Archive Page | Sakshi
Sakshi News home page

International

  • లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూపులే ల‌క్ష్యంగా ఇజ్రాయెల్ మ‌రోసారి విరుచుకుప‌డింది. లెబనాన్‌ తూర్పు ప్రాంతమైన బెకా వ్యాలీపై శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.  మృతుల్లో హిజ్బుల్లాకు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి కూడా ఉన్నట్లు భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.

    2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఇదే అతి పెద్ద దాడి అని అంత‌ర్జాతీయ మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే హిజ్బుల్లా నుండి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

    అదేవిధంగా దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ సమీపంలో ఉన్న 'ఐన్ అల్-హిల్వే' అనే పాలస్తీనా శరణార్థి శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. అక్కడ హమాస్ కమాండ్ సెంటర్ ఉందనే కార‌ణంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. కానీ హమాస్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది. అది కేవలం భద్రతను పర్యవేక్షించే జాయింట్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్రమని హమాస్ స్పష్టం చేసింది.

  • అత్యంత కఠినమైన సంప్రదాయాలు, ఆచారాలకు పేరొందిన అరబ్‌ దేశాలు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఉదారవాద విధానాల వైపు మారడం ప్రారంభమై..గత కొంత కాలంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ట్రెండ్‌లో ముందున్న దుబాయ్‌... ఇప్పటికే ప్రపంచ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. ఈ నేపధ్యంలో దుబాయ్‌కి సమీపంలోనే ఉన్న రస్‌ ఆల్‌ ఖైమా లో ఏర్పాటవుతున్న క్యాసినో ఆ ప్రాంత పర్యాటక సంప్రదాయాలను పునర్నిర్వచించనుంది.
     

    క్యాసినో అంటే ప్రధానంగా జూదకేంద్రాలు అనేది తెలిసిందే. ప్రపంచంలో పలు దేశాల్లో ఇవి విజయవంతంగా నడుస్తున్నప్పటికీ చాలా దేశాల్లో అనుమతులు లేవు. మన దేశంలో సైతం కేవలం గోవాలో అది కూడా సముద్రజలాలపై తప్ప మరెక్కడా వీటి నిర్వహణకు అవకాశం లేదు. ఈ నేపధ్యంలో అత్యంత కఠినమైన సంప్రదాయాలకు పేరొందిన అరబ్‌ దేశాల్లో తొలి క్యాసినో  పరిచయం కానుండడం ప్రపంచ పర్యాటకంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 5.1 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ రిసార్ట్‌ అయిన విన్‌ అల్‌ మార్జన్‌ ఐలాండ్‌ ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రస్‌ అల్‌ ఖైమా లో ఏర్పాటవుతోంది. తద్వారా ప్రపంచ పర్యాటక రంగంలో ఒక పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది.
     

    దుబాయ్‌ నుంచి 50 మైళ్ల లోపు దూరంలో ఉన్న 60 హెక్టార్ల మానవ నిర్మిత ద్వీపంలో  ఈ రిసార్ట్‌ నిర్మితమైంది. ఇది అరేబియన్‌ గల్ఫ్‌ కంటే 70 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. పూర్తి విలాసవంతంగా రూపొందిన ఈ రిసార్ట్‌లో మొత్తం 1,530 గదులు  సూట్‌లు, పై అంతస్తులలో బోటిక్‌ హోటల్, ఇందులోని ‘ఎన్ క్లేవ్‌‘లో 313 అల్ట్రా–లగ్జరీ బస సౌకర్యం ఉంటుంది. మొత్తం 20,900 చదరపు మీటర్ల క్యాసినో 22వ అంతస్తులో రెండవ గేమింగ్‌ ప్లేస్, వాటర్‌ గేమ్స్‌ కోసం డీప్‌–వాటర్‌ మెరీనాలు ఉంటాయి.
    విన్‌ అల్‌ మార్జన్‌ ద్వీపంలో 22 రెస్టారెంట్లు, లాంజ్‌లు కూడా ఉంటాయి.

    వీటిలో చెఫ్‌ అలైన్‌ డుకాస్‌ రూపొందించిన ఫ్రెంచ్‌–అమెరికన్‌ స్టీక్‌హౌస్‌  ప్రఖ్యాత లాస్‌ వెగాస్‌ సప్పర్‌ క్లబ్‌ అయిన డెలిలా లు ఉన్నాయి.  ఫైవ్‌–స్టార్‌ స్పా, లగ్జరీ రిటైల్‌ ప్రొమెనేడ్, థియేటర్, నైట్‌క్లబ్‌  7,700 చదరపు మీటర్ల ఈవెంట్స్‌ సెంటర్‌ ఉన్నాయి.షెడ్యూల్‌ ప్రకారం దీని నిర్మాణం చకచకా పురోగమిస్తోంది,గత 2025 చివరి నాటికి దాదాపుగా 90శాతం పనులు పూర్తి కాగా, మరో ఏడాది అంటే 2027లో ఇది ప్రారంభానికి నోచుకుంటుందని అంచనా. ప్రారంభం తర్వాత  ఈ రిసార్ట్‌ రస్‌ అల్‌ ఖైమా ప్రొఫైల్‌ను పెంచుతుందని, సంపన్నులైన పర్యాటకులను, సందర్శకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

    అలాగే యుఎఇ ఆర్థిక  వృద్ధి బాటలో వైవిధ్యాన్ని సృష్టించడానికి, ప్రపంచ క్యాసినో గమ్యస్థానాలతో పోటీ పడటానికి ఈ ఎడారి ‘ఆటల వేదిక’ సిద్ధమవుతోంది.  ఈ విన్‌ అల్‌ మార్జన్‌ ద్వీపం పర్యాటకం,  వినోదం పట్ల అరబ్‌ ప్రాంతపు సంప్రదాయ విధానాన్ని పునర్నిర్వచించడం  గల్ఫ్‌లో  ఆతిథ్య పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా పర్యాటక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని పది నుంచి ప‌దిహేను శాతంకు పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కాగా శుక్ర‌వారం ఆయా దేశాల‌పై ట్రంప్ విధించిన గ్లోబుల్ టారిఫ్‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. 

    దీంతో ధ‌ర్మాసనం తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. సెక్షన్ 122 కింద కొత్తగా 10 శాతం గ్లోబల్ టారిఫ్‌ను విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవార‌మే ట్రంప్‌ సంతకాలు చేశారు. అయితే ట్రంప్‌ త‌న నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. గరిష్టంగా 15 శాతం వరకు పెంచుతున్న‌ట్లు శ‌నివారం ప్ర‌క‌టించారు.

    "ప్ర‌పంచ దేశాల‌పై విధిస్తున్న 10% సుంకాన్ని 15%కి పెంచాలని నిర్ణ‌యించాను. ఇది త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి రానుంది. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయి. రాబోయో కొద్ది నెలల్లో చ‌ట్ట‌బ‌ద్దంగా అనుమ‌తించ‌ద‌గిన టారిఫ్‌ల‌ను అమ‌ల్లోకి తీసుకు రానున్నాను" అని  ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

    కాగా సెక్షన్ 122 ప్ర‌కారం.. అమెరికా ప్రెసెడెంట్ గరిష్టంగా 15 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఈ సుంకాలు 150 రోజుల వరకు అమలులో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తప్పనిసరి
     

  • ఇరాన్, అమెరికా వార్ టెన్షన్ రోజురోజుకూ పెరుగుతుంది. ఏక్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో ఉన్న విదేశీ పౌరుల కోసం ఆ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సెర్బియా, స్వీడన్  దేశాలు ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి.

    ప్రస్తుతం ఇరాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వచ్చే రెండువారాల్లోగా  అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇది వరకే ట్రంప్ అమెరికా నావికాదళాన్ని ఇరాన్ కు సమీపంలో మోహరించిన సంగతి తెలిసిందే. ఏదైనా తేడాలొస్తే ఏ క్షణానైనా దాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీంతో ఇరాన్ లోని తమ దేశ పౌరుల కోసం ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. వారిని వెనక్కి రావాల్సిందిగా  ఆదేశాలు ఇస్తున్నాయి. 

    సెర్బియా దేశం ఈ విషయంలో తమ దేశ  పౌరులకు స్పష్టమైన ఆ దేశాలు ఇచ్చింది. ఇరాన్ లో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నందున తమ దేశ పౌరులెవరూ అక్కడి వెళ్లకూడదని ఆదేశించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న వారు వీలైనంత త్వరగా ఇరాన్ ని వదలాలని అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా స్వీడన్ సైతం తమ దేశస్థులు వీలైనంత త్వరగా ఇరాన్ ని వీడాలని తెలిపింది. బల్కాన్ కంట్రీ గత నెలలోనే ఆ దేశ పౌరులు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది.

    ఇదిలా ఉండగా తాజాగా ఆక్సియోస్ (Axios) నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్‌ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు ఆక్సియోస్ నివేదిక ప్రచురించింది. దీంతో ఈఅంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు ఏ జరగనుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

  • ఒక పెద్ద గ్రహశకలం భూమికి చేరువగా వస్తోందని నాసా (NASA) ఒక హెచ్చరిక జారీ చేసింది. ఈ శిల కొన్ని గంటల్లో భూమిని సమీపిస్తుందని భావిస్తున్నారు. దీనికి ఆస్టరాయిడ్ (గ్రహశకలం)2025 YU15 అని పేరు పెట్టారు. దీని వెడల్పు 410 అడుగులు.  NASA JPL దాని పరిమాణాన్ని ఒక పెద్ద భవనంతో పోల్చింది. దీని వల్ల ఎలాంటి ముప్పు ఉంది?

    ఈ ఆస్టరాయిడ్‌ను 2025లో  గుర్తించారు. ఇది  ఫిబ్రవరి 21న భూమికి దగ్గరగా వస్తుందనీ, ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, భూమికి , ఆస్టరాయిడ్ మధ్య దూరం 5.89 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నాసా చెప్పింది. భూమికి చేరువగా వస్తున్న ఆస్టరాయిడ్ 2025 YU15 ను శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి కొంత సమీపం నుండే వెళ్తున్నప్పటికీ, దీని దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వారు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ, వీటిని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. గ్రహాల గురుత్వాకర్షణ శక్తి వల్ల వీటి కక్ష్యలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు వీటి పట్ల అప్రమత్తంగా ఉంటారు.

    ఇది గంటకు 21,306 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు, ఇది 36,60,000 మైళ్ల దూరంలో ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ దూరం తక్కువే అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆస్టరాయిడ్ 2025 YU15 'అటెన్' (Aten) సమూహానికి చెందినది. ఈ తరహా గ్రహశకలాలు భూమి కక్ష్యను దాటుతుంటాయి.

    ఆస్టరాయిడ్ 2025 YU15 వల్ల ముప్పు ఉందా?
    దీనివల్ల తక్షణ ముప్పు ఏమీ లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదకరమైన వస్తువులను గుర్తించడానికి నాసా కొన్ని కఠినమైన నిబంధనలను పాటిస్తుంది. ఏదైనా గ్రహశకలం భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల లోపు ఉండి, 85 మీటర్లకుమించి వెడల్పు ఉంటేనే దానిని ప్రమాదకరమైనదిగా భావిస్తారు. అందువల్ల, ఆస్టరాయిడ్ 2025 YU15 ప్రయాణం సురక్షితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్‌ వీడియోలు

    భారత్ ,అంతర్జాతీయ సంస్థలు ఎందుకు గమనిస్తున్నాయి?
    భారతదేశం కూడా గ్రహశకలాల పరిశోధనలో తన పట్టును పెంచుకుంటోంది. ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భారీ గ్రహశకలాలను దగ్గరగా అధ్యయనం చేయడంపై భారత్ దృష్టి సారించింది. ముఖ్యంగా 2029లో భూమికి దగ్గరగా రానున్న 'అపోఫిస్' (Apophis) గ్రహశకలంపై పరిశోధనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నాసా,ఈఎస్ఏ (ESA), జాక్సా (JAXA) వంటి సంస్థలతో భారత్ సహకరించనుంది. భవిష్యత్తులో గ్రహశకలాలపై ల్యాండింగ్ చేసే ప్రయత్నాలు కూడా జరగవచ్చు.

    నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రకారం, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి చాలా శక్తివంతమైనది, అది సెకనుకు 9.8 మీటర్ల వేగంతో ఒక వస్తువును లాగగలదు. కొన్నిసార్లు, ఉల్కలు కూడా భూమి వైపుకు లాగబడతాయి. గ్రహశకలాలు , ఉల్కలు రెండూ భూమిపై పడితే హానికరం కావచ్చు.అందుకే ఖగోళ సైంటిస్టులు దీన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు. 

    ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం
     

  • రెంకా:  చిలీ రాజధాని సాంటియాగోలోని రెంకా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లిక్విఫైడ్ గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ట్రక్ నియంత్రణ కోల్పోయి రహదారిపై బోల్తా పడింది. దీని ధాటికి  భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో 50 వాహనాలు దగ్ధమయ్యాయి.  ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయాలయ్యాయి. 

