Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌కు అస‌లు సిస‌లైన క్రికెట్ మాజాను అందించింది. ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌క‌తా సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కేకేఆర్ ఫినిష‌ర్ రింకూ సింగ్ మ‌రోసారి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను రింకూ త‌న విరోచిత హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు.

    రింకూ సింగ్ కేవ‌లం 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో ల‌క్నో పేస‌ర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

    సెన్సేషనల్ ష‌మీ
    అనంతరం లక్ష్య చేధనలో లక్నో కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.  కార్తీక్ త్యాగి వేసిన‌ చివ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో విజ‌యానికి 17 ప‌రుగులు అవ‌స‌ర‌మవ్వ‌గా.. ష‌మీ చివ‌రి బంతికి సిక్స్ కొట్ట‌డంతో స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌తో ఫ‌లితం తేల్చాల‌ని అంపైర్‌లు నిర్ణ‌యించారు. అయితే

    సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో మూడు బంతుల్లో రెండు వికెట్ల న‌ష్టానికి కేవ‌లం ఒక్క ప‌రుగు చేసింది. సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో తొలి బంతికి పూర‌న్ క్లీన్ బౌల్డ్ కాగా.. రెండో బంతికి పంత్ సింగిల్ తీసి మార్‌క్ర‌మ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి మార్‌క్ర‌మ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రూల్స్ ప్రకారం.. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తిస్తారు. ఆ త‌ర్వాత తొలి బంతికే రింకూ సింగ్ ఫోర్ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు.

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ స్టార్ రింకూ సింగ్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 73 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌ను రింకూ త‌న విరోచిత హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. ఓ ద‌శ‌లో ఆచితూచి ఆడిన రింకూ.. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు.

    మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన 19 ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు రాబ‌ట్టిన రింకూ సింగ్‌.. ఆ త‌ర్వాత ఆఖ‌రి ఓవ‌ర్‌లో స్పిన్న‌ర్ దిగ్వేష్ రాఠీని ఓ ఆడుకున్నాడు. ఆ ఓవ‌ర్‌లో రింకూ వ‌రుస‌గా నాలుగు సిక్స్‌లు బాది 26 ప‌రుగులు పిండుకున్నాడు. మ‌రో రెండు ప‌రుగులు వైడ్స్ రూపంలో వ‌చ్చాయి.

    కేవలం 51 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రింకూ సింగ్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్‌కు ఐపీఎల్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.

    నిప్పులు చెరిగిన మొహ్సిన్
    ఇక రింకూ సునామీకి ముందు లక్నో పేసర్ మొహ్సిన్ ఖాన్ నిప్పులు చెరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో కేకేఆర్ టాపర్డర్‌ను మోహ్షిన్ కుప్పకూల్చాడు. మొహ్సిన్ తన నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో లిండే ఓ వికెట్ సాధించారు. మహ్మద్ షమీతో సహా మిగితా బౌలర్లందా దారుణంగా విఫలమయ్యారు.
    చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'


     

     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీని దురదృష్టం వెంటాడింది. క్రికెట్‌లో అరుదుగా కన్పించే 'అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' (ఫీల్డింగ్‌కు ఆటంకం కలిగించడం) నిబంధన ప్రకారం రఘువంశీ ఔటయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔటైన నాలుగో బ్యాటర్‌గా రఘువంశీ నిలిచాడు.

    ఏమి జరిగిందంటే?
    కోల్‌కతా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మ‌హ్మ‌ద్ ష‌మీ బంతిని వేగంగా అందుకోవ‌డంతో.. ర‌ఘువంశీ స‌గం దూరం వెళ్ళాక మళ్ళీ వెన‌క్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు.

    అయితే వెన‌క్కి వెళ్లే క్ర‌మంలో ష‌మీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనుక్కి పరిగెత్తాడని పంత్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్‌ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు.

    దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్  కింద అవుట్‌గా ప్రకటించారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై రఘువంశీతో పాటు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, మెంటార్లు షేన్ వాట్సన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రఘువంశీ మైదానాన్ని వీడే క్రమంలో తన బ్యాట్‌ను, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు క్రీజులోకి చేరుకోవాలనే ఉద్దేశంతోనే అలా పరిగెత్తాడని, అలా ఎలా ఔట్ ఇస్తారని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. మరో యూజర్ రూల్స్ ప్రకారం ఇది అవుటేనని కామెంట్ చేశాడు.
     


     

     

  • ఐపీఎల్‌-2026లో చెపాక్ మైదానం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ నిరాశ‌ప‌రిచాడు. గ‌త మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్‌.. గుజరాత్‌పై మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 15 బంతుల్లో 11 పరుగులు చేసి సంజూ ఔటయ్యాడు.

    అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్ విఫలమైనప్పటికి  ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడి శాంసన్ రికార్డు సృష్టించాడు. సంజూ కేవలం 3555 బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

    ఇంతకుముందు ఈ రికార్డు సీఎస్‌కే లెజెండ్ సురేష్ రైనా పేరిట ఉండేది. రైనా 3620 బంతుల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో దిగ్గజాలు ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తొలి రెండు స్ధానాల్లో ఉన్నారు.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్‌కేపై 6 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.  ఓపెనర్‌ సాయిసుదర్శన్‌(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి అదరగొట్టాడు.

    అత్యంత తక్కువ బంతుల్లో 5000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:

    సంజూ శాంసన్‌ – 3555 బంతులు

    సురేష్ రైనా – 3620 బంతులు

    కేఎల్ రాహుల్ – 3688 బంతులు

    ఎంఎస్ ధోని – 3691 బంతులు

    రోహిత్ శర్మ – 3817 బంతులు

    విరాట్ కోహ్లీ – 3827 బంతులు
    చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. చెపాక్‌ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘన విజయం సాధించింది. సీఎస్‌కే నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ 16.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

    గుజరాత్‌ ఓపెనర్‌ సాయిసుదర్శన్‌(46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) మరోసారి సత్తాచాటాడు. అతడితో పాటు జోస్‌ బట్లర్‌(39 నాటౌట్‌), శుభ్‌మన్‌గిల్‌(33)రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఆకిల్‌ హోస్సేన్‌, నూర్‌ అహ్మద్‌ తలా వికెట్ పడగొట్టారు.

    రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌
    అంతకముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శాంసన్‌, బ్రెవిస్ వంటి స్టార్ ప్లేయర్లు ఆరంభంలోనే ఔటైనప్పటికి.. రుతురాజ్ మాత్రం ఆచితూచి ఆడుతూ జట్టుకు గౌరప్రదమైన స్కోర్‌ను అందించాడు.

    60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓవర్టన్‌(6 బంతుల్లో 18) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్‌ ఖాన్‌, సుత్తార్‌, సిరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది.
    చదవండి: IPL 2026: 'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్‌ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

    లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్‌ కేవలం​ 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

    అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి  సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు.

    "వైభ‌వ్‌ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో త‌న‌కు వివ‌రించాను. అత‌డు నిజంగా ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డు గ‌నుక మ‌రికొన్ని ఓవ‌ర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అత‌డు బ్యాటింగ్ చేస్తున్న తీరు త‌లుచుకుంటుంటే భయమేస్తోంది. అత‌డి వికెట్ తీయడం మాకు క‌లిసొచ్చింది" అని కిష‌న్ వెల్ల‌డించాడు.

    అంతేకాకుండా మా జ‌ట్టుపై కొంచెం నెమ్మ‌దిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభ‌వ్‌ను హెచ్చరించినట్లు కిష‌న్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
    చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా గుజ‌రాత్‌ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికి రుతురాజ్ మాత్రం ఆచితూచి త‌మ జ‌ట్టుకు గౌర‌వ‌ ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించాడు.

    60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్‌(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

    గుజరాత్‌ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్‌ ఖాన్‌, సుత్తార్‌, సిరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్‌.. గుజరాత్‌పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

  • ఐపీఎల్‌-2026లో శ‌నివారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ సంచ‌ల‌న సెంచ‌రీతో చెలరేగాడు. 

    వైభ‌వ్ కేవ‌లం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌ల‌తో త‌న రెండో ఐపీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అతడు వైభవ్ ఆటతీరుకు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ సైతం ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్‌పై క‌మ్మిన్స్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు.

    "వైభ‌వ్‌ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అత‌డు బ్యాటింగ్ స్కిల్స్ నిజంగా అద్భుతం. బంతిని చాలా బలంగా కొడుతున్నాడు. వైభ‌వ్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అత‌డికి బౌలింగ్ చేసేట‌ప్పుడు బౌల‌ర్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ మాత్రం లైన్ త‌ప్పినా బంతిని మైదానం వెలుప‌ల ప‌డ‌టం ఖాయమ‌ని" క‌మ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు.

    కాగా ఈ మ్యాచ్‌లో సూర్య‌వంశీ.. క‌మ్మిన్స్‌ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్‌గా మ‌లిచాడు. కాగా15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్లు అయిన జ‌స్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, అర్ష్‌దీప్ సింగ్‌ల‌కు త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడి 357 ప‌రుగులు చేశాడు.
    చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమి చవిచూసింది. శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్  పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడులేకపోయారు.

    అంతేకాకుండా కెప్టెన్ రియాన్ పరాగ్ తల తిక్క నిర్ణయాలు కూడా రాజస్తాన్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో టాప్ క్లాస్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాలతో పరాగ్ చెరో ఓవర్ మాత్రమే వేయించాడు. భారీగా పరుగులు సమర్పించుకున్న బ్రిజేష్ శర్మతో మాత్రం పరాగ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు.

    కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా రియాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పరాగ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి  ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ప‌రాగ్ కేవ‌లం 88 ప‌రుగులు చేశాడు. అత‌డి అత్య‌ధిక స్కోర్ 20 ప‌రుగులగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌రాగ్‌పై భార‌త మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ విమ‌ర్శ‌లు గుప్పించాడు.  

    "రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్ కెప్టెన్సీపై పునరాలోచన చేయాలి. అత‌డు త‌మకు స‌రైన కెప్టెన్ కాదా అన్న‌ది రాజ‌స్తాన్ మ‌రోసారి ఆలోచించాలి. మీరు 25 మందినీ ఇంటర్వ్యూ చేసి ప‌రాగ్‌ను ఎంపిక చేసి ఉండొచ్చు. కానీ అత‌డు లీడర్‌గా నిరూపించుకోలేక‌పోతున్నాడు. 

    ముఖ్యంగా అత‌డి వ్యూహాలు ఎంటో ఆర్ధం కావ‌డం లేదు. హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో వికెట్ టేకింగ్ బౌలర్లైన  రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాల‌తో ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే బౌలింగ్ చేయించాడు. వారికి మ‌రో ఓవ‌ర్ ఇచ్చి ఉండాల్సింది. ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే ఇస్తే వికెట్లు ఏలా తీస్తారు? అత‌డు బ్యాట‌ర్‌గా కూడా విఫ‌ల‌మ‌వుతున్నాడు. 

    ఆ ప్ర‌భావం క‌చ్చితంగా అత‌డి కెప్టెన్సీపై ప‌డుతుంది. ప‌రుగులు ఎలా సాధించాల‌న్న త‌ప‌న‌తో కెప్టెన్సీపై ఏకాగ్ర‌త‌ను కోల్పోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం బాదేశాడు, నేను సీనియ‌ర్‌ని, ఎందుకు ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాను అని ప‌రాగ్ తెగ ఆలోచిస్తుంటాడు. ప‌దేప‌దే ఎక్కువ‌గా ఆలోచించ‌డంతో అత‌డిపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని" క్రిక్‌బ‌జ్ ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్‌ నుంచి అవుట్‌?

  • ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్‌ జట్టులోకి అర్షద్‌ ఖాన్‌ రాగా.. సీఎస్‌కే జట్టులోకి ఉర్విల్‌ పటేల్‌ వచ్చాడు.

    తుది జట్లు
    గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్
     

  • జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. మే 4న మొదలయ్యే ఈ చారిత్రాత్మక సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహించనుంది. మే 4, 6, 9 తేదీల్లో నేషనల్‌ బ్యాంక్‌ స్టేడియం (కరాచీ) వేదికగా మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ ఐసీసీ వుమెన్స్‌ ఛాంపియన్షిప్‌ 2025–29లో భాగం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

    ఈ సిరీస్‌ కోసం ఎంపిక​ చేసిన పాక్‌ జట్టులో యువ స్పిన్నర్ మోమిరనా రియాసత్‌కు తొలిసారి చోటు దక్కింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, ఇటీవల జరిగిన నేషనల్ టీ20 టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. వన్డే కప్‌లోనూ 19 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది.

    ఈ పర్యటన కోసం జింబాబ్వే జట్టు ఏప్రిల్ 29న కరాచీకి చేరుకోనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, జింబాబ్వే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.

    జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాకిస్థాన్ మహిళల జట్టు ఐర్లాండ్‌ టీ20 ట్రై సిరీస్‌ 2026లో పాల్గొననుంది. ఇందులో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా పోటీపడనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.

    టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ అనంతరం పాక్‌ జట్టు ఆదే టీమ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌ మే 12, 14, 15 తేదీల్లో నేషనల్‌ బ్యాంక​్‌ స్టేడియం వేదికగానే జరగనుంది.

    జింబాబ్వే సిరీస్‌ కోసం పాక్‌ వన్డే జట్టు..
    ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (WK), నజిహా అల్వీ (WK), నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్‌

    రిజర్వ్‌ ప్లేయర్లు: ఇరామ్ జావేద్, ఈమాన్ ఫాతిమా, సైరా జబీన్, తుబా హసన్, అంబర్ కైనాట్.

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.

    టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

    ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.

    సాయంత్రానికి యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్‌ క్యాప్‌ను రాహుల్‌ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ లాగేసుకున్నాడు.

    ఇలా ఒకే రోజులో ఆరెంజ్‌ క్యాప్‌ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.

    కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్‌ మరో ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం​ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

     

Movies

  • తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమాలో ఉపయోగించిన బైక్ నంబర్ ప్లేట్‌ను జ్ఞాపికగా అందించారు. దాంతో ధనుష్‌ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ మలుపు తిరిగిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

    వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పొల్లాదవన్' నా కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాకు ముందు నన్ను చూసి చాలా మంది చాలా బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. కానీ 'పొల్లాదవన్'లో నేను మొదటిసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించినప్పుడు ప్రేక్షకులు చప్పట్లతో, ఈలలతో నన్ను స్వాగతించారు. నా జీవితంలో అది మర్చిపోలేని క్షణం. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా 'యద్భావం తద్భవతి'. మనం ఏదైనా బలంగా నమ్మితే, దాన్ని సాధించగలం.

    నా కెరీర్ ప్రారంభ రోజులైన "2002-03 సమయంలో నాకు జాతీయ అవార్డు వస్తుందని ఎవరైనా అంటే అందరూ నవ్వుకునేవారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదో ఒకరోజు ఆ అవార్డు నా చేతిలో ఉంటుందని గట్టిగా నమ్మాను. చివరకు అదే జరిగిందని ధనుష్ అన్నారు. తన పట్టుదల, కృషికి ప్రతిఫలంగా 2010లో ఆడుకాలం, 2019లో అసురన్‌ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు, నిర్మాతగా కూడా కాక ముట్టై, విసారణై వంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 

    ఇక 'కర' సినిమా విషయానికి వస్తే ధనుశ్, మమిత బైజు జంటగా నటించారు. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. 

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు జూన్‌లో వస్తుందని అధికారికంగా ప్రకటించారు గానీ తేదీ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. అలానే ఐటమ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తారు? అందులో చేసే బ్యూటీ ఎవరు? తదితర వివరాలపై స్పష్టత రాకపోయేసరికి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశారు.

    (ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)

    ధనుష్ 'కర' సినిమా ఈనెల 30న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బుచ్చిబాబు.. జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు. అలానే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని చెప్పాడు. దీంతో చరణ్ అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

    విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో 'పెద్ది' తీస్తున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు తదితరుల ఇతర పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)

  • టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్‌ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)

    పంజాబ్‌కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.

    ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్‌తో 2021 మార్చిలో మెహ్రీన్‌కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.

    (ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)

  • తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన సమంతని ఇప్పుడెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ.. వాటి కంటే విడాకులు, ఆరోగ్య సమస్యలు, రెండో పెళ్లి తదితర అంశాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం' మరో రెండు వారాల్లో రిలీజ్ కానుంది. అలానే మంగళవారం ఈమె పుట్టినరోజు కూడా. ఇంతలోనే చిన్నపాటి షాకిచ్చింది. తన దగ్గర ఇప్పుడేముంది? వేటిని వదులుకున్నానని ఓ పోస్ట్ రూపంలో బయటపెట్టింది.

    (ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)

    పని మీద ప్రేమ, నడిపించే శక్తి, మనసు చెప్పే విషయం, సంకల్పం, నమ్మిన నిజం, ఓ లక్ష‍్యం తనతో పాటు ఉన్నాయని చెప్పుకొచ్చిన సమంత.. ఎవరో వచ్చి ఎంపిక చేస్తారని ఎదురుచూడటం, నియంత్రించే ఆలోచన, నచ్చినట్లు ఉండాలనుకునే లక్షణం, పట్టుకుని వేలాడటం, హడావుడి పడటం లాంటి అంశాలని వదిలేశానని తెలిపింది. ఇందుకు సంబంధించి నాలుగు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

    చూస్తుంటే సమంత.. గత కొన్నేళ్లలో తన జీవితంలో జరిగిన సంఘటనలు, వాటి వల్ల తనలో వచ్చిన మార్పుల గురించి పరోక్షంగా ఈ పోస్టుతో చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఇక 'మా ఇంటి బంగారం' విషయానికొస్తే.. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. ఓ ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్(సమంత).. రౌడీలని ఎందుకు చితక్కొట్టాల్సి వచ్చిందనేది కాన్సెప్ట్. ఈ చిత్రానికి సామ్ భర్త రాజ్ నిడిమోరు స్టోరీ, నిర్మాణ పరంగా సహకారం అందించారు.

    (ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి)

  • రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది.

    అయితే పెద్ది మూవీ జూన్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియాలో టాక్‌ నడుస్తోంది. విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతలోనే పెద్ది ప్రీమియర్స్‌కు సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా ప్రీమియర్స్ విషయంలో కొత్త రికార్డ్ సెట్ చేయనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  జూన్ 24 న సాయంత్రం ఆరు గంటల నుంచే పెద్దఎత్తున ప్రీమియర్ షోలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

    అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు రామ్‌చరణ్ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్‌ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్‌ తెప్పిస్తాయని అంటున్నారు. దీంతో పెద్ది మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే పెద్ది రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. 

  • బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి గత రాత్రి నుంచి పలు వార్తలు వస్తున్నాయి. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎ‍న్నారై దగ్గర నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అషురెడ్డి.. తన అనుమతి లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటానని రాసుకొచ్చింది. ఇప్పుడు ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)

    '2021లో ఓ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సత్యనారాయణ అని తనని తాను పరిచయం చేసుకుని మీ అమ్మాయి పెళ్లి సంబంధం కోసం ఫోన్ చేశానని అన్నారు. మా అమ్మాయి మీకెలా తెలుసు అని అడిగాను. దీంతో మా అమ్మాయి, వాళ్ల అబ్బాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అని నాతో చెప్పారు. ఓసారి కాకినాడ వచ్చి వెళ్లండి అని కూడా అన్నారు. నేను కాకినాడ వెళ్లలేదు గానీ తెలిసిన వాళ్లతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి తెలుసుకోమన్నాను. అప్పటికే అతడికి పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని, సత్యనారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుదాం అని నాన్చుతూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వినడం'

    'నేను వైజాగ్‌లో ఉంటాను. మా అమ్మాయి, తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. మొదట నుంచి నాకు, అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. అషురెడ్డికి ఏం తెలీదు, అమయకురాలు. తల్లి పోత్రాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏం తెలీదు. కానీ మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష‍్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. రాత్రికల్లా హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు(సోమవారం) ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పింది. నేను కూడా ఈ రాత్రికి హైదరాబాద్ వెళ్తాను' అని అషురెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

    (ఇదీ చదవండి: సాయిపల్లవి లేదా రుక్మిణి.. ఇద్దరిలో ఎవరు?)

  • ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ పరంగా కొందరు హీరోయిన్లు టాప్‌లో ఉన్నారు. వాళ్లలో సాయిపల్లవి, రుక్మిణి వసంత్ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రామాయణ, కల్కి 2 లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీస్‌తో సాయిపల్లవి.. ఎన్టీఆన్ 'డ్రాగన్'తో రుక్మిణి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇ‍ప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: 'వారణాసి' కంటే ముందు మహేశ్ నుంచి ఓ సినిమా)

    ఎన్నో వందల పాటలతో దిగ్గజ గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్ తీసేందుకు అంతా సిద్ధమైంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి.. ఈ క్రేజీ బయోపిక్‌కి దర్శకుడు కాగా సుబ్బలక్ష‍్మి పాత్ర కోసం సాయిపల్లవిని ఎంపిక చేశారనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పుడు ఉన్నట్టుండి రుక్మిణి పేరు తెరపైకి వచ్చింది. పలు సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా సాయిపల్లవి, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందని అంటున్నారు.

    మరికొందరేమో సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లో సాయిపల్లవి ఇంకా ఉందని, రుక్మిణి అంటూ వస్తున్నవి రూమర్స్ మాత్రమేనని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటనేది దర్శకనిర్మాతే క్లారిటీ ఇవ్వాలి.

    (ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)

  • విశాల్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు.

    హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.

    ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

  • మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరికైనా చాలా స్పెషల్. స్కూల్, కాలేజీ డేస్ ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని క్షణాలు. ఆనాటి రోజులను ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంటుంది. మన ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగినా రోజులను చూసి చాలా మురిసిపోతాం. ఆ రోజుల్లో దిగిన ఒక్క ఫోటో ఉన్న సరే పట్టలేనంతగా సంతోషంతో మనల్ని మనం చూసుకుని సంబురపడిపోతాం. అలా తాను డిగ్రీ చదివిన రోజులను టాలీవుడ్ హీరోయిన్ మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఆనాటి రేర్‌ పిక్‌ను షేర్ చేసింది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకొండి అంటూ అభిమానులకు చిన్న పరీక్ష పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దాం.

    నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో మెప్పించింది. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిథి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. కానీ ఆ తర్వాత పెద్దగా సక్సెస్‌ రాకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ముద్దుగుమ్మ.. బీజేపీ నాయకురాలిగా కొనసాగుతున్నారు.

     

     

  • ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో మహేశ్ బాబు బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ తొలి వారంలో ఇది థియేటర్లలోకి రానుంది. కానీ ఇంతకంటే ముందే మహేశ్ ఓ మూవీతో రాబోతున్నాడు. కాకపోతే ఇది ఈయన నటించిన చిత్రం కాదు నిర్మాతగా వ్యవహరించినది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు.

    (ఇదీ చదవండి: సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు)

    కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేశ్ మహా తీసిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించాడు. గతేడాది ఆగస్టులోనే టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. కొన్నిరోజుల క్రితం తొలి పాట రిలీజ్ చేశారు. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 5న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ వదిలారు.

    జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మహేశ్‌బాబు, నమ్రత.. ఈ చిత్రాన్ని‌ సమర్పిస్తున్నారు. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థలపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్‌ రెడ్డి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే ఈ సినిమాని సైకలాజికల్‌ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది)

  • యాంకర్‌ విష్ణుప్రియకు జేడీ చక్రవర్తి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో చాన్స్‌ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె చెప్పింది. అప్పటి నుంచి జేడీ, విష్ణుప్రియల పెళ్లిపై రకరకాల రూమర్స్‌ వచ్చాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని సోషల్‌ మీడియా కోడై కూసింది. 

    తాజాగా ఈ పుకార్లపై జేడీ చక్రవర్తి  స్పందించాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

    ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్‌, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్‌పై యాంకర్ ప్రశ్నించగా.. జేడీ చక్రవర్తి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘విష్ణుప్రియ గురించి నేను ఒక విషయం చెబుతా. నేను నటుడిగానే కాకుండా నాకు మరో కోణం ఉంది. అదే ఫిలాసఫి. దానిపరంగా విష్ణుప్రియ నా శిష్యురాలు. విష్ణుప్రియకు నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయికి నాకు ఎఫైర్ ఉందని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోకటి లేదు. ఆమె నా శిష్యురాలు... పైగా పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తోంది. అలాంటి అమ్మాయితో నా పెళ్లి ముడిపెట్టడం సరికాదు’ అని జేడీ చెప్పుకొచ్చాడు.

    ఇక విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు ఫిలాసఫికల్‌గా మాత్రమే శిష్యురాలు.తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌తో నాకు ఏ సంబంధం లేదు. తన ఇష్టం తనది.. తను నాతో డిస్కష్ చేసేది ఫిలాసఫి. విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఫిలాసఫి వేరు, దేవుడు వేరు. ఫిలాసఫికి సంబంధించిన విషయాలకే తను నాకు ఫోన్ చేసి కన్సల్ట్ అవుతుంది. దాని మీద మాత్రమే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను విష్ణుప్రియని కలిసి దాదాపు మూడేళ్లు అవుతోంది అని జేడీ చక్రవర్తి తెలిపారు. 

  • రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్‌ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. పెద్ది ఐటమ్ సాంగ్‌ కోసం పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించగా.. చివరికీ కోలీవుడ్ భామ శృతిహాసన్ పేరు ఖరారు చేశారు.

    ప్రస్తుతం ఈ సాంగ్‌ను హైదరాబాద్‌లోనే షూట్ చేస్తున్నారు. ఇవాళ ఈ సాంగ్ షూటింగ్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శృతిహాసన్ రెమ్యునరేషన్‌పై టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ బ్యూటీ జాక్‌పాట్ కొట్టేసినట్లే. కాగా.. ఈ పాటను టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్నారు. ఈ స్పెషల్‌ సాంగ్‌ను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

    కాగా.. పెద్ది మూవీ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్‌కు పోస్ట్‌పోన్ చేశారు. 
     

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది)

    కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' ‍అనే వెబ్ సిరీస్‌లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.

    'సిరీస్ కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు'

    'ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి)

  • బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే.  ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్‌గా మారింది.

    ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ప్రత్యేకంగా తన భర్తకు విషెస్ తెలిపింది. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ గంగా అంటూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సంవత్సరం మాకు చాలా ప్రత్యేకమైనది… ఎందుకంటే మాతో పాటు మా చిన్న తల్లి కూడా ఉన్నారంటూ రాసుకొచ్చింది. మా జీవితంలో నువ్వు ఉండటం మా అదృష్టం.. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ భర్తపై ప్రేమను చాటుకుంది బిగ్‌బాస్ శివజ్యోతి. ఇది చూసిన పలువురు సినీతారలు ఈ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు.

  • ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి తెలిసిందే. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. ’అనే డైలాగ్‌తో పాటు ఆయన ఏం మాట్లాడినా..ఆ మాటలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి.ఇక ఇటీవల తన 50 ఏళ్ల వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) సందర్భంగా తన భార్య కల్పనను మరోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. అయితే ఎప్పుడు రాజకీయ సభల్లో లేదా కాలేజీలో నిర్వహించే ఈవెంట్స్‌లో మాత్రమే పాల్గొనే మల్లారెడ్డి..తొలిసారి ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి గెస్ట్‌గా వెళ్లాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘సర్కార్‌ షో’ ఆరో సీజన్‌లో పాల్గొన్నాడు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ ఎంటర్ టైన్మెంట్ షో లో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్ లు చేసి అలరించారు. 

    తాజాగా దీనికి సంబంధించిన కొత్త ప్రోమో రిలీజ్‌ అయింది. అందులో హోస్ట్‌ సుధీర్‌పై మల్లారెడ్డి వేసిన పంచులు నవ్వులు పూయిస్తుంది. ‘పెళ్లి చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్‌ ఉంటాయా సార్‌’ అని సుధీర్‌ అడిగితే..‘పనికిరానోళ్లకు ప్రాబ్లమ్స్‌ ఉంటాయి’ అని తనదైన శైలీలో జవాబిచ్చాడు. అంతేకాదు ‘ఇంత ఏజ్‌ వచ్చినా పెళ్లి చేసుకోకపోతే నువ్వేం మనిషివయ్యా’ అని సుధీర్‌ని అనగానే.. పక్కనే ఉన్న అలీ, శివాజీ పలగబడి నవ్వారు. 

    ఇక ‘సుధీర్‌ నువ్వు పెళ్లి చేసుకో.. నీ పిల్లలకు మల్లారెడ్డి తన కాలేజీలో ఫ్రీ సీటు ఇస్తాడు’అని అలీ అంటే..‘అవన్నీ ఏం లేవు..ఇది గవర్నమెంట్‌ కాదు’అని అంటూనే.. ‘ఫ్రీ కోసం పిల్లలు కంటడా ఏంటి? అని చమత్కరించాడు. ఇక ‘మీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది’అని సుధీర్‌ అడిగితే.. ‘డైరెక్టర్‌ ఎవరిని సెట్‌ చేస్తే వాళ్లు నటిస్తారు’ అని మల్లారెడ్డి తనదైన శైలీలో జవాబిచ్చాడు.  ఇంకా మల్లారెడ్డి ఏం మాట్లాడాడు.. ఆయన చేసిన సందడి ఎంటి అనేది మే1న ఫుల్‌ ఎపిసోడ్‌ రిలీజ్‌ అయిన తర్వాత తెలుస్తుంది. 

  • ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ క్యాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ పెళ్లి చేసుకుంది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ నూతన దంపతులకు విషెసె చెబుతున్నారు. రణవీర్ సింగ్, కృతి సనన్, పరిణీతి చోప్రా, ఖుషీ కపూర్, శర్వరి, వాణి కపూర్, వరుణ్ ధావన్, రష్మిక మందన్నతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అయితే ఆమె తన భర్త వివరాలను వెల్లడించలేదు.

    కాగా.. షానూ శర్మ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు క్యాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ కీలక పాత్రల్లో వచ్చిన వార్‌-2 మూవీకి సైతం వర్క్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు నటుల కెరీర్‌ను తీర్చిదిద్దడంలో  షానూ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె రణ్‌వీర్ సింగ్ బ్యాండ్ బాజా బారాత్‌, వాణి కపూర్‌ మూవీ దమ్ లగా కే హైషాలో, అర్జున్ కపూర్‌ ఇషాక్‌జాదే చిత్రాలకు నటీనటులను ఎంపికచేసింది.  అనుష్క శర్మ నటించిన రబ్ నే బనా ది జోడి మూవీకి క్యాస్టింగ్ డైరెక్టర్‌గా సేవలందించారు.  గతేడాది రిలీజైన  సైయారా మూవీకి అహాన్ పాండే, అనీత్ పడ్డాను  షానూ శర్మనే ఎంపిక చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా మారింది.

  • ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఓటీటీ స్ట్రీమింగ్‌ తేది మారింది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ది కేరళ స్టోరీకి కొనసాగింపుగా ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే ఓటీటీ రిలీజ్‌ గురించి ప్రకటించారు. అయితే, తాజాగా మరో తేదిని ప్రకటిస్తూ ఎక్స్‌ పేజీలో షేర్‌ చేశారు. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో  కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

    ది కేరళ స్టోరీ 2 మొదట మే 8  ZEE5లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, స్ట్రీమింగ్ తేదీని మే 1, 2026కి ముందుకు జరిపారు. అయితే, ఈ ముందస్తు విడుదలకు గల సరైన కారణాన్ని చిత్ర నిర్మాతలు గానీ, ప్లాట్‌ఫామ్ గానీ వెల్లడించకపోవడంతో, ఈ మార్పు చాలా మందిని ఆశ్చర్యపరిచింది.  థియేటర్స్‌లో విడుదల సమయంలో అనేక చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొని, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను పొందింది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

  • బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసులో ప్రియురాలు రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆమె ఇప్పటికే నిర్దోషిగా బయటకొచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ముంబైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఉ‍త్తర్వులు జారీ చేసింది. ఆమె సోదరుడు షోవిక్, తల్లి సంధ్యలకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టరీ డెత్ కేసులో వీరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

    కాగా.. 2020లో హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతి తర్వాత ప్రియురాలైన రియా చక్రవర్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె తమ్ముడు షోయిక్‌లకు చివరికి క్లీన్ చిట్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రియా తిరిగి తన కెరీర్‌ నటనలో మళ్లీ అడుగుపెట్టింది.  ఆమె ఇటీవలే రోడీస్‌లో కనిపించింది. ఆమె తన సొంత పాడ్‌కాస్ట్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో అమీర్ ఖాన్, సుష్మితా సేన్, ఫర్హాన్ అక్తర్, హనీ సింగ్ లాంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.

     

  • ‘ఆర్‌‌ఎక్స్‌‌ 100’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి..తొలి మూవీతోనే తెలుగు యువత మనసు దోచుకున్న బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. అంతకు ముందు పంజాబీలో సినిమాలు చేశారు. హిందీ సీరియళ్లలో నటించారు. అయితే, అక్కడ రాని గుర్తింపు... తెలుగులో ఒక్క సినిమాతో వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ విడుదలైన తర్వాత పాయల్ రాజ్‌‌పుత్‌‌కు ఓవర్ నైట్‌‌లో స్టార్‌‌డమ్ వచ్చింది. అక్కడ నుంచి తెలుగులో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ‘మంగళవారం’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ..తన బాయ్‌ఫ్రెండ్‌ని తెలుగు తెరకు పరచయం చేయనుంది. 

    సోషల్‌ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యవాళ్లకు సౌరబ్ ధింగ్ర గురించి తెలిసే ఉంటుంది. పాయల్‌తో కలిసి చేసిన హాట్‌ఫోటో షూట్‌ అప్పట్లో బాగా వైరల్‌ అయింది. ఆయన ఇప్పుడు ‘ఫస్ట్‌ టైం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి హేమంత్ ఇప్పనపల్లి కథ-దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 28 విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

    ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కి పాయల్‌ రాజ్‌పుత్‌ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు.
     

  • బిగ్‌బాస్‌ ఫేమ్‌, సినీనటి అషురెడ్డి తనపై నమోదైన కేసు గురించి సోషల్‌మీడియా ద్వారా స్పందించింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్‌ చేసింది. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్‌ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్‌ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను  పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి:  నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం)

    సినీ నటి అషురెడ్డిపై హైదరాబాద్‌లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి  రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర..  2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.
     

Politics

  • న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న హర్భజన్‌ నివాసం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం (ఏప్రిల్‌ 25) నిరసనలు చేపట్టారు. దీంతో ఆదివారమే కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పించడం గమనార్హం.

    హర్భజన్ సింగ్‌ మాజీ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న హర్భజన్‌ సింగ్‌ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. రాఘవ్ చద్దాతో పాటు బీజేపీలో చేరిన ఆరుగురు సభ్యుల్లో హర్భజన్‌ ఒకరు. భజ్జీకి ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ కమాండోలు భద్రత కల్పిస్తారు.

    హర్భజన్‌కు భద్రత కల్పించాలని కేంద్రం నుంచి ఆమోద ముద్ర పడగానే పంజాబ్ పోలీసులు ఆయన భద్రతను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటు సభ్యుడైన హర్భజన్‌కు పోలీస్ భద్రతలో 9-10 మంది సిబ్బంది ఉండేవారు. శనివారం ఆ భద్రత తీసివేశారు. ఇప్పుడు జలంధర్‌లోని ఆయన ఇంటి బయట సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కనిపిస‍్తున్నారు.

    శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసనల్లో హర్భజన్ ఇంటి గోడపై ద్రోహి అని స్ప్రే పెయింట్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా ఇళ్ల ముందు కూడా ఇలాంటి నిరసనలే జరిగాయి.

    రాఘవ్ చద్దాతో కలిసి బీజేపీలో చేరినవారిలో సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్‌జిత్‌ సహ్నే ఉన్నారు.

    మరోవైపు, ఇటీవలే రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఆయనకు పంజాబ్ ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2న రాఘవ్‌ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్‌ స్థానం నుంచి ఆప్‌ తొలగించింది. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆప్‌ ఆరోపించింది. 
     

  • కోల్‌కతా: ఈసారి పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం సాగుతోంది.  ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. రెండో విడతకు సిద్ధమైన తరుణంలో మోదీ ప్రచారం మరింత ఊపదుకుంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీనే లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. 

    ఈరోజు(ఆదివారం, ఏప్రిల్‌ 26వ తేదీ) మమతా బెనర్జీ కీలకంగా భావించే నియోజకవర్గాల్లో పర్యటించిన మోదీ.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 15 ఏళ్ల నుంచి ఇక్కడ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఏమీ మార్పులేదని, ఈసారి కచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందేనన్నారు. 

    ‘ పశ్చిమ బెంగాల్‌ ఎక్కడా చూసినా అమ్మ కన్నీటి జల్లే కనిపిస్తుంది. మనిషి అనేవాడు భయమనే ముల్లుపై అడుగులు వేస్తూ జీవిస్తున్నాడు. ఇక్కడ మట్టి ద్రోహల చెరలో ఉంది. ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడంలో మమతా బెనర్జీ సర్కార్‌ పూర్తిగా  విఫలమైంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళల పట్ల అరాచకాలే కన్పిస్తున్నాయి. 

    కోల్‌కతా ఆర్జీ కార్‌ ఆస్పత్రిలో ఓ యువ మహిళా డాక్టర్‌ను దారుణంగా పాడుచేసి చంపేశారు. ఇక కోల్‌కతా నగరానికి 20 కి.మీ దూరంలో ఉన్న కమ్దునిలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు.  ఈ తరహా ఘటనలే పశ్చిమ బెంగాల్‌లో కనిపిస్తున్నాయి.  ఇటువంటి ప్రభుత్వం మీకు కావాలా.. లేక మహిళలకు అండగా ఉండే మా ప్రభుత్వం కావాలా?, ప్రభుత్వాన్ని మార్చి చూడండి’ అంటూ బెంగాల్‌ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. 

     

  • సాక్షి,హైదరాబాద్‌: దుర్మార్గ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

    ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పలువురు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌లో భారీగా ఓట్లు వచ్చాయి. దుర్మార్గ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అంతా ముందుకు వస్తున్నారు. హుజూర్‌నగర్‌లో గతంలో ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలు మారలేదు. కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అనామకుడైన సైదిరెడ్డిని గెలిపించాం. 

    2023 శాసన సభ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీని వదిలిపెట్టి పోయారు. హుజూర్ నగర్‌లో దుర్మార్గమైన కాంగ్రెస్ వైఖరీని బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్పూర్తితో ఎదుర్కొంటున్నారు. సైదిరెడ్డి ఆయన సొంత ఊరులో సర్పంచ్‌ని గెలిపించుకోలేక పోయారు. ఆనాడు జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరి  25 యేండ్లు పూర్తి చేసుకొని 26 వసంతంలోకి అడుగుపెడుతోంది. దేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీకే ఉంది.

    సీఎం రేవంత్‌రెడ్డికి ఐడెంటిటీ క్రైసిస్‌ ఉంది.. అందుకే కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు. రేవంత్‌ పేరు చెప్పాలంటేనే మొహం తిప్పుకుంటున్నారు. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది. ఒక్కొక్క కాంగ్రెస్‌ నేత కమల్‌హాసన్‌ను మించి యాక్టింగ్‌ చేస్తున్నారు. వంద రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మించారు. బాండ్లు పేపర్లు రాసి, దేవుడి మీద ఒట్టు వేశారు. 420హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?. మాటలు ఆకాశన్నంటాయి.. చేసింది మాత్రం సున్నా.. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని నల్గొండ రైతులు చెబుతున్నారు’అని తెలిపారు. 

  • సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

    ‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు.

    ..టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్‌ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు

    ..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా

    ..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్‌ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు.

    ..తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు

    ..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్  రూమ్‌లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్‌గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్‌లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్‌కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.

  • సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు... దాన్ని రాష్టాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడటం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఇంకేమన్నారంటే..

    పెట్రోల్, డీజిల్ దొరక్క జనం కష్టాలు
    ఆంధ్రప్రదేశ్ లో గత మూడు రోజులుగా జనం పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని, దేశంలోనే నా కంటే అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేడని, ప్రధాని మోడీకి కూడా నాకన్నా ఎక్కువ ముందుచూపు లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఆయన కుమారుడు లోకేష్ ను అడిగితే ఏపీకి ఏముందని అడిగితే మా నాన్న చంద్రబాబు ఉన్నాడు చాలు అంటారు. వీళ్ల కోతలకు రాష్ట్రంలో సొరకాయలు చాలవు. ఇన్ని డబ్బాలు కొట్టుకునే వాళ్లు రాష్ట్రాన్ని ఎందుకింత దుస్దితిలోకి నెడుతున్నారు?

    పెట్రోల్, డీజిల్ లకు పెట్రోల్ బంకుల్లో జనం బారులు తీరితే మీకు కనపడేది క్యూలు మాత్రమే .. కానీ ఈ ఆగచాట్ల మాటున పేద, మధ్యతరగతి జనాల బతుకులు నలిగిపోతున్నాయన్న స్పృహ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌కు లేకుండా పోతోంది. పౌరసరఫరాలశాఖ అధికారులతో నిన్న సీఎం చంద్రబాబు సమీక్ష పెట్టిన తర్వాత చమురు కష్టాలు ఇంకా పెరిగాయి. ఇవాళ కూరగాయలు, మామిడి పళ్లు, సరుకులు రవాణా చేయాలంటే డీజిల్ లేని పరిస్ధితి నెలకొంది.  డీజిల్ లేక కాంక్రీట్ మిక్సర్లు ఆడటం లేదు, కూలీలకు పని దొరకట్లేదు, లిఫ్ట్ లు ఆడట్లేదు. ఇదంతా బ్లాక్ మార్కెటీర్లకు పండగలా మారింది. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించలేని మీ అనుభవం ఎవరికి కావాలి?

    చంద్రబాబు అనుభవం ఏమైంది?
    కేంద్రంలో నడుస్తున్న మోడీ ప్రభుత్వం మా భుజాల మీద ఉందని చంద్రబాబు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు రాష్ట్రం కోసం మీ పలుకుబడి వాడలేరా ? చంద్రబాబు తన  పలుకుబడిని హద్దుల్లేని అప్పులు తీసుకురావడానికి లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈడీ సోదాలు చేయించడానికి వాడుతున్నారు. ఇది మేం చెప్పడం లేదు, సాక్ష్యాత్తు చంద్రబాబు తమ్ముడే చెప్తున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నారు ? ఇక్కడ ఓటు కూడా లేని వాళ్లు ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ప్రకటనలు చేస్తుంటారు. చంద్రబాబుకు ఉన్న అధికార బలాన్ని రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కదా వాడుకోవాలి. కానీ చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. 2047కి రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటున్న చంద్రబాబు.. ఇవాళ ప్రజల కష్టాలు చూడరా ? 2047 వరకూ ఎవరు బతికి ఉంటారు ? ఇప్పుడు బతికి ఉన్న సమస్యలు ముందు పరిష్కరించండి.

    లోకేష్ కనబడరు, పవన్ అనారోగ్యం, బాబు హ్యాండ్సప్..
    రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో జనం ఇబ్బందులు ఎదుర్కుంటుంటే... పది రోజుల నుంచి నారా లోకేష్ నాయుడు గారు కనిపించడం లేదంటున్నారు. పది రోజుల నుంచీ లోకేష్ కనబడరు, పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగోదు, చంద్రబాబు చేయలేకపోతున్నారు. తక్షణం  చంద్రబాబు మేల్కోవాలి. ఈ సొరకాయ కోతలు ఆపి మోడీతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ఇబ్బందుల నుంచి ప్రజల్ని గట్టెక్కించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

    అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
    నీతి నిజాయితీలకు, అవినీతిరహిత పాలనకు ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. చంద్రబాబు  సావాసం కోసం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇక్కడికి వచ్చి, ఆయన దగ్గర అవినీతి నేర్చుకుని అక్కడ జైలు పాలయ్యారు. ఇప్పుడు ఏడుగురు రాష్ట్ర మంత్రులు సింగపూర్ కు వెళ్లడం వల్ల సింగపూర్ వాళ్లు చెడిపోకుండా ఉంటే చాలు. ఏపీలో వీళ్లు చేస్తున్న అవినీతి, డ్రగ్స్, గంజాయి వ్యవహారాలతో సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు.

    వ్యవసాయం లేని చోటకు వ్యవసాయ మంత్రి వెళ్తారు, పరిశ్రమలు ఎలా పెట్టాలో నేర్చుకోవడానికి పరిశ్రమల మంత్రి లేకుండానే వెళ్తారు, మున్సిపాలిటీల్లో రోడ్లు వేయడానికి గ్రాంట్లు ఇవ్వరు, మళ్లీ సింగపూర్ కు వెళ్లి ఏం నేర్చుకుంటారో చూడాలి. ఐదారు కోట్లు లెక్క రాసుకోవడం తప్ప మంత్రుల సింగపూర్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. గంజాయి సిగరెట్ల నుంచి చాక్లెట్ల వరకూ వచ్చిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

  • సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్‌ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ  కాకాణి ధ్వజమెత్తారు.

    ‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు

    ..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్‌ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్‌ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్‌ జగన్ హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Business

  • ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

    మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.

    ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.

    ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..

    ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.

    ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది.

  • భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (ఏప్రిల్ 19 నుంచి 25 వరకు) పసిడి ధరలు ఎంత తగ్గాయి?, ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 19 (ఆదివారం) 1,55,780 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు శనివారం (ఏప్రిల్ 25) నాటికి 1,54,040 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఏడు రోజుల్లో 1,42,800 రూపాయల నుంచి రూ.1,41,200 వద్దకు చేరింది.

    దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో 1,55,930 రూపాయల దగ్గర నుంచి రూ.1,54,190 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,42,950 రూపాయల నుంచి 1,41,350 రూపాయల వద్దకు చేరింది.

    చెన్నైలో బంగారం ధరలు తగ్గాయి. గత ఆదివారం (ఏప్రిల్ 19) రోజు రూ.1,56,660 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి.. ఏప్రిల్ 25 నాటికి 1,54,910 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 143600 రూపాయల వద్ద నుంచి 142000 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ధరలు ఎంతలా తగ్గాయో స్పష్టంగా తెలుస్తుంది.

    వెండి ధరలు ఇలా..
    బంగారం బాటలోనే.. వెండి కూడా అడుగులు వేసింది. ఏప్రిల్ 19న రూ.2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ ఏప్రిల్ 25 (శనివారం) నాటికి రూ.2.70 లక్షల వద్దకు చేరింది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

    ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

  • సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం, భవిష్యత్ మొబిలిటీ పరిష్కారాలపై నూతన దృష్టి సారించడం వంటివి చేయడం వల్ల కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది.

    సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఈ కంపెనీ.. మొత్తం 10 మిలియన్ల ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మైలురాయిని దాటినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థిరమైన వినియోగదారుల డిమాండ్.. నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణల మద్దతుతో, గత నాలుగేళ్లలో తమ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని సంస్థ వెల్లడించింది.

    సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం పటిష్టమైన సరఫరాదారుల వ్యవస్థ మద్దతుతో, భారతదేశం అంతటా 1,200కు పైగా టచ్‌పాయింట్‌లతో కూడిన విస్తృత నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. భారతదేశంలో దీని ప్రయాణం 2006లో సుజుకి హీట్ 125 మరియు సుజుకి జీయస్ 125 వంటి మోటార్‌సైకిళ్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2007లో సుజుకి యాక్సెస్ 125ను విడుదల చేశారు. ఈ మోడల్ అమ్మకాలలో కీలక పాత్ర పోషించి, 125cc స్కూటర్ విభాగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది.

    ఇదీ చదవండి: రూ.10 లక్షలుంటే.. ఓ కారు మీ సొంతం!

    కాలక్రమేణా..సుజుకి గిక్సర్ సిరీస్, సుజుకి వి-స్ట్రోమ్ SX వంటి మోటార్‌సైకిళ్లతో పాటు, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, సుజుకి అవెనిస్ వంటి ఉత్పత్తులతో సుజుకి తన పోర్ట్‌ఫోలియోను మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. సుజుకి హయబుసా, సుజుకి GSX-8R వంటి దాని ప్రీమియం మోడళ్లు, వివిధ విభాగాలలో దాని ఉనికిని మరింత బలోపేతం చేశాయి.

  • చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్‌ను సేవ్‌ చేసే స్మార్ట్‌ గాడ్జెట్లే ఇవి!

    చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!
    వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్‌ మినీ బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్ ఒక స్మార్ట్‌ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా  పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌లో మూడు స్పీడ్‌ సెట్టింగ్స్‌ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్  చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్‌ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్‌లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.

    చిన్న ప్రింటర్‌! 
    ప్రతి చిన్న ప్రింటౌట్‌ కోసం జిరాక్స్‌ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్‌ ప్రింటర్‌ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్‌ థర్మల్‌ ప్రింటర్‌ ఉంటే జిరాక్స్‌తో పని ఉండదు. స్టూడెంట్స్‌కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌ చాయిస్‌. మొబైల్‌తో బ్లూటూత్‌ ద్వారా సులభంగా కనెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్‌ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్‌ చేసుకోవచ్చు. ఇంక్‌ అవసరం లేకుండా థర్మల్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్‌ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్‌ ప్రింట్‌ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్‌ హెల్పర్‌లా ఉంటుంది. ధర రూ. 1,799.

    చార్జ్‌ కూడా.. స్టాండ్‌ కూడా!
    మొబైల్‌ను చార్జ్‌ చేస్తూనే వీడియోలు, సీరియల్స్‌ చూడాలా? లేదా గేమ్స్‌ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్‌ వన్ స్మార్ట్‌ చార్జర్‌ కేబుల్‌. ఇది కేవలం కేబుల్‌ మాత్రమే కాదు, చిన్న స్టాండ్‌లా కూడా పనిచేసే స్మార్ట్‌ ఐడియా. ఈ కేబుల్‌లో బిల్టిన్  ఫోల్డబుల్‌ స్టాండ్‌ ఉంటుంది. కేబుల్‌ పెట్టగానే మొబైల్‌ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో మొబైల్, టాబ్లెట్‌ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్‌ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్‌తో తయారైన ఈ కేబుల్‌ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్‌లో లేదా ట్రావెల్‌లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే!

  • రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్‌ల గురించి తెలుసుకుందాం.

    ఐసీఎఫ్ కోచ్‌లు
    భారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్‌తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్‌లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్‌లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.

    ఐసీఎఫ్ కోచ్‌లలో.. స్లీపర్ క్లాస్‌లో 72 బెర్త్‌లు, థర్డ్ ఏసీ క్లాస్‌లో 64 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్‌ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.

    ఐసీఎఫ్ కోచ్‌లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్‌లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.

    ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
    ఇక ఎల్‌హెచ్‌బీ (లింకే హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.

    ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్‌లో 80 బెర్త్‌లను, థర్డ్ ఏసీ క్లాస్‌లో 72 బెర్త్‌లు ఉంటాయి. ఇవి ICF కోచ్‌ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.

    ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్‌లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి.

    ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?

  • కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ తాజాగా గూగుల్‌ క్లౌడ్‌తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్‌ప్రైజ్‌ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.

    తమ ఏజెంట్‌ మేనేజ్‌మెంట్‌ సూట్‌ని జెమిని ఎంటర్‌ప్రైజ్, గూగుల్‌ క్లౌడ్‌ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్‌ టెక్నాలజీస్‌ సీఈవో శ్రీకాంత్‌ చక్కిలం తెలిపారు.

  • గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.

    2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.

    పాశ్చాత్య దేశాల ఆంక్షలు
    రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.

    లోటు బడ్జెట్!
    2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.

    ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తి
    ప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

  • ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.

    ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.

    రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్‌కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి.

  • దేశంలో బంగారం రేట్లు గత వారంలో సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. ఈ నెలలో అంతకుముందు కనిపించిన భారీ స్థాయి దిద్దుబాట్లు పునరావృతం కాలేదు. పసిడి ధర గత రెండు రోజులుగా స్వల్ప స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. గడిచిన వారం అంతా పసిడి ప్రియులకు మిశ్రమ ఫలితాలను అందించింది.

    తగ్గిన బంగారం ధరలు
    ఈవారం చివరి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,040, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,200 వద్ద స్థిరపడింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఏప్రిల్ 20 నుండి 23 వరకు 10 గ్రాములకు రూ.2,230 తగ్గుదల నమోదైంది.

    ఎంసీఎక్స్ మార్కెట్ ధోరణి
    దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌ (MCX)లో ఈ వారం బంగారం అల్లకల్లోలంగా గడిచింది. ఏప్రిల్ 20 నుంచి 24 మధ్య ధరలు సుమారు రూ. 400 తగ్గాయి. అయితే, తాజా ట్రేడింగ్ సెషన్‌లో 0.7% పుంజుకుని రూ. 1,52,799 వద్ద ముగిసింది. ఈ స్వల్ప రికవరీ ఉన్నప్పటికీ, వారం మొత్తం పనితీరును పరిశీలిస్తే ధరలు 0.23% తగ్గుదలనే నమోదు చేశాయి.

    అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
    గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,710.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధరలు 0.38% పెరిగినప్పటికీ, వారం మొత్తంగా చూస్తే 2% పైగా క్షీణత కనిపించింది. బలమైన అమెరికన్ డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌ బంగారానికి ప్రతికూలంగా మారాయి.

    వచ్చే వారం అంచనా
    వచ్చే వారం (ఏప్రిల్ 27 - మే 2, 2026) బంగారం ధరలు మిశ్రమ ధోరణిని చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు.. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇది బంగారానికి అవరోధంగా మారుతుంది. అమెరికా-ఇరాన్ చర్చల ఫలితాలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయి. ఇన్వెస్టర్లు ప్రస్తుతం రిస్క్ తీసుకోవాలా లేక జాగ్రత్తగా ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్నారని బ్రిక్ వర్క్ రేటింగ్స్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ అభిప్రాయపడ్డారు.

  • గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ. 319 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ4లో నమోదైన రూ. 304 కోట్లతో పోలిస్తే సుమారు 5 శాతం అధికం. సమీక్షాకాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 9,413 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ. 10,553 కోట్లకు చేరింది.

    నికర వడ్డీ ఆదాయం (చెల్లించినది పోగా) రూ. 4,907 కోట్ల నుంచి రూ. 5,677 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 2 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 5.95 శాతం నుంచి 5.93 శాతానికి నెమ్మదించింది. వ్యాపారం 19 శాతం వృద్ధితో రూ. 5.75 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం అసెట్స్‌లో మొండి పద్దులకు ప్రొవిజనింగ్‌ క్యూ1లో నమోదైన 1.92 శాతం నుంచి క్యూ4లో 1.52 శాతానికి తగ్గింది.

    మైక్రో ఫైనాన్స్‌ విభాగం మినహా అసెట్‌ క్వాలిటీ స్థిరంగా ఉందని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. పరిశ్రమవ్యాప్తంగా సూక్ష్మ రుణాల విభాగంలో సవాళ్లు ఎదురైనట్లు వివరించారు. ప్రస్తుతం స్థూల మొండిబాకీలు, నికర మొండిబాకీలు వరుసగా 1.61 శాతం, 0.48 శాతానికి దిగి వచ్చినట్లు చెప్పారు.

    ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో గత ఫిబ్రవరిలో బయటపడిన రూ.590 కోట్ల ఫ్రాడ్‌ ఉదంతం మార్చి త్రైమాసిక ఫలితాలపై (Q4FY26) ఎటువంటి ప్రభావం చూపలేదని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. ఇతర బ్యాంకులలో ఇలాంటి సంక్షోభాలు సద్దుమణగాలంటే దాదాపు సంవత్సరం పడుతుందని, కానీ ఇక్కడ అలా జరగలేదని పేర్కొన్నారు.

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా అంగీకరించారు.  ఏపీలో పెట్రో కొరతకు సంబంధించి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయన సమీక్షలో అధికారులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కంపెనీలు రిటైల్ ఔట్‌లెట్లకు ఇంతకు ముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీని ఫలితంగా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరత కొనసాగుతోందన్నారు.  అధికారులతో చెప్పిన దానితో ఏకీభవించిన చంద్రబాబు.. ఈ ఇంధన సంక్షోభాన్ని తొందరగా నిలువరించాలని  చంద్రబాబు సూచించారు. 

    కాగా, మూడు రోజుల నుంచి ఏపీలో పెట్రో కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నయార, రిలయన్స్, జియో బంకులకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శనివారం పెట్రోల్, డీజిల్ డిమాండ్ 34 శాతం పెరగగా, ఆదివారం 22 శాతం పెరిగింది.

    విజయవాడ నుండి తిరుపతి వరకు హైవేలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు కూడా డీజిల్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

    సమస్య ఎప్పటికి సాధారణ స్థితికి వస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • సాక్షి,తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

     శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు.

     

     

  • విశాఖ: గాజువాకలో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది. పిల్లర్‌లకు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డవారికి చికిత్స అందుతోంది.

     

     

  • సాక్షి, విజయవాడ: ఏపీలో పెట్రోల్, డీజిల్  కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్‌లు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, మూడు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత సమస్య ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు.

    ఏపీలో దాదాపు 50 శాతం వరకు బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. మూడు రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరి.. గంటల సమయంలో క్యూలైన్‌లోనే ఉండాల్సి వస్తోంది. కాగా, అధికారికంగా 10 శాతం పెట్రోల్ బంక్‌లు మూతపడినట్టు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

    విజయవాడ..

    • తీవ్రంగా డీజిల్, పెట్రోల్ కొరత.

    • రూరల్ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు

    • విజయవాడ నగర పరిధిలో ఇప్పటికే మూతబడ్డ పలు బంక్‌లు

    • బందరు రోడ్డులోని సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద భారీగా క్యూకట్టిన వాహనదారులు

    • చుట్టుపక్కల ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో సిటీ పోలీస్ సర్వీస్ బంక్ వద్ద అర కిలోమీటర్ మేర క్యూ

    • కార్ల కోసం ప్రత్యేకంగా ఒక క్యూలైన్ ఏర్పాటు చేసిన పోలీసులు

    • రేషన్ పద్ధతిలో బైక్‌కు 300 పెట్రోల్, కారుకు 1000 రూపాయల డీజిల్ ఫిల్ చేస్తున్న వైనం

    • డీజిల్ కోసం గంటల తరబడి బంక్‌ల వద్ద నిరీక్షిస్తున్న వాహనదారులు

    కాకినాడ జిల్లా

    • మూడవ రోజు కూడా బంకుల వద్ద డీజిల్ కోసం బారులు తీరిన వాహనాలు

    • కార్లకు రూ.1,000, ఆటోలకు 3 లీటర్ల చొప్పున డీజిల్‌ కొడుతున్న బంకులు

    • డీజిల్ కోసం గంటల తరబడి నిరీక్షణ

    • డీజిల్ సరఫరా లేక కొన్ని చోట్ల దర్శనమిస్తున్న సో స్టాక్ బోర్టులు.


    తూర్పుగోదావరి జిల్లా..

    • అనపర్తి నియోజకవర్గంలో కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత.

    • స్టాక్ లేదని బంకుల్లో బోర్డులు పెట్టిన యాజమాన్యం.

    • వరి చేలు కోతలు సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు.


    కృష్ణా జిల్లా..

    • మచిలీపట్నంలో పెట్రోల్ బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనదారులు

    • డీజిల్ కొరతతో మూతబడిన పలు బంక్‌లు  

    • పెట్రోల్, డీజిల్ కోసం బంక్ వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్న వినియోగదారులు


    తిరుపతి

    • తిరుపతి జిల్లాలో పెట్రోల్ బంకులు వద్ద క్యూ కడుతున్న వాహనదారులు

    • తిరుపతి నగరంలో పెట్రోల్ బంకులు వద్ద బారులు తీరిన వాహనాలు. 

    • తిరుమలలో భక్తులకు తప్పని తిప్పలు
    • నిన్నటి నుండి పెట్రోల్, డీజల్ తిరుమలలో ఖాళీ.
    • నో స్టాక్ బోర్డు పెట్టిన పెట్రోల్ బంకులు
    • ఇబ్బందుల కారణంగా టీటీడీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్న భక్తులు.

International

  • టెహ్రాన్‌ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్‌లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చింది

    సోషల్‌ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్‌లో మార్పుల వెనుక అసలు సీక్రెట్‌ అదేనా. ఇరాన్‌లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనా

    అమెరికా ఇరాన్‌ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ అదే స్థాయిలో బదులిస్తోంది.

    ఇలాంటి సమయంలో ఇరాన్‌ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్‌లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్‌ వాతావరణ యంత్రాలను ఇరాన్‌ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్‌ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.

    ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్‌ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ వాతావరణ ఇంజినీరింగ్‌ యంత్రాలను ఇరాన్‌ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.

    ఈ యుద్ధంలో ఇరాన్‌ అమెరికాకు చెందిన అధునాతన రాడార్‌ వ్యవస్థలపై, ఇజ్రాయెల్‌ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్‌ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్‌ పొరుగు ప్రత్యర్ధుల వైపు   మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

    నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్‌లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్‌ వాదన. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌ నుంచి మరో కీలక అధికారిని తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ట్రంప్ కేబినెట్ నుంచి వైదొలిగే ఛాన్స్‌ ఉందని ‘పోలిటికో’ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్‌ అడ్మినిట్రేషన్‌లో అంతర్గత ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పటేల్ భవిష్యత్తుపై వైట్‌హౌస్ వర్గాల్లో ప్రశ్నలు తలెత‍్తుతున్నాయి.

    ఇప్పటికే ట్రంప్‌ పలువరు కీలక అధికారులను తొలగించారు. ఈ వారమే ట్రంప్ అనుమతితో అమెరికా నౌకాదళ కార్యదర్శిని తొలగించారు. ఆ తర్వాత తదుపరి వెళ్లే సీనియర్ అధికారి ఎవరన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. 

    పోలిటికో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌ తదుపరి తొలగించే వారి లిస్టులో పటేల్‌ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్‌హౌస్ అధికారి సూచించారు. కాష్ పటేల్‌ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, ఇప్పుడు ప్రశ్న “ఎప్పుడు తొలగిస్తారు?” అన్నదేనని వ్యాఖ‍్యానించారు. మీడియాలో ఆయనపై నెగటివ్ వార్తలు ఎక్కువగా రావడం,  ఆయన పనితీరు, నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరగడం అందుకు కారణాలుగా చెప్పారు. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఇది ట్రంప్‌ను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెప్పారు.

    కీలక అడ్మినిస్ట్రేటివ్‌ పదవుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై రాజకీయపరంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాష్‌ పటేల్‌ గురించి వార్తలు వస్తుండడం గమనార్హం. 

    వరసగా తొలగిస్తున్న ట్రంప్‌ 
    కొన్ని రోజుల క్రితమే అమెరికా యుద్ధ శాఖ, నౌకాదళ కార్యదర్శి జాన్‌ సీ ఫెలన్‌ను పదవి నుంచి తొలగించారు. ఉప కార్యదర్శి హంగ్‌ కావో తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

    మార్చి నుంచి దాదాపు ఐదుగురు సీనియర్ అధికారులు (ఫెలన్ సహా) ఒత్తిడి మధ్య పదవులు వదిలుకున్నారు. ఫెలన్‌కు ముందు, జనరల్ రాండీ జార్జ్‌ ఈ నెల ప్రారంభంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి విరమణ చేశారు. ఇరాన్ యుద్ధం మధ్య ఇది అసాధారణ పరిణామం. అలాగే, మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించారు. 

    కాగా, ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ట్రంప్ గవర్నమెంట్‌ చేస్తున్న ఈ యుద్ధానికి తాను సపోర్టు ఇవ్వలేనని జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ పేర్కొంటూ ఆయన సైతం ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పిన సంగతి తెలిసిందే.  అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం రాత్రి వైట్‌హౌస్‌​ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్‌, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్​,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్‌ అలెన్‌గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో  ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 

    గత కొన్నేళ్లలో ఇలా ట్రంప్‌ లక్ష్యంగా కాల్పులు జరగడం మూడోసారి. అయితే రెండు గంటల పాటు ఆయనను హోటల్ నుండి హడావిడిగా తీసుకువెళ్లిన అనంతరం, అధ్యక్షుడు వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు అనూహ్యమైన ప్రశ్నలు రిపోర్టల నుంచి ఎదురయ్యాయి. 

     విలేకరులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక అనూహ్యమైన ప్రశ్న . ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ నుంచి దూసుకొచ్చింది.  ఈ ప్రశ్నను మీపై చాలా గౌరవ భావంతోనే అడుగుతున్నానంటూనే.. ‘ట్రంప్‌.. మీపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి. పదే పదే మిమ్మల్ని ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?. మీకు ఇలా ఎందుకు పదేపదే జరుగుతోందని మీరు అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. 

    దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. ఈ దాడి కూడా తానొక అద్భుతమైన వ్యక్తిని కాబట్టే జరుగుతుందన్నారు. ‘అవును, మీకు తెలుసు, నేను హత్యల గురించి అధ్యయనం చేశా. ఇక్కడ మీకు నేనొక విషయం చెప్పాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు.  విశేషంగా కృషి చేసిన వ్యక్తులపైనే ఎప్పుడూ దాడులు జరుగుతాయి. మీరు అబ్రహం లింకన్‌నే చూడండి.  అలాంటి వ్యక్తులే టార్గెట్‌ అవుతూ ఉంటారు’ బదులిచ్చారు. 

  • వాషింగ్టన్‌: వైట్ హౌస్‌లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. దాడికి నిందితుడు ఒక్కడే పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దాడి వెనుక ఉద్దేశ్యం ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది’అని చెప్పారు. 

    ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన కారస్పాండెంట్స్ డిన్నర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 2,600 మంది ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో ప్రధాన భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డాడు. అయితే అతను ధరించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పింది.

    వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన ఈ కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులను సీక్రెట్ సర్వీస్ తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించింది. 

    దాడి చేసిన వ్యక్తిని కోల్ టోమాస్ అలెన్ అనే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో వైట్ హౌస్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. కారస్పాండెంట్స్ డిన్నర్‌కు హాజరైన వారిని తక్షణమే బయటకు తరలించారు. అధికారులు దాడి వెనుక ఉన్న కారణాలను, అతను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  • అమెరికా-ఇరాన్‌ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్‌ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్‌ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ‍ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. 

    అలీ ఖమేనీ (ఇరాన్‌ దివంగత సుప్రీం లీడర్‌)ను అమెరికా-ఇజ్రాయెల్‌ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా పదవీ బాధ్యతలు స‍్వీకరించారని ఇరాన్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.

    నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? 
    అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తోంది ఇరాన్‌. మరి ఈ యుద్ధానికి ఇరాన్‌లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ‍్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యత స్వీకరించాడు. 

    ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్‌దే. అయితే, ఇరాన్‌కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా?   

    ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్‌ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.

    సుప్రీం లీడర్‌ ఎక్కడ?
    పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్‌ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 

    అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార‍్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.

    కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.

    క్లిష్టమైన సమయంలో బాధ్యతలు 
    మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్‌లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. 

    యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్‌ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.

    ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత‍్తుతున్నాయి.

    ఇరాన్‌లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప‍్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్‌లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.

    హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్‌కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్‌లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది.  

    సుప్రీం లీడర్‌కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్‌ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్‌లో అంతా బూడిదే మిగులుతుంది.

  • ఇస్లామాబాద్‌: ఇరాన్‌, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్‌ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్‌కు పంపించడం లేదని  ట్రంప్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.

    పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.

    కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    అరాగ్చీ స్పందన..
    ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్‌ను పాకిస్తాన్‌​కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్‌ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. 

  • వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌లో శనివారం రాత్రి  ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం షాక్‌కు గురిచేసింది. షాట్‌గన్‌తో భద్రతా సిబ్బందిపై కాల్పులు కలకలం  రేపాయి. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్.. ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్‌మాన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి?. ఈసారి విందు.. సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది? పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం

    ఓజ్ పెర్ల్‌మాన్.. అమెరికన్ మెంటలిస్ట్. మైండ్ రీడింగ్ (మనసును చదవడం), ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ప్రసిద్ధి చెందారు. 43 ఏళ్ల పెర్ల్‌మాన్ 2015లో 'అమెరికాస్ గాట్ టాలెంట్' సీజన్ 10లో మూడో స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుండి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆయన.. ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్, ది ఎల్లెన్ షో, లేట్ నైట్ విత్ జిమ్మీ ఫాలన్ వంటి ప్రసిద్ధ కార్యక్రమాల్లో కనిపించారు. 2018లో తన ఎన్‌బీసీ ట్రావెల్ షో 'ఓజ్ నోస్'కు ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.

    ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా..
    ఈసారి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్‌లో అధ్యక్షుడు, మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్యనటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్‌మాన్‌ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు. 2025 కోసం కమెడియన్ అంబర్ రఫిన్‌ను అనుకున్నప్పటికీ.. ట్రంప్ పరిపాలనతో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఆమెను ముందే తొలగించారు. 2026 నాటి ఈ విందు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.. ఎందుకంటే తన రెండు అధ్యక్ష కాలాల్లో ట్రంప్ హాజరైన మొదటి వేడుక ఇది. రాజకీయ విమర్శల కంటే.. 25 నిమిషాల పాటు నవ్వులు పూయించి.. అద్భుతమైన క్షణాలతో అందరినీ ఏకం చేయడమే తన లక్ష్యమని పెర్ల్‌మాన్ పేర్కొన్నారు.

    నేను ట్రంప్ మనసును చదవగలనా?
    వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవ్వడం అంత సులభం కాదు అంటూ పెర్ల్‌మాన్ ఈ కార్యక్రమానికి ముందు ఒక వ్యాసంలో రాశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనసును చదవాలని నాకు ఉంది. అధ్యక్షుడు తదుపరి ఏమి చెబుతారో?. ఏమి చేస్తారో ఎవరూ ఊహించలేరు. ట్రంప్ అందరిలాంటి వ్యక్తి కాదు.. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు.

    అందుకే ఈసారి ఇలా..
    తాను రాజకీయాలకు అతీతుడినని.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, విభజించడానికి తాను రాలేదన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ అలరించడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కమెడియన్ల విమర్శలు ట్రంప్‌కు నచ్చవు కాబట్టే.. ఈసారి తనలాంటి మెంటలిస్ట్‌ను ఎంపిక చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
     

Telangana

  • హైదరాబాద్: హైడ్రా, మున్సిపల్‌ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఫిష్‌ మార్కెట్‌ పక్కన ఉన్న డబ్బాలను తొలగించారని, తాను ఇక్కడ లేని సమయం చూసే వాటిని హైడ్రా తొలగించిందంటూ మండాపడ్డారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. 

    హైడ్రాకు దమ్ముంటే దారుసలాం, ఛార్మినార్ ముందు ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి చూపెట్టాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజల ఉపాధి అవకాశాలపై దౌర్జన్యం సరికాదని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారుని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • హైదరాబాద్‌: బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని సోమాజిగూడలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు  భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ దేశ ప్రజలకి ఆశా జ్యోతి.. అందుకే దేశ వ్యాప్తంగా వారోత్సవాలు జరగుతున్నాయి. 

    రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ జయంతిని తూతూ మంత్రంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని వారం రోజుల పాటు ప్రధాని మోదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంది. మనం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్రనే ప్రజలకి తెలియాలని కాంగ్రెస్ కుట్ర చేసింది.

    దేశ విభజన, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. నెహ్రూ ఆగడాలు, అరాచకాలు తట్టుకోలేక అంబేద్కర్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అంబేద్కర్ రాజకీయ చరిత్ర లేకుండా చేసింది కాంగ్రెస్. అప్పట్లో జనసంఘ్ పార్టీ అంబేద్కర్‌కి ఎంఎల్సీ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్మృతి వనం కట్టలేదు’ అని విమర్శించారు. 

    కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ ఆలోచన విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెన్ను పోటు పొడిచిందో ప్రజలోకి తీసుకెళ్లాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో అందరికీ తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్‌లకు గిరిజనులు, దళితులు, మహిళలని వెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. సీట్లు పెంపు ద్వారా అందరూ లబ్ది పొందేవారు. దక్షిణ భారతదేశంకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఒకే నిష్పత్తిలో సమాంతరంగా సీట్లు పెంచాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినపుడు ఏ రోజు కూడా బీసీలు గుర్తుకు రాలేదు’ అని మండిపడ్డారు.

    ‘వచ్చే నెల పదోవ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మొదటి సారి హైదరాబాద్‌కి మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెల 10 వ తేదీ న పెరెడ్ గ్రౌండ్ లో నాలుగు గంటలకు ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు’అని స్పష్టం చేశారు.

  • హైదరాబాద్‌: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్‌ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచించారు.  

    రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్‌ను బంకుల ద్వారా వాహనదారులకు పోస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేల కు పైగా ఎల్‌పీజీ గ‍్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్,డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్‌ చయొచ్చని కోరారు.

    కాగా, రెండు రోజులపాటు బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉండదన్న వదంతులతో ఖమ్మం నగరంలో వాహనదారుల పెట్రోల్ బంక్‌ల ముందు క్యూ కట్టారు. రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్‌ బంకుల ముందు నిలబడుతున్నారు. 

    కొన్ని బంకులు మూసివేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన మొదలై బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదని అపోహలతో కొంతమంది వ్యక్తులు క్యాన్లలో నింపుకుని పోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. కొన్ని రోజుల ‍క్రితం హైదరాబాద్‌ సహా పలు నగరాల్లోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 


  • సాక్షి, నల్లగొండ: ఉన్నత విలువలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తాను చదువు చెబుతున్న విద్యార్థినిపై ప్రేమ పెంచుకుని అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో సదరు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి సదరు విద్యార్థినిపై ప్రేమ పెంచుకున్నాడు. ఎలాగైనా విద్యార్థినిని కలవాలని బుధవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తలుపు తీస్తున్న క్రమంలో శబ్దం రావడంతో బయటే నిద్రిస్తున్న విద్యార్థిని తండ్రి టీచర్‌ను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశాడు.

    దీంతో ఆ టీచర్‌ తప్పించుకొని సొప్ప చేను, గడ్డివాముల్లో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఏకమై గ్రామాన్ని జల్లెడ పట్టి సదరు టీచర్‌ను పట్టుకొని దొంగగా భావించి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారించగా.. తాను దొంగను కాదని, విద్యార్థిని కోసమే వచ్చానని సదరు టీచర్‌ అసలు విషయం చెప్పాడు. ఈ ఘటనపై కనగల్‌ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డిని వివరణ కోరగా.. సదరు టీచర్‌ విద్యార్థిని కోసమే ఇంట్లోకి చొరబడినట్లు ఒప్పుకున్నాడని, విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

    ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వకుండా జాప్యం 
    చండూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వగా.. సదరు ఉపాధ్యాయుడు చదువు చెప్పే పాఠశాలలో మాత్రం ఇప్పటివరకు ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వడం లేదు. ఈ విషయం అందరికీ తెలియడంతో.. ప్రోగ్రెస్‌ కార్డులకు వచ్చే తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యంపై తిరగబడే అవకాశం ఉండడంతోనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం. 

  • సాక్షి, మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్‌ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్‌ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు.

    మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్‌.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

    కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్‌ ఇటుకలగడ్డతండాకు బైక్‌పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్‌పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు.

    పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

National

  • అంగవైకల్యం ఉన్నప్పటికీ చాలా మంది కష్టపడి పనిచేసుకుని జీవిస్తుంటారు. కొందరు మాత్రం ఏ సమస్య లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్లు నటిస్తూ అడుక్కుతింటుంటారు. అటువంటి వ్యక్తే నడిరోడ్డుపై ఓ కెమెరాకు దొరికిపోయాడు. ఘర్‌ కే కాలేశ్‌ అనే ఎక్స్‌ ఖాతాలో ఈ వీడియోను తాజాగా పోస్ట్‌ చేశారు. దీంతో, ఇది పాత వీడియోనా? లేదా కొత్త వీడియోనా? అన్నది తెలియకయినప్పటికీ ఆన్‌లైన్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

    ఈ దృశ్యాలు ఒక కార్ డ్యాష్‌క్యామ్‌లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో ఒక భిక్షగాడు నడిరోడ్డుపై కర్రల సాయంతో కుంటుతూ ముందుకు వస్తూ జనాల వద్దకు వెళ్లి తన కాలు బాగోలేదని  చెప్పి భిక్ష అడుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రోడ్డుపై దాదాపు 100 మంది ఉంటారు. వాళ్లంతా అతడిని చూసి నిజంగానే ఒక కాలు లేదేమోనని అనుకుంటారు. 

    సిగ్నల్‌ వద‍్ద రెడ్‌ లైట్‌ పడడంతో అతను స్కూటీపై ఉన్న జంట దగ్గరకు వెళ్లి భిక్ష అడుగుతాడు. వారు డబ్బులు ఇచ్చేదాక అక్కడే ఉంటాడు. చివరకు స్కూటీపై ఉన్నవారు డబ్బు ఇస్తారు. గ్రీన్ పడగానే వాహనదారులు అందరూ అక్కడి నుంచి వెళ్లడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ భిక్షగాడి నిజస్వరూపం బయటపడుతుంది. అందరూ వెళ్లిన తర్వాత అతడు కర్రల సాయంతో కాకుండా సాధారణంగా నడుస్తూ వెళ్లడం కనిపిస్తుంది. 

    ఇందుకు సంబంధించిన వీడియోను వేలాది మంది చూశారు. ఇలాంటి బిచ్చగాళ్లు ప్రతి రెడ్ లైట్ దగ్గర కనిపిస్తారని నెటిజన్లు అంటున్నారు. వికలాంగులుగా నటిస్తూ చాలా మంది భిక్ష అడుగుతారని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా కాలు సమస్య ఉన్నట్టు నటించి, కుంటుతూ జనాల్ని మోసం చేయడం చాలా తప్పని కొందరు కామెంట్లు చేశారు. బిచ్చగాళ్లపై ప్రజల నమ్మకాన్ని అతడు దెబ్బతీస్తున్నాడని చెప్పారు. 

  • న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ (NEET UG 2026) అడ్మిట్ కార్డుల నిరీక్షణకు తెరపడింది. ఎన్టీఏ (NTA) చేసిన తాజా ప్రకటన అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) హాల్ టికెట్లు సోమవారం, (ఏప్రిల్ 27)విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అడ్మిట్ కార్డులు విడుదలైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
     

    డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇదే..
    అడ్మిట్ కార్డులను సులభంగా పొందేందుకు విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి. అక్కడ కనిపించే ‘అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ (Admit Card PDF)’ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీ అప్లికేషన్ నంబర్ (Application Number), పాస్‌వర్డ్ (Password) వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఈ వివరాలు ఇచ్చిన వెంటనే నీట్ హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. వెంటనే ఆ పీడీఎఫ్‌ను సేవ్ చేసుకుని, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు తప్పనిసరిగా ఒక ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

    పరీక్షా విధానం.. 180 నిమిషాల సమరం
    నీట్ 2026 ప్రశ్నాపత్రం పూర్తిగా విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేలా ఉండనుంది. మొత్తం 180 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇందులో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) నుంచి 45, రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) నుంచి 45, జీవశాస్త్రం (బయాలజీ) నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. ఈ 180 ప్రశ్నలను సాధించడానికి విద్యార్థులకు కేవలం 180 నిమిషాల సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి పరీక్షలో సమయపాలన అత్యంత కీలకం కానుంది.

    ఇది కూడా చదవండి: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?

  • న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా  కలకలం సృష్టించింది. ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండారాజ్ నడుస్తోందని  ఆరోపించారు.

    దారుణ హత్య.. ఆవేదనలో రాహుల్
    అసన్సోల్‌లో కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న దేబ్‌దీప్ ఛటర్జీ అనే కార్యకర్తను పోలింగ్ అనంతరం కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఉదంతంపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఇదొక అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ఛటర్జీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, అధికార టీఎంసీ పార్టీకి చెందిన గూండాలే పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు.
     

    ప్రజాస్వామ్యం కాదు.. గుండారాజ్
    బెంగాల్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, కేవలం టీఎంసీ గూండాల రాజ్యమే నడుస్తోందని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటింగ్ ముగిశాక ప్రత్యర్థుల గొంతు నొక్కడం, దాడులు చేయడం, భయభ్రాంతులకు గురిచేయడమే టీఎంసీ నైజంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని, తాము రాజ్యాంగబద్ధమైన మార్గంలోనే నడుస్తామని అన్నారు. ఇదే తమ వారసత్వం, సంకల్పం అని ఆయన పేర్కొన్నారు.

    కఠిన శిక్ష పడాల్సిందే
    ఈ హత్యాకాండకు పాల్పడిన దోషులను తక్షణమే అరెస్టు చేసి, అత్యంత కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బాధితుని కుటుంబానికి పూర్తి భద్రత కల్పించడంతో పాటు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. అసన్సోల్ నార్త్ అభ్యర్థి ప్రసేన్‌జిత్ పుటండికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న దేబ్‌దీప్‌పై టీఎంసీ అనుబంధ దుండగులే ఈ దారుణ దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతదేశ అహింసా సిద్ధాంతానికి మచ్చ తెస్తున్న ఇటువంటి నీచ రాజకీయాలకు తాము తలొగ్గేది లేదని రాహుల్ గాంధీ  పేర్కొన్నారు.

    ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్

  • న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల తంతు కొనసాగుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ  ప్రజలతో పలు విశేషాలను పంచుకున్నారు. ఆదివారం జరిగిన తన 133వ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో స్వచ్ఛమైన ఇంధనం, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, అణుసామర్థ్యంలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని ఆయన వివరించారు.

    పవన విద్యుత్‌లో పవర్ ఫుల్ రికార్డ్
    ప్రపంచ పవన విద్యుత్ రంగంలో భారతదేశం సరికొత్త చరిత్ర లిఖిస్తున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. అదృశ్యమైన గాలి శక్తి దేశ పురోగతికి ఎలా చోదక శక్తిగా మారిందో వివరిస్తూ, దేశం ఇటీవల సాధించిన మైలురాయిని గుర్తుచేశారు. ప్రస్తుతం భారత పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 56 గిగావాట్లను  దాటిందని, తద్వారా ఈ ఇంధన సామర్థ్యంలో మన దేశం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరిందని ఆయన తెలిపారు.

    కల్పక్కం రియాక్టర్.. అణుశక్తిలో అరుదైన ఘనత
    భారత అణు కార్యక్రమానికి సంబంధించి మోదీ ఒక కీలక ఘట్టాన్ని ప్రస్తావించారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’క్రిటికాలిటీ దశకు చేరుకుందని, అంటే రియాక్టర్ ఆపరేషన్ దశ ప్రారంభమైందని వెల్లడించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రియాక్టర్.. దేశ పారిశ్రామిక వృద్ధి, ఇంధన, ఆరోగ్య రంగాలకు, అలాగే ఆధునిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఇది మన శాస్త్రవేత్తల అద్భుత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.

    బుద్ధుని బోధనలు.. ప్రపంచ శాంతికి మార్గం
    శాస్త్ర సాంకేతిక విజయాలతో పాటు రాబోయే పండుగల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. మే నెలలో రానున్న బుద్ధ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల పరిస్థితుల్లో గౌతమ బుద్ధుని శాంతి సందేశం ఎంతో ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. శాంతి అనేది మన అంతరంగం నుంచే మొదలవుతుందని, తనను తాను జయించడమే అత్యుత్తమ విజయమన్న బుద్ధుని బోధనలను ప్రధాని గుర్తుచేశారు.

    ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ

Family

  • వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గించడానికి బ్యూటీ క్లినక్స్‌లో సాధారణంగా గాఢమైన యాసిడ్లను వాడుతుంటారు. కానీ, ‘బీక్‌మన్‌ 1802’ సంస్థ ‘బెటర్‌–ఏజింగ్‌’ అనే కొత్త విధానంతో ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజా ఆవిష్కరణ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్‌. ఇది మాస్క్‌లా మాత్రమే కాకుండా, మెడికల్‌ గ్రేడ్‌ ట్రీట్‌మెంట్‌లా పనిచేస్తుంది. చాలా షీట్‌ మాస్క్‌లు నీళ్లలా ఉండే పల్చని సీరమ్‌లతో తయారవుతాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి. కానీ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్, క్రీమ్‌తో నిండిన సాంకేతికతతో రూపొందించినది. 

    రెనెక్సోసోమ్‌ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్‌ పదార్థాలు ఈ మాస్క్‌కి ప్రత్యేకం. రెనెక్సోసోమ్‌ కాంప్లెక్స్‌ రెటినాల్‌ కంటే నాలుగు రెట్లు వేగంగా కొలాజెన్‌ను ఉత్పత్తి చేసి, చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. మేకపాలలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రీబయోటిక్స్‌చర్మం పీహెచ్‌ స్థాయిని సమతుల్యం చేసి, దెబ్బతిన్న చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లోనే రిపేర్‌ చేస్తాయి. మొండో గ్రాస్‌ చర్మానికి అవసరమైన తేమను అందించి, రక్షణ కవచంలా పనిచేస్తుంది.

    ఈ మాస్క్‌ ముఖానికి వేసుకున్నప్పుడు చల్లటి అనుభూతిని ఇస్తుంది. మంచు నీటిలో ముఖాన్ని ఉంచినట్లుగా చల్ల బరుస్తూ, రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల చర్మంపై ఉండే ఎరుపుదనం తగ్గి ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దీర్ఘకాలిక వాపును కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ మిల్క్‌ ఆర్‌ఎక్స్‌ కంప్రెస్‌ డిజైన్‌ కూడా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన చిన్‌ స్ట్రాప్‌ ఉంటుంది. ఇది గడ్డం కింద చర్మాన్ని పట్టి ఉంచి, ముఖానికి తీరైన ఆకారాన్ని ఇస్తుంది. ఈ మాస్క్‌ను వారానికి ఒకసారి వాడటం వల్ల కొలాజెన్‌ స్థాయి గణనీయంగా పెరిగి, చర్మం యవ్వనంగా, కాంతి మంతంగా మారుతుంది.

    రొట్టెల పిండి ఫేస్‌ప్యాక్‌
    ప్రాచీన రోమన్‌ ప్రజలు రొట్టెల పిండిని ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించేవారు. రొట్టెల పిండిని ముఖానికి పట్టించుకోవడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుందని నమ్మేవారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన రోమన్‌ చక్రవర్తి ఓథో ప్రతిరోజూ స్నానానికి ముందు గడ్డం మీసం నున్నగా గీసేసుకుని, ముఖానికి రొట్టెల పిండి పట్టించుకునేవాడట!

    తాజా మెంతి ఆకులను మెత్తగా రుబ్బి  రాత్రి పడుకునే ముందు ముఖానికి పట్టించి ఉదయం కడగాలి. మెంతి ఆకులను వాడేటప్పుడు వాటిని ముందుగా శుభ్రం చేయాలి. వాటి మీద చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు లేకుండా శుభ్రం చేసిన తర్వాత మాత్రమే గ్రైండ్‌ చేయాలి. ఈ ప్యాక్‌ క్రమం తప్పకుండా  మూడు వారాల పాటు వేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌ తొలగి చర్మం నునుపుగా మారుతుంది. 

  • ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, వయోలా వాద్యం నేర్చుకొన్న ఓ అమ్మాయి... ఓ అమెరికన్ సినిమాలో నేపథ్యంలో వినిపించిన ప్రసిద్ధ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట విని, దక్షిణాసియా ప్రాంతపు ప్రత్యేక సంగీత రీతులపై ప్రేమ పెంచుకుందంటే నమ్మగలరా? బ్రిటన్ చేరిన ఆ అమ్మాయి ఆ సంగీతాభిరుచిని కొనసాగించింది.  ఏకంగా సంగీతంలోనే పరిశోధన చేసి, ఇవాళ నిజామ్ కాలపు సంగీతం, సంగీతజ్ఞుల కథలపై సాధికారిక రచయిత్రిగా మారింది. 18వ శతాబ్దంలో మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు పాలనా శకంలోకి భారతదేశం జారిపోతున్న వేళ... మన సంగీతం, సంగీతజ్ఞులు, తవాయిఫ్‌ల జీవితాలలో సాగిన ప్రయాణం, వచ్చిన మార్పులకు అక్షర రూపం ఇచ్చింది. స్లయిడ్ల రూపంలో అలనాటి చిత్రపటాలు, ఛాయాచిత్రాలు చూపిస్తూ, ఆ కథలన్నీ ఆమె చెబుతుంటే, ఎవరైనా కళ్ళు, చెవులు అప్పగించక తప్పదు.

    మరీ ముఖ్యంగా చాలామందికి తెలియని మన హైదరాబాదీ చరిత్ర చెబుతుంటే, నేటికీ నాంపల్లిలో ఆనవాళ్ళున్న నిజామ్ కాలపు అపురూప కళాకారిణి – కవయిత్రి – పలుకుబడి గల వేశ్యామణి మాహ్ లఖా బాయ్ (1768-1824) జీవితం వివరిస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది. లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్‌తో మన భాగ్యనగరం నడిబొడ్డున విద్యారణ్య స్కూల్‌ విశాల ప్రాంగణంలో ‘మంథన్’ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగం చరిత్ర, సంగీత, సంస్కృతీ ప్రియులకు అక్షరాలా అలాంటి అనుభవాన్నే అందించింది.

    మనకు తెలీని మన చరిత్ర... ఓ పాశ్చాత్య మహిళ పరిశోధన...
    క్యాథరిన్ ప్రాథమికంగా దక్షిణాసియా ప్రాంత సంగీతం, చరిత్రను అధ్యయనం చేసి, అక్షరబద్ధం చేస్తున్న చరిత్రకారిణి. ఇప్పటి వరకు లోచూపుకు నోచుకోని విస్తారమైన భారతీయ రచనలు, అలాగే అలనాటి చిత్రకారులు గీసిన బొమ్మల లాంటి విజువల్ సోర్స్‌లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. మౌలికమైన పరిశోధన సాగిస్తున్నారు. 

    అందులో భాగంగా ఆమె మన హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. సంగీతంతో ముడిపడిన పలువురు పాతకాలపు కళాకారుల కథలను జనం ముందుకు తెస్తున్నారు. ఆ క్రమంలోనే ఆనాటి పరిస్థితులు, ఆ కాలపు వ్యక్తుల స్వతంత్రత, అనుబంధాలు, అనురాగాలు, అధికార వ్యవస్థ అన్నింటినీ అక్షరబద్ధం చేసి, చర్చకు పెట్టడం రచయిత్రిగా, పరిశోధకురాలిగా క్యాథరిన్ ప్రత్యేకత.

    ప్రస్తుతం క్యాథరిన్ లండన్‌లోని సుప్రసిద్ధ కింగ్స్ కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యూజిక్‌కు హెడ్‌. దాదాపు 25 మంది దాకా పీహెచ్డీ విద్యార్థులు చరిత్ర, మానవశాస్త్రం, దక్షిణాసియాలోని పలు సంగీత సంస్కృతుల ప్రదర్శన లాంటి వివిధ అంశాలపై ఆమె సారథ్యంలోనే పరిశోధన చేయడం విశేషం. 

    మొఘల్, దక్కనీ, దక్షిణాసియాలో వలస పాలకుల కాలపు కళలు, సంస్కృతి తదితర అంశాలపై క్యాథరిన్ ప్రసంగాలకు బోలెడంత డిమాండ్. బ్రిటీష్ లైబ్రరీ నుంచి మన జైపూర్ లిటరరీ ఫెస్టివల్ దాకా ఆమె ప్రసంగించని వేదిక లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం సంగీతం, సంగీత కళాకారులపై ఆంక్షలు విధించినప్పుడు దాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ వేదికపై అందరినీ కూడగట్టడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించడం విశేషం.

     

    క్యాథరిన్ పరిశోధించి రాసిన ‘మ్యూజిక్ అండ్ మ్యుజీషియన్స్ ఇన్ లేట్ మొఘల్ ఇండియా: హిస్టరీస్ ఆఫ్ ది ఎఫిమెరల్ (1748 – 1858)’ అనేక ఇతర అంశాలతో పాటు మన నిజామ్ పాలనా కాలపు హైదరాబాద్ సంగతులనూ పాఠకుల ముందుకు తెచ్చింది. అందులో - మొఘల్ చక్రవర్తుల ఏలుబడిలో, ఆ పైన బ్రిటీషు వారి ఆరంభ కాలంలో... ఢిల్లీ నుంచి లక్నో, హైదరాబాద్, జైపూర్ దాకా వివిధ ప్రాంతాల్లో, పర్షియన్, వ్రజ భాష, ఉర్దూ, ఇంగ్లీషుల్లో సాగిన సంగీత రచనల ఆధారంగా తొమ్మిదిమంది సంగీత కళాకారుల జీవితాలను పాఠకుల ముందు పెట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు వారి శకంలోకి మారుతున్న ఆ కాలంలో మన సాంస్కృతిక, కళా రంగం ఎలా దానికి ప్రతిస్పందించిందన్నది ఆ రచన ప్రధానమైన దృష్టి కోణం.

    అపురూపమైన ఆ పరిశోధనాత్మక కృషిని ప్రపంచ ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ 2022లో పుస్తకంగా ప్రచురించింది. ఆశ్చర్యపరిచే ఆ కృషికి అనుబంధంగానే, హైదరాబాద్‌లోని ‘మంథన్’ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టోరీస్ ఆఫ్ మ్యూజికల్ లైఫ్ ఇన్ నిజామీ హైదరాబాద్ (క్రీ.శ. 1780-1830)’ అన్న అంశంపై ఏప్రిల్ 24న క్యాథరిన్ తన తాజా ప్రసంగం చేశారు. ఎంతో లోతైన వివరాలు, విశ్లేషణ, అందుకు ఆధారభూతమైన చరిత్ర గ్రంథాలు, పరిశోధనలో తనకు కలిగిన స్వీయాభిప్రాయాలను సభికులతో ఆమె పంచుకున్నారు.

    ప్రాణం పోసుకున్న నిజామ్ గజల్ గాథలు!
    సరిగ్గా గంటసేపు సాగిన ప్రసంగంతో అప్పటి నిజామ్ కాలానికి తీసుకువెళ్ళారు క్యాథరిన్. పరిశోధనలో భాగంగా హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియమ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు లండన్ లోని బ్రిటీష్ లైబ్రరీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ దాకా అనేక చోట్ల నుంచి ఆమె ఎంతో అరుదైన సమాచారం సేకరించారు. 

    అలా తాను సేకరించిన అనేక ప్రాచీన ఉర్దూ, పర్షియన్ రచనా ప్రతులలోని బొమ్మలు, సంగతులను ఆమె తన ప్రసంగంలో పంచుకున్నారు. మాటల్లో సందర్భానుసారంగా... నిజామ్ కాలపు చిత్రకారులు వెంకటచలం సహా పలువురు గీసిన చిత్రాలను ప్రదర్శించడంతో ఆనాటి సంగతులు కళ్ళకు కట్టినట్టయింది. జగత్ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ తీసిన అలనాటి హైదరాబాద్ ఛాయాచిత్రాలనూ ఉపయోగించారు.

    ప్రసిద్ధ నర్తకి మాహ్ లఖా బాయ్, ఆమెకు సంగీతం నేర్పిన గురువు - తాన్‌సేన్ వంశీకుడైన ఖుషాల్ ఖాన్ ‘అనూప్’, వారి గురు – శిష్య సంబంధం, అలాగే ఆమెతో సాన్నిహిత్యం సాగించిన మరాఠా యోధుడు రాజా రావ్ రన్‌భా తదితరులను వెరసి, ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించించారు. వెరసి, అలనాటి నిజజీవిత పాత్రలు అనేకం ఆ అనర్గళ ప్రసంగంలో ప్రేక్షకుల ముందు ప్రాణం పోసుకున్నాయి. 

    నిజామ్ చరిత్రలో ప్రసిద్ధుడైన మీర్ ఆలమ్ మరణానంతరం మహారాజా చందూలాల్ ప్రధానమంత్రి అయ్యారు. “బ్రిటీషు, రాజకీయ అతిథులను ఆకట్టుకొనేందుకు ఆయన మాహ్ లఖా బృందంతో భారీ నృత్య, గాన ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. . ఆయనకూ, మాహ్ లఖా బాయ్‌కీ అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది” అని క్యాథరిన్ పాత కథలు తవ్వి పోశారు.

    1798లో నిజామ్‌కూ, ఈస్టిండియా కంపెనీ వారికీ మధ్య ఒప్పందం కుదిరింది. నిజామ్ సంస్థాన రక్షణ బాధ్యతలు చేపట్టిన బ్రిటీషు సేనలు ఆ నిమిత్తం అన్నట్టుగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఏరియాలో దండు విడిచాయి. ఇక, హైదరాబాద్‌లో ప్రత్యేక బ్రిటీషు రాజప్రతినిధికి బ్రిటీష్ రెసిడెన్సీ ఏర్పాటైంది. ఆ సంగతులతో పాటు భారతీయ సంగీతం, సంగీత కళాకారులపై బ్రిటీషు వారి ప్రభావాన్ని క్యాథరిన్ ప్రస్తావించారు. 

    మన సుదీర్ఘమైన రాగప్రదర్శన బ్రిటీషర్లకు అర్థం కావడం కష్టం. అందుకని, అప్పట్లో తవాయిఫ్‌లు గజల్స్ లాంటివి గానం చేసేవారు. నృత్యగీతాలతో అలరించేందుకు ప్రయత్నించేవారు అని తెలిపారు. ఆనాటి పాపులర్ నృత్యగీతాల బాణీని బ్రిటీషర్లు ఇట్టే పట్టుకొని, దాన్ని ఎలా తమదైన పద్ధతిలో పాడేదీ క్యాథరిన్ స్వయంగా ఆలపించి వినిపించి, సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు.

    నాంపల్లి, మౌలాలీ సాక్షిగా... నేటికీ ఆ ఆనవాళ్ళు
    “1738 నాటికే... గోల్కొండ ప్రాంతం ఎంతో ప్రముఖమైనది. హైదరాబాద్ చాలా కీలకమైన కేంద్రం. పంజాబీ ఖత్రీల మొదలు ఇరానియన్ల వరకు ఎన్నెన్నో ప్రాంతాలు, వర్గాలకు చెందిన పలువురు మేధావులు, అధ్యయనశీలురు, సైనిక యోధులు, అద్భుతమైన వృత్తినిపుణులు హైదరాబాద్‌కు వలస వస్తుండేవారు. అదీ హైదరాబాద్ ఘన చరిత్ర” అని క్యాథరిన్ విశ్లేషించారు. 

    1768లో జన్మించిన మాహ్ లఖా బాయ్ జీవితంలోని ముఖ్యాంశాలను ఆమె వివరించారు. “1824లో చనిపోయే వరకు నాంపల్లి ప్రాంతంలోనే మాహ్ లఖా నివసించారు. ఆమె నమ్మి, ప్రార్థించిన మౌలాలీకి భక్తిసమర్పణంగా మరణానంతం సికింద్రాబాద్‌లోని మౌలాలీ గుట్ట పాదాల చెంత తన తల్లి సమాధి పక్కనే ఆమె భౌతికకాయాన్ని కూడా సమాధి చేశారు. ఇవాళ్టికీ వాటిని చూడవచ్చు.”

    స్వీయ ఉర్దూ గజల్స్‌ను సమగ్రమైన సంపుటిగా పుస్తక రూపంలో తెచ్చిన తొలి భారతీయ వేశ్యామణి (తవాయిఫ్) మాహ్ లఖా బాయ్. నిజామ్ సంస్థానంలో సాక్షాత్తూ పాలకులకే ప్రభుత్వ విధానాలు, దౌత్యానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. నాటి హైదరాబాద్ నిజామ్ సంస్థానంలోని ఓ ప్రియమైన వేశ్యకు దత్త పుత్రికగా పెరిగిన మాహ్ లఖా అత్యుత్తమ గురువుల వద్ద సమగ్ర శిక్షణ పొందారు. 

    ఆ రోజుల్లోనే కళాకారిణిగా, చింతనాశీలిగా, గుర్రపుస్వారీ, ఈటె విసరడం, ధనుర్విద్య, వేటాడడంలో దిట్టగా, చివరకు యుద్ధం సైతం చేయగల వీరవనితగా ఎదిగిన తీరు ఇవాళ తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లోనే ఆమెను రాజాస్థానంలో కులీనుల వర్గంలోని పెద్దల్లో ఒకరి (సీనియర్ ఉమ్రాహ్)గా నిజామ్ రాజు చేర్చుకోవడం విశేషం.

    ఆ రోజుల్లో నిజామ్ రాజు ఆమెకు ఇచ్చిన జాగీర్లలో... నేటి హైదర్ గూడా, చందానగర్, సయ్యద్ పల్లి, అడికిమెట్ తదితర ప్రాంతాలున్నాయి. మొత్తానికి, కవయిత్రిగా, కథక్ నర్తకిగా, హిందుస్తానీ శాస్త్రీయ గాయనిగా, ఆ లలిత కళలన్నీ ఆడపిల్లలకు నేర్పేందుకు పాఠశాలలు స్థాపించిన వ్యక్తిగా మాహ్ లాఖాది విలక్షణమైన కథ. 

    ప్రస్తుతం నాంపల్లిలో బజార్ ఘాట్ దగ్గర, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కార్యాలయానికి సమీపంలో నెలకొన్న ఎం.ఎ.ఎం. గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకప్పుడు మాహ్ లాఖా కార్యక్షేత్రం. అక్కడే ఆమె ఎంతోమంది వనితలకు ఆట, పాటల్లో శిక్షణ నిచ్చినట్టు చరిత్ర.

    రెండొందల ఏళ్ళ నాటి మన రాతప్రతి... బ్రిటన్‌లో భద్రంగా!
    “నిజానికి, ఆమె అసలు పేరు చందా బీబీ. చంద్రబింబం లాంటి చెక్కిళ్ళు గలది అనే అర్థంలో నిజామ్ ఆమెకు పెట్టిన పేరు - మాహ్ లఖా బాయ్. ఆమె తల్లి రాజ్ కున్వర్. ఆ రోజుల్లో రాజ్‌పుతానా నుంచి వలస వచ్చిన రాజ్ కున్వర్ సంతానం లేని తన చెల్లెలికి మాహ్ లఖాను దత్తత ఇచ్చింది. ఆ చెల్లెలు నాటి నిజామ్‌కు ప్రధాని అయిన నవాబ్ రుక్న్ ఉద్దౌలాకు ప్రీతిపాత్రమైన వేశ్యామణి. 

    అలా మాహ్ లఖా బాయ్ నిపుణులైన గురువుల వద్ద అత్యుత్తమ శిక్షణ పొందేందుకు వీలు కలిగింది. ఆ రోజుల్లో నిజామ్ మొదలు సంస్థాన ప్రధానమంత్రులు, ఉన్నత సైనికాధికారులు, చివరకు బ్రిటీష్ రెసిడెంట్ వరకు పలువురితో మాహ్ లఖాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఫలితంగా, ఆమె ఎంతో పేరు, పలుకుబడి గల తవాయిఫ్‌గా రాణించింది.

    టిప్పు సుల్తాన్‌పై తమ సంయుక్త సేనల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్రిటీషు వారికి నిజామ్ సంస్థానం భారీ విందు, వినోద కార్యక్రమం ఏర్పాటు చేసింది. 1799 అక్టోబర్ 18 రాత్రి నిజామ్ సంస్థాన ప్రధాన మంత్రి మీర్ ఆలమ్ నివాసంలో ఆ అపూర్వ గానాబజానా సాగింది. ఆ నృత్య ప్రదర్శన సమయంలో అందమైన క్యాలిగ్రఫీ చేతిరాతతో రూపొందిన తన గజల్స్ రాతప్రతిని ఆనాటి అసిస్టెంట్ బ్రిటీష్ రెసిడెంట్... సర్ జాన్ మాల్కోమ్‌కు ఆత్మీయంగా బహూకరించారు మాహ్ లాఖా బాయ్. 

    అలా ఆ రోజు ఆమె స్వయంగా సంతకం చేసి, కానుకగా ఇచ్చిన ఆ గజల్స్ సంపుటి రాతప్రతి ఇప్పటికీ బ్రిటీష్ లైబ్రరీలో భద్రంగా ఉంది” అని క్యాథరిన్ చెబుతుంటే ‘మంథన్’ నిర్వహించిన ఈ ప్రసంగానికి హాజరైన సభికులు అబ్బురంగా చెవులప్పగించి విన్నారు. అలాగే, “మాహ్ లఖా బాయ్ ప్రోద్బలంతో ఆమె గురువు ఖుశాల్ ఖాన్ అనూప్ ‘రాగ్ దర్శన్’ అనే సంగీత శాస్త్ర గ్రంథం రచించారు. ఆ రచన రాతప్రతి పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైబ్రరీలో నేటికీ పదిలపరచబడింది” అని ఆమె వివరించారు.

    ఆసక్తికరమైన ఆలోచనల ‘మంథన్’
    ప్రపంచ ప్రసిద్ధులైన ఆలోచనాపరులు మనసు విప్పి మాట్లాడే వేదికగా ‘మంథన్’ చిరకాలంగా భాగ్యనగర వాసులకు సుపరిచితం. సాహిత్యం, సంగీతం, సంస్కృతి, సమాజం... ఇలా పౌర జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల అంశాలపైనా ఎప్పటికప్పుడు ప్రముఖులను ఆహ్వానించి, వారితో ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు నిర్వహించడం కొన్నేళ్ళుగా ‘మంథన్’ చేస్తున్న మంచి పని. క్రియాశీలమైన ఈ సంభాషణల ద్వారా ప్రజాస్వామ్య, లౌకిక విలువలను బలోపేతం చేయాలన్నది ఈ పౌర సంస్థ ఆశయం. 

    అందులో భాగంగానే, ఎప్పటికప్పుడు తాజా ప్రచురణలతో ముందుకొచ్చిన ప్రసిద్ధ పుస్తక రచయితలతో, అధ్యయనశీలుర ప్రసంగాలు, సంభాషణలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏప్రిల్‌లో ఇటీవలే ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణతో ఆలోచనాత్మక సంవాదం సాగించిన ‘మంథన్’, వారం తిరిగేసరికి సంగీత చరిత్రకారిణి క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్‌తో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరపడం విశేషం. అయితే, ఇలాంటి అపురూప కార్యక్రమాలపై మీడియాలో ఎక్కడా మచ్చుకైనా మొక్కుబడిగా మూడు ముక్కలు కనిపించకపోవడమే విషాదం.
    రెంటాల జయదేవ

    (చదవండి: సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!)

  • చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింపచేసేలా చేస్తుంది కూడా. కొన్ని నినాదాలు మాటలకే పరిమితమైపోతాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్‌లో చోటు చేసుకుంది. 

    అసలేం జరిగిందంటే..గుజరాత్‌లోని నార్నౌల్‌లోని ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచారం అందర్నీ ఆకర్షించడమే కాదు లింగ సమానత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచింది. బీకామ్ పట్టభద్రురాలైన నేహా జాంగ్రా, తన పెళ్లికి ఒక రోజు ముందు, శనివారం రాత్రి తన పరిసర ప్రాంతాల్లో ఆడ గుర్రంపై ఊరేగుతూ కనిపించింది.  

    సంగీతం, ఉత్సవ నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనందం, గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి  హరిరామ్ జాంగ్రా చిన్న కిరాణ దుకాణం నడుపుతుంటారు.2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి, అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తాను కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు.

    ‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార స్ఫూర్తికి అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. "ఇది కేవలం ప్రతీకాత్మకం కాదు; ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి," అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహా తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెల మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పుకు స్ఫూర్తినిస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.

    పెళ్లికి ముందు బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో, ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కాగావడోదరలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన నిలేష్ కుమార్‌తో నేహా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. 

    (చదవండి: అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌ తప్పనిసరి..! ఎందుకో తెలుసా..)

     

  • స్త్రీ జీవితంలో అనేక ఖాళీ అరలు ఉంటాయి. కాని స్త్రీ జీవితంలో తప్పక ఉండాల్సిన ఒక ‘దాపుడు అర’ గురించి ఎందరు ఆలోచిస్తారు? ‘తాయి కెళవి’ సినిమాలో ముసలవ్వ ఈ దాపుడు అర మాట్లాడుతుంది. ఆ ఒక్క అర ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఇది అచ్చంగా ఒక బతుకు గోరే తల్లి కథ.

    ‘తాయి కెళవి’ చూస్తే తెలుగు వారి గొప్పతనం తెలిసొస్తుంది. ఇది గతంలో అంటే 1990లోనే వచ్చిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘బతుకుగోరే తల్లి’, ఆర్‌.ఎం.ఉమామహేశ్వర రావు ‘బిడ్డలు గల్ల తల్లి’ కథలను గుర్తు చేస్తుంది. పైకి గయ్యాళులుగా కనిపించే ఆ తల్లులు బిడ్డల క్షేమం కోసం లోపల ఎంత దయాళువుగా ఉంటారో పై రెండు కథలు గొప్పగా చూపాయి. అవి సినిమాలుగా తీసి ఉంటే మన గొప్ప తెలిసేది. తమిళంలో ‘తాయి కెళవి’ (జేజమ్మ) గా తీయడం వల్ల ఆ పేరు వారికి దక్కింది.

    పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథలో ఇలాగే ఒక తల్లి ఉంటుంది. ఆమెను అందరూ ‘జేబు రమణమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఆమె తన చిన్నప్పుడు ‘మగవాళ్లకు జేబు ఉన్నట్టుగా ఆడవాళ్లకు ఎందుకు ఉండదు’ అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ల బలానికి, అహానికి జేబు కారణం అని, దాని నుంచి పుట్టే డబ్బు కారణమని జేబు రమణమ్మ అర్థం చేసుకుంటుంది. 

    తను మరణించే వరకు తన ఆర్థిక స్వాతంత్య్రం గురించి నిర్లక్ష్యం వహించదు. అంతేకాదు, సొంత కోడలి పేర్న ఉన్న ఆస్తిని కొడుకు అమ్మడానికి చూస్తూ... అమ్మమని కోడల్ని బలవంతం చేస్తుంటే కోడల్ని వారించి ‘నీ ఆస్తి వాడికిచ్చావంటే నువ్వు బానిస బతుకు బతకాల్సి వస్తుంది’ అని చెప్పి, కొడుకు ఆగ్రహానికి గురయ్యి చావు కొని తెచ్చుకుంటుంది. మగవాళ్లు ఆడవాళ్లకు డబ్బు అందనివ్వరు. వారి దగ్గర ఉన్నది లాక్కునే దాకా ఊరుకోరు.

    ‘తాయి కెళవి’ పాత్ర పోషించిన రాధిక ఈ లోకరీతిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మన దగ్గర పైసలు ఉంటే లోకం మన ముఖం చూస్తుంది, ఖాళీచేతులు ఉన్నవారిని ఈసడిస్తుంది అని గ్రహిస్తుంది. డబ్బు లేనప్పుడు దయచూపని లోకంతో దయగా వ్యవహరించాల్సిన పని లేదనుకుంటుంది. అందుకే కఠినంగా వడ్డీ వసూలు చేస్తుంటుంది. 

    ‘సుఖంగా బతకడానికి డబ్బు కావాలో వద్దో తెలియదు గానీ గౌరవంగా బతకడానికి డబ్బు కావాలి’ అంటుంది. అందుకై మంచంలో ఒక రహస్య అరను ఏర్పాటు చేసుకుంటుంది. పైసా పైసా దాచి ఆ డబ్బుతో బంగారం కొని అదంతా ఆ అరలో భద్రం చేసుకుని ఉంటుంది. ప్రతి స్త్రీకి, గృహిణికి ఈ రహస్య అర అవసరం ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది.

    తాయి కెళవి కుమార్తె సురళిని మొగుడు మూడు తులాల బంగారం ఇవ్వలేదని వదిలేసి ఉంటాడు. అతను కూతురిని పీడించుకుని తింటున్నాడని రాధిక గ్రహిస్తుంది. సహించడం త్యాగం కాదు, బానిసత్వం ఆమె దృష్టిలో. అందుకే కూతురిని తన దగ్గర ఉంచుకుని స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. తల్లిగా తన దగ్గర డబ్బు లేక΄ోతే దీనమైన మాటలు చెప్పి భర్త దగ్గరకు పంపేదేమో. 

    కాని ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురికి కొత్త జీవితం ఇవ్వగలదు. అందుకే నీచుడైన అల్లుడితో విడాకులు ఇప్పించి రెండో మనువు చేస్తుంది. సొంత డబ్బు కలిగి ఉన్న తల్లికి వచ్చే ధైర్యం ఎలాంటిదో ఈ సినిమా చూపి దోవను సంకేతం చేస్తుంది.

    ‘చదువుకోండి. దానితోపాటు సంపాదించడం నేర్చుకోండి. మీ పర్సులో ఉన్న నాలుగు నోట్లే మీకు రక్షణ. మీ జీతమే మీకు స్వేచ్ఛ. మీరు డబ్బు దాచిన అర మీ పిల్లల జీవితాలు సరిదిద్దే మంత్రదండం’ అని నాలుగు తిట్లు కలిపి మరీ చె΄్తోంది ‘తాయి కెళవి’.
    – కె.

    (చదవండి: పెరిమెనోపాజ్‌ ఎఫెక్ట్‌: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!)
     

  • చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. 

    నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన  పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్‌కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్‌ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్‌ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్‌), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. 

    మెనోపాజ్‌ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?
    నిజానికి ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌.... ఇన్సులిన్‌ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్‌ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్‌ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్‌ మాస్‌) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. 

    కానీ ఈస్ట్రోజెన్‌ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది.  

    తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... 
    ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్‌ దశల్లో ఈస్ట్రోజెన్‌  హార్మోనల్‌ మార్పులు క్రమంగా మజిల్‌ మాస్‌ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. 

    ఇలా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్‌ ద న్యూట్రియెంట్స్‌), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్‌ చేయడం (స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్‌ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్‌ మెటబాలిజమ్‌ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో  నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. 

    మెనోపాజ్‌ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్‌ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ  ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్‌ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్‌ను సంప్రదించి అందుకోసం హార్మోన్‌ రీ–ప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.

    ఈ సమస్యను అధిగమించడం ఎలా... 
    ఏజింగ్‌ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్‌స్టైల్‌) బాగా ఉపయోగపడుతుంది.

    మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు  వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. 

    ఒత్తిడిని (స్ట్రెస్‌ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. 

    మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. 

    కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి.   
    రూమా సిన్హా,  సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆబ్‌స్టిట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌. 

    (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!)

  • శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు క్యాన్సర్  ముప్పు ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుండెకు క్యాన్సర్ సోకడం గురించి విన్నారా? క్యాన్సర్ బారిన పడని ఏకైక అవయవం గుండె మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ దశాబ్దాల మిస్టరీని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. నిరంతరం కొట్టుకునే గుండె చప్పుడే, అందులో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ‘మెకానికల్ ఫోర్సెస్’ క్యాన్సర్ జన్యువుల పనితీరును మార్చేస్తాయని తేల్చిచెప్పిన ఈ పరిశోధన వైద్య రంగంలో ఒక సంచలనంగా నిలిచింది.

    నిరంతర శ్రమతోనే క్యాన్సర్‌కు చెక్
    ప్రముఖ ‘సైన్స్’జర్నల్‌లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గుండె నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ యాంత్రిక ఒత్తిడి కారణంగా గుండె కణాల విభజన వేగం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ)కి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో, గుండె లోపలి ఈ ప్రత్యేకమైన వాతావరణం క్యాన్సర్ కణాల పెరుగుదలను క్రియాశీలంగా అడ్డుకుంటుందని తేలింది.

    ఎలుకల ప్రాజెక్టులో సంచలన నిజాలు
    దీనిని నిరూపించడానికి పరిశోధకులు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు. వారు ఒక దాత గుండెను ఎలుక మెడ భాగంలో అమర్చారు. ఈ కొత్త గుండెకు రక్తప్రసరణ జరుగుతుంది కానీ, రక్తాన్ని పంప్ చేసే యాంత్రిక ఒత్తిడి ఉండదు. ఆ తర్వాత ఈ ఒత్తిడి లేని గుండెలోకి, అలాగే సహజంగా రక్తాన్ని పంప్ చేస్తూ పనిచేస్తున్న ఎలుక సొంత గుండెలోకి మానవ క్యాన్సర్ కణాలను ఎక్కించి, కణతుల వృద్ధిని తులనాత్మకంగా పరిశీలించారు.

    పనిచేసే గుండెలో పెరగని కణాలు
    ఈ ప్రయోగ ఫలితాలు క్యాన్సర్ పరిశోధనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. రక్తాన్ని పంప్ చేయని, అంటే మెకానికల్ ఒత్తిడి లేని మెడలోని గుండెలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెంది, కణతులుగా మారాయి. కానీ సహజంగా నిరంతరం కొట్టుకుంటూ, ఒత్తిడిని ఎదుర్కొంటున్న అసలైన గుండెలో మాత్రం క్యాన్సర్ కణాలు పెరగలేదు. వివిధ రకాల క్యాన్సర్లలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి గుండె పడే యాంత్రిక శ్రమే క్యాన్సర్‌ను అడ్డుకునే ప్రధాన ఆయుధం అని స్పష్టమైంది.

    ‘నెస్ప్రిన్-2’.. క్యాన్సర్‌ను అడ్డుకునే హీరో
    అసలు ఈ ఒత్తిడి క్యాన్సర్‌ను ఎలా ఆపుతుందనే విషయానికొస్తే.. ఇక్కడే ‘నెస్ప్రిన్-2’ (Nesprin-2) అనే ప్రొటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఏర్పడే భౌతిక సంకేతాలను ఈ ప్రొటీన్ కణ కేంద్రకానికి చేరవేస్తుంది. ఈ సంకేతాలు కణాలలోని డీఎన్‌ఏ అమరికను, హిస్టోన్ మిథైలేషన్ ప్రక్రియను మారుస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమయ్యే జన్యువులు బలహీనపడి, కణతుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

    భవిష్యత్ క్యాన్సర్ చికిత్సలకు కొత్త ఆశ
    పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాల్లోని ఈ నెస్ప్రిన్-2 ప్రొటీన్‌ను సైలెంట్ (నిష్క్రియం) చేసి చూడగా, చురుగ్గా పనిచేసే గుండెలో కూడా క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించి కణతులు ఏర్పడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కొత్త శకానికి నాంది పలకనుంది. కణాలు అనుభవించే ఈ యాంత్రిక ఒత్తిడిని కృత్రిమంగా సృష్టించడం లేదా అనుకరించడం ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే క్యాన్సర్‌ను కూడా అరికట్టే సరికొత్త థెరపీలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు

  • ఎన్నో రైళ్ల జర్నీలు చేసి ఉంటారు. కానీ చైనాలో ఆ ప్రదేశంలోని రైలు జర్నీ ఓ ప్రత్యేక అనుభూతి మాత్రమే కాదు, ఆస్ప్రతిలో ఉన్నామా అనే భావన వస్తుంది. ఆ రైలు ఎక్కిన ప్రతి ఒక్కరు ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి తీరాల్సిందే. లేదంటే కష్టం. ఎందుకంటే..

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గమైన చైనా క్వింగ్‌హై-టిబెట్ రైల్వేలో కచ్చితంగా ఆక్సిజన్‌ మాస్క్‌ ధరించి ప్రయాణించాలి. ఆ రైలు "ఆసుపత్రి తరహా" ఏర్పాటుతో వస్తుంది. ఈ అసాధారణ ప్రయాణం మిమ్మల్ని టిబెట్ రాజధాని అయిన లాసా వరకు తీసుకువెళుతుంది.  దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైగా పొడవైన ఈ రైలు మార్గంలో అధిక భాగం సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల (13,123 అడుగులు) ఎత్తులో ప్రయాణిస్తుంది. 

    దీనిలోని అత్యంత ఎత్తైన ప్రదేశం టాంగ్‌గులా కనుమ వద్ద 5,072 మీటర్ల(16,640 అడుగులు) ఎత్తుకు చేరుకుంటుంది. ఈ ఎత్తులో, సముద్ర మట్టంతో పోలిస్తే గాలిలో సుమారు 40 శాతం తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సునాయాసంగా చేయడానికి, అలాగే అధిక ఎత్తులో ప్రయాణించేలా సహాయం చేయడానికి రెండు ప్రధాన ఆక్సిజన్‌ వ్యవస్థలను రూపొందించారు.

    మొదటిది డిస్పర్షన్ ఆక్సిజన్ సిస్టమ్. ఈ వ్యవస్థ రైలులోని ఎయిర్ కండిషనింగ్‌లో అదనపు ఆక్సిజన్‌ను కలుపుతుంది, తద్వారా ప్రతి కోచ్ లోపల మొత్తం ఆక్సిజన్ స్థాయి సుమారు 23.5 శాతానికి పెరుగుతుంది. రైలు సాధారణంగా గోల్ముద్ (2,829 మీ) చేరుకున్న తర్వాత ఈ వ్యవస్థను ప్రారంభిస్తుంది.

    రెండవది డైరెక్ట్ ఆక్సిజన్ అవుట్‌లెట్ సిస్టమ్. ఇది ప్రయాణికులు తమ సీట్ల దగ్గర ఉన్న అవుట్‌లెట్‌లకు అనుసంధానించబడిన చిన్న పైపుల ద్వారా ఆక్సిజన్‌ను పీల్చుకోవడానికి అనుమతిస్తుంది. హార్డ్ స్లీపర్ కంపార్ట్‌మెంట్లలో, ప్రతి బెర్త్‌కు దాని పక్క గోడల వెంబడి ఆక్సిజన్ అవుట్‌లెట్‌లు అమర్చబడి ఉంటాయి.

    హార్డ్ సీట్ కోచ్‌లలో, ఆక్సిజన్ అవుట్‌లెట్‌లు క్యారేజీ గోడల వెంబడి క్రమమైన విరామాలలో లేదా కొన్నిసార్లు సీట్ల కిందకూడా అమర్చబడి ఉంటాయి. ప్రతి అవుట్‌లెట్‌ను సుమారు 4 నుంచి 6 మంది ప్రయాణికులు పంచుకుంటారు. సాఫ్ట్ స్లీపర్ కంపార్ట్‌మెంట్లలో, ప్రతి బెర్త్‌కు మంచం దగ్గర దాని స్వంత ఆక్సిజన్ అవుట్‌లెట్ ఉంటుంది.

    ఈ  రైలు మార్గం ప్రకృతి సౌందర్యానికి నెలవు..
    కింగ్‌హై-టిబెట్ రైలు ద్వారా లాసా చేరుకునే ప్రయాణం చాలా అందమైనది, ప్రత్యేకమైనది. ఈ రైలు బీజింగ్, షాంఘై, చెంగ్డూ, షినింగ్ వంటి నగరాల నుంచి టిబెట్‌లోని లాసా వరకు వెళుతుంది.

    ఈ ప్రయాణంలో, ప్రయాణికులు మార్గం పొడవునా ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. వారు విశాలమైన నీలి ఆకాశాన్ని,తెల్లని మేఘాలను చూస్తారు. గాడిదలు, గొర్రెల మందలతో కూడిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. 

    ఈ రైలు కున్లూన్ పర్వత శ్రేణితో సహా మంచుతో కప్పబడిన పర్వతాలు, యాంగ్జీ వంటి ప్రధాన నదుల గుండా కూడా వెళుతుంది. ఈ ప్రయాణం హోహ్ షిల్ నేషనల్ నేచర్ రిజర్వ్ వంటి మారుమూల సహజ ప్రాంతాల గుండా సాగుతుంది.

    సాఫ్ట్ స్లీపర్, హార్డ్ స్లీపర్, హార్డ్ సీట్ల కోసం 

    ఢిల్లీ నుంmr లాసాకు ప్రయాణిస్తుంటే, బీజింగ్ మీదుగా విమానంలో వెళ్లవలసి ఉంటుంది. దీనికి సుమారుగా రూ. 55,000 ఖర్చవుతుంది. బీజింగ్ నుంచి లాసాకు రైలులో వెళ్లాలి. ధర మీరు ఎంచుకునే సీటు రకంపై ఆధారపడి ఉంటుంది.

    మూడు రకాల సీట్లు ఉన్నాయి. సాఫ్ట్ స్లీపర్ అత్యంత సౌకర్యవంతమైన ఎంపిక, దీనిలోని ప్రతి క్యాబిన్‌లో నాలుగు బెర్త్‌లు ఉంటాయి. కంపార్ట్‌మెంట్లు విశాలంగా ఉంటాయి. లాక్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. టేబుల్, టీవీ స్క్రీన్, లగేజీ పెట్టుకునే స్థలం, ఆక్సిజన్ అవుట్‌లెట్‌ల వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. పై బర్త్‌కు సుమారుగా  రూ. 675, కింది బంక్‌కు రూ. 700 ఖర్చవుతుంది.

    తరువాతది హార్డ్ స్లీపర్. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ఆరు బెర్త్‌లు ఉంటాయి, దిండ్లు, దుప్పట్లు అందించబడతాయి. గోప్యత కోసం తలుపు ఉండదు, మరియు స్థలం ఇరుకుగా ఉంటుంది. ధరలు పై బర్త్‌కు రూ. 425 మధ్య బర్త్‌ రూ. 440, కింది బంక్‌కు రూ. 450 నుంచి ప్రారంభమవుతాయి.

    హార్డ్ సీట్లు అత్యంత చౌకైన సుదీర్ఘ ప్రయాణానికి మాత్రమే సాధారణ సీటింగ్‌ను అందిస్తాయి. దీనికి సుమారుగా రూ. 212 ఖర్చవుతుంది.

     

    (చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!)

     

     

  • శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్‌ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు.

    శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు

    1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండి
    మెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్‌, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్‌లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.

    2 కాలేయం (Liver): 
    విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్‌ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.

    3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. 
    ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్‌ను అందిస్తాయి.
    సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.

    4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణ
    స్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.

    చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. 

    (చదవండి: పాద' సేవలను గుర్తించండి!)