Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. కేకేఆర్‌ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.

    ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించి కేకేఆర్‌ను మట్టుబెట్టారు. ఉనద్కత్‌ 3, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో 2, హర్ష​ దూబే ఓ వికెట్‌ పడగొట్టారు. గ్రీన్‌, రఘువంశీ రనౌటయ్యారు. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (52) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్‌ (35), ఫిన్‌ అలెన్‌ (28), రమన్‌దీప్‌ సింగ్‌ (10), సునీల్‌ నరైన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో రహానే 8, గ్రీన్‌ 2, కార్తీక్‌ త్యాగి 5, అనుకూల్‌ రాయ్‌, వరుణ్‌ చక్రవర్తి డకౌటయ్యారు.

    రాణించిన క్లాసెన్‌, హెడ్‌, అభిషేక్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించడంతో భారీ స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో  ఇషాన్‌ కిషన్‌ 14, అనికేత్‌ వర్మ 1, శివాంగ్‌ కుమార్‌ 4, హర్ష్‌ దూబే 9 (నాటౌట్‌) పరుగులు చేశారు. సలీల్‌ అరోరా డకౌటయ్యాడు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు.

     

  • కేకేఆర్‌ విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్‌ ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. కేకేఆర్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆండ్రీ రసెల్‌ పేరిట ఉండిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ రెండు క్యాచ్‌లు పట్టాడు. తొలుత ముజరబానీ బౌలింగ్‌ ఇషాన్‌ కిషన్‌ క్యాచ్‌ను, ఆతర్వాత అనుకూల్‌ రాయ్‌ బౌలింగ్‌లో అనికేత్‌ వర్మ క్యాచ్‌ పట్టాడు.

    ఈ రెండు క్యాచ్‌ల తర్వాత కేకేఆర్‌ తరఫున రింకూ క్యాచ్‌ల సంఖ్య 41కి చేరింది. ఈ క్యాచ్‌లను అతను కేవలం 61 మ్యాచ్‌ల్లోనే పట్టాడు. 40 క్యాచ్‌లు పట్టేందుకు రసెల్‌కు ఏకంగా 133 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. ఈ విభాగంలో రింక, రసెల్‌ తర్వాతి స్థానంలో సునీల్‌ నరైన్‌ ఉన్నాడు. నరైన్‌ 191 మ్యాచ్‌ల్లో 36 క్యాచ్‌లు పట్టాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన  కేకేఆర్‌, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఢీలా పడింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి ఓవర్‌లోనే ఏకంగా 24 పరుగులు రాబట్టి మెరుపు ఆరంభాన్ని అందించాడు. 

    అలెన్‌ ఔటయ్యాక అదే జోరును అంగ్‌క​ృష్‌ రఘువంశీ (52) కూడా కొనసాగించినప్పటికీ.. దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అంతకుముందు గ్రీన్‌ (2) కూడా రనౌటయ్యాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 137-5గా ఉంది. రింకూ సింగ్‌ (34) కేకేఆర్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా రమన్‌దీప్‌ సింగ్‌ (8) క్రీజ్‌లో ఉన్నాడు.

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 
     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చెలరేగిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్‌ పేన్‌ వేసిన తొలి ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు పిండుకొని, ఐపీఎల్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

    ఈ రికార్డు రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉంది. జైస్వాల్‌ 2023 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఫిన్‌ అలెన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు పృథ్వీ షాతో కలిసి ఈ రికార్డును షేర్‌ చేసుకున్నాడు. షా 2021 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్‌లో 24 పరుగులు రాబట్టాడు.

    ఐపీఎల్‌ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
    26 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, 2023
    24 - పృథ్వీ షా (DC) vs KKR, 2021
    24 - ఫిన్ అలెన్ (KKR) vs SRH, 2026*
    22 - యశస్వి జైస్వాల్ (RR) vs PBKS, 2025
    21 - నమన్ ఓజా (RR) vs KKR, 2009
    21 - సునీల్ నరైన్ (KKR) vs RR, 2018

    మ్యాచ్‌ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కేకేఆర్‌ ధాటిగా ప్రారంభించింది. అలెన్‌ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అలజడి సృష్టించి ఔటయ్యాడు. అనంతరం అంగ్‌క్రిష్‌ రఘువంశీ బ్యాట్‌ ఝులిపించడం ప్రారంభించాడు. 

    అయితే ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో కేకేఆర్‌కు కోలుకోని లేని దెబ్బ తగిలింది. దురదృష్టవశాత్తు గ్రీన్‌ రనౌటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 79-3గా ఉంది. రఘువంశీ (35), రింకూ సింగ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. హర్ష్‌ దూబే, ఉనద్కత్‌కు తలో వికెట్‌ దక్కింది.

    అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విధ్వంసకర  ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఖాతాలో మరో భారీ సిక్సర్ల రికార్డు చేరింది. ఇప్పటికే ఎన్నో సిక్సర్ల రికార్డులను తన పేరిట లిఖించుకున్న అభిషేక్‌.. తాజాగా సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకొని, మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. అభిషేక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

    అతనికి ముందు డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున 143 సిక్సర్లు బాదాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్‌, అభిషేక్‌ తర్వాతి స్థానాల్లో క్లాసెన్‌ (89), కేన్‌ విలియమ్సన్‌ (64), ట్రవిస్‌ హెడ్‌ (50) ఉన్నారు.

    కాగా, ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) సన్‌రైజర్స్‌-కేకేఆర్‌ తలపడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. ఈ  మ్యాచ్‌లోనే అభిషేక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి బంతి నుంచి ప్రత్యర్దిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. 

    ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 48; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (21 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆతర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (14) అదే జోరును కొనసాగించే క్రమంలో ఔటయ్యాడు. అనికేత్‌ వర్మ ఒక్క పరుగుకే ఔటై, నిరాశపరిచాడు. క్లాసెన్‌ (34), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30) క్రీజ్‌లో ఉన్నారు. 17 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 184-4గా ఉంది. ముజరబానీ 2, కార్తీక్‌ త్యాగి, అనుకూల్‌ రాయ్‌ తలో వికెట్‌ తీశారు. 

  • కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే తన ఐపీఎల్‌ కెరీర్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌ అతనికి 200వది. ఐపీఎల్‌ చరిత్రలో ఈ మైలురాయిని ఇప్పటివరకు కేవలం 11 మంది (రహానేతో కలుపుకొని) మాత్రమే చేరుకున్నారు. 

    ఈ జాబితాలో ఎంఎస్‌ ధోని (278) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (273, విరాట్‌ కోహ్లీ (268), దినేష్‌ కార్తీక్‌ (257), రవీంద్ర జడేజా (255), శిఖర్‌ ధవన్‌ (222), రవిచంద్రన్‌ అశ్విన్‌ (221), సురేష్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (204), అజింక్య రహానే (200) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.   

    2008లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రహానే.. ఇప్పటివరకు రాజస్థాన్‌ రాయల్స్‌, రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, ప్రస్తుతం కేకేఆర్‌కు ఆడుతున్నాడు. రహనే తన 18 ఏళ్ల ఐపీఎల్‌ ప్రయాణంలో 2 శతకాలు, 34 అర్ద శతకాల సాయంతో 5099 పరుగులు చేశాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. ఓ మార్పు చేసింది. 

    యువ స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ జట్టులోకి వచ్చాడు. తొలి 3 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 43-0గా ఉంది. ట్రవిస్‌ హెడ్‌ (14 బంతుల్లో 34; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (8) ఆచితూచి ఆడుతున్నాడు.

    తుది జట్లు..

    కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

    ఇంపాక్ట్ సబ్‌లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్

    సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్

    ఇంపాక్ట్ సబ్‌లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
     

  • శ్రీలంక పేసర్‌ నువాన్‌ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) తీరుపై అసంతృప్తితో అతడు కోర్టుకెక్కినట్లు సమాచారం. రైటార్మ్‌ పేసర్‌ అయిన 31 ఏళ్ల తుషార.. శ్రీలంక తరఫున ఇప్పటికి 30 టీ20 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు కూల్చాడు.

    తొలి టైటిల్‌
    ఇంతవరకు అతడు టెస్టు, వన్డేల్లో అరంగేట్రం చేయనేలేదు. అయితే, టీ20లో మంచి గుర్తింపు పొందిన తుషారను ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) రూ. 1.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడు ఒక్క మ్యాచే ఆడినప్పటికీ జట్టు టైటిల్‌ గెలవడంతో సంతోషంలో మునిగిపోయాడు.

    NOC ఇవ్వలేదని..
    ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 సీజన్‌కు గానూ ఆర్సీబీ నువాన్‌ తుషారను అట్టిపెట్టుకుంది. అయితే, ఆర్సీబీతో చేరేందుకు శ్రీలంక బోర్డు అతడికి ఇంత వరకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వలేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలో ప్రమాణాలకు తగినవిధంగా లేడనే కారణంగా అతడికి NOC ఇవ్వలేదని సమాచారం.

    అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
    అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని తుషార బోర్డుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మార్చి 31తో తన సెంట్రల్‌ కాంట్రాక్టు ముగిసిపోయినందున.. కాంట్రాక్టును పునరుద్ధరించాల్సిన అవసరం లేదని లేఖ రాసినట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో తాను జట్టు మారే యోచనలో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.

    కోర్టుకెక్కిన తుషార
    కానీ బోర్డు తన అభ్యర్థనను పట్టించుకోకపోవడం, ఐపీఎల్‌లో ఆడేందుకు NOC ఇవ్వకపోవడంతో తుషార న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ, కార్యదర్శి బందులా దిస్సానాయకే, కోశాధికారి సుజీవ గొడలియాడ, సీఈఓ ఆష్లే డి సిల్వలను ప్రతివాదులుగా చేరుస్తూ కొలంబో జిల్లా కోర్టులో తుషార పిటిషన్‌ దాఖలు చేశాడు. 

    ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 9న విచారణ జరుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఐపీఎల్‌-2026ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించి జయకేతనం ఎగురవేసింది.

    చదవండి: అక్కడున్న ప్రతి క్షణం ద్వేషమే.. అందుకే తప్పుకొన్నా: ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌

  • కేకేఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. కేకేఆర్‌ 16 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది.

    మూడో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
    5.6వ ఓవర్‌- 74 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. గ్రీన్‌ (2) రనౌటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
    4.6వ ఓవర్‌- 67 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో రహానే (8) ఔటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
    227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. హర్ష్‌ దూబే బౌలింగ్‌లో ఫిన్‌ అలెన్‌ (28) క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 

    వరుస బంతుల్లో వికెట్లు
    18.2వ ఓవర్‌- ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో సలీల్‌ అరోరా క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    ఐదో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
    18.1వ ఓవర​్‌- 200 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. వైభవ్‌ ఆరోరా బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) ఔటయ్యాడు. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    9.2వ ఓవర్‌- 118 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అనుకూల్‌ రాయ్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి అనికేత్‌ వర్మ (1) ఔటయ్యాడు.

    ఒకే ఓవర్‌లో 2 వికెట్లు
    అప్పటిదా​కా జోరుగా సాగుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఆట ఒక్కసారిగా మందగించింది. ముజరబానీ ఒకే ఓవర్‌లో (8.2, 8.4) 2 వికెట్లు (ఇషాన్‌ (14), అభిషేక్‌ (48)) వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 9 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 116-3గా ఉంది. అనికేత్‌, క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. హెడ్‌ (46) ఔట్‌
    5.4వ ఓవర్‌- 82 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ట్రవిస్‌ హెడ్‌ (46) విధ్వంసం సృష్టించి కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న ఆరో మ్యాచ్‌లో కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ తలపడుతున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం కేకేఆర్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సన్‌రైజర్స్‌ ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ కొత్తగా జట్టులోకి వచ్చాడు. 

    తుది జట్లు..

    కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

    ఇంపాక్ట్ సబ్‌లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, సౌరభ్ దూబే, రోవ్‌మన్ పావెల్

    సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్

    ఇంపాక్ట్ సబ్‌లు: హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, ఆర్ స్మరన్, సాకిబ్ హుస్సేన్
     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా దారుణంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు.

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు అద్భుతమైన బ్రేక్‌ ఇచ్చినా, పంత్‌ తన పేలవ నిర్ణయాలతో గెలిచే అవకాశమున్న మ్యాచ్‌ను జారవిడిచాడు. పంత్‌ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా విఫలం​ కావడంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఘాటుగా స్పందించాడు. ఓ పక్క సలహాలు ఇస్తూనే, మరోపక్క తలంటాడు.

    వాన్‌ మాటల్లో.. పంత్‌కు ఉన్న ప్రతిభతో ఏ దేశ క్రికెట్‌ జట్టులోనైనా స్థానం సంపాదించగలడు. టీమిండియాలోనే కాస్త కష్టం. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, జితేష్‌ శర్మ లాంటి మెరికలు ఉన్నారు. వీరితో పోటీ పడి నెగ్గుకు రావడం పంత్‌కు అంత ఈజీ కాదు.

    పంత్‌ మరో నిరుత్సాహకరమైన ఐపీఎల్‌ సీజన్‌ను భరించలేడు. అతను బ్యాటింగ్‌, కెప్టెన్సీ రెండింటిలోనూ మెరుగుపడాలి. నేను అతని స్థానంలో ఉంటే వైభవ్‌ సూర్యవంశీని గమనించేవాడిని. వైభవ్‌ ఆడే తీరు పంత్‌ను గుర్తు చేస్తుంది. పంత్‌ కెరీర్‌ తొలినాళ్లలో చాలా ధైర్యంగా ఆడేవాడు. ఇప్పుడా ధైర్యం కనిపించడం లేదు.

    ముందుగా పంత్‌ తన మైండ్‌ సెట్‌ను మార్చుకోవాలి. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా 40-45 బంతుల్లో సెంచరీ చేయగలననే ధీమాతో ఆడాలి.

    నెక్స్ట్‌ టాస్క్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
    లక్నో సూపర్‌ జెయింట్స్‌కు నెక్స్ట్‌ టాస్క్‌ ఎస్‌ఆర్‌హెచ్‌. ఏప్రిల్‌ 5న హైదారాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనైనా పంత్‌ ఫామ్‌లోకి రావాలి. లేని ప్రయోగాలకు పోకుండా తన రెగ్యులర్‌ బ్యాటింగ్‌ స్థానంలోనే బరిలోకి దిగాలి. కెప్టెన్సీలోనూ చాలా మెరుగుపడాలి. ఒకవేళ తొలి మ్యాచ్‌ ప్రదర్శనే ఆ మ్యాచ్‌లో కూడా కొనసాగితే, పంత్‌కు కష్టాలు తప్పవు.

    వైభవ్‌ సూర్యవంశీ విషయానికొస్తే.. ఈ రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు తమ తొలి మ్యాచ్‌లోనే ఉగ్రరూపం ప్రదర్శించాడు. సీఎస్‌కేపై 15 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు.

     

  • ఇంగ్లండ్‌ దిగ్గజ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ద్వేషించానన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో.. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఆండర్సన్‌ తిరుగులేని బౌలర్‌.

    ఇంగ్లండ్‌ తరఫున 2002- 2024 వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన ఆండర్సన్‌.. 188 టెస్టుల్లో ఏకంగా 704 వికెట్లు కూల్చాడు. ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌ ఖాతాలో 269 వన్డే వికెట్లు కూడా ఉండగా.. 19 టీ20లలో కలిపి 18 వికెట్లు పడగొట్టాడు. ఏదేమైనా రెడ్‌బాల్‌ క్రికెట్లో నేటికీ అత్యధిక వికెట్ల వీరుడిగా ఆండర్సన్‌ కొనసాగుతన్నాడు.

    మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌కు ప్రాతినిథ్యం
    ఇక 2024లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆండర్సన్‌.. తాత్కాలిక కాలానికి గానూ ఇంగ్లండ్‌ జట్టు మెంటార్‌గానూ పనిచేశాడు. గతేడాది ది హండ్రెడ్‌తో పొట్టి ఫార్మాట్లో గతేడాది రీఎంట్రీ ఇచ్చాడు ఆండర్సన్‌. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా యాజమాన్యంలోని మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌కు ఆండర్సన్‌ ప్రాతినిథ్యం వహించాడు.

    మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు తీయగలిగాడు. అయితే, తాజా ఎడిషన్‌ నుంచి ఆండర్సన్‌ ముందుగానే తప్పుకొన్నాడు. ఇందుకు గల కారణం గురించి తాజాగా మాట్లాడాడు.

    ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నా
    ‘‘గతేడాది ది హండ్రెడ్‌ లీగ్‌లో కొనసాగినంత కాలం ప్రతి క్షణాన్ని నేను ద్వేషిస్తూనే ఉన్నాను. ఆ టోర్నీ మొదలుకాగానే.. సెలవుపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుండు అనిపించింది. అదొక గొప్ప టోర్నీ. ఇందులో కూడా అనుభవం సంపాదించాలనే జట్టులో చేరాను.

    కానీ నాకు ఇది సరైంది కాదు. ముఖ్యంగా లంకాషైర్‌ కెప్టెన్‌గా నేను చేయాల్సింది చాలా ఉంది. నాలుగు రోజుల మ్యాచ్‌ ఫార్మాట్‌ నాకు సెట్‌ అవుతుంది’’ అని ఆండర్సన్‌ అన్నాడు. తనకు రెడ్‌బాల్‌ క్రికెట్‌లోనే అనుభవం, ఆనందం ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.

    పూర్తిగా న్యాయం చేసేందుకే
    కాగా 43 ఏళ్ల ఆండర్సన్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లంకాషైర్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సారథిగా, బౌలర్‌గా లంకాషైర్‌కు పూర్తిగా న్యాయం చేసేందుకే ది హండ్రెడ్‌ నుంచి వైదొలిగినట్లు సంకేతాలు ఇచ్చాడు. వయసు మీద పడుతున్న తరుణంలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించాలి కాబట్టే తనకు నచ్చిన ఫార్మాట్‌కే పూర్తిగా అంకితం కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

    చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత పద్దెమినిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న టీ20 లీగ్‌. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. 2008లో మొదలైన ఈ టోర్నీ.. 2021 వరకు ఎనిమిది జట్లతో కొనసాగింది. ఈ క్రమంలో 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కొత్తగా చేరడంతో జట్ల సంఖ్య పదికి చేరింది.

    చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లతో పాటు లక్నో (LSG), గుజరాత్‌ (GT) నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్‌ను మరింత విస్తృతం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.

    రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లు
    ఐసీసీ ఈవెంట్లతో సమానంగా ఐపీఎల్‌ క్రేజ్‌ సంపాదించిందనడంలో అతిశయోక్తి లేదు. గతేడాది పది ఫ్రాంఛైజీలు వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయం పొందడం.. ఐపీఎల్‌ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు నిదర్శనం.

    74 మ్యాచ్‌లతోనే
    ఈ నేపథ్యంలో క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మరో రెండు జట్లు చేర్చి.. మ్యాచ్‌ల సంఖ్య పెంచుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023, 2024లో 74 మ్యాచ్‌లు నిర్వహించగా.. 2025, 2026 సీజన్లలో 84 మ్యాచ్‌లు.. 2027 నాటికి వీటి సంఖ్య 94కు పెంచుతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. నేటికీ 74 మ్యాచ్‌లతోనే టోర్నీ కొనసాగుతోంది.

    కుదరదు
    తాజాగా మరోసారి ఈ అంశం మీద చర్చ జరుగుతుండగా.. ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో ఐపీఎల్‌ జట్లు, మ్యాచ్‌ల సంఖ్య పెంచే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు. ‘‘మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచడం కష్టం. ఎందుకంటే అంతర్జాతీయ షెడ్యూల్‌తో మ్యాచ్‌ చేయలేము.

    మార్చి- మే వరకు దీనిని పరిమిత విండోలో మాత్రమే నిర్వహించగలము. ఒకవేళ జూన్‌ వరకు కొనసాగిస్తే.. దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో అప్పటికే రుతుపవనాలు  ప్రవేశిస్తాయి. వర్షాల ప్రభావం ఉంటుంది.  కాబట్టి అప్పుడు మ్యాచ్‌ల నిర్వహణ కష్టం.

    వారికి ప్రయోజనం ఉండదు
    ఒకవేళ ఒకేసారి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు అంటే ఒకేరోజు ఒకే వేదికపై రెండు మ్యాచ్‌లు నిర్వహించాలనుకున్నా బ్రాడ్‌కాస్టర్లకు ఇది అంతగా నచ్చదు. వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బ్రాడ్‌కాస్టర్ల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టేకునే మేము 74 మ్యాచ్‌లకు విండోను పరిమితం చేవాము’’ అని అరుణ్‌ ధుమాల్‌ చెప్పుకొచ్చాడు.

    కాగా ఇప్పటికే టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ విరామం లేని బిజీ షెడ్యూల్‌తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్‌ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అరుణ్‌ ధుమాల్‌ పరోక్షంగా స్పష్టం చేశాడు.

    చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

  • న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలియా కెర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌- ఓపెనర్‌ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్‌ వైట్‌బాల్‌ సిరీస్‌లు ఆడుతోంది.

    ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్‌ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.

    346 పరుగులు
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్‌ వాల్వర్ట్‌ (69; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అనికె బాష్‌ (91; 12 ఫోర్లు), ట్రియాన్‌ (25 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. 

    అనంతరం ఛేదనలో న్యూజిలాండ్‌ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.

    139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా
    గతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్‌ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కివీస్‌ సారథి అమేలియా కెర్‌ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.

    కెర్‌ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 1 సిక్స్‌ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కెర్‌ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్‌ 1–1తో సమమైంది.

    అమేలియా కెర్‌ ప్రపంచ రికార్డు
    సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్‌ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌- ఓపెనింగ్‌ ప్లేయర్‌గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.

    బ్రిస్టల్‌ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్‌.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (171), న్యూజిలాండ్‌ స్టార్లు సుజీ బేట్స్‌ (168), బీఎమ్‌ హైల్డే (157) కెర్‌, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

    చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ వ్యూహాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో పంత్‌ ఓపెనర్‌గా రావడాన్ని తప్పుబట్టాడు.

    బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా చర్చ
    కాగా రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో గతేడాది పంత్‌ (Rishabh Pant)ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత సీజన్‌లో అతడు బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లో సెంచరీ మినహాయిస్తే మిగతా 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 151 పరుగులే చేశాడు. దీంతో పంత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా చర్చ సాగింది.

    తొలి మ్యాచ్‌లోనే దురదృష్టం
    ఈ నేపథ్యంలో తన సత్తా చూపించేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లతో పోటీ పడి భారత జట్టులో మళ్లీ చోటును ఆశిస్తున్న అతడిని తొలి మ్యాచ్‌లోనే దురదృష్టం వెంటాడింది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంత్‌ మిచెల్‌ మార్ష్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చాడు.

    ఈ క్రమంలో ముకేశ్‌ వేసిన బంతిని మార్ష్‌ నేరుగా ఆడగా అది బౌలర్‌ చేతికి తగులుతూ వెళ్లి స్టంప్స్‌ను ఎగరగొట్టింది. దీంతో క్రీజ్‌ బయట ఉన్న నాన్‌ స్ట్రయికర్‌ పంత్‌ రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరగక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పంత్‌ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.

    నువ్వు నిజంగా ఓపెనింగ్‌ బ్యాటర్‌వేనా?
    ఇక ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం ఈ విషయంపై స్పందించాడు. ‘‘లక్నో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ డెప్త్‌ గమనించినట్లయితే.. రిషభ్‌ పంత్‌ అసలు ఓపెనర్‌గా రావాల్సిన అవసరం ఉందనే అనిపించదు. నిజానికి కాస్త వెనుకే అతడు రావాల్సింది. గత సీజన్లో తనను తాను డిమోట్‌ చేసుకున్న పంత్‌.. అకస్మాత్తుగా ఈసారి ఇలా ఓపెనర్‌గా వచ్చాడు.

    ఆటను ఆస్వాదించు
    ఓపెనర్‌ లేదంటే వన్‌డౌన్‌ బ్యాటర్‌గా నిన్ను నువ్వు ఒత్తిడికి లోనుచేసుకోవద్దు. ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగు. ఒత్తిడిని జయిస్తే నువ్వు రాణించగలవు. ఓపెనర్‌గా రావాలనే ఒత్తిడిలో ఇప్పుడేం జరిగిందో చూశావు కదా! ఇకముందు ఇలాంటి పునరావృతం చేయకపోతే మంచిది’’ అని పీటర్సన్‌ జియో హాట్‌స్టార్‌ షోలో భాగంగా పంత్‌కు సలహా ఇచ్చాడు.

    కాగా పంత్‌ తన టీ20 కెరీర్‌లో ఓపెనర్‌గా ఇప్పటికి 23 టీ20 ఇన్నింగ్స్‌ ఆడి 672 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

    చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

  • దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. 37 ఏళ్ల వాన్‌డెర్ డ‌స్సెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అయితే డొమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం 'లయన్స్' జట్టు తరపున మాత్రం ఆడడం కొనసాగిస్తానని అతడు స్పష్టం చేశాడు.

    "దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అ‍త్యున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ప్రోటీస్ జెర్సీ ధరించిన ప్రతీసారి ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. అయితే ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అయితే ప్రోటీస్ క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను.

    నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన సౌతాఫ్రికా క్రికెట్‌కు, నా సహచరులకు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని వాన్‌డెర్ డ‌స్సెన్ పేర్కొన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన డస్సెన్‌.. సౌతాఫ్రికాకు 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రోటీస్‌కు కీలక ఆటగాడిగా అతడు ఉన్నాడు.

    అతడి పేరిట 6 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2023, 2019 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికా తరపున అతడు ఆడాడు. ఐపీఎల్‌లో కూడా అతడు రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో 4968 పరుగులు చేశాడు.

  • ఐపీఎల్‌-2026 టోర్నీని లక్నో సూపర్‌ జెయింట్స్‌ పరాజయంతో ఆరంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో లక్నో ఓటమిపాలైంది. సొంతమైదానం ఏకనా స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. 141 పరుగులకే ఆలౌట్‌ అయింది.

    సమీర్‌ రిజ్వీ ధనాధన్‌
    స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఆదిలోనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (0), పాతుమ్‌ నిస్సాంక (1).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (15) వికెట్లు తీసి లక్నో శుభారంభం అందుకున్నా..  సమీర్‌ రిజ్వీ (47 బంతుల్లో 70), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39) అజేయ ఇన్నింగ్స్‌తో ఢిల్లీని గెలుపుతీరాలకు చేర్చారు.

    కోచ్‌, గోయెంకా సీరియస్‌.. పంత్‌ వివరణ ఇస్తూ..
    ఫలితంగా లక్నో జట్టుకు చేదు అనుభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం లక్నో కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకాలకు సీరియస్‌గా ఏదో వివరణ ఇస్తున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

    ఈ నేపథ్యంలో లక్నో మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul)కు సంజీవ్‌ గోయెంకా గతంలో చివాట్లు పెట్టిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత రాహుల్‌.. గౌరవం లేని చోట ఉండలేనంటూ లక్నోను వీడి ఢిల్లీ జట్టులో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్‌కు కూడా ఇలాంటి పరాభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అత్యధిక ధర
    కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్‌ నిలిచాడు. అయితే, అతడి ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంటోంది. గత సీజన్‌లో బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన పంత్‌.. కెప్టెన్‌గా 14 మ్యాచ్‌లకు గానూ ఆరు మ్యాచ్‌లు గెలిపించగలిగాడు.

