Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది.  

    నియామకాల వివరాలు
    - తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులయ్యారు.  
    - పార్టీ పీఏసీ (PAC) సభ్యుడిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.  
    - ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు.  
    - సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్ ఎంపికయ్యారు.  
    - శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.  

  • సాక్షి తిరుపతి: భక్తుల సౌకర్యార్థంతో పాటు పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ  దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేపట్టింది. ఇది వరకూ తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి  ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో అందించనున్నట్లు తెలిపింది.

    ప్రస్తుతం తిరుమలలో  800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను  రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్నారు.  వాటిని జనవరి తొమ్మిది నుంచి ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

    ఈ టికెట్లు  ఒక్క కుటుంబంలో 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్  వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ విధానంలో  టికెట్లు అందజేయనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

    అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుందని టీటీడీ తెలిపింది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుందని పేర్కొంది.

     

  • సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (18521) బోగీ కింద పొగలు రావడంతో ట్రైన్‌ను అధికారుల నిలివేశారు. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో పొగలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రిపేర్ చేసి ట్రైన్‌ను రాజమండ్రికి తరలించారు.

  • సాక్షి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా: ఇరుసుమండలో మరో వారం పాటు బ్లో అవుట్‌ కొనసాగుతోందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణం నష్టం జరగలేదన్నారు. ధ్వంసమైన కొబ్బరి చెట్లకు, దెబ్బతిన్న పంటలకు సమీపంలో పంట పొలాలకు పరిహారం చెల్లిస్తామన్నారు. బ్లో అవుట్ ఒకేసారి కాకుండా క్రీమేపి తగ్గించే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్‌ తెలిపారు.

    ఐదు వైపులా పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుంది. పూర్తిస్థాయిలో బ్లోట్ అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్‌ డైరెక్టర్‌ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ.. బ్లో అవుట్ సంభవించిన మోరి- 5 వెల్‌ను డీప్ ఇండస్ట్రీకి 15 ఏళ్లకు లీజుకి ఇచ్చామని తెలిపారు. బ్లో అవుట్‌ వల్ల ఎటువంటి సమస్య తలెత్తదన్నారు.

  • సాక్షి, తాడేపల్లి: గుంటూరులోని హజరత్‌ కాలే మస్తాన్‌ షా అవులియా బాబా(నల్ల మస్తానయ్య) 134వ ఉరుసు ఉత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. 

    హజరత్‌ కాలే మస్తాన్‌షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఉరుసు నేపథ్యంలో మస్తాన్‌ బాబాకు చాదర్‌ (శేషవస్త్రం), చందనం, శాండిల్‌ ఆయిల్‌ సమర్పించారు వైఎస్‌ జగన్‌. 

    ఆ సమయంలో గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, రావి రామ్మోహన రావు సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్‌ సాయి గణేష్‌ రెడ్డి, రావి జ్జానేశ్వర్‌ బావాజీ మస్తాన్‌ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు ఉన్నారు. 

    హజ్రత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా గుంటూరు నగరంపాలెంలో ఉన్న ప్రసిద్ధ సూఫీ సంత్. ఆయన్ని హిందూ ముస్లింలు ఐక్యంగా ఆరాధిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల చివరి రోజున బాబా ఆశీసులైన కుర్చీని యథాస్థానంలో ఉంచడంతో ఉత్సవాలు ముగుస్తాయి.  

  • సాక్షి తాడేపల్లి: ప్రాజెక్టుల విషయంలో క్యూసెక్కులు, టీఎంసీలకు మధ్య కనీస తేడా సైతం తెలియని వ్యక్తి మంత్రి నిమ్మల రామనాయుడని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.  అలాంటి వ్యక్తికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విలువ ఏలా తెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిప్టుతో ఎన్ని జీవితాలు  ముడి‌పడి ఉన్నాయన్న విషయం మంత్రికి ఏం తెలుసని ప్రశ్నించారు.

    రాయలసీమను ఎడారిగా మార్చబోతే  దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ తెచ్చి ఊపిరి పోశారన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోతిరెడ్డిపాడును అడ్డుకునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ప్రభుత్వానికి రాయలసీమ మీద ఎందుకంత కోపమో తెలియదన్నారు. చంద్రబాబే రాయలసీమకు మరణ శాసనం రాశారని తెలిపారు.1995లో ఆల్మట్టి డ్యాం నిర్మాణాన్ని ఆపలేదు. అప్పటినుంచే చంద్రబాబు రాయలసీమ విషయంలో కుట్రలు జరుపుతున్నారని తెలిపారు.

    ఇప్పుడు రాయలసీమ లిఫ్టుపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అక్కడి ప్రజలు సహించరన్నారు.  ఆల్మట్టి నుండి జూరాలకు‌ నీరు వచ్చేసరికే  వాటిని పక్క రాష్ట్రాలు దోచేస్తున్నాయి. శ్రీశైలంలో 800 అడుగులకు నీరు రాకముందే తెలంగాణకు జలాలు వెళుతున్నాయి. ఇక వీటన్నిటిని దాటి ఇక రాయలసీమకు నీరు ఏప్పుడు వస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం డేడ్ స్టోరేజీ వాటర్ కూడా ఉండడం లేదు. చంద్రబాబు  నిర్లక్ష్యం వలనే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.

    బ్రహ్మం సాగర్, గండికోట ప్రాజెక్టులను మాజీ సీఎం జగన్ పూర్తి చేశారని  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమకు చేసిందేంటని ప్రశ్నించారు. మంత్రి నిమ్మలతో చంద్రబాబు మాట్లాడించిన మాటలను వెంటనే  వెనక్కు తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకోవాలని తెలిపారు.

    Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు
  • సాక్షి, అమరావతి: ఇవాళ మంగళవారం. షరా మామూలుగా కూటమి సర్కార్‌ చేయాల్సింది చేసింది. అయితే తాజా అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తిరగకుండానే.. ఏపీ అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది. 

    వారం కిందటే రూ.4 వేల కోట్ల అప్పు చేసిన బాబు సర్కార్‌(డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్ల అప్పులు).. ఇవాళ మరో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చింది. తద్వారా అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ, అత్యధిక అప్పులు చేస్తోన్న సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. వీటిల్లో.. 

    బడ్జెటరీ అప్పులు రూ. 1,71,637 కోట్లు కాగా, . బడ్జెట్ బయట అప్పులు రూ.1,27,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.77,040 కోట్లుగా ఉంది. ఆ అప్పుల చిట్టాను ఓసారి పరిశీలిస్తే.. 


    డిసెంబర్‌లో.. 

    డిసెంబర్ 2న తెచ్చిన అప్పులు రూ.3,000 కోట్లు

    డిసెంబర్ 30న తెచ్చిన అప్పు రూ.4,000 కోట్లు

    జనవరి 6న తెచ్చిన అప్పు రూ.6,500 కోట్లు

    • బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.80,245 కోట్లు అప్పు
    • ఏపీ మార్క్ ఫెడ్ 19,900 కోట్లు
    • జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లు
    • ఏపీఎండీసీ 9,000 కోట్లు
    • ఏపీఐఐసీ 8,500 కోట్లు
    • పౌరసరఫరాల సంస్థ 7,000 కోట్లు
    • ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు
    • ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ (బాండ్లు) 5,750 కోట్లు
    • ఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్ పి డిసి ఎల్ 5,473 కోట్లు
    • నాబార్డు నుండి డిస్కమ్స్ 3,762 కోట్లు
    • ఎస్ బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లు
    • బ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు
    • ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లు
    • అమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులు
    • ప్రపంచ బ్యాంకు, ఎడిబి ద్వారా 15,000 కోట్లు
    • హడ్కో ద్వారా అప్పు 11,000 కోట్లు
    • ఎన్ ఏ బి ఎఫ్ డి ద్వారా 7,500 కోట్లు
    • నాబార్డు ద్వారా అప్పు 7,387 కోట్లు
    • కే ఎఫ్ డబ్ల్యూ అప్పు 5,000 కోట్లు
    • ఏ పీపీ ఎఫ్ సీఎల్ 1500 కోట్లు
    NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

    జగన్‌ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం

    గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. జగన్‌ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లప్పులు చేసిందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్‌ ప్రసంగంలో ఆ అప్పును రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్‌ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు.  చివరికి బడ్జెట్‌కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లుగా చెప్పారు. చివరాఖరికి.. జగన్‌ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమేనని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని స్వయంగా ఆర్థిక మంతత్రి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రకటన బాబు దుర్మార్గమైన ప్రచారాన్ని బద్ధలు కొట్టింది.

Telangana

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే

    కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు. 

  • సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో  అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ  ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌పై  బదిలీ  వేటు వేశారు.   అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

    ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది.   ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు  విచారణకు ఆదేశించింది.

    ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

  • సాక్షి, నిజామాబాద్: భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్‌పై రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా.. బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోటం ఆపై ఇన్స్యూరెన్స్ డబ్బులతో పారిపోవడానికి ప్లాన్ చేశారు.

    ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గుండె పోటు అంటూ చిత్రీకరించారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్తగొంతు నులిమి హత్య చేసి హార్ట్ ఎటాక్‌గా భార్య నమ్మించింది. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో తామే హత్య చేసినట్లు  భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ ఒప్పుకున్నారు.

    పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామానికి చెందిన పట్టాటి రమేష్‌ భార్య సౌమ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది. అదే పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దిలీప్‌తో ఆమెకు పరిచయం.. వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో, ఇద్దరినీ గట్టిగా మందలించాడు.

    దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని సౌమ్య ప్రియుడితో కలిసి ప్లాన్‌ చేసింది. గత నెల 20న సౌమ్య తన ప్రియుడు దిలీప్‌తో కలిసి రమేష్‌ను ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించి, ఎవరికీ అనుమానం రాకుండా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియల సమయంలో రమేష్‌ మెడపై గాట్లు కనిపించడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదారికి సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఈ కేసులో సౌమ్యతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: టోలిచౌకిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. డెలివరీ బాయ్‌పైకి ప్రైవేట్‌ బస్సు దూసుకెళ్లింది. ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్తూ. అభిషేక్‌.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. గమనించకుండా.. ఆ యువకుడి తలపైకి డ్రైవర్‌ బస్సు ఎక్కించాడు. స్పాట్‌లోనే అభిషేక్ మృతి చెందాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్‌ను వాహనదారులు అడ్డగించి బస్సును నిలిపివేయించారు.

    ప్రమాదం తర్వాత రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. వాహనదారులు పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. బతికి ఉన్నాడో.. చనిపోయాడోనని చూసే ప్రయత్నం కూడా చేయని వాహనదారులు.. మృతదేహం పక్కనుంచే వెళ్లిపోయారు.
     

Movies

  • తమిళ స్టార్ హీరో విజ‌య్ తన కెరీర్ చివరి సినిమా జ‌న‌నాయ‌గ‌న్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజ‌య్, తన సినిమా ప్రయాణానికి ముగింపు పలికి ప్రజాసేవలో పూర్తిగా నిమగ్నం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజ‌య్ తన పార్టీ సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తూ రాజకీయ రంగంలో చురుకుగా ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. అయితే సినీ హీరోల రాజకీయ ప్రయాణం అంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.  

    గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. మొదట్లో ప్రజలే తనకు ముఖ్యమని, సినిమాలు తనకు ప్రాధాన్యం కాదని పలుమార్లు ప్రకటించారు. కానీ ఆ త‌ర్వాత మంచి డైరెక్ష‌న్ టీమ్ ఉండి ఉంటే త‌ను రాజ‌కీయాల్లోకే వ‌చ్చే వాన్ని కాద‌ని ప్ర‌క‌టించారు. ఇలా ప‌వ‌న్ ఎలాగైనా తన నాలుకను మ‌డ‌తేస్తూ ఉంటారు. ఇప్పుడు పొత్తులో ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కినా కూడా సినిమాలు మాత్రం ఆప‌డం లేదు. 

    కమల్ హాసన్ పార్టీ స్థాపన సమయంలో సినిమాలకు విరామం ఇచ్చారు. తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉపేంద్ర కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, తిరిగి దర్శకుడిగా, నటుడిగా బిజీగా మారిపోయారు. విజ‌య్‌కాంత్ మంచి స్థితిలో ఉన్న కెరీర్‌ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఒక దశలో ప్రతిపక్ష నేతగా నిలిచినా, తర్వాత పార్టీ బలహీనమైపోయింది.  

    విజ‌య్‌ రాజకీయాల్లో ఎంతవరకు విజయవంతం అవుతాడో చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా, కనీస స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన ప్రయాణం ఇతర స్టార్ హీరోల అనుభవాలకు భిన్నంగా ఉండకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకున్న క్రేజ్, ప్రజల మద్దతు రాజకీయాల్లోకి మారడం అంత తేలిక కాదు. ఇండ‌స్ట్రీ బంగారు బాతు లాంటిది. అయినా ప‌ద‌వి లేకుండా రాజకీయ వేడి తట్టుకోవడం స్టార్ హీరోలకూ పెద్ద సవాలే మరి.

  • టాలీవుడ్ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఇటీవలే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. హరణ్య అనే అమ్మాయితో గతేడాది (నవంబర్‌ 27న) గ్రాండ్‌ వెడ్డింగ్‌ జరిగింది. ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ కెరీర్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చిన రాహుల్.. మ్యారేజ్‌ తర్వాత ఫుల్‌గా చిల్ అవుతున్నారు. తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

    అయితే సింగర్ రాహుల్ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెట్టింట రచ్చ మొదలైంది. కొంచెం డబ్బులు రాగానే బట్టలన్నీ విప్పేసి ఏదో సోషల్ మీడియాలో స్టేటస్ చూపించుకోవడమేంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ఈ రోజు మీకు ఇది ఫ్యాషన్ అవ్వొచ్చు కానీ.. రాబోయే రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలతో ఇబ్బందులు పడతారని అంటున్నారు. మీకంటూ సభ్యత సంస్కారం ఉందా తమ్ముడు అంటూ రాహుల్‌పై నెటిజన్స్‌ ఫైరవుతున్నారు. మీ హనీమూన్ ఫోటోలు మేము చూసి ఎంజాయ్ చేయాలా అంటూ సోషల్ మీడియా వేదికగా సిప్లిగంజ్‌కు చురకలంటిస్తున్నారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి.. ఇలాంటి పనులు కోసం కాదని రాహుల్‌కు సూచిస్తున్నారు.

    రాహుల్‌ సిప్లిగంజ్ నేపథ్యం..

    రాహుల్‌ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్‌ సాంగ్స్‌ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్‌ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.

     

     

  • తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్లే టాలీవుడ్‌లోనూ ఈసారి ఐదు సినిమాలు పండగకి రానున్నాయి. వీటిలో ప్రభాస్ 'రాజాసాబ్'(జనవరి 09న), చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'(జనవరి 12న) ఉన్నాయి. గత నెలలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇకపై ఏ చిత్రానికి టికెట్ రేట్ల పెంపు లేదని తేల్చేశారు. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.

    (ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)

    టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులని సవాల్ చేస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి సూచించాలని కోరారు. అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన నిర్మాతల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటీషన్లపై హైకోర్టులో బుధవారం (డిసెంబరు 07) విచారణ జరగనుంది.

    ఇకపోతే 'రాజాసాజ్' నిర్మాతలు.. తెలంగాణ ప్రభుత్వాని టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోల గురించి అప్లై చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రీమియర్ల కోసం మల్టీప్లెక్స్‌ల్లో రూ.1000, సింగిల్ స్క్రీన్లలో రూ.800కు విక్రయించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్-మల్టీప్లెక్స్‌ల్లో ప్రీమియర్ల కోసం రూ.600 ధరకు విక్రయించే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. మరి ఈ విషయంలో అటు హైకోర్టు, ఆపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో చూడాలి?

    (ఇదీ చదవండి: తమిళనాడు సీఎం శివకార్తికేయన్.. ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి! ‍)

  • ఎర్ర స్కర్ట్‌లో అందంగా జాన్వీ కపూర్

    డిజైనర్ చీరలో మీనాక్షి చౌదరి గ్లామర్

    చిన్నప్పటి కల నెరవేర్చుకున్న కేతిక

    గులాబీ చీరలో మెరిసిపోతున్న మమిత

    డకాయిట్ షూటింగ్ జ్ఞాపకాలతో మృణాల్

  • 1990ల్లో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా 'రిమ్ జిమ్'. అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటించారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు. హేమ సుందర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మించారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

    దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని చెప్పారు. సాంకేతిక విభాగం విషయానికొస్తే కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతమందించగా.. వాసు పెండం సినిమాటోగ్రఫీ, పెనుమత్స రోహిత్ ఎడిటింగ్ చూసుకున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'గ్యాంగ్‌స్టర్' ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది.

  • టెలివిజన్ చరిత్రలో ఒక విప్లవాత్మక శకం ముగిసింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం రేడియోలోనే సంగీతం వింటూ ఉర్రూతలూగే అప్పటి తరానికి పాశ్చాత్య సంగీతం, పాప్ కల్చర్ పరిచయం చేసిన ఎమ్‌టీవీ (MTV).. తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ని అధికారికంగా మూసివేసింది. మైఖేల్‌ జాక్సన్‌ లాంటి పాప్‌ సింగర్లని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానెల్ తన ప్రయాణాన్ని ఆపేసింది. మారుతున్న కాలం, దానికి అనుగుణంగా జనంలో వస్తున్న మార్పులు, టీవీల నుంచి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై మళ్లిన ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా ఎంటీవీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం!

    1981 ఆగస్టు 1న ప్రారంభమైంది. పేరులోనే మ్యూజిక్ ఉన్న ఎంటీవీ.. సంగీతంలో ఓ విప్లవాత్మక మార్పునే తెచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎంటీవీ కేవలం సంగీతాన్ని అందించడమే కాదు.. పాశ్చాత్య సంగీతం నుంచి పాప్‌ కల్చర్‌ వరకు మైఖేల్‌ జాక్సన్‌ లాంటి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి అందించింది. ఎంటీవీ పేరిట ప్రారంభమైన ఆ ఛానెల్‌... క్రమేణా ప్రేక్షకుల్లో పెరిగిన అభిమానం, ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఎంటీవీ మ్యూజిక్‌, ఎంటీవీ 80స్‌, 90స్‌, క్లబ్‌ ఎంటీవీ, ఎంటీవీ లైవ్‌ అనే ఛానెళ్లను కూడా పరిచయం చేసింది. చివరకు ఆ ఛానెళ్లన్నింటినీ ఇప్పుడు మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

    1981లో తొలిసారి ఎంటీవీలో ప్రసారమైన "వీడియో కిల్డ్‌ ది రేడియో స్టార్‌" అనే పాటనే.. 2025 డిసెంబర్‌ 31న చివరిసారి ప్రసారం చేసి తన ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 45 ఏళ్ల క్రితం ఛానెల్‌ ప్రారంభించిన అదే పాటతో ముగించడం ద్వారా ఎంటీవీ తన ప్రయాణాన్ని వలయాకారంలో చూపే ప్రయత్నం చేసింది. పాట అదే అయినప్పటికీ అప్పటి మ్యూజిక్ వీడియో యుగాన్ని ప్రారంభించి, ఇప్పటి స్ట్రీమింగ్ యుగంలో ముగిస్తూ అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాణమనే సందేశాన్నిచ్చింది.

    ఎంటీవీ మూసేస్తున్నట్లు ప్రకటన విని ఆ ఛానెల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఈ ఛానెల్‌తో తమ జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎంటీవీ మ్యాజిక్‌ మూసివేసినప్పటికీ ఆ బ్రాండ్ కొనసాగుతుంది. ఇప్పుడు రియాలిటీ షోలు, ఎంటర్టైన్‌మెంట్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై దృష్టి పెట్టనున్నట్లు సదరు ఛానెల్ ప్రకటించింది.

    ఎంటీవీ ఛానెల్‌కు సంబంధించిన ప్రధాన ఘట్టాలు

    • 1981లో అప్పటి వరకు మ్యూజిక్‌ను రేడియో ద్వారా వినే ప్రేక్షకులకు మ్యూజిక్ వీడియో యుగం పరిచయం చేసింది.

    • 1983లో థ్రిల్లర్‌ ఆల్బమ్‌లోని బిల్లీ జీన్‌, బీట్‌ ఇట్‌ వీడియోలు ఎంటీవీలో ప్రసారం అవడంతో మైఖేల్ జాక్సన్ గ్లోబల్ సూపర్‌స్టార్‌గా మారాడు.

    • 1984లో ఎంటీవీ వార్షిక వీడియో మ్యూజిక్‌ అవార్డ్స్‌ ప్రారంభించడంతో... క్రమేణా అవి సంగీత పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా మారాయి. కళాకారుల్లో పోటీ పెరగడంతో ఎంతోమంది సంగీత కళాకారుల ప్రతిభ వెలుగు చూసింది.

    • 1985లో ఎంటీవీని వయాకామ్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ కొనుగోలు చేసింది. దాంతో ఎంటీవీ మరింత విస్తరించింది.

    • 1990లో ఎంటీవీ లైవ్ అకౌస్టిక్ ప్రదర్శనలు పాపులర్‌గా మారాయి. నిర్వానా, ఎరిక క్లాప్టన్‌ వంటి కళాకారుల ప్రదర్శనలు లెజెండరీగా నిలిచాయి.

    • 1992లో ఎంటీవీ రియాలిటీ టీవీకి నాంది పలికింది. ఇది తరువాత కాలంలో ఎంటీవీ దశను, దిశను మార్చేసింది.

    • 2000లో రియాల్టీ షోస్‌ యుగం వచ్చేసింది. జెర్సీ షోర్‌, లాగునా బీచ్‌, ది హిల్స్‌ వంటి వంటి షోలు ఎంటీవీని మ్యూజిక్ ఛానెల్ నుండి ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్‌గా మార్చాయి.

    • 2025 డిసెంబర 31న ఎంటీవీ తన 24 గంటల మ్యూజిక్ ఛానెల్స్‌ను నిలిపి వేసింది. చివరి ప్రసారం 'వీడియో కిల్డ్‌ ది రేడియో స్టార్‌'తోనే ముగించింది. 1981లో మొదట ప్రారంభమైన పాటతోనే ముగింపు పలికింది. 

  • కమర్షియల్, థ్రిల్లర్, హారర్ సినిమాలు.. దాదాపు ఒక ఫార్మాట్‌కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొన్నిసార్లు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ఒకరో ఇద్దరో దర్శకులు మూవీస్ తీస్తుంటారు. వీటికి ఎంత ఆదరణ దక్కుతుందనేది పక్కనబెడితే డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంటూ ఉంటాయి. అలా 2024లో తమిళంలో 'హాట్ స్పాట్' అనే బోల్డ్ మూవీ రిలీజైంది. తర్వాత దాని తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ అయిపోయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

    రెండేళ్ల క్రితం వచ్చిన తొలి పార్ట్‌లో పెళ్లి తర్వాత ఆడపిల్లలే ఎందుకు మరో ఇంటికి వెళ్లాలి? ప్రేమ పెళ్లికి సిద్ధమైన ఓ జంటకు ఇలా కూడా జరిగే అవకాశముందా? తప్పు చేసి దాన్ని సమర్థించుకునే ప్రియుడికి బుద్ధిచెప్పే అమ్మాయి, పిల్లల్ని టీవీ షోలు ఎలా చెడగొడుతున్నాయి అనే స్టోరీలు చూపించారు. నాలుగు కథల ఆంథాలజీ టైపులో దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్ కోసం కాస్త డోస్ పెంచి మరో నాలుగు కథలతో మూవీ తీసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

    లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో డింక్ (DINK-డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్) కల్చర్... సినిమా హీరోల ఫ్యాన్స్ చేసే అతి తదితర స్టోరీల ఉండనున్నాయని ట్రైలర్‌లో చూపించారు. ఇదే ట్రైలర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి శివకార్తికేయన్, ప్రతిపక్ష నేత విజయ్ సేతుపతి లాంటి డైలాగ్స్ ఫన్నీగా అనిపించాయి. ఈ నాయకులిద్దరూ కలిసి విజయ్ కాంత్ విగ్రహావిష్కరణ చేస్తారని ఓ పాత్ర అనడం ఆసక్తికరంగా అనిపించింది. ధోనీ రిటైర్మెంట్, 2026 ఎన్నికల్లో దళపతి గెలుస్తాడా లేదా? లాంటి విచిత్రమైన నిజ-కల్పిత సంఘటనలతో ఈసారి సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ భవానీ శంకర్ కీలక పాత్ర చేసింది. మిగతా వాళ్లెవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలైతే కాదు.

    (ఇదీ చదవండి: పండగ బరిలో 12 మంది హీరోయిన్లు.. 'హిట్' కొట్టాల్సిందే)

  • మెగాస్టార్‌ చిరంజీవికి సర్జరీ జరిగిందంటూ గత రెండు రోజులుగా  ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై చిరంజీవి కూతురు, ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’ నిర్మాత సుస్మిత స్పందించారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్‌ చేయదల్చుకోలేను’ అని అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.  

    మనశంకర్‌ వరప్రసాద్‌ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు(జనవరి 6) చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి(Chiranjeevi)కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి అడగ్గా.. ఆమె పై విధంగా సమాధానం చెప్పింది.  అయితే అదే ప్రశ్నకు కొనసాగింపుగా..‘సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అని అడగ్గా.. అలాంటిదేమి లేదని.. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు ఇటీవల ‘ఓవర్సీస్‌ అభిమానులతోనూ వీడియో కాల్స్‌లో మాట్లాడారని, త్వరలోనే జరగబోయే ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కి కూడా చిరంజీవి వస్తారని స్పష్టం చేసింది. 

    (చదవండి: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)

    దీంతో మెగా ఫ్యాన్స్‌ కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సర్జరీ జరిగిందనే వార్తలు రాగానే మెగా ఫ్యాన్స్‌ కాస్త ఆందోళనకు గురయ్యారు. సినిమా ప్రమోషన్స్‌లో ఇక ఆయన పాల్గొనబోరని అంతా అనుకున్నారు. కానీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వస్తారని సుస్మిత చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

    (చదవండి: ‘ది రాజాసాబ్‌’ నుంచి ఆ రెండు సీన్లు కట్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)

    మనశంకర్‌ వరప్రసాద్‌(Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న  ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

     

  • ప్రతిసారి సంక్రాంతి బరిలో రెండో మూడో సినిమాలు వస్తుండేవి. ఈసారి మాత్రం డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా ఏడు మూవీస్ బరిలో ఉన్నాయి. వీటిలో ఏది హిట్ అవుతుందోనని హీరోల కంటే అభిమానులకే చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ కూడా తగ్గేదే లే అంటున్నారు. వీళ్లే కాదు దాదాపు 12 మంది హీరోయిన్లు కూడా ఈ పండక్కే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. వీళ్లందరికీ హిట్ చాలా కీలకం.

    (ఇదీ చదవండి: ‘ది రాజాసాబ్‌’ నుంచి ఆ రెండు సీన్లు కట్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)

    మొదటగా ప్రభాస్ 'రాజాసాబ్'.. ఈ శుక్రవారం(జనవరి 09) థియేటర్లలోకి రానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. నిధి విషయానికొస్తే తెలుగులో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తోంది గానీ 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే చెప్పుకోదగ్గ హిట్ లేదు. గతేడాది వచ్చిన 'హరిహర వీరమల్లు'పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ అన్నీ అడియాశలయ్యాయి. చేతిలో ఇది తప్పితే మరొక ప్రాజెక్ట్ అయితే లేదు. హిట్ అయితేనే కెరీర్ పరంగా కాస్త ఫుష్ ఉంటుంది లేదంటే కష్టాలు మళ్లీ మొదటికొస్తాయి. మాళవిక విషయానికొస్తే.. తమిళ, మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇందులో అందచందాలు చూపించేందుకు అస్సలు మొహమాట పడలేదు. ఇది హిట్ అయితే టాలీవుడ్‌లో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశపడుతోంది. రిద్ధి కుమార్ విషయానికొస్తే.. గతంలో ప్రభాస్ చేసిన 'రాధేశ్యామ్'లో చిన్న పాత్ర చేసింది. ఇప్పుడు హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుబోతోంది. తెలుగులో ఈమెకు మరో ఛాన్స్ రావాలంటే ఈ చిత్రం హిట్ అవ్వాల్సిందే.

    రాబోయే సోమవారం(జనవరి 12) చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ఈమె అడపాదడపా తెలుగులో మూవీస్ చేస్తోంది. రీసెంట్ టైంలో టాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. బాలకృష్ణ కొత్త మూవీ కోసం ఈమెని తీసుకున్నారని ప్రకటించారు గానీ ఇప్పుడు బడ్జెట్, కథ మార్పు వల్ల బదులుగా మరో హీరోయిన్‌ని పెట్టే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. నయన్ టాలీవుడ్ కెరీర్‌కి ప్లస్ అవ్వాలంటే చిరు మూవీ హిట్ కావాలి.

    (ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్‌ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)

    13వ తేదీన రానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్. ఆషిక విషయానికొస్తే కన్నడ అమ్మాయి. కల్యాణ్ రామ్ 'అమిగోస్'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ఫ్లాప్. కానీ నాగార్జున 'నా సామి రంగ'లో అవకాశమొచ్చింది. హిట్ అందుకుంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో ఇప్పుడీ మూవీతో వస్తోంది. ఈమె నటించిన మరో తెలుగు చిత్రం 'విశ్వంభర' కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావాలంటే ఈ రెండు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. డింపుల్ విషయానికొస్తే.. గత ఎనిమిదేళ్లలో తెలుగులో ఆరు మూవీస్ చేసింది. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది హిట్ అయితే మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే అంతే సంగతి!

    14న రానున్న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి హీరోయిన్. తెలుగులోనే ఈమె హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ హిట్ అయితే ఈమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశముంది. ఇదే రోజున శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' కూడా రిలీజ్ కానుంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లు. సంయుక్త కూడా తెలుగులో సర్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హిట్ అందుకుంది. కానీ డెవిల్, అఖండ 2తో ఫెయిల్యూర్స్ చవిచూసింది. ఈ మూవీ హిట్ కావడం ఈమెకు చాలా కీలకం. 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాలతో ఫ్లాప్స్ అందుకున్న సాక్షి వైద్యకు కూడా ఈ చిత్రం సక్సెస్ కావడం ముఖ్యమే.

    డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే.. 9వ తేదీన వచ్చే 'జన నాయకుడు'లో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె తెలుగు తెరకి దూరమై చాలా రోజులైంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో అవకాశాలు రావొచ్చు. అలానే తెలుగు దర్శకుల దృష్టిలోనూ పడొచ్చు. ఇదే మూవీలో మమిత బైజు కీలక పాత్ర చేసింది. ఈ చిత్రంతో హిట్ అందుకుంటే ఈమెకు దక్షిణాదిలో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ. 10వ తేదీన రానున్న 'పరాశక్తి'లో శ్రీలీల హీరోయిన్. ఈమె కూడా తెలుగులో వరస సినిమాలు చేసింది గానీ ఒకటో రెండో మాత్రమే హిట్ అయ్యాయి. ఈ మూవీ హిట్ అయితే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే కాస్త కష్టమవ్వొచ్చు!

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వెర్షన్)

  • పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘ది రాజాసాబ్‌’.  మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విలన్‌ పాత్రలో సంజయ్‌దత్‌ కనిపించబోతున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

    (చదవండి: దిలీప్ కుమార్.. ఏఆర్ రెహమాన్‌‌గా ఎలా మారాడు?)

    ఫ్యాన్స్‌ కోసం ఒకరోజు ముందే..అనగా జనవరి 8న సాయంత్రమే ప్రీమియర్స్‌ వేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రన్‌ టైమ్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 189 నిమిషాలు. అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించబోతుంది. 

    ఇక ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్‌ సభ్యులు.. సినిమా మొత్తంలో రెండు కట్స్‌ మాత్రమే చెప్పారట. సినిమాలో తల నరికే సీన్‌తో పాటు నేలపై ఎక్కువ రక్తం కనిపించే సన్నివేశాన్ని తొలగించాలని సూచించారు. దీంతో ఆ రెండు సీన్స్‌ సినిమాలో నుంచి తొలగించిన 189 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట.  

    (చదవండి: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సీక్వెల్‌పై క్లారిటీ!)

    బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా సినిమాలన్నీ దాదాపు మూడు గంటల నిడివితోనే రిలీజ్‌ అవుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఎక్కువ రన్‌టైమ్‌నే కలిగి ఉన్నాయి. ఇప్పుడు ది రాజాసాబ్‌(The Raja Saab ) కూడా అత్యధిక నిడివితో విడుదల కాబోతుంది.  హారర్‌ కామెడీతో ప్రేక్షకులను మూడు గంటలు కూర్చోబెట్టడం కాస్త రిస్కే.  ఏమాత్రం తేడా వచ్చిన ఫలితం తారుమారు అవుతుంది. ‘రాజాసాబ్‌’ మాత్రం రిస్క్‌ చేసి మరీ పెద్ద నిడివితో వస్తున్నాడు.  ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 


     

  • తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక సినిమా 'అయలాన్'. ఏలియన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత ఓటీటీలోనూ కేవలం తమిళమే స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. మరి తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు తెలుగు వెర్షన్ తీసుకొచ్చేస్తున్నారు.

    శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఏలియన్ కామెడీ సినిమా 'అయలాన్'. 2024 సంక్రాంతికి తమిళంలో రిలీజైంది. అప్పుడే తెలుగు కూడా ప్లాన్ చేశారు. తర్వాత అప్పుడే జనవరి 26న తీసుకొస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌కి వచ్చిన శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ పలు కారణాలతో విడుదల కాలేదు. తర్వాత తమిళ వెర్షన్‌ని సన్ నెక్స్ట్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ గురించి ఏ సమాచారం లేదు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో'.. తెలుగు రివ్యూ)

    కానీ గత నెల అంటే డిసెంబరులో తెలుగు వెర్షన్‌ని జీ తెలుగులో ప్రసారం చేశారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అప్‌డేట్ వచ్చేసింది. ఆహా లో రేపటి(జనవరి 07) నుంచి తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

    'అయలాన్' విషయానికొస్తే.. ఓ మిషన్‌లో భాగంగా ఏలియన్ భూమ్మీదకు వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో హీరో(శివ కార్తికేయన్‍)ని కలుస్తుంది. కొన్నాళ్లకు ఏలియన్-హీరోకు స్నేహం ఏ‍ర్పడుతుంది. సదరు ఏలియన్‌కి టాటూ అని పేరు కూడా పెడతారు. కొన్ని సంఘటనల వల్ల టాటూ కొందరు వ్యక్తుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడేందుకు హీరో ఏం చేశాడు? టాటూ, భూమ్మీదకు రావడానికి కారణమేంటి? అనేది మిగతా స్టోరీ. ఏలియన్‌ పాత్రకు హీరో సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు. ఏలియన్ కామెడీ చూద్దామనుకుంటే దీన్ని మిస్ కావొద్దు.

    (ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)

  • తెలుగులో గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ రీసెంట్ టైంలో 'చికిరి' పాటతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మద్రాసులో పుట్టి పెరిగిన ఇతడు.. దక్షిణాదితో పాటు హిందీలోనూ గత మూడు దశాబ్దాలుగా సంగీతమందిస్తూనే ఉన్నాడు. అయితే రెహమాన్ అసలు పేరు ఇది కాదని మీలో ఎంతమందికి తెలుసు? అవును స్వతహాగా హిందూ అయిన ఇతడు ఇస్లాం మతంలోకి మారాడు. పేరు మార్చుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎప్పుడు ఎలా జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.

    (ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమాపై రాజకీయ కుట్ర?)

    చెన్నైలో 1967 జనవరి 6న ఆర్కే శేఖర్, కస్తూరి దంపతులకు దిలీప్ పుట్టాడు. ఇతడికి ఓ అక్క, ఇద్దరు చెల్లెళ్లు. శేఖర్ సంగీత దర్శకుడు. దిలీప్‌కి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి శేఖర్ చనిపోయారు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పరికరాలని అద్దెకిస్తూ వీళ్లు జీవనం సాగించారు. రెండేళ్లు గడిచేసరికల్లా అంటే 11వ యేటా దిలీప్.. కుటుంబ భారాన్ని మోసేందుకు సిద్దమయ్యాడు. పలువురు సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్, పియానో లాంటివి వాయించడం మొదలుపెట్టాడు. దిలీప్ తల్లికి ఆధ్యాత్మికత ఎక్కువ. ఇంట్లో హిందూ దేవతలతో పాటు ఇస్లాం, క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోలు కూడా ఉండేవి. తల్లి కస్తూరితో కలిసి నెల్లూరి తడ దగ్గరలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలు వినేందుకు దిలీప్ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఖాద్రీ బోధనలకు వీరు కుటుంబం ఆకర్షితులయ్యారు.

    తమ కుటుంబానికి అంతా మంచి జరగాలని, కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ దిలీప్ కుటుంబమంతా 1989లో ఇస్లాం మతాన్ని సీక్వరించారు. ఇది జరగడానికి కొన్నాళ్ల ముందు దిలీప్ చెల్లి పెళ్లి జరిగింది. ఆ సమయంలో ఓ జ్యోతిష్కుడిని కలిసిన ఇతడు.. తనకు దిలీప్ అనే పేరు నచ్చలేదని, ఏదైనా ముస్లిం పేరు సూచించాలని అడగ్గా.. అబ్దుల్ రహీమ్, అబ్దుల్ రెహమాన్ అనే పేర్లు సూచించారు. వీటి వల్ల అంతా మంచి జరుగుతుందని సదరు జ్యోతిష్కుడు సూచించారు. వీటిలో రెహమాన్ అనే పేరు నచ్చేసరికి దిలీప్ కాస్త రెహమాన్ అయ్యాడు. తల్లి కస్తూరి.. కొడుకు మార్చుకున్న పేరుకి ముందు 'అల్లా రఖా' అని జోడించింది. దీంతో దిలీప్ కాస్త ఏఆర్ రెహమాన్ అయ్యాడు.

    తర్వాత కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఆర్ రెహమాన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే తల్లి కస్తూరి కూడా తన పేరుని కరీమాగా మార్చుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కడప పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు దర్గాని రెహమాన్ సందర్శిస్తుంటారు. తెలుగులో ఈయన.. నిప్పురవ్వ, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేశావె, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత 'పెద్ది'తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్..‍ తేల్చేసిన దర్శకుడు)

  • ఈ మధ్య చిన్న, పెద్ద అనే తేడా లేకుండా  ప్రతి సినిమా చివరన సీక్వెల్ ప్రకటించడం ట్రెండ్‌గా మారిపోయింది. కొన్ని సినిమాల కథలు ఒకే పార్ట్‌లో చూపించలేక.. రెండో భాగం తెరకెక్కిస్తుంటే..మరికొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా ముగిసిన కథకు కూడా సీక్వెల్‌ని ప్రకటిస్తున్నారు. కథ రేడీగా ఉండదు కానీ ముందే సీక్వెల్‌ ప్రకటిస్తారు. సినిమా హిట్‌ అయితే..అప్పడు కథని డెవలప్‌ చేస్తారు. ఒకవేళ  ప్లాప్‌ అయితే.. సీక్వెల్‌ ప్రకటించినప్పటికీ..మళ్లీ దాని జోలికి వెళ్లరు. అలా ఎన్నో సినిమాల సీక్వెల్స్ ఆగిపోయాయి. అయినా కూడా సీక్వెల్‌ ప్రకటించడం మాత్రం ఆగడం లేదు. 

    చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’కి కూడా సీక్వెల్‌ ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకార్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల స్పందించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ లేదని స్పష్టం చేశారు. 

    ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సాహు, సుస్మిత తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మన శంకర్‌ వరప్రసాద్‌’కి సీక్వెల్‌ ఉంటుందా? అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది కంప్లీట్‌ ఎండింగ్‌ మూవీ. క్లైమాక్స్‌లో పార్ట్‌ 2 ప్రకటన ఏమి ఉండదు. అసలు ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని స్పష్టం చేశారు.

    మనశంకర్‌ వరప్రసాద్‌ విషయానికొస్తే.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న  ఈ చిత్రం విడుదల కాబోతుంది. 
     

  • తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. మరో మూడు రోజుల్లో అంటే ఈ శుక్రవారమే తెలుగు, తమిళంలో విడుదల కానుంది. మన దగ్గర పెద్దగా బజ్ లేదు గానీ తమిళనాడులో మాత్రం మంచి హైప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?

    (ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు టికెట్‌ రేట్ల పెంపుపై నిర్మాతల క్లారిటీ)

    విజయ్ 'జన నాయగణ్' సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కావాలి. కానీ ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాలేదు. దాదాపు రెండు వారాల క్రితమే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీ చూశారు. మూడు రోజుల తర్వాత కొన్ని సీన్స్ కట్స్ చేయమని మూవీ టీమ్‌కి సూచించారు. అలా చేస్తే యూ/ఏ సర్టిఫికెట్ ఇస్తామని కూడా చెప్పారు. రెండు రోజుల్లో ఆ ఫార్మాలిటీ అంతా టీమ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇది జరిగి రెండు రోజుల తర్వాత కూడా సెన్సార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణ సంస్థ మరోసారి అడిగింది.

    ఇది జరిగిన తొమ్మిది రోజులకు అంటే నిన్న(జనవరి 05).. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపుతున్నట్లు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ముంబైలోని ఆఫీస్‌ని సంప్రదించాలని చెప్పారు. దీంతో నిర్మాణ సంస్థ.. సెన్సార్ సర్టిఫికెట్ కోసం హైకోర్టులో కేసు వేసింది. త్వరగా ఇది ఇప్పించాలని పేర్కొంది. అయితే సెన్సార్ ఫార్మాలిటీస్ అంతా పూర్తయినా సరే ఇలా జరగడం వెనక ఎవరున్నారు? చెప్పిన తేదీకి రిలీజ్ అవుతుందా లేదా అని విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

    (ఇదీ చదవండి: 'అఖండ-2' ఫ్యాన్స్‌కు ట్విస్ట్‌ ఇచ్చిన 'నెట్‌ఫ్లిక్స్‌')

    రాజకీయ కారణాలతోనే తమ సినిమాకు ఇబ్బందులు పెడుతున్నారని విజయ్ టీవీకే పార్టీ ఆరోపణలు చేస్తోంది. విజయ్ పిటిషన్‌పై ఈ రోజు మధ్యాహ్నమే విచారణ జరగనుంది. ఇందులో ఏం తీర్పు వస్తుందో చూడాలి? ఈ ఏడాదిలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో విజయ్ సినిమాపై ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నారా అనే సందేహం అభిమానులకు వస్తోంది.

    ఈ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమిత బైజు కీలక పాత్ర చేసింది. తెలుగులో గతంలో వచ్చిన 'భగవంత్ కేసరి' రీమేక్ చేసి ఈ మూవీ తీశారు. కొన్నిరోజుల ముందు వరకు ఈ విషయమై రూమర్స్ వచ్చాయి గానీ తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో రీమేక్ అనే క్లారిటీ వచ్చేసింది. ట్రోల్స్ కూడా ఎక్కువగానే చేస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఆ సినిమాలో చిన్మయి పాట కట్..‍ తేల్చేసిన దర్శకుడు)

National

  • పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్‌లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు పంజాబ్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు పాక్ ఎత్తుగడ ఏంటి? దాన్ని భారత్ ఎలా చిత్తుచేస్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

    భారతదేశ రహస్యాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేయిస్తోందనే విషయం బహిర్గతం కావడంతో.. మన బలగాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా పంజాబ్ పోలీసులు 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని గూఢచర్య అభియోగాలపై అరెస్టు చేశారు. దాంతో.. ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్‌కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. మిలటరీ ఎస్టాబ్లిష్‌మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు? ఏయే సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్‌కు పంపాడు? అనే వివరాలను అధికారులు గుర్తించారు.

    తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్‌కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు. ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో.. పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. అయితే.. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లలో పలువురు బాలలతో పాకిస్థాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

    జమ్మూకశ్మీర్, పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి.. ఇక్కడి బాలలను హనీట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. మైనర్ బాలురతో గూఢచర్యం చేయిస్తే.. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో.. మరింత మంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

  • బట్టతల కారణంగా పెళ్లి ఈడు దాటిపోతుండడంతో.. అతగాడు ఘరానా మోసానికి దిగాడు. విగ్గుతో మేనేజ్‌ చేస్తూ ఎలాగోలా ఓ అమ్మాయికి తాళిబొట్టు కట్టేశాడు. తీరా.. కాపురంలోకి అడుగుపెట్టాక అతగాడి హెయిర్‌స్టైల్‌పై అనుమానం వచ్చిందామెకు. కొన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చిన అతను.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు. అక్కడి నుంచే అసలు డ్రామా మొదలుపెట్టాడు.. 

    బట్టతల భర్త పెట్టే టార్చర్‌ తట్టుకోలేక ఓ భార్య నోయిడా పోలీసులను ఆశ్రయించింది. విగ్గు పెట్టుకుని తనను పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత జుట్టు రాలుతోందంటూ డ్రామాలు ఆడాడనని.. చివరకు విషయం తెలిసిపోవడంతో విగ్గు పీకేసి విలన్‌ వేషాలు వేస్తున్నాడని వాపోయిందామె. అప్పటి నుంచి సైకోలా మారిపోయి వేధించడం మొదలుపెట్టాడు.. 

    నా ఫోన్‌ నుంచి వ్యక్తిగత ఫొటోలు సేకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌ చేశాడు. చేసేది లేక నగలు ఇచ్చేశాను. ఆపై అదనపు కట్నం కోసం నా తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. భరించలేక న్యూఢిల్లీ ప్రతాప్‌ భాగ్‌లోని అత్తింటి నివాసంలో పంచాయితీ పెట్టించా. అందరి ముందు విగ్గు తీసేసి.. ఏం చేస్తావో చేసుకో అంటూ తన కుటుంబ సభ్యులతో కలిసి మమ్మల్ని వేధించాడు అని ఫిర్యాదులో పేర్కొందామె. 

    సదరు భర్త కుటుంబం మొత్తంపై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని.. పరారీలో ఉన్న భర్త కుటుంబం కోసం గాలిస్తున్నట్లు బిస్రాఖ్‌ పీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ చెబుతున్నారు. 

  • ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో ప్ర‌ధాన పార్టీలు ప్ర‌చారం మొదలుపెట్టేశాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ త‌ర‌పున ప్ర‌చారం సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్ర‌చార బాధ్య‌త‌ను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డిచే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే నిజంగానే ఆ ప‌రిస్థితి ఉందా అంటే.. లేద‌నే అంటోంది తాజా స‌ర్వే.

    మ‌ళ్లీ దీదీకే చాన్స్‌
    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని 'ఓట్ వైబ్' సర్వే అంచ‌నా వేసింది. దీని ప్ర‌కారం 39.6 శాతం మంది ఓటర్లు దీదీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్నారు. క‌మ‌లం పార్టీకి ఓటు వేస్తామ‌ని చెప్పిన వారు 30.5 శాతం మంది మాత్రమే. నిమ్న వ‌ర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మ‌ద్ద‌తు ల‌భించ‌డం ఆస‌క్తిక‌ర పరిణామం. ఎస్సీ (50%), ఎస్టీ (38%), ఓబీసీ ఓటర్లలో (44%) అధిక శాతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మ‌మ‌తా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓట‌ర్ల‌లో 54 శాతం మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లలో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే ద‌క్క‌డం విశేషం.

    ప్ర‌భుత్వ ప‌నితీరు.. ప్చ్‌
    బెంగాల్ యువత ఎక్కువ‌గా బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉన్నారని స‌ర్వే వెల్ల‌డించింది. 18 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు కాషాయ‌పార్టీకి అండ‌గా ఉన్నారు. సీనియ‌ర్ సిటిజ‌నులు మాత్రం మ‌మ‌తా బెన‌ర్జీపైనే న‌మ్మ‌కం ఉంచారు. అయితే దీదీ ప్ర‌భుత్వ ప‌నితీరుపై మాత్రం బెంగాల్ ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. టీఎంసీ ప్ర‌భుత్వం బాలేద‌ని 40.6 శాతం మంది నిర్మోహ‌మాటంగా తేల్చేశారు. 38.3 శాతం మంది మాత్రం ప్ర‌భుత్వ ప‌నితీరు బాగుదంటూ కితాబిచ్చారు. ముస్లింల్లో సగానికి పైగా మమతా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం 50 శాతం కంటే ఎక్కువ మంది పేలవం అంటూ పెద‌వి విరిచారు. ఓటు ఎవ‌రికి వేయాలో ఇంకా నిర్ణ‌యం తీసుకోని వారు 18.5 శాతం మంది అని స‌ర్వే తెలిపింది.

    దీదీ బెస్ట్‌
    ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి మమతా బెనర్జీ మాత్ర‌మే స‌రైన నాయ‌కురాలని బెంగాల్ ప్ర‌జలు క్లియ‌ర్‌క‌ట్‌గా తేల్చేశారు. సర్వేలో ఆమెకు 35.4 శాతం మంది మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. బీజేపీ నాయ‌కుడు సువేందు అధికారికి 20.9 శాతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య (Samik Bhattacharya) 14.8 శాతం మద్దతుతో రెండుమూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెల‌లో బెంగాల్‌ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. 

    నిరుద్యోగంపై బెంగ‌
    ఉపాధిలేమి బెంగాల్ ప్ర‌జ‌ల‌ను బాగా క‌ల‌వ‌రపెడుతోంది. నిరుద్యోగం (Unemployment) ప‌ట్ల 33.8 శాతం మంది ఓట‌ర్లు ఆందోళ‌న వెలిచ్చారు. శాంతిభద్రతలు/మహిళల భద్రత (19.1%), అవినీతి (18.3%) గురించి కూడా బెంగాలీలు బెంగ‌గా ఉన్నారు. మతపరమైన ధ్రువీకరణ (క‌మ్యున‌ల్ పోల‌రైజేష‌న్‌) గురించి మాత్రం బెంగాల్ ఓట‌ర్లు (3 శాతం) పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నాయకత్వం లేదా సిద్ధాంతం ఆధారంగా కాకుండా.. ప్ర‌భుత్వ ప‌నితీరును చూసే ఓటు వేస్తామ‌ని 29.3 శాతం మంది చెప్ప‌డం గ‌మనించాల్సిన విష‌యం.  

    ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
    ఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న‌ట్టు స‌ర్వే బ‌య‌ట‌పెట్టింది. కేవలం 26.9 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారు. అదే పార్టీ నుండి వేరే అభ్యర్థిని నిల‌బెట్టాల‌ని ఎక్కువ మంది ఓట‌ర్లు కోరుకుంటున్నారు. అధికార పార్టీ అభ్య‌ర్థిని మార్చ‌క‌పోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని యోచిస్తున్నారు.

    బీజేపీకి అదే మైన‌స్‌
    బెంగాల్‌లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద స‌వాళ్లు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలని 20 శాతం మంది ఓట‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు. బెంగాల్ సంస్కృతిని (Bengal culture) అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2 శాతం మంది స‌ర్వేలో వ్య‌క్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మ‌రో మైన‌స్ అని 14.5 శాతం మంది పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చ‌క్రం తిప్పుతారా?

    టీఎంసీకి కబీర్ ఎఫెక్ట్‌
    టీఎంసీ నుంచి  సస్పెండ్ అయిన‌ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir).. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండి కొట్టే అవ‌కాశ‌ముంద‌ని ఓట‌ర్ల‌లో 26 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న వెనుక‌ బీజేపీ లేదా టీఎంసీ ఉండివుండొచ్చ‌న్న అనుమానాలు కూడా కొంత‌మంది వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా ముర్షిదాబాద్ జిల్లా రెజిన‌గ‌ర్‌లో బాబ్రీ మాదిరి మ‌సీదు నిర్మాణానికి పూనుకోవ‌డంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయ‌న బహిష్క‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. 

  • పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పక్కన పెట్టి.. ఈ ప్రక్రియను కొనసాగించాలని కోర్టులు సైతం ఆదేశించాయి. దీంతో.. ఎన్నికల సంఘం చకచకా ప్రక్రియను కొనసాగిస్తోంది. 

    లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి  సంబంధించి ఎస్‌ఐఆర్  (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) నివేదికను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో 2కోట్ల 89 లక్షల మంది ఓట్లను తొలగించినట్లు తెలిపింది. 

    దేశంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా పారదర్శకంగా రూపొందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం 2025లో (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమగ్రంగా సర్వే జరిపి కొత్త ఎంట్రీలను చేర్చడం, అర్హత లేనివి తొలగించడం.. ఇంకా ఏవైనా సవరణలుంటే చేయడం తదితరమైనవి చేయనున్నారు. అయితే ఇటీవలే యూపీలో (SIR) సర్వే నిర్వహించగా తాజాగా దాని వివరాలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు.

    దీనిపై ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ "రాష్ట్రంలో మెుత్తంగా 15కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 12 కోట్ల మంది వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. మెుత్తంగా 81శాతం మంది సర్వే పత్రాలపై సంతకం చేసి సమర్పించారు. 18శాతం మంది పాల్గొనలేదు. ఓటర్ల సర్వేలో  46.32లక్షల మంది ఓటర్లు మరణించిన‍ట్లు తేలింది. 2.17 కోట్ల మంది వలసకు వేరే ప్రాంతం వెళ్లారు. 25.47 లక్షల మంది వారి పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్నారు". అని తెలిపారు. రమారమీగా దాదాపు 3 కోట్ల మందిని ఓటర్ల జాబితానుండి తొలిగించినట్లు పేర్కొన్నారు.

    దీంతో దేశంలో అత్యధిక శాతం ఓట్ల తొలగింపు జరిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రికార్డులోకెక్కింది. ఉత్తరప్రదేశ్ 18.75శాతం, తమిళనాడు 15శాతం, గుజరాత్ 14.5శాతం ఆ తరువాతి స్థానాల్లో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఓటర్ల జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి ఆరు వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 91శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని మరో తొమ్మిదిశాతం మిగిలి ఉందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

  • సోషల్ మీడియా రోజుకో వింత వైరల్‌గా మారుతుంది. తాజాగా  మరోసారి వైరల్ వింత మిస్టరీగా మార్చింది. ఎక్కడ చూసినా ఆమె ఫోటోనే.  ఇంతింత కళ్లతో ఉన్న  ఒక మహిళ ఫోటోను దిష్టి  బొమ్మలా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలలో తెగ వాడేస్తున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ  వైరల్‌​ అవుతోంది.

    మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ దీనిపై ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పంచుకోవడంతో చర్చ జోరందుకుంది. బెంగళూరు వెలుపల ఉన్న ఒక నిర్మాణ స్థలంలో ఈ ఫోటో చూశాననీ, Google Lens, ఆన్‌లైన్ శోధనలను ప్రయత్నించానని, కానీ స్పష్టమైన సమాధానాలు దొరకలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ "ఆమె ఎవరు?" కోరింది. దీంతో ఆన్‌లైన్‌లో  హాస్యాస్పదమైన ఊహాగానాలతోపాటు, రకరకాల సమాధానాలువచ్చాయి.

     కర్ణాటకలో నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు,  పొలాలలో కూడా పదే పదే కనిపించే ఒక మహిళ ఫోటోపై దృష్టి సారించింది. సగం నిర్మించిన ఇళ్ల నుండి వ్యవసాయ భూమి వరకు ఈ మహిళ  ఫోటోను ఎందుకు పెట్టారనే  చర్చ ఇంటర్నెట్ వినియోగదారులను  ఆశ్చర్యపర్చింది. ఆఖరికి AI చాట్‌బాట్‌లు కూడా  అడిగేశారు. ఈఫోటోను'దిష్టి పరిహారం'గా  వాడుతున్నారని కొందరంటే, చిక్కబల్లాపుర సమీపంలోని ఒక పొలంలో  దిష్టిబొమ్మలా ఇదే ఫోటోలను చూశానని మరొకరు కమెంట్‌ చేశారు.

    ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

     ఇంతకీ ఆమె ఎవరంటే
    గణేష్ అనే వినియోగదారు వివరణాత్మక వివరణ  ఇవ్వడంతో దీనిపై ష్టత వచ్చింది. అతని ప్రకారం, ఫోటోలు  ఉన్న మహిళ పేరు నిహారిక రావు. ఒక యూట్యూబర్. స్థానికులు ఆమె ఫోటోను ఇళ్ళు, దుకాణాలు, పొలాలు, నిర్మాణ ప్రదేశాల వెలుపల ఉంచిన తరువాత నెగిటివిటీ పోయిందట,మంచి జరిగిందట. ఇది ఆ నోటా ఈ నోటా పాకి దీన్ని దిష్టిబొమ్మగా వాడేస్తున్నారన్నమాట.  

    ఇదీ చదవండి: సీనియర్‌ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి

  • రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి  తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్‌ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.

    అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.

    దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్‌ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భోపాల్‌లో(మధ్యప్రదేశ్‌) ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్యురాలు ఇక లేదు. గత 24 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 24 ఏళ్ల డాక్టర్ రష్మి వర్మ తుది శ్వాస విడిచింది.

    ఎయిమ్స్ భోపాల్‌లోని ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ  డిసెంబర్ 11న  అధిక మోతాదులో ఎనస్తీషియా ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.  అపస్మారక స్తితిలో ఉన్న ఆమెను  భర్త అదే ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అప్పటి నుండి వెంటిలేటర్ మద్దతుపై చికిత్స తీసుకుంటూ సోమవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించామని ఎయిమ్స్ భోపాల్ అధికారి తెలిపారు. అయితే, ఈ సంఘటనపై కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు  కారణంగా మరిన్ని వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు. 

    ఎయిమ్స్‌లో టాక్సిక్‌ వర్క్‌ కల్చర్‌ ఆరోపణలు 
    ఆమె సీనియర్ విభాగాధిపతి డాక్టర్ మొహమ్మద్ యూనస్ డా. వర్మను గత కొంతకాలంగా  దీర్ఘకాలం మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. బలమైన ఆరోపణలున్నప్పటికీ,  ఆసుపత్రి యాజమాన్యం మొదట్లో మౌనం వహించింది. అయితే బాధితురాలి ఆత్మహత్యా యత్నం,  వైద్యుల సంఘాలు , పౌర సమాజం నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో డాక్టర్ మొహమ్మద్ యూనస్‌ను యాజమాన్యం తన పదవి నుండి తొలగించింది. తాత్కాలికంగా అనస్థీషియా విభాగానికి అటాచ్ చేసింది. ఈ విషయంపై రహస్య విచారణ నిర్వహించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

    ఆమె సహచరులు అందించిన వివరాల ప్రకారం, డాక్టర్ వర్మ డిసెంబర్ 11న తన  డ్యూటీని పూర్తి చేసి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. ఆమె భర్త, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రతన్ వర్మ, ఆమె అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి  రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమెను ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. 

    ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

    గుండెపోటు , మెదడుకు నిలిచిపోయిన  ఆక్సిజన్‌
    అత్యవసర విభాగానికి చేరుకునేసమయానికి ఆలస్యం జరిగిపోయింది. దాదాపు 25 నిమిషాలు కావడంతో  ఆమె గుండె దాదాపు ఏడు నిమిషాలు కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.వెంటనే కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) ప్రారంభించారు. మూడు రౌండ్ల పునరుజ్జీవనం తర్వాత,  గుండె  స్పందించింది. కానీ  మెదడుకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా, అప్పటికే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరిగింది. గుండెపోటు సమయంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడు కణజాలానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని కోలుకునే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు వివరించారు. ఆసుపత్రిలో చేరిన 72 గంటల తర్వాత నిర్వహించిన MRI స్కాన్‌లో మెదడు  డ్యామేజ్‌, దీర్ఘకాలిక ఆక్సిజన్ కొరత ఉన్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయని ఎయిమ్స్ భోపాల్ గతంలో పేర్కొంది.

    మంచి మనిషిని, టీచర్‌ను కోల్పోయాం
    ఐదేళ్లకు పైగా బోధనా అనుభవంతో, ఆమె క్లినికల్ నైపుణ్యం ఆమె సొంతమని ప్రధానంగా రోగులు పట్ల  చాలా దయతో ఉండేదని విద్యార్థులు సహచరులు గుర్తు చేసుకున్నారు. తన సొంత డబ్బులను రోగుల చికిత్స కోసం చెల్లించేదని కంటతడిపెట్టారు. ఆమె మరణించే సమయానికి  బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్, నర్సింగ్ శిక్షణా సెషన్‌లకు ఇన్‌ఛార్జ్ ఫ్యాకల్టీగా, నోడల్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తున్నారు.

    ఇదీ చదవండి: 5th ఫెయిల్‌, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం

    కాగా డాక్టర్  వర్మ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని MLN మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. జనరల్ మెడిసిన్‌లో MD డిగ్రీ  చదివారు. AIIMS భోపాల్‌లో అనేక పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వహించారు. అలాగే LN మెడికల్ కాలేజీ, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMS), భోపాల్‌లో కూడాసేవలందించారు.

    ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్‌ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
     

  • సాక్షి చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవ‍త్తరంగా మారుతున్నాయి. అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీ మధ్య సీట్ల పంపకాలపై సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తుండగా.. డీఎంకే అందుకు ఇంకా స్పందించలేదు. ఒకవేళ సీట్ల పంపకం తేలనిపక్షంలో విజయ్‌ టీవీకే పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తోంది.

    తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు పొత్తుల బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాయి. దీంతో సీట్ల షేరింగ్ అంశంపై రెండుపార్టీల మధ్య ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

    కాంగ్రెస్ పార్టీ 40 అసెంబ్లీ సీట్లు తమ పార్టీకి కేటాయించాలని డీఎంకేను కోరినట్లు తెలుస్తోంది. అయితే స్టాలిన్‌ పార్టీ 32 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ కనీసం 38 స్థానాలకైనా పరిమితం కావాలని భావిస్తోందట. కాంగ్రెస్ సీనియర్‌ నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని  కోరుకుంటోంది" అని వ్యాఖ్యానించారు. దీంతో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌ తగ్గే ప్రసక్తే కనిపించడం లేదు.

    ఇటు కాంగ్రెస్ పార్టీ విజయ్‌ పార్టీ టీవీకేతో పొత్తుపెట్టుకునే అవకాశాల్ని పూర్తిగా కొట్టిపడేసే అవకాశాలు లేవు. ఇటీవల ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫిలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ " కాంగ్రెస్, టీవీకే పార్టీలు సహజమిత్రులు. రాహుల్ గాంధీ, విజయ్ మంచి స్నేహితులు,  రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు అధికంగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడం కలకలమే రేపింది. దీంతో.. బీజేపీ రంగంలోకి దిగింది. 

    బీజేపీ సైతం విజయ్ పార్టీతో పొత్తుకోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల తమిళనాడులో పర్యటించిన అగ్రనేత, హోం మంత్రి అమిత్‌షా ఉద్దేశపూర్వకంగానే అన్నాడీఎంకే ప్రదాన కార్యదర్శి పళనిస్వామిని కలవకుండా వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తుల అంశంపై తమ అధినేత విజయ్‌తో చర్చించాకే ఏ నిర్ణయమనేది ప్రకటిస్తామని టీవీకే నేతలు చెబుతుండడం గమనార్హం.

  • పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీల ప్రకటన నేపథ్యంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి ఆదివారం కావడంతో ఆ తేదీ మారవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.   

    దేశవ్యాప్తంగా యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తి నెలకొంది. 2017 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. కానీ, ఈసారి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది. సాధారణంగా వారాంతాల్లో పార్లమెంట్‌ సమావేశాలే జరగవు. బ్రిటీష్‌ కాలం నుంచే ఆదివారాలను తప్పించాలనే ఆచారం కొనసాగేది. అలాంటిది.. అందునా ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

    ఫిబ్రవరి 1నే కొనసాగిస్తారా? లేదంటే ఫిబ్రవరి 2 (సోమవారం)కి మార్చుతారా? అంటూ చర్చ మొదలైంది. అయితే.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం.. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో.. ఆదివారం నిర్వహించడంపై సందేహాలు కొనసాగుతున్నాయి. 

    అలాగని వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్త విషయమేమీ కాదు. 2025లోనూ శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. గతంలో..  అరుణ్‌ జైట్లీ ఫైనాన్స్‌ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.  2020లో కోవిడ్ సమయంలో.. అలాగే 2012 మే 13వ తేదీన 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్‌ సమావేశమైంది కూడా. దీంతో ఈసారి కూడా ఆదివారమే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అస్కారం లేకపోలేదు. 

    ఫిబ్రవరి 1నే ఎందుకంటే..
    2017 ఏడాదికి ముందు బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టబడేది. అయితే.. బడ్జెట్‌ ప్రవేశపెట్టాక మొదటి త్రైమాసిక ఖర్చుల కోసం ‘వోట్ ఆన్ అకౌంట్’ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత విభాగాల వారీగా డిమాండ్లను పరిశీలించి పూర్తి బడ్జెట్ ఆమోదించబడేది.ఈ ఆలస్యాన్ని నివారించేందుకు 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీంతో ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం లభించింది.
     

  • పంజాబ్‌లో లూథియానాలో మాజీ కబడ్డీ ఆటగాడిని కాల్చి చంపిన  ఘటన కలకలం  రేపింది.  అంతేకాదు మీ అబ్బాయి చంపేశాం..వెళ్లి అతని మృతదేహాన్ని తెచ్చుకోండి అంటూ నేరుగా అతని ఇంటికి  వెళ్లి చెప్పడం తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది.సోమవారం ఈ హత్య జరిగింది.

    మాజీ కబడ్డీ స్టార్‌ గగన్‌దీప్ సింగ్ అలియాస్ గగ్నా మనుకే గ్రామంలో తన స్నేహితుడు ఏకమ్‌తో కలసి ఉండగా దారుణ హత్యకు గురయ్యాడు. మోటార్‌బైక్‌లపై వచ్చిన దుండగులు గగ్నాపై  పై కాల్పులు జరిపారు. అనంతరం  అతని మృతదేహాన్ని సమీపంలోని పొలంలో పడేశారు.  మీ వాడిని చంపేశాం.. డెడ్‌బాడీ తెచ్చుకోవండి కుటుంబ సభ్యులతో స్వయంగా చెప్పారు. దీనిపై మృతుడి  తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదని బాధితుడి తండ్రి గుర్దీప్ సింగ్ బగ్గా (60)  కన్నీటి పర్యంతమయ్యారు.  లూథియానా రూరల్ ఎస్ఎస్‌పి అంకుర్ గుప్తా ప్రకారం, గగన్‌దీప్‌కు కనీసం మూడు బుల్లెట్ గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు పేర్కొన్న ఐదుగురు నిందితులలో ఒకరిని అరెస్టు చేశారు.

    హత్యకు కారణం
    బగ్గా  అందిందించిన వివరాల  ప్రకారం  నిందితులకు, మృతుడు గగ్నా స్నేహితుడు ఏకమ్‌తో పాత కక్షలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో  వీరి మధ్య సయెధ్య కుదిర్చేందుకు, రాజీకి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే నిందితులు అతన్ని కాల్చి చంపారు.కాగా గగ్నా ఒక రైస్ షెల్లర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.  ఇతనికి  భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితుడి భార్య నవప్రీత్ కౌర్ మాట్లాడుతూ, గగన్‌దీప్, ఏకమ్ కలిసి కబడ్డీ ఆడేవారని, అయితే నిందితులకు నచ్చలేదని చెప్పింది.  మరోవైపు డిసెంబర్ 31న, నిందితులు ఏకమ్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ రోజు   నా భర్తను కాల్చి చంపారని  కన్నీరు మున్నీరుగా  విలపిస్తోంది.

    ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

    గ్రామ క్షక్షలతోనే ఈ హత్య జరిగిందని భావిస్తున్నామని లూథియానా రేంజ్ డిఐజి సతీందర్ సింగ్  తెలిపారు.  ఇప్పటివరకు కబడ్డీకి సంబంధించిన  వివాదమేమీ వెలుగులోకి రాలేదన్నారు.  ప్రధాన నిందితుడిని గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటుగా గుర్తించారు. ఉదయం గ్రామస్థాయి వైరం కారణంగా రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం, గుర్సేవక్ సింగ్ అలియాస్ మోటు తన అనుచరులతో కలిసి తిరిగి వచ్చి కాల్పులు జరిపాడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. కుటుంబ సభ్యులు పేర్కొన్న నిందితులలో ఒకరిని  ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామ డీఐజీ తెలిపారు.

    ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్‌ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

    మనూకేకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాగ్రాన్ ఎమ్మెల్యే సర్వజిత్ కౌర్ మనుకే మీడియాతో  మాట్లాడుతూ గగన్‌దీప్ గ్రామంలోని పేద యువకులను కబడ్డీ ఆడటానికి ప్రోత్సహించేవాడని చెప్పారు. నిందితుల  లక్ష్యం ఏకామ్‌..కానీ గగన్‌దీప్ అతనికి అండగా నిలబడటంతో వారు అతడిని కాల్చి చంపారు. పంజాబీ యువత దారి తప్పుతోందని,  గూండాయిజం వల్ల శవాలు తప్ప మరేమీ మిగలదని ఆవేదన వ్యక్తం  చేశారు. కేవలం మూడు రోజుల్లోనే పంజాబ్‌లోఇది మూడో దారుణ హత్య ఇది.

    ఇదీ చదవండి: 5th ఫెయిల్‌, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం

     

  • సూరత్‌కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి  సావ్జీ డోలకియా అనగానే  అందరికీ గుర్తు వచ్చేది ప్రతి ఏటా తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు  ఇవ్వడం. ఖరీదైన కార్లు ఇళ్లు, కార్లు, వజ్రాలు, ఆభరణాలు ఇలా ఎంతో విలువైన బహుమతులతో కేవం తన ఉద్యోగులను మాత్రమే కాదుయావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. కానీ  ఇలా ఖరీదైన బహుమతులు  వచ్చేంత స్థాయికి రావడానికి వెనుక  ఉన్న కృషిని గురించి ఎపుడైనా ఆలోచించారా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి డైమండ్‌ సామ్రాజ్యాన్ని  నిర్మించి, సావ్జీభాయ్‌గా  పేరు గడించిన హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఛైర్మన్, సావ్జీ ధోలాకియా సక్సెస్‌ గురించి తెలుసుకుందాం.

    గుజరాత్‌లోని దుధాల గ్రామానికి చెందిన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు సావ్జీ ధోలాకియా.   కుటుంబ ఆర్థిక పరిస్తితుల కారణంగా 5వ తరగతిలోనే చదువు ఆపేశారు. అంతేకాదు  1977లో కేవలం 13 ఏళ్ల వయసులోనే , జేబులో 12 రూపాయలు 50 పైసలు (బస్సు టికెట్‌కు సరిపోయే) సూరత్ నగరానికి పయనమయ్యాడు. అప్పటికి ఆయన మనసులో ఉన్నది కుటుంబానికి పోషించుకోవడం మాత్రమే.

    ఆలా సూరత్‌ నగరంలో తొలి  ఉద్యోగం వజ్రాల కర్మాగారంలో. నెలకు  రూ.179 రూపాయల  జీతం. ఈ కొద్ది పాటి జీతంలోంచే ఆయన ప్రతి నెలా రూ. 39 పొదుపు చేసేవాడు.  1984లో  తనకంటూ ఏదైనా సాధించాలనే కల మొదలైంది.  ఈ కల సాకారానికి పట్టుదల  ఓర్పుతోడైంది. తన సోదరులతో కలిసి, అతను ‘హరి కృష్ణ ఎక్స్‌పోర్టర్స్’ అనే చిన్న వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడు.  వజ్రాల వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది, పైగా పోటీ. దీంతో మొదట్లో వ్యాపారం చాలా కష్టమయ్యేది. కానీ  ప్రజలపై  సావ్జీభాయ్‌కి నమ్మకం వమ్ముకాలేదు. దీనికి తోడు ఉద్యోగులకు  కార్మికుల్లాగా కుండా, తన ఇంట్లో మనుషుల్లాగా చూసుకునవాడు.  అటు ఉద్యోగుల మనసుల్లోనూ, ఇటు వ్యాపారంలోనే  అందనంత ఎత్తుకు  ఎదిగాడు.

    ఉద్యోగులకు బోనస్‌లు ఇవ్వడం మాత్రమే కాదు,  ఖరీదైన దీపావళి  కానుకలిస్తూ సావ్జీభాయ్ ధోలాకియా  వార్తల్లో నిలిచారు. ఆయన నమ్మింది ఒకటే. తన ఉద్యోగులకు బావుంటే.. కంపెనీ బావుంటుంది..వారి  అభివృద్దే  తన  వ్యాపారం అభివృద్ధి  అని. అదే  నమ్మకం నేటికీ కొనసాగుతోంది. 2025లో కూడా 3 కోట్ల రూపాయలకు పైగా విలువైన మూడు బ్రాండ్ న్యూ మెర్సిడెస్-బెంజ్ GLS SUVలను కానుకగా ఇచ్చాడు. పాతికేళ్ళనుంచి తన కంపెనీలో  సేవలందిస్తున్న నమ్మకమైన జట్టు సభ్యులు, ముగ్గురు సీనియర్ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చాడు.  సావ్జీభాయి దృష్టిలో ఇటువంటి బహుమతులు అంటూ దుబారా కాదు, జీవితాంతం కలిసి చేసిన కృషికి, విజయానికి హృదయపూర్వక 'ధన్యవాదాలు'అంటారాయన.

    ఇదీ చదవండి: మహిళల డ్రెస్సింగ్‌ వివాదం : రాధాకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

    ఈ ప్రత్యేకమైన లక్షణమే ఒక చిన్న వర్క్‌షాప్‌గా మొదలైన ఆయన  కంపెనీ ప్రపంచ వజ్రాల శక్తి కేంద్రంగా నిలిపింది. ఆభరణాల బ్రాండ్ 'కిస్నా  వ్యాపారం ఇప్పుడు రూ. 12,000 కోట్లకు పైమాటే.. 2022లో, భారత ప్రభుత్వం సావ్జీభాయ్ ధోలాకియాను గుజరాత్‌లో సామాజిక సేవలో ఆయన చేసిన విశిష్ట సేవకు గాను దేశంలోని అత్యున్నత పౌర అవార్డులలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. బిలియనీర్ ,పద్మశ్రీ అవార్డు గ్రహీత సావ్జీభాయ్ ఇప్పటికీ  చాలా సాదా సీదాగా ఉండే  వ్యక్తి. 

    ఇదీ చదవండి: గ్వాలియర్‌లో దారుణం మహిళల బొమ్మల్ని కూడా .. వీడియో వైరల్‌

    ధోలాకియా 1996లో హరి కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దాన్నే ధోలాకియా ఫౌండేషన్ అని  పిలుస్తారు. దీని ద్వారా అనేక కార్యక్రమాలతోపాటు, చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం , భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం కోసం కోట్లు ఖర్చు చేయడం విశేషం. మొక్కవోని పట్టుదల, అచంలమైన విశ్వాసంతో సాగిన ఆయన జీవితం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నారు. 

  • ల‌క్నో: అఖిలేశ్ యాద‌వ్‌కు స‌న్నిహితుడైన సమాజ్‌వాదీ పార్టీ సీనియ‌ర్‌ నాయకుడు శివరాజ్ సింగ్ యాదవ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో క‌ల‌క‌లం రేపారు. నిచ్చెన‌మెట్ల కుల‌వ్య‌వ‌స్థ‌లో నిమ్న‌వ‌ర్గాల‌ను (శూద్రుల‌ను) హీనంగా చూస్తున్నారంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారాయ‌న. ఈ నేప‌థ్యంలో యాద‌వులు హిందువులు కాదంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. యాదవ్ సమాజం హిందువులలో భాగం కాదని పేర్కొంటూ.. మనుస్మృతిలోని కుల విభజనను ప్రశ్నించారు. మనిషిని కుక్క కంటే హీనంగా చూసే మతాన్ని తాను అనుసరించనని చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సిర్సాగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దండియామాయి గ్రామంలో "పీడీఏ (దళిత్-వెనుకబడిన-మైనారిటీ) పాఠశాల" పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

    నేను మనిషిని..
    "మేము బ్రాహ్మణులం కాదు. మేము క్షత్రియులం కాదు. మేము వైశ్యులం కూడా కాదు. ఇక మిగిలింది ఎవ‌రు? శూద్రులు. నేను మీ అంద‌రికీ ఒక‌టే చెబుతున్నా.. హిందువుగా ఉండటం తప్పనిసరి కాదు. ప్రతి వేదికపై చెప్పినట్లే, ఇక్క‌డా చెబుతున్నా.. నేను హిందువును కాదు. నా పేరు శివరాజ్ సింగ్ యాదవ్, నేను ఒక మనిషిని. హిందువును కాదు. ఎందుకంటే ఏ మతమైతే మనిషిని కుక్క కంటే హీనంగా చూస్తుందో, ఆ మతాన్ని అస్సలు పాటించ‌ను, ఎప్పటికీ అనుసరించన''ని శివరాజ్ సింగ్ యాదవ్ అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌స్తుత ప్రభుత్వం దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై అత్యంత దారుణమైన అకృత్యాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

    పీడితుల‌కు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా..
    నిమ్న‌వ‌ర్గాల‌కు రాజ్యాధికారం క‌ట్ట‌బెట్టాల‌న్న ల‌క్ష్యంతో పీడీఏ భావ‌న‌ను వ్యాప్తి చేస్తున్నామ‌ని శివరాజ్ సింగ్ యాదవ్ (Shivraj Singh Yadav) వివ‌రించారు. దళిత- వెనుకబడిన- మైనారిటీ వర్గాలు దేశ జనాభాలో దాదాపు 90 శాతం ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో త‌గినంత ప్రాతినిథ్యం ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హిందూ మతంలో వివ‌క్ష‌కు గురైన ద‌ళితులు ఎక్కువ‌గా ఆ మ‌తాన్ని విడిచిపెట్టార‌ని తెలిపారు. వీరిలో చాలా మంది బౌద్ధమతంలోని సమతావాదానికి ఆక‌ర్షితులై అందులో చేరార‌ని అన్నారు. త‌మ కులానికి చెందిన కొద్దిమంది యాదవ్ నాయకులు మాత్రమే తాము హిందువులు కాదని ప్రకటించుకున్నారని చెప్పారు.

    చ‌ద‌వండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చ‌క్రం తిప్పుతారా?

    కాగా, బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక యూపీతో  పాటు కేంద్రంలోనూ పీడిత వ‌ర్గాల‌పై దాడులు పెరిగాయ‌ని సమాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ (Akhilesh Yadav) చాలా సంద‌ర్భాల్లో విమ‌ర్శించారు. యూపీలో యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారు, కేంద్రంలో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం.. దళిత వ్యతిరేక వైఖరిని అవ‌లంభిస్తున్నాయ‌ని ప‌లుమార్లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో అఖిలేశ్‌కు స‌న్నిహితుడైన శివరాజ్ సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, ద‌ళిత‌, మైనారిటీల ఓట్ల కోస‌మే ఆయ‌నీ వ్యాఖ్యలు చేశార‌ని అధికార వ‌ర్గాలు కౌంట‌ర్ ఇస్తున్నాయి. 

  • సాక్షి, ఢిల్లీ: కోలీవుడ్‌ స్టార్‌ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నోటీసులు జారీ చేసింది. కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ని విచారించాలని భావిస్తోంది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్‌ను సీబీఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది.  

    సెప్టెంబర్‌ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ ఆశా గార్గ్‌ నేతృత్వంలోని సిట్‌ తొలుత దర్యాప్తు చేపట్టింది. దీనిని సవాల్‌ చేస్తూ.. టీవీకే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. 

    తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని, సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీన్ని విచారించిన జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను ‘సీబీఐ’కి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు..

    సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ బృందం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కరూర్‌లోని ఘటన స్థలాన్ని పరిశీలించింది. బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది. ఆపై విచారణను ముమ్మరం చేసింది. 

    TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Sports

  • సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీవ్ స్మిత్‌.. తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. గ్రీన్‌, వెబ్‌స్టెర్‌తో కలిసి స్కోర్ బోర్డును అతడు పరుగులు పెట్టించాడు.

    ఈ క్రమంలో స్మిత్‌ 165 బంతుల్లోనే తన 37వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. స్మిత్ 129 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. స్మిత్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావెస్ హెడ్(163) కూడా భారీ శతకంతో చెలరేగాడు. ఫలితంగా ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు సాధించింది. కంగారులు ఇంగ్లండ్ కంటే 134 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో శతక్కొట్టిన స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

    వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..
    అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఇంగ్లండ్‌ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మిత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో స్మిత్‌ ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌(5,028) అధిగమించాడు. స్మిత్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్‌లు కలిపి 5,085 పరుగులు చేశాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
    స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 5085 పరుగులు
    డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా) - 5028 పరుగులు
    అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 4850 పరుగులు
    వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 4488 పరుగులు
    రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 4141 పరుగులు
    విరాట్ కోహ్లీ (భారత్‌) - 4036 పరుగులు
    సచిన్ టెండూల్కర్ (భారత్‌) - 3990 పరుగులు

    👉అదేవిధంగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆరో స్ధానానికి స్మిత్ ఎగబాకాడు. ఈ జాబితాలో స్మిత్‌ కంటే ముందు సంగక్కర(38), జో రూట్‌(41), పాంటింగ్‌(41), కల్లిస్‌(45), సచిన్‌ టెండూల్కర్‌(51) ఉన్నారు.

  • టెస్టు క్రికెట్‌లో ‘బాజ్‌బాల్‌’ అంటూ విర్ర‌వీగిన ఇంగ్లండ్ జ‌ట్టుకు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఘోర పరాభవం ఎదురైంది. ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్ ట్రోఫీని ఇంగ్లండ్  వ‌రుస‌గా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియాకు స‌మ‌ర్పించుకుంది. యాషెస్ 2025-26లో తొలి మూడు టెస్టుల్లో ఘోర ఓట‌ములను చ‌విచూసిన స్టోక్స్ సేన‌.. కేవ‌లం 11 రోజుల్లోనే సిరీస్‌ను కోల్పోయింది. 

    దీంతో ఇంగ్లండ్ జ‌ట్టుతో పాటు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్ల‌మ్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. అంతేకాకుండా టూర్ మధ్యలో నిర్వహించిన 'నూసా (Noosa)' పర్యటన వంటివి కూడా ఇంగ్లండ్ జట్టు ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీశాయి.

    డేంజ‌ర్‌లో మెక‌ల్ల‌మ్‌ పోస్ట్‌..
    అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఘోర ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ పదవి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మెక్‌కల్లమ్‌కు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. జట్టు వాతావరణంతో పాటు సంస్కృతిలో సమూల మార్పులు చేయాలని మెక్‌కల్లమ్‌ను బోర్డు సూచించినట్లు సమాచారం.

    ఒకవేళ అందుకు అతడు అంగీకరించకపోతే తనంతట తానుగా రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఈసీబీ కండిషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్, ఛైర్మన్ రిచర్డ్ థాంప్సన్ ప్రస్తుతం సిడ్నీలోనే ఉన్నారు. ఐదో టెస్టు ముగిసిన వెంటనే జట్టు వైఫల్యాలపై అధికారిక సమీక్ష జరగనుంది. అయితే కెప్టెన్ బెన్ స్టోక్స్ మద్దతు మాత్రం మెక్‌కల్లమ్‌కు ఉంది.  

    "బ్రెండన్‌తో కలిసి పని చేయడం నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఈ జట్టును మరింత ఉన్నత స్థాయికి  తీసుకెళ్లగలమని నమ్ముతున్నాను. ఇప్పుడున్న స్థితిలో జ‌ట్టును మెక్‌క‌ల్ల‌మ్ మాత్ర‌మే గ‌ట్టెక్కించ‌గ‌ల‌డు" అని స్టోక్స్ సిడ్నీ టెస్టుకు ముందు స్పష్టం చేశాడు. కాగా వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి చవిచూసిన ఇంగ్లీష్‌ జట్టు.. ఎట్టకేలకు బాక్సింగ్‌ డే టెస్టులో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం సిడ్నీ టెస్టు నువ్వానేనా అన్నట్లగా సాగుతోంది.

  • విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో వినోద్ విధ్వంసం సృష్టించాడు. 248 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దు చెలరేగాడు. ఈ క్రమంలో అతడు కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    32 ఏళ్ల విష్ణు వినోద్ సెంచరీ సాధించాక మరింత చెలరేగిపోయాడు. అతడిని ఆపడం​ ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 84 బంతులు ఎదుర్కొన్న వినోద్‌.. 13 ఫోర్లు, 14 సిక్స్‌లతో  162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు బాబా అపరాజిత్‌(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా లక్ష్యాన్ని కేరళ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 29 ఓవర్లలోనే చేధించింది.

    అంతకుముందు బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 47.4 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. అజయ్‌ రోహరా(53), జశ్వంత్‌(57) హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. మిగితా ప్లేయర్లంతా విఫలమయ్యారు. కేరళ బౌలర్లలో నిదేష్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఈడెన్‌ యాపిల్‌ టామ్‌, అనికేత్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే కేరళ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ మాత్రం విఫలమయ్యాడు.

    గైక్వాడ్ రికార్డు బ్రేక్‌..
    ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వినోద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన రెండో ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో వినోద్ ఇప్పటివరకు 106 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు రుతురాజ్ గైక్వాడ్(105) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గైక్వాడ్‌ను వినోద్ అధిగమించాడు. ఈ జాబితాలో కర్ణాటక ఆటగాడు మనీష్ పాండే(108) అగ్రస్ధానంలో ఉన్నాడు. విష్ణు వినోద్‌ ఐపీఎల్‌-2026లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఆడనున్నాడు.

    విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్లు వీరే..

    1 - మనీష్ పాండే: 99 ఇన్నింగ్స్‌లలో 108 సిక్సులు

    2 - విష్ణు వినోద్: 53 ఇన్నింగ్స్‌లలో 106 సిక్సులు

    3 - రుతురాజ్ గైక్వాడ్: 55 ఇన్నింగ్స్‌లలో 105 సిక్సులు

    4 - యూసుఫ్ పఠాన్: 56 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సులు

    5 - ఇషాన్ కిషన్: 50 ఇన్నింగ్స్‌లలో 85 సిక్సులు
    చదవండి: బంగ్లాదేశ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!


     

     

  • ఆటపై ప్రేమ.. అంకితభావం.. నిబద్ధతతో కష్టపడి పైకి వచ్చి.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని.. సుదీర్ఘకాలం కెరీర్‌లో కొనసాగిన ఏ ఆటగాడైనా రిటైర్మెంట్‌ ప్రకటించే క్షణం తీవ్రమైన భావోద్వేగానికి లోనుకావడం సహజం. అలాంటి తరుణంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి సదరు ప్లేయర్‌ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకొంటాడు.

    తాను అధిగమించిన సవాళ్లు, ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వారిని గుర్తుచేసుకోవడమూ పరిపాటి. ఆస్ట్రేలియా టెస్టు స్టార్‌ ఉస్మాన్‌ ఖవాజా కూడా తన రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రాణంగాప్రేమించిన ఆటకు భారమైన మనసుతో వీడ్కోలు పలికాడు. అయితే, ఆ సమయంలో తాను ఓ బాధితుడినని చెప్పుకొనేందుకే అతడు ప్రాధాన్యం ఇచ్చాడు.

    ‘‘కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. పాకిస్తాన్‌లో పుట్టడం, ముస్లిం కావడం వల్ల కఠిన పరిస్థితులు దాటాల్సి వచ్చింది. వాటి గురించి ఇప్పుడు చెప్పాలని లేదు.. కానీ.. నేను సాధించగలిగినప్పుడు ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నా.

    మరో ఉస్మాన్‌ ఖవాజాకు మళ్లీ ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే నా తాపత్రయం. మనుషులంతా ఒక్కటే అనేది నా అభిమతం. పుట్టిన ప్రాంతంతోనే, లేక మతంతోనో ఎవరినీ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచం అనేది ఆశల పొదరిల్లు. దాన్ని అందిపుచ్చుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉండాలి. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. కష్టపడకుండా ఆ చాన్స్‌ ఎవరికీ రాదు.

    పదిహేనేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. అయినా సమస్య మొత్తం తొలగిపోయిందని చెప్పలేను. నేను నల్లజాతీయుడిని కాబట్టి ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించలేనని విమర్శించేవారు. కానీ నేను అది సాధించాను. ఆటపై నా అంకితభావం, నిబద్ధతను శంకించడం... నా సన్నద్ధతను ప్రశ్నించడంతో చాలా ఇబ్బందిగా అనిపించేది.

    అలాంటి సమయంలో కనీస తోడ్పాటు దక్కేది కాదు. జట్టులో ఇతర ఆటగాళ్లు గాయపడితే... కనిపించే సానుభూతి నా విషయానికి వచ్చేసరికి పూర్తి భిన్నంగా ఉండేది. ముస్లింలందరూ మ్యాచ్‌లు ఫిక్స్‌ చేస్తారు అనుకోవడం తప్పు. ముందు అలాంటి ఆలోచన ధోరణి నుంచి బయట పడాలి. 2023లో పాలస్తీనాపై స్పందించింది కూడా అందుకే.

    స్వేచ్ఛ అనేది మానవులందరి హక్కు అని చెప్పాలనుకున్నా. అయితే క్రికెటేతర  అంశాలను ప్రస్తావించడం చాలా మందికి నచ్చలేదు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశా. యువతరానికి స్ఫూర్తిగా నిలిచానని అనుకుంటున్నా. ముఖ్యంగా మాకు అవకాశాలు దక్కవు అని నిరాశలో ఉండేవారికి నాకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది’’ అని ఉస్మాన్‌ ఖవాజా తన రిటైర్మెంట్‌ ప్రసంగంలో పేర్కొన్నాడు.

    మద్దతుగా నిలవలేదా?
    అయితే, ఆట గురించి కాకుండా తాను క్రికెటేతర అంశాల గురించి మాట్లాడుతూ రాజకీయాలకు తావిచ్చినా.. ఆసీస్‌ ఆటగాళ్లు అతడికి మద్దతుగానే నిలిచారు. ఐసీసీ మొట్టికాయలు వేసినపుడు క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడికి అండగానే ఉంది. డ్రెసింగ్‌రూమ్‌లోనూ అతడి పట్ల ఎవరూ వివక్షపూరితంగా వ్యవహరించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

    కమిన్స్‌ గొప్పగానే స్పందించాడే
    ముఖ్యంగా షాంపైన్‌ సెలబ్రేషన్స్‌కు ఖవాజా దూరంగా ఉంటాడని తెలిసి.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఒకానొక సందర్భంలో ఎంతో పరిణతి కనబరిచాడు. యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ 2022లో సొంతం చేసుకున్న తర్వాత.. జట్టంతా ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఖవాజా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.

    ఈ విషయాన్ని గమనించిన కమిన్స్‌.. సహచర ఆటగాళ్లకు షాంపైన్‌ సెలబ్రేషన్‌ ఆపమని చెప్పాడు. దీంతో వారంతా మిన్నకుండిపోగా.. కమిన్స్‌ ఖవాజాను కూడా వేదికపైకి పిలిచి ట్రోఫీని పట్టుకోమని చెప్పాడు. అప్పట్లో కమిన్స్‌ వ్యవహరించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది.

    జన్మభూమి పట్ల ప్రేమ ఉండాలి.. కానీ
    కమిన్స్‌ మనస్ఫూర్తిగా చేసిన పని గురించి ఖవాజాకు తన స్పీచ్‌ సమయంలో గుర్తుకురాకపోవడం గమనార్హం. తన ‍ప్రసంగం ఆసాంతం తానో బాధితుడినని చెప్పుకొన్న ఖవాజా పదేపదే తను పాకిస్తానీ ముస్లింనంటూ గుర్తుచేసుకున్నాడు. జన్మభూమి పట్ల ప్రేమ ఉండటాన్ని ఎవరూ తప్పుపట్టరు.

    అయితే, బతుకుదెరువు కోసం వచ్చిన చోట అనేక అవాంతరాలు దాటి ఆ దేశ జాతీయ జట్టుకు పదిహేనేళ్లుగా ప్రాతినిథ్యం వహించిన తీరును అతడు పెద్దగా గుర్తుచేసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఖవాజాకు ‘క్యాప్‌’ ఇవ్వడమే కాదు.. తన ప్రతిభను నిరూపించుకునేందుక చక్కటి వేదిక అందించింది.

    సొంత దేశంలో ఉన్నా
    అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సహించింది. ఆటకు సంబంధం లేని రాజకీయాలు మాట్లాడుతున్నా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు విలువనిచ్చింది. ఒకవేళ తన సొంత దేశంలో ఉన్నా ఖవాజాకు ఇంత ఫ్రీడమ్‌ దొరికేది కాదేమో!

    అయినా సరే.. అతడు పదే పదే నల్లజాతీయుడినని, పాక్‌కు చెందినవాడినని చెప్పినా.. క్రికెట్‌ ఆస్ట్రేలియా తప్పుపట్టలేదు. కేవలం అతడిలోని ప్రతిభకు పెద్ద పీట వేసి ఓపెనర్‌గా ఎన్నో అవకాశాలు ఇచ్చింది. 

    బాధితుడా? కృతజ్నుడా?.. 
    ప్రతి ఆటగాడి కెరీర్‌లో మాదిరే ఫామ్‌లో లేనపుడు ఖవాజా కూడా జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. అంతేతప్ప అతడిని కావాలని పక్కనపెట్టినట్లుగా ఎక్కడా అనిపించలేదు. చివరగా.. తన రిటైర్మెంట్‌ స్పీచ్‌లో ఉస్మాన్‌ ఖవాజా బాధితుడినని చెప్పుకోవడంలో సఫలీకృతమయ్యాడా? లేదంటే కృతజ్నుడిగా మిగిలిపోయాడా?

    ఈ మేరకు సోషల్‌ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల బాండీ బీచ్‌లో అమాయక యూదులపై జరిగిన మారణహోమం గురించి  మాత్రం ఖవాజా కనీసం స్పందించకపోవడాన్ని కూడా కొంత మంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

    ఏదేమైనా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఉస్మాన్‌ ఖవాజా.. యాషెస్‌ సిరీస్‌తో ఏ చోట మొదలుపెట్టాడో... అదే చోట కెరీర్‌ ముగిస్తున్నాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌తో తన 88వ, ఫేర్‌వెల్‌ టెస్టు ఆడుతున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో వచ్చి 17 పరుగులే చేసి నిష్క్రమించాడు. 

  • విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా బెంగాల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 107 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ విజ‌య భేరి మ్రోగించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

    యువ ఓపెనర్ అమన్ రావు అద్భుతమైన డబుల్ సెంచరీతో చెల‌రేగాడు. కేవలం 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు గహ్లాట్ రాహుల్ సింగ్(65), కెప్టెన్ తిలక్ వర్మ (34) రాణించారు. బెంగాల్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టాడు.

    నిప్పులు చెరిగిన సిరాజ్‌..
    అనంత‌రం 353 ప‌రుగుల భారీ ల‌క్ష్య  చేధ‌న‌లో బెంగాల్ జ‌ట్టు 44.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. బెంగాల్ బ్యాట‌ర్ల‌లో షాబాజ్ అహ్మద్ ఒంటరి పోరాటం చేశాడు. షాబాజ్113 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ ఆడుతున్న హైదరాబాదీ స్పీడ్ స్టార్ మహ్మద్ సిరాజ్.. ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు.

    సిరాజ్ మియా తన 10 ఓవర్ల కోటాలో 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నితేష్ రెడ్డి రెండు, సీవీ మిలంద్‌, రక్షణ్‌, నితిన్ తలా వికెట్ సాధించారు. కాగా హైదరాబాద్ ప్రస్తుతం గ్రూపు-బి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉంది. హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ భారీ విజయాన్ని అందుకోవాలి. అంతేకాకుండా మిగితా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
    చదవండి: ఐపీఎల్ నుంచి ఔట్‌.. ముస్తాఫిజుర్‌కు పరిహారం అందుతుందా?

  • టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనంలో శుభారంభం అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ముంబై కెప్టెన్‌గా తిరిగి మైదానంలో అడుగుపెట్టిన అయ్యర్‌.. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటాడు.

    విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే అయ్యర్‌ అర్ధ శతకం బాదాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 53 బంతుల్లో  10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 82 పరుగులు చేశాడు. 

    జైస్వాల్‌, సూర్య ఫెయిల్‌
    ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ యశస్వి జైస్వాల్‌ (15) విఫలం కాగా.. ముషీర్‌ ఖాన్‌ (73) మాత్రం అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (21).. టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24) నిరాశపరిచారు.

    శివం దూబే (20), హార్దిక్‌ తామోర్‌ (19 నాటౌట్‌), సాయిరాజ్‌ పాటిల్‌ (9 బంతుల్లో 25), షామ్స్‌ ములాని (5 బంతుల్లో 11) ఓ మోస్తరుగా ఆడగా.. తుషార్‌ దేశ్‌పాండే డకౌట్‌ కాగా.. శశాంక్‌ అటార్డే (1) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 33 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 299 పరుగులు సాధించింది.

    అయితే, లక్ష్య ఛేదనకు దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కుశాల్‌ పాల్‌, ఇన్నేశ్‌ మహాజన్‌ డకౌట్‌ అయ్యారు. ఇలాంటి తరుణంలో పఖ్రాజ్‌ మాన్‌ (41 బంతుల్లో 64), అంకుశ్‌ బ్రెయిన్స్‌ (39 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకాలతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

    ధనాధన్‌ దంచికొట్టినా..
    కెప్టెన్‌ మృదుల్‌ సరోచ్‌ (13) నిరాశపరిచినా.. మయాంక్‌ డాగర్‌ (47 బంతుల్లో 64), అమన్‌ప్రీత్‌ సింగ్‌ (21 బంతుల్లో 42) ధనాధన్‌ దంచికొట్టి గెలుపు ఆశలు రేపారు. ఆఖర్లో అమిత్‌ కుమార్‌ యాదవ్‌ (28) రాణించగా.. చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. శివం దూబే రెండు వికెట్లు తీయడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ఆలౌట్‌ అయింది. 32.4 ఓవర్లలో 292 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా ముంబై ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.

    ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..
    ముంబై బౌలర్లలో టీమిండియా స్టార్‌ శివం దూబే నాలుగు వికెట్లతో చెలరేగగా.. సాయిరాజ్‌ పాటిల్‌ రెండు, షామ్స్‌ ములాని, ముషీర్‌ ఖాన్, తుషార్‌ దేశ్‌పాండే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ముంబై గెలుపు కారణంగా.. రీఎంట్రీలో శ్రేయస్‌ అయ్యర్‌కు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అదిరిపోయే ఆరంభం లభించింది. 

    చదవండి: రీఎంట్రీ’లో శుబ్‌మన్‌ గిల్‌ అట్టర్‌ఫ్లాప్‌

  • బంగ్లాదేశ్ స్టార్‌ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడు కూడా ఆడకుండా బీసీసీఐ నిషేదం విధించింది బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

    బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అతడిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

    తమ దేశ క్రికెటర్‌ను అర్ధాంతరంగా తప్పించడాన్ని బంగ్లా జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో భద్రతను కారణంగా చూపుతూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనేందుకు భారత్‌కు వెళ్లబోము అని  ఐసీసీకి  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఆ లేఖలో బీసీబీ రాసుకొచ్చింది. అయితే బీసీబీ అభ్యర్ధను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది.

    భారీ ధరకు అమ్ముడైనా..
    అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ అనుహ్యంగా జట్టు నుంచి రిలీజ్ చేయడంతో అతడికి ఏమైనా పరిహరం చెల్లిస్తుందా? అన్న ప్ర‌శ్న క్రికెట్ అభిమానుల్లో ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి ప‌రిశీలిద్దాము. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. కాంట్రాక్ట్ పొందిన ఆట‌గాడికి స‌దురు ఫ్రాంచైజీకి ఇన్సూరెన్స్ చేయిస్తోంది.

    ఒక జట్టులో చేరిన తర్వాత లేదా టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో గాయపడితే భీమా వ‌ర్తిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు సదరు ఆటగాడికి ఏభై శాతం వరకు జీతాన్ని చెల్లిస్తాయి. కానీ ముస్తాఫిజుర్ ప‌రిస్థితి అందుకు భిన్నం. అత‌డు ఇంకా కేకేఆర్ క్యాంపులోనే చేర‌లేదు. దౌత్య‌ప‌రమైన కార‌ణాల వ‌ద్ద అత‌డి ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్నారు. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు ఆదేశాలు వంటివి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. కాబట్టి కేకేఆర్ యాజమాన్యం నుంచి అత‌డికి ఒక్క పైసా కూడా అంద‌ద‌ని ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

    అదొక్క‌టే మార్గం..
    అయితే చట్టపరంగా పోరాడటం ఒక్క‌టే ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ ముందున్న మార్గం. ఐపీఎల్ కాంట్రాక్ట్‌లు భారత చట్టపరిధిలోకి వస్తుంది. కానీ ఏ విదేశీ క్రికెటర్ భార‌త కోర్టుల‌లో గానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ (CAS)లో కేసు వేసే అంత స‌హ‌సం చేయ‌రు. ఎందుకంటే ఇది చాలా క‌ష్ట‌త‌ర‌మైన ప్ర‌క్రియ‌.
    చదవండి: బంగ్లాదేశ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • భారత స్టార్‌ పేసర్‌ క్రాంతి గౌడ్‌ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి కలలు ఫలించాయి. ఆమె తండ్రి మున్నా సింగ్‌ తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

    గతేడాది భారత్‌ తరఫున మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్‌. ఇప్పటికి మొత్తంగా 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ మీడియం పేసర్‌.. వన్డేల్లో 23, టీ20లలో రెండు వికెట్లు తీసింది.

    తొమ్మిది వికెట్లు కూల్చి.. 
    అయితే, గతేడాది సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో క్రాంతి గౌడ్‌ అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. ఈ మెగా టోర్నీలో మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. భారత్‌ తొలిసారిగా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది. జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

    కూతురి ప్రతిభ.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
    ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం క్రాంతి గౌడ్‌ సముచిత రీతిలో గౌరవించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌.. క్రాంతి తండ్రి మున్నా సింగ్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌కు గర్వకారణమైన తమ ముద్దుబిడ్డ పట్ల ప్రేమను చాటుకుంటూ నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ క్రమంలోనే మున్నా సింగ్‌ తిరిగి పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరవచ్చని సోమవారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ క్రీడా శాఖా మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ వెల్లడించారు. ‘‘అథ్లెట్ల పట్ల గౌరవం, వారి బాగోగుల గురించి మా ప్రభుత్వం పట్టించుకుంటుందనేందుకు ఇదే నిదర్శనం.

    మా నిర్ణయం వల్ల గౌడ్‌ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి లాభం చేకూరకపోవచ్చు. అయితే, తన తండ్రి గౌరవప్రదంగా.. పోలీస్‌ యూనిఫామ్‌లో రిటైర్‌ అవ్వాలన్న క్రాంతి కల మాత్రం నెరవేరుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా మధ్యప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో పనిచేసిన మున్నా సింగ్‌ 2012లో సర్వీస్‌ నుంచి తొలగించబడ్డారు.

    మున్నా సింగ్‌పై అందుకే వేటు
    ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మున్నా సింగ్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మున్నా సింగ్‌ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడింది. నిలకడైన ఆదాయంలేక చాలీచాలని డబ్బులతో.. ఒక్క పూట భోజనం కూడా దొరకడం కష్టమైన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రాంతి గౌడ్‌ క్రికెటర్‌ కావాలన్న తన కలను వదల్లేదు.

    ట్విస్టు  ఏంటంటే?
    కష్టాల కడలిని దాటి భారత జట్టుకు ఆడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు వరల్డ్‌కప్‌ విజయంలోనూ కీలకంగా వ్యవహరించి కీర్తిప్రతిష్టలు సంపాదించింది. ఈ క్రమంలోనే ఆమె తండ్రికి ఉద్యోగం తిరిగి వచ్చింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎన్‌డీటీవీ వివరాల ప్రకారం.. జూన్‌ 8, 2012 నుంచి జనవరి 5, 2026 వరకు మున్నా సింగ్‌ విధుల్లో లేడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆయనకు ప్రభుత్వం ‘నో వర్క్‌, నో పే’ నిబంధనను వర్తింపజేసినట్లు సమాచారం. అంటే.. 2012- 2026 వరకు సర్వీసు కోల్పోయిన మున్నా సింగ్‌కు ఎలాంటి జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించదు. 

    చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

  • విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూప్ విజేతగా బీహార్ నిలిచింది. మంగళవారం రాంచీ వేదికగా జరిగిన ఫైనల్‌లో 6 వికెట్ల తేడాతో మణిపూర్‌ను చిత్తు చేసిన బీహార్‌.. ఈ దేశవాళీ వన్డే టోర్నీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ 47.5 ఓవర్లలో కేవలం 169 పరుగులకే కుప్పకూలింది.

    బీహార్‌ స్పిన్నర్‌ షబీర్‌ ఖాన్‌ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి మణిపూర్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హిమాన్షు తివారీ 3 వికెట్లు సాధించాడు. మణిపూర్‌ బ్యాటర్లలో  ఉలెనయ్‌ ఖ్వేరాక్‌పమ్‌(61), ఫిరాయిజామ్ జోటిన్(51) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని బీహార్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 31.2 ఓవర్లలో చేధించింది.

    బీహార్ బ్యాటర్లలో ఆయుష్ లోహరుక 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మంగల్‌ మహరౌర్‌(32), ఆకాష్‌ రాజ్‌(20) రాణించారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ షబీర్ ఖాన్‌కు దక్కగా.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఫిరాయిజామ్ జోటిన్ నిలిచాడు. కాగా ఈ సీజన్‌లో బీహార్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది.  

    ఫైనల్‌లో కూడా అదే జోరును కొనసాగించింది. ముఖ్యంగా ఈ టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ 574 పరుగుల భారీ స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేవిధంగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే జాతీయ విధుల కారణంగా టోర్నీ మధ్యలోనే వైభవ్ వైదొలిగాడు.
    చదవండి: ‘రీఎంట్రీ’లో శుబ్‌మన్‌ గిల్‌ అట్టర్‌ఫ్లాప్‌

  • గతేడాది అక్టోబరులో ఆస్ట్రేలియాతో చివరగా వన్డే మ్యాచ్‌ ఆడాడు శుబ్‌మన్‌ గిల్‌. టీమిండియా వన్డే సారథి హోదాలో తొలిసారి ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టిన ఈ కుడిచేతి వాటం.. కెప్టెన్సీ అరంగేట్రంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పెర్త్‌లో 10, అడిలైడ్‌లో 9 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచిన గిల్‌.. సిడ్నీలో జరిగిన ఆఖరి వన్డేలో 24 పరుగులు చేయగలిగాడు.

    అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డేలకు మాత్రం గిల్‌ దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా సఫారీలతో మూడు వన్డేలకు అందుబాటులో లేకుండా పోయాడు. అనంతరం ప్రొటిస్‌ జట్టుతో మూడు టీ20లు ఆడినా.. స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడే భారత జట్టులో స్థానం కోల్పోయాడు.

    ‘రీఎంట్రీ’లో అట్టర్‌ఫ్లాప్‌
    ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సందర్భంగా మంగళవారం నాటి మ్యాచ్‌తో ‘వన్డే’లలో రీఎంట్రీ ఇచ్చాడు గిల్‌. గోవాతో మ్యాచ్‌లో సొంత జట్టు పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ గిల్‌ విఫలమయ్యాడు.

    11 పరుగులే చేసి
    మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న ఈ టీమిండియా కెప్టెన్‌.. రెండు ఫోర్లు బాది కేవలం 11 పరుగులే చేసి నిష్క్రమించాడు. గోవా పేసర్‌ వాసుకి కౌశిక్‌ బౌలింగ్‌లో ప్రభుదేశాయికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మరో ఓపెనర్‌, పంజాబ్‌ సారథి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11 బంతుల్లో 2) కూడా విఫలమయ్యాడు. కౌశిక్‌ బౌలింగ్‌లో అతడు బౌల్డ్‌ అయ్యాడు.

    టార్గెట్‌ 212
    ఇలాంటి పరిస్థితిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్నూర్‌ సింగ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా నమన్‌ ధిర్‌ కూడా మెరుగ్గా ఆడుతుండటంతో పంజాబ్‌ లక్ష్య ఛేదనగా పయనిస్తోంది. రాజ్‌కోట్‌ వేదికగా ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన గోవా తొలుత బ్యాటింగ్‌ చేసింది. పంజాబ్‌ బౌలర్ల ధాటికి తాళలేక 33.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది.

    గోవా బ్యాటర్లలో సూయశ్‌ ప్రభుదేశాయి (66), లలిత్‌ యాదవ్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు.పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, సుఖ్‌దీప్‌ బజ్వా, క్రిష్ భగత్‌ తలా రెండు వికెట్లు తీయగా.. మయాంక్‌ మార్కండే మూడు వికెట్లతో చెలరేగాడు. నమన్‌ ధిర్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

    Update: నమన్‌ ధిర్‌ 68 పరుగులతో రాణించగా.. హర్నూర్‌ సింగ్‌ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రమణ్‌దీప్‌ సింగ్‌ (8 బంతుల్లో 15 నాటౌట్‌) నిలవగా.. 35 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయిన పంజాబ్‌.. 212 పరుగులు చేసింది. తద్వారా గోవాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    చదవండి: షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.. కరీంనగర్‌ కుర్రాడి డబుల్‌ సెంచరీ

  • ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ స్టార్ ఆల్‌రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్దానాన్ని సదర్లాండ్ కైవసం చేసుకుంది.

    సదర్లాండ్ 736 పాయింట్ల‌తో టాప్ ర్యాంక్‌లో కొన‌సాగుతుండ‌గా.. దీప్తీ శ‌ర్మ‌(735) రెండో స్ధానంలో ఉంది. దీప్తీకి ఆసీస్ ప్లేయర్‌కు కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇటీవల శ్రీలంక మహిళలతో జరిగిన టీ20 సిరీస్‌లో శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో తన టాప్ ర్యాంక్‌ను కోల్పోవల్సి వచ్చింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆమె కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టింది. మరోవైపు, భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ ఐదు స్థానాలు దిగజారి 11వ స్థానానికి, రాధా యాదవ్ రెండు స్థానాలు తగ్గి 18వ స్థానానికి పడిపోయారు.

    ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం మన అమ్మాయిలు అదరగొట్టారు. శ్రీలంకతో సిరీస్‌లో దుమ్ములేపిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన షఫాలీ తన 6వ స్ధానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో హైద‌రాబాద్ క్రికెట‌ర్ అరుంధ‌తీ రెడ్డి స‌త్తాచాటింది. ఆల్ రౌండర్ల జాబితాలో ఆమె ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకుంది.
    చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు
     

  • బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను ఐపీఎల్ నుంచి విడుద‌ల చేయ‌డంతో మొద‌లైన వివాదం రోజు రోజుకు మ‌రింత ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ బ్యాన్ దగ్గర నుంచి, టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు భారత్‌కు రాబోమని చెప్పడం వరకూ చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

    ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు తమ అంపైర్లను పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్న బంగ్లా అంపైర్‌లు షర్ఫుద్దౌలా, షాహిద్ సైకత్ ప్రపంచకప్‌లో పాల్గోనడంపై  సందిగ్ధత నెలకొంది. అయితే వీరిద్దరూ  ఐసీసీ ప్యానెల్‌లో ఉన్నందున తుది నిర్ణయం మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకోనుంది.

    రగిలిపోతున్న బంగ్లా..
    ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్‌ రెహ్మ‌న్‌ను అనూహ్యంగా తప్పించడాన్ని బంగ్లాదేశ్‌ ఘోర అవమానంగా భావిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలంటూ శనివారం ఐసీసీకి విజ్ఞప్తి చేసిన బంగ్లాదేశ్‌... తర్వాతి రోజే ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. ఇప్పుడు అంపైర్‌లను కూడా భారత్‌కు పంపకూడదన్న యోచనలో బంగ్లా ఉంది.
    చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

     

  • నవతరం టెస్టు క్రికెట్‌లో ‘ఫ్యాబ్‌ ఫోర్‌’గా టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి, న్యూజిలాండ్‌ లెజెండ్‌ కేన్‌ విలియమ్సన్‌, ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లండ్‌ దిగ్గజ బ్యాటర్‌ జో రూట్‌ పేరొందారు. ఈ నలుగురిలో కోహ్లి మాత్రమే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. మిగతా ముగ్గురు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగుతున్నారు.

    సచిన్‌ శతకాల రికార్డుకు చేరువగా
    వీరిలో ముఖ్యంగా రూట్‌ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ మేటి బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) శతకాల రికార్డుకు చేరువవుతున్నాడు. యాషెస్‌ సిరీస్‌ 2025-26 ద్వారా ఇటీవలే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదిన రూట్‌... సిడ్నీ వేదికగా ఐదో టెస్టులోనూ శతక్కొట్టాడు. 

    టెస్టుల్లో అతడికి 41వ సెంచరీ. తద్వారా టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ (41)ను సమం చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ (51), జాక్‌ కలిస్‌ (45) మాత్రమే వీరి కంటే ముందున్నారు.

    ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా రూట్‌ (Joe Root) త్వరలోనే రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకొన్నాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే సచిన్‌ రికార్డును సమం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

    లోపాలను సరిచేసుకోకుండా
    టెస్టు క్రికెట్‌లో తన లోపాలను సరిచేసుకోకుండా కోహ్లి రిటైర్మెంట్‌ పేరిట తప్పించుకున్నాడని మంజ్రేకర్‌ అన్నాడు. టాపార్డర్‌ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడని.. అది తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘టెస్టు క్రికెట్‌లో జో రూట్‌ రోజురోజు సరికొత్త శిఖరాలు అందుకుంటున్నాడు.

    నా మనసు మాత్రం విరాట్‌ కోహ్లి వెంటే పరుగులు తీస్తోంది. చాలా ముందుగానే అతడు టెస్టుల నుంచి నిష్క్రమించాడు. రిటైర్‌ అవ్వడానికి ఐదేళ్ల ముందు నుంచి అతడు నిలకడలేమి ఫామ్‌తో సతమతమయ్యాడు. అయినా సరే పట్టువీడకుండా పోరాడాడు.

    గత ఐదేళ్లలో అతడి బ్యాటింగ్‌ సగలు 31. అలాంటపుడు తన లోపాలు సరిచేసుకుని ముందుకు సాగాల్సిందిపోయి గుడ్‌బై చెప్పాడు. జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ టెస్టు క్రికెట్‌లో మరింత గొప్పగా పేరు తెచ్చుకుంటూ ఉంటే కోహ్లి మాత్రం ఇలా చేయడం విచారకరం.

    సులువైన వన్డేలలో మాత్రం
    విరాట్‌ కోహ్లి అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా బాగుండేది. కానీ అతడు టాపార్డర్‌ బ్యాటర్‌కు ఎంతో సులువైన వన్డేలలో మాత్రం కొనసాగడం మాత్రం నన్ను నిరాశకు గురిచేసింది. నాకు ఇది నచ్చలేదు.

    టెస్టు క్రికెట్‌, టీ20 క్రికెట్‌.. ఈ రెండు భిన్నమైన సవాళ్లు విసురుతాయి. టెస్టు క్రికెట్‌ ఓ ఆటగాడిని ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉంటుంది. కానీ కోహ్లి దానినే వదిలేశాడు. సూపర్‌ ఫిట్‌గా ఉండి కూడా ఇంకొన్నాళ్లు పోరాడకుండా అతడు అలా సంప్రదాయ ఫార్మాట్‌ను వదిలివేయడం సరికాదు.

    ఫస్ల్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఆడి ఫామ్‌లోకి రావాల్సింది. కచ్చితంగా పునరాగమనంలో అతడు రాణించేవాడే’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. 

    ముప్పై శతకాలతో వీడ్కోలు
    కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. అనూహ్య రీతిలో గతేడాది టెస్టులకూ గుడ్‌బై చెప్పేశాడు. తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడిన కుడిచేతి వాటం బ్యాటర్‌.. 30 సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు.

    చదవండి: షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు.. కరీంనగర్‌ కుర్రాడి డబుల్‌ సెంచరీ

International

  • పాకిస్తాన్‌ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్‌గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.

    పాకిస్తాన్‌లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.

    చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. పాకిస్తాన్‌లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్‌గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్‌కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.

    పాకిస్తాన్‌ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.

    అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.

    ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.

    ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.

    ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు.

     

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను తీసుకెళ్లినట్లుగానే తనను ఎత్తుకెళ్లాలని, ఆ క్షణం కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెటకారంగా సవాల్‌ విసిరారాయన.

    వెనెజువెలా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కొలంబియా బాగా నష్టపోయింది. ఓ చెడ్డోడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు’’ అని కామెంట్‌ చేశాడు. పైగా కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే అవతలి వాళ్లను కోపం తెప్పించింది.

    ట్రంప్‌ బెదిరింపులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. ‘‘నేను ఇక‍్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.

    గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్‌గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.

    గత శనివారం(జనవరి 3న) వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. డ్రగ్స్ ముఠాకు మదురో నాయకుడని.. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ట్రంప్‌ ఆరోపించారు. అయితే.. వెనెజువెలాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.

    అయితే.. అమెరికా సైనిక చర్య కంటే ముందు ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్‌కు సవాల్ చేశారు. ఆ తర్వాతే అమెరికా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేసి మదురోను బంధించింది. ఈ నేపథ్యంలో.. కొలంబియా అధ్యక్షుడి సవాల్‌కు ట్రంప్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు  కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.

    బంగ్లాదేశంలో జరుగుతున‍్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు.  కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో  35 రోజుల వ్యవధిలో  ఇన్ని హత్యలు జరిగాయి.  ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి.  ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ​​ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

    2026 జనవరి 5,  ఒకే రోజులో రెండు హత్యలు
    జనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.

    ఇదీ చదవండి: 5th ఫెయిల్‌, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యం

    జనవరి 3న మూక దాడి, సజీవ దహనం
    షరియత్‌పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో,  ఢాకాలో మరణించాడు.

    డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేత
    అన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్‌ను మైమెన్‌సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా  అనుకోకుండా జరిగి  ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.

    డిసెంబర్ 24, 2025: మాబ్‌ లించింగ్‌
    అమృత్ మండల్‌ను రాజ్‌బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.

    డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడి
    మైమెన్‌సింగ్‌లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్‌ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.

    ఇదీ చదవండి: సీనియర్‌ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలి

    డిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్‌లను రంగ్‌పూర్‌లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్‌ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్‌ను ఫరీద్‌పూర్‌లో నరికి చంపారు.

    మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో  293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై  హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.

    భారతదేశం ఖండన
    భారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్‌సింగ్‌లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని   MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
     

  • వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్‌ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఇట్స్‌..మీ అని ట్రంప్ బదులిచ్చారు.

    కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి..  అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.  ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.

    ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్‌మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.

    ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.

    అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.

  • ‘‘ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు భీకర  యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదు. అలాంటి సొంత దేశంలో.. అదీ అక్కడక్కడా జరిగే నిరసనలు చూసి పారిపోతారా?..’’ అంటూ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ దేశం విడిచిపోతారన్న కథనాలను ఇరాన్‌ వర్గాలు ఖండిస్తున్నాయి. కానీ, పరిస్థితులు మాత్రం ఆ ప్రచారంలో కాస్తో కూస్తో వాస్తవం లేకపోలేదని చెబుతున్నాయి. 

    ఇరాన్‌లో ప్రజా నిరసనల వేళ.. అయతొల్లా అలీ ఖమేనీ అడ్రస్‌ లేకుండా పోయారు. ఆఖరికి.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారని ప్రచారం జోరందుకుంది. కానీ, ఇరాన్‌ వర్గాలు ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అయితే మారుతున్న సమీకరణాలు.. పరిస్థితులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఖమేనీ నెక్ట్స్‌ స్టెప్‌ గురించి ది టైమ్స్‌  ఓ కథనాన్ని ప్రచురించింది.  

    ఇరాన్‌లో చెలరేగిన ఆందోళనలను ‘ఫ్లాన్‌ ఏ’ ద్వారా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే.. వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య నేపథ్యంలో ఖమేనీ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రజా ఉద్యమం చల్లారకపోయినా.. ఒకవేళ ట్రంప్‌ జోక్యం చేసుకున్నా.. తక్షణమే దేశం విడిచిపోవాలని ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సదరు కథనం పేర్కొంది. 

    86 ఏళ్ల ఖమేనీకి, రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో తన వారసుడిగా భావిస్తున్న కుమారుడు ముజ్‌తబా సహా సుమారు 20 మంది బృందంతో ఖమేనీ టెహ్రాన్ విడిచి వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు ప్లాన్‌ బీ సిద్ధమైనట్లు ది టైమ్స్ పత్రిక సదరు ఇంటెలిజెన్స్ నివేదిక సారాంశాన్ని కథనంగా ఇచ్చింది. 

    ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు 78 నగరాలకు విస్తరించాయి. కనీసం 35 మంది మరణించగా, 1200 మందికి పైగా అరెస్టయ్యారు. అయితే.. భద్రతా బలగాల కాల్పుల్లో పసికందులు కూడా బలయ్యారని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. విదేశీ జోక్యం దాకా పరిస్థితి వస్తే ఆయన తప్పకుండా దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి తరలి పోవచ్చనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. 

    అలాంటి ఇలాంటి సంక్షోభం కాదు

    ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ 2025 డిసెంబర్‌లో డాలర్‌కు 42 వేల రియాల్‌కు చేరుకుంది. దీంతో ఆహార ధరలు (72%) ఔషధాల రేట్లు(50%) ఆకాశాన్నంటాయి. 2026 బడ్జెట్‌లో పన్నులు 62% పెంచే ప్రతిపాదన జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 

    అంతర్జాతీయ ప్రతిస్పందన

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై దాడులు జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌లో ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను నివారించాలని సూచించింది.

    బలహీనంగా ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’.

    ఇరాన్ మిత్ర బలగాలైన హమాస్, హిజ్బుల్లా, హౌతి తిరుగుబాటుదారులు, సిరియా ప్రభుత్వం గత కొన్నేళ్లలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో అమెరికా–ఇజ్రాయెల్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూటమి క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది. ఇరాన్‌పై వెనెజువెలా తరహా సైనిక చర్య జరిగితే ఇవి ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనేదానిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

    ఖమేనీ పాలన

    ప్రముఖ మత గురువు అయిన ఖమేనీ.. 1979 ఇస్లామిక్ విప్లవంలో కీలక పాత్ర పోషించారు. 1981లో అధ్యక్షుడిగా, 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంటే గత 35 ఏళ్లుగా ఆయన ఇరాన్‌లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నారు. ఆర్థిక సంక్షోభం, ప్రజా అసంతృప్తి, అంతర్జాతీయ ఒత్తిడి మధ్య ఖమేనీ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.

Business

  • బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.

    బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

    లిథియంకు డిమాండ్
    ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.

    సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

    ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు
    ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.

    ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

  • ముంబైలో దేశ జాతీయ క్రికెట్ జట్లను సత్కరించడానికి రిలయన్స్ ఫౌండేషన్ 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  నీతా అంబానీ.. బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీంను ప్రశంసించారు. ఈ సందర్భంగా.. వారికి రూ. 5కోట్ల చెక్ అందజేశారు.

    రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్, భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్లైండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ దీపికా టీసీ పాల్గొన్నారు.

  • ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్‌లెస్ ఆధార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.

    పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.

    ధర పెరుగుదలకు కారణం
    పీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

    ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?
    ➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్‌ ఉపయోగించాలి.
    ➤యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.
    ➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
    ➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
    ➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.

  • ఎయిరిండియాకు కొత్త సీఈవోను నియమించే దిశగా టాటా గ్రూప్‌ అన్వేషణ ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పదవీ కాలం 2027 జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో సేవలు అందించే అనుబంధ సంస్థ ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌’ కొత్త ఎండీ నియామకంపైనా టాటా గ్రూప్‌ దృష్టి సారించినట్లు తెలిసింది.

    ‘‘2027 తర్వాత ఒప్పందాన్ని పొడిగించాలనే ఉద్దేశం విల్సన్‌కూ, టాటా గ్రూప్‌కూ లేదు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని సీఈవోగా చేయాలని టాటాసన్స్‌ భావిస్తోంది. అందులో భాగంగా ఎయిరిండియాకు బాధ్యతలు చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

    అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక జూన్‌ నాటికి వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, టాటా హౌస్‌లో సోమవారం జరిగిన ఓ అధికారిక సమావేశానికి క్యాంప్‌బెల్‌ విల్సన్‌ హాజరు కావడం గమనార్హం.

  • ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.

    ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. 

    సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    లింక్‌పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.

    దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.

    ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్త
    సోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.

  • మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 376.27 పాయింట్ల నష్టంతో 85,063.34 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల నష్టంతో 26,175.60 వద్ద నిలిచాయి.

    శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్, గోయల్ అల్యూమినియంస్ లిమిటెడ్, రోలటైనర్స్ లిమిటెడ్, మనక్సియా అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిస్టమ్‌మాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బ్యాంకులు కొన్నిసార్లు పొరపాటున లేదా అనుకోకుండా ఖాతాదారుల ఖాతాల్లో భారీ నగదు జమ చేసేస్తుంటాయి. జరిగిన తప్పు తెలుసుకుని మళ్లీ.. ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. స్టాక్ మార్కెట్‌లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం బహుశా ఇదే మొదటిసారి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    కోటక్ సెక్యూరిటీస్ సాంకేతిక లోపం కారణంగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడర్ గజానన్ రాజ్‌గురు ఖాతాలోకి రూ. 40 కోట్లు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని చూసిన ట్రేడర్ కొంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ.. ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి 20 నిమిషాల్లో ఏకంగా రూ. 2.38 కోట్ల లాభాన్ని గడించారు. ఆ తరువాత ఇందులో రూ. 54 లక్షల నష్టం వచ్చింది. ఆ తరువాత మరోసారి ట్రేడ్ చేసి.. చివరకు రూ. 1.74 కోట్ల లాభాన్ని పొందాడు.

    విషయం తెలుసుకున్న.. కోటక్ సెక్యూరిటీస్, ట్రేడర్ నుంచి 40 కోట్ల రూపాయలు మాత్రమే కాకుండా, అతడు ట్రేడ్ చేసి సంపాదించిన రూ. 1.75 కోట్ల లాభాన్ని కూడా తీసుకుంది. దీనిపై ట్రేడర్ కోర్టును ఆశ్రయించారు. అతని అభ్యర్థనను కోర్టు కూడా రెండు సార్లు తిరస్కరించినప్పటికీ.. అతడు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తుండడంతో.. చివరికి బాంబే హైకోర్టు రూ.1.75 కోట్ల లాభాన్ని తన వద్దే ఉంచుకోవడానికి అనుమతించింది.

    ఇదీ చదవండి: సరికొత్త రికార్డ్.. చైనాను అధిగమించిన భారత్!

    ట్రేడర్ తన సొంత తెలివితేటలను ఉపయోగించి రిస్క్ చేశారని, అందులో వచ్చిన లాభం తనకే చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 40 కోట్ల రూపాయలు కోటక్ సెక్యూరిటీస్ తీసుకోవడంలో తప్పులేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు.. ట్రేడింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

  • భారత్‌పై అమెరికా మరిన్ని టారిఫ్‌లు విధిస్తే అగ్రరాజ్యానికి మన ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో ఎగుమతిదార్లు మరింత వేగంగా ఇతర మార్కెట్లకు ఎగుమతులను పెంచుకోవాల్సి వస్తుందని వివరించారు.

    రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపారు. 2025 మేనవంబర్‌ మధ్య కాలంలో అమెరికాకు భారత్‌ ఎగుమతులు 20.7 శాతం తగ్గాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) పేర్కొంది. మన ఎగుమతులపై ఇప్పటికే 50 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా వాటిని ఇంకా పెంచితే, ఎగుమతులు మరింత భారీగా పడిపోవచ్చని వివరించింది.

    ‘చైనా తరహాలో అమెరికాపై భారత్‌కి పైచేయేమీ లేదు. నిజానికి రష్యా క్రూడాయిల్‌ని చైనాయే అత్యధికంగా కనుగోలు చేస్తోంది. కానీ పరిణామాలకు భయపడి దాని గురించి అమెరికా పట్టించుకోవడం లేదు. భారత్‌ మాత్రం అమెరికా నుంచి పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తుల దిగుమతులను పెంచుకుంది. కానీ దీన్ని అమెరికా పట్టించుకోదు‘ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

  • విషపూరిత పని సంస్కృతులు రాజ్యమేలుతున్న కార్పొరేట్ఆఫీసుల్లో ఉద్యోగులకు ఆనందాన్ని పంచే బాస్లూ క్కడక్కడా ఉంటారు. ఎప్పుడూ వర్క్టెన్షన్లో ఉండే ఉద్యోగినిని ఇలాగే సర్ప్రైజ్చేశారు ఆమె మేనేజర్‌, తోటి ఉద్యోగులు.

    బెంగళూరులోని కార్యాలయంలో పని చేస్తున్న ఐశ్వర్యను ఏదో మీటింగ్అంటూ రూంలోకి పిలిచారు. దీంతో చేత్తో ల్యాప్టాప్పట్టుకుని చకాచకా వెళ్లిపోయింది. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగానే ఆమె మేనేజర్‌ సహా తోటి ఉద్యోగులు మరచిపోలేని సర్ప్రైజ్ఇచ్చారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో 2 వేల మంది ఫారోవర్లను చేరుకోవడాన్ని సెలబ్రేట్చేశారు. ఆమెతో కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచారు.

    వీడియోను తన ఇన్స్టా అకౌంట్లో షేర్చేశారు ఐశ్వర్య. "నా కార్పొరేట్ ప్రయాణంలో కొత్త ప్రయత్నాలు చేసేందుకు, ఎదిగేందుకు నిరంతరం ప్రోత్సహించే గొప్ప బాస్ దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలిని" అంటూ తన అనుభూతిని పంచుకున్నారు.

    ఎప్పుడూ మా బాస్అలాంటోడు.. ఇలాంటోడు.. అంటూ బాస్ రాక్షసత్వాల గురించే వినే సోషల్మీడియాలో మంచి బాస్వీడియో వైరల్గా మారింది. ‘భలే మంచి బాస్‌’ అంటూ కామెంట్లు చేశారు నెటిజనులు.

  • హైదరాబాద్‌: ‍ప్రపంచ ఫార్మా రాజధాని హైదరాబాద్‌లో మరో వినూత్నమైన కంపెనీ అడుగుపెట్టింది. ఎక్సోసోమ్‌ల ఆధారంగా కణజాలాన్ని పునరుత్పత్తి చేయగల టెక్నాలజీ సాయంతో ఆసియా పసఫిక్‌ ప్రాంతం మొత్తానికి సరికొత్త కంటి చికిత్సలు అందించేందుకు పండోరమ్‌ టెక్నాలజీస్‌, హైదరాబాద్‌లోని నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌లు చేతులు కలిపాయి.

    శరీర కణాలు స‍్రవించే అతిసూక్ష్మమైన భాగాలైన (30 నుంచి 150 నానోమీటర్లు) ఎక్సోసోమ్‌లు ప్రొటీన్లు, ఆర్‌ఎన్‌ఏ వంటివాటిని ఒక కణం నుంచి ఇంకో కణానికి మోసుకెళుతూంటాయి. వీటి స్థానంలో మందులను పంపిణీ చేయడం ద్వారా పాడైన కణాలను సరిచేయవచ్చునని అంచనా. ఈ దిశగా పండోరమ్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే కొంత ముందడుగు వేసింది.

    కనుగుడ్డు (కార్నియా) దెబ్బతిన్న వారికి మళ్లీ చూపు రప్పించేందుకు కూడా తాము తయారు చేసిన ఎక్సోసోమ్‌ మందు ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పండోరమ్‌ టెక్నాలజీస్‌, భారత్‌ బయోటెక్‌ అనుబంధ సంస్థ అయిన నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌ల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. పండోరమ్‌ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఎక్సోసోమ్‌ మందును నూసిలియాన్‌ పెద్ద ఎత్తున తయారు చేస్తుంది. ఆసియా పసఫిక్‌ ప్రాంతం మొత్తానికి సరఫరా చేస్తుంది. దేశంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

    ‘‘పునరుత్పత్తి మందుల తయారీ విషయంలో పండోరమ్‌ ఇప్పటికే మేలి ముందడుగు వేసింది. పరిశోధనలు, వాణిజ్యాంశాల్లోనూ ప్రగతి సాధించాము. అడ్వాన్స్‌డ్‌ బయోలాజిక్స్‌ తయారీలో నైపుణ్యమున్న నూసిలియాన్‌తో చేతులు కలపడం ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ వినూత్నమైన చికిత్సను అందించవచ్చు’’ అని పండోరమ్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ తుహిన్‌ భౌమిక్‌ తెలిపారు.

    నూసిలియాన్‌ థెరప్యూటిక్స్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ రఘు మలపాక మాట్లాడుతూ ‘‘కంటి జబ్బుల చికిత్స విషయంలో పండోరమ్‌ టెక్నాలజీస్‌ ఎక్సోసోమ్‌ ఆధారిత చికిత్స విప్లవాత్మకమైందని చెప్పాలి. బయలాజిక్స్‌ తయారీలో మాకున్న నైపుణ్యంతో ఎంతో మేలు చేకూరుతుంది’’ అని వివరించారు.

    ప్రస్తుతం కంటి జబ్బులపై మాత్రమే దృష్టి పెడుతున్నామని, స్టీవెన్స్‌-జాన్సన్‌ సిండ్రోమ్‌, న్యూట్రోఫిక్‌ కెరటిటిస్‌ వంటి వాటికి త్వరలో చికిత్స అందించగలమని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో ఇదే ఎక్సోసోమ్‌ ఆధారిత టెక్నాలజీ సాయంతో వాపు కారణంగా చర్మం, ఊపిరితిత్తులు, ఫైబ్రోసిస్‌తోపాటు ఇతర అవయవాలకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపగలమని చెబుతోంది.

Politics

  • సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్‌ జగన్‌ది కాగా, నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు  ఆ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్‌పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్‌గారు, అందుకోసం సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు.

    ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన, భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఆ మెయిన్‌ కనెక్టివిటీ రోడ్డుపై ఇప్పటివరకు డీపీఆర్‌ సిద్ధం కాలేదని, రోడ్‌ అలైన్‌మెంట్‌కూ ఇంకా ఆమోదం రాలేదని, అయినా పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని విశాఖలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు దుయ్యబట్టారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఏం మాట్లాడారంటే..:

    తప్పుదోవ పట్టిస్తున్న కూటమి నేతలు:
    ఉత్తరాంధ్ర ప్రజలను గత కొంతకాలంగా కూటమి నేతలు అబద్ధాలు, అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ట్రయల్‌ రన్‌ జరిగిన సందర్భంగా, దీనంతటికీ తామే కారణమని చంద్రబాబు, లోకేష్‌ తదితరులు క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సమయంలో కేవలం 377 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగింది, అంతటితో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సాధ్యమే కాదు.

    జగన్‌ వల్లనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌:
    2019లో జగన్‌ సీఎం కాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్లారు. 2020లో ఎయిర్‌పోర్టు నిర్మాణ ఒప్పందాలు, 2021లో భూసేకరణ ప్రారంభం, 2022లో ఎన్‌వోసీలు, 2023 జనవరిలో భూసేకరణ పూర్తి చేసి, అదే ఏడాది మే 3న పనులు ప్రారంభించారు. 2026 జూన్‌ నాటికి విమానాశ్రయం పూర్తవుతుందని అప్పుడే టైమ్‌ ఫ్రేమ్‌ ఇచ్చారు. పనుల్లో జీఎంఆర్‌ సంస్థ కూడా ఎక్కడా అలక్ష్యం చూపలేదు. మరోవైపు జగన్‌ చొరవతో వైజాగ్‌ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో రోడ్డు సహా, అద్భుతమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు.

    ఎయిర్‌పోర్టుకు రోడ్‌ కనెక్టివిటి ఏదీ?:
    ఏమీ చేయకపోయినా అన్నీ తామే చేశామని చెప్పుకుంటూ, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, నిజానికి నాటి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం విశాఖ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పుతో మెయిన్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. దీంతో విశాఖ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు పక్కా రోడ్‌ కనెక్టివిటీ లేకుండా పోయింది. మరి దీనికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఏం సమాధానం చెబుతారు?.

    ఇప్పుడు విశాఖ, భోగాపురం మధ్య ఒక్క రోడ్డు మాత్రమే ఉండగా, ఆనందపురం జంక్షన్‌లో తీవ్ర ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 70 మీటర్ల వెడల్పు రోడ్డుకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్, డీపీఆర్, అలైన్‌మెంట్‌ ఇప్పటివరకు సిద్ధం కాలేదు. అనుమతులూ తీసుకోలేదు. అయినా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని కెకె రాజు దుయ్యబట్టారు.

  • సాక్షి, జనగాం: భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. మంగళవారం జనగాంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 

    ‘‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయడం లేదు. రాహుల్‌, రేవంత్‌ను ఉరి తీయాలి. చదువురాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నాడు. కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌మీట్‌కే రేవంత్‌ లాగు తడిసింది’’ అంటూ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్‌ అయ్యింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు.

    దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది.

    కాగా, మున్సిపల్‌ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత కచ్చితంగా షెడ్యూల్‌ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్‌ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది.

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక వేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారని.. అవి ప్రభుత్వ భూములు కావు.. పరిశ్రమలకు అమ్మిన భూములు అంటూ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టత నిచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో హిల్ట్‌ పాలసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని.. పర్యావరణం బాగుచేయాలనే ఆలోచనతోనే హిల్ట్‌ పాలసీ తీసుకువచ్చినట్లు తెలిపారు.

    ‘‘హిల్ట్‌ పాలసీ కింద ఆరు నెలల గడువు ఇస్తాం. స్వచ్ఛందంగా ముందుకొస్తేనే భూములు కన్వర్ట్‌ చేస్తాం. పాలసీ గురించి అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. దశాబ్ధాల కిందటే గత ప్రభుత్వాలు వారికి భూములు అమ్మేశాయి. రాజకీయాల పక్కనపెట్టి ఆలోచించాలి’’ అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వలేని నాగరికత అసమర్థ నాగరికతే.. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతోందని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

    ‘‘డెవలప్‌మెంట్ అంటే ప్రకృతిని నాశనం చేయడం కాదు. పిల్లలకు ఆస్తులు కాదు.. క్లీన్ ఎన్విరాన్‌మెంట్‌ నిజమైన వారసత్వం. బంగారు గిన్నెలో విషం పెట్టినట్లవుతోంది మన పరిస్థితి. ప్రకృతి నాశనమైతే తిరిగి రాదు. మనమంతా భూమి యజమానులు కాదు. కేవలం ట్రస్టీలమే. ఫ్యూచర్ జనరేషన్లకు క్లీన్ ఎన్విరాన్‌మెంట్ ఇవ్వడం మన బాధ్యత. ఇది కేవలం ల్యాండ్ యూజ్ మార్పు కాదు. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం హిల్ట్ పాలసీ తీసుకొచ్చాం.

    ..ఓఆర్ఆర్ లోపల పరిశ్రమలు.. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్యాక్టరీ గోడ పక్కనే ఇళ్లు.. ఇది సైంటిఫిక్ డిజాస్టర్. 1970లలో నగరం బయట పరిశ్రమలు.. నేడు నడిబొడ్డు ప్రాంతాలు బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్ ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్లు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడమే లక్ష్యం. పిల్లలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వడమే ప్రభుత్వ సంకల్పం. హిల్ట్‌పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. మతలబు ఉందంటూ విమర్శలు బాధాకరం. తెలంగాణ నుంచే పర్యావరణ రక్షణకు చారిత్రక అడుగు.. మార్పు ఎప్పుడో కాదు.. ఇప్పుడే’’ అంటూ శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు.

     

     

  • సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతరెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, సమన్వయ కర్త దారా సుధీర్‌ పరిశీలించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

    నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని  రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది వైఎస్‌ జగన్‌ కల.. 2020లో రాయలసీమ ఎత్తిపోతలకు వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. రూ.3,207 కోట్ల వ్యయంతో వైఎస్‌ జగన్‌ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టారు. చీకటి ఒప్పందం చేసుకునే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

Family

  • మహాభారతంలో ధర్మరాజుతో కడదాకా నడుస్తుంది ఓ శునకం. ఆ మధ్య వచ్చిన పాతాళ్‌ లోక్‌ అనే వెబ్‌ సిరీస్‌లో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్‌ పాత్రకు వీధికుక్కలతో ముడిపెట్టిన సీక్వెన్స్‌ ప్రేక్షకుల్ని ఒకింత భావోద్వేగానికి గురి చేసింది. అయితే విశ్వాసం, కరుణ మాత్రమే కాదు.. శాంతి కోసమూ నాలుగు కాళ్ల అలోకా అలుపెరగని ప్రయాణంతో అందరి దృష్టికి ఆకర్షిస్తోంది.  

    ఇంటర్నెట్‌లో రీల్స్‌ చూసేవాళ్లకు అలోక అనే పేరు తెలియక పోవచ్చు. కానీ స్క్రోలింగ్ చేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గర కచ్చితంగా తారసపడుతుంది. అమెరికాలో పర్యటిస్తున్న బౌద్ధభిక్షువులతో ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోందీ అలోక. దీనికి దక్కిన ఫేమ్‌తో ఏకంగా ఒక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌నే ఓపెన్‌ చేశారు. ఒకటి రెండు బిస్కెట్లు వేస్తేనే కృతజ్ఞతలు చూపించే కుక్క మాదిరే.. తనను కాపాడిన వాళ్లను వీడేదే లేదంటూ వెంట తిరుగుతోంది. 

    స్వర్గాన్ని కాదని..  

    మహాప్రస్థాన ఘట్టంలో ధర్మారాజు భార్యాసహోదరులు స్వర్గానికి వెళ్తారు. అయితే తనతో వచ్చిన కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరించడం వల్ల స్వర్గానికి వెళ్ళలేక కొద్దిసేపు నరకంలో గడపాల్సి వస్తుంది. తనతో పాటు ఉన్న జీవిని విడిచిపెట్టలేనని చెబుతాడాయన. అయితే.. ఆ కుక్క రూపంలో ఉన్నది ధర్మదేవతే అని తెలుసుకున్నాక చివరికి స్వర్గానికి చేరుకున్నాడు. ఈ కథ.. ధర్మరాజు యొక్క నిస్వార్థత, సత్యనిష్ఠ, విశ్వాసపాత్రత, అన్ని జీవుల పట్ల కరుణను తెలియజేస్తుంది.  

    పాతాళ్‌ లోక్‌లో.. 

    2020 కరోనా టైంలో అమెజాన్‌ ప్రైమ్‌లో వచ్చిన వెబ్‌ సిరీస్‌ పాతాళ్‌ లోక్‌. అందులో హతోడి త్యాగి అనే సుపారీ కిల్లర్‌ పాత్ర ఉంటుంది. సుత్తిని ఉపయోగించి భయంకరంగా చంపే పాత్రలో అభిషేక్‌ బెనర్జీ ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.  క్రూరమైన పాత్ర అయినప్పటికీ కుక్కల పట్ల జాలి చూపించే వ్యక్తిగా అతనిలోని మానవీయ కోణాన్ని చూపించారు ఇందులో. ఆ కోణమే కథలో ఓ కీలక మలుపునకు కూడా కారణమవుతుంది. అలా ప్రేక్షకులు హతోడి త్యాగిని మరింత గుర్తుంచుకున్నారు. 

    భూమ్మీద అలోకా.. 

    కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి అలోక అని పేరు పెట్టి(పాలి భాషలో వెలుగు అని అర్థం) బాగోగులు చూసుకున్నారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది. 

    ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్‌ ఉంది కదా.. అలా ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు బౌద్ధబిక్షువులతో పాటు ఈ పర్యటనలో అలోకా కూడా భాగమైందన్నమాట. 

  • తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, కాపర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీ జుట్టు తెల్లరంగులోకి మారినట్లయితే.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టుకు సహజ రంగును తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే... 

    ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల నల్ల నువ్వులు,  ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల టీపొడి, మూడు టేబుల్‌ స్పూన్ల ఉసిరిపొడి, రెండు టేబుల్‌ స్పూన్లు ఆవనూనె తీసుకోవాలి.  

    తయారీ విధానం: ముందుగా ఒక ఇనుప కడాయిలో నల్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టీపొడి, ఉసిరి పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూడింటిని మీడియం మంట మీద వేయించాలి. మిశ్రమం పూర్తిగా నల్లగా మారినప్పుడు గ్యాస్‌ ఆఫ్‌ చేయాలి. చల్లబడిన తర్వాత మిక్సర్‌లో వేసుకుని బాగా గ్రైండ్‌ చేసి, జల్లించుకుని  గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. 

    రెండు చెంచాల పొడిని తీసుకుని.. ఆవాల నూనెలో కలిపి పేస్టులా తయారు చేసి, జుట్టుకంతటికీ బాగా పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం ఎప్పటిలాగే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. నువ్వులు, టీపొడి, ఉసిరి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సాయపడతాయి. దీనితో ఎటువంటి దుష్ఫలితాలూ ఉండవు

    నునుపైన మెడకోసం...
    ఒక బంగాళదుంపని  పొట్టు తీయకుండా ఉడకబెట్టి,మెత్తగా మెదుపుకోవాలి. దీనికి కాసిని పాలు, కొద్దిగాకొబ్బరినూనె జతచేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈమిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాతకడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడనలుపు తగ్గి చర్మం కాంతివంతం అవుతుంది. 

    (చదవండి: వెనెజువెలాలో 'ఏంజెల్‌' జలపాతం..! చేరుకోవడం అంత ఈజీ కాదు..)

  • వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ..మంచి స్ఫూర్తిదాయకమైన కథలు షేర్‌ చేస్తుంటారు. అలానే ఈసారి ఓ అద్భతమైన ప్రేరణాత్మక కథతో మన ముందుకొచ్చారు. సక్సెస్‌ అంటే..మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదని చెప్పే.. గొప్ప జీవిత పాఠాన్ని నేర్పే అద్భుత కథ. అదేంటంటే..

    20 మందితో ముంబై మురికి వాడలో ఒక పూరింట్లో పెరిగిన సిద్ధేష్‌ లోక్రే అనే యువకుడు మనందరికీ స్ఫూర్తి అంటూ అతడి స్టోరీని సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసుకోవడమే గాక, అతడు తలపెట్టిన మహాత్తర కార్యానికి సైతం తన సపోర్ట్‌ ఫుల్‌ ఉంటుందని నొక్కి చెప్పారు. సిద్ధేష్‌ తండ్రి కూరగాయల వ్యాపారి, కాగా తల్లి క్లర్క్‌.

    20 మందితో ఒకే గది ఉన్న ఇంట్లో పెరిగిన సిద్ధేష్‌ తన లైఫ్‌ని చదువుతోనే మార్చుకోగలని నమ్మి..చాలా కష్టబడి చదువుకున్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్‌లో ఎంబీఏ చేసి టెక్‌ స్టార్టప్‌గా ఎదిగాడు. అలా తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించి..మంచి కొడుకుగా హ్యాపీగా లైప్‌ లీడ్‌ చేస్తున్నాడు. అయితే సక్సెస్‌ అంటే ఇది కాదన్న వెళితి ఏదో వెంటాడుతూ ఉండేది. అసలు నిజమైన సక్సెస్‌ అంటే ఏంటీ అని ఆలోచిస్తూ..ఉండేవాడు. 

    తనలా అందిరి జీవితాలు బాగుంటే అన్న ఆలోచనే..అతడి జీవితాన్నే మార్చేసింది. అందుకు సోషల్‌ మీడియా సాయం తోడు తెచ్చుకుని మరి. ఎంతోమంది పేద ప్రజల జీవితాలను తీర్చిదిద్దాడు. పైగా ఎన్నో మురికివాడలను, గ్రామాలను దత్తత తీసుకుని అందంగా మార్చి..ఎందరో పేదలకు ఆశాకిరణంగా నిలిచాడు ఆ యువకుడు. పాడైపోయిన ఎన్నో షాపులను పునర్నిర్మించాడు, ప్రజలకు ఉపయోగపడేలా సొంతంగా అంబులెన్స్‌ సర్వీస్‌ వంటి ఎన్నో సేవలతో తన ఆనందాన్ని, సక్సెస్‌ని వెతుకున్నాడు సిద్ధేష్‌. 

    అక్కడితో ఆగలేదు ఆ యువకుడు తాజాగా మరో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే మిషన్ 30303. దీని సాయంతో 30 రోజుల్లో 30 పాఠశాలలను అభివృద్ధి చేసేల మౌలిక సదుపాయల కోసం రూ. 3 కోట్లు సేకరించడం. అందుకోసం కాస్త ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే బెంచీలు, టాయిలెట్లు  వంటి ప్రాథమిక అవసరాల నుంచి ఏఐ వంటి రోబోటిక్‌ ల్యాబ్స్‌ వరకు అన్ని ఆధునిక హంగులకు చాలా ఖర్చుతో కూడికున్న పని కావడంతో లక్ష్యం నెరవేరడం కష్టతరంగా మారింది సిద్ధుకి. 

    అయితే అతడి నిస్వార్థ సేవ నచ్చి సిద్ధేష్‌ ప్రాజెక్టుకు తనవంతుగా మదతిస్తానుంటూ ముందుకొచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు ఆనంద్‌ మహీంద్రా. చాలామంది మనం సక్సెస్‌ అయ్యి ఓ మంచి పొజిషన్‌లో ఉంటే చాలు అనుకుంటారు. అలా కాకుండా అందురూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నట్లుగా సాగుతున్న సిద్ధేష్‌ పయనం నిజంగా స్ఫూర్తిదాయకం, ప్రశంసించదగ్గ విషయం కూడా కదూ..!.

     

    (చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!)


     

     

  • గ్రరాజ్యం అమెరికా సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడి ఆ దేశ అ‍ధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెనెజువెలా దేశం గత కొన్ని రోజులుగా వార్తల్లో హాట్‌టాపిక్‌ నిలిచింది. ఒక రకంగా అమెరికా ఈ దుందుడుకు చర్య కారణంగా వ్యతిరేకతనే ఎక్కువగా మూటగట్టుకుంది. ఇదంతా ఎలా ఉన్నా..అందమైన దేశం చిక్కుల్లో పడటం పర్యాటక ప్రేమికులనే కాదు ఇతర దేశాలను సైతం కదిలిచింది. ఎన్నో ప్రకృతి అద్భుతాలకు నెలవైన వెనెజువెలా ఇదివరకటిలా పరిస్థితి చక్కబడలని ఆశిస్తూ..అక్కడ అత్యంత పేరుగాంచిన ఏంజెల్‌ జలపాతం విశేషాల గురించి తెలుసుకుందామా..!.

    వెనెజువెలాలో ఉన్న ఏంజెల్‌ జలపాతం అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. దాదాపు 979 మీటర్ల నుంచి పడుతుంది ఈ జలపాతం. భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన, నిరంతర జలపాతంగా పేరొందింది ఇది. అంతేగాదు నయాగరా జలపాతం కంటే 16 రెట్లు ఎత్తులో ఉంటుందట. ఈ నీరు ఆయాన్-టెపుయ్ అనే చదునైన పర్వతం పై నుండి పడిపోతుంది. 

    ఇక్కడ మాత్రమే కనిపించే పురాత టేబుల్‌ పర్వతం ఇది. నిజానికి ఇది జలపాతాన్ని చూస్తున్నట్లుగా ఉండదు. మేఘాలు గాల్లో కరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది. ఆ అందమైన జలపాతం కనైమా నేషనల్‌ పార్క్‌లో ఉంది. దీని చుట్టూ పెద్ద నగరాలు, రహదారులు, జనసముహం ఉండుదు. దట్టమైన అడవి, వంకరలు తిరిగిన నదులు దాటి..నేరుగా కొండల నడుమ అందంగా కొలువుదీరి ఉంటుంది ఈ జలపాతం.

    ఆ పేరు ఎలా వచ్చిందంటే..
    1930లలో గాలి నుంచి జలపాతాన్ని మొదటిసారిగా గుర్తించిన అమెరికన్ పైలట్ జిమ్మీ ఏంజెల్ కారణంగా వచ్చిందట. అయితే, స్థానిక ప్రజలు దీనిని ఎల్లప్పుడూ 'కెరెపాకుపై మేరు' అని పిలుస్తారు. దీని అర్థం 'లోతైన ప్రదేశంలోని జలపాతం'. చమత్కారంగా ఈ రెండు పేర్లు దాని అద్భుతం, శక్తి గురించి చెప్పకనే చెబుతున్నాయి కదూ..!.

    ఎలా చేరుకోవాలంటే..
    ఏంజెల్ జలపాతాన్ని చేరుకోవడం అనేది ఒక సాహసం. ముందుగా సియుడాడ్ బోలివర్ లేదా ప్యూర్టో ఓర్డాజ్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి నేషనల్‌ పార్కు లోపల ఉన్న కనైమా క్యాంప్‌కు వెళ్లే చిన్న విమానంలో ఎక్కాలి. ఆ తర్వాత వంకరలు తిరుగుతున్న నదులలో పడవ ప్రయాణం చేసి.. వర్షారణ్యం గుండా ఒక చిన్న నడక. అయితే వర్షాకాలంలో నదులు నిండి ఉంటాయి అందువల్ల పడవ ప్రయాణం సులభతరమవుతుంది.

    సందర్శించడానికి తగిన సమయం
    ఏంజెల్ జలపాతాన్ని చూడాలనుకుంటే జూన్, నవంబర్ మధ్య సందర్శించడం మంచిది. వర్షాలు జలపాతాన్ని మరింత అందంగా చూపిస్తాయి. వర్షాలు లేని నెలల్లో కూడా ఇది అద్భుతమైన దృశ్యమే.

    చూడాల్సిన కమనీయ ప్రదేశాలు..
    ఏంజెల్ జలపాతం చూడటం హైలైట్, కానీ ఈ ప్రాంతం దీంతోపాటు మరిన్ని జాయ్‌ఫుల్‌నెస్‌నిచ్చేవి ఎన్నో ఉన్నాయి ఇక్కడ . పడవలో అడవి నదులలో మునిగిపోవడం, సహజ కొలనులలో ఈత కొట్టడం లేదా సమీపంలోని స్పష్టమైన నీటి మడుగులను అన్వేషించడం తదితరాలెన్నో ఉన్నాయి. అరుదైన వన్యప్రాణుల కోసం పార్క్ గుండా నడవాలి. ఉత్కంఠభరితమైన వైమానిక వీక్షణ కోసం చిన్న విమానంలో జలపాతం మీదుగా వెళ్లడం పర్యాటకులకు ఓ థ్రిల్‌.

    (చదవండి: వామ్మో ఇదేం విచిత్రం..జుట్టు ఆరోగ్యం కోసం ఆలయమా..?!)

     

Vikarabad

  • ఏదీ ‘భరోసా’!
    పంట పెట్టుబడి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపులు

    వికారాబాద్‌: రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. గత రబీ సీజన్‌లో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయగా ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమైనా పథకం అమలు కాలేదు. సంక్రాంతి పండుగ ముందుగానీ తర్వాత గానీ అమలయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు లేవు. జిల్లా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఇప్పటికే రైతు భరోసా కోసం కావాల్సిన ప్రాథమిక సమాచారం సిద్ధం చేసి పెట్టుకోగా ప్రస్తుత ప్రభుత్వ విధివిదానాల ప్రకారం కసరత్తు చేస్తున్నారు.

    సాగవుతున్నది 5.5 లక్షల ఎకరాలే

    జిల్లాలోని 20 మండలాల్లో 12.35లక్షల వ్యవసాయ భూమి, 2,68,107 మంది రైతులు ఉన్నారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 5.5 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు వేస్తారు. గత ప్రభుత్వ హయాంలో సాగు భూములతోపాటు సాగవని పొలాలకు కూడా పథకం అమలు చేశారు. ఎకరాకు రూ.5వేల చొప్పున సగటున 6 నుంచి 6.5 లక్షల ఎకరాలకు పంట పెట్టుబడి సాయం విడుదల చేసింది. ఇందు కోసం జిల్లాకు రూ.300 కోట్ల నుంచి రూ.320 కోట్ల వరకు కేటాయించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.12 వేలు జమ చేస్తోంది. ఈ లెక్కన 5.5 లక్షల ఎకరాలకు ప్రతి పంటకూ రూ.330 కోట్ల కేటాయించాల్సి ఉంటుంది.

    అయోమయంలో అధికారులు

    రైతు భరోసా పథకం ఎవరికి వర్తింపజేయాలి అనే విషయం తేల్చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు తెలిసింది.అర్హులు ఎవరు..? సర్వే ఎలా చేయాలి..? లబ్ధిదారులను ఎలా గుర్తించాలి..? అనే దానిపై అధికారులు తర్జనబర్జన పడుతున్నారు.

    మండలాల వారీగా రైతులు, వ్యవసాయ భూమి

    మండలం రైతులు ఎకరాలు(లక్షల్లో..)

    బొంరాస్‌పేట్‌ 11,843 0.52

    దౌల్తాబాద్‌ 17,647 0,81

    దుద్యుల్‌ 10,121 0.46

    కొడంగల్‌ 15,343 0.85

    చౌడాపూర్‌ 7,838 0.31

    దోమ 14,319 0.61

    కుల్కచర్ల 10,691 0.47

    పరిగి 17,426 0.77

    పూడూరు 16,531 0.74

    బషీరాబాద్‌ 13,209 0.75

    పెద్దేముల్‌ 13,708 0.71

    తాండూరు 12,805 0.70

    యాలాల్‌ 13,160 0.64

    బంట్వారం 70,24 0.36

    ధారూరు 14,165 0.60

    కోట్‌పల్లి 8,751 0.40

    మర్పల్లి 16,638 0.76

    మోమిన్‌పేట్‌ 13,591 0.56

    నవాబుపేట 16,053 0.61

    వికారాబాద్‌ 17,344 0.72

  • విఠల్‌రావు పేరు ప్రస్తావనపై లగచర్లవాసుల హర్షం

    దుద్యాల్‌: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు 2009లో లగచర్ల గ్రామానికి చెందిన దివంగత ఎంపీ దేవరకొండ విఠల్‌రావు మొదటి బీజం వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎత్తిపోతల పథకాన్ని మేమే తెచ్చామని, సగానికిపైగా పూర్తి చేసిన ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలకు చేతకావడం లేదన్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు సమాధానం ఇస్తూ.. 2009లో అప్పటి మహబూబ్‌నగర్‌ విఠల్‌రావు, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి లేఖ రాసి మంజూరు చేయించారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విఠల్‌రావు పేరు పెట్టాలన్నారు. దీంతో ఆయన స్వగ్రామమైన దుద్యాల మండలం లగచర్లవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • సీపీఐ

    పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి

    విజయలక్ష్మి పండిట్‌

    తాండూరు టౌన్‌: సీపీఐ పార్టీ ఆవిర్భవించి శత వసంతాలు పూర్తయిన తరుణంలో ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి పండిట్‌ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్‌ చౌక్‌లో సభకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అణగారిన ప్రజల కోసం, కార్మికుల కోసం నిత్యం పోరాటం చేస్తు న్న పార్టీ సీపీఐ అన్నారు. భవిష్యత్‌లో కొత్త తరం నాయకులతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి, నాయకులు పీర్‌మహ్మద్‌, రవీందర్‌, వెంకటేష్‌, అనంతయ్య, అబ్దుల్లా, మునీర్‌, సు రేష్‌,పుష్ప, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

    సత్వరం పరిష్కరించాలి

    అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 85 ఫిర్యాదులు వచ్చాయి. పెన్షన్‌, వ్యవసాయం, గృహ నిర్మాణం, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అర్జీలు ఇచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్‌, ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌చౌదరి, డీఆర్‌ఓ మంగీలాల్‌, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    విచారణకు ఆదేశం

    ధారూరు: మండంలోని కొండాపూర్‌ఖుర్దు– తరిగోపుల మధ్య పీర్ల కత్వపై నిర్మించిన చెక్‌డ్యాంను ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ‘చెక్‌డ్యాం చెర’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ స్పందించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన మండల అధికారులతో ఈ విషయాన్ని చర్చించినట్లు సమాచారం. తరిగోపుల శివారులోని సుద్ద అక్రమ తవ్వకాలపై సాక్షిలో ప్రచురితమైన కథనాలపై కలెక్టర్‌ సీరియస్‌ అయినట్లు సమాచారం. చెక్‌డ్యాం ధ్వంసం, సుద్ద మైనింగ్‌పై పూర్తి విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న వ్యవహారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది.

    గొల్లచెరువు అభివృద్ధికి నిధులివ్వండి

    అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

    తాండూరు: పట్టణ సమీపంలోని గొల్ల చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటా యించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అసెంబ్లీలో కోరారు. సోమవారం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఆయకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తాండూరు పట్టణ పరిధిలో లక్ష జనాభా ఉందని, గొల్ల చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పట్టణంలోని చిన్న పరిశ్రమల ద్వారా 30 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. విద్యుత్‌ శాఖ.. ఆ పరిశ్రమలకు కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిందని, లేదంటే జరిమానాలు విధించేందుకు సిద్ధమైందని సభ దృష్టికి తెచ్చారు. వారికి వెసులబాటు కల్పించాలని కోరారు. మూడు నెలల గడువు ఇస్తే కెపాసిటర్లు ఏర్పాటు చేసుకుంటారని విన్నవించారు. 2004లో శివసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పట్టించుకోలేదన్నారు. నిధులు కేటాయించాలని కోరారు. పలు గ్రామాల్లో ఐరన్‌ విద్యుత్‌ స్తంభాల స్థానంలో సిమెంట్‌ స్తంభాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలన్నారు.

  • ఇదేం జాబితా?

    తాండూరు టౌన్‌: ముసాయిదా ఓటరు లిస్టుపై పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వార్డులోని ఓట్లు మరో వార్డులోకి రావడం, సరిహద్దులు లేకుండా ఓటర్లను వార్డుల్లో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల విడుదల చేసిన 36 వార్డుల ఓటరు లిస్టుపై సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం రసాభాసాగా మారింది.

    అధికారుల తీరుపై మండిపాటు

    ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. 4వ వార్డు ఓటరు లిస్టులో భార్య పేరు, 5వ వార్డులో భర్త పేరు ఉండటాన్ని తప్పు బట్టారు. ఒక్కో వార్డులో 1,800ల ఓటర్లకు మించి ఉండరాదనే నిబంధనను అధికారులు తుంగలో తొక్కి, ఒక్కో వార్డులో 2వేలకు పైగా ఓటర్లను నమోదు చేశారని దుయ్యబట్టారు. 8వ వార్డు రాజీవ్‌ కాలనీలో ఏకంగా 1,524 ఓట్లు అదనంగా చేర్చారని, వీరంతా చుట్టు పక్కల గ్రామాల్లో నివసించే వారి పేర్లు ఉన్నాయని ఆరోపించారు. మృతి చెందిన వారి ఓట్లు తొలగించలేదన్నారు. ఓటరు లిస్టు పూర్తి తప్పుల తడకగా రూపొందించారని, వెంటనే సరి చేయాలన్నారు.

    ముసాయిదా ఓటర్‌ లిస్టుపై తీవ్ర అభ్యంతరాలు

    మార్పులు, చేర్పులు ఉండవు

    నాయకులు చేసిన అభ్యంతరాలను స్వీకరించామని, అయితే ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులకు అవకాశం లేదని మున్సిపల్‌ కమిషనర్‌ యాదగిరి స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజెఎస్‌, డబ్ల్యూపీఐ, బీఎస్పీ తదితరల పార్టీల నాయకులు మల్లేశం, భద్రేశ్వర్‌, శ్రీలత, రజినీకాంత్‌, హాది, కమాల్‌ అత ర్‌, విజయలక్ష్మి పండిట్‌, సోమశేఖర్‌, నర్సింలు, నీరజా, ప్రభాకర్‌గౌడ్‌, హబీబ్‌లాలా, శోభారాణి, శ్రీనివాసాచారి, ఆసిఫ్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

  • గంజాయ

    అనంతగిరి: జిల్లాలో మట్కా, పేకాట, గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ స్నేహ మెహ్ర హెచ్చరించారు. సోమ వారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసులపై ఆరా తీశారు. పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్లను గుర్తించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని తెలిపారు. తరచూ వాహన, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సీసీ టీవీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. మహిళల భద్రత, పిల్లల రక్షణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాల న్నారు. పక్కా ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చక్కటి పనితీరు కనబరిచిన ధారూర్‌, పరిగి సీఐలు రఘురాములు, శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుళ్లు నరేష్‌, రామకృష్ణ, పాండురంగం, మున్నయ్య, దస్తప్ప, ప్రతాప్‌ సింగ్‌, జమీల్‌, అనిల్‌ కుమార్‌ను అభినందించి నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బలరాములు నాయక్‌, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్‌, వీరేష్‌, ఏఓ ఖాజామోహినొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.