Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సమస్యల కారణంగా అల్లుడు నాగ సాయి అత్త కోలా దుర్గపై దాడి చేసి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం. సంఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

    సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీసినందుకు ప్రజలు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.  

  • సాక్షి, విజయవాడ: భవానిపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో సాక్షి టీవి ప్రతినిధి నాగేంద్ర చేతికి తీవ్ర గాయమైంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన యూట్యూబర్‌కి చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి  కారు డ్రైవ్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

    ఎలక్ట్రికల్ కారులో మంటలు.. 
    మరో ఘటనలో బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఎలక్ట్రికల్ కారులో మంటలు చెలరేగాయి. కారు యాజమాని అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. కారు కానూరుకు చెందిన పీఆర్ హాస్పిటల్ డాక్టర్‌ చెందినదిగా గుర్తించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

     

     

     

  • సాక్షి, అన్నమయ్య జిల్లా: పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ‘మగవారి పొంగళ్లు’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మగవారే స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీసంజీవరాయ స్వామికి మగవారు పూజలు చేయడం.. పొంగళ్లు పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నేడు ఒక్కరోజు ఇక్కడ ఆడవారికి ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. స్వామివారి నైవేద్యం కూడా ఆడవారు తినడం నిషేధం.

    ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం ఈ పొంగళ్లు పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మగవారి పొంగళ్లకు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. సాధారణంగా మహిళలు మాత్రమే పొంగళ్లు వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ.. తిప్పాయపల్లెలో మాత్రం పురుషులే పొంగళ్లు వండి స్వామి వారికి సమర్పించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మహిళలు ఆలయం వెలపల నుంచే దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

    స్థల పురాణం..
    ఒకప్పుడు గ్రామస్తులు వ్యవసాయం, పశుపోషణ జీవనాధారంగా సాగించేవారు. క్రీ.శ. 1716లో తీవ్రమైన కరువు కాటకాలు ఎదురయ్యాయని అప్పట్లో తాగడానికి నీరు, తినడానికి తిండిలేక పశుపోషణ భారమైన పరిస్థితులు. సరిగ్గా ఇలాంటి తరుణంలో ఊరిలోకి ఓ వేద పండితుడు వచ్చివెళ్లేవారని తెలిసింది. పొలాల్లోనే నివాసం ఉండే పండితుడు ప్రజల కష్టాలు తొలగించడానికి నైరుతి మూలలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి సంజీవరాయస్వామిగా నామకరణం చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.

     

    అయితే ఆ పండితుడు ఆంజనేయస్వామికి మహాభక్తుడు కావడంతో ఆడవారు ఎవరూ ఆలయంలోకి రాకూడదని సూచించారని తెలిసింది. అప్పటి నుంచి ఆలయంలో మగవారికి మాత్రమే ప్రవేశం కల్పించడం సంప్రదాయంగా మారింది. నాటి నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా పూజలు చేస్తూ వస్తున్నారు.


     

  • సాక్షి, తాడేప‌ల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డికి సైన్యాధ్య‌క్షుడిగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురు నిల‌బ‌డి వడ్డే ఓబన్న చూపిన తెగువ‌ను నాయ‌కులు గుర్తుచేసుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి కార్యక్ర‌మాన్ని పార్టీ నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు.

    వ‌డ్డే ఓబ‌న్న చిత్ర‌ప‌టానికి నాయ‌కులు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయ‌న‌తో పాటు వ‌డ్డె రామ‌దాసు వంటి వ‌డ్డెర నాయ‌కుల‌ను ఈ సంద‌ర్భంగా కీర్తించారు. వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వ‌డ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్ చేసిన కృషిని రాజ‌కీయంగా ఇచ్చిన ప్రాధాన్య‌త‌ను ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకుని ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

    ఒక‌ ఎమ్మెల్యే సీటుతో పాటు మాచ‌ర్ల‌, చీమ‌కుర్తి, పులివెందుల మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లుగా గుంటూరు జెడ్పీ వైయ‌స్ చైర్ ప‌ర్సన్‌గా వ‌డ్డెర కుల‌స్తుల‌కు అవ‌కాశం క‌ల్పించిన వైఎస్‌ జ‌గ‌న్ రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామ‌ని చెప్పారు. వ‌డ్డెర కుల‌స్తుల‌తో వైఎస్‌ కుటుంబానికి విడ‌దీయ‌రాని బంధం ఉంద‌ని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా వైఎస్‌ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్రోత్స‌హిస్తే.. వైఎస్‌ జ‌గన్‌ సీఎం అయ్యాక కూడా మరింత ముందుకు తీసుకెళ్లార‌ని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.

    ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, ఎమ్మెల్సీ, పార్టీ కార్యాల‌య ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా జెడ్పీ వైఎస్‌ చైర్‌ప‌ర్స‌న్ బ‌త్తుల అనూరాధ‌, పార్టీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు పానుగంటి చైత‌న్య‌, పార్టీ బీసీ సెల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ బ‌త్తుల రామారావు, చిత్తూరు జిల్లా పార్టీ సోష‌ల్ మీడియా అడ్వైజ‌ర్ ప‌వ‌న్‌, హైకోర్టు అడ్వ‌కేట్ బేబీ రాణి, వివిధ పార్టీ అనుబంధ విభాగాల‌కు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్‌ సామ్రాజ్యానికే సవాల్‌ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

     వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో..
    తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు.

     

  • పల్నాడు:  గురజాలలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతల బెదిరింపులతో ఊరు విడిచి వెళ్లిపోయాడు సాల్మాన్‌. 

    అయితే తాజాగా కుటుంబ సభ్యుల్ని చూడటానికి పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు సాల్మాన్‌. దీన్ని అదునుగా చేసుకుని ‘నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మా గ్రామంలోకి వస్తావా’ అంటూ సాల్మన్‌పై దాడికి పాల్పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్‌.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నాడు. 

     

  • నెల్లూరు:  రాపూర్ మండలంలోని కండలేరు రిజర్వాయర్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిజర్వాయర్‌ సందర్శనకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే  ఆదివారం(జనవరి1వ తేదీ) వైఎస్సార్‌సీపీ నేతల కండలేరు సందర్భనన అడ్డుకున్నారు. 

    పొదలకూరు సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతల్ని అడ్డగించారు పోలీసులు.  అదే సమయంఓ కండలేరు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు.  దాంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కాకాణితో పాటు పలువురు నేతలు.

    దీనిపై నేదురమల్లి రామ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తమను అడ్డకుంటున్నారని  తీవ్రంగా ధ్వజమెత్తారు. 

    రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  దీన్ని అర్థాంతరంగా నిలిపివేస్తే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్‌, ఏపీ సీఎం చంద్రబాబులు లోపాయకారీ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తన్నారు. 

Telangana

  • సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మున్సిపాలిటీలో ఆదివారం రాత్రి 10 గంటలకు అధికారులు గేటుకు తాళాలు వేసి లోపల కసరత్తులు జరుపుతున్నారనే వార్తలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి. సెలవు రోజు రాత్రి వేళలో అధికారుల హడావుడి ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహులు, అనుచరులతో కలిసి అధికారులు రహస్యంగా సమావేశమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డుకు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తమకు అనుకూలమైన ఓటర్లను తమ పరిధిలో ఉంచుకుని, ప్రతికూలంగా ఉన్నవారిని పక్క వార్డులకు బదిలీ చేయడానికి రహస్యంగా కసరత్తు చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చీకటి దందాకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.  

    రేపటితో ఓటర్ల నమోదు (Voter Enrollment) చివరి తేదీ కావడంతో అభ్యంతరాలు స్వీకరించడానికే రాత్రి వేళలో తాళాలు వేసి పని చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే కొందరినే లోపలికి అనుమతించి మరికొందరిని బయటే నిలిపివేయడం ప్రజల్లో అనుమానాలను రేపింది. దాంతో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఓట్ల మార్పిడి దందా జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. రాత్రి వేళలో తాళాలు వేసి అధికారులు చేసే ఈ రహస్య కసరత్తులు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని ఓటర్ల హక్కులను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  

  • సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో రెండు గంటలుగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయలైనట్టు తెలుస్తోంది.

    వివరాల మేరకు.. యాదగిరిగుట్టలో ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

    ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి.  దీంతో, బలవంతంగా వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతోంది. విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. పతంగుల పండగ నేపథ్యంలో ‘గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు’ అంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్వీట్‌ చేశారు. 

    చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవు. పండగని పండగలా జరుపుకోండి. ప్రాణాలు తీసి కాదు’ అంటూ సజ్జనార్‌ హెచ్చరించారు.

    కాగా, చైనా మాంజా విక్రయంపై నగర పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. దీని వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2016లో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ 2017లో నిషేధించింది. అయినప్పటికీ విచ్చలవిడిగా సాగుతున్న విక్రయాలతో పక్షులు, మనుషులకు ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. దీంతో నెల రోజులుగా నిఘా ఉంచిన అధికారులు ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6226 బాబిన్ల మాంజా స్వాధీనం చేసుకున్నారు.

    ఇవాళ(జనవరి 11, ఆదివారం) హైదరాబాద్‌లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సాయి వర్దన్‌ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్‌ స్టేడియం మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగింది.

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అనుభవాల మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటనకు బెల్జియంకు బయలుదేరారు. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ – ఇంటీరియర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది.

    ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపర్చే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈఓ కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈఆర్వో కంకనాల అనంత రెడ్డి, నాంపల్లి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నం.97 బూత్ స్థాయి అధికారి వేముల ధ్రువ కుమార్ రెడ్డి ఉన్నారు.

    పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్‌పీఎస్ – ఇంటీరియర్, ఎఫ్‌పీఎస్ – ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ అవుట్‌రీచ్ కార్యక్రమంలో భాగమని అధికారులు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చైనా మాంజాకు మరో వ్యక్తి బలి అయ్యాడు. బైక్‌పై వెళ్తున్న సాయి వర్దన్‌ మెడకు మాంజా చుట్టుకోవడంతో అతడి చెయ్యి, మెడకి తీవ్ర గాయమైంది. దీంతో, వెంటనే సాయి వర్ధన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఉప్పల్‌ స్టేడియం మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగినట్టు తెలిసింది. 

    మరోవైపు.. శుక్రవారం కూడా చైనా మాంజా కారణంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్‌పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు. 

  • సాక్షి, హనుమకొండ: జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్‌లపై కేసులు నమోదు చేశారు. రెండు గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కల ప్రాణాలను గ్రామ పంచాయతీ సిబ్బంది బలి తీసుకున్నారు. వీధికుక్కలను చంపి పాతిపెట్టారు. శాయంపేట, ఆరేపల్లి రెండు గ్రామాల పరిధిలో ఘటన జరిగింది. ఇప్పటికే 120కి పైగా పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసులు, వెటర్నరీ సిబ్బంది వెలికితీశారు.

    వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. మొత్తం 9 మంది పై కేసులు నమోదు  చేశారు. మరో వైపు కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని.. ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

     

  • పెద్దపల్లి జిల్లా: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్‌ టైం అవుతుంది.. తొందరగా రెడీ అవ్వు అని అల్లారుముద్దుగా బడికి పంపిస్తిరి.. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు.. మీ ప్రేమ ఎవరి నుంచి దొరుకుతుంది.. నేను ఎందుకోసం చదవాలి.. నా మంచిచెడు ఎవరితో చెప్పుకోవాలి’ అంటూ ఆ కూతురు రోదన వర్ణనాతీతం. 

    పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతులు. అన్యోన్యంగా ఆర్థిక పొదుపు పాటిస్తూ ఆదర్శంగా జీవించారు. వీరి కూతురు శివాణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్‌కాస్టు మూతపడడంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి ఏదో ఓ పని చేసుకుంటూ, స్రవంతి కుట్టుమిషన్‌తో ఎంతో కొంత సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 7న దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్య బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకోగా, భర్త మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇద్దరూ 70శాతం కాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఈనెల 8న తిరుపతి, 10న స్రవంతి మృతిచెందారు.

    చివరిచూపునకు నోచుకోక..
    క్షణికావేశానికి తల్లిదండ్రులు బలి కాగా, కూతురు రోదనలు మిన్నంటాయి. ‘మమ్మీ.. డాడీ’ అని ఎవరిని పిలవాలంటూ శివాణి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చనిపోయిన విషయం తల్లికి తెలియదు.. తండ్రి అంత్యక్రియలు పూర్తవగానే తల్లి మరణం.. మళ్లీ తల్లికి అంత్యక్రియలు చేయడం.. మూడురోజులుగా ఆ కూతురు గుండెలవిసేల రోదించింది. పగోడికైనా ఇంతటి కష్టం రావద్దంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. తల్లి స్రవంతి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపించగా, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ శివాణి వెక్కివెక్కి ఏడ్వడం గుండెలను పిండేసింది.

     

Sports

  • భార‌త పురుష‌ల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘ‌నంగా ఆరంభించింది. ఆదివారం వ‌డోద‌ర వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 301 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవ‌ర్ల‌లో చేధించింది.

    దీంతో మూడు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

    విరాట్ విధ్వంసం..
    అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.

    కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(56), వైస్‌ కెప్టెన​ శ్రేయస్‌ అయ్యర్‌(49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

    అయితే కోహ్లి ఔటయ్యాక భారత్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్‌లో కాస్త టెన్షన్‌ నెలకొంది. కానీ కేఎల్‌ రాహుల్‌(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. హర్షిత్‌ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాడ్‌ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్‌, క్లార్క్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది.
    చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌
     

  • డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. 

    తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్‌లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్‌గా  కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్‌..7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్‌ గార్డనర్‌ 49 పరుగులతో రాణించింది.

    నందినీ శర్మ హ్యాట్రిక్‌..
    ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్‌ నందిని శర్మ హ్యాట్రిక్‌ వికెట్లతో మెరిశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన నందిని బౌలింగ్‌లో రెండో బంతికి కశ్వి గౌతమ్‌ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్‌ తీసి స్ట్రైక్‌ కనిక అహుజకు ఇచ్చింది. 

    అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్‌ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్‌, ఆరో బంతికి రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్‌ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్‌గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.
    చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్‌..

  • టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ సందర్భంగా 20 ఓవర్ వేస్తున్న సమయంలో సుందర్‌కు వెన్నునొప్పి తలెత్తింది.  దీంతో అతడు వెంటనే మైదానాన్ని వీడియాడు.

    వాషీ స్ధానంలో నితీష్ కుమార్ రెడ్డి సబ్‌స్ట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో వచ్చాడు. సుందర్ తిరిగి ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అతడి గాయంపై ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హర్షా భోగ్లే అప్‌డేట్ ఇచ్చాడు. సుందర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోందని భోగ్లే తెలిపాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సుందర్ బ్యాటింగ్‌కు కూడా వచ్చే సూచనలు కన్పించడం లేదు.

    అయితే తొలుత‌  సుందర్‌ పక్కటెముకుల నొప్పితో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది కేవ‌లం వెన్ను నొప్పి అనే తెలియ‌డంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే సైడ్ స్ట్రెయిన్ అయితే కోలుకోవడానికి కనీసం 3 నుండి 4 నెలల సమయం పడుతుంది.

    అటువంటి సంద‌ర్భంలో వ‌చ్చే నెల‌లో జ‌రగాల్సిన దూరంగా ఉండ‌క త‌ప్పుదు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన సుందర్‌ 27 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు.

    టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు
    అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), సంజుశాంసన్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్‌, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి 
    చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్‌

  • టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన విరాట్‌.. ఇప్పుడు కివీస్‌తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.

    క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధిం‍చిన ప్లేయర్‌గా విరాట్  వరల్డ్ రికార్డు సృష్టించాడు.

    కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముగ్గురే ముగ్గురు 28,000 ప‌రుగులు సాధించారు.  కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), స‌చిన్ టెండూల్క‌ర్‌(34,357) ఈ ఘ‌న‌త సాధించారు.

    సంగక్కర రికార్డు బ్రేక్‌..
    అదేవిధంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లోనే 42 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌డు ఈ ఫీట్ సాధించాడు. ఇంత‌కుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్‌తో అత‌డిని కోహ్లి అధిగ‌మించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్క‌డే ఉన్నాడు. అయితే కోహ్లి కేవ‌లం ఒక్క ఫార్మాట్‌లో మాత్ర‌మే ఆడుతుండ‌డంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయ‌డం క‌ష్ట‌మనే చెప్పాలి.
    చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'

  • టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు.

    వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు.  కివీస్ ఇన్నిం‍గ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.
    చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'


     

     

     

  • రాజ్‌కోట్ వేదిక‌గా వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 

    వీరిద్దరూ మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే మిడిలార్డర్‌లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

    మిచెల్‌ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్‌(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

    తుది జట్లు
    భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

    న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
     

  • వడోదర వేదికగా భారత్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో  న్యూజిలాండ్‌ ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌ (62), డెవాన్‌ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు. 

    భారత్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్‌-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు నాథన్‌ ఆస్టల్‌-క్రెయిగ్‌ స్పియర్‌మన్‌ పేరిట ఉండేది. 

    1999లో రాజ్‌కోట్‌లో ఈ న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ జోడీ భారత్‌పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్‌ ప్లేస్‌లో ఆండ్రూ జోన్స్‌-జాన్‌ రైట్‌ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్‌ పెయిర్‌ ఇదే వడోదరలో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది. 

    డారిల్‌ మిచెల్‌ (56 నాటౌట్‌) గౌరవప్రదమైన స్కోర​్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్‌ క్లార్క్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌ తలో 2.. ప్రసిద్ద్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (12), గ్లెన్‌ ఫిలిప్‌ (12), మిచెల్‌ హే (18), కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్‌ 1 పరుగుకే ఔటయ్యాడు.

    కాగా, న్యూజిలాండ్‌ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

    భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

  • నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్‌మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్‌కు ఎంపిక చేస్తే మరొక సిరీస్‌కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్‌ను వెనుక్కి నెట్టిస్తున్నాయి. 

    అంతేకాకుండా అతడిని  ఆల్‌రౌండర్‌గా  ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ పట్ల టీమ్ మెనెజ్‌మెంట్ కఠినంగా వ్యవహరించింది.

    న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్‌కు చోటు దక్కలేదు.

    అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు.

    "నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్‌తో పాటు ఉంటాడు.. కానీ తుది జ‌ట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒక‌వేళ తుది జ‌ట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవ‌ర్లు బౌలింగ్‌, 8 స్ధానంలో బ్యాటింగ్‌కు పంపుతారు. ఇది స‌రైన విధానం కాదు. రెగ్యూల‌ర్‌గా అవ‌కాశ‌మివ్వ‌క‌పోతే ఎప్ప‌టికీ అత‌డిని ఒక‌ మంచి ఆల్‌రౌండ‌ర్‌గా తీర్చిదిద్దలేరు. 

    హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్‌గా ఎదిగాడన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు" అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పఠాన్‌ పేర్కొన్నాడు.
    చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్‌
     

  • విరాట్‌ కోహ్లి భక్తుడు, గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్‌లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్‌లోని ఓ మాల్‌లో కలిశాడు. 

    ఆ పరిచయంతో  ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్‌లు పంపాడని ఆధారాలతో (చాట్‌ స్క్రీన్‌షాట్లు) సహా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. 

    లీకైన ఈ చాట్‌ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్‌ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన ఆర్సీబీ బ్రాండ్‌కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. 

    గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాల్‌పై ఘాజియాబాద్, జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. యశ్‌ దయాల్‌ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. 

    తాజాగా చికారా ఎపిసోడ్‌ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్‌ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్‌ ఇమేజ్‌ కలిగిన ఆర్సీబీ దయాల్‌, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్‌ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. 

    చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్‌లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన చికారా విరాట్‌ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్‌ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్‌ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్‌ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.

    మొత్తంగా యశ్‌ దయాల్‌, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా చెక్‌ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.

    కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్‌లోనే తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై జయకేతనం​ ఎగురవేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి అంకితమిచ్చారు. 

    ఈ గెలుపుతో విరాట్‌ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్‌ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్‌ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. 

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్‌ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్‌ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు. 
     

  • టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.

    కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్‌. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్(463) అగ్ర‌స్ధానంలో ఉన్నారు. అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలోనూ స‌చిన్(18426) టాప్‌లో కొన‌సాగుతున్నారు.

    భారత్‌ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..
    సచిన్‌ టెండూల్కర్‌-463
    ఎంఎస్‌ ధోని-347
    రాహుల్‌ ద్రవిడ్‌-340
    అజారుద్దీన్‌-334
    విరాట్‌ కోహ్లి-309
    సౌరవ్‌ గంగూలీ-308

    వన్డే కింగ్‌..
    ఇక ప్రపంచ వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లి కూడా త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లి కొన‌సాగుతున్నాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 53 సెంచ‌రీలు న‌మోదు చేశాడు. అదేవిధంగా వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవ‌రూ లేరు.
     

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్‌ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.

    రో-కో ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్‌ గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

    కోహ్లి విషయానికొస్తే.. రోహిత్‌తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 4 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్‌ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్‌ పెట్టారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌ (42), డెవాన్‌ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్‌కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద లైఫ్‌ లభించింది. కుల్దీప్‌ యాదవ్‌ సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగింది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

    భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

     

     

  • స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. 

    రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్‌, జడేజా, కుల్దీప్‌.. పేసర్లుగా సిరాజ్‌, ప్రసిద్ద్‌, హర్షిత్‌ బరిలో దిగుతున్నారు.

    న్యూజిలాండ్‌ తరఫున క్రిస్టియన్‌ క్లార్క్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్‌ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాన బౌలర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్‌ రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌. గూగ్లీలు వేయడంలో దిట్ట.

    ఎవరీ ఆదిత్య అశోక్‌..?
    ఆదిత్య అశోక్‌ తమిళనాడులోని వేలూర్‌లో 2002 సెప్టెంబర్‌ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆక్లాండ్‌లో స్థిరపడింది. అశోక్‌ ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు.

    అశోక్‌ 2020 అండర్-19 వరల్డ్ కప్‌తో న్యూజిలాండ్ తరఫున జూనియర్‌ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్‌లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు.  
    - 2021 డిసెంబర్‌లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు.  
    - 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు.  
    - 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు.  

    అశోక్‌కు న్యూజిలాండ్‌ సీనియర్‌ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్‌ న్యూజిలాండ్‌ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్‌ స్పిన్‌ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్‌ పునా ప్రథముడు కాగా.. దీపక్‌ పటేల్‌, జీత్‌ రావల్‌, ఐష్‌ సోధి, ఎజాజ్‌ పటేల్‌, రచిన్‌ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్‌ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు. 

  • స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. 

    స్పిన్నర్లుగా సుందర్‌, జడేజా, కుల్దీప్‌.. పేసర్లుగా సిరాజ్‌, ప్రసిద్ద్‌, హర్షిత్‌ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్‌ తరఫున క్రిస్టియన్‌ క్లార్క్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్‌ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్‌ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడింది.  

    తుది జట్లు..
    న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

    భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

International

  • భారత్- పాకిస్థాన్ దేశాల  మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్‌ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.

    హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని పేర్కొంది. 

    అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక  చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

    అయితే ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్‌పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే.

  • మనకు పండుగల సీజన్‌ ఇది. అలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లోనూ పండుగల సీజనే. చల్లని వాతావరణం వణకిస్తుంది...అలాగే ఎన్నో విందు వినోదాలనూ తెస్తుంది. కాలాలన్నింటిలో అత్యధికులు ఇష్టపడేది శీతాకాలమే. కురిసే మంచు తడిసే నేల కురిపించే అందాల నడుమ పందిరి వేసే సందళ్ల ఎన్నో.. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శీతాకాల పండుగలు బాగా ప్రాచుర్యం పొందాయి.

    పలు దేశాలు చల్లని వాతావరణంలో కళ, సంస్కృతి, సంప్రదాయంతో మమేకమైన వినోద భరిత కార్యకలాపాలను ఆస్వాదించడానికి ప్రజలను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన శీతాకాల పండుగలను నిర్వహిస్తాయి.  ఈ పండుగలు సంగీతం, లైట్లు, అలంకరణలు, ఆహారం  ఉత్తేజకరమైన సంప్రదాయాలతో ఆకట్టుకుంటాయి.  మంచు శిల్పాల నుంచి రంగురంగుల కవాతుల వరకు, ప్రతి పండుగలో సందర్శకులను ఆకర్షించే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రపంచంలోని టాప్‌–10 అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాల పండుగలు...

    👉చైనాలో జరిగే హార్బిన్‌ అంతర్జాతీయ  మంచు శిల్ప ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది డిసెంబర్‌ నెలలో క్రిస్మస్‌ రోజున ప్రారంభమై ఫిబ్రవరి మధ్య వరకూ కొనసాగుతుంది.

    👉జపాన్‌లో సప్పోరో మంచు ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ  నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది ఈ పండుగ.

    👉కెనడా లోని క్యూబెక్‌ సిటీలో నిర్వహించే క్యూబెక్‌ వింటర్‌  కార్నివాల్‌ కూడా అత్యధిక సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సందడే సందడి..

    👉11వ శతాబ్ధపు చారిత్రక మూలాలు ఉన్న ఇటలీ లోని ది వెనిస్‌  కార్నివాల్‌ కళ్లు తిరిగే కలర్‌ పుల్‌ సందడిని మోసుకొస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ కొనసాగుతుంది.

    👉అమెరికాలో నిర్వహించే సెయింట్‌ పాల్‌ వింటర్‌ కార్నివాల్‌ తనదైన శైలితో సందర్శకుల్ని ఆహ్వానిస్తుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది

    👉దాదాపు 50ఏళ్ల క్రితం ప్రారంభమైంది కెనడా రాజధాని ప్రాంతం లో జరిగే వింటర్‌లూడ్‌ ఫెస్టివల్‌. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకూ కొనసాగుతుంది.

    👉నెదర్లాండ్స్‌లో నిర్వహించే ఆమ్‌స్టర్‌ డామ్‌ లైట్‌ ఫెస్టివల్‌ను  లెగసీ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. చిత్రకళతో పాటు బోట్‌ టూర్స్‌ తదితర విశేషాలకు వేదికైన ఈ పండుగ గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైంది.. జనవరి 18వ తేదీ వరకూ కొనసాగుతుంది.

    👉స్కాట్లాండ్‌లో ఏకంగా 3 నెలల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతుంది  అప్‌ హెల్లీ యా ఫైర్‌ ఫెస్టివల్‌.. జనవరి 9న ప్రారంభమై మార్చి 20వ తేదీ వరకూ జరుగుతుంది.

    👉సెవన్‌ వండర్స్‌ ఆఫ్‌ ద వింటర్‌గా పేరొందింది దక్షిణ కొరియా లోని హ్వాచియోన్‌లో నిర్వహించే సాంచియోనియో ఐస్‌ ఫెస్టివల్‌. ఇది జనవరి 10న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది.

    👉స్కాట్లాండ్‌ లో జరిగే హోగ్మనే ఉత్సవం...కొత్త సంవత్సరానికి స్వాగత వేడుక. ఇది కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన  వింటర్‌ ఫెస్టివల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

  • కారకాస్‌: వెనెజువెలా నాయకుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడం సంచలనం సృష్టించింది. అయితే, మదురో నిర్భందం వేళ అమెరికా సైన్యం ప్రయోగించిన రసాయనం, టెక్నాలజీపై చర్చ మొదలైంది. అమెరికా సైన్యం దాడి సమయంలో తమకు ముక్కుల నుంచి రక్తం కారడం, వాంతులు చేసుకున్నట్టు వెనుజువెలా సైన్యం చెప్పుకొచ్చింది. ఈ మేరకు మదురోకు అత్యంత సన్నిహిత వ్యక్తి కీలక విషయాలను వెల్లడించారు.

    తాజాగా మదురోకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ మాట్లాడుతూ.. అమెరికా దాడులు జరిగిన సమయంలో మేమంతా నికోలస్‌కు రక్షణగా విధుల్లోనే ఉన్నాం. ఒక్కసారిగా మా రాడార్‌ వ్యవస్థలు పనిచేయలేదు. ఏం జరిగిందో మాకు అర్థమయ్యేలోపే డ్రోన్లు మావైపునకు దూసుకొచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఒక దశలో వారు ఏదో ప్రయోగించారు. అది తీవ్రమైన ధ్వని తరంగంలాంటిది. ఒక రసాయనం వంటిది కూడా. దాంతో, మా తల లోపలి నుంచి పేలిపోతున్నట్లు అనిపించింది. మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం.

