Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • గత కొన్నిరోజులుగా ఎప్‌స్టీన్ అనే వ్యక్తి పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి చాలానే కారణాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈయన.. అగ్రరాజ్యాన్ని కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. 1980-90ల్లో పేద, మధ్య తరగతి బాలికలకు, అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి..ఫ్లోరిడా,న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణ. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి, మరో యువతిని ఆ బంగ్లాకు తీసుకొస్తే మరికొంత కమీషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఇది అప్పట్లో బయటపడింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

    2005లో ఎప్‌స్టీన్‌ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఆరోపణలు వచ్చేసరికి అరెస్ట్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో.. జైలులోనే అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అది ఆత్మహత్య అని పోలీసులు తేల్చినప్పటికీ.. ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే ఎప్‌స్టీన్‌ మరణించిన ఏడాది తర్వాత ఇతడి జీవితం ఆధారంగా 'జెఫ్రీ ఎప్‌స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్‌ఫ్లిక్స్‌‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌కి లిసా బ్రయంట్ దర్శకత్వం వహించారు.

    తాజాగా ఎప్‌స్టీన్ ఫైల్స్ మరోసారి వైరల్ అవుతుండటంతో ఆరేళ్ల క్రితం రిలీజైన ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో టీచర్ స్థాయి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్‌స్టీన్ ఎలా ఎదిగాడు? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఏంటి? చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల ఏంటనేది చూపించారు.అయితే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ తదితరుల పేర్లు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది.

    (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీలో ట్విన్స్‌.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన)

  • మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న కొత్త సినిమా కథ ఇప్పటికే ఫైనల్ అయింది. పుష్ప తరహాలోనే ఇది కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతుందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

    ఇక హీరోయిన్ విషయంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. రంగస్థలం సమయంలో మొదట అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను తప్పించి సమంతను తీసుకున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సమయంలో నిరాశ చెందిన అనుపమకు తప్పకుండా మరో చిత్రంలో ఒక మంచి పాత్రకు తీసుకుంటానని సుకుమార్ మాటిచ్చాడు.

    ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. చరణ్-సుక్కూ కాంబో మళ్లీ కలిసింది. అనుపమ కూడా ఇంకా లైమ్‌లైట్‌లోనే ఉంది. ఈసారి ఆమెకు ఛాన్స్ వస్తుందా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తన కెరీర్‌లో అనుపమ కొన్ని మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా తనకు మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ తనకు ఇప్పటి వరుకు స్టార్ హీరోల రేంజ్‌లో మాత్రం ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. నటనలో మాత్రం అనుపమను తక్కువ చేయలేం. మరి ఈసారైనా ఆమెకు సుకుమార్ ఛాన్స్ ఇస్తాడా?

    సుకుమార్ ఈసారి రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందో, దానికి అనుపమ సరిపోతుందో లేదో చూడాలి. లేకపోతే మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చరణ్-సుక్కూ సినిమా అధికారిక ప్రకటన వచ్చే నెలలో వస్తుంది. హీరోయిన్ ఎవరన్నది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  
     

  • టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కథ మళ్లీ మొదటికొచ్చింది. గతంలో తలెత్తిన సినీ కార్మికుల వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా  టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్  సభ్యులు ఫిల్మ్ ఫెడరేషన్‌ అధ్యక్షుడికి లేఖలు రాశారు. దీంతో ముగిసిపోయిందనుకున్న సమస్య మళ్లీ అసమ్మతి సెగలకు కారణమైంది. 

    తమ సమస్యలు ఈ నెలాఖరు లోపు పరిష్కరించాలని కోరుతూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని యూనియన్ల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి మాకు న్యాయం చేయాలని యూనియన్ నాయకులు అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే మార్చి ఒకటి నుంచి సమ్మెకు దిగుతామని టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు.

    cine workers
     

  • రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్‌కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఉపాసన తన పోస్ట్‌లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం.  తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ  మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన  ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

     

  • ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన అక్యూజ్‌డ్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

    ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకి అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో వస్తోన్న ఈ చిత్రంలో కొంకణాసేన్‌ శర్మ కీలక పాత్రలో నటించారు. గతంలో ఆమె లైఫ్‌ ఇన్‌ ఏ మెట్రో, వేకప్‌ సిద్, ‘మెట్రో ఇన్‌ దినో’ లాంటి సినిమాల్లో నటించారు.
     

     

  • రన్‌ రాజా రన్‌, పటాస్‌, దోచేయ్‌, రాజుగారి గది, కుమారి 21 ఎఫ్‌, ఎక్కడికి పోతావు చిన్నవాడు, మజిలీ, సామజవరగమన.. ఇలా అనేక సినిమాలు చేశాడు నటుడు సుదర్శన్‌. నెల్లూరు యాసలో చెప్పే డైలాగులతోనే అతడు ఫేమస్‌ అయ్యాడు. ఎక్కువగా హీరో స్నేహితుడు పాత్రల్లో కనిపించాడు. ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాలో కనిపించాడు. 

    చదువు మధ్యలోనే..
    తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సుదర్శన్‌ మాట్లాడుతూ.. చిన్నప్పుడు క్లాస్‌ ఫస్ట్‌. కానీ బీటెక్‌ మధ్యలోనే ఆపేశాను. చాలా బిజినెస్‌లు, పని చేసి చివరకు సినిమాల్లోకి వచ్చాను. మూవీ ఇండస్ట్రీ అనగానే ఇంట్లోవాళ్లు భయపడ్డారు. కానీ, నన్ను వెండితెరపై చూసి సంతోషపడ్డారు.

    గోదావరిలో పడిపోయా..
    కుమారి 21 ఎఫ్‌ రిలీజ్‌కు ముందు ఓ చిన్న సినిమా షూటింగ్‌ కోసం గోదావరి జిల్లాకెళ్లాను. చిత్రీకరణ సమయంలో నేను గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రాదు. నేను చనిపోయానని అందరికీ ఫోన్లు వెళ్లాయి. లోకల్‌ మీడియా లొకేషన్‌కు చేరుకుంది. నానాకష్టాలు పడి నన్ను బయటకు లాగారు.

    బతికే ఉన్నా..
    నేను బతికే ఉన్నానని తెలుస్తోంది కానీ, కళ్లు తెరవడానికి గంట సేపు పట్టింది. ఈ సంఘటన తర్వాత ఇంట్లోవాళ్లు తిట్టి సినిమాలు వద్దు, ఇంటికి వచ్చేయ్‌ అన్నారు. నా తొలి మూవీ రన్‌ రాజా రన్‌. దీనికి నేను రూ.3500 పారితోషికం అనుకున్నాను. రిలీజైనవి, కానివి కలుపుకుంటే దాదాపు 150 సినిమాలు చేశాను అని సుదర్శన్‌ చెప్పుకొచ్చాడు.

    ప్రభాస్‌ ఇంటి ముందు వర్షంలో..
    సుదర్శన్‌ ఇంకా మాట్లాడుతూ.. ప్రభాస్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బర్త్‌డే రోజు నేను, నా స్నేహితుడు హీరో ఇంటికెళ్లాం. ఇంటి గేటు ముందున్న చెట్టు కింద నిల్చున్నాం. ప్రభాస్‌.. బాహుబలి ప్రీ ప్రొడక్షన్‌ కోసం కేరళ వెళ్లాడు, లేడని చెప్పినా మేము వినలేదు. అభిమానులు వచ్చి వెళ్లిపోతున్నారు. మేము మాత్రం కదల్లేదు. తిండీ తిప్పలు మానేసి ఉదయంనుంచి అర్ధరాత్రి ఒంటిగంటవరకు ఆ చెట్టు కిందే వర్షంలో తడుచుకుంటూ నిల్చున్నాం. ఇంతలో మమ్మల్ని లోపలకు పిలిచారు. నాతో కేక్‌ కట్‌ చేయించి, తినమన్నారు. ప్రభాస్‌ వచ్చాక ఈ ఫోటోలు చూపిస్తాం.. వెళ్లిపోండి అన్నారు. ప్రభాస్‌ నిజంగానే లేడని అర్థమైంది. అయినా ఆర్టిస్టులను ఇలా ఇబ్బందిపెట్టడం తప్పని తర్వాత తెలిసొచ్చింది అన్నాడు.

    చదవండి: పైసా పారితోషికం తీసుకోని తమన్నా..ఎందుకంటే?

  • సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రాల్లో దృశ్యం-3 ఒకటి. గతంలో విడుదలైన రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ ఫ్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3  ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది.  జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించనుంది.

    అయితే ఈ సినిమాలో ఐజీ గీతా ప్రభాకర్ పాత్రలో మెప్పించిన నటి ఆశా శరత్‌. తాజాగా ఆమె ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోతుందని తెలిపింది. మిమ్మల్ని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందని పేర్కొంది. ఈ క్లైమాక్స్ చూస్తే మీరంతా కచ్చితంగా షాకవుతారని చెప్పుకొచ్చింది.

    అసలు ఎవరీ ఆశా శరత్?

    దృశ్యం ఫ్రాంచైజీలో ఛాన్స్ కొట్టేసిన ఆశా శరత్‌ ఎవరనే విషయంపై నెట్టింట చర్చ మొదలైంది. అసలు ఆమె సినిమాల్లో ఎలా వచ్చిందనే దానిపై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజాగా ఆశా శరత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. మలయాళ బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఓకే ఒక్క సీరియల్‌తో మూవీస్‌లో అడుగుపెట్టింది.

    స్వతహాగా డ్యాన్సర్ అయినా ఆశా శరత్.. మలయాళంలో 'కుంకుమ పువ్వు' అనే  సీరియల్‌తో నటనారంగ ప్రవేశం చేసింది. ఇందులో లీడ్ రోల్ అయినా ప్రొఫెసర్ జయంతి పాత్ర పోషించింది.  ఈ క్యారెక్టర్‌తోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ‍అలా తనకు కుంకుమ పువ్వు సీరియల్‌లో నటిస్తున్నప్పుడే దృశ్యం సినిమాలో అవకాశం వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఫ్రైడే, కర్మయోధ, అర్ధనారి, జకరియాయుడే గర్భిణికల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ దృశ్యం సినిమానే ఆమె  కెరీర్‌ను మలుపు తిప్పింది. మలయాళంలోనే కాకుండా కన్నడ, తమిళ వెర్షన్లలో కూడా అదే పాత్రను పోషించింది.

    ఆశా శరత్ మాట్లాడుతూ.. "నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఆందోళన ఉండేది. సీరియల్‌లో జయంతి పాత్ర అనేది ఎమోషనల్‌తో కూడుకున్నది. ఒకవేళ ప్రేక్షకులు గీతా ఐపీఎస్ కూడా పోలీసు యూనిఫాంలో ఉన్న జయంతి లాగే ఉందని భావిస్తే ఎలా? అది సినిమాపై, నాపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన చెందా. కానీ వారి స్పందన నన్ను ఆశ్చర్యపరిచింది.  మలయాళీలు చాలా తెలివైనవారు. పాత్రల మధ్య తేడాను ఎలా గుర్తించాలో వారికి బాగా తెలుసు' అని గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, మురళి గోపి, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.
     

  • అది విని చాలా ఎమోషనల్ అయ్యా: అనిల్ రావిపూడిటాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టేశారు. మెగాస్టార్‌తో తీసిన మనశంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్.. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేశారు.

    తాజాగా హై టీజర్‌కు ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడి.. తనతో కలిసి పని చేసిన సాయికృష్ణపై ప్రశంసలు కురిపించారు. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ల నాన్న డ్రీమ్ అని తెలిపారు. కానీ ఆ కల నేరవేరకుండానే ఆయన వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఈ మాటలు విన్నప్పుడు నేను చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యానని అనిల్ రావిపూడి అన్నారు. సాయి బాగా చేస్తాడని తెలుసు.. కానీ ఇంత బాగా చేస్తాడనుకోలేదని కొనియాడారు. ఈ సినిమాలో చాలా ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌గా చేశాడని అనిల్ ప్రశంసించారు. 

    కాగా.. సాయి కృష్ణ, అనన్య శర్మ,ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.  
     

  • వాలంటైన్స్‌ డే కానుకగా అనేక సినిమాలు రిలీజవుతున్నాయి. అలా ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు ఫిబ్రవరి 13న బాలీవుడ్‌లో 'ఓ రోమియో' రిలీజవుతోంది. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. విక్రాంత్‌ మాస్సే, దిశా పటానీ, తమన్నా భాటియా, నానా పటేకర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    స్టార్‌ అవడానికి ముందే..
    అయితే విక్రాంత్‌ మాస్సే, తమన్నా ఈ సినిమాను ఉచితంగానే చేశారట! ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ స్వయంగా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితమే విక్రాంత్‌ మాస్సే 'ఓ రోమియో' చేసేందుకు ఒప్పుకున్నాడు. 12th ఫెయిల్‌ తర్వాత అతడు పెద్ద స్టార్‌ అయ్యాడు. ఆ తర్వాత తనను మళ్లీ కలిశాను. విక్రాంత్‌ ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. అయితే ఉచితంగానే నటిస్తానన్నాడు. 

    ఉచితంగానే..
    నేను డైరెక్ట్‌ చేసిన మఖ్బూల్‌ సినిమా చూసి ప్రేరణ పొందే సినిమాల్లోకి వచ్చానని, అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు. అందుకు బహుమతిగా ఈ మూవీలో ఉచితంగా యాక్ట్‌ చేశాడు. 8-9 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. తమన్నా కూడా ఎటువంటి పారితోషికం తీసుకోకుండానే యాక్ట్‌ చేసింది. తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో అదే కీలకం. తమన్నా దాదాపు 12 రోజులపాటు షూటింగ్‌కు వచ్చింది. అంతేకాకుండా రిహార్సల్స్‌కు కూడా వచ్చింది అని విశాల్‌ భరద్వాజ్‌ గుర్తు చేసుకున్నాడు.

    చదవండి: సెట్‌లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేశ్‌

  • ‘శంబాల’ చిత్రంతో రీసెంట్‌గా ఆది సాయి కుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. మరోసారి అద్భుతమైన కథతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, గ్లామరస్ హీరోయిన్ వేదిక హీరోయిన్‌గా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘జంగిల్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథనం, ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది అని చిత్రయూనిట్ చెబుతోంది.

    ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ బ్యానర్ మీద రాఘవ రెడ్డి పబ్బతి ప్రతిష్టాత్మకంగా తెలుగులో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను ఫ్రైడే పిక్చర్స్ స్వాధీనం చేసుకోవడం విశేషం. అతి త్వరలోనే గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. ప్రస్తుతం ‘జంగిల్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఫైనల్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి.

    ఈ మూవీలో ఆది సాయికుమార్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. హారర్‌తో పాటు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇకపై కంటిన్యూగా అప్డేట్‌లను ఇస్తామని టీం చెబుతోంది.

  • గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్‌’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్‌ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్‌ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. 

    ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్‌ టాక్‌తోనే భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు. 

    ఇక సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్‌ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్‌.. డిజిటల్‌ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్‌ చేస్తుంది. నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం  గ్లోబల్‌ టాప్‌ 10 నాన్‌ ఇంగ్లీష్‌ చిత్రాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుంది.

  • సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య రాజేశ్‌ దశ తిరిగిపోతుందనుకున్నారంతా! స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్‌ అందుకుని ఫుల్‌ బిజీ అవుతుందనుకున్నారు! కానీ, అలాంటిదేమీ జరగలేదు. పెద్ద సినిమాల ఆఫర్లు రాలేదు. దీంతో తెలుగులో చిన్న సినిమా అయినప్పటికీ కథ నచ్చడంతో 'ఓ సుకుమారి'లో కథానాయికగా నటిస్తోంది.

    స్వయంగా వడ్డించిన హీరోయిన్‌
    అలాగే తమిళంలో రెండు, కన్నడలో ఒక మూవీ చేస్తోంది. తాజాగా తను సెట్‌లో చెఫ్‌గా మారింది. సెట్‌లో ఉన్నవారికి స్వయంగా దోసెలు/ ఊతప్పం వేసి వడ్డించింది. సెట్‌లో ఈ పని చేయడమంటే నాకెంతో ఇష్టం అంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

    కీర్తి ఫేవరెట్‌
    పద్ధతిగా చీర కట్టుకున్న ఐష్‌.. పెనంపై చిన్న దోసెలు వేస్తూ, వాటిని తిరగేస్తూ వేడివేడిగా వడ్డించింది. ఇంకా ఎవరికి కావాలి, రండి అంటూ అక్కడున్నవారితో ఇట్టే కలిసిపోయింది.  ఈ వీడియో వైరల్‌గా మారగా కీర్తి సురేశ్‌ హే, దోసె.. దోసె అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టింది. అందుకు ఐష్‌ స్పందిస్తూ.. అవును, నీ ఫేవరెట్‌ అని రిప్లై ఇచ్చింది.

     

     

    చదవండి: 

  • ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫంకీ’. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్, ‘ధీరే ధీరే’, ‘రట్టాటటావ్’ పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘యమ యమ్మ’ విడుదలైంది.

    భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ మాస్ గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించాడు. గాయని రోహిణి సోరట్ తో కలిసి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించడం విశేషం. తమ ఉత్సాహభరితమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.  విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ అదిరిపోయే మాస్ బీట్ లు, ఆట సందీప్ మాస్టర్ అద్భుతమైన నృత్యరీతులతో మాస్ పాటల అభిమానులకు విందు భోజనంలా మారింది.

    గీతావిష్కరణ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతోనే సంవత్సరం విరామం తీసుకొని ఫంకీ సినిమా చేశాను. ఈ చిత్రం మీ అందరినీ మెప్పిస్తుంది. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. మీ కుటుంబంతో కలిసి థియేటర్ కి రండి. రెండు గంటల పది నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు." అన్నారు. 

  • అనన్య శర్మ,  ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్‌ను విడుదల చేశారు.  

    ఈ టీజర్ చూస్తుంటే యూత్‌ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో  రేవంత్‌ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్‌, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు.

     

  • ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ‘ధురంధర్‌’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్‌ టాప్‌ 10 నాన్‌ ఇంగ్లీష్‌ చిత్రాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్‌ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్‌లో పాక్‌ ప్రజలు చూస్తున్న టాప్‌ 10 సినిమాల్లో దురంధర్‌ మొదటి స్థానంలో ఉంది.

    గతేడాది డిసెంబర్‌ 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్స్‌ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. 

    అయితే పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్‌ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ హీరోగా నటించగా.. విలన్‌గా అక్షయ్‌ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా రాబోతుంది. ధురంధర్‌ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.

  • ఈ నగరానికి ఏమైంది?, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్‌ భాస్కర్‌. మీకు మాత్రమే చెప్తా మూవీతో హీరోగా మారాడు. ఇటీవల ఈయన హీరోగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్‌ సినిమా జయజయజయహేకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

    గాయపడ్డ సింహం
    తాజాగా తరుణ్‌ భాస్కర్‌ గాయపడ్డ సింహంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని కల్యాణ్‌ చక్రవర్తి, భానుకిరణ్‌, విజయ్‌ కృష్ణ, ఉమేశ్‌ కుమార్‌ నిర్మించారు. సోమవారం ఈ మూవీ ట్రైజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌, ట్రైలర్‌ను మిక్స్‌ చేస్తే వచ్చిన పదమే ట్రైజర్‌. ఈ ట్రైజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తరుణ్‌పై కొన్ని కామెంట్స్‌ వచ్చాయి.

    హీరోగా సక్సెస్‌ లేదు
    ఓ రిపోర్టర్‌ మాట్లాడుతూ.. తరుణ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కొన్ని నిరాశపర్చాయి. ఆయన ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు కానీ బాక్సాఫీస్‌ మనసులు గెల్చుకోలేదు అన్నాడు. దానికి వెంటనే తరుణ్‌ భాస్కర్‌ స్పందిస్తూ.. సర్‌, మీరు ఓ కథ రాసి నిర్మించండి, మనం దాన్ని హిట్టు కొడదాం.

    ఫెయిలైతే..
    అయినా నేను ఫెయిలవ్వాలని మీరు ఎందుకని అంతలా కోరుకుంటున్నారు అని సెటైర్‌ వేశాడు. జీవితంలో ఒక్కసారి ఫెయిలైనందుకు ప్రయత్నం ఆపొద్దు. మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎంతమంది ఇలాంటి ప్రశ్నలడిగినా సరే మళ్లీ ట్రై చేస్తా, సక్సెస్‌ వచ్చేవరకు ప్రయత్నిస్తా అనాలి. ఆ ప్రయత్నంలోనే మమీ విజయం దాగి ఉంది. మిగతాదంతా మర్చిపోండి అని యూత్‌కి సలహా ఇచ్చాడు తరుణ్‌ భాస్కర్‌.

    చదవండి: స్పిరిట్‌ నుంచి ఎగ్జిట్‌.. స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌

  • కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా తర్వాత రిషబ్ క్రేజ్‌ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. గతేడాది కాంతార-2 ప్రీక్వెల్‌తో మరో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు.

    ఇక సినిమాల సంగతి పక్కన పెడితే రిషబ్ శెట్టి.. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రగతి శెట్టిని పెళ్లాడారు. 2017లో పిబ్రవరి 9న వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. వీరి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తన సతీమణికి స్పెషల్‌ విషెస్ చెప్పారు రిషబ్ శెట్టి. ట్విటర్‌ వేదికా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలిపారు.

    రిషబ్ శెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ఈరోజుతో అందమైన, ప్రేమపూర్వక వివాహానికి తొమ్మిదేళ్లు. ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకాల నిధి. ఇందులో ఆనందం, బాధ, నవ్వు, ఉత్సాహం ప్రతిది ఉన్నాయి. అన్నింటినీ మించి అంతులేని ప్రేమ ఉంది. ప్రేమ ప్రసరింపజేసే వెలుగు, అది తెచ్చే శాంతి, అది నింపే ఆత్మవిశ్వాసమే నన్ను ఈ రోజు ఇలా మార్చాయి. నా భార్య, నా సహచరురాలు, అదృష్ట దేవత, నా జీవితాన్ని సముద్రమంత విశాలంగా మార్చేసిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. 

    అంతే కాకుండా నా సూపర్ పవర్, నన్ను నడిపించే శక్తి, నా బలానికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు జీవితం మరింత బాగుంటుందని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇది చూసిన రిషబ్ అభిమానులు తమ అభిమాన హీరో జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
     

     

  • టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహా వేడుక జరిగింది. డిసెంబర్ 1, 2025న భూత శుద్ధి వివాహం పేరుతో ఈ వేడుక నిర్వహించారు. ఈ పెళ్లికి అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు.

    అయితే సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీలో నటిస్తోంది.  ఓ బేబీ మూవీ తర్వాత సామ్‌తో దర్శకురాలు నందిని రెడ్డి చేస్తున్న రెండో మూవీ కావడం విశేషం. సమంత స్థాపించిన ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై భర్త రాజ్‌ నిడిమోరుతో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

    ప్రస్తుతం సామ్‌ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్ బాల్‌ లీగ్‌ను ఆస్వాదిస్తోంది. ఈ లీగ్‌లో తన టీమ్‌ విజయాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు కూడా అక్కడే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సామ్, రాజ్ నిడిమోరు సినిమాల్లో కలిసి పనిచేశారు.  రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌ల్లో సామ్ నటించారు.  ఆ తర్వాత వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది.
     

     

  • ప్రభాస్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా స్పిరిట్‌. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య వాయిస్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో ప్రకాశ్‌ రాజ్‌, ప్రభాస్‌ డైలాగులు వినిపించాయి తప్ప మనుషులు కనిపించలేదు. అయినప్పటికీ ఆడియో గ్లింప్స్‌తోనే స్పిరిట్‌కు మంచి హైప్‌ వచ్చింది.

    స్పిరిట్‌పై రూమర్‌
    అయితే ఈ సినిమా నుంచి ప్రకాశ్‌ రాజ్‌ తప్పుకున్నాడంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్‌తో వచ్చిన విభేదాల కారణంగానే ప్రకాశ్‌రాజ్‌ సినిమా నుంచి సైడ్‌ అయిపోయాడని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఈ ప్రచారంపై ప్రకాశ్‌ రాజ్‌ ఘాటుగానే స్పందించాడు. 

    మీ ప్రచారాలు తగలెయ్య
    స్పిరిట్‌ మూవీ గురించి విషపూరిత ప్రచారం చేస్తున్న అందరికీ చెప్పొచ్చేదేంటంటే.. ఇంకా సినిమాలో నా సీన్స్‌ షూటింగే మొదలవలేదు. కానీ, అంతలోనే వాట్సాప్‌ ఫ్యాక్టరీలో ఏవేవో కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోండి, పోయి మీ పని మీరు చూసుకోండి ట్వీట్‌ చేశాడు. దీనికి నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. 

    సినిమా
    దీంతో స్పిరిట్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ తప్పుకున్నాడన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. స్పిరిట్‌ విషయానికి వస్తే.. ప్రభాస్‌, ప్రకాశ్‌రాజ్‌తో సహా వివేక్‌ ఒబెరాయ్‌, తృప్తి డిమ్రి, కాంచన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదల కానుంది.

     

     

    చదవండి: బలవంతంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నా: ప్రిన్స్‌

Family

  • ఒక చెరుకు వ్యాపారి డబ్బు బాగా గడించాడు. వయసు మీద పడటంతో మనసు చిన్నగా ఆధ్యాత్మికం వైపు మళ్ళింది. గుడులూ గోపురాలూ తిరిగాడు. నదీ స్నానాలు చేశాడు. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేశాడు. అలా చేస్తున్న క్రమంలో అతడికి హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది.

    అదేమిటంటే ‘ఏ సేవ మంచిది, మనం ఎవరికి కృతజ్ఞతగా ఉండాలి?’ అని. సమాధానం కొరకు ప్రయత్నించాడు. సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. వారి ఊరికి చాలా దూరంగా ఉన్న గుట్టమీద ఒక సాధువు ఉన్నాడని తెలిసింది. ఆయన్ని అడిగితే సమాధానం దొరుకుతుందని బయలుదేరాడు. దారి సరిగా తెలియక అవస్థలు పడ్డాడు. అప్పటికే బాగా చీకటయ్యింది. వ్యాపారికి ఆ చీకట్లో నడవడం కష్టంగా తోచింది.

    దారిలో ఒక రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని వ్యాపారిని ప్రశ్నించాడు. తను వెళ్తున్న విషయం చెప్పాడు వ్యాపారి. ‘ఆ గుట్టపైకి వెళ్ళడానికి పగలే కష్టంగా ఉంటుంది. రాత్రయింది కాబట్టి మరింత కష్టం. అందులోనూ పురుగూపుట్రా ఉంటాయి. నేను మీకు తోడుగా వస్తాను’ అని చెప్పి లాంతరు పట్టుకుని బయలుదేరాడు. ఎలాగైతేనేం గుట్ట చేరారు. సాధువును కలిశారు. తను వచ్చిన విషయం చెప్పా వ్యాపారి.

    ‘బాగా రాత్రయ్యింది. అలసిపోయి ఉన్నారు. ఇద్దరూ శుభ్రంగా భోజనం చేసి నిద్రపొండి, ఉదయం మాట్లాడుకుందాం’ అని చెప్పాడు సాధువు. ఇద్దరూ అలాగేనని ఒప్పుకున్నారు. తెల్లారిందే లేదో గబగబా నిద్ర లేచిన రైతు పొలం పని ఉంది, నేను బయలుదేరుతాను’ అన్నాడు.

    వెంటనే వ్యాపారి ‘‘చీకట్లో ఉన్న నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు లాంతరుతో తోడు రాకుంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాణ్ణి. మీరు చేసిన సహాయం నా జీవితకాలం మరచిపోను’’ అని చెప్పి పడీపడీ నమస్కరిస్తూ అతడిని సాగనంపాడు.

    చ‌ద‌వండి: సంక్షోభంలో స్థిర‌త్వం

    సాధువు చిరునవ్వు ముఖంతో వ్యాపారిని దగ్గరికి పిలిచి ‘ఒక్క రాత్రి, చీకటిలో ఉన్న నీకు లాంతరు సాయం చేశాడని అతడిని ప్రముఖ వ్యక్తిగా ఆదరిస్తున్నావు. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటినుంచి చీకటిలో ఉన్న నీకు ఆరని దీపంలాగా, నీ ఆలనాపాలనా చూసి, మంచి చెడ్డలు నేర్పించారు నీ అమ్మానాన్నలు. ఎన్నో కష్టాలకు ఓర్చి విద్యాబుద్ధులు నేర్పి నిన్ను ఇంతవాడిగా చేసిన అమ్మానాన్నలకి చేసే సేవకన్నా వేరే ఏ సేవా గొప్పదికాదు, వారికి కృతజ్ఞతగా  ఉండటానికి మించింది ఏదీ లేదు’ అని హితవు చెప్పాడు.

    ‘నిజమే, నిరంతరం తను కాలుతూ వెలుగునిచ్చే దీపంలాగా మన జీవితాలకు వెలుగునిచ్చే అమ్మా నాన్నలకు మించిన గొప్పవారు ఎవరు ఉంటారని’ తెలుసుకున్న వ్యాపారి అక్కడినుంచి కదిలాడు.
    – ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

  • భారత కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే అది ప్రస్తుత కాలంలో చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ప్రాణప్రదంగా పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నవాళ్లే..కడదాక కలిసి ఉండలేకపోవడం బాధకరం. అది కూడా చిన్నచిన్న వాటికి, మనస్పర్థలతోటి విడాకులు తీసుకుంటున్నారు. తనకోసం అన్ని వదులుకుని వచ్చిందన్న భావం మగవాళ్లలో కొరవడం ఒక కారణమైతే..తన మాటే నెగ్గాలన్న అహంకారం మరొక కారణం అంటున్నారు మానసిక నిపుణుల. అచ్చం అలాంటి కారణాలతో ఈ టెక్‌ జంట విడిపోయింది. అందుకు గల కారణం చూస్తే..కన్నీళ్లు వస్తాయి. విమెన్‌ సాధికారత అన్న మాటలు వెగటుపుడుతాయి. దయచేసి మహిళల్ని మహారాణులు చేయకండి అర్థచేసుకోండి స్వామి..చాలు అని గొంతెత్తి అనాలనిపిస్తోంది. 

    అసలేం జరిగిందంటే..ఈ టెక్‌ జంట ప్రేమ కథ విడాకులతో ముగియడంతో నెట్టింట వైరల్‌గా మారింది. సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్‌ ప్రకారం. ఆ టెక్‌ జంట పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకున్నారు. విజయవంతంగా జీవితాన్ని నిర్మించుకున్నారు. గుర్తింపును వెల్లడించిన ఆ ఇంజనీర్‌ జంటకు ఇద్దరు పిల్లుల, చక్కటి ఆర్థిక భద్రతా ఉంది. 

    ఆమె మంచి కష్టపడి పనిచేసే ఉద్యోగి. గర్భధారణ తర్వాత ఆరునెలలు మినహా ఎన్నడు విరామం తీసుకోలేదు. తొమ్మిదో నెల వరకు ఆఫీసుకు వెళ్లింది. పిల్లలు, భర్త కోసం పనిచేయడం ఆమెకు చాలా సంతోషాన్నిస్తుంది కూడా. రెండో గర్భధారణ తర్వాత ఆ మహిళ కంపెనీ మార్చింది. కొత్త టెక్నాలజీ నేర్చుకుంది. ఇప్పుడు తన భర్త కంటే అధిక వేతనం సంపాదిస్తోంది కూడా. అయితే అత్తగారు అనారోగ్యానికి గురి కావడంతో భర్త తన భార్యను ఉద్యోగం మానేసి ఆమె బాగోగులు చూసుకునే సంరక్షకురాలిగా మారాలని ఆదేశించాడు. 

    అందుకు ప్రెగ్నెన్సీ వల్ల చాలాసార్లు తాను ఉద్యోగానికి విరామం ఇచ్చాను..ఇప్పుడు నీ టైం వచ్చింది కాబట్టి మీరే జాబ్‌ మానేయండి, ఫైనాన్షియల్గా మొత్తం చూసుకుంటాను, అలాగే ఇంటి బాగోగుల్లో కూడా హెల్ప్‌ చేస్తానని చెప్పింది. అవసరమైతే పిల్లల్ని చూసుకునేందు వాళ్ల అమ్మను కూడా పిలిపిస్తానని అంది. అందుకు భర్త తల్లి ససేమిరా అంది. కోడలు తల్లి ఇక్కడకు రావడం సరైన కాదని..పైగా ఉద్యోగం కోడలే మానేయాలని పట్టుబట్టింది. పైగా అత్తగారిని చూసుకోవడం అనేది కోడలు బాధ్యతని ఆమె గట్టిగా విశ్వసిస్తోంది. 

    చివరికీ కోడలు ఉద్యోగం మానేయడం లేదనే అక్కసుతో ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. దాంతో విసుగుపోయిన ఆమె పిల్లలుతో సహా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. అలాగే భర్తకు ఓ ఆఫర్‌ కూడా ఇచ్చింది. ఆమెకు ఇష్టమైతే తన ఇంటికి వచ్చి ఉండొచ్చని, తన అమ్మనాన్నలు చూసుకుంటారని అంది. అంతే భర్త ఉద్యోగం మానేయడం లేదనే కోపంతో..విడాకులు ఇస్తానని బెదిరిస్తూ లీగల్‌ నోటీసు పంపాడు. చివరికీ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. 

    ఎంతో విజయవంతంగా నిర్మించుకున్న ఆజంట సంసారం విచ్చన్నమైంది, విడాకులు తీసుకున్నారు. ఇక్కడ ఒక మహిళ ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా..ఎంత ప్రేమించినా..త్యాగం చేసినా విలువ ఉండదు. జస్ట్‌ తన స్వాతంత్య్రాన్ని వదులుకోను అనగానే ఆ భార్య ఒక్కసారిగా పనికిరానిదిగా అయిపోయింది. నెటిజన్లు సైతం ఆమె తల్లికి అనారోగ్యంగా ఉంటే..ఆ భర్త ఉద్యోగం మానేస్తాడా? అని ప్రశ్నించారు, మరికొందరు ఇక్కడ ఆమె బాధ్యత నిరాకరించిందని కాదని, కేవలం తనకంటే ఎక్కువ సంపాదిస్తుందన్న విద్వేషం విడాకులకు దారితీసిందని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

    చదవండి: భార్య కోసం ఏడాదికి 3 కిలోల బంగారం కొంటున్నాడు..!

  • దక్ష ప్రజాపతికి తన కూతురు సతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒక మహాయాగాన్ని నిర్వహించినప్పుడు సతీదేవిని, మహాశివుడిని ఆహ్వానించడు. పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞాన్ని చూడాలనే కోరికతో శివుడు నిరాకరించినప్పటికీ సతీదేవి అక్కడికి వెళుతుంది. తండ్రి చేసిన అవమానంతో యజ్ఞగుండంలోకి వెళ్లి, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ స్థలమే దక్షేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ సమీపంలోని కంఖాల్‌ ప్రాంతంలో ఉన్న దక్షేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయాన్ని సందర్శించి నాటి పౌరాణిక విశేషాలు తెలుసుకోవచ్చు. శివరాత్రి రోజులలో అత్యంత ప్రాచీన ఆలయాల సందర్శనకు,ఆధ్యాత్మిక విషయాల అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతంది..

    శక్తి పీఠాల కథకు ఆది
    ప్రధాన ఆలయం లోపల ఉన్న సతీకుండ్‌ అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. పౌరాణిక కథనాల ప్రకారం ఈ యజ్ఞగుండంలోనే సతీదేవి అగ్ని ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకుందని విశ్వాసం ఉంది. ఈ ఘటన తరువాత మహాశివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ తాండవం చేయగా, విశ్వ సమతుల్యత దెబ్బతింటుందని భావించిన శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విభజించాడని పురాణాలు చెబుతాయి. 

    అవి మొత్తం 108 భాగాలు కాగా, వాటిలో ముఖ్యమైన 54 భాగాలు, మరీ ముఖ్యమైన 18 భాగాలే ఈ శక్తి పీఠాల కథకు మూలంగా భావించే ప్రదేశంగా ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ్ర΄ాంగణంలో అనేక ఉ΄ాలయాలు, పవిత్ర వృక్షాలు దర్శనమిస్తాయి. మరోవైపు గంగానది నిశ్శబ్దంగా ప్రవహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేస్తుంది. ఇక్కడ భక్తులు పితృకార్యాలు, నదీ పూజలు, పిండప్రదానాలు నిర్వహిస్తారు.

    అహంకారానికి అంతం
    దక్షేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయ సముదాయంలో దశ మహావిద్య ఆలయం, బ్రహ్మేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం, శని ఆలయం, శ్రీరాముడి దర్బార్, శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు రుద్రాక్ష చెట్టును కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని పూర్తిగా దర్శించాలంటే కనీసం రెండు నుండి మూడు గంటల సమయం వెచ్చించాలి. స్థానిక విశ్వాసం ప్రకారం శ్రావణ మాసంలో శివుడు తన అత్తారింటికి వస్తాడని నమ్మకం ఉంది. శివరాత్రి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ కాలంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. దక్షేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం (Daksha Mahadev Temple) ఒక ఆలయం మాత్రమే కాదు అహంకారానికి ముగింపు ఉంటుందని తెలియజేసే పవిత్ర స్థలం. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక భూమి. శక్తి పీఠాల కథతో ముడిపడిన పవిత్ర ప్రదేశంగా భక్తుల విశ్వాసంలో నిలిచింది.

    ఇలా చేరుకోవచ్చు..

    దక్షేశ్వర మహాదేవ్‌ ఆలయం సమీప రైల్వే స్టేషన్‌- హరిద్వార్‌

    సమీప విమానాశ్రయం- డెహ్రాడూన్‌. 

    హరిద్వార్‌ నుండి 35 కి.మీ. రోడ్‌ వే ద్వారా కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. 

    తక్కువ ధర, ఆశ్రమాల వంటి ఉచిత వసతితో సహా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి

    ఇక్కడ కేవలం శాకాహారం మాత్రమే లభిస్తుంది.

    గంగానది ఒడ్డున
    హరిద్వార్‌ (Haridwar) భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మతపరమైన ప్రాచీన నగరం. హిందువులకు పవిత్ర స్థలం. అనేక దేవాలయాల సముదాయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇది హిందువుల ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దక్షేశ్వర మహాదేవ్‌ హరిద్వార్‌లోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది హరిద్వార్‌ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కంఖల్‌లో ఉంది. 

    సలేశ్వరం ప్రకృతి రమణీయత
    శివరాత్రి నుంచి గుర్తు పెట్టుకోవాల్సిన సందర్శన స్థలాల జాబితా తయారుచేసుకుంటే అందులో చేర్చాల్సిన పర్యాటక ప్రాంతం ‘సలేశ్వరం.’ ప్రకృతి ఏర్పాటు చేసిన ఈ ప్రాంత సందర్శన మనలో ఒక ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం క్షేత్రానికి దగ్గరలో.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా నల్లమల అడవులలో కొలువై ఉన్న యాత్రా స్థలం ఇది. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం. 

    శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లోయలో ఉన్న గుహలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతానికి సందర్శకులు ముగ్ధులు అవుతుంటారు. లోయలోకి ట్రెక్కింగ్‌ చేసేవారికి అనుకూలం. లోయ అడుగు భాగంలో ఉన్న శివయ్యను దర్శించుకోవాలంటే గుట్టల మధ్య నుంచి కిందుగా కాలి నడకన ప్రయాణించాల్సి ఉంటుంది. 

    ఆ దారిలో ఎన్నో గుహల నుండి జాలువారే సన్నని జల ధారలు కనిపిస్తూ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అడుగు భాగంలో ఉన్న గుండం చేరుకున్నాక పైకి చూస్తే .. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి.. మధ్యలో మనం.. తెలియని అనుభూతికి లోనవుతాం. 

    గుండంలోని నీళ్లు అతి చల్లగా, స్వచ్ఛంగా, రుచిగా ఉంటాయి. స్థానిక చెంచులు ఇక్కడ పూజారులుగా ఉంటారు. చైత్ర పౌర్ణమి రోజుల్లో ఇక్కడ విశేష పూజలు జరుపుతారు.  హైదరాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో 150 కి.మీ దూరంలో పరహాబాద్‌ వస్తుంది. అక్కడి నుంచి మరో 32 కిలో మీటర్ల దూరం దట్టమైన అడవిలోకి వెళ్లాలంటే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

    అమర్‌నాథ్‌ నమ్మకమే శాశ్వతం
    హిమాలయాల మధ్యలో అమర్‌నాథ్‌ మంచు గుహలో మహాశివుడు మంచు రూపంలో దర్శనం ఇస్తాడు. సహజంగా ఏర్పడే ఈ లింగం జీవితం శాశ్వతం కాదు అని, నమ్మకం, విశ్వాసమే శాశ్వతం అని గుర్తు చేస్తుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు కఠినమైన ఆధ్యాత్మిక యాత్రను చేపడతారు. అమర్‌నాథ్‌ యాత్ర అనేది శరీరానికి పెద్ద పరీక్ష లాంటిది. 

    పలుచని గాలి, తీవ్రమైన చలి, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం – ఇవే యాత్రలో భక్తులకు ఎదురయ్యే సవాళ్లు. అందుకే తొలిసారి అమర్‌నాథ్‌ యాత్ర చేపట్టిన వారు మొదట్లో కాస్త తటపటాయించినా, భోళాశంకరుడు తన భక్తుడికి కావాల్సిన మనోధైర్యం, శారీరక శక్తిని అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రయాణంలో మాటలు తగ్గిపోతాయి. ప్రతి శ్వాస లెక్కతోనే సాగుతుంది. అయినా లక్షలాది మంది ఈ మార్గంలో నడుస్తారు. 

    అద్భుతం కోసమో, అడ్వెంచర్‌ కోసమో కాదుం పూర్తిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఇలా శివయ్యను దర్శించుకుంటారు. ఈ యాత్రలో ప్రయాణాన్ని బాధగా కాకుండా తత్త్వబోధనగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి అడుగు ఒక ధ్యానం. నిశ్శబ్దం మనలో ఉన్న అహంకారాన్ని కరిగిస్తుంది. మంచు మన మనసు కూడా తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలి అని బోధిస్తుంది. లింగం కరిగిపోతుంది కానీ అనుభూతి మాత్రం మనసులో మిగిలిపోతుంది. అదే అమర్‌నాథ్‌ గుహాలయం చెప్పే సారాంశం. అదే శివతత్వం.

    కేదార్‌నాథ్‌ క్షేత్రం ఓ సందేశం
    ప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు కేదార్‌నాథ్‌ ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయం మంచు పొరల కింద నిశ్శబ్దంగా నిద్రపోతుంది. నిత్య పూజలు జరగవు. భక్తుల సందడి, రాకపోకలు ఉండవు. అయినప్పటికీ మహాశివుడు అక్కడే ఉన్నాడని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.

    ఇక్కడ శివుడిని ఉనికిగా కాకుండా, లేమిగా పూజిస్తారు. అంటే ప్రత్యక్ష దర్శనం లేకపోయినా భక్తి ఆగదనే భావానికి కేదార్‌నాథ్‌ ఒక జీవంత ఉదాహరణగా నిలుస్తుంది. వేసవిలో ఆలయం మళ్లీ తెరుచుకున్నప్పుడు భారీ ఉత్సవాల కంటే ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి దీపోత్సవం నిశ్శబ్దంగా జరిగినా, ఆ దీపం ఆలయ ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ ప్రారంభాన్ని ఒక పండగగా కాకుండా ఆధ్యాత్మిక యాత్రకు నాందిగా భావిస్తారు. 

    ఆ తరువాతే తీర్థయాత్రికుల రాక ప్రారంభమవుతుంది. భక్తి అంటే దేవుడిని ప్రతిరోజూ దర్శించుకోవడమే కాదు. ఆలయానికి నిత్యం వెళ్లడమే కాదు. దూరంగా ఉన్నా దేవుడిని స్మరించడమే నిజమైన భక్తి అని ఈ క్షేత్రం సందేశం ఇస్తుంది. అందుకే ఆలయం మూసి ఉన్న కాలం ముగిసిన వెంటనే భక్తులు దేశం నలుమూలల నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం కోసం తరలివస్తారు.

    ఈ ఏడాది ఆలయం తెరుచుకునే తేదీ 2026 సంవత్సరంలో కేదార్‌నాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 22న ఉదయం సుమారు 7 గంటలకు భక్తుల దర్శనానికి తెరుచుకోనుంది. అలాగే నవంబర్‌ 11 వరకు దర్శనాలు కొనసాగనున్నట్లు తెలియజేస్తున్నారు. అధికారిక ప్రకటనలు, వాతావరణ పరిస్థితులను బట్టి తేదీలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి యాత్రకు ముందు తాజా సమాచారం తెలుసుకోవడం మంచిది.

    కాశీ దివ్యమైన అనుభూతి
    గంగానది తీరంలో ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ క్షేత్రాన్ని భక్తులు కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా, మోక్షపురిగా కూడా భావిస్తారు. ఇక్కడ శివుడిని కాలాన్ని కూడా నియంత్రించగల విశ్వనాథుడిగా పూజిస్తారు. కాశీలో జీవితం, మరణాన్ని ఒకే తత్వంగా చూస్తారు. 

    గంగానది తీరంలో జరిగే పూజలు, హారతులు, సంస్కారాలు జీవితం శాశ్వతం కాదని గుర్తు చేస్తాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుడిని మాత్రమే కాదు జీవిత సారాన్ని కూడా దర్శించుకుంటారు. జననం, మరణం, మోక్షం అనే చక్రం గురించి ఆలోచిస్తారు.

    ప్రతీ రోజు జరిగే గంగా హారతి ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మిక అనుభూతి కలిసే ఒక దివ్యమైన సందర్భం. అగ్ని జ్యోతి గంగాజలాలపై ప్రతిబింబించే సమయంలో భక్తులు తమ భయాలు, బాధలు అన్నింటినీ శివుడికి సమర్పించినట్లు భావిస్తారు. కాశీ గురించి చాలా మంది ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మరణించిన వారికి శివయ్యే మోక్ష మార్గాన్ని చూపిస్తాడని భక్తులు నమ్ముతారు. 

    అందుకే జీవితంలో ఒక్కసారి అయినా కాశీ దర్శనం చేయాలని భక్తులు కోరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయం మనిషికి ఒక సందేశాన్ని కూడా అందిస్తుంది. జీవితం అశాశ్వతంం ఆధ్యాత్మికతే శాశ్వతం అని చాటి చెప్పే పవిత్ర ప్రదేశం కాశీ నగరం. భక్తి అంటే దేవుడిని బయట వెతకడం కాదుం మనలోని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనడం అని చెప్పే పరమ పవిత్ర క్షేత్రం కాశీ. 
    – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

    చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు.. ఆ దేశాల్లో లక్షాధికారులే..?

  • బంగారం ధరలు ఏ రేంజ్‌లో ఉ‍న్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్‌ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..

    భారత సంతతికి చెందిన బిలియనీర్‌ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్‌ఫ్లిక్స​్‌లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్‌లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్‌ చేస్తుంది. ఈ సిరీస్‌లో నటీనటులు కరణ్‌ కుంద్రా, తేజస్వి ప్రకాష్‌తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. 

    ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్‌లో బారత సంతతికి చెందిన బిలియనీర్‌ సతీష్‌ సన్పాల్‌ భార్య తబిందా సన్పాల్‌ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్‌కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.

    ఎవరీ సతీష్‌ సన్పాల్‌.. ?
    సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన  గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్‌ పింక్‌ రోల్స్‌ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. 

    ఇక సన్పాల్‌ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్‌పూర్‌లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్‌కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్‌ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్‌ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు.

     

    (చదవండి: 'భారతీయ పేరెంటింగ్‌'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్‌..! భావోద్వేగప‌రంగా..)

     

Sports

  • అహ్మదాబాద్‌: టి20 ప్రపంచ కప్‌ గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

     కెపె్టన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. అన్‌‡్ష పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్‌ దలివాల్‌ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, హర్‌‡్ష ఠాకెర్‌ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. 

    మార్క్‌రమ్‌ ఫిఫ్టీ... 
    ఓపెనర్లు మార్క్‌రమ్, డికాక్‌ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్‌ మార్క్‌రమ్‌ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్‌ వెనుదిరిగిన తర్వాత ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కెపె్టన్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్‌ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్‌రమ్‌ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్‌రమ్, రికెల్టన్, బ్రెవిస్‌ (6) అవుటయ్యారు. డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది.  

    మెరిపించిన నవ్‌నీత్‌ 
    దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్‌గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ (12) సహా నికోలస్‌ కిర్టన్‌ (4) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలోనే మొవ్వ శ్రేయస్‌ (9) కూడా అవుట్‌ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్‌నీత్‌ దలివాల్, హర్‌‡్ష ఠాకెర్‌ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించాక హర్‌‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్‌నీత్‌ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు.  

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్‌ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

    కెప్టెన్‌ మార్క్రమ్‌ (59) విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్‌ (34 నాటౌట్‌), మిల్లర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డికాక్‌ (25), రికెల్టన్‌ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్‌ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్‌ పటేల్‌ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 

    కలీమ్‌ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్‌ సింగ్‌ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్‌ దీల్‌ప్రీత్‌ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్‌), సాద్‌ బిన్‌ జాఫర్‌ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్‌ హెలిగర్‌ ఓ ఓవర్‌లో 13 పరుగులు సమర్పించుకున్నారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ సమ్రా (12), నికోలస్‌ కిర్టన్‌ (4), శ్రేయస్‌ మొవ్వ (9) ఔట్‌ కాగా.. నవ్‌నీత్‌ ధలీవాల్‌ (25), హర్ష్‌ థాకర్‌ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు. 

  • 2025-26 బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ల విషయంలో అనుకున్నదే జరిగింది. టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి డిమోషన్‌కు గురయ్యారు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన ఈ ఇద్దరు.. ఇవాళ (ఫిబ్రవరి 9) అధికారికంగా ప్రకటించిన కాంట్రాక్ట్‌ల్లో బి గ్రేడ్‌కు పడిపోయారు. 

    ఇలా జరగడానికి కారణం​ లేకపోలేదు. రోహిత్‌, విరాట్‌ టీ20, టెస్ట్‌ ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి కేవలం​ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుంటేనే అత్యుత్తమ కాంట్రాక్ట్‌ లభిస్తుంది. 

    తాజాగా బీసీసీఐ తమ అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అయిన ఏ ప్లస్‌ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు అత్యుత్తమ కాంట్రాక్ట్‌ అంటే ఏ గ్రేడ్‌ కేటగిరి. ఇందులో ఉండాలంటే టీమిండియా తరఫున కనీసం రెండు ఫార్మాట్లలోనైనా కొనసాగుతుండాలి. రో-కో ప్రస్తుతం ఒక్క ఫార్మాట్‌క మాత్రమే పరిమితమయ్యారు కాబట్టి ఆటోమేటిక్‌గా బి గ్రేడ్‌కి పడిపోయారు. 

    తాజా వార్షిక కాంట్రాక్ట్‌ల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఏ గ్రేడ్‌ లభించింది. టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా, స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మాత్రమే ఈ కాంట్రాక్ట్‌ పరిధిలో ఉన్నారు.

    గ్రేడ్‌ బిలో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

    గ్రేడ్‌ సిలో అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, సంజూ శాంసన్‌, అర్షదీప్‌ సింగ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌, ధృవ్‌ జురెల్‌, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయి సుదర్శన్‌, రవి బిష్ణోయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నారు. 

    ఆయా కాంట్రాక్ట్‌ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్‌-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్‌-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్‌-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి.  

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్‌-పాక్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్‌ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్‌ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్‌ క్రికెట్‌ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    కొద్ది రోజుల కిందట పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం.  

    భారతీయ క్రీడా జర్నలిస్ట్‌ విక్రాంత్‌ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్‌ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. 

    - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు 
    - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ  
    - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి  
    - భారత్‌-పాక్‌-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్  
    - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు  

    అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్‌ కోసం కూడా డిమాండ్‌ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్‌ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాక్‌ తమతో మ్యాచ్‌ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.

    కాగా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్‌కప్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించిన తర్వాత పాక్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించింది. 

  • అనునిత్యం వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా క్రికెట్‌ ప్రపంచంలోకి కూడా ఎంటరయ్యాడు. భారత్‌, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న తమ జట్టుకు (యూఎస్‌ఏ) ట్రంప్‌ మద్దతు ప్రకటించాడు. 

    సోషల్‌ ట్రూత్‌లో ఓ ప్రత్యేక సందేశం పోస్ట్ చేస్తూ.. టీమ్‌ యూఎస్‌ఏ చాలా బలమైంది. అమెరికా మొత్తం మీ వెనుకే ఉంది అని పేర్కొన్నాడు. ట్రంప్‌ ఇచ్చిన మద్దతు యూఎస్‌ఏ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. రేపు (ఫిబ్రవరి 10) పాకిస్తాన్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ సందేశం యూఎస్‌ఏ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ట్రంప్‌ మద్దతు అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

    వాస్తవానికి ట్రంప్‌కు క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేదు. గోల్ఫ్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ వంటి క్రీడలపై అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ట్రంప్‌కు 2020లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం (ప్రస్తుతం నరేంద్ర మోడి స్టేడియం) ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనుభవం ఉంది. భారత్‌తో వాణజ్యపరమైన సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతున్న వేల, ట్రంప్‌ ప్రకటన భారతీయుల్లోనూ ఆసక్తి కలిగిస్తుంది. ట్రంప్‌ మద్దతు ఉంటే క్రికెట్‌ కూడా విశ్వక్రీడగా మారిపోయే అవకాశం ఉంది.

    అమెరికాలో క్రికెట్ అభివృద్ధి 2023లో ప్రారంభమైన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌తో మొదలైంది. ఆ టోర్నీలో భారత్‌ తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొంటారు. 2024 టీ20 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం ఇవ్వడంతో అమెరికా ప్రజలకు క్రికెట్‌ మరింత చేరువైంది. యూఎస్‌ఏలో ఇప్పటికే 150 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.  

    ఇదిలా ఉంటే, యూఎస్‌ఏ జట్టు గత ఎడిషన్‌ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుత ఎడిషన్‌లోనూ ఆ జట్టు మరో సంచలనం సాధించే అవకాశం ఉంది. టోర్నీ ఓపెనర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చారు. ఈ మ్యాచ్‌లో వారి పోరాటానికి క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. టీమిండియా ఆ మ్యాచ్‌ను మాత్రమే గెలిచింది కానీ, యూఎస్‌ఏ జట్టు మాత్రం క్రికెట్‌ ప్రపంచాన్నంతా గెలిచింది.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) ధాటి​కి ఒమన్‌ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.

    ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్‌ కలీమ్‌, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌, షా ఫైసల్‌ తలో 5 పరుగులు, షకీల్‌ అహ్మద్‌ 4, జితెన్‌ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్‌ మీర్జా, కరన్‌ సోనావలే డకౌట్లయ్యారు.

    అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 నాటౌట్‌), బ్రెండన్‌ టేలర్‌ (31 రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. మరుమని 21, సికందర్‌ రజా 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. డియాన్‌ మైర్స్‌ డకౌటయ్యాడు. ఒమన్‌ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్‌ ముజరబానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

  • టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్‌ ఆటగాడు ఆమిర్‌ కలీమ్‌ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్‌ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్‌ ఈ ఘనత సాధించాడు. 

    గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్‌ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్‌ నదీమ్‌ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ 42, ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, నెదర్లాండ్స్‌ ఆటగాడు వాన్‌డర్‌ మెర్వ్‌ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌ బరిలో ఉన్నారు.

    కలీమ్‌ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్‌ కెరీర్‌ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కలీమ్‌.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

    ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్‌ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. 

    జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. వీరి ధాటికి ఒమన్‌ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. 
     

  • ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

    రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు. 

    ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 

    ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. 

    ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా ఆంధ్రతో మ్యాచ్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.

    దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. 

    టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.

    ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్‌ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌  స్కోర్‌కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా బెంగాల్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. 

  • టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.

    ఆర్థికంగా నష్టం
    గతంలో తమ జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్‌ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.

    యూఏఈ లేఖ
    తాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) క్రికెట్‌ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్‌ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.

    అయితే, టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాక్‌ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్‌ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.

    పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్‌ పంపింది.

     బంగ్లాదేశ్‌ సైతం
    ఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్‌ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్‌-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ ఐసీసీని ఆశ్రయించిది.

    తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.

    మొహ్సిన్‌ నక్వీతో చర్చలు
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్‌.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.

    మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీ
    ఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్‌ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.

    అదే సమయంలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్‌ నక్వీని కోరిట్లు సమాచారం.

    ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. 

    చదవండి: ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

  • టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    జోహెబ్‌ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్‌గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

    అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్‌మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.

    ఈ విషయంలో జోహెబ్‌ భారత్‌ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్‌ను నిందించడం సరికాదని వార్నింగ్‌ ఇస్తున్నారు.

    కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్‌లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. 

    ప్రీ-టోర్నమెంట్‌లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

    ప్రపంచకప్‌లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్

  • టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది. 
     
    325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్‌ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్‌ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్‌లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్‌ రవిచంద్రన్‌తో పాటు రాహుల్‌ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ను కర్ణాటకవైపు మళ్లించింది.

    స్మరణ్‌ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్‌ పాటిల్‌ (31 నాటౌట్‌) స్మరణ్‌కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్‌తో తలపడుతుంది.

    కర్ణాటకతో మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు.

    అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు.

    ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

     

Andhra Pradesh

  • విశాఖ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో కీలక అడుగుపడింది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్వహణకు సంబంధించి ఆర్ఐఎన్ఎల్ టెండర్లు ఆహ్వానించింది. కోల్ హ్యాండ్లింగ్ సహా ప్రైవేటుకు క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌కు టెండర్లు ఆహ్వానించారు. 

    ఉక్కు ఉత్పత్తిలో థర్మల్ పవర్ ప్లాంట్  కీలక భూమిక పోషిస్తుంది. దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు టెండర్లు ఆహ్వానించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కీలక విభాగాలను ప్రైవేటీకరణతో కార్మికుల తొలగింపు కార్యక్రమం సైతం కొనసాగుతోంది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

     

  • శ్రీశైలం: శ్రీశైలంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యాయి. దాంతో దర్శనం కోసం క్యూలైన్స్ , కంపార్ట్‌మెంట్లలో  వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద  శివస్వాములు ఆందోళన కొనసాగుతోంది. ఈవో డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు శివస్వాములు. 

    శివ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పి యుగంధర్ బాబు , జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు..లాఠీ తో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొడుతున్న ఏఎస్పి యుగంధర్ బాబు. ఫలితంగా రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండా వెనుతిరుగుతున్న శివదీక్ష స్వామి భక్తులు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని  శివ స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివ భక్తులు, శివమాల దారులు పరిస్థితి గందరగోళంగా మారింది.

    అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా శ్రీశైలం(ఫోటో గ్యాలరీ)

     

  • తిరుపతి:  కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ విషయంలో జనసేన హైడ్రామా కొనసాగుతోంది. రేపు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) మరోమారు రైల్వే కోడూరుకు త్రిసభ్య కమిటీ రానుంది. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు కార్యకర్తలను సదరు కమిటీ విచారించింది. అయినా ఇంతవరకూ పార్టీకి నివేదిక ఇవ్వలేదు త్రిసభ్య కమిటీ.

    ఇదిలా ఉంచితే,. నిన్నటి జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అంటూ లీకులిచ్చారు. అదే సమయంలో అరవ శ్రీధర్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైప బాధిత మహిళపై పోలీసు కేసులతో పాటు సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు వెలుగుచూస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మాత్రం చేసినదంతా చేసి పార్టీకి సంబంధం లేదంటూ కొత్త డ్రామాకి తెరలేపాడు. 

     

     

  • విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల విపరీతమైపోయాయి. రైతుల కంటే రైతు కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడైంది. కార్యదర్శల సమీక్షలో ఏపీలోని ఆత్మహత్యల వాస్తవాలు బయటకొచ్చాయి. 

    ఏపీలో ఆత్మహత్యలకు గల కారణాలు..

    • 4,456 మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు
    • 2,742 మంది ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు
    • 447 మంది ప్రేమ విఫలమై ఆత్మహత్యలు
    • నిరుద్యోగం వలన 206 మంది ఆత్మహత్యలు
    • మద్యంకి బానిసై 1544 మంది ఆత్మహత్యలు
    • చదువుల ఒత్తిడితో 191 మంది ఆత్మహత్యలు
    • పని ఒత్తిడి వలన 31 మంది మరణాలు
    • ఇతర కారణాలతో 4,500  మంది ఆత్మహత్యలు
  • బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): ఆఫీసుకు వెళ్తున్నా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుట్టినరోజుకు బర్త్‌డే కేక్‌ తీసుకొస్తానని అని చెప్పిన భర్త కానరాని లోకానికి వెళ్లిపోయాడు. నా పుట్టినరోజుకు కేక్‌ తీసుకొస్తాడని వెళ్లిన నాన్న ఇంకెప్పటికి కేక్‌ తీసుకురాలేడని ఆ బిడ్డకు, సాయంత్రం తిరిగి వస్తానని చెప్పిన వెళ్లిన భర్త ఇక ఎన్ని సాయంత్రాలు గడచినా ఆ మాటలు ఇక వినబడవని తెలిసి ఆ కుటుబం కుప్పకూలిపోయింది. నీకు..బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా అని భార్యకు మెసేజ్‌ పెట్టి ఆత్మహత్యకు పాల్బడిన భర్త గురించి గంటల వ్యవధిలో మరణవార్త వినడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు, భార్య తనపై ఆధారపడి ఉన్నారన్న విషయం తెలిసినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్బడిన సచివాలయ  వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ బి.సుబ్రమణ్యం (36) ఉదంతం ఆవేదనకు గురి చేస్తోంది. 

    సోమవారం ఉదయం బి.కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు. రామసముద్రానికి చెందిన బి.సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గతేడాది జూలైలో బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లె సచివాలయానికి బదిలీ అవ్వగా స్థానిక బైపాస్‌రోడ్డులో కుటుంబంతో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సౌమ్య, ఐశ్వర్య (4), హైందవి (2) సంతానం. తల్లి నీలమ్మ ఉండగా తండ్రి రత్నప్ప మతి చెందాడు. 

    ఈ నేపథ్యంలో  ఆదివారం సెలవు కావడంతో సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి బి.కొత్తకోట సమీపంలోని కర్ణాటకకు చెందిన నాగిరెడ్డిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండగా సోమవారం ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకు బి.కొత్తకోట వెళ్తున్నానని, కుమార్తె ఐశ్వర్య జన్మదినం కావడంతో సాయంత్రం వచ్చేటప్పుడు కేక్‌ తీసుకొస్తానంటూ చెప్పి ఉదయం ఏడు గంటలకు నాగిరెడ్డిపల్లె నుంచి బి.కొత్తకోటకు బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 7.50 గంటలకు రామసముద్రంలో ఉంటున్న తల్లి నీలమ్మతో ఫోన్‌లో మాట్లాడాడు. 

    ఈ రోజు బిడ్డ ఐశ్వర్య పుట్టినరోజని కేక్‌ తీసుకోవాలని చెబుతూనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని భారంగా మాట్లాడాడు. డబ్బులు లేవని, ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకున్నాడు. ఈ మాటలకు ఆందోళనకు గురైన నీలమ్మ విషయాన్ని కోడలు సౌమ్యకు చెప్పడంతో 8 గంటలకు భార్య సౌమ్య, తల్లి నీలమ్మ, కుటుంబీకులు ఫోన్‌లో మాట్లాడేందుకు కాల్‌ చేసినా తీయలేదు. ఆత్మహత్యకు సిద్దంకావడంతో అంతకుముందు భార్య సౌమ్య ఫోన్‌కు..నీకు, బిడ్డలకి నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను క్షమించండి అంటూ భార్య ఫోన్‌ నంబర్‌కు మెసేజ్‌ టైప్‌ చేశాడు కాని సెండ్‌ చేయలేదు. 

    ఆ తర్వాత ఇంటిలోనే శ్లాబుకు ఉన్న కొక్కికి వేసిన చీర, తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్బడ్డాడు. ఉదయం 8–9.15 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్బడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం ఆత్మహత్యకు పాల్బడిన విషయాన్ని స్థానికులు గుర్తించి ఇంటి యజమానికి, పొరుగు వాళ్లకు చెప్పడంతో వారు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మతి చెందినట్టు నిర్దారించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు..సుబ్రమణ్యం అర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, ఇప్పటికే పలుమార్లు ఆర్థికంగా సహయపడ్డామని, మళ్లీ ఆర్థిక సమస్యలతో తమతో చెప్పుకోలేని ఆత్మహత్యకు పాల్బడినట్టు పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. మతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

    AP: పని ఒత్తిడి.. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్మ

  • విజయవాడ: పని ఒత్తిడి భరించలేక ఇద్దరు సచివాలయ ఉద్యోగులు వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి సచివాలయంలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న దాసి సబిత ఆత్మహత్యా యత్నం చేయగా,  చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. 

    ఇదిలా ఉంచితే, మరో సచివాలయ ఉద్యోగి ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా బి. కొత్తపేటలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక బైపాస్ రోడ్ లోని తన ఇంటిలో ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం అనే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌. 

    మృతుడి స్వగ్రామం రామసముద్రం మండలం ఇటీవల బదిలీల్లో భాగంగా బి.కొత్తకోట వచ్చాడు సుబ్రహ్మణ్యం. అయితే సుబ్రహ్మణ్యంకు పని ఒత్తిడి పెరిగిపోయింది. డబ్యూఈఏ(వార్డు ఎడ్యకేషన్‌ అసిస్టెంట్‌), డీఏ(డేటా అనాలిసిస్‌), పీఎస్‌(పబ్లిక్‌ సర్వీసెస్‌), బీఎల్‌ఓ(బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌, ఈఎన్‌ఏ(ఎంక్వరీ యాక్టివిటీ) తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది.  ఈ క్రమంలో యూఎఫ్‌ఎస్‌(అర్బన్‌ ఫ్రేమ్‌ సర్వే)లో భాగంగా 888 గృహాలు అతనికి కేటాయించారు. ఇలా పనిభారం పెరిగిపోయింది. దాంతో  విరామం లేకుండా పనిచేసి అత్యధిక బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  ఈ ఘటనపై బి.కొత్తపేట పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

    వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించేసిన కూటమి ప్రభుత్వం..
    ఏపీలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు.  

    పెద్దఎత్తున ఉపాధి.. 
    టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్‌’గా ఉపాధి పొందారు.

    మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థ కాస్త తెరమరుగై పోయింది. దాంతో లెక్కల్లో మాత్రమే ఉన్న సచివాలయ ఉద్యోగులపై పని భారం అధికమైంది. తాజాగా జరిగిన ఈ రెండు ఆత్మహత్మ ఘటనలే అందుకు అద్దం పడుతున్నాయి. 

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు అంబటికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. 

    పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు
    గతేడాది నవంబర్‌ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.

    కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో  చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ వచ్చినప్పటికీ.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్‌లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్‌ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 

    44 కేసులు 
    కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి.

    అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు
  • సాక్షి,విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అంబటి దాఖలు పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని ఏపీ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  

    ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట

Business

  • పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.

    ఇంటర్నెట్‌లో డొమైన్‌ అడ్రస్‌ చాలా విలువైంది. వెబ్‌సైట్‌ డొమైన ట్రెండింగ్‌లో ఉన్నా డిమాండ్‌ ఉండే బిజినెస్‌కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్‌సైట్‌ డొమైన్‌ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్‌ వ్యవస్థాపకుడు  క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ డొమైన్‌ ఏఐ డాట్‌ కామ్‌ను 70మిలియన్‌ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్‌లలో తొలి స్థానంలో నిలిచింది.

    ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్‌ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్‌ బౌల్‌ సమయంలో ఏఐ.కామ్‌ను అధికారికంగా లాంచ్‌ చేయనున్నారు. ఈ వెబ్‌సైట్‌లో ఏఐ పర్సనల్‌ అసిస్టెంట్‌ లాంచ్‌ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్‌ పర్సనల్‌ మెసేజ్‌లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్‌,యాప్స్‌ మేనేజ్‌ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. 


     
    చాట్‌జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్‌జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్‌ డొమైన్‌ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్‌ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.

    ఇది స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్‌ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్‌ను పెంచుతాయని అంటున్నారు.

    2016లో క్రిస్‌.. క్రిప్టో.కామ్‌ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్‌లో క్రిప్టోఫ్లాట్‌ఫారమ్స్‌ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్‌ బ్రాండింగ్‌పై భారీ ఇన్వెస్ట్‌ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్‌పై సుమారు 700 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్‌ మీడియాతో బిజినెస్‌ డీల్స్‌ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్‌ బ్రాండింగ్‌ రికగ్నైజేషన్‌ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్‌ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్‌ మార్స్‌జాలెక్‌.

    ఇక క్రిస్‌ మార్స్‌జాలెక్‌ ఏఐ.కామ్‌ డొమైన్‌ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్‌ను ఇస్మాయిల్‌ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్‌ విలువ ఆకాశాన్ని తాకింది.

    2025 ఏప్రిల్‌లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్‌ను క్రిస్ మార్జాలెక్‌కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్‌గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్‌ ట్రాన్సాక్షన్‌గా గుర్తింపు పొందింది.

    ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్‌లో డొమైన్‌ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్‌పై   వంటి ప్రీమియం డొమైన్‌ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్‌ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్‌ ఆస్తి.

  • ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు.. ఈ విభాగంలో కూడా తమ హవా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హానర్, ఒప్పో ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంస్థల తరువాత షియోమి కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. కాగా వివో కూడా X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించనుంది.

    వివో లాంచ్ చేయనున్న X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ 200-మెగాపిక్సెల్ కెమెరా & మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్‌తో రానుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఇది బెస్ట్ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. కాగా కంపెనీ దీనికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.

    వివో X ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట దీనిని చైనా మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నారు. కాగా దీని ధరలు, లాంచ్ డేట్ వంటివి తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా త్వరలోనే తెలుస్తాయి.

  • ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.

    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్‌ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్‌డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్‌మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.

    • ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.

    • ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

    • యాప్‌లో మీరు ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.

    ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్‌గా యూపీఐ విత్‌డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు.

  • భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.

    ఈ సమ్మిట్‌కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.

    సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.

    ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్‌లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.

    హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్‌లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది.

  • కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.

    కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్‌లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్‌క‌మ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్‌లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.

    కొత్త మార్పులు
    ➤టాక్స్ ఆడిట్‌కు సంబంధించిన పాత ఫారమ్‌లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.
    ➤ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్‌కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.
    ➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.
    ➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.
    ➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.

    TDS & TCSకు సంబంధించిన మార్పులు
    ➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.
    ➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.
    ➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.
    ➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.
    ➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.
    ➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.

    చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు
    ➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.
    ➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.
    ➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.
    ➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.
    ➤డోనీ స్టేట్‌మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.
    ➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.

    ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు
    ➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.
    ➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్‌మెంట్‌గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.
    ➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.
    ➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.

    ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్‌కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.

    ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

  • ముంబై: కోటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. కోటక్‌ సర్వీసెస్‌ ఫండ్‌ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్‌ఎఫ్‌వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రకటించింది.

    వినియోగ సేవలు, టెలికం, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్‌ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.

    నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పేర్కొంది.

    360 వన్‌ ఎంఎఫ్‌ నుంచి సిఫ్‌ పథకం 
    సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్‌ మ్యుచువల్‌ ఫండ్‌ తాజాగా డైనాసిఫ్‌ ఈక్విటీ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ పేరిట స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్‌కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌ ద్వారా 25 శాతం వరకు షార్ట్‌ ఎక్స్‌పోజర్‌ తీసుకునేందుకు, డెట్‌ అలాగే ఇని్వట్స్‌లో 20 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.

    దీనికి బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మ్యుచువల్‌ ఫండ్స్‌ పరమైన ట్యాక్సేషన్‌ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్‌ ఉంటుందని 360 వన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో రాఘవ్‌ అయ్యంగార్‌ తెలిపారు.  

    డీఎస్‌పీ మల్టీ అసెట్‌ ఆమ్ని ఎఫ్‌వోఎఫ్‌ 
    ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్‌పీ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ మల్టీ అసెట్‌ ఆమ్ని ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ డీఎస్‌పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్‌ ఆధారిత స్కీములు, గోల్డ్‌..సిల్వర్‌ ఈటీఎఫ్‌ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది.

    మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్‌ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్‌–సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు.  మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్‌ హెడ్‌ సాహిల్‌ కపూర్‌ తెలిపారు.

  • ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.

    చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.

    బంగారం ధరలు పెరగడానికి కారణాలు
    బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్‌ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.

    భారతదేశంలో బంగారం ధరలు
    ఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది.

  • గత వారం బంగారం, వెండి మార్కెట్లు తీవ్రమైన ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఈ వారం కూడా ధరల్లో భారీ మార్పులు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలపై వ్యాపారుల దృష్టి కేంద్రీకృతమైంది.

    అమెరికా ద్రవ్యోల్బణ డేటా, జీడీపీ వృద్ధి రేటు, పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి సూచికలు బులియన్ ధరల దిశను నిర్ణయించనున్నాయి. అలాగే చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలు వడ్డీ రేటు తగ్గింపుల సమయంపై స్పష్టతనిచ్చే అవకాశముండటంతో, వాటిని కూడా వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు.

    అంతర్జాతీయ మార్కెట్లో గత వారం కామెక్స్‌లో బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. ఔన్సుకు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 5,000 డాలర్ల వరకు కోలుకోవడం గమనార్హం. అయితే వెండి ఫ్యూచర్స్‌పై ఒత్తిడి కొనసాగింది. గత వారం వెండి ధరలు 2 శాతానికి పైగా తగ్గాయి.

    జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ – కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. “బంగారంలో కన్సాలిడేషన్, రికవరీ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ వెండి విషయంలో మాత్రం అస్థిరత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తదుపరి దిద్దుబాట్ల పట్ల జాగ్రత్త అవసరం” అని చెప్పారు.

    దేశీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు రూ.15,760 లేదా దాదాపు 6 శాతం పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆదివారం కూడా కమోడిటీస్ మార్కెట్ పనిచేయడం విశేషం.

    మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విశ్లేషకుడు మానవ్ మోడీ మాట్లాడుతూ.. “డాలర్ బలపడటం, ఫెడ్ అంచనాల్లో మార్పులు, దూకుడు పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా బంగారం, వెండి అత్యంత అస్థిర వారాన్ని ఎదుర్కొన్నాయి” అన్నారు. వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తగ్గడం వంటి అంశాలు సేఫ్-హావెన్ డిమాండ్‌ను కొంత తగ్గించాయని ఆయన వివరించారు.

    అయితే, దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ పెట్టుబడులు కొనసాగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బులియన్‌కు మద్దతునిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

    మొత్తంగా చూస్తే, వచ్చే వారం కూడా బంగారం, వెండి మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు. అయినప్పటికీ, ధరలు తగ్గినప్పుడు ముఖ్యంగా బంగారంలో స్వల్పకాలిక కొనుగోలు అవకాశాలు కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  • పిల్లల భవిష్యత్‌ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  సంస్థ స్మార్ట్‌కిడ్‌ 360 ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్‌కం బెనిఫిట్‌ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్‌ పొందే వీలుంది.  

    బజాజ్‌ జనరల్‌ ఫీటల్‌ ఫ్లరిష్‌ ఆరోగ్య బీమా 
    గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్‌ ఫ్లరిష్‌’ పేరిట బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రత్యేక ఇన్సూరెన్స్‌ రైడర్‌ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి రాని అధునాతన ఇన్‌–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’, ‘హెల్త్‌ గార్డ్‌’ పథకాలతో కలిపి ఈ రైడర్‌ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది.

  • కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్‌ హోమ్‌ సింపుల్‌ స్టైల్‌, స్మార్ట్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...

    రెండు ప్లాట్లు ఒకే ఇల్లు
    30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్‌ హోమ్‌ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.

    ఇంటి లోపలి అందం
    డబుల్-హైట్ సీలింగ్‌తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్‌రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్‌రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.

    పిల్లల ప్రతి బెడ్‌రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు.

  • శాంసంగ్, వివో, గూగుల్, వన్ ప్లస్ వంటి కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి, విక్రయిస్తున్న తరుణంలో.. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో & ప్రో మాక్స్ లాంచ్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

    ఇప్పుడు చాలామంది స్మార్ట్‌ఫోన్ వినియోదాగారులు ఫోల్డబుల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ కోసం ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను శాంసంగ్ ఉత్పత్తి చేయనుంది. ఎందుకంటే.. శాంసంగ్ అత్యుత్తమ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే టెక్నాలజీ కలిగి ఉంది.

    ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే దీని ధర కూడా ఎక్కువగా (సుమారు 2399 డాలర్లు) ఉండే అవకాశం ఉందని ప్రముఖ రీసర్చ్ అనలిస్ట్ ఆర్థర్ లియావో పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ పరంగా రెండు విధాలుగా ఉండవచ్చని అంచనా. ఒకటి బుక్ స్టైల్ ఫోల్డ్(ఫోన్ తెరిస్తే టాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్), మరొకటి ఫ్లిప్-స్టైల్ ఫోల్డ్ (మడిచినప్పుడు చిన్నదిగా మారే డిజైన్).

    బ్యాటరీ విషయంలో.. పెద్ద స్క్రీన్‌కు సరిపడే విధంగా అధిక సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, పవర్ ఎఫిషియెన్సీపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే.. దీనికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

  • సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.

    నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Politics

  • సాక్షి,కరీంనగర్: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ‘ముఖ్యమంత్రుల దగ్గరికి మేం వెళ్లం. ముఖ్యమంత్రిలే మా దగ్గరికి వస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం బ్రదర్స్ ఏంటో సత్తా చూపిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం’అని పునరుద్ఘాటించారు.   

    అయితే,అక్బరుద్దీన్‌ కామెంట్స్‌పై మంత్రి  శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్‌లో మా సపోర్ట్ వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న అక్బరుద్దీన్ స్టేట్మెంట్‌పై స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం ఓట్లు వేశారు.మావల్లే గెలిచింది అని ఎవరైనా చెప్పుకుంటే ఏం చేస్తాం. ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది.అదంతా మావల్లే అనుకుంటే ఎవరేమి చేయలేరు’అని కౌంటర్‌ ఇచ్చారు. 

  • తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి దళిత, గిరిజన విద్యార్థులు బలవుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో మృత్యు ఘంటికలు మోగుతున్నా అవి చంద్రబాబుకు పట్టడం లేదని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకు మానవత్వం ఉంటే హాస్టల్‌లోని పిల్లలకు మేలు చేయాలని టీజేఆర్‌ సూచించారు. 

    ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్‌..  వైఎస్‌ జగన్‌ హయాంలో హాస్టల్స్‌ ఎలా ఉన్నాయో  చంద్రబాబు చూసి తెలుసుకోవాలన్నారు. జగన్ హయాంలో  హాస్టల్స్‌ కు రూ.7,245 కోట్లు  ఖర్చు చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు కేవలం రూ.455 కోట్లే ఖర్చు చేశారు. దాన్నిబట్టే సంక్షేమ హాస్టల్‌లో ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.  జగన్ ప్రతిరోజూ మంచి భోజనం పెట్టారు.

    చంద్రబాబు ఎంతసేపూ పబ్లిసిటీ చేసుకోవటమే తప్ప విద్యార్థులకు ఏం న్యాయం చేశారు?,  హోంమంత్రి అనిత హాస్టల్‌లో తిన్న భోజనంలోనే బొద్దింక వచ్చినా పద్దతి మార్చు కోలేదు. ఇప్పటికి 18 సంఘటనల్లో వేలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల అవస్థలను పట్టించుకోరా?, పోలవరం జిల్లాలో 89 మంది ఆస్పత్రి పాలయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, విద్యార్థుల అవస్థలు మీ హైటెక్ ప్రభుత్వానికి తెలియటం లేదా?, గిరిజనులు, దళితులంటే ఎందుకంత కక్ష?, అన్ని రకాల వస్తువులకూ ధరలు విపరీతంగా పెరిగి జనం అవస్థలు పడుతున్నారు. 

    కానీ అభివృద్ధి, సంక్షేమం అద్భుతమని చంద్రబాబు తనకు తానే చెప్పుకుంటున్నారు. మీ పాలన ఎలా ఉందో కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డే తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను చంద్రబాబు అమ్మేయపోతే జగన్ అడ్డుకున్నారు. ఇప్పటికీ అక్కడి ఉద్యోగులు భయంగానే బతుకుతున్నారు. అమరావతిలో రైతులను నిలువునా మోసం చేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాజధానిలో ఏం జరుగుతోంది?, చంద్రబాబు చీకటి ఎత్తుగడలకు రైతులు అన్యాయం అవుతున్నారు. రూ.76 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపుతున్నా నిర్మాణాలు మాత్రం కనపడటం లేదు. 

    TJR : చంద్రబాబు పాలనపై సొంత ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి

    రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు?, ఏఐ టెక్నాలజీ అని చెప్తూ‌ మరి ఆ మేరకు పాఠ్యపుస్తకాలను ఎందుకు రూపొందించ లేదు?, టెక్నాలజీ ఉండాలిగానీ మితి మీరిన టెక్నాలజీ అవసరం లేదు. ముందు ఆకలితో ఉన్న వాడికి తిండి పెట్టండి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ సీఎం. ఆయన ఆలోచనలు మారాలి. హెరిటేజ్ పెరుగు నాసిరకం అని ల్యాబులు నిర్ధారించాయి. సబ్ స్టాండర్డ్ అని తేల్చి చెప్పాయి. నాసిరకం పెరుగు విక్రయించినందుకు హెరిటేజ్ సంస్థ పెనాల్టీ కట్టింది. ఇలాంటి పనులు చేసినందుకు చంద్రబాబు సిగ్గు పడాలి’ అని మండిపడ్డారు.

  • ఖమ్మం:  అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆలోచన చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ)  ఖమ్మం జిల్లా మధిరలో మీడియా సమావేశం నిర్వహించారు భట్టి. 

    ‘ప్రతి నెల 1వ తారీఖున  ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమానికి కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు – ఎన్ని వేల కోట్లయినా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇప్పటికే రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం చెల్లిస్తుంది. రేషన్ కార్డులతో కుటుంబ సభ్యులకు 6 కిలోల సన్న  బియ్యం పంపిణీ. 

    ఆరోగ్యశ్రీ పరిమితి  10 లక్షల వరకు పెంపు. 2047 విజన్ డాక్యుమెంట్ తో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ చేరింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక పట్టణాల్లో శాంతియుత వాతావరణం నెలకొంది. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ కృషి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ కేంద్రాలు ఏర్పాటు. మధిరలో వరద నీరు నివారించేందుకు భారీ రిటైనింగ్ వాల్ నిర్మాణం. వైరా నదిని టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబుల్ విద్యుత్ సరఫరా పనులు.మై మధిర – క్లీన్ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు అమలు’ అని భట్టి స్పష్టం చేశారు.

  • మెదక్‌:  సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌  అగ్నిప్రమాదం వెనుక రేవంత్‌ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌ రావు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్‌.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

    ‘ఓటుకు నోటు కేసులో రేవంత్‌ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్‌ డైరెక్షన్‌లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్‌లో  ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. 

    హైదరాబాద్‌లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయం

    రుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్‌. రేవంత్‌  బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్‌ఎస్‌. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్‌ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్‌రావు.

    రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్
  • సాక్షి,ఎన్టీఆర్‌: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ఏపీలో ప్రభుత్వ పనితీరు అధ్వాన్నంగా ఉందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ కొలికపూడి పెట్టిన వాట్సప్‌ స్టేటస్‌ మరోసారి చర్చాంశనీయంగా మారింది.

    ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్‌లో మూడు రోజులపాటు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుందని పెట్టిన స్టేటస్‌పై స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 

    కొలికపూడి స్టేటస్‌ టీడీపీ పాలనకు అర్ధం పట్టే విధంగా ఉందని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. కొలికపూడి పోస్టుతో టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ మొదలైంది. పరోక్షంగా సొంత పార్టీనే ఉద్దేశించి స్టేటస్‌ పెట్టినట్లు గుసగుసలాడుకుంటున్నారు. 

Crime

  • చంఢీగడ్‌: లా కాలేజీ తరగదిలో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. న్యాయ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తోటి విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తరగతి గదికి గన్‌తో వచ్చిన ఓ విద్యార్థి.. తోటి విద్యార్థినిపై కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం, తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో తరన్‌ తారన్‌ జిల్లాలో చోటు చేసుకుంది

    పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన పంజాబ్‌ ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో జరిగింది. కాల్పులు జరిపిన వ్యక్తిని మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్గా, మరణించిన విద్యార్థినిని నౌషెహ్రా పన్నువాన్‌కు చెందిన సందీప్ కౌర్‌గా గుర్తించారు. కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ప్రిన్స్ రాజ్ కాలేజీ బ్యాగ్‌తో తరగతి గదిలోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతుండగా, ప్రిన్స్ రాజ్ వారిద్దరి దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. కొద్దిసేపటికి ముగ్గురూ వెనుక సీట్లలో కూర్చున్నారు. అయితే కొన్ని క్షణాల తర్వాత ప్రిన్స్ రాజ్ అకస్మాత్తుగా లేచి, బ్యాగ్‌లోని తుపాకీని బయటకు తీసి, సందీప్ కౌర్‌పై నేరుగా కాల్పులు జరిపాడు. కౌర్ నేలపై కుప్పకూలగా, మరో క్లాస్‌మేట్ షాక్‌తో వెనక్కి తగ్గింది. వెంటనే ప్రిన్స్ రాజ్ తనపై తానే కాల్పులు జరిపి నేలకొరిగాడు.

    కాల్పులు జరిగిన వెంటనే తరగతి గదిలోని విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. తరగతులు ప్రారంభం కానున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత కలకలం రేపింది. సందీప్ కౌర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని సందీప్ కౌర్ తల్లి కాల్పుల ఘటనపై స్పందించారు. ప్రిన్స్ రాజ్ తుపాకీతో కళాశాలలోకి ఎలా ప్రవేశించాడని ప్రశ్నించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 

     

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం అధికారికంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మైకులు మూగబోయాయి. ర్యాలీలు, సభలు నిలిచిపోయాయి. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచారం జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టింది.

    ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్ల సంఖ్య 52.43 లక్షలు కాగా, అందులో మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు ఉన్నారు. ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది. అందుకోసం 16,301 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు.

    పోలింగ్, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 25,000 మంది పోలీసులను బందోబస్తులో నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,900గా గుర్తించగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 1,400గా గుర్తించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తయింది. స్ట్రాంగ్ రూమ్‌లలో 24 గంటల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. నేటితో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.

    12ఏళ్లగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి. ఓటు వేసే ముందు గత పాలను గుర్తు చేసుకోండి. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తిస్తామని ప్రధాని మోదీ విస్మరించారు.మహారాష్ట్ర  సీఎం ఫడ్నవీస్‌ తెలంగాణను అవమానించారు.  తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. 

International

  • ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన నివాస రహస్యం ఎవరికీ తెలియకుండా  చాలా రహస్యంగా తలదాచుకుంటున్నారు. అమెరికా శాటిలైట్స్ సైతం కనిపెట్టకుండా ప్రత్యేకమైన బంకర్లలో ఆయన తలదాచుకుంటున్నట్లు సమాచారం .ఈ నేపథ్యంలో ఖమేనీ 37 ఏళ్లుగా ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశారు.

    1989లో షియా మత గురువు ఆదేశ సుప్రీం లీడర్ రుహోల్లా ఖోమేని మరణాంతరం  ఆయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి నేటి వరకూ దాదాపుగా 37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీంగా ఖమేనీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దశాబ్ధాలుగా ఉన్న ఓ సంప్రదాయాన్ని అమెరికా ఉద్రికత్తల నేపథ్యంలో వదులుకోవాల్సి వచ్చింది.

    1979 ఫిబ్రవరి 8వ తేదీ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది, ఆ రోజున ఒక బృందం వైమానిక దళ అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూలదోసినందుకు గాను రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. అనంతరం అప్పటి నుంచి ఆ రోజున  ఆ దేశ వైమానిక అధికారులతో ఇరాన్ సుప్రీం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కరోనాతో ప్రపంచం మంతా ఆంక్షలు ఉన్న సమయంలోనూ ఈ సమావేశం నిర్వహించారు.

    అయితే ప్రస్తుతం అమెరికాతో హాని పొంచి ఉన్న నేపథ్యంలో తొలిసారిగా ఆ దేశ సుప్రీం ఆ భేటీకి హాజరుకానట్లు ఇరాన్ అధికారులు ప్రకటించారు.  ఈ సారి ఆయనకు బదులుగా ఆ సమావేశానికి ఆర్మీ ఫోర్స్ చీఫ్  అబ్ధుల్ రహీం మౌస్వీ హాజరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో  37 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం పాటిస్తున్న సంప్రదాయానికి తొలిసారిగా బ్రేక్ పడినట్లయింది.

    అయితే అమెరికాతో ముంపు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఖమేనీ బయిటకి రాలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు వెనక్కితగ్గేలా కనిపించడం లేదు. అణు కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న యురేనియం శుద్ధి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో నిలిపేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. తమ దేశ సౌర్వభౌమాధికారం విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.

    అటు అమెరికా తన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను అరేబియా సముద్రంలో మెుహరించింది. కొద్దిరోజుల క్రితం ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసిన యుఎస్ ఇప్పుడు ఆ దేశంపైకి ఏ క్షణానైనా దాడి చేసేలా మరింత దగ్గరగా అబ్రహం లింకన్‌ను తీసుకవచ్చింది. దీంతో పశ్చిమాసియాలో ఏం జరగనుందా? అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

  • ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దాని పేరు-2024 YR4. మరి ఇంత జాగ్రత్తగా శాస్త్రవేత్తలు ఎందుకు గమనిస్తున్నారు? అంటే..ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందా?ఉంటే.. ఒక వేళ అలా జరిగితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? భూమికి ఏమైనా ప్రమాదమా? ఇప్పుడిదే చర్చ ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల మధ్య జరుగుతోంది.

    శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం, 2024 YR4 అనే ఈ ఆస్టరాయిడ్ చంద్రుడిని ఢీకొట్టే అవకాశం సుమారు 4 శాతం ఉందని చెబుతున్నారు. 4 శాతం అంటే చిన్న సంఖ్యలా అనిపించొచ్చు… కానీ అంతరిక్ష లెక్కల్లో ఇది గమనించాల్సిన స్థాయి. సింగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం ..ఒకవేళ ఇది నిజంగా చంద్రుడిని ఢీకొట్టితే? చంద్రునిపై భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంది.

    ఈ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే .హిరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో చంద్రుడిపై సుమారు ఒక కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. చంద్రుడి ఉపరితలం రెక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో కంపించవచ్చని చెబుతున్నారు. ఇక్కడి వరకు వినగానే… “అది చంద్రుడిపై కదా, మనకు ఏముంది?” అనిపించొచ్చు. కానీ అసలు ఆందోళన అక్కడే మొదలవుతోంది. ఈ విస్ఫోటనం వల్ల ఎగసి పడే దుమ్ము, శకలాలు భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    వాటిలో కొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కలుగా పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉల్కాపాతం కనిపించవచ్చు. మరికొన్ని చోట్ల అవి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కలిగించవచ్చు. ఇంకా పెద్ద ఆందోళన ఏంటంటే ..ఈ శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్‌ను ఢీకొట్టే అవకాశం. ఒక వేళ అలా జరిగితే…కమ్యూనికేషన్ వ్యవస్థలు, GPS, నావిగేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ నెట్‌వర్క్స్ ..ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ గ్రహశకలం గమనంపై నిశితంగా నిఘా పెట్టాయి.

    NASA, ESAతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా దీని ట్రాజెక్టరీని క్షణక్షణం ట్రాక్ చేస్తున్నాయి. అయితే… ఇప్పటికీ ఇది కేవలం సంభావ్యత మాత్రమే. ఖచ్చితంగా ఢీకొడుతుందని ఎవరూ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం గా తెలుస్తోంది..మన ఆకాశం ప్రశాంతంగా కనిపించినా.. అక్కడ జరిగే ప్రతి కదలికను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

National

  • ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీవ్ర ‍అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనను పుణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బారామతిలో ఉన్న ఆయన అనారోగ్యం పాలు కావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    ఇటీవలే శరద్‌ పవార్‌‌ మేనల్లుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ బారామతిలో జరిగిన విమానప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. బారామతిలో ఎన్నికల ప్రచారం చేయడానికి వెళుతుండగా దురదృష్టవశాత్తు ఫ్లైట్ కులి అజిత్ పవార్ మరణించారు. అజిత్ పవార్ మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

    అజిత్ పవార్ మరణంతో మూడురోజుల సంతాప దినాలు ప్రకటించడంతో ఫిబ్రవరి 5 న జరగాల్సిన ఎన్నికలు ఏడుకు వాయిదాపడ్డాయి. అయితే ఈ విషాదం జరిగిన తర్వాత జరిగిన  ఈ ఎన్నికలు జరిగియి.