    ఓపెనర్‌గా, సారథిగా విఫలం
    ఇక తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే బ్యాటర్‌, కెప్టెన్‌గా పంత్‌ విఫలమయ్యాడు. ఈసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 9 బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేశాడు. రనౌట్‌ అయి నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీంతో మరోసారి పంత్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే, తాను ఓపెనర్‌గా వచ్చి విఫలమైన అంశంపైనే లాంగర్‌, గోయెంకాకు వివరణ ఇచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ

Andhra Pradesh

  • సాక్షి,నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ఐదవ వీధిలో ఓ మహిళపై భర్త దారుణ హత్య జరిపిన ఘటన కలకలం రేపింది. 23 ఏళ్ల జర్సీ అనే యువతిని ఆమె భర్త వంశీ కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో అధిక కట్నం తేవాలని వాదనలతో భార్యపై వంశీ దాడి చేశాడు.అనంతరం సాయంత్రం సమయంలో ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించే ప్రయత్నం కూడా చేసినట్లు సమాచారం.  

    జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు సమాజంలో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.  

     

  • రైల్వేకోడూరు:  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు హర్షవీణపై దాడికి పాల్పడ్డారు  జనసేన పార్టీ కార్యకర్తలు. తిరుపతి జిల్లాలోని రైల్వేకోడూరు టోల్‌గేట్‌ సమీపంలో ఆమెపై దాడి చేశారు జనసేన కార్యకర్తలు. 

    తొలుత హర్షవీణ వెంట ఉండే గోపీ అనే వ్యక్తిని చితకబాదారు. ఆపై హర్షవీణను మూకుమ్మడిగా ఎటాక్‌ చేశాయి ఆ మూకలు. తనపై దాడి జరిగిన విషయన్ని రైల్వేకోడూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు అరవ శ‍్రీధర్‌ బాధితురాలు హర్షవీణ.

    కాగా, నాలుగు రోజుల క్రితం  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ బాధితురాలు మరో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు.  తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్‌ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్‌ కళ్యాణ్‌ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు.

    తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు.

    మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?,  మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్‌ను నిలదీశారు.

  • సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, రికార్డు స్థాయిలో మద్యం వినియోగం జరుగుతోంది. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌ల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.

    గత ఏడాదిలో బీర్ వినియోగం 70.29 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ. 31,237 కోట్లకు చేరాయి. మొత్తంగా ప్రభుత్వం 414 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. గతంలో 362 లక్షల కేసులు ఉండగా, ఇప్పుడు 414 లక్షలకు పెరిగింది.

    బీర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి, మొత్తం 232 లక్షల కేసుల బీర్‌ను ప్రజలు వినియోగించారు.

    ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • తాడేపల్లి: నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఎన్నికపై వైఎస్‌ జగన్ నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

    వైఎస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో బార్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా వైఎస్‌ జగన్‌కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు.

    కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు బొల్లవరపు జాన్‌ వెస్లీ, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ సెల్ ప్రెసిడెంట్‌, ఆర్చ్‌ బిషప్‌ ఎన్‌జెఎస్‌డి రాజు -ఇండియన్‌ క్రిస్టియన్‌ మిషన్‌, బిషప్‌ సంజీవరావు - బైబిల్ మిషన్‌, బిషప్‌ సైమన్‌ సీజర్‌ - మెట్రోపాలిటన్‌ చర్చెస్‌, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్‌ జగన్‌ను కలిశారు.

    రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

    అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా
  • సాక్షి, తాడేపల్లి: గుడ్‌ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్‌ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు..

    ..మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్‌ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
    వైఎస్ జగన్‌ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్‌కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్‌ వెస్లీ, వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్‌ సెల్ ప్రెసిడెంట్‌, ఆర్చ్‌ బిషప్‌ ఎన్‌జెఎస్‌డి రాజు -ఇండియన్‌ క్రిస్టియన్‌ మిషన్‌, బిషప్‌ సంజీవరావు - బైబిల్ మిషన్‌, బిషప్‌ సైమన్‌ సీజర్‌ - మెట్రోపాలిటన్‌ చర్చెస్‌, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

    వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
  •  అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని ముత్తూట్‌ ఫైనా న్స్‌ బ్యాంకు మేనేజర్‌ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్‌ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్‌ చేయడానికి సమ్మతించారు. 

    ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్‌ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్‌ నిమిత్తం బ్యాంకు మేనేజర్‌కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. 

    ఈ చెక్కుతో గోల్డ్‌లోన్‌కు జమ చేయకుండా మేనేజర్‌ పసుపులేటి నరేష్‌ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్‌ మేనేజర్‌ నరేష్‌ను ఫోన్‌ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్‌ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. 

    ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్‌ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్‌ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

    ముత్తూట్‌, మణప్పురం ఇతర ఫైనాన్స్‌ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్‌ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్‌ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం.

Family

  • ఆ పల్లె కీర్తి...దేశానికే స్ఫూర్తి వేసవిలో హిల్‌ స్టేషన్స్‌కు , పండగలు, జాతరలు ఉన్న రోజుల్లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు.. ఇలా ఏడాది మొత్తం సీజన్‌ను బట్టి టూర్‌ ‘ఇష్టుల’ అభిరుచులు కూడా మారుతుంటాయి. అయితే అత్యంత పరిశుభ్రంగా ఉన్న పల్లెటూర్లకు, చక్కని జీవనశైలికి పట్టం కడుతున్న గ్రామాలకు కూడా ఇటీవల పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. దుమ్మూ థూళి, అపరిశుభ్రవాతావరణం, కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరవువున్న నగరాల నుంచి ఇలాంటి పల్లెలకు ప్రయాణాలు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని ఓ పల్లె సైతం పర్యాటక ఆకర్షణగా మారడం విశేషం. పరిశుభ్రత అనేది భూతద్ధంతో వెదకాల్సిన అంశంగా ఉన్న పరిస్థితుల్లో , ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పరిశుభ్రతపై తన శ్రద్ధతో పౌర స్పృహకు కొత్త అర్థాన్ని ఇస్తోంది. బాబోజోలా అనే ఈ సాదాసీదా గ్రామం చెత్త, వ్యర్ధాల రహిత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. బాబోజోలాలో నివసించే గ్రామస్తులకు, పరిశుభ్రత అనేది కేవలం ఒక నియమం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి ఇంటివారు ఎంతో శ్రద్ధగా పాటించే ఒక విధి.

    పరిశుభ్రతే జన‘పధం’ నిషేధం ఓ ఆయుధం...
    మహిళలు రోజుకు మూడుసార్లు గ్రామాన్ని ఊడ్చి శుభ్రం చేస్తారు. అంతేకాదు ఇంటింటి నుంచీ చెత్తను డబ్బాలలో సేకరిస్తారు. మరుసటి రోజు మగవారు ఆ చెత్తను తొలగిస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని  పూర్తిగా «నియంత్రించారు. అంతేకాకుండా, ప్రజారోగ్యంపై అవగాహన పెంచడానికి  ప్రతి మూలలో ’ధూమపానం నిషేధం’ అనే బోర్డులను ఏర్పాటు చేశారు. ,  ఇంకా బహిరంగంగా ఉమ్మివేయడం లేదా పొగాకు నమలడం కూడా నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలను పక్కాగా అమలు చేస్తుండడంతో ఈ గ్రామంలో ఎవరూ గుట్కా సేవిస్తూ కనిపించరు ప్లాస్టిక్‌ జాడ కూడాఎక్కడా కనిపించదు.

    ఉపాధ్యాయుడి...పాఠం...
    బాబోజోలాను ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే ఆకాంక్షతో, మధుసూదన్‌ మారండీ అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు 15 సంవత్సరాల క్రితం ఈ పారిశుధ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన  బాటలో గ్రామస్తులు దీనిని ఒక నైతిక బాధ్యతగా స్వీకరించి, పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించడానికి  సీసీటీవీలు, చెత్తబుట్టలు, సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు కోసం నిధులు సేకరించడానికి ఒక క్లబ్‌ను ఏర్పాటు చేశారు.

    శుభ్రమైన ఇళ్లు...అందాల లోగిళ్లు...
    ప్రస్తుతం, బాబోజోలాలో సుమారు 70 సంతల్‌ కుటుంబాలు నివసిస్తున్నాయి,  వారి గడ్డి ఇళ్లు సహజసిద్ధంగా, ప్రకృతి వనరులతో నిర్మితమయ్యాయి. ఆసక్తికరంగా, ప్రతి ఇంటి గోడలను మహిళలు రంగురంగుల పువ్వులు  ఆకుల నమూనాలతో పాటు, జంతువులు  సాంప్రదాయ థీమ్స్‌తో అందంగా అలంకరిస్తారు. స్థానిక భాషలో దీనిని ’భిత్‌ పోటావ్‌’ అని పిలుస్తారు. ఈ చిత్రణలలో ఉపయోగించే రంగులన్నీ నదీ తీరంలోని బంకమట్టి, రాళ్ళు, చెట్ల బెరడు  పువ్వుల నుంచి సహజంగా లభించేవే కావడం విశేషం.

    ఫిబ్రవరిలో జరిగే పటపర్వ పండుగ సమయంలో, గ్రామస్తులు తమ ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, పారిశుధ్య భావనను ప్రచారం చేసే సాంప్రదాయ పాటలు  నృత్య  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సమయంలో ఎక్కువగా ఉండే సందర్శకులు  పర్యాటకుల రద్దీని పురస్కరించుకుని నిబంధనలు పాటిస్తున్నారో లేదో  గమనించడానికి, ఈ గ్రామం అంతటా సీసీటీవీలను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారు జరిమానా చెల్లించడాల్సి ఉంటుంది. లేదా ఆ ప్రదేశాన్ని స్వయంగా శుభ్రం చేయవలసి ఉంటుంది.

    ఈ పల్లెను సందర్శించాలంటే...
    విమాన మార్గంలోనైతే... భువనేశ్వర్‌ విమానాశ్రయానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి మయూర్‌భంజ్‌కు క్యాబ్‌ లేదా బస్సులో ప్రయాణించి, ఆ తర్వాత బాబోజోలాకు స్థానిక రవాణాలో వెళ్లాలి. అదే విధంగా రైలు ద్వారా చేరుకోవాలంటే.. సమీపంలో ఉన్న బారిపద  బాలాసోర్‌ రైల్వే స్టేషన్లలో దిగాలి.  అక్కడి నుంచి  స్థానిక బస్సును లేదా షేర్డ్‌ క్యాబ్‌/జీప్‌ను ఎక్కవచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా అయితే తొలుత బారిపదకు చేరుకుని, అక్కడి నుంచి స్థానిక బస్సు, ఆటో లేదా ఏదైనా షేర్డ్‌ వాహనాన్ని ఎంచుకోవాలి.

  • వృక్షము నరకబడిప్పుడు అది తిరిగి చిగురిస్తుంది. అయితే నరుడు మరణమై కదలలేక పడి ఉంటాడని యోబు అనే భక్తుడు యోబు గ్రంథం 14:7లో స్పష్టీకరించాడు. ఆ గ్రంథంలో దేవుడు నరావతారిగా తన కుమారుడైన యేసుక్రీస్తుగా జన్మించి శ్రమకు ఓర్పు ముఖ్య లక్షణమని, కష్టాలు, శ్రమలు భరించి, కాలం సంపూర్ణమైనప్పుడు ప్రతి ఒక్కరు కాలము చేయుదురని, కాని నిస్సహాయతలో దేవునివైపు తిరగడం మానవ విజ్ఞతకు సంకేతమని నిరూపించి సంధించిన పునరుత్థానం లేక మరణానంతరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే‘ఈస్టర్‌’ పండుగ.

    యేసుక్రీస్తు యూదామతంలో జన్మించారు. ఆయన మీ ΄ాపములు క్షమించానని అనడం, కుష్ఠ రోగులను ముట్టుకోవడం, స్వస్థపరిచాడన్న విషయం కంటే వారిని ముట్టడమే నేరమని, నలుబది సంవత్సరాలు శ్రమపడి కట్టిన దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులలో లేపుతానంటూ చేసిన ప్రసంగాలు యూదులు సహించక, ఆ చర్యలను దేవదూషణ, దేశద్రోహంగా చిత్రీకరించి ఆయనను రోమా సామ్రాజ్యపు అధికారులకు అప్పగించారు. యూదులలో ఛాందసుల కోరిక ప్రకారం రోమీయులకు యేసుక్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేసి, రాతి సమాధిలో ఉంచి, సమాధి ద్వారానికి పెద్ద రాయి  పొర్లించి ద్వారమునకు ముద్రను వేయించి కావలి వారిని కాపలాగా ఉంచారు.

    కానీ ఆదివారం తెల్లవారుతున్నప్పుడు ప్రభువు దూత రాయిని ΄÷ర్లించగా మహా భూకంపం కలిగింది. కావలివారు వణికిపోయారు. ఆయనను చూడటానికి వచ్చిన స్త్రీలు ఈ విషయం శిష్యులకు చె΄్పారు. ఆయన వారికి ప్రత్యక్షమై మీకు శుభమని చెప్పగా వారు ఆయన శరీరంతో సజీవుడై ఉండుట చూచి ఆయన ΄ాదములను పట్టుకొని మొక్కారు. అనంతరం యేసు ప్రభువు వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకానికి ఆరోహణుడయ్యాడు.  అటువలె యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు ఆయన ఏ రీతిగా చని΄ోయి బతికెనో, ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచువారు చని΄ోయినను ఆయనవలే తిరిగి మహిమ శరీరంతో తిరిగి లేపబడుతారు (యోహాను 14:6).
    – బి.బి.చంద్రపాల్‌ కోట
     

    మార్గం, సత్యం జీవం, 
    రెండువేల యేళ్ళనాటి ఈస్టర్‌ రోజున, మొదట యేసుక్రీస్తు ఉదయించాడు, ఆ తర్వాతే ఆ రోజున సూర్యుడుదయించాడు. ఉదయం చీకటితోనే ప్రభువు సమాధి వద్దకు వెళ్లిన మగ్దలీనా మరియకు  యేసుప్రభువు ఆనాడు తనను సజీవుడుగా కనపర్చుకోవడంతో ఈస్టర్‌ నవశకం  ఆరంభమయ్యింది. శుక్రవారం నాడాయన అత్యంత బలహీనుడు, నిస్సహాయుడు, రోమా ప్రభుత్వం దృష్టిలో నేరస్థుడు, యూదుమతాధిపతుల దృష్టిలో దైవ ద్రోహి. అంతా చూస్తుండగానే సిలువలో ఆయన మరణించాడు, పలువురి సమక్షంలో రోమా ప్రభుత్వం కనుసన్నల్లో ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం నాటికి ఆయన మళ్ళీ సజీవుడయ్యాడు. తన వాళ్లందరికీ సజీవుడై కనిపించాడు, మళ్ళీ ఎన్నో అద్భుతకార్యాలు కూడా చేసి తన శిష్యులకు, అనుచరులకు స్పష్టంగా దిశా నిర్దేశం చేసి 40 వ రోజున పరలోకానికి ఆరోహణుడయ్యాడు. దిశానిర్దేశం చెయ్యడమంటే, ప్రభువు తన పునరుత్థాన శక్తిలో వారిని అంతర్భాగం చేశాడు. ‘మీరు త్వరలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేవరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ తర్వాత భూదిగంతాల దాకే నాకు మీరు సాక్షులవుతారు’ అని ప్రభువు వారికి తెలిపాడు (అపో.కా .1:8). 

    అలా ఆరంభమైన ఆదిమ చర్చి ఆ పునరుత్థానశక్తి తోనే పరవళ్లు తొక్కి, ప్రభువుకోసం నవ్వుతూనే ప్రాణత్యాగం చెయ్యడానికి కూడా సంసిద్ధ మయ్యింది. ఆ శక్తితోనే అనూహ్యంగా విస్తరించింది. పరిశుద్ధాత్మ శక్తి కేవలం భాషల్లో మాట్లాడేందుకు, అద్భుతాలు, స్వస్థతలు చేసేందుకే తోడ్పడుతుందనుకోవడం, కిటికీ లోంచి గదిలోకొస్తున్న సూర్యకిరణాలు కేవలం గదిని వెలుగుతో నింపడానికేనని అనుకోవడం లాంటి సంకుచితమైన అవగాహన. సూర్యుడు తన కిరణాలతో మన గదిలో వెలుగు నింపుతాడు సరే, కానీ విశ్వానికంతటికీ జీవప్రదాత ఆ సూర్యుడే అని, సూర్యుడు లేకపోతే జీవకోటికి మనుగడే లేదని ముందు తెలుసుకోవాలి. 

    ఒక పెద్ద బండరాయిని కొండమీదినుండి కిందికి తొయ్యడానికి ఎంతో బలం కావాలి. కాని అదే బండరాయిని భూమ్మీదినుండి కొండమీదికి దొర్లించుకు  పోవడానికి మాత్రం పునరుత్తాన శక్తి కావాలి. క్రీస్తు తన పునరుత్థానం ద్వారా ఈ లోకానికిచ్చినది ఆ పునరుత్థాన శక్తే!!! హ్యాపీ ఈస్టర్‌. 
    – సందేశ్‌ అలెగ్జాండర్‌ 

  • క్రీస్తు కేంద్రకంగా దేవుడు సంకల్పం చేశాడు. ఇందులో క్రీస్తు మరణం అత్యంత ప్రధానం. ఈ సర్వ జగత్తుకు పూర్వమే క్రీస్తు బలి ఏర్పాటు చేయబడింది.  పాపము లేనప్పుడే క్రీస్తు పరిశుద్ధ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వడం అంటేనే దేవుడు అద్వితీయ జ్ఞాన సంపన్నుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. దూరదృష్టి, ముందుచూపు అనేవి దేవుని నుండి నేర్చుకోగలిగే జీవితాలు ఏంతో ఉన్నతంగా ఉంటాయి. మానవాళి పాపాలకు ప్రతిగా  యేసును నలగగొట్టడం దేవుడైన యెహోవాకు ఇష్టమైంది. క్రీస్తు వారి మరణం దేవుని చిత్తం. నీ చిత్తమే సిద్ధించును గాక అంటూ తలవంచిన క్రీస్తు ముందుకు అడుగు వేశాడు. దేవుడు తన  ప్రజల పరిశుద్ధత కొరకు యుక్త కాలాన యేసును ప్రాణం పెట్టమన్నాడు. అందుకు క్రీస్తు సంతోషంగా సమ్మతించాడు. బలి ఆగుటకు ఏంతో ఇష్టపూర్వకంగా విధేయంగా తన తండ్రియైన దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు .

    యేసు తనను గూర్చి  తన రాకను గూర్చి  ఇలా వివరణ ఇచ్చుకున్నారు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చాను (మత్త 20:28). ప్రాణత్యాగాన్ని మించిన గొప్ప పరిచర్య ఏముంటుంది? నీతి కలిగిన మంచి వ్యక్తులకొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవతెగించవచ్చు. మంచి వాడైనా చెడ్డ వాడైనా ’తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు’ అన్నది ఆయన ఉన్నత బోధే (యోహాను 15:13). ఒక్క దేవుని మెప్పు ఉంటే కోల్పోయేది ఎలాంటిదైనా ఎంతటిదైనా ఏముంది? తనదైన బోధలకు అనుగుణంగా అనగా, సాహసొపేతంగా జీవిస్తూ ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన వాడు యేసు. ప్రత్యేకంగా ఇదే యేసు జీవితానుభావం నుండి మనం నేర్చుకొనేది. క్రీస్తు భక్తిహీనులైన పాపుల కొరకు చని΄ోయారు (రోమా 5:6–8 ).

    క్రీస్తు మరణానికి కొద్దిరోజుల ముందు ప్రధాన యాజకుడైన కయప ఇలా ప్రవచించాడు. ‘మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం... యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరి΄ోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనైయున్నాడు’ ( యోహాను 11:49–52 )  అంటూ..

    దేవునిలో స్థిరపడి నిలకడగా ఉన్న యూదులైన దేవుని పిల్లలు,  దారితప్పి చెదరి దూరమైన వేరే దొడ్డి గొర్రెలు అనబడే అన్యజనులు ఇప్పుడు క్రీస్తు మరణం వలన ఏకం కాబోతున్నారు. విద్వేషం లేని ఆత్మ సంబంధ ఏక ప్రపంచం త్వరలో రూపుదిద్దుకోబోతోంది. ఈ పై రెండు వచనాలు క్రీస్తు ’మరణ శాసనం’ గుర్తు చేస్తున్నాయి. 

    ఇదీ చదవండి: రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి

    యేసు తన మరణాన్ని తానే నిర్ణయించుకొని అనగా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసికొనుటకును దేవుని వలన అధికారం  పొందియున్నారు. యేసుక్రీస్తు తన మరణ శాసనాన్ని అనగా కొత్త నిబంధన లేదా నూతన ఒడంబడికను  తన రక్తంతో వ్రాసుసుకున్నారు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటూ తన మరణానికి ముందే చెప్పకనే చెప్పారు. క్రీస్తును బట్టే దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అట్టి నిబంధనకు తన దైన సొంత రక్తం ద్వారా రూపకల్పన చేసినది మాత్రం క్రీస్తు వారే. రక్తము లేకుండా ఏ నిబంధన లేదు. క్రొత్త నిబంధన ఎంత ఉన్నతమైనదంటే ఇది క్రీస్తు వారి రక్తంతోనే ప్రతిష్టించబడింది.

    – జేతమ్‌ 

Movies

    • ఎల్లో డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ అందాలు..
    • ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..
    • బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..
    • శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. 
    • మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి..

     

     

     

     

     

     

     

  • ఏఐ వచ్చాక అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను అందిపుచ్చకుంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నారు. తాజాగా పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌గా “అంబ’s రివెంజ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జయవర్ధన్ మాడి దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లపై  సంయుక్తంగా శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ కథను ఆధారంగా తీసుకుని  వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్  విడుదల చేసింది.

    ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. 'తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. “అంబs రివెంజ్” ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగింతాం. విజువల్స్‌, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంభందించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం " అని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ ఆధారిత కథాచిత్రాల దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ పౌరాణిక  ప్రయోగాత్మక చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. 
     

  • బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్  ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

    ప్రస్తుతం దురంధర్‌ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్‌ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.

    కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు.

  • టైటిల్‌: ‘కార్మేని సెల్వం’
    నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్
    నిర్మాణ సంస్థ: పాత్‌వే ప్రొడక్షన్స్
    నిర్మాత:అరుణ్ రంగరాజులు
    దర్శకుడు: రామ్‌ చక్రి
    సంగీత దర్శకుడు:  ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ (MAAS)
    సినిమాటోగ్రఫీ: యువరాజ్‌ దక్షణ్‌
    ఎడిటింగ్‌: జగన్‌ ఆర్వీ, దినేష్‌ ఎస్‌
    విడుదల తేది: ఏప్రిల్‌ 3, 2026

    దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. విలక్షణ నటుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నాడు సముద్రఖని. ఒక పక్క స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోపక్క కంటెంట్‌ ఉన్న సినిమాల్లో లీడ్‌ రోల్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే ‘కార్మేని సెల్వం’. రేపు(ఏప్రిల్‌ 3) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    చెన్నైకి చెందిన సెల్వం(సముద్రఖని) ఓ మిడిల్‌ క్లాస్‌ వ్యక్తి. వ్యాపారవేత్త సంపత్‌(గౌతమ్‌ మీనన్‌) దగ్గర డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. భార్య శాంతి(లక్ష్మీ ప్రియా), కొడుకు బాలునే అతని ప్రపంచం. ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది అతని నైజం. బంధువుల ముందు చిన్నచూపు కావొద్దనేది భార్య శాంతి నైజం. ఫంక్షన్‌లో అవమానించారని, పౌరుషంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతో పాటు మెడపై ఉన్న పుస్తెల తాడుని సైతం అమ్మి ఆడపడుచు కూతురుకి కానుకగా ఇచ్చేస్తుంది. 

    ఓ రోజు కొడుకు తలకు గాయం కావడంతో ఆస్పత్రి ఖర్చులకై సొంత బావ దగ్గర రూ. 10 వేలు అప్పు తీసుకొస్తాడు సెల్వం. ఆ అప్పుని తీర్చేందుకు తన బాసుకు తెలియకుండా ఆయన కారుని టాక్సీలో పెడతాడు. టాక్సీలో ఎక్కినవాళ్ల మాటలు విని..సెల్వంకి డబ్బుపై ఆశ పెరుగుతుంది. ఆ ఆశ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? భార్య, కొడుకుని వదిలేసి.. వేరే దేశం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు సెల్వం తిరిగి ఇండియాకు వచ్చాడా? రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    విశ్లేషణ
    ఈ సినిమా చివరిల్లో ఒక డైలాగు ఉంటుంది. ‘అవసరం లేనివి కొంటే..అవసరమైనవి కోల్పోతాం’. ఈ ఒక్క డైలాగ్‌తో ఈ కథ ఇచ్చే సందేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం ఇది. డబ్బుపై ఆశతో ఫ్యామిలీని దూరం పెట్టి.. చిన్న చిన్న సంతోషలను సైతం మిస్‌ చేసుకుంటున్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అన్నట్లుగా.. పక్కవాళ్లను చూసి మన స్థాయిని మించి ఖర్చు చేస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే.. ఇలాంటి పనులు చేసే అప్పులపాలు అవుతున్నాయి. కార్మెనీ సెలం సినిమాలో ఇదే చూపించారు. అప్పుల వల్ల మధ్యతరగతి కుటుంబాల సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలని ఎలా ప్రభావితం అవుతాయి అనేది చాలా  రియలిస్టిక్‌ ఇందులో చూపించారు.  

    అయితే ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తకాదు. మిడిల్‌ క్లాస్‌ కష్టాల నేపథ్యంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచే సినిమాలు వస్తున్నాయి.  కానీ ఇందులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలు చేస్తున్న తప్పులను చూపించారు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు చాలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌ మొత్తం మిడిల్‌ క్లాస్‌ కష్టాలను,  సెకండాఫ్‌లో ఆ కష్టాల నుంచి బయటపడేందుకు చేసే అప్పులు, తప్పులను చూపిస్తూ..చివరిలో ఓ మంచి సందేశం అందించారు. 

     ఆడపడచు పిలిచింది కదా అని సంతోషంగా ఫంక్షన్‌కి వెళ్తే.. అక్కడ వాళ్లను అవమానించడం.. అది తట్టుకోలేక దాచుకున్న కొద్ది డబ్బుని కూడా కానుకగా ఇవ్వడం.. అప్పు తీర్చడానికి సెల్వం తొలిసారి తప్పు దారి ఎంచుకున్నప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది.  ఇతరుల మాటలు విని.. సెల్వం చేసే తప్పులన్నీ మనమో లేదా మన చుట్టు ఉన్నవాళ్లో చేసే ఉంటారు. అందుకే ఆ పాత్రతో కనెక్ట్‌ అయిపోతారు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్‌ మొత్తం మరింత ఎమోషనల్‌గా సాగుతుంది.  జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సినిమా చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తారు.

