Archive Page | Sakshi
Sakshi News home page

International

  • న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్‌ చేసింది. అమెరికా-ఇరాన్‌ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్‌-ఇరాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్‌, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.

    ఎక్స్‌లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.

    ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

    ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

    ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్‌ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది.

  • అమెరికా- ఇరాన్‌ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్దం కారణంగా సూమారుగా రూ. 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని దానికి ఎట్టిపరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. కాగా తాజాగా అమెరికా సైతం యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసింది.

    ఇప్పటివరకు సుమారు $25 బిలియన్ల (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ బడ్జెట్ చీఫ్ బుధవారం వెల్లడించారు. ఇరాన్‌పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న హైటెక్ క్షిపణులు, బాంబుల నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే $5.6 బిలియన్ల విలువైన ఆయుధాలు వాడినట్లు సమాచారం.ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అత్యంత సమగ్రమైన అంచనా ఇది.

    ఈ మేరకు రక్షణ బడ్జెట్‌పై జరిగిన కీలక సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్‌ను 40% పెంచడం వల్ల గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటు తీరుతుందని ఈ సమావేశంలో హెగ్సెత్ అన్నారు.. యుద్ధం విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల మాటలు "ఓటమిని కోరుకునేవిగా" ఉన్నాయని  విమర్శించారు. ఇదే సమయంలో చైనాతో "ఆధిపత్యం" కోసం కాకుండా, ఒక "సమతుల్య సంబంధం" కోసం అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.

    ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలు (ముఖ్యంగా నాటో) తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెగ్సెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు అమెరికాకు ఆదర్శవంతమైన మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు.కాగా ప్రస్తుతం యుద్ధంలో ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే.

  • ఇరాన్‌- అమెరికా యుద్ధంతో అసలే ప్రపంచమంతా చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు స్థావరాలే టార్గెట్‌గా ఉక్రెయిన్‌  వరుసగా డ్రోన్స్‌లతో దాడులకు తెగబడుతుంది.  దీంతో  24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్‌.. హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో క్రూడాయిల్‌ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

    వరుసగా చమురు స్థావరాలపై దాడులు 

    నిన్న( బుధవారం) తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు  గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్‌16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్‌ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.

    రష్యాకు ఈ రిఫైనరీ ఎంతో కీలకం

    కీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది  రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి .

    చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశం

    రష్యా బడ్జెట్‌లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్‌ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం  చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు ($777 మిలియన్లు) సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది .

    ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది. 

  • జపాన్‌లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్‌ ప్రభుత్వం అక్కడి  సింగిల్‌ కింగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్‌ ఆఫర్‌ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.

    జపాన్‌లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్‌లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం  2026 ఏప్రిల్ ఒకటి నుంచి  ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.

    జపాన్‌లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.

    ఇదీ చదవండి: నో క్రాష్ డైట్‌, నో షార్ట్‌కట్‌ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు

    • 20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.

    • గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

    • ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.

    • భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్‌లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.

    కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్‌లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి  వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్‌లో  10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు.  జపాన్‌ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

    జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది.  మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును  కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.

    ఇదీ చదవండి: జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
     

  • వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.

    ఆ ట్వీట్‌లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

    వైట్ హౌస్లో ట్రంప్‌ వ్యాఖ్యలు
    వైట్ హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.

    ఇరాన్ ప్రతిస్పందన
    ఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్‌రిచ్‌డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది.

     

     

     

Movies

  • దురంధర్‌ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్‌-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్‌వీర్‌ సింగ్‌, దర్శకుడు ధర్‌ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.

    అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్‌-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్‌తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్‌పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

    ఇటీవల ఆదిత్య ధర్, రణ్‌వీర్‌ సింగ్‌ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్‌వీర్‌కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్‌వీర్‌ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్‌ను ఫుల్‌ లెంగ్త్‌ స్క్రిప్ట్‌గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్‌వీర్‌తో సినిమా చేయాలని నిర్ణయించారు. 

  • బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. హౌస్‌ఫుల్ 5 చిత్రంలోని 'లాల్ పరి' పాటకు తన డ్యాన్స్‌తో మెప్పించారు. అక్షయ్ కుమార్ హోస్ట్ చేస్తోన్న వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫినాలే ఎపిసోడ్‌లో స్టెప్పులతో వేదికపై అలరించారు. అయితే ఈ వేడుకలో హై హీల్స్‌తో అక్షయ్ డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ చిన్న పరీక్ష పెట్టింది నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. హైహీల్స్ వేసుకుని ఒక నిమిషం పాటు డ్యాన్స్ చేయాలని ఛాలెంజ్ విసిరింది.  ఒకవేళ అక్షయ్‌ డ్యాన్స్ మధ్యలో ఆగిపోతే.. ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలని చిన్న పందెం కాసింది. దీంతో అక్షయ్ హై హీల్స్‌తో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.  ఈ వేడుకలో అక్షయ్‌తో పాటు ఫరా ఖాన్, భూమి పెడ్నేకర్ సైతం కాలు కదిపారు. ఒక నిమిషం డ్యాన్స్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అక్షయ్‌ను ఫరా ఖాన్ అభినందించారు.

    కాగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ఫరా ఖాన్, భూమి అతిథులుగా హాజరయ్యారు. హైహీల్స్‌లో అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేయడం హైలెట్‌గా నిలిచింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత అక్షయ్ సరదాగా మహిళలకు సెల్యూట్ చేశారు. హైహీల్స్‌లో నడవడం, డ్యాన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు తనకు అర్థమైందన్నారు.

    బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ ఇటీవలే భూత్ బంగ్లా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటి వరకు రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా అక్షయ్‌ కుమార్‌ 'వెల్కమ్ టు ది జంగిల్' అనే మూవీతో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుంది.

     

     

  • ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన మరో చిత్రం ‘ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌’ .  ‘#90s: ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ తాజాగా రిలీజ్‌ అయింది. ‘#90s’లోని ఆదిత్య పాత్ర పెరిగి పెద్దయ్యాక..ఇంట్లో వాళ్ల ఒత్తిడితో యూకేకి వెళ్లి, అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరిగిందన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. 

    మంచి రొమాటిక్‌ సీన్లతో టీజర్‌ని కట్‌ చేశారు. అయితే ఇందులో కులం, మతానికి సంబంధించిన డైలాగులు ఉండడం గమనార్హం. ముద్దు పెట్టుకునే క్రమంలో ‘మీరు ఏమిట్లు’ అని హీరోని హీరోయిన్‌ ప్రశ్నించడం.. మరోచోట హీరో తన పేరుని చెబుతూ..‘ఆదిత్య..హిందువు’ అని చెప్పడం టీజర్‌లో చూపించారు. దీంతో సినిమా మొత్తం కులం, మతం చుట్టూనే తిరుగుతుందేమో అనే సందేహాన్ని ఓ విలేకరి దర్శకుడి ముందు వెలిబుచ్చగా, ఆయన  క్లారిటీ ఇచ్చాడు.

    ఎపిక్‌ మూవీ టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ‘మీరు ఏమిట్లు..’అనే డైలాగు పెట్టారు. సినిమాలో కులం, మతం ప్రస్తావన ఉంటుందా?’అని దర్శకుడిని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి దర్శకుడు ఆదిత్య హాసన్‌ సమాధానం చెబుతూ..‘సినిమాలో కామెడీగానే ఆ డైలాగులు పెట్టాం. ఎక్కడా కుల మతాలను కించపరిచే సన్నివేశాలు ఉండవు. క్యాస్ట్‌పై వేసే జోకులు కూడా క్లీన్‌గానే ఉంటాయి. కాంట్రవర్సీ ఏం ఉండదు. ఒక కులాన్ని కానీ, మతాన్ని కానీ కించపరిచే సన్నివేశాలేవి మా సినిమాలో ఉండవు’ అని చెప్పాడు. 

  • పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదిలోనే కాదు..నార్త్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప-2 రిలీజ్‌ టైమ్‌లో బీహార్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు. పుష్ప 2 నార్త్‌లో కేవలం హిందీలోనే రూ. 812 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో బన్నీకి ఉత్తారాదిలోనూ భారీస్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది.

    ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెరకెక్కుతోన్న రాకా మూవీపై నార్త్‌ ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్‌ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం బిహార్‌లో తీవ్రమైన పోటీ ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే 'రాకా' చిత్ర నిర్మాతలను సంప్రదించారని తెలిపింది.

    ఈ మూవీ రైట్స్‌ కోసం భారీ ధర చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే బిహార్‌లో బన్నీకి ఎంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ మూవీ బీహార్‌తో పాటు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఇప్పుడు రాకా సినిమాకు సైతం  ఇలాంటి స్పందనే వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రైట్స్‌ కోసం భారీ పోటీ నెలకొంది.

    కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా టైటిల్‌తో  ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగుతో పాటు  హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. 
     

  • రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. మార్చి 19న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.  ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ చిత్రాలు ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. 

    అయితే ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్స్‌ మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో క్లైమాక్స్ సీన్స్‌ రణరంగాన్ని తలపించాయి. అయితే భారీ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ విశాల్‌ త్యాగి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సన్నివేశాల కోసం దాదాపు 500 లీటర్ల పెట్రోల్‌ వినియోగించామని పేర్కొన్నారు.

    ఫైర్‌తో కూడిన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్‌ వద్దని ఆదిత్య ధర్ తమకు ముందుగానే చెప్పాడని తెలిపారు.  ఆయన చెప్పినట్లుగానే ఆ సీన్స్‌ అన్నీ రియల్‌గా చేశామన్నారు. చివర్లో వచ్చే బ్లాస్ట్‌ను రూపొందించడం చాలా కష్టంగా చేశామని వెల్లడించారు. రణ్‌వీర్‌  భద్రత విషయంలో ఆందోళన పడ్డామని.. 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్‌ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండని అన్నారు.

    విశాల్‌ త్యాగి మాట్లాడతూ..' క్లైమాక్స్ సీన్‌కు పక్కా ప్రణాళికతో ఉన్నాం.  రణ్‌వీర్‌కు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. మొదట 250 లీటర్ల ఇంధనమే వాడాలని ప్రొడక్షన్‌ టీమ్‌ చెప్పింది. కానీ  500 లీటర్లు ఉంటేనే అవుట్‌పుట్‌ బాగా వస్తుందని చెప్పాం.  దీంతోపాటు 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్‌ పూర్తయ్యాక.. అద్భుతమంటూ నన్ను, టీమ్‌ని రణ్‌వీర్‌ అభినందించారు' అని అన్నారు. 
     

  • బేబీ మూవీ జోడీ మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతోన్న మూవీ ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్. ఈ సినిమాకు 90s ఏ మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాలేజీ డేస్, కెరీర్‌ నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది. ఈ చిత్రంలో శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నారు. 
     

  • సస్పెన్స్ థ్రిల్లర్లలో  డైరెక్టర్ జీతూ జోసెఫ్, మోహల్‌ లాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన  ‘దృశ్యం’ చాలా ప్రత్యేకమైనది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. మలయాళం ఒరిజినల్ గా ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ, భాషలకతీతంగా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో కూడా రీమేక్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో భాగం రాబోతుంది. మే 21 ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. 

    ఒక నిమిషం 50 సెకన్ల నిడివి గల ఈ టీజర్, మోహన్‌లాల్ వాయిస్‌ఓవర్‌తో పాటు 2013 నుండి 2021 వరకు వచ్చిన పాత భాగాలలోని సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌లో మోహన్‌లాల్ పోషించిన జార్జ్‌కుట్టి పాత్ర ఒక చర్చిలో కూర్చుని దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లు కూడా చూపించారు. అతను భయపడినట్లుగా, ఆత్మవిశ్వాసం లేనట్లుగా కనిపిస్తాడు.

     ‘నేను ఒక సాధారణ మనిషిని. నా ప్రపంచం చాలా చిన్నది, నా భార్య, నా పిల్లలు మాత్రమే. ఒక అవాంఛిత అతిథి మా ఏకాంతంలోకి చొరబడ్డాడు. నా కుటుంబాన్ని నాశనం చేయగల శక్తి ఉన్న అతిథి అతను. ఆ అతిథి మళ్లీ మా జీవితాలను నాశనం చేయడానికి తిరిగి రాకుండా ఉండేలా, మేము అతన్ని పంపించేశాం’ అంటూ మోహన్‌ లాల్‌ చెప్పే సంభాషణలతో ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్‌ సాగింది. 
     

  • మిల్కీ బ్యూటీ తమన్నాకు ఐటమ్‌ సాంగ్స్‌ కొత్తేమి కాదు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రత్యేక పాటలలో మెరిసింది. ఇప్పుడు కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరో పక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది.‘స్త్రీ-2’ చిత్రంలో తమన్నా చేసిన ‘ఆజ్‌ కి రాత్‌’ ప్రత్యేక గీతం ఇప్పటికీ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఐటమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అది కూడా మాములు ఐటం సాంగ్‌ కాదు బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టిస్తున్న చోలీ కేఛే క్యా హై’ రీమేక్‌ సాంగ్‌కి తమన్నా స్టెప్పులేయబోతుంది.

