Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

Telangana

  • ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో కాసేపటి క్రితం తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్‌, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్, ఆర్ కృష్ణయ్య  పాల్గొన్నారు.

    కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, రామచంద్రరావు గారి నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

    త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ బీజేపీ ఎంపీల పని తీరుపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

     

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కొత్త సిట్‌ (Special Investigation Team) ఏర్పాటైంది. ఈ సిట్‌కు హైదరాబాద్ కొత్వాల్ (పోలీస్‌ కమిషనర్‌) సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. 

    కొత్త సిట్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు సహా మొత్తం 9 మంది అధికారులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి రేపు సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

    సజ్జన్నార్‌ నేతృత్వంలోని కొత్త సిట్‌ సభ్యులు..

    రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

    సిద్దిపేట సీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్

    మాదాపూర్ డీసీపీ రితిరాజ్

    మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి

    గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం.రవీందర్ రెడ్డి

    రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్.రావు

    జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరి (దర్యాప్తు అధికారి)

    టీజీనాబ్ డీఎస్పీ సీహెచ్‌.శ్రీధర్

    హెచ్‌ఎంఆర్‌ఎల్ డీఎస్పీ నాగేందర్ రావు

    కాగా, ఫోన్ ట్యాపింగ్‌పై ఐటీఏక్ట్, పీడీపీపీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద పంజాగుట్ట పీఎస్‌లో కేసు (క్రైం నంబర్ 243/2024) నమోదైంది. ఈ కేసుపై కొత్తగా ఏర్పాటైన సిట్‌ విచారణ చేయనుంది. ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అత్యున్నత వృత్తి నైపుణ్యాలతో విచారణ జరపాలని సూచించారు.


     

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1370 ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరిగాయి.

    గ్రూప్ 3 పరీక్ష మొత్తం 1388 పోస్టుల భర్తీకి నిర్వహించగా 1370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 14,న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది.  

     

     

  • భువనగిరి(యాదాద్రి భువనగిరి జిల్లా):  రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ద్శజమెత్తారు. ఈరోజు(గురువారం, డిసెంబర్‌ 18వ తేదీ) యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికలైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లి వేధించారు. చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లను పడేశారు. 

    రాష్ట్రంలో 100-150 గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం. పార్టీ ఫిరాయింపులు స్పీకర్‌కు కనుబడటం లేదా..పార్టీ మారిన వాళ్లే సిగ్గులేకుండా చెప్పినా స్పీకర్ కు వినపడటం లేదట. పది మంది ఎమ్మెల్యేలు ఆడనా మగనా అని కూడా చెప్పుకోవడం లేదు. ఏ పార్టీనో చెప్పుకోవడం లేదు. 70 ఏళ్లు నిండిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ మారాల్సిన అవసరం ఏం వచ్చింది. అసెంబ్లీలో మొఖం చాటేస్తున్నారు. రేవంత్ రెడ్డి మూడు ఫీట్లున్నా ముప్పై ఫీట్ల డైలాగులు కొడతాడు. అడ్డుమారి గుడ్డిదెబ్బలో రేవంత్ సీఎం అయిండు. కేసీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు కూడా కోపం లేదు. జనవరిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడదాం. కేసీఆర్ హయాంలో కేంద్రం ఉత్తమ పంచాయతీల అవార్డులు ఇస్తే తెలంగాణకే 30 శాతం వచ్చాయి. రేవంత్ రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టాడు. ప్రభుత్వాన్ని నడిపేందుకు రేవంత్ కు చేతకావడం లేదు. కరోన సమయంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదు. కేసీఆర్ సీఎం అయ్యే నాటికి 72 వేల కోట్ల అప్పు ఉంది. 

    పదేళ్ల తర్వాత రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు అయిందని కాగ్ చెప్తోంది.. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఆరేడు లక్షల కోట్ల అప్పు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏనాడు ఓట్ల కోసం కాంగ్రెస్ నేతల్లా కేసీఆర్ అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ గెలిచిన చోట్ల సంక్షేమ పథకాలు అమలు చేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..  అదేం రేవంత్ అత్త సొమ్ము కాదు.. రేవంత్ డబ్బులు ఇవ్వడం లేదని ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తరం రాస్తున్నారు. ప్రతీ జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. సర్పంచులపై కేసులు వేసినా భయపడాల్సిన పరిస్థితి లేదు’ అని విమర్శించారు.

  • హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకు భద్రతను కల్పించే క్రమంలో సురక్షితమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడానికి , హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్‌లోని బేగంపేట వైపు ఉన్న పాత పాదచారుల వంతెనను కూల్చివేయాలని ప్రణాళిక సిద్దం చేసింది.

    ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి రెడ్ హిల్స్ ప్రాంతాన్ని పబ్లిక్ గార్డెన్‌తో కలుపుతుంది మరియు స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో దేనికీ అనుసంధానించబడలేదు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఐదు దశాబ్దాలకు పూర్వం జరిగినది, ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన స్టేషన్ లోనున్న రైల్వే యార్డ్ లైన్ల మీదుగా ఉండడంవలన , రైల్వే కార్యకలాపాలకు మరియు ప్రజలకు ప్రాణ ప్రమాదాన్నికలిగించే అవకాశముంది.

    ఊహించని ప్రమాదాన్ని నివారించడానికి, మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 20-12-2025 మరియు 23-12-2025 మధ్య తొలగిస్తారు. ఈ కాలంలో, అవసరమైన భద్రతా ఏర్పాట్లు అమలులో ఉంటాయి మరియు అవసరమైన విధంగా రైలు కార్యకలాపాలు నియంత్రించబడతాయి.

    కూల్చివేత పనులు కఠినమైన భద్రతా జాగ్రత్తలతో మరియు సంబంధిత రైల్వే విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయి. ఈ సంధర్భంగా రైల్వేలు ప్రజల సహకారం కోరుతూ తాత్కాలిక అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తుంది.

  • సాక్షి,హైదరాబాద్‌: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

    హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి ప్రయాణం చేయనున్నారు. ఆయన సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైలంలోని బ్రహ్మరాంభ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో సీఈసీ పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాగా, ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అధికారిక సమావేశాలు లేదా పరిపాలనా కార్యక్రమాలు ఉండవని అధికారులు తెలిపారు.

    హైదరాబాద్ షెడ్యూల్‌లో భాగంగా జ్ఞానేశ్‌కుమార్‌ నగరంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించనున్నారు. ఇందులో గోల్కొండ కోట, హుస్సేన్‌సాగర్, చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌వోలు) రవీంద్రభారతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Movies

  • టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా వస్తోన్న పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ఛాంపియన్‌. ఈ మూవీకి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బైరాన్‌పల్లి సంఘటన కూడా ఈ ట్రైలర్ చూపించారు. బ్రిటీష్‌ వారితో పోరాట సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి' అనే డైలాగ్‌ వింటే ఈ స్టోరీ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. 
     

     

  • టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా వస్తోన్న పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ఛాంపియన్‌. ఈ మూవీకి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహించారు.
    ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్‌ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.  మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేశ్‌ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్‌ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్‌లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. 

    రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్‌ను, రాజకుమారుడుతో మహేశ్‌బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్‌. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్‌ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్‌ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్‌ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్‌ హీరోలా  ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్‌ రెండో చిత్రం ఛాంపియన్‌ పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.  ఈ ఈవెంట్‌లో శ్రీకాంత్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కూడా పాల్గొన్నారు.
     


  • ప్రభాస్ ది రాజాసాబ్‌ మూవీ ఈవెంట్‌ వివాదానికి దారితీసింది. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ నిధి ‍అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ ఒక్కసారిగా హీరోయిన్‌ను చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. కొందరు ఏకంగా ఆమె తాకేందుకు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో హీరోయిన్‌కు భద్రత కల్పించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.

    ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను సమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈవెంట్‌కు నిర్వాహకులు అనుమతి తీసుకోలేదని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

    అసలేం జరిగిందంటే..

    ప్రభాస్‌- మారుతిల సినిమా  ది రాజా సాబ్ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని లులూ మాల్‌కు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ రావడంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. అయితే, ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో తన కారు వద్దకు  అభిమానులు చొచ్చుకు వచ్చారు. ఆమెతో సెల్ఫీల తీసుకునేందకు ఎగబడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.
     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం అనగానే థియేటర్ల వైపు చూస్తాం. ఏ సినిమా వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాం. అయితే ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు జేమ్స్ కామెరూన్ అవతార్-3 థియేటర్లకు వస్తోంది. దీంతో పాటు టాలీవుడ్ నుంచి సకుంటుబానాం, గుర్రం పాపిరెడ్డి, జిన్ లాంటి సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే అవతార్-3పైనే ఆడియన్స్‌లో ఎక్కువగా బజ్ ఉంది.

    అయితే ఫ్రైడే రోజు అనగానే ఓటీటీ ప్రియులు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ వీకెండ్‌ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేవారి కోసం ఓటీటీ మూవీస్ కూడా రెడీ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి ప్రియదర్శి ప్రేమంటే, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫ్రైడే స్ట్రీమింగ్ కానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    •    ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19

    •    రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) - డిసెంబరు 19

    •    ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) - డిసెంబరు 19

    •    ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20

    అమెజాన్ ప్రైమ్ వీడియో

    •    ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19

    •    హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19

    •    సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19
       

    జియో హాట్‌స్టార్

    •    మిసెస్ దేశ్‌పాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19

    •    ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19

    •    సంతాన ప్రాప్తిరస్తు(తెలుగు సినిమా) - డిసెంబరు 19


    జీ5

    •   నయనం (తెలుగు సిరీస్)  - డిసెంబరు 19

    •    డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19

    సన్ నెక్స్ట్

    •    దివ్యదృష్టి (తెలుగు సినిమా) - డిసెంబరు 19

    •    ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19

    ఆపిల్ టీవీ ప్లస్

    •    బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 19

    లయన్స్ గేట్ ప్లే

    •    రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 19
       

  • టాలీవుడ్‌లో డ్యాన్స్‌ షోలకు ఫుల్ క్రేజ్ ఉంటోంది. అందులో భాగంగానే పలు ఛానెల్స్‌లో డ్యాన్స్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఆట పేరుతో జీ తెలుగులో వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షో ఆట. ఈ షోకు అభిమానుల నుంచి అత్యంత ఆదరణ వచ్చింది. దీంతో మేకర్స్ సరికొత్త సీజన్‌తో మీ ముందుకు రానున్నారు.

    ఇందులో భాగంగానే ఆట 2.0 పేరుతో జీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ షోలో పాల్గొగనాలనుకునే వారికోసం ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఈనెల 21 అంటే ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని సారథి స్టూడియోస్‌లో నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్స్‌లో 18 నుంచి 60 ఏళ్ల వరకు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ఎవరైనా వాట్సాప్‌ ద్వారా 70322 23913 నంబర్‌కు వివరాలు పంపవచ్చని తెలిపింది. అంతేకాకుండా https://aata.zee5.com వెబ్‌సైట్‌లో వీడియో అప్‌లోడ్‌ చేసి ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 
     

     

  • సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. సినీతారలు ఏదో ఒక సందర్భంలో అలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. కొందరు వాటిని బహిరంగంగా మాట్లాడితే.. మరికొందరు బయటికి చెప్పలేక సతమతమవుతుంటారు. గతంలో చాలామంది హీరోయిన్స్‌ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా మరో నటి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసింది.

    బాలీవుడ్ నటి, స్టార్‌ క్రికెటర్‌ దీపక్ చాహర్ సోదరి అయిన మాల్టీ చాహర్‌ ఇటీవలే సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్‌ సీజన్-19లో కనిపించింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన మాల్టీ చాహర్ తాను కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడినట్లు తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిస్థితులు, క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి మాట్లాడింది.

    తనకు క్యాస్టింగ్ డైరెక్టర్లతో ఎలాంటి సమస్య రాలేదని మాల్టీ చాహర్ తెలిపింది.  ఏ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదని వెల్లడించింది. అయితే ఓ దర్శకుడు మాత్రం వర్క్‌ పరంగా మాట్లాడే సమయంలో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. ఆ వేధింపులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండేవి కావని.. వారి ఉద్దేశ్యాన్ని బయటికి చెప్పకుండా అలాంటి హింట్స్‌ ఇస్తారని మాల్టీ తెలిపింది. ఓ దక్షిణాది నిర్మాతతో సమావేశమైనప్పుడు అతని హోటల్ రూమ్ గది నంబర్ తనకు ఇచ్చాడని ఆ అనుభవాన్ని పంచుకుంది. అలాంటి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ఆ సమయంలో నేను అర్థం కానట్లు నటించానని.. ఆ తర్వాత మేము మళ్లీ కలుసుకోలేదని మాల్టీ చెప్పుకొచ్చింది.

    మాల్టీ చాహర్ మాట్లాడూతూ..'ఒక ఆఫీస్ మీటింగ్‌లో వీడ్కోలు సమయంలో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సాధారణ ఆలింగనం అని భావించా. కానీ అతను నన్ను ముద్దు పెట్టుకోవడానికి  ప్రయత్నించాడు. అది నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. వెంటనే అతన్ని అడ్డుకుని.. ఆ తర్వాత అతనితో అన్ని సంబంధాలను తెంచుకున్నా. అక్కడే అతన్ని నిలదీశా. అతన్ని నా తండ్రిలా భావించా. ఆ సంఘటన నాకు ఒక గుణపాఠం నేర్పింది. ఎవరినీ కూడా ఉన్నత స్థానంలో ఉంచొద్దు. 'అని అన్నారు. మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి అంగీకరించవద్దని సూచించింది. మనపై మనకు నియంత్రణ ఉండాలని కోరింది.

    కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ 2018లో అనిల్ శర్మ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం జీనియస్ ద్వారా రూబీనా పాత్రను పోషించింది. అరవింద్ పాండే దర్శకత్వం వహించిన  రొమాంటిక్ డ్రామా ఇష్క్ పాష్మినా (2022)లో ఒమిషా పాత్రను పోషించి తన నటనా నైపుణ్యాలను మరింతగా ప్రదర్శించింది. అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా ఆమె పనిచేస్తోంది. ఇన్‌స్టాలో గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషన్ పోస్ట్‌లతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 2018లో ఐపీఎల్ మ్యాచ్‌లో మిస్టరీ గర్ల్‌గా ఫేమస్ అయ్యింది. ఆ తరువాత ఆమె దీపక్ చాహర్ సోదరి అని ప్రపంచానికి తెలిసింది.

  • ప్రశ్న.. తికమక పెట్టేదిగా ఉండొచ్చు, సూటిగా బాణం వదిలినట్లుగా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకన చేసేదిగా ఉండకూడదు. తలదించుకునేలా అసలే ఉండకూడదు. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. అన్నీ వెకిలి ప్రశ్నలు.. సెన్సేషన్‌ కోసం అడ్డదిడ్డమైన కామెంట్లు.. నవ్వులపాలవుతున్నా సరే దులిపేసుకుని మరీ మళ్లీ అలాంటి పిచ్చి ప్రశ్నలే అడుగుతున్నారు.

    సినిమా ఈవెంట్స్‌లో నిత్యం ఇదే జరుగుతోంది. హద్దులు మీరి ప్రశ్నలడగడం కాదు ఏకంగా కించపరిచేలా మాట్లాడుతున్నారు. సినిమాల గురించి పక్కనపెట్టి మీరు సింగిలా? మింగిలా? ఎన్ని పుట్టుమచ్చలున్నాయి? బరువెంత? హీరో మెటీరియల్‌ కాదు.. ఇదిగో ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సెలబ్రిటీలకు ఎదురైన ఆ చేదు సంఘటనలను కొన్నిక్కడ చూద్దాం...

    ఛీ కొట్టే ప్రశ్న
    'తెలుసు కదా' ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డను ఓ మహిళా విలేకరి మీరు ఉమెనైజరా? అని అడిగింది. అందుకాయన వస్తున్న కోపాన్ని తమాయించుకుని ఇది సినిమా ఇంటర్వ్యూనా? నా పర్సనల్‌ ఇంటర్వ్యూనా? అని సమాధానం దాటవేశాడు. ఎక్కువమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారిని ఉమెనైజర్‌ అంటారు. అలాంటిది ఓ హీరోను పట్టుకుని మీరు ఉమెనైజరా? అని అడగడం ఎంత నీచమో గ్రహించలేకపోవడం ఆమె స్థాయికి నిదర్శనం!

    హీరో మెటీరియల్‌ కాదా?
    దీనికంటే ముందు డ్యూడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో కూడా.. ప్రదీప్‌ రంగనాథన్‌ను మీరు చూడటానికి హీరో మెటీరియలే కాదు, రెండు సినిమాలకే ఇంత సక్సెస్‌ అంటే అది హార్డ్‌ వర్కా? అదృష్టమా? అని అడిగింది. హీరో అంటే ఫలానా హైట్‌ ఉండాలి.. ఈ రంగుండాలి.. అని ఏ పుస్తకంలో రాశారో తనకే తెలియాలి! పాపం ఆమె ప్రశ్నకు ప్రదీప్‌ బిక్కచచ్చిపోయి చూస్తుంటే శరత్‌ కుమార్‌ లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిపడేశాడు.

    బుద్ధి చెప్పిన మంచు లక్ష్మి
    హీరో మెటీరియల్‌ కాదని మీరెలా జడ్జ్‌ చేస్తారు.. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే అని గూబ గుయ్యిమనేలా ఆన్సరిచ్చాడు. కిరణ్‌ అబ్బవరం కూడా.. పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాళ్లను కించపరిచే ప్రశ్నలు అడగొద్దని వేడుకున్నాడు. మంచు లక్ష్మికి కూడా ఇలాంటి అభ్యంతకర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యాంకర్‌.. ఇంటర్వ్యూలో ఆమె వయసు, డ్రెస్సింగ్‌కు లింక్‌ చేసేలా ప్రశ్న అడగడంతో నీకెంత ధైర్యం అని అక్కడే కడిగిపారేసింది. అంతేకాకుండా అతడు బహిరంగ క్షమాపణలు చేప్పేవరకు వదల్లేదు.

    స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ గురించి వెకిలి కామెంట్‌
    ఈ ఏడాది మేలో జరిగిన యోగిదా అనే తమిళ సినిమా ఈవెంట్‌కు ఐశ్వర్య రఘుపతి హాజరైంది. వేసవికాలంలో ఎండను తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోమని మీడియాను కోరింది. దానికి ప్రతిస్పందనగా ఓ వ్యక్తి.. వేడిని తట్టుకునేందుకే స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ వేసుకొచ్చారా? అన్నాడు. ఒక క్షణం పాటు షాక్‌లో ఉండిపోయిన ఆమె సినిమా ఈవెంట్‌లో నా దుస్తులపై చర్చ ఎందుకంటూ తిరిగి ప్రశ్నించింది.

    మీ బరువెంత?
    గత నెలలో జరిగిన తమిళ చిత్రం అదర్స్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ గౌరీ కిషన్‌ను ఓ వ్యక్తి మీ బరువెంత అని అడిగాడు. నా బరువు తెలుసుకుని ఏం చేస్తారు. ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపోతే మూడేళ్ల క్రితం డీజే టిల్లు ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి.. హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసా? అని సిద్ధు జొన్నలగడ్డను అడగడం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే! 

    మరి వీళ్లంతా వైరల్‌ అవడానికి ఇదంతా చేస్తున్నారా? ఏంటనేది వారికే తెలియాలి. ఇలాంటి దిగజారుడు ప్రశ్నలడిగి జర్నలిజం పరువు తీయడంతోపాటు ఇండస్ట్రీని నవ్వులపాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో? ఏంటో!

  • హర్షవర్ధన్ రాణే,సోనమ్ బాజ్వా జంటగా నటించిన చిత్రం ఏక్ దీవానే కీ దీవానీయత్'. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై అన్షుల్ గార్గ్, దినేష్ జైన్ నిర్మించారు.

    తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. ఈ చిత్రంలో షాద్ రంధావా, సచిన్ ఖేడేకర్, అనంత్ నారాయణ్ మహాదేవన్, రాజేష్ ఖేరా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా లవ్ అండ్ రొమాంంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. దాంపత్య జీవితంలో భార్య, భర్తల మధ్య ఆధిపత్య ధోరణి, వాటివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యల ఆధారంగా రూపొందించారు. 
     

     

  • హైద‌రాబాద్‌ నగరంలో మరో ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వేదిక కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎంట్రీలు ఆహ్వానించగా.. అతికొద్ది సమయంలోనే 704 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో నుంచి పలువురు నిష్ణాతులైన జ్యూరీ సభ్యులు 60 లఘు చిత్రాలను, మరో 11 ఈశాన్య లఘు చిత్రాలను కలిపి మొత్తం 71 చిత్రాలను, వీటితోపాటు ప్రేక్షకులను అలరించడానికి ఐదు క్లాసిక్‌ సినిమాలను ఎంపిక చేశారు.

    వీటిలో ఈజిప్ట్‌, స్పెయిన్, యూఎస్‌ఏ, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యూకే, శ్రీలంక, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, రష్యా, యూఏఈ దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు ఖైరతాబాద్‌లోని ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లోని స్కీన్‌ నెంబర్‌ 4, 5లో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

    సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వహణ కమిటీ ప్యాట్రన్, అంకురం సినిమా (Ankuram movie) దర్శకులు, తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు జ్యూరీ కమిటీ సభ్యులు ఉమామహేవ్వరరావు వివరాలను వెల్లడించారు. తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌ దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భావి చలనచిత్ర నిర్మాతలకు, చలనచిత్ర రంగంలోకి రావాలనుకునే వారికి ఈ ఫెస్టివల్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

    చ‌ద‌వండి: ఆలోచింప‌చేసే.. అంగ‌మ్మాల్ సినిమా 

    19న సాయంత్రం 5:30 గంటలకు ప్రసాద్స్‌ ఐమాక్స్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఉత్తమ చిత్రాలకు 21న సాయంత్రం ఆరు గంటలకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేందుకు నాగేష్‌ కుమార్, నాజర్, మైథిలిరావు, లీమాదాస్, అలెగ్జాండర్‌ లియోపో, డాల్టన్, శశి కుమార్‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కెమెరామెన్‌ మధు మహంకాళి, జర్నలిస్టు వీరయ్య పాల్గొన్నారు.

  • మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మనశంకరవరప్రసాద్‌ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. కేథరిన్‌ కీలక పాత్ర  పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.

    మూవీ రిలీజ్‌కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్‌లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి.
    ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు.

     

  • బిగ్‌బాస్‌ ఫైనల్‌ వీక్‌ అంతా పిక్నిక్‌ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్‌గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయేల్‌ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్‌ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్‌ కోసం ఓ ప్రోమో వదిలారు.

    యోధుడిగా నిలబడ్డావ్‌
    'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్‌ చేస్తూ టఫెస్ట్‌ కాంపిటీటర్‌గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్‌ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్‌ అంతా తిట్టు పడ్డ పవన్‌.. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్‌ అనిపించాడు. అతడి ఫుల్‌ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

     

  • మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు.  'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్‌కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.

    మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. 
     

  • మలయాళ సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఎస్తర్‌...   "దృశ్యం" సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. రెండు తెలుగు భాగాల్లోనూ తనే నటించింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.

    జోక్‌ అనుకున్నా..
    కొన్నేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తుండగా నాన్న ఫోన్‌ చేశాడు. నేనో వ్యక్తిని కలిశాను.. అతడి కూతురు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (LSE)లో చదువుతోందట. నువ్వు ఓసారి ఆమెతో మాట్లాడకూడదూ.. ఏదో ఒకరోజు నువ్వు కూడా ఆ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తావేమో అన్నాడు. ఏంటి నాన్న జోక్‌ చేస్తున్నావా? అన్నాను. 

    కలలో కూడా అనుకోలేదు
    ఎందుకంటే అక్కడ చదువుకోవడమనేది మామూలు విషయం కాదు. అసలు అక్కడికి వెళ్లి చదవాలని నేను కలలో కూడా అనుకోలేదు. మా నాన్న పిచ్చివాడు.. ఏవేవో అనవసరమైన కలలు కంటున్నాడు అని మనసులోని నవ్వుకున్నాను. కట్‌ చేస్తే.. ఆయన కూతురిగా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఎదుట గ్రాడ్యుయేషన్‌ పట్టాతో నిల్చున్నాను. నిజంగా జీవితం ఎంత విచిత్రమైనదో కదా!

    అంత స్థోమత ఎక్కడిది?
    నాకు లండన్‌లో సీటు వచ్చిందన్న విషయాన్ని మొదట వాళ్లకు చెప్పనేలేదు. ఎందుకంటే అక్కడ చదివించేంత స్థోమత మా వాళ్లకు లేదు. అప్పటికే నా ఇద్దరు సోదరుల కోసం స్టూడెంట్‌ లోన్స్‌ తీశారు. నా దగ్గర ఎలాగో అంత డబ్బు లేదు. ఎలాంటి గ్రాంట్లు, సహాయం లభించినా.. అది సరిపోదు. అందుకే అక్కడ చదువుకోవడం అంటే చాలా ఖరీదైన విషయమే అనిపించింది.

    పేరెంట్స్‌ అండగా
    కానీ ఇంట్లో వాళ్లు నాకిదెంత ముఖ్యం అనేది మాత్రమే ఆలోచించారు. డబ్బు ఎలాగోలా సమకూరుస్తాం.. నువ్వెళ్లి చదువు పూర్తి చేయు అని చెప్పి పంపారు. అప్పుడప్పుడు మా తల్లిదండ్రులు చేసే పనికి వారిపై కోప్పడతాను. కానీ వాళ్లు మాత్రం పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు అది నాకు భయంగా ఉంటుంది. అదే సమయంలో ఎంత కష్టం వచ్చినా మన తల్లిదండ్రులు పక్కనే నిలబడ్డందుకు సంతోషంగానూ ఉంటుంది.

    అదే అసలు కష్టం
    నేను కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు దోహదపడ్డ అమ్మానాన్నకు కృతజ్ఞతలు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ సో మచ్‌. గతవారం ఓ ఇంటర్వ్యూలో నేనేమన్నానంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చేరడం ఒక పెద్ద ఫెయిల్యూర్‌ అన్నాను. కానీ అది నిజం కాదు. అసలు అందులో ‍ప్రవేశం పొందడం కష్టమైన పని కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులతో పోటీపడటం.. ముఖ్యంగా మనతో మనం పోటీపడటమే ఎక్కువ కష్టమైన పని. 

    చాలా నేర్చుకున్నా..
    దీన్ని నేను అధిగమించాను, సాదించాను. అందుకు సంతోషంగా ఉంది. LSE నన్నెంతగానో మార్చేసింది. పరిస్థితులను అర్థం చేసుకోవడం, విషయాలను లోతుగా ఆలోచించడం.. ప్రతిదాన్ని భిన్న కోణాల్లో చూడటం.. ఇలా చాలా నేర్చుకున్నాను అని ఎస్తర్‌ (Esther Anil) రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ కింద పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

     

     

    చదవండి: తొలి మూవీకే చేదు అనుభవం.. డబ్బులివ్వకుండా..: నటి

  • టాలీవుడ్‌ నటుడు ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’.. ‘ఏ మిస్టిక్‌ వరల్డ్‌’ అనేది ఉపశీర్షిక. యుగంధర్‌ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, మహీధర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే,  ఈ మూవీ షూటింగ్‌లో కొన్ని సంఘటనలలో హీరో ఆది గాయపడ్డారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

    శంబాల మూవీని విజువల్ వండర్‌గా తీర్చి దిద్దే క్రమంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌లతో మేకర్లు ఆడియెన్స్‌ని అబ్బుర పరుస్తున్నారు. హీరోలు సైతం ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్స్‌ల్ని చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవాంఛనీయ ఘటనలు జరుగుతుంటాయి. ఇక ‘శంబాల’ చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయని టీం చెబుతోంది.

    ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో హీరో ఆది తీవ్రంగా గాయపడ్డారట. రాత్రి పూట చేస్తున్న ఈ షూటింగ్‌లో చాలా మంది నటీనటులున్నారట. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలోనే ఆదికి గాయాలు అయ్యాయి. అయితే గాయాలు అయినా కూడా షూటింగ్‌కి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించారట. ఆ గాయాలతోనే అలా ఆ రాత్రి షూటింగ్ చేసి సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ను చూపించారని టీం ప్రశంసిస్తోంది.

    ‘శంబాల’ ఇప్పటికే ట్రేడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ మీదున్నారు. అన్ని రకాల బిజినెస్‌లు క్లోజ్ అయ్యాయి. హాట్ కేక్‌లా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇక నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్‌లో ఉషా పిక్చర్స్ వంటి భారీ సంస్థలు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. 
     

  • బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. 2005లో వచ్చిన కామెడీ ఫిలిం 'వాహ్‌ లైఫ్‌ ఓతో ఐసీ'తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాలు, సిరీస్‌లు చేసింది. రెండు దశాబ్దాలుగా టాలెంటెడ్‌ నటిగా సినీరంగంలో రాణిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    చేదు అనుభవం
    రాధికా ఆప్టే మాట్లాడుతూ.. అందరూ తమ ఫస్ట్‌ సినిమా గురించి మంచిగా చెప్పుకుంటారు. కానీ, నాకు మాత్రం నా ఫస్ట్‌ మూవీ భయానక అనుభవాలనే పంచింది. నిర్మాత (సంగీత అహిర్‌) నాకు సరైన వసతి కల్పించలేదు, డబ్బులివ్వలేదు. నేను, అమ్మ.. వారిని సినిమా రెమ్యునరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాం.

    దారుణంగా..
    కానీ, వాళ్లేమో.. ఊర్మిళ వంటి పెద్ద నటియే ఏ హామీ అవసరం లేదంది.. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అని దాటవేశారు. అదెంతవరకు నిజమో నాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం చాలా దారుణంగా ట్రీట్‌ చేశారు. అందుకే నా ఫస్ట్‌ సినిమాను ఎప్పుడూ మర్చిపోవాలనుకుంటాను అని తెలిపింది..

    ఆయనే న్యాయ నిర్ణేత
    సినిమాలో తొలి అవకాశం ఎలా వచ్చిందన్నదాని గురించి మాట్లాడుతూ.. నేను బ్రెయిన్‌ సర్జన్‌ అనే నాటకం వేశాను. మా టీమ్‌కు రాష్ట్ర స్థాయిలో అవార్డు వచ్చింది. అయితే మాకు అవార్డు ఇచ్చిన జడ్జి టీమ్‌లో దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ ఉన్నారు. నాటకం అయిపోయిన వెంటనే నన్ను పిలిచి సినిమా ఛాన్స్‌ ఇస్తానన్నాడు. అలా ఆయన డైరెక్షన్‌లోనే తెరంగేట్రం చేశాను. చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి అని నటి చెప్పుకొచ్చింది.

    సినిమాలు
    రాధికా ఆప్టే తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ చిత్రాల్లో నటించింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్‌, మరాఠి, బెంగాలీ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, సేక్రెడ్‌ గేమ్స్‌, ఓకే కంప్యూటర్‌ వంటి వెబ్‌ సిరీస్‌లలోనూ నటించింది. చివరగా సాలి మొహబ్బత్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో కనిపించింది. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో అందుబాటులో ఉంది.

    చదవండి: భార్యకు విడాకులిచ్చిన దేవి నటుడు

  • గోదారి గట్టున సినిమా తీస్తే హిట్‌ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్‌.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్‌లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉండేది. అయితే, ముఖ్యంగా గోదారి గట్టున ఉన్న నిద్ర గన్నెరు చెట్టు చాలామందికి సెంటిమెంట్‌గా ఉండేది. అయితే, గతేడాది వర్షాలకు అది కూలిపోయింది.

    300 సినిమాలు
    కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్‌ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్‌ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్‌ ప్రదేశాలు ఉన్నాయి.

    కూలిపోయిన చెట్టు.. దర్శకుడు వంశీ భావోద్వేగం
    సితార, లేడీస్‌ టైలర్, డిటెక్టివ్‌ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి–గోపిక–గోదావరి, మంచు పల్లకీ.. ఇలా సుమారు 18 సినిమాలకు కుమారదేవం చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించానని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. ఈ చెట్టు కూలిపోయిందని తెలియగానే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వెళ్లారు. కూలిపోయిన భారీ నిద్ర గన్నెరు వృక్షాన్ని పరిశీలించి భావోద్వేగానికి లోనయ్యారు. స్థానికులతో మాట్లాడుతూ తనకు, చెట్టుకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ చెట్టు మళ్లీ బతకాలన్నారు. చెట్టు బతికితే తాను మళ్లీ ఇక్కడ సినిమా తీస్తానని చెప్పారు. చెట్టు పడిపోయిన విషయం తెలిసి వేలాది మంది నుంచి తనకు వేలాది మెసేజ్‌లు వచ్చాయని, తన తల్లి చనిపోయినప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదన్నారు.

    చిగురించిన చెట్టు
    చెట్టు కూలిపోవడంతో చాలామంది బాధపడ్డారు. ఇక ఆ చెట్టు మళ్లీ చిగురించదని అందరూ భావించారు. అయితే, అక్కడి యువకులు మాత్రం ఆ చెట్టును ఎలాగైనా బతికించాలని అనుకున్నారు.  అందుకోసం వారికి తోచిన పద్ధతులను అనుసరించారు. ఎట్టకేలకు ఎవరూ ఊహించలేని విధంగా ఆ చెట్టు మళ్లీ చిగురించింది.  ప్రస్తుతం  గోదారి గట్టుపై ఉన్న నిద్రగన్నేరు చెట్టు పూర్తిగా ఆకులతో కళకళలాడుతూ కనిపించడంతో స్థానికులు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

National

  • పండుగ సీజన్ అంటేనే షాపింగ్, ప్రయాణాలు మరియు చివరి నిమిషం పనులతో ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పరధ్యానాన్ని స్కామర్లు (మోసగాళ్లు) తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అత్యవసరమని నమ్మించడం, మీకు తెలిసిన బ్రాండ్‌ల పేర్లతో నకిలీ మెసేజ్‌లు పంపడం మరియు ఆశచూపే ఆఫర్లతో వారు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు చేసే ఒక్క పొరపాటు క్లిక్ మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఇతరుల చేతిలో పెట్టవచ్చు. అందుకే, ఆగండి, ఆలోచించండి మరియు నిర్ధారించుకున్న తర్వాతే స్పందించండి.

    సెలవుల కాలంలో మోసాలు సాధారణంగా ఎలా జరుగుతాయి:
    ఈ మెసేజ్‌లు ప్రముఖ కంపెనీల లోగోలు, సరళమైన భాష మరియు మీకు తెలిసిన బ్రాండ్ పేర్లను ఉపయోగించి నిజమైనవిగా కనిపిస్తాయి. ప్రజలు నివేదించిన కొన్ని సాధారణ పద్ధతులు ఇక్కడ ఉన్నాయి:

    * డెలివరీ సంబంధిత అలర్ట్‌లు: కొరియర్ ఆలస్యమైందని లేదా "ఫ్లాగ్" చేయబడిందని, వెంటనే నిర్ధారించాలని మెసేజ్‌లు వస్తాయి. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే, అది నిజమైన సైట్‌లా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కు దారి తీస్తుంది.

    * QR కోడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు: “డబ్బులు పొందడానికి స్కాన్ చేయండి” అనే మెసేజ్‌లు. నిజానికి, మీరు ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే మీ ఖాతా నుండి డబ్బు కట్ అయ్యే అవకాశం ఉంది.

    * నమ్మలేని డిస్కౌంట్లు: ఫోన్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్యాడ్జెట్‌లపై భారీ తగ్గింపులు ఇచ్చే వెబ్‌సైట్లు. మీరు డబ్బు చెల్లించినా, వస్తువు మాత్రం మీకు అందదు.

    * ఖాతా హెచ్చరిక ఈమెయిల్స్: మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయబడిందని, వెంటనే వెరిఫై చేయకపోతే ఆగిపోతుందని వచ్చే అలర్ట్‌లు. ఇవి తరచుగా మీ OTPని అడుగుతాయి.

    * ఉచిత బహుమతుల మెసేజ్‌లు: ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు లేదా గిఫ్ట్ హ్యాంపర్‌లు ఇస్తామని, వాటి కోసం చిన్న మొత్తంలో "ఫీజు" చెల్లించాలని అడుగుతారు. చివరకు మీ డబ్బు, డేటా రెండూ పోతాయి.

    సైబర్ స్మార్ట్‌గా ఉండటానికి అలవాట్లు: ఆగు (Ruko), ఆలోచించు (Socho), చర్య తీసుకో (Action Lo)!

    * తెలియని లేదా ఫార్వార్డ్ చేసిన లింక్‌లను క్లిక్ చేయకండి. ఎల్లప్పుడూ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించండి.

    * అపరిచితులు పంపే QR కోడ్‌లను స్కాన్ చేయవద్దు. డబ్బులు తీసుకోవడానికి మీరు దేన్నీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు.

    * OTPలు, బ్యాంకింగ్ వివరాలు లేదా కార్డ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. బ్యాంకులు లేదా కొరియర్ కంపెనీలు వీటిని అడగవు.

    * అదనపు భద్రత కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసుకోండి.

    ముగింపు
    స్కామర్లు ఎప్పుడూ సంక్లిష్టమైన పద్ధతులను వాడరు; వారు ప్రజల తొందరపాటును, అజాగ్రత్తను ఆసరాగా చేసుకుంటారు. ఈ పండుగ సీజన్‌లో, ఏదైనా క్లిక్ చేసే ముందు లేదా పేమెంట్ చేసే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించండి.

    మీరు మోసపోయారని భావిస్తే, వెంటనే నేషనల్ సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

    నేటి వేగవంతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, చిన్న వ్యాపారాలు మరియు సంఘాలు సురక్షితంగా కార్యకలాపాలు సాగించడంలో సహాయపడే సైబర్ అవగాహన మరియు విద్యా కార్యక్రమాలకు ఫెడెక్స్ తన మద్దతును కొనసాగిస్తోంది. మోసాన్ని (Fraud) ఎలా ఎదుర్కోవాలనే దానిపై మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!

  • శబరిమలలో అత్యధిక భక్తుల రద్దీ తర్వాత భారీ ఆదాయం వచ్చినట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు కేకే విజయకుమార్‌ పేర్కొన్నారు. ఇందులో 106 కోట్ల రూపాయలను అమ్మకానికి కేటాయించారు. గతేడాది ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం గణనీయంగా పెరిగింది. అలాగే భక్తులకు ముందుగా చెల్లించిన డిపాజిట్‌ మొత్తాన్నితిరిగే చెల్లించలేదనే ఫిర్యాదుకు ప్రతిస్పందనగా..అందుకోసం ప్రత్యేక కౌంటర్‌ తెరవనున్నట్లు దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. 

    కౌంటర్‌ వద్ద రద్దీ కారణంగా చాలామంది ప్రజకలు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కౌంటర్‌ ఆఫీసు పనిచేస్తుందని,భక్తుల మొత్తాన్ని తిరిగి అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి 500 గదులు ఉన్నాయన్నారు. సాఫ్టవేర్‌ కూడా మారనుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో గది బుక్‌ చేసుకోవడానికి ముందస్తు డిపాజిట్లు చెల్లించన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని అన్నారు.ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన మొత్తం తిరిగి ఖాతాలో జమ చేయబడుతుందని అన్నారు. 

    యథావిధిగా నియంత్రణ
    ఒక వ్యక్తికి 20 టిన్లు ఇవ్వాలనే నిర్ణయం కొనసాగుతుందని రాష్ట్రపతి అన్నారు. ప్రతి ఒక్కరికీ రిజర్వేషన్లు కల్పించడానికి ఇలాంటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేదప్రజలకు అసౌకర్యం కలిగించదని అన్నారు. మండల పూజ తరువాత, ప్లాంట్ 27 న మూసివేసి అనంతరం మూడు రోజుల తర్వాత తెరుస్తానమని అన్నారు. ఈ ఏడాది దాదాపు  45 లక్షల అరవణ నిల్వల సేకరణతో తీర్థయాత్ర సీజన్ ప్రారంభమైంది. 

    కానీ అవన్నీ అనూహ్యంగా అమ్ముడయ్యాయని అన్నారు. రోజుకు 3.5 లక్షల మేర టిన్లను విక్రయించాలని అనుకున్నా..సగటున్న నాలుగున్నర లక్షలు పైనే అమ్ముడయ్యాయని అన్నారు. ప్రస్తుతం. ఒక మిలియన్ కంటే ఎక్కువ టిన్లు నిల్వలు ఉన్నట్లు తెలిపారు.

    (చదవండి: శబరిమల బంగారం చోరీ కేసులో పురోగతి)

  • న్యూఢిల్లీ:  ఏపీ, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో 30 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు 

    న్యాయవాది గుడిమళ్ల సుభాషిణి. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..  బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ కల్పిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని పేర్కొంది.  ఈ నెల 20వ తేదీన బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండగా, జనవరి 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన కౌంటింగ్‌ జరుగనుంది. 

  • ఆధునిక సమాజంలో మనుషులు ఉచ్చం నీచం మర్చిపోతున్నారు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు.  రెంట్‌ అడిగిన పాపానికి ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన కలకలం  రేపింది. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో  జరిగిన ఈ సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌ లోని ఆరా చిమెరా నివాస సముదాయంలో ఈ సంఘటన జరిగింది.  ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు గత నాలుగు నెలలుగా అద్దె  చెల్లించపోవడంతో 
    ఇంటి యజమాని దీప్‌శిఖా శర్మ (48)  వారిని అద్దె బకాయి చెల్లించమని అడిగింది. అంతే మరునాటికి సూట్‌కేస్‌లో శవమై  తేలింది.


    అద్దెకు అడిగినప్పుడు ఇంటి యజమానిని హత్య చేసినందుకు ఒక జంటను అరెస్టు చేశారు. మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని సూట్‌కేస్ నుండి స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

    హత్య ఎలా జరిగింది?
    ఉమేష్ శర్మ వ దీప్‌శిఖా శర్మ సొసైటీలో రెండు ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.  ఒక ఫ్లాట్లో వారు ఉంటూ, మరొకదానిని అద్దెకిచ్చారు. ఇందులో  అజయ్ గుప్తా , అకృతి గుప్తా దంపతులు నివసిస్తున్నారు. అజయ్ గుప్తా రవాణా వ్యాపారంలో ఉన్నాడు. నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన దీప్‌ శిఖబుధవారం, గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో, ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే దీప్‌శిఖ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పని మనిషి మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళి ఆరా తీసింది. అప్పుడు వారి ప్రవర్తన, సమాధానాలు అనుమానాన్ని రేకెత్తించాయి. మీనా  సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయించగా, దీప్‌ శిఖా, గుప్తా దంపతుల ఇంట్లోకి వెళ్లింది గానీ, బయటకు రాలేదని గుర్తించి అప్పుడు పోలీసులకు  సమాచారం అందించింది.

    ఈలోపు విషయం తెలుసుకొని అప్రమత్తమైన గుప్తా దంపతులు మరో  పెద్ద ప్లాన్‌వేశారు. కానీ మీనా సమయ స్ఫూర్తితో వారి ఆటలు సాగలేదు. ఒక పెద్ద సూట్‌ కేసుతో బయటికి రావడం, ఆటోకి  ఫోన్‌ చేయడం చూసి  మీనా వారిని అడ్డుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత, గుప్తా దంపతుల ఇంటిని సోదా చేయగా, దిగ్భ్రాంతికరమైన విషయం టైటపడింది. బాధితురాలి మృతదేహం సూట్‌కేస్‌లో గుర్తించారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో   కుక్కి ఎక్కడో పారవేయాలనే వారి ప్లాన్‌ . పనిమనిషి వారి  ప్లాన్‌ను  భగ్నం చేసింది.

    దీప్‌ శిఖను ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి, ఆపై దుపట్టాతో గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబంపోలీసులకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి ఉపాసన పాండే తెలిపారు.

  • శబరిమల బంగారం చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొంత పురోగతి సాధించింది. ఈమేరకు ఒక ప్రవాస వ్యాపారి వాంగ్మూలాన్ని నమోదు చేయగలిగింది. నిన్న సాయంత్రం బుధవారం(డిసెంబర్‌ 18) పండలం స్థానికుడైన ప్రవాస వ్యాపారి నుంచి వివరణాత్మక వాంగ్మూలం సేకరించింది సిట్‌ బృందం. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ప్రవాస దర్యాప్తు బృందంతో పంచుకున్నారు. దాంతోపాటు కొంతమంది వ్యక్తుల నంబర్లను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వాంగ్మూలం ఆధారంగా SIT తదుపరి దర్యాప్తుకు సిద్ధమవుతోంది.

    ఇటీవల, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల శబరిమల బంగారు దోపిడీ వెనుక అంతర్జాతీయ పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠా ఉందని తనకు సమాచారం అందిందని ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిగా ఉన్న దుబాయ్ వ్యాపారవేత్త నుంచి సిట్ గతంలో వాంగ్మూలం నమోదు చేసింది కూడా. దోపిడీలో పాల్గొన్న ఒకరితో తనకున్న వ్యక్తిగత అనుభవాల గురించి ఆ వ్యాపారవేత్త చెప్పాడు కానీ అందుకు సంబంధించి.. ఎటువంటి పత్రాలను ఇంతవరకు అతడు సమర్పించలేదు.

    ఇదిలా ఉండగా, డిసెంబర్ 6న రమేష్ చెన్నితల సిట్‌కి లేఖ రాస్తూ, బంగారు దోపిడీలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ ముఠాకు ఉన్న సంబంధాన్ని దర్యాప్తు చేయాలని, రూ.500 కోట్ల లావాదేవీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఆయన సిట్ ముందు హాజరై తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. శబరిమల బంగారు దోపిడీలో రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారని చెన్నితల లేఖలో ఆరోపించారు. అలాగే ఆయన ఆ లేఖలో ఇలా వివరించారు.

    'పురాతన వస్తువులను దొంగిలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించే ముఠాల గురించి ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తి నాకు తెలుసు. అతను ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను వెల్లడించడానికి సిద్ధంగా లేడు. కానీ అతను దర్యాప్తు బృందం, కోర్టు ముందు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వతంత్రంగా దర్యాప్తు చేసిన తర్వాత నేను అలాంటి మాటలు చెబుతున్నాను. 

    రాష్ట్రంలోని కొంతమంది పారిశ్రామికవేత్తలకు, ఈ ముఠా రాకెట్లకు బంగారు దొంగతనంతో సంబంధం ఉంది. దేవస్వం బోర్డులోని కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు ఈ రాకెట్‌తో సత్సంబంధాలు ఉన్నాయా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలి. ​ అలాగే పురావస్తు సమూహాలను కూడా దర్యాపు పరిధిలోకి తీసుకురావాలి' అని రమేష్ చెన్నితల లేఖలో డిమాండ్ చేశారు.

    (చదవండి: శబరిమల: అటవీ మార్గంలో వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక పాస్‌లు)

  • ఢిల్లీ:​ వికసిత భారత్‌ జీ రామ్‌ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్‌-జీ’ బిల్లుకు ఆమోదం లభించింది. వీబీ-జీ-రామ్‌-జీ బిల్లు పత్రులను చించి విపక్షాలు నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చగా..  కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.

    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌–గ్రామీణ(వీబీ–జీ రామ్‌ జీ) బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందని కేంద్రం చెబుతోంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని కేంద్ర సర్కార్‌ అంటోంది. ఉపాధి హామీ పథకం నుంచి  గాంధీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్‌ సభ్యుడు జైప్రకాశ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అది అతిపెద్ద నేరమన్నారు. 

    కాగా, దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్‌కా బీమా సబ్‌కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్‌ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. అలాగే, కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్‌మెంట్‌–2025 బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh

  • గన్నవరం:  ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.  గురువారం(డిసెంబర్‌ 18వ తేదీ) రాత్రి గం. 8.10ని.లకు టేకాఫ్‌ కావాల్సిన విమానం.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.  టేకాఫ్‌ అవుతున్న సమయంలోనే నిలిచిపోయినట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

    కాగా, ఈరోజు ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX 398)లో గురువారం ఉదయం సమస్య ఏర్పడటంతో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.

    ఎయిరిండియా విమానం కోజికోడ్‌కు వెళ్తుండగా, కుడి వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్, టైర్‌లో సమస్య ఏర్పడింది. దాంతో వెంటనే విమానాన్ని కొచ్చి వైపు మళ్లించి ఉదయం 9 గంటల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్వహించారు.

    ఇదీ చదవండి:

    ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

  • సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద స్కాం అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను గురువారం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌కు అందించారు. అనంతరం లోక్‌భవన్‌ వద్ద వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. 

    ‘మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశాం. ఈరోజు ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా 1,04,11,136 సంతకాలు. దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో?. గత అక్టోబరు 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఆ తర్వాత అక్టోబరు 10 నుంచి ఈనెల 10 వరకు ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారిని ఉద్యమంలోకి తీసుకువచ్చాం. వాళ్ల సంతకాలు తీసుకున్నాం.

    నవంబర్‌ 12న ఒకసారి, మళ్లీ ఈనెల 10న మరోసారి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాం. డిసెంబరు 10న ర్యాలీల తర్వాత కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలించాం. అక్కడ డిసెంబరు 15న ర్యాలీలు నిర్వహించి, వాటిని ప్రజలకు చూపాం. ఆ తర్వాత వాటన్నింటినీ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈరోజు (గురువారం) గవర్నర్‌కి చూపించాం. ఆ విధంగా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల నిరసన, వారి మనోభావాలను వివరించాం.

    అసంబద్ధంగా ప్రభుత్వ నిర్ణయం:
    ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్‌ ఎందుకు నడుపుతుంది? దేశంలో అన్ని చోట్ల స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే ఎందుకు నడుపుతుందో ఆలోచించారా? రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నడపకపోతే పేద, మధ్య తరగతి వారు ప్రైవేటును ఆశ్రయించలేక నష్టపోతారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఒక బాధ్యతగా భావించి నిర్వహిస్తాయి.

    ఇలా అన్నీ ప్రైవేటీకరిస్తూ పోతే, దోపిడికి చెక్‌ పడదు. ప్రజా సేవలు పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరాలంటే కనీసం రూ.5 వేలు ఛార్జ్‌ చేస్తారు. కనీస వసతుల రూమ్‌ కావాలంటే రోజుకు రూ.10 వేలు, ఐసీయూలో రోజుకు కనీసం రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయం.

    మెడికల్‌ కాలేజీతో ఫ్రీగా అత్యుత్తమ వైద్య సేవలు:
     మా ప్రభుత్వ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీకి శ్రీకారం చుట్టాం. ఎక్కడైనా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తే, అక్కడ టీచింగ్‌ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఆ ఆస్పత్రిలో, మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు అందరూ అందుబాటులో ఉంటారు. దీంతో పేదలకు ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ఛార్జ్‌ చేయలేవు. మేము నాడు తలపెట్టిన 17 మెడికల్‌ కాలేజీలు ప్రారంభమైతే, మన పిల్లలకు మరిన్ని మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దాని వల్ల వైద్య విద్య కోరుకునే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.

    మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌ల మయం:
    కానీ, ఇప్పుడు చంద్రబాబు ఆ పని చేయకపోగా, కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్‌లు చేస్తున్నారు. స్కామ్‌ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్‌ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్‌. అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్‌ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్‌ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్‌లు దేశంలో ఎక్కడా ఉండవు.

    నిధుల కొరత అనేది అబద్ధం:
    మా హయంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్‌ చేశాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి చేశాం. అవి ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అవసరం. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా?.

    పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి. మేం వచ్చాక వాటిని పూర్తి చేస్తాం. చంద్రబాబుకు గట్టిగా తగిలేట్టుగా గవర్నర్‌ దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లాం. మెడికల్‌ కాలేజీలు పూర్తి చేస్తే, మాకు క్రెడిట్‌ దక్కుతుందన్న అక్కసుతో చంద్రబాబు పేదలకు నష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణతో స్కామ్‌లు చేస్తున్నారు. నిజానికి ఆ మెడికల్‌ కాలేజీలన్నీ భవిష్యత్‌లో లక్ష కోట్ల ఆస్తి అవుతాయి. ఇంకా కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం అందిస్తూ, వెల కట్టలేని సేవలందిస్తూ కోట్లాది మందికి వెలుగులు నింపుతాయి.

    అందుకే మా పోరాటం ఆపబోము:
    మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్‌కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్‌ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. గవర్నర్‌ కానీ, మనసున్న ఏ వ్యక్తికి కానీ చంద్రబాబు చేసేది తప్పు అని అర్థమవుతుంది. ఇదే గవర్నర్‌ ఇంట్లో పని చేసే వ్యక్తులు మెడికల్‌ కాలేజీకి వెళ్తే ఉచితంగా వైద్యం అందుతుంది. గవర్నర్‌ది మంచి మనసు. ఆయన అన్నీ అర్థం చేసుకున్నారు.

    ఈ ప్రభుత్వంలో అన్నీ సున్నా:
    మెడికల్‌ కాలేజీలను కాపాడుకునేందుకు ప్రతి ద్వారం తొక్కుతాం. కోర్టుల ద్వారా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఉద్యమమూ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది కచితంగా స్కామ్‌. అన్నీ ప్రభుత్వానివే.  అప్పగించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులకా?. ఎన్నికల ముందు ఏం చెప్పారు? బిర్యానీ పెడతామని నమ్మించారు. కానీ, ఈరోజు అవేవీ లేవు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ లేదు. దాంతో వారు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు ఇవ్వడం లేదు. విశాఖలో మా హయాంలో రిషికొండపై రూ.230 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్‌ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికంగా ఉంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు నిర్వహించిన యోగా డే కోసం అంత కంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామాగ్రి కొనుగోలులోనూ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.
     

    YS Jagan: దేశ చరిత్రలో ఇలాంటి ఉద్యమం ఇదే మొదటిసారి

     

  • ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణు వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంగా మారిన వేళ.. సోషల్‌ మీడియాలో ఆ ప్రజా ఉద్యమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.  ఎక్స్‌లో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం టాప్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. కోటి సంతకాల సేకరణకు ఎక్స్‌లో మద్దతు వెల్లువెత్తుతోంది.   కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.

    వైఎస్సార్‌సీపీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు ర్యాలీలకు యువత, ఉద్యోగులు, మేధావులు సహా అన్ని రంగాల నిపుణులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను బట్టబయలు చేసింది. 

    పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పించారు. అదే సమయంలో వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేశారు. తాను అధికారంలో ఉండగానే మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు కూడా. అయితే..

    చంద్రబాబు ప్రభుత్వం ఆ క్రెడిట్‌ను నాశనం చేయాలని బలంగా నిర్ణయించింది. స్వతహాగానే పెత్తందారుల సీఎం అయిన చంద్రబాబు.. పీపీపీ పేరిట లక్షల కోట్ల విలువైన ఆ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను చూపించైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని వైఎస్‌ జగన్‌ భావించారు. ఒక పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

    ఇందులో భాగంగానే.. కోటి సంతకాల సేకరణ ఉద్యమం “రచ్చబండ” కార్యక్రమం నుంచి మొదలై.. నియోజకవర్గాలు నుంచి ఇవాళ జిల్లా కేంద్రాలు దాటింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైనే సంతకాలు సేకరించి.. వాటిని ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయానికి తరలించింది. వీటిని రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్‌కు నివేదించి.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలన్నదే వైఎస్‌ జగన్‌ అభిమతం. 

     

Sports

  • టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్‌ అందింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహితులు జాతీయ మీడియాకు వెల్లడించారు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత జైసూ.. దేశీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో ముంబై తరపున బరిలోకి దిగాడు.

    మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడి 145 పరుగులు సాధించాడు జైసూ (Yashasvi Jaiswal). ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే, రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు జైస్వాల్‌ అస్వస్థతకు గురయ్యాడు. అయినప్పటికీ పుణె వేదికగా రాజస్తాన్‌తో మ్యాచ్‌ బరిలో దిగి.. 15 పరుగులు చేసి అవుటయ్యాడు.

     తీవ్రమైన కడుపు నొప్పి
    అయితే, ఈ సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌ తర్వాత జైస్వాల్‌ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన పుణెలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం పొట్టలో తీవ్రమైన ఇన్షెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు తేల్చారు.

    ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఫుడ్‌ పాయిజన్‌ (Food Poison) అయింది. పుణె హోటళ్లో జైస్వాల్‌ తిన్న కలుషిత ఆహారమే ఇందుకు దారితీసింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిల్లాడాడు.

    రెండు రోజుల్లో 2 కిలోలు తగ్గాడు
    అయితే, వైద్యుల చికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. రెండు రోజుల్లోనే రెండు కిలోల బరువు తగ్గిపోయాడు. పూర్తిగా కోలుకోవడానికి 7- 10 రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు’’ అని పేర్కొన్నాయి.

    ఈ నేపథ్యంలో జైస్వాల్‌ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ నాటికి 23 ఏళ్ల ఈ యువ ఓపెనర్‌ తిరిగి టీమిండియాతో చేరే అవకాశం ఉంది. 

    కాగా రాజస్తాన్‌తో సూపర్‌ లీగ్‌ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ.. నెట్‌ రన్‌ రేటు తక్కువగా ఉన్న కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో పుణె వేదికగా గురువారం జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించి జార్ఖండ్‌ విజేతగా నిలిచింది.

    చదవండి: AUS vs ENG: ఆర్చర్‌పై స్టోక్స్‌ ఫైర్‌!.. చెంప చెళ్లుమనిపించేలా రిప్లై

  • దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్‌ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.

    పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా టైటిల్‌ పోరులో హర్యానా- జార్ఖండ్‌ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    101 పరుగులు
    మరో ఓపెనర్‌ విరాట్‌ సింగ్‌ (2) విఫలమైనా.. ఇషాన్‌ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్‌ కుశాగ్రా మెరుపు హాఫ్‌ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.

    ధనాధన్‌ ఇన్నింగ్స్‌
    అనంతరం అనుకుల్‌ రాయ్‌ (20 బంతుల్లో 40), రాబిన్‌ మింజ్‌ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్‌ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, సమంత్‌ జేఖర్‌, సుమిత్‌ కుమార్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. జార్ఖండ్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్‌ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్‌ అంకిత్‌ కుమార్‌, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్‌ సివాజ్‌ డకౌట్‌ అయ్యారు.

    పోరాడిన మిడిలార్డర్‌
    ఇలాంటి దశలో మిడిలార్డర్‌లో యశ్‌వర్ధన్‌ దలాల్‌ (22 బంతుల్లో 53), నిషాంత్‌ సింధు (15 బంతుల్లో 31), సమంత్‌ జేఖర్‌ (17 బంతుల్లో 38) ధనాధన్‌ ఆడి.. ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్‌ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.

    ఆఖర్లో పార్త్‌ వట్స్‌ (4), సుమిత్‌ కుమార్‌ (5), అన్షుల్‌ కాంబోజ్‌ (11) తడబడగా.. అమిత్‌ రాణా (13 నాటౌట్‌), ఇషాంత్‌ భరద్వాజ్‌ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్‌ కావడంతో జార్ఖండ్‌ 69 పరుగుల తేడాతో గెలిచింది.

    జార్ఖండ్‌ బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా, బాల్‌ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్‌ గెలుచుకున్న జార్ఖండ్‌.. తాజాగా ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.

    చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్‌ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు
     

  • బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో  గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న 45వ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్- 2025 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. 2028 ఒలంపిక్స్‌తో పాటు.. భవిష్యత్తులో జరిగే అన్ని  ప్రపంచ స్థాయి పోటీల్లో  ఆర్చరీ విభాగంలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

    అదే విధంగా.. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌నకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆర్చరీ ఫెడరేషన్ సంసిద్ధతను వ్యక్తం చేస్తుందని అర్జున్‌ ముండా అన్నారు. భారతదేశ పురాతన క్రీడ అయిన విలువిద్యకు  గౌరవస్థానం దక్కేందుకు  ప్రణాళిక బద్ధమైన కృషి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    ఇక ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా  నూతన ప్రతిభ కు ప్రోత్సాహం లభిస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ముందుకు వచ్చే క్రీడా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుంది’’ అని తెలిపారు.

    అదే విధంగా.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు టి రాజు మాట్లాడుతూ.. ‘‘48 సంవత్సరాల తర్వాత సీనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించుకోవడం.. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 44 జట్లు.. దాదాపు 25 మంది అర్జున అవార్డు గ్రహీతలు  971 మంది జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాకారులు ఇందులో పాల్గొనడం.. 

    ఎటువంటి లోపం లేకుండా ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం సంతోషం కలిగిస్తోంది’’ అని అన్నారు. ఈ పోటీల నిర్వహణకు అన్ని విధాలుగా సహకరించిన ఎన్టీపీసీ బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యజమాన్యం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం స్పోర్ట్స్ అథారిటీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

    ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి అరవింద్, ఆర్చరీ డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యులు పుట్టా శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ అసోసియేషన్ అశ్విన్ రావు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్ గుస్తీ నోరియా, సభ్యులు మర్రి ఆదిత్య రెడ్డి  ఆర్చరీ ఫెడరేషన్ సభ్యులు వివిధ రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు.

  • భారత క్రీడా‌ రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్‌-2025లో పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీతో పాటు ఆయుశ్‌ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్‌లో దివ్యా దేశ్‌ముఖ్‌ మహిళల వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!

    దూసుకొచ్చిన యువ కెరటం
    భారత క్రికెట్‌లో నయా సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

    ఈ క్రమంలో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో శతక్కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా యూత్‌ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.

    ఆయుశ్‌ మాత్రే
    మహారాష్ట్రకు చెందిన ఆయుశ్‌ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్‌ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లో  48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.

    ఇక వైభవ్‌ బ్యాటర్‌గా భారత అండర్‌-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్‌ అతడికి ఓపెనింగ్‌ జోడీగా ఉంటూనే కెప్టెన్‌గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.

    దివ్య దేశ్‌ముఖ్‌
    భారత చెస్‌ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్‌ముఖ్‌. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపిని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది.

    తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్‌ అందుకున్న ప్లేయర్‌గానూ రికార్డు సాధించింది. వరల్డ్‌కప్‌ విజయంతోనే దివ్యకు గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కింది. ఓవరాల్‌గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్‌ మాస్టర్‌గా దివ్య నిలిచింది.

    ఇక వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌-2026​కు కూడా దివ్య దేశ్‌ముఖ్‌ అర్హత సాధించింది.

    డి. గుకేశ్‌
    గతేడాది వరల్డ్‌చెస్‌ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్‌ స్విస్‌-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్‌ రేటింగ్‌ లిస్టులో వరల్డ్‌ నంబర్‌ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు.  

    ఆర్‌. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్‌బాబు
    చెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్‌ గ్రాండ్‌మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్‌ చెస్‌-2025లో గుకేశ్‌ను టై బ్రేకర్‌లో ఓడించి టైటిల్‌ సాధించాడు.

    తద్వారా ఫిడే రేటింగ్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్‌ నంబర్‌ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.

    ఇక వైశాలి రమేశ్‌ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్‌ స్విస్‌ 2025 టైటిల్‌ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్‌ ప్లేయర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్‌ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.

    టాటా స్టీల్‌ చాలెంజర్స్‌లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్‌బాబు మహిళల రేటింగ్స్‌లో ఇండియా నంబర్‌ 2గా నిలిచింది. వీరితో పాటు  తెలంగాణ స్టార్‌ అర్జున్‌ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.

    మరెన్నో విజయాలు
    ఫ్రీస్టైల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌నే ఓడించి నాకౌట్‌కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్‌ రౌండ్‌ రాబిన్‌ స్టేజ్‌లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్‌ఫైనల్స్‌లో విన్సెంట్‌ కెమెర్‌ చేతిలో ఓడిపోవడంతో అర్జున్‌ సెమీస్‌ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.

    ఇక ఇతరులలో పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి ఈ ఏడాది వరల్డ్‌ ఆర్చరీ పారా చాంపియన్‌షిప్స్‌ గెలిచింది. మరోవైపు.. షూటర్‌ సామ్రాట్‌ రాణా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్స్‌షిప్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో టైటిల్‌ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

    వీరితో పాటు పారా అథ్లెట్‌ సుమిత్‌ ఆంటిల్‌, అథ్లెట్‌ అనిమేశ్‌ కుజూర్‌ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ తొలిసారి మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది.  

    చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..

  • దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఎలైట్‌-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో హర్యానాతో టైటిల్‌ పోరులో టాస్‌ ఓడిన జార్ఖండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    ఓపెనర్లలో విరాట్‌ సింగ్‌ (2) విఫలం కాగా.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.

    శతక్కొట్టిన ఇషాన్‌ కిషన్‌.. కుశాగ్రా ధనాధన్‌
    మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌ కిషన్‌ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.

    అనుకుల్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌
    ఇషాన్‌ కిషన్‌, కుమార్‌ కుశాగ్రాకు తోడు అనుకుల్‌ రాయ్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌ దంచికొట్టారు. అనుకుల్‌ రాయ్‌ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్‌ మింజ్‌ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.

    ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, సుమిత్‌ కుమార్‌, సమంత్‌ జేఖర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

    చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐ

  • యాషెస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా రెండోరోజూ ఆధిపత్యం కొనసాగించింది. అడిలైడ్‌ వేదికగా గురువారం ఆట పూర్తయ్యే సరికి.. ఇంగ్లండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 213 పరుగులే చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 158 పరుగులు వెనుకబడింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లిష్‌ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.

    ఓపెనర్లు జాక్‌ క్రాలీ (9), బెన్‌ డకెట్‌ (29) నిరాశపరచగా.. ఓలీ పోప్‌ (3), జో రూట్‌ (19) కూడా విఫలం అయ్యారు. ఇలాంటి దశలో హ్యారీ బ్రూక్‌ (45), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (45 నాటౌట్‌) మెరుగైన ఆటతో జట్టు పరువు కాపాడే ప్రయత్నం చేశారు. 

    మిగిలిన వారిలో జేమీ స్మిత్‌ 22 పరుగులు చేయగా.. విల్‌ జాక్స్‌ (6), బ్రైడన్‌ కార్స్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో టెయిలెండర్‌ జోఫ్రా ఆర్చర్‌ 30 పరుగులతో అజేయంగా నిలవడంతో.. స్కోరు 200 అయినా దాటగలిగింది.

    ఆసీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) మూడు వికెట్లతో చెలరేగగా.. స్కాట్‌ బోలాండ్‌ రెండు, నాథన్‌ లియోన్‌ రెండు, కామెరాన్‌ గ్రీన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

    స్టార్క్‌ అర్ధ శతకం
    ఇదిలా ఉంటే.. అంతకు ముందు 326/8తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ 371 పరుగులకు ఆలౌట్‌ అయింది.  టెయిలెండర్‌ మిచెల్‌ స్టార్క్‌ అర్ధ శతకం(54)తో అదరగొట్టడంతో కంగారూలకు ఈ మేర స్కోరు సాధ్యమైంది.

    ఇంగ్లండ్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టార్క్‌ వరుస విరామాల్లో ఫోర్లు బాదుతూ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. అయితే, అతడిని నిలువరించేందుకు ఇంగ్లండ్‌ సారథి స్టోక్స్‌ తన వ్యూహాలన్నీ అమలు చేసి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే తమ జట్టు స్టార్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer)పై అసహనం ప్రదర్శించాడు.

    ఇందుకు ఆర్చర్‌ తన ఆటతోనే సమాధానం ఇచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 86వ ఓవర్లో బంతితో రంగంలో దిగిన ఆర్చర్‌.. స్టార్క్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. దెబ్బకు లెగ్‌ స్టంప్‌ కూడా ఎగిరిపోయింది.

    చెంప చెళ్లుమనిపించేలా రిప్లై!
    ఈ క్రమంలో ఆర్చర్‌ను సహచరులు అభినందిస్తుండగా.. స్టోక్స్‌ మాత్రం.. ‘‘నువ్వు ప్రతిసారి ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్ల గురించి ఫిర్యాదు చేయకు. సరైన లైన్‌ అండ్ లెంగ్త్‌తో‌ బౌల్‌ చేయి’’ అని చెప్పినట్లుగా ఉంది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరే వేళ సహచరులు వారిని విడదీశారు.

    ఈ నేపథ్యంలో ఆర్చర్‌.. ‘‘నాకే సలహా ఇస్తున్నాడు చూడు’’ అన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్చర్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. కాగా స్టోక్స్‌- ఆర్చర్‌ వాగ్వాదం గురించి కామెంటేటర్‌, ఆసీస్‌ దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ స్పందిస్తూ..

    ‘‘ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. స్టోక్స్‌ నేరుగా అతడి దగ్గరికి వెళ్లి క్లాస్‌ తీసుకున్నాడు. అయితే, ఇందుకు ఆర్చర్‌ చెంప మీద కొట్టినట్లుగా వికెట్‌తో సమాధానం ఇచ్చాడు’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శనతో పేసర్‌ స్టార్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడం విశేషం.

    చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్‌ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు

  • భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 రద్దైన నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై విమర్శల వర్షం కురుస్తోంది. లక్నోలో పొగమంచు కారణంగా టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను ముగించాల్సి వచ్చింది. ఆరుసార్లు మైదానంలోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు ఆఖరికి 9.30 నిమిషాల సమయంలో.. ప్రతికూల వాతావరణం వల్ల మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

    అయితే, ఉత్తర భారతంలో పరిస్థితులు తెలిసి కూడా బీసీసీఐ (BCCI) ఇలా మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేయడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో అక్కడ కాలుష్యం, పొగమంచు ఏ స్థాయిలో ఉంటుందో తెలిసినా లక్నోలో మ్యాచ్‌ ఎలా షెడ్యూల్‌ చేశారని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

     స్పందించిన బీసీసీఐ
    మరోవైపు.. లక్నో మ్యాచ్‌ కోసం టికెట్ల రూపంలో డబ్బులు ఖర్చుచేసిన ప్రేక్షకులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించారు. ఈ మ్యాచ్‌ నిర్వహణకు ఉత్తరప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (UPCA) బాధ్యత వహిస్తుందని తెలిపారు.

    ‘‘ఈ మ్యాచ్‌ టికెట్ల విక్రయాన్ని రాష్ట్ర అసోసియేషన్‌ చూసుకుంది. బీసీసీఐ మ్యాచ్‌ నిర్వహణ హక్కులను మాత్రమే వారికి ఇచ్చింది. మిగతా విషయాలన్ని యూపీసీఏ పరిధిలోనే ఉంటాయి’’ అని IANSకు గురువారం దేవజిత్‌ సైకియా తెలిపారు. తద్వారా ప్రేక్షకులకు టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో యూపీసీఏదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు. 

    రీఫండ్‌ నిబంధనల ప్రకారం.. 
    కాగా బీసీసీఐ రీఫండ్‌ నిబంధనల ప్రకారం.. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దైతే టికెట్లు కొనుక్కున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు అర్హులు అవుతారు. ఇప్పుడు బంతి యూపీసీఏ కోర్టులో ఉందన్నమాట! 

    కాగా సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత కటక్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో ప్రొటిస్‌ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

    ఈ క్రమంలో ధర్మశాలలో మూడో టీ20లో భారత్‌ గెలిచి.. 2-1తో ఆధిక్యం సంపాదించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో నాలుగో టీ20 జరగాల్సి ఉండగా.. పొగమంచు వల్ల రద్దైపోయింది. ఇరుజట్ల మధ్య ఆఖరి, ఐదో టీ20కి అహ్మదాబాద్‌ వేదిక.

    చదవండి: తల్లి నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!

  • న్యూజిలాండ్‌ స్టార్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం మొదలైన మూడో టెస్టు సందర్భంగా ఈ ఘనత సాధించారు.

    డబ్ల్యూటీసీ  (WTC)  2025-27లో భాగంగా కివీస్‌ జట్టు స్వదేశంలో విండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడుతోంది. అసాధారణ పోరాటంతో వెస్టిండీస్‌ తొలి టెస్టు డ్రా చేసుకోగా.. రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం ‘బే ఓవల్‌’ వేదికగా మూడో టెస్టు మొదలైంది.

    ఓపెనింగ్‌ జోడీగా వచ్చి.. శతకాలతో చెలరేగి
    టాస్‌ గెలిచిన ఆతిథ్య కివీస్‌.. పర్యాటక విండీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (Tom Latham), డెవాన్‌ కాన్వే సెంచరీలతో చెలరేగారు. లాథమ్‌ 246 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 137 పరుగులు చేసి.. రోచ్‌ బౌలింగ్‌లో రోస్టన్‌ చేజ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

    మరోవైపు.. తొలిరోజు ఆట ముగిసే సరికి కాన్వే 279 బంతుల్లో 178 పరుగులతో (25 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మన్‌ జేకబ్‌ డఫీ (Jacob Duffy) 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫలితంగా గురువారం నాటి మొదటిరోజు ఆటలో న్యూజిలాండ్‌ 90 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 334 పరుగులు సాధించింది.

    ప్రపంచ రికార్డు
    ఇదిలా ఉంటే.. తొలి వికెట్‌కు లాథమ్‌, కాన్వే కలిసి 520 బంతుల్లో ఏకంగా 323 పరుగులు జతచేశారు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం విశేషం. సౌతాఫ్రికాతో టెస్టులో 2019లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ- మయాంక్‌ అగర్వాల్‌ తొలి వికెట్‌కు 317 పరుగులు జోడించగా.. లాథమ్‌- కాన్వే తాజాగా ఈ రికార్డును సవరించారు.

    అంతేకాదు.. సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించిన జోడీగానూ లాథమ్‌- కాన్వే చరిత్రకెక్కారు. గతంలో ఈ రికార్డు చార్లెస్‌ స్టెవర్ట్‌ డెంప్‌స్టర్‌- జాన్‌ ఎర్నెస్ట్‌ మిల్స్‌ పేరిట ఉండేది. వీరిద్దరు కలిసి ఇంగ్లండ్‌పై 1930లో 276 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

    ఇదిలా ఉంటే.. అబుదాబిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలి పోయిన కాన్వే.. వేలం తర్వాత తన తొలి మ్యాచ్‌లోనే రికార్డు సెంచరీ సాధించడం విశేషం.

    చదవండి: IPL 2026 Auction: స్టీవ్‌ స్మిత్‌, కాన్వేలకు షాక్‌.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి.  ఐపీఎల్‌-2026 మినీ వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.

    రూ. 14.20 కోట్లు
    అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు అయిన కార్తిక్‌ శర్మ (Kartik Sharma), ప్రశాంత్‌ వీర్‌ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్‌ టీ20 లీగ్‌లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్‌, ప్రశాంత్‌ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.

    వీరిద్దరిలో కార్తిక్‌ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్‌ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌. అతడి తల్లిదండ్రులు మనోజ్‌ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.

    అయితే, కుమారుడిని క్రికెటర్‌ చేయాలన్నది కార్తిక్‌ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్‌ తండ్రి మనోజ్‌ శర్మ మాటల్లోనే..

    నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు
    ‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్‌ను క్రికెటర్‌ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్‌ అయితే చాలు అనుకునేది.

    కార్తిక్‌ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్‌పై పడకుండా మేము చూసుకున్నాము.

    గ్వాలియర్‌లో టోర్నమెంట్‌ ఆడేందుకు కార్తిక్‌ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్‌లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్‌ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్‌ చేరింది. అయితే, ఆ మ్యాచ్‌ అయ్యేంత వరకు గ్వాలియర్‌లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.

    ఖాళీ కడుపుతోనే
    అప్పుడు మేము ఓ నైట్‌ షెల్టర్‌లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్‌ గెలిచిన తర్వాత కార్తిక్‌కు వచ్చిన ప్రైజ్‌మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.

    అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్‌తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్‌ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్‌ శర్మ తెలిపారు.

    చదువునూ కొనసాగిస్తా
    కాగా దేశీ క్రికెట్‌లో సత్తా చాటిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కార్తిక్‌ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్‌.. క్రికెట్‌తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్‌ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

    సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్‌ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్‌కు అతడు సెలక్ట్‌ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్‌ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.

    చదవండి: IND vs SA: 'ఇంత‌కంటే దారుణ ప‌రిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణ‌యంతో షాక‌య్యాను'

  • అడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ జ‌ట్టు 8 వికెట్ల న‌ష్టానికి 213 ప‌రుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్‌(45), జోఫ్రా ఆర్చ‌ర్‌(30) ఉన్నారు. వీరిద్ద‌రూ తొమ్మిదో వికెట్‌కు 45 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 

    ఇంగ్లండ్ జ‌ట్టు ఇంకా 158 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాట‌ర్ల పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది.  ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌, ఆర్చ‌ర్‌తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫ‌ర్వాలేద‌న్పించారు. వైస్ కెప్టెన్ పోప్‌(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశ‌ప‌రిచారు.

    ఆసీస్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. లియోన్‌, బోలాండ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. మ‌రో వికెట్ గ్రీన్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంత‌కుముందు 326/8 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఆసీస్ 371 ప‌రుగుల‌కు ఆలౌటైంది.  వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా..ఖ‌వాజా(82), స్టార్క్‌(54) రాణించారు.

    డీఆర్ఎస్ వివాదం..
    కాగా ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండ‌గా బంతి స్ప‌ష్టంగా బ్యాట్‌కు తాకిన‌ప్ప‌టికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్న‌ప్ప‌టికి స్నికోమీట‌ర్‌లో స్పైక్ చూపించ‌క‌పోవ‌డంతో థ‌ర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది

  • అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దు కావడంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.

    ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు సఫారీలు కూడా ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాత్మక పోరులో టీమిండియా కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

    సంజూకు లక్కీ ఛాన్స్‌!
    ఈ మ్యాచ్‌కు భార‌త వైస్ కెప్టెన్  శుభ్‌మ‌న్ గిల్ గాయం కార‌ణంగా దూరమ‌య్యాడు. నాలుగో టీ20కు ముందు ప్రాక్టీస్ చేస్తుండ‌గా గిల్ పాదానికి గాయ‌మైంది. దీంతో చివ‌రి రెండు టీ20ల‌కు అత‌డు దూరంగా ఉండ‌నున్న‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

    గిల్ గైర్హ‌జ‌రీలో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ తిరిగి తుది జ‌ట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి భారత ఇన్నింగ్స్‌ను సంజూ ప్రారంభించ‌నున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన శాంసన్.. 2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో తన ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం.

    బుమ్రా రీఎంట్రీ!
    మ‌రోవైపు ఈ కీల‌క మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా అందుబాటులో ఉండవచ్చు. వ్యక్తిగత కారణాల వల్ల మూడో మ్యాచ్‌కు దూరమైన అతను.. నాలుగో మ్యాచ్‌ సందర్భంగా జట్టుతో కలిసి కనిపించాడు. కాబట్టి ఇప్పుడు ఐదో టీ20లో అతడు ఆడే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

    ఒక‌వేళ అత‌డు జ‌ట్టుతో క‌లిస్తే హ‌ర్షిత్ రాణా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఉండకపోవచ్చు. అదేవిధంగా అక్ష‌ర్ ప‌టేల్ స్ధానంలో ప్రధాన జ‌ట్టులోకి వ‌చ్చిన ఆల్‌రౌండ‌ర్ షాబాజ్ అహ్మ‌ద్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు.

    భారత తుది జట్టు (అంచనా):
    అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా/ హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.
    చదవండి: IND vs SA: క్రికెట్ వ‌ర్సెస్ కాలుష్యం.. నిజంగా ఇది సిగ్గు చేటు!
     

Business

  • డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా కొత్త ఉత్సాహం నిండుకుంటుంది. క్యాలెండర్ మారుతున్న వేళ, పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయం కేవలం వేడుకలకే పరిమితం కాదు; ఇది ఒక భారీ ఆర్థిక చక్రానికి ఎనర్జీగా ఉంటుంది. నగరాల్లోని పబ్‌ కల్చర్‌ నుంచి గ్రామాల్లోని సెలబ్రేషన్స్‌ వరకు.. ఇయర్ ఎండింగ్ అనేది కోట్లాది రూపాయల వాణిజ్యానికి వేదికగా మారుతోంది.

    డిసెంబర్ 31 రాత్రి.. గడియారం ముల్లు 12 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థల గల్లా పెట్టెలు నిండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో పండుగ సీజన్, ఇయర్ ఎండింగ్ ఖర్చులు సుమారు 32% పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవెంట్ కల్చర్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు, పల్లెటూళ్లకు కూడా పాకింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిసెంబర్ ముగింపు అంటే ఒక వేడుక కాదు, అదొక భారీ వాణిజ్య జాతర!

    నగరాల్లో ఈవెంట్లు - కార్పొరేట్ వాణిజ్యం

    • నగరాల్లో ఇయర్ ఎండింగ్ అంటేనే విలాసవంతమైన పార్టీలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, స్టే-కేషన్లు(స్టేయింగ్‌+వెకేషన్స్‌ Staycations). ఇక్కడ వాణిజ్యం ప్రధానంగా వివిధ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటుంది.

    • హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు ఒక నెల ముందే బుకింగ్‌లు ప్రారంభిస్తాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.20,000 అంత కంటే ఎక్కువే పలుకుతుంది. డీజేలు, డ్యాన్సర్లు, లైటింగ్ డెకరేటర్లకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. 

    • నగరవాసులు ఇయర్ ఎండింగ్ కోసం గోవా, పాండిచ్చేరి, కేరళ.. వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు లాభాలను ఆర్జిస్తాయి. 

    • బట్టలు, గాడ్జెట్లు, కానుకల అమ్మకాలు పెరగనున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతో షాపింగ్ మాల్స్ ఇచ్చే ఆఫర్లు మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తాయి.

    ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

  • దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మేనేజ్‌మెంట్ నిర్మాణంలో కీలక మార్పులను ప్రకటించింది. సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా శశ్వత్ శర్మ నియమితులయ్యారు. ఈ మార్పులు జనవరి 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.

    ప్రస్తుతం ఎయిర్‌టెల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న శశ్వత్ శర్మ ఐదేళ్ల పాటు ఈ ఉన్నత పదవిని చేపట్టనున్నారు. హెచ్ఆర్, నామినేషన్ కమిటీ సిఫార్సుల మేరకు డిసెంబర్ 18న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శశ్వత్ శర్మ ఇకపై సంస్థ కీలక నిర్వాహక సిబ్బంది(KMP)గా కూడా వ్యవహరిస్తారు.

    గోపాల్ విట్టల్‌కు పదోన్నతి

    ప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా ఉన్న గోపాల్ విట్టల్ ఇకపై ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. జనవరి 1, 2026 నుంచి ఆయన ఐదేళ్ల పాటు పూర్తికాల డైరెక్టర్‌గా కొనసాగుతారు. సంస్థ వ్యూహాత్మక అభివృద్ధిలో ఆయన తన మార్గదర్శకత్వాన్ని కొనసాగించనున్నారు.

    ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!

  • భారత ఇంధన రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ (SHANTI) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించింది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

    అడ్డంకుల తొలగింపు

    సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం పాత కాలపు అణు ఇంధన చట్టం (1962), సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010)ను రద్దు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమైన అణు విద్యుత్ ఉత్పత్తి, దాని అనుబంధ కార్యకలాపాలు ఇకపై ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

    నిరసన సెగ

    మరోవైపు, ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, ఇంజినీర్ల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటీకరణ వల్ల అణు భద్రత, జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమన్వయంతో డిసెంబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

    అభ్యంతరం ఎందుకంటే..

    రియాక్టర్ సరఫరాదారులను (Supplier Liability) సైతం రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. పరికరాల లోపాల వల్ల ప్రమాదం జరిగితే తయారీదారులను కాపాడి ఆ భారాన్ని ప్రభుత్వం, ప్రజలపై వేసేలా ఈ నిబంధన ఉందని ఏఐపీఈఎఫ్‌ చైర్మన్ శైలేంద్ర దూబే విమర్శించారు.

    ప్రధాన డిమాండ్లు

    ప్రభుత్వం వెంటనే ‘శాంతి’ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వెళ్లాలనుకుంటే కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు.

    • సప్లయర్‌ లయబిలిటీ నిబంధనలను పునరుద్ధరించాలి.

    • స్వతంత్ర అణు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.

    • పర్యావరణ, కార్మిక రక్షణలను పటిష్టం చేయాలి.

    • విదేశీ భాగస్వామ్యంపై పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలి.

    భారతదేశం తన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులు, నిపుణులు మాత్రం తగిన చర్చ లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 23న జరగబోయే నిరసనలు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తాయో వేచి చూడాలి.

    ఇదీ చదవండి: టోకనైజేషన్‌ బిల్లు కోసం పార్లమెంట్‌లో డిమాండ్‌

  • ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్‌లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.

    టోకనైజేషన్ అంటే ఏమిటి?

    సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.

    ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.

    ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?

    ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్‌డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.

    విదేశీ మూలధనం

    సింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్‌లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

    మధ్యతరగతికి మేలు

    మధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.

    ప్రయోజనాలు

    సాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్‌చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.

    ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.

    ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

  • మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.

    మైత్రి-1

    1981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్‌లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.

    మైత్రి-1 సాధించిన విజయాలు

    గత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..

    • మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:

    • ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.

    • తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.

    • ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.

    • ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.

    ప్రస్తుత స్థితి.. సవాళ్లు

    కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.

    గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.

    ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ క్యూఆర్ కోడ్ బోర్డులు

  • జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రవేశపెట్టిన క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత సమాచార బోర్డులు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరులోని కీలక రహదారులపై ఏర్పాటు చేసిన ఈ బోర్డులు, ఆశించిన స్థాయిలో సమాచారాన్ని అందించడం లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.

    ఎన్‌హెచ్‌ఏఐ ఏం చెబుతోంది?

    బెంగళూరులోని ఎన్‌హెచ్‌-48 (బెంగళూరు-నెలమంగళ), ఎన్‌హెచ్‌-75 (బెంగళూరు-కోలార్-ముల్బాగల్) రూట్లలో క్యూఆర్ కోడ్ బోర్డులను ఎన్‌హెచ్‌ఏఐ ఏర్పాటు చేసింది. సాంకేతికతను ఉపయోగించుకుని వినియోగదారులకు కొన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. అత్యవసర సమాచారంలో భాగంగా హైవే పెట్రోలింగ్ బృందాలు, ఇంజినీర్లు, సమీప పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి. సమీపంలోని టోల్ ప్లాజాలు, మార్గమధ్యలో ఉండే మౌలిక సదుపాయాల వివరాలు ఉంటాయి.

    పారదర్శకత ఎక్కడ?

    క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎన్‌హెచ్‌ఏఐ చెబుతున్న దానికి భిన్నంగా ఉందని వాహనదారులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుత బోర్డులకు పొంతన లేదని వాదిస్తున్నారు.

    ప్రయాణికులు లేవనెత్తుతున్న ప్రధానాంశాలు

    • క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం, పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పేరు, కన్సల్టెంట్ వివరాలు, స్థానిక ఎమ్మెల్యే వివరాలు కనిపించడం లేదు.

    • రోడ్డు నాణ్యత సరిగ్గా లేనప్పుడు ఎవరిని ప్రశ్నించాలో తెలియడం లేదని ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా కమ్యూనిటీ నోట్స్ ద్వారా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    ‘ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్, కన్సల్టెంట్, అధికారులు ఎవరో క్యూఆర్ కోడ్ ద్వారా ప్రదర్శించాలి. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుంది’ అని గతంలో నితిన్ గడ్కరీ స్వయంగా పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్‌లో ఈ వివరాలు లేకపోవడం గమనార్హం.

    ఇదీ చదవండి: సామాన్యుడి చేతిలో సమస్తం!

  • ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని  ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.

    సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలు

    చదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్‌’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్‌బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.

    గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?

    • వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్‌లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.

    • గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.

    • ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్‌బాట్లు సహాయపడుతున్నాయి.

    ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?

    • స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్‌లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.

    • గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.

    • మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.

    ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు

  • ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్‌లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    పెరుగుతున్న బ్యాటరీలు

    ప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్‌ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.

    రీసైక్లింగ్ ప్రక్రియ

    బ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్‌కు బాధ్యత వహించాలి.

    బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’

    అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్‌ లైఫ్‌ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.

    సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.

    వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్‌గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.

    బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్‌లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.

    నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్‌లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.

    ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్‌

  • 2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్ఏదైనా ఉందంటే అది స్మార్ట్ఫోన్‌. శాంసంగ్నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్బ్రాండ్లు ప్రతినెలా కొత్త మోడల్స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి.

    అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్ఫోన్లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్స్మార్ట్ఫోన్లేవో కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..

    • షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్‌.

    • రియల్మీ 14ఎక్స్ 5జీ: మంచి డిసప్లే, బ్యాటరీ లైఫ్తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.

    • మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్ వేర్ ఎక్స్పీరియన్స్తో బ్రాండ్ సపోర్ట్తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్

    • ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్పొందింది.

    • వన్ప్లస్నార్డ్సీఈ 2 లైట్5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్ఎక్స్పీరియన్స్‌, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్‌.

    గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్ఫోన్బ్రాండ్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్‌, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది.

  • భారత ఆటోమొబైల్ రంగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా నిస్సాన్ మోటార్ ఇండియా కీలక అడుగు వేసింది. త్వరలో లాంచ్‌ చేయబోతున్న కాంపాక్ట్ త్రీ-రో ఎంపీవీకి ‘గ్రావైట్’ (Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ గురువారం అధికారికంగా ధ్రువీకరించింది. ఈమేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ అమియో రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మెసిమిలియనో మెస్సినా, నిస్సాన్ ఇండియా మోటార్‌ ఎండీ సౌరభ్‌వస్తా పాల్గొన్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకున్నారు.

    కంపెనీ ప్రకటించిన రోడ్‌మ్యాప్ ప్రకారం గ్రావైట్ ఎంపీవీని జనవరి 2026లో ఆవిష్కరించునున్నారు. షోరూమ్‌ల్లో మార్చి 2026 నుంచి ఈ మోడల్‌ అందుబాటులోకి రానుంది. దీని ధరల వివరాలు కూడా అప్పుడే తెలియజేస్తామని చెప్పారు. నిస్సాన్ ఇండియా నూతన ఉత్పత్తి వ్యూహంలో భాగంగా జులై 2024లో ప్రకటించిన రెండో మోడల్ ఇది. దీని తర్వాత 2026 మధ్యలో టెక్టన్ ఎస్‌యూవీని, 2027 ప్రారంభంలో మరొక 7 సీట్ల సీ-ఎస్‌యూవీని విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది.

    గ్రావైట్ ఎంపీవీని తమిళనాడులోని ఒరగదంలోని రెనాల్ట్-నిస్సాన్ ప్లాంట్‌లో పూర్తిస్థాయిలో స్థానికంగా తయారు చేయనున్నట్లు అమియో రీజియన్‌ ఛైర్‌పర్సన్‌ మెసిమిలియనో మెస్సినా చెప్పారు. భారత కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీని డిజైన్‌ ఉంటుందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ కంపెనీకు ప్రధాన మార్కెట్‌ అని చెప్పారు.

    నిస్సాన్ ఇండియా మోటార్‌ ఎండీ సౌరభ్‌వస్తా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో 7-సీటర్ ఆప్షన్‌గా ఈ మోడల్‌ నిలవనుంది. ఇండియాలో కంపెనీ వేగంగా వృద్ధి చెందాలని భావిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో లాంచ్‌ అయిన మాగ్నైట్‌, త్వరలో లాంచ్‌ కానున్న టెక్టాన్‌, గ్రావైట్‌ మోడళ్ల ఆవిష్కరణ అందుకు నిదర్శనం. భవిష్యత్తులో భారత్‌లో నిస్సాన్‌ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువయ్యేలా చేసేందుకు కంపెనీ 100 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చేలా, కస్టమర్లకు నచ్చే డిజైన్లలో ఉత్పత్తులను అందిస్తున్నాం. ఈ క్రమంలో టెక్నాలజీని వాడుతున్నాం. అదే సమయంలో వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం’ అన్నారు.

    డిజైన్, ఫీచర్లు

    నిస్సాన్ విడుదల చేసిన టీజర్ చిత్రాల ప్రకారం కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్ (LED ల్యాంప్స్), అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బానెట్, టెయిల్‌గేట్‌పై స్పష్టంగా కనిపించే ‘గ్రావైట్’ బ్యాడ్జింగ్ ఉంది. ఇంటీరియర్ గురించి అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన క్యాబిన్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.

    ఇదీ చదవండి: డ్రైవర్ల పంట పండించే ‘భారత్‌ ట్యాక్సీ’

  • భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు జీడీపీపరంగా భారత్‌ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. మరి జీడీపీలో పురోగతి సాధిస్తున్నా రూపాయి పతనం ఎందుకు.. భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి.. విద్యాపరంగా పరిమితులేంటి.. తదితర అంశాలను వివరంగా విశ్లేషించారు ఫారిన్‌ ట్రేడ్‌ నిపుణులు, హైదరాబాద్‌కు చెందిన డా.మురళీదర్శన్‌. సాక్షి డిజిటల్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

    అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానం

    అంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం చాలా విస్తృతమైన అంశం. ప్రతి దేశం మనతో స్నేహంగా ఉంటుందని ఆశించకూడదు. అధిక టారిఫ్‌లు భారత ఎగుమతులను బలహీనపరుస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతులు తగ్గడం జరుగుతోంది.

    రూపాయి విలువ.. జీడీపీ

    జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) రూపాయి విలువకు ప్రత్యక్ష సంబంధం లేదు. జీడీపీ అనేది దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఎగుమతులు, దిగుమతుల వ్యత్యాసం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంటివి రూపాయి విలువ ప్రభావితమయ్యే కీలక అంశాలు. దిగుమతులపై ఎక్కువ ఆధారపడితే రూపాయి బలహీనమవుతుంది.

    ఎగుమతుల లోపాలు

    భారత ఎగుమతులు ప్రధానంగా సాఫ్ట్‌వేర్, ఔషధ రంగంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ప్రతి దేశానికి అనుగుణంగా ఎగుమతి విధానాలు మార్చుకోవాలి.

    పరిమిత విద్యా వ్యవస్థ

    భారతదేశంలో నాణ్యమైన పరిశోధనా సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు తిరిగి రావడం లేదు. దీనివల్ల దేశానికి మేథో నష్టం జరుగుతోంది. ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మనవే. ఇప్పుడు మళ్లీ అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలి.

    పాలనలో మేధావుల పాత్ర

    రాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో నిపుణుల అవసరం ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ఏకాధిపత్యం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం 2% మంది వద్ద 98% సంపద ఉంది. సహజ వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగించాలి.

    ఉపాధి అవకాశాలు, సహజ వనరులు

    భారతదేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలు ఉన్నాయి. నౌకల మరమ్మత్తులు, నిర్వహణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉపగ్రహ మ్యాపింగ్ సేవలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.

    విలువ జోడింపు అవసరం

    ఉత్పత్తికైనా విలువ జోడింపు అవసరం. ఉదాహరణకు టమాటాలు పండించే రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వారు వాటిని సాస్ లేదా కేచప్లుగా మార్చి ఎగుమతి చేస్తే మంచి లాభం వస్తుంది. అలాగే కాఫీ, రఫ్ డైమండ్స్ కూడా. ఉత్పత్తికి విలువ జోడిస్తే ఉపాధి లభిస్తుంది. విదేశీ మారకం ద్రవ్యం పెరుగుతుంది.

    స్టార్టప్స్, పరిశోధన

    పరిశోధనా సంస్థలు పరిశ్రమలకు సహకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించాలి. విదేశీ టెక్నాలజీని దేశీయ అవసరాలకు అనుసంధానం చేయాలి. స్టార్టప్స్‌కు సరైన విధాన మద్దతు ప్రభుత్వాల నుంచి అందించాల్సిన అవసరం ఉంది.

    యువతకు సందేశం

    అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోండి. విద్య, పరిశోధన, వ్యాపారంపై దృష్టి పెట్టండి. మంచి నాయకులను ఎన్నుకోండి. యువత శక్తితో వ్యవస్థను మార్చవచ్చు. దేశ అభివృద్ధికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. అపారమైన మానవ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా దూరదృష్టి ఉన్న నాయకత్వం, నాణ్యమైన విద్య, కొత్త మార్కెట్లు, విలువ జోడింపు, సమాన అభివృద్ధి.

    డా.మురళీదర్శన్‌ మనోగతం మరింత వివరంగా చూడండి.. కింది వీడియోలో.. 

International

  • అమెరికా-పాకిస్థాన్..! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ ఈ రెండు దేశాల మైత్రి పైనే..! ముందెన్నడూ లేనివిధంగా అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిని వైట్‌హౌస్‌కు ఆహ్వానించడం మొదలు.. పాకిస్థాన్‌పై అమెరికా వరాల జల్లులు కురిపించడం వరకు అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశం..! ఇప్పటికే రెండు సార్లు అమెరికాకు వెళ్లి.. ట్రంప్‌తో భేటీ అయిన పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వైట్‌హౌస్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

    అయితే.. అమెరికా-పాక్ బంధం త్వరలో విడిపోనుందా? ఇరుదేశాల మధ్య తల్లాక్ తప్పదా? అంటే.. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. అందుకు గాజానే కారణమంటున్నారు. పాకిస్థాన్‌కు గాజాకు సంబంధమేంటి? అమెరికాతో తల్లాక్ వరకు వెళ్లేంతలా అందులో ఏముంది?

    నోబెల్ శాంతి బహుమతి కోసం ఉవ్విళ్లూరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు తహతహలాడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరును ఆపేసి.. గాజాలో శాంతిని నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. గాజాలో ఇస్లామిక్ దేశాల సైన్యాలతో అక్కడ శాంతి దళాలను నెలకొల్పాలని భావించారు. దానికి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని నామకరణం చేశారు. సరిగ్గా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ మద్దతు ట్రంప్‌కి అవసరమైంది. పైగా.. ట్రంప్‌కు నోబెల్ అవార్డు ఇవ్వాల్సిందేనని తొలుత ప్రతిపాదించింది కూడా పాకిస్థానే..! అంతే.. ట్రంప్ కూడా పాకిస్థాన్ సాయంతోనే గాజాలో శాంతిని స్థాపించాలని నిశ్చయించారు.

    ట్రంప్‌ 20 సూత్రాల ప్రణాళికే కారణమా?
    ాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేశారు. దానికి ఐక్య రాజ్య సమితి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నారు. అందులో ఆరో పాయింట్ అత్యంత కీలకమైనది. అదేంటంటే.. గాజా నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అందుకు అనుగుణంగానే హమాస్ ఆయుధాలను వీడాలి. ఆ తర్వాత ఇరువైపులా యుద్ధం ముగుస్తుంది. అయితే.. మరోమారు కవ్వింపు చర్యలు లేకుండా ఉండేందుకు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. అయితే.. ఇక్కడే ట్రంప్ ఓ రాజకీయ చతురతను, చాణక్య నీతిని ప్రదర్శించారు. ఆఫ్ఘానిస్థాన్, సిరియాలలో అనుభవాలను బేరీజు వేసుకున్నారు. 

    మిలిటెంట్లు, ఉగ్రవాదులు స్టెబిలైజేషన్ ఫోర్స్‌ను టార్గెట్‌గా చేసుకునే ఉదంతాలను విశ్లేషించారు. దీంతో.. నాటో దళాలు లేదా అమెరికా బలగాలను గాజాలో దింపకుండా.. ఆ బాధ్యతను ఇస్లామిక్ దేశాలకు అప్పగించాలని తీర్మానించారు. అంటే.. గాజా శాంతికోసం తీవ్రంగా కృషి చేస్తున్న తుర్కియే, జోర్దాన్, ఈజిప్టుతోపాటు.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్ ఆ బాధ్యతను తీసుకోవాలనేది ట్రంప్ ఆకాంక్ష..! ఈ దళాలు గాజాతోపాటు.. పాలస్తీనాలోని పోలీసు దళాలకు శిక్షణ ఇవ్వాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఒప్పందం జరగాలి. అది జరిగినప్పుడే ఇంతకాలం యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్ సభ్యులకు క్షమాభిక్ష ఉంటుంది. గాజాను వీడాలనుకునే హమాస్ సభ్యులు ఈజిప్ట్, జోర్దాన్, ఖతార్, ఇరాన్ వంటి దేశాలకు వలస వెళ్లేందుకు అమెరికా సహకరిస్తుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతే.. ఆసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

    చిక్కుల్లో ఆసిమ్ మునీర్..!
    ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ పాలిట అశనిపాతంగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌ని బద్ధశత్రువుగా భావిస్తాయి. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల పథకం ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉంటుంది. పైగా.. ట్రంప్ ఇజ్రాయెల్‌కు ఆప్తమిత్రుడనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే ఈ 20 సూత్రాల పథకంపై ఈజిప్ట్, ఖతార్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

    పాకిస్థాన్‌లో కూడా ఆసిమ్ మునీర్‌పై వ్యతిరేకతకు అంకురార్పణ జరగడానికి ఇదే కారణమవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌తో త్వరలో జరగనున్న భేటీలో మునీర్ బేషరతుగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా మునీర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారనుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌లో పాకిస్థాన్ సైన్యం ఉండదని మునీర్ చెబితే.. ట్రంప్‌కు నిస్సందేహంగా కోపం వస్తుంది. ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి మునీర్ తలూపినా.. పాకిస్థాన్‌లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇప్పటికే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. గాజాలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ బలగాలను అక్కడ మోహరించినా.. హమాస్‌ను ఆయుధాలు వీడమని చెప్పడం, నిరాయుధీకరణకు సహకరించడం తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు..!

    ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. 
    జెన్-జీ ఉద్యమాలు ఇప్పుడు ప్రభుత్వాల పాలిట ముప్పుగా మారుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్‌లో అధికార మార్పిడి ఇందుకు ఉదాహరణ..! బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, యూనస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది విద్యార్థి ఉద్యమమే. నేపాల్‌లో కూడా యువత ఉద్యమించడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు మునీర్ గనక ట్రంప్ నిర్ణయానికి తలొగ్గితే.. పాకిస్థాన్‌లోనూ నిరసనలు మొదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

    మునీర్ ఇటీవలి కాలంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, తుర్కియే, జోర్దాన్, ఈజిప్ట్, ఖతార్ దేశాల రాజకీయ, సైన్య అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశాల సందర్భంగా గాజా శాంతి గురించి మాట్లాడారు. దీనికి ప్రతిగా ఇప్పటికే పాకిస్థాన్‌లో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఒకవేళ ట్రంప్ నిర్ణయాన్ని మునీర్ అమలు చేస్తే.. పాక్‌లో ఆందోళనలు పేట్రేగిపోతాయని దక్షిణ-మద్య ఆసియా వ్యవహారాల నిపుణుడు మైఖేల్ కుగెల్మాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదనను మునీర్ సున్నితంగా తిరస్కరించినా.. అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో.. మునీర్ రిస్క్‌లో పడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     గాజాలో సైన్యాన్ని మోహరించాలని చూస్తే..!
    పాకిస్థాన్‌లో పాలస్తీనాకు మద్దతిచ్చే పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. గాజాలో సైన్యాన్ని మోహరించాలని మునీర్ నిర్ణయిస్తే.. పాకిస్థాన్‌లో అస్థిరత పెరిగే ముప్పు ఉంది. పాకిస్థాన్‌లో కరడుగట్టిన ఇస్లామిక్ ఎన్జీవోలు, సంస్థలు ఎన్నో ఉన్నాయి. పైగా.. ఉగ్రవాద సంస్థలన్నీ హార్డ్‌కోర్ ఇస్లామిక్ మైండ్ సెట్ ఉన్నవే..! ఈ సంస్థలు మూకుమ్మడిగా జెన్-జీ స్థాయిలో ఉద్యమించే అవకాశాలు లేకపోలేదు. 

    దీన్ని గమనించే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేస్తూ.. హమాస్ నిరాయుధీకరణ తమ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయిన మునీర్.. ట్రంప్‌ను విభేదిస్తే.. పెద్దన్న ఆగ్రహానికి గురవ్వక తప్పదు. ట్రంప్ నిర్ణయాన్ని ఆమోదిస్తే.. దేశంలో అస్థిరత ఏర్పడి మునీర్ పదవికే గండం తప్పదు. ఏది ఏమైనా.. త్వరలో అమెరికా-పాక్ మధ్య తల్లాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
    - హెచ్.కమలాపతిరావు

    ఇదీ చదవండి:
    చైనా-పాకిస్థాన్‌కు మధ్య చెడింది ఇక్కడే..!
     

  • మస్కట్: భారత్ -ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ను  ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ గౌరవం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

    సుల్తాన్ హైతమ్ స్వయంగా ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించారు. భారత్-ఒమాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ చూపిన దూరదృష్టి, నాయకత్వం, పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    భారత్–ఒమాన్ మధ్య 1950లలో ప్రారంభమైన దౌత్య సంబంధాలు ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా మోదీ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సముద్ర భద్రత, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ గౌరవం ప్రతీకాత్మకంగా నిలిచింది.

    ఇరు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
    భారత్-ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి. మస్కట్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) పై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఇంధన, సముద్ర భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

    12 బిలియన్ డాలర్ల వాణిజ్యం 
    భారత్–ఒమన్ మధ్య ప్రస్తుతం సుమారు 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఎఫ్‌టీఏ అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఔషధాలు,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోకెమికల్స్ వంటి రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఒమాన్, భారత సముద్ర భద్రతా వ్యూహంలో కీలక భాగస్వామి. అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో స్థిరత్వం కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్త విన్యాసాలు, నౌకాదళ సహకారం మరింత పెరగనున్నాయి.

    ఒమన్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు చర్చించాయి. వీసా సౌకర్యాలు, కార్మిక ఒప్పందాల సరళీకరణపై ఒమన్ సానుకూలంగా స్పందించినట్లు వర్గాలు తెలిపాయి.

    అంతకుముందు మస్కట్‌లో ప్రధాని మోదీకి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్‌తో జరిగిన సమావేశం అనంతరం మోదీ, ఒమాన్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి బంధం మరింత బలపడుతోంది అని పేర్కొన్నారు.

  • మనం ఏ పని చేయాలన్నా ప్రకృతి అనుకూలత అనేది చాలా ముఖ్యం. మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలిస్తున్నాయంటే అక్కడ ప్రకృతి అనుకూలంగా ఉన్నట్లే అర్ధం చేసుకోవాలి.  సెల్ఫ్‌  ఎఫర్ట్‌ (మానవ ప్రయత్నం)కు  ప్రకృతి అనుకూలించిందంటే ఎటువంటి  ఇబ్బందులు లేకుండా జీవనం అనే బండి ముందుకు పోతుంది. 

    ఇంతకీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తరచు జరుగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్న దాఖలాలు  కూడా చూశాం. అయితే కొన్ని రోజుల క్రితం ఓ భారీ విమాన ప్రమాదం తప్పిందనే చెప్పాలి. 

    ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం.. డిసెంబర్‌ 14వ తేదీన దోహా నుండి బయల్దేరింది. అయితే అది అమెరికాలోని అట్లాంటాకు చేరుకున్న తర్వాత బలమైన గాలుల కారణంగా  ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్‌ చేద్దామని పైలట్‌ ప్రయత్నించాడు. ఆ బలమైన గాలులకు విమానం నియంత్రణ కోల్పోవడంతో ఓ ప్రయత్నంగా ల్యాండింగ్‌కు యత్నించాడు. కానీ విమానం వెనుక భాగం రన్‌వేకు తాకడానికి అత్యంత సమీపంగా వచ్చిన సమయంలో మళ్లీ పైలట్‌ టేకాఫ్‌ తీసుకున్నాడు. ఇక్కడ పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడం ఒకటైతే..  ఆకాశం కరుణించి.. భూమి శాంతించడంతో మళ్లీ విమానం తిరిగి యధాస్థితికి వెళ్లిపోయింది. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

     

    దీనిపై ఖతార్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు మాట్లాడుతూ..  తమ పైలట్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ల్యాండింగ్‌ తీసుకోకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఇలా అత్యవసరంగా ల్యాండింగ్‌ పరిస్థితులు ఎదురైనప్పుడు భయాందోళనలు అనేవి సహజంగానే ఉంటాయని, ప్రయాణికుల్లో  ఇది ఇంకా గందరగోళానికి గురిచేస్తుందన్నారు.   

  • అమెరికాలో భారత సంతతికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన క్యాబ్‌లో గాఢంగా నిద్రపోయి, స్పృహ కోల్పోయిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. నిందితుడిని కాలిఫోర్నియాలోని బేకర్స్‌ఫీల్డ్ నివాసి  భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ సిమ్రంజిత్ సింగ్ సెఖోన్ (35)గా గుర్తించారు. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.

    వెంచురా కౌంటీ షెరీఫ్ కార్యాలయం సమాచారం ప్రకారం  నవంబర్ 27 తెల్లవారు జామున 1:00 గంటలకు  క్యాబ్‌ బుక్‌ చేసుకుంది యువతి.  క్యాబ్‌ రైడ్‌ సమయంలో  దిగాల్సిన చోటు వచ్చినా కూడా గమనించలేనంతగా ఆమె నిద్రలోకి జారిపోయింది. దీనికి తోడు మద్యం సేవించి ఉండటంతో అదే అదునుగా భావించిన సెఖోన్‌ ఆమెను థౌజండ్ ఓక్స్ బార్ నుండి కామరిల్లోలోని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పరిశోధకులు తెలిపారు.  దీనికి సంబంధించిన ఈ ఏడాది నవంబరులో మొదలైంది. ఈ సందర్బంగా సెఖోన్‌ బాధితుల సంఖ్య ఇంకా ఉండి ఉండవచ్చని డిటెక్టివ్‌లు అనుమానిస్తున్నారు.

    బెయిల్‌ కోసం రూ. 4.52 కోట్లు
    సెఖోన్‌ను డిసెంబర్ 15న అరెస్టు చేసి, అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిపై అత్యాచారం చేసినందుకు ప్రీ-ట్రయల్ డిటెన్షన్ ఫెసిలిటీలో కేసు నమోదు చేశారు. బెయిల్  రుసుము రూ. 4.52 కోట్లు (5లక్షల డాలర్లు) గా నిర్ణయించారు. తదుపరి విచారణ డిసెంబర్ 29న జరగాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలను సెఖోన్‌ ఖండించారు. అయితే నిందితుడు ఏ రైడ్ షేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, డ్రైవర్ స్థితి తదితర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

    ఇదీ చదవండి: రూ. 2400 కోట్ల వివాదం, 87 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో బిడ్డ

    కాగా భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు అమెరికా, కెనడాలో ట్రాఫిక్ ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడంలాంటి అనేక ఆరోపణల మధ్య తాజా వార్త మరింత కలకలం రేపుతోంది.

  • చైనాలో అత్యంత గౌరవనీయమైన , ప్రసిద్ధ  కళాకారుడు  ఫ్యాన్ జెంగ్.  87 ఏళ్ల వయసులో తాను ఒక బిడ్డకు తండ్రి అయినట్లు ప్రకటించాడు. తన భార్య 37 ఏళ్ల జు మెంగ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు.  అంతేకాదు ఏకైక జీవసంబంధమైన కొడుకు ఇతడే అంటూ తన ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుని, మరోసారి కుటుంబ వివాదాలను  సోషల్ మీడియాలో  తెరపైకి తీసుకురావడం విశేషంగా నిలిచింది. 

    సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం  తనకు  కొడుకు పుట్టినట్లు ప్రకటించడం మాత్రమే కాదు ఇతర పిల్లలతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తన బిడ్డను "ఏకైక సంతానం"గా అభివర్ణించాడు. కొత్త ఇంట్లోకి మారాం, భార్య, కొడుకుతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అలాగే వయసు పెరిగిన నేపథ్యంలో తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పూర్తిగా జుకు అప్పగిస్తున్నట్లు చెప్పాడు. రూ 2400 కోట్ల వివాదం, లేటు వయసులోఫ్యాన్ బిడ్డను కనడం, ఇంటితో సంబంధాలను తెంచుకోవడం, సుదీర్ఘ కళా జీవితాన్ని మసకబారుస్తుందంటున్నారు నిపుణులు.

    ఫ్యాన్‌ కుటుంబంలో వివాదాలు
    గత కొన్నేళ్లుగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే ఇటీవల ఫ్యాన్ కూతురు  జియావోహుయ్, సవతితల్లి జుపై సంచలన ఆరోపణలు చేసింది. తమను, తండ్రిని కలవనివ్వడం లేదని, తన తండ్రి 2 బిలియన్ యువాన్లు (రూ. 2,400 కోట్ల) విలువైన కళాఖండాలను జు రహస్యంగా అమ్ముకుందని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ సంస్థ ఖండించింది.

    ఎవరీ ఫ్యాన్‌  జెంగ్‌ 
    ఫ్యాన్ సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్‌లు, కాలిగ్రఫీ నైపుణ్యంతో చైనాలో బాగా పాపులర్‌. జియాంగ్సు ప్రావిన్స్‌లో ఫ్యాన్ జెంగ్  జన్మించాడు. బీజింగ్‌ సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ప్రఖ్యాత కళాకారులు లి కెరాన్, లి కుచన్ వద్ద శిక్షణ పొందాడు.అద్భుతమైన కళాకృతులతో గొప్పకళాకారుడిగా, చైనాలోని ప్రముఖ కళాకారుడిగా తెచ్చుకున్నాడు. అనేక దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శించబడుతున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో, తన కంటే 50 ఏళ్ల చిన్నదైన జు మెంగ్‌ను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆయన నాలుగో భార్య జుతో కలిసి జీవిస్తున్నాడు. 

    చైనీస్ మీడియా నివేదికల ప్రకారం, అతని రచనలు 2008 - 2024 మధ్య వేలంలో 4 బిలియన్ యువాన్లకు పైగా ఆర్జించాయి. పలు చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా అమ్ముడయ్యాయి. వీటిలో 1991లో 2011లో బీజింగ్ వేలంలో 18.4 మిలియన్ యువాన్లకు అమ్ముడుపోవడం విశేషం. అతను సృష్టించే కాలిగ్రఫీ విలువ 0.11 చదరపు మీటరుకు 200,000 యువాన్ల ధర ఉంటుందట.

  • మస్కట్: గడచిన 11 ఏళ్ల కాలంలో భారత్ తన విధివిధానాలను మార్చుకోవడమే కాకుండా, తన దేశ ఆర్థిక డీఎన్‌ఏనే సమూలంగా మార్చుకున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అన్నారు. ఒమన్ పర్యటనలో భాగంగా గురువారం మస్కట్‌లో నిర్వహించిన ‘ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. భారతదేశం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు నేడు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ మార్కెట్‌లలో ఒకటిగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) 21వ శతాబ్దపు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను, వేగాన్ని ఇస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

    దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడిన కీలక సంస్కరణలను ప్రస్తావిస్తూ, జీఎస్టీ (GST) అమలు ద్వారా భారతదేశం ఒకే సమీకృత మార్కెట్‌గా ఆవిర్భవించిందని ప్రధాని పేర్కొన్నారు. అలాగే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) వంటి నిర్ణయాలు దేశంలో ఆర్థిక క్రమశిక్షణను పెంచి, పారదర్శకతను పెంపొందించాయని వివరించారు. ఈ చర్యల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల నమ్మకం రెట్టింపు అయిందని, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశాయని ఆయన వివరించారు. వ్యాపారవేత్తలతో జరిగిన ఈ సమావేశంలో భారత ఆర్థిక ప్రగతి పథాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
     

    భారత్-ఒమన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా సముద్రం రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారధి అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల కాలం నుంచే సముద్ర వాణిజ్యంలో ఇరు దేశాలు సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్నేహం  ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మోదీ ఆకాంక్షించారు.

    ఇరు దేశాల దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జోర్డాన్, ఇథియోపియా పర్యటనలను ముగించుకుని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు ఒమన్ చేరుకున్న ప్రధాని, రెండు రోజుల పాటు ఇక్కడ వివిధ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్య రంగంలో కొత్త అవకాశాలను సృష్టించడం, భవిష్యత్ ప్రణాళికల కోసం ఒక బ్లూప్రింట్ సిద్ధం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

    ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్‌ సుతార్‌ కన్నుమూత

  • న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో, చైనా తన విజయగాథను భారత్‌తో పంచుకుంది. ఒకప్పుడు ‘ప్రపంచ స్మోగ్ రాజధాని’గా పేరుగాంచిన బీజింగ్‌, కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిదో వివరిస్తూ చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ 'ఎక్స్‌' (ట్విట్టర్) వేదికగా వరుస పోస్ట్‌లు చేశారు. 2013లో 101.7 ug/m3గా ఉన్న బీజింగ్ వార్షిక PM 2.5 సగటు, 2024 నాటికి ఏకంగా 30.9 ug/m3కు పడిపోవడం గమనార్హం.

    బీజింగ్ అనుసరించిన వ్యూహాలివే!
    వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు అని జింగ్ పేర్కొన్నారు. యూరో 6 ప్రమాణాలకు సమానమైన 'చైనా 6NI' నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా, లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసి-సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే.. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్సు నెట్‌వర్క్‌లను నిర్మించింది. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది.

    మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘షోగాంగ్’ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20 శాతం తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా, మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్‌కు వేదిక కావడం విశేషం.

    అయితే భారత్‌లో కూడా ఇటువంటి ప్రణాళికలు చర్చల్లో ఉన్నప్పటికీ, వాటి అమలు తీరులోనే ప్రధాన తేడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మన వద్ద BS6 ప్రమాణాలు ఉన్నా, రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు’ అని పర్యావరణ విశ్లేషకులు సునీల్ దహియా పేర్కొన్నారు. కేవలం కాలుష్యం పెరిగినప్పుడు మాత్రమే అత్యవసర చర్యలు తీసుకోవడం కాకుండా, బీజింగ్  మాదిరిగా ఏడాది పొడవునా కఠినమైన పారిశ్రామిక మార్పులు అమలు చేయాలి. ఇంధన పరివర్తన చేపట్టినప్పుడే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: శిల్పకళా భీష్మాచార్యుడు రామ్‌ సుతార్‌ కన్నుమూత
     

Family

  • సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతితో ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసంప్రారంభాన్నే గ్రామీణ  ప్రాంతాల్లో పండుగ నెల పెట్టడం అంటారు. భక్తవత్సలుడైన శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికమైన ఈ ధనుర్మాసం (Dhanurmasam) 16, మంగళవారం ప్రారంభమైన సందర్భంగా ఆ మాస విశిష్టతలను తెలుసుకుందాం...

    ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి రెండు పూటలా దీపారాధన చేయడం వల్ల శ్రీమహాలక్ష్మి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణం పెట్టే వరకు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.

    ఆధ్యాత్మిక ప్రయోజనాలకు ఆవాసం
    ధనుర్మాసం విశేషమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం. ధనుర్మాసంలో స్నానం, దానం, హోమం, వ్రతం పూజలు చేయడం అత్యంత శుభప్రదం.

    సుప్రభాతానికి బదులు తిరుప్పావై 
    ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. తిరుమలలో అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై (tiruppavai) గానం చేస్తారు. అలాగే మిగిలిన విష్ణు ఆలయాల్లో కూడా ఉదయం అర్చనలు చేసి నివేదనలు సమర్పించి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా పిల్లలకు ప్రసాదం పంచడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు.

    అలక్ష్మిని ఆవలకు నెట్టే లక్ష్మీ పూజ
    పవిత్రమైన ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రాలన్నీ దూరమవుతాయని విశ్వాసం. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు.  ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు తెల్లవారుజామునే అందమైన ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు, గుమ్మడి పూలు ఉంచి.. వాటిని బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం సకల శుభదాయకం.

    చ‌ద‌వండి: నెల‌గంట క‌ట్ట‌డం అంటే.. ఎంటే తెలుసా?

    గోదా రంగనాథుల కల్యాణం 
    గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించే అతి ముఖ్యమైన ఆచారం. సాధారణంగా శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి నాడు జరుగుతుంది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు గోదాదేవి, శ్రీ కృష్ణుడు లేదా శ్రీరంగనాథ స్వామి వారిని పూజించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి గానం చేయాలి. స్వామివారికి, అమ్మవారికి పొంగలి నివేదించాలి. ధనుర్మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయడం పరమ విశిష్టం. మనసు, వాక్కు, శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల సంపదలూ చేకూరతాయని శాస్త్ర వచనం.

  • ప్రతిష్టాత్మక సాయుధ దళాల సంస్థ అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA) నుంచి పాసైన తొలి మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించింది 23 ఏళ్ల అమ్మాయి. ఆమె నియామకంతో  93 ఏళ్ల రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న నిరీక్షణకు ఆమె నియామకంతో తెరపడింది. 1932లో అకాడమీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు 67,000కు పైగా ఆఫీసర్ క్యాడెట్లు పాసయ్యారు. వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఇంతకీ ఎవరా అమ్మాయి. ఈ ఘనతను ఎలా సాధించిందంటే..

    డెహ్రడూన్‌లోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఎ) తొలి మహిళా ఆఫీసర్‌గా 23 సంవత్సరాల సాయి జాదవ్‌ చరిత్ర సృష్టించింది. 1932లో ప్రారంభమైన ఈ అకాడమీ నుంచి 67,000 మంది ఆఫీసర్‌ క్యాడెట్‌లు పాసవుట్‌ పరేడ్‌ చేశారు. అందులో ఒక్కరు కూడా మహిళ లేరు. సాయి ముత్తాత బ్రిటిష్‌  సైన్యంలో, తాత భారత సైన్యంలో పనిచేశారు. నాన్న సందీప్‌ జాదవ్‌ ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ఆ కుటుంబం నుంచి నాలుగో తరం సైనిక అధికారిగా ప్రయాణం మొదలుపెట్టింది సాయి జాదవ్‌. ఆరు నెలల కఠిన సైనిక శిక్షణ పూర్తి చేసుకొని ‘ఐఎంఎ’ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిగా చరిత్ర సృష్టించింది.

    మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాయి కర్నాటకాలో బెల్గాంతో సహా అనేక రాష్ట్రాలలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్‌ తరువాత సర్వీసెస్‌ సెలెక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) పరీక్ష రాసి తన ప్రతిభతో అన్ని దశల స్క్రీనింగ్‌లలోనూ అర్హత సాధించింది. ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో అందరూ పురుషులే కావడంతో అందులో శిక్షణ పొందిన వారిని ‘జెంటిల్‌మెన్‌ క్యాడెట్స్‌’ అని పిలిచేవారు. ఇప్పుడది ‘ఆఫీసర్‌ క్యాడెట్స్‌’గా మారనుంది.

    ‘ఐఎంఎ’లో నిర్వహించిన వేడుకలో సైనిక ఉన్నతాధికారులు సాయి జాదవ్‌ యూనిఫామ్‌పై నక్షత్రాల బ్యాడ్జీని పిన్‌ చేశారు. టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా ర్యాంకింగ్‌ను కేటాయించారు. చారిత్రక ఘనత సాధించిన సాయి గురించి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. 

    ‘ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించి టెరిటోరియల్‌ ఆర్మీలో చేరిన తొలి మహిళగా సాయి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉంది’ అంటున్నారు ఆమె తల్లిదండ్రులు. జూన్‌ 2026లో డెహ్రాడూన్‌ ‘ఇండియన్‌ మిలిటరీ అకాడమీ’లో జరగనున్న పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ను పూర్తిగా మహిళలతో కూడిన తొలి ప్రత్యేక బ్యాచ్‌ నిర్వహించనుంది. ఇది చారిత్రక మలుపు అని చెప్పుకోవచ్చు.

    (చదవండి: ప్రేమ, ఆప్యాయతలకు కేరాఫ్‌ 'ఆహారమే'..! అదెలాగంటే..)
     

  • ఆహారం మన ప్రాణాలకు దివ్వౌషధమే కాదు..ప్రజందర్నీ ఒక చోటకు చేరుస్తుంది. భోజనం చేసే ప్రదేశమే(హోటల్‌ లేదా రెస్టారెంట్‌) మనకు కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. అక్కడే మనకు తోడు, స్నేహం, ప్రేమ వంటివి దొరుకుతాయి కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన నానుడిలా ఆహారం..అన్నింటిని చెంతకు చేరుస్తుంది అనొచ్చు. ఒక్కోసారి ఆ భోజనశాలే మన ప్రాణాలకు రక్షగా కూడా మారుతుంది. అదెలాగో ఈ ఇంట్రస్టింగ్‌ స్టోరీ చకచక చదివి తెలుసుకోండి మరి..

    అమెరికాలో జరిగి అరుదైన సందర్భం.  78 ఏళ్ల చార్లీ హిక్స్ ఫ్లోరిడాలోని పెన్సకోలాలోని ష్రిమ్ప్ బాస్కెట్ అనే రెస్టారెంట్‌లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవాడు. పదేళ్లుగా ఈ రెస్టారెంట్‌లోనే భోజనం చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్‌ స్టాఫ్‌కి కూడా అతడు బాగా అలవాటైపోయాడు. వాళ్లంతా అతడి రాకకై తలుపులు తెరిచే ఉంచేవారు. అలాంటిది కొన్నిరోజుల నుంచి అనూహ్యంగా రెస్టారెంట్‌ రాలేకపోతాడు. ఇంతలా సడెన్‌గా ఆయన రాకపోవడానికి కారణం ఏంటని ఆ రెస్టారెంట్‌లోని  45 ఏళ్ల చెఫ్ డోనెల్ స్టాల్‌వర్త్ ఆరా తీశారు. 

    దశాబ్దకాలంగా అతనికి సర్వీస్‌ అందిస్తున్న ఆ చెఫ్‌  వృద్ధుడి గురించి ఆరా తీసి ఫోన్‌చేసి మరి కనుక్కోగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో వాళ్లు అతని ఆర్డర్‌ని అతని ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. అతడి డోర్‌ వద్ద పదేపదేఆహార డెలివరీ చేసినా..అతడు  బయటకువచ్చితీసుకోవడం లేదని తెలుస్తుంది. దాంతో టెన్షన్‌తో ఆ చెఫ్‌ డోనెల్ స్టాల్‌వర్త్ అతని డోర్‌ వద్ద నిలబడి చాలాసేపు కొట్టినా..ఎలాంటి రెస్పాన్స్‌ రాదు. 

    దాంతో అతనిలో ఆందోళన పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే డోర్‌ కొడుతూనే ఉండగా చిన్నగా లోగొంతుతో కూడిన కేక వినిపిస్తుంది. ఏదోలా డోర్‌ పగలు కొట్టి వెళ్లగా వృద్ధుడు చార్లీ హిక్స్‌ నేలపై పడి ఉండటం చూసి షాక్‌ తింటాడు చెఫ్‌ డోనెల్‌.  అతని పక్కటెముకలు విరిగి, డీహైడ్రేషన్‌కి గురై ఉంటాడు. వెంటనే అతడిని చెఫ్‌ డోనెల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి.. అక్కడికే ఆహారం డెలివరీ అయ్యేలా కేర్‌ తీసుకుంటారు. 

    ఆశ్చర్యకరంగా ఆ వృద్ధుడు చార్లీ వారి ప్రేమ, అప్యాయతలకు త్వరితగతిన కోలుకుని డిశ్చార్జ్‌ అవుతాడు. అంతేగాదు అతన్ని 24 గంటలూ పర్యవేక్షించడం కోసం రెస్టారెంట్‌ పక్క అపార్ట్‌మెంట్‌లోకే షిఫ్ట్‌ అయ్యేలా చేస్తారు సదరు రెస్టారెంట్‌ నిర్వాహకులు. నిజానికి ఇది ఆహారంతో ముడిపడిన బంధం అని ఆనందంగా చెబుతున్నాడు చార్లీ.

    అయితే చెఫ్‌ డోనెల్‌ మాత్రం అతడే తన తాత, మావయ్యా అన్నీనూ అని ఆనందంగా చెబుతాడు. ప్రస్తుతం అతడి భోజనం దినచర్య ఆ రెస్టారెంట్‌లో యథావిధిగా సాగుతుంది. తనకు వడ్డించేది కూడా చెఫ్‌ డోనెల్‌. చెప్పాలంటే వ్యాపారానికి మించిన స్నేహం..ఆహారం కలిపిన బంధం కదూ..!. అందుకే "తినే అన్నంపై కోపగించుకోవడం, తినడం మానేయడం, వృధా చేయడం వంటివి అస్సలు చేయొద్దు సుమీ"..!.

    (చదవండి: తొమ్మిది పదుల వయసులో 400 పుష్-అప్‌లు..! అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌​ ఏంటంటే.)
     

  • ఒకప్పుడు సామాన్యులకు నిషిద్ధంగా భావించిన  ధ్యానం నేడు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది. ప్రపంచంలో అశాంతి మరింత పెరుగుతున్న ఈ కాలంలో ధ్యానసాధనను శాశ్వతంగా మన జీవితాలలో భాగంగా స్వీకరించాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించాలని, విశ్వవిఖ్యాత ఆధ్యాత్మిక గురువు మానవతావాది గురుదేవ్ విశంకర్ బుధవారం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి భవనం నుంచి పిలుపునిచ్చారు. 

    రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. గతేడాది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకేసారి ధ్యానం చేసి, ప్రపంచవ్యాప్తంగా చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన విషయం విదితమే. వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా, అలసట, ఒత్తిడి, సంఘర్షణలు, అనిశ్చితి, భావోద్వేగ వేదనలతో పోరాడుతున్న సమాజాలకు ధ్యానం ఎంత అవసరమో గురుదేవ్ తన ప్రసంగంలో వివరించారు.

    ప్రపంచ శాంతి కోసం ధ్యానం
    ఈ సందర్భంగా భారతదేశ శాశ్వత ప్రతినిధి కార్యాలయం (పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా), ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘ప్రపంచ శాంతి కోసం ప్రపంచం ధ్యానం చేస్తోంది’ అనే అంశంపై గురుదేవ్ ప్రసంగించారు. వయస్సు, ప్రాంతం అనే భేదం లేకుండా ఆందోళన, బర్నౌట్, ఒంటరితనం పెరుగుతున్న ఈ సమయంలో, సమస్యలకు బాహ్య పరిష్కారాలు కాకుండా, మానవ మనసును స్థిరపరిచి శాశ్వత పరిష్కారాన్ని అందించే దిశగా కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

    “ఈ రోజుల్లో ధ్యానం ప్రపంచానికి ఒక విలాసం కాదు,” అని గురుదేవ్ అన్నారు. “మన జనాభాలో మూడో వంతు మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. సగం మంది మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనల్ని మనతోనే కలిపే, మనలో దాగి ఉన్న ఒత్తిడిని తొలగించే ఒక సాధనం అవసరం. అప్పుడే ధ్యానానికి ప్రాముఖ్యత వస్తుంది.”

    ధ్యానం - మానసిక పరిపూర్ణత
    ధ్యాన సందర్భంలో మానసిక పరిపూర్ణత (మైండ్ ఫుల్ నెస్) గురించి వివరిస్తూ గురుదేవ్ ఇలా అన్నారు: “మైండ్ ఫుల్ నెస్ మీ ఇంటికి వెళ్లే దారి లాంటిది, ధ్యానం మీ ఇల్లు. ధ్యానం మనల్ని మన అంతర్లీన లోకంలోకి తీసుకెళ్లి అవసరమైన ప్రశాంతతను అందిస్తుంది. ఇది చేయడం  కష్టమేమీ కాదు. స్థూలంగా చెప్పాలంటే ధ్యానం అనేది మనసు అనే కంప్యూటర్లో అనవసరంగా నిల్వ చేసిన ఫైళ్లన్నింటినీ ‘డిలీట్’ బటన్ నొక్కి ఖాళీ చేయటమే.”

    శక్తి, సమన్వయం: ధ్యానం
    “మనమంతా శక్తే,” అని గురుదేవ్ పేర్కొన్నారు. “ఈ శక్తి సమన్వయంతో ఉందా? మన పరిసరాలలో ఐక్యతను సృష్టిస్తున్నదా? అనే ప్రశ్నలకు ధ్యానంలోనే సమాధానం ఉంది. ధ్యానం మన చుట్టూ అవసరమైన సామరస్యాన్ని సృష్టిస్తుంది. మన వైబ్రేషన్లను శుద్ధి చేస్తుంది.”

    చరిత్ర సృష్టించిన ప్రపంచ ధ్యానం
    గత ఏడాది డిసెంబర్ 21న ‘వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మందికి పైగా ప్రజలు ఒకచోట చేరి ధ్యానం చేశారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ధ్యాన సమూహంగా నిలిచి, ఆరు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది.

    ఈ కార్యక్రమం ప్రత్యేకత కేవలం సంఖ్యల్లోనే కాకుండా, పాల్గొన్న వారి వైవిధ్యంలోనూ కనిపించింది — నివాస ప్రాంతాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు, సామాజిక కేంద్రాలు ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల అన్ని వర్గాల ప్రజలూ ఇందులో భాగమయ్యారు.

    భారత శాశ్వత ప్రతినిధి అభిప్రాయం
    జెనీవాలోని ఐక్యరాజ్యసమితి, సంబంధిత అంతర్జాతీయ సంస్థల భారతదేశ శాశ్వత ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, “గతేడాది అంతర్జాతీయ సదస్సు నాటి గురుదేవుల జెనీవా సందర్శనను మేము ఆత్మీయంగా గుర్తుచేసుకుంటున్నాము. లోతైన సంఘర్షణలు, అవిశ్వాసంతో నిండిన ప్రపంచంలో, ధ్యానం కేవలం వ్యక్తిగత స్వీయాభివృద్ధి సాధన మాత్రమే కాదు అది సంక్లిష్టమైన ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విశ్వాసాన్ని పరస్పర సుహృద్భావాన్ని పెంపొందించడానికి ఒక శక్తివంతమైన సాధనం,” అని తెలిపారు.

    బాహ్య ఆడంబరాల నుంచి అంతరంగ కేంద్రానికి ప్రయాణం 
    ఆధునిక కాలంలో పశ్చిమ దేశాలలో ధ్యానం ఒకవైపు కొత్త ఫ్యాషన్‌గా, విభిన్నంగా ప్రాచుర్యం పొందగా, మరోవైపు అది పాతకాలపు ఆధ్యాత్మిక సాధనంగా, ఈ కాలానికి సరిపడదని కూడా భావించారు. 1980ల ప్రారంభంలో, మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగే ఈ శాస్త్రానికి పెద్దగా ప్రాధాన్యత లేని సమయంలోనే, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రపంచానికి ధ్యానాన్ని మరలా పరిచయం చేసే బృహత్తర ప్రయాణాన్ని ప్రారంభించారు.

    విద్య, సంఘర్షణల పరిష్కారం, రైతు సంక్షేమం, జైలు ఖైదీల పునరావాసం, యువ నాయకత్వం, కార్పొరేట్ రంగంలో ఒత్తిడి నిర్వహణ, సమాజ పునర్నిర్మాణం వంటి అనేక రంగాల్లో ధ్యానం ఆయన సేవలకు కేంద్రబిందువుగా మారి, 182కు పైగా దేశాలలో కోట్లాది మందిని చేరుకుంది.

    బుధవారంనాటి తన ప్రసంగంలో గురుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రధాన సభ తీర్మానాన్ని ఆమోదించిన 192 దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్గత సాధన ఇంత విస్తృతమైన సాంస్కృతిక, శాస్త్రీయ, సంస్థాగత గుర్తింపును పొందడం అరుదైన విషయం. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.

    ముందుకు సాగుతున్న ప్రపంచ ఉద్యమం
    ఈ విశ్వవ్యాప్త స్ఫూర్తిని కొనసాగిస్తూ.. గురుదేవ్ డిసెంబర్ 19న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి కీలక ప్రసంగం చేయనున్నారు. భిన్న ధృవాలుగా విడిపోతూ, విభిన్న అభిప్రాయాల సంఘర్షణకు లోనవుతున్న నేటి ప్రపంచంలో మానసిక ధైర్యం, పరస్పర చర్చలను, శాంతిని పెంపొందించడంలో ధ్యానం మరింత కీలకపాత్ర పోషించనుంది

    ఈ ఏడాది డిసెంబర్ 21న, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ప్రతిష్టాత్మక ‘ఒక్యులస్’ నుంచి రాత్రి 8.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గురుదేవ్ నేతృత్వంలో కోట్లాది మంది ధ్యానం చేయనున్నారు.

    నిరంతర ప్రయాణంగా సాగే ఈ ప్రపంచంలో, ఒక క్షణకాలపు నిశ్శబ్దం, సరిహద్దులను దాటి సామరస్యాన్ని వ్యాపింపజేసే ఒక శ్వాస.. అదే ధ్యానం. వేగంగా మారిపోతున్న అనిశ్చితమైన కాలంలో సైతం, మన ప్రశాంతతకు తాళం మన మనసులోనే ఉందని గుర్తుచేసే సున్నితమైన సందేశంగా ఈ కార్యక్రమం నిలవనుంది.

    (చదవండి: కొద్ది సేపు బ్రేక్‌ ఇచ్చే కిక్‌ వేరేలెవెల్‌..!)

  • ఓ అరవై ఏళ్లు రాగానే..మనలో శక్తి సన్నిగిల్లుతుంది, ఆటోమెటిగ్గా చేసే వ్యాయామాల జోరు తగ్గుతుంది. వయసులో ఉన్నంత సులభంగా వృధాప్యంలో వ్యాయమాలు చేయలేం. ఫిట్‌నెస్‌ నిపుణులు పర్యవేక్షణలో ఈజీగా చేయగలిగే వర్కౌట్లనే ఆశ్రయిస్తాం. అలాంటిది 92 ఏళ్ల తాత 20 ఏళ్ల యువకుడిలా ఎన్నిపుష్‌ అప్‌లు చేస్తాడో తెలిస్తే కంగుతింటారు. చెప్పాలంటే అతడు ముసలి తాతలా కనిపించే యువకుడిలా ఉంటుంది.. వ్యాయమాలు చేసే తీరు. అతనెవరు, ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటి వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.

    బ్రిస్టల్‌లోని స్పైక్ ద్వీపంలో నివసించే కెన్‌ అనే తాతకు 92 ఏళ్లు. కానీ అతడు 20 ఏళ్ల యుకుడి మాదిరిగా ఎలాంటి ఆయాసం లేకుండా అలవోకగా పుష్‌ అప్‌లు చేస్తుంటాడు. మాజీ కాంకోర్డ్‌ ఇంజనీర్‌ అయిన ఈ తాత ఫిట్‌నెస్‌ పరంగా అందరికీ స్ఫూర్తి అని చెప్పొచ్చు. అతడు రోజుకి దగ్గర దగ్గర 400 నుంచి 600దాక పుష్‌ అప్‌లు చేయగలడట. అక్కడితో వర్కౌట్లు ఆపేయడు. 

    దీని తర్వాత కోర్‌ వ్యాయామాలు చేస్తాడు, బరువుల ఎత్తుతాడు కూడా. దాంతోపాటు సుమారు 5 నుంచి 10 కి.మీ నడక కూడా తప్పనిసరిగా ఉంటుందట. చాలామంది ఇన్ని ఎందుకు చాలా తేలిగ్గా చేసే వాటిపై దృష్టిసారించమని హితబోధ చేసిన పట్టించుకోడట. ఎందుకిలా అంటే.. తాను చాలా ఏళ్ల నుంచి దినచర్యను ఇంట్రస్టింగ్‌ ఉండేలా చేసుకుంటానని చెబుతుంటాడు ఈ కెన్‌ తాత. 

    ఎందుకంటే రొటీన్‌గా ఎప్పుడూ చేసే వ్యాయామాలు చేయడం అనేది చాలా బోరింగ్‌గా మారిపోతుందట. అందుకే..పుష్‌ అప్‌లు తర్వాత కడుపుని సాగదీసేలా హామ్‌ స్ట్రింగ్‌లు, పరుగు, తదితరాలు చేస్తూ..ఆసక్తికరంగా మార్చుకుంటాడట. కేవలం తాను క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలనే డెడీకేషన్‌, యాక్టివ్‌గా ఉండటంపై నిరంతర ఫోకసే ఇంతలా ఈ వయసులో ఫిట్‌నెస్‌గా ఉండటానికి కారణమని అంటాడు కెన్‌. మరి అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటాడంటే..

    డైట్‌..
    కెన్ తన రోజుని  జంబో ఓట్స్, గోధుమలు, చియా గింజలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌తో ప్రారంభిస్తాడట. వాటితోపాటు అరటిపండు, ఎండుద్రాక్ష, పాలు తదితరాలు కూడా తీసుకుంటానని చెబుతున్నాడు.

    కెన్‌లా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..
    పెద్దయ్యే కొద్ది సిక్స్‌ప్యాకలు, మంచి శరీరాకృతి వంటి వాటిపై ఫోకస్‌ తగ్గి..ఆరోగ్యంగా జీవించాలనే కాంక్ష పెరుగుతుందట. అలా అనుకునేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, సమతుల్య ఆహారానికి పెద్ద పీటవేయడం వంటివి చేయాలట. ముఖ్యంగా గుండె, మెదడు ఆరోగ్యం బాగుండాలంటే..నడక, ఈత, సైక్లింగ్‌ తప్పనిసరి అట. ఇవి శరీరానికి తేలికపాటి శక్తి శక్షణ నిచ్చి..రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయట. 

    అంతేగాదు మానసిక ఆరోగ్యం మెరుగగ్గా ఉండి.. ఒంటరితనం, ఆందోళన, నిరాశతో పోరాడగలిగేలా ఆరోగ్యకరమైన రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట.ఇ క్కడ కెన్‌లా అంతలా వ్యాయామాలు చేయలేకపోయినా..కనీసం నడక, చిన్నపాటి కండరాల కదలికల కోసం కాస్త తేలికపాటి వర్కౌట్లు చేసినా.. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు నిపుణులు. 

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: స్నేహితుడి కూతురు కోసం వెల కట్టలేని గిఫ్ట్‌..! నెటిజన్లు ఫిదా)

Politics

  • యాదాద్రి(భువనగిరి జిల్లా): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. దీనిలోభాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 సర్పంచులు 20 మంది ఉపసర్పంచ్లు 1000 వార్డులు గెలిచాం. రాష్ట్రంలో 900 సర్పంచులు 1200 ఉపసర్పంచ్లు 10,000 మంది వార్డులను గెలిచాం. గతంలో  162 సర్పంచ్ స్థానాలను  ఉండేది. 

    గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ బలం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో, అవినీతి, అరాచకంతో గెలిచింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీ పథకాల పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీఆర్‌ఎస్‌ పార్టీ పని అయిపోయింది వారి అవినీతి గురించి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మినిస్టర్ పీఏలు తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారు, రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తి రాహుల్ గాంధీ. 

    బీఆర్‌ఎస్‌ పార్టీనే ఫిరాయింపుల మొదటి ప్రోత్సహించింది. ప్రభుత్వం ఒత్తిడితో స్పీకర్ రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియాగాంధీ వారి వారి కేసులలో బెయిల్ పై ఉన్నారు. బీజేపీ వారిపై కేసు పెట్టలేదు దర్యప్తు సంస్థలు కేసు పెట్టాయి. మా పార్టీ కార్యాలయంలపై దాడి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత’ అని పేర్కొన్నారు. 

    ఇదీ చదవండి:
    హైదరాబాద్‌ పర్యటనలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌

  • తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్‌ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు. 

    విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్‌తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు. 

    ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు.  

    తోపులాటకు ఆస్కారం లేకుండా.. 
    తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్‌ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్‌ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్‌, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. 

    ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్‌ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్‌ ది పీపుల్‌ ప్రచార ప్రయాణానికి విజయ్‌ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్‌ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది.

  • ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్‌ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.  గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

    సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్‌ వేస్తాం. 

    న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్‌.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

    ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్‌ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్‌. ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్‌ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్‌ అంటే!.

    కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్‌ అల్టమేటం జారీ చేశారు.

    YS Jagan : ఎన్. జనార్ధన రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశాడు..
  • సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

    గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్‌కు గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధమే లేదు.  తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్  కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్‌ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది.. 

    ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్‌ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్‌పర్ట్స్‌(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం. 

    వాల్‌ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది. 

    గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.

    ఈ సంతకాలు గవర్నర్‌ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్‌ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్‌ వేస్తాం. స్కామ్‌లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్‌. ప్రైవేట్‌ వాళ్లకు మెడికల్‌ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్‌ ఉంటుందా?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

    నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:
    కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్‌ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్‌ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్‌ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్‌ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ మోసాలు.

    విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:
    అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.

    వ్యవస్థలన్నీ తిరోగమనం:
    కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.

    న్యాయపోరాటం కూడా చేస్తాం:
    ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్‌ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్‌.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

    జగన్ పంచ్.. నీ పనైపోయింది.. ఆశలు పెట్టుకోకు

    2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్‌:
    ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్‌ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్‌. ఒక మెడికల్‌ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్‌

    అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:
    రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్‌ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్‌భవన్‌కు వెళ్లే ముందు అంబేడ్కర్‌ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్‌ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

     

     

     

     

     

     

     

     

Cartoon