    సెల్వం పాత్రలో సముద్ర ఖని ఒదిగిపోయాడు. . మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయన సతీమణిగా లక్ష్మీ ప్రియా తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడవుడి ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్‌లో శర్వానంద్ బైకర్‌ రిలీజ్‌ కానుంది. దీంతో పాటు సంగీత్ శోభన్‌ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటిలో బైకర్‌ మూవీపై ఆడియన్స్‌లో బజ్ క్రియేట్ ‍అయింది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ మృత్యుంజయ్‌ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌ విషయానికొస్తే ఈ రెండు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫిక్స్..

    • మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03

    • మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

    • వధ్‌-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03

    • బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03

    • హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

    • గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

    అమెజాన్ ప్రైమ్..

    • మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03

    జియో హాట్‌స్టార్‌..

    • ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03

    జీ5..

    • బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03

    ఆపీల్ టీవీ ప్లస్..

    • యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

    సన్‌ నెక్ట్స్..

    • వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03

    సోనీ లివ్

    • సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03
       

  • విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న హిస్టారికల్ యాక్షన్‌ మూవీ రణబలి. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఏపీలోని నంద్యాల జిల్లాలో జరుగుతోంది.

    తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ గుర్రంపై వస్తున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ముండమోపి నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా సంపుదువ్ కానీ..' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్‌ వింటే ఫుల్ మాస్‌ యాక్షన్‌ మూవీగానే తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న కథ కావడంతో ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంతంలో తెరెకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

     

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

    ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్‌ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

    వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్‌ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది.  ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. 
     

  • తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న రెంటల్ విధానానికి స్వస్తి పలికారు.  మల్టీప్లెక్స్‌ తరహాలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నగరంలోని 23 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏప్రిల్‌ 3 నుంచే ఇది అమల్లోకి రానుందని ప్రకటించారు. ఎగ్జిబిటర్లకు రెవెన్యూ షేర్‌ ఇలా.. సినిమా ప్రదర్శితమైన తొలివారం 60 శాతం, రెండోవారం 50 శాతం, మూడోవారం 40 శాతం. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుదల చేసింది.

    ఇప్పటికే 23 మంది ఎగ్జిబిటర్లు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించార. తెలంగాణలోని పలువురు అగ్ర శ్రేణి డిస్ట్రిబ్యూటర్లతో చర్చించారు. వారి థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని అన్నారు. వాటిలో ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. అయితే ఈ థియేటర్ల నిర్వహణ చాలా భారంగా మారిందన్నారు. ప్రస్తుత అద్దె విధానంతో నెట్టుకు రావడం కష్టసాధ్యమైందని వెల్లడించారు.

    పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామన్న తమ ప్రపోజల్‌ను డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించారని చెప్పారు. శశిధర్ రెడ్డి మాత్రమే నిర్మాతలు, ఇతర భాగస్వాములతో మరింత చర్చించి అభిప్రాయం చెబుతామన్నారని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలను కేవలం శాతం ప్రాతిపదికనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. ఇది దశల వారీగా జరుగుతుందని అని ఫిల్మ్‌ ఛాంబర్‌ తన ప్రకటనలో పేర్కొంది.

    t
  • లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ డైరెక్టర్‌ రంజిత్ బాలకృష్ణన్‌కు కేరళ ఫిల్మ్ ఫెడరేషన్ షాకిచ్చింది. తక్షణమే ఆయనను ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బి. ఉన్నికృష్ణన్ వెల్లడించారు. ఈ కేసులో అంతర్గత విచారణ పూర్తి చేసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తమ సభ్యులపై లైంగిక ఆరోపణలు వచ్చిన కేసులలో ఫెడరేషన్‌ ఒక ప్రామాణిక విధానాన్ని అనుసరిస్తుందని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు.

    కాగా.. కొచ్చిలోని ఒక సినిమా షూటింగ్ ప్రదేశంలో తనపై క్యారవాన్ లోపల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక యువ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 30న షూటింగ్ సెట్‌లో తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆ నటి ఆరోపించింది.  దీంతో ఆయనను కొచ్చి పోలీసులు  అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం నటి ఫిర్యాదు చేయగా.. ఎర్నాకులం మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంజిత్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అతను ప్రస్తుతం ఎర్నాకులం సబ్ జైలులో ఉన్నాడు.
     

  • తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌పై కొద్దిరోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కారణం.. ఆయన తల్లి సువర్ణలత అంత్యక్రియలను క్రైస్తవ ఆచారం ప్రకారం నిర్వహించడమే! దేవుడినే నమ్మనని చెప్పే ఆయన తల్లి భౌతికకాయాన్ని చర్చిలో పెట్టి ప్రార్థనలు, కీర్తనలు ఎందుకు చేయించాడని పలువురూ విమర్శలు గుప్పించారు.

    నేను నమ్మను
    ఈ ట్రోలింగ్‌పై తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ స్పందించాడు. అవును, నేను దేవుడిని నమ్మను, కానీ మా అమ్మ నమ్మేది. తన విశ్వాసాల ప్రకారం అంతిమసంస్కారాలు పొందే హక్కును కాదనడానికి నేనెవర్ని? ఇది తనకు నేనిచ్చే కనీస గౌరవం. ఒంటినిండా ద్వేషాన్ని నింపుకున్న రాక్షసులకు ఇదేం అర్థమవుతుంది? అని ట్వీట్‌ చేశాడు.

    నాస్తికుడిగా ప్రయాణం
    ఇది చూసిన కొందరు తల్లి నమ్మకాల్ని గౌరవించి, ఆమెకు నచ్చినట్లుగానే అంతిమయాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌ను సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం.. మీ తల్లి నమ్మకాన్ని గౌరవిస్తున్నావు, బాగానే ఉంది.. మరి మా నమ్మకాల్ని ఎందుకు హేళన చేస్తావు? ఎందుకు ద్వేషిస్తావు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రకాశ్‌ రాజ్‌ తల్లి సువర్ణలత క్రైస్తవురాలు కాగా తండ్రి మంజునాథ్‌ రాయ్‌ హిందువు. భిన్నమైన మతాల నేపథ్యంలో పెరిగినప్పటికీన ఆయన ఏ మతంవైపూ అడుగు వేయలేదు. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు.

     

     

    చదవండి: అచ్చం ఓయ్‌ హీరోయిన్‌లా ఉందే.. ఎవరీ మానస శర్మ?

  • మెగాస్టార్‌ చిరంజీవి.. ఆంజనేయ స్వామికి పరమభక్తుడు. గురువారం (ఏప్రిల్‌ 2న) హనుమాన్‌ జయంతి సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తన ఇంట్లోని పూజా మందిరంలో సూర్యభగవానుడి కిరణాలు హనుమంతుడి విగ్రహాన్ని తాకాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రతి ఏడాది..
    శ్రీ హనుమాన్‌ జయంతి సందర్భంగా మా పూజామందిరంలో జరిగిన ఓ విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజామందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కిందివరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను.

    పూర్వజన్మ సుకృతం
    ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అరసవెల్లి దేవాలయాల్లో సూర్యకిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే! అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

     

    చదవండి: ఎవరీ మానస శర్మ? ట్రెండింగ్‌లో రాకాస లేడీ డైరెక్టర్‌

  • గత రెండు రోజులుగా సోషల్‌ మీడియా మొత్తం తనే ఉంది. చూడటానికి అమాయకంగా, సాంప్రదాయంగా కనిపిస్తూ తెగ వైరలవుతోంది. ఆ తను మరెవరో కాదు రాకాస దర్శకురాలు మానస శర్మ. చూడటానికి ఓయ్‌ సినిమా హీరోయిన్‌ షామిలికి చెల్లెలిగా కనిపిస్తున్న ఈవిడ గురించి నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. కాబట్టి ఆమె ఎవరు? ఇంతకు ముందు ఏం చేసింది? అనేది ఓసారి చూసేద్దాం..

    రచయితగా
    మానస శర్మది శ్రీకాకుళం.. యూట్యూబ్‌లో మ్యాడ్‌ హౌస్‌ అనే మినీ సిరీస్‌కు డైలాగ్స్‌ రాసింది. తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌ సిరీస్‌కు రచయితగా పని చేసింది. ఈ రెండింటికీ మెగా డాటర్‌ నిహారిక కొణిదెలయే నిర్మాతగా వ్యవహరించింది. అలా నిహారిక దృష్టిలో పడింది. 2024లో సోనీ లివ్‌లో వచ్చిన బెంచ్‌ లైఫ్‌ వెబ్‌ సిరీస్‌తో దర్శకురాలిగా మారింది. తర్వాత మరోసారి నిహారికతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఆమె నిర్మించిన రాకాస చిత్రంతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం కాబోతోంది.

    ట్రెండింగ్‌లో డైరెక్టర్‌
    రాకాస మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరో సంగీత్‌ శోభన్‌, హీరోయిన్‌ నయన్‌ సారిక కన్నా దర్శకురాలు మానసయే ఎక్కువ హైలైట్‌ అవుతోంది. మాట్లాడేది తక్కువే అయినా అమాయకత్వం, సింపుల్‌ స్మైల్‌తో ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. ఓయ్‌ హీరోయిన్‌లా కనిపించినప్పటికీ ఆమెకు, మానసకు ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే జనాలు గుర్తుపెట్టుకునేలా, వారికి నచ్చేలా సినిమాలు తీయాలనుకుంటుంది మానస. మరి ఆమె రాకాసతో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి!

    నేను చాలా ఇంట్రోవర్ట్‌. కెమెరా అంటే మొహమాటం ఎక్కువ. అందుకే కెమెరా వెనకాల ఉండటానికే ప్రయత్నిస్తాను.
    - మానస శర్మ

     

     

    చదవండి: భార్య ఉండగా రెండో పెళ్లి.. బిడ్డ తనకు పుట్టలేదన్న నటుడికి షాకిచ్చిన డీఎన్‌ఏ రిపోర్ట్‌

National

  • దేశం మొత్తం నిద్రలో ఉన్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో మూడు గంటలపాటు జరిగిన గోప్య సమావేశం దేశ భద్రతా పరిస్థితులపై దృష్టి సారించింది. దోవల్ రూపొందించిన "రెడ్ ఫైల్"లో అమెరికా–పాకిస్థాన్ రహస్య ఒప్పందం, ఇరాన్‌పై దాడుల ప్రణాళిక, భారత్‌ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలపై కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు పూరీ జగన్నాథ, అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం, సరిహద్దుల్లో NOTAM జారీ చేయడం వంటి పరిణామాలు దేశం ఒక పెద్ద "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా–పాకిస్థాన్ ఒప్పందం ఇరాన్‌తో ఘర్షణకు దారితీస్తే, పాకిస్థాన్ ఈ పరిస్థితిని భారత్‌పై ఒత్తిడి పెంచడానికి వాడుకోవచ్చనే ఆందోళనలతో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ వీడియోను క్లిక్ చేయండి.

     

  • ఢిల్లీలోని సౌత్ బ్లాక్.. రాత్రి సమయం. దేశం మొత్తం నిద్రపోతున్న వేళ, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. సాధారణంగా కనిపించే మీటింగ్‌లు కావు ఇవి. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్ వంటి అగ్రనేతలతో పాటు, ఒక వ్యక్తి అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆయనే భారత జేమ్స్ బాండ్ – అజిత్ దోవల్! అసలు ఏం జరుగుతోంది? భారత్ మరో మహా యుద్ధానికి సిద్ధమవుతోందా? గత వారం రోజులుగా ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. 

    NSA అజిత్ దోవల్ అంటే కేవలం ఒక అధికారి కాదు, ఆయన భారత రక్షణ కవచం. రా (RAW) , ఎన్ఐఏ (NIA) ఇచ్చే అత్యంత రహస్య సమాచారాన్ని విశ్లేషించి, ఆయన ఒక 'రిస్క్ అసెస్మెంట్ ఫైల్' రూపొందించారు. దీనినే 'రెడ్ ఫైల్' అని పిలుస్తారు. సాధారణంగా ప్రపంచ నేతలెవరైనా 30 నుండి 40 నిమిషాలకు మించి చర్చలు జరపరు. కానీ మోదీ, దోవల్‌తో ఏకంగా మూడు గంటల పాటు ఏకాంతంగా చర్చించారంటే, అది చమురు ధరల గురించో, ఆర్థిక స్థితిగతుల గురించో కాదని ఇక్కడ స్పష్టమవుతోంది. అమెరికా , పాకిస్థాన్‌లు కలిసి భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి వేసిన ఒక మాస్టర్ ప్లాన్ దోవల్ చేతికి చిక్కింది.

    ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సమావేశాల్లో డిఫెన్స్ మినిస్టర్ తోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) గంటల తరబడి గడుపుతున్నారు. మరోవైపు, భారత త్రివిధ దళాధిపతులు చేస్తున్న పనులు చూస్తుంటే ఏదో పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతోంది. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పూరీ జగన్నాథుని సన్నిధిలో, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్వర్ణ దేవాలయంలో, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి ఉజ్జయిని మహాకాళి చెంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వీరంతా దైవ ప్రార్థనలు చేస్తున్నారంటే, భారత్ ఏదో భారీ "నేషనల్ సెక్యూరిటీ ఈవెంట్"కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్థాన్ తన గాలి సరిహద్దులను (Air Space) అప్పగించబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకెళ్తే, ఇరాన్ ఖచ్చితంగా పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటిస్తుంది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! పాకిస్థాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్‌ను యుద్ధంలోకి లాగాలని చూస్తోంది. భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో 'నోటామ్' (NOTAM) జారీ చేసింది. అంటే సరిహద్దుల్లో ఎప్పుడైనా ఏం జరగొచ్చనేదానికి ఇది సంకేతం.

    మరోవైపు, పీఓకే (PoK) సరిహద్దుల్లో సుమారు 1500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ ,పాకిస్థాన్ కలిసి భారత్‌ను "టూ ఫ్రంట్ వార్" (రెండు వైపుల నుండి యుద్ధం) లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే ఈ మీటింగ్‌లో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉన్నారు. యుద్ధం సంభవిస్తే బ్రహ్మోస్, ఎస్-400, రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్థాన్‌ను ఎలా దెబ్బకొట్టాలి? ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి? అనే వ్యూహంలో ఉంది. శతృవు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత వార్-రూమ్ అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహా-సంగ్రామంలో భారత్ పైచేయి సాధిస్తుందా? మోదీ, దోవల్ వ్యూహం పాకిస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీయబోతోందా? అనే చర్చ అంతర్జాతీయ మీడియాలో మొదలైంది.

     

  • చెన్నై: త‌మిళ‌నాడు శాస‌నస‌భ ఎన్నికల పోలింగ్‌కు మ‌రికొద్ది రోజుల స‌మ‌యం మాత్రమే ఉండడంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్ర‌నేత‌లు నామినేష‌న్లు దాఖ‌లు చేసి ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ కూట‌ముల మ‌ధ్య హోరాహోరీ త‌ప్ప‌ద‌ని ప్రిపోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌రోవైపు హీరో విజ‌య్ నాయ‌క‌త్వంలోని త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) మొదటిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ త‌మిళ‌ర్ క‌చ్చి (ఎన్‌టీకే) కూడా ఒంట‌రిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్య‌ర్థులకు భారీగా ఆధిక్యాలు రాక‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

    పోటీ ఎక్కువ ఉండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు చిన్న‌ పార్టీల‌ను కూడా త‌మ కూట‌మిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగ‌స్వామ్య పార్టీల‌కు అధికంగా సీట్లు కేటాయించాల్సి వ‌చ్చింది. ఫ‌లితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూట‌ముల మిత్ర‌ప‌క్షాల అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌డంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో 11 స్థానాల్లో మాత్ర‌మే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ ఈసారి మ‌రో ప‌ది స్థానాలు జ‌త‌య్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెర‌గ‌డంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. డీఏంకే కూట‌మిలో 20పైగా చిన్న పార్టీలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

    మిత్ర‌ప‌క్షాలు బ‌లంగా ఉన్నందువ‌ల్లే ఈ 21 స్థానాల‌ను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని జాతీయ పార్టీల‌కు ఎన‌లిస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వి. భార‌తి అభిప్రాయ‌ప‌డ్డారు. కొత్త‌గా బ‌రిలోకి దిగిన టీవీకే, ఎన్‌టీకే పార్టీలు కూడా స్థానికంగా బ‌లమున్న నేత‌ల‌కే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుంద‌న్నారు. విజ‌య్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో డీఎంకే, అన్నాడీఎంకే కూట‌ముల లెక్క‌లు మారిపోయాయ‌ని సెపాల‌జిస్ట్ ఆర్‌. చంద్ర‌శేఖ‌ర‌న్ అన్నారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి గెలిచే అభ్య‌ర్థుల‌కు పెద్ద‌గా మెజార్టీలు రాక‌పోవ‌చ్చ‌ని తెలిపారు. 

    చ‌ద‌వండి: హీరో విజ‌య్ విద్యార్హ‌త‌లు ఇవే

  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఒక  వివాహ వేడుక రసాభాసగా మారిపోయింది.  స్వల్ప వివాదానికే అతిథులు రెచ్చిపోయారు. ఇది కాస్తా తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి సమయంలో నిందితులు ఇంట్లోని వస్తువులను, నగదును కూడా  ఎత్తుకుపోవడం  కలకలం రేపింది.

    పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటాయ్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.  స్థానిక నివాసి మహేష్ జాతవ్ వివాహం జరుగుతుండగా, వేడుకలో తమకు మద్యం సరఫరా చేయాలని అతిథులు గొడవకు దిగారు. దీంతో వివాదం చెలరేగింది. మందు పోస్తావా, డబ్బులు ఇస్తావా అంటూ నానా యాగీ చేశారు. దీనికి వరుడు నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. 

    మద్యం ఇవ్వలేదని ఆగ్రహించిన అతిథుల బృందం, వధూవరులతో పాటు, కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసి నట్లు నగర పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు. ఈ ఘర్షణలో వరుడి కుటుంబానికి చెందిన కొందరు సభ్యులు గాయపడ్డారు. ఈ సమయంలో కొన్ని విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన ఆరోపణలున్నాయని  తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

    ఇదీ చదవండి : ఇపుడా పని..క్యాబ్‌ బుక్‌ చేసినంత ఈజీ : ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

     

    వరుడి తల్లి ఆరోపణలు
    పెళ్లింటికి తమ వధువు  చేరుకున్న తర్వాత కొన్ని ఆచారాలు జరుగుతుండగా, కొందరు పొరుగువారు అక్కడికి వచ్చి మద్యం కోసం తన కుమారుడిని డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారని వరుడి తల్లి షీలా విలేకరులకు తెలిపారు. మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ పొరుగువారు వరుడితో సహా తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాము జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, తనపై, తన భర్తపై , వధువుపై కూడా దాడి చేశారని జాతవ్ తల్లి ఆరోపించారు.

    ఇదీ చదవండి : లాస్ట్‌ మినిట్‌ ట్విస్ట్‌ : వరుడితో కాదు పెళ్లి !
     

  • పారిశ్రామిక వేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత  ఆనంద్‌ మహీంద్ర మరో ఆసక్తికర కథనాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ, భారతీయులు దాన్ని వినియోగించుకుంటున్నతీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సాంప్రదాయకమైన, స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామంటూ ఆనందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆయన షేర్‌ చేసిన వీడియో నెట్టింట సందడిగా మారింది. 


    ఆనంద్‌ మహీంద్ర తన ట్వీట్‌లో ఏమన్నారంటే..
    క్యాబ్‌ని బుక్ చేసుకున్నంత సులభంగా  ఇపుడు కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని (Coconut Harvester) పిలిపించుకోవచ్చు. ఒక శిక్షణ పొందిన వృత్తినిపుణుడులా యూనిఫాం ధరించి, అవసరమైన పరికరాలతో సైకిల్‌పై వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. ఈ ఉదంతంలో తనను  బాగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. ఆ చెట్లు ఎక్కిన యువకుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రాసుకొచ్చారు.

    అలాగే తన కరీర్‌ ప్రారంభం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన  కెరీర్ ప్రారంభంలో  గ్రూప్ స్టీల్ బిజినెస్‌లో పనిచేస్తున్నప్పుడు,  ఫర్నేస్ , ఫౌండ్రీ షాపుల్లో పనిచేసే వాళ్లకోసం ఎదురు చూడాల్సి వచ్చేది.  వీరిలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వచ్చినవారే. ముఖ్యంగా వీరంతా  బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చేవారు. <

     భారతదేశ సేవా రంగాన్ని (Services Economy) గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఐటీ ఎగుమతులు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గురించే చర్చించుకుంటాం. కానీ ఇపుడు పరిస్థితి చాలా మారింది.కానీ మనం మన అత్యంత సాంప్రదాయ, అతి స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు.  గతంలో భారీ పరిశ్రమలలో మాత్రమే కనిపించిన ఈ ఆశలు, ఆకాంక్షలు.. నేడు సాంకేతికతతో కూడిన సరికొత్త సేవా రంగాలలో కూడా మార్గాలను వెతుక్కుంటున్నాయి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్లడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారడం, అభివృద్ధి చెందిన అనేది నిజంగా  శక్తివంతమైన ఆర్థిక చోదక శక్తి మాత్రమే కాదు, ఇది దేశ సమగ్రతకు (Integration) కూడా ఒక గొప్ప బలం అని అభివర్ణించారు.  ఆయా రాష్ట్రాలు ఈ వలస కార్మికులను సాదరంగా ఆహ్వానించినంత కాలం ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుంది! అన్నారు.

    ఇదీ చదవండి: లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్‌ స్టోరీ

  • కనిపెంచిన తల్లిదండ్రులకు  బిడ్డలు ఖరీదైన బహుమతులు అందించడం చాలా కామన్‌. ఎదిగిన బిడ్డలు ఎంతో ప్రేమగా  ఇచ్చిన కానుకను చూసి మురిసిపోవడం ఇంకా కామన్‌. అయితే తల్లికి ఖరీదైన అందమైన  గిష్ట్‌ ఇచ్చిన కొడుకు ఆ తరువాత  తల్లిని ఒప్పించడానికి  చాలా కష్టపడ్డాడు. దీనికి సంబంధింన వివరాలను సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో ఇది  వైరల్‌గా మారింది. 
    స్టోరీ ఏంటంటే..

    వేదిక్‌క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ రాజ్ కుమార్ తన తల్లికి లక్ష రూపాయల బహుమతి కొన్నాడు. కానీ  దాన్నితల్లి తీసుకునేందుకు చాలా ష్టపడాల్సి వచ్చింది. దాదాపు  అరగంటపాటు  ఆమెకు నచ్చచెప్పి  ఒప్పించారు.. ఊహించిన దానికంటే తాను చాలా ఎక్కువ సంపాదిస్తానమ్మా.. డోంట్‌ వర్రీ అంటూ ఆమెను ఒప్పించారు.  ఆమెకు 1,200 డాలర్ల (సుమారు 1,00,500 రూపాయలు) విలువైన కళ్లజోడును కొనిచ్చిన హృద్యమైన కథను  ఎక్స్‌లో షేర్‌ చేశారు.  ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, సాహిల్ దానిని "చాలా హృద్యమైన రోజు"గా అభివర్ణించారు.

    సోషల్ మీడియాలో పంచుకున్న ఒక హృద్యమైన కథ ఆన్‌లైన్‌లో వేలాది మంది నెటిజనులను ఆకర్షించింది. తన తల్లి షాపింగ్ చేస్తుండగా అనుకోకుండా చేసిన వీడియో కాల్ అనంతరం, ఆమెకు  లక్ష రూపాయల విలువైన డిజైనర్ కళ్లజోడును ఎలా బహుమతిగా ఇచ్చాడో వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, తన కోసం విలాస వస్తువులపై అరుదుగా ఖర్చు చేసే తన తల్లి, ఒక దుకాణంలో కళ్లద్దాలు చూస్తుండగా, వాటిలో కొన్నింటిని చూపించడానికి  తనకు వీడియో కాల్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. అయితే  తనకు బాగా నచ్చిన కళ్లజోడు విలువ ఎక్కువ ఉండటంతో , దాన్ని  కొనే ఆలోచనను ఆమె వెంటనే విరమించుకుంది. దీంతో కొడుకు కుమార్ కల్పించుకుని, ఆ డబ్బు తానే చెల్లిస్తానని చెప్పాడు, కానీ అతని తల్లికి నమ్మకం కుదరలేదు. అతను నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు, సంపాదిస్తూ,  పొదుపు చేసినప్పుడే అలాంటి బహుమతిని అంగీకరిస్తానని ఆమె చెప్పింది. అలా కుమార్‌  ఆమెను 30 నిమిషాలు వాదించి ఒప్పించి, చివరకు ఆమె అతన్ని నమ్మిన తర్వాత, కళ్లద్దాలు కొనడానికి అంగీకరించింది. 

    ఇదీ చదవండి : బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతం

    ఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. కుమారుడిపై  ప్రశంసలు కురిపించారు.  సగటు  భారతీయ కుటుంబాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు. పిల్లలు తమ జీవితంలో బాగా రాణిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా వారి నుండి ఆర్థిక సహాయం స్వీకరించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి : రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి

  • బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. 11 నెలల తన బిడ్డ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో మునిగి చనిపోయిన కొద్ది నిమిషాలకే, 29 ఏళ్ల మహిళా టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

    సాఫ్ట్‌వేర్ నిపుణురాలైన ప్రతిభ తన బిడ్డతో ఇంట్లో ఉండగా, ఆమె భర్త మహంతేష్ పనిలో ఉన్నారు. ప్రతిభ తన బిడ్డ అగస్త్యను బట్టలు తీసుకోవడానికి టెర్రస్‌పైకి వెళ్లింది. ఆమె తన పనిలో ఉండగా, పాకుతూ వెళ్లిన బిడ్డ ప్రమాదవశాత్తు నీటితో నిండిన బకెట్‌లో పడిపోయింది. ప్రతిభ ఇది గమనించేసరికి, తన బిడ్డ బకెట్‌లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె, మొదల మణికట్టు కోసుకుని, కొన్ని మాత్రలు మింగి,  తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబం సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

    ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో, మహంతేష్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి గడియ పెట్టి ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న అదనపు తాళంచెవితో అతను ఇంట్లోకి ప్రవేశించి చూడగా, తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయి ఉన్నారు. ప్రతిభ రాసిన ఆత్మహత్య లేఖను చూశాడు. తన తప్పిదం వల్లే  బిడ్డ చనిపోయిందని ప్రతిభ తన సూసైడ్‌ లేఖలో పేర్కొంది.   దీంతో  15 మాత్రల ఖాళీ స్ట్రిప్‌ను కూడా  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    తన బిడ్డ మరణానికి తానే 'బాధ్యురాలినని' సూసైడ్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. గత నాలుగేళ్లుగా ఆ కుటుంబం అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోందని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: లాస్ట్‌ మినిట్‌ ట్విస్ట్‌ : వరుడితో కాదు పెళ్లి !

  • న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు.  ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

    మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్‌ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.

    అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా కర్నూల్‌ను జ్యూడీషియల్‌ క్యాపిటల్‌గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు వాకౌట్‌ చేశారు. 

    అమరావతి బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ?
  • ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్‌విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు.  
     

    అమరావతి కాదు.. కమ్మరావతి ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
  • న్యూఢిల్లీ: సామాన్యుల స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. సెల్‌ఫోన్ రీచార్జిలో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపై ఆయ‌న లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. అలాగే మొబైల్ డేటా వినియోగంలో టెలికం కంపెనీల వైఖ‌రిని కూడా చ‌ట్ట‌స‌భ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. అంతేకాదు మ‌హా న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య గురించి కూడా రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. మినిమ‌మ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యుల‌ను బ్యాంకులు ఇబ్బందులు గురిచేస్తున్నాయ‌ని స‌వివ‌రంగా వివ‌రించారు.

    పార్ల‌మెంట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతున్న రాఘ‌వ్ చ‌ద్దాకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడి ప‌ద‌వి నుంచి ఆయ‌నను తొల‌గించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమించింది. దీనికి సంబంధించి రాజ్యసభ సచివాలయానికి అధికారిక సమాచారం పంపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా,  రాఘ‌వ్ చ‌ద్దా 2023 నుంచి రాజ్య‌స‌భ‌లో ఆప్ ఉప నాయకుడిగా ఉన్నారు.

    కార‌ణం అదేనా?
    రాఘ‌వ్ చ‌ద్దా వైఖ‌రిపై అగ్ర‌నాయ‌క‌త్వం ఆగ్ర‌హం కార‌ణంగానే ఆయ‌న ప‌ద‌వి పోయిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీకి అంటిముట్ట‌న్న‌ట్టు ఉంటున్నార‌ని ఆయ‌నపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. పార్టీకి సంబంధించిన కీల‌క అంశాల‌పై స్పందించ‌కుండా మౌనం వ‌హించ‌డంపై అధినాయ‌క‌త్వం ఆయ‌నపై గుర్రుగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల‌ను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించినా రాఘ‌వ్ చ‌ద్దా నుంచి స్పంద‌న లేదు. సోష‌ల్ మీడియాలోనూ ఎటువంటి పోస్ట్ పెట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. 

    అగ్ర‌నేత‌ల‌కు ఊర‌ట ల‌భించినా చ‌ద్దా స్పందించ‌క‌పోవ‌డంపై పార్టీలో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అంతేకాదు ప‌లుమార్లు పార్టీ కీల‌క స‌మావేశాల‌కు గైర్హాజ‌రయ్యారు. గ‌తంలో కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు చ‌ద్దా. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పుడు ఆల‌స్యంగా స్పందించారు. బ్రిట‌న్‌లో కంటి ఆప‌రేష‌న్ చేయికున్నందునే ఆల‌స్యంగా స్పందించాన‌ని అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చారు.

    ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్ ఇచ్చిన ఆప్

    ఒక‌ప్పుడు కేజ్రీవాల్‌కు స‌న్నిహితుడు
    చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 37 ఏళ్ల రాఘ‌వ్‌ చ‌ద్దా, 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రారంభమైనప్పటి నుండి ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. గ‌తంలో కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న పార్టీకి జాతీయ కోశాధికారిగా పనిచేశారు. అత్యున్నత నిర్ణయాధికార విభాగ‌మైన రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ను సమన్వయం చేయడంలో కూడా చ‌ద్దా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు సలహాదారుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కో-ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

    చ‌ద‌వండి: చేతుల్లో ఏమీ లేదు.. అంతా బీజేపీ గేమ్‌ప్లాన్‌

  • కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్‌ఈఎంఎస్‌) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

    ఇది ఎలా పనిచేస్తుంది?
    ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్‌ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.

    ప్రత్యేకతలు ఇవే..
    మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్‌ఈఎంఎస్‌, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్‌) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్‌లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్‌ఈఎంఎస్‌ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

    రూపకర్తలు వీరే..
    జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.

    ఇది కూడా చదవండి: ‘బెంగాల్‌ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం

  • అన్నానగర్‌: చెన్నై కొడుంగైయూర్‌ ప్రాంతానికి చెందిన సుధాకర్‌. ఇతనికి భార్య , ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో, తన భర్త నుండి విడిగా నివసిస్తున్న కొడుంగైయూర్‌ లోని కన్నదాసన్‌ నగర్‌కు చెందిన రమ్య (38)తో సుధాకర్‌ కు పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా, వారిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈలోగా, గత సంవత్సరం నవంబర్‌లో, వారిద్దరూ కలిసి కొడుంగైయూర్‌లోని కామరాజ్‌ సాలైలో ఓ బైక్‌ షోరూంను ప్రారంభించారు. 

    ఆర్థిక సమస్య కారణంగా కొన్ని నెలల్లోనే వారు ఆ బైక్‌ షోరూంను మూసివేశారు. దీని తర్వాత, సుధాకర్, రమ్య మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంగా, సుధాకర్‌ గత వారం నుండి రమ్యకు దూరంగా ఉండి, మళ్లీ తన భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. సుధాకర్‌ నిర్ణయంతో ఆగ్రహించిన రమ్య, నల్ల బురఖా ధరించి, మంగళవారం రాత్రి సుమారు 12 గంటలకు సుధాకర్‌ ఇంటికి వచ్చి, అతని ఇంటి బయట నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం పై, ఇంటి తలుపుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయింది.దీంతో సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బుధవారం ఉదయం రమ్యను అరెస్టు చేశారు. 

International

  • వాషింగ్టన్‌: అమెరికాలో సంచలన సృష్టించిన ఎప్‌స్టీన్‌ ఫైళ్ల విడుదల అయ్యాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో వేలపేజీల రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రహస్య పత్రాలను అమెరికా డీవోజే(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌) బహిర్గతం చేసింది. పారదర్శకత కోసమే ఫైళ్లు విడుదల చేశామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూలు, గ్రాండ్‌ జ్యూరీ కీలక సాక్ష్యాలు బయటపడ్డాయి. తద్వారా 2008 నాటి వివాదాస్పద ఒప్పందాల వెనక ఉన్న రహస్యాలపై ఉత్కంఠ నెలకొనగా, ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

    కాగా, ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్‌స్టీన్‌ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్‌స్టీన్

    అతనికి  సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.

    ఎప్‌స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.

    అసలేంటి ఎప్‌స్టీన్ ఫైల్స్ ..
     అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.

    మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది.

    ఎప్‌స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.

    మరోవైపు ట్రంప్ -ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు గతంలోనే బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. మరి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఈ ఫైళ్లలో ఏముందో,  ఏమౌతుందో అనే ఆసక్తి నెలకొంది.


     

  • టెహ్రాన్: వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్‌ మిలిటరీ ఆపరేషనల్‌ కమాండ్‌ ఖతమ్‌ అల్‌ అన్బియా ప్రకటించింది. ఇరాన్‌ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్‌ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్‌లను ఇరాన్‌ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.

    ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్‌ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్‌కు ఏమీ తెలియదంటూ ఖాతమ్‌ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు.

    "మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్‌ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్‌ అల్-అన్బియా ప్రతినిధి  హెచ్చరించారు.


     

Business

  • 2026 మొదలై మూడు నెలలు పూర్తయిపోయింది. ఈ కాలంలో లెక్కకు మించిన కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని వాహనాలను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

    ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్
    ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 9న లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరికొత్త స్టైలింగ్‌తో వస్తుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, మెరుగైన ఇంటీరియర్స్ వంటివి ఉన్నాయి. అప్‌డేటెడ్ క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.

    టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా
    500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది లేటెస్ట్ డిజైన్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. దీనిని కొనుగోలుదారులు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సిటీ, హైవే డ్రైవ్‌ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.

    ఎంజీ మెజెస్టర్
    ఎంజీ మెజెస్టర్ కారు కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే పాపులర్ కార్ల జాబితాలో ఒకటి. ఇది ఏడీఏఎస్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు.. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ పొందనుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది.

    2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
    2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా అప్డేటెడ్ స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది సాధారణ బ్రేజ్జా కంటే కూడా మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.

    మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్
    మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్.. లేటెస్ట్ టెక్నాలజీ, అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లను పొందుతుంది. ఇంజన్ ఆప్షన్లు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఎస్‌యూవీ ప్రీమియం సౌకర్యం, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ ఉండనున్నాయి. కాబట్టి ఇది విలాసవంతమైన హంగులతో కూడిన.. గొప్ప పనితీరును ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

    ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

  • నాలుగైదు రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఈ రోజు ఉదయం ఓ మోస్తరుగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి భారీగా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు ఒకింత ఆనందాన్ని కలిగింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ.1,38,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి రూ.1,36,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,51,420 రూపాయల నుంచి 148970 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు ఎంతలా పతనమయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర 149120 రూపాయల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద ఉంది. ఉదయం ఈ ధరలు వరుసగా రూ.151570, రూ. 138950 వద్ద ఉన్నాయి.

    చెన్నైలో కూడా సాయంత్రానికి బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఈ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,50,000 వద్ద ఉంది. 22 క్యారెట్ల రేటు 137500 రూపాయల వద్ద ఉంది.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ రేటు రూ.10000 తగ్గడంతో సిల్వర్ రూ.2.55 లక్షల వద్దకు చేరింది. ఈ రేటు ఢిల్లీలో 2.50 లక్షల రూపాయల వద్ద ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే దేశ రాజధాని నగరంలో వెండి రేటు కొంత తక్కువే.

    ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

  • గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్‌టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.

    కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా  యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్‌ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి. 

  • ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

    సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్‌టెల్‌కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

    ఆఫ్రికాలో.. ఎయిర్‌టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నారు.

    ఎయిర్‌టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్‌టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు.

  • చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.

    ''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్‌కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.

    కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్‌గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.

    ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్‌ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను  అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ కోరుకునే వారి కోసం జియోలో ఓ పాపులర్‌ హిట్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. అదే రూ. 349 ప్లాన్‌.

    ప్లాన్ వివరాలు
    జియో అందిస్తున్న ఈ రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా మొబైల్ సేవలను ఆస్వాదించవచ్చు.

    డేటా ధమాకా
    ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ దీని డేటా ప్రయోజనాలే. ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజుల కాలపరిమితిలో వినియోగదారులకు మొత్తం 56 GB డేటా అందుబాటులో ఉంటుంది. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత కూడా తక్కువ వేగంతో ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉంటుంది.

    అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్
    డేటాతో పాటు, ఈ ప్లాన్ ద్వారా దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. లోకల్, ఎస్టీడీ కాలింగ్స్ కోసం అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

  • న్యూఢిల్లీ: పండుగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు తదితర అంశాల నేపథ్యంలో ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు మార్చిలో రికార్డు స్థాయికి ఎగిశాయి. ఏకంగా రూ. 29.53 లక్షల కోట్ల విలువ చేసే 2,264 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

    గతేడాది మార్చిలో నమోదైన రూ. 24.77 లక్షల కోట్లతో పోలిస్తే విలువపరంగా 19 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 26.84 లక్షల కోట్ల విలువ చేసే 2,039 కోట్ల లావాదేవీలు రికార్డయ్యాయి. డిజిటల్‌ చెల్లింపులు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారాయనడానికి ఇది నిదర్శనమని పేనియర్‌బై ఎండీ ఆనంద్‌ కుమార్‌ బజాజ్‌ తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్‌ తదితర ఏడు దేశాల్లో ఇది అందుబాటులో ఉంది.

  • చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్‌ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్‌బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్‌ ద్వారా కూడా ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు.

  • ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్‌లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

    వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్‌తో కలిసి జపాన్‌లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

    బ్రెజిల్ పాస్‌పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
    కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్‌పోర్ట్‌లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్‌లో విభిన్న జాతుల ప్రజలు  నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

    ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్‌లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్‌లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్‌ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులు
    కిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్‌పోర్ట్‌తో టోక్యో డిస్నీల్యాండ్‌కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.

    ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది.

  • గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 182.26 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 73,316.58 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 22,713.10 వద్ద నిలిచాయి.

    రుచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, ఓరియంటల్ ట్రైమెక్స్ లిమిటెడ్, బ్రూక్స్ లాబొరేటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్‌) లిమిటెడ్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్, హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్ సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • పెట్టుబడిదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2017 ఏప్రిల్‌ 1కి ముందు చేసిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే ఆదాయానికి  జనరల్‌ యాంటీ అవాయిడెన్స్‌ రూల్స్‌ (గార్‌) వర్తించవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది.

    సవరించిన ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద.. 2017 ఏప్రిల్‌ 1కు ముందు చేసిన పెట్టుబడులను బదిలీ చేసినప్పుడు వచ్చిన ఆదాయం గార్‌ పరిధిలోకి రాదని పేర్కొంది. గార్, గ్రాండ్‌ ఫాదరింగ్‌కు మధ్య గందరగోళాన్ని తాజా ప్రకటన తొలగిస్తుందని ఏకేఎం గ్లోబల్‌ పార్ట్‌నర్, పన్ను నిపుణుడు సందీప్‌ సెహగల్‌ పేర్కొన్నారు. పాత పెట్టుబడులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేసినట్టు చెప్పారు.

    గార్‌ను మొదటగా 2012–13 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు పన్ను తప్పించుకునే ప్రయత్నాలను అరికట్టడమే దీని లక్ష్యం. అయితే ఈ నిబంధనలపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో అమలు ఆలస్యమైంది. చివరకు 2017 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచి్చంది. అదే సమయంలో పాత పెట్టుబడులకు ‘గ్రాండ్‌ఫాదరింగ్‌’ రక్షణ కల్పించారు. ‘టైగర్‌ గ్లోబల్‌’ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు  ఇచ్చిన తీర్పు తర్వాత గార్‌ అమలుపై సందిగ్ధత ఏర్పడింది.

    2018లో ఫ్లిప్‌కార్ట్‌ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజా నోటిఫికేషన్‌తో 2017కు ముందు పెట్టుబడులపై లాభాలు భవిష్యత్తులో కూడా గార్‌కు లోబడవని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

  • అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ధృవీకరించారు. ఈ కార్ల కోసం ఇకపై ఆర్డర్స్ తీసుకోబోమని, ఇక్కడ డెలివరీ చేయాల్సిన 600 కార్లు మాత్రమే ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ''టెస్లా మోడల్ S, X మోడల్స్ ఆర్డర్లు ముగిశాయి. స్టాక్‌లో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక శకం ముగింపును సూచించడానికి మేము ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఆ కార్లంటే చాలా ఇష్టం. 14 సంవత్సరాల క్రితం ఉత్పత్తి ప్రారంభోత్సవంలో నేను ఇలా ఉన్నాను'' అని మస్క్ ట్వీట్ చేసారు.

    జనవరిలో జరిగిన టెస్లా 2025 క్యూ4 ఆదాయాల సమావేశంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తి నిలిపివేత వార్త వెలువడింది. ఆ సమయంలో.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు ఇది ఒక "గౌరవప్రదమైన ముగింపు" అని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇదే సమయంలో.. అవకాశం ఉన్నప్పుడే కార్లను ఆర్డర్ చేయమని మస్క్ వినియోగదారులను కోరారు. కార్ల కోసం కేటాయించిన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆప్టిమస్ రోబోట్‌ల ఉత్పత్తి కోసం మార్చనున్నట్లు కూడా ఆ బ్రాండ్ వెల్లడించింది.

    14 సంవత్సరాల మార్కెట్
    మోడల్ S అనేది సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని టెస్లా రూపొందించిన మొదటి వాహనం, దీనిని జూన్ 2012లో విడుదల చేశారు. ఇది 2015, 2016 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.కేవలం 2015లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మోడల్ Xను 2015లో పరిచయం చేశారు. ఈ రెండు మోడళ్లు కలిసి, వాటి ఉత్పత్తి కాలమంతటా 610,000కు పైగా డెలివరీలను సాధించాయి.

  • సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే కొందరు అవకాశం వచ్చినప్పుడు స్థలాలు, భూములు, ఇల్లు కొనుగోలు చేసి.. తమకు అవసరం వచ్చినప్పుడు విక్రయిస్తుంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని అంధేరి వెస్ట్‌లో ఉన్న ఒక కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని విక్రయించారు.

    రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. సోహైల్ ఖాన్ రూ. 5.90 కోట్లకు ఆఫీస్ స్పేస్ విక్రయించారు. ఇది లింక్ రోడ్‌లోని ఆర్క్ వన్ భవనంలో 1559 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో పాటు కమర్షియల్ ఆఫీస్ స్థలాన్ని బిల్కిష్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.

    ఈ లావాదేవీ మార్చి 27, 2026న నమోదయ్యాయి. దీనికి గాను రూ.35.40 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు సమాచారం.

    ఇదిలా ఉండగా.. 2025 అక్టోబర్‌లో, సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ. 22 కోట్లకు విక్రయించారు. సద్గురు డెవలపర్స్ అభివృద్ధి చేసిన ఫ్లయింగ్ కార్పెట్ భవనంలో ఉన్న ఈ ఆస్తి, సుమారు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌లో తొమ్మిది పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. దీనిని శివాయ సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు.

  • పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ భారత ప్రభుత్వం దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల దేశీయ పరిశ్రమలు కుదేలు కాకుండా చూసేందుకు 40 రకాల కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా మాఫీ చేసింది. ఏప్రిల్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మినహాయింపు జూన్ 30, 2026 వరకు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

    ఎందుకు ఈ నిర్ణయం?

    ప్రపంచ పెట్రోకెమికల్ మార్కెట్‌కు పశ్చిమాసియా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ముడి పదార్థాల లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా భారత తయారీ రంగంపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అవసరమైన ముడి పదార్థాల ధరలను స్థిరీకరించడం ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ కల్పించడమే మా ప్రాథమిక లక్ష్యం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

    ప్రయోజనం పొందే రంగాలు, ఉత్పత్తులు

    ఈ సుంకాల మాఫీ ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచే ప్రాథమిక ముడి పదార్థాలు, అధునాతన పాలిమర్లపై దృష్టి సారించింది. అందులో.. మిథనాల్, మోనోథిలిన్ గ్లైకాల్, ఫినాల్, ఎసిటిక్ ఆమ్లం, పాలిథిలిన్, పాలీప్రొపైలిన్, పాలీస్టైరిన్, పీవీసీ, ఎపోక్సీ రెసిన్లు, పాలీకార్బోనేట్లు, పీఈటీ చిప్స్ ఉన్నాయి.

    లాభపడే పరిశ్రమలు

    • ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్

    • టెక్స్‌టైల్‌

    • ఫార్మాస్యూటికల్స్

    • ఆటోమోటివ్

    విస్తృత ఆర్థిక వ్యూహం

    ఈ నిర్ణయం పరిశ్రమలకు రాయితీ ఇవ్వడంతోపాటు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ముందస్తు చర్య అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే అది నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సుంకాల రద్దు ద్వారా ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది.

    ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

  • పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.

    కుటుంబంలా అండగా ఉంటాం
    ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్‌లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.

    ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.

    హార్డ్‌వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..
    రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు.  ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

    ఇటీవల దుబాయ్‌లో 55 అంతస్తుల వాణిజ్య టవర్‌ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

Telangana

  • సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు.

    గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 'హెచ్‌-ఫాస్ట్‌' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు.

    నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్‌ రఘునాథ్‌, అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • ఢిల్లీ:  హైదరాబాద్‌ నగర మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదని, ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం,  సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపింది.  ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. 

    ‘2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై అప్రైజల్ జరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేస్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యసాధ్యల పై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు  ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి’ అని తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కట్నం కోరలకు మరో యువతి బలైపోయింది. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో,  ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే  26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య  చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త వేధించాడన్న ఆరోపణలతో, బిహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇషితా యాదవ్   తనువు చాలించింది. 

    పోలీసుల వివరాల ప్రకారం,బుధవారం సాయంత్రం, ఇషితా యాదవ్ తన అపార్ట్‌మెంట్‌లోని హాలులో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూసిన ఆమె భర్త, నీరజ్ భన్సల్, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇషితా ,నీరజ్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. ఇషితా స్వస్థలం బిహార్ కాగా, నీరజ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం, వీరిద్దరూ హైదరాబాద్‌కు మకాం మార్చారు.

    ఇదీ చదవండి : లాస్ట్‌ మినిట్‌ ట్విస్ట్‌ : వరుడితో కాదు పెళ్లి !

    బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం, నీరజ్ అదనపు కట్నం కోసం ఇషితాను వేధించడం, ఒత్తిడి చేయడం ప్రారంభించడంతో పాటు, తాను ఇటీవల ప్రారంభించిన ఒక స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె కుటుంబాన్ని డిమాండ్ చేయడంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇషితా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్‌లు, వీడియో వైరల్‌

  • హైదరాబాద్ : నగర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులు, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీమ్, టప్పాచబుత్రా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో జిర్రాలోని చాంద్ బేకరీపై దాడి చేసి, రూ. 2.77 లక్షల విలువైన ముడి సరుకులు, ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

    బేకరీ యజమాని సయ్యద్ ఖదీర్ (42)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ నగర్‌లో నివాసం ఉండే ఖదీర్‌ నటరాజ్ నగర్‌లో ‘చాంద్ బేకరీ’ పేరుతో తయారీ కేంద్రాన్ని నడుపుతున్నాడు. బేకరీ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు సమాచారం అందింది.

    పక్కా సమాచారంతో చాంద్‌ బేకరీపై పోలీసులు దాడులు చేశారు. నకిలీ ఉత్పుత్తులతో పాటు మైదా బస్తాలు, సాస్ కార్టన్లు, డాల్డా, చక్కెర, కొబ్బరి పొడి, కేక్ పౌడర్, ఆయిల్ టిన్నులు, చికెన్, బ్రెడ్ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.

    పక్కా  సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, టప్పాచబుత్రా పోలీసులు ఈ దాడి నిర్వహించారు. నిందితుడిపై టప్పాచబుత్రా పోలీసులు పలు కింద కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి అందె శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గోల్కొండ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. వెంకటేష్, టప్పాచబుత్రా ఇన్‌స్పెక్టర్ జి. బాలకృష్ణ, ఎస్.ఐలు కె. వెంకటరమణ, అమ్జద్ షరీఫ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిల్వ ఉంచిన కుళ్ళిన గొర్రె, మేక మాంసాన్ని (పాయా, ముడి, బీజా, గురుదా, కలేజీ తదితర అవయవాలు) విక్రయిస్తున్న ఒక భారీ నెట్‌వర్క్‌ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), హెచ్-ఫాస్ట్ (H-FAST) మరియు మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

    మంగళ్‌హాట్‌లోని 'A to Z షీప్ అండ్‌ గోట్ ఆఫ్ఫల్' స్టోర్‌పై మెరుపు దాడి చేసి సుమారు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడు రఫీ అహ్మద్‌ను అరెస్ట్‌ చేయగా.. మరో నిందితుడు, స్టోర్ యజమాని మొహమ్మద్ అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

    అఫ్రోజ్‌పై గతంలో జీహెచ్‌ఎంసీ జరిమానా విధించడంతో పాటు, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. నిందితుడు రఫీ అహ్మద్.. యజమాని అఫ్రోజ్ సహాయంతో హోల్‌సేల్ మార్కెట్ నుండి తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను సేకరించేవాడు. ఈ మాంసాన్ని మంగళ్‌హాట్, అమాన్ నగర్ కాలనీలోని తమ స్టోర్‌లో నిల్వ చేసేవారు. మాంసం కుళ్లిపోకుండా దుర్వాసన రాకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు, నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో ఎక్కువ కాలం నిల్వ ఉంచేవారు. అనంతరం, ఈ కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంగా నమ్మించి హోటళ్లు, శుభకార్యాలకు, ఇతర ఈవెంట్లకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.

Politics

  • హైదరాబాద్‌:  అమరావతికి సంబంధించి  ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్‌ తీర్మానం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 2వ తేదీ) హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్‌వీ సతీష్‌రెడ్డి. 

    ‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్‌ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు.  లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.

    అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 

    కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్‌ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్‌ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్‌ చేశారు.

    అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు..
    అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు.  రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్‌రెడ్డి. ‘  చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం.

    అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు 

    కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎ‍స్సార్‌సీపీ సపోర్ట్‌ చేయదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించిన మావిగన్‌(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌ ‘మావిగన్‌’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్‌లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే‌ ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా‌ ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.

    ‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్‌ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్‌లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు.

    ..వైఎస్‌ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది.

    జగన్ పై కోపంతో ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు

    ..అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్‌ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్‌రెడ్డి దుయ్యబట్టారు.

  • సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ఆరో వార్డులో అక్రమంగా కూల్చేసిన ఇంటిని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు పేర్నినాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.  పేదల గుండెల్లో ప్రొక్లెయిన్లు దించి వారికి నొప్పి కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర. పేదల గుండెల్లో నువ్వు దింపిన గునపాల నొప్పి నీకు కూడా చూపిస్తా. 2029లో వైఎస్‌ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే బాపిరాజును బందరు తీసుకొస్తా. ఇదే బాపిరాజు చౌదరిని మళ్లీ బందరు మున్సిపల్ కమిషనర్‌గా తీసుకొస్తా. పేదల గుండెల్లో నొప్పి ఎలా ఉంటుందో నీకు కూడా రుచి చూపిస్తా. నీకు, నీ పెన్ డ్రైవ్‌లు దాచి నిన్ను అడిస్తున్నవాడికి చెబుతున్నా. జేసీబీ బక్కెట్లు దిగితే నొప్పి ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదే బాపిరాజు.. ఇదే పోలీసులను బందరు తీసుకొస్తా.

    ..అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్‌ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆలోచన చేయాలి. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని రాతపూర్వకంగా బందోబస్తు ఇవ్వాలని అడిగారా?. కొల్లు రవీంద్ర తానా అంటే మీరు తందానా అనడం భావ్యమేనా?. మున్సిపల్ కమిషనర్ మిమ్మల్ని బందోబస్తు అడిగితే ఆ లెటర్‌ను మీడియాకు విడుదల చేయండి.

    ..బందరులో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప వచ్చే టీడీపీ కార్యకర్త లేడు. మమ్మల్ని కూడా వదిలేసి మా కాపులు నీ పల్లకి మోశారు. నీ దగ్గర పనిచేసేవాడు ఓ కాపు ఆడపిల్లకు కడుపు చేస్తే ఏం న్యాయం చేశావ్. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. నీకు ఆ మాత్రం కూడా విశ్వాసం లేకపోతే ఎలా?’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

    నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..
  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు. 

    భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్‌లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు. 

    గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.

    భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్‌ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది.