తిరువళ్లూరు: తాము రౌడీలమంటూ రోడ్డులో కత్తులతో హల్చల్ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం సమీపంలో గురువారం రాత్రి సబ్ ఇన్స్పెక్టర్ ఇళంగో నేతృత్వంలో పోలీసులు గస్తీ నిర్వహించారు. ఈ సమయంలో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో రోడ్డులో కత్తులతో హల్చల్ చేస్తూ ప్రజలపై వీరంగం చేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ యువకులను పోలీసులపై తిరగబడ్డారు. అంతుచూస్తామని బెదిరించారు. వారిని బలప్రయోగంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రాధమిక విచారణలో వారిద్దరూ రామతండలం గ్రామానికి చెందిన అన్నదమ్ములైన తెన్నరసు(23), అశ్వంత్(21)అని, వీరిపై పలు పోలీసుస్టేషన్లో కేసులు ఉన్నట్లు తేలింది. అనంతరం వీరిని కోర్టుకో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
Tamil Nadu
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించిన కొద్ది గంటల్లోనే, సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు. తమిళనాడులో మరింత మంది ప్రజలను అనుసంధానించేలా ‘మారుదాం.. మార్చుదాం’ అనే నినాదంతో ఒక సరికొత్త రాజకీయ విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారు. తమిళనాడు బిజేపీ బలోపేతంలో మాజీ ఐపీఎస్ అధికారి పాత్ర కీలకం అన్నది జగమెరిగిన సత్యం. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు ఆయన్ను బీజేపీ అధిష్టానం తప్పించి నైనార్ నాగేంద్రన్కు పగ్గాలు అప్పగించింది. అయినా, పార్టీకి సేవలు అందిస్తూ వచ్చిన అన్నామలైకు అధిష్టానం రూపంలో ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో రెండు రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసిన అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆ పార్టీ ఆమోదించిన కొన్ని గంటలలో శుక్రవారం మధ్యాహ్నం అన్నామలై సోషల్ మీడియా వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
బీజేపీకి రాజీనామా ఎందుకు?
2020 ఆగస్టులో బీజేపీలో చేరిన తాను తమిళనాడులో పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించానని గుర్తు చేశారు. అయితే, గత 18 నెలలుగా పార్టీ జాతీయ నాయకత్వంతో తమిళనాడు రాజకీయ వ్యూహాలు, కూటములపై తనకు కొన్ని భేదాభిప్రాయాలు (ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో) ఉన్నాయని ఆయన వివరించారు.
నా మార్గం వేరు, నా లక్ష్యాలు చాలా పెద్దవి :
తమిళనాడులో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, మూలాల నుంచి మార్పును తీసుకురావాలన్నదే తన ఆశయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఎంతో మర్యాదపూర్వకంగా వివరించి, పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు.
సరికొత్త రాజకీయ ఉద్యమం– వీ ది లీడర్
అన్నామలై తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఒక పార్టీగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక పెద్ద ఉద్యమంగా అభివర్ణించారు. వీ ది లీడర్ పేరిట ఈ ఉద్యమం సాగుతుందని ప్రకటించారు. ఈ ఉద్యమం త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
డిజిటల్ ప్లాట్ఫారమ్
యువత, ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించామని ప్రకటించారు. రాజకీయాల్లో నైతికతను పెంపొందించడానికి కోయంబత్తూరులో అబ్దుల్ కలాం పేరిట సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా కొత్త నాయకులకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు.
అన్నామలై ఉద్యమంలో ముఖ్యాంశాలు
ఈ కొత్త ఉద్యమంలోని విధానం, పరిమితుల మేరకు పార్టీలో శాశ్వత ఎమ్మెల్యేలు, శాశ్వత ఎంపీలు అనే సంస్క్కృతిని బద్దలు కొడతామని, పదవీ కాలానికి ఖచ్చితమైన పరిమితులు ఉంటాయని, సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్న తమిళ సాంకేతిక నిపుణులను రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నైతికత సోషల్ మీడియాలో తన మద్దతుదారులు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరారు.
ఇతర పార్టీలపై కొత్త వైఖరి
ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉంటుందని అన్నామలై స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు రాజకీయ క్షేత్రంలో తాము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, పీఎంకే, ఎన్టీకే, డీఎండీకే వంటి పార్టీలను ఏ విధంగా చూస్తానో, ఇకపై బీజేపీని కూడా అలాగే చూస్తానని స్పష్టం చేశారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని, ప్రజలే తమ నాణ్యతను చూసి ఎన్నుకుంటారని అని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ఏకై క లక్ష్యమని, ఇందుకోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు.
సాక్షి, చైన్నె: ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ వ్యవస్థాపకుడు కాయిదే మిల్లత్ మహ్మద్ ఇస్మాయిల్ 131వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు ఆవరణలోని ఆయన సమాధి వద్దకు వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. సీఎం విజయ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అధికారిక నివాళులర్పిస్తూ సమాధి వద్ద చాదర్ను సమర్పించారు. ట్రిప్లికేన్లోని పెద్ద మసీదు వద్దకు పెద్ద ఎత్తున ముస్లీం సంఘాల నేతలు, రాజకీయ పార్టీ నాయకులు తరలి రావడంతో ఆ పరిసరాలు క్రిక్కిరిశాయి. ముస్లీం మత పెద్దలు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా ట్రిప్లికేన్ పెద్ద మసీదు వద్దకు సీఎం విజయ్, స్పీకర్ జేసీడీ ప్రభాకర్, మంత్రులు ఎన్ ఆనంద్, ఆధవఅర్జున, వెంకటరమణన్, ఎ.ఎమ్. షాజహాన్, మహ్మద్ పర్వేజ్ , ఎన్. మరియ విల్సన్ వచ్చారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.కె. కుంజాలికుట్టి , ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ కె.ఎమ్.ఖాదర్ మొహిద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్వి మహ్మద్ అబుబకర్ , ఎంపీ నవాజ్ ఖని, సమాచార శాఖ కార్యదర్శి రాజారామన్ డైరెక్టర్ డాక్టర్ అ.అరుణ్ తంబురాజ్, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొని కాయిదే మిల్లత్ స్మారకానికి నివాళులర్పించారు. సీఎం విజయ్ చాదర్ను సమర్పించారు.
డీఎంకే వర్సెస్ కాంగ్రెస్
తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే – కాంగ్రెస్ సుదీర్ఘ బంధానికి తెరపడిన తర్వాత ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇందుకు చైన్నెలోని కాయిదే మిల్లత్ 131వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన స్మారకం వద్ద పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం విజయ్ వచ్చి వెళ్లినానంతరం మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అక్కడ ఛాదర్ సమర్పించేందుకు నిర్ణయించారు. ఆయన నివాళుర్పించి అటు వెళ్లగానే అదే సమయంలో అక్కడకు టీఎన్సీసీ అద్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటు ఆ పార్టీ వర్గాలు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న డీఎంకే కార్యకర్తలకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. చివరకు అక్కడున్న వారు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వ్యవహారంపై సెల్వపెరుంతొగై స్పందిస్తూ సుదీర్ఘ బంధం తెగిపోతే ఆ బాధ ఉంటుందని, ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దన్నారు. తమిళనాడులో డీఎంకే నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చేసిందని, ఇండియా కూటమి విషయంలో జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీల తరఫున నేతుల సమాధి వద్ద అంజలి ఘటించారు.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పార్టీలో గత కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత అధికార పోరాటం, చట్టపరమైన వివాదాలు మద్రాసు హైకోర్టులో పూర్తిగా ముగిశాయి. గతంలో పార్టీలో జరిగిన పరిణామాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని సివిల్ కేసులను పిటిషనర్లు వెనక్కి తీసుకోవడంతో, న్యాయస్థానం ఆయా కేసులను కొట్టివేస్తూ విచారణను ముగించింది. 2022, జూలై 11న అన్నాడీఎంకే పార్టీ నిర్వహించిన వివాదాస్పద జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని, అందులో ఆమోదించిన తీర్మానాలను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం, ఆయన మద్దతుదారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్ సివిల్ దావాలు దాఖలు చేశారు.
మారిన పార్టీలు..వ్యూహాలు
ఈ కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగానే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరో సీనియర్ నేత జేసీడీ ప్రభాకర్ విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరి తాజాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తాజాగా ఇతర పార్టీలలో తాము ఉండడంతో పాత అన్నాడీఎంకే వివాదాల కేసులను కొనసాగించడంలో అర్థం లేదని భావించి, ఆయా పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోర్టును కోరారు. దీనిని పరిశీలించిన జస్టిస్ కె. కుమరేష్ బాబు నేతృత్వంలోని బెంచ్, పన్నీరు, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు, అన్నాడీఎంకే పార్టీ పేరు, జెండా, రెండాకులు చిహ్నం ఉపయోగించకుండా పన్నీరు వర్గానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళనిస్వామి గతంలో వేసిన కేసును కూడా వెనక్కి తీసుకోవడానికి అనుమతించవలసిందిగా ఆయన తరఫున పిటిషన్ దాఖలైంది. ఈ అభ్యర్థనను సైతం అంగీకరించిన న్యాయమూర్తి, ఈ వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అధికారికంగా ముగించారు. దీంతో, గత నాలుగేళ్లుగా తమిళనాడు రాజకీయాలను ఊపేసిన అన్నాడీఎంకే వివాదాల కోర్టు పోరాటానికి తెరపడింది.
తిరువొత్తియూరు: నైల్లె జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానలా మారి, ఒకరు ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది. వినోద్ ఆకాష్ (23), ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. మణికంఠన్ (30). గురువారం సాయంత్రం వీరిద్దరూ కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన మణికంఠన్ రాయితో వినోద్ తలపై బలంగా కొట్టాడు. వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మద్యం మత్తులోనే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.
కొరుక్కుపేట: అన్నమయ్య కీర్తనలతో నగరానికి చెందిన తెలుగు గాయని అరుణ ఆధ్యంతం అలరించింది. వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో సీతా కల్యాణ వైభవం పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చైన్నె పటేల్ రోడ్డులోని ఆనంద నిలయం వేదికగా గురు వారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం రాత్రి గాయని అరుణ సంగీత కచ్చేరి ఇచ్చారు. కీ బోర్డుపై ఎన్ వి బాబు, తబలాపై రమేష్ వాయిద్య సహకారం అందించారు. గాయకుడు ఎం ఆర్ సుబ్రహ్మణ్యం అన్నమాచార్య కీర్తనలను అలపించి అలరించారు. కళాకారులను తమ్మినేనిబాబు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గుడిమెట్ల చెన్నయ్య, విజయలక్ష్మి, శ్రీనాథ్ పాల్గొన్నారు.
కొరుక్కుపేట: తాంబరం, పరంతూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లలో శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిగ్నల్ సిస్టం వైఫల్యం చెందింది. దీంతో ట్రాక్పై ఉన్న సిగ్నల్ బాక్సులు పనిచేయలేదు. ఫలితంగా చెంగల్పట్టు మార్గం నుంచి తాంబరం వైపు వచ్చే ఎలక్ట్రిక్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లకు సిగ్నలింగ్ ఇవ్వడం కుదరలేదు. ఈ వైపు నుంచి రైళ్లన్నింటినీ కొన్నిచోట్ల నిలిపివేశారు. అలాగే, తాంబరం నుంచి చైన్నె వెళ్లే రైళ్లను కూడా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లలో చిక్కుకుపోయారు. పాఠశాలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు పైగా రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు తాంబరం రైల్వేస్టేషన్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆ తర్వాత 9.30 గంటల తర్వాత సిగ్నల్ సమస్యను సరిదిద్దారు. ఆ తర్వాత, అన్ని రైళ్లు యథావిధిగా నడిచాయి.
వేలూరు: గ్రామసభలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వేలూరు ఎంపీ కదిర్ఆనంద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని వంజూరు గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామసభ సమావేశంలో ఎంపీ కదిర్ఆనంద్ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడిక్కడే పరిష్కరించారు. వేలూరు సమీపంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ వీఎస్ లీల పాల్గొన్నారు.
సాక్షి, చైన్నె: డీఎంకే మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ ఉద్యోగాలకు లంచం వ్యవహారం కేసు ఉచ్చుగా మారింది. ఆయనపై కేసు నమోదు చేసినట్టు టీవీకే ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు వివరించింది. అదే సమయంలో కోర్టు ఆదేశాలు పెండింగ్లో ఉండగా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 2,538 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. ఈ నియామకాల్లో రూ.634 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఈడీ ఒక లేఖ రాసింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే నేత ఇన్బదురై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు, వెంటనే కేసు నమోదు చేయాలని గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయకపోవడంతో ఇన్బదురై కోర్టు దిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు, ఈ కేసు నమోదు ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ గత డీఎంకే ప్రభుత్వం, అప్పటి మంత్రి కేఎన్ నెహ్రూ తరఫున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులన్నింటి విచారణను హైకోర్టు జూన్ 23వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టులో వాదనల జోరు
కోర్టు ధిక్కార కేసు పెండింగ్లో ఉన్న తరుణంలో, ఈ వివాదంపై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని మాజీ మంత్రి నెహ్రూ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ పాండియన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కూడా ఈ విషయాన్ని కోర్టుకు ధృవీకరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుల విచారణ ఈ నెలాఖరున జరగాల్సి ఉందని, తర్వాత విచారణ జరిగే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోమని ఇది వరకటి అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. అటువంటప్పుడు కోర్టు విచారణ పూర్తి కాకముందే కేసు ఎలా నమోదు చేస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమగ్రమైన ఉత్తర్వులు జారీ చేస్తామని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది.
– ఆరుగురికి గోల్డెన్ వింగ్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు అరక్కోణంలోని ప్రతిష్టాత్మక హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఐఎన్ఎస్ రాజాళి లో ఆరుగురు భారత నౌకాదళ పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. 106వ బ్యాచ్కి చెందిన హెలికాప్టర్ కన్వర్షన్ కోర్స్లో కఠినమైన విమానయాన, గ్రౌండ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఆరుగురు యువ ఆఫీసర్లకు తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్మీనన్ ప్రతిష్టాత్మక శ్రీగోల్డెన్ వింగ్స్శ్రీ ను బహూకరించారు. ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ –561 పరిధిలో సుదీర్ఘంగా 22 వారాల పాటు సాగిన ఈ అత్యంత కఠినమైన శిక్షణ ముగింపు, యువ బృందాన్ని సంపూర్ణ యుద్ధ సన్నద్ధత కలిగిన ఏవియేటర్లుగా తీర్చిదిద్దింది. శిక్షణ కాలంలో అసాధారణ ప్రతిభ, అంకితభావం కనబరిచిన ముగ్గురు అధికారులకు ప్రత్యేక ట్రోఫీలను అందజేశారు. ఫ్లయింగ్లో ప్రథమ స్థానం: ఫ్లయింగ్ విభాగంలో మెరిట్ ఆర్డర్లో ప్రథమ స్థానంలో నిలిచిన సబ్ లెఫ్టినెంట్ అహోనా మజుందార్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ రోలింగ్ ట్రోఫీ , గ్రౌండ్ సబ్జెక్టులలో ప్రథమ స్థానంలో నిలిచిన లెఫ్టినెంట్ శివమ్ సింగ్కు సబ్ లెఫ్టినెంట్ కుంటే మెమోరియల్ బుక్ ప్రైజ్ దక్కింది. అన్ని విభాగాల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన లెఫ్టినెంట్ అరుణ్ కుమార్కు ప్రతిష్టాత్మక కేరళ గవర్నర్ రోలింగ్ ట్రోఫీ లభించింది. ఈ శిక్షణ కేంద్రంలో 900 మందికి పైగా పైలట్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెలికాప్టర్ ఫ్లయింగ్ శిక్షణ ఇక్కడ పొందారు. తాజాగా పట్టభద్రులైన ఈ ఆరుగురు భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్లైన్ యూనిట్లలో, సముద్ర తీరాలలో నిఘా, శోధన–సహాయక చర్యల్లో నిమగ్నం కానున్నారు.
Tirupati
●
ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆచరణలో అవేమీ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో కళాశాలలను సమస్యలు చుట్టుముడుతున్నాయి. పలు పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా సత్ఫలితాలు ఒనగూరడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల లేమి..శాశ్వత అధ్యాపకుల కొరత పట్టి పీడిస్తోంది. జేఈఈ, నీట్ శిక్షణ తదితర అంశాల అమలు తీరును పరిశీలిస్తే అంతులేని ఆవేదన మిగులుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి సిటీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సమస్యలతో సతమతవుతున్నాయి. శనివారం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికుతున్నట్లే భావించాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాలు లేమితో పాటు ఆశించిన స్థాయిలో ఇంటర్ ఫలితాలు రాకపోవడం, శాశ్వత అధ్యాపకుల కొరత, విద్యార్థులను జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడంలో సరైన శిక్షణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలను చేర్పించేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం, నూతన సిలబస్కు అనుగుణంగా అధ్యాపకులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడంలో అధికారుల విఫలం తదితర సమస్యలు ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పట్టి పీడిస్తున్నాయి.
వేధిస్తున్న అధ్యాపకుల కొరత
జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు 72 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల కొరత పీడిస్తోంది. అధ్యాపకుల నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు బట్టీ చదువులే గతిగా మారింది. ఒక్కో కళాశాలలో సింగిల్ డిజిట్ కూడా పర్మనెంట్ అధ్యాపకులు లేకపోవడం బాధాకరం. పలు కళాశాలల్లో పూర్తిస్థాయిలో ప్రిన్సిపాళ్లను నియమించకపోవడంతో ఇన్చార్జిలతోనే కళాశాలలను నెట్టుకొస్తున్నారు.
తల్లికివందనం ఊసేలేదు!
ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యేనాటికి అర్హులైన విద్యార్థులందరికీ తల్లికి వందనం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు గారడీ మాటలేనని తేలిపోయింది. ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు చెల్లించాల్సిన తల్లికివందంపై ఇప్పటివరకు ఊసే ఎత్తకపోవడం విచారకరం. నూతనంగా కళాశాలల్లో ప్రవేశాలు పొందే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సైతం తల్లికి వందనం ఎప్పటికి దక్కుతుందో చెప్పలేమని అధికారులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొగ్గు చూపని తల్లిదండ్రులు
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు మొగ్గు చూపకపోవడంతో గత రెండేళ్లుగా ప్రవేశాలు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. జిల్లాలోని సుమారు 21 ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని గ్రూపుల్లో సింగిల్ డిజిట్కే ప్రవేశాలు పరిమితమవుతున్నాయి. అధికారులు అడ్మిషన్ల కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సంప్రదించినా విద్యార్థులు, తల్లిదండ్రులు వెనకడువేస్తున్నారు.
