Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.

    భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

    ''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.

  • ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ కొత్త నిబంధన డిసెంబర్ 10, 2025 నుంచి అమలులోకి రానుంది.

    ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్‌ (సోషల్ మీడియా మినిమం ఏజ్‌) బిల్లు’ ను 2024 నవంబర్‌లో ఆమోదించింది. ఈ చట్టం ఆన్‌లైన్ సేఫ్టీ చట్టం 2021 (Online Safety Act 2021)కు సవరణగా ఉంది.

    ఈ నియమంలోని కీలక అంశాలు ఏమిటి?

    ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లలపై కాకుండా సోషల్ మీడియా సంస్థలపై బాధ్యతను మోపుతుందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని నిర్దిష్ట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గల వినియోగదారులు ఖాతాలను సృష్టించకుండా లేదా కొనసాగించకుండా నిరోధించడానికి సంస్థలు సహేతుకమైన చర్యలు తీసుకోవాలి.

    • తల్లిదండ్రులు అనుమతి ఇచ్చినా కూడా 16 ఏళ్ల లోపు వారు ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడానికి అనుమతి లేదు.

    • ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించే ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, టిక్‌టాక్‌, ఎక్స్‌, రెడ్డిట్‌, థ్రెడ్స్‌, ట్విచ్‌, కిక్‌.

    • ప్రధానంగా మెసేజింగ్ లేదా గేమింగ్ కోసం ఉపయోగించే WhatsApp, Discord, Roblox వంటి సర్వీసులను ప్రస్తుతానికి మినహాయించారు. అయినప్పటికీ, సేఫ్టీ కమీషనర్ అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ఈ జాబితాను మార్చే అవకాశం ఉంది.

    • ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలు చేయనున్నారు.

    • సంస్థలు వయస్సు ధ్రువీకరణ కోసం ప్రభుత్వ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా కోరకూడదు. అయితే ఫొటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా లేదా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించే అవకాశం ఉంది.

    అనుసరించకపోతే జరిమానాలు

    ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్‌ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు రూ.270 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలకు లేదా వారి తల్లిదండ్రులకు ఎలాంటి జరిమానాలు ఉండవు. ఈ చట్టం బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపై మాత్రమే ఉంటుంది.

    ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు

    ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్న తీవ్ర ఆందోళనలే కారణం. సోషల్ మీడియా అధిక వినియోగంతో కౌమార దశలో ఉన్నవారిలో ఆందోళన, నిరాశ, ఒంటరితనం పెరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. నిరంతర పోలికలు, లైక్‌ల కోసం ఎదురుచూడటం, సైబర్‌బుల్లింగ్‌ (Cyberbullying-డిజిటల్ వేదికల ద్వారా ఇతరులను అవమానించడం, బెదిరించడం, వేధించడం లేదా హింసించడం) వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది.

    ప్రమాదకరమైన కంటెంట్

    ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ‘ప్రెడేటరీ అల్గారిథమ్స్’ కారణంగా పిల్లలు హింస, ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు, అసభ్యకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం వంటి ప్రమాదకరమైన కంటెంట్‌ బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ దీన్ని ‘బిహేవియరల్ కొకైన్‌’తో పోల్చారు.

    • సోషల్ మీడియా వేదికలు పిల్లల మధ్య తోటివారి ఒత్తిడికి, ఆన్‌లైన్ వేధింపులకు వాహకంగా మారుతున్నాయి. మోసగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి సులువైన మార్గాలుగా మారుతున్నాయి.

    • సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లలు చదువు, నిద్ర, ఆటలు వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు దూరం అవుతున్నారు.

    కంపెనీలపై ప్రభావం ఇలా..

    ఈ నియమం వల్ల సోషల్ మీడియా కంపెనీలు ముఖ్యంగా ఆదాయం, మార్కెట్ పరిమాణం పరంగా నష్టాలను ఎదుర్కొంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న వినియోగదారులను తొలగించడం లేదా వారిని చేర్చుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియాలో మొత్తం యూజర్ బేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ వయస్సు సమూహం తరచుగా అత్యంత చురుకైన వినియోగదారులలో ఒకటిగా ఉంటుంది.

    ప్రకటనల ఆదాయంపై ప్రభావం

    సోషల్ మీడియా కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. యూజర్ల సంఖ్య తగ్గితే ప్రకటనలను చేరుకునే అవకాశం ఉన్న జనాభా (Ad Reach) కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రకటనదారులకు ప్లాట్‌ఫామ్ ఆకర్షణ తగ్గి ప్రకటనల ఆదాయం తగ్గుతుంది.

    నియంత్రణ అమలు ఖర్చులు

    వయస్సు ధ్రువీకరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని అమలు చేయడానికి టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ కొత్త సాంకేతికతలను కొనసాగించడం, డేటా భద్రతను నిర్ధారించడం, స్థానిక చట్టాలను నిరంతరం పర్యవేక్షించడం అనేది అదనపు నిర్వహణ ఖర్చులను పెంచుతుంది.

    సాంకేతిక సవాళ్లు

    వయస్సు ధ్రువీకరణ అనేది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విషయం. కొన్ని పద్ధతులు (ముఖ ధ్రువీకరణ వంటివి) గోప్యత సమస్యలను పెంచుతాయి. ఏఐ ఆధారిత వయస్సు అంచనా (AI-based Age Estimation) వంటి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సవాళ్లు ఎదురుకావొచ్చు. అందుకోసం భారీగా పెట్టుబడులు అవసరం. వయస్సు ధ్రువీకరణ కోసం వినియోగదారుల నుంచి అదనపు వ్యక్తిగత సమాచారం సేకరించాల్సి వస్తుంది. దీని వల్ల డేటా ఉల్లంఘనలు, ప్రైవసీ ఉల్లంఘనల ప్రమాదం పెరుగుతుంది. ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్ సిఫార్సు అల్గారిథమ్‌లను మార్చాలి. తద్వారా 16 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే సరియైన కంటెంట్ చేరుకునేలా చూసుకోవాలి.

    ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్‌.. ఎందుకంటే..

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్’ డెవలపర్లు చారిత్రక విజయాన్ని సాధించారు. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్ బ్లాక్స్ రియాల్టీ కన్సార్టియం తెలంగాణలో రెండో అత్యధిక ల్యాండ్‌ బిడ్‌ను గెలుచుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్వహించిన 3వ ఫేజ్‌ వేలంలో ఈ కన్సార్టియం నియోపోలిస్ ప్లాట్ 15ను దక్కించుకుంది. ఈ మేరకు 4.03 ఎకరాల కోసం డెవలపర్లు ఎకరానికి రూ.151.25 కోట్లు రికార్డు స్థాయిలో బిడ్ వేశారు.

    ఇది తెలంగాణలో ఇప్పటివరకు ఎకరాకు నమోదైన రెండో అత్యధిక వేలంగా నిలిచింది. రాష్ట్రంలో అత్యధిక బిడ్ అక్టోబర్ 2025లో రాయదుర్గ్‌లోని నాలెడ్జ్ సిటీలో నమోదైంది. అక్కడ భూమి ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. ఈ భారీ పెట్టుబడి నియోపోలిస్‌ను హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మక, వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్‌మెంట్‌ కారిడార్‌గా సూచిస్తుంది.

    నియోపోలిస్‌లో కన్సార్టియం దృష్టి

    ఈ తాజా బిడ్‌ నియోపోలిస్‌లో కన్సార్టియం ప్రాబల్యాన్ని బలోపేతం చేస్తుంది. ది కాస్కేడ్స్ నియోపోలిస్‌ను జూన్ 2025లో ఆవిష్కరించారు. ఇది రూ.3169 కోట్ల లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇందులో 217 మీటర్ల వరకు ఎత్తు ఉన్న ఐదు 63 అంతస్తుల టవర్లు ఉంటాయని కన్సార్టియం తెలిసింది.

    ఇదీ చదవండి: క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా తగ్గిన మార్కెట్‌.. ఎందుకంటే..

  • ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన టీ20 టోర్నమెంట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ లీగ్ 2024లో సాధించిన 12 బిలియన్ డాలర్ల అపారమైన బ్రాండ్ విలువ 2025లో అనూహ్యంగా 20% పతనమై 9.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఈ పతనం 2020లో కొవిడ్-19 సమయంలో ఎదురైన పతనానికి దాదాపు సమానంగా ఉంది. ఈ పరిస్థితి కేవలం ఆర్థిక ఒత్తిడులనే కాకుండా కార్పొరేట్ దిగ్గజాల స్పాన్సర్‌షిప్ వ్యూహాలు, మీడియా రైట్స్ డైనమిక్స్, రెగ్యులేటరీ మార్పుల ప్రభావంతో ముడిపడి ఉంది. రియల్ మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై ప్రభుత్వ నిషేధం, మీడియా కన్సాలిడేషన్ వంటి కీలకమైన కార్పొరేట్ అంశాలు లీగ్‌ను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    భౌగోళిక ఒత్తిడులు

    2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు భారత్-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఆపరేషన్ సిందూర్), భారత క్రికెట్ బోర్డు (BCCI) భద్రతా కారణాల వల్ల ప్లేఆఫ్‌లతో సహా అనేక మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. ఐపీఎల్‌ ఆదాయాలపై, కార్పొరేట్ విశ్వాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ అంతరాయం కారణంగా స్పాన్సర్‌షిప్ డీల్స్‌లో 15-20% తగ్గుదల కనిపించింది.

    దీనికి తోడు మెగా-ఆక్షన్ కారణంగా ఫ్రాంచైజీల స్క్వాడ్‌ల్లో వచ్చిన గణనీయమైన మార్పులు టీమ్ పెర్ఫార్మెన్స్‌లను దెబ్బతీశాయి. ఉదాహరణకు, గతంలో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ విలువ ఏకంగా 24 శాతం తగ్గి 93 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అనిశ్చితి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) ఆధారంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ ఇన్వెస్టర్లను లీగ్‌కు దూరం చేసింది.

    రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లు

    • ఐపీఎల్‌ ఆర్థిక వ్యవస్థలో స్పాన్సర్‌షిప్‌లు కీలకం. అయితే, 2025లో ప్రభుత్వం అమలు చేసిన రియల్-మనీ గేమింగ్ స్పాన్సర్‌షిప్‌లపై నిషేధం లీగ్‌కు అతిపెద్ద దెబ్బగా మారింది. ఈ బ్యాన్ వల్ల ఐపీఎల్‌కు రూ.1,500–రూ.2,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు అంచనా.

    • రియల్-మనీ గేమింగ్ కంపెనీలైన డ్రీమ్11, మై11సర్కిల్ వంటి కంపెనీలు ఐపీఎల్‌ జెర్సీలు, మ్యాచ్ స్పాన్సర్‌షిప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టేవి. ఉదాహరణకు, డ్రీమ్11 జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి రూ.350 కోట్లను ఉపసంహరించుకుంది. ఇది కేవలం ఐపీఎల్‌కే కాకుండా మొత్తం భారత క్రికెట్ పరిశ్రమపై ప్రభావం చూపింది.

    • ఈ నిషేధం కారణంగా ఇతర కార్పొరేట్ బ్రాండ్‌లు (ఆటో, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్) కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ద్రవ్యోల్బణం, బడ్జెట్ కోతలు, ఆర్‌ఓఐ ఒత్తిడి నేపథ్యంలో స్పాన్సర్‌లు దీర్ఘకాలిక ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ వంటి అగ్ర ఫ్రాంచైజీలు కూడా 9% తగ్గుదలను చూశాయి.

    బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌లో పోటీ లోపం

    కార్పొరేట్ ప్రభావం ఐపీఎల్‌ బ్రాండ్ విలువను ప్రభావితం చేసిన మరో కీలక అంశం మీడియా రైట్స్. 2023-2027 సీజన్‌లకు రూ.48,390 కోట్లతో విక్రయించిన మీడియా రైట్స్‌లో డిస్నీ స్టార్, వియాకామ్18 మెర్జర్ (జియోస్టార్) వల్ల మోనోపాలీ ఏర్పడింది. ఇది గతంలో ఉన్న ఆక్షన్‌ను అంతం చేసి బిడ్డింగ్ పోటీని తగ్గించింది. ఫలితంగా ప్రతి మ్యాచ్ విలువ సుమారు రూ.115 కోట్లకు పరిమితమై ఐపీఎల్‌ మొత్తం విలువను దెబ్బతీసింది.

    ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వ్యూయర్‌షిప్‌ను పెంచినప్పటికీ, మోనిటైజేషన్ సామర్థ్యాన్ని తగ్గించాయి. కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఈ మెర్జర్ వల్ల ద్వారా ప్రయోజనం పొందినప్పటికీ ఐపీఎల్‌ ఎకోసిస్టమ్ మొత్తంగా నష్టపోయింది.

    పునరుద్ధరణకు మార్గాలు

    • రియల్-మనీ గేమింగ్‌పై ఆధారపడకుండా ఈస్పోర్ట్స్, హెల్త్‌కేర్, గ్లోబల్ టెక్ వంటి కొత్త రంగాల నుంచి స్పాన్సర్‌షిప్‌లను ఆకర్షించాలి.

    • ఫ్రీ స్ట్రీమింగ్ మోడల్‌తో పాటు ప్రత్యేకమైన కంటెంట్, ప్రీమియం ఫీచర్‌ల ద్వారా మోనిటైజేషన్ మార్గాలను అన్వేషించాలి.

    • భవిష్యత్ సీజన్‌ల్లో మీడియా రైట్స్ కోసం పోటీని పెంచడానికి బీసీసీఐ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

    ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

  • గ్లోబల్ స్కిల్లింగ్ అండ్ లెర్నింగ్ విభాగంలో సర్వీసులు అందిస్తున్న అప్‌గ్రాడ్ (upGrad) హైదరాబాద్‌లో రెండు కొత్త లెర్నింగ్ సపోర్ట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. దీని ద్వారా ‘ఫిజిటల్’(ఫిజికల్ + డిజిటల్) లెర్నింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ విస్తరణ పెరుగుతున్న టెక్నాలజీ, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో నైపుణ్యాల డిమాండ్‌ను తీర్చేందుకు ఉపయోగపడుతందని కంపెనీ తెలిపింది.

    అప్‌గ్రాడ్ ఇప్పటికే పుణె, కోల్‌కతా, ఇండోర్, భోపాల్, బెంగళూరు వంటి నగరాల్లో 11 ఆపరేషనల్ కేంద్రాలను స్థాపించినట్లు చెప్పింది. హైదరాబాద్ ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌లో కీలక ప్రాంతమని పేర్కొంది. కంపెనీ తన విస్తరణ రోడ్‌మ్యాప్‌లో భాగంగా మార్చి 2026 నాటికి ఈ నెట్‌వర్క్‌ను 40 కేంద్రాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో అత్యుత్తమ హైబ్రిడ్ లెర్నింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.

    ఏఐ, మిషన్‌ లెర్నింగ్‌, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా సైన్స్‌లో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌తో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్‌గ్రాడ్ కొత్త కేంద్రాలు నగరంలోని గ్రాడ్యుయేట్లకు నైపుణ్యాలను అందించాలని నిర్ణయించింది. కంపెసీ సీఓఓ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు శ్రామిక శక్తిలోకి ప్రవేశించినప్పటికీ యాజమాన్యాలు ఆశించే నైపుణ్యాలకు, సాంప్రదాయ సంస్థలు అందించే వాటికి మధ్య అంతరం విస్తృతంగా ఉంది. దాన్ని పూడ్చేందుకు మా కేంద్రాలు ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు.

    ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

  • అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ అండ్‌ చేజ్ సీఈఓ జామీ డిమోన్ ఇటీవల రీగన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్‌ అధికార యంత్రాంగం, ఆర్థిక విచ్ఛిన్నం అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు. డిమోన్ ఈ సందర్భంగా యూరప్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు.

    ‘యూరప్‌లో సమస్య ఉంది. వారు వ్యాపారాన్ని, పెట్టుబడులను, ఆవిష్కరణలను బయటకు పంపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌లో కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఆ ప్రాంతం స్థిరత్వానికి ప్రమాదం. యూరప్‌ బలహీనపడటం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరప్‌ విచ్ఛిన్నమైతే ‘అమెరికా ఫస్ట్’ ఇకపై సాధ్యం కాదు. బలహీనమైన యూరప్‌ అమెరికాకు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు.

    జేపీ మోర్గాన్ భారీ పెట్టుబడి

    ఈ హెచ్చరికల నేపథ్యంలో జేపీ మోర్గాన్ సంస్థ అమెరికా ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ఇటీవల ప్రకటించింది. ఇది గత ప్రణాళిక కంటే 500 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ పెట్టుబడులు ప్రధానంగా కొన్ని కీలక రంగాలపై దృష్టి పెట్టేందుకు తోడ్పడుతాయని కంపెనీ తెలిపింది.

    ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ

  • దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం (డిసెంబర్ 9, 2025) ఒక వీడియో సందేశం ద్వారా ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. విమానాల రద్దు, జాప్యం కారణంగా కస్టమర్‌లకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, ఇండిగో తన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించిందని చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికుల్లో విశ్వసనీయతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

    వ్యక్తిగత క్షమాపణ

    సీఈఓ తన సందేశంలో ‘ప్రియమైన కస్టమర్‌లు.. మేము మీకు అసౌకర్యాన్ని, నిరాశను కలిగించామని మాకు తెలుసు. మీలో చాలా మంది ముఖ్యమైన క్షణాలను కోల్పోయారని తెలుసు. కుటుంబ సభ్యులను కలుసుకునేవారు, వ్యాపార సమావేశాలు, సెలవులు.. ఇలా చాలా మందికి తమ ప్రయాణాల్లో అంతరాయం కలిగింది. మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అంగీకరిస్తున్నాం’ అని అన్నారు.

    కార్యకలాపాలు పునరుద్ధరణ

    గత కొన్ని రోజుల పాటు కొనసాగిన గందరగోళం తర్వాత నెట్‌వర్క్ పునరుద్ధరణ కోసం ఇండిగో తీసుకున్న చర్యలను సీఈఓ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న అతిపెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.

    విమాన సర్వీసుల పునరుద్ధరణ క్రమం

    • డిసెంబర్ 5: 700 విమానాలు

    • డిసెంబర్ 6: 1,500 విమానాలు

    • డిసెంబర్ 7: 1,650 విమానాలు

    • డిసెంబర్ 8: 1,800 విమానాలు

    • డిసెంబర్ 9: 1,800 విమానాలు, పూర్తి నెట్‌వర్క్ పునరుద్ధరణ

    ‘ఈ రోజు డిసెంబర్ 9 నాటికి మా కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని నేను నిర్ధారించగలను. మేము మా నెట్‌వర్క్‌లోని మొత్తం 138 గమ్యస్థానాలకు తిరిగి సేవలు అందిస్తున్నాం’ అని ఎల్బర్స్ ప్రకటించారు.

    ప్రయాణికులకు తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇండిగో తీసుకున్న చర్యలను కూడా ఎల్బర్స్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు లేదా ఇంటికి సురక్షితంగా చేర్చడం తొలి ప్రాధాన్యతగా తెలిపారు. లక్షల మంది కస్టమర్‌లకు ఇప్పటికే పూర్తి రిఫండ్‌లు జారీ అయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విమానాశ్రయాల్లో నిలిచిపోయిన చాలా బ్యాగ్‌లను ప్రయాణికుల ఇళ్లకు పంపినట్లు పేర్కొన్నారు.

    భవిష్యత్తుపై భరోసా

    ఈ సంక్షోభంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని సీఈఓ తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో ఎదురైన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు. ‘ఇటువంటి అంతరాయాలు మళ్లీ జరగకుండా చూసుకోవడానికి మేము కొత్త రక్షణలను అమలు చేస్తున్నాం. మాపై నమ్మకాన్ని ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

    ఇదీ చదవండి: అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

  • రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన రూ.228.06 కోట్ల బ్యాంకింగ్ మోసం కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

    ఈ కేసులో ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, దాని మాజీ సీఈవో, పూర్తికాల డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాల్కర్‌తో పాటు వివరాలు తెలియని కొందరు ప్రభుత్వోద్యోగుల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నాయి. మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన కారణంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.228.06 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జై అన్మోల్ అంబానీ, రవీంద్ర సుధాల్కర్ తదితరులు రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించడంలో అవకతవకలకు పాల్పడి ఆర్థిక నష్టాన్ని కలిగించే చర్యలకు పాల్పడ్డారని సీబీఐకి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో స్పష్టం చేశారు. మోసం, పదవి దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కింద ఏజెన్సీ కేసు నమోదు చేసింది.

    మోసం జరిగిందిలా..

    యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అనూప్ వినాయక్ తరాలే దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆర్థిక సహాయం కోరుతూ ముంబైలోని ఎస్సీఎఫ్ (SCF) శాఖను సంప్రదించింది. దాంతో 2015-2019 మధ్య యూనియన్ బ్యాంక్ ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.450 కోట్ల టర్మ్ లోన్లను మంజూరు చేసింది. దీనితో పాటు కంపెనీ అందించే రూ.100 కోట్ల విలువైన ప్రైవేటుగా ఉంచిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు కూడా బ్యాంకు సబ్‌స్క్రైబ్‌ చేసింది. ఆర్థిక క్రమశిక్షణ, సకాలంలో తిరిగి చెల్లించడం, సెక్యూరిటీలు, ఫైనాన్షియల్స్‌ను సరిగ్గా బహిర్గతం చేయాల్సిన షరతులపై ఈ రుణాలు మంజూరు చేసింది. ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌ నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా నమోదు చేయబడి, సెప్టెంబర్ 2017లో నేషనల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయింది.

    రుణ నిధులను జై అన్మోల్ అంబానీ, రవీంద్ర శరద్ సుధాల్కర్ సహా మాజీ డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాల్లోకి మళ్లించారని బ్యాంక్ ఆరోపించింది. 30 సెప్టెంబర్ 2019న డెట్‌ అకౌంట్‌ నిలిపేశారు. తదుపరి పరిశీలన తరువాత బ్యాంక్ 10 అక్టోబర్ 2024న ఖాతాను ‘ఫ్రాడ్‌’గా ప్రకటించింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది.

    ఆడిట్‌లో బట్టబయలు

    ఏప్రిల్ 2016 నుంచి జూన్ 2019 వరకు గ్రాంట్ తోర్న్‌టన్‌ ఇండియా ఎల్ఎల్‌పీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో తీవ్ర ఒడిదొడుకులు బయటపడ్డాయి. రుణం తీసుకున్న నిధులు ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు ఆడిట్‌లో కనుగొన్నారు. కంపెనీ జనరల్ పర్పస్ కార్పొరేట్ రుణాల్లో దాదాపు 86 శాతం, అంటే రూ.12,573.06 కోట్లు పరోక్షంగా అనుసంధానించిన సంస్థలకు పంపిణీ చేసినట్లు ఆడిట్ రిపోర్ట్‌ ఇచ్చారు. ఇందులో సర్క్యులర్ లావాదేవీలను కూడా నివేదించారు.

    ఈ నేపథ్యంలో నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), 13(1)(డీ), సవరించిన పీసీ చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తును న్యూఢిల్లీలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రోషన్ లాల్‌కు అప్పగించారు.

    ఇదీ చదవండి: అంతరిక్షంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్లు

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్‌ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్‌ సన్‌క్యాచర్‌’(Project Suncatcher)గా పేరు పెట్టింది.

    ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్‌లో మూన్ షాట్‌లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

    2027లో తొలి పరీక్షలు

    ఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్‌లను శాటిలైట్‌ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.

    ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్‌ఫాం‌మ్‌లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.

    ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?

  • మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? క్రెడిట్ కార్డుపై బిల్లింగ్ వివాదంతో సతమతమవుతున్నారా? కార్డు రివార్డ్‌ పాయింట్లలో సమస్యలున్నాయా? బ్యాంకు ద్వారా ఏ కారణం లేకుండా డబ్బులు కట్‌ అయ్యాయా?.. ఇలాంటి సమస్యలు మీకు ఒక్కరికే కాదు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏకంగా అంతకుముందు ఏడాది కంటే 13.55% పెరిగి 13.34 లక్షలకు చేరాయి. రుణాలు, క్రెడిట్ కార్డుల సర్వీసుల్లో లోపాల కారణంగా వినియోగదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్‌మన్ స్కీమ్ (ఆర్‌బీ-ఐఓఎస్) 2024-25 వార్షిక నివేదిక’ స్పష్టం చేసింది.

    ఈ ఫిర్యాదుల పెరుగుదల ట్రెండ్‌లో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులపై ఫిర్యాదులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మించి 37.53%కి చేరాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు రిటైల్ లెండింగ్‌లో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కస్టమర్ సర్వీస్ నాణ్యతలో లోపాలు ఎక్కువగా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం.

    సెక్టార్ వారీగా ఫిర్యాదులు ఇలా..

    బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన మొత్తం 2,96,321 ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా పెరిగింది.

    సెక్టార్ఫిర్యాదుల సంఖ్యశాతం (%)గతేడాది ఇలా (%)మార్పు
    ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు1,11,19937.5334.39+10% పెరుగుదల
    పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు1,03,11734.8038.32-8.45% తగ్గుదల

     

    అంతకుముందు ఆర్థిక సంవత్సరం 38.32% వాటాతో పబ్లిక్ బ్యాంకులు ముందుండగా, ఇప్పుడు 37.53% వాటాతో ప్రైవేట్ బ్యాంకులు వాటిని అధిగమించాయి. పబ్లిక్ బ్యాంకులు తమ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను మెరుగుపరుచుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

    కస్టమర్ల ప్రధాన సమస్యలు

    కస్టమర్ల నుంచి వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో దాదాపు సగం (46%) కేవలం రుణాలు, క్రెడిట్ కార్డులు కేటగిరీలకే పరిమితమయ్యాయి. లోన్లు, అడ్వాన్స్‌లు విభాగంలో 29.25% వాటాలో 86,670 ఫిర్యాదులు అందాయి. వడ్డీ రేట్లలో మార్పులు, రుణాల మంజూరులో ఆలస్యాలు, రుణ చెల్లింపుల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఇందులో ఉన్నాయి.

    క్రెడిట్ కార్డులు

    17.15% వాటాతో (50,811 ఫిర్యాదులు) రెండో స్థానంలో ఉంది. ఈ కేటగిరీలో ఏకంగా 20.04% పెరుగుదల నమోదైంది. బిల్లింగ్ తప్పులు, అనధికార లావాదేవీలు, రివార్డ్ పాయింట్ల మోసాలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా, క్రెడిట్ కార్డు ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా (32,696) అత్యధికంగా ఉంది.

    డిజిటల్ బ్యాంకింగ్

    మొబైల్/ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫిర్యాదులు అంతకుముందుతో పోలిస్తే 12.74% తగ్గడం స్వాగతించదగిన పరిణామం. డిజిటల్ సెక్యూరిటీ మెరుగుపడటం, కస్టమర్లకు అవగాహన పెరగడం దీనికి దోహదపడింది.

    సమస్యలకు కారణాలు ఇవేనా..

    ప్రైవేట్ బ్యాంకులు తమ మార్కెట్ షేర్‌ను, డిజిటల్ ఉత్పత్తుల విస్తరణను పెంచుతున్న వేగంతో పోలిస్తే కస్టమర్ సపోర్ట్, ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతను పెంచడం లేదనేది మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, హిడెన్‌ ఛార్జీలు వంటివి కూడా కొన్ని ఫిర్యాదులకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, మొత్తం ఫిర్యాదుల్లో 87% వ్యక్తిగత కస్టమర్ల నుంచి వచ్చాయి. ఇది బ్యాంకింగ్ నియమాలు, కస్టమర్ హక్కులపై ప్రజల్లో అవగాహన పెరగడాన్ని సూచిస్తోంది.

    ఎలా పరిష్కరించుకోవాలంటే..

    • బ్యాంకింగ్ సర్వీసుల్లో లోపాలు ఎదురైతే కస్టమర్ల కోసం ఆర్‌బీఐ-ఐఓఎస్ 2021 సులభమైన, ఉచిత పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీరు సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. బ్యాంకు 30 రోజుల్లోగా స్పందించాలి.

    • బ్యాంకు స్పందించకపోయినా లేదా వారిచ్చిన పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోయినా cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

    • మీ ఫిర్యాదు ‘మెయింటైనబుల్’(ఆర్‌బీఐ-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే, పరిశీలనకు అర్హత ఉన్న, పరిష్కరించదగిన ఫిర్యాదులు) అయితే అది 24 ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ కార్యాలయాల్లో ఒకదానికి బదిలీ అవుతుంది. అంబుడ్స్‌మన్ 30 రోజుల్లో మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.

    • అంబుడ్స్‌మన్ నిర్ణయంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    బ్యాంకింగ్ రంగం డిజిటల్ యుగంలో వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ సర్వీసుల నాణ్యతను మెరుగుపరచడం, కీలక విభాగాల్లో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, పబ్లిక్ బ్యాంకులు డిజిటలైజేషన్‌లో మరింత వేగవంతం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇదీ చదవండి: పనివేళల తర్వాత నో కాల్స్‌.. నో ఈమెయిల్స్‌

  • దేశంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ, ఇంటీరియర్స్‌పై చేసే ఖర్చుల పెరుగుదల వేగం మరింత అధికంగా ఉంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న ఇంటీరియర్స్ మార్కెట్, గృహ ధరల వృద్ధిని మించిన వేగంతో ముందుకు సాగుతోంది.

    భారతదేశ హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2024లోని రూ.1.27 లక్షల కోట్ల నుండి 2030 నాటికి ఇది రూ.2.75 లక్షల కోట్ల స్థాయిని చేరుకోనుందని మ్యాజిక్‌బ్రిక్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వృద్ధికి ప్రధానంగా ప్రేరణనివ్వబోతున్నవి టైర్-2 నగరాలు. ఇవి 19% వార్షిక వృద్ధితో పెరుగుతాయని, టైర్-1 నగరాల (12%) కంటే దాదాపు రెట్టింపు వేగమని అధ్యయనం చెబుతోంది.

    2024లో రూ.25,536 కోట్లుగా ఉన్న టైర్-2 మార్కెట్ విలువ, 2030 నాటికి దాదాపు రూ.72,500 కోట్లకు పెరగనుంది. ఇక్కడి ఇంటీరియర్ డిమాండ్‌లో 82% రీసేల్ ఇళ్ల నుంచే వస్తోంది. కొత్త తరహా మాడ్యులర్ ఫర్నిచర్, స్మార్ట్ స్టోరేజ్, ఆధునిక డిజైన్‌ల వైపు గృహయజమానులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. టైర్-2 నగరాల్లో ఒక్క ఇంటికి సగటు ఇంటీరియర్ ఖర్చు రూ.3.9 లక్షలు, ఇది టైర్-1 సరాసరి ఖర్చులో 74 శాతానికి సమానం.

    మ్యాజిక్‌బ్రిక్స్ సీఎంవో ప్రసూన్ కుమార్ మాట్లాడుతూ, “టైర్-2 నగరాల్లో హోమ్ ఇంటీరియర్స్ మార్కెట్ వేగంగా పెరగడం భారత వినియోగదారుల అభిరుచుల్లో పెద్ద మార్పునకు సంకేతం. ఇళ్లు మరింత వ్యక్తిగతీకరణ, ఫంక్షనల్, డిజైన్ ఆధారితంగా మారుతున్నాయి” అని అన్నారు.

    వేగవంతమైన నగరీకరణ, పెరిగిన ఆదాయాలు, మారుతున్న జీవన శైలి, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావం ప్రధాన వృద్ధి కారకాలు. బెడ్‌రూమ్‌లు, లివింగ్ రూమ్‌లు ఖర్చులో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. లక్నో, జైపూర్, గోవా, కొచ్చి వంటి నగరాలు ఇంటీరియర్ డిమాండ్‌లో ముందంజలో ఉన్నాయి.

    జాతీయ స్థాయిలో ఫర్నిచర్, మాడ్యులర్ భాగాలు మొత్తం ఇంటీరియర్ వ్యయంలో 45 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఆన్‌లైన్ ఫర్నిచర్ కొనుగోళ్లు కూడా టైర్-2 నగరాలలో వేగంగా పెరుగుతున్నాయి.

Telangana

  • భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు భారీ పోలీసు వహారా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌కు విదేశీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు.

    దీనికి గాను కింది స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు బందోబస్తు మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్క అధికారి ఈ సమ్మిట్‌కలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమ్మిట్‌లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్‌ను ఎస్టాబ్లిష్ చేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల ద్వారా ప్రతి సెకను కదలికలను గమనిస్తున్నారు.

    శంషాబాద్ విమానాశ్రయం టూ ఫ్యూచర్ సిటీ
    ఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం పోలీసు శాఖ నెల రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫ్యూచర్ సిటీలోనే మకాం వేసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

    ఈ బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్నటి రోజు సదస్సులో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా వీరిలో పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాన వచ్చారు. అలా వచ్చిన ప్రతినిధులు, ప్రముఖుల కోసం రహదారి వెంట వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు బాంబు స్వార్డ్, డాగ్ స్క్వాడ్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహించారు.

    ఆకట్టుకున్న పోలీసు స్టాల్
    సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ విదేశీయులను తదితరులను ఆకట్టుకున్నది. తెలంగాణ పోలీసు శాఖ తరపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఆంగ్లంలోవున్న ఈ కరపత్రాలు అందరికీ ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. అలాగే సమ్మిట్ ప్రాంతంలో రోడ్డు మార్గంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు  కలియతిరిగుతూ వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్ లేనివారికి  అవగాహన కల్పించారు.

  • సాక్షి, ఫ్యూచర్‌సిటీ: సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యం అని.. విద్య మీద ఖర్చు చేసేది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఫ్యూచర్‌ సిటీ మీర్‌ఖాన్‌ పేటలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 

    తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చాం

    2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు..

    .. ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత. పేదలలో  నిరుపేదలకు సహాయం చేయడం మా ప్రాధాన్యత. సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన మా లక్ష్యం. ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు  పెట్టుబడి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ, స్కిల్ లేదు. దాన్ని మేం నెలకొల్పుతాం. 140 కోట్ల జనాభాలో ఎంతమంది మెడల్స్ వస్తున్నాయి?. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ నుండి గోల్డ్ మెడల్స్ తెచ్చేలా కృషి చేస్తాం

    పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన..

    .. విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నాం. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోంది

    అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’’ అని రేవంత్‌ ప్రసంగించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ 2047 డాక్యుమెంట్ చూశాక.. తన టార్గెట్ పెద్దదిగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రమఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్" కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమం జరిగింది. 

    ఆ కార్యక్రమంలో ఆనంద్‌ మహీంద్రా మాట్లాడుతూ.. యువత, మహిళల అభివృద్ధి ఇందులో ఉందని ఈ డ్యాకుమెంట్ రూపొందించినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్‌లో మహిళలు నడుపుతున్న బ్యాటరీ పరిశ్రమ తమకెంతో ప్రత్యేకమని ఆనంద్ మహీంద్రా అన్నారు. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం రంగంలో ఉన్న తనకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమ ఉజ్జీగా అనిపించారని తెలిపారు. ప్రస్తుతం ఎంత ఏఐ, డిజిటల్ సాంకేతికతలు వచ్చినా హ్యుమన్ టచ్‌కు ఉన్న ప్రత్యేకత వేరని ఆ స్కిల్‌ను భర్తీ చేయడం ఎవరి వల్లా కాదని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

    రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మీర్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున ఒప్పందాలు చేసుకుంది. మంగళవారంతో ఈ సమ్మిట్‌ ముగియనుంది.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆ ప్రాంతాల్లో ఎల్లుండి సాయంత్రం దాకా మందు బంద్‌ కానుంది. మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రచారం.. నేటి సాయంత్రంతో ముగిసింది. 

    తెలంగాణ వ్యాప్తంగా .. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో (మంగళవారం, డిసెంబర్‌ 9)ముగిసింది. సాయంత్రం నుంచి మైకులు మూగబోగా.. ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి. కాదని తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల్లో అమ్మడం, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

    ఇదిలా ఉంటే.. ఎల్లుండి(గురువారం, డిసెంబర్‌ 11న) మొదటి విడత 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల అయ్యింది. 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఒక్కో ఎగ్జామ్‌కు మూడు రోజుల గ్యాప్‌ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది.

     

    • మార్చి 14- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ - (గ్రూప్‌ -ఎ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-1, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ -పార్ట్‌ 2
    • మార్చి 18 - సెకండ్‌ లాంగ్వేజ్‌
    • మార్చి 23 - థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌)
    • మార్చి 28- గణితం (మ్యాథమెటిక్స్‌)
    • ఏప్రిల్‌ 2 - సైన్స్‌ (పార్ట్‌ -1) - భౌతిక శాస్త్రం (ఫిజికల్‌ సైన్స్‌)
    • ఏప్రిల్‌ 7 - సైన్స్‌ - పార్ట్‌ 2 - బయోలాజికల్‌ సైన్స్‌
    • ఏప్రిల్‌ 13 - సాంఘిక శాస్త్రం (సోషల్‌ స్టడీస్‌ )
    • ఏప్రిల్‌ 15 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1; ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)
    • ఏప్రిల్‌ 16 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌ -2
  • మంచిర్యాల జిల్లా: తనతో సన్నిహితంగా ఉంటూ మరొకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందన్న కారణంతో ఓ యువకుడు వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన భైంసాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా పట్టణంలోని పులేనగర్‌కు చెందిన జోంద్లే సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం.

    దంపతుల మధ్య విబేధాల కారణంగా కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సంతోషిమాత నగర్‌లో టీ స్టాల్‌ నడుపుతున్నారు. సోమవారం ఇద్దరూ టీస్టాల్‌కు రాగా, అశ్విని మరొకరితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందన్న కారణంతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో కోపంతో నాగేశ్‌ పక్కనే ఉన్న రాడ్‌తో అశ్విని తలపై మోది కత్తితో గొంతుకోయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 

    విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జి.గోపినాథ్‌ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్దే కూర్చున్న నాగేశ్‌ తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. భైంసా ఏఎస్పీ రాజేశ్‌మీనా ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గాయక్వాడ్‌ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

  • కొండాపూర్‌(సంగారెడ్డి): కట్టుకున్న భర్తే భార్య ఆత్మహత్యను గుండెపోటుగా చిత్రీకరించాడు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొండాపూర్‌ ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం... మండల పరిధిలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని గీతానగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ కుటుంబం నివాసం ఉంటోంది. 

    ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో విధులు నిర్వహిస్తుండగా అతడి భార్య సుచిత(35) బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తుంది. ఆదివారం ఇద్దరి మధ్యలో మనస్పర్థలు రావడంతో సుచిత ఇంట్లో ఉరివేసుకుంది. కాగా ఈ విషయం బయటకు వెళ్తే ఉద్యోగపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆత్మహత్యను కాస్త గుండెపోటుగా చిత్రీకరిస్తూ శ్రీనివాస్‌ బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు నారాయణ ఖేడ్‌ మండలం మద్వార్‌కు తీసుకెళ్లారు. 

    అక్కడ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మృతురాలి మెడపై మరకలు ఉండడంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్ట్‌ వచ్చిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ సుచితది గుండెపోటు కాదని, ఆత్మహత్య అని ప్రకటించారు. మృతురాలి సోదరుడు ఆశిష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Movies

  • కొన్ని గంటల్లో రిలీజ్‌ కావాల్సిన అఖండ 2.. గత గురువారం అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖండ 2 నిర్మాతలకు ఈరోస్‌ సంస్థతో ఉన్న ఫైనాన్స్‌ వివాదం కోర్టుకు వెళ్లడంతో చివరి నిమిషంలో సినిమా ఆగిపోయింది. దీంతో కొత్త రిలీజ్‌ డేట్‌పై రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా నిర్మాత సంస్థ సినిమా విడుదల తేదిని ప్రకటించింది. అభిమానులు కోరుకున్నట్లుగానే ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

     రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్‌ 11న ప్రీమియర్స్‌ కూడా పడనున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.

     

     

    • బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ బోల్డ్ లుక్స్..

    • శ్రీలంకలో చిల్అవుతోన్న ధనశ్రీ వర్మ..

    • మరింత బోల్డ్గా ప్రియా ప్రకాశ్ వారియల్‌..

    • శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి హాట్ పోజులు..

    • హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్పిక్స్..

     

     

     

     

     

     

     

  • ప్రముఖ బుల్లితెర భామ, బిగ్‌బాస్‌ బ్యూటీ రూపాలి త్యాగి వివాహబంధంలోకి ‍‍అడుగుపెట్టింది. తన ప్రియుడు నోమిష్ భరద్వాజ్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో సినీతారలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి గ్రాండ్వెడ్డింగ్డిసెంబర్‌ 5 జరిగింది.

    కాగా.. రూపాలి త్యాగి సప్నే సుహానే లడక్‌పన్ కే సీరియల్లో గుంజన్ పాత్రతో ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్- 9లో కంటెస్టెంట్గా పాల్గొంది. కాగా.. వీరిద్దరు రెండు సంవత్సరాల క్రితం ముంబయిలో స్నేహితుల ద్వారా పరిచయమయ్యారు. ముంబయికి చెందిన నోమిష్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో యానిమేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.

    రూపల్ త్యాగి కెరీర్..

    హమారీ బేటియూన్ కా వివాహ్‌ సీరియల్తో కెరీర్ ప్రారంభించిన రూపాలి త్యాగి..బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. ఏక్ నయీ చోటి సి జిందగీ, రంజు కి బేటియాన్, కసమ్‌ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్‌ కీ, యంగ్ డ్రీమ్స్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. అంతేకాకుండా బిగ్ బాస్ -9 తో పాటు 2015లో ఝలక్ దిఖ్లా జా -8 లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొంది.

  • సాక్షి, ఫ్యూచర్‌ సిటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్‌ నాతో చెప్పారు.. చెప్పిన కొన్నిరోజులకే ఎందరో ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చారని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. మంగళవారం సాయంత్రం ఫ్యూచర్‌ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించారు. 

    వేదిక పై ఒక్కో రంగం నుంచి ఒక్కరు ఉన్నారు. నన్ను వేదికపై ఉంచడం సినిమా పరిశ్రమ కు ఇచ్చిన గౌరవం గా భావిస్తున్నా. సీఎం రేవంత్‌ రెడ్డికి సినీ పరిశ్రమ అంటే ఎంతో గౌరవం. నేను చిరంజీవిగా రాలేదు. సినిమా ఇండస్ట్రీ తరుపున వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి ‘బ్రెయిన్‌ చైల్డ్‌’ చూడాలని సమిట్‌కు వచ్చా. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన మొదట్లోనే హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా చేయాలని ఆయన మాతో అన్నారు. చెప్పినట్లుగానే.. సీఎం ప్రాక్టికల్‌గా ముందుకెళ్తున్నారు. 

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్రపరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామని సీఎం రేవంత్‌ నాతో చెప్పారు. చెప్పిన కొన్ని రోజులకే ఎందరో ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ సమిట్‌ చూసిన తర్వాత.. సీఎం అనుకున్నది సాధిస్తారనే విశ్వాసం వచ్చింది. వినోద రంగం పరంగా ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా కృషి చేస్తామని నమ్మకంగా చెప్పారు. మా సలహాలతో ముందుకు వెళ్తాం అన్నారు. అన్నట్లుగానే చేసి చూపిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి వారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. 

    వ్యసనాలకు అలవాటు పడ్డ యువతను వినోదం వైపు మల్లించాలి. చదువే ప్రమాణికం కాదు , డిగ్రీ లేని వారు కూడా జాతీయ స్థాయి సినిమా లు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలంటూ ఇండస్ట్రీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలకు స్థలాలు ఇస్తామని చెప్తున్నారు.. నేను దీనిపై ఆలోచన చేస్తున్నా... ఇండస్ట్రీ కూడా చేయాలి. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కి నా సపోర్ట్ ఉంటుంది’’ అని చిరంజీవి అన్నారు. 

  • టాలీవుడ్ హీరో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్నటిస్తోన్న లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘న‌య‌నం’. ఈ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించనున్నారు.

    తాజాగా వెబ్ సిరీస్ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'కన్ను ట్రాన్స్మీటర్.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను' అంటూ వరుణ్ సందేశ్డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే సిరీస్ను సస్పెన్స్తో పాటు సైక‌లాజిక‌ల్ మేసేజ్ఓరియంటెడ్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సిరీస్లో బిగ్బాస్బ్యూటీ ప్రియాంక జైన్ కీలక పాత్రలో నటించింది. డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ కనిపించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈనెవల 19 నుంచి జీ5 వేదికగా వెబ్ సిరీస్స్ట్రీమింగ్ కానుంది.

     

  • సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్‌, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్తేదీలు వెల్లడించారు.

    తాజాగా మరో టాలీవుడ్హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్వచ్చేసింది. జనవరి 14 థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్‌ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.  ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్‌ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. 

    కాగా.. చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37 చిత్రంగా నిలవనుంది.

     

     

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా,   అక్కినేని అమలతో పాటు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ చిత్ర పరిశ్రమకు కావాల్సిన సదుపాయలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.  

    ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, అక్కడ 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. 

    కాగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌​ సమ్మిట్‌-2025’లో మంగళవారం సినీ, వినోద రంగాలపై చర్చ  ఏర్పాటు చేశారు.  ఈ చర్చలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా, టాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

     

  • కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్నిర్వహించారు మేకర్స్.

    సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.

    మరి కోలీవుడ్ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.

    (ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)

    అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్‌ తనకు రిస్కీ సబ్జెక్ట్‌ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు.

  • ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా కనిపించనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న "డ్రైవ్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

    "డ్రైవ్" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిండియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్ లో స్థిరపడేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్ ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూవ్ మెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. 

    ప్రజా మీడియా కార్పొరేషన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్ లైన్ లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "డ్రైవ్" మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది.
     

  • రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌​ సమ్మిట్‌-2025’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో  సినీ, వినోద రంగాల అభివృద్ధి అంశంపై  కూడా చర్చ జరిగింది. ఈ చర్చలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, టాలీవుడ్‌ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా అర్జున్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. విద్యార్థిగా సమ్మిట్‌ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అందరం కలిపి పని చేయాలి. కొత్త ఫిల్మ్‌ సిటీ రావడంతో సినిమా పరిశ్రమను మరింత అభివృద్ది చెందుతుంది’ అన్నారు.

    రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ.. ‘ గ్లోబల్ సమ్మిట్‌ పానెల్ చర్చలో పాల్గొనడం ఎక్సయిటెడ్ గా ఉంది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇలాంటి చర్చలు అవసరం. పానెల్ చర్చల ద్వారా నేను మరింత నేర్చుకునే అవకాశం దక్కింది.సినీ పరిశ్రమ అభివృద్ధి మరింతగా జరగాలని అందరం కోరుకుంటున్నాం. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిస్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు’ అన్నారు. 

    బాలీవుడ్‌ నటుడు, నిర్మాత రితేష్ దేశముఖ్ మాట్లాడుతూ.. నాకు మొదట సినిమాలో అవకాశం ఇచ్చింది తెలుగు నిర్మాతలు.హైదరాబాద్ పెట్టుబడులకు మంచి స్థానం. ప్రశాతంగా ఉన్న దగ్గరికే పెట్టుబడులు వస్తాయి.ఫిల్మ్ ఇండస్ట్రీకి హైదరాబాద్ మంచి ప్లేస్’ అన్నారు.  సదస్సులో ‘తెలంగాణలో సినీ ప్రపంచం’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చొరవ, ప్రణాళికలు, లక్ష్యాలను ప్రదర్శించింది. 
     

  • ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న హారర్ రొమాంటిక్కామెడీ థ్రిల్లర్ మూవీ ది రాజాసాబ్. చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.

    ది రాజాసాబ్బిగ్స్క్రీన్పై సందడి చేసేందుకు మరో నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేపథ్యంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ఓటీటీ డీల్పై అభిమానులతో పాటు ఆడియన్స్లోనూ సస్పెన్స్ ఆసక్తి నెలకొంది. ఇటీవలే జియో హాట్స్టార్ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. మరి డీల్విలువ ఎంతనే దానిపై ఆడియన్స్ఆరా తీస్తున్నారు.

    నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ది రాజాసాబ్మూవీ హక్కులను దాదాపు రూ.140 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్మామెన్స్ఆధారంగా డీల్మరింత పెరగొచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రిజల్ట్ను బట్టి డీల్విలువ దాదాపు రూ.150 నుంచి 200 కోట్లకు పెరగవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాథమికంగా కుదుర్చుకున్న డీల్ కంటే జియో హాట్ స్టార్ అదనంగా మరింత మొత్తాన్ని నిర్మాత‌ల‌కు చెల్లించాల్సి రావొచ్చు. 

  • కింగ్డమ్తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాలతో బిజీగా ఉన్నారు. విజయ్ మూవీ రౌడీ జనార్ధన్ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు.

    మరోవైపు చిత్రంలో విలన్ఎవరనేది ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. యాక్షన్ మూవీలో ప్రముఖ స్టార్హీరో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి వల్ల తమిళంలోనూ ఫుల్ క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.

    ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ చిత్రానికి కోలీవుడ్లో కలిసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో విజయ్ సేతుపతి విలన్‌గా నటించడం వల్ల తమిళ ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి పెంచునుంది. దేవరకొండ- విజయ్ సేతుపతి మధ్య ఫైట్ సీన్స్చూసే ఛాన్స్ ఫ్యాన్స్కు దక్కనుంది. కాగా.. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. 

     

  • కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవారి పరిస్థితి కూడా అంతే! ఎప్పుడు? ఎలా? ఉంటుందో వారికే తెలియదు. కన్నడ హీరో అభిషేక్‌ హెచ్‌.ఎన్‌. పరిస్థితి కూడా అంతే.. కథానాయకుడిగా బిగ్‌స్క్రీన్‌పై మెప్పించిన ఆయన ఇప్పుడు రోజువాలీ కూలీగా మారాడు. దీని గురించే నేటి ప్రత్యేక కథనం..

    తిథి
    రామ్‌ రెడ్డి అనే యువకుడు 'తిథి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 101 ఏళ్ల వృద్ధుడు సెంచరీ గౌడ చనిపోయాక 11 రోజులకు కర్మ (తిథి) చేయాలి. తిథి చేసే క్రమంలో ఎదురైన ఇబ్బందులేంటి? అసలు సెంచరీ గౌడ మూడు తరాల వారు ఏం చేస్తున్నారు? ఏంటి? అనేదే కథ.

    జాతీయ అవార్డు
    పల్లె వాతావరణంలో ఎంతో సహజంగా తెరకెక్కించిన ఈ సినిమాకు కర్ణాటక రాష్ట్ర అవార్డులతో పాటు పలు ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శితమై పురస్కారాలు అందుకుంది. అలాగే జాతీయ అవార్డు సాధించడం విశేషం. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ డైరెక్టర్‌ ద ఫేబుల్‌ (జుగ్నుమా) సినిమా తెరకెక్కించగా ఆ చిత్రానికి సైతం మంచి ప్రశంసలు దక్కాయి.

    కూలీగా మారిన హీరో
    ఇకపోతే తిథి మూవీలో హీరోగా నటించిన కన్నడ నటుడు అభిషేక్‌ (Abhishek H. N.) జీవితం మాత్రం ఏమీ మారకపోగా మరింత అద్వాణ్నంగా మారినట్లు తెలుస్తోంది. సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించిన అభిషేక్‌ ప్రస్తుతం దుంగలు మోసే కూలీగా మారాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతడు మాసిన చొక్కాతో ఎడ్లబండిపై దుంగల పక్కన నిలబడ్డాడు. 

    పొట్టకూటి కోసం..
    ఇతడు తిథితో పాటు తర్లె విలేజ్‌ (2016), హల్లి పంచాయితీ(2017) అనే సినిమాలు చేశాడు.  మూడు సినిమాల్లో హీరోగా చేసినా అతడికి అదృష్టం కలిసి రాలేదు. అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలేశాడు. పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. ఇది చూసిన జనాలు... టాలెంట్‌ ఉన్నవారిని ఎందుకు ఆదరించరు? అని కామెంట్లు చేస్తున్నారు.

     

     

    చదవండి: నేనే దురదృష్టవంతుడిని.. దర్శకుడి ఎమోషనల్‌ పోస్ట్‌

  • రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్‌ నిర్మించిన సినిమా ‘దురంధర్‌’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్‌లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్‌(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్‌ టాక్‌ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్‌ పాటకు అక్షయ్‌ ఖన్నా చేసిన డ్యాన్స్‌పై మాత్రం ఇంటర్నెట్‌ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌  రివ్యూ చేశాడు. దురంధర్‌ సినిమా చూసిన పాకిస్థాన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...

    ‘‘అయ్యా... దురంధర్‌ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్‌లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్‌వీర్‌ సింగ్‌ ఓ మోటర్‌ సైకిల్‌ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్‌ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె‍్లండర్‌ బైక్‌నే సూపర్‌ బైక్‌ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. 

    కరాచీలో అండర్‌పాస్‌ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్‌పాస్‌లు అన్నీ భారత్‌ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్‌లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్‌ ఇక్బాల్‌, రెహ్మాన్‌ డెకాయిట్‌, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’

    కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్‌ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి.
     

  • ఫస్ట్‌ సినిమాకే జాతీయ అవార్డు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. కలర్‌ ఫోటో చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు సందీప్‌ రాజ్‌. తర్వాత గుడ్‌ లక్‌ సఖి, ముఖచిత్రం వంటి మూవీస్‌కు రచయితగా పని చేశాడు. అలాగే కొన్ని చిత్రాల్లో నటుడిగానూ మెప్పించాడు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత దర్శకుడిగా రెండో సినిమా చేస్తున్నాడు సందీప్‌. అదే "మోగ్లీ".

    మోగ్లీ వాయిదా?
    యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ హీరోగా, సాక్షి సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్‌గా నటించారు. టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్‌ 12న విడుదల కానుంది. అయితే సినిమా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 12న అఖండ విడుదల చేస్తే మోగ్లీకి పెద్ద దెబ్బ పడటం ఖాయం! దీంతో ఈ మూవీని పోస్ట్‌పోన్‌ చేసుకోక తప్పేలా లేదు.

    మరో దర్శకుడు తీయాల్సింది
    ఈ క్రమంలో దర్శకుడు సందీప్‌ రాజ్‌ (Sandeep Raj) ఎక్స్‌ ఖాతాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. కలర్‌ ఫోటో, మోగ్లీ సినిమాలు నేను కాకుండా మరో డైరెక్టర్‌ తీయాల్సింది. సినిమా అంటే పడిచచ్చేవాళ్లు, వృత్తిపై నిబద్ధత ఉన్నవారే ఈ రెండు సినిమాల్లో భాగమయ్యారు. ఈ రెండు చిత్రాల్లోని కామన్‌ పాయింట్స్‌ ఏంటో తెలుసా?

    దురదృష్టవంతుడిని
    1. అంతా బాగా జరుగుతుందనుకునే సమయంలో వాటి రిలీజ్‌ విషయంలో దురదృష్టాన్ని ఎదుర్కోవడం.. 2. ఆ దురదృష్టం నేనేనేమో! నాక్కూడా అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం- సందీప్‌ రాజ్‌ అన్న టైటిల్‌ను థియేటర్‌లో చూసుకోవాలన్న నా కల రోజురోజుకీ మరింత కష్టమవుతోంది. వెండితెరకు నేనంటే ఇష్టం లేదేమో! ఎంతో చెమటోడ్చి, రక్తం చిందించి, ప్యాషన్‌తో మోగ్లీ సినిమా చేశాం. రోషన్‌, సరోజ్‌, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ.. ఇలా అందరూ ఎంతగానో కష్టపడ్డాం. కనీసం వారికోసమైనా మోగ్లీకి మంచి జరగాలని ఆశిద్దాం అని సందీప్‌ రాజ్‌ రాసుకొచ్చాడు.

     

    చదవండి: ప్రియుడితో బ్రేకప్‌.. పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్‌

  • ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌. మధురైలో పుట్టి దుబాయ్‌లో పెరిగిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఆగస్టులో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్‌ ఇబ్రాన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్‌న్యూస్‌ చెప్పింది.

    బ్రేకప్‌
    కానీ ఈ పెళ్లి పట్టాలెక్కేట్లు కనిపించడం లేదు. వీరిద్దరూ జంటగా కలిసున్న ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. అంతేకాదు, నివేదా, రజిత్‌ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో క్రికెటర్‌ స్మృతి మంధానలాగే వీరి పెళ్లి కూడా రద్దయినట్లే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీనిపై నివేదా పేతురాజ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    సినిమా
    నివేదా పేతురాజ్‌.. ఒరు నాల్‌ కూతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మెంటల్‌ మదిలో మూవీతో తెలుగులో రంగప్రవేశం చేసింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, పాగల్‌, దాస్‌ కా ధమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. ఓటీటీలో పరువు, కాలా అనే వెబ్‌ సిరీస్‌లలో యాక్ట్‌ చేసింది. ఒకానొక సమయంలో కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్‌ చేజార్చుకుంది.

    చదవండి: పవన్‌ కల్యాణ్‌ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు

  • హాలీవుడ్‌కు పునాది లాంటి వార్నర్‌ బ్రదర్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ డీల్‌ కుదుర్చుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ  ఆశ్చర్యపోయింది. వార్నర్‌ బ్రదర్స్‌ డిస్కవరీకి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌ను కొనుగోలుకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరనే కోట్‌ చేసింది. ఏకంగా రూ. 6.50లక్షల కోట్లకు డీల్‌ సెట్‌ చేసుకుంది.  హాలివుడ్‌లో ఎంతో విలువైన కంపెనీగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌ ఈ రేంజ్‌లో కొనుగోలు చేపట్టడం ఇదే తొలిసారి.

    ఇండియన్‌ సినిమాలో పెను మార్పులు
    ఈ డీల్ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియన్‌ సినిమా పరిశ్రమలో పెను మార్పులు తెస్తుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకనుంచి నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix) దీర్ఘకాలిక థియేట్రికల్ రన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వదు. అంటే ఎంతపెద్ద సినిమా అయినా సరే కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి తీసుకురానుంది. 6–8 వారాల థియేట్రికల్ రన్స్ అనే రూల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఉండకపోవచ్చు. అయితే, థియేటర్లలో విడుదలలు కొనసాగుతాయని నెట్‌ఫ్లిక్స్‌ హామీ  ఇచ్చింది. కానీ, విడుదల అయ్యే థియేటర్స్‌ సంఖ్య తప్పకుంగా తగ్గుతుంది. కేవలం మల్టీఫ్లెక్స్‌లలో మాత్రమే సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటుంది. దీంతో చిన్న సినిమాలకు మరింత గడ్డుపరిస్థితి ఏర్పడే  అవకాశం ఉంది.

    వార్నర్‌ బ్రదర్స్‌ స్ట్రీమింగ్ జెయింట్స్ స్టూడియోలను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేస్తే.., థియేటర్లకు నిరంతర సినిమాల సరఫరా తగ్గిపోతుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) హెచ్చరించింది. నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియన్‌ సినిమా నుంచి మంచి మార్కెట్‌ ఉంది కాబట్టి వారి వ్యాపార దృష్టి ఇక్కడ తప్పకుండా పడుతుందని పేర్కొంది. అదే జరిగితే భారత్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు మరింత ప్రమాదమని తెలిపింది. ఇక నుంచి  పెద్ద స్టూడియో సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌ టార్గెట్‌ చేస్తుంది. ఈ క్రమంలో మల్టీఫ్లెక్స్‌ (PVR, INOX) వంటి వాటితో తమ స్టూడియోలతో డీల్ చేసుకోవచ్చు.

     కానీ, చిన్న థియేటర్స్‌కి ఆ అవకాశాలు తక్కువ. నెట్‌ఫ్లిక్స్‌కు అలవాటు పడినప్పుడు రానురాను పెనుమార్పులు వస్తాయి. థియేటర్స్‌ ఎక్సిపీరియన్స్‌ తగ్గిపోవడం వంటి జరుగుతాయి. దీంతో మల్టీఫ్లెక్స్‌లు ఎదోలా కొనసాగినప్పటికీ చిన్న థియేటర్స్ మూతపడే ప్రమాదం ఉంది. పెద్ద స్టూడియో సినిమాలు లేకపోతే సింగిల్‌ థియేటర్స్‌ నడవడం కష్టం అవుతుంది. ఆపై OTTలో త్వరగా సినిమాలు వస్తే.., థియేటర్‌కి వెళ్లే ఉత్సాహం కూడా ప్రేక్షకులలో తగ్గుతుంది.

    థియేటర్స్‌ రిలీజ్‌ అవసరమే
    నెట్‌ఫ్లిక్స్‌ ఎంత స్ట్రాంగ్‌ పుంజుకున్నా సరే థియేటర్‌ ఇండస్ట్రీని నాశనం చేయలేదు. అవెంజర్స్‌, బ్యాట్‌మెన్‌ గాడ్జిల్లా డ్యూన్‌ వంటి సినిమాలు ఇంట్లో కూర్చొని చూడలేం. ఇలాంటివి పెద్ద స్క్రీన్‌లోనే చూసేందుకు ఇష్టపడుతారు. నెట్‌ఫ్లిక్స్‌కు కూడా థియేటర్స్‌ రిలీజ్‌ ఉంటేనే మేలు అనుకుంటుంది. పెద్ద   స్క్రీన్‌లో సినిమా విడుదలైతేనే తన మార్కెట్‌కు మరంతి బలం చేకూరుతుంది. సులువుగా  ఆ చిత్రానికి ప్రమోషన్‌ దొరుకుతుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ కూడా థియేటర్లలో విడుదలలు కొనసాగిస్తామని హామీ  ఇచ్చింది. 

