Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఈడీ.  కర్నాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అగ్రిగోల్డ్‌ బాదితులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్‌ లో ఇప్పటికే 33 మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ.. వారి ఆస్తులను అటాచ్‌ చేసి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోంది

    గత ఏడాది నవంంబర్‌లో ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగా రూ. 4,141  కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న  ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. అగ్రిగోల్డ్‌ కేసులో ఇప్పటికే  పలువుర్ని అరెస్ట్‌ చేశారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.  ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ జీవో విడుదల చేసింది. జనవరి1,2023 నాటి డీఏపై జీవో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని పేర్కొంది

  • హైద‌రాబాద్‌:  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(శుక్రవారం. జూన్‌ 13)  విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌.. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌నకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. 

    విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపున‌కు వీలుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని సీఎం రేవంత్‌ సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో వారు త‌మ‌కు ఇష్ట‌మైన రంలగంలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని  అభిప్రాయ‌ప‌డ్డారు.

    తెలంగాణలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యా శాఖ పుర‌పాల‌క శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ఉన్న వివిధ విద్యా సంస్థ‌ల‌ను హేతుబ‌ద్దీక‌రించి ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

    నాణ్య‌మైన భోజ‌నం, యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని.. డే స్కాల‌ర్స్‌కూ ఆ పాఠ‌శాల‌ల్లోనే అవ‌న్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు  సూచించారు.

    పిల్ల‌ల‌కు కుటుంబం, స‌మాజం ప్రాధాన్యాన్ని వివ‌రించ‌డంతో పాటు కుటుంబం, సమాజం ప‌ట్ల వారి బాధ్య‌త‌ను తెలియ‌జేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మాన‌సికంగా దృఢంగా త‌యార‌వ‌డంతో పాటు బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా రాణిస్తార‌ని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు.

  • సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రసుత్త పరిస్థితులు చూస్తుంటే.. దండకారణ్యంపై పట్టు సడలకుండా ఉండేందుకు మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్‌ కగార్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదిన్నరగా మావోయిస్టులు బస్తర్‌ పరిధిలోకి వచ్చే దండకారణ్యం, ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌ ఏరియా, అబూజ్‌మడ్‌ అడవుల్లో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆపరేషన్‌ కగార్‌ మొదలైన తర్వాత 409 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందగా.. లొంగిపోయిన/అరెస్టయిన వారు మరో 1,200 మందికి పైగా ఉన్నారు. 

    పోలీసుల చేతిలో హతమైన వారిలో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు చలపతి, ప్రయాగ్‌మాంజీ, సుధాకర్‌ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో డివిజన్‌ కమిటీ సభ్యులు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీ మరో ఆరేడు నెలల్లో తన ఉనికిని కోల్పోతుందనే ప్రచారం జరిగింది. మరోవైపు ఈ ఏడాది మార్చి 28న శాంతి చర్చల ప్రతిపాదనను మావోయిస్టులు తెర మీదకు తెచ్చారు. 

    బస్తర్‌కు తిరిగి రండి..! 
    వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు/అరెస్టులతో కేడర్‌ను మావోయిస్టులు చాలా వరకు నష్టపోయారు. మరోవైపు శాంతి చర్చల ప్రతిపాదనపై కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ నుంచి సానుకూల ప్రకటన రావడం లేదు. దీంతో బస్తర్‌ అడవుల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మావోయిస్టులు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

    ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ), ఎంఎంసీ (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌), కేకేటీ (కర్ణాటక, కేరళ, తమిళనాడు) ప్రాంతాల్లో పనిచేస్తున్న అగ్రనేతలను బస్తర్‌కు తిరిగి రావాలని మావోయిస్టు పార్టీ కోరినట్టు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సాయుధ పోరాటం, గెరిల్లా వార్‌ఫేర్‌లో నిపుణులైన సీనియర్‌ నాయకులు రంగంలోకి దిగితే సానుభూతిపరులు, పార్టీ కేడర్‌లో ఆత్మ విశ్వాసం పెంచొచ్చని ఆ పార్టీ అంచనా వేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

    కొత్తగా ఏడుగురు ఐపీఎస్‌లు 
    వానాకాలం రావడంతో బస్తర్‌ అడవులు చిక్కబడ్డాయి. డ్రోన్ల సాయంతో కూంబింగ్‌ చేయడం సైతం భద్రతా దళాలకు కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అయినా మావోయిస్టులపై నిర్బంధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్‌లో కొత్తగా ఏడుగురు ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. 2021 బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారులకు నక్సల్స్‌ను తుదముట్టించే బాధ్యతలు అప్పగించింది. కొత్తగా వచ్చిన అధికారులతో ఈ నాలుగు జిల్లాల పరిధిలో యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న ఐపీఎస్‌ల సంఖ్య 20కి చేరుకుంది.

    ఊహించని దాడి.. 
    ఏఓబీ నుంచి కొందరు కీలక నేతలు ఇప్పటికే దండకారణ్యానికి చేరుకున్నట్టు సమాచారం. ఈ సందేహాలకు బలం చేకూర్చేలా పువర్తిలో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌నకు సమీపంలో ఒక వ్యక్తిని ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కుంట మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం–జగ్‌దల్‌పూర్‌ జాతీయ రహదారి నుంచి కేవలం 400 మీటర్ల సమీపంలో ఐఈడీ పేల్చి ఏఎస్పీ స్థాయి అధికారిని హతమార్చారు. తీవ్ర నిర్బంధం నడుమ వరుసగా రెండు రోజుల పాటు భద్రతా దళాల కన్నుగప్పి దాడులు నిర్వహించి ఈ ప్రాంతంపై తమకున్న పట్టు ఏంటో మావోలు తెలియజేసినట్టయ్యింది. అయితే ఈ రెండు ఘటనలపై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

    చ‌ద‌వండి: అడ‌వే ఆధారం.. బ‌తుకు భారం   

  • సాక్షి,హైదరాబాద్‌:  సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసెడింట్‌ కేటీఆర్‌ ఫైరయ్యారు.  ఈ మేరకు ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌  ట్వీట్‌ చేశారు. 

    ఆ ట్వీట్‌లో ‘ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడు

    చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని మాటిస్తున్నాను. అయితే, పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్‌లో ఉంది

    ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో.. విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలి’ అని పేర్కొన్నారు. 

    కాగా, కేటీఆర్‌కు తాజాగా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్‌ 16న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఆ నోటీసులపై కేటీఆర్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌పై దుయ్యబట్టారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోసారి నోటీసులుచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారం(జూన్‌ 16)న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

    జనవరి 9వ తేదీన సుమారు ఆరున్నర గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. ఆపై ఈ ఏడాది మే చివరి వారం(28వ తేదీ)లో మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలియజేశారు. దీంతో మరోసారి ఇవాళ మూడోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10గం. విచారణకు రావాలని ఏసీబీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది.

    ఫార్ములా ఈ కారు రేసు కేసులో.. కిందటి ఏడాది డిసెంబర్‌ 29వ తేదీన ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. తిరిగి.. 9వ తేదీ విచారణకు హాజరై ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

    ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేసీఆర్ కు నోటీసులు

Sports

  • లార్డ్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా సూప‌ర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయ‌ప‌డ్డాడు. మూడో రోజు ఆట సంద‌ర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా స్మిత్ చేతి వేలికి గాయ‌మైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్ వేసిన మిచెల్ స్టార్క్‌.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు.

    ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప్ర‌య‌త్నంలో బంతి బ‌లంగా స్మిత్  చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్ర‌మైన నొప్పితో విల్ల‌విల్లాడు.

    వెంట‌నే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అత‌డి స్దానంలో కొన్‌స్టాస్ స‌బ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్‌డేట్ ఇచ్చింది. అత‌డి చిటికెన వేలు ఎముక ప‌క్క‌కు జ‌రిగింద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్‌ దూరమయ్యే అవకాశముంది.
     

  • భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్ర‌క‌టించింది. ఇంగ్లీష్‌ అండ‌ర్‌-19 జ‌ట్టుకు థామస్ రెవ్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఈ జ‌ట్టులో ఇంగ్లండ్ దిగ్గ‌జం  ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు ద‌క్కించుకున్నాడు.

    రాకీ ప్లింటాఫ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా నిరూపించుకునేందుకు సిద్ద‌మవుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 5 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాకీ.. 15.22 స‌గ‌టుతో 137 ప‌రుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లలో అత‌డి పేరిట 167 ప‌రుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచ‌రీ కూడా ఈ జూనియ‌ర్ ప్లింటాప్ సాధించాడు. 

    ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు యూత్ వ‌న్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ త‌ర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. భార‌త జ‌ట్టుకు యువ సంచ‌ల‌నం అయూష్ మాత్రే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఈ జ‌ట్టులో వైభ‌వ్ సూర్య‌వంశీ వంటి చిచ్చ‌ర‌పిడుగులు ఉన్నారు.

    ఇంగ్లండ్ అండర్‌-19 టీమ్‌
    థామస్ రెవ్ (కెప్టెన్‌), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.
    భారత అండర్‌-19 జట్టు

    ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్‌జేద్ ఎహమ్‌జెనా.
     

  • పాకిస్తాన్ సూప‌ర్ స్టార్ బాబ‌ర్ ఆజం తొలిసారి ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. బీబీఎల్ 2025-26 సీజ‌న్ కోసం బాబర్ ఆజంతో సిడ్నీ సిక్స‌ర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం క‌దుర్చుకుంది. ప్రీ డ్రాఫ్ట్ ఒప్పం‍దంలో భాగంగా సిడ్నీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్‌తో క‌లిసి బాబ‌ర్ సిడ్నీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవ‌కాశ‌ముంది. స్మిత్ గ‌త కొన్ని సీజ‌న్ల‌గా సిక్స‌ర్స్ జ‌ట్టుకే ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్నాడు.

    "ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌ల‌లో ఒక‌టైన బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవ‌కాశం రావ‌డం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన సిడ్నీ సిక్స‌ర్స్ ఫ్రాంచైజీకి ధ‌న్య‌వాదాలు. జ‌ట్టు విజ‌యాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిడ్నీ సిక్సర్స్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఆజం పేర్కొన్నాడు. 

    బీబీబీఎల్ 15వ సీజన్ డ్రాఫ్ట్ జూన్ 19న జరగనుంది. కాగా బాబర్ ఆజం ఇప్పటికే పీఎస్‌ఎల్‌తో పాటు సీపీఎల్‌, ఎల్‌పీఎల్‌, బీపీఎల్ వంటి ప‌లు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడాడు. అయితే పాకిస్తాన్ టీ20 సెట‌ప్ నుంచి బాబ‌ర్ ఆజంతో పాటు మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షాహీన్ అఫ్రిదిని ప‌క్క‌న పెట్టాల‌ని పీసీబీ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బాబ‌ర్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు ఆస‌క్తిచూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
    చదవండి: చ‌రిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా

     

  • లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేసిన స్టార్క్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో తన జట్టును ఆదుకున్నాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్టార్క్ తన విరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. 

    హెడ్‌, స్మిత్‌, లబుషేన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. స్టార్క్ తన విలువను మరోసారి చాటుకున్నాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ స్పీడ్ స్టార్‌.. ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 136 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో స్టార్క్  ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఓ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ బ్రౌన్ పేరిట ఉండేది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రౌన్‌.. 35 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో బ్రౌన్ ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.

    సౌతాఫ్రికా టార్గెట్ 282..
    ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ(43) ప‌రుగుల‌తో రాణించాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెస‌న్‌,మార్‌క్ర‌మ్ త‌లా వికెట్ సాధించారు.

  • లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్‌ను ధరించారు.

    ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.

    కాగా అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.

    టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్‌(44 బ్యాటింగ్‌) ఆసీస్‌ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


    చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ.. భార‌త్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్‌

     

  • భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మ‌రో వారం రోజుల‌లో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై అడుగుపెట్టిన భార‌త జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. 

    నేటి నుంచి భార‌త సీనియ‌ర్ టీమ్‌-ఇండియా 'ఎ' జ‌ట్ల మ‌ధ్య వార్మాప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా తిరిగి భార‌త్‌కు వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. రెవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్ర‌కారం.. గంభీర్ త‌ల్లికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.

    ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం ప్ర‌స్తుతం ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్లుగా స‌ద‌రు రిపోర్ట్ పేర్కొంది. ఈ క్ర‌మంలోనే గంభీర్ హుటాహుటిన స్వ‌దేశానికి వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

    అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లండ్‌కు వెళ్తాడ‌న్నది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు  ప్రారంభానికి ముందే జ‌ట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవ‌కాశ‌ముంది. కాగా వైట్‌బాల్ సిరీస్‌ల‌లో కోచ్‌గా విజ‌య‌వంత‌మైన‌ గౌతీ.. టెస్టుల్లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోయాడు. 

    అత‌డి నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావాలను మూటకట్టుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్‌కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.
    చదవండి: న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత
     

  • విజయం దిశగా సౌతాఫ్రికా..
    లార్డ్స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్రమ్‌(102), టెంబా బావుమా(65) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి.

    ల‌క్ష్యం దిశ‌గా సౌతాఫ్రికా..
    282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా ధీటుగా బ‌దులిస్తోంది. 39 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ద‌క్షిణాఫ్రికా.. రెండు వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్ర‌మ్‌(76), బావుమా(41) ఉన్నారు. ప్రోటీస్ విజ‌యానికి ఇంకా 122 ప‌రుగులు కావాలి.

    మార్‌క్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ
    సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్‌క్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 51 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 26 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ద‌క్షిణాఫ్రికా రెండు వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులు చేసింది.

    సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్‌..
    వియాన్ ముల్డ‌ర్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 27 ప‌రుగులు చేసిన ముల్డ‌ర్‌.. స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 20 ఓవ‌ర్ల‌కు సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 79 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్‌క్ర‌మ్‌(41), బావుమా(5) ఉన్నారు. సౌతాఫ్రికా విజ‌యానికి ఇంకా 201 ప‌రుగులు కావాలి.

    నిల‌క‌డ‌గా ఆడుతున్న సౌతాఫ్రికా..
    282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా నిల‌క‌డ‌గా ఆడుతోంది. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సౌతాఫ్రికా వికెట్ న‌ష్టానికి 47 ప‌రుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్ర‌మ్‌(19), ముల్డ‌ర్‌(22) ఉన్నారు.
    సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్‌..
    ర్యాన్ రికెల్టన్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్‌.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
    సౌతాఫ్రికా టార్గెట్ 282 ప‌రుగులు..
    లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ల‌భించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో టెయిలాండ‌ర్ మిచెల్ స్టార్క్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

    టాప‌ర్డ‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన‌ప్ప‌టికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. స్టార్క్ 58 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అలెక్స్ క్యారీ(43) ప‌రుగుల‌తో రాణించాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెస‌న్‌,మార్‌క్ర‌మ్ త‌లా వికెట్ సాధించారు.

    మిచెల్ స్టార్క్ హాఫ్‌ సెంచరీ.
    లార్డ్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో మిచెల్ స్టార్క్ ఇటు బంతితోనూ, అటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాప‌ర్డ‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు విఫ‌ల‌మైన‌ప్ప‌టికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను స్టార్క్ అందుకున్నాడు. 53 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 64 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 207 ప‌రుగులు చేసింది. క్రీజులో స్టార్క్‌తో పాటు హాజిల్‌వుడ్(17) కూడా ఉన్నాడు. 

    సౌతాఫ్రికాకు ఆసీస్‌ టెయిలాండర్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ కొరకరాని కొయ్యగా మారాడు. తన బ్యాటింగ్‌తో సఫారీలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 37 పరుగులతో స్టార్క్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 51 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

    ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్‌..
    ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన నాథ‌న్ లియోన్.. ర‌బాడ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 43 ఓవ‌ర్ల‌కు ఆసీస్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 148 ప‌రుగులు చేసింది. క్రీజులో స్టార్క్‌(19), హాజిల్‌వుడ్‌(0) ఉన్నారు.

    లార్డ్స్ వేదిక‌గా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ మూడో రోజు ఆట ప్రారంభ‌మైంది. 144-8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజును ఆటను ఆసీస్‌ ఆరంభించింది. క్రీజులో మిచెల్‌ స్టార్క్‌(16), నాథన్‌ లియోన్‌(2) ఉన్నారు. ఆసీస్‌ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది

    తుది జట్లు
    ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్‌.

    దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికిల్‌టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్‌ వెరీన్‌ (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.

Business

  • తక్కువ బడ్డెట్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్‌ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్‌సెట్, ఎల్‌పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

    లావా స్టోర్మ్ ప్లే 5జీ ధర
    ఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్‌ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.

    👉  జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ

    ఫీచర్లు..స్పెసిఫికేషన్లు

    • లావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.

    • ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్‌తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ లభిస్తుంది.

    • ఇందులో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

    • లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

    • సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.

    • అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.

    • 2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

  • నేహా నాగర్.. దేశంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహిళా పర్సనల్ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆ పాపులారిటీతోనే ‘కాండేరే హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో స్థానం సంపాదించింది. సంపద సృష్టికర్తలు, పెట్టుబడిదారులు, దాతలు, సాంస్కృతిక రూపకర్తలు, యువ నాయకులు, ప్రొఫెషనల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఫౌండర్లతో సహా అన్ని కేటగిరీల్లోని మహిళలతో ఈ జాబితాను రూపొందించారు.

    దేశ పర్సనల్‌ ఫైనాన్స్ ల్యాండ్ స్కేప్‌లో నాగర్ ఒక మార్గదర్శక స్వరం. వైవిధ్యంతో ఆమె అందించే కంటెంట్, ఆర్థిక పాఠాలు నేహా నాగర్‌ను ఆన్ లైన్ లో దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్లలో ఒకరిగా చేశాయి. ఫైనాన్స్ కంటెంట్ క్రియేటర్, ఎంటర్‌ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన నాగర్ పన్నులు, బడ్జెట్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ వంటి సంక్లిష్ట ఆర్థిక అంశాలను సులభతరం చేయడంలో ప్రసిద్ధి చెందారు.

    👉 30 ఏళ్ల నాటి షేర్లు.. అప్పుడు లక్ష.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?

    వివిధ ప్లాట్‌ఫామ్‌లలో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఆర్థిక పాఠాలను వినోదంతో మిళితం చేసి కంటెంట్ ఫాలోవర్లకు అందిస్తుంది. అందరికీ అర్థమయ్యే బాలీవుడ్, క్రికెట్ వంటి అంశాలతో ఈమె ఫైనాన్స్‌ కంటెంట్‌ మిళితమై ఉంటుంది. నైకా, క్రెడ్, ఎయిర్ టెల్ వంటి టాప్ బ్రాండ్లతో కలిసి పనిచేసిన నేహా.. ఆర్థిక స్వావలంబన సాధించడానికి అవసరమైన పరిజ్ఞానం అందించి జనానికి సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.

    చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్న ఆకాంక్షలతో మొదలైన నాగర్ ప్రయాణం ఎంబీఏ, వెల్త్ మేనేజ్ మెంట్ కు దారితీసింది. ముఖ్యంగా మహిళలకు సహాయం చేయాలనే తపనతో, వాళ్లు డబ్బును అర్థం చేసుకోవడం, నిర్వహించుకోగలగడంలో తన వంతు సాయం అందించడానికి ఆమె చివరికి డిజిటల్ ఫైనాన్స్ పాఠాల వైపు మొగ్గు చూపారు. పిల్లల్ని కనడానికి ముందు అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఆమె చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆర్థిక అక్షరాస్యతకు ఆమె చేసిన కృషికి ఫోర్బ్స్, సీఎన్‌బీసీ, ఎన్‌డీటీవీ, టీఈడీఎక్స్, ఇతర ప్రముఖ వేదికలలో కూడా ఆమె స్థానం పొందారు.

  • ఆఫ్‌-రోడ్‌లో దూసుకెళ్లే మారుతి సుజుకి జిమ్నీ విక్రయాల్లోనూ దూసుకెళ్లింది. సరికొత్త మైలురాయిని దాటింది. మారుతి సుజుకి జిమ్నీ మొదటిసారిగా 2023 జూన్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ 5-డోర్ల వెర్షన్ లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. ఆటోకార్ ప్రొఫెషనల్స్ నివేదిక ప్రకారం.. రెండు సంవత్సరాలలో ఈ వాహనం మొత్తం 1,02,024 యూనిట్ల అమ్మకాలను సాధించింది.

    మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్లో విక్రయించిన 26,180 యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి), 75,844 ఎగుమతి యూనిట్లు (2025 ఏప్రిల్ చివరి వరకు లాంచ్ అయినవి) ఉన్నాయి. అయితే మారుతి సుజుకి జిమ్నీ అమ్మకాల సంఖ్య పరంగా దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన మహీంద్రా థార్ శ్రేణి కంటే చాలా వెనుకబడి ఉంది. 2020 అక్టోబర్‌లో లాంచ్ అయినప్పటి నుండి 2025 ఏప్రిల్ చివరి వరకు మూడు డోర్ల థార్, థార్ రాక్స్ తో, ఎస్‌యూవీ శ్రేణి మొత్తం 2,59,921 యూనిట్లతో 2.5 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.

    మారుతి సుజుకి జిమ్నీ మూడు డోర్ల వర్షన్‌ ప్రపంచ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందింది. ఈ పాపులారిటీని పునరావృతం చేయడానికి కంపెనీ ఐదు డోర్ల వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆఫ్-రోడర్ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వాహనం 4×4 సిస్టమ్‌తో బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చింది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో రూ .12.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మడవుతోంది. దీనిని గురుగ్రామ్ ప్లాంట్లో తయారు చేసి జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

    మారుతి సుజుకి జిమ్నీలో సింగిల్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 105 బీహెచ్‌పీ పవర్‌ని, 134 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 16.94 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 16.39 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

  • ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు రూ.లక్షల్లో వేతనాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొంత మంది ఉన్నతోద్యోగులు రూ.కోట్లలో సైతం పరిహారాలు అందుకుంటారు. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో రూ.కోట్లు సంపాదిస్తున్నవారి సంఖ్య ఈసారి పెరిగింది. అంతక్రితం ఏడాది క్షీణత తరువాత, వార్షికంగా రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరిగి 112కు చేరుకుంది.

    స్టాక్ ఇన్సెంటివ్స్ పర్క్విసైట్ విలువలో మార్పులు, అధిక వేరియబుల్ పే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. అదీకాకుండా 33 మంది అధిక సంపాదన కలిగిన ఉద్యోగులు ఇన్ఫోసిస్‌లో ఏడాది మధ్యలో చేరారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. వీరు ఒక్కొక్కరు సగటున నెలకు రూ .8.5 లక్షలకు పైగా జీతం పొందుతున్నారు. కంపెనీలో రూ .1 కోటి కంటే ఎక్కువ సంపాదించే వారి సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది పూర్తీగా రివర్స్‌ అయింది. అప్పుడు వీరి సంఖ్య అంతకు ముందు ఏడాది కంటే 17 శాతం తగ్గింది.

    చారిత్రాత్మకంగా 2023 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా 124 మంది ఉద్యోగులను నమోదు చేయగా, 2020 ఆర్థిక సంవత్సరం గత ఆరేళ్లలో అత్యల్పంగా 74 మందిని నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, టాప్ 10 ఎగ్జిక్యూటివ్ లను మినహాయించారని కంపెనీ స్పష్టం చేసింది. ఈ 112 మంది ఉద్యోగుల మొత్తం వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.203 కోట్లుగా ఉంది. సీఎఫ్‌వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.8.8 కోట్ల పరిహారంతో అగ్రస్థానంలో నిలవగా, చీఫ్ డెలివరీ ఆఫీసర్లు దినేష్ ఆర్ రూ.7.2 కోట్లు, సతీష్ హెచ్‌సీ రూ.6.9 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

    👉 ఇదీ చదవండి: అమ్మో ఏఐతో జాబ్‌ ఇంటర్వ్యూ.. అన్నీ పట్టేస్తుంది!

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అధిక సంపాదనలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 2000 సంవత్సరానికి ముందు నుండి ఇన్ఫోసిస్‌లో ఉన్నారు. కొందరు 1990 నాటివారూ ఉన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఇన్ఫోసిస్ మొత్తం వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో 4% పెరిగి రూ .85,950 కోట్లకు చేరుకుంది. ఇది దాని మొత్తం ఆదాయం రూ .1.63 లక్షల కోట్లలో 53 శాతం. 2025 మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.24 లక్షలుగా ఉంది.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పెరగడం, ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు పతనమయ్యాయి.

    ఇంట్రాడేలో 80,354.59 పాయింట్ల కనిష్టాన్ని తాకిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 573.6 పాయింట్లు (0.7 శాతం) క్షీణించి 81,118.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 169.6 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 24,718.6 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ లు వరుసగా 0.24 శాతం, 0.43 శాతం నష్టపోయాయి.

    అయితే రంగాలవారీ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, ఎనర్జీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

    సెన్సెక్స్ లోని 30 షేర్లలో 26 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1 శాతానికి పైగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ మాత్రమే లాభపడ్డాయి.

    ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 8.57 శాతం పెరుగుదలతో 73.87 డాలర్లకు ఎగసింది. మరోవైపు మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 7.6 శాతం పెరిగి 15.08 పాయింట్ల వద్ద స్థిరపడింది.

  • రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.

    జియో రూ.799 ప్లాన్
    జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.  ఇందులో  అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో పొందవచ్చు.

    జియో రూ.859 ప్లాన్
    ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో ఆనందించవచ్చు.

    👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్‌.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ

    జియో రూ.889 ప్లాన్
    జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌  ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు. అలాగే జియో సావన్‌కు కూడా ఉచిత యాక్సెస్‌ను కూడా వినియోగదారులు పొందుతారు.

  • లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ తాజాగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌’ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.4.3 కోట్లు (ఆల్‌ ఇండియా ఎక్స్‌–షోరూం). ప్రస్తుత టాప్‌ ఎండ్‌ లగ్జరీ వాహన కస్టమర్ల కోసం కంపెనీ కేవలం 30 యూనిట్లే విక్రయించనుంది. బెంగళూరులోని మెర్సిడెస్‌ బెంజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా (ఎంబీఆర్‌డీఐ) భాగస్వామ్యంతో భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ దీన్ని రూపొందించంది. తమ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దిన వాహనాలను కస్టమర్లు కోరుకుంటున్న నేపథ్యంలో టాప్‌ ఎండ్‌ లగ్జరీ సెగ్మెంట్లో హైపర్‌–పర్సనలైజేషన్‌ ట్రెండ్‌ ఎక్కువగా ఉంటోందని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు.

    ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

    • మిడ్ గ్రీన్ మాగ్నో, రెడ్ మాగ్నో రంగుల్లో లభిస్తుంది.

    • మొదటగా కొనుగోలు చేసే కస్టమర్లకు డ్యాష్ బోర్డ్ గ్రాబ్ హ్యాండిల్‌పై తమ పేరును చెక్కించుకునే వీలుంది.

    • స్పేర్ వీల్ కవర్‌పై ‘వన్ ఆఫ్ థర్టీ’ ప్లేట్‌ ఉంటుంది. ఇది లిమిటెడ్‌ ఎడిషన్‌ను సూచిస్తుంది.

    • బ్లాక్ నాప్పా లెదర్, ఓపెన్ పోర్ వాల్నట్ వుడ్ ట్రిమ్‌తో ఇంటీరియర్‌ ఉంటుంది.
       

National

  • వడోదరా:  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్‌లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. 

    వడోదరాకు చెందిన భావిక్‌ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన భావిక్‌.. జూన్‌ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్‌లో పని చేస్తున్న భావిక్‌,.. జూన్‌ 12వ తేదీన అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఎక్కాడు. 

    అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది.  తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి.  ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్‌ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్‌ వెళ్లాక ఫోన్‌ చేస్తానన్నాడు. టేకాఫ్‌ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్‌లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు.


     

  • న్యూఢిల్లీ:  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్‌ 12వ తేదీ అనేది టాటా గ్రూప్‌ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్‌ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్‌..  తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్‌ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన. 

    ‘నిన్న(గురువారం, జూన్‌ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్‌ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్‌ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని,  ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. 

     

    కాగా, అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు. 

     

     

  • గాంధీ నగర్‌: ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్‌ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్‌, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

    ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్‌ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.

     

     ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్‌ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్‌లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్‌ ఆస్పత్రిలో లంచ్‌ బాక్స్‌లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. 

    ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న  నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్‌కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్‌లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ  ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు.
     

    ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్‌లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా  మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్‌ఏని సేకరిస్తున్నారు.  బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు.  

  • సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్‌లైన్స్ డ్రీమ్‌లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్‌ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్‌ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.  

    గురువారం గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. 

     

  • ఢిల్లీ:  ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి.  ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 

    ‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి  ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం  కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు   కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.

    ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు
    ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.

    ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి
  • సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్‌,ఆర్యన్‌,మనవ్‌ జయ్‌ ప్రకాష్‌లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్‌ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్‌ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్‌ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్‌లో బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.

    మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్‌ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

    Plane Crash: బీజే మెడికల్ కాలేజీలో CCTV విజువల్స్

    ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే  ప్రమాద స్థాయి కనిపించింది.  దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్‌ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది.  ఇక హాస్టల్‌ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్‌పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్‌ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్‌లో లోపల ఉన్న టేబుల్‌ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్‌ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. 

    ఇందులో 230 ప్రయాణికులు,  ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్‌ మిస్‌ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. 

    లండన్‌కు వెళ్లాల్సిన గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్‌ అనే మహిళ.. అహ్మదాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్‌ మిస్‌ అయ్యిపోయిపోతుందేమోనని  గాబరా గాబరాగా ఎయిర్‌పోర్ట్‌ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్‌ ఎక్కలేదు. బోర్డింగ్‌ ప్రాసెస్‌కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్‌ మిస్‌ చేసుకుని బ్రతికిపోయింది. 

    ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది.  అది నేను వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా 171 బోయింగ్‌ విమానం.  ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్‌లోనే ఉన్నా. ఆ ఫ్లైట్‌ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్‌ అవుతుంది. బోర్డింగ్‌ ప్రోసెస్‌ అంతా 12.10 కల్లా కంప్లీట్‌ చేయాలి. 

    కానీ నేను 12.20కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చా. నేను చెక్‌ ఇన్‌ గెట్‌ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్‌ చేశా. మొత్తం ప్రొసెస్‌ అంతా త్వరగా కంప్లీట్‌ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్‌ కూలిపోయింది. 

    దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్‌ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్‌ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. 

     

    ఇక భూమి తల్లి మాట్లాడుతూ..  ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు  ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్‌కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్‌గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది.  నా  కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని  పేర్కొన్నారు.

    భూమి చౌహాన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్‌తో నా కూతురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్‌ ప్రాసెస్‌కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్‌ చేసినా వారు అనుమతించలేదు.  ఆ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు.

  • న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌(గుజరాత్‌) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్‌ బాక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్‌బాక్స్‌ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

    ఎయిరిండియా బోయింగ్‌ 787-8 విమానం కూలిన బీజే మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై ఆరంజె కలర్‌లో ఉన్న బ్లాక్ బాక్స్‌ లభ్యమైంది. ఏ171 బ్లాక్‌ బాక్స్‌  బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్‌ బాక్స్‌ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్‌ బాక్స్‌లో సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్‌, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్‌లో రికార్డయిన చివరి రెండు గంటల  పైలెట్‌, కోపైలెట్‌ల మధ్య సంభాషణ వినొచ్చు. 

    గురువారం మధ్యాహ్నాం లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.

    ఇదీ చదవండి: బ్లాక్‌బాక్స్‌తో ఏం చేస్తారో తెలుసా?

Movies

  • హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'హంటర్ ఛాప్టర్ 1'. ఈ చిత్రంలో నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాకు షరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ.రాజశేఖర్, సాయి కిరణ్ బత్తుల నిర్మించారు.

    తాజాగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించారు. బాలాజీ కె రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు  చేపట్టారు.  సస్పెన్స్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోనుంది. 

  • కమల్‌ హాసన్‌ నటించిన చిత్రం థగ్‌ లైఫ్‌. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్‌ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది.

    అయితే థగ్‌లైఫ్‌ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో థగ్‌ లైఫ్‌ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్‌ లైఫ్‌ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.

    అయితే సెన్సార్‌ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తాజాగా థగ్‌ లైఫ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్‌ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్‌- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు. 

    • యూట్యూబ్‌లో హల్దీ సెలబ్రేషన్స్‌ వీడియో షేర్‌ చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ శుభశ్రీ
    • నో క్యాప్షన్‌ అంటున్న నటి కీర్తి భట్‌
    •  వెకేషన్‌లో ప్రియా వారియర్‌
    • పెళ్లిరోజు సెలబ్రేట్‌ చేసుకున్న పూర్ణ

     

     

  • టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఏది చేసిన వెరైటీగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆయన.. జీవితానికి సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. తాజాగా బండ్ల గణేశ్‌ ట్విటర్‌ వేదికగా చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. అతి ప్రేమ.. అతి అభిమానం.. అతి విశ్వాసం.. అతి నమ్మకం.. ఆరోగ్యానికి హానికరం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది కేవలం మన లైఫ్‌ కోటేషన్ తరహాలోనే పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. తనకు నిజ జీవితంలో ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

    ఇటీవల బండ్ల గణేశ్‌ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కలిశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కలిసి పరామర్శించారు. కోట శ్రీనివాసరావుతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో కోట శ్రీనివాసరావు గుర్తు పట్టలేనంతగా మారిపోయినట్లు కనిపించారు. కాగా.. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటుడిగి మెప్పించిన బండ్ల గణేశ్.. నిర్మాతగాను తనదైన ముద్రవేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు.

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్‌ స్పందించారు. అక్కడే దాదాపు 24 ఏళ్లు నివసించానని తెలిపారు. తాను నివాసమున్న ప్రదేశానికి  పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మేఘనినగర్‌లో విమాన ప్రమాదం జరిగిందని అన్నారు. నా బాల్యమంతా అక్కడే గడిచిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను నివసించిన ప్రాంతంలో ఈ విషాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటన విన్న వెంటనే తాను, తన పాఠశాల స్నేహితులు షాక్‌లో ఉన్నామని తెలిపారు. కాగా.. కేరళలోని త్రిసూర్‌లో జన్మించిన ఉన్ని ముకుందన్‌ అహ్మదాబాద్‌లోని మణినగర్‌లో పెరిగారు.

    అంతకుముందు బాధితుల కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఉన్ని ముకుందన్‌ పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. కాగా.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్ది క్షణాల్లోనే  కూలిపోయింది. మేఘనినగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి హాస్టల్‌ భవనంపై విమానం కూలిపోవడంతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఇక ఉన్ని ముకుందన్ సినీ కెరీర్ విషయానికొస్తే 'సీడన్' అనే తమిళ చిత్రంతో  అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'మల్లూ సింగ్'లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ తర్వాత 'విక్రమాదిత్యన్', 'కెఎల్ 10 పట్టు', 'స్టైల్', 'ఒరు మురై', ​​'వంతు పార్థయ', 'అచాయన్స్', 'మాలికప్పురం' 'మార్కో' చిత్రాలతో అభిమానులను అలరించారు. నిర్మాతహా తన తొలి చిత్రం'మెప్పడియాన్‌'కి జాతీయ అవార్డు అందుకున్నారు.

  • తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే కౌశల్‌ మండా (Kaushal Manda) ఒక సంచలనం. ఇతడు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్‌ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్‌ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు.

    500 సినిమాలు చేసేవాడిని
    షోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్‌ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్‌ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్‌ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్‌ చేస్తాను. మోడలింగ్‌, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.

    ఆ హీరోలతో పని చేయాలనుంది
    హీరో ఉదయ్‌కిరణ్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్‌ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్‌ హాసన్‌ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్‌ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని క్యాన్సర్‌ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక

  • తక్కువ కాలంలోనే బాగా పాపులర్‌ అయిన బ్యూటీ వర్ష (Varsha). సీరియల్‌ నుంచి కామెడీ షోలోకి వచ్చి హైలైట్‌ అయింది. అయితే తనపై పదేపదే కుళ్లు జోకులు వేస్తుంటే తీసుకోలేకపోయింది. ముఖ్యంగా తనది అబ్బాయి గొంతు అని, అబ్బాయిలాగే ఉంటుందని ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసినప్పుడు ఒంటరిగా బాధపడింది.

    డిప్రెషన్‌లో..
    అలాగే తన ఇంట్లో జరిగిన ఓ విషాదకర వార్తను తాజాగా పంచుకుంది. ఓ పాడ్‌కాస్ట్‌లో వర్ష మాట్లాడుతూ.. మనకు మనుషులు చాలా అవసరం. మా అక్క ఏదో పనిమీద బావగారిని బయటకు పంపించింది. సడన్‌గా ఓ బైక్‌ ఢీ కొడితే అక్కడికక్కడే చనిపోయారు. మా అక్క డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మా బావగారి బట్టల్ని ఒక గదిలోకి తీసుకెళ్లి వాటిని పట్టుకునే నిద్రిస్తోంది.

     

    ఎవరికీ శాపం కాకూడదు
    ఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా అక్క కొడుకు నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. పిన్ని, మాకు టిఫిన్‌ తెచ్చుకోవడం కూడా తెలియదు. రేపటినుంచి మేము ఎవర్ని అడగాలి? అని ఏడ్చేశాడు. డ్రైవింగ్‌ చేసే ప్రతి ఒక్కరినీ ఒకటే కోరుకుంటున్నా.. మీ నిర్లక్ష్య డ్రైవింగ్‌.. వేరొకరి ప్రాణాలు తీసేంత శాపంగా మారకూడదు అని చేతులెత్తి మొక్కుతూ ఏడ్చేసింది వర్ష.

    చదవండి: నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక

  • బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ విన్నర్‌ సనా మక్బుల్‌ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్‌ సైరోసిస్‌ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్‌పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.

    తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు  లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.  ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.

    అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు  కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు.  ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా  ప్రభావితం చేసిందని చెప్పింది.

    కాగా.. సనా మక్బుల్ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్-3 విన్నర్‌గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది.  

  • బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్‌ ప్రస్తుతం వార్‌-2  మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్‌ కూడా నటించారు. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

    అయితే సినిమాల సంగతి పక్కనపెడితే హృతిక్ రోషన్‌ ఆయన తండ్రితో కలిసి ఖరీదైన మూడు ఫ్లాట్లను అమ్మేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఆంధేరి వెస్ట్‌లో ఉన్న మూడు రెసిడెన్షియల్ ఫ్లాట్లను దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించారు. ఈ ఆస్తులు ముంబైలోని అంధేరి శివారులోనే ఉండగా.. వాటిలో రెండు ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌వి కాగా.. మూడో ఫ్లాట్‌ హృతిక్ రోషన్‌కు చెందినదిగా సమాచారం.

    మరోవైపు హృతిక్ రోషన్‌ క్రిష్-4 మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను రాకేశ్‌ రోషన్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకు  హృతిక్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల పాప్ స్టార్ జాక్సన్ వాంగ్ రోషన్ దంపతులను వారి నివాసంలో కలిశారు. అతను క్రిష్ 4లో భాగం అవుతానని ఇప్పటికే ధృవీకరించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అయితే క్రిష్-4 ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.
     

  • తల్లాడ సాయికృష్ణ,అమ్మినేని స్వప్న చౌదరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కిషోర్ దాస్,వినోధ్ నువ్వుల, కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హనీ కిడ్స్. వీరి నటనకు తోడు అత్యాధునిక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఈ సినిమాను అద్భుతమైన విజువల్ అనుభవంగా మార్చబోతోంది.  భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి 100% VFX ఆధారిత సినిమాగా దీనికి గుర్తింపు రాబోతోంది. 

    హర్ష.ఎం దర్శకత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ-సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ చివరి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పోస్టర్ లుక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయిక స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ ఈ జోనర్ సినిమాలు పక్కా పిల్లలకి నచ్చుతాయంది. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపింది.

  • అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ దుర్ఘటన నిజంగా దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అన్నారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ విషాదంపై ఇప్పటికే టాలీవుడ్ సినీతారలతో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం విచారం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ది రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారుయ ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    జ
  • మెగా కోడలు త్వరలో తల్లి కాబోతుంది. గత నెలలోనే వరుణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. తన భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉందని తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. అప్పటినుంచి అటు వరుణ్ గానీ ఇటు లావణ్య గానీ మీడియా కంట పడట్లేదు. తాజాగా ఇద్దరూ కలిసి మాల్దీవుల్‌కు వెకేషన్ వెళ్లారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లావణ్య బేబీ బంప్‌తో కనిపించింది.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్.. 'శక్తిమాన్')

    కలిసి రెండు సినిమాలు చేసిన వరుణ్-లావణ్య.. దాదాపు ఆరేడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత చాలావరకు సినిమాలు తగ్గించేసిన లావణ్య.. అంతకు ముందే ఒప్పుకొన్న ఒకటి రెండు సినిమాలు, వెబ్ సిరీస్ పూర్తి చేసింది. అలా ఈ ఏడాది మే 6న తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది.

    ఇప్పుడు బేబీ బంప్‌తో బీచ్ ఒడ్డున భర్తతో కలిసి కనిపించింది. ప్రస్తుతం వరుణ్-లావణ్య.. మాల్దీవుల్లోనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే మెగా కోడలు ఇప్పట్లో కొత్త సినిమాలు చేయడం కష్టమే. ఒకవేళ బిడ్డ పుట్టిన కొన్నేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తే కనిపించొచ్చు. లేదంటే మొత్తానికే కెరీర్‌ని వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు వరుణ్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో కలిసి ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. ఇదివరకే కొంతమేర షూటింగ్ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.

    (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 

  • అమ్మతో పంచుకోలేనవి, నాన్నతో చెప్పుకోలేనివి, సోదరుడు/సోదరితో మాట్లాడలేనివి.. ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. మొహమాటాలకు అస్సలు తావుండదు. అతడే ఫ్రెండ్‌.. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నమ్మి దోచుకునేవారికంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్‌ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలామంది.

    ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌
    మెగా డాటర్‌ నిహారిక (Niharika Konidela)కు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు. వారే వితికా షెరు, మహాతల్లి జాహ్నవి, అంబటి భార్గవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. తాజాగా వితికా షెరు (Vithika Sheru).. నిహారికకు పెద్ద సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. తనకోసం ఏం చేయాలా? అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది. నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది. తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించి అందంగా సర్దింది. కొన్ని పూలమొక్కల్ని కూడా గదిలో అలంకరించింది.

    నిహారికకు తెలియకుండా..
    ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. నిహారిక, నేను ఒకే టీచర్‌ దగ్గర పాటరీ (మట్టి పాత్రలు తయారు చేయడం) నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్‌ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం. నేను కుమ్మరి పనిలో బేసిక్స్‌ మాత్రమే వచ్చు. కానీ నిహారిక, భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది. ఈ మేకోవర్‌ అంతా నిహారికకు తెలియకుండా చేసింది. తీరా ఆ పాటరీ స్టూడియోకు వచ్చిన నిహారిక.. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను ముద్దులతో ముంచెత్తింది.

    దిష్టి తగలొద్దు
    వితికా చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. నీకు, నీ ప్రేమకు ఏ దిష్టీ తగలకూడదు. తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది. నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థాంక్యూ. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను. కానీ, నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలినైపోయాను. నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్‌గా ఫీలయ్యేలా చేస్తావ్‌. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావ్‌. దీన్ని నేను గ్రాంటెడ్‌గా తీసుకోను.. నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ బేబీ..  అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. వితికా లాంటి ఫ్రెండ్‌ దొరకడం అదృష్టం అని కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: శూర్పణఖగా ప్రియాంక అవుట్‌.. రకుల్‌తో డీల్‌?

  • అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.

    ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్‌ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్‌ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్‌కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్‌ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్‌ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.

    మీరా చోప్రా ట్వీట్‌లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్‌కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్‌ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అయితే మీరా చోప్రా టికెట్‌ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు.  టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.  నిబంధనలకు విరుద్ధంగా  మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్‌ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. 
     

     

  • 90స్ జనరేషన్‌కి సూపర్ హీరోలు అనగానే స్పైడర్ మ్యాన్, 'శక్తిమాన్' గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే 'శక్తిమాన్' స్టోరీతో అటు సీరియల్ గానీ మూవీస్ గానీ రాలేదు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ఈ ప్రాజెక్ట్ తీస్తారనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఫైనల్‪‌గా అది అల్లు అర్జున్ చేతిలోకి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?

    'పుష్ప 2' తర్వాత లెక్క ప్రకారం బన్నీ.. త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ మూవీ ఒకటి అనుకున్నారు. కానీ అది ఆలస్యమవుతూ వచ్చింది. మధ్యలో తమిళ దర్శకుడు అట్లీతో.. బన్నీ కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఇదో హాలీవుడ్ రేంజ్ సూపర్ హీరో తరహా సినిమా అని అనౌన్స్‌మెంట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.

    (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 

    రీసెంట్‌గా బన్నీ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో నెక్స్ట్ ఎవరితో చేస్తాడా అనే టైంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఇతడు 'మిన్నల్ మురళి' అని లోకల్ సూపర్ హీరో మూవీ ఒకటి తీశాడు. ఈ క్రమంలోనే బన్నీ-బాసిల్ కలిసి 'శక్తిమాన్' చేస్తారనే రూమర్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

    అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు ఓ రెండు కలిసి.. గీతా ఆర్ట్స్‌తో భారీ ఎత్తున నిర్మించబోతున్నారని అంటున్నారు. త్వరలో ప్రకటన రావొచ్చని మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు వినిపిస్తున్నవన్నీ నిజమేనా? లేదంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేస్తున్నారా అనిపిస్తుంది. కొన్నిరోజులు ఆగితే నిజమేంటనేది క్లారిటీ రావొచ్చు.

    (ఇదీ చదవండి: 'రాజాసాబ్' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే కఠిన చర్యలు) 

  • మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్‌. ఫుట్‌ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!

    హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!

    రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!

    ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు
     

  • ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రాల్లో రామాయణ్‌ (Ramayan Movie) ఒకటి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయిపల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ స్టార్‌ యశ్‌ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. నితేశ్‌ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇదివరకే మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని, 2027లో రెండో భాగాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారు.

    ప్రియాంక అవుట్‌
    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రావణుడి చెల్లెలు శూర్పణఖ పాత్ర కోసం స్టార్‌ హీరోయిన్లను సంప్రదించారట! మొదట ఈ అవకాశం గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను వరించిందట. కానీ, తన చేతిలో ఉన్న ‍ప్రాజెక్టులతో ఆమె ఫుల్‌ బిజీగా ఉందట. దీంతో రామాయణ్‌ చిత్రయూనిట్‌.. ప్రియాంకను వదిలేసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను శూర్పణఖ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం కంటే సంతోషం ఇంకేముంటుందని రకుల్‌ వెంటనే రామాయణ్‌కు ఓకే చెప్పినట్లు భోగట్టా!

    రామాయణ్‌..
    ఈ క్రమంలో ఆమెకు లుక్‌ టెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. రామాయణ్‌ విషయానికి వస్తే సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. ఇక ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం రాజమౌళి- మహేశ్‌బాబు (SSMB29) సినిమాతో బిజీగా ఉంది. అటు రకుల్‌.. చివరగా మేరే హజ్బెండ్‌ కీ బీవీ మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్‌ 3, దేదే ప్యార్‌ దే 2 చిత్రాల్లో నటిస్తోంది.

    చదవండి: కూతురి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Andhra Pradesh

  • సాక్షి,అల్లూరి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను వర రామచంద్రపురం మండలం కొక్కెరగూడెం అడవిలో వదిలేసిన వైనం వెలుగులోకి వచ్చింది. 

    ఏ కన్నతల్లిబిడ్డో ఏమో ప్రసవం తరువాత పసికందును ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి చెట్టుకు వేలాడ దీశారు. ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టడంతో ఊపిరాడక గుండలవిసేలా ఏడుస్తున్న పసికందును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించారు. చింతూరు పసికందుల వార్డులో మగ బిడ్డకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. 

  • గుంటూరు:  తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి,  గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.

    ఈరోజు(శుక్రవారం, జూన్‌ 13) గుంటూరులో జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్‌, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతో పాటు  జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు.  వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. 

    దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్‌ సెల్‌  అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.

    రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది..  రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.

    గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్

    ఇవి పథకం ప్రకారం చేసే దాడులు
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. 

    ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని  వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

    అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారు
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. 

    కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు.

  • సాక్షి,విజయవాడ: టీవీ డిబేట్‌లో గెస్టు చేసిన వ్యాఖ్యలకు సదరు డిబెట్‌ నిర్వహిస్తున్న యాంకర్ ఎలా బాధ్యులవుతారు? అంటూ ఏపీ పోలీసుల్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.  సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయ స్థానం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

    సాక్షి ఛానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ అరెస్టుపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొమ్మినేని వెంటనే విడుదల చేయాలంటూ తీర్పును వెలువరించింది. అయితే రాష్ట్రంలో నిరంకుశంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పేలా సుప్రీం తీర్పు ఇవ్వడం హర్షణీయం అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

    గురుమూర్తి, ఎంపీ

    • ఏపీలో శాంతిభద్రతలు దిగజారాయి
    • అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై టిడిపి నేతలు అత్యాచారానికి పాల్పడ్డారు
    • ఈ అంశంపై  ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు
    • అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము
    • హరికృష్ణ పై దాడి పై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి  ఆదేశాలు ఇచ్చింది
    • బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను
    • ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది
    • సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం  కక్షపూరితంగా వ్యవహరించారు
    • కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది
    • విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు
    • వాక్ స్వాతంత్రానికి పెద్ద పీటల దేశం సుప్రీంకోర్టు  కొమ్మినేని విడుదల చేయాలని ఆదేశించింది 

    బొల్లా బ్రహ్మనాయుడు:

    • సీనియ‌ర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస‌రావును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయ‌డం ముమ్మూటికీ చంద్రబాబు స‌ర్కార్‌కు చెంప‌పెట్టే.
    •  చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా అక్ర‌మ కేసులు పెట్టించ‌డం, అరెస్టు చేయించ‌డం వంటివి ఆప‌క‌పోతే ప్ర‌జ‌లే బుద్ధి చెప్ప‌డం ఖాయం.
        

    వెన్నపూస రవీంద్రరెడ్డి:

    • సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశం
    • కొమ్మినేని శ్రీనివాస‌రావు అక్రమ అరెస్ట్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం చేసిన వ్యాఖ్య‌లు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు
    • కొమ్మినేనిపి వెంట‌నే విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయం.

    బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ట్వీట్

    • సీనియ‌ర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస‌రావు  అరెస్టుపై ఈ రోజు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర ప్ర‌భుత్వానికి పెద్ద ఎదురురెబ్బే.
    • క‌నీస నిబంధ‌న‌లు పాటించ‌కుండా అరెస్ట్ చేయ‌డంపై సుప్రీం కోర్టు సీరియ‌స్ అవ్వ‌డ‌మే కాకుండా వెంట‌నే కొమ్మినేనిని విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయం.

    గోరంట్ల మాధవ్: 

    • సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అక్రమ అరెస్ట్‌పై సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు.  
    • ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని హరించే అరాచకాలకు కోర్టు బుద్ధి చెప్పింది.
    • డిబేట్ నిర్వహించినందుకు చంద్రబాబు చేయడం అక్రమమని సుప్రీం స్పష్టంగా చెప్పింది.
    • ఈ తీర్పు ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టే గొప్ప విజయం.

    వంగా గీత:

    • సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ రక్షణకు బలమైన సందేశం.
    • కొమ్మినేని అక్రమ అరెస్ట్‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం చేసిన వ్యాఖ్య‌లు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు.
    • కొమ్మినేనిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయం.

    ఆరె శ్యామల:

    • సత్యమేవ జయతే
    • కొమ్మినేని శ్రీనివాసరావు అక్ర‌మ అరెస్టుకు, పత్రికా స్వేచ్ఛను సర్వనాశనం చేసే ప్రయత్నాలకు ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి గ‌ట్టి హెచ్చ‌రిక.
    • క‌నీసం ఈ తీర్పుతోనైనా చంద్ర‌బాబు బుద్ధి తెచ్చుకుని అక్ర‌మ కేసులు పెట్ట‌డం, అక్ర‌మంగా అరెస్టు చేయించ‌డం ఆపాలి.

    పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి:

    • కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్ అక్రమమని త‌న‌ తీర్పుతో కూట‌మి ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది.
    • చంద్రబాబు స‌ర్కార్‌ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక.
    • ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు సిగ్గుతో త‌ల‌దించుకోవాలి.
    • అక్ర‌మ అరెస్టుల‌ను ఆపాలి.

    వరుదు కళ్యాణి

    • కొమ్మినేని గారి అరెస్ట్‌పై సుప్రీం కోర్టు తీర్పు ప్రజాస్వామ్య రక్షణకు నిదర్శనం.
    • చంద్రబాబు ప్రభుత్వం పత్రికా స్వాతంత్య్రాన్ని అణచివేసే చర్యలకు కోర్టు బ్రేక్ వేసింది
    • డిబేట్ నిర్వహించినందుకు కేసు పెట్టడం అన్యాయమని సుప్రీం కోర్టు ఖండించడాన్ని స్వాగ‌తిస్తున్నా.
    • ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి.

    భూమన కరుణాకరరెడ్డి: 

    • కొమ్మినేని అరెస్టుపై సుప్రీం కోర్టు అత్యద్భుతమైన తీర్పు ఇచ్చింది.

    • కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు సుప్రీం కోర్టు తీర్పు కూటమి ప్రభుత్వంకు చెంప పెట్టు లాంటిది

    • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు సుప్రీం కోర్టు తీర్పుతో బుద్ధి చెప్పింది

    • ఏపీలో పత్రిక స్వేచ్ఛను సర్వనాశనం చేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంప పెట్టు లాంటిది

    • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ను ఏ విధంగా బలహీన పరచాలని చూస్తూనే, సాక్షి మీడియాపై దాడులు చేయించింది

    • డిబేట్ నిర్వహించే వారిని అరెస్ట్ చేయడం అక్రమమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది

    • ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యాన్ని పునాదులను నిలబెట్టింది

    • సాక్షి కార్యాలయాలుపై దాడి చేసిన గుండాలు, రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేయాలి

    గుడివాడ అమర్నాథ్:

    • సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం 

    • సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాను.

    • సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంపపెట్టు

    • సుప్రీం కోర్టు తీర్పుతో కొమ్మినేనిది అక్రమ అరెస్టు అని తేలింది.

    • కొమ్మినేని అరెస్టు వ్యవహారంపై సుప్రీం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది 

    • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు రాష్ట్రంలో గాడితప్పిన పాలనకు హెచ్చరిక 

    • పత్రికా స్వేచ్ఛను హరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు అక్రమమని సుప్రీం స్పష్టం చేయడం హర్షనీయం 

    • కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 70 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అరెస్టులో అత్యంత అమానవీయంగా వ్యవహరించారు

    • ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు చర్యలు ఆపాలి 

    సీదిరి అప్పలరాజు:

    • సీనియర్ పాత్రికేయలు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు 

    • కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైంది.

    • రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టు.

    • కోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ముమ్మూటికీ అక్రమ అరెస్టే అని తేలింది.

    • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీం వ్యాఖ్యలు రాష్ట్రంలో పరిస్ధితికి అద్దం పడుతున్నాయి. 

    • ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్టులు ఆపాలి. 

    • బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలి

  • సాక్షి,తాడేపల్లి: సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)ను వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

    కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అత్యున్నత న్యాయ స్థానం తీర్పుపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

    ‘సుప్రీం తీర్పు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.

    అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు.  మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్‌ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛ‌ను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.

    చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది: YS జగన్

    చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

     

International

  • డొనాల్డ్‌ ట్రంప్‌.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం.  ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్‌’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం..  ఇలా ప్రతీది ట్రంప్‌కు ముడిపడే ఉంది.

    ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జ‌పిస్తున్నారు.  రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్‌  యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు.  ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్న‌ది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్ర‌రాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల  ప్రశ్న.

    మరి ఇరాన్‌పై కక్ష ఎందుకు?
    ఇక్కడ ఇరాన్‌పై మాత్రం ట్రంప్‌ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్‌ సమర్ధిస్తున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్‌పై  దాడిని ఇజ్రాయిల్‌ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్‌ల సుదీర్ఘ యుద్ధం,  ఆపై భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం..  ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్‌.. ఇప్పుడు ఇజ్రాయిల్‌-ఇరాన్‌ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్‌కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. 

    అణు ఒప్పందంపై ఇరాన్‌కు చాన్స్‌ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్‌. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్‌ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.  వారు(ఇరాన్‌) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్‌ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్‌లో స్పష్టంగా కనబడుతోంది.  

    ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్‌ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..

    ఇజ్రాయెల్‌-ఇరాన్‌ రెండూ భారత్‌కు మిత్రదేశాలే, కానీ..

     

  • అహ్మదాబాద్‌ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్‌బాడీ ఎయిర్‌లైనర్‌తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే..  

    బోయింగ్‌ విమానం.. అందునా డ్రీమ్‌లైనర్‌(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్‌ బార్నెట్‌ స్టేట్‌మెంట్‌ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్‌.. ఆయన 787 డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 

    👉జాన్‌ బార్నెట్‌(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్‌ కరోలీనా చార్లెస్‌టన్‌లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్‌ను ప్రస్తావిస్తుంటారు.

    👉ఆ నోట్‌ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్‌పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్‌మెంట్‌ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 

    👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్‌ వాదన. 

    👉బోయింగ్‌ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్‌టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు.  అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.

    ఏం చెప్పాడంటే.. 

    2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. 

    Photo Credits: Netflix

    👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో  కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్‌ రెగ్యులేటర్‌, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 

    👉2022లో నెట్‌ఫిక్స్‌ ‘డౌన్‌ఫాల్‌: ది కేస్‌ అగెనెస్ట్‌ బోయింగ్‌’ డాక్యుమెంటరీలో జాన్‌ బార్నెట్‌ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్‌ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.

    👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్‌లైన్స్‌ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్‌ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 

    👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌పై బార్నెట్‌ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది.

Family

  • కందూరు రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే కాశీవిశ్వేశ్వరుడిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కల్ప వృక్షాలు ఉండటమే ఇందుకు ప్రత్యేక కారణం. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు సమీపంలోని రామలింగేశ్వరాలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. ఈ కల్ప వృక్షాలకు ఓ ప్రత్యేకత ఉంది. వృక్షాల కింద వంటలు చేసి, అందులో కొంత ఇతరులకు దానం చేసి కల్పవృక్షాల కిందే భోజనాలు చేసి నిద్రిస్తే కోరిన కోర్కెలు, గృహబాధలు, రోగాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

    కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత 
    కల్పవృక్షాలు (కబంధ) కాశీ తర్వాత కందూరులోనే కొలువయ్యాయని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ ఆలయం వద్ద ఓ విశిష్టత ఉంది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 27 కల్పవృక్షాలు ఉండటమే ప్రత్యేకత. 

    ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కనున్న కోనేరు చుట్టూ 27 కల్పవృక్షాలు ఉన్నాయి. చాలామంది ఆలయం వద్ద ఉన్న కల్పవృక్షాల వేర్లను తీసుకెళ్లి నాటినా అవి పెరగలేదు. ఆలయం వెలిసిన నాటి నుంచి ఇక్కడ 27 కల్పవృక్షాలే ఉండటం అరుదైన విశేషంగా భక్తులు భావిస్తారు. అందుకే కందూరుకు వెళ్తే కాశీకి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రచారకర్తగా ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి వ్యవహరిస్తున్నారు.

    తంబళి వంశ మహిళతో.. 
    కందూరు సమీపంలోని గుట్టపై పూర్వం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది. గుట్టపై కొలువైన రామలింగేశ్వరుడిని తంబళి వంశానికి చెందిన మహిళ రోజూ గుట్టపైకి ఎక్కి దర్శించుకునేది. కాలక్రమేణా ఆమె గర్భిణి కావడంతో రోజూ గుట్ట ఎక్కడం ఆమె వల్ల కాలేదు. ప్రతిరోజు గుట్ట ఎక్కి మిమ్మల్ని దర్శించుకోవడం నావల్ల కాదు.. మళ్లీ ఎప్పుడు దర్శించుకుంటానో ఏమోనని స్వామితో మొరపెట్టుకుంది. వెంటనే అక్కడ ప్రత్యక్షమైన రామలింగేశ్వరస్వామి నీవు రాలేకుంటే నేనే నీవెంట వస్తాను.. వెనుదిరిగి చూడకుండా గుట్ట దిగి వెళ్లు అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆ మహిళ గుట్ట దిగడం ఆరంభించింది.

    రథంపై రామలింగేశ్వరస్వామి గుట్ట దిగుతున్న సమయంలో రథచక్రాలు, గంటల శబ్దాలకు ఆమె భయపడి వెనుదిరిగి చూసింది. దీంతో రథచక్రాలు విరిగి ఒకటి కోనేరులో పడిపోయింది. రెండోది లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడి పీఠంగా ఏర్పడిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మహిళ శిలగా రూపాంతరం చెందింది. ఆమె శిలావిగ్రహం నేటికీ గర్భగుడిలో ఉంది. ప్రస్తుతం స్వామివారికి పానవట్టం లేదు. రథచక్రమే పానవట్టంగా మారడమే ఈ క్షేత్ర మహిమ.

    చ‌ద‌వండి: అడ‌వే ఆధారం.. బ‌తుకు భారం 

  • గాంధీ నగర్‌: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్‌ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. 

    ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్‌ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్‌ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. 

    వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

    (చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..)

  • విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. యావత్‌ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్‌లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్‌ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్‌ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?

    అహ్మ‌దాబాద్‌లో గురువారం మ‌ధ్యాహ్నం జ‌రిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్ర‌మాదం నుంచి ర‌మేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 

    మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్‌ వ్యక్తిగా ర‌మేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్‌ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్‌ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. 

    ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్‌ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్‌. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి  ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్‌ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.

    రీజన్‌ ఏంటంటే..
    'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లు లేదా స్ట్రక్చరల్ రీన్‌ఫోర్స్‌మెంట్‌ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్‌ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. 

    ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే  ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్‌ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్‌ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.   

    (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?)

  • చెన్నైకి చెందిన స్టార్టప్‌ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను గిఫ్టగా ఇచ్చింది. కంపెనీలు లాభాలను  ఉద్యోగులను పంచి ఇచ్చింది.  "నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు; అనుచరులు లేకుండా నాయకుడు లేడు" అని అజిలిసియం వ్యవస్థాపకుడు, CEO రాజ్ బాబు తెలిపారు.ఈ పరంపర కొనసాగుతుందని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.   దీంతో ఈ  వార్త నెట్టింట సందడిగా మారింది. 

    25 మందికి ఎస్‌యూవీ కార్లు గిప్ట్‌ 
    లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమకు ప్రముఖ అటానమస్‌ ఏజెంట్‌ ఏఐ భాగస్వామిగా ఉన్న అజిలిసియం సంస్థ ఒక గొప్ప ఆవిష్కరణకు చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంగా తమ సంస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులందరికీ హ్యుందాయ్‌ క్రెటా కార్లను బహుమతిగా గురువారం అందజేసింది. సంస్థ 10వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రారంభం నుంచి ప్రపంచ స్థాయికి దాని ప్రయాణాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉద్యోగులను గుర్తించి సత్కరించారు. 

    విలువైన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని అజిలిసియం ప్రధాన కార్యాలయంలో ఈ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్‌బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిలిసియంలో తమ ఉద్యోగుల సేవలను ఎల్లప్పుడు గుర్తిస్తూనే ఉన్నామని చెప్పారు.  సకాలంలో సేవలను అందించడంలో , దీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అందించిన ఈ కార్లు బహుమతులు కావని, అవి శాశ్వత విశ్వాసం, భాగస్వామ్య ఉద్దేశం కలిసిన అద్భుత స్పూర్తిగా ఆయన వ్యాఖ్యానించారు.   

    ఇదీ చదవండి: 41 కాదు 24 ఏళ్లే : వయసు తగ్గించుకున్న లండన్‌​ డాక్టర్‌ సీక్రెట్‌ ఇదే!
     

    2014లో అజిలిసియంను రాజ్ బాబు స్థాపించారు .ఇది ఏజెంట్ AI భాగస్వామిగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు సేవలందిస్తున్నందున బూట్‌స్ట్రాప్‌గా ఎదుగుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో   కంపెనీ అందించిన సమాచారం ప్రకారం  ఇది 45శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెంది 2027 నాటికి 100 మిలియన్ల  డాలర్ల ఆదాయాన్ని నమోదు చేస్తుందని బాబు  ధీమా వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!

  • పది రోజుల కింద ‘మహారాష్ట్ర అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్‌ వర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గౌరి గాడ్సే, జస్టిస్‌ సోమశేఖర్‌ సుందరేశన్‌ ఇచ్చిన మధ్యంతర ఆదేశానికి అనేక రకాలుగా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదేశం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పాటించవలసిన కనీస నిబంధనలను గుర్తు చేసింది. అది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ఉద్యో గానికి కనీసం పదకొండు సంవత్సరాలుగా నియామకాలు జరగలేదనే వాస్తవాన్ని బయట పెట్టింది. అది ఆ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగులు ఇరవై సంవత్సరాలకు పైగా పదోన్నతి లేకుండా కింది స్థాయి ఉద్యోగంలో కొనసాగుతున్నారని చూపింది. అన్నిటికీ మించి, అంగన్‌వాడీ కర్మచారి సంఘటన్‌ తరఫున ఈ కేసు వాదించి గెలిచిన న్యాయవాది ఎన్నో ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని, తన ప్రజా జీవనాన్నీ, తన న్యాయవాద వృత్తినీ ధ్వంసం చేయడానికి పాలకులు చేసిన ప్రయత్నాలను ధిక్కరించి, ప్రజా ప్రయోజన, కార్మిక సంక్షేమ కృషిలో మొక్కవోని దీక్షతో కొనసాగుతున్నారని చూపింది. 

    మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌’(ఐసీడీఎస్‌)లో భాగమైన అంగన్‌వాడీ ముఖ్య సేవిక అనే పర్యవేక్షక ఉద్యోగ నియామకాల కోసం 2021 జూన్‌ 4న ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మళ్లీ 2025 ఫిబ్రవరి 4న కూడా ఆ ఉద్యోగాలకు సంబంధించే మరొక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అప్పటికే ఆ ఉద్యోగం కన్నా కిందిస్థాయి సేవిక (వర్కర్‌) ఉద్యోగంలో పది సంవత్సరాలకు పైగా, కొన్ని సందర్భాలలోనైతే ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలకు పైగా పని చేస్తున్న వారికి ఈ ముఖ్య సేవిక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంగన్‌వాడి సేవికల సంఘమైన మహారాష్ట్ర అంగన్‌ వాడీ కర్మచారి సంఘటన్‌ తమకు జరిగిన ఈ అన్యాయాన్ని న్యాయస్థానంలో సవాల్‌ చేయదలచుకుంది. వారి తరఫున న్యాయవాది సుధా భరద్వాజ్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో వీరికి కూడా అవకాశం కల్పించేలా మార్పులు చేయాలని, ఈ మార్పులకు తగినట్టుగా గడువు తేదీలు మార్చాలని కోర్టు ఇప్పుడు మధ్యంతర ఆదేశం ఇచ్చింది. ఈ ఆదేశం మహారాష్ట్రలో ఎన్నో సంవత్స రాలుగా సేవికలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పని చేస్తున్న వేలాదిమందికి ఒక ఆశాసూచిక.  

    దేశంలో మొత్తంగా కొన సాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఈ మధ్యంతర తీర్పు ఒక చిన్న ఊరట. సుధా భరద్వాజ్‌ ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు రెండు దశాబ్దాలు ప్రధానంగా కార్మిక వ్యవహారాల న్యాయ వాదిగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక న్యాయ శాస్త్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసిన వ్యక్తి. సుధా భరద్వాజ్‌ ప్రపంచ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త కృష్ణా భరద్వాజ్‌ కూతురు. అమెరికాలో పుట్టి, ఆమెరికన్‌ పౌరురాలిగా అక్కడే పదకొండేళ్ల వయసు దాకా ఉన్నారు. ఢిల్లీలో జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నప్పుడు అక్కడి అర్థశాస్త్ర శాఖను నిర్మించమని కృష్ణా భరద్వాజ్‌కు పిలుపు వెళ్లగా, సుధ కూడా తల్లితో పాటుఢిల్లీ వచ్చారు. పద్దెనిమిదేళ్ల వయసు రాగానే స్వచ్ఛందంగా తన అమెరికన్‌ పౌరసత్వం వదులుకున్నారు. కాన్పూర్‌ ఐఐటీలో గణితశాస్త్రంలో ఎంఎస్‌ చేశారు. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ ఎస్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్,బిహార్, మధ్యప్రదేశ్‌గ్రామీణ పాంతాలకు, కార్మిక ప్రాంతాలకు వెళ్లి, కుల,వర్గ అసమాన తలను చూసి, ఆ పేద ప్రజల సేవలోనే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి మధ్యప్రదేశ్‌లో గని కార్మికులను సంఘటితం చేస్తున్న శంకర్‌ గుహ నియోగి ఆలోచనలతో, ఆచరణతో ప్రభావితమై తన ఇరవై ఐదవ ఏట, 1986లో అక్కడ కార్మికుల మధ్య పని చేయడానికి వెళ్లారు. అనేక సంఘాల్లో పని చేయడం ప్రారంభించారు. 

    భిలాయిలో ఎక్కువగా నిరక్షరాస్యులైన కార్మికుల మధ్య, పేదల మధ్య పని చేస్తున్నప్పుడు, అక్కడ చదువు వచ్చిన ఏకైక వ్యక్తిగా ఆమె ఆ కార్మికులకు, పేదలకు జరుగు తున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి, న్యాయస్థానా లలో కేసులు వేయడానికి ఎక్కువగా న్యాయవాదులను కలవ వలసి ఉండేది. పిటిషన్లు రాయవలసి ఉండేది. అటు వంటి పనులు చేస్తుండగా, ఆ కార్మికులు ‘మీరే ఎందుకు న్యాయవాది కాకూడదు’ అని ప్రోత్సహించడంతో, 2000 నాటికి తానే న్యాయవాదిగా మారారు. భూకబ్జాలకు, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కులనూ, ఆదివాసుల సామూహిక అటవీ హక్కులనూ, పర్యావర ణాన్నీ పరిరక్షించడానికి ఎన్నో కేసులు వాదించారు. ‘జన హిత’ అనే న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ‘పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’లో పని చేశారు. ఇలా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బిలాస్‌పూర్‌ హైకో ర్టులో, ఇతర న్యాయస్థానాల్లో ఆదివాసుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం ఆమె చేస్తున్న విస్తారమైన పని, ప్రభుత్వానికి కంటగింపు అయింది. ఆమె పనిని అడ్డుకోవ డానికి, వేధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ‘అర్బన్‌ నక్సల్‌’ అనే ముద్ర కొట్టి 2018 ఆగస్ట్‌ 28నఆమెను అరెస్టు చేసి భీమా కోరేగాం కేసులో నిందితురాలిగా చూపారు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత 2021 డిసెంబర్‌లో షరతులతో కూడిన బెయిల్‌ మీద ఆమె విడుదల య్యారు. ఆ షరతుల్లో ప్రధానమైనది, ‘ముంబయి వదిలి పోకూడదు’ అనేది. అందుకే బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈఅంగన్‌వాడీ సేవికల కేసులో గణనీయమైన విజయం సాధించారు.

    వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్‌ 
    ఎన్‌. వేణుగోపాల్‌ 

  • సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం.   పురాతన కాలం నుంచీ  మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు  గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర  అనేక సుగంధ ద్రవ్యాలను  కలిపి వాడతారు.   మరి ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్‌...

    గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని,  పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్‌వాటర్‌ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. 

    లేదంటే సింపుల్‌గా  పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల  రోజ్‌వాటర్‌, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. 

    అర టీ స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌ వాటర్‌తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)

    ఆలివ్‌ ఆయిల్, అలొవెరా జెల్‌ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. 

    చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 

    ఇదీ చదవండి: సంజయ్‌ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!
    మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, టీ స్పూన్‌ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్‌  ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 

     నోట్‌ : పువ్వులు ఎంత అందమైనవి అయినా  కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు.  అందుకే ఏదైనా ప్యాక్‌ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్‌ ప్యాక్‌లా వేసుకోవడం  మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Politics

  • తాడేపల్లి: సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్‌పై సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టించాలనుకుంటే కుదరదనే విధంగా సుప్రీంకోర్ట్ తీర్పు ప్రజాస్వామిక స్పూర్తిని నిలబెట్టిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే...

    ‘ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, పత్రికాస్వేచ్ఛను పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ కొమ్మినేని అరెస్ట్‌పై ఇచ్చిన ఉత్తర్వులను ప్రజలు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. వారి సొంత రెడ్‌బుక్ రాజ్యాంగాలు చెల్లవు, భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలన చేయాలని మరోసారి సుప్రీంకోర్ట్ తన తాజా ఉత్తర్వులతో చెప్పినట్లయ్యింది. ఏపీలో ఏడాది పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు. 

    అమరావతి పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడ్డారు. తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులతో ఒక అరాచకాన్ని సృష్టించారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ప్రజాస్వామిక స్పూర్తిని పరిరక్షిస్తూ సుప్రీంకోర్ట్ ఈ రోజు వెలువరించిన తీర్పు చంద్రబాబు అరాచకాలకు గొడ్డలిపెట్టు. గడిచిన మూడు రోజులుగా మహిళలను అవమానించారనే వక్రీకరణలను ఆపాదిస్తూ వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి భారతమ్మ, సాక్షి మీడియా పైనా, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపైనా చేసిన దుష్ప్రచారం, కూటమి ప్రభుత్వ కుట్రలు సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో మొత్తం దేశమంతా తెలిసింది. 

    ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వారంతా వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతమ్మకు క్షమాపణలు చెప్పాలి. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఇప్పటికైనా సుప్రీంకోర్ట్ ఉత్తర్వులతో తన బుద్ది మార్చుకోవాలి. బాధ్యతాయుతమైన మహిళా మంత్రులు పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి, తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడినందుకు వారు తమ పదవులకు రాజీనామా చేయాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, అమరావతి: సుప్రీం కోర్టు తీర్పుతో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. కొమ్మినేనిని తక్షణమే రిలీజ్‌ చేయాలంటూ.. ఆయన అరెస్ట్‌ అక్రమమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. సాక్షి, కొమ్మినేనికి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు ఏ సంబంధం లేకపోయినా.. వాటిని ఆపాదిస్తూ ఎల్లో బ్యాచ్‌ ఎంతగా రెచ్చిపోయిందో తెలిసిందే.  ఈ క్రమంలో ఎప్పుడు, ఏం జరిగిందో పరిశీలిస్తే..

    9వ తేదీ సోమవారం..
    గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కొమ్మినేనిని ఈ నెల 9వ తేదీన(సోమవారం) అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఆ రోజు ఉదయమే చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఏ అభియోగాలపై తనను అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించిన కొమ్మినేనికి సరైన సమాధానం ఇవ్వలేదు. 

    👉70 ఏళ్ల వయసులో.. సీనియర్‌ సిటిజన్‌, పైగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన్ను.. ఇంటి లోపల గదిలోకి వెళ్లి మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బలవంతంగా వాహనం ఎక్కించి గుంటూరుకు తరలించారు. కొమ్మినేనిని సోమవారం ఉదయం 11 గంటలకు అరెస్టు చేసినట్టు ప్రకటించారు.కొమ్మినేనిపై బీఎన్‌ఎస్‌ 79, 196(1), 353(2), 299, 356(2), 61(1), 67 ఐటీ యాక్ట్, ఎస్‌సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

    ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసిందని వైఎస్సార్‌సీపీ మండిపడింది. అదే సమయంలో సాక్షి మీడియా సంస్థలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి.

    పోలీసులపై మంగళగిరి కోర్టు ఆగ్రహం

    ఈ నెల 10న (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద ఏ విధంగా కేసు నమోదు చేస్తారు? అంటూ గుంటూరు జిల్లా మంగళగిరి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ సెక్షన్‌ను ఎందుకు పెట్టారని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డిబేట్‌లో అసలు ఎస్సీ, ఎస్టీల గురించి చర్చే జరగనప్పుడు ఆ చట్టం కింద కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఆ సెక్షన్లు కొట్టి వేస్తున్నట్లు చెబుతూ.. మెమోలు జారీ చేస్తామని పోలీసులను హెచ్చరించారు. ఆపై కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు.

    ఇవాళ.. పోలీసులకు సుప్రీం కోర్టు మందలింపు 
    కొమ్మినేని అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం(13 జూన్‌) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్‌ కొమ్మినేని ఎలా బాధ్యులవుతారు?. నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?.. అలాగైతే కేసు విచారణ సమయంలో చాలాసార్లు మేమూ నవ్వుతాం అని వ్యాఖ్యానించింది . వాక్‌ స్వాతంత్రాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం.

NRI

  • భారత సంతతికి చెందిన డాక్టర్‌ ముక్కామల శ్రీనివాస్‌ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.

    ముక్కామల మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్‌లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్‌లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.

    మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్‌  చేయండి!

    స్వయంగా కేన్సర్‌  సర్వైవర్‌
    గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్‌లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు.  ఈ ఆపరేషన్‌లో  90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

    తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ  లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా  మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని  శ్రీనివాస్‌ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ,  సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం.  అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.

    ఇదీ చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌

    గతంలో ఏఎంఏ ఫౌండేషన్‌  నుంచి ఎక్సలెన్స్‌ ఇన్‌ మెడిసిన్‌ లీడర్‌షిప్‌ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి  2021 వరకు ఏఎంఏ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో  ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
     

Jayashankar

  • ప్రోత్సాహమేది?

    కాటారం: ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయంగా నిలిచిన జిల్లాలోని పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమవుతున్నాయి. పల్లెప్రాంతాల్లో నాణ్యమైన, తాజా కూరగాయలను పండించి పట్టణ ప్రాంతాలకు తరలించే రైతులు పలు కారణాలతో సాగుపై నిరాసక్తి కనబరుస్తున్నారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ద్వారా సరైన ప్రోత్సాహం అందకపోగా సాగు రైతులకు సంబంధిత శాఖల అధికారులు అవగాహన కల్పించకపోవడంతో క్రమంగా జిల్లాలో కూరగాయల సాగు తగ్గిపోతుంది. పండించిన కూరగాయలను విక్రయించడానికి మార్కెట్‌ లేకపోవడం సాగుపై మరింత ప్రభావం చూపుతుంది. కూరగాయల సాగుకు కేరాఫ్‌గా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఒకప్పుడు ఎకరాల కొద్ది కూరగాయలు సాగుచేసిన రైతులు కేవలం తమ ఇంటి అవసరాలకు కూరగాయలను పండించడానికి పరిమితం అవుతున్నారు. సాగు తగ్గిపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.

    జిల్లాలో అత్యల్పంగా సాగు..

    రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నట్లు అధికారుల లెక్కలు చెపుతున్నాయి. కానీ జిల్లాలో మాత్రం గతేడాది 190 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో సుమారుగా 250 ఎకరాల నుంచి 300 ఎకరాల వరకు కూరగాయల సాగు జరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా కొద్ది మొత్తం వ్యత్యాసంతోనే కూరగాయల సాగు జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలోని మిగితా జిల్లాలతో పోల్చుకుంటే జిల్లాలో అత్యల్పంగా సాగు జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కాటారం, చిట్యాల, మహదేవపూర్‌ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పలు రకాల కూరగాయలను పండించేవారు. ప్రస్తుతం అలాంటిది కనిపించడం లేదు.

    పెరుగుతున్న కూరగాయల ధరలు..

    స్థానికంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో జిల్లాలో కూరగాయల కొరత ఏర్పడుతుంది. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో కూరగాయల ధరలు అధికమవుతున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు చూస్తే టమోట కిలో 60, వంకాయ కిలో రూ.50, బెండకాయ రూ.60, పచ్చిమిర్చి కిలో రూ.60, బీరకాయ రూ.80, దొండకాయ రూ.70గా ఉన్నాయి,

    అందుబాటులో లేని మార్కెట్‌..

    జిల్లాలో సరైన మార్కెట్‌ సదుపాయం లేకపోవడం కూరగాయలు సాగు చేసే రైతులకు సమస్యగా మారింది. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కూరగాయలు పండిస్తే అవి అమ్ముకోవడానికి వారు తీవ్ర ఇబ్బందులుపడాల్సి వస్తుంది. రైతుల చేతికి వచ్చిన కూరగాయలను గోదావరిఖని, వరంగల్‌ మార్కెట్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తుంది. అధిక రవాణా భారం, సమయం వృథా అవుతుండటంతో రైతులు కూరగాయల సాగుకు స్వస్తి పలుకుతున్నారు.

    కూరగాయల సాగుపై

    ప్రత్యేక దృష్టి

    కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో సాగు పెంచేందుకు ఉధ్యానశాఖ ద్వారా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలు తప్పకుండా రైతులకు చేరేలా చూస్తాం. కూరగాయల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించి మంచి దిగుబడులు సాధించేలా పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం.

    – మణి, హార్టికల్చర్‌ అధికారిణి,

    మహదేవపూర్‌ సబ్‌ డివిజన్‌

    జిల్లాలో సాగు వివరాలు..

    సంవత్సరం ఎకరాలు

    2020–21 271

    2021–22 130

    2022–23 123

    2023–24 75

    2024–25 190

    2025–26(ప్రస్తుతం) 250 అంచనా

    కూరగాయల సాగుకు ఆదరణ కరువు

    ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం

    రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థాయి

    మార్కెట్‌ అందుబాటులో లేకపోవడంతో రైతుల ఇబ్బందులు

    అవగాహన కల్పించడంలో

    అధికారులు విఫలం

    కానరాని అవగాహన..

    ప్రభుత్వం ద్వారా కూరగాయల సాగు రైతులకు ప్రోత్సాహం అందకపోవడంతో పాటు సంబంధిత అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. గతంలో కూరగాయల విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేసేది. పందిర్ల నిర్మాణం, డ్రిప్‌ ఏర్పాటుకు సబ్సిడీ అందజేసేవారు. ప్రస్తుతం కూరగాయలు సాగుచేసే రైతులకు అవేమీ అందడం లే దు. ప్రభుత్వం పత్తి, మిర్చి, వరి విత్తనాలతో పాటు మరికొన్ని వాణిజ్య పంటలకు రాయితీలు ఇస్తుంది. దీంతో రైతులు వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారు. తమ ఇళ్ల వద్ద ఉండే అరెకరం, ఎకరం భూ విస్తీర్ణంలో సైతం పత్తి, మిర్చి సాగుకు పూనుకుంటున్నారు. నీటి సౌకర్యం ఉంటే వరి పండిస్తున్నారు.

  • ధరలు

    కొనలేని స్థితిలో

    సామాన్యులు

    వర్షాభావంతో పెరిగిన ధరలు

    మింగుడు పట్టని పప్పన్నం

    మరింత పెరిగే అవకాశం

    కాళేశ్వరం: జూన్‌ మాసంలో వర్షాల జాడలేక ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులు పౌష్టికాహారం తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయల ధరలను వ్యాపారులు తగ్గించడం లేదు. గతంలో పోల్చితే ఈఏడాది కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలతో కూడా కూరగాయల పంటకు దిగుబడిని తగ్గింది. వాతావరణంలో వచ్చే మార్పులతో కూడా ఎండలకు కూరగాయల దిగుబడి లేక ధరలు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో మరింత అధిక ధరలు ఉన్నాయి. సామాన్యుడు కనీసం తాజా కూరగాయలు కొనుగోలు చేయడం లేదు. గతంలో రూ.200–300 వరకు డబ్బులు పెడితే సంచినిండా కూరగాయలు ఇంటిల్లిపాదికి వారం పాటు సరిపోయేది. ప్రస్తుతం రూ.400–500 పెట్టి కొనుగోలు చేసినా సరిపడా కూరగాయలు లభించడం లేదని పలువురు వాపోతున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. పప్పుతో ముద్దదిగని పరిస్థితులు నెలకొన్నట్లు సామాన్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయాలని సామాన్యులు కోరుతున్నారు.

    ఎండల ప్రభావం ఇలాగే ఉంటే..

    ఎండల ప్రభావంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఎండల ప్రభావం ఇలానే ఉంటే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. టమాట ధర ఇప్పటికే పెరిగింది. మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్‌లో ధరలు అకాశన్నంటుతున్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ కూడా తగ్గుతుంది.

    – మక్సూద్‌,

    కూరగాయల వ్యాపారి, కాళేశ్వరం

    కూరగాయలు కొనలేం..

    ఎండలు మండిపోతుండడంతో కూరగాయల ధరలు పెంచారు. సామాన్యులం కూరగాయలు కొనలేం. మరింత పెరుగుతాయని వ్యాపారులు చెపుతున్నారు. వారానికి రూ.500పెడితే కూడా సరిపడా కూరగాయలు వస్తలేవు. ఽటమాట ధర పెరుగుతుంది. ధరలను నియంత్రించాలి.

    – స్వప్న, టేకుమట్ల

    ధరలు (కిలోకు..)

    టమాట రూ.40–50

    పచ్చి మిర్చి రూ.60

    వంకాయ రూ.50

    బెండకాయ రూ.40

    కొత్తిమీర రూ.120

    కాకరకాయ రూ.70

    బీరకాయ రూ.100

    సోరకాయ రూ.20(ఒక్కటి)

    అలసంద రూ.50

    కాలీఫ్లవర్‌ రూ.80

    క్యాబేజీ రూ.40

    మునుగకాయ రూ. 80

    దోసకాయ రూ.40

    చిక్కుడుకాయరూ.90

    అడవి కాకరకాయ రూ.350

  • కాటారం: కాటారం డీఎస్పీగా సూర్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన రామ్మెహన్‌రెడ్డి సాధారణ బదిలీలో భాగంగా ఇటీవల బదిలీ కాగా హైదరాబాద్‌ ఎస్‌ఐబీలో పనిచేస్తున్న సూర్యనారాయణ కాటారం బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీని సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీఐ, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిశారు.

    ఉపాధి లక్ష్యాలు పూర్తిచేయాలి

    రేగొండ: ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని డీఆర్‌డీఓ బాలకృష్ణ అన్నారు. ఉపాధి హామీ పనులపై గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు పూర్తి చేయడంలో అధికారులు పోటీతత్వంతో పనిచేయాలని తెలిపారు. లక్ష్యం ప్రకారం మండలంలో ప్లాంటేషన్‌ చేపట్టాలని, అందులో సుమారు 100 ఎకరాలలో పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి లేబర్‌ టర్న్‌ఔట్‌ పెంచాలని, కూలీలకు వంద శాతం చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మంజుల, ఎంపీఓ రాంప్రసాద్‌, టీఏలు రాజు, రమేష్‌ పాల్గొన్నారు.

    మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలి

    భూపాలపల్లి అర్బన్‌: మూడు నెలలుగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య కోరారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నెలల కాలం నుంచి సింగరేణిలో మెడికల్‌ బోర్డు పెట్టకపోవడంతో సింగరేణి కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మెడికల్‌ బోర్డులో జరిగిన కుంభకోణం దోపిడీ విషయంలో విచారణ పేరుతో మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు దాసరి జనార్దన్‌, కాసర్ల ప్రసాదరెడ్డి, నామాల శ్రీనివాస్‌, రాళ్లబండి బాపు, జయశంకర్‌, ఎండి సాజిత్‌ పాల్గొన్నారు.

    కొనసాగుతున్న క్రికెట్‌ క్రీడాపోటీలు

    భూపాలపల్లి అర్బన్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లాల క్రికెట్‌ పోటీలు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన ఐదవ లీగ్‌ మ్యాచ్‌ను సీఐ నరేష్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్‌సీయూ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించి క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, అధ్యక్షుడు కర్ణాకర్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

    శిలాఫలకం కూల్చారు..

    టేకుమట్ల: మండలంలోని ఆరెపల్లి శివారులో రైతుల భూములకు వెళ్లే దారి మరమ్మతు కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. గురువారం కాంగ్రెస్‌ నాయకులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • ముస్తాబు.. స్వాగతం

    వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయులు ముస్తాబు చేసి విద్యార్థులకు స్వాగతం పలికారు. మామిడి కొమ్మలు, బెలూన్లు, పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూల అందజేసి స్వాగతం పలికారు. పలు మండలాల్లో పాఠశాలలను డీఈఓ రాజేందర్‌, ఎంఈఓలు సందర్శించి విద్యార్థులకు పాఠ్య, నోట్‌ పుస్తకాలు, యూనిఫాంలు అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను పాఠశాలలకు ఆహ్వానించి పండగ వాతావరణంలో పాఠశాలలను పున:ప్రారంభించారు. స్కూళ్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది.

    –భూపాలపల్లి అర్బన్‌

  • ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

    చిట్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్‌ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. బడిబాటలో భాగంగా నైన్‌పాక ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ అధ్యక్షతన పండుగ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రాజేందర్‌ హాజరై విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు కావాలసిన అన్ని వసతులు కల్పించామన్నారు. సుశిక్షితులైన ఉపాధ్యాయులతో సమగ్రమైన విజ్ఞానం అందించబడుతుందని తెలిపారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌ ద్వారా విద్యాబోధన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంతో జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పదవ తరగతిలో మండలంలో అత్యధిక మార్కులు సాధించిన నైన్‌పాక విద్యార్థిని రమ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొడెపాక రఘుపతి, సీఎంఓ రమేష్‌, సెక్టోరియల్‌ ఆఫీసర్‌ రాజగోపాల్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఊర్మిళ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాముకుంట్ల తిరుపతయ్య, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, తల్లిదండ్రులు, విద్యావంతులు పాల్గొన్నారు.

    చిట్యాలలో...

    మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కొడెపాక రఘుపతి విద్యార్థులకు పాఠ్యప్తుకాలు, నోట్‌ బుక్కులు, దుస్తులు పంపిణీ చేశారు. అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థులకు బొకేలు ఇచ్చి ఆహ్వానించారు.

    డీఈఓ రాజేందర్‌

  • లింగ నిర్ధారణను ప్రోత్సహిస్తే నేరమే

    భూపాలపల్లి అర్బన్‌: లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, పరీక్ష చేయించడం, ప్రోత్సహించడం నేరమేనని అందరూ శిక్షార్హులు అవుతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయని, ఇందులో ఐదు ప్రభుత్వ ఆధీనంలో 9 ప్రైవేట్‌ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి పెట్టాలన్నారు. లింగ నిర్దారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరీక్షలు చేయించి ప్రోత్సహించిన వారికి మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982, 63032 39891 నంబర్లకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్‌ కవిత, పీడియాట్రిషన్‌ డాక్టర్‌ సురేందర్‌, డెమో శ్రీదేవి, సోషల్‌ వర్కుర్లు పాల్గొన్నారు.

    డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌

  • పిల్లలు పనిలో కాదు.. బడిలో ఉండాలి

    భూపాలపల్లి అర్బన్‌: చిన్నపిల్లలు ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. చిన్న పిల్లలు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితి తీసుకున్న నిర్ణయంతో యావత్తు ప్రపంచం బాల కార్మిక నిర్మూలన కోసం కదులుతుందని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌కుమార్‌నాయక్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అఖిల, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మిప్రసన్న, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • ఉపాధి కల్పించడమే లక్ష్యం

    రేగొండ: పేద, దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా భూమి కొనుగోలు పథకం కొనసాగుతోందని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేట, చెన్నాపూర్‌ శివారులోని భూములను గురువారం భూమి కొనుగోలు పథకంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వర్లుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఎంపిక ప్రక్రియలో సమీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రామస్థాయి సమావేశాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మిరాజయ్య, సర్వేయర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

  • ఫీజు రాయితీ కల్పించాలి

    భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో జర్నలిస్ట్‌ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ.. గురువారం టీఎస్‌జేయూ నాయకులు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రాయితీ కల్పించే విధంగా సర్క్యూలర్‌ జారీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన డీఈఓ రాయితీ కల్పించేలా ఆదేశాలిస్తూ ప్రైవేట్‌, కార్పోరేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజషన్‌ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్‌, నాయకులు రవీందర్‌, రవి, భూపాల్‌, సతీష్‌, చంద్రమౌళి, జగన్‌ పాల్గొన్నారు.

Jogulamba

  • రైతు
    పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు

    మానవపాడు: రైతులకు చేయూత ఇచ్చేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమలుచేసి ఏటా వానాకాలం, యాసంగి పంటల పెట్టుబడి కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయి. 2023 డిసెంబర్‌లో ఏర్పడిన రైతు బంధు పథకం పేరును రైతుభరోసాగా మార్చింది. ఈ పథకంలో ఎకరాకు రూ.7500 ప్రతి పంటకు అందిస్తామని మాట ఇచ్చింది. ఇదిలాఉండగా, ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ముందుగానే ప్రారంభం కావడం, వర్షాలు మే నెలలో విస్తారంగా కురవడంతో రైతుభరోసా సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వార్షకాలం సీజన్‌ రైతు భరోసా పెట్టుబడి సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్‌లో అయినా సాగుకు ముందుసాయం అందించాలని కోరుతున్నారు. గత 15 రోజులుగా అకాల వర్షాలు, నైరుతి రుతుపవనాల రాకతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. గత ఖరీప్‌, రబీ పంటల మొదళ్లు, వేర్లు తొలగిస్తూ చెత్తాచెదరం కాల్చివేస్తున్నారు. ఇప్పటికే వేసవి దుక్కులు దున్నిన రైతులు దౌర కొడుతూ చేను సారవంతం చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వరి, మిరప, కందులు, పొగాకు సాగు చేయనున్నారు. యేటా తొలకరి వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూన్‌ నెలాఖరులో పత్తి విత్తనాలు వేయడం, వరి నారు పోయడం చేస్తుంటారు. ఈ సారి ముందుగానే వర్షాలు రావడంతో రైతులు విత్తుకునేందుకు సిద్ధమయ్యారు.

    జిల్లా వివరాలిలా..

    త్వరగా అందించాలి

    గత వానాకాలం ఎవరికి రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగిలో ఐదు ఎకరాలలోపు రైతులకు డబ్బులు పడ్డాయి. వర్షాలు ముందు కురుస్తుడటంతో పంట పొలాలను సాగుకు సిద్ధం చేశాం. త్వరగా రైతుల ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ చేస్తే ఎంతో మేలు చేసినట్లవుతుంది. – గోపాల్‌, రైతు, గోకులపాడు

    అప్పులు తప్పుతాయి..

    ఈ ఏడాది వానాకాలం ముందే వచ్చింది. ప్రతి యేడాది విత్తనాలు నాటేందుకు ఆలస్యమయ్యేది. పత్తి వేసుకునేందుకు దుక్కిదున్ని సిద్ధం చేసుకున్నా. ప్రభుత్వం రైతుభరోసా సాయం అందిస్తే విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు ఇబ్బంది ఉండదు. లేదంటే అప్పులు చేసి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది.

    – శ్రీకాంత్‌రెడ్డి, రైతు, మానవపాడు

    ముందస్తు వర్షాలతో పొలం బాట

    దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు

    విత్తనాలు, ఎరువులకు ఏర్పాట్లు

    జిల్లాలో 1,65,763 మంది రైతులు

    విడతల వారీగా...

    గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం ఎకరానికి రూ.5వేలు చొప్పున అందించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ఎకరానికి రూ.6వేలు చొప్పున గత యాసంగి నుంచి అందిస్తోంది. జనవరి నుంచి మార్చి వరకు ఎకరాలోపు, ఆ తర్వాత రెండు, మూడు, నాలుగు ఐదు ఎకరాల్లో భూమి ఉన్న రైతుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేసింది. యాసంగి పంటలు దిగుబడి వచ్చే సమయం వరకు నగదు జమ చేస్తూ వచ్చింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనైనా సాగు సమయానికి నగదు అందితే ఎంతో మేలు చేకూరుతుందని రైతులు బావిస్తున్నారు.

  • మోగిన

    గద్వాలటౌన్‌: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడి గంట కొట్టగానే పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాలన్నీ పండగ వాతావరణంలో ప్రారంభించారు. కొన్ని పాఠశాలలకు మామిడి తోరణాలను కట్టి అలంకరించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. హాజరైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు.

    తొలిరోజు.. తడ‘బడి’

    ఎంతో ఉత్సాహంగా ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం తడబడుతూ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది.

    ● మానవపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, 12 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.

    ● గోకులపాడు పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు హాజరయ్యాడు. విద్యార్థులు ఒక్కరూ కూడా పాఠశాలకు రాలేదు. అలాగే, కేజీబీవీకి ఆరుగురు ఉపాధ్యాయులు హాజరుకాగా.. విద్యార్థులు ఎవరూ ప్రార్థన సమయం నాటికి హాజరుకాలేదు.

    ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన కొద్దిమంది విద్యార్థులకు అసౌకర్యాలు దర్శమిచ్చాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బడికి పంపే విషయంలో మరో రెండు రోజులపాటు వేచిచూద్దామన్న ధోరణిలో మరికొంత మంది తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చిన విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. దూరప్రాంత విద్యార్థులు పాఠశాలలకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సు సౌకర్యాలు ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరి, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. నెలన్నర పాటు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు మొదటిరోజు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేశారు.

    ఆసక్తి చూపని వైనం

    మొదటి రోజు హాజరు అంతంతే

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    అయిజ: మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వినయ్‌ కుమార్‌ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని వివిధ మెడికల్‌ షాపులను, మెడికల్‌ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్‌ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్ట్‌ ఉండాలని, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదని, ఎమ్మార్పీ ధరలకు మించి కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకోరాదని అన్నారు. మందుల కొనుగోలు విక్రయానికి సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలని అన్నారు.

    రాజోళి ఎస్‌ఐ వీఆర్‌కు అటాచ్‌

    గద్వాల క్రైం: బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాజోళి ఎస్‌ఐను గురువారం వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజోళి మండలం పెద్ద ధన్వాడకి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు తమ వ్యవసాయ పొలం, మరొకరి మధ్య ఉన్న భూ వివాదంపై రాజోళి ఎస్‌ఐ జగదీష్‌కు ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యం కనబర్చినట్లు ఈ నెల 10వ తేదీన ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎస్‌ఐని జిల్లా కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఇటీవల పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో జరిగిన పలు తప్పిదాలు సైతం ఉండడంతో ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పలు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్‌ అయ్యాయి.

    నేడు రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి రాక

    గద్వాల: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి ఈనెల 13వ తేదీ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30గంటలకు గద్వాల మండలంలోని పుటాన్‌పల్లిలో సాగుచేసిన పత్తి విత్తన పంటలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అక్కడే రైతులతో ముఖాముఖి అనంతరం 11:30గంటలకు కలెక్టరేట్‌లో పత్తి విత్తన పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించనున్నట్లు తెలిపారు.

    విమాన ప్రమాదం దురదృష్టకరం

    గద్వాల: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మాజీ సీఎం విజయ్‌రూపానితో పాటు దేశప్రజలు, విదేశీయులు, చిన్నారులు, మహిళలు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. మృతులకు నివాళి అర్పించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

    ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీఫలితాలు విడుదల

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ సెమిస్టర్‌– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్‌ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్‌–1లో 37.74 శాతం, సెమిస్టర్‌–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, అడిషనల్‌ కంట్రోలర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

  • 573 బస్సులకు నో ఫిట్‌నెస్‌

    ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు

    స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం

    ఫిట్‌నెస్‌ లేకుండా నడిపితేకేసులు నమోదు

    పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్‌గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్‌ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసుకోలేదు.

    డీటీఓలకు ఆదేశాలు..

    ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్‌ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టామని డీటీసీ కిషన్‌ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ఫిట్‌నెస్‌, పర్మిట్‌ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్‌ బస్సులు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.

    ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..

  • బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

    గద్వాల: బాల కార్మిక వ్యవస్ధను పూర్తిగా నిర్మూలించి జిల్లాను బాల కార్మిక రహిత ప్రాంతంగా మార్చే దిశగా పని చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల కారికార్మిక నిర్మూలన జిల్లా కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు ఉజ్వల భవిష్యత్‌ కల్పించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీసీపీఓ నర్సింహులు, తదితరులు ఉన్నారు.

    భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు

    ధరూరు: భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండలంలోని చింతరేవులలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్‌ మిస్సింగ్‌, పట్టా పాస్‌ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్‌ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులపై దరఖాస్తులు స్వీకరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ లోపు భూ భారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ నరేందర్‌, రెవన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

  • బాధిత మహిళలకు అండగా నిలవాలి

    గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా, సఖీ, షీటీం సెంటర్‌లను గురువారం ఆకస్మికంగా ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లైంగిక దాడులకు గురైన మైనర్‌ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసకున్న చర్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్‌ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్‌ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపబడ్డ బాధితులకు భరోసా ఇవ్వాలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్‌లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్‌లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, తదితరులు ఉన్నారు.

  • పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌

    గద్వాల క్రైం: జిల్లాలోని పెండింగ్‌ కేసులు, రాజీకాదగా కేసుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని, ఈ నెల 14వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి ఎన్‌ ప్రేమలత వెల్లడించారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంతో పొలిస్తే నేటికి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేసుల సత్వర పరిష్కారానికి జాతీయలోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందన్నారు. పోలీసు, ఎకై ్సజ్‌, రెవెన్యూ, రోడ్డు ప్రమాద, బ్యాంకు రుణాలు, స్టేషన్‌లలో నమోదైన కేసుల వివరాలను ఇప్పటికే ఆ శాఖ సిబ్బందితో మాట్లాడి విపత్కర కేసుల అంశాలను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. నేటి లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో 4వేల కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ వి శ్రీనివాస్‌, శోభ తదితరులు ఉన్నారు.

Kakinada

  • విద్య
    ● ప్రచారార్భాటానబడి

    సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నాయి. పనులు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదు. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా ఇచ్చిన హామీల అమలు మొదలుకుని అన్నింటా పాలనలో తిరోగమనమే కనిపిస్తోంది. చివరకు గత జగన్‌ పాలనలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యపై కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) కిట్లు అందజేసినట్టు విద్యా శాఖా మంత్రి లోకేష్‌ను సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ భజన బృందం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది.

    ప్రభుత్వం విఫలం

    సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువైన విద్యార్థి మిత్ర కిట్‌లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విద్యార్థిని కదిపినా బూట్లు రాలేదని, బ్యాగ్‌లు, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. పుస్తకాలు మినహా కిట్‌లో మిగిలిన ఏ ఒక్కటీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్‌లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.

    బాబు పాలనలో ఎప్పుడూ ఇంతే..

    చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఇలానే జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బూట్లు, యూనిఫాం అందజేసేందుకు ముందస్తు ప్రణాళిక ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సగం విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ బడులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు.

    తూర్పుగోదావరి జిల్లాలో..

    ● జిల్లాలోని 19 మండలాల్లో అన్ని రకాల పాఠశాలలూ కలిపి 984 ఉన్నాయి. వీటిల్లో 44,771 మంది బాలు రు, 49,583 మంది బాలికలు చదువుతున్నారు.

    ● జిల్లాకు పాఠ్య పుస్తకాలు 4,14,529, వర్క్‌ బుక్స్‌ 76,662, నోట్‌ బుక్స్‌ 6,62,952, డిక్షనరీలు 14,947, బెల్టులు 61,548 వచ్చాయి.

    ● మొత్తం విద్యార్థులకు 94,354 బ్యాగ్‌లు రావాల్సి ఉండగా 67,158 మాత్రమే వచ్చాయి.

    ● 94,548 బూట్లు రావాల్సి ఉండగా 84,726 మాత్రమే వచ్చాయి.

    ● 94,354 యూనిఫాంలు రావాల్సి ఉండగా 50,549 మాత్రమే వచ్చాయి.

    రాజమహేంద్రవరంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులు

    జగన్‌ హయాంలో..

    చంద్రబాబు పాలనకు భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింతగా ప్రోత్సహించేలా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో మాదిరిగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు అదనంగా విద్యార్థులకు అవసరమైన నోట్‌ బుక్స్‌, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు జత చేసి ఇచ్చారు. పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా అందజేసేవారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలు తెరచిన రోజున విద్యా కానుక అందజేశారు. ఈసారి అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో కిట్‌ల పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వచ్చిన కిట్‌లను కూడా విద్యార్థులకు అందజేయకుండా ఆపేశారు. దీనిపై అడిగితే మెగా పేరెంట్స్‌ మీట్‌లు పెట్టి అందజేస్తామంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీని ప్రచారార్భాటానికి వాడుకోవాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    ప్రారంభమైన పాఠశాలలు

    పుస్తకాలకే ‘విద్యార్థి మిత్ర’ కిట్‌ పరిమితం

    బూట్లు, బ్యాగులు, యూనిఫాం లేవు

    ఇతర వస్తువుల ఊసే లేదు

    కూటమి సర్కారు వైఫల్యం

  • కూటమి

    సాక్షి ప్రతినిధి, కాకినాడ: అక్రమ సంపాదనలో పంపకాలు తెగక కూటమి నేతలు రోడ్డెక్కుతున్నారు. గద్దెనెక్కిన ఏడాది కాలంగా మట్టి, ఇసుక, మైనింగ్‌ మాఫియాతో చేతులు కలిపి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీకు సగం, నాకు సగం అంటూ వాటాలు వేసుకుంటూ, వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వాటాలు, పంపకాలు తెగక వివాదాలతో రోడ్డెక్కుతున్నారు. పిఠాపురంలో బొండు ఇసుక దందా కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య రగిలిన దుమారం చల్లారక ముందే.. తాజాగా తునిలో మట్టి అక్రమ తవ్వకాల చిచ్చు రేగింది.

    మాజీ మంత్రి, హోం మంత్రి వర్గాల పోరు

    టీడీపీలో నంబర్‌–2గా చెప్పుకొనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యనమల దివ్య ఒకవైపు.. హోం మంత్రి వంగలపూడి అనిత వర్గీయులు మరోవైపు మట్టిలో కాసుల కోసం కొట్టుకుంటున్నారు. మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తుని సరిహద్దునే ఉంది. అక్కడి వనిత అనుచరులైన టీడీపీ నేతల మట్టి తరలింపును తుని వైపు యనమల అనుచరులతో పాటు జనసేన నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో మట్టి తవ్వుకుంటూంటే అందులో వాటాలెందుకివ్వాలని పాయకరావుపేట టీడీపీ నేతలు.. మట్టి తమ ప్రాంతానికి తరలిస్తున్నందు తమకు పంపకాలు జరగాల్సిందేనని తుని వైపు కూటమి నేతలు సిగపట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వివాదం ముదురుపాకాన పడింది. ఈ నేపథ్యంలో పాయకరావుపేట వైపు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లు, జేసీబీని తుని వైపు వైరి వర్గం పట్టుకుని, తుని రూరల్‌ పోలీసులకు అప్పగించింది. దీనిపై ఇరువర్గాలూ గురువారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

    కొల్లగొడుతున్నారిలా..

    పాయకరావుపేట మండలంతో పాటు తుని మండలం ఎస్‌.అన్నవరం శివారు కవలపాడులో కాకినాడ జగన్నాథపురం ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌కు చెందిన భూములున్నాయి. ఈ భూముల్లో కొంత మంది ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుకల తయారీకి ప్రధాన ముడి సరకు చెరువు గర్భాల్లోని మట్టి. కవలపాడులో చాలా ఏళ్లుగా ఇటుకల బట్టీలు నడుస్తున్నా ఎప్పుడూ ఇటువంటి వివాదాలు లేవని అంటున్నారు. ఇటుక బట్టీలకు అవసరమైన చెరువు మట్టిని టిప్పర్‌కు రూ.10 వేలు, ట్రాక్టర్‌కు రూ.1,200కు అమ్మి కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారు. ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రిప్పుల మట్టి రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాత్రి వేళల్లో ఇష్టారాజ్యంగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ శాఖల నుంచి అనుమతి లేనప్పటికీ అధికారం చేతిలో ఉందనే బరితెగింపుతో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. అదేమని అడిగి నాథుడే లేకుండా పోయాడు. మట్టి అక్రమాల్లో కూటమి పెద్దలున్నారనే ఉద్దేశంతో తమకెందుకనే ధోరణిలో ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

    వాటాల కోసం ‘పంచాయితీ’

    పాయకరావుపేట మండలం నుంచి మట్టిని తుని మండలం కవలపాడులోని ఇటుక బట్టీలకు తరలిస్తూ పాయకరావుపేట కూటమి నాయకులు రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ దందాలో తమకు వాటా లేక అన్యాయమైపోతున్నామని తుని మండలం ఎస్‌.అన్నవరంలోని టీడీపీ జనసేన నేతలు భావించారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నుంచి జరుగుతున్న మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అక్రమార్జనలో తమకూ వాటా ఇవ్వాలని కొన్ని రోజులుగా తుని టీడీపీ పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది. పాయకరావుపేటలో బీజీపీకి చెందిన ఒక కీలక నేత, బంగారయ్యపేటకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత, తుని మండలం ఎన్‌.సూరవరం గ్రామ టీడీపీ నేతలు మట్టిలో అక్రమార్జన కోసం కుస్తీ పడుతున్నారు. అయినప్పటికీ పాయకరావుపేట నేతలు దారికి రావడం లేదు. దీంతో, తుని టీడీపీ, జనసేన నేతలు గురువారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. కవలపాడు మట్టి లోడుతో వచ్చిన మూడు లారీలను, మూడు ట్రాక్టర్లను, ఒక జేసీబీని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో, ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. మట్టి తవ్వకాల్లో వాటాల కోసం ఇంత నిస్సిగ్గుగా రోడ్డెక్కుతున్న కూటమి నేతలను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

    కుదిరిన సంధి!

    వాటాల కోసం రోడ్డెక్కిన నేతల మధ్య కూటమి పెద్దలు సంధి కుదిర్చారని అంటున్నారు. పర్సంటేజీలపై ఒప్పందాలు కుదిర్చి, వివాదాన్ని సర్దుబాటు చేశారని చెబుతున్నారు. పోలీసులకు అప్పగించిన వాహనాలను గంటల వ్యవధిలోనే వదిలేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అక్రమాలను బయటపెట్టి, వాహనాలను పట్టించిన కూటమి నేతలే.. వాటాలు కుదిరేసరికి వెనక్కు తగ్గడం చూసి జనం విస్తుపోతున్నారు. పంపకాల చిచ్చు ప్రస్తుతానికి చల్లారినా.. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

  • టెన్త్‌ సప్లిమెంటరీలో 86.51 శాతం ఉత్తీర్ణత

    బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా 86.51 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్‌ గురువారం తెలిపారు. పరీక్షలకు 5,248 మంది హాజరు కాగా 4,540 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో బాలురు 2,686, బాలికలు 1,853 మంది ఉన్నారని పేర్కొన్నారు. రీ కౌంటింగ్‌ లేదా రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

    ఓపెన్‌ స్కూల్‌లో 90.93 శాతం ఉత్తీర్ణత

    ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు 441 మంది హాజరవగా 401 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్‌లో 1,131 మందికి గాను 985 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈఓ రమేష్‌ తెలిపారు.

    జిల్లా దేవదాయ అధికారి

    బాధ్యతల స్వీకరణ

    బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా కనపర్తి నాగేశ్వరరావు గురువారం బా ధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవదాయ శాఖాధికారిగా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ సోమరాజు, నగరంలోని పలు దేవాలయాల ఈఓలు అ భినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవదాయ శాఖ ఈఓలు, అర్చకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు.

    వర్షాల హెచ్చరికలతో

    ఈపీడీసీఎల్‌ అప్రమత్తం

    విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్‌ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్‌ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్‌ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్‌ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్‌ రూమ్‌ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు.

    ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో

    కంట్రోల్‌ రూము నంబర్లు

    రాజమహేంద్రవరం: 73822 99960

    కాకినాడ: 94931 78718

    కోనసీమ: 94409 04477

    కార్పొరేట్‌ ఆఫీస్‌: 1912

  • సీతారాములకు వెండి మకర తోరణం

    అన్నవరం: సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి నిత్య కల్యాణంలో పెళ్లి పెద్దలుగా వ్యవహరించే సీతారాములకు అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులు వెండి మకర తోరణం సమర్పించారు. వ్రత పురోహిత సూపర్‌వైజర్లు అల్లంరాజు సత్య శ్రీనివాస్‌, గుత్తిన రామకృష్ణ, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు రవిశర్మ, వారి డ్యూటీ సభ్యులు 43 మంది రూ.3 లక్షల విలువైన 345 గ్రాముల వెండితో దీనిని తయారు చేయించారు. మకర తోరణాన్ని గురువారం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. దీనిని ప్రతి రోజూ స్వామివారి కల్యాణంలో సీతారాములకు అలంకరించాలని కోరారు.

    సాక్షి కథనంతో..

    గతంలో పెళ్లి పెద్దలు సీతారాములను వేరే ఆసనంపై కాకుండా సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి పాదాల చెంతన ఉంచి సత్యదేవుని కల్యాణం నిర్వహించేవారు. దీనివలన కల్యాణంలో స్వామి, అమ్మవారిపై వేసిన తలంబ్రాలు సీతారాములపై కూడా పడేవి. దీనిపై ‘సత్యదేవుని నిత్య కల్యాణంలో అపచారం’ శీర్షికన గత ఏడాది జూన్‌ 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ వెంటనే స్పందించారు. సత్యదేవుడు, అమ్మవారి సింహాసనం పక్కనే సీతారాములను మరో ఆసనంపై వేంచేయించి, కల్యాణం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదే విధంగా చేస్తున్నారు. అయితే సత్యదేవుడు, అమ్మవారి వెనుకన ఉన్నట్టుగా సీతారాముల మూర్తులకు మకర తోరణం లేకపోవడంతో బోసిపోయినట్లు ఉండేది. ఈ నేపథ్యంలో వ్రత పురోహితులు ఈ వెండి మకర తోరణం సమర్పించారు.

  • గోదారి.. కళాఝరి

    ప్రారంభమైన అంతర్జాతీయ కళా సమ్మేళనం

    అలరించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు

    సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కళలకు కాణాచి అయిన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాఝరి రసరమ్యంగా ప్రవహించింది. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళా కేంద్రంలో 43వ కళా సమ్మేళనం–2025 గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ కళా వైభవాన్ని చాటేలా పలువురు చిన్నారులు తొలి రోజు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాల్లో భాగంగా తొమ్మిది మంది సంగీత కళాకారులు వీణానాదంతో అన్నమయ్య కీర్తనలను వీనుల విందుగా వినిపించారు. అలాగే, తమిళనాడుకు చెందిన జానపద కొమ్మి నృత్యాలు, దుర్గ సూక్తం భరతనాట్యం అందరినీ ఆనంద గోదారిలో ఓలలాడించాయి. కళా సమ్మేళనంలో పాల్గొన్న కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

    కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి

    ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జీబీ నారాయణ ఇటీవలి కుంభమేళాలో సైతం తన ప్రదర్శనలతో పలువురి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నారాయణ కుమార్తె లక్ష్మీ గీతిక చిన్న వయస్సులోనే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారని, ఆమె మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలకు ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి శనివారం హాజరు కానున్నారని తెలిపారు. నృత్యాలతో అలరించిన చిన్నారులను మంత్రి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు.