Archive Page | Sakshi
Sakshi News home page

International

  • వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్‌ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి నుంచి 10 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.

    డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ సుంకానికి లోబడి ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచనున్నట్లు కూడా తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.

  • పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున  అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని  తెలుస్తోంది.

    కరాచీ అంతర్జాతీయ నౌకాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలను తీసుకెళ్తున్న కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం ఇవి వెనువెంటనే వేరే కంటైనర్లకు వ్యాపించడంతో 20 వరకూ కంటైనర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.

    అయితే మంటలు వ్యాపించిన సమయం మధ్యాహ్నం ఒంటిగంటతో పాటు నిన్న శుక్రవారం కావడంతో కార్మికులంతా నమాజ్‌ కోసం దగ్గర్లో ఉన్న మసీద్‌కు వెళ్లారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడంలో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 

     

  • బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్‌లో డీజిల్‌ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై  కారు ఎక్కించాడు. ఈ ఘటన అక్కడి మతఛాందసవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలుస్తోంది.

    బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఘటనలను భారత్ ఎంతగా ఖండించిన అక్కడి మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం మైనారిటీలపై దాడుల అంశం ప్రస్థావనకు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అక్కడ మరోసారి హిందూ యువకునిపై దాడి జరిగింది.

    డైలీ స్టార్ కథనం ప్రకారం.. రిపోన్ సోహ అనే హిందూ యువకుడు అక్కడి స్థానిక పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అక్కడికి ఎస్‌యూవీ వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి రూ. 3,710 డిజీల్‌ వాహనంలో కొట్టించాడు. దీంతో అతనిని డబ్బులు చెల్లించాలని ఆ  అడిగాడు. దీనికి అతను నిరాకరించడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది సోహ  వాహనం ఎదుట నిలుచున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అతనిపైనుంచి వాహనాన్ని నడిపాడు. దీంతో రిపోన్ సోహా అక్కడికక్కడే మృతిచెందాడు.

    ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు వాహానాన్ని సీజ్‌ చేసి నిందితులను అరెస్టు చేశారు.  కాగా ఆవాహనం NCP పార్టీకి చెందిన మాజీ నేత అబుల్ హషీంకు చెందినదిగా గుర్తించిట్లు పోలీసులు తెలిపారు.బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై అక్కడి మానవహక్కుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో మైనార్టీలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోకుండా భయాందోళనలకు గురిచేసేందుకే అక్కడి అల్లరి మూకలు ఈ దాడులు జరుపుతున్నట్లు హుమన్‌రైట్స్ కమిషన్ ఆరోపిస్తుంది. 

    బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువులు 7.95 శాతం కోటి 14 లక్షల మంది ఉన్నారు. కాగా వచ్చేనెలలో బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 

     

  • పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్‌ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.

    బ్రిస్సెన్స్‌కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన  భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.

    దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన  ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు. 

    కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు.

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జాబితాలో  భారత్ కూడా ఉంది. ట్రంప్ అధిక పన్నుల ప్రభావంతో ఎగుమతులు లేక చాలా మంది ఉపాధి కోల్పోయారు. అంతే కాకుండా ఫీజులు కట్టలేక  తమ పిల్లలను పాఠశాలలకు మాన్పించేస్తున్నారు. 

    తుంటరి ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. స్నేహ హస్తం అందిస్తూనే చేయి తీసేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ‍ఆయన అధికారం చేపట్టిన తర్వాత అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతాయని అందరూ ఆశిస్తే దానికి భిన్నంగా జరిగింది. పాకిస్థాన్ అంశంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా నిలిచిన ట్రంప్ అనంతరం రష్యానుంచి చమురు కొనకూడదని భారత్‌కు ఆంక్షలు విధించారు. భారత్‌ ఆ మాటల్ని ఖాతరు చేయకపోవడంతో పన్నులు 50 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

    అయితే ట్రంప్ పన్నుల ఎఫెక్ట్  గుజరాత్ సూరత్‌లోని వజ్రాల కార్మికుల కుటుంబాలపై పడింది. టాక్సులు 50 శాతానికి చేరడంతో వాటి ధరలు పెరిగి అమెరికాకు ఎగుమతయ్యే జువెల్లర్స్ చాలా తగ్గాయి. దీంతో దానిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావంతో వారి పిల్లలు పాఠశాలలు మానేయ్యాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

    ఈ శీతాకాల పార్లమెంటు సెషన్‌లో విద్యార్థులు స్కూల్‌ డ్రాపౌట్స్‌పై నివేదిక అందించారు. అందులో 2025-26 గుజరాత్‌లో పాఠశాల మానేసిన విద్యార్థుల సంఖ్య 2.4 లక్షలుగా ఉంది. గతేడాది 50,541తో పోలిస్తే దాదాపు నాలిగింతలు పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలే కాకుండా సూరత్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనూ దాదాపు 600కు పైగా విద్యార్థులు తమ చదువు మధ్యలో విద్యను ఆపేసినట్లు నివేదికలు తెలిపాయి.

    ఇండియన్ డైమండ్ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్సన్‌ దినేశ్ నవదీయా మాట్లాడుతూ.. "గతంలో వజ్రాల కార్మికులు నెలకు రూ. 30 నుంచి 35 వేలు సంపాదించేవారు ప్రస్తుతం ఆ మెుత్తం దాదాపు రూ. 20వేలకు పడిపోయింది. దీంతో ఇంటి అద్దెలు , ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి పిల్లలను స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నారు" అని తెలిపారు. 

    ట్రంప్ పన్నుల ప్రభావం వజ్రాల పరిశ్రమపై అధికంగా పడిందని పేర్కొన్నారు. అధిక పన్నుల ప్రభావంతో 50వేల మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. ఎంతో మందికి వేతనాలు తగ్గాయన్నారు. కాగా భారత్‌ నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌ నుంచి ఎగుమతయ్యే వజ్రాలలో దాదాపు 40 శాతం ఆ దేశానికే వెళతాయి.

Movies

  • సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్‌లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది. అందువల్ల మార్చిలో రిలీజ్ అవ్వడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది.  

    పెద్ది సినిమాకు ఇంకా ముప్పై రోజుల షూట్ మిగిలి ఉంది. సంక్రాంతి తర్వాత నాన్‌స్టాప్‌గా షూట్ చేసినా, రిలీజ్‌కు కావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ టైమ్ ఒక్క నెలలో పూర్తవడం కష్టమే. కానీ ఇటీవల రిలీజ్‌ చేసిన రామ్‌ చరణ్‌ పోస్టర్లలో మాత్ర మార్చి నెల రిలీజ్‌ అంటూ ప్రకటించారు. చూడాలి ఆ టైమ్‌కు పెద్ది రిలీజ్‌ అవుతుంతో లేదో. ఇక ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించిన దురంధర్ 2 మాత్రం బాలీవుడ్ స్టైల్‌లో డేట్ ఫిక్స్ చేస్తే ఎక్కువగా వాయిదా లేకుండా వస్తుందని అంచనా. అయితే మార్చి నెల ఎగ్జామ్స్ సీజన్. దాంతో ఆ టైమ్‌లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే సందేహం ఉంది.  

    దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ సినిమా 2027 మార్చికి ప్లాన్ చేశారు. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలు కలిగిస్తోంది. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ కూడా అదే టైమ్‌లో వస్తుందని టాక్ ఉంది. కానీ అధికారిక డేట్ మాత్రం ఇంకా రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ల మాదిరిగానే ప్రీ సమ్మర్ రిలీజ్‌లు కూడా ఇప్పుడు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ ఉన్నా, పెద్ద సినిమాలు వేసవి హాలిడేలకు దగ్గరగా రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

    మొత్తానికి మార్చి 2026లో ప్రకటించిన సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ 2027 మార్చి మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో భారీ సినిమాలతో హాట్‌గా మారనుంది. 

  • కోలీవుడ్‌ నటుడు ధ‌నుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో నవంబర్‌ 28న హిందీలో రిలీజ్‌ అయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. థియేటర్‌ రన్‌ ముగిసిని తర్వాత ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత  ధనుష్, దర్శకుడు ఆనంద్‌. ఎల్‌. రాయ్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. హిందీలో సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చకున్న ఈ మూవీ టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది.ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

    రొమాంటిక్‌ డ్రామా కథతో తెరకెక్కిన ‘తేరే ఇష్క్ మే’ (అమర కావ్యం)  మూవీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో  ఈ నెల 23న విడుదల కానుంది.  హిందీతో పాటు తమిళం, తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో ధనుష్‌ బాగా నటించారు. తన కోపం కారణంగా ఎప్పుడూ కాలేజ్‌లో గొడవలు పడుతూ ఉంటాడు. అయితే, కాలేజీ రోజుల్లోనే సాహీ (కృతి సనన్)తో ప్రేమలో పడుతాడు. అయితే, తన కోపం కారణంగా నిజాయితీగా ప్రేమించినప్పటికీ తన ప్రియురాలిని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అతను ఏం చేశాడు..? సాహీ జీవితంపై శంకర్‌ ప్రభావం ఎలా చూపింది..?  ఫైనల్‌గా ఈ జోడీ కలిసిందా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
     

  • ప్రభాస్‌- మారుతి మూవీ ది రాజాసాబ్‌ నుంచి హిట్‌ సాంగ్‌ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్‌, నిధి అగర్వాల్‌ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది.  కృష్ణకాంత్‌ రాసిన ఈ పాటను విశాల్‌ మిశ్రా పాడారు.  రొమాంటిక్‌ కామెడీ హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ సంగీతం అందించారు.  ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ కూడా నటించిన విషయం తెలిసిందే. జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ. 250 కోట్లకు పైగానే రాబట్టింది. అయితే, సినిమా ఫస్ట్‌ ఆటతోనే భారీగా ట్రోలింగ్‌కు గురికావడంతో కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపింది.
     

  • టాలీవుడ్‌లోకి యంగ్‌ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్‌గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది. ఈ మూవీ నుంచి తాజాగా ప్రత్యేకమైన పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్‌ గురించి ప్రశంసలు వస్తున్నాయి.

    యువతరంలో మంచి గుర్తింపు ఉన్న  మనస్విని బాలబొమ్మల చాలా టాలెంటెడ్‌.. తెలుగులో 'కొక్కొరొకో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.

    ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల  తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగుసినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడంతో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది.

    సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన అనుభవం ఆమెకు ఉంది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.. కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం  ఉంది. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.. ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబిస్తాయి.

    'కొక్కొరొకో' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. 

  • కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. కెరీర్‌లో ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుసగా 9 సూపర్‌ హిట్లు కొట్టేసి శెభాష్‌ అనిపించుకున్నాడు. దీంతో అతడి పదో సినిమా ఎవరితో? ఎప్పుడు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఓసారి చూసేద్దాం..

    ఫస్ట్‌ సినిమా నుంచే..
    అనిల్‌ రావిపూడి సహాయ దర్శకుడిగా, సంభాషణల రచయితగా కెరీర్‌ మొదలుపెట్టాడు. 2015లో నందమూరి కల్యాణ్‌ 'పటాస్‌' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. ఆ మరుసటి ఏడాది తీసిన సుప్రీమ్‌ కూడా ఘన విజయం సాధించింది. రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్‌ 3, భగవంత్‌ కేసరి.. ఇలా అన్నీ హిట్లు, సూపర్‌ హిట్లే అందుకున్నాడు. 

    బ్లాక్‌బస్టర్‌ సినిమాలు
    గతేడాది సంక్రాంతి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. పొంగల్‌ పండగను క్యాష్‌ చేసుకునేందుకు ఈసారి కూడా సంక్రాంతికే బరిలోకి దిగాడు.. కాదు, మెగాస్టార్‌ను బరిలోకి దింపాడు. చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీ తీశాడు. ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాగా పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.200 కోట్లు దాటేసింది. 

    సీనియర్‌ హీరోలతో సినిమాలు
    ఈసారైనా అనిల్‌ రావిపూడి దొరుకుతాడేమోనని చూసిన ట్రోలర్స్‌కు భంగపాటే ఎదురైంది. చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ.. ఇలా అందరు సీనియర్‌ హీరోలతో సినిమాలు చేశాడు అనిల్‌. మరి నాగార్జునతో ఎప్పుడు? అని అతడి ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచి కథ, సమయం కుదిరితే ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హామీ ఇచ్చాడు. 

    చిరంజీవి బంపరాఫర్‌
    మరోవైపు మెగాస్టార్‌.. తనకు అఖండ విజయాన్ని అందించాడన్న ఆనందంతో ఓ బంపరాఫర్‌ ఇచ్చాడు. అనిల్‌ కథ సిద్ధం చేస్తే.. తాను, వెంకటేశ్‌ కలిసి పూర్తిస్థాయి సినిమా చేస్తామన్నాడు. అవసరమైతే వెంకీ సినిమాలో అతిథి పాత్రలోనైనా కనిపించేందుకు సిద్ధమన్నాడు. ఇంత మంచి ఆఫర్‌ ఇస్తే అనిల్‌ ఎందుకు కాదంటాడు? కానీ, వెంటనే ఒప్పేసుకుని సినిమా చేసే పరిస్థితి లేకపోవచ్చు.

    రామ్‌చరణ్‌తో సినిమా!
    మన శంకరవరప్రసాద్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అనిల్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. 'రామ్‌చరణ్‌తో సినిమా తప్పకుండా చేస్తాను. ముందు ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ చేయండి.. వెంటనే రామ్‌చరణ్‌ దగ్గరకు వెళ్లిపోతాను' అన్నాడు. అతడు కోరినట్లుగానే ప్రేక్షకులు సినిమాకు మంచి విజయాన్ని అందించారు. మరి అనిల్‌.. చరణ్‌తో సినిమా చేస్తాడా? అన్నది చూడాలి!

    పదో సినిమాపై బజ్‌
    అసలే అనిల్‌ రావిపూడి కెరీర్‌లో 10వ సినిమా.. హిట్‌ స్ట్రీక్‌ పోకుండా మూవీ తీయాలన్న ఒత్తిడి అతడిపై చాలానే ఉంది. కథ, హీరో ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అది ఏమాత్రం బెడిసికొట్టినా అనిల్‌ రావిపూడిని ఆడేసుకుంటారు. మళ్లీ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటారు. మరి ఆ పదో సినిమా చరణ్‌తోనా? చిరు-వెంకీతోనా? నాగ్‌తోనా? లేదంటే వేరే హీరోతోనా?అన్నది రానున్నరోజుల్లో చూడాలి!

  • అల్లు అర్జున్‌ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్‌ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.  అయితే, బన్నీ కూడా అంతే రేంజ్‌లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్‌ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్‌లో తన ఫ్యాన్స్‌ బేస్‌ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్‌ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్‌ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే, తమిళ్‌లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్‌ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.

    దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్‌
    దళపతి విజయ్‌ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌లకు ఇమేజ్‌ ఉంది. బిగిల్‌, మెర్సిల్‌, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్‌ ఇస్తే.. లియో, మాస్టర్‌ మూవీస్‌తో లోకేశ్‌ తన మార్క్‌ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్‌ ఫ్యాన్స్‌ కన్ను అల్లు అర్జున్‌ మీద పడింది. లోకేశ్‌ తన నెక్ట్స్‌ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. విజయ్‌, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్‌ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.

    చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్‌లో  బన్నీ  తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.

    అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలత
    ప్రస్తుతం అల్లు అర్జున్ చూపు  తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్‌ తక్కువగానే ఉండొచ్చు. ఆపై  తమిళ మరో బిగ్‌ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి..  కార్‌ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్‌ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్‌ ఇమేజ్‌ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్‌ వర్కౌట్‌ అయితే సౌత్‌ ఇండియాలో బన్నీకి సినిమాలకు  బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఏర్పడుతుంది.

    బిగ్‌ లైనప్‌ సినిమాలతో ప్లాన్‌
    అల్లు అర్జున్‌ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్‌ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్‌ కనగరాజ్‌, త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా, సుకుమార్‌ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్‌ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్‌ కొడితే చాలు.. సౌత్‌ ఇండియాలో తన మార్కెట్‌ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్‌లో ఎటూ ఖాన్‌ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్‌ ఉంది. ముఖ్యంగా బీహార్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో   బన్నీ సినిమాలకు భారీ క్రేజ్‌ ఉంది. ఆపై తన ఫ్యూచర్‌ సినిమాల లైనప్‌ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్‌ ఏంటో అల్లు అర్జున్‌ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది.
     

  • 2026కి వెల్‌కమ్‌ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్‌గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌, ఎంపీ కంగనా రనౌత్‌ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.

    2016ని ఎందుకు మిస్‌ అవుతున్నారో?
    వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ  పోస్ట్‌ షేర్‌ చేసింది. అందరూ సడన్‌గా 2016ని ఎందుకు మిస్‌ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్‌, తను వెడ్స్‌ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్‌ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్‌ నోటీసులు పంపాడు.

    సంచలనం
    అది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్‌, ఔట్‌సైడర్స్‌ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.

    ఏమిటా వివాదం?
    గతంలో కంగనా రనౌత్‌- హృతిక్‌ రోషన్‌ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్‌ రోషన్‌ను ఎక్స్‌గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్‌ చేసింది. దీంతో హృతిక్‌.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. 

    దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్‌ నిరంజన్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.

     

     

  • బాలీవుడ్ సీనియర్హీరో గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మధ్య గోవిందాపై ఆయన సతీమణి సునీత ఆహుజా(Sunita Ahuja) సంచలన ఆరోపణలు చేసింది. గోవిందాకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని ఇంటర్వ్యూలో చెప్పింది. తర్వాత గోవిందా(Govinda) పర్సనల్లైప్పై రకరకాల పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం సునీత, గోవిందా వేరు వేరుగా ఉంటున్నారు. విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని స్వయంగా సునీతనే చెప్పింది. అయితే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనేది వందశాతం నిజమని చెబుతోంది

    తాజాగా మిస్మాలినికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయంపై మట్లాడారు. ‘చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరు వస్తారు. కానీ మీరు తెలివి తక్కువ వారు కాదు. 63 ఏళ్ల వయసు వచ్చింది. టీనా(కూతురు)కి పెళ్లి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. యశ్‌(కొడుకు)కి కెరీర్ఉంది. నిన్ను క్షమించే ప్రస్తక్తే లేదు గోవిందాఅని భర్త గోవిందకు సునీత వార్నింగ్ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నేపాల్అమ్మాయిని. ఖుక్రీ(కత్తి) బయటకు తీస్తే.. అందరూ ఇబ్బంది పడతారు. అందుకే జాగ్రత్తగా ఉండమని అతని చెప్పాఅని సునీత అన్నారు.

    కాగా.. సునీతా అహుజా, గోవిందల పెళ్లి 1987లో జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు యశ్‌, కూతురు పేరు టీనా. గత ఏడాదిగా వీరిద్దరు వేరు వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. విడాకుల రూమర్స్‌ వినిపిస్తున్నా.సునిత మాత్రం గోవిందా ఎప్పటికీ తనవాడే అని.. వదిలేసే ప్రసక్తే లేదన్నారు.

  • ఒకప్పుడు గ్లామర్‌తో అల్లాడించిన హీరోయిన్‌ సనా ఖాన్‌ ఆరేళ్ల క్రితమే సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. 2020 అక్టోబర్‌లో సినీ పరిశ్రమ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన నెల రోజులకే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో భర్త బలవంతం వల్లే సినిమాలు మానేసిందన్న ప్రచారం జరిగింది.

    నేనే కోరుకున్నా..
    తాజాగా ఈ రూమర్‌పై సనాఖాన్‌ స్పందించింది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నా పెళ్లి. వివాహం తర్వాతే నేను పూర్తిగా మరో కొత్త వ్యక్తిగా మారిపోయాను. ఆ మార్పు నేను ఎప్పటినుంచో కోరుకున్నదే..  అయితే నేను సినిమాలు మానేయడం, హిజాబ్‌తోనే బయటకు రావడం చూసి జనాలు ఏవేవో అనుకున్నారు. 

    నా భర్త వల్లే..
    గతంలో హిజాబ్‌ లేకుండా కూడా బయట తిరిగేది.. ఇప్పుడేమో ఇంత మార్పేమిటో.. నా భర్తే నన్ను మార్చేశాడు అనుకున్నారు. కానీ, అది నిజం కాదు. మన ఇష్టం లేనిదే మనల్నెవరూ మార్చలేరు. నా భర్త నన్ను గైడ్‌ చేశాడంతే.. పైగా నేను ప్రశాంతత కోరుకున్నాను. డబ్బు, పేరు ప్రఖ్యాతలు ఇలా ఎన్ని సంపాదించుకున్నా చివరకు మానసిక ప్రశాంతత కోరుకుంటాం కదా.. నేనూ అదే ఎంచుకున్నాను.

    అందుకే సినిమాలు వదిలేశా..
    ఇండస్ట్రీలో నా చుట్టూ ఉన్నవారు సరిగ్గా లేకపోతే నేను తప్పటడుగులు వేసే ఆస్కారం ఉంది. అందుకే ఇండస్ట్రీని వదిలేశాను. వీటన్నింటికన్నా నాకు నా భర్త ప్రేమ, అనుబంధమే ముఖ్యమనిపించింది. సాధారణంగా పెళ్లిలో అమ్మాయి తరపువారికే ఎక్కువ ఖర్చులుంటాయి. కానీ అందుకు భిన్నంగా నా భర్త కుటుంబమే ఎక్కువ పెళ్లి ఖర్చును భరించింది అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    హీరోయిన్‌ సనా ఖాన్‌.. గగనం, కత్తి, మిస్టర్‌ నూకయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 6వ సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్‌ అయింది. ఆరేళ్ల క్రితం అంటే 2020లో సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాతి నెలలో ముఫ్తీ అనాజ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

    చదవండి: 8 ఏళ్లుగా అవకాశాల్లేవ్‌.. నా మతం వల్లేనేమో!

  • కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ ‍ప్రేమలో  ఉన్నట్లు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈమేరకు పలు వెబ్‌సైట్లు కూడా నిజమేనంటూ పలు ఫోటోలను షేర్‌ చేస్తున్నాయి. అయితే, ఇందులో ఎంతమాత్రం నిజమనేది తెలియాలంటే ఈ బ్యూటీ వివరణ ఇస్తే తేలుతుంది. నెట్టింట ఇలాంటి వార్తలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఫైనల్‌గా వాటిలో కొన్ని నిజం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రుక్మిణి వసంత్‌ లవ్‌ ట్రాక్‌ గురించి ట్రెండ్‌ అవుతుంది.

    కాంతార సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌కు రుక్మిణి చేరుకుంది. దీంతో యశ్‌ భారీ బడ్జెట్‌ మూవీ టాక్సిక్‌లో కూడా ఆమె భాగమైంది. ఆపై ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రుక్మిణి తన ప్రాణ స్నేహితుడు సిద్ధాంత్‌తో డేటింగ్ చేస్తోందని సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. అతనొక పాపులర్‌ ఫోటోగ్రాఫర్ అని కూడా ప్రచారంలో ఉంది.  వారిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

    కానీ, ఈ అంశం గురించి వారిలో ఎవరూ స్పందించలేదు. సోషల్ మీడియాలో ధృవీకరించని ఇలాంటి పుకార్లు వైరల్‌ అవుతూనే ఉంటాయి. చాలా సార్లు, అవి నిజమవుతున్నాయి. కొన్నిసార్లు, అవి అబద్ధాలుగా మిగిలిపోవచ్చు కూడా.. ప్రస్తుతానికి, కొనసాగుతున్న ఈ రూమర్‌ నిజమో కాదో స్పష్టత లేదు.

  • కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్‌'. గతేడాదిలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ మూవీ విడుదలైంది. అయితే, తాజాగా ఓటీటీ విడులపై అధికారికంగా ప్రకటించారు.  ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించారు. క్రిస్మస్‌ సమయంలో తెలుగు సినిమాలు భారీ సంఖ్యలు విడుదలయ్యాయి. దీంతో ఈ మూవీకి తెలుగులో థియేటర్స్‌ కొరత ఏర్పడింది. దర్శకుడు  విజయ్‌ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించింది.

    మార్క్‌(Mark) సినిమా జనవరి 23న జియోహాట్‌స్టార్‌ (JioHotstar)లో విడుదల కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్‌, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లలో తన నటన హైలైట్ అని రివ్యూలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాయన్నారు. కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో కాస్త  నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్‌ ఆకట్టుకుంటాడని చెప్పొచ్చు.

  • సునీల్కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ మధ్య కామెడీ వదిలే వేరే జోనర్లో వెళ్లాడు. మళ్లీ భర్త మహాశయులు సినిమాతో కామెడీ వైపు వచ్చాడు. సినిమా చూసినవాళ్లు అంతా సునీల్కామెడీ గురించి మాట్లాడుతున్నారు. దుబాయ్శ్రీను తర్వాత బాగా ఎంజాయ్చేసిన సినిమా ఇది. అప్పుడప్పుడైనా సునీల్కామెడీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాఅని అన్నారు మాస్మహారాజా రవితేజ

    ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. నెల 13 విడుదలైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్లభించింది. శనివారం హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో సినిమా సక్సెస్మీట్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా సునీల్తో తనకున్న అనుబంధాన్ని రవితేజ పంచుకున్నాడు. ‘సునీల్‌, నేను మంచి స్నేహితులం. రకంగా చెప్పాలంటే.. వెతకారంతో కూడిన బెస్ట్‌ ఫ్రెండ్నాకు. మా అమ్మ, వాళ్ల అమ్మ మంచి స్నేహితులు. వాళ్ల నుంచే మాకు వెతకారం వచ్చింది(నవ్వుతూ..) ’ అన్నారు. ఇక సునీల్కూడా రవితేజ గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ లేకున్నా సరే నేను కలిసే ఏకైక హీరో రవితేజ. చాలా మంచి వ్యక్తి. ఆయన ఎనర్జీ నెక్ట్లెవల్‌’ అన్నారు. 

  • సంగీత ప్రపంచంలోనే అగ్రజుడు ఏఆర్‌ రెహమాన్‌. కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని భాషల్లోనూ తన సత్తా చూపించాడు. పుట్టుకతోనే హిందూ అయిన ఇతడు తర్వాత ముస్లిం మతానికి మారిపోయాడు. అయితే తాను ముస్లిం అవడం వల్ల బాలీవుడ్‌లో సరైన అవకాశాలు రాలేదంటూ అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

    ఔట్‌ సైడర్‌
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. రోజా, బాంబే, దిల్‌సే వంటి హిట్‌ సినిమాలకు సంగీతం అందించినప్పటికీ నేను బాలీవుడ్‌లో ఔట్‌సైడర్‌ (ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని వ్యక్తి)లానే ఫీల్‌ అయ్యేవాడిని. కానీ తాల్‌ సినిమా పాటలు అందరి ఇంట్లోకి చేరాయి. ఇప్పటికీ ఎంతోమంది ఉత్తరాదివాళ్లు ఆ మూవీ పాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే అందులో కొంత పంజాబీ, కొంత హిందీ మ్యూజిక్‌ మిక్స్‌ అయి ఉంటుంది.

    8 ఏళ్లుగా తగ్గిన అవకాశాలు
    అప్పుడు నాకు పంజాబీ సంగీతంపై మరింత ఆసక్తి కలిగింది. అలా సుక్వీందర్‌ సింగ్‌ను కలిశాను. తనతో కలిసి చేసిన 'చయ్య చయ్య', 'జై హో..' పాటలు ఎంత ఆదరణ పొందాయో మీ అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిదేళ్లుగా నాకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. బహుశా దీనికి ఇండస్ట్రీలో మారిన పవర్‌ షిఫ్ట్‌ ఒక కారణమైతే.. నా మతం కూడా మరో కారణం కావొచ్చు. ఏదేమైనా నాకు నా కుటుంబానితో గడిపేందుకు సమయం దొరికిందనుకుంటాను. 

    అవే నా దగ్గరకు..
    అయినా పనికోసం నేను పాకులాడటం లేదు. పనే నా దగ్గరకు రావాలని అనుకుంటాను. నా వృత్తిపట్ల నాకున్న నిబద్ధతే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. రెహమాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మతమే అడ్డంకైతే ఇండస్ట్రీలో ఇన్ని అవకాశాలు వచ్చేవే కాదని పలువురు సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. రామాయణం మూవీలో ఛాన్స్‌ నీ మతం చూసే ఇచ్చారా? అని మండిపడుతున్నారు. 

    చదవండి: ధనుష్‌తో మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి?

Andhra Pradesh

  • తాడేపల్లి: ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతిపై ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యుడిగా డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణ అందించిన విశేష సేవలను గుర్తుచేసుకున్నారు.

    పోలియో రోగులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పారన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారన్నారు. పోలియో బాధితులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత శస్త్రచికిత్సలు చేశారని, దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.

    డాక్టర్‌ ఆదినారాయణరావు  పోలియో రహిత భారతదేశం కోసం ఎన్నో కలలు కన్నారని, అలాంటి గొప్ప వైద్యుడి మరణం తీరని లోటని అభివర్ణించారు. డాక్టర్‌ ఆదినారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన  ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొన్నారు.

  • తాడేపల్లిగూడెం అర్బన్‌: పట్టణంలోని ఒక పాస్ట్‌ఫుడ్‌ హోటల్‌ నిర్వాహకులకు ఫుడ్‌ కొనుక్కోనేందుకు వచ్చిన యువకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌ సెంటరులో హిబ్బు అనే వ్యక్తి కింగ్స్‌ ఫాస్ట్‌ఫుడ్‌ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో పెంటపాడుకు చెందిన ఇద్దరు యువకులు ఫాస్ట్‌ఫుడ్‌ కొనుగోలు చేశారు. 

    కొనుగోలుదారులు మరో నిమ్మకాయ ఇమ్మని అడగడంతో హోటల్‌, లో పనిచేస్తున్న సిబ్బంది అక్కడ ఉన్నాయని తీసుకోమని చెప్పడంతో సిబ్బందికి యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కొంతసేపటికి హోటల్‌ నిర్వాహకులకు చెందిన వ్యక్తులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులపై తీవ్రంగా దాడి చేయడంతో చీర్ల వెంకటరెడ్డి కన్నుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చీర్ల వెంకటరెడ్డిని వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

    గురువారం మళ్లీ దాడి
    అయితే గురువారం సాయంత్రం గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డికి చెందిన పెంటపాడు, ముదునూరుపాడు ప్రాంతాలకు చెందిన వబంధువులు స్థానిక హోటల్‌ వద్దకు చేరుకుని హోటల్‌ యజమాని ఎక్కడని ప్రశ్నించగా అక్కడి సిబ్బంది తమకు తెలియదని చెప్పడంతో ఫుడ్‌ కొనుగోలు చేయడానికి వచ్చిన తమ వారిని ఎందుకు కొట్టారు? అని కోపంతో అక్కడి సిబ్బందిపై దాడి చేసి హోటల్‌లోని సామగ్రిని చెల్లాచెదురు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోనికి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరరలించారు.

    ఇరువర్గాలపై కేసుల నమోదు
    హోటల్‌ నిర్వాహకులు మహ్మద్‌ అబ్దుల్‌, గాయాలపాలైన చీర్ల వెంకటరెడ్డిలతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఘర్షణలో చీర్ల వెంకటరెడ్డి వద్ద ఉన్న కొంత నగదును, అతని శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను హోటల్‌ నిర్వాహకులు దౌర్జన్యంగా లాక్కొన్నారని ఫిర్యాదు చేశాడు. తమ హోటల్‌ వద్ద గొడవ చేసి క్యాష్‌ కౌంటర్‌లోని నగదును చీర్ల వెంకటరెడ్డి బంధువులు కాజేశారని హోటల్‌ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పట్టణ ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Sports

  • అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ టీమ్‌పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్‌ కుర్రాళ్ల టీమ్‌ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

    అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు 238 పరుగులు చేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు 80 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ తరఫున పేసర్ అల్ ఫహద్ ఐదు వికెట్లు తీశాడు.

  • అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.

    ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

    తొలి ప్లేయర్‌గా..
    అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్‌-19 ప్రపంచకప్‌లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో కమల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.

    అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్‌లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ  20 మ్యాచ్‌ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.  ఓవరాల్‌గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్‌లో కొనసాగుతున్నాడు.

    కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌  48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్‌, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్‌, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!
     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్‌కు గుడ్ న్యూస్‌. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తో పాటు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

    ఈ విష‌యాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీక‌రించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసిన‌ట్లు కేఎస్‌సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీల‌తో కళకళలాడనుంది" అని కేఎస్‌సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

    స‌ర్కార్ నిబంధ‌న‌లు ఇవే..
    స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్‌మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని క‌ర్ణాట‌క స‌ర్కార్‌ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్‌లను పూర్తిగా మార్చాలని ప్ర‌భుత్వం సూచించింది. 

    కాగా ఐపీఎల్‌-2025 ఆర్సీబీ ఛాంపియ‌న్‌గా నిలిచిన అనంత‌రం.. చిన్న‌స్వామి స్టేడియంలో విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. 

    దీంతో అప్ప‌టి నుంచి చిన్న‌స్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జ‌ర‌గలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదిక‌ను తొలిగించారు. అయితే తిరిగి మ‌ళ్లీ చిన్న‌స్వామి స్టేడియంలో క్రికెట్ క‌ళ సంత‌రించుకోనుండ‌డంలో కొత్తగా ఎన్నికైన కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్‌ది కీల‌క పాత్ర‌.
    చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్‌ ఘన విజయం

  • మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

    యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్‌ఫీల్డ్  37 బంతుల్లో 61 పరుగులు చేసింది.  ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్‌, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.

    పోరాడిన ఓడిన ముంబై..
    అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్‌(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.

    చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్‌) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్‌, ఎకిలిస్టోన్‌, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ముంబై ఓటమి పాలైంది.
    చదవండి: కివీస్‌తో మ్యాచ్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్ లాంటిది: మహ్మద్‌ సిరాజ్‌

  • అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.

    ప్రారంభంలోనే కెప్టెన్ ఆయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లోపడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72), అభిజ్ఞాన్ కుండు(80 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

    అయితే వీరిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు భారీ స్కోర్‌ చేసేలా కన్పించిన భారత్‌.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధిముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్‌, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు. 

    కాగా ప్రస్తుతం బంగ్లా-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్లు కెప్టెన్‌లు టాస్ సందర్భంగా కరచాలనం చేసుకునేందుకు నిరాకరించారు.
    చదవండి: U19 World Cup 2026: భార‌త్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్‌'

  • న్యూజిలాండ్‌తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.

    ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌ను వరల్డ్‌కప్ ఫైనల్‌లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్‌తో పోల్చాడు.

    భారత్‌లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్‌. చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు  సలహాలు, సూచనలు అందుతున్నాయి.

    దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్‌కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ  ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.

    అతడు స్పిన్‌ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. సిరీస్ డిసైడర్‌లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
    చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!

  • మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీవారియర్స్ బ్యాటర్లు మెరిశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ విధ్వంసం సృష్టించింది.

    ఈ ఆసీస్ లెజెండ్ ముంబై బౌలర్లను ఉతికారేసింది. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న లానింగ్‌ 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫీభీ లిచ్‌ఫీల్డ్ మెరుపులు మెరిపించింది. 37 బంతుల్లో7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు చేసింది.  ఆఖరిలో హర్లీన్‌ డియోల్‌(25), ట్రయాన్‌(21) రాణించారు. ముంబై బౌలర్లలో అమీలియా కేర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ట్‌ స్కివర్‌ బ్రంట్‌ రెండు, హీలీ మాథ్యూస్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌ తలా వికెట్‌ సాధించారు.

    తుది జట్లు
    యుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్

    ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట

  • నో హ్యాండ్ షేక్‌.. ఈ వివాదం గ‌తేడాది క్రికెట్ ప్ర‌పంచాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఆసియాక‌ప్‌-2025 సంద‌ర్భంగా భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాక‌రించారు. పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

    ఆ త‌ర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయ‌డం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ న‌ఖ్వీ చేతుల మీద‌గా భార‌త్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోక‌పోవ‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మ‌రోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్ర‌త్య‌ర్ధి మారింది.

    ఏమి జ‌రిగిందంటే?
    అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో బుల‌వాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్‌ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా  ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్‌-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.

    మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.

    అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా  2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.

    దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.
    చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు!
     

  • భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డే ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే ఈ నిర్ణ‌యాత్మ‌క మ్యాచ్ భార‌త తుది జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

    తొలి రెండు మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మూడో వ‌న్డేలో ఆడించాల‌ని టీమ్‌మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌క‌పోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ త‌న మన‌సు మార్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పేస‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.

    బదోని అరంగేట్రం
    ఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

    దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్‌మెనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.

    పిచ్ రిపోర్ట్:
    ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్‌ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్‌లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్‌పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.

    మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
    శుభ్‌మన్ గిల్‌(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌(వికెట్ కీపర్‌), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్‌

     

  • మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా నవీ ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

    ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌ అమ్మాయి నల్లా క్రాంతి రెడ్డి ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసింది. అదేవిధంగా స్టార్ పేసర్ ఇస్మాయిల్‌కు ముంబై విశ్రాంతి ఇచ్చింది. ఆమె స్ధానంలో హేలీ మాథ్యూస్ తుది జ‌ట్టులోకి వ‌చ్చింది. యూపీ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

    కాగా యూపీ వారియ‌ర్స్ త‌మ చివ‌రి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరును ఈ మ్యాచ్‌లో కూడా కొన‌సాగించాల‌ని లానింగ్ సేన ఉవ్విళ్లూరుతోంది.

    తుది జట్లు
    యుపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), క్లో ట్రయాన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభనా జాయ్, శిఖా పాండే, క్రాంతి గౌడ్

    ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, గుణాలన్ కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, సజీవన్ సజన, సంస్కృతి గుప్తా, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ట

     

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె.హరిత కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ ధోత్రే, ఫిషరీస్‌ డైరెక్టర్‌గా ఫిషరీస్‌గా కే.నిఖిలా, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భవానీ శంకర్ నియమితులయ్యారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

    విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఐజీగా అభిషేక్‌ మహంతి
    ఆదిలాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీగా చైతన్యకుమార్‌
    పీఅండ్‌ ఎల్‌ ఐజీగా గజరావ్‌ భూపాల్‌
    ప్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ అడ్మిన్‌ అడిషనల్‌ సీపీగా దీప్తి
    హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా కె.అపూర్వరావు
    ఇంటెలిజెన్స్‌ సెల్‌ డీఐజీగా ఆర్‌.భాస్కరన్‌
    సైబరాబాద్‌ డీసీపీగా అన్నపూర్ణ
    సీఐడీ ఎస్పీగా ఆర్‌. వెంకటేశ్వర్లు
    ట్రాఫిక్‌-3 డీసీపీగా రాహుల్‌ హేగ్డే
    విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌పోర్స్‌ ఎస్సీగా బాలస్వామి
    విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీగా పి.అశోక్‌
    హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా అవినాష్‌ కుమార్‌
    హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌-2 డీసీపీగా కాజల్‌
    సైబరాబాద్ ట్రాఫిక్–2 డీసీపీగా శేషాద్రిని రెడ్డి
    మల్కాజ్‌గిరి ట్రాఫిక్-I డీసీపీగా కంకనాల రాహుల్ రెడ్డి 
    ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్‌ డీసీపీగా శివమ్ ఉపాధ్యాయ
    శ్రీనివాసులు, రంజన్ రాథన్ కుమార్, శ్యామ్ సుందర్, పి. అశోక్, ఎ. బాలకోటిలు బదిలీ అయినవారిలో ఉన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ప్రజాభవన్‌లో జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.

    సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు. రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

    సమావేశంలో కర్ణాటక ప్రతినిధుల తరఫున హులికుంటే మూర్తి, డా. ఆశ్నా సింగ్, వి.మృదుల, రాహుల్ పాల్గొన్నారు. హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వెముల’ ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, ప్రొఫెసర్ భాంగ్య భుక్య, ప్రొఫెసర్ సౌమ్యా దేచమ్మ, ప్రొఫెసర్ తిరుమల్, ప్రొఫెసర్ రత్నం, వి. రఘునాథ్, డా డోంత ప్రశాంత్, తిరుపతి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్‌ మంగళ అపార్ట్‌మెంట్‌ దగ్గర థర్మకోల్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.


     

  • హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రార‌య్యాయి. మున్సిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌భుత్వం శ‌నివారం(జనవరి 17వ తేదీ) ఖరారు చేసింది. ఎస్టీల‌కు 5, ఎస్సీల‌కు 17, బీసీల‌కు 38, జన‌ర‌ల్ కేట‌గిరికి 61 స్థానాలు కేటాయించిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

    ఎస్టీ కేట‌గిరీ
    1. కొల్లూరు: ఎస్టీ (జ‌న‌రల్‌)
    2. భూత్పూర్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
    3. మ‌హబూబాబాద్‌: ఎస్టీ (జ‌న‌రల్‌)
    4. కేశ‌స‌ముద్రం: ఎస్టీ (మ‌హిళ‌)
    5. ఎల్లంపేట్ : ఎస్టీ (మ‌హిళ‌)

    ఎస్సీ కేట‌గిరీ
    1. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌: ఎస్సీ (జనరల్)
    2. చొప్ప‌దండి: ఎస్సీ (మహిళ)
    3. జ‌మ్మికుంట‌: ఎస్సీ (జనరల్)
    4. హుజురాబాద్‌: ఎస్సీ (మహిళ)
    5. ఎదులాపురం: ఎస్సీ (మహిళ)
    6. డోర్న‌క‌ల్‌: ఎస్సీ (జనరల్)
    7. ల‌క్సింపేట్‌: ఎస్సీ (జనరల్)
    8. మూడుచింత‌ల‌ప‌ల్లి: ఎస్సీ (జనరల్)
    9. నందికొండ: ఎస్సీ (జనరల్)
    10. మొయినాబాద్‌: ఎస్సీ (జనరల్)
    11. గ‌డ్డ‌పోతారం: ఎస్సీ (మహిళ)
    12. కోహిర్‌: ఎస్సీ (జనరల్)
    13. ఇంద్రేశం: ఎస్సీ (మహిళ)
    14. చేర్యాల‌: ఎస్సీ (మహిళ)
    15. హుస్నాబాద్‌: ఎస్సీ (జనరల్)
    16. వికారాబాద్‌: ఎస్సీ (మహిళ)
    17. మోత్కూరు: ఎస్సీ (మహిళ)

    బీసీ కేట‌గిరి
    1. ఇల్లెందు:  బీసీ (మహిళ)
    2. జగిత్యాల: బీసీ (మహిళ)
    3. జ‌న‌గాం: బీసీ (జనరల్)
    4. భూపాల‌ప‌ల్లి: బీసీ (జనరల్)
    5. లీజ‌: బీసీ (జనరల్)
    6. వ‌డ్డేప‌ల్లి: బీసీ(జనరల్)
    7. అలంపూర్‌: బీసీ (జనరల్)
    8. బిచ్కుంద: బీసీ (జనరల్)
    9. కామారెడ్డి: బీసీ (మహిళ)
    10. బాన్సువాడ: బీసీ (మహిళ)
    11. ఆసిఫాబాద్‌: బీసీ(జనరల్)
    12. కాగ‌జ్‌న‌గ‌ర్‌: బీసీ (మహిళ)
    13. దేవ‌ర‌క‌ద్ర‌: బీసీ (మహిళ)
    14. చెన్నూరు: బీసీ (మహిళ)
    15. మెద‌క్: బీసీ (మహిళ)
    16. ములుగు: బీసీ (మహిళ)
    17: కొల్లాపూర్‌: బీసీ (మహిళ)
    18. అచ్చంపేట‌: బీసీ (మహిళ)
    19. నాగ‌ర్‌క‌ర్నూల్‌: బీసీ (జనరల్)
    20. దేవరకొండ: బీసీ (మహిళ)
    21. మ‌ద్దూరు: బీసీ (జనరల్)
    22. పెద్దపల్లి : బీసీ (జనరల్)
    23. మంథని: బీసీ (జనరల్)
    24. వేములవాడ: బీసీ (జనరల్)
    25. షాద్‌న‌గ‌ర్‌: బీసీ (జనరల్)
    26. జిన్నారం: బీసీ (జనరల్)
    27. జ‌హీరాబాద్‌: బీసీ (జనరల్)
    28. గుమ్మ‌డిద‌ల‌: బీసీ (జనరల్)
    29. సిద్ధిపేట‌: బీసీ (జనరల్)
    30. గ‌జ్వేల్‌: బీసీ (మహిళ)
    31. దుబ్బాక‌: బీసీ (మహిళ)
    32. హుజూర్‌నగర్: బీసీ (జనరల్)
    33. తాండూరు: బీసీ (జనరల్)
    34. ప‌రిగి: బీసీ (మహిళ) 
    35. కొత్త‌కోట‌: బీసీ (మహిళ) 
    36. ఆత్మ‌కూరు: బీసీ (మహిళ) 
    37. న‌ర్సంపేట‌: బీసీ (మహిళ) 
    38. ఆలేరు: బీసీ (మహిళ) 

    అన్‌రిజ‌ర్వుడ్‌
    1. ఆదిలాబాద్: మహిళ (జనరల్)
    2. అశ్వారావుపేట: మహిళ (జనరల్)
    3. ప‌ర్కాల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    4. కోరుట్ల‌: మహిళ (జనరల్)
    5. రాయిక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    6. మెట్‌ప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
    7. ధ‌ర్మ‌పురి: మహిళ (జనరల్)
    8. గద్వాల‌: మహిళ (జనరల్)
    9. ఎల్లారెడ్డి: అన్‌రిజ‌ర్వుడ్‌
    10. స‌త్తుప‌ల్లి: మహిళ (జనరల్)
    11. వైరా: మహిళ (జనరల్)
    12. మ‌ధిర‌: మహిళ (జనరల్)
    13. జ‌డ్చర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    14. తొర్రూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    15. మరిపెడ: మహిళ (జనరల్)
    16. ఖ్యాతన్‌పల్లి: మహిళ (జనరల్)
    17. బెల్లంపల్లి: మహిళ (జనరల్)
    18. రామాయంపేట: మహిళ (జనరల్)
    19. నర్సాపూర్: మహిళ (జనరల్)
    20. తుప్రాన్: మహిళ (జనరల్)
    21. అలియాబాద్: మహిళ (జనరల్)
    22. క‌ల్వ‌కుర్తి: మహిళ (జనరల్)
    23. చందూరు: అన్‌రిజ‌ర్వుడ్‌
    24. న‌కిరేక‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    25. హాలియా: అన్‌రిజ‌ర్వుడ్‌
    26. మిర్యాలగూడ: మహిళ (జనరల్)
    27. చిట్యాల: మహిళ (జనరల్)
    28. నారాయణపేట: మహిళ (జనరల్)
    29. కోస్గి: అన్‌రిజ‌ర్వుడ్‌
    30. మ‌క్త‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    31. ఖానాపూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    32. భైంసా: అన్‌రిజ‌ర్వుడ్‌
    33. నిర్మల్: మహిళ (జనరల్)
    34. భీంగ‌ల్‌: మహిళ (జనరల్)
    35. ఆర్మూర్: మహిళ (జనరల్)
    36. బోధ‌న్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    37. సుల్తానాబాద్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    38. సిరిసిల్ల: మహిళ (జనరల్)
    39. శంక‌ర‌పల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
    40. చేవెళ్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    41. ఇబ్ర‌హీంప‌ట్నం: అన్‌రిజ‌ర్వుడ్‌
    42: ఆమ‌న్‌గ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    43. కొత్తూర్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    44. సదాశివపేట: మహిళ (జనరల్)
    45. నారాయ‌ణ‌ఖేడ్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    46. ఆందోల్‌-జోగిపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    47. సంగారెడ్డి: మహిళ (జనరల్)
    48. ఇస్నాపూర్: మహిళ (జనరల్)
    49. సూర్యాపేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    50. తిరుమ‌ల‌గిరి: అన్‌రిజ‌ర్వుడ్‌
    51. కోదాడ‌: మహిళ (జనరల్)
    52. నేరేడుచ‌ర్ల‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    53. కొడంగ‌ల్‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    54. వ‌న‌ప‌ర్తి: మహిళ (జనరల్)
    55. అమ‌ర‌చింత‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    56. పెబ్బేరు: అన్‌రిజ‌ర్వుడ్‌
    57. వ‌ర్ధ‌న్న‌పేట‌: అన్‌రిజ‌ర్వుడ్‌
    58. పోచంప‌ల్లి: అన్‌రిజ‌ర్వుడ్‌
    59. యాద‌గిరిగుట్ట: మహిళ (జనరల్)
    60. భువ‌న‌గిరి: మహిళ (జనరల్)
    61: చౌటుప్పల్: మహిళ (జనరల్)

  • హైదరాబాద్‌: పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 10 స్థానాల్లో మహిళలకు 5, బీసీలకు 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1  చొప్పున రిజర్వేషన్‌ కేటాయించింది.  ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఖరారు చేసింది. 

    మేయ‌ర్ ప‌ద‌వుల రిజ‌ర్వేష‌న్లు

    ఎస్టీ కేట‌గిరీ
    1. కొత్తగూడెం: ఎస్టీ (జనరల్)

    ఎస్సీ కేట‌గిరీ
    1. రామ‌గుండం: ఎస్సీ (జనరల్)

    బీసీ కేట‌గిరీ
    1. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌:  బీసీ (మ‌హిళ‌)
    2. మంచిర్యాల‌: బీసీ (జ‌న‌ర‌ల్‌)
    3. క‌రీంన‌గ‌ర్ : బీసీ (జ‌న‌ర‌ల్‌)

    అన్ రిజ‌ర్వుడ్‌
    1. ఖమ్మం: మహిళ (జనరల్) 
    2. నిజామాబాద్‌: మహిళ (జనరల్)
    3. జీడ‌బ్ల్యూఎంసీ: అన్ రిజ‌ర్వుడ్‌
    4. జీహెచ్ఎంసీ: మహిళ (జనరల్)
    5. న‌ల్ల‌గొండ‌: : మహిళ (జనరల్)

  • కొమరంభీం జిల్లా: అందరి జీవితాల్లో సంక్రాంతి సంతోషాన్ని నింపగా.. ఓ కుటుంబంలో చీకటి అలుముకుంది. ఎదిగిన కొడుకు తమను పోషిస్తాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త రెండు నెలలకే దూరమయ్యాడు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన రాపర్తి సంతోష్‌(32) దుర్మరణం చెందాడు. కెరమెరి మండల కేంద్రానికి చెందిన రాపర్తి తిరుపతి–గుణసుందరి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతోష్‌ సంతానం. అతనికి నవంబర్‌ 13న రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. సంతోష్‌ తన భార్యతో సంగారెడ్డిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

    దైవ దర్శనానికి వెళ్లి..
    సంక్రాంతి పండుగ సందర్భంగా నలుగురు స్నేహితులతో కారులో మెదక్‌లోని ఏడుపాయలు, దుర్గమ్మ ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి సమీపంలోని పోతిరెడ్డిపల్లె వద్ద ఎదురొచ్చిన గేదెను తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. తర్వాత అది వరిపొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతను ఇప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

    భార్యను పుట్టింటికి పంపి..
    పెళ్లయిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో భార్యను నాలుగు రోజుల క్రితం పుట్టింటికి పంపించాడు. శుక్రవారం వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. అంతలోనే ప్రమాదంలో మరణించడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. గడిచిన క్షణాలను గుర్తుచేసుకుంటూ భార్య, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

National

  • ఢిల్లీ: ఇండిగో సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) భారీ షాక్‌ ఇచ్చింది. రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు చేపట్టిన డీజీసీఏ.. కఠిన చర్యలకు ఉపక్రమించింది.

    భారీ సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందజేసింది. రిపోర్టు ఆధారంగా జరిమానా విధిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ప్రణాళికా లోపాలు, నిర్వహణ, నియంత్రణ వైఫల్యాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.

    2025 డిసెంబర్ 3 నుండి 5 మధ్య కాలంలో భారీ ఎత్తున విమానాలు ఆలస్యం కావడంతో పాటు వేలాది సర్వీసులు రద్దయ్యాయి. ఈ మూడు రోజుల్లో ఇండిగో 2,507 విమానాలను రద్దు చేయగా, 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో మూడు లక్షల మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇండిగో మాతృ సంస్థ అయిన 'ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్' బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ జరిమానాపై స్పందిస్తూ, తాము DGCA ఉత్తర్వులను అందుకున్నామని ధృవీకరించారు.

    ఇండిగో బోర్డు, మేనేజ్‌మెంట్ ఈ ఉత్తర్వులను పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుంటాయి. సకాలంలో తగిన చర్యలు చేపడతాము," అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత 19 ఏళ్ల ప్రస్థానంలో తమకు ఉన్న మంచి రికార్డును కాపాడుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లోతైన సమీక్ష చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

  • భారత్‌.. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి ప్రధాన కవాతు థీమ్ వందేమాతరం. 'స్వాతంత్ర్య మంత్రం -వందేమాతరం, శ్రేయస్సు మంత్రం - ఆత్మనిర్భర్ భారత్' అనే ఇతివృత్తం ఆధారంగా కర్తవ్య పథ్‌లో 30 శకటాలను ప్రదర్శించనున్నారు. ప్రధాన వేదికపై పూలతో వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీకి నివాళులర్పిస్తారు.

    ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటారు. కవాతులో తొలిసారిగా బాక్ట్రియన్ ఒంటె, కొత్త బెటాలియన్ భైరవ్ కూడా మార్చ్ పాస్ట్ చేయనున్నారు. అయితే ఈసారి ఫ్లైపాస్ట్లో రాఫెల్, ఎస్యూ-30, అపాచీ వంటి 29 విమానాలు ఉన్నాయి. అయితే, ఈసారి తేజస్ యుద్ధ విమానం పరేడ్‌లో ఉండదు.

    ఈసారి పరేడ్‌లో కొత్తగా ఏమున్నాయంటే?
    👉ఆహ్వాన పత్రికలపై వందేమాతరం 150 ఏళ్ల లోగో ఉంటుంది. పరేడ్ ముగిశాక వందేమాతరం బ్యానర్లతో కూడిన బెలూన్లను గాల్లోకి వదులుతారు
    👉పాత పద్ధతికి భిన్నంగా వివిఐపీ లేబుళ్లకు బదులుగా, ఎన్‌క్లోజర్లకు భారతీయ నదుల పేర్లు పెట్టారు
    👉మొదటిసారిగా ఆర్మీకి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ వింగ్ జంతువులు పాల్గొంటాయి. ఇందులో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు జాస్కరీ గుర్రాలు, నాలుగు వేట పక్షులు, 10 మిలిటరీ డాగ్స్ ఉంటాయి.
    👉అక్టోబర్ 2025లో ఏర్పాటు చేసిన 'భైరవ లైట్ కమాండో బెటాలియన్' మొదటిసారి పరేడ్‌లో పాల్గొంటుంది. ఇది ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తుంది.
    👉జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేదికపై ఎన్‌క్లోజర్లకు భారతీయ వాయిద్యాల (ఫ్లూట్, డమరుకం, వీణ, తబలా మొదలైనవి) పేర్లు పెట్టనున్నారు
    👉రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 17, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి 13 శకటాలు ప్రదర్శిస్తారు
    👉బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ గన్‌లు, డ్రోన్‌ల ప్రదర్శన ఉంటుంది
    👉సైనికులు యుద్ధ క్షేత్రంలో ఏ విధంగా ముందుకు సాగుతారో అదే తరహాలో (Battle Gear) ధరించి కర్తవ్య పథ్‌పై మార్చ్ చేస్తారు
    👉దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు

    భైరవ బెటాలియన్ అంటే..
    ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారతీయ సైన్యపు కొత్త విభాగం. 2025లో సరిహద్దుల రక్షణ కోసం రుద్ర బ్రిగేడ్, దివ్యాస్త్ర బ్యాటరీ, భైరవ బెటాలియన్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి బెటాలియన్‌లో సుమారు 250 మంది సైనికులు ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి 15 బెటాలియన్లు సిద్ధంగా ఉన్నాయి. వీరిని రాజస్థాన్, జమ్మూ, లడఖ్ మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో మోహరించారు.

    రిహార్సల్స్ కారణంగా జనవరి 17, 19, 20, 21 తేదీల్లో ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భవన్ (సర్క్యూట్ 1) జనవరి 21 నుండి 29 వరకు ప్రజలను అనుమతించరు.
     

  • పట్నా: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువుదీరింది బిహార్‌లోని  కేసరియాలోని విరాట్ రామాయణ మందిర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 210 టన్నుల శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. 33 ఫీట్ల ఎత్తు, 210 టన్నుల బరువు ఉన్న ఆ శివలింగాన్ని తమిళనాడులో తయారు చేశారు. కొన్ని వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ శివలింగం బిహార్‌కు చేరుకుంది.  

    ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా  ఈ ఆలయం ఘనతను సాధించింది.  ఈ సహస్రలింగం శివలింగ ప్రతిష్టాపనలో కార్యక్రమంలో పలువురు పండితులు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, , ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, పలువురు ఇతర నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ పవిత్ర శివలింగాన్ని 17 అడుగుల మాలతో అ లంకరించడం విశేషం. సహస్రలింగం శివలింగంతో పాటు, విరాట్ రామాయణ ఆలయంలో 1072 దేవతలను కూడా ప్రతిష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా గ్రానైట్ శివలింగాన్ని దాదాపు 10 ఏళ్లుగా తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించారు.

    20 కిలోల పూలమాల, 3250 కిలోల పువ్వులు

    శివలింగ ప్రతిష్ఠాపనలో పువ్వులు, మారేడు ఆకులు, ఉమ్మెత్తతో చేసిన 20 కిలోల పూలమాలను పూజాదికాలతో శివలింగానికి సమర్పించగా, ఆలయ అలంకరణ కోసం 3250 కిలోల పువ్వులను ఉపయోగించారు. ఈ పువ్వులను కోల్‌కతా, కంబోడియా నుండి తీసుకువచ్చారు. శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సంబంధించిన  21 మంది పూజారులు పూజలు నిర్వహించగా, వేదమంత్రోచ్ఛారణల మధ్య 1072 దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠాపన తర్వాత, నేల నుండి దీని ఎత్తు 56 అడుగులు ఉంటుంది. ఈ భారీ శివలింగాన్ని 96 చక్రాల ట్రక్కును ఉపయోగించి 45 రోజుల్లో తమిళనాడులోని మహా బలిపురం నుండి కైత్వాలియాకు తరలించారు.

    రూ. 3 కోట్లు 
    సహస్రలింగం శివలింగంలో 1008 చిన్న శివలింగాలు ఉన్నాయి, ఇది నల్ల గ్రానైట్ రాయితో తయారు చేయబడింది. అందుకే దీనికి సహస్రలింగం (అంటే "వెయ్యి శివలింగాలు") అని పేరు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ విరాట్ రామాయణ ఆలయాన్ని నిర్మిస్తోంది. పాట్నా హనుమాన్ ఆలయానికి చెందిన ఆచార్య కిషోర్ కునాల్ ఈ భారీ శివలింగం నిర్మాణాన్ని సంకల్పించారు ,ఇప్పుడు దాని ప్రతిష్ఠాపనతో ఆయన కల సాకారమైంది.

    డీజీపీ స్పందన
    ఈ కార్యక్రమం విజయవంతంపై  రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ మాట్లాడుతూ, "పూర్తి భద్రతా ఏర్పాట్లతో  ఈ పుణ్యకార్యాన్ని పూర్తి చేసినట్టు  చెప్పారు. ఈ ఆలయం రాబోయే రోజుల్లో బిహార్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచానికి ఒక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందుతుందని, ఈ సందర్భంగా కిషోర్ కునాల్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

     

  • ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా  పొగమంచు తీవ్రంగా ఉండడంతో రోడ్డుపై ఏమి కనిపించక వాహనాలు ఎక్కడికక్కడ ఢీకొన్నాయి. దీంతో దాదాపు 7మంది ప్రాణాలు కోల్పోగా పెద్దఎత్తున ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది.

    ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. శీతాకాలం కావడంతో దట్టమైన పొగమంచు రోడ్లపై అలుముకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో 40కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు ఢీకోనడంతో వేరువేరు ప్రమాద ఘటనల్లో ఏడుగురు మృతిచెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 100కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు  తెలిపారు.

    ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లో అత్యంత కఠినమైన చలికాలం చిల్లైకలాన్ కొనసాగుతుంది. దీంతో కశ్మీర్ అంతటా ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లోకి వెళ్లాయి. అత్యధికంగా షోపియాన్ ప్రాంతంలో -5.6 డిగ్రీలు, శ్రీనగర్ -4 డిగ్రీలు, గుల్మార్గ్‌  -4.2 డిగ్రీలు, సోనామార్గ్ -2.9, పహల్గామ్‌ -2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.

    జమ్మూకశ్మీర్‌లో చలికాలం అత్యంత ఎక్కువగా ఉండే కాలాన్ని చిల్లైకలాన్ అంటారు. ఇది డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 30 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలలోకి వెళతాయి.

  • కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.

    భార్యను హత్య చేసిన తర్వాత సచిన్‌ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    ఫతేహ్‌పూర్ జిల్లా మోహన్‌పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్‌లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్‌కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.  ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్‌ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.

    భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్‌.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య  గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడంతో  పోలీసులు వారిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.

    ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్‌కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు.
     

  • బర్త్‌డే అంటే వయసుతో నిమిత్తం లేకుండా అందరమూ చిన్నపిల్లలైపోతాం. చిన్న వయసులో బర్త్‌డే అంటే ఎదుగుతున్నామన్న సంతోషం అటు తల్లిదండ్రుల్లోనూ, ఇటు పిల్లల్లోనూ ఉండటం సహజం. ఒక సంవత్సరం వయసు పెరుగుతోందన్న బెంగ లేకుండా పెద్దలు కూడా ఈ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. అంత స్పెషల్‌ పుట్టిన రోజు. ఈ వేడుకల్లో ఇష్టమైన బట్టలు, ప్రదేశాలు, కోరికలు ఇలా చిట్టా చాలానే  ఉంటాయి.  కానీ మనకిష్టమైన వాళ్లు, మనకిష్టమైన వంటకాలను అదీ ఇంట్లో వండితే బాగా గుర్తుండిపోతాయి. దీన్నేకంటెంట్ క్రియేటర్ బర్త్‌డేని    ఆమె తల్లి ఫుడీగా నిర్వహించింది. అదేంటో చూద్దాం.

    కంటెంట్ క్రియేటర్ సారా సరోష్ 27వ పుట్టినరోజును  ఆమె కుటుంబంగా వినూత్నంగా జరుపుకుంది. ఆమె 27 ఏళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె తల్లి ఒకటీ రెండు కాదు, ఏకంగా 27 రకాల వంటకాలను తయారు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో  వైరల్‌గా మారింది.  ఈ క్లిప్ పుట్టినరోజు అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది, ఈ రూమ్‌ అంతా అద్భుతమైన అలంకరణలతోపాటు, టేబుల్‌పై అమర్చిన పదార్థాలు చూసి ఆశ్చర్యపోవడం బర్త్‌డే గార్ల్‌ వంతైంది.

    అలాగే కుటుంబ సభ్యులందరూ రకరకాల ఆహార పదార్థాలు టేబుల్‌పై అమర్చడానికి ముందు వాటిని తయారు చేయడం, చివరి నిమిషంలో కొన్ని వంటకాలను, తల్లి తయారు చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. వావ్‌.. 27 ఏళ్లకు 27 వంటకాలు, నా బర్త్‌డేకి బెస్ట్‌ గిఫ్ట్‌ థ్యాంక్యూ అమ్మా...ఎప్పటికీ నువ్వే మా అమ్మ అంటూ సారా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. 

     ఈ విందులో వివిధ రకాల ఫ్రైడ్ చికెన్ ముక్కలు, వింగ్స్, చిన్న సమోసాలు, పినా కోలాడా,రస్నా గ్లాసులు ఉన్నాయి. సలాడ్‌లు, పాస్తాలు, ఇతర డిషెస్‌ ఉన్నాయి.  టేబుల్ మధ్యలో ఫ్రాస్టింగ్‌తో కూడిన గుండ్రని చాక్లెట్ కేక్ ఉంది, దాని పక్కనే ప్రాన్ సుషీ, ప్రాన్ ఫ్రై, దహీ కే కబాబ్, స్టఫ్డ్ పొటాటోస్, తందూరి ప్రాన్స్ , చికెన్ షెజ్వాన్ వంటి వంటకాలు ఉన్నాయి.

    ఇదీ చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

    దీనిపై నెటిజన్లు కూడా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంత అద్భుతమైన తల్లిదండ్రులున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతు రాలివి అంటూ సారాను దీవించారు. తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. ఈ వంటకాల గురించి తెలుసుకోవాలని ఉంది అని ఒకరు, ఇది ఏఐ పిక్‌లా ఉంది అని మరొకరు చమత్కరించారు.  

    ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

  • పశ్చిమ బెంగాల్‌: బెంగాల్‌ పర్యటనలో మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమబెంగాల్‌లో శనివారం ఆయన వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం సభలో ప్రధాని మాట్లాడుతూ. పేద, మధ్య తరగతి ప్రజలంటే మమత సర్కార్‌కు లెక్కలేదంటూ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో అభివృద్ధికి మమతా బెనర్జీనే పెద్ద అడ్డంకి అంటూ మండిపడ్డారు.

    కేంద్ర నిధులను సైతం  టీఎంసీ సర్కార్‌ పక్కదారి పట్టించిందని.. బెంగాల్‌ ‍ ప్రజల్ని మమత సర్కార్‌ లూటీ చేస్తోందంటూ ఆరోపించారు. మమత ప్రభుత్వం బెంగాల్‌లో అభివృద్ధిని కోరుకోవడం లేదు. మమత సర్కార్‌ అన్నిరంగాల్లో అవినీతిలో కూరుకుపోయింది. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం. పశ్చిమబెంగాల్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. బెంగాల్‌లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’’ అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


     

     

     

  • మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. అధికార మహాయుతి కూటమి  పురపాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి ఈ సారి ముంబై పీఠం కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై శివసేన (ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పదవిలో లేకపోయినా మరాఠా ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

    దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది. మరాఠా సంస్కృతి, భాష స్థానికతే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ రాజకీయాలు జరిపింది. అయితే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించిన శివసేన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని అధిపత్యాన్ని కనబరిచేది. గత 25 ఏళ్లుగా ముంబై మేయర్‌ పీఠం శివసేన( ఠాక్రే) వర్గానిదే అంటే ఆ ప్రాంతంలో ఠాక్రేలు ఎంత ప్రభావం చూపగలరో చెప్పవచ్చు. అయితే నిన్న( శుక్రవారం) జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన అధిపత్యం కనబరిచి ముంబై పీఠం కైవసం చేసుకుంది.

    ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే సోదరులు ఓటమి  తర్వాత తొలిసారిగా స్పందించారు. దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రేతో ఫోటోతో కూడిన లేఖను ఉద్దవ్ ఠాక్రే పోస్టే చేశారు." చేసే పోరాటం ముగియలేదు. మరాఠీలకు వారు కోరుకున్న విధంగా గౌరవం లభించేంత వరకూ ఇది ముగియదు" అని అన్నారు. 

    ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ ఠాక్రే స్పందిస్తూ "ప్రస్తుతం అధికారంలో ఉన్న శక్తులు మరాఠా ప్రజలను వేదించడానికి లభించే ఒక్క అవకాశాన్ని కూడా వదలరు. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వచ్చిపోతుంటాయి. కానీ మనం మరాఠా ప్రజలకోసం ఉ‍న్న సంగతి మర్చిపోకూడదు. మరాఠా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తమ పార్టీ కార్పొరేటర్లు వారిని మోకాళ్ల మీద నిలబడేలా చేస్తారు" అని లేఖ విడుదల చేశారు.

    కాగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అక్కడ మెుత్తం 227 కౌన్సిల్ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 114 అయితే బీజైపీకి 89 స్థానాలు రాగా శివసేన (శిండే) 29 వార్డులు సాధించింది. 

  • అరుణాచల్‌ ప్రదేశ్‌లో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది.  తవాంగ్ జిల్లాలోని సేలా గడ్డకట్టిన సరస్సులోజారిపడి కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు మునిగిపోయారు. గౌహతి మీదుగా తవాంగ్‌కు వచ్చిన ఏడుగురు మిత్ర బృందంలో  మహాదేవ్‌ సరస్సులో దిగి ఇద్దరు ప్రాణాలుకోల్పోవడంతో అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.

    పోలీసుల సమాచారం ప్రకారం, శుక్రవారం  మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో గడ్డకట్టిన సెలా సరస్సులో కేరళకు చెందిన ఇద్దరు పర్యాటకులు జారిపడిమరణించారు. ఒకరి మృతదేహం లభించింది, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.

     

    గడ్డకట్టిన సరస్సులో మహాదేవ్ (24) జారిపడి మునిగిపోతూ ఉండటాన్ని గమనించిన   స్నేహితుడు దీను, మరొకరు మహాదేవ్ సరస్సులోకి దిగాడు. మూడో పర్యాటకుడు సురక్షితంగా బయటకు రాగలిగినప్పటికీ, మిగిలిన ఇద్దరూ కొట్టుకుపోయారు. బాధితుడు దీను (26)గా  ఆచూకీ ఇంకా లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి.డబ్ల్యూ.థోంగాన్ తెలిపారు. రెండో పర్యాటకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

     ఈ సంఘటనతో పర్యాటకులు గడ్డకట్టిన సరస్సులపై జాగ్రత్త వహించాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. గడ్డకట్టిన సరస్సులపై నడవవద్దని సందర్శకులకు స్పష్టంగా సూచిస్తూ సేలా సరస్సు, ఇతర పర్యాటక ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గడ్డకట్టిన  సరస్సులు, లేక్‌లు సురక్షితం కాదని, మంచు అస్థిరంగా ఉండవచ్చని , మానవ బరువును మోయలేకపోవచ్చని పర్యాటకులను హెచ్చరిస్తూ జిల్లా యంత్రాంగం డిసెంబర్‌లో ఒక సలహా జారీ చేసిందని ఆయన తెలిపారు.