జిల్లా సమాచారం
కళాశాలల ద్వితీయ విద్యార్థుల
సంఖ్య సంవత్సరం సంఖ్య
ప్రభుత్వ జూనియర్
కళాశాలలు 21 1677
ఏపీఆర్జేసీ 1 107
ఎయిడెడ్ 1 336
ఏపీఎస్డబ్ల్యూఆర్ 10 629
ఏపీటీడబ్ల్యూఆర్ 3 239
బీసీ రెసిడెన్షియల్ 2 209
హైస్కూల్ ప్లస్ 23 601
కేజీబీవీ 4 151
ఏపీఎస్ఎస్ 5 365
వేసవి సెలవుల అనంతరం 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టెక్ట్స్బుక్స్తో పాటు స్టడీ మెటీరియల్ కిట్ను అందజేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఆచరణలో విఫలమవుతోంది. సీబీఎస్ఈ విధానంలో నూతన సిలబస్ను రూపొందించి సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఏప్రిల్లోనే పుస్తకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదు. తూతూ మంత్రంగా పుస్తకాల పంపిణీ చేసి, అధికారులు చేతులు దులుపుకున్నారు. కళాశాలల భవనాలు, ఆర్వో ప్లాంట్ల శుద్ధి, మరుగుదొడ్లు, క్రీడాప్రాంగణాలను ప్రత్యేక నిధులతో వేసవి సెలవుల్లో మరమ్మతుల చేయాల్సి ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాలలకు వేసిన తాళం వేసినట్టే ఉండటం గమనార్హం.
టీటీడీ జూనియర్ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకులు ఇద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. అధ్యాపకుల నియామకాలపై టీటీడీ దృష్టిపెట్టకపోవడం పేద విద్యార్థులు ఉచిత పుస్తకాల పంపిణీకి నోచుకోకపోవడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కార్పొరేట్ స్థాయి వసతులు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పూర్తి స్థాయిలో అందజేస్తాం. విద్యార్థుల సరిపడా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు గత ఏడాది కంటే పెరగనున్నాయి. ఇప్పటికే అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రభుత్వం నుంచి మెరిట్ స్కాలర్ షిప్లు, తల్లికి వందనం వంటి అన్ని సౌకర్యాలు విద్యార్థులు అందనున్నాయి
–జి రాజశేఖర్రెడ్డి, ఆర్ఐఓ, తిరుపతి
నాయుడుపేటటౌన్: మండలంలోని జువ్వలపాళెం చెరువులో దొంగల్లా రాత్రి సమయాల్లో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజలుగా రాత్రి సమయాల్లో గుట్టు చప్పుడు కాకుండా చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. జువ్వలపాళెం పంచాయతీ పరిధిలోని బిరదవాడ, మందబైలు గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు చెరువులో మట్టి తవ్వి, అక్రమ తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. మట్టి అక్రమంగా తరలిస్తున్న వారిని నిలదీస్తే వారు అధికార పార్టీ బడాబాబుల అనుమతితోనే చెరువులో మట్టి తవ్వి తరలిస్తున్నట్లు బహాటంగా చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. జువ్వలపాళెం చెరువులో అర్ధరాత్రి సమయాల్లో అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేయనున్నట్లు బిరదవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పనబాక గంగాబాబు తెలిపారు. పార్టీ పటిష్టత దిగజారిపోయేలా స్థానిక అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ దందాలపై పార్టీ అధి నాయకులకు సైతం ఫిర్యాదు చేస్తమని గంగాబాబు పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తరలింపునకు అడ్డుకట్టు వేయాలని కోరారు.
చంద్రగిరి: మంగళం క్వార్టర్స్ పంచాయతీ పద్మావతి నగర్లో టీటీడీకి చెందిన నిరుపయోగ భవన సముదాయంలో భవన నిర్మాణ కార్మికుడు శివయ్య(70) శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నిరుపయోగంగా ఉన్న భవనంలో శివయ్య నుదుటిపై పెద్ద గాయమై విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పలు ఆధారాలను సేకరించారు. మృతుడు పచ్చికాపల్లం సమీపంలోని బలసలగుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దశాబ్దాలుగా మంగళం ప్రాంతంలో ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భవన నిర్మాణ కార్మికుడు శివయ్య మృతిపై హత్య కేసు నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
సినిమా షూటింగ్లకు అడ్డాగా ఎస్వీయూ
తిరుపతి సిటీ: రాయలసీమకు సరస్వతి నిలయంగా పేరుగాంచిన ఎస్వీయూ అధికారుల నిర్లక్ష్యంతో సినిమా షూటింగ్లకు అడ్డాగా మారుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్వీయూ ప్రాంగణంలో ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతించకూడదనే నిబంధనలున్నా, వాటిని వర్సిటీ అధికారులు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రైవేటు కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వీయూలో లా కళాశాల భవనాన్ని వర్సిటీ అధికారులు తమిళ సినిమా షూటింగ్కు కేటాయించడం దారుణమన్నారు. ఆ భవనాన్ని షూటింగ్ నిమిత్తం కేటాయించడంతో షూటింగ్ నిర్వహించే యాజమాన్యం కళాశాల భవనాన్ని ఉన్న నేమ్ బోర్డులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు షూటింగ్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.
22 మందికి జరిమానా
తిరుపతి లీగల్: తిరుపతి రూరల్, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడపడం, పబ్లిక్ స్థలంలో ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, ఇతర నేరాలకు పాల్పడిన 22 మందికి రూ.1,41,900 జరిమానా విధిస్తూ తిరుపతి రెండో ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ షేక్ కరీముల్లా మస్తాన్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఎంఆర్ పల్లి, తిరుచానూరు పోలీసులు 22 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
శ్రీసిటీ(వరదయ్యపాళెం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను పురస్కరించుకుని శ్రీసిటీలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) సభ్యులు ఎన్. నాగేశ్వరరాజు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రాంతీయ డైరెక్టర్ హెచ్.డి. వరలక్ష్మి పాల్గొన్నారు. శ్రీ సిటీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ విభాగం ఇన్చార్జి డి.ఎన్. రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అతిథులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి దిశగా కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సత్యవేడు అటవీ శాఖ రేంజ్ అధికారి త్రినాథరెడ్డి గౌరవ అతిథిగా హాజరై, మొక్క నాటారు. ఈ సందర్భంగా నాగేశ్వరరాజు మాట్లాడుతూ వాతావరణ మార్పులను ఎదుర్కొని, భూమి భవిష్యత్తును కాపాడడం మనందరి ఉమ్మడి బాధ్యత అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తుచేస్తోందని చెప్పారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రస్తుతం అతిపెద్ద సవాలు అని, దీనిని ఎదుర్కొనేందుకు శ్రీసిటీ కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. శ్రీసిటీ హార్టికల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ విభాగం ఇన్చార్జి డీఎన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీలో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా మొక్కలు నాటామని, ఈ ఏడాదిలో మరో పది వేలకుపైగా మొక్కలు నాటే ప్రణాళిక ఉందని తెలిపారు.
తిరుపతి మంగళం : విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల, కళాశాలల బస్సులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని తిరుపతి జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా పరిధిలో విద్యా సంస్థలకు చెందిన బస్సులపై శుక్రవారం రవాణా శాఖాధికారులు ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఈ తనిఖీలను ఆరు బృందాలుగా విభజించిన మోటారు వాహన తనిఖీ అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో సుమారు 850 విద్యాసంస్థల బస్సులను పరిశీలించి, సాంకేతిక లోపాలున్న 75 వాహనాలకు నోటీసులు జారీ చేశారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, మరమ్మతులు చేసి, వాహనాలను తిరిగి తనిఖీకి తీసుకురావాలని సంబంధిత యాజమాన్యాలను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని బస్సులు అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి, ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే రోడ్లపై వాహనాలను నడపాలని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ సూచించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మోటారు వాహన చట్టాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్తో పాటు మోటారు వాహన తనిఖీ అధికారులు బస్సుల నిర్వహణ, ఫిట్నెస్, పర్మిట్, పన్నుల చెల్లుబాటు, అత్యవసర మార్గ ద్వారాల ఏర్పాటు, వేగ నియంత్రణ పరికరాల అమరిక, వాటి పనితీరు, అగ్నిమాపక పరికరాల లభ్యత, చెల్లుబాటు కాలం, డ్రైవర్ల లైసెన్స్లతో పాటు వారి అనుభవం ప్రత్యేక తనిఖీలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల బస్సులు, యాజమాన్య నిర్లక్ష్యంపై ప్రశ్నించాలన్నారు.
చంద్రగిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం విత్తన దినోత్సవం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వి.చంద్రిక అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు విత్తన నాణ్యతపై అవగాహన కల్పించాలనే వీసీ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తుకుంటేనే ఆశించిన మేర అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయ డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ మునిరత్నం మాట్లాడుతూ రైతులు తమ సొంత అనుభవాలకు శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలను జోడించి, రైతు స్థాయిలోనే స్వయంగా విత్తనోత్పత్తి చేసుకోవడం ద్వారా ఆర్థికంగా అధిక లాభాలు గడించవచ్చన్నారు. మొక్కల ప్రజనన విభాగపు అధిపతి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ పంట పండించడానికి నేల, నీరు ఎంత బాగున్నప్పటికీ సరైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకోవడమే అత్యంత కీలకమైన అంశమన్నారు. అధిక దిగుబడులు సాధించాలంటే నేల స్వభావం, నీటి లభ్యత, నాణ్యమైన విత్తనం, రుతుపవనాల గమనంపై అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎమ్ రెడ్డి శేఖర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వేరుశనగ ప్రజనన విభాగ శాస్త్రవేత్తలు రూపొందించిన ‘వేరుశనగ పంటలో విత్తనోత్పత్తి పద్ధతులు‘ అనే పుస్తకాన్ని అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయం రూపొందించిన పంట రకాలు, బయో పెస్టిసైడ్స్ , జీవన ఎరువులు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రేణిగుంట: ఙమొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రేణిగుంట మండలంలోని తూకివాకం సమీపంలో తుడా ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, తుడా చైర్మన్ సి.దివాకర్ రెడ్డి పాల్గొని, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతోపాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మొక్కలు బతకవన్నారు. మొక్కల సంరక్షణలో ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యం అందించాలని కోరారు. ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని, సాధారణంగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీలుగా ఉండగా, ప్రస్తుతం 15 డిగ్రీలు దాటితే తీరప్రాంతాల్లో నివసించే మూడో వంతు జనాభా తీవ్ర ప్రభావానికి గురవుతున్నారన్నారు. తిరుపతి, శేషాచలం కొండల్లో ఉన్న చెట్ల కారణంగా అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో తుడా అధికారులు, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ఎంపీడీవో రవిచంద్ర, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అరణియార్ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న అధికార పార్టీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్బీ పేట విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.చంద్రన్ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం ఆయన ఆ అసోసియేషన్ సభ్యులతో కలసి తిరుపతి ప్రెస్క్లబ్లో మాట్లాడారు. పిచ్చాటూరు మండలం నుంచి నాగలాపురం మండలం సురుటపల్లికి ఇరువైపుల దాదాపు 23 గ్రామాల వారు ఆరణియార్ నది నీటితో పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. నదిలో నుంచి సుమారు 150 టిప్పర్లు, 120 ట్రాక్టర్లు, 50 ఇటాచీలతో ఇసుక, గ్రావెల్, రోడ్డు కంకరను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేత సత్యవేడు నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి తన అనుచరులతో యథేచ్ఛగా అక్రమ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. విలేజ్ పబ్లిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహజ వనరులను ధ్వంసం చేస్తున్న విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సదరన్ జోన్, చైన్నెలో ఫిర్యాదు చేశామన్నారు. ఆ మేరకు న్యాయస్థానం ఇసుక, గ్రావెల్, కంకర తరలింపును నిలిపివేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇందుకు సంబందించిన కాపీలను జిల్లా మైనింగ్శాఖతోపాటు ఆయా ప్రభుత్వశాఖాధికారులకు అందించినా స్పందన లేదన్నారు. ఇసుక, గ్రావెల్, రోడ్డు మెటల్ రవాణాను అడ్డుకుని న్యాయం చేయాలని విజ్ణప్తి చేశారు. అసోసియేషన్ సభ్యులు బాబునాయుడు, సుబ్రమణ్యం, జి.బాలాజీ, డి.మనోహర్, ఎస్.విల్సన్, కె. మధుబాబు, కె.రవీంద్రకుమార్ పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్: మామడి రైతుల భవిష్యత్ ఈ ఏడాది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. తాము పండించిన మామడి పంటను అమ్ము కోవడానికి రైతులు గత ఏడాది నానా తిప్పులు పడిన సంగతి తెలిసిందే. మామిడి కొనుగోలు చేసేవారు లేక కొందరు రైతులు ఉచితంగా గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భాలు లేకపోలేదు. అలాగే మామిడి సాగు వృథా అని కొందరు మామిడి చెట్లను తొలగించారు. గత ఏడాది ఫ్యాక్టరీలు తోతాపురికి కిలోకు రూ.8 ఇస్తారని, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని, మొత్తంగా కిలోకి రూ. 12 గిట్టుబాటు కల్పిస్తామని చెప్పారు. అయితే పలుచోట్ల ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.4 మాత్రమే ఇచ్చినట్లు రైతులు వాపోతున్నారు. గత ఏడాది పెద్ద ఎత్తున సమస్యలు వచ్చాయి. ఈ ఏడాదీ అలాంటి ఇబ్బందులు తిరిగి చోటుచేసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు.
నిద్రావస్థలో ఉద్యానశాఖ
గత ఏడాది నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టం అవుతోంది. రాష్ట్రస్థాయిలో గత ఏడాది మామిడి సమస్యలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు లేదని స్పష్టమవుతోంది. ఈ ఏడాది కిలోకి రూ.7 చొప్పున ఫ్యాక్టరీల నుంచి ఇప్పిస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వం నుంచి పైసా లేదు
మామిడి సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది కంటే ధర పెంచి ఇవ్వాల్సి ఉంది. అయితే తగ్గించి ఇస్తామని చెప్పడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
నాగలాపురం: ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉంటూ అర్హుల ఓట్లను తొలగించకుండా బూత్ లెవల్ ఏజెంట్లు అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నాగలాపురంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోట రాజేష్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూమన మాట్లాడుతూ జాతీయ ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్) బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి నేతలందరూ కలసి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. బీఎల్ఏలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నెల రోజులు పాటు కష్టపడి అర్హులు ఓట్లు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఓట్లను తొలగించకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఓటరు జాబితా నుంచి ఓట్లు తీసివేయడానికే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ఇటీవల పశ్చిమ బంగా, తమిళనాడు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హుల ఓట్లను తొలగించిందని ఆయన గుర్తు చేశారు. పశ్చిమ బంగాలో సుమారు 91 లక్షల తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు, తమిళనాడులో డీఎంకే అనుకూలంగా ఉన్న 75 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సమన్వయకర్త దృష్టికి తేవాలని బీఎల్ఏలకు భూమన దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్సీపీ గ్రామస్థాయి నాయకులు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేసి అర్హత కలిగిన వారి ఓట్లు, పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి ఓట్లను కూడా తొలగించకుండా ఉండేలా చూడాలని, ఆ బాధ్యత పూర్తిగా బీఎల్ఏలే చూడాలన్నారు. చంద్రబాబు మళ్లీ అడ్డదారిన గెలిచేందుకు ప్రస్తుత ప్రభుత్వం అడ్డగోలు కార్యక్రమాలను తీసుకొస్తుందని, ఇలాంటి కుయుక్తులను పార్టీ శ్రేణులు సమన్వయంతో ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, ఎస్ఐఆర్ నియోజవర్గ ఇన్చార్జి వేలూరు రాకేష్, ఎస్ఐఆర్ టాస్క్ఫోర్స్ ఇన్చార్జి వెంకటనారాయణరెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి, నరేంద్రం సనత్ కుమార్, భాను ప్రకాష్రెడ్డి, ఏడు మండలాల మండల అధ్యక్షులు అపరంజిరాజు, గవ్వర్ల కృష్ణయ్య, చలపతి రాజు, సొరకాయలు, మనినాయుడు, దయాకర్రెడ్డి, భాస్కర్ నాయు డు నాయకులు చిన్నదొరై, అన్నాదొరై, శ్యామ్, మహేష్ రెడ్డి, ఏవీఎం బాలాజీ రెడ్డి, షాబుద్దీన్, రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
- జువ్వలపాళెం చెరువులో రాత్రి వేళలో అక్రమార్కులు దొంగల్లా మట్టి తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: టీటీడీలో కొత్తగా తెరపైకి వచ్చిన ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ అక్ర మాల వివాదంపై విచార ణ జరిపించాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయ న తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఏఈఈ 27, ఏఈ 10, ఏటీఓ 19, విద్యుత్ జేఈ 4 మొత్తం 60 పోస్టులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 2023 నవంబర్ 23న నోటిఫికేషన్ ఇచ్చాం. 30 వేల దరఖాస్తులు వచ్చాయి. రాయలసీమ వా సులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే ఆస్కారం ఉన్న నేపథ్యంలో అప్పట్లో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వా త అంటే గత మే 10, 11న అవే పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేశారు. లీగల్ సమస్యలు తలెత్తుతాయని తమ పాలనలో నోటిఫికేషన్ నిలిపివేస్తే, అదే నోటిఫికేషన్ ఇప్పుడు యథావిధిగా ఇచ్చారు. 2 పోస్టులకు, 3 మూడు పోస్టులకు గత ప్రభుత్వంలో ఒకే చోట పరీక్ష రాసే అవకాశం ఇచ్చాం. అయి తే ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపి, అవకాశం ఇవ్వలేదు. సెంట ర్లు మార్పు చేయడంతో 18 వేల మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్ద రు సభ్యుల సహకారంతో ఒక్కో పోస్టును రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షలకు అమ్ముకున్నారనే చ ర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరి ష్కరించకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 20 24–25లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారికి అవకా శం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించడంతో రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. సీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆరోజు నోటిఫికేషన్ రద్దు చేశాం. ఇప్పుడు టీటీడీ చెర్మన్ బీఆర్ నాయుడు, టీడీపీ వాళ్లు డబ్బులు దండుకున్నారు. గత ప్రభుత్వంలో 60 పోస్టుల భర్తీ బాధ్యతను మద్రాస్ ఐఐటీ వాళ్ల కు అప్పగించాం. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ సా గాలని ఆరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం.’ అన్నారు.
ఏర్పేడు: తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశంపై శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ప్రతినిధుల బృందం శుక్రవారం ఐఐటీని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను అధికారులు అధ్యయనం చేశారు. పర్యటనలో సీఎస్ఐఆర్ సీనియర్ సాంకేతిక అధికారి సి.చంద్రశేఖర్, సీనియర్ పరిశోధన ఫెలో పి.రాజేష్ పాల్గొన్నారు. ఐఐటీ జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ చమన్ మెహతా సమక్షంలో ఈ బృందం ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా ఇంధనాన్ని తయారు చేసే విధానంపై వారు చర్చించారు. హాస్టళ్లలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏర్పేడు డిప్యూటీ ఎంపీడీఓ రమణ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పి.ఝాన్సీ రాణి, పి.వెంకటముని, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, దీనిని కాపాడుకుంటేనే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి కపీలతీర్థం సమీపంలోని నగరవనంలో అధికారులు, విద్యార్థులు, వాకర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ పవన్ కుమార్, ఎఫ్ఆర్ఓలు సుదర్శన్ రెడ్డి, మాధవి పాల్గొన్నారు.
Adilabad
ఆదిలాబాద్టౌన్: ఇద్దరు ప్రధానోపాధ్యాయుల వివాదం ఏడాదిగా విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. త్వరలో పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా, ఈ విషయాన్ని ఎటూ తేల్చలేకపోతున్నారు. కొత్త మండలాలు ఏర్పడినప్పుడు మావలను మండలంగా ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో ఈ మండలాన్ని పర్యవేక్షించారు. రెండేళ్ల క్రితం మావలకు ప్రత్యేక ఎంఈవో పోస్టు ఇన్చార్జీతో భర్తీ చేశారు. గతంలో ఎంఎన్వోలుగా పనిచేసిన వారికే ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే మావల మండలానికి స్కూల్ కాంప్లెక్స్ లేదు. ఇదివరకు సరస్వతినగర్ పాఠశాల పరిధిలోకి ఈ పాఠశాలలు వచ్చేవి. గతేడాది సమగ్ర శిక్షా ఎస్పీడీ చించుఘాట్ స్కూల్ కాంప్లెక్స్ను మావలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం మావల పరిధిలోకి వచ్చే ఏడు స్కూళ్లను సరస్వతినగర్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. కానీ ఓ హెచ్ఎం ఆ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని రికార్డులు అప్పగించడం లేదని సమాచారం. మావల మండలంలోనే సరస్వతినగర్ పాఠశాల ఉందని, తానే సీనియర్ కావడంతో ఎంఈవోగా నియమించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ వివాదం కలెక్టర్తోపాటు ఆర్జేడీ, డీఈవో వరకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.
స్కూళ్లు మావంటే.. మావే..
సరస్వతినగర్ స్కూల్ కాంప్లెక్స్ ఆదిలాబాద్ అర్బన్ మండల పరిధిలోకి వస్తుంది. అయితే రెవెన్యూ పరంగా చూస్తే మావల మండలంలో ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాల పర్యవేక్షణ ఆదిలాబాద్అర్బన్ ఎంఈవో చూస్తున్నారు. సరస్వతినగర్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 15 పాఠశాలలు ఉండగా, మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని సరస్వతినగర్ కాంప్లెక్స్లోనే కొనసాగించాలని ఓ హెచ్ఎం అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మావల మండల పరిధిలో ఏడు పాఠశాలలు ఉండగా, ఈ పాఠశాలలు తమ పరిధిలోకే వస్తాయని మావల ప్రస్తుత ఎంఈవో పేర్కొంటున్నారు. కాగా సమగ్రశిక్షా నుంచి చించుఘాట్ స్కూల్ కాంప్లెక్స్ను మావలకు కేటాయిస్తూ గతేడాది ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో విద్యాశాఖ అధికారులు కంప్యూటర్, ప్రింటర్, నిధులను మావలకు కేటాయించాలని చించుఘాట్ హెచ్ఎంకు ఆదేశాలు జారీ చేసినా సదరు హెచ్ఎం పట్టించుకోవడం లేదని విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అదేవిధంగా సరస్వతి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఏడు పాఠశాలల రికార్డులను మావలకు అప్పగించాల్సి ఉంది. కానీ ఆ రికార్డులను మాత్రం సదరు హెచ్ఎం అప్పగించడం లేదు.
విద్యార్థులకు నష్టం..
కొత్తగా ఏర్పడ్డ మావల మండలంలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇతర మండల స్థాయి అధికారులను కేటాయించిన ప్రభుత్వం ఎంఈవోను సైతం నియమించింది. ప్రస్తుతం ఆదిలాబాద్అర్బన్ పరిధిలో ఉన్న సరస్వతినగర్ను మావలలో కలపడంతో మండల పరిధిలోని విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. మౌలిక వసతులు, ఇతర వనరులు, పాఠశాలకు కేటాయించే నిధులు నష్టపోవాల్సి వస్తుందని మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మావల మండలానికి ప్రత్యేక స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి డి.మాధవిని విరణ కోరగా, ఈ విషయాన్ని ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్స్ ధరలను ప్రాంతాల వారీగా డిమాండ్కు అనుగుణంగా సవరించారు. ప్లాట్ల ధరలు 15 శాతం నుంచి 25 శాతం పెంచగా, వ్యవసాయ భూములను 20 శాతం నుంచి 100శాతం పెంపుదల చేశారు. నూతన ధరలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ అర్బన్లో అత్యఽధికంగా భూముల ధరలు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 20శాతం పెంచగా, మండల కేంద్రాలు, డిమాండ్ ఎక్కువగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీల్లో 50శాతం నుంచి 75శాతం ధరలు పెరిగాయి. దీంతో ప్లాట్ల కొనుగోలు దారులపై స్వల్పంగా భారం పడగా, వ్యవసాయ భూముల ధరలకు మాత్రం రెక్కలు వచ్చాయి. వాటి కొనుగోలు కొంత భారంగా మారనుంది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశముంది.
ఆదిలాబాద్ పట్టణంలో ఇలా..
ఆదిలాబాద్ పట్టణంలో ప్లాట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. గంజ్రోడ్, అంబేడ్కర్చౌక్, శివాజీచౌక్, రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్డౌనల్ వంటి ప్రాంతాల్లో గతంలో స్వ్కేర్యార్డ్కు రూ.26,400 అత్యధికంగా ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.30,400కు పెంచారు. పట్టణంలో ఏరియా, అక్కడి డిమాండ్కనుగుణంగా ధరలు పెంచారు. పంజేషాకాలనీలో చదరపు అడుగుకు రూ.13,200 ఉండగా దాన్ని రూ.15వేలకు పెంచారు. అత్యల్పంగా ఖానాపూర్, ధన్గర్గల్లి, మసూద్చౌక్, స్వీపర్స్కాలనీ, బొక్కల్గూడ కాలనీల్లో గతంలో రూ.2400 ఉండగా ప్రస్తుతం రూ.2800కు చేరింది. అశోక్రోడ్, కోలిపూర, బ్రహ్మణ్వాడల్లో రూ.5800 నుంచి రూ.6700కు పెంచారు. ప్రస్తుతం ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా జరగడంతో పాటు భారీ ధర పలుకుతున్న దస్నాపూర్, రాంనగర్, మణిపూర్ వంటి ప్రాంతాల్లో మార్కెట్ వ్యాల్యూను మురికివాడలైన గాంధీనగర్, రణదీవేనగర్ కాలనీలకంటే తక్కువగా నిర్ణయించడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లో స్క్వేర్యార్డ్కు రూ.600లు ఉన్న ధర రూ. 700లు కాగా, రూ.900లు ఉన్న ధర రూ.1100లకు పెంచారు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చార్జీలు భారంగా మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భారీగా పెరిగిన వ్యవసాయ భూముల ధరలు..
ఓపెన్ ప్లాట్ల కంటే వ్యవసాయ భూముల ధరలు జిల్లాలో భారీగా పెరిగాయి. 20శాతం నుంచి 100శాతం పెంచడంతో మార్కెట్ వ్యాల్యూ అధికమైంది. ఆదిలాబాద్ పట్టణంలోని సర్వే నంబర్ 400లో మొన్నటి వరకు రూ.11కోట్ల విలువ కలిగిన ఎకరం వ్యవసాయ భూమి రూ.13 కోట్లకు చేరింది. అదనంగా రూ.2 కోట్లు పెరిగాయి. ఖానాపూర్, భూక్తాపూర్ శివారులోని పలు సర్వే నంబర్లలో గల వ్యవసాయ భూములు ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగాయి. రియల్ ఎస్టేట్లో దూసుకుపోతున్న మావల మండల కేంద్రంలోని పలు వ్యవసాయ భూముల విలువను రూ.1.95 కోట్లకు పెంచారు. నేరడిగొండ మండలం నేరడిగొండ –జి గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం వ్యవసాయ భూమి ధర రూ.2.50లక్షలు ఉండగా రూ.6లక్షలకు పెరిగింది. సిరికొండ మండలం పొన్న గ్రామంలో రూ.3,37,500 ఉండగా రూ.8లక్షలకు చేరింది. సుంకిడి గ్రామంలో రూ.3,37,500లు ఉండగా రూ.15లక్షలకు పెరిగింది. మిగతా మండలాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో భూముల డిమాండ్, రోడ్డు సౌకర్యం, నివాసాలు వంటి వాటి ఆధారంగా 20 నుంచి 100శాతం పెంచినట్లుగా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్: ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన జిల్లాలో కళాకారులకు కొదవ లేదు. గుస్సాడీ మొదలుకొని బంజారా, జానపదం, వెస్ట్రన్, సంప్రదాయ నృత్యరీతుల్లోనూ ఎంతోమంది ప్రతిభ చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన కళాకారులెందరో ఉన్నా రు. అయితే తమ కళను ప్రదర్శించడానికి జిల్లాలో ఎటువంటి వేదిక లేకపోవడం కళాకారులకు శాపంగా మారింది. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆడిటోరియం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది సైతం అటకెక్కినట్లే కనిపిస్తోంది.
కళాభివృద్ధికి వేదికగా..
ఆడిటోరియం నిర్మాణం జరిగితే ఎంతోమంది కళాకారులు తమ కళను ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. తక్కువ ఖర్చుతో కళా ప్రదర్శనలు ఇవ్వొచ్చు. ఆడిటోరియం అందుబాటులో ఉండి ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేస్తే కళాకారులు ఆదాయం కూడా పొందవచ్చు. అదే సమయంలో జిల్లా ప్రజలకు ఈ కళా ప్రదర్శనలు చూసే అవకాశం కలుగుతుంది. ఆడిటోరియం వేదికపై ప్రదర్శన ఇవ్వడం వల్ల కళాకారులకు సమాజంలో మంచి గుర్తింపు రావడమే కాకుండా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటే అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ గదులు ఏర్పాటు ద్వారా కళాకారులు ప్రదర్శనలను మ రింతగా మెరుగుపరుచుకోవచ్చు. ఆడిటోరియంలో అధికారిక కార్యక్రమాలు సైతం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక నృత్యరీతులైన గుస్సాడీ, బంజారా నృత్యాల ప్రదర్శనతో వాటిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చు.
యువజనోత్సవాలకు మంగళం..
యువత ప్రతిభను వెలికి తీసేందుకు ఏటా యువజనోత్సవాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సరైన వేదిక లేకపోవడంతో వాటి నిర్వహణలో సైతం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఎంతోమంది ప్రతిభగల యువ కళాకారులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
గతంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ప్రాంగణంలో ఆడిటోరియం నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమకే ఆ స్థలం కావాలని కళాశాల యాజమాన్యం నిరాకరించడంతో స్థలం కరువైంది. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఆడిటోరియం నిర్మాణమయ్యేలా కృషి చేయాలని కళాకారులు
కోరుతున్నారు.
డిగ్రీ కళాశాలలో..
కళలకు నెలవైనా..
జిల్లాలో గిరిజనుల ప్రాభల్యం అధికంగా ఉంటుంది. వారి సంస్కృతి, సంప్రదాయాలు ఎంత భిన్నంగా ఉంటాయో వారి కళలు కూడా వైవిధ్యంతో నిండి ఉంటాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు గుస్సాడీ ఖ్యాతిని ఢిల్లీ వరకు చేర్చారు. మరోవైపు బంజారాల నృత్యాలు వాటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎన్నో భిన్నమైన నృత్యరీతులకు జిల్లా నెలవైనప్పటికీ వాటిని ప్రదర్శించేందుకు వేదికలు కరువయ్యాయి.
కై లాస్నగర్: పర్యావరణ పరిరక్షణ సామాజిక బా ధ్యతగా భావించి మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జి ల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడవులు, జల వనరుల సంరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్ర తీ దుకాణదారుడు తమ షాపుల ఎదుట మొక్కలు నాటాలని సూచించారు. పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కాగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకా రులు, విద్యార్థులు నిర్వహించిన నృత్యప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు, ఎఫ్డీవో అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్రూరల్: మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్రూరల్ మండలం యాపల్గూడ బీట్లో హైడెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరోష, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఎఫ్డీవో అరవింద్ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కై లాస్నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీరాజ్ భవనాలు, తాగునీటి సరఫరా, గ్రామీణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జెడ్పీ సీఈవో రవి, డీఆర్డీవో రవీందర్, డీపీవో రమేశ్, హౌసింగ్ పీడీ శంకర్, ఏడీ గ్రౌండ్ వాటర్ సతీశ్ యాదవ్ పాల్గొన్నారు.
నార్నూర్: మండలంలో ఏంపల్లి గ్రామ పంచాయతీ పరిధి గోండుగూడలో శుక్రవారం ఆదివాసీలు సంప్రదాయ బద్ధంగా విజంగ్ మొహతుక్ పూజా కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పూ జల అనంతరం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి, త్వరలో విత్తనాలు విత్తనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామస్తులు పెందోర్ అమృత్రావు పటేల్, కోట్నాక్ శ్రీరామ్, పెందోర్ జ్యో తిరాం, పూసం జాంబిరావు, మాడవి జల్పత్, కోట్నాక్ భీంరావు, పూసం లచ్చు, యందొ రావు, కలాబాయి, లచ్చుబాయి, ద్రౌపదిబాయి, పుల్లమ్మ, పారుబాయి పాల్గొన్నారు.
Jagtial
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం ధర్మపురిలో కలెక్టర్ సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి భూ నిర్వాహితులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామన్నారు. 2017–18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాహితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు సీఎం రేవంత్రెడ్డి మొదటి విడతగా రూ.117 కోట్లు కేటాయించడం జరిగిందని, వాటితో నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పుష్కరాలకు ముందే పనులు ప్రారభించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, దేవాదాయశాఖ అధికారులు తదితరులున్నారు.
జగిత్యాలజోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక పోకడల కారణంగా మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులతో గాలి, నీరు వంటి పంచ భూతాలు కలుషితం అవుతున్నాయన్నారు. ప్రకృతిని విచక్షణ రహితంగా కొల్లగొట్టడంతో పాటు అధికంగా ప్లాస్టిక్ వాడడం భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూరి సి.రత్న పద్మావతి మాట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత రవీందర్రెడ్డి, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండో అ దనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ నిఖిషా, డీఎఫ్వో రవిప్రసాద్, ఎఫ్ఆర్వో పద్మారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.
రండి.. మాట్లాడుకోండి!
కోరుట్ల: కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ కొరివితో తలగోక్కున్నట్లే ఉంది. ఇంటి నిర్మాణం అనుమతి నుంచి మొదలుకుని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి నంబరు వరకు అడుగడుగునా అవస్థలు తప్పడం లేదు. ఇల్లు అనుమతికి ఫైళ్ల లెక్కన ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది.. ఇంటి నంబరు వేయాల్సిన సమయంలో కొలతలు తీసుకుని జాప్యం చేస్తున్నారు. ‘సార్ మా ఇంటి కొలతలు తీసుకున్నారు.. మరి ఆస్తి పన్ను ఎంత కట్టాలో చెబితే కట్టి ఇంటి నంబరు తీసుకుంటా మని అంటే.. అది కుదరదు.. మీరు వచ్చి సార్తో మాట్లాడుకోండి’.. అన్న సమాధానాలు రావ డం మున్సిపల్ ఉద్యోగులు ఆమ్యామ్యాల కో సం దిగజారుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇంటి తీరును బట్టి రేటు
ఇంటి అనుమతుల సమయంలో టౌన్ప్లానింగ్ అధికారులు ఫైళ్ల లెక్కన కొంత, సెట్బ్యాక్ పేరిట మరికొంత, అనుమతికి విరుద్ధంగా డిజైన్ ఉందని ఇంకొంత అంతస్తులు లెక్కకట్టి డబ్బులు వసూలు చేయడం ఆనవాయితీగా మారినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇదే తీరును మున్సిపల్ రెవెన్యూ సెక్షన్ ఉద్యోగులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటి విస్తీర్ణం కొలతలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే ఇంటికి నంబరు ఇవ్వాల్సిన ఉద్యోగులు సకాలంలో ఆ పని చేయడం లేదు. దీంతో ఇంటి నిర్మాణదారు తనకు ఇంటి నంబరు రావడం లేదని అధికారులను సంప్రదిస్తే ‘మీరు.. సార్తో మాట్లాడుకుంటే వెంటనే ఇంటి నంబరు వస్తుంది.’ అని చెబుతుండడం విడ్డూరం. ఇల్లును బట్టి కనీసం రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ఇంటి నంబరు వేయడం కోసం సిబ్బందికి చెల్లించాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి నానా అవస్థలు పడాల్సిన వస్తోంది.
పర్యవేక్షణ కరువు
కోరుట్ల మున్సిపాల్టీలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడం, ఇన్చార్జి అధికారి పాలన సాగుతుండటంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. మున్సిపాల్టీలో సుమారు 20 వేల ఇళ్లు ఇదివరకే ఉండగా రోజూ 10 ఇళ్ల వరకు కొత్తగా నిర్మాణం పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రోజూ సదరు ఇళ్ల నిర్మాణదారుల నుంచి ఇంటి నంబరు కోసం రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఉద్యోగులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు మున్సిపల్ ఉద్యోగుల ఆమ్యామ్యాల తంతును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఫిర్యాదులు వస్తే చర్యలు
ఇంటి నిర్మాణం కొలతలు తీసుకుని ఇంటి నంబర్లు ఉద్యోగులు వేస్తారు. కొత్త ఇంటి నంబర్లు వేయడానికి ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్,
మున్సిపల్ మేనేజర్, కోరుట్ల
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అర్హులందరికీ పథకాలు అందాలి
జగిత్యాలరూరల్: జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా మండల మహిళా సమాఖ్యలు కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 141 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 13.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోళ్లను విజయవంతం చేసిన ఏపీఎం, సీసీలు, కమిటీ సభ్యులు, వీవోఏలను అభినందించారు. జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి సునీత మాట్లాడుతూ, బ్యాంక్ లింకేజీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.793.74 కోట్ల టార్గెట్ నిర్దేశించడం జరిగిందని, టార్గెట్ ప్రకారం ప్రగతి సాధించేలా మండల సమాఖ్య సిబ్బంది కృషి చేయాలన్నారు. డీపీఎంలు నారాయణ, నాగేశ్వర్రావు, సీ్త్రనిధి ఆర్ఎం నారాయణ, జిల్లా ఎస్బీఎం కోఆర్డినేటర్ హరిణి, ఏపీఎంలు గంగాధర్, త్రివేణి, హుస్సేన్, చక్రవర్తి, సమాఖ్య అధ్యక్షురాలు సరోజ, కార్యదర్శి ఆమని పాల్గొన్నారు.
ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత
జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందక రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఏ రైతును పలుకరించినా 5–10 కిలోలు ధాన్యం తూకంలో నష్టపోయామని వాపోతున్నారని పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు, ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా అమలు చేస్తారని ప్రజలు ఎంతో ఆశించినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్ ఎవరికీ రాలేదన్నారు. నాయకులు చంద్ర కృష్ణారెడ్డి, బూసి మల్లేశం పాల్గొన్నారు.
యూపీఎస్ పునఃప్రారంభం
గొల్లపల్లి: రెండేళ్లుగా మూతపడిన గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల గ్రామస్తులు, ఉపాధ్యాయుల కృషితో పునఃప్రారంభమైంది. పాఠశాల పునఃప్రారంభంపై శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల్లో అవగాహన పెరగడంతో, శుక్రవారం ఒక్కరోజే 30 మంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందడం విశేషం. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని, అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు గోస్కుల శ్రీనివాస్ను ఎంఈవో రాజన్న అభినందించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్వశక్తి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్న సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొరత పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు
ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు
మొత్తం క్యాడర్ పోస్టులు : 320
ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 185
ఖాళీగా ఉన్న పోస్టులు : 135
ఖాళీల్లో ఉన్న అర్చక పోస్టుల సంఖ్య: 35
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు సుమారుగా : 60
జూనియర్ అసిస్టెంట్ ,
రికార్డ్ అసిస్టెంట్ల పోస్టులు: 10
డ్రైవర్ పోస్టులు : 3
మొత్తం ఔట్ సోర్సింగ్ పోస్టులు: 290
ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య: 250
ఔట్ సోర్సింగ్లో ఖాళీ పోస్టులు: 40
- 39.0/27.0
7
గరిష్టం/కనిష్టం
పర్యావరణాన్ని కాపాడాలి
జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని గన్పార్క్లో కలెక్టర్ సత్యప్రసాద్ మొక్కలు నాటా రు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.
అంజన్న సేవలో ఎమ్మెల్యే
మల్యాల: పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
జగిత్యాల: జిల్లా కేంద్రం జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. కానీ, పట్టణవాసులు సేద తీరేందుకు సరైన స్థలాలు లేవు. పట్టణంలో 1,30,863 జనాభాకు అమరవీరుల స్తూపం వద్ద ఎకరం స్థలంలో ఒకటే పార్క్ ఏర్పాటు చేశారు. కానీ, అందులో సరైన సౌకర్యాలు లేవు. పట్టణ నడిబొడ్డున గల పార్క్లో వసతులు లేక పార్క్ కళావిహీనంగా మారింది. ఎప్పుడో ఏర్పాటు చేసిన పరికరాలు, ఫౌంటేన్లు దెబ్బతినగా, సంబంధిత అధికారులు వాటికి నామమాత్రంగా
పైన పూతలు పూసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యానవనంలో ఆధుని క వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ౖపైపెనే పూతలు
పార్కులో పిల్లలు ఆడుకునేందుకు గతంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అవి శిథిలావస్థకు చేరడంతో బల్దియా రూ.10 లక్షల నిధులు పార్క్ కోసం కేటాయించగా, ౖపైపె మరమ్మతులు చేపట్టి మమ అనిపించారు. పార్క్లో మ్యూజికల్ ఫౌంటేన్, మరో సాధారణ ఫౌంటేన్, ఆట పరికరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరైనా, కొత్తవి మాత్రం ఏర్పాటు చేయలేదు. పిల్లలు ఆడుకునే పరికరాలకు రంగులు పూసి వదిలేశారు.
పట్టణవాసులకు ఆహ్లాదం కరువు
జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనుల నిమిత్తం రోజూ చాలా మంది వస్తూ పోతుంటారు. కాగా, ప్రజలు సేద తీరేందుకు పట్టణంలో స్థలం కరువైంది. పట్టణవాసులకు సైతం ఆహ్లాదం అందడం లేదు. ఉన్న ఒకే ఒక పార్క్లో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉన్న పార్కులో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్త పార్క్ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పార్కులో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. ఫౌంటేన్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రజలకు ఆహ్లాదం అందించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇటీవల బడ్జెట్లో రూ.5 లక్షలు కేటాయించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తాం.– ఆనంద్కుమార్,
డీఈ, జగిత్యాల
వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పాశిగామ, స్తంభంపెల్లిలో కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణాలో నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు ఉన్నందున కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీసీవో మనోజ్కుమార్, డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్ప్రసాధ్, ఎంపీవో కృపాకర్ పాల్గొన్నారు.
జగిత్యాలక్రైం: ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యం, వాతా వరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి స మస్యలకు చెట్ల పెంపకం ప్రధాన పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నా టి సంరక్షించాలని కోరారు. ఏఎస్పీ చేతన్ నితిన్, ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు పురుషో త్తంరెడ్డి, రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలి
నేరాలను త్వరగా ఛేదించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, బాధితులకు న్యాయం అందించేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భూవివాదాలు, పాత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని సూచించారు.
జీవో 38 అమలు చేయాలి
జగిత్యాల: వైద్యుల బదిలీల్లో జీవో 38 అమలు చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మాతా శిశు సంక్షేమ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందన్నారు. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో, సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా స్పౌజ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి నవీన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
Mancherial
మంచిర్యాలక్రైం: స్థానిక ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుని మనగడకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతీ ఇంట్లో రెండు మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కే.నిరోషా, క్రిష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, ఎండీ.సందాని, రాములు, రామ్రెడ్డి, మల్లారెడ్డి, తిరుపతి, కోర్టు ఏఓ సూర్యకాంత్, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు.
లక్సెట్టిపేట: ఫెర్టిలైజర్ దుకాణాదారులు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేసిన రైతులకు రశీదు ఇవ్వాలని, స్టాక్ బోర్డు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఏడీఏ కృష్ణ, తహసీల్దార్ దిలీప్కుమార్, ఏవో శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దోపిడీని అరికట్టాలి
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు తుంగలో తొక్కి పుస్తకాల విక్రయాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నారు. పాఠశాల లోపల, బయట వర్క్బుక్స్, టై, బెల్ట్ షూ, పాఠ్యపుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని పోరాటాలు సాగిస్తుండగా ప్రైవేట్లో పుస్తకాల దోపిడీ ఎక్కువైంది. అధికారులు తనిఖీలు చేపట్టి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– శ్రీకాంత్, పీడీఎస్యూ
జిల్లా ప్రధాన కార్యదర్శి
నియంత్రణ చర్యలేవి..
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అక్కరలేని పుస్తకాలు, అధిక ఫీజులకు పాల్పడుతున్నా నియంత్రణ చర్యలు లేకుండా పోయాయి. పుస్తకాల పేరిట రెట్టింపు దోపిడీ చేస్తున్నారు. పుస్తకాల బరువుతో బాల్యంపై మోయలేని భారం పడుతోంది. ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. లాభార్జనే ధేయంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి.
– అజయ్, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్
మంచిర్యాలఅర్బన్: ప్రైవేటు పాఠశాలల్లో ఇటు పుస్తకాలు.. అటు ధరల మోత ఏటేటా పెరిగిపోతోంది. టెక్ట్స్బుక్స్ కంటే వర్క్బుక్స్ పేరిట అధిక ధరల వసూలుతో తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారుతోంది. ప్రభుత్వం పాఠ్యపుస్తకాల ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తుండగా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో స్పెషల్ మెటీరియల్ పేర్లతో కొత్త దారులు వెతుకుతూ ఆర్థికభారం మోపడం ఆందోళన కలిగిస్తోంది. టెక్నో, సీబీఎస్ఈ, ఐబీఎస్ఈ, ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరిట స్కూళ్ల ఫీజు భారం పెరిగిపోతోంది. పాఠశాల, ల్యాబ్, లైబ్రరీ ఇతర ఫీజులన్నీ కలిపి ట్యూషన్ ఫీజు, యూనిఫామ్, బస్సులు ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. పుస్తకాల బరువు పెరిగి విద్యార్థుల భుజాలు లాగేయడం, హోంవర్క్ ఒత్తిడి పెరిగిపోతోంది.
జిల్లాలో..
జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 234, సీబీఎస్ఈ పాఠశాలలు మూడు ఉండగా.. ఒక్క మంచిర్యాలలోనే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 53 ఉన్నాయి. వీటిల్లో 70,273 మంది చదువుతున్నారు. ఆయా పాఠశాలల చివరన ఏదో ఒక టెక్నో, సీబీఎస్ఈ, ఐఐటీ, నీట్ సిలబస్ అంటూ తగిలించి పుస్తకాలు అంటగడుతున్నారు. ఇంటి, పాఠశాల పని, రాత పుస్తకాలు, డ్రాయింగ్, జనరల్ నాలెడ్జి, ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్టడీ మెటీరియల్ కొనాలని పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి.
మోయలేని బరువు
1, 2వ తరగతి విద్యార్థులు 2కిలోలు, 3నుంచి 5వ తరగతులకు 2నుంచి 3కిలోలు, 6నుంచి 7వ తరగతులు 4కిలోల వరకు, 8నుంచి 9వ తరగతులు 4నుంచి ఐదు కిలోలు, 10వ తరగతి ఐదు కిలోల వరకు పుస్తకాల బరువు మోయాల్సి వస్తోంది. సాధారణ విద్యార్థి శరీర బరువు కంటే 10శాతం ఎక్కువ కాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అంతకుమించితే చిన్నారుల్లో వెన్ను, భుజాల నొప్పి, శరీర ఆకృతి సమస్యలు రావొచ్చని చెబుతున్నారు. ప్రైవేట్లో వర్క్బుక్స్ ఒక్కొక్కటి దాదాపు కిలో వరకు ఉంటుందని తెలుస్తోంది. పదో తరగతికి ఇలాంటి పుస్తకాలు 7వరకు ఉన్నాయి.
పుస్తకాల దుకాణాలు
ప్రైవేటు పాఠశాలల ఎదుటే షట్టర్లు తీసుకుని ప్రత్యేక దుకాణాల్లో టెక్ట్స్, వర్క్బుక్స్, ఇతర వస్తువులు విక్రయిస్తున్నారు. అన్నీ అక్కడే కొనాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకాల విక్రయానికి డీఈవో అనుమతి అవసరం. కానీ 12బుక్స్షాపులు మాత్రమే అనుమతి తీసుకోగా.. చాలాచోట్ల పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిగా విక్రయిస్తున్నారు. ట్రేడ్లైసెన్స్, జీఎస్టీ ఎగవేస్తున్నారు.
ఫీజుల నియంత్రణపై సాగదీత..
ప్రైవేటు విద్యాసంస్థల్లో ట్యూషన్ఫీజుల నియంత్రణ సాగదీతగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచార్య తిరుపతిరావు చైర్మన్గా కమిటీని నియమించింది. నివేదిక బహిర్గతం కాకపోయినా ఆ తర్వాత పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకు రావాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 10శాతం వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లినా ఎటూ తేల్చలేదు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ విద్యాకమిషన్ కమిషనర్ ఆకునూరి మురళి చట్టబద్ధ ఫీజులపై ప్రభుత్వానికి నివేదించడంతో అంతటా చర్చ జరుగుతోంది. ఫీజులుంకు ఎప్పుడు కళ్లెం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రభత్వ
పాఠ్యపుస్తకాల
ధర(రూ.లలో)
ప్రైవేటు
వర్క్బుక్స్
ధర(రూ.లలో)
తగ్గిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు 17శాతం మేర తగ్గాయి. పబ్లిషర్ల పోటీతోనే గతేడాది కంటే తక్కువ ధరకే పుస్తకాల ముద్రణకు ముందుకొచ్చారు. గత ఏడాది పదో తరగతి పాఠ్య పుస్తకాల ధర రూ.1078 ఉండగా ఈసారి రూ.900కు తగ్గింది. విద్యార్థులపై పాత ధరల కంటే దాదాపు 40శాతం తక్కువ భారం పడుతోంది. ప్రైవేటులో వర్క్బుక్స్ల పేరిట మూడు రేట్ల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అధిక బరువు ఉన్న పుస్తకాల బ్యాగులు మోయడం వల్ల విద్యార్థుల్లో వెన్ను, భుజంనొప్పి, మెడ నరాలపై ప్రభావం చూపే వీలుంది. ఈ నేపథ్యంలో నాలుగో శనివారం విద్యార్థులు సంచి లేకుండా పాఠశాలకు రావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిలో 10 రోజులు ఇలా హాజరు కావాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నాయి. వర్షాలు పడే అవకాశం ఉండడంతో గత వారం రోజులుగా అధికారులు ధాన్యం సేకరణ వేగంగా చేయిస్తున్నారు. జన్నారం, దండేపల్లి మండలాల్లో పూర్తి కాగా, లక్షెట్టిపేట మండలంలో ఒక కేంద్రంలో పూర్తి కావాల్సి ఉంది. ఇంకా చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. ఈ రెండు రోజుల్లో వానలు పడితే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి లారీలను వడ్లు ఉన్న చోట్లకు తరలిస్తున్నారు. కేంద్రాల్లోనే కాంటా వేసి బస్తాల్లో ధాన్యంతో నింపి ఉండగా, రవాణా చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 1,69,544మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా సుమారు మూడు వందల లారీల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా ఉంది. ఈ నెల 7వరకు సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక వేళ రవాణాలో జాప్యం జరిగితే మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ధాన్యం లేని చోట్ల కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తున్నారు. మొత్తం 334 కేంద్రాలకు గాను 216 కేంద్రాలు మూసి వేశారు.
వానలతో హైరానా
గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులతో కేంద్రాల్లో కాంటా వేసి ఉన్న బస్తాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరికోతలు ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల సేకరణ జరుగుతోంది. పగలు ఎండ, రాత్రివేళ మబ్బులు కమ్ముకోవడంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడాల్సి వస్తోంది. గత నెలలో వడ్లు తడిసిపోకుండా కాపాడుకునేందుకు వెళ్లి ముగ్గురు రైతులు ఈదురుగాలులకు గోడ కూలి చనిపోవడం తెలిసిందే. మరోవైపు నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉండడంతో అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ సీజన్ ఆరంభం నుంచే కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో సరిపడా మిల్లులకు ట్యాగింగ్ లేక ధాన్యం రవాణా జరగలేదు. తర్వాత రాష్ట్ర గిడ్డంగుల గోదాంలు, ప్రైవేటు గోదాంలు, రైస్మిల్లుల ఆవరణలోనూ నిల్వ చేసుకునేలా ఆదేశాలు రావడంతో ఆ మేరకు వడ్లను తరలించి భద్రపరుస్తున్నారు. ఇవేకాక పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు సైతం ధాన్యాన్ని తరలించేందుకు అనుమతులు రావడంతో నిల్వలకు ఇబ్బంది లేకుండా పోయింది.
రైతులు ఆందోళన చెందవద్దు
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా ధాన్యం ఉన్న చోట్ల ఎక్కువ లారీలు తీసుకొచ్చి వేగంగా రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశాం. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకవేళ అధిక వర్షంతో ధాన్యం తడిసినా బాయిల్డ్ మిల్లులకు తరలిస్తాం.
– వి.రాములు, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)
పాతమంచిర్యాల: జిల్లాలో మూడో విడత వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహణకు జిల్లా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోని 306 గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాల ఎంపిక, గుంతలు తీసే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపుల, పొలం గట్లు, చెరువు గట్లు, బంజరు భూములు, వైకుంఠధామాలు, ఇళ్ల ఆవరణలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. పూలమొక్కలు గులాబీ, మల్లెలు గుల్మోహర్, మందార, తులసితోపాటు పండ్లజాతులు జామ, అల్లనేరేడు, దాని మ్మ, మునగ, చింత, ఖర్జూరా, వృక్షజాతులు టేకు, వేప, కానుగ, అల్లనేరేడు, ఈత, తాటి మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం స్థలాలు ఎంపిక చేయాలని ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శులను అధికారులు ఆదేశించారు. స్థలాలు ఎంపికై న తర్వాత ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తీయిస్తారు. జూన్ రెండో వారంలో మొక్కలు నాటుతారు. ప్రభుత్వ శాఖలు, మండలాలు, పంచాయతీల వారీగా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించారు.
శాఖల వారీగా..
అటవీ శాఖ 5.45 లక్షలు, డీఆర్డీఏ 20.5లక్షలు, మున్సిపాల్టీలు 8.4 లక్షలు, సింగరేణి 5.7లక్షలు, పరిశ్రమల శాఖ 95 వేలు, అగ్రికల్చర్ 11000, పోలీస్ శాఖ 10 వేలు మొత్తం 41.11లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మండలాల వారీగా..
బెల్లంపల్లి మండలంలో 1,13,900, భీమారంలో 73,700, భీమినిలో 80,400, చెన్నూర్లో 2,01,000, దండేపల్లిలో 2,07,700, హాజీపూర్లో 80,400, జైపూర్లో 1,34,000, జన్నారంలో 1,94,300, కన్నెపల్లిలో 1,00,500, కాసిపేటలో 1,47,400, కోటపల్లిలో 2,07,700, లక్షెట్టిపేటలో 1,20,600, మందమర్రిలో 67,000, నెన్నెలలో 1,27,300, తాండూర్లో 1,00,500, వేమనపల్లిలో 94,500 మొత్తంగా 20,50,200 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా వన మహోత్సవంలో ఈత, తాటివనాల పెంపునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
మంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని 18 మండలాల్లో భూముల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో అత్యల్పంగా చదరపు గజానికి రూ.500 ఉన్న తాండూరు, భీమిని, కన్నెపల్లి మండలాల్లో ధరను రూ.700కు పెంచారు. మిగతా మండలాల్లోని గ్రామాల్లో రూ.700కు గజం ఉండగా, రూ.900కు పెరిగింది. అత్యధికంగా జిల్లా కేంద్రం మంచిర్యాల మార్కెట్ రోడ్డులో రూ.15,900 ఉండగా.. చదరపు గజం ధర రూ.23,900కు పెంచారు. అపార్టుమెంట్లలో చదరపు అడుగు ధర గతంలో రూ.1,600 ఉండగా, ప్రస్తుతం దానిని రూ.1,800కు చేరింది. అపార్టుమెంట్లలో కమర్షియల్ భవనానికి, హైటెక్సిటీ కాలనీల్లోని అపార్టుమెంట్లకు చదరపు అడుగు స్థలం రూ.2,500 నుంచి రూ.2,700కు పెంచారు.
