు ఒడ్డున దిగి పడవల్లో వారి స్థానాలకు వెళ్లేవారు.  ఇది కాస్త  ఇబ్బందిగా అనిపించినా 

    ఇక్కడ రైలు ట్రాక్ నది ఒడ్డునే ముగుస్తుంది, ఈ స్టేషన్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అప్పట్లో గంగపై పెద్ద రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, రైలు మార్గం ఇక్కడే ఆగిపోయేది. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత పడవల ద్వారా గంగాను దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు గంగానదిపై గంగానదిపై రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. తారీ ఘాట్ స్టేషన్ ప్రాముఖ్యత తగ్గిపోయింది, కానీ ఇది చారిత్రక గుర్తుగా నిలిచింది. భారత రైల్వే చరిత్రలో అరుదైన ఉదాహరణగా నిలిచిపోతోంది.

    గతంలో స్టేషన్ ఎంత ఉత్సాహంగా ఉండేదో ఇక్కడ అనుభవాలను ఎదుర్కొన్న వారిని పలకరిస్తే అర్థమవుతుంది. తారీ ఘాట్ వైభవం, టీ దుకాణాలు, పడవల కోసం వేచి ఉండటం ఇవన్నీ తలుచుకుంటే తమ కళ్లలో మెరుపులు తీసుకొస్తాయని ఓ వృద్ధుడు స్పష్టం చేశాడు. 

  • ఒడిషా: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పట్టణంలో పరిజాగూఢ వీధిలో నివనిస్తున్న మిలాన్‌ మిస్త్రీ భార్య లిల్లీ మిస్త్రీ ఫిబ్రవరి 28 నుంచి కనిపించడం లేదు. దీంతో ఆయన బలిమెల పోలీసు స్టేషన్‌లో మార్చి 2వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎస్పీ వినోద్‌ పటేల్‌ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించారు. 

    ఈ విషయం మీడియాలో రావడంతో అఖిల భారత హిందూ మహసభ జిల్లా అధ్యక్షుడు పిడియా పోడియామి పోలీసులతో సంప్రదింపులు జరిపారు. లిల్లీ తన భర్తకు 4వ తేదీన ఫోన్‌ చేసి ‘నన్ను రక్షించండి లేక పోతే వీరు నన్ను అమ్మేస్తున్నారు’ అని చెప్పింది. వెంటనే ఆ విషయాన్ని ఆయన పోలీసులకు, అఖిల భారత్‌ సభ్యులకు తెలియజేశారు. 

    పడియా పోడియమి వెంటనే అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర సంస్థాగత మంత్రి విశ్వజిత్‌ ముదిలికు సమాచారం ఇవ్వగా.. ఆయన స్పందించి అక్కడి పోలీసులతో చర్చించి మొబైల్‌ నంబర్‌ను ట్రాక్‌ చేశారు. ఆమె బేతూల్‌ జిల్లా చోపనాయక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బెంగాలీ బస్తీ ప్రాంతంలో ఒక వృద్ధురాలి ఇంటిలో ఉన్నట్లు తెలిసి 7వ తేదీన లిల్లీను అలానే మరో యువతిని ఆ వృద్ధురాలి ఇంటి నుంచి రక్షించారు. మల్కన్‌గిరి ఎస్పీ వెంటనే బలిమెల ఎస్‌ఐ మనోహర్‌ సాహుతో ఓ బృందాన్ని పంపించి వారిని సోమవారం మల్కన్‌గిరి తీసుకువచ్చారు. 

  • ఢిల్లీ:ముంబైలో ఎల్పీజీ సిలిండర్‌ కొరత తీవ్రంగా పెరిగి హోటల్‌ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు మూతపడగా, త్వరలో మరో 50 శాతం హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ముంబై (AHAR) హెచ్చరించింది.

    ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో వంటకాలు తయారు చేయడం అసాధ్యమవుతోంది. ప్రతిరోజూ వేలాది మంది కస్టమర్లు హోటళ్లపై ఆధారపడుతుంటారు. సరఫరా సమస్యలు కొనసాగితే, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ముంబై అధ్యక్షుడు హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆయిల్‌ కంపెనీలను తక్షణం చర్యలు తీసుకోవాలని హోటల్‌ అసోసియేషన్‌  కోరింది.

    ఎల్పీజీ సరఫరా పెంచాలి. హోటళ్లకు ప్రత్యేక కోటా కేటాయించాలి. బ్లాక్ మార్కెటింగ్‌ అరికట్టాలి. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే, ముంబైలో హోటల్‌ రంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హోటల్‌ రంగం ముంబై ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. హోటళ్లు మూతపడితే, ఉద్యోగాలు కోల్పోవడం, పర్యాటక రంగం దెబ్బతినడం, ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయ‌న మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర‌ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 
     

  • రాష్ట్రవ్యాప్తంగా  ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు.. టౌన్‌ ప్లానింగ్ విభాగంలో అవకతవకల నేపథ్యంలో  ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో ఏవైనా అవినీతి జరిగిందా అనే అంశం ఆరా తీస్తున్నారు.

  • చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీగా అప్పు తెచ‍్చింది. ఆర్‌బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన బాబు ప్రభుత్వం అక్కడికీ ఆగడం లేదు. 

    బడ్జెట్‌, కార్పొరేషన్ల అప్పులు రూ.3.30 లక్షల కోట్లు దాటిపోయాయి. ఈ రూ.3 వేల కోట్లతో రూ.1,82,264 కోట్లకు చేరింది బడ్జెట్‌ అప్పు. 21 నెలల్లో భారీగా బడ్జెటరీ అప్పులు తెచ్చింది బాబు సర్కార్‌. బడ్జెట్‌ బయట భారీగా అప్పులు తీసుకొస్తోంది. బాబు సర్కారు అప్పుల్లో దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది.  

    మరోవైపు, ఏపీలోని రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.

    రైతులపై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తంగా రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది.

    రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు
  • సాక్షి, కదిరి: అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథోత్సవం దగ్గర తొక్కిసలాట జరిగింది. రథం కింద పడి ఐదుగురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు.  

    మరోవైపు, కదిరిలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. కదిరిలో ఆధిపత్యం కోసం టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తంటాలు పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్థకు అనుమతి ఇవ్వలేదు.

    రథోత్సవరంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది. గత కొన్నేళ్లుగా లక్ష్మీనరసింహ రథోత్సవంలో భక్తులకు విష్ణువర్థన్ సూచనలు చేస్తూ వస్తున్నారు. దీనికి అడ్డుకట్టవేయాలనే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్.. ఆ ఉత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. ఒకవేళ బీజేపీ నేతలు వస్తే దాడులు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా విష్ణువర్థన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

    Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

Family

  • ఆరోగ్యం, వ్యాయామాలు సామాన్యుల వల్ల ఎక్కడవుతుంది అన్నమాటలు ఎన్నోసార్లు విని ఉంటారు. బాగా డబ్బున్నవాళ్లకు, యువతకు మాత్రమే సాధ్యం అనేది చాలామంది భావన. వాళ్లకు ఏ బాధ్యతలు, బరువులు అంతగా ఉండవు కాబట్టి హాయిగా చేయగలరని అనుకుంటుంటారు. కానీ ఈ మధ్యతరగతి జంట గురించి విన్నాక ఆ అభిప్రాయం కచ్చితంగా మారుతుంది. 50లలో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మేల్కొని విజయం సాధించడమే గాక..ఇతరులకు స్వచ్ఛందంగా ఆరోగ్యస్పృహ కలిగిస్తున్నారు. మరి ఆ జంట ఫిట్‌నెస్‌ ప్రయాణం ఎలా సాగిందంటే..

    చాలామందికి ఫిట్‌నెస్‌ అనేది యువతకు చెందినదిగా అనిపిస్తుంది. పెద్దలకు సుదీర్ఘ పనిదినాలు, కుటుంబ బాధ్యతలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టేలా చేస్తాయి. కనీసం శరీరం చెప్పే సంకేతాలను కూడా పట్టించుకోరు. తమ ఆరోగ్యం కంటే..కుటుంబ బరువు బాధ్యతలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలానే భావించారు డెహ్రాడూన్‌కు చెందిన తారా థాపా ఆయన భార్య సుశీలా. తార ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్‌ రిపేర్‌ షాపుని నడుపుతుండగా, సుశీల బీమా సలహాదారుగా పనిచేస్తోంది. 

