Archive Page | Sakshi
Sakshi News home page

International

  • లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్‌లో మేనజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్‌కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్‌ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్‌ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

    అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్‌పై రవిచంద్రన్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్‌ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్‌కు అందించాడు.  

    ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్‌కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి  67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

    ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి.

  • ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.

    మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్‌ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్‌లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.

    కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు.  ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

     

  • బంగ్లాదేశ్‌లో రాడికల్ నేత ఉస్మాన్ హాది హత్య తీవ్ర అంతర్గత సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో హింస చెలరేగింది. హిందువులపై దాడులు జరిగాయి.  ఈ నేపథ్యంలో ఉస్మాన్ హాదీని హత్య చేసినట్లు అనుమానిస్తున్న నేరస్థులు భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది.  

    ప్రస్తుతం బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. భారత్ వ్యతిరేక భావజాలం ఉన్న నేతలు ప్రస్తుతం అక్కడ బలంగా ఉండడంతో పాటు  ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనాకు  భారత్ ఆశ్రయం ఇవ్వడం ఆదేశానికి మింగుడుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆదేశానికి చెందిన కొంతమంది నేతలు ఇండియాపై కారుకూతలు కూశారు. అంతేకాకుండా ఇటీవల అక్కడ భారత వ్యతిరేక భావజాలం ఉన్న విద్యార్థి నేతల ఉస్మాన్ హాదీ హత్య తరువాత అక్కడ అలర్లు చెలరేగాయి. ఇద్దరు హిందూ యువకులను తీవ్రంగా కొట్టి కిరాతకంగా చంపారు. కాగా ఇప్పుడు ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్‌లో ఉన్నట్లు ఢాకా పోలీసులు ఆరోపిస్తున్నారు.

    ‍అక్కడి అడిషనల్ కమిషనర్ నార్జూల్ ఇస్లాం మాట్లాడుతూ" ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు నేరస్థులు, మైమెన్ సింగ్ జిల్లాలోని హాలుఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోని మేఘాలయలోకి ప్రవేశించారు. ‍అనంతరం వారిని పూరి అనే వ్యక్తి రిసీవ్ చేసుకొని, సమీ అనే ట్యాక్స్ డ్రైవర్ అక్కడి టూరా  సిటిీలో దించారు." ‍అని తెలిపారు. ఈ వివరాలను అక్కడి డైలీ స్టార్ పత్రిక ప్రచురించింది.

    అయితే పూరి, సమీలిద్దరినీ భారత అధికారులు ‍అదుపులోకి తీసుకున్నారే అనధికార సమాచారం తమకు అందిందని ఆయన తెలిపినట్లు మీడియా కథనాలు ప్రచురించాయి. నేరస్థులను బంగ్లాదేశ్ రప్పించేలా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపాయి . అయితే ఈ ఆరోపణల్ని మేఘాలయ పోలీసులు ఖండించారు. ఫైజల్ కరీం మౌసుద్, ఆలంగీర్ షేక్ అనే ఇద్దరు భారత్‌లో ప్రవేశించలేదని తెలిపారు.

    బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మేఘాలయ ప్రజలన భయభ్రాంతులకు గురిచేసేలా కథనాలు ప్రచురిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. పూరి, సమీలను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచురించారని అది కూడా పూర్తిగా అసత్య ఆరోపణలని  వారు తెలిపారు

Movies

  • ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' విడుదలకు సిద్ధమైంది. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ప్రభాస్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా మాట్లాడి ఫ్యాన్స్‌కి మంచి జోష్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్లు మరింత సంతోషపడిపోయేలా నిధి అగర్వాల్ ఓ ట్వీట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

    'రాజాసాబ్'లో నిధి అగర్వాల్ కూడా ఓ హీరోయిన్. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా '#ఆస్క్ నిధి' పేరుతో ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించింది. మిగతా ప్రశ్నలు, సమాధానాలు ఏమో గానీ ఓ ఆన్సర్ మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి? అని అడగ్గా.. హీరోలుగా ప్రభాస్-పవన్ కల్యాణ్ ఉంటారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాగా.. హీరోయిన్‪‌గా తాను ఉంటే బాగుంటుందని ట్వీట్ చేసింది.

    అయితే ఈ ట్వీట్ చేసిన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నిధి అగర్వాల్‌కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయిగా అని మాట్లాడుకుంటున్నారు. నిజ జీవితంలో ఈ మల్టీస్టారర్ సెట్ అవుతుందా అంటే సందేహమే. ప్రభాస్ ఓవైపు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ. పవన్ మరోవైపు రాజకీయాలతో బిజీ. కాబట్టి నిధి కల కలాలానే ఉండిపోతుంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు.

    'రాజాసాబ్' సినిమాలో నిధి అగర్వాల్ బెస్సీ అనే పాత్ర చేసింది. ఇందులో ఈమెతో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని నిధి చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ 'రాజాసాబ్'పై పెట్టుకుంది. ఇది వర్కౌట్ అయితే సరేసరి. లేదంటే మాత్రం నిధికి రాబోయే రోజుల్లో తెలుగులో అవకాశాలు కష్టమే?

  • ఒకప్పుడు సినిమా గురించి ఓ మాదిరిగా ప్రచారం చేసినా సరే థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేవాడు. యావరేజ్‌గా ఉన్నా గానీ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా ప్రమోషన్స్ చేసినా సరే థియేటర్‌కి వచ్చేందుకు ప్రేక్షకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. కన్నడలో ఇది ఎక్కువగా ఉండగా.. తెలుగులోనూ కొన్ని మూవీస్ ఈ తరహా ప్రయత్నాలు చేసి హిట్ కొట్టాయనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం?

    చిన్న సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడం చాలా కష్టం. తమ సినిమాలో కంటెంట్ ఉందని, కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తామని చెబితే సరిపోదు. ఆ విషయాన్ని తాము చెప్పకుండా.. వేరే ప్రేక్షకులతోనే చెప్పిస్తున్నారు. అదే 'ఫ్రీ' పబ్లిసిటీ. అంటే రిలీజ్‌కి కొన్నిరోజుల ముందే కొందరు ఆడియెన్స్ కోసం ఉచితంగా షోలు వేస్తున్నారు. అలా సినిమా చూసిన వాళ్లు ఏదైతే చెబుతారో ఆ విషయాలతో మూవీ టీమ్ ప్రమోషన్ చేసుకుంటోంది. రీసెంట్ టైంలో కన్నడ చిత్రం '45'కి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో 'చార్లీ 777'కి కూడా ఇలానే చేసి హిట్ కొట్టారనే విషయం మర్చిపోవద్దు.

    ఈ ఏడాది తెలుగులోనూ రిలీజైన లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు కూడా ఉచితంగా షోలు వేయలేదు గానీ విడుదలకు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటిలో అద్భుతమైన కంటెంట్ ఉండేసరికి రిలీజ్ రోజు ఉదయానికి మౌత్ టాక్ బలంగా వినిపించింది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. చిన్న సినిమాలు అయినా సరే వీటిని థియేటర్లకు వెళ్లి చూశారు. ఆదరించారు. వీటికి మంచి లాభాలు కూడా వచ్చాయి.

    అయితే ప్రీమియర్లు అన్ని సినిమాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' లాంటి మూవీకి ప్రీమియర్స్ అనేవి నెగిటివ్ కావడానికి చాలా కారణమయ్యాయి. ఎందుకంటే కంటెంట్‌పై చాలా నమ్మకం ఉండి ప్రీమియర్స్ వేస్తే.. తెల్లారేసరికి అది మౌత్ టాక్ రూపంలో ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం మొత్తానికే నెగిటివ్ కావడం గ్యారంటీ. దీనికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ 'హరిహర వీరమల్లు'.

    రీసెంట్‌గా క్రిస్మస్‌కి రిలీజైన 'ఛాంపియన్'కి తప్పితే దాదాపు మిగతా తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ వేశారు. ఉచితంగా టికెట్ గివ్ అవేలు కూడా ఇచ్చారు. అయినా సరే కంటెంట్ ఉన్న 'శంబాల' మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కేది కాదు. రీసెంట్ టైంలో మాత్రం ఫ్రీగా స్క్రీనింగ్, ప్రీమియర్స్‌తో వస్తున్న మౌత్ టాక్ కలిసొస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.

  • ఫన్నీగా ఫేస్ పెట్టి పోజులిచ్చిన అనసూయ

    'రాజాసాబ్' ఈవెంట్‌లో అందంగా మాళవిక

    చీరలో కుందనపు బొమ్మలా అనుపమ పరమేశ్వరన్

    2025 జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన నిహారిక

    'జన నాయగణ్' కోసం పూజా హెగ్డే రెడీ అయిందిలా

    పలుచని చీరలో అందాల ఆరబోస్తున్న కావ్య

  • హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు.. ఈ నాలుగు విభాగాల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు దీని ఫలితాలు బయటకు వచ్చేశాయి.

    ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్‌ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్‌' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్‌' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.

    నిర్మాతల సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది. ఓవరాల్‌గా 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31 మంది, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్‌లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.

    ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కార్యవర్గ పదవీకాలం ఈ ఏడాది జూలైలోనే ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీళ్లంతా 2027 జూలై వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పదవి అనేది నిర్ణయించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ ఎన్నికవగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ ఎన్నికయ్యారు.

  • దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

    షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.

    కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

  • బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఏడాదిలో ఛావా, ధురందర్చిత్రాలతో ఆయనకు పాన్ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపిన‌ట్లు తెలుస్తుంది. మూవీ వచ్చే ఏడాది అక్టోబర్లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్దశలో ఉంది.

    హిందీదృశ్యం -2’లో  అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్‌-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్సెట్చేసుకున్నామని పాఠక్చెప్పారు. మేరకు అక్షయ్ఖన్నాకు అడ్వాన్స్కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్లో అక్షయ్ఖన్నా తమకు షాకింగ్మెసేజ్చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మూవీ కోసం అక్షయ్ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్డిమాండ్చేసినట్లు తెలుస్తోంది.

    అక్షయ్‌ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375‌’ మూవీతో మంగత్పాఠక్లైఫ్ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

  • మెగా హీరో రామ్ చరణ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో కనిపించాడు. వీళ్లకు తోడుగా 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కూడా సందడి చేశాడు. వీళ్లంతా కలిసి చిల్ అవుతున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీళ్లు ఎక్కడ ఎప్పుడు కలిశారు?

    (ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)

    బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం జరిగాయి. పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌‌లో ఈ సెలబ్రేషన్స్ జరగ్గా.. సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ కనిపించాడు. క్రికెటర్ ధోనీ, నటుడు బాబీ డియోల్ కూడా వీళ్లతో పాటు కనిపించారు.

    మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్‌కి మంచి అనుబంధం ఉంది. కొన్నేళ్ల క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ అతిథి పాత్రలో కనిపించాడు. సల్మాన్ మూవీ 'కిసీ కా బాయ్ కిసీ కా జాన్'లో చరణ్ అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడా ఆ అనుబంధం దృష్ట్యా సల్మాన్ బర్త్ డే పార్టీలో చరణ్ సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

  • ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ,  ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇ‍ప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

    (ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

    అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎ‍ప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.

    గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?

    (ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)

  • సీరియల్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్‌తో బుల్లితెరకు పరిచమైన రవికి బిగ్‌బాస్‌ షోతో మరింత గుర్తింపు వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చాన్స్‌లు వచ్చాయి. విరూపాక్ష సినిమా రవి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు. కులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి..తక్కువ కులానికి చెందిన యువకుడిగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురవుతాడు. సినిమా చూసిన ప్రేక్షకులు రవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు రవి. దండోరా సినిమాలో మాదిరే ఆయన కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా చాన్స్‌లు ఇవ్వలేదట. 

    తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో​ రవి తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘మాది విజయవాడ. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా కంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటర్‌ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి.. సినిమాల్లోకి వచ్చాడు. 

    సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక..చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్‌ చేస్తే..అందులో నటించాడు. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాడు. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ.. అవకాశాల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్‌కి ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి వెళ్తే.. అప్పటికే పూర్తయిపోయాయని చెప్పారు. వాళ్లను రిక్వెస్ట్‌ చేసి ఆడిషన్స్‌ ఇచ్చాను. అలా ఆ సీరియల్‌తో నా కెరీర్‌ ప్రారంభం అయింది. ఆ ఫేమ్‌తో సినిమాల్లోకి వచ్చాయి. 

    ఇక్కడ నాకు కుల వివక్ష ఎదురైంది. కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసి.. చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్‌ అయ్యాను. అగ్రిమెంట్‌ సమయంలో నా ఆధార్‌ కార్డు పంపించా. అ‍క్కడ నా కులం (ఇంటి పేరు చూసి) చూసి.. తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సెట్‌ కాదు.. ఇంకో ప్రాజెక్ట్‌కి చూద్దాం అని చెప్పేవాళ్లు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్‌ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి చెప్పుకొచ్చాడు. 
     

  • కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)

    'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.

    సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.

    (ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి)

  • క్రిస్మస్కానుకగా విడుదలైన ఛాంపియన్సక్సెస్బాటలో నడుస్తోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌.. మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం తెరకెక్కించిన మూవీని భారీ బడ్జెట్తో ప్రియాంక దత్‌, జీకే మోహన్‌, జెమిని కిరణ్‌ నిర్మించారు. ఇందులో రోషన్‌ సరసన అనస్వర రాజన్‌, సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది తదితరులు నటించారు.

    కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్‌’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్రాబట్టిన మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

    మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్‌ నిర్మించిన ఛాంపియన్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మూవీలో చూపించారు. హైదరాబాద్‌ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు.

  • త్రిగుణ్, అఖిల్‌రాజ్‌ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం(డిసెంబర్‌ 25) విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్‌ మాత్రం భారీగా వచ్చాయి. 

    విడుదలైన మూడు రోజుల్లో 4 కోట్ల 80 లక్షల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి, బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. రానున్న రోజుల్లో ఈషా బాక్సాఫీస్‌ వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్‌ చేస్తుందని ట్రెడ్‌ వర్గాలు అంటున్నాయి. 

    సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మని నలుగురు స్నేహితులు(త్రిగుణ్‌, హెబ్పాపటేల్‌, సిని హనుమంతు, అఖిల్‌ రాజు)..పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. 

    అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.
     

  • ప్రభాస్ -మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

    ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్‌ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ  సినిమా కోసం ప్రభాస్‌ తన లైఫ్‌ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.

    మారుతి కూతురు ఎమోషనల్

    ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

  • నటుడు ఆది సాయికుమార్‌ ఖాతాలో 'శంబాల' సినిమాతో హిట్‌ పడింది. సరైన విజయం కోసం ఆయన చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాడు. బక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దాటిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హిందీలో కూడా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

    తెలుగులో క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న విడుదలైన శంబాల చిత్రాన్ని దర్శకుడు యుగంధర్‌ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ చిత్రాలకు బాలీవుడ్‌లో మంచి డిమాండ్ఉండటంతో జనవరి 1 హిందీ వర్షన్విడుదల చేస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సరైన ప్రచార వ్యూహంతో చిత్ర యూనిట్ప్లాన్చేస్తే హిందీ బెల్ట్లో ఇలాంటి కంటెంట్కు మంచి డిమాండ్ఉంది. అయితే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తారో చూడాలి. శంబాల పార్ట్ -2 ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.

    శంబాల చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్చేసుకున్నాడు. సినిమా బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్స్విషయంలో దూకుడు చూపించడం లేదు.

  • ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇమ్మోర్టల్‌ చిత్రం ఒకటి. ఇందులో ఆయనకు జంటగా కయదు లోహర్‌ నటిస్తున్నారు. కింగ్‌స్టన్‌ చిత్రం తరువాత జీవీ ప్రకాష్‌ కుమార్‌ నటిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా డ్రాగన్‌ చిత్రం తరువాత కయదులోహర్‌ నటిస్తున్న తమిళ చిత్రం కూడా ఇదే.. మారియప్పన్‌ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్‌ ధనశేఖరన్‌ నిర్మిస్తున్నారు. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, అరుణ్‌ రాధాకష్ణన్‌ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.

    టీజర్‌ను చూస్తుంటే ఇది సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథా చిత్రం అనిపిస్తోంది. ప్రేమతో పాటు అనూహ్య సంఘటనలు టీజర్‌లో కనిపిస్తాయి. ఏలియన్‌ లాంటి ఒక వింత మనిషి కూడా కనిపించడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. ఇమ్మోర్టల్‌ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. జీవీ కథానాయకుడిగా మంచి హిట్‌ చూసి చాలా కాలమైంది. మరి ఈ చిత్రం ఏ మాత్రం సక్సెస్‌ అవుతుందో చూడాలి. 
      

Business

  • ఈ రోజుల్లో ఎంత పెద్ద ఉద్యోగం చేసేవారికైనా.. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భాల్లో మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి?, ఇది చాలామంది మనసులో మెదిలే ప్రశ్న. ఈ ప్రశ్నకు.. ఇక్కడ సమాధానం తెలుసుకుందాం.

    నిజానికి పర్సనల్ లోన్ పొందటానికి దాదాపు ఎలాంటి ఆస్తులకు పూచీకత్తు అవసరం లేదు. కాబట్టి దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ కింద పరిగణిస్తారు. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లింపు విషయం కొన్ని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

    చాలా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు లోన్‌తో పాటు లోన్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాయి. ఆలాంటి ఇన్సూరెన్స్ ఉంటే.. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. కాబట్టి లోన్ భారం.. మరణించిన లోన్ తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులపై పడదు. ఇన్సూరెన్స్ లేని సందర్భంలో.. కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

    లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతనికి చెందిన ఆస్తులు ఏవైనా ఉంటే, బ్యాంక్ ఆ ఆస్తులపై క్లెయిమ్ చేయవచ్చు. ఆ ఆస్తుల విలువలో నుంచి లోన్ మొత్తాన్ని తీసుకుంటారు. మిగిలింది వారసులకు అప్పగిస్తుంది. ఒకవేళా కో-అప్లికెంట్ ఉన్నట్లయితే.. ఆ వ్యక్తే లోన్ చెల్లించాలి. గ్యారెంటర్ ఉంటే.. బ్యాంక్ గ్యారంటర్ దగ్గర నుంచి లోన్ రికవర్ చేస్తుంది

    ఇదీ చదవండి: బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే.. ఖాతాలో డబ్బు ఏమవుతుంది?

    ఏ ఆస్తులు లేవు, కో-అప్లికెంట్ లేరు, గ్యారంటర్ లేరు అన్నప్పుడు.. కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంక్ లీగల్ నోటీసులు పంపిస్తుంది. దానికి కుటుంబ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులు లోన్ మాఫీ చేసే అవకాశం కూడా ఉంది.

  • ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ఛానళ్లు అకౌంట్ ఉపయోగించకుండా ఉంటే ఏమవుతుంది?, ఖాతాలోని డబ్బును మళ్లీ విత్‌డ్రా చేసుకోవచ్చాయా?, అనే విషయాలు బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు.

    బ్యాంక్ అకౌంట్‌ను రెండేళ్లు ఉపయోగించకుండా (ఎలాంటి లావాదేవీలు చేయకుండా) ఉంటే.. ఇనాక్టివ్ లేదా డోర్మాంట్ అవుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఈ గడువు ఏడాది మాత్రమే. అంటే.. గడువు లోపల చిన్న చిన్న లావాదేవీలైన తప్పకుండా చేసి ఉండాలి. లేకుంటే.. డెబిట్ కార్డు పనిచేయకపోవచ్చు, ఆన్‌లైన్ లావాదేవీలు నిలిచిపోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా.. మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు చెల్లించాలి ఉంటుంది. కాబట్టి ఖాతాలోని బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది.

    మీ బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్ అయినప్పటికీ.. అకౌంట్‌లో ఉన్న ఎక్కడికీ పోదు. కానీ ఎక్కువ కాలం ఎవరు క్లెయిమ్ చేయకపోతే.. ఖాతాలోని మొత్తం డబ్బు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్' (DEAF)కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇలా జరిగినప్పుడు.. కావలసిన కేవైసీ పూర్తి చేసి మళ్లీ మీ ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు.

    కేవైసీ అప్డేట్ చేయాలంటే..
    కేవైసీ అప్డేట్ చేసి.. మళ్లీ మీ ఖాతాను యాక్టివేట్ చేయాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ ఆధార్, పాన్ వంటివాటితో కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత చిన్న మొత్తంలో లావాదేవీలను చేసుకోవాలి. ఇలా చేస్తే.. మీ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది.

    ఇదీ చదవండి: పెరిగిన ధరలు.. వెండి అవసరం!: మస్క్ ట్వీట్

  • బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే కేజీ సిల్వర్ రేటు భారతదేశంలో రూ.2.74 లక్షలకు చేరింది. ఈ ధరలు వచ్చే సంక్రాంతి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు.

    చైనా కొత్త ఎగుమతి నియమాల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.

    చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.

    ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!

    వెండిని ఆభరణాలుగా కంటే.. అనేక పరిశ్రమలలో (సౌర ఫలకాలు, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, 5జీ మౌలిక సదుపాయాలు) పారిశ్రామిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు. వెండి అనేది.. భూమిపై అత్యంత ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కాబట్టి దీనిని అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే.. సిల్వర్ ధరలు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

  • 2025 డిసెంబర్ నెల ముగుస్తోంది. త్వరలో 2026 జనవరి ప్రారంభం కానుంది. ఈ నెలలో బ్యాంకులకు సుమారు 16 రోజులు సెలవులు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది.

    ➤జనవరి 1: న్యూ ఇయర్ సందర్భంగా చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 2: మన్నం జయంతి సందర్భంగా ఐజ్వాల్, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 3: హజ్రత్ అలీ పుట్టినరోజు సందర్భంగా లక్నోలో బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 4: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 11: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా.. కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 14: మకర సంక్రాంతి/మాగ్ బిహు సందర్భంగా.. అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ఇటానగర్‌లలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం/పొంగల్/మాఘే సంక్రాంతి/మకర సంక్రాంతి.. సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 16: తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 17: ఉళవర్ తిరునాల్ సందర్భంగా.. చెన్నైలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 18: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు/సరస్వతీ పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/బసంత్ పంచమి సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 25: ఆదివారం - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు
    ➤జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. బ్యాంకులకు సెలవు

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్‌ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ సుమారు రూ. 11,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదిలో కంపెనీ లిస్టయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఐపీవో సజావుగా సాగితే కార్యకలాపాలు ప్రారంభించిన అత్యంత తక్కువ వ్యవధిలోనే లిస్టయిన యువ అంకుర సంస్థగా జెప్టో నిలుస్తుంది.

    అలాగే పోటీ సంస్థలు జొమాటో, స్విగ్గీ సరసన కూడా చోటు దక్కించుకుంటుంది. 10 నిమిషాల్లో డెలివరీ సర్వీసుల పేరిట ప్రారంభమైన జెప్టో 7 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటివరకు ఇన్వెస్టర్ల నుంచి రూ. 16,000 కోట్లు సమీకరించింది.  

    2023 ఆగస్టులో 200 మిలియన్‌ డాలర్ల సమీకరణ ద్వారా యూనికార్న్‌ (బిలియన్‌ డాలర్ల కంపెనీ) హోదా దక్కించుకుంది. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ డ్రాప్‌అవుట్స్‌ అయిన ఆదిత్‌ పలిచా, కైవల్య వోహ్రా కలిసి దీన్ని నెలకొల్పారు. 2025 సెపె్టంబర్‌ నాటికి కంపెనీకి 900 డార్క్‌ స్టోర్స్‌ ఉన్నాయి.

  • కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను ఎప్పుడు, ఎందుకు జాబ్ నుంచి తొలగిస్తున్నాయో కూడా తెలియకుండా తీసేస్తున్నాయి. రాత్రిలో మెయిల్స్ పంపిన సంస్థలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా.. ఒక మహిళ తాను పనిచేయని కంపెనీ నుంచి తొలగింపు మెయిల్ పొందింది.

    సైమన్ ఇంగరి అనే ఎక్స్ యూజర్.. ''నా భార్య ఎప్పుడూ పని చేయని కంపెనీలో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఒక మెయిల్ పొందిందని వెల్లడించారు''. ఈ మెయిల్ చూసిన నా భార్య ఒక్కసారిగా షాకైంది. వచ్చిన మెయిల్.. తాను పనిచేయని కంపెనీ అని తెలుసుకునే లోపే భయానికి గురైందని అన్నారు. అంతే కాకుండా.. ఎవరికైనా ఇలాంటి సందేశాలను పంపే ముందు మెయిల్ ఐడీ జాగ్రత్తగా గమనించాలని హెచ్‌ఆర్‌కు చెబుతూ.. ఇలాంటి తప్పుడు మెయిల్స్ వల్ల ఎవరికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని సూచించారు.

    ఇదీ చదవండి: సుందర్‌ పిచాయ్‌ కంటే పదిరెట్లు ఎక్కువ సంపద!.. ఎవరీమె?

    సైమన్ ఇంగరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆ కంపెనీపై విమర్శలు కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో పెరుగుతున్న నిర్లక్ష్యం & ఉద్యోగ అభద్రతకు ఇదొక ఉదాహరణ అని చెబుతున్నారు. ఇది చిన్న తప్పు కాదు. ఒక ఉద్యోగి మానసిక స్థితిని దెబ్బతీస్తుందని అన్నారు.

  • టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఐఐటీ బాంబేలో టెక్‌ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

    టెక్‌ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి.

  • భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

    ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?
    కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్‌ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఎటువంటి యాక్టివ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఉండకూడదు. అంటే..

    ➤పోస్ట్‌లు పెట్టడం, ఫొటోలు అప్‌లోడ్ చేయడం చేయకూడదు.
    ➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.
    ➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.
    ➤డైరెక్ట్ మెసేజ్‌లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.

    ఇన్‌స్టాగ్రామ్‌కు అధికారిక అనుమతి
    ఈ అప్‌డేట్‌లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

    కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌లు
    వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్‌లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్‌ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్‌లు అప్‌లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.

    కఠినమైన హెచ్చరికలు
    సౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్‌వేర్‌లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్‌ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్‌లు, ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

    2020లో 89 యాప్‌లపై నిషేధం
    జులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 యాప్‌లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్‌లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

  • రతన్‌​ టాటాను (Ratan Tata) ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. నేడు రతన్ టాటా జయంతి. ఈ సందర్భంగా ఆయన కెరియర్‌ ప్రస్థానం.. ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం ఈ కథనంలో..

    1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా నాయకత్వం, సమగ్రతకు ప్రతిరూపంగా ఎదిగారు. నాణ్యత, సామాజిక బాధ్యత, నైతిక విలువలకు కట్టుబడి ఉంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా జీవన ప్రయాణం సంకల్పం, క్రమశిక్షణ, ప్రేరణలతో నిండినది.

    టాటా గ్రూప్‌లో తొలి అడుగులు
    కార్నెల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 1961లో రతన్ టాటా టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM) నుంచి జాబ్‌ ఆఫర్ వచ్చింది. అయితే తన ప్రతిభను విదేశీ సంస్థకు ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకుని టాటా స్టీల్‌లో కొనసాగారు. ఆయన నాయకత్వంలో సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అప్పుడాయన ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే ఇప్పుడున్న ‘టాటా’ ఎలా ఉండేదో..

    టాటా గ్రూప్ పగ్గాలు
    1991లో జేఆర్‌డీ టాటా తర్వాత రతన్ టాటా టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య సమస్యల కారణంగా జేఆర్‌డీ టాటా సంస్థ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. రతన్ టాటా పదవీకాలంలో టాటా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008) వంటి అంతర్జాతీయ సంస్థల కొనుగోళ్లతో టాటా గ్రూప్ గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మారింది.

    ఇ‍క్కడో విషయం చెప్పుకోవాలి.. ఒకానొక సమయంలో టాటామోటర్స్‌  ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్‌ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. చర్చల సందర్భంగా ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు ఎగతాళి చేశారు. దీంతో ఆ డీల్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు టాటా. తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఫోర్డ్.. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను అమ్మకానికి పెట్టగా టాటానే కొనుగోలు చేశారు. టాటాకు ఫోర్డ్‌ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరిందన్నమాట.

    పురస్కారాలు
    2012లో టాటా సన్స్ ఛైర్మన్ పదవికి వీడ్కోలు పలికిన రతన్ టాటా, 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, మానవతావాదిగా, విలువల ప్రతీకగా గుర్తింపు పొందిన రతన్ టాటా 86వ ఏట 2024 అక్టోబర్ 9న ఈ లోకాన్ని వీడినా ఆయన పంచిన స్ఫూర్తి కొనసాగుతోంది.

  • రెనో ఇండియా తన వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. జనవరి నుంచి కార్ల ధరలను 2% మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ‘‘పెరిగిపోతున్న ముడి సరుకు వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచక తప్పలేదు. ధరలు పెంచినప్పట్టకీ.., కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులు, అత్యున్నత సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటాము’’ అని వివరణ ఇచ్చింది. ఇప్పటికే యూరో మారకంలో రూపాయి క్షీణత కారణంగా మెర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి సంస్థలు సైతం వచ్చే నెల నుంచి వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ఇక ఈ ధరల పెంపు వల్ల ఎంట్రీ-లెవల్ కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు స్వల్పంగా అయినా భారం పెరగనుంది. ముఖ్యంగా క్విడ్‌, ట్రైబర్‌, కైగర్‌ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ధరల ప్రభావం ఉంటుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ధరలు పెరగనున్న నేపథ్యంలో, డిసెంబర్‌ నెలలో వాహన కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉందని డీలర్లు భావిస్తున్నారు. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

    మరోవైపు ఆటోమొబైల్‌ రంగం మొత్తం వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముడి సరుకుల ధరలు, లాజిస్టిక్స్‌ ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు ఇందుకు కారణంగా మారుతున్నాయి. దీంతో ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా దశలవారీగా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు ధరలతో పాటు కొత్త ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సర్వీస్‌ ప్యాకేజీలపై దృష్టి పెడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ధరల పెంపు ఉన్నప్పటికీ విలువైన ఆఫర్లు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

  • ఇంటికొచ్చే అతిథులకు తలుపులు స్వాగతం పలుకుతాయి. అందుకే ప్రధాన ద్వారం వద్ద తలుపుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడుగు స్థలం కూడా ఖరీదైన మహానగరంలో వెడల్పాటి తలుపుల స్థానంలో స్థలాన్ని ఆదా చేసే డోర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్లైడింగ్, ఓపెన్, ఫోల్డింగ్‌ డోర్స్‌ జోరు మార్కెట్‌లో కొనసాగుతోంది. విభిన్న రంగులు, డిజైన్లతో లభ్యమవుతుండటంతో యువ కస్టమర్ల నుంచి 
    ఆదరణ పెరుగుతోంది.  

    మధ్యలో మడతపెట్టి.. 
    సాధారణ తలుపుల మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో, మడతపెట్టే వీలుగా ఉండటమే ఈ డోర్స్‌ ప్రత్యేకత. వీటిని కలప, అల్యూమీనియంతో తయారు చేస్తారు. తలుపులు తెరిచినప్పుడు మధ్యలో 1/2 లేదా 1/3 లేదా 2/3 నిష్పత్తిలో మడత పడుతుంది. వీటినే ఫోల్డింగ్‌ డోర్స్‌ అంటారు. రెండు ప్యానెల్స్‌ సమాన పరిమాణంలో ఉండొచ్చు లేదా అసమాన పరిమాణంలో ఒక ప్యానెల్‌ కంటే మరోటి వెడల్పుగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా ఒకవైపు తిరగానికి, మధ్యలో ఫోల్డ్‌ కావడానికి వీలుగా స్క్రూలను అమరుస్తారు. కస్టమర్ల అభిరుచి, అవసరాలను బట్టి తలుపులు ఎడమ లేదా కుడి వైపునకు తెరుచుకుంటాయి. ఈ ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌కు అద్దాలను జోడించి మరింత అందంగా తయారు చేస్తున్నారు.

    గాలి, వెలుతురు సులువుగా.. 
    చిన్న సైజు అపార్ట్‌మెంట్లకు, తక్కువ స్థలంలో నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఈ తరహా తలుపులు బాగుంటాయి. ప్రధాన ద్వారం వద్ద కాకుండా ఇతర గదులకు ఈ డోర్స్‌ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు వంద శాతం స్థలం వినియోగం అవుతుంది. అలాగే కప్‌బోర్డ్‌లు, వార్డ్‌ రోబ్‌లు, కారిడార్లు, వంటగది, బాత్‌రూమ్‌లు ఇతర యూటిలిటీ ప్రాంతాలలో ఈ ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా వీటిని ఇన్‌స్టాల్‌ చేయడం చాలా సులువు. నిర్వహణ కూడా తేలిక. ఫోల్డింగ్, స్లైడింగ్‌ డోర్స్‌తో ఒక గది నుంచి మరో గదిలోకి గాలి, వెలుతురు సులువుగా ప్రసరి
    స్తుంది.

    కర్టెన్‌ ఉందిగా.. ఇంట్లో వెచ్చగా.. 
    నగరంలో రోజురోజుకూ చలి పెరుగుతోంది.. ఉదయం నుంచే ఇంట్లోంచి బయటకు రావాలంటే గజగజలాడాల్సిందే.. సాయంత్రమైతే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఈ చలికాలంలోనూ ఇంటి లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలంటే కిటికీలకు ఉండే కర్టెన్లే కీలకమని అంటున్నారు కర్టెన్‌ ఇంటీరియర్‌ డిజైనర్లు. అయితే వాటిలోని రకం, రంగులను బట్టి ఇంటి లోపలి వాతావరణం గడ్డకట్టే చలిలోనూ వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు.

    ఈ కాలంలో కర్టెన్లకు పలుచటి, కాటన్, లెనిన్‌ కర్టెన్లు కాకుండా మందంగా లేదా థర్మల్‌ కర్టెన్లను వెల్వెట్, ఉన్ని, స్వెడ్‌ లేదా థర్మల్‌ లైన్డ్, బ్లాక్‌అవుట్‌ కర్టెన్లను వినియోగించడం ఉత్తమం. ఇంటి లోపల వేడి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో కర్టెన్ల రంగులు కూడా కీలకమే. ఎరుపు, నారింజ, పసుపు వంటి రంగులకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంచుతాయి.

Sports

  • రికార్డుల రారాణి, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్‌లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్‌ పేరిట ఉండేది.

    మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్‌లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్‌ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.

    చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్‌
    మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఈమె​కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (10868), న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బేట్స్‌ (10652), ఇంగ్లండ్‌కు చెందిన చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.

    టీమిండియా భారీ స్కోర్‌
    తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్‌ (16 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది.

    సిరీస్‌ ఇదివరకే కైవసం 
    కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

     

  • టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు తన ఉద్దేశాలను మరోసారి స్పష్టం చేశాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని సిక్సర్‌గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్న అభిషేక్‌.. తన తాజా ప్రదర్శనతో క్రికెట్‌ సర్కిల్స్‌లో భయోత్పాతం సృష్టించాడు.

    ప్రస్తుతం పంజాబ్ కెప్టెన్‌గా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న ఈ సిక్సర్ల వీరుడు.. ఇవాళ (డిసెంబర్‌ 28) జైపూర్‌లోని అనంతం గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఏకంగా 45 సిక్సర్లు బాది, అక్కడున్న వారిలో (ట్రిబ్యూన్‌ రిపోర్టర్ల కథనం) భయాందోళనలు పుట్టించాడు. ఈ విషయాన్ని ట్రిబ్యూన్‌ మీడియాకు చెందిన రిపోర్టర్లు నివేదించారు.

    వారి నివేదిక ప్రకారం.. పంజాబ్‌ రేపు జరుగబోయే విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో (జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్‌) ఉత్తరాఖండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అభిషేక్‌ శర్మ శివాలెత్తిపోయాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని భారీ షాట్‌ ఆడి, ఏకంగా 45 సిక్సర్లు బాదాడు. ఇది చూసి రిపోర్టర్లు సహా అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.

    ఈ స్థాయి విధ్వంసమేం​టంటూ ‍నోరెళ్లబెట్టారు. ప్రతి బంతిని బాదడమే ధ్యేయంగా పెట్టుకొన్న అభిషేక్‌.. స్పిన్నర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. దాదాపు ప్రతి బంతిని కవర్స్‌ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అభిషేక్‌ వీరంగం చూసి పంజాబ్‌ కోచ్‌ సందీప్‌ శర్మ అవాక్కైపోయాడు. ట్రిబ్యూన్‌ రిపోర్టర్లు నివేదించిన ఈ కథనం చూసి ప్రపంచ బౌలర్లంతా భయాందోళనలకు గురవుతుంటారు.

    వాస్తవానికి అభిషేక్‌ సిక్సర్ల వీరంగం గతేడాది ఆరంభం నుంచే మొదలైంది. ఈ ఏడాది చివర్లో అది తారాస్థాయికి చేరినట్లుంది. 2024 ఐపీఎల్‌తో మెరుపులు ప్రారంభించిన అభిషేక్‌ అప్పటినుంచి తానెదుర్కొన్న ప్రతి బౌలర్‌ను షేక్‌ చేస్తూనే వస్తున్నాడు. 

    ఈ ఏడాది అతని సిక్సర్ల ప్రదర్శన శృతి మించింది. ఇప్పటివరకు ఆడిన 41 టీ20ల్లో ఏకంగా 108 సిక్సర్లు బాది, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కరణ్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్‌) మాత్రమే అభిషేక్‌ కంటే ముందున్నారు.  

  • స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

    ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 28) నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో భారత్‌ టాస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి.

    ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున జెమీమా రోడ్రిగ్స్‌, క్రాంతి గౌడ్‌ స్థానాల్లో హర్లీన్‌ డియోల్‌, అరంధతి రెడ్డి తుది జట్టులో​కి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చారు.

    తుది జట్లు..

    శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషాని

    భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి

  • స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. స్టార్‌ ప్లేయర్‌, వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గడిపిన శ్రేయస్‌.. తాజాగా ఫిట్‌నెస్ టెస్ట్‌లన్నీ పూర్తి చేసుకొని, రీఎంట్రీకి అనుమతి పొందాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.

    CoE నుంచి తుది క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్‌ షెడ్యూల్ నిర్ణయించబడుతుందని సదరు అధికారి తెలిపారు. ప్రస్తుతం శ్రేయస్‌ నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.

    సదరు అధికారి చెప్పిన విషయాల మేరకు.. శ్రేయస్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇస్తాడు. అంతకంటే ముందే ముంబై తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడతాడు. 

    జనవరి 3న మహారాష్ట్రతో, 6న హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో శ్రేయస్‌ బరిలోకి దిగుతాడు. ఆతర్వాత భారత వన్డే జట్టుతో కలుస్తాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం జనవరి 3 లేదా 4 తేదీల్లో భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జనవరి 11 (వడోదర), 14 (రాజ్‌కోట్‌), 18 (ఇండోర్‌) తేదీల్లో జరుగనుంది.

    కాగా, అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రేయస్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్‌ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అత‌డి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంట‌నే అత‌డిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.

    మూడు రోజుల త‌ర్వాత శ్రేయస్‌ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంత‌రం ముంబైకు తిరిగొచ్చిన అయ్య‌ర్‌.. డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో చికిత్స పొందాడు. 

  • ఆసీస్‌ విధ్వంసకర వీరుడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ భారీ సిక్సర్ల రికార్డు చేరింది. బిగ్‌ బాష్‌ లీగ్‌ 2025-26 ఎడిషన్‌లో భాగంగా సిడ్నీ థండర్‌తో ఇవాళ (డిసెంబర్‌ 28) జరిగిన మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. బీబీఎల్‌ కెరీర్‌లో 150 సిక్సర్ల మార్కును దాటాడు. 

    తద్వారా లీగ్‌ చరిత్రలో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాక్సీకి ముందు క్రిస్‌ లిన్‌ మాత్రమే 150 సిక్సర్ల మార్కును తాకాడు. లిన్‌ ఖాతాలో ప్రస్తుతం 220 సిక్సర్లు ఉన్నాయి.

    బీబీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల టాప్‌-5 జాబితాలో లిన్‌, మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో బెన్‌ మెక్‌డెర్మాట్‌ (140), ఆరోన్‌ ఫించ్‌ (118), మార్కస్‌ స్టోయినిస్‌ (111) ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. సిడ్నీ థండర్‌పై మ్యాక్స్‌వెల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన థండర్‌.. హరీస్‌ రౌఫ్‌ (4-0-29-3), టామ్‌ కర్రన్‌ (4-0-22-2), స్టోయినిస్‌ (3-0-25-2), మిచెల్‌ స్వెప్సన్‌ (4-0-18-2), పీటర్‌ సిడిల్‌ (4-0-22-1) దెబ్బకు 20 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 128 పరుగులకు ఆలౌటైంది. 

    థండర్‌ ఇన్నింగ్స్‌లో షాదాబ్‌ ఖాన్‌ (25) టాప్‌ స్కోరర్‌ కాగా.. మాథ్యూ గిల్క్స్‌ (24), సామ్‌ బిల్లింగ్స్‌ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో కొన్‌స్టాస్‌ 11, డేవిడ్‌ వార్నర్‌ 10, బాన్‌క్రాఫ్ట్‌ 10, డేనియల్‌ సామ్స్‌ 3, క్రిస్‌ గ్రీన్‌ 1, తన్వీర్‌ సంఘా 1, ర్యాన్‌ హ్యాడ్లీ 1 పరుగు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మెల్‌బోర్న్‌ ఒకే వికెట్‌ కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. జో క్లార్క్‌ (37 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ద సెంచరీతో మెల్‌బోర్న్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అనంతరం సామ్‌ హార్పర్‌ (29 నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ (39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 

  • ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం బ్రెట్‌ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్‌గన్‌ స్వదేశీ (Australia) హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్‌ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

    లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్‌ క్లార్క్‌, మైఖేల్‌ బెవాన్‌, క్రిస్టినా మాథ్యూస్‌ ఆసీస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌, అలెన్‌ బోర్డర్‌, షేన్‌ వార్న్‌, రికీ పాంటింగ్‌ లాంటి దిగ్గజాలు ఉన్నారు.

    49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్‌ బౌలింగ్‌లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఆసీస్‌ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్‌లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్‌ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.

    అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.

    తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు. 

  • సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్‌ షంషి సొంత దేశ క్రికెట్‌ బోర్డునే (Cricket South Africa) కోర్టుకు లాగాడు. న్యాయపోరాటంలో విజయం కూడా సాధించాడు. జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్రికెట్‌ సౌతాఫ్రికాకు షాక్‌ తగిలినట్లైంది. కోర్టు తీర్పు మేరకు షంషి​కి భారీ ఊరట లభించింది.

    అసలేం జరిగిందంటే..?
    SA20 వేలంలో షంషిని ఎం కేప్‌టౌన్‌ ఫ్రాంఛైజీ 5 లక్షల ర్యాండ్లకు సొంతం చేసుకుంది.  అయితే ఈ డీల్‌కు షంషి నో చెప్పాడు. సమాంతరంగా ఇతర లీగ్‌లతో (ILT20, BBL) ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ లీగ్‌ల్లో ఆడేందుకు షంషికి సొంత దేశ క్రికెట్‌ బోర్డు (CSA) అనుమతి తప్పనిసరి. ఇక్కడే షంషికి, క్రికెట్‌ సౌతాఫ్రికాకు వివాదం మొదలైంది.

    సొంత దేశ క్రికెట్‌ బోర్డు ఆథ్వర్యంలో జరిగే లీగ్‌ను కాదని, పరాయి దేశ లీగ్‌లు ఆడాలనుకున్న షంషికి CSA అనుమతి నిరాకరించింది. NOC ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో షంషి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు. 

    షంషి పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. షంషి విదేశీ లీగ్‌ల్లో పాల్గొంనేందుకు వీలుగా NOC జారీ చేయాలని క్రికెట్‌ సౌతాఫ్రికాను ఆదేశించింది. కోర్డు తీర్పు మేరకు షంషి ఇకపై ఏ విదేశీ లీగ్‌ల్లో అయినా ఆడుకోవచ్చు.

    ఈ కేసులో క్రికెట్‌ సౌతాఫ్రికా కూడా తమ వాదనలు వినిపించింది. బోర్డు నిబంధనల ప్రకారం.. SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్‌లో ఆడాలి. అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే NOC ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టును తెలిపింది.

    అయితే క్రికెట్‌ సౌతాఫ్రికా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోకూడదని మందలించింది. షంషి 2024 అక్టోబర్‌లోనే  CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయినా, సౌతాఫ్రికా తరఫున ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.  

     

  • టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలొ క్లీన్‌ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్‌ టెస్ట్‌ ప్రస్తానం (టీమిండియా హెడ్‌ కోచ్‌గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్‌ స్వీప్‌ (0-2) వరకు సాగింది.

    ఈ మధ్యలో గంభీర్‌ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్‌ పర్యటనలో 1-3తో సిరీస్‌ కోల్పోయి, ఇంగ్లండ్‌ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.

    టెస్ట్‌ల్లో పేలవ ట్రాక్‌ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్‌ను టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్‌పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

    గంభీర్‌ స్థానంలో భారత టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్షణ్‌ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.

    ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్‌పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్‌ జట్టు విధుల నుంచి గంభీర్‌ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. 

    గంభీర్ టెస్ట్ జట్టు కోచ్‌గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్‌ టెస్ట్‌ హెడ్‌కోచ్‌మెన్‌షిప్‌పై ఊహాగానాలు తొలగిపోయాయి.

    ముందుంది ముసళ్ల పండగ
    ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో (2005-27) గంభీర్‌ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్‌ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్‌ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. 

    తాజా సైకిల్‌లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్‌లో భారత్‌ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో కేవలం  4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. 

    అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్‌ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్‌, కివీస్‌పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు. 

  • ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో  ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో 'డెజర్ట్ వైపర్స్' జట్టుతో ఎమిరేట్స్ తలపడనుంది.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ బౌలర్ల ఆరంభం నుంచే ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్పిన్నర్‌ అల్లా గజన్‌ఫర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్‌, మౌస్లీ, ఫరూఖీ తలా వికెట్‌ సాధించారు. దుబాయ్‌ క్యాపిటల్స్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మహ్మద్‌ నబీ(22) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    పొలార్డ్ విధ్వంసం.. 
    అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్‌కు ఓపెనర్లు మహమ్మద్ వసీం (27), ఆండ్రీ ఫ్లెచర్ (21) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఫ్లెయర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.

    అబుదాబి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్  వకార్ సలాంఖైల్‌కు చుక్కలు చూపించాడు. 14 ఓవర్ వేసిన సలాంఖైల్ బౌలింగ్‌లో పొలార్డ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో కిరాన్‌ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు.

    ఈ ఒక్క ఓవర్‌తోనే  మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. ఫలితంగా 123 పరుగుల లక్ష్యాన్ని ఎమిరేట్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పొలార్డ్ మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: హైకోర్టు చెప్పినా లెక్క చెయ్యని చంద్రబాబు ప్రభుత్వం.. హైకోర్టు సిబ్బందిని చావగొట్టిన సీఐకి పోస్టింగ్ ఇచ్చింది. మార్టూరు సీఐగా యార్లగడ్డ శ్రీనివాసరావుకు పోస్టింగ్‌ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుని సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

    గతంలో మంగళగిరి రూరల్‌ సీఐగా పనిచేసిన యార్లగడ్డ శ్రీనివాసరావు.. హైకోర్టు డ్రైవర్‌పై దాడి చేశాడు. అదే  కేసులో గతంలో సీఐని ప్రభుత్వం వీఆర్‌కు పంపింది. సీఐపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. హైకోర్టు ఆదేశంతో సీఐపై కేసు నమోదైంది. అదే సీఐకి చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్‌గా మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. సీఐకి పోస్టింగ్ ఇవ్వడంపై పోలీసు, హైకోర్టు వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

     

  • సాక్షి, పల్నాడు జిల్లా: పిడుగురాళ్ల పీఎస్‌లో ఓ మహిళ చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకట్రావుతో పాటు తెలుగుదేశం నాయకులు సివిల్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆరోపిస్తున్నారు. సీఐతో పాటు టీడీపీ నాయకులు తన భర్తను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి బలవంతంగా రూ. 10 కోట్లు విలువచేసే ఆస్తులను రాయించుకున్నారని ఆమె తెలిపింది.

    ఆ ఆస్తులు సరిపోవని మరికొన్ని ఆస్తులు రాయించుకోవడానికి మమ్మల్ని వేధిస్తున్నారంటూ బాధితురాలు జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు 20 రోజుల క్రితం రాత్రి వేళ నన్ను, నా కుమార్తెని అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో నిర్భందించారు. సీఐ ఒక మహిళ అని చూడకుండా నన్ను చెప్పలేని భాషతో దూషించారు.

    నిన్న రాత్రి  9:00 సమయంలో మా ఇంటి నుంచి బలవంతంగా పోలీసులు నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మరోసారి సీఐ వెంకటరావు చెప్పలేని భాషతో దుర్భాషలాడారు. నాకు భయం వేసి చెయ్యి కోసుకునే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. సీఐ వెంకట్రావు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. మాకు ప్రాణహాని ఉంది.. దయచేసి మాకు న్యాయం చేయండి’’ అంటూ బాధితురాలు జ్యోతి వేడుకుంటోంది.

     

  • సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్‌ తగిలింది. పున్నమి ఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి  సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్‌కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.

    భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్‌లోని మా‌ భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్‌లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా‌ భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా‌ భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా‌ భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా‌ సహనాన్ని పరీక్షిస్తున్నారు

    ..మా హద్దులు వేసుకొని మా‌ భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.

    కలెక్టర్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్‌ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు.

  • మదనపల్లె రూరల్‌ : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధురాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ఆవరణలో ఆరుబయట పడుకుని చలికి తాళలేక మృత్యువాత పడిన ఘటన శనివారం జరిగింది. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లెకు చెందిన వెంకటప్ప భార్య మల్లమ్మ(75)కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స  కోసం శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చింది. లోనికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు శరీరం సహకరించకపోవడంతో ఓపీ బ్లాక్‌ సమీపంలో ఆరుబయట పడుకుంది. గమనించిన కొందరు వృద్ధురాలిని అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. చేతికి క్యాన్‌లా అమర్చి సూదిమందు వేశారు. చికిత్స అనంతరం ఆమె ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండిపోయింది. 

    రాత్రిపూట ఆస్పత్రిలో అడ్మిట్‌ రోగులను తప్ప మిగిలిన వారిని బయటకు పంపేయడంతో వృద్ధురాలు ఓపీ బ్లాక్‌ బయట స్లాబ్‌ కింద పడుకుంది. అయితే, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి చలిగాలులు, మంచు అధికం కావడంతో అనారోగ్యంతో బాధపడుతున్న మల్లమ్మ, తట్టుకోలేక వణుకుతూ ప్రాణాలు విడిచింది. చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలు ఓపీ బ్లాక్‌  ఎదుట ఆరుబయట అందరికీ కనిపించే విధంగా పడుకుంటే, రాత్రిపూట విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది గమనించకపోవడం దారుణం. శనివారం ఉదయం వృద్ధురాలిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన అత్యవసర విభాగంలోకి తీసుకువెళ్లి డాక్టర్లతో పరీక్షలు చేయించగా, చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

     పట్టణంలోని బీకే.పల్లెలో నివాసం ఉంటున్న కుమార్తె మల్లీశ్వరి అంత్యక్రియల కోసం తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లింది. సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బంది రాత్రిపూట ఓ వృద్ధురాలు ఆరుబయట పడుకున్నా గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు అంతంతమాత్రంగానే ఉన్న తరుణంలో వచ్చిన ఒకటి అరా కేసులను నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ పట్టించుకోవడం లేదంటూ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

     

National

  • జమ్మూ కశ్మీర్‌లోకి అక్రమంగా దాదాపు 30 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో సైన్యం నిఘాను పెంచింది. 'చిల్లై కలాన్'( అత్యంత చలిఉండే కాలం)ను సైతం లెక్కచేయకుండా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో భద్రత సంస్థలు నిరంతరం నిఘాను పెంచుతున్నాయి.  

    జమ్ముకశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలోనే ఎముకలు గడ్డకట్టే చలి ఉండే  ఆ ప్రాంతంలో ఇక చలికాలం ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకూ మధ్య కాలాన్ని (చిల్లైకలాన్) అత్యంత కఠినమైన చలి ఉండే కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు, గడ్డకట్డి పోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటాయి.

    ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడం కోసం కఠినమైన ఆపరేషన్‌ చేపడుతుంది. జమ్మూ రీజియన్‌లో ముష్కరులకు ఎటువంటి సహాయం అందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. సున్నిత ప్రాంతాలలో సైనికుల మోహరింపును పెంచింది. కొండలు, ‍అడవులు, మారుమూల లోయ గ్రామాలను జల్లెడ పడుతోంది. గుల్మార్ల్, సోనాలేక్, థాల్‌ సరస్సు వంటి సమస్యత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచింది.

    అంతేకాకుండా ఉగ్రవాదులు సహాయం పొందే అవకాశాలున్న ప్రాంతాల్లో భద్రత పెంచింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గితే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్‌ రీజన్‌లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
     

  • దక్షిణ మధ్య రైల్వే 2025 క్యాలెండర్ సంవత్సరంలో, అన్ని రంగాలలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది. ఈ కాలంలో, ఈ జోన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నూతన రైళ్ల ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల పెంపు, సిబ్బంది సంక్షేమం, లోడింగ్, రాబడి సృష్టి మరియు భద్రతను పెంపొందించడం మొదలైన విషయాలలో నూతన శిఖరాలను అధిరోహించి, అనేక మైలురాళ్లను దాటినట్లు పేర్కొంది.

    2025 క్యాలెండర్ సంవత్సరంలో  రైల్వే సాధించిన విజయాలు. 

    •  తెలంగాణ రాజధాని నగర ప్రాంతంలోని (హైదరాబాద్) మూడు ప్రధాన టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి  ప్రయాణికులకు సులభమైన, ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందించడానికి, చర్లపల్లిలో ఒక నూతన శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేసి ప్రధానమంత్రి చే జనవరి 2025లోప్రారంభించబడింది.

    •  జోన్ లోని వైద్య విభాగం ఫిబ్రవరి 2025లో రైల్వే అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టుల మొదటి వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది.

    •  మార్చి-2025లో రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్‌లో 64 స్లైసెస్ సిటి స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.

    • తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్ మరియు వరంగల్ అనే మూడు ముఖ్యమైన రైల్వే స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసింది. వీటిని  ప్రధానమంత్రి మే 2025లో వర్చువల్‌గా ప్రారంభించారు.

    • ఇండో-సార్సెనిక్/ ఇండో-గోతిక్ వాస్తుశిలిలో నిర్మించబడిన కాచిగూడ రైల్వే స్టేషన్ వారసత్వాన్ని సరైన కాంతివిధానంతో చాటి చెప్పడానికి రూ. 2.2 కోట్ల వ్యయంతో కాచిగూడ హెరిటేజ్ స్టేషన్‌కు వాస్తుశిల్ప సుందరీకరణతో విద్యుత్ దీపాలంకరణ  పూర్తిచేసింది.కేంద్ర మంత్రి  జీ.కిషన్ రెడ్డి జూన్ 2025లో  దీనిని దేశానికి అంకితం చేశారు.

    •  జూన్ 2025లో, రైల్వే లబ్ధిదారుల ప్రయోజనం కోసం సికింద్రాబాద్‌లోని లాలాగూడ సెంట్రల్ హాస్పిటల్‌లో అంతర్గత కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు

    • గౌరవ రైల్వే కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ జూలై 2025లో కాచిగూడ ,భగత్ కీ కోటి మధ్య  రోజువారీ రైలును ప్రవేశపెట్టి జెండా ఊపి ప్రారంభించారు.  

    •  మార్గమధ్యంలో రైలు ఆలస్యాలను తగ్గించడానికి మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి జూలై, 2025లో పెద్దపల్లి జంక్షన్ వద్ద ఒక కీలకమైన బైపాస్ లైన్ ప్రారంభించారు.

    •  మహారాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు, 2025లో సి.ఎస్.టి.ఎం మరియు  జాల్న మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నాందేడ్ వరకు పొడిగించి, జెండా ఊపి ప్రారంభించారు.

    • రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న డిసెంబర్, 2025లో తిరుపతి మరియు సాయినగర్ షిర్డీ మధ్య నూతన వీక్లీ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు.

    • డిసెంబర్, 2025లో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ ల గౌరవ సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు.

    • 2025 సంవత్సరంలో జోన్ చేపట్టిన పైన పేర్కొన్న విజయవంతమైన కార్యక్రమాలతో పాటు, ఈ క్రింది తెలియజేయబడిన ప్రధాన మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపుదల ప్రాజెక్టులు, రాబడి సృష్టి మరియు ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి :

    • దక్షిణ మధ్య రైల్వే జనవరి నుండి నవంబర్, 2025 వరకు ఈ క్రింది  విజయాలు సాధించింది
      సరుకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులు (జనవరి - నవంబర్ 24లో 128.4 మిలియన్ టన్నులతో పోలిస్తే).
      సరుకు రవాణా ఆదాయం లో రూ. 12841 కోట్లు(జనవరి - నవంబర్ 24లో రూ. 12597 కోట్లతో పోలిస్తే)

    • ప్రయాణీకుల ఆదాయంలో రూ. 5525 కోట్లు ( సరుకు రవాణా ఆదాయం జనవరి - నవంబర్ 24లో రూ. 5261 కోట్లతో పోలిస్తే)
      రూ. 19314 కోట్ల స్థూల మొత్తం ఆదాయం (జనవరి - నవంబర్ 24లో రూ. 18831 కోట్లతో పోలిస్తే)

    • దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరంలో 52 స్టేషన్లు/సేవా భవనాలకు అత్యధిక శూన్య/శూన్య ప్లస్ లేబులింగ్‌ను సాధించింది .ఈ స్టేషన్లు/సేవా భవనాలలో నికర ఇంధన దిగుమతికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ నికర ఇంధన ఎగుమతిని సాధించినందుకు భారతీయ రైల్వేలలో ఇది అత్యధికం.
      2025 సంవత్సరంలో మూడు గతి శక్తి కార్గో టెర్మినల్స్ ప్రారంభించబడ్డాయి.
      గుంతకల్లు డివిజన్‌లోని సంజమల వద్ద మెస్సర్స్ రామ్కో సిమెంట్స్
      గుంతకల్లు డివిజన్‌లోని యెర్పేడు వద్ద మెస్సర్స్ జగదీష్ , ఇతరులు
      గుంటూరు డివిజన్‌లోని జనపహాడ్‌ వద్ద మెస్సర్స్ డెక్కన్ సిమెంట్స్

    • 68 మ్యాన్డ్ లెవల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు.
      22 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మరియు 60 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి.
      దక్షిణమధ్య రైల్వే ద్వారా 2025 లో 199 కి.మీ.ల ట్రాక్ జోడింపు (15 కి.మీ. కొత్త లైన్లు, 40 కి.మీ. డబుల్ లైన్ మరియు 144 కి.మీ. మూడవ లైన్)
      వాడి వద్ద 24 కి.మీ. పొడవునా విద్యుదీకరణతో పాటు (12 కి.మీ. డబుల్ లైన్) బైపాస్ లైన్‌ను ప్రారంభించారు. దీని వలన వాడి జంక్షన్‌కు వెళ్లకుండా రైళ్లను సజావుగా నడపడానికి సహాయపడుతుంది.

    • దక్షిణ మధ్య రైల్వే 2025లో 184 ట్రాక్ కి.మీ. విద్యుదీకరించింది (డబ్లింగ్‌లో భాగంగా 40 కి.మీ. మరియు మూడవ లైన్‌లో భాగంగా 144 కి.మీ.). అదనంగా, హైదరాబాద్ డివిజన్‌లోని అక్కన పేట్ - మెదక్ సెక్షన్ మధ్య 17 రూట్ కి.మీ మరియు కలబురగి - ఖానాపూర్ సెక్షన్ మధ్య 97 రూట్ కి.మీ కూడా విద్యుదీకరించబడ్డాయి. దీనితో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్‌లో 100 శాతం విద్యుదీకరణను సూచిస్తుంది.

    •  వివిధ విభాగాలలో 529 కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్‌ను విజయవంతంగా ప్రారంభించారు తద్వారా లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు ఎక్కువ సంఖ్యలో రైళ్ల నిర్వహణకు సహాయపడింది.

    • జోన్ సెక్షన్ సామర్థ్యాన్ని మరియు రైళ్ల సజావుగా నిర్వహణను పెంచడానికి వివిధ విభాగాలలో తొమ్మిది ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలను ప్రారంభించింది.

    • దక్షిణ మధ్య రైల్వే 2025 సంవత్సరానికి గాను నాలుగు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను గెలుచుకుంది - గుంతకల్లు లోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణా కేంద్రం ఉత్తమ పనితీరు గల యూనిట్ అవార్డును పొందగా, రాయచూర్, కాచిగూడ మరియు లింగంపల్లి మొదలైన 3 రైల్వే స్టేషన్లు మెరిట్ సర్టిఫికేట్‌ను పొందాయి.

  • కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో విజయవంతంగా ముగిసింది. ఈ ఒక్కరోజే సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్‌ వెల్లడించారు. 

    మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు. 

    కాగా, శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం అనంతరం గుడిని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తిరిగి తెరుచుకోనుంది.

    (చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు)

     

  • న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌’ జలాంతర్గామిలో ప్రయాణించారు. తద్వారా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం తర్వాత జలాంతర్గామిలో పయనించిన రెండో రాష్ట్రపతిగా ముర్ము రికార్డు సృష్టించారు. ఆదివారం కర్ణాటకలోని కర్వార్‌ నావికా స్థావరం ఇందుకు వేదికైంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ అయిన ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన కల్వరీ శ్రేణి అత్యాధునిక ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ జలాంతర్గామిలో ఆదివారం ప్రయాణించారు.

     నావికా దళాధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ కె.త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వాఘ్‌షీర్‌లో ముర్ము రెండు గంటలపాటు గడిపారు. జలాంతర్గామి పనితీరు గురించి అధికారులను ఆమె స్వయంగా అడిగి తెల్సుకున్నారు. అనంతరం జలాంతర్గామి సిబ్బందితో రాష్ట్రపతి సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె నావికా దళ యూనిఫాం ధరించి ఆకట్టుకున్నారు.
     
    స్ఫూర్తినిచ్చింది: మేడిన్‌ ఇండియా సాఫల్యానికి తార్కాణమైన ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లో పయనించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ముర్ము పేర్కొన్నారు. ప్రయాణానంతరం అందులోని అతిథుల పుస్తకంలో ముర్ము తన మనోభావాలకు అక్షర రూపమిచ్చారు. ‘‘జలాంతర్గామిలోకి ప్రవేశం, అందులో ప్రయాణం, సాహసికులైన నావికులు, నావికాధికారులతో విలువైన సమయం గడపడం నాకు మరపురాని అనుభూతిగా మిగిలిపోతాయి.

     ‘వీర వర్చస్వ విజయ’ అన్న స్వీయ స్ఫూర్తి వాక్యాన్ని ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ నిత్యం నిజం చేసి చూపుతూ వస్తోంది. ఎన్నో సాహస కార్యాలను విజయవంతంగా నెరవేర్చింది. దాని సిబ్బంది నిరంతర అప్రమత్తత, అంకితభావం అబ్బురపరుస్తున్నాయి. వారి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం నాలోనూ మరెంతో స్ఫూర్తి నింపాయి. మన జలాంతర్గాములు, నావికా దళం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నిత్యం సన్నద్ధంగా ఉన్నాయని మరోసారి వాఘ్‌షీర్‌ సిబ్బంది చాటారు’’ అంటూ ఆమె కొనియాడారు.

     త్రివిధ దళాలతో సుప్రీం కమాండర్‌ తరచూ భేటీ అవుతూ స్ఫూర్తి నింపుతున్న క్రమానికి ఇది కొనసాగింపు అని రాష్ట్రపతి కార్యాలయం తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. మన నావికా దళ వృత్తి నిబద్ధతకు, అద్భుత పాటవానికి, నిరంతర యుద్ధ సన్నద్ధతకు వాఘ్‌షీర్‌ జలాంతర్గామి అద్భుత ప్రతీక అని రాష్ట్రపతి కొనియాడినట్లు ఆ ప్రకటన పేర్కొంది. 2024 నవంబర్‌లో ముర్ము పూర్తిగా దేశీయంగా తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధ విమానంలో ప్రయాణించడం తెలిసిందే. 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఐఎన్‌ఎస్‌ సింధురక్షక్‌ జలాంతర్గామిలో ప్రయాణించారు.

    ‘నిశ్శబ్ద’ కెరటం 
    ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ను నావికా దళం గర్వంగా ‘నిశ్శబ్ద కెరటం’గా పేర్కొంటూ ఉంటుంది. పీ75 స్కార్పీన్‌ ప్రాజెక్టులో ఇది ఆరో, చివరి జలాంతర్గామి. గత జనవరిలో నావికా దళానికి అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతికత, సదుపాయాలు దీని సొంతం. ప్రపంచంలోనే వేళ్లపై లెక్కించగల డీజిల్‌–ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్లలో వాఘ్‌షీర్‌ ఒకటి అని నేవీ అధికారులు తెలిపారు. యాంటీ సబ్‌మెరైన్‌తో పాటు యాంటీ సర్ఫేస్‌ యుద్ధ తంత్రంలోనూ దీనికి తిరుగులేదు. నిఘా, సమాచార సేకరణతో పాటు పలు ప్రత్యేక రహస్య ఆపరేషన్లను ఇది నిశ్శబ్దంగా చక్కబెడుతుంటుంది. వైర్‌ గైడెడ్‌ టోర్పెడోలు, యాంటీ షిప్‌ క్షిపణులు, అత్యాధునిక సోనార్‌ వ్యవస్థలు వాఘ్‌షీర్‌ సొంతం. ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ (ఏఐపీ) టెక్నాలజీ సాయంతో దీని భావి ఆధునీకరణలకు కూడా పూర్తిస్థాయిలో వీలుండటం విశేషం.

  • న్యూఢిల్లీ:  2025వ సంవత్సరంలో మన దేశానికి గర్వకారణమైన మైలురాళ్లు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. జాతీయ భద్రత, క్రీడలు, నూతన శాస్త్రీయ ఆవిష్కరణలతోపాటు ప్రపంచంలో అతిపెద్ద వేదికలపై ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. భారతదేశ ప్రభావం, కీర్తిప్రతిష్టలు అంతటా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. 

    2025లో ఇదే చివరి మన్‌ కీ బాత్‌. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆపరేషన్‌ ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టంచేశారు. దేశ భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమన్న సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇచ్చామని వివరించారు. నూతన భారతదేశం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు. దేశ భద్రత పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రతి ఒక్కరూ మాతృభూమి పట్ల ప్రేమ, ఆరాధనతోపాటు భావోద్వేగాలు, కృతజ్ఞతలను విభిన్న రూపాల్లో వ్యక్తం చేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.  

    చిరస్మరణీయమైన సంవత్సరం  
    ‘‘ఆపరేషన్‌ సిందూర్‌ నాటి అదే స్ఫూర్తి వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగానూ ప్రజల్లో కనిపించింది. నా పిలుపునకు వారు ఉత్సాహంగా స్పందించారు. జాతీయ గీతం 150 ఏళ్ల వేడుకలో పాల్గొన్నారు. సోషల్‌ మీడియాలో సందేశాలు పంచుకున్నారు. క్రీడల విషయంలో 2025 మనకు చిరస్మరణీయమైన సంవత్సరం. పురుషుల క్రికెట్‌ జట్టు ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ సాధించింది. మహిళల క్రికెట్‌ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. అంధుల టీ20 ప్రపంచ కప్‌లో మన మహిళల జట్టు విజేతగా నిలిచి, చరిత్ర సృష్టించింది. ఆసియా కప్‌ టీ20 , పారా అథ్లెటిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధించారు. మువ్వన్నెల జెండాను సగర్వంగా రెపరెపలాడించారు.   

    కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే 
    భారతీయ భాషలు, సం్కృతి ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దేశంలో తమిళ భాషకు ప్రాచుర్యం లభిస్తోంది. కొత్త తరాన్ని ఈ భాషతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో నివసించే కన్నడ కుటుంబాలు కన్నడ పాఠశాలను ప్రారంభించాయి. పిల్లలకు కన్నడ భాష నేరి్పస్తున్నాయి. కన్నడనాడు, నుడి నమ్మ హెమ్మే(కన్నడ భూమి, కన్నడ భాష మనకు గర్వకారణం). జమ్మూకశీ్మర్‌లోని బారాముల్లాకు సంబంధించిన మూడు బౌద్ధ స్తూపాల పాత ఫోటో ఒకటి ఫ్రాన్స్‌ మ్యూజియంలో కనిపించింది. కశీ్మర్‌కు రెండు వేల ఏళ్ల మహోన్నత చరిత్ర ఉంది. పురాతన కాలం నాటి మానవ నిర్మిత కట్టడాలు, వస్తువులు అక్కడ లభ్యమయ్యాయి. కశీ్మర్‌ గత వైభవాన్ని అవి మనకు తెలియజేస్తున్నాయి.   

    మనసుంటే మార్గం ఉంటుంది  
    మణిపూర్‌ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల శ్రీరామ్‌ మొయిరంగ్‌థెమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు తన గ్రామానికి విద్యుత్‌ను తీసుకొచ్చాడు. సౌర విద్యుత్‌తో వందలాది ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మరోసారి నిరూపించాడు. సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కలి్పంచాడు. దాంతో అక్కడ  నిరంతరాయంగా విద్యుత్‌ అందుతోంది. ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ‘పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ కింద సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున అందజేస్తోంది. అర్హులైన ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి.  

    వైద్యుల సలహాతోనే మాత్రలు  
    యాంటీబయోటిక్స్‌తోపాటు పలు రకాల ఔషధాలను జనం విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ప్రమాదకరమే. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా ఔషధాలు తీసుకోవద్దు. న్యుమోనియా, యూటీఐ వంటి వ్యాధులపై యాంటీబయోటిక్స్‌ ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఇటీవల ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలింది. అంటే మనలో యాంటీబయోటిక్స్‌ నిరోధకత వచ్చేసింది. ఇది ఆందోళనకరమైన విషయం. ఇకనైనా పరిస్థితి మారాలి. ఒక మాత్ర వేసుకుంటే అన్ని రోగాలూ పోతాయని అనుకోవడం సరైంది కాదు. మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే వైద్యుల సలహాతోనే మాత్రలు వేసుకోవాలి.

    భారత యువశక్తికి తిరుగులేదు  
    సైన్స్, అంతరిక్ష రంగంలో గొప్ప ముందడుగు వేశాం. మన వ్యోమగామి శుభాంశు బుక్లా అంర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతగా వెళ్లొచ్చాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. నేడు ప్రపంచం మొత్తం భారత్‌ వైపు గొప్ప ఆశతో చూస్తోంది. మన యువజన బలమే ఇందుకు కారణం. భారత యువశక్తికి తిరుగులేదు. సైన్స్, నవీన ఆవిష్కరణలు, టెక్నాలజీ విస్తరణలో మన విజయాలను ప్రపంచదేశాలు అబ్బురంగా వీక్షిస్తున్నాయి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ‘యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌’ నిర్వహిస్తున్నాం. 

    నేను పాల్గొనే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా మారాలని యువతను కోరుతున్నా. కొత్త ఆవిష్కరణలు, ఫిట్‌నెస్, స్టార్టప్స్, వ్యవసాయం వంటి అంశాలపై వారు తమ ఆలోచనలు పంచుకోవచ్చు. శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, ఆసక్తులను ప్రదర్శించడానికి ఇప్పటి యువతకు ఎన్నో అవకాశాలు, వేదికలు ఉన్నాయి. అలాంటి ఒక వేదిక ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’. ఈ ఎనిమిదేళ్లలో 13 లక్షల మంది విద్యార్థులు ఈ హ్యాక్‌థాన్‌లో పాల్గొన్నారు. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువత దృష్టిపెట్టడం నిజంగా హర్షణీయం  

    స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ప్రశంసనీయం  
    ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ప్రజల విశ్వాసం, సంస్కృతి, విశిష్టమైన భారతీయ వారసత్వం ఒకే వేదికపైకి చేరాయి. ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాను చూసి ప్రపంచం సంభ్రమాశ్చర్యాలకు గురైంది. అయోధ్య భవ్య రామమందిరంపై ధ్వజరోహణాన్ని చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. అలాగే స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు పెద్దపీట వేస్తుండడం ప్రశంసనీయం. భారతీయుల స్వేదం, భారతీయ మట్టి పరిమళం కలగలిసిన ఈ ఉత్పత్తులను విస్తృతంగా కొనుగోలు చేసి ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దేశంలో చీతాల సంఖ్య పెరుగుతుండడం సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడు 30కిపైగా చీతాలు ఉన్నాయి. 2025వ సంవత్సరం మనకు మహోన్నత విశ్వాసాన్ని ఇచి్చందని చెప్పగలం. నూతన ఆశయాలు, సంకల్పాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి దేశం సిద్ధంగా ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.     
     

    ఇది కూడా చదవండి: 2026కు 26 ట్రెండ్స్‌.. ఏఐ నుంచి జీరో వేస్ట్‌ వరకూ..

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్‌ అనే వ్యక్తి డాక్యు మెంట్లు ఇమంది రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట ఇమంది రవి.. పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు తేలింది.

    బెంగుళూరు నుంచి ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్‌ పోలీసులకు చెప్పాడు. అయితే, ప్రహ్లాద్‌ తన రూమ్‌ మేట్‌ అని గతంలో రవి.. విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. తన పేరుతో రవి పాన్‌, లైసెన్స్‌ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానంటూ ప్రహ్లాద్‌.. పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రేపటితో(డిసెంబర్‌ 29, సోమవారం) ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది.

    కాగా, ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్‌ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్‌ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. పలు విడతలుగా జరుపుతున్న విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబడుతున్నారు.

    సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా పలు ఆసక్తికర సంగతులను రవి వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే.. స్క్రీన్‌ రికార్డింగ్‌ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానంటూ కస్టడీ విచారణలో సైబర్‌ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.

     

     

     

     

     

  • సాక్షి హైదరాబాద్: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుప్రక్కల వారు భయాందోళనలకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు తీవ్రంగా ఉండడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • సాక్షి హైదరాబాద్:న్యూఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈగల్ టీం తన డ్రగ్స్ వినియోగంపై నిఘాను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసింది. ఈసందర్భంగా కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో 8మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆపబ్‌కు నోటీసులు జారీ చేసింది. పబ్‌లలో మాదకద్రవ్యాలు వాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేసింది.

    ఈ డ్రగ్స్ దాడులలో మెుత్తం 14 మందికి ర్యాపిడ్ కిట్‌లతో పరీక్షలు నిర్వహించగా వారిలో 8మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మరో 8మంది పరీక్షలు నిర్వహించే కంటే ముందే తామే డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు.  పరీక్షలో నిందితులు కొకైన్, గంజాయి, OPM, THC వినియోగించినట్లు తేలిందని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి  6  ఎన్డీపీ బాటిళ్లు, మెుబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

    రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడం కోసం  "ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ (EAGLE) ను ఏర్పాటు చేసింది. ఈ విభాగం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) సమక్షంలో పనిచేస్తుంది.  మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వాడకం నిరోధించడంలో ఈ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది.

  • సాక్షి హైదరాబాద్: సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. ‍అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం కోసం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్‌లో గల తన నివాసానికి బయిలుదేరినట్లు పేర్కొంది. రేపు జరిగే అసెంబ్లీ సెషన్‌కు అక్కడి నుంచి కేసీఆర్ హాజరు కానున్నట్లు  అధికారికంగా వెల్లడించింది.

    కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీ సెషన్లకు హాజరయ్యారు. తొలిసారి గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వగా రెండోసారి బడ్జెట్ ప్రసంగానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం గుప్పించింది. 

    కాగా ఇటీవలే కేసీఆర్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా  పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చించారు. వాటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆరాతీశారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై  ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా  బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 

  • సాక్షి,ములుగు: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో అమ్మవార్లని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం 200మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

    వాస్తవానికి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల జాతర వచ్చే ఏడాది జనవరి 28న సారలమ్మ రాకతో ప్రారంభం అవుతుంది. 29న సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది. 30న భక్తులు మెుక్కులు సమర్పించుకుంటారు. 31వతేదీన అమ్మవార్ల వనప్రవేశంతో జాతరముగుస్తుంది. 

    సమ్మక్కసారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావిస్తారు. జాతర సందర్భంలో కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.  ఈ సందర్భంగా ముందుగానే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది అమ్మవార్ల జాతరను ప్రభుత్వం అత్యంత వైభవంగా జరపాలని సంకల్పించింది. జాతర ఏర్పాట్లకోసం ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.

    ‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?

    ..నల్లజర్ల సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్‌ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు

    ..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్‌పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  ఆదివారం(డిసెంబర్‌ 28) ఆయన వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.

    ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్‌, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

    ‘‘డేటా ప్రొఫైలింగ్‌ సరిగా ఉంటే మనకు భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్‌ సోల్జర్స్‌ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్‌ కూడా ఇప్పటికే ఇస్తున్నాం.

    ..ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్‌, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో  పైలెట్‌ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్‌ నాయకులు కొందరితో టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్‌ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు చీదరించుకంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.

    తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్‌ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండమీదకు తీసుకొస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం చోటు చేసుకుందని.. భక్తులు దైవ దర్శనానికి వెళ్తే  ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని గుర్తు చేశారు.

    చంద్రబాబు హయాంలో ప్రతిసారి హిందుత్వం మీద దాడి జరగడం పరిపాటిగా మారిందని.. తిరుపతి, అన్నవరం,కాశీబుగ్గ క్షేత్రమేదైనా కూటమి పాలనలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నా.. భక్తుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విష్టు ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్రంలో యధేచ్చగా గోవధ జరుగుతున్నా.. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం నిల్వలు పట్టుబట్టినా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    తిరుమలలో వరుస అపచారాలు..
    తిరుమలలో అధికారులు, విజిలెన్స్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సభ్యుడు ఏకంగా మహాద్వారం గుండా వెళ్లాలని అక్కడున్న సిబ్బందితో గొడవపడి నానా రాద్ధాంతం చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన గోశాల నిర్వహణ దారుణంగా మారింది. అక్కడ తొలిసారిగా దాదాపు 190 గోవులు మరణించడం అత్యంత బాధాకరం.

    అదే విషయాన్ని వైయస్సార్సీపీ నాయకులు ఎత్తి చూపితే.. వారి మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కానీ అదే టీటీడీ పాలకమండలి సమావేశంలో గోశాల నిర్వహణ కష్టంగా ఉందని చర్చించడం ద్వారా మేం చెప్పిన అంశం నిజమేనని రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టీటిడీని రాజకీయ విమర్శలకు వేదికగా దుర్వినియోగం చేస్తోంది.

    ఈ ఏడాది ఏప్రిల్‌ 12న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్న సమయంలో స్వామివారి గేటు తాళాలు మూసివేయడంతో స్వామివారి నైవేద్య సమర్పణ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇది ఘోరమైన అపచారం. పాలకమండలి పాలనా, నిర్వహణ వైఫల్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు తిరుమలలో వ్యవస్థ పని చేస్తుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తూ కొంతమంది చెప్పులు వేసుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్‌ లోకి వెళ్తున్న ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.

    దేవాలయాల్లో వరుస అపచారాలు..
    కూటమి ప్రభుత్వం తరహాలో వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏరోజూ ఇలా జరగలేదు. కానీ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిత్యం దేవుళ్లని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక చేయెద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. లడ్డూ తయారీ నెయ్యిలో లేని కల్తీ జరిగిందని సిట్‌ దర్యాప్తు వేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దాన్ని వాడుకుంటోంది.

    అదే విధంగా కాశీనాయన క్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రం, భక్తుల విశ్రాంతి భవనాలను టైగర్‌ రిజర్వ్‌ జోన్‌ లో ఉందని.. అత్యంత అమానుషంగా బుల్‌డోజర్లతో కూలగొట్టారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. వైయస్‌.జగన్‌ హయాంలో అయితే ఇదే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అటవీ భూముల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వానికి, వైయస్‌.జగన్‌ ప్రభుత్వానికి ఇదే తేడా.

    వైయస్‌. జగన్‌ హయాంలోనే పరకామణి కోసం అత్యాధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించారు. కాబట్టే పరకామణి చోరీ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో మాజీ ఏవీఎస్‌ సతీష్‌ వేధింపులకు ఎవరు కారణం?, ప్రభుత్వ వేధింపులు కాదా? ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న దేవాలయాల నిర్వహణ అత్యంత అధ్వాధ్నాంగా తయారైంది. కేవలం టీటీడీ, కాశీనాయన క్షేత్రాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లోనూ ఇవే అపచారాలు జరుగుతూనే ఉన్నాయి.  01–05–2025న సింహాచలం దేవస్దానంలో  గోడకూలి 7 మంది సజీవసమాధి అయితే దానికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు? పర్వదినాన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పేతే ఎవరు జవాబూదారీతనం

    రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అసాంఘిక కార్యకలాపాలకు విపరీతంగా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోతుంది. కోడిగుడ్లు తినడం, మద్యపానం, పేకాట వంటివి  అష్టాదశ శక్తిపీఠ శ్రీశైలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పైగా కూటమి ఎమ్మెల్యే తప్పతాగి, స్వయంగా అటవీశాఖ సిబ్బంది మీద దాడులకు దిగడమేనా సనాతన ధర్మం. ఈ ఏడాది మే 18న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం అద్దేపల్లిపేటలో కోదండరామాలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. కల్కి, బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి విగ్రహాలను ధ్వంసం చేసి పక్కన పడేశారు. నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు, దాని మీద ఎలాంచి చర్యలు లేవు. 

    ఈ ఏడాది నవంబరు 11న కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిమంది భక్తులు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగిప్రాణాలతో వస్తామో?   రామో? అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగనే పక్కనే ఉన్న శ్రీకూర్మంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల... నక్షిత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్టుమార్టమ్‌ కూడా నిర్వహించకుండా ఈవో కార్యాలయం వెనుక వాటిని తగలబెట్టారు. ఇవన్నీ మీ పరిపాలనకు మచ్చుతునకలు.

    రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వ్యక్తికి ప్రభుత్వ నిధుల నుంచి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చారా? లేదా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. 2024–25 లో హిందూ ధర్మాన్ని కూటమి ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజార్చిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే.  తిరుపతిలో తొక్కిసలాటలో గతేడాది 6గురు చనిపోయారు. దానికి కారణమైన అధికారులను మరలా అదే స్ధానంలో నియమించారు. రెండు రోజుల క్రితం 24, 25 తేదీల్లో మరలా తొక్కిసలాట జరిగింది. మీకు అనుకూలంగా పని చేసే అధికారులు తప్పు చేసినా వారి మీద చర్యలు ఉండవన్నది స్పష్టమవుతోంది.

    సదావర్తి భూములను వేద పండితుల పోషణ కోసం ఇచ్చారు. అని అన్యాక్రాంతం కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపాడింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల కానుకులు వేసిన హుండీలకు కూడా భద్రత లేదు. అహోబిలంలో రూ.20 లక్షలు భక్తులు వేసిన కానుకలని స్థానిక ఎమ్మెల్యే మనుషులు కైంకర్యం చేస్తే.. కనీసం కేసు కూడా పెట్టలేదు. దేవాలయాల్లో పెరిగిన రాజకీయ జోక్యానికి ఇదే నిదర్శనం. ఆలయాల్లో చొరబడి రాజకీయజోక్యంతో నాశనం చేస్తున్నారు.

    వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని చిన్నతిరుపతిగా పేరు గాంచింది. 19–11–2025న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు... మంత్రి వాసంశెట్టి సుభాష్‌ సిఫారసుతో వచ్చి.. డబ్బులు దొంగతనం చేస్తే కేసు పైలు చేశారు. దీని మీద కూటమి నేతలు నోరు మెదపరు. ఇవన్నీ ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలు.

    ఇవీ కూటమి ప్రభుత్వ ఘనతలు:
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో వదిలేసింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల నిర్వహణ కోసం, వేదపండితులు పోషణ కోసం  దేవాలయాలకు భూములిస్తారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో ప్రకారం ఆలయాల భూములను తమకు తూచినట్లు, టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెట్టే విధంగా జీవో జారీ చేసింది.  ఇది ఏ మేరకు ధర్మం? వైఎస్‌ జగన్‌ హయాంలో ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని దోచిపెట్టే పని చేస్తోంది. 

    రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం అయిన.. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో.. 70 వేల మంది భక్తులున్న ఆలయంలో 3 నుంచి 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసారంటే ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో అర్ధం అవుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? దేవాదాయ, ధర్మాదాయ మరియు విద్యుత్‌ శాఖలకు మధ్య ఉన్న సమన్వయలోపానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ అసమర్థ పాలనకు తార్కాణం. అనంతపురం సింగనమలలో పుట్‌ పాత్‌ మీద సిరి రమణ అనే ఒక అర్చకుడు ఆందోళనకు దిగాడు. 150 ఏళ్లుగా వంశపారపర్యంగా ఆలయ అర్చకత్వం చేస్తుంటే.. వారిని గుడి నుంచి గెంటేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్‌ కు అర్జీ ఇచ్చినా పట్టించుకోకపోవడం అత్యంత అమానుషం.

    ద్వారకా తిరుమలలో సైతం ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే గోవులు చనిపోతే.. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. కూటమి పాలన వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా పెద్ద మొత్తంలో గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతుంది. హిందూ సమాజానికి జరుగుతున్న అతిపెద్ద ద్రోహం ఇది. బాపట్ల ఎమ్మెల్యే సన్నిహితుడు గోడౌన్‌ లో పట్టుబడినా చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు.  కర్నూలులో లే అవుట్‌ కి అడ్డంగా ఉందని అలయ గోడ కూల్చి వేసిన ఘటన చోటు చేసుకుంది.

    ఇంకా టీడీపీ ఎమ్యెల్యే ఒకరు బహిరంగంగా భగవద్గీతను అవమానించారు. ఎన్టీఆర్‌ జిల్లా నారికంపాడులో ఆలయానికి చెందిన 28 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించమని హైకోర్టు ఆదేశిస్తే, మొత్తం 1036 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం జిల్లా రిజిస్టార్‌కు లేఖ రాసింది. అంటే కోర్టు ఆదేశాన్ని చూపి, మొత్తం భూమిపై కన్నేసి.. అలా ఆలయ ఆస్తుల రిజిస్టర్‌లో ఇనాం, ఎస్టేట్‌ భూములని చూపి, దాన్ని స్వాహా చేయడానికి కుట్ర చేశారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు రూ.1000 కోట్లు.

    వైఎస్‌ జగన్‌ హయాంలో దేవాదాయశాఖలో సంస్కరణలు:
    వైఎస్‌ జగన్‌ హయాంలో ఆలయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తిరుమలలో శ్రీవాణి పథకం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటే.. దానిపైనా విమర్శలు చేసి ఆనేక ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ఎన్నికల ముందు రద్దు చేస్తామని ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే వీరు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలనే తేలింది. మరోవైపు చంద్రబాబు హయాంలో గతంలో విజయవాడలో కూలగొట్టిన ఆలయాలన్నింటినీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్మించారు. అసలైన హిందూ పరిరక్షకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు, లోకేష్‌ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు అని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్‌ వ్యక్తుల మనిషి అని చెప్పుకొచ్చారు.

    మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలి. పీపీపీ, పీ-4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా?. నాలుగో పీ అంటే పబ్లిక్‌ ప్రాపర్టీ ప్రైవేటు పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారు?. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్‌ ఏ మాత్రం సిగ్గు, ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.

    ఆసుపత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా సంతకాలు చేశారు. మీ టీడీపీ, జనసేన నేతలు కూడా సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చి దిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసేది?. వైద్యరంగాన్ని వ్యాపారస్తుల చేతితో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదు. ఆరోగ్యాన్ని, చదువును జగన్‌ బాధ్యతగా తీసుకున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఆసుపత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు?. బాబూ.. నీ వాళ్లకు దోచిపెట్టాలి అనుకుంటే పీపీపీ కింద కొత్త కాలేజీలు పెట్టు. 17 మెడికల్‌ కాలేజీలు ఆరు కోట్ల ఏపీ ప్రజల ఆస్తి. 17 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి వైఎస్‌ జగన్‌ నిర్మాణం చేపట్టారు. 17 కాలేజీల్లో నాలుగు కాలేజీలను వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు.

    ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాశనం చేశారు. ప్రజల హక్కుగా పొందాల్సిన వైద్యాన్ని దిగజార్చుతున్నారు. అన్నీ ప్రైవేటీకరిస్తే సీఎం పదవి ఎందుకు?. వైఎస్‌ జగన్‌ ప్రజల మనిషి.. చంద్రబాబు కార్పొరేట్‌ వ్యక్తుల మనిషి. ప్రశ్నిస్తానని ఓట్లు అడుక్కున్న పవన్‌ కల్యాణ్‌.. ఇంకా జగన్‌నే ప్రశ్నిస్తున్నారు. మెడికల్‌ కాలేజీలను తీసుకుని ఆ పాపం మోయకూడదు అనుకునే ఎవరూ తీసుకోవడం లేదు. మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కరు కూడా తీసుకుంటామని ముందుకు రావడం లేదు. ఆదోని మెడికల్‌ కాలేజీని కిమ్స్‌ తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రకటనను కిమ్స్‌ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే మెడికల్‌ కాలేజీలపై సిట్‌ వేస్తారు.

     

     

     అమరావతిలో వచ్చిన ప్రతీ టెండర్‌లో చంద్రబాబుకు నాలుగు శాతం కమీషన్‌ ఇస్తున్నారు. ప్రజల సొమ్మును హల్వా తింటున్నట్టు బాబు అండ్‌ కో తినేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు మాస్‌ దోపిడీ చేస్తున్నారు. అమరావతి అవినీతి సొమ్ముతో కడుపు నిండటం లేదా బాబూ?. దేశంలో ఎక్కడైనా 99 పైసలకు భూములు ఇస్తున్నారా?.. లేక తీసుకుంటున్నారా?. చంద్రబాబు తానా అనగానే ఎల్లో మీడియా తానా తందానా అంటుంది. తన ఆవేదన చెబుతూ అమరావతి రైతు రామారావు చనిపోయారు. 

    అమరావతి రైతుని ఈడ్చుకు వెళ్లమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనలేదా?. రాజధానికి భూములు ఇచ్చిన రైతులంటే ఎందుకు అంత చిన్నచూపు?. కూటమి పార్టీల కార్యకర్తల అరాచకాలు రాష్ట్రంలో పెరిగి పోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికార మందంతో విర్ర వీగుతున్నారు. రాజధాని రైతులపై పోలీసులను ఉసి గొల్పుతున్నారు. డబ్బు పిచ్చితో రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు. అమరావతి రైతులను రోడ్డు పాల్జేయవద్దు. కనకదుర్గమ్మ గుడికి బిల్ కట్టలేదని కరెంటు కట్ చేస్తారా?. బాలకృష్ణ అల్లుడి విద్యాసంస్థకు వందల కోట్ల  బిల్ పెండింగ్ ఉన్నా కరెంటు ఎందుకు కట్ చేయలేదు?. కనకదుర్గమ్మ గుడికి కరెంటు బిల్ మాఫీ చేస్తే వచ్చే నష్టం ఏంటి?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మెప్పు కోసం రకరకాల మాటలు  మాట్లాడుతుంటారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. 

Family

  • బరువు తగ్గేందుకు రకరకాల డైట్‌లు, వ్యాయామాల తోపాటు..డిటాక్స్‌ డ్రింక్‌లు తోడైతే మరింత త్వరితగతిన బరువు తగ్గుతాం. ఇవి మన ఇంట్లోదొరికే వాటితోనే సులభంగా తయరు చేసుకోవచ్చు కడా. కఠినమైన డైట్‌, వర్కౌట్ల కంటే..ఇలాంటి సింపుల్‌ చిట్కాలతో మరింత సులభంగా బరువు తగ్గిపోగలమని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తేలిక పాటి వర్కౌట్లు, చక్కటి ఆరోగ్యకరమైన డైట్‌ తోపాటు ఇలాంటి కొలెస్ట్రాల్‌ని తగ్గించే అద్భతమైన పానీయాలు త్వరితగతిన వెయిట్‌లాస్‌ అవ్వడంలో బాగా హెల్ప్‌అవుతాయట. నిశబ్దంగా వొంట్లో కొవ్వుని తగ్గించే ఆ గట్‌ రీసెంట్‌ డ్రింక్‌ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

    ఫిట్‌నెస్‌ కోచ్‌ నేహా పరిహార్‌ కేవలం 15 వారాలలో 22 కిలోల బరువు తగ్గారట. అందుకు ఈ గట్‌ రీసెట్‌ డ్రింక్‌ బాగా హెల్ప్‌ అయ్యిందట. ఇది మన ఇంట్లో దొరికే దేశీ వస్తువులతో తయారు చేసే సాధారణ దేశీ మిశ్రమ టానిక్‌గా చెబుతున్నారు నేహా. 

    అందుకు కావాలసినవి:
    అజ్వైన్ (వాము): 1 టేబుల్ స్పూన్ 
    సోంపు : 2 టేబుల్ స్పూన్లు 
    మెంతి గింజలు (మెంతి గింజలు): 1 టేబుల్ స్పూన్ 
    తాజాగా తురిమిన అల్లం: 1 టేబుల్ స్పూన్ 
    నీరు: 2.5 లీటర్ల

    తయారీ విధానం:
    నీటిలో వాము, సొంపు, మెంతి గింజలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత మంటను కాస్త తగ్గించిన అప్పుడే తురిమిన తాజా అల్లం వేసి కొద్దిసేపు మరగనివ్వండి.  ఆ తర్వాత వడకట్టి దానికి కొంచెం నిమ్మకాయ రసం జోడించి సేవించాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా 14 రోజుల చేసి చూస్తే..తప్పక మంచి ఫలితాన్ని అందుకుంటామని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ కోచ్‌ నేహా.

    కలిగే లాభాలు..
    నేహా ప్రకారం,కొలెస్ట్రాల్‌ని ఎలా కరిగిస్తుందంటే..

    • జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

    • అదనపు నీటి నిలుపుదలను బయటకు పంపిచేయడంలో సహాయపడుతుంది

    • ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుంది. 

    • జీవక్రియ పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది

    • పేగు మంటను శాంతపరుస్తుంది

    • చెడుకొలెస్ట్రాల్‌ని బయటకు పంపించేస్తుంది

    చివరగా ఈ పానీయం బరువు తగ్గేలా చేయదు, మన శరీర వ్యవస్థకు మద్దతు ఇచ్చి..ఆయా వ్యవస్థల పనితీరుని సమర్థవంతంగా ఉంచి..బరువుతగ్గేందుకు దారితీస్తుందని చెబుతోంది నేహా. దీంతోపాటు సమతుల్య భోజనం, తేలికపాటి వ్యాయామాలు, వేళ్లకు నిద్ర తోడైతే బరువు తగ్గడం మరింత సులభమని చెబుతోంది ఫిట్‌నెస్‌ కోచ్‌ నేహా. ఈ చిన్నపాటి సాధారణ మార్పులు చోటుచేసుకుంటే సత్ఫలితాలను త్వరితగతిన పొందుగలమని చెప్పుకొచ్చింది.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సూచనలు సలహాలు పాటించటం ఉత్తమం. 

     

    (చదవండి: సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్‌లెట్ వెనుక ఇంట్రస్టింగ్‌ స్టోరీ ఇదే..! అంత ఖరీదా..?)

     

  • హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్‌లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..

    శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

    ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
    మకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.

    ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..
    మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.

    మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలు

    సన్నిధానం

    పాండితావళం

    మాలికాపురం ప్రాంతం – అట్టతోడు

    నీలిమల

    పుల్మేడు

    శరణ్ గుత్తి

    మరకూట్టం

    భక్తులకు సూచనలు..
    మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. 

    కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.

    (చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!)

     

     

  • నిండా దుప్పటి ముసుగేసుకుని నిద్రలోకి జారుకోడానికి ఇష్టపడే పాత రోజులకు భిన్నంగా సూర్యోదయ కాంతిని ఆస్వాదించాలి అనుకుంటున్నారు నేటి తరం యువత. కురిసే మంచుకు చిక్కకుండా దాక్కునే ఒరవడికి భిన్నంగా మంచుకురిసే వేళ.. మెరిసే అందాలను వెతుక్కుంటున్నారు. ప్రతి చలికాలం కనిపించే ఈ సరదాలు.. సిసలైన చలిపులిని రుచి చూపిస్తున్న
    సీజన్‌లో సాహసికుల సరదాలు సిటీలో మరింత ఊపందుకున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వీక్షణకు కొండలు, గుట్టలమీదకు చేరుతున్నారు ఔత్సాహికులు. బ్రేక్‌ఫాస్ట్‌ టూర్స్‌ నుంచి బోన్‌ ఫైర్‌ వరకూ రెడీ అంటూ ఏడాదికి ఓసారి వచ్చే ఈ సీజన్‌లో అరుదుగా కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తున్నారు. 

    స్వభావరీత్యా హైదరాబాద్‌ నగరం చల్లగా ఉండే ప్రాంతం.. శతాబ్దాల క్రితం మన సిటీని వేసవి విడిదిగా కూడా ప్రముఖులు పరిగణించేవారనే విషయం తెలిసిందే. అయితే రాను రాను కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన నగరం తన అసలు స్వభావానికి దూరమైపోతోంది. అయితే ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయే శీతాకాలంలో మాత్రం సిటీ పరిసరాలు రెట్టింపు ఆకర్షణతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆ అందాలు ఆస్వాదించమంటూ సిటీజనులను ఆహ్వానిస్తున్నాయి. 

    సన్‌రైజ్‌.. సర్‌‘ప్రైజ్‌’
    పొగమంచుతో కూడిన ఉదయాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఈ సీజన్‌లో ఆకట్టుకునే సన్‌రైజ్‌లు వీక్షించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీని కోసం బద్ధకాన్ని పక్కనబెట్టి తెల్లవారుఝామున 5 గంటలకే నిద్రలేని పలు ప్రాంతాలకు పయనమవుతున్నారు. 

    అందమైన సూర్యోదయాల కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (కోకాపేట్‌/నార్సింగి) లతో పాటు మహేంద్ర హిల్స్, ఖాజాగూడ హిల్స్‌ (బౌల్డర్‌ హిల్స్‌), మౌలాలీ హిల్స్‌.. వంటి కొండ ప్రాంతాలకు అలాగే నీటిలో తేలియాడే సూర్య కిరణాలను వీక్షించేందుకు అమీన్‌పూర్‌ సరస్సు, గండిపేట (ఉస్మాన్‌ సాగర్‌) రాజేంద్రనగర్‌ సమీపంలోని పీరంచెరువు సరస్సు, కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు అనుకునేవారు పోచారం ఆనకట్ట/సరస్సును విహారాలకు విడిదిగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో, అద్భుతమైన సహజ కాంతి కోసం కోహెడ గుట్ట ఎక్కువ మంది ఛాయిస్‌. 

    వర్కవుట్‌.. ట్రెక్కింగ్‌ 
    శరీరం నిదానంగా కదులుతూ క్రమక్రమంగా చురుకుగా మారే వాతావరణ పరిస్థితుల్లో తక్కువ అలసట, ఎక్కువ సంతృప్తి అందిస్తుంది. అందుకే యువత క్రీడలు, ముఖ్యంగా తెల్లవారుజామున ట్రెక్కింగ్‌ ఎంచుకునేందుకు అనువైన సీజన్‌ ఇది. ‘హైదరాబాద్‌లోని ప్రకృతి అందాలను అన్వేషించడానికి శీతాకాలం ఉత్తమ సమయం. మేం ఈ సీజన్‌లో వికారాబాద్‌ లేదా నగర శివార్లలో ట్రెక్కింగ్‌కు వెళ్తాం. చల్లని వాతావరణం, మా శారీరక సామర్థ్యాన్ని సానపెడుతోంది.

    ఓ ఆరోగ్యకరమైన ఈవెంట్‌ను ఆస్వాదించేలా చేస్తుంది’ అని కళాశాల విద్యారి్థని దీపా సమిరవ్‌ దేశాయ్‌ అంటున్నారు. వ్యాయామాలు, ఆటలు కూడా సిటిజనుల సీజనల్‌ ఫన్‌లో భాగమే. ‘మా స్నేహితుల బృందం శీతాకాలపు ఉదయాలను ఎక్కువగా సద్వినియోగం చేసుకునేందుకు సైక్లింగ్‌కు వెళ్తాం.. అలాగే ప్రశాంతమైన  పరిసరాల్లో యోగా సాధన చేస్తాం.. దీని కోసం హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ వంటి ప్రాంతాలకు వెళతాం’ అని కార్పొరేట్‌ ఉద్యోగిని సోనియా గాలా చెబుతున్నారు. 

    బ్రేక్‌ ఫాస్ట్‌ టూర్స్‌ షురూ.. 
    ఈ సీజన్‌లో ఉదయాన్నే అల్పాహారపు వింటర్‌ టూర్స్‌ ఆస్వాదించే సమూహాలు కూడా ఉన్నాయి. అటువంటి క్లబ్‌ ది పొంగల్‌ గ్రూప్, ఇది ఈ సీజన్‌లో శాఖాహార అల్పాహారం కోసం బృందాలుగా బయటకు వెళుతుంది. సఫిల్‌గూడ నివాసి రాజేష్‌ కళ్యాణన్‌ మాట్లాడుతూ.. ‘మా బృందంలో చాలా మంది సభ్యులు ముఖ్యమైన సంస్థల్లో అధికారులు, కాబట్టి ఆదివారాలను విహారయాత్రల కోసం ప్రత్యేకిస్తాం. ఇతర శీతాకాలపు ఉదయాలు మాకు రైట్‌ టైమ్‌’ అని చెప్పారు.  

    సన్‌సెట్స్‌.. అదిరే స్పాట్స్‌
    సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాలు కూడా ఈ సీజన్‌లో కనువిందు చేస్తాయి. నగరం చుట్టుపక్కల అటువంటి అందమైన సూర్యాస్తమయాల కోసం మౌలాలీ హిల్స్, విస్పర్‌ వ్యాలీ, ట్యాంక్‌ బండ్, ఖాజాగూడ హిల్స్, బుద్ధ విహార్, బిర్లా మందిర్, ఉస్మాన్‌ సాగర్, కుతుబ్‌ షాహీ టూంబ్స్, గోల్కొండ కోట,  షామీర్‌పేట్‌ లేక్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్, లాస్ట్‌ హౌస్‌ కాఫీ, వంటి ప్రదేశాలు బాగా పేరొందాయి. నగరంలోని బైద బాటిల్‌ వంటి కేఫ్స్, ఆక్వా ది పార్క్‌ వంటి హోటల్స్‌ కూడా ప్రత్యేకంగా సన్‌ రైజ్, సన్‌సెట్స్‌ ఏర్పాట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.  

    సాహసాల సీజన్‌.. 
    ఈ సీజన్‌లో వారాంతాల్లో సాయంత్రం వేళ బహిరంగ సాహసాలకు కూడా డిమాండ్‌ పెరుగుతుంది. మన్నెగూడలోని డెక్కన్‌ ట్రైల్స్‌ మేనేజర్‌ ఫిలిప్‌ ప్రసాద్‌ ప్రకారం, ‘బోన్‌ ఫైర్లు, తెల్లవారుజామున ట్రెక్కింగ్, టెంట్లలో ఆకాశం కింద క్యాంపింగ్‌ చేయడానికి చాలా డిమాండ్‌ ఉంది. ఎక్కువ. వీటి కోసం వారాంతాల్లో కార్పొరేట్‌ బుకింగ్స్‌ ఎక్కువగా ఉంటాయి’ అని చెప్పారు.  

    (చదవండి:  వర్క్‌–లైఫ్‌'లలో ఏది ముఖ్యం? జెన్‌-జడ్‌ యువతరం ఏం అంటుందంటే..)

  • వైద్యరంగంలో ఏడాదికేడాదీ చాలా అభివృద్ధులను నమోదు చేస్తోంది. కొత్త కొత్త సాంకేతిక పరిణామాలను, సరికొత్త చికిత్స ప్రక్రియలను రూపొందించుకుంటోంది. కొన్ని పరిణామాలైతే మొత్తం హెల్త్‌ కేర్‌ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక జబ్బుకు అందరికీ ఒకే రకరమైన స్టాండర్డ్‌ చికిత్స నుంచి... మెల్లగా ఆయా వ్యక్తుల తాలూకు జన్యుస్వభావాలను బట్టి వ్యక్తిగతమైన (పర్సనలైజ్‌డ్‌) చికిత్స వరకు ఇలా రకరకాల మార్పులను నమోదు చేసుకుంటోంది. కొద్దిరోజుల్లోనే 2025 వెళ్లిపోయి... మనమంతా 2026లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హెల్త్‌ కేర్‌ రంగంలో నమోదైన కొన్ని మార్పులను పరిశీలిద్దాం...

    పర్సనల్‌ కేర్‌ కొల్హాపూర్‌ టు హిందుస్థాన్‌ యూనిలీవర్‌
    ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లగ్జరీ హౌజ్‌కు నాయకత్వం వహించడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఆ ఘనత సాధించి సత్తా చాటిన మహిళ...లీనా నాయర్‌. కొల్హాపూర్‌ నుండి లగ్జరీ హౌజ్‌ ‘చానల్‌’ నాయకత్వ బా«ధ్యతల వరకు లీనా నాయర్‌ ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. 

    ఇంజినీర్‌ నుండి హెచ్‌ఆర్‌ ప్రొషనల్‌గా మారింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌లో ఎన్నో అడ్డంకులు బద్దలు కొట్టి ఆ ప్రసిద్ధ సంస్థలో మొదటి మహిళా చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ అయింది. ‘ఛానల్‌’ గ్లోబల్‌ సీయివోగా లీనా నాయర్‌  36,000 మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తోంది. తన ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఈ సంవత్సరం కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌(సిబిఇ) అవార్డ్‌ అందుకుంది.

    కోట్లాది హృదయాలను గెలిచిన... హార్ట్‌ ల్యాంప్
    తన కథల సంకలనం ‘హార్ట్‌ ల్యాంప్‌’తో ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకుంది బాను ముస్తాక్‌. ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి కన్నడ రచయిత్రిగా చరిత్ర సృష్టించింది. 1990–2023 మధ్య ముస్తాక్‌ రాసిన ఈ కథలు దక్షిణ భారత ముస్లింల కష్టాలను హృద్యంగా ఆవిష్కరిస్తాయి. ప్రాంతీయ కథలకు విశ్వజనీనత ఉంటుంది’ అనే ముస్తాక్‌ నమ్మకాన్ని ‘హార్ట్‌ ల్యాంప్‌’ నిజం చేసింది.

    ముస్తాక్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఎనిమిదేళ్ల వయసులో ఆమెను ఒక కాన్వెంట్‌ స్కూల్‌లో చేర్పించాడు. అక్కడ బోధనా మాధ్యమం రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ. కన్నడ భాషలో అనర్ఘళంగా మాట్లాడడానికి ముస్తాక్‌ చాలా కష్టపడింది. ఆ అపరిచిత భాషనే తన సాహిత్య వ్యక్తీకరణగా చేసుకుంది.

    అత్యంత నిశితమైన వైద్య చికిత్సలు (ప్రెసిషన్‌ మెడిసిన్‌)...
    ఒక జబ్బుకు అందరికీ టోకుగా ఒకేలాంటి చికిత్స అందించడానికి బదులుగా ఆయా వ్యక్తి భౌలిక, మానసిక, జన్యుపరమైన స్వరూప స్వభావాలను బట్టి అతడికి మాత్రమే ఉద్దేశించిన చికిత్స అందించడాన్ని పర్సనలైజ్‌డ్‌ మెడిసిన్‌గా చెప్పవచ్చు. 

    అది ఆ వ్యక్తి జబ్బును బట్టి, దాని తీవ్రత ను బట్టి అలాగే అతడి జెనెటిక్స్, అతడుండే వాతావరణం (ఎన్విరాన్‌మెంట్‌), అతడి జీవనశైలి... ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తికే పూర్తిగా సరిపడేలా చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్నే అత్యంత నిశితమైన వైద్య చికిత్స అంటూ ద రాయల్‌ సొసైటీ ఆఫ్‌ థాయిల్యాండ్‌ పేర్కొంటోంది. ఈ రంగంలో ఈ ఏడాది గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.

    టెలీహెల్త్‌...
    నిజానికి టెలీహెల్త్‌ అనే కాన్సెప్ట్‌ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే మునుపు దీని పరిధి చాలా తక్కువ. ఉదాహరణకు హైదరాబాద్‌లో అత్యంత నిపుణులైన, అనుభవజ్ఞులైన  వైద్యులు ఉండవచ్చు. కానీ ఎక్కడో అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ఓ పల్లెలో ఒక తీవ్రమైన జబ్బు ఉన్న వ్యక్తికి అతడి సేవలు అవసరం. కేవలం టెలీహెల్త్‌ అనే కాన్సప్ట్‌లో మునుపు కేవలం బాధితులను టీవీ ద్వారా / తమ మొబైల్‌ ఫోన్లద్వారా లేదా పర్సనల్‌ కంప్యూటర్లకు అమర్చిన కెమెరాల ద్వారా  చూడటం, వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సకు అవసరమైన మందులను సూచించడం మాత్రమే జరిగేది. కోవిడ్‌–19 నేపథ్యంలో నేరుగా బాధితులను తాకడానికీ / లేదా వాళ్లను తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ తరహా టెలీమెడిసిన్‌ చికిత్సలు ఊపందుకున్నాయి. 

    అటు తర్వాత ఇలా రిమోట్‌గా ఉన్నవారికి సర్జరీలు చేయాల్సి వచ్చినప్పుడు... పెద్ద పెద్ద నగరాల్లోని నిపుణులైన సర్జన్‌లు ఎక్కడో సుదూరంగా ఉన్న చిన్న పట్టణాల్లోని పేషెంట్లకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్జరీలు విజయవంతంగా చేయడం సాధ్యమైంది. అందునా ఇటీవల భారతదేశంలో రోబోటిక్‌ సర్జరీ సహాయాలతో ఇలాంటి సర్జరీలు చేయడం మొదలైంది. ఇదెంత వరప్రదయని అంటే... ఏవైనా కారణాల వల్ల ఒక చిన్న పట్టణంలోకి పేషెంట్‌ను సుదూరంలోని పెద్ద నగరానికి తరలించడానికి వీల్లేని పరిస్థితుల్లో నగరాల్లోని అత్యంత నిపుణులైన డాక్టర్లూ తమ శస్త్రచికిత్స నైపుణ్యాలను అంతదూరంలోని పేషెంట్లకు అందజేయడానికి ఇప్పుడు వీలవుతోంది.

    ఉంగరాల్లాంటి ఉపకరణాలతో స్వీయ పరిశీలన...
    స్మార్ట్‌ వాచీల సహాయంతో తమ గుండె స్పందనలూ, రక్త΄ోటూ, ఎంతసేపు నిద్ర΄ోయామనే సమాచారం, తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ మేరకు నిద్రలోపించిందీ లేదా ఎక్కువ సేపు నిద్ర΄ోయారా అన్న విషయాలూ... ఇలాంటి స్వీయ ఆరోగ్య విషయాలను తెలుసుకునే ‘ఫిట్‌నెస్‌ ట్రాకర్లు’ వచ్చాయి. ఈ ఏడాది ఇది మరింత ముందుకు వెళ్లి... చిన్న ఉంగరంలాంటిది తొడగడం ద్వారా తమ రక్తంలోని చక్కెర మోతాదులు మొదలుకొని అనేక విషయాల్లో ఆరోగ్యసమాచారాలు తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యపడుతోంది. 

    ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ ఆరోగ్యస్పృహ బాగా పెరిగిన ఈ రోజుల్లో ట్రెండీగా ఉన్న ఈ ఉంగరాలను తొడగడం మామూలైంది. ఇవి... ఒకపక్క ఫ్యాషనబుల్‌గా ఉండటంతో పాటు ఇటు ఆరోగ్య సమాచారాలూ తెలుస్తుండటంతో ΄ాటు ఇంచుమించూ బంగారు ఉంగరం ధరతో సమానంగా ఉండటంతో ఇటీవల వీటిని ధరించి తమ ఆరోగ్య సమాచారాన్ని తామే తెలుసుకోవడం, అవసరమైనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వంటి సౌకర్యం ఉండటంతో వీటికి ప్రాచుర్యమూ పెరుగుతోంది.

    కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌తో వ్యాధి నిర్ధారణలు, చికిత్సలు...
    ఒక డాక్టర్‌ తన జీవితకాలంలో ఓ లక్ష కేసులు చూడగలడని అనుకుందాం. అంటే ఒక లక్షమంది పేషెంట్లను చూసిన చరిత్ర / దాఖలాను బట్టి అతడి అనుభవం ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి లక్షమంది అనుభవజ్ఞులైన డాక్టర్ల అనుభవాలన్నీ క్రోడీకరించి... ఆ అనుభవ సారాన్ని కృత్రిమమేధస్సుకు ఆపాదిస్తే? అలాగే ఆ అనుభవసారంతో విశ్లేషించాల్సిన విషయాలను ఓ యంత్రానికి (మెషిన్‌ లెర్నింగ్‌) నేర్పితే? ఇందువల్ల కోటానుకోట్ల కేసులను చూసిన అనుభవం ఒక యంత్రంలో నిక్షిప్తమై ఉంటుందనీ, దానివల్ల చాలా సంక్లిష్టమైన కేసులనూ సులువుగా విశ్లేషించగలగడం వల్ల పేషెంట్లకు ఎంతో  ప్రయోజనం చేకూరుతుందంటూ కొన్ని ప్రయోగ ఫలితాలు చెబుతున్నాయి. 

    అయితే దీనికి చాలా పరిమితులు ఉంటాయనీ, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ ఎప్పటికీ మానవ మేధస్సు తాలూకు విశ్లేషణలను సాధించలేదనేది చాలామంది అనుభవజ్ఞులైన డాక్టర్ల మాట. అయినప్పటికీ చాలాకేసుల్లో ఇప్పుడు పేషెంట్‌ తాలూకు ఆరోగ్య చర్రిత, రకరకాల రక్తపరీక్షలూ, మెడికల్‌ ఇమేజింగ్‌ పరిశీలనల ఆధారంగా రోగుల పరిస్థితిపై ఇప్పుడు ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌తో విశ్లేషణలు జరిపాక దాన్ని నిపుణులైన డాక్టర్లు తమ అనుభవంతో సరిపోల్చుకుని (కో రిలేట్‌ చేసుకుని) అత్యంత నిశితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స ప్రక్రియల నిర్ధారణ జరుపుతున్నారు.

    హోలిస్టిక్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ అప్రోచ్‌... 
    ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చిందనుకుందాం. అది కేవలం గుండెకు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. ఇటు రక్తప్రసరణ వ్యవస్థలోనూ, అటు ఊపిరితిత్తుల విషయంలోనూ... ఈ రెండే కాకుండా బ్రెయిన్‌కు సరఫరా అయ్యే రక్తం కారణంగా మెదడును ఇలా రకరకాల వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చు. అందుకే ఇటీవల వైద్య చికిత్సలు చేస్తున్న వివిధ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన నిపుణులు... అంటే కార్డియాలజీ, పల్మునాలజీ, న్యూరాలజీ... ఇలాంటి నిపుణలంతా సంయుక్తంగా తాము నిర్వహించాల్సిన చికిత్సలను సమన్వయ పరచాల్సి ఉంటుంది. 

    ఇలా వివిధ ఆరోగ్య వ్యవస్థలకే కాకుండా ఇటు శరీరక ఆరోగ్యం, అటు మానసిక ఆరోగ్యం, మరో వైపున ఆధ్యాత్మిక ఆరోగ్యం... ఇలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంటేనే ఓ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు చె΄్పాలనేది డబ్ల్యూహెచ్‌ఓ నిర్వచనం. అందువల్ల ఓ వ్యక్తి తాలూకు పూర్తి ఆరోగ్య పరిస్థితిని నిర్వహితమయ్యేలా చూడటమనే అంశం కూడా ఈ ఏడాది ప్రయత్నాల్లో ఒకటి.

    అడ్వాన్స్‌డ్‌ జీనోమిక్‌ రీసెర్చ్‌...
    ఒక వ్యక్తి తాలూకు జన్యుపరమైన అనారోగ్యాలకు అతడి జన్యువులు కూడా కారణమవుతాయి. కొందరిలో ఈ జన్యువుల్లో ఏదైనా తేడాలుంటే... చికిత్సకు సాధ్యం కాని సమస్యలూ, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలూ (కంజెనిటల్‌ డిసీజెస్‌), వైకల్యాలూ రావచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలకు చెడి΄ోయిన ఓ జన్యువు కారణమైనప్పుడు... నేరుగా ఆ జన్యువుకే చికిత్స అందించడం ద్వారా ఆ వైకల్యాన్ని తప్పించడం / నివారించడమనే అంశంపైన చికిత్స అందించేలా పరిశోధనలు జరుగుతున్నాయి. 

    ముందుగా పేర్కొన్న టోకు చికిత్స కాకుండా...  వ్యక్తిగత (పర్సనలైజ్‌డ్‌) చికిత్సకూ ఈ అడ్వాన్స్‌డ్‌ జీనోమిక్‌ చికిత్సలు తోడ్పడతాయి. ఈ రంగంలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి విజయవంతమైతే గతంలో నిర్వహణ (మేనేజ్‌మెంట్‌) తప్ప చికిత్స లేని చాలా జబ్బులకు విజయవంతమైన పూర్తి చికిత్స అందే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఈ అంశంపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. పురోగతి కూడా చాలావరకు కనిపించింది.

    నైతికాంశాలు, సదస్సులు...
    ఈ ఏడాది చోటు చేసుకున్న విప్లవాత్మకమైన పరిశోధనలూ, వైద్య చికిత్సలో, అందులోని పురోగతితో వాస్తవంగా పేషెంట్‌ ఎలాంటి చికిత్సలు ఎంతవరకు అవసరమో అంతే అందేలా, పేషెంట్‌ తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా... అలాగే అతడు సమాచార లోపానికీ, ఆర్థికంగా దోపిడికి గురికాకుండా చూసే నైతికాంశాలపై అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహితమయ్యాయి. 

    ఈ పురోగతి పేషెంట్‌కు భారం కాకుండా చూసేందుకు అవసరమైన చర్యలను ప్రస్తావిస్తూ... ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా నైతికవేత్తలు అనేకానేక ప్రస్తావనలూ, ప్రతిపాదనలూ తీసుకువస్తున్నారు. స్థూలంగా... ఈ ఏడాది 2025లో వైద్యరంగంలో చోటుచేసుకున్న పురోగతి, ఇంకా ఓ అసిధారావ్రతంలా కొనసాగుతున్న పరిశోధనల , సంక్షిప్త వివరాలివి.
    డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ 

    (చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..)

     

  • తల్లి ప్రేమకు మించిది ఏది లేదు. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అన్న ఆర్యోక్తి ఎప్పటికీ ప్రకాశంతంగా వెలుగుతుంటుంది. ముదుసలి వయసులో సైతం తన బిడ్డకు తానే ఏదో చేయాలని తప్పనపడుతుంటుంది. అందుకోసం ఎంతలా తల్లి కష్టపడేందుకైనా సిద్ధపడుతుంది అనేందుకు ఈ 91 ఏళ్ల తల్లే ఉదాహారణ. ఆ ముదసలి వయసులో కూడా కొడుకు కోసం తప్పన పడుతూ అల్లిన స్వెటర్‌లో ప్రతి అల్లికలో ఆమె ప్రేమ, కష్టం కనిపిస్తుంది. ఎంత ఖరీదైన స్వెటర్‌ కూడా ఈ అమ్మ అల్లిన స్వెటర్‌ ఇచ్చిన వెచ్చదనంతో సరితూగదు.

    సోషల్‌ మీడియోలో అరుణ్‌ భాగవతులు తన తల్లి అంతులేని ప్రేమకు నిదర్శనమైన ఓ సన్నివేశాన్ని షేర్‌ చేసుకున్నారు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అమ్మ ప్రేమ అనంతం అని కీర్తిస్తున్నారు. ఇంతకీ అతడు పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..అరుణ్‌ భాగవుతుల తల్లి 91 ఏళ్ల వయసులో మంచానికే పరిమితమై ఉందామె. 

    అయినా తన కొడుక్కు తన చేతనైనది ఏదో ఒక గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంది. అందుకోసం తన చేత్తో తానే స్వయంగా స్వెటర్‌ అల్లాలనుకుంది. అలా మంచం మీద స్వెటర్‌ కుట్టేందుకు రెడీ అయ్యింది. చేతులు నొప్పి పుట్టినప్పుడల్లా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని అల్లడం ప్రారంభించేది. కొడుకు మీద ఉన్న ప్రేమ అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టేలా చేసింది. అయితే ఈ వయసులో ఇదంతా ఎందుకు అని కొడుకు వారించిన వినలేదామె. 

    అయితే ఆమె మందుగా పైభాగాంలోని మెడ భాగాన్ని పూర్తిచేసింది. ఒక్కసారి ధరించి చూసి..సరిపోయిందో లేదో చెప్పమంది. అయితే అరుణ్‌ దాన్ని వేసుకుని చూసి..కొంచెం పొడవు చేయమని సూచించాను. అందుకోసం అల్లిందంతా విప్పేయాల్సి వస్తుందని తెలియదు. అయితే తన తల్లి ఒక మాటకూడా మారుమాట్లాడకుండా కామ్‌గా అంత విప్పేసి కుట్టింది. నడుము కొలత కాకుండా ఛాలికొలత తీసుకుని కుట్టడంతో కాస్త టైట్‌ అయ్యిందని వివరించాడు అరుణ్‌. 

    అయితే ఆమె ముందు వెనుక భాగాలు అల్లడం పూర్తయ్యాక.. మరోసారి అది సరిపోయిందో లేదో చూడమని కోరగా..అప్పుడు ముందు భాగానికి, వెనుక భాగానికి, ఆరు అంగుళాలు ఖాళీ ఉంది. దాంతో ఆమె షాక్‌ అయ్యింది. అయినా సరే ఏదో రకంగా తన తల్లి స్వెట్టర్‌ని పూర్తిచేసి మళ్లీ ఇచ్చారట చూడమని. ఈసారి అది కాస్తా సరిపోయినా..పొట్టైందట. అయితే ఈసారి మార్పులు చేర్పులు గురించి చెప్పబుద్దిగాక, ఊరుకున్నానని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ స్వెట్టర్ పొట్టిగా ఉందేమో..ఆమె ప్రేమ మాత్రం చిన్నది కాదు అని షేర్‌ చేయడం నెటిజన్లు మనసును హత్తుకుంది. బ్రాండెడ్‌ స్వెటర్లలో అత్యంత అమూల్యమైన స్వెటర్‌ అని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. 
     

  • బాలీవుడ్‌ ప్రముఖ‌ నటుడు భాయిజాన్‌ సల్మాన్‌ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండల వీరుడు సల్మాన్‌కి ఎంతలా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో తెలిసిందే. 60లలో సైతం యువ హీరోలను కూడా వెనక్కి నెట్టి తన హ్యాండ్‌సమ్‌ లుక్, వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు బాయిజాన్‌. ఆయనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిని, కుతుహలాన్ని రేకెత్తిస్తుంటుంది. 

    తాజాగా ఆయన చేతికుండే వెండి బ్రాస్‌లెట్‌ గురించే అందరి అటెన్షన్‌. అది సాధారణ బ్రాస్‌లెట్‌లా కాకుండా ఒక రత్నంతో చాలా పెద్ద బ్రాసెలెట్‌. అంద పెద్దిది బాయిజాన్‌ ఎందుకు ధరిస్తారు అనేది అందరి మదిని తొలిచ్చే సందేహం ఇది. దీని వెనుకున్న కథను సల్మానే స్వయంగా వివరించి అభిమానుల అనుమానాలకు చెక్‌పెట్టారు. అంతేగాదండోయ్‌ దాని ధర, ప్రాముఖ్యత రెండు అత్యంత స్పెషాల్టీనే. 

    సికిందర్‌ భాయ్‌గా పిలిచే మన సల్లూ భాయ్‌ చేతికి ఉండే వెండి బ్రాస్‌లెట్‌ని ఎట్టిసమయంలో  స్కిప్‌ చేయరు. ప్రతి ఫంగ్షన్‌లో ఆయన చేతికి అది తప్పనిసరిగా ఉంటుంది. బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా ఉన్నప్పుడూ, పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడూ ఎప్పుడు దాన్ని అస్సులు బయటకు తీయడు. 

    దబాంగ్‌ వంటి చిత్రాల షూటింగ్‌ సమయంలో మాత్రమే దాన్ని ధరించలేదు. ఆ మూవీ క్యారెక్టర్‌కి నప్పదు కాబట్లి సల్లూభాయ్‌కి తీయక తప్పలేదు. దీన్ని ఐకానిక్‌ ఫిరోజా బ్రాస్‌లెట్గా పిలుస్తారట. దీని ధర దగ్గర దగ్గర రూ. 80,000/- పైనే పలుకుతుందట.

    అదంటే ఎందుకంత ఇష్టం..
    సల్మాన్‌కి ఆ బ్రాస్‌లెట్‌ అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి. దానిని మణిక్టు నుంచి తీయడం అత్యంత అరుదు. ఇది సుల్తాన్‌ నటుడు సల్మాన్‌ తండ్రి సలీంఖాన్‌ వద్ది ఇదే బ్రాస్‌లెట్‌ ఉండేది. తాను చిన్నప్పుడు దానితో ఆడుకునేవాడినని పంచుకున్నారు. అయితే తాను సినీఫీల్డ్‌లోకి వచ్చినప్పుడూ అచ్చం అలాంటి బ్రాస్‌లెట్‌నే బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. 

    ఈ రాయిని ఫిరోజా అంటారు. దీనిని సజీవరాయిగా పిలుస్తారు. అయితే సల్మాన్‌ దీన్ని ఫ్యాషన్‌ కోసం కాదు, ప్రశాంతత, ఆశావాద దృక్పథన్ని ఇచ్చే సెంటిమెంట్‌ బ్రాస్‌లెట్‌గా విశ్వసిస్తాడు. అందువల్లే మన సల్లుభాయ్‌ చేతికి ఆ బ్రాస్‌లేకుండా అస్సలు కనిపించడు. 

    స్పెషాల్టీ ఏంటంటే..
    మనపై వచ్చే ప్రతికూలతలను ఇది గ్రహిస్తుంది. ఆ తర్వాత ఇది పగిలిపోవడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు ఏడు రాళ్లు మార్చినట్లు సల్మాన్‌ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఇది ఆకాశ నీలం-ఆకుపచ్చ షేడ్‌లలో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు.

     

    (చదవండి: ధురంధర్‌ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్‌ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?)

     

Yadadri

  • సరికొ

    మూడు రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చిన్నాపెద్దా సిద్ధమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లోని యువకులు గ్రూపులుగా ఏర్పడి విందు, మందు, వినోదం ఉండేలా వేడుకలను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

    స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 31వ తేదీ రాత్రి కేక్‌ కట్‌ చేసి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు.

    ఇయర్‌ ఎండ్‌ వేడుకలకు సిద్ధమవుతున్న యువత

    పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్‌

    ప్రకృతి ఒడిలో ఎంజాయ్‌ చేసేందుకు కొందరి ఆసక్తి

    ఫామ్‌హౌస్‌లలో విందు, వినోదాలకు ప్రణాళిక

    ‘మ్యూజికల్‌ నైట్స్‌’ నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు

    భువనగిరిటౌన్‌, సూర్యాపేట టౌన్‌, రామగిరి(నల్లగొండ) : 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికే సమయం దగ్గర పడింది. ఆట పాటలతో ఉత్సాహంగా న్యూ ఇయర్‌ వేడుకలు జరిపేందుకు యువత ప్రణాళికలు వేసుకుంటోంది. అందుకు అనుగుణంగా ఆయా వ్యాపార సంస్థలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి.

    కొత్త సంవత్సరంలో యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకునే యోచనలో ఉన్నారు. కొందరు యువకులు గోవా, వైజాగ్‌, అరకుతోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. మరికొందరు హైదరాబాద్‌ శివారులోని ప్రముఖ హోటళ్లు, రిసార్ట్స్‌, పబ్‌లలో గడిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు, వ్యాపారులు తమ కుటుంబంతో కలిసి రిసార్ట్స్‌లో వేడుకలు జరుపుకునేందుకు ఈ నెల 31న ఉదయమే హైదరాబాద్‌ వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారు.

    మారుతున్న కాలానికి అనుగుణంగా యువకులు పల్లె వాతావరణాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. పట్టణాలు, గ్రామాల సమీపంలోని తోటల్లో న్యూఇయర్‌ వేడుకలకు జరుపుకునేందుకు యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తుండగా.. ఇప్పుడు ట్రెండ్‌ మార్చుకుని స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా వంటకాలు చేసుకుని పల్లె పదాలు పాడుకుంటూ ఎంజాయ్‌ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాటి కల్లు తీసుకుని.. కుండ చికెన్‌, వివిధ మాసాంహార వంటలు, రొట్టెలు స్వయంగా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

    ప్రతి ఏడాది 31 రోజు వినియోగదారులను ఆకర్షించేందుకు పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఆఫర్లు పెడుతుంటారు. హోటళ్ల ఎదుట పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యామిలీ ప్యాక్‌ బిర్యానీ తీసుకుంటే కిలో కేక్‌.. కిలో కేక్‌ తీసుకుంటే లీటరు కూల్‌ డ్రింక్‌ ఇలా ఆఫర్లు పెడుతూ బేకరీలు, హోటళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

    యువత అభిరుచికి అనుగుణంగా పలు ప్రాంతాల్లో మ్యూజికల్‌ నైట్స్‌ నిర్వహిస్తున్నారు. 31వ తేదీన నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్‌లో మ్యూజికల్‌ నైట్‌ ఏర్పాటు చేశారు. ఇక, నల్లగొండ పట్టణం సమీపంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో న్యూ ఇయర్‌ నైట్‌ పార్టీకి ఏర్పాట్లు చేశారు. పార్టీకి హాజరయ్యే సింగిల్‌, జంటలకు

    ఎంట్రీ ఫీజు వసూలు చేయనున్నారు.

  • పత్తి

    పత్తికి ఆదిలోనే ఇబ్బందులు

    ఎన్నో ఆశలతో వానాకాలం సేద్యాన్ని ప్రారంభించిన రైతులకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలకరి వానలకు విత్తిన పత్తి విత్తనాలు.. వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలోనే మాడిపోయాయి. దీంతో ఒకటి, రెండుసార్లు విత్తాల్సి వచ్చింది. తీరా పంట చేతికి వచ్చాక కురిసిన భారీ వర్షాలు రైతులు పూర్తిగా నష్టపోయాడు. ఇక వరి సాగు గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ మెరుగైన దిగుబడులతో రైతన్న గట్టెక్కాడు.

    వడ్ల అమ్మకాలకు అవస్థలు

    ఎప్పటిమాదిరిగానే ఈసారి వానాకాలం ధాన్యం అమ్మకాలకు రైతులు అవస్థలు పడ్డారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వల్ల తక్కువ ధరకు ప్రైవేట్‌కు అమ్ముకున్నారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగైంది. 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 3.14 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

    అధికంగా దొడ్డు రకం వరి సాగు

    సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్‌ ప్రకటించినప్పటికీ రైతులు ఆసక్తి చూపలేదు. మూసీ నీరు సన్నాల సాగుకు అనుకూలం కాకపోవడం, వర్షాలు కురిస్తే నూక ఎక్కువగా వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపారు. 2,98,885 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఇందులో దొడ్డురకం 2.75 లక్షలు, సన్నాలు 23 వేల ఎకరాల్లో సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్‌న్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. అందులో దొడ్డురకం 3.15 లక్షల మెట్రిక్‌ టన్నులు, 9,267 మెట్రిక్‌ టన్నులు సన్నరకం వడ్లు కొనుగోలు చేశారు. 48,099 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలుచేశారు.

    అందుబాటులోకి కొత్త వంగడాలు

    మూసీ కాలుష్య జలాలు, నదీ పరీవాహకంలోని వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సంప్రదాయ రకాలకు బదులుగా హైబ్రిడ్‌ విత్తనాలు వచ్చాయి. ఇవి చీడపీడలను తట్టుకొని, గింజ బరువు కలిగి అధిక దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు గరిష్టంగా 35 నుంచి 40 క్వింటాళ్ల (83 నుంచి 100 బస్తాలు) దిగుబడి వచ్చింది.

    యూరియా కొరత

    యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు. రోజుల తరబడి పీఏసీఎస్‌ కార్యాలయాలకు తిరి గారు. కాంప్లెక్స్‌ ఎరువుల కొరత ఏర్పడింది.

    యాప్‌పై అవగాహన లేమి

    సీజన్‌ ప్రారంభంలో అనావృష్టి, పంట చేతికొచ్చి న సమయంలో అతివృష్టి కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయాడు. అధిక వర్షాల వల్ల పూత, పింజ రాలిపోవడంతో పాటు, చివరి సమయంలో మెంథా తుపాను మరింత దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా 68,670 మంది రైతులు 1.34 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అరకొరగా చేతికొచ్చిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన కపాస్‌ కిసాన్‌ యాప్‌పై రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో దళారులకు అమ్ముకున్నారు. కొందరు రైతులు నేరుగా కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని వెళ్లగా.. కొర్రీలు పెట్టి మద్దతు ధర ఇవ్వలేదు.

    పెట్టుబడి ఖర్చులు వెళ్లలేదు

    ఆరు ఎకరాలు పత్తి సాగు చేశా. రూ.2.50 లక్షలు ఖర్చు వచ్చింది. వర్షాలు కురిసిన సమయంలో కూలీలు రాలేదు. చాలా వరకు పత్తి నేలపాలైంది. కేవలం 34 కింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా రూ.6300కి విక్రయించాను. మద్దతు ధర రూ.10వేలు ఉంటే మేలు జరిగేది.

    – తండ జంగయ్య, జనగాం,

    సంస్థాన్‌నారాయణపురం మండలం

    2025 సంవత్సరంలో వ్యవసాయం ఒడిదుడుకులతో సాగింది. వరి పర్వాలేదనిపించగా, పత్తి నిండా ముంచింది. పంట చేతికొచ్చిన సమయంలో వరుస వర్షాలు, మెంథా తుపాను పత్తి రైతును కోలుకోకుండా చేసింది. పెట్టుబడి కూడా వెళ్లక అప్పుల పాలయ్యారు. వరి మెరుగైన దిగుబడి రావడం అన్నదాతకు కాస్త ఊరటనిచ్చింది.

    – సాక్షి,యాదాద్రి

  • మున్సిపోల్స్‌కు రెడీ..!

    సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందని భావించినా వా టిని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు వివిధ పథకాల కింద గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాబట్టుకునేందుకు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనుంది. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఆయా మున్సిపాలిటీల వారీ గా ఇప్పటివరకు ఉన్న ఓటరు జాబితాలను తీసుకుంది. ఎప్పుడు షెడ్యూలు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చింది.

    పదవీ కాలం ముగిసి 11 నెలలు..

    ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం ముగిసి 11 నెలలు దాటింది. 2020 జనవరి 22వ తేదీన మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. 25వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అదే నెల 28వ తేదీన పాలకవర్గాలు కొలువుదీరాయి. వాటి పదవీ కాలం ఈ ఏడాది జనవరిలో 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాలిటీల్లో నిధుల సమస్య తప్పడం లేదు. మున్సిపాలిటీలకు 40:30:30 నిష్పత్తిలో ‘అమృత్‌ 2.0’ వంటి పథకాల కింద రావాల్సిన గ్రాంటు, ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. దీంతో ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణంగా పాలక వర్గాలు ఉంటే వారు ప్రభుత్వాన్ని సంప్రదించి కావాల్సిన నిధులను తెచ్చుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వారి నిధులను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఆ తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

    పునర్విభజన లేకపోతే

    జనవరిలోనే షెడ్యూల్‌

    ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభభజన చేసి 2020 జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన చేస్తుందా? లేదా? అన్న తేలాల్సి ఉంది. ఒకవేళ వార్డుల పునర్విభజన చేయకపోతే జనవరి రెండో వారం లేదంటే మూడో వారంలో షెడ్యూలు జారీచేసే అవకాశం ఉంది. పునర్విభజన చేస్తే కనుక ఫిబ్రవరిలో షెడ్యూలును జారీ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈలోగా ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అధికార పార్టీ.. ఇప్పుడే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవచ్చని కూడా భావిస్తోంది.

    ఫ మున్సిపాలిటీ ఎన్నికలకు

    ప్రభుత్వం కసరత్తు

    ఫ ముందుగా మున్సిపాలిటీ..

    ఆ తరువాతే పరిషత్‌ ఎన్నికలు!

    ఫ కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం

    మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి

    ఫ ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలు

    ఉమ్మడి జల్లాలోని 19 మున్సిపాలిటీల పరిధిలో గతంలో జరిగిన ఎన్నికల ప్రకారం 6,57,901 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 3,11,120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1,52,290 మంది ఉండగా, పురుషులు 1,58,827 మంది, ట్రాన్స్‌జెండర్లు ముగ్గురు ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం ఓటర్లు 2,14,490 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,04,075 మంది, మహిళలు 1,10,414 మంది, ట్రాన్స్‌జెండర్లు ఒకరు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,30,578 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 63,187 మంది ఉండగా, మహిళలు 67,373 మంది, ట్రాన్స్‌జెండర్లు 18 మంది ఉన్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదు, సవరణ ద్వారా వారి సంఖ్య భారీగా పెరుగుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

    ఆలేరు 6,624 6,902 0 13,526

    భువనగిరి 28,560 24,836 1 53,397

    చౌటుప్పల్‌ 6,689 13,593 0 20,282

    మోత్కూర్‌ 7,740 7,300 0 15,040

    పోచంపల్లి 6,943 7,923 0 14,866

    యాదగిరిగుట్ట 6,631 6,819 17 13,467

  • నేడు

    వలిగొండ : రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం వలిగొండకు రానున్నారు. వలిగొండ నుంచి కాటేపల్లి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించనున్నారు. అదే విధంగా నూతన సర్పంచులు, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొంటారని, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

    తల్లిదండ్రులను

    విస్మరించొద్దు

    చౌటుప్పల్‌ : ఆస్తులను పంచుకోవడమే కాదు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను బాగోగులను పట్టించుకోవాలని వయోవృద్ధుల పోషణ, సంరక్షణ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ వెల్మ శేఖర్‌రెడ్డి సూచించారు. ట్రిబ్యునల్‌లో బాధితులు అందజేసిన పిటిషన్లపై శనివారం ఇరువర్గాలను పిలిచి విచారణ చేశారు. ఆస్తులను పంచుకొని, చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించడం బాధాకరమన్నారు. కన్నబిడ్డలపై తల్లిదండ్రులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే పరిస్థితి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ట్రిబ్యునల్‌ ఆదేశాలను పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిబ్యునల్‌ మెంబర్‌, సీనియర్‌ న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్‌ అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు.

    యాదగిరీశుడికి

    నిత్యారాధనలు

    యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజా మున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం పాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర వేడుకలను నేత్రపర్వంగా చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండిజోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. పాతగుట్ట ఆలయంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి, పారాయణికులు పాశురాలు పఠించారు.

  • భక్తు

    యాదగిరిగుట్ట: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరిగుట్ట క్షేత్రంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఈఓ వెంకట్రావ్‌తో కలిసి డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌ పరిశీలించారు. క్యూలైన్లు, దర్శనం, భద్రత తదితర అంశాలపై చర్చించారు. భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ, ఈఓ తెలిపారు. అదే విధంగా భక్తులను, భక్తుల బ్యాగులను తనిఖీ చేయడానికి ఏర్పాటు చేసిన బ్యాగేజీ స్కానర్‌ను ట్రయల్‌రన్‌ చేసి పరిశీలించారు. కార్య క్రమంలో ఏసీపీ శ్రీనివాసనాయుడు, డిప్యూటీ ఈఓ భాస్కరశర్మ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దయాకర్‌రెడ్డి, సీఐ భాస్కర్‌, ఆర్‌ఐ శేషగిరిరావు పాల్గొన్నారు.

  • రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ల తనిఖీ

    భువనగిరి : బీబీనగర్‌–మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ సెక్షన్‌లో గేట్‌ నంబర్‌ 17, 20–ఈ వద్ద రైల్వే లెవల్‌ క్రాసింగ్‌లను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ శ్రీ వాస్తవ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.గేట్‌ బూమ్‌, రికార్డులు, భద్రతా పరికరాల పనితీరును పరిశీలించారు. గేట్‌మన్లతో మాట్లాడి క్రాసింగ్‌ల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అలాగే ట్రాక్‌మన్లతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. రైళ్లు సురక్షింతంగా రాకపోకలు సాగించడంలో ట్రాక్‌మన్లు, గేట్‌మన్ల పాత్ర కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని వారికి సూచించారు. రైళ్లు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తున్న పలువురు గేట్‌మన్లు, పెంట్రోలింగ్‌ మన్లను అభినందించి, వారికి నగుదు బహుమతి ప్రకటించారు. ఆయన వెంట సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ గోపాల్‌ కృష్ణన్‌, ఇతర అధికారులు ఉన్నారు.

  • జిల్ల

    చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాండునాయక్‌తో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్‌ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    తేది. 29.12.2025 సోమవారంసమయం : ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు

    ఫోన్‌ చేయాల్సిన నంబర్‌ :

    9848047492

  • శ్రీశైలానికి ఐదో ట్రిప్పు

    నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) నిర్వహిస్తున్న లాంచీ సేవలు కొనసాగుతున్నాయి. నవంబర్‌ 28న సాగర్‌–శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని టూరిజం శాఖ ప్రారంభించింది. శనివారం ఐదో ట్రిప్పులో 120 మందితో లాంచీ శ్రీశైలానికి బయల్దేరింది. ఈ ప్రయాణానికి పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐదో ట్రిప్పులో సీనియర్‌ జర్నలిస్టు, సాక్షి దినపత్రిక మాజీ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. సాగర్‌ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లాంచీ ట్రిప్‌ కొనసాగించే అవకాశం ఉన్నట్లు టూరిజం అధికారులు వెల్లడించారు.

  • మూగజీవాలకు షుగర్‌ పరీక్షలు

    కోదాడరూరల్‌ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో సూర్యాపేట జిల్లాలోనే మొదటగా జంతువులకు షుగర్‌ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్‌ పెంటయ్య. శనివారం కుక్కలు, పలు పశువులకు షుగర్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను రాసిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చిలుకూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన పెంపుడు కుక్క షుగర్‌ వ్యాధి లక్షణాలతో మృతిచెందిదని అన్నారు. జంవుతులకు షుగర్‌ పరీక్షలు చేసే పరికరాలు ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని గన్నవరంలోనే ఉన్నాయని, దీంతో పశుపోషకులు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి స్థానిక పశువైద్యశాలలోనే షుగర్‌ పరీక్ష కిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓ వెటర్నరీ ఫార్మా కంపెనీ సహాయంతో షుగర్‌ పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్‌, హరికృష్ణ ఉన్నారు.

    కోదాడ పశువైద్యశాలలో ప్రారంభం

  • పట్టు

    నకిరేకల్‌ : తాటి గీతకు చిన్నప్పటి నుంచి నటన అంటే ప్రాణం. ఇంటర్‌ పూర్తికాగానే తల్లిదండ్రులు గీతకు పెళ్లి చేశారు. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. భర్త సైదులు దివ్యాంగుడు. పేద కుటుంబం కావడంతో భర్త సహాయంతో నకిరేకల్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా తోపుడు బండిపై నిత్యం ఇడ్లీలు, టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలోనే గీత ఓపెన్‌లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. కళలు, నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న గీత ఎన్నోసార్లు జిల్లాస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు సాధించింది. అంతేకాకుండా ఇళ్లలో వాడి పడేసిన నిరుపయోగ వస్తువులతో అందమైన కళాకృతులను చేయడం హాబీగా మార్చుకుంది.

    టీవీ సీరియల్స్‌, సినిమాల్లో కూడా..

    గత ఆరేళ్లుగా ఎంతో కష్టపడిన గీత ఈ టీవీలో ప్రసారమయ్యే అభిరుచి కార్యక్రమంలో, మరొక టీవీ నిర్వహించిన బీ ఏ స్టార్‌ కార్యక్రమంలో తొలిసారి బుల్లితెరపై కనిపించారు. అంతేకాకుండా ఈ టీవీలో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్‌లో డాక్టర్‌గా, నాలుగు స్తంభాలాట సీరియల్‌లో గృహిణిగా, బమ్‌చిక్‌ బమ్‌లో అత్త పాత్రలో, మా టీవీలో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్‌లో కళాశాల ప్రిన్సిపాల్‌గా, గృహప్రవేశం సీరియల్‌లో ధనవంతురాలైన గృహిణి పాత్రలో, జీ టీవీలో వచ్చే నిన్నే పెళ్లాడుతా సీరియల్‌లోనూ నటించింది. గీత నటి ంచిన నేతన్న పాటను యూట్యూబ్‌లో లక్షల మంది వీక్షించారు. చదువెందుకు అబ్బినది, కేసీఆర్‌ కథాగానం, నందనం, శిఖరం, శానాబాగుంది వంటి యూట్యూబ్‌ పాటల్లోనూ గీత నటించారు. అదేవిధంగా తమాసోమా జ్యోతిర్గమయ సినిమాలో, వరుణ్‌ సందేశ్‌ నటించిన యాద్బావం తద్బవతి సినిమాలో తల్లి పాత్రలో నటించింది. రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాలో హీరోయిన్‌ పక్కన ఓ క్యారెక్టర్‌లో నటించింది. గాడ్‌, లగ్గం, ప్రేమ విమానం, గేమ్‌ ఛేంజర్‌, మహర్షి, భగవంత్‌ కేసరి, ఘాటీ, భీమదేవరపల్లి బ్రాంచి, ట్రెండింగ్‌ లవ్‌, పైలం పిల్లగా, అట్లాస్‌ సైకిల్‌, కాటి తదితర సినిమాలతో పాటు 5 యూట్యూబ్‌ సాంగ్స్‌, 20 షార్ట్‌ ఫిల్మ్స్‌, 10 డెమో ఫిల్మ్స్‌, 4 ఫీచర్‌ ఫిల్మ్స్‌, 3 ఇండిపెండెంట్‌ సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది.

    నా ప్రత్యేకత ఏంటో చూపిస్తున్నా

    తోపుడు బండిపై ఇడ్లీలు అమ్ముకునే నన్ను చాలామంది చుల కనగా చిన్నచూపుతో చూశారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. నటనపై ఉన్న ఆసక్తితో ఎలాగైనా సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలని 12ఏళ్ల నుంచి కృషి చేస్తున్నాను. ఇప్పడు నా ప్రత్యేకత ఎంటో చూపిస్తున్నా. మహిళలను చిన్నచూపు చూడకుండా, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే సత్తా చాటుతారని చాటి చెప్పడమే నా లక్ష్యం. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే ధ్యేయంతో కృషిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగల్గుతారు. – తాటి గీత

    సినిమా అనే రంగుల ప్రపంచం చాలా మందిని ఆకర్షిస్తుంది. ఎంతో మంది తమను తాము వెండితెరపై చూసుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొందరికే సక్సెస్‌ లభిస్తుంది. సినిమాల్లో రాణించాలంటే

    టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణానికి చెందిన తాటి గీత కూడా కుటుంబ పోషణ కోసం

    ఇడ్లీ బండి నడుపుతూనే.. వెండితెరపై నటించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సీరియల్స్‌, సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్స్‌లో ఆమె కనిపించింది.

    బుల్లితెర, వెండితెరపై రాణిస్తున్న

    నకిరేకల్‌కు చెందిన మహిళ

    కుటుంబ పోషణ కోసం

    ఇడ్లీ బండి నడిపిస్తూ..

    పలు సినిమాలు, సీరియల్స్‌లో

    నటించడంతో మంచి గుర్తింపు

  • కృష్ణ

    అడవిదేవులపల్లి : కృష్ణపట్టెలో మొసళ్లు, కొండచిలువలు, పాములు సంచరిస్తుండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. రెండేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో మొసళ్లు జనావాసాల్లో పట్టుబడ్డాయి. పదుల సంఖ్యల్లో కొండచిలువలు, పాములు గ్రామస్తుల చేతిలో హతమయ్యాయి. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి అడవిదేవులపల్లిలోని టెయిల్‌పాండ్‌ వరకు 21 కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుంది. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నుంచి టెయిల్‌పాండ్‌ వరకు కూడా నీరు నిల్వ ఉంటుండడంతో మొసళ్లకు ఆవాసంగా మారింది. దీంతో ఆహారం కోసం కృష్ణపట్టెలోని సమీప గ్రామాల్లోకి రాత్రివేళ మొసళ్లు వస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటి వేళ సైతం ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని నడిగడ్డ, చిట్యాల గ్రామాల్లో ఈ మొసళ్ల సమస్య అధికంగా ఉంది. ఇటీవల కాలంలో నడిగడ్డ గ్రామంలోకి మొసళ్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా చిట్యాల గ్రామంలో నది వద్ద నీరు తాగుతున్న మేకపోతును మొసలి తినేసింది. కాగా నది తీరంలో మనుషులు, పశువులు, మూగజీవాలు నీరు తాగే ప్రాంతాల్లోనే మొసళ్లు మాటు వేస్తున్నాయి. కృష్ణాతీరంలోని అడవిదేవులపల్లి, నడిగడ్డ, చిట్యాల, ముదిమాణిక్యం, ఇర్కిగూడెంతో పాటు వాడపల్లి, మఠంపల్లి పుణ్యక్షేత్రాల వద్ద నదిలోకి దిగి స్నానాలు చేసేటప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

    గ్రామాల్లోకి వస్తున్న

    జలచరాలు, పాములు

    రాత్రివేళ బయటకు వెళ్లాలంటనే

    జంకుతున్న ప్రజలు

    అధికారులు రక్షణ చర్యలు

    చేపట్టాలని వేడుకోలు

    మొసళ్ల బారి నుంచి కాపాడాలి

    గ్రామాల్లోకి నిత్యంమొసళ్లు, పాములు వస్తున్నాయి. టెయిల్‌పాండ్‌ బ్యాక్‌ వాటర్‌ వలన గ్రామానికి ఇరువైపులా నీరు రావడంతో విషపు పురుగుల బెడద ఎక్కువైంది. అధికారులు స్పందించి మొసళ్ల బారి నుంచి కాపాడాలి. గ్రామం చుట్టూ రక్షణ కవచంలా కంచె ఏర్పాటు చేయాలి.

    – రామానుంజనేయులు,

    చిట్యాల గ్రామం, అడవిదేవులపల్లి

  • రోడ్డ

    మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లికి చెందిన కొండ నాగరాజు(35), మిర్యాలగూడకు చెందిన నరేందర్‌ తమ ద్విచక్ర వాహనాలపై మాడుగులపల్లి మండల కేంద్రంలో యూటర్న్‌ తీసుకుంటుండడగా.. వెనుక నుంచి వచ్చిన అశోక్‌ లేలాండ్‌ దోస్త్‌ వాహనం నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఆ ద్విచక్ర వాహనం నరేందర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు, నరేందర్‌కు తీవ్ర గాయాలు కాగా.. వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నాగరాజు మృతిచెందాడు. నరేందర్‌ నల్లగొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య కొండ రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    కళాత్మకంగా ఇక్కత్‌ వస్త్రాలు

    నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌

    జస్టిస్‌ పుష్పసత్యనారాయణ

    భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు ఎంతో కళాత్మకంగా ఉన్నాయని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ జస్టిస్‌ పుష్పసత్యనారాయణ అన్నారు. శనివారం ఆమె పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత సహకార సంఘంలో ఇక్కత్‌ చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు అంతర్జాతీయంగా ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడి కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం ఆమె చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు.

    యాదగిరీశుడి సేవలో ప్రముఖులు

    యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తమిళనాడు హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎం. దండపాణి, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ మెంబర్‌ జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, కుటుంబ సభ్యులు శనివారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

  • జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

    నల్లగొండ టూటౌన్‌ : జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్‌–143) జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం కొత్తగా జారీచేసిన 252 జీఓలోని నిబంధనలను సవరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట టీయూడబ్ల్యూజే (హెచ్‌–143), డెస్క్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తెచ్చిన 252 జీఓ వల్ల జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చి జర్నలిస్టులను వేరు చేసే ఆలోచన సరికాదన్నారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇచ్చేలా 252 జీఓను సవరించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి అందజేశారు. కార్యక్రమంలో యూని యన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్‌, మట్టయ్య, దుర్గాప్రసాద్‌, జనార్దన్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, వరుణమ్మ, పగడాల సురేష్‌, వెంకట్‌రెడ్డి, గాదె రమేష్‌, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్‌, నరేష్‌, జాకీర్‌అలీ, కత్తుల గిరిబాబు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • మూడేళ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

    దేవరకొండ : రాబోయే మూడేళ్లలో జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్‌ అధ్యక్షతన శనివారం దేవరకొండలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు ప్రజలందరి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు. మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్ధులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చి తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీపై నోరు పారేసుకుంటున్న బీఆర్‌ఎస్‌ నాయకులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్‌, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాశ్‌నేత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్పంచులు పంచాయతీల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గంలో అత్యధికంగా 180 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారని గుర్తుచేశారు. రాబోయే మూడేళ్లల్లో ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. అనంతరం కాంగ్రెస్‌ సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నాయిని జమునమాధవరెడ్డి, శ్రీలతారెడ్డి, దొంతం సంజీవరెడ్డి, వేణుధర్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్‌, జాల నర్సింహారెడ్డి, ఆలంపల్లి నర్సింహ, ఏవీరెడ్డి, రాజేష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రేఖారెడ్డి, వేమన్‌రెడ్డి, పార్వతి, గుంజ రేణుక, ప్రతాప్‌రెడ్డి, కిన్నెర హరికృష్ణ, కొర్ర రాంసింగ్‌, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.

    నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి

  • విద్యుదాఘాతంతో  మహిళ మృతి

    కనగల్‌ : పొలంలో వరి నాట్ల పనులను పరిశీలిస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్‌ వైరు తగిలి విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన కనగల్‌ మండలం ఏమిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేపవారిగూడెం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేపవారిగూడేనికి చెందిన దేప వనమ్మ(58) తన వ్యవసాయ భూమిలో వరి నాట్ల పనులను పరిశీలించడానికి పొలానికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న కరెంట్‌ తీగ ఆమెకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న ఆమె కొడుకు మహేందర్‌రెడ్డి వెంటనే తల్లి వద్దకు పరుగు తీసి కర్ర సాయంతో వైరును తొలగించి ఆమెను పొలం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే వనమ్మ మృతిచెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

    స్కూటీ అదుపుతప్పి..

    మిర్యాలగూడ టౌన్‌ : మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్లకు చెందిన సట్టు మనోజ్‌ (26) తన స్నేహితులు రమావత్‌ రాకేష్‌, భూక్య సాయిశివ, గుడిసె సురేష్‌ కలిపి శుక్రవారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి వెంట ఉన్న కృష్ణపట్నం హోటల్‌లో భోజనం చేసి తిరిగి నేరేడుచర్లకు ప్రయాణమయ్యారు. గుడిసె సురేష్‌, సట్లు మనోజ్‌ స్కూటీపై వేగంగా వెళ్తుండగా.. అవంతీపురం వద్ద జడ్జర్ల–కోదాడ జాతీయ రహదారిపై స్కూటీ అదుపుతప్పడంతో మనోజ్‌ కిందపడిపోయాడు. అతడి తల, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Medak

  • ఆదివా

    భివృద్ధిలో వెనకబడిన మెతుకుసీమ వడివడిగా పురోగతి దిశగా సాగుతోంది. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జిల్లాకు సుమారు రూ. 1,400 కోట్ల పైచిలుకు నిధులు విడుదల అయ్యాయి. వీటితో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి.

    – మెదక్‌జోన్‌

    కొనసాగుతున్న

    మెదక్‌ – సిద్దిపేట

    రహదారి పనులు

    మెదక్‌ నుంచి సిద్దిపేట వరకు 67 కిలోమీటర్ల 765 (డీజీ) రెండు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 800 కోట్లు మంజూరు కాగా, పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మెదక్‌, పాతూర్‌, అక్కన్నపేటలో పనులు చేయాల్సి ఉంది. అలాగే రామాయంపేట అటవీ ప్రాంతంలో కొంతమేర పనులు నిలిచిపోయాయి. అలాగే రామాయంపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి రూ. 205 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్‌ చర్చి అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు కాగా, పనులు కొనసాగుతున్నాయి. ఏడుపాయల కమాన్‌ నుంచి ఆలయం వరకు 7 కిలో మీటర్ల మేర డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ. 35 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మెడికల్‌ కాలేజీ భవనం, వసతి గృహ నిర్మాణాలకు రూ. 180 కోట్లు, నర్సింగ్‌ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు కాగా, ఇటీవల టెండర్‌ ప్రక్రి య సైతం పూర్తి అయింది. మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు పనులు ప్రారంభించారు.

    రూ. 1,400 కోట్లు మంజూరు

    మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలనిర్మాణ పనులు ప్రారంభం

    నాలుగు లేన్ల రోడ్లతోతీరనున్న ఇబ్బందులు

    ఆర్వోబీకి అడుగులు

    చేగుంట రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి రూ. 47 కోట్లు మంజూరు కాగా, ఇటీవల విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, అటవీ, పీఆర్‌, పోలీస్‌శాఖల అధికారులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనాల రూటు మళ్లించి పనులకు ఎలాంటి ఆటంకం కాకుండా చర్యలు చేపడుతున్నారు. చేగుంట వద్ద రైల్వేగేట్‌ పడిన ప్రతీసారి వాహ నాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అనేక సమస్యలకు పరిష్కారం లభించనుంది. అలాగే నేషనల్‌ హైవే (44) వడియారం బైపాస్‌ రోడ్డు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 30 కోట్లు మంజూరయ్యా యి. కాగా టెండర్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

    ఏడాదిలో మెతుకుసీమకు నిధుల వరద

  • పార్లమెంట్‌కు చీకోడ్‌ విద్యార్థి

    పాపన్నపేట(మెదక్‌): ‘మన నాయకుడిని తెలుసుకోండి ’కార్యక్రమం పేరిట ఎంపికై న చీకోడ్‌– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి శివ చైతన్య శనివారం ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో పదో తరగతి చదవుతున్న శివ చైతన్య ఎన్‌సీఈఆర్టీ ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, జిల్లా నుంచి ఒకే విద్యార్థి ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు పార్లమెంట్‌ ప్రతినిధి శివచైతన్యకు బహుమతి అందజేశారు. గైడ్‌ టీచర్‌గా కిషన్‌ ప్రసాద్‌ వ్యవహరించారు.

  • జీవాలకు టీకాలు  తప్పనిసరి

    మనోహరాబాద్‌(తూప్రాన్‌): జీవాలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా రైతులు టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సంచాలకుడు వెంకటయ్య అన్నారు. శనివారం మ ండలంలోని కాళ్లకల్‌లో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జీవాలకు మందుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అంతకుముందు సర్పంచ్‌ నవ్య నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తూప్రాన్‌ ఉమ్మడి మండల పశు వైద్యాధికారి లక్ష్మి, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, సిబ్బంది రవి, మల్లేశ్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • విద్యార్థులు ఇష్టంగా చదవాలి

    చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని డీఈఓ వి జయ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిట్కుల్‌ శివారులో గల కేజీబీవీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్నిరంగాల్లో ముందుకు సాగాలన్నారు. ఎంఈఓ విఠల్‌ మాట్లాడుతూ.. కేజీబీవీలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాములు, ఉపసర్పంచ్‌ అఖిల్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

    పనుల్లో వేగం పెంచండి

    చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విద్యుత్‌శాఖ ఈఈ (సివిల్‌) సుకుమార్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని చండూర్‌ శివారులో నిర్మి స్తున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వచ్చేనెల 15 వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి లోపం జరగకూడదని ఆదేశించారు. ఆయన వెంట చిలప్‌చెడ్‌ విద్యుత్‌శాఖ ఏఈ రాకేశ్‌, కాంట్రాక్టర్‌ విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    ఏడుపాయల టెండర్ల ఆదాయం రూ. 2.01 కోట్లు

    పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయలలో శనివారం సీల్డ్‌, బహిరంగ టెండర్లు నిర్వహించగా రూ. 2.01 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్‌ తెలిపారు. దేవస్థానం వద్ద కొబ్బరికాయలు విక్రయించేందుకు రూ. 1,10,30,000 కోట్ల పాట పాడి ధరంకర్‌ లింగాజి, అమ్మవారి ఒడి బియ్యం రూ. 91 లక్షలకు జనార్దన్‌రెడ్డి టెండర్‌ కై వసం చేసుకున్నా రు. కాగా దేవస్థానం వద్ద పూజా సామగ్రి, జాతరలో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు వేలంలో ఎవ రూ పాల్గొనకపోవటంతో వాయిదా వేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి, ప్రధాన అర్చకులు శంకరశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

    కోతుల బెడదకు..

    చింపాంజీ వేషం

    కౌడిపల్లి(నర్సాపూర్‌): మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్‌ వెంకటమ్మ వినూత్నంగా ఆలోచించింది. శనివారం ఓ వ్యక్తికి చింపాంజీ వేషం వేయించి గ్రామంలో కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిప్పింది. దీంతో కోతులు భయంతో పారిపోయాయి. కోతులు గ్రామంలోకి తిరిగి వస్తే ఇదే ప్రణాళికను అమలు చేస్తామన్నారు.

    నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

    మెదక్‌ మున్సిపాలిటీ: నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈనెల 31 రాత్రి 8 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్‌ యంత్రాంగం నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీస్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

  • మాదకద్రవ్యాలను నియంత్రించాలి
    కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

    మెదక్‌ కలెక్టరేట్‌: విద్యార్థులు, యువత భవిష్యత్తుపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి మానసిక వైద్య నిపుణులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గంజాయి, మత్తుపదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలపై ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్లబ్‌ ఏర్పాట్లు ఇతర వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్స్‌ రిహాబిలిటేషన్‌ కేంద్రాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఇన్‌పేషెంట్‌ సేవలకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గురుకులాలు, వసతిగృహాలు, అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ, కారిడార్లు, పరిసరాలు స్పష్టంగా కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బెల్ట్‌ షాపులు, గుడుంబా స్థావరాలపై పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

  • ‘కొండ’ంత సమస్యలు
    కొండపోచమ్మ జాతర సమీస్తున్నా ఏర్పాట్లు ఏవీ?

    గజ్వేల్‌: తెలంగాణలోనే ప్రసిద్ది చెందిన కొండపోచమ్మ ఆలయం వద్ధ భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. జనవరి 15నుంచి మార్చి 19వ తేదీ వరకు ఆలయంలో జాతర జరగనుండగా లక్షలమందికి అమ్మవారికి చెంతకు వస్తారు. ఇంతటి ప్రాఽ దాన్యత కలిగిన ఆలయానికి ఇప్పటివరకు కమిటీ వేయకపోగా, ఏర్పాట్లపై సన్నాహాలు మొదలుకాలేదు. వాహనాల పార్కింగ్‌కు మొదలుకొని అన్నీ సమస్యలే. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని చెప్పిన పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి.

    కొమురవెల్లి మల్లన్న, జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌–నర్సాపూర్‌లో కొలువుదీరిన కొండపోచమ్మలు అన్నాచెల్లెళ్లని పూర్వకాలం నుంచి చరిత్ర చెబుతోంది. అన్నపై అలిగి... కొండపోచమ్మ తీగుల్‌నర్సాపూర్‌ గుట్టల్లో దాక్కోగా.. వెతుక్కొని వచ్చి సోదరిని బుజ్జగించిన మల్లన్న.. ఆమె కోరిక మేరకు వరమిస్తాడు. తనను దర్శించుకునే ప్రతి భక్తుడు నీ వద్దకు కూడా వస్తాడని అభయమిస్తాడు. అదే తరహాలో నేడు కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ ఆలయా లు వెలుగొందుతున్నాయి. కొమురవెల్లిని దర్శించే ప్రతి భక్తుడు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

    కమిటీ ఏదీ..?

    ఈ ఆలయానికి ఇటీవల కాలం వరకు ఉన్న రెనోవేషన్‌ కమిటీ గడువు అక్టోబర్‌ 19నాటికి ముగిసింది. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు ఊసే లేదు. జాతర సమీపిస్తున్న వేళ ఏర్పాట్లపై కనీసం సన్నాహాలు కూ డా మొదలుకాకపోవడం ఆలయంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

    మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు

    ఆలయానికి దాతలు సమకూర్చిన కొన్ని గదుల్లో తప్పా మిగితా చోట్ల ఎక్కడా తాత్కాలికంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఖాళీ స్థలాల్లో ఉండే భక్తులకు మల విసర్జనకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్‌గా కూడా సౌకర్యం లేకపోవడంతో భక్తులు వాహనాలు తీసుకుని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు.

  • అర్హులకు డబుల్‌ ఇళ్లు పంపిణీ చేయాలి
    నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి

    నర్సాపూర్‌ రూరల్‌: నెల రోజుల్లో అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం నర్సాపూర్‌ చౌరస్తా వద్ద రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం పట్టణానికి 500 డబుల్‌ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 252 ఇళ్లు పూర్తి కాగా, మరో 248 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని పలుమార్లు కలెక్టర్‌, మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. ఫలితం లేకపోవడంతో ధర్నా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నెలరోజుల్లో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూంలను అర్హులైన పేదలకు పంపిణీ చేయకుంటే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ నయీమోద్దీన్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌, నాయకులు సత్యంగౌడ్‌, ప్రసాద్‌, ఆంజనేయులుగౌడ్‌, ఆనంద్‌, రాంచందర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.