గ్రామాల్లో తక్కువ.. నగరంలో ఎక్కువ
భూముల ధరలు గ్రామాల్లో తక్కువగా, పట్టణాల్లో ఎక్కువగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ధరలు చదరపు గజానికి రూ.200 అదనంగా పెరగ్గా, పట్టణ ప్రాంతాలతోపాటు విలీన గ్రామాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలను విలీనం చేసి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయగా, ఇందులో హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను విలీనం చేశారు. దీంతో ఆయా విలీన గ్రామాల్లోని భూముల ధరలు భారీగా పెరిగాయి. నస్పూరులో గతంలో గజానికి రూ.1,300 ఉండగా, రూ.2 వేలకు, నగరంలోని రాజీవ్నగర్, దొరగారిపల్లె, తిలక్నగర్ ప్రాంతాల్లో గతంలో గజానికి రూ.2,400 ఉండగా ప్రస్తుతం రూ.3,600కు పెంచారు. విలీన గ్రామాలు వేంపల్లి, ముల్కల్ల, నర్సింగాపూర్, గుడిపేట్లలో గజానికి రూ.700 ఉండగా, ప్రస్తుతం రూ.1,500కు పెరిగింది. బెల్లంపల్లి, క్యాతన్పల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట పట్టణ ప్రాంతాల్లోనూ గజానికి రూ.600 వరకు అదనంగా పెంచారు.
మంచిర్యాలక్రైం: యువత గంజాయి మత్తుకు అలవాటు పడి అందమైన జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడుదామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయికి బానిసైన వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. యువతలో వింత ప్రవర్తన కనిపిస్తే డయల్ 100, స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం అందించాలని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీలు ప్రకాష్, కిరణ్కుమార్, వెంకటేశ్వర్లు, సీఐ ప్రమెద్రావు, డీ అడిక్షన్ సెంటర్ వైద్యులు రామునాయక్ పాల్గొన్నారు.
నేరస్తులకు స్ట్రాంగ్ పోలీసింగే..
మంచిర్యాలక్రైం: నేరస్తుల పట్ల నో ఫ్రెండ్లీ పోలీస్.. ఇకపై అంత స్ట్రాంగ్ పోలీసింగే అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. కార్యాలయం ఆవరణ, పరిసర ప్రాంతాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్యను జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన ప్రత్యేక చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్: జాతీయ రహదారులకే లేని విధంగా మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్ నుంచి రాళ్లవాగు మీదుగా రంగంపేట్ వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణం ఎందుకని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రశ్నించారు. శుక్రవారం రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానంగా మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని గోదావరి నదిపై నిర్మించేందుకు తాను అనుమతి తీసుకొస్తే స్వార్థం కోసం రద్దు చేయించిన ఘనత మంచిర్యాల ఎమ్మెల్యేదని విమర్శించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం రూ.160 కోట్లతో పనులు ప్రారంభించగా, రూ.35 కోట్లతో ఐబీ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు మంజూరు చేయించి నిధులు విడుదల చేయిస్తే ఆ రెండింటిని రద్దు చేయించి రాళ్లవాగు కాజ్వే ఉన్న చోట ఆరు వరుసల బ్రిడ్జిని నిర్మించాలని చూస్తున్నారని అన్నారు. గతంలోనే రూ.13.50 కోట్లతో రాళ్లవాగుపై బ్రిడ్జి తాను మంజూరు చేయించి, శంకుస్థాపన చేశానని అన్నారు. ఆర్మూర్, మంచిర్యాల జాతీయ రహదారి నాలుగు వరుసల రోడ్డు కాగా, మంచిర్యాల నగరంలో ఆరు వరుసల రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. రంగంపేట్ వైపున 24 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కొన్నారని, విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవాలని చూస్తున్నారని, అందుకోసమే రోడ్డు నిర్మించుకునేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
మంచిర్యాలఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారిగా లలిత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డీఈవో యాదయ్య బదిలీపై హైదరాబాద్కు వెళ్లడంతో ఆమెకు అదనపు బాధ్యత(ఎఫ్ఏసీ)లు అప్పగించారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉపాధ్యాయల సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని డీఈవో లలిత సూచించారు. శుక్రవారం 20206–27 విద్య సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల్లో గుడిరేవుకు చెందిన విద్యార్థిని బొమ్మన ఆద్విక చక్కని ప్రతిభ కనబరిచి ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు ఎంపికై ంది. విద్యార్థినిని డీఈవో అభినందించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు భరత్, విజయలక్ష్మీ, సత్తయ్య, కృష్ణమూర్తి, రాజ్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చన్న పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డుల ఎంపికలో రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. హెల్త్ కేర్సేవల నాణ్యత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆసుపత్రి పరిసరాల అభివృద్ధిలో చూపిన విశిష్ట పనితీరుకు ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు ఆసుపత్రి డీవైసీఎంఓ డాక్టర్ మధుకుమార్ శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తున్న ఆసుపత్రి సిబ్బందిని మధుకుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
మంచిర్యాలక్రైం: మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు మహిళల ముఠా వసూళ్లకు పాల్పడుతోంది. ఎక్కువ రు ణం కావాలన్నా.. ఇంకా ఎవరికై నా ఇప్పించాలన్నా అధికారులతో అర్ధరాత్రి వేళ వీడియో కాల్స్ మాట్లాడాలంటూ ఒత్తిడి తెస్తోంది. ఐడీ కార్డులు చూపించి నమ్మబలుకడంతో కొందరు మహిళలు మోసపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాలలో మహిళలు నిలదీయగా గొడవ జరిగింది. ఈ విషయమై బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
రుణాల పేరిట వసూళ్లు
జిల్లా కేంద్రం మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. తమకు పరిచయం ఉన్న మహిళలకు నటరాజ్ అనే ఓ సంస్థ పేరుతో ఐడీ కార్డులు చూపిస్తూ రుణాలు ఇప్పిస్తామని మాయమాటలు చెబుతున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి డబ్బులు సైతం వచ్చాయంటూ నోట్ల కట్టల ఫొటోలు చూపిస్తూ మోసాలకు తెరతీశారు. వారి మాటలు నమ్మిన జిల్లా కేంద్రంలోని 40 మందికి పైగా మహిళల నుంచి రూ.10 వేలు, మరికొందరు వద్ద 50 వేల చొప్పున వసూలు చేశారు. ముందు కంపెనీ పేరిట ఐడీ కార్డు ఇచ్చేందుకు రూ.3వేలు వసూలు చేశారు. జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట తదితర ప్రాంతాల్లో 200 మంది వద్ద వసూళ్లు చేసినట్లు సమాచారం. సదరు మాయలేడీలు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. గత మూడు నెలలుగా రుణాలు ఇప్పించకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎక్బాల్ హైమద్నగర్లో బాధిత మహిళలు తిరగబడ్డారు. మాయలేడీలు, మహిళల మధ్య గొడవ జరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అర్ధరాత్రి వీడియో కాల్స్
బాధితులకు రుణం ఎక్కువ కావాలన్నా, ఇంకెవరికై నా ఇప్పించాలన్న మాయలేడీలు బ్యాంకు అధికారులుగా చెబుతున్న వారితో సన్నిహితంగా ఉండాలని, త్వరగా రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పారు. రుణం కావాలంటే వీడియో కాల్స్ మాట్లాడాలని వేధింపులకు గురి చేశారు. రుణం కావాలంటే చెప్పినట్టు చేయాలని లేదంటే కట్టిన డబ్బులు అటే పోతాయని బెదిరించినట్లు తెలిసింది. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి ఫోన్ వీడియో కాల్స్ మాట్లాడే ఆ బ్యాంకు అధికారులు ఎవరనేది పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
జన్నారం: జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా తొలగించారని ఆరోపిస్తూ కట్టెకోల రాము శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని నీళ్ల ట్యాంకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. హామీ ఇవ్వకుంటే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మిరా నందునాయక్, సర్పంచ్ కళావతి, పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సముదాయించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇల్లు మంజూరయ్యేలా చూస్తామని హామీనివ్వడంతో కిందికి దిగాడు. ఇందిరమ్మ ఇల్లు, డ్రైనేజీల నిర్మాణం, పింఛన్పై డిమాండ్ చేశాడు. సర్పంచ్ కళావతి ఇల్లు మంజూరుతోపాటు డ్రైనేజీ నిర్మాణం చేయిస్తానని, పింఛన్ గురించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
తానూరు: మండలంలోని ఎల్వి గ్రామ సర్పంచ్ ఇర్వంత్ తన కుమారుడిని సర్కారు బడిలో చేర్పించారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుండడంతో ప్రజలకు నమ్మకం కలిగించేందుకు తన కుమారుడిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులతో విద్యా బోధన ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. బడిబాటలో భాగంగా తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను ప్రభత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయులు సుధాకర్, శంకర్, శివకుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్: పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన పోస్టర్లు, బ్యానర్లు విడుదల చేసిన అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వర్షాకాలంలో చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, పర్యావరణ పరిరక్షణలో వైద్యులు, సిబ్బంది భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అసంక్రమణ వ్యాధుల కోఆర్డినేటర్ కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, శ్రీనివాస్, పద్మ, వసుమతి, రవికిరణ్, సురేందర్ పాల్గొన్నారు.
కోటపల్లి: ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని కోట పల్లి సీఐ కృష్ణ అన్నారు. మండలంలోని శంకరా పూర్ గ్రామంలో శుక్రవారం కోటపల్లి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రతీ ఇంటిని తనిఖీ చేసి 2లీటర్ల గుడుంబాతోపాటు సరైన పత్రాలు లేని 30వాహనాలు సీజ్ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులకు లేదా 100డయల్కు స మాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ జగన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్టౌన్: ఉమ్మడి జిల్లాలోని ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్గా పదోన్నతి లభించింది. శుక్రవారం ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కొమ్రేవార్ అరుణ్కుమార్ను నిజామాబాద్ జిల్లాకు కేటాయించారు. మంచిర్యాలలో పనిచేస్తున్న తిరుపతికి అక్కడే సూపరింటెండెంట్గా పదోన్నతి లభించింది. కాగా టీఎన్జీఓ సంఘ భవనంలో అరుణ్కుమార్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవిన్ కుమార్, రాజేశ్వర్, నితిన్కుమార్, సోహెల్ మిర్జా, ప్రసాద్, నర్సిములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పాతమంచిర్యాల: ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ అన్నారు. శుశ్రవారం జిల్లా కేంద్రంలోని మోడల్ కెరీర్ సెంటర్లో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తమ సంస్థలో 20 ఉద్యోగాల భరీ కోసం జాబ్మేళా నిర్వహించారు. 29 మంది హాజరు కాగా 12మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరుగురికి ఉద్యోగ నియామక లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీఆర్యవర్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని యాపల్ ప్రాంతానికి చెందిన మారం రామకృష్ణ(46) వడదెబ్బతో మృతిచెందాడు. యాపల్ ప్రాంతంలో ఆయన గత కొంతకాలంగా ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండ్రోజులుగా స్వంత పనులపై ఎండలో తిరిగాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో మంచంపై విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బావమరిది సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. రామకృష్ణ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సందర్శించి అంత్యక్రియలు నిర్వహించారు.
కడెం: సంతానం కలగలేదని మనస్తాపంతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ పట్టణానికి చెందిన మండ శ్రీనివాస్ (40)కు వివాహమై పదేళ్లైనా సంతానం కలుగలేదు. దీంతో మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 4న కడెం ప్రాజెక్ట్ వద్ద గల మిషన్ భగీరథ ఇంటెక్వెల్ వద్ద నీళ్లలో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సర్పంచ్ దీకొండ విజయ్, ఉప సర్పంచ్ రాజు యువకుల సహాయంతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని బయటకు తీయించారు. శ్రీనివాస్ లక్ష్మణచాంద మండలంలోని పార్పెల్లి సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
కుంటాల: మండలంలోని మెదన్పూర్ గ్రామానికి చెందిన మోరె అశోక్ (54) మద్యానికి బానిసై శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
మందమర్రిరూరల్: మండలంలోని సండ్రోన్పల్లి గ్రామానికి చెందిన ఏదులు రాజ్కుమార్(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ కొంతకాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి 8గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం 7గంటల ప్రాంతంలో గ్రా మ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడి తల్లి లస్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్కు చెందిన సఫియా సుల్తాన వాస్మోలిన్ తాగి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. 2010లో ఈమెకు వివాహం జరగగా, 2018లో భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఇందిరానగర్కు చెందిన యువకుడు ఆసిఫ్ రజాతో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని వన్టౌన్ సీఐ సునిల్కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ పిట్ల నవీన్ కుమార్ సైబర్ వలలో చిక్కుకున్నాడు. ఏప్రిల్ 27న తన మొబైల్ ఫోన్కు లింక్ రాగా, దానిని ఓపెన్ చేశాడు. నా లుగు సార్లు అకౌంట్లో ఉన్న డబ్బులు రూ.35వేలు, రూ.15వేలు, రూ.40వేలు, రూ.9వేలు మొత్తం రూ.99వేలు కోల్పోయాడు. దీంతో మరుసటి రోజు బాధితుడు సైబర్సెల్కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.
పీజీఈసెట్లో సత్తాచాటిన సాయిప్రీతమ్
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ పీజీఈసెట్లో శుక్రవారం జెఎన్టీయూ విడుదల చేసిన ఫలితాల్లో మంచిర్యాలకు చెందిన అయిత సాయిప్రీతమ్ సత్తాచాటాడు. 90శాతం మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు. సాయిప్రీతమ్ స్థానిక కార్మెల్లో పదో తరగతి, అల్ఫోర్స్లో ఇంటర్మీడియెట్, హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి కళాశాలలో ఇన్స్ట్రుమెంటర్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పీజీ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ చాటాడు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షలకు 78 మందికి గాను 49 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ మల్లేశం సందర్శించారు. మొదటి రోజు పరీక్ష సజావుగా జరిగిందని డీఈవో ఎల్.లలిత తెలిపారు.
నేర పరిశోధనపై శిక్షణ అవసరం
మంచిర్యాలక్రైం: నేర పరిశోధనలో పోలీస్ అఽధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరమని రామగుండం పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బందికి సాంకేతికతపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు చేసిన తర్వాత వాటి దర్యాప్తులో నైపుణ్యతను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేర పరిశోధన లక్ష్యంగా టెక్టీమ్, వర్టికల్ ఆంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్టికల్ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్గౌడ్, సీఐలు రంజిత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. మంచి రోజు కావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1,019మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. వివిధ అర్జిత సేవల ద్వారా రూ.10,99,600 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు. – బాసర
ఇచ్చోడ: మండలంలోని ముఖరా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి శుక్రవారం ప్రపంచ పర్యావరణ ది నోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా అవార్డు ప్రదానం చేశారు. గతంలో సర్పంచ్గా ఉన్న కాలంలో గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం, అవెన్యూప్లాంటేషన్, హరితవనం, బృహత్ పార్కులలో మొక్కలు నా టడడం, ప్రతీ మొక్కను కాపాడి, డిజిటల్ ట్రీ ఆధార్ గుర్తింపు తేవడంతో అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు. ఎస్పీ అఖిల్మహాజన్, డీఎఫ్వో ప్రశాంత్బాజీరావు పాటిల్ ఉన్నారు.
మందమర్రిరూరల్: కారులో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుస్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై నరేశ్తో కలిసి సీఐ రమేశ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. తమకందిన పక్కాసమాచారంతో మందమర్రి పోలీస్స్టేషన్ పరిధి రామన్కాలనీ సమీపంలో వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేపట్టారు. స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా 30 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. శ్రీపతినగర్కు చెందిన మహ్మద్ సాహెబ్జానీ, మహ్మద్ అఫ్రోజ్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్ వద్ద పత్తి విత్తనాలు కేజీ రూ.వెయ్యి చొప్పున కొనుగోలు చేసి స్థానికంగా రూ.2500 కేజీ చొప్పున అమ్మడానికి సిద్ధపడ్డారు. కారుతోపాటు విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల గుట్టును రట్టు చేసిన ఎస్సైతోపాటు సిబ్బందిని సీఐ రమేశ్ అభినందించారు.
ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలకేంద్రానికి చెందిన జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపినాథ్, కేస్లాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అడవుల సంరక్షణకు కృషి చేయడంతో పాటు జీవవైవిధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నందుకు గుర్తింపు వచ్చిందని జిల్లా జీవ వైవిధ్య కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపినాథ్ తెలిపారు. నాగోబా ఆలయ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్ల రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసినందుకు అవార్డు వచ్చినట్లు కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారం తెలిపారు.
- ● డీసీపీ బాస్కర్
కాసిపేట: గంజాయి వినియోగం, క్రయవిక్రయాల కట్టడికి కృషి చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కాసిపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, కేసుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలు అదుపులోనే ఉన్నాయని, జాతీయ రహదారి, దేవాపూర్ కంపెనీ, కాసిపేట గనులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నివారణకు పోలీస్శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని అన్నారు. డివిజన్ స్థాయిలో గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, 150మంది అనుమానితులను గుర్తించామని తెలిపారు. గ్రామ పోలీస్ అధికారులను నియమించి వారానికి రెండుసార్లు గ్రామాల్లో పర్యటిస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్కుమార్, మందమర్రి సీఐ పర్స రమేష్, కాసిపేట ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.
Peddapalli
సాక్షి పెద్దపల్లి:
వానాకాలం సాగుకు సమయం ఆసన్నమైంది. జిల్లాలో 2,78,290 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. రోహిణి కార్తెలో దుక్కులు దున్నడం వంటి పనులు చేస్తూ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో చా లామంది పత్తి, మొక్కజొన్న, వరి అధికంగా సాగు చేస్తుంటారు. ఇదేసమయంలో అనుమతి లేనివిత్తనాలు, బీటీ–3 విత్తనాలు, నకిలీ విత్తనాలను వ్యాపారులు మార్కెటింగ్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు. రంగురంగుల ప్యాకెట్లలో నింపి రైతులకు అంటగట్టే పనిలోపడ్డారు. పల్లెల్లో స్థానికులను ఏజెంట్లుగా నియమించి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. కంపెనీ పేరు, చిరునామా లేకుండా మంచివని, అధిక దిగుబడి ఇస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎ రువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
టాస్క్ఫోర్స్ బృందాలతో
అన్నదాతలను నిండా ముంచుతున్న నకిలీ విత్తనాలు, ఎరువుల వ్యాపారులపై టాస్క్ఫోర్స్, పోలీసులు, వ్యవసాయశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు చేస్తున్నారు. మండలానికో టాస్క్ఫోర్స్ కమిటీ చొప్పున ఏర్పాటు చేసి.. వ్యవసాయ, పోలీ సు అధికారులు, సీడ్ సర్టిఫయింగ్ ఆఫీసర్ (ఏసీసీవో) ఉండనున్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తేలితే బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారులు దాడులు చేస్తున్నా..
ప్రతీసీజన్లో అధికారులు దాడులు చేస్తున్నా కొంద రు డీలర్లు అధిక డబ్బుకు ఆశపడి నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయిస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు డీలర్లందరూ క్రయవిక్రయాలు, స్టాక్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, ప్యాకెట్లపై తయారీ, మొలకశాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలను పరిశీలించాలని అధికారులు అన్నదాతలకు సూచిస్తున్నారు.
విత్తన ఎంపికలో జాగ్రత్త..
లైసెన్స్డ్ డీలర్ల నుంచే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేయాలని, డీలర్ల సంతకంతో కూడిన రసీదు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన తేదీ, విత్తన రకం, పరిమాణం, ధర, లాట్ నంబర్ తదితర వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయించుకుని సరిచూసుకోవాలని సలహా ఇస్తున్నారు. రంగు రంగుల ప్యాకెట్లను చూసి మోస పోవద్దని, కంపెనీ విశ్వసనీయత, విత్తనాల నాణ్య త, మొలక శాతం వివరాలను పరిశీలించుకోవాలని వివరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి సాగు చే సిన తర్వాత ఖాళీ విత్తనాల సంచులను పంట చేతికొచ్చే చివరిదశ వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచిస్తున్నారు. సీజన్ ప్రారంభం అవుతుండడంతో కొందరు బిల్లులు లేకుండా తక్కువ ధరలకు వి త్తనాలు అమ్ముతుంటారని, వారిపై వ్యవసాయ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. విత్తన మార్కెట్ను పెంచడం, అధికంగా విత్తనాలు అమ్మకం కోసం వివిధ కంపెనీలు వ్యాపారులకు బహుమతులు, టూర్లు ఆఫర్లను ప్రకటిస్తుండడంతో పలువురు వ్యాపారులు, డీలర్లు నకిలీ వ్యాపారం వైపు మొగ్గుచూపే అవకాశాలుంటాయని, అప్రమత్తంగా ఉండాలని వివరిస్తున్నారు.
జిల్లా సమాచారం
డీలర్లు 350
సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 6
సబ్సిడీ విత్తన విక్రయ కేంద్రాలు 51
సాగు విస్తీర్ణం(ఎకరాల్లో) 2,78,290
కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. జిల్లాలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నట్ల మా దృష్టికి వస్తే పీడీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవిషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి.
– శ్రీనివాస్, డీఏవో
రామగిరి: సింగరేణి ఆర్జీ–3 ఓసీపీ–2 విస్తరణ కో సం 2015లో అక్కేపల్లి, లద్నాపూర్, రచ్చపల్లిలో భూసేకరణ కోసం అవార్డు పాస్ చేశారు. కొందరు రైతులు మెరుగైన పరిహారం కోసం హైకోర్టుకు వెళ్లా రు. ఈమేరకు శుక్రవారం సెంటినరీకాలనీ సీఎన్సీవోఏ క్లబ్లో లోక్ అదాలత్ ద్వారా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల నుంచి రైతులు, సర్పంచులు, న్యాయవాదులు హాజరై మెరుగైన పరిహారం చెల్లింపుపై చర్చించారు. కమిటీ చైర్మన్, సింగరేణి ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ లక్ష్మీపతిగౌడ్ అధ్యక్షత వ హించారు. కోర్టు ఆదేశాల మేరకు మెరుగైన పరిహా రం అందిస్తామని, సమస్య పరిష్కారమయ్యేలా ని ర్వాసితులు సహకరించాలని కోరారు. ఆర్జీ–3 జీ ఎం మధుసూదన్, ఫైనాన్స్ జీఎం శ్రీనివాసులు, లా డీజీఎం శిరీషరెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజశేఖర్, ఫైనాన్స్ డీజీఎం సురేఖ, ఎస్టేట్స్ అధికారులు తేజా వత్ హీర్యా, శ్రీనివాస్, ఐలయ్య పాల్గొన్నారు.
పెద్దపల్లిరూరల్: పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని అ దనపు జిల్లా జడ్జి స్వప్నరాణి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్ర వారం జిల్లా కోర్టు సముదాయంలో జూనియర్ జడ్జి మంజులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరు తమవంతుగా సహకరించాలని జడ్జి సూచించారు.
విరివిగా మొక్కలు నాటాలి
పెద్దపల్లి: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి గణేశ్ కోరారు. కోర్టులో జడ్జి మొక్కలు నాటి మాట్లాడారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వొడ్నాల రవీందర్, ప్రధాన కా ర్యదర్శి ఆవు నూరి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ ఆవుల శివకృష్ణ, ఏజీపీ ఆంజనేయులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ సప్లిమెంటరీ ప్రశాంతం
పెద్దపల్లి: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ స ప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతు న్నాయని డీఈవో శారద శుక్రవారం తెలిపారు. తెలుగు పరీక్షకు 43 మందికి 33 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో పేర్కొన్నారు.
మైనర్లకు వాహనాలివ్వొద్దు
పెద్దపల్లిరూరల్: రోడ్డు భద్ర త నియమాలు పాటించాలని, ముఖ్యంగా మైనర్లకు వా హనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ అన్నారు. తమ పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలనే విషయమై అరైవ్.. అలైవ్ పేరిట అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారకులు కావొద్దని ఆయన సూచించారు.
ఘనంగా మాస కల్యాణం
కమాన్పూర్: ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి స న్నిధిలో శుక్రవారం మాస కల్యాణం వైభవంగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో తర లివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, డైరెక్టర్ తీగల రాజయ్య పాల్గొన్నారు.
రేపు బీఆర్ఎస్ సమావేశం
పెద్దపల్లి: బీఆర్ఎస్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఈనెల 7 వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపా రు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపల్లి మె యిన్ రోడ్డులోని తిరుమల గార్డెన్లో నిర్వహించనున్నామని, మాజీ మంత్రి హరీశ్రావు ము ఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పార్టీ బలో పేతం, భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
సమస్యలు పరిష్కరిస్తాం
ఫెర్టిలైజర్సిటీ: చైతన్యపురిని సమస్యల రహిత కాలనీగా తీర్చిదిద్దుతామని రామగుండం మే యర్ మహంకాళి స్వామి అన్నారు. 22వ డివిజన్ చైతన్యపురి కాలనీలో ఆయన శుక్రవారం స్వామి పర్యటించారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగింపు పనులు పరిశీలించారు. కా ర్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి భాగ్యలక్ష్మి, వడ్లూరి రవి, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వా మి, నాయకుడు సతీశ్ పాల్గొన్నారు.
సామర్థ్యం మెరుగుపర్చుకోవాలి
గోదావరిఖని: నేర పరిశోధనలో నైపుణ్యం, కచ్చితత్వం పెంపు కోసం దర్యాప్తు సామర్థ్యా న్ని మెరుగుపర్చుకోవాలని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం రా మగుండం పోలీస్కమినరేట్లో ఏర్పాటు చేసి న సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక పరి జ్ఞానానికి అనుగుణంగా నేరాలను త్వరితగతి న ఛేదించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్న సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొరత పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు
ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆలయ ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధులు నిర్వర్తించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. రాజన్న భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు
మొత్తం క్యాడర్ పోస్టులు : 320
ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 185
ఖాళీగా ఉన్న పోస్టులు : 135
ఖాళీల్లో ఉన్న అర్చక పోస్టుల సంఖ్య: 35
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు సుమారుగా : 60
జూనియర్ అసిస్టెంట్ ,
రికార్డ్ అసిస్టెంట్ల పోస్టులు: 10
డ్రైవర్ పోస్టులు : 3
మొత్తం ఔట్ సోర్సింగ్ పోస్టులు: 290
ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య: 250
ఔట్ సోర్సింగ్లో ఖాళీ పోస్టులు: 40
జ్యోతినగర్: బాలికలు విజయం సాధించడం కోసం విద్య, ఆత్మ విశ్వాసం, పట్టుదల ఎంతో ముఖ్యమని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో బాలికా సాధికారత మిషన్–2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంతతో కలిసి ఆయన మాట్లాడా రు. ఎన్టీపీసీ బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నెలరోజుల పాటు అత్యుత్తమ శిక్షణ అందించిందన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన 10 మంది విద్యార్థులకు ఉచిత విద్య కూడా అందించనున్నామని ఆయన వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. శిక్షణ పొందిన పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు. కమాన్పూర్, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాలకు చెందిన 140 మంది విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి
పర్యావరణ పరిరక్షణకు ఎన్టీపీసీ కృషి చేస్తోందని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలికా సాధికారత మిషన్–2026లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులతో కలిసి ప్రభాత భేరికి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి మాట్లాడారు.
‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు అవ్వండి.. అవయవదానం చేయండి.. మరోసారి జీవించండి.. శరీరదానం చేద్దాం.. వైద్యవిద్య అధ్యయనానికి చేయూతనిద్దాం.. బ్రెయిన్ డెడ్ అయితే అవయదానం చేసి పునర్జన్మనివ్వండి’ ఇలాంటి నినాదాలు బాగానే ఉన్నా ఆచరణకు నోచుకోవడంలేదు. మనిషి తలరాత ఎలా ఉన్నా.. గోడలపై రాతలతోనైనా మనుషుల్లో పరివర్తన వస్తుందని అవయవదానంపై అవగాహనకు శ్రీకారం చుట్టింది రామగుండం మున్సిపాలిటీ. ప్రమాదవశాత్తు మరణించిన వారి శరీరదానాలు, అవయవ దానాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ గోదావరిఖని జనరల్ ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్) పోస్ట్మార్టం గోడలపై బొమ్మలు గీసి చైతన్య పరచడం ‘సాక్షి’ కెమెరాకు కళారూపంలో కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం పూర్తయినా.. గోదాముల తరలింపులో అక్కడక్కడా కొంత జాప్యం జరిగిందని, మూడురోజుల్లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. పట్టణ శివారు చీకురాయిరోడ్డులోని గోదాములో ధాన్యం నిల్వలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమస్య పెద్దపలి, కాల్వశ్రీరాంపూర్ మండలాల పరిధిలోనే ఉందన్నారు. ధాన్యం తరలింపు కోసం అవసరమైన లారీలు, హమాలీల కొరతను అధిగమించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. మొక్కల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిందని, రైతుల ఖాతాకు డబ్బులు సైతం జయచేశామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, లారీ అసోసియేషన్ నాయకులు అబ్దుల్బారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీశ్, సీఐలు ప్రవీణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి
కాల్వశ్రీరాంపూర్: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ విజయరమణారావు ఆకాంక్షించారు. గంగారం గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రత్యేకపూజలు చేశారు. ముదిరాజ్ కులస్తులు ఆయనను శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ రేకుల జ్యోతి, ఉప సర్పంచ్ మేడి అశోక్గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.
ఎలిగేడు: పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సుల్తాన్పూర్ గ్రామపంచాయతీకి రాష్ట్రప్రభుత్వం అవార్డు ప్రకటించగా.. శుక్రవారం హైదరాబాద్లో సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, పంచాయతీ కార్యదర్శి జూపాక శివకుమార్ పురస్కా రం అందుకున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ రాష్ట్రసాయిలో ఉత్తమంగా ఎంపికై న విషయం విదితమే. ఈమేరకు హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అతిథుల నుంచి వారు అవార్డు అందుకున్నారు. ఉపర్పంచ్ తానిపర్తి రమేశ్రావు, వా ర్డు సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రికి..
జ్యోతినగర్: ఎన్టీపీసీ ధన్వంతరి ఆస్పత్రి పర్యావ రణ అవార్డు అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పద్ధతులకు చేసిన కృషికి గుర్తింపుగా ఎన్టీపీసీ – తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన ధన్వంతరి ఆస్ప త్రి నిర్వాహకులను కాలుష్య నియంత్రణ మండలి అవార్డుతో సత్కరించారు. మంత్రి కొండా సురేఖ ఈ పురస్కారాన్ని డాక్టర్ లహరికి అందజేశారు. వైద్యులను, సిబ్బందిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అభినందించారు.
అవార్డు అందుకున్న సుల్తాన్పూర్ సర్పంచ్
ధన్వంతరి ఆస్పత్రికి కూడా పురస్కారం
కాల్వశ్రీరాంపూర్: రోహిణి కార్తెలో వర్షాలు కురుస్తాయని, ధాన్యం త్వరగా తూకం వేసి రైస్మిల్లులకు తరలించాలని అన్నదాతలు నెత్తీనోరు బాదుకున్నా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేశారు. రైతులు భయపడినట్లే గురువారం సాయంత్రం హఠాత్తుగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆయా ప్రాంతాల్లో బురద పేరుకుపోవడంతో లారీలు వెళ్లలేకపోయాయి. దీంతో శుక్రవారం ధాన్యం తూకం ఆగిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచక రైతులు అయోమయంలో పడ్డారు.
ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతు
కూనారంలో వరదనీటిలో కొట్టుకు పోయిన ధాన్యం
Nirmal
నిర్మల్చైన్గేట్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర భుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల కోసం ప్ర భుత్వం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. 11వేల దివ్యాంగ పొ దుపు సంఘాల్లో దాదాపు 80వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఆరేళ్లలో పు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భ రోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్ట ర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం స్కూటీలు, అడ్వాన్స్డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు తదితర పరి కరాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రాంగణంలో కార్పొరేషన్ చైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి 38మంది దివ్యాంగులకు ప్రత్యేక స్కూటీలు అందజేశారు. మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి వినూత్న, అధికారులు పాల్గొన్నారు.
కుంటాల: వర్షాలు పడకముందే కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఓల, అంబకంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు తెలిపారు. కుంటాలలో లారీలు రాక ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలుపగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి లారీలు సమకూర్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ కమల్సింగ్, డీటీ కార్తిక్రెడ్డి ఉన్నారు.
నర్సాపూర్ (జి): రెండ్రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని గొల్లమాడలో డీసీఎంఎస్, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మా ట్లాడారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని కొనుగోళ్లు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్ డీఎం సుధాకర్, తహసీల్దార్ శ్రీకాంత్, సెంటర్ నిర్వాహకులు భూమయ్య, శ్రీను ఉన్నారు.
నిర్మల్చైన్గేట్: అధికారుల వేధింపులతోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ శా ఖలో పని చేసే అవుట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాడ్య శ్రీధర్బాబు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జే ఏసీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం న ల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై కలెక్టరేట్లో ని రసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ రాజ్, వినోద్కుమార్ మాట్లాడారు. ప్రభుత్వం తక్షణ మే స్పందించి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను వెలికితీయాలని కో రారు. మృతుడి కుటుంబానికి రూ.10లక్షల ఎ క్స్గ్రేషియా, కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల తక్షణ పరిష్కారానికి జి ల్లా స్థాయిలో ఒక ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సారంగపూర్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జౌళి గ్రామంలో శుక్రవారం రూ.9లక్షలు ఈజీఎస్ నిధులతో చేపట్టిన పాఠశాల ప్రహరీ, రూ.10లక్షలతో చేపట్టిన ఐకేపీ వర్క్షెడ్ నిర్మాణాని కి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధి బీజేపీతో నే సాధ్యమవుతుందని తెలిపారు. సర్పంచ్ సురేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు కాల్వ నరేశ్, ఆయా గ్రామాల సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్రావు, నాయకులు తిరుమలాచారి, విలాస్, పీఆర్ డీఈఈ తుక్కారాం, ఎంఈవో మహేందర్ ఉన్నారు.
- ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముంది.
టీ–ప్రైడ్.. సబ్సిడీకి బ్రేక్
నిర్మల్చైన్గేట్: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు స్వ యం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ప్రవేశపె ట్టిన టీ–ప్రైడ్ పథకం దరఖాస్తుదారులకు నిరా శే మిగిలింది. జిల్లాలో 356మంది దరఖాస్తు చే సుకోగా 192మందికి సబ్సిడీ వచ్చింది. మిగతా వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2016లో టీ–ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యూబేషన్ దళిత్ ఎంటర్ ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీం) పథకాన్ని ప్రారంభించింది. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వాహనాలు కొనుగోలు చేసి ఉపాధి కల్పించేలా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 2026 వరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. జిల్లాకు సంబంధించి కొందరికే సబ్సిడీని మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ పథకంలో పురోగతి కరువైంది. వందల సంఖ్యలో లబ్ధిదారులు సబ్సిడీ అందక నిరాశలో ఉన్నారు. వాహనాలు ఓ వైపు పాతబ డిపోతుండగా గిరాకీలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సి న డబ్బులు రాక ఆర్థికంగా నలిగిపోతున్నారు.
పలు రకాలుగా సబ్సిడీ
టీ–ప్రైడ్ పథకం 2016లో ప్రారంభమైంది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 35నుంచి 45శా తం సబ్సిడీపై కార్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, పొక్లెయినర్లు, టిప్పర్లు, ఇతర వ్యవసాయ, వ్యాపార రంగాలకు సంబంధించిన వాహనాలు కొనుగోలు చేసి తద్వారా ఉపాధి పొందేలా అవకాశం కల్పించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంక్ రుణం ద్వారా వాహనాలు కొనుగోలు చేశాక ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తుంది. రూ.5కోట్లలోపు ఏదైనా యూనిట్ను ఎంచుకోవచ్చు. కానీ, సబ్సిడీ మాత్రం గరిష్టంగా రూ.75లక్షలే వస్తుంది. వస్తువుల తయారీ పరిశ్రమలు, ట్రాన్స్పోర్టు వాహనాల కొనుగోలు కేటగిరీల్లో మహిళలకు 45శాతం, పురుషులకు 35శాతం సబ్సిడీ అందిస్తుంది.
పెండింగ్లో రూ.20 కోట్లు
2016 నుంచి 2025 వరకు జిల్లాలో 356 మంది వివిధ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరి లో 192 మందికే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మంజూరైంది. మరో 164 మందికి ఎదురుచూపులే మిగిలాయి. జిల్లాకు ఇంకా రూ.20 కోట్ల స బ్సిడీ రావాల్సి ఉంది. 2020 జూలై నుంచి ఎస్టీలు, 2021 మార్చి నుంచి ఎస్సీలకు సబ్సిడీ మంజూరు కావడం లేదు. సబ్సిడీ మంజూరు ఇచ్చిన వారికీ నిధులు జమ చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు నిత్యం కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యాపారాలు ఆ శించినంతగా లేక, తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు ఆలస్యమైతే రుణాలిచ్చిన కంపెనీలు వాహనాలను జప్తు చేస్తున్నాయని, ఇంట్లో దాచుకున్న బంగారం అమ్మి వాయిదాలు కడుతున్నామని వాపోయారు.
రూ.8.32 లక్షల సబ్సిడీ రావాలి
టీ–ప్రైడ్ పథకంలో సబ్సిడీ వస్తుందంటే ఆరేళ్ల క్రితం ధైర్యం చేసి హార్వెస్టర్ కొనుగోలు చేశాం. కానీ, ఇప్పటివరకు రూపాయి సబ్సిడీ కూడా రాలేదు. బ్యాంక్ రుణం మొత్తం మేమే చెల్లించాం. సబ్సిడీ డబ్బులు రూ.8.32 లక్షలు రావాల్సి ఉంది. వెంటనే సబ్సిడీ అందించాలి.
– భూక్య స్వరూప, లక్ష్మీసాగర్
రాయితీ సొమ్ము అందజేయాలి
45శాతం సబ్సిడీ వస్తుందంటే ఐదేళ్ల కింద ట్రాక్టర్ కొన్నాం. ప్రతినెలా వాయిదాలు కడుతున్నాం. సబ్సిడీ రూ.2.95 లక్షలు ఇప్పటికీ రాలేదు. గిరాకీలు సరిగా లేని సమయాల్లో వాయిదాలు చెల్లించడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. రాయితీ సొమ్ము మంజూరు చేయాలి.
– జాడి ఐలా, మద్దిపడగ, కడెం
అందాల్సిన సబ్సిడీ కేటగిరీల వారీగా..
జనరల్ కేటగిరి
ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.35,03,235
పావలా వడ్డీ రూ.2,47,52,395
ఎస్సీ కేటగిరి
ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.7,61,41,392
ఎస్టీ కేటగిరి
ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.11,19,14,150
పావలా వడ్డీ రూ.15,15,624
పీహెచ్సీ కేటగిరి
ఇన్సెంటివ్ సబ్సిడీ రూ.1,62,51,574
పావలా వడ్డీ రూ.14,84,932
నిర్మల్: సారంగపూర్ మండలంలో ని అడెల్లి అటవీ ప్రాంతంలో కొ లువుదీరిన మహాపోచమ్మకు ఏడాదికేడాది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అమ్మవారి ని దర్శించుకునేందుకు ఉత్త ర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సరిహద్దు జి ల్లాల భక్తులు అధికసంఖ్యలో వస్తున్నారు. వేలాదిమందితో కిక్కిరిసిపోయే అడెల్లి ప్రతీ ఆదివారం ‘మినీ మేడారాన్ని’ తలపిస్తోంది.
చల్లని చూపులతోనే దీవెనలు
ఈప్రాంత ప్రజల ఇలవేల్పుగా, లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న అడెల్లి పోచమ్మ తల్లి తన చల్లని చూపులతోనే దీవిస్తుంది. గతేడాది నవంబర్ 7న అంగరంగ వైభవంగా అమ్మవారు కొత్త ఆల యంలో కొలువుదీరారు. గర్భగుడిలో పోచమ్మతో పాటు తన అక్కాచెల్లెళ్లుగా భావించే బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణ వి, వారాహి, ఇంద్రాణి, చా ముండి విగ్రహాలున్నాయి. ఎక్క డా లేనివిధంగా ఇక్కడి మహా పోచమ్మ ఆలయంలో ఈ సప్తమాత్రికలు ఉండటం అడెల్లికి మరింత విశిష్టతను తీసుకొచ్చింది.
పార్కింగ్ పేరిట పైసా వసూల్!
అడెల్లి ఆలయానికి కార్లు, జీపులు, బస్సుల్లో వెళ్తే రూ.50 చెల్లించాల్సిందే. ఇదేంటీ అంటే.. ‘పార్కింగ్ ఫీజు’ అంటున్నారు. రోడ్డుపై అడ్డుపడి మరీ.. వసూలు చేస్తున్నారు. సరే.. అని డబ్బులు చెల్లించి గుడి దగ్గరికి వెళ్తే.. ఎక్కడా పార్కింగ్ ప్లేస్ అని ప్రత్యేకంగా లేదు. గుడి ఎదుట, రోడ్డుపైన, వంటలు చేసుకునే దగ్గర ఇలా.. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపాల్సి వస్తోంది. ఆదివారం వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది.
అడెల్లిలో మొక్కు తీర్చుకునే చోట ముక్కు మూసుకోవాల్సిందే. ఆలయానికి ఎదురుగా ఈశాన్య భాగంలో అమ్మవారికి మేకలు, కోళ్లు బలిచ్చే (స్లాటర్ ఏరియా) చోటుంది. ఇక్కడ ఎలాంటి సిమెంట్ ప్లాట్ఫాం లేదు. కనీసం గద్దెలూ నిర్మించలేదు. ఆకులతో వేసిన గుడిసెల కింద అపరిశుభ్రంగా ఉంది. వర్షాల సీజన్లో మరీ దారుణం. బురద, ఈగలతో భక్తులకు పరీక్షగా మారుతోంది.
కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి వా సుల సమస్యలు పరిష్కారిస్తామని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. ఈనెల 4న అల్లంపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యల పరిష్కారానికి గ్రామస్తులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అల్లంపల్లి రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యుత్ సదుపాయం, పాఠశాల, అంతర్గతరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అ టవీశాఖ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శా శ్వత పరిష్కారం చూపిస్తామని అధికారులు వెల్ల డించారు. 10 నెలల్లో రోడ్డు పనులు ప్రారంభించడ మే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జు, కలెక్టర్ భవేశ్మిశ్రా, జిల్లా అటవీ అధికారి సుశాంత్ సుఖ్దేవ్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మండలంలోని గంగాపూర్లో రూ.5లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి, పెంబి మండలంలో మూడు ఐరన్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు, గుమ్మెన ఎంగ్లాపూర్లో మొబైల్ టవర్ ఏర్పాటు, డీజీపీఎస్ సర్వే చేసి 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్న వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నిధులతో నవాబ్పేట్ నుంచి గంగాపూర్ వరకు గ్రావెల్ రోడ్డు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చారు. నోటిఫైడ్ గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాకు అనుమతి కోసం త్వరలోనే మండలాల్లో పర్యటిస్తామని ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ఖాజామొయినొద్దీన్, ఎంపీడీవో అరుణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న, పీఆర్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రజాప్రభుత్వం
పెంబి: పేదలకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల కు చెక్కులు పంపిణీ చేశారు. పర్యావరణ దినోత్స వం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణ లో మొక్కలు నాటారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుడిసె రమేశ్, డీసీసీ కార్యదర్శి స్వప్నీల్రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, సర్పంచులు సత్యనారాయణస్వామి, భీంరావు, నాయకులు రాజన్న, మహేందర్, పెద్దయ్య తదితరులున్నారు.
నిర్మల్చైన్గేట్: బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం 2025–26 ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరా లపై అప్రమత్తత, పొదుపు, బ్యాంకింగ్పై అవగాహ న కలిగేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన తరగతుల ప్రజలు, మ హిళా స్వయం సహాయక సంఘాలు, రైతులు, వీధి వ్యాపారులు, విద్యార్థులకు అందించే రుణాల మంజూరులో జాప్యం చేయొద్దని సూచించారు. అనంతరం 2026–27 వార్షిక రుణ ప్రణాళిక నివేదిక ఆవి ష్కరించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్గో పాల్, ఎస్బీఐ, టీజీబీ రీజినల్ మేనేజర్లు రంజన్కుమార్, నవీన్కుమార్, ఆర్బీఐ లింక్ బ్యాంకింగ్ ఆఫీ సర్ రాములు, అధికారులు, బ్యాంకర్లున్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
మామడ: పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆరేపల్లి గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. రైతులు పంట వ్యర్థాలను కా ల్చి పర్యావరణానికి హాని కలిగించొద్దని తెలిపారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అనేది ఇంటి నుంచే ప్రారంభించాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. కళాజా త బృందాలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎఫ్డీవో నాగినిభాను తదితరులు పాల్గొన్నారు.
Komaram Bheem
తిర్యాణి: స్వయం ఉపాధి కల్పనకు మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు మరింత అందనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ లక్ష్యాన్ని పెంచుతూ ఖరారు చేశారు. అతివలు స్వయం ఉపాధిలో రాణించేలా సోలార్ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వ్యాపారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి రుణాలు ఉపయుక్తంగా మారనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధిలో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేస్తోంది. ఆర్థిక చేయూత అందిస్తూ ఏటా తక్కువ వడ్డీతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తుంది. సభ్యులు తీసుకున్న మొత్తాలను నెలవారీ వాయిదాల రుణంలో తిరిగి చెల్లిస్తుంటారు.
ఈ ఏడాది రూ.239.77 కోట్ల చెల్లింపులు
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏటా పరిమితికి మించి బ్యాంకులు రుణాలు చెల్లిస్తున్నాయి. గత ఆర్థిక సంవతర్సంలో రూ.232 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అయితే లక్ష్యానికి మించి రూ.234 కోట్లను సంఘాలకు చెల్లించారు. ఈ నేపథ్యంలో 2026– 27 ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితి మరింత పెంచారు. జిల్లాలో 8,163 సంఘాలకు రూ.239.77 కోట్ల రుణాలు చెల్లించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో ఈ ఏడాది మరిన్ని సంఘాలకు రుణాలు అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కాగజ్నగర్ మండలంలో రూ.27.46 కోట్లు, ఆసిఫాబాద్లో రూ.20.92 కోట్లు, వాంకిడి మండలంలో రూ.19.25 కోట్లు అందించనుండగా, అత్యల్పంగా పెంచికల్పేట్ మండలంలో రూ.8.09 కోట్లు, సిర్పూర్(యు)లో రూ.8.41 కోట్లు, లింగాపూర్లో రూ.9.37 కోట్లు చెల్లించనున్నారు.
బస్సులు, సోలార్ ప్లాంట్తో అభివృద్ధి బాట
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం రుణాలకే పరిమితి కాకుండా స్వయం ఉపాధి పొందేలా ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, విద్యార్థుల యూనిఫాం కుట్టు పనులు, వడ్ల కొనుగోళ్లు తదితర పనులు అప్పగిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే రెబ్బెన మండలం నంబాల గ్రామంలో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగిన సోలార్ ప్లాంట్ను రూ.6కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ను రూ.3.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఇందులో వచ్చిన లాభాల్లో రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల సమైక్యలతోపాటు జిల్లా సమైక్యకు చెల్లిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను ఇటీవల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఇప్పటికే జిల్లాలో 15 మండల సమైక్యల కోసం 15 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేశారు. ఒక్కో బస్సు ద్వారా ప్రతినెలా రూ.69,485 ఆదాయం సమకూరుతోంది.
మండలాల వారీగా బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం
మండలం సంఘాలు లక్ష్యం
(రూ.కోట్లలో)
ఆసిఫాబాద్ 682 20.92
బెజ్జూర్ 467 15.21
దహెగాం 535 16.19
జైనూర్ 575 18.22
కాగజ్నగర్ 900 27.46
రెబ్బెన 690 18.93
సిర్పూర్(యు) 312 8.41
సిర్పూర్(టి) 507 13.84
వాంకిడి 743 19.25
తిర్యాణి 511 15.59
పెంచికల్పేట్ 267 8.09
లింగాపూర్ 279 9.37
కౌటాల 622 18.12
కెరమెరి 556 15.31
చింతలమానెపల్లి 517 14.79
మొత్తం 8,163 239.77
లక్ష్యం నిర్దేశించాం
జిల్లాలో 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 8,163 మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.239.77 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించాం. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు అందించి రాష్ట్ర స్థాయిలో మన్ననలు అందుకున్నాం. అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం టార్గెట్ చేరుతాం. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.
– నరేందర్, డీపీఎం
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేసుకోవాల నే డిమాండ్తో త్వరలో ఎస్పీఎం గేటు ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. పట్టణంలో ని దీక్ష శిబిరం వద్ద శుక్రవారం జేఏసీ నాయకులు ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వర్కర్స్ యూనియన్ల నుంచి ఇద్దరి చొప్పున కమిటీ ఏర్పాటు చేశామని, జేఏసీ కన్వీనర్గా గోగర్ల రాములు, కోకన్వీనర్గా వెంకటేశంను ఏకగ్రీవంగా ఎ న్నుకున్నామని తెలిపారు. సభ అనంతరం చలో ఆదిలాబాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేపడుతామన్నారు. శ్రీనివాస్, సురేందర్, రమణయ్య, నానాజీ, వెంకటేశం, ముంజం శ్రీనివాస్, రాజేశ్, ఓదెలు వేణుగోపాల్, కన్నయ్య, పోచం పాల్గొన్నారు.
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలబారతి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బాక్సింగ్ పోటీలు అట్టహాసంగా నిర్వహించా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ వి భాగాల్లో ప్రతిభ చూపిన 25 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేముర్ల మధు తెలిపారు. అనంతరం విజేతలకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిర్, ముత్తు బాక్సింగ్ క్లబ్ చైర్మన్ శివకుమార్, కార్యదర్శి మదురై శేఖర్, వైస్ ప్రెసిడెంట్ జయేందర్, ఎస్సై మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్అర్బన్: నూతన విద్యాసంవత్సరం ప్రా రంభానికి సమయం ఆసన్నమవుతున్నా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫి ట్నెస్ను నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇప్పటికీ చాలా బ స్సులు సామర్థ్య పరీక్షలకు నోచుకోలేదు. విద్యార్థులను తరలించేందుకు 91 బస్సులు వినియోగిస్తుండగా, ఇందులో ఇప్పటివరకు కేవలం 52 బస్సుల కు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించారు. మరో వైపు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ అధికారులు వా హన సామర్థ్య పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లావ్యాప్తంగా 116 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిలో 31,116 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని తరలించేందుకు యాజమాన్యాలు 91 బస్సులను నడిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పాఠశాలలు, కళాశాలలు మూసి ఉండటంతో యా జమాన్యాలు బస్సులను సాధారణంగా వాడకుండా ఉంచుతాయి. చాలామంది అద్దె కోసం సభలు, స మావేశాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తుంటాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల ల ప్రారంభం నాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఆ తర్వాతే బస్సులను రోడ్లపైకి అనుమతిస్తారు. ఇప్పటివరకు జిల్లాలోని 91 బస్సుల్లో కేవలం 52 బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించుకోగా, మిగిలిన 39 బస్సులకు త్వరగా పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. జూన్ 12వ తేదీ తర్వాత ఫిట్నెస్ పత్రాలు, సరైన అనుమతులు లేని బస్సులు రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులపైనా బాధ్యత
చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించే తల్లి దండ్రులు పాఠశాలలో సదుపాయాలు, తరగతి గ దులు, బోధనా విధానంతోపాటు ప్రైవేట్ బస్సులపైనా దృష్టి సారించాలి. బస్సులు కండిషన్లో ఉ న్నాయా.. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారా..? అనే విషయాలపై ఆరా తీయాలి. అర్హత కలిగిన డ్రైవర్ ఉన్నారో లేదో గమనించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఆటోలు, ఇతర వాహనాల్లో పంపించేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.
నిబంధనలు ఇవే..
7
‘మినరల్’ పేరుతో దోపిడీ
జిల్లా కేంద్రంలో మినరల్ వాటర్ పేరుతో కొందరు దోపిడీకి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలపై అధికారుల నిఘా కరువైంది. 9లోu
ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాయంత్రం పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
మంచిర్యాలలో మాయలేడీలు..!
మంచిర్యాలకు చెందిన ఇద్దరు మహిళలు రుణాలు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. 8లోu
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
పెంచికల్పేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ కె.హరిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెంచికల్పేట్ ఫారెస్ట్ డివిజన్లో ఎస్పీ నితిక పంత్, డీఎఫ్వో బాలామణి, అదనపు ఎస్పీ చిత్తరంజన్లతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత వస్తువులను వాడితే ప్రకృతిని కాపాడుకోవచ్చన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రత పెరగడం, నీటి లభ్యత తగ్గడం మానవాళి మనుగడకు ప్రమాదమని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వాడాలని, ప్రతీ వర్షపు నీటి బొట్టును భూమిలో ఇంకేలా చూడాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాగజ్నగర్ ఎఫ్డీవో అప్పయ్య, రేంజ్ అధికారి అనిల్కుమార్, సర్పంచ్ రాంచందర్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
యాప్లోనే ఇసుక అనుమతులు
కాగజ్నగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా ను అరికట్టేందుకు మన ఇసుక వాహనం యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, యాప్లోనే స్లాట్ బుక్ చేసుకుని ఇసుక అనుమతులు పొందాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ సమీపంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం అడ్డుకుని అనుమతి పత్రాలు పరిశీలించారు. సరైన అనుమతులు లేకుండా వాగులు, ఒర్రెల నుంచి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
‘బడిబాట’ విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్రూరల్: బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానంద, చారి, డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం, నోట్బుక్స్ అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్వో శ్రీనివాస్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, డీఎల్పీవో ఉమర్ హ్సుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్రూరల్: అంకితభావంతో పనిచేస్తే ఉపాధ్యాయులు గుర్తింపు పొందుతారని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం 2025– 26 విద్యాసంవత్సరంలో ఉత్తమ సేవలు అందించిన 200 మంది ఉపాధ్యాయులు, ప్రతిభ చూపిన 800 మంది విద్యార్థులకు సంబంధించిన ప్రశంసాపత్రాలను సంబంధిత ఎంఈవోలకు అందజేశారు. డీఈవో మాట్లాడుతూ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల అభ్యన్నతికి నిరంతర కృషి, విధి నిర్వహణలో అంకితభావం, 90 శాతానికి పైగా హాజరు, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల్లో క్రమశిక్షణకు కృషి చేసిన ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ ప్రశంసాపత్రాలు పంపించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేసి, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్టినేటర్ శ్రీనివాస్, కమ్యూనిటీ కోఆర్టినేటర్ కె.శ్రీనివాస్, ఎంఈవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి: షీర్ వాల్ టెక్నాలజీతో 15 రోజుల్లో నే కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సీఎం పర్యట నలో నిర్మాణ పనులు సైతం పరిశీలించారని పేర్కొన్నారు. బుధవారం కాంక్రీట్ పోయగా, గురువారం డీషెటరింగ్ చేసినట్లు వివరించా రు. సివిల్ పనులన్నీ పూర్తయ్యాయని, మిగిలి న పనులు త్వరలో చేపడతామని తెలిపారు. శుక్రవారం హౌసింగ్ అధికారులు ఇంటిని పరిశీలించారు. త్వరలో గృహ ప్రవేశానికి సిద్ధం చేసుకోవచ్చని హౌసింగ్ డీఈ వేణుగో పాల్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీశ్కుమార్, సర్పంచ్ శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా పర్సనల్ హెచ్వో డీగా డీజీఎం కిరణ్బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు హెచ్వోడీగా పనిచేసిన ఎస్వీ రాజేశ్వర్రావు ఎస్టీపీపీకి బదిలీ కాగా.. అక్కడ పనిచేస్తున్న కిరణ్బాబు బెల్లంపల్లి ఏరియాకు వచ్చారు. డిపార్టుమెంట్ ఉద్యోగులు నూతన డీజీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎస్టీపీపీకి బదిలీపై వెళ్తున్న పర్సనల్ డిపార్టుమెంట్ డీవైపీఎం రాజేశ్వర్రావును శుక్రవారం గోలేటి టౌన్షి ప్లో జీఎం శ్రీరమేశ్, అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఎస్వోటూజీఎం ఉమాకాంత్, డీజీఎంలు ఉజ్వల్కుమార్, కిరణ్బాబు, మదీనా బాషా, అన్ని విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
Karimnagar
- శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
‘రాజన్న’కుసాక్షి ప్రతినిధి, కరీంనగర్:
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొర త పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు
ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితంపై కూడా ప్రభావితం పడుతోందని వారు పేర్కొంటున్నారు. రాజన్న ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
‘భూమి సర్వే చేసేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి ఏసీబీకి పట్టుబడ్డాడు. తన భూమిని సర్వే చేయాలని సుంచు మహేందర్ సర్వేయర్ను సంప్రదిస్తే రూ.25వేలు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించాడు. తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు’.
గంగాధరకు చెందిన రాజిరెడ్డి తన భూమి సర్వే కోసం 5నెలల క్రితం దరఖాస్తు చేశాడు. నేటికి కొలత కాకపోగా కార్యాలయాల చుట్టూ తిరగడం, నిరాశగా వెనుదిరగడం తంతుగా మారుతోంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. జిల్లాలో వందల మందిది ఇదే పరిస్థితి.
కరీంనగర్ అర్బన్: పెరుగుతున్న భూముల విలువ సర్వేయర్లకు కాసులు కురిపిస్తోంది. హద్దు పంచాయితీలు పెరుగుతుండగా, సర్వేయర్లే సమస్యలు సృష్టిస్తున్న ఘటనలు అనేకం. శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి పట్టుబడటం అందుకు మచ్చుతునక కాగా హెచ్చు సర్వేయర్లది ఇదే దారని స్పష్టమవుతోంది. ఒకప్పుడు సోదర భావంతో ఉన్న చుట్టుపక్కల రైతులు ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. హద్దుల గొడవ తేల్చాల్సిన సర్వే లాండ్ రికార్డులశాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తుండటం గమనార్హం.
కొలత ఎప్పుడయ్యేనో..?
జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలుండగా భూ సర్వే ఆర్జీల సంఖ్య తగ్గకపోవడం విడ్డూరం. పలువురు సర్వేయర్లు మామూళ్లు ఇచ్చినవారికే ప్రాధాన్యతనిస్తుండగా ఎవరెక్కువ ఇస్తే వారి హద్దులనే నిర్ణయిస్తున్నారన్న విమర్శలు కోకొల్లలు. కరీంనగర్ అర్బన్, వీణవంక మండలాలకు ఇన్చార్జి సర్వేయర్లు ఉండగా మిగతా మండలాలకు సర్వేయర్లు ఉన్నా అర్జీలు వందల్లో పేరుకుపోవడం పనితీరుకు తార్కాణం. గతంలో సగం మంది పోటీ పరీక్షల కోసం దీర్ఘకాల సెలవులో వెళ్లగా తిరిగి విధుల్లో చేరారు. యుద్ధప్రతిపాదికన సర్వే చేయాల్సిన సర్వేయర్లు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా 300కు పైగా అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
బేరం కుదిరితేనే కొలత
జిల్లాలోని పలువురి సర్వేయర్ల తీరు విమర్శలకు తావిస్తోంది. రూపాయి లంచం లేకుండా హద్దులు నిర్ణయించాల్సి ఉండగా కాసుల బేరంతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బార్లలో రేట్లు మాట్లాడుకోవడం బేరం కుదిరితేనే కొలత వేయడం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. ఇక కారులో వస్తే ఒక రకం, ఇతర వాహనంలో వస్తే మరో రకం ఫీజు కాగా.. కోరిన భోజనం సమకూర్చాల్సిందే. సర్వేయర్కు తోడుగా వచ్చేవారికి లంచం ఇవ్వాల్సిందే. లేదంటే టీపాన్ సరిగా లేదని సర్వేను వాయిదా వేస్తున్నారు. ఇక కార్యాలయంలో టీపాన్, నక్షా, తదితర అవసరాలుంటే డబ్బులతో ముడిపెడుతుండటం విడ్డూరం. ఈ విషయంలో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కరవయ్యాయి.
డీజీపీఎస్ ఇస్తేనే సత్వర సేవ
జిల్లాలో ఏడు మాత్రమే డీజీపీఎస్లున్నాయి. మరో రెండు పైలట్ సర్వేలో వినియోగిస్తున్నారు. గొలుసు ద్వారా భూముల కొలతలు వేస్తే నలుగురు వ్యక్తులు, సహాయకులుగా మరొకరు వ్యవహరించాల్సి ఉంటుంది. వీరందరిని రైతే సమకూర్చుకోవాలి. దీనికి స్వస్తి పలికి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) మిషన్ను అందుబాటులోకి తెచ్చారు. మరింత స్పష్టతకు డీజీపీఎస్ పరికరం వినియోగిస్తున్నారు. అయితే సర్వే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వేలాండ్ రికార్డుశాఖ ఏడీ కిషన్రావు వివరించారు.
కరీంనగర్ కార్పొరేషన్: ఫోన్ వాడినా...ల్యాప్ టాప్ వాడినా రాజీవ్ గాంధీ గుర్తుకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధా ని రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లనే సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవం సాధ్యపడిందన్నారు. నగరంలోని రాజీవ్ చౌక్లో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్ల 20ఏళ్ల ముందే దేశంలోకి కంప్యూటర్ వచ్చిందన్నారు. ఆయన నాటిన బీజాలతోనే 15ఏళ్ల ముందే సెల్ఫోన్లు వచ్చాయని తెలిపారు. రాజీవ్ గాంధీని కలిసే మహాభాగ్యం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తమకు కలిగాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జెన్జీకి గుర్తింపు ఇచ్చింది రాజీవ్ గాంధీయేనన్నారు. రేవంత్, మహేశ్గౌడ్ జోడెద్దుల మాదిరిగా మళ్లీ కాంగ్రెస్ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తారన్నారు. అనంతరం మొదటగా రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కటకం మృత్యుంజయం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మంద నగేశ్ను సన్మానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, వొడితెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు.
ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్ష్ ప్రారంభం
సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. సుడా నిధులు రూ.1.28 కోట్లతో నిర్మించనున్న నైట్ఫుడ్ కోర్టు కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను భారీగా సవరించడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయించేవారిపై అదనపు భారం పడనుంది. శుక్రవారం నుంచి కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి రాగా.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూముల విలువను 50శాతం నుంచి 100శాతం వరకు పెంచగా, కీలక ప్రాంతాల్లో రెట్టింపు పెరగడం గమనార్హం. నగరంలోని టవర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజానికి గరిష్టంగా రూ.31,500 ఉండగా రూ.63,000 వరకు పెంచారు. మెయిన్ సెంటర్లయిన ప్రకాశం గంజ్, మదీనా కంప్లెక్, జాఫ్రీ రోడ్డు, రాజీవ్చౌక్తో పాటు మెయిన్ రోడ్డు పక్కనున్న ప్రాంతాల్లో ధరలు డబు ల్ చేసేశారు. అపార్టుమెంట్లకు రూ.4000 వరకు పెంచారు. కార్పొరేషన్లో విలీనమైన వల్లంపహాడ్లో గజానికి అతి తక్కువగా రూ.2,600 కాగా.. దుర్శేడ్లో గజానికి రూ.3,700గా నిర్ణయించారు. దుర్శేడ్, బొమ్మకల్, ఆరెపల్లి, వల్లంపహాడ్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ విలువను గజానికి రూ.1,800గా నిర్ణయించారు. కరీంనగర్–జగిత్యాల, కరీంనగర్–మంచిర్యాల, కరీంనగర్– హైదరాబాద్ వంటి ప్రధాన రహదారుల వెంట ఉన్న భూములకు భారీగా విలువలు పెంచారు.
కొనుగోలుదారులపై అదనపు భారం
భూముల మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలు పెరగనున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పదని రియల్ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ముందుగానే తెలిసిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావించిన కొనుగోలుదారులు, విక్రేతలు కార్యాలయాలకు తరలివచ్చారు. దీంతో అనేక చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్నా.. శుక్రవారం జరిగిన రిజిస్ట్రేషన్లకు అదనపు ఫీజు చెల్లించారు. కాగా.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 44 రిజిస్ట్రేషన్లు జరిగితే, 5వ తేదీన మార్కెట్ ధరలు పెరిగిన తర్వాత 24 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం.
కరీంనగర్ అర్బన్: ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీర్పార్క్లో కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ఆలంతో కలిసి మొ క్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గతేడాది సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుంచి కలెక్టర్ వరకు దాదాపు 11వేల మంది ఒకేసారి మొక్కలు నాటార ని గుర్తుచేశారు. జిల్లాలోనూ తదనుగుణంగా కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కరివేపా కు, మునగ, జామ మొక్కలు నాటాలని కోరారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ క్షితిజ, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీఎఫ్వో సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రతీ గింజ కొంటా.. ఆందోళన వద్దు
జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ చిత్రా మిశ్రా, సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో ఫోన్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ క్రైం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా జడ్జి శివకుమార్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్.శివకుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అన్నారు. ఇందుకోసం కోసం అందరూ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ సీహెచ్.కిరణ్ కుమార్, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
న్యాయవాదుల సహకార సంఘం ఏర్పాటు
కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పరస్పర సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు భవన సముదాయంలో అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే సొసైటీ పూర్తిస్థాయిలో న్యాయవాదులకు అందుబాటులోకి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శివకుమార్, బొడ్ల గీతారాణి, కార్యదర్శి సుంకె దేవకిషన్, ట్రెజరర్ బొజ్జ స్వామి పాల్గొన్నారు.
Politics
జడ్చర్ల: పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించానని, వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు తెలుసన్నారు సీఎం రేవంత్రెడ్డి. జడ్చర్ల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కేసీఆర్ ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కెసీఆర్ను లంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే…పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదన్నారు.
రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికిఖర్చు చేశాం. ఇలా మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
తాడేపల్లి : ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగింది నిజమేననడానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఉదాహరణ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకపోవడం డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడానికి నిదర్శమన్నారు. అసలు తమ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.
ఈరోజు(శుక్రవారం, జూన్ 5వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘డీఎస్సీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు అన్యాయం జరిగింది. విద్యా శాఖ ఉన్నతాధికారులు అసత్యాలు మాట్లాడుతున్నారు. కాల్ లెటర్స్ 1:1 రేషియోలో పంపాము అంటున్నారు. అసలు దానికి అర్థం ఏంటి..?, వారి మాటలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ యధాతథంగా అమలు చేయాలి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వారిని హారిజాంటల్ రిజర్వేషన్ లో ఇచ్చాం అంటున్నారు.
ఏ కేటగిరీలో స్పోర్ట్స్ కోటా వాళ్ళు వస్తారో మీకు తెలియదా ?, స్పోర్ట్స్ కోటాలో కొందరికి ఇవ్వటానికి పిలిచిన వాళ్లలో కొంతమందిని బలిచేసినట్లుగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడా జరగదు. మీరు చేసింది కరెక్టేనా అనేది పునః సమీక్ష చేసుకోవాలి. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ విధానంలో చేయని విధంగా మీరు చేశారు. మీరు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనిది వాస్తవమా.. కాదా ?,
కొన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు కూడా చెప్పలేక పోతున్నారు. టీచర్, డాక్టర్ పోస్టులు ఇష్టం వచ్చినట్లు ఇవ్వటం కుదరదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాన్ని వైలెట్ చేయడానికి లేదు. ఆర్డర్స్ తయారు చేసిన వాళ్లు, అమలు చేసిన వాళ్లు కోర్టులకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ, టెట్ రాయకుండా.. బీఎడ్, డీఎడ్ చదవకుండా వారికి ఎలా పోస్ట్స్ ఇస్తారు. శాప్ ధృవీకరణ ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, క్వాలిఫై అయిన కొందరు అభ్యర్థులతో మా పార్టీ వారిని తిట్టిస్తున్నారు. అన్యాయం అయినవారి పట్ల సానుభూతి చూపించాలి..
పోస్టులు అమ్ముకున్న ఉదంతాలపై విచారణ చేపట్టాలి. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన అభ్యర్థికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. సెల్ఫ్ డిక్లరేషన్ రాయటం రాని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సర్టిఫికెట్స్ అప్లోడ్ కాని వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు ?, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రశ్నించారు.
International
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.
కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది.
Telangana
సాక్షి,భువనగిరి: అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా గత 20 రోజుల నుండి నిమ్స్ దవాఖానలో డైరెక్టర్ డా.బీరప్ప పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు.
నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కొమ్మిడి నర్సింహారెడ్డిని పరామర్శించి నిమ్స్ డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులతో చర్చించారు. కొమ్మిడి నర్సింహారెడ్డితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుండి రెండు దఫాలుగా 1978లో, 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నిజామాబాద్: జిల్లాలోని భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. బ్రాహ్మణ కుంటలో పడి ముగ్గురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతిచెందిన చిన్నారులను సురేష్(4), వర్షిని(5), హరీష్(10)గా గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకొచ్చిన చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బ్రాహ్మణ కుంటలో దిగారు. స్నానం చేద్దామని దిగిన చిన్నారులు అక్కడ లోతు గ్రహించకపోవడంతో అందులోనే మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
పిల్లలను తల్లిదండ్రులు వెతుక్కునే క్రమంలో బ్రాహ్మణ కుంట వైపు వెళ్లారని ఎవరో చెప్పడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలించగా చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. దాంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sports
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది.
దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించినట్లుగా అనిపిస్తోంది. ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం న్యూజిలాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది.
61/6 క్రితంరోజు స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఎక్కువసేపు నిలవలేకపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో కైల్ జేమీసన్ (38 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలవగా.. గ్లెన్ ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో చెలరేగగా, జోష్ టంగ్ 3, అకిన్సన్లు రెండు వికెట్లు తీశాడు.
దీంతో ఇంగ్లండ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడినప్పటికీ టీ విరామ సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (31), అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ఎమిలియో గే (57) అర్థసెంచరీ సాధించగా, బెన్ డకెట్ (33) పర్వాలేదనిపించాడు.
కివీస్ బౌలర్లలో నాథన్ స్మిత్ మూడు వికెట్లు తీయగా, విలియం రూర్కీ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 193 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బౌలర్లకు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్పై మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఇంగ్లండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
That fifth-wicket feeling 🥰
🤝 @IGcom pic.twitter.com/aeRVZsTyz3— England Cricket (@englandcricket) June 5, 2026
Movies
రామ్ చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే పెద్ది మూవీ సంగతి పక్కనపెడితే.. గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి గురించే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. మూవీ ప్రమోషన్స్లో రామ్ చరణ్ కంటే అతనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అతను మరెవరో కాదు.. రామ్ చరణ్ ప్రత్యేక బాడీ గార్డ్ కెవిన్ కుంటా. అతను ఎక్కడికెళ్లినా సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పెద్ది సినిమాతో కెవిన్ కుంటా ఒక్కసారిగా స్టార్గా మారిపోయాడు.
అతనికి ఫేమ్ రావడంపై రామ్ చరణ్ సైతం ఫన్నీగా స్పందించారు. మీరు ఫేమస్ చేసేశారు.. కెవిన్ను బయటికి పంపకుండా చేశారంటూ సరదాగా మాట్లాడారు. తాజాగా కెవిన్ కుంటా ఫిట్నెస్పై ఎంత శ్రద్ధ పెడతారో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. అతను జిమ్లో వర్కవుట్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ కెవిన్ కుంటా డెడికేషన్కు ఫిదా అవుతున్నారు.
"Like boss, like bodyguard." 😎🔥#MassaMassa pic.twitter.com/tiFrCqMwg3
— ᶠʳᵒᵒᵗʸపెద్ది🦁 (@Mouli_Ka) June 4, 2026
Family
కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలాంటి సంఘటనే న్యూయార్క్లో చదువుకునే భవిత మండవ జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఉన్నత చదువు కోసం వెళ్లి ఫ్యాషన్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇదంతా రెండేళ్ల కిందట జరిగింది. ఓ రోజు న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్వే స్టేషన్లో నిలబడి ఉండగా ఓ మోడలింగ్ ఏజెంట్ ఆమెను సంప్రదించాడు. అంతే ఆశ్చర్యకరంగా రెండు వారాల్లో ఇటలీలోని మిలాన్కు వెళ్లి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘బోటెగా వెనెటా’ కోసం ర్యాంప్ వాక్ చేసింది.
భవిత హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయి. జేఎన్టీయూలో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లింది. మోడలింగ్ రంగంలో భవితకు డియోర్, కొరేజెస్ వంటి ప్రముఖ ఫ్యాషన్ హౌస్లలో పని చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు 2025లో ప్రముఖ టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్లో ఒకటైన ‘చానెల్’ నిర్వహించిన ఆర్ట్ షోను ప్రారంభించిన తొలి భారతీయ మోడల్గా చరిత్ర సృష్టించింది. ఆ షో కూడా న్యూయర్క్ సబ్వే స్టేషన్లో జరగడం విశేషం.
2026 మార్చిలో చానెల్ ఆమెను భారతీయ అంబాసిడర్గా నియమించింది. ఫోర్బ్స్ ఏషియా 30 అండర్ 30 జాబితాలో ఆర్ట్స్ విభాగంలో ఆమెకు స్థానం లభించింది. అవకాశం రావడం కాదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి స్థాయికైనా ఎదుగుతారనడానికి భవిత నిదర్శనంగా నిలిచింది.
చదవండి: 60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
Business
బంగారం, వెండి గురించి.. వాటిపై పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) తాజాగా డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా?, అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చాలామంది డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా? అనే ప్రశ్న వేస్తుంటారు. కానీ వ్యాపారవేత్త కావడం వెనుక అసలు ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకూడదని కియోసాకి చెబుతారు. డబ్బు కోసం మాత్రమే వ్యాపారం మొదలు పెడితే, అది దీర్ఘకాలంలో విజయాన్ని ఇవ్వకపోవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.
నిజానికి డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కాదు. కానీ సంపాదించిన డబ్బును నిలుపుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల త్వరగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదు, ఒక ఆర్థిక విద్య కూడా అని కియోసాకి పేర్కొన్నారు.
ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో.. ఆస్తులు, బాధ్యతలు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం అవసరం. అలాగే నగదు ప్రవాహం, అప్పుల నిర్వహణ, పన్నుల వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడదు. ఈ జ్ఞానం లేకపోతే పెద్ద మొత్తంలో సంపాదించినా.. తిరిగి కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..
చాలామంది డబ్బు గురించి సలహాలు ఇస్తారు, కానీ వారు స్వయంగా వ్యాపారం చేసి అనుభవం పొందినవారు కాకపోవచ్చు. కాబట్టి ఎవరి సలహా అయినా గుడ్డిగా నమ్మకూడదు. స్వయంగా ఆర్థిక విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం. వ్యాపారవేత్త కావడం అంటే రిస్క్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ రిస్క్ను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం కూడా.
వ్యాపారం ప్రారంభించే ముందు 'నేను ఎంత డబ్బు సంపాదించగలను?' అనే ప్రశ్నకన్నా.. నేను సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించగలను? అనే ప్రశ్న చాలా ముఖ్యమైంది. సరైన ఆర్థిక జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం కూడా సాధ్యమవుతుందని కియోసాకి అభిప్రాయం.
