టాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు దాదాపుగా తెలుగు నటీనటులు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వాళ్లో తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గత కొన్నేళ్లలో చూసుకుంటే కీలకమైన సహాయ పాత్రల్లో ఎక్కువగా తమిళ, మలయాళ యాక్టర్స్ దర్శనమిస్తున్నారు. అందులో జయరామ్ ఒకరు. ఈయన అల్లు అర్జున్తో కలిసి 'అల వైకుంఠపురములో' మూవీలో నటిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా అనుభవం గురించి ఇన్నాళ్లకు బయటపెట్టారు. అది ఆసక్తికరంగా అనిపించింది.
'నాకు తెలుగు తెలియదు. డైలాగ్ ఎన్నిసార్లు చదివినా సరే గుర్తుండట్లేదు. చివరకు డైలాగ్ని ఓ కాగితంపై రాసి ఎదురుగా ఉన్న అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించి, దాన్ని చూస్తూ డైలాగ్ చెప్పేశాను' అని జయరామ్.. తాజాగా మలయాళ ఎఫ్ఎమ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వతహాగా మలయాళ నటుడు అయిన జయరామ్.. 2018లో అనుష్క 'భాగమతి'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా, ఖుషీ, హాయ్ నాన్న, గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, మిరాయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. తనదైన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. సాధారణంగా డైలాగ్స్ విషయంలో నంబర్స్ చదువుతారు, లేదంటే పక్కనున్న వ్యక్తులు ప్రాంప్ట్ ఇస్తుంటారు. కానీ జయరామ్ మాత్రం అలా కాకుండా ఏకంగా బన్నీ నుదురుపైనే డైలాగ్ పేపర్ పెట్టి చెప్పడం అంటే కాస్త విశేషమే అని చెప్పొచ్చు.
ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్లడ్ రోజెస్. ఈ మూవీకి ఏంజీఆర్ దర్శకత్వం వహించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో హరీష్ కమర్తి నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
హైదరాబాద్ నగరంలో దేవి దాస్, భజరంగి దాస్ అనే ఇద్దరు లీడర్స్ ఉంటారు. వీరిద్దరు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెడతారు. ఆ తర్వాత సిటీలో వరుస హత్యలు జరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఈ వరుస హత్యలకు దేవి దాస్ కొడుకు మదన్కి సంబంధం ఉందని వార్తల్లో వస్తుంది. దేవి దాస్ కొడుకు రాజకీయ జీవితం నాశనం చేయడానికి భజరంగి దాస్ ప్లాన్ చేసాడని దేవి దాస్ కార్యకర్తలు రోడ్ మీదకి వస్తారు. ఈ కేసును సీఐ అరుణ్ గోగోయ్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. పొలిటికల్ ఒత్తిడితో అరుణ్ గోగోయ్ స్పెస్పెండ్ అవుతాడు. ఈ కేసు సీబీఐకి వెళ్తుండగా హోమ్ మినిస్టర్ని కమిషనర్ రిక్వెస్ట్ చేసి అధిరను ఒప్పిస్తాడు. ఈ వరుస హత్యలను వెనక ఉన్నా హంతకుడిని అధిర ఎలా పట్టుకున్నది అనేదే అసలు కథ.
ఎలా ఉందంటే..
ఈ సినిమాలో మహిళలను తక్కువ చేయొద్దని.. వాళ్లు అన్నింటిలో సమానం అని స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే ప్రేమించకూడదు.. ప్రేమిస్తే మోసం చేయకూడదని అమ్మాయి పాయింట్ అనే మెసేజ్ ఇందులో చూపించారు. అలాగే 2026లో డిఫరెంట్ పాయింట్తో ఈ సినిమా బ్లడ్ రోజెస్. వరుస హత్యల నేపథ్యంలో ఈ కథ సాగడం రోటీన్గా అనిపిస్తుంది. కథ నెమ్మదిగా సాగడంతో ఆడియన్స్కు అంతగా నచ్చదు.
డైరెక్టర్ యం. జి అర్ కథ, మాటలు స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నప్పటికీ తెరపై చూపించడంలో ఫెయిల్ అయ్యారు. తాను అనుకున్న పాయింట్ ఆడియన్స్ చెప్పడంలో కాస్తా తడబాటుకు గురయ్యారు. కన్నడతో రెండు సినిమాలు చేసిన ఆయన తెలుగు ఆడియన్స్కు మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. క్రైమ్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు కొద్దిగా నచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే రోటీన్ కథే. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.
ఎవరెలా చేశారంటే..
ఇందులో అధిర క్యారెక్టర్ చేసిన అప్సర రాణి లుక్ అదిరిపోయింది. ఆమెకు ఈ మూవీ తర్వాత ప్రత్యేక మార్క్ ఉంటుంది. శాండల్ వుడ్ హీరో ధర్మాకీర్తి రాజు అరుణ్ గోగోయ్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీలు పృథ్విరాజ్ జనని క్యారెక్టర్లో ఫర్వాలేదనిపించింది. క్రాంతి కిల్లి మార్టిన్ క్యారెక్టర్ అదరగొట్టేశారు. ఈ సినిమాలో సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ మాణిక్, జ్యోతి, అనిల్ కుమార్,ధ్రువ,నరేన్ తేజ్,ప్రగ్య,నవిత, లౌక్య,హాసిని,ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగ తెలిసిందే. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడగా.. అది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. కేవలం తాను కుక్కుల క్షేమం కోసమే పనిచేస్తున్నానని చాలా సార్లు వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్.. తాను వేగాన్గా మారడానికి కారణాలను పంచుకుంది.
తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూశానని రేణు దేశాయ్ తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టుకోలేదని రేణు వెల్లడించింది. మాది బ్రాహ్మణ కుటుంబమని.. అయినప్పటికీ నాన్న మాంసం తినేవారని పేర్కొంది. కానీ మా అమ్మ మమ్మల్ని తినద్దని ఎప్పుడు ఆపలేదని.. కానీ నేను తినకూడదని నిర్ణయించుకున్నాని రేణు దేశాయ్ పంచుకుంది. ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి పూర్తి వేగాన్గా మారిపోయానని తెలిపింది. మా అమ్మ కఠినమైన శాకాహారి..వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినకపోయేదని రేణు వివరించింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ పుష్ప-2. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఏకంగా వరల్డ్ వైడ్గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ చిత్రాల జాబితాలో రెండో పేస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కంటే ముందు అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2200 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అయితే జపాన్లో మన తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మన హిట్ సినిమాలను జపనీస్లోకి డబ్ చేసి అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల పుష్ప-2 మూవీని కూడా జపాన్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ మూవీని జనవరి 16న జపాన్లో 'పుష్ప కున్రిన్' అనే పేరుతో విడుదల చేశారు. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా జపాన్ బాక్సాఫీస్ వద్ద రూ.139.73 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది.
ఇటీవల జపాన్లో రిలీజైన పుష్ప-2 సైతం జపాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తాజాగా మూవీ రిలీజైన 14 రోజుల్లోనే ఇండియన్ చిత్రాల జాబితాలో టాప్-10లో అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.రూ.6.06 కోట్ల వసూళ్లతో ఆమిర్ ఖాన్ నటించిన ధూమ్ 3 (రూ6.03 కోట్లు) వసూళ్లను అధిగమించి 10వ స్థానంలో నిలిచింది. దీంతో జపాన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాలలో పుష్ప 2 చోటు దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించింది.
జపాన్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా..
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
టాప్లో ట్రెండింగ్..
థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.
తాజాగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్లో కొనసాగడం విశేషం.
కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
బిగ్బాస్ షో తర్వాత బుల్లితెర హీరో అమర్దీప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్ లవ్స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం, విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్.అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే.. కృష్ణ పాత్రకు అమర్దీప్ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
శాండల్వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. కేజీఎఫ్- 2 తర్వాత రాకింగ్ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ను భారీ డీల్కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్గా రికార్డ్ సృష్టించనుంది.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్ అని టాలీవుడ్లో చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్ఫుల్ స్టార్గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను అందించడానికి థ్రిల్గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం' అని అన్నారు.
ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.
The chaos is beginning to unfold.
Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCRelease
టైటిల్: హనీ నటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రి నిర్మాతలు: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి రచన, దర్శకత్వం: కరుణ కుమార్ సంగీతం: అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్ ఎడిటింగ్: మర్తాండ్ కె వెంకటేశ్ విడుదల తేది: ఫిబ్రవరి 6, 2025
కథేంటంటే.. ఆనంద్(నవీన్ చంద్ర)కు మూఢనమ్మకాల పిచ్చి. ఆ నమ్మకాల కారణంగా అతని ఉద్యోగం కూడా ఊడిపోతుంది. అయినా కూడా క్షుద్ర పూజలు, అఘోర విశ్వాసాలను వదలడు. భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరా(జయన్ని) భయబ్రాంతులకు గురవుతున్నా.. ఆయన క్షుద్ర పూజలు చేస్తూనే ఉంటాడు. ఊరికి దూరంగా ఓ బంగ్లాకి తన ఫ్యామిలీని తరలిస్తాడు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తే..తన కోరిక నెరవేరుతుందని, అందుకుగాను కూతురు మీరా తన మాట వినాలని చెబుతాడు. మొదట లలిత.. భర్త నిర్ణయాన్ని తిరస్కరించినా.. కొన్ని పరిస్థితుల కారణంగా తర్వాత ఆమె కూడా ఒప్పుకుంటుంది. కూతురు మీరాతో ఆనంద్ ఏ పని చేయించాడు? అతని క్షుద్రపూజలు నిజంగానే ఫలించాయా? ఆనంద్ కారణంగా తల్లి-కూతుళ్లు ఎదుర్కొన్న భయంకర అనుభవాలు ఏంటి? ఈ కథలో రవణ(దివి), సారంగపాణి(రాజా రవీంద్ర) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..? టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసంతో దుర్మార్గపు, అమానవీయ చర్యలకు పాల్పడే మనుషులు ఉన్నారు. క్షుద్రపూజల కోసం సొంత మనుషులనే చంపుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే ‘హనీ’. .‘పలాస’తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్, ఈసారి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మూఢనమ్మకాల పిచ్చితో కట్టుకున్న భార్యని, కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసే ఓ చీకటి మనిషి కథ ఇది. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. అయితే ఇందులో టచ్ చేసిన పిల్లి మాయ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మదనపల్లె సహా పలు నిజ జీవిత క్షుద్ర పూజల సంఘటనల్ని గుర్తొస్తాయి. ఎక్కడా అనవసరమైన భయపెట్టే సీన్స్ లేకుండా, సిచ్యుయేషన్స్ ద్వారానే టెన్షన్ క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత.
కొండగుహలో ఓ తెగ క్షుద్ర దేవతను ఆరాధించే ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అలాంటి క్షుద్రపూజలే హీరో ఆఫీస్లో చేయడంతో అతన్ని చితక్కొట్టి.. బయటకు పంపిస్తారు. ఆ తర్వాత కథనం ఆసక్తికరంగా మారుతుంది. అతనికున్న పిచ్చితో కూతురు, భార్య పడే ఇబ్బందులు ఎమోషనల్కు గురి చేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి ఊరి బయట ఉన్న ఇంట్లోకి వెళ్లిన తర్వాత.. కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పిల్లి మాయ సేకరణ సీన్ థ్రిల్లింగ్కు గురి చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ ఇచ్చినా, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ద్వితియార్థం కథని మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే.. ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల కంటి చూపుతోనే భయపెట్టాడు. లలిత పాత్రలో దివ్య పిళ్లై అద్భుతంగా నటించింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె నటన హృదయాలను హత్తుకుంటుంది. మీరా పాత్రలో కనిపించిన చిన్నారి సహజ నటనతో ఆకట్టుకుంది. రమణగా దివి చేసిన బోల్డ్ రోల్ సినిమాకు ఇంకో డార్క్ షేడ్ ఇచ్చింది. సారంగపాణిగా రాజా రవీంద్ర తనదైన ముద్ర వేశాడు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అజయ్ అరసాడ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ కథకు బలంగా నిలుస్తాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3/5
హీరోయిన్ శ్రీలీల ఈ ఏడాది పరాశక్తితో ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ మార్చి 26వ థియేటర్లలో సందడి చేయనుంది.
ఇదిలా ఉంచితే శ్రీలీల తాజాగా హైదరాబాద్లోని ఓ మాల్ ఓపెనింగ్కు హాజరైంది. ఈ సందర్భంగా తన టాలెంటన్ను బయటపెట్టింది. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్తో అదరగొట్టేసింది. ఉస్తాద్ భగత్ సింగ్లోని దేక్లేంగే సాలా అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీలీల స్టెప్పులకు అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించింది హిందీ బుల్లితెర నటి సుజానే బెర్నెర్ట్. లేటు వయసులో మరోసారి ప్రేమలో పడ్డానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటోంది. సుజానె భర్త, నటుడు అఖిల్ మిశ్రా 2023లో మరణించాడు. ఆ తర్వాత బాధలో కూరుకుపోయిన ఆమెకు అర్జున్ హర్దాస్ అనే వ్యక్తి బాసటగా నిలిచాడు.