  • ‘‘దేశం కోసం దేనికైనా సిద్ధమైన జవాన్‌లపై  ‘దీక్ష’ చిత్రంలో ఒక పాట పెట్టడం అభినందనీయం. మనం క్షేమంగా ఉన్నామంటే దానికి కారణం దేశ జవాన్లే. నిర్మాతలు తమ సినిమాల్లో జవాన్‌లను సపోర్ట్‌ చేస్తూ చూపించాలి’’ అని నటుడు సుమన్‌ తెలిపారు. కిరణ్‌ హీరోగా, అలేఖ్య రెడ్డి, ఆక్సా ఖాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దీక్ష’. డీఎస్‌ రెడ్డి సమర్పణలో ప్రతాని రామకృష్ణ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో పి.అశోక్‌ కుమార్‌ నిర్మించారు. 

    ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి సుమన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ–‘‘దేశం కోసం ్ర΄ాణాలర్పించిన మురళి నాయక్‌కు ఒక ΄ాటని మా సినిమా ద్వారా అంకితం చేశాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ భూషణ్, నిర్మాతలు తుమ్మల ప్రసన్నకుమార్, డీఎస్‌ రెడ్డి, సి. కల్యాణ్, నటీనటులు ఆక్సా ఖాన్, మౌనిక రెడ్డి, కిరణ్, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ వైస్‌ చైర్మన్‌ ఎత్తరి గురురాజ్, జనరల్‌ సెక్రటరీ స్నిగ్ధ రెడ్డి ΄ాల్గొన్నారు.  

Sports

  • కటక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కేవలం 74 పరుగులకే ఆలౌటయ్యారు. మ్యాచ్లో 101 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. విజయంతో ఐదు మ్యాచ్ సిరీస్లో టీమిండియా 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్లో బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, శివ దూబే చెరో వికెట్తీశారు.

    అంతకుముందు భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్‌ 4, సూర్యకుమార్‌ యాదవ్‌ 12, తిలక్‌ వర్మ 26, అక్షర్‌ పటేల్‌ 23, శివమ్‌ దూబే 11, జితేశ్‌ శర్మ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 ముల్లాన్‌పూర్ వేదికగా గురువారం జరగనుంది. 

  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్‌ 9) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇన్నింగ్స్‌ మధ్య వరకు తడబడినప్పటికీ హార్దిక్‌ రాకతో పరిస్థితి ఒక్కసారిగా మారింది.

    తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన హార్దిక్‌ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది స్కోర్‌ వేగాన్ని పెంచాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి సహకారం లేనప్పటికీ ఒంటరి పోరాటం చేశాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.

    ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్‌ 4, సూర్యకుమార్‌ యాదవ్‌ 12, తిలక్‌ వర్మ 26, అక్షర్‌ పటేల్‌ 23, శివమ్‌ దూబే 11, జితేశ్‌ శర్మ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సిపాంమ్లా 2, ఫెరియెరా ఓ వికెట్‌ పడగొట్టాడు.

    తుది జట్లు..
    భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌),అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్‌ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే
     

  • భారత పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఓ పెద్ద తలకాయ ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో ఆటగాడిని బలి తీసుకుంటున్నాడు. బీసీసీఐ అండదండలు పూర్తిగా ఉన్న ఆ పెద్ద తలకాయ టీమిండియాలో చెప్పిందే వేదం. భారత జట్టులో అతనేమనుకుంటే అది జరిగి తీరాల్సిందే. 

    అతడి అండదండలుంటే ఏ స్థాయి క్రికెట్‌ ఆడకపోయినా నేరుగా భారత తుది జట్టులోకి వస్తారు. అతడి ఆశీస్సులుంటే సాధారణ ఆటగాడు కూడా కెప్టెన్‌ అయిపోతాడు. భారత పురుషుల క్రికెట్‌ను శాశించే ఆ శక్తికి మరో పెద్ద తలకాయ మద్దతు కూడా ఉంది. 

    వీరిద్దరూ తలచుకుంటే అనర్హులను అందలమెక్కిస్తారు. అర్హుల కెరీర్‌లను అర్దంతరంగా ముగిస్తారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తారు. వారు చేసే ప్రతి పనికి వారి వద్ద ఓ సమర్దన స్క్రిప్ట్‌ ఉంటుంది. వారి జోలికి వెళ్లాలంటే మాజీలు, మాజీ బీసీసీఐ బాస్‌లు కూడా హడలిపోతారు. అంతలా వారు చెలరేగిపోతున్నారు.

    వీరి ప్రస్తావన మరోసారి ఎందుకు వచ్చిందంటే.. భారత్‌-సౌతాఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి (డిసెంబర్‌ 9) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమైంది. కటక్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అందరూ ఊహించిన విధంగానే శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతోనే టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడిన గిల్‌.. గాయం నుంచి కోలుకోగానే నేరుగా తుది జట్టులో చోటు సంపాదించాడు.

    వాస్తవానికి గిల్‌ స్థానం సంజూ శాంసన్‌ది. సంజూ గత కొంతకాలంగా ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ వరుస సెంచరీలతో విరుచుకుపడ్డాడు. అయితే గిల్‌ కోసం పైన చెప్పుకున్న పెద్ద తలకాయలు సంజూ కెరీర్‌ను బలి చేస్తున్నారు. 

    నేరుగా మెడపై కత్తి పెట్టకుండా తొలుత స్థానచలనం చేసి గేమ్‌ను మొదలుపెట్టారు. ఆతర్వాత ప్రణాళిక ప్రకారం జట్టులో స్థానాన్నే గల్లంతు  చేస్తున్నారు.

    ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రక్రియ మొదలైంది. రెండో టీ20 తర్వాత సంజూకు అవకాశమే ఇవ్వలేదు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లోనూ అదే కొనసాగింది. సంజూను శాశ్వతంగా జట్టు నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్దమవుతుంది. 

    ఓ దశలో సదరు పెద్ద తలకాయల్లో మొదటివాడు సంజూ కెరీర్‌కు పూర్తి భరోసా ఇచ్చినట్లు నటించాడు. 21 సార్లు డకౌటైనా తుది జట్టులో ఉంటావని నమ్మించాడు.

    తీరా చూస్తే.. తన అనూనయుడికి అవకాశం ఇవ్వడం కోసం సంజూ కెరీర్‌నే బలి చేస్తున్నాడు. సదరు పెద్ద తలకాయకు తనకు సరిపోని ఆటగాళ్ల కెరీర్‌లతో ఆటాడుకోవడం కొత్తేమీ కాదు. దిగ్గజాలైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతోనే మైండ్‌ గేమ్‌ ఆడాడు. 

    వారంతట వారే టెస్ట్‌, టీ20 కెరీర్‌లను అర్దంతరంగా ముగించుకునేలా చేశాడు. టీ20ల్లో గిల్‌ కోసం సంజూ కెరీర్‌ను పణంగా పెట్టిన ఆ పెద్ద తలకాయ.. మరో అనర్హమైన బౌలర్‌ కోసం​ షమీ లాంటి వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌ కెరీర్‌ను అంపశయ్యపై పెట్టాడు. ఇకనైనా ఈ పెద్ద తలకాయ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్‌ గౌరవం పోతుంది. 

  • డిసెంబర్‌ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్‌ ఆడనున్న తొలి సిరీస్‌ ఇదే.

    పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్‌కప్‌ స్టార్‌ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. 

    అలాగే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌, వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్‌కప్‌ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.

    షెడ్యూల్‌..
    తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నం
    రెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం 
    మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం 
    నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం 
    ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం

     

  • సచిన్‌ టెండుల్కర్‌.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో శతక శతకాలు సాధించిన ధీరుడిగా అతడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో టీమిండియా తరఫున లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి క్రికెట్‌ గాడ్‌గా నీరాజనాలు అందుకున్నాడు సచిన్‌.

    అయితే, తాను టీమిండియాకు ఎంపికయ్యే క్రమంలో సహచర ఆటగాడు ఒకరు తన కోసం చేసిన త్యాగం గురించి సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తాజాగా వెల్లడించాడు. అది 1989- 90 దేశీ క్రికెట్‌ సీజన్‌. ముంబైలోని వాంఖడే వేదికగా ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా- ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి.

    సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌
    రెస్టాఫ్‌ ఇండియాకు ఆడుతున్న సచిన్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. అప్పటికి బ్యాటింగ్‌కు రావాల్సిన ప్లేయర్‌ గాయపడ్డాడు. అతడు మరెవరో కాదు.. టీమిండియా మాజీ క్రికెటర్‌ గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh). అతడు బ్యాటింగ్‌కు వస్తేనే సచిన్‌ తన శతక మార్కును అందుకోగలడు.

    సచిన్‌ కోసం విరిగిన చేతితోనే బ్యాటింగ్‌ చేసేందుకు గురుశరణ్‌ సిద్ధమయ్యాడు. అతడి సహకారంతో సచిన్‌ సెంచరీ (103) పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ ద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు.

    అతడి త్యాగం.. నా సెంచరీ
    నాటి ఈ ఘటన గురించి సచిన్‌ టెండుల్కర్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘1989లో నేను ఇరానీ ట్రోఫీ ఆడుతున్న సమయం. టీమిండియా సెలక్షన్‌ కోసం ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఆ మ్యాచ్‌లో నేను 90 పరుగులు పూర్తి చేసుకుని సెంచరీ దిశగా పయనిస్తున్నా.

    ఇంతలో తొమ్మిదో వికెట్‌ పడింది. నేను శతకం పూర్తి చేసుకుని జట్టు పరువు పోకుండా కాపాడాలని అనుకున్నా. కానీ బ్యాటింగ్‌కు రావాల్సిన గురుశరణ్‌ చెయ్యి విరిగింది. అయినప్పటికీ.. అప్పటి సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌ సింగ్‌ దుంగర్పూర్‌ .. గురుశరణ్‌ను నాకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరారు.

    టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను
    ఆయన మాట ప్రకారం గురుశరణ్‌ క్రీజులోకి వచ్చాడు. అతడి సాయంతో నేను సెంచరీ పూర్తి చేసుకుని.. టీమిండియాకు సెలక్ట్‌ అయ్యాను కూడా!.. ఆ తర్వాత గురుశరణ్‌ కూడా భారత జట్టుకు ఆడాడు. ఆరోజు గురుశరణ్‌ చూపిన ధైర్యం, ఔదార్యం మరువలేనివి.

    డ్రెసింగ్‌రూమ్‌లో నేను గురుశరణ్‌కు అందరి ముందు ధన్యవాదాలు తెలిపాను. విరిగిన చెయ్యితో బ్యాటింగ్‌ చేయడం అంత తేలికేమీ కాదు. నా సెంచరీ పూర్తైందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. ఆ సమయంలో అతడు చూపిన ధైర్యం, జట్టు కోసం పడిన తాపత్రయం నా హృదయాన్ని మెలిపెట్టాయి’’ అని సచిన్‌ టెండుల్కర్‌.. గురుశరణ్‌ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.

    మ్యాచ్‌ ఓడినా..
    కాగా నాటి ఇరానీ కప్‌ మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 554 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెస్టాఫ్‌ ఇండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 209 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 

    ఈ క్రమంలో గురుశరణ్‌ సాయంతో ఆఖరి వికెట్‌కు సచిన్‌ మరో 36 పరుగులు జోడించగలిగాడు. ఇక 245 పరుగులకు రెస్టాఫ్‌ ఇండియా ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ 309 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, మ్యాచ్‌ ఓడినా.. వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా సచిన్‌కు టీమిండియా నుంచి పిలుపు అందింది.

    చదవండి: టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను!

  • కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 9) భారత్‌-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 జరుగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

    ఈ మ్యాచ్‌లో ముందుగా ఊహించినట్టుగానే శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగాడు. దీంతో సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కోటాలో జితేశ్‌ శర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. సౌతాఫ్రికా తరఫున నోర్జే చాలాకాలం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.

    తుది జట్లు..
    భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌),అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా

    సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్‌), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్ స్టబ్స్, డొనొవన్‌ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుథో సిపంమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే


     

     

  • ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్‌లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్‌ చౌదరి 2026 సీజన్‌ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.

    ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్‌క్లాస్ ఆడుతూ, బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్‌.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.

    ఓ ఆటగాడు విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ, ఐపీఎల్‌లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ అయిన నిఖిల్‌ వేలంలో సెట్ 35లో (ఆల్‌రౌండర్లు) షార్ట్‌లిస్ట్ అయ్యాడు. షార్ట్‌లిస్ట్‌ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్‌ పేరు ప్రత్యేకంగా నిలిచింది.  

    టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!
    నిఖిల్‌కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్‌ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.

    దీంతో అతని కెరీర్‌కు పుల్‌స్టాప్‌ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్‌ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్‌ చేశాడు. 

    నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్‌ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్‌.. తొలి సీజన్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే అవకాశం కూడా దక్కింది. 

    అరంగేట్రం మ్యాచ్‌లోనే నిఖిల్‌ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్‌గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్‌పై శతకంతో విరుచుకుపడ్డాడు. 

  • ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ  మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్‌కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. 

    ప్రస్తుతం అతను క్యాన్సర్‌ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్‌ 14) బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 కోసం సిడ్నీ థండర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్‌ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్‌తో బీబీఎల్‌ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. 

    థండర్‌తో ఒప్పందం అనంతరం మాడిన్సన్‌ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్‌లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్‌ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.

    మాడిన్సన్‌ థండర్‌తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో మాడిన్సన్‌ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్‌ (7 సీజన్లు), మెల్‌బోర్న్‌ స్టార్స్‌ (3), మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్‌ అతని నాలుగో జట్టు. 

    ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మాడిన్సన్‌ ఆసీస్‌ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్‌లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్‌ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్‌లు ఆడాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.  

  • టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు వచ్చాయి. అభిషేక్‌ శర్మతో కలిసి టీమిండియా టీ20 ఓపెనర్‌గా ఈ కేరళ బ్యాటర్‌ అదరగొట్టాడు. వికెట్‌ కీపర్‌గా సేవలు అందిస్తూ.. టాపార్డర్‌లో రాణించాడు. ఈ క్రమంలో మూడు శతకాలు బాది జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేశాడు.

    విఫలమైనా.. 
    అయితే, ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీతో వైస్‌ కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తిరిగి రావడంతో.. సంజూ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. అభిషేక్‌కు జోడీగా వస్తున్న గిల్‌ చాలాసార్లు విఫలమైనా.. యాజమాన్యం మాత్రం అతడికే మద్దతుగా నిలుస్తోంది. భవిష్య కెప్టెన్‌గా అతడికి పెద్ద పీట వేస్తూ ఒక్కోసారి భారీ మూల్యమే చెల్లిస్తోంది.

    మరోవైపు.. గిల్‌ రాకతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. ఒకవేళ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం దక్కినా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎప్పుడు రావాలో తెలియని పరిస్థితి. ఓసారి వన్‌డౌన్‌లో.. మరోసారి ఐదో స్థానంలో మేనేజ్‌మెంట్‌ అతడిని బ్యాటింగ్‌కు పంపిస్తోంది.

    సంజూపై వేటు వేసి.. జితేశ్‌కు చోటు
    ఇక ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరిగా ఐదో స్థానంలో వచ్చి విఫలమైన సంజూ (4 బంతుల్లో 2)ను.. ఆ తర్వాత మేనేజ్‌మెంట్‌ తప్పించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన తర్వాత సంజూపై వేటు వేసి.. వికెట్‌ కీపర్‌ కోటాలో జితేశ్‌ శర్మను ఆడించింది.

    ఈ క్రమంలో తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లోనూ సంజూకు మొండిచేయి చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. సంజూ కంటే తమకు గిల్‌ ఎక్కువని సూర్య చెప్పకనే చెప్పాడు.

    గిల్‌కే పెద్దపీట వేస్తామన్న సూర్య
    సౌతాఫ్రికాతో కటక్‌ వేదికగా తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సంజూ టాపార్డర్‌లో రాణిస్తాడు. అయితే, జట్టులో ఓపెనర్లు కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ఆటగాడు ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉండాలి.

    నిజానికి సంజూ ఓపెనర్‌గా అదరగొట్టాడు. మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ గతేడాది శ్రీలంక పర్యటనలో గిల్‌ ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూ కంటే ముందు అతడే జట్టుతో ఉన్నాడు. కాబట్టి గిల్‌ తన స్థానంలోకి తిరిగి వచ్చేందుకు వందశాతం అర్హుడు.

    కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము
    సంజూకు మేము కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చాము. అతడు కూడా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. జట్టుకు అదొక సానుకూలాంశం. మూడు- ఆరు వరకు ఏ స్థానంలో ఆడేందుకైనా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు.

    టాపార్డర్‌లో ఆడుతూనే.. అవసరం వచ్చినపుడు మిడిల్‌ ఆర్డర్‌లోనూ రాణించగల ఆటగాళ్లు ఉండటం మా జట్టుకు అదృష్టం లాంటిదే. తుదిజట్టులో స్థానం ఇంత మంది ఆటగాళ్లు పోటీపడటం.. సెలక్షన్‌ విషయంలో మాకు ఇలాంటి తలనొప్పి ఉండటం ఎంతో బాగుంటుంది. 

    వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరేనా?
    మా జట్టుకు ఉన్న వైవిధ్యమైన ఆప్షన్లను ఇది సూచిస్తుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న వేళ ప్రయోగాల పేరిట సంజూను పక్కనపెట్టడం చూస్తుంటే.. ఈసారి కూడా అతడికి వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఇవ్వరనే అనిపిస్తోంది. 

    చదవండి: వాళ్లిద్దరికి మొండిచేయి!.. తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!

  • స్పెయిన్‌లోని గలీషియా గ్రామాలు, పట్టణాల్లో శతాబ్దాల నాటి ప్రాచీణ ఆట మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. బిల్లార్డా (గిల్లీ దండ) అనే ఈ ఆట ఇప్పుడు 'లీగా గలేగా డి బిల్లార్డా' అనే లీగ్ రూపంలో అక్కడి ప్రజల ముందుకు రానుంది. ఈ ఆట సాంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక క్రీడాస్ఫూర్తితో కలిపి ముందుకు తీసుకెళ్తోంది.  

    బిల్లార్డా అంటే ఏమిటి..?
    ఈ ఆటలో రెండు కర్రలు ఉపయోగిస్తారు. చిన్న కర్ర (బిల్లార్డా) నేలపై ఉంచుతారు. పెద్ద కర్రతో దానిని కొట్టి గాల్లోకి ఎగరేస్తారు. లక్ష్యం.. బిల్లార్డాను దూరంగా కొట్టి, దశలవారీగా గోల్ లైన్ దాటించడం. ఈ ఆటను భారత దేశంలో గిల్లీ దండ అని పిలుస్తారు.  

    ఈ ఆటలో నైపుణ్యం, ఖచ్చితత్వం, వ్యూహం అవసరం. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈ పోటీలు ఉత్సాహభరితంగా, సామూహికంగా సాగుతాయి. సంప్రదాయ ఆటలు 21వ శతాబ్దంలో కూడా ఎలా నిలదొక్కుకుంటాయో బిల్లార్డా చూపిస్తోంది. 

    ఇది కేవలం ఆట మాత్రమే కాదు, గ్రామీణ గుర్తింపును తిరిగి పొందే ఉద్యమని ఔత్సాహికులు అంటున్నారు. 'లీగా గలేగా డి బిల్లార్డా' ఇప్పుడు పోటీ లీగ్‌గా మారి, జానపద క్రీడలు కూడా కాలానుగుణంగా మార్పులు స్వీకరించి కొత్త తరాలను ప్రేరేపించగలవని నిరూపిస్తోంది.  

     

  • టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు కోపమొచ్చింది. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ పాపరాజీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త యాంగిల్స్‌లో ఫొటోలు తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారంటూ మండిపడ్డాడు. అసలేం జరిగిందంటే..

    భార్య నటాషా స్టాంకోవిక్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) మళ్లీ ప్రేమలో పడిన విషయం తెలిసిందే. మోడల్‌ మహీక శర్మతో అతడు కొన్నాళ్లుగా డేటింగ్‌ చేస్తున్నాడు. తన పుట్టినరోజు (అక్టోబరు 11) సందర్భంగా మహీక (Mahieka Sharma)తో అత్యంత సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ తమ బంధాన్ని ధ్రువీకరించాడు. ఇక అప్పటి నుంచి జిమ్‌ మొదలు బీచ్‌ వరకు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నారు.

    కాగా పాపరాజీల వల్ల మహీక శర్మ ఇటీవల అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె రెస్టారెంట్‌ నుంచి మెట్లు దిగి వస్తున్న క్రమంలో కింద ఉన్న పాపరాజీలు కెమెరాలు క్లిక్‌మనిపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడిస్తూ హార్దిక్‌ పాండ్యా తీవ్ర స్థాయిలో పాపరాజీల తీరుపై మండిపడ్డాడు.

    తీయకూడని యాంగిల్‌లో ఫొటో..
    ‘‘ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే జీవితాన్ని నేను ఎంచుకున్నాను. అందువల్ల అందరూ నన్ను గమనిస్తూ ఉంటారని తెలుసు. కానీ రోజు కొంతమంది హద్దులు దాటేశారు. మహీక బాంద్రా రెస్టారెంట్‌లో మెట్లు దిగి వస్తున్నపుడు తీయకూడని యాంగిల్‌లో ఫొటో తీశారు. అసలు ఇలాంటి వాటికి ఏ మహిళా అర్హురాలు కాదు.

    ప్రైవేట్‌ మూమెంట్‌
    అంత ఘోరంగా తనను ఫొటో తీశారు. ప్రైవేట్‌ మూమెంట్‌ను ఫొటో తీసి.. దిగజారుడుతనాన్ని చాటుకున్నారు. మీ చెత్త సంచనాల కోసం తనని ఇబ్బంది పెట్టారు. మీ హెడ్‌లైన్స్‌ కోసం ఇతరుల గౌరవ, మర్యాదలు పణంగా పెడతారా? ప్రతి మహిళ తనదైన శైలిలో జీవించేందుకు అర్హురాలు.

    అలాగే ప్రతి ఒక్కరికి తాము చేసే పనుల్లో కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. మీడియా సోదరులకు నా విజ్ఞప్తి. మీ వృత్తిని నేను గౌరవిస్తాను. మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తాను. కానీ మీరు కొంచెం పద్ధతైన పనులు చేయండి.

    కాస్త మానవత్వం చూపండి
    ప్రతీ విషయాన్ని క్యాప్చర్‌ చేయాల్సిన పనిలేదు. ప్రతీ యాంగిల్లోనూ ఫొటో తీయాల్సిన అవసరం లేదు. ఈ ఆటలో కాస్త మానవత్వం చూపండి. థాంక్యూ’’ అంటూ పాపరాజీల తీరును హార్దిక్‌ పాండ్యా ఏకిపారేశాడు. ఇకనైనా బుద్ధిగా వ్యవహరించాలంటూ చురకలు అంటించాడు.

    కాగా గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ పాండ్యా... ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే.. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరిస్తూ.. ఒక్కోసారి వారి అనుమతి లేకుండానే ఫొటోలు తీసి వివిధ మాధ్యమాలకు అమ్ముకునే ఫొటోగ్రాఫర్లను పాపరాజీలు అంటారు.

    చదవండి: చరిత్ర సృష్టించిన బరోడా క్రికెటర్‌

  • ఒడిశాలోని క‌ట‌క్ న‌గ‌రంలో భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టి20 మ్యాచ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌ర‌గ‌నుంది. స్థానిక బారామ‌తి స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ టికెట్ల కోసం నాలుగు రోజుల క్రితం అభిమానులు పోటెత్తారు. టికెట్లు ద‌క్కించుకునేందుకు త‌మ‌ ప్రాణాలను సైతం ఫ‌ణంగా పెట్టేందుకు అభిమానులు వెనుకాడ‌లేద‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. క్రికెట్ అంటే పిచ్చా అనేంత‌గా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగ‌బ‌డ్డారు. క‌ట‌క్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నువాగ‌ర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన ప‌రిస్థితి ఉంది. కార‌ణం 21 ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ విషాదం.

    ఏం జ‌రిగింది?
    జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాలోని నువాగ‌ర్ గ్రామం (Nuagarh village) ఒక‌ప్పుడు క్రికెట్‌కు ప్ర‌సిద్ధి. ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు క్రికెట్ అంటే ఇష్టం. 2004 ముందు వ‌ర‌కు గ్రామ‌స్తులు నిరంత‌రం క్రికెట్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తూ ఉండేవారు. దీంతో ఆ ఊరిలో ఎప్పుడు చూసినా క్రికెట్ సంద‌డి క‌నిపించేది. అంతేకాదు నువాగ‌ర్ గ్రామానికి ప్ర‌త్యేకంగా ఉత్క‌ల్‌మ‌ణి క్రికెట్ క్ల‌బ్ పేరుతో ఒక జ‌ట్టు కూడా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌తో పాటు జిల్లా, రాష్ట్ర‌స్థాయి పోటీల్లో ఈ జ‌ట్టు పాల్గొంది. 2004, మార్చి 1 ముందు వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ ఆ రోజు నువాగ‌ర్ గ్రామం చ‌రిత్ర‌లో దుర్దినంగా మిగిలిపోయింది.

    కేంద్రపార జిల్లా మహాకలపాడలో స్థానిక టోర్న‌మెంట్‌లో ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు 2004, మార్చి 1న ఉత్క‌ల్‌మ‌ణి క్రికెట్ క్ల‌బ్ (Utkalmani youth club) జ‌ట్టు ప‌డ‌వలో బ‌య‌లుదేరింది. 15 మంది ఆట‌గాళ్లు, మ‌రో ఏడుగురు క‌లిసి పయ‌న‌మ‌య్యారు. బ‌హాకుడా ఘాట్ స‌మీపంలో దురదృష్టవ‌శాత్తు ప‌డ‌వ ప్ర‌మాదానికి గుర‌వ‌డంతో 13 మంది క్రికెట‌ర్లు మ‌హాన‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఊహించ‌ని విషాదంతో నువాగ‌ర్ గ్రామం దిగ్బ్రాంతికి గురైంది. అప్ప‌టివ‌ర‌కు స్థానికంగా క్రికెట్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న ఆ ఊరిలో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. క్రికెట్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఆ దుర్ఘ‌ట‌న‌ త‌ర్వాత త‌మ‌ ఊరిలో క్రికెట్ ఆడ‌రాద‌ని గ్రాస్తులంతా నిర్ణ‌యం తీసుకున్నారని నువాగ‌ర్ మాజీ స‌ర్పంచ్ సుధాల్ స్వాన్‌ మీడియాకు తెలిపారు.

    పెళ్లైన 6 నెల‌ల‌కే..
    ప‌డ‌వ ప్ర‌మాదంలో చ‌నిపోయిన 13 మంది ఆట‌గాళ్ల పేరుతో 2007లో స్మార‌క స్థూపం (memorial pillar) ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘ‌ట‌న రోజాలిని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె భ‌ర్త బిశ్వ‌జిత్ రే ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. వారిద్ద‌రికీ పెళ్ల‌యి అప్ప‌టికే ఆరు నెల‌లు మాత్ర‌మే అయింది. ''నా భ‌ర్త కుడిచేతి వాటం బ్యాట‌ర్‌, మీడియం పేస్‌బౌల‌ర్‌. అప్పుడ‌ప్పుడు వికెట్ కీప‌ర్‌గానూ ఉండేవాడు. క్రికెట్‌పై ఉన్న మ‌క్కువే అత‌డి ప్రాణాలు తీసింది. చ‌నిపోయిన 13 మంది క్రీడాకారుల కుటుంబాల‌కు జిల్లా అధికార యంత్రాంగం రూ. 25 వేలు చొప్పున స‌హాయం అందించింద‌''ని రోజాలిని గుర్తు చేసుకున్నారు.

    క్రికెట్ చూడ‌కూడ‌ద‌నుకున్నాం
    ఇదే దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన‌ ప్ర‌దీప్ ప‌రిడా కుటుంబానికి దాదాపు ఇదే ప‌రిస్థితి. ఏడాది ముందే అత‌డికి పెళ్లైంది. ''న‌దిలో మునిగి చ‌నిపోయిన 13 మందిలో నా భ‌ర్త కూడా ఉన్నాడు. నాతో పాటు, ఆరు నెల‌ల కూతురిని వ‌దిలేసి శాశ్వ‌తంగా వెళ్లిపోయాడు. మా ఊరిలోని మైదానంలో క్రికెట్ ఆడుతుండేవాడు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత క్రికెట్ చూడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నామ‌''ని ప్ర‌దీప్ భార్య టికీ చెప్పారు. 

    చ‌ద‌వండి: హెచ్‌సీఏ తీరుపై త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం

  • సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. ఓ క్రికెటర్‌ దేశవాలీ అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూసి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం పొందాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్‌.. ఏమిటా స్టోరీ..?

    బరోడాకు చెందిన 26 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అమిత్‌ పాసి తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిన్ననే తన దేశవాలీ అరంగేట్రం (టీ20) చేశాడు. తొమ్మిదేళ్లు నిరీక్షించినందుకు అతనికి మంచి ప్రతిఫలమే దక్కింది. తొలి మ్యాచ్‌లోనే (SMATలో సర్వీసెస్‌పై) వరల్డ్‌ రికార్డు సెంచరీ చేశాడు.

    టీ20 అరంగేట్రంలో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా పాకిస్తాన్‌ ఆటగాడు బిలాల్‌ ఆసిఫ్‌ (2015) ప్రపంచ రికార్డును సమం చేశాడు. పాసి, బిలాల్‌ ఇద్దరూ టీ20 అరంగేట్రాల్లో 114 పరుగులు చేశారు. టీ20 అరంగేట్రంలో ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే.

    ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురుచూసినా ఫలితం దక్కకపోవడంతో పాసి ఓ దశలో ఆటకు వీడ్కోలు పలికి కోచింగ్‌ వైపు మళ్లాలని అనుకున్నాడు. కొద్ది రోజులు ఆ ప్రయత్నం కూడా చేశాడు. జితేశ్‌ శర్మ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో ఎట్టకేలకు పాసి కల నెరవేరింది.

    అరంగేట్రం మ్యాచ్‌తోనే హీరో అయిపోయాడు. 24 బంతుల్లో అర్ద సెంచరీ చేసి కేవలం 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.

    పాసి ఉదంతం క్రీడలో అయినా జీవితంలో అయినా నిరీక్షణ అవసరమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆశ కోల్పోకుండా పట్టుదలతో ఎదురుచూసే వారికి పాసికి వచ్చినట్లే అవకాశాలు వస్తాయి. పాసికి 2016–17 సీజన్‌లో బరోడా అండర్–19 జట్టులో చోటు దక్కినా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.  

    ప్రతి సీజన్‌లో జట్టుకు ఎంపికైనా, తుది పదకొండులో అవకాశాలు రాలేదు. స్థానిక స్థాయిలో నిరంతరం రాణించినా, సీనియర్‌ స్థాయి అరంగేట్రం కోసం తొమ్మిదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 

    పాండ్యా సోదరులు హార్దిక్‌, కృనాల్‌ ప్రోత్సాహంతో పాసి ఆశ కోల్పోకుండా నిరంతర ప్రయత్నం చేశాడు. పాండ్యా సోదరులు పాసి గురించి తెలిసి ఎదురుపడిన ప్రతిసారి ధైర్యం చెప్పేవారు. అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిద్ధంగా ఉండాలని హార్దిక్ ఇచ్చిన సలహా అతనికి ప్రేరణగా నిలిచింది.

    ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన పాసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ధోనిని ఆరాధించే పాసి, అతనిలాగే దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్‌ చేస్తాడు. పాసి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి నాలుగు దశాబ్దాల క్రితం వడోదరాకు వలస వెళ్లింది.  

    అతని కుటుంబానిది గుజరాత్‌లో నీటి సరఫరా చేసే వ్యాపారం. ఆర్థికంగా పాసికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అతడి అన్నయ్య కూడా స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. ప్రస్తుతం అతను కూడా కుటుంబ వ్యాపారంలో భాగంగా ఉన్నాడు. 

    మొత్తంగా చూస్తే పాసి ఉదంతం అవకాశాల కోసం​ సుదీర్ఘంగా ఎదురుచూసే వారికి ఓ ప్రేరణగా నిలుస్తుంది. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, పట్టుదల, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఉంటే ఒకే ఇన్నింగ్స్ జీవితాన్ని మార్చేస్తుందని పాసి కథ సూచిస్తుంది. 

  • ముఖ్యమైన ప్రకటన.. టీమిండియాకు ఆల్‌రౌండర్లు కావలెను. అవును మీరు విన్నది నిజమే.  ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో నాణ్యమైన ఆల్‌రౌండర్ల లోటు కన్పిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, సుందర్ వంటి వారు ఉన్నప్పటికి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ చాలా వెనకబడి ఉంది. 

    ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప చెప్పుకోదగ్గ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ భారత లేరు. అయితే హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల వల్ల ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు బయట ఉంటాడో తనకే తెలియదు. నితీశ్ కుమార్ రెడ్డిని మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నప్పటికి.. ఆశించినంతమేర ఫలితాలు మాత్రం రావడం లేదు. 

    మొదటిలో అతడిపై నమ్మకం ఉంచిన గంభీర్ అండ్ కో.. ఇప్పుడు ఎక్కువగా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తోంది. టీ20 సెటాప్‌లో భాగంగా ఉన్న శివమ్ దూబే పరిస్థితి కూడా అంతంతమాత్రమే. SENA దేశాలతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాము. 

    గతంలో కపిల్ దేవ్‌, సౌరవ్ గంగూలీ వం‍టి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ప్రపంచ క్రికెట్‌నే శాసించారు. కచ్చితంగా అటువంటి ఆల్‌రౌండర్లు భారత జట్టుకు అవసరం.

    ఆల్‌రౌండర్ల ఉపయోగాలు ఏంటి?
    జట్టు సమతుల్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కావాలి. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌,  న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సేనా దేశాల విజయాలలో ఆల్‌రౌండర్లదే కీలక పాత్ర.  ఒ​‍క్క ఆస్ట్రేలియాలోనే మిచెల్ మార్ష్‌, గ్రీన్‌, అబాట్‌, స్టోయినిష్ వంటి అద్బుతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. 

    నిజమైన ఫాస్ట్-బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోతే, జట్టు కూర్పు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టీమిండియా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. ప్రతీ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక ఒక సమస్యగా మారింది. అదనపు బ్యాటర్‌ను ఆడిస్తే బౌలింగ్ బలహీనపడుతుంది. 

    ఐదుగురు బౌలర్లతో ఆడితే  బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారుతుంది. ఈ అసమతుల్యత కారణంగానే భారత్ విదేశాల్లో కీలక మ్యాచ్‌లు, టెస్ట్ సిరీస్‌లలో ఓడిపోయింది. భార‌త జ‌ట్టులో స్పిన్ ఆల్‌రౌండ‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఎవ‌రికి అవ‌కాశ‌మివ్వాలో తెలియ‌క టీమ్ మెనెజ్‌మెంట్ త‌ల‌లు ప‌ట్టుకుంటుంది. 

    జ‌డేజా, అక్ష‌ర్ వంటి వారు ఉప‌ఖండ పిచ్‌లోపై రాణిస్తున్న‌ప్ప‌టికి విదేశీ గ‌డ్డ‌పై బంతితో సత్తాచాటలేకపోతున్నారు. దీంతో విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల లోటు స్పష్టంగా కన్పిస్తోంది.

    శార్ధూల్ రీ ఎంట్రీ ఇస్తాడా?
    బీసీసీఐ సెలక్టర్లు మరోసారి శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆల్‌రౌండర్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అసవరముంది. శార్ధూల్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి దేశవాళీ క్రికెట్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. 

    ఫార్మాట్లకు అతీతంగా ఠాకూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అతడు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే లార్డ్ ఠాకూర్ మరోసారి సత్తా చాటుతున్నప్పటికీ.. ఇప్పట్లో తిరిగి పునరాగమనం చేసే సూచనలు  కన్పించడం లేదు.

    అయితే, ఠాకూర్ మాత్రం కూడా వన్డే ప్రపంచకప్‌-2027లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అతడితో పాటు రాజ్ అంగద్ బవా, సూర్యాంశ్ షెడ్గే వంటివారిపై కూడా సెలక్టర్లు దృష్టిసారించాల్సి ఉంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో రాజ్ అంగద్ బవా బంతితో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. సూర్యాంశ్‌కు కూడా సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించే సత్తా ఉంది. 
    చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

  • దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో తమిళనాడు జట్టుకు చెందిన ఓ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏకంగా 333కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో సన్నీ లియోన్‌ (Sunny Leone) ఫొటో షేర్‌ చేశాడు.

    అసలు.. ఆ ఆటగాడికి.. అశూ ఈ పోస్ట్‌ పెట్టడానికి సంబంధం ఏమిటి అంటారా?!... సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్రతో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. టాస్‌ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్‌  ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 

    ఓపెనర్‌ విశ్వరాజ్‌ జడేజా మెరుపు అర్ధ శతకం (39 బంతుల్లో 70)తో చెలరేగగా.. సమ్మార్‌ గజ్జార్‌ (42 బంతుల్లో 66) ధనాధన్‌ దంచికొట్టాడు. తమిళనాడు బౌలర్లలో సీలం బరాసన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇసక్కిముత్తు రెండు వికెట్లు తీశాడు. ఆర్‌. రాజ్‌కుమార్‌, సన్నీ సంధు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

    సాయి సుదర్శన్‌ మెరుపు శతకం
    ఇక సౌరాష్ట్ర విధించిన 184 లక్ష్య ఛేదనకు దిగిన తమిళనాడు 18.4 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ సాయి సుదర్శన్‌ మెరుపు శతకం (55 బంతుల్లో 101 నాటౌట్‌, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో దుమ్ములేపాడు.

    తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు
    మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన బౌలర్‌ సన్నీ సంధు (Sunny Sandhu) కేవలం తొమ్మిది బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగానే తమిళనాడు... సౌరాష్ట్రపై మూడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

    అసలు విషయం ఇదీ!
    ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ తనదైన శైలిలో ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. నటి సన్నీ లియోన్‌ ఫోటోకు.. చెన్నైలోని సంధు స్ట్రీట్‌ ఫోటోను జతచేసి షేర్‌ చేశాడు. దీంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. అశూ ఇలాంటి పోస్ట్‌ చేశాడని ఎందుకు చర్చించుకున్నారు.  

    అయితే, అంతలోనే మరికొంత మంది అశూ పోస్ట్‌ వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టారు. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన సన్నీ సంధును ప్రశంసించే క్రమంలోనే అశూ ఈ మేరకు పోస్ట్‌ పెట్టాడని, దీనిని తాము సులభంగానే డీకోడ్‌ చేశామంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అశూ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

    చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?

     

International

  • 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు  చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.

    బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా  ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.

    రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

    బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది.  అంతేకాకుండా  డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.

    బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్‌లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్‌లో  భారత్‌లో తలదాచుకుంటుంది.

  • పెద్ద కార్పొరేట్‌  కంపెనీ,  బిలియన్ల డాలర్ల ఆదాయం అంటే  ఏం ఊహించుకుంటాం. ఆ కంపెనీ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. కానీ  ఇక కంపెనీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే చాలా తక్కువ మంది ఉద్యోగులకు కంపెనీని నడిపిస్తోంది.   కేవలం 42 మంది పూర్తి కాల ఉద్యోగులకు  భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎలా? పదండి మరి  ఆ కంపెనీ రహస్యం ఏంటో తెలుసుకుందాం.

    ఆ కంపెనీ  పేరే ఓన్లీఫ్యాన్స్. ఇది  అనేది లండన్, ఇంగ్లాండ్‌లో ఉన్న  సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్‌ఫామ్. పోర్న్‌ రచనలకు ఎక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ,  అథ్లెట్లు, సంగీతకారులు , హాస్యనటులతో సహా ఇతర కంటెంట్ సృష్టికర్తలను కూడా హోస్ట్‌ చేస్తుంది. 2016 దీన్ని స్థాపించారు. దీని సీఈవో కైలీ బ్లెయిర్.కంపెనీ కావాలనే తక్కువ మంది ఉద్యోగులకు నియమించుకుంది. ముఖ్యంగా నిపుణులైన సీనియర్లతో పాటు, ఉద్యోగం చేయాలని తపన ఉన్న  జూనియర్లే ఈ కంపెనీకి ఆయువు పట్టు. మిడిల్‌మేనేజ్‌మెంట్‌ లేకుండా చేసి, ఉద్యోగులకు స్వేచ్ఛ నివ్వడమే తమ కంపెనీ విజయ రహస్యమంటారు. సీఈవో కైలీ బ్లెయిర్. నవంబర్‌లో లిస్బన్‌లో జరిగిన వెబ్ సమ్మిట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో మాస్టర్స్ ఆఫ్ స్కేల్ పాడ్‌కాస్ట్ హోస్ట్ జెఫ్ బెర్మాన్‌తో సంభాషణ సందర్భంగా బ్లెయిర్ ఈ విధానం గురించి చర్చించారు.ఘో

    మంచి మిడిల్‌ మేనేజర్  ఉండనే ఉండడు
    తమ కంపెనీ కేవలం 42 మంది పూర్తి-సమయ సిబ్బందితో మాత్రమే పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ టీంతోనే  తమ కంపెనీ వార్షికంగా 7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు చెప్పారు.  చాలా పవర్‌ ఫుల్‌ టీం అని బెర్మాన్‌ ప్రశంసించగా, ఆ టీం సామర్థ్యాన్ని పర్యవేక్షించే మరో టీం లేకపోవడమే దీనికి కారణమని తెలిపింది. నియామక తత్వంపై ఆమె ఇంకా ఇలా వివరించారు. నియామకంలో అనుభవం కంటే వైఖరి,  ఆప్టిట్యూడ్ చూస్తాము. మనస్తత్వం , సామర్థ్యానికి ప్రాధాన్యత తప్ప  ఓన్లీ ఫ్యాన్స్‌లో  మిడిల్ మేనేజ్‌మెంట్  పొర ఉండదు.  ఎందుకంటే తన అనుభవంలో ఎవరికీ నిజంగా మంచి మిడిల్ మేనేజర్ లేడు అని  ఆమె స్పష్టం చేయడం విశేషం.ఎంత మంది వ్యక్తులను పర్యవేక్షిస్తారనే బట్టి లీడర్స్‌ను అంచనా వేసే సాధారణ కార్పొరేట్ పద్ధతికి తాను వ్యతిరేకినని బ్లెయిర్ చెప్పారు.

    ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు

    గతంలో న్యాయవాదిగా పనిచేసిన బ్లెయిర్ 2022 జనవరిలో లండన్‌కు చెందిన కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ , ఆపరేషన్స్ ఆఫీసర్‌గా చేరారు.తరువాత 2023లో కంపెనీకి సీఈఓగా మారింది. ఈప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది. సుమారు 40 లక్షల కంటెంట్‌ క్రియేటర్లను హోస్ట్‌ చేసింది  సృష్టికర్తలకు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రధాన సాంకేతిక సంస్థలలో కంపెనీ మిడిల్-మేనేజ్‌మెంట్ స్థానాలను తగ్గించిన నిర్మాణ విస్తృత ధోరణిని  ఇది ప్రతిధ్వనిస్తుందని కూడా ఆమె  చెప్పడం విశేషం. 

    ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

  • పర్యాటక ప్రదేశానికి వెళ్లినపుడు, అక్కడి ప్రకృతిని  ఆస్వాదించడం కంటే, సెల్పీ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం పైనే దృష్టి. ప్రాణాలకు తెగించి మరీ  సెల్ఫీ తీసుకునేటపుడు పొంచి ఉన్న ప్రమాదాలపై  ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ  ఈ ధోరణి మాత్రం మారణం లేదు. అత్యంత ప్రమాదకరమైన 130 అడుగులు కొండపై నుంచి నడుస్తున్నపుడు సెల్ఫీ తీసుకుంటూ జారీ పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

    ది సన్  కథనం ప్రకారం, చైనాలోని గ్వాంగ్'ఆన్‌లోని హువాయింగ్ పర్వతంపై ఈ సంఘటన జరిగింది.  బ్లేడ్ రాక్  అనే పర్యాటక ప్రదేశంలోని 130 అడుగుల కొండ శిఖరం వద్ద  సెల్ఫీ తీసుకుంటూ జారి పడిన పర్యాటకుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది. దీని ప్రకారం అతను  ఫోన్ పట్టుకుని కొండ అంచున నడుస్తున్నాడు. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం ఇటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగిరి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు.

    ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

    ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్‌అయ్యారు.  కేకలు పెడుతూ కొండ అంచున పరుగులుపెట్టారు.  కానీ పడిపోయిన వ్యక్తి దాదాపు 15 మీటర్ల ఎత్తులో ఉన్న అడవిలో పడిపోయాడు. ఆ భయంకరమైన జలపాతం నుండి తీవ్రమైన గాయాలు లేకుండా , ప్రాణాలతో  బతికి బయటపడ్డాడు.

     

    ఆ దేవతలే కాపాడారు 
    ఈ విషయాన్ని  సదరు  పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను  ఆశీర్వదించారు.  చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని  రాసుకొచ్చాడు. మరోవైపు  ప్రమాదం జరిగిందని చెబుతున్న  బ్లేడ్ రాక్ ర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం ,  సరిహద్దుల్లో లేదు. వారు ఈ ప్రాంతాన్ని "దూరం నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది ,  ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు  నిబంధనలను పాటించాలని,  ఇలాంటి  ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని  సందర్శకులకు గుర్తు చేశారు.

    ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు

  • ఇండోనేషియా రాజధాని జకార్తలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి.. 20 మంది దాకా సజీవ దహనం అయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు.

    సెంట్రల్‌ జకార్తాలోని ఓ భవనంలో మంగళవారం మధ్యాహ్నా సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో ప్రారంభమైన మంటలు శరవేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటలు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల్లో 15 మంది పురుషులు, ఐదుగుర మహిళలు ఉన్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రులకు తరలించారు. 

    ప్రమాదం సంభవించిన భవనంలో టెర్రా డ్రోన్ ఇండోనేషియా అనే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక టీవీ చానెల్స్‌ ప్రసారం చేస్తున్న విజువల్స్‌లో .. అగ్నిమాపక సిబ్బంది బాధితులను బయటకు తీసుకువస్తూ.. కొందరి బాడీ బ్యాగ్‌లను మోసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పై అంతస్తుల నుండి కొంతమంది ఉద్యోగులు పోర్టబుల్‌ లాడర్లు ఉపయోగించి బయటకు తప్పించుకున్న విజువల్స్‌ కూడా వైరల్‌ అవుతున్నాయి. సహాయం కోసం కొందరు బిల్డింగ్‌ పైన నిల్చున్న​ దృశ్యాలు నెట్టింటకు చేరుతున్నాయి.

    ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. లంచ్‌ టైంలో ఘటన చోటు చేసుకుందని ప్రాణాలతో బయటపడిన కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి సహాయక చర్యలు ముగిశాకే ప్రమాదంపై ఓ స్పష్టమైన ప్రకటన చేయస్తామని అధికారులు అంటున్నారు. 

Politics

  • సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దొంగ లెక్కలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) అంచనా గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని.. ఈ గణాంకాలు ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో తయారు చేసినవని అన్నారు.

    కాగ్‌ (Comptroller and Auditor General) విడుదల చేసిన రాష్ట్ర ఖాతాల గణాంకాలు మాత్రం నిజమైన ఆదాయాలు, ఖర్చులను ప్రతిబింబిస్తున్నాయి. ఆ గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే.. 

    • ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల అత్యంత తక్కువ స్థాయిలో ఉంది
    • అప్పులు గణనీయంగా పెరిగాయి
    • అభివృద్ధి పనుల కోసం ఖర్చు తగ్గిపోయింది
    • వినియోగం, పెట్టుబడులు పడిపోయాయి
    • రెవెన్యూ, ఫిస్కల్ లోటు ఆందోళనకరంగా పెరిగాయి
    • అవినీతి కారణంగా ప్రభుత్వ ఆదాయాలు దోపిడీకి గురవుతున్నాయి

    ఈ పరిస్థితుల్లో కూడా టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని జగన్ మండిపడ్డారు. ఆయన అబ్రహాం లింకన్ మాటలను ఉటంకిస్తూ, “కొంతకాలం అందరినీ మోసం చేయవచ్చు, కొంతమందిని ఎప్పటికీ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు” అని చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా..

    • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగుంటే, ఈ స్థాయి ఆర్థిక ఒత్తిడి ఎందుకు?
    • 2014–19లో టీడీపీ పాలనలో GSDP వృద్ధి గొప్పదైతే.. ఇప్పుడు రాష్ట్రం జాతీయ GDPలో వాటా 4.45% మాత్రమే ఎందుకు ఉంది? 2019–24లో 4.78%గా ఉన్న సంగతేంటి?..
    • టీడీపీ పాలనలో రాష్ట్రం వ్యక్తి ప్రాతి ఆదాయ ర్యాంక్ ఒక్క స్థానం కూడా మెరుగుపడకపోవడానికి కారణం ఏమిటి?.. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

    టీడీపీ ప్రభుత్వం తప్పుడు గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని..  కానీ కాగ్‌ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అబద్ధపు ప్రచారాలు.. 2019–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పనితీరుపై చేస్తున్న ఆరోపణల వెనుక నిజాన్ని బహిర్గతం చేసే గణాంకాలను అందరూ పరిశీలించండి అంటూ సమాచారాన్ని ఆయన మంగళవారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

  • సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

    వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్‌ ఉండేది. అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు.. 

    కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు. 

    మోదీ, నీతీశ్‌కుమార్‌లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్‌, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్‌.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు. 

    ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్‌ జగన్‌. అందుకే వైఎస్సార్‌సీపీ హయాంలో స్కూల్స్‌ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్‌- పేరెంట్స్‌ మీటింగ్‌ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్‌లో కూడా పేరెంట్స్‌ మీటింగ్‌ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్‌లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్‌లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?.. 

    ..వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్‌ జగన్‌ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన‌ రాజేంద్రనాధ్‌(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్‌ విసిరారు.

    చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్‌ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.  

    టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.

    సీఎం హోదాలో చంద్రబాబు తనపై ఉన్న కేసులను తానే కొట్టేసుకోవటం పెద్ద నేరం. చంద్రబాబు చేసిన దివాళాకోరు తనం, నీతి మాలిన తనం కంటే ఇంకోటి లేదు. చంద్రబాబుకు దమ్ముంటే కేసును న్యాయబద్దంగా ఎందుకు ఎదుర్కోలేక పోయారు. పరకామని కేసులో తన ఆస్తిని రవికుమార్ టీటీడీకి రాసిచ్చారు. చంద్రబాబు చేసిన దోపిడీలతో పోల్చితే రవికుమార్ చేసిన నేరం చిన్నదే. 

    ఇండిగో సంక్షోభం టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి తప్పిదమే. పైలెట్లకు రెస్టు ఉండాలనే నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అమలు చేయాలి. విమానయాన సంస్థల పనితీరును సమీక్షించాలి. కానీ రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇండిగో సంస్థ విమానాలను పెంచుకుంటున్నంతగా సిబ్బందిని పెంచుకోలేదు. ఆ విషయాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎందుకు సమీక్ష చేయలేదు?. దీని గురించి ప్రజలు, ప్రయాణీకులు ప్రశ్నిస్తే చంద్రబాబు మా పార్టీపై పడి ఏడుస్తున్నారు. తెలుగువారి పరువే కాదు, మొత్తం దేశం పరువునే పోగొట్టారు. తప్పు చేశారు కాబట్టే అర్నాబ్ గోస్వామి చర్చను బాయ్ కాట్ చేశారు అని పేర్ని నాని అన్నారు. 

    Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ


     

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో విజయ దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

    హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటై మరో పోరాటానికి సిద్ధం కావాలి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. పదవులను గడ్డి పూసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో ప్రాణం మీదికి వచ్చిన దీక్ష విరమించని వ్యక్తి ఆయన. కేసీఆర్ అంటే పోరాటం, కేసీఆర్ అంటే త్యాగం. ఆయన దీక్ష లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2 తేదీలు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనివని గుర్తుచేశారు.

    కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమ ద్రోహులు చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డి పేరు తప్పక రాయాల్సి వస్తుందని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ద్రోహి, వెన్నుపోటు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, రెండేళ్లుగా ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రామోజీరావు కంటే గొప్ప  అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. కాళోజి, దాశరధి, గద్దర్ పేర్లతో ఇచ్చే అవార్డులను అవమానించడం, రేడియల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే ప్రయత్నం, ఒకప్పుడు సోనియా గాంధీని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ నేడు సోనియాగాంధీ దేవత అంటున్నాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

    ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే. సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్‌కు రానివ్వలేదు. ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే దానికి మేము కొన్ని సంవత్సరాలు ఢిల్లీ తిరగాల్సి వచ్చింది. తెలంగాణ జైత్రయాత్రను కేసీఆర్ శవయాత్ర అని నినదించినప్పుడు, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటూ హరీష్ రావు  ఆవేదన వ్యక్తం చేశారు.

    తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం: హరీష్ రావు
  • సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్న పానుగంటి చైతన్యను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకోవడం అవివేకం. పానుగంటి చైతన్య చేసిన నేరం ఏంటి.. విద్యార్థి సమస్యలపై పోరాటం చేయడం తప్పా?. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ ఏడాది చిత్తశుద్ధితో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రిబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యం వేధిస్తున్నాయి.

    కళాశాలకు అనుమతించడం లేదు, హాల్ టికెట్ ఇవ్వకుండా, పరీక్షలకు దూరం చేస్తున్నారు. కోర్సు కంప్లీట్ అయినా సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్నారు. చంద్రబాబు పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం’ అని హెచ్చరించారు. 

Family

  • మన గురించి మనం కాకపోతే ఇంకెవరు చెబుతారు అనేది ఈ తరం నానుడి..! దీనినే ట్రెండీగా బ్రాండ్‌ ప్రమోషన్‌ అంటూ ఈతరం నగర జీవనశైలిలో భాగం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాండ్‌ ప్రమోషన్‌ అనే మాట విరివిగా వినబడుతోంది. చిన్న చిన్న స్టార్టప్స్‌ సంస్థల నుంచి మొదలు ఎమ్‌ఎన్‌సీల వరకు ఈ బ్రాండ్‌ ప్రమోషన్‌ సంస్థల సేవలు వినియోగించుకుంటున్నాయి. అధునాతన రీతిలో మారుతున్న జీవన శైలి, వ్యాపార ధోరణుల్లో వచ్చిన వేగం, అన్నింటికీ మించి సోషల్‌ మీడియా విప్లవం.. ఈ మూడు సమ్మేళనంగా పుట్టింది ఒక భారీ మార్కెట్‌ ట్రెండ్‌ ఈ ‘బ్రాండ్‌ ప్రమోషన్‌’. కొన్ని సంవత్సరాలుగా ఈ రంగం మన నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అద్భుతమైన వృద్ధి సాధించింది. వ్యక్తిగత బ్రాండింగ్‌ నుంచి కార్పొరేట్‌ ప్రమోషన్‌ వరకు, ప్రతీ రంగానికీ ఇది తప్పనిసరి సాధనమైంది.    
    – సాక్షి, సిటీబ్యూరో

    అభిరుచి, సృజనాత్మకత, డిజిటల్‌ అవగాహన.. ఈ మూడు ఆయుధాలతో హైదరాబాద్‌ యువత (Hyderabad Youth) బ్రాండ్‌ ప్రమోషన్‌ రంగంలో నేటి ‘గేమ్‌ ఛేంజర్స్‌’గా మారుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, ఎక్స్‌(ట్విట్టర్‌) నుంచి పాడ్‌కాస్ట్‌లు, రీల్స్‌ ప్రొడక్షన్, వెబ్‌క్యాంపైన్ల వరకుం ఈ జెన్‌–జీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ తమ సొంత స్టైల్‌తో బ్రాండ్‌లను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్టప్‌ కల్చర్‌కు హబ్‌గా నిలిచిన హైదరాబాద్‌లో చిన్న టీమ్‌లే పెద్ద క్యాంపైన్‌లను నడిపిస్తూ పెద్ద మల్టీ నేషనల్‌ కంపెనీలకు టఫ్‌ పోటీ ఇస్తున్నాయి. కొత్త స్టార్టప్స్‌ స్థాపకుల నుంచి స్థానిక హోం–బేస్డ్‌ వ్యాపారులు కూడా వీరి సేవలను ఆశ్రయిస్తున్నారు.

    గ్లోబల్‌ స్టాండర్డ్స్‌.. 
    ఏఐ ఆధారిత క్యాంపైన్‌ టూల్స్, డేటా–డ్రైవన్‌ మార్కెటింగ్, కంటెంట్‌ ఇంజనీరింగ్, 3డీ రీల్స్, ఏఆర్‌ ఫిల్టర్లు.. ఇప్పుడు హైదరాబాద్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌ ఏజెన్సీలు గ్లోబల్‌ స్టాండర్డ్‌లతో పనిచేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ రంగం మరింత విస్తరించబోతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి వ్యక్తి ఒక బ్రాండ్‌ అయ్యే కాలం వస్తోంది. ప్రతి వ్యాపారం తమ కథను చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పించే వారే ఈ తరం బ్రాండ్‌ ప్రమోటర్లు. నగర జీవనశైలిని ప్రతిబింబించేలా డిజిటల్‌ ప్రపంచంలో తమ కథను చెప్పించుకోవాలంటే ఈ రోజుల్లో బ్రాండ్‌ ప్రమోషన్‌ ఒక ‘లగ్జరీ’ కాదు.. ఒక అవసరం.

    ‘ఆక్సిజన్‌’ సోషల్‌ మీడియా.. 
    సోషల్‌ మీడియా (Social Media) వేదికలు నేటి బ్రాండ్లకు కావాల్సిన ఆక్సిజన్‌ అని చెప్పుకోవచ్చు. ఒక వైరల్‌ రీల్‌ ఒక క్రియేటివ్‌ పోస్టు ఒక చిన్న స్టోరీ ఇవి నిమిషాల్లోనే బ్రాండ్‌ను లక్షల మంది దగ్గరకు తీసుకెళ్లగలిగే శక్తిని కలిగిఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌ నగరం మరింత ప్రత్యేకమైంది. ఇక్కడి ప్రేక్షకులకు ట్రెండ్స్‌పై అద్భుతమైన ‘సెన్స్‌’ ఉండటం. అందుకోసమే నగరంలోని చాలా బ్రాండ్‌ ప్రమోషన్‌ ఏజెన్సీలు ప్రత్యేకంగా ట్రెండింగ్‌ కంటెంట్‌ ల్యాబ్స్, క్రియేటివ్‌ స్టూడియోలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ భాగస్వామ్యాలను ఏర్పాటు చేసి సరికొత్త ఐడియాలతో బ్రాండ్లను ‘రిలేటబుల్‌’ – ‘వైరల్‌’గా మారుస్తున్నాయి.

    కాదేదీ అనర్హం.. 
    సినిమా, రాజకీయాలు, వ్యాపారం కాదేది అనర్హం అంటూ అందరికీ బ్రాండ్‌ ప్రమోషన్‌ (Brand Promotion) తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు బ్రాండ్‌ ప్రమోషన్‌ అంటే కార్పొరేట్‌ కంపెనీలు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ.. ప్రస్తుతం రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా స్టార్‌లు, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎడ్యూ–ఇనిస్టిట్యూట్స్, ఈవెంట్‌ ఆర్గనైజర్లు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ ఇమేజ్, వారి పనితీరును ప్రజలకు చేరువ చేసేందుకు డిజిటల్‌ ప్రమోషన్‌ను శాశ్వతమైన భాగంగా మార్చుకున్నారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల సమయంలో డిజిటల్‌ క్యాంపైన్‌లే కీలకం. సినిమా రీలీజ్‌లకు ఇన్‌ఫ్లూయెన్సర్‌ కొలాబ్స్‌ తప్పనిసరి. కొత్త ఉత్పత్తుల కోసం సోషల్‌ హైప్‌ లేకుండా మార్కెట్‌లో నిలబడటం కష్టమైన కాలం ఇది.

    సిటీ లైఫ్‌స్టైల్‌.. 
    టెక్‌ సిటీ, కల్చర్‌ సిటీ, ఇవన్నీ కలిసిన నగరం హైదరాబాద్‌ (Hyderabad). ఇక్కడి జీవనశైలిలో ‘డిజిటల్‌ ప్రెజెన్స్‌’ ఇప్పుడు ప్రొఫెషనల్‌ ఇమేజ్‌ మాత్రమే కాదు, లైఫ్‌స్టైల్‌ స్టేట్మెంట్‌ కూడా. అవుట్‌డోర్‌ షూట్స్, క్రియేటివ్‌ స్టూడియోలు, ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ బ్లాగర్లు, ట్రావెల్‌ రీల్స్‌ క్రియేటర్లు ఇలా విభిన్న రంగాల్లో పనిచేసేవారు తమ బ్రాండ్‌ ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా చేయడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్‌ స్ట్రాటజీలను అనుసరిస్తున్నారు.

    చ‌ద‌వండి: మేన‌రికాల జోడు.. భావిత‌రాల‌కు చేటు..!

    ‘గేమ్‌ ఛేంజర్‌’.. 
    సార్వత్రిక మార్కెట్‌లో తమ పేరు నిలబెట్టుకోవడం చిన్న వ్యాపారులకు పెద్ద సవాలు. కానీ బ్రాండ్‌ ప్రమోషన్‌ ఈ గ్యాప్‌ను పూర్తిగా తగ్గించింది. ఒక చిన్న బొటిక్, ఒక క్లౌడ్‌ కిచెన్, ఒక లోకల్‌ బ్యూటీ ప్రొడక్ట్‌.. ఇవి పెద్ద బడ్జెట్‌ లేకుండానే సోషల్‌ మీడియా క్యాంపైన్‌తో భారీ రీచ్‌ సాధిస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలు సిటీలో వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇది నగరపు స్వభావమే.. ప్రతి సృజనాత్మకతకు వేదిక.

  • ఇటీవ‌లి కాలంలో ప్ర‌స‌వం అంటేనే సిజేరియ‌న్ అంటున్నార‌ని, వాటి కంటే సుర‌క్షిత‌, సాధార‌ణ‌ ప్ర‌స‌వాలే ఎప్పుడూ శ్రేయ‌స్క‌ర‌మ‌ని కిమ్స్ గ్రూప్ ఆస్ప‌త్రుల సీఈఓ డాక్ట‌ర్ అభిన‌య్ తెలిపారు. సాధార‌ణ ప్ర‌స‌వాల మీద అవ‌గాహ‌న పెంపొందించే ల‌క్ష్యంతో డాక్ట‌ర్ కె.శిల్పిరెడ్డి ఫౌండేష‌న్‌, కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ మిసెస్ మామ్ తొమ్మిదో సీజ‌న్ గ్రాండ్ ఫినాలె కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్. శిల్పిరెడ్డి,  డా. శిల్పిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  

    ఈ  ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది. తొమ్మిదో సీజ‌న్‌కు మొత్తం 220 జంట‌లు పేర్లు న‌మోదుచేసుకోగా వారిలో 57 జంట‌లు గ్రాండ్ ఫినాలెకు అర్హ‌త సాధించారు. వారంద‌రినీ డాక్ట‌ర్ అభిన‌య్‌ అభినందించారు. మాతృత్వం అనేది ఒక మ‌ధురానుభ‌వం అని, అందులోని ప్ర‌తి ద‌శ‌నూ త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఆస్వాదించాల‌ని తెలిపారు. గ‌ర్భిణి అయిన భార్య‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డంతో పాటు, పుట్ట‌బోయే బిడ్డ సంర‌క్ష‌ణ విష‌యంలో కూడా తండ్రుల‌ది చాలా కీల‌క పాత్ర అని ఆయ‌న చెప్పారు. 

    భ‌ర్త చేదోడువాదోడుగా ఉంటే భార్య త‌న మాతృత్వాన్ని మ‌రింత ఆస్వాదించ‌గ‌ల‌ద‌ని వివ‌రించారు. సాధారణ లేదా సిజేరియన్ సురక్షిత ప్రసవాలు మంచివని డాక్టర్ అభినయ్ అన్నారు. గ్రాండ్ ఫినాలెకు హాజ‌రైన అతిథులు, జంట‌ల‌ను ఉద్దేశించి కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కె. శిల్పిరెడ్డి మాట్లాడుతూ.. “సాధార‌ణ ప్ర‌స‌వాల‌ను ప్రోత్స‌హించడంతో పాటు కుటుంబం యొక్క గొప్పతనాన్ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. త‌ల్లిదండ్రులు ఏం తినాలి, పిల్ల‌ల‌కు ఏం పెట్టాల‌నే అంశాల‌ను వారికి వివ‌రించాం. 

    70-80 ర‌కాల అంశాల‌ను ఈ త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేశాం. ఇంత‌మందికి ఒకేచోట అవ‌గాహ‌న క‌ల్పించ‌గలిగితే వాళ్లు స‌మాజంలో ఈ సందేశాన్ని పంచుతారు. సాధార‌ణ ప్ర‌స‌వం అన‌గానే నొప్పులు భ‌రించ‌లేం అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇది త‌ప్పు. గ‌తంలో అన్నీ సాధార‌ణ ప్ర‌స‌వాలే ఉండేవి. త‌ర్వాత క్ర‌మంగా వివిధ కార‌ణాల‌తో సిజేరియ‌న్లు పెరిగాయి. ప్ర‌స‌వం అనేది సహ‌జంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. దాన్ని అలాగే జ‌ర‌గ‌నివ్వాలి. ఇంత‌కుముందు సీజ‌న్ల‌లో పాల్గొన్న‌వారిలో 85% మందికి సాధార‌ణ ప్రస‌వాలే జ‌రిగాయి. వ‌క్రీక‌ర‌ణ‌లు చాలా జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి, వీరికి అవ‌గాహ‌న పెంచాలి. ఇక్క‌డ పాల్గొన్న‌వారు త‌మ బంధువులు, స్నేహితుల‌కు చెప్పినా నెమ్మ‌దిగా స‌మాజం మొత్తం మారుతుంది” అని చెప్పారు. గర్భధారణ సంరక్షణ తోపాటు భవిష్యత్తు తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించారు. 

    చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!

  • కొన్ని వివాహాలు విధి ఆడిన వింత నాటకంలా ఉంటాయి. డెస్టినీ అంటారే అలా..ఒకరితో మనకు రాసిపెట్టి ఉంటే..ఎలాగైనా..ఎన్నేళ్లైనా..మళ్లీ ఒక్కచోటుకి చేర్చి కలిపేస్తుంది.అందుకు నిదర్శనం ఈజంట. బహుశా వీళ్లిద్దరిని విధి ముడివేసిన జంట అనొచ్చేమో. కాదు కాదు.. విపత్తు ముడివేసిన జంట అనాలేమో..!.

    అసలేం జరిగిందంటే..నవంబర్ 29న హునాన్ ప్రావిన్స్‌లో ఐదవ వార్షిక హాన్ శైలి సామూహిక వివాహ వేడుక సందర్భంగా 37 జంటలు వైవాహిక బంధంతో ఒక్కటికానున్నాయి. ఆ నేపథ్యంలో ఓ జంట కథ వెలుగులోకి వచ్చింది. లియాంగ్‌ జిబిన్‌, లియు జిమెయ్‌ అనే జంట 15 ఏళ్లక్రితం అసాధారణ పరిస్థితుల్లో ప్రారంభమైన తమ లవ్‌స్టోరీని పంచుకున్నారు.  

    రెండు జీవితాలను మార్చిన రక్షణ బాధ్యత..
    2008లో వెంచువాన్‌లో భూకంపం సంభవించినప్పుడు 22 ఏళ్ల లియాంగ్ అత్యవసర సహాయక చర్యల కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు. అప్పటికి పది సంవత్సరాల వయసున్న లియు, ఒక కూలిపోయిన భవనం రెండొవ అంతస్తులో ఉక్కు కడ్డీలు, ఇటుకల కింద చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ ఉంది. అది చూసిన లియాంగ్ అతడి బృందం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆమెను కాపాడారు. 

    ఆ తర్వాత చికిత్స కోసం తక్షణమే ఆస్ప్రతికి తరలించారు. అయితే ఆ చిన్నారి కోలుకున్నాక తన తల్లిదండ్రులతో కలిసి హునాన్‌లోని జుజౌకు వెళ్లిపోయారు. అయితే తనను కాపాడిని సైనికుడి గురించి ఏదో స్పల్ప జ్ఞాపకమే ఉందామెకు. అదీగాక ఆ ఘటన జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతగా ఆ సైనికుడి ముఖం అంతగా గుర్తులేదామెకు. 

    అయితే 2020లో 22 ఏళ్ల లియు చాంగ్షాలో తన తల్లిదండ్రులతో భోజనం చేస్తున్నప్పుడు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ల టేబుల్‌కి సమీపంలోని మరో టేబుల్‌ వద్ద కూర్చొన్న వ్యక్తిని చూసి లియు తల్లి గుర్తుపట్టి పలకరించింది. "మీరు మా బిడ్డ లియుని కాపాడిన బ్రదర్‌ లియాంగ్‌ మీరేనా అని అడుగుతుంది. పదేళ్ల వయసులో ఆ అమ్మాయి కాస్తా చాలా మారిపోవడంతో గుర్తుపట్టలేక ఇబ్బందిపడతాడు లియాంగ్‌. ఆ ఘటన గుర్తుంది కానీ ఆ చిన్నారి రూపు రేఖలు చాలా మారిపోవడంతో పోల్చుకోలేకపోతున్నానని చెబుతాడు లియు తల్లితో". 

    అప్పటి నుంచి లియు ఆ సైనికుడు లియాంగ్‌తో క్రమంతప్పకుండా మాట్లాడుతూ ఉండేది. ఆమె భావల లోతుని అర్థం చేసుకుంటాడు లియాంగ్‌. అంతేగాదు లియుకి కూడా అతడి దృఢత్వం, విధేయత ఎంతగానో నచ్చుతాయి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

    లియుని తన జీవితంలోని ఆశాకిరణంగా భావిస్తాడు లియాంగ్‌.  తాను నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా లియు సానుకూలత తనను పైకి లేపుతుందని ప్రగాఢంగా విశ్వసించడమే కాదు జీవితంటే ఆశతో నిండి ఉందని గుర్తు చేస్తుంటాదామె అని భావోద్వేగంగ చెబుతున్నాడు లియాంగ్‌ 

    విధి ముడివేసిన బంధం..
    తమ జర్నీ గురించి చెబుతూ..విధి చాలా అద్భుతమైనది. పన్నేడేళ్ల క్రితం ఆమెను రక్షించాను. పన్నేండేళ్ల తర్వాత ఆమె నా జీవితంలోకి వచ్చింది. భలే చిత్రంగా ఉంది తలుచుకుంటుంటే అని నవ్వుతూ చెబుతున్నాడు లియాంగ్‌.

    (చదవండి: ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్‌ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్‌..! అంత ఖరీదా..?)

     

  • భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్‌కి చెందిన పటాన్‌ పటోలా ఫ్యాబ్రిక్‌. ఈ ఫ్యాబ్రిక్‌ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్‌ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్‌ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.

    విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్‌ ఇకాట్‌ టెక్నిక్‌ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్‌లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్‌లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

    900 ఏళ్ల నాటి చరిత్ర..
    12వ శతాబ్దంలో రాజు కుమార్‌పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్‌పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. 

    జల్నా రాజు పటోలా బట్టలను బెడ్‌షీట్‌లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్‌ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్‌ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్‌ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. 

    నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..
    నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. 

    సాల్విస్‌, సోనిస్‌ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. 

    డిజైన్‌ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. 

    అందుకే అంత ఖరీదు..
    అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్‌ పటాన్‌ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్‌ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ,  దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్‌లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

     

     

     

     

    (చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!)
     

     

National

  • శబరిమల యాత్రకు అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో.. అటవీశాఖ అధికారుల భక్తులకు కీలక సూచన చేశారు. ఉరక్కుళి జలపాతం వైపుగా వెళ్లకూడదని మంగళవారం ఆంక్షలు జారీ చేశారు. 

    ఉరక్కుళి జలపాతం ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ ఏనుగులు, అడవి పందులు, చిరుతలు తరచుగా సంచరిస్తుంటాయి. గతంలో కొంతమంది యాత్రికులు అక్కడికి వెళ్లి వన్యప్రాణుల దాడికి గురైన సంఘటనలు నమోదయ్యాయి. అదనంగా, జలపాతం ప్రాంతం రాళ్లతో నిండినదిగా ఉండటం వల్ల జారి పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా భక్తుల ప్రాణ భద్రత కోసం అటవీశాఖ ఈ హెచ్చరికను జారీ చేసింది.

    అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గంలో వెళ్లే కొందరు భక్తులు.. పంపా పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పర్యాటక ఆకర్షణగా ఉన్న ఉరక్కుళి జలపాతం వైపు వెళ్తుంటారు. అయితే, ఇటీవల వన్యప్రాణుల కదలికలు పెరగడం, ప్రమాదకర సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల కేరళ అటవీశాఖ భక్తులకు అక్కడికి వెళ్లొద్దు అని విజ్ఞప్తి చేసింది.

    శబరిమల యాత్రికులు పంపా సన్నిధానం మార్గం మాత్రమే ఉపయోగించాలని అధికారులు స్పష్టం చేశారు. అడవుల్లోకి వెళ్లడం, జలపాతం సందర్శన లాంటి ప్రయత్నాలు చేసి రిస్క్‌లో పడొద్దని కోరుతుతున్నారు. ‘‘శబరిమల యాత్ర ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. దానిని సురక్షితంగా, నియమ నిబంధనలకు లోబడి కొనసాగించడం ప్రతి భక్తుడి బాధ్యత. ఉరక్కుళి జలపాతం వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా.. అధికారుల సూచనలను పాటించడం ద్వారా యాత్ర మరింత సాఫీగా, భద్రంగా సాగుతుంది’’ అని ప్రకటనలో అధికారులు కోరారు.

    పోటెత్తిన అయ్యప్ప స్వాములు
    శబరిమలలో డిసెంబర్ 8న సన్నిధానం, పంబా ప్రాంతాలు తిరిగి భక్తులతో కిక్కిరిశాయి.  సాయంత్రం 4 గంటల వరకు లెక్క ప్రకారం 73,679 మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీళ్లలో స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చిన వాళ్లు.. 11,999 మంది. పథినెట్టాంపడి(18 మెట్లు) ఎక్కడానికి 4 గంటల సమయం పట్టింది.

  • ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. 

    వరుసగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లోనే ఎస్‌ఐఆర్‌ జరుగుతోంది. ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండోదశ ఎస్‌ఐఆర్ కొనసాగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్లను వేర్వేరుగా విచారిస్తున్న సుప్రీం కోర్టు.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కొనసాగుతుందని మంగళవారం స్పష్టం చేసింది. 

    ఈ ప్రక్రియలో భాగమైన బీఎల్‌ఓలు (బూత్‌ లెవెల్ అధికారులు), ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదురుకావొచ్చని హెచ్చరించింది. బీఎల్‌ఓలకు బెదిరింపులు, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అంతరాయాల గురించి తమ దృష్టికి తీసుకువస్తే.. వారి భద్రతకు సంబంధించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. బీఎల్‌ఓలు ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం వంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ.. ఎస్‌ఐఆర్‌ జరిగేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. 

    ఈ ప్రక్రియ నిర్వహణలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే.. అధికారులను రక్షించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం (Election Commission) కోర్టుకు వెల్లడించింది. 

  • కోల్‌క‌తా: తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్‌ కబీర్ మాట మార్చేశారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోన‌ని ప్ర‌క‌టించారు. నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకున్నానని మీడియాతో చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలోని భరత్‌పూర్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    "ఇప్పుడు నా రాజీనామా ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు. ప్రజలు నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. నేను రాజీనామా చేయాలని వారు కోరుకోవడం లేదు. వారి ఆకాంక్ష‌ల‌ను గౌరవిస్తూ, నా రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను" అని కబీర్ అన్నారు. డిసెంబర్ 17న కోల్‌కతాలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయన ఇంత‌కుముందు ప్రకటించారు.

    ముర్షీదాబాద్‌లో ఈనెల 6న బాబ్రీ మసీదు తరహా మసీదు (Babri-style mosque) నిర్మాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించడంతో టీఎంసీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. దీంతో డిసెంబర్‌ 22న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 135 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేయిస్తానని ఆయన ప్రకటించారు. అన్న‌ట్టుగానే ముర్షిదాబాద్‌లోని రెజినగర్‌లో మసీదుకు శనివారం కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య శంకుస్థాపన చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు.. డిసెంబర్‌ 6ను శంకుస్థాపనకు ఎంచుకున్నారు.

    బెంగాల్‌ ‘బాబ్రీ’ మసీదుకు రూ.1.30 కోట్ల విరాళాలు
    పశ్చిమ బెంగాల్‌లో మసీదు నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.30 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయని టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్‌ కబీర్‌ సన్నిహిత నాయకులు తెలిపారు. నాలుగు విరాళాల బాక్సులు, ఒక సంచి నుంచి రూ37.33 లక్షల నగదు, ఆన్‌లైన్‌లో రూ.93 లక్షలు వచ్చాయని ప్రకటించారు. మరో ఏడు బాక్సులు ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. సభా వేదిక వద్ద విరాళాలకోసం 11 బాక్సులను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

    చ‌ద‌వండి: 'మీరు ఫ్యూర్ వెజిటేరియ‌నా.. ఏదో మిస్సవుతున్నారు'

    గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న హుమాయున్‌  కబీర్‌ (Humayun Kabir) 2012లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. తరువాత కొంతకాలం బీజేపీకి వెళ్లి 2020లో అధికార పార్టీలోకి తిరిగొచ్చారు. టీఎంసీ నాయకత్వంతో నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. తాజాగా పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. 

  • హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోని ఒక గ్రామంలో  వివాహ వేడుకలో జరిగిన అనూహ్య ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతా పెళ్లి సంబరాల్లో ఉండగా ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. దాదాపు 20 మంది గాయపడ్డారు కానీ అదృష్టవశాత్తూ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    వివాహానికి సంబంధించి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో జరుపుకునే  సాంప్రదాయ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక జాతర కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపైకప్పున చేరి, కింద మరికొందరు ఈ  వేడుకను  చూస్తున్నారు.  అతిథుల జానపద నృత్యాలు, పాటలతో అక్కడి వాతావరణ అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో పక్కనే  ఉన్న ఇంటి పైకప్పు ఒకటి అక్కడ గుమిగూడిన వారిపై ఉన్నట్టుండి కూలిపోయింది.  దీంతో అక్కడున్న వారంతా తీవ్ర కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 

    చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

     మరికొందరు వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స కోసం టీసా ఆసుపత్రికి తరలించారు.  మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.

    ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు

  • సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలపై కేంద్రం ఎన్నో గొప్పలు చెబుతుందని.. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. తానేమి తప్పుగా.. నిరాధార ఆరోపణలు చేయడం లేదని, స్పష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతున్నానని అన్నారాయన. 

    మంగళవారం ఎస్‌ఐఆర్‌పై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది ఎన్నికల వ్యవస్థతో పాటు సీబీఐ, ఈడీ సంస్థలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదని అడిగారు. కేంద్రం విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసిందని మెరిట్‌తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారని ప్రశ్నించారు.

    ఈసీలను రక్షించడానికి ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఏంటని కేంద్రాన్ని రాహుల్ ప‍్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్‌లకు ఇంత పెద్ద గిప్ట్ ఏ ప్రధాని, హోంమంత్రి ఇవ్వలేదన్నారు. 45 రోజుల్లో సీసీటీవీ పుటేజ్  ధ్వంసం చేసే నిబంధన ఎందుకని?.. ఇది డేటా సంరక్షణ కాదు డేటా చోరీ అని రాహుల్ విమర్శించారు. 

    ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఓటు చోరి జరిగిందన్నారు. ఫేక్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని ప్రభుత్వం టార్టెట్ చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచడానికి ప్రయత్నిస్తుందని రాహుల్ అన్నారు. ఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉందని విమర్శించారు. 

    ఎస్ఐఆర్ చర్చలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పేరెత్తడంతో బీజేపీ సభ్యలు  తీవ్ర అభ్యంతంరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు స్పందిస్తూ రాహుల్ పార్లమెంట్‌లో అనవసరంగా రాహుల్ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ టాపిక్ తీస్తున్నారన్నారు. ఆ సమయంలో బీజేపీ-విపక్ష ఎంపీల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.దీంతో లోక్ సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా విపక్షాలను సున్నితంగా మందలించారు.

  • దుబాయ్‌ బ్లూచిప్‌ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు  సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్‌ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

    ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల  మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)  విచారణలో భాగంగా  నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్‌, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్‌లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను  బాధితులు దుబాయ్ నుండి   కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు  పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్‌కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.

    ఏడీసీపీ నాయకత్వంలో SIT
    పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును  దర్యాప్తు చేస్తోంది.  ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను  సేకరించారు.  దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి.  ఈ విషయంలో ఢిల్లీ ,  డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో  ఖాతాలను  సిట్‌ గుర్తించింది.  ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్‌లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.

    ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

    అసలేంటీ రవీంద్ర సోనీ కసు
    ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన సోని  కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్‌లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ  స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్‌లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు  ఇప్పటికే నమోదయ్యాయి.

    ఈ స్కాం ఎలా బయట పడింది
    బ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు.  మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్‌లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్‌షోర్ ఛానెల్‌లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది.  దీంతో వందలాది  ఎన్‌ఆర్‌ఐలు భారీ ఎత్తున నష్టపోయారు.  దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన  ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్‌లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్‌లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ  సమాచారం ప్రకారం వారు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌  చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య  ప్రదేశాన్ని గుర్తించారు. 

  • ఇటీవల గోవాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన "బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్" యజమానులకు సంబంధించిన మరో క్లబ్ ను మంగళవారం  కూల్చివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    గోవాలోని నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అక్రమ నిర్మాణంతో పాటు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడమే అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  నైట్ క్లబ్ యజమాని  గౌరవ్ లూథ్రాకు చెందిన బీచ్ షేక్ అనే మరో క్లబ్ ను  కూల్చివేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.

    దీంతో అధికారులు ఆ  బీచ్‌షేక్‌ను కూల్చివేశారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ "అక్రమంగా నిర్మించిన పోర్షన్ ను కూల్చివేయమని పర్యాటక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. నార్త్ గోవా కలెక్టర్  ఆకట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా పోలీసుశాఖ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఈ రోజు కూల్చివేతలు చేపడతారు" అని అన్నారు.

    నైట్ క్లబ్ నిర్మాణం తాటాకులతో ఉండడంతో పాటు ఆ క్లబ్ కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకైన దారులు కావడంతో సహాయక బృందాలు సరైన సమాయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయన్నారు. గతంలోనూ ఆ క్లబ్ ను కూల్చివేయాలంటూ నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆ ప్రాంతంలోని నాయకులు తెలిపారు.

    కాగా ఈ రోజు ఉదయం గోవా పోలీసులు  విచారణ నిమిత్తం ఢిల్లీలోని నైట్ క్లబ్ యజమానుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలు లేరు. వీరిద్దరూ ప్రమాదం జరిగిన అనంతరం థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ నైట్‌క్లబ్ ఓనర్ గౌరవ్ లూథ్రా థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టులో ఉన్న చిత్రాలు బయిటకి వచ్చాయి. కాగా వీరిద్దరిపై  అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ తో పాటు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేశారు.

  • ఒక పక్క ఇండిగో సంక్షోభం కొనసాగుతుండగా మధ్యప్రదేశ్ లోని సియోనీలో ఓ శిక్షణ విమానం  కుప్పకూలిన ఘటన  కలకలం రేపింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ అనే విమానయాన సంస్థకు చెందిన ట్రైనీ విమానం తన చివరి దశలో నియంత్రణ కోల్పోయి అకస్మాత్తుగా కూలిపోయింది. ఇద్దరు పైలట్లు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.  ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    సోమవారం సాయంత్రం సుక్తారా గ్రామంలోని ఎయిర్‌స్ట్రిప్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లఖన్వాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమ్గావ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్‌ స్ట్రిప్‌ లో ల్యాండింగ్‌ సమయంలో, 33 KV హై-వోల్టేజ్ లైన్‌కు చిక్కుకుని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్ అకస్మాత్తుగా వైఫ్యలం కారణంగా పైలట్ అమ్గావ్ సమీపంలోని ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెద్ద శబ్దంతో పొలంలో కూలిపోయింది. శబ్దం విన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నారు.  విమానం కాక్‌పిట్ నుండి ఇద్దరు పైలట్‌లను రక్షించారు. అదృష్టవశాత్తూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే సుమారు  90  గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు  కష్టపడి  విద్యుత్ సరఫరాను పనరుద్ధరించారు.

    ఇద్దరు పైలట్లు ప్రైవేట్ ఆసుపత్రిలో
    ఈ ప్రమాదంలో, పైలట్ అజిత్ , ట్రైనీ అశోక్ చావా తల మరియు ముక్కుకు గాయాలయ్యాయి. ఇద్దరినీ బారాపత్తర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. 
    రెడ్ బర్డ్ ఏవియేషన్ కంపెనీ నాగ్‌పూర్ రోడ్డులో ఉన్న సుక్తారా గ్రామంలో ఒక ఎయిర్‌స్ట్రిప్‌ను లీజుకు తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ పైలట్ శిక్షణ అందిస్తుంది.

    గతంలోనూ ప్రమాదం
    విమానయాన కేంద్రం వద్ద భద్రతా ప్రమాణాలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేశారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో శిక్షణా విమానాలు రన్‌వేపై రెండుసార్లు బోల్తా పడ్డాయనీ కానీ కంపెనీ, అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని సర్పంచ్ ఆరోపించారు.

     

  • లోక్‌సభలో మంగళవారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్‌ ఎంపీలు అభిశంసన (impeachment) నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి నోటీసుల అందజేసింది. 

    మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ తీర్పు ఇచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వెల్లవెత్తాయి. డీఎంకే.. దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి. 

    గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ, జస్టిస్‌ స్వామినాథన్‌ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలి అని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్‌ విలువలకు విరుద్ధంగా ఉందంటూ  మద్రాస్‌ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో 120 ఎంపీల  సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్‌ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత.. ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ ఆ సమయంలో కనిమొళి వెంట ఉన్నారు. 

     

    భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతుంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ-న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో.. లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. 

    నెక్ట్స్‌ ఏం జరగొచ్చు.. 

    • స్పీకర్‌ నోటీసును పరిశీలిస్తారు.. అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారు

    • లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలి

    • చివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారు

    జస్టిస్‌ స్వామినాథన్‌ నేపథ్యం.. 

    జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ తమిళనాడు తంజావూర్‌ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్‌ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తిరుపరంకుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది.

  • దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు,  ప్రయాణీకుల అగచాట్లతో విమానయానరంగంలో గతంలో ఎ‍న్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి పిల్లాపాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  అటు విమానాలు రద్దు, ఇటు సమయానికి రైళ్లు దొరక్క నానా కష్టాలపడుతున్నారు. దీనికి తోడు భరించ లేని ఆర్థిక భారం.  

    చేతగానితనం, నిర్లక్ష్యంతోనే ముప్పు
    ఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత గందర గోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేక పోవడపై  ప్రయాణికులు మండిపడ్డారు. మరోవైపు మంత్రి  అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని, రెండు నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. అటు రామ్మోహన్‌ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్‌ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

    దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
    కేంద్రమంత్రి వైఫల్యమా? ఇండిగో వైఫల్యమా? అనేదానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎయిర్‌లైన్స్‌ లోపాలను సరిదిద్దడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేసింది డీజీసీఏ (DGCA). మరి పైలట్ల పని గంటలు, విశ్రాంతిపై  కచ్చితమైన  మార్గనిర్దేశాలను ఇచ్చినప్పటికీ ఇండిగో ఎందుకు అమలు చేయలేదు. తీవ్ర సంక్షోభం వచ్చేదాకా ఎందుకు నియామకాలు చేపట్టలేదు. ఏ పైలట్ ఎన్ని గంటలు fly చేస్తున్నాడు అనే సమాచారం రియల్ టైంలో  విమానశాఖ వద్ద ఉంటుంది. దీంతోపాటు ఏయే సంస్థ దగ్గర ఎంత మంది పైలట్స్ ఉన్నారో  రెగ్యులేటరీ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. ఇండిగోలో  పైలట్ల కొరతనుగుర్తించడంలో  అటు విమాన యాన శాఖ, ఇటు డీజీసీఏ వైఫల్యం, ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముందస్తు సమీక్షలు చేయని నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనావేయడంలో ఘోర వైఫల్యమే ఇంతటి సంక్షోభానికి దారి తీసిందంటున్నారు. రామ్మోహన్‌ నాయుడు చేతగానితనంతోనే దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రి రామ్మోహన్‌ నాయుడుకి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి  ఉంటే ప్రయాణీకులకు ఇన్ని కష్టాలొచ్చేవి కావని మరికొంతమంది మండి పడుతున్నారు. 

    కబుర్లే గానీ, పనితనం లేదు
    ‘‘కుర్రాడికి కాళ్ళు ఎక్కడా భూమి మీద నిలవటం లేదు, ఇటువంటి స్ట్రోక్ అవసరం ఎంతైనా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చెయ్యటం స్పీచులు ఇచ్చినంత ఈజీ కాదు, మా బెజవాడ ఎయిర్‌పోర్ట్‌లో అతని పనితనం చూశాం, అప్పుడే అనుకున్నాను ఈ కుర్రాడు కబుర్లు బాగా చెబుతాడు కానీ  పనిమంతుడు కాడు అని జీవితంలో ఎయిర్‌ఫోర్ట్‌లో మొహం చూడని వాళ్ళు అతన్ని తిడుతున్నారు అని పోస్టులు చూసాను, జీవితంలో విమానాశ్రాయం  మొహం చూడని వాళ్ళు కూడా అతన్ని గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు’’ అని మూడు రోజులు నుంచి విమానాలు దొరక్క, ట్రెయిన్స్ దొరక్క భోపాల్ లో ఇరుక్కు పోయిన ప్రయాణికుడి ఆవేదన ఇది. 

    రీఫండ్‌లు ఇస్తారు సరే, మా కష్టాల మాటేమిటి? మా ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారు? మానసిక క్షోభకు ఎవరు విలువ కడతారు అంటూ బాధిత ప్రయాణీకుల ప్రశ్నలకు రామ్మోహనాయుడి దగ్గర సమాధానం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది జూన్‌ 12న అహ్మదాబాద్‌లో వందలామంది ప్రయాణీకుల సజీవ దహనమైన ఎయిరిండియా విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని ఘోరాలు జరగముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

    ఇది ఇలా ఉంటే చర్యలు తీసుకుంటున్నాం.. సమీక్షిస్తున్నాం అని కేంద్ర మంత్రి ఊదర గొడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇండిగో విమానాల రద్దుకు ఫుల్‌ స్టాప్‌ పడలేదు. కొంతమంది రీఫండ్‌లు, లగేజీలు పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఇండిగో క్రమంలో స్థిరీకరణలోకి వస్తున్నాయంటూ ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు.  విమానయాన రంగాన్ని సంరక్షిస్తాం, ప్రయాణీకుల భద్రతను కాపాడతాం అంటూ, ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్న వైనాన్ని మనం చూడవచ్చు. 
     

  • పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్‌ బహిరంగ సభ జరగగా,  తొక్కిసలాట జరిగి  41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

    డీఎంకే ప్రభుత్వంపై విజయ్‌ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు.

    Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్
     

    ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం  అభివృద్ధి  విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా..  తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.  గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. 

NRI

  • జార్జియాలోని కమ్మింగ్‌లోని వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్, శంకర నేత్రాలయ USA సంవత్సరాంతపు మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడంతో సంస్కృతి, కరుణ యొక్క శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ భారతదేశంలో కంటి సంరక్షణను గరిష్టంగా విస్తరించడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవ విస్తరణకు మద్దతు ఇచ్చే దాతృత్వ వేడుక. 

    ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో స కళ,సేవ  శక్తిని ప్రదర్శించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు  బాల రెడ్డి ఇందుర్తి ఇలా నొక్కిచెప్పారు. “వైద్య మిషన్‌కు మించి, MESU సానుభూతి ఉద్యమంగా నిలుస్తుంది. ప్రయాణించిన ప్రతి మైలు దృష్టి, ఆశ పునరుద్ధరించబడుతుందనే హామీని అందిస్తుంది. ”అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరై SNUSA బృందం, దాతలు, స్వచ్ఛంద సేవకులను ప్రశంసించారు. "నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో SNUSA నా అంచనాలను మించిపోయింది. 

    బాల రెడ్డి ఇందూర్తి నాయకత్వాన్ని  నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డాక్టర్ జగదీష్ శేత్, డాక్టర్ కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల బోర్డు సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. సన్మాన కార్యక్రమంలో, గౌరవ భారత కాన్సుల్ జనరల్  రమేష్ బాబును శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుగా అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.

    ఆత్మ వెలుగుతో కలిసిన వేళ: 
    ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి దాతృత్వం, నాయకత్వం మా లక్ష్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. 2025 వ్యవస్థాపకుడు సౌత్‌వెస్ట్ అవార్డు ఫైనలిస్ట్ ట్విస్టెడ్ ఎక్స్ గ్లోబల్ బ్రాండ్స్ వెనుక చోదక శక్తిలా  ఆవిష్కరణ, స్థిరత్వం, కరుణను కలిగి ఉన్నారు. సత్కార సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు—అది దానిని రూపొందిస్తోంది. ఆవిష్కరణ, కరుణ కలిసి పురోగమించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం నాకు గర్వకారణం. ” ఘంటసాల బయోపిక్ “ఘంటసాల ది గ్రేట్” సృష్టికర్త దర్శకుడు సిహెచ్. రామారావు గారు, ఘంటసాలకు అసాధారణ నివాళి అర్పించినందుకు వేదికపై సత్కరించారు. మరుసటి రోజు, ఈ చిత్రాన్ని అట్లాంటాలోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో, లార్డ్ బాలాజీ గర్భగుడి క్రింద ప్రదర్శించారు.

    తపన స్వరాన్ని కలిసిన చోటు: 
    ఈ సాయంత్రం కార్యక్రమం టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళిల హృదయపూర్వక సంగీత ఆవాహనతో ప్రారంభమైంది. వారి భక్తి,  శాస్త్రీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. దీని తరువాత నటరాజ నాట్యాంజలి కూచిపూడి నృత్య అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి ప్రముఖ అట్లాంటా నృత్య, సంగీత అకాడమీల నుంచి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు జరిగాయి. గార్డియన్స్ ఆఫ్ సైట్: $1.625 మిలియన్లను సేకరించడం ద్వారా మన అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ల స్ఫూర్తిని గుర్తించారు. 

    మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల నిరంతర మద్దతు ద్వారా దాదాపు $1.625 మిలియన్ల కీలకమైన నిధులను సమీకరించింది. శ్రేయోభిలాషులు, డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాష్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం,MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, డాక్టర్. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా మరియు డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్,దివంగత డాక్టర్ ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్ -లావణ్య, ఆది మొర్రెడ్డి-రేఖ రెడ్డి, డాక్టర్ మంజుల మంగిపూడి, డాక్టర్ రూపేష్ రెడ్డి-మాధవి, వెంకట్ కన్నన్, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు -రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ బిందు, నారాయణ రేకపల్లి -శైలజ,డాక్టర్ ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డాక్టర్ సుజాత &సూరి గున్నాల, డాక్టర్ శేషకుమారి మూర్తి -డాక్టర్ శ్రీనివాస మూర్తి, శివాని నాగ్‌పాల్, డా. సందీప్ శాండిల్య, డాక్టర్ నీతా సుక్తాంకర్ -విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ-శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డాక్టర్ రఘువీర్ రెడ్డి, మరియు పురప్రముఖులు రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన $1.625 మిలియన్ల దాతృత్వం సుమారు 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు ఉపయోగపడింది. 

    సేకరించిన నిధుల ద్వారా శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు (MESUలు) మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వేలాది మందికి దృష్టిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దాతలు సేవలు అందని ప్రాంతాలలో వందలాది ఉచిత శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ ఆశ, కరుణ, అవకాశాన్ని తెస్తాడు, గ్రామాలను దృష్టి ఆశతో ప్రకాశింపజేస్తాడు. శంకర నేత్రాలయ USA తరపున, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    సృజనాత్మకత కరుణను స్వీకరించే చోట: 
    సాయంత్రం శంకర నేత్రాలయ USA  మిషన్‌కు మద్దతునిస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాణం పోసిన నృత్య ఉపాధ్యాయులు, గాయకులు,  ప్రదర్శనకారులను సత్కరించారు. తెరవెనుక, SNUSA అట్లాంటా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డాక్టర్ మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలం, కమిటీ సమన్వయకర్తలు నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా.  కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, చాప్టర్ లీడ్స్ వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డాక్టర్ జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు,  కార్యక్రమ వ్యాఖ్యాత వసంత చివుకుల గార్లకు కృతజ్ఞతలు. 

    అమెరికా వివిధ నగరాల నుంచి విచ్చేసిన SNUSA అతిథులు శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, నారాయణరెడ్డి ఇందుర్తి, డా. శ్వేతా త్రిపాఠి, చంద్ర మౌళి సరస్వతి, శ్రీని గుప్తా, శశాంక్ రెడ్డి ఆరమడక, బుచ్చిరెడ్డి గోలి, తిరుమల్ మునుకుంట్ల, జగదీశ్ జొన్నాడ, వెంకట్రామిరెడ్డి మద్దూరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

    ఇది సాధ్యం చేసిన హృదయాలకు, చేతులకు నివాళి
    లాజిస్టిక్స్ నిర్వహణకు కోశాధికారి మూర్తి రేకపల్లికి; వేదిక, అలంకరణలు, ప్రదర్శనకారులను సమన్వయం చేసినందుకు సాంస్కృతిక చైర్ నీలిమా గడ్డమణుగుకు; భోజన ఏర్పాట్లను  పర్యవేక్షించిన చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలంకు; హోటల్, రవాణా ఏర్పాట్లను నిర్వహించినందుకు ట్రస్టీ మెహర్ లంకకు ప్రత్యేక ధన్యవాదాలు. 

    టీవీ వీడియోలను రూపొందించిన EVP శ్యామ్ అప్పాలి, ప్రెస్ నోట్స్ సిద్ధం చేసిన డా. రెడ్డి ఊరిమిండి,   సోషల్ మీడియా ప్రమోషన్‌ను నిర్వహించిన  వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి గార్లకు కృతజ్ఞతలు. అతిథులు ఆచిస్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆస్వాదించారు. ఈవెంట్ ఫ్లైయర్‌లను రూపొందించినందుకు చెన్నై బృందం - త్యాగరాజన్, దీన్ దయాళన్ అండ్‌ సురేష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 

    (చదవండి: డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం)

  • తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘ‌నంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. 

    డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్ర‌గ్స్‌పై భారీ స్థాయిలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో టీటీఏ నాయ‌కులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్ర‌క‌టించి, కార్య‌క్ర‌మాల వివ‌రాలు తెలిపారు.

    TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ‌ కార్యక్రమాల‌ను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు.    

    ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల,  EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్స‌వ వేడుక క‌ల్చ‌ర‌ల్ చైర్ డా. వాణి గ‌డ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    TTA 10వ వార్షికోత్సవం
    2025 డిసెంబర్ 25న TTA త‌న 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించ‌బోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. ప‌దేళ్లుగా తెలంగాణతో త‌మ‌ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయ‌కులు తెలిపారు.

    “10K రన్”తో డ్ర‌గ్స్‌పై అవ‌గాహ‌న‌
    టీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయ‌కులు తెలిపారు. ఈ రన్‌లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. 

    ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవ‌గాహ‌న కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమ‌ని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. 

    (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్‌పై అవగాహన)

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: దొడ్డిదారిన తనపై నమోదైన ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసును క్లోజ్ చేసుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రయత్నానికి వైఎస్సార్‌సీపీ నేత, ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ గౌతమ్ రెడ్డి రూపంలో ట్విస్ట్‌ ఎదురైంది. తాజాగా గౌతమ్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఉత్తర్వులను రెండ్రోజుల పాటు వాయిదా వేసింది.  

    2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీడీఐ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో ఆనాటి మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా సిద్ధమైంది.

    అయితే.. అదే సీడీఐ ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు నాయుడికి ఏ పాపం తెలియదని.. ఈ కేసు  క్లోజ్‌ చేయమని పిటిషన్‌ దాఖలు చేసింది. ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సీఐడీ, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎండీలు సైతం ఇందుకు అంగీకారం తెలిపారు. అయితే.. ఇక్కడే ట్విస్ట్‌ చోటు చేసుకుంది. 

    తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని పూనూరు గౌతమ్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు.  ఈ పిటిషన్‌లో ఇవాళ గౌతమ్‌ తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. 

    సీఐడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అభియోగాలను, వివరాలను.. ఇప్పుడు అధికారం ఉండడంతో కేసును మూసేయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌ ఆర్డర్స్‌ను 11వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

  • సాక్షి, ఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)ను విపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో నేడు ఈ అంశంపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్  తో మాకు  ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. ఈ చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై మాట్లాడారు. 

    అందరికీ సౌకర్యంగా ఉంటే.. ఎస్ఐఆర్‌తో మాకు  ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలి. వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం..

    .. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6గం. తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి. మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.  విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉంది. ఈవీఎంలో  చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వీవీ ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారు..

    .. ఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదు. హిందూపురం  పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు  472 ఓట్లు వస్తే..  అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. 

    ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో  సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందుకే పేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలి. పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయి’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.

  • సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity)  లైంగిక వేధింపుల కేసు‌‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. 

    ‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌‌ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్‌ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్‌లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. 

    తిరుపతి వెస్ట్‌ స్టేషన్‌ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్‌లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్‌ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్‌ చేశారు. 

    నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో  వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్‌లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. 

    పార్లమెంట్‌లో ఆందోళన.. 
    తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ నోటీసు ద్వారా వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు.