Archive Page | Sakshi
Sakshi News home page

Tirupati

  • టీటీడీలో దళారీ రాజ్యం

    తిరుపతి మంగళం : టీటీడీలో అవినీతి, దళారీ వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మంగళవారం ఆయన తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన చేసి శ్రీవారి పవిత్రతను పెంపొందిస్తామంటూ గొప్పలు చెప్పారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల పాలనలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, బీఆర్‌ నాయుడు టీటీడీని భ్రష్టుపట్టించి శ్రీవారిని అపవిత్రం చేస్తూ భక్తుల మనోబావాలు దెబ్బతినేలా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.

    ఇది నిజం కాదా?

    నిన్నటి రోజున గుంటూరుకు చెందిన 64 మందికి సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి చేత రూ.6వేల చొప్పున సుమారు రూ.4 లక్షలు వసూలు చేసి వారికి దర్శనం కల్పించకుండా దళారులు మోసం చేశారంటే టీటీడీలో దళారీ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని భూమన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ లేఖతో పాటు ఆరుగురు టీటీడీ ఉద్యోగుల పేరుపై శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లను పొందినట్లు బాధితులు చెబుతున్నారన్నారు. దర్శనాల కోసం దళారులకు ఫోన్‌పే చేసి ఆధారాలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రెండేళ్ల కూటమి పాలనలో టీటీడీని ప్రక్షాళన చేశామని, భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నామని చెప్పారన్నారు. అయితే ఆయన ఈ విషయాలు చెప్పిన మరుసటి రోజే తిరుమలలో ఇలా జరిగిందన్నారు. టీటీడీలో అవినీతి, అధిక ధరలకు శ్రీవారి దర్శన టికెట్లను దళారీలు విక్రయించుకునేందుకు అవసరమైన ప్రక్షాళన చేశారే తప్ప భక్తుల సౌకర్యార్థం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • తిరుపతి మంగళం : ప్రజలకు విశేష సేవలందించడంలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్‌ తెలిపారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం విశేష సేవలందించిన మోటారు వాహన తనిఖీ అధికారులు చంద్రశేఖర్‌, దామోదర్‌నాయుడును ఆయన ఘనంగా సత్కరించి, మెమెంటోలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి నిర్వహించిన ఫీడ్‌బ్యాక్‌ వ్యవస్థలో తిరుపతి జిల్లా రవాణాశాఖ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు ప్రథమ స్థానం పొందడం విశేషమన్నారు. అందులో పుత్తూరు మోటారు వాహన తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పుత్తూరు మోటార్‌ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం గత రెండు నెలలుగా వందశాతం పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌ నమోదయ్యిందని, అలాగే శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ అధికారి దామోదరనాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి కార్యాలయం 96శాతం పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌ నమోదయిందని తెలిపారు. ఎంవీఐలు సుబ్రమణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్‌, స్వర్ణలత, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

    ఎన్‌ఎస్‌యూలో ప్రవేశాలకు రేపే తుది గడువు

    తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గురువారంతో గడువు ముగియనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పాక్‌శాస్త్రి కోర్సులతో పాటు, యూజీ(శాస్త్రి) 3, 4 సంవత్సరాల కోర్సుల్లోనూ, అలాగే 17 విభాగాల్లో పీజీ (ఆచార్య) 1, 2 సంవత్సరాల కాలవ్యవధి కోర్సుల్లోనూ, పీహెచ్‌డీ (విద్యావారధి) కోర్సుల్లోనూ ప్రొఫెషనల్‌ కోర్సులైన ఐటీఈపీ (బీఏ, బీఈడీ), బీఈడీ (శిక్షా శాస్త్రి), ఎమ్‌ఈడీ (శిక్షా ఆచార్య) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు గురువారంతో ముగియనుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382595500, 7382585500 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • వేధింపులతో చంపేసింది!

    తిరుమల: టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు మంగళవారం హైదరాబాద్‌కు చెందిన కల్లా సత్య రిషబ్‌ రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు.

  • – ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు

    తిరుపతి క్రైం:తిరుపతిలోని పీపీచావడి సమీపంలో ని మటన్‌ మార్కెట్‌లో ఆరోగ్యానికి హానికరమైన మటన్‌ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఐదుగురు వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ యువ అన్వేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పీపీచావడి మట న్‌ మార్కెట్‌లో కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నాసిరకం మటన్‌ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపా రు. ఈ ఫిర్యాదును ఆధారంగా తీసుకుని తిరుపతి వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐదుగురు వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

    ఉద్యోగాల పేరుతో మోసం

    తిరుపతి క్రైం : తిరుపతిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి ఏఆర్‌ టెక్‌ వేవ్‌ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను సంప్రదించి, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం వచ్చిన పలువురి నుంచి డబ్బులు తీసుకుని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ పేరుతో నకిలీ ఆఫర్‌ లెటర్లు అందజేశాడు. ఈ విధంగా మొత్తం 18 మంది యువకుల నుంచి సుమారు రూ.10 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు కేసును ఈస్ట్‌ డీఎస్పీ భక్తవత్సలంకు బదిలీ చేసి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

Chittoor

  • కుప్పం మూడు రాష్ట్రాల కూడలి ప్రాంతం. ఇది అక్రమ రవానాకు కేంద్రంగా మారింది. గతంలో సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణ కోసం చెక్‌ పోస్టులు ఉండేవి. వాటిని ప్రస్తుతం మూసివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కొంతమంది తమిళనాడు రాష్ట్రం నుంచి బియ్యం కర్ణాటకలోని బంగారుపేటకు, అలాగే కుప్పం నుంచి గ్రానైట్‌ను తమిళనాడుకు తరలిస్తున్నారు. అలాగే ఉప్పు నుంచి పప్పు వరకు నిత్యావసర సరుకులను కర్ణాటక నుంచి కుప్పానికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    తమిళనాడు బియ్యం పట్టుకున్న పోలీసులు (ఫైల్‌)

    మూతపడిన బిసానత్తం చెక్‌ పోస్టు

    కుప్పం: తమిళనాడు ప్రభుత్వం రేషన్‌ కార్డులకు ఇచ్చే బియ్యాన్ని వ్యాపారులు కిలో రూ.15లకు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత వాటిని కర్ణాటకలోని బంగారుపేటలో ఉన్న రైస్‌ మిల్లులకు కేజీ రూ.30 నుంచి రూ.40లకు విక్రయిస్తున్నారు. రైస్‌ మిల్లుల యాజమాన్యం వాటిని పాలీష్‌ పట్టి అధిక ధరలు అమ్ముతున్నారు. అక్రమార్కులకు కూటమి నాయకులు అండదండలు మెండుగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక కూటమి నాయకుల టిప్పర్లు, కంటైనర్ల ద్వారానే బియ్యం రవాణా చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కుప్పం మండలంలోని ఇద్దరు మల్లానూరు చెందిన నాయకులు, శాంతిపురం మండలంలో ఇద్దరు, రామకుప్పంలో ఇద్దరు ముఠాగా ఏర్పడి బియ్యం స్మగ్లింగ్‌ను దర్జాగా సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు సరిహద్దులోని రామకుప్పం మండలం ఆరిమాను పెంట, శాంతిపురం మండలం విజలాపురం, కుప్పం మండలం మల్లానూను, అడవిబూదుగూరు గ్రామాల మీదుగా కర్ణాటకకు బియ్యం తరలిస్తున్నట్టు పేర్కొంటున్నారు. నిత్యం అర్ధరాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల్లో బియ్యం తరలిపోతోందని చెబుతున్నారు. కుప్పం మున్సిపల్‌ పరిధిలోని ఓ గ్రామంలో బియ్యం గోడౌన్‌ ఏర్పాటు చేసుకుని శాంతిపురానికి చెందిన నాయకులు దర్జాగా బియ్యం రవాణా సాగిస్తున్నారు.

    తమిళనాడు గ్రానైట్‌ తరలింపు

    కుప్పం ప్రాంతంలో గ్రానైట్‌ ఎక్కువగా లభిస్తుంది. ఇక్కడి క్వారీల్లో రాతి దిమ్మెలను గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని బరుగూరు, జగదేవి, హోసూర్‌, చైన్నె నగరాలకు తరిలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ విష యం తెలిసినా అధికారులు కూటమి నేతలకు భయపడి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    పుట్టగొడుగుల్లా క్వారీలు

    కుప్పం నియోజకవర్గంలో రెండేళ్లుగా అక్రమ క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అధికార పార్టీ నేతలు నిర్ణయించిన రేటు చెల్లిస్తే ఎన్ని హెక్టార్లలోనైనా తవ్వకాలు చేసుకోవచ్చు. వారు ఆ జాబితాను సంబందిత శాఖ అధికారులు, పోలీసులకు పంపిస్తారు.దీంతో అధికారుల నుంచి క్వారీ పనులకు ఆంటంకాలు ఉండవు. దీంతో పాటు రాతి బ్లాక్‌ రవాణాకు సైతం అనుమతులు అందినట్లే.

    కర్ణాటక నుంచి నిత్యావసర సరుకుల దిగుబడి

    కుప్పానికి కర్ణాటకలోని బంగారుపేట 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి కుప్పానికి ప్రతి రోజూ అక్రమంగా నిత్యావసర సరుకులను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సరుకులను పట్టణంలోని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారు.

    మూతపడిన చెక్‌ పోస్టులు

    అక్రమ రవాణాను అరికట్టేందుకు గతంలో సరిహద్దు ప్రాంతంలో చెక్‌ పోస్టులు ఉండేవి. తమిళనాడు సరిహద్దులోని గాంధీనగర్‌, వేపనపల్లి, ఆరిమానుపెంట, మెట్లచేను, నడుమూరు, కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం, కెంపాపురం, సాతు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఉండేవి. సిబ్బంది నిరంతరం కాపలా కాస్తూ అక్రమ రవాణాను అరికట్టేవారు. ప్రస్తుతం ఆ చెక్‌ పోస్టులు మూతపడడంతో అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

  • చిత్తూరు కలెక్టరేట్‌ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మోహన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల వసతులు, సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు చేపడుతామన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 12వ పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలు, సరెండర్‌ లీవ్స్‌ చెల్లింపులు పై చర్చించారు. ఉద్యోగుల వెల్ఫేర్‌ ఫండ్‌, మహిళా ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు కోరారు. సమావేశంలో ఆపస్‌ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రమేష్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షులు మదన్‌మోహన్‌రెడ్డి పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

    ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల గళం!

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన జిల్లా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం సుమారు 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కలెక్టరేట్‌లో నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జిల్లాలోని 19 గుర్తింపు పొందిన సభ్య సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరై ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై గళమెత్తారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ కౌన్సిల్‌ పునరుద్ధరించినందుకు కలెక్టర్‌కు సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

  • మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమా?

    తిరుపతి మంగళం : చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయమే దండగ, విద్యుత్‌ వైర్లపై బట్టలు ఆరేసుకోండి అంటూ రైతులను హేళన చేసిన ఘనుడు చంద్రబాబు అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా మామిడి పంటకు పెట్టింది పేరన్నారు. అలాంటి జిల్లాలో మామిడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

    కిలోకు రూ.15 ఇవ్వాల్సిందే

    కిలోకి రూ.15 ఇస్తే కానీ గిట్టుబాటు కాదని మామిడి రైతులు చెబుతుంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.4 ప్రకటించి చేతులు దులిపేసుకుందని భూమన మండిపడ్డారు. జిల్లాలో 25 ఫల్ప్‌ ఫ్యాక్టరీలు కిలో రూ.5కు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. రోజుల కొద్దీ ఫల్ప్‌ ఫ్యాక్టరీల వద్ద లారీలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడు లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తే అందులో గిట్టుబాటు ధర లేక రెండు లక్షల టన్నుల కాయలను రైతులు చెట్లల్లోనే వదిలేశారన్నారు.

    ఆత్మహత్యాయత్నం బాధాకరం

    గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలో టీడీపీ సానుభూతిపరుడైన మామిడి రైతు గిట్టుబాటు ధర లేక పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని భూమన వాపోయారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రైతు రాజుగా బతికాడని గుర్తుచేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఆ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులంతా తోపులను నరికేసి మామిడి కట్టెలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

  • గంగాధర నెల్లూరు: మండల కేంద్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద మంగళవారం ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. యువరైతు లోకేష్‌ నాయుడు ఆత్మహత్యాయత్నం ఘటనపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకోలేదని , రైతులు రాత్రింభవళ్లు కిలోమీటర్ల మేర రోడ్లపై పడికాపులు కాస్తుంటే కూటమి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు మండలం జైన్‌ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద బొమ్మవారిపల్లి గ్రామానికి చెందిన యువరైతు లోకేష్‌ నాయుడు తన ఎనిమిదెకరాల పొలంలో పండించిన మామిడి పంటను ట్రాక్టర్లలో నింపి నాలుగు రోజుల క్రితం పరిశ్రమ వద్దకు తీసుకురాగా మంగళవారం వరకు ఎలాంటి సీరియల్‌ నంబరు కేటాయించకపోవడంపై మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రతి ఒక్కరినీ కలిసి వేసిందన్నారు. మామిడి రైతులు అవస్థలు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటేపో ఓ పక్క కూటమి నేతలు మాత్రం పాలాభిషేకాలు చేస్తుండడంపై తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలు పూర్తిగా నెరవేర్చిన తరువాత సంబరాలు చేసుకుంటే మంచిదన్నారు. రైతులు అవస్థలు పడుతూ కన్నీరు కారుస్తుంటే కూటమి నేతలకు పట్టడం లేదన్నారు. అదేవిధంగా విజయవాడలో సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గంగాధర నెల్లూరు పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, సీనియర్‌ నేత రాష్ట్ర మాజీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ రెడ్డి , ఏకాంబరం మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

  • డాక్యుమెంట్‌ రైటర్‌కు

    టీడీపీ నేత బెదిరింపులు

    తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సుమారు 14 సంవత్సరాలుగా డాక్యుమెంట్‌ రైటర్‌ గా జీవనోపాధి చేసుకుంటున్న తనకు పొంచి ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని డాక్యుమెంట్‌ రైటర్‌ ఏఎస్‌ మహ బూబ్‌ ఉన్నతాధికారులకు విజ్ఞ ప్తి చేశారు. మంగళవారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. స్థానిక వార్డు కౌన్సిలర్‌, టీడీపీ నేత జాకీర్‌ ఈ నెల 15న తన వద్దకు వచ్చరన్నారు. తనకు ఒక డాక్యుమెంట్‌ చేసి పెట్టమని చేప్పాడన్నారు. కాగా అదే రోజు 11.30 గంటలకు బుక్‌ చేసి ఇచ్చానన్నారు. చలనా విషయంలో జరిగిన వాదనపై జాకీర్‌ దుర్భాషలాడి తన ఎడమ చెంపపై కొట్టి ‘నాతో పెట్టుకుంటే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా. నా సెటిల్మెంట్లకు అడ్డు వస్తే వి కోటలో విలే కరికి పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు వెళ్లి పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ ఇస్తే ఎవరూ తీసుకోరు. నీ మీదే రిటర్న్‌ కంప్‌లైంట్‌ ఇస్తా, నీ భార్య బిడ్డలను బతకనివ్వను’ అని హెచ్చరించాడని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్‌ జాకీర్‌, అతని అనుచరుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు తన కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యతని, తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు , డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, మంత్రి లోకేష్‌కు లేఖ ద్వారా కోరారు.

    వేరుశనగ 4,200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా

    చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఇప్పటి వరకు జిల్లాకు వేరుశనగ విత్తనం 4200 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. ఏప్రిల్‌లో వ్యవసాయశాఖ అధికారులు జిల్లాకు 27 వేల క్వింటాళ్ల కాయలు కేటాయించారు. ఈ మేరకు కుప్పం, పలమనేరు మండలాలకు మాత్రం 4,200 క్వింటాళ్ల కాయలొచ్చాయి. మిగిలిన మండలాలకు మొండిచేయి మిగిలింది. జూన్‌ నెల ముగుస్తున్నా కాయలు ఇవ్వకపోవడం ఏమి టని మండిపడుతున్నారు.

  • సాయికృష్ణ కేసులో

    పలు అనుమానాలు

    నగరి : సాయికృష్ణ కేసులో మొదటి రోజు నుంచే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ మాయం అయిందనే వార్తలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు. సాక్ష్యాలే మాయం అయితే నిజం ఎలా బయటకు తీస్తారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలన్నారు. సీసీటీవీ ఫుటేజి మాయం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందన్నారు. ఫుటేజీ మాయంపై క్రిమినల్‌ కేసు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు. లాకప్‌ డెత్‌లో నిజానిజాలు బయటపడే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

Tamil Nadu

  • వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.6.08 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరన్‌ తెలిపారు. ఆలయంలో ప్రతినెలా పౌర్ణమి అనంతరం హుండీ లెక్కించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయంలో తమిళ ఆణిమాస హుండీ లెక్కింపును సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు స్వామివారి సన్నిధి, అమ్మవారు, వినాయకుడు, అష్టలింగ ఆలయాల ప్రాంతాల్లోని 22 హుండీలను ఆలయ తిరుకల్యాణ మండపానికి తీసుకొచ్చి ఆలయ జేసీ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బందితో లెక్కించారు. లెక్కింపులో రూ.6,8, 64,491 నగదు, 188 గ్రాముల బంగారం, 1,695 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని భక్తులు కానుకలుగా హుండీలో వేసినట్లు తెలిపారు. నగదును ప్రభుత్వ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలున్నారు. భక్తులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని హుండీలను పెట్టేందుకు ఆలయ నిర్వాహకులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గిరివలయం రోడ్డులో కూడా హుండీలను ఏర్పాటు చేశారు.