రెండేళ్ల ప్రేమ ఢిల్లీకి చెందిన ఇతడి సాన్నిహిత్యంలో త్వరగానే బాధ నుంచి బయటపడింది సుజానె. వీరిద్దరూ తమకు తెలియకుండానే ప్రేమలో పడ్డారు. అలా రెండేళ్లుగా కలిసుంటున్నారు. ఈ విషయం గురించి సుజానె మాట్లాడుతూ.. ప్రేమకు వయసుతో పనేంటి? ఈ ఫలానా వయసువరకే ప్రేమలో పడొచ్చు అని ఎక్కడా రాసిలేదే.. స్వచ్ఛమైన ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రేమికుల రోజు కోసం వెయిటింగ్ ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే రోజు కోసం ఆయన ఎంతో ఎదురుచూస్తున్నాడు. నాకు ఎప్పుడెప్పుడు కానుకలు ఇవ్వాలా? అని తాపత్రయపడుతున్నాడు. అలా అని ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవాలని ప్లాన్ చేసుకోవడం లేదు. కేవలం మా ఆనందాన్ని పంచుకుంటామంతే! అని చెప్పుకొచ్చింది. సుజానె (Suzanne Bernert)- అఖిల్ మిశ్రా 2009లో పెళ్లి చేసుకున్నారు. 2023లో అఖిల్ మిశ్రా కన్నుమూశాడు. ఆ తర్వాత పరిచయమైన అర్జున్తో సుజానె ప్రేమలో పడగా అప్పటినుంచి వీరిద్దరూ కలిసుంటున్నారు.
సీరియల్స్, సినిమా సుజానె.. ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్, యే రిష్తా క్యా కెహ్లాతా హై, చక్రవర్తి అశోక సామ్రాట్ వంటి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. వెండితెరపై నో ప్రాబ్లమ్, లవ్ రెసిపీ, ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, తీర్పు వంటి పలు సినిమాలు చేసింది. చివరగా యాత్ర 2 మూవీలో సోనియా గాంధీ పాత్రను పోషించింది.
ఒక సినిమాకు అవార్డ్ వచ్చిందంటే అందులో కంటెంటే ప్రధాన కారణం. చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే అవార్డులు వచ్చేస్తుంటాయి. అలా ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డ్ అందుకున్న తొలి మరాఠీ సినిమా సబర్ బొండా. ఈ మూవీని క్యాక్టస్ పియర్స్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైంది ఆ తర్వాత అమెరికాలో జరిగిన సన్డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సబర్ బొండా అనే పేరుతో ఈ సినిమా ప్రదర్శించారు. అంతేకాకుండా ఈ సినిమాని గోథెన్బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మరాఠీ చిత్రంలో భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రోహన్ పరశురామ్ దర్శకత్వం వహించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కుల కథగా ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీని టాలీవుడ్ హీరో రానాకు చెందిన స్పిరిట్ మీడియా సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.
Between rituals of loss and moments of connection, a new sense of belonging emerges
గతంలో డ్రగ్స్ మహమ్మారి టాలీవుడ్ను ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో సినీ ప్రముఖులు సైతం విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా చెన్నైలో మలయాళ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెను డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సినీ రంగంలో ఈ డ్రగ్స్ దందా మరోసారి హాట్ టాపిక్గా మారింది.
చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్ అనే మరో వ్యక్తితో పాటు నటి అంజు కృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ విన్సీ నివేతను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.
కాగా.. కేరళలోని త్రిసూర్కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మలయాళంలో 'సుమేశ్ రమేశ్', ఆకాశం కడన్'లాంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' అనే చిత్రంలో మెరిసింది. తాజాగా అంజు కృష్ణ డ్రగ్స్ కేసులో దొరకడం అభిమానులను షాకింగ్కు గురి చేస్తోంది.
'పుష్ప' సినిమా ఫేమ్ డాలి ధనంజయ నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా! అతడికి డాలి పిక్చర్స్ అని ఓ బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ కింద తెరకెక్కిన తాజా చిత్రం జేసీ. ద యూనివర్సిటీ అన్నది ఉపశీర్షిక. సూర్య ప్రఖ్యాత్, భావన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కన్నడ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రీమియర్స్లో వాచీ గిఫ్ట్ అయితే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ సందర్భంగా అందరినోటా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డాలి ధనంజయ సంతోషపడిపోయాడు. దీంతో థియేటర్లోనే సూర్య ప్రఖ్యాత్ను హత్తుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించాడు. అంతేకాదు, వెంటనే తన చేతికున్న వాచీని అతడికి బహుకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సినిమా డాలి ధనంజయ (Daali Dhananjaya) విషయానికి వస్తే.. ఈయన చివరగా తమిళంలో పరాశక్తి సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం కన్నడలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఈయన అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో కథనాలు కూడా రాస్తుంటాడు.
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే.. రాజమండ్రి సమీప గ్రామంలో ఉండే సోలమన్(వంశీ తుమ్మల)కి మెల్లకన్ను ఉంటుంది.దీంతో ఊర్లోవాళ్లంతా అతనికి చిదంబరం అని పేరు పెట్టి హేళన చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్కి వెళ్లడమే మానేస్తాడు. అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్లజోడు ధరిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రీ పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా(సంధ్య వశిష్ట)కి చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ, తనకున్న లోపం కారణంగా లీలా తనను ఇష్టపడదనే భయంతో చిందబరం..ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలమన్.. ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చిదంబరం తనను అపార్థం చేసుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్లజోడు వెనుకాల బతికే పోలమన్.. చివరకు ఆ కళ్లజోడుని తీసి..ధైర్యంగా ఆ ప్రపంచాన్ని ఎలా చూశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే.. ధైర్యంగా జీవించొచ్చు అని సాటిచెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకొన్ని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరకలోపం ఉన్నవాళ్లని సమాజం ఎలా అవమానిస్తుంది? వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
మెల్లకన్ను కారణంగా సోలమన్కి స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ.. చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. సోలమన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా-సోలోమన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా-సోలోమన్ల లవ్స్టోరీని నడిపిస్తూనే..మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి ప్రజల జీవనశైలీని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సోలమన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చూట్టూనే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే హీరోలో వచ్చే మార్పుకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది.
ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో హీరోహీరోయిన్గా నటించిన వంశీ తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్య వశిష్ట తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. చందు-రవి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా సహజంగా ఉంటుంది. ఎం.ఎం.కీరవాణి ఆలపించిన ‘వెళ్లే దారిలోన’ పాట ఆకట్టుకునేలా ఉంటుంది. అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను, పల్లెటూరి పచ్చదనాన్ని తెరపై మరింత అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ చాలా తక్కువ సినిమాలే చేసింది. వాటిలో చిట్టెమ్మ మొగుడు (1993), శక్తి (2011) అని రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. చంద్రహాస్ హీరోగా నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీలో పూజా బేడీ కీలక పాత్రలో నటించింది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్లో ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించింది పూజా బేడీ.
నెగెటివ్ పాత్ర ఆమె మాట్లాడుతూ.. శక్తి సినిమా నేను సోనూసూద్కు భార్యగా నటించాను. నాది ప్రతికూల ఛాయలున్న పాత్ర. ఓ సీన్లో హీరో నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆడవారితో ఫైట్ చేయలేనని నిరాకరించారు. అప్పుడు ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఇప్పుడున్న సినీప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించేవాళ్లు చాలా అరుదు అని తెలిపింది.
తారక్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన చివరగా వార్ 2లో కనిపించాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా లైన్లో ఉంది.
నోరా ఫతేహి ఐటం సాంగ్ స్పెషలిస్ట్. దిల్బర్ సాంగ్తో సెన్సేషన్ సృష్టించింది. శరీరాన్ని రబ్బర్లా సాగదీస్తూ, విల్లులా వంచుతూ స్టెప్పులేయడంలో ఆమె దిట్ట. తన ఎనర్జీకి, అందానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేడు (ఫిబ్రవరి 6న) ఆమె 34వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
కెరీర్ నోరా ఫతేహి కెనడా నటి. కెనడాలోని టోర్నటోలో పుట్టిపెరగడంతోపాటు అక్కడే చదువుకుంది. రోర్ (2014) సినిమాతో నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా.. అనే ప్రత్యేక పాటలో అదరగొట్టింది. అక్కడినుంచే తన ఐటం సాంగ్స్ జర్నీ మొదలైంది. బాహుబలి మూవీలో 'మనోహరి..' అంటూ ప్రభాస్ను చుట్టుముట్టేసే సాంగ్తో మరింత ఆదరణ పొందింది.
నటిగా కలిసిరాని అదృష్టం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది. అయితే తనకు నటిగా కనిపించాలన్న కోరిక ఎక్కువ. అలా రెండేళ్లుగా ఐటం సాంగ్స్పై ఫోకస్ తగ్గించేసి యాక్ట్రెస్గా సినిమాలు చేస్తోంది. తెలుగులో మట్కా సినిమా చేయగా ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడే కాదు హిందీలోనూ తను నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో నటిగా బ్రేక్ రావడం లేదు. దీంతో మళ్లీ గతేడాది చివర్లో థామా మూవీలో స్పెషల్ సాంగ్లో కాలు కదిపింది.
బిగ్బాస్ షోలోనూ.. నోరా డ్యాన్సర్, నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రస్తుతం నోరా ఫతేహి.. కన్నడలో కేడీ: ద డెవిల్, తమిళంలో కాంచన 4 సినిమాలు చేస్తోంది. మరి వీటితోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలి! నోరా ఫతేహి.. హిందీ బిగ్బాస్ 9వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. డ్యాన్స్ ఐకాన్గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ జలక్ దిక్లాజా 9వ సీజన్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇదే షోకి జడ్జిగా వ్యవహరించడం విశేషం.
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.
ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.
ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి, త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు.
మలయాళ నటి కని కుస్రుతి సొంత భాషతో పాటు తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో స్పైడర్ మూవీలో విలన్ తల్లిగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ నటి అస్సి అనే హిందీలో సినిమా యాక్ట్ చేసింది. ఇందులో అత్యాచార బాధితురాలిగా కనిపించనుంది. ఈ మూవీ ఫిబ్రవరి 20న విడుదల కానుంది.
అంత ఈజీ కాదు అయితే కుస్రుతి ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలనుకుంది. గతంలో ఈ విషయం గురించి కని మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. తీరా ఇక్కడికి వచ్చాక అదంత ఈజీ కాదని తెలుసుకున్నాను. కొందరు దర్శకనిర్మాతలు లైంగిక వాంఛలు తీర్చితే అవకాశాలిస్తామన్నారు. ఓపక్క అడ్జస్ట్ అవమని ఒత్తిళ్లు, మరోపక్క నటిగా పరిమితులు విధించేవారు.
అమ్మతోనూ అదేమాట కొందరైతే నేరుగా మా అమ్మతో మాట్లాడారు. ఫలానా సినిమాలో మీ కూతురు కనిపించాలంటే తను అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్నారు. ఇవన్నీ భరించలేకపోయాను. ఈ ఇండస్ట్రీలో బతకడం కష్టమని వెనక్కు వచ్చేశాను. థియేటర్ డ్రామాలు చేసుకుంటూ పోయాను. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.
సినిమా కని కుస్రుతి సినిమాల విషయానికి వస్తే.. 2003లో అన్యర్ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బిర్యానీ, కేరళ కేఫ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్ వంటి పలు చిత్రాల్లో నటించింది. కిల్లర్ సూప్, పోచర్, నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్లలోనూ యాక్ట్ చేసింది.
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్ఫ్లిక్స్(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.
కథేంటంటే.. గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
కుర్రాళ్లు కుమ్మేశారు. ఏకంగా ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ విజేతగా టీమిండియా నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ని 100 పరుగుల తేడాతో యువ భారత్ ఓడించింది. అలా ఆరో వరల్డ్కప్ని టైటిల్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. యువ జట్టుని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
'భారత క్రికెట్ ప్రతిభ మెరిసింది. మన అండర్-19 జట్టు ప్రపంచకప్ సాధించినందుకు గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలానే ఆకట్టుకునే ప్రతిభ చూపించింది. ఈ విజయం చాలామంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం. గెలిచిన ఆటగాళ్లకు నా అభినందనలు' అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా యువ టీమిండియాని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఇంగ్లండ్ కష్టపడినప్పటికీ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో వరల్డ్కప్ సొంతం చేసుకుంది.
టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్.. ఫైనల్లో ఆడాడు. 14 ఏళ్ల వైభవ్.. తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
India’s cricketing talent shines!
Proud of our U-19 team for bringing home the World Cup. The team has played very well through the tournament, showcasing exceptional skill. This win will inspire several young sportspersons too. Best wishes to the players for their upcoming…
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో చివరి వార్మప్ మ్యాచ్లో భారత్-ఎ జట్టు 130 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.
పరాగ్ కేవలం 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 69 పరుగులు చేశాడు. అతడితో పాటు నమన్ ధీర్ (39), అశుతోష్ శర్మ (35) మెరుపులు మెరిపించారు. గెర్హార్డ్ ఎరాస్మస్, రూబెన్ ట్రంపెల్మాన్ ,మాక్స్ హీంగో తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, భారత బౌలర్ల ధాటికి కేవలం 12.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది.
నమీబియా బ్యాటర్లలో డైలాన్ లీచర్(22) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, మయాంక్ యాదవ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ తలా రెండు వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాసించారు.
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన యంగ్ ఇండియా.. రికార్డుస్దాయిలో ఆరోసారి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీది కీలక పాత్ర. తుది పోరులో వైభవ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 150 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 412 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ 311 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్ రికార్డులు బద్దలు 👉అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(175) సాధించిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఉన్మక్త్ చంద్(111*) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో చంద్ను వైభవ్ అధిగమించాడు.
👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 55 బంతుల్లోనే వైభవ్ సెంచరీ సాధించాడు.
👉అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ బాదిన అతని పిన్న వయస్కుడు కూడా సూర్యవంశీనే కావడం విశేషం.
👉అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది.
👉అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా వైభవ్ (30) నిలిచాడు.
అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 100 పరుగుల తేడాతో ఓడించిన యువ భారత్.. ఆరో వరల్డ్కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల వైభవ్ తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ అయూశ్ మాత్రే(53), కనిష్క్ చౌహాన్ (37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.
ఫాల్కనర్ విరోచిత పోరాటం.. అనంతరం భారీ లక్ష్య చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలేబ్ ఫాల్కనర్ వీరోచిత పోరాటం కనబరిచాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఫాల్కనర్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు.
అతడితో పాటు బెన్ డాకిన్స్ (66),థామస్ రెవ్(31) తమ వంతు ప్రయత్నం చేశారు. మిగితా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు పడగొట్టగా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఫైనల్లో భారీ సెంచరీతో చెలరేగిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.
కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్ను బాయ్కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.
ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది.
టీ20 ప్రపంచకప్-2026కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కొలంబో వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుకు నెదర్లాండ్స్ సీనియర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వాన్ మీకెరెన్ తాజాగా క్రిక్స్ అనే స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వాన్ మీకెరెన్కు పాక్తో మ్యాచ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురైంది.
"పాకిస్థాన్తో మ్యాచ్ను మేము ప్రత్యేకంగా చూడడం లేదు. ఇది కూడా మిగిలిన మ్యాచ్ల్లాగే. మా గ్రూపులో భారత్ వంటి బలమైన జట్టుతో పాటు అమెరికా, నమీబియా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి. మా దృష్టి కేవలం పాక్ మ్యాచ్పైనే లేదు. టోర్నీ తొలి మ్యాచ్లో పాక్ ఓడించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. 2009 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో మేము సంచలన విజయం సాధించాము. ఇప్పుడే అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నాము" అని వాన్ మీకెరెన్ పేర్కొన్నాడు.
అదేవిధంగా పాక్ పేస్ బౌలింగ్ చూసి భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు వాన్ మీకెరెన్ బదులిస్తూ: ఒకప్పుడు పాక్ బౌలర్లను చూసి భయపడేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్లో పాక్ జట్టుతో మ్యాచ్లు ఆడాము. పాక్ బలాలు, బలహీనతలపై మాకు ఒక అవగహన ఉందని చెప్పుకొచ్చాడు.
కాగా డచ్ జట్టుతో మ్యాచ్కు పాక్కు చాలా కీలకం. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్తో మ్యాచ్ పాయింట్లు కోల్పోనుండటంతో.. పాక్ తదుపరి రౌండ్కు వెళ్లాలంటే నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలతో జరిగే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిందే.
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.
ఓవరాల్గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.
టీమిండియా సరికొత్త చరిత్ర అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
అండర్-19 ప్రపంచకప్లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్ను నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కామెంటేటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈసారి కూడా అత్యుత్తమ కామెంట్రీతో ఆకట్టుకునేందుకు ఐసీసీ టీవీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు వరల్డ్క్లాస్ అనుభూతిని అందించేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని పేర్కొంది.
బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగా అయితే, ఈ కామెంటేటర్ల లిస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్కు చోటు ఇవ్వడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్- పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతూ.. భారత్, ఐసీసీని నాసిర్ హొసేన్ విమర్శించిన విషయం తెలిసిందే. బంగ్లా, పాక్లను ఒక విధంగా.. టీమిండియాను మరో విధంగా ఐసీసీ చూస్తోందని.. ఇదెక్కడి న్యాయం అని అతడు ప్రశ్నించాడు.
భారత్ దగ్గర డబ్బు ఉందని ఆ జట్టు అభిమానులు అనుకోవచ్చని.. అయితే, ఐసీసీ అందరినీ సమానంగా చూడాలంటూ నాసిర్ హొసేన్ వ్యాఖ్యానించాడు. కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతం ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఐసీసీఐ బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందనేలా నాసిర్ మాట్లాడాడు.
మరచిపోతే ఎలా? అయితే, నెటిజన్లు అతడికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. జింబాబ్వే విషయంలో ఇంగ్లండ్ ఏం చేసిందో గుర్తు చేసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది.
అయినా సరే బంగ్లా పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో బంగ్లాకు మద్దతుగా నిలుస్తామంటూ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అదే జరిగితే ఐసీసీతో పాటు ఐసీసీ సభ్య దేశాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 నిర్వహణకు షెడ్యూల్ ఖారారైంది. ఈ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి.
టీ20 వరల్డ్కప్-2026లో భారత క్రికెట్ జట్టు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. టోర్నీ ఆరంభం రోజు(ఫిబ్రవరి 7)నే వాంఖడే వేదికగా అమెరికాతో టీమిండియా తలపడనుంది. అయితే భారత తుది జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు చోటు దక్కుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చానీయాంశమైంది. సంజూ పేలవ ఫామ్ కనబరుస్తుండడంతో అతడి స్దానంలో ఓపెనర్గా ఇషాన్ కిషన్ పంపాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించారు.
దీంతో టీమ్ మెనెజ్మెంట్ శాంసన్పై వేటు వేసేందుకు సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లలో సంజూ ఆడకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. తాజాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వాఖ్యలు బట్టి సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు కష్టమే అన్పిస్తోంది.
శాంసన్ స్దానంలో సూపర్ ఫామ్లో ఉన్న కిషన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించడం దాదాపు ఖాయమైనట్లే అన్పిస్తోంది. అమెరికాతో మ్యాచ్కు ముందు విలేకరుల సమావేశంలో సూర్య పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఇషాన్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కేవలం టీమిండియా తరపునే కాదు, దేశవాళీ క్రికెట్లో కూడా దుమ్ములేపాడు. అతడు కచ్చితంగా టాప్-3లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడని సూర్య పేర్కొన్నాడు.
కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్గా వచ్చిన సంజూ.. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ను కాదని సంజూకు వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 5 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే సమయంలో రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కిషన్ తన సంచలన ప్రదర్శనలతో అందరిని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో కూడా 200పైగా స్ట్రైక్ రేట్తో సెంచరీ సాధించి, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో కూడా ఓపెనర్గా వచ్చి కిషన్ సత్తాచాటాడు. దీంతో ప్రధాన టోర్నీలో కూడా కిషన్కే ఓపెనర్గా పంపాలని గంభీర్ అండ్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధ్రువీకరించాడు.
కాగా శనివారం (ఫిబ్రవరి 7) నుంచి వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా శనివారం నాటి మ్యాచ్లో యూఎస్ఏతో తలపడుతుంది. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) శుక్రవారం మీడియాతో మాట్లాడాడు.
భారీ ఎదురుదెబ్బే ఈ సందర్భంగా హర్షిత్ రాణా గాయం గురించి అప్డేట్ అందిస్తూ. ‘‘హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొన్నాడని ఇప్పుడే చెప్పలేను. అయితే, అతడి పరిస్థితి ఏమాత్రం బాలేదు. గాయంపై స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.
ఒకవేళ హర్షిత్ రాణా టోర్నీకి దూరమైతే నిజంగా మాకు అది భారీ ఎదురుదెబ్బే. కాంబినేషన్లను దృష్టిలో పెట్టుకునే మేము పదిహేను మందిని ఎంపిక చేసుకున్నాం. అయితే, కావాల్సినంత బెంచ్ స్ట్రెంత్ ఉంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆల్రౌండరే అక్కర్లేదు అతడి స్థానంలో ఆల్రౌండర్నే తీసుకురావాలనే నిబంధన ఏమీ లేదు’’ అని ప్రి-మ్యాచ్ కాన్ఫరెన్స్లో సూర్య పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాదీ స్టార్ మొహమ్మద్ సిరాజ్ ప్రపంచకప్ జట్టులోకి రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సిరాజ్కు గోల్డెన్ ఛాన్స్! కాగా 2024 జూలైలో సిరాజ్ చివరగా టీమిండియా తరఫున టీ20 బరిలో దిగాడు. అయితే, గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున సిరాజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. పదిహేను మ్యాచ్లలో కలిపి 16 వికెట్లు తీశాడు. కాగా సిరాజ్ ఇప్పటికి టీమిండియా తరఫున మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. హర్షిత్ రాణా స్థానంలో సిరాజ్కు బదులు ప్రసిద్ కృష్ణను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్లో 25 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు ప్రసిద్. ఈ కర్ణాటక బౌలర్ చివరగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.
అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తుది పోరులో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అతడి బ్యాటింగ్ తుఫాను ముందు బౌండరీలు చిన్నబోయాయి.
ఈ క్రమంలో కేవలం 55 బంతుల్లోనే వంద పరుగుల మార్కును వైభవ్ అందుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ రికార్డులకెక్కాడు. తొలి స్దానంలో ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజ్జుక్(51) ఉన్నాడు. అయతే ఈ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సునాయసంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు.
కానీ ద్విశతకానికి 25 పరుగుల దూరంలో అతడు నిలిచిపోయాడు. ఓ భారీ షాట్కు ప్రయత్నించి సూర్యవంశీ తన వికెట్ను కోల్పోయాడు. ఓవరాల్గా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్..15 ఫోర్లు, 15 సిక్స్లతో 175 పరుగులు చేశాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ 25 ఓవర్లకే 250 పరుగుల మార్క్ దాటిపోయింది.
కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ సూర్యవంశీ రెండో వికెట్కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఈ బిహార్ ఆటగాడు పలు వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్ అండర్-19 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు మైఖేల్ హిల్(12) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో మైఖేల్ హిల్ రికార్డును వైభవ్(15) బ్రేక్ చేశాడు. అదేవిధంగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా 14 ఏళ్ల వైభవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రాజ్ అంగద్ బావా పేరిట ఉండేది. అతడు 2022లో ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Carnage continues as Vaibhav Sooryavanshi brings up 150 in style! 🔥🤩
The English bowlers have no answers as the Boss Baby is going all guns blazing with towering sixes! 🙌🏻😮💨
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం(ఫిబ్రవరి 5) దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్షిత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.
వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి ఏ మాత్రం ఫలితం లేదు. ఈ క్రమంలో రాణా ఫిజియో సాయంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అనంతరం అతడిని అస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు. అయితే స్కాన్లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం.
రాణా గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పొట్టి ప్రపంచకప్ దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం బీసీసీఐ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశముంది.
కెప్టెన్ల మీట్ సందర్భంగా భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా హర్షిత్ అందుబాటుపై సందేహం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న వాంఖడే వేదికగా అమెరికాతో తలపడనుంది. ఒకవేళ హర్షిత్ టోర్నీ నుంచి తప్పుకొంటే ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) విజయవంతంగా ముగిసింది. స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. టోర్ని ఆరంభం నుంచి ఆధిక్యత ప్రదర్శించిన ఆర్సీబీ అఖరిపోరులోనూ అదో జోరును కొనసాగించి డబ్ల్యూపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. వరుసగా నాలుగోసారి ఢిల్లీ క్యాపిటల్స్కు నిరాశ ఎదురైంది. టైటిల్ విజేత ఆర్సీబీకి రూ. 6 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. రన్నరప్గా నిలిచిన డీసీకి రూ. 3 కోట్లు దక్కాయి.
ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైంది. ఓవరాల్గా 337 పరుగులతో అందరి కంటే ముందు నిలిచిన ఆమెనే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్ని' కిరీటం వరించింది. ఈ టోర్నమెంట్లో ఎక్కువ ఫోర్లు (57) కొట్టింది కూడా ఆమెనే కావడం విశేషం. బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ (68.40) మాత్రం ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నమోదు చేసింది. అంతేకాదు అత్యధిక సిక్సర్లు (13) కూడా ఆమెనే బాదింది.
ఇక బౌలింగ్లోనూ ఢిల్లీ, బెంగళూరు బౌలర్లు సత్తా చాటారు. టాప్-10లో నలుగురు డీసీ బౌలర్లు, ముగ్గురు ఆర్సీబీ అమ్మాయిలు ఉన్నారు. ఢిల్లీ బౌలర్లు నందినీ శర్మ 2, తెలుగు అమ్మాయి శ్రీచరణి 5, చినెల్లే హెన్రీ 6, మారిజాన్ కాప్ 10 స్థానాల్లో నిలిచారు. గుజరాత్ జెయింట్స్ (జీజీ) సోఫీ డివైన్ 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి టాప్లో నిలిచింది. 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసిన నందినీ శర్మ రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ బౌలర్ నదైన్ డిక్లెర్క్ 9 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అమీలియార్ కెర్ (ముంబై), శ్రీచరణి(డీసీ), చినెల్లే హెన్రీ (డీసీ), లారెన్ బెల్(ఆర్సీబీ), రాజేశ్వరి గైక్వాడ్(జీజీ), శ్రేయాంక పాటిల్(ఆర్సీబీ), మారిజాన్ కాప్(డీసీ) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఫెయిర్ ప్లే: ముంబై ఇండియన్స్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: సోఫీ డివైన్ (గుజరాత్) సూపర్ స్టైకర్ ఆఫ్ ది సీజన్: గ్రేస్ హారిస్(ఆర్సీబీ) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: గ్రేస్ హారిస్ (ఆర్సీబీ) ఫాస్టెస్ట్ సెంచరీ: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై) హయ్యస్ట్ స్కోర్: నాట్ స్కైవర్-బ్రంట్ (ముంబై) బెస్ట్ బ్యాటింగ్ స్టైక్ రేట్: ఆశా శోభన (యూపీ వారియర్స్)
బ్యాటింగ్లో ఇరగదీసింది వీరే 1. స్మృతి మంధాన (377)- బెంగళూరు 2. హర్మన్ప్రీత్ కౌర్ (342)- ముంబై 3. నాట్ స్కైవర్-బ్రంట్ (321)- ముంబై 4. లిజెల్ లీ (320)- ఢిల్లీ 5. లారా వోల్వార్డ్ట్(317)- ఢిల్లీ 6. జెమిమా రోడ్రిగ్స్ (264)-ఢిల్లీ 7. షెఫాలీ వర్మ (259)- ఢిల్లీ 8. బెత్ మూనీ (258)- గుజరాత్ 9. మెగ్ లానింగ్(248)- యూపీ 10. ఆష్లీ గార్డనర్ (244)- గుజరాత్
బౌలింగ్లో అదరగొట్టింది వీరే.. మోస్ట్ మేడిన్స్: లారెన్ బెల్ (ఆర్సీబీ) మోస్ట్ గ్రీన్ డాట్ బాల్స్: లారెన్ బెల్ (ఆర్సీబీ) మోస్ట్ డాట్ బాల్స్: లారెన్ బెల్ (ఆర్సీబీ) బెస్ట్ బౌలింగ్ యావరేజ్: ప్రేమ రావత్ (ఆర్సీబీ) బెస్ట్ ఎకానమీ రేట్: లారెన్ బెల్ (ఆర్సీబీ) బెస్ట్ బౌలింగ్ ఎకానమీ: మారిజాన్ కాప్ (డీసీ) బెస్ట్ బౌలింగ్ స్టైక్ రేట్: ప్రేమ రావత్ (ఆర్సీబీ) బెస్ట్ ఫిగర్స్: శ్రేయాంక పాటిల్(ఆర్సీబీ)
భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన ఖాతాలో మరో ప్రపంచ రికార్డును జమ చేసుకున్నాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్, యూత్ వన్డేల్లో అతి పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అండర్-19 వరల్డ్కప్ టోర్నీతో బిజీగా ఉన్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ ఫైనల్కు చేరింది.
55 బంతుల్లో సెంచరీ ఇందులో భాగంగా శుక్రవారం నాటి టైటిల్ పోరులో ఇంగ్లండ్తో తలపడుతున్న ఆయుశ్ మాత్రే బృందం.. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో ఆరోన్ జార్జ్ (9) విఫలం కాగా.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నెమ్మదిగా ఆరంభించినా వేగం పెంచాడు. ఫలితంగా 32 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న పద్నాలుగేళ్ల ఈ చిచ్చర పిడుగు.. 55 బంతుల్లో సెంచరీ సాధించాడు.
That's a BIGGIEEEE! 🤯🔥
Vaibhav Sooryavanshi is unstoppable at the moment as he scores a MASSIVE SIX off Farhan Ahmed while the 100 run-stand between Boss Baby & Ayush! 🔥🙌🏻
ఈ క్రమంలో ఐదు సిక్సర్లు బాదిన వైభవ్ సూర్యవంశీ.. ఈ ఎడిషన్లో ఇరవై సిక్స్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ చరిత్రకెక్కాడు. మొత్తంగా 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఏకంగాఇ 175 పరుగులు సాధించాడు. అయితే, లమ్స్డన్ బౌలింగ్లో థామస్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ డబుల్ సెంచరీ చేయకుండానే నిష్క్రమించాడు.
ఇంగ్లండ్ బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్ కీపర్/కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్డెన్, అలెక్స్ గ్రీన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో పేస్ బౌలర్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
హాజిల్వుడ్ అవుట్ గత కొన్నాళ్లుగా తొడ కండరాల నొప్పి, చీలమండ గాయంతో బాధపడుతున్న జోష్ హాజిల్వుడ్ (Josh Hazlewood) ఇంకా కోలుకోలేదు. దీంతో వరల్డ్కప్ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ధ్రువీకరించింది.
అయితే, ఇప్పటికే హాజిల్వుడ్కు బ్యాకప్గా ప్రకటించిన సీన్ అబాట్ను జట్టుతోనే కొనసాగించిన యాజమాన్యం.. ప్రధాన జట్టులో హాజిల్వుడ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని మాత్రం ఎంపిక చేయలేదు.
కాగా గాయాల బెడద కారణంగా ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు హాజిల్వుడ్ దూరమైన సంగతి తెలిసిందే. నవంబరు నుంచి ఇప్పటివరకు అతడు మైదానంలో దిగనే లేదు. అయితే, వరల్డ్కప్ నాటికి కోలుకుంటాడని భావించిన సెలక్టర్లు అతడికి జట్టులో చోటిచ్చారు. కానీ హాజిల్వుడ్ పరిస్థితి మెరుగుపడలేదు.
రిస్క్ తీసుకోలేము ఈ విషయం గురించి ఆసీస్ సెలక్టర్ టోనీ డొడెమేడ్ మాట్లాడుతూ.. "జోష్ సూపర్-8 దశ వరకైనా ఫిట్నెస్ సాధిస్తాడని భావించాము. అయితే, ఇంకా అతడు కోలుకోలేదు.ఇందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఈ విషయంలో మేము రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.
అయితే, జోష్ స్థానంలో ఇప్పుడే ఆటగాడిని ప్రకటించడం లేదు. ఆరంభమ్యాచ్లలో మాకంత అవసరం లేదనిపిస్తోంది. కొన్నాళ్ల తర్వాత జోష్ స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేసే విషయం గురించి ఆలోచిస్తాము’’ అని తెలిపాడు. కాగా వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా కమిన్స్ దూరం కాగా.. అతడి స్థానాన్ని బెన్ డ్వార్షుయిస్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభం. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఆసీస్.. ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఒమన్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. కాగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో ఆసీస్ తమ తొలిమ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు మద్దతు ఇవ్వాలనుకుంటే పర్లేదని.. కానీ అనవసరంగా భారత్ను ఇందులోకి లాగితే సహించేది లేదని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య దేశమైన భారత్లో తమకు భద్రత లేదని.. పాక్తో పాటు తమ మ్యాచ్లను కూడా శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పునరాలోచన చేయాల్సిందిగా బంగ్లాకు అవకాశం ఇచ్చింది.
బంగ్లా మొండివైఖరికి భారీ మూల్యం అయినప్పటికీ బంగ్లాదేశ్ మొండి వైఖరి వీడకపోవడంతో బంగ్లాను టోర్నీ నుంచి తొలగించిన ఐసీసీ.. రాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. ఈ నేపథ్యంలో తాము బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని పాక్ ప్రకటించింది.
భారత్ను తొలగిస్తారా? ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ద్వంద్వ వైఖరి మీకు మాత్రమే సాధ్యమంటూ టీమిండియా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. స్కై స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. "ఒకవేళ టోర్నమెంట్ ఆరంభానికి నెల రోజుల ముందు.. ఇండియా.. 'మా ప్రభుత్వం ఆ దేశంలో వరల్డ్కప్ ఆడేందుకు ఒప్పుకోలేదు’ అని చెబితే..
ఇదే ఐసీసీ.. 'మీకు నిబంధనలు తెలుసు కదా! బ్యాడ్ లక్.. మిమ్మల్ని టోర్నీ నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పగలదా?.. అందరినీ సమానంగా చూడాలని మాత్రమే నేను చెబుతున్నా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా.. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.
మా దగ్గర డబ్బు ఉంది ఇప్పుడు టీమిండియా అభిమానులు వచ్చి.. 'మాపై పడి ఏడవండి. మా దగ్గర డబ్బు ఉంది’ అంటే మనమేమీ చేయలేము. అధికారం ఉన్నవాళ్లే బాధ్యతగానూ ఉండాలి’’ అని నాసిర్ హొసేన్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
అపుడేమో గర్వంగా ఉందన్నావ్! "బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై మీకు సానుభూతి ఎందుకో మాకు బాగా తెలుసు. అయినా గతంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయా?.. 2003లో జింబాబ్వే జట్టును బాయ్కాట్ చేసింది ఇంగ్లండ్ కాదా? అప్పుడు తమరే కెప్టెన్గా ఉన్నారు కదా!
ఆ సమయంలో.. ఇంగ్లండ్ కెప్టెన్గా ఉన్నందుకు గర్వంగా ఉంది. జింబాబ్వేకు వెళ్లకపోవడమే మంచిది అని మీరు అనలేదా? 2009 టీ20వరల్డ్కప్ సమయంలో జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు నిరాకరించి... వారిని టోర్నీ నుంచి తప్పుకొనేలా చేసింది మీరు కాదా?
మీరు చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పా? ఇప్పుడు శుద్ధపూసలాగా క్రికెట్- రాజకీయం కలపవద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. మరి ఆరోజు ఏమైంది మీ పెద్ద మనసు.
నాడు ఇంగ్లండ్ ఏం చేసిందంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలాంటి పనులు చేసినా మీకు నచ్చుతుందేమో! అందరూ మీలా ఉండరు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా 2003లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనను నిరసిస్తూ హరారేలో ఆడాల్సిన మ్యాచ్ను ఇంగ్లండ్ బహిష్కరించింది. రాజకీయ, భద్రతాపరమైన కారణాలు చూపుతూ ఇలా చేసింది.
అందుకే నాసిర్ హొసేన్కు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అతడి ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఎండగడుతున్నారు. కాగా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై హత్యాకాండ జరుగగా.. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ను బీసీసీఐ తొలగించింది. దీనిని సాకుగా చూపి భద్రతా కారణాలంటూ బంగ్లాదేశ్ రాగం ఎత్తుకుని మూల్యం చెల్లించింది. మరోవైపు.. పాక్లో గతంలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.
చీరాల: బాపట్ల జిల్లాలోని చీరాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. అయితే టీడీపీ కట్టిన ఫ్లెక్సీల వద్దకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సాక్షి,తాడేపల్లి: పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఇటీవల టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని శుక్రవారం వైఎస్ జగన్ పరామర్శించారు. జోగి రమేష్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అయితే, తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పోలీసులు పట్టించుకోలేదు. గ్రామాలు, ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ను మళ్లించారు. జగన్ భద్రతా సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదు. పూర్తి నిర్లక్ష్యం ఖాకీలు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకువెళ్తున్నామని చెప్పి, చివరికి ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ను మళ్లించారు.
ఈ ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సహకరించింది. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా, పోలీసులు సూచించినట్టుగానే వెస్ట్రన్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో ఎటు వెళ్తున్నామో పోలీసులు చెప్పలేదు.
జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ తీవ్రంగా విమర్శించింది. ఈ నిర్లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది.
సాక్షి,తూర్పు గోదావరి: జిల్లాలో గత కొద్దిరోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులి కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి బెబ్బులిని బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకోవడానికిన పూణేకు చెందిన ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐదు గంటల పాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేసి దానిని పట్టుకున్నారు.
జిల్లాలో గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ హాట్ టాపిగ్గా మారింది. రోజుకో,పూటకో రూటు మారుస్తూ అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆరురోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘనాథపురంలో గేదేను బలికొంది. అనంతరం యర్రపాలెంలో మూడు లేగదూడలను చంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పులి తమపై ఎక్కడ దాడి చేస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్ఫర్ట్ టీమ్ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామన్నారు. అయితే ఈ రోజు( శుక్రవారం) ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించన పులి జి. ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించారు. దీంతో జిల్లా హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది.
మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాక్షి,కర్నూలు: సీఎం చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో విద్యార్థి సంఘాలు చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసన చేపట్టాయి. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు.
సీఎం గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘం నేతలను ఈడ్చిపడేశారు. అనంతరం, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షేక్ హాసీనా భారత్లో తలదాచుకున్న మెుదలు అక్కడి మతఛాందస వాదులు హిందువులపై ఊచకోత జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశంలో దాదాపు ఎనిమిది శాతం ఉన్న హిందువులకు అక్కడి పార్టీలు ఏ రకమైనా హామీలిచ్చాయి. దాడులపై ఎలా స్పందించాయి. అనే విషయం తెలుసుకోవాలి ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.
ప్రస్తుతం బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు ఎంతమాత్రం ఆశించిన విధంగా లేవు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్గా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్తో డిస్టెన్స్ పెంచారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్, బంగ్లా సంబంధాలు క్షీణించాయి. అంతే కాకుండా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ భారత్తో ఎలా వ్యవహరించనున్నదనే అంశం ఆసక్తిగా మారింది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రెహమాన్ నేతృత్వంలోని BNP శుక్రవారం తన మ్యానిఫెస్టోని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదమే తమ ఎజెండా అని ఆ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఏ దేశానికి ప్రతినిధిగా ఉండదని సమానత్వం, ఆత్మగౌరవం ఆధారంగా మాత్రమే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటుందని పేర్కొన్నారు. అదే విధంగా బంగ్లాదేశ్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. అదే విధంగా తమ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే సహించదు అన్నారు. తమదేశం అటు పాకిస్థాన్తో గానీ ఇటు ఇండియాతో గానీ పొత్తు పెట్టుకోదని తెలిపారు. " అటు ఢిల్లీ కాదు ఇటు పిండి కాదు బంగ్లా అన్నింటికంటే ముందుంటుంది" అని తెలిపారు.
జమాత్- ఇ- ఇస్లామీ
అయితే అదే దశలో మరో పార్టీ జమాత్- ఇ- ఇస్లామీ పార్టీసైతం తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దానిలో చుట్టుపక్కల దేశాలతో స్నేహా పూర్వక వాతావరణం పెంపొందిస్తామని పేర్కొంది. ప్రత్యేక్షంగా పాకిస్థాన్ పేరు తీయకపోయినా ముస్లిం మెజారిటీ దేశాలకే అనుకూలంగా ఉండనున్నట్లు ప్రకటించింది.
హిందువుల దాడులపై
బీఎన్పీ: హిందువులతో పాటు ఇతర మైనార్టీల ఆస్తుల, దేవాలయాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది. అదే విధంగా వారి మనోభావాలను గౌరవిస్తామని తెలిపింది. అన్ని మతాలకు చెందిన నాయకులకు ప్రత్యేక స్టై ఫండ్ ఇస్తామని ప్రకటించింది. మతపరమైన పండుగలను ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుకునేలా రక్షణ కల్పిస్తామని తెలిపింది.
