Archive Page | Sakshi
Sakshi News home page

International

  • పాకిస్థాన్‌లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్‌కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.

    పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్ కోటలో  చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు.  దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే  హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు.  

    చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన  నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది.  ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. 

    దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన  సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు.

  • అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ జెట్ ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదినట్లు అక్కడి ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

    USA, మైనే రాష్ట్రంలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది.  ఎనిమిది మంది ప్రయాణికులతో బయిలుదేరిన ఓప్రైవేట్‌ జెట్‌లో టేకాప్ సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైలట్ జెట్‌ను అదుపుచేసే యత్నం చేసినప్పటికీ ఫలితం లేక జెట్ కుప్పకూలింది. ఈ ‍ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ వివరాలను ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.

    వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు విపరీతమైన మంచు కురవడమే విమాన ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమెరికాలో మంచుతుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి.  భారత్ నుంచి అమెరికా వెళ్లే పలు విమానాలు అక్కడి మంచు తుఫాన్ కారణంగా రద్దయ్యాయి.

  • ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది.. డెడ్‌లైన్లు, బాధ్యతలు, బిల్లులు, stress… ఈ గందరగోళం మధ్య “ఇవన్నీ  వదిలేసి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లిపోవాలి?” అనే భావన చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు కనిపించబోయే ఈ సీన్… మీ మనసు లోతుల్లో ఉన్న భావనకి మౌనంగా సమాధానం.ఇంటర్నెట్‌లో ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అదే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే ఒక చిన్న పెంగ్విన్. దాన్ని నెటిజన్లు ప్రేమగా “ది నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు, అంటే ఇక ఏదీ పట్టించుకోని పెంగ్విన్. ఎందుకంటే అది వెళ్లే దారిలో ఎవరూ లేరు, ఏ శబ్దం లేదు, ఏ గమ్యం కూడా లేదు.

    ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తీసిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న క్లిప్.డాక్యుమెంటరీ వీడియోలో డాక్టర్ డేవిడ్ ఎయిన్‌లే మాట్లాడుతూ.. ‘ఒక వేళ ఆ పెంగ్విన్ అక్కడి నుంచి తిరిగి కాలనీకి వచ్చేద్దామని అనుకున్నా కూడా సాధ్యపడదు. తిరిగి రావటం కూడా ‘డెత్ మార్చ్’ అవుతుంది. మార్గం మధ్యలోనే అది చనిపోయే అవకాశం ఉంది’ అని అన్నారు. 

    ఆ డాక్యుమెంటరీ వీడియో తీసిన ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్‌జోగ్ మాట్లాడుతూ...వీడియో తీసిన కొంత సేపటికే ఆ పెంగ్విన్ చనిపోయి ఉంటుంది. అది చనిపోవడానికి ముందు అంటార్కిటికా మంచు పర్వతాల్లో దాదాపు 70 కిలోమీటర్లు ఒంటరిగా నడిచింది’ అని చెప్పారు. అయితే, ఆ పెంగ్విన్ అలా అన్నిటినీ వదలి చావును వెతుక్కుంటూ వెళ్లిపోవటం వెనుక ఉన్న సరైన కారణం ఇంత వరకు తెలియరాలేదు. తన భాగస్వామి చనిపోవటం వల్ల ఆ పెంగ్విన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, ఆ బాధలో డెత్ మార్చ్ చేసి ప్రాణాలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    ఇప్పుడు ఈ క్లిప్ సోషల్ మీడియాలో  మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా దీనికి ఒక పాటను జోడించిన తర్వాత ఇది మరింత ఎమోషనల్ గా  మారింది. కానీ అసలు ప్రశ్న ఇదే… ఈ పెంగ్విన్ వీడియోకి ఇంత క్రేజ్ ఎందుకు? ఎందుకంటే ఇది మనల్నే చూపిస్తోంది. ఆఫీసు కుర్చీలో కూర్చొని, ల్యాప్‌టాప్ ముందు కళ్ళు ముడుచుకుని “ఇక చాల్రా… అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి” అనిపించిన క్షణాల్ని ఇది గుర్తుచేస్తోంది. పెంగ్విన్ మాటలు మాట్లాడదు, కానీ దాని నడక చెబుతోంది – “నాకు శాంతి కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు కొంచెం ఒంటరితనం కావాలి.అని.

    ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..ఇది ఒక పెంగ్విన్ కథ కాదు, ఇది మన ఆత్మ కథ. అని కామెంట్లు పెడుతున్నారు. పెంగ్విన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆ పెంగ్విన్‌తో తాను కూడా నడుచుకుంటూ వెళుతున్నట్లు ఓ ఏఐ ఫొటో క్రియేట్ చేశారు.

     

  • చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మ బార్బీ.  అమ్మాయి బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిలిసెంట్‌ రాబర్ట్స్‌. పుట్టింది మార్చి 19, 1959న న్యూయార్క్‌లో. అప్పట్నించి అనేక రూపాల్లో ఆకట్టుకుంటూ వస్తోంది. ఐకానిక్ ఫ్యాషన్ డాల్  కెన్ మగ బార్బి ఎక్కడ పుట్టింది?  ఈ కెన్‌ పూర్తి  పేరు ఎంటో తెలుసా? పదండి తెలుసుకుందాం.

    ఐకానిక్ ఫ్యాషన్ డాల్  కెన్  65  ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కెన్‌ పూర్తి పేరుకు సంబంధించిన వివరాలు  ఇన్నాళ్ల తరువాత ప్రపంచానికి తెలిసాయి. ఐకానిక్ కెన్ డాల్స్ వెనుక క్రేజ్ మామూలుదికాదు. మాట్టెల్  ప్రియమైన సృష్టి  ఒక కీలక మైలు రాయిని  సెలబ్రేట్‌ చేసుకుంటోంది.  ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి, కంపెనీ అతని పూర్తి పేరు కెన్నెత్ సీన్ కార్సన్ అని వెల్లడించింది. టైమ్ మ్యాగజైన్ ప్రకారం, మాట్టెల్ సహ వ్యవస్థాపకులు రూత్ ,ఎలియట్ హ్యాండ్లర్ కుమారుడు కెన్నెత్ హ్యాండ్లర్ పేరు మీద అతనికి పేరు పెట్టారు. 

    ఇదీ చదవండి: HR మేనేజర్‌ను ముక్కలు చేసి, గోనె సంచిలో కుక్కి ; తలకోసం గాలింపు

    ఐకానిక్ కెన్ డాల్స్ వెనుక క్రేజ్
    బార్బీ తోడుగా మగ బార్బీ ‘కెన్’ అరంగేట్రం చేసిన రెండేళ్లకు 1961 మార్చిలో అమ్మకాల్లోకి వచ్చింది. , "ఇదంతా డ్యాన్స్‌తో మొదలైంది. మాట్టెల్‌కు చెందిన ప్రసిద్ధ టీనేజ్ ఫ్యాషన్ మోడల్ బొమ్మ బార్బీ, ఇదొక స్పెషల్‌ నైట్‌గా భావించింది.  ప్రియుడు కెన్‌తో కలిసి నడుస్తారని బార్బీకి  తెలుసు." అంటూ ఒక ప్రకటన ద్వారా మగ బొమ్మను పరిచయం చేసింది కంపెనీ. సాటిలేని నాణ్యత గల పరిపూర్ణమైన దుస్తులతో కూడిన పూర్తి వార్డ్‌రోబ్‌తో వీరిని  మీ ముందుకు తీసుకువస్తుంది  మాట్టెల్‌.  కెన్ బార్బీ పాఠశాలలో భోజనం కోసం కలుస్తారు, పార్టీలకు వెళతారు , కలిసి విశ్రాంతి తీసుకుంటారు. డేట్‌లకెళ్లడం, ప్రతి ఒక్కరినీ సరిగ్గా దుస్తులు ధరించడం ఎంత సరదాగా ఉంటుందో ఆలోచించండి. బార్బీ  కెన్ ఇద్దరినీ తీసుకెళ్లండి , ప్రేమ ఎక్కడికి తీసుకెడుతుంతో చూడండి"   అంటూ ప్రకటించింది. ఈ యాడ్‌లో కెన్ స్విమ్ ట్రంక్‌లలో మరియు టవల్‌తో పోజులివ్వడం విశేషం.

    బొమ్మల చరిత్రలో అత్యంత ప్రసిద్ధ జంటలలో ఒకరిగా ఉన్నప్పటికీ, కెన్  బార్బీల  బంధంలో ఒడిదుడుకులు లేకుండా లేవు. 2004లో, మాట్టెల్ వారు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ విడిపోవడం బార్బీ ప్రేమ జీవితం గురించి ఊహాగానాలకు దారితీసింది, ఆమె మనోహరమైన ఆస్ట్రేలియన్ సర్ఫర్ బొమ్మ బ్లెయిన్‌కి వెళ్లిందనే పుకార్లు వెలువడ్డాయి. అయితే, బార్బీ - కెన్  మధ్య ప్రేమ 2011లో మళ్లి పుట్టింది. 

    ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్‌ గురించి తెలుసా?

    కెన్  కొత్త ప్రయాణం
    కెన్ ఇప్పుడు కొత్త ప్రయాణంలో ఉన్నాడు. ఈ బొమ్మ ప్రపంచవ్యాప్తంగా 65 సాహసాలకు ఎక్స్‌పీడియా సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. సృజనాత్మకత , స్వీయ వ్యక్తీకరణకు చిహ్నంగా,  కొత్త అభిరుచిని సృష్టించేలా ప్రతిభతో తన సాంస్కృతిక ప్రభావాన్నివిస్తరిస్తున్నాడని కెన్‌ బొమ్మ వైభవాన్ని వెల్లడించింది. బొమ్మల శ్రేణిని అధిగమించి, సరికొత్త కొలాబరేషన్స్‌, ఉత్తేజకరమైన సాహసాలతో కెన్‌ కొత్త ఎరాలోకి అడుగు పెట్టబోతున్నాడనికంపెనీ  ప్రకటన పేర్కొంది.

     

  • ప్రకృతి సౌందర్యానికి అమెజాన్ అడవులు పెట్టింది పేరు..! అనకొండ వంటి ఎన్నెన్నో హాలీవుడ్ చిత్రాలకు ఈ అడవులు ఫేమస్..! చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదువుకునే చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి అమెజాన్‌కు సొంతం. అలాంటి అడవిలో ఎన్నెన్నో తెగలుంటాయి. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని ఓ కొత్త తెగ వివరాలు తాజాగా వెలుగు చూశాయి. 

    అమెజాన్ అడవులపై పరిశోధనలు జరుపుతున్న పర్యావరణవేత్త పాల్ రోసాలీ డ్రోన్ కెమెరాలతో దట్టమైన అటవీ ప్రాంతాలను.. సెలయేళ్లను.. కొండాకోనలను జల్లెడపడుతున్నారు. హెచ్‌డీ కెమెరాలకు ఇటీవల ఓ అరుదైన దృశ్యం చిక్కింది. దాంతో.. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఓ గిరిజన జాతి ప్రజల ఉనికి వెలుగులోకి వచ్చింది. 

    అంతే.. పాల్ రోసాలీ తన డ్రోన్ కెమెరాలతో ఆ తెగ ప్రజల జీవన శైలిని తెలుసుకునేందుకు చాలా రోజులు శ్రమించారు. ఫలితంగా.. ఆ తెగ సామాజిక పరిస్థితులు, సామూహిక వేడుకలు, అడవుల్లో లభించే చెట్ల నారతో.. చేత్తో తయారు చేసిన దుస్తులు.. ఇలా ఎన్నో విశేషాలను మన ముందు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా బయటపడని తెగలు 200 వరకు ఉంటాయని.. అమెజాన్‌లో తాజాగా వెలుగు చూసిన తెగ అందులో ఒకటని పాల్ రోసాలీ చెబుతున్నారు.

    ఈ తెగ ఇప్పుడు అక్రమ మైనింగ్ కారణంగా అంతరించిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరింపెరోస్ పేరుతో బ్రెజిల్‌లో ఇలాంటి అక్రమ మైనింగ్‌లు సాధారణమే. ఈ మైనింగ్ వెనక శక్తిమంతమైన మాఫియాలున్నాయి. లూలా డా సిల్వా అధికారంలోకి వచ్చాక.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు హెలికాప్టర్లతో పెట్రోలింగ్ జరుగుతున్నా.. గిరిజన జాతులకు ప్రమాదం ఏమాత్రం తగ్గలేదని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. 

    వ్యవసాయం పేరుతో అడవులను నాశనం చేస్తున్నారని, సొయాబీన్, ఆయిల్‌పామ్ సాగు, పశువుల పెంపకం అమెజాన్‌లో విస్తృతమవుతోందని చెబుతున్నారు. ఇలాంటి పంటల కోసం అమెరికా, ఐరోపాలోని బడా బ్యాంకులు సైతం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ సహజ సంపద దోపిడీ కారణంగా 2050 నాటికి అమెజాన్ అడవులు చాలా వరకు కుంచించుకుపోతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

    తాజాగా కనుగొన్న తెగకు అక్రమ మైనింగ్‌తోపాటు.. మరో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాహ్య ప్రపంచ వ్యక్తులు వీరిని కలిస్తే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారంలో పురుగుమందు అవశేషాలుండడం తెలిసిందే..! ప్రకృతి ఒడిలో ఆర్గానిక్ ఫుడ్ తింటున్న ఈ తెగకు.. మన ఆహారాన్ని గనక ఇస్తే.. అది వారిపాలిట విషంలాంటిదే అంటున్నారు. ఇక బయటి వ్యక్తులు ఈ తెగను సంప్రదిస్తే.. ఇన్ఫ్లూయెంజా, మీజిల్స్ వంటి వ్యాధులు ప్రబలి, తెగ ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో దూరంగా ఉండే తెగలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, సాధారణ జలుబు, వైరస్‌లు కూడా ఈ తెగ అంతానికి కారణమవ్వొచ్చని హెచ్చరిస్తున్నారు.

    అమెజాన్ అడవిలో రహస్య తెగ!

     

  • ఏదైనా ప్రత్యేక సందర్భం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చే దుస్తులు చీర.   అలా కెనడా పౌరసత్వం తీసుకునే సందర్భంగా మహారాష్ట్రకు  చెందిన మహిళ  ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించింది. తమ ప్రాంతానికి చెందిన  చీర,  ముస్తాబులో  స్పెషల్‌గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీనికి  సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.

    మహారాష్ట్రకు చెందిన  దివ్య లాట్లికర్ కెనడా పౌరసత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నౌవారీ చీరతో హాజరై అందర్నీ ఆకర్షించారు. తన సొంత రాష్ట్రం నుండి వచ్చిన సాంప్రదాయ చీరను ధరించి, నుదిటిపై బిందీతో ముస్తాబైంది. ఈ వేడుకును ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచకుంది. నౌవారీ చీర ధరించడం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చీర బలం, గౌరవం, సహనం, కొనసాగింపుకు చిహ్నం అని ఆమె అన్నారు. పౌరసత్వ ప్రమాణాన్ని స్వీకరిస్తూ, సర్టిఫికేట్  అందుకుంటున్న ఆ క్షణం ఆమెలో  ఇన్నేళ్ల కృషి, సంకల్పం ప్రతిబింబించింది.

    ఇదీ చదవండి: నిపా వైరస్‌ కలకలం : ఎయిర్‌పోర్ట్స్‌లో హై అలర్ట్‌
    ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ, దివ్య దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాను ఉన్న చోట ఉండటం గర్వంగా ఉందని, అలాగే ఏ దేశమేగినా, పుట్టిన నేలను మర్చిపోకూడదని, మూలాలను సజీవంగా ఉంచుకోవడం  తనకెంతో గర్వకారణమని  వ్యాఖ్యానించారు.  

     ఆ వేడుకలో ఆమె ధరించిన  చీర, సాంప్రదాయ వేషధారణపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. చాలా సహజంగా, అందంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారంటూ  దివ్యను కొనియాడారు. అచ్చమైన మరాఠీ అమ్మాయిలా ఉన్నారన్నారు. అలాగే తన అమెరికా పౌరసత్వ స్వీకరణ సందర్బంగా తాను కూడా మరాఠీ దుస్తులు ధరిస్తానని, మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్‌ అంటూ మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. 
     

     

  • జెరూసలేం: హెజ్‌బొల్లా (Hezbollah), హమాస్‌లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. తాజాగా హెజ్‌బొల్లాకు అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహించిన ఆల్‌ మనార్‌ టీవీ ప్రజెంటర్‌ అలీ నూర్ అల్-దిన్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది.

    అలీ నూర్‌ అల్‌-దిన్‌ మరణంపై హెజ్‌బొల్లా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన ఇజ్రాయెల్‌  లెబనాన్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తుందని, అలీ నూర్‌ అల్‌-దిన్‌ ప్రాణాలు తీసిందని తెలిపింది.  

    గతంలో అల్-మనార్ ఛానెల్‌లో మతపరమైన కార్యక్రమాల న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసిన అలీ నూర్‌ టైర్‌లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. టైర్ శివారులోని అల్-హౌష్‌లో అల్-దిన్ ప్రధాన బోధకుడిగా కూడా పనిచేశాడు. లెబనీస్ సమాచార మంత్రి పాల్ మోర్కోస్ ఇజ్రాయెల్ తీరును ఖండించారు. ‘‘మీడియా కుటుంబానికి మా సంఘీభావం.అలీ నూర్‌ మరణానికి  అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘనలు జరగకుండా లెబనాన్‌లోని మీడియా ప్రతినిధుల్ని రక్షించే దిశగా అడుగులు వేయాల’’ని కోరారు.