  • – ఫీజులను భారీగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

    సాక్షి, చైన్నె : తమిళనాడులో విలాసవంతమైన, ప్రత్యేకమైన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఇష్టపడే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ద్విచక్ర , నాలుగు చక్రాల వాహనాల ప్రత్యేక నంబర్ల కేటాయింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న స్థిర రుసుము విధానాన్ని రద్దు చేస్తూ, వాహనం విలువ ఆధారంగా సరికొత్త రుసుము విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఫ్యాన్సీ నంబర్ల ధరలు రూ. 2వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ నంబర్ల కేటాయింపులో మధ్యవర్తులు, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రవాణా శాఖ ఈ కీలక మార్పులు చేస్తోంది.

    వాహనం విలువ ఆధారంగా కొత్త ఫీజులు

    ఇప్పటివరకు ఉన్న సాధారణ కనీస రుసుములను రద్దు చేసి, వాహనం మార్కెట్‌ విలువను బట్టి ఫీజులను నిర్ణయించనున్నారు. వాహనాల విలువను బట్టి అదనపు రుసుము రూ. 2,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెరుగనున్నది.

    హై–వాల్యూ వాహనాలు

    రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల పైబడిన విలువ గల లగ్జరీ వాహనాలకు గరిష్టంగా రూ. లక్ష వరకు అదనపు రుసుము ఉంటుంది. అలాగే, విదేశాల నుండి దిగుమతి చేసుకునే లగ్జరీ వాహనాల నంబర్‌ ప్లేట్ల ధరలు వాటి విలువను బట్టి రూ. 20,000 నుండి రూ. 1.5 లక్షల వరకు (రూ. 3.4 లక్షల వరకు విలువ గల వాహనాలకు) వసూలు చేయనున్నారు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 1,000 నుండి రూ. 3,000 – రూ. 16,000 కనీస రుసుము కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

    కొత్తగా ప్రీమియం’ కేటగిరీ పరిచయం

    అదృష్ట సంఖ్యలు, ప్రత్యేక సిరీస్‌ నంబర్ల కోసం డిమాండ్‌ను బట్టి ప్రభుత్వం కొత్తగా ప్రీమియం కేటగిరీని తీసుకురానుంది. ఇందులో సిరీస్‌ల వారీగా ఫీజులను నిర్ణయించారు. 10వ, 12వ సిరీస్‌ లోని ప్రత్యేక నంబర్ల కోసం రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 12వ, 13వ సిరీస్‌ లోని మరికొన్ని ప్రముఖ నంబర్ల ధర రూ. 4 లక్షలుగా నిర్ణయించారు. 13వ, 4వ తాత్కాలికేతర రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ లోని అత్యంత డిమాండ్‌ గల నంబర్ల కోసం ప్రత్యేక ప్రీమియం’ కేటగిరీని కేటాయించారు. ఈ లగ్జరీ నంబర్ల ధరను ఏకంగా రూ. 10 లక్షలుగా ముసాయిదాలో ప్రతిపాదించారు.ఈ ఫ్యాన్సీ నంబర్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం తుది ఆమోదం తప్పనిసరి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియలో మరిన్ని పారదర్శక మార్పులు రానున్నాయి.

  • సాక్షి, చైన్నె: తమిళనాడు రాష్ట్ర దీర్ఘకాలిక విద్యుత్‌ డిమాండ్‌ను పర్యావరణహిత పద్ధతిలో తీర్చడానికి, పునరుత్పాదక ఇంధన వనరులను భారీగా వృద్ధి చేయడానికి తమిళనాడు గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్‌ ఒక విప్లవాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు రూ.1.02 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 25,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల భారీ సమగ్ర గ్రీన్‌ ఎనర్జీ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి న వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. తమిళనాడు చరిత్రలోనే ఇప్పటివరకు ప్రతిపాదించిన అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌ ఇదే కావడం గమనార్హం.

    ఐదేళ్ల యాక్షన్‌ ప్లాన్‌

    ఈ మెగా ప్రాజెక్ట్‌ను ఐదు దశల్లో పూర్తి చేసేలా కాలక్రమ పట్టికను రూపొందించారు. మొదటి సంవత్సరంలో ప్రాథమిక సబ్‌స్టేషన్ల నిర్మాణం, పవర్‌ గ్రిడ్‌ అనుసంధానంతో 3,000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పనులు ప్రారంభమవుతాయి. తదుపరి దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తూ రాష్ట్ర ప్రసార గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. మైక్రోగ్రిడ్‌ సర్దుబాటు, రియల్‌–టైమ్‌ డేటా పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. చివరి దశలో ఐదు సంవత్సరాల కాలంలో 25 వేల మెగావాట్ల పూర్తి విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

    భూసేకరణ ప్రాంతాల గుర్తింపు

    ఈ ప్రాజెక్ట్‌ కోసం సుమారు 1.2 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా (ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌కు దాదాపు 1.2 ఎకరాలు). ముఖ్యంగా రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలలో వ్యవసాయానికి ఉపయోగించని బీడు భూములను గుర్తించి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సాగు చేయని, సాగులో ఉన్న భూములను ఏకీకృతం చేయడానికి టిడ్కోను రంగంలోకి దించారు.

  • – జూలై 10 వరకు తదుపరి చర్యలు వద్దు

    – మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

    సాక్షి,చైన్నె: గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో జరిగినట్లుగా చెబుతున్న భారీ ఉద్యోగాల అవినీతి కేసులో మాజీ మంత్రి కే.ఎన్‌. నెహ్రూకు మద్రాస్‌ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ వ్యవహారంలో నమోదైన కేసుపై జూలై 10 వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి , జస్టిస్‌ జి. అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది.

    రూ. 634 కోట్ల లంచం ఆరోపణలు

    గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో 2,538 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు, జూనియర్‌ ఇంజినీర్ల నియామకాలకు సంబంధించి దాదాపు రూ. 634 కోట్ల మేర లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పంపిన లేఖ ఆధారంగా.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక శాఖను గతంలో మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసు నమోదు ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ మాజీ మంత్రి కే.ఎన్‌. నెహ్రూ తరపున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.

    కోర్టులో మారిన ప్రభుత్వాల స్టాండ్‌

    ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. తమిళనాడు అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. గత డీఎంకే ప్రభుత్వం ఈ కేసు నమోదుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ప్రస్తుత టీవీకే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భావిస్తోందని, అందుకు అనుమతించాలని కోరు తూ కొత్తగా పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు.

    నెహ్రూ తరఫున అభ్యంతరం

    ప్రభుత్వం మారినంత మాత్రాన, గత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తాము అంగీకరించబోమని నెహ్రూ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన కేసులో తమ పక్షం వివరణ వినకుండానే గతంలో ఆదేశాలు ఇచ్చారని, కాబట్టి ఆ ఉత్తర్వులను ఖచ్చితంగా పునఃసమీక్షించాలని కోరారు. కాగా వాదనల అనంతరం కేసును జూలై 10కి వాయిదా వేసింది.

  • వేలూరు: ప్రతి రోజూ యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయట పడవచ్చునని రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ నుంచి వచ్చిన రాజయోగిని ఉషా దీదీ అన్నారు. తిరువణ్ణామలైలోని ప్రయివేటు కల్యాణ మండపంలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం, బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విద్యాలయ సంస్థ 90 సంవత్సరాల మానవతా సేవను గుర్తించే కార్యక్రమం తిరువణ్ణామలై వ్యాపారుల సంఘం, లయన్స్‌, రోటరీ క్లబ్‌, ఎక్స్‌నోరా, తిరువణ్ణామలై తమిళ సంఘం, పెన్‌ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించింది. డాక్టర్‌ మాధవ చినరాజన్‌, ఎక్స్‌నోరా అధ్యక్షుడు డాక్టర్‌ ఇందిరరాజన్‌ పాల్గొన్నారు. రాజయోగిని మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్‌ అందించే రాజయోగ ధ్యానం ఒక సరళమైన ధ్యాన పద్ధతి అన్నారు. ఇది మానసిక ప్రశాంతతను, ఆత్మ అవగాహనను , దేవునితో అనుబందాన్ని పెంచడానికి సహాయ పడుతుందన్నారు. యోగా చేయడం వల్ల దైవంతో అనుసంధానం, దేవుని గురించి ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించుకోవడానికి దైవిక శక్తిని, ఏకాగ్రతను, మనం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అనంతరం యోగా చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. రోటరీ క్లబ్‌ గవర్నర్‌ సురేష్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి గోమతి, రోటరీ సభ్యులు మన్నులింగం, ధనకోటి, కిషన్‌చంద్‌ పాల్గొన్నారు.

  • తిరువళ్లూరు: అమ్మోనియం గ్యాస్‌ లీకేజీతో పది మంది కార్మికులు మృతి చెందిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. మృతి చెందిన మహిళా కార్మికులకు పంచనామ నిర్వహించి ఒడిశాకు చెందిన అధికారుల సమక్షంలో బంధువులకు అప్పగించారు. అనంతరం మృతదేహాలను చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి విమానంలో సొంత గ్రామాలకు తరలించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం విజయ్‌ ఆదేశించారు. ఇందులో భాగంగానే త్రిసభ్య కమిటీ రెండు రోజులపాటు విచారణ జరిపి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ఫోరెనన్సిక్‌ సిబ్బంది ప్రమాధం జరిగిన ప్రాంతాల్లో నమూనాలను సేకరించి అమ్మోనియం లీకేజీ ద్వారా ప్రమాధం జరిగిందా లేదా కుట్ర ఏమైనా వుందా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాష్ట్ర కార్మిక సంక్షేమశాఖ అధికారులు సైతం కంపెనీలో విచారణ మొదలెట్టారు. అదికారుల తనిఖీల్లో అక్కడ ఉల్లంఘన జరిగిననట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు సంబంధిత కంపెనీకి సీల్‌ వేయాలని సిఫార్సు చేశారు. కార్మికుల భద్రతకు సంస్థ నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోలేదని, సేఫ్టీ పరికరాలు, సంస్థలో వైద్యులు నియమించకపోవడం, ఫస్ట్‌ ఎయిడ్‌ కేంద్రం లేదని సైతం నిర్ధారించారు. దీంతోపాటు సంస్థలో 18 వయస్సులోపు ఉన్నా కూడా పనుల్లో పెట్టుకున్నట్లు నిర్ధారించిన కార్మిక సంక్షేమశాఖ కఠిన చర్యల దిశగా పనులను ప్రారంభించారు. ఇది ఇలావుండగా సంస్థఽలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ కేంఽద్రాల్లో ఇప్పటికే వెయ్యి టన్నుల రొయ్యలు వున్నట్టు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గుర్తించారు. సంబందిత రొయ్యలు నాణ్యమైనవా , ఎగుమతి చేయడానికి అవకాశం వున్న వాటిని గుర్తించి కంటైనర్‌ ద్వారా హార్బర్‌కు షిప్ట్‌ చేసే పనులను అధికారులు ప్రారంభించారు.

  • అవినీతిని అంతం చేస్తాం

    హక్కుల విషయంలో రాజీ పడం

    రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి అనేదే తమ విధాన మని సీఎం విజయ్‌ పేర్కొన్నారు. కేంద్రంతో అనవసర ఘర్షణలకు వెళ్లకపోయినా... రాజకీయ సిద్ధాంతాలను, రాష్ట్ర హక్కులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు, మైనారిటీ సోదరులకు, తమకు మద్దతుగా నిలిచిన శ్రేణులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, తాము ఎవరికీ ‘బి’ టీమ్‌ కాదని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షను వ్యతిరేకించడంలో తాము ఇప్పటికీ బలంగా ఉన్నామని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో కచ్చితంగా తమిళ్‌ తాయ్‌ వాళ్తు ఆలపించాలన్నదే తమ స్టాండ్‌ అని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రపతి సభకు వచ్చిన సమయంలో తమిళ్‌ తాయ్‌ వాళ్తును రెండో స్థానంలోకి నెట్టిందెవరు..? అని డీఎంకే పై విరుచుకు పడ్డారు. చివరగా, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నల్లో ఎలాంటి బాధ్యత కనిపించడం లేదని, కేవలం బురదజల్లే రాజకీయాలే చేస్తున్నాయని సీఎం విజయ్‌ విమర్శించారు. కాగా, అసెంబ్లీలో విజయ్‌ హావాభావాలు చర్చకు దారి తీశాయి. సభలో లేని మాజీ సీఎం స్టాలిన్‌ను టార్గెట్‌ చేస్తూ ఆయన హావాభావాలు వివాదానికి దారి తీశాయి.

    అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం విజయ్‌

    సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజైన మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్‌ తొలిసారిగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. తనను టార్గెట్‌ చేసిన ప్రతి పక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తానేదో సినిమా షూటింగ్‌ ముగించుకుని నేరుగా వచ్చి సీఎం పదవిలో కూర్చున్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. 1990ల కాలం నుండే తాను పలు మార్గాల్లో ప్రజలకు అండగా నిలిచానని వివరించారు. తన సినిమాల్లో వీలైనంత వరకు అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం, విద్య, రాజకీయాల గురించి ప్రస్తావించానని గుర్తు చేశారు. అందుకే తన సినిమాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయని, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రజలు తమను స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టే తాజాగా అధికారంలో కూర్చోబెట్టారన్నారు.

    40 రోజుల్లోనే ప్రజా రంజక పాలన

    తాము అధికారంలోకి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం విజయ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ విజయాలను సభలో వివరించారు. మహిళల రక్షణ కోసం సింగప్పెన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతులకు కురువై సాగు ప్యాకేజీ, పంట రుణాల మాఫీ, డ్రగ్స్‌ రహిత రాష్ట్రం కోసం ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత., అమ్మా క్యాంటీన్ల పునరుద్ధరణ, రిజిస్ట్రేషన్ల శాఖలో సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట గురించి విశదీకరించారు. అలాగే, తమ 40 రోజుల ఘనత, అవినీతి అంతానికి తీసుకుంటున్న చర్యలపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేస్తూ ఆ సంపాదకుడికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేశారు.

    చిన్న కథ, సైగ వివాదం

    సభలో ఓ చిన్న కథను చెబుతూ... సీఎం విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పిల్లోడ్ని ఉద్దేశించి ఒకతను .. ఎక్కడ మీ తండ్రీ.. ఆయన్నే వెతుకుతున్నాను అంటూ ఆ కథలో వచ్చే లైన్‌ ఆధారంగా ఏదీ మీ తండ్రీ అంటూ పరోక్షంగా స్టాలిన్‌ను సభలో వెతుకుతున్నట్టుగా వ్యంగ్యంగా సైగతో విజయ్‌ చమత్కరించారు. అలాగే, గతంలో డీఎంకే కూటమిలో సీట్ల పందేరం ముగిసిన సమయంలో స్టాలిన్‌ చేసిన ఖేల్‌ ఖతం అన్న పరోక్ష సైగను అసెంబ్లీలో తాజాగా విజయ్‌ రిపీట్‌ చేస్తూ ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

    సామాన్యుడి ప్రభుత్వం..

    ఖజానా ఖాళీ చేసిన వారే విమర్శిస్తున్నారు

    తమిళనాడు ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి అప్పులపాలు చేసి వెళ్లారని గత డీఎంకే పాలకులను ఉద్దేశించి విరుచుకు పడ్డారు. ఈ పరిస్థితిని సృష్టించి, ఇప్పుడు తమకు పరిపాలన చేతకాదంటూ విమర్శిస్తున్నారని మండి పడ్డారు. తమకు ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసునని, ప్రజల సొమ్మును దోచుకోవడం తెలియదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై స్పందిస్తూ... తమిళనాడు మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ, గత ప్రభుత్వాల పరిపాలనా లోపాలు, ట్రానన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొందరు కావాలనే చేస్తున్న కుట్రల వల్లే ఈ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని వివరించారు.

  • సాక్షి, చైన్నె : సీఎం విజయ్‌ తీరుపై ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. అసెంబ్లీని కాస్తా సినిమా థియేటర్‌లా మార్చేశారని, సీఎం విజయ్‌ సభలో కృత్రిమంగా నటిస్తున్నారని మండిపడ్డారు.

    సినిమా స్క్రిప్ట్‌ – డైరెక్టర్‌ గా స్పీకర్‌:

    సీఎం విజయ్‌ ఎప్పటిలాగే సినిమా శైలిలో తనకు అందించిన స్క్రిప్ట్‌ను సభలో చదవి వినిపించారన్నారు. అసెంబ్లీలో ఆయన ఒక 30 నిమిషాలు మాట్లాడితే.. అందులో సోషల్‌ మీడియా కోసం ఒక 10 రీల్స్‌ సులభంగా తయారు చేసుకోవచ్చునని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని ఎద్దేవాచేశారు. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి డైలాగులు కంఠస్థం చేసి, నటించి వెళ్లిపోయినట్లే సీఎం తీరు ఉందన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఆవరణలోకి క్యార్‌వాన్‌ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఇక్కడ స్పీకర్‌ డైరెక్టర్‌లా, మంత్రులు అసిస్టెంట్‌ డైరెక్టర్లలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం విజయ్‌ ఎప్పుడు యాక్షన్‌, కట్‌ చెబుతారా అని స్పీకర్‌ చూస్తున్నట్లు ఉందని చమత్కరించారు.

    అసెంబ్లీ ఈలల గోల

    తమిళనాడు శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభలో అధికార పక్ష సభ్యులు ఈలలు వేశారని ఉదయనిధి ఆరోపించారు. సభను సినిమా థియేటర్‌గా మార్చేసి, ఈలలు వేసే సంస్కతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ముందు మంత్రులు ఎవరైనా పాటలు పెట్టుకుని డాన్స్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఒక పరిమితి దాటిన తర్వాత తాము భరించలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదని, కేవలం బ్లేమ్‌ పాలిటిక్స్‌ అని, తాము అడిగిన ఏ ఒక్క ప్రజా సమస్యకు సీఎం నుండి స్పష్టమైన సమాధానం రాలేదని ఉదయనిధి విమర్శించారు. అసెంబ్లీలో సాంప్రదాయాలను ఉల్లంఘించారని, గవర్నర్‌ విషయంలో ప్రభుత్వం ఏం రాజీ పడిందో చెప్పలేదని, సీఎంకు కనీసం ప్రోటోకాల్స్‌ కూడా తెలియకపోవడం విచారకరంగా పేర్కొన్నారు.

    అన్నాడీఎంకేతో లోపాయికారీ ఒప్పందం

    ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెబుతున్న సీఎం, అన్నాడీఎంకేలోని ఒక వర్గాన్ని ఎందుకు కలవడానికి వెళ్లారు? అని ప్రశ్నించారు. ‘బ్యూరో పుల్లింగ్‌’ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకు పడ్డారు.

    ఆ కథ తమిళనాడు మొత్తానికి తెలుసు..

    అసెంబ్లీలో సీఎం విజయ్‌, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మధ్య సాగిన మాటల యుద్ధం సామాజిక మాధ్యమాలకు కూడా పాకింది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్‌ ప్రసంగిస్తూ.. ’తండ్రిని వెతుకుతున్న కొడుకు’ అంటూ ఒక చిన్న కథను (కుట్టి కథ) చెప్పడం సభలో తీవ్ర కలకలం రేపింది. ఈ కథపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా అత్యంత ఘాటుగా స్పందిస్తూ సీఎం గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

    ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్ళండి!

    అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న విజయ్‌, ధైర్యం ఉంటే ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని ఉదయనిధి సవాల్‌ విసిరారు. బహిరంగ సభల్లో, ప్రచార వేదికల్లో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడటం కుదరదన్నారు. సీఎం పార్టీ ఫండ్‌ అంటూ ఆరోపణలు చేశారని, దమ్ముంటే అది ఏ పార్టీ ఫండో స్పష్టంగా చెప్పాలని, తాము దేనికై నా సిద్ధంగా ఉన్నామని సవాల్‌ చేశారు. తమ ఎన్నికల హామీలపై ఎక్కడా ప్రస్తావనే సభలో టీవీకే తీసుకు రాక పోవడం సిగ్గు చేటుగా వ్యాఖ్యలు చేశారు.

    సినిమా కెమెరా అనుకుంటున్నారా?

    అసెంబ్లీ లైవ్‌ కెమెరాను ఆయన సినిమా కెమెరాగా భావించి మాట్లాడేస్తున్నారని, ప్రసంగాన్ని ఒకే సింగిల్‌ టేక్‌ లో షూట్‌ చేయాలన్నట్లుగా స్పీకర్‌ పడిన తాపత్రయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సీఎం విజయ్‌ అసెంబ్లీలో తండ్రి–కొడుకుల కథను ప్రస్తావించడాన్ని ఉదయనిధి తప్పుపట్టారు. ‘ముఖ్యమంత్రి విజయ్‌ కుట్టి కథ చెబుతానంటూ చేసిన సైగలు, వ్యంగ్యాస్త్రాలు సభా మర్యాదలకు పూర్తిగా విరుద్ధం అంటూ ‘చెంగల్పట్టు కోర్టులో భర్తను వెతుకుతున్న భార్య’ కథ తమిళనాడు మొత్తానికి బాగా తెలుసునని పరోక్షంగా విజయ్‌ విడాకుల వ్యవహారం ప్రస్తావనతో కౌంట్‌ ఇచ్చారు. ఈ దృష్ట్యా, విజయ్‌ , తాను ఇంకా ఓ నటుడిని అనే విషయాన్ని మరిచిపోయి, ఇకనైనా సీఎం విజయ్‌గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ ఉదయనిధి ఘాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • సాక్షి, చైన్నె: శాసనసభలో మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాడివేడి చర్చ సాగింది. సీఎం విజయ్‌ గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి, పరిపాలనా వైఫల్యాల ఆరోపణలు గుప్పించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఆధ్వర్యంలో డీఎంకే సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు.

    సీఎం విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు

    శాంతిభద్రతలు, డ్రగ్స్‌ రవాణాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం విజయ్‌ సభలో తిప్పికొట్టారు. శాంతిభద్రతలపై ఏదో బాధ్యతతో మాట్లాడుతున్నట్లు లేదని, కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని విరుచుకు పడ్డారు. గత 9, 10 నెలలుగా రాష్ట్రానికి కనీసం శాంతిభద్రతల డీజీపీ కూడా లేకుండా పాలన సాగించారని, అప్పట్లో హోంశాఖను చేతిలో పెట్టుకున్నవారు డ్రగ్స్‌ నియంత్రణను ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. అలాగే, టాస్మాక్‌ (మద్యం దుకాణాలు) అవినీతిని ప్రస్తావిస్తూ... ప్రజాధనాన్ని దోచుకుని, అవినీతిపై అవినీతి చేసి, దాని నుండి తప్పించుకోవడమే పరిపాలనా సామర్థ్యం అనుకుంటే, అలాంటి సామర్థ్యం తమ ప్రభుత్వానికి ఎప్పటికీ అవసరం లేదన్నారు.. పెట్టెలకు పెట్టెలుగా డబ్బులు నింపుకుని, డ్రగ్స్‌ ప్రొటెక్షన్‌ కార్పొరేషన్‌లా వ్యవహరిస్తూ చేసిన ఒక్కో అవినీతి భాగోతం ఇప్పుడు బయటకు వస్తున్నదని విజయ్‌ మండిపడ్డారు. టాస్మాక్‌ నుంచి పార్టీ ఫండ్‌కు నిధిని మళ్లించారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసింది.

    సభలో ఉద్రిక్తత – స్పీకర్‌ జోక్యం

    సీఎం విజయ్‌ వ్యాఖ్యలతో డీఎంకే సభ్యులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్తూ నినాదాలు చేశారు. వీరికి కౌంటర్‌గా అధికార టీవీకే సభ్యులు కూడా రంగంలోకి దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో స్పీకర్‌ స్పందిస్తూ, సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తాను, సభ్యులు శాంతించాలని కోరారు. అనంతరం మంత్రులు సెంగోట్టయన్‌, రాజ్‌ మోహన్‌, , ఆధవ్‌ అర్జున తదితరులు డీఎంకే విమర్శలకు సమాధానమిచ్చారు.

    ఆధారాలు ఉంటే నిరూపించండి

    అనంతరం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ అధికార పక్ష తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్‌ సభలో ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు పదజాలం ఉపయోగించారని మండి పడ్డారు. పార్టీ ఫండ్‌ అంటూ ఆరోపణలు చేశారని, ధైర్యం ఉంటే అది ఏ పార్టీ ఫండో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆధారాలతో సహా చెబితే తాము దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. తాను మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కూడా ఒక మంత్రి సభలో మాట్లాడుతుండటం ఏం సంప్రదాయం?‘ అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ, ఒకవేళ సీఎం చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోతే పరిశీలించి రికార్డుల నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు.

    తగ్గేదే లేదన్న విజయ్‌.. డీఎంకే వాకౌట్‌

    స్పీకర్‌ వివరణ తర్వాత కూడా సీఎం విజయ్‌ తన పంథాను మార్చుకోలేదు. వివిధ శాఖల్లో పార్టీ ఫండ్‌ పేరిట దోచుకున్న సొమ్ము ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చేరుతోందన్నారు. ప్రజల సొమ్మును తాకనివ్వం, తాకిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రతి అవినీతి త్వరలోనే బయటపడుతుందని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన డీఎంకే సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు.

  • సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్‌–1 కేటగిరీకి చెందిన మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ మంగళవారం జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30 నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

    భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..

    ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌–1 పరిధిలోని డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ కమర్షియల్‌ టాక్సెస్‌ , డెప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌,డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ (రిజిస్ట్రేషన్‌ శాఖ), అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్‌ 30 నుంచి దరఖాస్తులకు శ్రీకారం చుట్టనున్నారు.దరఖాస్తులకు చివరి తేదీ జూలై 29గా ప్రకటించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ సెప్టెంబర్‌ 6వ తేదీగా వివరించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా ప్రకటించారు. జనరల్‌ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్‌ వర్గాలకు(బీసీ, ఎంబీసీ,ఎస్సీ, ఎస్టీ), నిరుపేద వితంతువులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుందని, ఇక దివ్యాంగులకు అన్ని వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 10 ఏళ్ల సడలింపు లభిస్తుందని ప్రకటించారు. పరీక్షా విధానం, సిలబస్‌, ఫీజు పరీక్షా కేంద్రాల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.tnprc.gov.in సందర్శించవచ్చని తెలిపారు. త్వరలో ఇతర నోటిఫికేషన్లూ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    డిజిటల్‌ సేవల్లో

    చైన్నె కార్పొరేషన్‌ ముందంజ

    – వాట్సాప్‌ ద్వారా 1.86 లక్షల మందికి లబ్ధి

    సాక్షి, చైన్నె: ప్రజలకు నగరపాలక సంస్థ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా చేరవేసేందుకు గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్‌ సేవలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ వాట్సాప్‌ చాట్‌బాట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అందిస్తున్న 44 రకాల విభిన్న సేవలను గత 10 నెలల్లో ఏకంగా 1.86 లక్షల మంది నగరవాసులు వినియోగించుకున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు మంళవారం ప్రకటించారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా అత్యవసర, పౌర సేవలను మొబైల్‌ ద్వారానే సులభంగా పొందేందుకు వీలుగా గత ఏడాది ఆగస్టు 25, 2025న ఈ ప్రత్యేక వాట్సాప్‌ సేవా విభాగాన్ని చైన్నె కార్పొరేషన్‌ అధికారికంగా ప్రారంభించింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దాదాపు 10 నెలల కాలంలోనే 1,86,000 మందికి పైగా పౌరులు తమకు కావాల్సిన వినతులు, ధృవీకరణ పత్రాలు , సమాచారాన్ని దీని ద్వారా విజయవంతంగా పొందారని గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం ద్వారా ప్రజలకు సమయం వృథా కాకుండా ఉండటమే కాకుండా, నగరపాలక సంస్థపై ప్రజల్లో నమ్మకం, జవాబుదారీతనం మరింత పెరిగిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

    కోవైలో బలిదాన్‌ దివస్‌

    సాక్షి, చైన్నె : భారత కేసరి డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ దేశ సార్వభౌమాధికారం, ఐక్యత కోసం చేసిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బలిదాన్‌ దివస్‌ కార్యక్రమాన్ని కోయంబత్తూరులో మంగళవారం నిర్వహించారు. కోయంబత్తూరు శివశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మరణ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ పి. కనకసబాపతితో కలిసి డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి.. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ చేరిన కార్యకర్తలను ఉద్దేశించి డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ సమగ్రత కోసం శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చేసిన పోరాటాన్ని, ఆయన జీవిత విశేషాలను కొనియాడారు. ‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు గుర్తులు, ఇద్దరు ప్రధానులు ఉండటానికి వీల్లేదు (ఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో నిషాన్‌, దో ప్రధాన్‌ నహీ చలేంగే) అంటూ జమ్మూ కాశ్మీర్‌లో అప్పట్లో అమలులో ఉన్న పర్మిట్‌ విధానానికి వ్యతిరేకంగా పోరాడి ముఖర్జీ తన ప్రాణాలనే అర్పించారన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా.. ముఖర్జీ కన్న అతిపెద్ద కల సాకారమైందన్నారు. ఇది దేశ జాతీయ సమగ్రతను మరింత బలోపేతం చేసిందన్నారు. దేశభక్తి, సుపరిపాలన , సమాజ సేవ అనే ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

  • తిరువళ్లూరు: రొయ్యలు ఎగుమతి చేసే పరిశ్రమలో అమోనియం గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన నాలుగు మృతదేహాలకు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామ పూరక్తి చేసి ఒడిశా కార్మిక సంక్షేమశాఖ అధికారి సౌమ్య నిరంజనకు తిరువళ్లూరు ఆర్డీవో రవిచంద్రన్‌ అప్పగించారు. ఈ మృతదేహాలను చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో ఉంచనున్నారు. వీటితో పాటూ రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాల, స్టాన్లీ వైద్యశాలలో వున్న మృతదేహలను ఒకేచోటకు చేర్చి విమానం ద్వారా సాయంత్రం సొంత గ్రామాలకు చేర్చడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా కన్నిగైపేర్‌లో రొయ్యలను ఎగుమతి చేసే ఫ్యాక్టరీలో గత ఆదివారం అమ్మోనీయం లీకేజీ కారణంగా ప్రమాదం ఏర్పడి 69 మంది స్పృహా కోల్పోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాయపడిన వారిని వేల్స్‌ వైద్యశాలలో 27 మంది, వెంకటేశ్వర వైద్యశాలలో 18 మంది క్షతగాత్రులను వుంచి వైద్యసేవలను అందించారు. మెరుగైన చికిత్స కోసం రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, స్టాన్లీ వైద్యశాలలో 13 మందిని తరలించారు. ప్రస్తుతం వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన క్రమంలో వారిని సోమవారం డిచార్జ్‌ చేశారు. అయితే వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ వచ్చిన ముగ్గురు, వెంకటేశ్వర వైద్యశాలలో ఒకరు, రాజీవ్‌గాంధీ వైద్యశాలలో ఇద్దరు, స్టాన్లీ వైద్యశాలలో ముగ్గురితో పాటు సోమవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 9 మందికి చేరింది. వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందిన జువానీజువాంగ్‌, పుల్‌మేణిజువాంగ అలియాస్‌ మలోతీ, సంభాతిజువాంగ, షిభాణీ తదితర నలుగురు మృతి చెందిన క్రమంలో వీరి మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు శవపరీక్షల నిమిత్తం తరలించారు. ఈ నాలుగు మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాల ముఖం ఛిద్రంగా మారిపోవడంతో వారిని గుర్తించడం, బంధువులకు అప్పగించడం ఆలస్యంగా మారింది. దీంతో ఒడిశాకు చెందిన అధికారులను సంఘటన స్థలానికి పిలిపించి మృతదేహాలను గుర్తించిన క్రమంలో మంగళళవారం ఉదయం ఒడిశా కార్మిక సంక్షేశాఖ అధికారి సౌమ్యకు తిరువళ్లూరు ఆర్డీవో రవిచంద్రన్‌ అప్పగించారు.

    విమానం ద్వారా సొంత గ్రామాలకు..

    తిరువళ్లూరు వైద్యశాల, స్టాన్లీ వైద్యశాలలో వున్న మృతదేహాలను రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మొత్తం 9 మృతదేహాలను సాయంత్రం విమానం ద్వారా సొంత గ్రామాలకు తరలించారు.

  • తమిళసినిమా: సోమవారం ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ నుంచి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నటి కీర్తి సురేష్‌ దంపతులు ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితురాలిగా ముద్ర వేసుకున్న నటి త్రిష ప్రతి ముఖ్య కార్యక్రమాల్లో వెన్నంటే ఉండే వారు.అలాంటిది ఈసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ తన పుట్టిన రోజు వేడుకను ఆదివారం అర్ధరాత్రే కేక్‌ కట్‌ చేసి జరుపుకున్నారు. ఆ సమయంలో నటి త్రిష ఆయనతోనే ఉన్నారు. వారి ముందు ఉన్న ఐదు కేకుల ఫొటోలను నటి త్రిష తన ఇన్‌ స్ట్రాగామ్‌. పోస్ట్‌ చేసి, అన్నింటినీ అర్ధవంతంగా మార్చుతున్న ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

  • సాక్షి, చైన్నె : ఐవీఎఫ్‌ ,సంతాన సాఫల్య చికిత్స సేవల నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ చర్యలు తీసుకన్నామని ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవస్థాపకురాలు, లాపరోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ చంద్రలేఖ తెలిపారు. తమ ఉనికిని మరింత విస్తరించే విధంగా అధునాతన సంతాన సాఫల్య వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, తిరువళ్లూరులో 84వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడు తూ, దంపతులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల ను, మానవతా దృక్పథంతో అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈకేంద్రాన్ని తీర్చిదిద్దామన్నారు. అత్యంత సురక్షితమైన , అనుకూలమైన వాతావరణంలో రోగులకు ప్రపంచస్థాయి చికిత్సను అందించేందుకు ఈ కేంద్రం నిరంతరం శ్రమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ లక్ష్మీమురళి, కార్యదర్శి డాక్టర్‌ గీతాప్రియ బాలాజీ, ట్రెజరర్‌ డాక్టర్‌ తమిళ్‌ సెల్వి, డిస్ట్రిక్ట్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ కరుణాకరన్‌, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ సాహిత్య తదితరులు పాల్గొన్నారు.