    ఈ ఇద్దరి ఫోకస్‌ కుటుంబ బాధ్యతలపైనే ఉంది. తమ ఇద్దరు కుమారులను పెంచడం, ఓ చక్కటి ఇంటిని నిర్మించుకోవడం ఇవే తమ ఆశయలు, జీవితం అన్నట్లుగా బతికారిద్దురు. అనుకున్నట్లుగా కుమారులు చక్కగా జీవితంలో స్థిరపడ్డారు. ఒకరు సోలార్ పర్మిట్ డిజైనర్‌గా, మరొకరు కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్నారు. కానీ అప్పటికే ఆ జంటను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. తారాకి తీవ్రమైన వెన్నునొప్పి, సుశీల నిరంతర అలసట, పునరావృతమయ్యే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. 

    అప్పుడే ఇరువురికి తమ శారీరక పరిమితులను అంగీకరిస్తూ ఆగిపోకూడదని అనిపించింది. ఆ అనారోగ్య సమస్యలను సవాలు చేసేలా.. ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారు.  2017లో, తార ఫిట్‌నెస్‌పై తీవ్రంగా దృష్టి పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసి భార్య సుశీల రెండేళ్ల తర్వాత 2019లో ఆయన బాటలోనే నడిచింది. అలా ఈ జంట రోజు సూర్యోదయానికి చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. ఉదయం ఐదు గంటలకల్లా..వ్యాయామాలు చేయడానికి, వాకింగ్‌కి రెడి అయిపోతారు. 

    కొండలలో నివసించడం వల్ల వారు ప్రకృతిని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మారింది. తరచుగా డెహ్రాడూన్ చుట్టూ ఉన్న పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేస్తూ సెలవులను ఆస్వాదిస్తుంటారు. భోజనంలో కూడా పప్పులు, కూరగాయలు, కాలనుగుణ పండ్లను భాగం చేసుకునేవారు. పండుగల సమయంలో కూడా, వారు అతిగా తినడం కంటే సమతుల్యతపే పాటిస్తూ.. మితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయాణం తమ సొంత ఇంటిని దాటి ప్రేరేపించడం మొదలైంది. 

    మూడేళ్ల క్రితం సుశీల పింక్ పాంథర్ అనే మహిళా సమూహాన్ని ప్రారంభించారు. ఈ బృందంలో మహిళలు సౌకర్యవంతమైన ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి ఫిట్‌నెస్‌ను స్వీకరించమని ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు తమ ఇళ్లను వదిలి వెళ్ళడానికి కూడా సంకోచించిన చాలా మంది సభ్యులు ఇప్పుడు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుండటం విశేషం. 

    అంతేగాదు ఈ జంట తమ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవాలని నిర్ణయించుకోవడంతో వారి కథ చాలమందికి కనెక్ట్‌ అయ్యి..ఎందరినో ప్రేరేపించింది. ఈ జంట వ్యక్తిగత వృద్ధి వాయిదాగా మారకూడదని, వయసు ఎప్పుడూ సాకుగా మారకూడదని తమ చేతలతో చెప్పకనే చెప్పారు ​​ కదూ. నెటిజన్లు సైతం చాలా స్ఫూర్తిదాయకం అని ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.

     

    గమనిక: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికే. అనుసరించే ముందు వ్యక్తిగత సమస్యలను పరిగణనలోనికి తీసుకోవాలి, అలాగే  వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

     

    (చదవండి: అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!)

     

     

  • మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ  సమయంలో గొడవతో సంబంధంలేని  మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు...బాధితులుగా మారుతున్నారు. మన  రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది.

    ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న  తీర్మానాన్ని ఆ గ్రామం ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక  స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. .అహల్యానగర్‌లోని శ్రీగొండలోని కోల్గావ్‌ గ్రామ పంచాయతీ  దీనిని ఆమోదించింది.

    విభిన్న కులాలు  మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివాసితులున్న కోల్గావ్‌ గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, సీనియర్‌ అంగన్ వాడీ సేవిక (కార్యకర్త) శకుంతల దేశ్‌ముఖ్‌ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామసభను ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జగ్‌తాప్‌ అనే మహిళ  లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. సుదీర్ఘ మధనం తర్వాత, మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా  రూ. 500  విధించాలని నిర్ణయించారు.  మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 

    దుర్భాషలు ఆడినట్టు డిజిటల్‌ ఆధారాలు అందించినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ‘అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడడంలో  మహిళలు ( అవసరమైతే, వారి పిల్లలు)  ముందుండాలని పంచాయతీ కోరింది, అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెబుతున్నారు.

    ‘తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వ సాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతలను భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణం గా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు’అని జగ్‌తాప్‌ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయితీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది.

    గతేడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేకమందిలో ఆలోచన రేకెత్తించేలాంటిదే. దీని ప్రకారం.. గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్‌ లేదా సెల్‌ఫోన్‌ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతబట్టుకోవాలి.  ప్రస్తుతం గ్రామంలో  తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. 

    గ్రామసభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది, నివాసితులు తమ ఇళ్లలో వాణిజ్య సంస్థలలో పరిశుభ్రతను కాపాడుకోవాలని కోరింది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో/వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీనిని ఉల్లంఘించినట్లు తేలిదే, వారికి రూ. 100 జరిమానా విధిస్తారు. 

    (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..)

  • ఒకప్పుడు... ‘సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్‌ లో సత్తా చాటుతున్నారు...

    24-35%: ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో మహిళల ప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.

    41%: 2023 ఐఏఎస్‌ బ్యాచ్‌లో రికార్డ్‌ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.

    18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.

    అసామాన్య విజేతలు
    ఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్‌సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు. ∙డాక్టర్‌ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్‌ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడిపోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్‌. 

    పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు. పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ యూపీఎస్‌సీలో ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 15 సాధించింది. కౌర్‌ తండ్రి సామాన్య రైతు. 

    కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్‌ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించడానికి ఆ కొటేషన్‌లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌. తల్లి సాధారణ గృహిణి. 

    గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్‌ ఆల్‌ ఇండియా ర్యాంక్‌ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్‌ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు.

    పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్‌ కౌర్‌ మొదటి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్‌  సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్‌ పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్‌ కౌర్‌ గృహిణి

    మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్‌ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్‌.

    ఒకే ఒక్కరు!
    సిక్కింలోని రాయ్‌గావ్‌కు చెందిన అన్నీలా షెర్పా, యూపీఎస్‌సీ పరీక్షలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచి ఆల్‌ ఇండియా ర్యాంకు 893 సాధించింది. 

    (చదవండి: అలనాటి అందాల నటి బ్యూటీ రహస్యం..! ఆరుపదుల వయసులోనూ..)

  • ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది.  ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.

    తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో  మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.  

    ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం 
    ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్‌ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి  

    గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు  
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి.  – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్‌

    పరిస్థితుల్లో మార్పు రాలేదు 
    మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే  ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్‌ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతి

    ఒంటరిగా వెళ్లాలంటే భయం 
    పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్‌ ఆషా, పీడీఎస్‌ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి 

     (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్‌ గైడ్‌)

    ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. 
    ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి  

    వివక్షకు గురవుతున్నారు 
    ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్‌ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి

  • బాలీవుడ్‌ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్‌లలో ఆమె ఒకరు. 'ప్యార్‌ ఝక్తా నహీ' వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్‌గ్రీన్‌ అందంతో గ్లామర్‌గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.

    ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె.  ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్‌ అలవాట్ల గురించి షేర్‌ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. 

    ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7  మేకప్‌ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు  కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. 

    కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్‌ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్‌ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్‌, మేకప్‌ రిమూవర్‌, సహజ వైప్‌లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని  చెప్పారు. మేకప్‌ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్‌, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.

    హెయిర్ కేర్ ఎలాగంటే..
    జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్‌ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్‌ లేనివే ఎంచుకుంటానని అన్నారు. 

    చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి,  నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్‌ బ్రాండ్‌లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్‌ మేకప్‌ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.

    (చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్‌ రోగులకు..)

     

  • రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్‌ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్‌ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు  మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్‌లో ‘బ్రీచ్‌’ బేబీస్‌ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు...  వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

    నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్‌’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...

    బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్‌ ఫ్లుయిడ్‌ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్‌లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్‌ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. 

    ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్‌ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీస్‌) జరిగేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. 

    బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... 

    ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). 

    ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ  జరగడం (మల్టీఫీటల్‌ జెస్టేషన్‌) 
    (సాధారణంగా ఇలాంటి కండిషన్స్‌లోనే కవలలు (ట్విన్స్‌) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).

    పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... 
    బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్‌), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్‌సెఫాలస్‌). 

    కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం.  ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్‌ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్‌ లాక్స్‌ అబ్డామిన్‌’గా చెబుతారు. 

    బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.

    ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... 
    ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. 

    కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. 

    ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. 

    ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్‌ కండిషన్‌కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). 

    ఒకవేళ ఆ టైమ్‌లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్‌డ్‌ కండిషన్‌లో ఉంటే... ఆ టైమ్‌లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. 

