Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కల్కి సినిమా మొదటి భాగం విడుదలై మంచి స్పందన పొందింది. దాంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ముగింపు దగ్గర మైథలాజికల్ టచ్ రావడంతో కర్ణుడు, అర్జునుడు ఎంట్రీ ఇచ్చారు. దీంతో కల్కి 2లో కథ ఎలా మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగింది.  

    ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ సినిమాల పనిలో బిజీగా ఉన్నారు. ఫౌజీ ఈ ఏడాది దసరాకు, స్పిరిట్ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానున్నాయి. ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఆయన పాత్రకు సంబంధించిన షూట్ జరుగుతుంది.  

    ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లను ముందుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ డేట్స్ కేటాయించారు. దీంతో కల్కి 2 షూటింగ్ వర్క్ త్వరలోనే మొదలుకానుంది. ప్రభాస్ షెడ్యూల్స్, ఇతర ప్రాజెక్టుల విడుదలల మధ్య గ్యాప్‌ను దృష్టిలో పెట్టుకుని కల్కి 2 విడుదల 2027 దసరా సమయంలో జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

  • ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'స్పిరిట్'. సందీప్ వంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్నిరోజుల క్రితమే మొదలైంది. త్వరలో విదేశాలకు కూడా వెళ్లనున్నారు. కొన్నిరోజుల క్రితమే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది మార్చి 5న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అంతకు ముందు న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలి అంచనాలని పెంచేశారు. ఇప్పుడీ చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.

    ఈ సినిమా నుంచి కొన్నాళ్ల క్రితం ఆడియో గ్లింప్స్ ఒకటి వదిలారు. ఇందులో ప్రభాస్, ప్రకాశ్ రాజ్ ఉన్నట్లు  వాయిస్ ద్వారా అర్థమైంది. హీరోయిన్ తృప్తి దిమ్రి కాగా వివేక్ ఒబెరాయ్ కూడా ఉన్నాడని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ ప్రకాశ్ రాజ్.. ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారట. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

    అయితే ప్రకాశ్ రాజ్ తప్పుకోవడానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సులే కారణమని మాట్లాడుకుంటున్నారు. సందీప్ వర్కింగ్ స్టైల్ గానీ సినిమా తీసే విధానం మిగతా దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మరి ఎక్కడ సమస్య వచ్చిందో గానీ ప్రకాశ్ రాజ్ తప్పుకొన్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది. మరి  ఇదే నిజమైతే ఇతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి?

  • ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు.  రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజి యాదవ్  అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

    అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్ లెవల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవల్ కమిటీల ఏర్పాటుపై తాజాగా చర్చించారు. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని  అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు ఉండాలని వారు సూచించారు.

    టాలీవుడ్‌లో ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి వారందరికీ ఫ్యాన్స్ అసోసియేషన్స్‌ ఉన్నాయి.  కొన్నేళ్లుగా ఈ అసోసియేషన్స్‌ కొనసాగుతున్నాయి. ఇప్పడు పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా సొంతంగా తన అభిమానుల సైన్యాన్ని రెడీ చేసుకోనున్నాడు. పుష్ప2 విడుదల సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో తనకు అండగా ఫ్యాన్స్‌ లేరనే చెప్పాలి. ఆ సమయంలో తను చెప్పాలనుకున్న విషయాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యాడు. బన్నీ తరుపున ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని సమర్థవంతంగా రీచ్‌ చేసేవారు లేరు.  అందుకే ఫ్యాన్స్‌ కొరతను ఆయన గ్రహించారని తెలుస్తోంది.

  • ప్రముఖ నటుడు అర్జున్‌ చాలా ఏళ్ల తర్వాత దర్శకుడిగా తెరకెక్కించిన సినిమా 'సీతాపయనం'.. ఇదే మూవీతో తన కూతురు ఐశ్వర్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఇందులో నిరంజన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట విశ్వక్‌ సేన్‌ హీరోగా ప్రకటించారు. కానీ, పలు విభేదాల కారణంగా అతను వాకౌట్‌ చేశాడు. అయితే, యాదృచ్చికంగా, విశ్వక్ చిత్రం ఫంకీతో పాటు 'సీతాపయనం' కూడా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా విడుదలవుతోంది. తాజాగా తమ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో విశ్వక్‌ సేన్‌ గురించి అర్జున్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

    గతంలో విశ్వక​్‌తో జరిగిన వివాదాన్ని గుర్తు చేస్తూ అడిగిన ప్రశ్నకు అర్జున్‌ ఇలా సమాధానం ఇచ్చారు. మా సినిమా సీతాపయనంతో పాటు విశ్వక్‌ సేన్‌ మూవీ ఫంకీ కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అతనొక యువకుడు.. తనకు చాలా భవిష్యత్‌ ఉంది. ఏదో మనకు కుదరలేదని అతనిపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. వారి అమ్మగారి చేతి భోజనం తిన్నాను. వాళ్లు బాగుండాలని కోరుకుంటాను. కాలంతో పాటు కొన్ని మరిచిపోతూ సంతోషంగా ముందుకు సాగాలి. మా రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను అని అర్జున్‌ అన్నారు.

    విశ్వక్‌పై అర్జున్‌ చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్‌ నుంచి అభినందనలు వస్తున్నాయి. పెద్దరికం ఎలా ఉంటుందో చూపించావ్‌ అంటూ అర్జున​్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అర్జున్‌ కూతురు హీరోయిన్‌గా విశ్వక్‌ సేన్‌తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే, షూటింగ్‌ కొంత జరిగిన తర్వాత పలు కారణాలతో విశ్వక్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో అర్జున్‌, విశ్వక్‌ మధ్య మాటల గొడవ జరిగిన విషయం తెలిసిందే. 
     

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌  త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే.. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్‌.. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కొడుకు (వాయు)ను స్వాగతించారు. గతేడాది నవంబర్‌లో సోనమ్ తన బేబీ బంప్‌ను రివీల్‌ చేస్తూ రెండవ గర్భధారణను ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ ఆనందాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ ముంబైలోని తమ నివాసంలో బేబీ షవర్‌(సీమంతం) కార్యక్రమాన్ని నిర్వహించారు. 

    ఈ వేడుకలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. కరీనా కపూర్ , అనిల్ కపూర్, అర్జున్ కపూర్, అన్షులా కపూర్, భూమి పెడ్నేకర్,  షబానా అజ్మీ ఈ కార్యక్రమంలో సందడిగా కనిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరే కూడా సోనమ్ నివాసంలో కనిపించారు. తరువాత, అనుపమ్ ఖేర్, మసాబా గుప్తా, కునాల్ రావల్, సంజయ్ కపూర్  ఇతరులు కూడా వచ్చారు.
     

  • ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌ను అధికారికంగా అన్నపూర్ణ స్టూడియో ప్రకటించింది. అయితే, పూర్తి క్లారిటీ కాకుండా ఒక పంచ్‌ డైలాగ్‌తో  పోస్ట్‌ చేశారు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ భారీ హిట​్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2022 సంక్రాంతికి సీక్వెల్‌గా బంగార్రాజు వచ్చాడు. అయితే,  2027 సంక్రాంతికి  మరో సీక్వెల్‌ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వాసివాడి తస్సాదియ్యా అంటూ.. 2027 జనవరి 15న సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్‌గా ఉంటాది కదా అని డేట్ మార్క్ చేసుకోమని పోస్ట్‌ చేశారు.

    దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హిట్‌ కొట్టడమే కాకుండా బంగార్రాజు సీక్వెల్‌తో మెప్పించాడు. దీంతో ఇదే ప్రాంఛైజీలో మరో సినిమా రానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్‌తో ఒక క్లారిటీ ఇచ్చేసింది. కల్యాణ్‌కృష్ణ, నాగార్జున కలిసి పార్ట్‌-3 ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడించే ఛాన్స్‌ ఉంది. రాబోయే సంక్రాంతికి సీనియర్‌ హీరోలు అందరూ పోటీలో ఉన్నారు. చిరంజీవి- బాబీ సినిమాతో పాటు బాలకృష్ణ- గోపీచంద్‌ మలినేని, వెంకటేశ్‌- అనిల్‌ రావిపూడి సినిమాలు రేసులో ఉన్న విషయం తెలిసిందే.

  • దక్షిణాదిన ఎంతోమంది స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన రాధికా శరత్‌కుమార్‌ ఈసారి చాలా డిఫరెంట్‌ పాత్రలో కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ "తాయి కిళవి". ఈ చిత్రంలో తను ఊరిలో రుణాలిచ్చే వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో శివకార్తికేయన్‌ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

    బైక్‌పై తిరిగాం
    ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాధిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ఒకరోజు రజనీకాంత్‌, నేను బైక్‌పై చెన్నై అంతా తిరిగాం.  నేను ఇక్కడే తిన్నాను, ఇక్కడే నిద్రపోయాను, ఇక్కడే కొన్నాళ్లు ఉన్నానంటూ రజనీ తను తిరిగిన ప్రదేశాలన్నీ నాకు చూపించాడు. రజనీ లైఫ్‌ స్టోరీ తన నోటి నుంచి వింటున్నప్పుడు చలించిపోయాను.

    జీవితంలో అనేక కష్టాలు
    ఇన్ని కష్టాలు పడ్డాడా? అని ఫీలయ్యాను. చాలామంది జీవితంలో అనేక కష్టాలు చూసుండొచ్చు. కానీ, రజనీకాంత్‌ తన బాధ, కష్టం, శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని అట్టడుగు స్థాయి నుంచి తారాస్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే మేము అలా బైక్‌పై తిరుగుతూ ఉంటే సడన్‌గా ఒక కారు మమ్మల్ని చేజ్‌ చేసుకుంటూ వచ్చి మా ముందు ఆగింది. నాకు ఒక్కసారిగా భయమేసింది. 

    సీక్రెట్‌ షికారు అనుకుని..
    అయితే వచ్చింది మరెవరో కాదు, రజనీకాంత్‌ భార్య లత సోదరుడు, నటుడు రాఘవేంద్ర. రజనీకాంత్‌ అర్ధరాత్రి ఒక మహిళను వెంటేసుకుని రహస్యంగా షికార్లు చేస్తున్నాడని భావించి మమ్మల్ని ఆపేందుకు వచ్చాడు. కానీ.. రజనీ, నేను షికారుకు వెళ్లామని లతకు ముందే తెలుసు. దీంతో అతడి ఆందోళన నీరుగారిపోయింది అని చెప్పుకొచ్చింది. కాగా రజనీకాంత్‌ భార్య, నిర్మాత, సింగర్‌ లత తమ్ముడే నటుడు రవి రాఘవేంద్ర. ఈయన కుమారుడు అనిరుధ్‌ రవిచందర్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు.

    చదవండి: సంతోషంగా లేను, మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు: శ్రీజ దమ్ము

  • వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌ కలిశారు. చెన్నైలో జరిగిన జగన్‌  సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో విజయ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌, విజయ్‌ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దీంతో జన నాయకుడు వైఎస్‌ జగన్‌తో జన నాయగన్‌ విజయ్‌ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

  • 'హోంబౌండ్‌' సినిమా హీరో ఇషాన్‌ ఖట్టర్‌ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని పాలి హిల్‌ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. నవరోజ్‌ అపార్ట్‌మెంట్‌లోని 14వ నెంబర్‌ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీని విలువ రూ.29.37 కోట్లు అని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ కింద అదనంగా రూ.1.76 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.

    సినిమా
    ఇషాన్‌ ఖట్టర్‌ చిన్న వయసులోనే ఇల్లు సొంతం చేసుకోవడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్‌- రాజేశ్‌ ఖట్టర్‌ ఇద్దరూ కూడా యాక్టర్సే కావడం విశేషం! ఇషాన్‌ ఖట్టర్‌.. గతంలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగానూ పని చేశాడు. బియాండ్‌ ద క్లౌడ్స్‌, ధడక్‌, ఖాలీ పీలి ఫోన్‌ బూత్‌, పిప్పా వంటి పలు హిందీ సినిమాలు నటించాడు.

    ఆస్కార్‌ రేసు నుంచి అవుట్‌
    గతేడాది రిలీజైన హోంబౌండ్‌ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో సత్తా చాటింది. అంతేకాదు ఆస్కార్‌ రేసులో అడుగుపెట్టి అంచనాలు పెంచేసింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరీలో భారత్‌ నుంచి హోంబౌండ్‌ మూవీ అధికారికంగా ఎంపికైంది. ఈ విభాగంలో మొత్తం 15 సినిమాలను షార్ట్‌ లిస్ట్‌ చేయగా అందులో స్థానం సంపాదించుకుంది. జనవరి 22న మరోసారి షార్ట్‌ లిస్ట్‌ చేసినప్పుడు మాత్రం హోంబౌండ్‌ ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో ఆస్కార్‌ నుంచి నిరాశగా వెనుదిరిగింది.

    చదవండి: తెలుగులో ఏకైక సినిమా.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

  • ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రం ‘వారణాసి’. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌ ఒక్కటే నిర్వహించారు. ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ షురూనే చేయలేదు కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మాత్రం ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాయి. అంతటి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు గాను జక్కన్న, మహేశ్‌ కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారట. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి తీసుకోవద్దని ఫిక్స్‌ అయ్యారట.

    గత సినిమాలకు కూడా రాజమౌళి పూర్తిగా పారితోషికం తీసుకునేవాడు కాదు. కొంతమేర రెమ్యునరేషన్‌గా తీసుకొని.. మిగతాది లాభాల్లో వాటాగా తీసుకునేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండానే పని చేస్తున్నాడట. పారితోషికంగా ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్‌ బాబు కూడా ఒక్క పైసా తీసుకోకుండా, నిర్మాణంలో భాగస్వామి అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఉన్న బజ్‌ దృష్ట్యా..కచ్చితంగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. 

    ఇక హిట్‌ టాక్‌ వస్తే మాత్రం.. ఊహించని కలెక్షన్స్‌ రావడం ఖాయం. ఈ  లెక్కన అటు జక్కన్నకు, ఇటు మహేశ్‌కు రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్‌ కంటే ఎక్కువే అందే అవకాశం ఉంది. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఓవర్సీస్‌లో రైట్స్‌ తీసుకోవడం ద్వారా జక్కన్నకు రూ. 150 కోట్లకు పైనే లాభం వచ్చే చాన్స్‌ ఉంది. అలాగే నిర్మాణం భాగస్వామ్యం అయిన మహేశ్‌కు రూ. 150-200 కోట్ల వరకు రావొచ్చు. 

    మహేశ్‌బాబు ఇందులో రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో టాప్‌ రేంజ్‌లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి  హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.

    'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్‌మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్‌ మూవీ ప్రమోషన్‌ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్,  సంజయ్ దత్‌లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.

    అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనా
    ఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ  ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్‌బీర్‌ సింగ​్‌కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.

  • ఒకప్పుడు హీరోయిన్‌గా చేసినవాళ్లు తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోవడం సహజం. కథానాయికగా అలరించినవారే తర్వాత అమ్మ, అత్త, వదిన పాత్రల్లో అలరిస్తుంటారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి వెండితెరకు దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటారు. నటి డాలీ మిన్హాస్‌ మొదటి కోవకు చెందినది. నేడు (ఫిబ్రవరి 8న) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై ఈ ప్రత్యేక కథనం..

    మోడలింగ్‌ నుంచి సినిమాలవైపు
    డాలీ మిన్హాస్‌ అసలు పేరు డాలీ మాట్యూ. తనొక మోడల్‌. 1988లో ఫెమినా మిస్‌ ఇండియా యూనివర్స్‌ కిరీటం గెలుచుకుంది. 1989లో మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత్‌ తరపున పోటీ చేసింది. అలా మోడలింగ్‌ నుంచి సినిమాల్లో వచ్చింది. డాలీ కథానాయికగా నటించిన మొదటి మూవీ దస్తూర్‌ (1991). 

    సినిమాలు
    మిస్టర్‌ బాండ్‌, క్షత్రియ, గేమ్‌, ప్యార్‌ మే ట్విస్ట్‌, గుడ్‌ లక్‌, దిల్‌ దడక్కనే దో వంటి పలు సినిమాలు చేసింది. హిందీతో పాటు పంజాబీ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీమాన్‌ బ్రహ్మచారి అని ఒకే ఒక్క సినిమా చేసింది. 1992లో వచ్చిన ఈ సినిమాలో సురేశ్‌ హీరోగా నటించాడు. చివరగా కబీర్‌ సింగ్‌ (2019) మూవీలో హీరో తల్లి పాత్రలో కనిపించింది.

    సీరియల్స్‌కు షిఫ్ట్‌
    తొలి సినిమా దర్శకుడు అనిల్‌ మాట్యూతో ప్రేమలో పడిన డాలీ అతడినే పెళ్లి చేసుకుంది. రానురానూ సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్‌ అయిపోయింది. ఇస్‌ ప్యార్‌కో క్యా నామ్‌ ధూ?, ఏక్‌ బార్‌ ఫిర్‌, చోటీ సర్దామి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. మహాయోధ, శక్తిమాన్‌ సీరియల్స్‌లో నెగెటివ్‌ పాత్ర పోషించింది. ప్రస్తుతం ప్రేమ్‌ లీలా సీరియల్‌ చేస్తోంది. అలా ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన డాలీ ఇప్పుడు బుల్లితెరపై నటిగా రాణిస్తోంది.

    చదవండి: జీవితంలో సంతోషంగా లేను.. దమ్ము శ్రీజ

  • సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ - సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ఒక సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మూవీ గురించి నిర్మాత రామ్‌ తాళ్లూరి   కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. పవన్‌ నటిస్తున్న మరో చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మార్చి 26న విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత తదుపరి ఆయన చేయనున్నది సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్న సినిమానే కావడం విశేషం. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎంపిక గురించి మరోసారి విమర్శలు వస్తున్నాయి.

    ‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్‌ను పవన్‌కు జోడీగా సురేందర్‌ రెడ్డి ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇమాన్వీ ఎంపికను తప్పుబడుతూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫౌజీ మూవీలో ఇమాన్వీని తీసుకుంటున్నట్లు ప్రకటన వచ్చిన సమయంలో కూడా ఇలాంటి వివాదమే రేగింది.  తన మూలాలు పాకిస్థాన్‌కు చెంది ఉన్నాయని మరికొందరు గుర్తు చేస్తున్నారు. 

    కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌తో ఉన్న సంబంధాలన్నీ కూడా భారత్‌ తెంచుకుంది.  పాకిస్థాన్‌ నటులు, సినిమాలపై కూడా నిషేధం విధించాలనే డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు పవన్‌ మూవీకి ఇమాన్వీని తీసుకోనున్నారని వార్తలు రావడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, ఇమాన్వీ ఎంపిక అంశం గురించి అధికారికంగా ప్రకటన రాలేదు.

    నాది పాకిస్థాన్‌ కాదు
    ఫౌజీ సినిమా సమయంలో కూడా ఇమాన్వీ ప్రాంతీయత గురించి ఇలాంటి విమర్శలే వచ్చాయి. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాను పాకిస్థానిని కాదని, భారతీయ అమెరికన్‌ని అని గర్వంగా చెప్పుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, కొందరు  తన మూలాల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు.  ' పాకిస్థాన్‌తో నా కుటుంబం సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని కొందరు నా గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భారత సంస్కృతి నా రక్తంలోనే ఉంది. 

    నేను చాలా క్లియర్‌గా హిందీతో పాటు తెలుగు, గుజరాతీ మాట్లాడగలనని గర్వంగా చెబుతాను. నేను పుట్టింది లాస్‌ ఏంజెలిస్‌లో.. చాలా ఏళ్ల క్రితమే నా తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. వారు ఎప్పుడో అమెరికన్‌ సిటిజన్స్‌గా గుర్తింపు పొందారు. నేను చదివింది కూడా అమెరికాలోనే.. సినిమాలపై ఆసక్తితో నా చదువు పూర్తయ్యాక కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించాను. ఫైనల్‌గా భారతీయ చిత్రపరిశ్రమలో అవకాశాల్ని అందుకున్నందుకు ఆనందంగా ఉంది.' అంటూ గతంలో ఇమాన్వీ తన గురించి క్లారిటీ ఇచ్చింది.
     

  • టాలీవుడ్‌ కింగ్‌  అక్కినేని నాగార్జున మరో రంగంలోనూ సత్తా చాటనున్నారు.  అగ్రస్థాయి నటుడుగా, చిన్నితెర పై టాప్‌ హోస్ట్‌గా, నిర్మాత, స్టూడియో అధినేత... వంటి బహుముఖ పాత్రలతో రాణిస్తున్న నాగ్‌... ఆంధ్రప్రదేశ్‌  తెలంగాణ రాష్ట్రాలలో సినిమా పంపిణీదారుగా కూడా కొత్త పాత్ర పోషించనున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సినీ పంపిణీ రంగంలోకి లాంఛనంగా అడుగుపెట్టారు, రాబోయే సంవత్సరాల్లో తన పంపిణీ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించాలని యోచిస్తున్నారు.

    బాలీవుడ్‌ బాటలో...
    ప్రస్తుతం తెలుగు హీరోలలో ఎవరూ పంపిణీ  రంగంలో లేని పరిస్థితుల్లో.. ఈ రంగంలోకి దిగిన తొలి తెలుగు హీరోగా నాగార్జున నిలవనున్నారు. బాలీవుడ్‌ లో చూస్తే రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పేరిట షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అజయ్‌  దేవగణ్, అక్షయ్‌ కుమార్, దక్షిణాది హీరోల్లో రాజ్‌ కమల్‌ ఫిలింమ్స్‌ ఇంటర్నేషనల్‌ పేరిట  కమల్‌ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌...వంటివారు  పంపిణీ రంగంలో ఉన్నారు. ఈ హీరోలు ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోల స్ఫూర్తితోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు. తెరపై పాత్రల ఎంపిక విషయంలో మాత్రమే కాదు వాణిజ్య ప్రణాళికల విషయంలోనూ ఎప్పుడూ మిగిలిన వారికంటే ఓ అడుగు ముందే నాగ్‌ ఉంటారనేది గతంలో ఎన్నోమార్లు  రుజువైన విషయం.  

    తెలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు...
    అన్నపూర్ణ స్టూడియోస్‌ ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక పంపిణీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది  ఇప్పుడు విశాఖపట్నంలో కూడా కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది, ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విస్తరణకు సంకేతంగా చెప్పుకోవచ్చు.  దాదాపు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ నాగార్జున స్వంతం.  ఇప్పుడు ఆయన మరిన్ని సినిమాలను నిర్మించాలని మరోవైపు  తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని  యోచిస్తున్నారని తెలుస్తోంది..ఆర్థికపుష్టి ఉన్న అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జున డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టడం ప్రస్తుత అగ్రగామి పంపిణీదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

    పోటాపోటీ...పంపిణీ
    తెలుగు రాష్ట్రాలలో పంపిణీ రంగం ఇప్పటికే పలు మార్పులకు నిదర్శనంగా నిలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్,  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు సిండికేట్‌గా  మారాయి. ఈ నేపధ్యంలో నాగార్జున ప్రవేశంతో రెండు రాష్ట్రాల్లో పంపిణీ ఆధిపత్యం కోసం జరిగే పోరు మరింత తీవ్రమవుతుందని సినీ పరిశీలకులు భావిస్తున్నారు.  నిజాం, వైజాగ్‌ ప్రాంతాలలో ప్రధాన పంపిణీదారుగా దిల్‌ రాజు కొనసాగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పంపిణీ రంగంలోకి  ప్రవేశించిన తర్వాత, చాలా మంది నిర్మాతలు మైత్రి ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌తో, ముఖ్యంగా నిజాం ప్రాంతంలో, భాగస్వామ్యం కావడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఏషియన్‌ థియేటర్స్‌కు చెందిన సునీల్, సురేష్‌ బాబులు కొన్ని ఎంపిక చేసిన ప్రాజెక్టుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారు.

    మారనున్న స్నేహాలు...
    గత కొంత కాలంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రాలను దిల్‌ రాజు, క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. అయితే, నిజాం ప్రాంతంలో ఇటీవల తన పంపిణీ కార్యాలయాన్ని ప్రారంభించిన అన్నపూర్ణ స్టూడియోస్‌తో ఇకపై నాగవంశీ భాగస్వామ్యం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం బహుళ చిత్రాలను విడుదల చేస్తూన్న నాగవంశీ తెలుగు సినిమాలో అత్యంత చురుకైన విజయవంతమైన నిర్మాతలలో ఒకరనేది తెలిసిందే అంతేకాక దిల్‌ రాజుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ మార్పు కార్యరూపం దాల్చితే, నిజాం ప్రాంతంలో దిల్‌ రాజు ఆధిపత్యానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించవచ్చు. 

    ఓ వైపు పంపిణీదారులుగా మారుతున్న నిర్మాతల సంఖ్య పెరుగుతుండడం,  సురేష్‌ బాబు, అల్లు అరవింద్, సునీల్‌ నారంగ్‌  వంటి పంపిణీ రంగంలో స్థిరపడిన వారికి సవాలు గా మారనుందని, నాగార్జున ప్రవేశం తెలుగు సినిమా పంపిణీ వ్యాపారాన్ని పునర్నిర్వచించబోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
     

  • బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష ద్వారా పాపులర్‌ అయింది శ్రీజ దమ్ము. పేరుకు తగ్గట్లుగానే షోలో తన దమ్ము చూపించి తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌లో అడుగుపెట్టింది. కానీ మొదట్లో ఓవర్‌ యాటిట్యూడ్‌ చూపించి విమర్శలపాలైంది. అయితే తన ముక్కుసూటితనం, ఆటతీరు వల్ల అభిమానులను సైతం సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్‌ ఇతరత్రా విషయాలను పంచుకుంది.

    ట్రోలింగ్‌
    శ్రీజ దమ్ము మాట్లాడుతూ.. మా నాన్న జీవీఎంసీ (మహా విశాఖ నగర పాలక సంస్థ) ఉద్యోగి (పారిశుద్ధ్య కార్మికుడు). నేను బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు ఓసారి చీర దోపుకుని చెత్త బ్యాగులు పట్టుకెళ్లాను. దానికి విపరీతంగా ట్రోల్‌ చేశారు. తడిచెత్త, పొడిచెత్త అమ్ముకునేలా ఉంది.. సరిగ్గా సరిపోయింది అని విమర్శించారు. అది చూసి నేను నవ్వుకున్నాను. 

    అందుకు సంతోషం
    కానీ, మా నాన్న చేసే పని అదే కావడంతో ఇంట్లో వాళ్లు బాధపడ్డారు. ఏదేమైనా బిగ్‌బాస్‌కు వెళ్లి నాకంటూ ఓ పేరు సంపాదించుకున్నందుకు హ్యాపీ. కానీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా వైల్డ్‌ కార్డ్స్‌తో గేమ్‌ ఆడించి బయటకు పంపించినందుకు బాధగా అనిపించింది. నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడ్చాను. ఇప్పుడు తల్చుకున్నా బాధనిపిస్తుంది.

    నేను పెళ్లి చేసుకునేవాడు..
    పార్టీలు, పబ్బులకెళ్తా.. కానీ, మందు మాత్రం తాగను. నాకు కాబోయే భర్త తాగుడుకు బానిసైతే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా.. ఇంకా నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు మంచి హైట్‌ ఉండాలి, జుట్టుండాలి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. రేపు నేను ఉద్యోగం చేసినా, చేయకపోయినా, ఖాళీగా ఉన్నా అతడే అన్నీ చూసుకునేలా ఉండాలి. నాకయితే ప్రేమపెళ్లి చేసుకోవాలని ఉంది. నేనంటే పడి చచ్చిపోయేవాడు కావాలి.

    నా జీవితం నా ఇష్టం
    నా డ్రెస్సింగ్‌పై వచ్చే ట్రోల్స్‌ పట్టించుకోను. నేను షార్ట్‌ వేసుకుంటా.. టీషర్ట్‌ వేసుకుంటా.. నీకెందుకు? నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటాను. ఇకపోతే సొంతింటి కల ఒక్కటే నాకున్న పెద్ద డ్రీమ్‌. ఇంతవరకు నేనెప్పుడూ సంతోషంగా లేను. ఏదో లైఫ్‌ ముందుకెళ్తుందా? అంటే వెళ్తుందంతే! ప్రశాంతమైన జీవితం దొరికితే సంతోషంగా ఉంటాను. అలా అని డిప్రెషన్‌లో లేను. బిగ్‌బాస్‌ కోసం రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేశా.. ఇప్పుడుమ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను అని శ్రీజ చెప్పుకొచ్చింది.

    చదవండి: సర్వం మాయ బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. తండ్రికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన దర్శకుడు

  • ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత, శివ కంఠనేని ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ థ్రిల్లర్ మూవీ అమరావతికి ఆహ్వానం. ఈ సినిమాకు జీవీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీని కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. 

    అమరావతికి ఆ‍హ్వానం ట్రైలర్ చూస్తుంటే హారర్‌ థ్రిల్లర్‌ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏంట్రా ఈ ఊరు మనుషులే కనపడట్లేదు అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఈ గ్రామంలో  జరిగే మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్‌లో సీన్స్‌ ఆడియన్స్‌ను భయపెట్టేస్తున్నాయి. దెయ్యాల కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

  • టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సోషల్‌ మీడియాలో హల్‌ చేసిన  ఈ బ్యూటీ..ఇకపై వెండితెరపై సందడి చేయబోతుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది సుప్రిత. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు..తన మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.

    ఒత్తిడితో ఎక్కువ తీసేశా.. 
    ఆ మధ్య నేను కాస్త బరువు పెరిగా. అందరూ నన్ను లావు అయ్యావు అనడంతో ఒత్తిడికి లోనయ్యా. నేను ఒత్తిడికి లోనైన ప్రతిసారి ఇంకాస్త ఎక్కువే తింటాను. అలా తినడంతో బరువు పెరిగిపోయా. దీంతో వెంటనే తగ్గాలని ఒక పూట తినడం ప్రారంభించా. ప్రతి రోజు 12-15 గంటల పాటు ఏం తినకుండా ఉండేదాన్ని. ఒక పూట మాత్రం ఏదైనా తీనేదాన్ని. ఎక్కువగా బిర్యానీలు తీనడంతో ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చేరాను. అక్కడ దాదాపు 15 రోజుల పాటు నరకం చూశా. మంచి నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. 20 రోజుల పాటు అన్నమే తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు అయ్యేవి. ఒకనొక దశలో నేను బతకనేమో అనుకున్నా. నా వల్ల అమ్మతో పాటు స్టాఫ్‌ అంతా ఇబ్బంది పడింది. ఆస్పత్రిలో వారిని చూసి నాకే బాధకలిగింది. ఈ నరకం భరించడం కంటే..ఏదో ఒక మెడిసిన్‌ ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నా. కానీ దేవుడి దయతో కోలుకున్నా. ఇప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను’ అని సుప్రీతి చెప్పుకొచ్చింది.

    ఆ ఇద్దరికి సిస్టర్‌గా నటించలేను
    ఇక ఇదే ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు హీరోయిన్‌గా మాత్రమే కొనసాగాలని లేదని.. మంచి స్క్రిప్ట్‌ వస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ చేస్తానని చెప్పింది. పవన్‌ కల్యాణ్‌, ఎన్టీఆర్‌కు సిస్టర్‌గా నటించే అవకాశం వస్తే వదులుకోను. ఈ ఇద్దరనే కాదు.. టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ తప్ప వేరే ఏ హీరోకి అయినా సిస్టర్‌గా నటిస్తా. విజయ్‌ దేవరకొండ, అఖిల్‌ అంటే నాకు చాలా ఇష్టం. పదో తరగతి పాస్‌ అయితే అఖిల్‌తో డిన్నర్‌కి తీసుకెళ్తా అని అమ్మ మాట ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు. అఖిల్‌, విజయ్‌ నేరుగా కనిపిస్తే..షాకులో ఉండిపోతానేమో’ అని సుప్రిత చెప్పుకొచ్చింది.

  • గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.

    అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. ‍అలా జరిగి ఉంటే దురంధర్‌కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.
    ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్‌లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.

    థియేటర్స్ మరింత అవసరం..

    ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్‌లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్‌లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి  పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్‌ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.

    గతేడాది  చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన  ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.

    మరింత భారీ వసూళ్లు..

    మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్‌లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు  గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్‌లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య  పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం  మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్‌ వీర్ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.  ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు. 

Sports

  • కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు.

  • శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ‍ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి  బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్‌ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్‌ స్టిర్లింగ్‌ (158 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

    అయితే ఆ ఓవర్‌ తర్వాత ఐర్లాండ్‌ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 

    ఐరిష్‌ బౌలర్లలో జార్జియా డాక్రెల్‌ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మార్క్‌ అదైర్‌ (4-0-33-1), గెరాత్‌ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-44-0), బ్యారీ మెక్‌ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

    లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ మెండిస్‌ (56 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆఖర్లో కుసాల్‌ మెండిస్‌ (44) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్‌ మిషారా 14, పవన్‌ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు. 

  • ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్‌ రాహుల్‌ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. 

    మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (3), ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట​్‌ తీశారు.

    అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

    కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఓ పెను సంచలనం తృటిలో మిస్‌ అయ్యింది. ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 8) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ రెప్పపాటులో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన లక్ష్యానికి అతి సమీపంగా వచ్చి, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. 

    నేపాల్‌ ఓడినా, ఇంగ్లండ్‌ జట్టుకు ముచ్చెమటలు పట్టించిన వైనం క్రికెట్‌ ప్రపంచాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌కు ఆది నుంచి మంచి ఆదరణ లభించింది. హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండే అయినా, వాంఖడే స్టేడియంలోని (ముంబై) ప్రేక్షకులు నేపాల్‌ ఆటగాళ్లకు బ్రహ్మారథం పట్టారు. ఆ జనాలను చూసి, ఇది ఖాట్మండునా (నేపాల్‌ రాజధాని) లేక ముంబైనా అన్న అనుమానం వచ్చింది. 

    ప్రేక్షకులు వేల సంఖ్యలో నేపాల్‌కు మద్దతిచ్చేందుకు తరలివచ్చారు. ఇందుకు నేపాల్‌ ఆటగాళ్లు తగిన న్యాయం చేశారు. వారి అభిమానులకు కావాల్సినంత మజాను అందించారు. ఇంగ్లండ్‌పై దాదాపు గెలిచినంత పని చేశారు. చివరి ఓవర్‌లో ఒక్క బౌండరీ నమోదై ఉంటే నేపాల్‌ పెను సంచలన సృష్టించేదే. 

    185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌కు చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్‌ను సామ్‌ కర్రన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పర్ఫెక్ట్‌ యార్కర్లు వేసి నేపాల్‌ బ్యాటర్లు కరణ్‌, లోకేశ్‌ బామ్‌ను ఇబ్బంది పెట్టాడు. కర్రన్‌ కట్టడి చేయడంతో నేపాల్‌ ఆ ఓవర్‌లో కేవలం 5 పరుగులే చేయగలిగింది. 

    అప్పటిదాకా మెరుపులు మెరిపించిన లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో ఏమీ చేయలేకపోయాడు. కర్రన్‌ అతన్ని అద్భుతంగా కట్టడి చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా.. లోకేశ్‌ సిక్సర్‌ బాది తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కర్రన్‌ ముందు లోకేశ్‌ పప్పులు ఉడకలేదు. 

    కర్రన్‌ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుతమైన యార్కర్లు సంధించాడు. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 18వ ఓవర్‌ నేపాల్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. అప్పటివరకు ఆచితూచి ఆడిన నేపాల్‌ బ్యాటర్లు.. ఆ ఓవర్‌లో చెలరేగిపోయారు. ఆసిఫ్‌ షేక్‌, లోకేశ్‌ బామ్‌ రెండు సిక్సర్లు సహా 22 పరుగులు పిండుకొని ఇంగ్లండ్‌వైపు నుంచి మ్యాచ్‌ను తమవైపు మళ్లించుకున్నారు. 

    ఆతర్వాత 19 ఓవర్‌లోనూ 14 పరుగులు రావడంతో ఇంగ్లండ్‌ శిబిరంలో కలవరం మొదలైంది. పసికూన అయినా, నేపాల్‌ను తక్కువ అంచనా వేయడం తప్పని అప్పుడు వారికి అర్దమైంది. కొంచెం అటుఇటు అయి ఉంటే, ఇంగ్లండ్‌ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చేది. 

    నేపాల్‌ బ్యాటర్లు ఆది నుంచే అద్భుతంగా ఆడారు. ఓపెనర్‌ కుషాల్‌ భుర్టెల్‌ (29) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (44), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (39) మూడో వికెట్‌కు 54 బంతుల్లో 82 పరుగులు జోడించి అప్పుడే ఇంగ్లండ్‌ను భయపెట్టారు. ఆఖర్లో లోకేశ్‌ బామ్‌ ఇంగ్లండ్‌ను కంగారు పెట్టాడు. 

    ఈ మ్యాచ్‌లో నేపాల్‌ ఓడినా, యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభిమానాన్ని చూరగొంది. అంతకుముందు నేపాల్‌ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను ఇబ్బందులకు గురి చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53), విల్‌ జాక్స్‌ (39 నాటౌట్‌) సత్తా చాటకపోయుంటే బౌలింగ్‌కు దిగకముందే మ్యాచ్‌ ఓడిపోయి ఉండేది. 

    వారు ముగ్గురు రాణించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ తలో 2, షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ తీసి సత్తా చాటారు. నేపాల్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 12) ఇటలీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ తప్పక గెలిచే అవకాశం ఉంది. 

  • నేపాల్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ షేర్‌ మల్లా చరిత్ర సృష్టించాడు. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి అత్యంత​ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనతను మల్లా ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో సాధించడం మరింత ప్రత్యేకం. 

    మల్లాకు ముందు కేవలం ఐదుగురు (ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ప్రగ్యాన్‌ ఓఝా, పరాస్‌ ఖడ్కా, నదీమ్‌ అహ్మద్‌, ఖుర్రమ్‌ ఖాన్‌) మాత్రమే ప్రపంచకప్‌ టోర్నీలో (కెరీర్‌లో) తొలి బంతికే వికెట్‌ తీశారు. వీరిలోనూ ఓ నేపాల్‌ బౌలర్‌ (పరాస్‌ ఖడ్కా) ఉన్నాడు. మరో ఆసక్తికర విశేషమేమిటంటే.. మల్లాకు ముందు మరో ముగ్గురు (పరాస్‌ ఖడ్కా, ఆరిఫ్‌ షేక్‌, కుశాల్‌ భుర్టెల్‌) నేపాల్‌ ఆటగాళ్లు కూడా కెరీర్‌లో తొలి బంతికే వికెట్‌ తీశారు.

    కాగా, టీ20 ప్రపంచకప్‌లో నేపాల్‌ ఇవాళ (ఫిబ్రవరి 8) ఆడుతుంది. ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జేకబ్‌ బేతెల్‌ (55), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. 

    ఆఖర్లో విల్‌ జాక్స్‌ (38 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ 1, జోస్‌ బట్లర్‌ 26, టామ్‌ బాంటన్‌ 2, సామ్‌ కర్రన్‌ 2, జోఫ్రా ఆర్చర్‌ ఒక్క పరుగు చేశారు. నేపాల్‌ బౌలర్లలో నందన్‌ యాదవ్‌, దీపేంద్ర సింగ్‌ ఎయిరీ తలో 2 వికెట్లు తీయగా.. షేర్‌ మల్లా, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. మల్లా తొలి వికెట్‌ ఫిల్‌ సాల్ట్‌.

    అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. భుర్టెల్‌ (29), ఆసిఫ్‌ షేక్‌ (7) ఔట్‌ కాగా.. రోహిత్‌ పౌడెల్‌ (10), దీపేంద్ర సింగ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. డాసన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలవాలంటే మరో 78 బంతుల్లో 125 పరుగులు చేయాలి. 
     

  • టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్‌ శర్మ వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్‌ఏతో మ్యాచ్‌కు దూరం కాగా.. అభిషేక్‌ నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్‌కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్‌ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్‌ కోలుకుంటాడో లేదో చూడాలి.

    కాగా, నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (84 నాటౌట్‌) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

    స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

    యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు. 
     

  • క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు  ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం​.

    కాగా, గత కొద్ది రోజులుగా భారత్‌-పాక్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ నుంచి బంగ్లాదేశ్‌ బహిష్కరణకు నిరసనగా పాక్‌ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్‌ బ్రాడ్‌కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇ​ందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.

    ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్‌, పాక్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ తలో మ్యాచ్‌ గెలిచాయి. భారత్‌ యూఎస్‌ఏపై, పాక్‌ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్‌ స్కాట్లాండ్‌పై, న్యూజిలాండ్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై విజయాలు సాధించాయి. 

  • భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్‌ 125 మ్యాచ్‌ల్లో 16 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం​ 105 మ్యాచ్‌ల్లోనే 17 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచాడు. 

    ఈ జాబితాలో స్కై, విరాట్‌ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (159 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్‌దీప్‌ సింగ్‌కు (22) దక్కుతుంది. విరన్‌దీప్‌ తర్వాతి స్థానాల్లో సికందర్‌ రజా (19), సూర్యకుమార్‌ (17) ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

    స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు. 
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో న్యూజిలాండ్‌ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్‌ నైబ్‌ (63) టాప్‌ స్కోరర్‌ కాగా.. రహానుల్లా గుర్బాజ్‌ 27, ఇబ్రహీం జద్రాన్‌ 10, సెదిఖుల్లా అటల్‌ 29, దర్విష్‌ రసూల్‌ 20, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 14, మొహమ్మద్‌ నబీ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ 2, రచిన్‌ రవీంద్ర, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తలో వికెట్‌ తీశారు.

    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 42, మార్క్‌ చాప్‌మన్‌ 28, డారిల్‌ మిచెల్‌ 25 (నాటౌట్‌), మిచెల్‌ సాంట్నర్‌ 17 (నాటౌట్‌), ఫిన్‌ అలెన్‌ ఒక పరుగు చేశారు. రచిన్‌ రవీంద్ర గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రహ్మాన్‌ 2, ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, నబీ తలో వికెట్‌ తీశారు.

     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్‌ జగన్‌ అన్నారు. 

    మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

  • సాక్షి, అన్నమయ్య: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని పలు మండల గ్రామాలకు చెందిన కోళ్లలో బర్డ్‌ఫ్లూను ఉన్నట్లు తేలింది.

    సుదుం మండలంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నిర్ధారణయ్యింది. పుట్టవారిపల్లి,అమ్మగారిపల్లి,కంభంవారిపల్లికి చెందిన కోళ్లల్లో బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూతో 28వేల కోట్లు చనిపోయినట్లు సమాచారం. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో అధికారులు పూడ్చేశారు. మూడు కోళ్ల ఫామ్‌లను సీజ్‌ చేశారు.     
     

  • విశాఖ సాక్షి: బక్కన్నపాలెం నవోదయ స్కూల్‌లో ఉద్రిక్తత నెలకొంది. దోమల నివారణకు వాడే పొగపీల్చడంతో  36 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. దీంతో వెంటనే వారిని కొమ్మాది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • భీమ‌వ‌రం: తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసిన సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ముక్కు నేల‌కు రాసి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మాజీ మంత్రి కారుమూరి వెంక‌ట నాగేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. భీమ‌వ‌రంలో వైయస్సార్సీపీ నాయ‌కులు చినిమిల్లి వెంక‌ట రాయుడు నివాసంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ సీబీఐ సిట్ చార్జిషీట్‌తో ల‌డ్డూ త‌యారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేప‌ల నూనే క‌ల‌వ‌లేద‌నే వాస్త‌వాలు బ‌య‌ట‌కొచ్చాయ‌ని, రాజ‌కీయ ల‌బ్ధి కోసం ల‌డ్డూపై దుష్ప్ర‌చారం చేయ‌డం ఇక‌నైనా మానుకోవాల‌ని హితవు ప‌లికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డం మంచిది కాద‌ని చెప్పారు. 

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిజంగా హిందూ ధ‌ర్మాన్ని ప‌రిరక్షించే వాడైతే త‌ణుకులో అనుమ‌తులు లేకుండా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్న జంతు వ‌ధ‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కార‌ణ‌మ‌వుతున్న క‌బేళాపై ప్ర‌జ‌లు చేస్తున్న ఫిర్యాదుల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. 12 వేల గోవులను చంపి విశాఖ‌లో 1.86 ల‌క్ష‌ల ట‌న్నుల మాంసాన్ని అక్ర‌మంగా నిల్వ చేస్తే ఆరోజు ప‌ట్టించుకోని కేంద్ర‌మంత్రి శ్రీనివాస‌వ‌ర్మ.. ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సిట్ చెప్పినా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేట‌ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌రరావు మండిప‌డ్డారు. 

    నిజం చెబుతుంటే మాపై దాడులు
    లడ్డూ క‌ల్తీ పేరుతో క‌లియుగ దైవం శ్రీవేంక‌టేశ్వ‌రుడిని అల్ల‌రి చేయ‌డం మానుకుని తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసినందుకు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి లోకేష్ స‌హా కూట‌మి నాయ‌కులంతా ముక్కు నేల‌కు రాసి శ్రీవారి భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. సీబీఐ సిట్ చార్జిషీట్ తర్వాత కూడా దుష్ప్ర‌చారం చేసి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా మాట్లాడటం సిగ్గుచేటు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం తిరుమ‌లేశుడిని వివాదాల్లోకి లాగ‌డం సరికాదు. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త నుంచి ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను దృష్టి మ‌ళ్లించ‌డం కోసం ప‌దే ప‌దే తిరుమ‌ల ల‌డ్డూ అంశాన్ని తీసుకొచ్చి వైకుంఠ‌వాసుడిని వివాదాల్లోకి లాగుతున్నారు. సిట్ చార్జిషీట్ బ‌య‌ట‌పెట్టి తిరుమ‌ల ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెబుతున్నందుకు మా నాయకుల మీద వ‌రుస పెట్టి దాడుల‌కు దిగుతున్నారు.

    జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సిట్ స్ప‌ష్టం చేసింది
    క‌ల్తీ జ‌రిగింద‌ని మాజీ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కూడా అంగీక‌రించారంటూ ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి మ‌రో దుష్ప్ర‌చారం మొద‌లుపెట్టారు. క‌ల్తీ జ‌రిగింద‌ని కూట‌మి నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్న నెయ్యి, ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే టీటీడీలోకి ప్ర‌వేశించిన విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో కూడా ఈ విష‌యం స్ప‌ష్టంగా రాసి ఉన్నా కూడా వైయ‌స్సార్సీపీ మీద బుర‌ద‌జ‌ల్లి రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌నుకోవ‌డం స‌మంజ‌సం కాదు. తాను ఏ త‌ప్పూ చేయ‌లేదు కాబ‌ట్టే ల‌డ్డూలో జంతువుల కొవ్వు కలిసింద‌ని కూట‌మి చేస్తున్న త‌ప్పుడు ప్రచారంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించార‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విష‌యంలో నార్కో ఎనాలిసిస్ టెస్టు స‌హా ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధ‌మ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఆ నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేప‌ల నూనె క‌లిసింద‌ని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టంగా చెప్పిన త‌ర్వాతైనా దుష్ప్ర‌చారం ఆప‌డం లేదు. బాత్రూమ్‌లు క‌డిగే ర‌సాయ‌నాలు క‌లిపారంటూ చంద్ర‌బాబు కొత్త ప్ర‌చారం చేస్తున్నారు. కూట‌మి నాయ‌కులు ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి. చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తున్న బోలేబాబా డెయిరీకి కూడా టీడీపీ హ‌యాంలోనే అనుమ‌తులు ల‌భించాయి.  

    ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి డైవ‌ర్ట్ చేసే కుట్ర
    పాల‌న చేత‌కాక ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మై ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న వ్య‌తిరేక‌తను క‌నిపించ‌కుండా చేయాల‌నుకోవ‌డం చంద్ర‌బాబు భ్ర‌మ‌. క‌నీసం స్కూళ్ల‌లో చ‌దివే పిల్ల‌ల‌కు నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా అందించ‌లేక‌పోతున్నారు. రెండేళ్లు కూడా గ‌డ‌వ‌కుండానే ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.  ఇన్నాళ్లూ తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో చేసిన త‌ప్పుడు ప్ర‌చారానికి గాను ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి ఆల‌య మెట్లు ఇప్పుడైనా స‌వ్యంగా పైనుంచి కింద‌కు క‌డ‌గాలి. దేవుడి మీద న‌మ్మ‌కం లేద‌ని, దేవుడిని ఉరి తీయాల‌ని చెప్పిన నాగ‌బాబు సైతం స‌నాత‌న ధ‌ర్మం గురించి చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌తో కోట్లాది మంది హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రుస్తూ త‌ప్పుడు ప్రచారం చేయ‌డం త‌గ‌దు. సీబీఐ సిట్ చార్జిషీట్‌లో మాజీ టీటీడీ చైర్మ‌న్లు వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ల పేర్లు లేక‌పోయినా వారి ఫొటోల‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంకా దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇలాంటి మాట‌ల‌తో హిందువుల మ‌నోభావాల‌ను గాయ‌ప‌రచ‌డం సరికాదు.

    గోవ‌ధ‌పై మీరెందుకు మాట్లాడ‌టం లేదు? 
    సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించే వారే అయితే త‌ణుకులో అనుమ‌తులు లేకుండా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డుస్తున్న క‌బేళా (శ్లాట‌ర్ హౌస్)ను త‌క్ష‌ణం మూసేయించాలి. ఇళ్ల మ‌ధ్య ఇష్టారాజ్యంగా జ‌రుగుతున్న జంతు వ‌ధ కార‌ణంగా వ‌స్తున్న దుర్వాస‌న‌తో ప్ర‌జ‌లు ఇళ్ల‌ల్లో కూడా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అర్థ‌రాత్రి అప‌రాత్రి అనే తేడా లేకుండా జ‌రుగుతున్న జంతు వ‌ధ‌ను ఆపేలా కేంద్ర‌మంత్రి శ్రీనివాస‌వ‌ర్మ కూడా దృష్టిసారించాలి. శ్లాట‌ర్ హౌస్‌పై ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి దీనిపై స్థానికులు ప‌లుమార్లు ఫిర్యాదు చేసినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. విశాఖ‌లో 1.85 ల‌క్ష‌ల ట‌న్నుల గోమాంసాన్ని అధికారులు సీజ్ చేస్తే, అది టీడీపీ నాయకుడి అనుచ‌రిద‌ని తెలిసినా ఈ కేంద్ర మంత్రి శ్రీనివాస‌వ‌ర్మ ఎందుకు స్పందించ‌లేదు?  12 వేల గోవుల‌ను చంపి ఆ మాంసాన్ని విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తుంటే ప‌ట్టించుకోని ఈ కేంద్ర మంత్రి ల‌డ్డూలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ స్ప‌ష్టం చేసినా ఇప్ప‌టికీ ప‌దే ప‌దే అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేస్తున్నాడు. దేవుడి మీద భ‌యం, భ‌క్తి ఉన్నవాళ్లు చేసే ప‌నేనా ఇది?  కేంద్ర త‌నిఖీల్లో హెరిటేజ్ పెరుగు మంచిది కాద‌ని తేలింది. దీనిపై చంద్ర‌బాబు, లోకేష్ ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు? అని కారుమూరి నాగేశ్వ‌ర‌రావు సూటిగా ప్ర‌శ్నించారు.

National

  • ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హానీమూన్-2 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితురాలు అంజూతన ప్రియుడు సంజూల మధ్య ఏడేళ్ల క్రితమే ప్రేమ మెుదలైనట్లు అధికారుల విచారణలో తేలింది. అంతేకాకుండా వీరిద్దరూ గతంలో ఓ వివాహంలో పరిచయం అయినట్లు తెలుస్తోంది.

    పెళ్లైన మూడు నెలలకే జనవరి 30న అంజలి అనే మహిళ తన భర్త అశీశ్‌ను ప్రియుడితో కలిసి హత్య చేయించిన సంగతి తెలిసిందే. అయితే వీరు ఏడేళ్ల క్రితమే తొలిసారిగా పరిచయం అయినట్లు విచారణలో తేలింది. విచారణలోని వివరాలు..2018లో జరిగిన ఓ వివాహంలో అంజలి, సంజయ్‌లు తొలిసారిగా కలిశారు. ఆవివాహంలో వెయిటర్‌గా పనిచేయడానికి వచ్చిన సంజయ్‌, అంజలిని ప్రేమలోకి దింపాడు. అనంతరం తన ఫోన్‌ నెంబర్‌ ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ సమయంలో తనకు మెుబైల్‌ లేకపోవడంతో వేరే వారి ఫోన్‌తో వారికి సంజయ్‌కి కాల్ అంజలి కాల్‌ చేసేది. అయితే  కొద్దిరోజుల తర్వాత ఇద్దరికి కాంటాక్ట్ లేకుండా పోయింది. 

    ఈ నేపథ్యంలో 2024లో అంజలి ఫోన్‌ కొనుగోలు చేయడంతో ఇద్దరికి తిరిగి కాంటాక్ట్ ప్రారంభమయ్యింది. ఆసమయంలో వారిద్దరూ మరింతగా దగ్గరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే వారి కుటుంబసభ్యులు తనకు అశీశ్‌తో వివాహం నిశ్చయించారు. అయితే కుటుంబసభ్యులకు భయపడి అంజలి 2025 అక్టోబర్‌ 30న అశీశ్‌ను వివాహం చేసుకుంది. అయితే అనంతరం కూడా సంజయ్‌తో వాట్సాఫ్‌ కాల్‌ మాట్లాడుతూ వస్తుంది. అయితే ఈ హత్య జరగడానికి 16 రోజుల ముందు అంజలి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 

    జనవరి 30న తన ప్రణాళిక ప్రకారం భోజనం ముగిసిన తర్వాత వాకింగ్‌కు వెళదామని తన భర్తను కోరింది. అనంతరం తన ప్రియుడికి వాట్సాఫ్‌లో వారున్న సమాచారం పంపింది. దీంతో సంజయ్ తన ఇద్దరు మిత్రులు రోహిత్, సిద్ధార్థ్‌లతో కలిసి అక్కడ ఉన్నాడు. వారిని చూడగానే అశీశ్‌ను కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాం పైనుంచి వాహనం తీసుకెళ్లారు. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో తన గుట్టు రట్టయ్యింది. విచారణలో తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

  • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పార్కింగ్ చేసిన కారులో  మూడు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలు ఎవరియా? అక్కడికి ఎలా వచ్చాయా? ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అన్న కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.  ఘటనా స్థలానికి చెందిన సీసీటీవీ ఫుటేజ్‌ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 

    ఘటనా ‍స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకొని నమూనాలు స్వీకరించాయి. మృతదేహాలు లభించిన కారు పీరాగఢి  ఓవర్ వద్ద పార్కు చేసి ఉంది. అయితే చనిపోయిన వారిలో ఒకరు యువతి కాగా  మరోకరు యువకుడు,  ఓ పెద్దాయన  ఉన్నారు. రణ్‌ధీర్‌(52), శివనరేష్‌(42)   లక్ష్మీ(41)లుగా గుర్తించారు.

     

     

     

     

  • మహారాష్ట్ర భివాండిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక హరిహర కాంపౌండ్‌లో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రిటైర్మెంట్ కావాలని సంఘ్ ఆదేశిస్తే వైదొలగడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.  అయితే చరిత్రలో ఇంతవరకూ  సర్వ సంఘ్ చాలక్‌ని పదవీ విరమణ చేయాలని సంఘ్ కోరలేదన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు.

    ఆర్ఎస్‌ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్ర  మంబై వర్లిలో ప్రత్యేక కార్యక్రమన్ని నిన్న( శనివారం) ప్రారంభించారు. దానికి హాజరైన మోహన్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. RSS సంఘ్ చాలక్ పదవికి ఎన్నికలు ఉండవన్నారు.అయితే వయస్సుతో సంబంధం లేకుండా తనను పని చేయాలని సంఘ్ కోరినట్లు తెలిపారు. తన చివరి రక్తపు బొట్టువరకూ సంఘ్ తనతో పనిచేయించుకుంటుందని తెలిపారు. 
     

    అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై మోహన్ భగవత్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. అక్కడి హిందు సమాజం వారి హక్కులను కాపాడుకోవడానికి పోరాడదలుచుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి అండగా నిలుస్తారన్నారు. ప్రస్తుతం అక్కడి హిందూ జనాభా 1.25 కోట్ల హిందూ జనాభా ఉందని తెలిపారు.

    అదేవిధంగా ఇటీవల కేంద్రం చేపట్టిన SIR ప్రక్రియలో దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలు సైతం అక్రమ చొరబాటు దారులపట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి ఎటువంటి ఉపాధి కల్పించకూడదని తెలిపారు. వారి సమచారం గుర్తిస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయాలన్నారు.

    బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు అక్కడే అల్లరిమూకలు రెచ్చిపోయాయి. హిందువులపై ఇష్ఠారీతిన దాడి చేశాయి.  ఇటీవల ఆ అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్‌ హాదీ హత్యతో మరోసారి అక్కడి హిందువులపై హింస చెలరేగింది. ఇస్లాం వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారనే నెపంతో అక్కడి మతఛాందస వాదులు వారిపై దాడులు చేసి చంపారు. అయితే తాజాగా వీటిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు.

     

  • బెంగళూరు:కర్ణాటకలో శిక్షణా విమానం కుప్పకూలింది. కర్ణాటక బాబలేశ్వర్‌ జిల్లా మంగళూరులో ఓ శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 

    పోలీసుల సమాచారం మేరకు.. రెడ్‌ బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన రెండు సీట్ల విమానం ట్రైనింగ్‌లో భాగంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ  విమానం పంట పొలాల్లో కూలింది. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పైలట్, ట్రైనీ పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు.

    ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారి పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

    విమానం శిక్షణ ప్రయాణంలో ఉందని, సాంకేతిక లోపమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విమానం మూడు ముక్కలుగా విరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. అయితే, పైలట్, ట్రైనీ పైలట్ సకాలంలో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.  

  • కేంద్రప్రభుత్వం పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌కు ఝలక్ ఇ‍చ్చింది. పొలిటికల్ క్లియరెన్స్ లేదనే కారణంతో తన విదేశీ పర్యటనను రద్దు చేసింది. కేంద్రం భగవంత్ మాన్ విదేశీ పర్యటనను రద్దు చేయడం ఇది వరుసగా మూడోసారి.

    భగవంత్ మాన్ నెదర్లాండ్స్‌లోని చెక్‌ రిపబ్లిక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే పొలిటికల్ క్లియరెన్స్ లేదనే కారణంతో ఆయన పర్యటనకు కేంద్రం రద్దుచేసింది. కాగా గతనెలలోనూ భగవంత్ మాన్ విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతులివ్వలేదు. జనవరిలో యునైటెడ్‌ కింగ్‌డమ్ ఇజ్రాయెల్ పర్యటించాల్సి ఉండగా విదేశాంగ శాఖ తన పర్యటనకు అనుమతులు నిరాకరించింది. అదే విధంగా పారిస్ ఒలంపిక్స్ సందర్భంలో ఫ్రాన్స్ పర్యటనను నిలిపివేసింది.

    అయితే వచ్చే నెలలో పంజాబ్‌లో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశం యూరోపియన్ యూనియన్ దేశాలలో భగవంత్ మాన్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు అనుమతి నిరాకరించడంపై ఆ రాష్ట్ర నేతలు అసంతృప్తితో ఉన్నారు. కేంద్రం చర్యలతో పంజాబ్‌కు అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడులు సన్నగిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    కాగా ఈ అంశం రాజకీయంగా సైతం వివాదాస్పదంగా మారింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం కక్ష‍ సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆప్ ఆరోపిస్తుంది. అయితే ఏదైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు చేయాల్సినప్పుడు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

  • ముంబై: ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో గల ఘాట్‌కోపర్ స్టేషన్ సమీపంలో  కలకలం చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఒక పురుషుడు ముంబై లోకల్ ట్రైన్‌లోని మహిళల బోగీలోకి ప్రవేశించాడు. రద్దీగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి చొరబడటంతో అక్కడి మహిళా ప్రయాణికులు  భయాందోళనకు గురయ్యారు.
     

    తొలుత మహిళా ప్రయాణికులు అతనిని గమనించలేదు.  తరువాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అప్రమత్తమై, అతనిని నిలదీశారు.  దీనిని అక్కడున్న వారు తమ ఫోన్‌లలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రైలులోని మహిళా ప్రయాణికులు ఆ వ్యక్తిపై రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే రైలు ఆగగానే ఆ వ్యక్తి  అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై ఘాట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడిని గుర్తించేందుకు  రైలులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Business

  • భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.

    ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలు

    తాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.

    ‘ఆర్‌బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

  • పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.

    సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.

    కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్‌లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది.

    స్థిరమైన వేగం మైలేజ్‌కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్‌ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.

    ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచకూడదు.

  • ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.

    నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.

    దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.

    నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.

    ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

  • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.

    బలమైన ఆర్థిక శక్తిగా భారత్

    ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్‌ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.

    అమెరికా నుంచి కొనుగోళ్లు

    వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్‌లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్‌ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.

    వ్యూహాత్మక చర్చలు

    వాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.

    భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్‌లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.

    ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

  • మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.  అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

    కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్‌పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.

    టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది.

  • భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్‌లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

    రూ.198 రీఛార్జ్ ప్లాన్
    ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.

    రూ.349 రీఛార్జ్ ప్లాన్
    ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్‌స్టార్, జియోసావన్‌ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.

    ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!

  • భారత్‌-యూఎస్‌ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్‌) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.

    ప్రధానాంశాలు.. ఆరోపణలు

    • ఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‍ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.

    • మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.

    • భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.

    • కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్‌కేఎం డిమాండ్ చేసింది.

    ఫిబ్రవరి 12న నిరసన

    రైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్‌కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

    వ్యవసాయంపై ప్రభావం

    ఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్‌లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

    ప్రభుత్వ వాదన

    మరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.

    ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక

  • కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్‌ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక  పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ  ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

    ఇటీవల దావోస్‌లో.. ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీతో కలిసి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్‌లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నా­యి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్‌లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.

    అమెరికా, చైనా దూకుడు
    2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని  పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.

    మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లు
    భారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్‌లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్‌వేర్‌ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.

    ఆర్థిక వ్యవస్థకూ ఊతం
    భారత్‌ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్‌ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది.

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సామాన్య పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్’ మొబైల్ యాప్ భారతీయ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. గతంలో కేవలం బ్యాంకులు, పెద్ద సంస్థలకే పరిమితమైన ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రారంభించి చాలా రోజులైనా దీని గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడులను ఇస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.

    ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు (ఎస్‌డీఎల్‌), ట్రెజరీ బిల్లులు (T-Bills), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆర్‌బీఐ వద్ద ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను తెరవాల్సి ఉంటుంది.

    లాభాలు

    • ఇవి ప్రభుత్వ బాండ్లు కాబట్టి మీ పెట్టుబడికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంటే అసలు, వడ్డీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటుంది.

    • ఈ ఖాతా తెరవడానికి, దాన్ని నిర్వహించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు.

    • మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్‌బీఐ నిర్వహించే ప్రైమరీ మార్కెట్ వేలంలో సామాన్యులు కూడా బిడ్లు దాఖలు చేయవచ్చు.

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కొన్నిసార్లు మెరుగైన వడ్డీ రేట్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.

    • సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఫిజికల్ గోల్డ్ కంటే తక్కువ ధరకు, అదనపు వడ్డీతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. (ఇటీవల కాలంలో బంగారం భారీగా పెరగడంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను నిలిపేసిందని గమనించాలి)

    పరిమితులు

    • షేర్ మార్కెట్‌తో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. అంటే అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు త్వరగా దొరక్కపోవచ్చు.

    • మార్కెట్‌లో వడ్డీ రేట్లు పెరిగితే, మీరు గతంలో తక్కువ వడ్డీకి కొన్న బాండ్ల విలువ తగ్గుతుంది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు.

    • బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్‌డీల మాదిరిగానే దీనికి పన్ను మినహాయింపులు తక్కువ.

    • యాప్‌ను వాడటం, బిడ్డింగ్ వేయడం వంటి ప్రక్రియలు గ్రామీణ లేదా తక్కువ అవగాహన ఉన్నవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు.

    ఎవరికి మేలు?

    • రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఇది మెరుగైన వేదిక.

    • నెలవారీ లేదా వార్షిక ఆదాయం కోసం దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం.

    • కేవలం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌పైనే ఆధారపడకుండా తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరైనది.

    • పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం 10-30 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమం. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లు తక్కువ మొత్తాన్ని సమకూర్చే అవకాశం ఉంది.

    ప్రభుత్వ సెక్యూరిటీల రకాలు

    ట్రెజరీ బిల్లులు.. ఇవి స్వల్పకాలిక పెట్టుబడులు (మెచ్యురిటీ పీరియడ్‌ 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు).

    ప్రభుత్వ బాండ్లు.. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు (5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి). వీటికి స్థిరమైన వడ్డీ వస్తుంది.

    రాష్ట్ర అభివృద్ధి రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం జారీ చేసే బాండ్లు.

    వడ్డీ ఎంత?

    ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులు, ఆర్‌బీఐ రెపో రేటు, కాలపరిమితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సాధారణంగా వీటిపై వడ్డీ 7% నుంచి 7.5% మధ్యలో ఉండే అవకాశం ఉంది (ఇది మారుతూ ఉండవచ్చు). దీర్ఘకాలిక బాండ్లపై వడ్డీని (దీన్ని కూపన్ అంటారు) సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ట్రెజరీ బిల్లులపై నేరుగా వడ్డీ ఉండదు. ఉదాహరణకు రూ.100 విలువైన బిల్లును ప్రభుత్వం రూ.98 కి అమ్ముతుంది. గడువు తీరాక మీకు రూ.100 ఇస్తుంది. ఆ రూ.2 మీ లాభం.

    ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక

  • తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా.. మహీంద్రా & మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆటోమొబైల్స్ & ట్రాక్టర్ల కోసం తన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని ప్రకటించింది. దీనిని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.

    మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. విదర్భలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి అనుబంధంగా శంభాజీనగర్‌లో 150 ఎకరాల సప్లయర్ పార్క్ కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కర్మాగారం ఏడాదికి ఐదు లక్షల వాహనాలు & లక్ష ట్రాక్టర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాగ్‌పూర్‌లో జరిగిన అడ్వాంటేజ్ విదర్భ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం & మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.

  • ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ షాకింగ్ వార్తను అందించింది. ఆండ్రాయిడ్ 12 (Android 12) లేదా అంతకంటే పాత వెర్షన్లపై పనిచేస్తున్న స్మార్ట్‌ఫోన్లకు ఇకపై అధికారికంగా సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లు అందవని ధ్రువీకరించింది. దీనివల్ల దాదాపు 42.1% ఆండ్రాయిడ్ ఫోన్లు సైబర్ దాడులు, మాల్వేర్, స్పైవేర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    అసలు సమస్య ఇదే!

    తాజా గణాంకాల ప్రకారం కేవలం 57.9% పరికరాలు మాత్రమే ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్లను వాడుతున్నాయి. ఆండ్రాయిడ్ వ్యవస్థలోని ‘ఫ్రాగ్మెంటేషన్’ సమస్యే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పటికీ గూగుల్‌ పిక్సెల్ ఫోన్లు మినహా మిగిలిన కంపెనీలపై (శాంసంగ్, షావోమి, ఒప్పో, మోటరోలా మొదలైనవి) అప్‌డేట్‌ల విషయంలో గూగుల్‌కు పూర్తి నియంత్రణ ఉండదు. ఫోన్ తయారీదారులు తమ సొంత షెడ్యూల్స్ పాటిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత పాత మోడళ్లకు అప్‌డేట్‌లు నిలిపివేస్తున్నారు. యాపిల్ తన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటినీ నియంత్రిస్తుంది కాబట్టి, పాత ఐఫోన్‌లకు కూడా అప్‌డేట్‌లు వేగంగా అందుతాయి. ఉదాహరణకు ఐఓఎస్‌ 26 ఇప్పటికే 50% ఐఫోన్‌ల్లో నడుస్తుండగా ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ కేవలం 7.5%ఫోన్లలో మాత్రమే ఉంది.

    ఏ వెర్షన్లు సురక్షితం? ఏవి కావు?

    ప్రస్తుతం సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందుతున్న, నిలిపివేసిన వెర్షన్ల జాబితా ఇక్కడ ఉంది.

    భద్రతా అప్‌డేట్‌ ఉన్నవిసాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నిలిపేసినవి
    ఆండ్రాయిడ్ 16ఆండ్రాయిడ్ 12
    ఆండ్రాయిడ్ 15ఆండ్రాయిడ్ 11
    ఆండ్రాయిడ్ 14ఆండ్రాయిడ్ 10
    ఆండ్రాయిడ్ 13ఆండ్రాయిడ్ 9, అంతకంటే పాతవి

     

    ముప్పులేమిటి?

    సెక్యూరిటీ అప్‌డేట్‌లు లేని ఫోన్ వాడటం అంటే తాళం లేని ఇంట్లో ఉండటమే. మాల్వేర్ దాడుల వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు.

    • మీ యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్‌ల చోరీ.

    • బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్ హ్యాకింగ్.

    • ఓటీపీ సందేశాలను అడ్డగించడం.

    • మీ ఆర్థిక ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం.

    గూగుల్ ప్లే ప్రొటెక్ట్ సరిపోదా?

    ఆండ్రాయిడ్ 7 నుంచి అన్ని వెర్షన్లలో ‘ప్లే ప్రొటెక్ట్’ రియల్ టైమ్ మాల్వేర్ స్కానింగ్ అందిస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఇది కేవలం యాప్స్ స్థాయిలోనే రక్షణ ఇస్తుంది. సిస్టమ్ స్థాయిలో ఉండే లోపాలను (Security Patches) ఇది సరిదిద్దలేదు. కాబట్టి పాత ఫోన్లు ప్రమాదంలో ఉ‍న్నట్లేనని గమనించాలి.

    ఇప్పుడేం చేయాలి?

    మీ ఫోన్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి.

    1. ఫోన్‌లో Settings ఓపెన్ చేయండి.

    2. తర్వాత About Phone కు వెళ్లండి.

    3. Android Versionను తనిఖీ చేయండి.

    ఒకవేళ మీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాతది అయితే దాన్ని అప్‌గ్రేడ్ చేయడం శ్రేయస్కరం. గూగుల్ సలహా ప్రకారం.. మీ ఫోన్‌ ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కానవసరం లేదు. కనీసం ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్ కొనుగోలు చేసినా మీకు భద్రత లభిస్తుంది.

    ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’

  • ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.

    ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.

    కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.

    2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.

    బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!

  • ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వినూత్న వ్యాపార శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. క్లిష్టమైన పరిశ్రమలను సైతం అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘ఇడియట్ ఇండెక్స్’ అనే భావన ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఏమిటీ ఇడియట్ ఇండెక్స్?

    ఇది అధికారిక ఆర్థిక గణాంకం కానప్పటికీ మస్క్ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ పనితీరును నిర్దేశించే ఒక అనధికారిక కొలమానం. దీని ప్రకారం.. ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి అయ్యే ముడి పదార్థాల మొత్తం ధర, ఆ ఉత్పత్తి విక్రయించే తుది ధర మధ్య వ్యత్యాసాన్నే మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక యంత్రం తయారీకి వాడే ఉక్కు, అల్యూమినియం ఖర్చు చాలా తక్కువగా ఉండి తుది యంత్రం ధర విపరీతంగా ఎక్కువగా ఉంటే ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసం వ్యవస్థలోని అసమర్థతను సూచిస్తుందని మస్క్ వాదిస్తున్నారు. ఇంజినీరింగ్ క్లిష్టత లేదా భద్రతా కారణాలు లేకుండా ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అక్కడ వ్యవస్థలో లోపం ఉందని లేదా కాలం చెల్లిన పద్ధతులు వాడుతున్నారని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు.

    స్పేస్ ఎక్స్, ఎక్స్‌ఏఐ విలీనం

    2026 ప్రారంభంలో మస్క్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వ్యాపార రంగంలో మైలురాయిగా నిలిచింది. తన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్‌ఏఐని అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్‌లో విలీనం చేయడం ద్వారా ఆయన సాంకేతిక సమగ్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లారు.

    ఈ విలీనం వెనుక కారణాలు

    • ఏఐ శిక్షణకు అవసరమైన భారీ విద్యుత్, డేటా కేంద్రాల నిర్వహణకు స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ నెట్‌వర్క్ తోడ్పడుతుంది.

    • ఏఐ ఇంజినీర్లు, రాకెట్ శాస్త్రవేత్తలు ఒకే గొడుగు కింద పనిచేయడం వల్ల సంస్థాగత జాప్యం తగ్గుతుంది.

    • బాహ్య సరఫరాదారులపై ఆధారపడకుండా ఏఐ నుంచి రాకెట్ తయారీ వరకు అంతా అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలవుతుంది.

    విమర్శలు, వాస్తవాలు

    మస్క్ పద్ధతులు ఎంత విజయవంతమైనా అవి విమర్శలకు అతీతం కాదు. ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి, కఠినమైన టార్గెట్‌లు వంటి అంశాలపై మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఫలితాల పరంగా చూస్తే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు, టెస్లా గిగాఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ‘ఇడియట్ ఇండెక్స్’ ద్వారా అసమర్థతను తొలగించి వేగమే ప్రధానంగా మస్క్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. 2026 నాటి ఈ పరిణామాలు భవిష్యత్తులో సాంకేతిక రంగం ఏ దిశగా వెళ్తుందో సూచిస్తున్నాయి.

    ఇదీ చదవండి: కియోసాకీకి కోపమొచ్చింది!

  • సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు 100 శాతం భారీ బోనస్ ప్రకటించింది. 2025లో అంచనాలను మించి ఆదాయ ఫలితాలను సాధించిన తరువాత ఈ బంపర్‌ బొనాంజా ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహం నిండింది.

    కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవి కుమార్ ఎస్ గత కొన్నేళ్లుగా "విజేత సర్కిల్"లోకి ప్రవేశించాలనే సంస్థ లక్ష్యం గురించి చాలాసార్లు మాట్లాడారు.  ఫలితాల విడుదల సందర్భంగా 2025లో పటిష్ట పనితీరుకు కారణమైన 3.5 లక్షలమంది సిబ్బందిని సీఈవో ప్రశంసించారు. నాస్‌డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే. డిసెంబర్‌31కల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 14,800 పెరిగి 3.51 లక్షలకు చేరింది.

    లాభం జూమ్‌
    కాగ్నిజెంట్‌ గత ఆర్థిక సంవత్సరం(2025) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 19 శాతం జంప్‌చేసి 64.8 కోట్ల డాలర్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024) ఇదే కాలంలో కేవలం 54.6 కోట్ల డాలర్లు ఆర్జించింది. కంపెనీ కేలండర్‌ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి 533.3 కోట్ల డాలర్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో 508.2 కోట్ల డాలర్ల టర్నోవర్‌ అందుకుంది. ఈ కాలంలో 12  భారీ డీల్స్‌ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. డిసెంబర్‌తో ముగిసిన పూర్తిఏడాది(2025)కి ఆదాయం 7 శాతం వృద్ధితో 21.1 బిలియన్‌ డాలర్లను తాకింది.

    ఆదాయ అంచనాలు గుడ్‌ 
    ప్రస్తుత ఏడాది(2026)కి కాగ్నిజెంట్‌ 5–7.4 శాతం అధికంగా 22.14–22.66 బిలియన్‌ డాలర్ల ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. ఈ బాటలో తొలి క్వార్టర్‌(జనవరి–మార్చి)కు 5.36–5.44 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 2.7–4.2 శాతం వృద్ధి అంచనాలివి.

  • ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్‌కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల  అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో వరుస ట్వీట్లు చేశారు.

    తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్‌కాయిన్‌ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.

    “నేను ఏ తేదీన బిట్‌కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.

    బిట్‌కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.

    తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్‌కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.

    అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్‌లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

    చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.

  • బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.

    2,307 మెట్రిక్‌ టన్నుల బంగారం
    పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్‌ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.

    ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?
    జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.

    ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.

    భారత్‌ పసిడి నిల్వలు ఇలా..
    జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్‌కు  ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి.

Telangana

  • పర్యావరణాన్ని  మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి, మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు.

    రంగారెడ్డి జిల్లా kadtal మండలం అన్మాసుపల్లిలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తాద్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ముగింపు సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సమావేశంలో జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి తదితర ముఖ్యులు పాల్గొన్నారు.

    పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాల గ్రేడింగ్ తో ప్రకృతి వ్యవసాయం లో కూడా అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... దేశీ విత్తనాలు దేశ సంపద అని, వాటి విస్తృత వినియోగానికి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ప్రణాళికా బద్దమైన ప్రభుత్వ విధానాలు అవసరం అన్నారు. రైతు ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఈ విధానాలు రూపొందాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన ప్రాధాన్యత ఇస్తేనే ప్రకృతి వ్యవసాయ పద్ధతు ల వినియోగం పెరుగుతుందన్నారు.

    ప్రభుత్వ విధానాలలో మార్పు వచ్చినప్పుడే ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుందని ఏపీ మాస్ వ్యవస్థాపకులు సీఎస్ రెడ్డి  ఆన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ఈ ఉద్యమం లో కీలక పాత్ర ఉందన్నారు. దేశీ విత్తనాల తో పంట దిగుబడి తగ్గుతుందనేది కేవలం ఒక అపోహేనని , వాటి వినియోగం వల్ల భూమి, మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయానికి అనుగుణమైన ప్రత్యామ్నాయ విత్తన వ్యవస్థ ను బలోపేతం చేయాలన్నారు.

    ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహా రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్, దేశీ విత్తన వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ ప్రయోజనాలతో కూడిన విత్తన వ్యవస్థను రైతులు సవాలు చేస్తూ ప్రకృతి వ్యవసాయ  ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయ భాగస్వామ్యం తో విత్తన పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు. లక్ష్యం దిశగా ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందని, మరింత స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు సాగుతామని ఆమె చెప్పారు

  • సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీలో అగ్నిప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందన్నారు. 

    ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్నిప్రమాదం సీఎం రేవంత్‌ పనే. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్రలు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మయం చేసేందుకు ఇలా చేశారు.

    తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ తూతూ మంత్రంగా వివరణిచ్చారు. ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 
     

  • సాక్షి,హైదరాబాద్‌: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉన్న జిల్లాలను తొలగించేది లేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదు. జిల్లాల పునర్వవస్థికరణ కోసం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు’ అని సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

    గత జనవరిలో సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) డైరీ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

    అప్పట్లో అడ్డగోలుగా విభజన 
    ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్‌లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. 

    ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్‌ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. 

    తొలుత మండలాల హేతుబద్ధీకరణ 
    ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్‌ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే  విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. 

    ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్‌ తెలిపారు.  

  • సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్‌ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. 

    సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్‌ అవుతుంటారు.. కానీ వీహెచ్‌ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్‌ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు.  

  • సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవనంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

    ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదివారం ఉదయం ల్యాబ్‌లో​ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం, అగ్ని ప్రమాదంపై శిఖా గోయల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ప్రమాదంపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో ఆఫీసులో ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నాం. దయచేసి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది.

    ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి. 2015 సంవత్సరంలో  ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయి. కేసుకు సంభంచిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందపరిచాం. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చింది. ఇక్కడ ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం లేదు. ఓటుకు నోటు కేసులో  యథావిధిగా నడుస్తుంది.

    2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ టాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫ్‌ఎస్‌ఎల్‌కి వచ్చాయి. మిగతా మెటీరియల్ అసిస్ట్ చేసాం. ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి. వీటిని రిట్రివ్ చేస్తాం. ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఇంత వరకు ఎంత నష్టం జరిగింది స్పష్టత లేదు. ఈ కేసుకు సంభంచిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ కేసుకు సంబంధించిన మెటీరియల్‌ ధ్వంసమైంది? అనేది విచారణ జరుపుతున్నాం అని క్లారిటీ ఇచ్చారు.  

Politics

  • భూపాలపల్లి: ఫోన్ల ట్యాపింగ్‌తో బ్లాక్‌ మెయిల్‌ చేసి వేల కోట్లు సంపాదించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఫోన్ల ట్యాపింగ్‌ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్‌ఎస్‌కు బీజేపీకి సహకరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ,  బీఆర్‌ఎస్‌లు రెండూ బొమ్మ-బొరుసు లాంటి పార్టీలని మండిపడ్డారు. ఇక భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తలపై సీఎం రేవంత్‌ స్పందించారు. 

    భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మారింది. కాంగ్రెస్‌ అభివృద్ధితోనే భూపాలపల్లి ఈ స్థాయికి చేరింది. భూపాలపల్లి ఎక్కడికి పోదు.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. మరొకవైపు మెడికల్‌ బోర్డు రద్దు అవుతుందనే విషం ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెడికల్‌ బోర్డు రద్దు ఆలోచన ప్రభుత్వ దృష్టిలో లేదు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. 

     

     

     

  • గుంటూరు:  పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పటం దారుణమన్నారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత.  సీబీఐ తన చార్జ్‌షీట్లో తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందని, అయినా కూటమి నేతలకు ఇంకా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు సుచరిత.

    ‘మొన్నటి వరకు జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో ఉందని విష ప్రచారం చేశారు. సిపిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాత్రూములు కడిగే హార్పిక్ ను లడ్డు తయారీలో ఉపయోగించారంటూ మరో విషపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వామి వారి లడ్డు ప్రసాదం పై విష  ప్రచారం చేసిన వారికి త్వరలోనే దేవుడు గుణపాఠం చెప్తాడు’ అని హెచ్చరించారు.

    ఒక పథకం ప్రకారం విష ప్రచారం..
    తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక పథకం ప్రకారం విష ప్రచారం చేశారని  వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ‘ తిరుమల లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని నిజాన్ని సిబిఐ  బయటపెట్టినా తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లను దహనం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

     

     

  • నల్లగొండ: గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఎస్సీ, బీసీ, రైతు, యువ డిక్లరేషన్లు ఏమయ్యాయని, ఆరోగ్యశ్రీ బకాయిలు,  రీయింబర్స్‌మెంట్‌, రైతు భరోసా రావడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ బహిరంగ సభలో రాంచందర్‌రావు ప్రసంగించారు. 

    ‘రేవంత్ రెడ్డి పేరు రేవంతొద్దీన్.  దేవాలయాలను, హిందూ దేవుళ్లను కాంగ్రెస్ అవమానిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోంది. బీఆర్ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే. బీఆర్‌ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే గెలిచినవాళ్లు పార్టీలు మారరు. జీతాలు ఇవ్వడానికి నిదులు లేవని రేవంత్‌ అంటున్నారు. జీతాలు, ఫించన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తావ్‌ రేవంత్‌.

    జనాలపై పన్నుల భారం పెంచబోతున్నారు‌. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి లేదు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ జెండా ఎగరబోతోంది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచినీటి సరఫరా, రోడ్లు సరిగా లేవు. నల్లగొండను స్మార్ట్ సిటీ చేస్తాం. కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది’ అని స్పష్టం చేశారు.

  • వరంగల్ :  కాంగ్రెస్‌పై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.   కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్‌ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒక తప్పు ఓటు వేసినందుకు రెండేళ్లుగా గోస పడుతున్నామని మరొకసారి ఆ తప్పు చేయొద్దన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్‌ ప్రసంగించారు. 

    ‘మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్ని దొంగ హామీలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆడవాళ్ల మెడలో పుస్తెల తాడు దొంగతనం చేసే దండుపాళ్యం బ్యాచ్. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’ అని ప్రజల్ని కోరారు.

  • హైదరాబాద్‌ :  సుమారు మూడు నెలల క్రితం, అంటే జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల సమయంలో మహ్మద్‌ అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మంత్రి పదవిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు విమర్శల వర్షం కురిపించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం బాగానే ఉన్నా, ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చి 3 నెలలైంది. ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి పోతుంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నినందుకే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కింది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌రావు. 

    అజారుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని ఆయన 31 అక్టోబర్ 2025న స్వీకరించారు. అదేవిధంగా, ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతున్నారు .  అయితే ఎమ్మెల్సీగా లేరు.  అంటే, ప్రస్తుతం ఆయనకు ఉన్న పదవి రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా లేరు. రాష్ట్ర మంత్రిగా ఉండాలంటే అటు  ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీ కానీ ఉండాలి. ఇదే విషయాన్ని ప్రశ్నించారు హరీష్‌రావు. 

  • సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. 

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు‌.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్‌ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్‌ చేశారు. 
     

  • తిరుపతి:  ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు.  ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలోని పదవుల కేటాయింపులపై వ్యంగ్యంగా స్పందించారు.  ‘ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది. పాలన కమ్మగా ఉంది అంటే అందరికీ అర్థమై ఉంటుంది. 

    1983లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి పాలన కమ్మగానే ఉందని చెప్పారు. అదే విషయాన్ని మళ్లీ నేను చెబుతున్నా. ఎన్టీఆర్‌ పాలనపై గజ్జల మల్లారెడ్డి చెప్పిందే నేను చెబుతున్నా. కూటమి పాలన ఇంకా కమ్మగానే ఉంది. ఒక కులం కాకుండా.. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమ్మతో పాటు అందరం ఉన్నాం. కులాలకు సంబంధంలేకుండా అందరినీ సమానంగా చూడాలి. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదు. కూటమిలో బీజేపీనే ప్రధానం..ఆ తర్వాతే టీడీపీ, జనసేన’ అంటూ వ్యాఖ్యానించారు. 

     

  • సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్‌ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.

    సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని  అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి ‌తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్‌ జగన్‌కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్‌ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. 

  • సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. సీబీఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా? అని ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

    మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘లడ్డూ విషయమై చంద్రబాబులో ప్రాయశ్చిత్తం కనపడటం లేదు. చంద్రబాబులో తప్పు చేశామన్న బాధ అసలే లేదు. సిగ్గూ, శరం, భయం భక్తి లేకుండా మాట్లాడుతున్నారు. సీబీఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. రోజా, జోగి రమేష్ మాట్లాడిన మాటల వీడియోని ఎల్లో మీడియా తప్పుగా ఎడిట్ చేసింది. కట్, పేస్ట్ వీడియోని ప్రసారం చేసి శునకానందం పొందారు. లడ్డూ ఇష్యూ మీద సంవత్సరం పైగా విచారణ జరిగింది. ఆ సిట్‌లో ఉన్నది చంద్రబాబు మనుషులే.

    చివరికి లడ్డూలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ వాడారని కూడా విష ప్రచారం చేస్తున్నారు. అలాంటి యాసిడ్స్‌ని స్వీటులో కలుపుకుని బీఆర్ నాయుడు తినగలరా?. టీటీడీ చైర్మన్ నాయుడు అత్యంత అసమర్థుడు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా చేసి తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. బీఆర్ నాయుడు తన టీవీ ద్వారా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు. బీఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులే ఆలయాలపై దాడులు చేయిస్తున్నారు. చెప్పులు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు హిందువని చెప్పుకోవటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ సనాతని అని ఎంత చెప్పుకున్నా జనం నమ్మటం ఎప్పుడో మానేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

International

  • భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్‌కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్‌ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్‌కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్‌ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.

    రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్‌కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్‌ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు  రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో ‍అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.

    అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్‌పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్‌ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది.  భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.

    ఇదిలా ఉండగా రష్యా పాక్‌తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్‌ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్‌ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు.  కాగా ఇప్పుడు రష్యా పాక్‌తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.

    పుతిన్ మెసేజ్‌లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్‌లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్‌తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. 

    అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • ఢాకా: కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్న బంగ్లాదేశ్‌లో విషాదం అలముకుంది. సీనియర్ నేత, అవామీ లీగ్ మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ (86) కన్నుమూశారు. దినాజ్‌పూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు ఆయనను దినాజ్‌పూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

    ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో రమేష్ చంద్ర సేన్ మృతి ప్రాధాన్యత సంతరించుకుంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌లో కీలక నేతగా ఉన్న రమేష్ చంద్ర సేన్, గతంలో నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 17న ఆయనను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి దినాజ్‌పూర్ జైలులో ‘డివిజన్ ప్రిజనర్’గా ఉంచారు. జైలుకు తరలించక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో ఉన్నారని, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారని జైలు సూపరింటెండెంట్ ఫర్హాద్ సర్కార్ పేర్కొన్నారు.

    1940 ఏప్రిల్ 30న ఠాకూర్ గావ్ జిల్లాలో జన్మించిన రమేష్ చంద్ర సేన్, అవామీ లీగ్ పార్టీలో అనుభవజ్ఞుడైన నేతగా పేరుపొందారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1997లో ఉపఎన్నిక ద్వారా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 2008, 2014, 2018, 2024 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. షేక్ హసీనా ప్రభుత్వంలో 2009 నుండి 2014 వరకు మంత్రిగా సేవలు అందించడమే కాకుండా, పార్టీ సలహాదారుగా కూడా వ్యవహరించారు.

    బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత జరుగుతున్న ఈ సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షణలో ఫిబ్రవరి 12న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే వెలువడిన పలు సర్వేల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఈ ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇటువంటి తరుణంలో అవామీ లీగ్ సీనియర్ నేత మృతిచెందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచింది.

    ఇది కూడా చదవండి: ‘ఎప్‌స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..

Crime

  • బెంగళూరు: వాళ్లిద్దరూ ప్రేమికులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో ప్రేమికుల రోజుని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం అబ్బాయి.. తన ప్రియురాలి కోసం ఖరీదైన గిఫ్ట్‌లు సైతం కొనుగోలు చేశాడు. కానీ అనూహ్యంగా అమ్మాయి వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదుర్చుకుంది. ‘త్వరలోనే నా పెళ్లి. నా పెళ్లికి నువ్వు రావాలి. ఇదిగో చూడు నా పెళ్లి నగలు, పెళ్లి చీర చూపించింది. ఆ పెళ్లి చీర చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరులో కిరణ్‌ అనే యువకుడు బిల్డర్‌,జిమ్‌ ట్రైనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కిరణ్‌..ఓ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నారు.

    ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. ఆ యువతి మరో యువకుడితో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ విషయం తెలిసిన కిరణ్‌కు గుండె పగిలింది. తానెంతో గాఢంగా ప్రేమిస్తున్న యువతి మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుందని తెలిసి తట్టుకోలేకపోయాడు. గత రెండు వారాలుగా మనిషి మనిషిలా లేడు. ఉల్లాసంగా,ఉత్సాహం ఉండే కిరణ్‌లో డిప్రెషన్‌ పెరిగింది.

    ఈ క్రమంలో శనివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఆత్మహత్యకు ముందు పేపర్‌,పెన్ను కావాలని తల్లిని అడగ్గా.. ఎందుకు అని అనుమానంగా అడిగింది. ఆర్ధిక వివరాలు రాయాలని,పెన్ను,పేపర్‌ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఇంటి గదిలోకి వెళ్లి సూసైడ్‌ లెటర్‌ రాశాడు. ప్రాణం తీసుకున్నాడు. గదిలోకి వెళ్లిన కిరణ్‌ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.

    డోర్లు బలవంతంగా ఓపెన్‌ చేసి చూడగా.. తాడుకు వేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సూసైడ్‌ నోటీను స్వాధీనం చేసుకున్నారు.

    అందులో తన చావుకు తాను ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యువతిని గాఢంగా ప్రేమిస్తున్నానని, ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తనని సైతం పెళ్లికి  రావాలని, ఇందుకోసం కొనుగోలు చేసిన నగదు,దుస్తులు కిరణ్‌కి చూపించడంతో తట్టుకోలేని ప్రాణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 

Family

  • మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా  నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్‌ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..

    భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్‌ మహిళ షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. 

    అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)

  • ఆల్కహాల్‌తో ఫ్యాటీలివర్‌ ముప్పు ఉందన్న విషయం తెలిసిందే. అయితే  నిత్యం తాగేవారిలోనే ఈ ఫ్యాటీ లివర్‌ ముప్పు ఎక్కువ అనే అ΄ోహ గతంలో ఉండేది. తాజా తార్కాణాలూ, అనేక అధ్యయనాల ప్రకారం ఎప్పుడో ఒకసారి (అకేషనల్‌గా) తాగేవారికీ ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని తెలుస్తోంది. దీనికి తోడు మగవాళ్లకు దీటుగా తాము ఆల్కహాల్‌కు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మహిళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువ అంటూ పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. సోషల్‌ డ్రింకింగ్, వీకెండ్‌ కాక్‌టెయిల్‌ పార్టీస్‌ అంటూనో లేదా ఇంట్లోనైనా ఎప్పుడో ఒకసారి అంటూ తాగేవారికి సైతం ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేమిటో చూద్దాం...

    చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. అదేమిటంటే... చాలా కొద్దిమోతాదులో అంటే ప్రతిరోజూ 30 మి.లీ.కు మించకుండా ఆల్కహాల్‌... అందులోనూ రెడ్‌వైన్‌ తీసుకునేవారిలో గుండెజబ్బులు నివారితమవుతాయనీ, రక్తనాళాల్లోని కొవ్వు కొట్టుకు΄ోతుందనీ, అంత తక్కువ మోతాదులో ఆల్కహాల్‌ తీసుకుంటే అది  ఫ్యాటీలివర్‌కు దారితీయదనీ... ఇలాంటి అ΄ోహలు ఎక్కువే ఉన్నాయి. అవన్నీ వాస్తవం కాదంటూ ఇటీవలి అనేక అధ్యయనాల్లో తేలింది. 

    ఆల్కహాల్‌ ఎంత తక్కువ మోతాదులో తాగినా... అది కూడా చాలా అడపాదడపా(అకేషనల్‌గా)   తీసుకున్నప్పటికీ ఫ్యాటీలివర్‌ ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఇటీవలే మన దేశంలోని మహిళలూ ఆల్కహాల్‌కు దగ్గరవుతున్న నేపథ్యంలో వాళ్లలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఫ్యాటీలివర్‌ అంటే?
    మన రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి కోసం రక్తంలోని చక్కెర ఉపయోగపడుతుంది. అటు తర్వాత మిగతా చక్కెర కొవ్వురూపంలో కాలేయంలో నిల్వ అవుతుంటుంది. ఒకవేళ మనం తీసుకున్న ఆహారం కంటే మన రోజువారీ కార్యకలాపాలు తగ్గుతూ పోతున్న కొద్దీ ఈ కొవ్వు నిల్వలు అలా పేరుకుపోతూ ఉండటంతో పాటు కాలేయ కణాలూ కొవ్వు కణాల్లా మారుతూ ఉంటాయి. ఇలా కాలేయ కణాల్లో కొవ్వు మోతాదులు పెరుగుతూ పోవడాన్ని ‘ఫ్యాటీ లివర్‌’ అంటారు. 

    ఇందుకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతాయి. అందులో మొదటిది ఆల్కహాల్‌ వినియోగం. రెండోది ఆల్కహాల్‌ కాకుండా ఇతరత్రా అంశాలు ఫ్యాటీలివర్‌కు కారణం కావడం. ఈ కారణాలను బట్టి ఫ్యాటీలివర్‌లోని రకాలివి... 

    ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ (ఏఎఫ్‌ఎల్‌డీ) : ఆల్కహాల్‌ వినియోగం వల్ల కాలేయంలో కొవ్వు చేరి ‘ఫ్యాటీలివర్‌’కు దారితీయడం. 

    నాన్‌ ఆల్కహాలివ్‌ ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) :  దీనికి ఆల్కహాలిక్‌ ప్రధాన కారణం కాదు. అయితే జీవక్రియల తేడా కారణంగా వచ్చే వ్యాధులు (మెటబాలిక్‌ సిండ్రోమ్స్‌), స్థూలకాయం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి కారణాల వల్ల ఈ ఫ్యాటీలివర్‌ సమస్య వస్తుంది.

    నిర్ధారణ 

    బాధితుల స్థూలకాయం, పొట్ట (సెంట్రల్‌ ఒబేసిటీ) చూసి డాక్టర్లు పరిస్థితిని కొంత తెలుసుకోగలరు. 

    కొన్ని రక్తపరీక్షలు, వాటితోపాటు డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ మోతాదులు, ట్రైగ్లిజరైడ్‌ స్థాయులు పెరిగాయా అన్నది చూడాలి. 

    అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌లో ఫ్యాటీలివర్‌ కండిషన్‌ బయటపడుతుంది. 

    కొందరిలో లివర్‌ బయాప్సీ (అంటే కాలేయం తాలూకు చిన్న ముక్కను సేకరించి చేసే) పరీక్ష అవసరం. లివర్‌ బయాప్సీతో ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీలో అది నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ (ఎన్‌ఏఎఎఫ్‌ఎల్‌) కండిషనా, లేక నాన్‌ ఆల్కహాలిక్‌ స్టియటో–హెపాటిక్‌ (నాశ్‌) కండిషనా అన్నది నిర్ధారణ చేయవచ్చు. 

    ఇప్పుడు ‘ఫైబ్రోస్కాన్‌’ అనే వైద్యపరీక్ష ద్వారా లివర్‌లో ఏ మేరకు కొవ్వు పేరుకుంది, ఫైబ్రోసిస్‌ ఎంత ఉందన్న విషయంతో పాటు, మూడు నెలల తర్వాత మళ్లీ సమీక్షించి, కొవ్వు మోతాదులు పెరిగాయా, తగ్గాయా కూడా తెలుసుకోవచ్చు.  

    మహిళల్లో మరింత ఎక్కువ ముప్పు ఎందుకంటే... 
    ఆల్కహాలిక్‌ ఫాటీలివర్‌ ముప్పు మహిళల్లో మరింత ఎక్కువ. ఎందుకంటే వీళ్లలో పురుషులతో ΄ోలిస్తే వాళ్ల కాలేయం సైజు తక్కువ. అలాగే వాళ్ల ఒంట్లోని నీటి మోతాదులు కూడా తక్కువే. ఇక మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్‌ కారణంగా ఆల్కహాల్‌ వాళ్ల రక్తంలో చాలా ఎక్కువగా గాఢతతో చాలాసేపు ఉంటుంది. అలా అరుదుగానే అప్పుడప్పుడూ తాగినా ఆ ఇంటర్‌మిట్టెంట్‌ ఆల్కహాల్‌ వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ పెరగడం, కొవ్వులు పేరుకుపోవడంతో పాటు ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ కూడా పెరుగుతుందని ఈ అంశాలన్నీ మహిళల్లో ఫ్యాటీలివర్‌ను పెంచడంతోపాటు లివర్‌ ఫైబ్రోసిస్‌ ముప్పునూ చాలా ఎక్కువగా పెంచేస్తాయి. 

    అందుకే 20 – 35 ఏళ్లున్న మహిళల్లో వాళ్ల ఆల్కహాల్‌ తీసుకునే మోతాదు ఎంత తక్కువైనప్పటికీ లివర్‌ ఫైబ్రోసిస్‌ రేటు చాలా పెరిగి΄ోతోంది. అందుకే పురుషులూ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లలో ΄ోలిస్తే మహిళలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆల్కహాల్‌ దుష్ప్రభావాలు మహిళల్లో కేవలం కాలేయాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ల రుతుక్రమం దెబ్బతినడం, హార్మోనల్‌ బ్యాలెన్స్‌ అతలా కుతలం కావడం, సంతానలేమి వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు.

    లక్షణాలు 

    • ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌లో పొట్ట బాగా పెరిగిపోతుంటుంది. 

    • ఆల్కహాలిక్‌ లివర్‌ డిసీజ్‌లో ఇలా కొద్దిమేరకు లక్షణాలు కనిపించవచ్చేమోగానీ...

    • నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌లో చాలావరకు లక్షణాలు కనిపించవు.

    • అయితే కొన్ని అంశాలు నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీలివర్‌ను సూచిస్తాయి. 
      ఉదాహరణకు వీళ్లలోనూ పొట్ట బాగా పెరిగి, సెంట్రల్‌ ఒబేసిటీతో ముందుకు వచ్చి కనిపిస్తుంది. ∙ కొద్దిమందిలో కుడివైపు పొట్ట పైభాగంలో (ఉరఃపంజరం / రిబ్‌కేజ్‌ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. 

    • క్రమంగా కాలేయం పెరుగుతుండటం వల్ల ఇలా జరుగుతుంటుంది.  

    నివారణ / చికిత్స

    ఆల్కహాల్‌ అలవాటును పూర్తిగా మానేయడం. 

    డైట్‌ : ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం. ఇందులో చక్కెర, కొవ్వుల మోతాదులను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, షుగర్‌–స్వీటెన్‌డ్‌ డ్రింక్స్‌ వంటి కూల్‌డ్రింక్స్‌ దూరంగా ఉండటం. అలాగే పొట్టుతో ఉండే ధాన్యాలూ (హోల్‌గ్రెయిన్స్‌), తాజా పండ్లు, కూరగాయల వంటి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం. 

    వ్యాయామం : రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. దేహానికి వారంలో కనీసం 150 నిమిషాల వ్యాయామాన్ని ఇవ్వడం. 

    నివారణ నియమాలు పాటించడంతో పాటు ఫ్యాటీ లివర్‌ దశను బట్టి డాక్టర్లు సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. 

    పైన పేర్కొన్న జాగ్రత్తలతోపాటు క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు (అల్ట్రా సౌండ్, మెటబాలిక్‌ మార్కర్‌ పరీక్షలు) చేయించుకుంటూ ఉండటం. 

    చివరగా... సోషల్‌ డ్రింకింగ్‌ లేదా వీకెండ్‌ పార్టీస్‌ అంటూ పార్టీ కల్చర్‌ పేరిట పరిమితంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల దేహానికి అత్యంత కీలకమైన భాగమైన కాలేయంపై పడే దుష్ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, ఈ అవగాహనను అందరిలోనూ కల్పించడం అన్నది ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతైన అవసరమని గుర్తించాలి. 
    డాక్టర్‌ పవన్‌ కె. అడ్డాల, సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో  ఎంటరాలజిస్ట్‌ 

    (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!)

  • వెయిట్‌లాస్‌ కోసం ఎన్నో రకాల డైట్‌లు ఫాలో అవుతుంటాం. కానీ కొందరు సంప్రదాయ ఆహారాన్ని తింటూనే స్లిమ్‌గా మారతారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ ఫిట్‌నెస్‌కోచ్‌ కాగివన్‌ ప్రభాహరణ్‌. అమ్మలాంటి సాంప్రదాయ వంట తింటూనే బరువు తగ్గొచ్చని అంటున్నారు. తాను ఒకప్పుడు అధిక బరువుతో బానలాంటి పొట్టతో ఉండేవాడినని..కానీ ఇప్పుడు సిక్స్‌ప్యాక్‌ శరీరంతో స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అయితే రైస్‌కి దూరంగా ఉండలేదని..సంప్రదాయ వంటను ఆస్వాదిస్తూనే వెయిట్‌లాస్‌ అయ్యినట్లు తెలిపాడు. అందుకోసం డైట్‌ ఎలా ఫాలో అవ్వాలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివరించాడు.

    తమిళులు చాలామంది సిక్స్‌ ప్యాక్‌ కోసం డైట్‌ వేరుగా ఉంటుందని భావిస్తారు. కానీ తాను తమిళ వారసత్వంలో పాతుకుపోయిన పప్పు వంటి వంటకాలను తింటూనే బరువు తగ్గానని అంటున్నాడు. వాటిని తీసుకుంటూనే సిక్స్‌ ప్యాక్‌ సాధించానని చెబుతున్నాడు. అమ్మలాంటి సంప్రదాయ వంటకాన్ని, రుచిని వదులుకుని వెయిట్‌లాస్‌ అవ్వాల్సిన పనిలేదని, కేవలం స్మార్ట్‌గా తింటే చాలట. 

    వాస్తవానికి తమిళ భోజనాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ప్రోటీన్‌ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. అందువల్ల అధిక కేలరీలు తీసుకోకుండానే శక్తిని ఇచ్చే వాటిని తీసుకునేవాడినని వీడియోలో తెలిపాడు.   

    ఆ మూడు తప్పనిసరి..
    సంతృప్తికరమైన భోజనం ఆస్వాదిస్తూనే బరువు తగ్గేందుకు ఈ మూడు మార్పులు చాలా హెల్ప్‌​ అయ్యాయని చెబుతున్నాడు. మొదటి ప్లేట్‌లో అన్నాన్ని తక్కువ పరిమాణంలో పెట్టుకోవడం. ఎందుకంటే కొలస్ట్రాల్‌ కరిగేలా..కండరాలను నిర్మించడానికి కార్మోహైడ్రేట్లు అవసరం అందువల్ల ఇలా తీసుకున్నట్లు తెలిపారు. రెండోది సాంప్రదాయ తమిళ ఆహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ల నిమిత్తం..చికెన్‌, చేపలు, గ్రీకు పెరుగు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. 

    ఇక మూడోది..వీటితోపాటు ఫైబర్‌ కోసం ఆకుకూరలను కూడా చేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే ఫిట్‌నెస్‌ ప్రపంచంలో తెల్లబియ్యాన్ని దగ్గరకు రానీయరు, కానీ ఇది వెయిట్‌లాస్‌కి అడ్డంకి కాదని అన్నారు. ముఖ్యంగా వర్కౌట్ల సమయంలో కండరాలకు ఇంధనంలా  ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల బియ్యం తక్కువగా ఉన్నా..కడుపు నిండిన అనుభూతి మిస్‌ చేసుకోవాల్సిన పని ఉండదని చెబుతున్నారు. ఎప్పుడైనా నచ్చిన ఆహారం ఆస్వాదిస్తూనే..తెలివిగా కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకుంటే వెయిట్‌లాస్‌ అవుతామని చెబుతున్నాడు కాగివన్‌

     

    (చదవండి: శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!)

     

  • వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్‌కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండటాన్ని ‘టాక్సిక్‌ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్‌’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్‌ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.

    మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్‌ యాంగ్‌’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.

    జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్‌ యాటిట్యూడ్‌ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.

    హద్దుల్లేని ఆశావాదం
    ఒక విద్యార్థి యావరేజ్‌ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్‌ యాటిట్యూడ్‌ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్‌ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్‌ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. 

    మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్‌ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్‌ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్‌గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. 

    ఆరు రుచులు... అన్ని భావాలు
    ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. 

    అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్‌ బారిన పడుతున్నారంటున్నారు.

    పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా?
    ఇదంతా విన్నాక ‘పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. 

    కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఆనందం శాశ్వతం కాదు...
    పాజిటివ్‌ థింకింగ్‌లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్‌ థింకింగ్‌ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. 

    ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. 

    నిర్వహణ: యాసీన్‌

    (చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు)

  • కరాచీలోని ఇస్లామిక్‌ యూనివర్సిటీ జామియా ఉలూమ్‌–ఉల్‌–ఇస్లామియా నుంచి జీహాదీ గ్రూప్‌ హర్కత్‌ ఉల్‌ అన్సారీలోకి వెళ్లిన ముహమ్మద్‌ మసూద్‌ అజర్‌ అల్వీ చివరకు హర్కత్‌ ఉల్‌ ముజాహిదీన్‌లో (హెచ్‌యూఎం) చేరాడు. హర్కత్‌–ఉల్‌–జిహాద్‌ అల్‌–ఇస్లామీ, హర్కత్‌–ఉల్‌– ముజాహిదీన్‌ గ్రూపుల మధ్య తారస్థాయికి చేరిన విభేదాలను సెటిల్‌ చేయడానికి 1994లో భారత్‌ వచ్చి పట్టుబడ్డాడు. అజర్‌తో పాటు అతడిని విడిపించడానికి ప్రయత్నించిన అహ్మద్‌ ఒమర్‌ సయీద్‌ షేక్, శ్రీనగర్‌లో చిక్కిన మరో ఉగ్రవాది అహ్మద్‌ జర్గర్‌... ముగ్గురూ ఢిల్లీలోని తీహార్‌ జైలుకు చేరారు. అక్కడే వీరికి కిడ్నాపింగ్‌ గ్యాంగ్‌ నిర్వాహకుడు ఆఫ్తాబ్‌ అన్సారీతో పరిచయం ఏర్పడింది. ఇదే పార్థప్రతిమ్‌ రాయ్‌ బర్మన్‌ కిడ్నాప్‌కు కారణమైంది. ఇతడి కుటుంబీకుల నుంచి వసూలు చేసిన మొత్తం నుంచి రూ.కోటి అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరాయి. అదెలాగంటే?

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆఫ్తాబ్‌ అన్సారీ ముంబైలో ఉంటూ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్లతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకునే అన్సారీ కిడ్నాప్‌లు, స్మగ్లింగ్‌ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా బతికేవాడు. ప్రస్తుతం అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఉన్న అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీని సైతం అన్సారీ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. అప్పుడప్పుడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న గౌతమ్‌ అదానీ 1998 జనవరిలో తన స్నేహితుడు శాంతిలాల్‌ పటేల్‌తో కలిసి అహ్మదాబాద్‌లోని కర్ణావతి క్లబ్‌ నుంచి బయటకు వస్తుండగా, అన్సారీ ఆదేశాల మేరకు అక్కడే కాపు కాసిన అతడి అనుచరులు ఫజల్‌ ఉర్‌ రెహ్మాన్, భోగీలాల్‌ దర్జీ తుపాకీతో బెదిరించి కారులో అపహరించారు. వారి విడుదల కోసం రూ.15 కోట్లు డిమాండ్‌ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు సాయంత్రం అదానీ, పటేల్‌ ఇరువురూ విడుదలయ్యారు. ఇలాంటి ఎన్నో నేరాలు చేసిన అన్సారీ అప్పటి వరకు ఓ నేరగాడు మాత్రమే. కోల్‌కతాకు చెందిన ఆసిఫ్‌ రజా ఖాన్‌... అన్సారీ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించేవాడు. ఓ కేసులో ఢిల్లీ పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేయడంతో తీహార్‌ జైలుకు చేరారు. 

    ఆ జైలు అధికారులు అజర్, ఒమర్‌లతో పాటు అన్సారీ, ఆసిఫ్‌లను ఒకే హై సెక్యూరిటీ ప్రిజన్‌లో ఉంచారు. అన్సారీ గ్యాంగ్, అతడి కార్యకలాపాలు తెలుసుకున్న ఆ ఉగ్రద్వయం అతడితో పాటు ఆసిఫ్‌కు బ్రెయిన్‌ వాష్‌ చేసి, ఇకపై జీహాద్‌ కోసం నేరాలు చేసేలా ప్రేరేపించింది. ప్రతి నేరం నుంచి కొంత మొత్తం జీహాదీ కార్యకలాపాలకు విరాళం ఇచ్చేలా వారిని ఒప్పించింది. ఇదిలా ఉండగా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 814 విమానం 1999 డిసెంబర్‌ 24న నేపాల్‌ రాజధాని కఠ్మండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తూ హైజాక్‌ అయింది. ఇది తమ పనేనంటూ పాకిస్తాన్‌కు చెందిన హర్కతుల్‌ ముజాహిదీన్‌ ప్రకటించుకున్నా, కేవలం అజర్‌ కుటుంబీకులు, ఐఎస్‌ఐ మద్దతుతో చేశారని నిఘా వర్గాలు చెప్పుకున్నాయి. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ విమానాశ్రయంలో ఈ విమానాన్ని నిలిపిన ఉగ్రవాదులు భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, వారం రోజుల తర్వాత అజర్, జర్గర్, ఒమర్‌లను విడుదల చేయించారు. తనను విడిపించడంలో హర్కతుల్‌ ముజాహిదీన్‌ స్పందన నచ్చని అజర్‌ తానే సొంతంగా జైషే మహ్మద్‌ సంస్థను స్థాపించాడు.

    పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన  అజర్‌... అల్‌ కాయిదాలో చేరిన ఒమర్‌... అక్కడ ఉన్న అన్సారీ, అసిఫ్‌లతో సంబంధాలు కొనసాగించారు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఇక్కడ పలు నేరాలు చేయించారు. అందులో ఒకటే ఖాదిమ్స్‌ సంస్థ యజమాని, అప్పట్లో దానికి వైస్‌ చైర్మన్‌గా ఉన్న పార్థ ప్రతిమ్‌ రాయ్‌ బర్మన్‌ కిడ్నాప్‌. అమెరికాలో ఉన్న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న అల్‌ కాయిదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ దానికి అవసరమైన నిధులు సమీకరించే బాధ్యతలు అనేక మందికి అప్పగించాడు. ఆ ఫండ్‌ రైజర్స్‌లో ఒమర్‌ కూడా ఒకడు కావడంతో అన్సారీ, ఆసిఫ్‌ తెరపైకి వచ్చారు. అమెరికాలో భారీ ఆపరేషన్‌ చేయనున్నామని, అందుకు విరాళం కావాలంటూ ఒమర్‌ ఇచ్చిన ఆదేశాలతో అన్సారీ, ఆసిఫ్‌లు 2001 జూలై 25న బర్మన్‌ను కిడ్నాప్‌ చేశారు. 

    అప్పటికే దుబాయ్‌కి మకాం మార్చేసిన ఆఫ్తాబ్‌ అక్కడ నుంచే ఆసిఫ్‌ గ్యాంగ్‌తో కథ నడిపించాడు. బర్మన్‌ కోల్‌కతాలోని తిల్జాలాలో ఉన్న తన కంపెనీ గోదాముకు వెళ్తుండగా ఆసిఫ్‌ గ్యాంగ్‌ అపహరించింది. అతడిని విడుదల చేయడానికి రూ.5 కోట్లు డిమాండ్‌ చేయగా, రూ.3.75 కోట్లకు బేరం కుదిరింది. ఈ మొత్తం హవాలా ద్వారా హైదరాబాద్‌ చేరింది. ఇక్కడ నుంచి రూ.కోటి దుబాయ్‌ వెళ్లగా, మిగిలిన మొత్తం కోల్‌కతా చేరింది. దుబాయ్‌ వెళ్లిన రూ.కోటి అక్కడ నుంచి బెల్జియం మీదుగా అమెరికాలో ఉన్న అల్‌ కాయిదా అనుచరులకు అందింది. అమెరికాలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై 2001 సెప్టెంబర్‌ 11న జరిగిన ‘9/11 ఎటాక్స్‌’కు ఈ నగదు కూడా వినియోగించినట్లు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేన్‌ (ఎఫ్‌బీఐ) విచారణలో తేలింది. ఈ కారణంగానే బర్నన్‌ కిడ్నాప్‌ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా సాక్షిగా ఉన్నాడు. 

    ఐఎంగా ఏఆర్‌సీఎఫ్‌!
    (ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పూర్తిగా ఉగ్రవాద బాటపట్టిన ఆసిఫ్‌ రజా ఖాన్‌ 2002లో కోల్‌కతాలో ఉన్న అమెరికన్‌ కల్చరల్‌ సెంటర్‌పై దాడి చేశాడు. ఆపై రాజ్‌కోట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీనికి ప్రతీకారంగా ఆసిఫ్‌ సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌ ఏర్పాటు చేసిన ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) కాలక్రమంలో దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. అదెలా..? దీని ఘాతుకాలు ఏంటి? పార్ట్‌–3లో...)
     

  • ఆల్కహాల్‌ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నప్పటికీ...దాంతో ముప్పు తప్పదంటూ ఇటీవలి తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలా కొద్దిమోతాదులో  ఆల్కహాల్‌ తీసుకున్నప్పటికీ నోటిలోని చర్మపు పొరల్లో (బక్కల్‌ మ్యూకోజల్‌) కేన్సర్‌ వచ్చేందుకు అవకాశాలు చాలా బలంగా ఉంటాయని ఇటీవలి పరిశోధనల తాలూకు ఫలితాలను ‘బీఎమ్‌జే గ్లోబల్‌ హెల్త్‌’ జర్నల్‌ ప్రచురించింది. 

    ఆ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం రోజూ కేవలం తొమ్మిది గ్రాముల ఆల్కహాల్‌ తీసుకున్నా నోటి క్యాన్సర్‌ వచ్చే ముప్పు 50 శాతం పెరుగుతుందనీ, అయితే దీనికి తోడు పొగాకు నలమడం కూడా తోడైతే ఆ ముప్పు 62 శాతానికి చేరుకుంటుందని ఆ అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.

    అందరూ 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే...
    ఈ నోటి క్యాన్సర్లే వరకే తీసుకుంటే మన దేశంలో ప్రతి ఏడాదీ  1,43,759 కొత్త కేసులు నమోదువుతున్నాయి. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ క్యాన్సర్లతో 80,000 మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ క్యాన్సర్‌ బాధితులందరిలోనూ 45 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని తెలిసింది.

    ఇక విదేశీమద్యం నాణ్యమైనదనీ, అది తాగేవారిలో ఈ ముప్పు తక్కువని అనుకో డానికి వీల్లేదు. ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ తాగేవారికి దాదాపు 72 శాతం ముప్పు ఉంటే... అదే దేశీ మద్యం తాగేవారిలో క్యాన్సర్‌ ముప్పు 82 శాతానికి పెరుగుతుంది.

    (చదవండి: రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..)
     

  • శుక మహర్షి ఒకప్పుడు పరీక్షిత్తు మహారాజుకు మాఘ మహాత్మ్యాన్ని గురించి చెప్పిన కథను సూత మునీంద్రుడు శౌనకాదులకు చెప్పాడు. మాఘ మాసంలో చేసే స్నాన, దాన, వ్రతాదులు అత్యంత పుణ్యఫలాలను ఇస్తాయని చెబుతూ, అందుకు ఉదాహరణగా సువ్రతుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు: పూర్వం నర్మదాతీరంలోని సోమనాథం అనే అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సజ్జనులైన బ్రాహ్మణులు నిత్య వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రాలు చేస్తూ, యజ్ఞ యాగాదులు జరిపేవారు. నిత్యం వేదఘోషతో అలరారే ఆ అగ్రహారం సర్వసుభిక్షంగా తులతూగుతూ ఉండేది.

    ఆ అగ్రహారంలో సువ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేద వేదాంగాలను; జ్యోతిష తర్క మీమాంసాది శాస్త్రాలను; సంగీతం, శిల్ప, నృత్యాది చతుష్షష్టి కళలను సాంగోపాంగంగా నేర్చుకున్నవాడై, మంత్రశాస్త్రంలో నేర్పరి అయి ఉండేవాడు. ఇవే కాకుండా, తత్త్వ, యోగ శాస్త్రాలను అభ్యసించి, పద్నాలుగు దేశ భాషలలో మాట్లాడటం, చదవడం, రాయడంలో నైపుణ్యం కలిగి ఉండేవాడు.ఇన్ని విద్యలు నేర్చిన సువ్రతుడికి అంతులేని ధనాశ ఉండేది. నేర్చిన విద్యలన్నింటినీ ధనార్జన కోసమే వినియోగించేవాడు. యజ్ఞ యాగాది క్రతువులతో పాటు శుభాశుభ సందర్భాలలో కర్తలు ఇచ్చే గోదాన, హిరణ్య దానాదులు సహా తిలదాన, లవణదానాల వంటి అన్ని రకాల దానాలనూ స్వీకరించేవాడు. అలా విశేషంగా ధనం కూడబెట్టాడు. విశేషంగా వస్తు వాహనాలను సమకూర్చుకున్నాడు. 

    అంతటితో సంతృప్తి చెందక దానంగా స్వీకరించిన గోవులను అంగడిలో విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. మిగులు ధనాన్ని అవసరంలో ఉన్నవారికి అప్పులుగా ఇచ్చి, అక్రమంగా వడ్డీలు గుంజేవాడు. ఎంత సంపాదించినా, భార్యా పిల్లల కోసమైనా సక్రమంగా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను అనుభవించేవాడు కాదు. మితిమీరిన లోభంతో ఇలా లక్షలాది వరహాల ధనాన్ని పోగు చేశాడు.కాలక్రమేణా సువ్రతుడు వృద్ధుడయ్యాడు. కాళ్లు చేతులు పట్లు సడలి; కళ్లు కనిపించక, చెవులు వినిపించక శరీర యాతనతో రోజులు వెళ్లదీస్తూ ఉండేవాడు. అలాంటి దశలో కూడా తాను తినక, ఒకరికి పెట్టక కాలం గడప సాగాడు. సంపాదించి పోగు చేసిన ధనాన్ని ఎక్కడ దాచిపెట్టాడో కనీసం భార్యా కుమారులకైనా చెప్పేవాడు కాదు. 

    అగ్రహారంలో యజ్ఞయాగాదులు జరుగుతున్నట్లు తెలుసుకున్నప్పుడల్లా, శక్తిలేక మూలపడటం వల్ల అక్కడ తనకు దక్కాల్సిన దానాలు దక్కకుండా పోతున్నాయని బాధపడుతూ ఉండేవాడు.సువ్రతుడు మూలపడటం వల్ల కుటుంబ ఆదాయానికి గండిపడింది. ఇల్లు గడవడం కష్టమైంది. చివరకు అన్న వస్త్రాదులకు కూడా లోటు ఏర్పడే పరిస్థితులు దాపురించాయి. డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో చెప్పకుండా ఉన్నందుకు భార్య, కొడుకులు, కోడళ్లు సువ్రతుడిని నానా రకాలుగా నిందించేవారు. కనీసం ఇంటి ఖర్చుల మేరకైనా డబ్బు తీసి ఇమ్మంటే ఇచ్చేవాడు కాదు. పైగా, ‘మీరంతా దయ్యాల్లా దాపురించారు. నా ఇంటి నుంచి వెళ్లిపోండి’ అంటూ కుటుంబ సభ్యులందరినీ తిట్టిపోసేవాడు. 

    రోజులు గడిచే కొద్ది పరిస్థితులు గడ్డుగా మారుతుండటంతో సువ్రతుడు ధనం దాచిన చోటు కనిపెట్టాలని ఇంటిల్లిపాది కలసి ఇల్లంతా వెదికారు. చివరకు ఒక బోషాణంలో దాచిన డబ్బు కనిపించింది. ఇక ఆనాటి నుంచి సువ్రతుడి కుటుంబ సభ్యులు ఆ డబ్బును స్వేచ్ఛగా ఖర్చుపెడుతూ, ముప్పూటలా సుష్టుగా భోజనాలు చేస్తుండేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉంటే, ఒకనాటి రాత్రివేళ సువ్రతుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉన్నవాళ్లను తాళ్లతో కట్టేసి, ఇంట్లో ఉన్న డబ్బును, చేతికందిన విలువైన వస్తువులను దోచుకున్నారు. దొంగలు ఇల్లంతా దోచుకుంటూ ఉండటం చూసి సువ్రతుడు బిగ్గరగా రోదిస్తూ, సొమ్మసిల్లిపోయాడు. 

    తెల్లవారుతూ ఉండగా సువ్రతుడికి స్పృహ వచ్చింది. మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘ఎన్నో తుచ్ఛమైన దానాలు పట్టి ఎంతో ధనం సంపాదించాను. నేనూ తినలేదు, ఎవరికీ పెట్టలేదు. దానంగా స్వీకరించిన గోవును విక్రయించడం మహాపాపం. అయినా, దానంగా లభించిన ఎన్నో గోవులను అంగడిలో డబ్బుకు అమ్ముకున్నాను. దాన ధర్మాలకు ఖర్చు చేయని ధనం దొంగలపాలవుతుంది. నా కర్మ ఇలా కాలింది. ఎన్ని వేదాలు, ఎన్ని శాస్త్రాలు చదివినా ఫలమేమి? ధనాన్ని పోగు చేయాలనే లక్ష్యంతో దేవర్షి పితృతర్పణాలను కూడా ఏనాడూ సమర్పించలేదు. గురువులకు దక్షిణలివ్వలేదు.

     నా లోభత్వమే నన్నింతకు దిగజార్చింది. ఇప్పుడు ఏ పుణ్యకార్యం చేద్దామన్నా, ఉన్న డబ్బంతా దొంగలపాలైంది. ముదిమితో ఒంట్లోని జవసత్త్వాలు ఉడిగిపోయాయి. కశ్మీర దేశంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ పండితుల వద్ద మాఘపురాణం విన్నాను. మాఘస్నానం వల్ల పాపాలు తొలగిపోతాయి. ఈ స్థితిలో నేను చేయదగ్గ పని మాఘస్నానం మాత్రమే’ అనుకున్నాడు.కొడుకులను చేరబిలిచి, తాను చేసిన పాపాలన్నీ ఏకరువు పెట్టి, పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనను మాఘస్నానం కోసం నర్మదా తీరానికి తీసుకుపోవలసిందిగా కోరాడు. ‘మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’ అని మాఘపురాణం చెబుతోంది. మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారికి పాపాలు నశించి, స్వర్గప్రాప్తి కలుగుతుంది. 

    అందువల్ల నన్ను నర్మదా తీరానికి తీసుకువెళ్లండి’ అని కొడుకులకు చెప్పాడు.కొడుకుల సాయంతో నర్మదా తీరానికి చేరుకున్న సువ్రతుడు మాఘమాసంలో పదిరోజులు పవిత్ర స్నానం ఆచరించాడు. ఒకనాడు యథావిధిగా నర్మదానదిలో స్నానం ముగించుకుని, గట్టు మీదకు వచ్చి, దక్షిణముఖంగా పడుకుని గోవిందనామ స్మరణ చేస్తూ, ప్రాణాలు విడిచాడు. అతడి కుమారులు చూస్తుండగానే, దివ్యవిమానంలో దేవదూతలు అక్కడకు వచ్చారు. సువ్రతుడిని తీసుకుని వారు స్వర్గానికి బయలుదేరారు. మాఘస్నానం ఫలితంగా సువ్రతుడు స్వర్గప్రాప్తి పొందాడు.
    ∙సాంఖ్యాయన