Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ ​కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్‌ మరో 5 బంతులు (19.1 ఓవర్లలో) మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్‌ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.

    తొలుత సునాయాసంగా గెలుస్తుందనుకున్న పంజాబ్‌ ఓ దశలో తడబడింది. 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. ఈ దశలో కన్నోల్లీ సంయమనంతో ఆడి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. అతనికి జేవియర్‌ బార్ట్‌లెట్‌ (11 నాటౌట్‌) సహకరించాడు. 

    పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (37) ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (18), ప్రియాంశ్‌ ఆర్య (7), నేహల్‌ వధేరా (3), శశాంక్‌ సింగ్‌ (4), స్టోయినిస్‌ (0), జన్సెన్‌ (9) నిరాశపరిచారు. 

    గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-29-3) అద్భుతమైన స్పెల్‌తో పంజాబ్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెంచగా.. రషీద్‌ ఖాన్‌ (4-0-29-1) పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లలో రబాడ, అశోక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీశారు.

    అంతకుముందు గుజరాత్‌ సైతం​ ఓ దశలో భారీ స్కోర్‌ చేసేలా కనిపించినప్పటికీ.. పంజాబ్‌ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్‌ (4-0-28-2), మార్కో జన్సెన్‌ (4-0-20-1), బార్ట్‌లెట్‌ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్‌ చేసి గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్‌ సింగ్‌ (4-0-42-0) మినహా పంజాబ్‌ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

    గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (18), షారుక్‌ ఖాన్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్‌ తెవాతియా (11), రషీద్‌ ఖాన్‌ (0) అజేయంగా నిలిచారు. 
     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 31) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో (ముల్లాన్‌పూర్‌) జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

    వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమైంది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ (4-0-34-3), యుజ్వేంద్ర చహల్‌ (4-0-28-2), మార్కో జన్సెన్‌ (4-0-20-1), బార్ట్‌లెట్‌ (4-0-36-0) అద్భుతంగా బౌలింగ్‌ చేసి గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఒక్క అర్షదీప్‌ సింగ్‌ (4-0-42-0) మినహా పంజాబ్‌ బౌలర్లంతా అద్బుతంగా బౌలింగ్‌ చేశారు.

    గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సాయి సుదర్శన్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (18), షారుక్‌ ఖాన్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రాహుల్‌ తెవాతియా (11), రషీద్‌ ఖాన్‌ (0) అజేయంగా నిలిచారు. 

  • ఐపీఎల్‌ 2026 నుంచి అకారణంగా తప్పుకొని చిక్కుల్లో పడిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ బెన్‌ డకెట్‌, తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు అతనికి కోర్టు భారీ జరిమానా విధించింది.  

    పూర్తి వివరాల్లోకి వెళితే.. 2025 ఆగస్టులో స్టోక్‌ సమీపంలోని A50 రహదారిపై డకెట్‌ 70 mph పరిమితి ఉన్న చోట 93 mph వేగంతో డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. స్టాఫోర్డ్‌షైర్‌ పోలీసులు స్పీడ్‌ గన్‌తో దాన్ని గుర్తించారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టుకు వెళ్లింది.  

    కానాక్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్డులో డకెట్‌ నేరాన్ని అంగీకరించడంతో 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్‌ లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్‌ విధించారు. మొత్తం ఆయన చెల్లించాల్సిన మొత్తం 1,100 పౌండ్లకు చేరింది.  

    కొత్తేమీ కాదు..!
    డకెట్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. 2017లో యాషెస్‌ సిరీస్‌లో సహచరుడు జేమ్స్‌ ఆండర్సన్‌ పట్ల దురుసగా ప్రవర్తించి జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఇటీవలి యాషెస్‌ సిరీస్‌ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్‌ చేశాడు.  

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో డకెట్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సి ఉంది. ఈ సీజన్‌ వేలంలో ఆ ఫ్రాంచైజీ డకెట్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే చివరి నిమిషంలో కౌంటీలు, జాతీయ జట్టు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌ నియమాల ప్రకారం, చివరి నిమిషంలో తప్పుకున్న ఆటగాళ్లకు 2–3 సంవత్సరాల నిషేధం విధించే అవకాశం ఉంది. దీంతో అతను ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ డబ్బును కూడా కోల్పోతారు.  

    మరోవైపు ఢిల్లీ ఇంకా డకెట్‌కి ప్రత్యామ్నాయం ప్రకటించలేదు. ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గర్క్‌ డకెట్‌ స్థానంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఏప్రిల్‌ 1న ఎల్‌ఎస్‌జీతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.  

  • స్టీవ్‌ స్మిత్‌.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నైపుణాల్యతో ప్రపంచంలోని మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు ఈ ఆస్ట్రేలియా స్టార్‌. నవతరం క్రికెట్‌లో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి, న్యూజిలాండ్‌ లెజెండ్‌ కేన్‌ విలియమ్సన్‌, ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌తో కలిసి ఫ్యాబ్‌-4లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

    ఒక్కరోజులోనే రూ. 9.5 కోట్ల లాభం!
    ఆస్ట్రేలియా కెప్టెన్‌గానూ చిరస్మరణీయ విజయాలు అందుకున్న స్మిత్‌ (Steve Smith).. మైదానం వెలుపలా ‘స్మార్ట్‌ ఆపరేటర్‌’ అని నిరూపించుకున్నాడు. స్మిత్‌కు ముందు చూపు ఎక్కువ. మార్కెట్‌పైనా అవగాహన ఉంది. అందుకే ఒక్కరోజులోనే అతడు ఏకంగా రూ. 9.5 కోట్ల మొత్తం లాభం కళ్లజూశాడు. ఇదెలా సాధ్యమైందంటే..

    ఎలా సాధ్యమైందంటే
    ఓ ఆన్‌లైన్‌ బెడ్డింగ్‌, ఫర్మీచర్‌ రిటైలర్‌ కంపెనీలో స్మిత్‌ 2015లో లక్ష డాలర్ల (ఆస్ట్రేలియన్‌ డాలర్లు) మేర పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో అతడికి 3.9 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మంగళవారం ఆస్ట్రేలియన్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయింది. ఈ క్రమంలో స్మిత్‌ వాటా విలువ 11.9 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. మార్కెట్‌ ముగిసేసరికి దీని విలువ 13.2 మిలియన్‌ డార్లకు చేరింది.

    తద్వారా స్మిత్‌ ఒక్కరోజులోనే సుమారుగా 1.4 మిలియన్‌ డాలర్ల మేర లాభం పొందినట్లు నైన్‌.కో.ఏయూ వెల్లడించింది. కాగా ఆన్‌లైన్‌ బెడ్డింగ్‌, ఫర్మీచర్‌ రిటైలర్‌ కంపెనీలోనే కాకుండా పలు ఇతర సంస్థల్లోనూ స్మిత్‌ పెట్టుబడులు పెట్టాడు. ఓట్‌ మిల్క్‌ గుడ్నెస్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా!

    కాగా స్మిత్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 10763, 170 వన్డేల్లో 5800, టీ20లలో 1094 పరుగులు సాధించాడు కుడిచేతి వాటం బ్యాటర్‌. ఇక 36 ఏళ్ల స్మిత్‌ చివరగా ఇంగ్లండ్‌తో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఆసీస్‌ తరఫున బరిలోకి దిగాడు.

    గమనిక: స్మిత్‌ పెట్టుబడుల ద్వారా పొందిన లాభం గురించి మాత్రమే వార్త ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సాక్షి.కామ్‌ ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు.

    చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పంజాబ్‌ ​కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. పంజాబ్‌ మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అరంగేట్రం ఆటగాడు కూపర్‌ కన్నోల్లీ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.

    శ్రేయస్‌ ఔట్‌
    12.1వ ఓవర్‌- 110 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌కు క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ అయ్యర్‌ (18) ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    9.3వ ఓవర్‌- 83 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (37) ఔటయ్యాడు. 

    ఆదిలోనే పంజాబ్‌కు ఎదురుదెబ్బ
    1.2వ ఓవర్‌- 163 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.రబాడ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్య (7) ఔటయ్యాడు. 

    స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

    నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    15.4వ ఓవర్‌- 129 పరుగుల వద్ద గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్‌ ఇచ్చి జోస్‌ బట్లర్‌ (38) పెవిలియన్‌ బాట పట్టాడు.

    మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    13.6వ ఓవర్‌- 119 పరుగుల వద్ద గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి గ్లెన్‌ ఫిలిప్స్‌ (25) ఔటయ్యాడు. 

    గిల్‌ ఔట్‌
    9.3వ ఓవర్‌- 83 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో కన్నోల్లీకి క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (39) ఔటయ్యాడు. 

    తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌.. సుదర్శన్‌ (13) ఔట్‌
    3.4వ ఓవర్‌- 37 పరుగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. జన్సెన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయి సుదర్శన్‌ ఔటయ్యాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో గత ఎడిషన్‌ రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో (ముల్లాన్‌పూర్‌) జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్‌ వేదికగా గత ఎడిషన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 243 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. గుజరాత్‌ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్‌ అయ్యర్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

    తుది జట్లు..
    పంజాబ్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

    పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రియాంష్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గే

    గుజరాత్‌: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్

    గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్‌లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా 

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్‌, మాజీ రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను ప్రస్తుత రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన తర్వాత వికెట్‌కీపింగ్‌ చేస్తున్న సంజూను కవ్విస్తూ ఓవరాక్షన్‌ చేశాడు. సంజూ తరహాలోనే కండలు చూపిస్తూ, ఇది నా పవర్‌ అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.

    ఇది చూసి సంజూ అభిమానులు హర్ట్‌ అయ్యారు. హనుమంతుని ముందా కుప్పిగంతులు అంటూ పంచ్‌లు వేశారు. మాజీ కెప్టెన్‌ అన్న గౌరవం కూడా లేదా అంటూ మండిపడ్డారు. కెప్టెన్‌ కాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. 

    వాస్తవానికి రియాన్‌ను ఇలాంటి అతి ప్రవర్తన కొత్తేమీ కాదు. అతనికి ఓవరాక్షన్‌ స్టార్‌ అన్న బిరుదు కూడా ఉంది. అయితే, తాజా మాజీ కెప్టెన్‌ విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. రియాన్‌ ఏ ఉద్దేశంతో కండలు చూపించినా, అది సంజూ అభిమానులను మాత్రం హర్ట్‌ చేసింది.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రియాన్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ సీఎస్‌కేపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో సీఎస్‌కేను 127 పరుగులకే కుప్పకూల్చి, ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలిసారి సీఎస్‌కేకు ఆడుతున్న సంజూ శాంసన్‌ (6) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం కాగా.. ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా రియాన్‌ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాడు.

    బౌలింగ్‌లో కలిసికట్టుగా సీఎస్‌కే పతనాన్ని శాశించిన రాయల్స్‌.. బ్యాటింగ్‌లో వైభవ్‌ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో విరుచుకుపడటంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్‌లో ఘనంగా బోణీ కొట్టింది. 

  • బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టును కివీస్‌ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్‌ త్రయం మ్యాట్‌ ఫిషర్‌, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్‌ టిక్నర్‌లకు చోటు దక్కింది. కాగా భారత్‌తో టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్‌.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

    ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడింది కివీస్‌ జట్టు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రొటిస్‌ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్‌పై 3-2తో గెలిచింది.

    పరిమిత ఓవర్ల సిరీస్‌లు
    ఇక ఈ సిరీస్‌ తర్వాత న్యూజిలాండ్‌ బంగ్లాదేశ్‌ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్‌ 17న వన్డే సిరీస్‌ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్‌ ముగియనుంది.

    టామ్‌ లాథమ్‌ సారథ్యంలో
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కివీస్‌ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ సారథ్యం వహించనున్నాడు.

    కాగా సాంట్నర్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్‌, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్‌ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.

    ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్‌, ఓరూర్కీ, టిక్నర్‌ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్‌కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్‌ స్పిన్నింగ్‌ ఆల్‌రౌండర్‌ డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.

    బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్‌ 17, 20, 23)
    టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), ముహమ్మద్‌ అబ్బాస్‌, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డేన్‌ క్లీవర్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, నిక్‌ కెల్లి, జేడెన్‌ లెనాక్స్‌, హెన్రీ నికోల్స్‌, విలియం ఓరూర్కీ, బెన్‌ సియర్స్‌, నాథన్‌ స్మిత్‌, బ్లెయిర్‌ టిక్నర్‌, విల్‌ యంగ్‌.

    బంగ్లాదేశ్‌తో టీ20లకు న్యూజిలాండ్‌ జట్టు (ఏప్రిల్‌ 27, 29, మే 2)
    టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), కెటెనె క్లార్క్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డేన్‌ క్లీవర్‌, మ్యాట్‌ ఫిషర్‌, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, బెవాన్‌ జేకబ్స్‌, నిక్‌ కెల్లి, జేడెన్‌ లెనాక్స్‌, టిమ్‌ రాబిన్సన్‌, బెన్‌ సియర్స్‌, నాథన్‌ స్మిత్‌, ఇష్‌ సోధి, బ్లెయిర్‌ టిక్నర్‌.

    చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

  • జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో నికిత్‌ శ్రీ చక్రి ఆకుల సత్తా చాటాడు. రికర్వ్‌ అండర్‌-10 బాలుర విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాదు జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో నికిత్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

    2025-26లో నికిత్‌ శ్రీ చక్రి సాధించిన విజయాలు
    జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ (రికర్వ్‌ అండర్‌-10)- సిల్వర్‌ మెడల్‌
    తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌ (రికర్వ్‌ అండర్‌-10)- సిల్వర్‌ మెడల్‌
    రంగారెడ్డి జిల్లా ఆర్చరీ చాంపియన్‌షిప్‌ (రికర్వ్‌ అండర్‌-10)- గోల్డ్‌ మెడల్‌
    తమిళనాడు స్టేట్‌ ఓపెనర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ (రికర్వ్‌ అండర్‌-10)- గోల్డ్‌ మెడల్‌
    సౌత్‌ ఇండియన్‌ ఓపెనర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ (రికర్వ్‌ అండర్‌-10)-గోల్డ్‌ మెడల్‌

  • పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ ఫకర్‌ జమాన్‌ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2026లో బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్‌ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ ఖలందర్స్‌కు ఆడే జమాన్‌.. మార్చి 29న  కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.

    అయితే జమాన్‌ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్‌ రిఫరి రోషన్‌ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్‌ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ అంశం పీఎస్‌ఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్‌ల నిషేధం.

    నిషేధం ప్రకటనలో జమాన్‌ ఏప్రిల్‌ 3న ముల్తాన్‌ సుల్తాన్స్‌తో, ఏప్రిల్‌ 9న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.  

    అసలేం జరిగిందంటే..?
    క‌రాచీ కింగ్స్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ  ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌కు అప్ప‌గించాడు. అయితే ఈ క్ర‌మంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వ‌ద్ద‌ మాట్లాడుకున్నారు. ఈ స‌మ‌యంలో బంతికి ఒక‌రు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.

    అయితే బంతిని ఫ‌కర్ త‌న చేతి వేలితో గీకిన‌ట్లు కనిపించింది. దీంతో వెంట‌నే అంపైర్ బంతిని అత‌డి చేతి నుంచి తీసుకుని  టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో బంతిని మార్చ‌డంతో పాటు ల‌హోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫ‌లితమే తారుమారైంది. జమాన్‌ జట్టు ఓటమిపాలైంది.

  • ఐపీఎల్‌ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ జాన్‌ విలియం లాంగ్‌ఫోర్డ్‌ ముంబైలోని తన హోటల్‌ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్‌ఫోర్డ్‌ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్‌ హోటల్‌లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్‌–కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో ఆయన పని చేశారు. 

    ఆ రాత్రి హోటల్‌ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది స్పేర్‌ లాక్‌తో డోర్‌ ఓపెన్‌ చేసి చూడగా లాంగ్‌ఫోర్డ్‌ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

    దీంతో రంగంలోకి దిగిన మెరైన్‌ డ్రైవ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు.  

    లాంగ్‌ఫోర్డ్‌ కెరీర్‌  
    బ్రిటిష్‌ సిటిజన్‌ అయిన లాంగ్‌ఫోర్డ్‌ ఐపీఎల్‌ 2026లో ZOOM కమ్యూనికేషన్స్‌ తరఫున ఫ్రీలాన్స్‌ విజన్‌ సూపర్వైజర్‌గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్‌ లీగ్‌, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌, 2010 FIFA వరల్డ్‌ కప్‌ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్స్‌లో కూడా పని చేశారు. 

    లాంగ్‌ఫోర్డ్‌కు ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌–కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ చివరి అసైన్‌మెంట్‌గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (78), ర్యాన్‌ రిక్‌ల్టన్‌ (81) మెరుపు ఇన్నింగ్స్‌ల కారణంగా ముంబై ఇండయన్స్‌ ఘన విజయం సాధించింది. 

  • గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్‌ కమిటీ వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని పట్టించుకోవడం మానేసింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో ఈ రైటార్మ్‌ బౌలర్‌ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ షమీది ముఖ్య భూమిక.

    అయితే, దాదాపు మూడేళ్లుగా షమీకి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డేల్లో మేజర్‌ టోర్నీల్లో సత్తా చాటినా.. ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫిట్‌నెస్‌ సమస్యల వల్లే షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్వయంగా వెల్లడించాడు.

    ఒకే సీజన్లో 67 వికెట్లు..
    కానీ షమీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడమే కాకుండా.. పూర్తి ఫిట్‌నెస్‌తో దేశవాళీ క్రికెట్‌ బరిలో దిగి సత్తా చాటాడు. బెంగాల్‌ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.

    ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌ ఊహాగానాలు వస్తుండగా షమీ స్పందించాడు. శుభంకర్‌ మిశ్రా షోలో మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్‌ అవుతాను. అంతేగాని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచిస్తే మనం వెనుకబడి పోతాము.

     ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నా
    ముందుగా చెప్పినట్లు నేను అలసిపోయాను.. ఆడలేను అని భావించినపుడే నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నేను ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’ అని షమీ పేర్కొన్నాడు.

    ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ షమీని లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘బౌలర్‌గా వంద శాతం బాధ్యతలు నిర్వర్తించగలను.

    అంచనాలు అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాదంతా నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానిని నేనైతే మార్చలేను. అంకితభావంతో ఆడటం మాత్రమే నా పని. లక్నో నన్ము నమ్మింది. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 2023లో చివరగా టెస్టు ఆడిన షమీ.. 2025లో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

    చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

  • తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తాను క్రికెట్‌ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. 

    ఆటగాడిగానే
    తన భవిష్యత్తుపై, రిటైర్మెంట్‌పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్‌ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 

    20 ఏళ్లుగా అదే పని 
    ముంబైతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాను. 

    వాళ్లనలా చూడనివ్వండి
    నా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. 

    వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్‌’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. 

    ఓ క్రికెటర్‌గా, బ్యాటర్‌గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.

    మా ఓటమికి కారణం అదే
    ‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్‌ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.

    అనుభవలేమి బౌలింగ్‌ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్‌ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్‌ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. 

    చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌  

  • భారత యువ సంచలనం, రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్‌ అనిపించుకున్నాడు.

    ప్రశంసల వర్షం
    గువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా రాజస్తాన్‌ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

    ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ..

    నేనే గనుక సెలక్టర్‌ అయి ఉంటే
    ‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్‌. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

    ఒకవేళ నేనే గనుక సెలక్టర్‌ అయి ఉంటే వైభవ్‌ను ఈ టూర్‌కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్‌కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.

    కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్‌ వాన్‌ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.

    చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

  • భారత క్రికెట్‌ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్‌ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

    అయితే, ఊహించని రీతిలో కేకేఆర్‌కు షాక్‌ తగిలింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తొలుత ముంబై ఇండియన్స్‌తో తలపడగా.. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ బౌలింగ్‌ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.

    క్రికెట్‌ ఆస్ట్రేలియానే అడగండి
    ‘ఆ విషయం ఏదో క్రికెట్‌ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green) బౌలింగ్‌ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్‌ టీమ్‌ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 

    10–12 రోజుల్లో 
    దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్‌ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్‌ చేయవచ్చు. 

    ఈ విషయం కేకేఆర్‌ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం కోల్‌కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, మ్యాచ్‌ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్‌ బౌలింగ్‌ చేశాడు. 

    కానీ మ్యాచ్‌లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌లో అన్ని మ్యాచ్‌లూ కలిపి గ్రీన్‌ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్‌కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది.  

    రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?
    నిజానికి తాజా పరిస్థితికి నైట్‌రైడర్స్‌ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్‌ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్‌లో కేవలం ‘బ్యాటర్‌’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. 

    ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్‌ పొరపాటు అని, బౌలింగ్‌ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్‌రౌండర్‌’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. 

    ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్‌ ఒక పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్‌ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్‌’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. 

    వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లి
    సహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్‌’ జాబితాలో వచ్చిన గ్రీన్‌ కోసం కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్‌ బౌలింగ్‌ గురించి టీమ్‌కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్‌లో వేలం జరగ్గా...  అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్‌ 2025 వరకు గాయంతో గ్రీన్‌ బౌలింగ్‌ చేయలేదు. 

    టీ20ల్లో బ్యాటర్‌గా గ్రీన్‌ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్‌ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్‌ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్‌ కేవలం అతని బ్యాటింగ్‌ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! 

    విఫల సమర్థన
    ఇప్పుడేమో బౌలింగ్‌ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్‌ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్‌ కోసం వెంకటేశ్‌ అయ్యర్‌కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. 

    ఆ సీజన్‌లో అతను అన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్‌ ఒక్క బంతి కూడా బౌల్‌ చేయలేదు!    

    రీఫండ్‌ చెల్లించాల్సిందే!
    ఇదిలా ఉంటే.. గ్రీన్‌ విషయంలో భారత మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా కోల్‌కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్‌రౌండర్‌గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్‌ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్‌ చేశాడు. 

    అయితే, అతడి పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్‌ కేకేఆర్‌ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్‌ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. 

    చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌

National

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కొత్త చీఫ్‌గా సీనియర్ అధికారి  వీర్ విక్రమ్ యాదవ్‌ని నియమించింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖలకు బదిలీ చేసింది.

    కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీ పరిపాలనా ప్రక్షాళనలో భాగంగా పౌర విమానయాన నియంత్రణ సంస్థ  నూతన చీఫ్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ వీర్ విక్రమ్ యాదవ్ నియమాకం చేపట్టింది. దానితో పాటు ఒకేసారి 25 మంది సివిల్ సర్వెంట్లను వివిధ శాఖల్లో అదనపు కార్యదర్శి స్థాయి హోదాల్లో నియమించింది.

    పునీత్ కన్సల్: పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి. విశాల్ గగన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్  కార్యదర్శిగా, జ్ఞానేంద్ర డి త్రిపాఠి భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) కార్యదర్శి మరియు వ్యవసాయ పరిశోధనా విభాగం అదనపు కార్యదర్శిగా నియమించింది.

    ఒడిశా క్యాడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  కాగా ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మరియు పాలనా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బదిలీలను చేపట్టినట్లు తెలుస్తోంది.

  • బృహన్ ముంబై నగర పాలక సంస్థ మున్సిపల్‌ కమిషనర్‌గా అశ్విని భిడే  నియామకమయ్యారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.  దీంతో ఆసియాలోనే అతిపెద్ద మున్సిపాలిటీకి  కమిషనర్‌గా వ్యవహరించనున్న మహిళ అధికారిగా  అశ్విని భిడే రికార్డు సాధించనున్నారు.      

    ముంబై మేయర్ రీతూ వాడే ప్రభుత్వ నిర్ణయం  పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. మహిళా కమిషనర్ ఎంపిక  "నారీ శక్తి"కి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ముంబై నగరాన్ని మరింత స్మార్ట్‌గా, పరిశుభ్రంగా మార్చడంలో ఈ నియామకం  ఎంతగానో దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.  

    కాగా  BMC చరిత్రలో మొట్టమొదటి మహిళా కమిషనర్‌గా సేవలు అందిస్తోన్న అశ్విని భిడే 1995 కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె గతంలో  ముంబై మెట్రోలో  2015 నుండి 2020 వరకు  రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ సేవలందించారు. కాగా ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్‌ కోసం  నలుగురు సీనియర్ అధికారుల పేర్లు పరిశీలనలోకి రాగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతుతో అశ్విని భిడే ఎంపికయ్యారు.

     

  • ఒడిశాలోని తల్సారీ బీచ్‌లో ఒక టీవీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఈ ఘటనకు సంబంధించి   షాకింగ్‌ విషయం  ఒకటి వెలుగులోకి వచ్చింది.

    షూటింగ్ సమయంలో తన సహ నటి నీటిలో ఉన్న ఒక లోతైన గుంతలో పడిపోవడాన్ని గమనించిన రాహుల్, ఆమెను రక్షించే ప్రయత్నంలో స్వయంగా నీటిలో మునిగిపోయారు. మోకాలి లోతు నీటిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో, సముద్రపు అలల తాకిడికి మలయాళ నటి (సహ నటి) అదుపు తప్పి పడిపోయారు. ఆమె చీరలో ఉండటంతో నీటిలో చిక్కుకుపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆయన లోపలికి వెళ్లి మునిగిపోయారని  ప్రత్యక్ష సాక్షి తపన్ చెప్పారు

    స్థానిక పడవ నడిపే వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ సాహసంగా ముందుకు అడుగు వేసినప్పటికీ, సముద్రపు అడుగుభాగం సమానంగా లేకపోవడం ఇసుక మూలంగా బయటకు రాలేకపోయారు. అంతేకాదు రాహుల్‌ను బయటకు తీసినప్పుడు ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, కానీ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.  తక్షణమేఅతన్ని బ్రతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాహుల్‌ను కాపాడలేకపోయారు. తల్సరి నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి అతన్ని తరలించే సమయానికే మరణించినట్లు ప్రకటించారు.

    ఇదీ చదవండి: గ్యాస్‌ కొరత : ఐఐటీ బాంబే అద్భుత ఆవిష్కారం

    అనుమతి లేదు
    ఈ ప్రమాదం విషయంలో భద్రతా పరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న విషయంపై అనుమతి తీసుకోలేదని, ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అధికారులంటున్నారు. స్పీడ్‌బోట్‌లో చిత్రీకరణ జరుపుతుండగా, బలమైన అలల కారణంగా వారు సముద్రంలో పడిపోయారని పోలీసులు తెలిపారు. తోటి మహిళా నటిని త్వరగా రక్షించినప్పటికీ, రాహుల్‌ను గుర్తించి నీటిలోంచి బయటకు తీయడానికి దాదాపు గంట సమయం పట్టిందని సమాచారం. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, అక్కడ లైఫ్ గార్డులు, వైద్య బృందం ,రెస్క్యూ బోట్లు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి ఉండేవాళ్ళమని స్థానిక  అధికారి  చెప్పారు.

    పోస్టుమార్టం నివేదిక
    రాహుల్ ఊపిరితిత్తుల్లోకి ఉప్పు నీరు, ఇసుక వెళ్లడం వల్లే ఆయన మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది.42 ఏళ్ల రాహుల్ అరుణోదయ బెనర్జీ కేవలం నటుడిగానే కాకుండా, రచయితగా, పాడ్‌కాస్ట్ హోస్ట్‌గా కూడా సుపరిచితులు. ఆయన మరణం చిత్ర పరిశ్రమలో పెద్ద లోటును మిగిల్చింది. 

    ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?

  • ఢిల్లీ:  ఏపీ-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్‌ పెరగడంపై  ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు.  ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్‌ బూత్‌ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్‌ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు.  ఢిల్లీలోని కాన్సిట్యూషన్‌ క్లబ్‌లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్‌ జోడో అభియాన్‌ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్‌. ఈ మేరకు ఏపీ ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్‌ పెరగడంపై ఆధారాలతో పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

    ‘ఏపీ-2024 ఎన్నికల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్‌ జరగడంలో మతలబు ఏంటి?,  3,500 పోలింగ్‌ బూత్‌లలో తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఓటింగ్‌ జరగడం వెనుక అనుమానాలున్నాయి. రాత్రి గం. 11. 45ని నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటు వేయడం ఎలా సాధ్యం.  ఇది ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది’ అని తన ప్రజెంటేషన్‌లో పరకాల ప్రభాకర్‌ పేర్కొన్నారు. 

  • ఇరాన్‌ వార్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా  చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా పెట్రోల్‌, డీజిల్‌,ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు,ఎల్‌పిజి (LPG) కొరత ఉన్న నేపధ్యంలో ఐఐటీ బాంబే తన క్యాంపస్‌లోని వంటశాలలను ఎల్‌పిజి కొరత నుంచి బయటపడేలా, ఒక వినూత్న మార్గాన్ని కనుగొంది. 


    దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే హామీ ఇస్తున్నప్పటికీ  పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తోంది. ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో వీరి ఆవిష్కారం ప్రాధాన్యతను సంతరించుకుంది.  కెమికల్‌ ఇంజనీరింగ్ విభాగంలోని ప్రొఫెసర్ సంజయ్ మహాజని నేతృత్వంలో 2014లో ఈ పరిశోధన ప్రారంభమైంది. క్యాంపస్‌లో కుప్పలుగా పేరుకుపోయే ఎండుటాకులను తొలగించడం, పారవేయడం లాంటివి సవాలుగా మారడంతో వారిలో కొత్త ఆలోచన  మెదిలింది.  దీన్ని శక్తిగా మార్చే ఆలోచన చేశారు.

    ఐఐటీ బాంబే 'బయోమాస్ గ్యాసిఫికేషన్'

    దశాబ్ద కాలం సుదీర్ఘ పరిశోధన తర్వాత, ఎండుటాకులను సమర్థవంతమైన వంట ఇంధనంగా మార్చే 'బయోమాస్ గ్యాసిఫికేషన్' (Biomass Gasification) సాంకేతికతను వారు రూపొందించారు. ఈ ప్రయోగాల్లో అనేక సవాళ్లు తప్పలేదు వీరికి. మొదట్లో పొగ రావడం, 'క్లింకర్స్' (వ్యర్థాలు పేరుకుపోయి వ్యవస్థ ఆగిపోవడం) వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ 2016 నాటికి ఈ సమస్యలను అధిగమించి పేటెంట్ పొందారు. 2017లో ఎనర్జీ సైన్స్ విభాగం నుండి ప్రొఫెసర్ సందీప్ కుమార్ చేరడంతో బర్నర్ డిజైన్ మరింత మెరుగుపడింది. 2024 నాటికి ఈ వ్యవస్థను స్టాఫ్ క్యాంటీన్‌లో విజయవంతంగా ఏర్పాటు చేశారు.

    లాభాలు 
    ప్రస్తుతం క్యాంటీన్లలో 30శాతం నుండి 40శాతం వరకు ఎల్‌పిజి వాడకం తగ్గింది. హాస్టల్ మెస్సుల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి రూ.50 లక్షల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాదు ఇది పర్యావరణ హితం కూడా. ఏటా దాదాపు 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఇది తగ్గిస్తుంది. ఈ వ్యవస్థ 60శాతం  థర్మల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.

    మరింత విస్తరణ
    కేవలం క్యాంపస్‌లకే పరిమితం కాకుండా, పరిశ్రమలు మరియు భారీ వంటశాలలలో కూడా ఈ సాంకేతికతను వాడేలా విస్తరించాలని ఐఐటీ బృందం భావిస్తోంది. అంతేకాకుండా, 2019 నుండి ఐఐటీ బాంబే ప్రతిరోజూ 2 టన్నుల తడి వ్యర్థాలను శక్తిగా మార్చే 'బయోమెథనేషన్' ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.

    ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య

    ప్రొఫెసర్ సంజయ్ మహాజని ఏమంటారంటే..
    తన పరిశోధన గ్యాసిఫికేషన్ , శక్తి మార్పిడిపై కేంద్రీకృతమై ఉందని, ఈనేపథ్యంలోనే  క్యాంపస్‌లోని ఈ వ్యర్థ పదార్థంలోనే సహజంగానే శక్తి ఉన్నప్పుడు, దానిని మన అంతర్గత అవసరాల కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించామనీ  ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ సంజయ్ మహాజని చెప్పారు. ఈ వ్యర్థాలను  దహనం చేసినప్పుడు, అది ముఖ్యంగా పార్టిక్యులేట్ మ్యాటర్ రూపంలో గణనీయమైన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని గణనీయంగా తగ్గించే విధంగా తాము గ్యాసిఫైయర్ డిజైన్‌ను రూపొందించామన్నారు.ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే వాయువును 'ప్రొడ్యూసర్ గ్యాస్' అంటారు. ఇలా ప్రధానంగా కార్బన్ మోనాక్సైడ్ , హైడ్రోజన్‌లను వెంటనే దహనం చేస్తేఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయి.  ఈ వాయువును దహనం చేసినప్పుడు, విడుదలయ్యే శక్తి ద్వారా  ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీన్ని ప్రాథమికంగా,  నీటిని ఆవిరిగా మారుస్తాం, ఇది ఆహార తయారీకి ఉపయోగించే ఆవిరి ఆధారిత వంట పరికరాలను,ఇతర ఉపకరణాలను నడపడానికి శక్తినిస్తుందని వివరించారు.  

    ఇదీ చదవండి: తండ్రితో గొడవ, నాలుగేళ్ల బాలుడిపై ఇంత ప్రతీకారమా?

  • షిల్లాంగ్‌: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ మర్డర్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే భార్య సోనమ్‌ రఘువంశీ చేతిలో దారుణ హత్యకు గురైన రాజా రఘువంశీ మళ్లీ పుట్టాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాజా రఘువంశీ సోదరుడు సచిన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాడు. 

    ఈ సందర్భంగా తన తమ్ముడు రాజా మళ్లీ పుట్టాడంటూ అన్న సచిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడికి ‘రాజా’ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. రాజా రఘువంశీ చంద్రపక్షంలోని పదకొండవ రోజు అయిన ఏకాదశి రోజే హత్యకు గురయ్యాడు. యాదృచ్ఛికంగా నా కుమారుడు కూడా అదే ఏకాదశి రోజే జన్మించాడు. ఇది దేవుడి ఆశీర్వాదమేనని, తన తమ్ముడు మళ్లీ జన్మించి కుటుంబంలోకి అడుగు పెట్టాడ’ని సంతోషం వ్యక్తం చేశాడు.

    రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ ఇండోర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తిరిగి వచ్చాడు’. రాజా రాక కోసం ఇంటిని బెలూన్లతో అలంకరించినట్లు చూపించారు. ఇంటి బయట ‘Raja is Back’ అంటూ డిజైన్‌ చేసిన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్య
    ఏప్రిల్‌ 23న రాజా రఘువంశీ,సోనమ్‌ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ  హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్‌  తన ప్రియుడు సాయంతో విశాల్‌ చౌహాన్‌,ఆనంద్‌ కుమార్‌,కాష్‌ రాజ్‌పుత్‌లకు సుపారీ ఇచ్చింది. 

    ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్‌డాంగ్ హిల్స్‌లో పడేశారు. జూన్‌ 2న అదే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని గుర్తించిన టూరిస్టులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో గతేడాది జూన్‌లో భార్య సోనమ్‌ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా,మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ అయ్యారు.

    కనిపించని పశ్చాత్తాపం..  
    పోలీసుల దర్యాప్తులో ప్రియుడితో కలిసి జీవించేందుకే తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు సోనమ్‌ రఘువంశీ నేరాన్ని అంగీకరించారు. భర్తను హత్య చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సోనమ్‌ మేఘాలయా షిల్లాంగ్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, భర్త హత్య చేసినందుకు సోనమ్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని జైలు అధికారులు చెప్పినట్లు అప్పట్లో పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

  • స్వల్ప వివాదానికే ముక్కపచ్చలారని చిన్నారిపై దారుణంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబైకి ఆనుకుని ఉన్నవసాయి ప్రాంతంలో, తండ్రితో వాగ్వాదం తర్వాత ఒక వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని దారుణండి కొట్టాడు. చిన్నపిల్లాడు అన్న కనికరం కూడా లేకుండా  తీవ్రంగా దాడి చేసిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.  దీనిపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

    ఈ దారుణ ఘటన ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన  విజువల్స్‌ ప్రకారం నిందితుడు సందీప్ పవార్, ఒక చిన్న విషయంపై బాలుడి తండ్రితో గొడవడ్డాడు.  తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో.. క్షణికావేశంతో చేశాడో గానీ  అక్కడే ఆడుకుంటున్న బాలుడు విఘ్నేష్‌ తన ప్రతాపాన్ని చూపించాడు.  పసుపు రంగు టీ-షర్టులో విఘ్నేష్ అక్కడే ఆగి ఉన్న ఆటో-రిక్షాలో కూర్చుని ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉ‍న్నాడు.  ఆగ్రహంతో  ఊగిపోతూ నిందితుడు బాలుడు కాళ్లు పట్టుకుని ఆటోలోంచి బయటకు లాగాడు.  బాలుడిని నేలపై ఒకసారిగా విసిరి కొట్టాడు.  తరువాత భవనం లోపలికెళ్లి, చిన్నారి తలను ఇనుప రాడ్‌కు కొట్టి, మళ్లీ నేలపై పడేశాడు.

    ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్‌ మీద నుంచి తోసేశాడు!

    తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే మీరా రోడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్య అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేశారు.   

    ఇదీ చదవండి: బెంగళూరులో విషాదం: తెలంగాణ టెకీ దంపతుల ఆత్మహత్య
     

    ఇదీ చదవండి : భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు

  • బెంగళూరులో పెను విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన యువ టెకీ దంపతులు బెంగళూరులో విషాదకరమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

    తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భానుచందర్ రెడ్డి కుంట (32), సోమవారం తన అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను చందర్‌ ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎంలో పనిచేస్తున్నాడు. అతని భార్య బీబీ షాజియా సిరాజ్ (31) తమ ఇంటి తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించింది. ఆమె పదేపదే తలుపు తట్టినా  లోపల ఉన్న భర్త స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భద్రతా సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసింది. వారు బలవంతంగా తలుపు తెరిచి చూడగా, భాను మృతదేహం కనిపించింది. 

    ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్‌ వెయిట్‌ లాస్‌ : కేవలం నీళ్లు, మద్యం

    కొన్ని నిమిషాల తర్వాత, షాజియా అదే నివాస సముదాయంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇరుకుటుంబాల్లో విషాదంలో మునిగి పోయాయి. తెలంగాణలో కుటుంబ సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా రెండు వేర్వేరు బలవంతపు మరణాలు కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాలనుపోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.  వీరి మరణాలకు ప్రేరేపించిన అంశాలు ఆరోగ్య సమస్యలా? మానసిక క్షోభ? ఇతర కారణాలపై ఆరాతీస్తున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి: పార్టీలో గొడవ : భార్యను బైక్‌ మీద నుంచి తోసేశాడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికర ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్ చేయ లేదన్న కోపంతో, ఒక భర్త తన భార్యను నడుస్తున్న బైక్ మీద నుండి నెట్టివేశాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలోరికార్డైనాయి.  

    నిందితుడు, భార్యతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ గొడవ పడ్డారు. అక్కడ పార్టీలో  డ్యాన్స్ చేయడానికి డ్యాన్స్ చేయడానికి నిరాకరించడంతో భార్యపై ఆగ్రహాన్ని పెంచుకున్నాడు.  వేడుక ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా దారిలో ఆమెతో  మళ్లీ గొడవకు దిగాడు.  బైక్ వేగంగా వెళ్తుండగాగానే భర్త భార్యను కిందకు నెట్టివేశాడు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది.  

    ఇదీ చదవండి: నటీమణులు షాకింగ్‌ వెయిట్‌ లాస్‌ : కేవలం నీళ్లు, మద్యం

    కుటుంబ సభ్యుల ఆరోపణలు
    అయితే ఈఘటనపై మృతురాలి పుట్టింటి వారు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కోపంతో జరిగింది  కాదనీ, పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆమెను హతమార్చారని వారు  కన్నీరు పెట్టుకున్నారు.

    ఇదీ చదవండి: పింక్‌ ఏనుగు ఫోటోషూట్‌, మృతి వివాదం : అటవీ అధికారుల రియాక్షన్‌
     

  • సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ పెరంబూర్, తిరుచిరాపల్లి–ఈస్ట్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సోమవారం ఆయ‌న నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. నామినేషన్‌ పత్రాలను సంబంధిత రిట‌ర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా స‌మ‌ర్పించిన అఫిడవిట్‌లో త‌న‌కు సంబంధించిన ఆస్తులు, వాహ‌నాలు, విద్యా వివ‌రాల‌ను పొందుప‌రిచారు. తనకు రూ.603.20 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

    విలాసవంతమైన కార్లు, బైకులు
    అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం విజయ్‌కు అత్యంత ఖరీదైన, విలాసవంత బీఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టొయోటా లెక్సస్‌ 350, టొయోటా వెల్‌ఫైర్‌ కార్లతోపాటు మరికొన్ని బైకులు ఉన్నాయి. మొత్తంలో ఆస్తుల్లో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నారు. కొడైకెనాల్‌లో వ్యవసాయ భూమి, చెన్నై పరిసరాల్లో రూ.198.62 కోట్ల విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. 2015–16 ఏడాదికి సంబంధించి రూ.1.5 కోట్ల విలువైన ఆస్తి వివాదాల్లో ఉంది. ఇప్పుడది కమిషనర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ట్యాక్స్‌(అప్పీల్స్‌), హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. 2022–23 ఏడాదికి సంబంధించి రూ.14.13 లక్షల విలువైన మరో ఆస్తి సైతం వివాదాల్లో ఉంది.

    భార్య పేరిట విడిగా ఆస్తులు
    విజయ్‌ భార్య సంగీత పేరిట విడిగా రూ.15.76 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు, రూ.25 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. విజయ్‌ వద్ద రూ.2 లక్షల నగదు, వేర్వేరు బ్యాంకుల్లో రూ.213 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. విజయ్‌ వద్ద 883 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి.

    అప్పులు లేవు
    తనకు ఎలాంటి అప్పులు లేవని విజయ్‌ అఫిడవిట్‌లో వెల్లడించారు. టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ ఆనంద్‌కు రూ.3 కోట్లు, తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌కు రూ.3.02 కోట్లు, తల్లి శోభాశేఖర్‌కు విజయ్‌ రూ.8.71 లక్షలు ఇచ్చారు. ఏఎల్‌పీ ఆంటోనియస్‌ బ్రిటో, కోకిలాంబల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెరో రూ.20 కోట్లు, విద్యా చారిటబుల్‌ ట్రస్ట్‌కు రూ.5.84 కోట్లు ఇచ్చారు. భార్య సంగీతకు రూ.12.60 కోట్లు, కుమారుడు జేసన్‌ సంజయ్‌కు రూ.8.78 లక్షలు, కుమార్తె విద్యా సాశకు రూ.4.60 లక్షలు ఇచ్చారు. ఏటా స్వయంఉపాధి(నటన), వడ్డీలు, స్థిరాస్తుల నుంచి అద్దెల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోందని విజయ్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: ఎన్నిక‌ల వేళ‌.. విజ‌య్‌కు మ‌రో షాక్‌

    డిగ్రీ డిస్‌కంటిన్యూ
    విజయ్‌ విద్యార్హ‌త‌ల‌ను గ‌మ‌నిస్తే.. 1989లో పదోతరగతి పాస‌య్యారు. ఆ తర్వాత ప్రైవేట్‌గా ఇంటర్మీడియట్‌ చదివారు. 1992లో చెన్నై లయోలా కాలేజీలో బీఎస్‌సీ డిగ్రీ మధ్యలోనే ఆపేశారు. 

  • దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    పేస్‌ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్‌కతాలో లియాండర్‌ పేస్‌ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో బ్రెజిల్‌కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్‌ నిలిచారు.

    ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో సింగిల్స్‌ కంటే డబుల్స్‌పై దృష్టి సారించిన పేస్‌ పురుషుల గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో డబుల్స్‌లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్‌డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. 

    బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

    బెంగాల్‌ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం.
     

  • కృష్ణరాజపురం: బెంగళూరులో ఇళ్లలో బాడుగకు ఉండేవారు లక్షలాది రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చుకుని, వేలాది రూపాయలను ప్రతి నెలా అద్దె చెల్లించాలి, అంతే కాదు.. ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తే చేయించుకోవాలి... ఇలా ఉంది కొన్నిచోట్ల దుస్థితి. ఇంటి యజమాని కుటుంబం దాడి చేయడంతో అద్దెకున్నవారు గాయాల పాలయ్యారు. ఈ సంఘటన మార్చి 29న బెంగళూరులోని కోడిహళ్లి, జీవన్‌ బీమా నగరలో జరిగింది. 

    ఇంటి యజమాని శోభ, దేవరాజ్‌ వారి పిల్లలు అద్దెకున్నవారి పైన దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నరేష్‌  అతని సోదరుడు సచిన్, సోదరి రేఖ ఈ ఇంట్లో బాడుగకు ఉంటున్నారు. అది కూడా వారం క్రితమే చేరారు. గ్యాస్‌ రేటు పెరిగిందని, నీటి బిల్లు కూడా ఎక్కువ చెల్లించాలని, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని వారిని ఒత్తిడి చేశారు. దీని మీద గొడవ జరిగింది. యజమాని కుటుంబీకులు నరేష్‌ సచిన్, రేఖలను కొట్టారు. వారి మీద బకెట్లతో నీళ్లు చల్లి అల్లరి చేశారు. కత్తి, బ్లేడ్లతో కోయడంతో నరేష్‌కు రక్త గాయాలు అయ్యాయి. బాధితులు జీవన్‌ బీమా నగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. 

  • రాజస్థాన్‌లోని  జైపూర్‌లో రష్యన్ ఫొటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు ముదురు గులాబీ రంగు (Pink) వేసి చేసిన ఫొటోషూట్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో జంతు ప్రేమికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోషూట్‌లో పాల్గొన్న 70 ఏళ్ల చంచల్ అనే ఏనుగు గత నెలలో మరణించింది. అయితే, ఆమె మరణానికి ఈ షూట్‌కు ఎలాంటి సంబంధం లేదని, వయసు పైబడటం వల్ల సహజ కారణాలతోనే చనిపోయిందని అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

    ఏమి జరిగింది?
    గత ఏడాది నవంబరులో  రాజస్థాన్‌లోని  జైపూర్‌లోని ఒక పురాతన గణేశుడి ఆలయం వద్ద ఈ షూట్ జరిగింది. 'పింక్ సిటీ' జైపూర్ నేపథ్యం నుండి ప్రేరణ పొంది, మోడల్ యశస్వి, చంచల్ అనే ఏనుగుకు ఒకే రకమైన గులాబీ రంగు వేసి ఫొటోలు తీశారు. బార్సిలోనాకు చెందిన ప్రఖ్యాత కాన్సెప్టువల్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా, సంస్కృతిని ప్రతిబింబించేలా  ఈ ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక ఏనుగుకు తల నుండి తోక వరకు పూర్తిగా గులాబీ రంగు పూయడం వివాదాస్పదమైంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. 

     

    కొంతమంది ఈ షూట్ సౌందర్య ఆకర్షణను  సృజనాత్మకతను ప్రశంసించగా, చాలా ఎక్కువ మంది ఏనుగు పట్ల వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులలో జంతువులను ఉపయోగించడం యొక్క నైతికతను ప్రశ్నించారు. ఇది కచ్చితమైన  జంతు హింసే.. ఇలా లైక్స్ కోసం మూగజీవాలను  కెమికల్‌ రంగులతో ముంచెత్తడం ఆర్ట్‌ అనిపించుకోదు అంటూ పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

    ఫోటోగ్రాఫర్‌ వాదన

    ఏనుగు యజమాని , హతి గావ్ కమిటీ అధ్యక్షుడు బల్లు ఖాన్ , ఫొటోగ్రాఫర్ వాదన ప్రకారం, హోలీ పండుగలో వాడే ఆర్గానిక్ గులాల్ (Gulal) పొడిని మాత్రమే వాడారు. అంతేకాదు రంగును కేవలం 10-30 నిమిషాలు మాత్రమే ఉంచి, వెంటనే కడిగేసినట్లు వారు తెలిపారు.

    ఏనుగు మృతితో  మరింత ఆందోళన 
    సుమారు 70 ఏళ్ల వయసున్న చంచల్ గత నెలలో మరణించినట్లు  బల్లుఖాన్‌ ధృవీకరించారు. ఏనుగు మరణానికి ఫోటోషూట్‌తో గానీ, దాని చుట్టూ ఉన్న వివాదంతో గానీ సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.దాని మరణం సహజ కారణాల వల్ల సంభవించిందని అధికారులు, స్థానిక సంరక్షకులు స్పష్టం చేశారు.

    స్పందించిన అటవీ అధికారులు
    అయినప్పటికీ, ఈ వీడియో వైరల్ అవ్వడంతో,కళాత్మక సృజన పేరుతో మూగజీవాలను ఇలా రంగులతో హింసించడం సరికాదని నెటిజన్లు విమర్శల నేపథ్యంలో రాజస్థాన్ అటవీ శాఖ స్పందించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘన జరిగిందో లేదో తేల్చనున్నారు.

    వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉల్లంఘించారా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. నిర్లక్ష్యం లేదా వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల ఉల్లంఘన ఏదైనా కనుగొనబడితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

    జైపూర్‎లో గులాబీ రంగు ఏనుగు
     

Movies

  • పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌కి నిజమైన అర్హత సాధించిన నటి నయనతార. ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేస్తూ, ఐదు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనతార తెలుగులో ఒక సినిమా షూటింగ్‌ దశలో ఉంది. మలయాళంలో రెండు సినిమాలు సెట్స్‌పై కొనసాగుతున్నాయి. తమిళంలో రెండు సినిమాలు రెడీ అయ్యాయి. మరో సినిమా షూటింగ్‌లో ఉంది. కన్నడలో ఆమె నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక హిందీ బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన నటించేందుకు సైన్ చేసింది.  

    ఇంతకుముందు షారూక్ ఖాన్‌తో కలిసి జవాన్ చిత్రంలో నయనతార నటించింది. ఇప్పుడు సల్మాన్‌తో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్ర పోషించనుంది. ఇందులో కూడా ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉండనుందని సమాచారం.  

    ఇలా ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయిన్‌గా నిలుస్తోంది నయనతార. నయనతార ఈ స్థాయికి రావడానికి గల కారణాల్లో ఆమె సినిమాల ఎంపికలో చూపే వైవిధ్యం ఒకటి. తన నటనతో ఇప్పటికే దక్షిణాది భాషల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునే ప్రయత్నంలో ఉంది.  

  • హాలీవుడ్ సినిమాలు సరైన కంటెంట్‌తో రావాలే గానీ మన దేశంలోనూ మంచి కలెక్షన్స్ వస్తాయి. ‍అలా లేటెస్ట్‌గా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. గత వీకెండ్ మన దేశంలోని విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? వసూళ్లు ఎంతొచ్చాయి?

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)

    మన దగ్గర ప్రస్తుతం 'ధురంధర్ 2' హవా నడుస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' గురించి సినీ ప్రేమికులు తెగ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పేస్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.2800 కోట్ల మేర వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరింతగా పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

    భారత్‌లో చాలావరకు ఈ సినిమాని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారు. అయినా సరే నాలురు రోజుల్లో రూ.18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా కొన్నిచోట్ల హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి గతంలో వచ్చిన ఇంగ్లీష్ చిత్రాలతో పోలిస్తే దీనికి బాగానే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.

    'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్-‍అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)

  • అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే స్పెషల్ పోస్టర్‌తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు బయటపెట్టారు. ఇదొచ్చిందని ఆనందించేలోపు మూవీ టీమ్‌కి ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఎదురైనట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)

    ఏప్రిల్ 8న ‍బన్నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని.. తర్వాత దుబాయిలో కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ యుద్ధ ప్రభావం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపై బలంగా ఉంది. మరీ ముఖ్యంగా దుబాయిలో ఎప్పటికప్పుడు ఏదో బాంబు పేలుతూనే ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నాయి. దీంతో దుబాయి షెడ్యూల్‌ని రద్దు చేశారట. మరి వేరే దేశానికి ఏమైనా దీన్ని షిఫ్ట్ చేస్తారా? లేదంటే పరిస్థితులు సద్దుమణిగాక దుబాయిలోనే చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

    ఇప్పటివరకు అయితే ముంబైలోనే వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై చాలావరకు సీన్స్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా, థియేటర్లలోకి రావొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు షూటింగ్ రద్దవడం లాంటి వార్తలు చూస్తుంటే.. థియేటర్లలోకి రావడం మరింత ఆలస్యమవుతుందా అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)

  • శర్వానంద్‌ హీరోగా నటింటిన తాజా చిత్రం ‘బైకర్‌’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 3న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజశేఖర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్  ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

    నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

    నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత  బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని  రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్  అమ్మేశారు (నవ్వుతూ).

    అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.

    ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.

    నా కుటుంబమే నా బలం.  ఈ సినిమా,  నా క్యారెక్టర్  ఇంత అద్భుతంగా రావడానికి  ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.

    కొత్త సినిమాల విషయాలకొస్తే..పవన్ సాదినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం.  బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.

  • సొట్టబుగ్గలతో క్యూట్‌గా లావణ్య త్రిపాఠి

    నారింజ రంగు చీరలో అను ఇమ్మాన్యుయేల్

    అందంతో చంపేస్తున్న దివ్య భారతి

    మెడలో పచ్చని హారంతో పాయల్ రాజ్‌పుత్

    ప్రకృతిలో యోగా చేస్తున్న అనన్య నాగళ్ల

    చూపు తిప్పుకోలేని గ్లామర్‌తో నిధి అగర్వాల్

  • తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఇందులో మలయాళ హీరో టొవినో థామస్.. విలన్‌గా నటిస్తున్నాడనే రూమర్స్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. ఇప్పుడు టొవినో హీరోగా నటించిన 'పల్లి చట్టంబి' మూవీ తెలుగులోనూ విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్ వచ్చాడు. మీడియాతో మాట్లాడుతూ తారక్-నీల్ సినిమాలో తాను నటించట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.

    (ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')

    'తెలుగ చిత్రాల్లో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. కానీ మలయాళ వర్కింగ్ కల్చర్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో భిన్నంగా ఉంటుంది. మేం తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తిచేసేస్తాం. తెలుగులో షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టముండదు. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తుంటా. ఒకవేళ తెలుగులో పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒప్పుకొన్నా మూడు-నాలుగు మలయాళ చిత్రాలపై దాని ప్రభావం పడుతుంది. అందుకే తెలుగులో నటించలేకపోతున్నా. డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ మూవీ(ఎన్టీఆర్-నీల్) చేయట్లేదు' అని టొవినో థామస్ చెప్పుకొచ్చాడు.

    కెరీర్ ప్రారంభంలో సహాయ నటుడిగా చాలా సినిమాలు చేసిన టొవినో థామస్.. గత పదేళ్లుగా మాత్రం హీరోగా మూవీస్ చేస్తున్నాడు. మిన్నల్ మురళి, 2018 తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇతడు పరిచితమే. అలాంటిది ఇప్పుడు ఇతడు, ఎన్టీఆర్-నీల్ మూవీలో లేడని తెలిసింది. మరి ఇతడి బదులు వేరే ఎవరిని తీసుకున్నారో చూడాలి?

    (ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)

  • అల్లు అర్జున్‌ అభిమానులకు నిర్మాత బన్నీ వాసు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. బన్నీ బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కి అందించబోతున్న  ప్రత్యేక కానుక ఏంటో రివీల్‌ చేశారు. 

    పుష్ప 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత అల్లు అర్జున్‌.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు . అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేయలేదు. సోషల్‌ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నా..అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. బన్నీ బర్త్‌డే (ఏప్రిల్‌ 8)  రోజు ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు వెల్లడించారు.  

    తాజాగా ఆయన పళ్లి చట్టంబి మూవీ టీమ్‌ ఏర్పాటు చేసిన గ్రాండ్‌ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ బర్త్‌డే కానుకగా కొత్త సినిమా అప్‌డేట్‌ ఏమైనా ఉంటుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానం చెప్పాడు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు స్పెషల్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేస్తారట.  

    ‘AA 22’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తోంది. దీపికతో పాటు జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై బన్ని బర్త్‌డే రోజు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

  • తెలుగులో దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కాస్త డిఫరెంట్ చిత్రాలు చూద్దామనుకుంటే మన ప్రేక్షకులు చాలామంది తమిళ, మలయాళం వైపు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఇండస్ట్రీల నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన మూవీస్ వస్తుంటాయి. ఇవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆదరణ బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')

    గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు శశికుమార్ లేటెస్ట్ తమిళ మూవీ 'మై లార్డ్'. పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్‌తో తీసిన సోషల్ డ్రామా చిత్రమిది. చైత్ర ఆచార్ హీరోయిన్ కాగా రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. మార్చి 20 నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

    'మై లార్డ్' విషయానికొస్తే.. అనాథలైన ముత్తుసిరిపి(శశికుమార్), సుశీల (చైత్ర ఆచార్) అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓరోజు గుడికి వెళ్లిన సుశీల కళ్లుతిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. అలానే తమకు తెలియకుండానే తమ శరీరంలోని కిడ్నీలు దొంగిలించారని వీళ్లకు తెలుస్తుంది. వీళ్లిద్దరూ చనిపోయారని ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ కేంద్రమంత్రికి కిడ్నీ దానం చేయాలని కొందరు వీళ్లని బలవంతపెడుతూ ఉంటారు. దీంతో ఓ చిన్న జర్నలిస్టు సాయంతో ముత్తుసిరిపి, సుశీల.. తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    థియేటర్లలో రిలీజైనప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. హీరో సూర్య.. తన బ్యానర్‌పై 'మై లార్డ్'ని సమర్పించడం విశేషం. సెకండాఫ్‌లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్‌బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష‍్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.

    మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.

    మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్‌ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.

    చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్‌తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.

    (ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్)

  • బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి.. బరువు సమస్యల కారణంగా తర్వాత మూవీస్ చేయడం చాలా తగ్గించేసింది. అప్పుడో ఇప్పుడో అన్నట్లు చేస్తూ వస్తోంది. 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకున్న ఈ హీరోయిన్.. గతేడాది 'ఘాటీ'తో ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది. ఇప్పుడు 'కథనార్' అనే మలయాళ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమైంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుష్కకి రెండు మూడు షాట్స్‌కి మాత్రమే పరిమితం చేశారు. విజువల్స్ బాగున్నాయి గానీ కాన్సెప్ట్ అర్థమై అర్థం కానట్లు అనిపించింది. డబ్బింగ్‌లో ఉపయోగించిన తెలుగు పదాలు కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విధంగా ఉన్నాయి.

    జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్. ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూలై ఆగస్టులో థియేటర్లలోకి మూవీ రానుందని తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకుడు. అనుష్కకి ఇది 50వ మూవీ కావడం విశేషం.

    (ఇదీ చదవండి: పెద్ది రిలీజ్‌ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్‌కేఎన్)

  • కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్‌ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్‌ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్‌.. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశాడు.

    రూ.600 కోట్లు..
    ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్‌ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్‌లో వెల్లడించాడు.  అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్‌లో వెల్లడించాడు.

    లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పు
    ఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.  అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్‌కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్‌ ఆనంద్‌కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. 


    సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులు
    విజయ్‌ అఫిడవిట్‌లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్‌ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

    బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్‌ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. దీంతో  వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేశారు.

    d

    కాగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.

     

International

  • టెహ్రాన్‌: ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా టెక్ కంపెనీలను లక్ష్యంగా  దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. రేపటి నుంచే ఈ దాడులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

    ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సైన్యం ఏప్రిల్ 1 నుంచి వెస్ట్ ఆసియా ప్రాంతంలో  అమెరికా కంపెనీలే లక్ష్యంగా చేసుకుంటామని  ప్రకటించాయి.  ఐఆర్‌జీసీ ప్రకటించిన జాబితాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. 

    అమెరికా దాడులకు ప్రతీకారంగా సైనిక స్థావరాలకే కాకుండా వాణిజ్య, సాంకేతిక రంగ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ చర్యలు ఏప్రిల్ 1, బుధవారం రాత్రి 8 గంటలకు (టెహ్రాన్ సమయం) ప్రారంభమవుతాయని హెచ్చరించింది. ‘ప్రతి ఉగ్రదాడికి ప్రతిగా గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా కంపెనీలను ధ్వంసం చేస్తాము’ అని ఐఆర్‌జీసీ  ప్రకటన విడుదల చేసింది.    

    ఇరాన్ గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు జరుపుతోంది. ఈ చర్యలు అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. అయితే, ఈసారి సాంకేతిక, వాణిజ్య రంగ సంస్థలను ప్రత్యక్షంగా లక్ష్యంగా చేసుకోవడంతో యుద్దం మరింత ఉద్రిక్తమయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

  • టెహ్రాన్‌: ఇరాన్‌పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్‌  ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.

    ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్‌లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్‌లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది.  

    అమెరికా వైపు చర్యలు
    అమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్‌లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం.

     

     

  • రోమ్‌: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు తమ గగనతలంలో అనుమతి ఇవ్వబోమని కొన్ని దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో ఇటలీ కూడా చేరింది. అమెరికా యుద్ధ విమానాలకు గగనతలాన్ని మూసివేయడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    ఈ నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కతూ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఇరాన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని దేశాలు తమకు కావాల్సిన చమురు అమెరికా నుంచి కొనుగోలు చేయాలి. లేదా హర్మూజ్‌ జలసంధి ద్వారా వెళ్లి మీకు కావాల్సి వెళ్లి స్వయంగా తెచ్చుకోవాల్సిందే’అని వ్యాఖ్యానించారు.

    హర్మూజ్‌ జలసంధి మూసివేతతో కొన్ని దేశాలు జెట్‌ ఇంధనం కొరతను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వద్ద ఇంధనం ఎక్కువగా ఉంది, కావాలంటే ఆ దేశాలు కొనుగోలు చేసుకోవచ్చు. ‘ధైర్యం చేసి హర్మూజ్‌కి వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకోండి’ అని బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ దేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మీరు అమెరికాకు తోడుగా లేరు. ఇకపై అమెరికా సహాయం చేయదు. ఇకనైనా మీరు ఒంటరిగా  పోరాడడం నేర్చుకోవాలి’ అని హెచ్చరించారు.
     
    హర్మూజ్‌ జలసంధి, పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి చమురు సరఫరా చేసే ప్రధాన మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ హెచ్చరిస్తూ ‘తక్షణమే కాల్పుల విరమణ జరగకపోతే, హర్మూజ్‌ జలసంధి తిరిగి తెరవకపోతే అమెరికా దాడులను విస్తరిస్తుంది. ఖార్గ్ దీవిలోని చమురు ఎగుమతి కేంద్రాన్ని, అవసరమైతే డీసాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు.

  • ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్తా రాత్రిలా మారిపోయింది. దానికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు సంకేతమా? 

    మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్‌ లో కూడా కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే, స్థానికులు ఇది ఒక ‘చెడు శకునం’ (Bad Omen) అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు. 

    దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్‌లో చెప్పబడిన ‘అంత్యకాలం’ (End Times) సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు మరియు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

    ప్రస్తుతం ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. 

    పక్షి శాస్త్రవేత్తల  ప్రకారం, దీనిని 'ముర్మురేషన్' (Murmuration) అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి.

    ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల్లో పెరిగిన 'అన్సర్టైనిటీ' (అనిశ్చితి). ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్‌లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా? లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు.

     

     

  • ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్  మొదలు  పెట్టిన యుద్ధం, ఇరాన్‌ ప్రతి దాడుల నేపథ్యంలో పవిత్ర వారంలో (Holy Week)  పాస్ ఓవర్ (Passover) వేడుకల సమయంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నగరంపై దాడులు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఈ దాడులను ధృవీకరించింది.

    జెరూసలేం ఆకాశంలో క్షిపణి దాడులు
    మంగళవారం ఇరాన్,  ఇజ్రాయెల్ భూభాగంపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.  జెరూసలేం అంతటా సైరన్లు మోగాయి. వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. దీంతో జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ (Temple Mount) అల్-అక్సా మసీదు (Al-Aqsa Mosque) వంటి పవిత్ర ప్రదేశాలపై క్షిపణి దాడి దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అయితే  పైన 'ఐరన్ డోమ్' , 'ఆరో' (Arrow) రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకున్నాయి. ఒకవేళ ఇవి నేరుగా తగిలి ఉంటే కోలుకోలేని నష్టం వాటిల్లేది. 

    మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాతలు టకర్ కార్ల్‌సన్ (Tucker Carlson) ,క్యాండేస్ ఓవెన్స్ (Candace Owens) ఈ విషయంలో ఇరాన్‌ను గట్టిగా ఖండించకపోవడమే కాకుండా, విభిన్నమైన, వివాదాస్పదమైన వాదనలు వినిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జెరూసలేం క్రైస్తవులకు, యూదులకు అత్యంత పవిత్రమైనది. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యాతలు ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇరాన్ దాడులను వారు ఖండించకపోవడం వారి మద్దతుదారుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    "అమెరికా ఫస్ట్" (అంటే అమెరికా ఇతర దేశాల యుద్ధాల్లో పక్షం వహించకూడదు) అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నవాళ్లలో వీరు ముఖ్యులు. ఈ క్రమంలో ఇరాన్ దురాక్రమణను నేరుగా ఖండించడం కంటే, అమెరికా ఈ గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రస్తుతం అమెరికాలోని రైట్‌ వింగ్‌లో ఒక పెద్ద చీలిక కనిపిస్తోంది. ఒక వర్గం ఇజ్రాయెల్‌ను పవిత్ర భూమిగా భావించి బేషరతుగా మద్దతు ఇస్తుంటే,కార్ల్‌సన్ , ఓవెన్స్ వంటి వారు ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చే ఆర్థిక, సైనిక మద్దతును ప్రశ్నిస్తున్నారు. అయితే జెరూసలేం వంటి పవిత్ర నగరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వీరు ఇరాన్‌ను ఖండించకపోవడం వెనుక వారి "ఐసోలేషనిజం" (Isolationism - అంటే ఇతర దేశాల గొడవల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదనే సిద్ధాంతం). ఇటీవల వారు అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

    కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాడులు, ప్రతిదాడులతో యావత్‌ ప్రపంచం దద్దరిల్లుతోంది. పవిత్ర భూమిపై భీకర దాడులు, యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అంతర్జాతీయ వేదికలపై దీనిపై జరుగుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం  ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

  • ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం దృష్ట్యా లాక్‌డౌన్ విధించినున్నారన్న వార్తల నడుమ అక్కడి ‍ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీకెండ్ లాక్‌డౌన్’ ప్లాన్‌కు ప్రావిన్షియల్ (రాష్ట్ర) ప్రభుత్వాలు గట్టిగా నో చెప్పడంతో ప్రస్తుతానికి లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకు తీసుకుంది.

    ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మండిపోతున్న వేళ, పాక్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక పొదుపు చర్యల్లో భాగంగా పలు ఆంక్షలను పరిశీలించింది. అయితే, తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా ఎలాంటి షట్‌డౌన్ ఉండబోదని స్పష్టమైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కోబోతోందని, దీనిని నియంత్రించేందుకు ఏప్రిల్ 4 లేదా 5 నుంచి ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

    శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసివేయడం, పెళ్లిళ్లు, బహిరంగ సభలపై నిషేధం, రవాణాపై ఆంక్షలు వంటి ప్రతిపాదనలతో ఒక ముసాయిదా కూడా సిద్ధమైంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన ‘ఐవాన్-ఎ-సదర్’లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ విధిస్తే సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రాల మద్దతు లభించకపోవడంతో కేంద్రం తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

    ప్రస్తుతానికి దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇచ్చారు. లాక్‌డౌన్ల కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చే చర్యలపైనే తాము దృష్టి సారిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు, ఇతర ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

    ఇది కూడా చదవండి: ‘జైషే’కు భారీ దెబ్బ.. తాహిర్ అనుమానాస్పద మృతి

Business

  • కొత్త కారు కొనాలనుకునే ప్లాన్ చేస్తున్నారా?, అయితే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో మీరు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి కారణం ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే.

    టాటా మోటార్స్ నుంచి.. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్, ఎంజీ మోటార్, హోండా మోటార్స్ వంటి పలు ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపును ప్రకటించాయి.

    బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్‌లు ధరలను సుమారు 2 శాతం మేర పెంచనున్నాయి. మరోవైపు. టాటా మోటార్స్ టియాగో, నెక్సాన్, సఫారీ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలను రూ.13,000 వరకు పెంచుతోంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. పెరుగుతున్న ఖర్చులు, బలహీనపడుతున్న రూపాయి, అధిక ముడిసరుకుల ధరలు, పెరిగిన రవాణా ఖర్చులు అని సంస్థలు వెల్లడిస్తున్నాయి.

  • ఇటీవల కాలంలో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే ఊహకందని విధంగా మారిపోతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే.. సాయంత్రానికి మరో రేటు ఉంది. ఈ రోజు కూడా ఇదే బాటలు గోల్డ్ రేటు అడుగులు వేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 136850 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 137050 రూపాయల వద్దకు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికి ధర రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల ధర రూ. 149290 నుంచి 149510 రూపాయల వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర 149660 రూపాయల వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 137200 రూపాయాల వద్దకు చేరింది. ఈ రేట్లు ఉదయానికి, సాయంత్రానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

    అయితే.. చెన్నై నగరంలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 136700 రూపాయల వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర 149130 రూపాయల వద్ద ఉంది.

    వెండి ధరలు
    కేజీ వెండి ధర రూ.250000 వద్ద ఉంది. ఈ రోజు (మంగళవారం) కేజీ సిల్వర్ రేటు రూ.5000 తగ్గడంతో రూ.2.5 లక్షల వద్ద నిలిచింది. అయితే ఢిల్లీలో వెండి రేటు రూ.5000 పెరిగింది. దీంతో అక్కడ కేజీ సిల్వర్ ధర రూ.2.5 లక్షల వద్ద ఉంది.

  • నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్, పీపీఎఫ్‌ సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగించనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు వివిధ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీములపై వడ్డీ రేట్లలో మార్పులేమీ ఉండవని ఆర్థిక శాఖ సోమవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

    దీని ప్రకారం సుకన్య సమృద్ధి స్కీముపై 8.2 శాతంగా, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్లపై 7.1 శాతంగా, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీములపై వరుసగా 7.1 శాతం, 4 శాతంగా వడ్డీ రేట్లు ఉంటాయి. కిసాన్‌ వికాస పత్రాలపై 7.5 శాతం, ఎన్‌ఎస్‌సీలపై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కం స్కీముపై 7.4 శాతంగా వడ్డీ రేటు కొనసాగుతుంది. కేంద్రం చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో కొన్ని పథకాల రేట్లను మార్చింది.

  • మధ్యప్రాచ్య సంఘర్షణపై నెలకొన్న ఆందోళనల నడుమ.. ఎల్‌పీజీ, ముడి చమురు నౌకలు కొచ్చికి చేరుకుని వినియోగదారులకు ఉపశమనం కలిగించాయి. ఖతార్ నుంచి ఎల్‌పీజీని తీసుకువస్తున్న 'అపోలో ఓషన్' ట్యాంకర్ నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకుంది. ఈ ట్యాంకర్ 9,086 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకువస్తోంది.

    నిన్న మధ్యాహ్నం కొచ్చికి చేరుకున్న ట్యాంకర్, గ్యాస్‌ను దించిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎల్‌పీజీని ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన వివిధ బాట్లింగ్ ప్లాంట్‌లకు రవాణా చేస్తారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో, దిగుమతి చేసుకున్న ఎల్‌పీజీ రాక చమురు కంపెనీలపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

    ఇదిలా ఉండగా.. రష్యా ముడి చమురు కూడా కొచ్చికి చేరుకుంది. 'నెవా' అనే చమురు ట్యాంకర్ రష్యాలోని కోస్మినో పోర్ట్ నుండి 1,084.80 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో కొచ్చికి చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే మన దేశంలో గ్యాస్ కొరత తగ్గుతుందని తెలుస్తోంది.

  • భారతదేశం ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలంటే.. బయోఫ్యూయల్ (జీవ ఇంధనం) మీద ఆధారపడాలని, దీనివల్ల దేశ ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని గడ్కరీ చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

    డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల దేశంలోని బయోఫ్యూయల్ కార్యక్రమాన్ని మరింత బలపరచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం.. ఇంధనాల్లో బయోఫ్యూయల్ మిశ్రమాన్ని పెంచేందుకు కొత్త ఫెడరల్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. దీని వల్ల ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు పండించే రైతులకు లాభం కలగనుంది.

    పర్యావరణ పరిరక్షణ సంస్థ ఖరారు చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. బయోమాస్ ఆధారిత డీజిల్ మిశ్రమం 60 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ ఇంధనాన్ని సాధారణంగా సోయాబీన్ నూనె, జంతువుల కొవ్వులు, ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఈ సంస్థ గ్యాసోలిన్, డీజిల్ కోసం మొత్తం పునరుత్పాదక ఇంధన అవసరాలను కూడా పెంచింది. ఇందులో భాగంగానే 2026, 2027 సంవత్సరాలకు కొత్త లక్ష్యాలను నిర్దేశించింది.

    బయోఫ్యూయల్ కార్యక్రమం వల్ల.. రైతుల నికర ఆదాయం 3 నుంచి 4 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్ వెల్లడించారు. అయితే దీనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన రిఫైనరీలు ఈ విధానం వల్ల తమ ఖర్చులు పెరుగుతాయని అంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు ఒత్తిడిలో ఉన్నాయని, ఈ కొత్త నిబంధనలు మరింత భారాన్ని పెంచవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

  • కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటు లక్ష్యంలో 80.4 శాతానికి సమానం. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 85.8 శాతంగా ఉండడం గమనించవచ్చు.

    2025–26 జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. కేంద్రానికి రూ.27.91 లక్షల కోట్ల ఆదాయం ఫిబ్రవరి చివరికి నాటికి వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి 82 శాతం సమకూరింది. రూ.21.45 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.5.8 లక్షల కోట్లు పన్నేతర రూపంలో వచ్చింది.

  • ఇండియాలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో కొత్త సీఈఓను ప్రకటించింది. పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా 'విలియం వాల్ష్' (Willie Walsh)ను నియమించింది.

    విలియం వాల్ష్ ప్రస్తుతం IATA (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అంతకంటే ముందు బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఐఏజీ వంటి ప్రముఖ కంపెనీలలో సీఈఓగా పనిచేచినట్లు ఇండిగో వెల్లడించింది.

    ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. విలియం వాల్ష్ ఒక అత్యుత్తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న విమానయాన రంగంలో ఇండిగోను మరింత బలోపేతం చేయడానికి ఆయన సరైన ఎంపిక అని చెప్పారు.

    తన నియామకంపై విలియం వాల్ష్ మాట్లాడుతూ.. ఇండిగోను నడిపించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంస్థకు బలమైన పునాది, స్పష్టమైన లక్ష్యం, మంచి ప్రతిష్ట ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా.. సంస్థలోని ఉద్యోగుల కృషి, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు, సహకారం, స్థిరమైన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.

  • నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2026 ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజును పెంచనున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేసిన ప్రకటన ఆధారంగా.. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 2008కి అనుగుణంగా వార్షిక రుసుమును పెంచింది.

    ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజు కోసం రూ.3075 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దీని ధర రూ.3000 ఉండేది. రేపటి నుంచి అదనంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.

    ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఎన్‌హెచ్‌ఏఐ ఫీజును పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాలలో వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తాయి.

    వార్షిక పాస్ ప్రయోజనాలు
    యాన్యువల్ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది.

    దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజాల వద్ద యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ పాస్ కలిగిన వాహనదారులు.. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్‌ప్రెస్‌వేలు ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.

    ఈ పాస్ ఎలా తీసుకోవాలి?
    వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్‌కే ఈ యాన్యువల్ పాస్‌ను లింక్ చేసుకోవచ్చు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.

    ఇదీ చదవండి: 'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా

  • అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఇటీవల రూ.95 మార్కును తాకిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా, పటిష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇటీవల లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి పతనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మూలాధారాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె తెలిపారు.

    రూపాయి భేష్

    రూపాయి విలువ తగ్గుదలపై స్పందిస్తూ, ‘మిగిలిన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పరిస్థితి బాగుంది. ఇది మెరుగైన స్థితిలోనే ఉంది’ అని మంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ఇస్తున్నాయని, ముఖ్యంగా మన ద్రవ్యలోటు నిర్వహణ, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు రూపాయికి రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

    గణాంకాలు ఇలా..

    మంత్రి సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం, మార్చి 27 నాటికి విలువ డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.94.82 వద్ద ముగిసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 27, 2026 మధ్య కాలంలో రూపాయి విలువ 9.9 శాతం మేర తగ్గింది. ఫిబ్రవరి 28న మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లో మొదలైన ఉద్రిక్తతల కారణంగా రూపాయి 4.1 శాతం మేర క్షీణించింది.

    ఆర్‌బీఐ పర్యవేక్షణ

    రూపాయి విలువ అనేది మార్కెట్ బాహ్య పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడుతుందని, దీనికి ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా పరిమితిని విధించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే, ఎఫ్‌డీఐ మార్కెట్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం పర్యవేక్షిస్తోందని, విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. విదేశీ మారకద్రవ్యం రాకను పెంచడానికి, ఇతర దేశాల్లో రూపాయి ఆమోదాన్ని పెంచడానికి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు

  • రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎరువుల విక్రయశాలల వద్ద రైతుల సందడి పెరిగింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్‌ ఈసారి మార్చిలోనే రికార్డు స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఎరువుల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో అన్నదాతలు భారీగా నిల్వలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు అంచనాలను మించిపోవడం గమనార్హం.

    గణాంకాలు ఏం చెబుతున్నాయి?

    ఎరువుమార్చి అంచనా డిమాండ్ (లక్షల టన్నుల్లో)మార్చి 23 నాటికే జరిగిన విక్రయాలు
    యూరియా14.9620.21
    డీఏపీ2.434.78
    కాంప్లెక్స్ ఎరువులు7.057.22
    ఎంఓపీ1.801.58

     

    గత ఏడాది (2025) మార్చి నెల మొత్తం మీద జరిగిన యూరియా విక్రయాలు 16.2 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది మార్చి 23 నాటికే అది 20 లక్షల టన్నులు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మార్చి 14 నుంచి 23 మధ్య పది రోజుల్లోనే సుమారు 13 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది.

    తెలుగు రాష్ట్రాల్లో నిల్వ ధోరణి

    తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరి సాగు కోసం రైతులు ముందస్తుగానే ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు. ఏటా సీజన్ సమయంలో ఎదురవుతున్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ముఖ్యంగా తక్కువ ధర ఉండే ఎరువులు, గతంలో కొరత ఏర్పడిన వాటిపై రైతులు మక్కువ చూపుతున్నారు. జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతోనే ఈ ముందస్తు నిల్వలు జరుగుతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఏ.కె.సింగ్ అన్నారు.

    ప్రభుత్వ చర్యలు - క్షేత్రస్థాయి పరిశీలన

    ఈ ఆకస్మిక విక్రయాల పెరుగుదలపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, పెరిగిన విక్రయాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.

    స్టాక్ వెరిఫికేషన్

    క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలపై భౌతిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజంగా రైతులే కొంటున్నారా? లేక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడానికి రికార్డుల్లో విక్రయాలు చూపి నిల్వ చేస్తున్నారా? అనే కోణంలో విచారణ జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు మొక్కజొన్న, చెరకు పంటల కోసం విక్రయాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.

    ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు

  • దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాలుగు కొత్త లేబర్‌ కోడ్లు అమలుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్లిష్టమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో సరళీకరించిన ఈ నూతన కోడ్లను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాల్సి ఉంది.

    స్వాతంత్య్రానికి పూర్వం నాటి పాత చట్టాలకు స్వస్తి పలికి మారుతున్న సాంకేతికత, పని వాతావరణానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకువచ్చారు. గత ఏడాది నవంబర్ 21, 2025న కేంద్రం వీటిని అధికారికంగా ప్రకటించినప్పటికీ రాష్ట్రాల నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఉండటంతో అమలు తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా, కార్మిక శాఖ ఈ నిబంధనలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు సమాచారం.

    ఏమిటి ఈ కొత్త కోడ్లు?

    1. వేతనాల కోడ్, 2019: వేతనాల పంపిణీ, కనీస వేతనాల క్రమబద్ధీకరణ.

    2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020: యాజమాన్యం, కార్మికుల మధ్య సత్సంబంధాలు, వివాదాల పరిష్కారం.

    3. సామాజిక భద్రత కోడ్, 2020: అసంఘటిత రంగ కార్మికులకు కూడా బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు.

    4. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020: పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు.

    జీతం లెక్కల్లో మార్పు..

    కొత్త కోడ్ల ప్రకారం వేతనం నిర్వచనంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం (బేసిక్‌ పే), కరువు భత్యం (డీఏ), రిటైనింగ్ అలవెన్స్ కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ఒకవేళ ఇతర అలవెన్సులు 50 శాతం మించితే ఆ అదనపు మొత్తాన్ని కూడా వేతనంగానే పరిగణిస్తారు. బేసిక్ పే పెరగడం వల్ల భవిష్య నిధి (పీఎఫ్‌), గ్రాట్యుటీ విరాళాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో కార్మికుడికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే ప్రతి నెలా చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

    కీలక సంస్కరణలు - ముఖ్యాంశాలు

    • ఈ నూతన చట్టాలు అమలులోకి వస్తే లింగ భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన వేతనం అందుతుంది.

    • సామాజిక భద్రతను నిర్ధారించడానికి ప్రతి కార్మికుడికి అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడం ఇకపై తప్పనిసరి.

    • కాంట్రాక్ట్ లేదా నిర్ణీత కాలానికి పనిచేసే వారికి కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందుతాయి.

    • ఫిర్యాదుల పరిష్కార కమిటీల్లో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పించాలి.

    • 500 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో ప్రత్యేక సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి.

    పెన్షన్ పథకంలో మార్పులు

    కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌) 1995 స్థానంలో కొత్త సవరించిన పథకం రానుంది. సామాజిక భద్రత కోడ్ కింద రూపొందించే ఈ కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చే వరకు పాత విధానమే కొనసాగుతుంది.

    కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిబంధనలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఇవి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి.

    ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు

Andhra Pradesh

  • తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం, ఏప్రిల్‌ 1వ తేదీ) ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడనున్నారు.ఏపీలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై ఆయ‌న మాట్లాడతారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర‌ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

  • సాక్షి, విజ‌య‌వాడ‌: ఏపీలో కూటమి ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమ‌ర్శించారు. కొంతమంది మూర్ఖుల ద్వారా రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కారణమవుతోంద‌ని ఆరోపించారు. కులాలు, మ‌తాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం డేంజ‌ర‌స్ గేమ్ ఆడుతోంద‌న్నారు. కులాలు, మతాల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయోగం చేస్తోందని మండిప‌డ్డారు. మంగ‌ళవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లేసి గద్దెనెక్కించిన ప్రజలపై ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏం ఆశించి కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని సూటిగా ప్ర‌శ్నించారు.  

    ''2014- 19 , 2019-24 మధ్య ప్రభుత్వాల్లో ఏపీలో ఎలాంటి మత ఘర్షణలు జరగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏపీలో కుల, మత ఘర్షణలు మొదలయ్యాయి. రెండు కులాలు, రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలనే దుర్మార్గకరమైన ప్రయోగం చేస్తున్నారు. కులాలు, మ‌తాలను ముడిపెట్టి రాజ‌కీయం చేయ‌డం రాష్ట్రానికి మంచిది కాదు. ఒక కులం వారు ఓటేయడం వల్లే మీకు 164 సీట్లు వచ్చాయా? ఆకువీడు ఘటన అత్యంత దురదృష్టకరం. అంతకంటే దురదృష్టకరమైన ఘటన తిరుపతి లడ్డూపై కల్తీ ప్రచారం. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని 6 నెలల పాటు చేసిన యాగీ ఎవరూ మర్చిపోలేదు. నిజమైన వెంకటేశ్వరస్వామి భక్తుడైతే చంద్రబాబు ఇలా చేసేవాడు కాదు. కానీ చంద్రబాబు భక్తుడి కంటే పొలిటీషియన్‌గానే వ్యవహరించారు. లడ్డూ ప్రసాదంపై, హిందూ సమాజంపై చంద్రబాబు తీవ్రమైన దాడి చేశారు. లడ్డూపై ప్రచారం చేస్తూనే క్రిస్టియన్లు, ముస్లింలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మ గౌరవంతో మొదలైన టీడీపీని చంద్రబాబు అధోగతి పాలు చేసే స్థాయికి తెచ్చారు. 

    డిప్యూటీ స్పీకర్లు, స్పీకర్ల స్థానంలో ఉన్న వ్యక్తులు.. క్రిస్టియానిటీ, ఎస్సీలపై వ్యవస్థీకృతమైన దాడి చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చేస్తున్న దాడికి టీడీపీ సమాధానం చెప్పాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చంద్ర‌బాబు ఇచ్చిన అలుసు కార‌ణంగానే రఘురామ కృష్ణంరాజు రెచ్చిపోతున్నార‌ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మీరు ఇచ్చిన అలుసు కారణంగానే పోలీసులు రఘురామ కృష్ణంరాజుకు ఊడిగం చేస్తున్నారు. కుల మతాలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ఆద్యులు. క్రిస్టియన్లు, ముస్లింలు ఓటేయకుండానే మీకు 164 సీట్లు వచ్చాయా? మీకు ఓట్లేసిన పాపానికి క్రిస్టియన్లు, ముస్లింలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారో మీకు అర్ధం అవుతుందా?

    నన్ను విమర్శిస్తున్న రఘురామకృష్ణంరాజుకు సంస్కారం లేదు. నీ ల్యాంగ్వేజ్‌లో మాట్లాడటానికి నాకు రెండు నిమిషాలు పట్టదు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు శకుని పాత్రకు సరిగా సరిపోతాడు. ఆకువీడులో రఘురామకృష్ణంరాజు మొదలుపెట్టిన డేంజరస్ క్రీడ టీడీపీ పునాదులను కదిలించడానికే.  ఉండి నియోజకవర్గంలో ఎస్సీలు, క్రిస్టియన్లు ఓటేయకుండానే నువ్వు గెలిచావా? ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ , బీసీలు ఓటేయకుండానే మీకు భారీ మెజారిటీలు వచ్చాయా? రఘురామ కృష్ణంరాజు ఒక మతంపై దాడి చేస్తుంటే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏం చేస్తున్నారు? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దళితుడు కాబట్టి నోటీసులిచ్చారు. రఘు రామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ కాబట్టి అతను ఏం చేసినా వంత పాడుతున్నారు. 

    రఘురామ కృష్ణంరాజుపై దాడి జరిగిపోయిందని చంద్రబాబు, పవన్ హడావిడిగా ఖండించారు. మరి దళితులపై జరిగిన దాడులు మీకు కనిపించవా? పి.గన్నవరంలో ఒక శవాన్ని అడ్డుకుంటే ఖండించడం మీకు చేతకాదా? కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ మునిగిపోవడం ఖాయం. హిందూత్వ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దుర్మార్గపు ఆలోచన మీది. మీరు ఎన్ని కుట్రలు చేసినా హిందు, ముస్లిం, మైనార్టీలు ఒక్కటే. కులమతాల మధ్య గొడవలు పెట్టే మిమ్మల్ని ప్రజలు నమ్మర''ని జడ శ్రావణ్ కుమార్ ఫైర్ అయ్యారు. 


     

  • సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

    చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు.  
     

  • తాడేపల్లి :  తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నంకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు. టీడీపీ గూండాలు చేసిన దాడుల గురించి వైఎస్‌ జగన్‌కు వివరించారు. జగన్‌ను కలిసిన వారిలో రామాపురం, చర్లగుడిపాడు గ్రామాల వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు ఉన్నారు. 

    చర్లగుడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు పార్టీ కార్యకర్తలను హతమార్చారు టీడీపీ గూండాలు. తమ వారి హత్యలతో తామంతా రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులు. 

    బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ ఓదార్చారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ల్నాడులో గూండారాజ్యం నడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని వైఎస్‌ జగన్‌ తప్పుబట్టారు. 

  • సాక్షి,అన్నమయ్య: భవిష్యత్‌లో రాయలసీమకు సాగునీరు,తాగునీరు తీవ్ర ఇబ్బందులు రాబోతున్నాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి నీళ్లు రావడమే కష్టంగా ఉంది. కర్ణాటక రాష్ట్రం లో 1996 ఆలమట్టి రిజర్వాయర్‌గా   ప్రారంభమై 200 టీఎంసీ వరద నీరు నిల్వ స్థాయికి చేరింది.

    అప్పర్ భద్ర, తుంగ భద్ర నీళ్ళు 30 టీఎంసీ నిల్వ చేస్తున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి లక్ష ఎకరాలు ఇచ్చిన ఘనత ఈ ప్రాంత రైతులది. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా నీళ్లు తీసుకుని వ్యవసాయం అంటే గిట్టని చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలుపుదల చేస్తూ, శిష్యుడుకు తాకట్టు పెట్టాడు.

    90 శాతం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అయ్యాయి.840 అడుగులు దగ్గర పోతిరెడ్డిపాడు వద్ద కృష్ణా నది నుండి నీళ్లు వస్తాయి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వెంటనే పూర్తి చేయాలి.రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం ఉండదు.

    వైఎస్సార్‌సీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది.పోలవరం ఎడమ పనులు పూర్తి చేయకుండా ఉత్తరాంధ్రకు ఆన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు.15 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అమరావతిలో వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. హంద్రీనీవా ప్రాజెక్టులో  కాలువలు ఎత్తు తగ్గించాడు.రాయలసీమ నుంచి కర్నూలు హైకోర్టు తీసుకుపోయారు, ఎయిమ్స్ ను తరలించుకుపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను వెంటనే పూర్తి చేయాలి’అని డిమాండ్‌ చేశారు.  

    రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం
  • గుంటూరు: వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా బలోపేతం అయ్యేలా ముందుకు వెళ్లాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసి హింసించారని చెప్పారు.

    గుంటూరులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ లిస్టు పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనకు అనుకూలమైన ఓట‍్లను తీసివేసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండండి. 

    ప్రభుత్వం ఎన్ని దాడులు చేసి, ఎంత హింసించినా మన కార్యకర్తలు నాయకులు ఎక్కడా భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ధైర్యంగా నిలబడిన ప్రతి నాయకుడికి, పార్టీ కార్యకర్తకు అభినందనలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ ఇళ్లపై దాడి చేశారు. కూటమి నాయకుల దాడులకు బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు.

    కూటమి నేతలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేశారో ప్రజలకు వివరించాలి. గత ఏడాది రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. వైఎస్‌ జగనన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకున్నాం.

    రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2028 కల్లా పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. 2028 కల్లా రాజధాని పూర్తయితే ఇంకా అసెంబ్లీలో తీర్మానం ఎందుకు? రాజధాని తీర్మానం పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా ఆడింది. ఇదో రకమైన డైవర్షన్ పాలిటిక్స్. రాజధాని పేరుతో మొదట్లో 50 వేల ఎకరాలకు పైగా భూమిని తీసుకున్నారు. 

    అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

    రైతులకు తిరిగి ఇచ్చే ప్లాట్లను ఎక్కడ అభివృద్ధి చేశారు? అమరావతిలో రోడ్లు ఎక్కడ పూర్తి చేశారు? ఇవేమీ జరగకుండానే మరోసారి 50వేల ఎకరాలు రెండో దశలో తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఖర్చు పెట్టే పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా? అమరావతి పేరుతో టెండర్లు పిలిచి ఏటీఎంలా వాడుకున్నారు. అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.. దానికోసమే అసెంబ్లీలో తీర్మానం’ అని చెప్పారు.

Telangana

  • హైదరాబాద్‌:  కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది.   ఆస్పత్రి మహిళా వాష్‌రూమ్‌ ఫ్లష్‌ ట్యాంకులో శిశువు డెడ్‌ బాడీ లభించడం హృదయ విదారకంగా మారింది. ఓ మహిళ ప్రసవం అనంతరం శిశువును ఫ్లష్‌ ట్యాంక్‌లో పడేసింది. ఆపై అక్కడ నుంచి పరారైంది.  

    ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనతో అంతా షాక్‌కు గురౌతున్నారు.  అప్పుడే పుట్టిన పసికందను ఇలా ఫ్లష్‌ ట్యాంక్‌లు పడేయడం ఏంటని విస్తుపోతున్నారు. 

  • హైదరాబాద్‌: ఏప్రిల్‌ 2వ తేదీన జరగనున్న శ్రీ హనుమాన్‌ జయంతి  శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను అత్యంత ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహించేందుకు నగర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్ర ఏర్పాట్లపై కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖలు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రను అన్ని శాఖల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసినట్లే, హనుమాన్ విజయ యాత్రను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

    ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు వెల్లడించారు.

    యాత్ర నిర్వహణలో వాలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు.

    యాత్రలో కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిర్ణీత మార్గాల్లోనే యాత్ర సాగేలా చూడాలని కోరారు. ఫ్లైఓవర్లు, రైల్వే బ్రిడ్జిల దృష్ట్యా విగ్రహాల ఎత్తు విషయంలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మళ్లింపులు చేపడతామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    సమావేశం అనంతరం సీపీ గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల యాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులను హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కైతలాపూర్‌ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ సైతం రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

    పోలీసుల దర్యాప్తులో తల్లి స్రవంతి ముందుగా ఇద్దరు కుమారులు కార్తిక్‌,కౌశిక్‌లను హత్య చేసింది. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

    మరోవైపు, భార్య స్రవంతిని వదిలేసి భర్త ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో అత్తమామలు స్రవంతికి కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే, ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వాలని భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇదే కారణంగా భార్య, పిల్లలను భర్త ప్రవీణ్ హత్య చేసి ఉండవచ్చని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

     

  • హైదరాబాద్‌:  రిటైల్‌ చికెన్‌ షాపులకు ఇచ్చే మార్జిన్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్‌ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా రేపట్నుంచి(బుధవారం, ఏప్రిల్‌ 1వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.  పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం (మార్జిన్) తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్‌ను పెంచాలని డిమాండ్‌ చేస్తోంది చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌. 

    గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చే వారని, గత 20 ఏళ్ళుగా 26 రూపాయలే మార్జిన్ ఉందని, కానీ ఇటీవల మార్జిన్‌ను16 రూపాయలకు తగ్గించారని, ప్రస్తుతం కేజీ చికెన్‌కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

    అసోసియేషన్ నాయకుల చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం చికెన్‌ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటించనున్నట్లు ప్రకటించారు.

    ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశముంది. ముఖ్యంగా వేసవి కాలంలో చికెన్‌కు ఉన్న డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు త్వరగా జోక్యం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. లేదంటే ఈ బంద్‌ దీర్ఘకాలం కొనసాగి మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న మహాలక్ష్మి(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లబ్ధిదారులైన మహిళలు కోట్ల సంఖ్యలో పొందిన ఉచిత ప్రయాణాల విలువ రూ. 10,000 కోట్ల చరిత్రాత్మక మార్కును చేరుకుందని  టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.

    ఈ చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి, ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన లబ్ధిదారులను అభినందించడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం (మార్చి 31, మంగళవారం) బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ (ప్రగతి భవన్)లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొనున్నారు.

    మహాలక్ష్మి పథకం 2023 డిసెంబరు 9న ప్రారంభం కాగా, ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఏకంగా రూ.10వేల కోట్లను ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వం చెబుతోంది.

    మహాలక్ష్మి స్కీమ్ సేవల కోసం త్వరలో మహిళలకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు ఇస్తామని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని.. పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 నుంచి 67కు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

     


     

Advt

  • భారతదేశపు ప్రముఖ ఏఐ బేస్డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్‌వర్స్.ఏఐల మాతృ సంస్థ అయిన వెర్స్‌ ఇన్నోవేషన్ (VerSe Innovation).. తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్. రమేష్‌ను నియమించినట్లు ప్రకటించింది. సంస్థాగత మరియు వ్యూహాత్మక వృద్ధిలో.. తదుపరి దశ వైపు కంపెనీ పురోగమిస్తున్న తరుణంలో, ఆయన ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తూ, కంపెనీ పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేస్తారు.

    రమేష్ ఫైనాన్షియల్ పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీ సలహా..  బోర్డు నాయకత్వంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్, డెలాయిట్ గ్లోబల్ బోర్డు మాజీ సభ్యుడు. తన కెరీర్‌లో.. ఆయన ప్రముఖ భారతీయ, బహుళజాతి సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలు, రెగ్యులేటరీ కంప్లయన్స్‌పై సలహాలు ఇచ్చారు.

    ఆయన ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, లార్సెన్ & టూబ్రో, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐటీసీ హోటల్స్, సైయంట్, తేజస్ నెట్‌వర్క్స్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి అనేక ప్రముఖ లిస్టెడ్ అండ్ అన్‌లిస్టెడ్ కంపెనీల బోర్డులలో కూడా పనిచేసినట్లు సమాచారం. 2022-23 సంవత్సరానికి గాను ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ ఆయనకు "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును ప్రదానం చేసింది.

    వృత్తిపరమైన సేవలలో తన నాయకత్వంతో పాటు.. రమేష్ భారతదేశంలో నియంత్రణ, విధాన సంభాషణలను తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన సెబీ, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఎలకు అనుబంధంగా ఉన్న కీలక కమిటీలు, సలహా సంస్థలలో పనిచేశారు, తద్వారా వివిధ రంగాలలో పరిపాలన, ఆర్థిక ప్రమాణాల పరిణామంకు కూడా దోహదపడ్డారు.

    వెర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడి మాట్లాడుతూ..''కాలపరీక్షకు నిలబడే కంపెనీని నిర్మించడానికి పటిష్టమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. బోర్డు సారథ్యం, ​​నియంత్రణ చట్రాలు, గ్లోబల్ ఆడిట్ నాయకత్వంలో పి.ఆర్. రమేష్‌కు సాటిలేని అనుభవం ఉంది. వెర్సే పరిణతి చెందుతూ.. సుస్థిర వృద్ధిపై తన దృష్టిని పదును పెడుతున్న తరుణంలో, మా పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడంలో.. వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన దృక్పథం కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.

    ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. "భారతదేశ డిజిటల్ రంగంలో వెర్సె ఒక గణనీయమైన స్థాయి వ్యాపారాన్ని నిర్మించింది. ఆ స్థాయికి తగ్గట్టుగానే, పాలనా వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణలు, రిస్క్ పర్యవేక్షణ కూడా వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వస్తుంది. బలమైన సంస్థలు కేవలం ఆవిష్కరణలపైనే కాకుండా, క్రమశిక్షణ, జవాబుదారీతనంపై కూడా నిర్మితమవుతాయి. ఈ సూత్రాలను మరింత బలపరచడానికి, నిరంతర, బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే పాలనను రూపొందించడంలో సహాయపడటానికి, బోర్డు, యాజమాన్య బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

    వెర్స్ ఇన్నోవేషన్‌లో.. రమేష్ ఆడిట్ కమిటీకి అధ్యక్షత వహించడంతో పాటు, ఆర్థిక నివేదికల సమగ్రత, అంతర్గత నియంత్రణలు, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, నియంత్రణ సమ్మతి, ఆడిట్ ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. కంపెనీ కార్యాచరణ క్రమశిక్షణ, పాలనా వ్యవస్థలు మరియు దీర్ఘకాలిక విలువ సృష్టి ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్న తరుణంలో, ఆయన నియామకం బోర్డు పర్యవేక్షణ సామర్థ్యాలకు గణనీయమైన బలాన్ని చేకూరుస్తుంది.

    వెర్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి
    డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో టెక్నాలజీ సహాయపడుతుందనేదే.. వెర్స్ ఇన్నోవేషన్ ప్రధాన సూత్రం. ప్రారంభమైనప్పటి నుంచి, వెర్స్ సాంకేతికతను ఉపయోగించి లక్షలాది వినియోగదారుల తీరని కంటెంట్ అవసరాలను తీర్చే సవాలును స్వీకరించింది. దీని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాంకేతికతలు, వినియోగదారుల వినియోగ ప్రాధాన్యతల ఆధారంగా లక్షలాది వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను అందించడానికి వీలు కల్పిస్తాయి.

    నేడు వెర్స్ ఇన్నోవేషన్ యొక్క సొంత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, భారతదేశవ్యాప్తంగా వందల మిలియన్ల మంది వినియోగదారులు డైలీహంట్‌లో తమ స్థానిక భాషలో కంటెంట్‌ను ఆస్వాదించేలా శక్తినిస్తోంది. దీని సాంకేతికత భారతదేశపు నెంబర్ 1, అత్యంత ఆకర్షణీయమైన క్రియేటర్స్ యాప్ అయిన జోష్‌కు కూడా శక్తినిస్తోంది. దీనికి అదనంగా.. వెర్స్ వద్ద నెక్స్‌వెర్సె.ఏఐ, డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో కాలింగ్ & ఆడియో స్టోరీస్ అండ్ వెర్సె కొలాబ్ వంటి ఏఐ-ఫస్ట్ ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌ల సమీకృత పోర్ట్‌ఫోలియో ఉంది. ఇవన్నీ కలిసి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, కంటెంట్ మరియు బ్రాండ్‌లు పరస్పరం వ్యవహరించే విధానాన్ని పునర్నిర్మిస్తున్నాయి.

    భారత్‌పై దృష్టి సారించిన తన యాప్‌ల శ్రేణితో.. వెర్స్ ఇన్నోవేషన్, స్థానిక భాషల టెక్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్‌గా అవతరించింది. దీనిలో సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ (OTPP), ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA), సిగులర్ గఫ్, కార్లైల్ గ్రూప్, బెయిలీ గిఫోర్డ్, గోల్డ్‌మన్ సాక్స్, గ్లేడ్‌బ్రూక్స్, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, ఆల్ఫావేవ్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, లూపా సిస్టమ్స్, లక్సర్ గ్రూప్, సోఫినా, బి క్యాపిటల్ గ్రూప్, ఐఐఎఫ్ఎల్, కోటక్, కాటమరన్, బే క్యాపిటల్, ఎడెల్‌వైస్ మరియు ఒమిడ్యార్ నెట్‌వర్క్ వంటి సంస్థలు ప్రస్తుత పెట్టుబడిదారులుగా ఉన్నాయి.

Family

  • మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రాధికా మర్చంట్‌ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్‌ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్‌ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. 

    చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్‌ రిచర్డ్ మిల్లే వాచ్‌తో తన లుక్‌ను హైలెట్‌ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్‌. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. 

    సముద్ర స్ఫటికపు పారదర్శకత,  గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్‌. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్‌. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది.  దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

    ప్రత్యేకతలు..
    వాచ్‌ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్‌తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్‌ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్‌ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. 

    అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్‌బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ​ సుమారు 65 గంటల వరకు ఫుల్‌ చార్జ్‌ ఉంటుందట. ఈ వాచ్‌ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు.

     

    (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!)

     

  • యంగ్‌గా ఉన్నప్పుడు నేర్చుకోవడం వేరు..పెద్ద వయసు వచ్చాక కొత్తవి నేర్చుకోవాలన్న లోలోన ఏదో బెరుకు ఉంటుంది. కొందరు మాత్రం చాల డేర్‌గా నచ్చిన నైపుణ్యాలను అందుపుచ్చుకునేందుకు ముందుకొస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ విద్యాకౌర్‌.

    మాజీ ఉపాధ్యాయురాలు, ప్రిన్సిపాల్‌ అయిన విద్యాకౌర్‌కి ‍డ్రైవింగ్‌ అంటే మహా ఇష్టం. ఎలాగైన నేర్చుకోవాలన్నది ఆమె డ్రీమ్‌. అయితే 59 ఏ‍ళ్ల వయసులో డ్డ్రైవింగ్‌ నేర్చుకుందామనుకుంటే..చాలా పెద్ద వయసు అని తిరస్కరించారు అధికారులు. అయితే విద్యాకౌర్‌ తగ్గేదే లే అంటూ ముందుకు సాగింది. 

    ఆమెనే స్వయంగా కారు కొనుక్కుని పొరుగువారి సాయంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నారామె. ప్రస్తుతం ఆమెనే స్వయంగా కారుని రయ్‌ రయ్‌మని నడిపేస్తోంది. సీనియర్‌ సిటిజన్‌ అనే మూసధోరణిని బద్దలు కొడుతూ..స్వేచ్ఛగా సాగిపోతోందామె. ఇక్కడ విద్యాకౌర్‌ కథ ఎవరో మన పరిమితుల్ని డిసైడ్‌ చేయడం కాదు..మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకు సాగిపోచ్చు అని చాటి చెబుతోంది ఈ సూపర్‌ బామ్మ స్టోరీ.

     

    (చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)

     

  • సమ్మర్‌ అనగానే అందరికి గుర్తొచ్చేది పుచ్చకాయ. వేసవి దాహార్తిని చల్లార్చేది పుచ్చకాయ ఒక్కటే. అది తినగానే తక్షణ శక్తి, దాహం తీరుతుంది కూడా. అలాంచి పుచ్చకాయను తినేముందు చిటికెడు ఉప్పు ఎందుకు జల్లుతారో తెలుసా!. అలా తింటేనే మంచిదా అంటే..

    సాధారణంగా చాలామంది పుచ్చకాయను అలానే తినేస్తారు. కొందరు మాత్రం తప్పనిసరిగా చిటికెడు ఉప్పు జల్లుకునే తింటుంటారు. ఇలా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!.

    సహజమైన తీపి..
    చిటికెడు ఉప్పు పుచ్చకాయ రుచిని మరింత తీపిగా చేస్తుంది. రుచి గ్రాహకాలు రుచిని గ్రహించే విధానాన్ని ఉప్పు ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇలా మరింత తీపిగా అనిపిస్తుందట. అలాగే ఉప్పులో ఉండే క్లోరైడ్‌ అయాన్లు తీపి రుచి గ్రాహకాలతో చర్య జరిపి తక్కువ గాఢతలో తీపిని గ్రహించే శక్తినిపెంచి, చేదుని తగ్గిస్తాయి. అంటే ఉప్పు పండులోని సహజ చక్కెరలను ఉత్తేజపరిచి వాటి ప్రభావాన్ని పెంచుతుంది, మరింత రుచికరంగా ఉంటుంది కూడా.

    కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. .
    పుచకాయలో సహజంగా నీటి శాతం ఎక్కువ. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలపడంతో శరీరానికి తగిని సోడియం అంది, ద్రవాలను నిలుపుకోవడానికి హైడ్రేషన్‌కు హెల్ప్‌ అవుతుంది. ఇది ప్లాస్మా పరిమాణాన్ని నిర్వహించడంలో అలాగే శరీరం తీసుకున్న నీటిని త్వరగా బయటకు పంపకుండా నిలుపుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వేడికి గురైన వెంటనే లేదా అధిక శ్రమ తర్వాత నీరు, సోడియం కలియిక నీరు రీహైడ్రేషన్‌కి ప్రభావవంతంగా ఉంటుందట.

    రుచి సమతుల్యతను మెరుగుపరుస్తుంది
    కొన్నిసార్లు పుచ్చకాయ రుచి చప్పగా లేదా మరీ నీళ్ళగా అనిపించవచ్చు. చిటికెడు ఉప్పు రుచిని సమతుల్యం చేయడం తోపాటు ప్రతి ముక్కను మరింత రుచికరంగా మారుస్తుంది.

    జీర్ణక్రియకు సహాయపడుతుంది..
    తక్కువ పరిమాణంలో జీర్ణరసాలను ప్రేరేపించడంలో ఉప్పు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. సాధారణంగా పుచ్చకాయ చాలా సులభంగా జీర్ణమవుతుంది, ఈ చిన్న చేర్పు మొత్తం తినే అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా భోజనం తర్వాత లేదా స్నాక్‌గా తీసుకున్నప్పుడు.

    శ్రద్ధగా తినేలా చేస్తుంది.. 
    పుచ్చకాయకు ఉప్పు కలపడం వల్ల  తినే వేగాన్ని తగ్గిస్తుంది. ఒక గిన్నెను త్వరగా పూర్తి చేయడానికి బదులుగా, ప్రతి ముక్కను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతారు. ఇది పరిమాణ నియంత్రణకు సహాయపడటం తోపాటు సంతృప్తికరంగా అనిపించేలా చేస్తుంది. 

    కాబట్టి, పుచ్చకాయకు చిటికెడు ఉప్పు కలపడం వల్ల పండు పోషక విలువలు పెద్దగా మారవు, కానీ అది తినే అనుభవాన్ని ఆనందదాయకంగా, సమతుల్యంగా చేస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు చాలు. ఎక్కువైతే  పండు సహజ రుచిని డామినేట్ చేసి,  సోడియం తీసుకోవడం అధికమయ్యే అవకాశం ఉంటుంది. అవసరమైతే అదనపు రుచి కోసం నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపునులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: చాయ్‌వాలాగా 103 ఏళ్ల బామ్మ..!)
     

Politics

  • కాకినాడ:  ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్‌ చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్‌మెన్‌గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

    తన వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్‌ కళ్యాణ్‌ వద్ద గన్‌మెన్‌గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్‌మెన్‌ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

    ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్‌ కళ్యాణ్‌ గన్‌మెన్‌ అని రాయాలని సవాల్‌ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్‌ను కూడా ప్రచురించాలని చాలెంజ్‌ చేశారు.  ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు.

    కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
  • సాక్షి, హైదరాబాద్‌: సినిమా వాళ్ళు చేస్తే ఒప్పు, రాజకీయ నాయకులం చెప్తే తప్పా? అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. హీరోలకంటే రాజకీయ నాయకులకు ప్రైవసీ లేకుండా పోయింది.. సినిమాల్లో హీరోలు తాగితే తప్పులేదా?’’ అంటూ మండిపడ్డారు.

    ‘‘ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతాడు. ధూల్‌పేటలో గుడుంబా దొరుకుంటుందని సినిమాలో చూపెట్టాడు. బాలకృష్ణ సినిమాలో మామా ఏక్ పెగ్ లా అనే పాటలో నటించాడు. మందుబాబులం అనే పాట పాడుకుంటూ డ్యాన్స్ చేశారు. రాజకీయ నాయకులం కల్తీసారా తాగకండి అంటే బద్నాం చేస్తారా.. ఎక్కువ డ్రగ్స్ వాడేది సినీ ఇండస్ట్రీ లోనే’’ అని అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

    ‘‘సినీ యాక్టర్స్ అందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు. సినిమా వాళ్లపైనే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. మా రాజకీయ నాయకులపై ఎక్కువగా రూమర్స్ లేవు. అందరూ సినిమా యాక్టర్స్ 90 రోజుల కోకసారి పాలికర్ టెస్ట్ చేయించుకోవాలి. నేను కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా.. నా కొడుకు నన్ను డ్రగ్స్ గురించి అడిగాడు. ఇప్ప సారా ఇండియన్ లిక్కర్. ఇప్పసారాను బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇప్పసారాకు 3000 ఏండ్ల చరిత్ర ఉంది. నేను సారాకి వ్యతిరేకం. తాగమంటున్నాడని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.

    కల్తీ సారా కంటే ఇప్పసారా చాలా మంచిది. రాలిపోయిన ఇప్ప పూల నుండి సారా చేస్తారు. ఇప్ప సారా వల్ల లాభాలపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఆదివాసీలు లిక్కర్ చేస్తే తప్పా?. కార్పొరేట్ కంపెనీలు లిక్కర్ చేస్తే కరెక్టా?. ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ మంచిది. ఇండియా నుండి తీసుకుపోతున్న ఇప్ప పువ్వుతో విదేశాల్లో సారా చేసి వేలల్లో సంపాదిస్తున్నారు. ఆదివాసీలు ఉన్నారు కాబట్టే అడవులు ఉన్నాయి’’ అని  అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు.

Guest Columns

  • భారతదేశంలో అత్యున్నత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేవలం ఒక ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల కెరీర్‌ను నిర్దేశించే కీలక ఘట్టం. ప్రస్తుతం ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆన్‌లైన్‌ విధానంలో, పలు షిఫ్టులలో నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అనుసరిస్తున్న ‘పర్సెంటైల్‌’ విధానం, షిఫ్టులలో పరీక్ష నిర్వహణ వంటివాటిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది.

    ప్రస్తుత ఆన్‌లైన్‌ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతి బంధకంగా మారింది. దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థలో విద్యా ర్థులు పెన్ను, పేపర్‌తో పరీక్షలు రాయడానికే అలవాటు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన కంప్యూటర్‌ పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, అద్భుతమైన సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఉన్న విద్యార్థులు కూడా స్క్రీన్‌ చూస్తూ సమాధానాలు గుర్తించడంలో తడబడుతున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులు మాక్‌ టెస్టుల ద్వారా పొందే ప్రావీణ్యం, గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో లేక పోవడం వల్ల ‘సమానత్వం’ దెబ్బతింటోంది.

    చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు లేవనెత్తే ప్రధాన ప్రశ్న, ‘నీట్‌ పరీక్షను 23 లక్షల మంది రాసినా ఒకే రోజు, ఒకే పేపర్‌తో ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పుడు... అందులో సగం సంఖ్యలో ఉండే జేఈఈని ఎందుకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించలేక పోతున్నారని! ఆఫ్‌లైన్‌లో షిఫ్టుల సమస్య ఉండదు. అందరికీ ఒకే ప్రశ్నాపత్రం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక అడ్డంకులు తొలగిపోతాయి.

    అంతర్జాతీయంగా నార్మలైజేషన్, పర్సెంటైల్‌ విధానం అనేక దేశాల్లో అమలులో ఉంది. ఉదాహరణకు, అమెరికాలో ఎస్‌ఏటీ (శాట్‌), జీఆర్‌ఈ పరీక్షలు ఐఆర్టీ (ఐటెమ్‌ రెస్పాన్స్‌ థియరీ) ఆధారిత ‘ఈక్వేటింగ్‌’ పద్ధతిని పాటిస్తాయి. ఈ విధానంలో విద్యార్థికి కఠినమైన ప్రశ్నలు వచ్చినప్పుడు, వాటిని సరిగ్గా రాస్తే ఎక్కువ స్కోర్‌ వస్తుంది; దీనివల్ల ఏ రోజు పరీక్ష రాసినా స్కోరులో వ్యత్యాసం ఉండదు. ఆస్ట్రేలియాలో ఏటీఆర్‌ విధానం ద్వారా వేర్వేరు సబ్జెక్టుల కఠినతాన్ని బట్టి స్కేలింగ్‌ చేస్తారు.

    అయితే, భారతదేశంలో వాడుతున్న పద్ధతి ‘పోస్ట్‌–హాక్‌  నార్మలైజేషన్‌’. అనగా పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థుల మార్కుల సగటును బట్టి పేపర్‌ కఠినత్వాన్ని నిర్ణయిస్తారు. ఇది తరచుగా ‘లక్‌ ఫ్యాక్టర్‌’కు దారితీస్తోంది. ఒకే మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులలో, షిఫ్ట్‌ తేడా వల్ల ఒకరికి ఎన్‌ఐటీలో సీటు రావడం, మరొకరు కనీసం క్వాలిఫై కూడా కాకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సులభమైన షిఫ్ట్‌ వచ్చిన విద్యార్థి ఒక చిన్న తప్పు చేసినా వేల ర్యాంకులు వెనక్కి వెళ్తున్నారు. ఇది విద్యార్థులలో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.

    ఇక షిఫ్టులు, పర్సెంటైల్‌ సమస్యలే కాకుండా... జేఈఈ మెయిన్స్‌ ప్రశ్నాపత్రంలో మరొక ముఖ్యమైన లోపం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, 2026తో సహా పలు సెషన్లలో ప్రశ్నలు తప్పుగా ఉండటం, లేదా బహుళైచ్ఛిక సమాధానాల్లో సరైన ఆప్షన్‌ లేకపోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.

    చ‌ద‌వండి: పంతం తీరినా ఆగ‌ని ప‌రుగు!
     
    ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఎన్టీఏ కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నీట్‌ తరహాలో ఒకే రోజు, ఒకే పేపర్‌తో పెన్ను–పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహించడం ఆమోద యోగ్యమైన పరిష్కారం. ఒకవేళ ఆన్‌లైన్‌ కొనసాగించాల్సి వస్తే, అమెరికాలోని శాట్‌ తరహాలో ఐటమ్‌ రెస్పాన్స్‌ థియరీని ప్రవేశ పెట్టాలి.

    – ఏటూరి సోమశేఖర్‌ శర్మ
    రిటైర్డ్‌ జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం 

Cartoon