    బ్రీచ్‌ బేబీస్‌ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు
    ఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్‌ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్‌టర్నల్‌ సెఫాలిక్‌ వర్షన్‌’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్‌లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్‌పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. 

    ఎక్స్‌టర్నల్‌ సెఫాలిక్‌ వర్షన్‌ (ఈసీవీ) అంటే..
    బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్‌లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్‌టర్నల్‌ సెఫాలిక్‌ వర్షన్‌–ఈసీవీ’ అంటారు. 

    సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్‌టర్నల్‌ సెఫాలిక్‌ వర్షన్‌’ (ఈసీవీ) అంటారు.

    బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు 
    బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...

    1) ఫ్రాంక్‌ / ఇన్‌కంప్లీట్‌ బ్రీచ్‌... 
    ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్‌లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.

    2) కంప్లీట్‌ బ్రీచ్‌ / ఫ్లెక్సెడ్‌ బ్రీచ్‌... ఈ కేస్‌లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్‌లో  ‘ఫ్రాంక్‌ / ఇన్‌కంప్లీట్‌ బ్రీచ్‌’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.

    3) ఫూట్లింగ్‌ ప్రజెంటేషన్‌... ఈ కండిషన్‌లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. 

    బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్‌ సెక్షన్‌కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. 

    ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...

    తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్‌ / అనెన్‌సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్‌ను హైడ్రోసెఫాలస్‌ కండిషన్‌ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్‌ను అనెన్‌సెఫాలీ కండిషన్‌ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. 

    ఆలిగో హైడ్రామ్నియస్‌ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా 

    పాలీ హైడ్రామ్నియస్‌ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. 

    యుటెరైన్‌ అనామలీస్‌ : యుటెరన్‌ లోపాలున్నప్పుడు. 

    ఫూట్లింగ్‌ బ్రీచ్‌ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. 

    ఎక్స్‌టెండెడ్‌ హెడ్‌ అండ్‌ కార్డ్‌ ఎరౌండ్‌ నెక్‌ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్‌ కెనాల్‌లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్‌ ఎరౌండ్‌ నెక్‌ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్‌. 

    ప్రీవియస్‌ సిజేరియన్‌ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్‌తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్‌ అయి ఉండటం. 

    ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్‌లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్‌ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.

    యాంటీరియర్‌ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).

    ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్‌స్ట్రెట్రీషియన్స్‌’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్‌ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్‌ టైమ్‌ అల్ట్రాసౌండ్‌ డాప్లర్‌’ సౌకర్యమూ ఉండాలి. 

    చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..

    ఈ డాప్లర్‌ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్‌)  క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్‌ సెక్షన్‌)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    చివరగా... 
    శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్‌)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. 

    దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. 

    తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్‌ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. 
    - నిర్వహణ: యాసీన్‌ 

Sangareddy

  • చేగుంట(తూప్రాన్‌): లయన్స్‌ క్లబ్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థిని హాశ్విక మొదటి బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్‌ రేణుక తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్‌ డీ320 ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా విద్యార్థిని ప్రతిభ చాటింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్‌ ప్రతినిధులు బాబూరావు, అమర్‌నాథ్‌రావు, గాయత్రి విద్యార్థినికి ప్రశంసాపత్రం, మెమెంటో అందజేశారు.

    నర్సాపూర్‌: నర్సాపూర్‌ – సంగారెడ్డి మార్గంలో పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద భగీరథ పథకం పైపులైను ఎయిర్‌ వాల్వ్‌కు సోమవారం లీకేజీ ఏర్పడింది. దీంతో నీరంతా కొంత సేపు వృథాగా పోయాయి. ఈ విషయమై మిషన్‌ భగీరథ పథకం డీఈఈ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ తమకు సమాచారం రాగానే స్పందించి నీటి సరఫరా నిలిపి వేసి వాల్వ్‌కు మరమ్మతులు చేయించామని చెప్పారు. మరమ్మతుల అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించామని ఆయన తెలిపారు.

    అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 108 అంబులెన్స్‌ వాహనాన్ని సోమవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ సంపత్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పైలట్‌ రవితేజ, ఈఎంటీ శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    తెల్లాపూర్‌లో కమిషనర్‌ పర్యటన

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): పటాన్‌చెరు సర్కిల్‌ పరిధిలోని తెల్లాపూర్‌ డివిజన్‌ను సోమవారం సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన సందర్శించారు. గోపన్‌పల్లి నుంచి తెల్లాపూర్‌ వరకు నడుస్తున్న రోడ్డు సర్వే పనులను ఆమె పరిశీలించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్‌ జ్యోతి రెడ్డి, డీఈ కృష్ణవేణి, ఏఈ ఫైజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

    మెదక్‌జోన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అమలు చేయాలని తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మెదక్‌కు వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌ నివేదిక అశాసీ్త్రయమైనదని, ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నీ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో విద్యా విధానం ఎలా ఉందో అవగాహన లేని వ్యక్తులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో యథావిధిగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధు, ఉపాధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి, మాధవరెడ్డి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

  • హుస్నాబాద్‌: ఏకలవ్య ఐఐటీ బుక్స్‌ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఐఐటీ పరీక్షల్లో హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ సాధించారు. హైదరాబాద్‌లోని దోమలగూడ రామకృష్ణ మఠంలో ఆదివారం ఏకలవ్య ఐఐటీ అకాడమి స్కూల్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర అవార్డులను ప్రదానం చేశారు. 6వ తరగతి చదువుతున్న ఆరాధ్యకు ప్రథమ శ్రేణి అవార్డు, ద్వితీయ శ్రేణి అవార్డు ఎల్‌.వైష్ణవి, రామ్‌ చరణ్‌, సాయి హవీస్‌ అందుకున్నారు. ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, ఉపాధ్యాయులు విద్యార్ధులను అభినందించారు.

  • ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త

    పటాన్‌చెరు టౌన్‌: వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌ మున్సిపల్‌కు చెందిన నాగేశ్‌ ఏ పని చేయకుండా తాగి ఇంటికి వస్తుండటంతో భార్య సుజ మందలించింది. దీంతో భార్యకు చెప్పకుండా ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. దీంతో భర్త కోసం తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త అదృశ్యంపై భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • కావేరి యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు

    వివిధ రంగాల ప్రముఖులకు సత్కారం

    వర్గల్‌(గజ్వేల్‌): మహిళాశక్తి అపారమని అవకాశం దక్కితే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని కావేరి యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని గౌరారం కావేరి యూనివర్సిటీలో ‘శక్తి నేషనల్‌ లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌–2026’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులలో స్ఫూర్తిని నింపడమే ధ్యేయంగా వివిధ రంగాల ప్రముఖ మహిళా సాధకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఉపన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖాముఖి సెషన్‌ ద్వారా మహిళా నాయకత్వం, ఆత్మస్థైర్యం, సమాజానికి అందించిన సేవలు పేర్కొంటూ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. ప్రముఖ మహిళలతో ‘శక్తి’ కార్యక్రమం విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ప్రేరణగా నిలుస్తుందని వీసీ పేర్కొన్నారు. ఆభాస రిహాబ్‌ సెంటర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గాయత్రి అరవింద్‌, ఎస్‌ఎంఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ మంజులరావు, ఐకార్‌ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ విశారద, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు హోల్డర్‌ సోఫియా సూఫీ, స్ట్రాటజీ, బిజినెస్‌ మెర్క్సియస్‌ మాజీ సీఈఓ వైశాలి నియోజియా, క్లాసికల్‌ డ్యాన్సర్‌ విదుషి దీక్ష తమ అనుభవాలను వివరించారు. విద్యార్థులు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం చూడకుండా తామే ఉద్యోగాలు సృష్టించేలా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా అంజలి బృందం సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, డైరెక్టర్‌ హర్ష పోలసాని, డీన్‌లు డాక్టర్‌ కొండ శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • 39 గోల్డ్‌ , 26 సిల్వర్‌ మెడల్స్‌ సొంతం