జమాత్-ఇ-ఇస్లామీ: సాధారణంగా ఈ పార్టీకి చెందిన నాయకులే హిందువులపై అధికంగా దాడులు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హిందువుల రక్షణపై ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెద్దగా స్పందించలేదు. మతపరమైన మరియు జాతి మైనారిటీలకు ప్రాతినిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి.
అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్
అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.
ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.
అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ ..
ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.
మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. అయితే వీరిలో చాలా మంది తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.
మరోవైపు ట్రంప్ మరియు ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ట్రంప్ పేరు ఈ స్థాయిలో బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది.
అయితే ప్రజలు ఎందుకు ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు? కారణం ఒక్కటే — ఇంకా అనేక ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉన్నాయి. ఫ్లోరిడాలో ఎప్స్టీన్కు ఎందుకు తేలికైన శిక్ష విధించబడింది? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? జైలులో అతని మరణంపై పూర్తిగా స్పష్టత ఉందా?
ఎప్స్టీన్ ఫైళ్లు కేవలం ఒక కేసు పత్రాలు కావు. అవి అధికారం, డబ్బు, ప్రభావం, రహస్యాల కలయిక. ప్రతి విడుదల కొత్త పేర్లను తెస్తోంది… కానీ పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. అసలు ప్రశ్న మాత్రం అదే ..ఇంకా విడుదల కాని పత్రాల్లో ఏముంది? ఇంకా ఎవరి పేర్లు బయటకు రావాల్సి ఉంది?ప్రపంచం ఇంకా ఆ సమాధానాల కోసం ఎదురుచూస్తోంది.
అరేబియా మహా సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా యుద్ద నౌక అబ్రహం లింకన్ ఇరాన్కు అత్యంత దగ్గరగా వచ్చింది. అమెరికా బలగాలు అబ్రహాంలింకన్ యుద్ధ నౌకపై యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఇతర ఆయుధ సామాగ్రి మోహరించాయి. ఒకవేళ ఇరాన్తో చర్చలు గనుక విఫలమైతే అమెరికా ఏ క్షణాన్నైన ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉంది.
అయితే ఇరాన్పై అణు ఒప్పందంపై ఒత్తిడి చేసేందుకే ఈ విధంగా యుద్ధనౌకను దగ్గరగా మోహరించినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులుభావిస్తున్నారు. కాగా ఇటీవలే ఇరాన్కు చెందిన డ్రోన్ను అమెరికా కూల్చివేసింది. యుద్ధనౌకకు దగ్గరగా వచ్చినందుకే భద్రతా కారణాలతో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
అణుఒప్పందంపై చర్చలకు ఇరు దేశాలు సముఖంగా ఉన్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే యుద్ధం తలెత్తడం అనివార్యంగా కనిపిస్తుంది.ట్రంప్ ఈ సారి వెనిజువెలాను మించి దాడి ఉంటుందని ప్రకటించగా, ఖమేనీ సైతం తగ్గేదేలే అన్నారు.
21వ శతాబ్ధంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశమేదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పుకోవాలి.. బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటిస్తూ ఇటీవల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది.. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్టూ భారత్పై విద్వేశం చిమ్మూతూ ప్రగల్భాలు పలికాడు.
కుక్కతోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్థాన్కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, వాళ్లదేశంలో వారిని తరిమినా, కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి ఎంతకీ బుద్ధి రావట్టేదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్లో కశ్మీరీ సోలిడారిటీ డే ను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్ పై మరోసారి తమ ద్వేషాన్ని చిమ్మాడు.
నఖ్వీ మాట్లాడుతూ" (అఖండ్ భారత్కో ఖండ్ ఖండ్ కరింగే) భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పుపెడతాం, దక్కన్ని మండిస్తాం,ఢిల్లీని షేక్ చేస్తాం" అని ప్రగల్భాలు పలికారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ, ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృథాపోవన్నారు. అబ్దుల్ రహమాన్ నఖ్వీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్కు అత్యంత సన్నిహితుడు.
అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వారి దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. మరోసారి ఉగ్రవాదుల బహిరంగ వేదికలకు ఆహ్వనిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్పై విషం చిమ్మే యత్నం చేస్తుంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాజధాని ఇస్లామాబాద్లో పేలుడు సంభవించి 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడుతో రాజధానిలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్ ఆంగ్ల మీడియా డాన్ తెలిపింది.
డాన్ మీడియా వివరాల ప్రకారం.. రాజధాని ఇస్లామాబాద్లో షహజాద్ టౌన్ ప్రాంత మజీద్లో రక్తం ఏరులై పారింది. పేలుడు దాటికి మజీద్లో 50మంది ప్రాణాలు కోల్పాయారు. 80మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి మృతులు,క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
మజీదులో పేలుడు ఘటనపై రంగంలోకి దిగిన బాంబు క్లూస్ టీం ఇది ఆత్మాహుతి దాడా? లేదంటే బాంబుల్ని అమర్చారా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇస్లామాబాద్లో పేలుడు ఘటన జరగడం రెండోసారి. అంతకుముందు నవంబర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12మందికిపైగా గాయపడ్డారు.
ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు, కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు తీవ్రంగా గాయపడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు.
అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.
అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది.
ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం. • ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం. • అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.
భారత్పై ప్రత్యక్ష ప్రభావం భారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే..
భారమే అయినా.. న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు..
అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.
ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.
కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.
భారత్ పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్.. యూనస్ ప్రభుత్వాన్ని టెన్షన్కు గురిచేస్తోంది. ఈ డీల్తో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్ సర్కార్.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్ డీల్ ఇప్పుడు బంగ్లాలో హాట్ టాపిక్గా మారింది.
అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్ ట్రంప్తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్లో నాన్-డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.
ఈ నేపథ్యంలో యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరోవైపు.. సీక్రెట్ ఒప్పందంపై బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.
వివాదాస్పద అంశాలు..
పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్కు తెలియజేయలేదు.
అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వస్త్ర పరిశ్రమపై ప్రభావం..
అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.
పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.
ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.
వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.
సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది.
భువనేశ్వర్: మావోయిస్టులు లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు దగ్గర పడటంతో వారు లొంగుబాట పడుతున్నారు. తాజాగా మరో 19 మంది మావోయిస్టులు లొంగిప్యోఆరు. ఒడిశాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఒడిశా డీజీఏపీ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల పేరిట రూ. 1.1 కోట్ల రివార్డ్ ఉంది.
కాగా, మార్చి నెల మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్లతో కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అడవుల్లో మావోయిస్టులు.. వాటిని వదిలి జనావాసంలోకి వస్తున్నారు. పలువురు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి చర్యలకు ఎదురెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్పై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. అయితే ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే ఓ పులి అనూహ్యంగా తుపాకీ తూటా గాయంతో చనిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో ఇది కానిస్టేబుల్ మరణానికి ప్రతీకార దాడినా? లేదంటే వేటగాళ్ల పనా? అనే అనుమానాలు తలెత్తాయి.
అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ విభాగంలో చిక్సెంగ్ మాన్పుంగ్ రేడియో ఆపరేటర్గా విధులు నిర్వహించాడు. లోయర్ దిబాంగ్ వ్యాలీ జిల్లా మయోడియాలో ఆయన డ్యూటీ నిర్వహించేవాడు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం అనిని నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో.. రోయింగ్ రహదారిపై ఘోరం జరిగింది. బైక్పై వెళ్తున్న టైంలో ఓ పెద్దపులి హఠాత్తుగా ఆయనపై దాడి చేసింది.
ఆ దారిన వెళ్లే వాహనదారులు.. రోడ్డు పక్కన బైక్ పడి ఉండడం చూసి యాక్సిడెంట్ కావొచ్చని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. తెల్లవారి అటుగా వెళ్లిన వాళ్లకు.. పక్కన పొదల్లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించగా.. అది పెద్దపులి చేసిన దాడిగా నిర్ధారించుకున్నారు. చిక్సెంగ్ మరణంతో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ ఆడపులి మూడు కూనలతో ఆ ప్రాంతంలో సంచరిస్తుందని గుర్తించారు. కూనల్ని రక్షించుకునే క్రమంలోనే అది దాడి చేసి చంపి ఉంటుందని భావించారు. అరుణాచల్ ప్రదేశ్లో మనుషులపై పులులు దాడులు చేయడం అత్యంత అరుదు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది.
A female tiger was found unalive with a gunshot injury near Mayudia in Arunachal Pradesh’s Lower Dibang Valley, just two days after a police head constable was attacked and lost his life on the Roing–Anini road.
ఈ ఘటనతో మయోడియా ప్రాంతంలో రాత్రి పూట ద్విచక్ర ప్రయాణాలపై నిషేధం విధించారు. అయితే.. రెండు రోజుల తర్వాత అదే ప్రాంతంలో ఒక పులి మృతదేహం తుపాకీ గాయాలతో కనుగొన్నారు. ఇది ప్రతీకార చర్య కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అదే సమయంలో వేటగాళ్ల దాడి అయ్యి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ మధ్యకాలంలో మయోడియా–మెహావో వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం పరిసరాల్లో పులుల సంచారం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. చిక్సెంగ్ మాన్పుంగ్ను చంపింది చనిపోయిన పులినేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు.. సోషల్ మీడియాలో రోడ్డు మీద పులులు రాత్రి పూట సంచరించడం, వాహనాలను వెంబడించడం వైరల్ అవుతోంది. బైకర్ల మీదకు పులి దూకిన వీడియోను చిక్సెంగ్ మాన్పుంగ్ దాడి వీడియో అంటూ వైరల్ చేస్తున్నారు. అటుగా ఓ వాహనంలో వెళ్లే వాళ్లు ఆ వీడియో తీసినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అధికారులు ఇవేం అధికారిక వీడియోలు అని చెప్పడం లేదు. వైరల్ అవుతున్న పులి వీడియోలు ఏఐవి కావని.. వేరే సందర్భాల్లో తీసినవని తెలుస్తోంది.
⚠️ Stay Alert, Stay Alive 🐅 Suspected tiger attack claims life of police constable in Arunachal Pradesh. pic.twitter.com/7Dg4DA0CaV
చండీఘడ్: పంజాబ్లో దారుణం జరిగింది. ఆమ్ ఆద్మీపార్టీ నేత ఒబెరాయ్ దారుణహత్యకు గురయ్యారు. జలంధర్ ప్రాంతంలో దుండగులు బ్లాక్ హూడీ ధరించి, ఓబెరాయ్ వాహనం దగ్గరికి వచ్చి 10 సెకన్లలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన ఒబెరాయ్ ప్రాణాలు వదిలారు. కాల్పుల కలకలంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
గురుద్వారాలోని మోడల్ టౌన్ ప్రాంతంలో జీప్లో ఉండగా బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన జలందర్ కారులోనే కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దర్యాప్తులో ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. నిందితులు బ్లాక్ హుడీ ధరించిన దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా నిందితుల్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గతంలో ఒబెరాయి సతీమణి అక్కడి మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ టికెట్పై పోటీచేసి ఓడిపోయింది.
కేంద్ర హోం మంత్రి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ వెళ్లిన ఆయన భద్రతాబలగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలతో సమీక్ష నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అమిత్షా పర్యటనకు కొద్ది గంటల ముందే జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టడం కలకలం రేపింది
అమిత్షాకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్అబ్దుల్లా ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హీరానగర్ సెక్టార్లోని గుర్నామ్, బోబియాన్ పోస్టులను సందర్శించారు. BSF బలగాలకు సంబంధించిన ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా పరిస్థితులపై ఆరా తీశారు. అదేవిధంగా గతేడాది వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని అమిత్ సందర్శించారు.
రేపు జమ్మూలోని లోక్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హాతో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జమ్ము ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారు. ఉగ్రవాదుల ఎరివేతకు వారు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించనున్నారు. అనంతరం ఇటీవల ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలతో అమిత్షా ప్రత్యేకంగా భేటీ అయి వారికి పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా అమిత్షా పర్యటనకు కొద్దిగంటల ముందు కిష్త్వార్, ఉదంపూర్ జిల్లాలలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
ఆపరేషన్ మిలాప్.. కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తించి వాళ్ల ఇళ్లకు చేర్చేందుకు ఢిల్లీ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్. కిందటి ఏడాది ఈ ఆపరేషన్ ద్వారా 1,303 మంది జాడను గుర్తించగలిగారు. అందులో చిన్నపిల్లలు, అమ్మాయిల ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కేవలం 15 రోజుల్లోనే వందల మంది ఆచూకీ లేకుండా పోయింది. వాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇలా అనుకుంటున్నలోపే పోలీసులు పెద్ద ట్విస్టే ఇచ్చారు.
దేశ రాజధాని రీజియన్లో మిస్సింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని.. అందులో అమ్మాయిల సంఖ్యే అధికంగా ఉంటోందన్న కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఇటు మీడియా సంస్థలూ వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. దీని వెనుక పెయిడ్ ప్రమోషన్ ముఠా ఉందని తేల్చేశారు.