    సేలా సరస్సు ప్రాముఖ్యత
    సముద్ర మట్టానికి 13,700 అడుగుల ఎత్తులో ఉండే సేలా  ఒక అందమైన, పవిత్రమైన సరస్సు ఇది శీతాకాలంలో మంచుతో గడ్డకట్టుకుపోయి అద్భుతమైన దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.  ఇక్కటి ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఈ సీజన్‌లో పర్యాటకులు అక్కడికి  క్యూకడతారు. కానీ తీవ్రమైన చలి , మంచు పొర కారణంగా శీతాకాలంలో ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది. 1962 లో భారత చైనా యుద్ధం సందర్భంలో, అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన నూరనాంగ్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన  సైనికుడు, 72 గంటలు ఆకలిదప్పులతో ఉండి,300 మంది చైనీయులను మట్టుబెట్టి వీర మరణం పొందిన  జస్వంత్ సింగ్ రావత్‌కు సహాయం చేస్తూ మరణించిన ‘‘సెలా" అనే  మహిళ పేరును దీనికి పెట్టినట్టు చెబుతారు.

     

  • తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.

    అన్నాడీఎంకే(AIADMK) జనరల్‌ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్‌ స్కీమ్‌ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..

    👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్‌ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.

    👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.

    👉అమ్మా ఇల్లమ్‌ స్కీమ్‌.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్‌ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్‌మెంట్‌లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.

    👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. 

    👉అమ్మా.. టూ వీలర్‌ స్కీమ్‌ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్‌ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ‍్సీడీ రూ.25,000 ఉంటుంది.

    రామచంద్రన్‌ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్‌ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

    అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్‌ స్కీమ్‌.. కళైంగర్‌ హౌజింగ్‌ స్కీమ్‌ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్‌ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది.

  • ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్‌ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్‌ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. 

    అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్‌ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్‌లో అవకాశాలు దక్కాలంటే ఘర్‌వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు.

    .. హమీద్‌ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్‌ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్‌వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్‌ అన్నారు.  ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్‌లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.

    ఓ ప్రముఖ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్‌సైడర్‌లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు.  

    మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్‌మేకర్‌ రెహమాన్ వ్యాఖ్యలను చీప్‌ అని పేర్కొన్నారు.    

    అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్‌ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్‌ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

  • సాక్షి ముంబై: మ‌హారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం పార్టీ స‌త్తా చాటింది. ముంబైతోపాటు మరాఠ్వాడాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో ఎంఐఎం పార్టీ తన ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్‌ కార్పొరేషన్‌ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 125 స్థానాలను దక్కించుకుని తన పట్టును పెంచుకుంది. రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు ఎంఐఎంకు పెద్దఎత్తున మద్దతు పలికినట్టు ఫ‌లితాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్, ఎన్సీపీలను తిరస్కరించి ఎంఐఎంవైపు మొగ్గుచూపారని తాజా ఎన్నిక‌ల‌ ఫలితాలతో స్పష్టమైంది.  

    ఛత్రపతి సంభాజీనగర్‌లో హ‌వా 
    ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్‌) మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గతంలోకంటే అధికంగా 33 స్థానాలు దక్కించుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక్క‌డ‌ కాంగ్రెస్, ఇరు ఎన్సీపీలు, ఇరు శివసేనల కంటే అధిక స్థానాలు దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా ఎంఐఎం ఎంపీ సయ్యద్ ఇంతియాజ్‌ జలీల్‌ (Syed Imtiaz Jaleel) నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి ఆయన తన సత్తాను చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై దాడి జరిగింది. దీంతో ఇంతియాజ్‌ జలీల్‌ ఈ ఎన్నికలకు మరింత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని ప్రచారం చేసి 33 స్థానాలను దక్కించుకున్నారు.

    అమ‌రావతి, నాందేడ్‌ల‌లో..
    మాలేగావ్, నాందేడ్‌, అమ‌రావతి, ధులే, ముంబై, షోలాపూర్, నాగ‌పూర్‌, థానే(ముంబ్రా) మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో కూడా ఎంఐఎం తన ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్‌లో 20 స్థానాలు దక్కించుకోగా నాందేడ్‌లో 15, అమ‌రావతిలో 12, ధులేలో 10 చోట్ల విజ‌యం సాధించింది. ముంబైలో 8,  షోలాపూర్‌లో 8, నాగ‌పూర్‌లో 6, థానేలో 5 స్థానాల్లో గెలిచింది. అకోలా (3), జాల్నా (2), అహ్మ‌ద్‌న‌గ‌ర్ (2) ల‌లో ఉనికిని చాటుకుకుంది. చంద్రాపూర్‌లో మొట్టమొదటి సారిగా ఒక్కస్థానం దక్కించుకుని బోణి కొట్టింది.

    మహారాష్ట్ర ప్రజలకు ఒవైసీ ధ‌న్య‌వాదాలు
    మ‌హారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో (Maharashtra civic polls 2026) త‌మ పార్టీకి చెందిన 125 మంది కార్పొరేటర్లు విజ‌యం సాధించార‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ తెలిపారు. త‌మ పార్టీకి ఓటు వేసిన మహారాష్ట్ర ప్రజలకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌మ పార్టీ కార్పొరేట‌ర్లు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌నిచేస్తార‌ని అన్నారు. ''మా కార్పొరేటర్లందరూ ప్రజల మధ్యే ఉండి, మీ వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాలని నేను గట్టిగా కోరుతున్నాన''ని ఎక్స్‌లో పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: కాంగ్రెస్ ఘోర ప‌రాభవానికి కార‌ణాలు ఇవే

  • పంపా: కేరళలోని పంపా ప్రభుత్వ ఆసుపత్రిలో  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. నెడుంబస్సేరికి చెందిన 55 ఏళ్ల ప్రీతా బాలచంద్రన్ అనే మహిళా భక్తురాలి కాలికి కట్టు కట్టిన బ్యాండేజీలో సర్జికల్ బ్లేడ్  ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితురాలు పథనంతిట్ట జిల్లా మెడికల్ ఆఫీసర్ (డీఎంఓ)కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం ఇది పూర్తిగా వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యమేనని ఆమె ఆరోపించారు.

    జనవరి 12 నుంచి పందళం నుండి తిరువాభరణ ఊరేగింపుతో పాటు పాదయాత్రలో పాల్గొన్న ప్రీతా, ఎక్కువ దూరం నడవడంతో కాళ్లకు బొబ్బలు వచ్చాయి. జనవరి 15 తెల్లవారుజామున ఆమె పంపా ఆసుపత్రికి వెళ్లారు. ఆ రోజు జరిగిన ఘటన గురించి ప్రీతా మాట్లాడుతూ అక్కడ అర్హత కలిగిన నర్సులు ఎవరూ విధుల్లో లేరని, సిబ్బంది అంతా నిద్రిస్తున్నారని, లుంగీ, చొక్కా ధరించిన ఒక నర్సింగ్ అసిస్టెంట్ తనకు చికిత్స చేశారని, ఆ సమయంలో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆమె వాపోయారు.

    నర్సింగ్ అసిస్టెంట్ తన గాయంపై సూదితో లోతుగా గుచ్చాడని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని ప్రీతా పేర్కొన్నారు. గాయంలోని ద్రవాన్ని తీయాలని చెబుతూ అతను సర్జికల్ బ్లేడ్ చేతిలోకి తీసుకున్నప్పుడు, అతని తీరు చూసి భయపడి తాను చికిత్సను ఆపించేశానని చెప్పారు. కట్టు కడితే చాలని తాను కోరినప్పటికీ, సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరించడంతో ఆ బ్లేడ్ పొరపాటున బ్యాండేజీ లోపలే ఉండిపోయిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో భక్తులు వచ్చే పంపాలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇంటికి చేరుకున్న తర్వాత, ఆమె తనకున్న మధుమేహం కారణంగా గాయాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుందామని బ్యాండేజీ విప్పగా, అందులో మెరుస్తున్న పదునైన సర్జికల్ బ్లేడ్ బయటపడింది. వెంటనే ఆమె పథనంతిట్ట డీఎంఓకు ఫిర్యాదు చేశారు. డీఎంఓ కార్యాలయం నుండి అధికారులు ఆమెను సంప్రదించి వివరాలు సేకరించినట్లు ప్రీతా తెలిపారు. మండలం-మకరవిళక్కు సీజన్‌లో భక్తులకు అందుతున్న వైద్య సేవలపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

    ఇది కూడా చదవండి: ‘అందుకే అఘాయిత్యాలు..’ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • తమిళనాడు: పల్లవరం సమీపంలోని త్రిసూలం, అమ్మన్‌ నగర్, 4 వ వీధికి చెందిన ఆరుముగం. ఇతని కుమారుడు సెల్వకుమార్‌(22), భవన నిర్మాణ కార్మికుడు. ఇతని స్వస్థలం దిండివనం. సెల్వకుమార్‌ కి పాత పల్లవరంలోని పచ్చై యమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన వివాహిత రీనా, ఆమె స్నేహితురాలు రజిత ఇద్దరితో  అక్రమ సంబంధంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో, సెల్వ కుమార్‌ తరచుగా ముఠా నాయకులు రీనా, రజితతో వాదనలకు దిగేవాడు.

     ఇది వారి మధ్య నిరంతరం ఘర్షణకు దారితీసింది. ఈ స్థితిలో, 14వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో, సెల్వకుమార్‌ పాత పల్లవరంలోని సుబార్‌ నగర్‌ ప్రాంతంలో రీనా, రజితలతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు అకస్మాత్తుగా సెల్వకుమార్‌ ను చుట్టుముట్టి కత్తులతో వరుస దాడుల్లో పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.  తీవ్రంగా గాయపడిన సెల్వకుమార్‌ను రక్షించి తాంబరం ఆసుపత్రికి తరలించారు. 

    తరువాత, తదుపరి చికిత్స కోసం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సెల్వ కుమార్‌ గురువారం విషాదకరంగా మరణించాడు. దీని గురించి పల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాహేతర వివాదంలో సెల్వకుమార్‌ హత్యకు గురైనట్లు తేలింది. దీని తరువాత, అతని వివాహేతర ప్రియురాలులైన రీనా, రజితను విచారించగా, వారు సెల్వ కుమార్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. సెల్వ కుమార్‌ తరచుగా తాగి ఉన్నప్పుడు గొడవలకు దిగేవాడు. దీనితో ఆగ్రహించిన రీనా, రజిత అతన్ని కొందరు దుండగులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.   

Business

  • బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది.  అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.

    చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

    ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది.

  • మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.

    మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.

    విక్టోరిస్ కారు గురించి
    మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

    ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!

    మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.

  • ఒకవైపు హైదరాబాద్‌లో గృహ విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రారంభమైన అందుబాటు, మధ్యస్థ ధరల ఇళ్ల వాటా అధికంగా ఉండటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం నగరంలో 54,878 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం మేర పెరిగింది. ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ) ల తర్వాతే అత్యధికం మన దగ్గరే ఇన్వెంటరీ అధికంగా ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో

    రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్టాక్‌లో అధికంగా ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్లు ఏకంగా 20,069 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 7.4 త్రైమాసికాలు పడుతుంది. ఇక, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు 5,638 ఉన్నాయి. వీటి అమ్మకానికి ఏకంగా 10.4 త్రైమాసికాలు పడుతుంది. అఫర్డబుల్‌ ఇళ్ల కొనుగోలుదారులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల వాటా గణనీయంగా తగ్గాయి. 2024 హెచ్‌–2తో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గగా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల లాంచింగ్స్‌ వాటా 25 శాతం నుంచి 23 శాతానికి క్షీణించాయి.

    ప్రీమియం యూనిట్లు తక్కువే..
    ఇన్వెంటరీలో ప్రీమియం ఇళ్ల వాటా కాస్త తక్కువగానే ఉన్నాయి. రూ.1.2 కోట్ల ధర ఉన్న గృహాలు 18,825 ఉన్నాయి. రూ.2.5 కోట్ల ధర ఉన్న యూనిట్లు 8,468, రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న ఇళ్లు 1,628, రూ.10 నుంచి రూ.20 కోట్ల ధర ఉన్నవి 92, రూ.20 నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న యూనిట్లు 158 ఉన్నాయి.

    38,403 ఇళ్ల విక్రయం..
    2025లో నగర నివాస మార్కెట్‌ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్లలో నమ్మకం, ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. గతేడాది హైదరాబాద్‌లో 38,403 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇక, 2025లో నగరంలో కొత్తగా 40,737 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. ప్రాజెక్ట్‌ లాచింగ్స్‌ కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం, నియంత్రణ పరిమితుల కారణంగా 2024 హెచ్‌–2తో పోలిస్తే లాచింగ్స్‌ 7 శాతం మేర క్షీణించాయి.

    2025లో హైదరాబాద్‌ కార్యాలయ సముదాయాలు వార్షిక లావాదేవీలు 1.14 కోట్ల చ.అ.లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే ఆఫీసు స్పేస్‌ సప్లై పరిమితంగా ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు కారణంగా లావాదేవీలు పెరిగాయి.

  • భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం అంటిలియా (Antilia) గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. అయితే.. సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ భవనానికి నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    2010లో అంబానీ.. ముంబయిలోని ‘అంటిలియా’కు మారిన తరువాత, మొదటి నెలలో 637240 యూనిట్ల విద్యుత్తును వినియోగించినట్లు, దీనికోసం కరెంట్ బిల్ ఏకంగా రూ.70,69,488గా చెల్లించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ బిల్లును సకాలంలో చెల్లించడం వల్ల.. అంబానీకి రూ.48,354 డిస్కౌంట్‌ కూడా లభించిందని సమాచారం. అంటిలియా భవనం ఉపయోగించే కరెంట్ దాదాపు 7000 సగటు ముంబై గృహాల నెలవారీ విద్యుత్ వినియోగానికి సమానం.

    అంటిలియా ప్రత్యేకతలు
    ముంబై నగరంలో నిర్మించిన.. ముఖేష్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్‌లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు.

    ఔట్ డోర్ ఏసీ లేదు!
    ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.

  • అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. డెవలపర్లు కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా అనే చెబుతుంటే.. చాలా మందికి వీటిపై అవగాహన ఉండదు. బిల్డర్‌ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏయే ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్‌ ఏరియా పోనూ మనకు వచ్చే ఏరియా ఎంత? మనం ఇంటి కోసం వెచ్చించే డబ్బులకు మన ఫ్లాట్‌లో ఎంత ఏరియా వస్తుంది? ఇలాంటి సందేహాలను ఈ కథనంతో నివృత్తి చేసుకుందాం.. -సాక్షి, సిటీబ్యూరో

    సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్‌ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణాన్నే. వారి అవసరాలకు అనుగుణంగా ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇల్లు కొనుగోలు చేసేందుకు వెళ్తే వారికి కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియాలపై అవగాహన ఉంటే తమ కుటుంబ అవసరాలకు ఆయా విస్తీర్ణం సరిపోతుందో లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. అలాగే మనం వెచి్చంచే ఇంటికి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందనే అంశంపై స్పష్టత వస్తుంది.

    మామూలుగా గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసే సమయంలో కార్పెట్‌ ఏరియా ప్రధానమైనది. ఇంటికి 
    సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్‌ ఏరియా కిందికి వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంట గది, స్నానాల గదులు వరకు కార్పెట్‌ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్‌ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవచ్చు.

    ఆ తర్వాత ఇంటికి సంబంధించి ప్రధానమైంది బిల్టప్‌ ఏరియా. కార్పెట్‌ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్‌ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్టప్‌ ఏరియాతో పాటు మిగిలిన ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్‌ మార్గాలు, క్లబ్‌ హౌస్‌ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్‌ వాటా కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్‌గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్‌ లేదా సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా పరిగణిస్తుంటారు. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్‌ ఏరియా సుమారుగా 70 శాతంగా వస్తుంది.

    ఇలా లెక్కించండి..
    ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలలో డెవలపర్లు వసతులకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30 శాతం కామన్‌ ఏరియా కలుపుకొని సూపర్‌ బిల్టప్‌ ఏరియాను లెక్కేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్‌ దగ్గర 2,000 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్‌ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్‌ ఏరియా సుమారుగా 1,400 చ.అ.లు మాత్రమే ఉంటుందన్నమాట.

    ఉదాహరణకు మనం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుందాం. ఈ లెక్కన మనం వ్యక్తిగతంగా వినియోగించే 1,400 చ.అ. కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించాల్సిన సొమ్ము మొత్తం రూ.1.40 కోట్లు. కానీ, మనం బిల్డర్‌కు చెల్లించేది మాత్రం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌కు రూ.2 కోట్లు చెల్లిస్తాం. అంటే మన కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించే సొమ్ము చ.అ.కు రూ.14,285లకు పెరిగిందన్నమాట.

    మిగిలిన సొమ్ము బిల్టప్, కామన్‌ ఏరియాలకు చెల్లించామన్నమాట. కాబట్టి అపార్ట్‌మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనం చెల్లించే సొమ్ముకు, మనకు వచ్చే విస్తీర్ణం ఎంతనేది డెవలపర్ల నుంచి స్పష్టత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,780 వద్ద ఉంది. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    ''1990లో ఒక కేజీ బంగారంతో.. మారుతి 800 వచ్చేది. 2000లో మారుతి ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చ్యూనర్, 2019లో బీఎండబ్ల్యు ఎక్స్1, 2025లో డిఫెండర్, 2030 నాటికి రోల్స్ రాయిస్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఒక కేజీ బంగారం కొని 2040 వరకు వేచి ఉండండి.. మీరు ఒక ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేయగలుగుతారు'' అని వివరించారు.

    ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

    ఈ రోజు రేటు ప్రకారం.. ఇండియన్ మార్కెట్లో ఒక కేజీ బంగారం విలువ రూ. 1,43,78,000. ఈ ధరలో ఒక లగ్జరీ కారును కొనుగోలు చేయవచ్చు. ధరలు ఇలాగే కొనసాగితే.. 2040 నాటికి ఒక కేజీ బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. ఒకవేళా గోల్డ్ రేటు తగ్గితే.. అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది.

  • తెలంగాణలోని పలు జిల్లాల్లో వీధికుక్కల పట్ల అత్యంత క్రూరమైన చర్యలు వెలుగులోకి వస్తున్నాయి. జంతు సంక్షేమ నిబంధనలను తుంగలో తొక్కి మెగ్నీషియం సల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి కుక్కలను సామూహికంగా హతమారుస్తున్నట్లు జంతు పరిరక్షణ కార్యకర్తలు, పశువైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    విషప్రయోగం - అత్యంత బాధాకరమైన మరణం

    సాధారణంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే మెగ్నీషియం సల్ఫేట్ మార్కెట్‌లో తక్కువ ధరకు సులభంగా లభిస్తుంది. దీన్ని ద్రవ రూపంలోకి మార్చి నిపుణుల ద్వారా కుక్కల గుండెకు నేరుగా ఇంజెక్ట్ చేస్తున్నారని సమాచారం. ‘ఇది చాలా పాత, క్రూరమైన పద్ధతి. మెగ్నీషియం సల్ఫేట్‌ను నేరుగా గుండెకు ఇంజెక్ట్ చేయడం వల్ల జంతువులకు తక్షణమే అత్యంత బాధాకరమైన మరణం సంభవిస్తుంది. ఇది సాధారణ వ్యక్తులు చేసే పని కాదు, శిక్షణ పొందిన వారే ఇలా చేస్తున్నారు’ అని ఒక సీనియర్ పశువైద్యుడు వెల్లడించారు.

    విచ్చలవిడిగా రసాయనాల వాడకం

    కుక్కలను చంపడానికి కేవలం మెగ్నీషియం సల్ఫేట్ మాత్రమే కాకుండా ‘స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 5 గ్రాముల స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్ పొడితో వందలాది కుక్కలను చంపవచ్చు. దీన్ని మాంసంలో కలిపి ఎరగా వేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు సైనైడ్ ఉపయోగించి కూడా కుక్కలను చంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘కొంగ మందు’ అని పిలిచే సాంప్రదాయ మందులను కూడా ఆహారంలో కలిపి ఇచ్చి కుక్కల ప్రాణాలు తీస్తున్నారు.

    చట్టం ఏం చెబుతోంది?

    భారత జంతు సంక్షేమ బోర్డు (AWBI) నిబంధనల ప్రకారం, వీధికుక్కలను చంపడం నేరం. కేవలం నయం చేయలేని వ్యాధులు ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక గాయాలైనప్పుడు మాత్రమే శాంతియుత మరణానికి ప్రత్యేక పద్ధతులు అనుసరించాలి. ఇందుకోసం ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాయి.

    దీని ప్రకారం, ప్రాణాంతక వ్యాధులు లేదా తీవ్రమైన గాయాలతో బాధపడుతున్న కుక్కలకు మాత్రమే అనుమతుల మేరకు పెంటనాల్ సోడియం, సోడియం థియోపెన్టోన్ వంటి మందులను ఉపయోగించి శాంతియుత మరణం ప్రసాదించాలి. అయితే, ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మెగ్నీషియం సల్ఫేట్, సైనైడ్, స్ట్రిక్‌నైన్‌ హైడ్రోక్లోరైడ్‌ వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి కుక్కలను అక్రమంగా హతమారుస్తున్నారు.

    సులభంగా అందుబాటులో..

    ఈ మందుల లభ్యత విషయంలో కూడా చాలా అనుమానాలున్నాయి. పెంటనాల్ సోడియం వంటి మందులు కేవలం అధికారిక ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే లభిస్తాయి. వీటి వినియోగంపై కఠినమైన నిఘా ఉంటుంది. దీనికి భిన్నంగా కుక్కలను చంపడానికి వాడుతున్న ఇతర రసాయనాలు సాధారణ రిటైల్ దుకాణాల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఎవరికైనా సులభంగా దొరుకుతున్నాయి. ఇది అసాంఘిక శక్తులకు, నిబంధనలు ఉల్లంఘించే వారికి వరంగా మారింది.

    నిబంధనల ప్రకారం, ఏదైనా జంతువుకు ప్రాణాపాయ స్థితిలో మందు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా అర్హత కలిగిన వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిపుణులు కాని వారిని నియమించి ఎటువంటి వైద్య పర్యవేక్షణ లేకుండా సామూహికంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం. ఇలాంటి అక్రమ పద్ధతులు జంతు హింసను ప్రోత్సహించడమే కాకుండా చట్టంలోని నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లేనని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విష రసాయనాల విక్రయాలపై నియంత్రణ విధించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

    ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!

  • భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.

    థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్‌ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్‌లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్‌ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.

    ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.

    పరిశోధనలోని ముఖ్యాంశాలు

    సాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.

    గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్‌హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్‌లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.

    బిర్యానీపై ప్రత్యేక దృష్టి

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్‌గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.

    వంట గదిలో ఏఐ అసిస్టెంట్

    ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.

    ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!

Family

  • నేడు జీవితం మొత్తం స్మార్ట్‌ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్‌ స్క్రీన్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది. ఇదే ఇపుడు మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన ఒక సర్పంచ్‌ అద్భుతమైన ఆలోచనకు నాంది పలికింది. పిల్లలను, యువతను డిజిటల్‌ స్క్రీన్‌నుంచి బయటపడవేసే మహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ నిర్ణయం ఇపుడు అద్భుతమైన ఫలితాలనూ సాధిస్తూ, ఆ గ్రామం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా చేస్తోంది.

    మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న అగ్రాన్‌ దుల్గావ్‌ (Agran Dhulgaon) అనే ఒక చిన్న గ్రామం డిజిటల్‌ స్క్రీన్‌ వినియోగంపై పరిమితులను విధించింది. ప్రతిరోజు నాలుగు గంటల పాటు డిజిటల్‌ స్క్రీన్‌కి దూరంగా ఉండాలని ఆ గ్రామ సర్పంచ్‌ శివ్‌దాస్‌ భోస్లే నిర్ణయించారు. ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఒకసారి మొత్తంగా ఒక రోజులో నాలుగు గంటల పాటు మొబైల్‌ ఫోన్‌కి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

    నిర్ణీత సమయానికి గ్రామంలో ఒక సైరన్‌ (Siren) మోగుతుంది. ఆ సైరన్‌ వినగానే అందరూ తమ మొబైల్‌ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లను పక్కన పెట్టేస్తారు. ఈ డిజిటల్‌ అలవాట్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలని, వారు ప్రతిరోజు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించేలా ఈ నిబంధనను తీసుకువచ్చారు.

    ఈ డిజిటల్‌ డిటాక్స్‌ (Digital Detox) నిర్ణయం గ్రామంలో ఎంత అద్భుతమైన ఫలితాల్ని తీసుకు వచ్చిందంటే... ఏకంగా ఆ గ్రామంలోని 53 మంది విద్యార్థులు జాతీయ స్కాలర్‌షిప్‌లను గెలుచుకునేంతగా... మరికొంత మంది విద్యార్థులు యూపీఎస్సీ, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ వంటి పోటీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యారు. గ్రామ సర్పంచ్‌ శివ్‌దాస్‌ భోస్లే తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    చ‌ద‌వండి: ట్రెండ్‌సెట్ట‌ర్ సీతారామ‌న్‌!

  • శీతాకాలంలో నిస్తేజమైన చర్మంతో విసిగిపోయారా, మెరిసే చర్మం కావాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. సమతుల్య ఆహారంతోపాటు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు  మన ఆహారంలో చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే బెర్రీలు, బచ్చలికూర, గింజలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని రక్షిస్తాయి.

    హైడ్రేట్గా ఉంటూ, సరైన పోషక విలువలు తీసుకుంటూ, సంరక్షణ చర్యలుతీసుకుంటే మొహంతోపాటు, చర్మం కూడా నిగనిగ లాడుతూ కాంతివంతంగా ఉంటుంది. వీటితోపాటు చర్మానికి సహజమైన మెరుపు కావాలంటే ఇవిగో చిట్కాలు.

    డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోయి చర్మం డల్‌గా, పొడిగా, నిస్తేజంగా అయిపోతుంది. వాయు కాలుష్యం, సూర్యరశ్మితో సహా పర్యావరణ కాలుష్యం కారణంగా చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా మారవచ్చు. అందుకే సమతుల ఆహారంతోపాటు  కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

    రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. అప్పుడే స్కిన్ ప్రకాశవంతంగా, సహజమైన మెరుపుతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

    మృత చర్మ కణాలు తొలగించేందుకు, రంధ్రాలు అన్ లాగ్ చేసేందుకు చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియేట్ చేయాలి. రసాయన రహిత చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

    క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి చర్మ సంరక్షణను పాటించాలి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.  చర్మ రకానికి తగిన ఉత్పత్తులు ఉపయోగించాలి.

    శీతాకాలంలో నువ్వుల నూనెతో మాసాజ్‌ చేసుకొని కాస్తంత ఎండ తగలనిచ్చి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మానికి చాలా ఉపశమనంగా ఉంటుంది.   చక్కటి రక్త ప్రసరణ కూడా  జరిగి  స్మూత్‌గా, షైనీగా  స్కిన్‌ మెరుస్తుంది.

    స్కిన్ బ్రైటెనింగ్ , మాయిశ్చరైజింగ్ కోసం ఫ్యాన్సీ విటమిన్ సి ఫేస్ క్రీమ్  వాడవచ్చు.  చర్మ తత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి.

    పైనాపిల్‌ రసాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల చర్మం కొత్తకాంతితో మెరుస్తుంది.

    చిన్న సైజు బంగాళ దుంప, రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సాస్‌ కలిపి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం సహజ కాంతితో మెరుస్తుంది.

    గుడ్డు సొన, ఆలివ్‌ ఆయిల్, కీర గుజ్జు సమభాగంలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టుకు పట్టులాంటి మృదుత్వం లభిస్తుంది. కేశాల ఎదుగుదలకూడా మెరుగవుతుంది.

    ఒత్తిడిలేని జీవితాన్ని గడపాలి.  రోజుకు కనీసం 7 గంటలు నిద్ర  ఉండేలా జాగ్రత్తపడాలి. ఆరుబయట సమయం గడపడం, వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు,  చర్మంకూడా  ఆరోగ్యంగా ఉంటుంది.  ప్రశాంతమైన మనస్సు ఆరోగ్యానికి బాటలు  వేస్తుంది.

     

  • ‘వీడియో గేమింగ్‌ ఇండస్ట్రీ అంటే చాలా టాలెంట్‌ ఉండాలి. మహిళల శక్తి సరిపోదు’... ఇలాంటి పురుషాధిపత్య ప్రేలాపనలు గేమింగ్‌ ఇండస్ట్రీలో మహిళల  ప్రాతినిధ్యాన్ని తగ్గించాయి. అయితే కాలం మారుతోంది.గేమ్‌ డెవలపర్స్‌గా మహిళలు సత్తా చాటుతున్నారు. గేమింగ్‌ ఇండస్ట్రీలో వివిధ విభాగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది.‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. మా సత్తా ఇది’ అని తమ కళతో కళ్లు తెరిపిస్తున్నారు. తాజాగా... ‘గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026’ సదస్సులో దేశ నలుమూలల నుంచి ఎంతోమంది ఫిమేల్‌ గేమ్‌ డెవలపర్స్‌ పాల్గొన్నారు. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం... మహిళలే కీలకంగా మారే రేపటి గేమింగ్‌ ఇండస్ట్రీని ఆవిష్కరించింది. 

     

    ఆల్‌ ఇండియా గేమ్‌ డెవలపర్స్‌ ఫోరం, కోరల్‌ రిక్రూట్, ఎం–లీగ్‌ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం... మొత్తం గేమర్స్‌లో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ గేమింగ్‌ ఇండస్ట్రీలో వారి ్ర΄ాతినిధ్యం తక్కువగా ఉంది. నిజానికి ఇది మన దేశానికే పరిమితమైన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. యూకేలో 2018–19కి సంబంధించి డేటా ప్రకారం వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులలోని విద్యార్థులలో 88 శాతం మగవాళ్లే ఉన్నారు!

    గుర్తింపు లేకపోవడం వల్లే...
    ‘అత్యంత వివక్షాపూరిత విషయం ఏమిటంటే, పురుషులు మహిళలను గేమర్‌లుగా చూడకపోవడం. మీ ఎదుటి వ్యక్తి గేమర్‌ అని, గేమ్‌ల గురించి వారికి బాగా తెలుసునని మీరు నమ్మకపోతే వారిలోని ప్రతిభను గుర్తించడం మీకు కష్టమవుతుంది’ అంటుంది గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్టూడియో ‘వాలా ఇంటరాక్టివ్‌’ కో–ఫౌండర్‌ మేఘా గుప్తా ఆమె గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026 జ్యూరీ సభ్యురాలు కూడా. ‘గుర్తింపు లేకపోవడం వల్ల గేమింగ్‌ కెరీర్‌ను కొనసాగించాలనే ఆలోచన, ఆసక్తిని అడ్డుకుంటుంది’ అంటోంది  గుప్తా

    ఇరవై లక్షల ఉద్యోగాలు!
    ‘గేమ్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకోవడానికి కారణం అది నాకు అత్యంత సంతోషం కలిగించే పని. ఒక గేమ్‌ను క్రియేట్‌ చేయడానికి సంబంధించిన సంతోషం మాటలకు అందనిది. పెద్ద కంపెనీలో చేరిన తరువాత నా కలల గేమ్‌లను సృష్టిస్తాను’ అంటుంది ఔత్సాహిక గేమర్‌ కె.శ్రావణి కామేశ్వరి. ‘మీకు గేమింగ్‌ స్కిల్స్‌ లేవు అనేవారి మాటలకు నిరాశ చెందకుండా, ఉత్సాహంగా, పట్టుదలగా పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది మరో ఔత్సాహిక గేమర్‌ శ్రేయా అరోర.

    గతంలో గేమింగ్‌ పరిశ్రమను జూదంలా భావించేవారు. ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఉద్యోగాల సంఖ్య, భద్రత పెరిగింది. మన దేశంలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్, రియాలిటీ రంగంలో 2035 నాటికి దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ‘సామాజిక కట్టుబాట్లతోపాటు వివిధ కారణాల వల్ల కొన్ని ఉద్యోగాల వైపు మహిళలు దృష్టి సారించడం లేదు’ అంటుంది మేఘా గుప్తా

    అడ్డుగోడలు ఉన్నాయి... అయినప్పటికీ...
    ఇప్పుడు అడ్డుగోడలు బద్దలవుతున్నాయి. మన దేశంలో నాణ్యమైన గేమ్‌లను రూపొందించడానికి కొత్త కొత్త స్టూడియోలు వస్తున్నాయి. గేమింగ్‌ పరిశ్రమలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉండడంతో మహిళలు ఇప్పుడు గేమింగ్‌ ఇండస్ట్రీలో చేరడం సులువు అయింది. ‘గేమ్‌ జామ్‌ జైపూర్‌’ లాంటి కార్యక్రమాలు ఔత్సాహికులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

    ‘గేమ్‌ జామ్‌ జైపూర్‌ విలువైన ఎన్నో అనుభవాలను అందించింది’ అంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు. భారతీయ గేమింగ్‌ పరిశ్రమలో లింగవివక్ష ఉంది’ అని గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026లోపాల్గొన్న చాలామంది మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఆ వివక్ష వారినేమీ భయపెట్టడం లేదు. ‘చిన్నచూపు అనేది అడ్డంకి కాదు. మమ్మల్ని మేము నిరూపించుకునే ఇంధనం’ అంటున్నారు.

    విశేషం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా గేమ్‌ జామ్స్‌లో పాల్గొనే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఇంకా ఏమి చేయాలి?’ అనేదానిపై గేమ్‌ జామ్‌లో నిర్మాణాత్మక చర్చ జరిగింది.‘గేమింగ్‌ ఇండస్ట్రీలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి’ అని సూచించాడు గేమింగ్‌ డెవలపర్‌ జతిన్‌ వర్మ.

    స్థూలంగా ఈ కార్యక్రమం ఇచ్చిన సందేశం ఏమిటి?
    మేఘా గుప్తా మాటల్లో చెప్పాలంటే... ‘గేమింగ్‌ రంగంలో ఇకపై మహిళలు ఎవరి అనుమతి కోసమో వేచి చూడనక్కర్లేదు. వారు ఒక్కో కోడ్‌లైన్‌తో తమ దారిని తామే నిర్మించుకుంటున్నారు. ఒకవేళ పరిశ్రమ వారికి చోటు కల్పించక పోతే వారు తమ సొంత మార్గాన్ని సృష్టించుకుంటారు’

    ఆహా... ఏమి ప్రతిభ!
    ‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ గేమింగ్‌ ఇండస్ట్రీకి వయసు, జెండర్‌ అడ్డు కాదు’ అని చెప్పకనే చెప్పింది అమి పలాన్‌ అనే మహిళ తాజా వైరల్‌ పోస్ట్‌. పుణే టు బెంగళూరు విమానంలో ప్రయాణిస్తున్న పన్నెండేళ్ల బాలుడితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ పిల్లాడు గేమ్‌ డెవలపర్, వీడియో ఎడిటర్‌గా డబ్బు సంపాదిస్తున్నాడు. ‘ఆ అబ్బాయి రోబ్‌లాక్స్‌ అనే గేమ్‌ కోసం రిసోర్స్‌  ప్యాక్‌ క్రియేట్‌ చేశాడు. మరో ఆశ్చర్యం... బిట్‌కాయిన్, డాగ్‌ కాయిన్‌ల గురించి అద్భుతంగా మాట్లాడడం’ అని రాసింది అమి పలాన్‌.

    ట్రెండ్‌ సెట్టర్‌..సీతారామన్‌
    ప్రతిష్ఠాత్మకమైన ఉమెన్‌ ఇన్‌ గేమ్స్‌ గ్లోబల్‌ అవార్డ్స్‌(డబ్ల్యూఐజీ) అందుకున్న తొలి భారతీయ గేమ్‌ డెవలపర్‌గా నిలిచింది పూర్ణిమ సీతారామన్‌. ‘జింగా’లో లీడ్‌ గేమ్‌ డిజైనర్‌ అయిన సీతారామన్, మొబైల్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలో  ప్రొగ్రామర్‌గా తన కెరీర్‌  ప్రారంభించింది. తనకంటూ సొంత కంప్యూటర్‌ సమకూర్చుకున్నాక గేమింగ్‌పై ఆమెలో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి గేమ్‌ డెవలపింగ్‌కు సంబంధించి ప్రయోగాలు చేసేలా, గేమ్‌ ఇండస్ట్రీలో పైస్థాయికి చేరుకునేలా చేసింది. గేమ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌లో రాణించాలనుకునే యువతులకు పూర్ణిమా సీతారామన్‌ పోస్టర్‌ గర్ల్‌గా మారింది.

    ‘నా కెరీర్‌ నల్లేరు మీద నడకేమీ కాదు. చాలామంది అమ్మాయిలలాగే నేను తొలిరోజుల్లో ఇబ్బంది పడ్డాను. వెక్కిరింపులు, వివక్షపూరిత మాటలు ఎదుర్కొన్నాను. గేమ్‌ డిజైనింగ్, డెవలపింగ్‌ రంగంలో లింగ అసమానతకు పక్షపాతంతో పాటు, సమాచార లోపం కూడా పెద్దకారణం. ఇది తమ భవిష్యత్తుకు ఉపకరించే కెరీర్‌ మార్గం అనేది తెలియక΄పోవడం వల్ల చాలామంది మహిళలు గేమింగ్‌ ఇండస్ట్రీలోకి అడుగపెట్టడం లేదు’ అంటుంది సీతారామన్‌.

    ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

    ‘సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో లాగే గేమ్‌ డెవలప్‌మెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం కచ్చితంగా పెరుగుతుంది’ అనేది సీతారామన్‌ ఆశవాదామే కాదు భవిష్యత్‌ వాస్తవం కూడా. ‘అది క్యాండీ క్రష్‌ అయినా, డోటా 2 అయినా, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ అయినా, మీరు గేమర్‌ కాదని ఎవరూ చెప్పడానికి వీల్లేదు. గేమింగ్‌ ఫోరమ్‌లలో చేరండి. గేమ్‌ జామ్స్‌లో  పాల్గొనండి. మీలోని సృజనాత్మక శక్తిని పరిచయం చేయండి’ అని గేమింగ్‌పై ఆసక్తి ఉన్న మహిళలకు పిలుపునిస్తోంది సీతారామన్‌. 

    చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

World

  • ఇండోనేషియాలోని మకాస్సర్ సమీపంలో అదృశ్యమైన ATR42-500 విమానం కూలిపోయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సమీపంలోని పర్వతంపై ఈ విమాన శకలాలను గుర్తించినట్టు విమాన ట్రాకింగ్ డేటా, స్థానిక మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.

    ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ATR 42-500 సముద్రంపై తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు రాడార్ నుండి అదృశ్యమైందని FlightRadar24 తెలిపింది. విమానం కనిపించకుండా పోయిందని, దానిచివరి సిగ్నల్ మకాస్సర్ విమానాశ్రయానికి ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ (12 మైళ్ళు) దూరంలో 04:20UTC వద్ద రికార్డ్ అయిందని, రాడార్‌ కవరేజ్‌ కూడా మిస్‌ అయిందని ఎక్స్‌లో  పోస్ట్ ద్వారా వెల్లడించింది.

     

    స్థానిక  మీడియా కవరేజ్ ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి రూటింగ్ సూచనలు అందిన తర్వాత మకాస్సర్ విమానాశ్రయాన్ని సమీపిస్తున్నప్పుడు ATR 42‑500 రాడార్ నుండి అదృశ్యమైంది. విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు సహా 11 మంది ఉన్నారు. అయితే ఇండోనేషియా అధికారులు  ఈ ప్రమాద విషయాన్నిఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మకాస్సర్‌లోని ఇండోనేషియా శోధన మరియు రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ హెడ్ ఆండి సుల్తాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపుతున్నట్లు చెప్పారు. విమానంలో ఉన్నవారి పరిస్థితి గురించి  ఎలాంటి సమాచారం లేదు.
     

Politics

  • సాక్షి, మహబూబ్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను కేసీఆర్‌ వివక్షతో చూశారని.. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలమూరులోని ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదంటూ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ చేతకానితనాన్ని కాపాడుకునేందుకు తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు జిల్లాలో ఒక్కటైనా ఉందా? అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు.

    సంగబండ పగలగొట్టేందుకు రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదు. గత పాలకులు పదేళ్లు పాలమూరుకు అన్యాయం చేశారు. అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే ముఖం చాటేశారు. త్వరలోనే తెలంగాణకు ఐఐఎం కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలుస్తాం.. ఐఐఎంను కూడా పాలమూరులోనే పెడతాం.. ‘‘మా ఎంపీ డీకే అరుణను ఓడించాలని నేను 14 మీటింగులు పెట్టిన.. కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు.. పాలమూరు అభివృద్ధికి కలిసి పోతాం. విమర్శలు వస్తుంటాయి.

    ..దేశ ప్రధానిగా మోదీని అభివృద్ధి కోసం కలుస్తాం.. ఎన్నికలప్పుడు బరాబర్ కొట్లాడతాం. వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ వారిని గెలిపించండి. అందరం కలిసి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

    CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

     

  • సంగారెడ్డి:  తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను జీవితంలో సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నారు.  సంగారెడ్డి మేధావులు తనను ఓడించారని అందుకే ఇక జీవితంలో ఇక్కడ నుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారు.  

    ‘రాహుల్‌ గాంధీ వచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం చేస్తే, నన్ను  ఇక్కడ ఓడించారు.  రాహుల్‌ గాంధీని  ఇన్సల్ట్‌ చేసినట్లు అయ్యింది. జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ గాంధీ అడిగితే.. నన్ను ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది. అందుకే సంగారెడ్డిలో జీవితంలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. 

    నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు..ఇక్కడి మేధావులు.. పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మలా పోటీ చేసిన కూడా నేను ప్రచారం చేయను.రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్ళి ప్రచారం చేస్తా కానీ.. సంగారెడ్డిలో ప్రచారం చేయను’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

  • సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్‌ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆస్రాకంటి ఆసుపత్రి యాజమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, బంధువులే డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారని ఆరోపించారు.

    దీంతో మహిళా డాక్టర్‌ భర్త షరీఫ్‌కు ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌.. తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించారు. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆడియో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

    కాగా, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.

    ఎమ్మెల్యే దగ్గుపాటి బూతు పురాణం