Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ నగరంలో.. శాంతిభద్రతలను మరింత బలపరచడం కోసం ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో రాత్రి 10:30 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 5000 మంది పోలీస్ సిబ్బంది, 150 ప్రదేశాలలో ఒకేసారి తనిఖీలు నిర్వహించారు.

    హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ చరిత్రలో.. ఆపరేషన్ కవచ్ అపూర్వమైన చర్య. ఈ కార్యక్రమంలో లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కాల్ట్స్ వంటి బృందాలు పాల్గొన్నాయి. విస్తృత తనిఖీలు నిర్వహించాయి. దీనికి ప్రజలు కూడా సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు మీ దృష్టికి వస్తే.. 100 డయల్ చేసి చెప్పాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

  • ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయగా.. దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజీని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ విమానంలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

  • హనుమకొండ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవోగా ఉన్న వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు.  కొత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడానికి రూ. 60వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వీరిని హనుమకొండ కలెక్టరేట్‌లో.. డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.

  • పుష్ప సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నారని తెలుసుకొని.. బోయిన్‌పల్లి నుంచి శామీర్‌పేట్ వరకు ఛేజ్ చేశారు. కారు తెరిచి చూడగా డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన రూ.4 కోట్లు కనిపించాయి. గతేడాది హవాలా డబ్బుతో పరారైన వ్యక్తి ఇవాళ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ముఠా సభ్యులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు 15కిమీ ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.

  • సాక్షి హైదరాబాద్ : సోమాజిగూడ శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ ఐదవ అంతస్థులో ఉన్న రెస్టారెంట్ లో అగ్గి రాజుకొని మంటలు వ్యాపించాయి దీంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది  అక్కడ ఉన్న వారిని బయిటకి పంపించారు. ఫైర్ ఇంజన్లు మంటలార్పే యత్నం చేస్తున్నాయి. కాంప్లెక్స్ నాలుగవ అంతస్థులో GRT జ్యూవెలర్స్ ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయనను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలలో  ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడారు. 

    అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమాయాలు వస్తాయని, వాటిని తట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ప్రజలు అధైర్యపడొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

    ఇక 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన పెద్దగా పబ్లిక్‌గా కనిపించలేదు. 2023 డిసెంబర్ 4న గజ్వెల్‌లో తన ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆపై 2025 జూన్ 11న, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న జ్యుడీషియల్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇలా చాలా అరుదుగానే కేసీఆర్‌ బయటకొస్తున్నారు. తాజాగా  తెలంగాణలో పలు గ్రామ పంచాయతీలలో బీఆర్‌ఎస్‌ నుంచి ఏకగ్రీవంగా  ఎన్నికైన  సర్పంచ్‌లతో కేసీఆర్‌ సమావేశం అవ్వడమే కాకుండా వారిలో జోష్‌ నింపే యత్నం చేశారు. 

  • సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని  పోలీసులు కోరగా  కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

    కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే  చేశారు.

    అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

  • సాక్షి వరంగల్ : రాష్ట్రంలో కోటి 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ జరగలేదని ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ జరిపామన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా నర్సంపేటలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి హన్మకొండ-మహబూబాబాద్ నాలుగు లేన్ల రోడ్డు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

    దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా  క్టర్‌ వైఎస్సార్‌ హయాంలో పేదలకు 25 లక్షల ఇందిరమ్మ  ఇళ్లు కట్టించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం  4 లక్షల50 వేలకు  పైగా ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేసిందని తెలిపారు. పేదల ఆత్మ గౌరవాన్ని పెంచడానికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.  ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పేటేంట్ కాంగ్రెస్ కే దక్కుతుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

    వరంగల్ అభివృద్ధిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కానీ ప్రజా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ మాదిరి వరంగల్ ను అభివృద్ది చేయాలని యోచిస్తుందని తెలిపారు. వరంగల్ లో ఎయిర్ పోర్టును మార్చి 31లోగా నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కోటి మంది మహిళలను  కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ అన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండిగో ఎంక్వైరీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. కస్టమర్  సర్వీస్ రూమ్ డోర్లు బాదుతూ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

    నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం.. స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్షన్‌ వాతావరణ నెలకొనడంతో సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు రంగ్ర ప్రవేశం చేశారు. పోలీసులు, ప్రయాణికులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

    ఇండిగో యాజమాన్యం కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ ప్రయాణికుల ఆందోళనకు దిగారు. బోర్డింగ్ పాస్ పూర్తయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ మండిపడ్డారు. తమ లగేజ్ అడిగితే ఇక్కడ ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో కస్టమర్ సర్వీస్ కనీస స్పందన లేదని.. గంటలు గంటలు నిల్చున్న సమాధానం చెప్పట్లేదని.. చిన్నారులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

    IndiGo Flight: ప్రయాణికులకు చుక్కలు

Movies

  • రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్‌డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. 

    తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్‌ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్‌- మెర్విన్‌ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు. 

     

  • ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో బిగ్‌ డీల్‌ ఖరారు కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఒప్పందం కోసం బిడ్‌ వేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 72 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.47 లక్షల కోట్లు)గా ఉంది.

    ఈ లెక్కన ఒక్కో వార్నర్‌ బ్రదర్స్‌ షేరుకు 27.75 డాలర్లు చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) బిడ్‌ వేసినట్లు తెలిసింది. సీఎన్‌ఎన్‌, టీబీఎస్‌, టీఎన్‌టీ వంటి కేబుల్‌ ఛానళ్లలో ప్రారంభించిన మార్పుల ప్రక్రియను వార్నర్‌ బ్రదర్స్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. హాలివుడ్‌లో అత్యంత విలువైన కెంపెనీగా ఎదిగిన నెట్‌ఫ్లిక్స్‌ ఇలాంటి బిగ్ డీల్ చేపట్టడం ఇదే తొలిసారి.

    ఈ బిగ్‌ డీల్‌ కొనుగోలుతో హెచ్‌బీఓ నెట్‌వర్క్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం కానుంది. అలాగే ది సొప్రానోస్‌, ‘ది వైట్‌ లోటస్‌ వంటి హిట్‌ షోల లైబ్రరీలతో పాటు హ్యారీ పోటర్‌, ఫ్రెండ్స్‌ వంటి సినిమా, టీవీ ఆర్కైవ్స్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌ చేతుల్లోకి వెళ్లనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అసాధారణమైన వినోదాన్ని అందిస్తామమని తెలిపింది. 
     

     

  • ఈ రోజుల్లో సోషల్ మీడియా ఖాతా లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని ‍అడిగితే టక్కున లేరనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ డిజిటల్ యుగం అంతా సామాజిక మాధ్యమాల మీదనే నడుస్తోంది. ఇప్పుడంతా అరచేతిలోనే ప్రపంచం కనిపిస్తోంది. సోషల్ మీడియాతో ఒక్క రోజులోనే వరల్డ్ ‍వైడ్ ఫేమస్‌ అవుతున్న రోజులివి. మరి ఇంతలా ప్రపంచాన్ని శాసిస్తోన్న సోషల్ మీడియాలో స్టార్‌ నటుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదంటే నమ్ముతారా? ‍మీరు అవునన్నా.. కాదన్నా ఇది నమ్మి తీరాల్సిందే. తాజాగా ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఆ నటుడు ఎవరో మీరు చదివేయండి. 

    నాగార్జున శివ మూవీలో తన విలనిజం, నటనతో మెప్పించిన జేడీ చక్రవర్తి. ఆయనకు ఇప్పటి వరకు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా లేదు. తాజాగా జేడీ చక్రవర్తి సోషల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. జేడీ మ్యాక్స్ మోడ్‌ పేరుతో ఈ సోషల్ మీడియా అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఇందులో  జేడీకి సంబంధించిన ఓ వీడియోను కూడా చేశారు. నేను దేవున్ని నమ్మను.. నువ్వు విన్నది కరెక్టే.. నేను దేవుళ్లను నమ్ముతాను.. అందరి దేవుళ్లను నమ్ముతాను.. జై ఆంజనేయ.. కాదు.. కాదు.. జై శ్రీ హనుమాన్.. నేను వచ్చేస్తున్నా అంటూ వీడియోలో జేడీ చక్రవర్తి మాట్లాడారు. 

    కాగా.. జేడీ చక్రవర్తి శివ, గాయం, సత్య లాంటి చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లోకి వచ్చేస్తున్నారు. కాగా.. జేడీ చివరిసారిగా దయా అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌ 2023లో జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. 

     

  • మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


    ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్‌ ప్రస్తుతం అనిల్ రావిపూడితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్‌గారు వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇ‍ప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ సైతం కీలక పాత్రలో నటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
     

     

  • తెలుగులో పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్.. విడుదలకు ముందే పూర్తయిపోతాయి. చిన్నచిత్రాలకు మాత్రం కొన్నిసార్లు రిలీజ్ తర్వాత లేదంటే ఎప్పటికో అవుతాయి. అలా కొన్నిసార్లు థియేటర్లలోకి వచ్చిన నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఓ తెలుగు చిత్రం దాదాపు 8 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది.

    అప్పట్లో పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన సత్యప్రకాశ్‌.. ప్రస్తుతం ఒకటి అరా చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'నాన్నా మళ్లీ రావా!'. ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష ఇతర పాత్రలు పోషించారు. నిర్దేశ్‌ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

    (ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

    రిలీజ్ టైంలో ఈ సినిమా గురించి మాట్లాడిన సత్యప్రకాశ్.. నన్నెంతగానో కదిలించిన కథ ఇది. చిత్రీకరణలో ప్రతిరోజూ గ్లిజరిన్‌ అవసరం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి. కథలోని ప్రతి సందర్భం వాస్తవంలా అనిపించేది అని చెప్పుకొచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ 'నాన్న చుట్టూ తిరిగే కథ ఇది. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది' అని అన్నారు.

    ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ విడుదలయ్యాయి. రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా జీ5లో, స్టీఫెన్ అనే డబ్బింగ్ బొమ్మ నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా.. హాట్‌స్టార్‌లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చాయి.

    (ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్‌..: దర్శకుడు)

  • ప్రముఖ బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్య ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడింది. తాను విలువలతో రాజీ పడకుండా  నిజాయితీగా ఉంటానని తెలిపింది. అవకాశాల కోసం తానెప్పుడు ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని దివ్య ఖోస్లా పేర్కొంది. ఆస్క్ మీ ఎనిథింగ్ పేరుతో నిర్వహించిన ఈ సెషన్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

    దివ్య ఖోస్లా మాట్లాడుతూ..'బాలీవుడ్‌లో చాలా మొసళ్లు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడ నువ్వు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. పని కోసం నా ఆత్మ గౌరవాన్ని నేను ఎప్పుడూ అమ్ముకోను. యూకేలో ఓ సినిమా కోసం సున్నా డిగ్రీల టెంపరేచర్‌లో దాదాపు 42 రోజుల పని చేశా. అది నా కెరీర్‌లో అత్యంత అద్భుతమైన షూట్.  దాదాపు మైనస్ 10 డిగ్రీలు.. అయినా కూడా నాన్-స్టాప్‌గా చిత్రీకరించాం. ఇతర సినిమాలతో పోల్చడానికి నాకు ఒక బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసింది.' అని తెలిపింది.

    అంతేకాకుండా భూషణ్‌కుమార్‌తో విడాకులపై కూడా దివ్య ఖోస్లా స్పందించింది. మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ఆమె  క్లారిటీ ఇచ్చింది.  ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. కానీ మీడియా అది నిజం కావాలని కోరుకుంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. కాగా.. ఆమె 2005లో టీ-సిరీస్ ఛైర్మన్, ఎండీ భూషణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే దివ్య ఖోస్లా చివరిసారిగా నీల్ నితిన్ ముఖేష్‌తో కలిసి నటించిన థ్రిల్లర్-కామెడీ ఏక్ చతుర్ నార్‌లో కనిపించింది.

  • ప్రభాస్ ప్రస్తుతం 'స్పిరిట్' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇతడి నుంచి 'రాజాసాబ్' మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం తొలుత ట్రైలర్, తర్వాత ఓ పాటని రిలీజ్ చేశారు. అలానే ఓవర్సీస్‌లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఓటీటీ డీల్ మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. ఇ‍ప్పుడు అది ఎట్టకేలకు పూర్తయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: సమంత రాజ్.. నో హనీమూన్, నో రిలాక్స్)

    ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీసిన హారర్ ఫాంటసీ మూవీ ఇది. కొన్నాళ్ల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కంటెంట్ ఏంటనేది చూచాయిగా క్లారిటీ వచ్చేసింది. హారర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటసీ అంశాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా ఈ సినిమా కోసం పెట్టుబడి పెట్టింది. సదరు ముంబై కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని తిరిగిచ్చే విషయంలో కాస్త ఆలస్యమైనట్లు తెలుస్తోంది. దీంతో ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉండిపోయింది.

    ఇప్పుడన్నీ సమస్యలన్నీ క్లియర్ కావడంతో 'రాజాసాబ్' డిజిటల్ హక్కుల్ని జియో హాట్‌స్టార్ ఓటీటీ.. భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి 6 వారాలకు ఒప్పందం కుదుర్చుకున్నారా లేదంటే 8 వారాలకు కుదుర్చుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

    (ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

  • షార్ట్ బ్లాక్ డ్రస్‌లో అదరగొట్టేస్తున్న అనన్య నాగళ్ల

    పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ దివ్య భారతి

    కలర్‌ఫుల్ ఔట్ ఫిట్‌లో మెరిసిపోతున్న రకుల్

    2025 జ్ఞాపకాలని పంచుకున్న ఆలియా భట్

    నవంబర్ మెమొరీస్ అంటూ నివేదా థామస్ పోస్ట్

    దేవాలయంలో పూజా చేస్తూ భాగ్యశ్రీ బోర్సే బిజీ

  •  పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఖుదీరామ్‌ బోస్ జీవితం ఎంతోమంది యువతకు ఆదర్శం. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఖుదీరామ్‌ బోస్‌. ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహించగా.. విజయ్‌ నిర్మించారు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని ఇ‍ప్పటికే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో ప్రదర్శించారు.

    తాజాగా ఈ చిత్రంలో ఓటీటీకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేవ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. డిసెంబర్ 3, 1889న జన్మించిన ఖుదీరామ్ బోస్ కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలర్పించాడు. ఇటీవలే అతని జయంతి సందర్భంగా యావత్ దేశం నివాళులర్పించింది కాగా.. ఈ సినిమాలో రాకేశ్‌ జాగర్లమూడి, వివేక్‌ ఒబెరాయ్‌, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు.


     

     

  • హీరోయిన్ సమంత.. నాలుగు రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. సాధారణంగా వివాహం తర్వాత సెలబ్రిటీలు చాలామంది హనీమూన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ సామ్ మాత్రం పనిలో పడిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    చివరగా విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమాలో సమంత కనిపించింది. తర్వాత తానే నిర్మాతగా మారి 'శుభం' అనే మూవీ తీసింది. ఈ ఏడాది మే నెలలో చిత్రం రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. తానే నిర్మాత, హీరోయిన్‌గా సమంత.. 'మా ఇంటి బంగారం' అనే చిత్రం చేస్తోంది. గత నెలలోనే షూటింగ్ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.

    (ఇదీ చదవండి: సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?)

    మధ్యలో సమంత పెళ్లి వల్ల కాస్త గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని సమంత బయటపెట్టింది. సెట్స్‌లో దర్శకురాలు నందినీ రెడ్డితో ఉన్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అలా పెళ్లయిన నాలుగు రోజులకే హనీమూన్ లాంటివి ప్లాన్ చేసుకోకుండా పనిలో పడిపోయిందనమాట.

    'మా ఇంటి బంగారం' సినిమా విషయానికొస్తే.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. కొన్నాళ్ల ముందే నందినీ రెడ్డి దర్శకత్వంలో మొదలైంది. ఈ సినిమాని సమంత నిర్మిస్తున్నప్పటికీ.. రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

  • ఐకాన్ స్టార్ అ‍ల్లు అర్జున్‌ హీరోగా గతేడాది ఇదే రోజు రిలీజైన చిత్రం పుష్ప-2. ఈ మూవీ డిసెంబర్‌ 2, 2024న విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇందుకోసం బాలానగర్‌లో విమల్ థియేటర్‌లో షో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ వద్ద బన్నీ ఫ్యాన్స్‌ గొడవ పడ్డారు.

    అయితే ఈ షో టికెట్లను ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్‌ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్‌ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    సంధ్య థియేటర్‌ ఘటన..

    పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అండగా నిలిచింది. ప్రస్తుతం శ్రీతేజ్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాుడు.

     

     

  • బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్‌ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్‌లో ఫస్ట్ ఫైనలిస్ట్‌ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్‌ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్‌ దాడి చేస్తుంటారు. సీజన్‌-7లో అమరదీప్‌ ఇదే టాస్క్‌తో బాగా వైరల్‌ అయ్యాడు. హౌస్‌మేట్స్‌ అందరూ అమర్‌ని టార్గెట్‌ చేయడంతో రేయ్‌ వద్దురా ప్లీజ​్‌ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్‌ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్‌ చేశారు.

    'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం  డీమాన్ పవన్‌ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్‌ నుంచి కల్యాణ్‌ టవర్‌ను కూల్చేందుకు బాల్స్‌ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్‌ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్‌ చేస్తారో వాళ్లని తాను టార్గెట్‌ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్‌ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్‌ దూకుడుగా బాల్స్‌ విసురుతున్న క్రమంలో లైన్‌ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్‌ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు.

  • పాన్ ఇండియా సినిమాల్లో 'నంబర్ వన్ హీరో' అంటే అందరూ చెప్పే  మొదటి పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత అతని ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ఫ్లాప్ సినిమాలు వచ్చినా, అతని చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు చేస్తూనే ఉన్నాయి. ఈ ఇమేజ్ వల్లే ప్రభాస్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో అతడే. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 100-120 కోట్లు తీసుకుంటున్నాడు. 

    గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్‌ ఇదే స్థాయిలో పుచ్చుకుంటున్నాడు. ఇది అందరికి తెలిసిన పాత వార్తే. కానీ, ఇప్పుడు మరోసారి ప్రభాస్‌(Prabhas) పారితోషికం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. స్పిరిట్‌ సినిమాకు ఆయన ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట. ఈ చిత్రానికి అత్యధికంగా రూ.160 కోట్లకుపైగా పారితోషికం(Remuneration) తీసుకుంటున్నారని టాలీవుడ్‌లో టాక్‌. ప్రభాస్‌కు ఉన్న గ్లోబల్‌ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణ సంస్థలు ఆ స్థాయితో పారితోషికం అందిస్తున్నాయి.

    స్పిరిట్‌ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా తృప్తి దిమ్రి నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వీళ్లతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించనుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్, టి.సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్‌ కుమార్‌ నిర్మాతలు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.

  • ఇప్పుడంటే వెబ్ సిరీస్‌ల హవా కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్‌కి ముందు, లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో చాలా సిరీస్‌లు అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. అలాంటి వాటిలో 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'. నలుగురు మోడ్రన్ అమ్మాయిలు, వాళ్ల జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన బోల్డ్ కామెడీ సిరీస్ ఇది. ఇప్పుడు దీని చివరి సీజన్ గురించి అప్‌డేట్ వచ్చేసింది.

    (ఇదీ చదవండి: విమానాలు రద్దు.. 'లక్షలు' ఖర్చు చేసిన సెలబ్రిటీలు)

    సయానీ గుప్తా, కృతి కల్హరీ, బని, మాన్వి గాగ్రూ లీడ్ రోల్స్ చేసిన ఈ సిరీస్ తొలి సీజన్ 2019లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. రెండో సీజన్ 2020లో, మూడో సీజన్ 2022లో వచ్చాయి. కానీ చివరిదైన నాలుగో సీజన్ రావడానికి మాత్రం దాదాపు మూడేళ్ల పట్టేసింది. తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ డిసెంబరు 19 నుంచి చివరి సీజన్ స్ట్రీమింగ్ కానుందని పోస్ట్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు.

    ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో రిలీజైన వాటి విషయానికొస్తే.. 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'జటాధర', 'ద గర్ల్‌ఫ్రెండ్', 'డీయస్ ఈరే', 'స్టీఫెన్', 'థామా' తదితర సినిమాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్‌..: దర్శకుడు)

Andhra Pradesh

  • విజయవాడ: వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కేసులు నమోదు కావడం కూటమి సర్కార్‌ వేధింపులు కొనసాగింపునకు మరొక ఉదాహరణ. అక్టోబర్‌ 7వ తేదీన ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావుకు చెందిన గోడౌన్‌లో నకిలీ మద్యం డంప్‌ను ఎక్సైజ్‌ పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలిసి డంప్‌ను పరిశీలించారు జోగి రమేష్‌. 

    దీనిపై ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు.  ఆ రోజు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఇప్పుడు అక్రమ కేసులు నమోదుఉ చేశారు పోలీసులు. విచారణకు రావాలని 20 మంది వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిచ్చారు. దీనిపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఎప్పుడో రెండు నెలల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులు నమోద చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటని ప్రశ్నించింది. 

  • తాడేపల్లి :  ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్‌ కో -ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం  విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్‌ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. 

    ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్‌ మీటింగ్‌కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ..  ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. 

    ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి.  పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్‌ 4వ తేదీ)  వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

Business

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్‌ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.

    బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్‌ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్‌ ఓపెన్‌ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్‌బాట్‌లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.

    జెమిని 3, నానో బనానా ప్రో

    ఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్‌ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం

  • దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ‍ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.

    ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్‌పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్‌ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

    రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధి

    వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీ,  జీరో పొల్యూషన్‌’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్‌ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.

  • అమెరికన్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు వెబ్‌సైట్‌లు స్తంభించాయి. క్లౌడ్‌ఫ్లేర్ వినియోగదారులు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. భార‌త దేశానికి చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లైన జెరోధా, గ్రో వెబ్‌సైట్లు కూడా ప‌నిచేయ‌లేదు. వీటితో పాటు కాన్వా, జూమ్, షాపిఫై, వాలరెంట్, లింక్డ్ఇన్, డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి.

    క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల్లో అంత‌రాయం కార‌ణంగా తాము సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నామ‌ని పేర్కొంటూ గ్రో (Groww) సంస్థ ఎక్స్ ద్వారా వెల్ల‌డించింది. “క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల్లో ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కారణంగా మేము ప్రస్తుతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ యాప్‌లు, సేవలను ప్రభావితం చేస్తోంది. మేము పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాము. సేవలు పునరుద్ధరించబడిన వెంట‌నే మీకు తెలియ‌జేస్తాం. మీ స‌హ‌నానికి ధన్యవాదాలు,” అని ట్వీట్ చేసింది. త‌ర్వాత ప‌ది నిమిషాల‌కు త‌మ సేవ‌లను పున‌రుద్ధరించిన‌ట్టు ఎక్స్‌లో మ‌రో పోస్ట్ పెట్టింది.

    అసౌక‌ర్యానికి చింతిస్తున్నాం
    క్లౌడ్‌ఫ్లేర్‌లో క్రాస్-ప్లాట్‌ఫారమ్ డౌన్‌టైమ్ కారణంగా కైట్ యాప్‌ సేవ‌లు నిలిచిపోయాయ‌ని జెరోధా పేర్కొంది. ట్రేడింగ్ కోసం కైట్ వాట్సాప్ బ్యాకప్‌ను ఉపయోగించుకోవాల‌ని త‌మ వినియోగ‌దారుల‌కు ఎక్స్ ద్వారా సూచించింది. స‌మ‌స్య ప‌రిష్కార‌మైంద‌ని, కైట్ యాప్‌ సేవలు పునరుద్ధరించబడ్డాయని కొంత సేప‌టి త‌ర్వాత ప్ర‌క‌టించింది. వినియోగ‌దారుల‌కు క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్టు తెలిపింది. జెరోధా కైట్ అనేది ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, యాప్.

    క్లౌడ్‌ఫ్లేర్ ఏం చేస్తుంది?
    అమెరికా కేంద్రంగా ప‌నిచేస్తున్న క్లౌడ్‌ఫ్లేర్ అతిపెద్ద ఇంటర్నెట్ (Internet) నిర్వ‌హ‌ణ‌ కంపెనీల్లో ఒక‌టి. ఇంటర్నెట్‌కు సంబంధించిన అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తోంది. వెబ్‌సైట్‌లు, యాప్‌లు, నెట్‌వర్క్‌లను వేగంగా, సురక్షితంగా ఉంచ‌డానికి అవ‌స‌ర‌మైన స‌ర్వీసులు ఇస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 125 దేశాలల్లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న క్లౌడ్‌ఫ్లేర్‌కు 3 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఒక త్రైమాసికంలో దాదాపు $500 మిలియన్లను ఆర్జిస్తుంద‌ని ద గార్డియ‌న్ వెల్ల‌డించింది.

    చ‌ద‌వండి: ఇండిగో సంక్షోభానికి కార‌ణాలు ఇవేనా..

    కార‌ణాలు అన్వేషిస్తున్నాం
    సేవ‌ల్లో అంత‌రాయానికి గ‌ల కార‌ణాల‌ను క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) వెల్ల‌డించ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ త‌మ వినియోగ‌దారుల వెబ్‌సైట్లు స్తంభించ‌డంతో స‌మ‌స్య‌ను వెంటనే ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌క‌టించింది. స‌మ‌స్య‌ త‌లెత్త‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వెల్ల‌డించింది. న‌వంబ‌ర్ 18న కూడా క్లౌడ్‌ఫ్లేర్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. దీంతో చాట్‌జీపీటీ, స్పాటిఫై, ఎక్స్ వెబ్‌సైట్లు స్తంభించాయి.త‌మ‌ డేటాబేస్‌లో చేసిన మార్పు వల్ల ఇది సంభవించిందని సీఈవో మాథ్యూ ప్రిన్స్ తెలిపారు.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుడు, ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే హెచ్చరిక చేశారు. 2026 నుంచి అతిపెద్ద మాంద్యం ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచే ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    ఉద్యోగ నష్టాలు.. ముందస్తు సంకేతాలు

    ప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకుంటున్న ఉద్యోగ నష్టాలను రాబోయే మహా మాంద్యానికి ముందస్తు సంకేతాలుగా కియోసాకి పేర్కొన్నారు. ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ నివేదికను ఉటంకిస్తూ, నవంబర్‌లో అమెరికాలో దాదాపు 32,000 ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ముఖ్యంగా పెద్ద కంపెనీలతో పాటు, చిన్న వ్యాపారాలు 1,20,000 మంది ఉద్యోగులను తొలగించడం మరింత కలవరానికి గురిచేసిందని అన్నారు.

    ‘2026లో భారీగా ఉద్యోగ తొలగింపులు మొదలవుతాయి. మీ ఉద్యోగం ప్రమాదంలో ఉంటే ఇప్పుడే నా పాఠం #4ని గుర్తుచేసుకోండి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి’ అని కియోసాకి ఉద్యోగులకు హితవు పలికారు.

    డబ్బు సంపాదించే మార్గాలు

    మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు. మాంద్యం సమయంలో అమ్మకం నైపుణ్యం అనేది జీవనాధారమవుతుందని, దురదృష్టవశాత్తూ చాలా మంది ఉద్యోగులకు ఈ నైపుణ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    రియల్ ఎస్టేట్ క్రాష్

    2026లో ముఖ్యంగా రెసిడెన్షియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య) రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా క్రాష్ అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ‘బేరసారాలు ఉండవు. లైఫ్‌టైమ్ ఒప్పందాలు మీ కోసం ఎదురుచూస్తాయి. పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండండి’ అని మాంద్యం సమయంలోనే అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు.

    కళాశాల డిగ్రీ కంటే నైపుణ్యాలు ఉత్తమం

    ఉపయోగంలేని డిగ్రీల కోసం మళ్లీ కళాశాలకు వెళ్లి రుణాలు తీసుకోవద్దని, దానికి బదులుగా నర్సింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, వృద్ధుల సంరక్షణ వంటి ఆచరణాత్మక నైపుణ్యాలు నేర్చుకోవాలని అన్నారు. ‘ప్రపంచానికి ఎప్పుడూ ఈ నైపుణ్యాలు కావాలి’ అని అన్నారు.

    బంగారం, వెండి, క్రిప్టో.. ఇవే భవిష్యత్తు

    ప్రస్తుతం చెలామణిలో ఉన్న డాలర్‌ను కియోసాకి మళ్లీ నకిలీ డబ్బుగా అభివర్ణించారు. సంక్షోభ సమయంలో డబ్బును కాపాడుకోవడానికి నిజమైన ఆస్తుల్లో పొదుపు చేయాలని ఆయన సూచించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథేరియం వంటి ప్రధాన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఔన్సుకు 57 డాలర్లుగా ఉన్న వెండి ధర, జనవరి 2026 నాటికి 96 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

    ఇదీ చదవండి: విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం

  • సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కీలక చర్య తీసుకుంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ (ఆస్టా) వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, ఆస్టా సంస్థ, డైరెక్టర్ గౌరీ సాథేలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, వారి ఖాతాల్లో ఉన్న ఏకంగా రూ.546 కోట్లను జప్తు చేయాలని సెబీ ఆదేశించింది.

    విద్య ముసుగులో..

    రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి ఈ భారీ మొత్తాన్ని సేకరించడానికి ఆస్టా రిజిస్టర్ చేయని పెట్టుబడి సలహాదారుగా పనిచేసిందని సెబీ నిర్ధారించింది. ఆస్టా అందించిన విద్యా కోర్సుల పేరుతో నిర్దిష్ట స్టాక్ చిట్కాలు, లైవ్ ట్రేడింగ్ కాల్స్, ఎంట్రీ-ఎగ్జిట్‌ సూచనలు ఇవ్వడం ద్వారా ఈ ఆదాయం వచ్చిందని సెబీ తేల్చింది. ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సెబీ దర్యాప్తు చేపట్టింది. వీడియోలు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్, పేమెంట్‌ లేవాదేవీలు, కొంతమంది వ్యక్తుల సాక్ష్యాలను పరిశీలించిన సెబీ ఆస్టా కార్యకలాపాలు కేవలం విద్యా శిక్షణకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష పెట్టుబడి సలహాగా ఉన్నాయని స్పష్టం చేసింది.

    ఉదాహరణకు, ఒక లైవ్ సెషన్‌లో అవధూత్ సాథే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌ను నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయమని, స్టాప్-లాస్, టార్గెట్‌తో సహా సూచించారు. దీన్ని సెబీ ఉత్తర్వుల్లో ఉటంకిస్తూ ‘ఇది విద్య కాదు, పెట్టుబడి సలహా’ అని స్పష్టంగా పేర్కొంది.

    అధిక ఫీజులు, హామీ రాబడుల భ్రమ

    ఆస్టా కౌన్సెలింగ్ బ్యాచ్‌ల పేరుతో ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక ఫీజులు చెల్లించిన వందలాది మంది సభ్యులకు రియల్‌టైమ్‌ ట్రేడింగ్ సూచనలు ఇచ్చింది. ఈ కోర్సుల ధర రూ.6.75 లక్షల వరకు ఉండగా, ఇవి కేవలం సైద్ధాంతిక పాఠాలకే కాకుండా రియల్‌టైమ్‌ సలహా కోసమేనని సెబీ గుర్తించింది. సంస్థ లాభదాయక ట్రేడ్ స్క్రీన్‌షాట్‌లు ప్రదర్శించి, నష్టాలను దాచిపెట్టి, అధిక రాబడుల హామీ భ్రమ కల్పించిందని సెబీ విమర్శించింది.

    2024 ప్రారంభంలో అధికారిక హెచ్చరిక అందినా సాథే ఈ పద్ధతులను కొనసాగించి, కార్యకలాపాలను మరింత రహస్యంగా మార్చారని సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.

    సెబీ ఆదేశాలు ఇవే..

    సెక్యూరిటీస్ మార్కెట్‌ను రక్షించడానికి, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి సెబీ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అవధూత్ సాథే, గౌరీ సాథే, ఆస్టా సంస్థపై సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలిక నిషేధిస్తున్నట్లు చెప్పింది. వీరు సెక్యూరిటీల కొనుగోలు-విక్రయాలు, సలహా కార్యకలాపాలు, లైవ్ ట్రేడింగ్ సెషన్లు నిర్వహించడంపై నిషేధం విధించింది. రూ.546 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల్లో ఉంచే వరకు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. పూర్తి ఆర్థిక రికార్డులు, ఆస్తి వివరాలు, జీఎస్టీ ఫైలింగ్స్, కస్టమర్ జాబితాను సమర్పించాలని చెప్పింది. సెబీ ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది. నోటీసులకు 21 రోజుల్లో అవధూత్ సాథే, ఇతరులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

    రిటైలర్లు ఏం చేయాలంటే..

    రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులు తమ డబ్బును రక్షించుకోవడానికి, ఆర్థిక నష్టాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తులు తప్పకుండా పాటించాలి. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా స్టాక్ చిట్కాలు, ట్రేడింగ్ కాల్స్ లేదా నిర్దిష్ట స్టాక్‌లపై సలహా ఇస్తే వారు సెబీతో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ (RIA) లేదా రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ (RA)గా నమోదు చేసుకున్నారో లేదో తప్పకుండా తనిఖీ చేయాలి.

    సలహా ఇచ్చే వ్యక్తి/ సంస్థ సెబీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను (ఉదాహరణకు, INA0000XXXXXX లేదా INH0000XXXXXX) సెబీ అధికారిక వెబ్‌సైట్‌లో 'Intermediaries/Market Participants' విభాగంలో తనిఖీ చేయాలి. ట్రేడింగ్ కోర్సు లేదా విద్యా తరగతులు పేరుతో లైవ్ ట్రేడింగ్ కాల్స్, నిర్దిష్ట ట్రేడ్ సూచనలు ఇస్తే, వారు రిజిస్టర్ కాకపోయినా సెబీ దృష్టిలో అది పెట్టుబడి సలహాగానే పరిగణిస్తారు.

    హామీ రాబడులు

    స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి హామీ రాబడులు ఉండవు. ఏ వ్యక్తి అయినా ‘కచ్చితమైన లాభం’, ‘రిస్క్-ఫ్రీ స్ట్రాటజీ’ లేదా ‘మీ డబ్బు రెట్టింపు’ అవుతుందని హామీ ఇస్తే అది మోసమే. లాభాల స్క్రీన్‌షాట్‌లు, విజయం సాధించిన క్లయింట్ల కథనాలు మాత్రమే చూపించి నష్టాలను లేదా రిస్క్‌లను దాచిపెడితే అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి.

    ఇదీ చదవండి: ‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’

  • భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

    ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్‌ కొద్ది సమయంలో వైరల్‌ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్‌కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.

    పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్‌ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.

    పైలట్ల కొరతే కారణం

    డీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్‌ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.

    ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..

  • దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

    • డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.

    • సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.

    • ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.

    సిబ్బంది కొరత

    కొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్‌పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్‌ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్‌ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌తో కలిసి జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్‌పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

    2023లో గూగుల్‌ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.

    టెక్ దిగ్గజాల అభిప్రాయాలు

    ఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.

    ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..

  • భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావాన్ని చూపడంలేదని, దీన్ని ఎగుమతి రంగం ఒక అవకాశంగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడిన మల్హోత్రా, భారతదేశం ప్రధానంగా దేశీయ డిమాండ్‌పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కాబట్టి యూఎస్‌ సుంకాల ప్రభావం గణనీయంగా ఉండదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, లేబర్ ఇంటెన్సివ్ రంగాలపై ప్రభావం కనిపిస్తున్నట్లు ఆయన అంగీకరించారు.

    సుంకాల పెరుగుదల, ఎగుమతుల తగ్గుదల

    ఆగస్టు 1 నుంచి అమెరికా 25 శాతం సుంకాలు విధించగా, ఆగస్టు 27 నుంచి రష్యా నుంచి ఇంధన దిగుమతుల కారణంగా అదనంగా 25 శాతం సుంకాలు అమలు చేసింది. ఏప్రిల్ 2న ప్రారంభమైన 10 శాతం సుంకాలు ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి చేరాయి. ఈ పరిణామాల వల్ల భారత్ తన అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాకు చేసే ఎగుమతులు గణనీయంగా తగ్గాయి.

    గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) నివేదిక ప్రకారం, మే నుంచి అక్టోబర్ 2025 వరకు భారత ఎగుమతులు 28.5 శాతం తగ్గి, 8.83 బిలియన్‌ డాలర్ల నుంచి 6.31 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈ సుంకాల వల్ల రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, కెమికల్స్, సీఫుడ్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు 31.2 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. జీటీఆర్‌ఐ ప్రకారం, స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 36 శాతం, కెమికల్స్ 38 శాతం తగ్గాయి.

    ఆర్‌బీఐ వృద్ధి అంచనా పెంపు

    ఎంపీసీ సమావేశాల్లో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకొచ్చింది. మల్హోత్రా జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచారు. ఇన్‌ఫ్లేషన్ 2 శాతానికి పడిపోయినప్పటికీ ఎగుమతుల తగ్గుదల రెండో అర్ధ సంవత్సరంలో వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఎగుమతి సంఘాలు, జీటీఆర్‌ఐ వంటి సంస్థలు ప్రభుత్వాన్ని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్‌ను త్వరగా అమలు చేయాలని సూచించాయి. అమెరికాతో చర్చలు వేగవంతం చేయాలని కోరుతున్నాయి.

    ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..

  • దేశంలో అద్దె గృహాల విభాగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచడం, యజమానులు-అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడం లక్ష్యంగా మార్పులు ప్రతిపాదించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన ‘మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA) 2025’ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించారు.

    ఈ ఎంటీఏ 2025 అనేది చట్టబద్ధమైన కేంద్ర చట్టం కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత అద్దె నియంత్రణ చట్టాలను సవరించడానికి లేదా కొత్త చట్టాలను రూపొందించడానికి ఇది ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. భూమి, ఆస్తి, అద్దె వ్యవహారాలు రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితా (ఎంట్రీ 18) పరిధిలోకి వస్తాయి కాబట్టి, రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా మాత్రమే ఈ మార్గదర్శకాలు చట్ట రూపం దాలుస్తాయని గుర్తుంచుకోవాలి.

    మార్గదర్శకాల్లోని వివరాలు

    • నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాలను సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

    • ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా సాధారణ స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే ఉండేవి. దీనివల్ల మోసాలు, అక్రమ ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. దీన్ని కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం  సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది.

    • ఒప్పందాన్ని నమోదు చేయడంలో విఫలమైతే భూస్వామికి రూ.5,000 వరకు జరిమానా విధించే వీలుంది.

    • ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెదారులు 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్‌గా చెల్లించాల్సిన భారం ఉంది. ఎంటీఏ 2025 ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్‌పై కచ్చితమైన పరిమితిని విధించింది.

    • నివాస గృహాలకు గరిష్ఠంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవచ్చు.

    • వాణిజ్య ఆస్తులకు గరిష్ఠంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంది.

    • ఆకస్మికంగా లేదా అతిగా అద్దె పెంచే విధానానికి కొత్త చట్టం అడ్డుకట్ట వేస్తుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు తప్పనిసరిగా ఇవ్వాలి.

    • రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారునైనా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం.

    • ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.

    • అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు లాకౌట్ (తాళం వేయడం), విద్యుత్/నీటి సరఫరాను నిలిపివేయడం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు.

    • అవసరమైన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు ఉంది.

    • అద్దెదారులు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

    రాష్ట్రాల స్పందన, అమలుపై అంచనాలు..

    కేంద్రం రాష్ట్రాలను తమ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, త్రిపుర వంటి 10కి పైగా రాష్ట్రాలు ఇప్పటికే ఎంటీఏ మార్గదర్శకాల ఆధారంగా తమ అద్దె చట్టాలను సవరించాయి. అందులో కొన్ని కొత్త చట్టాలను రూపొందించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా 2026 నాటికి ఈ కొత్త నియమాలను అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి: టెక్ తొలగింపులకు కారణం ఏమిటంటే: ఐబీఎం సీఈఓ

International

  • అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. 

    అమెరికా తమ పౌరుల భద్రత పేరుతో పలు దేశాలను, ఆ దేశాలకు చెందిన పౌరులను నిషేధించాలని నిర్ణయించింది. తాజాగా ఫాక్స్ న్యూస్ ప్రోగ్రామ్ ‘ది ఇంగ్రహం యాంగిల్’లో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా 19 దేశాలకు చెందిన పౌరులపై ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. అంటే.. ఈ దేశాలకు చెందిన పౌరులకు అన్నిరకాల ఇమ్మిగ్రేషన్లను నిలిపివేయనుంది. అదేవిధంగా పౌరసత్వం, గ్రీన్‌కార్డు దరఖాస్తులకు సైతం ఆయా దేశాల పౌరులను అనర్హులుగా ప్రకటించింది. అదేవిధంగా ఆయా దేశాలకు తమ పౌరులు వెళ్లకూడదంటూ ట్రంప్ ట్రావెల్ అలెర్ట్ జారీ చేశారు.

     ఇప్పటికే నిషేధం అమలవుతున్న దేశాలు ఏవి? 
    గత నెల వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై ఆఫ్ఘన్ శరణార్థి కాల్పులు జరిపిన ఉదంతం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు.. కాంగో, క్యూబా, ఇరాన్, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్, తుర్కెమెనిస్థాన్, వెనిజులా, యెమన్‌తోపాటు.. మొత్తం 19 దేశాలపై నిషేధం విధించారు. తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చెప్పిన దాని ప్రకారం ఈ జాబితాలో మరో 11 దేశాలు చేరనున్నట్లు స్పష్టమవుతోంది.

     ట్రంప్ నిర్ణయాన్ని రివర్స్ మైగ్రేషన్ అనవచ్చా?
    అవును ఇది కచ్చితంగా రివర్స్ మైగ్రేషనే. ట్రంప్ నిషేధం విధించిన దేశాలకు చెందిన వారిని అమెరికా నుంచి డీపోర్ట్ చేస్తారు. హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడినప్పుడు.. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, తమ దేశంలో నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆ మేరకు అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం భారీ కసరత్తే చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయంలో సమస్యాత్మక జనాబా తగ్గుతుందని, అంతకు మించితే సామాజిక సమస్యలు ఏమీ ఉండవని అభిప్రాయపడ్డారు. మరో 11 లేదా అంతకంటే ఎక్కువ దేశాలపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆ జాబితాలో ఏయే దేశాలున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.

  • హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసే మహిళకు ఆ జీవితం తృప్తినివ్వలేదు. సొంత బిజినెస్‌ చేయాలనే కోరిక  కలిగింది.  ఆ ఆలోచనే పట్టుదలగా మారింది. అదే ఆమె జీవితంలో కీలక మలుపునకు దారి తీసింది. ఇపుడు ఏడాది ఏకంగా రూ.4 కోట్లు ఆర్జిస్తోంది. 13 ఏళ్ల పాటు  నర్సుగా సేవలందించిన ఆమె మొదలు పెట్టిన బిజినెస్‌ ఏంటి? ఆమెవిజయ రహస్యం ఏంటి తెలుసుకుందామా?

    పట్టుదల ఉండాలే గానీ..
    అమెరికాలోని అరిజోనాకు చెందిన 38 ఏళ్ల కామి (మారు పేరు)  ఒక హాస్పిటల్‌లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ యూనిట్‌లో నర్సుగా  పనిచేసింది. జీవితం రొటీన్‌గా, మార్పు కావాలని అని అనిపించింది.  ఈ పని నుంచి బైటపడాలంటే ఉద్యోగం మానేసే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చాలా తీవ్రంగా ఆలోచించింది.   పెట్టుబడి కోసం ఇల్లు అమ్మాలని భావించింది.  వ్యాపారానికి రెండు మూడు వెంచర్‌లను పరిశీలించింది. చివరికి కొంతమంది స్నేహితులు,బంధువు సలహా మేరకు లాండ్రోమాట్ వ్యాపారాన్ని ఎన్నుకుంది. విదేశాల్లో లాండ్రోమాట్ అనేది కస్టమర్లు తమకు తాముగా బట్టలు ఉతుక్కునే స్వీయ-సేవ లాండ్రీ.

    నర్స్‌గా పనిచేయడం చాలా ఇష్టం, కానీ  "బెడ్‌సైడ్ నర్సింగ్ నిజంగా కష్టం" అని  పేర్కొంది. లాండ్రోమాట్ కొనుగోలుకు నిధుల కోసం 2020లో తన ఇంటిని విక్రయించింది. మిగిలిన మొత్తం, వాషింగ్‌ మెషీన్ల లాంటి పరికరాల కొనుగోలు కోసం లోన్లు తీసుకుంది. అలా ఉద్యోగం చేస్తూనే వ్యాపారాన్ని మొదలు పెట్టి అది లాభదాయకంగా మారడంతో నర్సింగ్‌ను విడిచిపెట్టింది. వ్యాపారం కాస్త పుంజుకోగానే, ఆ ప్లేస్‌ను పురుద్ధరించి, లాండ్రికి సంబంధించిన బట్టల పికప్, డెలివరీతో సహా సేవలను విస్తరించింది. తద్వారా అప్పులు తీరుస్తోంది.

    2020 నుండి 2023 వరకు అటు ఉద్యోగం, ఇటు వ్యాపారం రెండింటినీ మేనేజ్‌ చేస్తూ పూర్తిగా నిబద్ధురాలై పనిచేసింది. ఆకర్షణీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం లాండ్రోమాట్‌పైనే దృష్టిపెడుతూ స్థిరమైన కస్టమర్‌లు,సిబ్బందితో దిన దినాభివృద్ధి చెందుతోంది. లాండ్రోమాట్ గత సంవత్సరం (2024లో) దాదాపు రూ. 4.2 కోట్లు ఆర్జించింది. పక్కనే ఉన్న సెలూన్ నుండి దాదాపు  రూ. 24.96  లక్షల  అద్దె కూడా సంపాదించింది. అంతేకాదు వారానికి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే వ్యాపారం మీద దృష్టిపెడుతుంది. వ్యవస్థాపక ప్రయాణం గురించి సోషల్ మీడియా కంటెంట్‌ షేర్‌ చేయడం ద్వారా అదనంగా 10 గంటలు గడుపుతుంది. సోషల్‌ మీడియా ద్వారా మరో రూ.18.30 లక్షలు సంపాదిస్తోంది. తన వ్యాపార వృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు పోతోంది. రెండో లాండ్రోమాట్‌ సెంటర్‌ పెట్టడంతోపాటు,  రిటైర్‌మెంట్ ప్లాన్స్‌  కూడా పక్కాగా ఉన్నాయంటోంది కామి.

     పరిమిత వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ, ఆమె పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాలు, పరిశ్రమ ఈవెంట్‌ల ద్వారాతన నైపణ్యాన్ని మెరుగు పర్చుకుంది.  వారాంతాలు, తనకిష్టమైన ప్రయాణాలుకోసం సమయాన్ని కేటాయించే సౌలభ్యాన్ని అందిస్తోంది లాండ్రోమాట్.
     

     

NRI

  • అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు.  మరణించిన వారిలో ఉడుముల సహజ రెడ్డి,  కూకట్ పల్లి కి  చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు.  కాగా ఆ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. 

    హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు.

Sports

  • భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గ‌త కొన్ని సిరీస్‌ల‌గా క్రికెట్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే సుంద‌ర్‌ మూడు ఫార్మాట్ల‌లోనూ భార‌త జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్‌లో స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా ఆడితే..మ‌రో మ్యాచ్‌లో స్పిన్న‌ర్‌గా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. 

    బ్యాటింగ్‌లో కూడా ఒక స్దానంలో పంప‌డం లేదు.  ఒక మ్యాచ్‌లో మూడో స్దానం, మ‌రో మ్యాచ్‌లో ఆరో స్దానం అలా అత‌డి బ్యాటింగ్ ఆర్డ‌ర్ మారుతూనే ఉంది. బౌలింగ్‌లో కూడా స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డం లేదు.

    ఈ నేప‌థ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై తీవ్ర‌స్దాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా జ‌ట్టులో సుంద‌ర్ రోల్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్‌గానే వాషీని జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో సుంద‌ర్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 

    ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు వ‌న్డేల‌లోనూ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డిని మూడో వ‌న్డే నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు. 

    అందుకే సుందర్‌కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్‌పూర్‌లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గ‌త ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్ పేర్కొన్నాడు.
    చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది అత‌డినే

  • బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మాత్రం ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పై చేయి సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.

    ఆతిథ్య జట్టు ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కారీ (46*), నీసర్‌(15*) ఉన్నారు. అదేవిధంగా ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు  జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెర్త్ టెస్టు హీరో ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్ మూడు, స్టోక్స్ రెండు, ఆర్చర్ ఓ వికెట్ సాధించారు.

    అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోర్‌(325/9)కు తొమ్మిది పరుగులు జోడించి 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్‌(38) రాణించారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
    చదవండి: పాక్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

     

  • పాకిస్తాన్‌ సీనియర్‌ క్రికెటర్‌ ఫఖర్‌ జమాన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ జతచేసింది. ఇందుకు సంబంధించి ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    ముక్కోణపు టీ20 సిరీస్‌
    కాగా స్వదేశంలో శ్రీలంక- జింబాబ్వేలతో పాకిస్తాన్‌ ఇటీవల ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్‌- శ్రీలంక (Pakistna vs Sri Lanka) ఫైనల్‌ చేరగా.. శనివారం (నవంబరు 29) రావల్పిండి వేదికగా మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. లంక బ్యాటింగ్‌ చేసింది.

    కుప్పకూలిన లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌
    ఓపెనర్‌ కామిల్‌ మిశారా (59) తప్ప మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. 19.1 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి లంక ఆలౌట్‌ అయింది. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi), మొహమ్మద్‌ నవాజ్‌ చెరో మూడు వికెట్లు తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ (Abrar Ahmed) రెండు, సల్మాన్‌ మీర్జా, సయీమ్‌ ఆయుబ్‌ చెరో వికెట్‌ కూల్చారు.

    రాణించిన పాక్‌ టాపార్డర్‌
    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 18.4 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (23), సయీబ్‌ ఆయుబ్‌ (36) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    మిగిలిన వారిలో కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా(14)తో పాటు ఫఖర్‌ జమాన్‌ (3) విఫలమయ్యారు. అయితే, పవన్‌ రత్ననాయకే బౌలింగ్‌లో దసున్‌ షనక క్యాచ్‌ పట్టడంతో ఫఖర్‌ జమాన్‌ అవుట్‌ కాగా.. అంపైర్‌ నిర్ణయాన్ని ఫఖర్‌ వ్యతిరేకించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో పందొమ్మిదో ఓవర్‌లో ఈ మేరకు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇవ్వగా.. అతడితో వాగ్వాదానికి దిగాడు.

    ఫఖర్‌ జమాన్‌ ఓవరాక్షన్‌.. షాకిచ్చిన ఐసీసీ
    ఈ నేపథ్యంలో ఫఖర్‌ జమాన్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా వెల్లడించింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.8 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఫఖర్‌ జమాన్‌ మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కాబట్టి ఓ మెరిట్‌ పాయింట్‌ మాత్రమే జత చేస్తున్నాం.

    అంతర్జాతీయ మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయం పట్ల ధిక్కారం చూపినందుకు గానూ అతడికి శిక్ష విధిస్తున్నాం. అతడు కూడా తన తప్పిదాన్ని అంగీకరించాడు’’ అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.  కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల కాలంలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువ డీమెరిట్‌ పాయింట్లు చేరితే.. సదరు ప్లేయర్‌ తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం పడుతుంది. 

    చదవండి: IND vs SA: మ‌న‌సు మార్చుకున్న గంభీర్‌..!

  • టీమిండియా లెజెండ్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఫ్యాన్ ఫాలోయింగ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి  క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్‌లో అతడి ఆట కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. 

    అదేవిధంగా రో-కో ద్వయం కూడా కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నప్పటికి వారిని ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. కానీ 2025 ఏడాదిలో వీరి ముగ్గురుని ఓ యువ క్రికెటర్ అధిగమించాడు. అతడి గురుంచి తెలుసుకునేందుకు నెటజన్లు గూగుల్‌లో తెగ వెతికేశారు. అతడే భారత అండర్‌-19 సంచలనం, ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ.

    14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ  ఈ ఏడాది గూగుల్‌లో భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఈ వండర్ కిడ్  ఐపీఎల్, ఇండియా 'ఎ'మ్యాచ్‌లు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో తన సంచలన ప్రదర్శనతో అందరిని ఆకర్షించాడు. దీంతో అతడి గురుంచి తెలుసుకోవడానికి చాలా మంది మొగ్గు చూపారు. వైభవ్ 12 ఏళ్ల వయస్సలోనే ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

    కాగా గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదిక ప్రకారం.. వైభవ్ అగ్రస్ధానంలో ఉండగా మరో యువ సంచలనం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్దానంలో  అభిషేక్ శర్మ మరియు షేక్ రషీద్ నిలిచారు. అదేవిధంగా మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన  జెమీమా రోడ్రిగ్స్ గురుంచి కూడా ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.
    చదవండి: ఇండిగో సంక్షోభం.. బీసీసీఐకి ఊహించని షాక్‌!
     

  • భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ విజేతగా నిలవడం ఇందుకు ఓ కారణం అయితే.. అర్ధంతరంగా ఆమె పెళ్లి ఆగిపోవడం మరో కారణం.

    సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో ప్రేమలో ఉన్నట్లు గతేడాది స్మృతి వెల్లడించింది. టీమ్‌ టూర్లకు సైతం అతడిని స్మృతి వెంట తీసుకువెళ్లేది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత స్మృతి (Smriti Mandhana) ఇండోర్‌ (పలాష్‌ స్వస్థలం) కోడలు కాబోతోందంటూ పలాష్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

    తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ..
    అందుకు తగ్గట్లుగానే వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత.. తాము నిశ్చితార్థం (Engagement) చేసుకున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. స్మృతి మంధాన తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి వీడియో విడుదల చేసింది. అనంతరం పలాష్‌ సైతం స్మృతి వేలికి ఉంగరాన్ని తొడుగుతూ ఆమెకు ప్రపోజ్‌ చేసిన వీడియోను షేర్‌ చేశాడు.

    ఘనంగా వేడుకలు
    ఆ తర్వాత స్మృతి- పలాష్‌ హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మేనేజర్‌ వెల్లడించారు.

    అకస్మాత్తుగా ఆగిన పెళ్లి.. అనుమానాలు
    అయితే, ఆ తర్వాత పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రిలో చేరడం.. అతడు తనతో అసభ్యకర రీతిలో చాట్‌ చేశాడంటూ ఓ అమ్మాయి స్క్రీన్‌షాట్లు షేర్‌ చేయడం అనుమానాలు రేకెత్తించాయి. ఈ క్రమంలో స్మృతిని పలాష్‌ మోసం చేశాడంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. ఇరు కుటుంబాలు మౌనం వహించాయి.

    భిన్న స్పందనలు
    ఈ క్రమంలో త్వరలోనే స్మృతితో తన కుమారుడి వివాహం జరుగనుందని పలాష్‌ తల్లి అమితా వెల్లడించగా.. స్మృతి సోదరుడు శ్రవణ్‌ మాత్రం పెళ్లికి సంబంధించిన తాము కొత్త తేదీ ఫిక్స్‌ చేయలేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్మృతి మంధాన శుక్రవారం తొలిసారిగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

    రింగ్‌ తీసేసిన స్మృతి?
    ఓ ప్రముఖ బ్రాండ్‌ కోసం చేసిన యాడ్‌లో స్మృతి.. తన వరల్డ్‌కప్‌ విన్నింగ్స్‌ మూమెంట్స్‌ గురించి మాట్లాడింది. ఇందులో స్మృతి వేలికి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కనిపించలేదు. దీంతో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు. 

    అయితే, ఈ యాడ్‌ ఎంగేజ్‌మెంట్‌కు ముందే షూట్‌ చేశారని ఆమె అభిమానులు కౌంటర్‌ ఇస్తున్నారు. ఏదేమైనా స్మృతి ముఖం కళ తప్పినట్లు కనిపిస్తోందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. కాగా పెళ్లి వాయిదా పడిన వెంటనే స్మృతి.. తన వివాహ వేడుకలు, ఎంగేజ్‌మెంట్‌ రివీల్‌ వీడియోలను డిలీట్‌ చేయడం గమనార్హం.

    చదవండి: ‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టీ20 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్పు చేసింది. లాజిస్టికల్ సమస్యల కారణంగా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 

    వాస్తవానికి  డిసెంబర్ 12 నుండి 18 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లు ఫైనల్‌తో సహా 13 సూపర్ లీగ్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది.  కానీ  లాజిస్టికల్ సమస్యల కారణంగా మ్యాచ్‌లను నిర్వహించలేమని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) బీసీసీఐకి తెలియజేసింది. 

    డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో  గ్లోబల్ డాక్టర్ల కాన్ఫరెన్స్ జరగడం వల్ల స్టార్ హోటల్స్ ఖాళీగా లేవు. దీంతో నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పుడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియం, డివై పాటిల్ అకాడమీ వేదికగా జరగనున్నాయి.

    బీసీసీఐకు సవాల్‌..
    మరోవైపు ఇండిగో సంక్షోభం బీసీసీఐని సైతం కలవరపెడుతోంది. డీజీసీఏ కొత్తగా అమలు చేసిన ఫైలట్ రోస్టరింగ్ నియమాల కారణంగా సుమారు 1,000 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో బీసీసీఐ కూడా తీవ్రమైన లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది.

    ప్రస్తుతం దక్షిణాఫ్రికా-భారత్ టీ20 సిరీస్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా జరుగుతోంది. నాలుగు గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ నుండి  ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పూణేకు బీసీసీఐ విమానాల్లో తరలించాలి. వీటితో ఇతర  దేశీయ టోర్నమెంట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.

    "ఇదే సంక్షోభం కొనసాగితే ఎనిమిది జట్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్‌ను నాకౌట్ మ్యాచ్‌ల కోసం పూణేకు విమానంలో తరలించడం సవాలుగా మారవచ్చు. అలాగే అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 T20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ టోర్నీల కోసం జట్లు, అంపైర్‌లు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాల్సి ఉందిష అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు.
     

  • భారత మహిళా క్రికెట్‌ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడంలో దీప్తి శర్మది కీలక పాత్ర. ఈ మెగా ఈవెంట్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు గెలుచుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీలో దీప్తి మొత్తంగా 215 పరుగులు చేయడంతో పాటు.. 22 వికెట్ల కూల్చింది.

    ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ.. అర్ధ శతకం బాదడంతో పాటు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ -2026 మెగా వేలంలోనూ దీప్తికి భారీ ధర దక్కింది.

    వేలానికి ముందు ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను వదిలేసిన యూపీ వారియర్స్‌.. ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి తిరిగి ఆమెను సొంతం చేసుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.

    ఇదిలా ఉంటే..  వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టుతో కలిసి దీప్తి శర్మ.. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ నిర్వహించే ప్రముఖ షో.. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’కి హాజరైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా మారడానికి తన అన్నయ్యే కారణమని వెల్లడించింది.

    ‘‘నేను క్రికెట్‌ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య ప్రొఫెషనల్‌ క్రికెటర్‌. ఆయన వల్లే నేనూ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాను. నేను వేసిన ఒక్క త్రో నా జీవిత ప్రయాణాన్నే మార్చివేసింది.

    ఓరోజు మా అన్నయ్య ఆడుతున్న చోటికి వెళ్లాను. అక్కడే మెట్ల మీద కూర్చుని మ్యాచ్‌ చూస్తున్నా. ఇంతలో బంతి నా వైపు దూసుకువచ్చింది. వేగంగా స్పందించిన నేను.. దాదాపు 40- 50 మీటర్ల దూరం నుంచి దానిని నేరుగా స్టంప్స్‌నకు గిరాటేశాను. మా అన్నయ్య చాలా సంతోషించాడు.

    చుట్టూ ఉన్న వాళ్లు కూడా.. ‘ఈ అమ్మాయి క్రికెట్‌ ఆడితే బాగుంటుంది’ అని ఉత్సాహపరిచారు. ఆరోజు నుంచి క్రికెటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన నేను ఇంత వరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’’ అని దీప్తి శర్మ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే దీప్తి సేవలకు గానూ ఆమెను పోలీస్‌ శాఖలో డీఎస్‌పీగా నియమించింది.

  • సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్‌లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. శనివారం(డిసెంబర్ 6) వైజాగ్ వేదికగా సిరీస్ డిసైడ‌ర్ అయిన మూడో వ‌న్డేలో ఇరు జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ ఆఖ‌రి పోరులో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగనున్న‌ట్లు తెలుస్తోంది.

    సుంద‌ర్‌పై వేటు..
    ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్ తొలి రెండు వ‌న్డేల‌లోనూ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. మొద‌టి వ‌న్డేలో 13, రాయ్‌పూర్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి  నిరాశపరిచాడు. బౌలింగ్‌లో కూడా ఈ త‌మిళ‌నాడు ప్లేయ‌ర్ తేలిపోయాడు.

    దీంతో అత‌డిపై వేటు వేయాల‌ని గంభీర్ అండ్ కో సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం. అత‌డి స్దానంలో స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా రిష‌బ్ పంత్ లేదా తిల‌క్ వ‌ర్మ‌ను తీసుకోవాల‌ని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట‌. మ‌రోవైపు తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్న ఫాస్ట్ బౌల‌ర్ ప్ర‌సిద్ద్ కృష్ణను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది. 

    అతడి స్దానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో బౌలింగ్ కూడా చేయగలడు. ఎలాగో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు. 

    అంతేకాకుండా యశస్వి జైశ్వాల్‌పై కూడా వేటు పడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. జైశ్వాల్ రెండు వన్డేలలోనూ దారుణంగా విఫలమయ్యాడు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు రాయ్‌పూర్ వన్డేలో ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.

    సౌతాఫ్రికాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
    రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ/ రిషబ్‌ పంత్‌ , రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్
    చదవండి: ‘తిలక్‌, పంత్‌ ఉన్నా.. అతడిని నమ్మినందుకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే’

  • సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.

    సెంచరీతో అదరగొట్టాడు
    ఈసారి రుతురాజ్‌ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్‌పూర్‌ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్‌ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.

    సాధారణంగా రుతురాజ్‌ ఓపెనింగ్ బ్యాటర్‌గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.

    ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌కు తప్పక క్రెడిట్‌ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ..

    తిలక్‌, పంత్‌ ఉన్నా.. 
    ‘‘ఒక్క మ్యాచ్‌తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్‌కు మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. తిలక్‌ వర్మ , రిషభ్‌ పంత్‌ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. 

    అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్‌లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

    తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్‌ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు.

    దురదృష్టవశాత్తూ
    కాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రుతు ఇచ్చిన క్యాచ్‌ను డెవాల్డ్‌ బ్రెవిస్‌ సంచలన రీతిలో  ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు. 

    ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్‌ విజేత ఎవరో తేలుతుంది. 

    చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!

  • సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శన కారణంగానే అతడు ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.

    అతడితో పాటు ఈ జాబితాలో బంగ్లా దేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నవాజ్ ఉన్నారు. అయితే  ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు రేసులో భార‌త నుంచి మెన్స్ క్రికెట‌ర్ ఒక్క‌రూ కూడా లేక‌పోవ‌డం గ‌మనార్హం.

    దుమ్ములేపిన హార్మర్‌..
    సైమన్ హార్మర్ ఆలస్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. జాతీయ జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతడు బంతితో మ్యాజిక్ చేశాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు.

    హార్మ‌ర్ మొత్తంగా 17 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ గ‌డ్డ‌పై దక్షిణాఫ్రికా చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అంతక‌ముందు పాక్‌తో సిరీస్‌లో కూడా హార్మ‌ర్ 13 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక మ‌హిళ‌ల విభాగంలో ఈ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుకు భార‌త స్టార్ ఓపెన‌ర్ షెఫాలీ వ‌ర్మ నామినేట్ అయ్యింది. 

    గ‌త నెల‌లో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌ల‌లో షెఫాలీ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈ ఫైన‌ల్‌లో పోరులో బ్యాటింగ్‌లో 87 ప‌రుగులు చేసిన షెఫాలీ.. అనంత‌రం బౌలింగ్‌లో సునే లూస్, మరిజానే కాప్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.
    చదవండి: ఇదేం పిచ్చి?.. టికెట్ల కోసం ప్రాణాలకు తెగిస్తారా?

  • భారతదేశంలో క్రికెట్‌ ఓ మతం లాంటిది. అభిమాన క్రికెటర్ల ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే.. సగటు అభిమాని ఎగిరి గంతేయడం ఖాయం. అయితే, అందుకోసం టికెట్లు సంపాదించే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించడం విచారకరం. ఒడిషాలోని కటక్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.

    ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లతో బిజీ
    టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికా (IND vs SA)తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తొలుత టెస్టు సిరీస్‌లో ప్రొటిస్‌ జట్టు చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. రాంచి వేదికగా తొలి వన్డేలో గెలిచింది. అయితే, రాయ్‌పూర్‌లో రెండో వన్డేలో ఓడటంతో సిరీస్‌ 1-1తో సమం కాగా.. విశాఖపట్నంలో జరిగే మూడో వన్డేతో సిరీస్‌ ఫలితం తేలనుంది.

     ఆఫ్‌లైన్‌ టికెట్ల కోసం
    ఇక వన్డే సిరీస్‌ తర్వాత భారత్‌- సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో డిసెంబరు 9న జరిగే టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఆరంభంలో ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం చేపట్టగా.. త్వరితగతిన సేల్‌ ముగిసిపోయింది.

    ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌ టికెట్ల కోసం శుక్రవారం అభిమానులు పెద్ద ఎత్తున బారాబతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందురోజు రాత్రి 11. 30 నిమిషాలకే కొంతమంది స్టేడియం వద్దకు చేరుకోవడం గమనార్హం.

    ఏకంగా రూ. 11 వేలకు కూడా..
    స్థానిక ఒడిశా టీవీ కథనం ప్రకారం.. భారత్‌- సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌కు భారీ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో బ్లాకులో టికెట్లు అమ్మారనే ఆరోపణలు ఉన్నాయి. టికెట్‌ ధర రూ. 1100 ఉండగా.. దానిని సుమారుగా ఆరు వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది.  ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్ల విక్రయం జరిగినట్లు సమాచారం.

    ఇలా ఓవైపు బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతుంటే.. మరోవైపు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉ‍న్న కొద్దిపాటి టికెట్ల కోసం అభిమానులు ప్రాణాలకు తెగించడం గమనార్హం. టికెట్ల కోసం స్టేడియం వద్ద పరుగులు తీస్తున్న అభిమానులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారింది. 

    ఈ నేపథ్యంలో.. ‘‘ఇదేం పిచ్చి?.. ప్రాణాలంటే కూడా లెక్కలేదా? మ్యాచ్‌ చూడటం వల్ల ఒరిగే లాభం ఏమిటి?’’ అని కొంతమంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

    బీసీసీఐ ఏం చేస్తోంది?
    భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) విధానం ప్రకారం.. వంద శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మడానికి వీలులేదు. కొద్దిమేర టికెట్లు కచ్చితంగా ఆఫ్‌లైన్‌లో విక్రయించాల్సిన పరిస్థితుల్లో కొన్ని క్రికెట్‌ అసోసియేషన్లు ఇందుకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నాయి. 

    దీంతో తొక్కిసలాట జరిగే దుస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలో వంద శాతం టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించి.. టికెట్‌తో పాటు సరైన ఐడీ ప్రూఫ్‌ ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

    చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!

  • దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.

    సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్‌నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.

    ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. 

    సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు.

    "మహ్మద్ సిరాజ్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు?  సెల‌క్ట‌ర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావ‌డం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. అత‌డు ప్ర‌స్తుతం స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్‌.. వ‌న్డేల్లో ఆడ‌లేడా? ఇంత‌కుముందు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి కూడా అత‌డిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. 

    ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగాడు. అటువంటి బౌల‌ర్ ఇప్పుడు జ‌ట్టులోనే లేకుండా పోయాడు. హ‌ర్షిత్ రాణా, ప్ర‌సిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు. 

    అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కలేదు.
    చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!
     

Politics

  • కర్నూలు జిల్లా:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల కోసం గంపమట్టివేయలేదని సీపీఎం జాతీయ నాయకులు గఫూర్ విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి తప్ప వేరే అజెండా ఏమీ లేదని మండిపడ్డారు. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెస్తున్నావని, చేసింది మాత్రం ఏమీ లేదని ధ్వజమెత్తారు. 

    చంద్రబాబు రోజు ఉపన్యాసాలు చేస్తుంటావు కాని ఆలూరులో రోడ్ల పరిస్థితి ఒకసారి చూడు. జిల్లాల సమగ్రాభివృద్ధికి కొరకు నంద్యాల జిల్లా చేశారు వైఎస్‌ జగన్‌. అదే విదంగా చంద్రబాబు ఆదోని జిల్లా చేయాలి. కర్నాటక ప్రభుత్వం ఆంధ్ర నీళ్ళను జల దోపిడీ చేస్తున్నా..  చంద్రబాబుకు పట్టదు. చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు కోసం ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రాజెక్టులు కోసం గంప మట్టివేయలేదు. చంద్రబాబు పోలవరం ,అమరావతి తప్ప వేరే అజెండా పట్టదు’ అని మండిపడ్డారు. 

  • సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.

    ‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు.

    ..తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు  కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు.

    ..వైఎస్‌ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్‌ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?

    Ambati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోలవరం జీవనాడి

    ..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్‌లోని ఇంట్లోకి పవన్‌కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్‌ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్‌ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్‌ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం‌ కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

  • సాక్షి, శ్రీకాకుళం: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్‌ను ఆయన నిలదీశారు. 16 నెలల  కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘ఐదేళ్లలో  3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల  కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్‌లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు.

    Appalaraju : ప్రైవేటీకరణ ఆపాలని కొన్నిరోజులుగా ఉద్యమం చేస్తున్నాం

     

     

National

  • రాత్రంతా నానబెట్టిన మెంతుల నీళ్లను పరగడుపున తాగితే  ఆరోగ్య ప్రయోజలున్నాయా? ముఖ్యంగా డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందా? బరువు, ఆకలిని అదుపులో ఉంచుతుందా? పదండి  దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

     ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో  డయాబెటిస్‌కు  సహాయపడుతుందని  ఆయుర్వేదం  వైద్య విధానం  ఇటీవలి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.  


    రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మెంతి నీరు అత్యంత విస్తృతంగా సిఫార్సు  చేస్తున్న  సహజ నివారణలలో ఒకటి. సాంప్రదాయ  వైద్యం, కొన్ని పరిశోధనలు కూడా  ఇదే సూచిస్తున్నాయి.

    ఆరోగ్య ప్రయోజనాలు 

    • మెంతి గింజలలోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.

    • మెంతిలో ఒక అమైనో ఆమ్లం ఉంటుంది, ఇది క్లోమం నుండి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుందని తేలింది. ఇది హైపోగ్లైసీమిక్ చర్యకు నేరుగా దోహదం చేస్తుంది.

    • కరిగే ఫైబర్‌ సమృద్ధిగా ఉండే మెంతి గింజలు ఒక రకమైన కరిగే ఫైబర్‌ను కలిగి ఉంటాయి, ఇది పేగులో జెల్ లాంటి పదార్థాన్ని సృష్టించి చక్కెర , కార్బోహైడ్రేట్ల శోషణను గణనీయంగా నెమ్మదిస్తుంది. ఇది భోజనం తర్వాత పదునైన, ఆకస్మిక రక్తంలో చక్కెర స్పైక్‌లను నివారిస్తుంది.

    • HbA1c తగ్గింస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల   HbA1c స్థాయిలు(మూడు నెలల్లో సగటు ) అదుపులో ఉంటాయి ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది.

    • ఖాళీ కడుపుతో మెంతి నీటిని తీసుకోవడం గ్లూకోజ్ జీవక్రియను పెంచుతుంది.

    • మెంతులులోని ఫైబర్‌  ఆకలిని అదుపులో ఉంచుతుంది.మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

    • కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది . వమెంతి గింజలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి తద్వారా గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది.  

    • మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు లేదా మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి.

    • అంతేకాదు  ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే  మెంతి గింజల నీళ్లు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.


    నోట్‌: సూపర్ ఫుడ్ మెంతి నీటిని రోజువారీ దినచర్యలో తీసుకోవడం అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ మీ ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ అవసరం.  కనీసం వ్యాయాయం,   సమతుల ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సరియైన నిద్ర, నీళ్లు తాగడం చాలా కీలకమైంది.  ఏమైనా సమస్య ఉంటే  వైద్యుడిని సంప్రదించితగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.  కానీ శ్రద్ధ వహించండి మరియు సరైన మార్గదర్శకత్వం కోసం విశ్వసనీయ వైద్య సలహా తీసుకోండి

  • న్యూఢిల్లీ:  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే అధికారిక విందులో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం అందింది.  ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలను బలపరచడానికి ఇచ్చే ఈ విందుకు కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు(శుక్రవారం) రాత్రి పుతిన్‌తో కలిసి శశిథరూర్‌ విందలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ పెద్దలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జన ఖర్గేలక ఆహ్వానం అందలేదట. 

    కేవలం కాంగ్రెస్‌ నుంచి శశిథరూర్‌ను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్ల తెలుస్తోంది. గత కొంతకాలంగా  బీజేపీతో ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉంటున్న శశిథరూర్‌..  ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో విందుకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడికి ఇచ్చిన మర్యాదను తన ఆహ్వానం ప్రతిబింబిస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ (External Affairs)కి శశి థరూర్ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

    పార్లమెంట్‌ బయట శశిథరూర్‌ మాట్లాడుతూ.. ‘ ఇదొక సాంప్రదాయం. ఇది కేవలం బీజేపీ ప్రభుత్వమే మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది. గతంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ దీన్ని ప్రారంభించింది. ఏ దేశం నుంచైనా అధ్యక్షులు ఇక్కడకు(భారత్‌) వస్తే ప్రతిపక్షం నుంచి ఒకరు హాజర కావడం జరగుతుంది. కానీ ప్రస్తుత రోజల్లో విదేశీ నేతల్ని.. ప్రతిపక్ష నేతలు కలవ కూడదని కూడా కొన్ని ప్రభుత్వాల ఆంక్షలు విధించాయి’ అని అని స్పష్టం చేశారు. 

  • ఇండిగో  సంక్షోభం కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై  కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ  నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్‌ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.

    వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన  సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.

    ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది.

    ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్‌

    సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్‌మెంట్‌లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.  సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

    ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదన

    కమిటీ విచారణ
    ఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. 
     

  • ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభం ఎంతో ప్రయాణీకుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. దేశవ్యాప్తంగా విమానాల అంతరాయాలు వేలాది మంది ప్రయాణికులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఒక టెకీ జంట తమ వెడ్డింగ్‌  రిసెప్షన్‌ను వీడియో కాల్‌తో సరిపెట్టుకోవాల్సింది.  మరో సంఘటన తన బిడ్డకు అధిక రక్తస్రావం అవుతోంది, కనీసం  శ్యానిటరీ ప్యాడ్లు ఇవ్వండి  అని వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముందస్తు నోటిఫికేషన్ లేకుండా విమానాల్ని రద్దు  చేయడం ఒకెత్తు అయితే, ఈ గంగరదోఠం మధ్య మానసిక  ఆందోళనతోపాటు, గమ్య స్థానాలకు చేరుకునేందుకు, అక్కడి ఖర్చులు మరింత భారంగా మారడం మరో ఎత్తు. ఇదే అదును ఇతర విమానయాన సంస్థలు తమ ధరలను విపరీతంగా పెంచేయడం దారుణం.

    బెంగళూరుచెందిన  ఒక మహిళది మరో  హృదయ విదారక గాథ. వేలాది మంది ప్రయాణీకులలో ఒకరైన నమిత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. తండ్రి అస్థికలను పుణ్య నదిలో నిమజ్జనం చేసేందుకు  హరిద్వార్‌కు  బయలుదేరిన నమిత మహిళ బెంగళూరులో చిక్కుకుంది. చేతుల మధ్య కలశం పట్టుకుని, చితాభస్మాన్ని అత్యవసరంగా నిమజ్జనం చేయాలి, హరిద్వార్ చేరుకోవడానికి సాయం చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంది.

    "నా తండ్రి చితాభస్మాన్ని నాతో తీసుకెళ్తున్నాను. బెంగళూరు నుండి ఢిల్లీకి విమానంలో డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడి నుండి నా తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి హరిద్వార్‌కు వెళ్లాలి" అని నమిత చెప్పింది.  అంతేకాదు  మరో విమానం టికెట్‌ బుక్‌  చేయాలంటే ఒక్కొక్కరికీ 60 వేలుఅవుతుంది. తాము  ఐదుగురం ఉన్నామని వాపోయింది. ఇప్పుడు రైలు లేదా బస్సు టిక్కెట్లు అందుబాటులో లేవని కూడా నమిత పేర్కొంది. మరోవైపు నుంచి హరిద్వార్ నుండి తన స్వస్థలమైన జోధ్‌పూర్‌కు  రిటన్‌  ఇప్పటికే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంది. విమానాల ఆలస్యం కారంగా అవి కూడా రద్దయ్యే పరిస్థితి.

    ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్‌లైన్‌లోనే రిసెప్షన్‌

  • న్యూఢిల్లీ:  ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా  సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా  విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు.  పైలట్ల  రోస్టర్‌ సిస్టమ్‌ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా  పేర్కొంది.  ప్రయాణికుల కొరకు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌  011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.

    ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ  ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి.  ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.

    ప్రయాణికులకు ఇండిగో సూచనలు
    రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.
    క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే  విధంగా  05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.

    ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.
    అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.

    ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని  తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.

    ఏమి జరిగింది?
    గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.
    డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది.

  • అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన దగ్గర్నుంచీ అన్ని వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌.. ప్రధానంగా ప్రతీదేశం తమ అదీనంలో ఉండాలని ఆకాంక్ష ట్రంప్‌లో బలంగా నాటుకుపోయినట్లుంది. అందుకే ఆ దేశం, ఈ దేశం అని లేదు.. అన్ని దేశాలను తన చర్యలతో భయపెడుతున్నారు. తమది అగ్రరాజ్యమనే అహంకార భావనలో  ఉన్న ట్రంప్‌ చేస్తున్న చేష్టలు కొన్ని దేశాలకు విసుగుతెప్పిస్తూనే ఉంది.

    అలా ట్రంప్‌ చర్యలతో ఎక్కువగా విసుగుపోయిన దేశాలలో రష్యా ఒకటి, భారత్‌ మరొకటి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్‌  చమురు కొనుగోలు చేయడాన్ని ట్రంప్‌ తీవ్రంగా ఆక్షేపించారు. అదే సమయంలో భారత్‌కు ఆంక్షలు కూడా విధించారు. ‘ మీరు రష్యా ఆయిల్‌ కొనడానికి వీల్లేదనే హుకుం జారీ చేశారు.  ఇది రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపడానికని శాంతి ప్రవచనాలు కూడా చేశారు. రష్యా నుంచి భారత్‌ ఆయిల్‌ కొనుగోలు చేయడాన్ని ఎంతవరకూ నియంత్రించారో తెలీదు కానీ, రష్యా మాత్రం మళ్లీ భారత్‌కు చమురు సరఫరా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 

    భారత్‌కు చమురు కొనసాగిస్తాం.. : పుతిన్‌
    ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. మీడియా సాక్షిగా భారత్‌కు అన్ని రకాల చమురు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అమెరికా భయపెడితే భయపడిపోవడానికి తామేమీ చిన్న పిల్లలం(చిన్న దేశం) కాదనే సంకేతం ఇచ్చారు పుతిన్‌, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న పుతిన్‌..  ఇరు దేశాల మధ్య ఒప్పందాల గురించి వివరించే క్రమంలో చమురును భారత్‌కు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

    అసలే పుతిన్‌ భారత్‌ పర్యటనపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన ట్రంప్‌.. ఈ మాట అనేసరికి నోట్లో వెలక్కాయపడినట్లు అవ్వడం ఖాయం. పుతిన్‌-మోదీలు ఏం చెబుతారా అనే ఆసక్తిగా గమనిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. పుతిన్‌ మాటలకు చిర్రెత్తుకొచ్చినట్లు అయ్యి ఉంటుంది. గతంలో వైట్‌హౌస్‌ వేదికగా పుతిన్‌-ట్రంప్‌ల మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ కూడా సజావుగా సాగలేదు. తమ ఆంక్షలకు కట్టుబడి ఉండాలనే ఒత్తిడితో ఆ భేటీ సఫలం కాలేదు.  

    ‘శాంతి’ చర్యలు అంటూ పలు దేశాలకు తలనొప్పి
    వేరే దేశాన్ని నియంత్రించాలని అనుకోవడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎంతటి అగ్రజుడు అయినా తమ అధీనంలో అంతా ఉండాలని అనుకోవడం అవివేకం.  వీటికి ఎన్నో కథలు, ఉదాహారణలు, సామెతలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసినవే. ఇప్పటి వరకూ ట్రంప్‌ చేసింది ఏదైనా ఉందంటే అది తన ‘శాంతి’ చర్యలతో మిగతా దేశాలని నొప్పించడమే జరుగుతుంది. ఇక్కడ తమ మాట వింటే ఒక రకంగా, మాట వినకపోతే మరో రకంగా ట్రంప్‌ ప్రవర్తిస్తున్నారు. గతంలో ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత ‘కశ్మీర్‌’ అంశాన్ని తాను పరిష్కరిస్తానని ట్రంప్‌ చెప్పిన మాటలు  ఇప్పటికీ మనకు గుర్తే. 

    ఆ మాటలకు భారత ప్రధాని మోదీ కూడా స్ట్రాంగ్‌గానే సమాధానం ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించడానికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యను పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ట్రంప్‌ను పరోక్షంగా హెచ్చరించారు.  అంటే పుతిన్‌-మోదీలిద్దరూ ట్రంప్‌ను అంతగా పట్టించుకోలేదు. లైట్‌ తీసుకున్నారు. స్నేహ ధర్మంలో హద్దులు దాటి ‘సరిహద్దులు’ వరకూ వస్తే ఊరుకోమని సంకేతాలు పంపుతూనే ఉన్నారు. అందుకే మోదీ-పుతిన్‌ల భేటీపై ట్రంప్‌ సీరియస్‌ లుక్‌ వేసి ఉంచారు. ప్రస్తుతం పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు వినబడ్డాయా.. లేదా అనే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. 

    ఇదీ చదవండి:
    పాక్‌తో ఇంకా సంబంధాలెందుకు?: అమెరికా ఎంపీల డిమాండ్‌

  • ఇండిగో సంస్థ  ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి.  ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.

    ప్రయాణికులకు ఇండిగో సూచనలు

    -రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.
    -క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే  విధంగా  05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.
    -ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.
    -అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    -వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.

    ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని  తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.

Crime

  • హైదరాబాద్:  హవాలా ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.   ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఈ ముఠాలోనిఇద్దరు సభ్యులను పోలీసులు గురువారం(డిసెంబర్‌ 5వ తేదీ) అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రకాష్ ప్రజాపతి(30), ప్రజ్ఞేశ్ కీర్తిభాయ్ ప్రజాపతి(28)లను ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4 కోట్లకు పైగా నగదును ప్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఈ మేరకు నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాల్‌ మీడియా సమావేశంలో హవాలా నిందితుల్ని అరెస్ట్‌ చేసిన విషయాన్ని స్పష్టం చేశారు. 

    గతేడాది డిసంబర్‌ 7వ తేదీన నాగోల్‌కు చెందిన వి విశ్వనాథ్‌ చారీ అనే వ్యక్తి .. తన స్నేహితులతో కలిసి రూ. 50 లక్షలను మోసపోయినట్లు బోయినపల్లి పోలీస్‌ స్టేషనల్‌లో ఫిర్యాదు చేశారు. క్యాష్‌ను ఆర్టీజీఎస్‌లో మార్చతామని వారు నమ్మబలికి విశ్వనాథ్‌ చారీని మోసం చేశారు హవాలా కేటుగాళ్లు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎట్టకేలకు  హవాలా ముఠా సభ్యుల్లో ఇద్దర్ని అరెస్ట్‌ చేసి భారీ మొత్తాన్ని రికవరీ చేశారు. 

    నిందితులిద్దరూ గుజరాత్‌కు చెందిన వారే. వీరు నగదును మార్చడాన్ని వ్యాపారంగా చేసుకుని ఇలా మోసాలకు పాల్ప డుతున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్‌ చారీ, ఆయన స్నేహితుల్ని బురిడీ కొట్టించి రూ. 50 లక్షలు దోచుకున్నారు. అయితే వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. హుండాయ్‌ క్రెటా కారులో వెళుతున్న సమయంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితుల్ని పట్టుకున్న టీమ్‌ను నార్త్‌జోన్‌ డీసీపీ  రష్మీ పెరుమాల్‌ అభినందించారు. తాము దోచుకున్న నగదు రూ.  4.05 కోట్లను నాగ్‌పూర్ నుండి బెంగళూరుకు హవాలా రూపంలో బదిలీ చేయడంలో తన ప్రమేయం ఉందని ప్రకాష్‌ ప్రజాపతి విచారణలో అంగీకరించాడు.       

Family

  • భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. హైదరాబాద్‌ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అధికారిక విందులో ఆయ ఇష్టంగా ఆస్వాదించే వంటకాలేవి, ముఖ్యంగా ఇలాంటి పర్యాటనలలో ఎలాంటి ఫుడ్‌ తీసుకుంటారు తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.

    పుతిన్‌ భారత్‌ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్‌ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి.. ఫుల్‌ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్‌ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారట పుతిన్‌. 

    మాములుగా అయితే శిక్షణ పొందిన రష్యన్‌ చెఫ్‌లు, సహాయక సిబ్బంది పుతిన్‌ వెంట వస్తుంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్‌గా ఉంది. అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం..ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధ్యానత ఇస్తారట. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వోరోగ్‌(రష్యన్ కాటేజ్ చీజ్)తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్‌, కౌజు పిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్‌, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే తీసుకుంటారట.

    ఆయన ఎర్ర మాంసం కంటే తాజా చేపలు అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రెపిల్ల మాంసం కూడా అప్పడప్పుడూ తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువుగా టమోటాలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్‌లు తప్పనిసరిగా ఉంటుందట.

    ఇక జ్యూస్‌లలో కూడా మూలికా పానీయాలు, కేఫీర్‌,  బీట్‌రూట్-ముల్లంగి జ్యూస్‌ వంటివి తీసుకుంటారట. ఇక పుతిన్‌కు పిస్తా ఐస్ క్రీం మహా ఫేవరెట్‌ డిజర్ట్‌ అట. చివరగా ఆయన క్రమశిక్షణతో కూడిన సంప్రదాయ ఆహారానికే కట్టుబడి ఉంటారట. చాలామటుకు ప్రోటీన్‌ కంటెంట​ ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్‌ సన్నిహితులు.

    (చదవండి: అక్కడ మహిళల జనాభానే ఎక్కువ..! ఎందుకంటే..)

     

  • మహిళల సంఖ్య తగ్గిపోతోంది, బ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి అంటూ గగ్గోలు పెడుతున్న గణాంకాలు గురించి విన్నాం. కానీ వీటన్నింటికి విరుద్ధంగా మహిళలు సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. అక్కడ మహిళల సంఖ్య ఎంతలా ఉందంటే..మొత్తం కార్యాలయాల్లో అంతా మహిళలే కనిపిస్తారు. కనీసం ప్లంబింగ్‌, వడ్రంగి పనులు వంటి వాటిల్లో కూడా మహిళలే ఉంటారు. అందుకు గల కారణం..?, ఫలితంగా మహిళలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే..

    లాట్వియాలో గణనీయమైన లింగ అసమతుల్యత ఎదుర్కొంటోంది. అక్కడ పురుషుల కంటే 15.5% ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఇది యూరోపియన్ యూనియన్‌లో సగటు అంతరం కంటే మూడు రెట్లు ఎక్కువ. 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న పురుషులకు రెండింతలు మహిళలు ఉన్నారు. రోజువారి జీవితంలో పురుషుల కొరత చాలా ఘోరంగా ఉంటుందని వరల్డ్‌ అట్లాస్‌ పేర్కొంది. దాంతో అక్కడ మహిళ ఇంటి పనుల్లో సహాయం కోసం భర్తలను నియమించుకుంటున్నారట. 

    అంటే అద్దెకు భర్తలను తెచ్చకుంటున్నారు. ఆ మహిళలంతా ఆన్‌లైన్‌లో ఒక గంటకు భర్తలను బుక్‌ చేసుకుంటారట అక్కడ మహిళలు. వారు ప్లంబింగ్‌, వడ్రండి,టెలివిజన్‌ ఇన్‌స్టాలేషన్‌ వంటి పనుల్లో సాయం అందిస్తారు. అంతేగాదు పెయింటింగ్, కర్టెన్లు ఫిక్సింగ్ వంటి ఇతర పనులు కూడా చేస్తారట. చాలామంది ఈ సేవలను వినియోగించుకోవడానికే మొగ్గు చూపిస్తారట. 

    పురుషుల కొరతకు రీజన్‌
    దీనికి పురుషుల తక్కువ ఆయుర్దాయమే కారణమని చెబుతున్నారు. అధిక ధూమపాన రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరుగుతుందని పేర్కొన్నారు లాట్వియా నిపుణులు. వరల్డ్‌ అట్లాస్‌ ప్రకారం లాట్వియన్‌ పురుషులలో 31% మంది ధూమపానం చేస్తున్నారట. అదీగాక వారిలో చాలామంది అధిక బరువు సమస్యలను ఎదుర్కొంటున్నారట కూడా.

    ఫలితంగా అద్దెకు భర్తల ట్రెండ్‌
    ఇంతలా మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్‌వై పుకే మొగ్గు చూపుతున్నారట అక్కడ మహిళలు. ఇదేమీ కొత్తదికాదు ఎందుకంటే గతంలో యూకేలో లారా యంగ్ అనే మహిళ 2022లో "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద తన భర్త జేమ్స్‌ను చిన్న చిన్న ఉద్యోగాలకు అద్దెకు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 

    (చదవండి:  అమెరికా-భారత్‌కి మధ్య ఇంత వ్యత్యాసమా..!)
     

Yadadri

  • కూరగా

    గుర్రంపోడు : కూరగాయల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కొత్తగా కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 350 ఎకరాల్లో సాగు పెంచనుంది. హెక్టార్‌కు గరిష్టంగా రూ.24 వేలు, ఎకరాకు రూ.9,600 రాయితీ అందించనుంది.

    ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

    ఎన్‌ఐఎన్‌ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. కానీ, జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని అన్ని రకాల కూరగాయల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, పంజాబ్‌ నుంచి ఆలుగడ్డ, బెంగళూరు నుంచి క్యారెట్‌, బీట్‌రూట్‌ దిగుమతి చేసుకుంటున్నారు.

    కోతుల బెడదతో వెనుకంజ

    చాలా ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వడం లేదని భయాందోళనతో రైతులు కూరగాయల సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోతులను నివారించేందుకు టపాసులు పేల్చడం, మంకీగన్స్‌ ఉపయోగించడం, పంట చుట్టూ జే వైర్‌ లాంటివి కట్టాలంటే.. అధిక శ్రమకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల ఆవరణలో సొరకాయ ఇతర కూరగాయ పంటలు సాగు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల వల్ల ఇంటి ఆవరణల్లో కూరగాయలు సాగు చేయడం లేదు.

    రాయితీ పొందడం ఇలా..

    కూరగాయల పంటలను సాగు చేసుకునే రైతులు ముందుగా ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తారు. కూరగాయల నారును హైదరాబాద్‌లోని జీడిమెట్లలో గల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో పెంచుతున్నారు. అక్కడి నుంచి నారు పొందితే రాయితీ డబ్బును.. నారు అందించిన కంపెనీకి చెల్లిస్తారు. కూరగాయల విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 250 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఉమ్మడి జిల్లాలో కొత్తగా 350 ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యం

    ఫ విత్తనాలు, నారు కొనుగోలుకు ఉద్యానశాఖ రాయితీ

    ఫ కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక

  • రెబల్స్‌తో ​ట్రబుల్స్‌!

    సాక్షి,యాదాద్రి : ప్రధాన పార్టీలను రెబెల్స్‌ బెడద వెంటాడుతోంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తరఫున నలుగురైదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. వారిలో కొందరు నామినేషన్‌ ఉపసంహరించుకోగా, మరికొందరు బరిలో ఉన్నారు. ఒకరి కంటే ఎక్కువ ఓట్లను చీల్చగలిగే తిరుగుబాటు అభ్యర్థులు ఉండటం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది.

    ప్రచారంలో జోరు పెంచిన అభ్యర్థులు

    పల్లె పోరు వేడెక్కింది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి ఆరు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. అనుచరులతో కలిసి ఇంటింటికి వెళ్లి తమ విజన్‌, సొంత మేనిఫెస్టోను వివరిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మొదటి విడతలో ఆలేరు,యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారం, ఆత్మకూర్‌(ఎం) మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలు, 1,286 వార్డు స్థానాలున్నాయి. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను 137 పంచాయతీలు, 1,040 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

    బరి నుంచి తప్పుకోవడానికి ససేమిరా..

    ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరఫున కొన్ని చోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారు. వారంతా పోటీపడి జనంలోకి వెళ్తున్నారు. తామంటే తామే ప్రధాన అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకోవడం ఆయా పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రచారం నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నా ససేమిరా అంటున్నారు. పైగా కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి పార్టీలో చేరుతామని, పోటీ నుంచి మాత్రం ఉపసంహరించుకోబోమని స్పష్టం చేస్తున్నారు.

    పొత్తు కుదిరినా పోటీలో..

    యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, ఆలేరు మండలం శర్భనాపురం గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌, సీపీఎం పొత్తు అనుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే సమక్షంలో రెండుచోట్ల సీపీఎంకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. అయినా కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన పలువురు సానుభూతి పరులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. పెద్దకందుకూరులో సీపీఎం, కాంగ్రెస్‌ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. ఇక శర్బనాపురంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బుగ్గ నవీన్‌కు బీజేపీ, సీపీఎం సీపీఐ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.

    ప్రధాన పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ

    ఫ తామే అసలైన అభ్యర్థులమంటూ ఎవరికి వారే ప్రచారం

    ఫ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో తలనొప్పులు

    ఫ విజయావకాశాలపై ప్రభావం

    ఫ రసవత్తరంగా పల్లె పోరు

    గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజాపేట మండలం సో మారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థులుగా శీలం జయంతి జగన్మోహన్‌రెడ్డి, గొలుసు అనూష, యాకుబ్‌ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. బేగంపేట గ్రామ పంచాయతీలో జిల్ల బాలమణి భిక్షపతిగౌడ్‌. ఉస్తేపు జ్యోతికిరణ్‌, దూది వెంకటాపురంలో తుక్క ఏసుకుమార్‌, నడిమింటి నరేష్‌, ఎర్రోళ్లనరేష్‌, కొండ్రెడ్డిచెరువు పంచాయతీలో కర్రె శేఖర్‌, ఉప్పరి నరేష్‌. నమిల పంచాయతీలో పులి సత్యనారాయణ, పులిరాజు ఒకే పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో కాల్నే సరిత, బత్తిని ధనలక్ష్మి, మల్లాపురంలో మంగ సత్యనారాయణ, కర్రె వీరయ్య, భూషాల్ల శ్రీనివాస్‌, చొల్లేరులో చిన్నం మమత, గడ్డమీది సంధ్య, మహబూబ్‌పేటలో ఆరె రమేష్‌, సామ వెంకటరెడ్డి.. వీరంతా కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నారు. ఇక ఆలేరు మండలం రాఘవాపురం పంచాయతీలో బండ్ల శ్రీలత, తుంగ చంద్రకళ పోటీ చేస్తున్నారు. వీరిలో చంద్రకళ రెబెల్‌గా ఉన్నారు. తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులు ధారవత్‌ మల్లేష్‌, దారావత్‌ రమేష్‌ ఇద్దరూ సర్పంచ్‌గా బరిలో ఉన్నారు.

    బేగంపేటలో మంత్రాల అనూష సుమన్‌, గుండుకృప ప్రశాంత్‌, శర్బనాపురం గ్రామ పంచాయతీలో మొగులుగాని నరసయ్య, కందుల యాదమల్లయ్య పోటీ పడుతున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం మోదుగుకుంటలో బీఆర్‌ఎస్‌ నుంచి సోలిపురం ఎల్లారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మామిడి మోహన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపురం ఎల్లారెడ్డిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్‌ కండువా కప్పించుకొని ఏకగ్రీవం చేద్దామని కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. అనంతరం గ్రామానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ చేయకపోవడంతో ఆ గ్రామం నుంచి ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మల్లాపురంలో, బీఆర్‌ఎస్‌ తరఫున కర్రె వెంకటయ్య, పల్లెపాటి మాధవి, మాసాయిపేటలో వాకిటి కిష్టయ్య, బుడిగే గౌతమి, పెద్ద కందుకూరులో మాజీ ఎంపీపీ గడ్డమీది స్వప్న, గుండ్లపల్లి మంగమ్మలు, బొమ్మలరామారం మండలం మర్యాల పంచాయతీలో సంగి రాజు, సందెగళ్ల పెద్దులు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు.

  • కట్టు

    భువనగిరిటౌన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ హనుమంతరావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని గురువారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి తొలి విడత ఎన్నికల నిర్వహణకు తీసుకుంటన్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా ప్రత్యేక టీంల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్థులు, ఏకగ్రీవ స్థానాలు తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

    చిరస్మరణీయుడు రోశయ్య

    భువనగిరిటౌన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. గురువారం కొణిజేటి రోశయ్య వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ జగన్మోహన్‌ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

    యాదాద్రి భువనగిరి జిల్లాగా పేరు మార్పు

    గుండాల: ‘జిల్లా మారినా.. పేరు మారలే’ శీర్షికన గురువారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమైన కథనానికి అధి కారులు స్పందించారు. మండల పరిషత్‌ కార్యాలయ భవనంపై జిల్లా పేరు మార్చారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తోంది. అయినా ఎంపీడీఓ కార్యాలయ భవనంపై నేటికీ నల్లగొండ జిల్లా పేరే ఉంది. దీన్ని సాక్షి వెలుగులోకి తేగా అధికారులు నల్ల గొండ పేరు తొలగించి యాదాద్రి భువనగిరి జిల్లా పేరు పెట్టారు.

    పాఠశాలల తనిఖీ

    గుండాల : మండలంలోని అంబాల ప్రాథమికోన్నత పాఠశాల, వస్తాకొండూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను డీఈఓ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టెన్త్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు.ఆయన వెంట హెచ్‌ ఎలుగు లింగయ్య, సుమన్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

    యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

    భువనగిరి: ఆరోగ్య సంరక్షణకు యోగా కీలకమని బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ అమితా అగర్వాల్‌ అన్నారు. యోగా శాస్త్రంపై గురువారం బీబీనగర్‌ ఎయిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులకోసం యోగా చేయడం తప్పనిసరి అన్నారు. యోగా శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ సంగీత సంపత్‌, రిమాదాదా, రాహుల్‌ మహోత్ర, డాక్టర్‌ కృష్ణమూర్తి, వెరోనిక్‌ నికోలాయ్‌, రోహిణి మోత్వాణి,మీలి పాండా పాల్గొన్నారు.

  • మూడో విడతకు నేడు ఆఖరు

    రెండో రోజు సర్పంచ్‌కు 147, వార్డులకు 641

    సాక్షి,యాదాద్రి : మూడవ విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో రెండో రోజు గురువారం నామినేషన్లు వెల్లువెత్తాయి. సర్పంచ్‌కు 147, వార్డు స్థానాలకు 641 మంది నామినేషన్‌ వేశారు. రెండు రోజుల్లో కలిపి సర్పంచ్‌కు 281, వార్డులకు 888 నామినేషన్లు పడ్డాయి. ఈ విడతలో భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, మోటకొండూరు, గుండాల మండలాల్లో 124 పంచాయతీలు, 1,086 వార్డులకు డిసెంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. మూడో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

    రెండో రోజు దాఖలైనవి..

    మండలం జీపీలు నామినేషన్లు

    అడ్డగూడూరు 17 10

    చౌటుప్పుల్‌ 26 36

    గుండాల 20 24

    మోటకొండూరు 20 28

    మోత్కూరు 10 14

    నారాయణపురం 31 35

    మొత్తం 124 147

    వార్డు సభ్యుల స్థానాలకు

    మండలం వార్డులు నామినేషన్లు

    అడ్డగూడూరు 150 55

    చౌటుప్పుల్‌ 236 187

    గుండాల 182 101

    మోటకొండూరు 170 103

    మోత్కూరు 88 60

    నారాయణపురం 260 135

    మొత్తం 1,086 641

  • నేత్ర

    యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్‌ తిరునక్షత్ర ఉత్సవ వేడుకలను గురువారం వైభవంగా జరిపించారు. ఉదయం ఆలయ ముఖ మండపంలో విశేష తిరుమంజన స్నపన ఉత్సవం జరిపించిన అర్చకులు.. అనంతరం ప్రబంధ సేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణ వేడుకలు చేపట్టారు. సాయంత్రం తిరుమంగై ఆళ్వార్‌ పురవీధిసేవ, దివ్య ప్రబంధ సేవాకాలం, రాత్రి నివేదన, తీర్థప్రసాద గోష్టితో ఉత్సవాలకు ముగింపు పలికారు.

    సంప్రదాయ పూజలు

    ప్రదానాలయంలో సంప్రదాయ పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ సహస్రనామార్చన జరిపించారు.ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, ఉత్సవమూర్తులకు నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం ఆలయ ముఖమండపంలో స్వామివారి వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూ జల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.

  • నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి

    భువనగిరిటౌన్‌ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలకు మించి ఖర్చు చేయకూడదని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.50 వేలకు మించి ఖర్చు చూయకూడదన్నారు. 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.30వేల వరకు ఖర్చు చేయడానికి పరిమితి ఉందన్నారు. అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలకు రిటర్నింగ్‌ అధికారుల వద్ద అనుమతి పొందాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 6వ తేదీన మొదటి విడత, 8న రెండో విడత.. రెండు దఫాలు అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లో ఎన్నికల ఖర్చుకు సంబంధించిన తుది వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రచార సమయంలో అభ్యర్థుల వద్ద ఆధారాలు లేకుండా వెయ్యి రూపాయలకు మించి నగదు ఉండటానికి వీలు లేదన్నారు.

    ఫ జిల్లా వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్‌

  • ప్రజా సేవకులే పాలకులు కావాలి

    గుండాల : గ్రామాలలో స్థానిక సంస్థలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు సంక్షేమ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓర్సు ఇంద్రసేన ప్రజా సేవకులే ప్రజా పాలకులు కావాలని కోరుతూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై.. ‘మన స్వతంత్య్ర భారత దేశంలో ఇప్పటి వరకు ప్రజలకు నచ్చిన పాలన జరుగ లేదు. గడిచిన కాలం గడిచింది .. వర్తమానాన్ని సరిదిద్దుకుందాం, అందుకు అనువైన సమయం జరగబోయే స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికలలో అధికారం కోసం ఆరాట పడే వ్యక్తులు వార్డు మెంబర్‌ నుంచి జడ్పీటీసీ సభ్యుడి దాక ఎన్నికల సమయంలో అక్కరకు రాని ఖర్చు , ఓటుకు నోటు ఇవ్వడాలు ఆపి ఎన్నికల తరువాత ప్రజల ఆరోగ్యం, విద్య, రైతు కోసం, యువకుల కోసం ఖర్చు చేయాల్సిన విధానం అవలంభించాలి’. అని ఫ్లెక్సీపై పేర్కొన్నారు.

  • మొదట శాసనసభకు.. తర్వాత సర్పంచ్‌గా

    నాలుగుసార్లు

    ఎమ్మెల్యేగా పనిచేసి

    సర్పంచ్‌గా ఎన్నిక

    మోతె : ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, సర్పంచ్‌గా ఒకసారి ఎన్నికై నా.. కుటుంబ పోషణకు కులవృత్తిని నమ్ముకున్న ఆదర్శ నేత ఉప్పల మల్సూర్‌. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్‌ చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 20 ఏళ్ల వయసులోనే ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో సీడీపీ, సీపీఎం అభ్యర్థిగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 1972 వరకు ఏకధాటిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన సిరికొండలో కులవృత్తి అయిన చెప్పులు కుట్టే పనిచేస్తూ జీవనం సాగించారు. 1995లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపాదించారు. కానీ సీపీఎంపై ఉన్న అభిమానంతో ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తిపై 700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్‌గా పదవిలో ఉండగానే 1999లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.

  • ఏఐ వీడియోలతో ప్రచారం

    యాదగిరిగుట్ట రూరల్‌ : సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పద్ధతిలో ప్రచారాలు సాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి విన్నూత్నంగా ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) వీడియోలతో గ్రామంలోని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఏఐ వీడియోల ద్వారా తమను గెలిపించాలని, గ్రామాభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ వీడియోలను సర్పంచ్‌ ఎన్నికల్లో వినియోగించుకోవడం పట్ల గ్రామీణ ప్రజలు సోషల్‌ మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు.

  • ఓటేసిపోండి
    అన్నా ఊరికి రండి..

    తిరుమలగిరి (తుంగతుర్తి) : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు ఫోన్లు చేయడమే కాకుండా ప్రసన్నం చేసుకోవడానికి పట్నం బాట పట్టారు. వారిని పోలింగ్‌ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

    ఎవరెవరు వలస వెళ్లారు..

    ఎక్కడెక్కడ ఉంటున్నారు..

    ఈనెల 11న సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గల 159 గ్రామాలు, 1,442 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మండలాల్లో గల 153 పంచాయతీలు, 1286 వార్డులు, నల్లగొండ జిల్లాలోని 14 మండలాల్లో గల 318 పంచాయతీలు, 2870 వార్డులకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లోని వారు ఉపాధి కోసం హైదరాబాద్‌, నిజామాబాద్‌, విజయవాడ, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటరు లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరు వలస వెళ్లారు. ఎక్కడెక్కడ ఉంటున్నారు. వారి ఫోన్‌నంబర్లు తెలుకొని వారిని కలిసేందుకు వెళ్తున్నారు. మీరు వస్తారా? లేదా డబ్బులు పంపమంటారా అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చి ఓటేసి వెంటనే వెళ్లిపోతామని అందుకు అయ్యే ఖర్చులు భరించాలని కొందరు ఓటర్లు చెబుతున్నట్లు సమాచారం.

    వారే కీలకం..

    నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. హైదరాబాద్‌, భీమండి, నిజామాబాద్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్‌ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్‌ చేస్తున్నారు. పోలింగ్‌ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకుంటున్నారు. ఓటింగ్‌ రోజు తప్పకుండా గ్రామానికి వచ్చి, తమకు ఓటు వేయాలని మెసేజ్‌లు పంపించి వేడుకుంటున్నారు. పలు గ్రామాలకు చెందిన నాయకులు ఇప్పటికే పట్నం బయలుదేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేసి వారి మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు.

    ఫ వలస ఓటర్లకు

    గాలం వేస్తున్న అభ్యర్థులు

    ఫ ప్రతి ఓటు కీలకం కావడంతో

    ఫోన్లు చేసి నజరానాల ప్రకటన

    ఫ వారిని ప్రసన్నం

    చేసుకునేందుకు పట్నం బాట

    ఓటర్లను ఆకర్షించేందుకు విందులు

    గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే విధంగా విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. పట్నంలో ఉండే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అక్కడికి వెళ్లి దావత్‌లు సైతం ఇస్తున్నారు. ఒక్కో ఏరియాకు ఇన్‌చార్జిలను నియమించి పోలింగ్‌ రోజు తీసుకొచ్చే బాధ్యతను కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్‌లు నడుస్తుండగా మరో రెండు రోజుల్లో విందులు మొదలు కానున్నాయి.

  • ఆరోగ్యకరమైన నేలలే భవిష్యత్తుకు పునాది

    గరిడేపల్లి : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేలలోని సారాన్ని కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్‌ 5న జరుపుకుంటారు. ఈ ఏడాది మృత్తిక దినోత్సవం థీమ్‌ని శ్రీఆరోగ్యకరమైన నేలలు–ఆరోగ్యకరమైన నగరాలకు పునాదిశ్రీగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆహార భద్రత, నీటి నాణ్యత, పర్యావరణ స్థిరత్వాన్ని మెరుగుపర్చడంలో నేలలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ థీమ్‌ తెలియజేస్తుంది. నగరాల్లో సైతం కాలుష్యాన్ని తగ్గించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నేలలు పట్టణ వ్యవసాయానికి దారి తీసి నగరాల్లో సైతం ఆహార లభ్యతను పెంచుతాయి. నేలల్లోని ఇతర జీవులు జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. నేల నాణ్యత మెరుగైతే నీరు భూమిలోకి సులభంగా ఇంకి కాలుష్యం తగ్గుతుంది.

    క్షీణిస్తున్న నేల నాణ్యత..

    వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్న రసాయన ఎరువులు, అడ్డూ అదుపులేని నీటి వినియోగం, నేల క్రమక్షయం, సూక్ష్మపోషకాల కొరత వంటి సమస్యల వల్ల మట్టి నాణ్యత ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతమైన మట్టి పంటకు ఎక్కువ పోషకాలు అందిస్తుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని వల్ల రసాయనాల వాడకం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.

    రైతులు పాటించాల్సిన పద్ధతులు..

    రైతులు పంటలు వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా అవసరం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా లోపించిన పోషకాలకు తగ్గట్టు ఎరువులు వినియోగించాలి. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం పెంచాలి. పశువుల ఎరువు, పచ్చి ఎరువు, కంపోస్టు ఎరువులు భూసార నాణ్యతను పెంచి, నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా డ్రిప్‌, స్పింక్లర్లు ఉపయోగిస్తే నీటి ఆదా జరగడమే కాకుండా నేల క్రమక్షయం నివారించబడుతుంది. అదేవిధంగా పంట మార్పిడి కూడా నేల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వరి, కంది, పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ వేయడం వల్ల నేలకు విశ్రాంతి లభించి, పోషక సమతుల్యత మెరుగుపడుతుంది. పంట అవశేషాలను కాల్చకూడదు. అవశేషాలను నేలలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి మట్టి, సూక్ష్మజీవులు రక్షించబడతాయి. మల్చింగ్‌ పద్ధతి ఉపయోగించడం మంచింది. నేలపై ఆకులు, గడ్డి వంటి పదార్థాలను కప్పడం వల్ల నేలలో తేమ నిల్వ ఉండి కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. నేల క్షీణిస్తే పంటలే కాదు మానవ జీవన వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని గుర్తుంచుకోవాలి.

    నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం

  • ముగిస

    హాలియా : నల్లగొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హాలియా పట్టణంలోని టైం స్కూల్‌లో ఈ నెల 2న ప్రారంభమైన 51వ అంతర్‌ జిల్లా స్థాయి జూనియర్‌ బాలికల కబడ్డీ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా.. నల్లగొండ జట్టు ద్వితీయ స్థానంలో, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు తృతీయ స్థానంలో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర బాధ్యులు అనిల్‌, సత్యనారాయణ, చంద్రమౌళిగౌడ్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్ష, కారదర్శులు భూలోకరావు, కర్తయ్య, డీఎస్‌పీ శంకర్‌రెడ్డి, సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఎకై ్సజ్‌ సీఐ ఏడుకొండలు, టైం స్కూల్‌ డైరెక్టర్‌ మందా నరేందర్‌రెడ్డి, శ్లోక స్కూల్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ కుకుడాల ఆంజనేయులు, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు యడవెల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

    ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా జట్టు

    ద్వితీయ స్థానంలో నల్లగొండ జట్టు

  • నామినేషన్‌ రుసుముగా  రూపాయి నాణేలు

    గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి బుడిగె పుల్లమ్మ గ్రామస్తుల నుంచి సేకరించిన రూపాయి నాణేలతో రూ.1001 రుసుము చెల్లించి గురువారం నామినేషన్‌ వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన తాను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయడానికి కొన్ని రోజులుగా స్థానికుల వద్ద రూపాయి నాణేలను సేకరించి భద్రపర్చుకొని నామినేషన్‌ వేసినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా తన కుమారుడు రమేష్‌ గ్రామస్తుల ద్వారా, వాట్సాప్‌ గ్రూప్‌ల సాయంతో డబ్బులు సేకరించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.

  • గ్లోబల్‌ సమ్మిట్‌కు సూర్యాపేట వాసి

    పేరిణి నృత్య కళాకారుడు రాజ్‌కుమార్‌ బృందానికి ఆహ్వానం

    సూర్యాపేటటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ 2047 గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి ముందు పేరిణి నాట్యం ద్వారా స్వాగతం పలికేందుకు సూర్యాపేటకు చెందిన డ్యాన్స్‌ మాస్టర్‌ పేరిణి రాజ్‌కుమార్‌కు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీల సీఈఓలు నెల 7వ తేదీన సాయంత్రం శిల్పారామానికి రానుండడంతో వారికి పేరిణి నాట్యంతో స్వాగతం పలకనున్నట్లు పేరిణి రాజ్‌కుమార్‌ తెలిపారు. 8న గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమానికి స్వాగతంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

    జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం

    చౌటుప్పల్‌ రూరల్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. చౌటుప్పల్‌ మండల పరిధిలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద, తుప్రాన్‌పేట గ్రామ శివారులో పోలీసులు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు.

    ఎన్నికల ప్రచార వాహనం సీజ్‌

    యాదగిరిగుట్ట రూరల్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ శివారులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మల్లాపురం బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అభ్యర్థి కర్రె వెంకటయ్య ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అందులో కర్రె లింగస్వామి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యంతోపాటు, వాహనాన్ని సీజ్‌ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌ తెలిపారు.

  • అమ్మో.. పోస్టల్‌ బ్యాలెట్‌ !

    ఫ ఓటు గోప్యత లేకపోవడంతో జంకుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

    ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, స్టేజ్‌–2, ప్రిసైడింగ్‌ అధికారి, ఇతర పోలింగ్‌ అధికారులు, బందోబస్తులో పాల్గొనే పోలీసులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ను జారీ చేస్తుంది. దీనిని ఉపయోగించుకుని వారు తమకు నచ్చిన వారికి పెన్నుతో టిక్‌ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన తర్వాత అది సంబంధిత గ్రామపంచాయతీ స్టేజ్‌–2 ఆఫీసర్‌కి ఓట్ల లెక్కింపు కంటే ముందు అందజేస్తారు. సదరు పోస్టల్‌ బ్యాలెట్‌ను తెరిచి అభ్యర్థులకు చూపిస్తారు. తనకు ఓటు పడిన అభ్యర్థికి సంతోషంగా ఉన్నా, ఓటు పడని అభ్యర్థులు ఆ ఉద్యోగిపై కక్షగట్టి, గొడవలు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జంకుతున్నారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ రహస్యతకు భంగం వాటిల్లకుండా ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక పోలింగ్‌ బూత్‌ పెట్టాలని, ఓట్ల లెక్కింపు కంటే ముందే అందరి ఓట్లలో ఇవి కూడా కలపాలని వారు కోరుతున్నారు.

    బైండోవర్‌ అంటే ..

    తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా నేరస్థులు, రౌడీషీటర్లు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై నిఘా పెడతారు. అందుకే ఎన్నికలు రాగానే పాత నేరస్థులను బైండోవర్‌ చేస్తుంటారు. పోలీసులు వారిని స్థానిక తహసీల్దార్‌, ఆర్డీఓ ఎదుట హాజరు పర్చి జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరిస్తారు. ప్రత్యేక బాండ్‌ పేపర్‌పై వారి నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుంటారు. స్వంత పూచీకత్తుపై విడుదల చేస్తారు.

  • పల్లెలకు సిద్ధమైన శ్రీనృసింహుడి రథం

    యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రచార రథం పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని శ్రీస్వామి వారి ప్రచార రథాన్ని ఆలయ ఈఓ వెంకట్రావ్‌ బాగుచేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాలు, పట్టణాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవంతో పాటు ఆలయ విశిష్టతను ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని వినియోగించనున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్‌ గురువారం వెల్లడించారు. ఈ నెల మూడవ, నాల్గవ వారంలో భూపాలపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలో జరిగే శ్రీస్వామి కల్యాణోత్సవానికి ఏఈఓ నవీన్‌, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే కల్యాణానికి ఏఈఓ రఘులను నోడల్‌ అధికారులుగా ఈఓ నియమించారు. దశల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వామివారి ప్రచార రథాన్ని పంపి, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.