Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది.

    ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్‌(56), అభిషేక్ పోరెల్‌(51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్‌(34), అశుతోష్‌ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, బ్రిజేష్‌ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. షనక ఓ వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది.

    రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(53), రియాన్‌ పరాగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్‌ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయిం‍ట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది.

  • ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్‌ పరాజయం పాలైంది. 222 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత 199 పరుగులు చేసింది.

    శశాంక్‌ సింగ్‌(56), స్టోయినిష్‌(37), సూర్యాంశ్ షెడ్గే(35) కాస్త దూకుడుగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. ముఖ్యంగా ప్రియాన్ష్‌ ఆర్య(0), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(2), శ్రేయస్‌ అయ్యర్‌(1) దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో తమ పంజాబ్ కింగ్స్‌​ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

    ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ప‌వ‌ర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోవ‌డం తమ ఓటమిని శాసించిందని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు.

    "ఆర్సీబీకి ప‌వ‌ర్‌ప్లేలో అద్భుత‌మైన ఆరంభం ల‌భించింది. ఆపై పవర్‌ప్లే ముగిసిన త‌ర్వాత కూడా మా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 222 పరుగులు సాధించడం నిజంగా ప్రశంసనీయమైన ప్రదర్శన. మేం బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాం. మేము పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాము. 

    అనంత‌రం బ్యాటింగ్‌లో కూడా మాకు మంచి ఆరంభం ద‌క్క‌లేదు. మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డాము. ఈ సీజ‌న్‌లో మా జట్టులో ఎక్కువ పరుగులు చేసేది ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్ మాత్ర‌మే.  ప్రతి మ్యాచ్‌లో వారు పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి ఒక రిథ‌మ్ సెట్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారు ఆరంభ ఇవ్వ‌లేక‌పోయారు. నేను కూడా క్రీజులోకి వ‌చ్చిన వెంట‌నే ఔట‌య్యాను. ఇది న‌న్ను చాలా నిరాశ క‌లిగించింది. 

    కానీ మిడిలార్డర్‌లో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేము ఓవర్‌కు దాదాపు 10 పరుగులు సాధిస్తూ ల‌క్ష్యాన్ని చేధించాల‌నుకున్నాము. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము. భువీ, హాజిల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మా త‌దుప‌రి గెలిచేందుకు అన్ని విధాల‌గా ప్ర‌య‌త్నిస్తాం. 

    ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను. మ్యాచ్ ఫలితాలు నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు.  నేను గతం గురించి మరీ ఎక్కువగా ఆలోచించే వ్యక్తిని కాదు. జరగాల్సింది జరిగిపోయింది. రేపు ఉదయం నేను మళ్ళీ కొత్త సూర్యోదయాన్ని చూస్తాను. చీకటి తర్వాత ఎప్పుడూ వెలుగు ఉంటుందని నేను నమ్ముతాను" పోస్ట్ మ్యాచ్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు.

  • ఐపీఎల్‌-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్తాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 15 ఏళ్ల వైభవ్ తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ప్రపంచ స్ధాయి బౌలర్ అయిన మిచెల్ స్టార్క్‌ను సైతం సూర్యవంశీ విడిచిపెట్టలేదు.

    బౌండరీలు బాదుతూ స్టార్క్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. వైభవ్‌ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.

    ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ ఇప్పటివరకు 44 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉండేది. ఐపీఎల్‌-2024లో అభిషేక్ 42 సిక్స‌ర్లు బాదాడు. తాజా ఇన్నింగ్స్‌తో అభిషేక్‌ను సూర్య‌వంశీ దాటేశాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో క్రిస్ గేల్ (ఒకే సీజన్‌లో 59 సిక్సర్లు) ఉన్నాడు. రాజ‌స్తాన్ ప్లే ఆఫ్స్‌కు చేరితే గేల్ రికార్డును కూడా సూర్య‌వంశీ బ్రేక్ చేసే అవ‌కాశ‌ముంది. వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడి 486 ప‌రుగులు చేశాడు.

    ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయ‌ర్లు వీరే:
    వైభవ్ సూర్యవంశీ: 44 సిక్సర్లు (2026)  

    అభిషేక్ శర్మ: 42 సిక్సర్లు (2024)  

    శ్రేయస్ అయ్యర్: 39 సిక్సర్లు (2025)  

    విరాట్ కోహ్లి: 38 సిక్సర్లు (2016 & 2024)  

    సూర్యకుమార్ యాదవ్: 38 సిక్సర్లు (2025)  

  • ఐపీఎల్‌లో అరంగేట్రంలో చేసేందుకు గ‌తేడాది నుంచి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం కుర్రాడు,  ఆంధ్ర స్టార్ స్పిన్నర్‌ త్రిపురాన విజయ్ నిరీక్ష‌ణ‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విజయ్ అరంగేట్రం చేశాడు. 

    కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో విజయ్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్  కొనుగొలు చేసింది. కానీ గత సీజన్‌లో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమైనా ఏ మాత్రం నిరాశ చెందుకుండా నిత్యం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. స్పీడ్ స్టార్ అకిబ్ నబీ స్ధానంలో విజయ్‌ను తుది జట్టులోకి ఢిల్లీ తీసుకుంది. విజయ్‌కు రైట్- ఆర్మ్ ఆఫ్‌బ్రేక్‌తో పాటు బ్యాట్‌తో రాణించే సత్తా ఉంది.

    ఎవరీ విజయ్‌?
    24 ఏళ్ల త్రిపురాన విజయ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన మొదటి క్రికెటర్‌గా ఇప్పటికే గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాణ వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్‌ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్‌ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. 

    అండర్‌–19లో ఏసీఏ నార్త్‌జోన్‌ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆంధ్ర సీనియర్ జట్టు నుంచి 2021లో విజయ్‌కు తొలిసారి పిలుపు వచ్చింది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో జమ్మూ కాశ్మీర్‌పై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఏడాదికే విజయ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో విజయ్‌ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. 

    విజయ్‌ ఇప్పటివరకు 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడు లిస్ట్‌-ఎలో 5, టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో తన మార్క్ చూపించేందుకు విజయ్ సిద్దమయ్యాడు.
    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

    విరాట్‌ కోహ్లి (58), వెంకటేశ్‌ అయ్యర్‌ (73 నాటౌట్‌) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్‌ (45), టిమ్‌ డేవిడ్‌ (28) కూడా బ్యాట్‌ ఝులిపించారు. జేకబ్‌ బేతెల్‌ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్‌ సింగ్‌, చహల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్‌.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. 

    ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్‌ కన్నోల్లీ (37), సూర్యాంశ్‌ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్‌, సుయాశ్‌ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్‌ సింగ్‌ (56), స్టోయినిస్‌ (37) పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. 

    వీరు కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్‌ సలాం దార్‌ 3, భువీ 2, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్‌ 2, శ్రేయస్‌ 1, ఒమర్‌జాయ్‌ 14 పరుగులకు ఔటయ్యారు. 
     

  • Delhi capitals vs Rajasthan royals live updates and Highlights: అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ విధించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది.  అక్షర్ పటేల్‌(34), అశుతోష్‌ శర్మ(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    ఢిల్లీ ఐదో వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డేవిడ్‌ మిల్లర్‌ బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఢిల్లీ నాలుగో వికెట్‌ డౌన్‌
    ట్రిస్టన్‌ స్టబ్స్‌ రూపంలో ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్టబ్స్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 22 బంతుల్లో 41 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్‌ పటేల్‌(23) ఉన్నాడు.

    కేఎల్‌ రాహుల్‌ అవుట్‌
    133 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్‌ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రాహుల్‌.. దసున్‌ షనక బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకముందు అర్చర్‌ బౌలింగ్‌లో సాహిల్‌ ఫరాఖ్‌ ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 32 బంతుల్లో 60 పరుగులు కావాలి.

    తొలి వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. 51 పరుగులు చేసిన అభిషేక్‌ పోరెల్‌.. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    పోరెల్‌ హాఫ్‌ సెంచరీ
    10 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ పోరెల్‌(51), కేఎల్‌ రాహుల్‌(46) ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న పోరెల్‌
    4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ పోరెల్‌(27), కేఎల్‌ రాహుల్‌(16) ఉన్నారు.

    రాణించిన పరాగ్‌, జురెల్‌.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే?
    ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓ దశలో 200కు పైగా పరుగులు సాధించేలా కన్పించిన రాజస్తాన్.. ఆఖరిలో మాత్రం తడబడింది. 

    రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(53), రియాన్‌ పరాగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటగా.. వైభవ్‌ సూర్యవంశీ(21 బంతుల్లో 46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నాలుగు వికెట్లు, ఎంగిడీ, మాధవ్‌ తివారీ తలా రెండు వికెట్లు సాధించారు.

    మిచెల్‌ మ్యాజిక్‌
    మిచెల్‌ స్టార్క్‌ దెబ్బకు రాజస్తాన్‌ రాయల్స్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్‌ వేసిన స్టార్క్‌ బౌలింగ్‌లో రెండో బంతికి పరాగ్‌ ఔట్‌ కాగా.. మూడో బంతికి ఫెరీరా ఔటయ్యాడు.  ఆ తర్వాత ఐదో బంతికి రవి సింగ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 166/5

    పరాగ్‌ హాఫ్‌ సెంచరీ
    రియాన్‌ పరాగ్‌ దూకుడుగా ఆడుతున్నాడు. పరాగ్‌ కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    వైభవ్‌ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్‌.. మాధవ్‌ తివారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 98/2

    వైభవ్‌ మెరుపులు
    వైభ‌వ్ సూర్య‌వంశీ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవ‌లం 16 బంతుల్లోనే 42 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 75 ప‌రుగులు చేసింది.

    రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
    జైశ్వాల్ రూపంలో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన జైశ్వాల్‌.. లుంగి ఎంగిడీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా కీల‌క మ్యాచ్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

    ఈ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్‌ త్రిపురాన విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. అకిబ్‌ నబీ స్దానంలో విజయ్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో రవి సింగ్‌ జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు
    ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్(వికెట్ కీపర్‌), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్

    రాజస్థాన్ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), రవి సింగ్, డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
     

  • రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనికి భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేరారు. ఐపీఎల్‌-2026 తర్వాత ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని శాస్త్రి సూచించాడు. 

    కాగా 15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2026లో 15 ఏళ్ల సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 236.56 స్ట్రైక్‌ రేట్‌తో 440 పరుగులు చేశాడు. ఈ బీహార్ చిచ్చర పిడుగు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. దీంతో వైభవ్‌ సీనియర్ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

    వైభవ్ సూర్యవంశీ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయి.  ఇది కచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి, వీలైనంత త్వరగా ప్రధాన జట్టులో భాగం చేయాలనుకుంటే అందుకు అత్యంత అనువైనది టీ20 ఫార్మాటే.

    వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అతడికి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు ప్రపంచ క్రికెట్‌లోని ఎన్నో జట్లలోకి నేరుగా వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించగలడు. యువతకు ఉండే ఆ ఉత్సాహం, తెగింపు అతడి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    చాలామంది అతడికి 15 ఏళ్ళా? 16 ఏళ్ళా? 14 ఏళ్ళా?’ అని అడుగుతున్నాను. అది నాకు అనవసరం.  తనకంటే రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ వయసున్న జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. వయసుతో అతడికి పనిలేదు. 

    భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం వైభవ్‌ను భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది" అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే  జూన్‌లో శ్రీలంకలో జరగబోయే త్రైపాక్షిక సిరీస్ కోసం 'ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలఖారులో భారత సీనియర్‌ జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.
    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు

  • ఐపీఎల్‌లో కెప్టెన్సీ అంటే ఒత్తిడి, అంచనాలు, విమర్శలు కలగలిసిన బాధ్యత. ఒక్క తప్పిదం మ్యాచ్‌నే కాదు, కెప్టెన్‌ ప్రతిష్టనూ ప్రభావితం చేస్తుంది. ఇలాంటి హైప్రెషర్‌ లీగ్‌లో దీర్ఘకాలం జట్టును నడిపించడం చాలా కొద్దిమందికే సాధ్యమైంది. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేరాడు. ఐపీఎల్‌లో 100 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాళ్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, గౌతమ్‌ గంభీర్‌ సరసన నిలిచాడు.

    ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ధోని. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను తొలి సీజన్‌ నుంచే నడిపించిన అతను ఐపీఎల్‌లో మొత్తం 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో సీఎస్‌కే ఐదు టైటిళ్లు గెలుచుకుని లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. కెప్టెన్‌గా 136 విజయాలు సాధించిన ధోనికి 57.87 విజయశాతం ఉంది.

    రెండో స్థానంలో రోహిత్‌ శర్మ ఉన్నాడు. 2013లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ చేపట్టిన రోహిత్‌, అదే ఏడాది జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. తర్వాత మరో నాలుగు సార్లు ట్రోఫీ గెలిపించి ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 158 మ్యాచ్‌ల్లో జట్టును నడిపిన అతను 87 విజయాలు సాధించాడు.

    మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ నిలిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొమ్మిదేళ్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ, టైటిల్‌ గెలవలేకపోయినా జట్టును పలుమార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అతని నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్‌ చేరింది. మొత్తం 143 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ 66 విజయాలు సాధించాడు.

    కేకేఆర్‌కు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్‌ గంభీర్‌ 129 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బలమైన జట్టుగా మారి ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి శ్రేయస్‌ అయ్యర్‌ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభించిన అయ్యర్‌, ఆ జట్టును 2020లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారి ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ను నడిపిస్తున్న అతను 100 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 54 విజయాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 17) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రేయస్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు.

     

  • ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆదివారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. కింగ్‌ కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు సరికొత్త రికార్డులను లిఖించుకున్నాడు.  

    19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్‌గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ తరపున కోహ్లి ఓపెనర్‌గా 5500 పరుగులు సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

    అంతకముందు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఓపెనర్లుగా 5500 పరుగుల మార్కును దాటినప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లి మాత్రం కేవలం ఆర్సీబీ తరుపున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

    అదేవిధంగా ఐపీఎల్‌లో ఒకే  జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై కోహ్లి ఇప్పటివరకు 1175కు పైగా పరుగులు చేశాడు. ఇంతకముందు కోహ్లి చెన్నై సూపర్ కింగ్స్‌పై 1174 ప‌రుగులు చేశాడు.

    ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:

    1175 పరుగులు – విరాట్ కోహ్లి (vs పంజాబ్ కింగ్స్)

    1174 పరుగులు – విరాట్ కోహ్లి (vs చెన్నై సూపర్ కింగ్స్)  

    1172 పరుగులు – విరాట్ కోహ్లి (vs ఢిల్లీ క్యాపిటల్స్)  

    1161 పరుగులు – రోహిత్ శర్మ (vs కోల్‌కతా నైట్ రైడర్స్)  

    1134 పరుగులు – డేవిడ్ వార్నర్ (vs పంజాబ్ కింగ్స్)  

    ఈ ఇన్నింగ్స్‌తో  కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్‌లో తన 500 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 9 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    అత్యధిక సార్లు ఐపీఎల్ సీజన్లలో 500 ప్ల‌స్ ర‌న్స్ చేసిన ప్లేయ‌ర్లు వీరే
    9 సీజన్లు – విరాట్ కోహ్లీ  

    7 సీజన్లు – డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్  

    5 సీజన్లు – శిఖర్ ధావన్
    చదవండి: PAK vs BAN: బాబర్‌ ఆజం అరుదైన రికార్డు
     

  • పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న పున‌రాగ‌మ‌నంలో స‌త్తాచాటాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు గాయం కార‌ణంగా దూర‌మైన బాబ‌ర్‌.. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం అద్భుత‌మైన నాక్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 ప‌రుగుల‌కే ఓపెన‌ర్లు వికెట్లు కోల్పోయిన పాక్‌ను హాఫ్ సెంచ‌రీతో బాబ‌ర్ ఆదుకున్నాడు.

    కెప్టెన్ షాన్ మ‌సూద్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. 84 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అతడు 68 పరుగులు చేశాడు. బాబర్‌కు ఇది 31వ టెస్ట్ హాఫ్ సెంచరీ. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మాత్రం అతడికి ఇది 20 ఆర్ధ శతకం కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు.  

    డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక అర్ధశతకాల జాబితాలో స్మిత్, జాక్ క్రాలీలతో కలిసి బాబర్ మూడో స్ధానంలో నిలిచాడు. మరో హాఫ్ సెంచరీ సాధిస్తే వారిద్దరిని బాబర్ అధిగమిస్తాడు. బాబర్ కంటే ముందు మార్నస్ లబుషేన్‌(24), జో రూట్‌(22) ఉన్నారు. ఇక సిల్హాట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  బంగ్లాదేశ్ 278 పరుగులకే ఆలౌట్‌ కాగా.. పాకిస్తాన్ 232 పరుగులకే కుప్పకూలింది. 

    దీంతో బంగ్లాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిట్టన్‌ దాస్‌((126) వీరోచిత శకతం సాధించాడు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్‌ మూడు వికెట్లు, హసన్‌ అలీ రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: ఐపీఎల్‌ను తక్షణమే నిలిపి వేయండి..!

  • బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాక్‌ వెనుకపడింది. సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌట్‌ కాగా.. పాక్‌ మరింత తీసికట్టుగా 232 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాకు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. 

    అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 8 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. తంజిద్‌ హసన్‌ (4) ఔట్‌ కాగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (26), మొమినుల్‌ హక్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని బంగ్లాదేశ్‌ 89 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఆట మూడో సెషన్‌ కొనసాగుతుంది.

    బాబర్‌ పోరాటం వృధా
    బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం పాక్‌కు ఎంతో సేపు నిలబడలేదు. ఆ జట్టు బంగ్లా కంటే తక్కువ స్కోర్‌కే ఆలౌటై ఉసూరుమనిపించింది. బాబర్‌ ఆజం అద్భుతైన అర్ద సెంచరీతో (68) పోరాడినా పాక్‌ను గట్టెక్కించలేకపోయాడు. ఆఖర్లో సాజిద్‌ ఖాన్‌ (38) బ్యాట్‌ ఝులిపించడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

    పాక్‌ ఇన్నింగ్స్‌లో అజాన్‌ అవైస్‌ 13, అబ్దుల్లా ఫజల్‌ 9, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 21, సౌద్‌ షకీల్‌ 8, సల్మాన్‌ అఘా 21, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 13, హసన్‌ అలీ 18, ఖుర్రమ్‌ షెహజాద్‌ 10 పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్‌ రాణా, తైజుల్‌ ఇస్లాం తలో 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

    దాస్‌ శతకం
    తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ లిట్టన్‌ దాస్‌ (126) వీరోచిత శకతం సాధించడంతో గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. పాక్‌ బౌలర్లు అబ్బాస్‌ (3 వికెట్లు), ఖుర్రమ్‌ షెహజాద్‌ (4), హసన్‌ అలీ (2), సాజిద్‌ ఖాన్‌ (1) సత్తా చాటారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌ ఈపాటి స్కోర్‌ చేయడం కూడా చాలా గొప్పే. దాస్‌కు మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.

    తంజిద్‌ హసన్‌ (26), మొమినుల్‌ హక్‌ (22), కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (23), తైజుల్‌ ఇస్లాం (16), ఫోరిఫుల్‌ ఇస్లాం (12 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌, నహిద్‌ రాణా డకౌట్లయ్యారు.

    కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఊహించని విధంగా 104 పరుగుల తేడాతో పాక్‌కు షాకిచ్చింది. 

  • పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

    విరాట్‌ కోహ్లి (58), వెంకటేశ్‌ అయ్యర్‌ (73 నాటౌట్‌) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్‌ (45), టిమ్‌ డేవిడ్‌ (28) కూడా బ్యాట్‌ ఝులిపించారు. జేకబ్‌ బేతెల్‌ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్‌ సింగ్‌, చహల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్‌ తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్‌.. ఆతర్వాతి 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. 

    ఆర్సీబీతో మ్యాచ్‌లో పంజాబ్‌ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్‌ కన్నోల్లీ (37), సూర్యాంశ్‌ షేడ్గే (35) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్‌, సుయాశ్‌ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్‌ సింగ్‌ (56), స్టోయినిస్‌ (37) పంజాబ్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. 

    వీరు కూడా ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్‌ సలాం దార్‌ 3, భువీ 2, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 0, ప్రభ్‌సిమ్రన్‌ 2, శ్రేయస్‌ 1, ఒమర్‌జాయ్‌ 14 పరుగులకు ఔటయ్యారు. 

    93 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్‌
    223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ దాదాపుగా చేతులెత్తేసింది. 93 పరుగులకే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. స్టోయినిస్‌ (14), శశాంక్‌సింగ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

    పీకల్లోతు కష్టాల్లో పంజాబ్‌
    223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ తడబడుతోంది. 19 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భువనేశ్వర్‌ కుమార్‌ (2-0-8-2) అద్భుతమై స్వింగ్‌ బౌలింగ్‌తో పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 

    అతనికి రసిక్‌ సలామ్‌ దార్‌ (1-0-4-1) తోడయ్యాడు. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య డకౌట్‌ కాగా.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 2, శ్రేయస్‌ అయ్యర్‌ ఒక్క పరుగుకు వెనుదిరిగారు. కూపర్‌ కన్నోలీ (15), సూర్యంశ్‌ షేడ్గే (4) క్రీజ్‌లో ఉన్నారు. 

    పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ కింగ్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండు ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 19/2

    పంజాబ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య ఖాతా తెరవకుండానే భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఆర్సీబీ భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (58), వెంకటేశ్‌ అయ్యర్‌ (73 నాటౌట్‌) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్‌ (45), టిమ్‌ డేవిడ్‌ (28) కూడా బ్యాట్‌ ఝులిపించారు. జేకబ్‌ బేతెల్‌ (11) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ బ్రార్‌ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్‌ సింగ్‌, చహల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

    మూడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    14.6వ ఓవర్‌- 157 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో ప్రియాంశ్‌ ఆర్యకు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (58) ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    9.1వ ఓవర్‌- 97 పరుగుల వద్ద దేవ్‌దత్‌ పడిక్కల్‌ (45) ఔటయ్యాడు. హర్ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

    ధాటిగా ఆడుతున్న పడిక్కల్‌, కోహ్లి
    విరాట్‌ కోహ్లి (24), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23) ధాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 61-1గా ఉంది.

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    2.2వ ఓవర్‌- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. హర్ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్లో జేకబ్‌ బేతెల్‌ (11) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
    ఐపీఎల్‌ 2026లో ఇవాళ (మే 17) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ, పంజాబ్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలో జితేశ్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 

    తుది జట్లు..

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(w/c), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), సూర్యాంశ్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
     

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు.

    ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రాన్ని జపించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్‌ బాఘేల్‌ తాజాగా స్పందించారు. సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేస్తూ.. ఐపీఎల్‌ను వెంటనే నిలిపివేయాలని మోదీని కోరారు. స్టేడియాలకు వేలాది మంది అభిమానులు ప్రయాణించడం వల్ల భారీగా ఇంధనం వినియోగమవుతోందని, విదేశీ ఆటగాళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయని, బెట్టింగ్ కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

    "ప్రధానమంత్రి గారు, వెంటనే ఐపీఎల్‌ను ఆపేయండి. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. విదేశీ కరెన్సీ చెల్లింపులు తగ్గుతాయి. బెట్టింగ్ కూడా ఆగుతుంది" అంటూ బాఘేల్ తన పోస్టులో రాసుకొచ్చారు.

    బాఘేల్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. నెటిజన్లు బాఘేల్‌ వర్షన్‌ను సమర్దిస్తూ ఐపీఎల్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోదీ కేవలం మాటలకే పరిమితం కాకుండా పొదుపు మంత్రాన్ని ఆచరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై నెట్టింట డిబేట్లు నడుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఐపీఎల్‌ నిర్వహకులు నుండి గానీ ఎలాంటి స్పందన లేదు.

    కాగా, దేశంలో ఇటీవల పెట్రోల్‌, డీజిల్, సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. త్వరలో ఈ పెంపు మరింత ఎక్కువ కానుందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలో ఇంధనంతో ముడిపడి ఉన్న ఐపీఎల్‌ను కొనసాగించడం​ సబబు కాదని సగటు భారతీయుడు అభిప్రాయపడుతున్నాడు.

    మరోపక్క ఇంకో వర్షన్‌ కూడా వినిపిస్తుంది. టోర్నీ ముగియడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ దశలో సస్పెండ్ చేస్తే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ ఆదాయం, ఫ్రాంచైజీల వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

     

  • ఐపీఎల్‌-2026 ప్లే ఆఫ్స్‌ దశకు చేరుకుంది. మే 31న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ భారత్‌కు రానున్నాడనే ప్రచారం జరిగింది. 

    భారత్‌కు పాక్‌ బోర్డు చీఫ్‌?
    అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బోర్డు సమావేశానికి హాజరవుతాడని వదంతులు వచ్చాయి. కాగా భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత దాయాది వ్యవహారశైలిని ఎండగట్టిన భారత్‌.. పాక్‌లో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. 

    ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత సైన్యం ఈ పని పూర్తి చేయగా... ప్రతిగా పాక్‌ ఆర్మీ కూడా రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది. ఇలాంటి తరుణంలో భారత్‌- పాక్‌ తొలిసారి ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. 

    అయితే, ఈ మ్యాచ్‌లలో పాక్‌ ఆటగాళ్లతో కరచాలనానికి టీమిండియా నిరాకరించింది. దీనిని గురించి రచ్చ చేసిన పీసీబీకి ఆఖరికి నిరాశే మిగిలింది. ఫైనల్లో పాక్‌పై గెలిచి భారత్‌ టైటిల్‌ గెలిచింది.

    ట్రోఫీని ఎత్తుకెళ్లిన నక్వీ
    ఈ క్రమంలో ఆసియా క్రికెట్‌ మండలి (ACC) అధ్యక్షుడి హోదాలో నక్వీ తన చేతుల మీదుగా ట్రోఫీ ఇచ్చేందుకు సిద్ధం కాగా.. టీమిండియా తిరస్కరించింది. దీంతో ట్రోఫీని నక్వీ తనతో పాటు ఎత్తుకెళ్లి ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. ఇక ఈ ఘటన తర్వాత టీ20 ప్రపంచకప్‌-2026 సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్‌ నానాయాగీ చేసింది.

    భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించింది. బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవడంతో పాటు తాము కూడా తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. అయితే, ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించగా.. పట్టువీడి టోర్నీలో పాల్గొంది.

    అతడిని ఎలా ఆహ్వానిస్తారు?
    చెత్త ప్రదర్శనతో సెమీస్‌ చేరుకుండానే పాక్‌ నిష్క్రమించగా.. భారత్‌ ముచ్చటగా మూడోసారి టైటిల్‌ గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో నక్వీ భారత్‌కు వస్తున్నాడనే వార్త కలకలం రేపింది. అతడిని ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తూనే.. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐసీసీ చైర్మన్‌ జై షాకు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు విజ్ఞప్తి చేశారు.

    ఆన్‌లైన్‌ వేదికగా
    అయితే, అందరూ ఊహించినట్లుగా నక్వీ అహ్మదాబాద్‌కు రావడం లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అతడు వర్చువల్‌గా హాజరుకానున్నాడు. ఆన్‌లైన్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకోనున్నాడు. నిజానికి ఐసీసీ ఈ సమావేశానికి వేదికగా దోహాను ఎంచుకుంది.

    అయితే, పశ్చిమాసియా యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ వేదికగా ఐపీఎల్‌ ఫైనల్‌ నాడు సమావేశం నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే నక్వీ వర్చువల్‌గా ఈ మీటింగ్‌కు హాజరుకానున్నాడు. 

    చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ

  • ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రహ్మత్‌ షా చనిపోయాడంటూ సోషల్‌మీడియాలో ఓ వార్త వైరలైంది. ఈ ప్రచారంలో నిజమెంతో అని పరిశీలిస్తే.. పూర్తిగా అవాస్తవమని తేలింది. రహ్మత్‌ షా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాడని ఆఫ్ఘన్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రచారానికి రహ్మత్‌ షా సహచర ఆఫ్ఘన్‌ క్రికెటర్‌ కరీమ్‌ జనత్‌ చేసిన ఓ సోషల్‌మీడియా పోస్ట్‌ కారణమైంది.

    ఇటీవలే రహ్మత్‌ షా తల్లి మరణించింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తూ  కరీమ్‌ జనత్‌ తన మాతృ భాష పాష్టోలో ఓ సంతాప పోస్ట్‌ పెట్టాడు. దీన్ని ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ తప్పుగా అనువదించడంతో రహ్మత్ షా మరణించాడని నెటిజన్లు అపార్దం చేసుకున్నారు. క్రాస్‌ చెక్‌ చేసుకోని కొందరు ఈ వార్తను విస్తృతంగా షేర్ చేయడంతో వైరలైంది.

    ఇంతకీ కరీమ్‌ జనత్‌ తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే.. రహ్మత్ షా తల్లి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. అల్లా ఆమెకు స్వర్గం ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

    కాగా, 32 ఏళ్ల రహ్మత్‌ షా ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌, వన్డే జట్లలో కీలక మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ పార్ట్‌ టైమ్‌ లెగ్‌ స్పిన్నర్‌గా ఉన్నాడు. 2013లో అరంగేట్రం​ చేసిన ఈ కుడి చేతి వాటం ఆటగాడు.. 11 టెస్ట్‌లు, 125 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 3 శతకాలు (ఓ డబుల్‌ సెంచరీ), 5 అర్ద శతకాల సాయంతో 970 పరుగులు చేసిన షా.. వన్డేల్లో 5 సెంచరీలు, 32 అర్ద సెంచరీల సాయంతో 4034 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో టెస్ట్‌ల్లో ఒ‍కటి, వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. షా ఓ టీ20 కూడా ఆడాడు.

    షా గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. ఆ సిరీస్‌లో గాయపడడంతో కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టెస్ట్‌, వన్డే సిరీస్‌తో షా పునరాగమనం చేయవచ్చు. 
     

  • గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షాన్‌ మార్ష్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సాయి బద్దలు కొట్టాడు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య శనివారం మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 247 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

    మూడు అర్ధ శతకాలు
    లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ఓపెనర్లు సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెరుగ్గా రాణించారు.  సాయి 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో అజేయంగా నిలవగా.. గిల్‌ 49 బంతుల్లో 85 పరుగులు చేశాడు. మిగతావారిలో జోస్‌ బట్లర్‌ 35 బంతుల్లో 57 పరుగులు రాబట్టగలిగాడు.

    అయితే, ఈ ముగ్గురి హాఫ్‌ సెంచరీలు గుజరాత్‌ను నిలబెట్టలేకపోయాయి. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులకే పరిమితమైన గుజరాత్‌.. 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాయి సుదర్శన్‌ పొట్టి క్రికెట్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

    అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే
    ఈ క్రమంలో అత్యంత వేగంగా.. అంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే టీ20 ఫార్మాట్లో ఈ మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌ సాయి సుదర్శన్‌ చరిత్రకెక్కాడు. అంతకు ముందు ఆసీస్‌ స్టార్‌ షాన్‌ మార్ష్‌ 85 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సాయి సుదర్శన్‌ కేవలం 78 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ అందుకోవడం విశేషం.

    టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్‌ 3000 రన్స్‌ సాధించిన టాప్‌-5 క్రికెటర్లు
    👉సాయి సుదర్శన్‌ (ఇండియా)- 78 ఇన్నింగ్స్‌లో
    👉షాన్‌ మార్ష్‌ (ఆస్ట్రేలియా)- 85 ఇన్నింగ్స్‌లో
    👉డిఆర్సీ షార్ట్‌ (ఆస్ట్రేలియా)- 86 ఇన్నింగ్స్‌లో
    👉డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌)- 86 ఇన్నింగ్స్‌లో
    👉క్రిస్‌ గేల్‌ (వెస్టిండీస్‌)- 87 ఇన్నింగ్స్‌లో

    సాయి సుదర్శన్‌ టీ20 ఫార్మాట్‌ రికార్డు ఇదీ
    ఐపీఎల్‌లో గుజరాత్‌ తరఫున ఇప్పటికి 53 మ్యాచ్‌లలో కలిపి సాయి సుదర్శన్‌ 2347 పరుగులు సాధించాడు. తమిళనాడు తరఫున దేశీ టీ20 టోర్నీలో 25 మ్యాచ్‌లలో 670 పరుగులు చేశాడు. ఇక టీమిండియా తరఫున ఒక మ్యాచ్‌ ఆడినప్పటికీ పరుగులేమీ రాబట్టలేకపోయాడు.

    చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ

  • ఐపీఎల్‌ 2026లో ఇవాళ (మే 17) మధ్యాహ్నం అత్యంత కీలక​ సమరం జరుగనుంది. టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం కొట్టిమిట్టాడుతున్న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆర్సీబీకి పెద్దగా కీలకం కాకపోయినా, పంజాబ్‌కు మాత్రం చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిందా ఖేల్‌ దాదాపు ఖతమైనట్లే. 

    ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ మ్యాచ్‌ అంత ముఖ్యం కాకపోయినా, గెలిస్తే మాత్రం దర్జాగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఓడినా ఈ జట్టుకు మరో ఛాన్స్‌ ఉంటుంది. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిస్తే అప్పుడైన ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. 

    ఒకవేళ అది కూడా ఓడిందా.. ఇతర జట్ల గెలుపోటములపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంతదాకా తెచ్చుకోకూడదంటే నేటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే సరిపోతుంది. ఈ లెక్కన ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు కేవలం అడుగుదూరంలో ఉంది.

    తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్‌
    ఈ సీజన్‌లో పంజాబ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి జైత్రయాత్ర చేసిన ఈ జట్టు, అనూహ్యంగా పరాజయాల బాట పట్టింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, చివరి 5 మ్యాచ్‌ల్లో వరుసగా ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

    ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నా, చివరికొచ్చే సరికి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై, 23వ తేదీ జరిగే మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఉండవచ్చు. 

    ఇప్పటికే తెగే దాకా తెచ్చుకున్న పంజాబ్‌, ఇకపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఐపీఎల్‌ చరిత్రలో ఏ జట్టుకు ఎదురుకాని అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లు ఈ జట్టుకు సెమీస్‌, ఫైనల్స్‌ లాంటివి.

    నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇదే మొదటిసారి. ఆర్సీబీ రెండు వరుస విజయాలతో దూకుడుమీదుంటే.. పంజాబ్‌  ఐదు వరుస పరాజయాలతో ఢీలా పడిపోయి ఉంది.

     

  • ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మహిళా క్రికెట్‌ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి వన్డే ఇంగ్లండ్‌, మూడో వన్డే న్యూజిలాండ్‌ గెలవగా.. రెండో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

    కార్డిఫ్‌ వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడి ఆటంకాల నడుమ 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

    అలిస్‌ క్యాప్సీ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హీథర్‌ నైట్‌ 28, యామీ జోన్స్‌ 27, ఫ్రేయా కెంప్‌ 20, ఎమ్మా లాంబ్‌ 7, జోడీ గ్రూకాక్‌ 10, డానియెల్లా గిబ్సన్‌ 2, కెప్టెన్‌ ఛార్లెట్‌ డీన్‌ 16 (నాటౌట్‌), సోఫీ ఎక్లెస్టోన్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్‌, రోస్‌మేరీ మైర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జెస్‌ కెర్‌, అమేలియా కెర్‌, నెన్సీ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం ఛేదన సమయంలో వరుణుడు మళ్లీ ఆటంకాలు కలిగించడంతో న్యూజిలాండ్‌ను డ​క్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం విజేతగా ప్రకటించారు. 24.4 ఓవర్ల వద్ద భారీ వర్షం​ మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

    ఆ సమయానికి న్యూజిలాండ్‌ 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రూక్‌ హల్లీడే 42, ఇసబెల్లా గేజ్‌ 22 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు మ్యాడీ గ్రీన్‌ 37 పరుగులతో రాణించింది. మిగతా బ్యాటర్లలో సూజీ బేట్స్‌ 12, జార్జియా ప్లిమ్మర్‌ 7, అమేలియా కెర్‌ 1 పరుగు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ 3, డేనియెలా గిబ్సన్‌ ఓ వికెట్‌ తీసింది. 

    మే 20 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ మొదలవుతుంది. తొలి మ్యాచ్‌ డెర్బీ వేదికగా జరుగనుంది. 
     

  • భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తూ.. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధించే అభిమానులు కోకొల్లలు. ఇక పొట్టి ఫార్మాట్లో సాగే దేశీ క్రేజీ టోర్నీ ఐపీఎల్‌కు ఉన్న వీరాభిమానుల గురించి కూడా తెలిసిందే.

    ఆటగాళ్ల పాదాలు తాకేందుకు మైదానంలోకి దూసుకువెళ్లి.. భద్రతా సిబ్బందితో గెంటేయించుకునేవాళ్లు కొందరైతే.. తమ ఫేవరెట్‌ ప్లేయర్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వెర్రి అభిమానం మరికొందరిది.

    రూ. 8 వేల టికెట్‌ను రూ. 80 వేలకు పెంచి
    ఈ ‘పిచ్చి’నే క్యాష్‌ చేసుకుంటున్నారు బ్లాక్‌ టికెట్ల దందా నిర్వాహకులు. రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా రూ. 80 వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించి పలువురు నిందితులను అరెస్టు చేశారు.

    కంచే చేను మేసినట్లుగా!
    ఈ బ్లాక్‌ టికెట్ల దందాలో ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) అధికారిదే కీలక పాత్ర అని తేల్చినట్లు సమాచారం. ఈ విషయం గురించి డీడీసీఏ సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక వ్యవస్థీకృత నేరం. ఇందులో డీడీసీఏ అధికారి ఒకరిది కీలక పాత్ర. ఆటగాళ్ల క్రేజ్‌ను బట్టి టికెట్ల ధరలు నిర్ణయిస్తారు.

    మ్యాచ్‌ ఆరంభమయ్యే కాసేపటికి ముందు ధరలు ఇష్టారీతిన పెంచి సొమ్ము చేసుకుంటారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌ సమయంలో రేట్లు దారుణంగా పెంచారు.

    విరాట్‌ కోహ్లిని చూసేందుకు
    ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లిని చూసేందుకు అభిమానులు ఎగబడతారన్న సంగతి తెలిసిందే. అందుకే ఆరోజు బ్లాక్‌లో రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా 80 వేల రూపాయలకు అమ్మారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

    కాగా ఈ ఘటనలో ముకీమ్‌, గుఫ్రాన్‌, ఫైజల్‌ అనే వ్యక్తులతో పాటు పెట్రోల్‌ బంకు ఉద్యోగి పంకజ్‌ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

    ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరుణ్‌జైట్లీ మైదానం హోంగ్రౌండ్‌ అన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య డీడీసీఏకు ప్రతీ మ్యాచ్‌కు సంబంధించి ఫ్రాంఛైజీ 10- 15 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాసులుగా ఇస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు వెయ్యి కాంప్లిమెంటరీ పాసులను డీడీసీఏ అధికారి అక్రమంగా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.

    హైదరాబాద్‌లో అభిమానుల పాట్లు!
    మే 22న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ సన్ రైజర్స్ యాజమాన్యం మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంచినట్లు తెలుస్తోంది. 

    డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగా.. క్యూ లో 2.6 లక్షల మంది ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత కాసేపట్లో సోల్డ్ ఔట్ అని పెట్టారు. ఈ నేపథ్యంలో టికెట్లను బ్లాక్ మార్కెట్ లోకి మళ్లిస్తున్నారని అభిమానులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.

    ఈ క్రమంలో రూ. 950 టికెట్ 2000లకు... 1500 ఉన్న టికెట్ 3000లకు.. 1910 ఉన్న టికెట్ 3500లకు.. 2500 ఉన్న టికెట్ 4500లకు.. 4500 ఉన్న టికెట్ 6000లకు.. 7000 ఉన్న టికెట్ ధర 10 వేల రూపాయలకు.. 23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర 30 వేల రూపాయలకు.. 30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర 45 వేలకు పెంచినట్లు సమాచారం.

    చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ

Movies

  • మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా టైటిల్ వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరాజు అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ పుట్టిందని ఆయన తెలిపారు. పెద్దిరాజు తాపీ పని చేస్తూనే క్రికెట్, బాస్కెట్‌బాల్ బాగా ఆడేవారు. తనది పేద కుటుంబం కావడంతో ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడట. ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొంది కథను రాసుకున్నానని బుచ్చిబాబు చెప్పారు. అయితే ఈ సినిమా బయోపిక్ కాదు. నిజజీవితం నుంచి స్ఫూర్తిపొంది, దానికి కొంత ఫిక్షన్ కూడా జోడించి కథను రూపొందించానని ఆయన స్పష్టం చేశారు.  


    అలా టైటిల్ కోసం పెద్దిరాజు పేరులోని ‘పెద్ది’ అనే పదాన్ని ఎంచుకున్నాను.ఇది కోడి రామ్మూర్తి బయోపిక్ అని, జూ.ఎన్టీఆర్ కోసం రాసిన కథ అని వస్తున్న పుకార్లను బుచ్చిబాబు ఖండించారు. ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ కథ రాసుకున్నానని ఆయన క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ సినిమాను గోదావరి యాసలో తీద్దామనుకున్నాను. అయితే ఇప్పటికే రామ్‌ చరణ్‌ తన గురువు సుకుమార్‌ దర్శకత్వంలో చేసిన 'రంగస్థలం' ఆ నేపథ్యమే కావడంతో తన సినిమా ‘పెద్ది’ కోసం విజయనగరం బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నానని దర్శకుడు వెల్లడించారు. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

    ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్‌ సాంగ్‌లో శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ‘పెద్ది’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం సందడి చేయనుంది. 

  • న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ'. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. రీసెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులో నటించిన ప్రదీప్ కొట్టె ఈ మూవీలో తన జర్నీ విశేషాలని పంచుకున్నాడు.

    'తిమ్మరాజు పల్లి టీవీ'లో నేను చేసిన రాజప్ప పాత్రకు ప్రశంసలు దక్కాయి. నాకు తొలి సినిమా, అవకాశం అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సినిమాలు చేశాను కానీ తొలి ఫీచర్ ఫిల్మ్, మొదటిసారిగా స్క్రీన్ మీద కనిపించింది ఈ చిత్రంలోనే. ఇందులో సాయి తేజ్, లతీష్ ఇలా చాలామంది నటించిన పాత్రలు నాకు ఇష్టం. అందరూ సింగిల్ టేక్స్‌లోనే నటించారు. నేను యాక్టింగ్ సైడ్ ఉన్నానని మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మా అక్కకి తెలుసంతే. మా అమ్మనాన్నలకు చెప్పకుండా షూటింగ్‌కి తీసుకువచ్చింది మా అక్క. మా పేరెంట్స్‌ని అలా చూడటం, వారు నన్ను అలా చూడటం అదొక మెమరబుల్ మూమెంట్.

     

  • ఏది మనసును ఇబ్బంది పెడితే, దాన్ని కాగితంపై రాయండి. రాయడం అనేది ఒక ఆటోమేటిక్ రిలీజ్, అదొక థెరపీ కూడా.. అంటూ బ్రేకప్‌ టిప్స్  పంచుకుంది ప్రముఖ బాలివుడ్‌ సింగర్‌ కం యాక్టర్‌ సంజీతా భట్టాచార్య. మొదట్లో అలా రాసిన పాటను పాడేటప్పుడు గొంతు ఆగిపోతుందని, భావోద్వేగాలు అడ్డొస్తాయని.. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తి కన్నా పాటే మిగిలిందని, అదే సంగీతంలోని అందమని ఆమె తెలిపారు. “మనిషి వెళ్లిపోతాడు… కానీ పాట మాత్రం ఉండిపోతుంది” అనే తన మాటలతో ఈ జనరేషన్‌లో బ్రేకప్‌లను బలహీనతగా కాకుండా, భావాలను అర్థం చేసుకునే ఒక దశగా చూడాలని సంజీతా సూచించారు. బాధను దాచుకోకుండా, దాన్ని ఆర్ట్‌గా, పాటగా, రాతగా మార్చితే అదే మన శక్తిగా మారుతుందన్నారు.

    షారుఖ్‌ కోసం స్పానిష్‌ సాంగ్‌..
    నగరంలోని ఇనార్బిట్‌ మాల్‌ లో షాపర్ష స్టాప్‌, హైబ్‌ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలోని ఫస్ట్‌ గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌ ఆడిషన్స్‌లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న సంజీతా భట్టాచార్య ‘సాక్షి’తో ముచ్చటించారు. గ్లామరస్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ప్రతిష్టాత్మక బెర్క్లీ కళాశాలలో మ్యూజిక్ డిగ్రీ పొందిన సంజీతా భట్టాచార్య.. సంగీతమే తనకు మొదటి ప్రేమ అని తెలిపింది. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాలో తాను నటించడంతో పాటు స్పానిష్‌ సాంగ్‌ పాడటం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని అన్నారు. షారుక్‌ అంటే తనకూ ఎంతో ఇష్టమని, షూటింగ్‌ సమయంలో అలా చూస్తూ ఉండిపోయానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

    ‘‘మా నాన్న నాకు మొదటి ప్రేరణ.. తానొక పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌, ఆర్టిస్ట్‌గా సృజనాత్మకతతో జీవిస్తూ అందులోని ప్రేమను ఆస్వాదిస్తున్న వ్యక్తిగా పేర్కొన్నారు. ఫ్రాంక్లిన్, క్రిస్టినా, సెలిన్ డియాన్‌తో పాటు ఏ.ఆర్‌.రహ్మాన్ తన ఫేవరెట్స్‌ అని చెప్పారు. తదుపరి ప్రాజెక్ట్‌ కొత్త ఆల్బమ్‌ బీటీఎస్‌ అరిరంగ్‌ అందుబాటులో ఉందని, మరిన్ని కొత్త ప్రాజెక్టులతో రానుననాని, ఈ సంవత్సరం విడుదలకానున్న అల్బమ్ లో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీ పాటలు ఉంటాయని అన్నారు.

    మ్యూజిక్, కల్చర్, ఇన్‌స్పిరేషన్..
    హైదరాబాద్‌ ప్రజలు, ఇక్కడి సంస్కృతి ముఖ్యంగా బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం. ఇక్కడికి 5 సార్లు వచ్చాను.. ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత ఇక్కడి నుంచి కొత్త ఫ్రెండ్స్‌తో వెళుతున్నాను.. అని హైదరాబాద్‌ ఆత్మీయ విశేషాలను పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కూడా పాడాలని ఉంది.. ఆ కోరిక త్వరలో నిజం కావాలని ఆశించారు. ఈ సందర్భంగా అభిమానుల కే-పాప్‌ సాంగ్‌ కావాలనే కోరిక మేరకు.. స్మూత్‌ లైక్‌ బెటర్‌ బీటీఎస్‌ సాంగ్‌ పాడి అలరించారు. ఈ తరం అమ్మాయిలు సోషల్‌ మీడియా వాడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్‌ లైఫ్‌స్టైల్‌, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫోటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.

  • తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు కె.రాజన్(85) చనిపోయారు. చెన్నైలో అడయార్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)

    తమిళ సినిమాల్లో కె.రాజన్.. నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడిగా విశేష సేవలు అందించారు. 1983లో విడుదలైన 'బ్రహ్మచారిగళ్' మూవీతో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత డబుల్స్, అవళ్ పావమ్, నినైకథ నాళిళ్లయ్ తదితర సినిమాలు నిర్మించారు. 1991లో వచ్చిన 'నమ్మ ఊరు మరియమ్మ'తో దర్శకుడిగా మారారు. అనంతరం 'ఉనర్కిగళ్' తీశారు. దీంతో పాటు పలు చిత్రాలకు కథలు కూడా అందించారు.

    నటుడిగానూ తునివు, బకాసురన్ లాంటి సినిమాలతో పాటు పలు వాటిలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈయన కుమారుడు ప్రభుకాంత్ కూడా ప్రస్తుతం దర్శకుడిగా ఉన్నారు. ఇకపోతే రాజన్.. బహిరంగ వేదికలపై చేసే సంచలన వ్యాఖ్యలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆడియో లాంచ్‌లు, మూవీ ఈవెంట్స్‌లో నటుల భారీ పారితోషికాలు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలోని అక్రమాల గురించి ఘాటుగా స్పందించేవారు. అలాంటి ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో అంతా షాకయ్యారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా)

  • బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న అంజలి

    గ్లామర్ డోస్ పెంచేసిన నేహా శెట్టి

    పచ్చని ఔట్‌ఫిట్‌లో అదితీ హొయలు

    వర్కౌట్ వీడియో షేర్ చేసిన కీర్తి సురేశ్

    గ్లామర్‌తో మాయ చేస్తున్న రాశీ సింగ్

    రకుల్ ప్రీత్ సింగ్ రోజు గడుస్తుందిలా

  • హీరోయిన్ మీరా వాసుదేవన్ గురించి తెలుగువారికి కూడా సుపరిచితమే. గోల్‌ మాల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భామ..  2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. ఆ తర్వాత అంజలి ఐ లవ్యూ అనే చిత్రంలోనూ మెరిసింది. తెలుగుతో పాటు  మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా వాసుదేవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి ప్రస్తావించింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పులు చేశానని తెలిపింది. ఇప్పుడైతే చాలా ప్రశాంత జీవితం కొనసాగిస్తున్నానని వెల్లడించింది. పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాలు వృథా చేశానని పేర్కొంది. అర్థం లేని మూడు పెళ్లిళ్లకు అనవసరంగా సమయాన్ని కేటాయించానని వెల్లడించింది.  పెళ్లి విషయంలో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు.

    మూడోసారి కూడా విడాకులు తీసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని మీరా వాసుదేవన్ తెలిపింది. నాకు నచ్చిన పనులు, సేవ చేస్తూ ఆనందంగా ఉంటున్నట్లు వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపుతున్నానని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని వ్యక్తులతో సమయాన్ని వృథా చేసుకున్నానని అన్నారు.

    పర్సనల్‌ లైఫ్‌..

    కాగా.. మీరా వాసుదేవన్‌.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ కుమార్‌ కుమారుడు విశాల్‌ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్‌ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.

    వీరిద్దరు 2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్‌ షూటింగ్‌లో కెమెరామెన్‌ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2025 ఆగస్టులో విడాకుల విషయాన్ని ప్రకటించింది. దీంతో మూడు పెళ్లిళ్లు ఇలా పెటాకులయ్యాయి. 
     

  • కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సత్య.. హీరోగా గతంలో ఓ ప్రయత్నం చేశాడు గానీ వర్కౌట్ కాలేదు. మళ్లీ చాన్నాళ్లకు రీసెంట్‌గానే ఓ కామెడీ మూవీతో వచ్చాడు. తనకు మరింత క్రేజ్ వచ్చేలా చేసిన 'మత్తు వదలరా' దర్శకుడితో కలిసి తీసిన ఈ కామెడీ సినిమా.. ఇప్పుడు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

    'మత్తు వదలరా' రెండు సినిమాలతో ఆకట్టుకున్న రితేశ్ రానా దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'జెట్ లీ'. సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధాన పాత్రలు చేశారు. వెరైటీ ప్రమోషన్లతో ఆకట్టుకోవడంతో ఓ మాదిరి బజ్ ఏర్పడింది. కానీ మే 01న థియేటర్లలోకి వచ్చిన తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. కామెడీ పేరుతో చేసిన చిత్రవిచిత్ర విన్యాసాలు ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో డిజాస్టర్ అయింది. ఇప్పుడీ చిత్రం ఈనెల 25 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.

    'జెట్ లీ' విషయానికొస్తే.. ప్రజాపతి (అజయ్‌) అనే బిజినెస్‌మ్యాన్ రూ.15 వేల కోట్ల బ్యాంకింగ్‌ స్కామ్‌ చేసి దుబాయ్‌ పారిపోతాడు. దీంతో కేంద్ర హోంమంత్రి మేల్కోటి (శ్రీనివాస్‌ వడ్లమాని) ఇతడిని అరెస్ట్‌ చేసి తిరిగి దేశానికి రప్పించే బాధ్యతని భారత ఇంటెలిజెన్స్‌కి అప్పజెబుతాడు. అయితే కొందరి వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో ప్రజాపతి స్వయంగా లొంగిపోయినట్లు నటించి, ఆ తర్వాత తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. దుబాయ్‌ నుంచి కొచ్చికి ప్రజాపతిని ప్రత్యేక విమానంలో తీసుకొస్తుండగా.. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? ఇదే  విమానంలో గతం మర్చిపోయిన స్థితిలో ఉన్న డాక్టర్‌ వేదవ్యాస్‌ (సత్య) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. 12 రోజులకే స్ట్రీమింగ్)

  • భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.

    ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్‌ఎక్స్‌ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్‌ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

    ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.

    నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
     

  • హీరో మంచు మనోజ్‌ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించాడు. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కంటే ముందు సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపాడు. మార్చి 20న మనోజ్‌ పుట్టినరోజు.. ఈ క్రమంలోనే శనివారం (మార్చి 17) నాడు కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. 'ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎవరు మన పక్కనున్నారు? ఎవరు మానవత్వంతో వ్యవహరించారనేది జీవితం గుర్తు చేస్తుంది.

    అలాంటి వారికోసం..
    ఈ మానవత్వం, సేవా స్ఫూర్తి ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. అది ఎల్లప్పుడూ మాలో అంతర్భాగంగా ఉంది. అవసరంలో ఉన్నవారికోసం మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈరోజు మాలో ఉన్న స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానించాలనుకుంటున్నాము.

    మానవత్వం కోసం..
    ముఖ్యంగా మౌనిక ప్రేరేపించిన ఆలోచనతో నేడు ఐక్యధైర్యసేనా సమితిని ప్రారంభిస్తున్నాం. ఐక్య అంటే ఐకమత్యం. మానవత్వం కోసం అందరూ ఏకం కావడం. దేవుడు మాకు ప్రసాదించినదాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుకోవాలనుకుంటున్నాము. రక్తదానం, అత్యవసర సహాయం వంటివి అవసరమైనచోట ఐక్య సంస్థ నిలబడుతుంది. ఇది రాజకీయం కాదు, అలాగే ఈ సంస్థ మాది మాత్రమే కాదు, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరిదీ..

    కొత్త ఆశ
    ఒక గొప్ప లక్ష్యం కోసం హృదయాలు ఏకమైనప్పుడు జీవితాలు మారడమే కాదు... ఆశ మళ్లీ జీవం పోసుకుంటుంది అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్రస్ట్‌ ద్వారా మొదటగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు మనోజ్‌ ప్రకటించాడు. ఈరోజు నుంచి వారి బాధ్యతలు తనవేనని హామీ ఇచ్చాడు.

     

     

    చదవండి: పేరెంట్స్‌ విడాకులు.. వరలక్ష్మి అడిగిన ఒక్క ప్రశ్న వల్లే..

  • హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా హీరో వరుణ్ తేజ్‌ని 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలు అయిపోయింది. గతేడాది వీళ్లకు కొడుకు కూడా పుట్టాడు. పెళ్లికి ముందే ఓ సినిమాని లావణ్య పూర్తి చేయగా అది వాయిదాలు పడుతూ ఈ నెల ప్రారంభ వారంలో వచ్చింది. దీన్ని జనాలు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం రెండు వారాలైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

    లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సతీ లీలావతి'. తాతినేని సత్య దర్శకుడు. ప్రేమ, పెళ్లి, విడాకుల తదితర అంశాలతో తీసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ నెల 8వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కంటెంట్ బాగోలేకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం(మే 20) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. అంటే రిలీజైన 12 రోజులకే తీసుకొచ్చేస్తున్నారనమాట. తెలుగు, తమిళ వెర్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

    'సతీ లీలావతి' విషయానికొస్తే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) స్టార్ డైరెక్టర్. తల్లిదండ్రుల గొడవల కారణంగా చిన్నప్పటి నుంచి ఈమెలో ఓ రకమైన భయం ఏర్పడిపోతుంది. దీని నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్) ఈమెకు సాయం చేస్తాడు. అలా ప్రేమలో పడి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ వివాహమైన మూడేళ్లకు తనకు విడాకులివ్వాలని లీలావతిని సేతు అడుగుతాడు. నర్స్ నికోలా(మడోన్నా సెబాస్టియర్)తో ప్రేమలో ఉన్నానని.. విడాకులిస్తే ఆమెనే వివాహమాడతానని చెప్తాడు.

    భర్త ప్రేమ వ్యవహారం తెలిసిన లీలావతి.. సేతుని కొట్టి ఇంట్లో బంధిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు సేతు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈ కథలో లాయర్‌ తమలపాకుల (వీటీవీ గణేశ్‌), నిర్మాత మెట్ట రాజన్ (మెట్ట రాజేంద్రన్‌), దొంగ (సప్తగిరి) పాత్రల సంగతేంటి? చివరకు లీలావతి - సేతు విడిపోయారా? ఒక్కటయ్యారా? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

  • కన్నడ ముద్దుగుమ్మ, హీరోయిన్ శ్రీలీల గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడభామ ప్రస్తుతం ధనుష్‌కు జంటగా కనిపించనున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

    ఇక సినిమాల సంగతి పక్కనపెడితే.. ఈ ముద్దుగుమ్మపై గతంలో రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలొచ్చాయి. వినాయక చవితి వేడుకల కోసం ఆమె తన తల్లితో కలిసి ముంబయిలోని కార్తీక్ ఇంటికి వెళ్లడంతో పుకార్లు వైరలయ్యాయి.  అదే సమయంలో తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పడంతో మరింత ఆజ్యం పోసింది. కానీ వీటిపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.

    (చదవండి: రామ్‌ చరణ్‌ మణికట్టుకు గాయం.. ఎల్లుండి ఆపరేషన్‌!)

    తాజాగా శ్రీలీలపై మరోసారి డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ సారి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్‌లో ఉందంటూ కథనాలొస్తున్నాయి. మన తెలుగువాడు, యంగ్ క్రికెటర్‌తో డేటింగ్‌ చేస్తోందని కథనాలు మొదలయ్యాయి.

    ఏడాదిగా రూమర్స్.. 

    శ్రీలీల, తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారని గతేడాది నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించారని వార్తలు రావడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. దాదాపు ఆరు నెలల క్రితమే శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమలను సందర్శించింది. అదే సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.

    ఆ తర్వాత ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీలీల, ఆమె తల్లితో పాటు ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో కలిసి కనిపించడంతో రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు.

  • రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘పెద్ది’ మరికొద్ది రోజుల్లో(జూన్‌ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ కష్టపడ్డాడు. దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్‌ పడిన కష్టం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌తో పాటు నిర్మాత కూడా చరణ్‌ పడిన కష్టం గురించే చెబుతున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించే క్రమంలో చాలా సార్లు ప్రమాదానికి గురయ్యారట. దాదాపు మూడు పెద్ద గాయాలు అయ్యాయట. కానీ బయటకు మాత్రం కంటికి గాయం అయిందన్న విషయమే తెలిసిందే. 

    ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తున్నప్పుడు చరణ్‌ మణికట్టుకు కూడా తీవ్రంగా గాయం అయిందట. అయినా కూడా షూటింగ్‌కి బ్రేక్‌ ఇవ్వలేదట. ఇప్పుడా నొప్పి కాస్త ఎక్కువైపోవడంతో వైద్యులను సంప్రదిస్తే.. సర్జరీ చేయాలని చెప్పారట. రెండు రోజుల్లో చరణ్‌ మణికట్టు దగ్గర చిన్న సర్జరీ చేయించుకోబుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెంకట సతీష్‌ వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. చరణ్‌కు తగిలిన గాయాల గురించి వివరించాడు.

    ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌ చరణ్‌ చాలా కష్టపడ్డాడు. షూటింగ్‌ సమయంలో ఆయనకు మూడు గాయాలు అయ్యాయి. అయినా కూడా విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. కంటికి మాత్రమే కాదు మణికట్టు దగ్గర కూడా గాయం అయింది. ఇప్పుడా నొప్పితో బాధపడుతున్నాడు. ఎల్లుండి(మంగళవారం) ఆపరేషన్‌ ఉంది. షూటింగ్‌ సమయంలో కండరాలు పట్టేసేవి. షూటింగ్‌ గ్యాప్‌లో జిమ్‌ చేసి వచ్చేవాడు. 

    కుస్తీ పోటీలకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌లో ఆయన కండరాలు పట్టేశాయి. కాలు కూడా బెణికింది. ఆయన కోసం ప్రత్యేకంగా  ఫిజియో థెరపిస్ట్ పెట్టాల్సివచ్చింది.  ఈ సినిమా కోసం ఆయన  ప్రాణం పెట్టి నటించాడు. సినిమా చూస్తే అందరికి ఆ విషయం అర్థవవుతుంది. సినిమా ప్రారంభం నుంచే పెద్ది ప్రపంచంలోకి వెళ్తారు’ అని సతీష్‌ చెప్పుకొచ్చాడు.   కాగా, ఇటీవల చరణ్‌ కంటికి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మణికట్టుకు కూడా మరో సర్జరీ అని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

  • జబర్దస్త్ కామెడీ షోతో చాలామంది కమెడియన్లు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రారంభంలో అవినాష్‌తో కలిసి స్కిట్స్ చేసిన ఇతడు తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రవీణ్‌తో కలిసి షోలో కనిపిస్తున్నాడు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లు కార్తీక్ వెల్లడించాడు.

    (ఇదీ చదవండి: అట్లీ పాపకు అందమైన పేరు.. దాని అర్థమేంటంటే?)

    మేం అమ్మనాన్న అయ్యాం. చిన్ని పాదాలతో మా జీవితాల్లోకి వచ్చిన బిడ్డ మా జీవితాలని మార్చేసింది. అమ్మని కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు ఈ బిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది అని కెవ్వు కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

    కార్తిక్‌తో స్కిట్స్ చేసిన అవినాష్ కూడా రెండు మూడు రోజుల క్రితమే తండ్రయిన విషయాన్ని బయటపెట్టాడు. కొడుకు పుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పిల్లాడి ఫొటోలని పంచుకున్నడు. మరోవైపు కార్తిక్‌తో ప్రస్తుతం స్కిట్స్ చేస్తున్న ప్రవీణ్.. రీసెంట్‌గానే నటి వంశీతని పెళ్లి చేసుకున్నాడు.

    (ఇదీ చదవండి: 'ప్రేమలు' హీరో పగబడితే.. ఓటీటీ తెలుగు రివ్యూ)

  • సినీ రంగంలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఒకరు. తనకున్న గుండెధైర్యం మధ్యలో వచ్చింది కాదు, చిన్నప్పటినుంచే ఉంది. చిన్నతనంలోనే తల్లిదండ్రుల విడాకులను కళ్లారా చూసింది. తల్లి చాయా దేవి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎదురు తిరిగింది. ఆమె కొత్త జీవితం మొదలుపెట్టేందుకు కారణమైంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

    పేరెంట్స్‌ విడాకులు
    శరత్‌కుమార్‌, చాయా దేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వరలక్ష్మి, పూజ అని ఇద్దరు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి మనస్పర్థల కారణంగా శరత్‌కుమార్‌ దంపతులు విడిపోయారు. అప్పుడు వరలక్ష్మి వయసు పదిహేనేళ్లే.. తనకేం అర్థం కాలేదు. తమవైపు నుంచి ఏదైనా తప్పుందా? ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కదా అనుకుంది. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకుంది. తల్లికి అండగా నిలబడింది. 

    ఒక్క ప్రశ్నతో తల్లిలో మార్పు
    అయితే విడాకుల బాధ నుంచి చాయాదేవి అంత సులువుగా బయటకు రాలేదు. ఒకరోజు ఏడుస్తూనే కూర్చున్న తల్లి దగ్గరకు వెళ్లింది వరలక్ష్మి. జీవితాంతం ఇలాగే ఏడుస్తూ ఉండిపోతావా? జరిగిందేదో జరిగిపోయిందని ముందుకు కదుల్తావా? అని ప్రశ్నించింది. ఆ ఒక్క ప్రశ్న తల్లిని ఆలోచనలో పడేసింది. తనెందుకు బాధపడుతూ ఉన్నచోటే ఆగిపోవాలని తలచింది. సొంతంగా బిజినెస్‌ ప్రారంభించింది. సంపాదించడం మొదలుపెట్టింది.

    మళ్లీ పెళ్లి చేయాలని..
    అయితే తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలోనూ వరుడిని వెతికారు వరలక్ష్మి, పూజ. కానీ చాయా దేవి అందుకు ఇష్టపడలేదు. కేవలం పిల్లల పెంపకం, బిజినెస్‌.. ఈ రెండింటిపైనే దృష్టి పెట్టింది. తల్లి మాట కాదనలేక సైలెంట్‌ అయిపోయారు. తల్లితో విడాకుల కారణంగా మొదట్లో తండ్రిపై​ కోపం, బాధ కలిగాయని, కానీ గొడవపడుతూ కలిసుండటం కన్నా విడిపోవడమే మంచిదని తర్వాత అర్థమైందని నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

    ఎవరినీ దగ్గరకు రానివ్వను
    ఇంకా మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఒంటరితనాన్ని అనుభవించడం వల్ల ఎవరినీ తన దగ్గరకు రానివ్వనంది. అనుబంధాలపై పెద్దగా అటాచ్‌మెంట్‌ లేదంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే మనం జీవించలేమని, మన కోసం ఎవరో వచ్చి కంటతడి పెట్టరని పేర్కొంది. ఇతరులను గాయపరచకుండా మనం ఏం చేసినా తప్పులేదంది. 

    శరత్‌కుమార్‌ రెండో పెళ్లి
    వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మొదట్లో కథానాయికగా రంగప్రవేశం చేసినా, ఆ తర్వాత వచ్చిన, నచ్చిన పాత్రలు చేస్తూ ఆల్‌రౌండర్‌గా మారింది. ఇటీవల దర్శక, నిర్మాతగా కూడా అవతారమెత్తింది. కాగా శరత్‌కుమార్‌, చాయా దేవి 1984లో పెళ్లి చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది నటి రాధికను పెళ్లి చేసుకున్నాడు. శరత్‌- రాధిక దంపతులకు కుమారుడు రాహుల్‌ సంతానం.

    చదవండి: త్రిష కోసమే ఆ పని చేశా.. చెప్పడానికే ఎంతో భయంగా ఉంది: చిన్మయి

  • టాలీవుడ్ నటి సునయన షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్‌లో తాను లేకపోవడం తీవ్రంగా బాధించిందని తెలిపింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నేను లేకపోవడంతో నా ఫ్యామిలీ కూడా ఫుల్ డిసప్పాయింట్‌కు గురయ్యారని వెల్లడించింది. విదేశాల్లో షూట్‌కు వెళ్లినప్పుడు కాస్తా గ్యాప్‌ దొరికితే ఎవరైనా షాపింగ్ వెళ్తారని చెప్పింది. అంతమాత్రాన నా ఫోటోను ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నుంచి తీసేయండి చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేసింది.

    షాపింగ్ వెళ్తే ఎలా ఉంటారు.. డైరెక్టర్ కౌంటర్

    సునయనకు హ్యాపీ జర్నీ డైరెక్టర్ అభిరామ్ కౌంటరిచ్చారు. పారిస్ లాంటి లోకేషన్స్‌కు వెళ్లినప్పుడు.. షూట్‌లో లేకుండా మీరు షాపింగ్‌కు ఎలా వెళ్తారండి అని ప్రశ్నించారు. పారిస్‌ వరకు వచ్చాక మీరు షూటింగ్‌ లోకేషన్‌లో అందుబాటులో ఉండాలి కదా అని నిలదీశారు. అక్కడేక్కడో మిక్చర్ బాగుంటుంది.. ఇక్కడెక్కడో బజ్జీలు బాగుంటాయంటా? అని మీరు వెళ్తే మరి ఫోటోలో ఎలా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చివరికీ మిమ్మల్ని యాడ్ చేసేందుకు వీఎఫ్‌ఎక్స్‌లో కూడా ట్రై చేశామన్నారు. కానీ నేచురల్ లుక్ రాకపోవడంతోనే నేనే వద్దని చెప్పానని డైరెక్టర్ అభిరామ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది మీ బ్యాడ్ లక్ అండి.. ఈ విషయంలో నేను ఎలాంటి సాయం చేయలేనని కౌంటరిచ్చారు. ఇప్పుడు ఈ మ్యాటర్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సునయన బదం పలు సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మెప్పించింది.
     

  • తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ ఏడాది ప్రారంభంలో గుడ్‌న్యూస్‌ చెప్పాడు. భార్య ప్రియ రెండోసారి గర్భం దాల్చిందని వెల్లడించాడు. కుమారుడు మీర్‌తో ఆడుకునేందుకు ఓ బుజ్జి బేబీ ఇంట్లోకి రాబోతుందని శుభవార్త చెప్పాడు. అంతలోనే ఏప్రిల్‌ 20న పాప పుట్టిందని ప్రకటించాడు. తాజాగా పాప పేరును వెల్లడించాడు.

    కూతురి నామకరణం
    మీర్‌, ప్రియ.. ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా మియూ (MIYOU) అని నామకరణం చేశాడు. మియూ అంటే అందం, ప్రేమకు చిరునామా అని తెలిపాడు. అలాగే మి అంటే నేను, యు అంటే నువ్వు.. అని అర్థం వచ్చేలా మియూ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి మరోసారి అభిమానులు అట్లీ జంటకు కంగ్రాట్స్‌ చెప్తూ పాప పేరు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు.

    టాప్‌ డైరెక్టర్‌గా..
    అట్లీ విషయానికి వస్తే.. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా ఫేమస్‌ అయ్యాడు. విజయ్‌కు తేరి, మెర్సల్‌, బిగిల్‌ చిత్రాలతో సూపర్‌ హిట్లు అందించాడు. షారూఖ్‌ ఖాన్‌కు జవాన్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాకా మూవీ చేస్తున్నాడు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌తో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

     

    చదవండి: చేయి కోసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసింది నువ్వు కాదా? ఆర్తి రవి తల్లి ఫైర్‌

  • ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఈ సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని ‍అభిమానులను కోరింది. నాలుగేళ్ల పాటు బంధంలో ఉన్న ఈ జంట సంయుక్త ప్రకటన రిలీజ్‌ చేసి అందరికీ షాకిచ్చారు.

    అయితే అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు ఇప్పటికే సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. కానీ తాజాగా ఈ జంట మళ్లీ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. దీంతో ఈ జంట తమ విడాకుల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మళ్లీ ఫాలో కావడంతో ఈ జంట కలవబోతున్నారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. మౌనీరాయ్ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 
     

  • కట్టుకున్న భార్య ఆర్తిని కాదనుకున్నాడు. సింగర్‌ కెనీషాతో ప్రేమలో పడ్డాడు. విడాకులు మంజూరవకముందే ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసరికి జనం ఛీకొట్టారు. విపరీతమైన ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ తట్టుకోలేక ప్రేయసి వదిలేసింది. దీంతో ఒంటరివాడైపోయాడు తమిళ హీరో రవి మోహన్‌ అలియాస్‌ జయం రవి.

    పెళ్లి తర్వాత నరకం
    ఆ బాధ తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత నరకం చూశానన్నాడు. ఇంట్లో కనీస గౌరవం ఇచ్చేవాళ్లు కాదని, ఆఖరికి తాను సంపాదించిన డబ్బును దాచుకునేందుకు తనకంటూ ఒక అకౌంట్‌ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదని, తనపై చేతబడి చేయడంతో రక్తపు వాంతులు అవుతున్నాయన్నాడు. 

    నటి వల్ల జీవితం నాశనం
    శారీరకంగా, మానసికంగా హింసించి చంపేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితాన్ని నాశనం చేసిందన్నాడు. ఈ ఆరోపణలపై ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయకుమార్‌ స్పందించింది. అతడికి పిల్లల్ని దూరం చేస్తున్నారన్నదాంట్లో ఏమాత్రం నిజం లేదంది. పైగా 2009లో రవి- ఆర్తిల పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించింది. 

    బ్లాక్‌మెయిల్‌ చేసింది అతడే..
    ఆమె మాట్లాడుతూ.. '2008లో వికటన్‌ మ్యాగజైన్‌లో ఓ ఇంటర్వ్యూ వచ్చింది. దానికోసం నేను వెతుకుతున్నాను. అందులో ఆర్తిని పెళ్లి చేసుకోమని బలవంతపెట్టిందెవరు? చేతి మణికట్టు కోసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసిందెవరు? అన్నది స్పష్టంగా ఉంది. తన డబ్బు వాడుకోనిస్తున్నామా? లేదా? అన్నది కోర్టు ఇదివరకే క్లారిటీ ఇచ్చింది' అని తెలిపింది.

    ఆ నటి హస్తం లేదు
    రవి ప్రస్తావించినట్లుగా తన జీవితాన్ని నాశనం చేసిన మూడక్షరాల నటి ఖుష్బూ(ఖుష్బూ పేరును తమిళంలో మూడు అక్షరాలతో రాస్తారు) యా? అన్న ఓ విలేకరి ప్రశ్నకు సుజాత ఇలా స్పందించింది. 'తమిళనాడులో ఏ మహిళకు అన్యాయం జరిగినా అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది ఆర్తి పోస్టులకు కామెంట్లు పెట్టారు. కేవలం ఫలానా వ్యక్తులే ఆర్తి వెంట ఉండి ఇదంతా చేస్తున్నారనడం పూర్తిగా అబద్ధం. 

    పెళ్లి
    ప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అంది. కాగా రవి మోహన్‌- ఆర్తి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్‌, అయాన్‌ అని ఇద్దరు కుమారులు సంతానం. కాగా రవిమోహన్‌ దంపతులు 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు.

    చదవండి: త్రిష కోసం ఆ పని చేశా.. చెప్పాలంటే భయంగా ఉంది: చిన్మయి శ్రీపాద

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.

    ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్‌ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.

    చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్‌తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ 353(1)(c), బీఎన్‌ఎస్‌ 353(2), బీఎన్‌ఎస్‌ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: బండి భగీరథ్‌ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బండి భగీరథ్‌ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్‌ఔట్‌ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు.   

     

  • సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్‌ ఇదివరకే సరెండర్‌ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్‌ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.

    అయితే కేంద్రమంత్రి బండిసంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.

    కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్‌.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు

     

     

     

  • నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్‌ పవర్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్‌-3లో బాయిలర్‌ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్‌ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు

     

     

  • ‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్‌ గ్యాస్, వాటర్‌ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.

    అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్‌పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.

    అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్‌ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్‌ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం..

  • సాక్షి, మహబూబ్ నగర్: మహబూబ్‌ నగర్‌లో తనను ప్రేమించడం లేదని ప్రేమోన్మాది తేజ.. చేతితో గాయపడి వైష్ణవి (23) మృతి చెందింది. ఈ ఘటనలో స్థానికులు చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన తేజను ఆసుపత్రికి తరలించారు. ఆ యవకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ కీలక వ్యాఖ్యలు చేసింది. తన అక్క(వైష్ణవి) గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డింది.

    వైష్ణవి మృతిపై తన సోదరి అక్షయ ‍స్పందించింది. ఈ సందర్బంగా అక్షయ..‘మా సోదరి మృతిపై రకరకాల కథనాలు రావడం బాధాకరం. ఏ అమ్మాయి అయినా డబ్బులు తీసుకొని మోసం చేస్తారా?. చనిపోయే సందర్భంలో నిందితుడు చేసిన ఆరోపణను ఎలా నిర్ధారిస్తారు?. అమ్మాయిలను సమాజంలో పురుగుల్లా చూస్తున్నారు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆమె గురించి మీకేం తెలుసు?. మాకు న్యాయం చేయకపోయినా సరే కానీ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. న్యాయం కోసం ముఖ్యమంత్రి వద్దకైనా వెళ్తాం.

    మా అక్కపై దాడి జరిగే సమయంలో అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్‌ను అలవరచుకోవాలి. ఎవరో చనిపోయారని తెలిస్తే అక్కడికి వెళ్ళాక మా అక్క అని గుర్తించాం. సామాజిక బాధ్యతగా వివరించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రేమించకుంటే చంపేస్తారా?’ అని ప్రశ్నించింది.

    ఇదిలా ఉండగా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం స్కూల్‌లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో యువకుడు తేజ.. యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దీంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచ్చిన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్య చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

     

  • మధిర: భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళకు ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొదలైన ఘర్షణ.. సదరు మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతురాలిని కల్పనగా గుర్తించారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం మేడూరుకు చెందిన గోపిశెట్టి కల్పన (27),  మైలవరం మండలం బొర్రగూడెంకు చెందిన డేరంగుల నాగరాజు 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించాక మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆపై కల్పన కొంతకాలం తిరువూరులో, ప్రస్తుతం మధిరలోని ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వాయిద్యకారుడు విజయభాస్కర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడ్డాక, కొన్నాళ్లకు తిరువూరులోని ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేసే గంపలగూడెం మండలం కనుమూరుకు చెందిన యార్లగడ్డ చెన్నారావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై విజయభాస్కర్‌, చెన్నారావు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ప్రస్తుతం మేడూరులోని పుట్టింట్లో ఉంటూ మధిర వచ్చి వెళ్లే కల్పన రోజులాగే శనివారం కూడా బయలుదేరింది.

    ఇద్దరం కలిసి మాట్లాడుదాం..
    కల్పన విషయమై మాట్లాడే పని ఉందని, ఆమె కూడా వస్తున్నందున రావాలని చెన్నారావు.. విజయభాస్కర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో, తొలుత చెన్నారావు, కల్పన ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపాన వెంచర్‌లోకి వెళ్లారు. ఆ లొకేషన్‌ను విజయభాస్కర్‌కు షేర్‌ చేయడంతో ఆయన కాసేపయ్యాక బయలుదేరాడు. అయితే, తొలుత వెళ్లిన చెన్నారావు, కల్పన మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆపై చెన్నారావు వెళ్లిపోగా, కాసేపటికి లొకేషన్‌ ఆధారంగా చేరుకున్న విజయభాస్కర్‌కు ఇద్దరూ కనిపించకపోవడంతో వెనుదిరిగాడు.

    కొద్దిసేపయ్యాక కల్పన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మధిర సీఐ మధు, సిబ్బంది చేరుకుని పంచనామా నిర్వహించారు. అంతేకాక మృతురాలి భర్త నాగరాజు, ఆమెతో పరిచయం ఉన్న విజయభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హత్య అనంతరం పరారైన చెన్నారావు.. కల్పన సోదరుడి సెల్‌ఫోన్‌కు పలు అంశాలపై వాట్సప్‌ మెసేజ్‌లు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కాగా, కల్పన వివాహేతర సంబంధం కారణంగా ఆమె కుమారుడు ఒంటరైపోయాడని స్థానికులు చెబుతున్నారు. 

International

  • బీజింగ్‌: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.

    ఆ బామ‍్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్‌ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.

    60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? 
    షెంగ్ ఏకైక కుమార్తె టింగ్‌టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.

    గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్‌హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.  

    షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్‌గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.

    కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.

    అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్‌లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.

    షెంగ్ ఆన్‌లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్‌స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్‌స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్‌లైన్‌లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది.

  • గోతెన్‌బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.

    గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.

    ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్‌వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్‌లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.

    స్వీడన్‌లో 2 రోజుల పర్యటన 
    స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్‌లో పర్యటిస్తున్నారు.

    ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్ దేశాలు ఉంటాయి.

    “2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.

    ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్‌, స్వీడన్‌ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.

    ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్‌లో ప్రముఖ దేశంగా స్వీడన్‌కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

  • వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్‌కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్‌లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు.  అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.

    ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్‌ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.

    ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్‌లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్‌ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.  

    ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్‌ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది.

  • మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్‌లో మరో వ్యక్తి చనిపోయాడు.

    మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్‌మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.

    మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్‌ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.

    రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్‌ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.

    ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

    దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

  • కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.

    తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు.  అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి  తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

    అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై  గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు.

           మహిళలపై కఠిన చట్టాలు
     

    • కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.

    • బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.

    • యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.

    • మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.

    • మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.

    • మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.

    • పార్కులు, జిమ్‌లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు.
       

    • మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు

  • కాంగోలో ఎబోలా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 87 మంది మృతిచెందారు. దీంతో వరల్డ్‌ హల్త్‌ ఆర్గనైజేషన్‌ (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

    డెమెక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో ఎబొలా వైరస్‌తో అట్టుడుకిపోతుంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ 87 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 347 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటివరకు నమోదైన 87 మరణాలలో... 57 మోంగ్వాలులో, 27 ర్వాంపారాలో, బునియా మూడు మరణాలు సంభవించాయి. అయితే (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి (Pandamic) గా మాత్రం ప్రకటించలేదు.  

    ఈ వైరస్‌ లక్షణాలు

    ప్రమాదకరమైన ఈ వైరస్‌ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్‌ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. 
     

  • కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్‌ అనే వ్యక్తి  61మందిని మసాజ్‌ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి  13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.

    అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్‌లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై  97 అభియోగాలను నమోదు కాగా అ‍న్నింటిని కోర్టులో అంగీకరించాడు.

    అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్‌కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్‌ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని  కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అయితే సుమిత్‌కు సుమిత్‌కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్‌ సెంటర్‌లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది.
     

  • న్యూఢిల్లీ: క్రూయిజ్ షిప్‌లలో వరుసగా నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడిన అరుదైన ‘హంటా’ వైరస్ ఉదంతాలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు కోవిడ్-19 నాటి చీకటి రోజులను గుర్తుచేస్తున్నాయి.  అయితే ఈ మూడు వైరస్‌లు వ్యాప్తి చెందే విధానం, లక్షణాలు, వాటి వల్ల పొంచి ఉన్న ప్రాణాపాయం ఒకదానికొకటి పూర్తి భిన్నం. ఆ వ్యత్యాసాలు ఏమిటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

    హంటా వైరస్: అరుదైనప్పటికీ  ప్రాణాంతకం
    ఎలుకల ద్వారా మనుషులకు సోకే ‘హంటా వైరస్’ చాలా అరుదైనదే అయినప్పటికీ, ప్రాణాపాయం కలిగించడంలో దీని తీవ్రత చాలా ఎక్కువ. ఎలుకల వ్యర్థాలు, మూత్రం లేదా లాలాజలం ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి ప్రాథమిక ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది. తరువాత క్రమంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదకరమైన ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’కు దారితీసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం చాలా తక్కువ కావడం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూలాంశం.

    నోరోవైరస్: వేగంగా చుట్టుముట్టే కడుపు ఫ్లూ
    పాఠశాలలు, ఆఫీసులు క్రూయిజ్ షిప్‌ల వంటి రద్దీ ప్రాంతాల్లో ‘నోరోవైరస్’ అత్యంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలను తాకడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక వాంతులు, అతిసారం, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఇది రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోయినప్పటికీ, పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతక డీహైడ్రేషన్‌కు (శరీరంలో నీరు శాతం పడిపోవడం) దారితీసే ప్రమాదం ఉంది. దీనికి నిర్దిష్టమైన మందు లేదు, విశ్రాంతి ,  ద్రవాహారం తీసుకోవడమే ఏకైక మార్గం.

    కోవిడ్-19: దీర్ఘకాలిక ప్రభావం చూపే శ్వాసకోశ వ్యాధి
    గాలి ద్వారా, తుంపర్ల ద్వారా అత్యంత సులభంగా వ్యాపించే కోవిడ్-19 నేరుగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్ల రాకతో చాలా వరకు దీని తీవ్రత తగ్గినప్పటికీ, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఇంకా ముప్పుగానే పరిణమిస్తోంది. కొందరిలో నెలల తరబడి వేధించే ‘లాంగ్ కోవిడ్’ సమస్యలు కూడా ఉన్నాయి. నోరోవైరస్ నివారణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కోవిడ్‌ను అడ్డుకునేందుకు మంచి గాలి ఆడేలా చూసుకోవడం, హంటా వైరస్ దరిచేరకుండా ఎలుకల సంచారాన్ని నివారించడం అత్యంత ఆవశ్యకం.

    ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా?
     

National

  • వాషిం జిల్లా: పెట్రోల్‌ బంక్‌ వద్ద బారులు తీరి, క్యూలైన్లలో ఎదురుచూస్తున్నారు జనాలు. డీజిల్‌ లేదని వాహనదారులకు సిబ్బంది చెప్పారు. కొద్దిసేపటికి అక్కడకు డీజిల్‌ ట్యాంకర్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా డీజిల్‌ కోసం జనాలు తన్నుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లా, అకోలా నాకా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద చోటుచేసుకుంది. 

    ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. జిల్లాలో ఇంధన కొరత పెరగడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో డీజిల్ నింపించుకునేందుకు ఓ బంక్‌ వద‍్ద ఎదురుచూస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    మొదట వెయిట్‌ చేసే సమయంలో వాహనదారుల మధ్య మొదలైన వాగ్వాదం తర్వాత డీజిల్ ట్యాంకర్ చేరుకున్న తర్వాత పరిస్థితి ఇంకా అదుపుతప్పింది. భౌతిక దాడుల వరకు వెళ్లింది. రెండు వర్గాల వారు పరస్పరం కొట్టుకున్నారు. డీజిల్ డబ్బాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. పెట్రోల్ బంక్ వద్ద పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడడం వీడియోలో చూడొ​‍చ్చు. 

    డీజిల్ నింపించుకునేందుకు ఎదురుచూస్తున్న వారు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తొక్కిసలాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో వాహనాలు, జనాలతో భారీ రద్దీ మధ్య జనాలు తోసుకోవడం, కొట్టుకోవడం కనిపించాయి. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. గాయాలు, అరెస్టులపై ఇంకా స్పష్టత రాలేదు. గత కొన్ని రోజులుగా వాషిం జిల్లాలో తీవ్ర డీజిల్ కొరత కొనసాగుతోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాల్ని అడ్డుకున్న ఆమె.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆవుల జనన సర్టిఫికేట్ చూపించాలి’అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తృణముల్‌ కాంగ్రెస్‌ సెటైర్లు వేస్తోంది. 

    పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా శనివారం హింగల్గంజ్‌లోని లేబుఖాలి ప్రాంతంలో గోవుల రవాణా వాహనాన్ని అడ్డుకున్నారు. రహదారి మార్గంలో వాటికి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు. 

    ఈ సందర్భంగా రేఖా పత్రా మాట్లాడుతూ.. 14 ఏళ్ల లోపు ఆవులను వధ చేయరాదు. ఎవరు అక్రమంగా ఆవులను తరలిస్తే వారిని పట్టుకోవాలి. ఆవుల జనన సర్టిఫికేట్ చూపించమని అడగాలి. చూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

    ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఆవుకు జనన సర్టిఫికేట్ ఇచ్చిన ఉదాహరణ చూపించగలరా? ఒకటి చూపిస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారో కూడా తెలుసుకోవాలి” అని వ్యంగ్యంగా అన్నారు.

    అయితే టీఎంసీ నేతల సెటైర్లపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. గోవధను అరికట్టాలంటే జనన దృవీకరణ పత్రాలు ఉండాల్సిందేనని అంటున్నారు. ఎమ్మెల్యే రేఖా పత్రా ఆలోచన బాగుందని తెలిపారు.  

  • భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది 68 మంది ప్రయాణికులతో ఉన్న కోచ్‌ను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

    రైల్వే అధికారుల ప్రకారం, తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 12431 నంబరు గల రైలులోని బి-1 కోచ్‌లో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని విక్రమ్‌గఢ్ ఆలోట్,లునిరిచా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పీఆర్ఓ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఉదయం 3.45 గంటల ప్రాంతంలో రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది.

    ఈ ఘటన ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది, కనీసం ఐదు నుంచి ఆరు రైళ్ల షెడ్యూళ్లకు అంతరాయం కలిగింది. ఈ ఘటన తర్వాత పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రమాదం, రైళ్ల రాకపోకల అంతరాయంపై ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే అధికారులు హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తెచ్చారు.  

  • నూహ్: నీరే ప్రాణాధారం... కానీ ఆ గుక్కెడు నీటి కోసమే ఓ గ్రామం ప్రతిరోజూ ప్రాణసంకటాన్ని ఎదుర్కొంటోంది. ‘హర్ ఘర్ జల్’ అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా, వాస్తవ పరిస్థితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హర్యానాలోని నూహ్ జిల్లా మలాబ్ గ్రామంలో సూర్యోదయంతోనే మహిళల నీటి కష్టాలు మొదలవుతాయి. పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలయినా,పురుషులైనా, చివరికి నిండు గర్భిణులైనా ఆ నీటి కుండల బరువు మోయక తప్పని దయనీయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

    కాగితాలపైనే పథకాలు... కన్నీళ్లలో మహిళలు
    జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం కుళాయి కనెక్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా, మలాబ్ గ్రామంలో మాత్రం పైపుల ద్వారా చుక్క నీరు రావడం లేదు. భూగర్భ జలాలు ఉప్పగా మారడంతో, దాదాపు 12,200 మంది గ్రామస్తులు తాగే నీటి కోసం ‘కుండ్’ అనే భూగర్భ ట్యాంకులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. 82 ఏళ్ల వృద్ధురాలు షకీలా తన జీవితమంతా తలపై నీళ్ల బిందెలు మోస్తూనే గడిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం వారి నిరీక్షణ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.

    నిండు గర్భిణులకూ తప్పని..
    నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఏడు నెలల గర్భిణీ అయిన 26 ఏళ్ల అర్షీ సైతం ప్రతిరోజూ బరువైన నీటి బకెట్లు మోస్తోంది. బరువులు ఎత్తకూడదని వైద్యులు హెచ్చరించినా, ఆమెకు వేరే దారి లేదు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ రోజుకు పలుమార్లు ఈ భూగర్భ ట్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా స్థానిక మహిళలు నిరంతర వెన్నునొప్పి, డీహైడ్రేషన్, తీవ్రమైన అలసటకు గురవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.

    చదువును మింగేస్తున్న నీటి కటకట
    నీటి కోసం సాగే ఈ జీవన్మరణ పోరాటం బాలికల భవిష్యత్తును సైతం ఛిద్రం చేస్తోంది. ఇంటి పనుల్లో, ముఖ్యంగా నీళ్లు మోయడంలో సహాయపడేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. పైగా పాఠశాలల్లో కనీస నీటి సౌకర్యం, శుభ్రమైన మరుగుదొడ్లు లేకపోవడంతో నెలసరి సమయంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఆరుబయట ఉండే భూగర్భ ట్యాంకుల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అధికారులు ప్రాజెక్టుల పేరిట కేవలం హామీలకే పరిమితమవుతున్నారు.

    ఇది కూడా చదవండి: హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!

Business

  • సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ప్రస్తుతం.. సిమెంట్, ఇనుము, ఇసుక, కార్మిక చార్జీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడంతో ఇల్లు కట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ.. సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, తెలివైన నిర్ణయాలతో తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు తక్కువ డబ్బుతో ఇల్లు ఎలా కట్టుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.

    సరైన బడ్జెట్ ప్లాన్
    ఇల్లు నిర్మాణంలో మొదటి అడుగు బడ్జెట్ నిర్ణయించడం. మీ ఆదాయం, సేవింగ్స్, బ్యాంక్ లోన్ సామర్థ్యాన్ని బట్టి ఎంత వరకు ఖర్చు చేయగలమో ముందే నిర్ణయించుకోవాలి. చాలా మంది ప్లాన్ లేకుండా పనులు ప్రారంభించి మధ్యలో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ముందుగానే.. నిర్మాణానికి సంబంధించిన పూర్తి అంచనా తయారు చేసుకోవాలి.

    చిన్న ప్లాన్‌తో ప్రారంభించడం మంచిది
    తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టాలంటే.. మొదట చిన్న ఇంటి డిజైన్ ఎంచుకోవడం ఉత్తమం. అవసరానికి మించి పెద్ద హాల్‌లు, ఎక్కువ బెడ్‌రూమ్‌లు, ఖరీదైన ఎలివేషన్లు పెట్టుకుంటే ఖర్చు భారీగా పెరుగుతుంది. భవిష్యత్తులో అవసరం పెరిగితే పై అంతస్తు లేదా అదనపు గదులు నిర్మించుకోవచ్చు.

    సింపుల్ డిజైన్‌
    ఇంటి డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే.. నిర్మాణ వ్యయం అంత పెరుగుతుంది. కాబట్టి సాదాసీదా డిజైన్, సింపుల్ ఎలివేషన్, తక్కువ మలుపులు ఉన్న నిర్మాణం ఎంచుకోవడం మంచిది. దీని వల్ల సిమెంట్, ఇనుము, కార్మిక ఖర్చులు తగ్గుతాయి.

    నిర్మాణ సామగ్రి కొనుగోలులో జాగ్రత్త
    సిమెంట్, ఇనుము, ఇటుకలు వంటి మెటీరియల్స్‌ను ఒక్కోసారి కొనే బదులు, హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తే తక్కువ ధరలో లభిస్తాయి. అలాగే.. స్థానికంగా లభించే నాణ్యమైన మెటీరియల్స్ వాడితే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ చవక కోసం నాసిరకం వస్తువులు కొనడం మాత్రం మంచిది కాదు.

    కార్మిక ఖర్చులను నియంత్రించడం
    నిర్మాణంలో లేబర్ ఖర్చు కూడా పెద్ద భాగం. కాంట్రాక్టర్‌కు పూర్తిగా అప్పగించకుండా, మెటీరియల్స్ మీరు కొనుగోలు చేసి కూలీలకు రోజువారీ చెల్లింపులతో పని చేయిస్తే కొంత వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే పనిపై పర్యవేక్షణ తప్పనిసరి.

    అవసరమైన చోట మాత్రమే లగ్జరీ
    ఇంటి నిర్మాణంలో.. మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, ఖరీదైన వుడ్‌వర్క్, డిజైనర్ టైల్స్ వంటి వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రారంభ దశలో అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. తరువాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

    ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి
    ప్రభుత్వం అందించే గృహ పథకాలు, సబ్సిడీ హోమ్ లోన్స్, PMAY వంటి పథకాల గురించి తెలుసుకోవాలి. అర్హత ఉంటే వీటి ద్వారా వడ్డీ భారం కొంత తగ్గుతుంది.

    ఎలక్ట్రిక్, వాటర్ ప్లానింగ్
    ఇల్లు నిర్మాణ సమయంలోనే విద్యుత్ వైరింగ్, నీటి పైపులు, డ్రైనేజ్ వ్యవస్థలను సరిగ్గా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మరమ్మతుల ఖర్చు తగ్గుతుంది.

    మొత్తం మీద.. తక్కువ డబ్బుతో ఇల్లు కట్టుకోవడం అసాధ్యమైన పని కాదు. అయితే సరైన ప్రణాళిక, ఖర్చుపై నియంత్రణ, అవసరాలకు తగ్గ డిజైన్, నాణ్యమైన మెటీరియల్స్ వినియోగం ద్వారా తక్కువ బడ్జెట్‌లో కూడా అందమైన, బలమైన ఇల్లు నిర్మించుకోవచ్చు. తొందరపడకుండా ప్రతి దశను ఆలోచించి ముందుకు వెళితే సొంతింటి కల సాకారం అవుతుంది.

  • వేసవిలో వేడి ఎంత పెరిగినా, మిమ్మల్ని కూల్‌గా, కంఫర్ట్‌గా ఉంచే, బెస్ట్‌ హెల్పర్స్‌.. ఈ సమ్మర్‌ స్పెషల్‌ గాడ్జెట్స్‌!

    అరచేత్తో ఐస్‌ గోలా!
    వేసవిలో చల్లచల్లగా ఐస్‌ గోలా తినాలని అనిపిస్తుందా? కానీ హైజీన్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఇక టెన్షన్  అవసరం లేదు. ఎందుకంటే, మీ కళ్ల ముందే స్వచ్ఛమైన ‘గోలా’ను తయారుచేసి ఇస్తుంది ఈ ఐస్‌ గోలా మేకర్‌! పైగా దీనికి కరెంట్‌తో పనిలేదు. ఎందుకంటే ఇది చేత్తో తిప్పే మాన్యువల్‌ మ్యాజిక్‌ మెషిన్‌. ఇందులో ఉన్న తుప్పుపట్టని షార్ప్‌ బ్లేడ్లు  క్షణాల్లో గట్టి ఐస్‌ గడ్డలను ‘మంచు పొడి’గా మార్చేస్తాయి. దీనితో పాటు 3 బౌల్స్, 6 రీయూజబుల్‌ స్టిక్స్, ఒక గ్లాస్‌ కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న ఐస్‌ ముక్కలు వేయడం, హ్యాండిల్‌ తిప్పడం, మీ ఫేవరెట్‌ ఫ్లేవర్‌ వేసుకోవడం.. అంతే, హోమ్‌ మేడ్‌ ఐస్‌ గోలా రెడీ! ధర రూ. 460 మాత్రమే.

    పోర్టబుల్‌ వాటర్‌ కంటైనర్‌
    పిక్నిక్‌లో ‘నీళ్లు ఎక్కడ?’ అన్న ప్రశ్నకు స్టయిల్‌గా సమాధానం చెప్పండి. బ్యాగ్‌లో నుంచి ఈ పోర్టబుల్‌ డ్రింక్‌ స్టోరేజ్‌ను తెరిచి, ఒకేసారి క్షణంలో పదిమందికి పైగా నీళ్లను అందించండి. ఎందుకంటే, ఇది మామూలు కంటైనర్‌ కాదు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లి, వెంటనే వాడుకునే స్మార్ట్‌ డ్రింక్‌ స్టోరేజ్‌! వాడనప్పుడు సైలెంట్‌గా మడుచుకుని బ్యాగ్‌లో కూర్చుంటుంది. కానీ ఓపెన్  చేస్తే ఒక్కసారిగా 5.5 లీటర్ల ‘డ్రింక్‌ స్టేషన్’ గా మారిపోతుంది! జ్యూస్, నీళ్లు లేదా కూల్‌ డ్రింక్స్‌ నింపి ట్యాప్‌ ద్వారా సులభంగా సర్వ్‌ చేసుకోవచ్చు. లైట్‌వెయిట్‌ కాబట్టి మోసుకెళ్లడం ఈజీ. ధర రూ. 599 మాత్రమే!

    చల్లగా.. వేడిగా.. ఒక్క బౌల్‌లోనే!
    పార్టీలు, గెట్‌ టుగెదర్స్‌ లేదా ఇంట్లో స్పెషల్‌ సర్వింగ్‌ కోసం మీ ఫుడ్‌ ఎక్కువసేపు అదే టెంపరేచర్‌లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ డిప్‌ చిల్లర్‌ బౌల్‌ మీకు పర్ఫెక్ట్‌ చాయిస్‌! ఇది మామూలు గిన్నె కాదు, మీ ఫుడ్‌ను చల్లగా లేదా వేడిగా ఎక్కువసేపు అలాగే ఉంచే స్మార్ట్‌ సర్వింగ్‌ సొల్యూషన్.

    దీనిలో డబుల్‌ వాల్‌ ఇన్సులేషన్ ఉంటుంది. చల్లని వంటకాలకు బౌల్‌లో నీళ్లు నింపి ఫ్రీజ్‌ చేస్తే, సాల్సా, ఐస్‌క్రీమ్, డ్రింక్స్‌ లాంటి వాటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. అలాగే వేడి నీళ్లు పోస్తే, నూడుల్స్, సూప్, పాస్తా లాంటి వేడి వంటకాలు కూడా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. ఫుడ్‌ గ్రేడ్‌ స్టెయిన్లెస్‌ స్టీల్‌తో తయారైన ఈ బౌల్‌ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ధర రూ. 1,200 మాత్రమే!

  • mAadhaar యాప్ త్వరలో నిలిచిపోతుందని.. యూజర్లు కొత్తగా ప్రారంభమైన ఆధార్ యాప్ వైపు మారాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కొత్తగా అందుబాటులోకి రానున్న.. ఆధార్ యాప్ క్యూఆర్ బేస్డ్ ఆధార్ షేరింగ్, ఫేస్ ఆథెంటికేషన్, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ లాక్ కంట్రోల్, మెరుగైన ప్రైవసీ ఎంపికలను కలిగి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దీనిని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ సూచించింది.

    యాప్ డౌన్లోడ్ - సెట్‌అప్ విధానం

    ➤యూజర్లు కొత్త ఆధార్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యూఐడీఏఐ తన అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా డౌన్లోడ్ లింక్ అందజేస్తోంది.

    ➤యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యూజర్ తమ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నెంబరును ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫేస్ ఆథెంటికేషన్ కూడా అవసరం అవుతుంది.

    ➤లాగిన్ పూర్తయిన తరువాత.. యూజర్ సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేయాలి, లేదా ఫింగర్‌ప్రింట్/ఫేస్ అన్‌లాక్ ద్వారా యాప్‌ను సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. తరువాత, ఆధార్ ప్రొఫైల్‌ను మాన్యువల్‌గా యాప్‌లో ఎంటర్ చేసి మరో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

    ➤ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబ సభ్యులు కూడా వేర్వేరు ఆధార్ ప్రొఫైల్స్.. యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఒకే డివైస్‌లో అనేక ప్రొఫైల్స్ సపోర్ట్ అవుతాయని యూఐడీఏఐ వెల్లడించింది. ఇది కుటుంబాలకు ఆధార్ సేవలను సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.

    ➤ప్రతి ఆధార్ వివరాలు సరిగ్గా పనిచేస్తున్నాయని ధృవీకరించిన తర్వాత, యూజర్లు పాత mAadhaar యాప్ తొలగించవచ్చు.

    యాప్‌లో ముఖ్యమైన మార్పులు

    కొత్త ఆధార్ యాప్ ముఖ్యంగా ప్రైవసీ అండ్ డిజిటల్ వెరిఫికేషన్ మీద దృష్టి పెట్టింది. ఆధార్ కార్డు ఫోటోకాపీలు పంచుకునే అవసరం లేకుండా, యూజర్లు క్యూఆర్ ఆధారిత సురక్షిత పద్ధతిలో గుర్తింపును ధృవీకరించవచ్చు.

    ప్రయోజనాలు

    • ఆధార్ కార్డు ఫోటోకాపీలు ఇవ్వకుండా గుర్తింపు ధృవీకరణ.

    • ఆధార్ సమాచారం యాక్సెస్, షేరింగ్ పై యూజర్‌కు పూర్తి నియంత్రణ.

    • యాప్ ద్వారా నేరుగా ఆధార్ సేవలను నిర్వహించవచ్చు.

    • అదనపు గుర్తింపు ధృవీకరణకు ఫేస్ ఆథెంటికేషన్ సపోర్ట్.

    • ఆధార్ ఆథెంటికేషన్‌ను స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా సురక్షితంగా నియంత్రించుకోవడం.

  • బంగారం ధరలు భారీగా పెరుగుతూ.. తగ్గుతూ ఊహకందని మార్పులకు లోనవుతున్నాయి. వారం మధ్యలో పెరిగిన గోల్డ్ రేటు, వారాంతంలో ఒక్కసారిగా పడిపోయాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరల్లో జరిగిన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.

    మే 10న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,52,350 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర, మే 16 నాటికి 1,56,930 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,39,650 వద్ద నుంచి 1,43,850 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతగా మార్పు చెందాయో స్పష్టంగా అర్థమవుతోంది.

    చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఏడురోజుల్లో 1,54,370 రూపాయల నుంచి 1,60,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,500 వద్ద నుంచి రూ.1,47,500 వద్దకు చేరింది. ఈ మార్పు కేవలం వారం రోజులలో జరిగింది.

    ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలు, వారం రోజుల్లో భారీ పెరుగుదలను నమోదు చేసాయి. మే 10న 1,52,500 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం రేటు మే 16నాటికి 1,57,080 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,39,800 నుంచి 1,44,000 రూపాయల వద్దకు చేరింది.

    ధరలు పెరుగుదలకు కారణాలు
    బంగారం ధరలు పెరగడానికి సాధారణంగా అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉంటాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు లేదా రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు షేర్లు, బాండ్లు వంటి రిస్కీ ఆస్తుల నుంచి డబ్బును తీసి బంగారంలో పెట్టడం పెరుగుతుంది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఎగుస్తాయి.

    అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కీలకం. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది.

    ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా బంగారం ధరలు పెరుగుతాయి. కరెన్సీ విలువ తగ్గిపోతున్నప్పుడు ప్రజలు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం వైపు మొగ్గుతారు.

    ఇంకో కారణం వడ్డీ రేట్లు. బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బంగారం ఆకర్షణ పెరుగుతుంది, ఎందుకంటే ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే లాభం తగ్గిపోతుంది. అదే విధంగా.. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఆభరణాల డిమాండ్ (వివాహ సీజన్‌లు, పండుగలు), అలాగే మార్కెట్ స్పెక్యులేషన్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతాయి.

    ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!

  • ఇటీవలి కాలంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం చాలామంది ఉద్యోగులకు సౌకర్యంగా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తూ సమయం, ప్రయాణ ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. అయితే.. ఈ విధానం కొంతమందికి ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తోంది. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది.

    ఆ ఇంజనీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది తనకు మొదటి వర్క్ ఫ్రం హోమ్ అనుభవం. తాను సహజంగా చాలా యాక్టివ్ పర్సన్, అయితే.. ఇంట్లో ఒంటరిగా పని చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలలుగా ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయినా ఉదయం లేవగానే బద్ధకంగా, అలసటగా అనిపిస్తోందని తెలిపారు. దీని కారణంగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఉత్సాహం తగ్గిపోయిందని వివరించారు.

    అతను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పనిచేసే గది. ఆ గదిలో కిటికీలు లేవని, పొరుగింటి గోడ ఉండటం వల్ల సహజ కాంతి అసలు లోపలికి రాదని పేర్కొన్నారు. రోజంతా సూర్యకాంతి లేకుండా గదిలో ఉండటం వల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సూర్యకాంతి లేకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చని చాలామంది వైద్యులు చెబుతుంటారు.

    అంతేకాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్ తన లైఫ్ స్టైల్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు. పని స్టార్ట్ చేయడానికి ముందు మాత్రమే నిద్ర లేవడం, రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువగా AI టూల్స్ ఉపయోగించి కోడింగ్ చేయడం వల్ల శారీరక కదలికలు తగ్గిపోయాయని చెప్పారు. ముందులా తీవ్రంగా ఆలోచిస్తూ.. కోడింగ్ చేసే అనుభూతి కూడా లేకపోవడంతో పని పట్ల ఆసక్తి తగ్గుతోందని తెలిపారు.

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ముందుగా విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేసుకోమని సూచించారు. మరికొందరు గదిలో సూర్యకాంతి, తాజా గాలి లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాయామం చేయడం, జిమ్‌కు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం, అలాగే కిటికీలు ఉన్న గదిలో పని చేయడం మంచిదని సలహా ఇచ్చారు.

    కొంతమంది నెటిజన్లు “వర్క్ ఫ్రం హోమ్ నిజానికి శక్తిని ఆదా చేస్తుంది. ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. కానీ సరైన జీవనశైలి లేకపోతే అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని పేర్కొన్నారు. మరికొందరు తీవ్రమైన అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.

    ఇదీ చదవండి: కియోసాకి చెప్పిన సక్సెస్ ఫార్ములా ఇదే!

  • ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా దాదాపు ఆరేళ్లలో తొలిసారిగా లాభాల్లోకి మళ్లింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 51,970 లాభం ప్రకటించింది. చెల్లించాల్సిన ఏజీఆర్‌ బాకీలకు సంబంధించి కేంద్రం నుంచి వెసులుబాటు లభించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.

    గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వొడాఫోన్‌ ఐడియా రూ. 7,167 కోట్ల నష్టం నమోదు చేసింది. క్యూ4లో ఆదాయం 3 శాతం పెరిగి రూ. 11,229 కోట్ల నుంచి రూ. 11,332 కోట్లకు చేరింది. ఏజీఆర్‌పరమైన ఊరటని పరిగణనలోకి తీసుకోకుంటే.. నష్టం నాలుగో త్రైమాసికంలో రూ. 5,515 కోట్లుగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 24,059 కోట్లుగా ఉంది.

    మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి యూజర్ల సంఖ్య 19.28 కోట్లుగా ఉంది. మిగతా అన్ని టెల్కోలతో పోలిస్తే ప్రతి యూజరుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) అతి తక్కువగా రూ. 190గా ఉన్నప్పటికీ, వృద్ధి మాత్రం అత్యధికంగా 8.3 శాతంగా నమోదైంది. మరోవైపు, ప్రమోటర్‌ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన సూర్యజ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నుంచి రూ. 4,730 కోట్లు సేకరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకోసం 430 కోట్ల వరకు వారంట్లను జారీ చేయనుంది.

Family

  • తెలుగు డిటెక్టివ్‌ సాహిత్యంలో మధుబాబు కొన్ని దశాబ్దాలు పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత. ఆయన సృష్టించిన ‘షాడో’ ఒక సంచలనం. మధుబాబు అసలు పేరు వల్లూరు మధుసూదనరావు. తన కుమారుడు ఉదయ్‌ పెంపకం గురించి ఆయన పంచుకున్న అనుభవాలు... 

    ‘‘చాలాకాలం క్రితం మేము ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో నా శ్రీమతి ఆదిలక్ష్మి తనకు సంపంగి చెట్టు కావాలని అడిగింది. నూజివీడులో వున్న నర్సరీ నుంచి తీసుకువచ్చాను. మంచి సంపంగి కాదది, మాను సంపంగి. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చిన్న చిన్న ఆకులు కాస్తా వెడల్పు అవుతాయి. నర్సరీ వాడు నన్ను ఏమార్చాడు. ఆ మొక్క నాటినప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ప్రతిరోజూ బండెడు బండెడు ఆకులు రాల్చేది. వాటిని ఎత్తి అవతల పడేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.

    పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగింది చెట్టు. ఒక్క పువ్వు కూడా పూయలేదు. మాతో చాకిరీ చేయించుకోవటానికే అది మా ఇంటికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్‌గా ప్రత్యక్షం అయ్యాయి మొగ్గలు. రెండే రెండు రోజుల్లో వికసించాయి. మా ఇల్లేకాదు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుబాళించిపోయాయి సువాసనతో. మా అబ్బాయికి ఆ మాను సంపెంగకి తేడా ఏమీలేదని నాకు అనిపిస్తోంది ఇప్పుడు తరచి చూసుకుంటుంటే.

    పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు లేచి కూర్చునేవాడు. నా శ్రీమతిని నిద్రపోనిచ్చేవాడు కాదు. నన్ను నా రాతలు రాసుకోనిచ్చేవాడు కాదు. బెడ్‌ మీద నేను కనిపించకపోతే పాము మాదిరి పాకుతూ నా రైటింగ్‌ రూములోకి వచ్చి నా టేబుల్‌ కింద దూరేవాడు. భుజం మీద వేసుకుని వేమన శతకం, దాశరథీ శతకంలో నాకు వచ్చిన పద్యాలన్నిటినీ చెబుతూ రెండు గంటలు తిప్పితే తప్ప ఊరుకునేవాడు కాదు. స్కూల్‌కి టైమ్‌కి వెళ్ళేవాడు కాదు. అక్కడ టీచర్లను చెండుకు తినేవాడు. చూసి చూసి ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ మేడమ్‌ నాకు కబురుపెట్టింది. 

    డిజాస్టర్‌ ఏదో జరిగిందనే అనుమానంతో నేను నా ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి నా శ్రీమతిని తోడు తీసుకుని వెళ్ళాను. ప్రిన్సిపాల్‌ మేడమ్‌ చేసిన కంప్లైంట్‌ వినేసరికి నాకు మతిపోయింది. టీచర్లు చెపుతున్న పాఠాన్ని ఒకసారి విని అప్పటికప్పుడు అప్పగించేస్తున్నాడట. ఏదైనా వర్క్‌ ఇస్తే క్షణాల మీద పూర్తిచేసి, మిగిలిన పిల్లల్ని డిస్టర్బ్‌ చేస్తున్నాడట. ‘ఈ తలనొప్పిని మేము భరించలేము, మీ అబ్బాయిని డబల్‌ ప్రమోషన్‌ చేస్తున్నాము’ అన్నది ఆమె. అంటే సంవత్సరం మధ్యలో పై తరగతికి కాకుండా ఆపై తరగతికి పంపటం.

    అలా అలా తన చుట్టూ వున్న వారిని, మమ్మల్ని టెన్షన్‌ మీద టెన్షన్‌ పెడుతూ టెన్త్, ఇంటర్‌ పూర్తిచేసి ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. రెండో సంవత్సరంలో బండి కావాలన్నాడు. ఒక సంవత్సరం తాత్సారం చేసి థర్డ్‌ ఇయర్‌లో కొనిపెట్టాను. మూడోరోజున తన ఫ్రెండ్‌ని ఎక్కించుకుని ఎనభై స్పీడ్లో తీసుకుపోయి కొట్లాడుకుంటున్న కుక్కల మధ్యలోకి పోయి బోర్లాపడ్డాడు. కుక్కలు పారిపోయాయిట. కానీ వీడికీ వీడి దోస్తుకీ మోకాళ్ళు మోచేతులూ  చెక్కుకుపోయాయి.

    ఆ దెబ్బకి బండిని వదిలేస్తాడని ఆశించిన నాకు ఇంకో షాకు. నాలుగు రోజులు గడవకముందే, తగిలిన దెబ్బలు ఆరకముందే అదే దోస్తుతో అదే బండిమీద అదే స్పీడుతో నేషనల్‌ హైవే మీద కాలేజీకి పోయివచ్చాడు. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి తయారైంది పరిస్థితి. మా అదృష్టం బాగున్నది కాబోలు– ఫర్దర్‌ టెన్షన్లు లేకుండా ఇంజనీరింగ్‌ పూర్తి అయింది. మాకు తెలియకుండానే మేము పెంచిన మాను సంపెంగ మొగ్గలు వేసి పూలు పూసినట్టు ఒక్కసారిగా మార్పు వచ్చింది వాడిలో.

    బిట్స్‌ పిలానీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశాడు. పెద్ద ప్యాకేజీతో బెంగళూర్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. వేదం నేర్చుకున్నాడు. వయొలిన్‌ వాయించటం అభ్యాసం చేశాడు. రెండుసార్లు సోమయాగం చేసి సోమయాజిగా అనిపించుకున్న పెద్దమనిషి కూతుర్ని– ఆయుర్వేద వైద్యవిద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న అమ్మాయిని భార్యగా పొందాడు. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్థం అయింది. 

    మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. నా సతీమణి ఆదిలక్ష్మి ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఉండివుంటే తను పెంచిన మానుసంపంగి పువ్వుల్ని చూసి ఎంత మురిసిపోయిందో, అంతకు లక్షరెట్లు తన బిడ్డ అభ్యున్నతిని చూసి మురుసుకునేది. తన పెంపకమే ఇది. తన కష్టం. తన కడుపు పంట. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్ధం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. 

    షాడో మధుబాబు, రచయిత

  • కారులో కూర్చున్న అరవై రెండేళ్ళ ఆయన  చేతి గడియారం వంక చూసుకుని, అసహనంగా ఇంటి గుమ్మంవైపు చూశాడు. ఆయన భార్య చేతిలో హేండ్‌ బేగ్‌తో వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ‘‘ఆలస్యమైందే?’’ ఆయన కారు స్టార్ట్‌ చేస్తూ కోపంగా అడిగాడు. ‘‘హేండ్‌ బేగ్‌ కనపడలేదు.’’ ‘‘అందుకే తీసిన వస్తువు తీసిన చోటే ఉంచాలని చెప్పేది.’’ ‘‘మొదలెట్టారూ గ్రామఫోన్‌ రికార్డు?’’ ‘‘నేను చెప్పేవన్నీ జీవితానికి ఉపయోగించేవి. గిఫ్ట్‌ పేక్‌ తీసుకున్నావా?’’

    ‘‘అరే. మర్చిపోయానండి. మీరైనా గుర్తు చేయాల్సింది.’’ ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కదు. పైగా గ్రామఫోన్‌ రికార్డ్‌ అంటావు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. దాన్ని నీ చెప్పుల పక్కన ఉంచమని నిన్న రాత్రి చెప్పానా? అప్పుడు మర్చిపోవని.’’ ఆయన ఆగ్రహాన్ని అణచుకుంటూ చెప్పాడు. ‘‘మన పెళ్ళై ఎన్నేళ్ళైందంటారు?’’ ఆవిడ తన భర్త వంక చూస్తూ అడిగింది. ‘‘తెలీదా?’’ ‘‘మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.’’‘‘ముప్ఫై ఆరేళ్ళు. ఐతే?’’

    ‘‘అంతకాలం నించి మీరు నన్ను సాధిస్తున్నారు. అత్తలేని సంబంధం అని మా వాళ్ళు మీకిచ్చి చేశారు. కాని మీరు డబల్‌ అత్తగారని వాళ్ళకి తెలీదు.’’ ‘‘ఆపుతావా?’’ ఆయన అరిచాడు. ‘‘మీరు కారుని ఆపేదాకా ఆపను. ఏం? మీరు సాధించగా లేనిది నేను సాధించకూడదా? కొత్తల్లో భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు గెట్‌ అవుట్‌ అంటే పెద్దాడి ఇంటికి వెళ్ళిపోతాను.’’

    ‘‘స్టీరింగ్‌ వీల్‌ ముందు కూర్చున్న వాడికి కోపం తెప్పించకూడదు, అది ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ఆయన కోపంగా అడిగాడు. ‘‘మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్‌ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్‌ డిక్టేట్‌ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్‌ వస్తుంది. ఆపండి. ఓ బొకే  కొనుక్కెళ్దాం.’’‘‘ఎందుకు? మర్నాడు మన డబ్బు చెత్తబుట్టలో చేరడానికా? పళ్ళబుట్టని కొనుక్కెళ్దాం.’’

    ‘‘పూల బొకే రెండు వందల ఏభైతో పోతుంది. పళ్ళబుట్టలో అరడజను పళ్ళు. దానికి ఆరు వందలు తీసుకుంటారు. ఆ మేదర బుట్ట ఖరీదే రెండు వందలు ఉంటుంది.’’ ‘‘ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.’’‘‘కాదు. మీరు డబ్బుని వృథా చేస్తున్నారు అంటాను.’’ ‘‘ఎక్కడ ఆదా చేయాలో, ఎక్కడ ఖర్చు చేయాలో ఇంతకాలం నాతో కాపురం చేశాక కూడా నీకు బోధపడలేదు.’’ ఆయన గొణిగాడు. ‘‘ఏమిటి? గట్టిగా వినేలా తిట్టొచ్చుగా.’’ ఆయన మాట్లాడలేదు.

    ‘‘ఇల్లు తాళం వేశానంటారా?’’ ఆవిడ కొద్దిసేపు ఆగి అడిగింది. ‘‘కారులో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది? అది ఇంట్లోంచి బయటికి వచ్చిన వాళ్ళకి తెలియాలి.’’ ‘‘నేను కారులోకి తాళంచెవుల గుత్తితోనే వచ్చానా అని అడుగుతున్నాను.’’ ‘‘నా దగ్గర బైనాక్యులర్స్‌ లేవు.’’
    ‘‘వెనక్కి తిప్పండి.’’ ‘‘ముహూర్తం టైంకి వెళ్ళాలి.’’ ‘‘తాళం వేయకపోతే ఏ డెలివరీ బాయో ఉన్నదంతా చక్కబెట్టుకుపోతాడు. వెనక్కి తిప్పండి.’’

    ‘‘మనం పెళ్ళి ముహూర్తానికి వెళ్ళి తీరాలి.’’ ఆయన కోపంగా అరిచాడు. ‘‘ఇంటికి తిరిగి వెళ్ళేదాకా నాకు ఆందోళనగా ఉంటుంది.’’ ‘‘ఉండనీ.’’ ‘‘మీ వల్లే నాకు బీపీ’’ ‘‘అది మీ ఇంటి పేరు. మీ నాన్నకి, అమ్మకి, అక్కయ్యకి, ఆఖరికి మీ పనిమనిషికి, పెంపుడు కుక్కకీ కూడా బీపీ. నాకు లేదు.’’ ‘‘మీలాంటి వాళ్ళ వల్లే నాకు మాకు బీపీ’’ ఆవిడ కోపంగా అరిచింది. ‘‘అరవక. నీకు బీపీ వచ్చింది.’’ ‘‘నాకేం? హైకోర్ట్‌ జస్టిస్‌ ఇంట్లో దొంగలు పడ్డారని పేపర్లో రానీండి.’’

    ‘‘విడాకుల గురించి ఏం ఆలోచించావు?’’ ఆయన అకస్మాత్తుగా అడిగాడు. ‘‘పెద్దాడు వద్దన్నాడు. భరణం ఎంత వస్తుందో ముందు కనుక్కోమన్నాడు.’’ ‘‘ఆ ఆలోచన కూడా చేశారన్నమాట. మీ కడుపులో ఎన్ని ఆలోచనలు దాచుకున్నారు!’’ ‘‘ఆలోచనలు కడుపులో దాచరు. మెదడులో దాస్తారు. అందుకే మీ జడ్జిమెంట్లని సుప్రీం కోర్ట్‌ కొట్టేస్తూంటుంది.’’ ‘‘షటప్‌. ఎకసెక్కెమా?’’

    ఆయన బ్రేక్‌ వేయడంతో ఆ కుదుపుకి ఆవిడ తల డేష్‌ బోర్డుకి కొట్టుకుంది. వెనక సీట్లో కూర్చున్న దర్శకుడు చెప్పాడు. ‘‘నైస్‌. ‘దాంపత్యం’ సరైన టైటిల్‌. మీతరం వాళ్ళల్లోని గొప్పతనం ఇదే. రిహార్సల్స్‌ కావాలంటారు. డైలాగ్స్‌ కంఠతా పడతారు. బయట మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రేక్షకులకి తెలుసు. స్క్రీన్‌ మీద ఇలా పోట్లాడుకుంటుంటే ఎంజాయ్‌ చేస్తారు. టేక్‌ చేద్దామా?’’ మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్‌ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్‌ డిక్టేట్‌ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్‌ వస్తుంది. ఆపండి. ఓ బొకే  కొనుక్కెళ్దాం. 
    మల్లాది వెంకట కృష్ణమూర్తి  

  • స్టయిలిష్‌గా కనిపించాలంటే, బ్రాండ్స్‌ కాదు బాస్‌.. సరైన కలర్స్‌తో కంట్రోల్‌ చేసి గేమ్‌ చేంజర్‌గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్‌ని మిస్‌ అయితే, బడ్జెట్‌ ఎంత పెట్టినా లుక్‌ డల్‌గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్‌ ఏంటో చూద్దాం!

    త్రీ కలర్స్‌ రూల్‌: ఒక అవుట్‌ఫిట్‌లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్‌ వేసుకుంటే, మీరు స్టయిలిష్‌గా కాకుండా కలర్‌ ఎగ్జిబిషన్‌లా మారేలా చాన్స్‌ ఉంది.

    న్యూట్రల్స్‌గా బేస్‌: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్‌ఫిట్‌కి కూడా బేస్‌ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్‌ ఇవి మీ స్టయిల్‌కి బలమైన బేస్‌. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్‌ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్‌ ఎప్పుడూ ‘నో టెన్షన్‌  జోన్‌’లో ఉంటుంది.

    సింపుల్‌ స్టయిల్‌ ఫార్ములా: ఒక న్యూట్రల్‌ కలర్, ఒక మెయిన్‌ కలర్, ఒక చిన్న హైలైట్‌ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్‌ + వైట్‌ టీషర్ట్‌ + లైట్‌ గ్రీన్‌ షర్ట్‌. అంతా న్యూట్రల్‌ కలర్స్‌ అయితే కాస్త బోరింగ్‌గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్‌ బ్లూ, రస్ట్, సాఫ్ట్‌ పింక్‌ లాంటి కలర్స్‌ జోడిస్తే లుక్‌కి లైఫ్‌ వస్తుంది.

    టెక్చ్సర్‌ కూడా మ్యాటర్‌: ఒకే కలర్‌ అయినా, మెటీరియల్‌ మారితే లుక్‌ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్‌ గ్రే స్వెటర్‌ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్‌ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్‌ వంటి టెక్స్చర్స్‌ మిక్స్‌ చేస్తే మీ స్టయిల్‌ మరింత రిచ్‌గా కనిపిస్తుంది.

    రెడీగా ఉన్న సూపర్‌ కాంబినేషన్స్‌
    ఈ కాంబినేషన్స్‌ సేవ్‌ చేసుకోండి! ఎందుకంటే, 
    ఇవి ట్రై చేస్తే స్టయిల్‌ ఎప్పుడూ మిస్‌ అవ్వరు
    1. వైట్‌ షర్ట్‌ + నేవీ ప్యాంట్‌ 
    2. లైట్‌ బ్లూ షర్ట్‌ + టాన్స్‌ప్యాంట్‌ 
    3. బ్లాక్‌ టీషర్ట్‌ + ఖాకీ ప్యాంట్‌  
    4. బర్గండీ షర్ట్‌ + డెనిమ్‌ జీన్స్‌

    మీ స్కి  టోన్‌కి సరిపడే కలర్స్‌
    అందరికీ అన్ని కలర్స్‌ సెట్‌ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్‌ అయ్యే కలర్స్‌ తెలుసుకున్నారంటే, స్టయిల్‌ గేమ్‌లో మీరు అప్పుడే హాఫ్‌ విన్‌  అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్‌ స్కిన్‌కి  లైట్, సాఫ్ట్‌ కలర్స్, మీడియం స్కిన్‌ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్‌. డార్క్‌ స్కిన్‌ వారికైతే బోల్డ్, బ్రైట్‌ కలర్స్‌ సూపర్‌గా కనిపిస్తాయి.  

  • డాక్టర్‌ కృపాకర్‌ తన గదిలోనే నిర్జీవంగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఫోరెన్సిక్‌ తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అతడు అనుమానాస్పదంగా మరణించడం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను షాక్‌కు గురిచేసింది. కృపాకర్‌ బ్రహ్మచారి. రాత్రి వంటమనిషి వంట చేసి వెళ్తుంది. పొద్దున్నే సర్వెంట్‌ డూప్లికేట్‌ కీతో లోపలికి  వచ్చి పనులు పూర్తి చేసుకుని కాఫీతో డాక్టర్‌ను నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా డాక్టర్‌ లేవకపోవడం, తన గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్‌ చేసింది.
    ∙∙ 
    డిటెక్టివ్‌ సిద్ధార్థ డాక్టర్‌ కృపాకర్‌ బెడ్‌రూమ్‌ను పరిశీలిస్తున్నాడు. మృతదేహం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా పెనుగులాట ఆనవాళ్లు లేవు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆయన గుండె ఆగి మరణించారు. దానికి కారణం తీవ్రమైన ‘షాక్‌’. కానీ గదిలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన దాఖలాలు లేవు. అంతగా షాక్‌కు గురి చేసే సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. డిటెక్టివ్‌ సిద్ధార్థకి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. 

    కృపాకర్‌ టేబుల్‌ మీద ఉన్న ఒక ఖరీదైన ‘స్మార్ట్‌ ఆడియో స్పీకర్‌’ వైర్‌ కట్‌ అయి ఉంది. అలాగే, కృపాకర్‌ చేతికి ఉన్న స్మార్ట్‌ వాచ్‌ మరణానికి కొన్ని నిమిషాల ముందు అసాధారణమైన హార్ట్‌ రేట్‌ రికార్డ్‌ చేసింది. అతనికి శత్రువులు ఎవరూ లేరు... ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు వెళ్లి  విచారించాడు. కృపాకర్‌ మెడికల్‌ హిస్టరీ పరిశీలించాడు. కృపాకర్‌ స్టాఫ్‌ను ఒక్కొక్కరినీ విడివిడిగా విచారించాడు. కృపాకర్‌ చావుకు కారణం తెలిసింది.
    ∙∙ 
    కాలింగ్‌ బెల్‌ అదే పనిగా మోగుతూ ఉండటంతో నిద్రమత్తులోనే వచ్చి తలుపు తీశాడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భార్గవ్‌. ఎదురుగా డిటెక్టివ్‌ సిద్ధార్థ. ‘మీరా ఇంత రాత్రి వేళ?’ గోడ గడియారం వంక చూస్తూ అన్నాడు భార్గవ. రాత్రి పదకొండు...‘మీ డాక్టర్‌ చనిపోయిన బాధలో మీరు నిద్రపోయి ఉండరని ఈ టైంలో డిస్ట్రబ్‌ చేయాల్సి వచ్చింది.’ భార్గవ వంకే చూస్తూ అన్నాడు. ‘యస్‌... యస్‌...’ అన్నాడు భార్గవ.. ‘మరి ఇక వెళదామా?’ అన్నాడు డిటెక్టివ్‌ సిద్దార్థ. ‘ఎక్కడికి?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. 

    ‘పోలీస్‌ స్టేషన్‌కు.. డాక్టర్‌ కృపాకర్‌ను డిజిటల్‌ టెక్నాలజీ అనే ఆయుధంతో హత్య చేసినందుకు...’ తాపీగా అన్నాడు  డిటెక్టివ్‌ సిద్దార్థ.‘హత్య? నేనా?’ ఆశ్చర్యం నటించాడు భార్గవ.‘నీ కాల్‌ హిస్టరీలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని మా శైలిలో విచారించాం. మిస్టర్‌ భార్గవ్, కృపాకర్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయారు. ప్రొఫెషనల్‌ జెలసీ. కృపాకర్‌కు బలహీనమైన గుండె ఉందని తెలుసుకున్నారు. మీరు కృపాకర్‌ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశారు. డాక్టర్‌ కృపాకర్‌కు ‘ఫోనోఫోబియా’ (అకస్మాత్తుగా వచ్చే శబ్దాలంటే భయం) ఉందని తెలుసుకున్నారు.

    ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సహాయంతో కృపాకర్‌ ఇంట్లోని స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేశారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గదిలోని స్పీకర్ల ద్వారా అత్యంత భయంకరమైన, అధిక డెసిబుల్స్‌ ఉన్న శబ్దాన్ని (అల్ట్రాసోనిక్‌ హై ఫ్రీక్వెన్సీ సౌండ్‌) ఒక్కసారిగా ప్లే చేశారు. ఆ నిశ్శబ్ద రాత్రి ఊహించని ఆ భీకర శబ్దానికి కృపాకర్‌ గుండె తట్టుకోలేకపోయింది. షాక్‌తో ఆయన ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఆ తర్వాత రిమోట్‌ ద్వారా ఆ ఆడియో ఫైల్‌ను డిలీట్‌ చేశారు.

    మీ ల్యాప్‌టాప్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సెర్చ్‌ హిస్టరీలో ‘హౌ టు ట్రిగ్గర్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ యూజింగ్‌ సౌండ్‌ వేవ్స్‌’ అనే అంశం కనిపించింది. అంతేకాకుండా, కృపాకర్‌ చనిపోయిన సమయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మీ ఫోన్‌ నుండి కృపాకర్‌ ఇంటి వైఫై  నెట్‌వర్క్‌కు కనెక్షన్‌ వెళ్ళినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు.’ డిటెక్టివ్‌ సిద్ధార్థ లేస్తూ అన్నాడు.

    ‘కత్తితో పొడిస్తేనే హత్య కాదు భార్గవ్, ఒకరి భయాన్ని ఆయుధంగా మార్చుకుని చంపడం కూడా ముమ్మాటికీ హత్యే!’  ‘టెక్నికల్‌ మర్డర్‌’ డిజిటల్‌ క్రైమ్‌. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేరస్థుల కన్నా తెలివైన వాళ్ళు పోలీసులు, డిటెక్టివ్‌లు. మీ తెలివితేటలు మీరు ఎదగడంపైన చూపించాల్సింది. మీ జెలసీ మిమ్మల్ని నేరస్థుడిని చేసింది.’ సిద్దార్థ భార్గవ్‌ను చూస్తూ చెప్పాడు. 

    శ్రీ సుధామయి

    (చదవండి: ఆ కేఫ్‌ మొత్తం ఆడవాళ్లే..!)
     

  • పర్యాటకం కమ్‌ ఉపాధిని కల్పించేలా అద్బుతమైన కేఫ్‌ ఇది. అయితే ఇక్కడ మొత్తం ఆడవాళ్లే ఉంటారు. నిర్వహించేది..వంట చేయడం నుంచి క్లీనింగ్‌ వరకు మొత్తం ఆడవాళ్ల సామ్రాజ్యమే దర్శనమిస్తుంది. అలాంటి విచిత్రమైన కేఫ్‌ తూర్పు సిక్కింలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాబా హర్భజన్ సింగ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో, 13,000 అడుగుల ఎత్తులో ఉంది. 

    ఇది పూర్తిగా స్థానిక మహిళలతో కూడిన బృందంతో నడిచే కేఫ్‌. మారుమూల ఎత్తైన ప్రాంతంలో ఉండే ఈ కేఫ్‌ స్థితిస్థాపకత, వ్యవస్థాపకత, స్వావలంబనను ప్రతిబింబిస్తుంది. అంతేగాదు సందర్శకులకు ఓ గొప్ప అనుభవాన్ని అందిస్తోంది. ఈ కేఫ్‌ భారత ఆర్మీ చొరవతో ఏర్పాటైంది. స్థానికి భాగస్వాముల సమన్వయంతో త్రిశక్తి కార్ప్స్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించి, సులభతరం చేసింది. యుద్ధ భూమిని వీక్షించే కార్యక్రమంలో భాగంగా, ఈ ప్రాంత వారసత్వాన్ని, వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రదర్శిస్తూ సరిహద్దు ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్‌ రూపుదిద్దుకుంది. 

    ఇది ఒకరకరంగా స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ..మారుమూల ప్రాంతా ఆర్థిక సాధికారతనకు దోహదపడుతోంది.  అంతేగాదు జీవనోపాధిని ఇలా పర్యాటకంతో అనుసంధానించటంతో ఈ కార్యక్రమం సుస్థిర అభివృద్ధికి, పుణ్యక్షేత్రానికి పర్యాటకుల రాక పెరగడానికి తోడ్పడుతుందని పలువురు భావిస్తున్నారు. 

    ఈ ప్రయత్నం నిజంగా సమర్థవంతమైన సైనిక-పౌర సహకారానికి నిదర్శనంగా నిలుస్తుంది. అంతేగాదు  ఇది సరిహద్దు ప్రాంతాలలో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధి పట్ల భారత సైన్యం నిబద్ధతను బలోపేతం చేయడంతో పాటు, భారత పౌరులతో బలమైన సంబంధాలను పెంపొందిస్తుంది.

    (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)

     

  • అనగనగా ఒక ఆడవి. గుహలో సింహం పెద్దగా నోరు తెరిచి శబ్దం చేస్తోంది తప్ప మాట్లాడలేకపోతోంది. దాని ఎదురుగా కొన్ని జంతువులు కూర్చుని విచారంగా చూస్తున్నాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ ఉదయం మృగరాజు ఒక జింకను వేటాడి తింటున్నప్పుడు ఒక ఎముక దవడలో గుచ్చుకుంది. దాంతో విపరీతమైన నొప్పి... తినడం కాదు కదా నోరు మూయలేని స్థితి. 

    అంతలో ఆగమేఘాల మీద మంత్రి నక్కగారు వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకుని, ‘మరేం భయం లేదు. ఇప్పుడే మన కొంగను పిలిపిస్తాను అది చిటికెలో మీ సమస్యను పరిష్కరిస్తుంది’ అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ పంపేసింది. సింహం నిస్సహాయంగా తలూపింది. అరగంటలో అక్కడికి కొంగగారు రానే వచ్చారు. సింహం నోట్లోకి పరికించి చూసి ‘అవును మహారాజా! మీ నోట్లో ఒక ఎముక గుచ్చుకోనుంది దాన్ని తొలగిస్తాను. కానీ మీరు నాకు మూల్యం చెల్లించాలి’ అంది. 

    సింహం, నక్క కోపంగా చూశాయి. ‘మూల్యమంటే  కేవలం పది ఎండు చేపలు ఇస్తే చాలు మహారాజా!’ అంది కొంగ వినయంగా. నక్క ఏదో అనబోతుండగా సింహం వారించి సరే అలాగే అన్నట్లు తలాడించింది. పది నిమిషాల్లో సింహం నోట్లో తలపెట్టి ఆ ఎముక ఎక్కడుందో వెతికి బయటకి లాగి పడేసింది కొంగ. హమ్మయ్య అనుకుంది సింహం.

    ‘ఏంటి ఇప్పుడు చెప్పు నీకు మూల్యం కావాలా? నా నోట్లో నీ తల ఉన్నప్పుడు కొరకకపోవడమే నీకు నేనిచ్చే మూల్యం...’ అంది సింహం వికటంగా. ‘ఇది మోసం మహారాజా...’ అనబోతున్న కొంగపైకి దూకింది నక్క. అంతేకాదు, అప్పటికప్పుడే గుహ తలుపులు మూయించేసింది. కొంగకు భయం వేసింది. గుహ కప్పు అంత ఎత్తుగా లేదు. ఒకవైపు నుంచి నక్క మరోవైపు నుంచి సింహం దాని మీద దాడికి చూస్తున్నాయి. కొంగకు ఏం పాలు పోలేదు. అక్కడక్కడే ఎగురుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. పైకప్పులో బండల మధ్య ఉన్న ఒక రంధ్రాన్ని గమనించి తుర్రున దాంట్లో నుంచి ఎగిరిపోయి, ‘బతుకు జీవుడా’ అనుకుంది కొంగ.

    అప్పుడు సింహం విస్తుపోతూ, ‘ఆ బండల మధ్య సందును వెంటనే  మూయించు’ అని నక్కను ఆదేశించింది. ప్రాణభయంతో ఎగిరిపోయిన కొంగ దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద అలసట తీర్చడానికి వాలింది. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటు మత్తుగా కునికిపాట్లు పడుతోంది. ‘ఏంట్రా అలా భయంతో గజగజ వణుకుతున్నావు? ఏమిటి సంగతి?’ అంది ఎలుగు దాన్ని చూస్తూ. సింహం, నక్క తనకు చేసిన అన్యాయం గురించి కొంగ చెప్పి వాపోయింది. ‘వాళ్లంతే! నీచులు’ అంది ఎలుగు.

    అంతలోనే నక్క అటుగా రావటం చూసి కొంగ ఎగిరిపోయింది. నక్క చెట్టుకు దగ్గరకు వచ్చి ‘మామా! మన రాజుగారి గుహపైన ఒక కంత ఉంది. పెద్ద బండతో దాన్ని నువ్వు పూడ్చాలి. వెంటనే రమ్మని రాజాజ్ఞ’ అంది నక్క దర్పంగా. ‘అలాగే అల్లుడు... పద వస్తాను’ అంటూ చెట్టు దిగింది ఎలుగు. రెండూ గుహ దగ్గరకు వచ్చాయి. 

    నక్క దర్జాగా గుహలోకి వెళ్ళి, సింహంతో ముచ్చట్లు పెట్టింది. ఎలుగు గుహ పైకి ఎక్కి కంత ఎక్కడ ఉందో చూసింది. ఈ రెంటికి బుద్ధి చెప్పాలని అనుకున్న ఎలుగు– కంతకు సరిపడ బండ కాక కొద్దిగా చిన్న సైజు బండతో దాన్ని కప్పబోయింది. అంతే! ఆ బండ దడేల్న లోపల ముచ్చట్లు చెప్పుకుంటున్న నక్క తలను పచ్చడి చేసి, పక్కనే ఉన్న సింహం పైకి దొర్లింది. దాని ముందు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. 

    సింహం బాధతో, భయంతో అరవడం మొదలు పెట్టింది. గుహ తలుపులు మూసి ఉండడం వల్ల ఆ అరుపులు బయట ఎవరికీ వినపడలేదు. ఎలుగు నవ్వుకుంటూ, కంతకంటే పెద్దదైన బండతో ఆ ఖాళీని అప్పుడు మూసేసింది. రాజు, మంత్రి అనే గర్వంతో సింహం, నక్క చేస్తున్న అరాచకాలకు అలా అడ్డుకట్ట వేసింది ఎలుగు. సింహం ఆహారం, నీళ్లు లేక గొంతు ఎండుకు పోయేలా అరిచి అరిచి కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది.
     చంద్ర ప్రతాప్‌ కంతేటి 

    (చదవండి: పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..)

  • పూర్వం పాంచాల రాజ్యాన్ని పురుయశుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి, అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. తండ్రి పురుయశుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజలను పాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే గడిచినా, కొంతకాలానికి పుణ్యశీలుడి రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. రోగాలు సోకి ఏనుగులు, గుర్రాలు మరణించాయి. ధనాగారంలోని ధనమంతా నశించింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబలం, అశ్వబలం నశించడంతో పుణ్యశీలుడు బలహీనంగా మిగిలాడు. శత్రురాజులు ఈ సంగతి తెలుసుకుని, పుణ్యశీలుడి మీదకు దండెత్తి వచ్చారు. 

    యుద్ధంలో పుణ్యశీలుడు ఓటమిపాలయ్యాడు. భార్య శిఖినితో కలసి అడవులకు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండగుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అడవులపాలైన పుణ్యశీలుడు తనలోనే తాను కుమిలిపోసాగాడు. ‘ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల వినయ విధేయతలతో నడుచుకున్నాను. దైవభక్తి గలవాడిని. భూతదయాపరుడిని. సదా సదాచారపరాయణుడనైన నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది’ అని నిత్యం బాధపడసాగాడు.

    పుణ్యశీలుడు అడవులపాలై యాభైమూడేళ్లు గడచిపోయాయి. అతడి దుఃఖం అంతకంతకు పెరగసాగింది. ఒకనాడు అతడు తన గురువులైన యాజ ఉపయాజకులను స్మరించుకున్నాడు. అతడు మనసులో తలచినదే తడవుగా యాజ ఉపయాజకులు అతడి ముందు ప్రత్యక్షమయ్యారు. పుణ్యశీలుడు ఎదుట నిలిచిన గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజలాంఛనాలు లేకుండా, సామాన్యుడిలా ఉన్న పుణ్యశీలుడు గురువులను చూసి, కన్నీరు కార్చసాగాడు. వారు అతడిని లేవదీశారు. పుణ్యశీలుడు ఫలపుష్పాదులతో గురువులను పూజించాడు. 

    ‘‘గురువులైన విప్రులారా! నేను రాజును. జన్మ కర్మల చేత పవిత్రుడను. పితృదేవతా భక్తుడను. పాపభీతి గలవాడను. నాకు ఇంతటి కష్టం సంభవించడానికి కారణమేమిటి? శత్రువుల చేతిలో ఓటమి పాలై, రాజ్యాన్ని, ధనాన్ని పోగొట్టుకుని, ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా, ఇలా అడవుల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడటానికి కారణమేమిటి? అసలు నా రాజ్యంలో దుర్భిక్షం వాటిల్లడానికి కారణమేమిటి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

    ‘‘రాజా! నీ దుఃఖానికి, దుస్థితికి కారణాన్ని చెబుతున్నాం, విను. పూర్వం పదిజన్మలలో నువ్వు కిరాతుడివై ఉండేవాడివి. హింసాత్మకుడివై, కఠినాత్ముడివై జనాలను పీడించేవాడివి. ఏనాడూ ధర్మ కార్యాచరణ చేయలేదు. ఇంద్రియ నిగ్రహాది సుగుణాలు లేక యథేచ్ఛగా సంచరించేవాడివి. పొరపాటునైనా శ్రీహరి నామాన్ని ఉచ్చరించలేదు. తొమ్మిది జన్మలు ఇలాగే గడిచిపోయాయి. పదో జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతుడివై జన్మించావు. గడచిన తొమ్మిది జన్మల మాదిరిగానే పదో జన్మలో కూడా మనుషులను హింసించేవాడివి. 

    నరమాంసభక్షణ చేసేవాడివి. నమ్మినవారిని హింసించడం వల్ల సోదరులు లేకుండాపోయారు. నీకు గత జన్మలో సంతానం కూడా లేకపోయింది. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసక్లేశం సంభవించింది. నరమాంసభక్షణ వల్ల నీకు తిండికి కరవైన పరిస్థితి ఏర్పడింది. మనుషులకు అప్రియమైన పనులు అనేకం చేయడం వల్ల నానా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. సజ్జనులను హింసించడం వల్ల శత్రువుల చేతిలో ఓటమి ఎదురైంది. ఇదివరకటి జన్మలలో ఎవరికీ దానం చేయకపోవడం వల్ల దారిద్య్రబాధ సంభవించింది.’’ అని చెప్పారు. ‘‘మరి ఈ జన్మలో రాజవంశంలో ఎలా జన్మించాను?’’ అడిగాడు పుణ్యశీలుడు.

    ‘‘ఆ కారణం కూడా చెబుతాం విను. నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒక వేసవిలో ఇద్దరు ధనిక వైశ్యులు, కర్షణుడు అనే విప్రుడు తారసపడ్డారు. నువ్వు ఆ ముగ్గురినీ అటకాయించావు. వారిలో ఒక వైశ్యుడిని చంపి, అతడి వద్దనున్న ధనం లాక్కున్నావు. రెండో వైశ్యుడు తన డబ్బు మూటను పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం పరుగెత్తాక విప్రుడు సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వైశ్యుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నువ్వా విప్రుడికి శైత్యోపచారాలు చేసి, అతడి దప్పిక తీర్చావు. నీ పట్ల భయంతో అతడు రెండో వైశ్యుడు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టావు. 

    నీ స్వలాభం కోసమైనా, వైశాఖమాసంలో విప్రుడికి ఉపచారాలు చేసి, దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాలను నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలవు’’ అని చెప్పారు. గురువులైన యాజోపయాజకులు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ, శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులు ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి, శత్రువులతో యుద్ధంచేసి, వారిని తుదముట్టించి, తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు.
    సాంఖ్యాయన

     

  • ‘‘నాన్నా! నీకు ఫోన్‌ వచ్చింది.’’ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతూ, వరండాలో బూట్లు పాలిష్‌ చేసుకుంటున్న ఆనంద్‌కు వినిపించింది కూతురి అరుపు.‘‘ఎవరమ్మా, పేరు చూడు.’’ అన్నాడు తన పని ఆపకుండా. ‘‘ప్రవల్లిక అమెరికా... అంట నాన్నా.’’ కూతురి మాట ఇంకా పూర్తవకముందే, పాలిష్‌ మధ్యలోనే ఆపేసి ‘‘లిఫ్ట్‌ చేయొద్దూ...’’ అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్‌ లిఫ్ట్‌ చేస్తుందో అని హడావిడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్‌ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకొని దూరంగా పడింది.

    ఈలోగానే ‘‘సరే నాన్నా..’’ అంటూ కూతురి మాటతో పాటు ఫోన్‌ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు.కూతురి చేతుల్లోంచి మొబైల్‌ తీసుకుని, మళ్లీ కాల్‌ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి చార్జింగ్‌ పెట్టబోయి, ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్‌ను ప్యాంట్‌ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. 

    ‘‘మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్‌ చేయమని చాలాసార్లు చెప్పాను...’’ భర్తకు వినపడేలా గట్టిగా అంది.ఏమీ పలకలేదు ఆనంద్‌. ఆఫీస్‌కు రెడీ అవడంలో మునిగిపోయాడు. ‘‘.. అయినా, తను ఏం అడుగుతోంది? ఒకసారి కలసి మాట్లాడాలనే కదా? కలిపిస్తాననో కలిపించననో చెప్పొచ్చు కదా? ఇలా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకుండా, మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా?..’’ ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి.

    ‘‘ఏం నేనే చెప్పాలా?..నువ్వు చెప్పకూడదా? నీకూ ఫ్రెండే కదా?..’’నోరు తెరవొద్దనే నియమం మరచిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ‘‘ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరూ జాన్‌ జిగిరీలు... నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు. ఏదైనా వింటాడనే కదా? లేకపోతే తనే నేరుగా వెళ్లలేదా?.’’ దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లు వినబడింది. 

    ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్‌. తెరిస్తే పెద్ద యుద్ధమే! అంతేకాదు, మరో నిమిషంలోనో అర నిమిషంలోనో అదే నెంబరు నుంచి మీనాక్షికి కాల్‌ వస్తుందనీ తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్లే కాసేపటికి మీనాక్షి ఫోన్‌ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్‌ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్‌ ఆన్‌ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నయ్యా... మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే, నేనే వెళ్లి కలుస్తాను. రెండ్రోజుల్లో ఇండియాకు వస్తున్నాను. కానీ, మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వన్నయ్యా!’’ అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. 

    సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. 
    ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్‌ వైపే చూస్తోంది మీనాక్షి. అది గమనించి ‘సరే’ అని అంగీకరిస్తున్నట్లు తలూపి, హడావిడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్‌ తీసుకోవడం మర్చిపోయి వెళుతున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. 
    ∙∙ 
    ఆఫీస్‌కు వచ్చాడే గాని, పనేమీ చేయాలనిపించడం లేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్‌ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్‌ దగ్గర కుర్చీలో కూర్చొని, కాస్త కాఫీ తాగాక ఆనంద్‌ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. 

    ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్‌ నుంచి ఫ్రెండ్స్‌. ఒకే ఊరు, ఒకే గ్రూప్‌ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్లిద్దర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే, అక్కడా ఇద్దరివీ వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్‌. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్‌ నెమ్మదస్తుడు. తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే, చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. 

    రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్‌ ర్యాంక్‌ స్థాయి కాకపోయినా, మెరిట్‌ స్టూడెంటే. అయితే, ఆటల్లో, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్‌గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్‌బాయ్‌ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే, అందరూ అతని పేరులోని రాముణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుచేసేలా.. ‘క్రిష్‌’ అని పిలుచుకునేంతగా.

    ఆ కాలేజీలోనే వీళ్లకు ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్లది ఒకే ఊరు. కానీ, కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్‌ సమయంలోనో, క్యాంటీన్‌లోనో, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్లతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా, చామన ఛాయతో, కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్‌కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది.

    కానీ, వారం రోజులు ఎదురు చూసినా రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజూ కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలసి లంచ్‌ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ, రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. రెండు మూడుసార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్‌కు చెప్పింది. అప్పటికే తనకు ఇద్దరు లవ్‌ ప్రపోజ్‌ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ– ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్‌కు ఆశ్చర్యమనిపించింది. 

    అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. 
    ఆరోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక, ఆ తర్వాత ఆనంద్‌ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ప్రవల్లిక అడిగినా మాట దాటవేసేవాడు. మరో ఆర్నెల్లు గడిచి, డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్లను విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్‌ హైదరాబాద్‌కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. 

    ఆనంద్‌కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని, మీనాక్షి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. ‘‘సార్‌.. మేనేజర్‌గారు పిలుస్తున్నారు..’’ అనే పిలుపుతో ఆనంద్‌ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి మొహం కడుక్కొని, క్యాబిన్‌కు వెళ్లి మేనేజర్‌ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగుపెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు.

    మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్‌కు తెలుసు. భోజనాలు అయిపోయి, కూతుర్ని బెడ్రూమ్‌లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్‌చేసి కూర్చుంది మీనాక్షి. ‘ఇక తప్పదు ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది’ అని మనుసులో అనుకుంటూ తాను కూడా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్‌..’’ అంటూ నోరుతెరిచాడు. భర్తను సీరియస్‌గా చూసింది మీనాక్షి. ‘‘ఏమంటుందో మీకు తెలియదా?’’ ఎదురు ప్రశ్నించింది. ‘‘తెలుసు... కానీ...’’ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. 

    ‘‘అయినా... అది రెండేళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా? తీసుకెళ్లడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్లా... పన్నెండేళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వచ్చి రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి? అయినా, తను అనుకుంటే సరిపోతుందా? భార్య, పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. 

    ‘‘రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది? మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్‌ ఆరోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చుకదా?’’ అంటూ ఆగింది. ఇక తప్పదనుకొని నోరు విప్పాడు ఆనంద్‌. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతోపాటు మిత్రుణ్ణి వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు రామకృష్ణ. 

    ఊరికి అరకిలోమీటరు దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక, మిద్దె మీద పడుకొని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్‌. సమాధానం చెప్పకుండా, దూరంగా ఊళ్లో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ‘‘ఆ పెద్ద పెద్ద ఇళ్లు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే... మా పెద నాన్న, చిన్నాన్న వాళ్లవి. వాళ్ల కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి అందరూ నలభైమంది వరకు ఉంటారు. కానీ, వాళ్లెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా?..’’ అంటూ ఆనంద్‌ వైపు చూశాడు. తెలియదన్నట్లు ఆనంద్‌ ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు.

    ‘‘మా నాన్న పెళ్లి... తాతయ్యకు, అమ్మమ్మకు... ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరఫు వాళ్లు ఏమీలేనోళ్లు. అయినా, కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకొని వాళ్లందరికీ దూరంగా ఉంటున్నాడు. ముగ్గురు కూతుళ్లు, తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. 

    పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది రెండెకరాల ఈ పొలం... అందులోని ఈ ఇల్లు...’’ అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్‌కు. ‘‘ఓహో మీ నాన్నకు జరిగినట్లే నీకూ జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగయితే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికకే చెప్పొచ్చు కదా? అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా?’’ అన్నాడు ఆనంద్‌.

    వెంటనే రామకృష్ణ. ఇంట్లోకి వెళ్లి రెండు లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాస్‌లో ఉండే మరో ఇద్దరు అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ‘‘ప్రవల్లికే కాదు... వీళ్లన్నా నాకు ఇష్టమే. కానీ, వీళ్లెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లదీ మాలాంటి బతుకే...’’ స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ‘అయితే, ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది?!’ 

    ఆనంద్‌ మనసులోని మాటను చదివేసినట్లు చెప్పసాగాడు రామకృష్ణ. ‘‘అవును. ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు వీళ్లెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన ఇద్దరూ కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు. పైగా లావు. అయినా, పెళ్లి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరిని పడితే వాళ్లను చేసుకోవడానికి కాదు. 

    చదువు అయిపోయాక, ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ, కట్నం దండిగా తెచ్చే అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్లందరూ కుళ్లుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా? ’’ అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్‌. అన్ని రోజులూ స్నేహితునిలో తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ..‘‘అదీ జరిగిన విషయం..’’ అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్‌. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. 

    ‘‘ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే.. నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త, పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసేంత ఇష్టం. కానీ, తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు. తనని కలవనివ్వలేదు. ‘తనను ఎందుకు ఇష్టపడలేదు?’ అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తుచేసుకుంటూ బతకడం చాలా కష్టం’’ అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకపోయేసరికి లేచి బెడ్రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
    ∙∙ 
    చెప్పినట్లుగానే రెండ్రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్‌ కాలనీలోని ఆనంద్‌ ఇంటికి చేరింది. బాగా సన్నబడి, కాస్త తెల్లగా కూడా మారిపోయి, తమ కంటే చిన్నదానిలా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కుశలప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణను కలిసే విషయం ప్రస్తావించింది. 

    అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్‌ ‘మరుసటి రోజు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో పెళ్లి రిసెప్షన్‌కు రామకృష్ణ వస్తున్నాడని, ఆరోజు వెళ్లి కలుద్దామ’ని చెప్పాడు. ‘సరే’ అంది ప్రవల్లిక. అయితే, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్‌ బుక్‌ చేసుకున్నానని, రామకృష్ణను కలిశాక గచ్చిబౌలిలోని తన ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లి అట్నుంచటే ఎయిర్‌పోర్టుకు వెళతానని చెప్పింది. 

    తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్‌ జరిగే చోటుకు కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతుండగా... ‘‘అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు’’ అంటూ వేలును ఒక వైపు చూపించాడు ఆనంద్‌. అటువైపు చూసింది ప్రవల్లిక.‘‘ఎవరూ... అతనేనా? ’’ ‘‘అవును... అతనే ’’‘‘ఆ పక్కనున్నది?’’        

    ‘‘వాళ్లు తన భార్య, పిల్లలు. అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది... రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్‌ కూతుర్నే... సరే, అవన్నీ వాళ్లను కలిశాక తీరిగ్గా మీరే అన్ని విషయాలూ మాట్లాడుకుందురు గానీ... రండి’’ అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి, అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా... ఆపకుండా... ఆపుకోలేనంతగా... కళ్లలోంచి నీళ్లొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్నా చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. 

    దూరంగా బట్టతలతో, బాన పొట్టతో రామకృష్ణ... పక్కనే నిండుగా నగలు వేసుకొని, నల్లగా... భారీ ఆకారంతో భార్య... వాళ్లిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న ముగ్గురు కూతుళ్లు...కాసేపటి తర్వాత కాస్త తమాయించుకొని ‘‘వెళ్లొస్తా అన్నయ్యా... బై మీనాక్షి’’ అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్‌ కారులో కూర్చుంది. ఆనంద్‌కు ఏమీ అర్థంకావడంలేదు. ‘కలుస్తాను... కలుస్తాను అని రెండేళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోవడం ఏంటి?’

    అదే విషయం అడిగాడు. ‘‘కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా?!... నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావ్‌?! నువ్వైనా చెప్పు’’ అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక... రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవసాగింది.

    కలవకుండా వెళ్లిపోవడం వరకు ఓకే... కానీ, ఆ నవ్వు ఎందుకో అతనికే కాదు మీనాక్షికీ అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక... తనను వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక... ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిశాక... ప్రవల్లిక అంతరాల్లోంచి నవ్వు అలా తన్నుకొని స్వేచ్ఛగా బయటికొస్తోందని వాళ్లకు తెలియదు.  వెళుతున్న కారువైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దంలోంచి వాళ్లకు కనిపిస్తోంది. అది... అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు... అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కటి, చిక్కటి, చల్లని నవ్వు.  

    గౌకనపల్లె మహేశ్వరరెడ్డి 

    (చదవండి:  ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు

  • అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. 

    శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’  ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).

    సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.

    ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.

    “అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డి“
    ప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. 

    భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం. 

    అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు. 

    ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.

    దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. 

    వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో!

     రెంటాల జయదేవ

    (చదవండి: ప్రపంచం మెచ్చిన  బ్రేక్‌ఫాస్ట్‌!)
     

  • అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్‌ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్‌ స్టాల్‌ అయినా క్లిక్‌ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్‌ చేశాడు ఈ టీనేజ్‌ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్‌ జోడించడంతో అతడ ఫుడ్‌ స్టాల్‌ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్‌గా వంట చేయడం ఎలాగంటే..

    చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్‌ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 

    19 ఏళ్ల లూ షాన్‌డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్‌ డ్రెస్‌ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్‌గా ఉంటాడు. ఆయన ఆఫీస్‌కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్‌ రైస్‌ స్టాల్‌ రెస్టారెంట్‌కు మించి క్రేజ్‌ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్‌గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్‌కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. 

    అంతేకాదండోయ్‌ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్‌ రైస్‌ని జస్ట్‌ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్‌రైస్‌ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. 

    లూ నవ్వు మామలు గ్రేట్‌ కాదు..సూపరో సూపర్‌..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.  ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి  ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. 

     

    (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు)
     

  • గత కొన్ని రోజులుగా భారత్‌లో ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయో తెలిసిందే. ఎండలు భగభగలాడిస్తున్నాయి. ఉదయం పది దాటితేనే సూర్ర్యు సుర్రు మంటున్నాడు. కనీసం బయటకు వెళ్లాలంటేనే వణుకుపుట్టుకొస్తుంది. అంతలా ఎండలు గజగజలాడిస్తున్నాయి. ప్రతి చోట నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి. మెట్రో ప్రాంతాల్లో ఇక ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అంతేగాదు ఎండల ధాటికి వడదెబ్బల బారినపడుతున్న వారు ఎక్కువే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు కొందరు వడదెబ్బ బారిన పడగానే..పారాసెటమాల్‌ వేసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకూడదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వడదెబ్బ రెండు విధాలుగా ఉంటుందని, అందుకోసం ఎలాంటి ఆరోగ్య సంరక్షక చర్యలు తీసుకోవాలో సవివరంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మరి అవేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా!.

    దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45°C దాటుతుండగా, తీర ప్రాంతాలు తీవ్రమైన తేమ, భరించలేని వేడితో సతమతమవుతున్నాయి. పైగా ఆస్పత్రులలో వడదెబ్బ, వడతాపం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే..క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు డాక్టర్‌ విశాల్‌. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోలో వడదెబ్బకు, వడఘాతానికి మధ్య ఉన్న తేడాను కూడా వివరించారు. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో పారాసెటమాల్‌ వేసుకోవడం ఎంత ప్రమాదకరం, ఎలాంటి అత్యవసర చర్యలు తీసుకుంటే మంచిది, వంటి వాటి గురించి సవివరంగా వెల్లడించారు.  

    ప్రస్తుతం భారతదేశంలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీలకు దగ్గరగా ఉందని, తీరప్రాంతలైతే అంతకమించి ఉంటున్నాయి. సాధరణంగా వడదెబ్బ తగిలినప్పుడు..రోగి అలసిపోయినట్లు కనిపిస్తాడు, కానీ అతనికి చెమట పడుతూనే ఉంటుంది. ఈ సందర్భంలో, చాలా సమయం ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ విశాల్‌ చెబుతున్నారు. అదే వడఘాతం అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి అని పేర్కొన్నారు. 

    శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా విఫలమైనప్పుడు ఇది సంభవిస్తుందట. రోగి పూర్తిగా స్పృహ కోల్పోతాడు, ఆ వ్యక్తి శీతలీకరణ వ్యవస్థ పనిచేయడం ఆగిపోతుంది. పైగా చెమట కూడ పట్టదు కాబట్టి చర్మం పొడిగా, వేడిగా ఉంటుందట. దానివల్ల, మెదడు అక్షరాలా మైక్రోవేవ్‌లో పెట్టినట్లుగా ఉడికిపోతుంది. దాని కారణంగా, రోగి స్పృహ కోల్పోవచ్చు, అతనికి మూర్ఛలు రావచ్చు, కోమాలోకి వెళ్ళవచ్చు, లేదా చనిపోవచ్చు కూడా అని అన్నారు.

    పారాసెటమాల్‌ వేసుకోవచ్చా..
    వడదెబ్బలో పారాసెటమాల్ పనిచేయదని అంటున్నారు వైద్యులు. అనారోగ్యం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పారాసెటమాల్ మెదడు థర్మోస్టాట్‌ను రీసెట్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కానీ వడదెబ్బ తగిలినప్పుడు, బయటి నుండి వచ్చే అధిక వేడి శరీర వ్యవస్థను అధిగమించినప్పుడు, శరీరాన్ని చల్లబరిచే యంత్రాంగం విఫలమవుతుంది. 

    పైగా రోగిని చల్లటి నీటితో చల్లబర్చాలి, చంకల ప్రాంతంలో చల్లటి నీటినిపోయాలి. దాంతో వారిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రోగికి తగినంత నీఉ, ఓఆర్‌ఎస్‌ ఇవ్వడం వంటివి చేయాలి. ఇలాంటి వాళ్లు సాధ్యమైనంతవరకు చల్లటి నీటిని తాగుతూ..ఇంటిలోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్‌ విశాల్‌.

    గమనిక: ఇది కేవలం అవగాహాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యులు లేదా నిపుణులకు సంప్రదించడం ఉత్తమం. 

     

    (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)

     

Health

  • టీ లేదా కాఫీని చాలా మంది ప్రాణానికి ప్రాణంలా భావిస్తుంటారు. సమయానికి కాఫీ తాగనిదే ఏదీ తోచదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితంలో భాగమైపోయిన కాఫీపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తాజాగా, జరిగిన మరో పరిశోధనలో శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు గుర్తించారు. 

    రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం డిమెన్షియా (చిత్త వైకల్యం) ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించారు. ముఖ్యంగా 75 ఏళ్ల లోపు వయస్సు వారిలో ఈ ప్రభావం బాగా కనిపించింది. కెఫీన్ మెదడు కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న వాపు, హానికర ప్లాక్ పేరుకుపోవడాన్ని తగ్గించవచ్చు. అయితే, అధికంగా కాఫీ తాగితే మాత్రం చాలామంది అంతగా ప్రయోజనాలు పొందలేరు. మితంగా, మోతాదులో తాగేవారిలో డిమెన్షియా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గింది. పూర్తి వివరాలు...

    మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగితే వయస్సు పెరిగేకొద్దీ డిమెన్షియా ప్రమాదం తగ్గవచ్చని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ అధ్యయనాన్ని 131,821 మంది నర్సులు, ఆరోగ్య రంగ నిపుణులను 43 ఏళ్ల పాటు పరిశోధకులు చేశారు. 

    అధ్యయనం ప్రారంభమైనప్పుడు ఇందులో పాల్గొన్నవారి వయస్సు 40 ఏళ్ల ప్రారంభ దశలో ఉంది. అధ్యయనం కాలంలో 11,033 మందికి డిమెన్షియా వచ్చింది. మొత్తం పాల్గొన్నవారిలో ఈ సంఖ్య సుమారు 8 శాతం మాత్రమే. మితమైన మోతాదులో కెఫీన్ ఉన్న కాఫీ లేదా టీ తాగినవారిలో డిమెన్షియా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. 75 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిలో మంచి ప్రయోజనాలు కనిపించాయి. రోజుకు 250ఎంజీ నుంచి 300ఎంజీ వరకు కెఫీన్ తీసుకున్నవారిలో, అంటే సుమారు 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగినవారిలో డిమెన్షియా ప్రమాదం 35 శాతం తగ్గింది. అంతకంటే ఎక్కువ కెఫీన్ తీసుకున్నా అదనపు రక్షణ కనిపించలేదు.

    అధ్యయనం ప్రారంభంలో మహిళలు రోజుకు సగటున నాలుగున్నర కప్పుల కాఫీ లేదా టీ తాగుతున్నట్లు చెప్పారు. పురుషులు సుమారు రెండున్నర కప్పులు తాగుతున్నట్లు తెలిపారు. ఎక్కువ కెఫీన్ ఉన్న కాఫీ తాగినవారు సాధారణంగా తక్కువ వయస్సు ఉన్నవారే అయినా.. వారు ఎక్కువ మద్యం సేవించడం, ఎక్కువగా పొగ తాగడం, అధిక కేలరీలు తీసుకోవడం వంటివి చేశారు. ఇవన్నీ డిమెన్షియా ప్రమాదంతో సంబంధం ఉన్న అంశాలు.

    డీకాఫ్ కాఫీ (కాఫీ గింజల నుంచి 97 శాతం కంటే ఎక్కువ కెఫిన్‌ను తొలగించి తయారుచేసే కాఫీ) విషయంలో అనూహ్య ధోరణిని కూడా పరిశోధకులు గుర్తించారు. ఎక్కువ డీకాఫ్ తాగినవారిలో జ్ఞాపకశక్తి తగ్గుదల వేగంగా కనిపించింది. నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, గుండె స్పందనలో లోపాలు వచ్చిన తర్వాత కొందరు డీకాఫ్‌కు మారి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ సమస్యలు జ్ఞాపకశక్తి తగ్గుదల, డిమెన్షియాతో సంబంధం ఉన్నాయి.

    కెఫీన్ మెదడును ఎలా రక్షిస్తుంది?
    కెఫీన్ మెదడుకు ఆరోగ్యకర ప్రయోజనాలు అందించడానికి పలు జీవశాస్త్ర కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెఫీన్ అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. ఇది డోపమైన్, అసిటైల్‌కోలిన్ వంటి ముఖ్యమైన మెదడు సందేశ రసాయనాల పనితీరును మందగింపజేస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ, అల్జీమర్స్ వంటి వ్యాధుల్లో ఈ రసాయనాలు సహజంగానే తగ్గుతాయి. కెఫీన్ ఆ తగ్గుదలను ఎదుర్కోవడంలో సహాయపడవచ్చు.

    కెఫీన్ వాపును తగ్గించడం, రక్తంలో చక్కెర వినిమయాన్ని నియంత్రించడం ద్వారా కూడా మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీవితాంతం రోజు 2 కప్పులకంటే ఎక్కువ కాఫీ తాగినప్పటికీ డిమెన్షియా రాని వ్యక్తుల మెదడులో అమైలాయిడ్ ప్లాక్ స్థాయులు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి. అల్జీమర్స్ ఉన్నవారిలో ఈ విషపూరిత ప్లాక్‌లు సాధారణంగా కనిపిస్తాయి.

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే డీజిల్, పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ధరలు అధికంగా ఉన్నాయి. ఈ పెంపుతో సాధారణ ప్రజలపై భారీ భారం మోపారు’అని అన్నారు.

    పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవితం మరింత భారంగా మారిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రేపు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టి, అనంతరం అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • కృష్ణా జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్‌ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని అన్నారు. పవన్‌ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలేనని ఎద్దేవా చేశారు. పవన్‌ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడనుకుంటున్నారని చెప్పారు.

    కృష్ణా జిల్లాలో పేర్నినాని ఆదివారం మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలను కల్లబొల్లి కబుర్లతో నమ్మించాలని చూస్తున్నాడు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారనే భావనలోనే పవన్ మీటింగ్ సాగింది. 

    పవన్ మాటలకు పొంతన లేదు. 2019-24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గురించి ఎన్ని అసత్యాలు మాట్లాడారో మర్చిపోయారా? అప్పట్లో 175 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని మీకు జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ రాజకీయ జీవితమంతా పొంతనలేని మాటలే. రాష్ట్రం బాగు కోసం కూటమిలో చేరానంటాడు.

    జనసేన కార్యకర్తల బాధలను చూస్తూ సహించనంటాడు. బందరులో లంచాలు ఇవ్వలేదని జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లారు పవన్? కనీసం కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి బుద్దిలేదా అని అడిగారా? ఎంతమంది జనసేన కార్యకర్తలను తంతున్నారో మీకు తెలుసా? 

    జనసేన కార్యకర్తల బాధలు పగోడికి కూడా వద్దు. మహారాష్ట్ర వెళ్లి ప్రచారం చేసొస్తే 95 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందంటున్నారు. ఏపీలో మీరు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చినోళ్లలో గెలిచిన వారు ఎవరు... ఏరోజైనా మీ పార్టీ జెండా మోశారా? 

    చంద్రబాబు జనసేన అని మెడలో వేసిన వాళ్లకే కదా మీరు సీట్లిచ్చింది? సీజ్ ద షిప్ అని నాలుగైదు రోజులు కూడా ఆపలేకపోయారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో సీజ్ ద షిప్ అని నాలుగు రోజులు కూడా ఆపలేకపోయామని మీరే ఒప్పు కుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే రోడ్డు మ్యాప్ వచ్చిందన్నారు. 2020లోనే ఇప్పటం సభలో ఓట్లు చీలనివ్వనని చెప్పింది మీరే’’ అని చెప్పారు.

  • సాక్షి, విజయవాడ: తన భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుని తనని చంపడానికి యత్నిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన మహిళ.. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాజమండ్రిలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోలు అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది.

    ‘‘నా భర్తను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాను. రెండేళ్లు నన్ను భాగానే చూసుకున్నాడు. పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధాలు ఉన్నాయని నాకు తెలిసింది. వ్యాపారం పేరుతో నా దగ్గర 100 గ్రాముల బంగారం, రూ.60 లక్షలు బ్యాంకు లోన్లు, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 50 మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. 

    ..అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నాతో ఉన్న వీడియోలు తీసుకుని కూడా బ్లాక్‌ మెయిల్ చేశాడు. మే 4 తేదీన నన్ను కొట్టాడు. నన్ను చంపుతానని బెదిరించాడు. ఆయనకు భయపడి నేను పారిపోయి వచ్చాను. నాకు నా భర్తతో ప్రాణహాని ఉంది. విజయవాడ మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లెంట్ ఇచ్చాను. న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాను’’ ఆమె పేర్కొంది.

     

Politics

  • సాక్షి, కృష్ణా జిల్లా: ఏపీని ఉద్దరిస్తామంటూ చంద్రబాబు మోసపూరిత మాటలు చెప్పారు.. ఇప్పుడు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవలం 24 నెలల్లోనే ప్రజల నెత్తిన చంద్రబాబు అప్పుల బండ పెట్టారు. 3 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేశారు. రాబోయే మూడేళ్లలో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు’’ అంటూ నిలదీశారు.

    ‘‘అప్పుల్లో, నేరాల్లో నిరుద్యోగంలో దేశంలో ఏపీనే ముందు ఉంది. ఇప్పుడు ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని అమ్మేయడానికి మహిళలపై నెపం పెడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చిందంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజల ఆస్తులకు ప్రమాదం పొంచి ఉంది. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యుండకపోతే అప్పుడే చంద్రబాబు ఆర్టీసీని అమ్మేసేవారు. 2014 నుంచి 2019 వరకూ జయము జయము చంద్రన్న అని ఆర్టీసీని వాడుకున్నారు. ఆర్టీసీ టిడిపి సొత్తులాగా.. ఖర్జూర నాయుడు సంపాదించిన సొత్తులాగా అప్పనంగా వాడేశారు

    ..నయా పైసా ఆర్టీసీకి చంద్రబాబు జమ చేయలేదు. 2018లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే చంద్రబాబు కుదరదన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 54 వేల మందిని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి ఆర్టీసీ ఆపరేషనల్ అప్పులు 6300 కోట్లు, ఎక్యుమలేటెడ్ అప్పు 3350 కోట్లు. 2020 జనవరిలో ఆర్టీసీని జగన్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ఏడాదికి   రూ.3600 కోట్లు జీతాలుగా చెల్లించారు

    ..వైఎస్‌ జగన్ దిగిపోయేనాటికి ఆర్టీసీ అప్పుల భారం 2,500  కోట్లకు తగ్గింది. వైఎస్‌ జగన్‌ చొరవతో 9 వేల కోట్ల నుంచి 2500 కోట్లకు అప్పులు తగ్గాయి. ఆర్టీసీ అప్పులు తగ్గించిన ఘనత వైఎస్‌ జగన్‌ది. ఎలక్ట్రికల్ బస్సులు కొనడం ఆర్టీసీ వల్ల కాదని ఇప్పుడు కథలు చెబుతున్నారు. ప్రజారవాణాలో ఎలక్ట్రికల్ బస్సులు కొంటే కేంద్రం 40 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. 2014-19 లో చంద్రబాబు ఒక్క ఎలక్ట్రికల్ బస్సైనా కొన్నాడా?. 2019-24 లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 100 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసింది. తిరుపతిలో ఆ బస్సులను అందుబాటులోకి తెచ్చింది.

    ..తిరుపతిలో ఎలక్ట్రికల్ బస్సులు నడిపేది ఆర్టీసీ డ్రైవర్లే. ఆర్టీసీ డ్రైవర్లకు వైఎస్‌ జగన్‌ ట్రైనింగ్ ఇప్పించారు. వైఎస్‌ జగన్‌ అప్పులు తీర్చి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించినప్పుడు మీరెందుకు చేయలేరు?. ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మీరు ఆర్టీసీని దోచుకుతినడానికి రాష్ట్ర ప్రజలకు వేసిన ఎర మహిళలకు ఉచిత బస్సు స్కీమ్. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వల్లే ఆర్టీసీ కుదేలైపోయిందని చంద్రబాబు చెప్పించాడు. స్త్రీ శక్తి హామీ ఎవరిది?. ఆర్టీసీకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది. ఉచిత మహిళ పథకం ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు కట్టడం లేదు?  

    ..ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను ప్రైవేట్ పరం చేసేస్తామంటున్నారు. మీ మనుషులు , మీ బ్రోకర్లకు ఆర్టీసీని కట్టబెట్టడమేనా మీ సంపద సృష్టి. ఆర్టీసీని సర్వనాశనం చేసి.. మహిళలపై నెపం వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలకు పంగనామాలు పెట్టారు. వైఎస్‌ జగన్‌ మహిళలకు రూ.24 వేల కోట్లు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాల్లో సగం మహిళలకు ఇచ్చారు. ఎలక్ట్రికల్ బస్సు కిలోమీటర్‌కు 7 రూపాయలే భారం అని చెప్పడం పచ్చిమోసం. ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ పినాకిల్ అనే కంపెనీకి ఇచ్చారు. పినాకిల్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపితే కిలోమీటర్‌కు 71 రూపాయలు బిల్ వేస్తారట. 71 రూపాయల బిల్లులో 21 మోదీ ఇస్తే మిగిలిన 50 రూపాయలు మీ బాబు ఇస్తాడా?

    ..కరెంట్ బస్సుకు కిలోమీటర్ కు 7 రూపాయలని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. పీఎంఈబస్ స్కీమ్ కింద రాబోయే రోజుల్లో బస్సులు వస్తే పేదలు, సామాన్యులు బస్సులు ఎక్కగలరా?. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులు పీఎంఈబస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ బస్సులు మార్చేస్తామనడం కరెక్ట్ కాదు. పీఎంఈబస్ స్కీమ్ ప్రకారం 3 లక్షల పైబడి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే కరెంట్ బస్సులు తిప్పాలి. రాబోయే 750 కరెంట్ బస్సులన్నీ రాజధానిలోని 29 గ్రామాల్లో తిప్పుతారా?

    ..కోటి 70 లక్షల చొప్పున వైఎస్‌ జగన్‌ 100 బస్సులు కొన్నాడు కదా. ఒక్క ప్రైవేట్ వ్యక్తిని కూడా రాకుండా ఆర్టీసీ డ్రైవర్లతోనే నడిపిస్తున్నారు కదా.. ఈరోజుకీ ఆహా ఓహో అంటూ ఆ బస్సులపై వస్తున్న డబ్బులను మీరు తీసుకుంటున్నారు కదా. ఆడపిల్ల కనిపిస్తే చాలు సీటీపాట పాడినట్లు ఓట్లు అడుక్కున్నారు. మహిళలను మీ ప్రభుత్వం వచ్చాక ఏం ఉద్ధరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? రాష్ట్రంలోని సంపద అంతా చంద్రబాబు, లోకేష్, పవన్, ఎమ్మెల్యేలకే.. ఇప్పటికే ఆర్టీసీలో రిక్రూట్ మెంట్ నిలిపేశారు. ఆర్టీసీ జోలికొస్తే చూస్తూ ఊరుకోం’’ అని చంద్రబాబును పేర్ని నాని హెచ్చరించారు.

Hyderabad

  • బైక్‌ అదుపుతప్పి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

    గచ్చిబౌలి: స్నేహితుడిని బస్‌స్టాప్‌లో దించి వస్తుండగా బైక్‌ అదుపుతప్పి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరు.. జార్ఖండ్‌కు చెందిన దిబ్యం కుమార్‌ (26) కొండాపూర్‌లోని సాయి అర్బన్‌ విల్లాలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సంకల్ప్‌ సృజన్‌ను కొండాపూర్‌లోని రత్నదీప్‌ సూపర్‌మార్కెట్‌ సమీపంలో బస్‌స్టాప్‌లో దించి తిరిగి వస్తున్నాడు. బొటానికల్‌ గార్డెన్‌ ప్రధానం ద్వారం వద్ద బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో దిబ్య కుమార్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెనుక బైక్‌పై వచ్చిన స్నేహితులు దిబ్య కుమార్‌ను హైటెక్‌సిటీలోని యశోద హస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దిబ్య కుమార్‌ హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

  • ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కం ఆర్టిస్ట్‌ సంజీతా భట్టాచార్య సిటీలో సందడి చేశారు. శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ‘ఫస్ట్‌ గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’ ఆడిషన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కే–పాప్‌ సాంగ్‌ ‘స్మూత్‌ లైక్‌ బెటర్‌’ బీటీఎస్‌ పాటతో అభిమానులను ఉర్రూతలూగించారు. తన కొత్త ఆల్బమ్‌ లైవ్‌ కాపీలకు ఆటోగ్రాఫ్‌ ఇస్తూ, ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ అలరించారు. కాగా ఈ ఈవెంట్‌ లైఫ్‌స్టైల్‌, మేకోవర్‌, కలర్‌ అనాలిసిస్‌, ఫొటోబూత్‌ ఫన్‌ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్‌ క్యాంపస్‌ వాతావరణాన్ని సృష్టించింది.

    – సాక్షి, సిటీబ్యూరో

  • టెలికం వెరిఫికేషన్‌ పేరుతో సైబర్‌ మోసాలు

    ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్టు

    సాక్షి, సిటీబ్యూరో: సిమ్‌ స్వాపింగ్‌తో మోసాలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర సైబర్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. విషింగ్‌, సిమ్‌ మానిప్యులేషన్‌, ఓటీపీ డైవర్షన్‌, మోసపూరిత ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో వందలాది బాధితుల నుంచి రూ.77.75 లక్షల సొమ్మును ఈ ముఠా కాజేసినట్లు సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ టి.సాయి మనోహర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సలీం, సయ్యద్‌ హషీమ్‌ రెజా అలియాస్‌ టిప్పు, బన్సీధర్‌, అబ్దుల్‌ అలీం అలియాస్‌ మిట్టు, మిజానుర్‌ రెహమాన్‌ షేక్‌, మెహబూబ్‌ ఆలం అన్సారీ అలియాస్‌ సూరజ్‌లు ముఠాగా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. థర్డ్‌ పార్టీ నుంచి కస్టమర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి సిటీ బ్యాంక్‌ ప్రెస్టీజ్‌ క్రెడిట్‌ కార్డ్‌ డివిజన్‌ అధికారులమంటూ వారికి ఫోన్‌ చేసి నమ్మిస్తారు. టెలికాం శాఖ వెరిఫికేషన్‌ పేరుతో బాధితులను ఈ–సిమ్‌ నుంచి ఫిజికల్‌ సిమ్‌ కార్డ్‌లుగా మార్చుకునేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మాల్వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన మొబైల్‌ ఫోన్లను కొరియర్‌ సర్వీసుల ద్వారా బాధితులకు ఇంటికే పంపిస్తారు. బాధితులు ఆ ఫోన్లలో ఫిజికల్‌ సిమ్‌ కార్డ్‌లను వేయగానే.. వెంటనే, వారికి రావలసిన వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)లు, బ్యాంకింగ్‌ అలర్ట్‌లు నిందితులకు డైవర్ట్‌ అవుతాయి. వీటి ఆధారంగా నిందితులు బాధితుల బ్యాంక్‌ ఖాతాలకు అనధికారిక యాక్సెస్‌ పొంది, మోసపూరిత ఆన్‌లైన్‌ లావాదేవీలను నిర్వహిస్తారు. ఈక్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు వెస్ట్‌ బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడి వెళ్లి ఆరుగురు నిందితులను ట్రాన్సిట్‌ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నిందితుల నివాసాల నుండి రూ.15 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు.

  • తెలంగాణ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతి వేదికగా శనివారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినేత్రి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాలు మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. కాగా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అంటే గొప్ప చరిత్ర అని, ఇక్కడి ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సలహాదారు ఆర్‌.గోవింద్‌ హరి, దేవాదాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, డైరెక్టర్‌ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి

Medak

  • పూర్తిస్థాయిలో అందని పెట్టుబడి సాయం

    మెదక్‌జోన్‌: వానాకాలం సీజన్‌ ముంచుకొస్తుంది. పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. అయితే యాసంగి సీజన్‌ ముగింపు దశకు వచ్చినా, రైతు భరోసా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందలేదు. కేవలం రెండెకరాల వరకు మాత్రమే ఖాతాలో జమ చేశారు. మిగితా సాయం అందిస్తారా? లేదా అని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 3,00,558 మంది రైతులు ఉండగా, 4 లక్షల పైచిలుకు ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కాగా మార్చి 22న మొదటి విడతలో 2,59,936 మంది రైతులకు ఎకరం వరకు రూ.110,09,34,682 రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగితా రెండో విడతను ఏప్రిల్‌ 20న కేవలం 2 ఎకరాలకు వరకు 8,063 మంది రైతులకు రూ.56, 39,04,952 అందించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 2,67,999 మంది రైతులకు రూ.166,48,39,634 కోట్లు జమ చేశారు. ఈ లెక్కన ఇంకా 32,532 మంది రైతులకు 2 ఎకరాల పైచిలుకు భూములు గల ఉండగా, వారికి రైతు భరోసా నిధులు అందాల్సి ఉంది.

    పెట్టుబడికి తిప్పలు

    పంట పెట్టుబడి సాయం కోసం గత ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. కాగా రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి రూ. 6 వేలు అందజేస్తామని చెప్పింది. గత వానాకాలంలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. యాసంగి సీజన్‌కు వచ్చేసరికి పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో పెట్టుబడి సాయం అందకపోవడతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. యాసంగికి సంబంధించిన పెట్టుబడి సాయం నేటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఇక వానాకాలం సీజన్‌కు సంబంధించి స్పష్టత కొరవడింది.

    ముగిసిన యాసంగి సీజన్‌

    ఆందోళనలో అన్నదాతలు