‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది
ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్
ఇకపై మంచి పాత్రలు చేస్తా
హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!
ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్
నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..
టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !
మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య
కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు
పరీక్ష రాసేందుకు వెళ్లి.. తండ్రి ఆటో కింద పడి కూతురు దుర్మరణం
భవానీ భక్తులను అవమానించిన ఈవో, చైర్మన్ లను తక్షణం తొలగించాలి
మెస్సీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. కుర్చీలు, బాటిల్స్ విసిరేసి..
అదానీతో బాబు, లోకేష్ భేటీ అందుకేనా?
ఇదిగో మీ 2,270 రూపాయల బ్యాగ్.. కమిషన్ కి కక్కుర్తి పడితే ఇలానే ఉంటుంది
కుటుంబంతో తిరుమల శ్రీవారి సేవలో రజనీకాంత్..
Sports
నేపాల్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్ పశ్చిమ్ రాయల్స్తో ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో లయన్స్ రాయల్స్ను చిత్తు చేసి టైటిల్ను కైవసం చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో సుదుర్ పశ్చిమ్ రాయల్స్, లుంబిని లయన్స్ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. రోహిత్ పౌడెల్ హ్యాట్రిక్ సహా ట్రంపెల్మన్ (2.1-0-3-3), షేర్ మల్లా (4-0-18-3), తిలక్ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్, దీపక్ బొహారా, పూనీత్ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ఇషాన్ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్ (13), హర్మీత్ సింగ్ (10), కుగ్గెలిన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ దినేశ్ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లయన్స్ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్ 14, నిరోషన్ డిక్వెల్లా 11, రోహిత్ పౌడెల్ 16 పరుగులు చేసి లయన్స్ గెలుపుతో భాగమయ్యారు.
రాయల్స్ బౌలర్లలో హేమంత్ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్ ట్రంపెల్మన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, టోర్నీ అవార్డులు లభించాయి.
హైదరాబాద్: హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ (HPL) తొలి సీజన్ అత్యంత ఉత్సాహంగా ముగిసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని 'ది లీగ్' వేదికగా జరిగిన తుది పోరులో క్రెడికాన్ మావెరిక్స్(Credicon Mavericks) జట్టు అఖండ విజయం సాధించి, తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఆల్ స్టార్స్ జట్టుతో జరిగిన ఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. పోరు హోరాహోరీగా సాగి, ఏడో సెట్ అయిన నిర్ణయాత్మక టై-బ్రేకర్ వరకు వెళ్ళింది. అక్కడ మావెరిక్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి, 4–3 తేడాతో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఈ విజయంతో హెచ్పీఎల్ చరిత్రలో తొలి టైటిల్ విజేతలుగా క్రెడికాన్ మావెరిక్స్ జట్టు తమ పేరును లిఖించుకుంది.
సుమారు 2,000 మంది పికిల్బాల్ క్రీడాభిమానులు ఈ అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు. ఇది హైదరాబాద్లో పికిల్బాల్ క్రీడపై పెరుగుతున్న ఆసక్తిని, ఈ లీగ్ ఎంత వేగంగా ప్రజాదరణ పొందుతుందో తెలియజేస్తుంది. విజేతగా నిలిచిన క్రెడికాన్ మావెరిక్స్ జట్టు ట్రోఫీతో పాటు రూ. 6 లక్షల నగదు బహుమతిని గెలుచుకుంది. రన్నరప్గా నిలిచిన ఆల్ స్టార్స్ జట్టు తమ అద్భుత ప్రదర్శన తర్వాత రూ. 3 లక్షల నగదు బహుమతిని అందుకుంది.

చివరి రాత్రి క్రీడ, వినోదం కలగలిసి సాగింది. మ్యాచ్ మధ్యలో ప్రముఖ గాయకుడు లక్కీ అలీ, అతని బృందం ప్రదర్శించిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తొలి సీజన్ విజయవంతంపై స్పందిస్తూ, సెంటర్ కోర్ట్ స్పోర్ట్ & ఎంటర్టైన్మెంట్, హైదరాబాద్ పికిల్బాల్ లీగ్ కో ఫౌండర్ యశ్వంత్ బియ్యాల మాట్లాడుతూ.. "ఈ ఫైనల్స్, హెచ్పీఎల్ ముఖ్య లక్షణాలైన.. ఉత్కంఠ, సామాజిక అనుబంధం, వినోదం అన్నింటినీ బలంగా చూపించింది" అని అన్నారు. ఆల్ స్టార్స్ జట్టుకు చెందిన సమీర్ వర్మ 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్' అవార్డును గెలుచుకున్నారు.
ఈ ఏడాది ఆసియాకప్తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్న సంజూను కాదని మరి గిల్కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్మెంట్పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.
శాంసన్ చేసిన తప్పేంటి?
"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అతడికి అవకాశమివ్వడం లేదు? అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఈ సిరీస్కు ముందు సూర్యకుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవకాశం రాకముందే శుభ్మన్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవకాశం వస్తే ఏమి చేశాడో మనందరికి తెలుసు. ఓపెనర్గా వచ్చి వరుసగా మూడు సెంచరీలు బాదాడు. ప్రస్తుత యువ క్రికెటర్లలో అందరికంటే ముందు సంజూనే చేశాడు. ఆ తర్వాత అభిషేక్, తిలక్ వర్మ సెంచరీలు సాధించారు.
ఓపెనర్గా సంజూ తనను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ సంజూనే విజయవంతమైన ఓపెనర్గా ఉన్నాడు. అయినప్పటికి అతడిని ఓపెనర్గా తప్పించారు. ఆ తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మరోసారి అడుగుతున్న అతడు చేసిన తప్పు ఏంటి? కచ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అతడు అర్హుడు.
ప్రస్తుతం శుభ్మన్ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. తన శైలికి విరుద్దంగా ప్రయత్నించి విఫలమవుతున్నాడు. మొదటిలో అభిషేక్తో పోటీపడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నాను. తడు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అతడు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్కు టీ20కు సరిపోతుంది" అని ఉతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్ ఎంపికైన వారం రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.
ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చిన్నస్వామి మైదానంలో అభిమానులు సందడి నెలకోనుంది.
ఐపీఎల్-2026 సీజన్కు ముందే టీమిండియా స్టార్, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లి ఈ మైదానంలో ఆడనున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి చిన్నస్వామి మైదానంలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నట్లు సమాచారం. వానికి
వాస్త విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025-26 గ్రూపు-డి మ్యాచ్లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది. గ్రూపు-డిలో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహించే ఢిల్లీ జట్టు కూడా ఉంది. కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది.
దీంతో ఢిల్లీ ఆడే మ్యాచ్లను అలూర్ నుంచి చిన్నస్వామికి తరలించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ హాజారే టోర్నీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ఢిల్లీ తమ తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్!
మెస్సీ రాక.. మెస్సీ రాక.. ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. మెస్సీ హైదరాబాద్కు రానున్న తరుణంలో ఇది ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ మ్యాచ్. ఇదే కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వీరిద్దరి ఆటవిడుపు గురించి సరదాగా మాట్లాడుకుంటే..
మెస్సీతో మ్యాచ్ను సీఎం రేవంత్ తేలిగ్గా తీసుకోవడం లేదు. అందుకే ఆయన తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫుట్బాల్ ప్రాక్టీస్ను చేస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు రేవంత్. అందుకోసం యూనివర్శిటీకి చెందిన ఫుట్బాల్ క్రీడాకారులతో తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. మెస్సీ మొత్తంగా స్టేడియంలో ఉండే సమయం 20 నిమిషాలే. అందులో సీఎం రేవంత్తో ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు.
అయినప్పటికీ దీన్ని సీఎం రేవంత్ సరదాగా తీసుకోవడం లేదు. సీరియస్గానే తీసుకున్నట్లున్నారు. అందుకోసమే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. ఇక్కడ స్థానిక ఫుట్బాల్ క్రీడాకారులకు సీఎం రేవంత్ దీటుగానే బదులిస్తూ తన కిక్లతో అలరిస్తున్నారు. అంతే కాకుండా తన పాస్లతో కూడా ఆకట్టుకుంటున్నారు రేవంత్.
అదే జోరు కొనసాగేనా..?
నేటి ఐదు నిమిషాల మెస్సీతో మ్యాచ్లో రేవంత్ జోరు కొనసాగిస్తారా..? అనేది చూడాలి. రాష్ట్ర ఫుట్బాల్ ప్లేయర్లను పరుగులు పెట్టించిన రేవంత్.. మెస్సీని ఎంతవరకూ ధీటుగా ఎదుర్కొంటారో చూడాలి. మెస్సీతో గేమ్ అంటే మామూలు కాదు.. ఆ విషయం రేవంత్కు తెలుసు. అందుకే అంత ప్రాక్టీస్ చేశారు రేవంత్,.ఫుట్బాల్ మ్యాచ్ కోసం టెక్నికల్గా పుంజుకుని మరీ తన వార్మప్ మ్యాచ్లను కొనసాగించారు రేవంత్. ఒకవేళ పొరపాటను మెస్సీతో గేమ్లో రేవంత్ పైచేయి సాధించారంటే ఏమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. చాలా స్పల్ప సమయం పాటు జరిగే మ్యాచ్ కాబట్టి పెద్దగా అంచనాలు ఉండకపోవచ్చు. కానీ ఆ ఐదు నిమిషాల్లోనే రేవంత్ అద్భుతం చేసి మెస్సీని ఆశ్చర్యపరుస్తాడా? అనేది ఫుట్బాల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్లో మెస్సీ షెడ్యూల్
కోల్కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.
👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.
👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.
👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
👉 8:10 నిమిషాలకు హార్డ్ స్టాప్ ఉండనుంది
👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్
👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైదానంలో రానున్నారు.
👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.
👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నాడు.
చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.
తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్మెనెజ్మెంట్ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు.
కెప్టెన్ అంటే టాస్లు వేయడం, ఫీల్డ్ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు.
"సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్తో కూడా రాణించాలి. టాప్ ఫోర్లో బ్యాటింగ్కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్లు ఆడాడు.
అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్లో ఎటువంటి మార్పు కన్పించలేదు.
మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్తో టీ20 ప్రపంచకప్లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తన ఫామ్ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్కు ఊహించని షాక్!
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది.
కానీ మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ తీవ్రనిరాశకు గురయ్యారు. ఈవెంట్ నిర్వహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా అవిష్కరించారు.
Politics
విజయవాడ: ఏపీలోని రైతుల్ని దీనావస్థలోకి నెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బండారం బట్టబయలైంది. మంత్రి పార్థసారథి ఎపిసోడ్తో ప్రభుత్వం గుట్టురట్టయ్యింది. రైతులు దీనావస్థలో ఉన్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పింది.. ఇప్పుడు మంత్రి పార్థసారధి సాక్షిగా నిజమని తేలిపోయింది. అసల రైతుల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఎంత దారుణంగా ఉన్నాయో సుస్పష్టమైంది.
ఈరోజు(శనివారం) మంత్రికి రైతుల నుంచి సెగ తగలడంతో రెచ్చిపోయారు. బూతులతో మరీ రెచ్చిపోయారు రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని మంత్రికి రైతులు ఫిర్యాదు చేయగా, దాన్ని అధికారుల మీదకు, మిల్లర్ల మీదకు నెట్టేసే యత్నం చేశారు. మీరు మీర కలిసి దోచుకోండి అంటూ మండిపడ్డారు. ఫలితంగా మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్న వైనం బయటపడింది.
రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటామో చెప్పకుండా ‘ మీరు మీరు’ దోచుకోండి’ అంటూ అధికారుల్ని, మిల్లర్లపై ధ్వజమెత్తారు మంత్రి. నాణ్యత ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం. మంత్రి పార్థసారథి సొంతగ్రామంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు చేయక కల్లాల్లోనూ , మిల్లుల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారు. నాణ్యత ఉన్నప్పటికీ తేమ శాతం చూపించి మిట్లర్లు ధాన్యం కొనుగోలు చేయని క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా ఇలా రెచ్చిపోతే రైతుకు న్యాయం ఎలా జరుగుతుందనేది రైతుల ప్రశ్న.
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుందని.. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగిందని సజ్జల వివరించారు.
‘‘గ్రామాలు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.
..వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన రూపొందించిన ఉద్యమాలకు ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ఇప్పటికే చలో మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నిర్వహించగా, దీనికి కొనసాగింపుగా నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
..గ్రామగ్రామాన, పట్టణాల్లోని డివిజన్లలోనూ కొద్ది రోజులుగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరించారు. ఇందులో భాగంగా కోటి సంతకాల సేకరణను ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంతకాల సేకరణలో వివిధ గ్రామాల నేతలు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. అందుకే ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60 వేల సంతకాల సేకరించాలనేది పెద్ద లక్ష్యంగా కాకుండా అంతకుమించి సేకరించగలిగాం.
..పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పార్టీలో అన్ని స్థాయిల నేతలతో పాటు అనుబంధ విభాగాల ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ రెట్టించిన ఉత్సాహంతో సంతకాల సేకరణ ముమ్మరంగా చేశారు. పట్టణాలు, నగరాల్లో అయితే డివిజన్లను క్లస్టర్లుగా విభజించి, పార్టీ నేతలంతా బాధ్యతలు పంచుకుని మరీ సంతకాల సేకరణ చేశారు. మీ అందరి కష్టం, శ్రమను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇక కోటి సంతకాల కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పార్టీ నాయకత్వమంతా కూడా ఈ నాలుగు రోజుల పాటు మీ ఫోకస్ అంతా దీనిపైనే ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. 15న జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీలతో జిల్లా కేంద్రాలు హోరెత్తాలి. అనంతరం అక్కడి నుంచి కోటి సంతకాలు ఉన్న ప్రత్యేక వాహనాలను పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను వైఎస్ జగన్, ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చించుకునేంత స్ధాయిలో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
టెలి కాన్ఫరెన్స్ చివరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం.
అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైఎస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు. ఇకనైనా చంద్రబాబు తన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల అంధ్రప్రదేశ్ మారుస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు అప్పులే పరమావధిగా చేస్తున్నారని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా? అపి బొత్స ప్రశ్నించారు. ఈరో.జు(శనివారం, డిసెంబర్ 13వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు.
వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాం. మరి కూటమి పాలనలో చంద్రబాబుేచేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, ఆర్బీకేలతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశాం. చంద్రబాబు చేసిన అప్పులుపారదర్శకంగా ప్రజలకు వివరించాలి. చంద్రబాబు ఇన్ని అప్పులు చేసినా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అని మండిపడ్డారు.
బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..
- ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారింది
- చంద్రబాబు 18 నెలల కాలంలో రెండు లక్షలు 66 వేల కోట్లు అప్పు తెచ్చారు..
- వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 3 లక్షల 44 కోట్లు అప్పు తెచ్చారు..
- డైరెక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా 2 లక్షల కోట్ల కు పైగా ఖర్చు చేశారు..
- చంద్రబాబు తెచ్చిన అప్పులకు లెక్క పత్రం లేదు..
- దేనికి ఖర్చు పెట్టారో తెలియదు..
- వైఎస్ జగన్ 10 లక్షలు 20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పుడు ప్రచారం చేశారు..
- జగన్ తెచ్చిన అప్పులతో శ్రీలంకగా మారిపోతుందన్నారు..
- చెత్తనుండి సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు..
- కూటమి పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
- అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి ఉంది..
- పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు..
- చేయి తడిపితే కానీ పనులు జరజని ఏపీలో పని జరగదు
- రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి నెలకొంది..
- జగన్ అప్పులు తెచ్చి 90% వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చారు
- చంద్రబాబు అప్పల గురించి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్తున్నారు..
- ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర అభివృద్ధికి చేటు..
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.
‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది.
..కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?
..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు.
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రాజకీయాలన్నీ హోటల్స్లో రహస్యంగా జరుగుతాయని.. పైరవీలు, ప్రలోభాలన్నీ అక్కడే చేయిస్తుంటారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారాన్ని కూడా పాండిచ్చేరిలో హోటల్కు చేర్చారన్నారు. నెల్లూరు 54 డివిజన్లలో మొత్తం వైఎస్సార్సీపీనే గెలుపొందిందని.. అలాంటి చోట ఏమాత్రం బలం లేకున్నా ఎలా గెలవాలని చూస్తున్నారు?’’ అంటూ నాగార్జున యాదవ్ ప్రశ్నించారు.
‘‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగారు. రాజ్యాంగబద్దంగా అవిశ్వాస తీర్మానం మీద ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీనే గెలుస్తుంది. కిడ్నాప్లు చేయటానికి ఖాకీలను వాడుకుంటున్నారు. పోలీసులు ఖాకీ క్యాబ్ సర్వీసులుగా మారారు. కొందరు పోలీసులు బిఎన్ఎస్ చట్టాలు అంటే 'బాబు అన్యాయ సంహిత' చట్టాలుగా మార్చారు’’ అంటూ నాగార్జున యాదవ్ దుయ్యబట్టారు.
‘‘టీడీపీకి బలం ఉంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ నైతికంగా ఆల్రెడీ ఓడిపోయింది. అధికార బలం ఎల్లవేళలా పని చేయదు. చంద్రబాబు అనైతిక రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టే రోజు వస్తుంది’’ అని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు.
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీలేదన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని ఆరోపించారు. బ్రిటీష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూముల రీసర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు.
మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రెవెన్యూ డిపార్ట్మెంట్పై సమీక్ష చేయడానికి సీఎం చంద్రబాబుకు ఏడాది కాలం పట్టింది. సంస్కరణలు తెచ్చాం అని చంద్రబాబు అంటున్నారు. 2019లో జగన్ వచ్చే వరకు పేదల భూములకు ఎవరూ ఎలాంటి సంస్కరణలు తేలేదు. ఏది ఎవరి భూమి అనేది గుర్తించలేని పరిస్థితి. దశాబ్దాల తరబడి ఉన్న భూములను కారు చౌకగా అమ్మేసిన పరిస్థితి ఉండేది. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణలు తెచ్చింది. 2012కి ముందు ఉన్నవారికి చుక్కల భూమి పట్టాలు ఇవ్వటం జరిగింది. దీని వల్ల పేదలకు భూ హక్కులు వచ్చాయి. లాభం చేకూరింది. బ్యాంకు లోన్లు వచ్చాయి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.
1952 తర్వాత మళ్ళీ 2019లో జగన్ భూ సంస్కరణలు తెచ్చారు. భూ సంస్కరణల కోసం తమిళనాడు,కర్ణాటక వెళ్ళి స్టడీ చేశాం. ఏడాదిన్నర అయింది. దాన్ని మీరు ఆపారు. జగన్ తప్ప భూముల విషయంలో బీదలకు అనుకూలంగా చంద్రబాబు ఒక్క నిర్ణయం అయిన చేయగలిగారా?. చంద్రబాబు ఇతరుల వద్ద భూములు లాక్కొని ధనవంతులకు ఇచ్చారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు అన్ని పేదలకు మేలు చేశాయి. వాటిని మభ్యపెట్టి ఎన్నికల్లో మీరు లబ్ధి పొందారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భూములు అన్ని 22Aలో పెట్టి గందరగోళానికి గురి చేశారు. మేము వాటిని సరిచేద్దాం అంటే కేసులు పెట్టి అధికారులను ఎంత భయపెట్టారు. ఎంఆర్వో కార్యాలయాలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. 80 శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు. సంస్కరణలు మీరు చేయలేరు. చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని మండిపడ్డారు.
Business
భారత్ నుంచి 14,000 పేటెంట్లను దాఖలు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. అంతర్జాతీయంగా అర్థవంతమైన నవకల్పనలను ఆవిష్కరించడంలో కొత్త శకానికి భారత్ సారథ్యం వహిస్తుందని ఆశిస్తున్నట్లు దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ తెలిపింది.
‘భారత్ నుంచి 14,000 పైగా పేటెంట్లు దాఖలయ్యాయి. తద్వారా గ్లోబల్ ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్ స్థానం మరింత పటిష్టం అయింది. రాబోయే దశాబ్దకాలంలో ప్రపంచం కోసం భారత్లో డిజైన్ చేసిన, తయారు చేసిన మరిన్ని ఉత్పత్తులు రాబోతున్నాయి‘ అని శాంసంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యాల సాకారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. 1995లో టీవీలతో దేశీ మార్కెట్లోకి ప్రవేశించిన శాంసంగ్ క్రమంగా కార్యకలాపాలను విస్తరించింది. చెన్నై, నోయిడాలో రెండు ప్లాంట్లను, ఢిల్లీ, నోయిడా, బెంగళూరులో మూడు పరిశోధన.. అభివృద్ధి కేంద్రాలను, ఢిల్లీ–ఎన్సీఆర్లో డిజైన్ సెంటర్ని ఏర్పాటు చేసింది.
సాధారణంగా పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజ్ కంటే కూడా సీఎన్జీ (Compressed Natural Gas) కార్లు ఇచ్చే మైలేజ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఎందుకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందనే విషయం మాత్రమే బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇంధన రసాయన నిర్మాణం
పెట్రోల్ అనేది C8H18 వంటి హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఇది ఒక మధ్యస్థాయి పరిమాణం గల అణువు. అయితే సీఎన్జీలో మీథేన్ (CH4) ఉంటుంది. ఇది పరిమాణంలో చిన్నది, తేలికైంది.. కాబట్టి ఇది గాలిలో తేలికగా మండుతుంది, తద్వారా పవర్ డెలివరీ సమర్థవంతంగా సాగుతుంది. ఇది మండే సమయంలో కూడా కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ అనేది సీఎన్జీతో పోలిస్తే అసంపూర్తిగా మండుతుంది. దీనివల్ల కొంత ఇంధన శక్తి వృధా అవుతుంది. కాబట్టి సీఎన్జీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.ఎయిర్ ఫ్యూయెల్ రేషియో
సీఎన్జీ వాహనాల్లో.. ఎయిర్ - ఫ్యూయెల్ రేషియో (నిష్పత్తి) 17.2:1గా ఉంటుంది. అంటే 17.2 భాగాల గాలికి, ఒక ఫ్యూయెల్ (ఇంధనం) అవసరం అవుతుంది. పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. ఈ రేషియో (ఎయిర్:ఫ్యూయెల్) 14.7:1గా ఉంటుంది. దీని ప్రకారం.. ఎక్కువ గాలి ఉండటం వల్ల, సీఎన్జీ పూర్తిగా మండి శక్తిని అందిస్తుంది.ఎనర్జీ కంటెంట్
పెట్రోల్లో సుమారు 34.2 MJ/L ఎనర్జీ ఉంటుంది, కానీ CNGలో 1 కేజీకి 53.6 MJ ఉంటుంది (MJ-మెగాజౌల్). గ్యాస్ పరిమాణం తక్కువ కాబట్టి వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీ పెరగదు. కానీ CNG ఇంజిన్స్ ఎక్కువ కంప్రెషన్ రేషియోకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇది వేడి నష్టం తగ్గించి, ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.వేడి నష్టం తక్కువ
CNG తక్కువ వేడి నష్టం కలిగిన ఇంధనం. కాబట్టి మండే (దహనం) సమయంలో వేడి సమర్థవంతంగా ఉపయోగిస్తే, ఇంజిన్ పనితీరు పెరుగుతుంది. పెట్రోల్ కారు కొంత శక్తిని వేడిగా వృథా చేస్తుంది. అందువల్ల పెట్రోల్ వాహనాల మైలేజ్ తక్కువ.మైలేజ్
సాధారణంగా ఒక పెట్రోల్ కారు 12-15 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. సీఎన్జీ కారు 18-22 కిమీ/కేజీ అందింశింది. దీన్నిబట్టి చూస్తే.. మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మైలేజ్ అనేది వెహికల్ డిజైన్, ట్రాఫిక్ కండిషన్, డ్రైవింగ్ వంటివాటిపై ఆధారపడి ఉంటుంది.మరో ప్రధానమైన విషయం ఏమిటంటే పెట్రోల్ కార్ల కంటే సీఎన్జీ వాహనాల పవర్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సాధారణ హైవేలు, ట్రాఫిక్ లేని రోడ్లపైన.. ఈ కార్లు మైలేజ్ కొంత ఎక్కువగానే అందిస్తాయి. కానీ ఎత్తైన రోడ్లలో ప్రయాణించే సమయంలో మాత్రం.. పెట్రోల్ కార్లు అందించినంత పవర్ డెలివరీ చేయవు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, రూపాయి పతనం, ఉద్యోగాల తొలగింపు, స్థిరమైన వడ్డీ రేట్లు వంటి రకరకాల కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది. ఇటీవల రాయదుర్గం, నియోపొలిస్ భూముల వేలంలో రూ.వందల కోట్ల బిడ్డింగ్తో నగర స్థిరాస్తి మార్కెట్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్–2025తో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. సమ్మిట్లో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047తో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు పెరిగాయి. విద్యా, వైద్యం, తయారీ, క్రీడలు, పర్యాటకం, నివాసం, పరిశ్రమలు.. అన్ని రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో.. స్థానిక స్థిరాస్తి రంగంలో సానుకూల దృక్పథం ఏర్పడింది. ప్రధానంగా సామాన్య, మధ్యతరగతి గృహాలు, పర్యాటకం, గిడ్డంగులు, డేటా సెంటర్లలో రియల్టీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. – సాక్షి, సిటీబ్యూరో
అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గ్లోబల్ సమ్మిట్ రూపంలో ప్రభుత్వం తీసుకున్న చొరవ ప్రశంసనీయం. రియల్ ఎస్టేట్కు జీవం.. ఉపాధి.. ప్రస్తుతం తరుణంలో ఈ ప్రాథమిక అంశంపై ప్రభుత్వం దృష్టిసారించడం కీలకం. విజన్ డాక్యుమెంట్తో ప్రభుత్వ దీర్ఘకాల విజన్పై స్పష్టత ఇవ్వడంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంటోంది. జాయింట్ వెంచర్లు, విదేశీ పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్లు, అనుమతుల్లో వేగం, పాలసీలతో సెంటిమెంట్ బలపడుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో తయారీ, ఐటీ, ఫార్మా వంటి రంగాలే కాదు సినిమా, క్రీడలు, సెమీ కండక్టర్లు, అంతరిక్షం, జీవ ఉత్పత్తులు, జీవ వైవిధ్యం వంటి అన్ని రంగాలతో సమగ్రంగా ఉంది. దీంతో నివాస, ఆఫీసు స్పేస్లోనే పర్యాటకం, క్రీడలు, గిడ్డంగులు, డేటా సెంటర్ల వంటి ఇతర రియల్టీ మాధ్యమాలలో కూడా పెట్టుబడి అవకాశాలు ఏర్పడ్డాయి.
వెస్ట్ టు సౌత్..
నగర రియల్టీ మార్కెట్లో ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్దే ఆధిపత్యం. బహుళ జాతి ఐటీ, ఆర్థిక సంస్థలు, డేటా సెంటర్లు పశి్చమంలో కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఈ ప్రాంతానికి శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్కు సులువైన కనెక్టివిటీతో పాటు విశాలమైన రహదారులు, మెరుగైన మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, నిరంతరం విద్యుత్ వంటి మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయి. దీంతో బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు, అంతర్జాతీయ విద్యా, వైద్యం, వినోద సంస్థలకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా రాయదుర్గం, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి వెస్ట్ హైదరాబాద్లో భూములు హాట్కేక్లుగా మారాయి.ప్రభుత్వం నిర్వహించే వేలంలోనే ఎకరం రూ.వందల కోట్లు పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన ప్రాంతంలో సామాన్య, మధ్యతరగతికి సొంతిల్లు కలే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కొత్త ప్రాంతానికి అభివృద్ధిని విస్తరించడం హర్షించదగిన పరిణామం. నగరానికి దక్షిణ భాగమైన శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో గ్రీన్ఫీల్డ్ నెట్ జీరో సిటీ పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులు మెరుగవుతాయి. ఫలితంగా నివాస, వాణిజ్య సముదాయాలు వెలుస్తాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అందుబాటు ధరల్లోనే సొంతింటి కలను సాకారం చేసుకునే వీలు ఏర్పడుతుంది.
మాస్టర్ ప్లాన్స్పై స్పష్టత వస్తేనే..
ఏ ప్రాజెక్ట్కైనా బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్) కీలకం. రాష్ట్రాభివృద్ధిని మార్చే కీలక ప్రాజెక్ట్లలో భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం కీలకమని పదే పదే ప్రభుత్వం చెబుతోంది. అలాంటి కీలకమైన ప్రాజెక్ట్లకు మాస్టర్ ప్లాన్ వస్తేనే పెట్టుబడులపై స్పష్టత వస్తుంది. డెవలపర్లు, పెట్టుబడిదారులు ఎవరికైనా సరే మాస్టర్ ప్లాన్లో ఏ జోన్ ఎక్కడ వస్తుంది? బహుళ వినియోగ జోన్ ఏరియా ఎంత? వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకొనే ముందడుగు వేస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం బృహత్తర ప్రాజెక్ట్ల సమగ్ర మాస్టర్ ప్లాన్ విడుదల అయితేనే ఆయా ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలపై స్పష్టత వస్తుందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.కార్యరూపం దాలిస్తేనే ఫలాలు..
‘అన్ని రహదారులు రోమ్కు దారితీస్తాయి’ విస్తృతమైన రోడ్ నెట్వర్క్ను దాని రాజధానికి అనుసంధానించే క్రమంలో ఉద్భవించిన ప్రాచీన రోమ్ నానుడి లాగే.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా రియల్ ఎస్టేట్కు ఊతమిస్తుంది. రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో పాక్షికంగా కార్యరూపంలోకి వచ్చినా రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రమే మారిపోతుంది.పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. దీంతో రియల్టీలో పెట్టుబడులు పెరుగుతాయి. అసలు సమస్య ఏంటంటే.. ఫ్యాబ్ సిటీ, ఎల్రక్టానిక్ సిటీ, ఫార్మా సిటీ.. ఇలా ఏ పేరుతోనైనా ఏ ప్రభుత్వమైనా భూములు సమీకరించడం సర్వ సాధారణమే. కానీ, అవి కార్యరూపం దాలిస్తేనే అభివృద్ధి. లేకపోతే ఇతర రాష్ట్రాలు నిర్వహించే సాధారణ సమ్మిట్ మాదిరిగానే ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా వారం, నెల రోజుల్లో మరుగునపడిపోతుంది. స్థానిక అవసరాలు, బలాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ రూపొందిస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఊహకందని రీతిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు క్రాస్ చేయగా.. కేజీ వెండి రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రెండు కాకుండా ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం వంటి విలువైన లోహాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలామందికి తెలిసిన లోహాలు గోల్డ్, సిల్వర్, ప్లాటినం మాత్రమే. పెట్టుబడిదారులకు పల్లాడియం గురించి తెలుసుంటుంది.
ఇతర లోహాల సంగతి పక్కన పెడితే.. బంగారం వెండి ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి. ప్లాటినం ధరలు ఎందుకు చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటి?.. ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా పెరిశీలిద్దాం..
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాల కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు బంగారంపైన ఇన్వెస్ట్ చేయడం, డిమాండుకు తగ్గ.. బంగారం సరఫరా లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణాలు అవుతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులలో.. లాభనష్టాలు ఉంటాయి. కానీ బంగారం పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే పెట్టుబడిదారులు.. మార్కెట్స్ కుప్పకూలినప్పుడు గోల్డ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.
వెండి ధరలు పెరగడానికి కారణాలు
ఈ ఏడాది వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం ఒక కారణం అయితే.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీలలో వెండి వినియోగం పెరిగిపోవడం కూడా మరో కారణం. నీటి శుద్ధి, వైద్య రంగం, పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలలో కూడా వెండి వినియోగం విరివిగా ఉంది. ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.ఆభరణాలుగా మాత్రమే కాకుండా.. వెండిని పారిశ్రామిక రంగంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల.. సిల్వర్ రేటు రెండు లక్షల రూపాయలు దాటేసింది.
ప్లాటినం ధరలు ఎందుకు తక్కువ?
➤బంగారం, వెండితో పోలిస్తే.. ప్లాటినం ధరలు చాలా తక్కువ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
➤బంగారం, వెండి ఆభరణాలకు ఉన్నంత డిమాండ్.. ప్లాటినం ఆభరణాలు లేదు.
➤ప్లాటినంపై పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువ
➤ఇండస్ట్రీల్ వినియోగం ఎక్కువగా ఉంది.
➤ప్లాటినం ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, రష్యాలలో మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
➤డిమాండ్ తక్కువగా ఉండటం వల్లనే.. ప్లాటినం ధరలు తక్కువగా ఉన్నాయి.ఇతర లోహాలు
బంగారం, వెండి మాదిరిగానే.. ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇరిడియం, రుతేనియం, ఓస్మియం కూడా విలువైన లోహాలు. అయితే వీటికున్న డిమాండ్ భారతదేశంలో చాలా తక్కువ. ఈ కారణంగానే వీటి ధరలు కూడా అలాగే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో వీటి ధరలు పెరుగుతాయా? అనేది తెలియాల్సి ఉంది.
భారత్లో ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ (ఈవీ బ్యాటరీ) డిమాండ్ వచ్చే ఏడేళ్లలో గణనీయంగా పెరనుందని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్) సంస్థ అంచనా వేసింది. 2025లో ఈవీ బ్యాటరీ డిమాండ్ 17.7 గిగావాట్ హవర్ (జీడబ్యూ్యహెచ్) ఉండగా, 2032 నాటికి 256.3 గిగావాట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఏటా 35 శాతం కాంపౌండెడ్ వృద్ధి (సీఏజీఆర్) ఈ రంగంలో నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇంధన ధరలు పెరుగుతుండడం, ఎలక్ట్రిఫికేషన్ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడం, వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదల అవుతుండడం, విధానపరమైన మద్దతు అన్నీ కలసి ఈవీ మార్కెట్ భారీ వృద్ధికి అనుకూలిస్తున్నట్టు తన నివేదికలో సీఈఎస్ వివరించింది.
‘‘భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి బ్యాటరీ కెమిస్ట్రీ పురోగతులు కీలకమైనవి. ఎల్ఎఫ్పీ జెన్ 4, సోడియం అయాన్ టెక్నాలజీ ఆవిష్కరణలు కేవలం సాంకేతికపరమైన పురోగతులే కాదు. ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటు ధరలకు తీసుకొచ్చే సంచలనాలు. సురక్షితమైన, ఒక్కచార్జ్తో మరింత దూరం ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి’’అని సీఈఎస్ ఎండీ వినాయక్ వలింబే తెలిపారు. ఎల్ఎఫ్పీ జెన్4 సెల్స్ అన్నవి ఇప్పుడు 300 వాట్హవర్/కిలోని అధిగమించాయంటూ.. ఎక్కువ దూరం ప్రయాణించేందుకు, ధరలు తగ్గేందుకు అనుకూలిస్తాయ ఈ నివేదిక తెలిపింది.
సవాళ్లను అధిగమించాలి..
భారత్ తన ఎలక్ట్రిఫికేషన్ (ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లడం) లక్ష్యాలను సాధించేందుకు వీలుగా పరిశ్రమతో సహకారం, బలమైన బ్యాటరీ ఎకోసిస్టమ్ ఏర్పాటు, వ్యూహాత్మక పెట్టుబడుల సవాళ్లను అధిగమించేందుకు విధానపరమైన జోక్యం అవసరమని సీఈఎస్ నివేదిక సూచించింది. బ్యాటరీల్లో వినియోగించే కీలక ముడి పదార్థాలను, ఖనిజాలపై చైనా నియంత్రణలు.. భారత్లో గిగాఫ్యాక్టరీల నిర్మాణాన్ని నిదానింపజేయొచ్చని, సరఫరా వ్యవస్థ రిస్్కలకు దారితీయొచ్చని హెచ్చరించింది. అధిక ఆరంభ పెట్టుబడులకుతోడు, దేశీయంగా ఖనిజ నిల్వలు పరిమితంగా ఉండడం భారత స్వావలంబన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది.
భారత్ 2047 నాటికి తయారీ దిగ్గజంగా మారాలంటే.. జీడీపీలో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 25 శాతానికి చేర్చాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), జెడ్47 సంయుక్త నివేదిక సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన భారత్లో తయారీ, ఆత్మనిర్భర్భారత్, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)తో దేశీ సామర్థ్యాలు వేగంగా విస్తరిస్తున్నట్టు పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్, రక్షణ, ఆటోమోటివ్-ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో 2047 నాటికి 25 ట్రిలియన్ డాలర్ల అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కాలంలో తయారీ రంగంలో భారత్ వృద్ధికి ఈ రంగాలు కీలకంగా మారనున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వీటికితోడు బలమైన జీడీపీ వృద్ధి, పారిశ్రామిక మద్దతు, స్పష్టమైన విధానాలు/పెట్టుబడులతో తయారీ రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని పేర్కొంది. ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీతత్వాన్ని పెంచడం, టెక్నాలజీ అమలు ద్వారా సామర్థ్యాలను విస్తృతం చేయడం ద్వారా తయారీ రంగానికి బలమైన పునాదులు వేయాలని సూచించింది.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం కోసం.. రక్షణ, ఈవీ, సెమీకండక్టర్లకు సంబంధించి ప్రాంతీయ తయారీ క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ నివేదిక పేర్కొంది. నోయిడా–చెన్నై–హోసూర్, దొలెరా కారిడార్లు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నట్టు తెలిపింది. ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల తుది మార్కెట్ 2022లో 33 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి 117 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. రక్షణ రంగానికి 2025–26లో కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉండగా, దేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చే దశాబ్దంలో కేటాయింపులు రెట్టింపు కానున్నట్టు పేర్కొంది.
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.
డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలు
బీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.
కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.
ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.

తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.

డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!
వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?
హైదరాబాద్లో సామాన్యుడికి సొంతిల్లు కలే. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి. నిజం చెప్పాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలోనే సామాన్య, మధ్యతరగతి ఇళ్ల సరఫరా పెరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాల రూపంలో ప్రైవేట్ సంస్థలను ఆకర్షించాల్సి ఉంటుందని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కొరతను అధిగమించేందుకు చిన్న, తక్కువ ధరల ఇళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సిటీ అభివృద్ధి ఔటర్ దాటింది. కనెక్టివిటీ, సామాజిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. దీంతో సామాన్యులకు గృహాలు కొనగలుగుతారు. – సాక్షి, సిటీబ్యూరో
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఇళ్ల డిమాండ్పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో మధ్యతరగతి వర్గాలకు 20.30 లక్షలు, పేద వర్గాలకు 8.70 లక్షల ఇళ్లు కలిపి.. మొత్తం 29 లక్షల ఇళ్ల డిమాండ్ ఉందని తేలింది. ఈ కొరతను అధిగమించాలంటే పీపీపీ విధానం మేలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్) మధ్య పీపీపీ విధానంలో సరసమైన గృహాలను నిర్మించే యోచన చేస్తున్నట్లు ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మౌలిక వసతుల కల్పన..
అందుబాటు గృహాలను నిర్మించాలంటే నగరంలో స్థలం కొరత. దీంతో శివారు ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ముందుగా శివారుల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే డెవలపర్లు, కొనుగోలుదారులు ఇద్దరూ ముందుకొస్తారు. ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ మధ్య ప్రభుత్వం నీరు, డ్రైనేజీ, విద్యుత్, ప్రజా రవాణా, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి మౌలిక, సామాజిక వసతులను కల్పించాలి. అలా చేస్తే అందుబాటు గృహాల నిర్మాణాలు ఊపందుకుంటాయి.ప్రభుత్వం ఉచితంగా స్థలాలను కేటాయించి.. జాయింట్ వెంచర్గా అందుబాటు గృహాలను నిర్మిస్తే విజయవంతం అవుతాయి. ఎలాగంటే.. ప్రైవేట్ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్ను నిర్మిస్తాయి కనుక నిర్మాణంలో నాణ్యతతో పాటూ వారికి దక్కే వాటా ఫ్లాట్లు ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకుంటారు. దీంతో ప్రాజెక్ట్లో భిన్నమైన సంస్కృతి వస్తుంది. నిర్వహణ కూడా బాగుంటుంది. అలాగే ఈ తరహా నిర్మాణాలకు రిజి్రస్టేషన్ చార్జీలను నామమాత్రంగా వసూలు చేయాలి.
ముచ్చటగా మూడు పద్ధతులు
➤ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తుంది.➤కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్)లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేయనున్నారు. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకురానున్నారు.
➤పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్) పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లను అభివృద్ధి చేయనున్నారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టిపెడతారు.
➤మిగిలిన ప్రాంతం పరిధిలో చిన్న, మధ్య తరహా టౌన్íÙప్లు, పారిశ్రామిక పార్క్లు, లాజిస్టిక్ హబ్లతో గృహ నిర్మాణ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.
ఏఐ పెట్టుబడులు
టెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.
కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.
ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.
వ్యూహాత్మక భాగస్వామ్యాలు
ఐటీ కంపెనీలు స్టార్టప్లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.
మానిటైజేషన్ మోడల్స్
ఏఐ ఆధారిత టూల్స్కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.
మానవ వనరుల పెంపు
ఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.
ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.
ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.
జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.
పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.
సవాళ్లు అధిగమించాలంటే..
పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.
ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!
భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామం. ఇటీవల రూపాయి మారకం విలువ తొలిసారిగా డాలర్తో పోలిస్తే రూ.90.4 వద్ద ఆల్-టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలం తగ్గుతున్నప్పటికీ రూపాయి పతనం కొనసాగడం అనేక అంతర్జాతీయ, దేశీయ సంక్లిష్టతలను సూచిస్తోంది. ఈ పతనం దేశంలో ద్రవ్యోల్బణం పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి పతనానికి కారణాలు
భారత రూపాయి విలువ ఈ విధంగా జీవనకాల కనిష్టానికి చేరడానికి ప్రపంచవ్యాప్త ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక అనిశ్చితులు, దేశీయ పరిణామాలు సంయుక్తంగా కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గతంలో పెంచింది. దీని కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) తమ నిధులను వెనక్కి తీసుకొని అధిక రాబడి కోసం డాలర్ ముడిపడిన ఆస్తుల్లోకి మళ్లించారు. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతలు వంటి భౌగోళిక అనిశ్చితులు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే అమెరికన్ డాలర్కు ప్రాధాన్యత ఇవ్వడం రూపాయి బలహీనతకు దారితీసింది.
దేశీయ, వాణిజ్య పరిణామాలు
భారతదేశం దిగుమతి చేసుకునే విలువ, ఎగుమతి చేసే విలువ కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముడి చమురు, బొగ్గు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటి దిగుమతులు అధికంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో డాలర్లు అవసరం. దీనివల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది.
ముడి చమురు ధరల పెరుగుదల
భారతదేశ అవసరాల్లో దాదాపు 85% వరకు చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం (సుమారు 17 బిలియన్ డాలర్లకు పైగా) రూపాయి పతనానికి ప్రధాన కారణమైంది. దాంతోపాటు అమెరికా విధించిన పరస్పర సుంకాలు, వాణిజ్య ఒప్పందంపై జాప్యం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
సవాళ్ల పరిష్కారం ఇలా..
ఈ సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి, రూపాయి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర అధికార యంత్రాంగాలు పటిష్టమైన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాలి.
ఆర్బీఐ తరఫున తీసుకోవాల్సిన చర్యలు
రూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుంచి మార్కెట్లోకి డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. (ఆర్బీఐ ఇప్పటికే లండన్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో జోక్యం చేసుకుంది) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి ఆకర్షించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు (రెపో రేటు) నిర్ణయం తీసుకోవచ్చు. ఇది పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎన్నారైలు విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకులు) డిపాజిట్లను పెంచేందుకు వారికి ప్రత్యేక ఆకర్షణలు, మినహాయింపులు ప్రకటించడం ద్వారా దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచవచ్చు.
అధికార యంత్రాంగం..
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు ప్రకటించవచ్చు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతులు, లాజిస్టిక్స్ మెరుగుపరచాలి. ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. అలాగే బంగారం దిగుమతిపై సుంకాలను పెంచడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా దిగుమతులపై ఖర్చును తగ్గించవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత సులభతరం చేయాలి. పారిశ్రామిక విధానాలు, పన్నుల విధానంలో స్థిరత్వం, స్పష్టత ఉండేలా చూడాలి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని అమెరికన్ డాలర్కు బదులుగా రూపాయిలో నిర్వహించేందుకు ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను వేగవంతం చేయాలి. ఇది డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ
International
పొరుగు దేశాల భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే జిత్తుల మారి చైనా ఇప్పుడు రష్యాపై కన్నేసిందా? పదేపదే భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ అక్కడి ప్రాంతాల పేర్లు మార్చి మ్యాపులు విడుదల చేసే డ్రాగన్ దేశం ఇప్పుడు రష్యా-చైనా సరిహద్దుల్లోని ఓ ద్వీపం పూర్తిగా తమదేనని వాదిస్తోందా? దీనిపై రష్యా నిఘా వర్గాలు అవునని పేర్కొంటూ నివేదికలు అందజేశాయి. అసలు ఆ ద్వీపం కథేంటి? చరిత్ర ఏం చెబుతోంది? శతాబ్దన్నర క్రితం చైనా ఆ ద్వీపాన్ని కోల్పోవడానికి కారణాలేంటి? దీనిపై ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య ఒడంబడికలు జరిగాయా? దీనిపై సాక్షి డిజిటల్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి.
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో.. ఉస్సూరీ-అమూర్ నదుల సంగమం వద్ద అతిపెద్ద ద్వీపం ఉంది. దీన్ని బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్గా పిలుస్తారు. 150 ఏళ్లుగా ఇది రష్యాలో అంతర్భాగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ద్వీపంపై చైనా కన్నేసింది. ఈ ద్వీపాన్ని సాంతం ఆక్రమించాలని ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇటీవల రష్యా నిఘా సంస్థ ఎఫ్ఎస్బీ 8 పేజీల నివేదికను అందజేసింది. ఆ నివేదికలో చైనాను శత్రువుగా పేర్కొంది. అమెరికా మ్యాగజైన్ ‘న్యూస్ వీక్’.. అదేవిధంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక దీనిపై కథనాలను ప్రచురించడం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మ్యాపుల్లో ఈ ఐల్యాండ్ పూర్తిగా చైనాదేనని పేర్కొనడమే కాకుండా.. ఆ దీవి పేరును మార్చింది. అంతేకాదు.. రష్యాలోని తూర్పు నగరం వ్లాడివోస్టోక్ కూడా తమ భూభాగమేనని చైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ మ్యాప్ స్పష్టం చేస్తోంది.
చరిత్రలో వెనక్కి వెళ్తే.. బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ ఒకప్పుడు చైనాలో భాగమే..! కానీ, 150 ఏళ్ల క్రితం.. అంటే.. 19వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం బలహీనపడింది. ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. భద్రత దృష్ట్యా ఈ దీవిని రష్యాకు అప్పగించింది. రష్యాకు కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఈ దీవి అప్పట్లో అవసరంగా మారింది. 1958లో జరిగిన ఒప్పందం ప్రకారం అమూర్ నదికి ఉత్తరాన ఉన్న విశాలమైన ప్రాంతాన్ని రష్యాకు దఖలుపరిచింది. 1860లో మరో యుద్ధంలో చైనా ఓడిపోవడం.. పాశ్చాత్య దేశాలకు రష్యా సహకరిస్తుందనే భయంతో ‘పెకింగ్ ఒప్పందం’ చేసుకుంది. ఈ రెండు ఒప్పందాల ప్రకారం ఈ దీవితోపాటు.. సువిశాలమైన భూభాగం రష్యా సొంతమైంది. ఆ వెంటనే రష్యా ఇక్కడ వ్లాదివోస్తోక్ నగరాన్ని నిర్మించింది.
ఐదు దశాబ్దాల క్రితం నుంచి చైనా సంస్కరణల బాటలో దూసుకుపోవడం మొదలు పెట్టింది. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా బలోపేతమవుతుండడంతో.. క్రమంగా ఈ ప్రాంతాలపై వివాదాలు రాజుకున్నాయి. రష్యా-చైనా మధ్య 4,200 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ సరిహద్దు ఉంది. 60వ దశకంలో కూడా ఈ సరిహద్దు వెంబడి ఇరుదేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. 1990-2000 మధ్యకాలంలో ఈ వివాదం ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో.. పలు ఒప్పందాలు కుదిరాయి. రష్యా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు.. ఎప్పటికప్పుడు అవకాశాలను వాడుకున్న డ్రాగన్.. తన కవ్వింపు చర్యలకు ఫుల్స్టాప్ పెట్టకపోవడంతో 2008లో రష్యా కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్లో కొంత భాగం చైనాకు చెందుతుంది.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో రష్యా ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కకుపోతోంది. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో అతలాకుతలమవుతోంది. దీంతో డ్రాగన్ మరోమారు కుయుక్తులకు తెరతీసింది. ఓ వైపు రష్యాను మిత్రదేశంగా పేర్కొంటునే.. పాశ్చాత్య దేశాల ఆంక్షలను కాదని రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు బోల్షోయ్ ఉస్సూరిస్కీ ఐల్యాండ్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. ఒకవేళ చైనా తన చర్యలను మరింత ముమ్మరం చేస్తే.. రష్యా ఎదుర్కోగలదా? ఇరు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే.. అది ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందా? మిత్రుల మధ్య కీచులాటను చాలా ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఈ వివాదాన్ని అవకాశంగా మలచుకుంటుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పనుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాయండి.
-హెచ్ కమలాపతి రావు
జీ7 దేశాలను కాదని.. భారత్ సహా ఐదు దేశాలతో కోర్-5 దేశాల కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు పాకిస్థాన్పై వరాల జల్లులను కంటిన్యూ చేస్తున్నారు. వాణిజ్యం, అప్పులు, ఇతరత్రా సహాయసహకారాలు అందించడంలో ఇప్పటికే పాకిస్థాన్కు అగ్రతాంబూలం ఇస్తున్న ట్రంప్ సర్కారు.. తాజాగా పాక్ యుద్ధ విమానాలు – ఎఫ్16 అప్గ్రేడేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏకంగా 686 మిలియన్ డాలర్లు.. అంటే.. సుమారు 5,800 కోట్ల రూపాయలను వెచ్చించనుంది.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత పాక్ ప్రతిస్పందనకు ధీటుగా బదులిచ్చేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. అయితే.. భారత్తో పోలిస్తే.. పాకిస్థాన్ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. అమెరికా సరఫరా చేసిన ఎఫ్16, చైనా అందజేసిన జే10సీ వంటి యుద్ధ విమానాలు పాకిస్థాన్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయినా.. భారత్ తన సంప్రదాయ మిరాజ్, మిగ్ విమానాలతో పాకిస్థాన్ పీచమణిచింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఆ సమయంలో బంకర్లలో తలదాచుకోవడంతో.. అధునాతన యుద్ధ విమానాలున్నా పాకిస్థాన్ ఏమీ చేయలేకపోయింది.
నిజానికి ఆపరేషన్ సిందూర్లో భారత్కు చెందిన రాఫెల్ను కూల్చేశామని పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేసింది. అదే సమయంలో పాకిస్థాన్కు చెందిన అమెరికా తయారీ ఎఫ్-16లు భారత్ దాడిలో ధ్వంసమైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది ఒక విధంగా అమెరికాకు తీవ్ర అవమానం. దీంతో అగ్రరాజ్యం పాకిస్థాన్కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ 5,800 కోట్ల రూపాయలతో పాకిస్థాన్ వద్ద ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను అమెరికా పార్లమెంట్కు పంపింది.
డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంట్ ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ను జారీ చేస్తుంది. ఆ వెంటనే పాకిస్థాన్లోని ఎఫ్16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ మొదలవుతుంది. 686 మిలియన్ డాలర్ల ప్రతిపాదనలో వేర్వేరు కేటగిరీల వారీగా ఆ ఏజెన్సీ వివరాలను కాంగ్రెస్కు అందజేసింది. దాని ప్రకారం 37 మిలియన్ డాలర్లను ఎఫ్16లో ఉపయోగించే కీలక పరికరాలకు వెచ్చిస్తారు. మిగతా 649 మిలియన్ డాలర్లను హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్కు కేటాయిస్తారు.
సరే.. పాకిస్థాన్కు అమెరికా చేసే ఈ సాయంతో భారత్కు నష్టమేంటి? అనుకుంటున్నారా? దీని ప్రభావం మనదేశంపై తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. ఎఫ్16లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్పై అమెరికా దృష్టి సారించింది. ముఖ్యంగా 92 లింక్-16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ని పాకిస్థాన్కు అందజేయనుంది. ఈ సాంకేతికత అమెరికాతోపాటు.. నాటో దేశాల వద్ద మాత్రమే ఉంది. అంటే.. క్లిష్టపరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాల మధ్య జామ్-ప్రూఫ్ కమ్యూనికేషన్కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్థాన్కు అందుతుంది. దీంతోపాటు.. కొత్త ఏవియానిక్స్, క్ట్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, విడిభాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక ఎఫ్16పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది.
అయితే.. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి భారత్కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలున్నాయి. అయితే.. శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం .. ముప్పును ఎదుర్కోవడంలో చాణక్య నీతిని ప్రదర్శిస్తుందని ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచదేశాలు గుర్తించాయి. ఇప్పుడు ఎఫ్16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం..! ఈ వీడియో మీకు నచ్చినట్లైతే.. లైక్ చేయండి.. షేర్ చేయండి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో షేర్ చేయండి.
-హెచ్ కమలాపతి రావు
ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫిలిప్పీన్స్లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందుకే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్లైన్లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్ను సాధించడం విశేషం.
ICYMI: This is real courage.
During a massive fire in Mandaue City, Cebu, Philippines, a woman refused to leave without her dogs.
As flames spread, she climbed onto a ladder, threw each dog down to safety, then hung by her hands from the railing while firefighters climbed up to… pic.twitter.com/unDE6PcyUG— Tony Lane 🇺🇸 (@TonyLaneNV) December 13, 2025
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇప్పుడు ఒక్క ఫోటో కారణంగా ట్రోలింగ్ బారిన పడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసు క్రమంలో ఒక్కరే కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు ట్రెండింగ్,గా ఆపై ట్రోలింగ్గా మారిపోయింది. రష్యా అధ్యక్షుడి కోసం దాదాపు 40 నిమిషాల పాటు నిరీక్షించారు షెహబాజ్.
ఇది తుర్కిస్థాన్ దేశంలో చోటు చేసుకున్న ఘటన. ఆష్కాబాద్లో పాక్ ప్రధాని-రష్యా అధ్యక్షుడి సమావేశం జరగాల్సి ఉండగా అది కాస్త బాగా ఆలస్యమై పోయింది. మరి పుతిన్ కావాలనే వెయిట్ చేయించారో.. లేక ప్రత్యేక పరిస్థితల్లో ఆలస్యమైందో అనేది ఆయనకే తెలియాలి. అయితే గతంలో కూడా ట్రంప్.. పుతిన్కు ఫోన్ చేసిన సందర్భాల్లో కూడా ఆయన ఇలానే వ్యవహరించిన ఘటన గుర్తుకొస్తుంది.
నాలుగైదు నెలల క్రితం ట్రంప్ ఫోన్ చేసిన సమయంలో పుతిన్ అధ్యక్ష కార్యాలయంలో సిబ్బంది ఫోన్లోకి టచ్లోకి వచ్చేవారు. పుతిన్ ఏదో అత్యవసర సమావేశంలో ఉన్నారని వారు చెప్పేవారే కానీ, పుతిన్ ఆ ఫోన్ను తీసుకునేవారు కాదు. ఇదంతా పుతిన్ చర్యగానే అప్పట్లో వైరల్ అయ్యింది. ట్రంప్ను కావాలనే పుతిన్ వెయిట్ చేయించారనే వార్తలు వచ్చాయి. ఈ యాంగిల్లో చూస్తే పుతిన్ తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనే వ్యక్తులను వెయిట్ చేస్తారనే చెప్పక తప్పదు. మరి షెహబాజ్ను కూడా ఇలానే వెయిట్ చేయించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కొంతమంది షెహబాజ్కు తిట్టిపోస్తున్నారు. అంతసేపు వెయిటింగ్ అవసరమా అంటూ పాకిస్తానీయులు ట్రోలింగ్ చేస్తున్నారు.
షెహబాజ్ గేట్ క్రాసింగ్..
షెహబాజ్ వెయింట్ అనేది విమర్శల బారిన పడితే, ఆయన గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ మరింత చర్చకు దారి తీసింది. పుతిన్ ఎంతకూ రాకపోయేసరికి షెహబాజ్ నేరుగా పుతిన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడకు వెళ్లిపోయారు. ఆ సమయంలోటర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్తో సమావేశంలో ఉన్నారు. అయితే ఎదురుచూపులు చాలనుకున్న షెహబాజ్.. నేరుగా పుతిన్ ఉన్న దగ్గరకు వెళ్లిపోయారు. అలా వెళ్లి ఇలా వచ్చేసారు కూడా. అయితే అక్కడ ఏమైందనేది తెలియకపోయినా షెహబాజ్న వేచి ఉండండి అని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది పాక్ ప్రధానికి జరిగిన అవమానమే అయినా ఎటువంటి అనుమతి లేకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించి షెహబాజ్ ఇలా చేశారు. ఇది గేట్ క్రాసింగ్ కిందుకు వస్తంది.అసలు గేట్ క్రాసింగ్ అంటే ఏమిటి..?
అంతర్జాతీయ సంబంధాల్లో నాయకులు, ప్రతినిధులు కలిసే సమయంలో ప్రోటోకాల్ అనేది అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రోటోకాల్లో ప్రవేశ క్రమం, గ్రీటింగ్ విధానం, సీటింగ్ ఆర్డర్, ఫ్లాగ్ ప్రదర్శన వంటి అంశాలు ఉంటాయి. ఒక నాయకుడు ఆతిథ్యుడు ముందుగా ఆహ్వానించకముందే గేట్ దాటి ముందుకు వెళ్లడాన్ని గేట్ క్రాసింగ్ అంటారు.. ఇది షెహబాజ్ ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇది సాధారణ తప్పిదంగా మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా అంతర్జాతీయ అంశాలకు వచ్చేసరికి ఇవి చాలా ప్రాధన్యత సంతరించుకుంటాయి. ఆ క్రమంలోనే షెహబాజ్ గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ వైరల్గా మారిపోయింది.ఇలా జరగడం తొలిసారా?
ఇలా ఒక దేశ అధ్యక్షుడు వేరే వారితో సమావేశంలో ఉన్నప్పుడు మరో దేశ ప్రతినిధి.. ఇలా వెళ్లడం చాలా అరుద అనే చెప్పాలి. అంతర్జాతీయ సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ఇలా గేట్ క్రాసింగ్ చేయడం అనేది తొలిసారిగా జరిగిన ఘటనగానే కొందరు పేర్కొంటున్నారు.. సాధారణంగా నాయకులు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం వచ్చిన తర్వాతే ప్రవేశిస్తారు. కానీ షెహబాజ్ షరీఫ్ పుతిన్–ఎర్డోగాన్ సమావేశం జరుగుతున్న గదిలోకి నేరుగా వెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో మొదటి సారి పెద్దగా హైలైట్ అయిన ఘటన.గా మారింది,కొసమెరుపు..
ఇది షెహబాజ్ తెలిసే చేసేరా.. లేక పొరపాటును ఓపిక నశించి ఇలా చేశారనేది ఆయనకే తెలియాలి.ఇదీ చదవండి:
భారత్తో ట్రంప్ దాగుడు మూతలు..!
ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలను చూస్తే.. భారత్తో అమెరికా దూరం పెరిగిపోయిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరే కారణం. ఏ విషయాన్ని తెగేసి చెప్పకుండా భారత్-పాక్ల యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకున్న ట్రంప్.. మద్దతు విషయానికొచ్చేసరికి పాక్కే ప్రయారిటీ ఇచ్చారు. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్లను అమెరికాకు ఆహ్వానించడమే కాకుండా వారితో రాసుకుపూసుకుని తిరిగారు. ఇక్కడ ట్రంప్ ద్వంద్వ వైఖరి బయటపడింది.
భారత్పై ఆంక్షలే లక్ష్యంగా..
అదే సమయంలో భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించి అక్కసు తీర్చుకున్నారు. దీనిపై అమెరికాలో ఉన్న నిపణులు సైతం ట్రంప్ను హెచ్చరించారు కూడా. భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తే ఆ దేశంలో ఎన్నో దశాబ్దాల నుంచి సాగుతున్న మిత్రత్వం చెడిపోతుందని కూడా వివరించారు. దానివల్ల అమెరికాక ఒరిగేదేమీ లేకపోయినా మనమే దెబ్బతింటామని కూడా చెప్పారు. కేవలం భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని ఒక్క ఒక్క తలంపుతో 50శాతం సుంకాలను విధించారు ట్రంప్.ఇదిలా ఉంచితే, రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ఆంక్షలు విధించారు. రష్యా చమురును కొనడం ఆపాలనే భారత్ను చాలాసార్లే హెచ్చరించారు. అయితే దాన్న భారత్ పూర్తి సీరియస్గా తీసుకోగా పోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షడు పుతిన్.. భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. తాము భారత్కు సరఫరా చేస్తామని కచ్చితంగా చెప్పేశారు. మరొకవైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా వేరే దేశాలకు భారత్ దగ్గరవ్వడాన్ని ట్రంప్ సహించలేకపోతున్నారు.
మెక్సికో సుంకాల వెనుక ట్రంప్ హస్తం?
గత రెండు రోజుల క్రితం భారత దిగుమతులపై మెక్సికో 50 శాతం సుంకాన్ని విధించింది. దీనికి ఏవో కారణాలు చెప్పుకొచ్చింది. తమ దేశంతో పూర్తిస్థాయి వాణిజ్య సంబంధాలు లేని దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తున్నామంటూ స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా కూడా చేరింది. మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) లేని దేశాలన్నింటికీ ఈ సుంకాలు వర్తిస్తాయని చెప్పింది.అయితే వీటి వెనుక ఉన్నది ట్రంప్ అని పలు ఆరోఫలణలు వచ్చాయి.. వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ఇప్పటికే మెక్సికో సుంకాలపై స్పందించారు. ఇది ట్రంప్ చర్య కావొచ్చనే అనమానం వ్యక్తం చేశారు. దీన్ని పూర్తిగా కాదనలేం. అమెరికాకు అత్యంత మిత్ర దేశాల్లో మెక్సికో ఒకటి. మెక్సికోను పదే పదే పొగడ్తలతో ముంచెత్తం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది.
ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య ఒప్పందాలున్నాయి. గతంలో పలు సందర్భాల్లో మెక్సికో అధ్యక్షరాలు క్లాడియా షీన్బామ్ను అత్యంత సాహసిగా, గొప్ప నాయకురాలిగా అభివర్ణించారు ట్రంప్. ఇక మెక్సికోకు కూడా అమెరికాపై అంతే ప్రేమ ఉంది. ఈ కారణంగానే ట్రంప్ దాగుడు మూతలకు తెరలేపి భారత్కు ఏదో రకంగా నష్టం చేకూర్చాలని చూశారనేది నిపుణుల అంచనా.
ఇది ట్రేడ్ డైవర్షన్కు అడ్డుకట్టా.. ట్రంప్ అడ్డుకట్టా..?
భారత్, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు మెక్సికోకు దిగుమతి చేసే వస్తువులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. దీన్ని ట్రేడ్ డైవర్షన్ అంటారు.దీనికి అడ్డుకట్టవేయాలనే తలంపుతో మెక్సికో చేసినా, ఇందులో ట్రంప్ హస్తం ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారత్పై అమెరికా విధించిన సుంకాలపై అక్కడ ఎంపీల నుంచే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఇలా చేసే ఉంటారనేది మరో కోణంలో విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి:
భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం
Movies
టికెట్ రేట్ల పెంపు అనేది తెలంగాణలో పెద్ద జోక్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి రెండుసార్లు జరిగితే ఏదో పొరపాటు అనుకోవచ్చు. కానీ పదేపదే జరగడం చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ విషయంలో ఎందుకింత కన్ఫ్యూజన్ అనే సందేహం వస్తోంది. అసలు ప్రస్తుతం ఏం జరుగుతోంది? దీనికి పరిష్కారం లేదా?
టాలీవుడ్లో టికెట్ రేట్ల పెంపు చాన్నాళ్లుగా ఉన్నదే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం దీని గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. రీసెంట్ టైంలో జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గతేడాది డిసెంబరులో 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం మీకు తెలిసే ఉంటుంది. ఇది జరిగిన వెంటనే ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్కి అనుమతి ఇవ్వబోం, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోం అని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు.
కొన్నాళ్ల పాటు ప్రభుత్వం.. టికెట్ రేట్ల విషయంలో చెప్పిన మాటపై నిలబడింది. తర్వాతే మెల్లమెల్లగా సడలింపులు మొదలయ్యాయి. కొన్నాళ్ల ముందు పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశమిచ్చారు. ఈ విషయమై ఒకరు హైకోర్టుని ఆశ్రయించగా.. ప్రభుత్వంపై మొట్టికాయలు పడ్డాయి. సరే ఇకనైనా పాటిస్తారేమో అనుకుంటే.. తాజాగా 'అఖండ 2' విషయంలో ఏకంగా హైకోర్ట్ ఆదేశాల్నే ధిక్కరించారు.
ప్రీమియర్ల కోసం పెంచిన టికెట్ ధరల్ని పూర్తిగా తగ్గించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే నిర్మాతలు వీటిని పాటించలేదు. ఇదే విషయమై మరో పిటిషన్ వేయగా హైకోర్టు.. చిత్రబృందాన్ని ప్రశ్నించించింది. హైకోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాతలు డివిజన్ బెంచ్ని ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది.
'అఖండ 2' టికెట్ రేట్ల పెంపు గురించి తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా అధికారులు జీవో జారీ చేశారని, ఇకపై దర్శకనిర్మాతలు ఎవరూ తమ దగ్గరకు రావొద్దని అన్నారు. అయితే మంత్రికే తెలియకుండా జీవో జారీ చేసే అవకాశముందా? అనేది ఇక్కడ అర్థం కాని విషయం! ఇలా ప్రతిసారి 'టాలీవుడ్' విషయంలో తెలంగాణ ప్రభుత్వం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంది.
సరే 'అఖండ 2' విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుందాం. రాబోయేది సంక్రాంతి సీజన్. చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి చెప్పినట్లు ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండా ఉంటారేమో చూడాలి? లేదంటే మళ్లీ జీవో జారీ చేసి హైకోర్టుతో చెప్పించుకుంటారా అనేది చూడాలి?
ఏదేమైనా టికెట్ రేట్ల పెంపు విషయమై ఇండస్ట్రీ, ప్రభుత్వం ఒకచోట కూర్చుని ఓ క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. లేదంటే ప్రతిసారి ఇలా గందరగోళపడటమే అవుతుంది. టికెట్ రేట్ల పెంపు ఏమో గానీ ప్రేక్షకుడు క్రమక్రమంగా తెలుగు సినిమాకు దూరమవుతూనే ఉన్నాడు. థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఇదే నిజం. దర్శకనిర్మాతలు హీరోలకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో?
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)
శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.
సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.
(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)

బ్లాక్ డ్రస్లో మృణాల్.. డిసెంబరు జ్ఞాపకాల ఫొటోలు
సఫారీ ట్రిప్లో మాళవిక.. గ్లామరస్గా కనిపిస్తూ
ఫిన్లాండ్లో కలర్ఫుల్ ఆకాశంతో 'దృశ్యం' పాప
దుబాయి ట్రిప్ వీడియో పోస్ట్ చేసిన కృతిశెట్టి
టెన్నిస్ కోర్టులో గ్లామర్ చూపించేస్తున్న యుక్తి
'అఖండ 2' షూటింగ్.. దూడపిల్లతో హర్షాలీ మల్హోత్రా
'దండోరా' సినిమా టైటిల్ గీతాన్ని శనివారం విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతమందించాడు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల బాధలను తెలియజేసేలా సాగే ఈ పాట చాలా ఎమోషనల్గా ఉంది. తరాలు మారుతున్నాయి. చంద్రుడిపైకి మనిషి అడుగు పెట్టిన ఎన్నో ఏళ్లవుతుంది. అయినా కూడా ఈ అసమానతలు మాత్రం తగ్గటం లేదనేది ఈ పాటలోని భావం.
(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)
కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తీసింది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. డిసెంబర్ 23నే ప్రీమియర్స్ ఉండనున్నాయి.
(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్)
స్మిత పాడిన "మసక మసక చీకటిలో" పాట ఆమె కెరీర్లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సాంగ్గా గుర్తింపు పొందింది. - దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్కు నచ్చేలా అదే సాంగ్కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్ను విడుదల చేశారు. "మసక మసక చీకటిలో" పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. పాత పాటకు కొత్త రీమిక్స్ రూపం ఇచ్చి, యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికీ ఆమె సిగ్నేచర్ హిట్గా గుర్తించబడుతోంది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. గతంలో వీళ్లిద్దరూ 'గబ్బర్ సింగ్' చేశారు. అది అప్పట్లో పెద్ద హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ కోసం కలిశారు. ఇప్పటికే పవన్కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో తొలి గీతాన్ని లాంచ్ చేశారు.
(ఇదీ చదవండి: అందుకే సినిమాల్లో నటించడం మానేశాను: స్మిత)
'దేఖ్ లేంగ్ సాలా' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోని ఇప్పుడు రిలీజ్ చేశారు. బీట్ బాగానే ఉంది కానీ ఎక్కడో విన్నామే ఇది అనిపించేలా మ్యూజిక్ ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వచ్చే ఏడాది మార్చి లేదా వేసవిలో మూవీ రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు.
ఈ సినిమా విషయానికొస్తే.. తమిళ హీరో విజయ్ 'తెరి'కి ఇది రీమేక్ అని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ దర్శకనిర్మాతలు మాత్రం కొత్త స్టోరీతో చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజైతే తప్ప కంటెంట్ ఏంటనేది క్లారిటీ రాదు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ లేదు. రీమేక్ అనే రూమర్స్ దీనికి కారణం. అలానే దర్శకుడు హరీశ్ శంకర్ గత కొన్ని చిత్రాలు చాలావరకు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా మరో కారణమని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా తెలుగు సినిమా ట్రైలర్)
గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశంగా ఈ మూవీ ఉండనుంది. బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు.
పాప్ సింగర్ స్మిత ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ 2000ల్లో మాత్రం 'మసక మసక చీకటిలో..' అనే ఆల్బమ్ సాంగ్తో సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత పలు ఆల్బమ్ గీతాలు చేసింది. కాకపోతే రీసెంట్ టైంలో మాత్రం పెద్దగా బయట కనిపించట్లేదు. తాజాగా 'మసక మసక' అని సాగే కొత్త పాటతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైపోయింది. హైదరాబాద్లో ఈ సాంగ్ లాంచ్.. శనివారం సాయంత్రం జరిగింది.
(ఇదీ చదవండి: కాసుల కోసం హిందూధర్మం, దేవుళ్లను వాడేస్తున్న టాలీవుడ్)
ఈ కార్యక్రమంలో మాట్లాడిన స్మిత.. నటిగా ఎందుకు సినిమాలు చేయడం మానేశానో మరోసారి చెప్పుకొచ్చింది. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. 'గాయనిగా నా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు వెంకటేశ్ 'మల్లీశ్వరి'లో ఓ పాత్రలో నటించాను. అది మిస్ ఫైర్ అయింది. మనకు చెప్పేది ఒకటి అక్కడ ఉండేది ఒకటి. ఎందుకులే అని అప్పటినుంచి సినిమాలు చేయడం మానేశాను' అని స్మిత చెప్పుకొచ్చింది.
స్మిత సింగర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ నటి, యాంకర్, బిజినెస్ఉమన్ గానూ పేరు తెచ్చుకుంది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. ప్రస్తుతానికైతే మళ్లీ సింగర్గా రీఎంట్రీ ఇచ్చే బిజిలో ఉంది. ఈ సాంగ్ ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)
భారతదేశంలో దేవుడిపై భక్తి అనేది అత్యంత లోతైన, విస్తృతమైన ఆధ్యాత్మిక భావన. అందుకే సినిమాల రూపంలో చాలా ప్రాజెక్ట్లు వచ్చాయి. విజయం సాధించాయి. ఈ క్రమంలో తాజాగా అఖండ 2 కూడా అదే పాయింట్ మీద వచ్చింది. బాలయ్య అభిమానులు కూడా భక్తి, సనాతన ధర్మం మీద బాలయ్య పోరాటం అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారు.
దేవుడిని నిర్మలమైన మనస్సుతో ప్రార్థించడం, మోక్షం కోసం ఆరాధించడం భక్తి యొక్క మూలం. విశ్వాన్ని సృష్టించి నడిపే, శాసించే అజ్ఞాత శక్తే దైవం అని మన శాస్త్రాలు వివరణ ఇస్తున్నాయి. భగవంతుడే సర్వోన్నతుడని భక్తుడు భావించాలి. ఈ విషయంలో అనుమానాలు వ్యక్తం చేయకూడదు. కానీ ,ఇందులోకి మతం చొచ్చుకు రావడంతో సమాజంలో వైశ్యామ్యాలు ఏర్పడుతున్నాయి. భక్తి అంటే దైవంతో వ్యక్తిగత అనుబంధం, ప్రేమను చూపడం. మతం అంటే దైవాన్ని పూజించే పద్ధతులు, నమ్మకాలు, సంప్రదాయాల వ్యవస్థ అని తెలిసిందే. కానీ, నేటి దర్శకనిర్మాతలు డబ్బు కోసం ఈ రెండిటిని జోడించి సినిమాలుగా తీయడమే అసలు సమస్య వస్తుంది. భక్తి సినిమాలు పెరగడం వల్ల ప్రజల్లో మరింత మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

భక్తి సినిమాలకు భారీ డిమాండ్
భారత్లో భక్తి సినిమాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతా కథల ఆధారంగా రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులు వీటిని ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. భక్తి సినిమాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. భక్తి సినిమాలు ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని తాకుతూ.. బాక్సాఫీస్ వద్ద కూడా బలమైన విజయాలు సాధిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురాణ, ఇతిహాస ఆధారిత సినిమాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఈ జానర్కు మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.భక్తిని డబ్బుగా మలుచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ
భక్తి సినిమా అంటేనే చాలా ప్రత్యేకం.. అందుకే సినిమా పరిశ్రమ టార్గెట్ భక్తి మార్గమే అయింది. పురాణ కథలను తమకు అనుగుణంగా మార్చడం లేదా తప్పుగా చూపించడం వివాదాలకు దారితీస్తుంది. ఇలాంటి వివాదంలో చాలా సినిమాలు చిక్కుకున్నాయి. భక్తి సినిమాలు ఎప్పటికీ ఆధ్యాత్మికతను, విశ్వాసాన్ని గౌరవించేలా ఉండాలి. అప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. మతసామరస్యం, కులవ్యవస్థ వ్యతిరేకత, ప్రజలకు ఆధ్యాత్మికత చేరువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, దర్శకులు ముందుకు రావాలి.
సినిమా పేరుతో దందా
ఒకప్పుడు ప్రజల్లో భక్తిని నింపే చిత్రాలు వచ్చేవి.. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, కన్నప్ప శ్రీ రామ రాజ్యం, దేవుళ్లు, షిరిడి సాయి వంటి సినిమాలకు ఎవరూ పేరు పెట్టరు కూడా.. అయితే, 1990 దశకం ముందు ఎక్కువగా భక్తి చిత్రాలే ప్రేక్షకులను మెప్పించాయి. అప్పట్లో వారు భక్తితో పరవశించారు. అయితే, ఇప్పడు భక్తి పేరుతో వచ్చే సినిమాలు వివాదాలకు తావిస్తున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాలను వక్రీకరించడమే కాకుండా వాటికి కాస్త కల్పితాలను జోడించి నిర్మిస్తున్నారు.అఖండ భక్తి సినిమానేనా.. ఏం చెబుతుంది?
రీసెంట్గా మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు అందించాడు. తన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాలి. కానీ, పూర్తిగా భక్తితో నిండిన సినిమాను మనోళ్లు పెద్దగా ఆదరించలేదు. ప్రస్తుతం మన సినిమా ట్రెండ్ సనాతన ధర్మం, దేశభక్తి, యాక్షన్ టచ్ ఇలా ఏదో ఒక పాయింట్ ఉంటే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. కానీ, అఖండలో అన్నీ కలిపి కొట్టేశారు. బాలయ్య పాత్ర మొత్తం డివోషినల్గా ఉంటుంది. కానీ, మాస్ ఆడియన్స్ కోసం ఐటమ్ సాంగ్ను ఇందులో చేర్చారు. కేవలం విజిల్స్ కోసమే దేవుడి పేరును ఉపయోగించారు. దేవుళ్లను ఇలా ఎలివేషన్స్ కోసం దర్శకులు ఉపయోగించడం ఏంటి అనే సందేహాలు రావడం సహజం.అఖండ2లో బాలయ్య పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ, ప్రేక్షకుల చేత విజిల్స్ వేపించేందుకు హనుమాన్ను గ్రాఫిక్స్ చేసి సీన్ క్రియేట్ చేశారు. అక్కడ సీన్లో స్కోప్ లేకున్నా సరే హనుమాన్ను చేర్చడం విడ్డూరంగానే ఉంటుంది. అఖండలో శివుడి పాత్ర అదుర్స్.. తన భక్తురాలి కోసం భగవంతుడే దిగొస్తాడని చూపించిన తీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.
రెగ్యులర్ రొటీన్ ప్రేమకథలకు సినిమాల్లో కాలం చెల్లింది. అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీస్ వస్తుంటాయి. అలాంటి ఓ మూవీనే 'ఆరోమలే'. గత నెలలో తమిళంలో రిలీజై హిట్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తీసిన ఈ చిత్రంలో కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లు. ఇప్పుడు ఇది హాట్స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: రూ. 99కే సినిమా.. కొత్త ప్రయోగం!)
కథేంటి?
అజిత్ (కిషన్ దాస్) మిడిల్ క్లాస్ కుర్రాడు. టీనేజీలో ఓ ప్రేమకథా సినిమా చూసి, తనకు కూడా ఇలాంటి లవ్ స్టోరీనే కావాలని ఫిక్స్ అయిపోతాడు. స్కూల్లో ఉన్నప్పుడు స్మృతి, కాలేజీలో మేఘ, పెద్దయ్యాక స్నేహ(మేఘా ఆకాశ్)ని ప్రేమిస్తాడు. కానీ వాళ్లు పట్టించుకోరు. తీరా చదువు పూర్తయిన తర్వాత తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా ఓ మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ అంజలి(శివాత్మిక రాజశేఖర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెనే తనకు టీమ్ లీడర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఆమెకు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారం అనుకునే టైపు. ఇలా ప్రేమ విషయంలో భిన్నమైన ఆలోచనలు ఉన్న వీళ్లిద్దరి జీవితంలో ఏం జరిగింది? ప్రేమలో ఎందుకు పడ్డారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?
ప్రేమ అనే దానికి సరైన డెఫినిషన్ అంటూ ఏం లేదు. ఎవరికి వాళ్లు స్వయంగా అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని అర్థం చేసుకోవడం కష్టం. అదే ప్రేమలో ఉన్న మహత్తు. పెళ్లి చేసుకోవద్దని ఎవరైనా చెబితే వింటారేమో గానీ ప్రేమలో పడొద్దని చెబితే ఎవరూ వినరు. అలా ప్రేమ కోసం తపించే ఓ యువకుడి స్టోరీనే ఈ సినిమా.సినిమా గురించి చెప్పాలంటే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. రెగ్యులర్ ప్రేమకథలతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంది. రెండు గంటల సినిమాలో ప్రేమ, ఎమోషన్, కామెడీ ఇలా అన్ని ఫెర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. కాకపోతే క్లైమాక్స్ మాత్రం హీరోహీరోయిన్ కలవాలి అని ఏదో హడావుడిగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం మూవీ మరో లెవల్లో ఉండేది.
థియేటర్లో ఓ ప్రేమకథా సినిమా చూసి లవ్ అంటే బయట కూడా ఇలానే ఉంటుందని హీరో అనుకోవడం.. తర్వాత స్కూల్, కాలేజీ లైఫ్లో ప్రేమలో పడటం.. కనీసం వ్యక్తపరిచే అవకాశం రాకుండా అవి ముగిసిపోవడం ఇలా తొలి 20 నిమిషాల్లో చకచకా సీన్లన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అంజలి పనిచేసే మ్యాట్రిమోనీ కంపెనీలో అజిత్ చేరతాడో అక్కడి నుంచి సినిమాలో అసలు కథ మొదలవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
ఫస్టాప్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్కి వచ్చేసరికి హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్తో పాటు వీటీవీ గణేశ్ ఎపిసోడ్, హీరో తల్లి గతం ఎపిసోడ్ ఇలా డిఫరెంట్ లేయర్స్ చూపిస్తారు. స్టోరీ నుంచి సైడ్ అవుతున్నారేమో అనిపించినా చివరకొచ్చేసరికి హీరోహీరోయిన్ని కలపాలి కాబట్టి కలిపేశాం అన్నట్లు అనిపించింది. ఇలా ఒకటి రెండు కంప్లైంట్ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ చూశాం అనిపిస్తుంది.
చెప్పాలంటే ఇది చాలా సింపుల్ కంటెంట్.. బడ్జెట్ పరంగా చూసినా చిన్న సినిమా. కానీ స్టోరీలోని పాయింట్ బాగుంది. తెచ్చిపెట్టుకున్నట్లు కాకుండా సీన్లన్నీ చాలా సహజంగా ఉంటాయి. జీవితంలో ఓదార్చేవాళ్లు ఉన్నప్పుడు ఒంటరిగా బ్రతకడంలో అర్థం లేదనే మెసేజ్ కూడా బాగుంది. పేరుకే ప్రేమకథ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్స్ చేసే కామెడీ కూడా ఆకట్టుకుంది.
ఎవరెలా చేశారు?
అజిత్ పాత్రలో కిషన్ దాస్ యాక్టింగ్ బాగుంది. అంజలి పాత్రలో శివాత్మిక రాజశేఖర్ బాగా చేసింది. మిగిలిన వాళ్లలో వీటీవీ గణేష్, తులసి పాత్రలు అసలెందుకు ఉన్నాయి అని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కానీ కథని మలుపు తిప్పే పాత్రల్లో వీళ్లిద్దరూ ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ అయింది. పాటల్లో మ్యూజిక్ బాగున్నా సాహిత్యం బాగోలేదు.డైరెక్టర్ సారంగు త్యాగు గురించి చెప్పుకోవాలి. సినిమాటిక్ లిబర్టీ అని ఏది పడితే అది తీసేయలేదు. సాదాసీదాగా ప్రేమ ఎలా ఉంటుందో అలానే చూపించాడు. చాలామంది ఈ పాత్రల్లో తమని తాము చూసుకునేలా తీశాడు. ఇతడికి టెక్నికల్ టీమ్, యాక్టర్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఓవరాల్గా చెప్పుకొంటే ఈ సినిమాని కుటుంబంతో కలిసి హాయిగా చూడొచ్చు.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా)
ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.
రాంబాయికి కలిసొచ్చిన 99
నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.రాంబాయి బాటలో మోగ్లీ..
రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్కి వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే పైరసీపై ఆసక్తి!
కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు.అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారు
అందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి.
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్లో ఆకట్టుకుంటోంది.
'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ విజయాల జోరు కొనసాగించింది. 2025లో హిందీ సినిమాలు ఆధిపత్యం కొనసాగించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్గానే మిగిలాయి. అయితే, ఈ ఏడాది కాస్త పర్వాలేదు. చాలా సినిమాలు మినిమమ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినవే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే ఛావా వంటి సినిమాతో ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సైయారా కూడా రూ. 600 కోట్ల మార్క్ను దాటేసింది. గతంలో అక్కడ టాలీవుడ్ సినిమాలు కల్కి, పుష్ప-2 వంటి సినిమాలు సత్తా చాటాయి. అయితే, ఈసారి మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు.
డిసెంబర్ నెలలో కూడా బాలీవుడ్ చిత్రాలు మెప్పిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ. 300 కోట్ల మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ.180 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కేవలం డిసెంబర్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇప్పటికే రెండు ఉంటే.. మరోకటి భారీ అంచనాలతో రానుంది.
క్రిస్మస్ వీకెండ్లో డిసెంబర్ 31న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ విడుదల కానుంది. అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో రూమిగా అనన్య, రే పాత్రలో కార్తిక్ కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో బాలీవుడ్లో తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సౌత్ నుంచి కాంతార-2 మాత్రమే బాలీవుడ్లో సత్తా చాటింది. 2025లో సౌత్ సినిమాలను వెనక్కి నెట్టిసి తన పట్టును హిందీ సినిమా నిలిబెట్టుకుంది.
ఈ వారం ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', అల్లరి నరేశ్ '12ఏ రైల్వే కాలనీ'తో పాటు డబ్బింగ్ చిత్రాలైన బ్రాట్, ఆరోమలేతో పాటు తెలుగు వెబ్ సిరీస్ త్రీ రోజెస్ రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు హారర్ మూవీ కూడా సడన్గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు.
(ఇదీ చదవండి: ‘మోగ్లీ’మూవీ రివ్యూ)
శ్రీజిత్, నిష్కల, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'చెరసాల'. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే చిన్న సినిమా కావడం, యాక్టర్స్ ఎవరూ పేరున్న వాళ్లు కాకపోవడంతో ఇది వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది.
'చెరసాల' విషయానికొస్తే.. వంశీ (శ్రీజిత్), ప్రియ (నిష్కల) కాలేజీ స్టూడెంట్స్. కలిసి చదువుకున్నప్పుడే ప్రేమలో పడతారు కానీ బయటకు చెప్పుకోరు. కాలేజీ చదువులు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి వీళ్లిద్దరూ ఓ ట్రిప్కి వెళ్తారు. ఓ బంగ్లాలో ఉంటారు. కానీ ఈ భవంతిలో ఓ ప్రేతాత్మ ఉంటుంది. అసలు అక్కడ ప్రేతాత్మ ఎందుకు ఉంది. అక్కడికి వచ్చిన వాళ్లని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? చివరకు వంశీ, ప్రియ ఎలా బయటపడ్డారనేది స్టోరీ.
(ఇదీ చదవండి: నటి పాకీజాకు ఆశ్రయం కల్పించిన కోనసీమ వాసి)
కథ రాసుకోవడంతో సినిమా అయిపోదు, అక్కడే అసలు కథ మొదలువుతుంది. ఆ కథలోని పాత్రల ఎంపిక దగ్గరే దర్శకనిర్మాతలు మల్లగుల్లాలు పడుతుంటారు. విక్టరీ వెంకటేశ్ "ప్రేమంటే ఇదే రా" సినిమా విషయంలో ఇదే జరిగింది. జయంత్ సి. పరంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది.
ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్య
ఇందులో వెంకీ సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను తీసుకున్నారు. అయితే ప్రీతి కంటే ముందు చాలామందినే సంప్రదించారు. ఆ విషయం గురించి జయంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఫస్ట్ ఐశ్వర్యరాయ్ను అనుకున్నాం. తనకు కథ బాగా నచ్చి డేట్స్ కూడా ఇచ్చింది. కానీ అప్పటికే తన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తి
దీంతో ఆమె ఐరన్ లెగ్ అని పక్కన పెట్టాం. అలా తనను వద్దని వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్లాం. అమీషా పటేల్, రేణూ దేశాయ్ను స్క్రీన్ టెస్ట్ చేశాం. భూమిక చావ్లా, రీమా సేన్.. ఇలా చాలామందిని అనుకున్నాం. ఇంకో మూడునాలుగురోజుల్లో ముహూర్తం ఉందనగా రామానాయుడు స్టూడియోలో ఒంటరిగా కూర్చుని.. ఎవర్ని హీరోయిన్గా తీసుకోవాలి? అని తల పట్టుకున్నాను.ఐదు నిమిషాల్లో హీరోయిన్ ఫిక్స్
సరిగ్గా అప్పుడే అనిల్ కపూర్ వచ్చి పలకరించాడు. నా సమస్య చెప్పాను. ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన ప్రీతి జింటాను తీసుకోమని సలహా ఇచ్చాడు. తర్వాతి రోజే తనతో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆమెతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే తనే నా మూవీ హీరోయిన్ అని ఫిక్సయ్యాను అని చెప్పాడు. అలా ప్రేమంటే ఇదే రా మూవీతో ప్రీతి జింటా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.రీరిలీజ్ వాయిదా
1998లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్గా కూడా చాలా పెద్ద హిట్టయింది. రమణ గోగుల.. నైజాం బాబులు, నాలో ఉన్న ప్రేమ వంటి హిట్ సాంగ్స్ అందించారు. అన్నీ కలిసొస్తే నేడు (డిసెంబర్ 13న) ప్రేమంటే ఇదేరా రీరిలీజ్ అయ్యేది. కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది.
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా టైటిల్ లాంఛ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ - సాయిబాబా ఆశీస్సులు ఇస్తున్న ఫొటో ఒకటి మా ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఉంది. ఆ ఫొటో చూసిన ఇన్సిపిరేషన్ తో "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమా స్క్రిప్ట్ మొదలైంది. ఈ సినిమా పోస్టర్ మీద ఒక సాయిబాబా ఉంటే మరో సాయిబాబాలా నాకు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు దశరథ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సహకారం అందించారు. నేను గతంలో మిస్టరీ అనే మూవీ చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియా ప్రమోషన్స్ చేశాను. ఆ టైమ్ లోనే దశరథ్తో కలిసి వర్క్ చేసే అవకాశం వచ్చింది. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే మిగతా పార్ట్ పూర్తి చేసి మూవీని విడుదలకు తీసుకొస్తాం’ అన్నారు.
హీరోయిన్ ఏకాదంతాయ సిరి మాట్లాడుతూ - చిన్న సినిమాలోకి హీరోయిన్స్ ను తీసుకున్నారంటే ఏదో గ్లామర్ షో చేయిస్తారు అనుకుంటారు. కానీ సాయికృష్ణ దర్శకుడిగా ఒక సిన్సియారిటీ చూపించారు. సినిమాను ఎంత ఫాస్ట్ గా రూపొందించారంటే మేమంతా ఆశ్చర్యపోయాం. ఇంత స్పీడ్ గా సినిమా చేయొచ్చా అనుకున్నాం. "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుందని నమ్ముతున్నాం అన్నారు.
నిర్మాత తల్లాడ వెంకన్న మాట్లాడుతూ - నన్ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది సాయికృష్ణ. నేను హీరోగా ఒక్కడే అనే మూవీని చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్స్ రిలీజ్ చేశాను. ఇప్పుడు "మ్యాజిక్ మూవ్ మెంట్స్" (మీరు అనుకున్నది కాదు) సినిమాను మంచి కమర్షియల్ అంశాలతో నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో నేనొక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. తల్లాడ సాయితో ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమా కూడా నిర్మించబోతున్నా అన్నారు.
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..
అఖిల్ - జైనబ్
కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరు
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిల
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీ
చిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్
సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్
బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా
23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్
కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు.
ఒకప్పటి సినీ నటి వాసుకి (పాకీజా) కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె మోహన్బాబు హిట్ సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో టాలీవుడ్కు పరిచయమయ్యారు. ఈ మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, మేజర్ చంద్రకాంత్, బ్రహ్మ ఇలా అనేక సినిమాలో ఛాన్స్ దక్కింది. దీంతో పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.
అయితే, ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సోషల్మీడియాలో కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆత్రేయపురంలోని శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమంలోనే పాకీజా ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో పాకీజా కొంత కాలంగా ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే ఆమె ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం నుంచి పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆమెకు కాస్త ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని కేశవరావు కోరారు. ఇప్పటికే తన వద్ద చాలామంది వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.తనను తెలుగువారికి పరిచయం చేసిన మోహన్బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిదని పాకీజా అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మంచు విష్ణు తన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. తన కళ్లకు శస్త్రచికిత్స చేయించారని ఆమె తెలిపారు. పాకీజాకు ఇప్పటికే చిరంజీవి ఆర్థిక సాయం చేశారనే విషయం తెలిసిందే.
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ "మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’.
సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ గారు మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ గారు అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి.
ఇటీవల విడుదల అయినా 'ఇలా చూసుకుంటానే' పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు మరియు టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. డిసెంబర్ 25న విడుదల అవుతుంది తప్పక చూడండి" అని తెలిపారు.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2: తాండవం. ఇది 2021లో వచ్చిన హిట్ సినిమా అఖండకు సీక్వెల్గా తెరకెక్కింది. దైవభక్తిపై ఆధారపడి తీసిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే సినిమాలో కొన్ని సీన్లు లాజిక్తో సంబంధం లేకుండా మరీ ఓవర్గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అఖండ 2లో శివుడు
అయినా బాలయ్య డైలాగులు, యాక్షన్ 'అతి' లేకుండా ఉండవని అందరికీ తెలిసిందే! అయితే సినిమాలో శివుడి పాత్ర మాత్రం బాగుందంటున్నారు. అఖండ తల్లి మరణించినప్పుడు కైలాసంలోని శివుడు భువిపైకి వచ్చి ఆమె చితికి అగ్ని సంస్కారం చేస్తాడు. ఈ సన్నివేశాన్ని బోయపాటి ఎంతో భక్తిభావంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ ముఖ్యమైన సీన్లో శివయ్యగా మెప్పించిన ఆ నటుడెవరు? అని నెట్టింట జనం ఆరా తీస్తున్నారు.హిందీ సీరియల్స్లో ఫేమస్
అతడు మరెవరో కాదు హిందదీ బుల్లితెర నటుడు తరుణ్ ఖన్నా. 2015లో ప్రసారమైన సంతోషి మా సీరియల్లో తొలిసారి మహాశివుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాధాకృష్ణ, రామ్ సియాకె లవ్కుశ, నమః, దేవి ఆది పరాశక్తి, శ్రీమద్ రామాయణ్, వీర్ హనుమాన్: బోలో బజ్రంగ్ బలీకీ జై, కాల భైరవ్ రక్ష శక్తిపీఠ్ కే వంటి పలు సీరియల్స్లో ఈశ్వరుడిగా వేషం కట్టి మెప్పించాడు.పర్ఫెక్ట్!
అందుకే ఈ పాత్రకు తనైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించినట్లు తెలుస్తోంది. దర్శకుడి అంచనా నిజమైంది. తరుణ్ ఖన్నా తెరపై అడుగుపెట్టిన ప్రతి సీన్ వెండితెరపై బాగా పేలిందని టాక్ వినిపిస్తోంది. తరుణ్ ఖన్నా (Tarun Khanna).. చంద్రగుప్త మౌర్య సీరియల్లో చాణక్య పాత్ర పోషించాడు.చదవండి: 25 ఏళ్లుగా డిన్నర్కే వెళ్లలేదంటున్న బాలీవుడ్ స్టార్
'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేశాయి. అధికారికంగా 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. టీడీపీకి చెందిన ఒక యూట్యూబర్ చెప్పినట్లు 3 కోట్ల టికెట్లు తెగలేదు. అది కూడా కేవలం హైదరాబాద్లో అని చెప్పడం మరీ అశ్చర్యాన్ని కలిగించే అంశమే అని చెప్పాలి. ఒకవేళ ఇదే నిజమైంటే టికెట్ ధర రూ. 100 ఉన్నా కూడా మూడు వందల కోట్లు వచ్చేవి. పుష్ప-2 రికార్డ్ కూడా దాటేది.. ఇలాంటి మ్యాజిక్లు ఏమీ జరగవని తెలిసిందే.
కానీ, మెగా హీరోలను ట్యాగ్ చేస్తూ మా బాలయ్య రేంజ్ ఇదీ అంటూ ఆ వీడియోను సోషల్మీడియాలో కొందరు షేర్ చేయడం విశేషం. అయితే, తాజాగా కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఫేక్ ప్రచారం ఎందుకు అంటూ పోస్టులు పెడుతున్నారు.

అఖండ2 ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ 59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్ షోలతో కలిపి ఈ కలెక్షన్స్ అన్నట్లు ఒక పోస్టర్ను విడుదల చేశారు. సాక్నిల్క్ వెబ్సైట్ ప్రకారం అఖండ సుమారు రూ. 36 కోట్ల నెట్ రాబట్టినట్లు పేర్కొంది. అంటే అధికారికంగా ప్రకటించిన గ్రాస్ కలెక్షన్స్కు సమానంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.75 కోట్లు, హిందీలో రూ. 50 లక్షలు, కేరళలో రూ. 3 లక్షలు, తమిళనాడులో రూ. 1.13 కోట్లు మాత్రమే ఈ మూవీ రాబట్టింది.
The DIVINE ROAR is heard LOUD & CLEAR 💥💥#Akhanda2 collects a gross of 59.5 CRORES+ on Day 1 (including premieres), making it the biggest opener for God of Masses #NandamuriBalakrishna ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/8l5WolzzT6#Akhanda2Thaandavam… pic.twitter.com/YpXzF1xRyE— 14 Reels Plus (@14ReelsPlus) December 13, 2025
NRI
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్కోస్ట్లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.
ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్గా పనిచేయనున్నారు.
కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.
అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.
అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది.
Telangana
సాక్షి, మెదక్: పెద్దశంకరంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది.
మృతుల్లో దంపతులు సహా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన మృతులు లింగమయ్య, సాయమ్మ, మానస, సాయిగా గుర్తించారు.
సాక్షి, హైదరాబాద్: రామేశ్వరం కేఫ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ మధ్యాహ్నం(డిసెంబర్ 13, శనివారం) రామేశ్వరం కేఫ్ రుచులను ఆస్వాదించారు. అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి అఖిలేష్ యాదవ్ తెలుసుకున్నారు. అఖిలేష్కు కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు.


రామేశ్వరం కేఫ్ యజమాని శరత్.. ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రామేశ్వరం కేఫ్లో లంచ్ అనంతరం, అఖిలేష్ యాదవ్, కేటీఆర్ అక్కడి నుండి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు.

హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతంలో నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.వివాహానంతరం యశ్వంత్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్కు వచ్చి, భార్య జ్యోతి కలిసి మూసాపేట్లో నివాసం ఉంటున్నాడు. యశ్వంత్ ఓ ప్రైవేటు సంస్థ అయిన మెడ్ప్లస్లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో మనస్తాపానికి గురైన చందన జ్యోతి నిన్న(శుక్రవారం) రాత్రి బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది.
ఈ విషయం గమనించిన భర్త యశ్వంత్ 108కి ఫోన్ చేయగా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు .

సాక్షి, హన్మకొండ: బీజేపీ నేత ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ బండి సంజయ్ PRO సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
నేను బీజేపీ పార్టీ ఎంపీని. నేను కూడా కొన్ని పోస్టులు చూశాను. అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అసలు అవగాహన ఉన్నోడు అలా పోస్టులు పెడతాడా? ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తేల్చుకుంటారు. వీటిపైన పార్టీ తేలుస్తుంది.. టైమ్ విల్ డిసైడ్. ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. రెండో, మూడో విడత ఎన్నికలు అయ్యాక జరిగిన పరిణామాలన్నీ అధిష్ఠానానికి చెప్తానని ఈటెల పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై ఈటెల అసహనం వ్యక్తం చేయడం, పార్టీ లోపల విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో కోల్కత్తా స్టేడియంలో జరిగిన పరిస్థితుల దృష్టా ఉప్పల్ స్టేడియంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్చలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో, ఉప్పల్ స్టేడియం వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది.కోల్కత్తా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తం.
కోల్కత్తా ఘటన కారణంగా ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాల మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. మెస్సీ పర్యటన దృష్ట్యా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. జెడ్ కేటగిరి భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించినట్టు చెప్పారు. కాగా, 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మరోవైపు.. మెస్సీ వస్తున్న నేపథ్యంలో ఫలక్నామా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
మరోవైపు.. మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూశారు. ఇలాంటి సమయంలో కోల్కత్తా స్టేడియంకు వచ్చిన మెస్సీ.. అలా వచ్చి.. ఇలా స్టేడియం నుంచి వెళ్లిపోవడాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి తమ అసహనం వ్యక్తంచేశారు. దీంతో, కోల్కత్తాలోని స్టేడియంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Kolkata, West Bengal: Angry fans vandalise the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event
A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible event. He came for just 10 minutes. All the leaders and ministers surrounded him. We couldn't see… pic.twitter.com/a3RsbEFmTi— ANI (@ANI) December 13, 2025
#WATCH | Kolkata, West Bengal: Angry fans resort to vandalism at the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event.
Star footballer Lionel Messi has left the Salt Lake Stadium in Kolkata.
A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible… pic.twitter.com/TOf2KYeFt9— ANI (@ANI) December 13, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా: చింతల్ఠాణా ఓటర్లు ఎన్నికల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ప్రచార సమయంలోనే గుండెపోటుతో మరణించాడు. అయితే ఎన్నికల్లో మరణించిన వ్యక్తికే ఓట్లు వేసి గ్రామస్తులు గెలిపించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చెర్ల మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 3న గుండెపోటుతో మరణించాడు. కానీ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆ ఊరి ఓటర్లు భారీ మెజార్టీతో చనిపోయిన వ్యక్తి మురళిని గెలిపించారు. దీంతో సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం నెలకొంది.
బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చిన ఓట్లు..
చింతల్ఠాణా గ్రామపంచాయతీకి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బడుగు శ్రీనివాస్కు 40, ఇండిపెండెంట్ మంత్రి రాజలింగంకు 160, బీజేపీ బలపరిచిన సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. నోటాకు 5, చెల్లని ఓట్లు 44 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. ఉపసర్పంచ్గా గొట్ల కుమార్యాదవ్ ఎన్నికయ్యారు.అయోమయంలో అధికారులు
పోటీ చేసిన వ్యక్తి మరణిస్తే.. శాసనసభ ఎన్నికలు అయితే వాయిదా పడుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించారు. అప్పటికే ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంలో ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి గుర్తును మార్పు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ముందుగానే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు కావడంతో ఏమీ చేయలేక అధికారులు నోటాతో కలిపి ఆరు గుర్తులున్న బ్యాలెట్పత్రంతో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సానుభూతి పవనాలు వీచి చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాశారు. సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఉన్న అభ్యర్థుల్లో రెండో స్థానం పొందిన వ్యక్తికి సర్పంచ్గా అవకాశం ఇస్తారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్నారు.
National
శబరిమల సన్నిధానం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల గుంపుపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఇవాళ సాయంత్రం(డిసెంబర్ 13, శనివారం) 6:10 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా తొమ్మిది మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదానికి గురైన ట్రాక్టర్ వ్యర్థాలను తీసుకెళ్తోంది. భారీ వర్షం కారణంగా ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకుపోయింది. సన్నిధానం పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రికి రిఫర్ చేశారు. క్షతగాత్రులందరినీ పంబలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంట్పై ఉగ్రమూకలు విరుచుకుపడి 24 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై జరిగిన ఆ భయానక దాడిలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజాస్వామ్య దేవాలయాన్ని రక్షించుకున్న వీర జవాన్లను యావత్ దేశం స్మరించుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో అమరవీరులకు ఘన నివాళులరి్పంచారు.
ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్లోకి చొరబడేందుకు యతి్నంచగా పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసులు వారిని నిలువరించారు. ఉగ్రవాదులెవరినీ లోపలికి వెళ్లనీయలేదు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సరీ్వస్ సిబ్బంది, ఒక తోటమాలి, టీవీ జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంట్ భవన ప్రాంగణంలోనే మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఉపరాష్ట్రపతి, మోదీ, రాహుల్, సోనియా నివాళి
పార్లమెంట్ హౌస్ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి వీర జవాన్లకు సెల్యూట్ చేశారు.
ధైర్యసాహసాలకు సలాం: ప్రధాని మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ’2001లో పార్లమెంట్పై జరిగిన దాడిలో ప్రాణత్యాగం చేసిన అమరులను దేశం నేడు స్మరించుకుంటోంది. ఆనాడు వారు చూపిన ధైర్యం, అప్రమత్తత, కర్తవ్య దీక్ష అమోఘం. సంక్షోభ సమయంలో వారు ప్రదర్శించిన తెగువకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’అని కొనియాడారు.
ఉగ్రవాదంపై పోరుకు పునరంకితమవుదాం: రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ఎక్స్’వేదికగా స్పందిస్తూ.. ’2001లో పార్లమెంట్ను రక్షించుకునే క్రమంలో ప్రాణాలరి్పంచిన వీరనాయకులకు దేశం సెల్యూట్ చేస్తోంది. వారి త్యాగం మన జాతీయ భావనను ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. అమరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది. ఈ రోజున ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా పునరంకితమవుదాం’అని సందేశం ఇచ్చారు.
కమలేష్ కుమారికి సీఆర్పీఎఫ్ నివాళి
ఉగ్రవాదులను అడ్డుకోవడంలో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి, మరణానంతరం ’అశోక చక్ర’పురస్కారం అందుకున్న సీఆరీ్పఎఫ్ కానిస్టేబుల్ కమలేష్ కుమారికి సీఆరీ్పఎఫ్ ప్రత్యేక నివాళులర్పించింది. ఆమె చూపిన తెగువ ’సదాస్మరణీయం’అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతి సార్వభౌమాధికారంపై జరిగిన దాడిని తిప్పికొట్టిన వీరుల త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
కోల్కతా, సాక్షి: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.
టికెట్ డబ్బులు వాపసు
మరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp
— ANI (@ANI) December 13, 2025
దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.
ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.
ఎన్డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్లోనూ జయకేతనం ఎగురవేసింది.
అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి.
రాశి కంటే వాసి ముఖ్యమని మన పెద్దలు అంటుంటారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనేది దీని అర్థం. ఎంత పని చేశామనే దానికంటే ఎంత బాగా చేశావన్నదే ముఖ్యం. చదువు, ఉద్యోగాల్లో ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే గ్రాడ్యుయేట్లే ఎక్కువగా విజయం సాధించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఐదు సంవత్సరాల డేటాను విశ్లేషిస్తే.. పీజీ చేసిన వారి కంటే డిగ్రీ పట్టభద్రులే ఎక్కువగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయినట్టు తేలింది. ప్రణాళిక ప్రకారం ప్రిపేరయితే బ్యాచిలర్ డ్రిగీతోనే సివిల్స్ సాధించొచ్చని దీని ద్వారా నిరూపితమవుతోంది. యూపీఎస్సీ సివిల్ పరీక్షల్లో (UPSC CSE) గత మూడేళ్లలో మహిళల ఉత్తీర్ణత రేటు కూడా గణనీయంగా పెరిగింది. సబ్జెక్టుల వారీగా చూసుకుంటే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది.
లోక్సభలో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023లో సివిల్స్ పాసైన అభ్యర్థుల్లో 75% మందికి కేవలం బ్యాచిలర్ డిగ్రీ మాత్రమే ఉంది. మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు 25% మంది ఎంపికయ్యారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు మొత్తం 4,655 మంది అభ్యర్థులు సివిల్స్కు ఎంపికయ్యారు. వీరిలో 3,520 మంది గ్రాడ్యుయేట్లు (సుమారు 76%) ఉన్నారు. ఉన్నత విద్యార్హతలు లేకపోయినా.. పటిష్టమైన సన్నద్ధత, సరైన ప్రణాళిక ఉంటే సివిల్స్ పరీక్షలో విజయం సాధించవచ్చని దీన్నిబట్టి అర్థమవుతోంది.
గ్రాడ్యుయేట్ల హవా ఇలా..
2022: 1,020 మందిలో 765 మంది గ్రాడ్యుయేట్లు
2021: 748 మందిలో 585 మంది గ్రాడ్యుయేట్లు
2020: 833 మందిలో 650 మంది గ్రాడ్యుయేట్లు
2019: 922 మందిలో 672 మంది గ్రాడ్యుయేట్లుఅమ్మాయిలు పెరుగుతున్నారు
సివిల్స్లో మహిళల విజయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లలో మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత రేటు పెరిగింది. 2019లో 24 శాతం మంది మహిళలు ఉత్తీర్ణత సాధించగా, గత మూడేళ్లలో ఇది 35 శాతంగా ఉంది. 2019లో 922 మంది సివిల్స్ సాధించగా, వీరిలో 220 మంది మహిళలు ఉన్నారు. 2024లో 1009 మంది సివిల్స్ పాసయితే వీరిలో 350 వరకు మహిళలు ఉన్నారు. అంతేకాదు టాప్ 5 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన శక్తి దూబే (Shakti Dubey) ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంగతి తెలిసిందే.ఇంజనీరింగ్ టాప్
ఏ స్ట్రీమ్ విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఎక్కువగా పాసవుతున్నారనే ప్రశ్న ఎక్కువగా అడుగుతుంటారు. ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధిస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. 2023 ఫలితాల్లో ఇంజనీరింగ్ (49%), హ్యుమానిటీస్ (32%), సైన్స్ (12), మెడికల్: (6%) అభ్యర్థులు విజయం సాధించారు. గత కొనేళ్లుగా ఇదే తరహాలో ఫలితాలు వస్తున్నాయి. 2020 సివిల్స్ ఫలితాల్లో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులు 53 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచారు.
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్కతా విజిట్ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్ ప్లేయర్ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా చేరుకున్నారు. నిర్వహణ లోపంతో అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫలితంగా సాల్ట్ లేక్ స్టేడియం వెళ్లిన మెస్సీ కేవంల నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు.
#WATCH | Kolkata, West Bengal: A fan of star footballer Lionel Messi says, "It was really disappointing, we came all the way from Darjeeling for this... We couldn't even see him properly, and that was the most disappointing thing I have ever witnessed..." https://t.co/Ce4kNu8dBH pic.twitter.com/dgBSOIMEoG
— ANI (@ANI) December 13, 2025
డార్జిలింగ్ నుంచి వచ్చిన మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్ను చూడలేకపోయానని ఆరోపించారు.
కాగా గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్తా టూర్ సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో పట్టరాలి ఆగ్రహంతో అభిమానులు స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్ యత్నించారు. దీంతో జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్ను మరియు గోల్ పోస్ట్ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. అంతేకాదు నిర్వాహకులు టికెట్ రుసుమును అభిమానులకు తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు.
బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకత్వంపై ఇంటా బయిట విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నాయకత్వ బాధ్యతలు ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని లేఖ రాశారు. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తరచుగా ప్రధాని చేయమని ప్రజలను అడుగుతారని, ఆ పదవి కోరుకునే ముందు తానేంటో నిరూపించుకోవాలన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా బాగాలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన ఆ పార్టీ చేసింది. సొంతంగా 99 ఎంపీ సీట్లు సాధించి లోక్ సభ ప్రతిపక్షనేత హోదా దక్కించుకుంది. అయితే ఆ తరువాత జరిగిన హర్యాణా, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై ప్రస్తుతం విమర్శలస్తున్నాయి. నాయకత్వాన్ని మార్చకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని క్షేత్రస్థాయిలో క్యాడర్ సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎంపీ ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఓ కార్యకర్త సోనియాగాంధీకి లేఖ రాయడం పొలిటికల్ హీట్ పెంచింది. కాగా తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాహుల్గాంధీని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఉద్దేశించి భగవంత్ మాన్ వ్యాఖ్యలు చేశారు. భగవంత్ మాన్ మాట్లాడుతూ "రాహుల్ గాంధీ తరచుగా తనని ప్రధాని చేయండి అప్పుడు నేనేమైనా చేస్తాను అంటారు. అయితే అంతకంటే ముందు ప్రజలకు తానేంటో నిరూపించాలి. తరువాత తనని ప్రధాని చేసే విషయం ప్రజలు ఆలోచిస్తారు. ఇదే తరహాలో పంజాబ్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ వ్యవహరిస్తారు. తనని పంజాబ్ సీఎం చేయమని అడుగుతారు. ప్రజలు తనకి ఇది వరకే చెప్పారు. మెుదటగా ఏదైనా పనిచేయండి దాని తర్వాత సీఎం చేయాలో లేదో తేలుస్తామన్నారు". అని భగవంత్ మాన్ తెలిపారు.
నాయకత్వం అనేది క్రమశిక్షణగా పనిచేయడం ప్రజల నమ్మకం ద్వారా వస్తుందే తప్ప విద్వేశ ప్రసంగాల ద్వారా రాదని భగవంత్ మాన్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని కష్టపడి సంపాదించాలి అని తెలిపారు. భగవంత్ మాన్ తొలుత కామెడీయన్గా నటించారు. 2014లో ఆప్ నుంచి తొలిసారిగా ఎంపీ అయ్యారు. 2022 పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఈ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇది వరకూ ఆప్ ఇండియా కూటమిలో భాగంగా ఉండేది. 2024 లోక్సభ ఎన్నికల అనంతరం ఆ కూటమి నుంచి విడిపోయి స్వతంత్ర్యంగా పోటీచేస్తుంది.
ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యకరమైన సుదీర్ఘ జీవితం కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంత కాలం జీవించగలం అనేది జెనెటిక్ అంశాలతో పాటు, జీవనశైలి, రోజువారీ అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. దీర్ఘాయుష్కులుగా 90 అంతకంటే ఎక్కువ కాలం జీవించ గలమా లేదా అనేది తెలుసుకోవాలంటే 5 అద్భుతమైన పరీక్షలున్నాయి, వీటిల్లో చాలామంది మూడు పరీక్షల్లోనే ఫెయిలవుతున్నారు అంటూ డాన్ గో అనే ఫిట్నెస్ కోచ్ ఇన్స్టా పోస్ట్ నెట్టింట ఇంట్రిస్టింగ్ మారింది. మరి ఆ పరీక్షలేంటో ఒకసారి చూసేద్దామా?
సాధారణంగా సుదీర్ఘం కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఒత్తిడి లేని జీవితం, సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, ఒక వయసుదాటిన తరువాత కొన్ని ఆరోగ్య పరీక్షలు (ఇతర ప్రమాదకర అనారోగ్య సమస్యలు ఏమీ లేనివారు) చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. మరి 90 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ జీవించగలరా అనేది తెలియాలంటే ఈ అయిదు పరీక్షలు చాలా కీలకమంటూ ఆరోగ్య కోచ్ షేర్ చేశారు.
నడక వేగం
ఎంత వేగంగా నడవ గలరు అనేదాని మీద కూడా మన ఆయుష్షు ఆధారపడి ఉంటుందట. ఇచ్చిన సమయ వ్యవధిలో మీరు ఎంత వేగంగా నడవగలరో చెక్ చేసుకోవాలి. ఇది గుండెలోని నాళాల పనితీరుకు సంకేతం. 1 మీ/సె (2.2 మైళ్ల) కంటే ఎక్కువ వేగం ఎక్కువ ఆయుర్దాయం కలిగిస్తుందని అంచనా. . 2.7 మైళ్ల కంటే ఎక్కువ వేగంగా నడవ గలిగితే మరణం ముప్పు తగ్గుతుందట. వేగంగా నడిచేవారిలో వృద్ధాప్యం లక్షణాలు తొందరగా కనిపించవు.విశ్రాంతి హృదయ స్పందన రేటు
లో రెస్టింగ్ హాట్ బీట్ రేట్ (ఏ పనీలేదా వ్యాయామం చేయకుండా విశ్రాంతిగా ఉన్నపుడు) మన గండెప నితీరుకు, ఒత్తిడిని తట్టుకునే శక్తికి నిదర్శనం.నిమిషానికి 70 బీట్స్ (బిపిఎం) కంటే తక్కువ కొట్టుకుంటే సాలిడ్గా ఉన్నట్టు. 60 బిపిఎం కంటే తక్కువ అంటే ఎలైట్ దీర్ఘాయువు ప్రాంతం.అదే విశ్రాంతి సమయంలో 80-90 బిపిఎం కంటే ఎక్కువ గుండె స్పందన ఉంటే గుండె దృఢత్వానికి సంబందించిన వ్యాయామాలు మొదలు పెట్టాల్సిందే అని సూచన.కూర్చుని పైకి లేచే ( Sit and Rise) పరీక్ష
డాన్ చెప్పిన దాని ప్రకారం 87 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారట.ఇది చాలా సులభం అనుకుంటారుగానీ, నేలపై కూర్చుని,చేతుల సాయం లేకుండా తిరిగి నిలబడటం అనేది వయస్సు పెరిగే కొద్దీ బలం, సమతుల్యత, చలనశీలత, సమన్వయానికి నిదర్శనం. 85 సంవత్సరాల వయస్సులో, గాయాలకు సంబంధించిన అన్ని మరణాలలో దాదాపు 2/3 వంతు పడిపోవడంవల్లే సంభవిస్తాయి. 8 మంది పెద్దవారిలో ఒకరు మాత్రమే ఈ ఎక్సర్సైజ్ చేయగలరు.బార్ హ్యాంగ్స్ (గ్రిప్ స్ట్రెంత్)
దీనికి ఆహారం లేదా వ్యాయామంతో సంబంధం లేదు.బలమైన పట్టు గుండె ఆరోగ్యం, కండరాల బలం, ,ఎముక సాంద్రతకు సూచిక. గ్రిప్ స్ట్రెంత్ దీర్ఘాయువును అంచనా వేస్తుంది. అందుకే పరిశోధకులు దీనిని ఆరో ముఖ్యమైన సంకేతం అంటారు. 90 సెకన్లలో బార్ పట్టుకుని వేలాడితే సాధారణం కంటే బెటర్గా ఉన్నట్టు.ఒక మైలు పరుగు సమయం
ఏ వయసులోనైనా 10 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తగలిగితే, హృదయనాళ వ్యవస్థ మంచి స్థితిలో ఉన్నట్టు. 8 నిమిషాల కంటే తక్కువ సమయమైతే దీర్ఘాయుష్షు-అథ్లెట్ స్థాయి ఫిట్నెస్తో ఉన్నట్టు అర్థం. ఇది ఫిట్నెస్ స్థాయికి స్నాప్షాట్ లాంటిది. ఎంత ఫిట్గా ఉన్నారో అంచనా వేయడానికి శరీర ప్రతిస్పందనలే సూచిక అని డాన్ వెల్లడించారు.నోట్ : ఆరోగ్య , ఫిట్నెస్కు సంబంధించి ఇది ఒక సలహా మాత్రమే. ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం సరియైన మార్గం.
మీరు కారు గానీ బైక్ కొనుగోలు చేయడానికి ఏదైనా సంస్థ నుంచి లోన్ తీసుకున్నారా? ఏదైనా కారణాలతో లోన్ కట్టకుండా పెండింగ్లో ఉంచారా?. అయితే ఫేక్ లోన్ రికవరీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ వాహనం యెుక్క లోన్ బకాయిలు చెల్లించాలంటూ వారు మిమ్మల్ని బుట్టలో వేయవచ్చు. ఎంత కొంత చెల్లించకుంటే వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరిస్తూ అందిన కాడికి దోచుకోని వారు పరారయ్యే అవకాశమూ ఉంది.
ప్రస్తుత 5జీ కాలంలో టెక్నాలజీతో పాటు మోసాలు అదే విధంగా అప్డేట్ అవుతున్నాయి. సైబర్ అటాక్లతో అకౌంట్లలో డబ్బును రాత్రికి రాత్రి మాయం చేసేవారు కొందరైతే దొంగతెలివిని ఉపయోగించి ప్రజలను మోసం చేసేవారు మరికొందరు. ఇటీవల కాలంలో కొత్తరకం మోసగాళ్లు పుట్టుకొచ్చారు. ఫైనాన్స్ కంపెనీలలో పెండింగ్ బకాయిలు ఉన్న వారే టార్గెట్గా వీరు వల పనుతున్నారు. వివిధ రకాల ఫైనాన్స్ కంపెనీలలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వాహనాల వివరాలు వీరు సేకరిస్తున్నారు. ఆ వాహనానికి లోన్ ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో ఆ కంపెనీ ఏజెంట్లుగా నటిస్తూ లోన్ తీసుకున్నవారిని బెదిరిస్తున్నారు. అందినకాడికి డబ్బులు చేతపట్టుకొని అక్కడి నుంచి ఊడాయిస్తున్నారు.
తాజాగా ఇటువంటి ఘటన కర్ణాటకలో జరిగింది. అక్కడి పర్యాటక ప్రాంతమైన కూర్గ్ నుంచి ఒక వ్యక్తి తిరిగివస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు తనని వెంబడించారని తెలిపారు. ఒక కారు డ్రైవ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి కారు డోర్ కొట్టారని ఏంటని ప్రశ్నించగా ఈ కార్ లోన్ పెండింగ్లో ఉంది. దీని డబ్బుులు కట్టాలని అడిగారన్నారు. అయితే కారుకు సంబంధించిన డ్యాకుమెంట్స్ అన్ని క్లియర్గా ఉండడంతో ఇది మోసం అని తాను గ్రహించానని వెంటనే అక్కడి నుంచి ఊడాయించానని అన్నారు. ఆ వ్యక్తికి ఏదురైన భయానక అనుభూతిపై రెడ్డిట్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్పై నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
అయితే ఇటువంటి ఘటనలు ఈ మధ్యన తరచుగా జరుగుతున్నాయి. ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా పెండింగ్ బకాయిలు ఉన్నాయని ఆపితే వారు సంబంధింత ఫైనాన్స్ కంపెనీకి చెందిన వారా కాదా అని నిర్ధారించుకొండి. మీరు ఏ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నారో ఆ సంస్థకు ఫోన్ చేసి వివరాలు నిజ నిర్ధారణ చేసుకొండి. దాని తరువాతే వారికే డబ్బులు చెల్లించడమో లేదా వాహనాన్ని ఇవ్వడమో చేయండి. నకీలీ ఏజెంట్లకు కంపెనీల ఐడీ కార్డులు సృష్టించడం ఏమాత్రం పెద్ద విషయం కాదు కనుక ఐడీకార్డులను చూసి వారికి డబ్బులు చెల్లించి వారి వలలో పడొద్దు.
అర్థరాత్రి రద్దీగా ఉండే నగరాల్లో కూడా అర్థరాత్రి మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. క్యాబ్ సేవలు అందించే సంస్థలకు చెందిన ఆటో,క్యాబ్, బైక్ డ్రైవర్లు మర్యాదగానే ఉంటారు. అయినా కూడా సురక్షింగా గమ్య స్థానానికి చేరేదాకా మనసులో బెరుకు తప్పదు. తాజాగా బెంగళూరులో రాపిడో ఆటోలో అర్ధరాత్రి ఇంటికి ప్రయాణిస్తున్న ఒక మహిళకు అనుభవం నెట్టింట విశేషంగా నిలిచింది.
రాత్రి 12 గంటలకు అర్థరాత్రి, ఒంటరిగా ఉన్నప్పటికీ తన ప్రయాణంలో తాను ధైర్యంగా గడిపిన క్షణం గురించి వివరించిన వీడియోను షేర్ చేసింది. నిజంగా ఆటోలు కనిపించిన ఒక నోట్ను ఆమెలోఆనందాశ్చర్యాల్ని నింపింది. వాహనం లోపల అతికించిన చేతితో రాసిన నోట్ను చూపించడానికి కెమెరాను అటు తిప్పింది. అక్కడ ఇలా ఉంది: "నేను ఒక తండ్రిని, సోదరుడుని కూడా. మీ భద్రత ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి."అని ఒక నోట్లో రాసి ఉండటం విశేషం. అంటే ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మనస్సుల్లో చెలరేగే భావాలను, భయాలను అర్థం చేసుకుని భయపడకండి.. నేనూ ఒక బిడ్డకు తండ్రినే, ఒక సోదరికి అన్నయ్యను కూడా..భయపడకుండా కూర్చోండి, నా వలన మీకెలాంటి ప్రమాదం ఉండదు అని ధైర్యం చెప్పడం బాగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
ఈ వీడియోను లిటిల్ బెంగళూరు స్టోరీస్ "పీక్ బెంగళూరు" అనే శీర్షికతో పోస్ట్ చేసింది . దీంతో నెటిజన్ల నుండి హృదయపూర్వక స్పందనలు వచ్చాయి. "గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు! ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం." ‘‘మేము కోరుకుంటున్నది , మనం చేయవలసినది ఇదే" అంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి చిన్ని చిన్న విషయాలు చాలు. నగరంలోని మహిళలకు అర్థరాత్రి ప్రయాణం సురక్షితంగా అనిపించేలా చేయడంలో సహాయపడతాయి’’ అని మరొకరు కామెంట్ చేశారు. శభాష్..భయ్యా..ఇలాంటి భరోసానే కావాల్సింది అంటూ మరికొందరు ఆటో డ్రైవర్ను కొనియాడారు.
ఇంట్లో పెంపుడు జంతువులుంటే ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతుందని నమ్ముతారు. అందుకే చాలామంది ఏదో ఒక పెట్ను పెంచుకుంటూ ఉంటారు. అల్లారుముద్దుగా చూసుకుంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ ఒకోసారి పెంపుడు జంతువులే ప్రాణానికి చేటు తెస్తూ ఉంటాయి. బెంగళూరులో జరిగిన ఒక విషాదం గురించి తెలిస్తే హృదయం ద్రవించకమానదు.
బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అరుణ్ కుమార్ ఎంతోఖరీదైన చిలుకను పెంచు కుంటున్నాడు. మకావ్ రకానికి చెందిన దీని విలువ 2.5 లక్షలరూపాయలు. అది ఉన్నట్టుండి ఇంట్లోంచి ఎగిరిపోయి, సమీపంలోని విద్యుత్ స్తంభంపై వాలింది. దాన్ని పట్టుకుందామని ప్రహరీ గోడపైకి ఎక్కాడు. అలా దాన్ని రక్షించబోయే ప్రయత్నంలో అరుణ్ ప్రమాదవశాత్తు హై-వోల్టేజ్ విద్యుత్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను కుమార్ గోడపై నుండి కిందపడి గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ణి అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. బెంగళూరులోని గిరినగర్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు అసాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అరుణ్ కుమార్కి వాహనాల నంబర్ ప్లేట్ల తయారీ వ్యాపారం ఉంది.
కోల్కతా: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఈరోజు (శనివారం) ఫుట్బాల్ సూపర్స్టార్ లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో జరిగిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ పోస్ట్లో ఆమె.. ‘ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన గందరగోళాన్ని చూసి నేను తీవ్రంగా కలత చెందాను. షాక్ అయ్యాను. అభిమాన ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీని చూసేందుకు వేలాది మంది క్రీడా ప్రేమికులు, అభిమానులతో పాటు నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి స్టేడియంనకు వెళ్తున్నాను’ అని రాశారు. మమతా బెనర్జీ తన ‘ఎక్స్’ పోస్టులో క్రీడాకారుడు మెస్సీతో పాటు అభిమానులకు కూడా క్షమాపణలు కూడా చెప్పారు.
ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు
సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన అల్లర్లపై కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశిం కుమార్ రే నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు. ఈ ప్యానెల్ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించనుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు దిద్దుబాటు చర్యలను సిఫార్సు చేస్తుంది.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వర్సెస్ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే త్వరగా వెళ్లిపోయాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్ను, కూర్చీలను మైదానంలోకి విసిరి రచ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్లను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాల్సి ఉండేది.
West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) posts, "I am deeply disturbed and shocked by the mismanagement witnessed today at Salt Lake Stadium. I was on my way to the stadium to attend the event along with thousands of sports lovers and fans who had gathered to catch a… pic.twitter.com/Ew7azrl1o2
— Press Trust of India (@PTI_News) December 13, 2025
చండీగఢ్: హర్యానా సర్కారు కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమం ‘హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ను ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. మొత్తం రూ. 3,600 కోట్ల కార్పస్తో రూపొందించిన ఈ ఐదేళ్ల ప్రాజెక్ట్.. రాష్ట్రంలో వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక నవీకరణలు, ఈ-బస్సుల ఏర్పాటు, మెరుగైన పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు మొదలైనవి కీలకంగా ఉన్నాయి. ఈ భారీ కార్యక్రమం ద్వారా హర్యానా సర్కారు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రమాదకరమైన వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఈ ప్రాజెక్ట్లో కాలుష్య రహిత పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 1,000 పరిశ్రమలకు వాయు ఇంధనాలపై నడిచే కొత్త బాయిలర్లను కొనుగోలు చేయనున్నారు. అదే విధంగా 1,000 డీజీ సెట్లను హైబ్రిడ్/డ్యూయల్ ఫ్యూయల్ మోడ్పై నడిచేలా చేస్తారు. రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి 500 ఈ-బస్సులను ఏర్పాటు చేయనున్నారు. డీజిల్ ఆటోలను దశలవారీగా తొలగించడం, 50,000 ఈ-ఆటోలను ప్రోత్సహించడం వంటి చర్యలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. సాధారణ బాయిలర్లు, ఇటుక బట్టీల ఉద్గారాలను తగ్గించడానికి పైలట్ ప్రాతిపదికన రెండు టన్నెల్ బట్టీలు ఏర్పాటు చేయనున్నారు.
మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ కోసం రాష్ట్రంలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. 500 కి.మీల మేర దుమ్ము రహిత రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రియల్ టైమ్ సోర్స్ అపార్ట్మెంట్ సామర్థ్యంతో కూడిన 10 నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ (సీఏఏక్యూఎం) స్టేషన్లు, ఒక సీఏఏక్యూఎం మొబైల్ వ్యాన్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. తద్వారా కాలుష్య స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళికలను కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఢిల్లీ ఎన్సీఆర్లో వాయు కాలుష్య నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: తల్లీకుమారుల ఆత్మహత్య.. లేఖలో గుండె పగిలే నిజాలు!
Andhra Pradesh
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేవారికి భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపు(డిసెంబర్ 14, ఆదివారం) ఉదయం 8గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ను ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
2026 జనవరి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా.. ఏపీలోని ఇతర ప్రాంతాలకు, అలాగే ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
South Central Railway Advisory
for #Sankranti Special Trains pic.twitter.com/fLaubRZiNC— SCRAILWAYUSERS (@scrailwayusers) December 13, 2025
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ అడ్వైజరీ సర్వీసెస్’ బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరిగా బాధితులు బయటకొస్తున్నారు. ఇంటికో మొక్క పెంచితే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేసిన నిర్వాహకులు.. సంస్థలో డబ్బులు పెడితే మీ భవిష్యత్ మారిపోతుందంటూ ఆశ పెట్టారు. జనం అత్యాశను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.
ఏజెంట్లను నియమించుకుని టార్గెట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు వసూలు చేశారు. పది వేలు పెడితే ప్రతీ నెలా వెయ్యి రూపాయలు, రూ. ఐదు లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు ఇస్తామంటూ టోకరా వేశారు. సుమారు రూ.25 కోట్లకు పైగానే వసూళ్లు చేశారు. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్ చనిపోయిన తర్వాత అతని భార్య నండూరి శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మోసపోయామని గ్రహించిన బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.

సాక్షి, ఏలూరు: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అక్టోబర్ 10వ తేదీ నుండి ప్రతి నియోజకవర్గంలో ఉద్యమంలా సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 లక్షల 25 వేల సంతకాలు సేకరించగా, రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు దాటాయి. ఈ నెల 15వ తేదీన కోటి సంతకాల ప్రతులను పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నాము.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతీ వైసీపీ నాయకులు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. మరో 6 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు, ప్రజా పాలన ఎలా చేయాలో చంద్రబాబు తెలుసుకోవాలి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలం వచ్చినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్కు కోటి సంతకాలను మాజీ సీఎం వైఎస్ జగన్ అందజేయనున్నారని అవినాష్ వెల్లడించారు.
సాక్షి, తిరుపతి: టీటీడీ బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ చేస్తున్న అక్రమాలపై ఓ అజ్ఞాత భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల జగదీష్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు ఓ భక్తుడు ఈవోకు లేఖ రాశాడు. డైరెక్టర్ చేస్తున్న అక్రమాలను వివరించాడు.
మెడికల్ ఇంప్లాంట్స్ కొనుగోళ్లలో టెండర్ దారులకు అనుకూలంగా మార్పులు చేసి కొందరికి మేలు చేశారు. నాణ్యత లోపించిన సర్జికల్ ఇంప్లాంట్స్ వినియోగించారు. గత మూడు నెలలుగా హాస్పిటల్లో సర్జికల్ ఇంప్లాంట్స్, మెడిసిన్స్ కొరత ఉంది. బలవంతంగా ఆన్లైన్, టెలిఫోన్ ఓపిడి రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెల్లవారుజామున 4 గంటలకు అపాయింట్మెంట్ ఓపిడి సేవలు ప్రారంభించడం వల్ల రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ అనుమతులు ఉన్నాయని జగదీష్ యదేచ్ఛగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రముఖ వైద్యులను శ్రీవారి ప్రొఫెషనల్ సేవకులుగా రాకుండా కక్ష్యపూరితంగా అడ్డుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో బర్డ్ హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతోంది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2021లో నాసిరకం ఇంప్లాంట్స్ వాడటం వల్ల రోగులకు రెండవసారి ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక డాక్టర్ జగదీష్ పై ఉన్న రెండు విజిలెన్స్ కేసుల పై చర్యలు తీసుకోవాలి. మార్కెట్ రేటు కంటే ఎక్కువ మొత్తంలో ఇంప్లాంట్స్ కొనుగోలు చేసి 11 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆర్థిక నష్టం జరుగుతోంది. గత 15 ఏళ్లలో దిగుమతి చేసిన సర్జికల్ ఇంప్లాంట్ల ధరలను పెంచి కొనుగోలు మార్గాలను దుర్వినియోగం చేశారని ఆరోపణలు. మొత్తం ఆర్థిక నష్టం సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
డాక్టర్ గుడారు వ్యక్తిగత సద్భావన, ప్రజా సంబంధాలను పెంచుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరు, ప్రతిమను ఉపయోగించారు. వారి స్వీయ ప్రచారం కోసం సంస్థాగత పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశారు. ఈ ఆరోపణలన్నింటిపై విజిలెన్స్ విచారణ జరపాలి. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో అజ్ఞాత భక్తుడు ఈవోను కోరాడు.

