Archive Page | Sakshi
Sakshi News home page

International

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేరు విన్నారా...? వినే ఉంటారు...? చూశారా అంటే అతికొద్ది మంది మాత్రమే చూసి ఉంటారు. ఇక కలిశారా? అని ప్రశ్నిస్తే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు..... అదేంటీ... ఓ దేశ అధ్యక్షుడు కొంతమందినే కలిశాడనడమేంటీ అని ఆశ్చర్య పోతున్నారా...? అవును మీరు విన్నది నిజమే. అతని చుట్టూ వలయంలా ఉండే భద్రతా సిబ్బందిని దాటి పుతిన్‌ను కలవాలంటే... మామూలు విషయం కాదు. అసలు అతనికున్న సెక్యూరిటీని ఛేదించి ముందుకు వెళ్లాలంటే... ఈగలు- దోమలకు కూడా ఆస్కారం లేదు. అంతటి రక్షణ వ్యవస్థతో కూడిన పుతిన్‌ సెక్యూరిటీతో పోలిస్తే ప్రపంచంలో మరే అధ్యక్షుడికి అంతటి సెక్యూరిటీ లేదనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడికి మించి ఉన్న అతని భద్రతా వలయం... అతని రక్షణ కోసం నిత్యం జరిగే కసరత్తుపై ఓ సారి ఫోకస్‌ చేద్దాం.

    వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలో ప్రముఖుల్లో ఒకరు. ఆయనకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన భద్రతా బలగాలు... కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. పటిష్ఠమైన భద్రతా వలయంలో ఉంటూ... అతనిపై ఈగ కూడా వాలనీయకుండా సిబ్బంది జాగ్రత్త పడుతుంటారు. దానికోసం నమ్మకస్తులైన అతని భద్రతా సిబ్బంది చేసే కసరత్తు... ఓ యంత్రంలా సాగుతుంటుంది. పుతిన్‌ విదేశాలకు వెళ్లినప్పుడు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది 5 వలయాల్లో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా... గుర్తించే యంత్రాంగం ఉంటుంది. చివరకు పుతిన్‌ మల మూత్రాలను కూడా రష్యా తిరిగి తీసుకెళ్తారు.

    విదేశాల్లో అక్కడి టాయిలెట్‌ వాడితే... వాటిని సేకరించి... అతని డీఎన్‌ఏను గుర్తించడం లేదా... పుతిన్‌కు ఉన్న రోగాల గురించి తెలుసుకునే ప్రమాదం ఉందని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది... అతని మల మూత్రాలను కూడా ఓ సూట్‌కేస్‌లో భద్రపరిచి రష్యాకు తీసుకొస్తారంటే... ఇక అతని సెక్యూరిటీ స్థాయిని గుర్తించవచ్చు. పుతిన్‌ సెక్యూరిటీ స్థాయి అమెరికా అధ్యక్షుడి సీక్రెట్ సర్వీస్ కన్నా మించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జనంతో అతి తక్కువగా కలిసే పుతిన్‌ దగ్గరికి కేవలం అతని కుటుంబీకులు, సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. మిగత వారు అతని వద్దకు రావడం అసాధ్యమే అని చెప్పవచ్చు. ప్రజలతో కాంటాక్ట్ చాలా పరిమితంగా ఉంటుంది. అతనికి దగ్గరగా రావడం దాదాపు అసాధ్యం.

    పుతిన్ భద్రతా వ్యవస్థను ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అనే ప్రత్యేక భద్రతా సంస్థ పర్యవేక్షిస్తుంది. భద్రతా సిబ్బందితో పాటు ఎలైట్ బాడీగార్డులు, ఇంటెలిజెన్స్ యూనిట్లు పుతిన్‌ భద్రతలో ఉంటాయి.

    పుతిన్‌ మస్కటీర్స్‌ పేరిట ఉన్న అతని బాడీగార్డులు ఎప్పుడూ అతని చుట్టూ ఓ కంచెలా ఉంటారు. శిక్షణ పొందిన అతని బాడీగార్డులు... అధునాతన ఆయుధాలు ధరించి ఉంటారు. పుతిన్ ఆరస్ సెనేట్ పేరుతో ఉన్న కారులో తిరుగుతారు. సెనేట్‌ కారు ప్రత్యేకంగా పుతిన్‌ అధికారిక వినియోగం కోసం తయారైంది. ట్విన్‌ టర్బో ఇంజిన్‌తో తయారైన కారు ఎంతో అధునాతనమైంది.

    లగ్జరీతో పాటు సెక్యూరిటీ... రష్యా తయారీ బ్రాండ్‌ కారునే పుతిన్‌ వాడుతారు. ఈ కారు ఆర్మర్-పియర్సింగ్ బుల్లెట్లతో...., గ్రనేడ్ దాడులను కూడా తట్టుకునేలా తయారైంది. భోజన విషయంలోనూ ఎంతో సెక్యూరిటీ ఉంటుంది. పుతిన్‌ కోసం తయారైన భోజనాన్ని తొలుత అతని బాడీగార్డులు రుచి చూస్తారు. ఆ తర్వాతనే పుతిన్‌కు వడ్డిస్తారు. ఫుడ్‌ తయారు చేసే షెఫ్‌లను కూడా తనిఖీలతో పాటు హైజీన్‌ చెక్‌లు ఉంటాయి.

    పుతిన్‌ అంతర్జాతీయ పర్యటనల సమయంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. పుతిన్ ఏ దేశం వెళ్లినా... స్థానిక భద్రతా బలగాలతో కలిపి ఐదు- అంచెల సెక్యూరిటీ గ్రిడ్ ఉంటుంది. వాటిలో స్నిపర్‌ టీమ్స్‌, ఏఐ ఆధారిత సర్వైలెన్స్ కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసినప్పుడు ఫ్లయింగ్‌ క్రెమ్లిన్‌ అనే ప్రత్యేక విమానం ద్వారా వెళ్తారు. అందులోనూ బాడీగార్డులు, ఎలైట్ సెక్యూరిటీ, అధికారులు, NSG కమాండోలు, టెక్నాలజీ AI ఆధారిత సర్వైలెన్స్, స్నిపర్ టీమ్స్ ఉంటాయి. అతని పర్యటన, షెడ్యూల్‌ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. విమానం కూడా యాంటీ మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌తో ఉంటుంది.

    దాంతో శత్రు క్షిపణులను గుర్తించి తప్పించుకునే టెక్నాలజీ ఆ విమానానికి ఉంది. రాడార్ - జామింగ్ టెక్నాలజీ ద్వారా శత్రువుల రాడార్‌లను తప్పుదోవ పట్టించే సాంకేతికత కూడా ఉంది. అందులో ఉన్న కమ్యూనికేషన్‌ సిస్టంతో.... యుద్ధ పరిస్థితుల్లో కూడా రష్యా సైన్యం... ప్రభుత్వంతో నిరంతర సంబంధాలు కలిగి ఉండేలా చర్యలున్నాయి. విమానం ద్వారానే ఎయిర్‌బోర్న్ కమాండ్ సెంటర్ – ఏర్పాటు చేసి అణు యుద్ధం జరిగినా అధ్యక్షుడు ఆకాశంలో నుంచే ఆదేశాలు ఇవ్వగల సాంకేతికత జోడించి ఉంది.  

    పుతిన్ భద్రతా వ్యవస్థలో అతని వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు ఎక్కడా లీక్‌ కాకుండా ఉండే విధంగా జాగ్రత్త పడతారు. విదేశీ ప్రయాణాల్లో ప్రత్యేక ప్రోటోకాల్స్‌ కూడా ఉంటాయి. విచిత్రమేమిటంటే... విదేశీ పర్యటనలో అతని బాడీగార్డుల వద్ద పూప్‌ సూట్‌కేస్‌ ఉంటుంది. ఆ సూట్‌కేస్‌ కూడా... పుతిన్.. ‌ విదేశీ పర్యటనల్లో ఉపయోగించే ఒక విచిత్రమైన భద్రతా ప్రోటోకాల్. అతని బాడీగార్డులు అతని శరీర వ్యర్థాలను మూత్రం, మలము సేకరించి వాటిని ప్రత్యేక సూట్‌కేస్‌లో రష్యాకు తీసుకెళ్తారు.

    దీని ఉద్దేశ్యం అతని ఆరోగ్య స్థితి, DNA వంటి గోప్యమైన సమాచారం విదేశీ గూఢచార సంస్థలకు చేరకుండా కాపాడటం. పుతిన్ ఎప్పుడూ విదేశాల్లో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించరు. అతని బాడీగార్డులు ప్రత్యేకంగా పూప్‌ సూట్‌కేస్‌లో సేకరించి రష్యాకు తీసుకెళ్తారు. ఈ ప్రోటోకాల్ అసాధారణంగా వినిపించినా, ఇది అత్యంత గట్టి భద్రతా వ్యూహంలో భాగమని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఇంతటి రక్షణ వ్యవస్థలో ఉన్న పుతిన్‌ సెక్యూరిటీని ఛేదించడం దాదాపు అసాధ్యమే.

  • మెక్సికోలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. ఇది గెరెరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ ప్రాంతం సమీపంలో  ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం మెక్సికో సిటీ వరకు చేరి, భవనాలు కంపించాయి, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి బలంగా కంపించింది. భూకంపం కారణంగా ఒకరు మృతిచెందగా.. 12 మంది గాయపడ్డట్లు మెక్సికో సిటీ ప్రభుత్వ అధిపతి క్లారా బ్రూగాడా తెలిపారు. 

    అధ్యక్షురాలు క్లౌడియా షైన్‌బామ్ తన ప్రత్యక్ష ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే భూకంప అలారం మోగడంతో బయటకు వెళ్లి, కొన్ని నిమిషాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి నివేదిక బయటకు రాలేదు. కాకపోతే భూకంప తీవ్రత ఎక్కువగానే  ఉందని స్థానికులు అంటున్నారు.

  • కాబూల్: వెంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందని సామెత ఇప్పుడు ఆఫ్గాన్ దేశంలోని క్షౌరకులుకు సరిగ్గా సరిపోతుంది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడడం ఏమోగాని అక్కడి క్షౌరకుల కుటుంబాలు జీవన ఆధారం లేక తల్లడిల్లిపోతున్నాయి.తాలిబన్ల చట్టం ప్రకారం పురుషులు గడ్డం తీసుకోవడం నేరం అని ఓకవేళ గడ్డాలు తీస్తే 15 నెలల దాకా జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఆదేశంలో ప్రస్తుతం హెయిర్‌ డ్రెస్సింగ్స్ పైనే ఆదారపడాల్సి వస్తుందని తెలిపారు

    తాలిబన్ల చట్టాన్ని ఒకవేళ ఎవరైనా మగవారి గడ్డం తీస్తే వారికి 15 నెలల జైలుశిక్ష వేయడంతో పాటు ఇతర కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో అక్కడి ప్రజలు గడ్డం తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు.అంతేకాకుండా ఇటీవల కొంతమంది యువకులు అక్కడ వెస్ట్రన్‌ హెయిర్‌ స్టైల్ చేసుకున్నారని ఆరోపణలతో వారిని తీవ్రంగా కొట్టారని ఆరోపణలున్నాయి. దీంతో అక్కడి హెయిర్‌డ్రెస్సర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

    కొంతమందైతే ప్రజల ఇళ్ల కెళ్లి పురుషులని కటింగ్ అయినా చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.2021లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంటి తమ జీవనోపాధి పెద్దఎత్తున దెబ్బతిందని అక్కడి క్షౌరకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

  • రియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రక్రియ మొదలైంది. కొత్త ప్రభుత్వం.. పాత బషర్ అల్-అసద్ చిత్రాలతో ఉన్న నోట్లను తొలగించి, వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్లతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ ప్రక్రియ 2026 జనవరి 1 నుండి ప్రారంభమైంది. దీన్ని గతేడాది చివరి మాసంలో అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. 

    ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై సిరియా షౌండేషన్‌ పునర్నిర్మించి.. రెండు సున్నాలు తొలగించారు. ఈ నోట్ల ముద్రణను రష్యా కాంట్రాక్ట్‌కు తీసుకుంది.  కొత్త నోట్లలో గోధుమ, నారింజలు, ఆలివ్, రోజాలు వంటి వ్యవసాయ చిహ్నాలు ఉన్నాయి. బషర్ అల్-అసద్ చిత్రాలను తొలగించి, కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా ఆధ్వర్యంలో నోట్లను విడుదల చేశారు.

    ఈ నోట్ల ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం చూరగొంటుందా అనే ప్రశ్న మాత్రం ఇంకా ఉంది. అయితే అంతర్జాతీయంగా ఈ కొత్త నోట్ల ముద్రణ తర్వాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ.. కొత్త కరెన్సీకి అంగీకారం ఎంతవరకూ లభిస్తుందనేది మరొక ప్రశ్నగా మారింది. అయితూ అసద్ చిత్రాలను తొలగించడం ద్వారా కొత్త ప్రభుత్వం ప్రజలకు కొత్త ఆరంభం సంకేతం ఇచ్చింది..

    మొత్తంగా, సిరియాలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఆర్థిక పునరుద్ధరణకు ఒక పెద్ద మైలురాయి అవుతుందని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, రాజకీయంగా కొత్త యుగానికి సంకేతమనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేస్తుంది. 

     

     

     

  • సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.

    2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.

    ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.

    బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.   

    2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి.

  • ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది.  ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అనుకూలంగా వీరు యూట్యూబ్‌లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ  ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది. 

    ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం,  సైన్యం.. ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది.   దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు,  సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర‍్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది. 

    కోర్టు  ఏం చెప్పింది?
    కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్‌లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని ,  విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది. 

    దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?
    కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు.

  • వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్‌ఫెక్ట్‌గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్స్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.

    డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో  అప్పట్లో అంతా సైలంట్‌ అయ్యారు.

    అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు.      

    వైట్‌హౌస్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్‌మిల్‌పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్‌గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని  వాల్‌ స్ట్రీట్స్ జనరల్‌కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

    ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.

  • బలూచిస్తాన్.. పాకిస్తాన్‌తో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలనేది వారి లక్ష్యం. ఇందుకోసం గత కొంతకాలంగా పాకిస్తాన్‌తో పోరాటం చేస్తునే ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనేది వారి డిమాండ్‌. గతంలో పాక్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయ ఎలాగైతే దేశంగా ఏర్పడిందో అదే తరహాలో బలూచిస్తాన్‌ కూడా పాక్‌ నుంచి వేరు కావాలని కోరుకుంటోంది. అందుకోసం అలుపెరగని పోరాటం సాగిస్తోంది. 

    అయితే  గతంలో భారత్‌ సాయం కోరిన బలూచిస్తాన్‌.. మరొకసారి భారత్‌ సాయం కోసం అభ్యర్థించింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత జరిగిన పరిణామాల్లో  భారత్‌ సైన్యం తమతో కలిస్తే పాక్‌ అంతు చూద్దాం’ అంటూ గతంలో కోరిన బలూచిస్తాన్‌.. ఇప్పుడు తమకు చైనా నుంచి ముప్పు ఉందని, ఆ క్రమంలోనే భారత్‌ తమకు సాయం అందించాలని వేడుకుంటోంది. 

    బలూచ్‌ అగ్రనేత మిర్‌ యార్‌ బలూచ్‌.. ఈ మేరకు భారత్‌కు లేఖ రాశారు. ప్రత్యేకంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే ‘ మాకు చైనా నుంచి ముప్పు ఉంది. కొన్ని నెలల్లో చైనా బలగాలను మా భూభాగంలో మోహరించే అవకాశం ఉంది. కొన్ని దశాబ్దాలుగా పాక్‌ నుంచి వేరపాటును కోరుకుంటున్నాం. పాక్‌తో కలిసి ఉండటం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుఉతుంది. అలాగే అవమానాలను సైతం ఎదుర్కొంటున్నాం. గతేడాది మే 25వ తేదీన మా జాతీయ నాయకత్వం పాక్‌ నుంచి విడిపోవాలని తీర్మానించింది. అందుకోసమే పోరాటం సాగిస్తున్నాం. ఈ ఏడాది బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడతుందని అనుకంటన్నాం. మాకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.

    ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రశంసలు
    అదే సమయంలో పాక్‌తో యుద్ధంలో భాగంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై సైతం బలూచిస్తాన్‌ నేత మీర్‌ ప్రశంసలు కురిపించారు. . పాక్‌ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అమోఘమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్‌.. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. మరొకవైపు వంద కోట్లకు పైగా జనాభా కల్గిన భారత్‌.. విశేషమైన ప్రగతి సాధించే దిశలో ఉందన్నారు. ఈ క్రమంలోనే భారత్‌కు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలియజేశారు. 
     

     

     

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్‌పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్‌ సోషల్‌ వేదికగా పేర్కొన్నారు.  

    ఇరాన్‌లో జెన్‌జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్‌లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు.  

    ఈ క్రమంలో ఇరాన్‌ తీరుపై ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

    2022 తర్వాత తొలిసారి ఇరాన్‌ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్‌లోని టెహ్రాన్‌తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
     

National

  • ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ మార్చినెలలోనే మొదలు కానుందా? కశ్మీరంలో మంచు కరిగి.. ఎండాకాలం మొదలవ్వగానే సైన్యం రంగంలోకి దిగి, ఉగ్రవాదుల పీచమణచనుందా?? ఈ దెబ్బతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు దబిడిదిబిడేనా?? ఈ ప్రశ్నలకు భారత వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకున్నా.. పీవోకేలో లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసుకుని, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న లష్కరే తాయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. అటు పీవోకేతోపాటు.. ఇటు జమ్మూకశ్మీర్‌లో పాగావేసుకున్న ఉగ్రవాదులు సైతం ఈ సమాచారంతో బెంబేలెత్తుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఉగ్రవాద సంస్థలు ఈ మేరకు సమాచారాన్ని అందిపుచ్చుకున్నాయి. రెండు పేజీల సందేశాన్ని ఉగ్రవాద సంస్థలు పరస్పరం అందిపుచ్చుకుంటున్నాయని, అందులో పాకిస్థాన్ నిఘా సంస్థ హెచ్చరికలను ఉటంకిస్తున్నాయని అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.


    ఈ పత్రిక ద్వారా ఉగ్రవాదులకు సైన్యం ఆపరేషన్, తదుపరి సన్నాహాల గురించి తెలియజేస్తున్నారు. 33 ఏళ్లుగా పరారీలో ఉన్న జహంగీర్ అనే ఉగ్రవాదితో ఇంటర్వ్యూ కూడా ఇందులో ఉంది.
    చొరబాట్ల ప్రణాళిక సిద్ధం, రాశారు- పరిస్థితికి సమాధానం ఇవ్వకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది ఉగ్రవాద సంస్థలు సందేశం ఇవ్వడానికి ZUV పేరుతో లేఖ పంపుతున్నాయి. ZUV అంటే - నా ఆత్మ యొక్క ఉనికి ద్వారా నా జీవితం ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ నెట్ వర్క్ తరపున పలుమార్లు ప్రకటనలు చేసి ఉగ్రవాద గ్రూపులకు పంపారు. ఈ ప్రకటనలలో ఒకటి 9 పేజీలు. దాని చివరి పేజీలో, భారత సైన్యం యొక్క సన్నద్ధత గురించి ప్రస్తావన ఉంది. నవంబర్ 10న జరిగిన ఢిల్లీ పేలుళ్లను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉన్న ఈ లేఖలు డిసెంబరు చివరి వారంలో విడుదలైనట్లు తెలుస్తోంది.

    ఢిల్లీ పేలుళ్ల తర్వాత..
    ఇటీవలి ఢిల్లీ పేలుళ్ల తర్వాత భారత బలగాలు అప్రమత్తమైనట్లు ఉగ్రవాద మూకలు గుర్తించాయి. దీంతో.. శీతాకాలం ముగిసేలోపే కశ్మీర్‌లో పాగా వేయాలని నిర్ణయించాయి. ఒకవేళ ఈ టాస్క్ తప్పితే.. మార్చిలో భారత సైన్యం ప్రారంభించే ‘ఆపరేషన్ సిందూర్ 2.0’తో ఇబ్బందులు తప్పవని ఆ లేఖలో హెచ్చరించాయి. ఈలోగానే తమతమ ఉగ్రవాద సంస్థల్లో జోరుగా రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని ఆ లేఖలో తీర్మానించాయి. ‘‘సైన్యం కార్యకలాపాలపై స్థానికులతో నిఘా పెంచాలి. సంస్థలతో సంబంధం లేకుండా.. భారత సైన్యం ప్రణాళికలను అడ్డుకోవాలి. ఢిల్లీ పేలుళ్లు, నౌగామ్‌లో పేలుడుతో పోలీసులు, భారత సైన్యం కసితో ఉన్నాయి. రాటిల్ పవర్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టాయి’’ అని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

    కాగా.. రాటిల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు అరెస్టు చేసిన మహమ్మద్ అమీస్ అలియాస్ జహంగీర్ సరూరీ 1992 నుంచి హిజ్బుల్ ముజాహిదీన్ కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతను పలు హత్య కేసుల్లో నిందితుడు. గతంలో ‘ద రివల్యూషన్ రీసర్జెన్స్’ అనే మ్యాగజైన్‌లో అతని ఇంటర్వ్యూ ప్రచురితమైనట్లు భారత భద్రతాబలగాలు గుర్తించాయి. ఆ ఇంటర్వ్యూలో జహంగీర్ తాను త్యాగం వైపు అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నాడు. 
     

  • అరుదైన భారతదేశపు అత్యంత  విషపూరిత సర్పం ఓ కెమెరాకు చిక్కింది. అయితే అది భయాందోళనలను కలగించడానికి బదులుగా వన్యప్రాణుల పట్ల ఆసక్తిని, ఆరాధనను పెంచేలా ఉండడం విశేషం.  ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ రాత్రి గస్తీ సమయంలో అత్యంత విషపూరితమైన బ్యాండేడ్‌ క్రైట్‌ (కట్లపాము)(Banded krait)ను చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఇది భారత దేశంలో అరుదుగా కనిపించే వన్యప్రాణుల వైవిధ్యభరిత వీక్షణ అవకాశాన్ని నెటిజన్స్‌కు అందించి, స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో వైరల్‌ గా మారింది.

    ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి  కాస్వాన్‌ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఆయనకు ఈ పొడవైన విషసర్పం ఎదురైంది. ఫుటేజ్‌లో పాము ఎక్కడా దూకుడును ప్రదర్శించలేదు. ఆ చీకటిలో బ్యాండేడ్‌ క్రైట్‌ ప్రశాంతంగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.   దాని ముదురు పసుపు  నలుపు చారలు స్పష్టంగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. కాస్వాన్‌ తన పోస్ట్‌లో స్పష్టమైన రూపాన్ని చారలను విలక్షణంగా వర్ణించారు. ఈ కట్లపాము భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి  అయినప్పటికీ, ఇది చూడడానికి కూడా అంతే అందమైన అద్భుతమైన రూపం కలిగి ఉండడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. బురద నీటిలో ఎదురీదుతూ  అది కదులుతున్నప్పుడు పాకుతున్న దాని వంటి మీది  చారలు స్పష్టంగా కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న గడ్డి పాము గుర్తులను మరింత హైలైట్‌ చేసింది. ఈ వీడియో చూసేవారిని కన్నార్పనీయకుండా చేస్తోంది.   

    నెటిజన్ల స్పందన...
    ఈ వీడియోను చూసిన తర్వాత దానిపై వచ్చిన రకరకాల స్పందనలు వన్యప్రాణుల పట్ల ఆసక్తికి అద్దం పట్టాయి. చాలా మంది వీక్షకులు పాము  రంగు ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. వారు దీనిని అపోస్మాటిజం (తమను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి, వాటికి  హెచ్చరిక సంకేతాలను అందించడం కోసం  ప్రకాశవంతమైన రంగులు ఉండడం) తాలూకు క్లాసిక్‌ కేస్‌గా వివరించారు. ఈ మనుగడ వ్యూహం  ప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తాయి.  ఆన్ లైన్ లో. వీక్షణకు వీలుగా  స్పష్టత  చాలా బాగుందని వినియోగదారులు ప్రశంసించారు. మరొక వీక్షకుడు ఆ చారల గుర్తులను రోడ్‌ డివైడర్‌లతో పోల్చారు. మొత్తంగా విజువల్స్‌ను  అద్భుతమైనవిగా వర్ణించారు.

    అటవీ అధికారుల విధి నిర్వహణపై అవగాహన
    వీడియో భారీ సంఖ్యలో  ప్రశంసలతో పాటు అనేక అంశాలపై చర్చను రేకెత్తించింది. సౌందర్యంతో పాటు అంతకు మించి ఈ క్లిప్‌ అటవీ అధికారుల కఠినమైన  విధులను హైలైట్‌ చేసింది. ప్రమాదకరమైన వన్యప్రాణుల మధ్య నిర్వహించే రాత్రి గస్తీని వీరు ఎంత సవాలుతో కూడిన పరిస్థితులలో నిర్వహిస్తారనేది కూడా వెల్లడించింది.  ఈ వీడియో రాత్రిపూట జీవవైవిధ్యాన్ని గుర్తు చేస్తుంది. వన్యప్రాణులు మానవ ప్రదేశాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా ఇది చూపించింది.

  • పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం వేడెక్కనుంది. ఈ ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ‍ప్రధాని మోదీ ఈ నెల 17న బెంగాల్‌లో పర్యటించనున్న‍ట్లు బీజేపీ ప్రకటించింది. అక్కడ మోదీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోంది. గతేడాది జరిగిన ప్రతి ఎ‍న్నికల్లో  కాషాయపార్టీ నేరుగానో లేక కూటమి ద్వారానో అధికారం సాధించింది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం అధికారం కాషాయానికి ఇప్పటికీ అందరి ద్రాక్షగానే ఉంది. గత ఎన్నికల్లో అధికారం సాధిస్తామని చెప్పుకున్నప్పటికీ ఆపార్టీ డబుల్ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది జరిగే ఎలక్షన్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోండగా మరోసారి గెలిచి కాషాయ పార్టీకి ఝలక్ ఇవ్వాలని తృణముల్ కాంగ్రెస్ భావిస్తోంది.

    ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల పశ్చిమ బెంగాల్‌లోని మాల్గాలో బహిరంగ ర్యాలీలో మోదీ పాల్గొననుట్లు బీజేపీ ప్రకటించింది. జనవరి 17న మాల్దాలో 18న హౌరాలో ర్యాలీలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపింది. ఈ కార్యక్రమంలో మోదీ హౌరా- గుహవతి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటు మరి కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. 

    ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ స్థానాలకు ఎ‍న్నికలు జరగనున్నాయి. దీంతో దేశంలో పొలిటికల్ హీట్ పెరగనుంది.

  • న్యూఢిల్లీ:  xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్ గ్రోక్ ను న్యూడ్‌ ఫోటోల వివాదం చుట్టుముట్టింది. గ్రోక్‌ను ఆసరాగా చేసుకుని  ఆకతాయిలు న్యూడ్‌ ఫోటోలు క్రియేట్‌ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రముఖుల ఫోటోలను న్యూడ్‌గా మారుస్తూ ప్రస్తుత సమాజానికి సవాల్‌ విసురుతున్నారు. ప్రైవేటు వ్యక్లుల ఫోటోలు ఇచ్చి న్యూడ్‌ పిక్స్‌గా ఇమ్మంట ప్రామ్టింగ్‌ చేస్తున్నారు 

    వీటిని సోషల్‌ మీడియలో వైరల్‌ చేస్తున్నారు. దాంతో అమాయిక మహిళలు, చిన్న పిల్లలు ఈ చర్యలకు బలైపోతున్నారు. దీనిపై కేంద్రానికి ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫిర్యాదు చేశారు. 

    Grok అనేది ఎలన్‌ మస్క్‌ స్థాపించిన  xAI సంస్థ రూపొందించిన AI అసిస్టెంట్. ఇది “truth-seeking AI”గా పిలవబడుతూ, రియల్‌టైమ్ సెర్చ్‌, రీజనింగ్‌, కోడింగ్‌, విజువల్‌ ప్రాసిసింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది. దీన్ని తప్పుదోవలో ఉపయోగిస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీని ఫలితంగా AI వినియోగంలో నైతికత, భద్రత అంశాలపై చర్చకు కారణమైంది. 

  • విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువు, అండగా నిలవాల్సిన స్నేహితులే, ఆమె పాలిట యమ కింకరుల య్యారు. వారి వేధింపులు తాళలేక ఒక అమ్మాయి మతిస్థిమితం కోల్పోయింది. చివరికి ప్రాణాలే కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి 19 ఏళ్ల యువతి విషాద గాథ ఇది.

    ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది పల్లవి. పల్లవిపై కాలేజీ లెక్చరర్, ముగ్గురు యువతులు ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు గత ఏడాది సెప్టెంబర్ 18న తన కుమార్తెపై అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్‌తో పాటు ముగ్గురు తోటి విద్యార్థులు లైంగిక వేధింపులకు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషాదం వెలుగులోకి వచ్చింది.

    ప్రొఫెసర్‌తోపాటు, హర్షిత, అకృతి, కొమోలికా అనే ముగ్గురు విద్యార్థినిలు తన కుమార్తెపై దారుణమైన ర్యాగింగ్‌కు పాల్పడ్డారని, మౌనంగా ఉండమని బెదిరించారని కూడా ఆరోపించారు. కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను కూడా నిందితుల్లో ఒకరిగా పేర్కొన్నారు. అశోక్‌ కుమార్‌  అసభ్య ప్రవర్తన , మానసిక వేధింపుల కారణంగా తన కుమార్తె అధిక ఒత్తిడికి గురైందని మరణించిన విద్యార్థి తండ్రి చెప్పారు.

     

    హిమాచల్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమెను లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించామనీ, అక్కడ చికిత్స పొందుతూ పల్లవి డిసెంబర్ 26న  తది శ్వాస విడిచిందని తెలిపారు. అయితే కుమార్తె  అనారోగ్యం, మానసిక వేదన కారణంతా  తాను ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని మృతురాలి తండ్రి చెప్పారు. డిసెంబర్ 20న పోలీసులకు, ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశానని, కానీ వారు స్పందించలేదని తండ్రి వాపోయారు. 

    చదవండి: సిద్ధార్థ భయ్యా ఇక లేరు.. ప్రముఖుల దిగ్భ్రాంతి

    అలాగే వారు లైంగికంగా వేధించిన తీరును, ర్యాగింగ్ గురించి  చనిపోయే ముందు వీడియోను రికార్డ్ చేసిందని తెలిపారు. ఇందులో ప్రొఫెసర్ తనను ఎలా అనుచితంగా తాకాడనే దానితో పాటు అనేక ఇతర మానసిక మరియు లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడింది.ఈ ఫిర్యాదు మేరకు ప్రొఫెసర్‌. ర్యాగింగ్ , లైంగిక వేధింపుల అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యాసంస్థల (ర్యాగింగ్ నిషేధం) చట్టం, 2009 కింద పోలీసులు కేసు నమోదు చేశారని పోలీసు అధికారి అశోక్ రత్తన్ తెలిపారు. ర్యాగింగ్ కోణం, ప్రొఫెసర్‌పై ఆరోపణలు, విద్యార్థిని చనిపోయే ముందు ఆమె చేరిన అన్ని ఆసుపత్రుల దర్యాప్తు చేపడతామని తెలిపారు.

    కాలేజీ యాజమాన్యం స్పందన
    మరోవైపు పల్లవి కుటుంబానికి కళాశాల యాజమాన్యం సంతాపాన్ని ప్రకటించింది.  పల్లవి మొదటి సంవత్సరంలో విఫలమైందని, అయినప్పటికీ రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోరిందని అయితేకాలేజీమార్గదర్శకాల ప్రకారం ఆమెను ప్రమోట్ చేయలేదని  కళాశాల ప్రిన్సిపాల్ రాకేష్ పఠానియా  చెప్పారు. దీంతో అడ్మిషన్‌ను ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తున్నట్లు భావించిందన్నారు.  గత జూలై 29 నుండి తరగతులకు హాజరు కాలేదని కూడా ప్రిన్సిపాల్ చెప్పారు. అలాగే వేధింపులపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని  తెలిపారు.  
     

    ఇదీ చదవండి: ఎల్‌ఐసీకి రూ. 11, 500 కోట్లు నష్టం, ఎందుకో తెలుసా?

     

     

  • సాక్షి, ముంబై: ప్రముఖ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) ఫండ్ మేనేజర్ సిద్ధార్థ భయ్యాగుండెపోటుతో కన్నుమూవారు. అక్విటాస్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ సిద్ధార్థ్‌ (47) అస్తమయం వార్తను ఎక్విటాస్ ధృవీకరించింది, డిసెంబర్ 31న న్యూజిలాండ్‌లో కుటుంబ సెలవుల్లో ఉండగా భయ్యా మరణించారని పేర్కొంది. దిగ్భ్రాంతికరం నమ్మశక్యంగా లేదు.ఒక లెజెండ్‌ను కోల్పోయామంటూ ఇండస్ట్రీ ప్రముఖలు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.

    సిద్ధార్థ భయ్యా అకాల మరణంపై పెట్టుబడిదారులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన సిద్ధార్థ చాలా చిన్న వయసులోనే వెళ్లి పోయారంటూ విచారం వ్యక్తం  చేశారు. అని అభివర్ణించారు. హీలియోస్ క్యాపిటల్‌కు చెందిన సమీర్ అరోరా  ఎక్విటాస్‌ సిద్ధార్థ భయ్యా  మరణం చాలా బాధాకరమన్నారు. 

    కేవలం 47 ఏళ్ల వయసులోనే సిద్ధార్థ భయ్యా వార్త వినడం చాలా బాధగా ఉందని ఫిన్‌ఫ్లూయెన్సర్ అలోక్ జైన్ కూడా మరణానికి సంతాపం వ్యక్తం చేశారు.  జీవితం క్షణ భంగురం..ఎపుడైనా ముగిసిపోవచ్చు అనడానికి ఆయన మరణమే నిదర్శన్నారు. ఫిన్‌ఫ్లూయెన్సర్  రాజర్షి షోమ్ సూరజ్ బాలకృష్ణన్, ట్వీట్ చేసారు. పరిశ్రమలో తాను గౌరవించే  వారిలో సిద్ధార్థ భయ్యా ఒకరు. ఆయన మరణం షాక్‌కు గురి చేసిందంటూ వివేక్ జోషి సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

    కాగా 2012లో అక్విటాస్‌లో చేరడానికి ముందు, భయ్యా 2011 వరకు నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్  PMS విభాగంలో పనిచేశారు.  అతి పిన్న వయస్కుడైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా  ఖ్యాతి గడించారు.
     

  • సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకం రాష్ట్ర బీమా సంస్థలభారీ సెగ తగిలింది.  సిగరెట్లపై ప్రభుత్వం కొత్త ఎక్సైజ్  సుంకం భారీగా పెంచడంతో గత రెండు రోజుల్లో ఐటీసీ షేర్లు 14 శాతం పడిపోయాయి. ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)భారీగా నష్టపోయింది.

    ఐటీసీ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా  ఎల్ఐసీ వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థల రూ.13,740 కోట్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క ఎల్ఐసీ రూ.11,468 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తుంది. డిసెంబర్ 31 ముగింపు స్థాయిలో రూ.80,028 కోట్ల నుండి రికార్డు స్థాయిలో టోటల్‌వాల్యూలో  రూ.68,560 కోట్లకు చేరింది.  అలాగే ఐటీసీ అమ్మకం కారణంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.1,254 కోట్లు, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ రూ.1,018 కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

    2026 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఐటీసీ వాటాదారుల సంఖ్యపై డేటా ప్రకారం, కంపెనీలో మొత్తం 100 శాతం వాటాను పబ్లిక్ వాటాదారులు కలిగి ఉన్నాయి.  ఐటీసీలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 15.86 శాతం వాటాను కలిగి ఉండగా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జిఐసీ) 1.73 శాతం వాటాను, ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 1.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 

    ఇదీ చదవండి: దుబాయ్‌లో గ్రాండ్‌గా తల్లి బర్త్‌డే : వివాదాల బ్యూటీ వీడియో వైరల్

    జనవరి 2న ఐటీసీ షేర్లు 5 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయి రూ.345.25కి చేరాయి. 2026లో కేవలం రెండు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ స్టాక్ 14 శాతానికి పైగా  కుప్పకూలాయి. ఈ భారీ అమ్మకాల వల్ల కేవలం రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి రూ.72,000 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఇది దాదాపు రూ.4,38,639 కోట్ల వద్ద ఉంది. జనవరి 2న 4 శాతం నష్టంతో రూ.350.10 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ స్టాక్ 13 శాతానికి పైగా పడిపోయింది. గత ఆరు నెలల్లో 15 శాతానికి పైగా నష్టపోయింది.

    (ప్రియుడిని న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి పిల్చి, ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి)

    అయితే LIC షేర్లు ముగింపులో దాదాపు 1 శాతం పెరిగి రూ.861 వద్ద , జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు సెషన్‌లో రూ.380 వద్ద స్వల్ప లాభాలతో ముగిశాయి.

     

  • అస్సాం రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అక్కడ తీవ్రవాదులతో పొంచి ఉన్న ముప్పు... అడవుల్లో ఉగ్రవాదుల ఆవాసాలు... బోడోల నుంచి దాడులు.. బంగ్లాదేశీ వలసదారుల సమస్యలు... వారి మధ్య హింస... పోరు... ఇలా పెను సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ పని చేసే అధికారుల తీరు ఎలా ఉంటుందనే ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యలతో సతమతమవుతున్న ఆ రాష్ట్రంలో ఓ లేడీ ఐపీఎస్‌ అధికారి తనదైన శైలిలో వారిని ఎదుర్కొని... దేశం ముందు ఓ రోల్‌ మోడల్‌గా నిలిచింది. 

    అస్సాం రాష్ట్రానికే చెందిన ఆ మహిళ ఆ రాష్ట్రంలోనే తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా గుర్తింపు పొందింది. తన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బాగా గుర్తించిన ఆమె ఆ సమస్యలను నివారించడంలో చూపిన ధైర్య సాహసాలు.... దేశంలో ఎంతో మంది మహిళలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించి....ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా.... ఐరన్‌ లేడీగా... మరో కిరణ్‌బేడీగా పేరొందిన ఐపీఎస్‌ అధికారి సంజుక్తా పరాశర్.... గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

    సంజుక్తా పరాశర్.... 1979 అక్టోబరు 3న అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్‌లో జన్మించారు. ఆమె తల్లి మీనాదేవి అస్సాం హెల్త్ సర్వీసెస్ లో పనిచేస్తుండగా.... తండ్రి దులాల్ చంద్ర బారువా నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేశారు. గౌహతిలో హోలీ చైల్డ్‌ ఆర్మీ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తయిన తరువాత....న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ ఫర్‌ విమెన్‌లో పొలిటికల్‌ సైన్స్‌ ఆనర్స్‌లో డిగ్రీ, జవహర్‌ లాలా్‌ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఇంటర్నల్‌ రిలేషన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. జెఎన్‌యూలోనే అమెరికన్ విదేశాంగ విధానంలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ పొందారు. 2006లో యూపీఎస్‌సీ పరీక్షలు రాసి ఆలిండియా 85వ ర్యాంక్‌ సాధించారు. ఐఏఎస్‌ అవకాశమున్నా... ఐపీఎస్‌ను ఎంచుకుని... శిక్షణ పొందిన తర్వాత అస్సాం- మేఘాలయా కేడర్‌కు తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా పోస్టింగ్‌ సాధించారు. 2008లో అస్సాం, మాకుమ్‌ జిల్లాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా తొలి పోస్టింగ్‌ తీసుకున్నారు. 

    పోస్టింగ్‌ తీసుకున్న వెంటనే ఉగ్రవాదులపై పోరాటం ప్రారంభించారు. AK-47 తుపాకీ చేత బట్టి నేరుగా అడవుల్లోకి వెళ్లారు. కిందిస్థాయి సిబ్బందిపై పూర్తిగా వదిలేయకుండా ప్రతి దాడిలో నేరుగా పాల్గొని కేవలం 15 నెలల వ్యవధిలో 16 ఎన్‌కౌంటర్లు చేశారు. 64 అరెస్టులు.... భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బోడోస్,  బంగ్లాదేశీ వలసదారుల మధ్య హింసను నియంత్రించడాన్ని ఓ సవాలుగా తీసుకుని ఉగ్రవాదులను పరుగులు పెట్టించింది. ఉగ్రవాద మూలాల్ని మట్టబెట్టినప్పటికీ... ఇప్పటికీ అస్సాంలో అసాంఘిక శక్తుల్లో ఆమె పేరు వినగానే వణుకు పుడుతుంది. దీంతో ఐపీఎస్‌లో చేరగానే ఫీల్డ్ ఆపరేషన్లలో నేరుగా పాల్గొన్న అరుదైన మహిళాధికారిగా గుర్తింపు పొందారు. ఆమె ధైర్యం, క్రమశిక్షణ, నిబద్ధతతను గుర్తించిన తోటి అధికారులు... సిబ్బంది ఆమెను 'ఐరన్‌ లేడీ ఆఫ్‌ అస్సాం అని పిలుస్తారు. 

    ఆమె కెరీర్‌లో విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు నాయకత్వం వహించడం... 15 నెలల్లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం... పోలీస్‌ శాఖలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు అమెరికన్ విదేశాంగ విధానంలో పీహెచ్‌డీ చేసిన ఆమెకు అంతర్జాతీయ సంబంధాలపై ఆమెకు ఉన్న ఆసక్తి... అవగాహనను ప్రతిబింబిస్తుంది. సంజుక్త పరాశర్ కథ ఒక ప్రేరణాత్మక గాథగా... విద్య, ధైర్యం.... కర్తవ్యనిబద్ధతతో ఒక మహిళా అధికారి ఎలా ఉగ్రవాదులపై పోరాడి ప్రజలలో భద్రతా భావన కలిగించగలదో చూపిస్తూ అస్సాంలో కథనాలు ప్రచురితం కాగా... పలు టీవీ ఛానెళ్లలో ఆమె గురించి చర్చలు... విద్యాలయాల్లో ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ విద్యా బోధనలు జరిగాయి. 

    ఆమె ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వాలు ఆమె శౌర్యానికి రాష్ట్రపతి పోలీస్‌ పతకం... విశిష్ఠ సేవలకు గానూ పోలీసు పతకం... మహిళా సాధికారతకు గాను రాణి గైడిన్లియు జెలియాంగ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తన సేవలు... ధైర్య సాహసాలతో ఆమె తన తోటి అధికారులు, కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శకంగా మారారు. ముఖ్యంగా మహిళలకు మాత్రం ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. 

    అస్సాం రాష్ట్రానికి చెందిన 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పురు గుప్తాను ఆమె 2008లో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. విధుల నిర్వహణలో భాగంగా భార్యా భర్తలు నెలల వ్యవధి దూరంగా ఉన్నప్పటికీ... వారి కుమారుణ్ని సంజుక్త తల్లి చూసుకుంటుందంటే తన కుటుంబాన్ని, వృత్తిని ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రెండు నెలలకు ఓ సారి తల్లితో..., టిన్సుకియాలో డిప్యూటి కమిషనర్‌గా ఉన్న భర్తతో, కుమారుడితో కలిసి కొన్ని రోజులు ఉండి తిరిగి తన విధి నిర్వహణకు అంకితమవడం ఆమె అంకిత భావం, స్ఫూర్తిని చాటుతోంది. 

    ఆమె తన ఐపిఎస్ కెరీర్లో ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు. ఉగ్రవాద పోరులో ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. భర్త, తల్లి, కుమారుడు ఉన్న ఆమెను చంపేస్తామని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని ఉగ్రవాదులు, బోడోల బెదిరింపులు వచ్చినా డోంట్‌ కేర్‌ అంటూ ఎక్కడా జంకకుండా, అధైర్య పడకుండా తన ఆపరేషన్లను సక్సెస్‌ చేశారు. ప్రస్తుతం సంజుక్తా పరాశర్ న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ డిఐజిగా పనిచేస్తున్నారు. ఆమెకు ప్రొఫార్మా ప్రమోషన్ ఇవ్వడంతో ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. ఆమె 2017 నుండి ఈ పదవిలో  కొనసాగుతున్నారు. ఆమెకు ఈత, జిమ్నాస్టిక్స్ ల అభిరుచులున్నాయి.
    -మహమ్మద్ అబ్దుల్ ఖదీర్

  • తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున ప్రాతినిథ్యం కల్పించనుంది. అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, గోదావరి రివర్ మెనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మన్లకు ఇందులో స్థానం కల్పించింది.

    ఈ కమిటీకి ఛైర్మన్‌గా  కేంద్రజలసంఘం ఛైర్మన్ అతుల్‌జైన్  వ్యవహరించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల్ని పరిష్కరించడం.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రజలశక్తి శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

     

  • సాక్షి,తమిళనాడు: భారత్‌-పాక్ వివాదంలో అమెరికా-చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్‌కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికి లేదని పరోక్షంగా హెచ్చరించారు. పాకిస్థాన్ లాంటి చెడ్డ పొరుగుదేశంతో భారత్‌ సరిహద్దు పంచుకోవాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఐఐటీ మాద్రాస్‌ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

    కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇండియా ఎయిర్‌ఫోర్స్ కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పాక్ టెర్రరిస్టులను వారి సొంత దేశంలో  భారత్ మట్టి కరిపించింది. అంతే కాకుండా ఇది జస్ట్ ట్రైలర్‌ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాల్పులు విరమణ  జరిగింది. 

    ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తలనొప్పిగా మారింది.   ఈ యుద్ధం తాను చెబితేనే ఆగిందని, పన్నులు పెంచుతానని హెచ్చరించడంతో ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాయని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు.  భారత్ ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం ఇదే తంతు ఎత్తుకుంది. ఇండియా పాక్ యుద్ధాన్ని తామే నివారించామని ఇటీవల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రగల్భాలు పలికారు.

    ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " భారత్‌కు ఏంచేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికీ  లేదు తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇండియాకు చాలా క్లియర్‌గా తెలుసు’ అంటూ పరోక్షంగా ఈ రెండు దేశాలకు కౌంటరిచ్చారు. 

    అనంతరం పాకిస్థాన్‌ను ఉద్దేశించి  మాట్లాడుతూ " ప్రతిఒక్కరికీ చుట్టుప్రక్కల వారు ఉంటారు. అలాగే భారత్‌కు ఉన్నారు. అయితే వారు చెడ్డవారు. మన సరిహద్దుకు పశ్చిమ దిక్కునున్న దేశం దిక్కు చూస్తే వారు తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన ప్రజలను టెర్రరిజం నుంచి కాపాడుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది. ప్రస్తుతం అదే చేస్తున్నాం" అని  జైశంకర్ అన్నారు.

    అదేవిధంగా ఆయన సిందూనది జలాల ఒప్పందం అంశంపై  మాట్లాడుతూ. "చాలా సంవత్సరాల క్రితం సిందూనది జలాల ఒప్పందం చేసుకున్నాము. కానీ దశాబ్ధాలుగా మనకు సత్సంబంధాలు లేవు. మంచి సంబంధాలు లేనప్పుడు దాని ఫలితాలు అదే విధంగా ఉంటాయి. దయచేసి మీరు మాకు నీరు ఇవ్వండి మేము మాత్రం ఉగ్రవాదులని మీదేశానికి పంపుతాము అంటే ఏలా కుదురుతుంది" అని జైశంకర్‌ ప్రశ్నించారు. 

    గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

  • పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడిపై దాడిచేసి ప్రైవేట్ భాగాలను నరికివేసింది.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ వివాహితులే. ముంబైలో ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం 25 ఏళ్ల ఒక మహిళ ఇద్దరు పిల్లల తల్లి. ఈమెకు 42 ఏళ్ల వివాహితుడితో దాదాపు ఏడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విడాకులిచ్చి తనన పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో అసలు పెళ్లి ఊసు ఎత్తగానే  సరైన సమాధానం  చెప్పకుండా ముఖం చాటేసేవాడు. తన మాట వినడం లేదని, భార్యను విడిచిపెట్టడానికి నిరాకరించాడన్న కోపంతో  ఆ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టింది.

    పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో గత ఏడాది నవంబరులో బిహార్‌కు వెళ్లి పోయాడు. భార్యాబిడ్డలు ముంబైలోని శాంటా క్రజ్‌లోని  ఇంట్లో ఉంటున్నారు. గత 18  ఏళ్లుగా కుటుంబంతో  కలిసి ఇక్కడే ఉంటున్నాడు. బాధితుడు. బిహార్‌కు వెళ్లిన తరువాత కూడా  ఆమె ఫోన్ కాల్స్ ద్వారా పెళ్లి గురించి అడగడం,  అతన్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. అయితే  2026 కొత్త సంవత్సరం సందర్బంగా డిసెంబర్ 19న ముంబైకి తిరిగొచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రేమికురాలు నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి రావాల్సిందిగా బాధితుడిని ఆహ్వానించింది. గురువారం తెల్లవారుజామున మాటల్లో పెట్టి, సమయం చూసి పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలపై దాడిచేసిందని ముంబై పోలీసు అధికారి తెలిపారు.

    ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

    తీవ్ర గాయాలపాలై అధిక రక్తస్రావంతో బాధితుడు మొత్తం మీద బైటపడి, సోదరుడు, ఇతర బంధువుల సాయంతో  బీఎన్‌ దేశాయ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.  గాయం చాలా లోతుగా ఉందని శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు.  ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరికీ బంధుత్వం ఉన్నట్టు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలి కోసం వెతుకుతున్నారు. 

    ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్‌, రికార్డ్‌

  • సాక్షి,హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మడావి హిడ్మా సన్నిహితుడు, బెటాలియన్‌ కమాండర్‌ బర్సేదేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

    మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు(సీఎంసీకి)వెన్నెముకగా నిలిచిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కార్యకలాపాలు ముగిసినట్లేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిడ్మా మృతితో కోలుకోలేని దెబ్బ తగలగా.. తాజాగా బెటాలియన్‌ కమాండర్‌ బర్సేదేవా తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో పాటు మరో 19 మంది  కమిటీ సభ్యులు సైతం ఉన్నారని.. రేపోమాపో వారిని పోలీసుల ఎదుట ప్రవేశ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  

    కొద్ది రోజుల క్రితం మావోయిస్టు లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న మడివి హిడ్మా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బరిసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆయన సైతం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

    కాగా మడివి హిడ్మా, బరిసేదేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బరిసే దేవా కీలక పాత్ర పోషించారు. బరిసే దేవా లొంగుబాటు సందర్భంగా పోలీసులు ఆయన దగ్గరినుంచి పెద్ద మెుత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న బరిసే దేవా రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

Politics

  • హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీపై కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్‌ వేదికగా బండి సంజయ్‌ మండిపడ్డారు. 

    ‘దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు భావజాలం ప్రజాదరణను కోల్పోయింది.  ఇందుకు ఇలాంటి బాధ్యతలేని, అసభ్య భాషే  ప్రధాన కారణం. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ నవ్వడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. 

    మిత్రపక్షాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ దూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తక్షణమే ఈ  వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేశ ప్రజలకూ, గౌరవ ప్రధానికీ నిస్సందేహంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 

     

  • కాకినాడ:  ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి కానీ చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గత ఏడాదిగా పాలన గాలికొదిలేసి.. అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, క్రెడిట్‌ చోరీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 2వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘చంద్రబాబు, లోకేష్ పాలన గాలికి వదిలేసి విదేశి పర్యాటనలకు వెళ్ళారు. 

    అధికారంకంగా వెళ్తున్నామా? వ్యక్తిగతంగా వెళ్ళారో ఎవరికి తెలియదు. ప్రజల్ని ఎందుకు ఇంత అయోమంకు గురి చెసి... పర్యటనలను రహస్యంగా ఉంచారు. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె దగ్గరకు లండన్ వెళ్తే లోకేష్ ఎంతో హేళన చేశారు‌. నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ అబద్దాలు. .పిట్ట కధలు వల్లిస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అప్పులు చేసేస్తున్నారని టిడిపి వీపరితమైన ప్రచారం చేసింది.గత 18 నెలల కాలంలో అత్యధిక అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆర్బీఐ చెబుతోంది. 

    ఇప్పటి వరకు చంద్రబాబు రూ.2.9 లక్షలు కోట్లు అప్పు చేశారు. సంపద సృష్టి లేదు..ఉద్యోగ కల్పన లేదు.. పారిశ్రామిక వేత్తలు రావడం లేదని ఆబద్దాలను ప్రజల మీదకు వదులుతున్నారు. ఆర్బీఐ నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కి ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. 2019-24 లో తయారీ రంగంలో సౌత్ లో మొదటి స్ధానంలోను, దేశంలో ఐదవ స్ధానంలో ఉందని ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. ఈ ఎనిమిది నెలల కాలంలో జిఎస్టీ 3.48% పెరిగింది. సగటున 10% పెరగాలి. స్టేట్ సేల్స్ టాక్స్ పడిపోయింది. ఊళ్ళల్లో నిర్మాణ పనులు జరగడం లేదు. పండుగ పూట రోడ్లు, దుకాణాలు కాళీగా ఉన్నాయి‌.

    Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

    చంద్రబాబు చేసిన అప్పుల సొమ్ములను ఏం చేశారు?, పధకాలు అమలు చేయడం లేదు...ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. దేశ విదేశాలకు పాఠాలు చెబుతాననే చంద్రబాబు. ఏపీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేకపోతున్నాడు. అమరావతి రైతులు చంద్రబాబు ద్రోహనికి బలైపోయే రోజులు వస్తాయి. ఈ ఏడాదిన్నర కాలంలో అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుండి ఒక్క గ్రాంట్ తీసుకువచ్చారా?, అమరావతిలో వందల కోట్లతో  నీళ్లు తోడుతున్నారు. అమరావతి రైతు చనిపోతే చంద్రబాబుకు చీమ కుట్టినట్లు లేదు. రైతు కూల్‌గా మాట్లాడి చనిపోయాడని అబద్దపు  ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 

  • సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల ఆచూకీ లేకుండా పోవడంతో, సోషల్ మీడియాలోనూ ప్రజల్లో వీరి ఆచూకిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్ఫష్టీకరించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తమ విదేశీ పర్యటలపై తండ్రీకొడుకుల ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీసిన ఆయన... సీఎస్, డీజీపీలే ప్రజలకు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు.

    అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా.. తెచ్చిన అప్పంతా దోచుకుంటోందని మండిపడ్డారు. చివరకు టీడీపీ కార్యకర్తల నూతన సంవత్సర అభినందనలకు కూడా అందకుండా తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ ల కోసం టీడీపీ కార్యకర్తలు వెదుకుతున్నారని... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రహస్య పర్యటనలేంటని వెంకటరెడ్డి ఆక్షేపించారు.

    ప్రతి 3 నెలలకు చంద్రబాబు, 2 నెలలకు లోకేష్  ప్రత్యేక విమానాల్లో దోచుకున్నది దాచుకోవడానికే రహస్య పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


    ఆచూకీ లేని సీఎం చంద్రబాబు
    నాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఆచూకీ తెలియ‌డం లేదు. ఆయ‌న ఏమైపోయాడోన‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో సీఎం చంద్ర‌బాబు క‌న‌బ‌డుట లేదు. ఆచూకీ ఎక్క‌డ అనే పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్య‌మంత్రి ఆచూకీ గురించి రాష్ట్ర డీజీపీ, సీఎస్‌ల వ‌ద్ద స‌మాచారం ఉంటే వెంట‌నే ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. లేదంటే కేంద్ర ప్ర‌భుత్వానికైనా ఆచూకీ క‌నుగోన‌మ‌ని కోరాలి. సీఎం చంద్ర‌బాబుతో పాటు స‌క‌ల శాఖ‌ల విధ్వంస మంత్రి నారా లోకేష్ సైతం గ‌డిచిన వారం రోజులుగా క‌నిపించ‌కుండా పోయాడు. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చంద్ర‌బాబు ఆచూకీ గురించి ఎల్లో మీడియా సైతం ప‌లు దేశాల పేర్లు ప్ర‌స్తావిస్తున్నారు. ఎవ‌రూ క్లారిటీగా ఫ‌లానా దేశం వెళ్లాడ‌ని కూడా చెప్ప‌డం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న చంద్ర‌బాబు, ఇలా ర‌హ‌స్యంగా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావ‌డం లేదు.

    శంషాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానాల్లో జంప్‌
    రాష్ట్రమంతా వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని క‌న్నుల‌ పండుగగా నిర్వ‌హించుకుంటుంటే సీఎం చంద్ర‌బాబు మాత్రం అదే రోజు (30.12.2025)న‌ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద‌యం 10.28 గంట‌ల‌కు వీజేటీ 101 అనే స్పెష‌ల్ ఫ్లైట్‌లో బాలి వెళ్లాడ‌ని తెలుస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండ‌న్ వెళ్లాడ‌ని ప్ర‌చారం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ మీటింగ్ కూడా వ‌దిలేసి 28-12-2025న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌లో హాంకాంగ్ వెళ్లాడ‌ని తెలుస్తోంది. ప్ర‌జా ప్ర‌తినిధులుగా కీల‌క‌స్థానాల్లో ఉండి ఇలా ర‌హ‌స్య ప‌ర్య‌ట‌నలు చేయ‌డంలో ఆంత‌ర్యం ఏమిటి? క‌నీసం ప్ర‌భుత్వం వ‌ద్ద కూడా స‌మాచారం లేకుండా కేబినెట్ మీటింగ్‌లు కూడా వ‌దిలేసి ప్ర‌త్యేక విమానాల్లో ఎందుకు వెళ్లారు? వారి ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారు?  క‌నీసం వారు తిరిగి ఎప్పుడోస్తారో కూడా చెప్ప‌క‌పోవ‌డానికి ఏవైనా కార‌ణాలున్నాయా? ఇవ‌న్నీ ప్ర‌జ‌ల నుంచి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌లు.

    ప్ర‌తి మూడు నెలలకు చంద్ర‌బాబు, రెండు నెల‌ల‌కు లోకేష్‌
    చంద్ర‌బాబు సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఆరుసార్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తే, అందులో రెండుసార్లు కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో క‌లిసి చేసిన ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌లే ఉన్నాయి. ఇప్ప‌టికే దుబాయ్‌, అబుదాబి, లండ‌న్, దావోస్‌, యూర‌ప్, సింగ‌పూర్‌ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లాడు. ప్ర‌స్తుతం బాలి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. స‌క‌ల శాఖ‌ల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఇప్ప‌టికే 9 సార్లు విదేశీ ప‌ర్య‌ట‌నలు చేశాడు. ప్ర‌తి రెండు నెల‌ల‌కోసారి ప్ర‌త్యేక విమానాల్లో ఆయ‌న విదేశాల్లో విహ‌రించి వ‌స్తున్నాడు. యూర‌ప్‌, అమెరికా, దావోస్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, లండ‌న్‌, డ‌ల్లాస్‌, కెన‌డా వెళ్లి వ‌చ్చాడు. ఇప్పుడు ఏ దేశ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కే క్లారిటీ లేదు.

    దోచుకున్న‌ది దాచుకోవడానికే
    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 18 నెల‌ల కాలంలోనే రూ. 2.93 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ సంప‌ద‌ను త‌న బినామీల‌కు అప్ప‌నంగా దోచిపెడుతున్నాడు. ఆ డ‌బ్బును విదేశాల్లో దాచుకోవ‌డానికి పెట్టుబ‌డులు పెట్ట‌డానికే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. ఏపీ ప్ర‌జ‌ల సంప‌ద‌ను దోచుకుని విదేశాల్లో దాచుకోవ‌డానికే తండ్రీకొడుకులు ర‌హ‌స్యంగా విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

    అరాచకాలకు కేరాఫ్‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు 
    రాష్ట్రంలో 164 మంది కూట‌మి ఎమ్మెల్యేల బాగోతాలు చూస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి, హ‌త్య‌లు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి దారుణాల‌న్నీ కూట‌మి ఎమ్మెల్యేల కేంద్రంగానే జ‌రుగుతున్నాయి. మ‌హిళ‌ల‌ను వేధిస్తూ ఇప్ప‌టికే కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోల సాక్షిగా దొరికిపోయారు. మ‌రికొంద‌రి బాగోతాలు బాధితుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి.

    ఇప్పుడు శ్రీకాళ‌హ‌స్తి జ‌న‌సేన నాయ‌కురాలు కోట వినుత డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్ రెడ్డి హ‌స్తం ఉన్న‌ట్టు తెలుస్తోంది. త‌మిళ‌నాడు పోలీసులు ఆయ‌న‌తోపాటు అత‌డి అనుచ‌రుడు సుజిత్ రెడ్డి, జ‌న‌సేన కార్య‌క‌ర్త పేట చంద్ర‌శేఖ‌ర్‌ల‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల ఆధిప‌త్య పోరులో ఒక అమాయ‌కుడు బ‌లైపోయాడు. డ్రైవ‌ర్ రాయుడి హ‌త్య‌లో శ్రీకాళ‌హస్తి ఆల‌య చైర్మ‌న్, జ‌న‌సేన నాయ‌కుడు కొట్టే సాయి హ‌స్తం కూడా ఉన్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీయించ‌డానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్ రెడ్డి పూనుకున్నాడ‌ని అభియోగాలున్నాయి. ఆ కుట్ర‌లో పావుగా మారిన డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య‌కు గురైన‌ట్టు తెలుస్తోందని వెంకటరెడ్డి తెలిపారు. రాయుడు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వీరాభిమాని అయినా.. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించ‌క‌పోవ‌డం దారుణమని కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు.

    క్యాబినెట్ మీటింగ్ కు డుమ్మా కొట్టి లోకేష్ హాంకాంగ్ వెళ్లారు: కారుమూరి

Sports

  • మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యంగ్‌ స్టార్‌ సాయి సుదర్శన్‌ పక్కటెముక విరిగింది. 

    పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్ చేసిన సుదర్శన్‌ ప్రమాదకర రీతిలో కింద పడ్డాడు. అప్పటికి గాయం పెద్దదిగా అనిపించనప్పటికీ స్కానింగ్‌ల్లో రిబ్‌ ఫ్రాక్చర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఈ గాయం కారణంగా సాయి  వీహెచ్‌టీలో తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. 

    సాయి ఐపీఎల్‌ 2026 ప్రారంభ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. సాయి గుజరాత్‌ టైటాన్స్‌లో కీలక సభ్యుడు. గత కొన్ని సీజన్లుగా అతను టైటాన్స్‌ తరఫున స్థిరంగా రాణిస్తున్నాడు.

    సాయికి ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భారత టెస్ట్‌ జట్టులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలపై ఆధారపడి ఉంటాయి. 

    24 ఏళ్ల సాయి టీమిండియా తరఫున 6 టెస్ట్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 302 పరుగులు.. 3 వన్డేల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 127 పరుగులు చేశాడు. 

    ఐపీఎల్‌లో సాయికి ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అరంగేట్రం నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కే ఆడుతున్న సాయి.. 40 మ్యాచ్‌ల్లో 145కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, కళ్లు చెదిరే 49.8 సగటున 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 1793 పరుగులు చేశాడు. 

  • టీమిండియాలో అప్‌ కమింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్‌ సుందర్‌.. మైదానం వెలుపల తన ప్రవర్తన కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు. సుందర్‌ తాజాగా ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్‌ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. 

    అలాగే కొందరు ఫ్యాన్స్‌ సెల్ఫీల కోసం ప్రయత్నిస్తున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

    ఇది చూసి నెటిజన్లు సుందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు.. ఏంటా బలుపు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరేమో నువ్వేమైనా విరాట్‌ కోహ్లి లేదా రోహిత్‌ శర్మ అనుకుంటున్నావా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. 

    మొత్తానికి ఆన్‌ ఫీల్డ్‌ ప్రదర్శనలతో అభిమానులను ఆకట్టుకున్న సుందర్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా అదే అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.

    ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్‌..త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే హోం టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన జట్టే టీ20 ప్రపంచకప్‌లో కూడా కొనసాగనున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో  స్థానాన్ని పక్కా చేసుకున్న సుందర్‌.. ప్రపంచకప్‌లో ఆడటం​ లాంఛనమే.

    న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఐదు టీ20లు జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గౌహతి, వైజాగ్‌, తిరువనంతపురం వేదికలుగా జరుగనున్నాయి. 

    ఈ సిరీస్‌కు ముందే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ జనవరి 11 నుంచే మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.

     

  • సౌతాఫ్రికా జాతీయ జట్టు సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌ జట్టుకు పలువురు స్టార్‌ ప్లేయర్లను ఎంపిక​ చేయలేదు. 

    ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపు శతకంతో సత్తా చాటిన ర్యాన్‌ రికెల్టన్‌.. ఇదే లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ కెప్టెన్‌ అయిన ట్రిస్టన్‌ స్టబ్స్‌.. ఫాస్ట్‌ బౌలర్‌ ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, విధ్వంసకర ఆటగాడు రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌ను ప్రపంచకప్‌ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు.

    వీరిలో డస్సెన్‌పై వేటు ఊహించిందే అయినా స్టబ్స్‌, రికెల్టన్‌, బార్ట్‌మన్‌పై వేటు మాత్రం ఎవరూ ఊహించనిది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఎంపిక కాగా.. కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, జాసన్ స్మిత్ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

    పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, 2024 వరల్డ్‌కప్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్‌ అన్రిచ్‌ నోర్జే, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జన్సెన్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, అనుభవజ్ఞులైన బ్యాటర్లు డికాక్‌, మిల్లర్‌ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.

    కాగా, ఫిబ్రవరి 7 నుంచి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌, కెనడా, న్యూజిలాండ్‌, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి. మెగా టోర్నీలో గత ఎడిషన్‌ రన్నరప్‌ అయిన సౌతాఫ్రికా ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్‌ (కెనడాతో) ఆడుతుంది. 

    2026 టీ20 ప్రపంచకప్‌ కోసం సౌతాఫ్రికా జట్టు..
    ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, జాసన్ స్మిత్‌

     

  • పొరుగు దేశాలను ఆదుకునే విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) మరోసారి తమ ఉదారత చాటుకుంది. డిట్వా తుఫానుతో అతలాకుతలమైన శ్రీలంకకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక సాయంతో ముందుకొచ్చింది. భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో శ్రీలంకలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

    డిట్వా తుఫాన్‌ బాధితుల సహాయార్థం బీసీసీఐ ఈ టూర్‌ను పొడిగించేందుకు నిర్ణయించింది. టెస్ట్‌లకు అదనంగా టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అంగీకరించింది. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిట్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు షెడ్యూల్‌లో లేని టూర్‌ ఎక్స్‌టెన్షన్‌ను ప్లాన్‌ చేసింది.

    ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధ్యక్షుడు షమ్మి సిల్వా ధృవీకరించారు. భారత్‌-శ్రీలంక మధ్య ఉన్న సహృదయ వాతావరణాన్ని, పెరుగుతున్న స్నేహాన్ని ప్రస్తావించారు. అదనపు టీ20ల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

    వాస్తవానికి తాజా పరిణామానికి ముందే భారత జట్టు డిసెంబర్‌లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు (డిట్వా తుఫాన్‌ బాధితులకు నిధులు సమకూర్చేందుకు) ఒప్పుకుంది. ఆ పర్యటనలో భారత్‌-శ్రీలంక జట్లు రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌ కార్యరూపం దాల్చకముందే, బీసీసీఐ ఆగస్ట్‌ విండో ప్రతిపాదనకు సమ్మతించింది.

    కాగా, గతేడాది నవంబర్ చివర్లో డిట్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించింది.

    శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలు
    డిట్వా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను “Rebuilding Sri Lanka” కార్యక్రమానికి అంకితం చేసింది. ఈ సిరీస్‌లో #VisitSriLanka పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

     

  • 2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. 

    భారత్‌ నుంచి దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఎంపికయ్యారు. మరో భారతీయ ఆటగాడు మిలింద్‌ కుమార్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కినా, ప్రస్తుతం అతను యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

    వెస్టిండీస్‌ (షాయ్‌ హోప్‌, జేడన్‌ సీల్స్‌), న్యూజిలాండ్‌కు (మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ) కూడా భారత్‌తో సమానంగా రెండు బెర్త్‌లు దక్కాయి. మిగతా బెర్త్‌లు సౌతాఫ్రికా (మాథ్యూ బ్రీట్జ్కే), స్కాట్లాండ్‌ (జార్జ్‌ మున్సే), ఇంగ్లండ్‌ (ఆదిల్‌ రషీద్‌), శ్రీలంకకు (అషిత ఫెర్నాండో) చెందిన ఆటగాళ్లు దక్కించుకున్నారు.