    దుబ్బాక/మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయస్థాయి కరాటే పోటీల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఏకంగా 65 మంది విద్యార్థులు ప్రతిభ చాటి 39 గోల్డ్‌ మెడల్స్‌, 26 సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. కిక్కెర్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో 3వ జాతీయస్థాయి మార్షల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యువస్పోర్ట్స్‌ కరాటే అకాడమి తెలంగాణ వ్యవస్థాపకుడు బురాని శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన విద్యార్థులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కరాటే పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన 2 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా దుబ్బాక మండలం రామక్కపేట గురుకులానికి చెందిన బాలికలు 20 గోల్డ్‌, 22 సిల్వర్‌ , లచ్చపేట మాడల్‌ స్కూల్‌ విద్యార్థులు మూడు గోల్డ్‌ , 1 సిల్వర్‌, దుబ్బాక కేజీవీబీ మూడు గోల్డ్‌, 1 సిల్వర్‌, సిద్దిపేట స్ప్రింగ్‌ డయల్‌ స్కూల్‌ 1 గోల్డ్‌ , దిశ స్కూల్‌ 1 సిల్వర్‌, మాస్టర్‌ మైండ్స్‌ స్కూల్‌ 4 గోల్డ్‌ , 1 సిల్వర్‌ , మిరుదొడ్డి కేజీవీబీ బాలికల పాఠశాల విద్యార్థులు 8 గోల్డ్‌ మెడల్స్‌ సాధించారు. ప్రతిభ చాటి జిల్లాకు పేరు తెచ్చిన విద్యార్థులను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీసీడీఓ నర్మద, డీసీఓ శారద, ప్రిన్సిపాల్‌ బుచ్చిబాబు అభినందించారు.

  • కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసిని

    నర్సాపూర్‌ రూరల్‌: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ ఉద్యో గుల సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సుహాసిని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని చిప్పల్‌తుర్తి కేజీబీవీ వద్ద టీఎస్‌ యూటీఎఫ్‌, కేజీబీవీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుహాసిని, టీఎస్‌ యూటీఎఫ్‌ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడారు. కేజీబీవీ, యుఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారికి వెంటనే సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలన్నారు. సర్వీస్‌ రక్షణ కల్పిస్తూ, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీలత, జబీనా సుల్తానా, పుణ్యవతి, షమీం, ఇందిరా, జ్యోతి, మంజుల, స్వరూప, శృతి పాల్గొన్నారు.

  • సైబర్‌ క్రైం డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌

    మెదక్‌జోన్‌: సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళా శాలలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ ప్రొఫైల్స్‌ ద్వారా జరిగే మోసాలు, తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైం సిబ్బంది సతీశ్‌, సయ్యద్‌, స్వప్న, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • వివరాలు వెల్లడించిన గజ్వేల్‌ ఏసీపీ

    గజ్వేల్‌రూరల్‌: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ప్రవీణ్‌ తన ఇంటిముందు ఉంచిన బైక్‌ చోరీకి గురైనట్లు ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని పిడిచెడ్‌ రోడ్డు నుంచి ప్రభుత్వాస్పత్రి వైపు అనుమానాస్పదంగా పల్సర్‌ బైక్‌పై వస్తున్న వ్యక్తులను తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి పారిపోగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వర్గల్‌ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి స్వామి, బూర్గుపల్లి మల్లేశ్‌లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో అపహరించిన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీ కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్‌ ఎస్‌హెచ్‌వో రవి, అదనపు ఇన్‌స్పెక్టర్‌ ముత్యంరాజు, ఎస్‌ఐ ప్రేమ్‌దీప్‌, క్రైమ్‌ సిబ్బంది వెంకటేశ్‌, రవి, దివ్య, స్వామి, వెంకన్నను ఏసీపీ అభినందించారు.

  • వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి యశోద

    టేక్మాల్‌(మెదక్‌): వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి యశోద అన్నారు. సోమవారం మండలంలోని కాద్లూర్‌ గ్రామంలో నిర్వహించిన వికలాంగుల సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ వికలాంగులకు రూ. 6వేల పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. పింఛన్‌తోపాటు చేయూత పెన్షన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద వికలాంగుల సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో వికలాంగులకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి, సభ్యులు చంద్రమ్మ, కేశమ్మ, ఎల్లమ్మ, రమేశ్‌, మల్లయ్య, కిష్టయ్య, చిన్న నవీన్‌ పాల్గొన్నారు.

  • జిల్లా రవాణా శాఖాధికారి

    మెదక్‌జోన్‌: పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, ఇది అందరి బాధ్యతని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

    చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు రూ.45 లక్షల నిధులు సీసీ రోడ్లకు మంజూరైనట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. నార్సింగికి రూ. 25 లక్షలు, నర్సంపల్లి, వల్లూర్‌ గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. నిధుల మంజూరుకు సహకరించిన ఇన్‌చార్జి మంత్రి వివేక్‌, దుబ్బాక నియోజవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ మండల నాయకులు రాజేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రాజేశ్‌, బాల్‌రాజ్‌గౌడ్‌, వినోద్‌ కృతజ్ఞతలు తెలిపారు.