     

     

  • అమెరికాలో వలస నియంత్రణ కోసం పని చేస్తున్న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) దాడులు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో మిన్నెసోటా స్టేట్‌లో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లలో ఆందోళన పెరిగిపోతుండగా.. ఐస్‌ వ్యతిరేక నిరసనలు ఒకసారిగా ఉధృతం అయ్యాయి. మరోవైపు.. ట్రంప్‌ సర్కార్‌ మానవ హక్కులను కాలరాస్తోందనే రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిరుడు జరిపిన దాడుల్లో.. 32 మంది మరణించారు. ఈ ఏడాదిలో మొన్నమధ్యే మిన్నెసోటా రాష్ట్రంలో ఐస్‌ అధికారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది. జనాల ప్రాణాల్ని తీస్తున్న ట్రంప్‌ సర్కార్‌ అంటూ డెమోక్రటిక్‌ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీ మాత్రం ఈ దాడుల్ని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ అమెరికన్లలో లేనిపోని భయాలను డెమోక్రాట్లే సృష్టిస్తున్నారని తిట్టిపోస్తోంది. ఇటు.. ప్రజాభిప్రాయ సర్వేలు మాత్రం అమెరికన్లలో మెజారిటీ ఐస్‌ దాడుల పద్ధతులను వ్యతిరేకిస్తున్నారు.

    వైట్ హౌస్ స్పందన
    మిన్నెసోటా ఘటనపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా వీధుల్ని నెత్తరోడ్చడం అధ్యక్షుడు ట్రంప్‌ ఉద్దేశం ఎంతమాత్రమూ కాదని పేర్కొంది. వైట్‌హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోనీన్‌ లెవిట్‌ మాట్లాడుతూ.. జనాల్ని గాయపర్చడమో.. చంపడమో ట్రంప్‌ ఉద్దేశం కాదని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారామె. ఈ పరిస్థితికి డెమోక్రటిక్‌ నాయకులే కారణమని ఆరోపించారామె. ఫెడరల్‌ అధికారులపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్, మేయర్ జాకబ్ ఫ్రేలపై ఆమె మండిపడ్డారు. 

    ఇలాంటివి అవసరమా?
    న్యూయార్క్ సిటీ మేయర్‌ జోహ్రాన్ మామ్దానీ ICE దాడులను “క్రూరమైనవి, మానవత్వరహితమైనవి” అభివర్ణించారు. ఆయన ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ ది వ్యూ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇలాంటి సంస్థకు అమెరికాలో స్థానం లేదన్నారు. అలాంటి దాడులు న్యూయార్క్‌ నగరం దాకా రానివ్వబోనని సవాల్‌ చేశారు.

    2026 మధ్యంతర ఎన్నికల్లో ఐస్‌ వ్యవహారం కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ నడుస్తోంది. అమెరికాలో ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 435 హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ సీట్లు, 35 సెనేట్‌ సీట్లు, అలాగే 39 రాష్ట్రాల్లో గవర్నర్‌ ఎన్నికలు జరుగుతాయి. ఇవి అమెరికా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా భావిస్తున్నారు. కాబట్టి రెండో దఫా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌నకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమనే చెప్పొచ్చు. హౌస్‌ లేదంటే సెనేట్‌లో రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యం కోల్పోతే.. ఆయనపై ఇంపీచ్‌మెంట్‌ అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Movies

  • టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్‌ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు.  

    అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్‌లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్‌లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.

    కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్‌ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్‌లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్‌లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.  

  • ప్రముఖ బాలీవుడ్ సింగర్‌  తన కెరీర్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ప్లే బ్యాక్ సింగర్ అర్జిత్‌ సింగ్‌ తాజాగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇకపై ఎలాంటి ప్రాజెక్టులు ఒప్పుకొనని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

    ఇన్ని రోజులుగా నాపై ప్రేమ, అభిమానం చూపిన వారందరికీ థాంక్స్‌ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేయనని వెల్లడించారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందన్నారు. అయితే తన రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించలేదు. సినిమాలకు గుడ్‌బై చెప్పిన అర్జిత్‌ ఇండిపెండెంట్‌ సింగర్‌గా కొనసాగుతారని సమాచారం.
     

     

  • ఆది పినిశెట్టి  హీరోగా నటించిన చిత్రం డ్రైవ్‌. గతేడాది డిసెంబర్‌ 12న అఖండ-2తో పాటు ఈ మూవీ విడుదలైంది. చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఆది పినిశెట్టి న‌టించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. దర్శకుడు జెనూస్ మొహమ్మద్ తెరకెక్కించిన ఈ మూవీలో మ‌ల‌యాళ బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో ప్రేక్షకులను ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది.

    ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా అందుబాటులో ఉంది. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రం జనవరి 30 నుంచి ఆహాలో అందుబాటులో ఉంటుందని ట్వీట్ చేసింది.  సైబ‌ర్ క్రైమ్స్‌, హ్యాకింగ్స్ నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. 
     

     

  • టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు.  తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.

    తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్‌ చేయగానే ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్‌ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్‌ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.  

     

     

  • బాలీవుడ్ ఒకప్పుడు లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'నేషనలిజం' ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వెండితెరపై త్రివర్ణ పతాకం కనిపిస్తే చాలు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. 'ఉరి', 'గదర్ 2' నుంచి మొదలైన ఈ ఊపు, ఇప్పుడు 'ధురంధర్', 'బోర్డర్ 2' వరకు కొనసాగుతోంది. సామాన్యుడిలో ఉండే దేశభక్తిని భావోద్వేగంతో కలిపి వెండితెరపై చూపించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

    ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన  దేశభక్తి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే రూ.450 కోట్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద విక్కీ కౌశల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. చారిత్రక వీరగాథలకు దేశభక్తి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది.

    రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన  'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక స్పై థ్రిల్లర్‌గా వచ్చి, దేశభక్తిని అద్భుతంగా పండించిన ఈ చిత్రం కేవలం ఏడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,285 కోట్లకు పైగా వసూలు చేసి 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది.

    ఇక గతవారం (జనవరి 23) రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' ప్రస్తుతం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. 1971 ఇండియా-పాక్ యుద్ధం ఆధారంగా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్కును చేరుకుంది. నిన్న ఒక్క రోజులోనే  ఇండియాలో ఈ చిత్రం రూ.59 కోట్లు రాబట్టిందని  నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇలానే కొనసాగితే ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. .సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి చిత్రానికి  అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. 1971 ఇండో - పాక్‌ యుద్ధం నేపథ్యంలో జేపీ దత్తా తెరకెక్కించిన బోర్డర్‌(1997) చిత్రానికి సీక్వెల్‌ ఇది. 
     

  • ప్రముఖ సంగీతజ్ఞులు, 'సంగీత క్షీరసాగరం' వ్యవస్థాపకులు విద్వాన్ శ్రీ ఓరుగంటి ఆనంద్ మోహన్  (90) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు సంతానం ఉన్నారు. 

    సంగీతమే శ్వాసగా..

    1956 నుంచి 1977 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో లలిత సంగీత కళాకారుడిగా సేవలందించిన ఆనంద్ మోహన్.. వృత్తిరీత్యా ఢిల్లీలోని కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ కార్యాలయం లోనూ కాగ్ (CAG) కార్యాలయంలో పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని సంగీతానికే అంకితం చేశారు. తన గురువు ఉప్పలపాటి అంకయ్య స్మరణార్థం 2002లో 'సంగీత క్షీరసాగరం' సభను స్థాపించి, సప్తపర్ణి సహకారంతో ఇప్పటివరకు 699 కచేరీలను నిర్వహించారు. ఎవరి వద్ద ధనసహాయం ఆశించకుండా తన పెన్షన్ డబ్బులే ఖర్చు చేస్తూ నిస్వార్థంగా ఈ కచేరీలు నిర్వహించడం విశేషం.

    అందుకున్న పురస్కారాలు..

    శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన కృషికి గాను 2012లో కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసునిగా గౌరవం పొందారు. 2013లో చెన్నైలో జ్ఞాన సరస్వతీ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. 1966-67 మధ్య కాలంలో శ్రీ త్యాగరాయ గాన సభ వ్యవస్థాపక కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. యువ కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంగీత విద్వాంసులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

     

     

  • కొంటె చూపులతో ఫన్నీ పోజులిచ్చిన మీనాక్షి చౌదరి

    జ్యూవెలరీతో హీరోయిన్ తమన్నా ఊహించని లుక్స్

    జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న హాట్ బ్యూటీ కేతిక శర్మ

    ఎయిర్‌పోర్ట్‌లో అనన్య నాగళ్ల సందడే సందడి

    డ్యాన్స్ అదరగొట్టిన 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి

    బాలిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రుహానీ

  • రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు.

    అయితే ఈ సినిమాలో ఓ సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. 

  • రీసెంట్ టైంలో ఓటీటీ సంస్థలు.. ఏ భాషా చిత్రాలకైనా తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా భాషల్లో హిట్ అయిన మూవీస్‪‌కి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తెస్తున్నాయి. రీసెంట్‌గా 'సిరై' అనే తమిళ చిత్రానికి ఇలానే చేశారు. ఇప్పుడు మలయాళంలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఓ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన దాదాపు 10 రోజులకు తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)

    మలయాళంలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా చెలామణీ అయిన దిలీప్.. 2017లో హీరోయిన్ భావనపై అత్యాచారం చేయించాడనే ఆరోపణలతో మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటన తర్వాత నుంచి దిలీప్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. గత నెల అంటే 2025 డిసెంబరులో ఈ కేసు నుంచి దిలీప్‌కి పూర్తిగా రిలీఫ్ దక్కింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి దిలీప్ పేరు తొలగించారు. ఇది జరిగిన కొన్నిరోజులకే దిలీప్ కొత్త మూవీ 'భా భా భా' థియేటర్లలోకి వచ్చింది.

    కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించాడు. డిసెంబరు 18న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి టాక్ పాజిటివ్‌గానే వచ్చింది. ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కొన్నిరోజుల క్రితం ఈ చిత్రం జీ5 ఓటీటీలోకి వచ్చింది. అప్పుడు మలయాళం మాత్రమే రాగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

  • ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో 'అనగనగా ఒక రాజు' కూడా ఒకటి. నవీన్ పొలిశెట్టి.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేసిన మూవీ ఇది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‪‌లో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఇకపోతే ఇందులో ఇద్దరూ కలిసి భీమవరం బల్మా పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఆ పాట పూర్తి వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మీనాక్షి డ్యాన్స్ అదరగొట్టేసింది.

    ఈసారి పండగకు రిలీజైన వాటిలో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' లీడ్ తీసుకోగా.. నవీన్ పొలిశెట్టి సినిమా కూడా ఉ‍న్నంతలో బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. కథ పరంగా కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కామెడీ ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు బాగానే చూశారు. నిర్మాణ సంస్థ అయితే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ప్రకటించారు. రిలీజై దాదాపు రెండు వారాలుపైనే అయిపోయింది. అయినా సరే హీరో నవీన్ పొలిశెట్టి.. అమెరికా వెళ్లి ప్రస్తుతం ప్రచారం చేస్తున్నాడు.

  • జీవీ నాయుడు, వీజే బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాట్‌’(CAT). వీఆర్‌జీఆర్‌ మూవీస్ బ్యానర్ పై వై. గంగాధర్  ఐపీఎస్‌ సమర్పణలో, రజని గొంగటి నిర్మించిన ఈ చిత్రానికి   జీవీ నాయుడు దర్శకత్వం వహించారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.

    ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, క్యాట్‌ స్టోరీ కూడా నాకు చెప్పాడు.ఈ కథ వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా  పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’అన్నారు.  డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి రాజా సంగీతం అందించగా, పంకజ్‌ తొట్టాడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

  • నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తుంటారు. అంతేకాకుండా తన కోపంతో అభిమానులపై చేయి కూడా చేసుకుంటారు. ‍అలా చాలాసార్లు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమాల్లో లాగా ఓ స్టంట్ చేయబోయి నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంతమ స్టైల్లో అద్దాలను గాల్లోకి ఎగరేశాడు బాలయ్య. కానీ అది వర్కవుట్ కాలేదు. అద్దాలు కాస్తా కింద పడిపోవడంతో వెంటనే తీసుకుని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్  ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు

    ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే గతేడాది అఖండ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. 
     

     

  • టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాలో హీరోయిన్‌గా‌ ఈషా రెబ్బా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా..తరుణ్ సైతం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరయ్యారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషాతో రిలేషన్‌పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. మీపై వస్తున్న రూమర్స్‌పై ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్‌ కంటే ఎక్కువని తెలిపారు. ఇది నా పర్సనల్‌ కాబట్టి.. టైమ్ వచ్చినప్పుడు అన్ని చెప్తా అన్నారు. నేను ఏదైనా చెప్తే.. దాని వల్ల ఎవరైనా  ఇబ్బంది పడడం తనకు ఇష్టం లేదన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే గుడ్‌ న్యూస్ చెప్తానని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. 

    కాగా.. ప్రస్తుతం వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్‌గా తెరకెక్కించారు.

    (ఇది చదవండి: తరుణ్‌తో డేటింగ్‌? తొలిసారి స్పందించిన హీరోయిన్‌)

    తర్వాత చెప్తా: ఈషా రెబ్బా

    ఇటీవల సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు సైతం తరుణ్‌తో డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్‌- ఈషా.. రియల్‌ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. వీరిద్దరి రిలేషన్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 
     

  • ‘యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె. ఆయన ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘దేవగుడి’. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో  శౌర్య, నరసింహ, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామకృష్ణారెడ్డితో కలిసి రఘు కుంచె మీడియాతో ముచ్చటించారు.

    నటుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను  వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. నేను జీపులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా’ అన్నారు.

    దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. 

  • గత కొన్నాళ్లలో ప్రెస్‌మీట్స్ అంటే తెలుగు సినిమా హీరోహీరోయిన్లు చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే చిత్రవిచిత్రమైన ప్రశ్నలు, కొన్నిసార్లయితే మరీ దారుణమైనవి అడుగుతూ సదరు సెలబ్రిటీలని పలువురు రిపోర్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళంలోనూ ఒకరిద్దరు రిపోర్టర్లు ఇలానే తయారైనట్లు కనిపిస్తున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్‌కి ఇలాంటి ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది.

    (ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'పై రీమేక్ రూమర్స్)

    గతేడాది 'కూలీ'తో వచ్చిన లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం చేయనున్నాడు. రెండు వారాల క్రితం దీని ప్రకటన వచ్చింది. వీటి గురించి చెప్పేందుకు చెన్నైలో ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టాడు. తన గత, ప్రస్తుత చిత్రాల గురించి వివరాలు వెల్లడించాడు. అలానే 'ఖైదీ 2' ఎప్పుడు ఉండబోతుంది? ఎల్‌సీయూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

    ఇదే ప్రెస్‌మీట్‍‌లో ఓ రిపోర్టర్.. దర్శకుడు లోకేశ్‌ని ఇబ్బందికర రీతిలో ప్రశ్నించాడు. మీరు ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి? మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అని సదరు రిపోర్టర్ అడగ్గా.. లేదు సర్ నాకు కుటుంబం ఉంది అని లోకేశ్ సమాధానమిచ్చాడు. అయినా సరే రిపోర్టర్ వదలకుండా.. రెండో ఫ్యామిలీ వద్దా? అన్నట్లు అడిగాడు. దీనికి ఆన్సర్ ఇవ్వని లోకేశ్.. ప్రెస్‌మీట్ అక్కడితో ముగించేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో సదరు రిపోర్టర్‌పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చీప్ బిహేవియర్ అని కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్.. 2012లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ 'అనకొండ'.. తెలుగులోనూ)

  • రిపబ్లిక్ డే వేడుకల్లో హీరోయిన్ సమంత కనిపించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడు అనుకోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    సమంత తన పోస్ట్‌లో రాస్తూ..' నేను ఎదుగుతున్నప్పుడు నన్ను ప్రోత్సహించేవారు ఎవరూ లేరు... నేను ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తానని నా అంతరాత్మ కూడా ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఎలాంటి మార్గదర్శకత్వం లేదు... ఇలాంటి కలలు ఒకప్పుడు ఊహించుకోవడానికి కూడా చాలా పెద్దగా అనిపించేవి. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఈ దేశంలో నేను కేవలం నా పని చేసుకుంటూ ముందుకు సాగిపోయాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 
     

     

  • ఐకాన్ స్టార్ ‍అల్లు అర్జున్.. తన 20 ఏళ్ల నాటి మూవీని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో అత్యంత ఆనందాన్నిచ్చిన చిత్రాలలో ఇది ఒకటని ట్వీట్ చేశారు. హ్యపీ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన కరుణాకర్‌ గారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.

    నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన హీరోయిన్ జెనీలియా, టాలెంటెడ్‌ మనోజ్ భాజ్‌పాయ్‌.. నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులందరూ కలిసి ఈ ప్రయాణాన్ని మర్చిపోలేనిదిగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించినందుకు యువన్ రాజాకు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచినందుకు మా నాన్న అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ ‍చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
     

     

  • ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. ఛాంపియన్, సర్వంమాయ, పతంగ్, అన్నగారు వస్తారు తదితర చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు 'ధురందర్' కూడా ఓటీటీలోకి రానుందనే టాక్ నడుస్తోంది. వీటికి తోడు హాలీవుడ్ క్రేజీ మూవీ 'అనకొండ' ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

    (ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

    1997లో తొలిసారి వెండితెరపై 'అనకొండ' సినిమా వచ్చింది. అప్పట్లో ఇలాంటి పాములతో మూవీస్ ఎవరూ తీయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా జనాలు విరగబడి చూశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన హిట్‌గా నిలిచింది. దీని తర్వాత 2004లో ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్, 2008లో ఆఫ్ స్ప్రింగ్, 2009లో ట్రయల్ ఆఫ్ బ్లడ్, 2015లో లేక్ ప్లాసిడ్ అని మరో నాలుగు మూవీస్ కూడా వచ్చాయి. కమర్షియల్‌గా హిట్ అయ్యాయి గానీ కంటెంట్ పరంగా ఓకే ఓకే అనిపించుకున్నాయి.

    దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెలలో 'అనకొండ' పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇది ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో నెలయ్యేసరికి అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్‌లోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఎల్లుండి (జనరి 29) నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ రూపంలోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

  • అరడజనుకు పైగా సినిమాలతో వరసగా ఫ్లాప్స్ అందుకున్న హీరో రవితేజ.. ఈసారి సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీతో వచ్చాడు. కంటెంట్ పరంగా పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఎందుకనో జనాలు దీన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ చిత్రం ఫలితం సంగతి ఏంటనేది పక్కనబెడితే తాజాగా రవితేజ కొత్త మూవీని ప్రకటించాడు. 'ఇరుముడి' అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంపై రీమేక్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

    ట్రెండ్ ఎంత మారుతున్నా సరే రవితేజ ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో 'ఈగల్', 'టైగర్ నాగేశ్వరరావు' లాంటి ఒకటి రెండు ప్రయోగాత్మాక మూవీస్ చేసినప్పటికీ.. వాటిలోనూ రెగ్యులర్ కమర్షియల్ సాంగ్స్, సీన్స్ ఉండేసరికి అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కాస్త ఆలోచించి భిన్నంగా 'ఇరుముడి' అనే మూవీని రవితేజ చేస్తున్నాడు. ఇందులో అయ్యప్ప మాలధారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని చాలామంది 2022లో వచ్చిన మలయాళ మూవీ 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. అందులోనూ ఇలానే హీరో అయ్యప్ప మాల వేసుకుని ఉంటాడు. కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. దీంతో ఈ రెండింటి మధ్య పోలికలు కనిపిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: ఓటీటీలో కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా.. డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‌)

    కొన్నిరోజుల క్రితం శివ నిర్వాణ.. రవితేజతో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ 'ఇరుముడి' టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తే ఇదో కూతురు, దేవుడి సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే 'మాలికాపురం' రీమేక్ అని అంటున్నారు. ఈ మలయాళ సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయి ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే 'ఇరుముడి' రీమేకా కాదా అనేది కొన్నిరోజుల ఆగితే క్లారిటీ వచ్చే అవకాశముంది.

    'మాలికాపురం' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల పాప కల్యాణి, అయ్యప్పస్వామి భక్తురాలు. తండ్రితో కలిసి శబరిమల వెళ్లాలనేది  ఈమె కల. అనుకోని పరిస్థితుల్లో తండ్రిని కోల్పోతుంది. దీంతో ఓ స్నేహితుడితో కలిసి శబరిమలకు బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు, కిడ్నాప్ ప్రయత్నాలు, చివరకు అయ్యప్పన్ అనే వ్యక్తి సాయంతో శబరిమల ఎలా చేరుకున్నారనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు 'దేవర' నిర్మాత గుడ్‌న్యూస్‌)

Telangana

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లాంటి పరిణామాలతో శాస్త్ర, సాంకేతిక ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఈ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు భారతదేశం తనదైన మార్గాన్ని నిర్దేశించుకునే పనిలో ఉంది. స్వాతంత్ర్యానంతర కాలంలో శాస్త్ర, సాంకేతిక రంగం సహా వివిధ రంగాల్లో సంస్థాగత నిర్మాణం చేపట్టడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత్ ఆ చరిత్ర, అనుభవం ఆసరాగా చేసుకొని వర్తమానానికి తగ్గట్టు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది అని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో భాగంగా ‘సైన్స్ అండ్ ది సిటీ’ అన్న అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో భాగంగా వక్తలు ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు.

        ఈ కార్యక్రమంలో 'స్పేస్: ది ఇండియా స్టోరీ' పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దినేష్ సి శర్మ మాట్లాడుతూ, ''భారతదేశంలో శాస్త్ర విజ్ఞాన పథకాలను ఆరంభించినవారికి మొదటి నుంచి ఒక స్పష్టమైన దృష్టి, అలాగే ఎంచుకున్న మార్గం ఉన్నాయి. ఫలితంగా అణుశక్తి, అంతరిక్ష పరిశోధన సంస్థల వంటి వాటి అభివృద్ధి జరిగింది. విదేశీ మారక ద్రవ్యం కొరత పీడిస్తూ, అలాగే భారతదేశం వారసత్వంగా పొందిన ప్రభుత్వ యంత్రాంగ జాప్యం అనే భారం వేధిస్తున్నప్పటికీ ఈ సంస్థలు ఎంతో శ్రమించి, పురోగామి పథంలో సాగాయి'' అని చెప్పారు.

        ''భారతదేశం వద్ద కనీసం రాకెట్ కానీ, ఉపగ్రహం కానీ లేనప్పుడే విక్రమ్ సారాభాయ్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆధారిత విధానం, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాలను అభివృద్ధి చేయడంపై ఆయన చూపిన ప్రాధాన్యం... ఫలితంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విలక్షణమైన పని సంస్కృతితో వృద్ధి చెందింది'' అని దినేశ్ శర్మ వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి తన మనసులో ఉన్న ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు వీలుగా విక్రమ్ సారాభాయ్ పలువురు శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాలను తీర్చిదిద్దారని శర్మ వివరించారు.

    ఈ చర్చాగోష్ఠిలో ‘హోమి జె. భాభా: ఎ లైఫ్’ రచయిత భక్తియార్ కె. దాదాభాయ్ మాట్లాడుతూ, హోమీ భాభా బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. సంగీత ప్రేమికుడు, నిష్ణాతుడైన చిత్రకారుడు, శాస్త్రవేత్త, పలు శాస్త్ర విజ్ఞాన సంస్థల రూపకర్త అని తెలిపారు. ఆయన ఒక దార్శనికుడు, అదే సమయంలో కార్యసాధకుడు అని వివరించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థల ప్రస్థానంపై ఆసక్తికరంగా సాగిన ఈ చర్చాగోష్ఠిని వినేందుకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకావడం విశేషం. 

  • సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడు అని భావించే పరిస్థితి తలెత్తిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. సింగరేణిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొద్ది సేపటి క్రితం బీఆర్‌ఎస్‌ నేతలు లోక్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

    సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు.

    సీఎం అంటే అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో. సింగరేణి సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. వాటిని ఫుట్‌ బాల్‌ ఆటకి వినియోగించారు. సీఎం రేవంత్‌ సింగరేణి సంస్థకు తీరని అన్యాయం చేశారని అన్నారు.   

  • హైదరాబాద్‌:  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేశారు. రూ. 16.20 కోట్ల సైబర్‌ నేరాలకు పాల్పడ్డారు వీరు. 

    అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం సైతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డిజిటల్‌ అరెస్టులు, ట్రేడింగ్‌, కొరియర్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్‌ నేరగాళ్లు. మ్యూల్‌ అకౌంట్ల ద్వారా విదేశాలకు నగదు తరలిస్తున్నారు. వీరి బారిన పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించుకున్న నగదును పోగొట్టుకుంటున్నారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

    జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనవరి 30 వరకు నామినేషన్లు దాఖలు గడువు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహణ.. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్‌ ఎన్నిక పోలింగ్‌.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది.  

    52.43 లక్షల మంది ఓటర్లకు గాను 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 16,031  బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయనున్నారు.  

    ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ‘మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. 50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి... 50 వేల కంటే ఎక్కువ ఉంటే రసీదు ఉండాలి. వెబ్ కాస్టింగ్ ఉంటుంది.. పటిష్టమైన బందొబస్తు ఉంటుంది. 22వేల మంది పోలీసులు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారు. 1926 సెన్సిటివ్, 13 వందలు అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు గుర్తించాం. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్‌లు ఉన్నాయి. మేడారం వెళ్లే వాళ్ళను చెకింగ్ నుంచి మినహాయింపు ఉంటుంది’ అని తెలిపారు. 

    👉ఎన్నికల షెడ్యూల్‌ వివరాలు.. ఇక్కడ క్లిక్‌ చేయండి

  •  సిట్‌ విచారణ.. అప్‌డేట్స్‌

    • మాజీ ఎంపీ సంతోష్‌ సిట్‌ విచారణ ముగిసింది
    • ఐదుగంటల పాటు సాగిన సిట్‌ విచారణలో ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రశ్నల వర్షం
    • మరి కాసేపట్లో జూబ్లీహిల్స్‌ పీఎస్‌ నుంచి బయటకు రానున్న మాజీ ఎంపీ సంతోష్‌

     

    • ఫోన్‌  ట్యాపింగ్‌ కేసులో కొనసాగుతున్న సిట్‌ విచారణ
    • 2 గంటలుగా మాజీ ఎంపీ సంతోష్‌ను ప్రశ్నిస్తోన్న సిట్‌
       
    • జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు మాజీ ఎంపీ సంతోష్‌రావు
    • సిట్‌ విచారణకు హాజరైన సంతోష్‌రావు
    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారించనున్న సిట్‌

    సంతోష్‌కు సిట్‌ నోటీసులు

    • సోమవారం(జనవరి 26వ తేదీ) సంతోష్‌రావు సిట్‌ నోటీసులు
    • ఈరోజు(మంగళవారం, జనవరి 27వ తేదీ) జూబ్లీహిల్స్‌ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
       

    హరీష్‌, కేటీఆర్‌లను విచారించిన సిట్‌

    • ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా  సంతోష్‌కు నోటీసులు
    • మంగళవారం మధ్యాహ్నం  మూడు గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌ విచారణకు హాజరు కావాలని స్పష్టం 
    • .సీఆర్సీసీ 160 కింద నోటీసులు
       
    • ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్‌ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్‌ వాదన.  ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్‌ఎస్‌ నేతలు ఇలా చేశారని సిట్‌ చెబుతోంది.
       

     

  • ‘అమ్మ.. ఇప్పుడే వస్తా .. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తింటా’ అని చె ప్పిన ఒక్కగానొక్క కొడుకు రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో.. ‘నేను ఇపుడు ఎవరికి అన్నం తి నిపించాలి బిడ్డా’ అని అతడి తల్లి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మరో యువకుడి తల్లిదండ్రులు సైతం చేతికందిన కొడుకు ఇక లేడని గుండెలవిసేలా రోదించారు.

    కరీంనగర్‌క్రైం/వీణవంక: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందగా, వారి తల్లిదండ్రుల రోదనలు మి న్నంటాయి. త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలం మామిడాలపల్లి గ్రా మానికి చెందిన మ్యాకల గణేశ్‌(22), అదే గ్రామానికి చెందిన మిరియాల సందీప్‌రెడ్డి(20)తో పాటు మరో స్నేహితుడు వేర్వేరు బైక్‌లపై గణేశ్‌ బైక్‌ స్పేర్‌ పార్ట్స్‌ కోసం మధ్యాహ్నం కరీంనగర్‌ వచ్చారు. అనంతరం గణేశ్‌, సందీప్‌రెడ్డి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో హౌసింగ్‌బోర్డుకాలనీలో రోడ్డు క్రాస్‌ చేస్తున్న ప్రైవేట్‌ సూ్‌క్‌ల్‌ బస్సును ఢీకొని బైక్‌పై నుంచి ఎగిరిపడ్డారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే క్రమంలో ఇద్దరూ మృతిచెందారు. మృతుడు గణేశ్‌ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.తిరుమల్‌ తెలిపారు.

    మామిడాలపల్లిలో విషాదం

    కరీంనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందడంతో స్వగ్రామం వీణవంకలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మ్యాకల కొమురయ్య–పద్మ దంపతులకు గణేశ్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గణేశ్‌ ఇంటర్‌లోనే చదువు మానేసి ఇంటి వద్దే వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మిరియాల శ్రీనివాస్‌రెడ్డి–మమత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సందీప్‌రెడ్డి. ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు ఒక్కడే కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.

  • సాక్షి, యాదాద్రి: యాదగిరి గుట్ట పరిసర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుట్ట శివారులో పులి సంచరిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. 

    గత కొంతకాలంగా ఆవుల్ని, మేకలు చనిపోతుండడంతో మిస్టరీ కొనసాగింది. ఈ క్రమంలో శివారులోని దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ట్రాప్‌ కెమెరాల్లో రికార్డయ్యిది. అయితే ఆడ తోడు కోసం బహుశా ఆమ్రాబాద్‌ అడవుల నుంచి అది వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గుట్టతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు.. పులిని ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు. 

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: మరోసారి రాష్ట్ర  పోలీసుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారని మండిపడింది. 

    విచారణ సందర్భంగా.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. ‘ఇలాంటి వాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు. హైకోర్టులో కూడా ఇలాగే అరెస్టులు చేస్తారా?’ కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు తీరు సరైంది కాదని వ్యాఖ్యానించింది.

    దౌర్జన్యం చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తేలికగా తీసుకోవద్దని, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

    పత్తికొండ న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్‌లో, కోర్టు హాల్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు, పోలీసుల వ్యవహారంపై కఠినంగా స్పందించింది. 

  • సాక్షి,తాడేపల్లి: అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌ సీసీ నేతలు, క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. 

    నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవలే జోగి రమేష్‌, రాము విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు.

    ఈ భేటీలో తమను, తమ కుటుంబాన్ని అక్రమ కేసులతో టీడీపీ ప్రభుత్వం ఇబ్బందిపెట్టిన తీరును జోగి సోదరులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, క్యాడర్‌ ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధీటుగా ఎదుర్కొందామని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు. పార్టీ లీగల్ సెల్ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.
     

  • తాడేపల్లి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు (బుధవారం, జనవరి 28వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.  రేపు ఉదయం గం. 11లకు  భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలో ప్రజాసమస్యలు, రాజకీయ పరిణామాలపై వైఎస్‌ జగన్‌ చర్చించనున్నారు. 

    కాగా, గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

    ఇవీ చదవండి:

    వచ్చే ఏడాది ప్రజల్లోకి.. ప్రజల మధ్యే ఉంటాను: వైఎస్‌ జగన్‌

    ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

     

  • విశాఖ: చంద్రబాబు బరితెగించి ప్రభుత్వ భూములను దోపీడీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు కుటుంబం భూముల దోపిడీ చేస్తోందని, చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తామరని ధ్వజమెత్తారు. ప్రధానంగా గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈరోజు( మంగళవారం. జనవరి 27వ తేదీ)జీవీఎంసీ కార్పొరేటర్లతో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, కన్నా బాబు, గుడివాడ అమరనాథ్, కేకే రాజు, వాసుపల్లిలు సమావేశమయ్యారు. 

    30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎంపీ భరత్ యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఎజెండా సిద్ధం చేయడాన్ని తప్పుబడుతున్నారు. రూ. 5 వేల కోట్ల విలువ చేసే భూ కేటాయింపులు రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. 

    ఈ నెల 30వ తేదీన జరిగే భూ కేటాయింపులను అడ్డుకుంటామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ హెచ్చరించగా, ఆ మేరకు అనుసరించాల్సిన వ్యూహంపై  జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ..  ‘ ప్రభుత్వ భూములను కాపాడటం కోసం వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ వరకూ పోరాటం చేస్తోంది. ప్రభుత్వ భూములను విశాఖ ఎంపీ భరత్‌ కబ్జా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే భూముల దోపిడీకి ప్రాధాన్యత ఇస్తారు. గీతం యూనివర్శిటీకి భూములు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. గీతం యూనివర్శిటీకి ఇచ్చిన భూములపై మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు.

  • సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో జనసేన నేతల కీచక పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా వేధిస్తున్నారని మీడియా ఎదుట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్‌ దారుణాల్ని బయటపెట్టింది. 

    ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేత అరవ శ్రీధర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందినందుకు అరవ శ్రీధర్‌కు ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా విధులు నిర్వహిస్తున్న బాధిత మహిళ ఫేస్‌బుక్‌లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌ పెట్టింది. ఆ మెసేజ్‌కు అరవ శ్రీధర్‌ రిప్లయి ఇచ్చారు. అంతే నాటి నుంచి శ్రీధర్‌ తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. 

    మాట్లాడాలి. కలవాలి అంటూ పలు మార్లు ఆమెకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ పెట్టాడు. దీంతో బాధితురాలు భయాందోళనకు గురైంది. ఎమ్మెల్యే ఏంటి ఇలా అంటున్నారంటూ సమాధానం ధాటవేసింది.  అసలే ఎమ్మెల్యే. తనకున్న అధికారంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎవరు? .ఎక్కడ ఉద్యోగం చేస్తుంది?. పెళ్లైయ్యిందా?. భర్త ఏం చేస్తుంటాడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు. వారి వయస్సు ఎంత. ఆమె ఇంటి అడ్రస్‌ ఎక్కడ.  ఇలా అన్నీ వివరాలు సేకరించాడు. 

    బాధితురాలికి తల్లిదండ్రులు లేరని, భర్త ఐటీ ఉద్యోగిగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటారని తెలుసుకున్నాడు.  అంతే ఓ రోజు నేరుగా ఆమె ఇంటికే వెళ్లాడు. పలానా ప్రాంతానికి వెళ్లాలంటూ కారులో ఎక్కించుకున్నాడు. భర్త ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మూడేళ్ల కుమారుడు చేసేది లేక ఎమ్మెల్యే కారు ఎక్కింది. ఓ ప్రాంతానికి వెళ్లాలంటూ కారు ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామ సమీపంలో కారులోనే ఆమెపై బలవంతం చేయబోయాడు. చేస్తుంది తప్పని, వద్దని వారించింది. కారు దిగిపారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బాధితురాల్ని అరవ శ్రీధర్‌ ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడు. కారులోనే దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. 

    జనసేన ఎమ్మెల్యే శశ్రీధర్‌ ఆగడాలు అంతటితో ఆగలేదు. ఆమె భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి బెదిరించాడు. దీంతో బాధితురాలికి ఆమె భర్తకు విభేదాలు తలెత్తాయి. భర్తకు విడాకులు ఇవ్వాలని.. తాను ఎమ్మెల్యేనని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబడట్టాడు. లేదంటే బాధిత మహిళ మూడేళ్ల కుమారుణ్ని ప్రాణం తీస్తానని హెచ్చరించారు. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ ఆగడాలు తట్టుకోలేని మహిళ తాజాగా, వీడియోలు, వాట్సాప్‌ చాట్‌లతో సహా పలు ఆధారాల్ని బయట పెట్టడం కలకలం రేపుతోంది.   

    Arava Sridhar: మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నరగా అత్యాచారం

Crime

  • పాట్నా: ‘అమ్మా,నాన్న. నన్ను క్షమించండి. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చితికి నిప్పు నా భర్తతో కాదు.. నా మూడేళ్ల కూతురితో పెట్టించండి’అంటూ ఓ మహిళా ఉపాధ్యాయురాలు బలవన్మరణం చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు రాసిన లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.    

    బిహార్‌ రాష్ట్రం వైశాలీ జిల్లాకు చెందిన ప్రియా భారతి ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో భారతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇలా ఉంది.

    ‘అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నేను చనిపోతున్నాను. అనారోగ్య సమస్యల వల్ల ప్రాణం తీసుకుంటున్నాను. నా మరణానికి ఎవరూ కారణంగా కాదు.నాకు నచ్చినట్లు నా అంత్యక్రియలు నిర్వహించండి. నేను మరణించిన నా భౌతిక కాయాన్ని నా స్వగ్రామానికి తీసుకుని వెళ్లొద్దు. నా చితికి నా కుమార్తెతో నిప్పుపెట్టించండి.నా భర్తతో వద్దు. 5.5లీటర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. నా పర్సులో నుంచి తీసుకోండి. నా ఫోన్‌ని నాభర్తకు ఇవ్వండి. అందులో కొన్ని ఆడియో,వీడియో ఫైల్స్‌ ఉన్నాయి. ఫోన్‌ పాస్‌వర్డ్‌ ఏంటో నా భర్తకు తెలుసు.

    నా వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వారందరికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. పోస్టుమార్టం నిర్వహించవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా భర్త, కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు చేయద్దు. ఈ చర్య నా వ్యక్తిగత నిర్ణయం. అమ్మా, నాన్న, మీ కూతురు ఓడిపోయింది. క్షమించండి అమ్మా’అని నోట్‌లో రాశారు.

    అయితే, భారతి కుటుంబ సభ్యులు అత్తింటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. భారతి తన భర్త దీపక్ రాజ్, అత్తింటివారి వేధింపులకు గురయ్యిందని, ఈ విషయాన్ని ఆమె తన తల్లికి కూడా చెప్పిందని తెలిపారు. కాగా, బాధితురాలి తల్లి తండ్రుల ఆరోపణలకు.. ఆత్మహత్యా లేఖలోని మాటలకు విరుద్ధంగా ఉండటం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారింది.

     

Sports

  • అండర్‌ 19 ప్రపంచకప్‌లో యువ భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌ దశలో హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌ సిక్స్‌కు చేరిన యంగ్‌ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

    బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఒడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విహాన్‌ మల్హోత్రా (109 నాటౌట్‌) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది.

    మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్‌ (62), కియాన్‌ బ్లిగ్నాట్‌ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 

    భారత బౌలర్లలో ఉధవ్‌ మోహన్‌, ఆయుశ్‌ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్‌ 2, హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ చెరో​ వికెట్‌ తీశారు. సూపర్‌ సిక్స్‌లో భారత్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ దాయాది పాకిస్తాన్‌. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది. 
     

  • మద్యం​ మత్తులో కారు యాక్సిడెంట్‌ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్‌ జేకబ్‌ మార్టిన్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో జేకబ్‌ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

    జేకబ్‌ తన ఎంజీ హెక్టార్‌ కారుతో హ్యుందాయ్‌ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్‌ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్‌ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

    పోలీసులు జేకబ్‌ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్‌ వెహికిల్‌ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్‌ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.

    53 ఏళ్ల జేకబ్‌ మార్టిన్‌ 1999-2001 మధ్యలో భారత్‌ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్‌లో (బరోడా, రైల్వేస్‌, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్‌ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.

    కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ కమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కూడా అయిన జేకబ్‌ దేశవాలీ కెరీర్‌లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్‌ ముగిసిన తర్వాత జేకబ్‌ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

    2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్‌ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు. 

  • ఈ జనరేషన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్‌ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్‌ ఫోర్‌గా పిలువబడే విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌ మధ్య అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్‌ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.

    అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్‌ అనిపించుకునేందుకు జో రూట్‌ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్‌, స్టీవ్‌, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు.  

    విరాట్‌ (37), స్టీవ్‌ (36), కేన్‌ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్‌ (35) కూడా వారి ఏజ్‌ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్‌ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.

    టెస్ట్‌, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టీవ్‌ స్మిత్‌ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్‌ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్‌-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కేన్‌.. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.

    రూట్‌ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.

    ఇటీవలికాలంలో టెస్ట్‌, వన్డేల్లో రూట్‌ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్‌-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. 

    ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్‌ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్‌లోనూ రూట్‌ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.

    తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్‌ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ.  ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి (85) మాత్రమే రూట్‌ కంటే ముందున్నాడు.

    వాస్తవానికి విరాట్‌, స్టీవ్‌, కేన్‌ కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్‌ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్‌ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్‌ మొత్తం తలకిందులైంది. 

    అతను స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్‌ కూడా టెస్ట్‌ల్లో రూట్‌ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్‌ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్‌ ముందున్న ఏకైక టార్గెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాత్ర​మే. రూట్‌ తర్వలోనే సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్‌ జోరు ఇలాగే కొనసాగితే విరాట్‌ సెంచరీల సంఖ్య దాటడం​ పెద్ద కష్టం కాకపోవచ్చు. 

  • కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్‌లో జో రూట్‌ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    జేకబ్‌ బేతెల్‌ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్‌ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్‌కు తరలించాడు. బ్రూక్‌ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్‌ చెలరేగుతుంటే రూట్‌ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.

    కఠినమైన పిచ్‌పై వీరిద్దరు నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్‌ స్కోర్‌ 50 ఓవర్‌ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్‌ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.

    మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్‌.. జోరు మీదున్న బ్రూక్‌కు ఎక్కువగా స్ట్రయిక్‌ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌) ఇన్నింగ్స్‌ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లలో రెహాన్‌ అహ్మద్‌ 24, బెన్‌ డకెట్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు. 

    లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్‌ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్‌ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. 

  • జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 ప్రపంచకప్‌-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్‌ ఇండియా మ్యాచ్‌ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్‌ (352-8) చేసింది.

    మిడిలార్డర్‌ బ్యాటర్‌ విహాన్‌ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్‌; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ అభిగ్యాన్‌ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.

    ఆఖర్లో ఖిలన్‌ పటేల్‌ (12 బంతుల్లో 30; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝులిపించడంతో భారత్‌ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్‌ జార్జ్‌ 23, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 21, వేదాంత్‌ త్రివేది 15, కనిష్క్‌ చౌహాన్‌ 3, అంబ్రిష్‌ 21, హెనిల్‌ పటేల్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

    జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్‌, కెప్టెన్‌ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.

    కాగా, గ్రూప్‌ దశలో భారత్‌ వరుసగా యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ​్‌పై విజయాలు సాధించి సూపర్‌ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగానే భారత్‌ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ తర్వాత భారత్‌ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

     

  • క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్‌ ప్రారంభమైంది. వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌ పేరిట భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ లీగ్‌.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొంటున్నాయి.

    పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.

    లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్‌కు ఆడుతున్న విండీస్‌ ఆటగాడు చాడ్విక్‌ వాల్టన్‌ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్‌ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. పీటర్‌ ట్రెగో (60), కిర్క్‌ ఎడ్వర్డ్స్‌ (41), అంబటి​ రాయుడు (36), కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్‌ పఠాన్‌ (2), రిషి ధవన్‌ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్‌ బౌలర్లలో సుభోత్‌ భాటి 3, హర్భజన్‌ సింగ్‌ 2, ఇసురు ఉడాన ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్‌ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్‌ వాల్టన్‌ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్‌ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్‌ శ్రీవట్స్‌ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ పియుశ్‌ చావ్లాకు దక్కింది. 
     

  • టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ రిటైర్మెంట్‌పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్‌ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్‌ రాహుల్‌.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

    ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడిన కేఎల్‌ రాహుల్‌.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.

    వికెట్‌ కీపర్‌గానూ
    టీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్‌ కీపర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్‌ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్‌గా ఉన్న అతడు మిడిలార్డర్‌కు డిమోట్‌ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్‌గా వచ్చాడు.

    మరుక్షణమే రిటైర్మెంట్‌ ప్రకటిస్తా
    ప్రస్తుతానికి జట్టులో కేఎల్‌ రాహుల్‌ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్‌కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్‌ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో ముచ్చటిస్తూ..

    ‘‘రిటైర్మెంట్‌ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్‌కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.

    ఇంకాస్త సమయం ఉంది
    నేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్‌కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.

    క్రికెట్‌ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.

    నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్‌ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.

    మానసిక స్థితి బలహీనపడుతుంది
    అయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్‌ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది. 

    ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్‌ రాహుల్‌ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. 
    చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

  • 2026 టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్‌ రన్నరప్‌ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 

    ఇదే వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్‌ఏ, నమీబియాకు ప్రాక్టీస్‌ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్‌ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్‌ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

    ఫిబ్రవరి 2
    ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
    భారత్‌-ఏ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)
    కెనడా వర్సెస్‌ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)

    ఫిబ్రవరి 3
    శ్రీలంక-ఏ వర్సెస్‌ ఒమన్‌ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
    నెదర్లాండ్స్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)
    నేపాల్‌ వర్సెస్‌ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)

    ఫిబ్రవరి 4
    నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ (బీసీసీఐ గ్రౌండ్‌, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)
    ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
    ఐర్లాండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)

    ఫిబ్రవరి 5
    ఒమన్‌ వర్సెస్‌ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
    కెనడా వర్సెస్‌ నేపాల్‌ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
    ఆస్ట్రేలియా వర్సెస్‌ నెదర్లాండ్స్‌ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
    న్యూజిలాండ్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ (డీవై పాటిల్‌ గ్రౌండ్‌, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)

    ఫిబ్రవరి 6
    ఇటలీ వర్సెస్‌ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
    భారత్‌-ఏ వర్సెస్‌ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్‌-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)

    ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ మెయిన్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.
     

  • ఆస్ట్రేలియా స్టార్‌ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్‌లో లిస్ట్-ఏ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 

    అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ సాధించడంతో రిచర్డ్సన్  భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.

    అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే రిచర్డ్సన్‌కు బిగ్‌బాష్‌ లీగ్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్  ఒకరు. 

    మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

    చివరిగా 2025-26 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్‌ కెరీర్‌లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్‌ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.

    రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్‌గా రిచర్డ్సన్‌కు మంచి గుర్తింపు ఉంది.

     

  • అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్‌.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ (72)తో ఫామ్‌లోకి వచ్చాడు.

    తొలుత బ్యాటింగ్‌
    చివరగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్‌ ఓడిన భారత్‌... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    వైభవ్‌ ధనాధన్‌
    ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్‌ జార్జ్‌, వైభవ్‌ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. అయితే, ఆరోన్‌ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్‌ పనాషే మజాయ్‌ షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌ బాదే క్రమంలో ఆరోన్‌.. సింబరెషెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

    దీంతో వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను వైభవ్‌ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్‌. 

    52 పరుగులు చేసి
    మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్‌లో సింబరెషెకు క్యాచ్‌ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్‌ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్‌ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్‌కు.. సూపర్‌ సిక్స్‌ దశలో ఇదే తొలి మ్యాచ్‌. 

    తుదిజట్లు
    భారత్‌
    ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్‌ కీపర్‌), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.

    జింబాబ్వే
    నథానియల్ హ్లబంగానా (వికెట్‌ కీపర్‌), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్‌స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్‌), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్‌.

    చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్‌ అవుట్‌.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్‌!

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2026లో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ముందుగానే ప్లే ఆఫ్స్‌ చేరిన స్మృతి మంధాన సేన జోరుకు ఆ తర్వాత బ్రేక్‌ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో తొలి ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలోనూ పరాజయం పాలైది.

    రిచా ఘోష్‌ భేష్‌
    ఈ నేపథ్యంలో ఓటమి స్పందిస్తూ కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రిచా ఘోష్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె ఆటను మేమంతా ఆస్వాదించాము. నదైన్‌ డిక్లెర్క్‌ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. నాట్‌ వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌. ఒకచోట పడిన బంతిని మూడు వేర్వేరు విధాలుగా షాట్లు బాదగల సత్తా ఆమెకు ఉంది.

    నాట్‌ మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేసింది. అద్భుతంగా ఆడి జట్టును గెలిపించుకుంది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. తొలి ఐదు మ్యాచ్‌లలో మా బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. కానీ రోజు మా వాళ్లు సరైన రీతిలో బౌలింగ్‌ చేయలేదు. టీ20 క్రికెట్‌లో ఇలాంటివి సహజమే.

    మా బౌలర్లు విఫలమయ్యారు
    కొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి. ఏదేమైనా లారెన్‌ బెల్‌ కొత్త బంతితో అద్బుతంగా ఆడింది. ఆ తర్వాత తిరిగి వచ్చి కూడా తన వంతు సహకారం అందించింది. కానీ మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా ఈరోజు సరిగ్గా ఆడలేదు. నదైన్‌ మాత్రం రెండు కష్టతరమైన ఓవర్లను అద్భుతంగా వేసింది’’ అని పేర్కొంది. ముంబై చేతిలో తమ ఓటమికి బౌలర్లే కారణమని స్మృతి మంధాన విశ్లేషించింది.

    కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (57 బంతుల్లో 100 నాటౌట్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు శతకం బాదింది. తద్వారా వడోదరలో సోమవారం జరిగిన పోరులో ముంబై 15 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. 

    తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్‌ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటైంది. 

    చదవండి: WPL 2026: చరిత్ర సృష్టించిన నాట్ సివర్ బ్రంట్‌.. తొలి ప్లేయర్‌గా

Family

  • ఎవరిలోనైనా నిద్ర తక్కువైతే దాని తాలూకు ప్రతికూల ప్రభావాలు దేహంపైనా, మనసుపైనా... ఇలా రెండింటిపైనా ఉంటాయి. చిత్రంగా ఇంకొందరిలో నిద్ర ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్యలూ కనిపిస్తుంటాయి. ప్రధానంగా నిద్ర తాలూకు సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... 
    ’నిద్రలేమి (ఇన్‌సామ్నియా)  ’అతి నిద్ర (హైపర్‌సామ్నియా) ’ నిద్రలో విచిత్రంగా ప్రవర్తించడం (పారాసామ్నియా).

    నిద్ర...
    దాన్ని అనుభవించి, ఆస్వాదించి తెలుసుకోవాలేగానీ అక్షరాల్లో నిర్వచించడం కష్టం. నిర్వచనమే ఇవ్వలేని ఓ అద్భుతం. దేహం, మనసూ ప్రశాంతంగా సేదదీరే అనిర్వచనీయమైన ప్రక్రియ.  అందుకే నిద్ర తాలూకు ప్రశాంతత లోపించినవారు ఆ నిద్రాసుఖం కోసం పరితపిస్తారు. ఆ సుఖానుభూతి కోసం తాపత్రయపడతారు. సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అనుభవించే ఆ అనుభవం కోసం ప్రతి వ్యక్తీ తన జీవితంలోని దాదాపు మూడో వంతు వెచ్చిస్తాడు. అయితే కొందరిని ఆ నిద్రదేవత కరుణించదు.

    మరికొందరిలో నిద్రపరమైన కొన్ని  సమస్యలుంటాయి. ఆ సమస్యలు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడతాయి. నిద్రలో నడవడం వంటి కొన్ని రకాల నిద్రకు సంబంధించిన సమస్యలు ఒక్కోసారి కొన్ని  ప్రమాదాలకూ కారణమవుతాయి. నిద్ర గురించి ఇలాంటి ఎన్నో విషయాలను తెలిపే ఈ కథనంలో స్లీప్‌కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం...

    నిద్రలేమి (ఇన్‌సామ్నియా)...
    సాధారణంగా ప్రతి ఒక్కరూ దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోతుంటారు. ఇది సాధారణం. అంతకంటే తక్కువగా నిద్రపోతే... దాన్ని నిద్రలేమి (ఇన్‌సామ్నియా) అని చెప్పవచ్చు. సాధారణ నిద్ర ఆరు నుంచి ఎనిమిది గంటల పాటే అయినా... జనాభాలోని 2 శాతం  నుంచి 4 శాతం ప్రజల్లో ఇది కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ల శరీర తత్వాన్ని బట్టి అది వాళ్లకు ఎలాంటి సమస్యను తెచ్చిపెట్టకపోవచ్చు. అలా కొద్దిసేపు నిద్రే అయినప్పటికీ వాళ్లలో ఎలాంటి అలసటా, నీరసం, నిస్సత్తువ లేదా ఇలాంటి సమస్యలేవీ లేకుండా ఉంటే వాళ్ల శరీర తత్వాన్ని బట్టి వాళ్లకు ఆ నిద్ర సరిపోతుందన్నమాట. అయితే చాలామందిలో నిద్రలేమి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవి...

    ∙ఏకాగ్రత, దృష్టిని కేంద్రీకరించే శక్తి లోపించడం. 
    ∙రాత్రి నిద్రలేమి వల్ల పగటివేళ కునికిపాట్లు పడుతూ ఉండటం. 
    ∙జ్ఞాపకశక్తి తగ్గడం.  
    ∙పనిలో తగినంత సామర్థ్యం చూపలేకపోవడం. 
    నిద్రలేమి సమస్య కేవలం ఒకటి నుంచి రెండు రోజుల పాటు ఉంటే అదో సమస్య కాబోదుగాని... అదే నెలల పాటు కొనసాగితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఇలా నిద్రలేమితో బాధపడేవాళ్లలో రక్తపోటు హై–బీపీ, మధుమేహం (డయాబెటిస్‌), గుండెజబ్బులు, బ్రెయిన్‌స్ట్రోక్, భరించలేనంతగా తలనొప్పులు, హైపర్‌ ఎసిడిటీ, కడుపులో పుండ్లు (గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌), ఉద్విగ్నత (యాంగ్జైటీ),  నరాల సమస్య (న్యూరోసిస్‌), కుంగుబాటు (డిప్రెషన్‌) లాంటి కొన్ని మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

    నిద్రలేమికి కారణాలు... 
    ∙వేళకు నిద్రపోక పోవడం (ఇర్రెగ్యులర్‌ స్లీప్‌ హ్యాబిట్స్‌) 
    ∙వేళకు తినకపోవడం (ఇర్రెగ్యులర్‌ ఫుడ్‌ హ్యాబిట్స్‌) 
    ∙నిద్రకు ముందు పొగతాగడం 
    ∙కాఫీ, టీ, కెఫిన్‌ ఉండే కాఫీ అలాగే కూల్‌డ్రింక్స్‌ తాగడం 
    ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్, యాంగ్జైటీ)కి గురికావడం 
    ∙ఆస్తమా, గుండెజబ్బులకు సంబంధించిన కొన్ని రకాల మందులు వాడటం వల్ల. 
    ∙కొన్ని రకాల జబ్బుల కారణంగా... అందునా ముఖ్యంగా ఆస్తమా, కంజెస్టివ్‌ హార్ట్‌ డిసీజెస్,  మూత్రపిండాల సమస్యలు (కిడ్నీలో వ్యర్థాలు మిగిలిపోవడం వల్ల), కొన్ని లివర్‌ సమస్యలు 
    ∙థైరాయిడ్‌ సమస్యలు 
    ∙స్థూలకాయం / ఊబకాయం  
    ∙తీవ్రమైన నొప్పుల కారణంగా (అంటే విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, మెడనొప్పి, తిమ్మిర్లు, మంటలు ఉండటం)

    నిద్ర లేమి – నివారణ చర్యలు...
    నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి గాఢమైన  నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.

    ∙బెడ్‌రూమ్‌ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. వురీ చల్లగానూ, వురీ వేడిగా ఉండకూడదు. 
    ∙నిద్రపోతున్న గదిలో మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. 
    ∙పొగతాగడం పూర్తిగా మానేయాలి. 
    ∙సాయంత్రం నుంచి కాఫీలు, టీలను, కెఫిన్‌ ఉండే కూల్‌డ్రింక్స్‌ తీసుకోకూడదు. 
    ∙రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.
    ∙ప్రతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రకు ఉపక్రమించడం.  
    ∙పగటి పూట ఎక్కువసేపు నిద్రపోకపోవడం. 
    ∙నిద్రకు వుుందర టీవీలో తీవ్రమైన ఉద్విగ్నత, ఉద్రిక్తత, ఉద్వేగపూరితమైన  దృశ్యాలున్న సినివూలూ, సీరియళ్లు, వెబ్‌సిరీస్‌లూ చూడకపోవడం.

    ∙రాత్రి వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపయినా పూర్తిస్థాయి పగటి వెలుగులో (డే లైట్‌) గడపడం ఓ మంచి సూచన. (పగలంతా వుసకమసగ్గా ఉండే వెలుగు తక్కువ గదుల్లో గడపడం వల్ల రాత్రిపూట మంచి నిద్రపట్టకపోవచ్చు). 
    ∙నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన మ్యూజిక్‌ను వినడం.

    ∙అలాగే పెద్దపెద్ద చప్పుళ్లు ఉండే రణగొణధ్వని ల్లాంటి వు్యూజిక్‌కు దూరంగా ఉండటం. 
    ∙రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగడం. (పాలలో ఉండే ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆసిడ్‌తో మంచి నిద్ర పట్టే అవకాశముంటుంది).

    ∙నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి సరికాదు. నిజానికి పుస్తకం చదివితే నిద్ర వస్తుందని చాలావుంది అంటుంటారు. కానీ చాలా సందర్భాల్లో పుస్తకంలో ఆసక్తికరమైన అంశాలుండటం, పుస్తకంలోని కంటెంట్‌లో ఉద్విగ్నతకు గురిచేసే సన్నివేశాలుంటే అవి నిద్రను దూరం చేయడానికి అవకాశాలెక్కువ.

    ∙నిద్రకు ముందర టీవీ లేదా మొబైల్‌ చూడటం కూడా సరికాదు. ఇది రెండు రకాలుగా నిద్రకు దూరం చేస్తుంది. స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ కారణంగా నిద్ర పట్టదు. అలాగే మొబైల్‌ చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఆసక్తికరమైన అంశాలూ, ఉద్విగ్నతకూ, ఎక్సైట్‌మెంట్‌కు గురిచేసే అంశాలు నిద్రను దూరం చేయవచ్చు.

    ∙నిద్రపోవడాన్ని ఓ పనిలా అనుకొని దానిపైనే దృష్టిపెట్టి నిద్రకు ఉపక్రమించాలి. ఆ సమయంలో వేరే విషయాలు ఆలోచించడం సరికాదు.

    ∙ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఆల్కహాల్‌ తీసుకున్న రాత్రి పూర్తిగా నిద్రపట్టకపోవచ్చు. లేదా ఆ నిద్ర నాణ్యత (స్లీప్‌ క్వాలిటీ) చక్కగా ఉండకపోవచ్చు. ఆల్కహాల్‌తో పట్టిన నిద్ర తర్వాత మనసు చికాగ్గానూ, నిద్రలేచాక పూర్తిగా అలసట తీరిన భావన లేకపోవడానికి స్లీప్‌ క్వాలిటీ చక్కగా లేకపోవడమే కారణం.  

    ∙బెడ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన లైట్‌ మ్యూజిక్‌ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అయితే నిద్రకు ఉపక్రమించాక ఆ మ్యూజిక్ ఆపాలన్న స్పృహ కారణంగా నిద్ర ఆపుకోవాల్సి రావచ్చు.

    ∙ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులతో బాధపడేవారు తాము వాడే కొన్ని రకాల మందుల వల్ల సరిగా నిద్రపట్టకపోవచ్చు. ఉదాహరణకు ఆస్తమాకు వాడే కొన్ని రకాల ఇన్‌హేలర్స్‌తో కొందరికి సరిగా నిద్రపట్టకపోవచ్చు. అందుకే లంగ్స్, కిడ్నీ జబ్బులతో బాధపడేవారు తాము ఉపయోగించే మందులను డాక్టర్లకు చూపించి, వారి  సలహామేరకు మందులు వాడటం లేదా వాటిని పగటిపూట వాడేలాగా వేళల్లో మార్పు చేసుకోవచ్చు. ఇక తీవ్రమైన నొప్పుల సమస్యలతో బాధపడేవారు (పెయిన్‌ డిజార్డర్స్‌ ఉన్నవారు) తమ డాక్టర్‌ను సంప్రదించి తమకు నిద్రాభంగం కలిగించని విధంగా తమ సమస్యలకు తగిన మందులు సూచించాల్సిందిగా కోరాలి.  

    హైపర్‌సామ్నియా
    సాధారణంగా సగటున నిద్రపోయే వ్యవధి అయిన ఎనిమిది గంటలకంటే కూడా చాలా ఎక్కువ సేపు నిద్రపోవడాన్ని ‘హైపర్‌సామ్నియా’గా (hypersomnia) చెప్పవచ్చు

    హైపర్‌సామ్నియాకు కారణాలు...
    ∙హైపోథైరాయిడిజం అనే రుగ్మత ఉన్నవాళ్లూ, అలాగే దీర్ఘకాలంగా ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడేవారు... రాత్రివేళల్లో వారికి సరైన నిద్రలేకపోవడం వల్ల పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు. అలాగే నిద్రలో ఊపిరి అందకపోవడం (స్లీప్‌ ఆప్నియా), రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్, నార్కొలెప్సీ వంటి సమస్యలున్నవాళ్ల లోనూ నిద్ర ఎక్కువగా వస్తుంటుంది.

    ∙స్లీప్‌ ఆప్నియా సమస్య :  నిద్ర సవుస్యల్లో ప్రధానమైనది నిద్రపోతున్నప్పుడు వచ్చే గురక కారణంగా ఊపిరి అందకపోవడం. దీన్నే స్లీప్‌ ఆప్నియా సిండ్రోమ్‌ అంటారు. శ్వాసప్రక్రియ 10 సెకండ్ల కంటే ఎక్కువ సేపు ఆగిపోతే దాన్ని ‘ఆప్నియా’గా చెబుతారు. కొందరు తమది చాలా చిన్నపాటి గురక అని, దాంతో పెద్దగా ప్రమాదం లేదని అనుకుంటుంటారు. గురక చిన్నదైనా, పెద్దదైనా వుుక్కు నుంచి గొంతు వరకు గాలి తీసుకెళ్తే అవయవాల్లో అడ్డంకి వల్లనే ఆ గురక వస్తుంటుంది. ఆ అడ్డంకి వల్ల ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్‌ మోతాదు తగ్గి శరీరంలో కార్బన్‌–డై–ఆక్సైడ్‌ మోతాదులు పెరిగిపోతుంటాయి. దాంతో మెదడుకు అందాల్సినంత ఆక్సిజన్‌ అందక చాలాసార్లు తమకు తెలియకుండానే వాళ్లలో నిద్రాభంగమవుతుంటుంది. ఫలితంగా స్లీప్‌ ఆప్నియాతో బాధపడేవారికి నాణ్యమైన నిద్ర (క్వాలిటీ స్లీప్‌) ఉండదు. ఫలితంగా రాత్రివేళ సరిగా నిద్రలేకపోవడంతో ఆ నిద్రలేమిని (ఇంగ్లిష్‌లో స్లీప్‌ డెబిట్‌)ను ఉదయం వేళల్లో భర్తీ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇలా గురక కారణంగా తరచూ నిద్రభాగం అవుతుండేవారు తరచూ ఉదయం వేళల్లో నిద్రతో తూగుతూ (నిద్రలో జోగుతూ) ఉంటారు. ఇలా తూగడం / జోగడం వల్ల ఎన్నో రకాల ప్రమాదాలు జరిగే అవకాశముంది. డ్రైవింగ్‌ చేసేప్పుడు ఇలా తూగడం / జోగడం ఎంతో ప్రమాదకరం. అదీగాక ఇలా రాత్రివేళ నిద్రలేమి (స్లీప్‌ డెఫిసిట్‌) వల్ల ఉదయంవేళల్లో మందకొడిగా (డల్‌గా) ఉంటుంటారు.

    ∙సమస్యలను పరిష్కరించడం (ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌), ఏకాగ్రతా అలాగే సవుస్యపై దృష్టికేంద్రీకరణ (కాన్సంట్రేషన్‌)... ఇలాంటి అన్ని విషయాల్లోనూ సవుస్యలుంటాయి.

    ∙తీవ్రమైన తలనొప్పులు : కొందరిలో ఉదయం వేళల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. నిద్రసమస్య కారణంగా రాత్రివేళల్లో నోటితో గాలిపీల్చుకోవడం వల్ల నోరెండిపోయిన ఫీలింగ్‌ కొనసాగుతుంది. పీల్చుకునే గాలిలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గడంతో మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రస్థానమైన ‘వూమిల్లరీ బాడీ’ అనే అవయవం తాలుకు పరిమాణం (సైజ్‌) 20 శాతం వరకు తగ్గిపోతుంది. శరీరంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గడం వల్ల... దాని తాలూకు దుష్ప్రభావం గుండెపై పడుతుంది. హార్ట్‌ ఎటాక్స్‌తో అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ల ఆరోగ్య చరిత్ర (కేస్‌ హిస్టరీ) పరిశీలిస్తే... ముఖ్యంగా  ‘స్లీప్‌ ఆప్నియా’ సమస్య ఉన్నవాళ్లలో 30 శాతం వుంది గుండెపోట్లకు గురవుతున్నట్లు అనేక పరిశీలనల్లో తేలింది.  

    ∙‘రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌’ :  ఈ సమస్యతో బాధపడేవారు పదే పదే తమ కాళ్లను కదిలిస్తూ, ఆ చర్య వల్ల రిలీఫ్ పొందుతుంటారు. రాత్రుళ్లు నిద్రలేకపోవడంతో పగలు చాలాసేపు నిద్రపోతూ ఉంటారు.

    ∙‘నార్కోలెప్సీ’ : మెదడుకు సంబంధించిన ఈ జబ్బుతో బాధపడేవారు రాత్రి మామూలుగా నిద్రపోయినప్పటికీ... మళ్లీ పగటివేళ అలా కునుకులోకి జారిపోయి నిద్రలోకి వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటివారు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోతూ ఉంటారు.

    ∙కెటాప్లెక్సీ : ఈ సమస్య ఉన్నప్పుడు వాళ్లకు... నిద్రలేవగానే కాళ్లూ, చేతులు రెండూ కాసేపు పనిచేయకుండాపోతాయి. ఈ కండిషన్‌నే ‘స్లీప్‌ పెరాలిసిస్‌’ అని కూడా అంటారు.

    ∙క్లీన్‌ లెవిన్‌ సిండ్రోమ్‌ : వీళ్లు నెలల తరబడి నిద్రపోతూనే ఉంటారు. వీళ్లకు ఆకలి కూడా ఎక్కువ. ఇలా ఎక్కువగా తినడాన్ని హైపర్‌ బులీమియా అంటారు.  

    ఇక్కడ పేర్కొన్న ఇలాంటి అతినిద్ర (హైపర్‌సామ్నియా)కు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి తగిన సూచనలూ, సలహాలు, తగిన చికిత్సలు  తీసుకోవాలి.

    పారాసామ్నియా సమస్యలు
    నిద్రలో వింతగా ప్రవర్తించడాన్ని ‘పారాసామ్నియా’ అంటారు. ఈ పారాసామ్నియాలో చిత్రవిచిత్రమైన చాలా రకాల సమస్యలను చూడవచ్చు.

    ∙నిద్రలో నడవడం
    (స్లీప్‌ వాకింగ్‌) : ఇది నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎమ్‌) స్టేజ్‌–4లో వచ్చే సమస్య. కొందరు తలుపులు తెరుచుకుని కూడా నిద్రలో నడుస్తూ వెళ్తారు.  మర్నాడు ఉదయం నిద్ర లేచాక వాళ్లకు తాము చేసిందేమీ గుర్తుండదు. ఇలాంటివాళ్లు మేడ మీది నుంచి పోవడం లేదా ఇతరత్రా ప్రమాదాలకు (యాక్సిడెంట్స్‌కు) గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

    ∙నిద్రలో భయంతో ఉలిక్కిపడిలేవడం (స్లీప్‌ టెర్రర్స్‌) : ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో డాక్టర్లు ఈ సమస్యను ఎక్కువగా చూస్తుండటం చాలా సాధారణం. పెద్దగా అరుస్తూ నిద్రలోంచి లేవడం, లేచాక భయంకరంగా ప్రవర్తించడం, టీవీ లేదా మొబైల్‌  వంటి వస్తువులను విసిరేవేయడం లేదా బద్దలు కొట్టడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేసే పిల్లల్ని అదుపు చేయడమూ చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4 లలో వస్తుంది. కాబట్టి ఆ దశల్లో వాళ్లేం చేస్తున్నారన్నది వాళ్లకు ఏమాత్రం తెలియదు.

    ∙నిద్రలో పీడకలలు రావడం (నైట్‌మేర్‌) : ఈ సమస్యలో భయంకరమైన పీడకలలు వస్తుంటాయి. ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4లో వచ్చే సమస్య. నిద్రలేచాక ఏమాత్రం గుర్తుకురాని భయంకరమైన కలలు వస్తుండటం ఈ జబ్బు విషయంలో జరుగుతుంటుంది.

    ∙నిద్రలో కలవరింతలు, పొంతనలేని మాటలు (స్లీప్‌ టాకింగ్‌) : ఈ సమస్యతో బాధపడేవారు నిద్రలో ఏదేదో కలవరిస్తుంటారు. ఏమాత్రం పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా ఎన్‌ఆర్‌ఈఎమ్‌ స్టేజ్‌3, స్టేజ్‌4లో వచ్చే సమస్యే.  ఆ దశలో వచ్చే సమస్య కావడంతో వాళ్లు మాట్లాడుతున్నదేమిటో వాళ్లకే తెలియదు. నిద్రలేపి అడిగినా వాళ్లేమీ చెప్పలేరు. అందుకే వాళ్లనేదైనా ప్రశ్నించినా పొంతనలేని సమాధానాలు చెబుతుంటారు.

    ∙కన్ఫ్యూజనల్‌ అరోజల్స్‌ : నిద్రలోంచి లేచి ఏవేవో పొంతన లేని విషయాలను ప్రస్తావిస్తుంటారు.

    ∙స్లీప్‌ అన్యురోసిస్‌ : చిన్నారులు నిద్రలో పక్క తడపటం మామూలే. కానీ  సాధారణంగా ఈ అలవాటు మూడునుంచి ఐదేళ్ల లోపు పిల్లలప్పుడే ఆగిపోతుంది. అయితే అరుదుగా కొందరిలో పది పదిహేనేళ్లవరకు కొనసాగుతూ వారిని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. సామాజికంగా నలుగురిలో కలవడం, ఫంక్షన్లలో పాల్గొనడం, రాత్రుళ్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వెనకాడటం, ఆత్మవిశ్వాసం, తమపట్ల తమకు గౌరవం (సెల్ఫ్‌ ఎస్టీమ్‌)తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.  

    నిద్రకు సంబంధించి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సమస్య నిర్ధారణ కోసం కొందరిలో వాటికి అవసరమైన కొన్ని రకాల పరీక్షలూ చేయాల్సి రావచ్చు.  

    ఇక చికిత్సల విషయానికి వస్తే నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్లను సంప్రదిస్తే చాలావరకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, అవసరమైన కొందరికి కొన్ని రకాల ఉపకరణాలు వాడటం (సీ–ప్యాప్‌ లాంటివి), చాలా అవసరమైన  మరికొందరికి తగిన మందులు వాడటం ద్వారా వైద్యనిపుణులు ఈ సమస్యలను పరిష్కరిస్తారు. స్లీప్‌ వాకింగ్‌ లాంటి నిద్రకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నందున నిద్రసమస్యలను తేలిగ్గా తీసుకోకుండా, బిడియం వదిలి డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించడం అవసరం.

    నిద్ర అంటే ఏమిటన్నది ఇంకా ఇప్పటికీ పూర్తిగా తెలియని రహస్యమే. ఆ కలల ప్రపంచమంటే ఏమిటన్నది ఇంకా పూర్తిగా పరిష్కరానికి నోచుకోని ప్రహేళికే. అందుకే నిద్ర గురించిన అధ్యయనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నిద్ర తాలూకు  అనేక దశలూ, స్లీప్‌కు సంబంధించిన అనేక సమస్యలూ, వాటికి పరిష్కారాలూ, ప్రశాంతమైన నిద్రకోసం పాటించాల్సిన సూచనలేమిటన్నది చూద్దాం...

    నిద్ర... దశలు
    నిద్రలో ప్రధానంగా రెండు దశలుంటాయి. అందులో మొదటిది ‘నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గా చెప్పే ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ దశ. రెండోది ‘ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గా పిలిచే ‘ఆర్‌ఈఎమ్‌’ దశ. ఇందులో మొదట పేర్కొన్న దానిలో కనురెప్పల కింద కనుపాప కదలదు కాబట్టి దాన్ని ‘నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గానూ... అలాగే దాని తాలూకు మొదటి అక్షరాలతో సంక్షిప్తంగా ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’గా చెబుతారు. ఇక రెండో దాంటో కనుపాప వేగంగా కదులుతుంటుంది కాబట్టి దాన్ని ‘ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌’గానూ సంక్షిప్తంగా ‘ఆర్‌ఈఎమ్‌’గా పిలుస్తారు.

    నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఎన్‌ఆర్‌ఈఎమ్‌)లోని ఉపదశలు... 
    కంటిపాప కదలికలు, కాళ్లూ చేతుల కదలికలు ఉండని మొదటి దశ ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ (నాన్‌ ర్యాపిడ్‌ ఐ వుూవ్‌మెంట్‌)లో  మళ్లీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2, స్టేజ్‌ 3, స్టేజ్‌ 4 అని నాలుగు ఉపదశలుంటాయి.
    ఇందులో...

    స్టేజ్‌–1 అనేది 10–15 నిమిషాల పాటు 
    స్టేజ్‌–2 అన్నది 10–15 నిమిషాలు పాటు 
    స్టేజ్‌–3 అన్నది 20–25 నిమిషాల పాటు 
    స్టేజ్‌–4 అన్నది 20–30 నిమిషాల పాటు
    కొనసాగుతుంటుందని ఓ అంచనా.

    నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌లోని ఈ నాలుగు  ఉప–దశలు దాటగానే...  నిద్ర అనేది  కంటిపాపలు వేగంగా కదిలే ఆర్‌ఈఎమ్‌ (ర్యాపిడ్‌ ఐ వుూవ్‌మెంట్‌) దశలోకి వెళ్తుంది.  దీన్ని ఐదో దశ పరిగణిస్తే... ఇలా ఈ ఐదు దశలూ ఒక వరసలో కొనసాగడాన్ని ఒక ‘స్లీప్‌ సైకిల్‌’ అంటారు. ఇక్కడ పేర్కొన్న దశలవారీగా... ఒక రాత్రి నిద్రలో ఇలాంటి స్లీప్‌ సైకిల్స్‌ ఐదు నుంచి ఆరు వరకు నడుస్తాయి.

    ఏ అర్ధరాత్రో అకస్మాత్తుగా నిద్రలేచామంటే... మనం ఏ దశ తాలూకు నిద్ర నుంచి లేచామో తెలుసుకోడానికి ఓ బండగుర్తు ఉంటుంది. నిద్ర లేచీ లేవగానే చాలా వుత్తుగా ఉంటూ... వెంటనే తేరుకోలేనట్లుగా ఉంటే అప్పుడు వునం ‘ఎన్‌ఆర్‌ఈఎమ్‌’ దశ నుంచి లేచావున్నవూట. అదే ‘ఆర్‌ఈఎమ్‌’ దశలోంచి నిద్రలేస్తే రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ ఉంటుంది. కనుపాపలు కదులుతుండే ‘ఆర్‌ఈఎమ్‌’ నిద్రలోనే కలలు వస్తుంటాయి. ఆ దశలోని కలలే చాలావరకు గుర్తుంటాయి.  

    డాక్ట‌ర్‌ రమణ ప్రసాద్‌
    సీనియర్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ 
    – పల్మునాలజిస్ట్‌

    నిర్వహణ
    యాసీన్‌ 

  • న‌చ్చిన వాటిని ద‌క్కించుకోడానికి 'క్యూ' క‌ట్ట‌డం మ‌న దేశంలో స‌ర్వ సాధార‌ణం. అభిమాన హీరో సినిమా విడుద‌లైన‌ప్పుడు టికెట్ల కోసం ధియేట‌ర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీట‌ర్ల వ‌ర‌కు క్యూ క‌ట్టేస్తాం. ఈ మ‌ధ్య‌న బ‌ట్ట‌లు కొనేందుకు కూడా షాపుల‌ ముందు నించుంటున్నారు జ‌నం. ఇక మ‌ద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవ‌ర్‌గ్రీన్‌. ఇక్క‌డ మీరు చూస్తున్న ఫొటోలో క‌నిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డ‌బ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంత‌కీ అక్క‌డ ఏం పెడుతున్నారు, అంత ఫేమ‌స్సా?

    ముంబై మ‌హాన‌గ‌రంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న‌ అమ్మకై అనే రెస్ట‌రెంట్ (AmmaKai Restaurant) ముందు జ‌నం క్యూ క‌ట్టిన వీడియోను ఎక్స్‌లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్త‌గా ప్రారంభ‌మైన అమ్మకై రెస్ట‌రెంట్.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఉచిత అల్ప‌హారం ఆఫ‌ర్ చేసింది. సోమ‌వారం ఉద‌యం 9.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కు ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. ముందుగా వ‌చ్చిన వారికి మాత్ర‌మే వ‌డ్డిస్తామ‌ని ష‌ర‌తు పెట్టింది. ఇది చూసిన జ‌నం రెస్ట‌రెంట్ ముందు ఉద‌యం 7 గంట‌ల నుంచే బారులు తీరారు.

    బిచ్చ‌గాళ్ల మాదిరిగా..
    ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన యూజ‌ర్.. జ‌నం తీరుపై విమ‌ర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడ‌తామంటే జ‌నం బిచ్చ‌గాళ్ల మాదిరిగా రెస్ట్‌రెంట్ తెర‌వ‌డానికి 2 గంటల ముందే క్యూ క‌ట్టార‌ని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవ‌రూ పేద‌వారులా క‌నిపించ‌లేద‌న్నారు. క‌నీసం రెండుమూడు కోట్ల రూపాయ‌ల విలువైన ఫ్లాట్ల‌లో నివసిస్తున్న ల‌క్ష‌ధికారుల్లా క‌నిపిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఫ్రీగా వ‌స్తుందంటే చాలు వెనుకాముందు చూడ‌కుండా ఎగేసుకుని వ‌చ్చేస్తారంటూ నిష్టూర‌మాడారు. ఒక ప్లేట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంట‌ల త‌ర‌బ‌డి కిలోమీట‌ర్ల మేర క్యూలో నిల‌బ‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 'ప్ర‌జ‌ల‌కు ఉచిత ప‌థ‌కాలు ఇస్తున్నందుకు ప్ర‌భుత్వాల‌ను త‌ప్పుబ‌డ‌తాం. కానీ దానికి మ‌న బాధ్య‌త ఉంద‌ని అనుకోం. మ‌న‌ ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద‌'ని ఎక్స్‌లో రాశారు. ఫ్రీగా వ‌స్తుందంటే జ‌నం ఇలాగే ఎగ‌బ‌డ‌తార‌ని నెటిజ‌నులు కామెంట్లు పెడుతున్నారు. 

    అమ్మకైగా మారిన బాస్టియన్
    ఇంత‌కీ అమ్మకై రెస్ట‌రెంట్ ఎవ‌రిదో తెలుసా? ఒక‌ప్ప‌టి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోట‌ల్‌. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో క‌లిసి ఈ రెస్ట‌రెంట్ ప్రారంభించారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో దీన్ని మూసివేస్తున్న‌ట్టు ఎక్స్‌లో శిల్పా శెట్టి ప్ర‌క‌టించారు. ఎందుకు మూసివేస్తున్నార‌నే విష‌యాన్ని ఆమె వెల్ల‌డించ‌లేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోట‌ల్ మూసేస్తున్నార‌ని అప్ప‌ట్లో మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్‌ను కొత్త‌గా మార్చి అమ్మకై పేరుతో మ‌ళ్లీ ప్రారంభించారు. ప్ర‌మోష‌న్ కోసం ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఆఫ‌ర్ (Free Breakfast Offer) పెట్టార‌ని ముంబై జ‌నం అనుకుంటున్నారు. 

    చ‌ద‌వండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!

  • బరువు తగ్గడం ఇటీవల ట్రెండీగా మారింది. స్మార్ట్‌గా వయసు తక్కువగా కనిపిస్తే ఏదో ఘనకార్యం సాధించిన ఫీలింగ్‌ చాలామందిలో. ఆ క్రమంలో ఆరోగ్యకరమైన పద్ధతుల వైపుకి కాకుండా షార్ట్‌కట్‌ల జోలికి వెళ్లి అనారోగ్యం పాలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాగైతేనేం వెయిట్‌లాస్ అయ్యితే చాలు అనుకునేవాళ్లు ఉన్నారు. ఆ వింత ధోరణిలోంచి పుట్టుకొచ్చిందే ఈ డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్. దెయ్యం పేరుతో పిలిచే ఈ డైట్‌ప్లాన్‌ ఆరోగ్యానికి అసలు మంచిదేనా..? ఎవ్వరైనా పాటించారా..అంటే..

    చైనాలోని హాంగ్‌జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు అనే మహిళ తన ప్రాణ స్నేహితురాలి వివాహం సమయానికి తగ్గడానికి ఈ డెవిల్‌ వెయిట్‌లాస్‌ ప్లాన్‌ ప్రయత్నించింది. జస్ట్‌ రెండు నెలల్లో దాదాపు 15 కిలోలు తగ్గాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రయత్నించింది. అయితే ప్రీడయాబెటిస్‌ బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. నిజానికి ఈ డైట్‌ వల్ల పోషకాహార లోపం, హర్మోన్ల అమసతుల్యత, పిత్తాశయ రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయినేది ఆరోగ్య నిపుణుల వాదన. 

    ఇక్కడ ఈ చైనా మహిళ జియావోయు ఈ వెయిట్‌లాస్‌ ప్లాన్‌తో తన స్నేహితురాలి వివాహానికి సరిగ్గా 50 కిలోల బరువు లక్ష్యానికి చేరుకుంది. అయితే తర్వితగతిన అలసట, తీవ్ర దాహం, ఆకలి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ వెయిట్‌లాస్‌ ప్లాన్‌లో భాగంగా చేసిన ఉపవాసల వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలింది. అధిక తీవ్రత వ్యాయామాలు చేస్తూ..పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించిది. దాంతో ఇన్సులిన్‌పై ఎఫెక్ట్‌పడి ప్రీ డయాబెటిస్‌ని ఎదుర్కొనక తప్పలేదామెకు. 

    త్వరితగతిన బరువు తగ్గే వెయిట్‌లాస్‌ ప్లాన్‌ కండరాలు నష్టం, డీ హైడ్రషన్‌కి దారితీసి..చివరికి జీవక్రియను పూర్తిగా దెబ్బతీసింది. దెబ్బతో ఆ మహిళ వెంటనే ఆ డైట్‌ ప్లాన్‌కి స్వస్తి చెప్పి..తన జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంది. సమతుల్య ఆహారాన్ని స్వీకరించి, పరిమిత అధిక తీవ్రత వ్యాయామాలు లేదా ఏరోబిక్‌ వ్యాయమలు చేయడం ప్రారంభించింది. ఈ మార్పులతో ఆమె మూడు నెలల్లో 52.5 కిలోలు తగ్గింది. ఈ విధానంతో ఆమె మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. 

    'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్' అంటే..
    ఇది సరైన డైట్‌ ప్లాన్‌ మాత్రం కాదు. స్వీయంగా రూపొందించిన డైట్‌ ప్లాన్‌. తీవ్రమైన వ్యాయామాలు, డైట్‌, పరిమిత కేలరీలతో కూడిన డైట్‌. అలాగే వేగంగా బరువు తగ్గడమే ధ్యేయంగా రూపొందించిన అనారోగ్యకరమైన డైట్‌. 

    ఇందులో ప్రధానమైన ఆహారాన్ని నివారించి, తీవ్రమైన వ్యాయమాలు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటంటారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గడం ఎలా ఉన్నా..జీవక్రియ నష్టం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమే ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: భారతీయ అవుట్‌ఫిట్‌లో ఈయూ చీఫ్‌ ఉర్సులా ..!)
     

  • భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్‌ టైలర్డ్‌​ ప్యాంట్‌సూట్‌లకు పేరుగాంచిన ఈయూ చీఫ్‌ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్‌గాలా విత్‌ ఆఫ్-వైట్ ప్యాంట్‌లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. 

    సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్‌కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్‌ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం. 

    విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. 

    ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్‌లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.

     

    (చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..)

     

Business

  • సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్యను ప్రశంసిస్తూ.. ఇది అన్ని ఒప్పందాలకూ తల్లి లాంటిదని (మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)అన్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు.. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    అబద్దాలకోరు ఉర్సులా & భారత బృందం 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అనే ఒప్పందంపై సంతకాలు చేస్తున్నారని నేను వింటున్నాను. ఇది చాలా బాగుంది. నేను దేశాన్ని పాలిస్తుంటే, వాళ్లు ఇంట్లో కూర్చుని ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక డాడీ ఉన్నాడని అందరికీ తెలుసు, అతను ఓవల్ ఆఫీస్‌లో కూర్చుని అమెరికాను మళ్లీ ధనిక దేశంగా మారుస్తున్నాడు అని పోస్టులో వెల్లడించారు.

    అంతే కాకుండా.. యూరోపియన్ యూనియన్ దివాలా తీసింది కాబట్టే వాళ్లు ఒక తల్లి కోసం వేడుకోవాల్సి వచ్చింది. బహుశా వాళ్లు తమ సొంత బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నారు కాబోలు!. నేను భారతదేశంతో చెప్పాను. మీకు ఒప్పందం కావాలా? అయితే ముందుగా 50 శాతం డాడీ ట్యాక్స్ (టారిఫ్‌లు!) చెల్లించండి. ఇది జరగబోయే ఒక పెద్ద విపత్తు. నా ఒప్పందాలు భారీగా ఉంటాయని, ఆ ఒప్పందం ఒక హైస్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ మాదిరిగా ఉందని కూడా పేర్కొన్నారు.

    సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కానీ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇలా పోస్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

    భారత్ - ఈయూ డీల్ ప్రయోజనాలు
    ఇండియా.. యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా.. మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయి. ట్యాక్స్ తగ్గించడంతో.. వీటి ధరలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా.. మన దేశంలో ప్రీమియం కార్ల ధరలు, మెడిసిన్స్ ధరలు, మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయి. అంతే కాకుండా.. ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలపైన, ఉక్కు & రసాయన ఉత్పత్తులపైన ట్యాక్స్ రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం.

  • కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1860 ఏప్రిల్ 7న భారత్ బ్రిటిష్ పాలనలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ (మధ్యంతర బడ్జెట్)ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్‌.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

    బ్లాక్ బడ్జెట్ గురించి
    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా..

    1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.

    రూ. 550 కోట్ల ఆర్థిక లోటు..
    దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.

    బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా.. ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.

  • విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్‌పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.

    ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.

    ఈ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్‌మెంట్‌లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్‌లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.

    ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్‌లిమిటెడ్ 5జీ సబ్‌స్క్రైబర్‌లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్‌స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్‌తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్‌కు ప్రాప్యతను కల్పిస్తుంది.

    ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్‌బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.

    యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్‌రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్‌లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది.

  • భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. అనేక వర్గాలకు అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా వైన్, విస్కీ అభిమానులు, లగ్జరీ కార్ల ప్రియులు, పరిశ్రమలు & సాధారణ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

    ఈ ఒప్పందం ద్వారా ఇండియా ఉత్పత్తులు యూరప్ దేశాలకు ఎగుమతి, అక్కడి ఉత్పత్తులు భారతదేశానికి ఎక్కువగా దిగుమతి అవుతాయి. సుంకాలు చాలా వరకు తగ్గడం వల్ల.. యూరోపియన్ వస్తువులు మన దేశంలో చౌకగా మారనున్నాయి.

    తగ్గనున్న ప్రీమియం కార్ల ధరలు
    మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి యూరోపియన్ కార్లపై ప్రస్తుతం దిగుమతి 100 శాతంగా ఉంది. అయితే ఒప్పందం ప్రకారం, 15,000 యూరోల కంటే ఎక్కువ.. అంటే దాదాపు రూ. 16 లక్షల విలువైన కార్లపై ఇప్పుడు 40 శాతం సుంకం విధిస్తారు. ఆ తరువాత ఈ ట్యాక్స్ క్రమంగా 10 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల కార్ల ధరలు చాలా తగ్గుతాయి.

    మద్యం ధరలు
    ఒప్పందం తరువాత ఫ్రాన్స్, ఇటలీ & స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకునే వైన్ చౌకగా లభించనుంది. ప్రస్తుతం, భారతదేశం దిగుమతి చేసుకునే వైన్‌పై 150 శాతం దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తుంది. కొత్త ఒప్పందం దీనిని 20 శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ధరలు గణనీయంగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. అయితే 2.5 యూరోల కంటే తక్కువ ధర ఉన్న వైన్లకు విధించే ట్యాక్స్ విషయంలో ఎలాంటి రాయితీ ఉండదు.

    ఔషధాలు (మెడిసిన్స్)
    యూరప్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సాంకేతికతలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఒప్పందం కారణంగా.. క్యాన్సర్ & ఇతర అనారోగ్యాలకు కావలసిన దిగుమతి చేసుకున్న మందులు, వైద్య పరికరాల ధరలు భారతదేశంలో తగ్గనున్నాయి.

    ఇదీ చదవండి: భారత్-ఈయూ ఒప్పందం: బీఎండబ్ల్యూ సీఈఓ ఏమన్నారంటే?

    ఎలక్ట్రానిక్ & హై-టెక్ యంత్రాలు
    వాణిజ్య ఒప్పందంతో..దిగుమతి చేసే విమానాల విడిభాగాలు, మొబైల్ ఫోన్లు & హైటెక్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు అవుతాయి. దీంతో ఈ వస్తువుల తయారీ ఖర్చులు తగ్గి, దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాడ్జెట్లు మరింత చౌకగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది భారత్‌లో తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సాంకేతిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.

    ఉక్కు & రసాయన ఉత్పత్తులు
    వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇనుము, ఉక్కు & రసాయన ఉత్పత్తులపై సున్నా సుంకాలు (Zero Tariffs) విధించాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, తయారీ పరిశ్రమలు లాభపడతాయి. ఫలితంగా ఉత్పత్తి ఖర్చులు తగ్గి, దీని ప్రభావం చివరికి వినియోగదారులకు కూడా మేలు చేసేలా ఉండనుంది.

  • గూగుల్ వంటి దిగ్గజ సంస్థలో జాబ్ చేయాలని చాలామంది కలలు కంటుంటారు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చని కొందరు అనుకుంటారు. కానీ.. ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెబుతున్నారు గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించిన ఆర్చీ గుప్తా. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గూగుల్ సంస్థలో జాబ్ ఎలా తెచ్చుకున్నారు?, అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి?, అనే ఆసక్తికరమైన ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఒక సాధారణ కాలేజీలో చదువుకుని.. గూగుల్‌లో ఉద్యోగం సాధించిన టెక్ ప్రొఫెషనల్ ఆర్చీ గుప్తా ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. ఆమె తన సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక వ్యక్తి ప్రతిభకు, కష్టపడే తత్వానికి.. కాలేజీ పేరు లేదా ప్రతిష్ట అడ్డంకి కాదని స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు, అంకితభావం & నిరంతర ప్రయత్నం ఉంటే ఎవరైనా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించవచ్చని వెల్లడించారు.

    తాను షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులో.. ఆర్చీ గుప్తా కెరీర్‌లోని ముఖ్యమైన దశలను ఫోటోల రూపంలో చూపించారు. మొదటి ఇంటర్న్‌షిప్ నుంచి మొదటి ఉద్యోగం వరకు.. ఎదురైన తిరస్కారాలు, వచ్చిన అవకాశాలు అన్నింటినీ వెల్లడించారు. ప్రారంభంలో ఆమెను గూగుల్ తిరస్కరించింది. అదే తిరస్కారం ఆమెకు మరింత బలాన్ని ఇచ్చిందని, ముందుకు వెళ్లడానికి ప్రేరణగా మారిందని చెప్పారు. పట్టుదలతో శ్రమించి చివరికి గూగుల్‌లో జాబ్ తెచ్చుకుంది.

    సాధారణ కాలేజీ నుంచి గూగుల్ వరకు ఎదగడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ లేవు. అదృష్టం మీద ఆధారపడలేదు. సంవత్సరాల పాటు కృషి చేసాను. ప్రతిరోజూ ప్రయత్నించడం చేయడం మానుకోలేదని ఆర్చీ గుప్తా చెప్పారు. ఒక్కసారికే విజయం లభించదు. గొప్ప క్షణాలు వెంటనే కనిపించవు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే.. తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని ఆమె వివరించారు.

  • మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.77 పాయింట్ల లాభంతో.. 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద నిలిచాయి.

    టాప్ గెయినర్స్ జాబితాలో ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, కామధేను లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, SBFC ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    లక్షను 50 లక్షలు చేసిన స్టాక్.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..!

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్‌ను విస్తరించడంలో సహాయపడుతుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా & సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల ఈ విభాగం వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

    ప్రస్తుతం భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో లగ్జరీ కార్ల మార్కెట్ కేవలం ఒక శాతం మాత్రమే. ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఒప్పదం ఈ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ బ్రార్ పేర్కొన్నారు.

    భారత్ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిపై ప్రపంచానికి గట్టి విశ్వాసాన్ని కలిగిస్తోంది. ఇండియా కేవలం పెద్ద మార్కెట్ మాత్రమే కాదు.. సంస్కరణలు & భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకున్న విధానాలతో గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని హర్దీప్ సింగ్ తెలిపారు. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం పెరగడమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానం, ఇన్నోవేషన్స్ మార్పిడి మరింత బలపడుతుందని వివరించారు.

    ప్రస్తుతం భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా వచ్చే కార్లపై భారీగా కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయి. ఇవి తగ్గితే.. వీటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని బ్రార్ అన్నారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ విక్రయాల్లో దిగుమతి వాటా ఐదు శాతం మాత్రమే ఉంది. ట్యాక్స్ తగ్గేదే ఈ వాటా పెరుగుతుందని అన్నారు.

    ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు..
    దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువైన అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.

    ట్యాక్స్ తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.

  • భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు ఇక పండగే! భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలవబడే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో యూరప్‌ నుంచి భారత్‌లోకి వస్తున్న యూరోపియన్ బ్రాండెడ్ కార్లు, అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు, దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేయబోతున్న ఈ ఒప్పందం వివరాలు, ఏయే వస్తువులపై సుంకాలు ఎంత మేర తగ్గుతాయో కింద చూద్దాం.

    భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వచ్చే దశాబ్ద కాలంలో భారత దిగుమతి మార్కెట్‌ను సమూలంగా పునర్నిర్మించేలా, కీలక రంగాల్లో భారీగా సుంకాలు తగ్గనున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

    ఆటోమొబైల్ రంగంలో..

    ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం కార్లపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం 70% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని భారత్ క్రమంగా 10%కి తగ్గించనుంది. ఏడాదికి 2,50,000 వాహనాల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు భారత ప్రీమియం కార్ల మార్కెట్‌ను పూర్తిగా రీసెట్ చేస్తుందని ఈయూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

    ఎగుమతులు - సుంకాల ఆదా

    2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. 90% పైగా వస్తువులపై సుంకాల తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర ట్యాక్స్‌ ఆదా అవుతుందని బ్రస్సెల్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గరిష్టంగా ఉన్న సుంకాలు (యంత్రాలపై 44%, రసాయనాలపై 22%, ఫార్మాపై 11%) గణనీయంగా తగ్గనున్నాయి.

    వైద్యం, సాంకేతిక రంగం

    భారతదేశంలో వైద్య సేవల ఖర్చులను తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది. దాదాపు అన్ని వైద్య పరికరాలపై సుంకాలను సున్నాకి తగ్గించనున్నారు. 90% ఉత్పత్తులపై సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. విమానాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించి దాదాపు పూర్తిస్థాయిలో సుంకాల తొలగింపు ఉంటుంది.

    ఆహారం, పానీయాలు

    యూరప్ నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ పానీయాలపై సుంకాలను భారత్ భారీగా తగ్గించింది. యూరోపియన్ వైన్‌లపై 20 నుంచి 30 శాతం వరకు సుంకాలు తగ్గనుండగా వివిధ రకాల స్పిరిట్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. అన్నిటికంటే ఎక్కువగా యూరోపియన్ బీరుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలు తగ్గనున్నాయి.

    కేవలం పానీయాలకే పరిమితం కాకుండా వంట గదిలో అత్యవసరమైన ఆహార నూనెలపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ఐరోపా నుంచి వచ్చే ఆలివ్ ఆయిల్, మార్గరీన్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాల్లో ప్రభుత్వం భారీ కోత విధించింది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన యూరోపియన్ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    భారత ఎగుమతులకు లబ్ధి

    ఏడేళ్ల వ్యవధిలో 99.5% వాణిజ్య వస్తువులపై ఈయూ కూడా సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అందులో..

    • సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు.

    • రసాయనాలు, రబ్బరు, రత్నాలు, ఆభరణాలు.

    ఈ ఒప్పందం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వినియోగదారుల మార్కెట్‌లో యూరప్ పట్టును బలోపేతం చేయనుంది. అయితే, యూరోపియన్ ఉత్పత్తుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేలా దేశీయ తయారీదారులు ఏ విధంగా సిద్ధమవుతారనేది ఆసక్తికరంగా మారింది.

    ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

  • దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్‌సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.

    పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!

    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్‌-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్‌ (ప్రధాని ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ రివల్యూషన్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ వెహికల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌ చైర్‌పర్సన్‌ అంజలి రట్టన్‌ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్‌సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్‌ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్‌సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.

    పరిశ్రమ డిమాండ్లు ఇవే..

    అహ్మదాబాద్‌కు చెందిన ‘మ్యాటర్‌’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్‌సైకిల్‌ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్‌లను భారత్‌లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

  • దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా వ్యవసాయ రంగ వృద్ధిని పరుగులు తీయించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది.

    ఆందోళన కలిగిస్తున్న వృద్ధి రేటు

    వ్యవసాయ రంగ వృద్ధి రేటులో కనిపిస్తున్న మందగమనంపై పీఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు 2025–26 అంచనాల ప్రకారం 3.1 శాతానికి పడిపోయింది. 2020–21లో దేశ మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయ రంగం వాటా 20.4 శాతం ఉండగా 2023–24 నాటికి అది 17.7 శాతానికి తగ్గింది. గత 5-6 ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ కొవిడ్ ప్రభావం, వాతావరణ మార్పుల వల్ల సగటు జీవీఏ వృద్ధి 3–4 శాతం వద్దే నిలిచిపోయింది.

    బడ్జెట్‌పై అంచనా

    ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు బడ్జెట్‌లో భారీ నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.

    1. చిన్న, సన్నకారు రైతులను ఏకం చేసి సహకార సంఘాల ద్వారా వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం.

    2. పంట పండించడమే కాకుండా అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించడం.

    3. పంట కోత అనంతర నష్టాలను తగ్గించేందుకు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వసతుల కల్పన.

    4. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రత్యేక సంస్థల ద్వారా మార్కెట్ అవకాశాన్ని పెంచడం.

    ప్రభుత్వం ప్రతిపాదించబోయే ఈ సమగ్ర గ్రామీణ పునరుజ్జీవన కార్యాచరణ కేవలం వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల విస్తరణకు కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. సరఫరా గొలుసుల (Supply Chains) ఆధునీకరణ ద్వారా వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీల ప్రభావం తగ్గి నేరుగా రైతుకే లాభం చేకూరే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?

Politics

  • బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు అంశానికి దాదాపు తెరపడినట్లే కనిపించినా, అక్కడక్కడ  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అభిమానించే గణం మాత్రం తమ వాయిస్‌ వినిపిస్తూనే ఉంది. తాజాగా  ‘డీకే.. డీకే’ అంటూ పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద పెద్దగా అరుపులు అరవడం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విపరీతమైన కోపం తెప్పించింది. అది కూడా తాను పాల్గొన్న ర్యాలీలో ఇలా అరవడం ఏంటనే చిరాకు సిద్ధరామయ్యలో కనిపించింది. ‘ఎవరు డీకే.. డీకే అరుస్తుంది.. నెమ్మదిగా ఉండలేరా.. కామ్‌గా ఉండండి’ అంటూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధరామయ్యా.

    వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి పథకం "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ ప్రవేశపెట్టడాన్ని  నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ తీవ్ర  నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్‌ పెద్దలు ఓ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో సిద్ధరామయ్యతో పాటు శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

    అయితే దీనిలో భాగంగా వేదిక వద్దకు సిద్ధరామయ్య నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు డీకే.. డీకే అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య.. ఎవరు.. డీకే డీకే అంటూ అరిచేది.. అరవ కుండా ఉండలేరా. అంతా సైలెంట్‌గా ఉండండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో కూడా డీకే నాదమే వినిపించడంతో సిద్ధరామయ్యకు మరింత కోపం తెప్పించింది. కాకపోతే చేసేది లేక అలాగే ప్రసంగించారు సిద్ధరామయ్య.

  • సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి‌ ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.

    అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది  టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి  చేసినా చర్యలు లేవు.

    ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి  పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారు

    అధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. 

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జోగి రమేష్‌, జోగి రామును తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాజీ మంత్రి జోగి రమేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని.. చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.

    ‘‘జోగి రమేష్‌ను కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ సభ్యుల పైనా కేసు పెట్టారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అంతా చూస్తున్నారు. మర్డర్లు చేసిన వారిపై కేసులు పెట్టడం లేదు. కోడిని, గొర్రెలను కోసిన వారి పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమంగా జైళ్లకు పంపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మావాళ్లు పనిచేస్తారు. కూటమి ప్రభుత్వం తప్పిదాల పై జోగి రమేష్ పోరాటం చేస్తూనే ఉంటారు.

    చంద్రబాబుకు కేతిరెడ్డి సవాల్‌..
    ‘‘ధర్మవరంలో 70 శాతం కల్తీ మద్యం దొరుకుతోంది. కల్తీ మద్యం తయారు చేసేది నీ జిల్లా నుంచే చంద్రబాబు. బెల్టుషాపులు లేకుండా చేస్తానన్నావ్. కానీ ఇప్పుడు ఊరికి నాలుగు బెల్టు షాపులు ఉన్నాయి. వేలంపాటలో బెల్ట్ షాపులు పాడుకుంటున్నారు. గిట్టుబాటు కావడం కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తన పై ఉన్న కేసును కొట్టేయించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. కేసు పెట్టిన వాసుదేవ రెడ్డి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అదే వాసుదేవ రెడ్డి మరో కేసులో అప్రూవర్ అవుతాడు. ఇది కేసును ప్రభావితం చేయడం కాదా?. చంద్రబాబుపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఎలా తొలగిస్తున్నారు?

    ..కేసులు పెట్టిన మీరే ఆ కేసులు తీసేయాలని కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్‌లో లోకేష్ చెప్పాడు. లా అండ్ ఆర్డర్ ఎంత వరస్ట్‌గా ఉందో ఇంతకంటే నిదర్శనం ఏముంది?. మీరు ఎంతమందిని జైల్లో వేస్తారో.. అంతకు పదింతలు ప్రశ్నిస్తాం. కేసులు.. అరెస్టులు.. జైళ్లు మాకు కొత్త కాదు...ఇలాంటివి మేం చాలా చూశాం. తప్పుడు కేసులు కట్టే అధికారులు ఆలోచన చేయండి. మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సన్నిహితులుగా ఉన్నారు.. ఫోటోలు ఉన్నాయని కేసులు పెట్టడం కాదు. అత్యాచారాలు చేసిన వారు లోకేష్‌తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు లోకేష్‌ను కూడా ముద్దాయిగా చేరుస్తారా?. చట్టం అందరికీ ఒకటే

    జోగి రమేష్ కు కేతిరెడ్డి పరామర్శ.. కూటమికి  దిమ్మతిరిగే వార్నింగ్

    ..కేసులు తీయించుకోవాలని చూస్తున్న ప్రయత్నంపై అప్పీల్‌కు వెళతాం. నాయకులు చెప్పారని అధికారులు అక్రమ కేసులు పెడితే ఇబ్బంది పడతారు. మీకు చేతనైతే నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతుందో అరికట్టండి. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిపారని సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం చేశారు. ఈ రోజు లడ్డూలో అలాంటిదేమీ లేదని తేలింది. తాము ఒకటి చేయాలనుకుంటే మరొకటి జరిగిందని కూటమి నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూమతాన్ని కాపాడతాడా?. నకిలీ మద్యం విషయంలో తప్పుడు ఆధారాలతో బురదజల్లారు. దీని పై లీగల్ గా ఫైట్ చేస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదలం

    ..మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ మేం అధికారంలో ఉన్నప్పుడే తెచ్చాం. మంచి మద్యం ఇస్తానని చంద్రబాబు చెబితే అందరూ ఈలలు వేశారు. మంచి విద్య, వైద్యం ఇస్తామని జగన్ చెబితే ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మా ధర్మవరంలో ఇవాళ తనిఖీ చేసినా 70 శాతం నకిలీ మద్యం దొరుకుతుంది. జనం దగ్గరకు వెళ్లాంటే గట్స్ ఉండాలి. నేను ఇది చేశానని చెప్పి గడప గడపకు వెళ్లాలంటే ధైర్యం కావాలి. వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేలందరినీ ప్రజల ఇళ్లకే పంపించారు. వాళ్లచేతిలోనే కదా ప్రభుత్వం ఉంది. నా పై ఆరోపణలకు ఎందుకు ఆధారాలు చూపలేకపోతున్నారు. ఈ ప్రభుత్వంలోని నేతలకు దమ్ముంటే గడపగడపకు వెళ్లమని చెప్పండి. నేను ఎక్కడ భూ కబ్జాలు చేశానో చూపించమనండి. చేతనైతే వాటిపై చర్యలు తీసుకోమనండి’’ అంటూ కేతిరెడ్డి సవాల్‌ విసిరారు.

  • సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్‌ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు రూ.3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

    సూరాయపాలెం ఇసుక రీచ్‌పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ విరివూరు ఇసుక రీచ్‌లో అర్ధరాత్రి, వేకువ జామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఎలా దోచేస్తున్నదీ ఆయన వివరించారు.

    సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి వారికి బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లాలని కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న వారు దొరికితే అరెస్ట్‌ చేసి శిక్షించాల్సిన పోలీసులు మంత్రి పర్మిషన్‌ అడగడం ఏమిటని మండిపడ్డారు. పైగా కూటమి నాయకుల ఇసుక దందాను బయటపెట్టడానికి వెళ్తుంటే  పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే కూటమి నాయకుల దందాకు కలెక్టర్, ఎస్పీ లైసెన్స్‌ ఇచ్చినట్లుగా ఉందని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

    పెన్నా నదికి గర్భశోకం:
    అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. నదీగర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీలతో తరలిస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

    సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లకు పొక్లెయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఐదు రెట్లు అధిక ధరలకు ఇసుకను అమ్మేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్లు నిర్వహించి ఏడాదికి రూ.700 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.3500 కోట్ల ఆదాయం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పేరుతో ఆ మొత్తాన్ని కూటమి నాయకులు దోచుకుంటున్నారు.

    Kakani : అర్థరాత్రి ఏంటీ పని పెన్నా నదిలో పగలూ రాత్రి దోపిడీ

    రాత్రింబవళ్లూ ఇసుక దోపిడీ:
    ఒక్క సూరాయపాలెం ఇసుక రీచ్‌ ద్వారానే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ.100 కోట్లు దోపిడీకి స్కెచ్‌ వేశారని గతంలో నేను ఆరోపిస్తే, ఆయన తోసిపుచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ఏకంగా సాయి శ్రీనివాస్‌ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌కి వెళ్లేలా క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి నేరుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్‌ షీట్‌ పేరుతో చేత్తో రాసిన స్లిప్‌ చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులు లోడ్‌తో వెళ్లే ఒక ట్రాక్టర్‌కి టన్నుకి రూ.68 చొప్పున రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉంటే ఐదు రెట్లు అధికంగా రూ.1,250 వసూలు చేస్తున్నాడు. పైగా ఉ. 6 గం. నుంచి సా. 6 గం. మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రేయింబవళ్లు పొక్లెయినర్లతో తోడేస్తున్నారు. (అంటూ.. పెన్నా నదిలో విరువూరు ఇసుక రీచ్‌లో వేకువజామున, అర్ధరాత్రి వేళల్లో ఇసుక తవ్వుతున్న ఫొటోలు ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు).

    ఓపెన్‌ రీచ్‌లలో ఏకంగా రైతులకు సాగు నీరు వెళ్లే కాలువలకు అడ్డంగా గట్టు కట్టి మరీ గ్రావెల్‌తో రోడ్డేసి ఇసుక లారీలను రప్పిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను బేఖాతరు చేసి మరీ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పడి అమాయకుల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారిని నడిరోడ్డు మీద బేడీలు వేసి నడిపించాలి.

    ఐదు రెట్లకు మించి అధిక ధరలు:
    సూరాయపాలెం ఇసుక రీచ్‌ను కేస్‌ స్టడీగా తీసుకుని తెలుగుదేశం నాయకుల ఇసుక దోపిడీపై మేం కూలంకషంగా స్టడీ చేశాం. ఇసుక రీచ్‌ మీద నెలకు ఏకంగా రూ.3 కోట్లు దోచేస్తున్నారు. రూ.1400 వసూలు చేయాల్సిన టిప్పర్‌కి ఏకంగా రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. 12 టైర్ల లారీకి రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు, 14 టైర్ల లారీకి రూ.2024 వసూలు చేయాల్సి ఉంటే రూ.15 వేలు వసూలు చేస్తున్నారు.

    ఇసుక దోపిడీదారులకు పోలీసుల రక్షణ!:
    కూటమి నాయకుల ఇసుక దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీని పోలీసులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెబుతూ నిందితులపై చర్యలు తీసుకోమని ఆదేశించకుండా, రాత్రుళ్లు టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. (అంటూ.. మంత్రి మాటల ఆడియోను ప్రెస్‌మీట్‌లో వినిపించారు)

    ఇసుక దొంగలు చేతికి దొరికితే వారిని అరెస్ట్‌ చేయకుండా మంత్రి నారాయణ సలహా అడగడం చూస్తుంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు న్యాయబద్ధంగా నిబంధనల మేరకు వ్యవహరించడం లేదు. కూటమి నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికి వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే, కూటమి నాయకుల ఇసుక దోపిడీకి కలెక్టర్, ఎస్పీలు లైసెన్స్‌ ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

National

  • విదేశీ ప్రయాణాలు చేసేవారికి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ చెక్, ఇతరత్రా తనిఖీలు తెలియనిది కాదు..! కొన్ని సందర్భాల్లో ఈ తనిఖీల కోసమే చాంతాడంత క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది..! కానీ, ఇటీవల భారత్ అమల్లోకి తెచ్చిన ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు మాత్రం ఇలాంటి క్యూలైన్లలో నిలబడకుండానే.. చాలా సులభంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. 

    ఈ-పాస్‌పోర్టు విదేశీ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొత్త పాస్‌పోర్టు దరఖాస్తుదారులతోపాటు.. రెన్యూవల్ చేయించుకునేవారు కూడా ఇప్పుడు ఈ-పాస్‌పోర్టుకు జైకొడుతున్నారు. సాధారణ పాస్‌పోర్టుతో పోలిస్తే.. ఈ-పాస్‌పోర్టులో ఓ మైక్రోచిప్ ఉంటుంది. అందులో పాస్‌పోర్టుదారుడి వేలిముద్రలు, ఫొటోలు, ప్రయాణ వివరాలు.. ఇలా అన్నీ డిజిటల్‌గా రికార్డ్ అయ్యి ఉంటాయి. 

    అలాగని ఈ చిప్‌కు హ్యాకింగ్‌ బెడద ఉండదు. ఎందకంటే.. ఇది పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. చూడ్డానికి సాధారణ పాస్‌పోర్టు మాదిరిగానే ఉన్నా.. పాస్‌పోర్టు కవర్‌పై చిన్న బంగారు చిహ్నంతో మైక్రోచిప్ ఉండడం ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకం. మన దేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఈ-పాస్‌పోర్టు జారీ ప్రారంభమైంది. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతోపాటు.. 120 దేశాల్లో ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉంది.

    అసలు ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకత ఏంటంటే.. పాస్‌పోర్టుదారుడు బయోమెట్రిక్ అందజేస్తే తప్ప.. ఇందులోని వివరాలు ఇమిగ్రేషన్ అధికారులు యాక్సెస్ చేయలేరు. ఇందులో బీఏసీ.. అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్, పాసివ్ అథెంటికేషన్, ఎక్స్‌టెండెడ్ యాక్సెస్ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫలితంగా.. విమానాశ్రయాల్లో తనిఖీ సులభతరమవుతుంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇతర తనిఖీ అధికారులు ఈ-పాస్‌పోర్టులోని సమాచారాన్ని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. వ్యతిగత సమాచార తస్కరణ, వివరాల ట్యాంపరింగ్ ఇందులో అసాధ్యం కాబట్టి..! ఈ-పాస్‌పోర్టును ట్యాంపర్ చేయడం.. వివరాలను మార్చడం వంటి మోసాలు అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం ఈ-పాస్‌పోర్ట్‌లను భారత్ జారీ చేస్తోంది. అందుకే.. 120 దేశాలకు ఈ-పాస్‌పోర్టులను యాక్సెస్ చేసే వ్యవస్థ ఉంది. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు 120 దేశాల్లో ఎక్కడా కూడా తనిఖీల కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు.

    విదేశీ ప్రయాణాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా మందికి శిరోభారాన్ని తెచ్చిపెడుతుంది. భారత్‌నుంచి బయలుదేరేప్పుడే ఐఎంఆర్సీ అవసరమా? కాదా? వెళ్లబోతున్న దేశంలో మాట్లాడే భాషపై అవగాహన ఉందా? ఇంగ్లిష్ ఎలా ఉంది? అనే వివరాలను తనిఖీ చేయడం తెలిసిందే..! ఈ-పాస్‌పోర్టు విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉండే గమ్యస్థాన దేశాన్ని చేరాక కూడా.. సాధారణ పాస్‌పోర్టుదారులకు భిన్నంగా సపరేట్ క్యూలైన్ ఉంటుంది. ఈ క్యూలో తనిఖీలు వేగంగా జరుగుతాయి. సాధారణ పాస్‌పోర్టుదారుల క్యూలో మాత్రం ఒకరి తనిఖీ పూర్తయ్యాకే.. మరొకరిని తనిఖీ చేస్తారు. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఇప్పడు ఇమిగ్రేషన్ విధానాన్ని చాలా సులభతరం చేసిందన్నమాట..! 

  • ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని దారుణంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసిన వైనం కలకలం రేపింది. అనుమానంతోనే ఈ హత్యకు తెగబడినట్టు తెలుస్తోంది.  ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.

    టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం,  ఆగ్రాలో యమునా నదిపై ఉన్న వంతెన సమీపంలో 32 ఏళ్ల హెచ్‌ఆర్ మేనేజర్‌ను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసి, తల నరికి, ఆ తర్వాత ఒక గోనె సంచిలో కుక్కి పడేశాడని పోలీసులు సోమవారం తెలిపారు. 

    వినయ్‌సింగ్‌ (30) ఆగ్రాలోని తేధి బగియా ప్రాంతానికి చెందిన మింకీ శర్మ (32) గత రెండేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఈమె ఒక ప్రైవేట్ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో నిందితుడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత ఆరు నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే వారి మధ్య తరచుగా గొడవలకు దారి తీసింది. 

    పోలీసుల ప్రకారం, జనవరి 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మింకీ తన కార్యాలయానికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుండి బయలు దేరింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడం, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు  ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. 

    జనవరి 24 తెల్లవారుజామున, ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ వంతెనపై ఒక గోనె సంచి పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సంచిని తెరిచి చూడగా, అందులో తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.

    సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, గోనె సంచిని లాక్కెళ్లడం, ఆ తర్వాత స్కూటర్‌పై జవహర్ వంతెన వైపు వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. మారుతి ప్లాజా, ఎంజీ రోడ్, హైవేతో సహా పలు ప్రాంతాల నుండి సేకరించిన ఫుటేజ్ ఆధారంగా, బాధితురాలి స్కూటర్‌ను నడుపుతున్నట్లు కనిపించిన వినయ్ సింగ్‌ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించి విచారించారు. దీంతో సింగ్ తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్‌ గురించి తెలుసా?

    జనవరి 23న వినయ్‌, మింకీని కార్యాలయానికి పిలిచాడు. ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన అతను కత్తితో పదేపదే దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి, ఒక ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి, తలను ఒక బ్యాక్‌ప్యాక్‌లో పెట్టాడు. మింకీ స్కూటర్‌పైనే ఆమె మృతదేహాన్ని జవహర్ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి యమునా నదిలో పడేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బరువైన సంచిని ఎత్తలేక, అటుగా వెళ్తున్న వారిని గమనించి, అతను దానిని వంతెన సమీపంలో వదిలి పారిపోయాడు. స్థానికులు పోలీసులుకు సమాచారం అందించారు. అందులో మొండెం, బాధితురాలి బట్టలు, మొబైల్ ఫోన్, బ్యాగ్‌ను ఒక మురుగు కాలువ సమీపంలో పారవేసి, స్కూటర్‌ను ఒక నిర్మానుష్య ప్రదేశంలో వదిలి పారిపోయాడని  పోలీసులు తెలిపారు.

    నేరానికి ఉపయోగించిన స్కూటర్, కత్తి, బాధితురాలి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  సింగ్‌, శర్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అయితే ఆమె నిరాకరించచడంతోనే హత్య చేశాడని డీసీపీ అబ్బాస్ తెలిపారు. మృతురాలి తల, నేరానికి సంబంధించిన ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.

    ఇదీ చదవండి: యాక్సిడెంట్‌ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్‌ విజువల్స్‌

  • భారతదేశంలో నిపా వైరస్‌ ఉనికి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు. దాదాపు 100 మందిని  హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజా వ్యాప్తితో ఆసియాలోని కొన్ని ప్రాంతాల విమానాశ్రయాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను ముమ్మరం చేశాయి. 

    పశ్చిమ బెంగాల్‌లో ఒక ఆసుపత్రిలో వైరస్  గుర్తించారు. అదే జిల్లాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో రెండు కేసులు నమోదైనాయి. నర్సు, మరొ ఆసుపత్రి ఉద్యోగికి కూడా  పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొత్తం 5 కేసులను నిర్ధారించారు. దాదాపు 100 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ రోగులు కోల్‌కతా,చుట్టుపక్కల ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఒక రోగి పరిస్థితి విషమంగా ఉంది. 

    పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి తెలియని వ్యాధితో మరణించడం, మరో ఐదుగురు ఈ వైరస్‌ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ,ఈ వైరస్‌ బారిన పడ్డ మరో 100- 200 మందిని పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ బిలాస్‌పూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా  మీడియాకు తెలిపారు.

    ఈ నేపథ్యంలో అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలు ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశాయి. థాయిలాండ్, నేపాల్, తైవాన్‌తో సహా అనేక ఆసియా దేశాలు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో ఆరోగ్య స్క్రీనింగ్‌లను ముమ్మరం చేశాయి. మరోవైపు చైనీస్‌  న్యూఇయర్‌ సీజన్‌కు ముందు నిపా వైరస్‌ వ్యాప్తి మరింత ఆందోళన పుట్టిస్తోంది.

    నిపా వైరస్
    ఈ వైరస్ గబ్బిలాలు (ప్టెరోపస్ జాతి),పందులు వంటి జంతువుల నుండి మానవులకు  వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ప్రజల నుంచి ప్రజలకు సామాజికసంబంధాల ద్వారా వ్యాపిస్తుంది.  

    నిపా వైరస్ (NiV) అత్యంత అంటువ్యాధి. ప్రాణాంతకం కూడా. ఈ వైరస్ కేసు మరణాల రేటు 40–75శాతం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపు, మూర్ఛలు , కోమా వంటి లక్షణాలు ఉంటాయి. ప్రారంభ సంకేతాలు నిర్దిష్టంగా ఉండవు, గుర్తించడం కష్టమే.

    జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి శ్వాసకోశ ఇబ్బంది లేదా విలక్షణమైన న్యుమోనియా లాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. 

    ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్‌ గురించి తెలుసా?

    ఇంక్యుబేషన్ వ్యవధి 4 నుండి 14 రోజుల వరకు ఉంటుంది.కొన్ని సందర్భాల్లో, 45 రోజుల వరకు ఉంటుంది. ప్రాణాలతో బయటపడినవారు మూర్ఛ లేదా వ్యక్తిత్వ మార్పులు వంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు.

    నివారణ ఎలా

    • క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం. సెల్స్‌ ఐసోలేషన్, మాస్క్ ధరించడం ద్వారా మానవుని నుండి మానవునికి వ్యాప్తిని తగ్గించగలగాలి.

    • పండ్ల గబ్బిలాలు, అనారోగ్య పందులు లేదా కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలి.

    • ఖర్జూర రసాన్ని మరిగించి పండ్లను పూర్తిగా కడగాలి; దెబ్బతిన్న పండ్లను పారవేయాలి.

    • జంతువులు, వ్యాధిసోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి

    • అనుమానిత లక్షణాల కనిపిస్తే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. 

    భారతదేశంలో పశ్చిమ  బెంగాల్‌, కేరళలో రాష్ట్రాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా నమోదైంది. ప్రతి సంవత్సరం మే నుండి సెప్టెంబర్ వరకు ఉండే పండ్ల గబ్బిలాల సంతానోత్పత్తి కాలంలోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గబ్బిలాల మేటింగ్‌  పీరియడ్‌  కారణంగా జూనోటిక్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి  కేరళ ఆరోగ్య శాఖ కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్, ఎర్నాకులం అనే ఐదు జిల్లాల్లో అవగాహన కల్పిస్తోంది.

    ఇదీ చదవండి: యాక్సిడెంట్‌ కాదు.. డాష్‌బోర్డ్ కెమెరా షాకింగ్‌ విజువల్స్‌

  • ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త మేయర్‌ను ఎప్పుడు ఎన్నుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

    ఇటీవలి పౌర ఎన్నికల్లో బీజేపీ- ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. మహారాష్ట్రలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పటికే తమ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ, ముంబైలో మాత్రం జాప్యం కొనసాగుతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం అధికార బీజేపీ- ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గాలు కొంకణ్ డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో తమ గ్రూపు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయకపోవడమేనని  సమాచారం.

    ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ముంబై మున్సిపల్ సెక్రటేరియట్‌లో తదుపరి చర్యలు చేపడతారు. నిబంధనల ప్రకారం, గ్రూపు రిజిస్ట్రేషన్ పూర్తయిన ఏడు రోజుల్లోపు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. గ్రూపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సెక్రటరీ సమావేశమై ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం మేయర్ పదవులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ, పౌర యంత్రాంగం అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి మూడు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ పత్రాలను పరిశీలించి, తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.

    ఇటీవల నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రకారం, ఈసారి ముంబై మేయర్ పదవి జనరల్ కేటగిరీకి చెందిన మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మేయర్ రేసులో నిలిచే అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. రిజర్వేషన్ ఖరారు కావడంతో మహిళా కార్పొరేటర్లు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: రైల్వేకు షాక్‌.. విద్యార్ధినికి రూ. 9 లక్షల పరిహారం

     

Delhi

  • సాక్షి,ఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. పేద ప్రజలను వైద్య విద్యకు దూరం చేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో  గళం విప్పుతాం​’అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

    రేపటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఢిల్లీలో ఆల్‌ పార్టీ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు  మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మీడియాతో మాట్లాడారు. 

    ‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడాలని బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో  గళం విప్పుతాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు మూలన పడేశారు. దానికి నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది.నిర్దేశించిన సీలింగ్‌కు మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.అప్పుల తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారు.
     
    కనీసం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదు. 8 త్రైమాసిక ఫీజులు చెల్లించలేదు. కనీసం హాస్టల్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. రైతులకు పంటల భీమా అమలు చేయడం లేదు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి తగ్గించిన నిధులను కేంద్ర నుంచి తీసుకురావాలి.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ... నిధుల లోటును పూడ్చేలా కృషి చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

    MP Subhash : అమరావతికి మేము వ్యతిరేకం కాదు ప్రైవేటీకరణకు వ్యతిరేకం

NRI

  • యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్‌హెచ్‌ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్‌ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. 

    వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్‌లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్‌ (8332062299), నిజామాబాద్‌ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. 

    దళారుల్ని నమ్మొద్దు 
    ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు.     
    – చీటీ సతీశ్‌రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్‌ 

    (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)