జనవరి 1 నుంచి 15వ తేదీల మధ్య ఏకంగా 800 కనిపించకుండా పోయారన్నది ఆ ప్రచార సారాంశం. వీటి ఆధారంగా కొన్ని ఇండిపెండెంట్ మీడియా సంస్థలు.. వాటి ఆధారంగా ప్రధాన వార్తా సంస్థలూ కథనాలు ప్రచురించాయి. అందులో.. ఢిల్లీలో మొత్తం 807 మంది కనిపించకుండా పోయారు. వీళ్లలో 509 మంది మహిళలు, అమ్మాయిలు.. 298 మంది పురుషులు ఉన్నారు. మొత్తంలో 191 మంది మైనర్లు, 616 మంది పెద్దలు ఉన్నారని తెలిపాయి. జనవరి 1 నుండి 27 వరకు 235 మందిని పోలీసులు గుర్తించగా, 572 మంది ఇంకా కనిపించలేదని.. రోజుకు సగటున 27 మంది మిస్సింగ్గా రిపోర్ట్ అవుతుండగా, 9 మందిని మాత్రమే పోలీసులు కనిపెడుతున్నారని మీడియా డాటా తెలిపింది. ఈ డాటా ఆధారంగా ప్రతిపక్ష ఆప్.. అధికార బీజేపీపై విరుచుకుపడింది.
అయితే.. ఈ కథనాలతో ఆశ్చర్యపోయిన ఢిల్లీ పోలీసులు విచారణను లోతుగా దర్యాప్తు చేశారు. అందులో.. మిస్సింగ్ గర్ల్స్ సంఖ్య పెరిగిందన్న ప్రచారం స్పాన్సర్డ్ పోస్టుల ద్వారా వైరల్ అయ్యిందని గుర్తించారు. డబ్బు కోసం భయాన్ని సృష్టించడం సహించబోమని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇలాంటి వదంతులను నమ్మొద్దని.. నిర్ధారణ లేని సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోవద్దని.. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ వాసులకు చెబుతున్నారు.
After following a few leads, we discovered that the hype around the surge in missing girls in Delhi is being pushed through paid promotion. Creating panic for monetary gains won't be tolerated, and we'll take strict action against such individuals.
గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే మిస్సింగ్ కేసులు పెరగలేదు. ఈ జనవరిలో కేసులు తగ్గాయి అని జాయింట్ కమిషనర్ సంజయ్ త్యాగి తెలిపారు. కాబట్టి నెట్టింట జరిగే ప్రచారం కేవలం వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు.
గత సంవత్సరం ఢిల్లీ పోలీసులు “ఆపరేషన్ మిలాప్” కింద మొత్తం 1,303 మంది కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలతో మళ్లీ కలిపారు. వీరిలో 434 మంది పిల్లలు, 869 మంది పెద్దలు ఉన్నారు. ఒక్క డిసెంబర్లోనే 102 మంది ఆచూకీకి గుర్తించగలిగారు.
నిజామాబాద్: యువత బీజేపీ ట్రాప్లో పడొద్దని, కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్లో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు సీఎం రేవంత్. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినాదం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. గొప్ప గొప్ప నాయలకులు నిజమాబాద్ నుండే వచ్చారు. 2014 నుండి కేంద్రం, రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలు పాలించినా.. నిజమాబాద్ కార్పొరేషన్ లో అభువృద్ధి జరగలేదు.
అంకపూర్ దేశి చికెన్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు. వ్యవసాయనికి పెట్టింది పేరు నిజమాబాద్. నిజమాబాద్ పసుపు బంగారంతో సమానం. నిజమాబాద్ జిల్లా వ్యవసాయం దేశానికే ఆదర్శం. పంజాబ్, హర్యానా రైతుల వలే చైతన్యం ఉన్న రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. నాడు వైఎస్, డిఎస్.. ద్వయం కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారో... అలాగే నేను, మహేష్ కుమార్ గౌడ్ కలిసి మళ్ళీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తాం. అందరి సహకారంతో కాంగ్రెస్ ఆధికారంలోకి వచ్చింది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి నిజమాబాద్ జిల్లానే కారణం.
నిజమాబాద్ జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం, జిల్లా అభివృద్ధి బాధ్యత నాది. తెలంగాణ యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. రూ.1045 కోట్ల రూపాయలతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాం. మున్సిపల్ మంత్రిగా అభివృద్ధి బాధ్యత. రెండు సార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ జిల్లాకు ఏమి చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసింవదని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి , బీజేపీ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో కాంగ్రెస్ ఓడిపోతుందనే తెలిసే సీఎం రేవంత్ ఇక్కడకు రాకుండా పారిపోయారన్నారు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) కరీంనగర్ 10, 11 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ప్రసంగించారు.
ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. ఎంఐఎంకు మేయర్ పదవి ఆఫర్ చేశారు. కేంద్రం నిధులిస్తే.. మేమే తెచ్చామనడానికి కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదా?, కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి? , ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు.
గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు..
చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు.
ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది
విజయవాడ: వరుసగా వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు చేస్తున్న దాడులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.అక్కడ(గుంటూరులో) అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడి విధ్వంసం.. ఇక్కడ జోగి రమేష్( విజయవాడ, ఇబ్రహీంపట్నం) ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడులు చేయడం కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు నిదర్శనమంటూ మండిపడ్డారు వైఎస్ జగన్.
ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 06) జోగి రమేష్ ఇంట్లో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన వైఎస్ జగన్.. ఆపై కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం,వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటి రాంబాబు ఇంట్లో కొనసాగించిన జంగిల్ రాజ్ పరంపరను జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారని ధ్వజమెత్తారు.
‘గుంటూరులో అంబటి రాంబాబు అన్న ఇంటిని.. ఇక్కడ జోగి రమేష్ అన్న ఇంటిని ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డారు.. విధ్వంసం సృష్టించారు. అంబటి కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారు. పక్కనున్న అంబటి ఆఫీస్ను కూడా తగలబెట్టారు. అంబటి ఇంట్లో, ఆఫీస్లో జరిగిన జంగిల్ రాజ్ను.. జోగి రమేష్ విషయంలో కూడా కొనసాగించారు. అసత్య ప్రచారం చేస్తున్న మీ చిప్ సరి చేసుకోమన్నందుకే జోగిరమేష్పై దాడి చేశారు. చిప్ సరిగ్గా లేకనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు. చిప్ సరిగ్గా లేకనే సీబీఐ రిపోర్టుపై అసత్య ప్రచారం చేశారు’ అంటూ వైఎస్ జగన్ విమర్శించారు.
రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం... చంద్రబాబు అబద్ధాలను సీబీఐయే తేటతెల్లం చేసింది. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ ఎటువంటి పంది కొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్ట్లో పేర్కొంది. శ్రీ వెంకటేశ్వరస్వామిని అగౌరపరిచిన, అవమానపరిచిన వ్యక్తి చంద్రబాబు. ఒక అబద్ధాన్ని సృష్టించి.. దానికి రెక్కలు కట్టి మరీ దుష్ప్రచారం చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ విష ప్రచారం చేశారు. చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు హయాంలో సేకరించిన నమూలను కేంద్ర సంస్థలైన ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపింది.
ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పాయి. సీబీఐ ఇంకొకటి కూడా చెప్పింది. టీటీడీ చైర్మన్లుగా పని చేసిన తమ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు సమయంలో ఎటువంటి తప్పు జరగలేదని సీబీఐ క్లీన్చిట్ కూడా ఇచ్చింది. సీబీఐ ఇచ్చిన చార్జ్షీట్లో.. పేజ్ నం 62లో వాళ్లు మెన్షన్ చేసింది ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జూలైలో టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అవే ట్యాంకర్లను దొడ్డిదారిని మళ్లీ టీటీడీకి రప్పించి, వాటినే వాడారని సీబీఐ చెప్పింది.
మరి ఇప్పుడు పాపం చేసింది ఎవరు అనేది ప్రశ్నిస్తున్న చంద్రబాబుని. కూటమి నేతల్ని కూడా ప్రశ్నిస్తున్న తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? అని, జంతువుల కొవ్వు ఉందని గొడ్డుమాంసం ఉందని ఏ ల్యాబ్ రిపోర్ట్లు చెప్పాయి. ఎవరూ చెప్పలేదు. అది చంద్రబాబు సృష్టి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబే సృష్టించారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ అరాచకాన్ని నిలదీస్తే.. దాడులు చేస్తారా? ఒక అబద్ధాన్ని స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు సృష్టిస్తే.. దానికి ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లు వంత పాడారు. వీరికి ఎల్లో మీడియానే ఈ విషయాన్ని పదే పదే విష ప్రచారం చేశాయి. దుష్ప్రచారం చేసి దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. ఆ దుష్ప్రచారం తప్పు అని చెప్పినప్పుడు.. చంద్రబాబు ఏం చేయాలి. క్షమించమని లెంపలు వేసుకోవాలి. తప్పుడు ప్రచారం చేశారు కాబట్టి వారి చిప్లు బాగు చేయమని గుడుల్లోకి పూజలు చేయడం తప్పా?, సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినప్పడు.. తప్పుడు ఫ్లెక్సీలు కట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. దాన్ని నిలదీస్తే.. ఈ అరాచకం మొదలుపెట్టారు. ఈ జంగిల్ రాజ్ పరిపాలన ఆరంభించారు’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
పోలీసులతో కలిసి టీడీపీ గూండాలు స్కెచ్ దీన్ని ప్రశ్నించే వారిపై ఎటాక్ చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై ఆపై జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారు. రమేష్ ఇంటిపై పెట్రోల్, యాసిడ్లతో దాడులు చేశారు. ఓ పెద్దాయన(జోగి రమేష్ తండ్రి) ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేయడం హత్యాయత్నం కాదా? అని అడుగుతున్నా. జోగి రమేష్ ఇంటిపై దాడిక జరగకమునుపు.. కుట్ర చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రెండు గంటలకు ఓ స్కెచ్ వేశారు.
పోలీసులే.. టీడీపీ నాయకులతో కలిసి స్కెచ్ వేశారు( జోగి రమేష్ ఇంటిపై దాడికి ముందస్తు పన్నాగం ఎలా చేశారో పలు దృశ్యాలను చూపిస్తూ) వైఎస్ జగన్ తూర్పూరాబట్టారు.. ఆశ. ఫతుల్లా, సుబ్బారావులు కలిసి పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీరంతా టీడీపీ నేతలే అనడానికి ఇవే రుజువులు అంటూ కొన్ని క్లిప్పింగ్స్ చూపించారు వైఎస్ జగన్. ఆశ కూతురు పెళ్లికి చంద్రబాబు వెళ్లడం, ఫతుల్లాకి లోకేష్కి సన్నిహిత సంబంధాలను వైఎస్ జగన్ మీడియా సాక్షిగా చూపించారు. దాడులకు సంబంధించి అన్నిఆధారాలున్నాయని, దీనిపై ఎన్హెచ్ఆర్సీ, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తామన్నారు వైఎస్ జగన్.
మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఇది నిదర్శనం కాదా? తాము తప్పు చేసి ఉంటే, తమ హయాంలో పని చేసిన అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా ఎందుకు తెచ్చావ్ చంద్రబాబూ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ‘ గత చంద్రబాబు హయాంలో అనిల్ సింఘాల్ టీటీడీ ఈవోగా పని చేశారు. మేము ఆయన్ను మా హయాంలో కూడా కొనసాగించాము. ఇప్పుడు అదే అనిల్ సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా చంద్రబాబు తెచ్చుకున్నారు. మరి ఇందులో అర్థమేమిటి చంద్రబాబు. అంటే చంద్రబాబు చేసే ఆరోపణలకు చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది నిదర్శనం కాదా? అని అడుగుతున్నా.
అదే సమయంలో టీటీడీ ఈవోగా చేసిన శ్యామలరావును తొలగించడానికి కారణాలను కూడా వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘ మీరు అధికారంలోకి రాగానే టీటీడీ ప్రక్షాళన అంటూ శ్యామలరావును తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆయన్ను తీసేశారు. టీటీడీ ప్రక్షాళన జరిగిందా చంద్రబాబు?అని వైఎస్ జగన్ నిలదీశారు.
అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, అదే శ్యామలరావు టీటీడీ ఈవో ఉండగానే నాలుగు నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయని, వాటిని రిజెక్ట్ చేసి పంపితే మళ్లీ దొడ్డిదారిన అవి మళ్లీ అక్కడకే వచ్చాయనేది సీబీఐ చెబుతున్న నేపథ్యంలో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చ కాదా? అని ప్రశ్నించారు జగన్.
హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రాంచందర్రావు. ఈరోజు(శుక్రవారం, ఫిబ్రవరి 6వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు రాంచందర్రావు. దీనికి బీజేపీ ఎన్నికల సహ ఇంచార్జ్లు, పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. దీనిలో భాగంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. ‘ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. మేము వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వండి. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తాం. మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతాం
కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం. అవినీతి రహిత పాలన అందిస్తాం. మా పార్టీ నేతలు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం. అధికారులపై కూడా చర్యలు తప్పవు. వికసిత్ మున్సిపాలిటీ, వికసిత తెలంగాణ, వికసిత భారత్గా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.. ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఏమివ్వలేదని విమర్శిస్తున్నారు. మేము ఏ జిల్లాకు ఏమిచ్చామో చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఏమిచ్చిందో చెప్పగలరా?,
రెండ్రోజులుగా పోలీస్ వ్యవస్థ మొత్తం మా కార్యకర్తలపై దాడులు చేస్తోంది. కొట్టి, బెదిరించి విత్ డ్రా చేయించారు. కాంగ్రెస్.. పోలీసులను కార్యకర్తల్లా వినియోగించుకుంటోంది. మా కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేస్తే ఊరుకోను. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వమే.. అన్న విషయం మరిచిపోవద్దు. పోలీసులు ఇప్పటికైనా స్మార్ట్ యాక్టింగ్ ఆపేయాలి. రేవంత్ హేట్ స్పీచ్ బిల్లు పెట్టాలంటున్నారు.. ఆయన సొంత బుర్రతో ఆలోచించకుండా పక్క రాష్ట్రం ఆలోచనను ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. హేట్ స్పీచ్ చట్టం అమలైతే మొదటి కేసు రేవంత్ పైనే పెట్టాలి. గతంలో ఆయన అడ్డగోలుగా మాట్లాడదలేదా?, బీజేపీ పెరుగుతోంది కాబట్టే భయపడి బీజేపీని అడ్డుకోవాలని హేట్ స్పీచ్ తేవాలని చూస్తున్నారు. తెలంగాణలో దొంగలు పోయి దోపిడీ దొంగలు వచ్చారు. పవన్ కల్యాణ్ ప్రచారం షెడ్యూల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తో దోస్తీ లేకుంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ కాపాడినట్టే కాళేశ్వరం విషయంపై బీఆర్ఎస్ను రేవంత్ కాపాడుతున్నారు’ అని విమర్శించారు.
మేడ్చల్: కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య మేడ్చల్లోని ఆలియాబాద్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మల్లారెడ్డి వాహనం ధ్వంసమైంది. మల్లారెడ్డి అనుచరుడు పరమేష్పై డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ అనుచరులు దాడికి దిగారు.
దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరికి ఒకరికి ఎదురుపడిన నేపథ్యంలోనే వారి మధ్య ఘర్షణ వాతావారణం చోటు చేసుకున్నట్లు సమాచారం.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. సీఎం రేవంత్రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. దీంతో, ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా.. ‘ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికేగట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేను ఒక ఈ మెయిల్ పంపించాను. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికి, దాదాపుగా 50 రోజులు జైలులో గడిపి, ఇప్పుడు సీఎంగా పలు కుంభకోణాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ప్రతి చోటా అభ్యంతరకరమైన భాషను ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాడని, ఇలాంటి రాజకీయ నాయకుడు 21వ శతాబ్దానికి పనికిరాడని, ప్రాచీన రాతి యుగంలో కూడా ఇలాంటి నాయకులు ఉండి ఉండరని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నాయకులకు హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వడం దేనికి సంకేతం? అని లేఖలో ప్రశ్నించారు. దీంతో, రాజకీయ ఒక్కసారిగా హీటెక్కింది.
నేను ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సర్టిఫికేట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక ఈ మెయిల్ పంపించాను.
దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోనన్ని క్రిమినల్ కేసులు (89) ఎదుర్కొంటూ, ఓటు కు నోటు కేసులో రెడ్…
సాక్షి, హైదరాబాద్: కేవలం తన వైఫల్యాలను హామీల అమలును కపిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికలవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని, రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్లో పడొద్దంటూ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందన్నారు.
పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి ఆయనేనని కొనియాడారు. కేసీఆర్ గారు ఎప్పుడూ బిరుదుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని కేటీఆర్ స్పష్టం చేశారు. నేడు అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి పన్నుతున్న 'తిట్ల ట్రాప్'లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే కానీ, రేవంత్ రెడ్డి తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ సోదర సోదరీమణులారా,
కోట్లాది మంది ఆశల రూపమైన గులాబీ సైనికులారా, నిజాన్ని నిర్భయంగా చాటే మీడియా మిత్రులారా..
ఇవాళ తెలంగాణ గడ్డపై ఒక వికృతమైన రాజకీయ క్రీడ జరుగుతోంది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు…
ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడిపోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని, ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డీఏలు మరియు పీఆర్సీ లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కేటీఆర్ కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి 'కోవర్టు' ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల తీర్పే కేసీఆర్ గారికి ఇచ్చే అసలైన గౌరవమని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని ఆయన కోరారు.
చివరగా, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలమని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ.. పసిడి ప్రియులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కనిపించిన రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం చూసేద్దాం.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ. 1,39,650 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,900 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా రూ. 1,53,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 1,53,710 రూపాయల వద్ద నిలిచింది. దీన్ని బట్టి చూస్తే.. గంటల వ్యవధిలో బంగారం రేటు ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది.
ఢిల్లీలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. 1,39,800 రూపాయల నుంచి 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1,41,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,52,500 నుంచి 1,53,860 రూపాయల వద్దకు చేరింది.
ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు మారింది. ఉదయం 1,41,200 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం పసిడి ధర సాయంత్రానికి రూ. 1,42,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,040 రూపాయల వద్ద నుంచి రూ. 1,55,460కు చేరింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది.
టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.
సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.
టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది.
వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.
ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.
స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.
క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.
వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.
సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.
వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.
వెండికి హాల్ మార్క్ భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.
హాల్మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో 15సీ ఫోన్ని ఆవిష్కరించింది. ట్రావెలర్లు, క్రియేటర్లు, ఫొటోగ్రఫీపై మక్కువ గల వారి కోసం దీన్ని తెచ్చినట్లు తెలిపింది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఒప్పో రెనో 15c ఫిబ్రవరి 5 నుంచి భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఆఫ్టర్గ్లో పింక్ & ట్విలైట్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది. 8GB RAM & 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా.. 12GB RAM & 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకానికి ఉంది.
కెమెరాల విషయానికొస్తే.. రెనో 15c 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్తో వస్తుంది. ముందు భాగంలో 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ముందు & వెనుక కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది.
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, కస్టమ్ చిప్స్, లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వంటి సాంకేతిక రంగాల్లో.. అమెజాన్ దాదాపు 200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఖర్చు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని.. ది వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మందిని తొలగించాలని తన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా సంస్థ నాల్గవ త్రైమాసిక ఆదాయం 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఈ ఖర్చు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం ఉపయోగిస్తామని తెలిపారు. AWS అనేది సంస్థలు, ప్రభుత్వాలు, మొబైల్ యాప్స్కు క్లౌడ్ సేవలు అందించే విభాగం. ఇది సంస్థను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబడటానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఇదే సమయంలో, ది వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పత్రిక మొత్తం ఉద్యోగుల్లో సుమారు 30 శాతం.. అంటే 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే ప్రకారం.. పత్రిక చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది. అందుకే ఈ ఉద్యోగాల తొలగింపు తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు.
భవిష్యత్తులో పత్రిక జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. కాగా క్రీడలు, పుస్తకాలు వంటి విభాగాలను పూర్తిగా మూసివేయనుంది.. రోజువారీ పాడ్కాస్ట్ 'పోస్ట్ రిపోర్ట్స్' కూడా నిలిపివేయనుంది.
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.
నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.
వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సమయాల్లో పరిహారం.. బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు.
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.
అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.
హైదరాబాద్లో 8 శాతం ధరల వృద్ధి 2025లో హైదరాబాద్లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.
ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చింది.
బెంగళూరు ముందంజ దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.
ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.
అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల 2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.
అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.
2026పై అంచనాలు ప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు.
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడే కొనేది లేదు వెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.
గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.
బంగారం, వెండి మార్కెట్ పరిస్థితి గురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.
ఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.
సమయం, సహనం కీలకం ధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.
“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.
AS I POSTED on X earlier.
I stopped buying silver at $60.
I stopped buying Bitcoin at $6000.
I stopped buying gold at $300.
I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.
Today…. I wait patiently for new bottoms for gold…
సాక్షి, కడ్తాల్: అంతరించి పోతున్న దేశీయ, సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ, వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీలోకి తీసుకు రావాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపు నిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు. ఈరోజు బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ విత్తనాలతోనే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి లోని ఎర్త్ సెంటర్ లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ... బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయం అన్నారు.
మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సాంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒకవంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని కోదండరెడ్డి హెచ్చరించారు. సాంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు కోదండ రెడ్డి. అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు.
ఈ కార్యక్రమంలో సీజీఆర్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ.. ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందన్నారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు.
సీజీఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ... మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగలో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఆహార వ్యవస్థలో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.
రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... సమస్య చాలా తీవ్రంగా ఉందని, జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని విమర్శించారు.
‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాంప్రదాయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’కి నాబార్డు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం సీజీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సాక్షి హైదరాబాద్: గత నెలరోజులుగా రాష్ట్రంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ప్రస్తుతం సిద్ధిపేట–యాదాద్రి–జనగాం సరిహద్దుల్లో పెద్దపులి సంచారం నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ కీలక సూచనలు చేసింది. రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివార్లలో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలిపింది. దీంతో పరిసర గ్రామాల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది.
గత నెలరోజులుగా అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బెబ్బులి..మహారాష్ట్ర అడవుల నుంచి రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదివరకూ జగదేవ్ పూర్ మండలంలో పులి సంచారం జరిగినట్టు ఆనవాళ్లు గుర్తించగా...అంతలోనే అది అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో మకాం మార్చింది. రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల మండలాల్లో సంచరించింది. దానితో పాటు అమ్మనబోలు - అనంతారం గ్రామాల మధ్య ఓ వాగులో స్థానికులకు కంటపడినట్లు తెలిపారు.
ప్రస్తుతం సిద్ధిపేట-యాదాద్రి-జనగాం ప్రాంతాలలో దాని అడుగుజాడలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రజలు రాత్రిపూట బయిటకి వెళ్లకూడదని.. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఒంటరిగా కాకుండా గుంపులుగా మాత్రమే బయిటకి వెళ్లాలని తెలిపారు. అదే విధంగా పులి సంచారం నేపథ్యంలో రైతులు లైవ్ విద్యుత్ తీగలు పెట్టవద్దని అటవీశాఖ హెచ్చరించింది. పశువులను జాగ్రత్తగా కట్టాలని ఒకవేళ పులి దాడిలో పశువుల నష్టం జరిగితే ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని పేర్కొంది.
అయితే గడిచిన 20 రోజుల్లో సుమారు 15 లేగ దూడలను చంపితిన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పులిని పట్టుకోవడానికి అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది వారికి చిక్కడం లేదు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారమివ్వాలని అటవీశాఖ తెలిపింది.
అటు ఆంధ్రప్రదేశ్లోనూ పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో సంచరిస్తున్న పులి రోజుకో రూటు మార్చుతూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. దీంతో దానిని పట్టుకోవడం అధికారులకు సవాల్గా మారింది. ఈ క్రమంలో పులిదాడిలో ఇదివరకే అనేక మూగజీవాలు బలైపోయాయి.
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేల విచారణకు సమయం పొడిగించాలని స్పీకర్ తరఫున సంఘ్వీ కోర్టును కోరారు. ఒక ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ జరిగిందని, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ జరుగుతుందని అభిషేక్ సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. మరో మూడు వారాల సమయం ఇచ్చింది. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే, గత విచారణ సందర్భంగా.. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
సాక్షి, సంగారెడ్డి: పరిహారం విషయంలో రేవంత్ సర్కార్ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. శుక్రవారం ఆయన సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిగాచి ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాళా కోరు ప్రభుత్వం నడుస్తుందంటూ దుయ్యబట్టారు.
‘‘ఎన్నికల్లో ఇచ్చిన హమీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు. పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాలో తాగునీరు, విద్యుత్కు కొరతే లేదు. రేవంత్ రెడ్డి హయాంలో కరెంట్ కష్టాలు, నీటి యుద్ధాలు తప్పటం లేదు. కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి పేరుతెచ్చుకుంటే.. రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లు నరకమే. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా ప్రజలను కాపాడుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్న సంక్షేమ పథకాలు బంద్ పెట్టడం తప్ప చేసిందేమిలేదు.’’ అని హరీష్రావు మండిపడ్డారు.
‘‘సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన 54 మంది కార్మికులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానన్న రేవంత్.. కార్మికులను మోసం చేశాడు. ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీలను నమ్మొద్దు’’ అంటూ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించిన సేంద్రియ వ్యవసాయ సంస్థలతో కూడిన నెట్వర్క్ ఐఫోమ్– ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్. జర్మనీలోని బాన్ కేంద్రంగా 1972 నుంచి పనిచేస్తోంది. 700 పైచిలుకు అనుబంధ సంస్థలకు సేంద్రియ సంబంధిత అంశాలపై చోదక శక్తిగా ఉంది. సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ నిపుణులు ఏమంటున్నారంటే..?
సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలేంటి? నేల సారాన్ని పెంపొందించడం, పరిశుభ్రమైన నీటిని అందుబాటులోకి తేవటం, జీవవైవిధ్యం కోసం పెట్టుబడి పెట్టడం, మట్టిలో సేంద్రియ పదార్థాన్ని స్థిరీకరించడం ద్వారా వాతావరణ మార్పును తగ్గించడం. నెదర్లాండ్స్లో డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం.. రైతులందరినీ 100% సేంద్రియ సాగుకు మళ్లిస్తే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి 1000 కోట్ల యూరోలు ఆదా చేయవచ్చని లెక్కగట్టింది. మరొక అధ్యయనం ప్రకారం.. వ్యవసాయాన్ని సేంద్రియం వైపు మళ్లిస్తే సరఫరా గొలుసులను ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ఆహార భద్రతకు దోహదపడుతుంది.
సేంద్రియం ప్రపంచాన్ని పోషించలేదనే విషయం నిజమేనా? రసాయనిక వ్యవసాయంలో ఉత్పాదకత స్తబ్దుగా ఉండటంతో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. పంటల మార్పిడి పాటిస్తూ సేంద్రియ సాగు చేస్తే సాధారణ సాగుకు దీటుగా దిగుబడి వస్తుందని కెన్యాలోని చుకా, కందరాలలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనాలు నిరూపించాయి. బొలీవియాలోని అగ్రోఫారెస్ట్రీ కోకో పొలాల్లోనూ ఇది రుజువైంది.
సేంద్రియ ఆహారం పర్యావరణానికి మేలేనా? సేంద్రియ సాగు (Organic Farming) పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు శాస్త్రీయ గణాంకాల ద్వారా ధృవీకరించబడ్డాయి. మల్చింగ్ వంటి సేంద్రియ పద్ధతులు భూమిని క్షీణింపజేయకుండా కాపాడుతాయి. మంచి దిగుబడిని ఇస్తాయని తేలింది. ఇంధన వినియోగం తగ్గి, నేల సారం పెరిగి పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుందని గణాంకాలు నిర్థారిస్తున్నాయి.
సేంద్రియ ఆహారం ఖరీదైనది. అందుబాటులో లేదన్నది నిజమేనా? అమెరికా వాసుల (జనవరి 2025) అభిప్రాయం ప్రకారం సేంద్రియ ఉత్పత్తులు సాధారణ ఉత్పత్తుల కంటే సగటున 52% ఖరీదైనవి. ఒక ప్రాంతంలో రైతులందరినీ స్థానిక పంటలను, సీజన్కు అనువైన పంటలను సేంద్రియంగా పండించటాన్ని ప్రోత్సహిస్తే ప్రజలకు సేంద్రియ ఆహారం అందుబాటులోకి వస్తుంది. సరసమైన ధరకే అందించవచ్చు. స్థానికంగా పండించిన పంటలను స్థానికంగానే ప్రాసెసింగ్ చేసి అమ్మితే.. గ్రామీణ మార్కెట్లలో సేంద్రియ ఆహారం మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగా ప్రయత్నం జరగాలి.
సేంద్రీయ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందనటానికి బలమైన ఆధారాలున్నాయి. సేంద్రియ ఆహార ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు, శాస్త్రవేత్తలు ఇద్దరూ గుర్తించారు. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. సాధారణ ఆపిల్ పండ్ల కంటే సేంద్రియ ఆపిల్లు 19% అదనంగా ఆరోగ్యకరమైనవని తేలింది. నేషనల్ పెస్టిసైడ్ అబ్జర్వర్ సమాచారం ప్రకారం సేంద్రియ ఆహారానికి మారటం వల్ల మూత్రంలో గడ్డి మందు గ్లైఫొసేట్ అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి.
ఫ్యాషన్లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్లో వస్తున్న గ్రాండ్లుక్ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు.
‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్శారీ ఫంక్షన్ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు.
మన చేనేతలు బెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది.
ఆభరణాల మార్క్ హాఫ్ శారీస్కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్.
సాధారణంగా ఏ వస్తువైనా కొందరికి నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అంటే కొంతమందికి అదో అలవాటులా ఏదోక వస్తువుని నోట్లో పెట్టుకుని నములుతున్నట్లుగా చేస్తుంటారు. అయితే అది ప్రమాదకరమైనదా లేద పెట్టకూడనిదా అని ఉండదు. ఏదైతేనేం..అలా నోటిలో పెట్టి నమలాల్సిందే. ఇక్కడొక యువకుడు అలాంటి పాడు అలవాటు కారణంగానే తీవ్ర గాయలపాయాలయ్యాడు.
అసలేం జరిగిందంటే..ఈ ఘటన చూశాక ఎవ్వరూ ఇలాంటి సాహసం చేసే యత్నమైతే చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక మొబైల్ షాప్లో యువకుడు కూర్చొని మొబైల్ ఫోన్ బ్యాటరిని నోటిలో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేశాడు. అది లిథియం బ్యాటరీ కావడంతో.. ఇలా గట్టిగా నమిలాడో లేదో..అంతే ఒక్కసారిగా పెద్దశబ్దంతో కూడిన మంటలు ఎగిశాయి.
అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. సమీపంలోని వ్యక్తులు అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ మండుతున్న బ్యాటరీని అక్కడున్న మరో వ్యక్తి కాస్త ధైర్యం చేసి బయటకు విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటరీలను ఇలా నోట్లో పెట్టుకోకూడదని, అందులోనూ లిథియం అధిక శక్తిని నిల్వ చేస్తుందని దాంతో అస్సలు ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.
Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p
కొందరు అమ్మాయిలు ఎవర్ని నొప్పించకుండా అందరి దృష్టిలో మంచి అనిపించుకునేలా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకోసం తమను తాము మార్చుకోవడం, సర్దుబాటు చేసుకోవడం చేస్తుంటారు. అది ఓ మోస్తారు స్థాయిలో ఉంటే పర్లదు. తనను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేలా పరిస్థితులు ఉన్నప్పుడూ కూడా..మంచి వ్యక్తిలా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలో ఉంటే మాత్రం అంతరంగికి ప్రశాంతత కనుమరుగవ్వుతుంది. అదికాస్త శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి భారీ మూల్యం చెల్లించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అందుకే సాధ్యమైనంత వరకు అన్నివేళలా మంచి అమ్మాయిలా ఉండటం సురక్షితం కాదని నొక్కి చెబుతున్నారు. ఎప్పుడు మంచిగా ఉండటం కోపానికి మించి ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్ పూర్ణిమ. అంతేగాదు ఆమె దీన్ని "గుడ్ గర్ల్ సిండ్రోమ్"గా పిలిచారు. మంచి అమ్మాయిగా ఉండండి కానీ..మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేంతగా మాత్రం కాదు. లేదంటే అది ఒక విధమైన ఒత్తిడికి గురిచేసి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అదెలాగంటే..
దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ ఎప్పటికీ ఇతరులను సంతోషపెట్టాలని అనుకుంటే..సదా నాడీ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అది ఒక అలవాటులా మారి నో చెప్పడం, హద్దులు నిర్ణయించడం అసురక్షితంగా మారి..అభద్రతాభావంలోకి నెట్టేస్తుంది. దాంతో ఒత్తిడి బారినపడి శరీరంలో కార్టిసాల్ స్టాయిలను పెంచేస్తుంది. ఫలితంగా నిద్ర లేమి, అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
థైరాయిడ్ అసమతుల్యత ఇలా మంచి అనిపించుకునే ధోరణి భావోద్వేగాలను అణిచేస్తుంది. అంటే కోపాన్ని అణిచేసి, గొతు పెగలనీయకుండా చేస్తుంది. దాంతో థైరాయిడ్ బారిన పడతామని అంటున్నారు.
జీర్ణ సమస్యలు మన భావాలు ఎప్పుడైతే వ్యక్తీకరించలేకపోతే..జీర్ణక్రియపై ప్రభావం చూపి.. ఉబ్బరం, ఆమ్లత్వం IBS లాంటి లక్షణాలు సాధారణం. భావోద్వేగాలు ప్రాసెస్ చేయబడనప్పుడు శరీరం ప్రతిస్పందిస్తుందట. అదీగాక అధ్యయనం ప్రకారం, ఒత్తిడి శరీరం జీర్ణక్రియను నెమ్మదిస్తుంది లేదా పాజ్ చేయమని సూచిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ దెబ్బతిని..తిన్నది ఒంటబట్టలేని సమస్యను ఎదుర్కొంటారట.
హార్మోన్ల అసమతుల్యత, అలసట ఇక్కడ "మంచిగా" ఉండటం చాలా శక్తిని ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ శరీరం ప్రతిసారి మనుగడ అనే మోడ్లోనే ఉండాలి. దాంతో హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి..వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. నిరంతరం అలసటకు గురవ్వుతారట.
ఆందోళన, భావోద్వేగ అలసట ఎల్లప్పుడూ మంచిగా ఉండటం వల్ల విశ్రాంతి లేదా ప్రామాణికతకు చోటు ఉండదు. ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగ అలసట ఒక వ్యసనంగా మారుతుంది. నిజానికి బయటకు ప్రశాంతంగా కనిపించిన..లోలోపల కుంగిపోయి అలసిపోతారట.
దీనికి వైద్యం మిమ్మల్ని మార్చుకోవాలనే సంకల్పానికి పునాది వేయడమే అని అంటున్నారు సెలబ్రిటీ హార్మోన్ కోచ్. ఇది నిజాయితీగా వ్యవహరించటంతో మొదలైన "మంచి" మిమిల్ని అన్నిరకాలుగా ముంచేయడం ప్రారంభిస్తుందన్నది గ్రహించాలి. అసురక్షితమైన స్థితికి తీసుకువచ్చే మంచిని వదులుకోవడమే అన్ని వేళల మంచిదని అంటోందామె. దాంతోపాటు శరీరం మాట వినాలి. మనకు అనుకూలంగా సాధ్యమైనదే అయితే.. దానికే సుముఖత వ్యక్తం చేయాలి.
సాధ్యమైనంత వరకు కొన్నింటికి "నో" అని ఎంత మేర చెప్పగలుగుతామో అప్పుడు మనం మానసికంగా, శారీరకంగా సురక్షితంగా, స్ట్రాంగ్గా ఉండగలుగుతారని అన్నారు. అతి సర్వత్ర వజ్రయేత్ అనిపెద్దలు చెప్పిన నానుడిలా అతి మంచి పనికిరాదని గుర్తెరగండి అని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్లు వచ్చినా.. భారతీయ వారసత్వానికి మించింది లేదు. సాంప్రదాయ దుస్తుల్లోని అందమే వేరు. బంగారు మోటీఫ్లతో ఉండే బనారీసి చీర లుక్కే ఎవర్గ్రీన్. ఆ విషయాన్ని రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. తరచుగా బెనరసీ చీరలతో తళుక్కుమనే నీతా ఈసారి సంప్రదాయ ఎరుపు బనారసీ చీరతో పండుగ వాతావరణం తెప్పించారు. యాభైఏళ్ల క్రితం నాటి ఈ ఫ్యాషన్ నేటికి అద్భుతమే అని చాటిచెప్పారు.
ఎరుపు రంగు బంగారు జరీతో ఉన్న ఈ బనారసీ చీర ..చేనేత కళాకారుల నైపుణ్యాన్ని హైలెట్ చేసింది. అందుకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ వెనుక భాగం రాజదర్పంలా లేదా ఆలయ చిహ్నంలాంటి క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ స్పెషల్ ఎట్రాక్షన్ని ఇచ్చింది. ఈ చిహ్నం శ్రేయస్సుకి సంకేతం కూడా.
ఇంతలా వివరణాత్మకంగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఈ దుస్తుల ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మరింత హైలెట్ చేసింది. నీతా ఈ కాస్ట్యూమ్కి తగ్గట్టుగా కాంట్రాస్ట్గా పచ్చని డైమండ్ నెక్లెస్ ధరించి.. తన లుక్ని మరి ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. ఆ ఎరుపు పట్టు చీరకు ఆ పచ్చని నెక్లెస్ మరింత అందం. నిండుదనం ఇచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పార్లమెంట్ వెలుపల మెట్లపై పోన్లో మాట్లాడుతూ పడిపోయిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ ఘటనలో శశి ధరూర్కి మడమ ఫ్యాక్చర్ అయ్యిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు కూడా. అలాగే ఆయన కోలుకున్నాని, ప్రస్తుతం బాగానే ఉన్నట్లు కూడా తెలిపారు. ఇలా మెట్లపై నడుస్తూ..ఫోన్ మాట్లాడటం మంచిది కాదని నూర్యాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి మల్టీటాస్కింగ్ని బ్రెయిన్ నిర్వహించలేదని హితవు చెప్పారు. ముఖ్యంగా మెట్లపై ఫోన్ స్క్రోల్ చేస్తూ లేదా మాట్లాడుతూ నడవడం అత్యంత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది అజాగ్రత్తగా వ్యవహరించడం గురించి కాదని, బ్రెయిన్ వర్కింగ్పై అవగాహన ఉండటం.. అత్యంత ముఖ్యమని అంటున్నారు న్యూరాలజిస్ట్లు.
మానవ బ్రెయిన్ బహుళ పనులు చేయగలదు. కానీ ఒకేసారి అన్ని పనులు చేస్తున్నప్పుడు.. విభజింపబడతాయి. దాంతో మొదటి దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరోకటిపై అటెన్షన్ పెట్టడంలో విఫలమవుతుంది ఫలితంగా ఆ ప్రభావం మనపై పడుతుందన్నారు. ఇక్కడ మెట్లపై నడుస్తూ ఫోన్ చూసినప్పడూ..చూడటంపైనే అంటే కళ్లమీద బ్రెయిన్ ఫోకస్ ఉండి..నడకపై అటెన్షన్ తప్పుతుంది.
అందులోనూ నేలలా చదునుగా ఉండకుండా స్టెప్స్లా ఉంటుంది కాబట్టి పాదం సవ్యంగా పడాలి లేదంటే బ్యాలెన్స్ అవ్వలేం. దాంతో ఎప్పుడైత్ ఫోన్ మాట్లాడుతూ మెట్లు ఎక్కుతామో పడిపోవడం లేదా జారిపడటం జరుగుతంది. దాంతో మెదడు, లేదా శరీరానికి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
అంతేగాదు నిపుణులు ఇలా ఎన్నో సార్లు చేశాను అని తేలిగ్గా కొట్టిపారేయొద్దని హెచ్చరిస్తున్నారు కూడా. సాధ్యమైనంత వరకు ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్పై నడవాలనుకుంటే రైలింగ్ని పట్టుకోండి నడకపై దృష్టిపెట్టండని అంటున్నారు. సాధ్యమైనంత వరకు వచ్చిన కాల్ పాజ్లో పెట్టి..మెట్లపై నుంచి చదునైన నేలపైకి వచ్చేశాక ఫోన్ కాల్ మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
One phone call. One staircase. One misstep.
This video of Mr. Shashi Tharoor tripping while talking on the phone and walking downstairs is not about clumsiness. It’s about the brain. (Glad to note that Mr Tharoor is doing well🙏)