  • తమిళసినిమా: ఇప్పుడు సోషల్‌ మీడియా విజృంభన మామూలుగా లేదు. సీమ చిటుక్కుమన్నా వార్తగా మారిపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పాఠకుల ముందు ఉంచుతోంది. దీంతో చాలా మంది తమ ఎదుగుదలకు సోషల్‌ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం షాక్‌ తగిలినట్లుగా భయపడిపోతున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలు గోరంతను కొండంత చేయడమే ఇందుకు కారణం కావచ్చు. మరికొన్ని వదంతులను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే వాదనను కొట్టి పారేయలేని పరిస్థితి. ఒక్కోసారి పరిస్థితులను బట్టి చేసిన వ్యాఖ్యలు ఆ తరువాత వారిని, విమర్శలకు గురి చేస్తుంటాయి. వాటి నుంచి బయట పడటానికి కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించారు అని ఎదురు దాడి చేస్తుంటారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్‌ మీడియాకు కొందరు భయపడుతున్నారని చెప్పక తప్పదు. తమ గురించి జరుగుతున్న వదంతుల నుంచి బయట పడటానికి కొందరు సోషల్‌ మీడియాకే దూరం అవుతున్న పరిస్థితి. తాజాగా పాన్‌ ఇండియా క్రేజీ కథానాయకి, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కూడా సోషల్‌ మీడియా దెబ్బకు భయపడుతున్నట్లు తేట తెల్లమైంది. ఇందుకు చిన్న ఉదాహరణ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే.. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల గురించి దొర్లుతున్న వదంతులపై మీ స్పందన అన్న ప్రశ్నకు రష్మిక మందన్నా బదులిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది అని అన్నారు. ఏం మాట్లాడినా అది వేరే విధంగా బయటకు పోతోందన్నారు. అనని విషయాలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. అందువల్ల మనం గురించి ఎలాంటి వదంతి ప్రచారం అవుతుందేమోనని రోజూ భీతితో గడపాల్సిన పరిస్థితి నెల కొంటోందన్నారు. సోషల్‌ మీడియా ఎదుగుదల మంచిదేనని, అయితే దాన్ని కొందరు తప్పుగా వాడుతుండటమే వేదన కలిగిస్తోందని రష్మిక పేర్కొన్నారు.

  • తమిళసినిమా: దర్శకుడు మీరా కదిరవన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన తాజా చిత్రం హబిబీ. నేశం ఎంటర్‌ టైన్మెంట్‌, జీకేఎస్‌ బ్రోస్‌ ప్రొడక్షన్స్‌, రోమియో పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్‌ దర్శకుడు, నటుడు ధనుష్‌, దర్శకుడు సెల్వరాఘవన్‌ లో తండ్రి కస్తూరి రాజా ప్రధాన పాత్రను పోషించారు. నటి మాళవిక మనోజ్‌, నటుడు ఈశా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఇస్లామిక్‌ సముదాయం నేపథ్యంలో రూపొందింది. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గత వారం తెరపైకి వచిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు రాజు మురుగన్‌, తమిళ్‌, నిర్మాత సురేష్‌ కామాక్షి మొదలగు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హబిబీ చిత్ర విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకుడు మీరా కదిరవన్‌ మాట్లాడుతూ 110 ఏళ్ల సినీ చరిత్రలో హబిబీ తన తొలి చిత్రం కావాలని భావించానన్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌ తనకు కొత్త కాదనీ, ఈ అనుభవం కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ సహోదరులను ఇంతకు ముందు చాలా చిత్రాల్లో తీవ్రవాదులుగా చిత్రీకరించారని, దాన్ని మార్చడమే ఈ చిత్రం పెద్ద విషయంగూ తాను భావిస్తున్నానన్నారు. దర్శకుడు కస్తూరి రాజా మాట్లాడుతూ తనను నటుడిగా మార్చిన గురువు దర్శకుడు మీరా కదిరవన్‌ అని పేర్కొన్నారు. హబిబీ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి చూశానన్నారు. తన పెద్ద కూతురు, డాక్టరు చాలా ధైర్యవంతురాలు అనీ, ఆమె ఈ చిత్రం చూసి ఏడ్చేశారని చెప్పారు. తన చిన్న చన్ను కొడుకు, నటుడు ధనుష్‌ చిత్రం చూసి చాలా గౌరవమైన చిత్రాన్ని చేశావు నాన్నా అని గట్టిగా వాటేసుకున్నారని చెప్పారు. తాను నటించినా, లేకపోయినా ఈ చిత్రంలో నటించిన అనుభవం చాలని కస్తూరి రాజా పేర్కొన్నారు.

    శింబు, ధనుష్‌

    కాంబోలో వడచైన్నె – 2

  • సాక్షి,చైన్నె: సాంకేతికత, సోషల్‌ మీడియా అల్గారిథమ్స్‌ మనుషుల ఆలోచనలను, వారి జీవన విధానాన్ని శాసిస్తున్న ఈ ఆధునిక యుగంలో.. ప్రతి ఒక్కరూ తమ అంతర్గత శక్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ రచయిత, న్యాయవాది కార్తికేయ వాజ్‌పాయ్‌ పేర్కొన్నారు. తన చైన్నె పర్యటనలో భాగంగా రామాపురంల్నో ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో తొలుత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌. శివకుమార్‌, డీన్‌ డాక్టర్‌ ఎస్‌. తిరుమగన్‌, హెచ్‌ఓడి డాక్టర్‌ ప్రభాకరన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నాసాలైలోని చారిత్రాత్మక హిగ్గిన్‌ బోథ మ్స్‌ బుక్‌ స్టోర్‌లో జరిగిన తన నూతన పుస్తక ఆవిష్కరణ సభలలో ఆయన ప్రసంగించారు. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురించిన ది అన్‌బికమింగ్‌గా లెట్‌ లైఫ్‌ రివీల్‌ ఇట్స్‌ పర్పస్‌ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం హిగ్గిన్‌బోథమ్స్‌ వేదికగా ప్రముఖ రచయిత, లీడర్‌షిప్‌ మెంటర్‌ శ్రీప్రకాష్‌ నాదదూర్‌ శ్రీధరన్‌తో కలిసి కార్తికేయ తన పుస్తకంపై ఆసక్తికరమైన చర్చ జరిపారు.

    అల్గారిథమ్స్‌ మాయలో పడకండి

    ఎస్‌ఆర్‌ఎం నావిగేటింగ్‌ లైఫ్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ అల్గా రిథమ్స్‌ అనే సదస్సులో కార్తికేయ వాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. డిజిటల్‌ యుగంలో మానసిక ఎదుగుదలకు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. ప్రస్తుత కాలంలో అల్గారిథమ్స్‌ మనకు నచ్చిన గుర్తింపులను మనకే విక్రయిస్తున్నాయన్నారు. స్క్రీన్‌ టైమ్‌ను మేనేజ్‌ చేయడం కంటే.. ఆత్మగౌరవాన్ని, స్వీయ విలువను కాపాడుకోవడమే ఈ తరం ముందున్న అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు.డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లు బాహ్య ప్రపంచం నుండి గుర్తింపును కోరుకునేలా చేస్తూ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయన్నారు. సాంకేతికతను,కృత్రిమ మేధ ను వద్దనకూడదని, అయితే, దానిని స్పృహతో, స్పష్టమైన అవగాహనతో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

  • తమిళసినిమా: నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్న చిత్రం అంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అదేవిధంగా దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా వైవిధ్య భరిత కథా చిత్రాలకు చిరునామా. ఈయన ఇంతకు ముందు టైలర్‌ డర్డన్‌, కినో ఫీస్ట్‌ సంస్థలు అరణ్యకాండం, సూపర్‌ డీలక్స్‌ వంటి విమర్శల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా కాంబినేషన్లో వచ్చిన సూపర్‌ డీలక్స్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు నటుడు విజయ్‌ సేతుపతికి జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డును తెచ్చిపెట్టింది. కాగా తాజాగా ఈ కాంబోలో రూపొందుతున్న చిత్రం పాకెట్‌ నావల్‌. నటి మాళవిక మోహన్‌ నాయకి గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజ్‌.బీ.శెట్టి, కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇ యళరాజా సంగీతాన్ని, నీరవ్‌ షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో షూటింగ్‌ పూర్తి అవుతుందని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నాయని చెప్పారు. చిత్ర టైటిల్‌, టీజర్‌ లను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఆడియో, ట్రైలర్‌ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

  • – చైన్నెలో ఈ–టెప్‌ మాస్టర్‌ క్లాస్‌ సదస్సు

    సాక్షి, చైన్నె : హెర్నియా చికిత్సలలో అత్యాధునిక విధానం అమలు గురించి చైన్నెలో ఈ టెప్‌ మాస్టర్‌ క్లాస్‌ సదస్సు మంగళవారం జరిగింది. హెర్నియా , పొట్ట గోడల పునర్నిర్మాణ చికిత్సా విధానంలో వస్తున్న సరికొత్త సాంకేతిక మార్పులపై సర్జన్లకు అవగాహన కల్పించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా – తమిళనాడు స్టేట్‌ చాప్టర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చైన్నె ఈ–టెప్‌ మాస్టర్‌ క్లాస్‌’ 3వ ఎడిషన్‌ సదస్సు విజయవంతంగా అత్యాధునిక చికిత్స విధానాల గురించి వైద్యులు,నిపుణుల బృందాలు చర్చించాయి. మారుతున్న ఆధునిక వైద్య శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ విద్యా కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ మాస్టర్‌ క్లాస్‌ సదస్సులో భారతదేశానికి చెందిన ప్రముఖ సర్జన్లతో పాటు అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్ల ప్రసంగాలు, అత్యాధునిక శస్త్రచికిత్సల వీడియో ప్రదర్శనలు, మల్టీడిసిప్లినరీ చర్చలు , వివిధ క్లిష్టమైన కేసుల విశ్లేషణల ద్వారా ప్రస్తుతం హెర్నియా చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్‌ పద్ధతులను వివరించారు. ఈ సదస్సుకు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ రవీంద్రన్‌ కుమరన్‌ మాట్లాడుతూ.. హెర్నియా శస్త్రచికిత్స జరిగిన తర్వాత అది మళ్లీ తిరగబెట్టే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ, అందుకోసమే ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన సర్జన్లు హెర్నియాలజిస్ట్‌లుగా మారుతున్నారని వివరించారు. నేషనల్‌ ఏఎస్‌ఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మరుదుపాండి మాట్లాడుతూ.. అబ్డామినల్‌ వాల్‌ పునర్నిర్మాణ రంగంలో సర్జికల్‌ విద్యను ప్రోత్సహించడానికి , రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి నిరంతరం కట్టుబడి ఉన్నామన్నారు.

Andhra Pradesh

  • కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

    గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలు
    కర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. 

  • తాడేపల్లి: `పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగు వారికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. వారు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు.

    ‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం. వీరంద‌రినీ మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు సాధించిన విజయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    కాగా, రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 65 మందికి రాష్ట్రపతి పద్మ అవార్డులు అందజేశారు.

  • విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్‌.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. 

    కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

    సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్‌ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

  • అనంతపురం: తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా, జేసీ అనుచరులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కేశవరెడ్డిని పార్టీ శ్రేణులు వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

    అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశవరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిపై జేసీ వర్గీయులు విచ్చలవిడిగా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితులు కళ్లముందే జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై స్థానికంగా,  వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • సాక్షి,విజయవాడ: కేబినెట్ సమావేశంలో కూటమి సర్కార్‌ రాష్ట్ర పరిపాలన, ప్రజా సేవలు, విద్యా రంగం, వైద్య రంగంపై ప్రతికూల ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంది.

    వాటిల్లో ప్రధానంగా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలోని అసైన్డ్‌ కమిటీలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై నియోజకవర్గంలో అసైన్డ్‌ భూములపై నిర్ణయాధికారాన్ని ఎమ్మెల్యేల కమిటీలకు అప్పగించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను కమిటీ ఛైర్మన్‌లుగా నియమించనున్నారు. దీంతో అసైన్డ్‌ భూములపై తుది నిర్ణయాలు కూటమి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ ప్రభావం, పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

    గీతం యూనివర్సిటీలో 45 మీటర్ల ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణానికి ఫైర్ ఎన్‌ఓసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని నిబంధన విధించింది. ఈ నిర్ణయం విద్యా రంగంలో అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నప్పటికీ, భద్రతా ప్రమాణాల అమలు కఠినంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

    ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌లో బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్‌కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆస్పత్రులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ఆస్పత్రులే భరించాలని నిర్ణయించింది. 8 శాతం వడ్డీని ఆస్పత్రులే బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఆస్పత్రులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని, దీని ప్రభావం రోగులపై పడవచ్చని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • భాకరాపురం:  బ్రెయిన్‌ టీబీతో బాధపడుతున్న పులివెందుల భాకారాపురానికి చెందిన ఆయేషాను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలిసి.. ఆయన రాకకోసం ఆయేషాతో పాటు ఆమె భర్త బాబా ఫక్రూద్దీన్‌ రోడ్డు పక్కన ఎదురుచూశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. తన కాన్వాయ్‌ దిగి ఆయేషాను పరామర్శించారు. వైద్య సహాయం అందిస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 

    మూడేళ్ల క్రితం ఆయేషాకు వైఎస్‌ జగన్‌ వైద్య సహాయం అందించడంతో ఆమె ఆరోగ్యం అప్పుడు కాస్త మెరుగైంది. అయితే ఇప్పుడు మళ్లీ ఆయేషా ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే వైఎస్‌ జగన్‌.. పులివెందులకు వస్తున్నారని తెలిసి..  ఆయన కోసం రోడ్డు పక్కనే ఎదురు చూశారు.  వారి విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి వారిని పరామర్శించారు.  వారికి ధైర్యం చెప్పిన వైఎస్‌ జగన్‌.. ఆయేషాకు అండగా ఉంటామని, తగిన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

    దీనిపై ఆయేషా భర్త బాబా ఫక్రూద్దీన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ దయవల్లే  ఆయేషాకు మెరుగైన వైద్యం అందిందన్నారు. వైఎస్‌ జగన్‌ మేలును ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

    రోడ్డుపై కాన్వాయ్ ఆపి.. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్
  • పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం వైఎస్సార్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు చేరుకున్నారు.పులివెందులలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

    స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

    హెలిప్యాడ్ వద్ద నాయకులు, శ్రేణులకు అభివాదం చేసిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలపై ఈ పర్యటనలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    ప్రజల నుంచి వినతుల స్వీకరణ
    పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయానికి వైఎస్‌ జగన్ చేరుకున్నారు. ఆయనను కలిసేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో వైఎస్‌ జగన్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. స్థానిక సమస్యలు, వ్యక్తిగత అభ్యర్థనలు, అభివృద్ధి పనులపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సమస్యలను విని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వైఎస్‌ జగన్ హామీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Movies

  • సౌత్ సినీ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.  తమన్నా మాట్లాడుతూ.. సౌత్ సినిమాలలో మహిళలను చూసే కోణంలో ఒకింత పురుషాధిక్యత కనిపిస్తుంది. హీరోయిన్లను గౌరవప్రదంగా కాకుండా ఎక్కువగా గ్లామర్ కోణంలోనే చూపిస్తారు. అయితే బాలీవుడ్‌లో మాత్రం నటన లేదా గ్లామర్ ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సౌత్‌లో ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సి వస్తుందని ఆమె అభిప్రాయపడింది.  

    తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే.. తమన్నా కెరీర్‌లో టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్టార్ స్టేటస్, భారీ పారితోషికంతో పాటు అభిమానుల నుంచి ఆదరణ కూడా వచ్చింది. ఇవన్నీ ఆమెకు దక్షిణాదే ఇచ్చాయి. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా కూడా అదే జాబితాలో చేరిందని సినీ వర్గాలు అంటున్నాయి.  

  • రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ పెద్ది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో  మేకర్స్
    నిర్వహించారు.

    ఈ ఈవెంట్‌కు హాజరైన రామ్ చరణ్‌ ఎమోషనలయ్యారు. ఈ సినిమా నా లైఫ్‌ను మార్చేసిందని అన్నారు. ఇంత పెద్ది హిట్‌ ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీలోని పాటలకు అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోందన్నారు. క్లీంకార ఇప్పుడు నన్ను పెద్ది అని పిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా నా పేరు మరిచిపోయి పెద్ది అని అంటారేమోనని అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడలేని ఏదైనా ఉంటే డైరెక్టర్‌ సుకుమార్‌కు ఫోన్ చేస్తానని చెప్పారు.

    తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని రామ్ చరణ్ అన్నారు. మా పెద్ది సినిమాకు పాజిటివ్‌గా రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. 

     

  • మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

    ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది..  దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.

    మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్‌లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్‌కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.

    దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్‌కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్‌ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. 
     

     

  • హీరోయిన్ త్రిష అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ రోజే దళపతి విజయ్‌ను అన్‌ఫాలో చేసిన ముద్దుగుమ్మ.. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవన్నీ విలువైనవిగా చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. కానీ ఈనెల 22న సీఎం విజయ్ బర్త్‌ డే కాగా.. ఒక రోజు ఆలస్యంగా విష్ చేయడంతో ఫ్యాన్స్‌ షాకవుతున్నారు.

    సోమవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం త్రిష నుంచి స్పెషల్ విషెస్ వస్తుందని ఎదురుచూశారు. రోజు గడిచిపోయింది కానీ ఎలాంటి శుభాకాంక్షల పోస్ట్ కనిపించలేదు. తాజాగా ఇవాళ విజయ్‌కు పుట్టినరోజు విషెస్ చెప్పడం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

    త్రిష పేరు వైరల్..

    హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం మాటేమో గానీ ఆ టైంలో హీరోయిన్ త్రిష తెగ వైరలైంది. వీళ్లిద్దరూ డేటింగ్ ఉన్నారనే రూమర్సే దీనికి కారణం. ఇదే కాదు విజయ్ వదిలేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానం నుంచి ఉపఎన్నిక కోసం త్రిషనే పోటీలో నిలబెడతారనే రూమర్స్ కూడా వచ్చాయి. 
     

     

  • కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే రామ్ చరణ్ పెద్ది మూవీలో కనిపించింది. ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది ముద్దుగుమ్మ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోన్న శృతిహాసన్.. తాజాగా అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌లో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

    ఈ సెషన్‌లో పాల్గొన్న నెటిజన్స్ శృతికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటిలో ఓ ఆసక్తికర ప్రశ్న కూడా ఎదురైంది. మీరు బొడ్డుకు పియర్సింగ్ ఉందా?.. ఎప్పుడు చేయించుకున్నారు అని అడిగింది ఓ నెటిజన్. దీనికి శృతిహాసన్ కూడా బదులిచ్చింది. అవును, ఉంది. నాకు 19 ఏళ్ల వయసులో చేయించుకున్నానని తెలిపింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి నాన్న నాపై చాలా కోపంగా ఉన్నారని వెల్లడించింది.

    అంతేకాకుడా తన జుట్టు సంరక్షణ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది. జుట్టు సంరక్షణ, స్టైలింగ్ కోసం తరచుగా సెలూన్‌లకు వెళ్తారని అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చింది. తాను ఐదేళ్లుగా హెయిర్ సెలూన్‌కు వెళ్లలేదని శృతి వెల్లడించారు. చివరిసారిగా నా జుట్టుకు 2017లో రంగు వేసుకున్నానని తెలిపింది. నా జుట్టును నేనే కత్తిరించుకుంటా..నేనే ట్రీట్మెంట్ చేసుకుంటానని సమాధానమిచ్చింది. తరచుగా సెలూన్‌లకు వెళ్లడంపై ఆధారపడటం కంటే తన జుట్టు సంరక్షణను తానే చూసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చింది.

    ఇక శృతి సినిమాల విషయానికొస్తే ఆమె ఇటీవలే 'పెద్ది' చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌లో కనిపించింది. ప్రస్తుతం మైస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన కనిపించనున్నారు. 
     

  • దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త  సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ రోజు ‘స్టూడెంట్’ సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ ఈ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి.

     'ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు' అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. 'ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..' అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి.‘స్టూడెంట్’ సినిమా మేఘాంశ్ శ్రీహరి కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీగా రాబోతుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

  • మలయాళ స్టార్ మమ్ముట్టి పద్మభూషణ్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‍అవార్డ్ స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పద్మశ్రీ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్‌ అందుకున్నారు. 

    టాలీవుడ్‌లో ఇద్దరికి పద్మశ్రీ..

    మమ్ముట్టితో పాటు ప్రముఖ సింగర్ అల్కా యగ్నిక్‌ కూడా పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. పద్మశ్రీ అందుకున్న వారిలో టాలీవుడ్ నటుడు మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ జానపద కళాకారుడు గురు సంగ్యుసాంగ్ పొంగెనర్, అనిల్ కుమార్ రస్తోగి అవార్డులు అందుకున్నారు. దివంగత నటుడు సతీష్ షాకు పద్మశ్రీ అవార్డ్ రాగా.. ఆయన సోదరుడు అరవింద్ షా  స్వీకరించారు.

     

     

     

  • ఇటీవలే టాలీవుడ్‌లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ సింగ్ గీతం. ఈ సినిమాకు 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి కల్కి డైరెక్టర్ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రంలో అయాన్, అహిల్య బమ్రు, శాలిని కోడెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.

    టాలీవుడ్‌లో పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోలీవుడ్‌ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీని కోలీవుడ్‌లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయనుంది. జూన్ 26న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఏజీఎస్ సినిమాస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
     

     

  • రెస్టరంట్‌ స్టైల్‌ వంటకాలను టెలివిజన్‌ ద్వారా దేశ మహిళకు పరిచయం చేసిన ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌. 1990ల ప్రారంభంలో తన ఐకానిక్ షో 'ఖానా ఖజానా'తో ఆయన ఫేమస్‌ అయ్యారు. 'మాస్టర్‌ చెఫ్ ఇండియా' రియాల్టీ షోతో ఆయన ప్రజాదరణ మరింత పెరిగింది. ఈ ఫ్రాంచైజీ విజయాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే తొలుత ఈ రియాల్టీ షోని ఆయన రిజెక్ట్‌ చేశాడట. అలా ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

    మాస్టర్‌ చెఫ్‌ ఇండియా మొదటి సీజన్‌కు అక్షయ్‌ కుమార్ జడ్జ్‌గా వ్యవహరించారు. రెండో సీజన్‌ కోసం నిర్వాహకులు నన్ను సంప్రదించారు. నేను చేస్తానని చెప్పా. కానీ అక్షయ్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ పారితోషికం ఇస్తేనే చేస్తానని కండీషన్‌ పెట్టాను. దానికి వాళ్లు అంగీకరించలేదు. వాళ్లు చెప్పిన రెమ్యునరేషన్‌కే షో చేయమన్నారు. నేను కుదరని చెప్పా. అది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా అనిపించింది. అందుకే రెండో సీజన్‌ని రిజెక్ట్‌ చేశారు. ఇక మూడో సీజన్‌ సమయంలోనూ వారు నన్ను సంప్రదించారు. షో సరిగా నడవడం లేదని.. నన్ను జడ్జ్‌గా చేయమని అడిగారు. అప్పుడు కూడా నేను అదే కండీషన్‌ పెట్టా. అక్షయ్‌ కుమార్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చి..నన్ను ఆ షోకి తీసుకున్నారు’ అని సంజీవ్‌ అన్నారు. 

  • టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు హాజరైన ఆమె తన కుటుంబం గురించి మాట్లాడింది. మా నాన్న మోహన్‌ బాబుకు సేవాగుణం మొదటి నుంచే ఉందన్నారు. ఆయన తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేశారని తెలిపారు. నాన్నలాగే నాకు సేవాగుణం ఎక్కువేనని అన్నారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ పర్సులో నుంచి డబ్బులు దొంగతనంగా తీసుకుని చాలా మందికి ఇచ్చేదాన్ని అంటూ ఫన్నీగా మాట్లాడారు. 

    మంచు లక్ష్మీ మాట్లాడుతూ..'నా లైఫ్‌లో ఆదర్శం నాన్నే. నా చిన్నప్పుడు మా ఇంటికి చాలామంది వచ్చేవాళ్లు. దాదాపు రెండు నెలలపాటు ఉండేవాళ్లు. తిరిగి వెళ్లేటప్పుడు నాన్నను ఏదో ఒకటి కావాలని అడిగేవారు. ముక్కు, మొహం తెలియని వాళ్లకు కూడా సాయం చేశారు. ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా ఎంతో చేశారు. విద్యానికేతన్ ద్వారా ఎంతోమందికి విద్యనందిస్తున్నారు. అలా మమ్మీ పర్సులో డబ్బులు తీసి ఎంతోమందికి ఇచ్చేదాన్ని. స్లమ్స్‌లోకి వెళ్లనప్పుడు వారి జీవన విధానం చూసి బాధపడేదాన్ని. నా వంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటా' అని చెప్పుకొచ్చింది. 

    కాగా.. అంతకు ముందు ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. రాను బొంబైకి రాను.. అంటూ సాగే ఫేమస్ ఫోక్‌ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్‌ మంచు లక్ష్మీ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. 
     

  • తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌..తనదైన స్టైల్లో ప్రసంగిస్తూ ప్రతిపక్ష డీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ప్రభుత్వంలో వాటికి అడ్డుకట్ట వేస్తుందని విజయ్ ప్రకటించారు. నీట్‌, హిందీ భాష వివాదంతో పాటు కరూర్‌ తొక్కిసలాట ఘటన గురించి కూడా విజయ్‌ ఆవేశంగా మాట్లాడాడు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే..ఆయన అసెంబ్లీలో చేసిన సైగలు మరో ఎత్తు. ఆ సైగలు చూసి డీఎంకే నేతలు రగిలిపోతుండగా.. నెటిజన్స్‌ మాత్రం తమదైన స్టైల్లో కామెంట్స్‌  చేస్తూ..నవ్వులు పూయిస్తున్నారు.

    స్పీకర్‌ అనుమతితో..
    అసెంబ్లీలో ఎంతో ఆవేశంగా మాట్లాడిన విజయ్‌.. తన ప్రసంగం ముగించే ముందు స్పీకర్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు. తాను సినిమా స్టైల్ లో ఓ సంజ్ఞ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన అనుమతి ఇవ్వగానే అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి అంతా అయిపోయిందన్న తరహాలో ఓ సైగ చేశారు. దీంతో టీవీకేతో పాటు కూటమి ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. డీఎంకే సభ్యులు మాత్రం రగిలిపోతూ వాకౌట్ చేశారు.

    స్టాలిన్‌కి కౌంటర్‌గా..
    గతంలో స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్.. మ్యాటర్ సెటిలైందనే అర్థం వచ్చేలా చేతితో ఇలానే సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. స్టాలిన్‌కి కౌంటర్‌గానే విజయ్‌ ఇలా సైగలు చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.

    విజయ్ Vs ఉదయ్ తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ

    నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌.. 
    విజయ్‌ చేసిన సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కొంతమంది నెటిజన్స్‌ విజయ్‌పై ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘విజయ్‌ అన్న సినిమాల షూటింగ్‌ని మిస్‌ అవుతున్నాడేమో’ అని ఒక నెటిజన్ కామెంట్‌ చేయగా.. మరో నెటిజన్‌ ఏమో.. ‘త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఓటీటీ రైట్స్‌ పెడతారోమో అని వ్యాఖ్యానించాడు. మరొకరు.. ‘స్పీకర్‌ కట్‌ అన్న ప్రతిసారి.. సీఎం విజయ్‌ సినిమా కట్‌ అనుకుంటున్నాడేమో’ అని కామెంట్‌ చేశాడు. చాలా మంది విజయ్‌ హాస్య చతుర బాగుందని పోస్టులు పెడుతున్నారు.

Sports

  • తెలంగాణ టీ20 లీగ్‌-2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 23) రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస​్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రైజర్స్‌.. ఫాల్కన్స్‌ను 164 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. 

    అనంతరం రైజర్స్‌ బ్యాటర్లు మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు (5 వికెట్ల నష్టానికి). కెప్టెన​ తనయ్‌ త్యాగరాజన్‌ బంతితో (4-0-36-3), బ్యాట్‌తో (11 బంతుల్లో 21) సత్తా చాటి రైజర్స్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

    రాణించిన బౌలర్లు
    తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్‌ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్‌ నాయక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్‌ అగర్వాల్‌ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

    శుభారంభం అందించిన ఓపెనర్లు
    165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్‌ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోన్‌ జార్జ్‌ (27), అరవెల్లి అవనీశ్‌ (25) మెరుపు ఇన్నింగ్స్‌లతో గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ఆదిత్య (12), అలంక్రిత్‌ (9) నిరాశపరిచినా.. రాకేశ్‌ (38 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు. అతనికి తనయ్‌ త్యాగరాజన్‌, నితిన్‌ యాదవ్‌ (28 నాటౌట్‌) సహకరించారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో వరుణ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. రవితేజ, అబ్బాస్‌, అశ్విన్‌ రామ్‌ తలో వికెట్‌ దక్కి​ంచుకున్నారు.

     

  • లండన్‌ వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌ మ్యాచ్‌లో భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్‌ టీమ్‌పై 4-3 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. భారత్ తరఫున అభిషేక్‌, రాజిందర్‌, నీలకంఠ, సుఖ్‌జీత్‌ గోల్స్‌ చేశారు.

    మంచి ఫామ్‌ను కొనసాగించిన భారత్
    ఈ మ్యాచ్‌కు ముందు భారత్ నెదర్లాండ్స్‌పై 3-2తో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. యూరప్‌ లెగ్‌లో తొలి ఓటమి తర్వాత జట్టు గణనీయంగా పుంజుకుని జర్మనీ, నెదర్లాండ్స్‌లాంటి బలమైన జట్లపై విజయాలు నమోదు చేసింది.

    క్రెయిగ్‌ ఫుల్టన్‌ శిక్షణలో భారత జట్టు రక్షణ, దాడి విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా చివరి కొన్ని మ్యాచ్‌ల్లో భారత ఆటగాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలు రాబడుతున్నారు.

    పాక్‌కు మరో నిరాశ
    ఇప్పటికే టోర్నీలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆ జట్టు.. పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. పాక్‌ రెలిగేషన్‌ ప్రమాదం నుంచి బయటపడాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక విజయాలు సాధించాలి.

    మిగిలిన మ్యాచ్‌లు
    ఈ టోర్నీలో భారత్‌ మరోసారి పాక్‌తో తలపడాల్సి ఉంది. అలాగే ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ మెరుగైన ఫలితాలు సాధించి సీజన్‌ను సానుకూలంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై ఓ యువతి పెళ్లి పేరుతో మోసం​ చేశాడని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అభిషేక్‌ స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా, మగ్రా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం.

    మీడియా కథనాల ప్రకారం.. అభిషేక్‌ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆతర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.

    అయితే, ఈ ఆరోపణలను అభిషేక్‌ పూర్తిగా ఖండించాడు. ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు అసత్యమని, తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు.

    కాగా, ప్రస్తుతం కేసు కేవలం ఫిర్యాదు దశలోనే ఉంది. పోలీసులు విచారణ చేపట్టి, ఇరు పక్షాల వాంగ్మూలాలు నమోదు చేసిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించిన పోరెల్‌, బెంగాల్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అలాగే ఇండియా-ఏ, వయోపరిమితి జట్లకూ ప్రాతినిధ్యం వహించాడు.

    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతూ మంచి గుర్తింపు పొందాడు. దూకుడైన బ్యాటింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. పొట్టి క్రికెట్‌లో 1500కుపైగా పరుగులు చేసి, 150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడి 4 అర్ద శతకాల సాయంతో 769 పరుగులు చేశాడు.

     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రవేశపెట్టిన తర్వాత భారత్‌లో టీ20 ఫార్మాట్‌కు ఆదరణ మరింతగా పెరిగింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు స్థానికంగా టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ దేశీ ఆటగాళ్లకు చక్కటి వేదిక కల్పిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, బెంగాల్‌ టీ20 లీగ్‌లు నిర్వహిస్తుండగా.. ఇటీవలే తెలంగాణ కూడా ఈ జాబితాలోకి చేరింది.

    మరో టీ20 లీగ్‌ సంబరం
    టీజీ20 పేరిట హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. జూన్‌ 21న మొదలైన ఈ లీగ్‌ జూలై 12న ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL) షెడ్యూల్‌ విడుదలైంది.

    డీపీఎల్‌ మూడో ఎడిషన్‌ను జూలై 31 నుంచి ఆగష్టు 30 మధ్య నిర్వహించనున్నట్లు ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది. ఈసారి కూడా టీమిండియా స్టార్లు ఈ లీగ్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

    టీమిండియా స్టార్లు సిద్ధం
    భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌తో పాటు.. హర్షిత్‌ రాణా డీపీఎల్‌లో భాగం కానున్నాడు. వీరితో పాటు టీమిండియా వెటరన్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, నవదీప్‌ సైనీ కూడా లీగ్‌ ఆడనున్నారు.

    ఇక ఐపీఎల్‌ స్టార్లు నితీశ్‌ రాణా, ఆయుశ్‌ బదోని, ప్రియాన్ష్‌ ఆర్య, సూయశ్‌ శర్మ, దిగ్వేశ్‌ రాఠీ, ప్రిన్స్‌ యాదవ్‌, యశ్‌ ధుల్‌, అనూజ్‌ రావత్‌, సిమర్జీత్‌ సింగ్‌, హిమ్మత్‌ సింగ్‌, హృతిక్‌ షోకీన్‌, సార్థక్‌ రంజన్‌ తదితరులు డీపీఎల్‌ బరిలో దిగనున్నారు. అనుభవజ్ఞులైన, యువ ప్లేయర్లతో సమతూకం చేసుకుంటూ ఫ్రాంఛైజీలు తమ జట్లను తయారుచేసుకున్నాయి.

    మహిళల లీగ్‌ కూడా..
    ఇక మహిళల డీపీఎల్‌ను ఈసారీ ఆటంకాలు లేకుండా  కొనసాగించనున్నారు. శ్వేతా సెహ్రావత్‌, ప్రియా పునియా, సోని యాదవ్‌, ఆయుశి సోని తదితరులు ఇందులో భాగం కానున్నారు. వీరితో పాటు రైజింగ్‌ స్టార్లు తనీషా సింగ్‌, నజ్మా, మోనికా, పూర్వా సివాచ్‌ కూడా లీగ్లో ఆడనున్నారు.

    కాగా పురుషుల డీపీఎల్‌లో గతేడాది.. నితీశ్‌ రాణా సారథ్యంలో వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో శ్వేతా సెహ్రావత్‌ కెప్టెన్సీలో సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ చాంపియన్‌గా అవతరించింది.

    డీపీఎల్‌-2026లో పాల్గొనే పురుష జట్లు
    సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌, ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌, న్యూ ఢిల్లీ టైగర్స్‌, నార్త్‌ ఢిల్లీ స్ట్రైకర్స్‌, ఔటర్‌ ఢిల్లీ వారియర్స్‌, పురానీ ఢిల్లీ 6, సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌, వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌.

    మహిళల జట్లు
    సెంట్రల్‌ కింగ్స్‌ వుమెన్‌, ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌ వుమెన్‌, సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ వుమెన్‌, నార్త్‌ ఢిల్లీ స్ట్రైకర్స్‌ వుమెన్‌. 

    చదవండి: ఎమ్మెల్సీగా తిలక్‌ వర్మ ఫ్రెండ్‌!

  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక మొత్తాన్ని (₹27 కోట్లు) వెచ్చించి రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీకి చేదు అనుభవం ఎదురైంది. రెండు సీజన్లలో (2025, 2026) పంత్‌ ఘోరంగా విఫలం కావడంతో ట్రేడ్‌ పేరుతో లక్నో అతన్ని వదిలించుకుంది. 

    తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ట్రేడ్‌లో పంత్‌ను వదిలేసిన లక్నో, కుల్దీప్‌ యాదవ్‌ను అక్కడి నుంచి తెచ్చుకుంది. దీంతో రెండేళ్ల పంత్‌ ఎల్‌ఎస్‌జీ ప్రయాణం ముగిసింది.

    రూ.54 కోట్ల ఒప్పందం.. మొత్తం ఆదాయం రూ.55.88 కోట్లు
    ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో పంత్‌ను ఎల్‌ఎస్‌జీ రికార్డు స్థాయిలో ₹27 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 సీజన్‌లో కూడా అదే మొత్తాన్ని చెల్లించింది. రెండు సీజన్ల జీతం కలిపి ₹54 కోట్లు కాగా, మ్యాచ్‌ ఫీజులతో కలిపి అతని మొత్తం ఆదాయం సుమారు ₹55.88 కోట్లకు చేరింది.

    రెండేళ్లలో చేసిన పరుగులు ఎన్ని..?
    IPL 2025: 269 పరుగులు
    IPL 2026: 312 పరుగులు
    మొత్తం మ్యాచ్‌లు: 28
    మొత్తం పరుగులు: 581
    సగటు: 26.41
    స్ట్రైక్‌రేట్‌: 135.74
    2 హాఫ్‌ సెంచరీలు, 1 సెంచరీ

    ఒక్కో పరుగుకు రూ.9.62 లక్షలు
    పంత్‌ ఎల్‌ఎస్‌జీ నుంచి అందుకున్న మొత్తం పారితోషికం ₹55.88 కోట్లు. అతను చేసిన మొత్తం పరుగులు 581.
    ₹55.88 కోట్లు ÷ 581 పరుగులు = రూ.9.62 లక్షలు (సుమారు)

    ఈ లెక్కన పంత్‌ ఎల్‌ఎస్‌జీ తరఫున చేసిన ప్రతి పరుగుకు ఫ్రాంచైజీకి దాదాపు రూ.9.62 లక్షల చెల్లించింది.

    కెప్టెన్‌గానూ విఫలం
    పంత్‌ నాయకత్వంలో ఎల్‌ఎస్‌జీ 2025లో ఏడో స్థానంలో నిలవగా, 2026లో చివరి స్థానానికి పడిపోయింది.

    మళ్లీ ఢిల్లీ గూటికి
    ట్రేడ్‌ డీల్‌లో భాగంగా పంత్‌ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ తరఫున 111 మ్యాచ్‌లు ఆడిన అతడు, ఆ జట్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.

     

  • మెదక్‌ ఫాల్కన్స్‌పై రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు
    తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. రంగారెడ్డి రైజర్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

    గెలుపు దిశగా రంగారెడ్డి రైజర్స్‌
    165 పరుగుల లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్‌ గెలుపు దిశగా సాగుతోంది. 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన ఆ జట్టు.. మరో 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. 

    సత్తా చాటిన త్యాగరాజన్‌.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన ఫాల్కన్స్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ ఫాల్కన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్‌ పట్టి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డూ, కరియప్ప తలో 2 వికెట్లు తీయగా.. అరుణ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

    ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన విక్రమ్‌ నాయక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి కాకులమర్రి (38), నమన్‌ అగర్వాల్‌ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

    5 బంతుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్‌
    5 బంతుల వ్యవధిలో ఫాల్కన్స్‌ 2 వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌మూడో బంతికి త్యాగరాజన్‌  నమన్‌ అగర్వాల్‌ను (37) ఔట్‌ చేయగా. 16వ ఓవర్‌ తొలి బంతికే వరుణ్‌ను (1) అరుణ్‌ కుమార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

    కోలుకున్న ఫాల్కన్స్‌
    5 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఫాల్కన్స్‌ తిరిగి కోలుకుంది. 12 ఓవర్లలో ఆ జట్టు మూడే వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. విక్రమ్‌ నాయక్‌ (31), నమన్‌ అగర్వాల్‌ (21) ఫాల్కన్స్‌ను ఆదుకున్నారు. 

    3 వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న మెదక్‌ ఫాల్కన్స్‌ కష్టాలు ఎదుర్కొంటుంది. 55 ఓవర్లలో ఆ జట్టు 51 పరుగులు చేసినప్పటికీ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత తనయ్‌ త్యాగరాజన్‌ బౌలింగ్‌లో శృన్జిత్‌ రెడ్డి క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. ఆతర్వాత రవితేజ (6), పూర్ణచంద్‌ రావ్‌ (38) పెవిలియన్‌కు చేరారు. రవితేజను తనయ్‌ జడ్డూ ఔట్‌ చేయగా.. త్యాగరాజన్‌ పూర్ణచంద్‌ ఆట కట్టించాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ఫాల్కన్స్‌
    2.3వ ఓవర్‌- 26 పరుగుల వద్ద మెదక్‌ ఫాల్కన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తనయ్‌ త్యాగరాజన్‌ బౌలింగ్‌లో శృన్జిత్‌ రెడ్డి (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    తెలంగాణ టీ20 లీగ్‌-2026లో భాగంగా ప్రణవ్‌ రంగారెడ్డి రైజర్స్‌- మెదక్‌ ఫాల్కన్స్‌ మంగళవారం రాత్రి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మెదక్‌ ఫాల్కన్స్‌ బ్యాటింగ్‌కు దిగింది.

    తుది జట్లు..
    రంగారెడ్డి రైజర్స్‌: తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్ఘీస్‌, అవనీశ్‌ రావ్‌ (వికెట్‌కీపర్‌), అలంక్రిథ్‌ రాపోల్‌, జ్ఞానప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితీశ్‌ సాయి యాదవ్‌, నానావత్‌ రాకేశ్‌, అరుణ్‌ కుమార్‌, తనయ్‌ జడ్డూ, ఆర్యన్‌ కరియప్ప

    మెదక్‌ ఫాల్కన్స్‌: రవితేజ (కెప్టెన్‌), సాయి పూర్ణానంద్‌ రావ్‌, శృన్జిత్‌ రెడ్డి, విక్రమ్‌ నాయక్‌ (వికెట్‌కీపర్‌), సూర్య తేజ, సాయి వరుణ్‌, జంగం బన్ని, అశ్వినన్‌ రామ్‌, నమన్‌ అగర్వాల్‌, సయ్యద్‌ ఘజా అబ్బాస్‌, మధుకర్‌ మన్నే
     

  • ఊహాగానాలే నిజమయ్యాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను వదులుకుంది. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కి ట్రేడ్‌ చేసి బదులుగా.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో భాగంగా లక్నో పంత్‌ కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడ్డ సంగతి తెలిసిందే.

    రూ. 27 కోట్లకు సొంతం
    ఈ క్రమంలో ఎక్కడా తగ్గకుండా ధరను పెంచుకుంటూ పోయిన లక్నో.. ఏకంగా రూ. 27 కోట్లకు పంత్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఇక పంత్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించిన లక్నోకు రెండు సీజన్లలో తీవ్రమైన నిరాశే మిగిలింది.

    గతేడాది పంత్‌ కెప్టెన్సీలో పద్నాలుగు ఆరు మ్యాచ్‌లే గెలిచిన లక్నో.. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగతంగా పంత్‌ 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

    అట్టడుగున పదో స్థానంలో
    ఇక ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 312 పరుగులు చేసిన పంత్‌... జట్టును అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. అతడి సారథ్యంలో లక్నో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను రూ. 15 కోట్లకు లక్నో ట్రేడ్‌ చేసింది.

    పదిహేనేళ్ల పాటు ఆడతాడు
    ఈ నేపథ్యంలో లక్నో జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘పంత్‌ లక్నోకు దాదాపు పదిహేనేళ్ల పాటు ఆడతాడు. ఈ ప్రయాణంలో కనీసం నాలుగు నుంచి ఆరు ఐపీఎల్‌ టైటిళ్లు సాధిస్తాడు. ముంబై, చెన్నై జట్లను విజయవంతమైన జట్లుగా ప్రజలు చూస్తారు.

    మహీ (ధోని), రోహిత్‌ శర్మ  ఈ రెండు జట్లను ఉన్నత శిఖరాలకు చేర్చారు. పదేళ్ల తర్వాత మహీ, రోహిత్‌ తర్వాత రిషభ్‌ పేరునే అందరూ చెప్తారు. నా మాటలు రాసిపెట్టుకోండి’’ అంటూ సంజీవ్‌ గోయెంకా పంత్‌ను ఆకాశానికెత్తాడు. అయితే, రెండేళ్లకే అతడిని వేరే జట్టుకు బదిలీ చేయించాడు.

    విమర్శలు
    ఈ నేపథ్యంలో సంజీవ్‌ గోయెంకాపై మరోసారి ట్రోల్స్‌ వస్తున్నాయి. లక్నో మొట్టమొదటి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను మైదానంలోనే సంజీవ్‌ తిట్టినట్లుగా ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత అతడు జట్టును వీడాడు. ఇక పంత్‌ విషయంలోనూ గోయెంకా ఇలాగే వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పంత్‌ కూడా జట్టును వీడటంతో గోయెంకాపై విమర్శలు ఎక్కువయ్యాయి.

    చదవండి: ఎమ్మెల్సీగా తిలక్‌ వర్మ ఫ్రెండ్‌

  • భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ (జూన్‌ 23) అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.

    ఈ ఏడాది జనవరిలోనే రోహిత్‌తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ గత నెలలో అవార్డు అందుకోగా, తాజాగా రోహిత్ ఈ గౌరవాన్ని స్వీకరించాడు.

    టీమిండియాకు అందించిన సేవలకు గుర్తింపు
    గత కొన్నేళ్లుగా భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు, అతని నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో పాటు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.

    దిగ్గజాల సరసన రోహిత్
    పద్మశ్రీ అందుకున్న భారత క్రికెట్ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు రోహిత్ కూడా చేరాడు. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోని వంటి దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

    ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధం
    హామ్‌స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. శుభ్‌మన్‌ గాల్‌ నాయకత్వంలోని భారత జట్టు జూలై 14 నుంచి 19 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆ సిరీస్‌కు ఎంపికైన జట్టులో రోహిత్ కూడా చోటు దక్కించుకున్నాడు.

     

     

  • టీమిండియా యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్‌ కాకడే మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ముంబైలోని విధాన్‌ భవన్‌లో ఇవాళ (జూన్‌ 23) జరిగిన కాకడే ప్రమాణస్వీకారానికి తిలక్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తిలక్‌ మాట్లాడుతూ.. నా స్నేహితుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని అన్నాడు.

    "మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే ప్రత్యేకంగా వచ్చి కలిశాను. ఆయన ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తుంటారు. ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం" అని తెలిపాడు.

    ఇదే సందర్భంగా క్రికెట్‌ గురించి మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ ఇంకా దూరంలోనే ఉందని, ప్రస్తుతం భారత జట్టు ఒక్కో సిరీస్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతోందని చెప్పాడు. ప్రతిరోజూ కష్టపడి మరింత మెరుగుపడటమే మా లక్ష్యం అని పేర్కొన్నాడు.

    మహాయుతి జోరు
    మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో అధికార కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది. బీజేపీ 11, శివసేన 3, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 2 రెండు స్థానాలు గెలుచుకున్నాయి. పూణే నుంచి పోటీ చేసిన విక్రమ్‌ కాకడే (NCP) ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

     

  • ఐపీఎల్‌లో ఆటగాళ్ల వేలం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, ట్రేడ్‌ డీల్స్‌ కూడా అంతే సంచలనంగా మారుతుంటాయి. జట్ల అవసరాలకు అనుగుణంగా స్టార్‌ ఆటగాళ్లను భారీ మొత్తాలకు ట్రేడ్‌ చేసుకోవడం గత కొన్నేళ్లుగా తరచూ కనిపిస్తోంది. తాజాగా రిషబ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి రావడం, కుల్దీప్‌ యాదవ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లడం మరో భారీ ట్రేడ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో జరిగిన టాప్‌-5 ఖరీదైన ట్రేడ్లపై ఓ లుక్కేద్దాం.  

    5. కుల్దీప్‌ యాదవ్‌ (DC → LSG) – ₹13.25 కోట్లు
    ఐపీఎల్‌ 2027కు ముందు జరిగిన ట్రేడ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి లక్నో సూపర్‌ జెయింట్స్‌లో చేరాడు. ఐదేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 72 వికెట్లు తీసిన అతడు, ₹13.25 కోట్ల ఒప్పందంతో కొత్త జట్టులోకి వెళ్లాడు.

    4. రవీంద్ర జడేజా (CSK → RR) – ₹14 కోట్లు
    రవీంద్ర జడేజా 2026 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ఇందుకు గానూ జడేజా ఫీజు ₹14 కోట్లుగా నిర్ణయించారు.

    3. హార్దిక్‌ పాండ్యా (GT → MI) – ₹15 కోట్లు
    హార్దిక్‌ పాండ్యా 2024 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్‌ అయ్యాడు. ఈ డీల్‌ విలువ ₹15 కోట్లు. దీనికి అదనంగా గుజరాత్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫర్‌ ఫీజు కూడా చెల్లించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

    3. రిషభ్‌ పంత్‌ (LSG → DC) – ₹15 కోట్లు
    లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి చేరిన పంత్‌ ట్రేడ్‌ విలువ ₹15 కోట్లు. గతంలో ₹27 కోట్ల రికార్డు ఒప్పందంతో LSGలో చేరిన పంత్‌, ఇప్పుడు తగ్గిన మొత్తంతో తన పాత జట్టులోకి వచ్చాడు.

    2. కామెరూన్‌ గ్రీన్‌ (MI → RCB) – ₹17.5 కోట్లు
    కెమరూన్‌ గ్రీన్‌ ముంబై ఇండియన్స్‌ నుంచి ఆర్సీబీకి ₹17.5 కోట్లకు ట్రేడ్‌ అయ్యాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడి ట్రేడ్‌ ఇదే.

    1. సంజూ శాంసన్‌ (RR → CSK) – ₹18 కోట్లు
    సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ₹18 కోట్ల భారీ డీల్‌తో ట్రేడ్‌ అయ్యాడు. ఈ ఒప్పందంలో జడేజా, సామ్‌ కర్రన్‌ రాజస్థాన్‌కు వెళ్లారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన ట్రేడ్‌గా నిలిచింది.
     

  • తెలంగాణ టీ20 లీగ్‌-2026లో హైదరాబాద్‌ ఇ- ఛాంపియన్స్‌ జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా ఇవాళ (జూన్‌ 23) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పాలమూరు స్ట్రయికర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన హైదరాబాద్‌..  పాలమూరు జట్టును 19.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్‌ చేసింది. అనుముల విఘ్నేశ్‌ రెడ్డి (30), రోహిత్‌ రాయుడు (35), ప్రతీక్‌ పవార్‌ (30) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో అజయ్‌ దేవ్‌ గౌడ్‌ నాలుగు వికెట్లు తీయగా.. యశ్‌వీర్‌ గౌడ్‌, ప్రణవ్‌ వర్మ చెరో రెండు, శ్రీనికేత్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

    అనంతరం 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి 35 పరుగులు చేసి శుభారంభం​ అందించగా.. అన్విత్‌ రెడ్డి (53 నాటౌట్‌), గడుగు గణేశ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. పాలమూరు బౌలర్లలో రిషబ్‌ బస్లాస్‌ 2, రవి కిరణ్‌ ఓ వికెట్‌ తీశారు. 
     

  • మహారాజా టీ20 ట్రోఫీ 2026లో కర్ణాటక వెటరన్‌ బ్యాటర్‌, గుల్బర్గ మిస్టిక్స్‌ సారధి మనీశ్‌ పాండే చెలరేగిపోయాడు. కోస్టల్‌ కింగ్స్‌ మంగళూరు జట్టుపై విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగుల చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతడి జట్టు 177 పరుగులు చేసింది.

    గుల్బర్గ ఇన్నింగ్స్‌లో మనీశ్‌ మినహా ఎవరూ రాణించలేదు. ప్రకార్‌ ఛతుర్వేది (25), తిప్పా రెడ్డి (25), ధృవ్‌ ప్రభాకర్‌ (22) 20కి పైగా స్కోర్లు చేశారు. మంగళూరు బౌలర్లలో శ్రేయాస్‌ గోపాల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్‌, కోదండ అజిత్‌ కార్తీక్‌ తలో 2, సంతోక్‌ సింగ్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగళూరు టీమ్‌.. ఓపెనర్‌ నికిన్‌ జోస్‌ (47 బంతుల్లో 100 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టుడు, కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ (56) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

    గుల్బర్గాకు ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో (5) నిలిచింది.

    ఐపీఎల్‌ 2026లో పాండే ప్రదర్శన
    ఐపీఎల్‌ 2026లో కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన పాండేకు సీజన్‌ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. చివరి దశలో జట్టులో స్థానం దక్కించుకున్న అతడు. ఆరు మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ముంబై ఇండియన్స​్‌పై అతడు ఆడిన 45 పరుగుల మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ సీజన్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 

    ఈ సీజన్‌లో పాండే ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ క్యాచ్‌ను నమ్మశక్యంకాని రీతిలో అందుకొని అందరి మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌ను సీజన్‌లోనే ఉత్తమ క్యాచ్‌గా ఎంపిక చేశారు.
     

  • టీమిండియా స్టార్‌ తిలక్‌ వర్మకు భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మద్దతుగా నిలిచాడు. శ్రీలంక- ‘ఎ’, అఫ్గానిస్తాన్‌- ‘ఎ’ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఈ హైదరాబాదీ స్టార్‌ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అయినప్పటికీ కొంతమంది తిలక్‌ వర్మను విమర్శించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.

    భారత్‌దే టైటిల్‌
    కాగా తిలక్‌ వర్మ సారథ్యంలో భారత్‌- ‘ఎ’ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో అఫ్గాన్‌, శ్రీలంకపై పైచేయి సాధించిన భారత జట్టు.. ఫైనల్లోనూ లంకను చిత్తు చేసి టైటిల్‌ గెలుచుకుంది.

    ఈ సిరీస్‌లో తిలక్‌ వర్మ నాలుగు అర్ధ శతకాల సాయంతో 275 పరుగులు సాధించాడు. తద్వారా భారత్‌- ‘ఎ’ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 74.93. ఇక శ్రీలంకతో ఫైనల్లో భారత ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ 324కు పైగా స్ట్రైక్‌రేటుతో (29 బంతుల్లో 94) విధ్వంసం సృష్టించగా.. నాలుగో స్థానంలో ఆడిన తిలక్‌ వర్మ కాస్త నెమ్మదిగానే ఆడాడు.

    వైభవ్‌ అలా.. తిలక్‌ ఇలా
    ఈ మ్యాచ్‌లో తిలక్‌ 74 స్ట్రైక్‌రేటుతో (90 బంతుల్లో) 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వైభవ్‌ను ప్రశంసిస్తూ.. తిలక్‌ ఆట తీరుపై కొద్దిమంది సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ విషయంపై అశ్విన్‌ తాజాగా స్పందించాడు. ‘‘కొంతమంది కామెంట్ల రూపంలో తిలక్‌ వర్మ స్ట్రైక్‌రేటును విమర్శించడం నా కంటపడింది.

    అవును నిజమే.. అయితే ఏంటి?
    నిజమే అతడు కాస్త నెమ్మదిగానే ఆడాడు. అయినా సరే ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు. వైభవ్‌ సూర్యవంశీ వేగంగా ఆడుతూ ఉంటే.. మరో ఎండ్‌లో తిలక్‌ వర్మ అతడిని కాంప్లిమెంట్‌ చేస్తూ.. అతడు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు’’ అని అశ్విన్‌.. తిలక్‌ వర్మకు మద్దతుగా నిలిచాడు.

    చదవండి: టీమిండియాలోకి డేంజరస్‌ ప్లేయర్‌!

  • ఐసీసీ మ‌హిళ‌ల టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో భార‌త యువ స్పిన్న‌ర్‌, తెలుగు తేజం శ్రీచ‌ర‌ణి తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఉమెన్స్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీచ‌రణి దుమ్ములేపుతోంది. కేవలం మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టింది. 

    ఈ అద్బుత ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగానే ఆమె ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర పీఠాన్ని అధిరోహించింది. ఈ క‌డ‌ప అమ్మాయి 753 పాయింట్ల‌తో ఇంగ్లండ్ స్టార్ స్పిన్న‌ర్ లిన్సీ స్మిత్‌(726)ను వెన‌క్కి నెట్టి టాప్ ర్యాంక్‌ను కైవ‌సం చేసేకుంది. భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసిన ఏడాది లోపే చ‌రణి ఈ అరుదైన ఘ‌న‌త‌ను అందుకోవ‌డం విశేషం.

    చ‌రణి భార‌త జ‌ట్టులో ప్ర‌స్తుతం కీల‌క స‌భ్యురాలిగా కొన‌సాగుతోంది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో హ‌ర్మ‌న్ సేన ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. చ‌రణి మాత్రం మూడు వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తా చాటింది. కాగా గ‌తేడాది భార‌త్ తొలి మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌డంలోనూ శ్రీచ‌ర‌ణి ముఖ్య‌ పాత్ర పోషించింది. ఓవరాల్‌గా 21 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన చరణి.. 65 వికెట్లు పడగొట్టింది.
    చదవండి: IND vs ENG: భారత జట్టులోకి డేంజరస్‌ ప్లేయర్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Telangana

  • హైదరాబాద్‌: గత నాలుగు సంవత్సరాలుగా 14 లక్షల మంది పేద విద్యార్థులకు చెల్లించాల్సిన ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని, గతంలో ఉన్న మాదిరిగానే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీములు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్.. ఉపముఖ్యమంత్రి బట్టి  విక్రమార్కను కోరారు.

    హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో జాజుల శ్రీనివాస్ గౌడ్ బేటి అయ్యారు ఈ సందర్భంగా బీసీ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకు జాజుల అందజేశారు.

    ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు వేధిస్తున్నాడంతో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు, కాంట్రాక్టర్లకు బిల్లులను ఆపి పేద విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు

     అలాగే 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఏ విధంగా అమలు చేశారో ఇప్పుడు కూడా జీవో నెంబర్ 8, 9 లను రద్దుచేసి పాత పద్ధతిలోని ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలు చేయాలని ఆయన కోరారు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పదివేల ర్యాంకు నిబంధనలు ఎత్తివేసి పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

    త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటాం: భట్టి
    ఫీజుల రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఫీజుల బకాయిల చెల్లింపు పై రెండు మూడు రోజుల్లోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జాజులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు 

     

  • సాక్షి,నిజామాబాద్‌: ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అవినీతిశాఖ  అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో చేపట్టిన సోదాల్లో నాలుగు ఇళ్లు,ఒక వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. 8 ఇళ్ల స్థలాలు,10.23 ఎకరాల భూమి,3.31లక్షల నగదు,ఖాతాలో 50 లక్షలు ఉన్నట్లు తేల్చారు.

    మొత్తం మూడు కోట్లకుపైగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో స్థిరాస్తుల విలువ అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. నిజామాబాద్,సికింద్రాబాద్ మచ్చ బొల్లారం ఇళ్లతోపాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో మొత్తం 11 బృందాలు,11 చోట్ల ఉదయం నుంచి తనిఖీలు చేశాయి. సోదాలు ముగిసినప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుందని అనిశా అధికారులు వెల్లడించారు.

  • హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎల్లుండి(గురువారం) నుంచి ఉచిత బీమా పథకం ప్రారంభించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్నిరవీంద్ర భారతిలో ప్రారంభించనున్నారు.

    సహజ, ప్రమాద మరణాలకు ఈ బీమా వర్తించనుంది. దీనికి సంబంధించి బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  సుమారు రూ. 1.20 కోట్ల వరకూ ఉచిత జీవిత బీమా పథకం వర్తింప చేయనున్నారు.

  • సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్వవస్థీకరిచడంతో పాటు కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ ఏర్పాటైంది. రాచకొండ పేరును మల్కాజ్‌గిరిగా మార్చిన డీజీపీ కార్యాలయం.. నాలుగు కమిషనరేట్లకు అధిపతుల్ని నియమించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ప్రక్రియ జరగ్గా ఇప్పటికీ అంతా గందరగోళంగానే ఉంది. ఈ కాలంలో మల్కాజ్‌గిరికి రెండో పోలీసు కమిషనర్‌ కూడా వచ్చేశారు. ఇటీవల హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ చేపట్టిన సబ్‌–ఇన్‌స్పెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  

    తాత్కాలికంగా ఎక్కడి వారు అక్కడే అంటూ... 
    పునర్వ్యవస్థీకరణలో భాగంగా మల్కాజ్‌గిరిగా మారిన రాచకొండ నుంచి ఐదు పోలీసుస్టేషన్లు హైదరాబాద్‌లో కలవగా..నగరం నుంచి తొమ్మిది ఠాణాలు అక్కడకు వెళ్లాయి. అప్పట్లో డీజీపీ కార్యాలయం ఎక్కడి సిబ్బంది అక్కడే పని చేసేలా తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ తొమ్మిది ఠాణాల్లోని ఇన్‌స్పెక్టర్ల నుంచి హోంగార్డుల వరకు మల్కాజ్‌గిరిలోనే పని చేస్తున్నారు. ఈ రెండే కాదు.. అన్ని నాలుగు కమిషనరేట్లలోనూ జరిగిన మార్పుచేర్పులతో ఎక్కడి సిబ్బంది అక్కడే తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ సిబ్బందితో పాటు సరిహద్దులను పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిర్దేశించడానికి ఉద్దేశించిన కమిటీ అధ్యయనం పూర్తి కాకపోవడంతో తుది ఉత్తర్వులు వెలువడలేదు.

    ఈ రెండింటి మధ్యే అసలు ఇబ్బంది... 
    రాజధానిలోని మిగిలిన కమిషనరేట్ల విషయం అంటుంచితే... హైదరాబాద్‌–మల్కాజ్‌గిరి మధ్యే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ల మధ్య పోలీసుస్టేషన్ల మార్పిడి జరిగినప్పటికీ సిబ్బంది పంపకం విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. హైదరాబాద్‌ కమిషనరేట్ చార్మినార్‌ జోన్‌లోకి, మల్కాజ్‌గిరి యాదాద్రి జోన్‌లోకి వస్తాయి. దీంతో ఒక కమిషనరేట్‌ సిబ్బంది మరో కమిషనరేట్‌లోకి మారాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాల్సిందే. ఇవి జారీ అవ్వాలంటే నాలుగు కమిషనరేట్ల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం పూర్తయి..కీలక సిఫార్సులు ప్రభుత్వానికి చేరాలి.

    వీళ్లు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో.. 
    ఈ పరిణామంతో ఆ తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న దాదాపు 600 మంది సందిగ్ధంలో  పడ్డారు. తమకు పరిపాలన పరమైన ఇబ్బందులు ఉన్నా... బదిలీ అవసరమైనా... ఇతర సమస్యలు వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది అంతుచిక్కట్లేదని వాపోతున్నారు. తాము సాంకేతికంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన వారమని... తాత్కాలిక ప్రాతిపదికన మల్కాజ్‌గిరిలో పని చేస్తుండటంతో ఈ ఇబ్బంది వస్తోందని చెప్తున్నారు. కమిటీ వీలున్నంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించి తమ సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

    చ‌ద‌వండి: హెచ్‌ఎండీఏ భూముల వేలం.. కనీస ధర గజానికి  రూ.50 వేలు

    బదిలీల సమస్య ఏమిటంటే..? 
    హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని వివిధ పోలీసుస్టేషన్లలో సుదీర్ఘకాలంలో పని చేస్తున్న ఎస్‌ఐల జాబితాను ఇటీవల ఉన్నతాధికారులు రూపొందించారు. శాశ్వత కేటాయింపులు జరగకపోవడంతో మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో కలిసిన తొమ్మిది ఠాణాల్లో పని చేస్తున్న సిబ్బంది వివరాలూ ఈ జాబితాలోకి వచ్చాయి. దీంతో ఆయా పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న దాదాపు 20 మంది ఎస్‌ఐలను వేరే ఠాణాలు, విభాగాలకు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ కమిషనర్‌ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఠాణాలు సాంకేతికంగా మల్కాజ్‌గిరి కమిషనర్ ఆధీనంలో ఉండటంతో ఈ తొమ్మిది ఠాణాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్స్‌ ఆగాయి. 

Business

  • బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 గంటలు గడవక ముందే.. గోల్డ్ రేటు భారీ పతనం చవి చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు సంభవించింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు ఉదయం రూ.1900 (22 క్యారెట్స్ తులం), రూ.2070 (24 క్యారెట్స్ తులం) తగ్గి వరుసగా రూ. 133750, రూ.145910 వద్ద నిలిచిన 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రాని మరోమారు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు రూ.132500, రూ.144600 వద్దకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే బంగారం ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టమవుతోంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3100 రూపాయలు తగ్గి రూ.132700 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3380 రూపాయలు తగ్గి రూ.144750 వద్దకు చేరాయి.

    చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో సాయంత్రానికి ఏ మాత్రం మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడ తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 147930 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.135600 వద్ద ఉంది.

    ఇదీ చదవండి: డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా?

  • 1990 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ కుమార్ జైన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

    సంజయ్ కుమార్ జైన్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది, కానీ ఆయన 2026 జూలై 20 వరకు తన పదవిలో కొనసాగుతారు. 2024 ఫిబ్రవరి 14న ఐఆర్‌సీటీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన జైన్ నాయకత్వంలో.. సంస్థ టికెట్ బుకింగ్, పర్యాటక సేవలు, క్యాటరింగ్‌తో సహా వివిధ రంగాలలోకి విస్తరించింది.

    విలక్షణమైన మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా విలాసవంతమైన రైలు 'మహారాజాస్ ఎక్స్‌ప్రెస్'కు ఒక కొత్త కోణాన్ని ఇవ్వడంలో జైన్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విమానాశ్రయ లాంజ్‌ల తరహాలో భారతదేశపు మొట్టమొదటి 'ఎగ్జిక్యూటివ్ లాంజ్'ను ప్రారంభించడంలో కూడా ప్రమేయం కీలకం. ఈయన  నాయకత్వంలో ఐఆర్‌సీటీసీ పర్యాటక వ్యాపారం భారీగా వృద్ధి చెందింది.

    జైన్ చేసిన సేవలకు గాను, రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను రెండుసార్లు సత్కరించింది. భారతీయ రైల్వేలో అత్యున్నత పురస్కారమైన 'రైల్వే మంత్రి పురస్కారం' ఆయన విశిష్ట సేవలకు గాను ప్రదానం చేశారు.

     

  • ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా అవతరించిన కొద్ది రోజులకే, ఎలాన్ మస్క్ 'స్పేస్‌ఎక్స్' అనూహ్యమైన ఎదురుదెబ్బను చవిచూసింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ సంస్థ, మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది.

    నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయినప్పుడు స్పేస్‌ఎక్స్ షేర్లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన పొందాయి. ఐపీఓ ధర 135 డాలర్లు ఉండగా, కొద్ది రోజుల్లోనే దాదాపు 67 శాతం పెరిగి 225 డాలర్ల స్థాయికి చేరాయి. ఆ సమయంలో కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానాలకు చేరుకుంది. అయితే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రారంభ ఉత్సాహం తగ్గిపోవడంతో, పెట్టుబడిదారులు కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.

    స్పేస్‌ఎక్స్ కమర్షియల్ స్పేస్ లాంచ్‌లు, స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, ఏఐ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. అయినప్పటికీ.. కంపెనీ విలువ చాలా ఎక్కువగా ఉండటం, ఏఐ ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయడం, అప్పులు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.

    ఇటీవల కంపెనీ కొత్త షేర్లు విడుదల చేయకుండా.. స్వల్పకాలిక అప్పులను తీర్చేందుకు బాండ్‌ల ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించడం కూడా మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలకు కారణం అయింది.

    స్పేస్‌ఎక్స్‌లో సుమారు 38 శాతం వాటా కలిగిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఈ పతనం వల్ల భారీగా తగ్గింది. కంపెనీ షేర్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పోలిస్తే, మస్క్ సంపద దాదాపు 350 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. ప్రస్తుతం ఆయన నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ప్రస్తుతం షేర్ ధరల్లో భారీ తగ్గుల కనిపిస్తున్నప్పటికీ, స్పేస్‌ఎక్స్ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా.. కంపెనీ త్వరలో నాస్‌డాక్‌-100 సూచీలో చేరే అవకాశం ఉండటంతో, ఇండెక్స్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారుల నుంచి అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశముంది.

  • టెలికం కంపెనీలు ఆదాయం పరంగా మార్చి క్వార్టర్‌లో మరో రికార్డు నమోదు చేశాయి. మార్చి త్రైమాసికంలో రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఇవి ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో (రూ.98,250 కోట్లు) పోల్చితే 6.9 శాతం అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు ట్రాయ్‌ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది.

    సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) మార్చి క్వార్టర్‌లో 9.45 శాతం పెరిగి రూ.86,716 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.79,226 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన లైసెన్స్, స్పెక్ట్రమ్‌ ఫీజులు కూడా కలిపినదే ఏజీఆర్‌. మొత్తం ఏజీఆర్‌లో 83.59 శాతం వాటా టాప్‌-3 సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాల నుంచే సమకూరింది.

    ఇందులో రూ.32,468 కోట్లతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో ఉంది. రూ.28,773 కోట్లతో భారతీ ఎయిర్‌టెల్, రూ.8,195 కోట్లతో వొడాఫోన్‌ ఐడియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏజీఆర్‌ మాత్రం 6.19 శాతం తగ్గి రూ.2,101 కోట్లుగా ఉంది. ఎంటీఎన్‌ఎల్‌ ఏజీఆర్‌ రూ.333 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వానికి లైనెన్స్‌ ఫీజుల ఆదాయం 9.41 శాతం పెరిగి రూ.6,936 కోట్లు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీ 1.68 శాతం పెరిగి రూ.1,017 కోట్లు సమకూరింది.

  • ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.

    మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్‌ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్‌లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.

    ప్రైవేట్ చాట్స్ లీక్
    ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్‌క్రిప్షన్‌లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్‌ను ఆపేసింది. అయితే.. ఈ లీక్‌పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.

    ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.

    ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం
    నిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్‌ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

    ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో డిఫ్లేషన్ (Deflation) దిశగా వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వ్యూహకర్త అమిత్ గోయెల్ చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది నిపుణులు ద్రవ్యోల్బణం (Inflation) కొనసాగుతుందని భావిస్తున్నా.. అమిత్ మాత్రం పరిస్థితి వేరుగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

    డిఫ్లేషన్ అంటే ఏమిటి?
    సాధారణంగా వస్తువులు, సేవల ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం (Inflation) అంటారు. అయితే.. దీనికి విరుద్ధంగా, వస్తువుల ధరలు నిరంతరం తగ్గుతూ ఉండే పరిస్థితిని డిఫ్లేషన్ అంటారు. ఇది వినియోగదారులకు మొదట లాభంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

    ఎలా అంటే.. ధరలు తగ్గితే, ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు, కంపెనీల ఆదాయాలు పడిపోతాయి. సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గితే.. ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతుంది. దీంతో ఆర్థిక వృద్ధి కూడా మందగిస్తుంది.

    డిఫ్లేషన్‌కు కారణాలు ఏమిటి?
    అమిత్ గోయల్ అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అప్పుల భారం, కృత్రిమ మేధస్సు వల్ల ఉత్పాదకత పెరగడం డిఫ్లేషన్‌కు దారితీయవచ్చు.

    ఏఐ వినియోగం పెరగడం వల్ల.. సంస్థల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తులు, సేవలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తాయి. దీని ప్రభావంగా ధరలు తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చు. మరోవైపు.. ప్రభుత్వాలు, సంస్థలపై పెరుగుతున్న అప్పుల భారం ఆర్థిక వృద్ధిని తగ్గించే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.

    బంగారం, వెండిపై ప్రభావం
    సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల వాటి ధరలు పెరుగుతాయి.

    కానీ.. డిఫ్లేషన్ పరిస్థితుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నగదు విలువ పెరగడం, పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడటం వంటి కారణాల వల్ల బంగారం, వెండి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని గోయల్ అభిప్రాయపడ్డారు.

Crime

  • సాక్షి,బెంగళూరు: సహజీవనం తప్పమ్మా?. అన్ని లక్షలు అప్పు ఎందుకైంది? అని ప్రశ్నించినందుకు పెద్ద కుమార్తె ఇంటికి శాపంగా మారింది. కనీపెంచిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సొంత చెల్లెల్ని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పెద్ద కుమార్తె ఘాతుకానికి పాల్పడుతుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు అటు తల్లిదండ్రులు, ఇటు చెల్లెల్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే వెంటపడి మరి ప్రాణాలు తీసింది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన సిలీకాన్‌ వ్యాలీ సిటీగా పేరొందిన బెంగళూరులో చోటు చేసుకుంది.

    సోమవారం జరిగిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ, కుటుంబ విభేదాలు, అప్పుల భారం, ఆవేశం.. ఇవన్నీ కలిసి చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు పోలీసులు.

    కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి ప్రాంతంలోని సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సోమసుందర్ (55), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), చిన్న కుమార్తె సుప్రియ (20) సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలోని పెద్ద కుమార్తె శ్వేత,ఆమె ప్రియుడు కెన్నెత్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారు.

    ప్రేమకు కుటుంబం అడ్డుగా మారిందా?
    శ్వేత కొంతకాలంగా కెన్నెత్‌తో సహజీవనం చేస్తోంది. తీరు మార్చుకోవాలని పెద్ద కుమార్తెను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఇదే కుటుంబంలో తరచూ గొడవలకు కారణమైంది. ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు.. శ్వేత దాదాపు రూ.30 లక్షల వరకు అప్పులు చేసింది. ఈ అప్పుల గురించి తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించడంతో కుటుంబంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ముత్తులక్ష్మి ఒక్కరే ఉన్న సమయంలో శ్వేత, కెన్నెత్ అక్కడికి వెళ్లారు. ముగ్గురి మధ్య మాట మాట పెరిగింది. ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు.  హత్య అనంతరం కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేశారు.   కొంతసేపటి తర్వాత ఇంటికి వచ్చిన చెల్లెలు సుప్రియపై కూడా దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్వేత ఆమెను అడ్డుకోగా, కెన్నెత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడని అనుమానిస్తున్నారు.

    అనంతరం ఇంటికి చేరుకున్న సోమసుందర్‌పై కూడా అదే ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ఇంటి బయటకు పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నించినట్లు సమాచారం. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా ఆయన కూడా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో భార్య, ఇద్దరు కుమార్తెలు, తండ్రి మధ్య చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

    ఒకప్పుడు ప్రేమగా పెంచిన కూతురిపైనే ఇప్పుడు హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రేమకు వ్యతిరేకత, అప్పుల ఒత్తిడి, కుటుంబ కలహాలు... ఏది అసలు కారణమో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పరారీలో ఉన్న శ్వేత, కెన్నెత్‌ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించినప్పటికీ, మరిన్ని వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక అసలు నిజం ఏమిటి? ప్రేమా... అప్పులా... లేక ఇంకేదైనా కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు పూర్తయ్యాకే తెలిసే అవకాశం ఉంది.

National

  • ఎన్నెన్నో ఆధ్యాత్మిక వింతలకు భారతదేశం ఆలవాలం. పూరీజగన్నాథుడి ఆలయంపై ఉండే ధ్వజం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని జ్వాలాజీ ఆలయంలో చమురు లేకుండానే దీపం వెలుగుతుంది. ఇలా సైన్స్‌కు కూడా అంతు చిక్కని విశేషాలెన్నెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే.. రాధాకృష్ణులు, గోపికలు రోజూ విహరించే ప్రదేశం ఒకటుంది. ఆ ప్రాంతంలో అన్నీ వింతలే.. చెట్ల కొమ్మలు ఆకాశంవైపు కాకుండా.. భూమివైపుగా పెరుగుతాయి. సైన్స్ కూడా హైపోథెసిస్ వరకే పరిమితమై.. అజెంప్షన్లతో ప్రకటనలు చేసిందే గానీ.. నిగూఢ రహస్యాలను ఛేదించలేకపోయింది. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..
     

     

Politics

  • తాడేపల్లి : SIR( స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే  పనిచేస్తోందని, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల‌ ఓట్లు పోకుండా కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

    ఈరోజు(మంగళవారం) వైఎస్సార్‌సీపీ నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. SIR, సోషల్ మీడియా బలోపేతం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘SIR పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. గత రెండు నెలలుగా పార్టీ యంత్రాంగమంతా దీనిపైనే  పనిచేస్తోంది. రానున్న రెండు నెలలూ అత్యంత కీలకం. అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారు. 

    అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇందులో బూత్ లెవల్ ఏజెంట్లదే కీలక పాత్ర. ఎన్యూమరేషన్ ఫారాలు ప్రతి అర్హుడికి అందించి, వాటిని సేకరించి సరైన మ్యాపింగ్ చేయాలి. బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలి. బీఎల్‌వో ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే, పరిష్కారం కోసం  పైస్థాయికి‌ సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో పార్టీ వాణి మరింత బలంగా వినిపించాలి. పార్టీ నెట్‌వర్క్‌ను విస్తృతంగా పెంచుకోవడంతో పాటు, ప్రజలకు వాస్తవాలను చేరవేయాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. పార్టీ సభ్యత్వ నమోదు, ఐడీ కార్డుల వెరిఫికేషన్‌లో జాప్యం లేకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Family

  • చిన్నప్పుడే కష్టాలు, ఆర్థిక కష్టాలు కొందర్ని దృఢంగా ఎదిగేలా చేస్తాయి. పైగా ఆ సవాళ్లను తమ అభ్యున్నతికి బాటలుగా మలుచుకుని అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. హాయిగా చదువు సాగించిన వారికంటే..టాప్‌ పొజిషన్‌లో సెటిల్‌ అయ్యి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా కథ. అతడి స్టోరీ సినిమాని తలపించే కథలా ఉంటుంది. 

    కునాల్‌ షా అరుదైన స్టార్టప్‌ వ్యవస్థాపకులలో ఒకరు.  ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ కెరీర్‌ని ప్రారంభించారు. తండ్రి వ్యాపారం కుప్పకూలడంతో ఒక్కసారిగా కుటుంబం రోడ్డున పడిపోయింది. దాంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక చిన్నా చితక పనులు చేశారు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి డెలివరీ బాయ్‌గా, డేటా ఆపరేటర్‌గా, మెహందీ కోన్‌ల అమ్మకందారుడిగా, సైబర్ కేఫ్ ఆపరేటర్‌గా, పైరేటెడ్ సీడీల అమ్మకందారుడిగా, కంప్యూటర్ ట్యూటర్‌గా పనిచేస్తూ ఆర్థిక స్వేచ్ఛను సాధించారు. 

    అలాగే ఆయన ఐఐటీ ఐఐఎం డిగ్రీలు లేదా కనీసం సాంకేతిక ఎడ్యుకేషన్‌ కాకుండా..ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీని ఎంచుకున్నారు. ఆ సబ్జెక్టుని ఆయన ఎంచుకోవడానికి రీజన్‌ ఉదయం 8 నుండి 10 గంటల వరకు మాత్రమే తరగతులు ఉండే ఏకైక కోర్సు కావడంతోటే అది ఎంచుకున్నారట కునాల్‌. మిగిలిన సమయంలో ఉపాధి చూసుకోవడం కోసం ఇలా చేశారు. ఆ తర్వాత ఎంబిఏలో చేరారు. కానీ దాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారు. 

    అలాంటి వ్యక్తి  భారతదేశపు తొలి డిజిటల్ చెల్లింపుల స్టార్టప్‌లలో ఒకటైన ఫ్రీఛార్జ్‌ను నిర్మించారు. దీనిని 2017లో యాక్సిస్ బ్యాంకుకు సుమారు $60 మిలియన్లకు(రూ.56.68 కోట్లు) విక్రయించారు. 2018లో $1 మిలియన్ (రూ. 9.46 కోట్లు) వ్యక్తిగత పెట్టుబడితో క్రెడ్‌ను ప్రారంభించారు. క్రెడ్‌కు ప్రస్తుతం నెలకు 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించడం కోసం మాత్రమే ఉద్దేశించిన ప్లాట్‌ఫామ్‌గా రూపొందించిన యాప్‌ ఇది. 

    ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఈ క్రెడ్‌ కంపెనీపై ప్రశంసల వర్షం కురిపించారు. షా దీనిని భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారని కొనియాడారు. అంతేగాదు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడానికి అవసరమైన నిర్మాణ దృక్పథం, ప్రపంచ దృష్టికోణాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. క్రెడ్‌లో మెటా 20% వాటాను కొనుగోలు చేయడంతో, ఇప్పుడు ఆ కంపెనీ విలువ $4.5 బిలియన్లుగా(రూ.4 వేల కోట్లు) ఉంది. 

    ప్రస్తుతం షా AI-ఆధారిత వినియోగదారు ఉత్పత్తులపై దృష్టి పెట్టడానికి మెటాలో  ప్రస్తుత వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో షా బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక క్రెడ్‌లో వ్యూహం, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించిన మిధున్‌ సంపత్ తాత్కాలిక సీఈఓ పాత్రను చేపట్టనున్నారు. 

    మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
    ఉద్యోగ నియామకాల సమయంలో డిగ్రీలకు ప్రాధాన్యత ఇవ్వని బహుముఖ ప్రజ్ఞాశాలి కునాల్‌. లింక్డ్‌ఇన్ (LinkedIn)లో షాను నేరుగా ట్యాగ్ చేయడం ద్వారా క్రెడ్‌లో ఇంటర్న్‌షిప్‌లు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేగాదు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎల్లప్పుడూ సీరియస్‌గా ఉండనివ్వరూ..అక్కడ అంతర్గత మీమ్‌ ఛానెల్స్‌ ఉంటాయి. 

    వాటి సాయంతో అక్కడ షాతో సహా ఉద్యోగులు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారని కునాల్‌ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే అక్కడ సీరియస్‌నెస్‌గా పనిచేసే వారిని కంపెనీ మెచ్చదట. కేవలం ఉద్యోగులు ఆహ్లాదభరితంగా పనిచేసే సంస్కృతికి పెద్దపీట వేయడం కునాల్‌ ప్రత్యేకతని సన్నిహిత వర్గాలు చెబుతుండటం విశేషం.

    (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..! బ్రిటన్‌ పౌరురాలేనే ఐనా..)

     

  • పాలు ఆరోగ్యానికి మంచిదని, దానిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుందని విన్నాం. అయితే అతిగా తాగితే అవే పాలు హానికరమై ఎముకలు పెళుసుగా మారిపోయి విరిగిపోతాయనే అపోహ కూడా ప్రబలంగా ఉంది. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య మరింత ఎక్కువ అంటూ సోషల్‌ మీడియా పోస్టులు తెగ వైరల్‌ అయ్యాయి. కానీ ఇందులో ఏమంత వాస్తవం లేదని తేల్చి చెబుతున్నారు వైద్యులు. చాలామంది పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వస్తుందని చెబుతుంటారు.. ఇది కూడా ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆర్ధోపెడిక్‌ సర్జన్లు. అసలు ఈ అపోహ ఎందుకు వచ్చింది?, నిజంగానే పాలు అధికంగా తీసుకోకూడదా అంటే..?

    మాంసం, పాల ఉత్పత్తులు అధికంగా తీసుకుంటే శరీరంలో ఆమ్లత్వం పెరిగి దానిని తటస్థీకరించడానికి ఎముకల నుంచి కాల్షియం గ్రహించాల్సి వస్తుందని, తత్ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు అధికమవుతాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజం కాదని పరిశోధనల్లో ఇలా జరుగుతుందని నిర్థారితం కాలేదని అన్నారు. 

    ఆహారంలోని ప్రోటీన్‌ ముఖ్యం, సరైన మోతాదులో కాల్షియం తీసుకుం​​టే ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఎముకలు విరగకుండా కాపాడతాయని చెబుతున్నారు. పాలు అధికంగా తీసుకుంటే ఆస్టియోపొరోసిస్‌ వస్తుందనే వాదనకు శాస్త్రియ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే ఆమ్లీకరణం సమస్య వస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. 

    ఆస్టియోపొరోసిస్‌ అంటే..
    ఎముకల ఖనిజ సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు బలహీనపడి, సులభంగా విరిగిపోయే పరిస్థితి. ఇది అనేక జన్యు, జీవ, జీవనశైలి కారకల వల్ల ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే వృద్ధాప్యం, హార్మోన్ల స్థితిలో మార్పులు, విటమిన్ డి లోపం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, సరైన పోషకాహారం లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. 

    అయితే పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్ (బలవర్ధకమైన) విటమిన్ డి ఉంటాయి. ఇవి శరీరంలో ఎముకల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. కానీ అతిగా తీసుకుంటే అసమతుల్యత ఏర్పడి పోషకాహార లేమికి దారితీస్తుందే తప్ప..ఆస్టియోపొరోసిస్‌ ప్రమాదాన్ని పెంచదన్నారు. ఎప్పుడైతే పాలను ఎక్కువగా తీసుకుంటామో ఫలితంగా ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోతాయన్నారు. 

    అలాగే అజీర్ణం, పాలు పడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎముకల బలం ‍కోసం బేషుగ్గా పాలు తీసుకోవచ్చని అన్నారు. కానీ మితంగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని చెప్పారు. పైగా ఆస్టియోపొరోసిస్‌ను నివారిస్తుందన్నారు. చాలామటుకు సమతుల్యతకు పెద్దపీట వేస్తూ..అన్ని రకాల పోషకాలు అందేలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. 

    (చదవండి: రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..! బ్రిటన్‌ పౌరురాలేనే ఐనా..)