    తర్వాత 20 మంది సైనికులతో 8 హెలికాప్టర్లు వచ్చాయి. సంఖ్య తక్కువే అయినా.. వెంటనే మొత్తం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వారు సాంకేతికంగా ఎంతో ముందున్నారు. ఇంతకుముందు చూడని పోరాట పద్ధతులను ఉపయోగించారు. అమెరికా శక్తి ముందు వెనెజువెలా సైన్యం తేలిపోయింది. మేం వందల సంఖ్యలో ఉన్నా ఉపయోగం లేకపోయింది. అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది అని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు.. గార్డ్ చెప్పిన మాటలను వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

    ఇదిలా ఉండగా.. గార్డ్ చెప్పిన విషయాలపై అమెరికా నిఘా విభాగంలో పనిచేసిన అధికారి స్పందించారు. ఈ క్రమంలో అమెరికా తన లక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి మైక్రోవేవ్స్‌, లేజర్స్‌ వంటి వాటిని వాడి ఉండవచ్చని తెలిపారు. వాటిలో కొన్నింటి వల్ల రక్తస్రావం, నొప్పి, మంట, కదలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు. దీంతో, అమెరికా సైన్యంపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

  • డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్‌ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.


    ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. ‍అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్‌లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.

    ఇరాన్ సైనిక శక్తి
    వెనిజువెలాతో పోలిస్తే ఇరాన్‌ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం.  అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.

    ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.

    ఇస్లాం దేశాల మద్ధతు
    ఇరాన్‌కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్‌ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్‌కు  సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.

    మూడో ప్రపంచ యుద్ధం

    అయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా  ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం.

Family

  • లండన్‌లో  సమోసాలు అమ్ముతున్న బిహార్‌ వ్యక్తి నెట్టింట తెగ వైరల్‌ అయ్యాడు. అది మరువక మునుపే తాజాగా  మరో బిహార్‌ వ్యక్తి అదే బాటలో నడుస్తూ అందర్నీ అమితంగా ఆకర్షించాడు. లండన్‌లో రుచికరమైన సమోసాలను విక్రయిస్తున్న ఒక బిహార్‌ వ్యక్తి నెట్టింట సంచలనంగా మారి..ఎంతలా బిజినెస్‌ రన్‌ చేస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. 

    అచ్చం అలానే ఇప్పుడు ఈవ్యక్తి లాస్‌ ఏంజిల్స్‌ వీధుల్లో చాయ్‌ పోహ అమ్ముతున్న వీడియో అందర్నీ విస్మయానికి గురి చేసింది. అంతేగాదు ఒకరకంగా ఇది కష్టపడేతత్వం, ఆత్మవిశ్వాసం, సాంస్కృతిక గర్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశేషం. పైగా స్వతహాగా స్వదేశానికి దూరంగా ఉన్నా..వాటి మూలాలతో కనెక్ట్‌ అయ్యే ఉన్నా అన్నట్లుగా అతడు జీవిస్తున్న విధానం ఉంది. 

    అంతేగాదు విదేశాల్లో ఉన్నా.. హిందీలోనే మాట్లాడతాడు, బిహారీ వ్యక్తిగా గుర్తింపునే అత్యంత గౌరవంగా భావిస్తాడు. అంతేకాదండోయ్‌ లండన్‌లో ఆ వ్యక్తి అమ్మే టీ ఖరీదు రూ.782 కాగా, పోహా ఖరీదు రూ. 1,512లు. అంతర్జాతీయ నగరానికి అనుగుణంగా అతడు విక్రయించే ధరలు నిజాయితీని, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అక్కడ స్థానిక లండన్‌ప్రజలు అతడి పొడవాటి జుట్టు, మీసాలను చూసి..ఏసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటారని చెబుతున్నాడు. 

     

    (చదవండి: వలస వచ్చి..ప్రేమ 'నరకం'లో పడి..ఇప్పుడు 'కరోడ్‌పతి'గా..)

Business

  • ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.

    2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.

    95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.

    కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.

    ఇదీ చదవండి: 2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!

  • 2026 జనవరి 11న రాజ్‌కోట్‌లో నిర్వహించిన 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్‌'లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

    ముకేశ్ అంబానీ తన ప్రసంగంలో.. రిలయన్స్ గుజరాత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచిందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో గుజరాత్‌లో సంస్థ రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మరో ఐదేళ్లలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది గుజరాత్ పాలనపై, నాయకత్వంపై, అభివృద్ధి సామర్థ్యంపై రిలయన్స్‌కు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు.

    ఈ భారీ పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాల కోసమే కాకుండా.. గుజరాత్ ప్రజలు & భారతీయుల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అంబానీ వివరించారు. పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. క్లీన్ ఎనర్జీ & గ్రీన్ మెటీరియల్స్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేయడం రిలయన్స్ అన్నారు.

  • ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?
    ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.

    ఈ లోన్ ఎవరికి ఇస్తారు?
    బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.

    ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్  అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
    బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

    గుర్తుంచుకోవాల్సిన విషయాలు
    బ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.

  • భారతదేశంలో టయోటా కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచింది. దీంతో.. అత్యంత ప్రజాదరణ పొందిన పెద్ద SUVలలో ఒకటైన టయోటా ఫార్చ్యూనర్ రేటు గరిష్టంగా రూ. 74వేలు వరకు పెరిగింది.

    ధరల పెరుగుదల.. వేరియంట్లను బట్టి రూ. 51వేలు నుంచి రూ. 74వేలు మధ్య ఉంది. కాగా కంపెనీ లిమిటెడ్-రన్, డీలర్-లెవల్ లీడర్ వేరియంట్‌లను నిలిపివేసింది. ఫార్చ్యూనర్ & లెజెండర్ వరుసగా ₹ 74,000 మరియు ₹ 71,000 వరకు ధర పెరిగాయి. ఎంట్రీ-లెవల్ మాన్యువల్ వేరియంట్‌ ధర రూ. 51వేలు పెరిగింది. దీంతో ఈ SUV ధర ఇప్పుడు రూ. 33.65 లక్షల నుంచి రూ. 34.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

    ఇన్నోవా క్రిస్టా ధరలు
    భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్‌ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.

  • బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనుకడుకు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసినవారికి మాత్రం మంచి లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్, సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తాయా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది.

    నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావొచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో రూ.5000 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 1.40 లక్షలు దాటేసింది. ఇదిలాగే కొనసాగితే.. రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు రూ.2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటి సారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు 140 శాతం పెరిగింది.

    వెండి ధరల విషయానికి వస్తే.. 2025 ప్రారంభంలో దాదాపు రూ. 90వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. 2026లో రూ.2.75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలోనే మూడు లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉందని కొందరి అంచనా.

    బంగారం రేటు పెరగడానికి కారణాలు!
    భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్. కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల.. మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం అయింది.

    మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా.. బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావొచ్చు.. కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుందనే కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం అవుతోంది.

    భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. పండుగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది.

    వెండి ధరలు పెరగడానికి కారణాలు
    వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.

  • 2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.

    పోకో ఎం7 ప్రో 5జీ
    రూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్‌నెస్ & డాల్బీ విజన్‌తో 6.67 ఇంచెస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.

    ఒప్పో కే13ఎక్స్
    ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.

    రెడ్‌మీ 15సీ
    12,999 రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.

    వివో T4 లైట్ 5జీ
    వివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్‌తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.

    మోటరోలా జీ57 పవర్ 5జీ
    మోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను ప్రదర్శిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.

    ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!

  • ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. డెలివరీ కావడానికి ఓ నాలుగైదు రోజులు లేదా వారం రోజులు అనుకుందాం. ఆర్డర్ పెట్టిన 16 ఏళ్ల తరువాత డెలివరీ అయితే?, ఇది వినడానికి వింతగా అనిపించినా.. లిబియాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో కొత్తగా ఏ మోడల్ వచ్చిన సేల్స్ అద్భుతంగా జరిగేవి. ఇలాంటి సమయంలో లిబియాకు చెందిన ఓ షోరూమ్ ఓనర్ 2010లో ఎక్కువ సంఖ్యలో నోకియా ఫోన్స్ ఆర్డర్ పెట్టారు. అయితే అవి మాత్రం 2026లో డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    వీడియోలో గమనించినట్లయితే.. ఒక వ్యక్తి నోకియా ఫోన్లను ఒక్కొక్కటిగా చూపించడం, అక్కడున్నవారంతా నవ్వుకోవడం చూడవచ్చు. ఇక్కడ వివిధ నోకియా మోడల్స్ ఉన్నాయి.

    ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?

    నిజానికి 2010లో నోకియా ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. అయితే కాలక్రమంలో ప్రత్యర్ధ కంపెనీలకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్లను డిమాండ్ ఉంది. ఇప్పుడు నోకియా ఫోన్స్ వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. డెలివరీకి 16ఏళ్ల సమయం పట్టడానికి కారణం.. అప్పట్లో లిబియాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఈ కారణంగా షిప్‌మెంట్ ఆగిపోయింది. డెలివరీ చేయాల్సిన మొబైల్స్ వేర్ హౌస్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో డెలివరీలు జరిగాయని తెలుస్తోంది.

  • అమెజాన్ తన ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఏడాది కాలంలో తాము సాధించిన ముఖ్యమైన విజయాలు మూడు నుంచి ఐదు పేర్కొనడంపాటు, కంపెనీలో మరింత వృద్ధి సాధించడానికి తాము తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించాల్సిందిగా సంస్థ ఉద్యోగులను కోరుతోంది. అసలే లేఆఫ్లు కొనసాగుతున్న తరుణంలో కంపెనీ ఎందుకిలా అడుగుతోందని ఉద్యోగుల్లో ఆందోళన పట్టుకుంది.

    బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, ఉద్యోగులు ఇప్పుడు తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపించే ప్రాజెక్టులు, లక్ష్యాలు లేదా కార్యక్రమాల నిర్దిష్ట ఉదాహరణలను వార్షిక సమీక్షలో భాగంగా సమర్పించాలి. “ఫోర్టే” (Forte)అనే ఈ కొత్త కార్యక్రమం ద్వారా, అమెజాన్ ఉద్యోగులు తమ విలువను నిరూపించుకునేలా తొలిసారిగా వ్యక్తిగత సాఫల్యాల జాబితాలను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు అమెజాన్ పనితీరు సమీక్షలు మరింత ఓపెన్-ఎండెడ్‌గా ఉండేవి. ఉద్యోగులను వారి “సూపర్ పవర్స్” ఏమిటో, లేదా వారు అత్యుత్తమంగా పనిచేసే సమయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రతిబింబించమని మాత్రమే అడిగేవారు. అయితే కొత్త విధానం స్పష్టమైన మార్పును సూచిస్తోంది.

    ఈ కొత్త వ్యవస్థతో అమెజాన్ కొలవదగిన ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులు తీసుకున్న రిస్కులు లేదా పూర్తిగా విజయవంతం కాకపోయిన ఆవిష్కరణల గురించి కూడా ప్రస్తావించమని అడుగుతోంది. “విజయాలు అనేవి మీ పని ప్రభావాన్ని చూపించే నిర్దిష్ట ప్రాజెక్టులు, లక్ష్యాలు, కార్యక్రమాలు లేదా ప్రక్రియలలో చేసిన మెరుగుదలలు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, మీరు రిస్క్ తీసుకున్న లేదా ఆవిష్కరణ చేసిన సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి” అంటూ అమెజాన్ అంతర్గత మార్గదర్శకాల్లో సూచించింది.

    ఆందోళన ఎందుకంటే..

    అమెజాన్‌లో ఫోర్టే సమీక్ష ప్రక్రియ వేతన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు జాబితా చేసిన వారి విజయాలు, సహోద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, అమెజాన్ నాయకత్వ సూత్రాలకు వారు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, అలాగే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాల ఆధారంగా వారి మేనేజర్లు అంచనా వేస్తారు. ఈ అంశాలన్నింటి ఆధారంగా ఉద్యోగికి “మొత్తం విలువ” (Overall Value) రేటింగ్ కేటాయిస్తారు. ఇది వార్షిక వేతనాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది.

  • నూతన సంవత్సరంలో పలు కొత్త కార్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌(ఎస్‌యూవీ) విభాగపు కార్ల హడావిడి అధికంగా ఉండనుంది. ఇప్పటికే కొన్ని కార్లను ప్రవేశపెట్టగా మరికొన్నింటిపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా ఇండియా, రెనో, నిస్సాన్‌ మొదలైనవి తమ ఎస్‌యూవీ మోడళ్లకు అప్‌డేటెడ్, ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లతో పాటు గతంలో ప్రజాదరణ పొందిన కార్లను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎకానమీ నుంచి లగ్జరీ సెగ్మెంట్‌ వరకూ అన్ని ధరల రేంజ్‌లో లభించనున్నాయి. మొత్తంగా ఈ ఏడాది భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌ అత్యంత రద్దీగా ఉంటుందని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

    ఎస్‌యూవీల దూకుడు

    ఎస్‌యూవీ కార్లకు డిమాండ్‌ కొనసాగుతూనే ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, మల్టీపర్పస్‌ వెహికల్స్‌ (ఎమ్‌పీవీలు)ను అధిగమించి ఆటో మార్కెట్‌పై ఎస్‌యూవీ విభాగం ఆధిపత్యం చూపుతోంది. విస్తృతమైన ఇంటీరియర్స్, మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్, రోజువారీ వినియోగానికి పనికివచ్చే సౌకర్యాల కారణంగా ‘ఎస్‌యూవీ’లు కస్టమర్లకు తొలి ఎంపికగా మారుతోంది. ఆటో కంపెనీలు ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎంట్రీ లెవల్‌ నుంచి ప్రీమియం ధరల శ్రేణిలో కొత్త మోడళ్లు, ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.

    మారుతీ సుజుకి ఈవిటారా

    మారుతీ సుజుకి ఈవిటారా కూడా జనవరిలోనే లాంచ్‌ అవుతోంది. మారుతీ ఫస్ట్‌ ఫుల్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌ఈవీ కారుగా రానుంది. 49కేడబ్ల్యూహెచ్, 61కేడబ్ల్యూహెచ్‌ రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. 543 కిలోమీటర్ల వరకు రేంజ్‌ కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. డ్యూయల్‌ స్క్రీన్‌ సెటప్, 360డిగ్రీ కెమెరా లెవల్‌ 2 ఏడీఎస్‌ వంటి ఫీచర్లు ఈవిటారాను మరింత మోడ్రన్‌ ఈవీగా ఈ కారు ధర రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

    టాటా సఫారీ, హ్యారియర్‌

    టాటా మోటార్స్‌ ఏళ్ల నిరీక్షణకు తెరతీస్తూ తన ప్రసిద్ధ సఫారీ, హారియర్‌ ఎస్‌యూవీలకు పెట్రోల్‌ ఇంజిన్‌ వెర్షన్లను పరిచయం చేసింది. 1.5 లీటర్‌ సామర్థ్యంతో కొత్త టర్బోపెట్రోల్‌ ఇంజిన్‌ను టాటా మోటార్స్‌ ఈ రెండు ఎస్‌యూవీలకు అందిస్తోంది. కొత్త టర్బోపెట్రోల్‌ ఇంజిన్‌ స్మార్ట్‌ ట్రిమ్‌ నుంచి ప్రారంభమై సఫారీ, హారియర్‌లలో వరుసగా అకంప్లిÙ్డ అల్ట్రా, ఫియర్‌లెస్‌ అల్ట్రా వేరియంట్‌ల వరకు అందుబాటులో ఉంది. హ్యారియర్‌ పెట్రోల్‌ ధర రూ. 12.80 లక్షల నుంచి సఫారీ రేటు రూ. 13.29 లక్షల నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది.

    న్యూజెన్‌ సెల్టోస్‌

    కియా ఇండియా సెల్టోస్‌ కొత్త వెర్షన్‌గా ‘న్యూజెన్‌ సెల్టోస్‌’ పేరుతో అధికారంగా లాంచ్‌ అయ్యింది. హెచ్‌టీఈ నుంచి జీఎస్‌ఎక్స్‌(ఏ), ఎక్స్‌లైన్‌ వరకు వివిధ వేరియంట్లలో ఇది లభిస్తుంది. అప్‌గ్రేడ్‌ చేసిన ఫీచర్లతో, పూర్తిగా రీడిజైన్‌ చేసిన ఇంటీరియర్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.

    స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌

    స్కోడా కుషాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ జనవరి మధ్యలో లాంచ్‌ కానుంది. ఈ అప్‌డేట్‌లో ఫ్రంట్‌ గ్రిల్, బంపర్లు ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను మరింత షార్ప్‌గా చేస్తున్నారు. పనోరమిక్‌ సన్‌రూఫ్, 360డిగ్రీ కెమెరా, లెవెల్‌ 2 అడాస్‌ వంటి ఫీచర్లు క్యాబిన్‌ని మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి. ఈ కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

    మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ

    మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ700’ని పూర్తిగా రీబ్రాండ్‌ చేసి ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ‘ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ’గా లాంచ్‌ చేసింది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్లు, టూస్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పానోరమిక్‌ సన్‌రూఫ్, అంబియంట్‌ లైటింగ్, బాస్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    రెనో డస్టర్‌

    సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ అయిన రెనో డస్టర్, భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇది ఈ నెలలో (జనవరి) కొత్త మోడల్‌తో లాంచ్‌ అవుతోంది. కొత్త జనరేషన్‌ డస్టర్‌ సీఎంఎఫ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే డస్టర్‌ .. లుక్‌ మరింత ప్రొఫెషనల్‌గా ఉంటుంది. లోపలి భాగంలో 10.1అంగుళాల టచ్‌్రస్కీన్, ప్రీమియం ఇంటీరియర్‌ ఫుల్‌ అడాస్‌ ప్యాకేజీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

  • బంగారం, వెండి ధరలు పూట పూటకూ మారిపోతున్నాయి. రోజుకో కొత్త రేటును నమోదు చేస్తున్నాయి. క్రమంలో హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పసిడి, వెండి ధరలు గడిచిన వారం రోజుల్లో ఎలా మారాయన్నది కథనంలో తెలుసుకుందాం.

    గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. జనవరి 4 నుంచి జనవరి 11 వరకు బంగారం తో పాటు వెండి ధరల్లో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

    బంగారం ధరల పెరుగుదల ఇలా..

    24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 4న రూ.1,35,820 ఉండగా జనవరి 11 నాటికి రూ.1,40,460 లకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4640 పెరిగింది. ఇక జనవరి 4న రూ.1,24,500 ఉన్న 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర జనవరి 11 నాటికి రూ.1,28,750 లను తాకింది. ఏడు రోజుల్లో రూ.4250 ఎగిసింది.

    వెండి దూకుడు

    ఇక వెండి ధరలు అయితే బంగారాన్ని మించి అమిత వేగంతో దూసుకెళ్లాయి. వారం రోజుల్లో వెండి ధర కేజీకి ఏకంగా రూ.18 వేలు పెరిగింది. జనవరి 4 రూ.2,57,000 ఉన్న కేజీ వెండి ధర జనవరి 11 నాటికి రూ.2,75,000 లకు చేరింది.

    ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు బలపడటం, డాలర్ మారకం విలువల్లో మార్పులు, అలాగే వివాహాలు, శుభకార్యాల నేపథ్యంలో నగలపై డిమాండ్ పెరగడం కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. వెండిపై పరిశ్రమల నుంచి కూడా డిమాండ్ పెరగడం ధరలపై ప్రభావం చూపిందని అంటున్నారు.

Movies

  • మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్‌ షోల విషయంలో దుమ్మురేపుతున్నాడు. హైదరాబాద్‌లో  ఏకంగా 200 స్క్రీన్స్‌లలో ప్రీమియర్స్‌ ప్రదర్శించనున్నారు.  రూ. 600 టికెట్‌ ఉన్నప్పటికీ దాదాపు అన్ని థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఆపై నార్త్‌ అమెరికాలో కూడా టికెట్స్‌ బుకింగ్‌ జోరు కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అమెరికాలో కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 9 లక్షల డాలర్లు (రూ. 8.12కోట్లు) కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించారు.   1మిలియన్‌ మార్క్‌ కూడా చేరవచ్చని తెలుస్తోంది. దీంతో  చిరంజీవి కెరీర్‌లో మరో అతిపెద్ద ఓవర్సీస్ ఓపెనింగ్‌గా ఈ మూవీ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

    ‘మన శంకర వరప్రసాద్ గారు’ అమెరికా ప్రీమియర్స్‌లో సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌ పరంగా చిరు కెరీర్‌లో రెండో చిత్రంగా నిలిచింది. మొదటి స్ధానంలో ఖైదీ 150 మూవీ ఉంది. చిరు రీఎంట్రీ మూవీ కావడంతో కేవలం ప్రీమియర్స్‌ ద్వారా  1.25 మిలియన్‌ డాలర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత అంతటి రేంజ్‌ ఓపెనింగ్స్‌ కలెక్షన్స్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి దక్కింది. అయితే, చిరు హిట్‌ సినిమా వాల్తేరు వీరయ్య కూడా 6 లక్షల డాలర్ల వద్దే ఆగిపోయింది.  సంక్రాంతి పండుగ కాబట్టి చిరు సినిమాకు పాజిటీవ్‌ టాక్‌ వస్తే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా  ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిలిచే ఛాన్స్‌ ఉంది.

  • బాలీవుడ్ న‌టుడు ఫర్హాన్ అక్తర్ న‌టించిన కొత్త సినిమా ‘120 బహదూర్‌’ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, ప్రస్తుతం అదనంగా రూ. 349 అద్దె చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండా సినిమా చూసే అవకాశం  రానుంది. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రజనీష్‌ (రాజీ ఫేమ్) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పరమ వీర చక్ర అవార్డ్‌ అందుకున్న మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ మెప్పించారు. ఇందులో రాశీఖన్నా కీల‌క పాత్ర‌లో నటించింది. గతేడాదిలో విడుదులైన ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. కొన్ని రాష్ట్రాల్లో ట్యాక్స్‌ లేకుండా ప్రభుత్వాలు అనుమతులు కూడా ఇచ్చాయి.

    ‘120 బహదూర్‌’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జనవరి 16నుంచి  ఉచితంగా చూడొచ్చని ప్రకటించారు. భాగ్ మిల్కా భాగ్ త‌ర్వాత ఫర్హాన్ అక్తర్ మ‌రోసారి బ‌యోపిక్ చేయడంతో భారీగా ఫ్యాన్స్‌ ఈ మూవీ కోసం ఎదురుచూశారు. ఈ హిస్టారికల్‌ మూవీ అందరినీ మెప్పిస్తుంది. కానీ, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు.

    '120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు.  మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.

  • బుజ్జిగాడు సినిమాలో యాక్ట్‌ చేసిన సంజనా గల్రానీ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. మధ్యలో డ్రగ్స్‌ వివాదంలో చిక్కుకోవడంతో తన ఇమేజ్‌ డ్యామేజ్‌ అయింది. తనకు ఆ కేసులో క్లీన్‌చిట్‌ వచ్చినప్పటికీ తన ఆత్మగౌరవం దెబ్బతిందని బాధపడింది. ఆ మరకు పోగొట్టుకునేందుకు బిగ్‌బాస్‌ షోను ఎంచుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో అడుగుపెట్టింది.

    బిగ్‌బాస్‌ షోలో..
    చిలిపితనం, ముక్కుసూటితనంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్డు దొంగతనంతో సీజన్‌పై బజ్‌ క్రియేట్‌ చేసిన ఆమె ఏకంగా ఫైనల్స్‌లో అడుగుపెట్టడం విశేషం. ఈ షో కోసం తన ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసింది. ఆరేండ్ల కుమారుడు అలరిక్‌ను, ఏడాది కూడా నిండని పాపను భర్తకు అప్పజెప్పి బిగ్‌బాస్‌ షోలో పాల్గొంది. లోలోపల ఎంత కుమిలిపోయినా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేది. 

    సంజనా కూతురికి భోగి పండ్లు
    తాజాగా ఓ సంక్రాంతి ఈవెంట్‌లో సంజనా కూతురికి దువ్వాడ మాధురి, శ్రీముఖి, రోహిణి భోగి పండ్లు పోశారు. అందులో సంజనా పాప ఎంతో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ఆ చిన్నారి ముందు పుస్తకం, స్టెతస్కోప్‌, మేకప్‌ వంటి సామాను పెడితే.. మేకప్‌ సామానునే పట్టుకుంది. అంటే తల్లి దారిలో నడవనున్నట్లు సిగ్నల్స్‌ ఇచ్చిందన్నమాట! ఈ సందర్భంగా సంజనా భావోద్వేగానికి లోనైంది. 

    అదే నా సక్సెస్‌
    'చాలా సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. ఇప్పటికీ ఇదంతా కలా? నిజమా? అర్థం కావడం లేదు. ఇంత చిన్న పాపను పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడమేంటి? ప్రతిరోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. టాప్‌ 5వరకు వెళ్లాను. ఇప్పుడు మీ అందరితో ఇక్కడున్నాను.. ఇదే నా విజయం' అని సంజనా చెప్పుకొచ్చింది.

    చదవండి: ప్రభాస్‌కు కలిసిరాని ఆర్‌ అక్షరం

  • శర్వానంద్‌ నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలకానుంది. ఈ మూవీని దర్శకులు రామ్‌ అబ్బరాజు తెరకెక్కించగా..  అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర  నిర్మించారు. ఇందులో  సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. వివాహ భోజనంబు, సామజవరగమన వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన రామ్‌ అబ్బరాజు తొలిసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు.
     

  • పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్‌ సినిమాలున్నాయి. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్లకు సైతం కొదవ లేదు. అయితే తన అపజయాల లిస్టు చూస్తే అందులో R అక్షరంతో మొదలైన సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభాస్‌కు R అక్షరం కలిసిరావడం లేదన్న వాదన మొదలైంది. ఈ భయంతోనే కాబోలు రాజాసాబ్‌ సినిమా టైటిల్‌ ముందు The అనేది యాడ్‌ చేశారు. అయినా సరే ఆ సెంటిమెంట్‌ కొనసాగినట్లే కనిపిస్తోంది...

    R అక్షరం వల్లే..
    ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన మూవీ ది రాజాసాబ్‌. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. సినిమా టైటిల్‌ రాజాసాబ్‌ ఆర్‌ అక్షరంతో మొదలుకావడం వల్లే ఇంత వ్యతిరేకత వస్తోందని కొందరంటున్నారు. ఈ సెంటిమెంట్‌ ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు.. రాఘవేంద్ర సమయంలో మొదలైంది. 

    నెగెటివ్‌ టాక్‌
    ప్రభాస్‌ నటించిన సెకండ్‌ మూవీయే రాఘవేంద్ర. 2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రెబల్‌ సినిమా చేశాడు. రాఘవ లారెన్స్‌తో కలిసి చేసిన ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత అంటే 2022లో రాధే శ్యామ్‌ అని భారీ బడ్జెట్‌ సినిమా చేశాడు. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న కృష్టంరాజు చివరిసారిగా యాక్ట్‌ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

    సాహసం చేస్తాడా?
    ఇలా ఆర్‌ లెటర్‌తో చేసిన నాలుగు సినిమాలు తనకస్సలు కలిసిరాలేదు. ఈసారి 'ది రాజాసాబ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆర్‌ సెంటిమెంట్‌ ప్రభాస్‌ను వెంటాడినట్లే కనిపిస్తోంది. మరి మున్ముందు ప్రభాస్‌ R అక్షరంతో సినిమాలు చేస్తాడా? ఈ సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటాడా? లేదా లైట్‌ తీసుకుంటాడా? అన్నది చూడాలి!

  • సంక్రాంతి కానుకగా  శివకార్తికేయన్‌ సినిమా పరాశక్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  అయితే, జనవరి 10న కేవలం  తమిళ్‌లోనే విడుదల చేశారు. కానీ, సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. తెలుగు మూలాలు ఉన్న  సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాపై పలు విమర్శలు వస్తున్నాయి. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ మూవీ కొనసాగుతుంది. మూవీలో​ పలు అభ్యంతరకరమైన డైలాగ్స్‌ ఉండటంతో సెన్సార్‌లో భారీ కొతలు పడ్డాయి. అయినప్పటికీ వివాదాలకు ఈ మూవీ తావిచ్చింది.

    అమరన్ చిత్రంతో తెలుగువారి ప్రేమను పొందిన శివకార్తికేయన్‌.. ఇప్పుడు పరాశక్తితో కొల్పోయేలా  ఉన్నాడు. ఈ మూవీలో తెలుగు ప్రజలను అవమానించే విధంగా "గోల్టీ"(Golti) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. (గోల్టీ అంటే దొంగ, మురికివాడు) ఈ పదాన్ని కట్ చేస్తామని ముంబై సెన్సార్ రివిజన్ కమిటీ ముందు చిద్ర యూనిట్‌ మొదట అంగీకరించి కూడా, తమిళ వెర్షన్‌లో అలాగే ఉంచడంతో #BoycottParasakthi అని వైరల్‌ అవుతుంది.  తెలుగు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ మూవీకి దర్శకత్వం వహించింది కూడా తెలుగు మూలాలు ఉన్న సుధ కొంగర కావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. పైగా ఆ పదం తీసేస్తే సినిమాకు ఉన్న  ఆత్మ పోతుందని ఆమె సమర్థించుకున్నారని తెలుస్తోంది.

    1960 సమయంలో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి ఈ మూవీ ఉంది. ఈ కాన్సెప్ట్‌ చాలా సున్నితమైనది కావడంతో  సెన్సార్ బోర్డు (CBFC) చాలా అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా 20కి పైగా కట్స్‌ సూచించింది.  సినిమాలో వాడిన కొన్ని పదాలను తొలగించారు. అందులో కొన్ని రాయలనేని బాషలో ఉన్నాయి. వాటిని తొలగించమని కూడా సెన్సార్‌ ఆదేశించింది. అయితే, ఈ పదాలన్నీ తొలగిస్తే సినిమాకు ఉన్న బలం పోతుందని దర్శకురాలు వాదించారట. అయితే, సినిమాపై సానుకూల రివ్యూలు రాలేదు. కథను సాగదీసి చెప్పారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కేవలం శివకార్తికేయన్‌ ఇమేజ్‌ మాత్రమే ఈ మూవీకి బలాన్ని ఇచ్చిందన్నారు. రాజకీయ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి పర్వాలేదు. ఫ్యామిలీ ప్రేక్షకులకు నిరాశ కలిగించేలా ఉంది.
     

  • ‘నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే చూస్తాను’ అన్నారు యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి.  మీనాక్షి చౌదరి, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు'తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.

    ⇢ ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇది చాలా భిన్నమైన పాత్ర.  నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.

    ⇢ నవీన్‌తో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.

    ⇢ ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.

    ⇢ గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.

    ⇢ ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.

    ⇢ నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.

    ⇢ ప్రస్తుతం నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.
     

  • మంచితనానికి మారుపేరుగా ఉండే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో గొప్ప పని చేశాడు. గుజరాత్‌లోని వారాహి గోశాలకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు. వారాహి గోశాలను సందర్శించిన ఆయన గోవులను సంరక్షిస్తున్న విధానం చూసి సంతోషం వ్యక్తం చేశాడు. సోనూసూద్‌ మాట్లాడుతూ.. కేవలం కొద్ది ఆవులతో మొదలైన ఈ గోశాలలో ఇప్పుడు వాటి సంఖ్య ఏడు వేలకు చేరింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

    గోశాలకు విరాళం
    ఈ గ్రామంలోని ప్రజలందరూ వాటి సంరక్షణ కోసం పాటుపడుతుండటం అభినందనీయం. వారు చేసినంత సేవ నేను చేయకపోవచ్చు. కానీ నా తరపున రూ.11 లక్షలు విరాళం ఇచ్చాను. దానివల్ల వారి సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను. ఈ గ్రామ ప్రజల ప్రేమ నన్నెంతగానో కట్టిపడేసింది. వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరోసారి ఇక్కడికి వస్తాను. ఇక్కడ ఆవులను సంరక్షిస్తున్న విధానాన్ని దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు.

    సినిమా
    సోనూసూద్‌ సినిమాల విషయానికి వస్తే.. సూపర్‌, అరుంధతి, చంద్రముఖి, దూకుడు, జులాయి, అల్లుడు అదుర్స్‌.. ఇలా అనేక సినిమాల్లో విలన్‌గా చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటుడిగా రాణిస్తున్నాడు. చివరగా 'ఫతే' అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ మారాడు.

    చదవండి: చచ్చిపోవాలన్నంత బాధ.. ఎంతోమందిని కలిశా..

  • టాలీవుడ్‌లో ఫేక్ రివ్యూలు, నెగెటివ్ రేటింగ్స్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు ఈ సమస్యపై కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షో (BookMyShow) వంటి ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌లలో రేటింగ్స్, రివ్యూలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షో ఈ సినిమాకు రేటింగ్స్ , రివ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై  స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయం తనకు సంతోషాన్నిచ్చినప్పటికీ, కొంత బాధను కూడా కలిగిస్తోందని ట్వీట్‌ చేశారడు.

    ‘ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం సంతోషకరం. ఇది చాలా మంది కష్టం, కలలు, డబ్బును కాపాడుతుంది. అదే సమయంలో బాధ కలిగిస్తోంది ఎందుకంటే... మన సొంత మనుషులే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. ‘మనం బతుకుతూ ఇంకొకరికి బతికించాలి’ అనే సూత్రం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్లింది?

    (చదవండి: మొన్న అల్లు అర్జున్‌, ఇప్పుడు ప్రభాస్‌పై కక్ష.. హరీశ్‌రావు సంచలన కామెంట్‌)

    'డియర్ కామ్రేడ్' సినిమా నుంచే నాకు ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. అలా చెబితే ఎవరూ పట్టించుకోలేదు .ఒక మంచి సినిమాను ఎవరూ ఆపలేరని నాకే తిరిగి చెప్పారు. కానీ నాతో సినిమా తీసిన దర్శకులకు, నిర్మాతలకు ఈ సమస్య యొక్క తీవ్రత తర్వాత అర్థమయింది.

    ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ, నా కలలను , నా లాగే నా తర్వాత వచ్చే చాలా మంది కలలను కాపాడుకోవడానికి వారితో ఎలా వ్యవహరించాలో అని ఆలోచిస్తూ  అనేక రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఇన్నాళ్లకు ఈ విషయం  బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. 

    (చదవండి: చిరు-అనిల్ రావిపూడి.. ఈసారి హిట్ కొడతారా?)

    మెగాస్టార్ లాంటి పెద్ద హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఈ ఆదేశాలతో సమస్యను పూర్తి పరిష్కారం లభించదు కానీ, ఆందోళన చెందాల్సిన విషయాల్లో ఒకటి తగ్గుతుంది. ఇదంతా పక్కనపెట్టి ఇప్పుడైతే మనం ‘మన శంకరవరప్రసాద్‌’(Mana Shankara Varaprasad Garu) తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయవంతంగా అలరించాలని కోరుకుందాం’ అని విజయ్‌ ట్వీట్‌ చేశాడు. 

  • చెప్పుకోలేని బాధ, విపరీతమైన ఆలోచనలతో ఇబ్బందిపడుతున్నప్పుడు మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరం. అలా తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు థెరపీ తీసుకుని చాలా మంచి పని చేశానంటోంది మలయాళ నటి పార్వతి తిరువోతు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. థెరపీ తీసుకోవడం అనేది నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం. 

    అర్ధరాత్రి థెరపీ
    కాకపోతే మనకు కరెక్ట్‌ థెరపిస్ట్‌ దొరకాలి. అందుకు నాకు చాలా సమయం పట్టింది. మొదట్లో నేను అమెరికన్‌ థెరపిస్ట్‌ను కలిశాను. అర్ధరాత్రి ఒంటిగంట, రెండు గంటల సమయంలో నాతో మాట్లాడేవారు. తర్వాత ఇక్కడే ఉన్న థెరపిస్ట్‌లను సంప్రదించాను. వారు నా సమస్యలేంటో గుచ్చిగుచ్చి అడిగి.. వాటిని వెలికితీసి మరింత బాధపెట్టేవారు.

    చచ్చిపోవాలన్న ఆలోచనలు
    అప్పటికే నేను తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాను. చచ్చిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కరెక్ట్‌ థెరపిస్ట్‌ దొరికాక నా బాధకు ఉపశమనం లభించింది. నన్ను ఎంతో బాధపెట్టిన 2021 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి నెలల్ని నా జీవితంలో నుంచే తీసేశాను. 

    సినిమా
    ప్రస్తుతం నేను కుటుంబం, ఫ్రెండ్స్‌, సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. పార్వతి బెంగళూరు డేస్‌, ఎన్ను నింటె మొయిదీన్‌, చార్లీ, ఉయరె, వైరస్‌, పుళు వంటి పలు చిత్రాల్లో నటించింది. దూత వెబ్‌ సిరీస్‌తో తెలుగువారికి సైతం పరిచయమైంది.

    గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
    ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
    మెయిల్: roshnihelp@gmail.com

  • తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు  పలు విమర్శలు చేశారు. సినిమా రంగం అనేది తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు ఒక అడ్డాగా మార్చుకున్నారని ఆయన భగ్గుమన్నారు. ఒక సినిమాకు టికెట్‌ ధరలు పెంచి మరో సినిమాకు పెంచకపోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది. మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు తెలియదు.. ఆ జీఓ ఎలా వచ్చిందో అంటారు. అసలు తన దగ్గరికే ఫైల్‌ రాలేదని నిస్సహాయంగా చేతులెత్తేస్తారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

    వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడితే.., మరో సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే టికెట్‌ ధర రూ. 600కు పెంచుకోవచ్చని అనుమతి ఇస్తారా..? ఆపై వారం రోజుల పాటు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా..? అంటూ  హరీశ్‌రావు ప్రశ్నించారు. '50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న చిత్ర పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు.' అని ఆయన ఫైర్‌ అయ్యారు.

    తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది..
    సినిమా టికెట్‌ రేట్ల విషయంలో శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. అని హరీశ్‌రావు అన్నారు. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. 'మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం.' అని ఆయన హెచ్చరించారు. 
     

  • టాలీవుడ్‌ స్టార్‌ జంట నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఈసారి సంక్రాంతిని కాస్త ముందుగానే జరుపుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకకు హాజరైన వీరిద్దరూ అక్కడ ఉన్నవారికి ఆప్యాయంగా భోజనం వడ్డించారు. అనంతరం అక్కడి వారితో ఫోటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    సినిమా
    కాగా చై- శోభితలది ప్రేమ పెళ్లి. కొంతకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన చైకి 'తండేల్‌'తో పెద్ద హిట్‌ లభించింది. రూ.100 కోట్లు రాబట్టిన తొలి సినిమాగా అతడి కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చై 'వృషకర్మ' సినిమా చేస్తున్నాడు. 

    శోభిత సంగతేంటి?
    'విరూపాక్ష' వంటి సూపర్‌ హిట్‌ మూవీ తెరకెక్కించిన కార్తీక్‌ వర్మ దండు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తోంది. శోభిత విషయానికి వస్తే.. ఇటీవలే తన కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. 'చీకటిలో' అనే థ్రిల్లర్‌ సినిమాతో జనవరి 23న ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది.

     

     

    చదవండి: నీ బర్త్‌డే నాకెంతో స్పెషల్‌.. పుట్టినందుకు థాంక్స్‌: అల్లు అర్జున్‌

  • సినీ తారలు అన్నాక.. రకరకాల రూమర్స్‌ వస్తుంటాయి. సోషల్‌ మీడియాలో ఏవోవో రాస్తుంటారు. ప్రేమలో పడకపోయినా..త్వరలోనే పెళ్లి అంటూ పోస్టులు పెడుతుంటారు. ఇక డేటింగ్‌ రూమర్స్‌ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పుకార్లను కొంతమంది నటీనటులు పర్సనల్‌గా తీసుకుంటారు. బాధ పడతారు. భయపడతారు.. ఖండిస్తారు. మరికొంతమంది అయితే.. ఎన్ని పుకార్లు వచ్చిన పట్టించుకోరు. దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా..తమ పని తాము చేసుకొని వెళ్తారు. తాను కూడా ఆ బాపతే అంటోంది అందాల తార మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ట్రోలింగ్‌, రూమర్స్‌ అనేవి పిచ్చ లైట్‌గా తీసుకుంటానని చెబుతోంది.

    ఇటీవల మీనాక్షి ప్రేమ, పెళ్లిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి.  అయితే మీనాక్షి మాత్రం ఈ రూమర్స్‌ని ఖండించింది. సుశాంత్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేసింది.  అయినా కూడా రూమర్స్‌ ఆగడం లేదు.  అయితే ఇలాంటి పుకార్లను చూసి నవ్వుకుంటానే తప్ప అస్సలు హార్ట్‌కు తీసుకోనని మీనాక్షి చెప్పింది. 

    ఆమె నటించిన తాజా చిత్రం ‘అనగనగ ఒకరాజు’ జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సోసల్‌ మీడియాలో వచ్చే రూమర్స్‌ని ఎలా తీసుకుంటారు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానంగా చెప్పింది. సెలెబ్రెటీల పెళ్లిపై పుకార్లు రావడం కామన్‌..  ఇప్పటికే నాకు సోషల్‌ మీడియాలో చాలా సార్లు పెళ్లి చేశారంటూ మీనాక్షి నవ్వేసింది. 

  • ట్రోలింగ్‌ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్‌ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్‌ చూశాడు అల్లు అర్జున్‌. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్‌ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

    నాలుగు సార్లు రిపీట్‌
    హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్‌ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. 

    ఎనలేని గౌరవం
    పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్‌ను తిరుగులేని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్‌ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్‌ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

    నా జీవితాన్ని మార్చేసిన రోజు 
    హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్‌ సుకుమార్‌ అంటూ రెండు ఫోటోలు షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

     

     

    చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్‌ రావిపూడి

Politics

  • సాక్షి, గుంటూరు: కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు.. ఆయననే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫాలో అవుతున్నారని తెలిపారు.

    గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌  సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్సార్‌సీపీ నేతలు అన్నబత్తుని శివ కుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకట రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీల్లో గీతాంజలి లక్ష రూపాయల మొదటి ప్రైజ్ గెలుచుకుంది.

    ఈ సందర్బంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనుక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారం రాగానే మొదటి క్యాబినెట్లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్‌ జగన్‌కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్‌లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులు బయటపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.

    మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి అంటే మొదట గుర్తు వచ్చేది ముగ్గుల పోటీలు. రాంబాబు అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే రాంబాబు. గతంలో రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే సంబరాల రాంబాబు అని హేళన చేశారు. వాళ్లే ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లి డాన్సులు వేస్తున్నారు. అందరి ఆత్మీయుడు అంబటి రాంబాబు.

    వైఎస్‌ జగన్‌ను ఎవరు విమర్శిస్తే వారికి.. అంబటి రాంబాబు తన మాటల చురకులతో తాట తీస్తారు. కూటమి పాలనలో సంక్షేమం లేదు. ఆరోగ్యశ్రీ లేదు, చేయూత, రైతు భరోసా లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లితండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతీ నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అమలు జరిగేది. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ను ఎందుకు వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు.

    వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘సంక్రాంతి అంటే సాంప్రదాయం. ఆటలు, పాటలు, కోడిపందాలు ఎన్నో ఉంటాయి. ప్రతీ సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన్ను కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకి వెళ్ళాడు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు నిర్వహించి వేల కోట్లు దోపిడి చేసేలా కూటమి నాయకులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా 450కి పైగా బరులు సిద్ధం చేశారని, ప్రతి నిర్వాహకుడి నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

    అంతే కాకుండా ఒక్కో బరి వద్ద సగటున 40 వరకు పందేలు నిర్వహిస్తారని, ఒక్కో పందెం విలువ విలువ రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులకు వాటాలు చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇవే కాకుండా ఆ కోడి పందేల బరుల వద్ద ఫుడ్‌ స్టాళ్లు, లిక్కర్‌ అమ్మకాలు, కూల్‌ డ్రింక్స్, పేకాట డెన్‌లు నిర్వహిస్తూ అధికార పార్టీ నాయకులు మరో భారీ దోపిడీకి తెరదీశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్‌ వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    సంక్రాంతి సంబరాల్లో ‘కేపీఎల్‌’:
    క్రికెట్‌లో ఐపీఎల్‌ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్‌’ (కోడి పందేల లీగ్‌)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు చేశారు. అసలు కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, పోలీసులతో కుమ్మక్కై వాటి ద్వారా వేల కోట్లు దోచుకునేందుకు కూటమి నాయకులు ఈ సంక్రాంతి సంబరాల్లో స్కెచ్‌ వేసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కి రూ.10 లక్షలు ముట్టజెప్పి పందేలు నిర్వహించుకుందామని, మూడు రోజుల తమకు అదే పని అంటూ వారు మాట్లాడుకున్న వీడియో ఇందుకు సాక్ష్యం.

    పండగ వేడుకలనూ ఈవెంట్‌లా మార్చారు:
    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పులు, ఈవెంట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. పెన్షన్‌ పంపిణీ పేరుతో ప్రతి నెలా 1న సీఎం చేస్తున్న ఈవెంట్, ఏటా స్కూళ్లలో రొటీన్‌గా జరిగే పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ (పీటీఎం)ను కూడా ఏ స్థాయిలో ఈవెంట్‌లా మార్చి హంగామా చేశారో చూశాం. ఇప్పుడు చివరకు సంక్రాంతి పండగను కూడా విడిచిపెట్టకుండా, ఆ వేడుకలను కూడా ఈవెంట్‌లా మార్చి దోపిడికి సిద్ధమయ్యారు. ఇటీవలే దసరా సందర్భంగా విజయవాడలో గొల్లపూడి వద్ద ఎగ్జిబిషన్‌ నిర్వహించి ఏం చేశారో చూశాం. కాగా, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలనూ ఈవెంట్‌లా మార్చిన కూటమి నాయకులు, యథేచ్ఛగా వేల కోట్ల దోపిడి పర్వానికి తెర తీశారని పుత్తా శివశంకర్‌ ఆక్షేపించారు.

  • సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడి చేయిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భయపడరు అని చెప్పుకొచ్చారు. అరెస్ట్‌లతో వైఎస్సార్‌సీపీ పోరాటం ఆగదు అని అన్నారు.

    కండలేరు డ్యామ్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణిని కూడా అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. సీమ లిఫ్ట్‌ నిలిపేసి నెల్లూరు జిల్లాకు బాబు ద్రోహం చేశారు. లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు భయపడేవాళ్లం కాదు. పోలీసులను అడ్డుకుని చంద్రబాబు.. దాడులు చేయిస్తున్నాడు. పోలీసు శాఖ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మొండి వైఖరి ప్రవర్తిస్తోంది.

    కండలేరు డ్యామ్ పరిశీలనకు వెళ్ళకుండా అరెస్టులు చేస్తారా?. అరెస్టులతో మా పోరాటం ఆగదు. మా నాయకుడు వైఎస్‌ జగన్ ఆశయాలు, ఆదేశాలతో పోరాడుతూ ముందుకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల వలన నెల్లూరు జిల్లాకు కూడా చంద్రబాబు తీరని లోటు తలపెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి. డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి.. విడుదల చేస్తామని ఇప్పటికీ అందించలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులను మభ్యపెట్టి.. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు.

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో దోహదం చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం.. వారికి డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి విడుదల చేస్తామని‌ ఇప్పటికీ అందించడం లేదు. వైఎస్ జగన్ హయాంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శత్రువుగా మారిపోయింది. టీచర్స్ పట్ల టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, సచివాలయంలో లక్ష సమస్యలుగా కూటమి ప్రభుత్వం మారింది.

    ఉద్యోగులకు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా అమలు చేయకుండా తుంగలో తొక్కారు. రూ.34వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఆర్ అందిస్తామని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పీఆర్సీ ఇస్తామని ఆ ఊసే లేదు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రస్తావించడం లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేయకుండా మభ్యపెడుతున్నారు.

    గతంలో వైఎస్ జగన్ హయాంలో ఐఆర్ 27 శాతం అందించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి కేబినెట్‌ మీటింగ్‌లోనే నిర్ణయం తీసుకోని ఉద్యోగులకు అందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. 16 నెలలు అవుతున్నా డీఏలు అందించడం లేదు. వైఎస్‌ జగన్‌ కరోనా సమయంలో కూడా ఐఆర్, డీఏలు, పీఆర్సీ అందించారు. మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం.. ఉద్యోగులకు ఎందుకు బకాయిలు చెల్లించలేదు?. సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో‌ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

  • సాక్షి, అన్నమయ్య: కూటమికి ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు రాయచోటి ప్రజలను గుండెకోతకు గురిచేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రాంత ప్రజల గొంతు కోశారని అన్నారు. పక్క ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

    అన్నమయ్య జిల్లా తరలింపుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పినా సంబరాల పేరిట ప్రజలను ఏమార్చారు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నాం, మా వాదనలు వినిపించాను. నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయపోరాటం ఒకటే మార్గం. జన గణన ప్రారంభమవుతుంది ఈ లోపల సరిహద్దులు మార్చకూడదనే నిబంధన కూడా ఉంది. ఉన్న జిల్లాను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు, ఈ ప్రాంత ప్రజలను కోతకు గురి చేశారు.

    ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినా జరిగిన నష్టాన్ని పూడ్చలేరు. జిల్లా కేంద్రం నుంచి చుట్టూ ముప్పై కిలోమీటర్ల వరకు లక్షల కోట్ల మా సంపదను ఆవిరి చేసి నష్టం చేశారు. ప్రజలు మద్దతిచ్చి గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు. రైతులను వ్యాపారులను యువతను అన్ని విధాల మోసం చేశారు. మమ్మల్ని గుండు కోతకు గురి చేసిన ఓ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుత తెలుగుదేశానికి కూడా అదే గతి పడుతుంది.

    జన గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జిల్లాల విభజన జరిగి ఉంటే స్వాగతించే వాళ్లం. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి అన్ని ప్రాంతాల పెట్టుబడులన్నీ ఒక అమరావతిలోనే పెడుతున్నారు చంద్రబాబు. 100 కోట్లతో రాయచోటి కలెక్టరేట్ తయారవుతుంది. కానీ 1800 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లో తిరిగేందుకు విహారయాత్రలు చేసుకునేందుకు వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని మంత్రులు మాట్లాడుతున్నారు. 5000 కోట్లతో బనకచర్ల, గండికోట పనులు గతంలో ప్రారంభించాం. రాయచోటిని జిల్లా చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాం. జిల్లా తీసుకు వస్తాం. ఈ ప్రాంతానికి వచ్చిన సైనిక్ స్కూల్, యునాని మెడికల్ కాలేజ్, జిల్లా కేంద్రం తరలిపోవడం బాధాకరం.

    రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటే ఏ విధంగా కట్టుబడి ఉన్నారు?. రాయచోటిలో యూనివర్సిటీ కోసం, కలెక్టరేట్ కోసం, జడ్పీ కార్యాలయం కోసం వేలాది ఎకరాలు కేటాయించి పెట్టాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నమయ్య జిల్లా పేరు మీదే వచ్చింది. అందుకే అన్నమయ్య జిల్లాపై కుట్ర పన్నారు. గతంలో అమరావతి రాజధాని చేస్తామంటే వైఎస్సార్‌సీపీ అభ్యంతరం చెప్పలేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా అమరావతి కూడా ప్రతిపాదించాం. అమరావతి కోసం 50 వేల ఎకరాలు తీసుకుంటే చనిపోయిన రైతులకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని ఘాటు విమర్శలు చేశారు. 

  • శ్రీ సత్యసాయి జిల్లా:  ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని  ఎంపీ మిధున్‌రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురి చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.  ఈ వేధింపు చర్యలను తాను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నానన్నారు. 

    వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీదే విజయమన్నారు. వైఎస్సార్‌సీపీ సంస్థాగత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కార్యకర్తలకు ఇన్సూరెన్స్, ఐడీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మిథున్‌రెడ్డి సూచించారు.

     

National

  • బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఠాక్రే కుటుంబానికి ఎదురులేదన్నారు. ప్రస్తుతం మరాఠీల గౌరవం కోసమే ఠాక్రే సోదరిలిద్దరూ కలిసి ప్రచారానికి వచ్చారన్నారు. మహానగరంలో శివసేన పట్టు ఇప్పటికీ సడలేదని ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైనగరం మూసివేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    గతేడాది మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలిద్దరూ  20 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కలిశారు. అనంతరం ముంబై మహానగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో శివసేన (ఠాక్రే), మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి.

    ఈ నేపథ్యంలో ఎంపీ సంజయ్‌ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముంబై నగరంలో ఠాక్రేలు ఎప్పుడు ఓడిపోలేదు. వారు తలుచుకుంటే ముంబైని 10 నిమిషాల్లో స్తంబింపచేయగలరు. ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలిద్దరూ అన్నదమ్ములూ వారు మళ్లీ కలవడం అదృష్టం" అన్నారు. వారిద్దరి మధ్య విబేధాలున్నప్పటికీ దేశం కోసం ఏకమయ్యారని తెలిపారు.

    "ఠాక్రేలు అంటే ఒక బ్రాండ్ వారు ఉంటేనే మరాఠాల గౌరవం బ్రతికుంటుంది. ఉద్దవ్, రాజే ఒకరే, మేయర్ మనవారే" అని రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. "ఒకవేళ బాల్‌ఠాక్రే బతికి ఉంటే ఇది సాధ్యమయ్యేది.కానీ వీరివల్ల కాదు ఏక్ నాథ్ శిండేని ముంబైలో అడుగుపెట్టనివ్వమన్నారు. కానీ 50మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు" అని ఠాక్రే సోదరులను ఫడ్నవీస్ దుయ్యబట్టారు.

     

     

  • నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్‌పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.

    ‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్‌లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.

    ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే మమ్మద్‌ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజహర్‌ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్‌ అజహార్‌ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజార్‌ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్‌ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్‌ చేశారు.

    కాగా, భారత్‌లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్‌ అజార్‌ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్‌ అజార్‌ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్‌ మోస్గ్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా మసూద్‌ అజార్‌ ఉన్నాడు.

     

  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేల వైరుధ్యాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రేపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్‌ ఠాక్రేలతో ఎవరితో పనిచేయడం తేలిక అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవీస్ బదులిస్తూ  ఉద్దవ్‌తో పని చేయడం చాలా టఫ్‌ జాబ్‌ అన్నారు.

    మహారాష్ట్రలో త్వరలో బృహత్‌ ముంబై మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరంలో జరిగే ఎన్నికలు కావడంతో వీటిని అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓ నేషనల్‌ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా శివసేన ( యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే గురించి ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఫడ్నవీస్ మాట్లాడుతూ" శిండేతో వ్యవహారం చాలా తేలిక ఎందుకంటే ఆయన ఎమోషనల్ వ్యక్తి, నేను కూడా ఎమోషనల్ వక్తినే కనుక ఇది జరుగుతుంది. భావోద్వేగంతో అర్థం చేసుకుంటే శిండేతో వ్యవహారం చాలా సులభం. అయితే ఆయన కంటే నేను ఎక్కువ ప్రాక్టికల్ వ్యక్తిని, అదే ఉద్దవ్‌ ఠాక్రే విషయానికోస్తే ఆయన ఎవరికీ అర్థం కారు. ఆయనను అర్థం చేసుకోవాలంటే ఒక స్కాలర్‌ని అపాయింట్ చేసుకోవాలి. అందుకే ఆయనతో వ్యవహారం చాలా కష్టమైన పని" అని ఫడ్నవీస్ అన్నారు.

    ప్రస్తుతం తమ ఎన్డీయే అలయెన్స్‌లో ఎటువంటి విభేదాలు లేవని స్థిరంగా ఉందని వచ్చే ఐదేళ్లతో పాటు దాని తర్వాత కూడా కలిసే తాము కలిసే ఉంటామని ఫడ్నవీస్ అన్నారు. 2019కి ముందు  శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. 2019లో ఎన్డీఏ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం 2022లో శివసేన నేత ఏక్ నాథ్ శిండే పార్టీని చీల్చి బీజేపీతో జతకట్టి సీఎం అయ్యారు. 2023లో అసలైన  శివసేన ఏక్‌నాథ్ శిండేదేనని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.  

     

  • అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్‌గా పిలుచుకునే ఈ ఆఫీసర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారత గూఢచారిగా ఎన్నో సీక్రెట్‌ మిషన్లలో పాల్గొని దేశ భద్రతలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకూ ఇంటర్నెట్‌ వాడడం లేదని, మెుబైల్‌కు సైతం చాలావరకూ దూరంగా ఉంటానని తెలిపారు.

    భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాతృభూమి రక్షణ కోసం అనునిత్యం తపించే ఈ  ఆఫీసర్ దేశం కోసం ఎన్నో రిస్కీ ఆపరేషన్‌లు చేశారు. 1980 దశకంలో పాకిస్థాన్‌లో ఏడేళ్లపాటు ముస్లిం వ్యాపారిగా, బిచ్చగాడిగా నటిస్తూ భారత్‌కు ఎంతో కీలక సమాచారాన్ని చేరవేశారు. అంతేకాకుండా అమృత్ సర్ గోల్డెన్‌ టెంపుల్‌లో నక్కిన మిలిటెంట్లను బయిటకి తీసేందుకు అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేశారు. ఇలా భారత్‌ కోసం ఆయన ప్రాణాలు తెగించి చేసిన ఆపరేషన్‌లు అనేకం. అందుకే ఆయనను అందరూ ఇండియన్ జేమ్స్‌బాండ్ అని పిలుచుకుంటారు.

    అయితే శనివారం ఢిల్లీ భరత మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్-2026- కార్యక్రమం జరిగింది. అందులో అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ" నేను అసలు ఇంటర్నెట్ వినియోగించను. ఇది నిజం అంతేకాకుండా మెుబైల్‌ ఫోన్‌ అసలు వాడను. కేవలం విదేశాల్లో ఉన్నప్పుడు మా కుటుంబసభ్యులతో మాట్లాడడానికి  తప్ప దానిని వినియోగించను. నాపని అంతా అలానే సాగుతుంది" అని అజిత్ దోవల్ అన్నారు.  

    1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్‌ సాధించి కేరళ క్యాడర్‌కు ఎంపికయ్యారు. కాందహార్ ఫ్లైట్‌ హైజాక్ సమయంలో భారత్‌ తరపున చర్చలలో పాల్గొన్నారు. అంతేకాకుండా అత్యంత చిన్న వయసులో కీర్తి చక్ర అవార్డుకు ఎంపికయిన పోలీసు ఆఫీసర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అజిత్‌ దోవల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, కౌంటర్‌ టెర్రరిజం విభాగాల్లో దశాబ్దాల కాలం పాటు భారత్‌కు సేవలందించారు.

  • చెన్నై: తమిళనాట రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కరూర్‌ తొక్కిసలాట (Karur stampede) కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌ (Actor Vijay).. రేపు సీబీఐ(CBI) విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ అవుతారా? అని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    అయితే, కరూర్‌ తొక్కిసలాట ఘటనలో సీబీఐ (CBI) మూడు రోజుల క్రితమే విజయ్‌కు సమన్లు జారీచేసింది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు. కరూర్‌ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు విజయ్‌ హాజరు అవుతుండటం చర్చకు దారి తీసింది.

    కాగా, విచారణలో భాగంగా విజయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్‌ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. విజయ్‌.. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు విషయమై అనుకూలంగా ఉన్నట్టు ఇప్పటికే టీవీకే పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ కూడా విజయ్‌ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సీబీఐ విచారణ జరగడం ఆసక్తికరంగా మారింది.

    ఇదిలా ఉండగా.. గత ఏడాది సెప్టెంబర్‌ 27న తమిళనాడులోని కరూర్‌ పట్టణంలో విజయ్‌ ప్రచార ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 110 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇక మూడు రోజుల క్రితం విజయ్‌కి సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 12న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో విజయ్‌ని విచారించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. 

  • గదగ్: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గదగ్ జిల్లా, లక్కుండి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు పునాదుల కోసం భూమిని తవ్వుతుండగా అనూహ్యంగా బంగారు నిధి లభ్యమయ్యింది. పునాదుల్లో పసిడి ఆభరణాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. పాతకాలపు రాగి బిందెలో దాచి ఉంచిన ఈ విలువైన సంపదను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

    ఈ నిధిని స్థానికంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రజ్వల్ రిత్విక్ అనే విద్యార్థి గుర్తించాడు. భూమిలో కనిపిస్తున్న రాగి బిందెను గమనించిన ఆ బాలుడు, వెంటనే గ్రామ పెద్దలకు ఆ సమాచారం అందించాడు. ఆ రాగి బిందెను తెరిచి చూడగా, అందులో వివిధ రకాల బంగారు ఆభరణాలు కనిపించాయి. బాలుడి నిజాయితీని గ్రామస్తులు మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న గదగ్ జిల్లా ఎస్పీ రోహన్ జగదీష్ నేతృత్వంలో పోలీసుల బృందం, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

    అధికారులు ఆ బంగారాన్ని పరిశీలించి, అది సుమారు 470 గ్రాముల బరువు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ రాగి బిందెలో మొత్తం 22 రకాల బంగారు వస్తువులు ఉన్నాయని, వాటిలో గొలుసులు, చెవి కమ్మలు వంటి విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. అధికారులు ఈ బంగారు నిధిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం లభ్యమైన 470 గ్రాముల బంగారాన్ని ప్రభుత్వ ట్రెజరీకి తరలించారు. పురావస్తు శాఖ నిపుణులు ఈ ఆభరణాల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి: కేరళలో అమిత్‌ షా.. ‘స్వామి కార్యం.. స్వకార్యం’

  • తిరువనంతపురం: కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అటు అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించడంతో పాటు పార్టీ (బీజేపీ) కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. నేడు (ఆదివారం) పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించిన అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి కేరళ చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్ల్రాలు ధరించిన అమిత్ షాకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి జరిగే ‘లక్షదీపం’ ఉత్సవానికి ఆలయం సిద్ధమవుతున్న తరుణంలో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14న ఆలయంలో లక్ష దీపాలను వెలిగించే మహోత్సవం జరగనుంది.

    ఆలయ దర్శనం అనంతరం అమిత్ షా రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా గడపనున్నారు. ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ప్రతినిధులతో ఆయన సమావేశమై, వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఒక ప్రత్యేక సదస్సులో పాల్గొన్న అనంతరం, సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    కేరళ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అమిత్ షా ‘మిషన్ 2026’ను ఈ పర్యటన ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2025లో ఆయన ప్రారంభించిన ‘మిషన్ 2025’ వ్యూహం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే  ఉత్సాహంతో 2026 శాసనసభ ఎన్నికల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో అమిత్ షా జరిపే చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. కేరళలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది.

    ఇది కూడా చదవండి: ‘మకర జ్యోతి’కి సర్వం సిద్ధం.. భక్తుల నియంత్రణ ఇలా..

World

  • నిర్మాణపరంగా అది ఒక భవంతి మాత్రమే! అయితే, దాని పరిమాణం ఒక ఊరంత ఉంటుంది. ఈ భవంతి పొడవు దాదాపుగా మూడు కిలోమీటర్లు. కచ్చితంగా చెప్పాలంటే, 2.75 కిలోమీటర్లు. ఇందులో ఒక చివరి నుంచి మరో చివరకు నడవాలంటే, కనీసం అరగంట పడుతుంది. ప్రపంచంలోనే అతి పొడవాటి నివాస భవనంగా పేరు పొందిన ఈ భవంతిలో దాదాపు పదివేల మంది నివాసం ఉంటారు. ఈ అరుదైన భవంతి ఉక్రెయిన్‌లోని లత్‌స్క్‌ నగరంలో ఉంది. 

    ఉక్రెయిన్‌ ఇదివరకు సోవియట్‌ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న కాలంలో ఆర్‌.జి.మెతెల్‌నిత్‌స్కీ, వి.కె.మలోవిత్సా అనే ఆర్కిటెక్ట్‌లు ఈ సుదీర్ఘ భవంతి నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతి పొడవాటి చైనాగోడ స్ఫూర్తితో ఈ ఆర్కిటెక్ట్‌లు ఈ భవంతిని 1969లో నిర్మించారు. ఇందులో మూడువేల అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ భవంతి లోపలికి అడుగు పెడితే, ఒక చిన్న పట్టణంలోకి అడుగుపెట్టినట్లుగానే ఉంటుంది. ఇప్పటికీ దీనికి పోటీవచ్చే మరో కట్టడమేదీ ప్రపంచంలో లేకపోవడం విశేషం. 

Crime

  • బెంగళూరు: గతేడాది సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్‌ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.  

    కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్‌ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్‌ షీట్‌ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్‌ మహేందర్‌రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.

    ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.

    ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు,సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్‌ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్‌ షీట్‌ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్‌ షీట్‌లో 77మంది స్టేట్మెంట్‌, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్‌ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.

    వైద్యురాలు హత్యకేసులో భర్తే ప్రధాన నిందితుడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్‌ ఆధారంగా కేసును విచారించాం. విచారణలో భర్తే హంతకుడని తేలింది. అందుకు ఊతం ఇచ్చేలా ఐదు రకాల ఆధారాల్ని సైతం సేకరించాం. వాటిల్లో నిందితుడు పోలీసులకు ఇచ్చిన  ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’ స్టేట్మెంట్‌ కీలకంగా వ్యవహరించినట్లు చెప్పారు. 

    నిందితుడు కృతికాతో ఆమె మరణానికి ముందు కొన్ని గంటలపాటు ఆమెతో ఉన్నాడని సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి. వైద్య ఆధారాల ప్రకారం, కృతికా శరీరంలో ప్రొపోఫోల్‌ అనే శక్తివంతమైన అనస్థీషియా మందు ఆనవాళ్లు బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమె కాళ్లలో కూడా ఈ ఆనవాళ్లు కనిపించడం, మందు బయట నుంచి ఇంజెక్షన్‌ ద్వారా ఇచ్చినట్లు స్పష్టంగా చూపుతోంది. కృతికా మరణం తర్వాత నిందితుడు పోస్ట్‌మార్టం జరగకుండా తీవ్రంగా వ్యతిరేకించాడు. తన మామగారు, కుటుంబ సభ్యులను ఒత్తిడి చేసి అడ్డుకోవాలని ప్రయత్నించాడని ప్రాసిక్యూషన్‌ ఆరోపించింది. ఒక వైద్యుడిగా ఆయనకు పోస్ట్‌మార్టం ద్వారా నిజమైన మరణ కారణం బయటపడుతుందని తెలుసు’

    అదనంగా, నిందితుడు స్వయంగా ప్రొపోఫోల్‌ మందును ఒక ఫార్మసిస్ట్‌ వద్ద కొనుగోలు చేసినట్లు ఎలక్ట్రానిక్‌ ఆధారాలు చూపుతున్నాయి. “తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా, తన బ్యాంక్‌ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపు చేశాడు. కృతికా మరణం అనంతరం, నిందితుడు ఒక మహిళా స్నేహితురాలికి పేమెంట్‌ యాప్‌ ద్వారా సందేశాలు పంపినట్లు కూడా ఆధారాలు చూపుతున్నాయి.

    ‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు” అని ప్రాసిక్యూటర్‌ వెల్లడించారు. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించారు.  

    జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ మహేంద్రరెడ్డి (32), డాక్టర్‌ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్‌ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్‌ సర్జన్‌. 

    కాగా, తన వివాహేతర సంబంధానికి డాక్టర్‌ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్‌ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు. ఆ సమయంలో కృతిక సోదరి డాక్టర్‌ నిఖిత మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరితో వివాహం కాక మునుపు నుంచే మరో వైద్యురాలితో మహేంద్రరెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. వివామైన అనంతరమూ ఆ సంబంధాన్ని కొనసాగించాడని తప్పుబట్టారు. వివాహమైన రెండు నెలల నుంచే సొంతంగా ఆసుపత్రి పెట్టుకునేందుకు నగదు కావాలని ఒత్తిడి చేయడం, ఆ తర్వాత చికిత్స పేరిట ఎక్కువ మోతాదులో అనస్తీషియా డోసు ఇచ్చాడని ఆక్రోశించారు. ఆపై నేరం భయటపడుతుందనే ఉద్దేశ్యం తన అక్క భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నించినట్లు మండిపడింది. 

Vikarabad

  • జీపీల్లో.. మరో ఆప్షన్‌

    పరిగి: పంచాయతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల పదవికి పోటాపోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కో ఆప్షన్‌ పదవులు కేవలం మండల, జిల్లా పరిషత్‌లలో మాత్రమే ఉండేవి. వీటిని మైనార్టీలతో పాటు ఇతరులకు కట్టబెట్టేవారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఎవరివైపు మొగ్గు చూపితే, వారికే అవకాశం దక్కేది. పంచాయతీరాజ్‌ 2018 నూతన చట్టం ప్రకారం జీపీల్లో సైతం ముగ్గురు కోఆప్షన్‌ సభ్యులను నియమించాలి. ప్రస్తుతం ఈ పదవులపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. సర్పంచ్‌లతో పాటు మండల స్థాయి నాయకులను కలుస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతేడాది డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరారు. ప్రస్తుతం వీరు తమ పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించారు. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేయని రాజకీయ నాయకుల కన్ను ఇప్పుడు కో ఆప్షన్‌ పదవిపై పడింది.

    ముగ్గురు చొప్పున..

    జిల్లాలో 594 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో జీపీలో ముగ్గురు చొప్పున కో ఆప్షన్‌ మెంబర్లను నియమించనున్నారు. దీంతో జిల్లాలోని 594 పంచాయతీల్లో మొత్తం 1,782 మంది కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు.

    సమాన హోదా..

    ● కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నికై న వారికి గ్రామ సభలు, పంచాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది.

    ● వార్డు సభ్యులతో సమానంగా హోదా, ప్రొటోకాల్‌ వర్తిస్తుంది.

    ● అన్ని అధికారిక కార్యక్రమాలకు పంచాయతీ తరఫున ఆహ్వానం అందుతుంది.

    ● సమావేశాల్లో పాల్గొని చర్చించడంతో పాటు తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు.

    ● కానీ ఏదైన తీర్మానంపై ఓటు వేసే హక్కు ఉండదు. కేవలం సలహాదారులుగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది.

    అర్హులు వీరే..