    సాంటియాగోలోని రెంకా హైవేపై రూట్‌ నంబర్‌-5 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ట్రక్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి సేఫ్టీ బ్యారియర్లను ఢీకొట్టడం వల్ల వాహనం తిరగబడింది, దాంతో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా పొగతోకమ్ముకుంది. మరొకవైపు హైవేపై ట్రాఫిక్‌ భారీగానిలిచిపోయింది. చిలీలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 

     

  • ఢాకా: బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా గడవక ముందే భారత్- బంగ్లా సంబంధాల్లో కీలక పురోగతి ఏర్పడింది. ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది డిసెంబర్ లో నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.

    భారత్, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు గత రెండేళ్లుగా తీవ్రంగా క్షీణించిన సంగతి తెలిసిందే. షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిన నాటి నుంచి  బంగ్లాదేశ్ భారత్ పై తీవ్ర అక్కసు వెల్లగక్కింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయి. అంతేకాకుంగా ఆ దేశంలోనే మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. దీంతో గతేడాది డిసెంబర్ లో భారత్ అదే విధంగా బంగ్లా పరస్పరం వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఇటీవలే అక్కడ ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారం చేపట్టడం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ తారిఖ్ రెహ్మాన్ అభినందనలు చెప్పి భారత్ రావాల్సిందిగా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత చల్లారినట్లయింది.

    అయితే బంగ్లాదేశ్ సైతం భారత్ తో స్నేహం హస్తం కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయులకు నిలిపివేసిన వీసా సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్న శుక్రవారం  ఆ దేశ హైమిషనరేట్ కార్యాలయం భారత్ కు వీసాల నిలిపివేతను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యాటక, మెడికల్, బిజినెస్, వర్క్ లతో పాటు ఇతరాత్ర వీసాలకు సంబంధించి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీంతో భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పడానికి తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలుస్తోంది.

    అయితే ఇదివరకే ఈ అంశంలో భారత్ సానుకూలంగా స్పందించింది.  సిల్హెట్‌లోని భారత సీనియర్ కాన్సులెట్ అధికారి అనిరుద్ధ దాస్ మాట్లాడుతూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని అన్నారు. దీనిపై బంగ్లాదేశ్ సైతం పాజిటివ్ గా స్పందించడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

  • ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. అయితే అరుదైన వ్యాధితో  చనిపోవడానికి ముందు తన ఇద్దరు కుమార్తెలు (బిల్లీ, జార్జియా) కోసం రాసిన భావోద్వేగపూరితమైన సందేశం నెట్టింట వైరల్‌గా మారింది.  ఈ సందేశాన్ని విన్న తరువాత కన్నీళ్లు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

    ఎరిక్ డేన్ తన జీవితంలోని ఒడిదుడుకులు, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసవ్వడం, డిప్రెషన్ వంటి సమస్యల నుండి కోలుకున్న తర్వాత ‘‘లెటర్స్ టు మై డాటర్స్" (Letters to My Daughters) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా తీవ్రమైన భావోద్వేగంతో  తన ఇద్దరు కుమార్తెలకు  కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, తమకు తాము నిజాయితీగా ఉండాలని  కోరారు. తాను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు, కానీ నా తప్పుల నుండి పాఠాలు నేర్చుకున్నానన్నారు. తన పిల్లలు కూడా తప్పులు చేయడానికి భయపడ కూడదని హితవు పలికారు. తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని, వారి ఎదుగుదలలో తండ్రిగా గర్వపడతానని చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు. లోకం ఏమనుకున్నా సరే, తమ స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని ఆయన వారికి సూచించారు.

    కన్నీళ్లు పెట్టించే ఎరిక్‌డేన్‌ ఏమోషనల్‌ మెసేజ్‌ 
    ‘‘వర్తమానంలో జీవించండి.ఇప్పుడే, ఈ క్షణమే. మీ దగ్గర ఉన్నదల్లా ఈ వర్తమానమే. దానిని నిధిలా దాచుకోండి. ప్రతి క్షణాన్ని ప్రేమగా ఆస్వాదించండి. ప్రేమలో పడండి. అది కేవలం ఒక వ్యక్తితో  కాకపోవచ్చు (అది కూడా మంచిదే అనుకోండి). కానీ ఏదో ఒక దానితో ప్రేమలో పడండి. మీ అభిరుచిని, మీ సంతోషాన్ని వెతుక్కోండి. మిమ్మల్ని ఉదయాన్నే నిద్రలేపేలా చేసే, రోజంతా ఉత్సాహంగా నడిపించే ఒక లక్ష్యాన్ని కనుగొనండి. అమ్మ, మీరు ఎన్నో ప్రదేశాలు చూశాం. ఎన్నో బీచ్‌ల్లో గంటల తరబడి సంతోషంగా గడిపాం.​ ఆ క్షణాలు ఎప్పటికీ నాతోనే.

    స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ మనస్తత్వానికి తగ్గ వ్యక్తులను వెతకండి, వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉండండి. ఆపై వారికి అంకితమవ్వండి. ఎటువంటి తీర్పులు, షరతులు, ప్రశ్నలు ఉండని నిజమైన స్నేహితులు మీకు తిరిగి అంతే ప్రేమను ఇస్తారు. మీ స్నేహితుల్ని ప్రేమించండి.వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తారు..నవ్విస్తారు. సాయం చేస్తారు..మార్గనిర్దేశం  చేస్తారు. కొంతమంది మిమ్మల్ని కాపాడతారు.

    మీలోని ప్రతి అణువుతో, ఆత్మగౌరవంతో పోరాడండి. మీకు అనారోగ్యం లేదా మరేదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, పోరాడండి. ఎప్పుడూ వెనకడుగు వేయకండి. మీ చివరి శ్వాస వరకు పోరాడండి. ఈ వ్యాధి నా శరీరాన్ని నెమ్మదిగా హరిస్తోంది కావొచ్చు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయ లేదు.

    మీరు దేనినైనా ఎదుర్కోగలరని, మీ జీవితం ముగిసిపోవచ్చని, నరకాన్ని కూడా గౌరవంగా ఎదుర్కోగలరని నేను నిరూపించానని ఆశిస్తున్నాను. మై డియర్‌  బిల్లీ, జార్జియా, మీరే నా హృదయం, మీరే నా సర్వస్వం. తలెత్తుకుని పోరాడండి. శుభరాత్రి. ఐ లవ్‌ యూ’’ అంటూ ఇచ్చిన సందేశం ఆయన మరణం తరువాత విడుదలైంది. ఇది  పలువురి చేత కంటతడి పెట్టిస్తోంది.

     మరోవైపు  డేన్‌ స్నేహితులు , మద్దతుదారులు  ALS తో పోరాడుతూ మరణించిన డేన్ భార్య రెబెక్కా, ఇద్దరు టీనేజ్ కుమార్తెలు, బిల్లీ, జార్జియా కోసం GoFundMe ప్రచారం ప్రారంభించారు. లాస్ ఏంజిల్స్‌లోని "ఫ్రెండ్స్ ఆఫ్ ది డేన్ ఫ్యామిలీ"  ‘ఇన్ హానర్ ఆఫ్ ఎరిక్ డేన్’ అనే పేరుతో ఈ ప్రచారానికి భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు  రూ.1.07 కోట్లనిధులను సేకరించారు.  మొత్తం 2.27 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

    కాగా అమెరికన్ టీవీ సిరీస్ గ్రేస్ అనాటమీ (Grey's Anatomy) లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు  పొందిన ఎరిక్ డేన్ 53  ఏళ్లకే  (2026 ఫిబ్రవరి 19న) చనిపోవడంతో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనేది  ప్రొగ్రెసివ్‌ న్యూరోడీజెనరేటివ్ వ్యాధి.ప్రస్తుతం దీనికి చికిత్స లేదు.

    తన మరణానికి ముందు, ఎరిక్ డేన్ తాను మరణించిన తర్వాతే ఈ విషయం ప్రపంచంతో పంచుకుంటాడనే అవగాహనతో ఇంటర్వ్యూ ఇచ్చారు. ALS తో తన పోరాటం, వ్యసనంతో తన పోరాటాలు, రెబెక్కా గేహార్ట్‌తో  ప్రేమతదితర విషయాలు పంచుకున్నాడు. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

     

  • అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని టార్గెట్‌ చేసి హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా ఆక్సియోస్(Axios) నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

    అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌​కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్‌ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు రెడీగా కూడా ఉంది. ఇరాన్‌కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్‌కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి.

    ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖమేనీ గురించిన సంచలన విషయాలను బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది. అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    మరోవైపు.. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ల సలహాదారులు, అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు.  ఇక, ఓ వైపు ఇరాన్‌తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది.

Movies

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  

    థియేటర్స్‌ రన్ విజయవంతమైన తర్వాత ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో కూడా ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. జీ తెలుగు వారు ఈ ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 కి ప్రసారం కానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. జీ సంస్థ ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులు కూడా సొంతం చేసుకుంది. 

    మరి ఈ సినిమా బుల్లితెరపై ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం  అందించగా సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు. 

  • టాలీవుడ్‌లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ప్రస్తుతం 'ప్యారడైజ్'తో బిజీగా ఉన్నాడు. మరోవైపు 'ఓజీ' సుజీత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని లైన్‌లో ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న నాని.. ఇప్పుడు ఓ బోల్‌ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.

    (ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)

    పలు హిందీ చిత్రాల్లో నటించిన తృప్తి దిమ్రికి.. సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' మూవీ ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్‌లో వరస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగా తీస్తున్న 'స్పిరిట్'లో ప్రభాస్‌కి జోడీగా చేస్తోంది. మరి మెయిన్ లీడ్ లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇదలా ఉండగానే ఇప్పుడు నాని చేయబోయే ఓ మూవీ కోసం తృప్తిని హీరోయిన్‌గా అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి.. టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావొచ్చు.

    గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌పై దృష్టి పెట్టిన నాని.. అందుకు తగ్గట్లే బాలీవుడ్‌లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న 'ప్యారడైజ్'లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యూయెల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో ఎంత నిజముందో?

    (ఇదీ చదవండి: 18 ఏళ్లప్పుడు రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా)

  • 'కేజీఎఫ్' పేరు చెప్పగానే ప్రశాంత్ నీల్, యష్‌తో పాటు రవి బస్రూర్ అనే పేరు కూడా కచ్చితంగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈయన ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. తర్వాత 'సలార్' పలు చిత్రాలకు సంగీతమందించి బాగానే పేరు తెచ్చుకున్నాడు. దక్షిణాదిలోని ఇతర భాషల్లోనూ పనిచేస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన చేసిన లేటెస్ట్ తెలుగు మూవీ 'కల్ట్'. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. తాజాగా టీజర్ లాంచ్ జరగ్గా.. ఈ వేడుకలో పాల్గొన్న రవి బస్రూర్ తన గతం గురించి మరోసారి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

    (ఇదీ చదవండి: గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విశ్వక్‌.. రవి బస్రూర్‌ ఎమోషనల్‌)

    'విశ్వక్ సేన్ ప్రవర్తనకు ఫిదా అయిపోయా. 25 ఏళ్లుగా సంగీతమందిస్తున్నాను. అందరూ నన్నే గుర్తిసే విశ్వక్.. నా జర్నీని గుర్తించారు. ఇతడి కోసం నేనెప్పుడూ ఉంటాను. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. రెండోసారి ఓ వ్యక్తి నన్ను కాపాడాడు. నాకు కీ బోర్డ్ కొనివ్వడంతో పాటు రూ.35 వేలు ఇచ్చాడు. ఆయన పేరు రవి. అందుకే నా పేరు ముందు ఆయన పేరుని జోడించాను' అని రవి బస్రూర్ చెప్పుకొచ్చాడు.

    గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడిన రవి బస్రూర్.. తన అసలు పేరు కిరణ్ అని, కానీ రవి బస్రూర్ అని పిలిస్తే చాలా సంతోషిస్తానని అన్నాడు. ఎనిమిదో తరగతిలో ఫెయిల్ అయిన తనని ప్రశాంత్ నీల్ నమ్మి అవకాశమిచ్చాడని, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని కూడా చెప్పుకొచ్చాడు. రవి బస్రూర్ సంగీత దర్శకుడు అయినప్పటికీ.. బంగార ఆభరణాలు తయారు చేసే వృత్తి కూడా నేర్చుకున్నాడు. లాక్‌డౌన్ టైంలో ఈ పనిచేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

    (ఇదీ చదవండి: ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు)

  • పెళ్లి సీజన్ హడావుడి.. అందంగా ప్రగ్యా జైస్వాల్

    వీకెండ్ పార్టీ మూడ్‪‌లో బిగ్‌బాస్ రీతూ చౌదరి

    జాకెట్ లేకుండా పోజులిచ్చిన ఊర్వశి రౌతేలా

    పసుపు చీరలో ముద్దుగుమ్మలా ప్రియాంక మోహన్

    జిమ్‌లో కష్టపడిపోతున్న హీరోయిన్ నందితా శ్వేత

    'డ్రాగన్' జ్ఞాపకాలని పంచుకున్న కాయదు లోహర్

  • రియాలిటీ షోలంటే జనాలకు భలే ఇష్టం. రీల్‌ లైఫ్‌లో సెలబ్రిటీలను చూసి ఆరాధించే ప్రేక్షకులు వారు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని తెగ తహతహలాడుతుంటారు. అందుకేగా బిగ్‌బాస్‌ షో అనేక భాషల్లో ఫేమస్‌ అయింది. బిగ్‌బాస్‌ తరహాలోనే హిందీలో ఇటీవల ద 50 అనే షో కూడా మొదలైంది. ఇప్పుడు తెలుగులో ఒక కపుల్‌ షో రాబోతోంది. అదే మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. ది అల్టిమేట్‌ టెస్ట్‌ ఆఫ్‌ లవ్‌ అనేది క్యాప్షన్‌.

    10 జంటలు - 70 రోజులు
    ఈ షోలో సెలబ్రిటీ జంటలు మాత్రమే పాల్గొననున్నారు. అందులో పెళ్లయినవాళ్లున్నారు. పెళ్లి చేసుకోకుండా డేటింగ్‌లో ఉన్నవారూ ఉన్నారు. 10 సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజులపాటు ఉండనున్నారు. ఈ జంటల మధ్య ప్రేమ, రొమాన్స్‌, డ్రామా.. ఇలా అన్ని ఎమోషన్స్‌ చూపించనున్నారు. షో నిర్వాహకులు పెట్టే ప్రేమ పరీక్షలను వీరు ఎలా దాటుతారు? అన్నది ఆసక్తికరంగా ఉండనుంది.

    ఆ జంటలెవరంటే?
    ప్రస్తుతం సోషల్‌మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఆ 10 జంటలెవరో ఓసారి చూసేద్దాం.. అమర్‌దీప్‌- తేజు, హరిత- హరీశ్‌, ప్రియాంక- శివకుమార్‌, అంజలి - పవన్‌ సంతోష్‌, నటరాజ్‌ మాస్టర్‌- నీతూ, సోనియా సింగ్‌- సిద్ధు, జబర్దస్త్‌ నూకరాజు- ఆసియా, సాండ్రా- మహేశ్‌బాబు, వాసంతి - పవన్‌ కల్యాణ్‌, శుభశ్రీ రాయగురు- అజయ్‌.

    అప్పుడే ప్రారంభం?
    వీరిలో అమర్‌దీప్‌, హరీశ్‌ (మాస్క్‌ మ్యాన్‌), ప్రియాంక జైన్‌, నటరాజ్‌ మాస్టర్‌, వాసంతి కృష్ణన్‌, శుభశ్రీ.. వీళ్లందరూ బిగ్‌బాస్‌ ద్వారా బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరైనవారే! మార్చి 2వ వారంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌లో ఈ షో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో వచ్చిన బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష బాగానే హిట్టయింది. మరి మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి!

     

     

  • సినిమా ప్రమోషన్లలో హడావుడి చేసే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అప్పట్లో రకరకాలుగా రచ్చ చేసి హాట్ టాపిక్ అయ్యేవాడు. గత రెండు మూడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టేసరికి సైలైంట్ అయిపోయాడు. గతవారం రిలీజైన 'ఫంకీ' కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంతలోనే మరో కొత్త మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ చాలా హడావుడి చేసేశాడు. బోలెడన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.

    'నేను ట్విటర్, రెడిట్‌లో జనాలు ఏం కోరుకుంటున్నారు. ఏం మిస్ అవుతున్నారనేది చదివా. అవన్నీ కలిపి ఓ మిక్సర్‌లో కొట్టి 'కల్ట్' తీశాను. 'ఫలక్‌నుమా దాస్' తీసిన దానికి 10 రెట్లు కసిగా తీశాను' అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలానే టీజర్ చూసి.. చాలామంది దీన్ని 'స్క్విడ్ గేమ్', నాని 'హిట్ 3'తో పోల్చారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన విశ్వక్.. ఈ స్టోరీని నాలుగేళ్లుగా రాస్తున్నాను. హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్'ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను గతంలో దర్శకత్వం వహించిన వాటిలా స్క్రాచ్ నుంచి రాశాను అని అన్నాడు.

    (ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)

    అలానే ఈ సినిమాకు కుటుంబాలు, పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూవీ చూస్తే, సూపర్ రా నువ్వు అని నన‍్ను మెచ్చుకుంటారు. ఇక 'ఫంకీ' ఫలితం గురించి ప్రశ్న రాగా.. ఎవడు ఏమనుకున్నా 'ఫంకీ' నాకు హిట్టే, నేనో గొప్ప మూవీ చేశాననని విశ్వక్ పేర్కొన్నాడు. 'ఆవేశం' చిత్రంలోలా మూవీ మొదలైన 45 నిమిషాల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 'కల్ట్' టైటిల్ నిర్మాత ఎస్కేఎన్‌ది కదా? అని ఓ రిపోర్టర్, విశ్వక్‌ని అడగ్గా.. నాకు తెలియదు సార్. నేను అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా. ఇది ఎప్పటికి నాదే అని బదులిచ్చాడు.

    'కల్ట్' చిత్రంలో చాలామంది పలువురు కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశాడు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందించాడు. బహుశా ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రావొచ్చేమో?

    (ఇదీ చదవండి: గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విశ్వక్‌.. రవి బస్రూర్‌ ఎమోషనల్‌)

  • టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ చిత్ర టీజర్ గ్రాండ్‌గా విడుదలైంది. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    టీజర్ విడుదల చేసిన అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "పూర్వాజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమాలోని కొన్ని సీక్వెన్స్ చూశాను, చాలా బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను కలిపి చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా జ్యోతి గారి ట్రాన్స్‌ఫర్మేషన్ తోపాటు యాక్షన్ సీన్స్ షాకింగ్‌గా ఉన్నాయి. రియల్ లైఫ్ భార్యాభర్తలు రీల్ లైఫ్‌లో ఎలా మెప్పించారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది," అని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

    దర్శక-నిర్మాత పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే గొప్ప మనసుతో టీజర్‌ను లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన పాజిటివిటీ తమ టీమ్‌లో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

  • హీరో విశ్వక్‌సేన్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన లైలా, ఈయేడు ఫిబ్రవరిలో వచ్చిన ఫంకీ.. రెండు చిత్రాలు తీవ్ర నిరాశపర్చాయి. దీంతో ఈసారి తన డైరెక్షన్‌లోనే ఓ సినిమా చేశాడు. అదే కల్ట్‌. శనివారం నాడు ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

    కల్ట్‌ టీజర్‌ రిలీజ్‌
    టీజర్‌ ఫుల్‌ వయొలెంట్‌గా ఉంది. కల్ట్‌ అనే చోటుకు వెళ్లిన వారందరికీ లోపల ఉన్న ఒక బొమ్మ గేమ్స్‌ పెడుతోంది. అందులో ఓడిపోయినవారు గేమ్‌లోనే కాదు ఏకంగా ఈ భూమిపై నుంచే ఎలిమినేట్‌ అవుతారు. స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌ను గుర్తు చేస్తున్న ఈ మూవీకి తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్‌ రాయగా, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు. అతడి మ్యూజిక్‌కు ఫిదా అయిన విశ్వక్‌సేన్‌ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఊహించని బహుమతి ఇచ్చాడు. 

    ఖరీదైన కానుక
    విశ్వక్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్‌ భాస్కర్‌ అయితే మరో కన్ను రవి బస్రూర్‌ సర్‌. ఇంత మంచి మ్యూజిక్‌ నా మూవీకి దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలాంటిది నాకు మంచి మ్యూజిక్‌ అందించారు. అందుకు కృతజ్ఞతగా రోలెక్స్‌ గోల్డ్‌ వాచ్‌ బహుమతిగా ఇస్తున్నాను. ఇది నా ఫేవరెట్‌ గిఫ్ట్‌. ఎందుకంటే ఇది నేను రెండేళ్లు వెయిట్‌ చేసి మరీ తెప్పించుకున్న వాచ్‌. మళ్లీ నేనెప్పుడైనా సినిమా చేయమని అడిగితే ఈ వాచ్‌ చూసైనా ఓకే చేయాలి అన్నాడు. ఆ వెంటనే వాచ్‌ను రవి బస్రూర్‌ చేతికి తొడిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు.

    రవి బస్రూర్‌ ఎమోషనల్‌
    అనంతరం రవి బస్రూర్‌ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఎల్లప్పుడూ మంచి సంగీతం అందించాలనే కృషి చేస్తూ వచ్చాను. ఇన్నేళ్లకాలంలో ఒకడు నాలోని అసలైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ను గుర్తించాడు. ఇది కేవలం వాచ్‌ కాదు, సంగీత దర్శకులకు దక్కిన గౌరవం అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను. 

    చివరి శ్వాస వరకు..
    ఈ జీవితమే నాకు వద్దని చనిపోదామనుకున్నాను. రెండుసార్లు ఎలాగోలా బతికేశాను. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీబోర్డు కొనుక్కోమని రూ.35 వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటినుంచి నా పేరు రవి బస్రూర్‌గా మారింది. చివరి శ్వాస వరకు ఈ పేరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ నా జర్నీని, ప్రతిభను గుర్తించాడు. అతడిని కూడా ఎన్నటికీ మర్చిపోలేను అని రవి బస్రూర్‌ ఎమోషనలయ్యాడు.

    కల్ట్‌ టీజర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

  • హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయినా సరే వరస వివాదాలతో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్. ఈ నెల ప్రారంభంలో 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఇదొక సినిమా ఉందని కూడా తెలియనంతగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీని రిలీజ్ టైంలోనే 'గుంజీ గుంజీ' అనే బూతు పాట పాడి వివాదానికి కారణమయ్యాడు. ఓ జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.

    ఇప్పటికీ తాను ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదని చెప్పిన చంద్రహాస్.. అప్పట్లో ఏ మాత్రం కోపం వచ్చినా సరే ఎవరనేది చూడకుండా చేయెత్తి కొట్టేసేవాడినని చెప్పుకొచ్చాడు. అలానే ప్రదీప్ రంగనాథన్ తీసిన 'డ్రాగన్' సినిమా తన బయోపిక్ అని అన్నాడు. అందులో చూపించినట్లే.. తాను కూడా నిజజీవితంలో చివరి సెమిస్టర్‌లో ఒకేసారి 26 సబ్జెక్టులు క్లియర్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

    (ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)

    అప్పట్లో తన తండ్రి స్పైడర్ మ్యాన్ డ్రస్ కొనిస్తే.. దాన్ని వేసుకుని కింద ఇంటిలో ఉన్న పిల్లలకు చూపిస్తే.. డ్రస్ వేసుకుంటే సరిపోదు. స్పైడర్ మ్యాన్‌లా ఎగరాలి అని చెప్పేసరికి రెండో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశానని కూడా చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. అవకాశం లభిస్తే దర్శకులతో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాతో పనిచేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    చంద్రహాస్ విషయానికొస్తే టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు. తొలుత 'రామ్‌నగర్ బన్నీ' అనే మూవీ చేశాడు. 2024లో ఇది థియేటర్లలోకి వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీని ప్రమోషన్ల టైంలోనే కాస్త వింతగా ప్రవర్తించడం, మాట్లాడటంతో యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. ఈ పేరుని తనకు ట్యాగ్‌గా పెట్టేసుకున్న చంద్రహాస్.. తొలి రెండు మూవీస్‌కి అదే ట్యాగ్ వేసుకోవడం విశేషం.

    (ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • కోర్ట్‌ జంట శ్రీదేవి -రోషన్‌ మరోసారి జతగా కలిసి నటించిన చిత్రం బ్యాండ్‌ మేళం. ఈసారి వీళ్లిద్దరూ బావమరదళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఈ మూవీ నుంచి ఊహించని గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. అందులో ప్రేమ కబుర్లు ఉంటాయనుకుంటే హీరో బ్రేకప్‌ బాధలో మునిగి తేలుతుంటాడు.

    ఫ్రెండ్‌ మెడలో తాళి కట్టిన హీరో
    'తాళి కట్టుడు కలిసుండటం కోసమే అయితే.. మధ్యలో విడిచిపెట్టి పోయిన దానికి కాదురా, చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్న వీడికి కట్టాలిరా' అంటూ స్నేహితుడి మెడలో మూడు ముళ్లు వేస్తాడు హీరో. ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సీన్‌ చూసిన ఓ వ్యక్తి హీరోను లెస్బియన్‌ అనుకున్నాడట! ఈ విషయాన్ని బ్యాండ్‌ మేళం నిర్మాత కోన వెంకట్‌ తాజాగా వెల్లడించాడు.

    గే లవ్‌ స్టోరీయా?
    శనివారం నాడు బ్యాండ్‌ మేళం నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేసిన సందర్భంగా కోన వెంకట్‌ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. వాలంటైన్స్‌ గ్లింప్స్‌ చూశాక నాకో ఫన్నీ మెసేజ్‌ వచ్చింది. గే లవ్‌స్టోరీని తెరపై తీసుకొస్తున్నందుకు థాంక్యూ సర్‌ అని ఓ అబ్బాయి మెసేజ్‌ పెట్టాడు. అది చూసి షాకైపోయాను. 

    ఎమోషనల్‌గా ఫీలయ్యా..
    ఓహో.. మగవాడు మగవాడికి తాళి కట్టాడు కాబట్టి, వాళ్లిద్దరూ కాపురం చేసుకుంటారు, బెడ్‌రూమ్‌లో పాల గ్లాసు పట్టుకెళ్తాడు అనుకున్నట్లున్నాడు! చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. బాబూ, ఇది గే లవ్‌స్టోరీ కాదు. మనసును తాకే లవ్‌ స్టోరీ. ఫన్‌తో పాటు ఎమోషన్స్‌ కూడా ఈ మూవీలో ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన బ్యాండ్‌ మేళం మార్చి 13న విడుదల కానుంది.

    చదవండి: మీ వల్లే ఇలా బతుకుతున్నా.. ఏడ్చేసిన వరలక్ష్మి

  • గతవారం 'ఫంకీ' సినిమాతో వచ్చిన విశ్వక్ సేన్.. ఘోరమైన ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఊహించిన దానికంటే ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇంతలోనే మరో మూవీతో వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?)

    టీజర్ బట్టి చూస్తే ఓ ముగ్గురు కుర్రాళ్లు.. గోవాకి వెళ్తారు. కానీ పబ్‌లోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు. దీంతో 'కల్ట్' అనే చోటుకి వెళ్తారు. ఈ గేమ్‌లో భాగంగా స్క్రీన్ పై ఓ బొమ్మ కనిపిస్తుంది. లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఫెయిలైన వాళ్లు ఎలిమినేట్ అవుతుంటారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే చంపేయడం. మరి ఈ 'కల్ట్' సంగతేంటి? ఇందులో విశ్వక్ పాత్ర ఏంటనేది తెలియాలంటే ట్రైలర్, మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ చూడగానే చాలామంది 'స్క్విడ్ గేమ్' సిరీస్ గుర్తుకురావడం గ్యారంటీ. ఎందుకంటే అందులోనూ ఇలానే గేమ్‌లో ఎలిమినేట్ అయితే చంపేస్తుంటారు.

    (ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి. ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి, రాధిక, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వరలక్ష్మి సైతం కీలక పాత్ర పోషించింది. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో వరలక్ష్మి భావోద్వేగానికి లోనైంది. 

    నన్ను క్షమించండి
    ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల నా గొంతు పోయింది. అందుకు నన్ను క్షమించండి. మేము ఒక మంచి సినిమా తీశాం. మీరు ఇచ్చిన సపోర్ట్‌ వల్లే నేను ఇన్నిరోజులుగా ఇండస్ట్రీలో బతుకుతున్నాను. ఇప్పుడు దర్శకురాలిగా లాంచ్‌ అయ్యాను. మీ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా సినిమా తీశాం. నిర్మాత బన్నీ వాసు సినిమా చూసి బాగుందన్నారు. ఆయన నోటినుంచి ఆ మాట వినగానే నేను సక్సెస్‌ అయిపోయా అనిపించింది.

    ఎమోషనలైన వరలక్ష్మి
    గోపీచంద్‌ మలినేని సర్‌ నా ఫ్రెండ్‌, గురువు, మెంటార్‌. ఆయనే నన్ను తెలుగులో రీలాంచ్‌ చేశారు. ఆయన వల్లే నేనీరోజు ఇక్కడ ఉన్నాను. థాంక్యూ సోమచ్‌ సర్‌. ఇది నాకు సెకండ్‌ లైఫ్‌. ఎక్కువ టెన్షన్స్‌ వల్ల ఎమోషనల్‌ అవుతున్నాను అంటూ వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఏడ్చేసింది. నేను అంత ఈజీగా ఎమోషనల్‌ అవను. కానీ ఎప్పుడో ఒకసారి మనసారా ఏడ్చేయడం తప్పేం కాదు. 

    అందుకోసమే ఈ పోరాటం
    ఒకమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పోరాడుతున్న ప్రతి మహిళ కోసం నేను పోరాడుతున్నాను. ఇండస్ట్రీలో మహిళలు ఎదిగేందుకు సహకరించండి అని వరలక్ష్మి శరత్‌కుమార్‌ చెప్పుకొచ్చింది. కోలీవుడ్‌ సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కూతురైన వరలక్ష్మి... హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది. 

    ఆ సినిమాతోనే గుర్తింపు
    గోపీచంద్‌ మలినేని డైరెక్ట్‌ చేసిన తెలుగు మూవీ క్రాక్‌లో జయమ్మగా నటించింది. ఈ మూవీ సూపర్‌ హిట్‌ అవడంతో వరలక్ష్మికి తెలుగులో ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు టాలీవుడ్‌లో గుర్తింపునిచ్చిన గోపీచంద్‌ మలినేనిని సరస్వతి ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా ఆహ్వానించి అతడిపై ప్రశంసలు కురిపించింది.

    చదవండి: అదే చివరి సినిమా అనుకున్నా: బాలీవుడ్‌ నటుడు

  • టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్‌కు ఈ వేసవి కాలం కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారబోతోంది. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు 'స్వయంభు', 'నాగబంధం' అనే రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైన కథా నేపథ్యాలతో రూపొందడం విశేషం. స్వయంభులో 'సుందరవల్లి' అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో నభా కనిపించబోతోంది. నాగబంధంలో 'పార్వతి' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది.

    ఒకే సీజన్‌లో ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలు విడుదల కావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రాల టీజర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

    నభా నటేష్ ఈ చిత్రాల విజయంపై పూర్తి ధీమాతో ఉంది. కంటెంట్ కనుక ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే, ఈ సమ్మర్ తర్వాత ఆమె స్టార్ ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. మొత్తానికి, ఈ సమ్మర్ నభా నటేష్ పర్ఫార్మెన్స్‌తో థియేటర్లు కళకళలాడబోతున్నాయి.

  • హీరోయిన్ రష్మిక.. రాబోయే ఓ కొత్త సినిమాలో స్వలింగ సంపర్కరాలిగా నటించనుందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమా కాదా అనేది సదరు మూవీ రిలీజైతే కానీ తెలియదు. అయితే దీనికంటే ముందే ఇప్పుడు ఇదే తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఓ హిందీ చిత్రం.. నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇదివరకే స్ట్రీమింగ్ తేదీ ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ సినిమా.. 'చథా పచ్చ తెలుగు రివ్యూ)

    ప్రముఖ నటి కొంకనా సేన్, 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభ రత్న ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అక్యూజ్డ్'. నెట్‌ఫ్లిక్స్ సొంతంగా నిర్మించిన ఈ చిత్రం.. సదరు ఓటీటీలోకే వచ్చే శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇందులో లీడ్ పెయిర్.. లెస్బియన్ కపుల్ పాత్రల్లో నటించడం విశేషం. ఇదో హాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది.

    విదేశాల్లో జీవించే ప్రధాన పాత్రధారుల్లో ఒకరు(కొంకనా సేన్).. ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఈమెపై షాకింగ్ ఆరోపణలు వస్తాయి. ఆస్పత్రిలోని చాలామంది లైంగికంగా వేధిస్తుందని రూమర్స్ బయటకొస్తాయి. దీంతో ఈమె రిలేషన్‌లోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. చివరకు ఏమైంది? నిజంగానే సదరు డాక్టర్ అలాంటిదేనా? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ సినిమాని భారతీయ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి? ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్)

  • ఈ వీకెండ్ థియేటర్లలోకి పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ సుహాస్ హీరోగా చేసిన 'హే బలవంత్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారిక నంబర్స్ వదిలారు. ఎన్ని కోట్లు వచ్చాయనేది పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?

    (ఇదీ చదవండి: ‘హే బల్‌వంత్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

    గతవారం రిలీజైన వాటిలో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఈ వారం 'హే బలవంత్' ఆ బాధ్యత తీసుకుంది. ఇది కాకుండా మరో రెండు మూడు విడుదలైనప్పటికీ వాటికి పాజిటివ్ టాక్ రాలేదు. ఇకపోతే సుహాస్, శివానీ నాగారం, నరేశ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'హే బలవంత్' చిత్రానికి ముందురోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న(ఫిబ్రవరి 20) థియేటర్లలోకి వచ్చింది. అలా తొలిరోజు రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. సుహాస్ గత చిత్రంతో పోలిస్తే ఇది చాలా బెటర్. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశముంది.

    'హే బలవంత్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కృష్ణ(సుహాసన్), తండ్రి బలవంత్(నరేశ్), నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ.. ఆయన బిజినెస్ టేకోవర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి తొలుత వద్దని చెప్పినప్పటికీ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వల్లే ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దాని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ధురంధర్‌.. ఆ సీన్‌ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్‌)

  • కొన్ని సినిమాలు కెరీర్‌నే మలుపు తిప్పుతాయి. బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీకి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ అలాంటి సినిమానే! హీరో సంజయ్‌ దత్‌కు రైట్‌ హ్యాండ్‌గా ఉంటూ తన కామెడీ టైమింగ్‌, డైలాగులతో కడుపుబ్బా నవ్విస్తాడు. వీరి కాంబినేషన్‌ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలామంది కన్నార్పకుండా చూస్తుంటారు. 

    ఎంతిస్తే అంత చాలనుకున్నా..
    ఈ మూవీ తన కెరీర్‌లోనే టర్నింగ్‌ పాయింట్‌ అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ. తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. మున్నా భాయ్‌ సినిమాకంటే ముందు నేను పెద్దగా సంపాదించిందంటూ ఏమీ లేదు. ఎంతిస్తే అంత చాలనుకుని సినిమాలు చేసుకుంటూ పోయాను తప్ప ఎన్నడూ మంచి పారితోషికం కోసం గొడవపడలేదు. మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ రిలీజయ్యాక కరోజు దర్శకనిర్మాత విపుల్‌ షా నాకు ఫోన్‌ చేశాడు. 

    మున్నా భాయ్‌ MBBS మూవీలో ఒక దృశ్యం

    రెమ్యునరేషన్‌ రూ.1 కోటి
    ఇక మీదట నువ్వు చేసే సినిమాలకు రూ.1 కోటి కంటే ఒక్క రూపాయి తక్కువ తీసుకున్నా నిన్ను ఊరికే వదిలిపెట్టను. నీ టాలెంట్‌ నీకు తెలియట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు? అని క్లాస్‌ పీకాడు. అప్పుడు నా మేనేజర్‌తో ఎవరైనా అడిగితే నా రెమ్యునరేషన్‌ కోటి రూపాయలు అని చెప్పమన్నాను. అప్పటినుంచే నాకు కొంచెం ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. నిజానికి మున్నాభాయ్‌ సినిమా ఆఫర్‌ నాకంటే ముందు చాలామందికి వెళ్లింది. నేను కూడా మంచి పొజిషన్‌లో ఉంటే రిజెక్ట్‌ చేసేవాడినేమో!

    చివరి సినిమా అనుకున్నా..
    ఇదే నా చివరి సినిమా అవుతుందనుకున్నాను. ఎందుకంటే మళ్లీ గూండాలా నటించమనే ఆఫర్లు వస్తాయి.. వాటిని చేయడం నావల్ల కాదని డిసైడయ్యాను. అనూహ్యంగా సినిమాకు మంచి స్పందన లభించింది. నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది అని అర్షద్‌ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌కు రీమేక్‌గా తెలుగులో శంకర్‌దాదా MBBS తెరకెక్కగా ఇక్కడ కూడా ఘన విజయం అందుకుంది.

    చదవండి: కూతురు పుట్టిన ఏడాదికి పాప ఫోటో షేర్‌ చేసిన అంబటి అర్జున్‌

  • సీరియల్‌ నటుడు, తెలుగు బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి గతేడాది తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అర్జున్‌- సురేఖ దంపతులు 2025 జనవరి 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కూతురికి అర్ఖ అని నామకరణం చేశారు. తన పేరులోని ఆర్‌.. సురేఖ పేరులోని ఖ అక్షరాలు తీసుకుని అర్ఖ అని వచ్చేలా పేరు పెట్టామని వెల్లడించాడు.

    తొలిసారి కూతురి ఫోటో
    అయితే పాప ఫోటోలు మాత్రం వీరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయలేదు. తాజాగా అర్జున్‌- సురేఖ దంపతులు తమ ఏడో పెళ్లిరోజు సందర్భంగా ఫ్యామిలీ ఫోటోను షేర్‌ చేశారు. అందులో వారి కూతురి ముఖాన్ని తొలిసారి చూపించారు. ఇక సురేఖ భర్త గురించి చెప్తూ ఎమోషనలైంది. ఏడేళ్ల క్రితం.. మేము జీవితాంతం కలిసుండాలని, ఒకరి చేయి మరొకరు వడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాం. 

    మాకెంతో స్పెషల్‌
    కష్టాలు, సంతోషాలు, పాఠాలు.. ఇలా అన్నింటిలో ఒకరికొరం తోడుగా నిలిచి బలంగా ఎదిగాము. మా ప్రేమకు ప్రతిరూపం, మా జీవితంలో అత్యంత మధురమైన అధ్యాయం మా కూతురు అర్ఖ. ఇద్దరం నుంచి ముగ్గురంగా మారిన మా ప్రయాణం ఎంతో అపురూపమైనది. ఈ ఫోటో మాకెంతో స్పెషల్‌. ఎందుకంటే మా చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న తొలి ఫోటో ఇదే!

    జీవితాంతం కలిసిమెలిసుండాలి
    నాకు భాగస్వామిగా ఉన్నందుకు, అండగా నిలబడినందుకు, నా కూతురికి ప్రేమగల తండ్రిగా ఉన్నందుకు థాంక్యూ అర్జున్‌. మనం ఇలాగే జీవితాంతం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మధురమైన పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని రాసుకొచ్చింది.