    సంజయ్‌ దత్‌  కల్ట్ క్లాసిక్‌ ఖల్ నాయక్ సీక్వెల్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఖల్‌ నాయక్‌ రిటర్న్స్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. ‘ఖల్‌ నాయక్‌’లోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాట అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మాధురీ దీక్షిత్‌ వేసిన స్టెప్పులకు యువత ఫిదా అయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలోని స్టెప్పులు ఎంత వైరల్‌ అయ్యాయో.. లిరిక్స్‌ కూడా అంతే వివాదానికి దారి తీశాయి. డబుల్ మీనింగ్ లతో కూడిన లిరిక్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అయినప్పటికీ ఈ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పటికీ పలు పార్టీలలో ఈ పాట వినపడుతూనే ఉంటుంది.

    అలాంటి సూపర్‌ హిట్‌ ఐటం సాంగ్‌ని ‘ఖల్‌ నాయక్‌ రిటర్న్స్‌’ కోసం రీమేక్‌ చేయబోతున్నారట. ఆ పాటకు తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్ రీమిక్స్ పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫైనల్ కాస్టింగ్ ఇంకా లాక్ కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, తమన్నా పేరు బలంగా వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 

  • టాలీవుడ్ నటి సురేఖవాణి బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఆమె కూతురు సుప్రీత మదర్ బర్త్‌ డే వేడుకలు నిర్వహించింది. 'హ్యాపీ బర్త్ డే మమ్మీ.. నాకు అన్నీ నువ్వే.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా'.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సురేఖవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

    కాగా.. టాలీవుడ్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంటోంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఎక్కడికెళ్లినా ఫోటోలను షేర్ చేస్తోంది.
     

     

  • ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్‌ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. ‍అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్‌ హల్‌చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ ‌కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.

    కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట.  అలా మెగాస్టార్ ఈ బ్లాక్‌బస్టర్‌ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.  ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్‌లో తెలుగులోనూ విడుదల చేశారు.
     

  • టాలీవుడ్‌లో ఇప్పుడో చిత్రమైన ట్రెండ్ కనిపిస్తోంది. స్టార్ హీరోల్లో చాలామంది ఒక్క సినిమా కోసం ఏకంగా ఏళ్లకు ఏళ్లు పనిచేస్తారు. పోనీ ఆ మూవీ సరిగా ఉంటుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకప్పుడు ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేసిన హీరోలు కూడా ఫెర్ఫెక్షన్ పేరిట టైమ్ అంతా వృథా చేస్తున్నారు. అదే టైంలో తెలుగు హీరోల్లానే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మాత్రం ఒంటి చేత్తో మూడు బాధ్యతల్ని అద్భుతంగా పూర్తి చేస్తున్నాడు. ధనుష్ వల్ల అవుతున్న ఆ పని.. మిగతా హీరోల వల్ల ఎందుకు కావట్లేదు?

    (ఇదీ చదవండి: స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్‌మెయిల్: తమిళ సింగర్)

    చాలామందికి ధనుష్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ ఇతడిలో ఓ డైరెక్టర్, నిర్మాత కూడా ఉన్నాడు. గడిచిన 15 నెలలు తీసుకుంటే.. గతేడాది ప్రారంభంలో తన మేనల్లుడు పవిష్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తీశాడు. దీనికి దర్శకుడు నిర్మాత ధనుషే. ఇది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆకట్టుకుంది. ఇక వేసవిలో 'కుబేర'తో వచ్చాడు. బిచ్చగాడి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టేశాడు. దసరా వచ్చేసరికి 'ఇడ్లీ కొట్టు' మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించాడు. ఈ చిత్రం కోసం హీరో, డైరెక్టర్, నిర్మాతగా మూడు బాధ్యతల్ని నిర్వర్తించాడు. తెలుగులో ఇది ఫెయిలైనప్పటికీ తమిళంలో సూపర్ హిట్ అయింది.

    గతేడాద చివరలో 'తేరే ఇష్క్ మై' అనే హిందీ సినిమాలో హీరోగా నటించాడు. రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగు నెలలు తిరిగేసరికల్లా 'కర' మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయాడు. దీని ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.

    అయితే ఏడాదిన్నర కాలంలో ధనుష్.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఐదు సినిమాలు చేశాడు. మరి ఇతడి వల్ల అవుతున్న పని మిగతా హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఫెర్ఫెక్షన్ పేరు చెప్పి ఆలస్యం చేయడమనేది ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్‌గా సినిమాలు చేస్తేనే సినిమా మీద ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అలానే రెగ్యులర్ టచ్‌లో ఉంటే ఆడియెన్స్ కూడా సదరు హీరోల చిత్రాల్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరి ఈ విషయాన్ని తెలుగు, తమిళ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?

    (ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర)

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు.  సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘3 ఇడియట్స్‌’కు సీక్వెల్‌ రాబోతున్నట్లు ప్రకటించాడు. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా, ఆర్‌. మాధవన్, శర్మాన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘3 ఇడియట్స్‌’. రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. తాజాగా ‘3 ఇడియట్స్‌’ సినిమా సీక్వెల్‌ పనులు మొదలయ్యాయని ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. 

    ఈ సీక్వెల్‌ గురించి ఓ ఆంగ్ల మీడియాతో ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘3 ఇడియట్స్‌’కి సీక్వెల్‌ చేయనున్నాం...  కథ విన్నాను. నాకు నచ్చింది. మొదటి భాగంలో ఉన్న ప్రధాన పాత్రధారుల జీవితాల్లో పదేళ్లు గడిచిన తర్వాత ఏం జరుగుతుంది? అనే అంశంతో సీక్వెల్‌ కథ ఉంటుంది. అలాగే తొలి భాగంలోని కామెడీ కంటిన్యూ అవుతుంది. దర్శకుడు రాజ్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతూ, స్క్రీన్‌ప్లేను సెట్‌ చేసే పనిలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

  • ఇటీవల హీరోయిన్ నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలను కనాలంటే పెళ్లి అవసరం లేదని అన్నారు. అది మన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోకుండానే హ్యాపీగా ఉన్నానని తెలిపింది. తాజాగా నిత్యామీనన్ బాటలో స్టార్ నటుడి కుమార్తె నిలిచింది. ఇప్పటికే నిత్యామీనన్‌ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో.. తాజాగా నటుడు సత్యరాజ్‌ కూతురు దివ్య చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

    వివాహ వ్యవస్థ పట్ల తనకు గౌరవం ఉందని దివ్య తెలిపింది. వ్యక్తిగతంగా తాను పెళ్లి బంధాన్ని విశ్వసించనని పేర్కొంది.  కేవలం మంగళసూత్రం కట్టడం వల్లనో లేదంటే ఉంగరాలు మార్చుకోవడం వల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం బలపడుతుందని నేను భావించడం లేదని వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారం, ప్రేమతో కలిసి జీవించవచ్చని దివ్య స్పష్టం చేసింది.  కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర, ధృవీకరణ పత్రం అవసరం లేదంటూ దివ్య సత్యరాజ్ కుండ బద్దలు కొట్టింది. 

  • మహిళా గాయని స్వాగత కృష్ణన్.. తమిళ ప్రముఖ సంగీత దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్‌ని 'ఎప్‌స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: ‘స్పిరిట్‌’ సినిమా కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం)

    'ఏడేళ్ల క్రితం చెన్నై వదిలిపెట్టి రిషికేష్ వెళ్లిపోవడం వెనక కారణం ఇప్పుడు బయటపెడుతున్నా. బ్రేకప్ అయిపోయి డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నా జీవితంలోకి ఆ సంగీత దర్శకుడు వచ్చాడు. నా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. మాయమాటలు చెప్పి తనపై నమ్మకం పెరిగేలా చేసి, గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు అసలు రంగు బయటపెట్టాడు. కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ లాంటివి చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. మళ్లీ అప్పుల్లో ఉన్నానని  చెప్పి నా దగ్గరే చాలా డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వలేదు'

    'ఆయన స్టూడియో సౌండ్‌ప్రూఫ్‌గా ఉండేది. ఆ గది తలుపులు లాక్ చేసి బలవంతంగా నాపై లైంగిక దాడి చేశాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఇదంతా రికార్డ్ చేసి తర్వాత నన్ను బెదిరించాడు. ఈ ఘటన తర్వాత తిరిగి నాపైనే అబద్దాలు చెప్పడం, దొంగతనం లాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. చికిత్స కూడా తీసుకున్నా. అందుకే చెన్నై వదిలేసి రిషికేష్ వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటున్నా'

    'ఈ మధ్యే మరో యువతి తనకు ఇలానే జరిగిందని నాతో చెప్పడంతోనే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. నేనే కాదు చాలామంది అమ్మాయిలు అతడి బాధితులే. భయం, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్తా. అయితే ఇది ఆయనపై ప్రతీకారం కాదు. ఇకపై నాలాగా మరెవరూ మానసిక వేదన అనుభవించకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నాను' అని సింగర్ స్వాగత కృష్ణన్ చెప్పుకొచ్చింది.

    'యెనో పెన్నే', 'కాదల్ కన్మణి' లాంటి పాటలు పాడిన ఈమె.. సదరు సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈమె సోదరి మాయ కృష్ణన్.. విక్రమ్, లియో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది.

    (ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర)

  • టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి  శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.

    ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్‌లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు.

    తిరుపతిలో వివాహం నా ‍అదృష్టం.
  • ‘‘ఈ వేదికపైకి రావడానికి చాలా కష్టపడ్డాం. మాకున్న గొర్రెలన్నిటినీ అమ్ముకొని మా కుమారుడు రవీంద్రనాథ్‌ దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమా తీశాం. అందరూ మమ్మల్ని ఎగతాళి చేసినా పట్టించుకోలేదు. అయితే మా కష్టం చూసిన వారు మాత్రం సపోర్ట్‌ చేశారు. ‘స్పిరిట్‌’ మా ఒక్కరిది కాదు... మనందరి సినిమా. చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం’’ అని నిర్మాతలు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు తెలిపారు. 

    రవిబాబు, సత్య ప్రకాశ్, ‘చిత్రం’ శీను, గడ్డం నవీన్, జూనియర్‌ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలీ ముఖ్య తారలుగా సీహెచ్‌ రవీంద్రనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పిరిట్‌’. రైతులు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు నిర్మించిన ఈ సినిమా మే 8న విడుదల కానుంది. ఎస్‌ఎస్‌ వెంకటేశ్, సంతోష్‌ కావాలా సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ వేడుకలో దర్శకుడు వి. సముద్ర, కె. మోహన్, నిర్మాతలు అశోక్‌ కుమార్, ముత్యాల రాందాస్‌ ముఖ్య అతిథులుగా హాజరై, ‘స్పిరిట్‌’ హిట్‌ అవ్వాలని ఆకాంక్షించారు.

     సీహెచ్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ– ‘‘అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే.. నాకు మాత్రం జన్మతో పాటు సినీ జీవితాన్ని కూడా ఇచ్చారు నా తల్లిదండ్రులు. ‘స్పిరిట్‌’ చాలా బాగా వచ్చింది. అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌కమల్‌ పి. భరత్‌.   

  • తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం. దర్శకుడు రఘురామ్ చనిపోయారు. మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సహచరులు, పలువురు ఈయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

    రచయిత, జర్నలిస్టు అయిన రఘురామ్.. ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంస్థల్లో ‍స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లాంటివి చేసినప్పటికీ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. మొదట్లో సానా యాదిరెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్‌గా పనిచేశారు. 2004లో వచ్చిన 'వరం' మూవీతో దర్శకుడిగా మారారు. ఇది పెద్దగా మెప్పించలేకపోయింది.

    గత కొన్నాళ్లుగా రైటర్, ఘోస్ట్ రైటర్‌గా పలు సినిమాలు చేస్తున్న ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈయన స్వస్థలం జగిత్యాల కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని మధురా నగర్‌లో ఉంటున్నారు. భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరిగిన 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

    రికెల్టన్‌ రికార్డు సెంచరీ
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

    సన్‌రైజర్స్‌ బ్యాటర్ల ఊచకోత
    244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్‌ శర్మ (45), ట్రవిస్‌ హెడ్‌ (76), హెన్రిచ్‌ క్లాసెన్‌ (65 నాటౌట్‌) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్‌ అరోరా (30 నాటౌట్‌) సైతం​ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు. 
     

  • ర్యాన్‌ రికెల్టన్‌.. ఈ పేరు ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ అభిమానుల నోట మారుమోగుతోంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

    ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రికెల్టన్‌ కేవలం 44 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్‌ జయసూర్య ఖాతాలో ఉండింది. జయసూర్య ఐపీఎల్‌ అరంభ ఎడిషన్‌లో (2008) ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ సీఎస్‌కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్‌ నేటి మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.

    ఐపీఎల్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు
    44 బంతులు – ర్యాన్ రికెల్టన్
    45 బంతులు – సనత్ జయసూర్య
    45 బంతులు – తిలక్ వర్మ
    47 బంతులు – కెమరూన్‌ గ్రీన్‌

    ఈ సెంచరీతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్‌లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ దిగ్గజం రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. 

    రికెల్టన్‌ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌) తరఫున మొత్తం 3 సెంచరీలు చేయగా.. రోహిత్‌ 2 సెంచరీలు (రెండూ ముంబై ఇండియన్స్‌ తరఫునే) చేశాడు. 2025 ఐపీఎల్‌ సందర్భంగా ఎంఐ ఫ్యామిలీలో చేరిన రికెల్టన్‌ కేవలం రెండేళ్ల వ్యవధిలో రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం.

    ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యధిక సెంచరీలు
    3 – ర్యాన్ రికెల్టన్ (ఐపీఎల్‌, SA20)
    2 – రోహిత్‌ శర్మ (ఐపీఎల్‌)
    2 – సూర్యకుమార్‌ యాదవ్‌ (ఐపీఎల్‌)
    2 – టామ్‌ బాంటన్‌

    రికెల్టన్‌ను ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే సొంతం చేసుకుంది. ఇతగాడు ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.

    ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్‌ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రికెల్టన్‌ మరో రికార్డు  కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

    ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక స్కోర్‌
    123 (నాటౌట్‌)- ర్యాన్‌ రికెల్టన్‌‌
    114 (నాటౌట్‌)- సనత్‌ జయసూర్య
    112 (నాటౌట్‌)- క్వింటన్‌ డికాక్‌
    109 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ
    105 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ
    103 (నాటౌట్‌)- సూర్యకుమార్‌ యాదవ్‌

    కాగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన డికాక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రికెల్టన్‌ రికార్డు శతకం బాది ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే, రికెల్టన్‌ సెంచరీకి ముందు డికాక్ కూడా ఓ అద్భుత శతకం బాదాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్‌కు అర్దం కావట్లేదు.

    భారీ స్కోర్‌
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.

    జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.

    ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.

    ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతర​ం ఆ జట్టు స్కోర్‌ 181-3గా ఉంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. 

    అతనికి జతగా హార్దిక్‌ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో వికెట్‌ తీశారు. 

  • ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

    టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

    ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.

    ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్‌ స్థానంలో రికెల్టన్‌, సాంట్నర్‌ స్థానంలో రాబిన్‌ మింజ్‌ బరిలోకి దిగారు. ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ స్థానంలో హర్ష్‌ దూబే తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్నపేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. ఈ సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. మంగ‌ళ‌వారం సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాల‌తో ఎదురులేకుండా సాగుతున్న పంజాబ్ కింగ్స్‌కు చెక్‌పెట్టిన రాజ‌స్తాన్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

    కాగా జైస్వాల్‌, వైభ‌వ్ మ‌రోసారి మెరుపు ఆరంభం ఇచ్చారు. చివ‌ర్లో ఫెరీరా, శుభ‌మ్ దూబే ఫినిషింగ్ ట‌చ్‌తో రాజ‌స్తాన్‌ను గెలిపించారు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఫీల్డింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో షూ వేసుకోకుండానే మైదానంలోకి వ‌చ్చాడు. 

    అయితే పొర‌పాటును గ్ర‌హించిన వైభ‌వ్ వెంట‌నే త‌న షూ పంపించాలంటూ డ్రెసింగ్ రూమ్‌కు సైగ‌లు చేయ‌డం క‌నిపించింది. ప‌క్క‌నే ఉన్న‌ రోమి భింద‌ర్ కూడా వైభ‌వ్‌కు స‌హాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడి 6 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.

    చదవండి: లంక క్రికెట్‌లో సంక్షోభం.. బోర్డు మూకుమ్మడి రాజీనామా!

  • ముంబైని చిత్తు చేసిన సన్‌రైజర్స్‌
    244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్‌ శర్మ (45), ట్రవిస్‌ హెడ్‌ (76), హెన్రిచ్‌ క్లాసెన్‌ (65 నాటౌట్‌) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్‌ అరోరా (30 నాటౌట్‌) సైతం​ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు.

    అంతకుముందు రికెల్టన్‌ (123 నాటౌట్‌) శతక్కొట్టుడుతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

    4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌
    9.4వ ఓవర్‌- 4 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌ వరుస బంతుల్లో ఔట్‌ కాగా.. ఆతర్వాత హెడ్‌ (76) హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

    వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌
    తొమ్మిదో ఓవర్‌ 4, 5 బంతులకు సన్‌రైజర్స్‌ అభిషేక్‌ (45), ఇషాన్‌ కిషన్‌ (0) వికెట్లు కోల్పోయింది. 

    అభిషేక్‌ శర్మ (45) ఔట్‌
    8.4వ ఓవర్‌- 129 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఘజన్‌ఫర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్‌ శర్మ (45) ఔటయ్యాడు.

    సన్‌రైజర్స్‌ ఓపెనర్ల ఊచకోత
    244 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రవిస్‌ హెడ్‌ (48), అభిషేక్‌ శర్మ (36) చెలరేగిపోతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 92-0గా ఉంది. 

    ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌
    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు. 

    నమన్‌ ధిర్‌ ఔట్‌
    13.4వ ఓవర్‌- 165 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హింగే బౌలింగ్‌లో హర్ష్‌ దూబేకు క్యాచ్‌ ఇచ్చి నమన్‌ ధిర్‌ (22) ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ డౌన్‌
    8.3వ ఓవర్‌- 110 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. ఎషాన్‌ మలింగ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (5) ఔటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై
    7.1వ ఓవర్‌- 93 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ కోల్పోయింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి విల్‌ జాక్స్‌ (46) ఔటయ్యాడు.

    దుమ్మురేపుతున్న ముంబై ఓపెనర్లు
    ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది. 

    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఈ ఎడిషన్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఈ జట్టు మధ్యమధ్యలో తడబడినా, ఓ మోస్తరు ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది.

    తుది జట్లు..
    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

    ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

  • న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరగాల్సిన రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఆధిక్యం 1-0తో కొనసాగుతోంది. ఏప్రిల్‌ 27న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో టీ20 ఢాకా వేదికగా మే 2న జరుగనుంది.

    కాగా, 3 మ్యాచ్‌ల వన్డే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

    న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌
    చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌కు ఊహించని షాకిచ్చింది. ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ న్యూజిలాండ్‌ను 182 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేటీన్‌ క్లార్క్‌ (51), డేన్‌ క్లీవర్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్‌ క్లార్క్‌సన్‌ (27 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ 2, షోరిఫుల్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తౌహద్‌ హృదోయ్‌ (51 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్‌ హొసేన్‌ (28), షమీమ్‌ హొసేన్‌ (31 నాటౌట్‌) సహకరించారు. 

    మిగతా ఆటగాళ్లలో సైఫ్‌ హసన్‌ 17, తంజిద్‌ హసన్‌ 20, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఐష్‌ సోధి 2, జోష్‌ క్లార్క్‌సన్‌, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ తీశారు. 

  • శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు సంక్షోభంలో కూరుకుపోయింది. లంక క్రికెట్ అధ్యక్షుడు షమీ సిల్వా సహా బోర్డు సభ్యులంతా తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వీరు తమ రాజీనామా లేఖలను శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే, క్రీడల శాఖ మంత్రి సునీల్ కుమార గమాగేలకు పంపినట్లు తెలుస్తోంది. 

    అయితే జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో షమీ సిల్వాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు కనీసం సూపర్-8 దశకు కూడా చేరుకోలేకపోయింది. ఈ పేలవ ప్రదర్శనే అనూహ్య రాజీనామాలకు కారణమని తెలుస్తోంది.

    65 ఏళ్ల షమీ సిల్వా 2019 నుంచి శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2021, 2023, 2025 సంవత్సరాల్లో ఆయన ఏకగ్రీ వమయ్యారు. 2025లో జై షా తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ సిల్వా బాధ్యతలు చేపట్టారు. అయితే షమీ సిల్వా హయాంలో శ్రీలంక క్రికెట్ బోర్డు వివాదాల్లో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు. 

    2023 వన్డే ప్రపంచకప్‌లో జట్టు దారుణంగా విఫలం కావడంతో అప్పటి క్రీడల మంత్రి బోర్డును రద్దు చేశారు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలకు విరుద్ధం కావడంతో, శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. దీని ఫలితంగా శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు.

    ఇక శ్రీలంక 1973 క్రీడా చట్టం ప్రకారం క్రీడా సమాఖ్యలను రద్దు చేసే అధికారం మంత్రికి ఉన్నప్పటికీ, ఎన్నికైన సంస్థలలో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ అంగీకరించదు. ప్రస్తుత పరిణామాలపై ఐసీసీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

  • ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో జరిగిన ఓ టీ20 లీగ్‌లో అనుమతి లేకుండా పాల్గొన్న ముగ్గురు స్వదేశీ క్రికెటర్లపై నాలుగు నెలల నిషేధం విధించింది. నిషేధానికి గురైన వారి పేర్లు సమీవుల్లా షిన్వారి, అఫ్తాబ్‌ ఆలం, మొహమ్మద్‌ షెహజాద్‌. వీరు భారత్‌లో ఇటీవల జరిగిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో సొంత దేశ క్రికెట్‌ బోర్డు అనుమతి లేకుండా ఆడారు.

    వీరు బోర్డు నుంచి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండింది. అయితే వీరు అలా చేయలేదు. దీంతో బోర్డు ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంది.

    ఈ నాలుగు నెలల కాలంలో షిన్వారి, ఆఫ్తాబ్‌, షెహజాద్‌ దేశీయ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఎక్కడా క్రికెట్‌ ఆడలేరు. నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ శిక్ష విధించినట్లు ఆఫ్ఘన్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

    లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌కు ఐసీసీ లేదా బీసీసీఐ అధికారిక గుర్తింపు లేదని, అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉందని ఆఫ్ఘన్‌ బోర్డు అభిప్రాయపడింది.

    ఈ లీగ్‌లో మరో ఆఫ్ఘన్‌ ఆటగాడు, ఆ దేశ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌ కూడా పాల్గొన్నప్పటికీ, అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకే అతనిపై చర్యలు తీసుకోలేదని బోర్డు వివరణ ఇచ్చింది.

    కాగా, ACB ఇటీవలే తమ కాంట్రాక్ట్ ఆటగాళ్లకు ఏడాదిలో గరిష్టంగా మూడు విదేశీ లీగ్‌లలో మాత్రమే పాల్గొనేలా పరిమితులు విధించింది. రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ వంటి స్టార్ ఆటగాళ్లపై కూడా ఈ నిబంధన ప్రభావం చూపింది.

     

  • టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌కు ఐపీఎల్‌లో ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. గతేడాది వరకు అతడు ముంబై ఇండియన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు తరఫున అర్జున్‌ కేవలం ఐదు మ్యాచ్‌లు ఆడి 13 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు.

    ఇక్కడా బెంచ్‌కే పరిమితం
    అయితే, 2026 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar)ను లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసింది. కానీ.. ముంబై ఇండియన్స్‌ మాదిరే ఇక్కడ కూడా ఈ ఆల్‌రౌండర్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఈ సీజన్‌లో లక్నో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా.. అర్జున్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు.

    అర్జున్‌ టెండుల్కర్‌ కీలక నిర్ణయం
    ఇక ఇప్పటికి ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా ఆరు ఓడి లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో అర్జున్‌ టెండుల్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లక్నో జట్టులో ఆడే పరిస్థితి లేని తరుణంలో టీ20 ముంబై లీగ్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నట్లు జర్నలిస్టు గౌరవ్‌ గుప్తా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  

    రూ. 5 లక్షల కనీస ధరతో
    కాగా మే 2న ముంబైలో టీ20 ముంబై లీగ్‌ వేలం జరుగనుంది. ఇందులో రూ. 5 లక్షల కనీస ధరతో అర్జున్‌ టెండుల్కర్‌ తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర గల కేటగిరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ ఆల్‌రౌండర్‌ దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    బీసీసీఐ అనుమతితోనే..
    అయినప్పటికీ ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) అర్జున్‌కు ఈ టీ20 లీగ్‌ వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. నిబంధనల ప్రకారం.. సంవత్సర కాలం పాటు కూలింగ్‌ పీరియడ్‌ పూర్తైన తర్వాత స్థానిక ఆటగాళ్లు ఈ లీగ్‌లో తిరిగి పాల్గొనవచ్చని తెలిపింది.

    ఈ విషయం గురించి ఎంసీఏ కార్యదర్శి ఉన్మేష్‌ ఖన్వీకర్‌ స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు (అర్జున్‌).. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అసోసియేషన్‌ తరఫున టీ20 లీగ్‌లో ఆడటం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు వేరే లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. అలా అర్జున్‌ టెండుల్కర్‌, సిద్ధాంత్‌ అద్ధాత్‌రావు టీ20 ముంబై లీగ్‌ సీజన్‌-4లో ఆడేందుకు అనుమతి లభించింది’’ అని పేర్కొన్నాడు. 

    చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. 15 ఏళ్ల వ‌య‌సులోనే అద్భ‌త బ్యాటింగ్‌తో అద‌ర‌గొడుతున్న వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 400 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. 

    అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్‌పై అనుమాన‌ముంద‌ని, ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఉండొచ్చ‌ని, వెంట‌నే డోపింగ్ టెస్టుకు పంపించాలంటూ పాక్ క్రికెట్ అనలిస్ట్ నౌమ‌న్ నియాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాక్ క్రికెట్ అన‌లిస్ట్‌కు వైభ‌వ్ త‌న స్టైల్లో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ‘దేవుడే నా బ్యాట్‌కు ఆ ఏఐ చిప్‌ను జోడించాడు. ఆ భగవంతుడే నా బ్యాట్‌కు దానిని జత చేసినట్లు నాకు స్వయంగా చెప్పాడు. అందుకే నేను ఆ బ్యాట్‌ను ఉపయోగించి పరుగులు సాధిస్తున్నా’ అని నవ్వుతూ పేర్కొన్నాడు.

    అసలేం జరిగింది?
    ఐపీఎల్ 2026 సీజన్‌లో అగ్ర‌శ్రేణి బౌల‌ర్లంద‌రినీ ఉతికారేస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అత‌డి మెద‌డులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అన‌లిస్ట్ నౌమ‌న్ నియాజ్ సరదాగా పేర్కొన్నారు. వైభవ్‌కు డోపింగ్‌ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు.  ‘వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒక‌సారి వైభ‌వ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. 

    అత‌డి బుర్ర‌లో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసారా అన్న‌ది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి ప‌రీక్షించాల్సిందే. వైభ‌వ్ నాకు మ‌నిషిలా అనిపించ‌డం లేదు. అయితే అత‌డి మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభ‌వ్ సూర్య‌వంశీ ఒక అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అత‌డి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. 

    ఇక ఒక టీనేజీ కుర్రాడు కండ‌లు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్య‌వంశీ 18 ఏండ్లు నిండ‌కుండానే అత‌డి దేహ‌దారుఢ్యం బ‌లంగా క‌నిపిస్తోంది. రాబోయే సంవ‌త్స‌రాల్లో వైభ‌వ్ ఆట‌లో మ‌రింత రాటు దేల‌డం ఖాయం.’ అని చెప్పుకొచ్చారు.

    ఐపీఎల్ 19వ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. అయితే ఈ మార్క్‌ను అందుకునేందుకు వైభవ్‌కు అవసరమైన బంతులు కేవలం 167 మాత్రమే. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా అతి తక్కువ బంతుల్లో 400 పరుగుల మార్క్ చేరుకున్న వేగవంతమైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు సాధించాడు. 

    ఇప్పటిదాకా ఈ రికార్డు  ఆండ్రీ రసెల్ పేరిట ఉంది. 2019 సీజన్‌లో రసెల్ 188 బంతుల్లో 400 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 2024 సీజన్‌లో అభిషేక్ శర్మ (195 బంతులు),  2025 సీజన్‌లో నికోలస్ పూరన్ (197 బంతులు), 2014 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ (200 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    చదవండి: ‘వైభ‌వ్‌పై అనుమానముంది.. డోపింగ్‌ టెస్ట్ చేయాల్సిందే!’

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్‌ క్రికెటర్‌ ఇప్పుడు అతని దేశ క్రికెట్‌ బోర్డు (ECB) చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన 37 ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. 

    ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్‌ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్‌కు కోహ్లీ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఫిన్‌ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్‌ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.

    అయితే ఫిన్‌ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కామెంటేటర్‌ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్‌, కామెంటేటర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

    తాజాగా ఫిన్‌ ఇంగ్లండ్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్‌ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్‌ రైట్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్‌ తన పదవికి రాజీనామా చేశాడు.

    ఈ క్రమంలో చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి ఎన్నిక అనివార్యం​ కాగా.. ఫిన్‌తో పాటు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాళ్లు డారెన్‌ గాఫ్‌, నిక్‌ నైట్‌ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్‌కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. 

    జూన్ 4న ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్‌ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్‌లకు డగౌట్‌కే పరిమితమయ్యాడు. అయితే ముంబై ఇండియన్స్ ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ బరిలోకి దిగుతాడా లేడా అన్నది అనుమానమే. తాజాగా ఈ విషయమై ముంబై ఇండియన్స్‌ స్పష్టత ఇచ్చింది. 

    కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని ముంబై యాజమాన్యం పేర్కొంది. అయితే ఎస్‌ఆ ర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు రోహిత్ కచ్చితంగా అందుబాటులో ఉంటాడని ముంబై అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

    కానీ ముంబై యాజమాన్యం మాత్రం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. రోహిత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆడించాలని భావిస్తోంది. ఈరోజు ఉదయం వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన రోహిత్ శర్మ బ్యాటింగ్ జోలికి పోలేదు. వార్మప్‌, రన్నింగ్ అనంతరం కాసేపు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు.  ఆ తర్వాత ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్‌తో కాసేపు ముచ్చటించి మైదానం వీడాడు.  
     

    ఏప్రిల్ 12న ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ సమయంలో రోహిత్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలోనే హిట్‌మ్యాన్‌కు ట్రీట్‌మెంట్ చేసినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో మరుసటి ఓవర్‌లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ మరోసారి బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ తేడాతో ఓటమి చవిచూసింది. 

    ఈ సీజన్‌లో ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఏడు మ్యాచ్‌లాడి కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించి ప‌ట్టిక‌లో 9వ స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ మాత్రం మ‌ధ్య‌లో ప‌రాజ‌యాలు చ‌విచూసినా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సాధించి జోరు క‌న‌బ‌రుస్తోంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజ‌యాలు, ఒక ఓట‌మితో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది.

    చదవండి: సోదరి ఓటమి.. జడేజా ఇంట మరోసారి విభేదాలు!

  • టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రివాబా విద్యాశాఖ మంత్రిగా  విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే ఆమె వ‌దిన, జడేజా సోదరి నైనాబా తాజాగా గుజరాత్‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

    దీంతో జడేజా ఇంట మ‌రోసారి రాజ‌కీయ విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. విషయంలోకి వెళితే.. ఇటీవ‌ల రాజ్‌కోట్‌కు మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. నైనాబా జ‌డేజా రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డ్ నెం-2 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.  మంగళవారం మున్సి పల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జ‌రిగింది. 

    ఈ ఎన్నిక‌ల్లో నైనాబా మ‌రోసారి ప‌రాజ‌యం పాలయ్యారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జడేజా జీవితంలో నైనాబాది కీలక పాత్ర అని చెప్పొచ్చు. జడేజా క్రికెట్‌ విజయ ప్రస్థానంలో నైనాబా ముఖ్యపాత్ర పోషించినట్లు జడ్డూ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇటీవ‌లే మంత్రి హోదాలో రివాబా రాజ్‌కోట్ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా నైనాబా ఆమెకు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం క‌నిపించింది.

    గ‌తంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు స‌మ‌యంలోనూ రివాబా జ‌డేజా, నైనాబా జ‌డేజా ప్ర‌త్య‌ర్థులుగా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకున్నారు. అప్ప‌ట్లో జడేజా భార్య రివాబా జడేజాను జామ్‌నగర్‌ నార్త్‌ స్థానం నుంచి బీజేపీ ఎన్నికల బరిలో దించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ వెంట‌నే జడేజా సోదరి నైనాబాను స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో చేర్చి జామ్‌నగర్‌లో ప్రచారానికి పంపింది. 

    అయితే ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా వదిన నైనాబాపై విజయం సాధించింది. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మరోసారి నైనాబా ఓటమి పాలవ్వడంతో మంత్రిగా ఉన్న రివాబా తన వదినపై రాజకీయంగా ఆధిక్యతను మరోసారి కొనసాగించింది.  

    ఇక ర‌వీంద్ర జ‌డేజా ప్ర‌స్తుతం ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సీజ‌న్‌కు ముందు ట్రేడింగ్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు మారిన జ‌డేజా ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌లాడి 132 ప‌రుగులు చేయ‌డంతో పాటు ఆరు వికెట్లు తీశాడు.

    చదవండి: ‘వైభ‌వ్‌తో పోల్చ‌ద్దు’.. జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు!

  • ఐపీఎల్‌-2026లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిచ్చ‌ర పిడుగు  వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న భీక‌ర ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మంగ‌ళ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇప్ప‌టికే జ‌స్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు చుక్క‌లు చూపించిన వైభ‌వ్‌.. తాజాగా అర్ష్‌దీప్ సింగ్‌, లాకీ ఫెర్గూస‌న్ వంటి స్పీడ్ స్టార్ల‌ను ఉతికారేశాడు. 

    కేవ‌లం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 43 ప‌రుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ మ‌రో సిక్స్ కొట్టి ఉంటే ఓ ప్ర‌పంచ రికార్డును త‌న పేరిట లిఖించుకునేవాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించేందుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 511 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 99 సిక్సర్లు బాదాడు.

    మరో సిక్సర్ బాదితో ఈ చారిత్రత్మక రికార్డు అతడి సొంతం అవుతుంది. ప్రస్తుతం ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్(843 బంతులు) ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మే1న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పొలార్డ్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది.

    కాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజ‌న్‌లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభ‌వ్ ఈ ఫీట్‌ను కేవ‌లం 167 బంతుల్లో మాత్ర‌మే సాధించాడు.
    చదవండి: IND vs AFG: సంజూ, కిషన్‌లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్‌
     

  • వైభవ్‌ సూర్యవంశీ.. గతేడాది కాలంగా భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న పేరు. దేశీ క్రికెట్‌, భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున అదరగొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. ఐపీఎల్‌-2026లోనూ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు.

    గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్లు)లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

    ఆ తర్వాత ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డపై ఫార్మాట్లకు అతీతంగా రాణించిన వైభవ్‌.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ దుమ్ములేపాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి భారత్‌ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

    36 బంతుల్లోనే శతకం
    ఇక తాజాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మరోసారి అదరగొడుతున్న వైభవ్‌ సూర్యవంశీ.. ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతకం సాధించాడు. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

    ఆరెంజ్‌ క్యాప్‌
    తద్వారా ఈ సీజన్‌లో ఇప్పటికి ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు వైభవ్‌. తద్వారా అత్యధిక పరుగుల వీరులకు ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ చేతులు మారి ఈ లెఫ్టాండర్‌కు చేరింది. దీంతో మరోసారి వైభవ్‌ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

    అదే సమయంలో కొంతమంది ‘అభిమానుల’ ముసుగులో వైభవ్‌ సూర్యవంశీని తిట్టిపోయడం ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో... టీమ్‌ బస్సులో వెళ్తున్న సమయంలో వైభవ్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని మ్యూజిక్‌ వింటున్నట్లు కనిపిస్తోంది.

    విద్వేష విషం
    ఆ సమయంలో కొంతమంది బస్సు బయట నిల్చుని వైభవ్‌ను ఫొటోలు, వీడియోలు తీయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే, వైభవ్‌ మాత్రం వారి వైపు చూడకుండా తన పనిలో తాను మునిగిపోయాడు. దీంతో.. ‘‘చాలా ఎక్కువైంది. ఒక్కసారైనా చూడవచ్చు కదా! ఇంత ఓవరాక్షన్‌ ఎందుకు?’’ అంటూ వైభవ్‌పై విద్వేష విషం చిమ్మారు.

    సిగ్గులేకుండా..
    అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు వైభవ్‌ సూర్యవంశీకి మద్దతుగా నిలుస్తూ.. అక్కడున్న వాళ్లపై మండిపడుతున్నారు. ‘‘సిగ్గులేకుండా పదిహేనేళ్ల పిల్లాడిపై ఈ ‘పెద్ద మనుషులు’ విషం చిమ్ముతున్నారు. ఆటిట్యూడ్‌ చూపిస్తున్నాడంటూ పిల్లాడిని ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తున్నారు.

    ప్రపంచంలోనే భారీ క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌లో ఈ పిల్లాడు ఆడుతున్నాడు. వరల్డ్‌క్లాస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ చితక్కొడుతున్నాడు. ఆ ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో కాస్త సేద తీరితే.. తమవైపు చూడలేదంటూ ఇంతకు దిగజారుతారా? మీకిదో వ్యసనంగా మారింది. పాపం పిల్లాడిని కాస్త ఊపిరిపీల్చుకోనివ్వండి’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్‌

Telangana

  • హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. 

    ముంపు ప్రభావం తక్కువగా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే 11 వేల కోట్లు ఖర్చు చేశామని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల పనులు పూర్తయ్యాయని సమీక్షలో చర్చించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

    మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకొని ప్రత్యక్షంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌కు సీఎం సూచించారు. 

    మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జియో టెస్టింగ్ పనులను వర్షాల కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజ్ పూర్తయితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్. రమేష్‌కి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం హైదరాబాద్‌కి బదిలీ చేసింది. బి. ప్రవీణాను ములుగు ఫారెస్ట్ కాలేజ్ డీన్‌గా నియమించగా.. బాలమణికి కుమ్రంభీం ఆసిఫాబాద్ డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు.

    బోగా నిఖిత.. వరంగల్ డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు. వికాస్ మీనా ములుగు డీఎఫ్‌వోగా నియమితులయ్యారు. శివ్ ఆశీష్ సింగ్ మహబూబ్‌నగర్‌కు బదిలీ కాగా, సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌కు నిజామాబాద్ డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు. రాహుల్ కిషన్ జాదవ్ మంచిర్యాల డీఎఫ్‌వోగా నియామకం కాగా, నరిజ్ కుమార్ తిబ్రేవాల్ కామారెడ్డి డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు. అనుజ్ అగర్వాల్ ఖమ్మం డీఎఫ్‌వోగా పోస్టింగ్ ఇవ్వగా.. సత్యనారాయణ.. రాజన్న సిరిసిల్ల-కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. జి. జ్ఞానేశ్వర్‌ను హోఎఫ్‌ఎఫ్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
     

  • హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.1,461.47 కోట్లకు 100% షేర్లను స్వాధీనం చేసుకుంది, దీంతో ఫేజ్-I, ఫేజ్-II విస్తరణ, సేవల సమన్వయం మెరుగుపడనుంది. దీంతో ఇప్పుటి నుంచి మెట్రో నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. కాగా మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా... స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.

    ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్(HEINEKEN) నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.

    హైదరాబాద్‌ను కేవలం ఐటీ డెస్టినేషన్‌గా కాకుండా, ప్రపంచ శ్రేణి వ్యాపార పరిష్కారాలకూ చిరునామాగా మారుతోందన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు... మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.

    తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ... ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్ గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందన్నారు.

    హైనెకెన్ స్ఫూర్తితో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్ వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హేనెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి,హైదరాబాద్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటారని చాదర్‌ఘాట్ పోలీసులు నిరూపించారు. రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడి ఉన్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారికి తగిన ఆశ్రయం కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

    బుధవారం (29.04.2026) ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో మలక్‌పేట్ గంజ్ మార్కెట్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై కొందరు అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నట్లు చాదర్‌ఘాట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వివరాలు.. వేణుగోపాల్ (46 సం),నరసింహ (60 సం),కృష్ణ (70 సం),భరత్ ఛెత్రి (35సం),అనిల్ (35 సం)లుగా గుర్తించారు.

    తీవ్రమైన ఎండలో, సరైన ఆహారం, వసతి మరియు ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వీరిని చూసి చలించిన పోలీసులు, మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, సురక్షితమైన సంరక్షణ కోసం ఐదుగురిని నగరంలోని ఒక షెల్టర్ హోమ్‌కు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతి మరియు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఈ చొరవను స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి. ఖాకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపించాయి.

  • సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకుండా చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్‌ కొరతపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌, డీజీల్‌ను ఎవరూ ఇళ్లలో నిల్వ  చేసుకోవద్దన్న కిషన్‌రెడ్డి.. చమురు నిల్వలు లేకపోతే ప్రభుత్వమే ప్రకటిస్తుందని తెలిపారు.

    ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మొద్దు. పెట్రోలు ధరలు పెరుగుతాయని రాహుల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడం దురదృష్టకరం. కేంద్రం ముందు చూపుతో దేశంలో చమురు కొరత లేదు. తెలంగాణలో సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ ఉంది. పానిక్‌తో ఎవరూ పెద్ద ఎత్తున పెట్రోల్‌ కొని నిల్వ చేసుకోవద్దు’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూ.1000కోట్ల బకాయిలను విడుదల చేసింది. 2025 అక్టోబర్‌ వరకు రిటైర్డ్‌ ఉద్యోగల జీపీఎఫ్‌ బకాయిలను ఆర్థిక శాఖ చెల్లించింది.

    గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ మార్చి 2026 వరకు ప్రతి నెలా చెల్లింపులు చేసింది. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాల దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంనుంచి నెలవారీ కేటాయింపును రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు.

    ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు రూ.1000 కోట్లు యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని జీపీఎఫ్ బకాయిలను ఈ నిధులతో పూర్తిగా తీర్చింది. దీని వల్ల పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించింది.

    ఉద్యోగుల ఆరోగ్య అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య బిల్లులు ఒక్కరోజు ఆలస్యం లేకుండా, అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ చర్యలతో ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఊరట లభించింది.

  • సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణ‌త‌తో ములుగు జిల్లా ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. హైద‌రాబాద్ జిల్లా చివ‌రి స్థానంతో స‌రిపెట్టుకుంది. ఇక్క‌డ 89.23 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. నాగ‌ర్ క‌ర్నూలు (99.03), నిర్మ‌ల్ (98.96), జ‌గిత్యాల (98.87), మ‌హ‌బూబాబాద్ (98.81) మొద‌టి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా చూస్తే మొత్తం 99.15 శాతం మంది విద్యార్థులు పాస‌య్యారు. వీరిలో బాలురు 2,45,027 (94.04 శాతం), బాలిక‌లు 2,46,747 (96.26 శాతం) మంది ఉన్నారు.

    రాష్ట్ర‌వ్యాప్తంగా 5,16,815 మంది విద్యార్థులు ప‌రీక్షలు రాశారు. వీరిలో 4,91,774 మంది విద్యార్థులు పాస‌య్యారు. హైద‌రాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 74,099 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాగా, వీరిలో 66,115 మంది ఉత్తీర్ణుల‌య్యారు. ములుగు జిల్లాలో అత్య‌ల్పంగా 3,287 మంది విద్యార్థులు ప‌రీక్షలు రాయ‌గా, 3,264 మంది పాస‌య్యారు. రంగారెడ్డి జిల్లాలో 52,946, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 48,855 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. 

    (Telangana SSC Results 2026) ములుగు త‌ర్వాత అత్య‌ల్పంగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో 3,541 మంది పిల్ల‌లు టెన్త్ ప‌రీక్షలు రాశారు. వీరిలో 3,483 మంది పాస‌య్యారు. జ‌న‌గాం జిల్లాలో 6,443 మంది విద్యార్థులు ప‌రీక్షలకు హాజ‌రుకాగా, 6,292 మంది ఉత్తీర్ణుల‌య్యారు.  

    మంత్రి సీతక్క హర్షం
    పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల మంత్రి సీతక్క హర్షం ప్ర‌క‌టించారు. జిల్లా యంత్రంగానికి, విద్యాశాఖ అధికారులకు, టీచర్లకు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 

    జిల్లాల వారీగా ఫ‌లితాల వివ‌రాలు

Business

  • భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానం దేశాన్ని మరో పెను ప్రమాదంలోకి నెట్టేస్తోందా? అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణవేత్తలను వేధిస్తోంది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతోందన్న వాస్తవం ఇప్పుడు దేశ జల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

    బియ్యం నుంచి ఇంధనం

    ప్రభుత్వం 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. రాబోయే 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆహార సరఫరా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే విరిగిన బియ్యం వాటాను 25% నుంచి 10%కి తగ్గించనున్నారు. దీనివల్ల మిగిలిన బియ్యాన్ని నేరుగా ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు మళ్లిస్తారు. అయితే, ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    నీటి వినియోగం గణాంకాలు ఇలా..

    ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇథనాల్ తయారీకి పంటల వారీగా నీటి వినియోగం కింది విధంగా ఉంది.

    పంట రకంఒక లీటరు ఇథనాల్‌కు అవసరమయ్యే నీరు
    బియ్యం (వరి)10,790 లీటర్లు
    మొక్కజొన్న4,670 లీటర్లు
    చెరకు3,630 లీటర్లు

     

    ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. అంటే, మనం వాహనాల్లో వాడే ఇంధనం ఎంత భారీ స్థాయిలో జల వనరులను హరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

    పెరుగుతున్న కాలుష్యం

    నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు నిండుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే ఇథనాల్ ప్లాంట్లు కేంద్రీకృతమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తాగునీటికే కటకటలాడుతున్న స్థితిలో అక్కడ 396 కోట్ల లీటర్ల ఇథనాల్‌ సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లోనే ఇథనాల్ తయారీ జోరుగా సాగుతోంది. ఇథనాల్ మిల్లులు విడుదల చేసే వినాస్సే (Vinasse) అనే వ్యర్థ జలాలు భూమిలోకి చేరితే భూగర్భ జలాలు, ఉపరితల జలాలు పూర్తిగా కలుషితమవుతాయని కొందరు చెబుతున్నారు.

    వైరుధ్యాల వలయం

    ఒకప్పుడు పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లోని రైతులు వరి పండించి భూగర్భ జలాలను తోడేస్తున్నారని విమర్శించిన వ్యవస్థే ఇప్పుడు అదే ధాన్యాన్ని పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇంధనంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశాన్ని మంచినీటి చుక్క కోసం అల్లాడేలా చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    క్లీన్ ఎనర్జీ లక్ష్యం గొప్పదే అయినా అది దేశ జల వనరులను బలిపెట్టేదిగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం, చెరకు వంటి నీటి తీవ్రత పంటల కంటే ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ఇదీ చదవండి: ‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్‌ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.

    ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?

    పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్‌ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.

    గణాంకాలు ఏం చెబుతున్నాయి?

    వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్‌ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

    పరిష్కారం ఏమిటి?

    యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.

    ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.

    ఇదీ చదవండి: ‘మస్క్‌ దొంగ ఏడుపు దేనికి?’

  • కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్‌ ఆల్టమన్‌, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన​్‌ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.

    మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..

    మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్‌కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్‌ అంటున్నారు.

    ఓపెన్ ఏఐ కౌంటర్

    మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

  • అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్‌కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఒపెక్ పట్టు సడలుతోందా?

    1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్‌కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.

    యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్‌ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్‌కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.

    ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్‌ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్‌లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.

    ఏమిటా కొత్త రోల్‌? బాధ్యతలు ఇవే..

    బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్‌ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్‌లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో 30% నుంచి 40% సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.

    సిలికాన్ వ్యాలీ దిగ్గజాల స్పందన

    ఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది (అంటే మానవ సంబంధాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు) అరుదుగా మారుతుంది’ అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్‌కు ఉన్న డిమాండ్‌ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది.

    అర్హతలు, ఎంపిక విధానం

    ఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. ‘మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?’ అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్‌ ద్వారా సంప్రదిస్తుంది.

    ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..

  • కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు ఒక్కోసారి వింత పోకడలకు వేదికవుతున్నాయి. ఒక అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇచ్చి, అతను దానికి అంగీకారం తెలిపి, ఇక విధుల్లో చేరతాడు అనే సమయానికి.. చివరి నిమిషంలో భారీ ప్యాకేజీ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ తన కంపెనీలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇది పూర్తిగా ‘నాన్‌ సెన్స్‌’ అన్నారు.

    అసలేం జరిగింది?

    జస్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బ్యాకెండ్ డెవలపర్ నియామకం కోసం తమ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఓ అభ్యర్థి ప్రస్తుతం రూ.21 ఎల్‌పీఏ సంపాదిస్తున్నారు. తనకు కంపెనీ సుమారు 33 శాతం పెంపుతో ఏటా రూ.28 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అభ్యర్థి ఈ ఆఫర్‌ను సంతోషంగా అంగీకరించి కంపెనీలో చేరతానని ధ్రువీకరించారు. కానీ, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు ఆ అభ్యర్థి కంపెనీకి ఒక ఈమెయిల్ పంపారు. తనకు మరో సంస్థ నుంచి రూ.32 లక్షలు ఆఫర్ వచ్చిందని, కాబట్టి తన జీతాన్ని రూ.36 లక్షలకి పెంచితేనే చేరుతానని డిమాండ్ చేశారు.

    ‘మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు రూ.28 లక్షలకి అంగీకరించాను. కానీ ఇప్పుడు రూ.32 లక్షలు ఆఫర్ వచ్చింది. నాకు మీ కంపెనీ అంటే ఇష్టమే అందుకే నా ప్యాకేజీని రూ.36 లక్షలకు సవరించే వెసులుబాటు ఉందేమో చూడండి. అలాగే, నేను వారాంతాల్లో పని చేయను’ అని ఆ అభ్యర్థి నిస్సంకోచంగా మెయిల్‌లో పేర్కొన్నారు.

    ‘ఇది ప్రొఫెషనలిజం కాదు’

    ఈ మెయిల్ చూసి విస్మయానికి గురైన జస్వీర్ సింగ్ అభ్యర్థి ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి చర్చలు జరపడం సహజమే కానీ, ఒక ఆఫర్‌ను అంగీకరించిన తర్వాత ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. ‘ప్రస్తుత కంపెనీలో నోటీసు పీరియడ్ ముగిసే వరకు వేచి చూసి కొత్త కంపెనీలో చేరడానికి రెండు రోజుల ముందు ఇలా డిమాండ్ చేయడం వల్ల కంపెనీ సమయం, వనరులు వృథా అవుతాయి. ఇంకా ఆఫర్ల కోసం వెతుకుతుంటే ఆ విషయాన్ని ముందే చెప్పాలి. ఇది నాన్‌సెన్స్‌’ అని జస్వీర్‌ అన్నారు.

    నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

    ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడికి వెళ్లడం సహజం. కంపెనీలు కూడా అవసరం తీరాక ఉద్యోగులను తొలగిస్తాయి కదా, అప్పుడు లేని నైతికత ఇప్పుడెందుకు?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక మాట ఇచ్చాక తప్పడం సరికాదు. మరిన్ని ఆఫర్లు కావాలనుకుంటే అసలు ఆఫర్ లెటర్ మీద సంతకం చేయకూడదు. ఇది రిక్రూటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని మరికొందరు వాదిస్తున్నారు.

    ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’

  • భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఏప్రిల్ 29, 2026) వృద్ధిని కనబరిచాయి. అంతర్జాతీయ ప్రతికూలతలను అధిగమిస్తూ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 77,496 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 181 పాయింట్లు పుంజుకుని 24,177 స్థాయికి చేరుకుంది.

    లాభాలకు కారణాలు(నిపుణుల అంచనా)

    ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సడలింపు ఆశలు

    గత కొద్దివారాలుగా ప్రపంచ మార్కెట్లను వణికించిన ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొంత సడలినట్లు కనిపిస్తోంది. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపాయి. ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు తొలగుతాయన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

    క్రూడాయిల్ ధరల తగ్గుదల

    మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభం కారణంగా మార్చి నెలాఖరులో బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్ల మార్కును దాటినప్పటికీ ప్రస్తుతం అది క్రమంగా తగ్గుముఖం పట్టి 111 డాలర్ల స్థాయికి చేరుకుంది. దీనికి తోడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మే నెలలో ఒపెక్ నుంచి నిష్క్రమిస్తుందన్న వార్తలు చమురు సరఫరా పెరుగుతుందన్న అంచనాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చాయి. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి చమురు ధర తగ్గడం మార్కెట్లకు సానుకూల అంశంగా మారింది.

    యూఎస్ ఫెడ్ నిర్ణయంపై దృష్టి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈరోజు తన వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటించనుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లను మార్చకుండా 3.50% - 3.75% వద్దే కొనసాగించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్న ఆశాభావంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లోకి నిధులను మళ్లించడం గమనార్హం.

    భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సద్దుమణగనప్పటికీ భారత కంపెనీల ఆర్థిక పటిష్టత, అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ నేటి లాభాలకు ప్రధాన కారణమయ్యాయి. రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు, అమెరికా ఫెడ్ ఇచ్చే దిశానిర్దేశం మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి.

    ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’

  • దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సందీప్ బక్షి పదవీకాలం పొడిగింపుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. బక్షి నాయకత్వంలో బ్యాంక్ వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, నియంత్రణ ఉల్లంఘనలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి లేఖ రాశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించవద్దని, అది బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని భూషణ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

    నియంత్రణ ఉల్లంఘనల పరంపర

    సాధారణంగా మూడేళ్ల పాటు ఉండే పదవీకాలాన్ని కాదని వారసత్వ ప్రణాళికలో భాగంగా సందీప్ బక్షికి రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని ఐసీఐసీఐ బ్యాంక్ జనవరిలో ఆర్‌బీఐని కోరింది. ఈ నేపథ్యంలో భూషణ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లు 35A, 35B, 36AA, 10B కింద ఆర్‌బీఐ తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు.

    ‘బక్షి హయాంలో నిరంతర నియంత్రణ ఉల్లంఘనలు జరిగాయి. ఆయనను కొనసాగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. ముఖ్యంగా 2020-21 కాలంలో (చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత) రుణాల వ్యవహారం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ రక్షణ వంటి అంశాలలో విఫలమైనందుకు బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.12 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

    రూ.245 కోట్ల మోసాలు.. డేటా ఉల్లంఘనలు

    2024 నుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆర్థిక మోసాలు జరిగినట్లు భూషణ్ తన లేఖలో జాబితా చేశారు. ‘22 శాఖల్లో సుమారు రూ.245 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కస్టమర్ల గోప్యతకు సంబంధించిన డేటా ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి’ అన్నారు. అయితే, ఈ నష్టాలు బ్యాంకు నికర లాభంలో కేవలం 0.25% మాత్రమేనని, పైగా వీటిలో బక్షి వ్యక్తిగతంగా నిందితుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక విపత్తు సంభవించే వరకు ఆర్‌బీఐ వేచి చూడకూడదని భూషణ్ వాదించారు.

    కార్మిక చట్టాల ఉల్లంఘన.. ఉద్యోగుల ఆత్మహత్యలు

    బ్యాంకులో పని ఒత్తిడి, ఉద్యోగుల వేధింపులపై భూషణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘2024 జనవరి - జూన్ మధ్య సుమారు 800 మంది ఉద్యోగులు పని మానేసినట్లు సమాచారం. ఇది మొత్తం సిబ్బందిలో 0.39%. పని ఒత్తిడి కారణంగా ఇటీవల నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మిక అధికారులు కోరినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, రికార్డులు అందించడంలో బ్యాంక్ విఫలమైంది’ అని ఆరోపించారు. దీనిపై బక్షిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరడానికి చర్యలు ప్రారంభించినట్లు లేఖలో పేర్కొన్నారు.

    రూ.1,224 కోట్ల జీఎస్టీ డిమాండ్లు

    పన్ను చెల్లింపుల్లో కూడా బ్యాంక్ విఫలమైందని భూషణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,224 కోట్లకు పైగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు రావడం అంతర్గత ఆడిట్ నియంత్రణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు.

    చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత బ్యాంకును గాడిలో పెట్టిన బక్షి తన చిరకాల ప్రత్యర్థి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరి ఈ ఆర్థిక విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్‌బీఐ ఆయనకు పదవి పొడిగింపు ఇస్తుందా? లేక ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన నియంత్రణ లోపాలపై విచారణ చేపడుతుందా? అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

    ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

  • న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఇకనైనా మేల్కొని స్వచ్ఛమైన ఇంధనాల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన 'బస్‌వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2025'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

    శిలాజ ఇంధనాల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ దిగుమతుల కోసం దేశం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ "తీవ్రమైన సమస్యల" నుండి బయటపడాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాలే మార్గమని ఆయన పేర్కొన్నారు.‘డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఇక భవిష్యత్తు లేదు. తయారీదారులు జీవ ఇంధనాలు (Bio-fuels), సీఎన్‌జీ (CNG), ఎల్‌ఎన్‌జీ (LNG), ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేయాలి’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

    భవిష్యత్తు ఇంధనం 'హైడ్రోజన్'
    భారతదేశం ఇప్పటికే ప్రయోగాత్మకంగా 10 ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులను నడుపుతోందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో హైడ్రోజన్ అత్యంత కీలకమైన ఇంధనంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇథనాల్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్ల అభివృద్ధిపై పరిశ్రమ ఇప్పటికే దృష్టి సారించిందని, ప్రస్తుతం వాహనాలు E20 (20% ఇథనాల్ మిశ్రమం) ఇంధనంతో విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు.

    ప్రజా రవాణాలో భద్రతే ముఖ్యం
    ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేసింది. బస్సు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం భౌతిక, వీడియో అనుమతులతో పాటు వివరాలను 'వాహన్' పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. తయారీదారులు కేవలం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంపైనే కాకుండా.. నాణ్యత, భద్రత,ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని ఆయన సూచించారు.

    ఎలక్ట్రిక్ బస్సులకు భారీ డిమాండ్
    రాబోయే మూడేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ బస్సుల డిమాండ్ సుమారు 1,50,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ప్రస్తుత తయారీ సామర్థ్యం ఏడాదికి 70,000 బస్సులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

National

  • సాక్షి,చెన్నై: తమిళనాడులో టీవీకేదే విజయమంటూ యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్ట్‌ విడుదల చేసింది. మెజార్టీ సర్వే సంస్థలకు భిన్నంగా టీవీకే  చీఫ్‌ విజయ్‌దే ప్రభంజనమన్న ఈ సం‍స్థ ఎగ్జిట్‌ పోల్స్‌.. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండో స్థానంలో డీఎంకే 92-100 సీట్లు సాధించే అవకాశముందని అభిప్రాయం పడింది. మొత్తానికి టీవీకేకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

    తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్‌ ఇన్‌సైట్‌ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. మాట్రిజ్‌ సర్వే.. డీఎంకే: 122-132, అన్నా డీఎంకే: 87-100, టీవీకే 10-12, ఇతరులు 0-6 సీట్లు సీట్లు వస్తాయని పేర్కొంది. డీఎంకే 134-141, అన్నా డీఎంకే 84-90, టీవీకే 4-8 సీట్లు సాధించే అవకాశముందని ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి.

    పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. కాగా, యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌  మాత్రం మిగతా ఎగ్జిట్‌ పోల్స్‌  అంచనాలకు  విభిన్నంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను ప్రకటించింది. టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పింది.

    తమిళనాడులో ఈసారి ప్రధాన పోటీ డీఎంకే , అన్నాడీఎంకే  కూటముల మధ్య ఉన్నప్పటికీ, నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభావంపైనే అందరి దృష్టి నెలకొన్న సంగతి తెలిసిందే విజయ్‌ పార్టీ చీల్చే ఓట్లు అధికార డీఎంకే కూటమిపై ప్రభావం చూపుతాయా లేక అన్నాడీఎంకే ఓటు బ్యాంక్‌ను దెబ్బతీస్తాయా అన్నది సోషల్‌ మీడియాలో ఇప్పటికే  హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ముక్కోణపు సమరంలో  కొన్ని నియోజకవర్గాల్లో విజయ్‌ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందన్న అంచనాల నడుమ, ప్రధాన పార్టీలలో టెన్షన్‌ పెట్టిస్తోంది. ఇవాళ విడుదలైన పలు సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని అంచనా వేయగా.. యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది.

  • బెంగళూరులో కురిసిన అకాల వర్షాలు ఏడుగురిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ రోజు బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఓ ఆసుపత్రి ప్రహారి గోడ కూలి ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు.

    నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రహారి గోడ కూలింది.  వర్షం పెద్దఎత్తున కురవడంతో బలమైన గాలులు వీశాయని దీంతో గోడ పక్కన నిల్చున్న ఏడుగురు బాధితులు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. మృతులలో అధికంగా అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని తెలిపారు.

    దీంతో వివరాలు తెలుసుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న సంఘర్షణల నేపథ్యంలో, ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతున్న తరుణంలో, 12 మంది సభ్యుల ఒపెక్ , విస్తృత 22-సభ్యుల ఒపెక్+ కూటమి రెండింటి నుంచి నిష్క్రమిస్తున్నట్లు యూఏఈ  ఏప్రిల్ 28నప్రకటించింది. ఈ నిర్ణయం భారతదేశానికి  లాభం   చేకూరుస్తుందా? లేక మరింత సంక్షోభం లోకి కూరుకుపోనుందా?  దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారు?

    పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి (OPEC), OPEC+ నుండి తప్పుకుంటున్నట్లు యూఏఈ ప్రకటించింది.  మే 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ పరిణామం భారతదేశానికి సానుకూల అంశమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారని మనీ కంట్రోల్‌ తనకథనంలోపేర్కొంది. ఒపెక్ నుండి యూఏఈ నిష్క్రమణతో భారతదేశానికి చమురు సరఫరా పెరిగిచ, ధరలు తగ్గుతాయని, అంతిమంగా ఇది  దేశానికి మేలు జరగవచ్చు అంటున్నారు.

    ఇదీ చదవండి: జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు


    భారతదేశానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు:

    • ఇప్పటివరకు యూఏఈ 'ఓపెక్' నిర్దేశించిన కోటాల ప్రకారం పరిమితంగానే చమురును ఉత్పత్తి చేసేది. ఇప్పుడు కూటమి నుండి బయటకు వచ్చిన కారణంగా  ఇండియా భారీగానే ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో చమురు సరఫరా పెరిగి, ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.

    • భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ధరలు తగ్గితే దేశంపై విదేశీ మారకద్రవ్య భారం తగ్గి,  ఇన్‌ప్లేషన్‌ అదుపులోకి వస్తుంది. అలాగే యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2027 నాటికి రోజుకు 5 మిలియన్ బారెల్స్‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    • భౌగోళికంగా భారత్‌కు దగ్గరగా ఉండటం వల్ల, అత్యవసర సమయాల్లో చమురును సులభంగా దిగుమతి చేసుకోవచ్చు.

    • ప్రపంచ సరఫరాలో యూఏఈ వాటా    3 - 4 శాతంగా  ఉండగా, భారత చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా    సుమారు 10 శాతంగా ఉంది.

    •  సౌరవ్ మిత్ర (గ్రాంట్ థోర్న్టన్ భరత్): యూఏఈ నిష్క్రమణ వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో మరింత సరళత వస్తుంది. ధరలపై ఒత్తిడి తగ్గి భారత్‌కు ఊరట లభిస్తుంది.

    •  ప్రశాంత్ వశిష్ట్ (Icra): ఓపెక్ కూటమిలో కీలక దేశమైన యూఏఈ బయటకు వెళ్లడం వల్ల ధరలను నియంత్రించే ఆ కూటమి శక్తి తగ్గుతుంది. భారత్ తన చమురు వనరులను మరింత వైవిధ్యపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం.


    ఇదీ చదవండి: నో క్రాష్ డైట్‌, నో షార్ట్‌కట్‌ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు

    ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల చమురు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నప్పటికీ, మధ్యస్థ కాలంలో యూఏఈ నిర్ణయం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: 

  • కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.

    పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది. 
       

    2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్‌కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్‌టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది.
        

    ఏన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్‌పీఏ కూటమిలోని డీఎమ్‌కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.
     

    పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి.ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు. 

     

    ఎస్‌ఏఎస్‌ గ్రూప్‌ 
    NDA-17-19 
    CONG 11-12 
    OTH 1-3

    చాణక్య స్ట్రాటజీస్ 
    NDA- 17-20 
    SPA - 9-13 
    TVK - 1

     

  • సాక్షి,  తిరువనంతపురం:  కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.  కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి  భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 

    140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది. 

    ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్‌డీఎఫ్‌కు మళ్లీ అధికారం కట్టబెట్టక పోవడం ఇక్కడ విశేషం. ఎల్‌డీఎఫ్‌కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు. 
     

    • రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్‌కు 14.5 శాతం మద్దతిచ్చారు. 

    • ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.

    • కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో  ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.

    • కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు. 

    • ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.


      యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : 
      యూడీఎఫ్‌(కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలు
      పినరయ్ విజయ్ కూటమి,ఎల్‌డీఎఫ్‌కి 49 నుంచి 62 స్థానాలు
      బీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం


      ఆత్మసాక్షి.ఎగ్జిట్‌పోల్స్‌ 
      UDF 76-81
      LDF 61-66
      BJP 3- 4
      ఇతరులు 1

  • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఇవాళతో (బుధవారం)తో ముగిసింది. పలు సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌  విడుదల చేశాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్‌ ఇన్‌సైట్‌ సర్వే అంచనా వేసింది. డీఎంకే-122-140, ఏఐడీఎంకే-60-70, టీవీకే 30-40, ఇతరులు-4 సీట్లు గెలిచే అవకాశముందని పేర్కొంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.

    మాట్రిజ్‌ సర్వే:
    DMK: 122-132
    ADMK: 87-100
    TVK: 10-12
    ఇతరులు 0-6

    ఆత్మసాక్షి ఎగ్జిట్‌ పోల్స్‌
    DMK 134-141
    AIDMK 84-90
    TVK 4-8

    టీవీకే విజయ్‌దే విజయం: యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌
    టీవీకే 98-120 స్థానాల్లో గెలిచే అవకాశం
    రెండో స్థానంలో డీఎంకే 92-100

    పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.

    తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేప‌ట్ట‌నుంద‌ని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి. డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.

    మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు. 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది. డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. 

    ప్రధాన అభ్య‌ర్థుల‌ స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది.

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

    తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది. 

    ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.

  • పశ్చిమబెంగాల్‌లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాత్యంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్‌ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి. 

    చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్‌ పోల్స్

    టీఎంసీ-130-140
    బీజేపీ- 150-160 
    కాంగ్రెస్‌2-4

    పీమార్క్ ఎగ్జిట్‌ పోల్స్

    TMC 118-138
    BJP 150-175
    CONG 2-6

    దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.

    పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే పూర్తి వివరాలు

    రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు.అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110,  కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది
        

    ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్లో బలహీనంగా ఉంది. ఇక్కడ  దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది..


    మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్‌కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది.  

    సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు.  ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.అని సర్వే చెబుతోంది.

    రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.
    ‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. 
     

    టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు.

    రికార్డులు బద్దల్.. బెంగాల్లో 90% పోలింగ్
       

    కాగా స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి. 
     

    బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది. కాగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే చాలా సార్లు ఇవి తారుమారైన సందర్బాలున్నాయి. వాస్తవిక ఫలితాలు మే 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది.
     

  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సాధారణ  డొమెస్టిక్‌ వర్కర్‌ (Domestic Worker)  పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఇళ్లలో పాచిపని చేస్తూ  అతి సాధారణ జీవనం సాగిస్తున్న ఆమె, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    పరిమిత వనరులతో జీవిస్తున్న లక్షలాది మందికి బెంగాల్ ఎన్నికల్లో కలితా మాఝీ  ఎంట్రీ స్ఫూర్తివంతంగా నిలుస్తోంది. నేటికీ ఆమె ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్, లేదా ఎయిర్ కండిషనింగ్ వంటి కనీస సౌకర్యాలు లేవు. అయినప్పటికీ, ఆమె నిరాడంబరత, అవిశ్రాంత పోరాటం ఆమెకు గుర్తింపును, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని సంపాదించిపెట్టాయి. ఒకప్పుడు నలుగురి ఇళ్లలో అలసిపోకుండా పాత్రలు కడిగిన అవే చేతులు, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి

    పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ (Ausgram) నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 37 ఏళ్ల కలితా మాఝీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదరికం నుండి వచ్చి, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, క్షేత్రస్థాయి నుండి ఎదిగిన నాయకురాలిగా  గుర్తించిన  బీజేపీ ఆమె  రెండోసారి పోటీలో నిలపడం విశేషం. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఇదే స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2026లో కూడా పార్టీ ఆమెపై నమ్మకంతో మళ్ళీ టికెట్ ఇచ్చింది. ఇంటింటి ప్రచారం నిర్వహించి వార్తల్లో నిలిచారు. ఆమెకు భర్త (ప్లంబర్), ఒక కుమారుడు ఉన్నారు.

    ఆమె పనిచేసే ఇంటి యజమాని ప్రతీలాల్ పాత్ర మాట్లాడుతూ.. "ఆమె మాకు కూతురు లాంటిది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆమె పనికి వస్తానంది, కానీ మేమే ఆమెను ప్రచారానికి వెళ్లమని పంపించేశాం. ఆమె లేకపోవడంతో ఇంట్లో పనులు చేసుకోవడం మాకు కష్టమవుతోంది, కానీ ఆమె ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాం" అన్నారు. అంతేకాదు ఆమె ప్రచారంలో తలనమునకలై ఉన్నప్పటికీ, ఆమె యజమానులు ఈ నెల జీతాన్ని కూడా ఇస్తామని హామీ ఇవ్వడం విశేషం.

    ఇదీ చదవండి: జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు

    ఎవరీ కలితా మాఝీ
    ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన కలితా ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తూ, నెలకు సుమారు రూ.4,500 సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. కలిత తన నిజాయితీతో, కష్టపడే తత్వంతో తాను పనిచేసే ఇళ్లలో కుటుంబ సభ్యురాలిగా మారిపోయారు.  ఇపుడు ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.  కలితా కుటుంబ మద్దతు కూడా బాగానే లభిస్తోంది.  ఆమె అత్తగారు ఇంటి పనుల్లో సాయం చేస్తుండగా, ఆమె కుమారుడు పార్థ తన తల్లి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలిత బావ కార్తీక్ బాగ్ 2006లో ఇదే నియోజకవర్గం నుండి సీపీఎం ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబంతో వీరికి ఎటువంటి సంబంధం లేదు.

    ఇదీ చదవండి: నో క్రాష్ డైట్‌, నో షార్ట్‌కట్‌ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు

    "నాలాంటి ఒక సామాన్య మహిళ కూడా ఎమ్మెల్యే కాగలదని నిరూపించాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత నాలాంటి పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడతాను" అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగాలనుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని స్థానికులు కొనియాడుతున్నారు. ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నారు.  కలిత గెలుపు కోసం మే 4 వరకు ఎదురు చూడాల్సిందే. 

    కాగా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో  రికార్డ్‌ స్థాయిలో 91.78శాతం పోలింగ్ నమోదైంది.  మొత్తం 294 స్థానాలున్న బెంగాల్‌లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ  నేతృత్వంఓలని అధికార టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దీదీని ఓడించి  ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రధాని మోదీ, షాలు తీవ్రప్రయత్నాలు చేయగా,  నాలుగోసారి సీఎం పదవే తనదేనని దీదీ  ధీమాగా ఉన్నారు.  మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

    ఇదీ చదవండి: బంపర్‌ ఆఫర్‌ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
     

  • న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిందనే కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ కథనాల్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఖండించింది. దేశంలో ఇంధన ధరలు పెరగలేదని, స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది.

    కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పెట్రోల్ ధరలను రూ.10, డీజిల్ ధరలను రూ.12.50 పెంచినట్లు సోషల్‌ మీడియా పోస్టులు వైరల్‌గా మారాయి.  ఇంధన ధరల పెంపుపై వస్తున్న వదంతులను భారత ప్రభుత్వం బుధవారం ఖండించింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన అధికారిక ఉత్తర్వు అంటూ ప్రచారంలో ఉన్న ఓ పత్రాన్ని ట్వీట్‌లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్‌ చేసింది. ఆ పత్రం ‘నకిలీ’దని ప్రకటించింది. వదంతులను నమ్మొద్దని కోరింది.  

    ఇంధన ధరలు పెరిగాయంటూ సర్క్యూలేట్‌ అవుతున్న పత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ చెక్‌ చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చింది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదు’అని పేర్కొంది.


     

  • ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్ మృదుల్ అరోరా, క్రమశిక్షణ,  పట్టుదలతో తన బాడీ షేప్‌ను చక్కగా మార్చుకున్నాడు. బిజీ లైఫ్ స్టైల్ తన అస్తవ్యస్తమైన జీవనశైలి, నిరంతరం అలసటతో బాధపడే వ్యక్తి పొరబాటును గ్రహించి, క్రమశిక్షణ, నిలకడ, అంకితభావానికి ప్రాధాన్యతనిచ్చి, అనుకున్నట్టుగా బరువును తగ్గించుకున్నాడు.  తన ఫిట్‌నెస్‌ను ఒక 'మార్కెటింగ్ క్యాంపెయిన్' లాగా భావించి ఈ లక్ష్యాన్ని సాధించడం విశేషం.

    మార్కెటింగ్ నిపుణుడు మృదుల్ అరోరా చాలా మంది ఉద్యోగ నిపుణుల మాదిరిగానే గంటల తరబడి కూర్చోవడం, వేళాపాళాలేని ఆహారపు అలవాట్లతో గడిపేవాడు. అయితే ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి శక్తి తగ్గిపోయినట్టు అనిపించడం మొదలైంది. 97 కిలోలకు చేరుకోవడంతో బాగా అలసటగా అనిపించేది.  కానీ హఠాత్తుగా తన శరీరాన్ని మార్చుకోవాలనుకోలేదు మృదుల్. డెడ్ లైన్లు, ఆఫీసు పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానని గ్రహించిన మృదుల్‌ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. క్రమంగా బరువు తగ్గించుకోవడానికి 45 రోజుల గడువు పెట్టుకున్నాడు. 

    ఇందుకోసం అధిక ప్రోటీన్డ్‌ఫుడ్‌, రోజువారీ వ్యాయామాలు, ఇంకా మరెన్నో అంశాలపై దృష్టిపెట్టాడు. 

    • అన్నింటి కన్నా ముఖ్యంగా,క్రాష్ డైట్‌లు లేవు. షార్ట్‌కట్‌లు లేవు.   

    • ఏం తింటున్నాం, ఎంత తినాలి అనే క్యాలరీ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. తీసుకునే ఆహారం కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు.

    • ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతోపాటు,  జంక్ ఫుడ్,  ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరం

    • ప్రతిరోజూ వ్యాయామం చేయడం.

    • తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం.

    • దీంతోపాటు ప్రతి వారం తన బరువును, ఎనర్జీ లెవల్స్‌ను గమనిస్తూ రికార్డ్ చేసుకునేవాడు. తద్వారా మరింత ప్రేరణ  పొందేవాడు.

    ఫలితంగా అతని బరువు కేవలం 45 రోజుల్లో 97 కిలోల నుండి 85 కిలోలకు చేరింది. అంటే దాదాపు 12 కిలోల బరువు తగ్గడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరిగింది, పనిలో మరింత చురుగ్గా  ఉండేవాడు.

    తన వెయిట్‌లాస్‌ జర్నీపై మృదులు ఏమంటారంటే.. "తీవ్రత (Intensity) కంటే స్థిరత్వం (Consistency) ముఖ్యం. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. సమయం కోసం ఎదురుచూడకుండా, బరువు తగ్గాలనుకునే ప్రయాణాన్ని ఇపుడే మొదలు పెట్టండి అని సూచించారు.

    నోట్‌ : బరువు తగ్గడానికి ఖరీదైన ప్లాన్లు అవసరం లేదు, కేవలం క్రమశిక్షణ, అంకితభావం ఉంటే చాలు! కానీ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టే ముందు, మన బరువు ఎంత ఉంది? ఎంత  తగ్గాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అసలు బరువు పెరగడానికి కారణాలను విశ్లేషించుకోవాలి.  ఇందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

    ఇదీ చదవండి: జస్ట్‌, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు
     

  • ఇరాన్‌ వార్‌ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇండియాలో వంటగ్యాస్‌ సరఫరాపై ఆందోళన తీవ్రంగానే ఉంది. దీనికి  ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన నిదర్శనం. దీనికి సంబంధించిన వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా పెళ్లిళ్లలో కట్నకానుకలు, విందులో లేదా ఇతర డిమాండ్ల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక వింత సంఘటన జరిగింది.

    రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక్క పక్క పెళ్లి తతంగం జరుగుతుండగానే గ్యాస్ ధరలు పెరగడం లేదాకొరత ఏర్పడటం వంటి పరిస్థితులువస్తే, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెళ్లి కొడుకు అశోక్‌కు వచ్చిన సందేహం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. వరుడు అందరి ముందూ వధువుని పట్టుకుని ఒక ఊహించని ప్రశ్న వేశాడు.

    అసలు ఏం జరిగింది?
    అందరూ పెళ్లి సంబరాల్లో మునిగితేలుతుండగా,  అకస్మాత్తుగా "ఒకవేళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేకపోతే, నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేయగలవా?" అని అడిగాడు పెళ్లి కూతుర్ని కాబోయే భర్త. ఈ ప్రశ్న వినగానే అక్కడ ఉన్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పెళ్లి సమయంలో ఇలాంటి ప్రశ్న ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు.దీనికి వధువు సమాధానం విని అందరూ సంతోషంగా తెగ నవ్వు కున్నారు.

    వధువు సమాధానం
    వధువు ఏమాత్రం తడబడకుండా చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. తనకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం వచ్చని, అలా వండటానికి తనకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వధువు ఇచ్చిన ఈ సమాధానంతో వరుడు సంతోషించి, పెళ్లి తంతును ముందుకు సాగించాడు. వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ కారులో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి కెమెరాతో వారి వద్దకు వెళ్తాడు. ముందు ముందు ఇబ్బంది రాకూడదనే ఈ ప్రశ్న అడిగానని వరుడు వివరణ ఇచ్చాడు. దీంతో  వధువు ముసిముసిగా నవ్వుకుంది.

    నెటిజన్ల స్పందన
    ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన అని మెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో పెళ్లి కూతురు దొరకడమే కష్టమంటే, ఇప్పుడు 'పొయ్యి టెస్ట్' కూడా మొదలుపెట్టారా?" అంటూ మరికొందరు సరదాగా కామెంట్స్  చేశారు. మొత్తానికి, ఈ "కట్టెల పొయ్యి" ప్రశ్నదేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    ఇదీ చదవండి: చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్‌ సెంటర్‌లో అమానుషం

  • ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం  చోటు చేసుకుంది. వారణాసిలోని ఘమ్‌హాపూర్ గ్రామంలో, 38 ఏళ్ల వ్యాపారవేత్తను సామూహిక హత్య కలకలం  రేపింది. కారుతో ఒక మహిళను ఢీకొట్టాడన్న ఆగ్రహంతో స్థానికులు మూకదాడికి పాల్పడి అతడిని కొట్టి చంపారు. 

    మృతుడిని మనీష్ సింగ్‌గా గుర్తించారు. డీసీపీ (గోమతి జోన్) నీతు కాడియన్  అందించిన వివరాల ప్రకారం  ఆదివారం రాత్రి, సింగ్ తన ఫ్యాక్టరీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతని కారు  రోడ్డు పక్కన నడుస్తున్న ఒక మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం, ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు మనీశ్ కుమార్‌ను కారులో నుంచి బయటకు లాగి ఇటుకలు, రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

    మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఫూల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని,  పాత కక్షలు, దోపిడీ, ప్రమాదం అంశాలపై దర్యాప్తు జరుగుతోందని డీసీపీ కాడియన్ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఒక అధికారి మంగళవారం (ఏప్రిల్ 27) తెలిపారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ఈ ఘటనతో బాధితుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

     ఇదీ చదవండి: ‘బోష్‌’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణం

  • ల‌క్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాదవ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎమ్మెల్యేను స్వ‌యంగా ప‌రామ‌ర్శించి మంచి సంప్ర‌దాయానికి తెర‌తీశారు. నిరసన కార్య‌క్ర‌మంలో తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ అగ్నిప్ర‌మాదానికి గురైన బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌ను (MLA Anupama Jaiswal) మంగళవారం లక్నోలోని మెదాంత ఆసుపత్రిలో అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. సానుకూల రాజకీయాల‌తో పాటు మానవ సంబంధాల విలువ‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌స్తావించారు.

    రాజ‌కీయాల క‌న్నా మానవ సంబంధాలు ముఖ్య‌మ‌ని, మ‌నుషుల మ‌ధ్య సామ‌ర‌స్యం వెల్లివిరియాల‌ని ఆయ‌న 'ఎక్స్‌'లో పేర్కొన్నారు. ''ప్రజల మధ్య వైష‌మ్యాలు రేగ‌డం మాకు ఇష్టం లేదు. సమాజంలో శాంతి, సామ‌ర‌స్యం ఉండాల‌నిమ బ‌లంగా కోరుకుంటున్నాం. సానుకూల రాజకీయాల్లోని ఆరోగ్యకరమైన సంప్రదాయం మనకు ఇదే నేర్పింది. అందుకే బీజేపీ ఎమ్మెల్యే శ్రీమతి అనుపమ జైస్వాల్ గారిని కలవడానికి వెళ్లి, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాం. రాజ‌కీయాలు, మానవ సంబంధాలు.. దేని స్థానం దానిదే. సద్భావన, సామరస్యం వ‌ర్ధిల్లాలి!'' అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

    పార్ల‌మెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న విప‌క్ష‌ ఇండియా బ్లాక్‌కు వ్యతిరేకంగా శ‌నివారం ల‌క్నోలో బీజేపీ నిర్వహించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ గాయ‌ప‌డ్డారు. అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో ఆమె ముఖానికి, నుదురుకు కాలిన గాయాల‌య్యాయి. దిష్టిబొమ్మకు నిప్పు పెట్టడానికి అగ్గిపెట్టెను వెలిగించగానే ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో ఆమె జుట్టుకు కూడా నిప్పంటుకుంది. బీజేపీ కార్య‌క‌ర్త‌లు వెంట‌నే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

    చ‌ద‌వండి: 'నేను చ‌ద్దాను కాదు.. బీజేపీలోకి వెళ్ల‌ను'

    ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే అఖిలేష్ యాద‌వ్ 'ఎక్స్‌'లో స్పందించారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని శ‌నివారం 'ఎక్స్‌'లో పోస్ట్ పెట్టారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌, జైస్వాల్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న వీడియోను షేర్ చేశారు. కాగా, ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌.. బహ్రాయిచ్ నియోజ‌క వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

     

Andhra Pradesh

  • సాక్షి, తిరుపతి: టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో వైఎస్‌ జ‌గ‌న్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. వైఎస్సార్‌సీపీపై “హత్య రాజకీయాలు” ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబుకు “మెగలోమానియా” అనే వ్యాధి ఉందని.. తనను తాను అతిశయోక్తిగా చూపించుకుంటారంటూ భూమన విమర్శించారు. మీడియా సంస్థలు చంద్రబాబును అతిగా పొగడ్తలతో ప్రోత్సహిస్తున్నాయంటూ భూమన మండిపడ్డారు.

    హింసా, కుల రాజకీయాలకు చంద్రబాబే తెర తీశారని.. పలు పాత హత్య ఘటనలపై చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైలులో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెరిగాయి. “సూపర్ సిక్స్” హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమైంది, దేవుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’’ అని భూమన ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

    వైఎస్‌ జగన్ ప్రజల కోసం పనిచేసే నాయకుడని, చంద్రబాబు మేనేజ్‌మెంట్ రాజకీయాలపై ఆధారపడుతున్నారన్న భూమన.. 2029లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల నాయకుడిగా అభివర్ణించిన భూమన.. టీటీడీ భూములను కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడంపై అభ్యంత‌రం వ్యక్తం చేశారు.

    టీటీడీలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు పెరిగాయన్న భూమన.. ఇసుక, గ్రావెల్ దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.
     

  • సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్‌ నల్లి శ్రీనివాసరావుపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడటం తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు, అదీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి మరో రిపోర్టర్‌తో కలిసి బైక్‌పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్‌పై వెంబడించి, పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు.

    నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై విలేకరుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    సాలూరులో దాడికి గురైన శ్రీనివాసరావును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పరామర్శించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడాన్ని రాజన్నదొర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమన్న ఆయన, శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    సాక్షి రిపోర్టర్ పై దాడి.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
  • సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. త్రోవగుంట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద  జీపీఎస్ ఫౌండేషన్ పేరుతో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

    అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్కజొన్న రైతులు పక్క రాష్ట్రం తెలంగాణాకు పోయి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రాష్టంలో ఏర్పడిందని మండిపడ్డారు. అమరావతిలో వేల కోట్లు దోచుకోవటానికి తప్ప అమరావతిపై ప్రేమ లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన వలన రాష్ట్రంలో ఇంధన కొరత  ఏర్పడిందని.. ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఏ రాష్ట్రంలో ఇంధన సమస్య లేదన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత వల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

    అమరావతికి డీజిల్ తరలింపు.. ఏపీలో మాత్రమే ఇంధన కొరత

Politics

  • డిస్పోర్‌: అసోం అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జిట్స్‌ పోల్స్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్లు తెలిపింది. యాక్సిస్‌ మై ఇండియాతో పాటు ఇతర సర్వే సంస్థలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. 

    బీజేపీ-ఏపీజీ-బీపీఎఫ్‌ కూటమి 88 నుండి 100 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పోల్స్ సూచించాయి. ఇందులో బీజేపీ 70-80 స్థానాలు, ఏజీపీ 7-9 స్థానాలు, బీపీఎఫ్‌ 9-11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్‌డీఏ మొత్తం ఓటు శాతం 48శాతంగా అంచనా వేయబడింది. బీజేపీకి 37శాతం, ఏజీపీకి 7శాతం,బీపీఎఫ్‌కికి 4శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని పోల్స్ తెలిపాయి.

    కాంగ్రెస్ కూటమి  
    కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి 24 నుండి 36 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా.
    కాంగ్రెస్ పార్టీకి 22-30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
    మిగతా మిత్రపక్షాలు: రైజోర్ దల్ 1-4 స్థానాలు

    ఏజీపీ 1-2 స్థానాలు
    సీపీఐ(ఎం) 0-1 స్థానాలు
    ఐఎన్‌డీ0-2 స్థానాలు

    ఎన్‌డీఏలో బీజేపీ 90 స్థానాలు, ఏజీపీ 26 స్థానాలు, బీపీఎఫ్‌ 11 స్థానాలు పోటీ చేసింది.
    కాంగ్రెస్ 99 స్థానాలు, రైజోర్ దల్ 13 స్థానాలు,ఏజీపీ 10 స్థానాలు పోటీ చేశాయి.

    ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్‌డీఏ మరోసారి అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. తుది ఫలితాలు విడుదల తర్వాతే అధికారం ఎవరిదనేది తేలనుంది.  

  • ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి.  మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.  మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్స్‌ పోల్స్‌ను విడుదల చేశాయి. 

    తమిళనాడు (మొత్తం: 234)
    ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

    డీఎంకే: 125 – 145
    ఏడీఎఎంకే: 65 – 80
    టీవీకే (విజయ్): 18 – 24
    ఇతరులు : 2 – 6

    కేరళ (మొత్తం: 140)
    ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

    యూడీఎఫ్‌: 75 – 85
    ఎల్‌డీఎఫ్‌: 55 – 65
    బీజేపీ: 0 – 3
    ఇతరులు : 0

    అసోం (మొత్తం: 126)
    ఏజెన్సీ: యాక్సిస్‌ మై ఇండియా

    బీజేపీ: 88 – 101
    కాంగ్రెస్‌: 15 – 36
    ఏఐయూడీఎఫ్‌: 0
    ఇతరులు: 0 – 3

    పశ్చిమ బెంగాల్ (మొత్తం: 294)
    ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

    టీఎంసీ: 177 – 187
    బీజేపీ: 95 – 110
    కాంగ్రెస్‌: 1 – 3
    వాపక్షాలు: 0 – 1

    పుదుచ్చేరి (మొత్తం: 30)
    ఏజెన్సీ: పీపుల్స్‌ పల్స్‌

    ఎన్‌ఆర్‌సీ: 16 – 19
    కాంగ్రెస్‌: 10 – 12
    ఇతరులు: 1 – 2

     అస్సాంలో బీజేపీ సునామీ
    అస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మ నేతృత్వంలోని ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీ 88-100 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24-36 సీట్లతో సరిపెట్టుకోవచ్చని తెలిపింది.  

    పశ్చిమ బెంగాల్
    రెండో దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్‌ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

    తమిళనాడు
    234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82 శాతం పైగా ఓటింగ్‌ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో టీవీకే విజయ్‌, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి.

    కేరళం
    ఎప్పటిలాగే అధిక ఓటింగ్‌ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని చూపడం కష్టం. ఎల్‌డిఎఫ్, యూడిఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

    అసోం
    85 శాతం పైగా పోలింగ్‌ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ, ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.

    పుదుచ్చేరి
    89 శాతం పైగా పోలింగ్‌ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.

    ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బలంగా నిలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ–బీజేపీ మధ్య పోటీ, కేరళలో ఎల్‌డిఎఫ్–యూడిఎఫ్ మధ్య పోటీ కనిపిస్తోంది.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్‌ చక్రబేరియా పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్‌ బూత్‌ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.

    స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు.  మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్‌లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.

    అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్‌లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్‌కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్‌లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.

    ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు.

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిప‌డ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమ‌ర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ర‌ఘురాం ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.

    డీజిల్ కొర‌త కార‌ణంగా మంత్రి నాదేళ్ల మ‌నోహ‌ర్ ప్ర‌క‌టించిన కేటాయింపుల ప‌ట్టిలో రైతుల‌కు, వ్య‌వ‌సాయ రంగానికి స్థానం లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 24 గంట‌ల్లో డీజిల్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌క‌పోతే రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న బంకుల‌ను ముట్ట‌డిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్రెస్‌మీట్‌లో వ‌డ్డీ రఘురాం ఏమ‌న్నారంటే..

    వ్య‌వ‌సాయ రంగం అంటే ఈ ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు
    రాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.  

    నాదేళ్ల మ‌నోహ‌ర్‌కు రైతుల‌కు క‌నిపించ‌లేదా?
    గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్‌కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్ర‌క‌టించ‌లేదు.  రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్‌లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.

    ఆక్వా రంగం ఎలా బాగుప‌డుంది?
    ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?

    చేపలను కార్గో విమానాల్లో పంపాలా?
    గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్‌మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?

    24 గంటల డెడ్ లైన్.. పెట్రోల్ బంకుల వద్ద YSRCP ధర్నా..

    ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?
    ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్‌లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.

    గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్‌కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్‌బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.

    కూట‌మి ప్ర‌భుత్వానికి 24 గంట‌లే డేట్‌లైన్‌
    రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్‌పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.

    గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి త‌క్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. స‌బ్సిడీ ఇవ్వ‌కపోతే ఆక్వా రైతుల తరఫున  ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్‌సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయ‌ని వ‌డ్డీ ర‌ఘురాం స్ప‌ష్టం చేశారు.