    ● గ్రామంలోని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కో ఆప్షన్‌ సభ్యులుగా పరిగణించడతారు. వీరిని తప్పకుండా ఎంపిక చేయాలి.

    ● గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగిని కో ఆప్షన్‌ మెంబర్‌గా తీసుకోవచ్చు.

    ● పంచాయతీ అభివృద్ధికి సహకరించిన వారు, స్థల దాతలను సభ్యుడిగా ఎన్నుకోవచ్చు.

    మెజార్టీకే పదవి

    ప్రస్తుతం కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందనే వాదనలున్నాయి. వారు ఎవరిని అనుకుంటే వారికే పదవులు దక్కే పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యుల భర్తీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే వీరిని ఎన్నుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. పంచాయతీల్లో ఏ పార్టీ మెజార్టీలో ఉంటే వారికే కో ఆప్షన్‌ పదవులు దక్కే చాన్స్‌ ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక చూద్దాంలే అనుకుంటే.. అప్పటికే ఇతరులకు మాటిచ్చామని చెబుతారేమోననే అనుమానంతో ఆశావహులు నేతలను సంప్రదించి, తమ మనసులో మాట చెప్పేస్తున్నారు. కో ఆప్షన్‌ పదవిని తమకు ఇవ్వాలని కోరుతున్నారు.

    కో ఆప్షన్‌ పదవులపై

    ఆశావహుల నజర్‌

    ప్రతీ పంచాయతీలో

    ముగ్గురికి అవకాశం

    ఈసారి పోటాపోటీ

    తప్పదంటున్న నేతలు

  • ఇద్దర

    పహాడీషరీఫ్‌: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముఖేష్‌ కుమార్‌ రాజ్‌బార్‌, అతని భార్య పూనమ్‌(24), కుమారుడు ఆర్యన్‌(4), కుమార్తె ఇషా(2)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం జల్‌పల్లి శ్రీరామ కాలనీకి వలస వచ్చారు. దంపతులు లక్ష్మీగూడలోని మోడీ బిల్డర్స్‌ వద్ద లేబర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పనిచేసే వద్ద పరిచయమైన రింకూ కుమార్‌తో పూనమ్‌ రాత్రి పూట ఫోన్‌ మాట్లాడుతుండడాన్ని గమనించిన భర్త 20 రోజుల క్రితం మందలించాడు. ఈ నెల 1వ తేదీన ముఖేష్‌ పనికి వెళ్లి రాత్రి వచ్చి చూడగా పూనమ్‌, పిల్లలు కనిపించలేదు. స్వస్థలానికి వెళ్లి ఉంటుందని అక్కడ వాకబు చేసినా కనిపించలేదు. ఈ విషయమై రింకూ పైనే అనుమానం ఉందంటూ ముఖేష్‌ శుక్రవారం రాత్రి పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్‌ ఠాణాలోగాని 87126 62367 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

    పిల్లలతో అదృశ్యమైన పూనమ్‌ (ఫైల్‌)

  • పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ

    కడ్తాల్‌: మండల కేంద్రానికి చెందిన శేఖర్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన జగదీశ్వర్‌చారి, హైదరాబాద్‌కు చెందిన స్పందన ఇటీవల మండల కేంద్రంలో తమ సెల్‌ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ మేరకు అదే రోజు వారు స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు , నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్‌) అప్లికేషన్‌ ఆధారంగా సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ గంగాధర్‌ బాధితులకు సెల్‌ఫోన్‌లను అందజేశారు. ఎవరైన సెల్‌ఫోన్లను పొగొట్టుకున్న, చోరికి గురైన ఫోన్‌ వివరాలను సీఈఐఆర్‌ ఫోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వార తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. సెల్‌ఫోన్ల రికవరీకి కృషి చేసిన కానిస్టేబుల్‌ రాంకోటిని సీఐ గంగాధర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు వరప్రసాద్‌, చంద్రశేఖర్‌, కానిస్టేబుల్‌ రాంకోటి ఉన్నారు.

  • ప్లంబ

    విద్యుదాఘాతంతోఇద్దరికి తీవ్ర గాయాలు

    మంచాల: విదు్‌య్‌త్‌ ప్రమాదంలో ఇద్దరు ప్లంబర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆరుట్లకు చెందిన ప్లంబర్లు సాతిరి నవీన్‌, బూర త్రీశూల్‌ బాత్‌రూం మరమ్మతులు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాంకు పక్కన ఇనుపరాడ్‌ను తొలగిస్తుండగా సమీపంలోని 33 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి షార్ట్‌సర్క్యూట్‌ అయింది. దీంతో మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే గ్రామస్తుల సహకారంతో 108 అంబులెన్స్‌లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, ఇతర అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ మెరుగైన వైద్యం నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రమాద సమయంలో మంటలు చెలరేగడంతో ట్రిప్‌ అవడంతో విద్యుత్‌సరఫరా నిలిచిపోయి పెనుప్రమాదం తప్పింది.

    వేద విద్యతో విజ్ఞానం

    మొయినాబాద్‌రూరల్‌: విద్య విజ్ఞానాన్ని పెంపొందిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వికారాబాద్‌ ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని జేబీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో శనివారం గాయత్రీ వేద ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేద పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేదం బుద్ధితో కూడిన విజ్ఞానం అని అన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న చైర్మన్‌ పురుషోత్తం లాలా, కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, కంజర్ల ప్రకాష్‌, గోపాల్‌రెడ్డి, మోర నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

    జిల్లా అస్తిత్వాన్ని రక్షించాలి

    ఇబ్రహీంపట్నం: జిల్లా అస్తిత్వాన్ని రక్షించాలని జిల్లా సేవ్‌ టీచర్స్‌ ప్రతినిధులు శనివారం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బి.రవి, అధ్యక్షుడు బి.మధుకర్‌రెడ్డి, కార్యదర్శులు టి.సురేష్‌, జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371(డీ) ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన స్థానిక హక్కులను కాలరాస్తూ జిల్లా విభజన జరపడం అన్యాయమని అన్నారు. రాష్ట్రపతి 2018లో జారీ చేసిన ఉత్తర్వులతో కల్పించిన 95 శాతం స్థానిక వాటాను పూర్తిగా విస్మరించిందన్నారు. స్థానికులను స్థానికేతరులుగా మార్చి, స్థానికేతరులను స్థానికులు మార్చే విధంగా చర్యలు జరుగుతుండటం బాధాకరమన్నారు. జీఓ 317ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికి స్థానికత ఆధారంగా ఉద్యోగాల విభజన అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్పౌజ్‌ వంటి పేర్లతో వందలాది మంది నాన్‌ లోకల్స్‌ ఉపాధ్యాయులను జిల్లాలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. స్థానికులకు ఏమాత్రం న్యాయం జరగడంలేదన్నారు. వికారాబాద్‌ జిల్లాకు వెళ్లిన స్థానిక ఉపాధ్యాయులు ఇప్పటికీ అక్కడే పనిచేస్తున్నారని.. మరోసారి జిల్లా విభజన జరిగితే స్థానిక ఉపాధ్యాయులు మరింత నష్టపోతారన్నారు. సేవ్‌ టీచర్స్‌ ప్రతినిధులు భాషయ్య పాల్గొన్నారు.

  • అనుమానాస్పద స్థితిలో యువకుడి బలవన్మరణం

    షాద్‌నగర్‌రూరల్‌: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుశీల తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని యువకుడు(28) చెట్టుకు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎస్‌ఐ సుశీల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలకుకోసం ప్రయత్నించగా ఆచూకీ తెలియరాలేదు. మృతుడి ఒంటిపై బనియన్‌, షర్టు లేకుండా నెక్కర్‌(షాట్‌) మాత్రమే ఉంది. మృతుడు స్థానిక పరిశ్రమలలో పనిచేసే ఇతర రాష్ట్రానికి చెందిన కార్మికుడిగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు ఉరేసుకున్నాడా..? ఎవరైనా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసినా, ఆచూకీ లభించినా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.

    మున్సిపల్‌ ఎన్నికల్లో

    గెలుపే లక్ష్యం

    డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

    జిల్లా ముఖ్యనేతలతో సమావేశం

  • ప్రమాదంలో ఆడపిల్లల భద్రత

    అనంతగిరి. ఆడపిల్లల భద్రత ప్రమాదంలో పడిందని, ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కృప, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత అన్నారు. సికింద్రాబాద్‌ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన సంఘటనకు నిరసనగా.. శనివారం వారు వికారాబాద్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో జరిగిన సంఘటన సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఓ విద్యార్థిని లెక్చరర్లు పీరియడ్స్‌ ప్రూఫ్‌ చూపించాలని అడగటమే కాకుండా.. ఎగతాళి చేయడం అత్యంత అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అవమానాన్ని భరించలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు యువతి.. ఇంటికి వెళ్లగానే కుప్పకూలి, మెదడులో రక్తం గడ్డకట్టి మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో విద్యా సంస్థల్లో బాలికలకు భద్రత, గౌరవం ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ విషాదకర సంఘటనపై ప్రభుత్వం స్పందించి, బాధ్యులైన లెక్చరర్లను తొలగించడంతో పాటు, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, లలిత, మాధవి, ఎంవీఎఫ్‌ సిబ్బంది శ్రీనివాస్‌, ఉమా, దేవకుమారి, ఆశలత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

    అగౌరవం భరించలేక

    కుప్పకూలి యువతి మృతి

    లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలి:

    పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత

  • పర్యా

    లక్నాపూర్‌ ప్రాజెక్టులో

    సౌకర్యాల కల్పనకు కృషి

    ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి

    సుందరీకరణ పనులకు శంశుస్థాపన

    పరిగి: పరిగి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధి లక్నాపూర్‌ ప్రాజెక్టులో రూ.6 కోట్ల 83 లక్షల నిధులతో చేపడుతున్న సుందరీకరణ, పునరుద్ధరణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటీవల పర్యాటకుల కోసం బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశామని, దీంతో సందర్శకుల తాకిడి పెరిగిందన్నారు. పరిగి.. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారనుందన్నారు. ప్రాజెక్టు వద్ద పర్యాటకుల కోసం కాటేజీల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్నామని, పరిగి– లక్నాపూర్‌ వరకు రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని పేర్కొన్నారు. జాఫర్‌పల్లి వద్ద 140 ఎకరాల్లో అర్బన్‌ పార్క్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఏ బ్లాక్‌ అధ్యక్షుడు పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.

  • గెలుపోటములు సమానంగా స్వీకరించాలి

    కడ్తాల్‌: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్‌ఐ వరప్రసాద్‌ సూచించారు. కడ్తాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న కడ్తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌–4 పోటీలు శనివారంతో ముగిసాయి. ఈ పోటీల్లో కడ్తాల్‌ ఈగల్స్‌ జట్టు విజయం సాధించగా కడ్తాల్‌ సుప్రీం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేత జట్టుకు రూ.50 వేలు, రన్నరప్‌ జట్టుకు రూ.30 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లోనూ ఉన్నతంగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌గుప్తా, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోల రాఘవేందర్‌, హనుమాన్‌ యూత్‌ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టోర్నీ నిర్వాహకులు వడ్డె రాజు, సంతోశ్‌ కుమార్‌, దేవేందర్‌గౌడ్‌, హెచ్‌ఆర్‌ మహేశ్‌, జగన్‌యాదవ్‌, గణేశ్‌గౌడ్‌, వెంకటేశ్‌, విజయ్‌గౌడ్‌, రవినాయక్‌, జహంగీర్‌బాబా, లక్ష్మయ్య, రాజేందర్‌గౌడ్‌, ముత్తి కృష్ణ, మహేశ్‌, రవీందర్‌రెడ్డి, నర్సింహ, జగత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, జావీద్‌ వార్డు సభ్యులు నాయకులు ఉన్నారు.

    కడ్తాల్‌ ఎస్‌ఐ వరప్రసాద్‌

  • మైనర్లను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు

    అబ్దుల్లాపూర్‌మెట్‌: మైనర్లను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆపరేషన్‌ స్మైల్‌ టీం అబ్దుల్లాపూర్‌మెట్‌ సభ్యులు హెచ్చరించారు. ఆపరేషన్‌ స్మైల్‌–12లో భాగంగా మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కమిషనర్‌ మెహంతి ఆదేశాల మేరకు ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీటీ ఉషారాణి సూచనలతో శనివారం అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని బాటసింగారంలోని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌లోని వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. బాలల హక్కులపై అవగాహన లేని వ్యాపారస్తులు వారిని వెంటనే తొలగించి హక్కులు కాపాడాలని ఆదేశించారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇళ్లలో పనిచేయించుకునే వారు సైతం స్వచ్ఛందంగా ఆశ్రమాలకు లేదంటే తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏహెచ్‌టీయూ సభ్యులు ఎస్‌ఐలు రాములు, ఖలీల్‌, ఏఎస్‌ఐలు వెంకట్‌స్వామి, రంగారెడ్డి డబ్ల్యూపీ రజిత, వనస్థలిపురం స్మైల్‌ టీం సభ్యులు పాల్గొన్నారు.

    ఆపరేషన్‌ స్మైల్‌ బృందం

  • పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

    అభివృద్ధి పనులు పట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం

    ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

    ఆమనగల్లు: మున్సిపల్‌ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఫుడ్‌ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ చేవారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పట్టణంలోని 13వ వార్డులో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాట కార్యక్రమానికి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలనుతెలుసుకున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ అసంపూర్తి పనులను వారు పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచిందన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు పత్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గోపి, చాంద్‌పాష, అచ్చయ్య, రమేశ్‌, బాలస్వామి, రఘు, వెంకటయ్య, సుభాశ్‌, రాజు, వెంకటేశ్‌, శివకుమార్‌, జగన్‌, సైదులుగౌడ్‌, రమేశ్‌, ప్రసాద్‌, కిరణ్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం మాదే

    అనంతగిరి: మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం మాదేనని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ పట్టణ ముఖ్యనాయకులతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల బరిలో ఉంటామని, పార్టీ నాయకులు సమష్టిగా పనిచేసి, కాషాయ జెండా ఎగురవేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజు, సదానంద్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సుచరితారెడ్డి, శ్రీదేవి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, పాండుగౌడ్‌, శ్రీకాంత్‌, నరోత్తంరెడ్డి, రాజేందర్‌రెడ్డి, నందు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.