    బిగ్‌బాస్‌తో గుర్తింపు
    తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతడితోపాటు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వెనువెంటనే ఎలిమినేట్‌ అయిపోయారు. కానీ, అర్జున్‌ మాత్రం కడవరకు నిలబడ్డాడు. టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు. గ్రాండ్‌ ఫినాలేలో టాప్‌ 6లో చోటు దక్కించుకున్నాడు.

     

     

    చదవండి: 

  • తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్‌ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్‌’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.

    ‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్‌ నుంచి క్యాబ్‌లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్‌లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌ సడెన్‌గా రూట్‌ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్‌కట్‌’ అని డ్రైవర్‌ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది. 

    ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్‌ డ్రైవర్‌ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్‌ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్‌ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్‌ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్‌ వయసున్న నా కూతురితో  ఉన్నాను. మర్యాదగా మెయిన్‌ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్‌ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు. 

    బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్‌, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. 

    ‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్‌ ఈ ఫ్లవర్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు.  ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. 

Sports

  • టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శ‌నివారం కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు త‌లో పాయింట్ ల‌భించింది. షెడ్యూల్ ప్ర‌కారం సాయంత్రం 6:30 గంట‌ల‌కు టాస్ ప‌డింది.

    అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. 

    అయితే మొద‌టి మ్యాచే ర‌ద్దు కావ‌డంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జ‌ట్లు క‌చ్చితంగా గెల‌వాల్సిందే. న్యూజిలాండ్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో బుధ‌వారం శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది. పాక్ విష‌యానికి వ‌స్తే ఫిబ్ర‌వ‌రి 24న ఇంగ్లండ్‌తో ఆడ‌నుంది.
     

  • న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆసియా కప్‌ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

    గ్రూప్‌ ‘సి’లో ఉన్న భారత్‌ మార్చి 4న పెర్త్‌లో వియత్నాంతో తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఆ తర్వాత మార్చి 7న జపాన్‌తో, మార్చి 10న చైనీస్‌ తైపీతో టీమిండియా పోటీపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకునే నాలుగు జట్లు 2027 ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి.  

    ‘స్వర్ణ’ సరిత 
    సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో హైదరాబాద్‌ జిల్లాకు చెందిన బానోత్‌ సరిత మూడు స్వర్ణ పతకాలతో మెరిపించింది. సైబరాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో సరిత పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్మ్‌ రెజ్లింగ్‌ క్రీడాంశాల్లో బరిలోకి దిగి విజేతగా నిలిచింది.

    పవర్‌లిఫ్టింగ్‌లో 63 కేజీల విభాగంలో పోటీపడ్డ సరిత డెడ్‌లిఫ్ట్‌లో 105 కేజీలు, బెంచ్‌ప్రెస్‌లో 40 కేజీలు, స్క్వాట్‌లో 55 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీఐడీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సరిత... గత ఏడాది కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లోనూ రాణించి రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది. 

  • ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పదిహేడు పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

    కాగా మూడు టీ20, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడేందుకు భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో తొలి టీ20లో గెలుపొందిన భారత్‌.. రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.

    స్మృతి మంధాన ధనాధన్‌
    ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 జరిగింది. అడిలైడ్‌ వేదికగా టాస్‌ గెలిచిన హర్మన్‌ సేన.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులతో ఇరగదీయగా.. షఫాలి వర్మ (7) విఫలమైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధ శతకం (59)తో సత్తా చాటగా రిచా ఘోష్‌ 18 పరుగులు చేసింది.

    కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2 పరుగులతో అజేయంగా నిలవగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (1), దీప్తి శర్మ (1) రనౌట్‌ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ రెండు వికెట్లు తీయగా.. కిమ్‌ గార్త్‌, కెప్టెన్‌ సోఫీ మొలినెక్స్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    చెలరేగిన శ్రేయాంక, శ్రీచరణి
    ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు జార్జియా వోల్‌ (10), బెత్‌ మూనీ (6) సహా ఎలిస్‌ పెర్రీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోబే లిచిఫీల్డ్‌ (26) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆష్లే గార్డ్‌నర్‌ హాఫ్‌ సెంచరీ (57) చేసింది. కానీ మిగిలిన వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.

    భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. స్మృతి మంధానకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.

    కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్‌, సౌతాఫ్రికా.

    ప్రతికూల అంశాలు ఇవే
    అయితే, గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) డకౌట్‌ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్‌ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్‌ మార్క్రమ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌లతో కూడిన స్పిన్‌ దళంతో అటాక్‌ చేసే అవకాశం ఉంది.

    వాళ్ల గురించే నా బాధంతా!
    ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.

    అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్‌ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్‌ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్‌ పాండ్యా టాప్‌నకు ప్రమోట్‌ అవుతారు.

    సమస్య లేదు
    నాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారుతూనే ఉంటుంది. రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్‌ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. 

    మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్‌ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.

    చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

  • సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్‌ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు​ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

    అజేయంగా సూపర్‌-8కు
    ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్‌కప్‌-2026లో హాట్‌ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచి సూపర్‌-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్‌-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది.

    ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే
    ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.

    సెమీ ఫైనల్‌.. ఆపై ఫైనల్‌ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. 

    భారత్‌దే ఆధిపత్యం
    కాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్‌ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్‌ పేర్కొనడం గమనార్హం.  కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.

    చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

  • టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రేమలో మునిగితేలుతున్నాడు. భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన ఈ బరోడా క్రికెటర్‌కు మహీక శర్మ రూపంలో కొత్త ప్రేమ దొరికింది. గతేడాది తమ బంధాన్ని బహిర్గతం చేసిన హార్దిక్‌- మహీక అప్పటి నుంచి రొమాంటిక్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను నింపేస్తున్నారు.

    ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణిస్తూ టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న హార్దిక్‌.. ప్రియురాలు మహీక పుట్టినరోజును ఇటీవల ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు.

    నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డే
    పాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం తనతో పాటు మహీకను శ్రీలంకకు తీసుకువెళ్లిన హార్దిక్.. అక్కడ ఓ స్విమింగ్‌ పూల్‌లో ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డే’’ అంటూ విషెస్‌ తెలిపాడు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.

    నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వే. నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని హార్దిక్‌ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రేమను కురిపించాడు. ఇందుకు మహీక శర్మ సైతం తనదైన శైలిలో బదులిచ్చింది. 

    నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనే
    హార్దిక్‌తో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఐ లవ్‌ మై మ్యాన్‌. నా జీవితంలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమైన పుట్టినరోజు. థాంక్యూ బేబీ. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలైన అమ్మాయిని నేనే’’ అంటూ హార్దిక్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.

    కొడుకు సమక్షంలో మరోసారి పెళ్లి
    కాగా సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించిన హార్దిక్‌ పాండ్యా.. 2020లో సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. అదే ఏడాది ఈ జంట కుమారుడు అగస్త్యకు జన్మనిచ్చింది. అనంతరం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే హఠాత్తుగా విడాకుల బాంబు పేల్చారు. 2025 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.

    ఆ తర్వాత కొన్నాళ్లకే మహీకతో 32 ఏళ్ల హార్దిక్‌ తన ప్రేమ బంధాన్ని చాటుకుంటూ విహారయాత్రలలో దిగిన ఫొటోలు షేర్‌ చేయడం మొదలుపెట్టాడు. కాగా మహీక ఫిబ్రవరి 19న 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్‌ ధర అక్షరాలా రెండు లక్షలు ఉండటం గమనార్హం. కాగా మహీక ఓ మోడల్‌ అన్న సంగతి తెలిసిందే. 

    చదవండి: ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!

Andhra Pradesh

  • కడప:  దేశంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేదన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజికవేత్త డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌. ఈ నూతన భారతదేశంలో 20 సెక్లనకి ఒక ఓటు పడుతుందని, మరి అటువంటి అర్థరాత్రి ఒక బూత్‌లో 2 గంటల్లో 490 ఓట్లు పడ్డాయని పునరుద్ఘాటించారు. ‘కూలిపోతున్న ప్రజాస్వామ్యం’  అనే అంశంపై కడపలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఓట్లను ఎలా లెక్కకట్టారో, ఫలితాలు ఎలా ప్రకటిస్తున్నారో తెలియడం లేదన్నారు. 

    ‘2024 లోక్ సభ ఎన్నికల్లో జూన్ 1న 7వ విడత పోలింగ్ జరిగి.. 4వ తేదీ లెక్కింపు జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు..ఇదే ఇప్పటి మన ప్రజాస్వామ్యం. ప్రజలకు మతం అనే మత్తు మందు ఇచ్చిన తర్వాత ఏమి చేసినా కనపడదు. దయచేసి అలవాటు పడకండి...ప్రశ్నించండి.. సహిస్తూ పోతే ఇంకా ఇంకా పెరిగిపోతుంది. మీరు వేసిన ఓటు వేసిన వారికి పడిందో లేదో గ్యారంటీ లేదు. అవి సక్రమంగా లెక్కిస్తున్నారనే గ్యారంటీ లేదు’ అని స్పష్టం చేశారు. 

    ఏపీలో అర్థరాత్రి ఓట్ల మిస్టరీ!

  • గుంటూరు: దేవుని ప్రతిమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్లకు బూట్లు ఉండగానే తీసుకోవడంపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. వినుకొండ ప్రభుత్వ సభలో చంద్రబాబు నాయుడు.. చీఫ్‌ విప్‌ ఆంజనేయుల చేతుల మీదుగా వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందుకున్నారు. ఆ సమయం‍లో చంద్రబాబు కాళ్లకు బూట్లు ఉండటం విమర్శలకు దారి తీసింది. 

    సాధారణంగా దేవుడి ప్రతిమలను తీసుకునేటప్పుడు కాళ్లకు చెప్పులు, బూట్లు వంటి ఉంటే వాటిని తీసేయడం జరుగుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు ఇలా బూట్లు ఉండగానే దేవుని ప్రతిమను అందుకోవడం మరొకసారి చర్చనీయాంశమైంది. ఇది వినుకొండ సభ సాక్షిగా జరిగింది. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు మళ్లీ పాత పాట పాడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇది చోటు చేసుకుంది.  అయితే సెక్యూరిటీ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆంజనేయులు తమ కాళ్లకు ఉన్న బూట్లను తీసేశారు. 

     

  • విజయవాడ: బెజవాడ రోడ్లను వీపీపీకి  ఇచ్చేందుకు విజయవాడ  మున్సిపల్‌ కార్పోరేషన్‌(వీఎంసీ) నిరాకరించింది. విజయవాడ నగర పరిధిలోని రోడ్లను తామే అభివృద్ధి చేయాలని వీఎంసీ నిర్ణయించింది. ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 21వ తేదీ) జరిగిన వీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి వీఎంసీ షాకిచ్చినట్లయ్యింది.

    దీనిలో భాగంగా  విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ 165 అంశాల పై చర్చించాం. విజయవాడలో 19 రోడ్లను పీపీపీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కౌన్సిల్‌లో తిరస్కరించాం. వీఎంసీ పరిధిలో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. పీపీపీ మోడల్‌లో రోడ్లను ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేయడం వల్ల వీఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వీర్యం అవుతుంది. 

    విజయవాడ అభివృద్ధి వీఎంసీ పరిధిలో జరగాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం వీఎంసీకి మెమో ఇవ్వడం దారుణం. వీఎంసీకి కొన్ని అధికారాలున్నాయ్. ప్రభుత్వం వీఎంసీకి ఇచ్చిన మెమోను కౌన్సిల్‌లో తిరస్కరించాం. నాడు నేడు స్కూల్స్‌కు ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  వైఎస్‌ జగన్  హయాంలో అనేక స్కూల్స్ బాగుచేశారు’ అని తెలిపారు.

  • సాక్షి విశాఖపట్నం: భీమిలీలో విషాదం చోటుచేసుకుంది.  స్థానికంగా గల ఒక హోటల్ లో శ్యాం కూమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఉద్యోగి మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం తన ప్రియురాలితో  శ్యాంకుమార్ గొడవపడ్డారు. 

    ఈ నేపథ్యంలో కలత చెందిన తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాంకుమార్ పై హైదరాబాల్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.  అమ్మాయి స్వస్థలం అనకాపల్లి కాగా ప్రియుడు శ్యాంకూమార్ హైదరాబాద్ కు చెందిన వాడిగా పోలీసులు తెలుస్తోంది.

  • రాజమండ్రి:  వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్‌ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. 

    అంబటి కాన్వాయ్‌కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు..  సెక్షన్‌ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్‌ నగర్‌ పోలీసులు.

    కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్‌ను పదే పదే అడ్డుకున్నారు.  ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న  వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. 

    దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు.  

    తన కాన్వాయ్‌ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్‌ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్‌ 30, ఇప్పుడు తాను కాన్వాయ్‌లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. 

  • చిత్తూరు అర్బన్‌: వివాహేతర సంబంధం మోజులో భర్త, అత్తను చంపడానికి ప్లాన్‌ చేసిన కవిత అలియాస్‌ వేలాంగని (37) అనే మహిళను చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గిరింపేటకు చెందిన ఈ మహిళ, ఓ మైనర్‌ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని.. అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపాలని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

     దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది ఆపై ఆమె అత్త గొంతు కోసిన మైనర్‌ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి.. తిరుపతి జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహిళను ఎస్‌ఐ నాగప్ప నాయక్‌ అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు.  

     

  • సాక్షి, బెంగళూరు: ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం (రాజమహేంద్రవరం) కుమారుడి వివాహ వేడుకకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బెంగళూరులోని ది లీలా భారతీయ సిటీ(తిరుమేనహళ్ళి)లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్ఙిత, యశ్వంత్‌‌లను వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు.

    Bengaluru: నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్

     

  • సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్‌లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్‌ సదస్సులో ఎగ్జిబిషన్‌ హాల్‌ నంబర్‌–5 వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.

    వెరీ షేమ్.. కాంగ్రెస్ నేతలపై జగన్ ఫైర్

    అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్‌స్టీన్స్‌ ఫైల్స్‌’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకున్నారు.

Business

  • కార్ల ధరలు ప్రధానంగా మీరు ఎంచుకునే ఫీచర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే.. బేస్ వేరియంట్ ధర ఒకలా ఉంటే, టాప్ వేరియంట్ ధర ఇంకోలా ఉంటుంది. చూడటానికి కారు ఒకేలా కనిపించినా.. బేస్ వేరియంట్ - టాప్ వేరియంట్ ఫీచర్స్ వేరేలా ఉంటాయి. అంటే బేస్ వేరియంట్ లిమిటెడ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ లేదా అదనపు ఫీచర్స్ పొందుతుంది.

    ప్రస్తుతం కారు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లనే కొంటున్నారు. ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు సరే.. ఉన్న ఫీచర్స్ ఉపయోగిస్తున్నారా.. అంటే?, లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా. కాబట్టి ఈ కథనంలో ఫాఫాపు అవసరం లేని 5 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

    బిల్ట్ నావిగేషన్ సిస్టమ్‌లు
    చాలా మంది డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే వీటికంటే ఫోన్ నావిగేషన్ మరింత ఖచ్చితమైనది. అప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతుంది.

    పవర్డ్ టెయిల్‌గేట్
    బటన్‌తో బూట్‌ను ఓపెన్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ చిన్న కార్లలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చేతితో ఓపెన్ చేయడం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది పెద్ద కార్లకు అనుకూలంగా ఉంటుంది.

    పనోరమిక్ సన్‌రూఫ్
    ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. కానీ చాలామంది ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించరు. ఎక్కువ గాలి లేదా ఎండ వస్తుందని దాదాపు క్లోజ్ చేసి ఉంచుతారు.

    గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్
    గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మీ చేతిని ఊపి మ్యూజిక్ మార్చడం లాంటి ఫీచర్. మొదట చూడటానికి ఇది చాలా కూల్‌గా అనిపించవచ్చు, కానీ ఎక్కువసార్లు ఇవి సరిగ్గా పని చేయవు. కాబట్టి టచ్ కంట్రోల్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది వేగంగా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది.

    టచ్-ఓన్లీ క్లైమేట్ కంట్రోల్స్
    డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ద్వారా ACని అడ్జస్ట్ చేయడం చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఫిజికల్ నాబ్‌లు సులభంగా ఉంటాయి. ప్రత్యేకించి దీనిపై శ్రద్ద చూపాల్సిన అవసరం లేదు.

    ఒక కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అవసరమైన ఫీచర్స్ ఏవి కావాలి?, వాటిని ఎంతవరకు ఉపయోగిస్తాము అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. లేకుంటే మీకు అవసరం లేని ఫీచర్లకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం.

  • దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్‌మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.

    ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.

    ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.

    సింగపూర్‌లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.

    ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

    కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు.

  • బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.

    ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.

    చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.

    వెండి ధరలు
    బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.

    ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

  • ఎండ, వాన, చలి నుంచి రక్షణ కల్పించే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ఉన్నంతలో ప్రతి ఒక్కరూ తమ పొదరింటిని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఖర్చుకు ఏమాత్రం వెనకాడట్లేదు. ఈక్రమంలోనే ఇంటి లోపల కాదు ఇంటి బయటి ప్రదేశాల్లోనూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది.  – సాక్షి, సిటీబ్యూరో

    మెట్రో నగరాలలో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే నగరాలలో భూముల ధరలు రూ.కోట్లలో ఉంటాయి.. గ్రీనరీకి స్థల కేటాయింపులు తక్కువే. దీన్ని లక్ష్యంగా చేసుకునే నిర్మాణ సంస్థలు పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రీనరీ హోమ్స్‌ను నిర్మిస్తున్నాయి. విశ్రాంతి, ప్రశాంతత, ఆహ్లాదకర వాతావరణాన్ని 
    కల్పించే గార్డెన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో గార్డెన్‌ ఫర్నీచర్‌కు మార్కెట్‌లో ఆదరణ పెరిగింది.  

    ఉన్నంతలో ఉన్నతంగా.. 
    మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినూత్న డిజైన్లతో భారత ఔట్‌ డోర్‌ ఫర్నీచర్‌ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిమిత స్థలంలో అందంగా, ఆకర్షణీయంగా ఒద్దికైపోవడమే ఈ గార్డెన్‌ ఫర్నీచర్‌ ప్రత్యేకత. వినియోగంలో సౌకర్యం, సౌలభ్యంతో పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, ఎక్కువ కాలం మన్నికగా నిలుస్తుండటంతో కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. రీసైకిల్‌ చేసిన కలప, వెదురు, తాటి చెట్ల నుంచి తయారయ్యే రట్టన్, గ్లాస్, ప్లాస్టిక్, సింథటిక్‌ ఫైబర్, లోహ మిశ్రమం వంటి పర్యావరణ అనుకూలమైన, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు.

    నచ్చిన రంగు, ఆకృతి.. 
    కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా నచ్చిన రంగు, ఆకృతి, డిజైన్‌లలో ఈ గార్డెన్‌ ఫర్నీచర్‌ అందుబాటులో ఉన్నాయి. ఫోల్డబుల్‌ కుర్చీలు, సోఫాలు, డైనింగ్, కాఫీ టేబుల్స్, కాంపాక్ట్‌ యూనిట్లు, బార్‌ లాంజ్‌లు వంటివి ఉంటాయి. చూపరులకు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. గుండ్రంగా, చతురస్రాకారం, వంపు తిరిగిన, నక్షత్రం, గొడుగు, కోడి గుడ్డు ఆకారంలో ఇలా మనకు నచి్చన ఆకృతిలో ఎంపిక చేసుకోవచ్చు. వీటి కోణాలు పదునుగా ఉండవు.. దీంతో భద్రత ఉంటుంది.

  • అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్‌ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్‌ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్‌ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.

    ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?
    “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్‌ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్‌లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

    ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..
    ఆంథ్రోపిక్‌​ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్‌స్ట్రయిక్‌ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్‌ 9% పైగా క్షీణించింది. క్లౌడ్‌ఫ్లేర్‌ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్‌స్కేలర్‌ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్‌ల్యాబ్‌, జేఫ్రాడ్‌ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్‌ ఎక్స్‌ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్‌ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.

    మార్కెట్ ఎందుకు షేక్‌ అయిందంటే..
    సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్‌ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వర్క్‌ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది.

  • లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో నడిపే లేదా పార్క్ చేసిన పాత పెట్రోల్ & డీజిల్ వాహనాలను నోటీసు లేకుండా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.

    బీఎస్ III అంతకంటే పాత వాహనాలు, అంటే.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన డీజిల్ వాహనాలు & 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పెట్రోల్ వాహనాలను లైఫ్ టైమ్ ముగిసిన వాహనాలుగా పరిగణిస్తారు. ఇలాంటి వాహనాలను పబ్లిక్ రోడ్డుపై డ్రైవ్ చేయకూడదు.

    కాలం చెల్లిన వాహనాలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందటం ద్వారా.. ఢిల్లీ వెలుపలికి తీసుకెళ్లవచ్చు. రూల్స్ అతిక్రమించి.. బహిరంగ ప్రదేశాల్లో పాత వాహనాలను నడిపినట్లయితే.. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకుని స్క్రాపేజ్ చేయడానికి తరలించడం జరుగుతుంది. కాలం చెల్లిన వాహనాలను గుర్తించడానికి కూడా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం ఈ నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.

    ఇదీ చదవండి: ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం

    పాత వాహనాలు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీలు కూడా కార్లలో ఇంజిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీఎస్ 4, బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దాదాపు బీఎస్ 6 వాహనాలే అందుబాటులో ఉన్నాయి.

  • ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్ఎ‌స్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్‌ను పొందవచ్చు.

    జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.

    ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!

  • ఇల్లు కొనుగోలు చేయాలంటే సవాలక్ష ఎంక్వైరీలు.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు.. ఇలా చాలా మందికి ప్రత్యక్షంగా ఇల్లు చూపించి, ధర గురించి చర్చించి నిర్ణయం తీసుకోవడం సహజం. కానీ, విలాసవంతమైన ఇంటిని కొందరు కస్టమర్లు చిటికేసినంత సులువుగా కొనుగోలు చేస్తున్నారు. రూ.2–3 కోట్ల ధర ఉన్న ఇళ్లు కొనేందుకు కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్, ఏఐ విశ్లేషణ వేదిక అస్త్ర రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2024 సంవత్సరంలో 28 రోజుల సమయం తీసుకునే వారని తెలిపింది.             – సాక్షి, సిటీబ్యూరో  


    ప్రాపర్టీ కొనేందుకు అన్వేషించే వారు వాస్తవ కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయం.. మొత్తం మార్కెట్‌ డిమాండ్, సెంటిమెంట్‌ను అంచనా వేసేందుకు కీలకమైన కొలమానం. బడ్జెట్‌ను అనుసరించి కస్టమర్లు నిర్ణయం తీసుకునే ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది. ‘లీడ్‌ టు బై కన్వర్షన్‌’ డేస్‌లో తగ్గుదలకు ప్రధాన కారణం మెట్రో నగరాలలో పెద్ద టికెట్‌ సైజు ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటమే. 2025లో అమ్ముడైన అన్ని బడ్జెట్‌ గృహాల్లో రూ.2–3 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు లీడ్‌ టు బై కన్వర్షన్‌ సమయం అత్యల్పంగా ఉంది. 2024లో ఈ ఇళ్ల కొనుగోలు నిర్ణయానికి 28 రోజులు పట్టగా.. గతేడాది కేవలం 15 రోజుల్లోనే ముగించేశారు.

    యువ కస్టమర్లకు నచ్చితే చాలు.. 
    నేటి యువతరం ఇల్లు కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్తున్నారు. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. మన దేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. అలాగే కొన్ని ఏళ్లుగా మార్కెట్‌లో బ్రాండెడ్‌ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ.1–2 కోట్ల ధర ఉన్న ప్రాపరీ్టలను కొనేందుకు 30 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న యూనిట్లకు 29 రోజులు పడుతుంది.

    విక్రయానికి ఎన్ని రోజులంటే.. 
    రూ.1–2 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించేందుకు బ్రోకరేజ్‌ సంస్థలకు 2024లో 47 రోజులు పట్టింది. ఇవి 56 శాతం వేగంగా అమ్ముడయ్యాయి. ఇక, రూ.3 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే యూనిట్ల అమ్మకానికి 2024లో 17 రోజులు పట్టగా.. గత ఏడాదికి 27 రోజులకు పెరిగింది. అలాగే రూ.50 లక్షలలోపు ధర ఉన్న సరసమైన గృహాలకు గత ఏడాది 19 రోజులు పట్టగా.. అంతకుముందు ఏడాది ఏకంగా 28 రోజులు వేచి చూడాల్సి వచ్చింది.

    ఇది చదివారా? సిటీ శివారులో రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌!

  • కరోనాతో ఇంటి అవసరం పెరిగింది. అప్పటి వరకు చిన్న ఇల్లు అయినా పర్లేదు అనుకునే కొనుగోలుదారులు ఆ తర్వాత నుంచి విశాలమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో క్రమంగా అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2019 నుంచి 2025 మధ్య కాలంలో యూనిట్ల సగటు సైజులు 45 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే యూనిట్ల సైజులు అత్యధికంగా ఉన్నాయని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.

    నగరంలో ఇళ్ల పరిమాణం రెండేళ్ల కాలంలో 13 శాతం మేర పెరిగాయి. 2023లో ఇక్కడ యూనిట్ల సగటు విస్తీర్ణం 2,299 చ.అ.లుగా 
    ఉండగా.. 2025 నాటికి 2,600 చ.అ.లకు పెరిగింది. ఆసక్తికరంగా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో 2024లో కంటే గతేడాది అపార్ట్‌మెంట్ల పరిమాణం అత్యధికంగా 24 శాతం మేర పెరిగాయి. ఆ ఏడాది నగరంలో సగటు విస్తీర్ణాలు 2,103గా ఉన్నాయి. 2025లో మన తర్వాత ఎన్‌సీఆర్‌(ఢిల్లీ)లో ఫ్లాట్ల సైజు 2025లో 2,466 చ.అ.గా ఉంది. ఇక్కడ 2023లో 1,890 చ.అ.లుగా ఉన్నాయి. 2023లో ముంబైలో 810 చ.అ.లుగా ఉన్న యూనిట్ల సైజు.. గత ఏడాది నాటికి 904 చ.అ.లకు పెరిగాయి.

    స్టడీ రూమ్‌లు కూడా..
    గతంలో పిల్లల కోసం ప్రత్యేకంగా స్టడీ రూమ్‌ అనేది ఉన్నత స్థాయి గృహాలలోనే కనిపించేవి. కానీ, ఇప్పుడు ఈ గదులు కూడా మెయిన్‌ స్ట్రీమ్‌లోకి వచ్చేశాయి. స్టడీ రూమ్‌లు, వెయిటింగ్‌ హాల్‌ వంటివన్నీ ప్రధాన ఇంటి విస్తీర్ణంలోనే మిళితమైపోయాయి. దీంతో ఇళ్ల విస్తీర్ణాలే కాదు ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్ల సగటు సైజులు 2023లో 1,420 చ.అ.లుగా ఉండగా.. 2025 నాటికి 1,676 చ.అ.లకు పెరిగాయి. 2024లో 1,540 చ.అ.లతో పోలిస్తే జస్ట్‌ ఒక సంవత్సర కాలంలోనే యూనిట్ల విస్తీర్ణాలు 
    ఏకంగా 8 శాతం వృద్ధి చెందాయి.

  • ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన సీఎల్ఈ, ఏఎంజీ సీఎల్ఈ, ఏఎంజీ సీ-క్లాస్ మొదళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడం కోసం కస్టమర్లు డబ్బు చెల్లించాలా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా.. ఎమర్జెన్సీ స్టాప్ అసిస్ట్ ఫీచర్‌ పనిచేయకుండా పోతుంది. దీనివల్ల అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఈ రీకాల్ ప్రభావం.. 2024-25 మధ్య తయారైన సీఎల్ఈ మోడల్స్, 2025లో తయారైన ఏఎంజీ సీఎల్ఈ మోడల్స్, 2024 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తయారైన సీ క్లాస్ మోడల్స్ మీద పడుతుంది.

    రీకాల్ సమాచారాన్ని కంపెనీ కస్టమర్లకు మెయిల్స్, మెసేజస్ రూపంలో తెలియజేస్తుంది. ప్రభావితమైన మోడల్స్ అన్నింటికీ ఉచితంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లు దీనికోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

  • వ్యక్తిగత ఎదుగుదలే పరమావధిగా భావించే ప్రస్తుత పోటీ ప్రపంచంలో తోటివారి కష్టాన్ని చూసి చలించి, వారి జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో రాజు పి.పుత్రన్ ఒకరు. తన జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుని ‘సరస్వతి ఫౌండేషన్’ ద్వారా వేలాది మందికి ఆశాదీపంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

    కష్టాల నుంచి కమ్యూనిటీ లీడర్‌షిప్

    ఉడిపి జిల్లాలోని మంచల్ సమీపంలో షిర్వా గ్రామంలో జన్మించిన రాజు పి.పుత్రన్, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నలుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నవాడైన రాజు తన ప్రాథమిక విద్యను షిర్వాలోనే పూర్తి చేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముంబైకి వలస వెళ్లి అక్కడ మదర్ మేరీ నైట్ హైస్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు విరామం ఇచ్చి అతిథ్య రంగంలో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణలో ఆయన పడిన కష్టం, నేర్చుకున్న పాఠాలే నేడు తనను ఒక సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.

    సేవే లక్ష్యంగా..

    తాను అనుభవించిన పేదరికం, కష్టం మరొకరు పడకూడదనే సంకల్పంతో 2012లో సరస్వతి ఫౌండేషన్‌ను స్థాపించారు. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ సంస్థ నేడు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తోంది. ‘సేవ అనేది కేవలం సహాయం కాదు, ఒక వ్యక్తిని గౌరవప్రదంగా బ్రతికేలా చేసే సాధనం’ అని రాజు పుత్రన్ చెబుతుంటారు.

    ప్రభావశీల కార్యక్రమాలు

    సరస్వతి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలోని వివిధ వర్గాలకు అండగా నిలుస్తున్నాయి.

    విద్య - సాధికారత: ఓరియంట్ ఇన్‌స్టిట్యూట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని అర్హులైన విద్యార్థులకు ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూనే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నారు.

    ఆరోగ్యం, వెల్‌నెస్‌: కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాకుండా యోగా, ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య పునరావాస కేంద్రాలకు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఫౌండేషన్ అండగా ఉంటోంది.

    ఆర్థిక స్వాలంబన: కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు.

    సామాజిక బాధ్యత: వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల నిర్వహణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించడంలో ఈ సంస్థ ముందుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో కూడిన సామాజిక ఐక్యత కోసం కొన్ని ఆలయాల పునరుద్ధరణ వంటి పనుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

    గమనిక: ఈ కథనం సరస్వతి ఫౌండేషన్ తరఫున సాక్షి.కామ్‌లో అందిస్తున్నాం.

  • బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.

    ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్‌పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.

    ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్‌కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.

    దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.

National

  • న్యూఢిల్లీ:  అధ్యక్ష హోదాలో డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత ట్రంప్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పరిణామాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నట్లు  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 

    అమెరికా సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును మేము గమనించాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. ఈ పరిణామాలన్నింటినీ వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మేము అధ్యయనం చేస్తున్నాము.  దానిని భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. అవసరమైన ప్రతిస్పందనను వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ  ఇస్తాయి’అని తెలిపారు.

    కాగా, పలు దేశాలపై విధించిన సుంకాల అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ల్రంప్‌ విధించిన సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అమెరికా అధ్యక్షుడికి కానీ, వైట్‌హౌస్‌కు కానీ సుంకాలు విధించే అధికారం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వాణిజ్య పరమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధకారం కేవలం అమెరికా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని పేర్కొంది. దాంతో డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 

    ఇవీ చదవండి
    ట్రంప్‌ టారిఫ్‌లు కొట్టివేత.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    నిజంగా ఇది సిగ్గు చేటు.. సుప్రీం కోర్టు తీర్పుపై ట్రంప్‌ ఫైర్‌

  • ఉత్తరప్రదేశ్ లో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరంది  సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై  ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దానితో లోతైన విచారణ జరపాలని పోలీసులకు తెలిపింది. సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో  మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. 

    అయితే ఈ ఆరోపణలపై అవిముక్తేశ్వరానంది స్వామి స్పందించారు. ఈ ఆరోపణలు అవాస్తవమని వాటిని కోర్టులో చట్టపరంగా ఎదుర్కుంటానని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఈ కేసు విచారణ ఆలస్యం చేయవద్దని వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని అన్నారు. అయితే ఈ పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలన్నారు.

    అయితే జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాజాగా నిందితునిపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది. కాగా సత్యాన్ని తెలియజేయడానికి ప్రయాగ్ రాజ్ నుండి వారణాసిలోని విద్యామఠం వరకూ పాదయాత్ర చేపడాతానని అశుతోష్ బ్రహ్మచారి తెలిపారు. 

  • మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ సెక్స్‌టార్షన్, 'డిజిటల్ అరెస్ట్' రాకెట్‌ను పోలీసులు ఛేదించిన వైనం కలకలం రేపింది. 'ఆపరేషన్ మ్యాట్రిక్స్' పేరుతో చేపట్టిన ఈ దాడిలో 20 మంది అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.07 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

    శివపురి ఎస్పీ అమన్ సింగ్ రాథోడ్  ఈ అరెస్టులను ధృవీకరించారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో గ్వాలియర్ జోన్ ఐజీ అరవింద్ కుమార్ సక్సేనా, డీఐజీ అమిత్ సంఘీ ఆదేశాల మేరకు తొమ్మిది ప్రత్యేక బృందాలు శివపురి జిల్లాలోని కరేరా, భోంతి, పిచ్చోర్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయని ఆయన తెలిపారు.

    అసలేంటీ  రాకెట్‌
    పకడ్బందీ పథకం ప్రకారం ఈ ముఠా సభ్యులు  మోసాలకు  పాల్పడేవారు. మొదట వాట్సాప్‌లో మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించేవారు. డేటింగ్ ,టింగ్ యాప్‌ల ద్వారా బాధితులను ఆకర్షించి, వారితో అసభ్యకరమైన చాట్లు,వీడియో రికార్డింగ్‌లు చేసేవారు. ఆతరువాత బాధితుల వ్యక్తిగత వీడియోలు సేకరించిన తర్వాత, తమ నిజప్వరూపాన్ని బయటపెట్టేవారు.  తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని, బాధితులపై అత్యాచారం, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులు నమోదయ్యాయని భయపెట్టి, బెదిరింపులకు పాల్పడేవారు. ఈ కేసుల నుండి తప్పించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాలని  డిమాండ్‌ చేయడం వీరి మోడస్‌ ఒపరాండీ.

    గత వారంలో నమోదైన నాలుగు ఎఫ్ఐఆర్లలో మొత్తం 32 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా, మరో 12 మంది పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో అంగద్ లోధి, విశాల్ లోధి, సుఖ్‌దేవ్, అర్జున్, దీపక్ ప్రజాపతి తదితరులు ఉన్నారు. వీరిలో మెజారిటీ నిందితులు శివపురి మరియు ఝాన్సీ ప్రాంతాలకు చెందినవారే.

    రూ. 1.20 లక్షల నగదు, ఏటీఎం  కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్కులతోపాటు  7 నాలుగు చక్రాల వాహనాలు, 29 స్మార్ట్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ. 1.07 కోట్లు అని పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌తో సరదాగా, సర్‌ప్రైజింగా : వైరల్‌ వీడియోలు

    పోలీసుల హెచ్చరిక
     అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాథోడ్ ప్రజలను  ఈ సందర్బంగా కోరారు. తెలియని నంబర్ల నుండి వచ్చే వీడియో కాల్‌లను ఎత్తవద్దనీ,  ఒకవేళ ఎవరైనా 'డిజిటల్ అరెస్ట్' పేరుతో బెదిరింపులకు పాల్పడితే, వెంటనే స్థానిక పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ‌

    ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

  • న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో  గూగుల్ ఉద్యోగి సీఈఓ సుందర్ పిచాయ్‌ను కలవడం గురించి చేసిన హృదయపూర్వక పోస్ట్ ఆన్‌లైన్‌లో అందరినీ ఆకట్టుకుంది.  గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అయిన తనుషి గుప్తా సుందర్‌ పిచాయ్‌ కలవాలనే తన చిరకాలకలను సాకారం చేసుసుకున్న వైనం గురించి లింక్డ్ఇన్‌లోపోస్ట్‌ చేసింది.

    గుర్గావ్ కార్యాలయంలో సుందర్ పిచాయ్‌తో తన సంభాషణను సంగ్రహించిన వీడియో క్లిప్‌తో పాటు,  ఆ భావోద్వేగ క్షణాన్ని  ఆ ఒక కలగా అభివర్ణించింది. తన చిన్ననాటినుంచి తనకు 'రోల్ మోడల్' అయిన వ్యక్తితో షేక్‌  హ్యాండ్‌ ఇచ్చిన ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని  తెలిపింది. అలాగే తాను గూగుల్‌లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌ని మాత్రమే కాదనీ, మేకప్ కంటే యంత్రాలను ఎంచుకున్న చిన్న అమ్మాయినని  పేర్కొంది. టెక్ గురించి అంతులేని ఆసక్తి ఉన్న విద్యార్థిని. వస్తువులను కొనడం కంటే వస్తువులను నిర్మించడం ముఖ్యమని నమ్మిన అమ్మాయి నంటూ పోస్ట్‌ చేసింది. 

    ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

    సోషల్ మీడియా స్పందన
    ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 259,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు తాము ఆరాధించే ప్రజా వ్యక్తులను కలిసిన అనుభవాలను పంచుకున్నారు.

    తనుషి కథతోపాటు మరో యువకుడి సరదా సంభాషణ కూడా నెట్టింట సందడిగా మారింది.  యూట్యూబ్‌ ద్వారా సక్సెస్‌ అయిన అనంత్ లథా స్టోరీ ఇది.  ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’  అను యూట్యూబ్‌ ని రన్‌ చేస్తున్న అనంత్‌  ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేయడంతోపాటు  తన అనుభవాన్ని కూడా షేర్‌ చేశాడు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం వచ్చిన తాను నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ  పలకరించానని చెప్పుకొచ్చాడు. దీనికి ఆశ్చర్యపోయిన పిచాయ్ ఎలా అని ప్రశ్నించారట.  తానొక యూట్యూబర్‌నిని,  మీ మూలంగానే నెలనెలా యూట్యూబ్ నుంచిఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన సరదాగా నవ్వేశారంటూ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు.

  • న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంపాక్ట్ సమ్మిట్’ వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) కార్యకర్తలు చేపట్టిన అర్ధనగ్న ప్రదర్శన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు శనివారం పటియాలా హౌస్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ నిరసనల వెనుక అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసేందుకు  భారీ కుట్ర ఉందని పోలీసులు ఆరోపించారు.

    శుక్రవారం ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు ఉన్న టీ-షర్టులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు ఐవైసీ (ఐవైసీ) నేతలను పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపాల్‌లో గతంలో జరిగిన ఒక భారీ ఆందోళనను పోలి ఉందని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని పోలీసులు కోర్టుకు వివరించారు. భారత్ మండపంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమయంలో ఇటువంటి నిరసన చేపట్టడం ద్వారా దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై మసకబార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.

    ఈ నిరసనల వెనుక ఉన్న కారణాలను వెలికితీసేందుకు తమకు ఐదు రోజుల రిమాండ్ కావాలని పోలీసులు కోర్టును కోరారు. నిందితుల తరపు న్యాయవాది పోలీసుల వాదనలను తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన కోర్టులో వాదించారు. ‘ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపే హక్కు నిందితులకు ఉంది. ఈ ఆందోళన శాంతియుతంగా జరిగింది. ఎక్కడా ఎటువంటి హింస జరిగినట్లు వీడియో ఆధారాలు లేవని న్యాయవాది పేర్కొన్నారు. నిందితులను పోలీసులు  అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని న్యాయవాది వాదించారు.

    ఇది కూడా చదవండి: కెనడా కాల్పులు: పసిగట్టిన ఏఐ.. ఆగని మారణకాండ

Telangana

  • సాక్షి సంగారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇటీవల జరిగిన  మెదక్ మున్సిపల్ ఎన్నికల ఘర్షణలో అరెస్ట్ అయి కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న 13మంది BRS కార్యకర్తలతో హరీష్ రావు ములాఖత్ అయ్యారు. 

    మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా  కార్యకర్తలను కారాగారానికి తరలించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఒక సీటు ఎక్కువే గెలిచిందని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే  రోహిత్ 15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మెదక్ డీఎస్పీ దగ్గరుండి కాంగ్రెస్ కార్యకర్తలతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని హరీశ్ రావు ఆరోపించారు. కనుక కేసులు పెట్టాల్సింది ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులపై కానీ అన్యాయాన్ని ప్రశ్నించిన BRS నాయకులపై కాదన్నారు.

    ఆరుగురు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఇది అత్యంత దారుణమన్నారు. పోలీసులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని సైతం శిక్షించక తప్పదని హరీశ్ రావు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.  మెదక్ లో కాంగ్రెస్ గుండాలు BRS కార్యకర్తలని బెదిరిస్తున్నారని మెదక్ లో గుండాల రాజ్యం నడుస్తోందా? లేక ప్రభుత్వ పాలన నడుస్తోందా అని అడిగారు.

    పోలీసులు కేసులు పెట్టేటప్పడు ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని కేసులు పెట్టాలని తెలిపారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్ ని తిడితే కేసు ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతారు. ఆయనకు ఇది కనబడడం లేదా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో 800 స్థానాలను BRS గెలిచిందని ఆనాడు BRS అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కనీసం నాలుగు స్థానాలను సైతం గెలవలేదని అన్నారు. రైతు బంధు ఇంకా ఎప్పుడు వేస్తావో రేవంత్ రెడ్డి తెలపాలని అది ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేయడం తప్పదని హరీశ్ రావు అన్నారు.

  • సాక్షి కామారెడ్డి: ఖాదీ చొక్కా ధరించడం అంటే  కలెక్షన్లు  వసూలు చేయడం కాదని  ప్రజలకు సేవ చేయడమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి అన్నారు. కామారెడ్డిలో ఈ రోజు (శనివారం) నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమవేశం నిర్వహించారు. తాను  లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ  ఇంఛార్జ్ మంత్రితో షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో తాను  మాట్లాడకుండా ఉంటే తన  నియోజకవర్గానికి నవాబు లాగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 

    గతంలో ఎన్నోసార్లు పోటీ చేసి ఓటమిపాలైన షబ్బీర్ అలీ అవినీతి బాగోతం గురించి ముఖ్యమంతి రేవంత్ రెడ్డి కి  వివరించానని ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగినా మౌనంగా ఉన్నానని .. ఇక నుంచే భరించే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రభుత్వ కళాశాల ఆస్తుల విషయంలో తాను ఏదైనా  అవినీతి చేసినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే. తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డి ప్రభుత్వ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని తన తండ్రితో కలిసి అప్పటి  ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడానని  ఆ సమయంలో షబ్బీర్ అలీ మంత్రి హోదాలో ఉండి కూడా కామారెడ్డికి ఏమి  చేయలేదని ఆరోపించారు. 

    ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెంకట రమణా రెడ్డి తేల్చి చెప్పారు.వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తానని నిజమైన నాయకులెవరైనా ఉంటే తన తప్పు నిరూపించాలని సవాల్ విసిరారు.అయితే ఈరోజు ఉదయం నుంచి కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు  పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్‌ విసిరారు. దీంతో, చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్‌ చేశారు. 

    ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు  కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్‌ నేతలను  బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేత కారు ధ్వంసం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

  • సాక్షి హైదరాబాద్: బండ్లగూడలో  విషాదం జరిగింది.  వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. దీంతో పాప తరపు బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో  ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో డాక్టర్ ఇంజెక్షన్ వేశారు. అయితే అది వికటించి ఆ పాప మృతి చెందింది.

    దీంతో డాక్టర్ల నిర్లక్షంతోనే పాప మృతి చెందిందని తీవ్ర ఆగ్రహానికి గురైన పాప తరపు బంధువులు అక్కడి వైద్యులపై దాడి చేశారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

     

  • సాక్షి జగిత్యాల:  ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. తీసుకున్న బాకీ ఎట్టిపరిస్థితుల్లో చెల్లించాలంటూ మైక్రోఫైనాస్స్ సంస్థ ప్రతినిధులు వేధించడంతో సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన లక్కం రాజశేఖర్ అనే వ్యక్తి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయాడు. 

    దీంతో ఎలాగైనా అప్పు చెల్లించాలని ఆ మైక్రోఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురి చేయడంతో అప్పు తీర్చలేక తన ఇంటిలోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. 

  • సాక్షి నల్గొండ: నకిరికేల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆటో మెుబైల్ షాపులో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Family

  • సాక్షి, హైద‌రాబాద్‌: ఒక వైపు సచివాలయం.. మరో వైపు నాణేలు ముద్రించే మింట్‌ కాంపౌండ్‌.. అనేక ప్రాంతాలను కలిపే కూడలి.. అక్కడ ఓ మర్రి చెట్టు.. దాని నీడలో 30 ఏళ్లుగా ఓ కుటుంబం పుచ్చకాయల ముక్కలు విక్రయిస్తోంది. సాధారణంగా మండుటెండల్లో మాత్రమే పుచ్చకాయల విక్రయాలు కనిపిస్తాయి. కానీ ఖైర‌తాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌ మర్రి చెట్టు నీడలో మాత్రం 365 రోజులు విక్రయిస్తుంటారు.  

    షేక్‌ మౌలానా 30 ఏళ్ల క్రితం మింట్‌ కాంపౌండ్‌లోని అతి పెద్ద మర్రి చెట్టు కింద పుచ్చకాయలు కోసి అమ్మడం ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం మౌలానా భాయ్‌ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొడుకులు పర్వేజ్, ముబీన్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టూ పర్యాటక ప్రదేశాలు ఉండటంతో నగరానికి వచ్చే వేలాది మందికి మర్రి చెట్టు (Banyan Tree) సుపరిచితమే.

    ఐస్‌ వాడకుండా.. 
    సాధారణంగా బయట దుకాణాల్లో పుచ్చకాయ ముక్కలు విక్రయించే వారు ముక్కలు చల్లగా ఉండేందుకు ఐస్‌ వినియోగిస్తారు. కానీ వీరు మాత్రం అప్పటికప్పుడు ముక్కలు కోసి వినియోగదారులకు అమ్మతుంటారు. మధ్యాహ్నం నుంచే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో మంది కుటుంబ సభ్యులతో సహా వచ్చి పుచ్చకాయ ముక్కలు కొనుగోలు చేస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.  

    రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. 
    సీజన్‌తో పనిలేకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రత్యేక లారీల్లో వీటిని తెప్పించి ఇక్కడ విక్రయిస్తుంటారు. సచివాలయానికి వచ్చే రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సైతం మర్రి చెట్టు నీడన సేదదీరతారు. మొదట్లో ప్లేట్‌ 10 పైసలకు అమ్మేవాడని, ప్రస్తుతం రూ.30కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. 

    చ‌ద‌వండి: ఈ హైద‌రాబాద్ అన్నాచెల్లెలు.. ఏక‌ధాటిగా 700 స్లోకాలు 

Politics

  • అన్నమయ్య జిల్లా: రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. 

    ‘ బడ్జెట్‌ కేటాయింపుల్లో మహిళలకు, నిరుద్యోగులకు కేటాయింపులు లేవు. 50 ఏళ్లు దాటిన వారికి ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వడం లేదు. ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా అప్పులు మాత్రం చేస్తూ పోతున్నాడు. ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. దేవుడిపై కూడా రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. 

    ఏడు కొండలు, లడ్డూ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి దిగజారిపోయి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో గురు శిష్యులిద్దరూ దొరికారు.  శిష్యుడికి తెలంగాణలో మేలుచేయడం కోసం చంద్రబాబు రాయలసీమను తాకట్టుపెట్టారు.   మార్చి 1 వ తేదీన రాయలసీమ సన్నాహక సమావేశం ఉంటుంది. చంద్రబాబు అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని స్పష్టం చేశారు. 

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని.. అందుకే ఒన్‌మెన్ కమిటీ వేసి, తనకు కావాల్సినట్టు రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతోందని.. ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసి పోయాయన్నారు

    ‘‘ప్రపంచ హిందూ భక్తుల ముందు చంద్రబాబు దోషిగా నిలబడ్డారు. లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మండలిలో ఇందాపూర్ సంబంధంపై చర్చకు రమ్మంటే టీడీపీ పారిపోయింది. ఇందాపూర్ హెరిటేజ్ సంస్థది కావటం వల్లే టీడీపీ చర్చకు రాలేదు. ఈ విషయాన్ని మేము బయట పెట్టగానే దాన్ని కో-మ్యానిఫెక్చర్ కంపెనీగా మార్చారు. ఆ కంపెనీ కీలక ఉద్యోగిని ఎందుకు తొలగించారో చెప్పాలి. యావత్ ప్రపంచానికి చంద్రబాబు కుట్ర వైఖరి తెలిసిపోయింది’’ అని అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.

    ‘‘తిరుమలలో రెండు కొండలేనంటూ వైఎస్సార్ మీద కూడా అభాండం వేశారు. చివరకు వాస్తవాలు ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు వేసిన సీబిఐ విచారణను కాదని మరో ఏకసభ్య కమిషన్ వేయటం ఏంటి?. తమకు కావాల్సిన రీతిలో సీబిఐ నివేదిక ఇవ్వలేదనే ఈ ఏకసభ్య కమిటీ వేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తోంది. ఏ వ్యవస్థ మీదా చంద్రబాబుకు నమ్మకం లేదు. హోంమంత్రి భాష అత్యంత దారుణం.

    ..మండలిలోని సీసీ కెమెరా విజువల్స్ ఎలా బయటకు వెళ్లాయి?. దీనిపై మేము ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. పోడియం దగ్గరకు వెళ్లేటప్పుడు మేము చెప్పులు విడిచి వెళ్లాం. కానీ మేము మా ఛైర్స్ దగ్గర ఉన్నప్పుడు వీడియో మాత్రమే ఎందుకు లీక్  చేశారు?. మొత్తం వీడియో ఎందుకు బయట పెట్టడం లేదు?’’ అంటూ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు.

    హిందువుల ద్రోహి చంద్రబాబు.. వెంటనే క్షమాపణ చెప్పాలి

Social Media

  • నేటి సమాజంలో వార్తా విశేషాల్ని తెలుసుకోవడానికి టీవీలు, పేపర్ల పాత్ర చాలా తక్కువైపోయింది.  అంతా సోషల్‌ మీడియా హవానే నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికలపై దృష్టి పెడుతున్నారు. వార్తలు, వినోదం, అభిప్రాయాలు ఇలా  ఆల్‌ ఇన్‌ వన్‌ తరహాలో అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్(ట్విటర్) వంటి ప్లాట్‌ఫాంలు ప్రధాన సమాచార వనరులుగా మారాయి. తక్షణ సమాచారం అందించే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉండడం ప్రజలను ఆకర్షిస్తోంది.  ఫలితంగా యువతలో సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉంది.

    సమాజంలో అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా కూడా. 

    ఈ క్రమంలోనే ఇక్కడ మీతో(ప్రేక్షక్షులకు) ఒక విషయాన్ని షేర్‌ చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ‘సాక్షి’ సోషల్‌ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లలో నెలవారీ వీక్షణలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్‌ను సాధించింది.  

    తెలుగు సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్న ‘సాక్షి’ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ఎప్పటికప్పుడు  వేగంగా వార్తా సమాచారాన్ని తెలుసుకోవడానికి  ‘సాక్షి’ సోషల్‌ మీడియాని ఫోలో అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.

    సాక్షి ఫేస్‌బుక్‌

    సాక్షి ఇన్‌స్టా

    సాక్షి ‘ఎక్స్‌’

    సాక్షి  వాట్సాప్‌ చానల్‌

NRI

  • చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్‌ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్‌లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.

    సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది.  విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.