    ఆటగాళ్ల వారిగా గతేడాది ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..

    రోహిత్‌ శర్మ
    పరుగులు- 650 
    సగటు- 50.00
    స్ట్రయిక్‌రేట్‌- 100 
    అత్యుత్తమ ప్రదర్శనలు- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 76 పరుగులు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై సెంచరీలు

    జార్జ్ మున్సే
    పరుగులు- 735
    సగటు- 73.50
    స్ట్రయిక్‌రేట్‌- 107
    2 సెంచరీలు

    విరాట్‌ కోహ్లి
    పరుగులు- 651
    సగటు- 65.10
    స్ట్రయిక్‌రేట్‌- 96
    పాకిస్తాన్‌పై అజేయ శతకం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో 84 పరుగులు

    షాయ్‌ హోప్‌ (వికెట్‌కీపర్‌)
    పరుగులు- 670 
    సగటు- 64.18
    స్ట్రయిక్‌రేట్‌- 99 
    పాకిస్తాన్‌పై 120*; 15 క్యాచ్‌లు, 2 స్టంపింగ్స్

    మాథ్యూ బ్రీట్జ్కే
    పరుగులు- 706
    సగటు- 64.18
    స్ట్రయిక్‌రేట్‌- 99
    అరంగేట్రంలోనే 150 పరుగులు; మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు

    మిలింద్ కుమార్
    పరుగులు- 652
    సగటు- 81.50 
    స్ట్రయిక్‌రేట్‌- 99
    2 శతకాలు
    వికెట్లు- 20
    ఓ ఐదు వికెట్ల ప్రదర్శన

    మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌)
    పరుగులు- 210
    వికెట్లు- 25 
    ఎకానమీ- 4.57
    కెప్టెన్‌గా స్థిరమైన ప్రదర్శన

    ఆదిల్‌ రషీద్‌
    వికెట్లు- 30 
    సగటు- 23.63

    మ్యాట్‌ హెన్రీ
    వికెట్లు- 27 వికెట్లు
    సగటు- 18.14
    2025లో అత్యధిక వికెట్లు; ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ బౌలర్

    జేడన్‌ సీల్స్‌
    వికెట్లు- 27 
    సగటు- 18.14
    పాకిస్తాన్‌పై 6-18

    అషిత ఫెర్నాండో 
    వికెట్లు- 23 వికెట్లు
    సగటు- 21.30

  • దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్‌-1లో గెలిచి డెజర్ట్‌ వైపర్స్‌ నేరుగా ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీ కొనసాగుతుంది. 

    నిన్న (జనవరి 1) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌పై తిరుగులేని విజయం సాధించి, ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్స్‌-2కు (ఎంఐ ఎమిరేట్స్‌తో) అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2 విజేత జనవరి 4న జరిగే ఫైనల్లో డెజర్ట్‌ వైపర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.

    ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌పై అబుదాబీ నైట్‌రైడర్స్‌ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. మైఖేల్‌ పెప్పర్‌ (49 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (43), ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (22 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లతో సత్తా చాటగా.. హైదర్‌ అలీ, వకార్‌ సలాంఖిల్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన క్యాపిటల్స్‌.. 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సునీల్‌ నరైన్‌ (3-0-12-3), జేసన్‌ హోల్డర్‌ (3.2-0-18-3), లివింగ్‌స్టోన్‌ (4-0-26-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించారు. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన నబీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మొట్టమొదటి సీజన్‌ విజేతగా రాజస్తాన్‌ రాయల్స్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్‌ ఆడిన రాజస్తాన్‌.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్‌ ఆడింది.

    సుదీర్ఘ బంధానికి వీడ్కోలు
    క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్‌ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్‌ కథనం ప్రకారం.. ఐపీఎల్‌-2026 సీజన్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ హోం గ్రౌండ్‌ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్‌ ఎంచుకుంది.

    కారణం ఇదే
    జైపూర్‌లోని ‘SMS’ గ్రౌండ్‌లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్‌ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్‌ తమ హోం గ్రౌండ్‌ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    పుణెలో
    ఇప్పటికే రాయల్స్‌ ఆపరేషన్‌ టీమ్‌ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్‌ పరిస్థితులు, సీటింగ్‌ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.

    కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్‌ కింగ్స్‌ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. 

    ఆర్సీబీని ఓడించి..
    ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్‌ మ్యాచ్‌ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్‌’కు భారీ షాక్‌ తగిలినట్లే!!

    ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్‌.. మళ్లీ ఫైనల్‌ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్‌ చేసిన రాయల్స్‌ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.

    చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

  • టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఆఫర్‌పై పాకిస్తాన్‌ మాజీ హెడ్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్‌లో ఓ పాకిస్తాన్‌ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్‌గా వ్యవహరించమని అడిగాడు. 

    ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్‌ వాష్‌ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్‌ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్‌ చేశాడు. 

    ఈ ఆఫర్‌ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్‌' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్‌ యూజర్‌-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

    బీసీసీఐకి పాకిస్తాన్‌ కోచ్‌గా పని చేసిన వారికి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యేంత సీన్‌ లేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్‌ ఎక్స్‌ యూజర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్‌ను భారత టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. 

    అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్‌ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.

    వాస్తవానికి గంభీర్‌పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలొ క్లీన్‌ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్‌ టెస్ట్‌ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్‌ స్వీప్‌ (0-2) వరకు సాగింది.

    ఈ మధ్యలో గంభీర్‌ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్‌ పర్యటనలో 1-3తో సిరీస్‌ కోల్పోయి, ఇంగ్లండ్‌ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది. 

    ఇంత దారుణమైన ట్రాక్‌ ఉంటే సహజంగానే ఏ కోచ్‌పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్‌ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.

    గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్‌ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్‌లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్‌) ఆ పదవికి రాజీనామా చేశాడు. 

    గిల్లెస్పీ జమానాలో పాక్‌ బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్‌ మొహిసిన్‌ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు. 
     

  • యాషెస్‌ 2025-26 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్‌ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్‌ బృందం వైట్‌వాష్‌ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.

    ఇక సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్‌ తాజా ఎడిషన్‌లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్‌ XIIను ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.

    విల్‌ జాక్స్‌తో పోటీ
    ఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్‌.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్‌ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్‌ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.

    పాట్స్‌ రీఎంట్రీ
    గాయం కారణంగా గస్‌ అట్కిన్సన్‌ దూరం కాగా.. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్‌ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్‌వుడ్‌ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్‌ పాలిట వరంగా మారింది. 

    డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడిన ఈ పేస్‌ బౌలర్‌ యాషెస్‌ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్‌ రీప్లేస్‌మెంట్‌గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.

    ఆస్ట్రేలియాతో యాషెస్‌ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ XII
    బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), జోష్ టంగ్.

    అదే జట్టు
    మరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌ చివరి టెస్టు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

    గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్‌ స్మిత్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్‌ బృందం గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి సిరీస్‌ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్‌... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది. 

    దీంతో ఇంగ్లండ్‌ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్‌ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్‌బోర్న్‌ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్‌ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  

    చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

  • క్రికెట్‌కు సంబంధించి 2026 స​ంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో భాగంగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి, సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పైచేయి సాధించింది.

    ఈ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డొనొవన్‌ ఫెరియెరా (డాన్‌) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఆల్‌రౌండ్‌ షో అంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌ మత్రమే కాదు వికెట్‌కీపింగ్‌ కూడా.

    తొలుత బ్యాటింగ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌ (10 బంతుల్లో 33 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) ఆడిన డాన్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో (4-0-24-1), ఆఖర్లో వికెట్‌ కీపింగ్‌లో (చివరి బంతికి ఒక పరుగు చేస్తే ప్రత్యర్ది గెలిచే సమయంలో అద్భుతమైన రనౌట్‌ చేశాడు) అదరగొట్టి ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. సూపర్‌ ఓవర్‌లో రిలీ రొస్సో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. డివిలియర్స్‌ (38), డుప్లెసిస్‌ (47), శుభమ్‌ రంజనే (50 నాటౌట్‌), డొనొవన్‌ ఫెరియెరా (33 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డర్బన్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-12-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. హార్మర్‌ (4-0-22-1) కూడా పర్వాలేదనిపించాడు.

    అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో డర్బన్‌ జట్టు చివరి బంతి వరకు గెలుపు కోసం​ పోరాడింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందన్న తరుణంలో డాన్‌ మ్యాజిక్‌ రనౌట్‌ చేసి మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. ముల్దర్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసిన హార్మర్‌ బంతిని కట్‌ చేసే క్రమంలో మిస్‌ అయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. అప్పుడు వికెట్‌కీపింగ్‌ చేస్తున్న డాన్‌ అద్భుతమైన రీతిలో బాష్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

    సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ వికెట్‌ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లీసన్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి డర్బన్‌ బ్యాటర్లు జోస్‌ బట్లర్‌, ఆరోన్‌ జోన్స్‌ను కట్టడి చేశాడు. 6 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రిలీ రొస్సో 3 బంతుల్లో 2 బౌండరీలు బాది సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

     

  • ప్రపంచంలోనే మేటి టీ20 లీగ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కొనసాగుతోంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టోర్నమెంట్‌ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.

    కేవలం భారత్‌కు చెందిన ఆటగాళ్లే కాకుండా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడంతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు కూడా!

    ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం
    అయితే, ఆరంభంలో పాకిస్తాన్‌ ప్లేయర్లు సైతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడేవారు. వసీం అక్రం, షోయబ్‌ అక్తర్‌, మిస్బా ఉల్‌ హక్‌, ఉమర్‌ గుల్‌, కమ్రాన్‌ అక్మల్‌, షోయబ్‌ మాలిక్‌, సొహైల్‌ తన్వీర్‌ వంటి వాళ్లు ఆరంభ సీజన్‌లో ఆడారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2009 నుంచి పాక్‌ ప్లేయర్లు ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.

    తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు సైతం ఇదే దుస్థితి కలిగే అవకాశం ఉంది. భారత్‌ నుంచి ఎల్లవేళలా మద్దతు, సాయం పొందిన బంగ్లాదేశ్‌ కొన్నాళ్లుగా విచిత్ర పోకడలకు పోతోంది. ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్‌ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

    బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు
    ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.

    ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఐదు నుంచి ఆరుగురు క్రికెటర్లు పేరు నమోదు చేసుకోగా.. లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. షారుఖ్‌ ఖాన్‌ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    అతడొక ద్రోహి..
    ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత సంగీత్‌ సింగ్‌ సోమ్‌ షారుఖ్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ప్లేయర్‌ను కొన్న షారుఖ్‌ను ద్రోహిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలంటూ ఆయనకు కొంతమంది మద్దతు తెలపగా..కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.

    బీసీసీఐ స్పందన ఇదే
    అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రమాణాలకు అనుగుణంగా బీసీసీఐ ఈ లీగ్‌ను నిర్వహిస్తోందని.. ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఈ పరిణామాలపై స్పందించారు. 

    ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ శత్రు దేశమేమీ కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్‌ ప్లేయర్లు ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనబడటం లేదు’’ అని పేర్కొన్నారు. కాబట్టి ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ బరిలో దిగే అవకాశం ఉంది.

    ఎలాంటి ఆదేశాలు రాలేదు
    మరోవైపు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా IANSతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అయితే, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను ఐపీఎల్‌ నుంచి నిషేధించే అంశమై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము’’ అని పేర్కొన్నాయి.
     

    చదవండి: న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. వాళ్లిద్దరికి మొండిచేయి!

Movies

  • ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్‌కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్‌ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్‌లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్‌గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్‌ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. 

    ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్‌లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్‌లో వైరస్‌ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్‌ జోన్‌లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 

     

  • టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల్లో కలిసి పనిచేశారు. ఆ   పరిచయమే వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్లుగా వీరిపై రూమర్స్ వస్తున్నా పట్టించుకోలేదు. చివరికీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఆ రూమర్స్‌ను నిజం చేశారు.

    తాజాగా ఈ నూతన జంట న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్, అభిమానులు సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా..సమంత- రాజ్ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‪‌లో లింగ భైరవి సన్నిధిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

  • టైటిల్‌: మదం
    నటీనటులు: హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి తదితరులు
    నిర్మాతలు: సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్నబాబు), రమేష్ బాబు కోయ
    దర్శకత్వం: వంశీ కృష్ణ మళ్ల
    సంగీతం: డేవ్ జాండ్
    ఎడిటింగ్: నందమూరి తారక రామారావు
    సినిమాటోగ్రఫీ: రవి. వి
    విడుదల తేది: జనవరి 2, 2026

    బిగ్బాస్షో కంటే ముందు ఇనయా సుల్తానా పేరు ఎవరికీ తెలియదు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ఆరో సీజన్లో పాల్గొని..తనదైన ఆటతీరుతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తర్వాత ఆమె పలు సినిమాలు, వెబ్సిరీస్లతో బిజీ అయిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మదం.  రాఅండ్ రస్టిక్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం నేడు(జనవరి 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    సినిమా కథంతా 1980ల నేపథ్యంలో సాగుతుంది. ఓ అవినీతి పోలీసు అధికారి, అతని భార్య స్వార్థం వల్ల  సర్వస్వం కోల్పోయిన ఒక నిరుపేద కుటుంబం యొక్క విషాద గాథ ఇది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో(హర్ష గంగవరపు) ఎలాంటి పోరాటం చేశాడు?, తన అందచందాలతో మగవాళ్లను పావుగా వాడుకునే బోల్డ్లేడీ(ఇనయ సుల్తానా)కి, కథకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హీరో ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..
    'మదం' అనే టైటిల్ వినగానే ఇది కేవలం అడల్ట్ మూవీ అని అనుకుంటే పొరపాటే. ఇది ఒక మహిళా మనస్తత్వాన్ని, సమాజంలోని అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టే సామాజిక చిత్రం. దర్శకుడు ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, కథకు అవసరమైన మేరకే బోల్డ్ సీన్లను ఉపయోగించుకున్నారు. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌ అంతా హీరో ఫ్యామిలీ నేపథ్యం, పోలీసు అధికారి వల్ల వారి కుటుంబానికి వచ్చే కష్టాలను చూపించారు. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఇనయ సుల్తానా పాత్ర ఎంట్రీతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆమెను బోల్డ్‌గా చూపిస్తూనే.. ఫ్లాష్‌బ్యాక్‌ ఏదో ఉంటుందన్న క్యూరియాసిటీని పెంచేశాడు. ఫస్టాఫ్‌లో సిల్లీగా అనిపించే కొన్ని సీన్లకు.. సెకండాఫ్‌లో ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని బోల్డ్‌ సీన్లు..ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథను మరింత బలంగా రాసుకొని.. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.

    ఎవరెలా చేశారంటే..
    ఈ సినిమాకు ప్రధాన బలం ఇనయ సుల్తానా. గటివ్ షేడ్స్ ఉన్న, బోల్డ్ అండ్ అగ్రెసివ్ పాత్రలో ఆమె జీవించేసింది. తెలుగు తెరపై హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు కాకుండా, ఒక ఇంటెన్స్ పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించడం విశేషం. హీరోహర్ష గంగవరపు తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. ఎమోషనల్‌ సీన్లలో బాగా చేశాడు.  అనురూప్, లతా రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈగల్ ఫేమ్ డేవ్‌జాండ్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు యావరేజ్గానే ఉన్నా..బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరగదీశాడు. రవి వి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. గతేడాది డిసెంబర్‌లో ముగిసిన ఈ సీజన్‌లో కామనర్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌ రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్‌-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.

    తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్‌ ఫినాలే అత్యధిక రేటింగ్‌ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్‌స్టార్‌లో 285 మిలియన్‌ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్‌ మా టీవీ రేటింగ్స్‌లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి  ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్‌ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.

     

  • ఎర్రచీరలో కొంటెచూపులతో 'ఫౌజీ' ఇమాన్వి

    అందాల చందమామలా అనుపమ పరమేశ్వరన్

    సెల్ఫీలతో మాయ చేసేస్తున్న కాయదు లోహర్

    బీచ్ ఒడ్డున గ్లామర్‌తో అలరిస్తున్న విష్ణుప్రియ

    గ్లామర్ డోస్ పెంచిన హీరోయిన్ కేతిక శర్మ

  • హిట్టు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాడు హీరో ఆది సాయికుమార్‌. తన కంటే ఎక్కువగా అతడి తండ్రి, నటుడు సాయికుమార్‌ నిరీక్షిస్తున్నాడు. వీరి ఎదురుచూపులకు తెరదించుతూ 2025 ముగింపులో భారీ విజయం సొంతమైంది. శంబాల సినిమాతో ఆది హిట్టు కొట్టాడు. తండ్రి సినీ జర్నీ మొదలై 50 ఏళ్లు పూర్తయిన సమయంలో ఈ సక్సెస్‌ రావడం మరింత విశేషం! 

    వారం రోజుల్లోనే అన్ని కోట్లా?
    శంబాల విషయానికి వస్తే ఆది హీరోగా, అర్చన్‌ అయ్యర్‌ హీరోయిన్‌గా నటించారు. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించగా మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ మూవీ క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. శంబాల సక్సెస్‌తో ఆదికి మంచి బూస్ట్‌ దొరికినట్లయింది! 

     

     

    చదవండి: భార్యకు విడాకులు! మళ్లీ కలిసే ప్రసక్తే లేదు: నటుడు

  • వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.

    ​ఈ చిత్రాన్ని  సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్  మూవీ కథేంటో ‍అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు.


     

  • ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. 'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా హిట్ అందుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'గోదారి గట్టుపైన' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రిలీజ్ ఎప్పుడనేది ఇప్పుడు వెల్లడించలేదు కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: విడాకులు తీసుకుని నాలుగేళ్లు.. మళ్లీ ప్రేమలో పడ్డ 'ఉరి' నటి)

    గోదావరి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఓ క్యూట్ ప్రేమకథ ఇదని తెలుస్తోంది. దీనికి తోడు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో చేసే కామెడీ ఉండనే ఉందని టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరోహీరోయిన్లు కాగా సుదర్శన్, రాజ్ కసిరెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నారు. బహుశా వేసవిలో థియేటర్లలో రిలీజ్ చేస్తారేమో? అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి పేరు తెచ్చుకున్న సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో సినిమా దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

    (ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)

  • పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటోంది ప్రముఖ నటి రోహిణి. మనం పాటించే మంచి అలవాట్లను వారు కూడా అనుసరించేలా చూడాలని చెప్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో రోహిణి పాల్గొంది. ఈ సందర్భంగా తనను కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అని పేర్కొందిం.

    చిన్నప్పటి నుంచే..
    ఆమె ఇంకా మాట్లాడుతూ... సమాజం నాకు స్త్రీ పాత్ర ఇచ్చింది. స్త్రీ అంటే మగాడికన్నా తక్కువ.. వాళ్లంత చదవనవసరం లేదు, వాళ్లకున్న హక్కులు నీకు లేవు అన్నప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సమానత్వం లేదని తెలిసింది. చిన్నప్పటినుంచే ఇలా కూర్చోవాలి, వంట చేయాలి, ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు మా పేరు నిలబెట్టాలని తల్లిదండ్రులు చెప్తుంటారు. కొడుక్కి మాత్రం.. ఈ పని చేయొద్దు, ఆడదే చేస్తుంది అని అమ్మ చెప్తుంది. 

    జీతాల్లేని శ్రామికులం
    అలా కాకుండా.. మీ ఇద్దరూ కలిసి పనిచేయాలిరా అని అమ్మ చెప్పి పెంచితే ఎంత బాగుంటుంది. సమాజంలోని ఎన్నో విషయాలను సరిచేసే శక్తి మహిళకు ఉంది. అహోరాత్రులు ఇంట్లో శ్రమించే ఆడవాళ్ల గురించి పట్టించుకోవాలి. మనం జీతాల్లేని శ్రామికులం. పుట్టుకతోనే శ్రామికులం. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది. ఆడదాని చేత్తో వండితేనే అన్నం అవుతుందా? అబ్బాయిలకు కూడా అన్నీ నేర్పండి.

     మా అబ్బాయికి కూడా..
    సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. దీనివల్ల యువత పక్కదారి పడుతుంది. ఈ డ్రగ్స్‌ నియంత్రణ కోసం పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి. బట్టలు వేసుకునే బయటకు వెళ్లాలి.. ఒంటిపై డ్రెస్‌ లేకుండా వెళ్లకూడదని పిల్లలకు చిన్నప్పుడే చెబుతున్నాం.. దాన్ని అలవాటు చేశాం. ఇక్కడ ఆడవాళ్లం చీరలు కట్టుకుంటాం. లండన్‌లో షార్ట్స్‌, స్కర్ట్స్‌,గౌన్‌ వేసుకుంటారు. మన అలవాట్లనే పిల్లలకు నేర్పించి మంచిదోవ పట్టించాలి. మా అబ్బాయికి కూడా అదే చెప్తుంటాను. చెడు అలవాట్ల వల్ల వచ్చే కష్టనష్టాలను చెప్పి దానిజోలికి వెళ్లకుండా చూసుకోవాలి అని రోహిణి చెప్పుకొచ్చింది.

    చదవండి: కల్యాణి కంటే ముందు ఆ హీరోయిన్‌కు లోక ఆఫర్‌

  • నెల క్రితం సమంత రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈమె అనే కాదు గతంలోనూ పలువురు హీరోయిన్లు విడాకులు తీసుకున్న కొన్నేళ్లకు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో బ్యూటీ చేరింది. కొత్త ఏడాది సందర్భంగా తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి వీడియోని కూడా పంచుకుంది.

    (ఇదీ చదవండి: సమంత హనీమూన్ ట్రిప్.. ఫొటోలు వైరల్!)

    యాడ్స్‌లో నటించి కెరీర్ ప్రారంభించిన కీర్తి కల్హారీ.. తర్వాత బాలీవుడ్‌లోనూ పింక్, ఉరి, షైతాన్, మిషన్ మంగళ్ తదితర సినిమాలు చేసింది. క్రిమినల్ జస్టిస్, హ్యుమన్, ఫోర్ మోర్ షాట్స్ తదితర వెబ్ సిరీస్‌ల్లోనూ కీలక పాత్రలు చేసి పేరు సొంతం చేసుకుంది. ఈమెనే ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేసింది. 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్‌లో తన సహనటుడు రాజీవ్ సిద్ధార్థ్‌తోనే ప్రేమలో పడింది. గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని అధికారికం చేసేశారు.

    కీర్తి కల్హారీ గతంలో సాహిల్ సెహగల్‌ అనే నటుడిని 2016లో పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2021లో వీళ్లిద్దరూ విడిపోయారు. గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న కీర్తి ఇప్పుడు రాజీవ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. చూస్తుంటే త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతారనిపిస్తోంది. కొత్త జంటకు తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే 'ఫోర్ మోర్ షాట్స్' సిరీస్ చివరి సీజన్ గత నెల 19న స్ట్రీమింగ్ అయింది. ఆ సిరీస్ ఇలా అయిపోయిందో లేదు వీళ్లు తమ బంధాన్ని బయటపెట్టేశారు.

    (ఇదీ చదవండి: 'స్ట్రేంజర్ థింగ్స్' ఓవరాల్ రివ్యూ.. పదేళ్ల పాటు సాగిన సిరీస్)

  • నటి,వివాదాలతో వార్తల్లో నిలిచే బ్యూటీ క్వీన్‌  ఊర్వశి రౌతేలా తన తల్లి మీరా రౌతేలా పుట్టిన రోజును ఘనంగా నిర్వహించింది.  ప్రపంచంలోనే అతి పెద్ద హెటల్‌, 24 క్యారెట్ల బంగారు కిరీటం, గోల్డ్‌ కేక్‌ లాంటి విశేషాలతో గుర్తుండిపోయేలా వేడుక చేసింది. దీనికి సంబంధించిన వీడియో,ఫోటోలను  ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

    ప్రపంచంలోని  ఎత్తైనహోటల్‌లో 24 క్యారెట్ల బంగారు కిరీట కేక్‌తో అమ్మ పుట్టినరోజు వేడుక.. మేం అందరం నిన్ను ప్రేమిస్తున్నాం.  వరల్డ్‌ టాలెస్ట్‌ హోటల్‌,ప్యూర్‌ రాయల్ గోల్డ్ క్రౌన్ కేక్,ప్యూర్‌ లవ్‌’’అంటూ ఊర్వశి పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు, ఊర్వశిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

    ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

    విలాసవంతమైన వేడుకలో మూడు లేయర్ల బంగారు రంగు కేక్‌ ఒ‍క ఆకర్షణ అయితే, 24 క్యారెట్ల బంగారంతో చేసిన కిరిటాన్ని ఊర్వశి తన తల్లి తలపై ఉంచడం మరో ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందంగా ముస్తాబైన మీరా నవ్వుతూ, తన కుమార్తె స్వచ్ఛమైన ఆప్యాయత అనురాగాలను మురిసిపోయింది. కాగా ప్రతీ ఏడాది  తల్లి బర్త్‌డే ఘనంగా నిర్వహించడం ఊర్వశికి అలవాటు. ఊర్వశి కలాజికల్ హారర్ చిత్రం కసూర్ 2 , వెల్‌కమ్ టు ది జంగిల్‌లలో నటించనుంది.  గ్లెన్ బారెట్టో దర్శకత్వంలో ఆమె అఫ్తాబ్ శివదాసాని, జాస్సీ గిల్‌తో కలిసి నటిస్తోంది. 

     

    ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థికి ఏకంగా రూ. 2.5 కోట్ల ఆఫర్‌, రికార్డ్‌

  • ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ మూవీ రిలీజ్‌కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.

    అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ ‍స్టార్స్‌ రెమ్యునరేషన్‌పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్‌ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్‌ తన రెగ్యులర్‌ రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్‌ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.

    ఎవరికి ఎంతంటే?

    మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్‌ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్‌ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. 
     

  • మలయాళ ఇండస్ట్రీని షేక్‌ చేసిన చిత్రం లోక. కల్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్‌ ఉమెన్‌ చిత్రం లోక. డామినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొత్త లోక: చాప్టర్‌ 1 పేరిట తెలుగులో విడుదలైంది. ఈ సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాతగా వ్యవహరించాడు. 2025 ఆగస్టులో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా కల్యాణి ప్రియదర్శన్‌ కంటే ముందు పార్వతి తిరువోతును సంప్రదించినట్లు ఓ రూమర్‌ ఉంది.

    హీరోయిన్‌ అసహనం
    తాజాగా ఈ రూమర్‌పై పార్వతి సీరియస్‌ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ప్రతమదృష్ట్య కుట్టకర్‌. ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు పార్వతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్‌ వచ్చిందా? అన్న ప్రశ్న ఎదురైంది. దానికామె స్పందిస్తూ.. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం. మీరు ఇలాంటివి చాలా వింటుంటారు. మీకు నచ్చింది వినుకోండి అని బదులిచ్చింది.

    చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలిస్తా: నటికి బంపరాఫర్‌

  • గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'స్ట్రేంజర్ థింగ్స్' గురించే మాట్లాడుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఈ వెబ్ సిరీస్‌ చూసిన వాళ్లకు కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలియని వాళ్లకు దీని గురించి వివరించాలంటే ఇదో ఫాంటసీ థ్రిల్లర్ అడ్వెంచరస్ సిరీస్. 2016లో మొదలై 2026లో ముగిసింది. న్యూఇయర్ సందర్భంగా చిట్టచివరి ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌కి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంటుంది? ఎందులో చూడొచ్చు? అనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: బిగ్‌ స్కామ్‌పై వెబ్‌ సిరీస్‌.. విడుదలకు లైన్‌ క్లియర్‌)

    కథేంటి?
    అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో అందరూ కలిసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడతారు. పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్తారు. విలియమ్ అలియాస్ విల్‌ మాత్రం కనిపించకుండా పోతాడు. ఇంతకీ విల్ ఏమయ్యాడు? మరోవైపు ఫ్రెండ్ కోసం వెతుకుతుండగా.. మిగిలిన ముగ్గురు పిల్లలకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గతమేంటి? విల్‌ని కనిపెట్టడంలో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    సినిమాలు చూడటం మనకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. 2-3 గంటల్లో ఇవి ముగిసిపోతాయి. కాకపోతే కొన్నేళ్లుగా పెరిగిన ఓటీటీ కల్చర్ వల్ల పరభాషా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనకు పరిచయమయ్యాయి. అలాంటి వాటిలోని ఓ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్'. తెలుగు ప్రేక్షకుల్లో దీన్ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఎందుకంటే 2016 నుంచి ఇది సీజన్ల వారీగా స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. లాక్‌డౌన్ టైంలో దీనికి మన దేశంలోనూ విపరీతమైన పాపులారిటీ వచ్చింది.

    ఇదో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్. ఓ చిన్న గ్రామంలో నలుగురు పిల్లలకు ఓ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి స్నేహం ఏర్పడితే తర్వాత ఏమైందనేదే స్టోరీ లైన్. కాకపోతే పిల్లాడు తప్పిపోవడంతో మొదలయ్యే ఈ సిరీస్.. తర్వాత అనుహ్యమైన మలుపులు, అద్భుతమైన సన్నివేశాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మర్చిపోలేని పాత్రలు.. ఇలా ప్రతి దశలోనూ ఆశ్చర్యపరుస్తుంది. చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యాలా ఉండటం ఈ సిరీస్ స్పెషాలిటీ.

    పదేళ్ల పాటు సాగిన ఈ సిరీస్‌లో మొత్తంగా 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాల పాటు ఉంటుంది. నాలుగో సీజన్‌లో మాత్రం ఎపిసోడ్ యావరేజ్ గంట 10 నిమిషాలు. రీసెంట్‌గా రిలీజైన ఐదో సీజన్‌లోనూ ఒక్కో ఎపిసోడ్ గంటకు పైనే నిడివితో ఉంటుంది. జనవరి 1న స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఫినాలే ఎపిసోడ్ అయితే ఏకంగా 2 గంటలు ఉంది.

    మిగిలిన సిరీస్‌ల కంటే 'స్ట్రేంజర్ థింగ్స్' ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం స్టోరీ చెప్పిన విధానం. ఇందులో డార్క్ హారర్ ఎలిమెంట్స్, ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు కొదవలేదు. తొలి మూడు సీజన్లలో హారర్ అంశాలు ఓ రేంజులో ఉంటే నాలుగో సీజన్‌లో అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్స్ అనే కాదు సౌండ్, పాత్రలు, నిర్మాణ విలువలు ఒకటేమిటి ఇలా సిరీస్‌లోని ప్రతి అంశం ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా విలన్ వెక్నా, మైండ్ ఫ్లయిర్‌ని చూస్తే భయమేస్తుంది.

    ఈ సిరీస్ అంతా కూడా 80ల్లో జరుగుతుంది. అందుకు తగ్గట్లే అప్పటి పరిస్థితులు, దుస్తులు, వస్తువులు.. ఇలా ప్రతి ఒక్క దాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం బడ్జెట్ రూ.5000-6000 కోట్ల పైనే ఉంటుంది! వ్యూస్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. ఇ‍ప్పటికీ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ బూతులు ఎక్కువ. వీలైతే ఇంగ్లీష్ వెర్షన్‌లోనే చూడండి. ఈ సిరీస్‌ని మీరు ఒక్కసారి చూడటం మొదలుపెట్టారంటే అయిపోయేంతవరకు అస్సలు ఆపరు.

    గత నెలరోజుల్లో చిట్టచివరిదైన ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేశారు. తొలి నాలుగు సీజన్లు వావ్ అనేలా ఉంటాయి. చివరి దానిలో మాత్రం వావ్ ఫ్యాక్టర్స్ కంటే వీలైనంత ఎమోషనల్ కంటెంట్ ఉండేలా దర్శకద్వయం ఢప్పర్ బ్రదర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సిరీస్‌కి ఎలాంటి ముగింపు ఇస్తారా అని అందరూ ఎదురుచూశారు. కానీ చాలా సింపుల్‌గా తేల్చేయడం ఈ సిరీస్ ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. ప్రస్తుతానికైతే భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎలెవన్ పాత్ర చనిపోయిందా? బతికుందా అనే విషయాన్ని ప్రేక్షకులకే వదిలేశారు.

    ఐదో సీజన్లలో ఈ సిరీస్‌ని ముగించారు. కానీ దీనికి 'స్పిన్ ఆఫ్' ఉంటుందని దర్శకద్వయం చెప్పుకొచ్చారు. దీని పేరు కూడా 'స్ట్రేంజర్ థింగ్స్' అనే పెడతామని క్లారిటీ ఇచ్చారు.  ఇప్పటివరకు వచ్చిన సిరీస్ 1980ల్లో హాకిన్స్ అనే ఊరిలో జరిగింది. స్పిన్ ఆఫ్‌లో భాగంగా ప్రస్తుత కాలంలో మరో ఊరిలో జరిగే కథతో కొత్త సిరీస్ తీయబోతున్నారు.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: 'రంగస్థలం'లో ఆ పాట సుకుమార్‌కి నచ్చలేదు.. ఎవరూ ఏడవకపోవడంతో)

  • మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్‌ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్‌ పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్‌ ఈ పాటకు మరింత ‍‍స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్‌రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు.

  • ఈ ఏడాది విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ కింగ్‌డమ్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కింగ్డమ్‌ మూవీ   ఈ ఏడాది జులైలో  విడుదలైన సంగతి తెలిసిందే. ‍అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడంతో విఫలమైంది. సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

    అయితే ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని విజయ్ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. కొన్ని నెలలుగా కింగ్‌డమ్ పార్ట్‌-2పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగా ఆగిపోయిందని చాలాసార్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది.

    ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కింగ్‌డమ్-2 సీక్వెల్‌ ఆలోచన తమకు లేదని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో తమ సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేశారు నిర్మాత. అయితే తాము గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం గౌతమ్ మరో మూవీతో బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత మాతో కలిసి పనిచేస్తారని నాగవంశీ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ కింగ్‌డమ్‌-2 గురించి ఆశలు వదులుకోవాల్సిందే.

    ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం 'రౌడీ జనార్ధన మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 2026లోనే విడుదల కానుంది.

     

     

     

     

  • పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరి చేయి మరొకరు జీవితాంతం విడవమని చెప్తుంటారు. కానీ ఇప్పుడంతా రివర్స్‌లో జరుగుతోంది. చాలామంది దంపతులు కొన్ని నెలలకే విడిపోతుంటే మరికొందరు మాత్రం పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. మలయాళ బుల్లితెర జంట మను వర్మ- సింధు వర్మ ఈ కోవలోకే వస్తారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు.

    మళ్లీ కలిసే ప్రసక్తే లేదు
    ఈ విషయం గురించి మను వర్మ మాట్లాడుతూ.. నేను, నా భార్య కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నాం. చట్టపరంగా విడాకులు ఇంకా మంజూరు కానప్పటికీ మేము మళ్లీ కలిసే అవకాశాలు చాలా తక్కువ. మళ్లీ జంటగా జీవితాన్ని కొనసాగించే అవకాశం, ఆలోచన ఎంత మాత్రం లేదు. మాకంటే ఎక్కువ ప్రేమించుకున్నవాళ్లు, జంటగా కలిసున్నవాళ్లు కూడా విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. 

    లోపించిన సఖ్యత
    మూడేళ్ల క్రితం మేమిద్దరం ప్రేమగానే కలిసిమెలిసున్నాం. కానీ కొంతకాలానికే అంతా రివర్స్‌ అయిపోయింది. మా మధ్య సఖ్యత లేనప్పుడు కష్టంగా కలిసుండటం కన్నా విడివిడిగా జీవించడమే మంచిది. విదేశాల్లో దంపతులు విడిపోయినా వారి మధ్య స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అది కేరళలోనూ అవలంబిస్తే బాగుంటుంది. 

    ముగ్గురు పిల్లలు
    ఇక్కడ విడిపోయిన జంట మళ్లీ తారసపడ్డారంటే ఒకరిని మరొకరు ఎద్దేవా చేసుకుంటూ అవతలి వారి పరువు తీయడానికే ప్రయత్నిస్తుంటారు. మాకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దవాడు అమెరికాలో ఐటీ ఇంజనీర్‌ కాగా రెండో కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. మాకో కూతురుంది. తనకు ఆరోగ్య సమస్యలున్నాయి అని చెప్పుకొచ్చాడు. 

    సీరియల్స్‌, సినిమా
    దివంగత నటుడు జగన్నాథ వర్మ కుమారుడే మను వర్మ. మను వర్మ.. కాదమట్టతు కథనార్‌, పోక్కాలం వరవై, కుంకుమచెప్పు వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. అలాగే మమ్ముట్టి 'నీలగిరి', జయరామ్‌ 'నరనాతు తంపురాన్‌' సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు. సింధు వర్మ విషయానికి వస్తే ఎటో జన్మ కల్పనయిల్‌, పంచాంగి వంటి సీరియల్స్‌ చేసింది. మమ్ముట్టి 'సీబీఐ 5: ద బ్రెయిన్‌', 'అర్థం' చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.

    చదవండి: మూడో భార్యగా వస్తావా? నెలకు రూ.11 లక్షలు: నటికి ఆఫర్‌

  • 'రంగస్థలం'.. రామ్ చరణ్ కెరీర్‌లో మైలురాయి లాంటి సినిమా. అప్పటివరకు ఉన్న ఇమేజీని ఒక్కసారిగా మార్చేసింది. ఎంత మంచి నటుడో అందరికీ తెలిసేలా చేసింది. ఈ మూవీలో క్లైమాక్స్‌ ముందొచ్చే 'ఒరయ్యో' అనే సాంగ్.. ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకునేలా చేసింది. అయితే ఈ పాట, దర‍్శకుడు సుకుమార్‌కి తొలుత అస్సలు నచ్చలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత చంద్రబోస్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ గీతం వెనకున్న గమ్మత్తయిన సంఘటనల్ని బయటపెట్టారు.

    ''రంగస్థలం' కోసం నాలుగు రోజుల్లో నాలుగు పాటలు సిద్ధం చేశాం. సుకుమార్ మరో పాట కూడా కావాలనేసరికి.. ఇంత వేగంగా వద్దులేండి. మళ్లీ దిష్టి తగులుతుందేమో అని ఆయనతో అన్నాను. లేదు రాయాల్సిందే అని చెప్పడంతో 'ఒరయ్యో..' పాట రాశాను. ఇది మొదట్లో సుకుమార్‌కి నచ్చలేదు. ఈ విషయాన్ని నాకు తెలియనివ్వలేదు. అప్పటికే షూటింగ్ దగ్గర పడింది. దీంతో పాటలో సీన్స్ తీస్తున్నప్పుడు విషాద వాతావరణం ఉండటం కోసం తమిళ, మలయాళ పాటల్ని ప్లే చేశారు. కానీ సెట్‌లో ఒక్కరు కూడా ఏడవలేదు. పైపెచ్చు నవ్వుకున్నారు. ఎంతకీ ఎమోషన్ రాకపోయేసరికి చివరగా 'ఒరయ్యో..' పాట పల్లవిని ప్లే చేశారు. దీంతో అందరికీ దుఖం పొంగుకొచ్చింది. సుకుమార్‌కి ఈ పాటలో విషయం ఉందనేది అర్థమైంది' అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు.

    (ఇదీ చదవండి: పిల్లల్ని కనాలనే ఆలోచన నాకు లేదు: వరలక్ష‍్మి శరత్ కుమార్)

    'షూటింగ్ చేస్తున్నప్పుడు పల్లవితో మేనేజ్ చేశాం. అయితే పాటంతా రాయడం పూర్తి చేసిన తర్వాత దేవి, సుకుమార్‌కి వినిపించా. ఆ టైంలోనే దేవి తండ్రి, సుకుమార్ తండ్రి చనిపోయారు. దీంతో పాటలో పల్లవి, చరణాలు వినిపిస్తున్నప్పుడు ప్రతిఒక్కరం ఎమోషనల్ అయ్యాం. చివరగా దేవి.. ఈ పాట నన్నే పాడమని అన్నాడు. వద్దులేండి ఎవరైనా ప్రొఫెషనల్ సింగర్‌తో పాడించండి అని చెప్పా. లేదు మీ వాయిస్ బాగుంటుందని నాతో పాడించాడు. 45 నిమిషాల్లో ఈ పాట పాడేశాను. తర్వాత ఇంత తర్వగా పాడటం పూర్తి చేశానేంటి అని ఆశ్చర్యపోయాను' అని చంద్రబోస్ అప్పటి అనుభవాన్ని బయటపెట్టారు.

    పాట సందర్భం విషయానికొస్తే.. అప్పటివరకు చిట్టిబాబు(రామ్ చరణ్), కుమార్ బాబు(ఆది పినిశెట్టి) సరదాగా ఉంటారు. సడన్‌గా కుమార్ బాబు పాత్ర చనిపోతుంది. సరిగ్గా అప్పుడు ఈ గీతం వస్తుంది. 'ఈ సేతితోనే పాలు పట్టాను.. ఈ సేతితోనే బువ్వ పెట్టాను.. ఈ సేతితోనే తలకు పోశాను.. ఈ సేతితోనే కాళ్లు పిసికాను.. ఈ సేతితోనే పాడే మొయ్యాలా.. ఈ సేతితోనే కొరివి పెట్టాలా.. ఓరయ్యో.. నా అయ్యా..' అనే లిరిక్స్‌తో సాంగ్ ఉంటుంది. సినిమా హిట్ విషయంలో చరణ్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ ఎలాంటి పాత్ర పోషించాయో.. ఈ గీతం కూడా అంతే ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాంటి పాట సుకుమార్‌కి మొదట నచ్చలేదని చంద్రబోస్ చెప్పడం ఆసక్తికకరంగా అనిపించింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆది పినిశెట్టి' కొత్త సినిమా.. నెలలోనే స్ట్రీమింగ్‌)

  • మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది  రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు.

    ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్‌ గారు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్‌ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించింది.

     

  • ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్‌’ మరో వారం రోజుల్లో(జనవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి పక్కా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తానని దర్శకుడు మారుతి ముందే హామీ ఇచ్చారు. తేడా వస్తే..ఇంటికొచ్చి అడగొచ్చు అంటూ అడ్రస్కూడా చెప్పాడు. మారుతి(Director Maruthi) ఇలాంటి ప్రకటనలు చేయడం వెనక కారణం ఉంది. ఆయన ప్రభాస్తో సినిమా ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ఆందోళన వ్యక్తం చేశారు

    Prabhas The Raja Saab Movie HD Stills2

    సోషల్మీడియాలో ట్రోల్కూడా చేశారు. వారికి భరోసా ఇచ్చేందుకు మారుతి అలాంటి ప్రకటనలు చేశాడు. అయినా కూడా ఇండస్ట్రీలో కొంతమంది ది రాజాసాబ్‌(The Raja Saab) ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నారట. తాజాగా ఇంటర్వ్యూలో యాంకర్ఇదే విషయాన్ని మారుతి దగ్గర ప్రస్తావిస్తూ.. వాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు’ అని ప్రశ్నించారు. దీనికి మారుతి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కొంతమంది జెలసీతోనే అలా కోరుకుంటున్నారని.. వారికి తన సినిమాతోనే సరైన సమాధానం చెబుతానన్నారు.

    Prabhas The Raja Saab Movie HD Stills8

    ఈర్ష్య, అసూయ మానవ నైజం. నాకు భారీ హిట్పడితే.. ఎక్కడ బిజీ అయిపోతాడేమోననే భయంతో కొంతమంది అలా కోరుకుంటున్నారు. నేను ఇప్పుడు చిన్న చిన్న సినిమాల ఈవెంట్స్కి కూడా వెళ్తున్నాను. రాజాసాబ్హిట్అయితే.. ఇలాంటి ఈవెంట్లకు రానేమో అని వాళ్లు భయపడుతున్నారు. నాకు ఫెయిల్యూర్వస్తే.. వాళ్లకు అది ఫుడ్పెట్టదు. కానీ జెలసీతో అలా కోరుకుంటున్నారు

    Prabhas The Raja Saab Movie HD Stills13

    ఈసారి కిందపడితే కొన్నాళ్ల పాటు కోలుకోలేడని వాళ్లు అనుకుంటున్నారు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు. హిట్వచ్చినా..ఫ్లాప్వచ్చిన మరో సినిమా తీస్తా. ప్రభాస్తో సినిమా తీశా కదా అని ఇకపై పెద్ద సినిమాలు మాత్రమే తీయాలనే కోరికలు నాకు లేదు. రాజాసాబ్తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీసేస్తా. నా కథకి హీరో సెట్అయితే హీరోతో వెళ్లిపోతా. బిజీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాఅని మారుతి చెప్పుకొచ్చాడు.

  • ఈ వీకెండ్ థియేటర్లలో సైక్ సిద్ధార్థ్, వనవీర, 45 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు రిలీజయ్యాయి. కానీ వీటిలో ఏది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి. క్రిస్మస్‌కి వచ్చిన చిత్రాల్నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరోవైపు న్యూఇయర్ సందర్భంగా చాలా కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇప్పుడు దానిలోకి మరో వార్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా చేరింది.

    (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్‌?)

    బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్.. చాన్నాళ్ల తర్వాత హీరోగా చేసిన సినిమా '120 బహదూర్'. 1962లో భారత్-చైనా మధ్య జరిగిన రెజాంగ్ లా యుద్ధ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. నవంబరు 21న థియేటర్లలో రిలీజైంది. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా చేసింది. ఇప్పుడీ మూవీ ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరో రెండు వారాల్లో ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

    '120 బహదూర్' విషయానికొస్తే.. మేజర్ షైతాన్ సింగ్ భాటి(ఫర్హాన్ అక్తర్).. తన 120 మంది సైనికులతో ఇండియా-చైనా బోర్డర్‌లో ఎలాంటి యుద్ధం చేశాడు.  మూడు వేల మంది చైనా సైనికుల్ని ఎలా నిలువరించాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. యుద్ధ తరహా సినిమాలంటే ఇష్టముండే వాళ్లకు ఇది నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు రొటీన్‌గానే అనిపించొచ్చు. స్టోరీ తెలిసిందే అయినప్పటికీ.. విజువల్స్, యాక్టింగ్ పరంగా ప్రశంసలు దక్కాయి.

    (ఇదీ చదవండి: సాయిపల్లవి కొత్త సినిమా.. స్టార్ హీరో వల్లే ఆలస్యం?)

Family

  • వన్స్ అపాన్‌ ఏ టైమ్‌... లవ్‌ స్టోరీలు కావచ్చు... జస్ట్‌ నిన్న మొన్నటి లవ్‌స్టోరీ కావచ్చు... లవ్‌స్టోరీలు ఎప్పుడూ హాట్‌ కేకులే! తాజా విషయానికి వస్తే... బిహార్‌కు చెందిన ఇంజినీర్‌ రాహుల్‌ కుమార్‌ లవ్‌స్టోరీకీ నెటిజనులు ఫిదా అయ్యారు. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ అయిన రాహుల్ జపాన్‌లోని ఆటోమొబైల్‌ కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. టోక్యోలో జరిగిన అంతర్జాతీయ వ్యాపార సమావేశంలో జపనీయురాలైన మెరీనాతో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా, పెళ్లిగా మారింది.

    ‘నా జీవితంలోని కీలకమైన మలుపు టోక్యోలో జరిగిన వ్యాపార సమావేశంలో మొదలవుతుందని ఊహించలేదు. మేము మొదట స్నేహితులం. స్నేహం నమ్మకంగా పరిణామం చెందింది, ఆ నమ్మకం ప్రేమగా వికసించింది. వేరు వేరు దేశాల నుంచి వచ్చినప్పటికీ ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవడంప్రారంభించాం’ అని రాశాడు రాహుల్‌.

    మొదట్లో వీరి పెళ్లికి ఇరుపక్షాల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ ఆ తరువాత పచ్చజెండా ఊపారు. పెళ్లి వేడుకలు దిల్లీలో, రిసెప్షెన్‌ దిల్లీలో జరిగింది. ఆ తరువాత వీరు బిహార్‌లోని మాదేపుర గ్రామానికి వెళ్లారు. అది రాహుల్‌ కుమార్‌ స్వగ్రామం. ‘నమస్తే ఇండియా. ఐయామ్‌ మెరీనా యాదవ్‌’ అని తనను తాను పరిచయం చేసుకున్న మెరీనా తమ లవ్‌ స్టోరీ (Love Story) ఎలా ప్రారంభమైందో వివరించింది. మొత్తానికైతే వీరి వివాహ వేడుక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

    చ‌ద‌వండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం
     


     

  • ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇటీవల కశ్మీర్‌కు వెళ్లాడు. అరు అనే గ్రామంలో క్రికెట్‌ ఆడుతున్న ఓ బాలిక దగ్గరకు వెళ్లి పలకరించాడు.

    మాటల్లో ‘స్మృతి మంధాన అంటే నాకు ఇష్టం. ఆమెలా ఆడాలనుకుంటున్నాను’ అని చెప్పింది.
    ఆ బాలిక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి...

    ‘కశ్మీర్‌కు వెళ్లిన ప్రతిసారీ నా కెమెరా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తూనే ఉంటుంది. ఈసారి అద్భుతం... ఆరు గ్రామంలోని బాలిక. తాను భవిష్యత్తులో స్మృతి మంధాన కావాలనుకుంటుంది. స్మృతి ఈ పోస్ట్‌ చూస్తుందని ఆశిస్తున్నాను’ అని రాశాడు ఖాన్‌.

    అతడు ఆశించినట్లే... స్మృతి ఈ పోస్ట్‌ చూసి సంతోషించింది. ఒక మెసేజ్‌ ద్వారా ఆ కశ్మీర్‌ బాలికకు బిగ్‌ హగ్‌ ఇచ్చింది! ‘ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని రాసింది.

    చ‌ద‌వండి: ఏం చేశావ్ బ్రో.. చూపు తిప్పుకోలేక‌పోయాం

    మారుమూల గ్రామాల్లోని పిల్లలకు ఆడాలనే తపన తప్ప, క్రికెట్‌కు సంబంధించి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. అయితే వారిలో ప్రతిభ ఉంటే, ఆ ప్రతిభ వారిని ఎక్కడికో తీసుకెళుతుందని చరిత్ర చెబుతూనే ఉంది! 
     

  • స్వచ్ఛనగరంగా వరుసగా ఎనిమిదేళ్లపాటు వరుసగా అవార్డులు అందుకున్న ఇండోర్‌లో జరిగిన ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తాగునీటిలో కలుషిత నీరు కలిసి వేల మంది అస్వస్థతకు గురికావడంతో ఆ అవార్డులపైనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ ఘటనలో పసికందులతో పాటు పెద్దలూ ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం సంగతి ఎలా ఉన్నా..  తాగునీటి భద్రత ఎంత ముఖ్యమో చెబుతూ మన చేతుల్లో ఉన్న జాగ్రత్తలనూ ఈ ఉదంతం మనకు గుర్తు చేస్తోంది.

    మంచి నీరు ఆరోగ్యానికి రక్షణ కవచం. కొన్ని సాధారణ.. అత్యవసరమైన సూచనలు పాటించడం ద్వారా ఆ కవచాన్ని మనం కాపాడుకోవచ్చు. అందులో మొదటిది.. చాలా ఇళ్లలో చేసేది.. 

    • తాగేముందు నీటిని బాగా మరిగించడం. ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులను నాశనం చేస్తుందిA. 

    • ఫిల్టర్ లేదంటే శుద్ధి పద్ధతులు.. మార్కెటలో దొరికే రకరకాల ఫిల్టర్లను ఉపయోగించొచ్చు. లేదంటే క్లోరినేషన్ తరహా నీటి శుద్ధి పద్ధతులు ఉపయోగించడం మంచిది. తద్వారా నీటిలోని హానికర సూక్ష్మజీవులు, రసాయనాలు తొలగిపోతాయి.

    • తాగే నీటిని నీటిని శుభ్రమైన పాత్రల్లో నిల్వ చేయాలి. మూత ఉన్న కంటైనర్‌లో ఉంచడం ద్వారా దుమ్ము, పురుగులు, ఇతర కలుషితాలు చేరకుండా ఉంటుంది.

    • వ్యక్తిగత శుభ్రత కూడా ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. తాగునీటిని తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గ్లాసులు, బాటిళ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

    • అత్యవసర పరిస్థితుల్లో.. ప్రభుత్వం లేదంటే స్థానిక సంస్థలు కలుషిత నీటి హెచ్చరికలు జారీ చేసినప్పుడు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని మాత్రమే వినియోగించాలి. వాటని వేడి చేసి తాగాలనే ప్రయత్నమూ అంత మంచిది కాకపోవచ్చు. 

    • డయేరియా, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది.

    నీటిని మరిగించడం, శుద్ధి పద్ధతులు ఉపయోగించడం, నిల్వలో పరిశుభ్రత పాటించడం, వ్యక్తిగత హైజీన్ కాపాడుకోవడం.. పైన చెప్పుకున్నవన్నీ కలుషిత నీటి ప్రమాదాల నుండి రక్షణ కలిగించే సాధారణ కానీ అత్యంత ప్రభావవంతమైన చర్యలు. నీరు సురక్షితంగా ఉంటేనే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

Andhra Pradesh

  • తాడేపల్లి : అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్‌ రెడ్డిపై టీడీపీ గూండాల చేసిన దాడిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు.  ప్రస్తుతం విజయప్రతాప్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన తండ్రితో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రతాప్‌రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీశారు వైఎస్‌ జగన్‌. 

    ఈ క్రమంలోనే టీడీపీ గూండాల దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారం అండతో వారు చేస్తున్న దాడులను తిప్పికొడదామన్నారు వైఎస్‌ జగన్‌. కూటమి ప్రభుత్వంపై వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 

    ‘ఈ అనైతిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కూటమి పార్టీలకు తగిన బుద్ది చెబుతారు. వైఎస్సార్‌సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి. అందరికీ పార్టీ అండగా ఉంటుంది. రాజకీయాలు ఇంతలా దిగజారిపోవడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వారందరికీ తగిన గుణపాఠం చెబుదాం’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 

    కాగా,నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్‌ బరితెగించింది.  న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.  ఈ దాడిలో ప్రతాప్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

  • తిరుపతి: జిల్లాలోని చందరగిరి మండలం కొత్తశానంబట్లలో ఏర్పాటు చేసిన జల్లికట్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎద్దులు ఒక్కసారిగా  అక్కడున్న వారిపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్పల్ప గాయాలయ్యాయి.  ఆ ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

    జల్లికట్టు పోటీలో పాల్గొన్న ఎద్దు ఒక్కసారిగా దాడి చేయడంతో  అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది  ఈ పోటీలకు అధికారిక అనుమతి ఉందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.  జల్లికట్టు ప్రధానంగా తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సాంప్రదాయ పోటీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా పశువుల పండుగ పేరుతో  జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. తిరుపతి ఘటనలో కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • సాక్షి, విజయవాడ:  మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జోగీ రమేష్‌పైకు డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సందర్భంగా జోగి రమేష్‌ను కలిసేందుకు వచ్చిన భార్య, కుమారుడితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు అందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష‍ సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జోగి రమేశ్‌ను అరెస్టు చేసింది.

    జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు
  • సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  విజయవాడ మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసు నమోదైంది.

    ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. 

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్‌ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్‌,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్‌ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్‌ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు.  

    సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.

    సీసీ కెమెరాలు
    సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.

    ఇళ్ల భద్రతా చర్యలు  
    ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

    వాహనాల భద్రత  
    విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్‌ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.

    టెక్నాలజీ ఆధారిత భద్రత  
    ఇళ్లలో టైమర్‌తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్‌లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్‌మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి

    సోషల్ మీడియాతో తస్మాత్‌ జాగ్రత్త   
    ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • హైద‌రాబాద్: మారిష‌స్ దేశానికి చెందిన 55 ఏళ్ల మ‌హిళ‌కు ఉన్న‌ట్టుండి షుగర్ లెవల్స్ త‌గ్గిపోయేది. అప్ప‌టిక‌ప్పుడు ఏమైనా తింటే స‌రే.. లేక‌పోతే క‌ళ్లు తిరిగి ప‌డిపోయేవారు. ఏంటా అని అక్క‌డి వైద్యుల‌కు చూపిస్తే, ఆమెకు పాంక్రియాస్ (క్లోమం)లో అరుదైన క‌ణితి (ఇన్సులినోమా) ఉంద‌ని తేలింది. సంక్షిష్టమైన శస్త్రచికిత్స కావడంతో అక్క‌డి వైద్యులు దానికి శ‌స్త్రచికిత్స చేయ‌డం మారిష‌స్‌లో సాధ్యం కాద‌ని, హైద‌రాబాద్ పంపారు. ఇక్క‌డ కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో ఆమెకు చికిత్స అందించిన క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్, రోబోటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ సీహెచ్ న‌వీన్ కుమార్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

    “ఆ మ‌హిళ నేరుగా కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. సాధార‌ణంగా పాంక్రియాస్‌లో క‌ణితుల‌ను తొల‌గించ‌డం చాలా సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. ఎందుకంటే, పాంక్రియాస్‌కు కుట్లు వేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఆమెకు ఇన్సులినోమా అనే ర‌కం క‌ణితి ఉన్న‌ట్లు గుర్తించాం. మా బృందంతో పాటు అనస్థీషీయా బృందం డా. వీరభధ్ర రావు తో కలిసి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను కేవలం లాప్రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో చిన్న చిన్న రంధ్రాలు మాత్ర‌మే చేసి ఆమె పాంక్రియాస్‌లో ఉన్న క‌ణితిని తొల‌గించాం. అది బాగా చిన్న క‌ణితి కావ‌డంతో.. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇత‌ర టెక్నాల‌జీలు వాడి దాన్ని తీసేశాం. శ‌స్త్రచికిత్స అయిన త‌ర్వాత ఎలాంటి ఇబ్బందులు లేక‌పోవ‌డంతో.. ఆరు  రోజుల త‌ర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్ట‌ర్ న‌వీన్ కుమార్ తెలిపారు.

  • ఖమ్మం:  ఓ స్కూల్‌ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.  ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్‌పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    ఆ సమయంలో స్కూల్‌ బస్సులో 105 మంది చిన్నారులు ఉన్నారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవ్‌ చేసే సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ మద్యం సేవించాడని విద్యార్థులు చెబుతున్నారు. 

     

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IITH) విద్యార్థి 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో రికార్డు ప్యాకేజీ సాధించాడు. చివరి సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి నెదర్లాండ్స్‌కు చెందిన గ్లోబల్ ట్రేడింగ్ సంస్థలో  ఏకంగా రూ. 2.5 కోట్ల ప్యాకేజీని సాధించాడు.   2008లో ప్రారంభమైనప్పటి నన ఐఐటీ హైదరాబాద్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం.

    హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, 7 నుండి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్న 21 ఏళ్ల  విద్యార్థి ఎడ్వర్డ్ నేథన్ వర్గీస్ (Edward Nathan Varghese) భారీ వేతనంతో నెదర్లాండ్స్ ప్రముఖ సంస్థ 'ఆప్టివర్' (Optiver)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరనున్నాడు. అంతకుముందు రెండు నెలల వేసవి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో వర్గీస్‌ ఒకడు. ఇంటర్న్‌షిప్‌ తరువాత కంపెనీ ఆయనకు ఇచ్చిన ప్రీ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌తోపాటు, కేవలం రెండు వారాల ట్రైనింగ్ తర్వాత ఒక ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు.ఈ తర్వాత తుది ఆఫర్‌ను అందుకున్న ఏకైక వ్యక్తి. 

    టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం  ప్రకారం  విద్యాపరంగా, వర్గీస్ 2022లో JEE మెయిన్‌లో 1100 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), JEE అడ్వాన్స్‌డ్‌లో AIR 558 సాధించాడు. 2025లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)కి కూడా హాజరయ్యాడు. 99.96 పర్సంటైల్ సాధించి 120వ ర్యాంక్‌ను సాధించాడు.ప్లేస్‌మెంట్స్‌తో పాటు, వర్గీస్ క్యాంపస్‌లో అనేక లీడర్‌షిప్‌ రోల్స్‌ పోషించాడు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను IIT హైదరాబాద్‌లోని ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్‌లో ఓవరాల్ హెడ్‌గా పనిచేశాడు, ఎనిమిది మంది విద్యార్థి నిర్వాహకులు, దాదాపు 250 మంది కోఆర్డినేటర్లకు నాయకత్వం వహించాడు. దీనికి ముందు, అతను దాదాపు 11 నెలల పాటు ఇంటర్న్‌షిప్ సెల్

    Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు 

    ఇదీ చదవండి: ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

    కాగా  ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్లలో సరికొత్త చరిత్ర రికార్డైంది. ఐఐటీహెచ్‌లోని మరో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి రూ. 1.1 కోట్ల ప్యాకేజీని పొందగా ఏడాది తరువాత ఈ రికార్డు స్థాయి ఆఫర్ రావడం విశేషం. 2017లో అత్యధిక ఆఫర్ రూ. కోటిగా ఉన్న క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్‌ ఈ బెంచ్‌మార్క్‌ను దాటింది. మొత్తంమీద, 2025 ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో సగటు ప్యాకేజీలు దాదాపు 75శాతం పెరిగాయి, 2024లో రూ. 20.8 లక్షల నుండి ఈ సంవత్సరం మొదటి దశ ప్లేస్‌మెంట్‌లలో రూ. 36.2 లక్షలకు చేరుకున్నాయి. ఐఐటీహెచ్‌లోని విద్యార్థులు 24 అంతర్జాతీయ ఆఫర్‌లను పొందారు.

  • సికింద్రాబాద్ (రాంగోపాల్‌పేట): ఎటు చూసినా పండుటాకులే.. ఒక్కొక్కరిని కలుస్తూ ఆయన అలా ముందుకుపోతున్నారు.. మిఠాయిలు, పండ్లు అందిస్తున్నారు.. బాగున్నారా.. అంటూ పలకరిస్తున్నారు.. ఒక వృద్ధురాలి దగ్గరికి వచ్చేసరికి ఆమెను ఎక్కడో చూసినట్టుగా అనిపించి ఒక్క క్షణం ఆగారు. గుర్తుపట్టి ‘బాగున్నారా.. శ్యామల గారూ!’ అంటూ నమస్కరించారు. ఇదీ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం, హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో గురువారం కనిపించిన సన్నివేశం.

    హైద‌రాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) న్యూ ఇయర్‌ వేడుకలకు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఆర్కే ఫౌండేషన్‌ వృద్ధాశ్రమం, హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నవారిని సజ్జనర్‌ పరామర్శించడంతోపాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నిరాడంబరంగా న్యూ ఇయర్‌ డే వేడుకలు నిర్వహించారు. ఆశ్రయం పొందుతున్న 48 మందికి స్థానిక అధికారులతో కలిసి పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు.

    అనారోగ్యంతో బాధపడుతున్న పావలా శ్యామలను (Pavala Shyamala) నెలరోజుల క్రితం తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ చొరవ తీసుకుని ఆర్కే ఫౌండేషన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో చేర్పించారు. విషయం తెలుసుకున్న సీపీ సజ్జనార్‌.. మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీ రమేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మిగిలినవారూ రమేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

    ఆర్కే ఫౌండేషన్‌ ద్వారా 18 ఏళ్లుగా దాదాపు 15 వేల మంది వృద్ధులకు ఆశ్రయంతోపాటు వైద్యం అందిస్తున్న డాక్టర్‌ రామకృష్ణ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదేనని ఈతరానికి సూచించారు. కార్యక్రమంలో నార్త్‌ జోన్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, అదనపు డీసీపీ అశోక్, తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌, కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

    చ‌ద‌వండి: 'గుండెల‌కు హ‌త్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు'  

Business

  • భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ఆర్య.ఏజీ.. జీఈఎఫ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నుంచి రూ.725 కోట్లు ఈక్విటీ పెట్టుబడిగా సమీకరించినట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో.. కంపెనీ రైతులు, వారికి సంబంధించిన సంస్థలతో తన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే క్లైమేట్ స్మార్ట్, మార్కెట్ ఆధారిత వ్యవసాయ విధానాలను ప్రోత్సహించనుంది.

    ఆర్య.ఏజీ.. సాంకేతిక పరిష్కారాల ద్వారా చిన్న రైతులు వాతావరణ మార్పుల అనిశ్చితులను ఎదుర్కొనేలా చేయడం, పంట కోత అనంతరం ఫార్మ్ గేట్ వద్ద & మొత్తం వ్యవసాయ సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం వంటివి చేస్తుంది. దీనిని 2013లో ప్రసన్న రావు, ఆనంద్ చంద్ర, చట్టనాథన్ దేవరాజన్ స్థాపించారు.

    ప్రస్తుతం ఆర్యా.ఏజీ కార్యకలాపాలు భారతదేశంలోని 60 శాతం జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. 12,000 అగ్రి-వేర్‌హౌస్‌ల నెట్‌వర్క్ ద్వారా ఏటా సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ధాన్యాన్ని సమీకరించి నిల్వ చేస్తోంది. అలాగే, వ్యవసాయ రంగంలోని వివిధ వర్గాలకు 1.5 బిలియన్ డాలర్లకు పైగా రుణాల పంపిణీకి తోడ్పడుతోంది.

  • హ్యుందాయ్ ఇండియా.. ఇటీవల ప్రవేశపెట్టిన వెన్యూ లైనప్‌ను విస్తరిస్తూ.. కొత్త HX5+ ట్రిమ్‌ లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది సాధారణ వెన్యూ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్స్ పొందినట్లు తెలుస్తోంది.

    వెన్యూ HX5+ కారులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. స్టాండర్డ్ HX5 వేరియంట్‌తో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, రూఫ్ రెయిల్స్, రియర్ విండో సన్‌షేడ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, స్టోరేజ్‌తో డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ వైపర్ & వాషర్ పొందుతుంది.

    వెన్యూ HX5+ కారు సాండ్, మడ్, స్నో మోడ్స్ పొందుతుంది. ఇందులో ఇప్పుడు డ్రైవర్ సీటు ఎత్తు సర్దుబాటు ఫీచర్ కూడా ఉంది.

    ఇదీ చదవండి: ఒక్క కంపెనీ.. 22.55 లక్షల కార్లు!

  • శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 573.41 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 85,762.01 వద్ద, నిఫ్టీ 182.00 పాయింట్లు లేదా 0.70 శాతం లాభంతో 26,328.55 వద్ద నిలిచాయి.

    రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, షాలిమార్ పెయింట్స్, బీపీఎల్, సిల్వర్ టచ్ టెక్నాలజీస్, కృతి న్యూట్రియంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, క్యుపిడ్, వివిమెడ్ ల్యాబ్స్, కిరి ఇండస్ట్రీస్, ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • మారుతి సుజుకి కార్లకు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. దీంతో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 2025లో ఏకంగా 22.55 లక్షలకు వాహనాలను ఉత్పత్తి చేసింది.

    దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి.. 2021లో 16.29 లక్షల యూనిట్లను, 2022లో 19.16 లక్షల యూనిట్లను, 2023లో 19.34 లక్షల యూనిట్లను, 2024లో 20.63 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు కంపెనీ గత ఏడాది 22.55 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దీంతో మారుతి సుజుకి ఉత్పత్తి 20 లక్షల యూనిట్ల మార్కును దాటడం ఇది వరుసగా రెండవ సంవత్సరం.

    గత ఏడాది కంపెనీ ఉత్పత్తి చేసిన కార్లను.. మన దేశంలో విక్రయించడానికి మాత్రమే కాకుండా. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఇందులో ఫ్రాంక్స్, బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా మొదలైన మోడల్స్ ఉన్నాయి. కాగా మారుతి సుజుకి ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్, ఖార్ఖోడాలలో తయారీ సౌకర్యాలను నిర్వహిస్తోంది.

    భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతి చేయడానికి కంపెనీ దేశంలోనే తన ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా మారుతి సుజుకి తన తయారీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 40 లక్షల యూనిట్లకు విస్తరించాలని యోచిస్తోంది. ఇదే జరిగితే కార్ల ఉత్పత్తి మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

NRI

  • భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం  గత  ఏడాది ఆగస్టున సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.

    ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్‌కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్‌పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.

    ఇవే 19 ఈసీఆర్ దేశాలు
    ఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.

    గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).

    ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.

    ఈసీఆర్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?

    ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్‌పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.

    సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.

    ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?

    • ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్‌ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.

    • వలస కార్మికుని పాస్‌పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు అవుతాయి.

    • అలాగే, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.

    • రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పునరుద్ధరణ చేసుకోవచ్చు.

     

    ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్ట్ అంటే?
    ఈసీఎన్‌ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.

    ఈసీఎన్‌ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:

    * 10వ తరగతి ఉత్తీర్ణులు
    * విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు
    * ఆదాయపు పన్ను చెల్లింపుదారులు
    * 50 సంవత్సరాల పైబడిన వారు

    వీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.

    విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదు

    ఏ పాస్‌పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.
    రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.

    –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622