Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

Sports

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ అందింది. లీగ్‌ ప్రారంభ తేదీ మారినట్లు ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌ పేర్కొంది. ముందుగా ప్రకటించినట్లు ఐపీఎల్‌ 2026 మార్చి 15న కాకుండా మార్చి 26న ప్రారంభం కానున్నట్లు తెలిపింది. మే 31తో ముగియనున్నట్లు పేర్కొంది. 

    ఇవాళ (డిసెంబర్‌ 15) అబుదాబీలో జరిగిన ఫ్రాంఛైజీల మీటింగ్‌లో ఈ విషయం ఖరారైనట్లు వెల్లడించింది. సీజన్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ విషయంలో ఇంకా స్పష్టత లేనట్లు ప్రకటించింది.

    సాధారణంగా సీజన్‌ ఓపెనర్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ (ఆర్సీబీ) హోం గ్రౌండ్‌లో జరుగుతుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంపై సందిగ్దత నెలకొనడంతో ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. పై విషయాలను ఐపీఎల్‌ సీఈవో హేమంగ్‌ అమిన్‌ తమతో షేర్‌ చేసుకున్నట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది.

    కాగా, రేపు అబుదాబీ వేదికగా ఐపీఎల్‌ 2026 మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలకు సంబంధించి 77 స్లాట్లు భర్తీ కానున్నాయి. ఇందులో 31 విదేశీ స్లాట్లు కాగా.. మిగతావన్నీ దేశీయ ఆటగాళ్లతో భర్తీ చేయబడతాయి. 

    10 ఫ్రాంచైజీల వద్ద రూ. 237.55 కోట్ల నిధులు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.30 కోట్లు, రెండో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 43.40 కోట్లు ఉన్నాయి. ఈ వేలంలో తాజా అడిషన్స్‌తో పాటు (అభిమన్యు ఈశ్వరన్‌) మొత్తం 369 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

  • బిగ్‌బాష్‌ లీగ్‌ 2025లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ ఘనంగా బోణీ కొట్టింది. బ్రిస్బేన్‌ హీట్‌తో ఇవాళ (డిసెంబర్‌ 15) జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసి.. ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 102; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

    రెనెగేడ్స్‌ ఇన్నింగ్స్‌లో ఓలివర్‌ పీక్‌ (29 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. మిగతా ఆటగాళ్లలో జోష్‌ బ్రౌన్‌ 15, మహ్మద్‌ రిజ్వాన్‌ 4, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 14, హస్సన్‌ ఖాన్‌ 5 (నాటౌట్‌), కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ 3 (నాటౌట్‌) పరుగులు చేశారు. బ్రిస్బేన్‌ బౌలర్లలో జాక్‌ విల్డర్‌ముత్‌ 3 వికెట్లు తీయగా.. ప్యాట్రిక్‌ డాక్లీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్‌  గెలుపు కోసం విఫలయత్నం చేసింది. ఓపెనర్‌ కొలిన్‌ మున్రో (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హగ్‌ వెబ్‌జెన్‌ (20 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తొమ్మిదో నంబర్‌ ఆటగాడు జిమ్మీ పియర్సన్‌ (22 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. 

    ఈ ముగ్గురు చెలరేగినా బ్రిస్బేన్‌ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. మిగతా బ్రిస్బేన్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ మెక్‌స్వీని 9, మ్యాట్‌ రెన్షా 18, మ్యాక్స్‌ బ్రయాంట్‌ 14, బార్ట్‌లెట్‌ 1, లియామ్‌ హాస్కెట్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. జాక్‌ విల్డర్‌ముత్‌, షాహీన్‌ అఫ్రిది డకౌటయ్యారు. విల్‌ సదర్‌ల్యాండ్‌ 3, గురిందర్‌ సంధు, బెహ్రెన్‌డార్ఫ్‌ తలో 2 వికెట్లు తీసి బ్రిస్బేన్‌ను దెబ్బకొట్టారు.

     

  • ఆటను మించి.. అందరి మీదా ప్రభావం చూపిన అరుదైన అథ్లెట్లలో లియోనల్‌ మెస్సీ ఒకడు. చిన్నతనంలో ఎదుర్కొన్న శారీరక సమస్యలను అధిగమించి.. మేటిస్థాయి ఫుట్‌బాలర్‌గా అతడి ప్రయాణం అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసులు చూరగొన్న అత్యంత అద్భుతమైన ఆటగాడు అతడు.

    ఓ అథ్లెట్‌ జీవితం ఎలా ఉంటుందో నాకూ తెలుసు. అందుకే అతడి పట్ల గౌరవ మర్యాదలు, ప్రేమ, ఆరాధానభావం కలిగిన వాళ్లను ఏరకంగానూ తప్పుబట్టను. ఇటీవలే మెస్సీ భారత పర్యటనకు వచ్చాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నాకు బాధ కలిగించాయి. కాస్త అసౌకర్యానికి గురిచేశాయి.

    ఈ హంగామా అంతా ఎందుకు?.. నేనేమీ ఈ విషయంలో న్యాయనిర్ణేతగా ఉండదలచుకోలేదు. కానీ ఈ తంతుతో మనం ఏం సాధించాలనుకుంటున్నామన్న ప్రశ్న నా మదిని తొలచి వేస్తోంది. క్రీడల చుట్టూ ఉండే ఆర్థిక విషయాల గురించి నాకు అవగాహన ఉంది. వాణిజ్యపరంగా, బ్రాండ్‌ ప్రమోషన్ల కోసం ఇలా చేస్తారనే స్పృహ కూడా ఉంది.

    ఇక్కడ నేను ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టడం లేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అతడు దిగ్గజ స్థాయికి చేరాడు. అందుకు అతడి పట్ల ఆరాధనా భావం ఉండటం సహజమే. ఎదిగినా ఒదిగి ఉండటం కూడా గొప్ప విషయం.

    అయితే, అభిమానం పేరుతో చేసే పనులు కూడా ఒక్కోసారి జడ్జ్‌ చేయబడతాయి. సమాజంలో క్రీడా సంస్కృతిని విస్తరించే బదులు.. మనం వ్యక్తి పూజకు పరిమితం అవుతున్నాం. లెజెండ్ల ఫొటోల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తాము నిజాయితీగా సంపాదించుకున్న డబ్బును ఇష్టారీతిన ఖర్చు పెట్టుకునే హక్కు ప్రజలకు ఉంటుందనేది నిజం.

    కానీ ఎందుకో నా మనసు బాధతో మూలుగుతోంది. అతడి రాక, కార్యక్రమం విజయవంతం చేయడంలో పెట్టిన శ్రద్ధలో.. కాస్తైనా మన దేశంలోని క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో పెట్టగలరా? స్వేచ్ఛగా పరిగెడుతూ ఆడుకునేందుకు ఇరుకుల్లేని మైదానాలు  చిన్నారుల కోసం నిర్మించగలరా?

    యువతరానికి మార్గదర్శనం చేసే కోచ్‌లను నియమించగలరా? ఆటలు కూడా చదువులో భాగంగా ఉంటాయి.. రోజూవారీ జీవితంలో అవీ భాగమే అని ఉపాధ్యాయులచే చెప్పించగలరా? బాల్యం నుంచే క్రీడాకారులకు బలమైన పునాది వేయగలరా?.. ఇవన్నీ జరిగితే బాగుంటుంది.

    క్రీడల్లో గొప్పగా కనిపిస్తున్న దేశాలు ఒక్కరోజులోనే అదంతా సాధించలేదు. సాధారణ పిల్లాడు కలగన్న అసాధారణ కలలు నెరవేరడానికి వ్యవస్థలను సృష్టించి.. వాటిని సక్రమంగా నడిపిస్తున్నాయి. మెస్సీ వంటి ఐకాన్లు మనందరికీ ఆదర్శం. అయితే, ఇలాంటి కార్యక్రమాలతో పాటు.. క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేసేందు చొరవ, నిబద్ధత అవసరం.

    మెస్సీ వంటి దిగ్గజాలను గౌరవించాలంటే ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి ఉండదు. దేశంలో క్రీడాకారుడు కావాలనుకునే ప్రతి చిన్నారికి ప్రోత్సాహం ఇవ్వడమే క్రీడా సంస్కృతికి, దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇది దోహదపడుతుంది
    -భారత్‌కు విశ్వక్రీడల్లో మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణం అందించిన షూటర్‌ అభినవ్‌ బింద్రా మనుసులోని ఆవేదనకు ప్రతిరూపం ఇది. అతడొక్కడే కాదు.. దేశంలోని సగటు క్రీడాభిమాని మనసును తొలచి వేస్తున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ మాటలు.

    గోట్‌ టూర్‌లో భాగంగా
    అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ గోట్‌ టూర్‌లో భాగంగా శనివారం భారత్‌కు వచ్చాడు. ఈ ఈవెంట్‌ కోసం కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అభిమానులు సైతం వేలాది రూపాయలు పోసి కొన్న టికెట్లతో మైదానాలకు వచ్చారు. అతడితో ఫొటో దిగేందుకు రూ. 10 లక్షలు అని చెప్పినా చాలా మంది ముందడుగే వేశారు.

    మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదు
    మెస్సీ క్రేజ్‌కు ఇదొక నిదర్శనం. క్రికెట్‌ను మతంగా భావించే దేశంలోనూ ఈ స్థాయిలో అభిమానులు ఉండటం అతడిలోని క్రీడాకారుడు గర్వించదగ్గ విషయం. అభినవ్‌ బింద్రా చెప్పినట్లు ఈ విషయంలో ఏ రకంగానూ మెస్సీని తప్పుబట్టాల్సిన పనిలేదు.

    అయితే, మెస్సీ పట్ల ప్రేమను చూపిస్తున్న కొంత మందికి స్థానిక హీరో సునిల్‌ ఛెత్రి ఘనతల గురించి అసలు తెలిసి ఉండకపోవచ్చు. నయా జమానాలో భారత ఫుట్‌బాల్‌కు టార్చ్‌బేరర్‌లా ఉన్న భాయిచుంగ్‌ భుటియా గురించి కూడా అతి కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు.

    దేశం కోసం, దేశంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెంచేందుకు ఎంతగానో కష్టపడిన ఇలాంటి హీరోలకు ఈ స్థాయిలో సన్మానం జరిగిన దాఖలాలు లేవన్నది పలువురి వాదన. మెస్సీతో పోలిస్తే వారి క్రేజ్‌ తక్కువే కావచ్చు.. కానీ ఆట, అందుకోసం వారు పడ్డ శ్రమ అతడి హార్డ్‌వర్క్‌కు ఏమీ తీసిపోవు. 

    స్థానిక హీరోలు గుర్తున్నారా?
    మరి వారికి దక్కుతున్న ‘ప్రత్యేక గుర్తింపు’ ఏమిటి? క్రికెటర్లపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న చాలా మంది.. ఛెత్రి లాంటి ఫుట్‌బాలర్ల గురించి, వారి కృషి గురించి కాస్తైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా?

    ఐపీఎల్‌లో ఆడే విదేశీ కుర్ర క్రికెటర్ల గురించి కూడా మనకో అవగాహన ఉంటుంది. కానీ వీరి సేవలను, వీరు ఆడే మ్యాచ్‌లను కనీసం పట్టించుకుంటామా?.. అఫ్‌కోర్స్‌ ఇష్టమైన ఆటను ఆరాధించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మెస్సీ.. ఛెత్రి.. ఇద్దరూ ఫుట్‌బాలర్లే. అయితే, వారిపై చూపించే ప్రేమ, ఆదరణంలో తేడా ఉండటం విచారకరం.

     మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?
    సరే.. మెస్సీ టూర్‌తో భారత క్రీడా వ్యవస్థకు ఏమైనా లాభం చేకూరుతుందా? లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఇదొక కమర్షియల్‌ టూర్‌ తప్ప.. దీని వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని అభినవ్‌ బింద్రా వంటి మేటి అథ్లెట్లు కూడా చెబుతున్నారు. ఇంతకీ మెస్సీ రాకతో మనకు ఒరిగిందేమిటి?.. డబ్బున్న వాళ్లకు.. అతడిని నేరుగా చూసే వన్స్‌ ఇన్‌ ఏ లైఫ్‌టైమ్‌ ఛాన్స్‌, ఫొటోలు దిగడం తప్ప!..

    అదొక్కటే సంతృప్తి
    అన్నట్లు ఈ టూర్‌లో భాగంగా ముంబైలోని వాంఖడేలో మెస్సీ.. ఛెత్రిని ఆలింగనం చేసుకోవడం, అతడికి తన సంతకంతో కూడిన జెర్సీని ఇవ్వడం భారత సగటు ఫుట్‌బాల్‌ అభిమానికి సంతృప్తినిచ్చిన క్షణాల్లో ఒకటి. అదే విధంగా.. ప్రాజెక్ట్‌ మహాదేవ పేరిట రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ ప్రతిభను వెలికితీస్తామని ప్రకటించడం ఇక్కడి హైలైట్లలో ఒకటి. 
    చదవండి: ‘గోట్‌ టూర్‌’ చీఫ్‌ ఆర్గనైజర్‌ జైలుకు!

    చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?

  • సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలిచి జోరు మీదున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఒకరు.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఇంతకీ ఎవరా ఆటగాడు?

    స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. వన్డే సిరీస్‌ (IND vs SA)ను 2-1తో గెలిచింది. ఇదే జోరులో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.

    గెలుపుబాట పట్టిన సూర్య సేన..
    ఈ క్రమంలో ధర్మశాలలో ఆదివారం నాటి మూడో టీ20లో సత్తా చాటి తిరిగి గెలుపుబాట పట్టిన సూర్య సేన.. 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ తుదిజట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు విశ్రాంతినిచ్చారు.

    అక్షర్‌ పటేల్‌ అవుట్‌!
    అయితే, తాజా సమాచారం ప్రకారం అక్షర్‌ పటేల్‌ (Axar Patel) అనారోగ్యం బారిన పడ్డాడని.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పటికే బుమ్రా రూపంలో కీలక బౌలర్‌ దూరం కాగా.. అక్షర్‌ కూడా అందుబాటులో లేకుంటే తుదిజట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొనవచ్చు.

    కాగా కటక్‌లో 23, ముల్లన్‌పూర్‌లో 21 పరుగులు చేసిన అక్షర్‌ పటేల్‌.. ఆయా మ్యాచ్‌లలో రెండు (2/7), ఒక వికెట్‌ (1/27) పడగొట్టాడు. మరోవైపు.. అక్షర్‌ స్థానంలో మూడో టీ20లో ఆడిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లతో మెరిశాడు. ఇదిలా ఉంటే.. భారత్‌- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 లక్నోలో బుధవారం జరుగనుండగా.. శుక్రవారి నాటి ఆఖరి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక.

    సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన ప్రాథమిక జట్టు
    అభిషేక్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా.

  • క్రికెట్‌ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలంపైనే కేంద్రీకృతమై ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) వేలంపాట నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, అంతకంటే ముందు టీమిండియా మాజీ స్టార్లతో బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ మాక్‌ వేలాన్ని నిర్వహించింది.

    ఆ మాక్‌ ఆక్షన్‌లో ముప్పై మంది ప్లేయర్లను వేలం వేయనున్నారు. ఇందులో భాగంగా పది ఫ్రాంఛైజీల తరఫున పది మంది భారత మాజీ క్రికెటర్లు మాక్‌ వేలంలో పాల్గొన్నారు. వీరిలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్‌ ఊతప్ప తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.  

    క్లారిటీ ఇచ్చిన గ్రీన్‌
    వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green)పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా పేరు నమోదు చేసుకోవడం గందరగోళానికి గురిచేసింది. ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌ సేవలు అందిస్తాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

    ఈ విషయంపై గ్రీన్‌ ఇటీవల స్వయంగా స్పందించాడు. తాను బౌలింగ్‌ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని.. తన మేనేజర్‌ తప్పిదం వల్లే అనుకోకుండా ప్యూర్‌ బ్యాటర్‌ బ్యాక్స్‌ టిక్‌ చేసినట్లు ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో మాక్‌ వేలంలో గ్రీన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున సురేశ్‌ రైనా, కోల్‌కతా తరఫున రాబిన్‌ ఊతప్ప పోటీపడ్డారు.

    రూ. 30.50 కోట్ల భారీ ధరతో
    ఈ క్రమంలో గ్రీన్‌ ధర ఏకంగా రూ. 27 కోట్లు దాటింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లు రైనా, ఊతప్ప పట్టువీడలేదు. ఏకంగా రూ. 30.50 కోట్ల భారీ ధరతో గ్రీన్‌ను కొనుగోలు చేశాడు ఊతప్ప. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ను రూ. 27 కోట్ల అసలైన ధరకు కొనుక్కుంది.

    ఇక ఈ మాక్‌ వేలంలో ఊతప్ప గ్రీన్‌కు ఈ మేర.. పర్సులో దాదాపు సగం మొత్తం గ్రీన్‌ కోసం కేటాయించడం విశేషంగా నిలిచింది. ఇక గ్రీన్‌తో పాటు జానీ బెయిర్‌ స్టో (రూ. 2.5 కోట్లు)ను కూడా కొనుగోలు చేసిన ఊతప్ప.. శ్రీలంక యువ పేసర్‌, చెన్నై మాజీ బౌలర్‌ మతీశ పతిరణ కోసం ఏకంగా రూ. 13 కోట్లు వెచ్చించాడు.

    అత్యధికంగా రూ. 64.3 కోట్లు
    కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు కేకేఆర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు), ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు)ల రూపంలో ఖరీదైన ఆటగాళ్లను వదిలేసింది. ఈ క్రమంలో కేకేఆర్‌ పర్సులో అత్యధికంగా రూ. 64.3 కోట్లు చేరింది. 

    అయితే, మాక్‌ వేలంలో ఒక్క గ్రీన్‌ కోసమే ఊతప్ప రూ. 30 కోట్లు వెచ్చించడం విశేషం. రసెల్‌ రిటైర్మెంట్‌తో ఏర్పడిన ఆల్‌రౌండర్‌ స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆప్షన్‌ అని భావించే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా కేకేఆర్‌లో మొత్తంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 

    చదవండి: Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు

  • టీ20 ప్రపంచకప్‌-2024 టైటిల్‌ గెలిచిన తర్వాత టీమిండియాలో చోటు చేసుకున్న ప్రధాన మార్పు.. దిగ్గజాలు రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లిలేని జట్టు. ఈ మెగా టోర్నీలో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

    హార్దిక్‌ పాండ్యాకు బదులు
    ఇక అప్పటి నుంచి జట్టు పునర్నిర్మాణంలో భాగంగా భిన్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. హార్దిక్‌ పాండ్యాకు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌కు బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. అతడు సారథిగా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం అప్పటి నుంచి విఫలమవుతూనే ఉన్నాడు.

    మరోవైపు.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకమైన మూడో స్థానంలో ఎవరిని ఆడించాలన్న విషయం ఇప్పటికీ స్పష్టత రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీ20 ఫార్మాట్లో మరో వరల్డ్‌కప్‌ టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ.. టీమిండియాలో ఇంత వరకు ఈ కన్ఫ్యూజన్‌కు మాత్రం తెరపడటం లేదు.

    మూడో స్థానంలో
    ఒకప్పుడు మూడో స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చేవాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత కూడా సత్తా చాటి ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు పంత్‌. అయితే, ఆ తర్వాత పంత్‌తో పాటు చాలా మంది సీనియర్లకు టెస్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ టీ20 జట్టును యువ ఆటగాళ్లతో నింపేసింది యాజమాన్యం.

    అభిషేక్‌ శర్మకు తోడుగా.. సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా పంపగా.. వీరు సక్సెస్‌ఫుల్‌ జోడీగా నిరూపించుకున్నారు. ఇక మూడో స్థానంలో యువ ఆటగాడు తిలక్‌ వర్మ.. కెప్టెన్‌ సూర్యతో పోటీపడ్డాడు. వన్‌డౌన్‌లో తాను సరైన వాడినేనని నిరూపించుకున్నాడు కూడా!

    పక్కనపెట్టేశారు
    అయితే, గత కొంతకాలంగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలతో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. గిల్‌ కోసం ఓపెనర్‌గా సంజూను తప్పించి.. మిడిలార్డర్‌లో ఓసారి, వన్‌డౌన్‌లో ఓసారి ఆడించారు. ఇప్పుడిక ఏకంగా వికెట్‌ కీపర్‌ కోటాలోనూ ఆడించకుండా పక్కనపెట్టేశారు. మరోవైపు.. కీపర్‌గా, ఫినిషర్‌గా జితేశ్‌ శర్మ రాణిస్తుండటంతో సంజూ ప్రపంచకప్‌ ఆశలు దాదాపు ఆవిరిఅయ్యినట్టే!

    ముచ్చటైన ‘మూడు’ కోసం ఇ‍ప్పటికే ఏడుగురు
    ఇక మూడో స్థానం విషయానికొస్తే.. 2024 వరల్డ్‌కప్‌ తర్వాత ఇప్పటి వరకు సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, శివం దూబే, అక్షర్‌ పటేల్‌.. ఇలా చాలా మంది ఆడారు. వీరిలో సూర్య 26.92 సగటుతో 157కు పైగా స్ట్రైక్‌రేటుతో 377 పరుగులు సాధించగా.. తిలక్‌ వర్మ 185కు పైగా స్ట్రైక్‌రేటుతో.. 161కి పైగా సగటుతో ఏకంగా 323 పరుగులు సాధించాడు.

    మిగిలిన వారిలో రుతురాజ్‌, సంజూ, అభిషేక్‌, శివం, అక్షర్‌.. ప్రయోగాత్మకంగా వచ్చి వరుసగా 84, 58, 24, 24, 21 పరుగులు చేశారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌కు ముందు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. తమ జట్టులో కేవలం ఓపెనింగ్‌ జోడీ మాత్రమే స్థిరంగా ఉంటుందని స్పష్టం చేశాడు. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలో రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని.. ఉంటారనీ పేర్కొన్నాడు.

     వారధి
    నిజానికి టీ20 క్రికెట్‌లో నంబర్‌ 3 అనేది ఫిల్లర్‌ పొజిషన్‌ కానేకాదు. ఓపెనర్లు వేసిన పునాదిని బలపరుస్తూ.. మిడిలార్డర్‌కు సహకరించేలా వన్‌డౌన్‌ బ్యాటర్‌ వారధిని నిర్మించాల్సి ఉంటుంది. పరిస్థితిని బట్టి ఒక్కోసారి పవర్‌ప్లేలోనే రావాల్సి ఉంటుంది. మరికొన్నిసార్లు బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించాల్సి ఉంటుంది.

    మిగతా వారితో పోలిస్తే వన్‌డౌన్‌లో ఆడే ఆటగాడికి ఫిక్స్‌డ్‌ పొజిషన్‌ ఉండటం అత్యంత ముఖ్యం. అందుకు తగ్గట్టుగా అతడు నైపుణ్యాలు కనబరచగలడు. కానీ టీమిండియా నాయకత్వ బృందం దీనిని ఒక ట్రయల్‌ రూమ్‌గా మార్చేసి ఇష్టారీతిన ప్రయోగాలు చేస్తోంది. 

    సమస్యను ఫిక్స్‌ చేసుకోవాలి
    అయితే, ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మన జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ దానిని ఉపయోగించుకునే విధానంలో ‍స్పష్టత లోపించింది. ఏదేమైనా వరల్డ్‌కప్‌ నాటికి టీమిండియా నంబర్‌ 3 సమస్యను ఫిక్స్‌ చేసుకోవాలి. 

    అనుభవజ్ఞుడైన సూర్యను లేదంటే.. మూడో స్థానంలో ఇప్పటికే నిరూపించుకున్న తిలక్‌ వర్మను పంపాలి. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలు గెలవాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ ప్రణాళికలు, జట్టు కూర్పులో స్పష్టత అవసరం.

    చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్‌’ ప్లేయర్‌గా..

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటర్‌గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.

    కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ ఫెయిల్‌
    సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్‌ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్‌లో అతడు కనీసం హాఫ్‌ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. 

    ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్‌గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్‌ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్‌ను బలి చేసి గిల్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

    సూర్య, గిల్‌పై నమ్మకం ఉంది
    ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. 

    సూర్య, గిల్‌పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మ్యాచ్‌లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్‌లో జట్టును గెలిపిస్తారు.

    వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్‌మన్‌తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.

    త్వరలోనే మీరు కూడా చూస్తారు
    సూర్య, గిల్‌ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్‌ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్‌ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.

    వరుస వైఫల్యాలు
    కాగా అభిషేక్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వస్తున్న గిల్‌.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్‌లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్‌ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.

    ఇదిలా ఉంటే.. కటక్‌లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్‌పూర్‌లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో  2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్‌-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.

    చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్‌’ ప్లేయర్‌గా..

Movies

  • కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్‌ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.

    రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి  చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.

    కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన కామెంట్స్‌ ఆడియన్స్‌ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్‌వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి  నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

     

  • మెగా హీరో రామ్ చరణ్ సతీమణికి అవార్డ్ వరించింది. మోస్ట్ పవర్‌పుల్‌ వుమెన్ ఇన్ బిజినెస్‌ అనే అవార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఉపాసన. అయితే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల అవార్డ్‌ తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

    కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి పాటకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్‌ పరంగా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
     

     

  • కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న యాక్షన్‌ థ్రిల్లర్ 45. ఈ మూవీకి అర్జున్ జన్యా దర్శకత్వం వహించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే 45 మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 

    'అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ.. మరణించిన తేదీ రాసుంటుంది..ఆ మధ్య ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం' అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫైట్స్, విజువల్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్‌ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాజ్‌ బి శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి.

     

  • మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్‌ విషెస్ చెప్పారు. ఇవాళ తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు. ఇవీ చూసిన అభిమానులు లావణ్య త్రిపాఠికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బర్త్‌ డే విషెస్ తెలిపింది. 

    కాగా.. నాగబాబు కుమారుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాడు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడికి హనుమంతుడి  పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.  కాగా.. మట్కా మూవీ తర్వాత.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు.  
     

     

  • అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్‌'. ఈ మూవీకి షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ  నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్‌ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.  ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్‌ను పంచుకుంది.

    ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్‌లో హిందీ టీజర్‌ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా  మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్ రిలీజ్ కానుంది. 

  • ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ భాగం. కానీ ఇప్పుడు యువత.. అదంటేనే భయపడుతున్నారు. సరే సరైన జాబ్ లేదు, పోషించేందుకు డబ్బులు లేవు కదా వివాహానికి నో చెబుతున్నారని అనుకోవచ్చు. బోలెడంత ఫేమ్, కోట్లాది ఆస్తి ఉన్న స్టార్ హీరోహీరోయిన్లు కూడా కొందరు ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయారు. అలాంటి కొందరి గురించి ఈ స్టోరీ.

    ఇండియన్ స్టార్స్‌లో బ్యాచిలర్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్‌లో గత కొన్ని దశాబ్దాల నుంచి స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లతో రిలేషన్, డేటింగ్ రూమర్స్ వచ్చాయి గానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. బహుశా ఇతడికున్న అనారోగ్య సమస్యలు కావొచ్చు. లేదంటే తన స్నేహితుల వైవాహిక జీవితంలో సమస్యల ప్రభావం కావొచ్చు సల్మాన్.. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నాడు. ప్రస్తుతం ఇతడికి 59 ఏళ్లు. ఇకపై చేసుకునే అవకాశమే లేదు.

    (ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)

    ఈ లిస్టులో నెక్స్ట్ ఉండేది ప్రభాస్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరస సినిమాలు చేస్తున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు బతికున్నప్పుడే ప్రభాస్‌కి పెళ్లి చేసేస్తాం అని చాలాసార్లు చెప్పారు. కానీ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత అస్సలు ఖాళీ అన్నదే దొరకట్లేదు. గతంలో హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని రూమర్స్ వచ్చాయి గానీ తామిద్దరం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. అయితే ఇటు ప్రభాసే కాదు అటు అనుష్క కూడా పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ఇకపై కూడా వీళ్లిద్దరికీ(వేర్వేరుగా) జరుగుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో లేదు.

    రీసెంట్‌ బ్లాక్‌బస్టర్ హిట్ 'ధురంధర్'లో విలన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటుడు అక్షయ్ ఖన్నా కూడా బ్యాచిలరే. ప్రస్తుతం ఇతడి వయసు 50 ఏళ్లు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి చాలానే కారణాలున్నాయి. గతంలో కరిష్మా కపూర్‌తో ఇతడికి వివాహం సెట్ అయి, రద్దయిందని.. అప్పటినుంచి అక్షయ్ ఖన్నా ఒంటరిగానే ఉండిపోయాడనేది టాక్. అలానే మరో వ్యక్తి బాధ్యత తీసుకోవడం తనకు సూట్ కాని పనికాని కూడా అక్షయ్ చెప్పాడు. చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోవడం గ్యారంటీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ఈ లిస్టులో తర్వాతి నటి టబు. ఈమె వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. మరి పెళ్లి చేసుకుంటే నటిగా కెరీర్ ముగిసిపోతుందని భయపడిందో ఏమో గానీ అస్సలు ఆ వైపు చూడను కూడా చూడలేదు. ఇప్పటికీ సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

    మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇందుకు గల కారణాన్ని కూడా గతంలో చెప్పింది. జీవితంలో కలిసిన కొందరు పురుషులు.. చాలా నిరాశపరిచారని చెప్పింది. అలానే తను దత్తత తీసుకున్న పిల్లల (రెనీ, అలీసా) ప్రాధాన్యత.. సరైన వ్యక్తి కోసం ఎదురుచూడటం లాంటివి కూడా కారణమని చెప్పుకొచ్చారు. మూడుసార్లు పెళ్లి చేసుకోవడం వరకు వెళ్లినప్పటికీ దేవుడే తనని రక్షించాడనేది ఈమె నమ్మకం.

    తమిళ హీరో శింబు జీవితంలో చాలా ప్రేమకథలే ఉన్నాయి. నయనతార, నిధి అగర్వాల్ లాంటి పలువురు హీరోయిన్లతో ఇతడు డేటింగ్ చేశాడని రూమర్స్ వచ్చాయి. పెళ్లి కూడా జరుగుతుందని మాట్లాడుకున్నారు. తీరా చూస్తే 42 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉండిపోయాడు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో తెలియదు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి జీవితంలోనూ విషాదం ఉంది. హీరోయిన్ రష్మికతో చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. మరి ఏమైందో ఏమో గానీ ఇది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా పోయింది. 

    (ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)

  • టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ సినిమాకు యదునాథ్‌ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అనే టైటిల్ ఖరారు చేశారు. మొత్తానికి హీరో పేరుతోనే మూవీ టైటిల్‌ పెట్టడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. 
     

  • కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న మీనాక్షి

    నిషా కళ్లతో చూస్తూ మాయ చేస్తున్న అనసూయ

    జిమ్ వేర్‌లో రచ్చ లేపుతున్న నభా నటేశ్

    పింక్ కలర్ డ్రస్‌లో అందంగా దివ్యభారతి

    భర్తతో ప్రియాంక చోప్రా క్యూట్ జ్ఞాపకాలు

  • డైరెక్టర్ శ్యామ్‌ బెనగళ్‌ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడాయన. కమర్షియల్‌ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో సినిమాకి ఊపిరి పోసిన దర్శకుడు శ్యామ్‌ బెనగళ్‌. ఆయన పూర్తి పేరు బెనగళ్ శ్యామ్‌ సుందర రావు. మన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో డిసెంబరు 14, 1934న జన్మించారు. మన దేశ సినీ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 23న 90 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనెగల్‌ దర్శకత్వంపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

    శ్యామ్ బెనెగల్.. మొదట యాడ్‌ ఏటెన్సీలో కాపీ రైటర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా సినిమా వైపు మళ్లింది. కమర్షియల్‌ సినిమాలకు భిన్నంగా తన ఆలోచనలు ఉండేవి. జీవితాన్ని, సమాజంలోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనే ఆశయంతో శ్యామ్‌ బెనెగల్ సినీరంగంలో అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఫిలిమ్‌ సొసైటీ ప్రారంభించిన ఏకైక వ్యక్తి శ్యామ్‌ బెనగళ్‌. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్‌లు అతి కష్టం మీద తెప్పించుకుని.. సినిమా లవర్స్‌ కోసం హైదరాబాద్‌ ఫిలిమ్‌ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారాయన. శ్యామ్‌ బెనెగల్ అంకుర్‌ సినిమాతో తన ప్రస్థానం మొదలెట్టారు. ఆ తర్వాత మంథన్, నిశాంత్, గరమ్‌ హవా, భూమిక ది రోల్‌ లాంటి సూపర్ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం..

    శ్యామ్ బెనగళ్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ముజిబ్‌: ది మేకింగ్‌  ఆఫ్‌ ఏ నేషన్‌. బంగ్లాదేశ్‌ తొలి అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్‌ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్‌ ఉన్నారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో శ్యామ్ బెనెగల్‌లో కనిపించింది.   సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతులు, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది.  సినిమాలు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడాలి ఎప్పుడు అనుకునేవారు శ్యామ్ బెనెగల్.
     

    ముఖ్యంగా శ్యామ్‌ బెనగల్(ShyamBenegal)తన సినిమాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశాడు. అంకుర్‌(1974)తో మొదలెట్టి  జుబేదా (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్‌ బెనగళ్‌. సత్యజిత్‌ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్‌ సేన్‌ అందుకున్నాక శ్యామ్‌ బెనగళ్‌ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. ముస్లిమ్‌ మహిళల జీవితాలను స్పృశిస్తూ  మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు తెరకెక్కింటారు. 

    వెండితెరపై ప్రయోగాలు:

    శ్యామ్‌ బెనగళ్‌ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎప్పుడు కొత్తవారికే ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. బెనగళ్‌ సినిమాలతో షబానా, స్మితా పాటిల్‌ గొప్ప పాత్రలతో గుర్తింపు  పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో అనుగ్రహంలో వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా మన దేశం కోసం ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్‌ రే మీద డాక్యుమెంటరీ, నెహ్రూ డిస్కవరీ ఆఫ్‌ ఇండియాను భారత్‌ ఏక్‌ ఖోజ్‌,  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, మేకింగ్‌ ఆఫ్‌ మహాత్మా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు కేవలం బాక్సాఫీస్ సంఖ్యలు మాత్రే కాదు.. అంతకు మించి అని అందరూ చెప్పడం ఆయన టాలెంట్‌కు ఓ నిదర్శనం.

    ఎనిమిది జాతీయ అవార్డులు...

    శ్యామ్‌ బెనగళ్‌ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి అంకుర్‌(1975), నిశాంత్‌(1976), మంథన్‌ (1977), భూమిక: ది రోల్‌(1978), జునూన్‌(1979), ఆరోహణ్‌(1982), నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(2005), వెల్‌డన్‌ అబ్బా(2009) చిత్రాలకు దక్కాయి. ఆయనకు సినీ రంగంలో సేవలకు గానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్‌ఆర్‌  జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అందుకున్నారు. తెలుగు సినిమా అనుగ్రహంకు నంది అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అనంత్‌ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్‌ షా , ఓం పురి , స్మితా పాటిల్‌ , అమ్రేష్‌ పురి  లాంటి గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయే చేసిన డైరెక్టర్‌ శ్యామ్‌ బెనగల్ కావడం విశేషం. 
     

  • గత కొన్ని సినిమాలతో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న విశ్వక్ సేన్.. ఈసారి కామెడీ రూట్‌లోకి వచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే టీజర్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. గత నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో మూవీ విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రెండు నెలల ముందుకు తీసుకొచ్చారు.

    (ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)

    ముందు చెప్పినట్లు ఏప్రిల్‌లో కాకుండా ఫిబ్రవరి 13న 'ఫంకీ' విడుదలవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే షూటింగ్‌తో పాటు మిగిలిన పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్‌కి చాలా కీలకం.

    టీజర్ బట్టి చూస్తే ఇదో సినిమా డైరెక్టర్ కథ. దర్శకుడిగా విశ్వక్ కనిపిస్తుండగా.. హీరోయిన్ పాత్రలో నిర్మాత కూతురిగా కాయదు లోహర్ చేస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో రెగ్యులర్ ఫన్ ఉండబోతుందనే అనిపిస్తుంది. మరి ఈసారి విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • ఈ శుక్రవారం(డిసెంబరు 19).. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ 'అవతార్ 3' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈసారీ విజువల్స్, స్టోరీ గ్రాండియర్ అదే రేంజులో ఉండబోతున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. కానీ మన దగ్గర ఈ మూవీ వస్తుందనే విషయం కూడా చాలామందికి తెలీదు. హైప్ అంత తక్కువగా ఉంది మరి! అసలు దీనికి ఏంటి కారణం? మూడో భాగంలో స్టోరీ ఏమై ఉండొచ్చు?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    1997లో 'టైటానిక్' లాంటి బ్లాక్ బస్టర్, ఆ‍స్కార్ విన్నింగ్ సినిమా తీసిన తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరున్ దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఓ విజువల్ వండర్ సృష్టించాడు. అదే 'అవతార్'. 2009లో ఇది రిలీజైంది. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.18-19 వేల కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత ఇది ఫ్రాంచైజీలా వస్తుందని కామెరూన్ ప్రకటించాడు. కాకపోతే రెండో భాగం రావడానికి చాలా ఆలస్యమైంది. 2022 డిసెంబరులో 'అవతార్ 2' విడుదలైంది. తొలి భాగంతో పోలిస్తే దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. వసూళ్లు మాత్రం కళ్లు చెదిరేలా వచ్చాయి.

    ఈ వారం మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తొలి రెండు భాగాలతో పోలిస్తే దీనిపై అనుకున్నంత బజ్ లేదు. తొలి పార్ట్ రిలీజైనప్పుడు విజువల్స్, పండోరా ప్రపంచం అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో పార్ట్‌ వచ్చేసరికి చూసిన కంటెంట్‌లానే ఉంది కదా అనిపించింది. దీంతో రెండో భాగానికి మన దేశంలో రూ.450-480 కోట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు రాబోయే మూడు పార్ట్ ట్రైలర్ కూడా విజువల్‌గా బాగున్నప్పటికీ స్టోరీ.. తొలి రెండు భాగాల్లో చూపించిందే ఉండబోతుందా అని సందేహం కలిగేలా చేస్తోంది. హైదరాబాద్ లాంటి చోట్ల బుకింగ్స్ ఇంకా పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు. బహుశా రిలీజైన తర్వాత అదిరిపోయిందనే టాక్ వస్తే జనాలు దీనిపై ఆసక్తి చూపిస్తారేమో?

    (ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)

    అవతార్ విషయానికొస్తే.. ప్రకృతినే ప్రాణమని భావించే 'నావి' జాతి వాళ్లకు, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్లే మానుషులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా థీమ్‌. ఇందులో యాక్షన్‌ని మించిన లవ్‌స్టోరీ దాగుంది. ఆ ప్రేమకథ ఎన్నో హృదయాలని హత్తుకుంది. అలానే పంచభూతాలైన భూమి గురించి తొలి పార్ట్‌లో చూపించారు. నీటి గురించి రెండో భాగంలో, ఇప్పుడు అగ్ని గురించి మూడో భాగంలో చూపించబోతున్నారు.

    'అవతార్' 22వ శతాబ్దంలో పండోరా అనే గ్రహంపై జరుగుతుంది. ఇక్కడ మానవులు 'అన్‌బ్టేనియం' అనే విలువైన ఖనిజం కోసం వచ్చి, స్థానిక 'నావి' తెగపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. వికలాంగుడైన మాజీ మెరైన్ జేక్ సుల్లీ.. నావి తెగలో ఒకడిగా మారేందుకు తన 'అవతార్' శరీరం ద్వారా వారి సంస్కృతిని అర్థం చేసుకుని, వారి ప్రేమలో పడి, చివరికి నావి పక్షాన నిలబడి మానవులతో పోరాడి గెలుస్తాడు. పండోరని రక్షించుకుంటాడు. ఇదే పార్ట్-1 స్టోరీ.

    (ఇదీ చదవండి: దిగ్గజ గాయని బయోపిక్‌లో సాయిపల్లవి?)

    అవతార్ 2 (ది వే ఆఫ్ వాటర్) కథ.. మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలవుతుంది. దశాబ్దం గడిచిపోతుంది. జేక్ సుల్లీ, నెయితిరి తమ ఐదుగురు పిల్లలతో కలిసి పండోరాలో కొత్త జీవితం ప్రారంభిస్తారు. తర్వాత మనుషుల దాడుల నుంచి తమ కుటుంబాన్ని, తమ జాతిని కాపాడుకోవడానికి, సురక్షితంగా ఉండటంలో భాగంగా మరో చోటకు వెళ్లిపోతారు. నీటిలో నివసించే మెట్‌కైయినా తెగతో కలిసి మనుగడ సాగిస్తారు. కానీ మనుషులు తిరిగి రావడంతో మళ్లీ పోరాడతారు. పాత శత్రువు కల్నల్ క్వారిచ్‌తోనూ మరోసారి తలపడతారు.

    అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) కథ.. రెండో భాగంగా ముగిసిన చోటనే మొదలవుతుంది. ఈసారి కల్నల్ క్వారిచ్.. నావి తెగలోని మనుషుల్లా మారిపోతాడు. ఇదే జాతికి చెందిన ఓ మహిళతో కలిసి జేక్, అతడి బృందంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఏమైంది? జేక్, అతడి కుటుంబం ఈసారి ఎలా తప్పించుకుంది? ఇందులో యాష్ తెగ పాత్ర ఏంటనేది మూడో భాగం స్టోరీ అని తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: బతికున్నప్పుడే అన్నయ్య తన విగ్రహం గురించి చెప్పారు: ఎస్పీ శైలజ)

  • బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్  ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్‌ సైతం మేకర్స్‌ను కొనియాడారు.

    ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్‌వీర్‌ సింగ్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్‌ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్‌ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్‌ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్‌ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

    దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్‌లో శుక్రవారం రూ34.70 కోట్లు,  శనివారం రూ.53.70 కోట్లు,  ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది.  దీంతో బాలీవుడ్‌ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది. 

    ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో ‍అరబ్ దేశాల్లో దురంధర్‌పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్‌, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.

  • తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్‌. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్‌ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.

    ఒక్కవారంలో అంతా అయిపోయిందా?
    అందులో ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.

    ఏడ్చేసిన డిమాన్‌ పవన్‌
    డిమాన్‌ పవన్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్‌లో స్ట్రగుల్‌ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.

    టాప్‌ 5 ఎమోషనల్‌
    కల్యాణ్‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్‌ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

     

  • బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్‌ టాప్‌ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్‌ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్‌ చేశారు. 

    కామనర్‌ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్‌ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...

    నలిగిపోయిన భరణి
    భరణి మొదట ఎలిమినేట్‌ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్‌ ఆడండి అని నాగార్జున వార్నింగ్‌ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్‌ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్‌ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.

    ఫ్యామిలీ వీక్‌తో మార్పు
    కానీ దివ్య ఫెవికాల్‌లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్‌ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.

    విమర్శలు
    భరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్‌ ఎంట్రీలో మాత్రం ఫైర్‌ చూపించాడు. ఆ ఫైర్‌ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.

    చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి

  • దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఆయన విగ్రహం. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దీన్ని పెట్టాలనుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. అయితే బాలు విగ్రహం వద్దని అంటూ పలు ప్రజాసంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. కొన్నిరోజులుగా ఈ తతంగం నడిచింది. విగ్రహావిష్కరణ రోజు(డిసెంబరు 15) రావడంతో మళ్లీ వ్యతిరేకత కనిపించింది. దీంతో పోలీసులు.. భారీ బందోబస్తు సిద్ధం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విగ్రహావిష్కరణ చేస్తారు.

    ఈ వేడుకకు వచ్చిన బాలు చెల్లి, గాయని ఎస్పీ శైలజ.. అన్నయ గురించి, విగ్రహ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా  భావిస్తున్నాం. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నారు. ఇప్పుడు వాయిద్య బృందం ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది అని శైలజ చెప్పుకొచ్చారు. వివాదం గురించి అడగ్గా.. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు నాకు తెలియదు, కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు. బాలు తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈ విషయంలో వివాదం చేయడం సరికాదని అన్నారు.

  • శిరోద్కర్‌ సిస్టర్స్‌ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్‌ ఇస్తూ గతేడాది హిందీ బిగ్‌బాస్‌ 18వ సీజన్‌లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.

    పర్ఫెక్ట్‌ బర్త్‌డే డిన్నర్‌
    ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్‌ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. "నా పర్ఫెక్ట్‌ కూతురికి పర్ఫెక్ట్‌ బర్త్‌డే డిన్నర్‌.. ఫ్యామిలీ, ఫుడ్‌, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్‌ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్‌ కూడా ఉన్నాడు.

    ఎంత ఎదిగిపోయావో..
    అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్‌ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్‌ వీడియోను సైతం షేర్‌ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్‌డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్‌ ఫ్రెండ్‌వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది.

     

     

  • సినిమాల్లో బయోపిక్స్ కొత్తేం కాదు. నాలుగైదేళ్ల ముందు విపరీతంగా వచ్చాయి. ప్రస్తుతం ట్రెండ్ మారిపోవడంతో అప్పుడప్పుడు జీవితకథల్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ బయోపిక్ అంటే చాలామంది చెప్పే మాట 'మహానటి'. ఇది తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో క్రేజీ బయోపిక్‌కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

    ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ్'లో సీతగా చేస్తున్న సాయిపల్లవి.. త్వరలో తెలుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తీయబోయే ఓ బయోపిక్‌లో నటించబోతుందని తాజాగా రూమర్స్ వస్తున్నాయి. అదే దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి జీవితకథ. సుబ్బలక్ష‍్మిగా సాయిపల్లవి కనిపించనుందనే విషయం.. సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మళ్లీ రావా, జెర్సీ, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడని అంటున్నారు.

    (ఇదీ చదవండి: 'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!)

    త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రకటన వచ్చే అవకాశముందని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది రూమర్ మాత్రమేనా లేదంటే నిజమా అనేది కొన్నిరోజులు క్లారిటీ వచ్చే అవకాశముంది. ఒకవేళ తీస్తే ఏమేం చూపిస్తారనేది ఆసక్తికరం. ఎందుకంటే సుబ్బలక్ష‍్మి అంటే కేవలం సింగర్ మాత్రమే కాదు. అంతకు మించిన గుర్తింపు దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. అలాంటి ఈమె బయోపిక్ అంటే ఏం చూపిస్తారు? ఎలా తీస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

    ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి. తమిళనాడులోని మధురైలో 1916లో పుట్టారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనిగా పేరు తెచ్చుకున్నారు. భారతదేశంలో 'భారతరత్న' పొందిన తొలి సంగీత విద్వాంసురాలు, రామన్ మెగసెసే అవార్డును అందుకున్న మొదటి భారతీయ సంగీత కళాకారిణి ఈమెనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా "భారతదేశపు నైటింగేల్"గా పేరుగాంచారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్‌కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.

    రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్‌ కల్యాణ్‌ సైలెంట్.. ఎందుకు?)

    ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్‌ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్‌లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్‌వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

    ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్‌వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Andhra Pradesh

  • తాడేపల్లి : మెడికల్‌ కాలేజీలప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అనంతరం వాటిని జిల్లా కేంద్రాల నుండి తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలింపులో భాగంగా  ఈరోజు(డిసెంబర్చే‌ 15వ తేదీ) చేపట్టిన ర్యాలీలు విజయవంతం కావడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన  ఉద్యమం మాత్రమే కాదని, చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు అని అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌

    ఇది అత్యంత విజయవంతమైన ఉద్యమం
    ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైనదిగా వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. ‘ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన  ఉద్యమం మాత్రమే కాదు. చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ  ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు.  

     ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణ
    ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్‌ 18న గౌరవ గవర్నర్‌గారికి  అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి  చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది. 

    ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో  మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ఈ ఉద్యమం ద్వారా  చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి’ అని అన్నారు.

     

    ఇవీ చదవండి:

    కోటి సంతకాలు.. కోట్ల గళాలు

    విజయవాడకు వైఎస్‌ జగన్‌

    ఇదీ కదా ప్రజా ఉద్యమం అంటే..
     

  • ఏలూరు: జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. కొయ్యలగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న దంపతులు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గాడాల గ్రామం నుండి మనవరాలి అన్నప్రాసనకై జంగారెడ్డిగూడెం బైక్‌పై వస్తున్న ప్రత్తి జయరాజు(52), భార్య సత్యవతి(45) దంపతులు.. ట్రాలీ ఆటోని ఢీకొట్టి మృతిచెందారు. 

    కొయ్యలగూడెం శివారు పులి వాగు సమీపంలో బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దాంతో ఘటనా స్థలంలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • సాక్షి, విజయవాడ: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో ఆసంస్థకు చెందిన వెబ్‌పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి కాంట్రాక్ట్‌లో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలున్నాయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న సంజయ్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.

    ఐపీఎస్ సంజయ్‌ కుమార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ సరిగ్గా 112 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పటికీ బెయిల్ లభించలేదు.  సంజయ్‌ కుమార్  1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో సీఐడీ చీఫ్‌గా ఉ న్నారు.

    సీఐడీలో ఎస్పీ, ఎస్టీ అవగాహన కార్యక్రమాలకు టెండర్లు పిలిచి 1.15కోట్లు దుర్వినియోగం చేశారని 2025లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం రిమాండ్, కస్టడీ పొడిగింపులు జరిగాయి. 2025 నవంబర్‌లో సంజయ్‌ కుమార్‌ సస్పెన్షన్‌ మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ మే 2026 వరకు ఉంటుంది.

  • తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం, డిసంబర్‌ 16వ తేదీ) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు.  ఇళ్లు కోల్పోయిన  జోజినగర్ బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. 

    భవానీపురం  జోజినగర్‌కు చెందిన 42  ప్లాట్లకు చెందిన బాధితులు ఇటీవల వైఎస్‌ జగన్‌ను  కలిశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. దీనిలో భాగంగా ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని వైఎస్‌ జగన్‌ పరిశీలించనున్నారు. 

    అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ హామీ..

    విజయవాడలోని జోజినగర్‌లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహా­యం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్‌ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

    పక్కా  రిజిస్ట్రేషన్‌  డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్‌  రిజిస్ట్రేషన్‌ , ఇంటి పన్ను, కరెంట్‌ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్‌ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్‌ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్‌ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.

    అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు. వచ్చేవారం తాను వచ్చి కూల్చి వేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.    

    ఇదీ చదవండి:
    ‘ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..!’

  • సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్‌న్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను  కాకాణి కోరారు. రిట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం​ అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

    కాగా, చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్‌ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.

  • ఢిల్లీ: రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చర్చలో పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలు వచ్చాయన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు.

    సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంచాలి. ఈవీఎంలను నమ్మలేము. పేపర్ బ్యాలెట్ సిస్టంపైనే అందరికీ నమ్మకం ఉంది. స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణపై స్వేచ్ఛగా, పారదర్శకంగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

  • చిత్తూరు రూరల్‌ (కాణిపాకం) : కుటుంబ కలహాలతో ఓ తల్లి కన్నకొడుకుతో మృత్యుఒడిలోకి చేరింది. ఈ ఘటన ఆదివారం చిత్తూరు మండలం తుమ్మింద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు... తుమ్మింద గ్రామానికి చెందిన బాబు భార్య కవిత్ర (26)కు అయిదేళ్ల కిందట వివాహం అయింది. ఈ దంపతులకు ముకేష్‌ (04) అనే కుమారుడు జన్మించాడు. శనివారం ఈ దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కవిత్ర సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో కుమారుడుతో పాటు దూకి ఆత్మహత్య చేసుకుంది. 

    భార్య, కుమారుడు ఇంట్లో కనిపించకపోవడంతో భర్త, కుటుంబీకులు ఊరంతా గాలించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఊరికి సమీపంలోని బావిలో శవమై తేలారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కుమార్‌ తదితులున్నారు.

  • సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో కూటమి ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త తారక్‌ ప్రతాప్‌ రెడ్డికి సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. తక్షణమే విడుదల చేయాలంటూ జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జిలతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

    ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అణచివేత ధోరణిని కూటమి ప్రదర్శించడం చూస్తున్నదే. ఈ క్రమంలోనే యూరియా కొరతపై తారక్‌ ప్రతాప్‌ రెడ్డి ఓ పోస్ట్‌ చేశారు. ఈ పరిణామంలో రగిలిపోయిన ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. తారక్‌ను అక్రమ అరెస్ట్‌ చేయించింది. తారక్‌ తరఫున సుప్రీం కోర్టులో సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. 

    ‘‘యూనిఫాంలో కాకుండా మఫ్టీలో వైఎస్ఆర్సిపీ సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేస్తున్నారని.. ప్రభుత్వ దమనకాండపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని’’ వాదించారు. సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. తారక్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

    YSRCP సోషల్ మీడియా కార్యకర్త ప్రతాప్ రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్

Business

  • వారెన్ బఫెట్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. బెర్క్‌షైర్ హాత్వే చైర్‌పర్సన్ & దిగ్గజ పెట్టుబడిదారుడుగా ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రజలకు సుపరిచయమే. ఈయన స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి సులభమైన నియమాలను వెల్లడించారు. విజయవంతమైన పెట్టుబడికి.. మార్కెట్ అంచనాలతో సంబంధం లేదని, క్రమశిక్షణ, స్వీయ అవగాహన, మీ ఆలోచనలతో ఎక్కువ సంబంధం ఉందని పేర్కొన్నారు.

    వారెన్ బఫెట్ ప్రకారం.. పెట్టుబడి విషయంలో వాస్తవికంగా ఉండటం గురించి చెబుతారు. మీరు అర్థం చేసుకున్నది తెలుసుకోవడమే కాకుండా, మీకు తెలియనిది తెలుసుకోవడం.. దానికి ప్రలోభపడకుండా ఉండటం ముఖ్యమని, ఇది స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని అంటారు.

    తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ.. అదుపులేని దురాశ, దీర్ఘకాలిక రాబడికి అతిపెద్ద శత్రువులలో ఒకటి బఫెట్ హెచ్చరించారు. మీరు చాలా దురాశపరులైతే, అది విపత్తు అవుతుందని ఆయన అంటారు.

    పెట్టుబడి అంటే అది క్లిష్టమైన ప్రక్రియ కాదంటారు బఫెట్. అయితే దీనికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అని స్పష్టం చేశారు.

    బఫెట్ తన పెట్టుబడి తత్వశాస్త్రంలో ఎక్కువ భాగాన్ని బెంజమిన్ గ్రాహం బోధనలకు ఆపాదించారు. దశాబ్దాల మార్కెట్ పరిణామం తర్వాత కూడా అతని ఆలోచనలు సాటిలేనివిగా ఉన్నాయని అతను నమ్ముతారు. ఈ ప్రాథమిక విధానం ప్రకారం.. మీరు స్టాక్‌లను వ్యాపారాలుగా భావించి, ఆపై మంచి వ్యాపారాన్ని ఏది చేస్తుందో అంచనా వేయాలని ఆయన అన్నారు. ఈ పద్దతిలో ప్రధానమైనది భద్రతా మార్జిన్ అని బఫెట్ అన్నారు.

  • బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా.. యాక్సిస్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ న్యూ ఆఫర్‌. ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది.

    ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్‌ ఈటీఎఫ్, సిల్వర్‌ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్‌ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో బి.గోపకుమార్‌ తెలిపారు.

  • సాధారణంగా చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలొ ఉంచుకుని పలు ఆటోమొబైల్ కంపెనీలు దాశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. అయితే ఐఐటి బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసింది. ఇది మామూలు వాహనాల కంటే భిన్నంగా శక్తిని వినియోగించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ..

    ఐఐటీ బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్.. రూపొందించిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు బిబ్యా 1.1 (Bibtya 1.1). ఇది టాటా ఏస్ గోల్డ్‌. దీనికి సరికొత్త టెక్నాలజీని అమర్చి.. టెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ గమనించవచ్చు.

    సాధారణంగా ఒక వెహికల్ పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా వాహనం నడుస్తుంది. కానీ ఇక్కడ రైజెన్ టెక్ రూపొందించిన హైబ్రిడ్ ఏలక్ట్రిక్ టాటా ఏస్ గోల్డ్‌ ట్రక్ దానికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే.. ఇందులోని ఇంజిన్ పెట్రోల్ ఉపయోగించి.. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ శక్తిని నేరుగా చక్రాలకు సరఫరా చేయదు. ఈ శక్తిని బ్యాటరీ తీసుకుని.. ఛార్జ్ చేసుకుంటుంది. ఈ ఛార్జ్ ద్వారా వాహనం నడుస్తుంది. తద్వారా.. పనితీరు కూడా పెరుగుతుంది.

    ఇదీ చదవండి: శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్‌ టిప్స్‌, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    నిజానికి ఈ విధానం కొత్తగా ఉంది. టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఇది అన్నింటా సక్సెస్ సాధిస్తే.. ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలు సాధ్యమవుతాయి. అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

    పెట్రోల్, బ్యాటరీ రెండూ ఉండటం వల్ల.. పేలిపోయే అవకాశం ఉందా?, ఒకవేళా బ్యాటరీ పనిచేయని సందర్భంగా పెట్రోల్‌తో మాత్రం వాహనం నడుస్తుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది, కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో లేదు. బహుశా దీనిని అన్ని విధాలా.. పరీక్షించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

  • కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నాయి. ఈ రోజు కూడా అదేబాటలో పయనించాయి. అయితే సాయంత్రానికి మరోమారు రేటు పెరగడంతో పసిడి ప్రియులు అవాక్కవుతున్నారు. ఉదయం 980 పెరిగిన పసిడి ధర.. సాయంత్రానికి దాదాపు డబుల్ అయింది. దీంతో రేటు ఊహకందని విధంగా పెరిగిపోయింది. అనూహ్యంగా వెండి కూడా 5000 పెరిగింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,23,500 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 400 పెరిగిందన్న మాట. (ఉదయం 750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 400 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1350 పెరిగింది).

    24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,35,380 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 820 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 650 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1470 పెరిగింది).

    ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 1460 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,35,530 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1350 పెరిగి.. 124250 రూపాయల వద్దకు చేరింది.

    ఇదీ చదవండి: రూ.2.40 లక్షలకు వెండి.. కొత్త ఏడాదిలో కష్టమే!

    ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1580 పెరగడంతో రూ. 1,36,530 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,450 పెరిగి.. 1,25,150 రూపాయల వద్దకు చేరింది.

    వెండి రేటు ఇలా
    బంగారం ధరలు పెరిగినా.. దాదాపు ఎప్పుడూ స్థిరంగా ఉండే వెండి రేటు ఈ రోజు రెండోసారి పెరిగింది. ఉదయం కేజీ రేటు 3000 పెరిగింది. ఇప్పుడు ఆ ధర రూ. 5000లకు చేరింది. అంటే ఉదయం నుంచి.. సాయంత్రానికే మరో 2000 రూపాయలు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రూ. 2,15,000లకు చేరింది.

  • శీతాకాలంలో పొగమంచు సర్వసాధారణం. ఇది చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఒకింత జాగ్రత్త వహించాలి. లేకుంటే అనుకోని ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో శీతాకాలం పొగమంచులో డ్రైవింగ్‌ టిప్స్‌, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

    పొగమంచులో డ్రైవింగ్‌ టిప్స్‌
    నెమ్మదిగా డ్రైవ్ చేయండి: పొగమంచు ఉన్నప్పుడు మీ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం మానుకోవాలి. ముందున్న వాహనాలను జాగ్రత్తగా గమనించాలి.

    ఫాగ్ లైట్స్ ఉపయోగించండి: ప్రయాణించేటప్పుడు.. తప్పకుండా ఫాగ్ లైట్స్ ఉపయోగించాలి. లో బీమ్ హెడ్లైట్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. హైబీమ్ లైట్ ఆన్ చేస్తే.. ఎక్కువ లైటింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కొంత ఇబ్బందికి గురవుతాయి.

    సేఫ్ డిస్టెన్స్ పాటించండి: మీకు ప్రయాణించే సమయంలో తప్పకుండా.. ముందు వెళ్తున్న వాహనానికి డిస్టెన్స్ పాటించండి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా.. మీరు ప్రమాదంలో చిక్కుకుండా ఉంటారు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.

    లేన్ డిసిప్లిన్ పాటించండి: వాహనదారులు తప్పకుండా.. రోడ్డు మధ్య లైన్ లేదా ఎడ్జ్ మార్కింగ్‌ని గమనిస్తూ డ్రైవ్ చేయాలి. ఒకవేళా లేన్ మార్చాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు హారన్ మోగించడం మర్చిపోవద్దు. అనవసరంగా హారన్ మోగించవద్దు.

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    వాహనం ముందే చెక్ చేయండి: ప్రయాణించే వాహనం కండిషన్ ఎలా ఉందనే విషయాన్ని.. ముందుగానే గమనించాలి. లైట్స్, బ్రేక్స్, వైపర్స్ సరిగ్గా ఉన్నాయా.. పనిచేస్తున్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

    హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి: ఫాగ్ లైట్ కాంతి ఎక్కువ అనిపిస్తే.. హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఈ లైట్స్ వెనుక వచ్చే వాహనాలకు.. ముందు ఒక వాహనం వెళ్తోందని చూపిస్తాయి.

    ఇదీ చదవండి: కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!

    మొబైల్ వాడకండి: పొగమంచుతో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండాలి. వాహనం డ్రైవింగ్ మీదనే మీ పూర్తి దృష్టి పెట్టాలి. మొబైల్ వాడాలంటే.. వాహనం ఆపి ఉపయోగించుకోవడం మంచిది.

    ఉదయం, రాత్రి వేళల్లో జాగ్రత్త: ప్రత్యేకింగ్ పొగమంచు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే.. తప్పా ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళా ప్రయాణం తప్పనిసరి అయితే.. కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

  • ఒకప్పుడు స్వాతంత్రం రాక ముందు ఆదాయపు పన్ను చట్టం 1922, స్వాతంత్రం వచ్చిన తరువాత చట్టం 1961 అమలులోకి వచ్చింది. మధ్యలో ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు, నాలుగైదు సార్లు పెనుమార్పులు. తీసివేతలు, కలిపివేతలు, 65 సార్లు 4,000 మార్పులు చేశారు. ఈ సంవత్సరం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారు.

    ఆదాయపు పన్ను చట్టం 2025.. 47 చాప్టర్లను 23కు కుదించారు. 819 సెక్షన్లను 536కి తగ్గించారు. ఇప్పుడు షెడ్యూళ్లు లేవు. ఇప్పుడు వాటి సంఖ్య 16. ప్రస్తుతం అంకెలకు ఇంగ్లీషు అక్షరాలు తగిలించి.. మూడు అక్షరాల రైలుబండిలా పెట్టి వ్యవహారం నడుపుతున్నారు. ఇకపై అలా ఉండదు. కేవలం నంబర్లే... సెక్షన్‌ 10లో ఉండే అన్ని మినహాయింపులను షెడ్యూల్స్‌లో అమర్చారు. క్లారిటీ కోసం కొన్ని టేబుల్స్, ఫార్మూలాలు ప్రవేశపెట్టారు. అదేదో సినిమా డైలాగు గుర్తొస్తోంది. ‘అయితే నాకేంటి’? ఈ మార్పుల వలన మనకు ఒరిగేది ఏమిటి? 

    1.4.2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ చట్టం ప్రత్యేకతలు ఏమిటంటే...?

    • సరళీకృతంగా ఉంటుంది.  

    • వాడుకలో లేనివాటిని తీసివేశారు

    • కొన్ని అంశాలను నెంబరింగ్‌ ఇచ్చి క్రమబద్ధీకరించారు.  

    • కొన్ని అంశాలను పునర్‌నిర్మాణం చేశారు.  

    • రాబోయే పదం ‘‘పన్ను సంవత్సరం’’. ప్రస్తుత అకౌటింగ్‌ సంవత్సరం, ఫైనాన్సియల్‌ సంవత్సరం, ఆదాయపు సంవత్సరం, గత సంవత్సరం, ఇవన్నీ మనకు అర్ధం అయ్యేలా చెప్పాలంటే మనం ఆదాయం సంపాదించిన సంవత్సరం. ఈ ఆదాయాన్ని సంవత్సరం తరువాత అస్సెస్సుమెంట్‌ సంవత్సరం అంటే ఆ తరువాత సంవత్సరంలో అస్సెస్సు చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అస్సెస్సుమెంట్‌ సంవత్సరం అని అంటారు.

    • రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి అవుతుందని అడిగినట్లు... 64 ఏళ్లు దాటినా టాక్స్‌ ప్లేయర్‌కి ఈ రెండు సంవత్సరాల మధ్య తేడా తెలియదు. కన్ఫ్యూజన్‌ పోలేదు. ఎన్నో పొరపాట్లు జరిగేవి. ఇన్‌కం టాక్స్‌ చెల్లించేటప్పుడు చలాన్‌లో సంవత్సరానికి సంబంధించిన కాలమ్‌ నింపేటప్పుడు తికమక అయ్యేవారు. ఇకపై తికమక అవసరం ఉండదు.  1.4.2026 నుంచి నుంచి ఒకే పదం వాడుకలోకి వస్తుంది. అదే ‘‘పన్ను సంవత్సరం’’.  

    • టీడీఎస్‌కి సంబంధించిన అంశాలను చాలా పద్ధతి ప్రకారం ఎటువంటి తికమక రాకుండా చేశారు. ఒక సెక్షన్‌ ద్వారా జీతాలకు సంబంధించిన అంశాలు పొందుబరిచారు. ఒకే ఒక సెక్షన్‌ ద్వారా మిగతా అన్ని టీడీయస్‌ అంశాలు పొందుబరిచారు. ఈ పట్టిక సమగ్రం.., సంపూర్ణం. క్రమసంఖ్య ఏ ఆదాయం మీద చేయాలి? ఎవరికి వర్తిస్తుంది? పరిమితులు... ఇలా ఉంటాయి వివరాలు... రెసిడెంట్లకు, నాన్‌ రెసిడెంట్లకు, టీసీఎస్‌.. ఎవరికి అక్కర్లేదు.? ఇలా అన్నీ టేబుల్స్‌ ద్వారా చక్కగా వివరించారు.  

    • పాతకాలపు పదజాలానికి స్వస్తి పలికారు.  

    • పాతవాటికి మంగళం పలికి, ప్రపంచంలో ఆచరించే మంచి పద్ధతులకు చట్టంలో చోటిచ్చారు.

    • వర్చువల్, డిజిటల్‌ ఆస్తులను నిర్వచించారు. క్రిప్టో కరెన్సీ, టోకనైజ్డ్‌ ఆస్తులు, టెక్నాలజీ ద్వారా ఏర్పడే హక్కులు మొదలైనవి వివరించారు.  

    • వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చేస్తారు.  

    • టెక్నాలజీని ఆసరా తీసుకొని అధికార్లకు

    • విస్తృత అధికారాలు కల్పించారు. ఇన్నాళ్లు సెర్చ్‌లు అంటే ఇంటినో, ఆఫీసునో, ఫిజికల్‌ ఏరియా మాత్రమే ఉండేవి. ఇక నుంచి మీ ఈ–మెయిల్స్, క్లౌడ్‌ సర్వర్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు, వెబ్‌సైట్లు అన్నింట్లోనూ చొరబడతారు ఎగబడతారు. ఇకపై బుకాయించలేము. ఈ నగదు నాది కాదు మా మామగారిది అనలేము. అధికారులకు విస్తృత సమాచారం ఇవ్వడం వల్ల మీకు సంబంధించిన సమాచారం వారి చెంతనే ఉంటుంది.  

    • కాబట్టి కొత్త చట్టంలోని అంశాలకు అనుగుణంగా నడుచుకుందాం. చట్ట ప్రకారం మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి. ఫిబ్రవరిలో బడ్జెటుకు కసరత్తు జరుగుతోంది. అందులో శ్లాబులు, రేట్లు మారవచ్చు. మారకపోవచ్చు. ఈ రాబోయే మార్పులు తప్ప, మిగతా అంతా కొత్త చట్టం మనకు అందుబాటులో ఉంటుంది.


      కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య 

  • దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్‌' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

    అడల్ట్ మోడ్ ఫర్ చాట్‌జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్‌పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.

    చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి

    అడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్‌గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్‌ను అన్‌లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.

  • సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 84.00 పాయింట్లు లేదా 0.099 శాతం నష్టంతో 85,183.66 వద్ద, నిఫ్టీ 19.65 పాయింట్లు లేదా 0.075 శాతం నష్టంతో 26,027.30 వద్ద నిలిచాయి.

    కరోనా రెమెడీస్ లిమిటెడ్, తైన్‌వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ (ఇండియా), టీవీ విజన్, రిఫెక్స్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మనీబాక్స్ ఫైనాన్స్ లిమిటెడ్, వెల్స్పన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ కమర్షియల్స్, G-Tec Jainx ఎడ్యుకేషన్, ఎంబసీ డెవలప్‌మెంట్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • బంగారం ధర రూ. 1.30 లక్షలు (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) దాటితే.. కేజీ వెండి రేటు రూ. 2.13 లక్షలకు చేరింది. సిల్వర్ రేటు మరింత పెరిగి 2026కు సుమారు రూ. 2.40 లక్షలకు చేరుకుంటుందని స్టాక్ బ్రోకర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కంపెనీ 'యాక్సిస్ సెక్యూరిటీస్' వెల్లడించింది.

    యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం.. వెండి రేటు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతూనే ఉంది. 2025 ప్రారంభంలో రూ. 80వేలు వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఇప్పుడు గణనీయంగా పెరిగి, రెండు లక్షల రూపాయలు దాటేసింది. దీనికి కారణం మార్కెట్లో వెండికి పెరుగుతున్న డిమాండ్ అని స్పష్టమవుతుంది.

    ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడం, దీంతో డిమాండ్ ఎక్కువ కావడం వల్ల కూడా సిల్వర్ రేటు ఊహకందని విధంగా పెరిగింది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో మాత్రమే వెండి వినియోగం నాలుగేళ్లలో రెండింతలు పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా వెండికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    ఈ రోజు వెండి ధరలు
    డిసెంబర్ 14న రూ. 2.10 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. ఈ రోజు రూ. 2.13 లక్షలకు చేరింది. అంటే ఈ ఒక్క రోజులోనే సిల్వర్ టు రూ. 3000 పెరిగిందన్నమాట. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరులో సిల్వర్ రేటు ఒకేలా ఉన్నా.. ఢిల్లీలో మాత్రం కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 2,00,900. దీన్నిబట్టి చూస్తే.. దేశంలో ఢిల్లీలోనే సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.

    ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

National

  • అమ్మాన్‌: జోర్డాన్‌తో భారత ద్వైపాక్షిక బంధం ద్విగుణీకృతం కాబోతోందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్‌కు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడి అత్యంత విలాసవంత రాజ ప్రాసాదం హుస్సేనియా ప్యాలెస్‌లో జోర్డాన్‌ రాజు అబ్దుల్లాహ్‌–2 ఇబిన్‌ అల్‌ హుస్సేన్‌తో భేటీ అయ్యారు. 

    37 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్‌లో పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం పర్యటించడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇరుదేశాల ప్రతినిధుల స్థాయి సమావేశానికి ముందే ఇరుదేశాల అగ్రనేతలు ఇలా స్వయంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. పరస్పరం ప్రయోజనం చేకూర్చే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా మోదీ, రాజు అబ్దుల్లాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. 

    ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ‘‘భారత్‌–జోర్డాన్‌ బంధం మరింత పటిష్టమవుతోందని రాజు అబ్దుల్లాహ్‌ బలంగా విశ్వసిస్తున్నారు. ఇరుదేశాల సత్సంబంధాల పునాదులు మరింత గట్టిపడుతున్నాయి. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్‌ సాంకేతికత, మౌలిక వసతుల కల్పన అంశాలతోపాటు ఇరుదేశాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధాల బలోపేతం కోసం పరస్పర సహకారాన్ని ఇకమీదటా కొనసాగిస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల ఉమ్మడి పోరు సల్పుతాం.

     గాజా అంశంలోనూ క్రియాశీలక, సానుకూల పాత్ర పోషిస్తాం. పశ్చిమాసియాలో శాంతికపోతాలు ఎగిరేందుకు శతథా కృషిచేస్తాం. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల వైఖరి ఒక్కటే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ మీ నాయకత్వంలో జోర్డాన్‌ అనేది ఉగ్రవాదం, అతివాదం, వేర్పాటువాదాల విషయంలో ప్రపంచానికి గట్టి సందేశం ఇస్తోంది. నన్ను, భారత ప్రతినిధులకు సాదర స్వాగతం పలికిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రాజు అబ్దుల్లాహ్‌ను మోదీ కొనియాడారు. 

    సత్సంబంధం సమున్నత శిఖరాలకు..
    ‘‘ ఇండియా–జోర్డాన్‌ బంధాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేలా మీరెంతో సానుకూల దృక్పథాన్ని అవలంభిస్తున్నారు. భారత్‌ విషయంలో మీ స్నేహపూర్వక వైఖరి, అంకిత భావానికి ధన్యవాదాలు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధం ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. మేలిమలుపు లాంటి ఈ సందర్భంలో కొంగొత్త ఉత్సాహంతో ఇరుదేశాల బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం’’ అని రాజుతో మోదీ అన్నారు. 

    ఈ సందర్భంగా 2018లో ఇస్లామిక్‌ వారసత్వ సదస్సు కోసం అబ్దుల్లాహ్‌ భారత పర్యటన నాటి విశేషాలను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ ప్రాంతీయ శాంతి కోసం మాత్రమేకాదు ప్రపంచశాంతి కోసం మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. 2015లో ఐక్యరాజ్యసమితిలో సమావేశాల వేళ తొలిసారిగా మీతో భేటీ అయ్యా. ఉగ్రవాదభూతాం పెను విలయాలను మానవాళి ఎంతగా ఇబ్బందులు పడుతుందో మీరెంతో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు’’ అని మోదీ పొగిడారు. పర్యటనలో భాగంగా మోదీ ప్రాచీనభారత్‌లో వ్యాపారంచేసిన పెట్రా ప్రాంతంలో యువరాజుతో కలిసి పర్యటించనున్నారు.

    భారతీయుల ఘన స్వాగతం
    అంతకుముందు సోమవారం మోదీ జోర్డాన్‌లోని అమ్మాన్‌ నగరంలోని విమానాశ్రయానికి చేరుకోగానే జోర్డాన్‌ ప్రధానమంత్రి జఫర్‌ హసన్‌ సాదరంగా ఆహ్వానించారు. తర్వాత హోటల్‌కు చేరుకోగానే అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. భారతీయ అనుకూల జోర్డాన్‌ పౌరులు సైతం ప్రధానికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. జోర్డాన్‌స్థానికులు భారతీయ నాట్యంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే కళారూపాలను ప్రదర్శించారు.

  • కేరళ పంబ తీర్థం స్వామియే శరణం అయ్యప్ప  ప్రతిధ్వనులతో  మారుమోగిపోతుంది. ఏ వైపు చూసినా అయ్యప్పస్వాములే దర్శనమిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం  ఇప్పటికే అధిక మెుత్తంలో స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకూ అయ్యప్పస్వామిని 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

    శబరిమలలో అయ్యప్పస్వాముల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అయ్యప్పభక్తులు పెద్దఎత్తున పంబ సన్నిధానానికి చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామికి ఇరుముడి సమర్పించి తమ మెుక్కులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రారంభంలో స్వామివారి దర్శనానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం ఏర్పాట్లు మెరుగైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకూ దాదాపు 21 లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకోగా ప్రస్తుతం ఆసంఖ్య 25 లక్షలు దాటిందన్నారు.

    మండల పూజకోసం అయ్యప్పస్వామి (అభరణాల ఊరేగింపు) "తంగ అంకి" రథోస్థవం డిసెంబర్ 23 ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 7గంటలకు అరణ్ముల పార్థసారధి ఆలయం నుంచి బయిలుదేరి 26న అయ్యప్ప సన్నిధానం చేరుకుటుందని తెలిపారు. 27వ తేదీన అభరణాల అలంకారం అనంతరం స్వామివారికి మండల పూజ జరుగుతుందని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.

    అయ్యప్ప స్వాములందరూ వారికి కేటాయించిన సమయాలలో స్వామివారి దర్శనానికి రావాలని పోలీసులు సూచించారు. అలా చేయడం ద్వారా ఇ‍బ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని కేరళ పోలీసులు తెలిపారు. 

  • ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం,  డిసెంబర్‌ 15వ తేదీ) పార్లమంట్‌ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.  

    ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. 

    ప్రమాదకరస్థాయిలో ఏపీ అప్పులు..
    ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 18 నెలల్లోనే రూ 2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి కుంభకోణానికి పాల్పడుతున్నారు. 9 శాతానికి వడ్డీ తెచ్చి ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిధి నుంచి డబ్బులు డ్రా చేసే అవకాఃశం ప్రైవేటు వ్యక్తులకు కల్పించడం దారుణమన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే వైద్య రంగం ఉండాలని, ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన ఏపీ ప్రభుత్వం..  వైద్య కళాశాలను కాపాడలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్టాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

    ఇవీ చదవండి:

    కోటి సంతకాలు.. కోట్ల గళాలు

    విజయవాడకు వైఎస్‌ జగన్‌

    ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..

  • ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాజన్‌, మనీష్ బేడీ అనే ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థ ఆదేశాల మేరకు భారత్‌లో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరంతా ఆర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    గత నెలలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) NIA అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీగా సోదాలు నిర్వహిస్తుంది. అధికారులు ఇదివరకే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో 15 మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను దర్యాప్తు బృందాలు ఇది వరకే అరెస్టు చేశాయి.

  • ఢిల్లీ:  తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీసీ చీఫ్‌ మహేష్‌  గౌడ్‌ మాట్లాడుతూ.. ‘ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం. బీసీ రిజర్వేషన్ల  చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం’ అని తెలిపారు. 

     ఈ మేరకు సోమవారం(డిసెంబర్‌ 15వ తేదీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌  వద్ద  బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42%కు పెంపు చట్టానికి ఆమోదం కోరుతూ ఆందోళన చేపట్టింది జేఏసీ. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేసింది. 

    సామాజిక రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. ఈ ధర్నాలో మహేష్‌గౌడ్‌తో పాటు వి. హనుమంతరావు, విల్సన్ ఎంపీ (డిఎంకే), కే. నారాయణ (సిపిఐ), వి. శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, మల్లు రవి ఎంపీ, అనిల్ కుమార్ యాదవ్‌లు హాజరయ్యారు. 

  • సామూహిక కాల్పుల ఘటనలప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చే అంశం.. అక్కడి గన్‌ కల్చర్‌.. సులువైన ఆయుధ చట్టాలు అందుకు కారణమయ్యే పరిస్థితులు. అయితే.. ఇలాంటి దాడులప్పుడు ఆయుధ చట్టాలను కఠినతరం చేయడం పరిపాటిగా మారింది. బాండీ బీచ్‌ కాల్పుల ఘటన (Bondi Beach Shooting) నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా తాజాగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. మరి భారత్‌లో పరిస్థితి ఏంటి?

    భారత పౌరుడు గన్‌ లైసెన్స్‌ను ఆయుధ చట్టం(1959) ప్రకారం మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఎన్‌పీబీ తుపాకులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా.. ప్రాణాలకు ముప్పు ఉంటేనే తుపాకీ కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తారు. ఆత్మ రక్షణకు తప్ప మరే సందర్భాల్లోనూ వీటిని వినియోగించకూడదు. లైసెన్స్‌ పొందాలనుకునే వ్యక్తి కచ్చితంగా ఎఫ్‌ఐఆర్‌ సమర్పించాల్సిందే. తుపాకీ కావాలనుకుంటే కలెక్టరేట్‌లో, ఎస్పీకి మొదటగా అర్జీ  ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడిపై గతంలో కేసులున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టి వివరాలు సేకరించిన తర్వాతే లైసెన్స్‌ మంజూరు చేశారు.

    వ్యక్తిగత రక్షణ, వ్యవసాయ అవసరాలు(జంతువుల నుండి రక్షణ)కు మాత్రమే లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ లేకుండా ఆయుధం కలిగి ఉంటే జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆయుధాల చట్టం ఉల్లంఘనకు 3-7 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఆయుధాల చట్టం-1959 ప్రకారం ఆయుధాల కలిగి ఉండటం, తయారీ, అమ్మకం, దిగుమతి, ఎగుమతి, రవాణా చేయడం నేరం.

    ఆయుధాల నియమాలు 1962ను రద్దు చేసిన కేంద్రం.. 2016లో కేంద్రం కొత్త ఆయుధాల నియమాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం.. ఆయుధాల లైసెన్స్ కోరుకునే వారు ఏదైనా రైఫిల్ క్లబ్‌లో సభ్యత్వం పొంది గన్ వినియోగం, నిర్వహణపై శిక్షణ పొందాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు వారికి ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు. క్రిమినల్ రికార్డు ఉన్నవారు లైసెన్స్ పొందలేరు. లైసెన్స్ ప్రతి 3 సంవత్సరాలకు రీన్యూ చేయాలి. ఆయుధాన్ని ప్రదర్శన కోసం, భయపెట్టడానికి ఉపయోగించడం చట్ట విరుద్ధం.

    నిషేధిత ఆయుధాలు: మిలిటరీలో ఉపయోగించే ఆటోమేటిక్ ఆయుధాలు (AK-47, LMGలు) ఉపయోగించకూడదు
    ప్రొహిబిటెడ్ అమ్యూనిషన్ (ఉదా: హై-ఎక్స్‌ప్లోసివ్ బుల్లెట్లు)
    వీటిని పౌరులు కలిగి ఉండటం పూర్తిగా నిషేధం

    అనుమతించబడిన ఆయుధాలు (వీటికి లైసెన్స్ తప్పనిసరి)
    నాన్-ప్రొహిబిటెడ్ బోర్ (NPB) ఆయుధాలు (రివాల్వర్లు, పిస్టల్స్, షాట్‌గన్స్, స్పోర్ట్స్ రైఫిల్స్)

    కాగా, ఆస్త్రేలియాలో సామాన్య జనంపై కాల్పులు ఘటనలు చాలా అరుదే. 1996లో పోర్ట్‌ అర్థర్‌ టౌన్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఈ ఘటన తర్వాత ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్స్‌లు సులభంగా దక్కకుండా చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 2014లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు, 2018లో ఏడుగురు మృతిచెందారు.

    ఆయా ఘటనల్లో సాయుధులు తమ కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరిపి, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2019లో ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్‌ సిటీలో జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన ఖైదీ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. 2022లో క్వీన్స్‌లాండ్‌ స్టేట్‌లో ఓ తీవ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. ఆ్రస్టేలియాలో భారీ ఎత్తున కాల్పులు జరగడం, పది మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.
     

  • న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ శీతాకల సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం, డిసంబర్‌ 15వ తేదీ) లోక్‌సభలో కేంద్రం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు, మరొకటి ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లును జేపీసీ(జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ) పంపే అవకాశం ఉంది. 

    వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్టాన్‌ బిల్లు అంటే..
    ఉన్నత విద్య నియంత్రణను పూర్తిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది.యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (VBSA) అనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

    12 మంది సభ్యులతో కూడిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ అనే అత్యున్నత కమిషన్ ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా విధానాలు, ప్రమాణాలు, నాణ్యత నియంత్రణను ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా కేంద్రానకి అధిక అధికారాలుంటాయి. దీని ఫలితంగా ఉన్నత విద్య నియమ నిబంధనలు అనేవి కేంద్రం నియంత్రణలోకి వస్తాయి. ముందుగా ప్రతిపాదించిన భారత ఉన్నత విద్యా కమిషన్( Higher Education Commission of India  బిల్లును ఇప్పుడు వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుగా మార్చారు.

    ప్రయోజనాలు
    సమగ్ర నియంత్రణగా అమలు చేయడానికి వీలవుతుంది.  అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే విధమైన ప్రమాణాలు.
    విభిన్న సంస్థల మధ్య గందరగోళం తగ్గుతుంది.
    ఒకే కమిషన్ ద్వారా విద్యా ప్రమాణాలు కఠినంగా అమలు చేయవచ్చు.


    ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌ బిల్లు
    పాత చట్టాలను రద్దు చేయడం లేదా వాటిలో మార్పులు చేయడం కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లు. ఇది కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా పాత చట్టాల్లోని అనవసరమైన, పాతబడ్డ నిబంధనలను తొలగించడానికి ఉపయోగిస్తారు

    ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పులు చేయడం. ఉదాహరణకు, ఒక చట్టంలోని సెక్షన్‌లో పదాలను మార్చడం, కొత్త నిబంధనలను చేర్చడం, లేదా పాత నిబంధనలను సవరించడం జరుగుతంది. దీని ద్వారా చట్ట వ్యవస్థను సులభతరం చేయడం జరుగుతుంది. 

    రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ
    మరొకవైపు రాజ్యసభలో  ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతుంది.  ఈ చర్చల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో అనేక తేడాలున్నాయన్నారు. సీసీటీవీ ఫుటేజ అందుబాటులో ఉంచాలన్నారు. ఈవీఎంలను నమ్మలేని పరిస్థితి వచ్చిందని, పేపర్‌ బ్యాలెట్‌పై అందరికీ నమ్మకం ఉందన్నారు వైవీ సుబ్బారెడ్డి. 

  • బెంగళూరు: బెంగళూరు నగరంలో రూ. 449 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ కాస్తా రన్నింగ్‌ ట్రాక్‌గా మారిపోయింది. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 449 కోట్ల భారీ వ్యయంతో  ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తు​న్నారు. దాదాపు ఐదు కి.మీ పొడవున్న ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా పేరొందింది.

    ఈ ఫ్లైఓవర్‌ మొదటి దశ (రాగిగుడ్డ నుండి హెచ్‌ఆర్‌ఎస్‌ లేఅవుట్‌కు) పనులు 2024 జూలై  నాటికి పూర్తయ్యాయి. దీంతో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే రెండవ దశ (హెచ్‌ఎస్‌ఆర్‌ నుండి రాగిగుడ్డ వైపు) నిర్మాణం పూర్తైనట్లు కనిపిస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.ఈ జాప్యానికి భారీ ట్రాఫిక్ రద్దీ, పని గంటలపై విధించిన ఆంక్షలే కారణమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌)అధికారులు చెబుతున్నారు. కాగా ప్రారంభానికి నోచుకోని ఈ ఫ్లైఓవర్‌ను స్థానికులు తమ మార్నింగ్‌ జాగింగ్, వాకింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగిస్తున్నారు.

    స్థానికుడు కిరణ్ కుమార్  మాట్లాడుతూ ‘ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి దాదాపు సిద్ధమైంది. అయితే యాక్సెస్ ర్యాంప్ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే మేము కట్టే రోడ్డు టాక్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దీనిపై రన్నింగ్‌ చేస్తున్నామన్నారు. అధికారికంగా వాహన రాకపోకలకు తెరుచుకోని ఈ ఫ్లైఓవర్ నగరంలో తాత్కాలిక వాహన రహిత రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. కాగా బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంలోని మిగిలిన 10శాతం పనులు త్వరలోనే పూర్తిచేసి, 2026 జనవరి చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటున్నారు.

    ఇది కూడా చదవండి: కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం!

International

  • వాషింగ్టన్‌: గ్లోబల్ వార్మింగ్‌ తాలూకు విపరిణామాలకు మరో తాజా తార్కాణం. గత నవంబర్‌ ప్రపంచవ్యాప్తంగా పెద్దగా చలి జాడలు లేకుండానే గడచిపోయింది. అంతేనా, చరిత్రలో అత్యంత వేడిని చవిచూసిన నవంబర్‌ మాసాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన కొపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్ సర్వీస్‌ (సీ3ఎస్‌) ఈ మేరకు చేదు వాస్తవాన్ని వెల్లడించింది.

    నవంబర్‌లో సగటు భూ ఉపరితల వాయు ఉష్ణోగ్రత 14.02 డిగ్రీ సెంటీగ్రేడ్‌ గా నమోదైంది. 1991–2020 నడుమ నమోదైన నవంబర్‌ సగటు కంటే ఇది ఏకంగా 0.65 డిగ్రీ అదనం! అత్యంత వేడిమి నవంబర్లుగా రికార్డులకెక్కిన 2023 కంటే 0.2 డిగ్రీలు, 2024 కంటే కేవలం 0.08 డిగ్రీలే తక్కువ. ఇక పారిశ్రామికీకరణ (1850–1900)కు ముందునాటితో పోలిస్తే ఏకంగా 1.54 డిగ్రీలు ఎక్కువ! ఈ విషయంలో అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీల పరిమితిని కూడా ఈ నవంబర్‌ దాటేసింది.

    2025లో తొలి 11 నెలల సంగతి చూసుకున్నా 1.48 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ లెక్కన 2025 కూడా చరిత్రలోనే అత్యంత వేడిమిమయమైన సంవత్సరాల జాబితాలో రెండు, లేదా మూడో స్థానంలో నిలవడం ఖాయమేనని సైంటిస్టులు (Scientists) అంటున్నారు.

    ఎంత భారీ తేడాలో! 
    ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత (Temperature) పెరుగుదలలో కూడా భీతి కలిగించే ఒక పరిణామాన్ని సైంటిస్టులు గమనించారు. ధ్రువ ప్రాంతాల్లో ఈ పెరుగుదల మరీ ఎక్కువగా నమోదైంది. ఆర్కిటిక్‌ లోని ఉత్తర కెనడా, ఆర్కిటిక్‌ మహాసముద్రం, పశ్చిమ రష్యా సగటు కంటే ఏకంగా 5 నుంచి 7 డిగ్రీలు ఎక్కువ వేడెక్కాయి.

    చ‌ద‌వండి: సంచ‌ల‌న విజ‌యం.. ఎవ‌రీ 'రైడ్ శ్రీలేఖ'?

  • ఆస్ట్రేలియా బీచ్‌లో  ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది అమాయక ప్రజలను పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి ఆసక్తికర విషయాలు తెలిపింది. కాల్పులు జరిపే కొద్ది సేపటి ముందు తన కుమారుడితో ఫోన్‌  మాట్లాడినట్లు పేర్కొంది. తన కుమారుడు తనతో ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడాడని కొద్దిసేపటి తర్వాత తినడానికి వెళ్తానన్నాడని తెలిపింది.

    ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని కొద్దికాలం క్రితమే ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. ‍అయితే తాజాగా ఈకాల్పుల ఘటనపై ఉగ్రవాది నవీద్ అక్రమ్ తల్లి స్పందించింది. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే అక్రమ్ తనతో మాట్లాడరని తెలిపింది.

    ఉగ్రవాది తల్లి వెరినా మాట్లాడుతూ "ఘటన జరగడానికి కొద్ది సేపు మందు నా కొడుకుతో మాట్లాడా అక్రమ్ చాలా సాధారణంగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే స్కూబా డ్రైవింగ్‌కు, స్విమ్మింగ్‌కు వెళ్లివచ్చాను. ఈ రోజు చాలా వేడిగా ఉంది హోటల్‌లోనే ఉంటాను. కొద్దిసేపు తర్వాత తింటాను " అని అక్రమ్ అన్నారని తన తల్లి పేర్కొంది. తన కొడుకు చాలా మంచివాడని అతనికి ఏలాంటి దురలవాట్లు లేవని,స్నేహితులతో కూడా ఎక్కువ తిరగడని తనకు పనికి వెళ్లడం ఇంటికి రావడం తప్ప మరేది తెలియదని ఆమె అంది. ‍

    అయితే తన కుమారుడి చిత్రాలను ప్రస్తుతం చూపిస్తున్న చిత్రాలతో సరిపోల్చలేమని తెలిపింది. నవీద్ అక్రమ్ సిడ్నీలోని హెకెన్‌బర్గ్- అల్- మురాద్‌ ఇనిస్టిట్యుూట్‌లో ఖురాన్ సంబంధింత అధ్యయనాలని పూర్తి చేశాడు. 2024లో అక్కడే ఒక గృహాన్ని కొనుగోలు చేశాడు. ఇటీవల తన పని చేస్తున్న నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో అతని ఉద్యోగం పోయినట్లు అతని తల్లి తెలిపింది.  

     

     

  • అలజడులు సృష్టించడం.. పదుగురు అటెన్షన్ రాబట్టుకోవడం.. మనుషుల ప్రాణాలను ఏమాత్రం ఆదలెక్కలేకుండా ఎడాపెడా తీసేయడం.. ఇవే కదా ఉగ్రవాద లక్షణాలు.. లక్ష్యాలు. మరి ఈ ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితం చేయడం ఎంతవరకు సబబు? క్రూరత్వానికి మతమేముంటుంది? విద్వేషానికి, కుట్రలకు, కుతంత్రాలకు మతమంటూ ఉంటుందా? తాజాగా ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని ఓ బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే వీరిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారు కావడంతో విమర్శలు మరింత ఘాటుగా.. నాటుగా ఉంటున్నాయి.

    బాండీ బీచ్ లో ఆదివారం తుపాకులు గర్జించడంతో ఆస్ట్రేలియా సిడ్నీ ఉలిక్కిపడ్డాయి. బాండీ బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన సందర్శకులకు ఆక్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులు చేతపట్టుకుని  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాండీ బీచ్ లో సంప్రదాయంగా జరుగుతున్న హనుక వేడుకల్లో పాల్గొన్న జుయిష్ కమ్యూనిటీ ప్రజల్లో  ఏమయ్యిందో తెలుసుకునేలోగా 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 29 మందికి గాయాలయ్యాయి. ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న వేడుక.. రక్తసిక్త రణరంగంగా మారిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో తండ్రి కుమారుడు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారు...ముస్లిం మతస్తులు కావడంతో...ఆ మతం పై సహజంగానే కొందరు విరుచుకు పడుతున్నారు.

    అయితే ఇంత ఘోర ఉగ్రచర్యల్ని అడ్డుకుంది కూడా ఓ ముసల్మానే అని మనం గుర్తుంచుకోవాలి. అతనో పండ్ల వ్యాపారి. ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులిద్దరూ తుపాకులు పట్టుకుని విచక్షణ రహితంగా కాలుస్తుంటే.. పండ్లవ్యాపారి అహ్మద్ అత్యంత ధైర్యసాహసాలను, మానవత్వాన్ని ప్రదర్శించాడు. వెనకనుంచి వచ్చి వారిలో ఒకరికి వారి గన్ తీసుకుని గురిపెట్టి తరిమేయసాగాడు. కానీ మరో ఉగ్రవాది అతడిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో అహ్మద్ రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అహ్మద్ చొరవ ప్రదర్శించకుండా ఉంటే మరికొందరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోయేవారే.

    కాల్పుల ఘటన సమయంలో అక్కడే ఉన్న  ఇంగ్లండ్ మాజీ క్రికెటర్...కామెంటేటర్ మైకేల్ వాన్ అహ్మద్ చూపిన చొరవ తెగింపును ప్రశంసించాడు. ఘటన సమయంలో బాండీ బీచ్ కు దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో వాన్ తన కుటుంబంతో ఉన్నాడు. ఫోన్లో మాటాడ్డానికి బైటికి వెళ్లిన సమయంలో ఈ కాల్పుల శబ్దం వినిపించినట్లు వివరించాడు. అహ్మద్ చూపిన మానవీయ దైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  అహ్మద్ నిజమైన హీరో అని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

    పెహల్గాం దాడిలో  పాల్గొంది ముస్లింలే కావచ్చు. వారు బాధితుల్ని మతం అడిగి మరీ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. అలాగే మన దేశంలో చాలా వరకు ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదుల మతం ముస్లిం మతమే కావచ్చు. అయినంత మాత్రాన అందరినీ అదే గాటన కట్టేయడం సరికాదని కొందరి అభిప్రాయం. ఉగ్రవాదమనేది మనిషిలోని అతిరేక లక్షణమే గానీ మతం విధానం కానేకాదు.

    ఇప్పుడు చెప్పండి.. విచక్షణారహితంగా ఉగ్రరూపంతో కాల్పులు జరిపిన తండ్రీ కొడుకులు ముస్లిం మతానికి చెందిన వారు. అలాగే ధైర్య సాహసాలతో మానవీయతతో ప్రజల్ని ఆ కాల్పుల నుంచి కాపాడిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడే. మరి ముస్లింలందరూ ఉగ్రవాదులే అన్న కొందరి వితండ వాదన నిజమైతే ...పండ్ల వ్యాపారి అహ్మద్ కు ఎదుర్కోవాల్సిన పనేం ఉంది. తను కూడా ఉగ్రవాదుల చర్యల్ని సమర్థించవచ్చు కదా అంటున్నారు సెక్యూలరిస్టులు. ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులుండవచ్చేమో గానీ  ఉగ్రవాదులందరూ ముస్లింలే అనడం అర్థరహితం. అసలు ఉగ్రవాదానికి ముస్లిం మతమెందుకు ఉంటుంది? అది కొందరు పనిగట్టుకుని అద్దిన రంగు మాత్రమే.
    - ఆర్‌ఎం.

     

     

     

     

     

Politics

  • తాడేపల్లి :గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. 

     మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో  ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్‌ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్‌సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్‌లోకి తీసకెళ్లారు. 

    ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను  అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్‌సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు.  అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు. 

    ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు.
     

  • విశాఖ : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి జరగలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నార్‌ మరోసారి ధ్వజమెత్తారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కేసులు బనాయించడం, లప్పులు చేయడం, తండ్రీ కొడుకులు గొప్పలు చెప్పుకోవడం ఇవే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్‌ 15వ తేదీ) అమర్నాథ్‌ మాట్లాడుతూ.. ‘పెద్ద కంపెనీలకు భూములు ఇవ్వడం.. పెట్టుబడులను ప్రోత్సాహించడం సహజం. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టాబేడుతున్నారు. ఆ కంపెనిల్లో సత్వ ఒకటి. సత్త్వ కంపెనీకి 30 ఎకరాలు రిషికొండలో ఇచ్చారు. 

    మార్కెట్ విలువ రూ. 40 కోట్లు ఎకరా ఉంటుంది.మొత్తం 30 ఎకరాలు రూ. 45 కోట్లకే ప్రభుత్వం కేటాయించింది. సత్త్వ ఉద్యోగాలు ఇవ్వదు. ఇది ఒక అద్దెలకు ఇచ్చుకునే సంస్థ. భూమి కేటాయించిన 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇప్పటి వరకూ డబ్బులు సత్త్వ కంపెనీ కట్టలేదు. డబ్బులు కట్టడానికి గడువు పెంచుతూ జిఓ ఇచ్చారు. వడ్డీ కూడా లేకుండా చేశారు. 

    రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి 45 కోట్లకు కొట్టేసి.. ఆ డబ్బులు కూడా కట్టడం లేదు. సత్త్వ వెనక సీఎం చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. ఆ సంస్థ చేసే నిర్మానాలకు 50 శాతం మళ్ళీ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఒప్పందం ఉందా..?. 50% భూమిలో గృహ నిర్మానాలు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు..ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..?, సత్త్వ అన్ని రాష్ట్రల్లో వేలంలో భూములు కొనుక్కుంది’ అని స్పష్టం చేశారు. 

  • సాక్షి, అమరావతి: మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా ఈ ర్యాలీ జరిగింది. కోటి సంతకాల సేకరణ ప్రతులతో జరిగిన ఈ బైక్ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీకి జనం పోటెత్తారు.

    ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని వెనకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి కూటమి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ మార్కాపురం ఇన్చార్జి అన్న రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ మెడికల్ కాలేజీ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే కడుపుమంటతో చంద్రబాబు ప్రైవేటీకరణ చేశారన్నారు. మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతాల నుంచి వైద్యం కోసం ప్రజలు నేటికీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ నిర్వహణల  ఉంటే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85 వేల మంది సంతకాలు చేశారని అన్నా రాంబాబు తెలిపారు.

    నంద్యాల జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారు

    అన్నమయ్య జిల్లా: జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో నినాదాలు హోరెత్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ ప్రజానీకం కదం తొక్కింది. ‘‘పేదలకు అండ వైఎస్ జగన్. కార్పోరేట్‌లకు అండ చంద్రబాబు. సీఎం డౌన్.. డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

  • చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ప్రజా పోరాటంగా మారిన తీరు యావత్‌ దేశాన్నే ఆశ్చర్యపరుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఈ ఉద్యమాన్ని “ప్రజా గళం”గా అభివర్ణించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. అందుకు కారణం.. విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనడమే!.. 

    పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే.. 

    చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్‌ జగన్‌ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. 

    ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్‌ జగన్‌ అభిమతం. 

    రచ్చబండతో షురూ ..
    అక్టోబర్‌లో వైఎస్సార్‌సీపీ “రచ్చబండ” పేరుతో ప్రజల మధ్యకు వెళ్లి సంతకాల సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..  విద్యార్థులు, యువత, మేధావులు, వైద్య వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు.

    తుపాను ఆపలేకపోయింది!
    లక్ష్యం కోటి సంతకాలు. ఆ సమయంలోనే తుపాను, వర్షాలు వచ్చాయి. దీంతో ఈ కార్యక్రమం ప్లాప్‌ అవుతుందని కూటమి సర్కార్‌ సంతోషించింది. కానీ, ప్రభుత్వ వ్యతిరేక ప్రజాభిప్రాయం సేకరణ ఏ దశలోనూ ఆగిపోలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం సంతకాలు చేస్తూనే వచ్చారు. ఆపై ఈ ప్రజా ఉద్యమం నవంబర్‌కొచ్చేసరికి నియోజకవర్గాల స్థాయికి చేరింది. 

    ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. అటుపై సంతకాల బాక్సులు సేకరించి.. నియోజకవర్గాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రాలకు తరలించారు. ఆ ర్యాలీలకు అనూహ స్పందన లభించింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసించాలి అంటూ ఆ ర్యాలీల్లో నినాదాలు చేశారు. 

    డిసెంబర్‌ మొదటి వారం కల్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆ బాక్సులను భద్రంగా జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసులకు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ర్యాలీగా తాడేపల్లికి తరలించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఉద్యమం.. తమ ఆరోగ్యం, విద్యా హక్కుల పరిరక్షణ కోసమని జనం అర్థం చేసుకున్నారు. అందుకే ఇవాళ్టి(సోమవారం) ర్యాలీలో పార్టీ శ్రేణులకు పోటీగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం వల్లే ఇది ఒక విశాలమైన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా నిలిచి దేశం దృష్టిని ఆకర్షించగలిగింది.

Family

  • ఫర్నీచర్‌ అనగానే చాలామటుకు ప్లాస్టిక్‌ ఏదో రూపంలో వినియోగిస్తున్నాం. ముఖ్యంగ కుర్చీలు, సోఫాసెట్‌ల వరకు అన్నింట్లో ప్లాస్టిక్‌ మయం. కాస్త డబ్బులు బాగా ఉంటే..మంచి వుడ్‌తో చేసిన ఫర్నీచర్‌ ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఖరీదు కూడా. ఇలా అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్‌ ఫర్నీచర్‌కి అడ్డుకట్ట వేసేలా ముంబైకి చెందిన దంపతులు విన్నూతన ఆవిష్కరణకు తెరలేపారు. భూమాతకు హానికరం కానీ మట్టిలో కలిసిపోయే ఫర్నీచర్‌ని అన్వేషించి మరి సరికొత్త ఆవిష్కరణకు పూనుకుని అందరిచేత ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు ఆ  ఫర్నిచర్‌ని ఏవిధంగా తయారు చేశారంటే..

    మష్రూమ్‌తో ఫర్నిచర్‌ డిజైన్‌కి శ్రీకారం చుట్టారు ముంబైకి చెందిన భక్తి లునావత్‌, సుయాష్‌ సావంత్‌ దంపతులు. 2010లో ముంబైలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. అలా 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇద్దరూ బార్సిలోనాలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కాటలోనియా (ఐఏఏసీ)కి పై చదువుల కోసం వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇద్దరి వేర్వేరు మార్గాల్లో పయనించారు. భక్తి స్పానిష్ ఆర్కిటెక్ట్ రికార్డో బోఫిల్‌తో కలిసి పనిచేస్తే.. సుయాష్ లిస్బన్‌లో ప్రాక్టీస్ చేశాడు. కానీ.. ఇద్దరూ 2022లో తిరిగొచ్చి ముంబైలో కలుసుకున్నారు. అదే సంవత్సరం వాళ్లు 'అనోమాలియా' పేరుతో స్టార్టప్‌ పెట్టారు.

    సాధారణంగా కన్‌స్ట్రక్షన్‌, డిజైన్ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యర్థాలు వస్తుంటాయి. వాటిని తగ్గించే మార్గాల కోసం ఇద్దరు అన్వేషించారు. వారిద్దర్ని కలిపింది కూడా ఆ ఆలోచనే. అప్పుడే వాళ్లు మైసిలియం రీ జెనరేటివ్‌, సర్క్యులర్‌ నేచర్‌ గురించి తెలుసుకున్నారు. దాంతో ఫర్నిచర్‌ తయారుచేస్తే లైఫ్‌ స్పాన్‌ పూర్తి కాగానే బయోడీగ్రేడ్‌ అవుతుంది. అంటే నేచర్‌లో కలిసిపోతుంది. ఇతర ఫర్నిచర్‌ మెటీరియల్స్‌లా భూమిపై పేరుకుపోదని గుర్తించారు.

    దీనిపై ప్రయోగాలు చేసేందుకు కరోనా టైం కలిసొచ్చింది. అప్పుడే వాళ్లు దీనిపై రీసెర్చ్, ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముందుగా వాళ్లు కప్ కేక్ ట్రేల్లో మష్రూమ్స్‌ని పెంచారు. అవి తేలికగా ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అప్పటినుంచి వాటితో ఇటుకలు, పార్టిషన్స్‌, క్లాత్ తయారుచేశారు. చివరికి ఫర్నిచర్‌తో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు.

    ఇది పెరుగుతుందే గానీ..తయారవ్వదు..
    ఇప్పుడు వాళ్లు అనోమాలియాలో ఫర్నిచర్ తయారుచేయడం లేదు. పెంచుతున్నారు. అందుకే 'గ్రోన్ నాట్ బిల్ట్' అనే ట్యాగ్‌లైన్‌తో ప్రొడక్ట్స్‌ని ప్రమోట్‌ చేస్తున్నారు. మైసిలియంని అగ్రికల్చర్ వేస్ట్‌తో కలిపి మాడ్యులర్ 'మైక్రోబ్లాక్‌లను' తయారుచేస్తారు. ప్రతి బ్లాక్ 1.5 కిలోల బరువు ఉంటుంది. కానీ, 1.5 టన్నుల కంప్రెసివ్ లోడ్‌ను తట్టుకోగలదు. ఈ బ్లాక్‌లను స్టూల్స్, టేబుళ్లు, అల్మారాలు.. ఇలా ఏ ఫర్నిచర్ తయారీలో అయినా వాడుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. దీంతో 'మైకోలైవింగ్' అనే మైసిలియం క్లాత్‌ని కూడా తయారుచేస్తున్నారు.

    మైసిలియం ఓవర్‌ గ్రోత్‌ దశలో ఉన్నప్పుడు దాని పొరని ఒలిచి, ప్రాసెస్ చేసి సీటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. పెరిగిన మైసిలియం బ్లాక్స్‌ను కాల్చడం, ఎండలో ఆరబెట్టడం వల్ల అది చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. దానికి తేనె తెట్టె మైనం, లైమ్‌ ప్లాస్టర్ లాంటి న్యాచురల్ కోటింగ్స్‌ వేస్తారు. వీళ్లు తయారుచేసిన ప్రొడక్ట్స్‌ 10 నుంచి 12 సంవత్సరాల వరకు మన్నికగా ఉంటాయి. ఆ తర్వాత చెత్తలో వేస్తే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. అయితే ఈ పుట్టగొడుగులు పెంచడం అంత సులభం కాదు. 

    అందుకు సవాళ్ల తోపాటు, ఓపిక చాలా అవసరం. ఆర్థికంగా కూడా ఈ స్థార్టప్‌ ప్రయాణం చాలా కష్టమే. ఇక భక్తి, సయాష్‌లు ఉద్యోగాలు చేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టేశారు. అలాగే దీనికి గోద్రేజ్ లాంటి ఫెలోషిప్స్‌, గ్రాంట్ల వల్ల కొంత ఆర్థికసాయం కూడా తోడైంది. అలా 2022లో అనోమాలియాను ప్రారంభించారు. మొదట్లో తమ ప్రొడక్ట్‌ని కొంటారో లేదో అని భయపడ్డారు. కానీ మూడేళ్లకే వాళ్ల ప్రొడక్ట్స్‌కి మంచి గుర్తింపు లభించింది. 

    2025లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ వేదికల్లో ఒకటైన వెనిస్ బిన్నెలేలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని ఎంవైసీఎల్‌ కంపెనీతో పార్ట్‌నర్‌షిప్‌ కుదుర్చుకున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మైసిలియం ఉత్పత్తిదారుల్లో ఒకటి. ఇందులో రైతులను కూడా భాగస్వాములను చేయాలని చూస్తున్నారు ఇద్దరూ. వాళ్ల సాయంతోనే వ్యర్థాలను సేకరించి పర్యావరణానికి మేలుచేసే ఫర్నీచర్‌ ఉత్పత్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు భక్తి, సుయోష్‌లు.

    (చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..)

     

  • కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఒంటరిగా పోటీ చేసి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం 101 వార్డుల‌కు జ‌ర‌గిన ఎన్నిక‌ల్లో 50 చోట్ల బీజేపీ అభ్య‌ర్థులు గెలిచారు. దీంతో తిరువ‌నంత‌పురం మేయర్ పీఠం తొలిసారిగా కాషాయ పార్టీకి ద‌క్కింది. అయితే మేయ‌ర్‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. మేయ‌ర్ రేసులో సీనియ‌ర్ మ‌హిళా ఐపీఎస్ అధికారి ఆర్‌. శ్రీలేఖ (R. Sreelekha) ముందంజ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 64 ఏళ్ల శ్రీలేఖ శాస్త్ర మంగ‌ళం వార్డు నుంచి ఎల్‌డీఎఫ్ కూటమి అభ్య‌ర్థిపై 700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

    మోదీ స్ఫూర్తితో పొలిటిక‌ల్ ఎంట్రీ
    1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శ్రీలేఖ కేర‌ళ‌లో తొలి మ‌హిళా ఐపీఎస్‌గా రికార్డుకెక్కారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొన్న ఆమె, వివాద‌స్ప‌ద అధికారిగా పేరుగాంచారు. 2020లో పదవీ విరమణ చేశారు. అప్ప‌టి నుంచి అనేక అంశాల‌పై బ‌హిరంగంగా స్పందిస్తూ వ‌స్తున్నారు. 2024, అక్టోబ‌ర్‌లో ఆమె బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ స్ఫూర్తితో తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు చెప్పారు.  “నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాను. పదవీ విరమణ తర్వాత, ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఉత్తమ మార్గమని నేను నమ్ముతున్నాను,” అని ఆమె అన్నారు.

    లెక్చ‌ర‌ర్ టు ఐపీఎస్‌
    శ్రీలేఖ తిరువ‌నంత‌పురంలోనే పుట్టిపెరిగారు. 1960 డిసెంబర్ 25న ప్రొఫెసర్ ఎన్. వేలాయుధన్ నాయర్, బి. రాధమ్మ దంపతులకు ఆమె జన్మించారు. కాటన్ హిల్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభాస్యం ప్రారంభించారు. ఆ త‌ర్వాత ఉమెన్స్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో తన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ నుంచి మాస్టర్ డిగ్రీ ప‌ట్టా అందుకున్న త‌ర్వాత లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం మొద‌లుపెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులు రిజర్వ్ బ్యాంక్‌లో కూడా పనిచేశారు. 1987, జనవరిలో కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా పోలీసు స‌ర్వీసులో చేరారు. మ‌హిళ‌లు పోలీసు ఉన్న‌త ఉద్యోగాల్లో చేర‌డానికి ఆమె ప్రేర‌ణ‌గా నిలిచారు.

    త‌ల్లి ప్రోత్సాహం
    మ‌హిళా ఐపీఎస్ అధికారిగా మొద‌టి ప‌దేళ్లు చాలా స‌వాళ్లు ఎదుర్కొన్నాన‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్య్వూలో చెప్పారు. మహిళా పోలీసు అధికారికి స్నేహపూర్వకంగా లేని వ్యవస్థతో పోరాడటానికి తాను రెట్టింపు కష్టపడ్డానని పేర్కొన్నారు. అయితే ఎంతో మంది యువ‌తులు త‌న‌ను స్ఫూర్తిగా తీసుకోవ‌డం ఆనందం క‌లిగించే విష‌య‌మ‌ని చెబుతూ... వేరే రాష్ట్రానికి చెందిన ఒక యువ మ‌హిళా ఐపీఎస్ తనలాగే కావాలని ఆకాంక్షిస్తున్నా ఆశీర్వాదం కోసం తన వద్దకు వచ్చిన క్షణాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. త‌న త‌ల్లి ఇచ్చిన ప్రోత్సాహం కార‌ణంగానే తాను ఐపీఎస్ సాధించాన‌ని శ్రీలేఖ వెల్ల‌డించారు. కాగా, పోలీసు శాఖలో మహిళల ప్రాతినిథ్యం పెంచ‌డానికి శ్రీలేఖ కృషి చేశారు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాల్లో  'పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి' అనే నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె నిరంతరం లేఖలు రాసేవారు. ఆమె కాలంలో 4 శాతం ఉన్న మహిళా ప్రాతినిధ్యం, నేడు పోలీసు బలగంలో 9 శాతానికి పైగా పెరిగింది.

    'రైడ్ శ్రీలేఖ'
    చేర్తలా, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజ జిల్లాల్లో ఎస్పీగా ప‌నిచేశారు శ్రీలేఖ. త‌న ప‌నితీరుతో 'రైడ్ శ్రీలేఖ'గా ఆమె ప్రాచుర్యం పొందారు. సీబీఐలో నాలుగేళ్లు ప‌నిచేశారు. న్యూఢిల్లీలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గానూ సేవ‌లు అందించారు. డిఐజీ, ఐజీ, ఏడీజీపీగా ఆమె విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరో, క్రైమ్ బ్రాంచ్‌కు నాయకత్వం వహించారు. ఆర్థిక నేరాల కేసుల విచార‌ణ‌లో భాగంగా దాడులు చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. ఆమె నాయకత్వంలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అవినీతిని బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. అందుకే ఆమెకు 'రైడ్ శ్రీలేఖ' అనే పేరు వ‌చ్చింది. 2007లో కేరళ ప్రభుత్వం ఆమెను విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది.

    నిందితురాలికి చెంప‌దెబ్బ‌
    కేర‌ళ సంచ‌ల‌నం రేపిన 2003 నాటి కిలిరూర్ లైంగిక వేధింపుల కుంభ‌కోణంలో ప్రధాన నిందితురాలైన లతా నాయర్‌ను చెంప‌దెబ్బ కొట్టి వార్త‌ల్లో నిలిచారు శ్రీలేఖ‌. ఇలా కొట్ట‌డం చట్టవిరుద్ధమైన‌ప్ప‌టికీ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకున్నారామె. మైనర్ బాలికల లైంగిక దోపిడీపై ద‌ర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఒక‌రిని అప్ప‌ట్లో శ్రీలేఖ క‌లిశారు. త‌మ‌కు ఈ గ‌తి ప‌ట్టించిన దుర్మార్గుల‌ను ప‌ట్టుకుని రెండు చెంపదెబ్బలు కొట్ట‌మ‌ని ఆమెను బాధితురాలు వేడుకుంది. ఆమె కోరిక మేర‌కు నిందితురాలిని చెంప‌దెబ్బ కొట్టారు. “ఇంకొకటి మిగిలి ఉంది. రెండో చెంప‌దెబ్బ కొట్ట‌నందుకు బాధ ప‌డుతున్నాను” అని తర్వాత అన్నారు. పోలీసు విభాగంలో స్త్రీ ద్వేషం, లైంగిక వేధింపులను కూడా ఆమె బ‌హిరంగంగానే ప్ర‌తిఘ‌టించారు.

    చ‌ద‌వండి: సివిల్స్ విజేత‌ల్లో ఎక్కువ మంది వారే!

    చిన్న‌నాటి స్నేహితుడే భ‌ర్త‌
    శ్రీలేఖ వ్య‌క్తిగ‌త జీవితానికి వ‌స్తే.. ఆమె భర్త డాక్టర్ సేతునాథ్ తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పీడియాట్రిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా ప‌నిచేశారు. సేతునాథ్ ఆమె చిన్న‌నాటి స్నేహితుడు కావ‌డం విశేషం. వీరి కుమారుడు గోకుల్ ఎంబీఏ చదువుతున్నాడు. శ్రీలేఖ రచయిత్రి కూడా.  'మరణదూతన్' అనే డిటెక్టివ్ నవల సహా తొమ్మిది పుస్తకాలు రాశారు. 

  • ఆ్రస్టేలియాలోని సిడ్నీలోని బాండీ బీచ్‌ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక విషాదంగా మార్చేసి..సంతోషాన్ని ఆవిరి చేశారు ముష్కరులు. ఆదివారం సెలవరోజు కావడం సరదాగా బీచ్‌లో ఈ పండుగ చేసుకుంటున్న యూదులపై హఠాత్తుగా కాల్పులు జరిపారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో అక్కడికక్కడే 16 మందికి పైగా మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలయ్యారు. ఇలా మతపరమైన వేడుకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారంటే..ఇది కచ్చితంగా ఉగ్రదాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో యూదులు జరుపుకునే పండు హనుక్కా అంటే ఏంటి. ఈ పండుగ ప్రధానోద్ధేశ్యం ఏంటో చూద్దామా..!.

    యూదుల సంప్రదాయ హనుక్కా వేడుక (Hanukkah)ను "కాంతి పండుగ" అని కూడా పిలుచుకుంటారు. మక్కబీస్ (Maccabees) అనే యోధులు జెరూసలేం ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన అద్భుతానికి గుర్తుగా  ఈ వేడుకను ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. 

    దీనిలో భాగంగా ప్రతిరాత్రి మెనోరా (Menorah) పై(కొవ్వొత్తుల స్టాండ్‌) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు, ఆటలు, పాటలతో గడుపుతారు. ఆ రోజు నూనెతో చేసిన వంటకాలను తింటారు. ఈ పండుగ అణిచివేత నుంచి సంపాదించుకున్న స్వేచ్ఛ, విశ్వాసాలకు ప్రతీకగా జరుపుకుంటారు యూదులు.  

    హనుక్కా అంటే..
    "హనుక్కా" అంటే హీబ్రూలో "అంకితం" (dedication) అని అర్థం. ఇది ఆలయ పునఃప్రతిష్ఠను సూచిస్తుంది.

    అద్భుతం జరిగిన రోజు..
    క్రీ.పూ. 2వ శతాబ్దంలో గ్రీకు-సిరియన్ పాలకులు యూదుల మత స్వేచ్ఛను అణచివేసినప్పుడు, మక్కబీస్ (Maccabees) అనే యోధులు పోరాడి ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆలయంలో ఒక రోజుకు సరిపడా నూనె ఎనిమిది రోజులు వెలిగిందని ఒక అద్భుతం జరిగింది.

    ఏరోజున ఈ పండుగ జరుపుకుంటారంటే..
    ఇది హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కిస్లేవ్ (Kislev) నెల 25వ రోజున ప్రారంభమై ఎనిమిది రోజుల పాటు జరుపుకుంటారు. 

    ఎలా జరుపుకుంటారు?
    మెనోరా వెలిగించడం(ప్రత్యేక దీపపు స్టాండ్‌): ప్రతి రాత్రి తొమ్మిది కొమ్మల దీపం (Hanukkiah లేదా Menorah) వెలిగిస్తారు. ఒక ప్రత్యేక కొవ్వొత్తి (Shamash) మిగిలిన ఎనిమిదింటిని వెలిగిస్తుంది. ఇది అద్భుతానికి ప్రతీక.

    డ్రీడెల్ (Dreidel) అనే నాలుగు వైపుల బొంగరంతో ఆడుతూ పాటలు పాడుతూ జరుపుకుంటారు.

    విందు..
    ఆరోజు ముఖ్యంగా బంగాళదుపంతో చేసిన పాన్‌కేక్‌లను తప్పనిసరిగా ఆరగిస్తారు. దాంతోపాటు జామ​్‌ డోనట్స్‌ను కూడా ఆస్వాదిస్తారు. అంతేగాదు ఆరోజు పిల్లల కోసం ప్రత్యేకంగా చాక్లెట్‌ బాక్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చి పెద్దలు ఆశీర్వాదాలు అందిస్తుంటారు కూడా.

    స్వేచ్ఛకు గుర్తుగా చేసుకునే హనుక్కా పండగ రోజునే ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపి వేడుకను ఆస్వాదించే స్వేచ్ఛే లేకుండా చేసి తీరని శోకాన్ని నింపారు. నాడు జరిగిన అద్భుతమే జరిగి..తమ పండుగను యూదులు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

    (చదవండి: ఏఐతో.. 'మెస్సీ'మరైజ్‌! సెల్ఫీ రూ. 10 లక్షలు..)

     

     

NRI

  • శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.

    కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్‌మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

    స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.

    2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;
    2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;

    అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

    డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

    SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

    శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.

    (చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!)

  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. 

    ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. 

    ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్‌ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. 

    అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

    వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు
    ‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.

    అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.

    ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.

    (చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యుడిగా ఉదయ్‌ నాగరాజు)

Telangana

  • సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో దారుణం జరిగింది. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమపై పోటీ చేశారని కోపంతో ఒక అభ్యర్థి కుటుంబంపైకి ట్రాక్టర్ ఎక్కించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సోమర్‌పేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పాపయ్య, బాలరాజ్‌ అనే ఇద్దరు  అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో పాపయ్య గెలుపోందారు. దీంతో ఎన్నికల్లో తమ పైనే పోటీ చేశారనే కోపంతో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి తమ్ముడైన చిరంజీవి అనే వ్యక్తి బాలరాజ్‌ కుటుంబంపై ట్రాక్టర్‌ ఎక్కించాడు.

    ఈ ప్రమాదంలో బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులు బాలమణి, స్వరూప, భారతి, పద్మసత్వవలకు  తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాద ఘటనతో సోమర్‌పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఈ ఘటనపై సోమర్‌పేట గ్రామం భగ్గుమంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఎల్లారెడ్డిలో 4 గంటలుగా ధర్నా చేపడుతున్నారు.  

    ఎల్లారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మెుహరించారు. రాష్ట్రంలో మూడుదశలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఆదివారం రెండో విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. చివరిదశ  ఎలక్షన్లు 17 తారీఖున జరగనున్నాయి.

Karimnagar

  • నోట్లు పాయే.. ఓట్లు రాకపాయే!

    సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తొలి, మలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండు విడతల్లోని ఫలితాలపై అభ్యర్థులు పోస్టుమార్టం చేస్తున్నారు. నోట్ల కట్టలు పాయే.. ఓట్లు రాకపాయే అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి రెండో విడత ఫలితాలు వెలువడిన ఆదివారం వరకు అభ్యర్థులు చేసి ఖర్చు తడిసి మోపైడెంది. తొలివిడత నామినేషన్ల పర్వం నుంచి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు నాటికి చేసిన ఖర్చు ఎంత.. వచ్చిన ఓట్లు ఎన్ని అని అభ్యర్థులు లెక్కలేస్తున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు చేసిన వారిలో గెలిచిన వారు సంబరాల్లో ముగిని తేలుతుండగా.. ఓడిన వారు ఎక్కడ బోల్తాకొట్టామని సమీక్షించుకుంటున్నారు.

    నమ్మకంగా వంచించారంటూ ఆవేదన

    ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఖర్చుకు వెనకాడకుండ ముందుకెళ్లిన అభ్యర్థులు పరాజయభారంతో చేసిన ఖర్చును లెక్కలేస్తున్నారు. కులసంఘాల వారీగా, ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బు ఓట్లను రాల్చకపోవడంతో ఏమైందనే ఆవేదనకు లోనవుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. ఇంకా కులసంఘాలకు, యువజన సంఘాలకు, సన్నిహితులకు మందుపార్టీలు అదనం. మహిళా ఓటర్లకు చీరల పంపిణీ, వెండి భరణిలు, దేవుడి లడ్డూలను పంపిణీ చేసిన అభ్యర్థులు గెలుపు అంచు వరకు వెళ్లి ఓడిపోవడంతో అవాక్కయ్యారు. నమ్మకంగా వంచించారంటూ కోవర్టు రాజకీయాలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎన్నికలు సవ్యంగా సాగడంతో అధికారులు ఫలితాలు ప్రకటించారు. ఒక రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడఅర్బన్‌ మండలం చింతల్‌ఠాణాలో చనిపోయిన వ్యక్తి చెర్ల రమేశ్‌ గెలుపొందడంతో ఆ ఫలితాలను నిలిపివేశారు.

    ఓట్ల ఖరీదు రూ.200 కోట్లు

    ఉమ్మడి జిల్లాలో తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు అభ్యర్థులు ఖర్చు పెట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే రెండు విడతల్లో దాదాపు రూ.50కోట్లకు పైగా డబ్బును వెచ్చించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పక్షం రోజులుగా సగటును ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అనధికారికంగా వెచ్చించారు. ఒక్కో ఊరిలో సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు కలిపి సగటున రూ.35 లక్షల వరకు ఖర్చు చేశారు. పెద్ద గ్రామాల్లో ఈ వ్యయం మరింత పెరిగింది. ఈ లెక్కన ఒక్కో ఓటు కోసం సగటున సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు రూ.3వేలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖర్చు చేసిన డబ్బుకు గౌరవ ప్రదమైన ఓట్లు రాకపోయేనని పరాజితులు కన్నీరుపెడుతున్నారు. విజయం సాధించిన అభ్యర్థులు లెక్కల జోలికి వెళ్లకుండా విజయోత్సవాల్లో ఉన్నారు.

    వదిలిందెంత? వచ్చిందెంత ?

    ఎన్ని‘కల’ల్లో రూ.‘లక్ష’ణంగా ఖర్చు

    పైసలు పోయే.. ఫలితం లేకపాయే

    ‘పంచాయతీ’ ఎన్నికల ఫలితాలపై పరాజితుల పోస్ట్‌మార్టం

    నమ్మకంగా వంచించారని ఆవేదన

    తొలి, మలి విడతల్లో అనధికారిక ఖర్చు రూ.200 కోట్లు

  • చలో ‘గురుకులం’

    కరీంనగర్‌టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా 2026– 27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్‌ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇంగ్లిష్‌ మీడియంలో విజయవంతంగా నడుస్తున్న గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్‌ జోనల్‌ పరిధిలో50 గురుకులు పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలలో జిల్లాలో 2,227పై సీట్లు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 5, జగిత్యాలలో 5, పెద్దపల్లిలో6, రాజన్న సిరిసిల్లలో 7 కలిపి 23 గురుకులాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో చింతకుంట, హుజూరాబాద్‌, జమ్మికుంట, మానకొండూర్‌, జగిత్యాల జిల్లాలో మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, గొల్లపల్లి, పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని, రామగుండం, నందిమేడారం, మల్లాపూర్‌, గొల్లపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి, వేములవాడ, చిన్నబోనాల, బోయినపల్లి, ముస్తాబాద్‌, నర్మాల, ఇల్లంతకుంట లలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటితోపాటు రాజన్నసిరిసిల్ల జోన్‌ పరిధిలో గురుకులాలు కుండా కరీంనగర్‌ జోన్‌ పరిధిలోకి వస్తాయి. వీటిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఈనెల 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లు గరిష్ట సడలింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.

    కరీంనగర్‌ జోన్‌ల్‌ పరిధిలో 2,227 సీట్లు

    ఉమ్మడి జిల్లాలోని 23 గురుకులాల్లో 5వ తరగతిలో ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్ల చొప్పున 1,840 సీట్లు ఉన్నాయి. కరీంనగర్‌లో జోన్‌ల్‌ పరిధిలో మిగితా పాఠశాలలున్నాయి. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధనతో పాటు, భోజనవసతితో పాటు సకల వసతులు ఉంటాయి. సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉండనుంది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధించనున్నారు. ఎస్సీలకు 65 సీట్లు, ఎస్టీ, బీసీ,ౖ మెనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఒక్కసారి ప్రవేశం పొందితే 12వ తరగతి వరకు ఉచితంగా చదువు, హస్టల్‌తో పాటు అన్నిరకాల వసతులు కల్పిస్తారు. బట్టలు, పుస్తకాలు, కాస్మోటిక్‌ చార్జీలు అందించనున్నారు.

    జనవరి 21 వరకు దరఖాస్తు గడువు

    5వ తరగతి ప్రవేశం పొందే విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 22 ఫిబ్రవరి 2026 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక ఫోన్‌నంబరుతో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు. వేరే వారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేస్తే వారిపై సెక్షన్‌ 416 ఐపీసీ 1860 ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు. 2025లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో గుర్తించిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

    గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు వరం. పిల్లలకు పౌష్టికాహార లోపంతో తలెత్తే రుగ్మతలు మాయమవుతాయి. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం బోధన కావడంతో పాఠశాలల్లో ప్రవేశాలకు తీవ్ర పోటి నెలకొంది. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. జనవరి 21 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుంది. కరీంనగర్‌ జోనల్‌ పరిధిలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాలకై అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

    – కె.ప్రత్యూష, గురుకులాల జోనల్‌ ఆఫీసర్‌

    5వ తరగతిలో ప్రవేశాలు

    ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

    జనవరి 21 వరకు గడువు

    ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష

    కరీంనగర్‌ జోనల్‌ పరిధిలో 50 గురుకులాలు

  • మేడిపల్లి ఓసీపీలో పులి సంచారం

    గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ పరిధి మేడిపల్లిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టు(ఓసీపీ)లో ఆదివారం పెద్దపులి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. రామగుండం డివిజన్‌–1 పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బొగ్గు నిల్వలు అడుగండంతో దానిని గతంలోనే యాజమాన్యం మూసివేసింది. ఆ ప్రాంతంలోనే పెద్దపులి సంచరించినట్లు ఫారెస్ట్‌ అధికారులు గుర్తించారు. మంచిర్యాల వైపు నుంచి గోదావరి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు వారు వెల్లడిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పులి వేలిముద్రలను వారు పరిశీలించారు. లింగాపూర్‌ శ్మశానవాటిక వైపు ఉన్న ముళ్ల పొదల్లో పులి సంచరినట్లు ఆనవాళ్లు ఉన్నాయని ఫారెస్ట్‌ అధికారి శివయ్య, రేంజ్‌ ఆఫీసర్‌ రహ్మతుల్లా తెలిపారు. దీంతో లింగాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

    ఒంటరిగా వెళ్లవద్దు – డీఎఫ్‌వో శివయ్య

    మేడిపల్లి, లింగాపూర్‌, పాములపేట, హౌసింగ్‌బోర్డు కాలనీ వాసులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని డీఎఫ్‌వో శివయ్య సూచించారు. అవసరమైతేనే గుంపులుగా వెళ్లాలని, ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లో పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని అన్నారు. ద్విచక్రాహనాలపై కూడా ఒంటరిగా వెళ్లవద్దని ఆయన పేర్కొన్నారు.

    స్థానికుల్లో భయం.. భయం

    జ్యోతినగర్‌(రామగుండం): మేడిపల్లి ఓసీపీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఓసీపీ, సమీప గోదావరి నదీతీరంలో పులి సంచరించినట్లు పాదముద్రలు పరిశీలించిన అనంతరం.. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ పంప్‌హౌస్‌ ప్రాంతం మల్కాపూర్‌ గ్రామానికి సమీపంలో ఉండడంతో ఎప్పుడేమవుతుందోనని గ్రామస్తులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పులి సంచరించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

    పేట్రేగనున్న స్క్రాప్‌ చోరీ ముఠాలు

    ఓపెన్‌కాస్ట్‌ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో జనసంచారం ఉండదని భావించే ఇనుప సామాను దొంగలించే ముఠాలు రెచ్చిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో సైతం పులి సంచారం ప్రచారం కావడంతో పెద్దమొత్తంలో ఇనుస సామగ్రి చోరీ అయినట్లు తెలుస్తోంది.

    గోదావరి నదీతీరంలో పాదముద్రలు

    నిర్ధారించిన అటవీశాఖ అధికారులు

  • ఎల్లలు దాటి వచ్చి.. ఓటేసి

    రాయికల్‌: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా యువతీ, యువకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహ్రెయిన్‌, యూఎస్‌ఏ, తదితర ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో మాట్లాడారు.

    యూఎస్‌ఏ నుంచి వచ్చా

    నేను యూఎస్‌ఏ హస్టన్‌ టెక్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నా. కొద్దిరోజుల తర్వాత మా ఊరికి వస్తాననుకున్న. కానీ, ఇంతలోనే సర్పంచ్‌ ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుగానే వచ్చా. – బొలిశెట్టి భావన, ఇటిక్యాల

    ఆనందంగా ఉంది

    సర్పంచ్‌ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయడం ఆనందాన్ని ఇచ్చింది. గ్రామాభివృద్ధి కోసం మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు వినియోగించుకున్న. – సుప్రియ, ఇటిక్యాల

    ప్రతీ ఓటు కీలకం

    సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. మంచి నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటు హక్కు మంచి అవకాశం. నా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి విధులకు హాజరయ్యేందుకు తిరిగి వెళ్తున్నా.

    – సిరిపురం గిరి, డెప్యూటీ తహసీల్దార్‌,

    ఎలిగేడు మండలం, పెద్దపల్లి

    నోటిఫికేషన్‌ రాగానే..

    నేను ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో ఉంటున్నా. ప్రతి రెండేళ్లకోసారి నాకు కంపెనీ సెలవు ఇస్తుంది. ప్రస్తుతం మా గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకుని ఎలాగైనా ఓటు వేద్దామన్న ఉద్దేశంతో నోటిఫికేషన్‌ రాగానే స్వగ్రామానికి వచ్చి ఓటు వేశా. – పడాల రమేశ్‌, కుమ్మరిపల్లి

    ప్రలోభాలకు లొంగకుండా..

    ఓటు వేసేందుకు ముంబయ్‌ నుంచి వ చ్చాం. తిరిగి వెళ్తున్నా ం. ప్రతి ఓటు కీలకం కాబట్టి వచ్చినం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్నాం.

    – గాజంగి శ్రీధర్‌, రాజేంద్రప్రసాద్‌

    కుటుంబ సమేతంగా..

    హైదరాబాద్‌ నుంచి సుమా రు 20 మందిమి మా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఆది వారం సెలవు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశాం.

    – పారిపల్లి సుధీర్‌, ప్రైవేటు ఉద్యోగి, కుమ్మరిపల్లి

  • కొత్త

    మానకొండూర్‌: సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన నూతన ఓటర్లలో ఓటు ఏ విధంగా వేయాలో అవగాహన కరువు అవడంతో అయోమయానికి గురయ్యారు. చాలామంది నూతన ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడని అనుకున్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేయాలని పోలింగ్‌ కేంద్రంలో తెలుసుకున్నాక అయోమయానికి గురయ్యారు.

    నాకు తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఓటు వేసుడు ఏ విధంగానో నాకు తెలియదు. పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు కొంత కంగారుగా ఉండే. మొదటి సారి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉంది.

    – రసజ్ఞ, గంగిపల్లి

    నేను తొలిసారిగా ఓటు వేస్తున్నా. ఓటుహక్కు రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేసుడనుకున్నా. బ్యాలెట్‌ పేపర్‌లో ఏ విధంగా ఓటు వేసుడో తెలియదు. అవగాహన కల్పించాల్సి ఉంది.

    – మమత, గంగిపల్లి

    తొలిసారి నాకు ఓటు హక్కు వచ్చి ంది. ఓటు వేయడం సం తోషంగా ఉంది. ఈవీఎంల ద్వారానే ఓటు వేసుడనుకుంటున్నా. ఓటు ఏ విధంగా వేయాలో తెలియ దు. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎలా వేయాలో తెలుసుకుంటా.

    – కొలిపాక అఖిల( కొండపల్కల)

    ఈవీఎంలు ఉంటాయనుకున్నా యువ ఓటర్లు

    బ్యాలెట్‌ పేపర్లతో అయోమయం

  • పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ సీటు

    సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి అబ్బాయికి ఢిల్లీలో పీజీ దక్కింది. పట్టణంలోని గీతానగర్‌కు చెందిన యువకుడు రెడ్డిమల్ల అభినవ్‌ సాయి నీట్‌ పీజీ 2025–26 ప్రవేశ పరీక్షల్లో ఆలిండియా స్థాయిలో 716వ ర్యాంకు సాధించాడు. ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఎండీ జనరల్‌ మెడిసిన్‌ సీటు కైవసం చేసుకున్నారు. సిరిసిల్లకు చెందిన రేషన్‌ డీలర్‌ రెడ్డిమల్ల హన్మాండ్లు–కల్యాణి దంపతుల కొడుకు అభినవ్‌సాయి. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశాడు. ఆర్‌ఎంఎల్‌లో సీటు సాధించడంతో ఆదివారం రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. అభినవ్‌సాయి సోదరుడు గుణశేఖర్‌ సైతం వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మీనారాయణ, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు రోడ్డ శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేశ్‌, సమ్మయ్య, భాను, ప్రతినిధులు గట్టయ్య, రవీందర్‌, ఆకునూరి బాలరాజు, రాజయ్య, మహేశ్‌, శ్రీనివాస్‌, మహేందర్‌రెడ్డి, నర్సయ్య, గాజుల శ్రీనివాస్‌, ప్రసాద్‌, చంద్రం, శంకర్‌, శ్యామ్‌, శోభన్‌ పాల్గొన్నారు.

    ఆర్‌ఎంఎల్‌ మెడికల్‌ కాలేజీలో సీటు

    అభినందించిన రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు

  • మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ టెస్ట్‌కు స్పందన

    కొత్తపల్లి(కరీంనగర్‌): అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అమోట్‌–2025కు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం కరీంనగర్‌ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో రామానుజన్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి అల్ఫోర్స్‌ మ్యాథ్స్‌ ఒలంపియాడ్‌ (అమోట్‌)–2025ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్వహించిన టెస్ట్‌కు 18,450 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఎన్‌ఆర్‌ మాట్లాడుతూ, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల ఆరంభం నుంచి శ్రీనివాస రామానుజన్‌ జ్ఞాపకార్థం జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ రూ.3 వేలు, తృతీయ రూ.2 వేలు ఈ నెల 22న రామానుజన్‌ జయంతి సందర్భంగా అందజేస్తామని తెలిపారు.

  • కేపీఎస్‌ టాలెంట్‌ ఎంకరేజ్‌మెంట్‌ పరీక్షకు స్పందన

    కరీంనగర్‌ టౌన్‌: కరీంనగర్‌లోని కోట పబ్లిక్‌ స్కూల్‌ ఆదివారం నిర్వహించిన టాలెంట్‌ ఎంకరేజ్‌మెంట్‌ పరీక్ష– 2026కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కోట పబ్లిక్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుత సిలబస్‌ ఆధారంగా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 100శాతం స్కాలర్‌షిప్‌తో పాటు పూర్తిగా ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతిభను ప్రోత్సహించడమే కోట పబ్లిక్‌ స్కూల్‌ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులకు బలమైన అకాడమిక్‌ ఫౌండేషన్‌తో పాటు విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా శిక్షణ ఉంటుందని వివరించారు.

  • మా ఓటు అమ్మబడదు

    మామిడాలపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు

    వీణవంక: ‘మా ఓటు మద్యానికి, డబ్బుకు అమ్మబడదు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కల్పించిన ఓటుహక్కును వినియోగించుకుందాం. మన గ్రామ అభివృద్ధికి ఓటు వేద్దాం’ అని మండలంలోని మామిడాలపల్లి గ్రామంలో యువకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్పంచ్‌, వార్డు సభ్యులు మద్యం, డబ్బు పంపిణీ చేయొద్దని, పంపిణీ చేసినా ఓటర్లు తీసుకోవద్దని, యువకులు, విద్యావంతులు అలోచన చేియాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు.