Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అక్షయ్ తన కెరీర్‌లో ఏకంగా 20 సినిమాలతో 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా నిలిచారు. ఖాన్ త్రయం అయిన షారూక్, సల్మాన్, అమీర్‌లను ఈ విషయంలో మించి అక్షయ్ ముందంజలో నిలిచాడు. ఇక ఈ వరుసలో అక్షయ్ తర్వాత స్ధానంలో సల్మాన్ ఖాన్ 18 సినిమాలతో ఉన్నాడు. ఇలా అజయ్ దేవగన్ 16 సినిమాలతో మూడో స్థానంలో, షారూక్ ఖాన్ 10 సినిమాలతో నాలుగో స్థానంలో, రణ్వీర్ సింగ్ 9 సినిమాలతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.  

    2012లో హౌస్‌ఫుల్ 2తో తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లో అక్షయ్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కరోనా తర్వాత కూడా ఆయన నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల మార్కును దాటాయి. తాజాగా విడుదలైన బూత్ బంగ్లాతో ఈ సంఖ్య 20కి చేరింది. రజనీకాంత్, విజయ్, ప్రభాస్ వంటి స్టార్‌లు కూడా 100 కోట్ల క్లబ్‌లో ఉన్నారు. కానీ అక్షయ్ స్థాయిలో వరుసగా ఇంత పెద్ద సంఖ్యలో సినిమాలు డెలివర్ చేయలేదు. ఎందుకంటే, హీరోలంతా ఏడాదికి లేదా రెండేళ్లకు ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు. అక్షయ్ మాత్రమే ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తూ ఇలా రికార్డులు సృష్టిస్తున్నాడు. 

  • గతేడాది కాంతార-2 మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన రిషబ్ శెట్టి ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కొత్త ఏడాదిలో సడన్‌ షాకిచ్చాడు. ఎలాంటి అప్‌డేట్స్‌ ఇ‍వ్వకుండా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ఏ ఫిల్మ్ బై గిరి. ఈ మూవీలో ఇందిర హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

    ఈ నేపథ్యంలో ఏ ఫిల్మ్ బై గిరి ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే రిషబ్ శెట్టి మూవీ స్క్రిప్ట్ రైటర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుధ్ మహేశ్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని   రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజీ మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎన్.పి తాపేశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

  • ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌‌ మేకర్స్ రిలీజ్ చేశారు. 

    'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్‌ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్‌లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. కర  ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే  వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్‌ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. 

  • సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమని మనందరికీ తెలుసు. కానీ మనకు పైకి కనిపించనంత అందంగా నటీమణుల జీవితాలు ఉండవని కొందరికే తెలుసు. పైకి కలర్‌పుల్‌గా కనిపించే వారి జీవితాల్లోనూ ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలా సినీతారల పర్సనల్‌ లైఫ్‌లో  కూడా ఎన్నో బాధలు, కష్టాలు ఉంటాయి. కొందరు తమ ఆవేదన చెప్పుకోలేని పరిస్థితుల్లోనూ ఉంటారు. మరికొందరేమో సినీతారలు తాము పడిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. అలా తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆనాటి హీరోయిన్‌, బుల్లితెర నటి షాకింగ్ విషయాలు పంచుకుంది. అప్పట్లో స్టార్‌గా పలు హీరోల సరసన మెప్పించిన పూజిత తన పెళ్లి, భర్త గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్త చేసిన ఘనకార్యాలను బయటపెట్టేసింది.

    'ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కు రెండో భార్యగా మెప్పించిన పూజిత.. అప్పటి వారికి సుపరిచితమైన పేరు. రుతురాగాలు వంటి సీరియల్‌తో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత తెలుగులో దాదాపు 70కి పైగా సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళం, కన్నడ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో మెప్పించింది.

    భర్త మోసంపై ఒంటరి పోరాటం..

    వెండితెరపై అభిమానులను మెప్పించిన పూజిత రియల్ లైఫ్‌ మాత్రం భర్త చేసిన మోసంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపింది. తన భర్త విజయ్‌ గోపాల్ గురించి తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్త దాదాపు 9 మంది మహిళలతో ఎఫైర్స్ నడిపాడని పూజిత తెలిపింది. కానీ చివరికీ ఒక ఐఏఎస్‌ అధికారిణిని పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. దాదాపు 28 ఏళ్ల వయసు కొడుకు ఉన్న ఓ మహిళా అధికారిణిని పెళ్లాడటం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. తన భర్త మీడియా వ్యక్తి కావడంతో ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి.. తనకి అన్యాయం చేశాడని చాలాసార్లు పూజిత చెప్పుకొచ్చింది.

    కాగా.. విజయగోపాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన పూజితకు ఓ కుమారుడు జన్మించారు. దాదాపు 14 ఏళ్ల తరువాత పూజితను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు విజయ గోపాల్. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో నటి పూజిత రోడ్డుకెక్కింది.  ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీలో బాగా వైరలైంది. కానీ అప్పట్లో పూజితతో తాను కేవలం సహజీవనం మాత్రమే చేశానని ఆమె భర్త విజయ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 
     

  • బాలీవుడ్‌ నటుడు, రణవీర్‌, దీపికా పడుకోన్‌ దంపతుల కమార్తె దువా ఇంత చిన్న వయసులోనే లైవ్‌ షో ఇచ్చి అదరగొట్టింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC)లో తన పెర్‌ఫామెన్స్‌తో దీప్‌వీర్ అభిమానులను ఆకట్టుకుంది. ధురందర్‌ సినిమా భారీ హిట్‌ కావడంతో సంతోషంలో మునిగితేలుతున్న రణవీర్‌కు  దువా తన టాలెంట్‌తో మరింత ఆనందాన్ని ఇచ్చింది అంటున్నారు ఫ్యాన్స్‌. 

    'ధురందర్' స్టార్ రణ్‌వీర్ సింగ్, తన కుమార్తె దువా మొదటి కోకో మిలన్ (చిన్న పిల్లల కార్టూన్‌ షో) లైవ్ మ్యూజికల్ షో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రణవీర్ సింగ్ , దీపికా పడుకోన్ తమ బిడ్డ దువా మొదటి లైవ్ షోను ఎంజాయ్‌ చేశారు. షో అనంతరం, రణవీర్ తన  ఆనందాన్ని వ్యక్తం చేశారు. "ఇది మా దువా పాపకి తొలిప్రదర్శన కాబట్టి మాకు చాలా ప్రత్యేకమైనది. జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలను మిగుల్చుకునే అవకాశవ కల్పించిన NMACC బృందానికి చాలా కృతజ్ఞుడను’’, అంటూ NMACC బృందానికి ధన్యవాదాలు తెలిపారు.తాను, దీపిక, ఇంకా తాతయ్య, నానమ్మలతో కలిసి ఈ మ్యూజికల్‌కు హాజరైందని రణ్‌వీర్ వెల్లడించారు. ఎంతో సరదా, సంతోషం, అదొక రంగులమయం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని తెగ సంతోష పడిపోయాడు.

     

    కాగా  దీపికా, రణవీర్‌లు 2018 నవంబర్ 14న పెళ్లి చేసుకోగా, 2024లో వారికి కుమార్తె జన్మించింది. మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఇటీవల వీరు ప్రకటించారు.

     

  • సొంతూరిలో సరదాగా తిరిగేస్తున్న నభా నటేశ్

    నాభి అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్

    చిత్రమైన డ్రస్‌లో జాన్వీ కపూర్ పోజులు

    పెట్ డాగ్‌తో భాగ్య శ్రీ బోర్సే సరదా సరదాగా

    సీరియస్ లుక్‌లో అందంగా 'దృశ్యం' ఎస్తర్

    ట్రిప్ జ్ఞాపకాలు పంచుకున్న జైన్ మేరీ ఖాన్

  • ప్రముఖ మలయాళ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్ షియాస్ కరీంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేరళలోని పాలారివట్టం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తనపై లైంగిక వేధింపులతో పాటు ఆర్థికంగా మోసం చేశాడంటూ విదేశాల్లో నివసిస్తున్న ఓ మహిళ కేరళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

    తన నగ్న చిత్రాలను అశ్లీల వెబ్‌సైట్లలో పెడతానని బెదిరించాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తన వద్ద నుంచి రూ.65 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన సోషల్ మీడియా చాటింగ్స్, వాయిస్ రికార్డింగ్‌లను పోలీసులకు అందించింది. షియాస్ కరీంకు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులను సైతం పోలీసులకు సమర్పించింది. అతని వల్ల తాను తీవ్ర మానసిక వేధింపులకు గురయ్యానని ఫిర్యాదులో ప్రస్తావించింది. వేధింపులు భరించలేకనే పోలీసుల ముందుకు వచ్చానని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

    కాగా.. గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులతో పాటు ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు షియాస్‌ను అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం చెన్నై విమానాశ్రయంలో అతడిని అరెస్టు చేశారు. అప్పట్లో ఎర్నాకుళంలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న కాసరగోడ్‌కు చెందిన మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగిక దాడి వేధింపులతో పాటు దాదాపు రూ.11 లక్షలు వసూలు చేశాడని ఆ మహిళ ఆరోపించింది.
     

  • కూతురిని చాలా ప్రేమించే తండ్రి.. కానీ కూతురేమో ఓ కుర్రాడితో ప్రేమలో పడటం. తద్వారా ముగ్గురి జీవితాల్లో ఏర్పడే సంఘర్షణ ‍అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి స్టోరీతో తీసిన మరో మూవీ 'గోదారి గట్టుపైన'. సుమంత్ ప్రభాస్, జగపతిబాబు, నిధి ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోంది.

    (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా)

    షార్ట్ ఫిల్స్మ్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు గోదారి గట్టుపైన' చిత్రం చేశాడు. మే 08న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. పేరుకు తగ్గట్లే సరదాగా సాగిపోయే ప్రేమకథ చిత్రంలా అనిపించింది. అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి క్రేజ్ తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ మూవీతో దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.

    (ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)

  • టాలీవుడ్ మాస్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో జతకట్టారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

    ఇక సినిమాల సంగతి పక్కనపెడితే పూరి జగనాధ్‌ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైఫ్‌ పాఠాలు చెబుతుంటారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో తన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా పూరి రిలీజ్‌ చేసిన వీడియో మన టైమ్, మనీ గురించి మాట్లాడారు. ప్రతి రోజు మనం ఖర్చు చేస్తున్న సమయం గురించి వివరించారు. లైఫ్‌లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్‌ కాదని సందేశమిచ్చారు. గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఏం చేసినా తిరిగి తీసుకురాలేమని అన్నారు.  రియల్‌ కరెన్సీ పేరుతో పూరి ఏమన్నారో మీరు కూడా చదివేయండి.

    'అందరికీ దేవుడు ఇచ్చింది రోజుకి 24 గంటలు మాత్రమే. ఎన్ని గంటలు ఉన్నాయన్నది కాదు.. ఆ 24 గంటలు ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మనం ప్రతి రోజు డబ్బు కోసం రాత్రి, పగలు కష్టపడతాం. ఆరోగ్యం పాడు చేసుకుంటాం. డబ్బు కంటే విలువైన సమయాన్ని మాత్రం పట్టించుకోం. టైం గురించి వివరంగా చెప్పాలంటే.. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. రాత్రి అయ్యేసరికి నువ్వు ఏం చేసినా.. చేయకపోయినా ఖర్చు అయిపోతుంది. మళ్లీ ఉదయం చూసుకుంటే పర్సు నిండా 24 గంటలు నిండే ఉంటాయి'  అని అన్నారు.

    'నువ్వు టైమ్‌ను వేస్ట్ చేసినా కరిగిపోతుంది.. తెలివిగా ఇన్వెస్ట్ చేసినా అయిపోతుంది. ఈ రెండింటిలో మనం ఏం చేస్తున్నామనేది చాలా ముఖ్యం. ఎన్నేళ్లు కష్టపడినా పర్లేదు.. ఏదో రోజు బోలెడంత డబ్బు సంపాదించి మిగిలిన జీవితమంతా హ్యాపీగా బతుకుదామనుకుంటాం. బాగా సంపాదించిన తర్వాత ఎంజాయ్‌ చేయడానికి టైముండదు. అందుకే అదే రియల్ కరెన్సీ. డబ్బు మాయలో పడి కుటుంబంతో గడిపే అరుదైన క్షణాలు కోల్పోతాం. మిత్రులతో గడిపే అందమైన సాయంత్రాలు మిస్ అవుతాం'

    'ఒక రోజులో మన నాలుగు గంటలు ట్రాఫిక్.. మరో నాలుగు గంటలు చిరాకులో గడిచిపోతాయి. మిగతావి నిద్రకు కేటాయిస్తాం. ఈరోజు కాకపోతే రేపు గుడ్‌న్యూస్‌ వింటామని ఎదురు చూస్తూ నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా మన జీవితంలో ఎంత పోగొట్టుకున్నామో కరిగిపోయిన కాలమే సమాధానం చెబుతుంది. ఈ భూమ్మీద మనకి లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ప్రాణం వదిలేస్తాం. అందుకే వీలైనన్ని మధుర క్షణాలు మన అకౌంట్‌లో పడితేనే పుట్టినందుకు.. ఇక్కడ గడిపినందుకు ఏదో ఓ మీనింగ్ అంటూ ఉంటుంది. లేకపోతే ఈ జర్నీ మొత్తం నాశనమైపోద్ది' అంటూ సమయం విలువను కరెన్సీతో పోలుస్తూ సందేశమిచ్చారు మన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.

     

  • హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

    సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.

    'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!)

  • టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్‌గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

    జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్‌తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.

    ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్‌కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

    (ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?')

  • కేజీఎఫ్ తర్వాత యశ్ నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం టాక్సిక్. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ ఓసారి వాయిదా వేశారు. మార్చిలో రావాల్సిన ఈ చిత్రం జూన్‌కు పోస్ట్‌పోన్ అయింది. ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేసిన మేకర్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. టీజర్‌లో బోల్డ్ సీన్‌ ఉండడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఈ మూవీ రిలీజ్‌ మరోసారి వాయిదా పడనుందనే టాక్ వినిపిస్తోంది. జూన్ 4న రిలీజ్‌ కావడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మూవీ షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం కూడా ఉన్నట్లు సమాచారం.

    ఓటీటీ డీల్‌ ఆలస్యం..!

    ఈ బిగ్‌ మూవీ ఓటీటీ డీల్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ మూవీ నిర్మాతలు డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఓటీటీ యాజమాన్యాలు రూ.110 కోట్లకు పైగా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. నిర్మాతల డిమాండ్ వల్లే టాక్సిక్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.

    యశ్ వల్లేనా..?

    ఈ మూవీ ఓటీటీ డీల్ ఆలస్యానికి హీరో యశ్‌ ఓ కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులకు ఓటీటీ డీల్ సమయంలో ఆ సంస్థ ప్రతినిధులకు సినిమా ప్రివ్యూ చూపించాలి. కానీ మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే చూడాలని..ముందే చూపించడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గుతుందని యశ్‌ భావిస్తున్నారట. యశ్ నిర్ణయం వల్ల తీసుకున్న అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు ఓటీటీలు వెనకాడుతున్నాయని లేటేస్ట్ టాక్. అందుకే టాక్సిక్ మరోసారి వాయిదా తప్పదని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
     

  • ఒకప్పుడు స్టార్ హీరోగా వరస హిట్స్ అందుకున్న రవితేజ.. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. ఎంతలా అంటే సరైన హిట్ కొట్టి దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది. ఆడియెన్స్ కూడా ఇతడి మూవీస్ థియేటర్లలో రిలీజ్ అవుతున్నా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే మూవీతో వచ్చాడు. కంటెంట్ పర్లేదనిపించింది గానీ వసూళ్లు పెద్దగా రాలేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే ఇప్పుడు రవితేజ చేయబోయే కొత్త సినిమా కోసం ఓ విచిత్రమైన టైటిల్ అనుకుంటున్నారట.

    (ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)

    ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే సినిమాని రవితేజ చేస్తున్నారు. కూతురి సెంటిమెంట్‌తో పాటు అయ్యప్ప మాలకు సంబంధించిన పార్ట్ కూడా ఇందులో ఉండనుంది. దీని తర్వాత చేయబోయే మూవీ ఏంటనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడదే ఫైనల్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. 'రాజరాజచోర' అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మెప్పించిన హసిత్ గోలి.. తర్వాత 'స్వాగ్' తీశాడు గానీ ఫ్లాప్ అయింది.

    ఇప్పుడీ దర్శకుడే రవితేజకు ఓ స్టోరీ చెప్పాడని, దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే  'అక్కాయిలు బాగున్నారా?' అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్‌ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్‌ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 
     

     

  • సినిమాల్లో కమర్షియల్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటేనే థియేటర్లలో ఆడతాయి. సమాజంలో జరిగే చాలా సంఘటనలని చూపించాలనుకుంటే మాత్రం వెబ్ సిరీస్‌లు బెస్ట్ ఆప్షన్. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరిగాయి, జరుగుతున్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులపై ఓ సిరీస్ తీశారు. దాని ‍స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించారు. తెలుగులోనూ ఇది అందుబాటులోకి రానుందని వెల్లడించారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

    'ప్రేమదేశం' లాంటి సినిమాతో హీరోగా అప్పట్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న అబ్బాస్.. తర్వాత కాలంలో నటనకు దూరమైపోయాడు. రీసెంట్‌గానే 'హ్యాపీరాజ్' అనే తమిళ సినిమాలో తండ్రిగా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు 'ఎగ్జామ్' అనే సోషల్ థ్రిల్లర్ సిరీస్‌లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయనకు ఇదే ఓటీటీ అరంగేట్రం కావడం విశేషం.

    దుశారా విజయన్, అదితీ బాలన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఎగ్జామ్' సిరీస్.. మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ దర్శకద్వయం పుష్కర్-గాయత్రి దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ కాగా ఏ.సర్కుణం దర్శకత్వం వహించారు. మీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది ఎగ్జామ్, మరి ఎగ్జామ్‌ని డిసైడ్ చేసేది ఎవరు? అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. చూస్తుంటే పోటీ పరీక్షల్లో జరిగే లొసుగులు ఇందులో చూపించబోతున్నారనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: ప్రీమియర్లకే నెగిటివ్ టాక్.. కానీ తొలి వీకెండే 'మైఖేల్'కి వేల కోట్ల కలెక్షన్స్)

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: నర్సీపట్నం ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌‌ గణేశ్‌పై జరిగిన దాడిని ఖండించారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు. 

    ‘హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు ఉమాశంకర్ గణేశ్‌పై దౌర్జన్యం చేశారు. ఉమాశంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో విఫలమైన శాంతిభద్రతలకు ఈ సంఘటన నిదర్శనం. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు నిజాన్ని అణచివేయలేవు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలి. దాడికి దిగిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. ఉమా శంకర్ గణేశ్‌కు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ అన్నారు. 

    నర్సీపట్నం సృష్టి క్షేత్రంలో తవ్వకాలపై హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట  అక్రమంగా పనులు జరుగుతున్నాయి. వాటిని మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ పరిశీలించి.. పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు. ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. ఆపై బరితెగించి ఆయనపై దాడి చేశారు.  
     

  • నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్‌ వాహనంపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఉమా శంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రంలో అక్రమంగా మట్టి తవ్వకం, ఇతర పనులు జరుగుతున్నాయి. వాటిని ఉమా శంకర్ పరిశీలించారు. హైకోర్టులో స్టే ఉండగా పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు.

    ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. హైకోర్టులో కేసు ఉండగా మట్టిని ఎలా తరలిస్తున్నారని ఉమాశంకర్ ప్రశ్నించారు. టీడీపీ గూండాల బరితెగింపును నిలదీశారు. కాగా, నర్సీపట్నంలో టీడీపీ గూండాలూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. మట్టి తవ్వకం,  పనుల నిర్మాణంపై ఇప్పటికే ఉమా శంకర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సృష్టి క్షేత్రంపై ఫిర్యాదు చేసినప్పటికీ కలెక‍్టర్‌ పట్టించుకోలేదు. 

  • సాక్షి,కృష్ణా: కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కృష్ణాజిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

    మచిలీపట్నం పోర్టు, రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ కొరత పై చర్చించాం. దేశంలో ఎక్కడా లేనంత కొరత ఏపీలోనే ఉంది. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

    రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా పోర్టులు పూర్తిచేయించేందుకు పోరాటం చేస్తాం. ఎన్నికల నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చాలా వేగంగా సాగింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు పూర్తయిపోతాయి.మే 5 నుంచి 10వ తేదీలోపు మచిలీపట్నం పోర్టును సందర్శిస్తాం
    పోర్టు అధికారులను అనుమతి కోరాం.

    అనుమతులు రాగానే తేదీని ప్రకటిస్తాం.రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తున్నారు. కేవలం పదివేల కోట్లు పోర్టులు,హార్బర్లకు ఖర్చు పెట్టలేరా . వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం పోర్టుల పనులు చేపట్టడం లేదు.రాష్ట్రంలో అన్ని పోర్టులు, హార్బర్లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.. పోరాటం చేస్తాం’అని హెచ్చరించారు. 

  • తాడేపల్లి:  ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచి పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోలు బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

    విత్తనాలు దగ్గర నుంచి వంట గ్యాస్‌ వరకూ ఇదే పరిస్థితి
    ‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్‌ బ్లాక్‌ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. 

    వాస్తవం మీకు కూడా తెలుసు..
    వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. 

    ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్‌ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు.

     

  • ఢిల్లీ:  ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. 

    ‘ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఏపీ రాష్ట్రంలో 4510 పెట్రోల్‌ బంకుల్లో 70 శాతం నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ రేషన్‌ విధిస్తున్నారు. కానీ పెట్రోలియం శాఖ దేశ వ్యాప్తంగా  పెట్రోల్ డీజిల్ సప్లై కి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుంది  

    ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయికి , ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు  ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం. 

    పెట్రోల్ డీజిల్ కొరత ఫలితంగా వ్యాపారులు రైతులు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలి.  ఏపీ అవసరాలకు తగిన పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.

  • సాక్షి,నక్కలపల్లి: అనకాపల్లి జిల్లా నక్కల పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలపై ఏథర్‌ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయాపడ్డారు.

    అప్రమత్తమైన స్థానికులు వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచండంతో ఓ మహిళను అనకాపల్లికి చెందిన ఓ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.    

    నక్కపల్లి వైపు నుండి అడ్డురోడ్డు వైపు మహిళా కూలీలు నడుస్తూ వెళ్తుండగా.. వారి వెనక నుంచి ఏథర్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

  • బి.కొత్తకోట: చంద్రబాబు తంబళ్లపల్లె టీడీపీ నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం రండి రండి అని   పలుకుతూనే.. వద్దు వద్దు అంటూ సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితిపై తంబళ్లపల్లె టీడీపీ నేతలు తలలు బాదుకుంటున్నారు. మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో అప్పటి టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

    గత ఏడాది అక్టోబర్‌ నుంచి పార్టీకి ఇన్‌చార్జి లేరు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల క్రితం అమరావతికి శంకర్‌ను, పార్టీ మండల అధ్యక్షులను చంద్రబాబు ఆహ్వానించారు. ఆయన నివాసంలో సమావేశం నిర్ణయించారు. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడు కాదు, వెళ్లిపోండి అని సమాచారం అందడంతో వెళ్లిన వారంతా నిరుత్సాహంగా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది.

    శనివారం సాయంత్రం శంకర్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఆదివారం ఉదయం అమరావతి రావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇలాంటి ఆహ్వానం వస్తుందా అని కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న టీడీపీ నాయకులకు  ఈ పిలుపు ఎడారిలో ఒయాసిస్సులా  అనిపించింది. అప్పటికప్పుడు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా అంతలోనే మళ్లీ కబురొచ్చింది. వద్దు వద్దు మీరు రాకండి.. మళ్లీ  ఎప్పుడు వచ్చేది చెబుతామంటూ సమాచారం ఇచ్చారు. దీంతో నాయకుల్లో ఉత్సాహం గంటల్లోనే నీరుగారిపోయింది

National

  • ముంబై-సోలాపూర్ వందే భారత్ రైలు పుణే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం (ఏప్రిల్‌ 27) రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో స్టేషన్‌లోకి ప్రవేశించే వేళ నాల్గో బోగీకి చెందిన ఒక ట్రాలీ డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పిందని సెంట్రల్ రైల్వే తెలిపింది.

    ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి ప్రారంభమై మహారాష్ట్రలోని సోలాపూర్ దిశగా వెళ్తోంది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. సాధారణ ప్రమాణాలకు అనుగుణంగా లేని డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగింది. పుణే స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా దీన్ని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

    అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు వారిని మరొక రేక్‌కి మార్చే ఏర్పాట్లు చేసినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారత్‌లో స్వదేశీగా అభివృద్ధి చేసిన మొదటి సెమీ హైస్పీడ్ రైలు. 2019లో భారతీయ రైల్వే దీన్ని ప్రారంభించింది. ఇది సంప్రదాయ రైళ్లతో పోలిస్తే వేగంగా, సౌకర్యవంతంగా, సాంకేతికంగా ఆధునికమైనది. 

  • మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.గాయపడిన రోగిని తరలించేందుకు అతని భార్యతో అంబులెన్స్‌ను శుభ్రం చేయించిన అమానుష ఘటనపై అంబులెన్స్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్‌ కావడంతో ఆరోగ్య శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    శుక్రవారం సాయంత్రం ఉమరియా-బర్హి రోడ్డులోని ఖితౌలి సమీపంలో ఉన్న కరేలా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాహుల్ బర్మన్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రాహుల్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డయల్ 112 సహాయంతో అతడిని మొదట బర్హి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని కట్నీ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. బర్హి నుంచి కట్నీకి తీసుకువస్తుండగా, నొప్పి, గాయం కారణంగా రోగి రాహుల్ అంబులెన్స్ కిటికీలోంచి వాంతి చేసుకున్నాడు.దీంతో ఉద్యోగి మోహిత్ నాయక్ రోగి భార్యపై అంబులెన్స్‌ను శుభ్రం చేయమని ఒత్తిడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి భార్య నీళ్లు పోస్తూ అంబులెన్స్‌ను శుభ్రం చేస్తూ కనిపిస్తుంది.

    ప్రత్యక్ష సాక్షుల ప్రకారం,ఈ సమయంలో అంబులెన్స్ సిబ్బంది సున్నితత్వం లేకుండా ప్రవర్తించారు. ఆ మహిళకు ఏమాత్రం సహాయం చేయలేదు.ఆ తర్వాత జబల్‌పూర్‌కు తరలించారు: కట్నీ జిల్లా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, రాహుల్ పరిస్థితి మరింత విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని జబల్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు.

     

    ఈ మొత్తం విషయంపై చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్ఓ) డాక్టర్ రాజ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రాథమిక ప్రకటన వివాదాస్పదంగా ఉంది. అంబులెన్స్‌లో రక్తస్రావం జరిగి ఉండవచ్చని, దానిని ఆ మహిళ శుభ్రం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అంబులెన్స్ మేనేజర్‌తో మాట్లాడిన తర్వాత సమగ్ర విచారణ జరిపి తెలిపారు.

  • ముంబై:  ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత.  ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్‌ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్‌ పాయిజన్‌ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. 

    బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్‌లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్‌ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు. 

    అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర  అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్‌ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు. 

    వారి డాక్టర్‌ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు.  వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి  కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు. 

    బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్‌ పాయిజన్‌ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.  పోస్ట్‌మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్‌ దొకాడియా(35), ఐషా(16), జైనబ్‌(13)లుగా పోలీసులు తెలిపారు. 

  • కోల్‌క‌తా: త‌మ పార్టీ నాయ‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీని ప్ర‌ధాన‌మంత్రిగా చూడాల‌నుకుంటున్న‌ట్టు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, న‌టి, గాయ‌కురాలు స‌యాని ఘోష్ అన్నారు.  2029లో దేశానికి మ‌మ‌త ప్ర‌ధాని అవుతారా అని మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు ఈ విధంగా జ‌వాబిచ్చారామె. ప‌శ్చిమ‌ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా ఓ టీవీ చాన‌ల్ రిపోర్ట‌ర్‌తో ఆమె ప్ర‌త్యేకంగా మాట్లాడారు. మ‌మ‌త ప్ర‌ధాని అయితే ముఖ్య‌మంత్రి కావాల‌న్న కోరిక ఉందా అని ప్ర‌శ్నించ‌గా.. అటువంటిదేమీ లేద‌ని స‌మాధానం ఇచ్చారు.

    రాఘ‌వ్ చ‌ద్దా లాగా మీరు కూడా ఎప్పుడైనా సొంత పార్టీని వీడిని బీజేపీలో చేరే అవ‌కాశం ఉందా అని అడ‌గ్గా.. అలాంటి ప‌రిస్థితే ఉత్ప‌న్నం కాద‌న్నారు. ''నేను సయాని ఘోష్, రాఘవ్ చద్దాను కాదు. ఎప్ప‌టికీ సంఘ ప‌రివార్‌కు దూరంగానే ఉంటాన‌''ని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తూ ప్ర‌తిప‌క్ష‌ ఎంపీల‌ను బీజేపీ భ‌య‌పెడుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ ద‌గ్గ‌ర వేల కోట్ల డ‌బ్బు, ఈడీ, సీబీఐ, అధికారం ఉంటే.. త‌మ‌కు అండ‌గా హ‌వాయి చెప్పులు, తెల్ల‌చీర ధ‌రించిన మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నార‌ని అన్నారు.

    బెంగాల్ బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారి బ్రిగేడ్ నేత అంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను సయాని ఘోష్ (Saayoni Ghosh) స‌మ‌ర్ధించుకున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీని ఉద్దేశించి ఆయ‌న దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఆ మాట‌లు వింటే బిగ్రేడ్ కాదు, సీగ్రేడ్ నాయ‌కుడంటార‌ని పేర్కొన్నారు. బెంగాల్ ప్ర‌జ‌లు మ‌ళ్లీ త‌మ పార్టీకే ప‌ట్టం క‌డ‌తార‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేశారు.

    ప్ర‌చారంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌
    జాద‌వ్‌పూర్ లోక్‌స‌భ స్థానానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సయాని ఘోష్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణమూల్ కాంగ్రెస్ త‌ర‌పున పెద్ద ఎత్తున‌ ప్ర‌చారం సాగించారు. త‌న వాక్చాత్యురం, హావ‌భావాల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఎక్క‌డికి వెళ్లినా త‌నదైన శైలిలో ఓట‌ర్ల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. దీంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. తృణమూల్ యూత్‌ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

    చ‌ద‌వండి: కేజ్రీవాల్‌కు షాక్‌.. చ‌ద్దాకు జాక్‌పాట్‌? 

    ముగిసిన ఎన్నిక‌ల ప్ర‌చారం
    ప‌శ్చిమ బెంగాల్ రెండో ద‌శ ఎన్నిక‌ల‌కు ప్రచారం సోమ‌వారం సాయంత్రం ముగిసింది. ప్ర‌ధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నిక‌లు ప్ర‌చారం సాగించాయి. ఆయా పార్టీల అగ్ర‌నేత‌ల ప్ర‌చారంతో బెంగాల్ హోరెత్తింది. బీజేపీ త‌ర‌పున ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్నారు. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. 29న రెండో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 4న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. 

     

  • ఢిల్లీ, సాక్షి: "సర్కే చునార్ తేరీ సర్కే"పాటలో అశ్లీలత, మహిళలను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై వచ్చిన ఆందోళనలకు సంబంధించి కీలక పరిణామం  చోటు చేసుకుంది.  సోమవారం నటుడు సంజయ్ దత్ జాతీయ మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు జయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్‌కు లిఖితపూర్వక క్షమాపణను సమర్పించారు.  ఈ విషంయంపై విచారం వ్యక్తం చేస్తూ, సృజనాత్మక కంటెంట్‌లో మహిళలకు బాధ్యతా యుతమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకతను అంగీకరిస్తానని హామీ ఇచ్చారని మహిళా కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

    50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం
    ఒక దిద్దుబాటు చర్యగా, సామాజిక సంక్షేమానికి , మహిళా సాధికారతకు సానుకూలంగా దోహదపడే దిశగా, సంజయ్ దత్ 50 మంది గిరిజన బాలికల విద్యకు ఆర్థిక సహాయం చేయడానికి అంగీకరించారు. ఇకపై, సినిమాలు మరియు సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులలో మహిళలు ,పిల్లలకు గౌరవప్రదమైన మరియు సముచితమైన ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు, తప్పనిసరి చట్టపరమైన నిబంధనలను చేర్చుతానని సంజయ్‌ దత్‌ కమిషన్‌కు హామీ ఇచ్చారు.

    ఈ విచారణ సందర్భంగా ఎన్‌సీడబ్ల్యూ అనేక అంశాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. ఈ వివాదానికి సంబంధించి ఏప్రిల్ 6న దర్శకుడు, కిరణ్ కుమార్ అలియాస్ ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం , గౌతమ్ కె.ఎం. కెవిఎన్ ప్రొడక్షన్ ప్రతినిధులు  కూడా ఎన్‌సీడబ్ల్యూ ముందు హాజరై క్షమాపణలు తెలిపారు. మరోవైపు నటి నోరా ఫతేహిని కూడా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఆమె ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున హాజరు కాలేకపోయారు. ఆమె మరో తేదీని కేటాయించమని కమిషన్‌ను కోరారు.

    కాగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన సినిమాలోని ‘సర్కే చునార్ తేరి సర్కే’ పాట పెద్ద వివాదానికి దారితీసింది.ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ దుమారం చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినిమా యూనిట్‌ను ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్‌ను తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.

  • యూపీలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్  అనుచిత వైఖరి సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది.  ఈ వీడియోను @NewsAlgebraINDతో సహా   ట్విటర్‌లో పలువురు యూజర్లు  ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం  షట్‌ అప్‌, షట్‌ అప్‌ గెట్‌లాస్ట్‌ అంటూ   ఒక విద్యార్థి తల్లిపై సన్‌బీమ్ పాఠశాల ప్రిన్సిపాల్ మమతా మిశ్రా  విచక్షణా రహితంగా విరుచుకుపడింది.  దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.పాఠశాల పుస్తకాల కొనుగోలు నిబంధనలను పాటించనందుకు, వారి పిల్లల పేరును తొలగించమని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.


    బయటి విక్రేతల నుండి పుస్తకాలు కొనడంపై పాఠశాల విధానాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై "నోరు మూయండి! ఇక్కడి నుండి వెళ్ళిపోండి!" అని అరుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతో హర్దోయ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.  పాఠశాల యాజమాన్యాల వైఖరి, సిబ్బంది ప్రవర్తన,  జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

    దీనిపై వివాదం మరింత ముదరడంతో ప్రిన్సిపాల్ మమతా మిశ్రా ఆ రోజు ఏం జరిగిందో, తాను తల్లిదండ్రులపై ఎందుకు అరిచానో వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

     హర్దోయ్‌లోని సన్‌బీమ్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తన వివరణలో పేర్కొన్న దాని ప్రకారం నెలకు రూ.1,300 ఫీజును తగ్గించాలని తల్లిదండ్రులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో  సహనం కోల్పోయింది. ఫీజును ఇంకా ఎంత తగ్గించాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. సంఘటన జరిగిన రోజున, పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరుగుతోందని, ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు అప్పటికే తెలియజేశామనిన్నారు. సాధారణంగా, టీకాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉంటారు, కానీ ఇది పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో, పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

    సరిగ్గా ఆసమయంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అదే రోజు తమ ఆందోళనలను వ్యక్తం చేసి, ప్రక్రియకు అంతరాయం కలిగించారనేది ఆమె అయితే. అంతేకాదు తమ పాఠశాల ఎల్లప్పుడూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఏళ్లుగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. చాలా మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.వైరల్ వీడియోలో సంఘటనలోని కొంత భాగాన్ని మాత్రమే చూపించారని, పూర్తి సందర్భం అందులో లేదని ఆమె అన్నారు. ఒక చిన్న క్లిప్ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని  విజ్ఞప్తి చేశారు. 


    ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు

     

    బాధిత మహిళ వాదన
    తల్లి నీలం వర్మ ప్రకారం, కేవలం 15 రోజుల గడువు పొడిగింపు కోరినందుకే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అప్పటికే నోట్‌బుక్‌లతో సహా పూర్తి కోర్సును కొనుగోలు చేశాను, కానీ భర్త ప్రస్తుతం ఊళ్లోలేని  కారణంగా  15 రోజుల సమయం కోరానని, అయినా కనీస మర్యాద లేకుండా, దుర్బాషలాడుతూ పిల్లల వస్తువులను రోడ్డుపై విసిరేశారని వాపోయింది.

    ఇదీ చదవండి : రూ. లక్షకు కొని, ‘లక్’‌ లేదని వదిలేశారు.. షాకింగ్‌ ఫ్యాక్ట్స్‌

     

  • భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని, భోపాల్‌ దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆడబిడ్డ ఇంటికి లక్ష్మిలాంటిది అని భావిస్తారు. కానీ తమ కుటుంబానికి, వ్యాపారానికి రెండున్నరేళ్ల పాపను ఇంటికి  పట్టిన శనిగా భావించారు. ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. ఏప్రిల్ 18న  నేషనల్‌ హైవేపై వదిలేశారు. కట్‌ చేస్తే..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 

    షియోపూర్ జిల్లాలోని ఒక హైవేపై తమ రెండున్నరేళ్ల కుమార్తెను వదిలేశారు ఒక వ్యాపారవేత్త కుటుంబం.  పోలీసులు ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.  అయితే వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగు చేశాయి. ఏప్రిల్ 18న షియోపూర్‌లోని సోయిన్‌కలాన్‌లో జాతీయ రహదారి-552పై ఆ పాప ఒంటరిగా కనిపించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక బాలల సంక్షేమ కమిటీ (CWC)కి సమాచారం అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ కమిటీ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుంది.

    అయితే ఈకేసు విచారణలో అనుమానిత బాలల అక్రమ రవాణా ముఠా వ్యవహారం తెలిసింది. ఆ పాపను వారు దత్తత తీసుకోలేదు, రూ.లక్షకు ఇండోర్‌లోని ఒక అక్రమ నెట్‌వర్క్ ద్వారా కొనుగోలుచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బలహీన వర్గాల నుంచి పిల్లలను సేకరించి, దత్తత ముసుగులో కొనుగోలు దారులకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.

     

    సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు, చిన్నారిని పడేయడానికి ఉపయోగించిన వాహనాన్ని  భోపాల్‌లో గుర్తించారు. తద్వారా గుణకు చెందిన ఒక వ్యాపారవేత్త దంపతులను అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నామని  వాదింయినప్పటికీ పోలీసుల సుదీర్ఘ విచారణలో అసలు విషయం ఒప్పుకుని, ఆ బాలికను ఇండోర్‌కు చెందిన ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, ఆమె సహచరుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.అయితే ఆ పాప ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తమకు అరిష్టం జరుగుతోందని, అందుకే ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశామని వారు ఒప్పుకున్నారు.

    మరోవైపు ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భోపాల్‌కు చెందిన ఒక మహిళ, తాను ఆ చిన్నారి మాజీ సంరక్షకురాలినని చెప్పుకుంటూ, ఆ బాలిక శారీరక వేధింపులకు గురైందని పోలీసులకు తెలిపింది. బిడ్డను చూసుకోవడానికి తనను నెలకు రూ. 20,000 జీతానికి నియమించుకున్నారని, అయితే జీతం అందకపోవడంతో తాను పని మానేశానని  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    పోలీసులు ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఉన్న ఇండోర్‌కు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారి కన్న తల్లిదండ్రులను గుర్తించి, ఈ దందా పూర్తి స్థాయిని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు
     

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరిగిన 39వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్‌ (2-0-21-1), సుయాశ్‌ (4-1-7-1), కృనాల్‌ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది.

    ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్‌ పోరెల్‌ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (19), జేమీసన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్‌, సమీర్‌ రిజ్వి, అక్షర్‌ పటేల్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్‌ 5, కుల్దీప్‌ 3 పరుగులు చేశారు.

    అనంతరం ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్‌ బేతెల్‌ ఔట్‌ కాగా.. పడిక్కల్‌ (34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (23 నాటౌట్‌) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్‌ వికెట్‌ జేమీసన్‌కు దక్కింది. 
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో పిచ్ ఆది నుంచి పేస‌ర్ల‌కు అనుకూలంగా మార‌డంతో ఆర్సీబీ బౌల‌ర్లు హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లు చెల‌రేగిపోయారు. చెరో మూడు ఓవ‌ర్లు వేసిన ఈ ఇద్ద‌రు చెరో మూడు వికెట్లు త‌మ ఖాతాలో వేసుకోవ‌డం విశేషం. 

    బంతి అనూహ్యంగా బౌన్స్‌, స్వింగ్ అవ్వ‌డంతో 10 ప‌రుగుల్లోపే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇంత చెత్త ఆట‌లోనూ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ అరుదైన రికార్డు న‌మోదు చేశాడు. టీ20ల్లో 12వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెట‌ర్‌గా డేవిడ్ మిల్ల‌ర్ నిలిచాడు. 11 ప‌రుగుల స్కోరు వ‌ద్ద ఉన్న‌ప్పుడు మిల్ల‌ర్ ఈ ఘ‌న‌త సాధించాడు. 

    మిల్ల‌ర్ టీ20ల్లో 12వేల ప‌రుగులు పూర్తి చేయ‌డానికి 565 మ్యాచ్‌లు (513 ఇన్నింగ్స్‌లు) తీసుకున్నాడు. మిల్ల‌ర్ కంటే ముందు క్వింట‌న్ డికాక్ (12,454 ప‌రుగులు), పాఫ్ డుప్లెసిస్ (12,041 ప‌రుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో 12వేల ప‌రుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాట‌ర్‌గా మిల్ల‌ర్ నిలిచాడు. ఇక టీ20ల్లో మిల్ల‌ర్ 56 సార్లు ఫిఫ్టీ మార్క్ సాధించాడు. నాలుగుసార్లు సెంచ‌రీలు బాదాడు. 

    ఇక 2012లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మిల్ల‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 149 మ్యాచ్‌లాడి 3,100 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ స‌హా 14 అర్థ‌శ‌త‌కాలు చేశాడు. అయితే ఈ పద్నాలుగింటిలో 13 హాఫ్ సెంచ‌రీలను మిల్ల‌ర్ ల‌క్ష్య‌ఛేద‌న‌లో సాధించ‌డం మ‌రో విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ పొరేల్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 4, భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశారు.

    చదవండి: అమ్మాయి చేసిన‌ పనికి అభిషేక్ శ‌ర్మ షాక్‌!

  • ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతూ, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక స్పిన్నర్ మిచెల్‌ సాంట్నర్‌ భుజం గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌ మహారాజ్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.

    ఈ సీజన్‌లో సాంట్నర్‌ను గాయాల సమస్య వెంటాడింది. ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అతని కుడి భుజానికి గాయమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

    తరువాత కోలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఏప్రిల్ 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన పోరులో మళ్లీ అదే భుజానికి గాయమైంది. దీంతో అతను సీజన్‌ మొత్తానికే దూరమవాల్సి వచ్చింది.

    సాంట్నర్ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లు తీశాడు. ముంబై బౌలింగ్ విభాగంలో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సాంట్నర్‌ దూరం కావడం ముంబై ఇండియన్స్‌కు భారీ దెబ్బగా పరిగణించబడుతుంది.

    ప్రత్యామ్నాయంగా మరో స్టార్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ను తీసుకున్నప్పటికీ.. అతను ఏ మేరకు ముంబై కష్టాలను తీర్చగలడో చూడాలి. సాంట్నర్‌ తరహాలోనే ఎడమచేతి స్పిన్నర్ అయిన మహారాజ్‌కు టీ20ల్లో అపార అనుభవం ఉంది. అతడు 218 టీ20 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు.

    ముంబై ఏప్రిల్ 29న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. కేశవ్ మహారాజ్ రాకతో జట్టు బౌలింగ్ దళానికి కొత్త బలం చేకూరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
     

  • ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికాలో పర్యటించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు ఓటమితో పర్యటనను ముగించింది. ఈ సిరీస్‌ను ఇదివరకే కోల్పోయిన టీమిండియా.. బెనోని వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరిగిన నామమాత్రపు చివరి టీ20లో 23 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత్‌కు లభించిన ఏకైక గెలుపు నాలుగో మ్యాచ్‌లో వచ్చింది.

    ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్‌ (92 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సూన్‌ లస్‌ 23, తజ్మిన్‌ బ్రిట్స్‌ 2, అన్నెరి డెర్క్‌సన్‌ డకౌట్‌, అన్నెకె బాష్‌ 8, క్లో ట్రయాన్‌ 12, నదినే డి క్లెర్క​్‌ 1, సినాలో జఫ్టా 16 (నాటౌట్‌) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, శ్రీచరణి, దీప్తి శర్మ తలో 2 వికెట్లు తీశారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో భారత్‌ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ, ఒత్తిడికిలోనై చివరికి టార్గెట్‌ను పెద్దది చేసుకుంది. భారతి ఫుల్మలీ (40), రిచా ఘోష్‌ (25 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో లక్ష్యం పెద్దది కావడంతో చేతులెత్తేశారు. ఫలితంగా భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

    భారత ఇన్నింగ్స్‌లో షఫాలీ వర్మ 4, అనుష్క శర్మ 17, జెమీమా రోడ్రిగ్స్‌ 1, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 22, దీప్తి శర్మ 8, అరుంధతి రెడ్డి 1, క్రాంతి గౌడ్‌ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా, డి క్లెర్క్‌ చెరో 2, ఎలిజ్‌ మారి, క్లో ట్రయాన్‌, ఖాకా తలో వికెట్‌ తీశారు. 

  • పాక్‌ క్రికెటర్లకు భారత ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో ఈ తంతు మరీ ఎక్కువైంది. కొందరు ప్రస్తుత ఆటగాళ్లు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.

    తాజాగా ఆ జట్టు టాపార్డర్‌ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌ భారత బౌలర్లపై తనకెప్పుడూ ఆగ్రహంగా ఉంటుందని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

    ఒక ఇంటర్వ్యూలో హసన్ నవాజ్‌కు ప్రపంచ స్థాయి బౌలర్లను ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఏ బౌలర్ అయినా లక్ష్యంగా చేసుకుంటామని, అవసరమైతే ఎవరిపైనైనా దాడి చేస్తామని అన్నాడు.

    భారత్ గురించి అడిగినప్పుడు అతని సమాధానం మరింత వివాదాస్పదంగా మారింది. "భారత్ అనగానే, ప్రతి బౌలర్‌ను తప్పకుండా టార్గెట్ చేయాలనిపిస్తుంది. వారి ప్రతి బౌలర్‌పై మాకు ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. వారిని బలంగా ఎదుర్కోవాలనుకుంటాం" అని అన్నాడు.

    క్రీడల్లో ప్రత్యర్థిపై గెలవాలనే తపన సహజం. అయితే "ద్వేషం" వంటి పదాల వాడకం అనవసర వివాదాలకు కారణమవుతుంది. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ లాంటి సున్నిత సందర్భాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుంది.

    హసన్ నవాజ్ ఇప్పటివరకు భారత్‌పై ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఆసియా కప్‌ 2025లో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులకే ఔటయ్యాడు. కుల్దీప్‌ యాదవ్‌ అతని వికెట్‌ను పడగొట్టాడు.

    ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో హసన్‌ మంచి ఫామ్‌లో కనిపించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున పది మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే, అతని జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) ఓపెన‌ర్‌ అభిషేక్ శ‌ర్మ విధ్వంసం కొన‌సాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 380 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్న అభిషేక్ సెంచ‌రీతో పాటు మూడు అర్థ‌శ‌త‌కాలు సాధించాడు. 

    ఇక శ‌నివారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ అనంత‌రం ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు హోట‌ల్ రూంకు చేరుకునే స‌మ‌యంలో అభిషేక్ శ‌ర్మ‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదుర‌య్యింది. అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఒక అమ్మాయి చేయి పట్టుకుని లాగింది.  ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్క‌సారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందిగానే అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

    భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

     చదవండి: ఏమిటీ ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌’.. ఎంతమంది ఔటయ్యారంటే?

  • క్రికెట్ చ‌రిత్ర‌లో ‘అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్‌. ఈ నిబంధ‌న ఎప్ప‌టి నుంచో అమ‌ల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేకేఆర్‌, ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావ‌డంతో ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.  మ‌రి అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంత‌ర్జాతీయ క్రికెట్‌లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది క్రికెట‌ర్లు అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట‌య్యార‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

    అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ అంటే?
    క్రికెట్ చ‌ట్టాల‌ను రూపొందించే ఎంసీసీ చ‌ట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ అనే నిబంధ‌న ఉంది. 37.2 నిబంధ‌న ప్ర‌కారం ఓ బ్యాట‌ర్ ఉద్దేశ‌పూర్వంగా త‌న వికెట్ కాపాడుకోవ‌డానికి బంతిని చేతితో అడ్డుకున్న‌ట్ల‌యితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా కింద ప‌రిగ‌ణిస్తూ బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు. 

    అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా 11 మంది ఆట‌గాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్‌ రహీం 11వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇద్ద‌రే ఇలా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. వీరిలో ర‌హీం రెండ‌వ ఆట‌గాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్‌కు చెందిన లియోనార్డ్ హ‌ట‌న్ మొద‌టి ప్లేయ‌ర్‌. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క ఆట‌గాడు అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో మొహింద‌ర్ అమ‌ర్‌నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.

    అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆట‌గాళ్లు..
    రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్‌నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.

    ఐపీఎల్‌లో నాలుగుసార్లు..
    ఇక ఐపీఎల్ విష‌యానికొస్తే ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన 19 సీజ‌న్ల‌లో న‌లుగురు ఆట‌గాళ్లు అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట‌య్యారు. ఈ జాబితాలో యూస‌ఫ్ ప‌ఠాన్‌, అమిత్ మిశ్రా, ర‌వీంద్ర జ‌డేజా ఉండ‌గా.. తాజాగా అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ చేరాడు.

    యూస‌ఫ్ ప‌ఠాన్‌


    ఐపీఎల్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆట‌గాడిగా ఆల్‌రౌండ‌ర్ యూస‌ఫ్ ప‌ఠాన్ నిలిచాడు. 2013 సీజ‌న్‌లో రైజింగ్ పుణే వారియ‌ర్స్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డింది. కేకేఆర్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో 72 ప‌రుగుల‌తో ఆడుతున్న యూస‌ఫ్ ప‌ఠాన్ బౌల‌ర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు విసిరిన బంతికి అడ్డువ‌చ్చాడు. దీంతో ఉద్దేశ‌పూర్వ‌కంగానే బంతికి అడ్డువ‌చ్చిన‌ట్లు పుణే ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో అంపైర్ ఔటిచ్చాడు.

    అమిత్ మిశ్రా


    2019 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అమిత్ షా ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌల‌ర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మ‌ధ్య‌లో ప‌రిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీప‌ర్ నాన్‌స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్ల‌డంతో అంపైర్ ఔట్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.

    ర‌వీంద్ర జ‌డేజా
    2024 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా  సీఎస్‌కే  బ్యాట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్‌ప‌రుగు వ‌ద్ద‌ని వారించ‌డంతో జ‌డేజా వెన‌క్కి ప‌రిగెత్తే క్ర‌మంలో త‌న దిశ‌ను మార్చుకున్నాడు. అప్ప‌టికే బంతిని అందుకున్న కీప‌ర్ శాంస‌న్ బంతిని విస‌ర‌డం, అదే స‌మ‌యంలో జ‌డేజా అడ్డు రావ‌డంతో అంపైర్ అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.

    అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ
    తాజాగా 2026 సీజ‌న్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఇదే త‌ర‌హాలో ఔట‌య్యాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మ‌హ్మ‌ద్ ష‌మీ బంతిని వేగంగా అందుకోవ‌డంతో.. ర‌ఘువంశీ స‌గం దూరం వెళ్ళాక మళ్ళీ వెన‌క్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. 

    అయితే వెన‌క్కి వెళ్లే క్ర‌మంలో ష‌మీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెన‌క్కి పరిగెత్తాడని పంత్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్‌ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్  కింద అవుట్‌గా ప్రకటించారు.

    చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’

  • ఆర్సీబీ ఘన విజయం
    ఢిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 6.3 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదేసింది. 20 పరుగులు చేసి జేకబ్‌ బేతెల్‌ ఔట్‌ కాగా.. పడిక్కల్‌ (34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (23 నాటౌట్‌) ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.బేతెల్‌ వికెట్‌ జేమీసన్‌కు దక్కింది. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    2.5వ ఓవర్‌- 76 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. జేమీసన్‌ బౌలింగ్‌లో నటరాజన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో జేకబ్‌ బేతెల్‌ (20) ఔటయ్యాడు. 

    75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4) చెలరేగడంతో 75 పరుగులకే కుప్పకూలింది. భువీ, హాజిల్‌కు రసిక్‌ (2-0-21-1), సుయాశ్‌ (4-1-7-1), కృనాల్‌ (2-0-9-1) తోడవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. 

    ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అభిషేక్‌ పోరెల్‌ (30) పుణ్యమే. అతనితో పాటు డేవిడ్‌ మిల్లర్‌ (19), జేమీసన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లలో సాహిల్ పరాఖ్‌, సమీర్‌ రిజ్వి, అక్షర్‌ పటేల్‌ డకౌట్లు కాగా.. కేఎల్‌ రాహుల్‌, నితీశ్‌ రాణా తలో పరుగు చేశారు. స్టబ్స్‌ 5, కుల్దీప్‌ 3 పరుగులు చేశారు. 

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
    12.3వ ఓవర్‌- 62 పరుగుల వద్ద ఢిల్లీ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో జేమీసన్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

    ఏడో వికెట్‌ డౌన్‌
    8.6వ ఓవర్‌- 43 పరుగుల వద్ద ఢిల్లీ ఏడో వికెట్‌ కోల్పోయింది. రసిక్‌ సలాం బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి డేవిడ్‌ మిల్లర్‌ (19) ఔటయ్యాడు.

    ఆరో వికెట్‌ డౌన్‌
    3.5వ ఓవర్‌- ఆర్సీబీ పేసర్లు చెలరేగిపోతున్నారు. 8 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో నితీశ్‌ రాణా (1) ఔటయ్యాడు. 

    7 పరుగులకే సగం వికెట్లు డౌన్‌
    2.4వ ఓవర్‌- 7 పరుగుల వద్దే ఢిల్లీ ఐదో వికెట్‌ కూడా కోల్పోయింది. భువీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ () ఔటయ్యాడు. 

    7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
    2.1వ ఓవర్‌- ఢిల్లీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భువీ బౌలింగ్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 7 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.

    పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్‌లు తగిలాయి. రెండో బంతికే భువీ సాహిల్‌ పారఖ్‌ (0), రెండో ఓవర్‌ తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ను (1), రెండో బంతికి సమీర్‌ రిజ్విని (0) హాజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) జరుగుతున్న 39వ మ్యాచ్‌లో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో, ఢిల్లీ ఏడో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఢిల్లీకి ఇకపై ప్రతి మ్యాచ్‌ కీలకమే. 

    తుది జట్లు..
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(సి), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తన జట్టు ఓడినా, సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రుతురాజ్‌ ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున 100 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. 

    తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రుతురాజ్‌కు ముందు ధోని (234), సురేశ్‌ రైనా (180), శివమ్‌ దూబే (106) మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం రుతురాజ్‌ ఖాతాలో 101 సిక్సర్లు ఉన్నాయి.

    కాగా, నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్‌ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్‌ అందించినప్పటికీ.. సీఎస్‌కే పరాజయంపాలైంది. రుతురాజ్‌ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 

    సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ మినహా ఎవరూ రాణించలేదు. సంజూ శాంసన్‌ 11, ఉర్విల్‌ పటేల్‌ 4, సర్ఫరాజ్‌ ఖాన్‌ డకౌట్‌, బ్రెవిస్‌ 2, శివమ్‌ దూబే 22, కార్తీక్‌ శర్మ 15, ఓవర్టన్‌ 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్‌ ఖాన్‌ 2, సిరాజ్‌, సుతార్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని గుజరాత్‌ టైటాన్స్‌ ఆడుతుపాడుతూ ఛేదించింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (87) భారీ అర్ద సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అతనికి కెప్టెన్‌ గిల్‌ (33), బట్లర్‌ (39) సహకరించారు. సీఎస్‌కే బౌలర్లలో అకీల్‌ హొసేన్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌ తర్వాత గుజరాత్‌ ఐదో స్థానానికి ఎగబాకగా.. సీఎస్‌కే ఆరో స్థానానికి పడిపోయింది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కృనాల్ పాండ్యా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. జ‌ట్టులో కీల‌క ఆల్‌రౌండ‌ర్‌గా కొన‌సాగుతూ విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఒక క్రికెట‌ర్‌గా తాను ఏంతో ప‌రిణితి చెందానని, ఒక‌ప్ప‌టి పాండ్యాను కాద‌ని.. చాలా మారిపోయానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 

    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్ నేప‌థ్యంలో కృనాల్ పాండ్యా క్రికెట‌ర్‌గా త‌న ప్ర‌యాణంతో పాటు ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పాండ్యా మాట్లాడుతూ.. ‘కాలక్రమేణా నేను మంచి వ్యక్తిగా మారాను. ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. 

    నా తల్లిదండ్రులు నన్ను పెంచిన తీరుకు ఈ ఘనత దక్కుతుంది.  ఒక మనిషిగా మాత్రం మారలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఆడటానికి ఇప్పటికీ అంతే ఉత్సాహంగా, ఆసక్తిగా ఉంటాను. నేను ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని. నా కుటుంబాన్ని, పిల్లలను, భార్యను అమితంగా ప్రేమిస్తాను. నా తల్లిదండ్రులు ప్రతీ విషయంలో నాకు అండగా నిలిచారు. 

    మీరు విజయాన్ని రుచి చూసినప్పుడు, రెండు విషయాలు జరగవచ్చు, ఒకటి మీరు పిచ్చివాళ్లు అయిపోతారు లేదా అది మిమ్మల్ని వినయవంతులుగా చేస్తుంది. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. నేను ఎదిగే కొద్దీ, మరింత వినయవంతుడిగా మారాను, అందుకే నాకు కుటుంబం చాలా ముఖ్యం.’ అని చెప్పుకొచ్చాడు.

    ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున కేకేఆర్‌పై తొలి మ్యాచ్ ఆడిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ‘ఆర్సీబీ తరఫున నా తొలి మ్యాచ్ ఆడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. షారుఖ్ సర్ వేదికపై ఉండటం, ప్రేక్షకులు నినాదాలు చేయడం నాకు గుర్తుంది. పవర్‌ప్లేలో నా మొదటి ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చాను. 

    10 ఓవర్లలో కేకేఆర్ 110 పరుగులు చేసింది, వాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. తర్వాతి ఓవర్‌లో నేను అజింక్య రహానేను డీప్ స్క్వేర్ లెగ్ వద్ద అవుట్ చేశాను. అప్పుడు వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో నేను ఒక బౌన్సర్ వేయాలనుకున్నా. అయితే వెంటనే వెంకటేశ్ అయ్యర్ తన హెల్మెట్ పెట్టుకున్నాడు. కానీ తర్వాతి బంతికే వెంకటేశ్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.’ అని పేర్కొన్నాడు. 

    వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గెలవడాన్ని గుర్తుచేసుకున్న కృనాల్ పాండ్యా 2025 సీజన్‌లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడం తన కెరీర్‌లో మరిచిపోలేని క్షణమని తెలిపాడు. కోహ్లితో కలిసి ట్రోఫీని అందుకోవడం ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతూనే ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సీజ‌న్‌లో కృనాల్ పాండ్యా 7 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 149 మ్యాచ్‌లాడిన కృనాల్ 1792 ప‌రుగులు చేయ‌డంతో పాటు బౌలింగ్‌లో 101 వికెట్లు తీశాడు.

    చదవండి: థామ‌స్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. క్వార్టర్స్‌కు భారత్‌

  • ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, చెన్నై యాజమాన్యం ముంబైకి చెందిన యువ ఆల్‌రౌండర్ ఆయుశ్‌ వర్తక్‌ను మిడ్-సీజన్ ట్రయల్స్‌కు పిలిచింది.

    ఈ సీజన్‌లో చెన్నై పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్ రుతురాజ్‌ నాయకత్వంలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ, గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.

    లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆయుశ్‌ మాత్రే, ఖలీల్‌ అహ్మద్‌ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.

    ఈ నేపథ్యంలో ముంబై, పార్సీ జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయుష్ వర్తక్‌ను చెన్నై ట్రయల్స్‌కు పిలిచింది. అతడు త్వరలోనే చెన్నై జట్టుతో కలవనున్నాడు.

    21 ఏళ్ల అయుష్ వర్తక్ దేశీయ క్రికెట్‌లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. కుడిచేతి మీడియం పేసర్‌గా, దిగువ వరుసలో వేగంగా పరుగులు చేసే బ్యాటర్‌గా మంచి పేరు సంపాదించాడు.

    నవి ముంబై టీ20 లీగ్‌లో అతడు 264 పరుగులు చేసి, 191 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అదనంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

    ఇప్పటికే ఆకాశ్‌ మధ్వాల్‌ను అయుష్ మాత్రే స్థానంలో జట్టులోకి తీసుకున్న చెన్నై, ఖలీల్ అహ్మద్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. ఆ లోటును వర్తక్ భర్తీ చేసే అవకాశం ఉంది.

    ప్రస్తుతం చెన్నై జట్టులో డెవాల్డ్‌ బ్రెవిస్‌, నాథన్‌ ఇల్లిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

    ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో అయుష్ వర్తక్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

     

     

  • ప్ర‌తిష్ఠాత్మ‌క థామ‌స్ క‌ప్‌లో భార‌త జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో భాగంగా సోమ‌వారం ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 5-0తో విజ‌యం సాధించింది. ఇప్ప‌టికే కెనడాను 4-1తో మ‌ట్టిక‌రిపించిన భార‌త్ గ్రూప్‌-ఏలో టేబుల్ టాప‌ర్‌గా కొన‌సాగుతుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు భార‌త్ ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ స్థానంలో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ ఆడాడు.

    తొలుత సింగిల్స్‌లో ల‌క్ష్య‌సేన్ 21-14, 21-16తో స్టీఫెన్ సామ్‌పై విజ‌యం సాధించాడు. ఆ త‌ర్వాత మ‌రో సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి 21-8, 21-6తో శ్రేయ్ ధండ్‌పై విజ‌యం సాధించ‌డంతో భార‌త్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ త‌ర్వాత డ‌బుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్ జోడి 21-14, 21-16తో రిజ్కీ హిద‌య‌త్‌-జాక్ యూ జంట‌పై గెలుపొందింది. 

    ఆ త‌ర్వాత రివ‌ర్స్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ 21-11, 21-17తో రిషి హొండా భూప‌తిని, డ‌బుల్స్‌లో హ‌రిహ‌ర‌న్‌-అర్జున్ జోడి 21-12, 21-10తో అండికా ర‌మ‌డియ‌న్‌-సామ్ జంట‌పై విజ‌యం సాధించ‌డంతో భార‌త్ 5-0తో స్ప‌ష్ట‌మైన ఆధిక్యంతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 

    ఇక బుధ‌వారం భార‌త్ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ చైనాతో త‌ల‌ప‌డ‌నుంది. గ‌త థామస్ క‌ప్‌లో చైనా చేతిలో ఓడిన‌ భార‌త్ క్వార్ట‌ర్స్‌కే ప‌రిమిత‌మైంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ సాధించాల‌నే ధృడ నిశ్చ‌యంతో ఉంది.

    చదవండి: వైభవ్ ఇదేం పని.. ఫొటోకు వంద రూపాయలా?

  • స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌, ఇవాళ (ఏప్రిల్‌ 27) ప్రారంభమైన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. చట్టోగ్రామ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ప్రత్యర్దిని 182 పరుగులకు (6 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేటీన్‌ క్లార్క్‌ (51), డేన్‌ క్లీవర్‌ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో జోష్‌ క్లార్క్‌సన్‌ (27 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ 2, షోరిఫుల్‌ ఇస్లాం, తంజిమ్‌ హసన్‌ సకీబ్‌, మెహిది హసన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తౌహద్‌ హృదోయ్‌ (51 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హృదోయ్‌కు పర్వేజ్‌ హొసేన్‌ (28), షమీమ్‌ హొసేన్‌ (31 నాటౌట్‌) సహకరించారు. 

    మిగతా ఆటగాళ్లలో సైఫ్‌ హసన్‌ 17, తంజిద్‌ హసన్‌ 20, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ 21 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఐష్‌ సోధి 2, జోష్‌ క్లార్క్‌సన్‌, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్‌ 29న జరుగనుంది.

     

     

  • ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కీలక ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ను ప్రకటించి అభిమానుల్లో చర్చకు తెరలేపాడు. బట్లర్‌ టీమిండియా విధ్వంసకర ఆటగాడు, ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు ఈ జట్టులో చోటు కల్పించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

    బట్లర్‌ రోహిత్‌ను విస్మరించడాన్ని హిట్‌మ్యాన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌పై శీతకన్ను ప్రదర్శించి, అతని సమవుజ్జీ అయిన విరాట్‌ కోహ్లిని జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. బట్లర్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా దిగ్గజం ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు.

    ఈ జట్టులో బట్లర్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు పెద్దపీట వేశాడు. ఓపెనర్లుగా విరాట్‌ కోహ్లి, క్రిస్‌ గేల్‌లను ఎంపిక చేసి.. మూడో స్థానంలో 'మిస్టర్ ఐపీఎల్'గా పేరొందిన సురేశ్‌ రైనాకు చోటిచ్చాడు. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు.

    మిడిలార్డర్‌లో వెస్టిండీస్ దిగ్గజాలు కీరన్‌ పోలార్డ్‌, ఆండ్రీ రసెల్‌\కు స్థానం కల్పించి.. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనిని ఎంచుకున్నాడు.

    ఆల్‌రౌండర్లుగా రషీద్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను లసిత్‌ మలింగ, జస్ప్రీత్‌ బుమ్రాకు అప్పగించాడు. ఈ జట్టులో బట్లర్‌ తన పేరును కూడా చేర్చకోకపోవడం కొసమెరుపు.

    మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్‌తో నిర్వహించిన 'For The Love Of Cricket' పోడ్‌కాస్ట్‌లో బట్లర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును వెల్లడించాడు.

    బట్లర్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు:
    విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, కీరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.

     

     

  • ఐపీఎల్‌ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఇవాళ (ఏప్రిల్‌ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    ఒమర్‌జాయ్‌కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్‌ కింగ్స్‌ బృంద సభ్యులు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నారు. ఈ విషాద వార్తను ఆఫ్ఘనిస్తాన్‌ మాజీ కెప్టెన్ అస్గర్‌ అఫ్గాన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్‌కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "అల్లాహ్ ఆమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

    ఈ హఠాత్పరిణామంతో ఒమర్జాయ్ ఐపీఎల్‌ను మధ్యలో వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేందుకు అతడు త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు అపరాజితంగా కొనసాగుతోంది. బలమైన జట్టు కూర్పు కారణంగా ఒమర్జాయ్‌కు ఈ సీజన్‌లో ఇంకా ఒక్క అవకాశం కూడా రాలేదు.

    గత సీజన్‌లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఒమర్‌జాయ్‌కు ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. కాగా, పంజాబ్‌ రేపు సొంత మైదానం ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. 

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతుంది. 15 ఏళ్ల వయసులోనే అగ్రశ్రేణి బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న సూర్యవంశీ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. ఈ సీజన్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తోన్న వైభవ్ తాజాగా తనతో ఫొటో దిగాలని వచ్చిన ఇద్దరు చిన్న పిల్లలను ఆటపట్టించడం ఆసక్తికరంగా మారింది. 

    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్తాన్ రాయల్స్ జట్టు తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడేందుకు ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగిన వైభవ్ వద్దకు ఇద్దరు పిల్లలు వచ్చి ఫొటో దిగాలని అడిగారు. తాను ఫొటో దిగేందుకు రెడీనే అని, కానీ తాను ఏదీ ఉచితంగా చేయనని పేర్కొన్నాడు. 

    వైభవ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్‌.. నేను మీతో ఫొటో దిగాలంటే మీరు ఒక్కో ఫొటోకు నాకు వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.’ అని పేర్కొన్నాడు. దీంతో పిల్లలు 200 రూపాయలు తీసుకొచ్చి వైభవ్ చేతిలో పెట్టారు. అయితే డబ్బులు పిల్లలకు తిరిగి ఇచ్చిన వైభవ్..‘ ఇది కేవలం ప్రాంక్ మాత్రమే.. మీ డబ్బులు మీరు తీసుకోండి’ అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరు చిన్నారులను దగ్గరికి తీసుకొని వారితో ఫొటో దిగాడు. 

    దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. 

    వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేశాడు. ఇందులో 31 బౌండరీలు, 32 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లాడి 5 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో ఆడ‌నుంది.

    చదవండి: గిల్‌పై బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు!

  • భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ల కొర‌త ఎక్కువ‌గా ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత ఇప్ప‌టివ‌ర‌కు  సరైన బౌలర్లు దొరకలేదు. అర్ష్‌దీప్ సింగ్ ఉన్న‌ప్ప‌టికి కేవ‌లం టీ20ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నాడు. దీంతో భార‌త వ‌న్డే, టెస్టు జ‌ట్టులో ఎడ‌మ చేతి వాటం పేస‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది.

    అయితే ఇప్పుడు మొహ్సిన్ ఖాన్ రూపంలో మరో లెప్ట్ ఆర్మ్ పేసర్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆదివారం  ఏకానా స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొహ్సిన్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 

    త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం కేవ‌లం 23 ప‌రుగులిచ్చి 5 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో తొలి ఐదు వికెట్ల హాల్ సాధించిన బౌల‌ర్‌గా అత‌డు నిలిచాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా మూడు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అందులో రెండు వికెట్ మెయిడెన్ ఓవ‌ర్లు ఉన్నాయి. 

    మొహ్సిన్‌కు అద్భుత‌మైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. వైవిధ్యంగా బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. అదే స‌మ‌యంలో స‌రైన పేస్ కూడా జ‌న‌రేట్ చేయ‌గ‌ల‌డు. సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో కూడా అతడు బౌలింగ్‌ చేస్తున్నాడు. కాగా అత‌డు దేశ‌వాళీ క్రికెట్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 2018లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ క్రికెట్‌లోకి, అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. 

    అనంతరం 2020లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2018లో అత‌డిని ముంబై ఇండియ‌న్స్ తొలిసారిగా కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో అత‌డికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవ‌కాశం ల‌భించ‌లేదు. కానీ జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజాలతో ట్రావెల్ చేశాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌-2022 వేలంలో మొహ్సిన్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

    ఆ సీజ‌న్‌లో అత‌డు  9 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అత‌డు ఇప్పటివ‌ర‌కు 28 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా అత‌డి పేరిట 89 టీ20 వికెట్లు ఉన్నాయి. సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్న మొహ్సిన్‌ను భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని మాజీ క్రికెట‌ర్లు సూచిస్తున్నారు. మ‌రికొంత‌మంది ఒక‌డుగు ముందుకేసి భార‌త బౌలింగ్ దిగ్గ‌జం జ‌హీర్ ఖాన్‌తో పోలుస్తున్నారు.
    చదవండి: IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?


     

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ విష‌యంలో ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ఫీల్డ్‌లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు జ‌రుగుతున్నాయి. ఆరం భంలో వ‌రుస ప‌రాజ‌యాలు, మ‌ధ్య‌లో విజ‌యాలు, మ‌ళ్లీ ఓట‌మి.. ఇలా సీఎస్‌కే త‌న ప్ర‌యాణాన్ని ప‌డుతూ లేస్తూ కొన‌సాగిస్తుంది. అయితే ఆన్‌ఫీల్డ్‌లో ఇలా ఉంటే ఆఫ్‌ఫీల్డ్‌లో సీఎస్‌కే కు అవ‌మానాలు జ‌రుగుతున్నాయి. 

    సీజ‌న్ ఆరంభంలో ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సీఎస్‌కే తాజాగా గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌పై ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది. ఇందులో నిజ‌మెంత అనేది తెలియ‌నప్ప‌టికీ గిల్‌పై సీఎస్‌కే చేసిన ఫిర్యాదు కాపీ మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

    అస‌లేం జ‌రిగింది?
    ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నై వేదిక‌గా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) త‌ల‌ప‌డింది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేపై గుజ‌రాత్ 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజ‌యం అనంత‌రం గుజ‌రాత్ కెప్టెన్ గిల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్‌కే ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేశాడు. 

    ఏఐతో రూపొందించిన త‌న ఫొటోను పంచుకున్న గిల్ చేతిలో పసుపు రంగు విజిల్ ప‌ట్టుకొని న‌వ్వుతూ క‌నిపించాడు. అయితే గిల్ పెట్టిన పోస్టు సీఎస్‌కే జెర్సీని, ఫ్రాంచైజీ నినాదం అయిన‌ విజిల్ పోడును అవమానిస్తున్న‌ట్లుగా ఉందంటూ సీఎస్‌కకే ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది న‌కిలీదా లేక నిజ‌మైనదేనా అన్న‌ది ఇంకా తెలియదు. అయితే సీఎస్‌కే ఫ్రాంచైజీ గిల్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన కాపీ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

    గతంలో ఆర్సీబీపై ఫిర్యాదు
    ఇక ఇదే సీజ‌న్‌లో 11వ మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే త‌ల‌ప‌డ్డాయి. సీఎస్‌కే ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ’దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అంటూ ఓ ట్రాక్‌ను డీజే ప్లే చేశారు. అయితే ఇవి దక్షిణాదికి చెందిన ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు. ఈ ట్రాక్‌పై సీఎస్‌కే తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. 

    ‘దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ’ అనే పదాలను వాడుతూ తమిళనాడు గుర్తింపును ఎగతాళి చేశారంటూ సీఎస్‌కే ఆర్సీబీ ఫ్రాంచైజీపై బీసీసీఐకి ఫిర్యాదులో చేసింది. కాగా ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సీఎస్‌కే ఐదో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. సీఎస్‌కే విధించిన 159 ప‌రుగుల టార్గెట్‌ను గుజ‌రాత్ మ‌రో 20 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. సాయి సుద‌ర్శ‌న్ (87), గిల్ (33), బ‌ట్ల‌ర్ (39 నాటౌట్‌) జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు.

    చదవండి: ‘వైభ‌వ్‌పై అనుమానముంది.. డోపింగ్‌ టెస్ట్ చేయాల్సిందే!’

  • ఐపీఎల్‌-2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఈ సీజన్‌లో ఎనిమిదింట ఐదో పరాజయం నమోదు చేసింది.

    ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గై​క్వాడ్‌ (60 బంతుల్లో 74 నాటౌట్‌) ఒక్కడే మెరుగైన స్కోరు సాధించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ శివం దూబేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

    సిక్సర్ల వీరుడని బిల్డప్‌
    ‘‘శివం దూబే పరుగులు రాబట్టలేక సతమతమవుతున్నాడు. సిక్సర్ల దూబేగా అతడికి బాగా ప్రచారం కల్పించారు. కానీ అతడు ఐపీఎల్‌లో ప్రభావంతమైన ఇన్నింగ్స్‌ ఆడి దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది. కేవలం స్పిన్‌ బౌలింగ్‌లో మాత్రమే హిట్టింగ్‌ ఆడేవాడిగా ఉండిపోవద్దు దూబే.

    టీమిండియాకు ఆడుతున్నాడు కానీ..
    నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌లో దూబే అద్బుతంగా ఆడుతున్నాడు. కానీ ఐపీఎల్‌లో తేలిపోతున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో అతడు విఫలం కావడం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పెద్ద సమస్యగా పరిణమించింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు.

    కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో 22 పరుగులు చేశాడు దూబే. ఈ సీజన్‌లో ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తంగా కేవలం 150 పరుగులు సాధించాడు.

    రుతు ఒక్కడే
    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. బౌలర్ల క్రమశిక్షణకు టాపార్డర్‌ మెరుపులు తోడవడంతోగుజరాత్‌ టైటాన్స్‌ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. 

    సొంతమైదానం చెపాక్‌ వేదికగా టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (60 బంతుల్లో 74 నాటౌట్‌) ఎట్టకేలకు అర్ధశతకం సాధించగా... మిగతావాళ్లు విఫలమయ్యారు.

    సాయి అదరగొట్టేశాడు
    గుజరాత్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కగిసో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... అర్షద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. 

    సాయి సుదర్శన్‌ (46 బంతులలో 87; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) దుమ్మురేపగా... కెప్టెన్‌శుబ్‌మన్‌ గిల్‌ (23 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు), బట్లర్‌ (30 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అతడికి అండగా నిలిచారు. చెన్నై బౌలర్లలో అకీల్, నూర్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

    చదవండి: Virender Sehwag: వైభ‌వ్, శ్రేయ‌స్ కాదు.. ఎవ‌రికీ టీమిండియాలో చోటు లేదు

  • ఐపీఎల్‌-2026 సీజన్ ముగిసిన త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు స్వ‌దేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుతో పాటు మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్‌పూర్ వేదిక‌గా భార‌త్‌-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.

    స్టార్ పేస‌ర్ ఆకాష్ దీప్ గాయం కార‌ణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్ర‌స్తుతం వెన్ను గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ గాయంతోనే అత‌డు ఐపీఎల్‌-2026 సీజ‌న్ నుంచి కూడా త‌ప్పుకొన్నాడు. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో అత‌డిని రూ.కోటికి  కేకేఆర్ సొంతం చేసుకుంది.

    కానీ అత‌డు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌కుండా వైదొలిగాడు. అత‌డు త‌న గాయం నుంచి కోలుకోవాడ‌నికి మ‌రో రెండు నెల‌ల స‌మయం ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డు తిరిగి శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. భార‌త టెస్టు సెటాప్‌లో ఆకాష్ దీప్ కీల‌క స‌భ్యుడు.

    జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్‌గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివ‌ర‌గా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా అతడు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు. ఆ సిరీస్‌లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్‌..13 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. మ‌రి ఇప్పుడు అత‌డు గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ అత‌డి స్ధానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేస్తుందో చూడాలి.
    చదవండి: IPL 2026: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం..! సీజన్‌ మధ్యలోనే?

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న సంచ‌న‌ల బ్యాటింగ్‌తో బౌల‌ర్ల‌కు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ బౌల‌ర్ల‌ను చిత‌క్కొడుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీ అల‌వోక‌గా బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదేస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా ఈ సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో శ‌త‌కంతో రెచ్చిపోయాడు. 

    ఇప్ప‌టికే ఆడిన 8 మ్యాచ్‌ల్లో వైభ‌వ్ సూర్య‌వంశీ 234 స్ట్రైక్‌రేట్‌తో 357 ప‌రుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభ‌వ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగ‌రేసుకుపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అగ్ర‌శ్రేణి బౌల‌ర్లంద‌రినీ ఉతికారేస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అత‌డి మెద‌డులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అన‌లిస్ట్ నౌమ‌న్ నియాజ్ స‌ర‌దా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది. 

    వైభ‌వ్ సూర్య‌వంశీ బుర్ర‌లో ఏఐ చిప్‌ను ఏమైనా ఇన్‌స్టాల్ చేశారేమోన‌ని త‌న‌కు అనుమానంగా ఉంద‌ని తెలిపారు. టీనేజీ వ‌య‌సులో ఉన్న‌ప్ప‌టికీ భారీ సిక్స‌ర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్‌కు డోపింగ్‌ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. 

    నౌమ‌న్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒక‌సారి వైభ‌వ్‌ను చెక్ చేస్తే బాగుంటుంది. అత‌డి బుర్ర‌లో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేసారా అన్న‌ది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్‌కు పంపించి ప‌రీక్షించాల్సిందే. వైభ‌వ్ నాకు మ‌నిషిలా అనిపించ‌డం లేదు. అయితే అత‌డి మీద అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. 

    నిజంగానే వైభ‌వ్ సూర్య‌వంశీ ఒక అద్భుత‌మైన ప్లేయ‌ర్‌. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అత‌డి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండ‌లు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్య‌వంశీ 18 ఏండ్లు నిండ‌కుండానే అత‌డి దేహ‌దారుఢ్యం బ‌లంగా క‌నిపిస్తోంది. రాబోయే సంవ‌త్స‌రాల్లో వైభ‌వ్ ఆట‌లో మ‌రింత రాటు దేల‌డం ఖాయం. 

    ఇప్పుడు వైభ‌వ్‌కు 15 ఏళ్లు. త్వ‌ర‌లోనే టీమిండియా త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది.నిజానికి అత‌డి బ్యాటింగ్‌లో పెద్ద‌గా టెక్నిక్స్ క‌నిపించ‌వు. కానీ అత‌డి మ‌ణికట్టు బ్యాటింగ్‌తో బౌల‌ర్ల‌కు చుక్కుల చూపిస్తూ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌గా త‌యారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లాడి 5 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. లీగ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో ఆడ‌నుంది.

Business

  • ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.

    నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్‌కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రాక్‌మాన్‌లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''

    ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?
    శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్‌లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్‌బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.

  • ఇన్వెస్కో మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ ఫండ్, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌ వీటి లో ఉన్నాయి.

    మొదటిది సెన్సెక్స్‌ ఇండెక్స్‌లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఎన్‌ఎఫ్‌వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్‌ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్‌ ఆఫర్లు మే 7న ముగుస్తాయి.

  • జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

    తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్‌లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

    భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్‌లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!

    ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • చైనా కార్ల తయారీ దిగ్గజం బీవైడీ సరికొత్త కారు 'డెంజా జెడ్' (Denza Z)ను ఆవిష్కరించింది. మసెరటి గ్రాన్‌కాబ్రియో ఫోల్గోర్‌కు గట్టి పోటీని ఇచ్చే విధంగా రూపు దిద్దుకున్న ఈ కారును కంపెనీ 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో ఆవిష్కరించింది.

    బీవైడీ కంపెనీ ప్రధానంగా.. ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని దీనిని విఫణిలో ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. డెంజా జెడ్ ఆకట్టుకునే స్టైల్ కలిగి.. అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది. ఇది కూపే, కన్వర్టిబుల్, ట్రాక్-ఫోకస్డ్ వేరియంట్లలో లభించనుంది.

    2026 బీజింగ్ ఆటో షోలో కనిపించిన డెంజా జెడ్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రంగులో ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి మసెరటి కారు మాదిరిగా కనిపించే ఈ వాహనం.. ఎక్కువ ఫ్యాబ్రిక్ పొందునట్లు తెలుస్తోంది.

    డెంజా జెడ్ సిరీస్ మూడు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతుంది. ఇవి ఏడబ్ల్యుడీ సామర్థ్యాలను కలిగి సుమారు 1,000 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసేలా తయారైంది. ఇది కేవలం రెండు సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్ కారు.

    ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!

    కంపెనీ దీనిని చైనా షోరూమ్‌లలోకి చేర్చడానికి ముందే.. యూరప్, ఇతర దేశాల్లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని ధర 400,000-500,000 యెన్ల (58,600-73,200 డాలర్లు) వరకు ఉంటుందని అంచనా. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కావాల్సి ఉంది.

  • యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్‌ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.

    బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.

    గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.

    ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్‌.. 30వేల మందికి లేఆఫ్స్!

    పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది.

  • టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.

    దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.

    దీనికి ఉదాహరణ.. ఒరాకిల్‌లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్‌ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్‌గా అనిపించిందని తెలిపారు.

    ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్‌లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.

    ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి.

     ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

    మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్‌ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

  • సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 639.42 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో 77,303.63 వద్ద, నిఫ్టీ 194.75 పాయింట్లు లేదా 0.81 శాతం లాభంతో 24,092.70 వద్ద నిలిచాయి.

    ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, శ్రీ కృష్ణ దేవ్‌కాన్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, తాన్లా ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్ వంటివి నష్టాల్లో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ‘బీవోబీ సీనియర్‌ సిటిజన్‌ విశేష్‌ సమ్మాన్‌’ పేరుతో వృద్ధులైన ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతాను తీసుకొచ్చింది. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు అదనంగా ఇంటి వద్దే బ్యాంకింగ్‌ సేవలను ఈ ఖాతా ద్వారా అందుకోవచ్చు.

    60 ఏళ్లు నిండిన వారి కోసం ఈ ఖాతాను ప్రత్యేకంగా రూపొందించినట్టు ప్రకటించింది. కుటుంబంలో ఆరుగురు సభ్యుల కోసం ఉచిత ఆన్‌లైన్‌ డాక్టర్‌ కన్సల్టేషన్లను పొందొచ్చు. అలాగే, ఆన్‌లైన్‌లో ఔషధాల కొనుగోలుపై 15 శాతం, డయాగ్నోస్టిక్స్‌ సేవల చార్జీల్లో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రుణంపై ప్రాసెసింగ్‌ చార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్‌ అద్దెల్లోనూ 20 శాతం తగ్గింపు పొందొచ్చని సంస్థ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్‌ ప్రకటించారు. ఈ ఖాతాలో కనీస నిల్వ రూ.లక్ష ఉంచాలి.  

  • గతంలో స్థిరమైన ఉద్యోగం, చేతినిండా సంపాదన వచ్చాక మాత్రమే భారతీయులు పెట్టుబడుల గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి జెన్-జీ యువత (Gen Z) తమ ఇరవయ్యో ఏట అడుగుపెట్టకముందే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP)ల గురించి చర్చిస్తున్నారు.

    భారతీయ యువతలో ఆర్థిక అవగాహన మునుపటి కంటే గణనీయంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, ఆన్‌లైన్ ఆర్థిక సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల పెట్టుబడి అనేది కేవలం నిపుణులకు పరిమితమైన అంశం కాకుండా, సామాన్యుల రోజువారీ సంభాషణల్లో భాగమైపోయింది. నేడు యువతకు పెట్టుబడి పెట్టడం అనేది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి ఒక చిహ్నంగా మారుతోంది.

    భారీగా పెరుగుతున్న డీమాట్ ఖాతాలు
    పెట్టుబడి ధోరణిలో వచ్చిన ఈ భారీ మార్పునకు కోవిడ్-19 మహమ్మారి ఒక ప్రధాన చోదక శక్తిగా నిలిచింది. లాక్‌డౌన్ సమయంలో యువత ఆన్‌లైన్‌లో గడిపే సమయం పెరగడంతో యూట్యూబ్, పాడ్‌కాస్ట్‌లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సంక్లిష్టమైన మార్కెట్ అంశాలను సులభంగా అర్థం చేసుకున్నారు. గణాంకాల ప్రకారం, జనవరి 2023 నుండి ఆగస్టు 2024 మధ్య కాలంలోనే దేశంలో 6 కోట్లకు పైగా కొత్త డీమాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, నేటి యువత కేవలం సాంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఫ్రీలాన్సింగ్, గిగ్ వర్క్ వంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ మిగులు ఆదాయాన్ని వారు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఈక్విటీలు, సిప్ (SIP)లలో మదుపు చేస్తున్నారు.

    మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యువత జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 మధ్య నాటికి భారతదేశంలో డీమాట్ ఖాతాల సంఖ్య 20 కోట్లు దాటగా, అందులో ప్రతి నలుగురిలో ముగ్గురు 30 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. సెబీ (SEBI) 2025 సర్వే ప్రకారం, పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న వారిలో 56 శాతం మంది జెన్-జీ యువతే ఉన్నారు. అయితే, ఈ ఉత్సాహంతో పాటు కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం యువతకు సమాచారం తక్కువగా లేదు, కానీ అతిగా ఉంది. వేల సంఖ్యలో లభించే ఆన్‌లైన్ టిప్స్, మార్కెట్ అంచనాలలో ఏది నిజమో, ఏది ఊహాగానమో గుర్తించడం వారికి కష్టతరంగా మారుతోంది. కేవలం 30 శాతం మంది యువకులకు మాత్రమే కాంపౌండింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

    అవగాహన అవసరం 
    ఈ నేపథ్యంలో, యువత కేవలం ఉత్సాహంతో కాకుండా సరైన అవగాహనతో పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారానికి లోనుకాకుండా ఉండటానికి క్రమబద్ధమైన ఆర్థిక విద్యా కార్యక్రమాలు (Structured Learning) అవసరం. ప్రస్తుతం మార్కెట్ సిమ్యులేషన్స్, మెంటార్‌షిప్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ల ద్వారా యువతకు వాస్తవ మార్కెట్ పరిస్థితులపై శిక్షణ ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం త్వరితగతిన లాభాలు ఆర్జించడం కాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాట్లను పెంపొందించుకున్నప్పుడే భారత పెట్టుబడి రంగం సుస్థిరమైన భవిష్యత్తును కలిగి ఉంటుంది. యువత ఎంత మంది మార్కెట్లోకి వస్తున్నారనే దానికంటే, వారు ఎంత అవగాహనతో వస్తున్నారనేదే ముఖ్యం.


    - అజయ్ లఖోటియా, స్టాక్‌గ్రో ఫౌండర్‌ & సీఈవో

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ పోలీసులకు శుభవార్త. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

    పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారని గుర్తించిన డీజీపీ, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమన్నారు.

    అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. సరైన ఆధారాలు, ముందస్తు దరఖాస్తు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     

  • సాక్షి,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్‌ కింద పడి ముగ్గురు కార్మికులు మరణించారు. 

    పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. శంకర్‌ పల్లి మండలం, మహాలింగాపురంలో ఎన్‌సీసీ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలులకు క్రేన్‌ కింద పడింది. క్రేన్‌ కిందపడి ముగ్గురు కార్మికులు మరణించారు. పదిమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • సాక్షి,తెలంగాణ భవన్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్నీ కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో అన్నీ స్థాయిల కమిటీలు నియమించాలని ఆదేశించారు. కమిటీల నియామక బాధ్యతల్ని కేసీఆర్‌కు అప్పగించారు. కొత్త కమిటీలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. 

    సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో రైతుల పరిస్థితి దిగజారుతోంది. రాష్ట్రంలోని ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి ధాన్యం కొనడానికి చేతకావడం లేదు. కాంగ్రెస్‌ది చిల్లర ప్రభుత్వం’అని ధ్వజమెత్తారు. 

    మరోవైపు, కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తేజస్వి సూర్య ఒక వెధవ. ఆయన అలా మాట్లాడుతుంటే ఒక్కరూ నోరుమెదపలేదు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేది. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరు మెదపలేదు’అని అన్నారు. 

  • హైదరాబాద్‌:  నగరంలోని అంబర్‌పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్‌ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్‌పేటలోని మహేంద్ర, రెనాల్ట్‌ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో  చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. 

    ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. 

    కార్ల పార్క్‌ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  వాహనాలు పార్క్‌ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. 

    అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Politics

  • హైదరాబాద్‌:  కొత్తగా వచ్చే పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి అంటూ కేటీఆర్‌ తనదైన శైలిలో పేర్కొన్నారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్‌ఎస్‌) గురించి మీడియా అడిగిన ప్రశ్నకు  కేటీఆర్‌ స్పందిస్తూ.. పైవిధంగా పేర్కొన్నారు. 

    ఈరోజు(సోమవారం, ఏప్రిల్‌ 27వ తేదీ) తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో  మాట్లాడారు. ‘ తెలంగాణలో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సంక్షోభంపై బీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. రైతుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం’ అని తెలిపారు.

    ‘బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణను అవమానిస్తే కాంగ్రెస్‌ ఎంపీలు మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఉండి ఉంటే తేజస్వితో క్షమాపణలు చెప్పించేవాళ్లం’ అని పేర్కొన్నారు. 

    కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్
  • హైదరాబాద్‌:  బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలపై, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై  పార్టీ అధినేత కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్‌ఓ జాబితాను బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్‌.  

    ఈరోజు(సోమవారం, ఏప్రిల్‌ 27వ తేదీ) తెలంగాణ భవన్‌లో  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై బీఎల్‌ఓ జాబితాను కేసీఆర్‌ ప్రస్తావించారు. దీనికి బీఆర్‌ఎస్‌ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    ‘15రోజుల్లో బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్‌ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా కాదు.. ఫీల్డ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుంది,. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్‌  ఇవ్వను.  నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు.  

  • మచిలీపట్నం:  కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నవీన్‌ మిట్టల్‌ కాలనీ, కరగ్రహారం జగనన్న లే అవుట్లను మాజీ మంత్రి పేర్ని నాని పరిశీలించారు.  దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘ ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. పేదలకు మూడు సెంట్లు ఇస్తానన్న హామీని విస్మరించారు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ పేదవాడి సొంతింటి కల నెరవేర్చారు. పదివేల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల సొంతింటి ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. మచిలీపట్నంలో 16 వేల మందికి ఒకే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించాం. 

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తోంది. జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలు జరగని ఖాళీ స్థలాలను కొల్లు రవీంద్ర రద్దు చేస్తానని ప్రకటన చేయడం దారుణం. మచిలీపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు వైఎస్సార్‌సీపీ తరపున హామీ ఇస్తున్నాం.

    ఏ ఒక్క లబ్ధిదారుడి స్థలాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పేదల ఇళ్లను స్వాధీనం చేసుకుని కూటమి నేతలు లబ్ధి పొందాలనుకుంటున్నారు.  కూటమి నేతల యత్నాలను అడ్డుకునేలా పేదల తరపున న్యాయపోరాటం చేసేందుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. కూటమి దురాగత పాలనకు ఇప్పటికే రెండేళ్లు ముగిశాయి. మరో రెండున్నరేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది వైఎస్సార్‌సీపీ పాలనే. 

    గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రుద్రవరం టిడ్కో ఇళ్లను మధ్యలో వదిలేస్తే జగన్ హయాంలో వాటిని పూర్తిచేసి ప్రజలకు చేరువ చేశాం. ఆర్భాటంగా గృహ ప్రవేశాల పేరుతో కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. కానీ కనీసం త్రాగునీరు కరెంట్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. రుద్రవరం టిడ్కో ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారో జిల్లా కలెక్టర్ , మంత్రులు చెప్పగలరా?’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

  • సాక్షి,హైదరాబాద్‌ : కొత్త పార్టీని పక్కన పెట్టండి. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది.. భవిష్యత్తు లేదు. కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్థి.. నాకు శత్రువు కాదు’ అని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 

    రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలపై ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆ చిట్‌చాట్‌లో మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌), బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

    ‘కొత్త పార్టీ పక్కన పెడితే.. ఉన్న పార్టీ ఉంటుందో.. ఊడుతుందో. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది. భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్ధి. శత్రువు కాదు’ అని వ్యాఖ్యానించారు.  

    ప్రతి పనికి పర్సస్‌ ఉంటుంది.. పర్పస్‌ అయిపోయాక దాంతో పనేముండదు. కేసీఆర్‌ పార్టీ మనుగడ ముగిసింది. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు. బీఆర్‌ఎస్‌ పార్టీ చనిపోయిన శవంతో సమానం. బీఆర్‌ఎస్‌కు గతం ఉంది.. భవిష్యత్‌ లేదు.. ఉండదు. తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినా చెల్లింది. దాడులు చేసినా, అవమానించినా పడ్డారు.. ఇప్పుడు కూడా అలా ఉంటామంటే కుదరదు. పదేళ్ల అధికారంలో ఆహంభావం, అధికారం తలకెక్కింది.

    అహంకారం పెరగడంతో 2023లో బీఆర్‌ఎస్‌ను ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌తో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు పడే తాపత్రయం అంతా కుటుంబం కోసమే. కుటుంబ పంచాయితీల్లో వచ్చిన కొత్త సంస్థలను మాపై రుద్దకండి. ఒక్క చెరువు నుంచి వచ్చిన నీటికి రంగు రుచి మారదు. 

    శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

    కేసీఆర్‌ ఆరోగ్యం బాగాలేదు అనగానే పరామర్శించా. అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తే యోగక్షేమాలు కనుక్కున్నది నేను. హిందూ సమాజంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు వారసత్వం వస్తుంది. ఔరంగజేబు వారసత్వం కోసమే అందరినీ చంపేశాడు. ఒకరు చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటా. వాళ్లు చనిపోతే ఆ పార్టీ, ఆపార్టీ ఆస్తులు నాకు రావు. కేసీఆర్‌ నా రాజకీయ ప్రత్యర్థి. నాకు శత్రువు కాదు. 2023 నుంచి అన్నీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాను. కేసీఆర్‌ మీద నాకు గెలుపు కొత్తకాదు’అని అన్నారు. 

  • హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్‌.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి నందినగర్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. బీఆర్‌ఆర్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ జీవన్‌రెడ్డితో కలిసి లంచ్‌ చేశారు. 

    అనంతరం జీవన్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకన్నారు కేసీఆర్‌. తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌  రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది.  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్‌.

    తేజస్వీ సూర్య ఒక వెదవ

     

International

  • అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

    గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది.  

    రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్‌సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్‌ను వినియోగంలోకి తెచ్చింది. 

    యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది.
     
    తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు.  

  • గల్ప్‌ దేశాలకు ఇరాన్‌ మరోసారి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని,  ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్‌ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు  ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్‌ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని  ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ  హెచ్చరించారు. 

    ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్‌ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు. 

    ‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు. 

    గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్‌ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు.  ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. 

  • 50 ఏళ్లు రాగానే చాలామంది ఇక కష్టపడింది చాల్లే రిటైర్‌మెంట్‌ తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు. కానీ కాథరిన్ బ్రికెన్ మాత్రం  ఇందుకు భిన్నం. 50 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించడమేకాదు, కోట్లాది డాలర్ల  వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి కష్టాలనైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించిన కేథరీన్‌ స్టోరీ తెలుసుకుందాం.

    లండన్‌కు చెందిన కాథరిన్ బ్రికెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే ఏదైనా పని  చేయాలనుకుంది. మొదటి కాన్పులో కవలలు, ఆ తరువాత కొద్ది కాలానికే మరో బిడ్డ పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా పిల్లలునిద్రపోయే సమయంలో కేకులు, కుకీలు తయారు చేయడం ప్రారంభించింది.2017లో 'డోలిషియస్' అనే బహుళ-మిలియన్ డాలర్ల స్నాక్ బ్రాండ్‌కు నాంది పలికింది.

    వ్యాపార ఆలోచన ఎలా  పుట్టింది
    2008లో అమెరికా నుండి లండన్‌కు మారినప్పుడు, అక్కడ అమెరికన్ తరహా సాఫ్ట్ కుకీలు దొరకడం లేదని గమనించింది. అలాంటివే తాను తయారు చేసి  విక్రయిస్తే  ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.  అలా  2017లో50 ఏళ్ల వయసులో, 'డోలిషియస్' 'Doughlicious' అనే సంస్థను స్థాపించింది. వ్యాపారం ప్రారంభంలో ఆమె రోజుకు 20 గంటలు పని చేసేవారు. నిరంతరం పిండి కలపడం వల్ల ఆమె చేతి వేలి కీలు దెబ్బతిని, శస్త్రచికిత్స  చేయాల్సి వచ్చింది.

    బ్రెస్ట్‌ క్యాన్సర్‌
    2019లో ఆమెకు స్టేజ్-1 రొమ్ము క్యాన్సర్ సోకింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సర్జరీ, రేడియేషన్ తీసుకుంటూనే వ్యాపారాన్ని నడిపించింది. అంతే కాదు వ్యాపారంపై ఉన్న ధ్యాస తన బాధను మర్చిపోయేలా చేసిందని తెలిపింది.

    ప్రస్తుతం ఆమె వయసు 59 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా క్యాన్సర్ నుండి విజయవంతంగా కోలుకుంది. అలాగే ఆమె బ్రాండ్ 'Doughlicious' ఇప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కుకీలను ఉత్పత్తి చేస్తోంది. టెస్కో, హోల్ ఫుడ్స్, టార్గెట్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల స్టోర్లలో ఆమె ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.

    ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు

    అలుపెరుగని శ్రమ,  ఎన్నో సవాళ్లు
    అయితే తన సక్సెస్‌ అంత  ఈజీగా రాలేదు అంటూ  తన అనుభవాలను గుర్తు చేసుకుంది. అటు కేటరింగ్ పనులు చేయడం, కుకీలు తయారు చేయడం, ఇటు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రలేకుండా ఉండటం, మళ్ళీ ఉదయం 7 గంటలకు లేచి అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్‌ గా ఉండేదని తెలిపారు.  కానీ  క్యాన్సర్ గురించి గానీ, లేదా నొప్పి గురించి గానీ ఆలోచించే సమయం లేకుండా  తన సంస్థ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎందుకంటే తన గురించి తన వ్యాధి గురించి మథనపడటానికి అస్సలు సమయమే లేదు, తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనే విషయాన్ని తన బాధ్యత గుర్తు చేసిందని అదే తన విజయానికి బాటలు వేసిందంటారు కాథరిన్ బ్రికెన్ .  

    ఇదీ చదవండి: రూ. లక్షకు కొని, ‘లక్’‌ లేదని వదిలేశారు.. షాకింగ్‌ ఫ్యాక్ట్స్‌
     

Family

  • డయాబెటిస్‌ ఉన్నవారి చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా మరింత శక్తిని పొందేలా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లు సరైన పద్ధతిలో వ్యాయామాలు చేయడం అత్యంత ముఖ్యం.

    ఎందుకంటే..

    ఇన్సులిన్ సమస్యను మెరుగుపరుస్తుంది. 
    రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
    తక్షణ కండర శక్తిని పెంచుతుంది
    బరువు నియంత్రణకు సహాయపడుతుంది

    చేయాల్సినవి..

    1. ఏరోబిక్ వ్యాయామం

    వేగంగా నడవడం
    సైక్లింగ్
    ఈత
    వ్యవధి: 30–45 నిమిషాలు
    వారానికి కనీసం 5 రోజులు

    2. శక్తి శిక్షణ

    తేలికపాటి బరువులు / రెసిస్టెన్స్ బ్యాండ్‌లు

    శరీర బరువు వ్యాయామాలు (స్క్వాట్‌లు, వాల్ పుష్-అప్‌లు)
    వారానికి 2–3 సార్లు

    కండరాలను పెంచుతుందిm గ్లూకోజ్ వినియోగం మెరుగుపడుతుంది. పైగా చక్కెర స్థాయిలు తగ్గుతాయి

    3. ఫ్లెక్సిబిలిటీ, చలనశీలత
    స్ట్రెచింగ్
    యోగా

    ప్రతిరోజూ (10–15 నిమిషాలు)

    బిగుతును తగ్గిస్తుంది, కదలికను మెరుగుపరుస్తుంది. అలాగే గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

    ఎప్పుడు చేయాలంటే..
    భోజనం తర్వాత (ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత)

    భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

    ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా తీవ్రమైన వ్యాయామం చేయవద్దు

    వ్యాయామానికి ముందు ..

    ముందుగా ఒక చిన్న స్నాక్ తీసుకోండి

    తీవ్రమైన వ్యాయామం చేయవద్దు, జాగ్రత్తగా ఉండండి

    వ్యాయామానికి ముందు తినదగిన  స్నాక్స్ (అవసరమైతే)
    కొన్ని నట్స్
    సగం పండు
    పెరుగు
    ఇది వ్యాయామం చేసేటప్పుడు చక్కెర స్థాయిలు తగ్గకుండా నివారిస్తుంది

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
    తల తిరగడం
    అధికంగా చెమట పట్టడం
    నీరసం
    గుండె దడ

    తక్షణమే వ్యాయమాలు ఆపేసి విశ్రాంతి తీసుకోవడం, అవసరమైతే చక్కెర స్థాయిలను తనిఖీ చేయడం తదితరాలు చేయాలి.

    వ్యాయామం తర్వాత పాటించాల్సిన చిట్కాలు:

    అప్పుడప్పుడు షుగర్ స్థాయిలను తనిఖీ చేసుకోవడం

    నీళ్ళను బాగా తాగండి

    వ్యాయామం తర్వాత అతిగా తినడం మానుకోండి

    చేసే తప్పిదాలు..
    క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
    కేవలం నడవడం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకపోవడం
    వార్మ్-అప్ మానేయడం
    అకస్మాత్తుగా వ్యాయామాన్ని అతిగా చేయడం

    షుగర్ తక్కువగా/ఎక్కువగా ఉన్న లక్షణాలను పట్టించుకోకపోవడం

    వారంలో వర్కౌట్ల ప్లాన్‌..
    సోమవారం–శుక్రవారం:

    30 నిమిషాల వేగవంతమైన నడక

    10 నిమిషాల స్ట్రెచింగ్

    మంగళవారం నుంచి శనివారం:

    15–20 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జోడించండి
    ఆదివారం:

    తేలికపాటి కార్యకలాపాలు (నడక/యోగా)

    అప్పుడప్పుడు చేసే కఠినమైన వ్యాయామాల కంటే, క్రమం తప్పకుండా చేసే మితమైన వ్యాయామం మరింత ఉత్తమంగా పనిచేస్తుంది.

    చివరగా డయాబెటిస్‌కు వ్యాయామం అత్యంత శక్తిమంతమైన "మందులలో" ఒకటి. అయితే దానిని సరిగ్గా, క్రమం తప్పకుండా చేసినప్పుడు మాత్రమే ఫలితం అందుకోగలం అని చెబుతున్నారు నిపుణులు.

    డా. ఆదర్శ గౌడ, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్) సీఈవో, బెంగళూరు

    (చదవండి: క్లినికల్ ఫార్మసిస్ట్ వెయిట్‌లాస్‌ సీక్రెట్‌..! నో ‍స్ట్రిక్ట్‌ డైట్‌, నో వర్కౌట్లు)

     

  • అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్‌ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్‌లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 

    ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్‌వేర్‌ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్‌ స్ప్రింగ్‌ సమ్మర్‌ 2026 కౌచర్‌ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్‌వేర్‌. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్‌తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది. 

    అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్‌ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్‌ లుక్‌ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్‌తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక​ అండ్‌ వైట్‌ మేరీ జేన్స్‌ స్లిప్పర్స్‌, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది. 

    ఆ డ్రెస్‌కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్‌ రేంజ్‌లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్‌ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.

    (చదవండి: జస్ట్‌ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!)
     

  • హిమగిరి గుండెల్లో వెలిగిన జ్యోతిర్లింగం విశ్వనాథుడి కైలాస ధామం కేదార్‌నాథ్‌ ఈ యాత్ర అంటేనే మదిలోని గుబుళ్లన్నీ వదిలేసి పరమశివుని పాదాల దగ్గర మౌనంగా కూర్చోవడంలాంటిది. గాలిలో వినిపించే ‘ఓం నమఃశివాయ‘ మంత్రం, గంటల నాదం, ఆలయ ప్రాంగణంలో ఉండే అద్మాత్మిక దివ్య శక్తి మనకు తెలియకుండానే మనల్ని ఒక భక్తి లోకానికి తీసుకుని వెళ్తుంది.కేదార్‌నాథ్‌ కేవలం ఒక టూరిజం స్పాట్‌ మాత్రమే కాదు. ఇది ప్రతి భక్తుడి జన్మ ధన్యం అయ్యే ఒక పవిత్ర క్షేత్రం. హిమవంతుడి ఒడిలో, పర్వతాల మధ్య కొలువుతీరిన ఆ మహాదేవుని చూసే ప్రతి కన్ను ధన్యమే అని భక్తుడికి అనిపిస్తుంది. 

    మహాదేవుడి దివ్య సన్నిధిలో
    కేదార్‌నాథ్‌ ఆలయం దగ్గర నిల్చుని ఆకాశంలో చూస్తే ఆ ధవళ వర్ణపు మంచు కొండలు, శివ భగవానుడి జటాజూటంలా కనిపిస్తాయి. ఆయలం లోపల ఉండే స్వయంభూ లింగం ముందు తలవంచితే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఆ చల్లటి గాలిలో కూడా భక్తుల గుండెల్లో ఉన్న భక్తి వేడిని నింపుతుంది.

    సందర్శనీయ ప్రదేశాలు 

    ఆలయం వెనక ఉన్న భైరవనాథ్‌ క్షేత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం కేదార్‌ లోయ మహాదేవుడి పాదాల దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూస్తేనే భక్తి పరవశం కలుగుతుంది.

    కొంచెం దూరంలో ఉండే వాసుకి తల్‌ సరస్సు నిత్య ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుంది. అది చూస్తే ప్రకృతి మొత్తం ఆ శివుడి రూపమే అని అర్థం అవుతుంది.
    తెలియాల్సినవి..

    దర్శన సమయం: ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తుల కోసం తెరిచి ఉంటాయి.

    ప్యాకేజీలు: కేదార్‌నాథ్‌ వెళ్లాలనుకునే భక్తుల కోసం 5 రోజుల నుంచి 10 రోజుల వరకు బడ్జెట్‌ను బట్టి అనేక ప్యాకేజీలు లభిస్తాయి.

    రిజిస్ట్రేషన్‌: యాత్రకు వెళ్లే ముందు ఉత్తరాఖండ్‌ గవర్నమెంట్‌ పోర్టల్‌లో బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ పూర్తిగా ఉచితం. క్యూఆర్‌ కోడ్‌ పాస్‌ జాగ్రత్తగా కాపాడుకోవాలి.

    ప్రయాణం: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ నుండి రుద్రప్రయాగ్‌ మీదుగా గౌరీకుండ్‌ చేరుకోవాలి. అక్కడి నుండి 16 కి.మీ ట్రెక్కింగ్‌ ప్రారంభమవుతుంది.

    వసతి సదుపాయాలు: కేదార్‌నాథ్‌ టాప్‌ దగ్గర కాటేజీలు, రూమ్‌లు ఉంటాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌  చేసుకుంటే మంచిది.

    ఏం చూడాలి? ఏం తినాలి?
    కేదార్‌నాథ్‌ వెళ్తే సాయంత్రం జరిగే హారతి తప్పక చూడాలి. ఆ హారతి వెలుగులో ఆలయం బంగారు వర్ణంలో మెరిసి΄ోతుంది. కేదార్‌నాథ్‌లో భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ లభించే ‘పహాడి మ్యాగీ’ ఒక క్విక్‌ స్నాక్‌లా ఎంజాయ్‌ చేయవచ్చు.

    ఎలా వెళ్లాలంటే.. 
    హరిద్వార్‌లో గంగా స్నానం చేసి రిషికేష్‌ నుంచి కేదార్‌ యాత్ర మొదలు పెట్టడం ఒక సంప్రదాయం. అక్కడి నుంచి రిషికేష్‌ సోన్‌ ప్రయాగ్‌ మార్గంలో నుండి గౌరీకుండ్‌ చేరుకోవాలి.  అక్కడి నుంచి కాలినడకన యాత్రనున కొనసాగించాల్సి ఉంటుంది. 

    చాలా మంది ఈ యాత్రను ట్రెక్కింగ్‌ అని పిలుస్తుంటారు. కానీ మనం మాత్రం దీనిని ఒక తపస్సులా భావించి అంతే పవిత్రంగా అడుగులు ముందుకేయాలి. ప్రతి అడుగులో ‘శంభో శంకర’ అంటూ భక్తులు పైకి వెళ్తుంటే ఆ పర్వతాలే స్పందిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

    ఎక్కడ ఉండాలి?
    కేదార్‌నాథ్‌ లోయలో ఉండటం అంటే మహాదేవుడి ఒడిలో నిద్రించడం లాంటిదే. చిన్న చిన్న కాటేజీల్లో కూర్చుని బయట చూస్తే గుడి దగ్గర వెలిగే దీపాలు ఆకాశంలోని నక్షత్రాల్లా కనిపిస్తాయి. 

    ఏం చేయాలి? 
    ఆలయ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయవచ్చు. ఫోన్లలో ఫొటోలు తీయడానికి బదులు కళ్లతో చూస్తూ మనసులో శివుడిని కొలుస్తూ గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. 

    వీలు చూసుకొని మందాకిని నది తీరంలో కూర్చొని ఆ ప్రవాహాన్ని ఫీల్‌ అవ్వాలి. నది ప్రవాహంలో మన మదిలోని ఆలోచనలను కొట్టుకు పోతున్నట్టుగా భావించి, కడిగిన ముత్యంలాంటి మనసుతో ఇంటికి తిరిగి చేరుకోవచ్చు. 

    సూర్యోదయం సమయంలో ఆలయం బంగారు వర్ణంలో మారడం చూడటాన్ని అస్సలు వదులుకోకూడదు.

    యాత్ర – బడ్జెట్‌ వివరాలు
    కేదార్‌నాథ్‌ యాత్ర ప్లాన్‌ చేస్తున్నప్పుడు ప్యాకేజీ అంటే కేవలం టికెట్‌ మాత్రమే కాదు. అది మన ప్రయాణం, భోజనం, వుండే చోటు అన్నీ కలిసిన ఒక పూర్తి ప్రణాళిక. ఈ యేడాది కేదార్‌నాథ్‌ ఆలయం ద్వారాలు ఏప్రిల్‌ 22న తెరుచుకున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు. పర్యటను ఎలా ఎంచుకుంటున్నారు అనేదానిని బట్టి, మొత్తం ఖర్చు మారుతుంది.

    బడ్జెట్‌ అంచనా

    సాధారణంగా 5 రోజుల నుంచి 10 రోజుల వరకు యాత్రకు అయ్యే ఖర్చు బడ్జెట్‌లో రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది.

    కాస్త కంఫర్ట్‌గా వెళ్లాలి అనుకుంటే రూ.45,000 నుంచి రూ.65,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 

    ఇక లగ్జరీగా, సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అనుకుంటే మాత్రం రూ.1.4 లక్ష నుంచి రూ.2.3 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

    రవాణా ఖర్చులు
    ట్రావెల్‌ విషయానికి వస్తే.. రైలులో సుమారు రూ.5,000 వరకు ఖర్చు అవుతుంది. హైదరాబాద్‌ నుంచి డెహ్రాడూన్‌ వరకు అప్‌ అండ్‌ డౌన్‌ రూ.17,000 నుంచి రూ.33,000 వరకు, లేదా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు రూ.13,000 నుంచి రూ.17,000 వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడి నుంచి హరిద్వార్‌ లేదా రిషికేష్‌కు బస్‌ లేదా ట్రైన్‌లో వెళ్లి యాత్రను కొనసాగిస్తారు.

    వసతి సదుపాయాలు
    గౌరీకుండ్, సోన్‌ ప్రయాగ్‌ ప్రాంతాల్లో బడ్జెట్‌ గెస్ట్‌ హౌజ్‌లు రూ.1,000 లోపు దొరుకుతాయి. స్టాండర్డ్‌ హోటల్స్‌ సుమారు రూ.3,000 వరకు ఉంటాయి. కేదార్‌నాథ్‌ టాప్‌ దగ్గర పీక్‌ సీజన్‌లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీఎంవీఎన్‌ టెంట్స్‌ లేదా రూమ్స్‌ రూ.1,000 నుంచి ప్రారంభమవుతాయి కానీ ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవడం తప్పనిసరి.

    ఫుడ్‌ ఖర్చు
    ఫుడ్‌ విషయానికి వస్తే సింపుల్‌ థాలీ లేదా స్నాక్స్‌ కోసం రోజుకు ఒక వ్యక్తికి సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా ఫుడ్, స్టే కలిపి రోజుకు రూ.1,200 నుంచి రూ.4,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

    ప్యాకేజీలు, హెలికాప్టర్‌
    ఐఆర్‌సీటీసీ ఫ్లైట్‌ ప్యాకేజీలు ఎంచుకుంటే హైదరాబాద్‌ నుంచి సుమారు రూ.74,000లో సకల సౌకర్యాలతో ట్రిప్‌ పూర్తి చేసుకోవచ్చు. అదే కొన్ని బడ్జెట్‌ ప్యాకేజీలు రూ.27,000 నుంచే లభిస్తాయి. సోన్‌ ప్రయాగ్‌ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌ సర్వీస్‌ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి రూ.7,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సర్వీస్‌ను ఐఆర్‌సీటీసీ ద్వారా మాత్రమే బుక్‌ చేసుకోవాలి.

    లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌
    లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విషయానికి వస్తే సోన్‌ ప్రయాగ్‌ నుంచి గౌరీకుండ్‌కు గవర్నమెంట్‌ షటిల్‌ ట్యాక్సీ ఫేర్‌ కేవలం రూ.50 మాత్రమే ఉంటుంది, అయితే ప్రైవేట్‌ ట్యాక్సీలు ఎక్కువగా చార్జ్‌ చేసే అవకాశం ఉంది.

    ముఖ్య సూచనలు
    మే, జూన్‌ నెలల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రశాంతంగా యాత్ర చేయాలనుకుంటే సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ మధ్యలోనూ న్‌ చేసుకోవచ్చు. వెళ్లే ముందు వాతావరణ అప్‌డేట్స్‌ తప్పనిసరిగా చెక్‌ చేసుకోవాలి. స్థానిక అధికారుల సూచనలు టించడం చాలా ముఖ్యం. ఈ బడ్జెట్‌ వివరాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ప్లాన్, సీజన్‌ ఆధారంగా ఖర్చులు మారవచ్చు. 
    – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు 

  • అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ యాత్ర ప్రారంభకానుంది. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ హిమాలయాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయం, నెలల తరబడి శీతాకాలపు మూసివేత తర్వాత మరోసారి భక్తుల కోసం తలుపులు తెరుచుకోనుంది. ఛార్‌ధామ్‌ యాత్ర పేరుతో ఇక్కడకు వచ్చి ఆ మహాదేవుడిని కొలుస్తుంటారు భక్తులు. అయితే ఇప్పుడు ఆధునికత యాత్రను కొంచెం సులభతరం చేయగలిగింది. కానీ వందేళ్ల క్రితం ఈ కేదార్‌నాథ్‌ ఎలా ఉండేదో అందుకు సంబంధించిన ఫోటోని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు.  ఎలా ఉందంటే..

    1882లో తీసిన కేదార్‌నాథ్ ధామ్‌కు సంబంధించిన మొట్టమొదటి ఛాయాచిత్రాలలో ఒకటిగా భావిస్తున్న ఒక చిత్రాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌  చేశారు. ఆ ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి రోడ్లు, రైల్వే స్టేషన్లు, హెలికాప్టర్లు ఏవీ లేవని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ప్రయాణం సౌలభ్యం అయిపోయాక..అక్కడున్న అందాల్ని ఆస్వాదించడం మర్చిపోతున్నాం అంటూ ఆలోచింపచేసే ప్రశ్నను లేవనెత్తారు. 

    టెక్నాలజీ సౌలభ్యతను అందివ్వాలేగానీ..ఏదో వచ్చాం, వెళ్లిపోయాం అన్నట్లు కాదు కదా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మహీంద్రా. ఆ మంచు కొండల మధ్య కొలువైన ఆ మహా దేవుడి చుట్టుతా ఉన్న అద్భుతాలు, ప్రకృతి రమ్యతను తనివితీరా ఆస్వాదించడం ఓ కళ. అప్పుడే ఆధ్యాత్మిక ప్రయాణం పరిపూర్ణమయ్యేది అనేది పలువురి ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. ఆ విషయాన్నే గుర్తుచేసేలా ఇలా నాటి ఫోటోని షేర్‌ చేశారు మహీంద్రా. 

    కాగా, కేదార్‌నాథ్ యాత్ర ఊపందుకుంటున్న తరుణంలో మహీంద్రా ఈ పోస్ట్ చేశారు. యాత్ర ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 1.1 లక్ష మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ సీజన్‌లో యాత్రికుల రాకపోకలు సజావుగా సాగడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రణాళికే కారణమని ఆలయ అధికారులు అన్నారు. 

    ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సుమారు 3,584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్, శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే దేశంలోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఆలయం ప్రతి ఏడాది పరిమిత కాలం వరకు మాత్రమే(ఆరు నెలలు) సందర్శనకు అందుబాటులో ఉంటుంది.

     

    (చదవండి:  పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...)