Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. 

    కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. 

    వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. 

     ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్‌ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. 

    • 2023 సీజ‌న్ నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఎస్ఆర్‌హెచ్‌కు ఇది వ‌రుస‌గా ఆరో విజ‌యం కావ‌డం విశేషం. గ‌తంలో సీఎస్‌కే (2010 నుంచి 2013 మధ్య‌) రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఆరు వ‌రుస విజ‌యాలు సాధించింది. 2019 నుంచి 2022 మ‌ధ్య ఆర్సీబీ.. రాజ‌స్తాన్‌పై 5 వ‌రుస విజ‌యాలు అందుకుంది. 2018 నుంచి 2020 మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐదు వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది.

    • ఐపీఎల్‌లో 200 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా ఛేదించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండ‌గా, ముంబై ఇండియ‌న్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్‌, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.

    • ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఛేదించిన జట్ల‌లో ఎస్ఆర్‌హెచ్ చోటు ద‌క్కించుకుంది. రాజ‌స్తాన్‌పై 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 ప‌రుగుల టార్గెట్‌), ఎస్ఆర్‌హెచ్ (పంజాబ్‌పై 246 ప‌రుగుల టార్గెట్‌) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (ల‌క్నోపై 228 ప‌రుగుల టార్గెట్‌) ఉంది.

    • జైపూర్ వేదిక‌పై  రాజ‌స్తాన్‌పై 228 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ త‌న రికార్డును తానే మెరుగుప‌రుచుకుంది. 2023లో ఇదే రాజ‌స్తాన్‌పై 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును స‌వ‌రించింది.

  • ఐపీఎల్‌-2026లో భాగంగా జైపూర్ వేదికగా సన్‌రైజర్స్‌​ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్యవంశీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో వైభవ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.

    వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. అయినా కొంచెం అతడికి నొప్పి తగ్గలేదు. వైభవ్ నడిచేందుకు కూడా  ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇది నిజంగా రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. వైభవ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 

    ఈ మ్యాచ్‌లో కూడా భారీ సెంచరీతో సూర్యవంశీ చెలరేగాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే టోర్నీ కీలక సమయంలో వైభవ్ గాయపడడం రాజస్తాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఒక‌వేళ వైభ‌వ్  గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ను వైభవ్‌ వైదొలగనున్నాడు.

    కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు అతడితో పాటు పాటు ధ్రువ్‌ జురెల్‌(51), ఫెరీరా(33) రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో మలింగ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్‌, షకీబ్‌ హసన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా వికెట్‌ సాధించారు.
     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా శ‌నివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో మైదానంలో సంతోషం, ఉత్కంఠ‌, భ‌యం అన్నీ క‌న్పించాయి.

    తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్య‌ధిక స్కోర్‌. దీంతో ఢిల్లీ విజ‌యం ఖాయ‌మ‌ని అంతా భావించారు. కానీ యువ ఆట‌గాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ ఢిల్లీపై ఒత్తిడి పెంచారు. 

    అయితే ఓ వైపు పంజాబ్ ఓపెన‌ర్లు విధ్వంసం కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు మైదానం మొత్తం ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ బౌల‌ర్ లుంగి ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బంతిని అందుకునే క్ర‌మంలో ఎంగిడీ త‌ల‌కు బ‌ల‌మైన గాయమైంది. అంబులెన్స్‌లో అత‌డిని ఆస్ప‌త్రికి త‌రలించారు.

    దీంతో మైదానంలో కాసేపు టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌ళ్లీ మ్యాచ్ ప్రారంభ‌మ‌య్యాక పంజాబ్ విధ్వంసం కొన‌సాగింది. ఓపెన‌ర్లు ఔట‌య్యాక శ్రేయ‌స్ అయ్య‌ర్  (71 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫ‌లితంగా ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్‌ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది.

    49 ఫోర్లు.. 33 సిక్స‌ర్లు.. 529 ర‌న్స్‌
    మొత్తంగా ఈ మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర్షం కురిసింది. ఇరు జ‌ట్లు క‌లిపి మొత్తంగా 529 ప‌రుగులు చేశాయి. అదేవిధంగా పంజాబ్‌, ఢిల్లీ బ్యాట‌ర్లు క‌లిసి 49 ఫోర్లు, 33 సిక్సర్లు బాదారు. కాగా లెక్కలేనన్ని డ్రాప్ క్యాచ్‌లు ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించాయి. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్‌ను 12 ప‌రుగుల వ‌ద్ద శ‌శాంక్ సింగ్ విడిచిపెట్టాడు.

    ఫ‌లితంగా రాహుల్ భారీ సెంచ‌రీతో కదం తొక్కాడు. ఆ త‌ర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇచ్చిన రెండు ఈజీ క్యాచ్‌ల‌ను క‌రుణ్ నాయ‌ర్ జార‌విడిచాడు. దీంతో అయ్య‌ర్ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
    చదవండి: IPL 2026: లుంగీ ఎంగిడీ ఆరోగ్య పరిస్థితిపై బిగ్‌ అప్‌డేట్‌
     

  • ఐపీఎల్‌-2026లో జైపూర్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌లనం వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. వైభవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఉతికారేశాడు.

    గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సైతం చుక్కలు చూపించాడు. సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.  ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    వైభవ్ మొత్తంగా 103 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్‌లో తన హాఫ్ సెంచరీని వైభవ్ కేవలం 15 బంతుల్లోనే సాధించాడు. వైభవ్ ఈ ఏడాది సీజన్‌లో హాఫ్ సెంచరీ కేవలం 15 బంతుల్లో పూర్తి చేయడం ఇది మూడోసారి. ఈ క్రమంలో వైభవ్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

    వైభవ్‌ సాధించిన సంచలన రికార్డులు ఇవే
    👉ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. వైభవ్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(గేల్ 21 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.

    👉టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డు సాధించాడు.  కేవలం 26 ఇన్నింగ్స్‌ల్లోనే సూర్యవంశీ ఈ రికార్డును అందుకున్నాడు.

    👉ఐపీఎల్‌లో 20 ఏళ్ల లోపు వయసులో  5 కంటే ఎక్కువసార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.

    👉ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. వైభవ్ మూడు సార్లు ఈ ఘనతను అందుకున్నాడు.

    👉అదేవిధంగా ఇది ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. తొలి స్ధానంలో క్రిస్ గేల్‌(30) ఉండగా.. సెకెండ్ ప్లేస్‌లో సూర్యవంశీ(35)నే ఉన్నాడు.



     

     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. తలకు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అత‌డిని వెంట‌నే అంబులెన్స్‌లో పూసా రోడ్డులోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. 

    అయితే తాజాగా అత‌డి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఎంగిడీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, త్వ‌ర‌లోనే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కానున్న‌ట్లు ఢిల్లీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఆర్‌సీబీ వంటి ఫ్రాంచైజీలు కూడా ఎంగిడీ త్వ‌రంగా కోలుకోవాల‌ని పోస్ట్‌లు పెట్టారు.

    అస‌లేమి జ‌రిగిందంటే?
    ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అక్షర్ పటేల్ వేసిన మూడో బంతిని ప్రియాన్ష్‌ ఆర్య మిడాఫ్‌ భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతికి గాల్లోకి లేచింది. మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ బంతిని అందుకునేందుకు వెనుకకు పరిగెత్తాడు. బంతిని అందుకు క్ర‌మంలో ఎంగిడీ బ్యాలెన్స్ కోల్పోయి కింద‌ప‌డిపోయాడు. 

    ఈ క్ర‌మంలో అత‌డి త‌ల వెనుక భాగం మైదానంకు బ‌లంగా తాకింది. మెడ నొప్పి, తీవ్రమైన తలనొప్పితో బాధ‌ప‌డ్డాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి అతడికి ఏ మాత్రం రీలీఫ్ రాలేదు. దీంతో మైదానం నుంచి నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓట‌మి పాలైంది. పంజాబ్ రికార్డు ఛేజింగ్ చేసింది.

  • ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ రికార్డు విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది.

    తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్‌ తమ రికార్డును తామే బ్రేక్ చేసింది. అంతకముందు ఐపీఎల్‌-2024 సీజన్‌లో కేకేఆర్ నిర్ధేశించిన 262 రన్స్ టార్గెట్‌ని పంజాబ్ ఛేజ్ చేసింది.

    దంచి కొట్టిన పంజాబ్ ఓపెనర్లు
    265 పరుగుల భారీ లక్ష్య చేధనలో పంజాబ్‌కు ఓపెనర్లు  ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76; 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి ధాటికి పంజాబ్ పవర్‌ప్లేలోనే ఏకంగా 116 పరుగులు చేసింది.

    అనంతరం క్రీజులోకి వచ్చిన  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. నేహల్ వధేరా (25), శశాంక్ సింగ్ (19 నాటౌట్‌) దూకుడుగా ఆడారు. ఫలితంగా ఈ చారిత్రత్మక విజయాన్ని పంజాబ్ విజయాన్ని అందించాడు. అయితే ఈమ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను ఢిల్లీ ఫీల్డర్ కరుణ్ నాయర్ విడిచిపెట్టాడు. దీంతో ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

    రాహుల్ సూపర్ సెంచరీ
    తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్; 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు నితీష్ రాణా(44 బంతుల్లో 91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

    టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవే
    పంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌
    పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌
    సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌
    బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్
     

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. 

    ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు.

    16 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ 193/3
    రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయానికి చేరువలో ఉంది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్‌ 21, క్లాసెన్‌ 18 పరుగులతో ఆడుతున్నారు.

    6 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (34), ఇషాన్‌ కిషన్‌ (35) పరుగులతో క్రీజులో ఉన్నారు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    7 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన హెడ్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 38/1. క్రీజులో ఇషాన్‌ కిషన్‌(35), అభిషేక్‌ శర్మ(4) ఉన్నారు.

    వైభవ్‌ సూపర్‌ సెంచరీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ ముందు భారీ టార్గెట్‌
    జైపూర్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. రాజస్తాన్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103) సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పాటు ధ్రువ్‌ జురెల్‌(51), ఫెరీరా(33) రాణించారు.

    వైభవ్‌ సూర్యవంశీ సెంచరీ
    వైభవ్‌ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    152 పరుగుల వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 51 పరుగులు చేసిన ధ్రువ్‌ జురెల్‌.. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 153/2

    100 దాటిన రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్‌ 
    రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్‌ 100 దాటింది. 9 ఓవర్ల నాటికి 104/1 స్కోరు చేసింది. 

    వైభవ్‌ సూర్యవంశీ హాఫ్‌ సెంచరీ
    15 బంతుల్లో వైభవ్‌ సూర్యవంశీ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
    36 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన యశశ్వి జైశ్వాల్‌.. ఎషాన్‌ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 63/1

    వైభవ్‌ సూర్యవంశీ దూకుడు
    రాజస్తాన్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దూకుడుగా ఆడుతున్నాడు. ప్రపుల్‌ హింగే వేసిన తొలి ఓవర్‌లో వైభవ్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు.  ఆ తర్వాత కమ్మిన్స్‌ బౌలింగ్‌లో వైభవ్‌ భారీ సిక్సర్‌ బాదాడు. 2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 36/0

    బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌
    ఐపీఎల్‌-2026లో జైపూర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ తిరిగొచ్చాడు.

    కమ్మిన్స్‌ తిరిగి రావడంతో ఇషాన్‌ కిషన్‌ కేవలం ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. దిల్షాన్‌ మధుశంక స్ధానంలో కమ్మిన్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జ‌ట్లు
    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

    రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ

  • ఐపీఎల్‌-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్  విశ్వరూపం ప్రదర్శించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను కేఎల్‌ రఫ్పాడించాడు. అరుణ్ జైట్లీ మైదానంలో రాహుల్ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.

    అతడు బ్యాటింగ్ ధాటికి పంజాబ్ ఫీల్డ‌ర్లు కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర మాత్ర‌మే పోషించాల్సి వ‌చ్చింది. రాహుల్‌ను ఔట్ చేయ‌డం ఎవ‌రి త‌రం కాలేదు. ఈ క్ర‌మంలో రాహుల్ కేవ‌లం 47 బంతుల్లోనే త‌న ఆరువ ఐపీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

    ఓవ‌రాల్‌గా కేవ‌లం 67 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న రాహుల్‌.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో రాహుల్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    రాహుల్‌ సాధించిన రికార్డులు ఇవే
    👉ఐపీఎల్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ సాధించిన భార‌త క్రికెట‌ర్‌గా రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 19 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో రాహుల్‌ కంటే ముందు ఏ ఒక్క భారత ఆటగాడు కూడా 150 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇంతకుముందు వరకు  సన్‌రైజర్స్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ సాధించిన 141 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది.

    👉ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోర్. తొలి రెండు స్ధానాల్లో క్రిస్ గేల్ (175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) ఉన్నారు.

    👉ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రాహుల్(47) నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్వింటన్ డికాక్(48) పేరిట ఉండేది.

    👉ఐపీఎల్‌లో అ‍త్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్‌తో కలిసి మూడో స్ధానంలో రాహుల్ నిలిచాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లి(8), జోస్ బట్లర్ (7) ఉన్నారు.



     

     

  • ఐపీఎల్‌-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్‌ లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో ఎంగిడీ తలకు బలమైన గాయమైంది. పంజాబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య.. మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు.

    అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో బంతి గాల్లోకి లేచింది. దీంతో మిడాఫ్‌లో ఉన్న ఎంగిడీ వెనుకకు వెళ్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి అతడు వెల్లకిలా పడిపోయాడు. తల వెనుక భాగం మైదానంకు బలంగా తాకింది. 

    దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతూ కదలకుండా అలా ఉండిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి ప్రాథమిక చికిత్స అందించారు. కానీ గాయం తీవ్రమైనది కావడంతో మైదానంలోకి అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి మెడకు కూడా తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది.

    దీంతో అతడు మెడకు 'నెక్ బ్రేస్' అమర్చి జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మైదానం మొత్తం ఒక్కసారి సైలెంట్‌ అయిపోయింది. ఎంగిడీ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.


     

     

  • ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు శ‌శాంక్ సింగ్ మ‌రోసారి ఫీల్డింగ్‌లో తీవ్రనిరాశ‌ప‌రిచాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు క్యాచ్‌ల‌ను జార‌విడిచిన శశాంక్‌.. ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై అదే తీరును క‌న‌బరిచాడు. కేఎల్ రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శ‌శాంక్ విడిచిపెట్టాడు.

    ఢిల్లీ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రాహుల్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ అయిన‌ప్ప‌టికి బంతి నేరుగా డీప్ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న శ‌శాంక్ సింగ్ చేతికి వెళ్లింది. కానీ అత‌డు సులువైన క్యాచ్‌ను జార‌విడిచాడు. ఇందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. 

    12 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న రాహుల్‌.. భారీ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. రాహుల్ కేవ‌లం 67 బంతుల్లో16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

    ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక రాహుల్‌ క్యాచ్‌ విడిచిపెట్టిన శశాంక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డర్‌ను ఇప్పటివరకు చూడలేదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. శశాంక్‌ ఫీల్డింగ్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌ ప్రీతి జింటా, హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.



     

     

  • పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అరుదైన ఘనత సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసింది. ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

    ఆరింట మూడు గెలిచి..
    వీటిలో మూడు గెలిచిన ఢిల్లీ.. మూడు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన అక్షర్‌ సేన.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌నూ ఓడించింది. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలోనూ ఓటమి పాలైంది.

    ఆ తర్వాత ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ చివరగా సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా సొంతమైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌ను ఢీకొట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ సారథి అక్షర్‌ పటేల్‌ టాస్‌ గెలిచాడు. తద్వారా ఐపీఎల్‌లో వరుసగా తొమ్మిదిసార్లు టాస్‌ గెలిచిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌.. సీఎస్‌కే, సన్‌రైజర్స్‌ రికార్డును సమం చేసింది.

    ఐపీఎల్‌లో వరుసగా అత్యధికసార్లు టాస్‌ గెలిచిన జట్లు ఇవే
    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 9 సార్లు (2015-16 సీజన్‌)   
    చెన్నై సూపర్‌ కింగ్స్‌- 9 సార్లు (2019)
    ఢిల్లీ క్యాపిటల్స్‌- 9 సార్లు (2025-26 సీజన్‌)
    చెన్నై సూపర్‌ కింగ్స్‌- 8 సార్లు (2018-19)
    రాజస్తాన్‌ రాయల్స్‌- 8 సార్లు (2023).

  • ఐపీఎల్‌-2026లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ శ‌త‌క్కొట్టాడు. 12 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న రాహుల్‌.. ఆ త‌ర్వాత ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. పంజాబ్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

    అత‌డు బ్యాటింగ్ ధాటికి బౌండ‌రీలు చిన్న‌బోయాయి. ఈ క్ర‌మంలో  రాహుల్ కేవ‌లం 47 బంతుల్లోనే త‌న ఆరువ ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  రాహుల్‌కు తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా కేవలం 67 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రాహుల్‌.. 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    రాహుల్‌కు ఇదే ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో రాహుల్‌తో పాటు నితీష్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


     

     

  • ఆస్ట్రేలియా దిగ్గ‌జం, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. శ‌నివారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న‌ మ్యాచ్‌లో క‌మ్మిన్స్ బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైంది. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇషాన్ కిష‌న్ త‌న బాధ్య‌త‌ల‌ను క‌మ్మిన్స్‌కు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

    అయితే క‌మ్మిన్స్ గైర్హ‌జారీలో స‌న్‌రైజర్స్ జ‌ట్టును కిష‌న్ అద్బుతంగా న‌డిపించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా కిష‌న్ విజ‌య‌వంత‌మ‌య్యాడు. దీంతో క‌మ్మిన్స్ తిరిగొచ్చినా కెప్టెన్‌గా కిష‌న్‌నే కొన‌సాగించాల‌ని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కానీ టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ ఇందుకు విరుద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను క‌మ్మిన్స్‌ తిరిగి తీసుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు.

    "క‌మ్మిన్స్ తిరిగి రావ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్. అయితే కిషన్ నుంచి క‌మ్మిన్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోవాలి. క‌మ్మిన్స్ జ‌ట్టుకు దూరంగా ఉండ‌టం వ‌ల్లే ఇషాన్ కిష‌న్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇప్పుడు క‌మ్మిన్స్ తిరిగి అందుబాటులోకి వ‌చ్చాడు. కాబ‌ట్టి అత‌డే జ‌ట్టును న‌డిపించాలి. 

    క‌మ్మిన్స్ ఒక సీనియ‌ర్ కెప్టెన్ మాత్ర‌మే అద్బుత‌మైన ఆల్‌రౌండ‌ర్ కూడా. స‌రైన స‌మ‌యంలో క‌మ్మిన్స్ అందుబాటులోకి వ‌చ్చాడు. అయితే క‌మ్మిన్స్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి ఎవ‌రి స్ధానంలో వ‌స్తాడ‌న్న‌దే ప్ర‌శార్ధ‌కంగా మారింది. అతడిని మ‌ధుశంక స్ధానంలో తుది జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది" క్రిక్‌బ‌జ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్‌!

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

    కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కార‌ణంగా సీఎస్‌కే జ‌ట్టును వీడి పుణేకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అత‌డు జ‌ట్టుతో పాటు చెన్నైకి ప్ర‌యాణించ‌లేదు. అయితే అత‌డు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్‌కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.

    మరోవైపు సీఎస్‌కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్‌కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.

    ఒకవేళ రుతురాజ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్‌.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్‌ చేయండి!
     

  • Delhi Capitals vs Punjab kings Updates: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది.  265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పంజాబ్ తమ రికార్డును తామే తిరగరాసింది. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(76), శ్రేయస్‌ అయ్యర్‌(71), ప్రియాన్ష్‌ ఆర్య(43) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.

    శ్రేయస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ
    16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్‌ అయ్యర్‌(51), శశాంక్‌ సింగ్‌(1) ఉన్నారు. పంజాబ్‌ విజయానికి 34 బంతుల్లో 65 పరుగులు కావాలి.

    పంజాబ్‌ మూడో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కూపర్ కానలీ.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 10 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 147/3

    పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రాన్‌ సింగ్‌.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    పంజాబ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    126 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన ప్రియాన్ష్‌ ఆర్య.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    6 ఓవర్లకు పంజాబ్‌ స్కోరు ఎంతంటే?
    265 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (38 నాటౌట్), ప్రభ్ సిమ్రన్ (71 నాటౌట్) అద్బుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి బ్యాటింగ్‌ ధాటికి పంజాబ్‌ స్కోర్‌ కేవలం 6 ఓవర్లలో ఏకంగా 116 పరుగులు దాటేసింది.

    ఢిల్లీ రికార్డు స్కోరు
    ఐపీఎల్‌ చరిత్రలో తమ అత్యధిక స్కోరును ఢిల్లీ నమోదు చేసింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 264 పరుగులు సాధించింది. 

    సెంచరీ మిస్‌
    18.3: బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన నితీశ్‌ రాణా. 44 బంతుల్లో 91 పరుగులు చేసిన రాణా. స్కోరు: 248-2(18.3). క్రీజులోకి మిల్లర్‌.

     సూపర్‌ ట్విస్టు
    16.6: చహల్‌ బౌలింగ్‌లో మార్కస్‌ స్టొయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన నితీశ్‌ రాణా. 39 బంతుల్లో 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగిన వన్‌డౌన్‌ బ్యాటర్‌. అయితే, ఇక్కడ ఊహించని ట్విస్టు చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ రివ్యూకు వెళ్లగా అది సిక్సర్‌గా తేలింది. దీంతో నితీశ్‌ రాణాకు లైఫ్‌ లభించింది. అయితే,  స్కోరు: 226-1(17). కేఎల్‌ రాహుల్‌ 129 పరుగులతో ఉన్నాడు.

    కేఎల్‌ రాహుల్‌ సెంచరీ
    47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌. 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు మార్కు అందుకున్న ఓపెనింగ్‌ బ్యాటర్‌. స్కోరు: 189-1(15). నితీశ్‌ రాణా 36 బంతుల్లో 72 పరుగులతో రాహుల్‌కు తోడుగా ఉన్నాడు.

    దుమ్ములేపిన నితీశ్‌ రాణా
    11.3: జేవియర్‌ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది యాభై పరుగులు పూర్తి చేసుకున్న నితీశ్‌ రాణా. బార్ట్‌లెట్‌ ఓవర్లో 6,4,4,4,4,6 బాదిన నితీశ్‌. ఢిల్లీ స్కోరు: 142-1(12)

    పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1
    రాహుల్‌ 56, నితీశ్‌ రాణా 35 పరుగులతో ఉన్నారు.

    రాహుల్‌ హాఫ్‌ సెంచరీ
    9.1: విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్‌ రాహుల్‌. 26 బంతుల్లో రాహుల్‌ ఫిఫ్టీ.

    పవర్‌ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు: 68-1(6)
    కేఎల్‌ రాహుల్‌ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్‌ రాణా   13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.

    ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
    28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?
    2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(12), నిస్సాంక(11) ఉన్నారు.

    బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ
    ఐపీఎల్‌-2026లో అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఆడిన జట్లునే కొనసాగించాయి.

    తుది జట్లు
    పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్‌), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

    ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్‌), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్
     

  • ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు యజమాని అయిన సంజీవ్‌ గొయెంకా విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతూ అవమానకరమైన పోస్టులు, వీడియోలు రూపొందిస్తున్నారని గొయెంకా ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ముఖాన్ని ఇతరుల శరీరాలకు జతచేసి, హింసాత్మక లేదా అనుచిత దృశ్యాల్లో చూపిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గొయెంకాకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పించింది. ఐపీఎల్‌ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.

    గొయెంకా తరఫున సీనియర్‌ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. "ఇది సరదా కాదు, వ్యంగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం" అని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.

    కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రముఖులు విమర్శలను, వ్యంగ్యాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంటూనే.. డిజిటల్ మార్ఫింగ్, డీప్‌ఫేక్‌ల ద్వారా తప్పుడు కథనాలు సృష్టించడం మాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది.

    ప్రత్యేకంగా గొయెంకాపై ఐపీఎల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న కంటెంట్ హద్దులు దాటిందని కోర్టు అభిప్రాయపడింది. వ్యంగ్యానికి, అవమానానికి మధ్య స్పష్టమైన రేఖ ఉందని తెలిపింది.

    ఈ ఉత్తర్వులతో గోయెంకా పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వక్రీకరించి ప్రచారం చేసే కంటెంట్‌ను తొలగించేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

  • భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌తో బిజీగా ఉంది. డెన్మార్క్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సింధు తన ఆట తీరుతోనే కాకుండా.. కుడి కణతపై ధరించిన ప్రత్యేక పరికరంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్‌ పేరు ‘టెంపుల్‌’.

    ఎందుకీ ‘టెంపుల్‌’?
    జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా.. పీవీ సింధు ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో దీనిని ధరించడం విశేషం. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్‌ స్థాయిలను ‘టెంపుల్‌’ రియల్‌ టైమ్‌లో కొలుస్తుందని సమాచారం. 

    దీని ద్వారా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని తెలుస్తోంది. నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో ఇది మెదడులో ఆక్సిజన్‌ స్థాయిని కొలుస్తుందని సమాచారం. కేవలం ఇంచు పొడవు ఉండే ‘టెంపుల్’ను మూడు- నాలుగు గంటల పాటు ధరించవచ్చు. 

    ఇది బ్రెయిన్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లా ఉపయోగపడుతుందని సమాచారం. ముఖ్యంగా క్రీడాకారులు మ్యాచ్‌ ఆడే సమయంలో లేదంటే ప్రాక్టీస్‌ సెషన్‌లో ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటా విశ్లేషణకు ఈ డివైస్‌ ఉపయోగపడనుంది.

    స్పందించిన సింధు భర్త
    ఇక సింధు ధరించిన ‘టెంపుల్‌’ గురించి ఆమె భర్త వెంకటదత్త సాయి (Venkata Datta Sai) స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈ డివైస్‌ ద్వారా తన మెట్రిక్స్‌ కొలుస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. 

    దీని ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆరంభ దశలో వస్తున్న ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని వెంకటదత్త సాయి హర్షం వ్యక్తం చేశారు. కాగా క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఈ ‘టెంపుల్‌’‌ డివైస్‌ చర్చనీయాంశంగా మారింది.

    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉబర్‌ కప్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో 30 ఏళ్ల పీవీ సింధు తొలుత లీనీ క్రిస్టోఫర్‌సెన్‌ను ఎదుర్కొంది. ఆతిథ్య డెన్మార్క్‌ చెందిన 26 ఏళ్ల లినీని సింధు 21-13, 18-21, 21-17 తేడాతో ఓడించి గెలుపుజెండా ఎగురవేసింది.  

    పందొమ్మిదేళ్లు కాదని గుర్తు చేస్తోంది
    ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు ముగించుకున్న తర్వాత పీవీ సింధు చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘రెండు గంటల్లో రెండు మ్యాచ్‌లు.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు నా శరీరం.. ‘ఇంకా నీ వయసు 19 కాదు అని మర్యాదగా గుర్తు చేసింది. రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్‌ జతచేసింది.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్‌ చేయండి!

  • 31 ఏళ్ల పాకిస్తాన్‌ క్రికెటర్‌ జాఫర్‌ గోహర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బ్రిటిష్ పౌరసత్వం పొందిన అ లెఫ్ట్‌ హ్యాండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌, త్వరలో ఇంగ్లండ్‌ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.

    లాహోర్‌లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం 2021లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. దీంతో విరక్తి చెందిన గోహర్‌ పాక్‌ నుంచి ఇంగ్లండ్‌కు మాకం మార్చేశాడు. 

    స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్‌.. దేశవాలీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 343 వికెట్లు తీసి, 3000కుపైగా పరుగులు సాధించాడు.

    దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ పాక్‌ క్రికెట్‌ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు.

    గోహర్‌ దేశీయ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. అయితే పాక్‌ సెలెక్టర్లు గోహర్‌ కౌంటీ ప్రదర్శనలను విస్మరించారు. ఓ సెలెక్టర్‌ ఏకంగా గోహర్‌ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలుగా అభివర్ణించాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్‌కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.

    ఇంగ్లండ్‌లో నాలుగు సీజన్లు గడిపిన గోహర్, ప్రస్తుతం మిడిల్‌సెక్స్‌ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో బ్యాట్, బాల్‌తో రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

    ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌, విల్‌ జాక్స్‌ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది. 

    ఈ నేపథ్యంలో గోహర్‌కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జాక్‌ లీచ్‌ స్థానాన్ని భర్తీ చేసే దీర్ఘకాలిక ఎంపికగా గోహర్‌ను ఇంగ్లండ్ పరిశీలించే అవకాశం ఉంది. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు.

Movies

  • నందమూరి బాలకృష్ణ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో తాజాగా కాజల్ అగర్వాల్‌ను ఆ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. దీంతో కాజల్ మరోసారి మెయిన్ లీడ్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. పెళ్లయ్యాక, బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ సినిమాలు చేయడం ఆపలేదు. భగవంత్ కేసరి, సత్యభామ, కన్నప్ప వంటి చిత్రాల్లో కాజల్ నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాన పాత్రతో వస్తోంది. ఇది తనకు రీఎంట్రీ లాంటిదే.

    అయితే రకుల్ ప్రీత్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. టాలీవుడ్‌లో ఆమెకు పెద్ద గ్యాప్ వచ్చింది. ఆ మద్య వచ్చిన ఇండియన్-2తో మళ్లీ తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశించింది. కానీ ఆ అవకాశాలు ఫలించలేదు. ఆ సినిమా తర్వాత ఆమెకు సౌత్‌లో కొత్త ప్రాజెక్టులు ఏమాత్రం దొరకలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో మాత్రం రకుల్ పలు సినిమాలు చేసింది. మంచి ప్రాజెక్టు దొరికితే సౌత్‌లో తిరిగి అడుగుపెట్టాలని చూస్తోంది. కొత్త ఏడాదిలో సౌత్‌లోకి రీఎంట్రీ చేస్తానని రకుల్ ప్రకటించింది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ ప్రకటనకు సంబంధించిన ప్రాజెక్టు ఏదీ వెలుగులోకి రాలేదు. 

  • ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. చాన్నాళ్ల నుంచి నటుడిగానే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరో మూవీతో వచ్చేశాడు. అదే 'గాయపడ్డ సింహం'. మే 01న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)

    ట్రైలర్ విషయానికొస్తే.. అమెరికా వెళ్లి సెటిలైపోవాలని ఆశపడ్డ హీరోని ట్రంప్, తిరిగి స్వదేశానికి పంపిస్తాడు. దీంతో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? జేడీ చక్రవర్తి తదితరుల పాత్రలేంటి అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగ నటించగా.. హీరో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

    ట్రైలర్ అయితే కామెడీ, థ్రిల్లింగ్‌గా బాగానే ఉంది. కానీ ఐపీఎల్, వేసవిని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి? దీంతో పాటు మే 01న కమెడియన్ సత్య హీరోగా చేసిన 'జెట్ లీ', ధనుష్ 'కర' చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.

    (ఇదీ చదవండి: చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?)

  • చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చాయంటే ఏదో అనుకోవచ్చు. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి మూవీకి, అది కూడా ఇంకా మొదలవకముందే వస్తున్నాయంటే ఏమనుకోవాలి? ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' మూవీతో హిట్ కొట్టిన చిరు.. లెక్క ప్రకారం డైరెక్టర్ బాబీతో ఈ పాటికే కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టేయాలి. కానీ ఎక్కడో సమస్యలు ఈ చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో నిర్మాత విషయంలో లేనిపోని టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?

    (ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)

    తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'జన నాయగణ్' తీసిన నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఈ సినిమాతో బోలెడన్ని లాభాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.

    మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్‌తో ఈయనే 'టాక్సిక్' నిర్మించారు. ఇది కూడా మార్చిలోనే విడుదలవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. మరోవైపు ఈయనే నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా సినిమాలోని పాట, కొన్నిరోజుల ముందు వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ట్రైలర్ కూడా ఇలాంటి సమస్యే ఎదురవగా యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇలా లెక్కకు మించిన సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.

    ఇన్ని ఇబ్బందులు ఉండటంతో చిరు-బాబీ చేయాల్సిన కొత్త ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. చిరు సినిమా నుంచి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకొందని కొందరు అంటున్నారు. లేదు లేదు ఈయనతో పాటు మరో నిర్మాత కావాల్సి ఉందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే చిరు తెలిసిన ఓ నిర్మాత.. ఈ మూవీ విషయంలో భాగస్వామిగా మారబోతున్నాడని మరో టాక్ వినిపిస్తుంది. ఏదో ఒకటి త్వరగా దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో స్టార్‌ హీరో సర్జరీ.. రిస్క్‌ చేశాడా?)

  • సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.

    ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్‌లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్‌లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. మరి ఈ చిత్రంతో సుహాస్‌ పాన్‌ ఇండియా యాక్టర్‌ అవుతాడో చూడాలి. 

    ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. 

  • సినిమా హీరోలలో కొంతమంది మాత్రమే ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. అలాంటి అతికొద్ది మంది హీరోలలో విక్రమ్ చియాన్‌ ఒకరు. సినిమా సినిమాకు వేరియేషన్‌ చూపిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన గెటప్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అందుకోసం తన శరీరాన్ని దారుణంగా కష్టపెడుతుంటాడు. పాత్ర డిమాండ్‌ చేస్తే.. బరువు పెరగడానికైనా.. తగ్గడానికైనా రేడీ అంటాడు.

    విక్రమ్‌ కెరీర్‌ చూస్తే.. శివపుత్రుడు, అపరిచితుడు, కోబ్రా, ఐ, తంగలాన్‌.. ఇవన్నీ ప్రయోగాత్మక చిత్రాలే. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. దాని కోసం విక్రమ్‌ ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే. కోబ్రా సినిమాలో అయితే ఏకంగా 7 విభిన్నమైన పాత్రల్లో కనిపించి షాకిచ్చాడు. చివరిగా చేసిన తంగలాన్‌, వీరధీర సూర బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచినా.. విక్రమ్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే మూడు సినిమాలతో వస్తానని విక్రమ్‌ ఇప్పటికే ప్రకటించాడు. 

    ఇదిలా ఉంటే..తాజాగా విక్రమ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవల ఓ రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న విక్రమ్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో విక్రమ్‌ చాలా యంగ్‌గా, ఒత్తైన జుట్టుతో కనిపించాడు. విక్రమ్‌ వయసు ప్రస్తుతం 60 ఏళ్లు. ఈ వయసులోనూ విక్రమ్‌ అంత యంగ్‌గా కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

    ఇలా యవ్వనంగా కనిపించేందుకు విక్రమ్‌ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  ‍విదేశాల్లో ఆయన అత్యాధునిక కాస్మోటిక్ ట్రీట్‌మెంట్‌లు చేయించుకోవడం వల్లే ఇలా యంగ్‌గా కనిపిస్తున్నాడని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ప్రకృతి వైద్యం, ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల ఈ మార్పు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.  విక్రమ్ సర్జరీకి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ పుకారు చక్కర్లు కొడుతోంది. 

  • గ్లామర్ ఒలకబోసేస్తున్న మాళవిక మోహనన్

    ముంబై బీచ్ ఒడ్డున రాశీ గ్లామర్ షో

    వయ్యారంగా ఒంపు సొంపులతో సంయుక్త

    రెడ్ డ్రస్‌లో హాట్ హాట్‌గా రుక్మిణి వసంత్

    శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నేహా శర్మ

  • హాస్య నటుడు సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, ‘వెన్నెల’ కిశోర్, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రితేష్‌ రానా మాట్లాడుతూ– ‘‘జయేంద్ర అనే రచయిత, నేను 2020లో ఓ ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ స్టోరీ అనుకున్నాం. ఆ కథకు కొంతమంది హీరోలను సంప్రదించాం.   కానీ కుదర్లేదు. ఇదే కథలో సత్యది ముందు ఫ్లైట్‌ అటెండర్‌ క్యారెక్టర్‌. ఆ తర్వాత ఈ కథకు కాస్త హ్యూమర్‌ జోడించి, సత్యతోనే హీరో పాత్ర  చేయించాం. ‘నువ్వే హీరో’ అని సత్యకు చెప్పగానే షాక్‌ అయి, రిస్క్‌ అన్నారు. కానీ ఈ కథను ఎలా తెరకెక్కిస్తానో చెప్పగానే, హీరోగా నటించేందుకు ఓకే చెప్పారు.

    ‘వెన్నెల’ కిశోర్‌గారు ఈ సినిమా అంతా సుడోకు ఆడుకుంటుంటారు. ఆయనది కాస్త టిపికల్‌ క్యారెక్టర్‌. రియా సింఘా స్పెషల్‌ ఏజెంట్‌ రోల్‌ చేశారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన ప్రజాపతి పాత్రను అజయ్‌గారు చేశారు. 

    ప్రధాన కథ ఆయన పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రజాపతి యాభైవేల కోట్ల రూపాయల బ్యాంకు స్కామ్‌ చేసి, పారిపోతాడు. ఆయన్ను దుబాయ్‌ నుంచి కొచ్చికి తీసుకురావడమే ఈ సినిమా స్టోరీ. యాక్షన్, థ్రిల్, హ్యూమర్‌తో సాగే మంచి ఎంటర్‌టైనర్‌. 80 శాతం కథ ఫ్లైట్‌లోనే జరుగుతుంది. ఎకానమీ, బిజినెస్‌ క్లాస్, కార్గో, కాక్పిట్‌ ఇలా ఒకే ఫ్లోర్‌పై ఐదు సెట్లు వేశాం. 

    ఈ సినిమా హిట్‌ అయితే సీక్వెల్‌ గురించి ఆలోచిస్తాను. నా నెక్ట్స్‌ మూవీ హారర్‌ జానర్‌లో ఉంటుంది. చెర్రీగారి నిర్మాణంలోనే ఉండొచ్చు. ‘మత్తు వదలరా 3’ సినిమా ఆలోచన ఉంది’’ అని చెప్పారు.

  • AI Image

    మనిషి జీవితం రోజురోజుకీ మారుతోంది. మరోవైపు సినిమాలు తీసే, చూసే విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోతో కమర్షియల్ మూవీ తీస్తే చాలు.. కథ కొంచెం అటుఇటుగా ఉన్నాగానీ 50, 100 రోజుల పాటు ఆడేవి. మరి ఈ తరహా చిత్రాలపై జనాలకు మోజు తగ్గిందో లేదంటే నిర్మాతల అత్యుత్సాహం కొంపముంచుతోందో తెలియట్లేదు గానీ తెలుగు సినిమాల జీవితకాలం తగ్గిపోయింది. కేవలం మూడంటే మూడు రోజులకు వచ్చేసింది. మరి ఈ పరిస్థితికి ఎవరు కారణం? ప్రస్తుతం ఏం జరుగుతోంది?

    ఒకప్పుడు 50,100 రోజుల పాటు సినిమాలు ఆడేవి. తర్వాత అవి వారాలకు వచ్చాయి. ఇప్పుడు మొదటి వీకెండ్ అయ్యేసరికి సినిమా పరిస్థితి అటో ఇటో తేలిపోతోంది. శుక్రవారం రిలీజైన చిత్రానికి ఆదివారం వచ్చేసరికల్లా హిట్ లేదా ఫ్లాప్ అనే ముద్రపడిపోతుంది. హిట్ అయితే సోమవారం నుంచి కాస్తోకూస్తో జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఫ్లాప్ అని టాక్ వస్తే మాత్రం థియేటర్ వైపే చూడట్లేదు.

    ఒకప్పుడు సినిమా టాక్ యావరేజ్‌గా ఉన్నా సరే వారం, పదిరోజుల తర్వాత పికప్ అయ్యేది. మౌత్ టాక్ ఇందులో కీలక పాత్ర పోషించేంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కనీస ఊపిరి పీల్చుకునేంత టైమ్ కూడా సినిమాలకు దొరకట్లేదు. దీనికి కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు జనాలు స్వయంగా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి.. నచ్చితే నలుగురికి చెప్పేవారు. కానీ ఇప్పుడు మొదటి షో పూర్తయ్యేసరికే ట్విటర్ రివ్యూలు, పబ్లిక్ టాక్ అని మూవీ రిజల్ట్ చాలా వేగంగా బయటకొచ్చేస్తుంది. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతున్నారు.

    సినిమాల లైఫ్ తగ్గడానికి మరో కారణం 'అంచనాలు'. కొందరు హీరోలు, దర్శకులు.. తమ సినిమాలో అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అంచనాలు పెంచేస్తున్నారు. తీరా చూస్తే ఓస్ ఇంత దానికా అంత హడావుడి అని జనాలకు అనిపిస్తోంది. దీంతో ఆయా మూవీస్ నచ్చట్లేదు. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులు.. ప్రతి మూవీలోనూ 'వావ్ ఫ్యాక్టర్' ఉందా లేదా అని వెతుకుతున్నారు. కథ పక్కనబెడితే సర్‌ప్రైజ్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎలిమెంట్స్ లాంటివి ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. అలాంటివి లేకపోతే ఆ సినిమాని పట్టించుకోవట్లేదు. దీని వల్ల నెమ్మదిగా సాగే కంటెంట్ ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతున్నాయి.

    ఈ నెలలోనే చూసుకుంటే డెకాయిట్, బైకర్, రాకాస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ యావరేజ్‌గా ఉన్నాయని ఆడియెన్స్ ఫిక్సయిపోవడంతో మూడు రోజులకు మించి ఊపు కొనసాగించలేకపోయాయి. చిత్రబృందాలు ఎంతలా ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు ఈ తరహా చిత్రాలకు లాంగ్ రన్ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదంటేనే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

    ఇప్పుడివే దర్శకనిర్మాతలకు ‍అతిపెద్ద సవాళ్లుగా మారిపోయాయి. ఇండస్ట్రీ ధోరణి కూడా మొదటి వీకెండ్ అయ్యేసరికి ఎలాగోలా డబ్బులొచ్చేస్తే చాలులే అన్నట్లే తయారైంది. మరోవైపు ఆడియెన్స్ టేస్ట్ కూడా మారిపోతోంది. ఒకప్పుడు సినిమాలు చూసి బాగుంది బాగోలేదు అని అనుకునేవారు. కానీ ఇప్పుడంతా ఫస్ట్ డే ఫస్ట్ షోకే డిసైడ్ అయిపోతున్నారు. టాక్ బాగోలేకపోతే సినిమాని నిర్ధాక్ష‍్యిణ్యంగా వదిలేస్తున్నారు. మరోవైపు ఓటీటీలో ప్రతి వీకెండ్ వస్తున్న పరభాషా సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాల జీవితకాలం తగ్గడానికి ఓ రకంగా కారణమవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం టాలీవుడ్‌కి రాబోయేది గడ్డుకాలమే!

  • సినిమాలు తీసే దర్శకులు తర్వాతి కాలంలో నటులుగా మారడం అనే ట్రెండ్ తమిళంలో ఎప్పటినుంచో ఉంది. కేఎస్ రవికుమార్, సెల్వరాఘవన్ తదితరులు ఇప్పటికే కీలక పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో స్టార్ డైరెక్టర్ చేరబోతున్నాడట. ‍రజనీ-కమల్ మల్టీస్టారర్ కోసం ఈయన నటుడిగా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

    (ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

    కమల్‌హాసన్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గించినప్పటికీ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్‌ని రెట్టింపు చేసే విషయం ఒకటు బయటకు వచ్చింది.

    కమల్‌హాసన్‌తో 'భారతీయుడు', రజనీకాంత్‌తో రోబో, శివాజీ లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. రీసెంట్ టైంలో ఈయన తీసిన గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 చిత్రాలు, బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో అసలు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన నటుడిగా మారబోతున్నాడని, అది కూడా రజనీ-కమల్‌కి విలన్‌గా చేయబోతున్నారని అనేసరికి ఆసక్తికరంగా అనిపించింది. మరి ఇది నిజమా కాదో అనేది తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాలేమో?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)

  • ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ

    రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్‌స్క్రీన్‌పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.

    'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

  • దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయాడు. వచ్చే ఏడాదిలో విడుదలయ్యే ఈ సినిమాకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టాడు.  తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని మెక్సికోలో జరుగుతోన్న ‘కామిక్‌కాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ - 2026’లో ప్రదర్శించారు. ఈసందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా  అక్కడి ప్రేక్షకులకు సందేశమిచ్చారు.

    ‘నాకు మెక్సికో అంటే చాలా ఇష్టం. నేను తెరకెక్కించిన బాహుబలి మూవీలో కూడా సిటీ సెంటర్‌ నిర్మాణానికి చిచెన్‌ ఇట్జా(మెక్సికోలో ఒక నగరం) స్ఫూర్తిగా తీసుకున్నా. గత 25 ఏళ్లుగా నేను సినిమా రంగంలోనే ఉన్నాను.ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాను. మనం తెరకెక్కించిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే  ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ప్రపంచమంతా ఆదరించినప్పుడు నా సంతోషానికి అవధులు లేవు. నాటు నాటు పాటకు ప్రపంచం అంతా స్టెప్పులేస్తుంటే.. అది చూసి చాలా సార్లు ఎమోషనల్‌ అయ్యాను. అప్పుడే నేను సినిమాలు ఎందుకు చేస్తున్నానో అర్థమైంది. వీలైనంత వరకు ప్రపంచం మెచ్చే చిత్రాలనే తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను’ అని రాజమౌళి అన్నారు. 

    వారణాసి విషయానికొస్తే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ సినిమా ఇది. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్‌ కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు.కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.
     

International

  • ప‌శ్చిమాసియాలో ప‌రిస్థితి మ‌ళ్లీ యుద్ధ మేఘాలు  క‌మ్ముకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.  పాకిస్తాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ వేదిక‌గా జ‌ర‌గా ల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చ‌ర్చ‌ల కోసం అమెరికా ప్ర‌తినిధులు స్టీవ్ విట్కాఫ్‌, జారెడ్ కుష్న‌ర్ వెళ్లాల్సి ఉండ‌గా, వారి ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేస్తూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 

    ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విష‌యాన్ని ట్రంప్ త‌న‌ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్ర‌క‌టించారు. ‘కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..
    మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. 

    చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, ‘చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు.

  • టెహ్రాన్‌: మరోసారి అమెరికాను ఇరాన్‌ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్‌ పేర్కొంది.

    ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్‌ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చింది.

    మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్‌ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. 

    ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్‌ శనివారం అధికారికంగా ప్రకటించింది.

     

     

  • వాషింగ్టన్‌ డీసీ.. అమెరికా రాజధాని. ఇది చారిత్రకంగా వాస్తు శిల్ప పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాలతో నిండిన నగరం. ముఖ్యంగా వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ మాన్యుమెంట్ వంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. వాషింగ్టన్‌డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి.

    అయితే  ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వీడియోలు  వాషింగ్టన్‌ డీసీలో బిల్డింగ్‌ గోడలపై ప్రదర్శితమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీ వెలుగుల్లోట్రంప్‌-ఎప్‌స్టీన్‌లు కలిసి ఉన్న వీడియోలను  ప్రదర్శించారు నిరసనకారులు.

    అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు.. మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనం ముఖ భాగంపై ప్రదర్శించారు నిరసనకారులు.  ఈ వీడియోలలో ఎప్‌స్టీన్‌కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది.   వీటిని వాషింగ్టన్‌ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను మరొకసారి ఆసక్తిగా తిలకించారు జనం. 

    అయితే వాషింగ్టన్‌ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి  ట్రంప్‌ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. వాషింగ్టన్‌ డీసీలో అధ్యక్ష హోదాలో ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్‌ తొలిసారి హాజరు కానున్నారు. 

    వైట్ హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించే ఈ విందు కార్యక్రమంలో సంప్రదాయంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఇది మీడియా స్వేచ్ఛను జరుపుకునే దీర్ఘకాలిక సంప్రదాయం. ప్రతి అధ్యక్షుడు తన పదవీకాలంలో కనీసం ఒకసారి హాజరయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన మొదటి పదవీకాలమంతా, అలాగే 2025లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తాజాగా దీనికి హాజరయ్యే సందర్భంలో ఇలా వాషింగ్టన్‌ డీసీలో బిల్డింగ్‌ల ముఖభాగాలపై ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న వీడియోలను నిరసన కారులు ప్రదర్శించడం ఇప్పుడు ట్రంప్‌కు మరింత తలనొప్పిగా మారింది. 

    ఇటీవలే మీడియాపై ట్రంప్‌ చిందుకు తొక్కారు. తనపై మీడియా కక్ష కట్టిందని,  చెడ్డ వాడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ట్రూత్‌లో రాసుకొచ్చారు ట్రంప్‌. 

     

     

     

  • దేశంలో చాలామంది యువత కనీస ఉపాధి దొరక్క నానా కష్టాలుపడుతోంటే, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా, జీవితం బోరింగ్‌గా ఉంది అంటున్న ఒక టెకీ స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. రియాద్‌లో నివసిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నెలకు రూ. 10 లక్షలు సంపాదన.  నెలకు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నాడు. అయినా సంతృప్తి లేదట. ఎందుకలా? 

    డబ్బు, ఆస్తులు జీవితానికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేవని, జీవనశైలిలో వైవిధ్యం కూడా ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన హంగర్‌స్టేషన్ కోసం రియాద్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడి వివరాలను ఇంజనీర్ అభిషేక్ సింగ్ పంచుకోవడంతో  చర్చ మొదలైంది. దీని ప్రకారం అతను నెలకు రూ. 10 లక్షల జీతం. ఖర్చు తక్కువ. దీంతో  సగానికిపైగా జీతం ఆదానే. ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నారు. దీంతోపాటు భారతదేశంలో కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా తన జీవితం చాలా 'బోరింగ్'గా ఉందని వ్యాఖ్యానించాడు.

    ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్‌.. రాఘవ్‌ చద్దాకు భారీ షాక్‌

    జీవితం 'బోరింగ్'?
    అధిక వేతనం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో సంతోషం లేకపోవడం, రోజువారీ రొటీన్ జీవితం విసుగు తెప్పిస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఇంత సంపాదన ఉన్నప్పటికీ, తన దైనందిన జీవితం చాలా నిరర్థకంగా మారిందని ఆ ఇంజనీర్ పేర్కొన్నారు. ఆయన జీవనశైలి కేవలం "పని, జిమ్, నిద్ర.. మళ్ళీ అదే పని" అన్నట్లుగా ఒకే పద్ధతిలో సాగుతోందని, అందులో ఎటువంటి ఉత్సాహం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన బెంగళూరులోని 'ఇన్‌మోబి' (InMobi) , లండన్‌లోని 'వైజ్' (Wise) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.

    ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!

    నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
    ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.  ఒక స్థాయి దాటిన తర్వాత భౌతిక సుఖాలు, డబ్బు అర్థరహితంగా అనిపిస్తాయి. నిత్యం ఒకే రకమైన జీవనశైలి విసుగు తెప్పిస్తుందఅని కొందరు సమర్థించారు. నెలకు రూ. 2 లక్షలతో రియాద్ వంటి నగరంలో విలాసవంతమైన జీవితం గడపడం కష్టం, ఆయన తన ఖర్చులను తక్కువ చేసి చెబుతున్నారంటూ మరికొందరు విమర్శించారు. కేవలం భారత రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆయన సంపద ఇంకా పెరిగేదని  కొందరు సలహా ఇచ్చారు.డబ్బు, స్థిరమైన ఆస్తులు ఉన్నప్పటికీ, జీవితంలో ఉత్సాహం లేకపోవడం అనే అంశంపై ఇది ఆధునిక కార్పొరేట్ జీవితంలోని ఒక వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది.

     

    ఇదీ చదవండి: నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్‌ సూసైడ్‌ నోట్‌ కలకలం

  • పిల్లలూ... మనం మూడు నెలలు ఉండే వేసవికే అష్షో బుష్షో అంటున్నాం కదా. అసలు ఎప్పుడూ వేసవే ఉండే ఊరు ఉందంటే నమ్ముతారా? అలాంటి ఊరు ఉంది. లక్కీగా ఇండియాలో కాదు. అమెరికాలో. అరిజోనా రాష్ట్రంలో.  ఆ ఊరి పేరు యుమా

    యుమాకి చుట్టూ ఎడారి, ఇసుక, కొండలు. మ్యాప్‌లో చూస్తే మెక్సికో దేశానికి దగ్గరగా కనిపిస్తుంది. దీనిని ‘ఎండల రాజధాని’ అంటారు. ఎందుకంటే ఏడాదికి 4000 గంటలు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 330 రోజులు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా ఉండదు. నీలం రంగు అద్దంలా మెరిసి పోతుంటుంది. చుట్టూ సోనోరాన్‌ ఎడారి. ఇసుక తొందరగా వేడెక్కిపోతుంది

     పర్వతాలు అడ్డు: పెద్ద పర్వతాలు వాన మబ్బులను రానివ్వవు. దగ్గరలో సముద్రం లేదు. అందుకే తేమ, చల్లని గాలి రాదు. పంటల ఏడాదికి కేవలం 8 సెం.మీ. వాన పడుతుంది. మన హైదరాబాద్‌లో ఒక పెద్ద వానకు 5 సెం.మీ.  పడుతుంది. యుమాకు అది ఏడాది వాన!

     

    గిన్నిస్‌ రికార్డ్‌: 
    ‘ప్రపంచంలో అత్యంత ఎండ కాసే నగరం’ అని గిన్నిస్‌ బుక్‌లో ఈ ఊరుకి పేరుంది.   యుమాలో గొడుగులు అమ్మే షాపులు చాలా తక్కువ. ఎందుకంటే అవసరమే ఉండదు. పిల్లలు ‘వాన పాట పాడాలంటే యూట్యూబ్‌ పెట్టుకోవాలి. బయటికి వెళ్లాలంటే మొహం, చేతులకు సన్‌క్రీమ్‌ రాయడం మర్చిపోరు. లేదంటే 10 నిమిషాల్లో టమాటో అయిపోతారు. ప్రతి ఇంట్లో, స్కూల్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటుంది.  మనకు వాన సెలవు ఇస్తారు కదా? యుమాలో ‘చాలా ఎక్కువ వేడి’ అని ఎండకు బడికి సెలవు ఇస్తారు. 48 సెంటిగ్రెడ్‌లు దాటితే బయట ఆడుకోవడం బ్యాన్‌! ఇంత ఎండలో కూడా యుమాలో పాలకూర’ పండిస్తారు. అమెరికాకి కావాల్సిన పాలకూరలో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది. చలికాలంలో పండిస్తారులే!  

  • టెహ్రాన్‌: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు  భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.

    'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్‌కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్‌, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా  ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్‌ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.

    అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు.

     

  • మనుషుల చరిత్రలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తరచుగా కనిపిస్తాయి. రాజ్యాల కోసం, మతాల కోసం, జాతుల కోసం జరిగిన ఈ పోరాటాలు సమాజాలను శాశ్వతంగా మార్చేశాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలాంటి అంతర్యుద్ధాలు జరుగుతాయని.. వాటి ఫలితంగా 11 ఏళ్లుగా నిత్యం కారడవిలో రక్తపాతం జరుగుతోందని మీకు తెలుసా?.. 

    ఉగాండాలోని కిబాలే నేషనల్‌ పార్క్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహంగా పేరుగాంచిన న్గోగో(Ngogo) కమ్యూనిటీకి కేరాఫ్‌. సాధారణంగా చింపాంజీలు 50 లోపే ఒక సమూహంగా ఉంటాయి. కానీ, న్గోగో జాతివి మాత్రం 200లకు పైనే కలిసి ఉండేవి. ఇది పరిశోధకులను ఎంతో ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు కలిసే ఉంటూ.. కలిసే వేటాడుతూ.. కాలం వెల్లదీస్తుంటాయివి. అలాంటిది ఓరోజు అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. 

    ఉన్నట్లుండి.. ఆ చింపాంజీ గ్రూప్‌ రెండుగా విడిపోయింది. ఒకదానితో మరొకటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అది ఘర్షణలకు దారి తీసింది. మనుషుల్లాగే.. అవి గ్యాంగ్‌ వార్‌లు చేస్తుండడం, పక్కా ప్లానులతో ప్రత్యర్థులు దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించాయి. చివరకు వాటిలో అవి కొట్టుకుని చంపుకునే దాకా వెళ్లింది పరిస్థితి. 

    అలా.. 2015 నుంచి ఇప్పటిదాకా ఏడు పెద్ద చింపాజీలు, మరో 17 పిల్ల చింపాంజీలు మరణించాయి. మరో 14 చింపాంజీలు జాడ లేకుండా పోయాయి.  ప్రస్తుతం వెస్టర్న్‌ గ్రూప్‌, సెంట్రల్‌ గ్రూప్‌ల మధ్య అంతర్యుద్ధంతో నిత్యం కిబాలేలో రక్తం చిందుతోంది. 

    ప్రఖ్యాత పరిశోధకుడు ఆరన్‌ సాండెల్‌ ఈ సంఘటనను “చింపాంజీల సివిల్‌ వార్‌”గా అభివర్ణించారు. 2014లో ఆ కమ్యూనిటీని అదుపు చేసిన కొన్ని చింపాజీలు వ్యాధులతో చనిపోవడం.. కొత్త ‘ఆల్ఫా మేల్‌’ రావడం వల్ల సంబంధాలు బలహీనపడ్డాయని చెబుతున్నారాయన. ఆయన మాటల్లో.. ఇది మనుషుల మధ్య మతం, జాతి కోసం జరుగుతున్న యుద్ధంలా కాదు. సంబంధాలు, ఆధిపత్యం, సామాజిక బంధాలు బలహీనపడటం వల్లే చింపాంజీల మధ్య విభజన జరిగింది అని అభిప్రాయపడ్డారు. 

    ఈ సంఘటనను 70వ దశకంలో జేన్‌ గూడాల్‌ గోంబే నేషనల్‌ పార్క్‌(టాంజానియాలోని అతి చిన్న నేషనల్‌ పార్క్‌)లో జరిగిన “ఫోర్‌ ఇయర్‌ వార్‌”తో పోలుస్తున్నారు. అప్పట్లో కూడా ఒకే సమూహంలో పెరిగిన చింపాంజీలు.. కహామా, కసకెలా కమ్యూనిటీలుగా విడిపోయి చంపుకున్నాయి. అయితేనీ వైరంతో తక్కువ కాలంలోనే ఆ జాతి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. 

    న్గోగో చింపాంజీల యుద్ధం ఎలా ముగుస్తుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సెంట్రల్‌ గ్రూప్‌ తమను తాము బలపరుచుకుని రక్షించుకోవడం. రెండోది.. వెస్టర్న్‌ గ్రూప్‌ పూర్తిగా ఆధిపత్యం సాధించి సెంట్రల్‌ గ్రూప్‌ను అంతమొందించడం. మూడోది.. రెండు గ్రూపులు మళ్లీ కలిసిపోవడం. అయితే చివరిది చాలా అరుదుగా జరిగే అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ బ‌దిలీలు చేప‌ట్టారు. పలువురు అధికారులను బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా పో స్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 మంది అధికారులను బ‌దిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్‌బీ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా ప్రావీణ్య‌, పంచాయ‌తీరాజ్-గ్రామీణాభివృద్ధి ప్ర‌త్యేక కార్య‌ ద‌ర్శిగా దాన‌కిషోర్‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా కృష్ణ ఆదిత్య‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బి.ఎం. సంతోష్‌, ఇంట‌ర్ బోర్డు డైరెక్ట‌ర్‌గా అభిలాష అభిన‌వ్‌, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ డైరెక్ట‌ర్‌గా జి.వి శ్యామ్‌ప్ర‌సాద్ లాల్ నియ‌మితుల‌య్యారు. 

    • సంజయ్ కుమార్ (ఐఏఎస్ 1995)
        ప్రస్తుతం: పీఆర్&ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
        బదిలీ: తెలంగాణ భవన్, న్యూఢిల్లీకి ప్రత్యేక అధికారిగా
    • ఎం.దాన కిషోర్ (ఐఏఎస్ 1996)
        ప్రస్తుతం: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
        బదిలీ: పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా
    • బి.విజియేందిర (ఐఏఎస్ 2006)
        ప్రస్తుతం: టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి & ఎస్సీడీ కమిషనర్
        బదిలీ: ఎస్సీడీ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా
    • హరిచందన దాసరి (ఐఏఎస్ 2010)
        ప్రస్తుతం: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
        బదిలీ: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా
    • కృష్ణ ఆదిత్య ఎస్ (ఐఏఎస్ 2014)
        ప్రస్తుతం: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి
        బదిలీ: పరిశ్రమలు & వాణిజ్య శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా
    • భావేష్ మిశ్రా (ఐఏఎస్ 2015)
        ప్రస్తుతం: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి
        బదిలీ: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • పి.ఉదయ్ కుమార్ (ఐఏఎస్ 2016)
        ప్రస్తుతం: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ
        బదిలీ: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్‌గా
    •  బధావత్ సంతోష్ (ఐఏఎస్ 2016)
        ప్రస్తుతం: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
        బదిలీ: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా
    • జెండాగే హనుమంత్ కొండిబా (ఐఏఎస్ 2016)
        ప్రస్తుతం: పౌర సరఫరాల డైరెక్టర్
        బదిలీ: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా
    • పి.ప్రవీణ్య (ఐఏఎస్ 2016)
         ప్రస్తుతం: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
         బదిలీ: టీఆర్&బీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా
    • ప్రియాంక అలా (ఐఏఎస్ 2016)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
         బదిలీ: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • సంతోష్ బి.ఎం. (ఐఏఎస్ 2017)
         ప్రస్తుతం: గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్
         బదిలీ: గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా
    • ప్రతీక్ జైన్ (ఐఏఎస్ 2017)
         ప్రస్తుతం: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
         బదిలీ: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • దివాకర టీఎస్ (ఐఏఎస్ 2017)
         ప్రస్తుతం: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
         బదిలీ: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్ 2018)
         ప్రస్తుతం: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
         బదిలీ: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా
    •  అభిలాష అభినవ్ (ఐఏఎస్ 2018)
         ప్రస్తుతం: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్
         బదిలీ: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగా
    • భోర్ఖాడే హేమంత్ సహదేవరావు (ఐఏఎస్ 2018)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్
         బదిలీ: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • చెక్క ప్రియాంక (ఐఏఎస్ 2018)
         ప్రస్తుతం: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి
         బదిలీ: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • జి.వి.శ్యాం ప్రసాద్ లాల్ (ఐఏఎస్ 2019)
         ప్రస్తుతం: నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)
         బదిలీ: పౌర సరఫరాల డైరెక్టర్‌గా
    • జి.ముకుంద రెడ్డి (ఐఏఎస్ 2019)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్
         బదిలీ: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా
    • హేమంత్ కేశవ్ పాటిల్ (ఐఏఎస్ 2019)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
         బదిలీ: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్‌గా
    • మండ మకరందు (ఐఏఎస్ 2020)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్
         బదిలీ: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా
    • అపూర్వ్ చౌహాన్ (ఐఏఎస్ 2020)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్
         బదిలీ: సీసీఎల్ఏ కార్యాలయంలో సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా
    • లెనిన్ వత్సల్ టోప్పో (ఐఏఎస్ 2021)
         ప్రస్తుతం: మహబూబాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)
         బదిలీ: ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా
    • నారాయణ అమిత్ మాలెంపాటి (ఐఏఎస్ 2022)
         ప్రస్తుతం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్
         బదిలీ: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా
    • వికాస్ మహతో (ఐఏఎస్ 2022)
         ప్రస్తుతం: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్-కలెక్టర్
         బదిలీ: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా
    • మయాంక్ సింగ్ (ఐఏఎస్ 2022)
         ప్రస్తుతం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్-కలెక్టర్
         బదిలీ: జీహెచ్ఎంసీ, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా
    • కిరణ్మయి కొప్పిశెట్టి (ఐఏఎస్ 2022)
         ప్రస్తుతం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్
         బదిలీ: రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
    • యువరాజ్ మార్మట్ (ఐఏఎస్ 2022)
         ప్రస్తుతం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్-కలెక్టర్
         బదిలీ: కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
    • ఎస్.శ్రీనివాస్ రెడ్డి (నాన్-కేడర్)
         ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, చార్మినార్ జోనల్ కమిషనర్
         బదిలీ: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా
  • హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎల్‌ అండ్‌ టీ మెట్రోపై 100 శాతం ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. రూ.15,000 కోట్లతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ద్వారా కొనుగోలు పూర్తయింది. ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి మెట్రో వచ్చేసింది. కొత్త బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్లర్ల నియామకం జరిగింది. 

    మెట్రో చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావును నియమించారు. మెట్రో ఎండీగా సర్పరాజ్‌ అహ్మద్‌ కొనసాగుతారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు కీలక డైరెక్టర్‌ పదవులు దక్కాయి. షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేర్‌ కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ షేర్‌ హోల్డింగ్‌ ఉంటుంది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు మిగిలిన షేర్లను కేటాయించారు. 

    కాగా, ఎల్‌ అండ్‌ టీకి చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం (ఏప్రిల్‌ ) జీవో నంబర్‌ 127ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెట్రోను టేకోవర్‌ చేసుకునేందుకు ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. 

    నిజానికి ఈ ఏడాది మార్చి 30 నాటికే టేకోవర్‌ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది, అయితే, పలు అంశాలు కుదరకపోవడంతో ఆలస్యం జరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైళ్ల సర్వీసులు 2017 నవంబరులో ప్రారంభయ్యాయి. అయితే, ఎల్‌అండ్‌టీకి అప్పటి నుంచి నష్టాలే ఎదురవుతున్నాయి. చివరకు మెట్రో రైళ్లను నడపలేమని ఎల్‌అండ్‌టీ చెప్పేసింది.

  • రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తంగళ్లపల్లి మండలం రామనపల్లిలో శనివారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని తెలిపారు. 100 ఏళ్ల క్రితమే లండన్‌లో చదువుకున్న విశ్వ మేధావి అంబేద్కర్ అని చెప్పారు.

    ‘అంబేద్కర్ చూపిన బాటలో 14 ఏళ్లుగా లక్షలాదిమందితో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 1952-54లో అంబేద్కర్ పార్లమెంటుకు రాకుండా ఓడించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇతర పార్టీ నుంచే భారతరత్న వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి కులానికి, మతానికి అండగా నిలిచాం. 

    దురదృష్టవశాత్తు మనం ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును నెలకు ఒకసారి ఎకరానికి కిస్తుల ద్వారా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి కోటి మందిని కోటీశ్వరులను చేస్తానన్నారు.. ఇప్పటికీ పింఛన్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు వినిగించుకునేటప్పుడు ఆలోచించి వేయాలి.

    కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. నెల రోజుల క్రితం వడ్లు తీసుకువచ్చి సెంటర్లలో వేసినా ఇప్పటివరకు ఒక గింజ కొన్న పాపాన పోలేదు. ప్రభుత్వం వడ్లు కొనాల్సి వస్తే మద్దతు ధరతో పాటు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలులో జాప్యం చేస్తోంది. రైతులే వడ్లను దళారులకు అమ్ముకునే పరిస్థితిని వస్తోంది.

    రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వీరు రైతుబంధు వేయడం లేదు.. కరెంట్ సరిగా ఇవ్వడం లేదు. వడ్లను కొనుగోలు చేయకపోవడంతో వర్షం కురుస్తుందనే భయంతో రైతులు పంటను కవర్లతో కాపాడుకోవాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా’ అని అన్నారు.

  • హైదరాబాద్‌: శంషాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో  స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..  ‘ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్‌గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఏరో స్పేస్ విభాగం లో కూడా స్కిల్ యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలి. 

    ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తాం. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధి లోకి తీసుకువస్తాం. స్కిల్స్ యూనివర్సిటీ ని అద్భుతం గా తీసుకువస్తున్నాం. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ని సందర్శించాలి. ఐటీఐలను టాటా గ్రూప్ సహకారం తో ఏటీసీలు గా మారుస్తున్నాం. 

    సిలబస్‌ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మహులిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థి పైన లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది’ అని పేర్కొన్నారు. 

  • హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్‌గడ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి వద్ద నుంచి 34 ఆయుధాలను సరెండర్‌ చేసుకున్నారు. వీరిని ఈరోజు(శనివారం, ఏప్రిల్‌ 25వ తేదీ) మీడియా ముందు  ప్రవేశపెట్టారు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి.  ఈ మేరకు డీజీపీ  మాట్టాడుతూ.. వారంతా  చత్తీస్‌గడ్‌కు చెందిన మావోయిస్టులేనని పేర్కొన్నారు.

    డీజీపీ శివధర్‌రెడ్డి  ఏమన్నారంటే..

    తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టు  లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 32 తుపాకులను కూడా పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు మరియు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ  ఇంర్జి అయిన హేమ్లా ఇతు అలియాస్‌ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ అయిన పోడియం లచ్చు అలియాస్‌ మనోజ్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు. లొంగిపోయిన మావోలు పోలీసులకు 32 ఆయుధాలతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను అప్పగించారు.

    పోలీసులకు సమర్పించిన ఆయుధాలు

    1 - LMG,4 - AK-47 రైఫిల్స్
    3 - SLR రైఫిల్స్,2 - INSAS రైఫిల్స్
    2 - 410 మస్కెట్ రైఫిల్స్,1 - 8mm రైఫిల్
    12 - సింగిల్-షాట్ గన్స్,1 - 9mm పిస్టల్
    1 - రివాల్వర్,2 - BGL గన్స్
    2 - ఎయిర్ గన్స్,1 - SBBL గన్

    దక్షిణ బస్తర్ డివిసి (DVC) కార్యదర్శితో సహా కీలక నాయకులు, సాయుధ కేడర్లు దాదాపు అందరూ ఈరోజు లొంగిపోవడంతో, ప్రస్తుతం దక్షిణ బస్తర్ డివిసి మొత్తం నిర్వీర్యం అంచుకు చేరుకుంది.

    లొంగిపోయిన 47 మంది క్యాడర్ల వారీగా వివరాలు 
    PLGA బెటాలియన్: 4 మంది
    DKSZC: 28 మంది
    9వ & 30వ ప్లాటూన్, దక్షిణ బస్తర్ DVC: 15 మంది (మొత్తం: 47 మంది) లొంగిపోవడం జరిగింది.

    తెలంగాణకి చెందిన నలుగురు మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు
    వారు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని అభ్యర్థిస్తున్నాము

    ‘జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు మరియు పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  గత రెండేళ్లలో 818 మంది తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు.  గత రెండేళ్లలో 334 ఆయుధాలను మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ పేర్కొ‍న్నారు.

    అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు 

    1. లక్ష్మణరావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు
    2. పసునూరి నరహరి అలియాస్ సంతోషం కేంద్ర కమిటీ సభ్యులు
    3. జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత ,స్టేట్ కమిటీ మెంబర్
    4. వార్త శేఖర్ అలియాస్ మంగు, స్టేట్ కమిటీ మెంబర్

     

Business

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్‌టెక్‌ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.

    సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్‌లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.

    ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.

    సెటప్ చేసుకోవడం ఎలా?
    పీఎన్‌బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.
    💸 ముందుగా మీ యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
    💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.
    💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.

    బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్‌బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

  • సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.

    ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.

    ఇప్పటికే పలు కీలక సంస్కరణలు

    యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్‌ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

    అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!

    సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్‌ లొకేషన్‌లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.

    నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలు

    ఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.

    ‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు.

     

    నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!
    వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

     

    ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..
    ‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.

    ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

  • పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో  (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్‌ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్‌ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

    ఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్‌ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

    ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..

    నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్‌ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్‌ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.

    దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్‌లు, శానిటరీ వేర్‌ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్‌మెంట్ల ధరలు  (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

    ఎన్నికల ప్రభావం

    నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.

    ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

  • ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో సుమారు 1.70 లక్షల హైబ్రిడ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారులోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన లోపం వల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది.

    సమస్య ఏమిటంటే?
    ఈ వాహనాల్లోని DC-DC కన్వర్టర్‌లోని బూస్ట్ కంట్రోల్ మైక్రోచిప్‌లో అంతర్గత లోపం ఉన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ భాగం 12-వోల్ట్ బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్‌ను నియంత్రిస్తుంది. ఇది విఫలమైతే, వాహనానికి అందే విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. దీనివల్ల కారు ప్రొపల్షన్ (ముందుకు కదిలే శక్తి), బాహ్య లైట్లు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

    హెచ్చరిక సంకేతాలు
    సిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడానికి ముందు, డ్యాష్‌బోర్డ్ పై "Stop Safely Electric Fault Detected" అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ దీనిని గమనించకుండా డ్రైవింగ్ కొనసాగిస్తే గేర్‌బాక్స్ సరిగ్గా పనిచేయదు. కారు 'న్యూట్రల్' మోడ్‌లోకి వెళ్తుంది.సెంట్రల్ డిస్‌ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఆగిపోతాయి. చివరగా ఇంజిన్, బాహ్య లైట్లు పనిచేయడం నిలిచిపోయి వాహనం ఆగిపోతుంది.

    ప్రభావితమైన మోడళ్లు 
    మొత్తం 1,70,169 ఎస్‌యూవీలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎవోక్ (2020-2023), స్పోర్ట్ (2019-2024), వెలార్ (2021-2024), రేంజ్ రోవర్ స్టాండర్డ్ (2020-2024) మోడళ్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ డిస్కవరీ(2021-2024), డిస్కవరీ స్పోర్ట్(2020), డిఫెండర్ (2020-2024), జాగ్వార్ ఇ-పేస్ (2021-2022), ఎఫ్-పేస్ (2021-2024) వాహనాలకూ రీకాల్‌ వర్తిస్తుంది.

    పరిష్కారం ఇంకా సిద్ధం కాలేదు
    రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సమస్యకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం సిద్ధంగా లేదు. సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ అప్‌డేట్ కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. వాహన యజమానులకు ప్రమాదం గురించి హెచ్చరిస్తూ జూన్ 12, 2026 నాటికి నోటీసులు అందుతాయి. పరిష్కారం సిద్ధమైన తర్వాత తుది మరమ్మతు లేఖలు కంపెనీ పంపుతుంది.

    భారత్‌పై ప్రభావం?
    ప్రస్తుతానికి ఈ రీకాల్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేసింది కంపెనీ. అయితే, భారతీయ యజమానులు (ముఖ్యంగా దిగుమతి చేసుకున్న మోడళ్లు వాడుతున్న వారు) గ్లోబల్ VIN (వెహికల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) తనిఖీల ద్వారా తమ కారు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: కియోసాకి కొత్త వార్నింగ్‌.. ఈవీలపై కీలక కామెంట్స్‌

  • ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్‌కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..

    ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.

    ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..
    ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.

    కేటగిరీ మారినా.. 
    మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్‌లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

    ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

National

  • ఇంఫాల్‌: మణిపూర్‌లో మళ‍్లీ అలజడి చెలరేగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శనివారం కోఆర్డినేటింగ్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటెగ్రిటీ (కోకోమీ-మణిపూర్ సమగ్రత కోసం ఏర్పడిన సమాఖ్య) ర్యాలీ నిర్వహించింది. నగరవ్యాప్తంగా ఘర్షణలు జరిగాయి, పలువురు గాయపడ్డారు.

    ర్యాలీ మధ్యాహ్నం ఒంటి గంటకు 8 ప్రాంతాల నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ అధికార నివాసం వైపు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చెలరేగి ఘర్షణలకు దారితీసింది.

    ఇంఫాల్ మధ్య ప్రాంతంలోని ఓవర్‌బ్రిడ్జ్ వద్ద పోలీసులు నిరసనకారులకు వార్నింగ్‌ ఇచ్చి 10 నిమిషాల్లో వెళ్లిపోవాలని చెప్పారు. కానీ, వారు నిరాకరించారు. ఇమా కైథెల్, అలూ గలి మార్కెట్ ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి.

    ఆ తర్వాత భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టాయి. పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు, ఇమా కైథెల్ వద్ద దాగి ఉన్న వ్యక్తుల వద్ద నుంచి స్లింగ్స్, కటపుల్ట్లు స్వాధీనం చేసుకున్నారు.

    మధ్యాహ్నం ఒంటి గంటకు మార్కెట్లు మూసివేయడంతో సాధారణ జీవనం ప్రభావితమైంది. కోకోమీ తెలిపిన ప్రకారం ఈ ర్యాలీ ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిర్వహించారు. అందులో ఆరోపిత ప్రాక్సీ వార్, నార్కో టెర్రరిజం, ఇటీవలి హత్యలు, సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ, అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తుల (ఐడీపీలు – దేశంలోనే వేరే ప్రాంతాలకు తరలిన బాధితులు) పునరావాసం, కుకీ తిరుగుబాటుదారులతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ రద్దు వంటి అంశాలు ఉన్నాయి.

    కోకోమీ ప్రతినిధి నహాక్పామ్ శాంతా మాట్లాడుతూ, 2023 మే నుంచి జరిగిన పరిణామాలు, తాజా ఘటనల నేపథ్యంలో ప్రజలు భారీగా బయటకు వచ్చారని తెలిపారు. సోఓ రద్దు, నార్కో టెర్రరిజంపై చర్యలు, ట్రోంగ్లాఓబి దాడి, ఉఖ్రుల్ హైవే అంబుష్ వంటి ఘటనల్లో మృతి చెందిన వారికి న్యాయం కోరుతూ కోకోమీ ఉద్యమాలు చేపట్టిందని చెప్పారు.

    ప్రభుత్వానికి పలు డిమాండ్లతో మెమొరాండం అందజేస్తామని శాంతా తెలిపారు. నిరాశ్రయుల పునరావాసంపై ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆరోపిస్తూ, జనగణన లేదా ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర నమోదు ప్రక్రియ) వంటి ప్రక్రియల కంటే ముందు ఈ సమస్య పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే పలు మెమొరాండాలు సమర్పించినప్పటికీ స్పష్టమైన నివేదిక ఇవ్వలేదని చెప్పారు.

    నిరసనలో పాల్గొన్న స్థానికుడు అజిత్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఉద్యమం దేశ వ్యతిరేకం కాదని, న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఇప్పటికీ న్యాయం లభించలేదని, ప్రబుత్వం మౌనం ఎందుకు వహిస్తుందని ప్రశ్నించారు.

  • హుగ్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా హుగ్లీ జిల్లాలోని శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో ద్వేషాన్ని, భయాన్ని నింపుతారు. ఇది ఎన్నికల పోరాటం కాదు.. సిద్ధాంతాల పోరాటం’’ అంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు.

    ప్రధాని మోదీతో పాటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలపై తీవ్ర స్థాయిలో రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ఇద్దరివి.. అవినీతి, బెదిరింపులతో ఒకే రకమైన పాలన విధానాలు అంటూ ఆరోపించారు. మమతా బెనర్జీ.. మోదీ కంటే ఏమాత్రం తక్కువ అవినీతిపరురాలు కాదు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ భయాందోళనలు, అరాచక వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నాయని రాహుల్‌ అన్నారు.

    ‘‘మమతా నేరుగా బీజేపీతో పోరాడదు కాబట్టే ఈడీ కేసులు లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తనపై అనేక కేసులు నమోదు చేసింది.. కానీ మమతా బెనర్జీపై ఒక్క కేసు కూడా లేదు. ఆమె బీజేపీతో నేరుగా పోరాడకపోవడమే దీనికి కారణమంటూ రాహుల్‌ ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనను వరుసగా ఐదు రోజుల పాటు 55 గంటల సేపు ప్రశ్నించిందని గుర్తు చేస్తూ.. మమతా బెనర్జీని ఎన్ని గంటల పాటు విచారించారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. తాను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నానని, తన ఇంటిని లాక్కున్నారని, తన లోక్‌సభ సభ్యత్వాన్ని కూడా తొలగించారని రాహుల్ చెప్పారు. "నాపై 36 కేసులు ఉన్నాయి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి జార్ఖండ్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు కోర్టు కేసుల కోసం తిరగాల్సి వస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘కేవలం కాంగ్రెస్ మాత్రమే బీజేపీతో సైద్ధాంతికంగా పోరాడుతోందని, అందుకే మోదీ తనను, పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ఎప్పుడూ టార్గెట్ చేస్తారు. బెంగాల్ ఎన్నికలు ముగియనివ్వండి. ఆ తర్వాత మోదీ ఒక్క మాట కూడా మమతకు వ్యతిరేకంగా మాట్లాడరు. పశ్చిమ బెంగాల్‌లో పరిశ్రమలను మమత నాశనం చేశారు. నిరుద్యోగాన్ని పెంచారు ఆరోపించారు. బెంగాల్‌లో ఉద్యోగం రావాలంటే టీఎంసీలో బంధువులు ఉండాలి. లేకపోతే రాదు’’ అంటూ రాహుల్‌ విమర్శించారు.

  • రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. అతని ఇంటిలోకి చొరబడి భార్య, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో కానిస్టేబుల్ భార్య, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి సొంతూరికి వెళ్లేందుకు టిక్కెట్లు కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో నిందితురాలు సరోజినీ భరద్వాజ్.. దుర్గ్‌లోని ఆయన ఫ్లాట్‌కు చేరుకుని కానిస్టేబుల్ భార్య రీనా యాదవ్‌తో గొడవకు దిగింది,

    గొడవ బయటకు వినిపించకుండా టీవీ వాల్యూమ్‌ను పెంచిన సరోజినీ భరద్వాజ్.. అనంతరం కత్తి తీసుకుని మొదట నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల కుమారుడు ఆదిత్యపై విచక్షణారహితంగా దాడి చేసింది. తర్వాత నిందితురాలు మిగిలిన ఇద్దరు కుమార్తెలు నైనా, తానియాపై దాడికి ప్రయత్నించగా... తీవ్రంగా గాయపడిన రీనా యాదవ్ తన బిడ్డలను వదిలేయమని ప్రాధేయపడింది. నిందితురాలి కాళ్లు పట్టుకుని తన కూతుళ్లను పారిపోమని కోరింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కుంది, మరొకరు బయటకు పరుగెత్తి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు.

    కేకలు విని పొరుగువారు వచ్చేసరికి.. నిందితురాలు రక్తంతో తడిసిన కత్తితో తలుపు దగ్గర నిలబడి ఉంది. స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రికి తరలించే లోపే రీనా యాదవ్, ఆమె కుమారుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

    భరద్వాజ్, లలితేష్ యాదవ్ మధ్య సంబంధం ఉన్నట్లు తేలింది. శుక్రవారం కూడా ఆమె ఇంటికి రాగా, కానిస్టేబుల్ ఆమెను పంపించివేశారు. కానీ శనివారం ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. నిందితురాలిని అరెస్టు చేశామని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

  • ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 44.5°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర ప్రాంతాల్లో వేడి-తేమతో వాతావరణ మండుతోంది. ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.

    మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తగినంత నీళ్లు తాగాలని.. తేలికపాటి బట్టలు ధరించాలి. బయట శ్రమతో కూడిన పనులు నివారించాలని వాతావరణ శాఖ సూచించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏప్రిల్-జూన్‌లో తూర్పు, మధ్య, ఉత్తర-పశ్చిమ భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

    ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (40°C నుండి 44°C) మధ్య నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5°C, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

    జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతం, తూర్పు రాష్ట్రాల్లో ఉక్కపోత (వేడి, తేమ) ఎక్కువగా ఉంటుంది. వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 27 వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. ఇతర ప్రాంతాల్లో మొదట ఉష్ణోగ్రతలు పెరిగి, ఆపై తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
     

     

  • సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త నిబంధనలు తెచ్చిందంటూ ఇటీవల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. సింధూరం, తిలకంపై నిషేధం వార్తలను ఖండిస్తూ.. కల్పితాలుగా కొట్టిపారేసింది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు వచ్చిన కథనాలపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్నీ అసత్యాలేనని.. తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ స్పష్టం చేసింది.

    సింధూరం, తిలకం సిబ్బంది ధరించకుండా నిషేధించామన్న వాదనలను తోసిపుచ్చిన ఇండిగో సం‍స్థ.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న తమ గ్రామింగ్ పాలసీ (వేషధారణ నిబంధనలు) డాక్యుమెంట్లు ‘తప్పు’ అంటూ శనివారం స్పష్టం చేసింది.

    ఎక్స్(ట్విట్టర్‌) యూజర్.. ఇండిగో గ్రామింగ్ హ్యాండ్‌బుక్‌కు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ పత్రాల్లో తిలకం, సింధూరం, మంగళసూత్రం, కలావా(చేతికి కట్టే పవిత్ర దారం) వంటి వాటిని స్పష్టంగా నిషేధించినట్లు.. హిజాబ్, టర్బన్ (పాగా)లను అనుమతించినట్లు కనిపించింది.

    దీనిపై స్పందించిన ఇండిగో.. ధృవీకరించని, కల్పిత పత్రాలను షేర్ చేయవద్దని పేర్కొంది. తమ నిబంధనలు అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది. "అన్ని వర్గాలను కలుపుకొనిపోయే పని వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని.. మా సిబ్బంది, కస్టమర్ల భద్రత, శ్రేయస్సు మా మొదటి ప్రాధాన్యత అని ఇండిగో స్పష్టం చేసింది.
     

  • కాన్పూర్‌లో ఒక 24 ఏళ్ల యువ న్యాయవాది తన తండ్రి వేధింపుల కారణంగా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లితండ్రుల ప్రవర్తన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. సూసైడ్ నోట్‌లో అతను పేర్కొన్న విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రియాంషు శ్రీవాస్తవ అనే యువ న్యాయవాది కాన్పూర్ కోర్టు భవనం ఐదవ అంతస్తు నుండి దూకేశాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయనను హుటా హుటిన ఉర్సులా హార్స్‌మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

    బాల్యంలో చేదు అనుభవాలు వారి మనసుపై చెరగని ముద్ర  వేస్తాయి, తద్వారా అపరాధ భావం, న్యూనతా భావం, ఒత్తిడి పెరిగిపోతాయని మనస్తత్వ నిపుణులు చెపుతారు. తన తండ్రి చిన్నతనం నుండి తనను ఎలా మానసిక వేదనకు గురిచేశారో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు ప్రియాంషు తన వాట్సాప్ స్టేటస్‌లో రెండు పేజీల సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశాడు. శ్రీవాస్తవ తాను రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌లో, తన బాల్యం , కౌమార దశలో తన తండ్రి తనను మానసికంగా వేధించిన వైనాన్ని వివరించాడు. పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న తండ్రి వల్ల మానసిక ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు.

    మ్యాంగో జ్యూస్ తాగినందుకు శిక్ష
    ప్రియాంషుకు 6 ఏళ్ల వయసున్నప్పుడు, ఫ్రిజ్‌లో ఉన్న మామిడి జ్యూస్‌ను అనుమతి లేకుండా తాగినందుకు తండ్రి ఆయన బట్టలు విప్పదీసి ఇంటి నుండి బయటకు గెంటివేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన  తనను చాలా బాధించిందని పేర్కొన్నాడు.

    ఇదీ చదవండి: అంత్యక్రియల్లోబార్‌ గర్ల్స్‌ డ్యాన్స్‌.. అసలు విషయం ఇదీ!

    2016లో 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రియాంషు 'ఫిజికల్ ఎడ్యుకేషన్' తీసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి బలవంతం చేసి 'కంప్యూటర్' సబ్జెక్టు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, మాట వినకపోతే పాత శిక్షలే వేస్తానని బెదిరించారని నోట్‌లో రాశాడు.

    తండ్రిపై  ఆగ్రహం
    తండ్రి ప్రవర్తన ప్రియాంషు మనసుని చిన్నాభిన్నం చేసింది. అందుకే తన తండ్రి లాంటి వ్యక్తి ఎవరికీ వద్దు దేవుడా అని  ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన మరణం తర్వాత తండ్రి, తన దేహాన్ని తాకడానికి వీల్లేదని కోరుకున్నాడు. అలాగే తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కోరుతూనే, తన మరణం తర్వాత తన తల్లిని వేధించవద్దని వేడుకున్నాడు. 

    ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!

    పోలీసుల దర్యాప్తు
    మృతుడి ఆత్మహత్య లేఖలోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 

    ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్‌.. రాఘవ్‌ చద్దాకు భారీ షాక్‌

  • గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో  నాలుగేళ్ల  కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన  పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. 

    ఈ సంఘటన ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్‌పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది.  సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్‌ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది.  దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం  అంతకన్నా లేదు. చిరుతపై  ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని  దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది.  అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. 

    దీనిపై  పావి జెట్‌పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి   స్పందిస్తూ  రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు.  

    ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.

    నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలు

    తండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈ ఎన్నికలు కేవలం బెంగాల్‌కే కాకుండా యావత్ భారతదేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. చొరబాటుదారుల ముప్పును అరికట్టకపోతే తూర్పు భారతదేశ రూపురేఖలే మారిపోతాయని హెచ్చరిస్తూ.. ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

    200 సీట్లతో బీజేపీ సునామీ
    పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నదని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్‌లో బీజేపీకి వచ్చిన మద్దతుతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, బీజేపీ 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో వీస్తున్న గాలిని ‘బీజేపీ సునామీ’గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో మార్పు తథ్యమని అన్నారు.

    పెను ముప్పు
    టీఎంసీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంగ్లాదేశ్ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని సీఎం హిమంత మండిపడ్డారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్ (బీఎస్‌ఎఫ్‌)దళాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చొరబాట్లను అడ్డుకోకపోతే భవిష్యత్తులో దేశంలోని తూర్పు ప్రాంతమంతా బంగ్లాదేశ్‌లో కలిసిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం అత్యవసరమని ఆయన  పేర్కొన్నారు.

    ప్రమాదంలో హిందువుల జనాభా
    అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న జనాభా సమీకరణలపై శర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసోంలో 60 శాతం హిందువులు, 40 శాతం ముస్లింలు ఉన్నారని.. రాబోయే రెండు దశాబ్దాల్లో అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రభావం బీహార్, జార్ఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిపై పడుతుందన్నారు. కాగా బెంగాల్‌లో ఏప్రిల్ 23న బెంగాల్ తొలి దశ పోలింగ్ ముగియగా, ఏప్రిల్ 29న రెండో దశ జరగనుంది. ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి.

    ఇది కూడా చదవండి: గేటుకి వేలాడిన గజదొంగ.. గ్రేట్ ఎస్కేప్ ఫెయిల్!

  • ఘజియాబాద్‌: ఆ దొంగ ఒక ఇంట్లో చోరీ చేద్దామని ఎంతో పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. అయితే కీలక సమయంలో అతగాడి ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది! ఇల్లు దోచుకోవడం పక్కనపెడితే.. కనీసం అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేక, గేటుకే వేలాడుతూ అందరిముందూ నవ్వులపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

    దొంగతనం చేద్దామని వెళ్లి..
    ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని ఓ  దొంగ గమనించాడు. ఆ ఇంటిలోనికి చొరబడి అయినకాడికి దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోడకు, గేటుకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్ సందులో నుంచి అతికష్టం మీద ఇంటి లోపలికి దూరాడు. కానీ, అప్పటికే వీధిలో ఎవరో నడుస్తున్న అలికిడి వినిపించడంతో భయపడిపోయాడు. ఎవరైనా చూస్తారనే కంగారులో, తాను వచ్చిన సందులో నుంచే వెంటనే పారిపోవాలని భావించాడు.

    గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి..
    ఎంత వేగంగా బయట పడాలని  ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఆ ఇనుప కడ్డీల మధ్యలో  ఇరుక్కుపోయాడు. సగం శరీరం బయటకు, ఇంకో సగం లోపల ఉండిపోయి గేటుపైనే ఇబ్బంది పడుతూ ఉండిపోయాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు గుమిగూడి, ఆ తతంగాన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కిందకు దిగమని అడుగుతున్నా అతను రాలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

     

    అసలు ట్విస్ట్ ఏంటంటే..
    స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీసుకువచ్చి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని, ఇంటి యజమానులు కూడా ఫిర్యాదు చేయడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. పైగా ఆ కుర్రాడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. నెటిజన్లు మాత్రం ‘ఉద్యోగం’లో మొదటి రోజే ఇలా ఇరుక్కున్నాడేంటి? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురకలు

Politics

  • తాడేపల్లి : దళితులకు సమాజంలో గౌరవం తీసుకొచ్చింది దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అని మాజీ మంత్రి నారాయణస్వామి మరోసారి స్పష్టం చేశారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పాలనలోనే దళితులకు గౌరవం దక్కిందన్నారు. 

    ఈరోజు(శనివారం, ఏప్రిల్‌ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన నారాయణస్వామి.. . చంద్రబాబు దళితులంటే తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉంటారన్నారు. చంద్రబాబుకు దళితులంటే అస్సులు గిట్టదన్నారు. 

    ‘జగన్‌.. నా ఎస్సీలు అంటూ అందరినీ అక్కున చేర్చుకున్నారు.. చంద్రబాబు మాల, మాదిగలను చీల్చి రాజకీయ లబ్ధి పొందారు. జగన్‌ తన క్యాబినెట్‌లో దళితులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవస్ధలో మార్పులు తీసుకొచ్చారు. దళిత సమాజం అభ్యున్నతికి కృషిచేసిన జగన్‌ని మళ్లీ సీఎంని చేసుకుందాం’ అని విజ్ఞప్తి చేశారు. 

  • సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.

    ‘‘వైఎస్సార్‌సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?.

    ..చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్‌ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు.

    టీడీపీ బాంబుల పార్టీనా..గునపం పార్టీనా ?

    ..చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల‌ మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్‌ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని‌ కొండంతల్ని చేసి పబ్బం‌గడుపుకుంటారు. వైఎస్‌ జగన్‌పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్‌ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్‌ జగన్‌కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.

  • న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి అని, ఆయన గూండా రాజకీయాలకు పేరుగాంచిన వ్యక్తి అని రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ అన్నారు. 2012 నుంచి నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఉన్న ఆమె.. శుక్రవారం (ఏప్రిల్‌ 24) బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

    బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి స్వాతి మాలివాల్ శనివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “నేను బీజేపీలో ఏ ఒత్తిడి లేకుండా చేరాను. మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది. సానుకూల రాజకీయాలు చేయాలనుకునే వారు బీజేపీలో చేరాలని కోరుతున్నాను. 2006 నుంచి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశాను, పలు ఉద్యమాల్లో మద్దతు ఇచ్చాను. అయితే, తర్వాత పార్టీలో నాపై హింస, ఒత్తిడి పెరిగింది. రెండు సంవత్సరాలు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

    నా ఇంట్లోనే ఒక గుండా ద్వారా నాపై దాడి చేయించారు. దీనిపై నేను నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని బెదిరించారు, తీవ్రమైన ఒత్తిడి చేశారు. రెండు సంవత్సరాలు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా సిగ్గుచేటు. నేను ఆప్‌ను వదిలి బీజేపీలో చేరాను’’ అని ఆమె అన్నారు.

    పంజాబ్‌లో ఆప్ పాలనపై మాట్లాడుతూ.. పంజాబ్‌ను ఆప్‌ నేతలు వ్యక్తిగత ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. “ఇసుక తవ్వకం, మాదక ద్రవ్యాల వినియోగం అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే నాయకులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి, గూండాగిరికి పేరుగాంచిన వ్యక్తి. మోదీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల నాయకుడు.

    ఆపరేషన్ సిందూర్, నక్సలిజం ముగింపు, పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్ బిల్లు వంటి సమయాల్లో మోదీ, అమిత్ షా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నేను బీజేపీలో ఏ ఒత్తిడి లేకుండా చేరాను, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది” అని ఆమె చెప్పారు.

    మరోవైపు, శుక్రవారం బీజేపీలో చేరిన తర్వాత, స్వాతి మాలివాల్.. ఆప్ జాతీయ కన్వీనర్ ఆర్వింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తూ.. ఆప్‌లో నిజాయితీతో కూడిన రాజకీయాల సిద్ధాంతాలు, విలువలను వదిలేశారని అన్నారు.

    ఆర్‌టీఐ ఉద్యమం, అన్నా ఉద్యమం, ఆప్ స్థాపన, ఢిల్లీ మహిళా కమిషన్‌లో పనిచేసిన తీరును ప్రస్తావించారు. “2006లో నేను ఉద్యోగం వదిలి దేశ సేవ మార్గాన్ని ఎంచుకున్నాను. ఆర్‌టీఐ ఉద్యమం, అన్నా ఉద్యమం, ఆప్ స్థాపన, ఢిల్లీ మహిళా కమిషన్‌లో 8 సంవత్సరాల సేవ.. ఇలా ప్రతి దశలో నిజాయితీతో పనిచేశాను” అని ఆమె చెప్పారు.

  • సాక్షి, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. మహిళలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ వివేక్‌ బదులిచ్చారు.

    ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ చేసిన నిర్వాకమే కారణమని మంత్రి వివేక్ చెప్పడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం రచ్చరచ్చగా మారింది. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా కూడా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులను అదుపుచేయలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులు అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర పడింది. గవర్నర్‌ సంతకంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. కాగా, ఎమ్మెల్సీల విషయమై ఆగస్టు 30న ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. దీంతో, తాజాగా ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేశారు. 

    ఎమ్మెల్సీ గురించి ఆలోచించడం మానేశా: కోదండరాం
    నిన్నటి వరకు ఎలా ఉన్నానో ఎమ్మెల్సీగా  కూడా అలాగే ఉంటానని తెలంగాణ జ‌న‌స‌మితి (టీజేఎస్‌) నాయ‌కుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. త‌న ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేసిన నేప‌థ్యంలో సాక్షి న్యూస్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ''ఎమ్మెల్సీ ప‌ద‌వి గురించి ఆలోచించడమే మానేశాను. దాని గురించి ఎవరు అడిగినా సున్నితంగా ఆ విషయం వదిలేయమ‌న్నాను. పదవులు శాశ్వతం కాదని అర్థమైంది. నన్ను విమర్శించే వాళ్ళకి ఏం చెప్పలేను. నా ఎమ్మెల్సీని ఆపి కొందరు సంతోష పడ్డార''ని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. 

    చ‌ద‌వండి: కేసీఆర్‌పై క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
     

Andhra Pradesh

  • అనకాపల్లి: జిల్లాలో డయేరియా విజృంభించింది. నక్కపల్లి మండలం, గొడిచర్ల గ్రామంలో డయేరియా ప్రబలి 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులు, విరేచనాలు అవుతుండడంతో గ్రామస్థలులు భయాందోళనలకు గురవుతున్నారు. పంచాయతీ కులాయి నీరు తాగిన కారణంగా డయేరియా వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. పలువురు డయేరియా బాధితులను గ్రామస్థులు పీహెచ్‌సీకి తరలించారు.

    డయేరియా వచ్చినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో నీరు తగ్గిపోకుండా ఎక్కువ ద్రవాలు తాగాలి. పరిశుభ్రత పాటించాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. డయేరియా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్‌ఎస్‌ తరచుగా తాగాలి. ఇది శరీరానికి నీరు, ఉప్పు తిరిగి అందిస్తుంది.  కొబ్బరి నీరు, సూప్, పల్చని పాలు, పండ్ల రసాలు ఉపయోగపడతాయి. కాఫీ, మద్యం, గ్యాస్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి.

  • వాల్మీకిపురం: కూటమి ప్రభుత్వ శ్రేణులకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దల తీరునే వారి శ్రేణులు కూడా అనుసరిస్తున్నాయి.  ఇందుకు తాజా ఘటనే ఉదాహరణ. టోల్‌గేట్‌ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని  ఆపకూడదంట. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపినందుకు టోల్‌గేట్‌ సిబ్బందిని చితకబాదారు కల్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు.

    ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు.. టోల్‌గేట్‌ సిబ్బందిని చితకబాది మరి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. టోల్‌గేట్‌ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపాల్సి ఉండగా సురేంద్ర బాబు అనుచరులు నానా హంగామా చేశారు. తమ వాహనాన్నే ఆపుతారా అంటూ టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

    ఈ క్రమంలోనే టోల్‌గేట్‌ సిబ్బందిని చితకబాదారు, అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం గండబోయిన పల్లెలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  అక్కడ నానా బీభత్సం సృష్టించిన సురేంద్ర బాబు అనుచరులు.. చివరకు టోల్‌గేట్‌ మేనేజర్‌ను కారులో ఎత్తుకెళ్లిపోయారు.  మహిళా సిబ్బంది పట్ల కూడా విచక్షణా రహితంగా ప్రవర్తించారు. మహిళా సిబ్బందిని జట్టుపట్టుకుని ఈడ్చేసి దాడికి పాల్పడ్డారు. 

    టోల్ సిబ్బంది పొట్టుపొట్టు కొట్టారు టీడీపీ ఎమ్మెల్యేతో మాములుగా ఉండదు
  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ అస్వస్థతకు గురికావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. గవర్నర్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

    కాగా, అబ్దుల్‌ నజీర్‌ కడుపు నొప్పితో బాధపడడంతో శనివారం తెల్లవారుజామున మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు బెంగళూరు నుంచి రావాల్సిన గవర్నర్ విమానం ఆలస్యమైంది. 

    అర్ధరాత్రి  గంటలకు గవర్నర్‌ విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు అబ్దుల్‌ నజీర్‌ కడుపులో నొప్పి బాధపడ్డారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

    YS Jagan: త్వరగా కోలుకోవాలి

     

  • తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దళిత గళ సమ్మేళన సమావేశం జరుగుతుంది. ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

    Tadepalli: దళిత గళ సమ్మేళనం

     

Family

  • వివాహం, పిల్లలు కనడం గురించి ఇటీవల కొందరు ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు యువత కెరీర్‌, మంచిగా సెటిల్‌ అవ్వడమే ప్రధానం అనుకునేవాళ్లను ప్లీజ్‌ అలా ఆలోచించద్దు అని బతిమాలుతున్నారు. ఫ్యామిలీ లైఫ్‌కే ప్రాధాన్యత ఇవ్వండని వేడుకుంటున్నారు. ఆ దిశగా ఆలోచించేలా ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు సింగపూర్‌ మాజీ ప్రధాని సైతం సలహలిస్తుండటం విశేషం. అందుకు సంబధించిన వీడియోని షేర్‌ చేస్తూ ప్రముఖ టెక్‌ దిగ్గజం జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు కూడా ఆయన మాటలకే మద్దతిస్తూ యువతకు చక్కటి సందేశం ఇచ్చారు.

    శ్రీధర్‌ వెంబు షేర్‌ చేసిన ఎక్స్‌ పోస్ట్‌లో సింగపూర్ మాజీ ప్రధాని లీ క్వాన్ యూ యువతకు సలహాలిస్తున్నారు. ప్లీజ్‌ వివాహాన్ని, కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చెయ్యొద్దు అని ఒక పీహెచ్‌డీ విద్యార్థికి సలహా ఇస్తున్నారు. ఆ వీడియోలో లీ ఆమె విద్యా ప్రణాళికలను ప్రశ్నిస్తూ, కుటుంబ నిర్ణయాలను వాయిదా వేయకూడదని సూచిస్తున్నారు. మాజీ ప్రధాని లీ ఆ విద్యార్థిని వ్యక్తిగత విద్యా జీవితం గురించి వరుసగా ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. ఆమెకు పెళ్లయిందా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా, పీహెచ్‌డీ ఎప్పుడు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే ప్రశ్నిస్తారు. 

    ఆమె సుమారు రెండేళ్లలో పీహెచ్‌డీ పూర్తి చేస్తుందని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ విద్యార్తి నేరుగా సలహా ఇచ్చారు. “దయచేసి సమయాన్ని వృధా చేయకండి. కుటుంబ జీవితం మీ పీహెచ్‌డీ కంటే ముఖ్యమైనది. సంతృప్తినిచ్చే జీవితం కూడా. మీకు ఇదే నా శుభాకాంక్షలు నీకు పీహెచ్‌డీ, మంచి బాయ్‌ఫ్రెండ్‌ దొరకాలని ఆశిస్తున్నా అంటూ లీ ముగించారు. ఆ వీడియో గురించి ప్రస్తావిస్తూ..శ్రీధర్‌ వెంబు తన ప్రారంభ సంవత్సరాల నుంచి లీ జీవితాన్ని సునిశితంగా పరిశీలించానని అన్నారు. ఆయనపై తనకు ప్రగాఢమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. 

    తాను ఇటీవల సంభాషణలలో ఇలాంటి సలహానే ఇచ్చానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేట్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన, ఎలాన్ మస్క్ తరచుగా పంచుకునే అభిప్రాయాలను ప్రతిధ్వనించారు. ఉన్నత ఆశయాలున్న మహిళలు తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే, పిల్లలను కనేలా ప్లాన్‌ చేసుకోవలని చెబుతున్నారు శ్రీధర్‌వెంబు. మన సమాజ సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణాలు సర్దుబాటు కావాలంటే కుటుంబ వ్యవస్థ ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. కాగా, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న సామాజిక ప్రాధాన్యతల కారణంగా చాలామంది వ్యక్తులు వివాహాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆలస్యం చేస్తున్నారు. 

    తీరా కెరీర్‌లో సెటిల్‌ అయ్యాక..సంతానం కలుగక నరకం చూస్తున్నారు. అదే సమయంలో గతకాలంటే గణనీయంగా జననరేటు తగ్గిపోతోంది. దాంతో పలువురు వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తరాలను ఆ దిశగా ఆలోచించేలా సలహాలు సూచనలతో మేల్కొలుపుతున్నారు. 

     

    (చదవండి: ఆ బేకరీకి వెళ్తే..ఎవ్వరైనా సైలెంట్‌ అవ్వాల్సిందే!)
     

  • ఎన్నో పర్యాటనలకు వెళ్తుంటాం. కొన్ని ప్రదేశాలు, అక్కడ చూసిన బ్యూటీఫుల్‌ స్పాట్‌లు మదిలో అలా నిలిచిపోతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ పర్యాటక ప్రదేశంలోని బేకరీ స్టాల్‌. ఇక్కడకు వెళ్తే..ఎవ్వరైన నిశబ్దంగా మారి..చిరునవ్వులు చిందిస్తుంటారు. ఎందుకంటే..

    నేపాల్‌లో ఒక బదిర దంపతులు నడుపుతున్న బేకరీ ఇది. అక్కడ నేపాల్‌లో అందమైన ప్రదేశాలన్ని తిలకించాక లాంట్‌టాంగ్‌ లోయ వద్దకు చేరుకునే యాత్రికులకు మధుమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది ఈ బేకరి. అక్కడే ఈ బదిర దంపడుతు 'పీస్‌ఫుల్ బేకరీ', ఉంది. పర్వతాల మధ్య నెలకొన్న ఈ బేకరీ బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌ కంటే ఇంత అందమైన జ్ఞాపకంగా మార్చిన దంపతులకే క్రెడిట్‌ మొత్తం ఇవ్వలి. సైగలతో మాట్లాడే ఆతిధ్యం మనల్ని కట్టిపడేయేగా, అక్కడ మనం చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాం. ఎక్కడకు వెళ్లినా ఇంతలా నవ్వే ఛాన్స్‌ లేదన్నట్లుగా ఆ దంపతులు తమ ఆప్యాయత, ప్రేమతో నవ్విస్తుంటారు. 

    ఈ బేకరీలో ఆపిల్‌ మోమో(ఆపిల్‌ పైస్‌) అత్యంత రుచికరమైన వంటకంగా గూగుల్‌ రివ్యూలు చెబుతున్నాయి. చాలామంది సందర్శకులు పర్వత ట్రెక్కింగ్‌ తర్వాత తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈ వంటకాన్ని రుచిచూసే ‍ప్రయత్నం చేస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యాక దీనికి మరింత క్రేజ్‌ వచ్చింది. 

    ఎలా చేరుకోవాలంటే..
    నేపాల్‌లో ఈ బేకరీని సందర్శించాలనుకుంటే.. కాఠ్మండు నుంచి ఏడు గంటల బస్సు ప్రయాణం, ఆ తర్వాత పర్వతాలలో రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడకు వెళ్లడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది. రైలు పట్టాల పక్కన ఉన్న ఒక మనోహరమైన చిన్న ప్రదేశం వద్ద ఈ బేకరీ ఉంటుంది. 

    వారు సైగ భాషలోనే అద్భుతమైన ఆతిథ్యం అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అస్సలు మిస్‌ కాకండి మరి..అయినా ఏ పర్యాటకంలోనైనా అత్యంత మధురమైన స్మృతులు అక్కడ కలిసిన వ్యక్తులేనని ఈ బేకరీ సందర్శన గుర్తు చేస్తుంది అని చెబుతున్నారు చాలామంది పర్యాటకులు.

     

    (చదవండి: పెరుగు అన్నం vs లెమన్‌ రైస్‌: ఈ సమ్మర్‌లో డయాబెటిస్‌ రోగులకు ఏది మంచిదంటే..)
     

  • విజ‌య‌వాడ‌ గొల్లపూడికి  చెందిన 35 సంవత్సరాల చందు ఉదయాన్నే నిద్రలేవగానే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తొలుత సమీపంలోని ఆస్పత్రికి, అనంతరం విజయవాడలోని గుండె ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

    విజ‌య‌వాడ లబ్బీపేటకు చెందిన రమేష్‌ వయసు 40 సంవత్సరాలు. ఇటీవల వేకువ జామున 4 గంటలకు ఛాతీలో నొప్పిగా  ఉందని చెప్పాడు. గ్యాస్‌ నొప్పిగా భావించి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. మళ్లీ 6 గంటలకు ఛాతీలో పెయిన్‌ ప్రారంభమైంది. దీంతో తమ ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.  

    ఇలా వీరిద్దరే కాదు.. గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. వాకింగ్‌ చేస్తూ... క్లాస్‌రూమ్‌ లో పాఠాలు వింటూ... కుప్పకూలి మరణిస్తున్న వారిని నిత్యం చూస్తున్నాం. ప్రస్తుతం  అతిపెద్ద కిల్లర్‌గా గుండెపోటు మారిందని వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. గుండెపోటు మరణాలను నివారించాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. జీవనశైలిని మార్పు చేసుకోవడంతో పాటు, ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా గుండెపోటు మరణాలను నివారించవచ్చునని వైద్యులు అంటున్నారు. ఉరుకుల పరుగుల జీవనంలో వత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా అవసరం అంటున్నారు.  

    గుండెపోటుకు కారణాలివే... 
    ∙ వయస్సు రీత్యా వచ్చే గుండెపోటు, ఇవి 45 ఏళ్లు నిండిన వారికి వస్తుంటాయి.  
    ∙ రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఉన్న వారు 40 ఏళ్ల లోపు గుండె పోటుకు గురవుతున్నారు. అందుకు కారణాలిలా ఉన్నాయి.  
    ∙ ఫ్యామిలీ(తల్లి, తండ్రి) గుండెపోటుకు గురైన వారు ఉండటం
    ∙ స్మోకింగ్‌ చేయడం 
    ∙ కోవిడ్‌  ప్రభావం 
    ∙ పుట్టుకతోనే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ఉండటం 
    ∙ ప్రొటీన్‌ డెఫిషియన్సీ  
    ∙ జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక కొలస్ట్రాల్, ఒబెసిటీ రావడం  

    ముందస్తుగా ఏమి చేయాలి... 
    ∙ ప్రతి ఒక్కరూ 40 ఏళ్లు దాటిన తర్వాత సీటీ యాంజియో చేయించుకోవడం ద్వారా గుండె రక్తనాళాల్లోని బ్లాక్‌లను గుర్తించవచ్చు.  
    ∙ రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఉన్న వారు వయస్సుతో సంబంధం లేకుండా వైద్యుల సూచన మేరకు సీటీ యాంజియో చేయించుకోవాలి 
    ∙ రక్తపోటు, మధుమేహం ఉన్న వారు వాటిని అదుపులో ఉంచుకుంటూ, కొల్రస్టాల్‌ మందులు రెగ్యులర్‌గా వాడాలి.  

    వ్యక్తిగత జాగ్రత్తలు 
    ∙ వత్తిడిని తగ్గించుకోవాలి. మంచి నిద్రపోవాలి 
    ∙ స్మోకింగ్‌ అలవాటు ఉంటే మానుకోవాలి 
    ∙ ఆహారపు అలవాట్లను మార్పుకోవాలి 
    ∙ నాన్‌ వెజ్‌ వంటకాలు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది 
    ∙ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి  

    మధుమేహమూ కారణమే...  
    మధుమేహం అదుపులో లేని వారు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. మెదడు, పాదాలకు రక్త ప్రసరణ సరిగా లేని శరీర తత్వం ఉన్న వారిలో గుండె రక్తప్రసరణలోనూ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు గుండె, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటం, క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో పాటు, అధిక రక్తపోటు, కొలస్ట్రాల్‌లను మెరుగ్గా నియంత్రించుకోవాలి.  

    వాకింగ్‌తో బ్లాక్స్‌కు చెక్‌ 
    ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వాకింగ్‌ చేయడం ద్వారా రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడకుండా చూడవచ్చునని వైద్యులు చెపుతున్నారు. వాకింగ్‌ చేసే వారిలో రక్తనాళాల్లోని కొల్రస్టాల్‌ బ్లాక్స్‌ పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ముఖ్యంగా మధుమేహుల్లో రక్తనాళాలు సన్నబడి రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, వాకింగ్‌ చేస్తే అలాంటి సమస్యలు రావంటున్నారు. మొత్తంగా రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో 5 రోజులు వాకింగ్‌ చేస్తే రక్తనాళాల్లో బ్లాక్స్‌ రాకుండా చూడటంతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చునంటున్నారు.  

    ముందస్తు పరీక్షలతో మేలు 
    40 ఏళ్లు నిండిన వారు గుండె రక్తనాళాల్లోని బ్లాక్స్‌ను నిర్ధారించేందుకు సీటీ యాంజియో చేయించుకుంటే మంచిది. ఆరోగ్యకర జీవన విధానం, వత్తిళ్లను తగ్గించుకోవడం, ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్‌గా వాకింగ్‌ చేయడం ద్వారా గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. స్మోకింగ్‌ చేసే వారిలో, కోవిడ్‌ ప్రభావం ఉన్న వారిలో చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.  
    – డాక్టర్‌  కృష్ణచంద్‌ కాగిత, కార్డియాలజిస్ట్,సెంటినీ, విజయవాడ  

  • డయబెటిస్‌ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా మితంగా అన్నం తినడమే మేలు అని వైద్యులు సూచిస్తుంటారు. అందులోనూ మన భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉండే రైస్‌ని తక్కువగా, కూర ఎక్కువగా కలుపుకుని తినమని చెబుతుంటారు. పైగా ఇలాంటి హాట్‌ సమ్మర్‌లో ప్రజలంతా తేలికపాటి వంటకాల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా పెరుగన్నం, నిమ్మకాయ పులిహార వంటి తేలికపాటి వంటకాలనే తరుచుగా చేసుకుంటారు. మరి రైస్‌ కంటెంట్‌ తక్కువగా తీసుకోవాల్సిన మధుమేహ రోగులకు మరి ఇవి మంచివేనా అంటే..

    మరి ఈ రెండు వంటకాలలోని పోషక విలువలు వేరువేరుగా పరిశీలించి ఏది తీసుకోవడం మంచిదో పోషకాహార నిపుణులు మాటల్లో తెలుసుకుందామా..!.

    అన్నం తింటే చక్కెర స్థాయిలు పెరగడానికి రీజన్‌..
    రైస్‌ రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతుందంటే..శుద్ధి చేసిన తెల్ల బియ్యం రకాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంటుందని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, కాబట్టి వైద్యులు డయాబెటిస్‌ పేషెంట్లను అన్నం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంటారు.

    పెరుగు అన్నం..
    పెరుగు, అన్నంతో పాటు రకరకాల మసాలాలు, కరివేపాకు కలిపి తయారు చేస్తారు. ఇది రుచిని జోడించడమే కాకుండా,  రక్తంలో చక్కెరను పెంచే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. వేడి తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇది చాలా అనువైనది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకునే పోషకమైన ఆహారం.

    దీని తయారీలో సాదా అన్నాన్ని పెరుగుతో కలుపుతారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి.  ఇది కార్బోహైడ్రేట్ల శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అన్నంలో పెరుగు కలపడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వంపై దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ఇది మెదడుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్‌, మెరుగైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వేసవి వేడికి చక్కటి ఉపశమనం కూడా. అలాగే గ్లూకోజ్‌ ప్రతిస్పందనను స్థిరీకరిస్తుంది కూడా. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఇది బెస్ట్‌ ఆహారం.

    నిమ్మకాయ పులిహోర(లెమన్‌ రైస్‌)
    ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది, అందువల్ల ఇది ఇతర వేసవి ఆహారాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని తయారీకి ఉపయోగించే నూనె, వేరుశెనగలు మరియు ఆవాలు కలపడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత మెరుగుపడుతుంది.

    ఏది మంచిదంటే..

    పెరుగు అన్నం సాధారణంగా భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, కాబట్టి దానిని ఎలా తీసుకుంటే మంచిదనే దానిపై అవగాహన అవసరం.  నియంత్రించుకోవడం అవసరం.

    నిమ్మకాయ అన్నం  ఇందులో ఉపయోగించే నూనె పరిమాణంపై ఆధారపడి ఉంటుంది , అలాగే తినే పరిమాణం కూడా అత్యంత ముఖ్యం.

    రోజులోని సమయం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగతంగా గ్లూకోజ్ తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆ రెండింటిని తీసుకునే పరిమాణం అనేది అత్యంత ప్రధానం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.  

    తీపిలేని పెరుగు, మిగతా కూరగాయలు జోడించి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. 

    ఇక నిమ్మకాయ పులిహోరలో వేరుశెనగలు తక్కువగా వేసుకుంటూ..మిగతా కూరగాయలు జోడిస్తే ఇది కూడా మధుమేహ రోగులకు మంచి బలవర్ధకమైన ఆహరమే అవుతుంది. 

    ఇవి రెండూ కూడా డయాబెటిస్‌ రోగులకు మంచివే గానీ చేసే విధానం, పరిమాణం వంటి ఆధారంగానే  మంచి ప్రయోజనాలను పొందగలరని వైద్యులు చెబుతున్నారు. 

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..)
     

Crime

  • న్యూఢిల్లీ: ఓ వ్యక్తి 31 ఏళ్ల క్రితం ఓ బాలుడిని హత్య చేశాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అతడు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... నిందితుడి పేరు సలీమ్ ఖాన్. కొన్నేళ్లుగా సలీమ్ వాస్తిక్ పేరుతో జీవిస్తున్నాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతూ పేరు తెచ‍్చుకున్నాడు. ‘ఎక్స్ ముస్లిం’గా తనను తాను ప్రచారం చేసుకున్నాడు.

    గత నెల ఘాజియాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు సలీమ్ వాస్తిక్‌పై అతని ఇంట్లో కత్తితో దాడి చేశారు. సలీమ్‌ నాస్తిక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో సలీమ్ వాస్తిక్‌ గురించి పోలీసులు ఆరా తీశారు. దీంతో అతడు పేరు మార్చుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సలీమ్ వాస్తిక్‌ పాత రికార్డులు, వేలిముద్రలు, ఫొటోలను పోలీసులు పరిశీలించారు. అతడు పాత నేరస్తుడని తేల్చారు. అతడికి కిడ్నాప్, దోపిడి కోసం బెదిరింపులు, హత్య ఆరోపణలపై తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష విధించారని తేల్చారు.

    1995లో బాలుడి కిడ్నాప్‌, హత్య 
    ఈ హత్య కేసు 1995, జనవరి 20కి సంబంధించినది. సిమెంట్ వ్యాపారవేత్త కుమారుడు సందీప్ బన్సాల్ ఢిల్లీలో పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబం ఎంతగా వెతికినా అతడి కనుగొనలేకపోయింది. మరుసటి రోజు వ్యాపారవేత్తకు ఫోన్ కాల్ వచ్చింది. అతని కుమారుడిని అపహరించామని, సురక్షితంగా విడుదల చేయాలంటే రూ.30,000 డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేశారు. ఫ్లైఓవర్ సమీపంలో బస్సులో డబ్బు పెట్టాలని, పోలీసులకు సమాచారం ఇస్తే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు. కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    దర్యాప్తు సమయంలో ఆ వ్యాపారవేత్త పొరుగింటి వ్యక్తి కీలక సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు ‘మాస్టర్‌జీ’ అనే పొడవైన యువకుడితో ఆటోరిక్షాలో వెళ్తున్నట్లు తాను చూశానని తెలిపాడు. దీంతో పోలీసులు సలీమ్ ఖాన్ (ప్రస్తుతం సలీమ్ వాస్తిక్)ను గుర్తించారు. అతను దర్యాగంజ్‌లోని రామ్‌జాస్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. అతను నేరాన్ని ఒప్పుకొని ముస్తఫాబాద్‌లోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి మృతదేహం లభించింది.

    వాస్తిక్‌కు సహకరించిన అనిల్ అనే వ్యక్తికి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్, గడియారం స్వాధీనం చేసుకొని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు. 1997 ఆగస్టు 5న కర్కర్డూమా కోర్టు సలీమ్ ఖాన్ (అలియాస్ సలీమ్ వాస్తిక్) అనిల్‌ను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 2000, నవంబర్ 24న సలీమ్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. తర్వాత అతడు పరారయ్యాడు. సలీమ్ ఆ తర్వాత సలీమ్ వాస్తిక్, సలీమ్ అహ్మద్ పేర్లతో జీవించాడు.

    తదుపరి 26 సంవత్సరాలు హరియాణాలోని కర్నాల్, అంబాలా ప్రాంతాల్లో దాక్కొని వార్డ్రోబ్ తయారీ పనులు చేశాడు. తర్వాత 2010లో ఘాజియాబాద్ లోని ఓ ప్రాంతానికి మారి మహిళల దుస్తుల దుకాణం ప్రారంభించాడు. సలీమ్ సామాజిక కార్యకర్తగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఉగ్రవాదం, మత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలతో ప్రసిద్ధి చెందాడు.

    జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అతని జీవితం ఆధారంగా ఒక బాలీవుడ్ నిర్మాత బయోపిక్ తీసేందుకు నిర్ణయించాడు. ప్రాజెక్ట్ కోసం రూ.1.5 మిలియన్ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభంకాక ముందే ఇది జరగకముందే సలీమ్ అరెస్ట్ అయ్యాడు.

Cartoon