Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.

    యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

    ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టం
    డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.

    యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.

    ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.

  • వాహన కొనుగోలుదారుల కోసం ఎంజీ మోటార్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు చెప్పింది. ‘మిడ్‌నైట్ కార్నివాల్’ పేరుతో డిసెంబర్ 5 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న పరిమితకాల ప్రమోషన్‌లో దేశవ్యాప్తంగా ఎంజీ షోరూమ్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని చెప్పింది. వినియోగదారులు సౌకర్యవంతమైన సమయాల్లో తమకు నచ్చిన ఎంజీ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుగోలు చేయవచ్చని చెప్పింది.

    ఈ మూడు రోజుల ఈవెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఇంటర్నల్ కంబర్షన్‌ ఇంజిన్ (ICE) మోడల్స్‌పై భారీ తగ్గింపులు, ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. కొనుగోలుదారుల కోసం రూ.11 కోట్ల విలువైన బహుమతుల పూల్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇందులో అర్హత కలిగిన ఇద్దరు కొనుగోలుదారులు లండన్‌కు ఉచిత ట్రిప్ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

    మోడల్ వారీగా గరిష్ట ప్రయోజనాలు(ఐసీఈ మోడల్స్‌పై)

    మోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)
    గ్లోస్టర్ (Gloster)రూ. 4 లక్షల వరకురూ. 38.33 లక్షలు
    హెక్టర్ / హెక్టర్ ప్లస్ (Hector / Hector Plus)రూ. 90,000 వరకురూ. 14.00 లక్షలు
    ఆస్టర్ (Astor)రూ. 50,000 వరకురూ. 9.65 లక్షలు

     

    ఈవీ మోడల్స్‌పై ప్రయోజనాలు

    మోడల్గరిష్ట ప్రయోజనాలుప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (దాదాపు)
    ZS EVరూ. 1.25 లక్షల వరకురూ. 17.99 లక్షలు
    కామెట్ EVరూ. 1 లక్ష వరకురూ. 7.50 లక్షలు
    విండ్సర్ EVరూ. 50,000 వరకురూ. 14.00 లక్షలు
  • భారతీయ విమానయాన మార్కెట్‌లో 64 శాతం పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల అమలులో జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు 1,200కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 5న ఒక్కరోజే 1,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ సవాలుగా నిలిచింది.

    ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల్లో ఏముంది?

    జనవరి 2024లో డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను ప్రకటించింది. వీటిని నవంబర్ 1, 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు..

    డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.

    సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.

    ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.

    తాత్కాలిక రిలాక్సేషన్‌

    పరిస్థితి చేయిదాటిపోవడంతో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకుని డిసెంబర్ 5న డీజీసీఏ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఇండిగో A320 ఫ్లీట్‌కు మాత్రమే వర్తించేలా ఫిబ్రవరి 10, 2026 వరకు రిలాక్సేషన్లు మంజూరు చేశారు.

    ఇండిగో ఆధిపత్యం

    • మార్కెట్ షేర్: ఆగస్టు 2025 నాటికి 64.2 శాతం డొమెస్టిక్ మార్కెట్ వాటాతో దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికులలో 6 మంది ఇండిగోలో ప్రయాణిస్తున్నారు.

    • అంతర్జాతీయంగా ఆసియాలో 2వ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ప్రపంచంలో 9వ అతిపెద్ద ప్యాసింజర్ క్యారియర్‌గా ఉంది.

    • నవంబర్ 2025 నాటికి రోజుకు 2,700కి పైగా సర్వీసులు నడుపుతోంది.

    ఇదీ చదవండి: విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ

  • అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.  

    ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను  "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.

    సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది.
     

Andhra Pradesh

  • ముదునూరు: కృష్ణాజిల్లాలో  స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివ శంకర్‌  స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ వద్ద శాంపిల్స్  తీసుకుంది వైద్య బృందం. 

    అయితే 4వ తారీఖున  శివశంకర్ మృతి చెందగా, ఈరోజు(శనివారం, డిసెంబర్‌ 6వ తేదీ) స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు రిపోర్ట్‌లో తేలింది.  స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది. 

    ఇదీ చదవండి: 
    స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..

  • సాక్షి, తిరుపతి: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ లక్ష్మణ్ కుమార్ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినిని బెదిరించి గర్భవతిని చేశాడు. బాధిత విద్యార్థిని.. వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసింది. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు.

    యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌ కన్నేశారు. ఆ విద్యార్థినిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ కూడా ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

    లక్ష్మణ్ కుమార్‌పై యూనివర్శిటీ సిబ్బంది.. తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. కానీ ఆ విద్యార్థిని సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్ళిపోయింది.

     

  • సాక్షి తాడేపల్లి: దేశీయ విమానయాన రంగంలో సంక్షోభ పరిస్థితుల వేళ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఇండిగో సంస్థతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు కారణమైన కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడును పదవి నుండి వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు. 

    దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్‌ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసుకుంటూ గడుపుతున్నారన్నారు. అహ్మదాబాద్ విమాన‌ ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని విమానాయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది.

    కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో పాటించేలా చేయడంలో కేంద్రమంత్రి  రామ్మోహన్‌ నాయుడు విఫలమయ్యారని ఈ ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చిందని తెలిపారు. డీజీసీఏ తన రూల్స్‌ను వెనక్కి తీసుకునేలా ఇండిగో వ్యవహరించిందంటే దానికి కారణం కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడేనని కనుక ఆయనను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని జూపూడి ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు.

    నారా లోకేష్ వార్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారంటూ నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. అసలు కేంద్ర మంత్రి పదవితో లోకేష్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. లోకేష్‌కి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా తెలుగు వారి పరువు తీశారని జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు.

  • పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పై మండిపడ్డారు.

    పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు.

    పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వలన జిల్లా ప్రజలకు ఏం ఉపయోగం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఒక్క స్కూల్ తరగతి గది కూడా కట్టలేదు. ఒక్క టేబుల్ కుర్చీ కూడా ఇవ్వలేదు. అందుకే క్లాస్ రూమ్ సెట్ వేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సి వచ్చింది.

    ఈ ప్రభుత్వంలో విద్యా రంగానికి ఏం చేస్తున్నారో చెప్పలేక పోయారు. వైఎస్ జగన్ కట్టించిన స్కూల్‌లో కార్యక్రమం చేస్తే స్కూల్స్ అభివృద్ధి కనిపిస్తుందని సినిమా సెట్ వేసుకొని వారి దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు.

    వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పథకం అయినా తెచ్చిందా. విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పుష్పశ్రీవాణి పేర్కొంది .

Politics

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌కు నివేదించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్‌ జగన్.. గవర్నర్‌ను కలవనున్నారు.

    ఈ మేరకు గవర్నర్‌ స్పెషల్‌ సీఎస్‌ నుంచి వైఎస్సార్‌సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు.

  • సాక్షి, నల్గొండ జిల్లా: రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించిందే దివంగత నేత వైఎస్సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన దేవరకొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వేలాది మంది రైతులకు విద్యుత్ బిల్లులను వైఎస్సార్ మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అవకాశం వస్తే మంచి రోజులు కాదు.. ముంచే రోజులు వస్తాయంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ నలుగురు కలిసి పీక్కుతిన్నారంటూ ఆయన ఆరోపించారు.

    ‘‘కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీని పదేళ్లలో పది కిలోమీటర్ల దూరం తవ్వలేకపోయారు. ఎస్‌ఎల్‌బీసీలో ఎనిమిది మంది చనిపోతే మామా అల్లుళ్లు డ్యాన్స్‌లు చేస్తున్నారు. పదెకరాల్లో 150 రూమ్‌లతో కేసీఆర్ గడీని నిర్మించుకున్నాడు. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసి రైతుల నెత్తిన అప్పు, చేతిలో కేసీఆర్ చిప్ప పెట్టిండు. ఓటు అనే ఆయుధంతో గడీల పాలనను కూల్చారు. గత ప్రభుత్వానికి రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయింది.

    ..కాంగ్రెస్ హయాంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా?. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినవో చెప్తే ఆ ఊర్లో ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ చేశాం. పేదవాళ్ల పట్ల కేసీఆర్‌కు ఏ మాత్రం ప్రేమ, అభిమానాలు లేవు. మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నమ్మించి నట్టేట ముంచినోడు.. ఒకవైపు నమ్మినోళ్ల కోసం పనిచేసేటోడు ఒకవైపు ఉన్నారు ఎవరు కావాలో జనాలు తేల్చుకోండి. దేశానికి ఆదర్శంగా నిల్చేలా తెలంగాణను రోల్ మోడల్‌గా తయారు చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

  • సాక్షి, నెల్లూరు: వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంట ఏహ్యభావమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    అసలు ప్రభుత్వం అనేది ఉందా?:
    రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. జిల్లాలో వరినాట్లు పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులకు పైసా సహాయం లేదు. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు గ్రామాలకు వెళ్లలేదు.

    ఇవన్నీ చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోంది. తుపాన్ల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పార్టీ చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిల్చింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో 2023లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, చాలా వేగంగా స్పందించాం. రైతులను వెంటనే ఆదుకున్నాం.

    మా ఎమ్మెల్యే ఆ మాటలు ఫాలో అవుతున్నారు:
    సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు. ‘సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోండి’ అని ఆయన చెబుతుంటారు. వాటిని మా సర్వేపల్లి ఎమ్మెల్యే గట్టిగా వంట బట్టించుకున్నాడు. అందుకే కష్టనష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచించకుండా, ఎక్కడ దొంగ బిల్లులు పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లడ్‌ డ్యామేజ్‌ మరమ్మతుల పేరిట కోట్లు దోచుకుంటున్నారు. రైతుల పేరు చెప్పి గతంలో నీరు–చెట్టు కార్యక్రమంలో ఎలా అయితే దోచుకున్నారో.. ఈరోజు మరమ్మతు పేరిట మళ్లీ అదే చేస్తున్నారు.

    అరాచకంగా మారిన విజిలెన్స్‌ విభాగం:
    ఈరోజు విజిలెన్స్‌ దర్యాప్తు అన్న దానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతల ఆదేశాలను రాసి పెట్టే కార్యాలయంగా ఇక్కడి విజిలెన్స్‌ విభాగం తయారైంది. ఒకసారి జిల్లా విజిలెన్స్‌ అధికారుల కాల్‌ లిస్టులు బయటపెడితే, మంత్రి, ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి.. వారి ఆదేశాలు అధికారులు ఎలా అమలు చేస్తున్నారనేది బయటపడుతుంది. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు.. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి, వారితో ఫోన్లలో మాట్లాడి, వారి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇదే అత్యంత దారుణం. అరాచకం.

    దమ్ముంటే బహిరంగ చర్చకు రండి:
    మీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ మేలు చేయడం లేదు. అదే గత మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. విత్తనం మొదలు, పంటల అమ్మకాల వరకు గ్రామాల్లో ఆర్బీకేలు రైతుల కోసం పని చేశాయి. అందుకే మీకు, దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. మీడియా, రైతుల సమక్షంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదాం. జగన్‌గారి హయాంలో రైతులకు ఎలా సహాయం జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా దోపిడీ జరుగుతోంది.. అన్నదానిపై కూలంకషంగా చర్చిద్దాం. నా నియోజకవర్గం సర్వేపల్లిలోనే చర్చ మొదలు పెడదాం. మరి మీరు అందుకు సిద్ధమా?.

    విజిలెన్స్‌ రిపోర్టులపై సీబీఐ విచారణకు సిద్ధమా?:
    వరద సాయాన్ని అధికార పార్టీ నేతలు దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు. వీటిని సీబీఐ విచారణ పెడితే ఎంత మంది అధికారులు ఇళ్లకు వెళ్తారో, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలుస్తుంది. ఈరోజు ఫాల్స్‌ విజిలెన్స్‌ రిపోర్టులు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. విచారణ సంస్థలు కూడా పూర్తిగా రాజకీయ బానిసలయ్యాయి. ఈ దుస్థితి కొనసాగితే సమాజంపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉండి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రికి  లెటర్‌ రాయడం విడ్డూరంగా ఉంది. ఆయనకు నేరుగా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?. ఏదేమైనా కోట్ల రూపాయల దోపిడిపై సీబీఐ విచారణకు అధికార పార్టీ నేతలు సిద్ధమా?

    వ్యవసాయ మంత్రి పారిపోతున్నారు:
    వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం గురించే తెలియదు. ఆయన రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మేం చర్చకు సిద్ధమైతే అచ్చెన్నాయుడు తోక ముడుచుకుని పారిపోయాడు. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు వేదిక, సమయం నిర్ణయిస్తే గత ప్రభుత్వ రైతు సంక్షేమం, ఈ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. కానీ, ఆయన పారిపోతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

  • హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని, అట్లాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చుకోరని, మార్చు కోలేరని విమర్శించారు.  

    ఈ మేరకు శనివారం(డిసెంబర్‌ 6వ తేదీ) ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. ‘ రెండేళ్లుగా కేసీఆర్ మీద, బీఆర్‌ఎస్‌ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప  చేసిందేముంది రేవంత్ రెడ్డి?, విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవు. అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరిచిపోరు. 

    బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్దం చెబుతున్న రేవంత్ రెడ్డి.. 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్దమా?, గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా?, నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు?, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు?, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ. 3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా?, ఈ లెక్కలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? 

    పదే పదే ఎందుకు అబద్దాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి?, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్‌ఎల్‌బీసీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా?, రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నడు.

    కనీసం ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న శవాలను కూడా ఇప్పటికీ బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. రోమ్ తగలబడుతుంటే, ఫిడేల్ వాయించినట్లు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే..నువ్వు మాత్రం పాలన గాలికి వదిలి ఫుట్ బాల్ ఆడుతున్నవు. ఆటలాడటంపై ఉన్న శ్రద్ద నీకు ప్రజా సమస్యల మీద, పరిపాలన మీద లేక పోవడం సిగ్గుచేటు. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?, భ్రమల నుంచి బయటికి వచ్చి చూడు రేవంత్ రెడ్డి. నీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. నీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నరు. నీ స్కాంల పాలనను ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నరు.అందిన కాడికి దోచుకోవడం, అందరు కలిసి పంచుకోవడం ఇదే కదా మీరు చేసింది. మూటలు, వాటాలు, కమీషన్లు ఇదే కదా మీకున్న విజన్. నలుదిక్కులా గద్దల్లా మారి భూములను ఖతం పట్టిస్తున్నరు.  

    ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అందిన కాడికి దండుకుంటున్నరు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని సర్కారు మీది.కూట్లో రాయి తీయని రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటుండటం హాస్యాస్పదం. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరిని మభ్య పెడుతున్నవు?, ఇందులో ఎన్ని కోట్ల స్కాంకు ప్లాన్ వేసినవు. ఇందులో ఎవరి వాటా ఎంత?, గాల్లో మేడలు కట్టడం, అబద్దాలు చెప్పి రంగుల ప్రపంచం చూపడం మానేసి.. పాలన మీద దృష్టి సారించు. చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ది చెందదు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదు.నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం గుర్తుంచుకో.. అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొలగించుకో’ అని హరీష్‌ ధ్వజమెత్తారు.

    ఇండిగో ఇష్యూపై.. కేటీఆర్ రియాక్షన్

  • సాక్షి, తూర్పుగోదావరి: పవన్‌ కల్యాణ్‌ ‘దిష్టి’ వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. కోనసీమకు తెలంగాణ ‘దిష్టి’ తగిలిందన్న వ్యాఖ్యలు సరికాదన్నారు. శనివారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీగా పెట్టుబడులు తెస్తానంటున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీలో ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి నేను వ్యతిరేకం కాదు.. అన్ని వేల ఎకరాలు ఎందుకనేదే నా ప్రశ్న’’ అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.

    కాగా, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. పవన్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. పవన్‌ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

    డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తనను బాధించాయని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్‌ సినిమా విడుదల కాదు. పవన్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


     

  • సాక్షి, అమరావతి: ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్‌ రివ్యూ చేస్తున్నారంటూ.. జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేశారు. అసలు నారా లోకేష్‌ ఎవరన్న అర్నబ్‌ గోస్వామి.. విమానయాన శాఖకు, లోకేష్‌కు సంబంధమేంటి? అంటూ ప్రశ్నించారు. ‘‘ఏ హోదాలో  లోకేష్‌ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇది పౌర విమానయాన శాఖ.. లేక టీడీపీ శాఖ?’ అంటూ అర్నబ్‌ మండిపడ్డారు. అర్నబ్‌ గోస్వామి ప్రశ్నలకు టీడీపీ నేత నీళ్లు నమిలారు.

    విమాన ప్రయాణికుల కష్టాలు తీర్చడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్ లైన్స్ సొమ్ము చేసుకుంటున్నా రామ్మోహన్‌ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

    ఇండిగో సంక్షోభాన్ని నారా లోకేష్ చక్కదిద్దుతున్నారని చెప్పుకుంటున్న టీడీపీ అధికార ప్రతినిధిని నారా లోకేష్‌కు ఏం సంబంధం అంటూ జాతీయ  మీడియా చివాట్లు పెట్టింది. సంక్షోభాన్ని కూడా నారా లోకేష్‌ క్రెడిట్ కోసం వాడుకుంటున్నారంటూ నెటిజన్ల మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభ నివారణకు రామ్మోహన్ నాయుడు తూతు మంత్రంగా చర్యలు చేపట్టారు. సమీక్షలు, ప్రకటనలతోనే సరిపెట్టారు.

    మంత్రి నారా లోకేశ్ రివ్యూ చేస్తున్నారంటూ అతి చేసిన టీడీపీ అధికార ప్రతినిధి

    ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల అమలు పరచడంలో తీవ్ర వైఫల్యం చెందారు. సేఫ్టీ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలును పట్టించుకోని రామ్మోహన్.. లక్షలాదిమంది ప్రయాణికులు ఆందోళనలకు దిగడంతో ఇండిగో పై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానికి తగిన విధంగా చర్యలు చేపట్టడంలో రామ్మోహన్‌నాయుడు విఫలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి.

     

Sports

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో టీమిండియా యువ ఓపెనర్‌, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా స‌ర్వీసెస్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించాడు.

    ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. అదేవిధంగా అభిషేక్‌ 2025 ఏడాదిలో టీ20ల్లో వంద సిక్స్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో 100 సిక్స్‌ల మైలురాయిని అందుకున్న మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివర​కు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు.

    అభిషేక్ ఈ ఏడాది ఆరంభం నుంచే టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్‌, ఆసియాకప్‌, ఆసీస్ టూర్‌, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఈ సంవత్సరం టీ20ల్లో అభిషేక్ శర్మ ఇప్పటివరకు 42.82 సగటుతో 1,499 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 149గా ఉంది.

    పంజాబ్‌ ఘన విజయం
    ఇక ఈ మ్యాచ్‌లో సర్వీసెస్‌ టీమ్‌ను 73 పరుగుల తేడాతో పంజాబ్‌ చిత్తు  చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో అభిషేక్‌తో పాటు ఫ్రబ్‌సిమ్రాన్‌ సింగ్‌(50), నమన్‌ ధీర్‌(54) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.

    అనంతరం సర్వీసెస్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్‌ బౌలర్లలో అభిషేక్‌ శర్మ, సన్వీర్‌ సింగ్‌, హర్‌ప్రీత్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

     

  • వైజాగ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ప‌ర్యాట‌క ప్రోటీస్ జ‌ట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. త‌ద్వారా మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 39.5 ఓవర్లలో ఛేదించింది.

    జైశ్వాల్ సెంచరీ..
    లక్ష్య చేధనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్‌ను స్పిన్నర్ కేశవ్ మహారాజ్ పెవిలియన్‌కు పంపాడు. కానీ జైశ్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 

    ప్రత్యర్ధి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఈ ముంబై ఆటగాడు 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక రోహిత్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లి.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్‌ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

    డికాక్ సెంచ‌రీ వృథా..
    అంతకుముందు బ్యాటింగ్ చేసిన  సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్‌ అయింది.  ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు) సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఈ ఓటమితో డికాక్ సెంచరీ వృథా అయిపోయింది.

    చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

     

  • సౌతాఫ్రికాతో తొలి రెండు వ‌న్డేల్లో విఫ‌ల‌మైన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదిక‌గా జ‌రుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో జైశ్వాల్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

    271 పరుగుల లక్ష్య చేధనలో జైశ్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన యశస్వి.. క్రీజులో సెటిల్ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. జైశూ 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో త‌న వ‌న్డే సెంచ‌రీ మార్క్ అందుకున్నాడు. శతక్కొట్టగానే జైశ్వాల్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గాల్లోకి జంప్‌ చేస్తూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.

    కాగా మొద‌టి రెండు వ‌న్డేల్లో ఈ ముంబై ఆట‌గాడు విఫ‌లం కావ‌డంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ మాత్రం జైశ్వాల్‌పై న‌మ్మ‌కం ఉంచాడు. దీంతో త‌న‌కు ల‌భించిన అవకాశాన్ని జైశ్వాల్ అందిపుచ్చుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గాయ‌ప‌డ‌డంతో జైశ్వాల్‌కు జట్టులో చోటుదక్కింది. మళ్లీ గిల్‌ తిరిగొస్తే జైశ్వాల్‌ బ్యాకప్‌ ఓపెనర్‌గానే కొనసాగనున్నాడు. 

    ఇక వైజాగ్‌ వన్డేలో టీమిండియా విజయానికి చేరువైంది. సిరీస్‌ విజయానికి భారత్‌కు ఇంకా 29 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(46), జైశ్వాల్‌(107) ఉన్నారు.
    చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

     

  • సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

    మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచిలో భారత్‌ గెలవగా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్‌తో సిరీస్‌ ఫలితం తేలనుంది. వైజాగ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    270 పరుగులకు ఆలౌట్‌
    కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్‌ చేశారు. పేసర్లలో ప్రసిద్‌ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

    ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా పది ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన కుల్దీప్‌ యాదవ్‌.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29), మార్కో యాన్సెన్‌ (17), కార్బిన్‌ బాష్‌ (9) రూపంలో ముగ్గురు డేంజరస్‌ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్‌.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

     పదే పదే అప్పీలు చేస్తూ.. 
    అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్‌ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్‌ అయ్యాడంటూ కుల్దీప్‌ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.

    ముఖం మాడ్చుకున్న కుల్దీప్‌
    ఇంతలో రోహిత్‌ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్‌ను టీజ్‌ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్‌.. మరోవైపు విరాట్‌ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. 

    అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్‌ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్‌కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర ప‌రాభవం

  • టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 20,000 పరుగులను రోహిత్ పూర్తి చేసుకున్నాడు. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడిగా రోహిత్ రికార్డులెక్కాడు.

    రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్‌( (34357), విరాట్‌ కోహ్లీ (27910), రాహుల్‌ ద్రవిడ్‌ (24208) ఈ ఘనత సాధించారు. రోహిత్‌ ఇప్పటివరకు వన్డేల్లో 11486, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ ముంబైకర్‌ 50 సెంచరీలు నమోదు చేశాడు.

    వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కూడా రోహిత్‌(264)  పేరిటే ఉంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్‌ ఈ హాఫ్‌ సెంచరీతో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

    సచిన్‌ రికార్డు బ్రేక్‌
    👉సౌతాఫ్రికాపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఓపెనర్‌గా రోహిత్‌ రికార్డు నెలకొల్పాడు. రోహిత్‌ ఇప్పటివరకు ఓపెనర్‌గా సఫారీలపై మూడు ఫార్మాట్‌లు కలిపి 1758 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(1734) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్‌ చేశాడు.

    👉అదేవిధంగా వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన మూడో ఓపెనర్‌గా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకు 79 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో విండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌(78)ను అధిగమించాడు.

    డికాక్‌ సెంచరీ..
    ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్‌ అయింది.  ప్రోటీస్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు 106 పరుగులు)  సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ బవుమా(48) రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా నాలుగు వికెట్లతో సఫారీలను దెబ్బతీశారు. 

    అనంతరం లక్ష్య చేధనలో భారత్ నిలకడగా ఆడుతోంది. 29 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్‌(83), విరాట్‌ కోహ్లి(7) ఉన్నారు.
    చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్‌.. ప్రపంచ క్రికెట్‌లోనే!
     

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. సఫారీ జట్టుతో తొలి టీ20 నుంచే అతడు అందుబాటులోకి రానున్నాడు.

    ఫిట్‌నెస్‌ సాధించాడు
    భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE) వర్గాలు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించాయి. గిల్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలిపాయి. ఈ మేరకు.. ‘‘CoEలో శుబ్‌మన్‌ గిల్‌ తన పునరావాసం పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు ఆడేందుకు ఫిట్‌నెస్‌ సాధించాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

    ఈ నేపథ్యంలో డిసెంబరు 9న కటక్‌ వేదికగా భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA T20Is) మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్‌ అందుబాటులోకి రానున్నాడు. కాగా స్వదేశంలో టీమిండియా సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌ జరుగగా.. సఫారీల చేతిలో భారత జట్టు 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.

    మెడనొప్పి కారణంగా..
    ఇదిలా ఉంటే.. తొలి టెస్టు సందర్భంగానే గిల్‌ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్‌ మధ్యలోనే నిష్క్రమించిన గిల్‌.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన తర్వాత.. అతడు రెండో టెస్టుతో పాటు.. వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.

    ఈ క్రమంలో గిల్‌ టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉంటాడో.. లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, ప్రొటిస్‌ టీమ్‌తో పొట్టి సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటిచ్చిన యాజమాన్యం ఫిట్‌నెస్‌ ఆధారంగా జట్టుతో కొనసాగేది.. లేనిది తేలుతుందని పేర్కొంది. తాజాగా గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు వెల్లడించింది.

    సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌, ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    👉మొదటి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా
    👉రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌
    👉మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌
    👉నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌
    👉ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.

    చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

  • ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కమ్మిన్స్ పూర్తిగా కోలుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మూడో టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులోకి రానున్నాడు.

    ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆడాల్సి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ముందుస్తు జాగ్రత్తగా అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు.

    ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను కమ్మిన్స్ మొదలు పెట్టాడు. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను కోల్పోయిన ఆసీస్‌కు కమ్మిన్స్ రీ ఎంట్రీ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే ఆంశంగా చెప్పుకోవాలి.  

    "ఆడిలైడ్ టెస్టుకు సిద్ద‌మ‌వుతున్నాను. ఆదివారం(డిసెంబ‌ర్ 7) మ‌రోసారి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ త‌ర్వాత అడిలైడ్ వెళ్లాక కూడా నెట్స్‌లో బౌలింగ్ చేస్తాను. ప్ర‌స్తుతం ఫిట్‌గా ఉన్నారు. నా శ‌రీరం కూడా అద్భుతంగా స‌హ‌క‌రిస్తోంది. ఈ గ్యాప్‌లో ఎటువంటి స‌మ‌స్య‌లు రాకూడ‌ద‌ని కోరుకుంటున్నానని" మూడో రోజు ఆట సందర్భంగా ఫాక్స్ క్రికెట్‌తో కమిన్స్ చెప్పుకొచ్చాడు. 

    క‌మ్మిన్స్‌, హేజిల్‌వుడ్ లేక‌పోవ‌డంతో బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్‌, మైఖేల్ నేసర్‌ల‌తో కూడిన పేస్ ధళానికి స్టార్క్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బౌల‌ర్లు అద‌ర‌గొట్టారు. రెండో టెస్టులో కూడా ఫ‌ర్వాలేద‌న్పిస్తున్నారు. ఇక ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లోని మూడో టెస్టు అడిలైడ్ ఓవల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్‌.. ప్రపంచ క్రికెట్‌లోనే!

  • టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ సెల‌క్ట‌ర్ల‌కు మ‌రోసారి సవాల్ విసిరాడు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో దుమ్ములేపుతున్నాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో భాగంగా శ‌నివారం పుదుచ్చేరి (Puducherry)తో జ‌రిగిన మ్యాచ్‌లో ష‌మీ నిప్పులు చెరిగాడు. 

    ష‌మీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 32 ప‌రుగులిచ్చి మూడు వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ష‌మీ స‌త్తాచాటిన‌ప్ప‌టికి బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో బెంగాల్ 81 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మి చూడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది.

    పుదుచ్చేరి బ్యాట‌ర్ల‌లో ఆమ‌న్ ఖాన్‌(74) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జస్వంత్‌(45) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. బెంగాల్‌ బౌలర్లలో షమీతో పాటు చటర్జీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో బెంగాల్‌ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.

    పుదుచ్చేరి బౌలర్ల దాటికి బెంగాల్‌ 13.5 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌గా కరణ్‌ లాల్‌(40) మినహా మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పుదుచ్చేరి బౌలర్లలో జయంత్‌ యాదవ్‌ 4 వికెట్లతో సత్తాచాటగా.. సైదక్‌ సింగ్‌ మూడు, అయూబ్‌, అమన్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ సీజన్‌లో బెంగాల్‌కు ఇది రెండో ఓటమి.
     

  • సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును  270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్‌పూర్‌లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్‌ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఫలితంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ జట్టుకు భారత పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌.. ఐదో బంతికే ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

    శతక్కొట్టిన డికాక్‌
    ఈ క్రమంలో డికాక్‌ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్‌ కృష్ణ అతడిని బౌల్డ్‌ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్‌ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

    మార్క్రమ్‌ విఫలం
    మిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్‌ మార్క్రమ్‌ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్‌రౌండర్లలో మార్కో యాన్సెన్‌ (17), కార్బిన్‌ బాష్‌ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్‌ కాగా.. ఆఖర్లో కేశవ్‌ మహరాజ్‌ మెరుగైన (20 నాటౌట్‌) బ్యాటింగ్‌తో అలరించాడు. ప్రసిద్‌ బౌలింగ్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ పదో వికెట్‌గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

    చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్‌, కుల్దీప్‌
    ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.  భారత బౌలర్లలో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ డికాక్‌, బ్రీట్జ్కే, మార్క్రమ్‌ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్‌మన్‌ను అవుట్‌ చేశాడు. 

    మరోవైపు.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బ్రెవిస్‌, యాన్సెన్‌. బాష్‌, ఎంగిడిలను పెవిలియన్‌కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్‌దీప్‌ సింగ్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

    చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ ప్రపంచ రికార్డు

  • టీమిండియాతో వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా స్టార్ వికెట్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. వైజాగ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో డికాక్ సెంచరీతో చెలరేగాడు. తొలి రెండు వన్డేల్లో తడబడిన డికాక్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 

    వైజాగ్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా ఈ వెటరన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో డికాక్ తన  సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 89 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 8 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. 

    వ‌న్డేల్లో అత‌డికి ఇది 23వ సెంచ‌రీ కావ‌డం గ‌మనార్హం. అదేవిధంగా భార‌త్‌పై 7వ వ‌న్డే సెంచ‌రీ. త‌ద్వారా డికాక్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

    చరిత్ర సృష్టించిన డికాక్‌..
    ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గ‌జం ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్, శ్రీలంక లెజెండ్ సంగ‌ర్క‌ర‌ పేరిట ఉండేది. గిల్లీ శ్రీలంక‌పై 6 సెంచ‌రీలు సాధించగా.. సంగక్క‌ర భార‌త్‌పై స‌రిగ్గా ఆరు వ‌న్డే సెంచ‌రీలు న‌మోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని డికాక్‌(7) అధిగ‌మించాడు.

    అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన వికెట్ కీప‌ర్‌గా కుమార సంగ‌క్క‌ర రికార్డును డి కాక్ స‌మం చేశాడు. సంగక్క‌ర త‌న వ‌న్డే కెరీర్‌లో 23 సెంచ‌రీలు చేయ‌గా.. డికాక్ కూడా సరిగ్గా ఇప్ప‌టివ‌ర‌కు 23 సెంచ‌రీలు చేశాడు. మ‌రో సెంచ‌రీ చేస్తే సంగాను డికాక్ అధిగ‌మిస్తాడు. ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో షాయ్ హోప్‌(19), గిల్‌క్రిస్ట్‌(19) ఉన్నారు.

    విదేశీగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్‌, సయ్యద్ అన్వర్‌, ఏబీ డివిలియర్స్‌, రోహిత్ శర్మ రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిందరూ 7 సెంచరీలు విదేశాల్లో చేశారు.

    భార‌త్‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్‌గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(7) రికార్డును డికాక్ స‌మం చేశాడు.
    చదవండి: IND vs SA: అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! గంభీర్‌ నమ్మకమే నిజమైంది
     

  • టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది.

    కానీ తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై మాత్రం టీమ్ మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ గంభీర్ నమ్మకాన్ని ఈ కర్ణాటక పేసర్ తొలి స్పెల్‌లో నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి స్పెల్‌లో 2 ఓవర్లు వేసిన కృష్ణ ఏకంగా 13.5 ఏకానమీతో 27 పరుగులు ఇచ్చాడు. 

    సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో తన తొలి స్పెల్‌ను వేసేందుకు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణను క్వింటన్ డికాక్ ఓ ఆడుకున్నాడు. దీంతో గంభీర్‌తో పాటు కృష్ణను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అతడు తప్ప ఇంకొక బౌలర్ మీకు దొరకలేదా అంటూ నెటిజన్లు మండిడ్డారు.

    సీన్ రివర్స్‌.. 
    అయితే కాసేపటికే ప్రసిద్ద్‌, గంభీర్‌ను విమర్శించిన వారే శెభాష్ అంటూ ప్రశంసించారు. ప్రసిద్ద్ కృష్ణ తన సెకెండ్ స్పెల్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. 29వ ఓవర్‌ వేసిన కృష్ణ రెండో బంతికి ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ బ్రీట్జ్కేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కృష్ణ.. ఆఖరి బంతికి రాయ్‌పూర్‌ వన్డే హీరో మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

    ఆ తర్వాత డికాక్‌ను కూడా అద్భుత బంతతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రసిద్ద్‌ తన సూపర్‌ బౌలింగ్‌తో తిరిగి జట్టును గేమ్‌లోకి తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సౌతాఫ్రికా 38 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌(106) సెంచరీతో మెరిశాడు.



     

     

  • వెస్టిండీస్‌ క్రికెటర్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరు లేదంటే అంతకంటే లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

    పరిమిత ఓవర్ల సిరీస్‌లలో పరాభవం
    కాగా ఐదు టీ20, మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు విండీస్‌ క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటన (West Indies tour of New Zealand, 2025)కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగగా ఆతిథ్య కివీస్‌ 3-1తో గెలిచింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మేరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాభవాల తర్వాత.. వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌ మొదలుపెట్టింది.

    తొలి టెస్టులో అసాధారణ పోరాటం
    క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టును అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్‌ అయింది.

    ఇందుకు బదులిచ్చే క్రమంలో వెస్టిండీస్‌ తడబడింది. తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (52), షాయీ హోప్‌ (Shai Hope- 56) మాత్రమే రాణించగా.. మిగతా వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 167 పరుగులకే పర్యాటక జట్టు కుప్పకూలింది. ఫలితంగా కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 64 పరుగుల ఆధిక్యం లభించింది.

    హోప్‌ సెంచరీ, జస్టిన్‌ డబుల్‌ సెంచరీ
    ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌.. ఎనిమిది వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తద్వారా విండీస్‌కు 531 (64+ 466)పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ నేపథ్యంలో షాయీ హోప్‌ (234 బంతుల్లో 140)తో కలిసి జస్టిన్‌ గ్రీవ్స్‌ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు.

    ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీవ్స్‌.. 388 బంతులు ఎదుర్కొని 19 ఫోర్ల సాయంతో 202 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఆఖరి రోజు విండీస్‌కు చేతిలో 4 వికెట్లు ఉండి.. విజయానికి 74 పరుగుల దూరంలో ఉన్న వేళ.. సమయాభావం దృష్ట్యా ‘డ్రా’కు అంగీకరించాల్సి వచ్చింది.

    ఆరో స్థానంలో వచ్చి
    ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా 31 ఏళ్ల జస్టిన్‌ గ్రీవ్స్‌ (Justin Greaves)... టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో వచ్చి డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇతరులలో భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 221 పరుగులు చేయడం విశేషం.

    చదవండి: భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు

  • బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ సాధించింది. స్టార్క్‌ నిప్పులు చెరగడంతో తొలుత ఇంగ్లండ్‌ను 334 పరుగులకు పరిమితం చేసిన ఆసీస్‌.. ఆతర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటి 511 పరుగులు సాధించింది. తద్వారా 177 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

    బంతితో రాణించిన స్టార్క్‌ (141 బంతుల్లో 77; 13 ఫోర్లు) బ్యాట్‌తోనూ చెలరేగి ఆసీస్‌కు భారీ స్కోర్‌ అందించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ స్కోరే అత్యధికం. మరో నలుగురు కూడా అర్ద సెంచరీలు చేశారు. జేక్‌ వెదరాల్డ్‌ 72, లబూషేన్‌ 65, స్టీవ్‌ స్మిత్‌ 61, అలెక్స్‌ క్యారీ 63 పరుగులు చేశారు.

    ట్రవిస్‌ హెడ్‌ (33), గ్రీన్‌ (45) కూడా పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఇంగ్లిస్‌ 23, నెసర్‌ 16, బోలాండ్‌ 21 (నాటౌట​్‌), డాగెట్‌ 13 పరుగులు చేశారు. ఇం​గ్లండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌ 4 వికెట్లతో సత్తా చాటగా.. స్టోక్స్‌ 3, ఆర్చర్‌, అట్కిన్సన్‌, జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.

    అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

    రికార్డుల్లోకెక్కిన స్టార్క్‌
    తాజా ఇన్నింగ్స్‌తో స్టార్క్‌ రికార్డుల్లోకెక్కాడు. పాట్‌ కమిన్స్‌ తర్వాత వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 1000 పరుగులు సహా 200 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో స్టార్క్‌ డబ్ల్యూటీసీలో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. అలాగే కమిన్స్‌, అశ్విన్‌, జడేజా, వోక్స్‌ తర్వాత డబ్ల్యూటీసీలో 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగానూ నిలిచాడు. ​

Movies

  • సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లు చేసిన సినిమా 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించగా.. క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు మెహర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

    డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు పూరి జగన్నాథ్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. దాని తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు.
     

  • స్విమ్మింగ్ పూల్‪‌లో రకుల్ ప్రీత్ బికినీ పోజులు

    బుంగమూతి పెట్టుకుని మాయ చేస్తున్న దివి

    న్యూజిలాండ్ ట్రిప్‌లో హీరోయిన్ నభా నటేశ్

    మేకప్ లేకుండా రష్మీ.. చేతులతో లవ్ సింబల్

    నైట్ రైడ్‌తో చాలా ఆనందంగా అనంతిక

    ఫన్నీ పోజులతో నచ్చేస్తున్న ప్రియాంక మోహన్

  • బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ దాదాపుగా చివరకొచ్చేసింది. ప్రస్తుతం 13వ వారం నడుస్తోంది. అంటే మరో రెండు వారాల్లో షో పూర్తి కానుంది. సరే ఎప్పటిలానే వీకెండ్ వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని అందరూ ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఆమెనే రీతూ చౌదరి.

    ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, పవన్, రీతూ చౌదరి ఉన్నారు. గత రెండు మూడు వారాల బట్టి చూసుకుంటే ఓటింగ్ తక్కువగా పడుతున్న సంజన లేదంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి. కానీ గత వీకెండ్ ఎపిసోడ్‌లో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు కనిపిస్తోంది. రీతూ-పవన్ మధ్య బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేసింది. హోస్ట్ నాగార్జున.. ఎలాగైనా సరే సంజనతో క్షమాపణ చెప్పించాలని చూశాడు. కానీ వల్ల కాలేదు.

    (ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?

    గత వీకెండ్‌లో సంజన చెప్పిన పాయింట్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారేమో గానీ ఈ వారం ఆమెకు ఓటింగ్ పరంగా టాప్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి బిగ్‌బాస్‌కి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విషయంలో రీతూపై కాస్త నెగిటివిటీ ఏర్పడినట్లు అనిపిస్తుంది. దీంతో ఈసారి ఈమెకు కాస్త ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అలా ఈమెని హౌస్ నుంచి బయటకు పంపేసినట్లు సమాచారం.

    అయితే రీతూ చౌదరి.. టాప్-5 వరకు వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ పరంగా కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గేమ్స్ విషయంలో మాత్రం మిగతా వాళ్లకు మంచి పోటీ ఇచ్చేది. ఫినాలే కంటెండర్‌షిప్ పోటీల్లోనూ చివరివరకు వచ్చింది గానీ విజయం సాధించలేకపోయింది. అలానే పవన్‌తో ఈమె రాసుకుపూసుకు తిరగడం కూడా జనాలకు మొహం మొత్తేసినట్లు ఉంది. ఇలా పలు కారణాల వల్ల బిగ్‌బాస్, రీతూని సాగనంపేసినట్లున్నాడు! 

    (ఇదీ చదవండి: ఏసియన్ పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నటి ప్రగతి)

  • ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్‌. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్‌ సందేశ్‌ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్‌ బ్యూటీ... దురదృష్టవశాత్తూ...  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ లో ఉన్న ఓ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.

    ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది.  ఇటీవల మహారాణి అనే వెబ్‌సిరీస్‌ 4వ సీజన్‌ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది.  తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది.  

    ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు  తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది.   నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది.  

    ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు  లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి  ఫోటోషూట్‌లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది.  ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్‌ గ్రౌండ్‌( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి  పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్‌తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది.

     గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్‌ ఫైల్స్, సీరియస్‌ మెన్, జూబ్లీ, త్రిభువన్‌ మిశ్రా సిఎ టాపర్‌  వంటి పలు వైవిధ్య భరిత  చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. 

    ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని  ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు  అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె.

  • నటిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. గత రెండు మూడేళ్లుగా మాత్రం పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిస్తోంది. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. టర్కీలో జరిగిన ఏసియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్ సాధించింది.

    (ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?

    నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా లెవల్, తెలంగాణ స్టేట్ లెవల్ పోటీల్లో బంగారు పతకం గెల్చుకుంది. కేరళలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. 2023 నుండి ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రగతి... గత రెండేళ్లలో పలు పతకాలు సాధించింది. ఇప్పుడు ఏసియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ బంగారంతోపాటు వెండి పతకాలు గెల్చుకుంది.

    టర్కీలో జరిగిన పోటీలు అనంతరం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రగతి.. ఓవరాల్‌గా వెండి పతకం గెల్చుకున్నానని.. డెడ్ లిఫ్ట్ విభాగంలో బంగారు పతకం, బెంచ్, స్క్వాడ్ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించానని గర్వంగా చెప్పుకొచ్చింది. ఈ మేరకు వీడియోలు, ఫొటోలతో ఉన్న ఓ పోస్ట్‌ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

    (ఇదీ చదవండి: బాలీవుడ్ నటితో వాషింగ్టన్ సుందర్ డేటింగ్?)

  • దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు బండి సరోజ్‌ కుమార్‌. ప్రస్తుతం ఈయన మోగ్లీ మూవీలో కీలక పాత్రలో నటించాడు. యాంకర్‌ సుమ కనకాల తనయుడు రోషన్‌ ప్రధాన పాత్రలో యాక్ట్‌ చేసిన ఈ మూవీ డిసెంబర్‌ 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా బండి సరోజ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

    ఎవరితో టచ్‌లో లేను
    ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ, చిన్నప్పటినుంచే నేను చాలా ధనవంతుడిని అని ఫీలయ్యేవాడిని. మా అమ్మ స్కూల్‌కి వస్తే కూడా పక్కింటావిడ అని చెప్పేవాడిని. డబ్బుల గురించి కాదు కానీ ఎప్పుడూ అందరికంటే పైన ఉండాలని ఆశపడేవాడిని. అమ్మానాన్నకు టచ్‌లో లేను. వాళ్ల ఫోటో కూడా నా దగ్గర లేదు. 

    భార్యాబిడ్డకు దూరం
    అందరికంటే నేను తేడాగా ఎందుకున్నానని ఆలోచించాను. మామూలుగా ఉండాలని ప్రయత్నించాను. సీరియస్‌గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఈ జీవితమంతా ఫేక్‌ అనిపించింది. నా భార్య ఏడాది వయసున్న నా కొడుకును తీసుకొచ్చి చూపిస్తే నాలో ఎటువంటి చలనం లేదు. అంటే నాకు కడుపు తీపి లేదు. కొడుకుని చూసి పదేళ్లవుతోంది. వాళ్లందరికీ దూరంగా ఉన్నాను.

    సిగరెట్లు మానేశా..
    నాకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉంది. దేనిపైనా నాకు వ్యామోహం లేదు. అంతకుముందు అమ్మాయిలను ఇంటికి పిలిచేవాడిని. కానీ, ఏడాదికాలంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. అప్పట్లో వెయ్యికి పైగా సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. కాకపోతే మోగ్లీ సినిమాలో మాత్రం సిగరెట్లు తాగుతూ కనిపిస్తాను అని బండి సరోజ్‌ కుమార్‌ (Bandi Saroj Kumar) చెప్పుకొచ్చాడు.

    సినిమా
    బండి సరోజ్‌ కుమార్‌ నిర్బంధం, నిర్బంధం 2, మాంగళ్యం, పరాక్రమం సినిమాల్లో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించాడు. పోర్‌కాలం, అస్తమానం అనే తమిళ సినిమాలకు దర్శకరచయితగానూ పని చేశాడు.

    చదవండి: ఇమ్మాన్యుయేల్‌ తొండాట.. బయటపెట్టిన నాగార్జున

  • టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్ అంటూ వార్తలు కొత్తేం కాదు. గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు తెలుగు యాంకర్ వర్షిణితో ఇతడు డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వచ్చాయి. తర్వాత తర్వాత అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి. ఇప్పుడు సుందర్, ఓ బాలీవుడ్ నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్‌తో డేటింగ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?

    క్రికెటర్లు.. హీరోయిన్లతో డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటివి కొత్తేం కాదు. ఇప్పుడు ఆ లిస్టులోకి సుందర్ చేరుతాడా అనిపిస్తుంది. ఎందుకంటే హిందీ నటి సాహిబా బాలీతో ఓ కేఫ్‌లో సుందర్ జంటగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎప్పటిది అనేది తెలియట్లేదు గానీ సుందర్-సాహిబా డేటింగ్ గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.

    సాహిబా బాలీ విషయానికొస్తే.. ఈమె కశ్మీరీ కుటుంబానికి చెందిన అమ్మాయి. నాటకాలతో మొదలుపెట్టి హిందీలో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఐపీఎల్‌లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గానూ కనిపించి ఆకట్టుకుంది. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ టైంలోనూ క్రికెట్ యాంకర్‌గా పనిచేసింది. అయితే సుందర్-సాహిబా మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం డేటింగ్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!

  • బాలీవుడ్‌లో ఈ వారం రిలీజ్‌ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్‌’. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. రణ్‌వీర్‌ సింగ్, మాధవన్, సంజయ్‌ దత్, అక్షయ్‌ ఖన్నా, అర్జున్‌ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్‌ బేడీ, సౌమ్య టాండన్‌  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్‌ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్‌ తర్వాత హిట్‌ టాక్‌ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి.

    తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ ఖాతాలో హిట్‌ పడిందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరే చాన్స్‌ ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

    కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్‌ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్‌ ఏజెంట్‌గా రణ్‌వీర్‌ సింగ్‌.. ఐబీ చీఫ్‌గా మాధవన్‌ నటించారు. విలన్‌గా అక్షయ్‌ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. 
     

  • వీకెండ్‌లో ముందు ఫైర్‌ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్‌ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్‌ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్‌.. ఆ డ్రెస్‌లో పవన్‌ మ్యాజిక్‌ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు. 

    కల్యాణ్‌కు సెల్యూట్‌
    ఆ సంగతిని నాగ్‌ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్‌ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్‌ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్‌ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్‌ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్‌ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్‌.

    తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలు
    సంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్‌ అది. అందులో ఇమ్మాన్యుయేల్‌ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్‌ రూల్స్‌ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్‌.. కానీ దాన్ని సంచాలక్‌ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్‌.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్‌.. అని మెచ్చుకున్నాడు.

     

    చదవండి: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: రాజ్‌ పిన్ని

  • బుల్లితెర నటి సారా ఖాన్‌ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్‌ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్‌ లాహిరి కుమారుడే క్రిష్‌ పాఠక్‌. డిసెంబర్‌ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 

    రెండో పెళ్లి
    ఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్‌.. సాప్న బాబుల్‌ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. 

    బుల్లితెరపై, వెండితెరపై..
    పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్‌కే దిఖా, నాచ్‌ బలియే 4 వంటి డ్యాన్స్‌ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్‌ రెయిన్‌బో, సైనైడ్‌, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్‌ అప్‌ షోలోనూ పార్టిసిపేట్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్‌ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్‌ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

    మొదటి పెళ్లి
    బయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్‌ 2016లో అనమ్‌ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్‌ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు.

     

     

    చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్‌ చిన్నత్త

  • చాలా సినిమాలు థియేటర్లలో రిలీజై ఆపై ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్నిసార్లు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'స్టీఫెన్'. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఇంతకీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!

    కథేంటి?
    స్టీఫెన్ జబరాజ్ (గోమతి శంకర్) అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోతాడు. కోర్ట్‌లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో 15 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తుంది. పోలీసులు విచారణ మొదలుపెడతారు. ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? కృతిక ఎవరు? అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఓటీటీల్లో ఎక్కువమంది చూసేవి థ్రిల్లర్స్. సినిమాలు కావొచ్చు, వెబ్ సిరీస్‌లు కావొచ్చు సరిగా తీయాలే గానీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. మరి 'స్టీఫెన్' ఎలా ఉందంటే ఓకే ఓకే అనిపిస్తుంది. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం బోర్ కొట్టిస్తుంది. తొలి గంటలో జరిగే సీన్స్ అన్నీ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. తర్వాత నుంచి స్టోరీలో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. బాగానే తీశారే అనిపిస్తుంది.

    ఆడిషన్ కోసం పిలిచి అమ్మాయిలని స్టీఫెన్ హత్య చేయడం అనే పాయింట్‌తో సినిమా మొదలవుతుంది. తర్వాత ఇతడి కోసం పోలీసులు వెతకడం, ఇతడేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవడం.. కోర్ట్‌లో హాజరు పరచడం.. తర్వాత పోలీస్ కస్టడీకి స్టీఫెన్‌ని అప్పగించడం ఇలా సీన్స్ చకచకా వెళ్తాయి. విచారణ మొదలైన తర్వాత స్టీఫెన్, అతడి గతం, తల్లిదండ్రులు ప్రవర్తన.. స్టీఫెన్ ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలుస్తుంది. కానీ అమ్మాయిలని ఎందుకు చంపాడు అనే ప్రశ్న మాత్రం మన మదిలో ఉండనే ఉంటుంది. దానికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది.

    సినిమా అంతా ఓకే ఓకే ఉంటుంది గానీ చివరి 20 నిమిషాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అప్పటివరకు మనం చూసిందంతా అబద్ధం, ఇది కాక వేరే నిజం ఉంది అనే సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు.

    సైకో కిల్లర్స్ అంటే ఎక్కడో ఉండరు. మన చుట్టుపక్కనే చాలా సాధారణంగా బతికేస్తుంటారు. కాకపోతే వాళ్ల మానసిక పరిస్థితి కారణంగా అమాయకులు బలైపోతుంటారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ స్టోరీలో చాలా కోణాలు ఉన్నాయి. ఓ సైకో కిల్లర్ అమ్మాయిలను చంపడం అనే కథని ఇదివరకే మనం చాలాసార్లు చూశాం. ఈ మూవీ స్టోరీ కూడా అదే అయినప్పటికీ కాస్త కొత్తగా ఉంటుంది. స్టీఫెన్ పాత్రలో చాలా షేడ్స్ కనిపిస్తాయి. అదే ఈ మూవీకి బలం. ఊహించని ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి.

    స్టీఫెన్ పాత్రలో గోమతి శంకర్ అనే కొత్త కుర్రాడు పర్లేదనిపించాడు. మరీ సూపర్ అని చెప్పలేం గానీ బాగా చేశాడు. ఇతడి తల్లిదండ్రులుగా చేసిన విజయ శ్రీ, కుబేరన్ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఓకే ఓకే. టెక్నికల్‌గా ఈ సినిమా మరీ ఏమంత గొప్పగా అయితే అనిపించదు. కాకపోతే సైకలాజికల్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ మూవీస్ అంటే ఇష్టమున్న వాళ్లకు మాత్రం నచ్చేస్తుంది. అభ్యంతరకర సీన్స్ ఏం లేవు గానీ ఒంటరిగానే చూడండి.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: చెల్లి పెళ్లి చేసిన యంగ్ హీరో.. ఎమోషనల్ పోస్ట్)

  • హీరోయిన్‌ సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్‌లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్‌ శోభారాజు. 

    శోభారాజు రియాక్షన్‌
    2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్‌ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్‌ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. 

    చిన్నప్పటి నుంచే..
    వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.

    పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది
    ఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్‌సైజ్‌లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. 

    బహుమతులు ఏమిచ్చారంటే?
    ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్‌ వాడని పర్‌ఫ్యూమ్స్‌ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. 

    చదవండి: పవన్‌ కల్యాణ్‌.. బిగ్‌బాస్‌ చరిత్ర తిరగరాయనున్నాడా?

  • బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి. ఇతడి చెల్లి కృతికకు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగింది. పైలట్ తేజస్వి కుమార్ సింగ్‌తో ఏడడుగులు వేసింది. కార్తీక్ ఆర్యన్ సొంతూరు అయిన గ్వాలియర్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసిన కార్తీక్.. భావోద్వేగానికి గురై పోస్ట్ పెట్టాడు.

    (ఇదీ చదవండి: అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!

    'నీ ప్రపంచం చాలా మారింది. అందులో ఈ రోజు ఒకటి. నా కికీని పెళ్లి కూతురిలా చూస్తుంటే ఇన్నేళ్లు ఒక్క క్షణంలా అనిపిస్తుంది. నువ్వు నా వెనక పరుగెత్తడం దగ్గర నుంచి ఇప్పుడు ఎంతో ఆనందంగా పెళ్లి కూతురిలా నడిచి వస్తున్నావ్. నిన్ను ఇలా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నువ్వు ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించొచ్చు. కానీ ఎప్పటికీ నువ్వు నా చిట్టి చెల్లిలివే. ఈ ప్రయాణం నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుందనుకుంటున్నాను' అని కార్తీక్ ఆర్యన్ ఎమోషనల్ అయిపోయాడు.

    కార్తీక్ ఆర్యన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2011 నుంచి బాలీవుడ్‌లో మూవీస్ చేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా, లూకా చుప్పీ, పతీ పత్ని ఔర్ ఓ, భూల్ భులయ్యా 2, చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 తదితర చిత్రాలతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడి చెల్లి పేరు కృతిక తివారీ. ఈమె డాక్టర్. ఇప్పుడు ఈమెకే పెళ్లయింది. కార్తీక్ ప్రస్తుతం 'తూ మేరీ మైన్ తేరా మైన్ తేరీ తు మేరీ' అనే సినిమా చేశాడు. ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. 

    (ఇదీ చదవండి: ఈ ఏడాది టాప్‌- 10 సినిమాలు ఇవే.. తెలుగు నుంచి ఒకే ఒక్కటి

  • బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ త్వరలోనే రెండోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్‌ మీడియాలో వెల్లడించింది. తాజాగా ఈ నటి తన బేబీ బంప్‌ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేసింది. నల్లటి బనారస్‌ చీరలో బేబీ బంప్‌తో ఉన్న నటి ఫోటోలను చూసిన అభిమానులు బేబీ ఆన్‌ ద వే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    వ్యాపారవేత్తతో పెళ్లి
    ప్రముఖ నటుడు అనిల్‌ కపూర్‌ కుమార్తె సోనమ్‌ కపూర్‌, వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజా 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో వాయు అనే కుమారుడు జన్మించాడు. సినిమాల విషయానికి వస్తే.. సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో 'సావరియా' మూవీతో సోనమ్‌ వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. 

    సినిమాలు
    బాంబే టాకీస్‌, బ్లైండ్‌, ప్రేమ రతన్‌ ధన్‌పాయో, నీర్జా, సంజు, థాంక్యూ, రాంఝన, ఖుబ్సూరత్‌ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సోనమ్‌ (Sonam Kapoor) బ్యాటిల్‌ ఫర్‌ బిట్టోరా సినిమా చేస్తోంది. ఇది అనూజా చౌహాన్‌ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రకటించి రెండేళ్లవుతున్నా మళ్లీ దానిపై ఎటువంటి అప్‌డేట్‌ లేదు.

     

     

    చదవండి: జుట్టు పీక్కునేలా గొడవలు పడ్డాం: హీరోయిన్‌

  • మెగాస్టార్‌ చిరంజీవి-  అనిల్‌ రావిపూడి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ మూవీ నుంచి కొద్దిరోజుల క్రితం విడుదలైన 'మీసాల పిల్ల' సాంగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా 'శశిరేఖ..' అంటూ కొనసాగే రెండో పాటకు సంబంధించిన ప్రోమోను షేర్‌ చేశారు.  డిసెంబర్ 8న పూర్తి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు  లిరిక్స్‌ అనంత్‌ శ్రీరామ్‌ అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మధుప్రియ ఆలపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు సాంగ్‌ను మధుప్రియ  ఆలపించిన విషయం తెలిసిందే.
     

  • మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కుమారుడు  ప్రణవ్ నటించిన హారర్‌ థ్రిల్లర్‌  'డీయస్ ఈరే' మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇండియాలోని ప్రేక్షకులు చూసేందుకు ఇప్పటికే డిసెంబర్‌ 5న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఎఆర్‌ఐల కోసం సన్‌నెక్ట్స్‌లో  ఈ మూవీ తాజాగా విడుదలైంది. అంటే కేవలం ఇతర దేశాల్లోని ప్రేక్షకులు మాత్రమే  'డీయస్ ఈరే' చిత్రాన్ని సన్‌నెక్ట్స్‌లో చూడొచ్చు.

    'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.  ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌ అదిరిపోయే రేంజ్‌లో ఉందని ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. జియోహాట్‌స్టార్‌లో(jiohotstar)  తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో  ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. భారత్‌ మినహా ఇతర దేశాల్లోని ప్రేక్షకుల కోసం సన్‌నెక్ట్స్‌లో తాజాగా విడుదల చేశారు. హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దని నెట్టింట పలు పోస్టులు కనిపించడం విశేషం.
     

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే  గ్లోబల్  సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా  నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను  మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. ఈ స‌మ్మిట్‌కు దేశ‌విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష‌గుర్తింపు పొందిన దిగ్గ‌జాలను ఆహ్వానించ‌డం జ‌రిగింద‌న్నారు.

    ‘లక్ష్యాలు, ఆలోచ‌న‌ల‌ను ఈ స‌మ్మిట్‌లో వివ‌రించ‌బోతున్నాం.  గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి సూచ‌న‌ల  మేర‌కు ఈ రోజు స‌మ్మిట్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని, గ‌డువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్ల‌కు ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో ఇందిర‌మ్మ కాంగ్రెస్  ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

    2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నాం.   2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌న్నారు.  స‌మ్మిట్‌పై ఇండిగో విమానాల ర‌ద్దు ప్ర‌భావం ఏమాత్రం చూప‌ద‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారు దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే అతిధుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌రిశీస్తున్నాం’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై అతివేగం, రాంగ్‌ సైడ్‌ పార్కింగ్, లేన్‌ డ్రైవింగ్‌ అతిక్రమణ, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్‌ పోలీసులు, హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీసీ)లు సంయుక్తంగా కార్యాచరణకు దిగాయి. 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

    ఓఆర్‌ఆర్‌ పొడవు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించిన పోలీసులు.. 14 ప్రాంతాల్లో ఏఐ ఆధారిత మల్టీ వయలేషన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌లను (AI-based multi-violation detection system) ఏర్పాటు చేయనున్నారు. ఇందులోని ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈఎంఈఎస్‌) సాంకేతికత ద్వారా ప్రమాదాలకు కారణం, కారకులను గుర్తించడానికి వీలు కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.

    లేన్‌ డ్రైవింగ్‌.. 
    నగరం చుట్టూ 158 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్‌ విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు 25 ఎగ్జిట్‌ పాయింట్లున్నాయి. ఔటర్‌పై ఒక్కో లైన్‌లో ఒక్కో వేగంతో వెళ్లడానికి అవకాశం ఉన్నా.. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా డ్రైవింగ్‌ చేయడం, అనుమతి లేని ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, సీట్‌ బెల్ట్‌ (Seat Belt) పెట్టుకోకపోవడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వంటి రకరకాల కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళలో జరిగే ప్రమాదాలకు కారణాలను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారడంతో ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. అలాగే ఔటర్‌పై స్లో, స్పీడ్‌ మూమెంట్‌ వాహనాలను సులువుగా గుర్తించవచ్చు.

    చద‌వండి: 27 మున్సిపాలిటీల విలీనానికి వేగంగా అడుగులు

    పెట్రోలింగ్‌ టీమ్‌కు మెసేజ్‌..  
    ఏఐ కెమెరాల్లోని సాంకేతికతతో ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్, మోడల్, క్లాసిఫికేషన్‌ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తించి ఈ– చలానాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సాంకేతికత ద్వారా ఏ ప్రాంతంలోనైనా అనధికారంగా వాహనాలను పార్కింగ్‌ చేసి ఉన్నా వెంటనే స్థానిక పెట్రోలింగ్‌ టీమ్‌కు మెసేజ్‌ను పంపిస్తుంది. వాహనాల కదలికలను గుర్తించి, ప్రమాదాలు జరిగితే అంబులెన్స్‌లను అలర్ట్‌ చేసే టెక్నాలజీ కూడా ఏఐ కెమెరాలకు ఉంటుంది.   

  • హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో తమ విజన్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమ్మిటకు వందలాది మంది విదేశీ ప్రతినిధులు వస్తున్నాయన్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోరుకునేవారంతా ఇందులో పాల్గొనాలని మల్లు సూచించారు. ‘

     ‘6 ఖండాలు 44 దేశాలు 154 మంది ప్ర‌తినిధులు వస్తున్నారు.  తెలంగాణ భ‌విష్య‌త్‌కు సంబంధించిన ఎకనమిక్ సమ్మిట్ ఇది. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగక‌రం. డిసెంబర్ 8న 1.30 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. 9న సాయంత్రం 6 గంట‌ల‌కు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ సమ్మిట్‌ను గవర్నర్‌ ప్రారంభిస్తారు’ అని భట్టి తెలిపారు. 

    8న 2.30కి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మొద‌టి రోజు 8న అభిజిత్ బెన‌ర్జీ, ట్రంప్ డైరెక్ట‌ర్ ఆఫ్‌ ట్రంప్-మీడియా అండ్ టెక్నాల‌జీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడ‌ర్, కర్ణాటక డిప్యూటీ సిఎం డీ కె శివ కుమార్, నోబెల్ బ‌హుమ‌తి గ్రహీత కైలాష్ స‌త్యార్థి, కిర‌ణ్ మ‌జుందార్, కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి ప్రసంగాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు.

    ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ ఆరా..
    తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనే అతిథులు, డెలిగేట్స్‌కు కల్పించే సదుపాయాలతో పాటు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై అధికారులను అరా తీశారు సీఎం రేవంత్‌. 

  • హైద‌రాబాద్‌, సాక్షి : ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆస్ప‌త్రిలో 25 ఏళ్ల యువ‌కుడికి ఆయ‌న చిన్నాన్న ఇచ్చిన కిడ్నీని విజ‌య‌వంతంగా మార్చారు. కిడ్నీ మార్పిడి కేసుల‌లో సొంత బంధువులు ఇవ్వ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌కు ఈ కేసు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుందనీ  జన్యుప‌ర‌మైన సానుకూల‌త‌ల కార‌ణంగా కుటుంబంలోంచి ఎవ‌రైనా కిడ్నీ దానం ఇస్తే అది బాగా విజ‌య‌వంతం అవుతుందనీ ఏఐఎన్‌యూ వెల్లడించింది.

    కోన‌సీమ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువ‌కుడు.. బీటెక్ చ‌దివి, హైద‌రాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు. సుమారు రెండేళ్ల క్రితం ఉన్న‌ట్టుండి అత‌డికి త‌ల‌నొప్పి, వాంతులు త‌ర‌చు అవ్వ‌డం మొద‌లైంది. ఏంటా అని వైద్యుల‌కు చూపించుకుంటే సీరం క్రియాటినైన్ బాగా పెరిగింద‌ని ర‌క్త‌ప‌రీక్ష‌ల్లో తేలింది. మ‌రిన్ని ప‌రీక్ష‌ల అనంత‌రం.. అత‌డికి దీర్ఘ‌కాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ఉంద‌ని తెలిసింది. దీంతో ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యుల‌ను సంప్ర‌దించాడు.   సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ నెఫ్రాల‌జిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియ‌న్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ గుండ్ల‌ప‌ల్లి ఆధ్వర్యంలో చికిత్స అందించి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా  ముగించారు.

    సాధార‌ణంగా ఇంత చిన్న వ‌య‌సులో ఎలాంటి దుర‌ల‌వాట్లు లేనివాళ్ల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు రావ‌డం అరుదు. కానీ, రోగ‌నిరోధ‌క శ‌క్తి కార‌ణంగా కొన్నిసార్లు ఇలా కావ‌చ్చని వైద్యులు తెలిపారు. మరోవైపు   కిడ్నీని దానం చేసేందుకు  త‌ల్లిదండ్రుల ర‌క్తం గ్రూపులు ఆ యువ‌కుడి గ్రూపుతో క‌ల‌వ‌లేదు. దానికితోడు  వారి ఆరోగ్య పరిస్థితులు కూడా   దానానికి అనుగుణంలేదు. దీంతో అత‌డి చిన్నాన్న ముందుకు రావ‌డంతో లాప‌రోస్కొపిక్ ప‌ద్ధ‌తిలో కిడ్నీ సేక‌రించి, దాన్ని యువ‌కుడికి అమ‌ర్చామని డా. శ్రీ‌కాంత్ వివ‌రించారు.

    చిన్న‌ప్ప‌టి నుంచి ఉన్న బంధంతోనే..
    ఇంత‌కుముందు  తనకెలాంటి స‌మ‌స్య లేదు,  చెడు అల‌వాట్లు కూడా లేవని  యువకుడు తెలిపారు. 2023 డిసెంబ‌ర్ నుంచి అప్పుడ‌ప్పుడు వాంతులు, త‌ల‌నొప్పి రావ‌డంతో వైద్యులను సంప్రదించానని చెప్పారు.  కిడ్నీ మార్పడి అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. అమ్మానాన్న‌ల నుంచి కిడ్నీ తీసుకోలేని ప‌రిస్థితి ఉండ‌డంతో, తన ప‌రిస్థితి చూసి చ‌లించిపోయి  బాబాయ్‌ కిడ్నీని దానం చేసేందుకు  ముందుకొచ్చారన్నారు.  మా పిన్ని, వాళ్ల పిల్ల‌లు కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. దాంతో విజ‌య‌వంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. బాబాయ్ పూర్తిగా కోలుకుని ప‌ని చేసుకుంటున్నారు. నాకు కూడా ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని ఆ యువ‌కుడు చెప్పాడు.

    యూరాల‌జీ రోబోటిక్ స‌ర్జ‌రీ, యూరో-ఆంకాల‌జీ, రీక‌న్‌స్ట్ర‌క్టివ్ యూరాల‌జీ, నెఫ్రాల‌జీ, కిడ్నీ మార్పిడి, డ‌యాల‌సిస్, మ‌హిళ‌ల యూరాల‌జీ, పీడియాట్రిక్ యూరాల‌జీ, పురుషుల ఆరోగ్యం, ఆండ్రాల‌జీ. భార‌త‌దేశంలో యూర‌లాజిక‌ల్ శ‌స్త్రచికిత్స‌ల‌లో విశేష సేవలందిస్తోందని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ గురించి విభాగం వెల్లడించింది.

  • సాక్షి హైదరాబాద్ : భారత విమానయాన సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సివిల్ ఏవియేషన్ లో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం నడుస్తుందన్నారు. విమానయానం మెుత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఐదు రోజులుగా దేశంలోని ఎయిర్ పోర్టులు బస్టాండ్లను తలపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

    ఏడాది కింద డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకవస్తే వాటిని ఇండిగో సంస్థ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. శ్రమ దోపిడికి అలవాటు పడ్డ సంస్థ రూల్స్ అమలు చేయడానికి ఇష్టపడట్లేదని వాటిని అమలు చేయాలని డీజీసీఏ ఒత్తిడి తెస్తే 1,000 విమానాలను రద్దు చేసిందని తెలిపారు. ఇండిగో చర్యలతో విమానాశ్రయాలన్నీ బస్టాండ్లను తలపిస్తున్నాయన్నారు. పవర్ కొంతమంది చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ అర్థమైందని కేటీఆర్ ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

    ఇండిగో విమానాల రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్
  • సాక్షి హైదరాబాద్‌: సర్పంచ్‌ ఎన్నికల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో రద్దీ భారీగా పెరిగింది. ఆదాయం, కుల ధృవీకరణ  సర్టిఫికేట్‌ల కోసం అప్లికేషన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మెుత్తం మీద గత రెండు వారాల్లో మీసేవ  అత్యధిక దరఖాస్తులను స్వీకరించినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

    నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు మీసేవ మొత్తం 4,19,219 దరఖాస్తులు స్వీకరించింది. వీటిలో 1,67,779 ఆదాయ సర్టిఫికేట్‌లు కాగా  1,61,601 కుల సర్టిఫికేట్‌లు వీటితో పాటు  2,185 ఆదాయ రీయిష్యూ, 87,654 కుల రీయిష్యూ దరఖాస్తులు ఉన్నాయి. భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ  సేవల్లో పెద్దగా అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. అయితే  కొన్ని కేంద్రాల్లో  స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తగా  టెక్నికల్ టీములు వెంటనే వాటిని  పరిష్కరించాయని పేర్కొన్నారు.  

    రోజువారీ గణాంకాలు ఎన్నికల రద్దీని స్పష్టంగా ప్రతిబింబించాయి. ఆదాయ సర్టిఫికేట్ దరఖాస్తులు పీక్ రోజుల్లో 19 వేలకు చేరుకోగా, కుల సర్టిఫికేట్ దరఖాస్తులు 28 వేల మార్క్‌ను దాటాయి. రీయిష్యూ దరఖాస్తులు కూడా అధికంగా నమోదైనట్టు డేటా సూచిస్తోంది.  

    మీ సేవ సేవలను నిలకడగా కొనసాగించేందుకు నిరంతర పర్యవేక్షణ, వేగవంతమైన సాంకేతిక స్పందనను వ్యవస్థలు కొనసాగించాయని అధికారులు తెలిపారు. ఫీల్డ్ నుంచి వచ్చిన సమస్యలకు వెంటనే స్పందించి సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని వారు పేర్కొన్నారు.  

    ఎన్నికల ప్రభావం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రజలకు పారదర్శకంగా, సమయపాలనతో, సౌహార్దంగా సేవలు అందించే సామర్థ్యం మీసేవకు ఉందని సంబంధిత  విభాగం ప్రజలకు  భరోసా ఇచ్చింది.

International

  • భారత్- అమెరికా దౌత్య సంబంధాలపై అమెరికా మాజీ రక్షణ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇరు దేశాల మధ్య మైత్రి దెబ్బతినడానికి పాకిస్థాన్ కారణమన్నారు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే  వల్లే  భారత్ - రష్యా మధ్య స్నేహం మరింతగా చిగురిస్తుందని తెలిపారు.

    భారత్- అమెరికాల మధ్య ప్రస్తుతం దౌత్య సంబంధాలు మెరుగ్గా లేవు. దానికి  కారణం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలతో పాటు తలబిరుసు వ్యాఖ్యలు ఈ రెండింటి కారణంతో భారత్- యూఎస్ మధ్య గ్యాప్ పెరిగింది. అదే సమయంలో ఇండియా- రష్యా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ రక్షణ అధికారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

    అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మిచెల్ రూబిన్ మాట్లాడుతూ "భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ట్రంప్ రివర్స్ చేసిన విషయం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ ఇలా చేయడానికి కారణమేంటా అని? ఆలోచిస్తున్నారు. బహుశా పాకిస్థానీల పొగడ్తల వల్లనో లేక పాకిస్థాన్, టర్కీ, ఖతార్ దేశాలు ఆయనకు లంచం ఇచ్చి ఉండవచ్చు. ఈ లంచం అమెరికాను  ద్రవ్యలోటులో ఉంచబోతుందని" ఆయన అన్నారు. రష్యాతో, అమెరికా వాణిజ్యం చేస్తూనే ఇండియాను ట్రేడ్ చేయద్దని అడ్డుకంటుందన్నారు.

    భారత ప్రజలు వారి ప్రధాని మోదీని ఎన్నుకున్నది అక్కడి ప్రజల అవసరాలను తీర్చడానికే అన్న విషయం అమెరికన్లకు అర్థం కావడం లేదన్నారు. భారత్ అనేది చాలా పేరు గల దేశం త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరిచబోతుంది. అటువంటి దేశానికి  ఎనర్జీ అవసరం ఎంతో ఉంటుందన్నారు. ఒకవేళ రష్యా చమురు కొనకుండా భారత్ ను నియంత్రించాలనుకుంటే అమెరికా అంతకంటే తక్కువ ధరకు ఆ దేశానికి చమురు అందించాలని తెలిపారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మౌనంగా ఉండడం ఉత్తమం అన్నారు. ఎందుకంటే ఏ దేశమైన వారి అవసరాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని మిచెల్ రుబెన్ తెలిపారు.

    యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఆపరేషన్ సింధూర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాక్ మధ్య యుద్ధం తానే ఆపానని అన్నారు. అంతే కాకుండా రష్యా చమురు కొంటే అధిక పన్నులు విధిస్తానని భారత్ ను హెచ్చరించారు. ఇండియా ట్రంప్ వ్యాఖ్యలని లెక్కచేయకపోవడంతో ఆగస్టులో  భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50 శాతం పన్ను విధించారు.

  • పాకిస్తాన్‌--ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులు మళ్లీ భగ్గుమన్నాయి.  వీరి మధ్య మధ్య శాంతి ఒప్పందం జరిగిన 48 గంటల వ్యవధిలోనే మళ్లీ ఇరు దేశాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో తమ దేశాలనికి చెందిన ఐదుగురు పౌరులు మృతిచెందిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ ధృవీకరించింది. ఇరు దేశాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగియాని, పాకిస్తాన్‌ తమ సరిహద్దులు వెంబడి కాల్పులకు ఉపక్రమించిందని ఆఫ్ఘాన్‌ అధికారులు స్పష్టం చేశారు. వారి దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టామని, కాకపోతే ఐదుగురు పౌరులు మృత్యువాత పడటం బాధాకరమని ఆఫ్ఘాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

    దాంతో ఇరుదేశాల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయ్యింది. ఈ ఏడాది అక్టోబర్‌లో, ఆపై నవంబర్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగ్గా,  తాజాగా వీరి మధ్య మరొకసారి ఒప్పందం జరిగింది. అయినప్పటికీ సరిహద్దుల వెంబడి ఇరు దేశాలు కాల్పులు జరుపుకోవడం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

    కందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్ ప్రాంతంతో పాటు, అలాగే పాకిస్తాన్ సరిహద్దు చమన్ ప్రాంతం వద్ద కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆఫ్ఘాన్‌ చెబుతుండగా,  ఆఫ్ఘానిస్తానే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని పాకిస్తాన్‌ అంటోంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాతే ఈ కాల్పుల విరమణ జరిగిందని  ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి.

  • జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ఇక్కడి ప్రటోరియా సమీపంలో ఓ హాస్టల్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు జొహన్నెస్‌బర్గ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు.

    కాల్పులు జరిపిందెవరో స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికారి అథ్లెండా మాథే తెలిపారు. మృతుల్లో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 సమయంలో హాస్టల్‌కు వచ్చి, తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

    ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించినట్లు, దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 2023-24 నివేదిక ప్రకారం హత్యల రేటులో దక్షిణాఫ్రికా టాప్-10లో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందికి గాను 45 మంది హత్యకు గురవుతున్నారు. రోజుకు సగటున 63 హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.


     

  • త్వరలో భారత్‌కు 40 వేల లైట్ మెషీన్ గన్లు సరఫరా చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ సంస్థ సిద్ధమవుతోంది. ఇరుదేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కి చెందిన (Israel Weapon Industries (IWI) సంస్థ భారత్‌కు లైట్ మెషిన్ గన్స్ సరఫరా చేయడానికి రెడీ అయ్యింది.  

    ఈ సరఫరా 2026 ఆరంభం నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుండి 40,000 లైట్ మెషిన్ గన్స్ (ఎల్ ఎంజీ) మొదటి బ్యాచ్ ను భారతదేశానికి పంపిణీ చేయడం ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన రక్షణ సంస్థ తెలిపింది.

    ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) సీఈవో షుకీ స్క్వార్ట్జ్ మాట్లాడుతూ భారతదేశంలో పిస్టల్స్, రైఫిల్స్, మెషిన్ గన్లు వంటి ఆయుధాల అమ్మకంపై భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన అనేక ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

    "మేము ప్రస్తుతం మూడు పెద్ద కార్యక్రమాలలో పాల్గొంటున్నాము. మొదటిది గత సంవత్సరం సంతకం చేసిన 40 వేల లైట్ మెషిన్ గన్ల ఒప్పందం. మేము అన్ని పరీక్షలు,  ప్రభుత్వ దర్యాప్తులను పూర్తి చేశాం.  ఉత్పత్తి చేయడానికి మాకు లైసెన్స్ వచ్చింది. మేము సంవత్సరం ప్రారంభంలో మొదటి సరుకును పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని తెలిపారు. 

    లైట్‌ మెషీన్‌ గన్స్‌( LMG) సరఫరా ఐదేళ్ల పాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  ఇంతకంటే త్వరగా సరఫరా చేయగలనని, అయితే మొదటి లాట్ సంవత్సరం ప్రారంభంలో పంపిణీ  చేసే అవకాశం ఉందన్నారు. కార్బైన్ కోసం టెండర్ అని చెప్పారు. ఇందులో కంపెనీ రెండో అత్యధిక బిడ్ వేలం వేయగా, 'భారత్ ఫోర్జ్' ప్రధాన బిడ్డర్‌గా నిలిచింది. మేము ఈ ఒప్పందంలో 40 శాతం సరఫరా చేయాలనుకుంటున్నాము. మేము ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు దశలో ఉన్నాం. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో పూర్తవుతుందని నేను భావిస్తున్నాను.

    సీక్యూబీ కార్బైన్‌లో 60 శాతం భారత్ ఫోర్జ్ సరఫరా చేయనుంది, మిగిలిన 40 శాతం (1,70,000 యూనిట్లు) అదానీ గ్రూప్ కంపెనీ పీఎల్ఆర్ సిస్టమ్స్ సరఫరా చేస్తుంది’ అని స్పష్టం చేశారు. 

    అర్బెల్ టెక్నాలజీ గురించి స్క్వార్ట్జ్ మాట్లాడుతూ, ‘ ఇది కంప్యూటరైజ్డ్ ఆయుధ వ్యవస్థ, దీనిలో ఒక సైనికుడు సరైన లక్ష్యంలో ఉన్నప్పుడు సంక్లిష్టమైన అల్గోరిథం గుర్తిస్తుంది మరియు ఆపై గొప్ప వేగం మరియు ఖచ్చితత్వంతో కాల్పులు జరుపుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశాన్ని అనుసంధానించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

    "అర్బెల్ టెక్నాలజీని అవలంబించడానికి మేము వివిధ ఏజెన్సీలతో ప్రారంభ చర్చలు జరుపుతున్నాం వారు దానిని తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, మేము దానిని ఇజ్రాయెల్‌తో పాటు భారతదేశంలో సంయుక్తంగా తయారు చేసి సరఫరా చేస్తాం పిఎల్ఆర్ సిస్టమ్స్ భారతదేశంలో ఈ సహ-ఉత్పత్తిని నిర్వహిస్తుంది’ అని తెలిపారు.

    ఎందుకు ఇది ముఖ్యమైంది?

    • భారత రక్షణ సామర్థ్యం పెరుగుతుంది: కొత్త తరం LMGలు సైనికులకు అధునాతన ఫైర్‌పవర్ అందిస్తాయి.
    • ఇజ్రాయెల్-భారత్ రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి: ఇజ్రాయెల్ ఇప్పటికే భారత్‌కు డ్రోన్లు, రాడార్లు ఇతర రక్షణ సాంకేతికతలు అందిస్తోంది.
    •  ఈ ఒప్పందం భారత్‌కి రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరుస్తుంది.

       

     

  • బ్రెజిల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి జిమ్‌ చేస్తూ కన్నుమూసిన ఘటన విషాదాన్ని నింపింది.బ్రెజిల్‌లోని ఒలిండా నగరంలో ఉన్న ఒక  జిమ్‌లో రొనాల్డ్ మోంటెనెగ్రో కసరత్తు  చేస్తున్నాడు.  రోజూ వ్యాయామం చేసే జిమ్‌లోనే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్‌లోని ఈశాన్య తీరంలోని  రెసిఫే నగరానికి సమీపంలోని  ఒలిండాలో ఈ నెల 1న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది.    

    రోనాల్డ్ మోంటెనెగ్రో బెంచ్ ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బార్‌బెల్  జారి ఛాతీపై పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో  రికార్డయ్యాయి.  బార్‌బెల్  జారి  బార్బెల్  ఛాతీపై పడింది.  దీని తర్వాత  తొలుత లేచాడు కానీ సెకన్లలోనే కుప్పకూలిపోయాడు.  పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తుచేశారు. ఇది ఒక ప్రమాదమని ప్రాథమికంగా భావించారు.

     దీనికి సంబంధించిన వీడియెనెట్టింట  వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు.స్పాటర్ ఉండటంఅందుకే చాలా ముఖ్యం! ఇలాంటివి చేసేటపుడు ట్రైనర్‌ కచ్చితంగా ఉండాలని కొందరు  విచారం వ్యక్తం చేశారు. అయ్యో..  కొన్ని సెకన్లలోనే జీవితం మారి పోయింది అని మరికొందరు వ్యాఖ్యానించారు.  మరోవైపు మోంటెనెగ్రో పని చేసే పలాసియో డోస్ బోనెకోస్ గిగాంటెస్ మ్యూజియం, ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జిమ్, RW అకాడెమియా కూడా దాని సోషల్ మీడియాలో విచారాన్ని వ్యక్తం చేసింది.  

    ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం ..కట్‌ చేస్తే


     

National

  • ముందస్తు హెచ్చరికలు లేకుండా వందలాది విమానాలు రద్దు, ప్రయాణీకులు ఆగ్రహాలు, కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్ననేపథ్యంలోఇండిగో ఎట్టకేలకు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని తాజాగా ప్రకటించింది.

    ఇండిగో కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల నియామ​​కాలు 
    సిబ్బంది నియామకాల్లో నెలల తరబడికొనసాగుతున్న స్తంభనను ముగించి ఇండిగో కొత్త FDTL నిబంధనలకు అనుగుణంగా నియంత్రణ సంస్థ డీజీసీఏ ద్వారా తాత్కాలిక మినహాయింపు పొందిన రోజే ఎయిర్‌బస్ A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లను (టైప్ రేటెడ్) నియమాకాలకు రంగంలోకి దిగింది.

    ఈ పదవికి భారతీయులు డిసెంబర్ 6న, ఎయిర్‌లైన్ A320 కెప్టెన్లు, ఇతర సిబ్బంది కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జారీ చేసింది. భారతీయ పౌరులు లేదా 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు  ఉండి,  విదేశీ పౌరుడు కార్డ్ హోల్డర్లు కాకుండా ఉండాలి. దరఖాస్తుదారులు A320 కుటుంబంలో మొత్తం 3000 గంటలు ,PIC పోస్ట్ లైన్ రిలీజ్‌గా కనీసం 100 గంటలు ప్రయాణించాలి.

    ఇదీ చదవండి: రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!

    అలాగే 18-27 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా భారతీయ పౌరుల కోసం క్యాబిన్ అటెండెంట్ (గ్రేడ్ ట్రైనీ) నియామకాన్ని కూడా ఎయిర్‌లైన్ ప్రారంభించింది. అభ్యర్థి ఏదైనా ఇండిగో స్థావరంలో మకాం మార్చేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇండిగో నెట్‌వర్క్ అంతటా తన కార్యకలాపాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకు రావడానికి దృఢంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.

    కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని ఇండిగో ప్రకటించినప్పటికీ పైలట్ల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) నియామకాల నిలిపివేత కొనసాగుతోందని ఆరోపించింది.  మరో పైలట్ సంస్థ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) కొత్త FDTL నిబంధనలను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై  తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కాగా కొత్త FDTL నియమాలు వన్-టైమ్ మినహాయింపు ఇండిగో కొన్ని కఠినమైన నిబంధనలను, ముఖ్యంగా నైట్ డ్యూటీకి సంబంధించిన నిబంధనలపై మినహాయింపునిచ్చింది.

    ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం ..కట్‌ చేస్తే
     

  • ఇండిగో వైఫ్యలం, భారీ సంక్షోభంతో ఇతర విమానయాన సంస్థలు తమ ఇష్టారీతిన ధరలను పెంచేశాయి.  అనేక మార్గాల్లో టిక్కెట్ల ధరలు భారీగా పెంచేసిన ప్రయాణీకులను దోచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ శనివారం దేశీయ విమాన ఛార్జీలపై పరిమితిని విధించింది. ప్రయాణికులనుంచి ఎటువంటి అదనపు ఫీజుల వసూలు చేయొద్దని,  టికెట్ ధరలు పెంచకుండా పరిమితులు విధిస్తూ విమానయాన సంస్థలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, విమానయాన సంస్థలు కొత్తగా నిర్ణయించిన గరిష్ట ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయరాదని మంత్రిత్వ శాఖ తన ఆదేశంలో పేర్కొంది, కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే వరకు ధరలను స్థిరీకరించడానికి ఈ  ఆదేశాలిచ్చారు.

     

    ఈ పరిమితి కింద, అనుమతించబడిన గరిష్ట ఛార్జీలు ఇలా ఉన్నాయి.  

    • 500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 7,500

    • 500 - 1,000 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 12,000

    • 1,000 నుండి 1,500 కి.మీ వరకు ఉన్న మార్గాలకు రూ. 15,000

    • 1,500 కి.మీ కంటే ఎక్కువ ఉన్న మార్గాలకు రూ. 18,000

    ఈ పరిమితికి లోబడే చార్జీలను వసూలు చేయాల్సి ఉంటుంది.  అవకాశవాద ధరలు, అసాధారణంగా పెరిగిన విమాన ఛార్జీలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిర్దేశించిన పరిమితులను మించి వసూలు చేస్తే  కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది.  మరోవైపు మిస్‌ అయిన  లేదా ఆలస్యమైన అన్ని సామాగ్రిని 48 గంటల్లోపు ట్రాక్ చేసి  సంబంధీకులకు తిరిగి ఇవ్వాలని మంత్రిత్వ శాఖ ఇండిగోకు తేల్చి చెప్పింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ప్రాసెస్ చేయాలి. ఏదైనా  జాప్యం,లేదా నిర్లక్ష్యం  జరిగినా  నియంత్రణ  చర్యలు తప్పవని పేర్కొంది. 

     ప్రస్తుత ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాలకు ప్రయాణానికి దేశీయ విమాన ఛార్జీలను భారీగా పెరిగాయి. ఒక్కె టికెట్‌ పైనా మూడు నాలుగు రెట్లు  ధరలను వసూలు చేస్తున్నాయి. పెరిగాయి. ఉదాహరణకు, ఢిల్లీ నుండి ముంబైకి నాన్-స్టాప్ విమానం ధర రూ. 65,460కి పెరిగింది, అయితే వన్-స్టాప్ విమాన ఎంపికలు రూ. 38,376 నుండి రూ. 48,972 వరకు ఉన్నాయి.  వందలాది విమానాల రద్దు, దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఇబ్బందుల తర్వాత కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంది.  మరో మూడు రోజుల్లో  విమానాలు, ప్రయాణాల అంతా సర్దుకుటుందని చెప్పింది. అలాగే   ప్రయాణికులను అన్ని  సౌకర్యాలను  కల్పించాలని,   పిల్లలు, వృద్ధులు, మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇండిగోను ఆదేశించింది.  శుక్రవారం 1,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా,  శనివారం 400 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేసింది ఇండిగో.

     

    ఇదీ చదవండి: ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన నటి
     

     

  • గత కొద్ది రోజులుగా దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.     

    దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఐదో రోజు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. విమానాలు రద్దయ్యే సమాచారం ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో  వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సంస్థ కావాలనే ఈ విధంగా చేసిందని కేంద్రం భావిస్తోంది. దీంతో  ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు పెద్ద మెుత్తంలో జరిమానా విధించనున్నట్లు సమాచారం.

    ఈ మేరకు కేంద్ర విమానయాన సంస్థ ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ భేటీకి ఇండిగో సంస్థ యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది.ప్రస్తుత ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ 2022లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ కి సీఈఓగా వ్యవహరించారు.

    కాగా ఇండిగో ఘటనపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. అంతర్గతంగా చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైందని అంగీకరించారు. అంతర్గతంగా అన్నీ షెడ్యూళ్లను రీబూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 5-10 రోజుల్లో ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. 

     

     

  • ఏఐ, రోబోటిక్స్‌ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్‌ మస్క్‌. ఆయన నిఖిల్‌ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేశారు. మస్క్‌ మాటల్లోని ముఖ్యాంశాలు:

    భారతీయులు ‘ద బెస్ట్‌’
    ‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్‌–ఏఐ, స్పేస్‌ఎ క్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలు హెచ్‌–1బి వీసాలతో అమెరికన్‌ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్‌–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.

    పని అభిరుచి అవుతుంది!
    ‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్‌ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్‌ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.

    ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయ‌లే.. ఎగబడిన జనం ..కట్‌ చేస్తే

    డిజిటల్‌ ఫ్రీ... ‘లైవ్‌’ కాస్ట్‌లీ
    ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్‌ రియల్‌ –టైమ్‌ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్‌ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్‌ – ఈవెంట్‌’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!

    చదవండి : ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన నటి

    వితరణలకు పెను సవాళ్లు
    ‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్‌ ఫౌండేషన్‌’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!

    అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’
    ‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్‌ కాయిన్‌ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన  శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 
    ఎడిటోరియల్‌ టీమ్‌

    వ్యూ పాయింట్‌: 

    పాడ్‌కాస్ట్‌: పీపుల్‌ బై డబ్లు్య.టి.ఎఫ్‌.
    అతిథి: ఎలాన్‌ మస్క్, పారిశ్రామికవేత్త
    హోస్ట్‌: నిఖిల్‌ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్‌

  • సాధారణంగా తల్లిదండ్రులనో,  తమ జీవిత భాగస్వాములనో  జీవితంలో మొదటి సారి విమానం   ఎక్కించి, వారికి చక్కటి  అనుభవాన్ని అందించాలని చాలామంది కోరకుంటారు. కానీ తమ ఇంటిలో సహాయకులకు మరపురాని అనుభవాన్ని అందించేఘటనలు చాలా అరుదు.  నటి అర్చన  పూరన్‌  సింగ్  మంచిమనసును చాటుకున్న వైనం నెట్టింట ఆకర్షణీయంగా నిలుస్తోంది.

    నటి అర్చన పూరన్‌ సింగ్‌ ఇటీవల తన హౌస్ కీపర్ భాగ్యశ్రీకి జీవితంలో మర్చిపోలేని అనుభవాన్ని అందించింది. ఆమెను మొట్టమొదటిసారి  విమానంలో ప్రయాణించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో  ఇది వైరల్‌గా మారింది.

    రాత్రిబాగా  నిద్రపోయి భాగ్యశ్రీ పనికి లేటుగా రావడం,విమానాశ్రయంలో భోజనం కోసం ఆగినప్పుడు, దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే మూవీలోని జోక్‌లు మొదలు, విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా తన సీట్ బెల్ట్ బిగించుకోవడానికి సహాయం చేయమని అర్చన భాగ్యశ్రీ పక్కన ఉన్న ప్రయాణికుడిని అడగడం, నేను వేసుకున్నా అని  భాగ్యశ్రీ చెప్పడం, సూట్‌ కేస్‌ మిస్‌ అయిందనే జోకులతో పాటు ఎన్నో సన్నివేశాలు ఈ వీడియోలో చూడవచ్చు. టేక్‌ ఆఫ్‌ అప్పుడు కొద్దిగా భయమేసింది అందరూ నా వైపే చూశారు. కానీ ఒక్కసారి విమానం ఆకాశంలోకి ఎగిరాక మేఘాల్లో తేలినట్టు ఉంది అంటూ భాగ్యశ్రీ తన ప్రయాణ అనుభవంపై ఉత్సాహంగా మాట్లాడింది.

     

  • ఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడి పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్షించారు. ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్‌ ఇచ్చారు. అయితే, సమీక్షకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ను పీఎంవో పిలవలేదని సమాచారం.

    పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు ఘోరంగా విఫలమయ్యారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేతకానితనంతో దేశ ఏవియేషన్‌ రంగంలో పెను సంక్షోభం నెలకొందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండిగో సంక్షోభాన్ని చివరి వరకు రామ్మోహన్‌ పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

    కాగా, ఇండిగో సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై సీరియస్‌ అయ్యింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్‌ను ఆలస్యం చెయవద్దని.. రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు, ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది.

    బాధ్యత లేదా..! రామ్మోహన్ నాయుడుపై మోదీ ఆగ్రహం

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.  శంషాబాద్‌లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

    దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దుతో భారత రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-చెన్నై,చర్లపల్లి- కోల్‌కత్తా, హైదరాబాద్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 37 రైళ్లకు 116  కోచ్‌లు జోడించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగీలతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి.

    కాగా, రేణిగుంట విమానాశ్రయంలోనూ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థ తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక పక్క సంక్షోభం కొనసాగుతుండగానే  ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

     

     

  • మూడు రోజులుగా దేశ వైమానిక రంగంలోసంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణ వాయిదాల నివారణకు తగిన ప్రత్యామ్నాయలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ ను ఆలస్యం చెయవద్దని వారికి  రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల వేలాది మంది ఇబ్బందులు పడుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపింది. 

    ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంస్థకు ఏమాత్రం పట్టడం లేదని దానిని కనీసం లెక్కచేయడం లేదని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. 

    ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు  కేంద్ర విమానయాన శాాఖ కీలక సమావేశం నిర్వహించనుంది.  ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని  ఆదేశించింది. కాగా డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఇండిగో సంస్థ  ప్రకటించింది. అయితే ఆ రూల్స్ ని డీజీసీఏ  తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు. 

    ప్రయాణికులకు విమానాలు రద్దైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇండిగో సంస్థ కావాలనే వారికి ఈ సమాచారం అందించలేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్తరూల్స్ వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండిగో సంస్థ కావాలనే ఈ కృత్తిమ సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

  • బెంగళూరు నగరంలో ఒకవైపు ఇండిగో విమానాలరద్దు  ఆందోళన కొనసాగుతుండగానే  మరో గందరగోళం వెలుగులోకివచ్చింది. ఏ వంటకమైనా  రూ. 30 అన్న ఆఫర్‌, విపరీతమైన ట్రాఫిక్‌తో పోలీసులకు తలనొప్పిగా మారింది.

    బెంగళూరులోని హెబ్బల్‌లోని ఒక ప్రముఖ పబ్ తన మూడవ వార్షికోత్సవాన్ని సందర్భంగా'రూ. 30 కి ఏదైనా వంటకం' అనే ఆఫర్‌ను ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది దీంతో  కస్టమర్లు ఆ పబ్‌కు క్యూ కట్టారు. దాదాపు 300 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఆ స్థలంలో దాదాపు 1,000 మంది  తరలి వచ్చారు.  దీంతో  జనాన్ని నియంత్రించ లేక సిబ్బంది నానా బాధలు పడ్డారు.

    అటు  ఫుడ్‌ కోసం  పడిగాపులు జనం పబ్ వ్యతిరేకంగా నినాదాలతో  ఆందోళనకు దిగడం, విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో పరిస్థితిని నియంత్రించలేక, సాయంత్రం 4 గంటలకు ముందే అవుట్‌లెట్‌ను మూసివేసింది. సరిగ్గా ప్లాన్‌ లేకపోవడంతో, జనాన్ని అదుపు  చేయలేకపోవడంతో వేచి ఉన్న కస్టమర్లలో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. మరోవైపు ఈ రద్దీ కారణంగాఎస్టీమ్ మాల్ రోడ్,హెబ్బల్ ఫ్లైఓవర్‌తో సహా ప్రక్కనే ఉన్న రోడ్లపై ట్రాఫిక్ స్థంభించిపోయింది.  చివరికి పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

    దీనిపై  కస్టమర్లు ఏమన్నారంటే..
    ఆఫర్‌కి సంబంధించి టైం ఏమీ చెప్పలేదు. కాబట్టి మేము డిన్నర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుని సాయంత్రం 6.30 గంటలకు బసవేశ్వరనగర్ నుండి బయలుదేరాం. కానీ భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఎస్టీమ్ మాల్ దగ్గరికి వెళ్లేసరికి పబ్‌ మూసేశారని తెలిపింది. పిల్లలు తాము ఆకలితో, బాధతో వెనక్కి వచ్చామని వాపోయింది ఏడుగురు కుటుంబ సభ్యులతో పబ్‌కు వచ్చిన 35 ఏళ్ల మహిళ. 

    ఉదయం 11.30 గంటలకు పబ్‌కు చేరుకున్నాం అప్పటికే రెండు క్యూలు కనిపించాయి. మొదటి బ్యాచ్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే లోపలికి అనుమతించారు, ఆ తర్వాత మమ్మల్ని లోపలి క్యూలోకి పంపారు. బ్యాచ్‌ బ్యాచ్‌లుగా జనం వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1 కల్లా ఆఫర్‌ముగిసిందన్నారు. నిరసనల తర్వాత, 10 మందిని బ్యాచ్‌లుగా అనుమతినిచ్చారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు మాకు టేబుల్ దొరికింది. చాలా భయంకరం అని మరొకరు చెప్పారు.

    సిబ్బంది ఏమన్నారంటే 
    వాస్తవానికి, ఆఫర్‌ను రోజంతా అమలు చేయాలనుకున్నాం. కానీ  1,000 పైగా జనం రావడంతో ఇబ్బందిగా మారిందని సిబ్బంది చెప్పారు. ఇంత స్పందన ఊహించలేదని, భద్రతా కారణాల వల్ల పబ్‌ను ముందుగానే మూసివేయాల్సి వచ్చిందన్నారు. మరోవైపు జనం వెళ్లిపోయేంతవరకు షట్టర్లను మూసివేయమని తామే పబ్ యాజమాన్యానికి చెప్పి, జనాన్ని చెదరగొట్టామని పోలీసు అధికారి తెలిపారు. 

  • న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు సుదూర ప్రయాణాలలో కొత్త అనుభవాన్ని అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. వేగవంతమైన తేజస్, సౌకర్యవంతమైన రాజధాని, వందే భారత్‌లోని  అధునాతన సాంకేతికతల కలబోతగా మనముందుకు ‘వందేభారత్‌ స్లీపర్‌’ రానుంది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును డిసెంబర్ చివరి నాటికి ఢిల్లీ-పట్నా మార్గంలో నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంల్‌) ఫ్యాక్టరీలో తయారవుతున్న వందే భారత్ స్లీపర్ రెండు రేక్‌లలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. మొదటి రేక్ డిసెంబర్ 12న నార్తర్న్ రైల్వేకు బయలుదేరి, ఆ తర్వాత ఢిల్లీ-పట్నా మార్గంలో ట్రయల్ రన్‌కు సిద్ధం కానుంది. ఈ హైటెక్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 827 బెర్త్‌లు అందుబాటులో ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీలో 611 బెర్త్‌లు, సెకండ్ ఏసీలో 188 బెర్త్‌లు, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి. భవిష్యత్తులో కోచ్‌ల సంఖ్యను 24కి పెంచే అవకాశం కూడా ఉంది.

    వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేయనుంది. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం క్వాలిటీలో సౌకర్యవంతమైన ఇంటీరియర్లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. అంతేకాకుండా దీనిలో ‘కవచ్ సిస్టమ్’ (రైలు ఢీకొనకుండా నిరోధించే వ్యవస్థ), క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ లాంటి అధునాతన భద్రతా సాంకేతికతలు కూడా ఉన్నాయి.

    వందేభారత్‌ స్లీపర్‌ వారానికి ఆరు రోజులు నడిచే అవకాశం ఉంది. పట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ నుండి రైలు సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోనుంది. ఈ నెలాఖరు నాటికి రైలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభించేందుకు దానాపూర్ డివిజన్ కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు రాకపోకలు ప్రారంభిస్తే పట్నా-ఢిల్లీ మార్గంలోని ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం అందుబాటులోకి రానుంది.

    ఇది కూడా చదవండి: 87 ఏళ్ల క్రితం ‘జై భీమ్‌’ పుట్టిందిలా..

NRI

  • భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

    42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.

    ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దు
    బాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.

    ‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.

    డిమాండ్లు
    బిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలి
    ఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.
    ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.
    ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.
    24/7 హెల్ప్‌లైన్‌లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.
    శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.
    ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్‌లైన్ రిక్రూట్మెంట్‌పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.
    విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.

  • ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.

    అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

    అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.

    కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.

    రవీందర్ కోడెల ప్రస్థానం
    ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. 

    చద‌వండి: ఎన్ని క‌ష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వ‌చ్చేస్తున్నా!

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.

Family

  • శబరిమల అయ్యప్ప ప్రసాదం ఇష్టపడని వారుండరు. అంతటి ప్రత్యేకత కలిగిని అరవణ ప్రసాదం ఇంటి వద్దకే నేరుగా వచ్చేస్తుంది. అదికూడా శబరిమలకు వెళ్లక్కర్లేకుండానే అయ్యప్ప ప్రసాదాన్ని నేరుగా పొందొచ్చు. అదెలాగంటే..

    మనం ఉన్న చోటు నుంచే పోస్టాఫీసుల ద్వారా ఆర్డర్‌ చేస్తే సులభంగా శబరిమల అరవణ ప్రసాదం పొందొచ్చు. దీనికోసం ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేస్తోంది. శబరిమలలోని పోస్టాఫీస్‌ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించలేని భక్తుల కోసం ఇంటి నుంచే అరవణ ప్రసాదం కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. 

    భారతదేశంలో అన్ని పోస్టాఫీసులు నుంచి ఈ శబరిమల అయ్యప్ప ప్రసాదం కొనుగోలు చేసుకోవచ్చని దేవస్వం బోర్డు పేర్కొంది. భారతదేశంలోని అయ్యప్ప భక్తులందరికీ శబరిమల అయ్యప్ప ప్రసాదం అందేలా చేయడమే తమ లక్ష్యమని శబరిమల పోస్టాఫీస్‌ అధికారులు తెలిపారు. దీనికోసం ప్రసాదాన్ని ఇంటింటికి చేరవేసే ప్రాజెక్టును పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రారంభించింది. ఈ ప్రసాదంలో నెయ్యి, అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, విభూతి, అరచనై ప్రసాదం తదితరాలు ఉంటాయి. 

    ధరల వివరాలు..
    టిన్ కవర్‌తో కూడిన ప్రసాదం కిట్ కొనడానికి రూ.520లు రుసుము చెల్లించాలి
    4-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.960లు
    10-టిన్ అరవాణ ప్రసాదం కిట్ కోసం రూ.1,760 చెల్లించాలి
    పోస్టాఫీసులో ప్రసాదం ధర చెల్లస్తే..రాబోయే కొద్ది రోజుల్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం స్వయంగా మీ ఇంటికి వచ్చి తీరుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది అయ్యప్ప ఆలయం మకర సంక్రాంతి జ్యోతి దర్శనం నిమిత్తం తెరిచి..కొద్దిరోజుల అనంతరం మూతబడుతుంది. ఆ తర్వాత శబరిమల పోస్టాఫీస్‌ కూడా లాక్‌ చేయబడుతుంది. 

    అలాగే వచ్చిన స్టాంప్‌లను పంపాలో సురక్షితంగా ఉంచుతారు. అంతేగాదు భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ప్రత్యేకమైన పిన్‌కోడ్‌ (689713) కలిగి ఉన్న ఏకైక దైవం శబరిమల అయ్యప్ప స్వామి. వార్షిక మకరజ్యోతి ప్రారంభం కాగానే శబరిమల అయ్యప్ప ఆలయానికి వివిధ లేఖలు అందుతాయి. ఆ భక్తుల లేఖలు అయ్యప్ప పాదాల వద్ద ఉంచడం అనేది అక్కడొక ఆచారం. ఇక్కడి పోస్టాఫీసు ద్వారానే భక్తుల ఇళ్లకు ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.

    (చదవండి: అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరిన జనం..నాడ మూసివేత..)

     

  • భాగ్యన‌గ‌రంలో నిర్మాణంలో ఉన్న ఒక భ‌వ‌నం మూడో అంత‌స్తు నుంచి న‌వీన్ కుమార్ అనే ఓ భ‌వ‌న నిర్మాణ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌డిపోయాడు. అత‌డి ఊపిరితిత్తుల్లోకి ఇనుప రాడ్లు గుచ్చుకుపోయి, వాటికి రంధ్రం ప‌డింది. అయినా స‌రే.. ఆ కార్మికుడికి అమోర్ ఆస్ప‌త్రి వైద్యులు రికార్డు స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర శ‌స్త్రచికిత్స  చేసి, అత‌డి ప్రాణాలు నిల‌బెట్టారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..

    42 ఏళ్ల వ‌య‌సున్న న‌వీన్ కుమార్‌ను ఆస్ప‌త్రికి తీసుకొచ్చేస‌రికి అత‌డి శ‌రీరం నుంచి రెండు ఇనుప రాడ్ల‌ను తొల‌గించాల్సి ఉంది. అప్ప‌టికే అత‌డు స్పృహ కోల్పోయాడు, అత‌డి ర‌క్త‌పోటు కేవ‌లం 50/30 మాత్ర‌మే ఉంది. ఇక ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ అయితే క‌నీసం లెక్క‌ల‌కు కూడా అంద‌నంత త‌క్కువ‌గా ఉంది. అత‌డి హృద‌యం వ‌ద్ద పెద్ద గాయం ఉండ‌డం, అందులోంచి గుండె, ఊపిరితిత్తులు కూడా క‌నిపిస్తుండ‌డం, దాదాపు 2-3 లీట‌ర్ల వ‌ర‌కు ర‌క్తం పోవ‌డం, ఊపిరితిత్తుల‌కు-ఛాతీ గోడ‌కు మ‌ధ్య ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం, ఊపిరితిత్తుల‌కు రంధ్రం ప‌డ‌డం... ఇన్ని స‌మ‌స్య‌లు అత‌డికి ఉన్నాయి.

    ముందు అత్య‌వ‌స‌రంగా అత‌డిని వెంటిలేట‌ర్ మీద పెట్టారు. శ‌ర‌వేగంగా ర‌క్తం ఎక్కించి, రీస‌సిటేష‌న్ చేశారు. గాయం చాలా పెద్ద‌గా ఉన్న‌ట్లు సీటీ స్కానింగ్‌లో తెలిసింది. దాంతో వెనువెంట‌నే అత‌డిని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు త‌ర‌లించారు. వైద్యులు అత‌డికి అత్య‌వ‌స‌రంగా థొరకాట‌మీ శ‌స్త్రచికిత్స చేశారు. అత‌డి ఎడ‌మ ఊపిరితిత్తిలోని శ్వాస‌కోశం పూర్తిగా ధ్వంస‌మైపోయింది. 

    దాంతో దాన్ని తొల‌గించాల్సి వ‌చ్చింది. కానీ ర‌క్త‌స్రావం చాలా ఎక్కువ‌గా ఉండ‌డంతో న‌వీన్ ర‌క్త‌పోటు మ‌రింత‌గా ప‌డిపోసాగింది. ఫ‌లితంగా ర‌క్తం మ‌రింత ఎక్కించారు. ఒక ఊపిరితిత్తి మాత్ర‌మే ప‌నిచేస్తుండ‌డంతో దాన్ని ర‌క్షించేందుకు వెంటిలేష‌న్ వ్యూహాల‌ను అమ‌లుచేశారు. అత‌డికి ఆక్సిజ‌న్ ఏమాత్రం అంద‌క‌పోతున్నా కూడా మెద‌డు, ఇత‌ర కీల‌క అవ‌య‌వాలు ఏవీ దెబ్బ‌తిన‌కుండా వైద్య‌బృందం చాలా క‌ష్ట‌ప‌డింది.

    ఈ కేసు సంక్లిష్ట‌త గురించి అమోఆర్ ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్, ఆర్థో ఆంకాల‌జీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కిశోర్ బి. రెడ్డి మాట్లాడుతూ, “మేం చికిత్స చేసిన వాటిలో ఇది అత్యంత సంక్లిష్ట‌మైన, స‌మ‌స్యాత్మ‌క‌మైన‌ ట్రామా కేసు. న‌వీన్‌కు త‌గిలిన గాయాల‌న్నీ ప్రాణాంత‌క‌మే. ప్ర‌తి నిమిషం చాలా విలువైన‌ది. 

    దాంతో మా అత్య‌వ‌స‌ర‌, స‌ర్జిక‌ల్, ఎన‌స్థీషియా, క్రిటిక‌ల్ కేర్ బృందాల్లోని వైద్యులంద‌రూ అద్భుత‌మైన స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి అత‌డి ప్రాణాలు కాపాడారు. ప్ర‌పంచ‌స్థాయి ట్రామాకేర్ స‌దుపాయాలు, స‌రైన స‌మ‌యానికి చికిత్స అందించాం అన‌డానికి అత‌డి ప్రాణాలు నిల‌బ‌డ‌డ‌మే నిద‌ర్శ‌నం. ఇప్పుడ‌త‌డు కోలుకుని సాధార‌ణ జీవితం గ‌డప‌డం మాకెంతో ఆనందాన్నిస్తోంది” అని తెలిపారు.

    న‌వీన్ చాలా అద్భుతంగా కోలుకోవ‌డంతో, 48 గంటల్లోనే వెంటిలేట‌ర్ తొల‌గించారు. కాసేప‌టి త‌ర్వాత అత‌డు ఒక‌రి సాయంతో న‌డ‌వ‌గ‌లిగాడు. వారం రోజుల్లోపే అత‌డు ఎలాంటి సాయం అవ‌స‌రం లేకుండా త‌న కాళ్ల మీద తాను న‌డుస్తూ కోలుకోవ‌డంతో డిశ్చార్జి చేశాం.

    అత‌డికి చికిత్స చేసిన వైద్య‌బృందంలో శ‌స్త్రచికిత్స నిపుణులు డాక్ట‌ర్ క‌ళ్యాణ్‌, డాక్ట‌ర్ పూజిత‌, ఎమ‌ర్జెన్సీ బృందానికి చెందిన డాక్ట‌ర్ నందీప్, డాక్ట‌ర్ అశోక్‌, క్రిటిక‌ల్ కేర్ విభాగ నిపుణులు డాక్ట‌ర్ ప్ర‌త్యూష‌, ఎన‌స్థీషియా నిపుణులు డాక్ట‌ర్ జ‌గ‌దీష్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

    (చదవండి: మాంజా మెడ‌కు చుట్టుకుని తెగిన ర‌క్త‌నాళాలు..హెల్మెట్‌ పెట్టుకున్నా..!)

  • రోడ్డు మీద రాయిని చూడగానే కాలితో తన్నడమో చూసిచూడనట్లు వదిలేయడమో చేస్తాం. కానీ ఈ యువకుడు రోడ్డుపై పడి ఉన్న రాయికి రూపం ఇచ్చాడనాలో లేక దానికి విలువనిచ్చాడనలో తెలియదు గానీ అద్భుతం చేశాడు. టాలెంట్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా ఓ రాయిని అద్భతమైన వస్తువుగా తీర్చిదిద్ది ప్రశంసలందుకోవడమే కాదు వేలల్లో డబ్బుని కూడా ఆర్జించాడు.  

    ఢిల్లీకి చెందిన ఒక యువకుడు రాయిని ఇంటి అలంకరణకు ఉపకరంగా ఉండే వస్తువుగా మార్చాడు. అతడి నైపుణ్యానికి అంతా విస్తుపోయారు కూడా. రోడ్డుమీద పడి ఉన్న రాయిని అద్భుతమైన గడియారంగా మార్చాడు. రాయి చివరి అంచులను పాలిష్‌ చేసి అందంగా మార్చాడు. గడియారం సూదిని అటాచ్‌ చేసేందుకు, ఇతర పరికరాలను సెట్‌ చేసేందుకు రంధ్రాలు చేశాడు. అలాగే ఆకర్షణీయంగా కనిపించేలా పెయింట్‌ వేశాడు. 

    చివరగా సూది, బ్యాటరీ చొప్పించి.. రాతితో రూపుదిద్దుకున్న ఫంక్షనల్‌ గడియారాన్ని డిజైన్‌ చేశాడు. ఆ తర్వాత ఆ గడియారాన్ని పలువురికి చూపించినా..ఎవరూ ప్రశంసించలేదు, కొనేందుకు ఆసక్తి కూడా చూపించలేదు. దాంతో మరికొన్ని మార్పులు చేసి అమ్మకానికి పెట్టగా కూడా పరిస్థితి అలానే ఉంది. 

    దాంతో ఆ యువకుడి గడియారంతో రోడ్డుపై నిలబడి అమ్మేందుకు ప్రయత్నించగా..చాలామంది రూ. 460కి అడగారు. మరి అలా అడగటం నచ్చక..ఇది రాయితో తానే స్వయంగా చేతితో చేసిన గడియారం అని చెబుతుంటాడు. అది విని ఆసక్తిగా ఒక వ్యక్తి ఆ యువకుడి వద్దకు వచ్చి ధర ఎంత అని అడగగా రూ. 5 వేలు అని చెప్పగానే మారుమాట్లడకుండా డబ్బు చెల్లించి మరి ఆ గడియారాన్ని కొనుగోలు చేశాడు. 

    అంతేగాదు ఆ రాయిని సేకరించడం దగ్గర నుంచి గడియారంగా మార్చడం వరకు మొత్తం తతంగాన్ని రికార్డు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు ఆ యువకుడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

     

    (చదవండి: వివాహంలో వరుడు సప్తపది తోపాటు మరొక ప్రమాణం..!)

     

  • సంక్రాంతికి ఇంకా దాదాపు 40 రోజుల‌కు పైగా ఉన్నా ఇప్ప‌టి నుంచే మాంజా ప్రమాదాలు మొద‌లైపోయాయి. న‌గ‌రంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రముఖ సంస్థ‌లో ప‌నిచేస్తున్నారు. ఆయ‌న ఇంటి నుంచి నాగోలు వైపు త‌న‌కు కాబోయే భార్య‌తో క‌లిసి బైకు మీద వెళ్తుండ‌గా ఉన్న‌ట్టుండి మెడ‌కు ఏదో ప‌ట్టుకున్న‌ట్లు అయ్యింది. తీరా చూస్తే.. అప్ప‌టికే మెడ తెగిపోయింది. అటుగా వెళ్తున్న మ‌రో వ్య‌క్తి అత‌డిని గ‌మ‌నించి వెంట‌నే స‌మీపంలో ఉన్న కామినేని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ కార్తీక్‌కు స‌త్వ‌రం చికిత్స అందించి ర‌క్త‌నాళాలు తిరిగి అతికించిన క‌న్స‌ల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ రిషిత్ బ‌త్తిని ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

    కార్తీక్ త‌న‌కు కాబోయే భార్య‌తో క‌లిసి వెళ్తుండ‌గా కామినేని ఫ్లై ఓవ‌ర్ ఎక్కిన కాసేప‌టికి అత‌డి మెడ‌కు మాంజా చుట్టుకుంది. హెల్మెట్ పెట్టుకున్నా కూడా మెడ భాగంలో అది గ‌ట్టిగా కోసుకుంది. దాంతో అత‌డి మెడ కండ‌రాల‌తో పాటు, పైవైపు ఉండే ర‌క్త‌నాళాలు కూడా తెగిపోయాయి. అయితే అదృష్ట‌వ‌శాత్తు లోప‌లి భాగంలో ఉండే ప్ర‌ధాన ర‌క్త‌నాళాలు గానీ, శ్వాస‌నాళం గానీ గాయ‌ప‌డ‌క‌పోవ‌డంతో అతడికి మ‌రీ ఎక్కువ‌గా ఇబ్బంది క‌ల‌గ‌లేదు. 

    అయితే, ర‌క్త‌నాళం తెగ‌డంతో ర‌క్త‌స్రావం ఎక్కువ‌గా ఉంది. ఆస్ప‌త్రికి తీసుకురాగానే ముందు ఎమ‌ర్జెన్సీలో ర‌క్త‌స్రావం ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. అది సాధ్యం కాక‌పోవ‌డంతో వెంట‌నే శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. అర‌గంట‌లోపే శ‌స్త్రచికిత్స ప్రారంభించి అత‌డికి తెగిపోయిన ర‌క్త‌నాళాల‌ను తిరిగి అతికించ‌డంతో పాటు.. కండ‌రాన్ని కూడా కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయ‌గ‌లిగాం. మాంజాను చేత్తో తీయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో అత‌డి చేతి వేళ్ల‌కు కూడా గాయాల‌య్యాయి. అత‌డితో పాటు వెన‌క కూర్చున్న యువ‌తికి మెడ ద‌గ్గ‌ర‌, కంటి ద‌గ్గ‌ర స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే కావ‌డంతో ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశాం.

    సంక్రాంతికి ఇంకా చాలా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే ప‌తంగులు ఎగ‌రేయ‌డం మొద‌లైంది. అయితే, అవి తెగిపోయిన‌ప్పుడు వాటికి వాడుతున్న మాంజాలు కూడా తెగిపోయి.. గాలికి వేలాడుతూ ఇలా రోడ్డు మీద వెళ్లేవాళ్ల ప్రాణాల మీద‌కు తెస్తున్నాయి. గాజు పూసిన మాంజాలు ఎక్కువ ప్ర‌మాదక‌రంగా ఉంటాయి. వీటి నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టినుంచే అధికారులు ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే ఇలాంటి ప్రాణాంత‌క ప్ర‌మాదాలు మ‌రిన్ని జ‌రిగే అవ‌కాశం ఉంటుంది అని డాక్ట‌ర్ రిషిత్ బ‌త్తిని తెలిపారు. ఈ శ‌స్త్రచికిత్స‌లో ఇంకా జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ స‌య్య‌ద్ మ‌ఝ‌ర్ అలీ, చీఫ్ కార్డియాక్ అనెస్థ‌టిస్ట్ డాక్ట‌ర్ సురేష్ కుమార్‌, క‌న్స‌ల్టెంట్ అనెస్థ‌టిస్ట్ డాక్ట‌ర్ ర‌వ‌ళి సాదె పాల్గొన్నారు.

    కాపాడింది కూడా కామినేని వైద్యుడే
    త‌న‌ను ఈ ప్ర‌మాదం నుంచి కాపాడి ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ది కూడా కామినేని ఆస్ప‌త్రికి చెందిన వైద్యుడేన‌ని బాధితుడు కార్తీక్ తెలిపారు. ‘‘నేను నాకాబోయే భార్య‌తో క‌లిసి నాగోలు వైపు వెళ్తున్నాను. 40 కిలోమీట‌ర్ల‌లోపు వేగంతోనే వెళ్తుండ‌గా ఉన్న‌ట్టుండి ఏదో కోసుకున్న‌ట్లు అనిపించింది. చెయ్యి పెట్టి చూసేస‌రికి హెల్మెట్ లోప‌ల నుంచి మాంజా క‌నిపించింది. అది త‌గిలిచెయ్యి కూడా కోసుకుపోయింది. వెంట‌నే బండి ప‌క్క‌కి తీసి ఆపేశాను. 

    త‌ర్వాత మెడ‌ద‌గ్గ‌ర నొప్పి ఉంది ఏంటా అని చెయ్యి పెడితే చెయ్యి అంతా ర‌క్తం ఉంది. ఈలోపు అటుగా వ‌చ్చిన వైద్యుడు త‌న క‌ర్చీఫ్ ఇచ్చి అదిమిప‌ట్టుకోమ‌న్నారు. రెండు మూడు ఆటోలు ఆపినా ఆగ‌లేదు. దాంతో ఆయ‌న త‌న బండి మీద ద‌గ్గ‌ర్లో ఉన్న‌కామినేని ఆస్ప‌త్రికి  తీసుకెళ్లారు. 

    అక్క‌డ ఎమ‌ర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. త‌ర్వాత అర‌గంట‌కు ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్లారు. న‌న్ను ఆస్ప‌త్రిలో చేర్చింది కూడా ఒక వైద్యుడే అని త‌ర్వాత తెలిసింది. ఇంకా సంక్రాంతికి చాలా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే ఇలా మాంజాలు త‌గ‌ల‌డం మొద‌లైతే రోడ్ల మీద వెళ్లేవారికి చాలా ప్ర‌మాదం ’’ అని కార్తీక్ చెప్పారు.

    (చదవండి: ఊపిరితిత్తుల కేన్సర్‌కి విలన్‌ ధూమపానం మాత్రమే కాదు..!)

  • సాధారణంగా వివాహంలో సప్తపది అనే తంతు ఉంటుంది. ధర్మేచ, కామేచ అంటూ వధువరులు చేత ఏడు ప్రమాణాలు చేయిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ వరుడు వెరైటీగా ఎనిమిదో ప్రమాణం చేయిస్తాడు. పాపం ఆ వధువుకి అంగీకరించక తప్పలేదు. ఇంతకే ఏంటా ప్రమాణం అంటే..

    ఢిల్లీలో జరిగి వివాహ వేడుకలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. మయాంక్‌ దియా అనే వధువరుల వివాహం అంగరంగ వైభవంగా సాగుతుంది. సరిగ్గా సప్తపది తంతు వచ్చింది. అందరి వధువరులానే ఈ జంట ఆ ప్రమాణాలు చేసింది. కానీ ట్వీస్ట్‌ ఏంటంటే వీటి తోపాటు ఇంకో ప్రమాణం కూడా చేద్దాం అనగానే ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఎనమిదో వచనం(ప్రమాణంగా) ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుదాం అని చెబుతాడు. 

    సాంప్రదాయ హిందూ వివాహంలో జంట సాధారణంగా పవిత్ర అగ్ని చుట్టూ తిరుగుతూ..ఏడు పవిత్ర ప్రమాణాలు చేస్తారు. దీనని సప్తపది అంటారు. అయితే మయాంక్‌ ఎనిమిదో వచనంగా చెప్పించిన ప్రమాణం ఆ వధువుకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం కదూ..!. మయాంక్‌ ఈ పెళ్లి వేడుకలో సడెన్‌గా మైక్‌ తీసుకుని మరి తన కాబోయే భార్యతో ఈ ఎనిమిదో ప్రమాణం చేయించడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్రో భార్యను అడగకుండానే ఈ ప్రమాణం చేయించావే..ముందే గ్రిప్‌లో పెట్టుకుంటున్నావా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి: పేరు మార్చేసుకున్న ఇండిగో?! వైరల్‌గా హర్ష్ గోయెంకా పోస్ట్‌)