Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • రాజ‌స్తాన్ రాయల్స్‌ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ.. టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రాను సైతం వ‌ద‌ల్లేదు. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో బుమ్రాను సూర్య‌వంశీ ఎలా ఎదుర్కొంటాడో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ వైభవ్ మాత్రం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా బుమ్రాను ఉతికారేశాడు.

    రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో బుమ్రా తను వేసిన తొలి బంతినే వైభవ్ అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ఆషాట్‌కు బుమ్రా సైతం ఫిదా అయిపోయాడు. బుమ్రా నవ్వుతూ తన ఎండ్‌ వైపు వెళ్లిపోయాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతిని కూడా సూర్యవంశీ స్టాండ్స్‌కు పంపించాడు.

    ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రాకే చుక్కులు చూపించావు.. బుడ్డోడా నీవు గ్రేట్‌ అంటూ కొనియాడుతున్నారు. కాగా వైభవ్‌ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.

    ఇక గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా కేవలం 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ నిర్ణీత  ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వీ  జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

    జైశ్వాల్‌ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్‌, 5 సిక్సర్లతో 39), రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.
    చదవండి: ముంబై ఇండియ‌న్స్‌లోకి వైభ‌వ్ సూర్య‌వంశీ?

     

     

  • భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయించింది. గురువారం (ఏప్రిల్ 9) రవిశాస్త్రి పేరిట స్టాండ్‌ను ఘ‌నంగా ఆవిష్క‌రించ‌నున్నారు. 

    ఈ కార్య‌క్ర‌మానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయ‌న చేతుల మీదుగా రవిశాస్త్రి స్టాండ్ అధికారికంగా ప్రారంభం కానుంది. కేవలం రవిశాస్త్రి మాత్రమే కాకుండా మరికొందరు దిగ్గజాలను కూడా అదే రోజున ఎంసీఏ స‌త్క‌రించ‌నుంది.

    భారత మహిళా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ డయానా ఎదుల్జీ పేరును వాంఖడే స్టేడియం గేట్‌కు పెట్టనున్నారు. అదేవిధంగా దివంగత దిగ్గజ బ్యాటర్ దిలీప్ సర్దేశాయ్ పేరును కూడా వాంఖ‌డేలోని ఒక గేట్‌కు పెట్టాల‌ని ఎంసీఎ నిర్ణ‌యించింది.

    కాగా ర‌విశాస్త్రి భార‌త క్రికెట్‌కు నాలుగు దశాబ్ధాల సేవలను అందించాడు. ప్లేయర్‌గా, కోచ్‌గా భారత జట్టు విజయాల్లో భాగమయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా శాస్త్రి ఉన్నాడు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు తొలి భారత క్రికెటర్ కూడా శాస్త్రినే కావడం విశేషం.  రవిశాస్త్రి తన కెరీర్‌లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశారు.

  • వైభ‌వ్ సూర్య‌వంశీ.. విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లోనూ వైభ‌వ్ త‌న భీక‌ర ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభ‌వ్ త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం వ‌ణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

    ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్‌ఫుల్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.

    మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్‌కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే  జోస్యం చెప్పాడు.

    "ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్‌ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.
    చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి నో ఛాన్స్‌!

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ త‌ర్వాత భార‌త అండ‌ర్‌-19, అండ‌ర్‌-25జ‌ట్లు రెడ్ బాల్ సిరీస్‌ల కోసం శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనుంది. ఈ క్ర‌మంలో భార‌త క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యువ ఆట‌గాళ్ల‌లలో రెడ్ బాల్ స్కిల్స్‌ను వెలికితీసేందుకు బెంగ‌ళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఒక ప్ర‌త్యేక ట్రైనింగ్ క్యాంప్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.

    ఈ అండర్-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. అయితే ఈ లిస్ట్‌లో యువ ఆట‌గాళ్లు వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రేల‌కు చోటు ద‌క్క‌లేదు. వీరిద్ద‌రూ ఐపీఎల్‌-2026లో బీజీగా ఉండ‌డంతో బోర్డు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. కానీ ప్ర‌ధాన జ‌ట్టులో మాత్రం వారు చోటు ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది.

    కాగా శ్రీలంక టూర్ కంటే ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్‌లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్‌ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. దేశ‌వ్యాప్తంగా  64 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని 4 జట్లుగా విభ‌జిస్తారు. ఒక్కో జ‌ట్టులో 16 మంది ఉంటారు.

    ఇందుకోసం సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో రాణించిన 25 మందిని, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో స‌త్తాచాటిన 25 మందిని ఎంపిక‌చేశారు. మిగిలిన 14 మందిలో అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.

    ఈ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌లో రాణించిన వారికి 'ఇండియా ఎమర్జింగ్'(అండర్‌-25) ప్రధాన జ‌ట్టులో చోటు ద‌క్క‌నుంది. ఈ జ‌ట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఈ క్యాంప్ మొత్తం దిగ్గ‌జ క్రికెట‌ర్‌, బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గ‌నుంది.

    బీసీసీఐ అండర్-25 షార్ట్‌లిస్ట్ ప్లేయర్స్ వీరే:
    ఆయుష్ దోసేజా, యష్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింబాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖ్రాజ్ మాన్, యశ్వర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖాడే.
    చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

  • ముంబైపై రాజస్తాన్‌ ఘన విజయం
    గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్‌ ధీర్‌(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ రెండు, సందీప్‌ శర్మ, బర్గర్‌ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత  ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. 

    ముంబై ఏడో వికెట్‌ డౌన్‌
    నమన్‌ ధీర్‌ రూపంలో ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది.

    ముంబై ఆరో వికెట్ డౌన్‌
    షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రూథర్‌ఫోర్డ్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్‌: 94/6

    కష్టాల్లో ముంబై ఇండియన్స్‌
    ముంబై ఇండియన్స్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. రవిబిష్ణోయ్‌ వేసిన ఐదో ఓవర్‌లో మూడో బంతికిక్‌ పాండ్యా(9), ఆఖరి బంతికి తిలక్‌ వర్మ(1) ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.

    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ డౌన్‌
    రోహిత్‌ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ డౌన్‌
    151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన ర్యాన్‌ రికెల్టన్‌.. జోఫ్రా అర్చర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

    ముంబై ముందు భారీ టార్గెట్‌
    ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత  ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. యశస్వీ  జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.

    కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్‌, 5 సిక్సర్లతో 39), రియాన్‌ పరాగ్‌(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.

    రాజస్తాన్ మూడో వికెట్ డౌన్‌
    రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్‌.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  10 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 97/2.

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    84 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ధ్రువ్ జురెల్‌.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.  7 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 97/2. జైశ్వాల్‌(47), రియాన్‌ పరాగ్‌(7) క్రీజులో ఉన్నారు.

    రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
    80 పరుగుల వద్ద రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. శార్థూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    రాయ‌ల్స్ ఓపెన‌ర్ల విధ్వంసం
    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైశ్వాల్‌(10 బంతుల్లో 36), వైభ‌వ్ సూర్య‌వంశీ(7 బంతుల్లో20) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్ట‌పోకుండా 58 ప‌రుగులు చేసింది.

    ఒకే ఓవర్‌లో 22 పరుగులు
    రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో జైశ్వాల్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.

    మ్యాచ్‌ ఆరంభం
    ఈ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, ట్రెంట్‌ బౌల్ట్‌ తుది జట్టులోకి వచ్చారు. రాజస్తాన్‌ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.

    తుది జట్లు
    రాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్‌ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్,  ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

    మరి కాసేపట్లో మ్యాచ్‌ ఆరంభం
    👉వర్షం కారణం‍గా రాజస్తాన్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. 9:55కు టాస్‌ పడనుండగా.. 10:10 నిమిషాలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

    తగ్గిన వర్షం
    అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసేందుకు గ్రౌండ్‌ స్టాప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    టాస్‌ ఆలస్యం
    ఐపీఎల్‌-2026లో గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌- ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. గౌహ‌తిలో ప్ర‌స్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్ర‌కారం 7:00 గంట‌ల‌కు ప‌డాల్సిన టాస్ ఇప్పుడు ఆల‌స్యం కానుంది. కాగా సోమ‌వారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కేకేఆర్‌-పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది.

  • అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. 

    రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.

    జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.

    శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు.  మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.

    కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున  క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్‌కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్‌ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు.

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌తో తలపడ్డ సన్‌రైజర్స్‌ 201 పరుగులు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

    సొంతమైదానంలో నామమాత్రపు స్కోరు
    తదుపరి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో 226 పరుగుల భారీ స్కోరు సాధించిన సన్‌రైజర్స్‌.. 161 పరుగులకే ప్రత్యర్థిని కుప్పకూల్చి జయభేరి మోగించింది. అయితే, సొంతమైదానంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. హైదరాబాద్‌ జట్టు కేవలం 156 పరుగులే చేయగా.. మరో బంతి మిగిలి ఉండగానే లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.

    ఇదిలా ఉంటే.. రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఆరంభ మ్యాచ్‌లకు దూరం కాగా ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) సన్‌రైజర్స్‌ సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. 

    ఇక కమిన్స్‌ రూపంలో కీలక పేసర్‌ సేవలను కూడా జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ విభాగం బలహీనంగా ఉన్నందువల్లే సన్‌రైజర్స్‌ రాణించలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి.

    బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉంది
    ఈ విషయంపై సన్‌రైజర్స్‌ పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ తాజాగా స్పందించాడు. తమ వైఫల్యాలకు బ్యాటింగ్‌ విభాగమే ప్రధాన కారణమంటూ బౌలర్లను సమర్థించాడు. ఈ మేరకు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘గత మూడు మ్యాచ్‌లలో మేము 40 పరుగుల మేర వెనుకబడి ఉన్నాం అనిపించింది. కాబట్టి బ్యాటర్లు మరింతగా శ్రమించాల్సి ఉంది.

    అతడు లేనిలోటు తీరనిది
    ప్యాట్‌ కమిన్స్‌ వంటి ఆటగాడు లేకపోవడం ఏ ఫార్మాట్లోనైనా ఇబ్బందికరమే. జట్టుకు భారీ నష్టం కూడా! బ్రైడన్‌ కార్స్‌ చేతికి గాయమైంది. కాబట్టి మా ప్రణాళికల్లో మార్పు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా మా జట్టు అనుభవం ఉన్న జట్టు. ముఖ్యంగా పేస్‌ దళం బాగుంది.

    బ్యాట్‌తో మేము కష్టపడ్డ చోట మా వాళ్లు వికెట్లు తీయగలిగారు. బ్యాటర్లుగా మేము మాత్రం అనుకున్న మేర రాణించలేకపోయాము. ఓటములకు మా బౌలర్లను బాధ్యులను చేయడం సులువే. 

    అదనంగా 20- 30 పరుగులు చేసి ఉంటే
    కానీ ఓడిన రెండు మ్యాచ్‌లలో మేము 20- 30 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా అయితే మా బౌలర్లు లక్ష్యాన్ని కాపాడగలిగి ఉండేవారు’’ అని హెన్రిచ్‌ క్లాసెన్‌ బౌలింగ్‌ విభాగానికి మద్దతుగా నిలిచాడు. 

    కాగా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగంలో హర్ష్‌ దూబే, జయదేవ్‌ ఉనాద్కట్‌, ఎషాన్‌ మలింగ, హర్షల్‌ పటేల్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కమిన్స్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

    చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు

  • బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. దిగ్గ‌జ ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌గా ఎంపిక‌య్యాడు. మంగళవారం అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని బోర్డును రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం.. బీసీబీకి కొత్త చీఫ్‌గా త‌మీమ్‌ను నియ‌మించింది. 

    కాగా గత అక్టోబర్‌లో జరిగిన బోర్డు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  వీటిపై ఇటీవల ఆ దేశ క్రీడా మంత్రి అమీనుల్ హక్ విచారణకు ఆదేశించారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఈ ఆరోపణలన్నీ నిజమేనని తేల్చడంతో, ప్రభుత్వం తక్షణమే బోర్డు ఆఫ్ డైరెక్టర్లను తొలగించింది. 

    ఈ క్రమంలోనే అమినుల్ ఇస్లాం స్ధానంలో బీసీబీ అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్ బాధ్యతలు చేపట్టనున్నాడు.  39 ఏళ్ల తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నాడు. 11 మంది సభ్యులతో కూడిన బీసీబీ అడ్హక్ కమిటీకి తమీమ్ నాయకత్వం వహించనున్నాడు. 

    ఈ బీసీబీ కమిటీలో మాజీ కెప్టెన్ మిన్హాజుల్ అబెడిన్, రష్నా ఇమామ్, మీర్జా యసీర్ అబ్బాస్, సయ్యద్ ఇబ్రహీం అహ్మద్, ఇస్రాఫిల్ ఖస్రు, తంజీల్ చౌదరి, సల్మాన్ ఇస్పాహానీ, రఫీకుల్ ఇస్లాం వంటి వారు ఉన్నారు. తమీమ్ ఎంపికను బంగ్లాదేశ్ జాతీయ క్రీడా మండలి (NSC) డైరెక్టర్ మహమ్మద్ అమీనుల్ అహెసాన్  ధృవీకరించారు. తమ నిర్ణయం గురంచి అంతర్జాతీయ క్రికెట్ మండలికి(ICC)కి తెలియజేసినట్లు అహెసాన్ తెలిపారు.

    కాగా తమీమ్ ప్రెసెడెంట్‌గా బాధ్యతలు చేపట్టడంతో భారత్‌-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని తమీమ్ తప్పు పట్టాడు.  దీంతో అప్పటి బోర్డు సభ్యులు "ఇండియన్ ఏజెంట్" అని విమర్శించారు. అటువంటిది త‌మీమ్ ఇప్పుడు ఏకంగా చైర్మెన్‌గా ఎంపికై వారంద‌రికి షాకిచ్చాడు.
     

  • ఐపీఎల్‌-2026లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్టార్ పేసర్‌, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. భుజం, మోచేయి గాయాలతో బాధపడుతున్న స్టార్క్, కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

    దీంతో అతడు ఢిల్లీ ఆడబోయే తదుపరి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఏప్రిల్ 20 తర్వాతే ఢిల్లీ క్యాంప్‌లో చేరే సూచనలు కన్పిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్‌లలో ఏప్రిల్ 8న గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 11న చెన్నై సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

    అయితే స్టార్క్ గైర్హజరీలో ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ను లుంగి ఎంగిడీ,  ముఖేష్ కుమార్, టి.నటరాజన్‌లు సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్టార్క్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉంట జట్టు మరింత పటిష్టంగా మారుతుంది.  స్టార్క్ ఇటీవల తన గైర్హాజరీపై భారత మీడియాలో వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించాడు.

    భార‌త మీడియాలో నా  గైర్హాజరీపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నారు. కానీ అవ‌న్నీ ఆ వాస్త‌వం. ఆస్ట్రేలియా స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో భుజం, మోచేయికి గాయాలయ్యాయి. వాటి తీవ్ర‌త అప్పుడు నాకు తెలియ‌లేదు. ఇప్పుడు వాటికి చికిత్స తీసుకుంటున్నాను అని స్టార్క్ ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా స్టార్క్‌ను ఐపీఎల్‌-2026కు ముందు రూ.11.75 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. గత సీజన్‌లో అతడు 11 వికెట్లు పడగొట్టాడు.
    చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌ అరెస్టు
     

  • ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు. సిడ్నీలోని మారుబ్రాలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం న్యూ సౌత్ వేల్స్ పోలీసులు మరూబ్రాలోని మలబార్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.

    ఆ సమయంలో అటుగా వస్తున్న వార్నర్ చెకింగ్ పాయింట్‌ను చూసి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గ‌మ‌నించిన పోలీసులు అనుమానంతో అక్క‌డి వెళ్లి వార్న‌ర్‌ను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. ఈ టెస్టులో అత‌డు పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.

    వెంటనే అతడిని మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండో సారీ పరీక్షలు నిర్వహించారు. అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా ఉన్నట్లు తేలింది. ఇది ఆస్ట్రేలియాలోని అనుమతించిన పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో వార్నర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదైంది. అనంతరం అతడిని విడుదల చేస్తూ.. 2026, మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.

    వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ టోర్నీలో వారి తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ రావడంతో తన  ఫ్యామిలీతో గడిపేందుకు వార్నర్ తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అయితే అతడు తిరిగి ఏప్రిల్ 7న పాకిస్తాన్‌కు చేరుకోనున్నట్లు సమాచారం.
    చదవండి: నోటితో కాదు.. ఆటతో సమాధానం చెప్పు: సెహ్వాగ్‌ ఫైర్‌

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఎడిషన్‌ ఇప్పటికే ఆరంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఈ టీ20 లీగ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మాయగాళ్లు బెట్టింగ్‌ పేరిట ఉచ్చు బిగుస్తూ ఉంటారు. ఈసారి కూడా ‘ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ క్రికెట్‌ ప్రేమికులను హెచ్చరించారు.

    ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా.. ‘‘ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

    టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.

    ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించాం. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

    ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) కెప్టెన్‌ అజింక్య రహానే వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అసహనం వ్యక్తం చేశాడు. విమర్శకులకు కౌంటర్‌ ఇస్తూ రహానే సమయాన్ని వృథా చేసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ల పేర్లను వీరూ ప్రస్తావించాడు.

    గతేడాది కేకేఆర్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు రహానే. ఐపీఎల్‌-2025 సీజన్‌లో కేకేఆర్‌ దారుణ ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో ఒకటి కూడా గెలవలేకపోయింది.

    వారినే అడగండి!
    భారీ అంచనాలతో రూ. 25 కోట్లకు పైగా వెచ్చించి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను కొనుగోలు చేస్తే.. అతడు ఘోరంగా విఫలమవుతున్నాడు. ఆరంభ మ్యాచ్‌లలో బౌలింగ్‌ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో రహానే స్పందిస్తూ.. గ్రీన్‌ బౌలింగ్‌ ఎందుకు చేయడం లేదో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)నే అడగాలనే అనుచితంగా మాట్లాడాడు.

    అసూయతోనే
    ఇందుకు సీఏ సైతం బదులిచ్చింది. గ్రీన్‌ వెన్నునొప్పి కారణంగా ఎక్కువగా బౌలింగ్‌ చేయలేడన్న విషయం కేకేఆర్‌కు ముందుగానే చెప్పామని పేర్కొంది. ఇక తన స్ట్రైక్‌రేటు గురించి వస్తున్న విమర్శలపై రహానే స్పందిస్తూ.. ‘‘నాపై ఎందుకంత ద్వేషం.. నేను ఆడకూడదా? అయినా నాపై అసూయతోనే కొందరు ఇలా మాట్లాడుతున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    ఈ రెండు సందర్భాల్లో రహానే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీరేందర్‌ సెహ్వాగ్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అతడు ఓ జట్టుకు కెప్టెన్‌. కామెరాన్‌ గ్రీన్‌ గురించి అడిగినపుడు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకవేళ మాట్లాడినా నేరుగా సమాధానం ఇవ్వకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియాను అడగమని చెప్పడం దేనికి?

    ‘ఎండుల్కర్‌’ అంటూ..
    ఇక స్ట్రైక్‌రేటు విషయానికొస్తే.. బాగా ఆడినపుడు ప్రశంసించే వాళ్లు కొన్నిసార్లు విమర్శిస్తారు కూడా! అంత మాత్రాన ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ పోవడం సరికాదు. గ్రీన్‌ విషయంలో ఒకలా.. తన విషయంలో మరోలా రహానే స్పందించాడు.

    ఒకానొక సందర్భంలో సచిన్‌ టెండుల్కర్‌ గురించి.. ‘ఎండుల్కర్‌’ అంటూ కెరీర్‌ ముగిసిపోయిందనే వార్తలు రాశారు. కానీ సచిన్‌ వాటిని పట్టించుకోకుండా ఆటతో సమాధానమిచ్చి అందనంత ఎత్తుకు ఎదిగాడు. అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఎప్పుడూ విమర్శకులను సమాధానం ఇస్తూ సమయం వృథా చేయలేదు.

    కాబట్టి రహానే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. నోటితో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలి. ఒక్క సెంచరీ చేస్తే అంతా సైలెంట్‌ అయిపోతారు. అంతమాత్రానికి ఇలాంటి మాటలు ఎందుకు?’’ అని సెహ్వాగ్‌ రహానే తీరును విమర్శించాడు.

    చదవండి: RR vs MI: ‘వైభవ్‌ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్‌ లేదు’

  • టీమిండియా స్టార్ పేసర్‌ అర్షదీప్ సింగ్‌ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అర్షదీప్‌ ఇటీవలే తన స్నాప్‌చాట్‌ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేయడం సోషల్‌మీడియాను ఊపేసింది. ఈ టీమిండియా స్టార్‌ షేర్‌ చేసిన ఫోటోలో అమ్మాయి ముఖం కనిపించకపోయినప్పటికీ, నెట్టిజన్లు ఒక చిన్న క్లూ ద్వారా ఆమె ఎవరో కనిపెట్టేశారు. 

    అర్షదీప్‌ పట్టుకున్న ఆ అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. పంజాబ్‌కు చెందిన మోడల్, నటి అయిన సమ్రీన్ కౌర్ చేతిపై కూడా సరిగ్గా అదే టాటూ ఉండటంతో, ఆమె  అర్షదీప్‌తో లవ్‌లో ఉన్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ సందర్భంగా సమ్రీన్ పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోవడంతో అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. 

    పంజాబ్‌కు చెందిన సమ్రీన్ (26), పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోలు, ఓటీటీ చిత్రాలలో నటించిన ఆమెకు  ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

    ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఇటు అర్షదీప్ కానీ, అటు సమ్రీన్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఏదో విషయం ఉందన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో అర్షదీప్‌ పంజాబ్‌ కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.

    చదవండి:  18 కోట్ల క్రికెట‌ర్ ఆగ‌మ‌నం.. కేకేఆర్ భ‌విష్య‌త్తు మారేనా!

     

  • భారత క్రికెట్‌ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన పేరు వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.

    ఫార్మాట్లకు అతీతంగా
    ఇక భారత్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టు తరఫునా ఫార్మాట్లకు అతీతంగా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో భారత్‌కు టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఐపీఎల్‌-2026 బరిలో దిగిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై దంచికొట్టాడు.

    ఆది నుంచే దూకుడు
    కేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించి సత్తా చాటాడు వైభవ్‌. ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 18 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తమ మూడో మ్యాచ్‌లో భాగంగా మంగళవారం గువాహటిలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. వైభవ్‌ గురించి మరోసారి చర్చ మొదలైంది.

    వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌, టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాను వైభవ్‌ ఎలా ఎదుర్కొంటాడోనన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముంబై సైతం ఈ కుర్రాడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించిందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.

    వైభవ్‌ గురించి తెలుసు
    ‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. వైభవ్‌ కొత్త ఆటగాడేమీ కాదు. ఐపీఎల్‌లో అతడికి ఇది రెండో సంవత్సరం. కాబట్టి అతడు కొత్త కాదు. అయితే, అతడొక మంచి ప్లేయర్‌. అయినా అతడి కోసం మేమేమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. మిగతా వారిలాగే అతడు కూడా!’’ అని పారస్‌ మాంబ్రే కొట్టిపారేశాడు.

    అతడికి అంత సీన్‌ లేదు
    ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయి గురించి ప్రస్తావన రాగా.. ‘‘రవి మిస్టరీ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడని నేను నమ్మను. గత కొన్నేళ్లుగా అతడు ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసు. 

    ఆటగాళ్ల కెరీర్‌లో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి బాగా ఆడతారు.. మరోసారి తేలిపోతారు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నంత మాత్రాన అతడి గురించి భయపడాల్సిందేమీ లేదు’’ అని పారస్‌ మాంబ్రే అతడిని తేలికగానే తీసుకుంటున్నట్లు తెలిపాడు.

    కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రవి బిష్ణోయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్‌ (73), గ్లెన్‌ ఫిలిప్స్‌ (3), వాషింగ్టన్‌ సుందర్‌ (4), రాహుల్‌ తెవాటియా (12) రూపంలో కీలక వికెట్లు తీసి రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    చదవండి: BCCI: ‘అమ్మిన మోడల్‌ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోకి మ‌రో ఇద్ద‌రు విదేశీ స్టార్లు త్వ‌ర‌లోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంక‌కు చెందిన వనిందు హ‌స‌రంగ, మ‌తీశా ప‌తీరానాలు త్వ‌ర‌లోనే ఫిట్‌నెస్ టెస్టులో పాస‌య్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ పొందేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఐపీఎల్‌లో హ‌స‌రంగ ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, ప‌తీరానా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ఆడ‌నున్నాడు. 

    హ‌స‌రంగ‌ను రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర‌కు ల‌క్నో ద‌క్కించుకోగా, ప‌తీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధ‌ర చెల్లించి కొనుగోలు చేసింది. ప‌తీరానా రాక‌తో కేకేఆర్ బౌలింగ్ లైన‌ప్ ఫుంజుకునే అవ‌కాశముంది. నిఖార్సైన బౌల‌ర్ లేక కేకేఆర్ ఈ సీజ‌న్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే ప‌రాజ‌యాల‌నే మూట‌గట్టుకుంది. 

    కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు గాయాల‌తో హ‌స‌రంగ‌, ప‌తీరానాలు మేజ‌ర్ టోర్నీకి దూర‌మ‌య్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా తొడ వెనుక కండ‌రాల్లో చీలిక రావ‌డంతో హ‌స‌రంగ టోర్నీ నుంచి త‌ప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ప‌తీరానా కండ‌రాల గాయంతో జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు. అప్ప‌టినుంచి ఈ ఇద్ద‌రు కొలంబోలోని ఫిట్‌నెస్ అకాడ‌మీలో చికిత్స పొందుతున్నారు. 

    లంక క్రికెట్‌లో సెంట్ర‌ల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆట‌గాళ్ల జాబితాలో హ‌స‌రంగ‌, ప‌తీరానాలు చోటు ద‌క్క‌డంతో బ‌య‌టి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్ద‌రు ఫిట్‌నెస్ టెస్టు పాస‌య్యేందుకు శ్ర‌మిస్తున్నారు. అయితే వీరిలో హ‌స‌రంగా ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్‌వోసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోవ‌డంతో అత‌డు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.

    ప‌తీరానా మాత్ర‌ం ఎన్‌వోసీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్‌నెస్‌ టెస్టులో  క్లియరన్స్‌ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్‌ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో క‌లిసే అవ‌కాశ‌ముంది. ఇక పతీరానా ఐపీఎల్‌లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

    ఇక హసరంగ ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓట‌ములు ఎదుర‌వ్వ‌గా.. పంజాబ్‌తో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణమ‌యింది. ఇక ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓట‌మి చెందిన‌ప్ప‌టికీ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో గెలిచి సీజ‌న్‌లో బోణీ చేసింది.

    చదవండి: అన్నింటా విఫ‌లం.. ‘త‌లా’ లేక సీఎస్‌కే ఆగమాగం!

International

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని అన్నారు. మళ్లీ ఎప్పటికీ పునరుద్దరించలేరని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ఇరాన్.. ఓ సైకో తమని ఏం చేయాలేడని చెప్పింది. ఇప్పటికే చర్చల ప్రక్రియని పూర్తిగా నిలిపివేసింది.

    'మా ఇంధన వనరులు, బ్రిడ్జిలపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రపంచ చమురు రవాణా మొత్తాన్ని అస్తవ్యస్తం చేస్తాం' అని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. ఇకపోతే ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా నౌకలకు గేట్ వేగా ఉండే బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని మూసేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ రూట్‌లో నిత్యం 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది.

    ప్రపంచ చమురు వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గంలోనే రవాణా జరుగుతుంది. ఒకవేళ ఇది మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా మరింత ఇంధన సంక్షోభం తలెత్తడం గ్యారంటీ. ఇప్పటికే హర్ముజ్ జలసంధి మూతపడగా.. ఇప్పుడు బాబ్ అల్ మండేబ్ మార్గాన్ని కూడా మూసేస్తే ఆఫ్రికా దేశాల చుట్టూ తిరిగి రావడానికి 14 రోజులు పడుతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది.

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియాలపై సోషల్‌ మీడియాలో విపరీతమైన నెగిటివ్‌ ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ఇటీవల వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో మెలానియా చేసిన వాఖ్యలు పెద్దఎత్తున దుమారం రేపుతున్నాయి. అమెరికా దాడుల్లో వందలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే.. వారి భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తామనడం ఏవిధంగా సమంజనీయసమని నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు.

    నిన్న ఆదివారం వైట్ హౌస్‌లో జరిగిన  'ఈస్టర్ ఎగ్ రోల్' కార్యక్రమంలో ట్రంప్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలానియా మాట్లాడుతూ' ఇరాన్‌లో జరుగుతున్న సంఘర్షణ అంతా అక్కడి పిల్లల భవిష్యత్తు కోసమే వారు సురక్షితంగా ఉండాలనే తాము పోరాడుతున్నాం' అన్నారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ "మేము యుద్ధ ప్రాంతంలో ఉన్న పిల్లల కోసం, వారి తల్లిదండ్రుల కోసం పోరాడుతున్నాం. వారి భవిష్యత్తును కాపాడటమే మా లక్ష్యం" అని  వ్యాఖ్యానించారు.

    అయితే  ఈ వ్యాఖ్యలకు గానూ ట్రంప్‌ దంపతులపై.. ప్రజలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఈ యుద్ధంలో అమెరికా  జరిపిన దాడుల్లో వందలాది మంది ఇరాన్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అలాంటిది వారి క్షేమం కోసమే యుద్ధం అనడం  అని మాట్లాడటం సిగ్గులేని తనమని కామెంట్స్‌ చేస్తున్నారు.

    కాగా యుద్ధం మెుదలైన తొలిరోజే ఒక పాఠశాల పై జరిగిన దాడిలో190 మందికి పైగా విద్యార్థినిలు చనిపోయారు. అంతేకాకుండా ఇంతకాలంహగా జరుగుతున్న యుద్ధంలో పెద్దఎత్తున పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పిల్లల కోసమే యుద్ధం అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అదేవిధంగా ఇరాన్‌లోని మౌళిక సదుపాయాలు  మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని హెచ్చరిస్తూన్న ట్రంప్ ఏ విధంగా ఆ దేశపిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు.

  • మరోసారి అమెరికా-ఇరాన్‌ల మధ్య  యుద్ధం భీకర రూపం దాల్చబోతుందా..? అం‍టే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కాస్త నెమ్మదించిన యుద్ధ మేఘాలు తీవ్ర రూపం దాల్చబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ‘ ఇక ఇరాన్‌ నాశనం’ అంటూ ప్రకటన.. మరొకవైపు ‘ రండి.. చూస్కుందాం’ అంటూ ఇరాన్‌ కౌంటర్లతో యుద్ధ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. 

    ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులకు  పలు సూచనలు చేసింది ఇండియన్‌ ఎంబసీ. ఇరాన్‌లో ఉన్న భారతీయులెవరూ 48 గంటల పాటు ఎక్కడకు వెళ్లవద్దని, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. విద్యుత్‌ ప్లాంట్లలకు చేరువలో గానీ, సైనిక స్థావరాలకు చేరువలో గానీ ఉండొద్దని స్పష్టం చేసింది. భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉండేవారు నిరంతరం తమతో టచ్‌లో ఉండాలని తెలిపింది. అంతా తామిచ్చే అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండాలని స్పష్టం చేసింది.

    ఇరాన్‌ను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామని అతిపెద్ద హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఇరాన్‌లోని భారత ఎంబసీ స్పందించింది. ఏ క్షణమైనా యుద్ధా మేఘాలు తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తలు అవసరమని తెలిపింది. 

  • టెహ్రాన్‌: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అమెరికా-ఇజ్రాయెల్‌లు వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ప్రధాన రవాణా మార్గాలపై వరుసగా వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్‌ మీడియా కథనాల ప్రకారం.. ఈ దాడులు హెమ్మత్ హైవే ప్రాంతంలో ఉత్తర రన్‌వే జరిగినట్లు తెలుస్తోంది. 

    తాజాగా జరిగిన దాడుల్లో పలు వంతెనలు, రహదారులు లక్ష్యంగా మారాయి. తబ్రీజ్–టెహ్రాన్ ఫ్రీవే, జంజాన్–టెహ్రాన్ ఫ్రీవే, కోమ్‌లోని రవాణా మార్గాలు కూడా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

    ఇరాన్ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి  238 మంది విద్యార్థులు, 49 మంది ఉపాధ్యాయులు, 7 మంది టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. 178 మంది విద్యార్థులు, 24 మంది ఉపాధ్యాయులు గాయపడినట్లు తెలిపింది. నివేదికల ప్రకారం, ఇప్పటి వరకు 764 పాఠశాలలు లక్ష్యంగా అమెరికా దాడులు జరిపినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం టెహ్రాన్, కెర్మాన్షా ప్రావిన్సులలో ఉన్నాయి. పౌర ప్రాంతాలపై జరిగిన ఈ దాడులు అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలను బలి తీసుకున్నాయి.
     
    పాఠశాలలు, వంతెనలు, రహదారులు వంటి పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పౌరులపై దాడులు యుద్ధ నేరాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

    టెహ్రాన్–కరాజ్ ఫ్రీవేపై జరిగిన తాజా వైమానిక దాడులు ఇరాన్‌లోని పౌర జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం, పాఠశాలలు ధ్వంసం కావడం దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.  యుద్ధం కొనసాగితే ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలు నాశనమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన యుద్ధం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత తరువాత మరింత ఉద్రిక్తంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను రెట్టింపు చేస్తూ 'కొత్త దశ యుద్ధం' ప్రారంభమైందని ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

    'రెట్టింపు దాడులు' - ఇరాన్ హెచ్చరిక
    మరోవైపు  ఇప్పటికే ద్వంద్వ ప్రయోగ క్షిపణి (Dual-launch) వ్యూహాన్ని ఇరాన్ వివరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఏరోస్పేస్ దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ సయ్యద్ మజీద్ మౌసావి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘యుద్ధం కొత్త దశ ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. ఇరాన్, ఖైబర్ షెకాన్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణితో పాటు ఫతా( (Fattah)-110, ఫతే-313 ,ఫతా వంటి కొత్త హైపర్‌సోనిక్ వేరియంట్‌లతో సహా ఫతా శ్రేణికి చెందిన వ్యవస్థలను ఉపయోగించి, గత దాడులన్నీ రెండింతలు ఎక్కువవుతాయని హెచ్చరించారు. 

    ఖార్గ్ ద్వీపంపై జరిగిన దాడుల నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరాలకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో, ద్వంద్వ ప్రయోగ క్షిపణి వ్యూహాన్ని ఐఆర్‌జీసీ కమాండర్ వివరించారు. ఇరాన్‌ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణి కార్యకలాపాలను పెంచుతోంది అంటూ ఒక ఐఆర్‌జీసీ కమాండర్ నుండి వచ్చిన మొదటి అధికారిక  ప్రకటన ఇది  కావడం గమనార్హం. 

    దీంతో పాటు, మంచి పొరుగు సంబంధాలు, ఆత్మసంయమనం ముగిశాయి అంటూ పర్షియన్ గల్ఫ్‌లోని దేశాలకు ఐఆర్‌జిసి మరో హెచ్చరిక జారీ చేసింది. ఫతే శ్రేణిలో సాధారణంగా 200 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్లకు పైగా పరిధి గల స్వల్ప నుండి మధ్యశ్రేణి క్షిపణులు ఉంటాయి. ఫతా వంటి హైపర్‌సోనిక్ రకాలు మాక్ 15 వరకు వేగాన్ని అందుకోగలవని ఇరాన్ పేర్కొంది.

    హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేకపోతే వంతెనలు, ఇంధన కేంద్రాలతో సహా మౌలిక సదుపాయాలపై దాడులు ఎదుర్కోవలసి వస్తుందంటూ డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఈ దాడులకు ప్లాన్‌ జరిగినట్లు సమాచారం. ఇటీవలి రోజుల్లో, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన షరతులు ఇంకా పరిష్కారం కాలేదని ఇరాన్ అధికారులు, ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా విధించిన గడువు (మంగళవారం రాత్రి 8 గంటలే)  ముగియకముందే  సంచలన హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల  దోపిడీ, అవినీతి అంతమవుతుందని  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

    కాగా డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు (హోర్ముజ్ జలసంధిని తెరవాలని) ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు  ట్రంప్‌ వ్యాఖ్యలు, ఇరాన్ వద్ద ఉన్న ఫతా  వంటి హైపర్ సోనిక్ క్షిపణులు మ్యాక్ 15 (Mach 15) వేగంతో ప్రయాణించగలవని, వీటిని అడ్డుకోవడం ప్రస్తుత రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది. మొత్తానికి, ట్రంప్ వ్యూహం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడమా లేక సైనిక చర్యకు పునాది వేయడమా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం రాత్రి 8 గంటల గడువు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

    ఇదీ చదవండి: దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్‌ బిలియనీర్‌ స్టోరీ

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ రాత్రికి ఇరాన్‌ నాగరికత అంతమవుతుంది. అది జరగొద్దని అనుకుంటున్నా. కానీ జరుగుతోంది. ఆ నాగరికతను తిరిగి వెనక్కి తీసుకురావడం అసాధ్యం. ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నా. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం. 47 ఏళ్ల  దోపిడీ, అవినీతి అంతమవుతుంది’అని వ్యాఖ్యానించారు.  

    ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఇరాన్ హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవకపోతే, అమెరికా భారీ దాడులు చేస్తుందని ఆయన స్పష్టంచేశారు. అదే సమయంలో ఇరాన్‌లోని ఓ నాగరికత అంతం’ అని పేర్కొన్నారు. 

    అదే సమయంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా ‘రెడ్ లైన్స్’ దాటితే ప్రాంతం బయట కూడా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. అమెరికా, దాని మిత్రదేశాలకు చాలా సంవత్సరాల పాటు చమురు,ఇతర సహజ వనరులు అందకుండా చేస్తామని తెలిపింది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ, ట్రంప్ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా  పూర్తి విధ్వంసం జరగబోతుందని స్పష్టంచేశారు.

    ఇరాన్ ఇప్పటికే అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందించడానికి సిద్ధమవుతుండగా..‘నాగరికత నశనం’అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పశ్చిమాసియా యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరా, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
     

     

     

  • జాతి కోసం రగిలిన జ్వాల.. దేశ రక్షణే పరమావధి.. ఇది ఇప్పుడు ఇరాన్‌లో కనిపిస్తున్న పరిస్థితి. ఇరాన్‌లో ఉన్న యువత దగ్గర్నుంచి అద్యక్షుడి స్థాయి వరకూ వినిపిస్తున్న మాట మాత్రం.. దేశాన్ని రక్షించుకోవడమే.  ఇది ఇప్పుడు ఇరాన్‌లో మాట కాదు.. నినాదంగా మారిపోయింది.  దేశం కోసం జ్వాలలై, నడుంబిగిద్దాం రండి అంటూ ఇరాన్‌ నినదిస్తోంది. 

    ఇప్పటివరకూ అమెరికా బెదిరింపులకు గానీ, డెడ్‌లైన్లకు గానీ ఏ మాత్రం లొంగని ఇరాన్‌.. ఇక దేశాన్ని తుది వరకూ పోరాడైనా సరే కాపాడుకోవాలనే కృతనిశ్చయంతో ఉంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. మళ్లీ ఇరాన్‌పై యుద్ధానికి కాలు దువ్విన క్రమంలో ఆ దేశం శాయశక్తులా పోరాడాలని, అందుకు తమకు చెందిన ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని అంటోంది. దీనిలో భాగంగా దేశం కోసం మీ పిల్లల్ని పంపాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చింది. ఇరాన్‌ దేశంలో ఉంటున్న వారు యుద్ధంలో భాగస్వాములు కావాలని పేర్కొంది. ఇందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలని విజ్ఞప్తి చేసింది. 

    ఇప్పటికే తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యుత్‌  ప్లాంట్ల చుట్టూ మానవహారాలు చేస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ నుంచి భీకర దాడులు తప్పవని తెలిసినా వారు విద్యుత్‌ ప్లాంట్ల చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. ఇందుకోసం ఇరాన్‌ పిలుపు ఇవ్వకుండానే, యువతే ప్రభుత్వానికి సూచన చేయడం విశేషం. 

    ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహిమీ తెలిపారు. “యువతే ఈ సూచన చేసింది. కొంతమంది విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయం లేదా మానవ హారంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు” అని చెప్పారు. దేశ మౌలిక వసతులను రక్షించడంలో యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా ఈ నిర్ణయం నిలుస్తుందన్నారు.

    హార్మూజ్‌ జలసంధిని తెరవడానికి ట్రంప్‌ మంగళవారం రాత్రి వరకు గడువు ఇచ్చారు. ఇరాన్‌ ఒప్పందం కుదు​ర్చుకోకపోతే కఠిన సైనిక చర్యలు తీసుకుంటామని, ముఖ్య మౌలిక వసతులపై దాడులు జరగవచ్చని ట్రంప్‌ హెచ్చరించారు. ఆ గడువు దాటాక ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ మరింత తీవ్రంగా విరుచుకుపడతాయని తెలుస్తోంది. 

    మరొకవైపు తనతో సహా ఇరాన్‌ ప్రజలంతా ప్రాణ త్యాగం చేస్తామన్నారు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్. 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశం కోసం నేనూ ఎప్పుడూ, ఎప్పటికీ ప్రాణ త్యాగం చేస్తా’నని పునరుద్ఘాటించారు. దీనిపై కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. దేశాన్ని కాపాడుకోవాలనే తపన మాత్రం అక్కడున్న పౌరుల్లో రగులుకుంది. 

  • టెహ్రాన్‌: పశ్చిమాసియాలో క్షిపణుల వర్షం కురుస్తోంది. హర్మూజ్‌ జలసంధి తెరిచే అంశంలో ట్రంప్‌ డెడ్‌లైన్‌ విధించడంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే ఆ గడువుకు ముందే ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ తన ఆదేశాల్ని బేకాతరు చేయడంతో ట్రంప్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

    ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, అమెరికా సైన్యం ఖర్గ్ ఐల్యాండ్‌తో పాటు కీలక రైల్వే బ్రిడ్జీని ధ్వంసం చేసింది. విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్‌లో భారీ ఎత్తున ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం.

    ట్రంప్‌ హెచ్చరికలతో ఇరాన్‌ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ యువతను విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలుగా ఏర్పాటు చేయాలని ఇరాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు యువతను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. క్రీడాశాఖ కూడా క్రీడాకారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. అమెరికా దాడులు ప్రారంభించడంతో ఇరాన్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇకపై ఏమి జరగనుందో అన్న ఆందోళన, టెన్షన్ దేశవ్యాప్తంగా నెలకొంది.


     

  • ఇస్లామాబాద్‌: ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాత్రి 8గంటలకే మార్కెట్లు మూసివేయాలని  ప్రధాని షహ్‌బాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  పాక్‌ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. 

    పాకిస్థాన్‌ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం.. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, బజార్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఈ ఆదేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

    ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి. బేకరీలు, రెస్టారెంట్లు, హోటల్స్‌తో పాటు కళ్యాణ మండపాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగవచ్చు. ఇళ్లలో జరిగే వ్యక్తిగత వేడుకలు కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒత్తిడి, ఆర్థిక సంక్షోభం కారణంగా తీసుకున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలో బజార్లు రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచే ఆదేశాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

    ప్రభుత్వం ఈ చర్యను జాతీయ అవసరంగా పేర్కొంది. “దేశ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి” అని షహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. అయితే వ్యాపార సంఘాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమ వ్యాపారాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద పాక్‌ ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, వ్యాపారులు  ప్రజలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. 
     

  • టర్కీలోని ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇస్తాంబుల్‌లోని కార్యాలయం వద్ద ముగ్గురు దుండగులు కాల్పుల యత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని మట్టుబెట్టాయి. మరోకరిని అదుపులోకి తీసుకున్నాయి.

    ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట లాంగ్‌ బారెల్‌ గన్స్‌తో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల ఘటనతో కాన్సులేట్ ఎదుట భారీగా భద్రత మోహరించినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు.

    టర్కీ అధికారులు ఈ దాడిని అధికారికంగా గుర్తించారు. అయితే దాడి చేసిన వారి వివరాలు, ఎందుకు చేశారు అనే కారణాలు వెల్లడించలేదు.

  • టెహ్రాన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా ఇరాన్‌ ప్రజలంతా ప్రాణ త్యాగం చేస్తామన్నారు. హర్మూజ్‌ జలసంధిని తెరవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు డెడ్‌లైన్‌ విధించారు. ఆ గడువు సమీపిస్తున్న వేళ పెజేష్కియాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

    హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, లేదంటే పవర్ స్టేషన్లు, వంతెనలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని సూచించారు.   

    ఈ నేపథ్యంలో పెజెష్కియన్ మాట్లాడుతూ.. “14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశం కోసం నేనూ ఎప్పుడూ, ఎప్పటికీ ప్రాణ త్యాగం చేస్తా’నని పునరుద్ఘాటించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

    ఇరాన్‌లో మొత్తం జనాభా సుమారు 90 మిలియన్లు. గతంలో జరిగిన ప్రభుత్వ దమనకాండలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో 14 మిలియన్ల సంఖ్యను ప్రకటించడం, అమెరికా దాడులను అడ్డుకోవడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నంగా భావిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా, సందేశాల ద్వారా ప్రజలను స్వచ్ఛందంగా త్యాగానికి సిద్ధమవ్వమని పిలుపునిస్తోంది.

    ఈ ప్రకటన ఇరాన్‌లోని అంతర్గత అసంతృప్తిని తగ్గించడమే కాకుండా, అమెరికా దాడులను నిరోధించడానికి ఒక ప్రచార మార్గంగా కనిపిస్తోంది. ప్రజలలో నిజమైన మద్దతు ఎంత ఉందో అనేది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దేశ రక్షణ కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నిస్తోంది.

    ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన, అమెరికా హెచ్చరికలు, ప్రజల అసంతృప్తి అన్నీ కలిపి పశ్చిమాయాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.  

Movies

  • ‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్‌లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్‌కు థ్యాంక్స్ చెప్పారు.  

    అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
     

  • టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్‌లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్‌లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్‌ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్‍లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్‌లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.

    కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.  ఈ మూవీని లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. 

     

  • టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్‌ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.  లవ్‌స్టోరీతో కూడిన యాక్షన్‌ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్‌ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది.‍ అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.
     

     

  • టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఇటీవలే కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకైన శ్రీనివాస్ తెలుగులో హీరోగా రాణిస్తున్నారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. మార్చి 29న తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారు.

    తాజాగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్షణం నుంచి అంతా మారిపోతుందంటూ రాసుకొచ్చారు. నిండు మనసులతో.. ఒకరి కళ్లలో ఒకరు కనిపిస్తుండగా.. మేము ఎప్పటినుంచో నమ్ముతూ వచ్చిన ఆ శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాం అంటూ పోస్ట్ చేశారు. ఎలాంటి హడావిడి లేదు.. తొందర లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉందంటూ ట్వీట్ చేశారు.  ఇది కేవలం ఒక నిశ్చితార్థం మాత్రమే కాదు..ఇది ఒక శాశ్వత బంధానికి ఆరంభం అంటూ నిశ్చితార్థం ఫోటోలను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ శ్రీనివాస్‌కు అభినందనలు చెబుతున్నారు.

    కాగా.. అల్లుడు శ్రీను మూవీతో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. గతేడాది 'కిష్కింధపురి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ప్రస్తుతం మూడు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక శ్రీనివాస్‌కి కాబోయే సతీమణి కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. తాత జడ్జి కాగా తండ్రి లాయర్. ఇది పెద్దల కుదిర్చిన ప్రేమ వివాహం అని తెలుస్తోంది. మార్చిలో తనకు కాబోయే భార్య అని కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. 
     

     

  • ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.

    ఎల్‌ఐకే రిలీజ్‌ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉ‍న్నారు. హీరోయిన్ కృతిశెట్టి సైతం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ప్రేమకథా చిత్రం కావడంతో కృతి శెట్టి కూడా ప్రేమ, బ్రేకప్‌ గురించి మాట్లాడారు. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది. అయితే ఓసారి బ్రేకప్ అయిందన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తే అలాంటి వారిని మాత్రమే బ్లాక్‌ చేస్తానని వెల్లడించింది ఉప్పెన బ్యూటీ. 
     

     

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,622.72 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే హిందీలో పలు రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డ్‌పై కన్నేసింది. తాజా వసూళ్లు చూస్తుంటే రాజమౌళి చిత్రం బాహుబలి-2 వసూళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

    దురంధర్‌-2 రిలీజైన 18 రోజుల్లోనే కన్నడలో రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో రిలీజైన టాలీవుడ్ మూవీ బాహుబలి-2 కన్నడలో రూ. 129 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్‌-2 ఈ రికార్డ్‌కు కేవలం రూ.9 కోట్ల దూరంలోనే నిలిచింది. ఇదే జోరు కొనసాగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2ను దాటేయనుంది. ఇదే జరిగితే కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడేతర చిత్రంగా దురంధర్‌-2 నిలవనుంది.

    ఇక కర్ణాటక బాక్సాఫీస్‌ను పరిశీలిస్తే కన్నడ చిత్రాల ఆధిపత్యమే కొనసాగుతోంది. అయినప్పటికీ తెలుగు చిత్రాలు కూడా కన్నడలో సత్తా చాటుతున్నాయి. శాండల్‌వుడ్ హీరో రిషబ్ శెట్టి మూవీ 'కాంతార చాప్టర్ 1' రూ. 247.50 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో యశ్‌ నటించిన 'కేజీఎఫ్ 2' కొనసాగుతోంది. కన్నడలో టాప్-5 చిత్రాలలో 'బాహుబలి 2' మాత్రమే కన్నడేతర చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ రికార్డ్‌ను దురంధర్-2 అధిగమించే ఛాన్స్ ఉంది. కాగా.. 'ధురందర్ 2' ఇప్పటికే కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించింది. కర్ణాటకలో 'బాహుబలి 2'  తర్వాత రూ. 100 కోట్ల మార్కును దాటిన రెండో కన్నడేతర చిత్రంగా 'ధురందర్ 2' నిలిచింది.

    కాగా.. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.

     

     

     

     

     

     

     

     

  • పుష్ప 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  #AA22XA6 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న   ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటివరకు టైటిల్‌ని కానీ, హీరో లుక్‌ కానీ రిలీజ్‌ చేయలేదు. బన్నీ బర్త్‌డే సందర్భంగా రేపు(ఏప్రిల్‌ 8) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్‌ సినిమాల టైటిల్స్‌ కానీ, లుక్‌ కానీ ముందుగానే లీకవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. 

    ఇప్పటి వరకు షూటింగ్‌కు సంబంధించిన చిన్న ఫుటేజీ కూడా బయటకు రాకుండా  టీమ్‌ జాగ్రత్త పడింది. ఇక టైటిల్‌ గురించి సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి వైల్డ్‌ ఫైర్‌ అనే పేరు ఖారారు చేశారని ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు ‘లెగసీ’ అనే టైటిల్‌ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ‘అయాన్‌’, ‘స్పార్క్‌’ అనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. అసలు ఈ సినిమా టైటిల్‌ ఏంటి అనేది మాత్రం రేపే తెలుస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ గురించి అట్లీ, బన్నీకి తప్ప మిగతావారెవరికి సమాచారమే లేదట. అందరితో పాటు చిత్రబృందం కూడా రేపే టైటిల్‌ ఏంటనేది తెలుసుకోబోతుంది.

    పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ఫిక్షన్‌ చిత్రంలో అల్లు అర్జున్‌ మూడు విభిన్న పాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించబోన్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే దీపికా పదుకొణె పేరును అధికారికంగా ప్రకటించారు. జాన్వీకపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా  నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. 

  • టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలోఅత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

    ఇటీవలే రష్మిక తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత తన తొలి బర్త్‌ డేను ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకుంది. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని ఇగ్గుతప్ప ఆలయాన్ని కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    అయితే తాజాగా ఈ జంట మరోసారి రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. రష్మిక సొంత గ్రామం కూర్గ్‌లో కొడగు సంప్రదాయంలో రిసెప్షన్‌  జరుపుకున్నారు. ఈ ఫంక్షన్‌లో రష్మిక కొడగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. ఈ రిసెప్షన్‌లో కూర్గి స్టైల్లో చీరను ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 

    ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను కొడగు రావడం ఇది మూడోసారని తెలిపారు. మొదటిసారి రష్మికను కలవక ముందే ఇక్కడకు వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పుడు తన ఫ్రెండ్‌ ఇంట్లో ఉన్నానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. అయితే తన ఫ్రెండ్‌  ఈ రిసెప్షన్‌కు హాజరు కాలేదని తెలిపారు. నా స్కూల్ టైమ్‌లో స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చానని పంచుకున్నారు.

    చాలా అందంగా ఉంటారు..

    తనకు కొడగు అందాలు అంటే చాలా ఇష్టమని.. ఇక్కడి మహిళలు కూడా అంతే అందంగా ఉంటారని కొనియాడారు. కూర్గ్ మహిళలు చాలా అందంగా ఉంటారని.. నేను కూర్గ్ అమ్మాయినే వివాహం చేసుకున్నానని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. మిమ్మల్నందరినీ ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కొడగు రిసెప్షన్‌కు ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక- విజయ్ జంటహా 'రణబాలి' సినిమాలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.
     

  • తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మ నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ మట్కా కింగ్. ఈ వెబ్ సిరీస్‌కు సైరత్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తీసిన నాగరాజ్ ముంజలే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో   కృతిక కమ్రా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ముంబయికి చెందిన రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే.  

    తాజాగా మట్కా కింగ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మట్కా నేపథ్యంలో సాగే క్రైమ్ కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  1960ల్లో ఓ సాధారణ పత్తి వ్యాపారి (విజయ్ వర్మ), తన తెలివితేటలతో మట్కా అనే జూద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడనే స్టోరీగా ఈ సిరీస్‌ తీసినట్లు అర్థమవుతోంది. ఈ క్రైమ్ సిరీస్‌ ఏప్రిల్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

     

  • టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆ‍ర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్‌కు భిన్నంగా తన పంచ్‌లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్‌లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.

    ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్‌ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్‌ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. 
     

     

  • మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా రానున్న చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది అని సంగీత దర్శకుడు కీరవాణి '365' నంబర్‌తో మెసేజ్‌ ద్వారా తెలిపారు. అంటే ఈ మూవీ వచ్చే ఏడాది సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇందులో  ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  వారణాసిలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నటం విశేషం.

    2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదల కానుందని చిత్ర యూనిట్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అయితే, 'ధురందర్' ఫ్రాంచైజీ భారీ విజయం సాధించిన తర్వాత, రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా విభజించి, విడుదల ప్రణాళికను సవరించవచ్చని ఇటీవల వదంతులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కీరవాణి చేసిన కౌంట్‌డౌన్‌ కామెంట్‌తో అనుకున్న సమయానికే వారణాసి విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. ఆ పోస్ట్, వారణాసి చిత్రం కనీసం ప్రస్తుతానికి ఒకే భాగం (సింగిల్-పార్ట్)గా రాబోతోందని కూడా ధృవీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. విడుదలకు సరిగ్గా 365 రోజులు మిగిలి ఉండటంతో, ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ఈ ప్రాజెక్ట్‌కు కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది.
     

  • స్టార్‌ హీరోయిన్‌ త్రిష పేరు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తోంది. కోలీవుడ్‌ స్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో త్రిష రిలేషన్‌తో ఉన్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరవ్వడంతో.. ఈ పుకార్లు ఇంకా ఎక్కువైయ్యాయి. త్వరలో పెళ్లి చేసుకుంటారని..ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి..రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ రకరకాల రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల  నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్‌ కూడా త్రిష ఇకపై నటించబోదని చెప్పడంతో మరోసారి త్రిషపై నెట్టింట చర్చ జరిగింది. 

    దీనిపై త్రిష తనదైన శైలీలో స్పందించింది. చిత్రా లక్ష్మణ్‌ వాఖ్యలకు కౌంటర్‌గా ‘అవును నేను సినిమాలు మానేసి, ఒక ధనవంతుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని, నిన్నటికి రెండేళ్లు నిండిన నలుగురు కవలలను పెంచుతున్నాను. మీ ఊహాగానాలకు ఇది సరిపోతుందా? ఈ రోజు వార్తలు రాసుకోవడానికి ఇది సరిపోతుందా లేదా ఇంకా ఏదైనా జోడించమంటారా?’ అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌తో ఆమె సినిమాలు మానేసిందనేది పుకారు మాత్రమేనని తేలిపోయింది. 

    త్రిష సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అమె ‘కరుప్పు’(తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తోంది. తెలుగులో చిరంజీవి సరసన నటించిన విశ్వంభర రిలీజ్‌కు రెడీ అవుతుంది. దేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్‌ కు జంటగా రామ్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అంతకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం.

     

Politics

  • మహబూబ్‌నగర్‌: గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్య శ్యామలం అవుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రేస్ అదికారంలోకి వచ్చిన 3 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తప్పుడు,అబద్దాలు ప్రచారం చేస్తున్నారని,

    రేవంత్  కోట్ల రూపాయల విదేశి పెట్టుబడులు తీసుకొచ్చారని, కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్‌లో పదవులు వస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో  ఆర్దిక విద్వంసం జరిగిందని, అప్పుల పాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకంగా పనులు చేయటం వల్ల కూలేశ్వరంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మహేష్‌కుమార్‌ గౌడ్‌.

  • హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు.  మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందంటూ సీఎం రేవంత్‌ చేసే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు హరీష్‌రావు. కాంగ్రెస్‌ మళ్లీ గెలవడం కాదు.. సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అంటూ ఎద్దేవా చేశారు. 

     ఈరోజు(మంగళవారం, ఏప్రిల్‌ 7వ తేదీ) పరిగి పర్యటనకు వెళ్తున్న హరీష్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసి శంషాబాద్‌ పీఎస్‌కు తరలించారు. దీనిలో  భాగంగా ఆయన్ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు హరీష్‌. 

     ‘మీరు మళ్లీ గెలవడం కాదు కదా.. ఈసారి సింగిల్‌ డిజిటే మీకు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వడం ఖాయం. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?, పరిగిలో రైతులను పరామర్శించేందుకు వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి పాలన.. గడీల పాలన... బేడీల పాలన గుడ్డి పాలన. సాగుకు పనికిరాని భూముల్లో పరిశ్రమలు పెట్టండి. 

    ఎస్సీ ఎస్టీ రైతులు సాగు చేసుకుంటున్నా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. మీ పాలన అంతా బోగస్ మాటలు బోగస్ పాలన. రేవంత్ రెడ్డికి మించిన రావణాసురుడు ఎవరైనా ఉన్నారా?, పరిగిలో భూముల లాక్కొని తన అన్య కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు 900 రోజులైనా ఎందుకు పూర్తి చేయలేదు?,  వచ్చే ఎన్నికల్లో రాబోయే కేసీఆర్‌ రాజ్యమే’ అని హరీష్‌ స్పష్టం చేశారు.

  • సాక్షి, తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ  తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంధ్రజ్యోతి పేపర్లను తగలబెట్టారు. దీంతో, అక్కడున్న పోలీసులు వైఎ‍స్సార్‌సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

    ఈ సందర్బంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘జర్నలిజానికి విలువ ఇవ్వని బ్రోకరిజంతో బ్రతుకు రాధాకృష్ణకు రాష్ట్రంలో మహిళలు అంతా ఎదురుతిరుగుతున్నారు. రాధాకృష్ణకు కూతురు లేదా?. మా నాయకులు, మహిళలు గురించి తప్పుడు కూతలు కాస్తున్నారు నీకు అర్హత ఉందా? డొక్కు సైకిల్‌పై వచ్చి వేల కోట్లకు ఎదిగినావు అంటే ఏవిధంగా ఎదిగావో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్‌గా పనులు చేశావు. కొత్త పలుకు అంటూ కొవ్వెక్కి పనులు చేస్తున్నాడు, కొవ్వు కరిగిస్తాం కొవ్వు తగ్గిస్తాం.

    వైఎస్సార్‌సీపీ నాయకుల కుటుంబసభ్యుల్ని అంటే చూస్తూ ఊరుకుంటామా?. నీ అవినీతి పత్రికలు తగలబెడతాం. చంద్రబాబు, పవన్‌, మంత్రులను హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేత కాక కాదు.. మాకు సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిడితే రోడ్లపై తిరగలేక సిగ్గుతో తల దించుకుంటారు. మహిళల గురించి తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్ తగలబెట్టేస్తాం’ అని హెచ్చరించారు. 

    ఇక, అంతకుముందు.. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మాట్లాడుతూ..‘రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు 2లక్షల కోట్లు అమరావతి ఎలా ఖర్చు చేస్తారు?. ఈ రెండేళ్లలో 8వేల కోట్లు అమరావతికి ఖర్చు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు చంద్రబాబు. రాయలసీమ ద్రోహి ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజలు దురదృష్టం.

    రాయలసీమ పథకం నిలిపి వేయడం అంటేఈ ప్రాంత ప్రజలు గొంతు కోయడమే అవుతుంది. రాయలసీమ పథకం ఎంత ముఖ్యమన్నది ప్రజలకు తెలియజేయాలి. 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పాదయాత్ర ద్వారా, మహా ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి’ అని కామెంట్స్‌ చేశారు.

    ABN బ్రోకర్ కృష్ణ... నీ ఆఫీసుని తగలేస్తాం జాగ్రత్త రెచ్చిపోయిన రోజా

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి:  ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల గురించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను ఉద్దేశించి అసహ్యకరమైన భాషను ఉపయోగించడం.. వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదన్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

    ‘ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే.  వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్న అనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘MAVIGUN’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను.. దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. 

    మావిగన్‌ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక బాబు, ఎల్లో మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకూ దిగారు. మేం శాంతియుతంగా నిరసనలు చేపట్టాం. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాం. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడలేదు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. అత్యంత సంయమనంతో వ్యవహరించారు’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

     

     

  • సాక్షి, పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ రేపు( బుధవారం) తాడేపల్లి గూడెం నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, నియోజకవర్గ సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు.
     

  • సాక్షి, అమరావతి: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

    తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు పామర్రు సీఐ శుభాకర్‌, ఎస్సై భాస్కర్‌ స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తిరిగి తనపై కేసులు నమోదు చేశారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ,ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

    కూటమి ప్రభుత్వంలో తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాలను సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం దారుణమని జగన్ మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కైలే అనిల్‌కుమార్‌కు సూచించారు.

    పామర్రు సీఐ శుభాకర్‌, ఎస్సై భాస్కర్‌లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అన్నారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో సుప్రియ,ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

  • తాడేపల్లి : అణుశక్తి సైంటిస్టులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతం కావడంపై వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు IGCAR((Indira Gandhi Centre for Atomic Research), BNHAVINI( (భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్) అణుశక్తి విభాగంలోని  శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలియజేశారు. 

    ‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది. మన అపారమైన థోరియం నిల్వలను ఇంధన స్వావలంబనకు  వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈ విజయం ప్రతి  భారతీయుడికి గర్వకారణం’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

    కాగా,  భారతదేశం తన పౌర అణుశక్తి కార్యక్రమంలో భాగంగా సోమవారం(ఏప్రిల్‌ 6వ తేదీ)దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని సాధించింది. తమిళనాడులోని కల్పక్కం వద్ద ఉన్న ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) — అణువిచ్ఛిత్తి ప్రక్రియకు  చేరుకుంది.  దాంతో అణు విభజన శృంఖల ప్రతిచర్య ప్రారంభమైంది. ఫలితంగా రియాక్టర్ పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధమైంది.

     

     

  • ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో  క్రికెట్‌ మ్యాచ్‌లో రనౌట్ నిర్ణయం  అంపైర్‌ ప్రాణం తీసింది.  స్థానిక మ్యాచ్‌లో  21 ఏళ్ల క్రికెట్ అంపైర్‌ను కత్తితో పొడిచి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది. 

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం  బాధితుడు, డోల అజిత్ బాబు, తన తోటి అంపైర్ బుదుమూరి చిరంజీవితో కలిసి స్థానిక మైదానంలో ఆదివారం క్రికెట్‌ ఆడారు. మూడు జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు అజిత్‌. ఇందులో భాగంగా అఇత్‌ రనౌట్ నిర్ణయంపై రెండు ప్రాంతాలకు చెందిన ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చెలరేగగా, ఇద్దరు అంపైర్లు దానిని మైదానంలోనే పరిష్కరించారు. 

    అయితే, అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో  26 ఏళ్ల కాంతా కిషోర్ (ప్రేక్షకుడు) ఆగ్రహానికి గురై అంపైర్లను, ఆటగాళ్లను దూషించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.  మ్యాచ్ ముగిసిన తర్వాత,  మాట్లాడుదాం రమ్మంటూ కిషోర్ సమీపంలోని ఒక ప్రదేశానికి అంపైర్లను పిలిపించాడు, అతని అభ్యర్థన మేరకు అజిత్ బాబు, చిరంజీవి, మరికొందరు స్నేహితులు అక్కడికి వెళ్లారు. వారు అక్కడికి వెళ్లగానే మరో సారి వాగ్వాదం చెలరేగింది.దీంతో కిషోర్ అకస్మాత్తుగా కత్తి తీసి ఇద్దరు అంపైర్లపై దాడి చేశాడు,సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ దాడిలో అజిత్ బాబు ఛాతీపై కత్తిపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. పారిపోయే ప్రయత్నంలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావ గాయాలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా గాయపడ్డాడని  పోలీసులు తెలిపారు.

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

    గాయపడిన అజిత్ బాబును VIMS ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో, అపోలో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో ఆటగాడు కూడా కాని వ్యక్తి పథకం ప్రకారమే ఈ దాడి చేశాడని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. పొరుగు కాలనీలోని వినాయక్ నగర్ నివాసి అయిన కిషోర్, ఈ వివాదంలోకి చొరబడి, దుర్భాషలాడి, ఆ తర్వాత మద్యం మత్తులో తిరిగి వచ్చి హత్య చేశాడని అతను చెప్పాడు. ఆ రోజు ఉదయం గ్రామ పెద్దలు ఒకే ఒక్క పరుగు విషయంలో తలెత్తిన విభేదాన్ని ఇప్పటికే పరిష్కరించినా ఈ హత్యకు పూనుకున్నాడని అజిత్‌ సోదరుడు వాపోయాడు. కిషోర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ తప్పించు కొని పారిపోయాడని అజిత్‌ సోదరుడు ఆరోపించాడు. మృతుడి తండ్రి డోలా అప్పల రాజు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కిషోర్‌పై హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

  • సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్‌కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్‌కు  ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. 

  •  తిరుపతి జిల్లా: పుత్తూరులో మానవత్వాన్ని చాటిన ఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండల మధ్య దాహంతో అలమటిస్తున్న నాగుపాముకు స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ నీళ్లు తాగించి, అనంతరం అడవిలో విడిచిపెట్టాడు.

    పుత్తూరులోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము నీటి ట్యాంక్ కింద దాక్కుంది. దీనిని గమనించిన ఇంటి సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్‌ శ్రీకాంత్ వెంటనే అక్కడికి చేరుకుని జాగ్రత్తగా పామును సురక్షితంగా పట్టుకున్నాడు..

    ఎండ తీవ్రతకు పాము దాహంతో అలమటిస్తున్నట్లు గుర్తించిన స్నేక్ క్యాచర్‌ శ్రీకాంత్, దానికి నీళ్లు తాగించాడు. అనంతరం ఆ నాగుపామును సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సమస్య పరిష్కారమవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 

     

     

     

     

     

Business

  • కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.

    అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్‌లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.

    దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్‌లు, కార్పెంటర్‌లు, ప్లంబర్‌లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.

  • దేశంలో పవనవిద్యుత్‌ (విండ్‌ ఎనర్జీ) ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

    ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదని పేర్కొంది. 2016–17లో ఏర్పాటైన 5.5 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు రికార్డును అధిగమించినట్టు అయింది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.

    ప్రభుత్వ విధానాల్లో పెరిగిన స్పష్టత, పోటీ మార్గంలో టారిఫ్‌ల నిర్ణయం, సరఫరా నెట్‌వర్క్‌ సిద్ధంగా ఉండడం వంటివి కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరడానికి దారితీసినట్టు పునరుత్పాదక ఇంధన శాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన విండ్‌ ఎనర్జీలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఉండడం గమనార్హం.   

  • ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరోసారి ఫ్రీడమ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగానే.. కేవలం రూ.1 ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్.. తీసుకొచ్చిన ఒక రూపాయి ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా ఉచిత సిమ్ కార్డు పొందవచ్చు. ఆ తరువాత యూజర్లకు నెల రోజులు (30 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ సమయంలో 30 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.

    బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ను మరోసారి తీసుకురావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల డిమాండ్ అని తెలుస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు (ఏప్రిల్ 30) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

  • హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఈ తరుణంలో నైట్ ఫ్రాంక్ ఇండియా 2026 త్రైమాసిక రియల్ ఎస్టేట్ నివేదిక విడుదల చేసింది. ఇందులో నగరంలో ఆఫీస్, రెసిడెన్షియల్ మార్కెట్లకు డిమాండ్ అద్భుతంగా ఉన్నట్లు వెల్లడించింది.

    ఆఫీస్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్థలాల లీజింగ్ 5.86 మిలియన్ చదరపు అడుగులకు చేరుకొని, ఒకే త్రైమాసికంలో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. గత సంవత్సరం పోలిస్తే.. ఇది 48% వృద్ధిని సూచిస్తోంది. ఈ వృద్ధితో హైదరాబాద్ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెండవ అతిపెద్ద ఆఫీస్ మార్కెట్‌గా నిలిచింది.

    ఈ వృద్ధికి ప్రధాన కారణంగా.. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) అని తెలుస్తోంది. మొత్తం లీజింగ్‌లో 43 శాతం వాటాను వీటిదే కావడం గమనార్హం. జీసీసీలు 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఆక్రమించినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే థర్డ్-పార్టీ సర్వీసెస్ రంగం కూడా 1.7 మిలియన్ చదరపు అడుగులతో 29 శాతం వాటా సాధించింది. మరో ముఖ్యమైన అంశం ఫ్లెక్స్ వర్క్‌స్పేస్‌లు. ఇవి 457 శాతం వృద్ధితో 1.42 మిలియన్ చదరపు అడుగులకు చేరాయి. ముఖ్యంగా పెద్ద కంపెనీలు, ముఖ్యంగా GCCలు ఈ ఫ్లెక్స్ స్పేస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి.

    నివాస రంగం విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో గృహ విక్రయాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 2026 Q1లో 9,541 గృహాలు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాదితో పోలీసైతే 1 శాతం వృద్ధిని చూపిస్తుంది. గృహాల సగటు ధర చదరపు అడుగుకు రూ.8,211గా ఉండి 9 శాతం పెరిగింది. ప్రజలు చాలామంది విలాసవంతమైన గృహాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక ద్వారా తెలిసింది.

  • భారతదేశంలో దిగ్గజ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్న తరుణంలో.. కేటీఎమ్ ఇండియా కూడా తన 390 డ్యూక్ ధరను రూ. 40,000 పెంచింది. దీంతో ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 3.39 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

    2025 సెప్టెంబర్ చివరిలో.. అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 కింద ప్రవేశపెట్టిన సవరించిన జీఎస్టీ విధానం నేపథ్యంలో ఈ పెరుగుదల జరిగింది. కొత్త పన్ను విధానం ప్రకారం.. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై ఇప్పుడు 40 శాతం జీఎస్టీ విధిస్తారు. కాబట్టి ఇప్పుడు కంపెనీ బైక్ ధరను పెంచింది.

    ఇదీ చదవండి: మంత్రిత్వ శాఖ పిక్చర్ ఛాలెంజ్: ఫోటో పెట్టు.. రివార్డు పట్టు!

    ప్రకటన వెల్లడించిన సమయంలో.. భారతదేశంలో బజాజ్ ఆటో ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేటీఎం ఇండియా, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ రెండూ.. తమ తమ 390 మరియు 400cc మోడళ్ల ధరలు యథాతథంగా ఉంటాయని, అదనపు ఖర్చులను కంపెనీయే భరిస్తుందని పేర్కొన్నాయి.

  • ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ మురళీధర్‌ టోన్సే బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లపాటు వినయ్‌ బ్యాంకు నిర్వహణను చేపట్టనున్నట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. ఈ నెల 6తో అదనపు పదవీ కాలం ముగియనున్న ప్రశాంత్‌ కుమార్‌ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేసింది. వేతనం తదితరాలకు ఆర్‌బీఐ ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది.

    వినయ్‌ గతంలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకు ఎండీగా విధులు నిర్వహించారు. యస్‌ బ్యాంక్‌లో గతేడాది జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ 24 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలుస్తోంది.

    బ్యాంకింగ్‌ రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా అనుభవమున్న వినయ్‌ ట్రెజరీ, రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్యకలాపాలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలలో పనిచేశారు. బెంగళూరుకు చెందిన సెయింట్‌ జోసెఫ్‌ కామర్స్‌ కాలేజ్‌లో కామర్స్‌ డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా 1988లో కెరీర్‌ ప్రారంభించారు.

  • బెంగళూరు నగరంలో రోజురోజుకి ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. కానీ కావలసిన కనీస అవసరాలు కూడా లభించడం లేదు. అధిక మొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ, తగిన ఇళ్లు దొరకడం లేదని చాలా మంది అద్దెదారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    బెంగళూరు నివాసి ఒకరు ఇటీవల కడుబీసనహళ్లికి 6 కిలోమీటర్ల పరిధిలో 1BHK ఫ్లాట్ కోసం వెతుకుతున్నప్పుడు ఎదురైన తమ అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్నారు. ఈ అన్వేషణలో.. బెల్లందూర్, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, మారతహళ్లి, ఏఈసీఎస్ లేఅవుట్, సమీపంలోని సర్జాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

    ఎక్కడ ఇల్లు కోసం సెర్చ్ చేసినా.. కనీస సౌకర్యాలు లేదని వెల్లడించాడు. అయితే అద్దె మాత్రం చాలా ఎక్కువగా ఉందని వాపోయాడు. దాదాపు రూ. 30,000 చెల్లిస్తున్నప్పటికీ, సరైన బాల్కనీ, పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఫ్లాట్‌ను వెతుక్కోవడం కష్టంగా ఉందని కూడా ఆయన అన్నారు.

    ఫ్లాట్లు రూ.28 వేల నుంచి రూ.32 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరకే లభిస్తున్నాయి, అయినా కూడా వాటిలో సరైన బాల్కనీ లేదా ప్రత్యేక కార్ పార్కింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. నన్ను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటంటే, ఇళ్లను చూపించే విధానం. చాలా చోట్ల బాల్కనీ ఉందని చెబుతారు, కానీ మీరు నిజంగా వెళ్ళినప్పుడు, అది వాషింగ్ మెషీన్ పక్కన ఉండే ఒక చిన్న పని ప్రదేశంలా ఉంది. ఇది తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా అనిపిస్తుందని అతడు వెల్లడించాడు.

    ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!

    నేను మరీ అంత ఆడంబరమైన ఇళ్ల కోసం ఏమీ వెతకడం లేదు. గేటెడ్ సొసైటీలో.. కనీసం నిలబడటానికి లేదా కూర్చోవడానికి వీలుగా ఒక చిన్న ప్రైవేట్ బాల్కనీ, సరైన కార్ పార్కింగ్ ఉన్న ఒక సాధారణ 1BHK చాలు. అయినా అలాంటివి అస్సలు దొరకడం లేదు. దీన్నిబట్టి చూస్తే నగరంలో సరైన సౌకర్యాలున్న ఇళ్లను వెతుక్కోవడం పెద్ద సహజంగా అనిపిస్తుంది.

  • మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 509.73 పాయింట్ల లాభంతో 74,616.58 వద్ద, నిఫ్టీ 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద నిలిచింది.

    ఆల్కలీ మెటల్స్ లిమిటెడ్, ఆల్ఫాజియో (ఇండియా) లిమిటెడ్, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఉమా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ల్యాండ్‌మార్క్ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్, అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు.. ఫ్యాకేజిలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ప్రయోజనాలను అందివ్వడం సర్వసాధారణం. కానీ ఆఫ్రికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్త అమన్ ధత్తర్వాల్‌తో, ప్రముఖ పాడ్‌కాస్టర్ కుశాల్ లోధా మాట్లాడుతూ.. ఒక ఆఫ్రికన్ కంపెనీ ప్లేస్‌మెంట్ల కోసం ఐఐఎంకు వచ్చి రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ అందులో రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించిందని వెల్లడించాడు. అంటే ఆ డబ్బు కిడ్నాపర్ల కోసం అన్నమాట.

    "ఈ సీటీసీ వర్సెస్ చేతికి అందే జీతం అనేది ఒక రకమైన మోసం అని నాకు అనిపిస్తోంది" అని లోధా అన్నారు. "ఈ కంపెనీ ఐఐఎం కలకత్తాకు వచ్చి, సంవత్సరానికి రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది. పైగా ఇది ఆఫ్రికాకు చెందిన కంపెనీ. అక్కడ కిడ్నాప్‌లు చాలా సాధారణమని తెలుస్తోంది. కాబట్టి ఆ రూ. 80 లక్షల వార్షిక వేతనంలో, రూ. 40 లక్షలు జీతం కాగా.. మిగిలిన రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్. అంటే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎప్పుడైనా కిడ్నాప్‌కు గురైతే.. రూ.40 లక్షలు కిడ్నాపర్లకు చెల్లించి విడిపించుకుంటుందన్న మాట. అయితే లోధా ఆ కంపెనీ పేరును వెల్లడించలేదు.

    ఇదీ చదవండి: 'ఒరాకిల్‌'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?

    ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒకవేళా కిడ్నాపర్లకు రూ.40 లక్షల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే?, ఆ తరువాత సంవత్సరం క్లెయిమ్ చేసుకోవాలా? అని కొందరు పేర్కొన్నారు. ఒకవేలా సన్నిహితులు కూడా ఆ డబ్బుకోసం ఉద్యోగిని కిడ్నాప్ చేయొచ్చు కదా అని ఇంకొందరు అన్నారు.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భారీ విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి, గజరాజుల సంరక్షణకు సంబంధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

    రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు పెద్దపీట

    ఇటీవల తలపరంబలోని చారిత్రక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.12 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అత్యంత పురాతనమైన, పురావస్తు ప్రాధాన్యత కలిగిన తూర్పు గోపురాన్ని పునరుద్ధరించడానికి ఈ నిధులను ప్రధానంగా వెచ్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయి. తక్షణ విరాళం కింద ఆలయ నిర్వహణ కమిటీకి రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.

    ఏనుగుల సంరక్షణ కోసం..

    అంతకుముందు, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ స్వామివారికి రూ.3 కోట్ల విరాళాన్ని సమర్పించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల సంక్షేమం కోసం వినూత్న ప్రణాళికలను ప్రకటించారు.

    • ఏనుగుల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం.

    • ఏనుగులను గొలుసులతో కట్టేయకుండా స్వేచ్ఛగా తిరిగేలా ఆధునిక వసతి గృహాల ఏర్పాటు.

    • ఏనుగులకు గౌరవప్రదమైన, శాస్త్రీయమైన సంరక్షణ అందించడానికి అవసరమైన సాంకేతిక మద్దతు.

    ‘భారతీయ ఆధ్యాత్మిక ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, కరుణ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే జీవన కేంద్రాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మన సంప్రదాయంలో భాగమైన మూగజీవాలకు అత్యుత్తమ వైద్యం, గౌరవం అందించడమే మా లక్ష్యం’ అని అనంత్ అంబానీ అ‍న్నారు.

    ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే..

National

  • NMACC 3rd Anniversary  నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌  నీతా అంబానీ  (Nita Ambani)    వివిధ రంగాల్లో నిష్టాతులైన కళకళారుల  పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారు.  భారతదేశ స్ఫూర్తికి జీవం పోసిన ప్రముఖ కళాకారులను నీతా అంబానీ సత్కరించారు.


    NMACC స్టూడియో థియేటర్ ది గ్రాండ్ థియేటర్‌లో జరిగిన 'ఏక్ సుర్ – భారత్ కీ ఆవాజ్' కార్యక్రమంలో, దిగ్గజ త్రయం శంకర్-ఎహసాన్-లాయ్,  ప్రముఖ గాయని  శ్రేయా ఘోషల్, రాజస్థానీ జానపద దిగ్గజం మామే ఖాన్, గుజరాత్ ప్రసిద్ధ ద్వయం ఉస్మాన్ మీర్ & అమీర్ మీర్, తాళ వాయిద్య మేధావి ఓజస్ అధియా తమ కళ ద్వారా ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు.  వారి అద్భుతమైన సేవలకు గుర్తింపుగా నీతా అంబానీ వారిని ఘనంగా సత్కరించారు.  

    వీరితోపాటు ప్రముఖ ప్రదర్శకుడు శేఖర్ సుమన్, ప్రసిద్ధ భక్తి సంగీత విద్వాంసుడు అగమ్ అగర్వాల్, సితార్ విద్వాంసుడు స్వయం సిద్ధ ప్రియదర్శి,  భరతనాట్య దిగ్గజం రాధే జగ్గీలను కూడా సత్కరించడం విశేషం.

    ఇదీ చదవండి: దుబాయ్‌లో ఖరీదైన బంగ్లాలు, కార్లు : షాకింగ్‌ బిలియనీర్‌ స్టోరీ

  • ఇటీవల కాలంలో కేంద్రం బలగాలు మావోయిస్టులపై ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లొంగిపోయిన నక్సల్స్‌ను పోలీసులు కీలక ఆపరేషన్‌ కోసం వాడుకుంటున్నారు. కౌంటర్‌ టెర్రరిజం అండ్ జంగిల్ వార్‌ ఫేర్‌ కోసం మావోయిస్టులతో పోలీసులు శిక్షణ తీసుకోనున్నారు.

    ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులలో ఐఈడీలు, గెరిల్లా వ్యూహాలలో సిద్ధహస్తులైన డజనుకు పైగా మావోయిస్టులను కాంకేర్‌లోని సీటీజేడబ్ల్యూ కళాశాలకు పంపించారు. అక్కడ వారు పోలీసు అధికారులకు IED నిర్వహణ, గెరిల్లా యుద్ధ వ్యూహంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దానితో పాటు కొత్తగా నియమితమైన డీఎస్పీలకు, ఎస్సైలకు గెరిల్లా యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందిస్తారని బస్తర్‌ ఐజీ తెలిపారు.

    మావోయిస్టుల కార్యక్రమాలపై పోలీసులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇదివరకే అడవిలో  రహదారులపై అమర్చిన ఐఈడీలను గుర్తించడంలో నక్సలైట్లు ఎంతగానో సహాయపడ్డారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులు సాధారణంగా ఐఈడీలను అమర్చే క్రమంలో ఆకులను ఇతరాత్రా సహజ సంకేతాలను ఉపయోగిస్తారని వాటిని గుర్తించడంలో లొంగిపోయిన మావోయిస్టులు ఎంతగానో ఉపయోగపడుతారని తెలిపారు.

    అయితే ఇటీవల లొంగిపోయిన 600 మంది మావోయిస్టులను బస్తర్‌లోని ఆరు పునారావాస కేంద్రాల్లో ఉంచుతున్నామని జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వారికి యోగా, కౌన్సిలింగ్, స్కిల్‌ డెవలఫ్‌మెంట్‌, ఉపాధి శిక్షణ తదితరాలు అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా సైకాలజిస్టుల పర్యవేక్షణలో వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు.

  • బీఆర్‌ శెట్టి (B.R. Shetty)    జీవితంలో సేల్స్‌మేన్‌ నుంచి బిజినెస్‌టైకూన్‌గా ఎదిగి, తిరిగి అదేస్థాయిలో పతనమైన, ఉత్థాన పతనాల గురించి తెలుసుకుంటే  కాబోయే వ్యాపారవేత్తలకు సత్యం బోధపడుతుంది. ఒకప్పుడు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో అంతస్తులు, ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్‌లతో దుబాయ్‌లో టాప్‌ బిలియనీర్‌గా  ఒక వెలుగు వెలిగిన బీఆర్‌ శెట్టి ( బావగుత్తు రఘురాం శెట్టి)  వ్యాపార సామ్రాజ్యం ఎందుకు కుప్పకూలిందో తెలుసా?  చివరికి రూ. 12400 కోట్ల కంపెనీని కేవలం రూ. 74కి విక్రయించే స్థాయికి  పడిపోవడానికి దారిన వినాశనం ఎలాంటిది? తెలుసుకుందాం.

    1973లో ఖాళీ చేతులతో యూఏఈ (UAE) వెళ్లిన శెట్టి, అక్కడ తొలి రోజుల్లొ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. 1975లో తన భార్య ఏకైక డాక్టర్‌గా ఒక చిన్న క్లినిక్‌ను ఎన్.ఎమ్.సి (NMC)ని  ప్రారంభించారు. అది  అంచెలంచెలుగా  ఎదిగి తర్వాత ప్రపంచవ్యాప్త హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌గా ఎదిగింది. హెల్త్‌కేర్‌తో పాటు ఫిైనాన్స్ (UAE Exchange), ఫార్మాస్యూటికల్స్ (Neopharma),ట్రావెలెక్స్ (Travelex) వంటి సంస్థలను ఏర్పాటు చేసి  దృఢ సంకల్పంతో, ధైర్యంతో తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్లాడు.  రూ. 207 కోట్ల విలువైన దుబాయ్  ఐకానిక్ బుర్జ్ ఖలీఫాలో మొత్తం రెండు అంతస్తుల నివాసంలో ఉండేవాడు. ఇవేనా వరల్డ్ ట్రేడ్ సెంటర్, పామ్ జుమేరాలో ఆస్తులు ఉండేవి. ఖరీదైన రోల్స్ రాయిస్, మేబ్యాక్ కార్లతో సహా విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. 34 కోట్లకు కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్‌లో 50 శాతం వాటాను  కూడా ఉండేది 2012లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన  తొలి యూఏఈ కంపెనీగా NMC నిలిచింది. శెట్టి వ్యక్తిగత ఆస్తి సుమారు 4 బిలియన్లకు డాలర్లు చేరుకుంది.

    పతనం ఎలా మొదలైంది 
    2019లో, షార్ట్-సెల్లర్ కార్సన్ బ్లాక్ నేతృత్వంలోని UK ఆధారిత పెట్టుబడి పరిశోధన సంస్థ  ముడీ  వాటర్స్, తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించింది. అప్పులను తక్కువగా చూపించడానికి నగదు ప్రవాహాన్ని పెంచిందని ఆరోపిస్తూ ఒక ట్వీట్‌ చేయడంతో శెట్టి సామ్రాజ్యం పతనమైంది.

    2020 ప్రారంభంలో, సుమారు దాదాపు రూ.33,000 కోట్ల అప్పును కంపెనీ  ప్రకటించకుండా దాచిపెట్టిందని తేలింది.  ఈ  క్రమంలోనే ఫోర్జరీ పత్రాలు, అనధికారిక రుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బ్రిటన్ హైకోర్టు NMC ని అడ్మినిస్ట్రేషన్‌లోకి తీసుకుంది. శెట్టి ఆస్తులను సీజ్‌ చేశారు.  2025, అక్టోబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) వ్యక్తిగత గ్యారెంటీ కింద 46 మిలియన్ల డాలర్లు చెల్లించాలని దుబాయ్ కోర్టు శెట్టిని ఆదేశించింది. భారీగా అప్పులు, ఆర్థిక అస్థిరతతో, శెట్టి తన రూ. 12,478 కోట్ల  ఎన్‌ఎంసి హెల్త్‌ను కేవలం రూ. 74కి ఇజ్రాయెల్-యుఎఇ కన్సార్టియమ్‌కు విక్రయించవలసి వచ్చింది.

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

    ఆశయం ఎంత గొప్పదైనా, పారదర్శకత  ప్రాధాన్యంగా ఉండాలి. వ్యాపార వృద్ధి కంటే నిజాయితీతో,  విశ్వాసాన్ని నిలబెట్టు కోవడం ముఖ్యం. అలాగే కార్పొరేట్ పాలన  ముఖ్యం అని  బీఆర్‌  శెట్టి ఉదంతం నిరూపిస్తోంది.   ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడిన ఆయన జీవితం భవిష్యత్‌ వ్యాపారవేత్తలకు ఒక గుణపాఠం.

    ఇదీ చదవండి: రనౌట్‌ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు
     

  • ఢిల్లీ: పాకిస్థాన్‌కు భారత రక్షణశాఖ రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ ‘కోల్‌కతాపై దాడి’ వ్యాఖ్యల్ని ఖండించారు. పశ్చిమ బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్థాన్‌ మరిన్ని ముక్కలవుతుందని హెచ్చరించారు.

    మంగళవారం ఖ్వాజా అసిఫ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. అసిఫ్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు.  భవిష్యత్తులో భారత్‌ తమ దేశాన్ని దోషిగా నిలబెట్టి దాడులు చేస్తే ప్రతిస్పందనగా.. కోల్‌కతాపై దాడులు చేస్తామని అని అన్నారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పాక్‌ చరిత్రను గుర్తుచేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసే  55 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై రెండు ముక్కలైంది. ఇప్పుడు బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్‌ ఎన్నిముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని హెచ్చరించారు.

    1971లో పాక్‌ రెండు ముక్కలుగా విడిపోయింది. అందులో బంగ్లాదేశ్‌ విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌ సైన్యం అండగా నిలిచింది. నాటి చరిత్రను తాజాగా రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తు చేశారు. మరోసారి అదే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పాకిస్థాన్‌ ముక్కలవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టింది. నాటి నుంచి పాకిస్థాన్‌.. భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఖవాజా మరోసారి ప్రగల్భాలు పలికారు.  

    ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ కూడా స్పందించింది. కోల్‌కతాపై దాడి చేస్తే పాక్‌లోని వారి ఇళ్లలోకి దూరి మరి చంపుతామని అధికార టీఎంసీ నేతలు వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలు మాత్రం భారతదేశం తన భూభాగాన్ని రక్షించేందుకు ఎలాంటి రాజీపడదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బెంగాల్‌పై కన్నేసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్‌కు మరింత విభజన తప్పదని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. 

  • మెయిన్‌  రోడ్‌కాకుండా షార్ట్‌ కట్‌లో వెళ్లాలనే  నిర్ణయం  కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  ప్రధాన రహదారిలోంచి కాకుండా,  వేరే రూట్‌లో వెళితే తొందరగా ఇంటికి చేరుకోవచ్చని భావించారు. కానీ అదే మృత్యువుకు షార్ట్‌కట్‌ అవుతుందని అస్సలు ఊహించలేదు.  

    నాసిక్ జిల్లాలోని దిండోరి తహసీల్‌లో శుక్రవారం అర్ధరాత్రి, కారు బావిలో పడిపోవడంతో, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలతో సహా తొమ్మిది మంది సభ్యులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర విషాదం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ఆరుగురు పిల్లలతో కలిసి  ఒకే కారులో దిండోరిలో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహించిన కార్యక్రమానికి   హాజరయ్యారు.  ఆ తరువాత వీరంతా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి బయలుదేరారు. షార్ట్‌కట్‌లో వెళ్లాలని కారు నడుపుతున్న సునీల్‌ నిర్ణయించుకున్నాడు. ఇదే ఘోర తప్పిదంగా మారిపోయింది.  

    నివేదికల ప్రకారం  వీరు ప్రయాణిస్తున్న కారు  ప్రమాదవశాత్తు  రోడ్డు పక్కన ఉన్న బావి గోడను ఢీకొట్టి అందులోకి దూసుకు పోయింది. బావిలో 40 అడుగుల లోతు వరకు నీరు ఉంది. కారు బావిలో పడిపోయిన శబ్దం  విన్న  స్థానికులు అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. నివాసితులు సహాయక చర్యలకు ప్రయత్నించి నప్పటికీ,  చీకటి  బావి లోతు  వారికి చాలెంజ్‌గా మారింది. అగ్నిమాపక సిబ్బంది లైట్లను ఉపయోగించి వాహనాన్ని గుర్తించారు. తాళ్ల సాయంతో కారును బావి నుండి బయటకు లాగారు.  కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కారులో ఉన్నవారందరూ  కన్నుమూశారు.

    మృతులలో సునీల్ దర్గుడే (32), అతని భార్య రేష్మా (27), కుమార్తె గుణవంతి (11), సునీల్ వదిన ఆశా (32), ఆమె పిల్లలు శ్రేయాష్ (11), శ్రావణి (11), శ్రద్ధ (13), సృష్టి (14), మరో బంధువు సమృద్ధి (7) ఉన్నారు.

    ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులలో ఒకరైన సునీల్ దర్గుడేపై అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు అభియోగాలు మోపగా, బావి యజమాని రాజేంద్ర రాజేపై నిర్లక్ష్యం కేసు పెట్టారు. 

    ఇదీ చదవండి: రనౌట్‌ వివాదం : అంపైర్‌ను పొడిచి చంపేశాడు

    రహదారికి ఇంత దగ్గరగా ఉన్న రాకాసిలా నోరుతెచుకుని ఉన్న అంత పెద్ద బావిని నిర్లక్ష్యంగా ఎందుకు  వదిలేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ బావిని చాలా ఏళ్ల  క్రితం నిర్మించారు, కానీ బావిని మూసివేయలేదు. ఈ విషయంపై పౌర అధికారులు, బావి యజమాని మధ్య వివాదం  నడుస్తోంది. ఈ విషాద ఘటనం తరువాత ఈ బావిని పూడ్చివేసే పనులను స్థానిక అధికారులు  మొదలు పెట్టారు. 

    ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్‌ దోస పిండి

  • భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక వివాహిత తన ఇష్టానుసారం ప్రియుడితో వెళ్లవచ్చని పేర్కొంది. తన భర్తను విడిచి ప్రియుడితో వెళ్లాలని 19 ఏళ్ల యువతి దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ విషయమై ఆ మహిళకు ప్రియుడితో వెళ్లడానికి  అనుమతినిస్తూ తీర్పు ఇచ్చింది.

    వివరాల్లోకి వెళితే.. అనూజ్‌ కుమార్ అనే వ్యక్తి తన భార్యను అపహరించాడని ఆరోపిస్తూ యువతి భర్త అవదేష్ హెచియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు వారిద్దరిని పట్టుకొని కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి సదరు మహిళను ఎవరితో ఉండాలనుకుంటున్నావు అని ప్రశ్నించారు.

    దీనికి సదరు మహిళ సమాధానం ఇస్తూ" నా భర్త వయస్సు 40 సంవత్సరాలు, నావయస్సు 19 సంవత్సరాలు మా ఇద్దరి మధ్య 19 ఏళ్ల తేడా ఉంది. నా వైవాహిక జీవితం సరిగ్గా లేదు. నా భర్త సరిగ్గా ప్రవర్తించడం లేదు". అని కోర్టుకు తెలిపింది. అనంతరం ఆ మహిళకు కౌన్సిలింగ్‌ ఇచ్చినప్పటికీ ఆమె తన ప్రియుడితో వెళ్లడానికే అంగీకరించింది. దీంతో కోర్టు ఆమె అభ్యర్థనను అంగీకరించింది.

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ ఎదుర్కొన్న కట్న వేధింపుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేపుతోంది. పెళ్లి సమయంలో  భర్త అనారోగ్యాన్ని దాచి పెట్టడమే  కాకుండా, భార్యను  కిడ్నీ ఇస్తావా, రూ. 30 లక్షలు  తెస్తావా అంటూ  వేధించిన కథనం తాజాగా వైరల్‌గా మారింది.

    ఎన్‌టీవీ కథనం ప్రకారం గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనలో  కాన్పూర్‌కు చెందిన ఒక మహిళ, తన భర్త , అత్తమామలపై అత్యంత భయంకరమైన ఆరోపణలు చేసింది.  తనను శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం 2023, జూన్ 22న లక్నోకు చెందిన నిశాంత్ కుమార్‌తో   బాధిత మహిళ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబం భారీగా నగలు, రూ. 8 లక్షల నగదు మరియు 'మహీంద్రా థార్' కారును కట్నంగా ఇచ్చారు.

    అయితే పెళ్లి అయిన కొన్న రోజులకు నిశాంత్‌ తీవ్ర అనారోగ్యం గురించి భార్యకు తెలిసింది.  పెళ్లయ్యాక భర్త తనతో శారీరక సంబంధానికి ఆసక్తి చూపేవాడు కాదు. అత్త తన గదికి వచ్చి ఇద్దరి మధ్య పడుకునేది.. అలాగే, మామగారు అనుమతి లేకుండా గదిలోకి రావడం, ఫోటోలు తీయడం వంటివి చేసేవారు.  మరోవైపు అతని నిరంతరం మందులు తీసుకుంటూ, బాత్రూంలో ఎక్కువ సమయం గడిపేవాడు. దీంతో అనుమానం వచ్చి ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చి మెడికల్ రిపోర్టులు చూడగా, భర్త నిశాంత్‌కు  రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్‌పై ఉన్నాడని తెలిసింది.  ఈ విషయాన్ని  ఎందుకు  దాచిపెట్టారని  అత్తమామల్ని నిలదీయగా, "నీ కిడ్నీ అయినా ఇవ్వు లేదా పుట్టింటి నుండి రూ. 30 లక్షలు అయినా తీసుకురా" అని అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు  నిశాంత్‌కు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆ విషయం కుటుంబ సభ్యులందరికీ తెలుసు.

    దీంతో ఆవేదన చెందిన ఆమె 2024  అక్టోబర్ 11న తన అత్తవారి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె కాన్పూర్‌లోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పుట్టింటికి వెళ్లేటపుడు తన అత్తమామలు తన బ్యాగ్‌ను తనిఖీ చేసి, అందులోంచి నగలను తీసుకున్నారని ఆ మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె పుట్టింటికి తిరిగి వెళ్లి, అప్పటి నుంచి అక్కడే నివసిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా, వరకట్నం వేధింపులు, మానసిక హింస, బెదిరింపుల సెక్షన్ల కింద ఆమె భర్త, అత్తమామలపై చకేరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఇన్‌చార్జ్ అజయ్ ప్రకాష్ మిశ్రా తెలిపారు.

  • చెన్నై: నిన్న (సోమవారం) సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు చట్టం ముందు నిలబడడానికి కారణం ఒక లేడీ కానిస్టేబుల్‌ అవునండీ నిజం. బాధితులకు న్యాయం జరగడం కోసం తన సొంత డిపార్ట్‌మెంట్‌ను సైతం ఎదురించి సత్వం వైపు నిలబడడం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది.

    సాధారణంగా పోలీస్‌ స్టేషన్లలో జరిగిన ఏదైనా నేరాలు జరిగితే వాటిని బహిర్గతం చేయడానికి వారు ఆసక్తి చూపరు. అయితే హెడ్‌కానిస్టేబుల్ రేవతి మాత్రం ఇందుకు విభిన్నంగా వ్యవహరించింది. బాధితుల పక్షాన నిలబడడానికి తన సొంత డిపార్ట్‌మెంట్‌నే ఎదురించింది. ఆ రోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఘటనను మేజిస్ట్రేట్ ముందు నిర్భయంగా వివరించింది.

    బాధితులు జయరాజ్, బెన్నిక్స్‌లను పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎంతో దారుణంగా హింసించారని మేజిస్ట్రేట్ ముందు ఆమె వివరించింది. పోలీసులు ఆ తండ్రీ కొడుకులను రాత్రంతా తీవ్రంగా  కొట్టారని, లాఠీలు మరియు టేబుళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. దీంతో ఆమె సాక్షం ద్వారానే  ఆ రక్తపు మరకలున్న వస్తువులను ఫోరెన్సిక్ ఆధారాలుగా సేకరించడం సాధ్యమైంది.

    అయితే ఈ సమయంలో తన తోటి పోలీసులు మరియు ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి, భయం ఉన్నప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి, మేజిస్ట్రేట్ విచారణకు వెళ్ళినప్పుడు అక్కడి పోలీసులు సహకరించలేదు, కానీ ఆమె ఇచ్చిన ధైర్యంతోనే విచారణ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలోనే  తోటి పోలీసుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేయడంతో, అప్పట్లో ప్రభుత్వం ఆమెతో పాటు తన కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించింది.

    ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ ఆమె ఆ ఆప్షన్ తీసుకోలేదు  కేవలం డ్యూటీ మాత్రమే కాదు… తన కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించడమే ప్రథమ కర్తవ్యంగా భావించింది. దీంతో ఎట్టకేలకు నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడంలో కానిస్టేబుల్ రేవతి ఎంతో కీలకపాత్ర పోషించింది.

    సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు మరణ శిక్ష..
  • న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైన వేళ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పోలింగ్‌కు ముందు తప్పనిసరిగా అమలు చేసే 48 గంటల ‘సైలెంట్ పీరియడ్’లో రాజకీయ పార్టీలు, మీడియా పాటించాల్సిన కఠిన నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది.

    సైలెంట్ పీరియడ్ అంటే ఏంటి?
    అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ తొమ్మదిన పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (1)(b) ప్రకారం.. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ముందున్న 48 గంటల సమయాన్ని ‘సైలెంట్ పీరియడ్’ అని అంటారు. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే లేదా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఎలాంటి సమాచారాన్ని మీడియా లేదా ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రసారం చేయకూడదు.

    ఈ 48 గంటల్లో నిబంధనలు ఏంటి?
    ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, ఒపీనియన్ పోల్స్, సర్వే ఫలితాలు ప్రసారం చేయడం పూర్తిగా నిషేధం.
    టీవీ, రేడియో, కేబుల్ నెట్‌వర్క్‌లు, సినిమా హాళ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్‌లు, ఆడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ప్రచారం చేయరాదు.
    స్టార్ క్యాంపెయినర్లు, రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు నిర్వహించడం గానీ, ఎన్నికల గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయకూడదు.
    పోలింగ్ ప్రాంతంలో మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తి నిషేధం (డ్రై డే) ఉంటుంది.

    ఎగ్జిట్ పోల్స్‌పై బ్యాన్
    ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ పూర్తి నిషేధం విధించింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరిగే ఎనిమిది ఉప ఎన్నికలకూ ఇది వర్తిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి.

    ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
    ఈ నిబంధనలను ఉల్లంఘించి ఈ 48 గంటల సైలెంట్ పీరియడ్‌లో ప్రచారం చేసినా, నిబంధనలు అతిక్రమించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది.
     
    ఇది కూడా చదవండి: కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల

  • మ‌రో రెండురోజుల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న వేళ అక్క‌డి రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్మ రిణికి భూయాన్ శ‌ర్మ వ‌ద్ద  మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించిన విషయం తెలిసిందే. 

    ప‌వ‌న్ ఖేడా వ్యాఖ్య‌ల‌పై సీఎం స‌తీమ‌ణి  పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసుల బృందం మంగ‌ళ‌వారం దిల్లీలోని ప‌వ‌న్ ఖేడా నివాసానికి వెళ్లారు.  అయితే పోలీసులు వెళ్లే సమయానికి పవన్ ఖేడా అక్కడ లేకపోవడంతో.. వారు ఆయనకోసం ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

    పవన్ ఖేడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత సతీమణి రిణికి భూయాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని.. కానీ తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

    త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ నేతలు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏప్రిల్ 9న అస్సాంలోని 126 స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

    చదవండి: Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!

Family

  • ఒక్కోసారి రోడ్డు ప్రమాదాలు బాధనే కాదు త్రుటిలో పెను ప్రాణాంతక ప్రమాదాల నుంచి రక్షిస్తాయి కూడా. ఒక్కోసారి విత్కర పరిస్థితి కూడా వరంగా మారిపోతుంది. అందుకు నిదర్శనమే ఈ మహిళ కథ. ఆ రోజు ఆమెకు ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే..ప్రాణాలతో ఉండేది కాదు. ఇదేంటి అనుకోకండి ఈ కథ వింటే ఏం జరిగినా మన మంచికే అనే పెద్దల మాట తలపుకు వస్తుంది. 

    అమెరికాలోని ఓవెన్స్‌ క్రాస్‌ రోడ్స్‌కు చెందిన 31 ఏళ్ల మెలిస్సా ఆడమ్స్‌ తన పెళ్లికి ఒక రోజు ముందు రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైంది. రిహార్సల్‌ డిన్నర్‌ నుంచి ఇంటికి వస్తుండగా సిగ్నల్‌ వద్ద  ఉన్న ఆమె కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఢీ కొట్టారు. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్సి చేసే నిమిత్తం వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా..ఆమె ప్రాణాంతక కేన్సర్‌ వాధి బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. అది నాలుగో స్టేజ్‌లో ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. ఒక్క క్షణంలో జీవితం తలకిందులైనట్లు అనిపించిందామెకు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ తమ పెళ్లిని వాయిదా వేసుకోకూడదని ఆమె, తన భాగస్వామి తీర్మానించుకున్నట్లు ఆడమ్స్‌ పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటన మరుసటి రోజే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించింది. తన జీవితంలోని ముఖ్యమైన రోజుని దూరం చేసుకోవడం ఇష్టంలేక ఇలా చేసినట్లు తెలిపింది. 

    తర్వాత వైద్యులు ఆమె శరీరంలోని మొత్తం 18 గడ్డలను గుర్తించి, ఆమెకు ఫోలిక్యులర్ డెండ్రిటిక్ సెల్ సార్కోమా (FDCS) అనే అత్యంత అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఆ గడ్డలు ఆమె శరీరంలోని గుండె దగ్గర నుంచి పొత్తికడుపు, ఛాతీతో సహా పలుచోట్ల ఉన్నట్లు తెలిపారు. అనేక ఆస్పత్రులు, ఆంకాలజీ క్లినిక్‌లను సందర్శించిన తర్వాత చివరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు చికిత్సను ప్రారంభించారు. సుమారు 19-20 వారాలు వేచి ఉన్న తర్వాత కీమోథెరపీని ప్రారంభించడంతో తనకు ఉపశమనం, ఆశ కలిగిందని అన్నారు. 

    ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు కోసం గోఫండ్‌ సాయం తీసుకున్నట్లు తెలిపింది. నిజానికి తనకు అప్పటికే కొన్ని ఆటోఇమ్యూన్ సమస్యలు ఉన్నాయని, నడుము నొప్పితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మొదటి నుంచి ఆసమస్యలు ఉండటంతో అందువల్ల ఇలా అనుకున్నాననే గానీ ఇలా ప్రాణాంతక కేన్సర్‌ బారిన పడతానని ఊహించలేదని కన్నీటిపర్యంతమైంది. తాను గత కొంతకాలంగా శరీరం అంతా పలు నొప్పులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకుంది. 

    కణుతులు అవయవాలపై ఒత్తిడి తేవడం వల్లనేనని ఇప్పుడు అర్థమవుతోందని అంటోంది. వ్యాధి నిర్థారణ తర్వాత తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలంటూ ఇతరులకు సూచనలందిస్తోంది. అస్సలు తనకు గనుక ఆ కారు ప్రమాదం జరిగి ఉండకపోతే..తన అనారోగ్యాన్ని గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని అని అంటోందామె.

    అలాగే తనలాంటి లక్షణాలు ఉన్నా లేక శరీరం ముందుగా ఇచ్చే సంకేతాలనుక్ క్షణ్ణంగా అర్థంచేసుకోమని సూచిస్తోంది. తనలా నిర్లక్ష్యంగా ఉండొద్దని హితవు పలుకుతోంది. ఇక ఆడమ్స్‌​ పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని, పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. 

    (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్‌ హ్యాబిట్స్‌)
     

  • పంటి రక్ష ప్రాణాలకు రక్ష అన్నా పర్వాలేదు. ఎందుకంటే నోరు అనే సింహద్వారానికి పళ్లు ద్వార పాలకులు.వాటిని దాటి ఏదీ రాలేదు. కానీ నోటి ఆరోగ్యం దెబ్బతింటే అది గొంతు ఇన్ఫెక్షన్లనూ, దీర్ఘకాలంలో అక్కడి నుంచి గుండెనూ దెబ్బతీసే ముప్పు లేకపోలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే పంటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడమే. మనకు తెలియకుండా...మన రోజువారీ అలవాట్లలో భాగంగా చాలా పనులు చేస్తుంటాం.

    ఉదాహరణకు పంటికి లుంగజుట్టుకు పోయే చాక్లెట్లు తింటుంటాం.కూల్‌ వాటర్‌ తాగుతూ పంటి కిందికి ‘ఐస్‌’వస్తే నమిలేస్తుంటాం. ఇలా మనం చాలా తేలిగ్గా తీసుకుని చేసే కొన్ని పనులు పంటి ఆరోగ్యాన్నీ... దీర్ఘకాలంలో ఒంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి అలవాట్లు ఏమిటో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం ఎలాగో, తద్వారా పంటి, ఒంటి ఆరోగ్యాలను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం...

    ఇప్పటి తరం పిల్లల దూకుడు గురించి చెప్పడానికి చాలానే ఉంటుంది. నేటి యువతలో నలుగురు కలిసి ఎక్కడో పిక్నిక్‌కు అంటూ కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ తీసుకెళ్లారనుకోండి. అక్కడ ఓపెనర్‌ దొరకక΄ోతే పళ్లతోనే బాటిల్‌ మూతలను ఓపెన్‌ చేసే నైపుణ్యం ఇప్పటి యువకుల సొంతం. అలాగే చాలామంది తమకు తెలియకుండానే పంటిని దెబ్బతీసే పనులు చాలానే చేస్తుంటారు. 

    ఉదాహరణకు రాస్తూ రాస్తూ ఏదో ఆలోచిస్తూ పెన్ను చివరను నోట్లో పెట్టుకుని తేలిగ్గా కొరుకుతూ ఉండవచ్చు. అలాగే పొద్దున్నే బ్రష్‌ నోట్లో వేసుకుని నలుగురు కలిసి మాట్లాడుకునే టైమ్‌లో బ్రషింగ్‌కు బదులు బ్రష్‌ను నములుతూ ఉండిపోయే పల్లెల్లోని రచ్చబండ  బ్యాచ్‌కు కొదవే లేదు. చల్లటి నీళ్లనో లేదా ‘ఛిల్ల్‌’టి డ్రింక్స్‌ తాగుతూ ఆ నీళ్లకు పళ్లు అదేపనిగా తాకుతూ ఉండేలా తాగేవారికి లోటు లేదు. 

    మనం అంతగా పట్టించుకోకుండా చేసే ఇలాంటి చాలా పనులు పళ్లకు హాని చేయవచ్చు. నోరు అనేది దేహానికి సింహద్వారం అని చెప్పుకున్నాం కదా. మరి ఆ నోట్లోకి హానికరమైన బ్యాక్టీరియా వచ్చి చేరాక అవి గొంతులోకి... అక్కడ్నుంచి దేహంలోకీ పోతూ... మొత్తం ఒంటికే చేటు తెచ్చే ముప్పు ఎప్పుడూ ΄పొంచే ఉంటుంది. అందుకే అలాంటి కొన్ని చెడ్డ అలవాట్లను చిన్నారులు, యువత దృష్టికి తెచ్చి... వాటిని మాన్పించేలా చేయడమే ఈ కథనం ఉద్దేశం.  

    టైటానిక్‌కు ఐస్‌బర్గ్‌ లాంటిదే... పంటికి ‘ఐస్‌’ వాటర్‌...
    మంచి టేస్టీ బిర్యానీతో పాటు చల్లటి కూల్‌డ్రింక్‌ తాగుతుండటం చాలామందికి అలవాటు. అంతేకాదు... ఇటీవలి ఫాస్ట్‌ ఫుడ్స్‌ అయిన బర్గర్, పిజ్జాలతో పాటు కోలా క్రిండ్స్‌ తీసుకోవడం ఇంకొందరికి పరిపాటి. ఒకవేళ వాళ్లు తీసుకోక΄ోయినప్పటికీ... ఇలాంటి ఫాస్ట్‌ఫుడ్స్‌తో పాటు కాంప్లిమెంటరీ డ్రింక్‌గా కూల్‌డ్రింక్స్‌ చాలా మాల్స్‌లో దొరుకుతూ ఉండటం మామూలే. అందునా ఆ డ్రింక్స్‌లో ఐస్‌ క్యూబ్స్‌ వేసి మరీ ఇస్తుంటారు. 

    కొందరు నోట్లోకి వచ్చిన ఆ ఐస్‌ ముక్కను ఉమ్మేస్తే బాగుండదనుకుని నుములుతూ ఉండటమూ మామూలే. ఇక రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ‘ఐస్‌’ఫ్రూట్స్‌ తినే చిన్నారులు ఒక దశవరకూ వాటిని చప్పరించాక... ఇక ఓపిక తగ్గిపోయి... వాటిని నమిలి మింగేస్తుంటారు. మరికొందరు బాక్సింగ్, కిక్‌బాక్సింగ్,  ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ తమ పళ్ల రక్షణ కోసం ఐస్‌ ముక్కల్ని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి ఐస్‌ ముక్కల కారణంగా చాలామంది పళ్లు దెబ్బతింటాయి. 

    తొలిదశలో కాస్తంత భరించేలా ఉన్న అవే ఐస్‌ ముక్కలు... పంటి ఎనామిల్‌ దెబ్బతిన్న తర్వాత జిల్లంటూ బాధించేవరకూ పరిస్థితి వెళ్తుంది. ఐస్‌ క్యూబ్స్‌ లేదా ఐస్‌ నోట్లోకి తీసుకోవడం కారణంగా నోట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారిపోవడం వల్ల ఎనామిల్‌లో పగుళ్లు (క్రాక్స్‌) వచ్చే ప్రమాదం ఉంటుంది. 

    పరిష్కారం: పెద్దవాళ్లు ఐస్‌ ముక్కలతో కూడిన డ్రింక్స్‌ తీసుకుంటున్నా... లేదా చిన్నారులు ఐస్‌ఫ్రూట్లూ, ఐస్‌క్యాండీ తింటున్నా వీలైనంతవరకు ఐస్‌ను నమలకూడదు. అసలు పంటికి ఐస్‌ తగలకుండా జాగ్రత్త పడాలి. ఇక బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌ వంటి ఆటగాళ్లు ఐస్‌కు బదులు పళ్ల రక్షణ కోసం మౌత్‌గార్డ్‌నే వాడటం మేలు.

    పళ్లను ఓపెనర్‌గా వాడటం సరికాదు... 
    పిక్నిక్‌లకు వెళ్లేప్పుడు ఆర్భాటంగా కూల్‌డ్రింక్స్‌ తీసుకెళ్లే యువకుల్లో చాలామంది ఓపెనర్‌ను తీసుకెళ్లడం మరచి΄ోయి, సీసా మూతలు తీయడానికి  పళ్లను వాడుతుంటారు. బట్టలు కుట్టే టైలర్లలో కొందరు దారం ఎక్కించే ముందర సూదిని పంటితో పట్టుకోవడమూ అక్కడక్కడా కనిపించే దృశ్యమే. అంతేకాదు వాళ్లలో కొందరు దారాన్ని పంటితోనే తెంపుతుంటారు. షాంపూ షాచేలను చింపడానికి కొందరు పళ్లనే ఉపయోగిస్తుంటారు.

    పరిష్కారం: పంటి రక్షణ కోసం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మన పళ్లు ఓపెనర్లు కాదు. అలాగే కత్తెరకు బదులుగా పళ్లను వాడటమూ సరికాదు. ఈ పనులు చేసే చాలామందిలో పళ్ల ఎనామిల్‌ దెబ్బతినే ప్రమాదముంది. పంటి తాలూకు  చిన్న ముక్క ఊడి΄ోయే ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటి పనులతో పళ్లు త్వరగా దెబ్బతింటారు. అందుకే సీసా మూతలు తీయడానికి ఓపెనర్‌నే వాడాలి. షాంపూ షాచేలు చిం΄ాలంటే కత్తెరనే వాడాలి. అంతేతప్ప పళ్లను వాడకూడదని గుర్తుంచుకోవాలి.

    పండ్లరసాల్లోని చక్కెర పళ్లకు ముప్పు... 
    పండ్లరసాలు ఆరోగ్యానికి చాలామంచివంటూ చాలామంది వాటిని తాగేస్తూ ఉంటారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్‌ అనీ, స్పోర్ట్స్‌ డ్రింక్స్‌ అనీ తాగేస్తూ తమకు ఆరోగ్యంతో కూడిన శక్తి సమకూరుతోందంటూ ఆనందిస్తుంటారు. నిజానికి ఫ్రూట్‌ జ్యూసుల్లో, స్పోర్ట్స్‌ డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... లైమ్‌జ్యూస్‌ల వంటి పుల్లటి  పండ్లరసాల్లోనియాసిడ్‌ వల్ల పళ్లు దెబ్బతినే ముప్పు పెరుగుతుంది.  

    పరిష్కారం:  చక్కెర మోతాదు ఎక్కువగా ఉండే పండ్లరసాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాంటి పానీయాలు తాగేటప్పుడు ఆ ద్రవం వీలైనంతవరకు పంటికి తగలకుండా తాగడం మేలు. ఇక తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ లేదా పండ్లరసాలు తాగాక నోరు శుభ్రంగా కడుక్కోవడం మరచి΄ోవద్దు.

    పండ్లూ... పళ్లు... ప్రాధాన్యం దేనికి... 
    ఏ సీజన్‌లో దొరికే మంచి తాజాపండ్లను ఆయా సీజన్‌లలో తినడం మంచి అలవాటే. అది ఆరోగ్యానికి మేలు చేసే అంశమే. కాకపోతే మరీ చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే పండ్లనూ, పులుపు మోతాదు కాస్తంత ఎక్కువగా ఉండే బత్తాయి, ద్రాక్ష, ఆరెంజ్‌ జ్యూస్‌లను వీలైనంత మేరకు పళ్లకు తగలకుండా తీసుకోవడం మేలు. ఎందుకంటే పుల్లటి పండ్లలో ఉండే ఆ పులుపులో ఉండే ఆమ్ల గుణం పంటిని దెబ్బతీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది.

    పరిష్కారం: పండ్లను ఫ్రూట్‌జ్యూస్‌లుగా తాగడం కంటే వాటిని కొరికి తినడం మంచిది. ఒకవేళ జ్యూస్‌ రూపంలో తాగాలనుకుంటే... ఆ పానీయంలో చక్కెర కలుపుకోవడం తగదు. ఇక జ్యూస్‌ రూపంలో తాగినప్పటికీ... వెంటనే నోరు కడుక్కోవడం మరచిపోవద్దు.

    కరకరలాడే చిప్స్‌తో కిరికిరి... 
    చిప్స్‌ కరకరలాడుతూ నాలుకకు రుచిగా ఉండవచ్చు. కానీ పళ్లకు అంత మంచివి కాదు. పైగా కరకరలాడే పదార్థాలు పళ్లకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలెక్కువ. అంతేకాదు చిప్స్‌ లాంటి చిరుతిండ్లలో స్టార్చ్‌ కూడా ఎక్కువ. ఈ స్టార్చ్‌ లాలాజలం తగలగానే దాదాపు చక్కెరలా మారిపోయి పంటిని దెబ్బతీసే ముప్పు మరీ ఎక్కువ. అందుకే చిప్స్‌ లాంటివి తిన్న 20 నిమిషాల తర్వాత అవి పంటిని దెబ్బతీయడం మొదలు పెడతాయి. 

    అంతేకాదు... పంటి మధ్యన చిక్కుకునే చిప్స్‌ తాలూకు చిన్న చిన్న ముక్కలతో దంత క్షయం ముప్పు మరింత పెరుగుతుంది. ఇక మరికొందరు పిల్లలూ, ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా ఎప్పుడూ ఏదో ఓ చిరుతిండిని నములుతూ ఉంటారు. దాంతో చిరుతిండిలో ఉండే పిండిపదార్థాలూ, చక్కెర వంటి పంటికి ముప్పు తెచ్చే అంశాలు పళ్లను దెబ్బతీస్తాయి.

    పరిష్కారం: వీలైతే తరచూ చిరుతిండ్లు తినే అలవాటుకు దూరంగా ఉండటం మేలు. లేదంటే చిరుతిండి తిన్న వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చిరుతిండ్లకు బదులుగా క్యారట్‌ వంటిని నములుతూ ఉండటం మంచిది. 

    ఇక చిప్స్‌ లాంటి చిరుతిండ్లను వీలైనంత తక్కువగా తినాలి. ఒకవేళ తప్పక తినాల్సివచ్చినప్పుడు తిన్నవెంటనే నోరు కడుక్కోవడం, వీలైతే ఫ్లాసింగ్‌ చేసుకోవడం (దారంతో పళ్ల మధ్య చేరే చిన్న చిన్న ముక్కలను శుభ్రపరచుకోవడం) తప్పనిసరి.

    కాఫ్‌ సిరప్‌తోనూ దంతక్షయం...
    చాలామంది కాఫ్‌ సిరప్‌ అనేది దగ్గు తగ్గేలా చేసే ఓ మందు అనుకుంటారు గానీ అందులో ఔషధంతో పాటు చక్కెర మోతాదులూ ఉంటాయి. ఆ చక్కెర పంటి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశాలుంటాయి. 

    పరిష్కారం: దగ్గు మందును వీలైనంత మేరకు పలువరసకు తగలకుండా గొంతులో ΄ోసుకోవడం మేలు. అలాగే దగ్గు మందు తాగిన వెంటనే నోరు కడుక్కోవడం మరచిసెవద్దు.

    తప్పుడు బ్రష్షింగ్‌ సరికాదు...  
    చాలామంది బ్రష్‌ చేసుకోడానికి నోట్లో బ్రష్‌ పెట్టుకుంటారు గానీ... ఆ ప్రక్రియను వేగంగా ముగించకుండా అదేపనిగా నములుతుంటారు. ఇక కొందరు తప్పుడు పద్ధతుల్లో బ్రష్షింగ్‌ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు  నోరు శుభ్రంగా ఉండాలనే తపనతో విపరీతంగా బ్రష్‌ చేసుకుంటారు. ఈ అన్ని చర్యలతోనూ పళ్లు త్వరగా అరిగిపోయే ముప్పు ఉంటుంది.

    పరిష్కారం: మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న టూత్‌బ్రష్‌ను ఎంచుకోవాలి. పంటి మీద ఎక్కువ ఒత్తిడితో బ్రష్షింగ్‌ చేయకూడదు. బ్రష్షింగ్‌ చేసే సమయంలో పంటికి అడ్డంగా కాకుండా నిలువుగా బ్రష్‌ చేసేలా టూత్‌బ్రష్‌ను కదిలించాలి. సున్నాలు చుడుతున్నట్లుగా (సర్క్యులర్‌గా)  కదిలిస్తూ బ్రష్‌ చేసుకోవడం సరైన పద్ధతి. ఈ సమయంలో చిగుర్లకూ మాలిష్‌ జరుగుతుండేలా బ్రష్‌ కదలికలు (స్ట్రోక్స్‌) ఉండాలి. 

    బ్రషింగ్‌ పూర్తయ్యాక వేలిచివరతో చిగుర్లను మాలిష్‌ చేస్తున్నట్లుగా సున్నాలు చుడుతున్నట్లుగా కదిలించాలి. కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా బ్రష్‌ను మార్చడం మేలు. ఒకవేళ జ్వరం రావడం లేదా ఆరోగ్యం చెడిపోవడం జరిగితే... కోలుకున్న వెంటనే బ్రష్‌ను మార్చడం మంచి పద్ధతి. ఇలా ఆరోగ్యం చెడి΄ోయినప్పుడు బ్రష్‌ మార్చడానికి మూడు నెలలు ఆగడం అనే నిబంధన పనికిరాదు.

    ఆ జబ్బుతో పంటికి ముప్పు... 
    కొందరు ‘బ్రక్సిజం’ అనే జబ్బు కారణంగా పదే పదే పళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజువారీ ఒత్తిడుల కారణంగా తమకు తెలియకుండానే నిద్రలో పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలా పళ్లు కొరుకుతూ ఉండేవారిలో పళ్లు త్వరగా అరిగిపోతాయి. ఇక మరీ గట్టి పదార్థాలను అదేపనిగా నమలడం కూడా పంటి అరుగుదలను వేగవంతం చేస్తుంది.

    పరిష్కారం: నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉన్నవారు కారణాన్ని తెలుసుకుని, ఆ అలవాటును మానుకోవాలి. బ్రక్సిజం ఉంటే చికిత్స తీసుకోవడం, ఒత్తిడి ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అనుసరించాలి.

    ఎంత తక్కువ అయినా ముప్పే... 
    గుండెపోటు నివారణకు తోడ్పడుతుందంటూ కొందరు రెడ్‌వైన్‌ తాగుతుంటారు. మిగతా ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌తో ΄ోలిస్తే రెడ్‌వైన్‌ ఆరోగ్యకరమనే అపోహ చాలామందిలో ఉంటుంది. నిజానికి రెడ్‌వైన్‌లో క్రోమోజెన్‌ ట్యానిన్స్‌ అనే రంగునిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దాంతో పళ్లు మెరుపును కోల్పోతాయి. అంతేకాదు... ఎంత తక్కువ మోతాదులోనైనా ఆల్కహాల్‌ ఒంటికి ముప్పు తెచ్చే అంశమే!

    పరిష్కారం: అది ఎంతటి ఖరీదైన లేదా నాణ్యమైన రెడ్‌వైన్‌ అయినప్పటికీ అది మద్యమే తప్ప ఆరోగ్యప్రదాయిని కానే కాదు. అదీ ఒకరకమైన మద్యమే కాబట్టి ఆ అలవాటును మానుకోవడమే మేలు.

    గోళ్లు కొరికే అలవాటు... పళ్లకు చేటు... 
    కొందరు అదేపనిగా గోళ్లు కొరుక్కుంటుంటారు. ఈ చెడ్డ అలవాటుతో పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల ద్వారా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ నోటి ద్వారా కడుపులోకి వెళ్లి ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

    పరిష్కారం: గోళ్లు కట్‌ చేసుకోవాలనుకుంటే నెయిల్‌ కట్టర్‌నే వాడాలి. టెన్షన్‌ వల్ల ఈ అలవాటు వస్తే... ధ్యానం, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ వంటి వాటితో ఆ దురలవాటుకు దూరం కావాలి.  

    పళ్లు కుట్టుకోవడం ఓ బ్యాడ్‌ హ్యాబిట్‌... 
    చాలామంది ఏదైనా తినగానే టూత్‌పిక్స్‌తో పళ్లు కుట్టుకుంటారు. ఈ అలవాటు వల్ల పళ్ల మధ్య సందులు మరింత పెరిగే ముప్పు ఉంటుంది. ఫలితంగా పళ్ల మధ్య మరింత ఆహారం చిక్కుకుని, బ్యాక్టీరియా పెరగడం, దాంతో పళ్లు మరింత వదులు కావడం వంటి ముప్పు ఉంటుంది.

    పరిష్కారం: పళ్లు కుట్టుకునే అలవాటు మానేయాలి. వీలైతే ఫ్లాసింగ్‌ చేసుకోవాలి.

    చివరగా... ఇక్కడ పేర్కొన్న చెడు అలవాట్లను వదులుకుంటే అవి చాలావరకు నోటికీ, పలువరసకు, పంటి చిగుర్లకు మాత్రమే కాదు... మొత్తం దేహానికే మంచి చేస్తాయని, ఓవరాల్‌  ఆరోగ్యానికీ మంచిదని గుర్తుంచుకోవవడం మేలు.

    ‘టీత్‌’కు ముప్పు తెచ్చిపెట్టే టీలు... కాఫీలు
    కొందరు కాఫీలు, టీలు చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఇక తమ పనిలో ఒత్తిడిని అధిగమించడానికి టీ, కాఫీలను అలవాటు చేసుకుంటుంటారు. కొంతలో కొంత టీ వల్ల అంతగా ముప్పు ఉండదేమోగానీ... కాఫీలో ఉండే అసిడిక్‌ గుణం వల్ల పలువరస పచ్చగా మారే ముప్పు ఉంటుంది. 

    టీ కూడా మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే అదీ తెల్లటి పలువరస రంగుమారేలా చేస్తుంటుంది. అంతేకాదు... బాగా వేడివేడిగా ఉండే టీ, కాఫీలలోని ఉష్ణోగ్రత వల్ల పంటి ఎనామిల్‌ దెబ్బతీనే అవకాశమూ ఉంటుంది. అందుకే చాలాకాలం పాటు టీ, కాఫీలు  మితిమీరి తాగుతుండే కొందరిలో పంటి మెరుపు తగ్గే ముప్పు కూడా ఉంటుంది.  ఇక కాఫీ, టీలలో ఉండే చక్కెర పంటికి అంటుకుపోవడం వల్ల పళ్లమధ్య క్యావీటీలూ, పిప్పిపళ్లు వచ్చే ముప్పు కూడా ఎక్కువే. 

    పరిష్కారం: కాఫీ, టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇప్పటికే ఈ అలవాట్ల కారణంగా పళ్లు పచ్చబారి ఉంటే బ్లీచింగ్‌ చేయించుకోవడం ద్వారా వాటిని మళ్లీ మెరిసేలా చేసుకోవచ్చు.

    పాన్‌లూ, జర్దా / ఖైనీలు వద్దు... 
    చాలామంది అదేపనిగా పాన్‌ తింటూ ఉంటారు. అందులో వక్కలను నములుతూ ఉంటారు. ఇక అందులో జర్దా, ఖైనీ వంటి పొగాకు ఉత్పాదనలు నోటి ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఇందులో పాన్‌లోని కఠినమైన వక్కలను తినడం ఒక ప్రమాదమైతే... ఇక నోటి ద్వారా పొగాకును తీసుకోవడం పంటికీ, ఒంటికీ... ఈ రెంటికీ చాలా ప్రమాదం. ఇక పాన్‌ తినేవారి నోట్లో పళ్లు ఎర్రగా, చాలాకాలం నుంచి అదే అలవాటు ఉన్నవారిలో నల్లబారి ఉండటం చూస్తుంటాం.  

    పరిష్కారం: పాన్‌ తినే అలవాటు ఉన్నవారు తక్షణం ఆ అలవాటు మానివేయడం తప్పనిసరి. లేదంటే పళ్లకే కాదు మొత్తం దేహానికే ఈ అలవాటు  చేటు తెచ్చిపెట్టవచ్చు. పాన్‌పరాగ్‌లూ, జర్దా వంటి పొగాకు ఉత్పాదనల వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలా ఎక్కువ.

    సిగరెట్లతో వచ్చే ముప్పు ఎన్నో రెట్లు... 
    సిగరెట్‌ అలవాటు అనేది కేవలం పళ్లను మాత్రమే దెబ్బతీయదు. అది పూర్తిగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్నీ, గుండెనూ... ఒక్కోసారి పూర్తిగా శరీర ఆరోగ్యానికి ముప్పుగ పరిణమించవచ్చు. సిగరెట్‌ అలవాటు ఉన్నప్పుడు అది కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు... నోటి దుర్వాసనతో నలుగురిలో స్వేచ్ఛగా మాట్లాడగిగే సోషలైజింగ్‌కూ పరిమితులు విధిస్తుంది. పొగాకు వల్ల పంటి చిగుర్లకూ ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు... నోటి క్యాన్సర్లూ, పెదవుల, నాలుక, గొంతు క్యాన్సర్‌ల (హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్ల) ముప్పును తెచ్చిపెడుతుంది. 

    పరిష్కారం: సిగరెట్లతో / పొగతాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు తప్పాలంటే తప్పక పొగతాగే అలవాటును వదిలివేయాల్సిందే. అప్పటికీ ఆ అలవాటును వదలలేకపోతే డాక్టర్‌ సలహా మేరకు కొంతకాలం పాటు చ్యూయింగ్‌ గమ్స్‌ వంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇలాంటి ప్రత్యామ్నాయాలు కూడా కొద్దికాలం కోసమే.

    పెన్సిల్‌ను కొరకవద్దు...  
    కొందరు ఏదైనా రాస్తూ రాస్తూ ఉండి మధ్యమధ్యన ఏదో ఆలోచిస్తూ పెన్సిల్‌ను గానీ లేదా పెన్‌ క్యాప్‌ను గానీ పళ్ల మధ్య పెట్టుకొని కొరుకుతుంటారు. పెన్సిల్‌ మధ్యన ఉండే లెడ్‌ చాలా ప్రమాదకారి. ఈ లెడ్‌పాయిజన్‌ చిగుర్ల రంగును నల్లగా మారుస్తుంది. పైగా లెడ్‌ పాయిజన్‌ మేనికి కూడా ప్రమాదకరమే. 

    పరిష్కారం: రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పళ్లమధ్యకు పెన్నూ, పెన్సిల్‌ పెట్టుకోవద్దు. మరీ తప్పనప్పుడు చ్యూయింగ్‌గమ్‌ వంటివి నములుతూ ఉండటం కాస్తంత బెటర్‌. అసలు నమిలే అలవాటును మానుకోవడమే ఆరోగ్యానికి మేలు.

    పళ్లకు చుట్టుకుపోయే చాక్లెట్లు... 
    తియ్యటి చాక్లెట్లు అంటే పిల్లలందరికీ ఇష్టమే. పైగా కొందరు పెద్దవాళ్లు కూడా  తమకు మంచి ఆరోగ్య సమకూరడానికి డార్క్‌ చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాక్లెట్లలో చాలావరకు పళ్లకు చుట్టుకుపోతూ ఉంటాయి. అలా చుట్టుకుపోవడంతో అందులోని చక్కెరను చాలాసేపు పంటిని అంటిపెట్టుకునే ఉంటూ... దంతక్షయానికి దారి తీస్తుంది. అంతేకాదు.. అలా చాలాకాలం పాటు చాక్లెట్లు చుట్టుకుపోవడం, పళ్లపైన ఉండే గుంటవంటి ప్రదేశంలో ఇరుక్కుపోవడం వల్ల పళ్లమధ్య రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. 

    ఈ రంధ్రం లోతు పెరుగుతున్న కొద్దీ... అందులో ఆహారపదార్థాలూ, చాక్లెట్ల వంటి చుట్టుకు΄ోయే పదార్థాలు మరింత ఎక్కువగా ఇరుక్కుపోతూ ఆ రంధ్రాలను మరింత లోతు ఎక్కువయ్యే ముప్పు ఉంటుంది. ఇలాంటి చర్యల వల్లనే పిల్లల్లో పిప్పిపళ్లు వస్తుంటాయి. 
    పరిష్కారం: పంటిని చుట్టుకు΄ోయే చాక్లెట్లు, క్యాండీలు తీసుకున్న వెంటనే బ్రష్‌ చేసుకోవడం లేదా ఆ చుట్టుకుపోయిన పదార్థాలు పూర్తిగా తొలగిపోయేలా వేలిని ఉపయోగించి నోరు కడుక్కోవాలి.

    పాల బాటిల్‌ పళ్ల మధ్య పెట్టడం సరికాదు... 
    కొందరు పిల్లలు రాత్రంతా పాలసీసా పళ్ల మధ్య పెట్టుకుని నిద్రపోతుంటారు. పిల్లలు అల్లరి చేయకుండా ఉండటానికి చాలామంది తల్లులు ఈ అలవాటును ప్రోత్సహిస్తుంటారు. నిజానికి ఈ దురలవాటు వల్ల పిల్లలకు ‘మిల్క్‌బాటిల్‌ కేరిస్‌’ అనే సమస్య వచ్చే అవకాశముంది. దాంతో చిన్నారుల్లో పిప్పిపళ్లు వచ్చి పళ్లన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. పైగా పాలలో ఉండే చక్కెరవల్ల కూడా పళ్లు పుచ్చిపోతాయి.

    పరిష్కారం: రాత్రివేళల్లో పిల్లల నోటికి పాలసీసా ఇవ్వడం సరికాదు. మరీ తప్పనిసరై చిన్నారులకు పాలను పట్టించాల్సి వస్తే గ్లాసు / స్పూన్‌ / ఉగ్గుగిన్నెతో పాలు పట్టించాలి. పిల్లలు పాలు తాగాక పెద్దపిల్లలకు బ్రషింగ్‌ చేయించడమూ లేదా బ్రషింగ్‌కు వీలుకాకపోతే కనీసం ఒక గ్లాసు నీళ్లయినా తాగించడం అవసరం.

    డాక్టర్‌ ప్రత్యూష, కన్సల్టెంట్, డెంటల్‌ – కాస్మెటిక్‌ సర్జన్‌ 

    (చదవండి: మగవారిపై కేన్సర్‌ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..)

  • దేశవ్యాప్తంగా కేన్సర్‌ బాధితుల సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. అలాంటి ముప్పును ఎదుర్కుంటున్న వాటిలో అభివృధ్ధి పధంతో ఉన్న నగరాలే ముందుండడం ఆందోళన కరం. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఉన్న  హైదరాబాద్‌ నగరం త్వరలోనే కేన్సర్‌ కేంద్రంగా మారనుందని ఓ ప్రతిష్టాత్మక ఆసుపత్రి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...

    ప్రమాద ఘంటికలు...ఆ గణాంకాలు...
    హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో కేన్సర్‌ కేసులు గణనీయంగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లోని పురుషులలో కనిపించే అన్ని రకాల కేన్సర్లలో ఒక్క ప్రోస్టేట్‌ రూన్సర్‌ వాటాయే దాదాపు 6.9 శాతంగా ఉంది.  తెలంగాణలో నమోదవుతున్న ​కేన్సర్‌ కేసుల్ని పరిశీలించి చూస్తే, ఈ 2026లో కేవలం పురుషులలోనే 21,252 కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతాయని మొత్తం  రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాబోయే కేన్సర్‌ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

    హైదరాబాద్‌లో 0 నుంచి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో కేన్సర్‌ వచ్చే ముప్పు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా. ఇది ముందుగా కేన్సర్‌ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.

    నిర్ధారణ లేకపోతే నివారణ ఎలా?
    ఇంత తీవ్రంగా వ్యాధి విస్త్రుతి ఉన్నప్పటికీ, కేన్సర్‌  స్క్రీనింగ్‌ రేట్‌ మాత్రం  4 శాతం కంటే దిగువనే ఉండడం ఆందోళనకరం. పెరుగుతున్న కేన్సర్‌ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. 

    ఆ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. చాలా మంది రోగులు కేన్సర్‌ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

    పొగతాగడం, ప్రాసెస్‌ తినడం...
    ఈ కేన్సర్‌ కేసులు  సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం బాగా తగ్గడం వంటివి ఈ న్సర్‌ విజృంభణకు ముఖ్య కారణాలు. 

    అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం,  మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్‌ అసౌకర్యం వంటి ప్రోస్టేట్‌ కేన్సర్‌ ప్రారంభ లక్షణాలను అవగాహన లోపంతో అలక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  వీటిని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ అపోహ వైద్య సహాయం అందుకోవడంలో ఆలస్యానికి  దారితీస్తుంది,

    ప్రారంభంలో గుర్తిస్తే మేలు...
    ‘ప్రోస్టేట్‌ క్యాన్సర్‌  ప్రారంభ దశలో తీవ్రంగా ఉండదు,  అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది,‘ అని జూబ్లీ హిల్స్‌లోని అపోలో హెల్త్‌ సిటీ లో మెడికల్‌ ఆంకాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ నిఖిల్‌ సురేష్‌ గడ్యాల్‌ పాటిల్‌ అంటున్నారు. అయితే చాలా మంది మగవారు  వ్యాధి  లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారనీ, రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం లేదని అన్నారాయన.  

    సమస్య తీవ్రమైన తర్వాత హాస్పిటల్‌ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. అందువల్లే ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం లేదన్నారు. ‘‘ 50 ఏళ్ల వయసు దాటిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అనే చిన్న ఆలోచన చేస్తే చాలు..అది ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలదు...‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఆవిష్కరణలు కాదు..అవగాహనే ముందు
    శస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్‌ థెరపీ ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం కేన్సర్‌ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో హైదరాబాద్‌ నగర  ప్రస్తుత పరిస్థితి ఒక సవాలుగా నిలుస్తోంది.  

    ఈ పరిస్థితిని వ్యాధి విస్త్రుతిని నివారించడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై కన్నా, ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే వైద్య సంప్రదింపులను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

    (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు)

  • సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.

    ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్‌ చేసే ఆనంద్‌ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్‌ అనే పారా ఆర్చరీ కథను సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేశారు. 

    ఆ పోస్ట్‌లో ఆనంద్‌ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. 

    అయితే పాయల్‌ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్‌ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్‌ వేద్వాన్‌ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. 

    అలా అలుపెరగని పట్టుదలతో పాయల్‌ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్‌ 2026లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ పారా ఆర్చరీ సిరీస్‌. ఆ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్‌ దేవిని ఎదుర్కొని,  ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్‌ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. 

     

    అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా ఘనత అందుకుంది పాయల్‌. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్‌ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. 

    ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్‌ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్‌  మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్‌, శీతల్‌ సక్సెస్‌ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.

     

    (చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!)

     

Guest Columns

  • దళిత క్రైస్తవులకు షెడ్యూల్డు క్యాస్ట్‌ (ఎస్సీ) హోదాను నిరాకరిస్తూ భారత దేశ అత్యు న్నత న్యాయస్థానం ఇటీవల వెలువరించిన తీర్పు దురదృష్టకరం. విజయవాడలో ఇటీవల వామపక్ష, కాంగ్రెస్, వైసీపీ తదితర రాజకీయ పక్షాలు; దళిత, క్రైస్తవ, ముస్లిం సంఘాలు; యువజన, విద్యార్థి, మహిళా సంస్థలను ఆహ్వానించి సీపీఐ ఈ తీర్పుపై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.

    సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన క్షణం నుంచే అతని ఎస్సీ రిజర్వేషన్‌ హక్కు రద్దవుతుంది. ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు బీసీ(సీ) వర్గంలోకి వెళ్లి, వారి సామాజిక స్థితి మరింత దిగజారే ప్రమాదముంది.  రాష్ట్రపతి జారీ చేసిన 1950 రాజ్యాంగ ఆదేశంలోని క్లాజ్‌ 3 ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే షెడ్యూల్డ్‌ కులాల హోదాను పరిమితం చేయడం; ఇతర మతాలలోకి మారిన దళితులకు ఆ హోదాను నిరాకరించడం, రాజ్యాంగంలోని సమానత్వ హక్కులకు విరుద్ధమైనది.

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్సీ – మాదిగ కులానికి చెందిన చింతాడ ఆనంద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (Chinthada Anand vs State Of Andhra Pradesh) కేసులో సుప్రీంకోర్టు (24.3.2026న) పేర్కొన్నట్లుగా – హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను షెడ్యూల్డ్‌ కుల సభ్యులుగా పరిగణించకూడదని చెప్పడం, రాజ్యాంగంలోని సెక్యు లర్‌ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. క్లాజ్‌ 3ని ‘కచ్చితమైనది, తిరుగు లేనిది’గా భావించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు, పురోగతికి తలుపులు మూసివేయడమే! ఈ పరిస్థితుల్లో, 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయడం అత్యవసరం.

    లౌకికవాద సూత్రానికి దెబ్బ
    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛను హామీ ఇస్తూ, దానిని ప్రాథమిక హక్కుల పరిధిలో చేర్చింది. వ్యక్తి తన ఇష్టానుసారం ఏ మతాన్నయినా ఆచరించే హక్కు కలిగి ఉండటం, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం. సదుపాయాలు, రిజర్వేషన్లు, చట్టబద్ధ హక్కులు పొందా లంటే హిందూ మతంలోనే కొనసాగాలని పరోక్షంగా నిర్బంధించడం, ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష దాడి చేయడమే! ఇది మత స్వేచ్ఛను నిర్వీర్యం చేయడమే కాకుండా, రాజ్యాంగం ప్రతిష్ఠించిన లౌకికవాద సూత్రాన్ని దెబ్బతీస్తుంది.

    ఇక ఆర్టికల్‌ 341ను పరిశీలిస్తే... దాని నిర్మాణం స్పష్టంగా రెండు క్లాజులుగా ఉంది. మొదటి క్లాజు ప్రకారం – ఆయా రాష్ట్రాల్లో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో షెడ్యూల్డ్‌ కులాలను రాష్ట్రపతి, సంబంధిత రాష్ట్ర గవర్నరుతో సంప్రదించిన తరువాత బహిరంగ ప్రకటన ద్వారా నిర్దేశించవచ్చు. రెండవ క్లాజు ప్రకారం, షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడానికి పార్లమెంట్‌కు మాత్రమే చట్టబద్ధమైన అధికారం ఉంది. రాష్ట్రపతి జారీ చేసిన నోటిఫికేషన్‌ను మరో నోటిఫికేషన్‌ ద్వారా మార్చే అధికారం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ విధంగా చూస్తే... షెడ్యూల్డ్‌ కులాల గుర్తింపులో మతాన్ని ప్రమాణంగా నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చినట్లు రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్‌ను ప్రాతిపదికగా తీసుకుంది. ఆర్టికల్‌ 341లో నిజంగా అలాంటి అధికా రాలు ఉన్నాయో, లేదో సుప్రీంకోర్టు  సమగ్రంగా పరిశీలించలేదు.

    చ‌ద‌వండి: ఇప్పసారా.. రెండు అంచుల క‌త్తి!

    అంతిమంగా ఈ ఆర్డర్‌ సామాజిక న్యాయం కోసం కాకుండా, వర్గ ఆధిపత్యాన్ని కొనసాగించడానికీ, మత ఆధారిత నియంత్రణను బలపరచడానికీ ఉపయోగపడుతున్న సాధనంగా మారింది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం (ఫుల్‌ బెంచ్‌) ముందు ఈ అంశాన్ని పునర్వి చారణకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. 1950 రాష్ట్రపతి ఆర్డర్‌లోని పేరా 3ను సవరించడం అత్యవసరంగా భావించాలి. దళిత క్రైస్తవులకు, ముస్లింలకు కూడా షెడ్యూల్డ్‌ కుల (ఎస్సీ) హోదా కల్పించేలా పార్లమెంట్‌ చట్ట సవరణ చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ అంశంపై స్పష్టమైన తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా తమ బాధ్యతను నిర్వర్తించాలి.  

    గుజ్జుల ఈశ్వరయ్య
    సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి  

Telangana

  • తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్లపై కేరళ సీఎం పినరయి విజయన్‌ ఎక్స్‌లో ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో రేవంత్‌ రెడ్డి మళ్లీ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశారు. ఎక్స్‌లో విజయన్‌ స్పందనను చదివానని.. అందులో తప్పుదారి పట్టించే అంశాలతో పాటు ముఖ్యాంశాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారు.

    రేవంత్‌ రెడ్డి రాసిన లేఖపై ఇవాళ (ఏప్రిల్‌ 7న) ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. "పినరయి విజయన్‌ ఎప్పుడు సిద్ధంగా ఉన్నా ఆయనతో చర్చకు నేను సిద్ధమే. ఆయనకు రోల్‌ మోడల్స్‌ ఎవరు? నరేంద్ర మోదీ, అమిత్ షా లేదా జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ? నరేంద్ర మోదీని పినరయి విజయన్ రోల్‌ మోడల్‌గా తీసుకున్నారు. ఇది కేరళం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. అతను ఇంకో నరేంద్ర మోదీలా పినరయి విజయ్‌ ప్రచారం చేస్తున్నారు" అని అన్నారు.

    కాగా, తాను అన్ని అంశాలపై చర్చించేందుకు మంగళవారం (ఏప్రిల్‌ 7న) త్రివేండ్రం వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని లేఖలో విజయన్‌ను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. పినరయి విజయ్‌ను రేవంత్‌ రెడ్డి మోదీతో పోల్చుతుండడం గమనార్హం.