Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 12వ వారంలో దివ్య నిఖిత ఎలిమినేట్‌ అయింది. సెప్టెంబర్ 25న నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి  ఆమె ఎంట్రీ ఇచ్చింది. సుమారు 65రోజుల పాటు హౌస్‌లో దివ్య కొనసాగింది.  వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువరోజుల గేమ్‌లో కొనసాగిన కంటెస్టెంట్‌గా ఆమె రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అయితే, బిగ్‌బాస్‌ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది.

    సెప్టెంబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా   దివ్య నిఖిత  బిగ్ బాస్‌ హౌస్‌లోకి వచ్చింది. అయితే, ఆమెకు వారానికి రూ.1.7 లక్షల మేరకు రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9వారాలకు గానూ రూ. 15 లక్షల మేరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన ఇన్‌స్టా పేజీలో సినిమా రివ్యూలు కూడా చెబుతూ ఉంటుంది. అలా ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఏదేమైనా చాలా స్ట్రాంగ్‌గానే బిగ్‌బాస్‌లో దివ్య తన మార్క్‌ చూపింది.

    ఈ వారం అన్‌అఫీషియల్ పోల్స్ ప్రకారం తనూజ, కల్యాణ్‌  ఎక్కువగా ఓట్లు తెచ్చుకున్నారు. వారిద్దరిలో ఒకరు టైటిల్‌ గెలవడం దాదాపు ఖాయం అయిపోయింది. అయితే, దివ్య, సుమన్‌ అతి తక్కువ ఓట్లతో లాస్ట్‌ వరకు ఎలిమినేషన్‌లో నిలిచారు. ఫైనల్‌గా దివ్యకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేషన్‌ కావడం జరిగింది.
     

  • సినీ పైరసీ కేసులో  ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్‌వర్క్‌ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా.. ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాధించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ క్రమంలో విజయ్‌దేవరకొండకు విసిరిన సవాల్‌ గురించి రవి పోలీసులకు చెప్పాడు.

    ఈ ఏడాది ఆగష్టులో విజయ్‌దేవరకొండను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి  విజయ్‌ దేవరకొండకు ఐబొమ్మ వెబ్‌సైట్‌ ద్వారా రవి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు.  ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి ఇలా చెప్పాడు. 'మేము మీకు ముందే చెప్పాము.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని..! కానీ, మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్‌కి డబ్బులు ఇస్తున్నారు. కానీ, వాళ్లు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐ బొమ్మ ఎఫ్‌ఎఫ్‌ డాట్‌ ఇన్‌ పేరుతో రన్‌ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్‌సైట్లు రన్ చేస్తున్నారు. దీనిని ముందే హెచ్చరించాం.. అందుకే మీ కింగ్‌డమ్‌ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం.' అంటూ   గతంలోనే విజయ్‌ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు.

    • ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా చిల్..

    • మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఆషిక రంగనాథ్..

    • మరింత నాటీగా హీరోయిన్ పూనమ్ బజ్వా..

    • రోజా పువ్వులాంటి డ్రెస్లో శాన్వీ మేఘన..

    • మంగళవారం బ్యూటీ రాజ్పుత్ పాయల్ సైకిల్ రైడ్..

    • వేకేషన్లో చిల్ అవుతోన్న రీతూ వర్మ..

     

     

     

     

     

     

     

  • ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌ జంటగా నటిస్తోన్న చిత్రం దండోరా. మూవీకి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్డ్రాప్లవ్ స్టోరీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీని లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లో ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    తాజాగా మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.  లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్రేమికులను తెగ అలరిస్తోంది. పాటకు పూర్ణచారి లిరిక్స్ అందించగా.. ఆదితి భవరాజు, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతమందిస్తున్నారు. చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 25న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

     

  • టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్బ్యాక్డ్రాప్లో వస్తోన్న పీరియాడికల్ మూవీలో  కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా నటిస్తున్నారు. కేఏప్రోడక్షన్స్‌ పతాకంపై మూవీని నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం గత చిత్రాలకు ఆన్‌లైన్‌ ఎడిటింగ్‌ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

    తాజాగా మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే  ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. పాటకు సనారే లిరిక్స్ అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. సాంగ్కు వంశీకాంత్ రేఖన సంగీతమందించారు.

    కాగా.. చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. మూవీలో ప్రదీప్‌ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది

  • టాలీవుడ్‌లో ఓ సెంటిమెంట్‌ ఉంది. నవంబర్‌ నెలలో రిలీజ్‌ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్‌ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్‌ హీరోల హిట్‌ చిత్రాలు కూడా రీరిలీజ్‌ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్‌ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.

    సెంటిమెంట్‌ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్‌ కూడా భారీ ఫ్లాప్‌తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్‌ 1న విడుదలైన రవితేజ ‘మాస్‌ జాతర’ బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్‌ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్‌ వైపు కన్నెత్తి చూడలేదు.

    ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్‌ఫ్రెండ్‌, జటాధర, ది గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్‌ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్‌ ప్రీవెడ్డింగ్‌ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చేశాయి.

    ఇక రెండోవారం(నవంబర్‌ 14) కాంత, జిగ్రీస్‌, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్‌ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్‌ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.

    ఇక నవంబర్‌ 21న అల్లరి నరేశ్‌ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’, పాంచ్‌ మినార్‌తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్‌ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్‌ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్‌ షోకే నెగెటివ్‌ టాక్‌ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్‌ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్‌ అయింది.  ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

    ఇక నవంబర్‌ చివరివారంలో రామ్‌ ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’తో, కీర్తి సురేశ్‌ ‘రివాల్వర్‌ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్‌ తాలుకా చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్‌ అయితే రాబట్టుకోలేకపోయింది.  రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్‌ రీటా డిజాస్టర్‌ టాక్‌ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్‌ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో  ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ది గ్రేట్‌ ఫ్రీవెడ్డింగ్‌ షో’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్‌లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్‌లో అయిన టాలీవుడ్‌కి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దక్కుతుందో చూడాలి. 

  • నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ చిత్రం అఖండ-2. మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మూవీకి సీక్వెల్గా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ ఆదరణ వస్తోంది. చిత్రం డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుంది.

    తాజాగా చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అఖండ-2 మూవీ ఫస్ట్ టికెట్ కోసం అభిమాని ఏకంగా లక్ష రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. టికెట్ కోసం జర్మనీలో నిర్వహించిన వేలంపాటలో రాజశేఖర్ పార్నపల్లి అనే అభిమాని పోటీపడ్డారు. లక్ష రూపాయలు చెల్లించి సూపర్ ఫ్యాన్ టికెట్ను సొంతం చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

  • టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న సినిమా నవంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్డ్టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

    ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్ను దాటేసింది.

    అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్కాలేకపోయాడు. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కించారు. 

     

  • లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 18 42 వసంతంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. సందర్భంగా ఆమెకు పలువురు సినీతారలు విషెస్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.

    ఏడాది తన పుట్టినరోజున తన పిల్లలు ప్రత్యేకంగా విష్ చేసినట్లు పోస్ట్ చేసింది. తన కవలలు ఉయిర్, ఉలగం రాసిన క్యూట్ కొటేషన్ను ఇన్స్టాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్డే టూ బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్ అంటూ చిట్టి చేతులతో రాసిన పేపర్ను నయన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

     

     

  • కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్‌ హాస్యనటుడు ఎంఎస్‌ ఉమేష్‌(80) కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం బెంగళూరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమేష్‌ పూర్తి పేరు.. మైసూర్ శ్రీకాంతయ్య ఉమేష్. 

    1960లో చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేష్‌ దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటుడిగా సేవ చేశారు .తన కెరీర్‌ మొత్తంలో 350కిపైగా సినిమాల్లో నటించారు. నాగరహోళె, గురు శిష్యుడు, అనుపమ, కమనబిల్లు, అపూర్వ సంగమం, శృతి సెరిదగ, హాలు జేను, గోల్‌మాల్ రాధాకృష్ణ వంటి చిత్రాలలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. 

    'కథా సంగమం'(1975) చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. నటుడిగా  ఆయన చేసిన కృషికిగాను 2013లో కర్ణాటక నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. ఎంఎస్‌ ఉమేష్‌ మరణం పట్ల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌, కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు నటీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.

  • షారూఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, సన్నీ డియోల్‌ వంటి హీరోలతో ఎక్కువగా జోడీ కట్టింది జూహీ చావ్లా. అలా సన్నీ డియోల్‌తో లూటెరే అనే హిట్‌ సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. ఆ విశేషాల గురించి నిర్మాత సునీల్‌ దర్శన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'జూహీ కెరీర్‌లో ముఖ్య పాత్ర పోషించిన సినిమాల్లో లూటెరె ఒకటి. 

     దివ్య భారతిని కాదని..
    ఆమె నటించిన సుల్తానాత్‌ (1986), ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌ (1988) సినిమలను నేనే డిస్ట్రిబ్యూట్‌ చేశాను. తను చాలా బాగా యాక్ట్‌ చేయగలదు. అందుకే లూటెరె మూవీలో తనను హీరోయిన్‌గా తీసుకున్నాం. నిజానికి దివ్య భారతి అప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తను ఈ సినిమాలో భాగం కావాలని కోరుకుంది. కానీ, ఆమె ఈ పాత్రకు సరిపోదని భావించాం. దర్శకుడు ధర్మేశ్‌, నేను.. తనను కాదని జూహీ చావ్లాను తీసుకున్నాం.

    గ్లామర్‌గా చూపించాం
    అయితే ఈ సినిమాలో మే తేరీ రాణి తు రాజా అని ఓ బీచ్‌ సాంగ్‌ ఉంటుంది. అందులో ఆమె బీచ్‌లో షర్ట్‌ ధరించి నీళ్లలో తడవాల్సి ఉంటుంది. అప్పటిదాకా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో ఉన్న జూహీ చావ్లా.. సడన్‌గా గ్లామర్‌గా కనిపించాలంటే కొంత భయపడింది. కానీ కథ మొత్తం చెప్పాకే తను సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కాబట్టి చేయక తప్పలేదు. 

    ముద్దు సన్నివేశం
    అలాగే హీరోతో ముద్దు సన్నివేశం ఉంటుందని కూడా చెప్పాం. అలా మొదట్లో సీన్‌ షూట్‌ చేశాం. అయితే ఔట్‌డౌర్‌లో ఆ సీన్‌ తీస్తే బాగుంటుందనుకున్నాం. అంతా సిద్ధం చేసుకున్నాక జూహీ రాలేదు. తనకు వేరే షూటింగ్‌ ఉందని సాకు చెప్పి తప్పించుకుంది. సినిమాకు ఆ సన్నివేశం కీలకమని, ఏదో సంచలనం కోసం దాన్ని షూట్‌ చేయట్లేదని దర్శకుడు అన్నాడు.

    రీటేక్‌కు ఒప్పుకోలేదు
    అలా సన్నీ డియోల్‌ , జూహి (Juhi Chawla)తో ముద్దు సీన్‌ తీశారు. అప్పటికీ అది సరిగా రాలేదని రీటేక్‌ చేయాలన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జూహి.. కాంట్రాక్ట్‌లో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటిస్తానని చెప్పాను. అది ఆల్‌రెడీ చేశానుగా అని వాదించింది. అందుకని ఆమెను బలవంతం చేయకుండా ఫస్ట్‌ తీసిన సీన్‌ను అలాగే ఉంచాం. ఆ సినిమా జూహీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది' అని సునీల్‌ దర్శన్‌ (Suneel Darshan) చెప్పుకొచ్చాడు.

    చదవండి: కాంతార దైవాన్ని దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్‌ స్టార్‌

  • పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వం లో  నిర్మించిన చిత్రం దేవగుడి . ఈ చిత్రం  డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా  చిత్ర యూనిట్ తిరుపతి , గొల్లపల్లిలోని సిద్ధార్థ  ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది .ఈ  సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో  ప్రదర్శించారు. హీరో కావాలని  ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. 

    Dఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం  రామ కృష్ణారెడ్డి.సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు.

  • ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్‌ అయితే ‘చికిరి’ సాంగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది.  అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్‌ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.

    సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్‌ రైట్స్‌ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్‌. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్‌ మొత్తం పూర్తయి రిలీజ్‌ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్‌ అవ్వడం లేదు.  అలాంటిది ఇంకా షూటింగ్‌ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్‌ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

    హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ తండ్రి, ప్రముఖ స్టంట్‌ డైరెక్టర్‌ ‘దంగల్‌’ ఫేమ్‌ షామ్‌ కౌశల్‌ ఈ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్‌ స్టంట్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్‌ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. 

Telangana

  • తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పలు వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ముందుకువెళ్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి  తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న  సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరుతో డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.

    డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని  మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.

    రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 9న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా  తెలంగాణను మార్చడానికి భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతామన్నారు.


     

  • సాక్షి, హైదరాబాద్‌: గ్లోబల్‌ సమ్మిట్‌లో పాలసీ డాక్యుమెంట్‌ను ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజన్‌ డాక్యుమెంట్‌కు తెలంగాణ రైజింగ్‌ 2047 అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.

    ‘‘విజన్‌  డాక్యుమెంట్‌లో లక్షలాది మందిని భాగం చేశాం. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్నదే మా లక్ష్యం. ఐఎస్‌బీ, నీతి ఆయోగ్‌ సంస్థల సలహాలు కూడా తీసకున్నాం. స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నామని వివరించారు. కోర్ అర్బన్, రీజియన్ ఎకనామిగా హైదరాబాద్ మాడిఫికేషన్ చేశారు. ఓఆర్‌ఆర్ పరిధిలో మున్సిపల్‌ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలు  ఉండడం వల్ల వ్యవస్థల మధ్య సమన్యాయం లోపిస్తుంది. అందుకే కోర్ అర్బన్ రీజియన్ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి  పేర్కొన్నారు.

    ‘‘కాలుష్య రహితనగరంగా హైదరాబాద్‌ను మారుస్తాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను తరలిస్తాం. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ను తీసుకొస్తున్నాం. వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెంతో పాటు రామగుండంలో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తాం. కోర్‌, ప్యూర్‌, రేర్‌ రీజియన్లుగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. సమగ్రంగా మూడు రీజియన్ల అభివృద్ధి చేపడతాం. సర్వీస్‌ సెక్టార్‌గా కోర్‌ అర్బన్‌ రీజియన్‌ అభివృద్ధి చేస్తాం. ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌ మధ్య ప్రాంతాన్ని పెరీ అర్బన్‌ రీజియన్‌గా గుర్తించాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

     

     

     

     

     

     

     

     

     

Sports

  • సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్‌కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. 

    రాంచిలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కాంప్లెక్స్‌లో టాస్‌ వేదికగా తొలి వన్డేలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. 

    రోహిత్‌, కోహ్లి, రాహుల్‌ ధనాధన్‌
    ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్‌ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్‌ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. 

    ఆదిలోనే షాకులు
    సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, నండ్రీ బర్గర్‌, కార్బిన్‌ బాష్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ను డకౌట్‌ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చిన క్వింటన్‌ డికాక్‌ను కూడా డకౌట్‌గా వెనక్కి పంపాడు. 

    అదరగొట్టిన  మాథ్యూ, యాన్సెన్‌
    మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (7)ను అర్ష్‌దీప్ సింగ్‌ అవుట్‌ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్‌ జట్టును మాథ్యూ బ్రీట్జ్‌కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్‌రౌండర్‌ యాన్సెన్‌ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్‌ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37) ఫర్వాలేదనిపించారు. 

    భయపెట్టిన బాష్‌
    అయితే, సగం ఇన్నింగ్స్‌లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్‌ సుబ్రేయన్‌ (17), నండ్రీ బర్గర్‌ (17) ఆల్‌రౌండర్‌ కార్బిన్‌ బాష్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్‌ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్‌ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. 

    తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్‌ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్‌ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. 

    ప్రసిద్‌ కృష్ణ, రోహిత్‌ అద్భుతం
    ఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్‌ గాల్లోకి లేపగా ఎక్స్‌ట్రా కవర్‌లో ఉన్న రోహిత్‌ శర్మ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది.

    భారత బౌలర్లలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్‌ రాణా మూడు, అర్ష్‌దీప్‌ రెండు, ప్రసిద్‌ కృష్ణ ఒక కీలక వికెట్‌ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.

    చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ 

  • దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.

    ఎట్టకేలకు ఓ అవకాశం
    ఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్‌లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్‌.. రెండో మ్యాచ్‌లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. 

    ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.

    అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్‌కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్‌ పంత్‌కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్‌కు వచ్చాడు.

    ఊహించని రీతిలో షాక్‌
    నెమ్మదిగానే తన ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన రుతురాజ్‌కు ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. భారత ఇన్నింగ్స్‌లో 27వ ఓవర్‌ను సఫారీ పేసర్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ వేశాడు. అతడి బౌలింగ్‌లో మూడో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. 

    అంతే.. ఇన్‌సైడ్‌ సర్కిల్‌ లోపల ఇంతలో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.

    కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడు
    బ్రెవిస్‌ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్‌ ఆ క్యాచ్‌ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్‌లో ఉన్న  దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సైతం.. ఆ క్యాచ్‌ చూసి నోరెళ్లబెట్టాడు.

    అలా బ్రెవిస్‌ అద్భుత ఫీల్డింగ్‌ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్‌ సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ హైలైట్‌ కాగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) చేసిన పోస్టు వైరల్‌గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్‌ చేసిన సీఎస్‌కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చింది.

     

    పొడిచేశావు కదా కట్టప్పా
    తమ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్‌కే ఈ మేరకు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్‌ మీమ్స్‌తో ఇద్దరినీ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్‌.. ఐపీఎల్‌లో రుతు కెప్టెన్సీలో సీఎస్‌కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్‌ను సీఎస్‌కే అట్టిపెట్టుకుంది కూడా!

    భారత్‌ భారీ స్కోరు
    ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు సాధించింది. రోహిత్‌ శర్మ (57), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60),  రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

    కష్టాల్లో సౌతాఫ్రికా
    లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (7), ర్యాన్‌ రికెల్టన్‌ (0), క్వింటన్‌ డికాక్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.

    అన్నట్లు హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో బ్రెవిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను రుతురాజ్‌ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్‌ రాణా మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక వికెట్‌ తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్‌ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!

    చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీ
    ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌!

  • ‘వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్‌ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చెప్పిన మాట ఇది.

    ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్రకటించిన అగార్కర్‌.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్‌ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్‌ టూర్‌లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్‌ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు.

    రో- కో వన్డే భవితవ్యంపై చర్చ
    మూడో వన్డేలో శతక్కొట్టి భారత్‌ను గెలిపించడంతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.

    టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్‌ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్‌, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్‌ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.

    ఇచ్చిపడేశారు భయ్యా!
    ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

    ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్‌, అగార్కర్‌లను సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్‌ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

    రోహిత్‌ శర్మ రియాక్షన్‌ వైరల్‌
    అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్‌- అగార్కర్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్‌ సమయంలో రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ మరింత హైలైట్‌ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.

    ముఖం మీద కొట్టినట్లుగా 
    ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్‌ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్‌ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ కాగా.. గంభీర్‌- అగార్కర్‌లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

    తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్‌ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.

    చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్‌ను దాటేసి తొలి ప్లేయర్‌గా.. 7000వ సెంచరీ

  • సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్‌ నమోదు చేసింది.

    రోహిత్‌ మెరుపు అర్ధ శతకం
    స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్‌ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా.. రోహిత్‌ శర్మ (Rohit Sharma) ధనాధన్‌ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.

    మరోవైపు.. రోహిత్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 

    కోహ్లి రికార్డు సెంచరీ
    ఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.

    ఈ మ్యాచ్‌లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 

    రాణించిన జడేజా
    మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), వాషింగ్టన్‌ సుందర్‌ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్‌ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్‌ విధించింది.

    సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, నండ్రీ బర్గర్‌, కార్బిన్‌ బాష్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). 

    ఇంతకు ముందు 2010లో గ్వాలియర్‌ వేదికగా టీమిండియా ప్రొటిస్‌ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్‌కు దూరం కాగా.. కేఎల్‌ రాహుల్‌ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.

    చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా?

  • భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్‌... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.

    సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును బద్దలు
    రాంచి వేదికగా ప్రొటిస్‌ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్‌లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... సింగిల్‌ ఫార్మాట్లో అత్యధిక​ శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.

    ఏకైక బ్యాటర్‌గా
    కాగా శతక శతకాల వీరుడు సచిన్‌ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

    అంతేకాదు వన్డేల్లో భారత్‌లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్‌లో మూడు శతకాలు బాదగా.. సచిన్‌ వడోదరలో ఏడు ఇన్నింగ్స్‌లో మూడుసార్లు​ శతక్కొట్టాడు.

    అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్‌ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ టెండుల్కర్‌, డేవిడ్‌ వార్నర్‌ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.

    అరుదైన నంబర్‌
    అంతర్జాతీయ పురుషుల క్రికెట్‌లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్‌ బాదడంతో మెన్స్‌ క్రికెట్‌లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది.  

    భారత్‌ స్కోరెంతంటే?
    కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్‌ శర్మతో రెండో వికెట్‌కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్‌ రాహుల్‌ (60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 

    వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. 
    చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్‌ ఫైర్‌

  • సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.

    వింటేజ్‌ కింగ్‌
    ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్‌తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్‌ కింగ్‌’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్‌ను కొనసాగించాడు. ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

    రోహిత్‌తో కలిసి ధనాధన్‌
    రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (18) వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో ‍కలిసి కోహ్లి ఇన్నింగ్‌ నిర్మించాడు.

    రోహిత్‌ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్‌కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్‌ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), వాషింగ్టన్‌ సుందర్‌ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్‌ రాహుల్‌ కోహ్లికి తోడుగా నిలిచాడు.

    ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

    చదవండి: రోహిత్‌ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిరాశపరిచాడు. చాన్నాళ్ల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెరుగ్గానే ఇన్నింగ్స్‌ ఆరంభించినప్పటికీ నిలకడగా ముందుకు సాగలేకపోయాడు.

    ఈ నేపథ్యంలో జైస్వాల్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. టీ20లలో శుబ్‌మన్‌ గిల్‌- అభిషేక్‌ శర్మ, వన్డేల్లో రోహిత్‌ శర్మ- శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రమే జట్టులో చోటు దక్కుతోంది.

    తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ గిల్‌ గాయం కారణంగా దూరం కాగా.. జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. రాంచి వేదికగా ప్రొటిస్‌ జట్టుతో ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతికే ఫోర్‌ బాది సత్తా చాటిన జైసూ.. రెండో బంతిని కూడా బౌండరీకి తరలించాడు.

    ఆ తర్వాత సిక్సర్‌ బాది దూకుడు ప్రదర్శించిన జైస్వాల్‌కు ప్రొటిస్‌ పేసర్‌ నండ్రీ బర్గర్‌ చెక్‌ పెట్టాడు. నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బర్గర్‌... తొలి బంతిని అవుట్‌ సైడాఫ్‌ దిశగా సంధించగా.. జైస్వాల్‌ గాల్లోకి లేపాడు.  ఈ క్రమంలో వేగంగా స్పందించిన వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ బంతిని ఒడిసిపట్టగా.. జైసూ పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.

    ఈ నేపథ్యంలో జైస్వాల్‌పై విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీలో సత్తా చాటుతాడనుకుంటే.. నిరాశపరిచాడంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ జైసూ విఫలమైన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 12, 0, 58, 13. ప్రొటిస్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్‌.. ఒక్క హాఫ్‌ సెంచరీతో సరిపెట్టాడు.

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్‌ శర్మ ఈ ఘనత సాధించాడు.

    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్‌ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్‌లో.. టాస్‌ ఓడిన భారత్‌ మొదట బ్యాటింగ్‌కు దిగింది . ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డాడు.

    ఈ క్రమంలో రోహిత్‌కు తోడైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్‌ ప్లేలో (10 ఓవర్లు) భారత్‌ వికెట్‌ నష్టానికి 80 పరుగులు సాధించింది. 

    తద్వారా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్‌- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్‌ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్‌ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.

    రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు
    రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో ప్రొటిస్‌ స్పిన్నర్‌ సుబ్రేయన్‌ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతుల్లో రోహిత్‌ వరుసగా సిక్సర్లు బాదాడు. 

     

    ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్‌ను రోహిత్‌ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. అనంతరం రోహిత్‌ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుగదిరిగాడు.

    కోహ్లి అర్ద శతకం
    మరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్‌లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది.  కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్‌ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

    చదవండి: శతక్కొట్టిన అభిషేక్‌ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర

  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అదరగొట్టాడు. బెంగాల్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పంజాబ్‌ కెప్టెన్‌.. భారీ శతకం బాదాడు. కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకున్నాడు.

    ఆది నుంచే బౌలర్లపై అటాక్‌
    దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025 (SMAT)లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో పంజాబ్‌- బెంగాల్‌ (Punjab Vs Bengal) తలపడ్డాయి. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (Prabhsimran Singh) ఆది నుంచే బెంగాల్‌ బౌలర్లపై దాడికి దిగారు.

    148 పరుగులు
    ఆకాశమే హద్దుగా బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో అభిషేక్‌ శర్మ 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 148 పరుగులు సాధించాడు. అయితే, ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో వ్రితిక్‌ ఛటర్జీకి క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ సునామీ ఇన్నింగ్స్‌​కు తెరపడింది.

    మరోవైపు.. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 35 బంతుల్లోనే 70 పరుగుల సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లతో పాటు 4 సిక్స్‌లు ఉన్నాయి. మిగతా వారిలో రమణ్‌దీప్‌ సింగ్‌ (15 బంతుల్లో 39), సన్వీర్‌ సింగ్‌ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (6 బంతుల్లో 11) కాస్త నిరాశపరిచాడు.

    ఇక నమన్‌ ధిర్‌ (2 బంతుల్లో 7),  నేహాల్‌ వధేరా (2 బంతుల్లో 2) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన పంజాబ్‌ ఏకంగా 301 పరుగులు సాధించింది. బెంగాల్‌ బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ రెండు వికెట్లు తీయగా.. మొహమ్మద్‌ షమీ, షక్షైమ్‌ చౌదరి, ప్రదీప్త ప్రామాణిక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
    ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 198 పరుగులే చేసింది. పంజాబ్‌ బౌలర్ల ధాటికి బెంగాల్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్స్‌లు బాది 130 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    అభిమన్యుకు తోడుగా.. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ (7 బంతుల్లో 31) ఒక్కడే మెరుపు వేగంతో పరుగులు రాబట్టాడు. అయితే, మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్‌ చేతిలో బెంగాల్‌ ఏకంగా 112 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 

    పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నేహాల్‌ వధేరా, గుర్నూర్‌ బ్రార్‌ చెరో రెండు.. అభిషేక్‌ శర్మ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. భారీ సెంచరీతో కదం తొక్కి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

    చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ
    బెంగాల్‌తో మ్యాచ్‌లో 148 పరుగులు సాధించిన అభిషేక్‌ శర్మ (16 సిక్సర్లు) అరుదైన రికార్డు సాధించాడు. టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో 17 సిక్స్‌లు (146 నాటౌట్‌)తో మేఘాలయ బ్యాటర్‌ పునిత్‌ బిస్త్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

    కాగా టీ20లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా తిలక్‌ వర్మ కొనసాగుతున్నాడు. గతేడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలో ఈ హైదరాబాదీ 67 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.

    చదవండి: IND vs SA: టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. రుతురాజ్‌కు చోటు.. పంత్‌కు నో ఛాన్స్‌

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)- 2026 వేలానికి వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌బై చెప్పిన రసెల్‌.. మరో కొత్త అవతారంలో అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపాడు.

    ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) సహాయక సిబ్బంది బృందంలో చేరనున్నట్లు రసెల్‌ వెల్లడించాడు. ఈ సందర్భంగా కేకేఆర్‌ జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపేలా రసెల్‌ (Andre Russel) ఓ ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేశాడు. సుదీర్ఘ కాలంగా తనకు అండగా నిలిచిన కేకేఆర్‌ యాజమాన్యంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ​

    వేలంలోకి వదిలిన కేకేఆర్‌
    కాగా 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రసెల్‌.. 2014లో కేకేఆర్‌లో చేరాడు. ఇక అప్పటి నుంచి కోల్‌కతానే ప్రయాణం సాగించిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది టైటిల్‌ గెలిచిన కేకేఆర్‌ టీమ్‌లో అతడు మెంబర్‌ కూడా!

    ఈ క్రమంలో ఐపీఎల్‌-2025 వేలానికి ముందు కేకేఆర్‌ రసెల్‌ను రూ. 12 కోట్ల భారీ మొత్తానికి రిటైన్‌ చేసుకుంది. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌ ఆడి 167 పరుగులు చేసిన రసెల్‌.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సీజన్‌లో రహానే సారథ్యంలోని కేకేఆర్‌ చేదు ఫలితాలు చవిచూసింది. 

    రెండో ఇన్నింగ్స్‌లోనూ కేకేఆర్‌తోనే..
    ఈ నేపథ్యంలో తమ ఖరీదైన ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు), రసెల్‌ (రూ. 12 కోట్లు) 2026 వేలానికి ముందు కేకేఆర్‌ విడిచిపెట్టింది. దీంతో రసెల్‌ను తిరిగి తక్కువ ధరకు కేకేఆర్‌ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. అతడు రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం. 

    అయితే, కోచింగ్‌ సిబ్బందిలో ఒకడిగా కేకేఆర్‌తో కొనసాగుతానన్న 37 ఏళ్ల రసెల్‌ ప్రకటన పట్ల ఆ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్‌ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశాడు. 

    చదవండి: IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్'

Business

  • 2025 దాదాపు ముగిసింది. రేపటి (సోమవారం) నుంచి చివరి నేలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ నెలలో (డిసెంబర్) బ్యాంకులకు వివిధ ప్రాంతీయ, జాతీయ పండుగల కారణంగా దాదాపు 18 రోజులు సెలవులు ఉంటాయని తెలుసుకున్నాం. ఈ కథనంలో స్టాక్ మార్కెట్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.

    డిసెంబర్ నెలలో ఒక్క రోజు (క్రిస్మస్) మాత్రమే స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా శని, ఆది వారాలు సాధారణంగా స్టాక్ మార్కెట్ క్లోజ్. మొత్తం మీద శని, ఆదివారాలు.. క్రిస్మస్ కలిపి 9 రోజులు స్టాక్ మార్కెట్ సెలవులన్నమాట. ఇవి పోగా.. 22 రోజులు స్టాక్ మార్కెట్ సెషన్స్ జరిగుతాయి.

    నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.

  • భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.

    బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

    రూ.251 రీఛార్జ్ ప్లాన్
    బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.

    28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

  • టీవీఎస్ మోటార్ కంపెనీ & బీఎండబ్ల్యూ మోటోరాడ్ తమ దీర్ఘకాల భాగస్వామ్యంలో రెండు లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. 2013లో ఇరు కంపెనీలు కలిసినప్పటి నుంచి సబ్ 500సీసీ విభాగంలో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత జీ 310 ఆర్, జీ 310 జీఎస్, జీ 310 ఆర్ఆర్ మోడల్స్ పుట్టుకొచ్చాయి. ఇవి ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడయ్యాయి.

    'బీఎండబ్ల్యూ మోటోరాడ్'తో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యంలో.. ఆవిష్కరణ & నాణ్యత భాగస్వామ్య విలువలు, విజయానికి పునాదిగా నిలిచాయి. మేము యూరప్, అమెరికా & ఆసియాలోని ప్రముఖ మార్కెట్లలోని అనేక కొత్త ఉత్పత్తులను రూపొందించామని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ అండ్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ అన్నారు.

    రెండు లక్షల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా.. టీవీఎస్ హోసూర్ తయారీ కేంద్రం నుంచి బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ అడ్వెంచర్ బైక్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది రెండు కంపెనీల ప్రయాణానికి గొప్ప అధ్యాయం అని బీఎండబ్ల్యూ మోటోరాడ్ సీఈఓ మార్కస్ ఫ్లాష్ పేర్కొన్నారు.

    బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్
    బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ బైక్.. 420సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో 8,750 rpm వద్ద 48 bhp & 6,750 rpm వద్ద 43 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. బీఎండబ్ల్యూ బేస్ మోడల్ మినహా అన్నింటిలోనూ క్విక్‌షిఫ్టర్‌ను అందిస్తుంది, అయితే టాప్-స్పెక్ జీఎస్ ట్రోఫీ ఈజీ రైడ్ క్లచ్ సిస్టమ్‌ను పొందుతుంది.

  • డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా పైలట్లకు శిక్షణ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ)లో 72.8 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఏడీఎస్‌టీఎల్‌), దానికి 50 శాతం వాటాలున్న హొరైజన్‌ ఏరో సొల్యూషన్స్‌ (హెచ్‌ఏఎస్‌ఎల్‌) సుమారు రూ. 820 కోట్లు వెచ్చించనున్నాయి.

    ఎఫ్‌ఎస్‌టీసీకి హైదరాబాద్‌తో పాటు గురుగ్రామ్‌లో సిమ్యులేషన్‌ సెంటర్లు ఉన్నాయి. హర్యానాలోని భివాని, నార్నౌల్‌లో ఫ్లయింగ్‌ స్కూల్స్‌ నిర్వహిస్తోంది. సంస్థ 11 అధునాతన ఫుల్‌ ఫ్లయిట్‌ సిమ్యులేటర్లు, 17 ట్రైనింగ్‌ విమానాలు ఉన్నాయి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్సులకు శిక్షణ, ప్రత్యేక నైపుణ్యాల కోర్సులను అందిస్తోంది.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.

    కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.

    ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.

    ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'

    నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్‌కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.

  • లండన్‌ ఆధారిత టెక్‌ కంపెనీ నథింగ్‌ కొత్తగా తమ ఫోన్‌ (3ఎ) లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్‌ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్‌ ఫోన్‌ డిసెంబర్‌ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్‌ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.

    నథింగ్‌ ఫోన్‌ ‘3ఎ లైట్‌’లో 6.77 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 50 ఎంపీ మెయిన్‌ కెమెరా, ట్రూలెన్స్‌ ఇంజిన్‌ 4.0, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్‌ ఓఎస్‌ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్‌ అప్‌డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్‌ పొందవచ్చు.

  • చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్‌ థెరపీ టచ్‌ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్‌ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్‌ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.

    చలికి చెక్‌ ఈ దుప్పటి!
    చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్‌కు ‘టాపిష్‌ ఎలక్ట్రిక్‌ దుప్పటి’తో ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్‌ ఫ్లీస్‌ మెటీరియల్‌తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్‌ డిజైన్‌తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్‌బిల్ట్‌ థర్మల్‌ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్‌ప్రూఫ్‌ సిస్టమ్‌ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్‌ డివైజ్‌ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్‌ ఆఫ్‌ చేయడం తప్పనిసరి. దీని రిమోట్‌కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.

    వెచ్చని పాదాలు!
    చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్‌ స్మార్ట్‌ సాక్స్‌ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్‌తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్‌ టెక్నాలజీతో ఈ సాక్స్‌ మరింత హైజినిక్‌గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!

    స్మార్ట్‌ బాటిల్‌!
    బాటిల్‌ని క్లీన్‌ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్‌ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా సెల్ఫ్‌–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్‌ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్‌ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్‌ వాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఇన్సులేషన్‌తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్‌బీ చార్జింగ్‌తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్‌ ఉంటుంది. ధర రూ. 21,649.

  • సెలబ్రిటీలు తమకు ఇష్టమైన కార్లు, బైకులు కొనుగోలు చేయడంతో పాటు.. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే.. నటుడు హృతిక్ రోషన్.. అతని తల్లిదండ్రులు రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్‌లతో కలిసి అంధేరీ వెస్ట్‌లో 10 ఆఫీస్ యూనిట్లను రూ.28 కోట్లకు కొనుగోలు చేశారు.

    హృతిక్ రోషన్.. యురా బిజినెస్ పార్క్ 3వ, 4వ అంతస్తులలో ఉన్న 10 ఆఫీస్ యూనిట్లను రెండు కంపెనీల ద్వారా కొనుగోలు చేశారు. వీటిని హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

    మొత్తం 10 ఆఫీసులలో.. ఐదు ఆఫీసులను హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసినట్లు, ఫిల్మ్‌కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ మిగిలిన ఐదు ఆఫీసులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన లావాదేవీలు 2025 నవంబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది.

    మొత్తం ఆఫీస్ స్థలం 6968 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్ పరిమాణం 769 చదరపు అడుగుల నుంచి 852 చదరపు అడుగుల వరకు ఉంటుంది. విక్రేత పేరు యురా బిజినెస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ (పెకాన్ అండ్ ట్రాన్స్‌కాన్ గ్రూప్) అని తెలుస్తోంది..

    హృతిక్ రోషన్ కుటుంబం.. నవంబర్ 19, 2025న అంధేరీలో రూ.19.68 కోట్ల విలువైన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ డాక్యుమెంట్స్ ప్రకారం, వీటిని వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశారు. ఆ తరువాత నవంబర్ 24 హృతిక్ సోదరి సునైనా రోషన్ కూడా అంధేరీ ఈస్ట్‌లో రెండు ఆఫీస్ యూనిట్లను రూ. 6.42 కోట్లకు కొనుగోలు చేసింది.

  • డిసెంబర్ నెలలో పలు బ్యాంకింగ్, పెన్షన్, ఆదాయపు పన్ను సంబంధించిన కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఎస్‌బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత నుంచి, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, పాన్–ఆధార్ లింకింగ్, ఐటీఆర్ గడువులు, ఎన్‌పీఎస్ నుంచి యూపీఎస్‌కు మారడానికి ఆప్షన్‌ గడువు.. ఇలా అనేక అంశాలు గమనించాల్సివి ఉన్నాయి.

    నవంబర్‌తో ముగిసే కీలక గడువులు

    ఎస్‌బీఐ ఎంక్యాష్ సేవ నిలిపివేత
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ, యోనో లైట్‌లో ఎంక్యాష్‌ (mCASH) సేవలను నిలిపివేస్తోంది. దీని తర్వాత లబ్ధిదారును నమోదు చేయకుండా డబ్బు పంపడం లేదా లింక్ ద్వారా నిధులు స్వీకరించడం సాధ్యం కాదు. బదులుగా వినియోగదారులు యూపీఐ, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ వంటి సురక్షిత చెల్లింపు మార్గాలను ఉపయోగించాలని ఎస్బీఐ సూచించింది.

    లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు చివరి తేదీ
    ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను నవంబర్ 30లోపు తప్పనిసరిగా సమర్పించాలి. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఇంటి వద్ద సేవల ద్వారా, బ్యాంకులు/పోస్టాఫీసుల ద్వారా, డిజిటల్ యాప్ ద్వారా కూడా సమర్పించవచ్చు. గడువు దాటితే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

    ఎన్‌పీఎస్ నుండి యూపీఎస్‌కు మార్పు..
    ఎన్‌పీఎస్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కి మారడానికి నవంబర్ 30 చివరి అవకాశం ఉంది. దరఖాస్తులు సీఆర్‌ఏ వ్యవస్థ ద్వారా లేదా నోడల్ కార్యాలయాలకు భౌతికంగా అందించాలి.

    డిసెంబర్‌లో కీలక ఆదాయపు పన్ను గడువులు

    పన్ను ఆడిట్ కేసుల ఐటీఆర్‌
    పన్ను ఆడిట్‌కి అర్హులైన మదింపుదారుల కోసం ఐటీఆర్‌ దాఖలు గడువును సీబీడీటీ డిసెంబర్ 10 వరకు పొడిగించింది. అసలు గడువు అక్టోబర్ 31తోనే ముగిసింది.

    ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు
    అసలు గడువులో ఐటీఆర్‌ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(4) కింద డిసెంబర్ 31 వరకు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ తేదీ తర్వాత దాఖలు చెయ్యడం అసాధ్యం. జరిమానా, వడ్డీ, రిఫండ్ నష్టం వంటి పరిణామాలు ఎదురవచ్చు.

    పాన్–ఆధార్ లింకింగ్
    2024 అక్టోబర్ 1 లోపు  ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ పొందిన వ్యక్తులు తమ పాన్ ఇనాక్టివ్‌ కాకుండా ఉండాలంటే డిసెంబర్ 31 లోపు ఆధార్–పాన్ లింకింగ్ పూర్తి చేయాలి.

  • ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే ప్రముఖ ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక కఠినమైన హెచ్చరికను జారీ చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రపంచ ఆస్తి బుడగ పేలడం ప్రారంభించిందని, అత్యంత ప్రభావవంతమైన "క్యారీ ట్రేడ్"కు జపాన్  ముగింపు పలుకుతోందని హెచ్చరించారు.

    ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor) రచయిత.. జపాన్ "క్యారీ ట్రేడ్" అంటే అతి-తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే దీర్ఘకాల పద్ధతి గురించి సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో వరుస పోస్టులలో వ్యాఖ్యానించారు. ఈ విధానం ద్వారా ప్రపంచ రియల్ ఎస్టేట్, ఈక్విటీలు, బాండ్లు, కమాడిటీలు, ప్రైవేట్ వ్యాపారాలలోకి ప్రవహించిన మూలధనం ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలను పెంచడానికి సహాయపడిందని పేర్కొన్నారు.

    కియోసాకి (Robert Kiyosaki ) ప్రకారం.. ఈ అనూహ్య తిరోగమనం ఇప్పుడు యు.ఎస్. థాంక్స్ గివింగ్ సమయంలో "చరిత్రలో అతిపెద్ద క్రాష్"ను ప్రేరేపిస్తోంది. మార్కెట్లు కుదుపునకు లోనవుతున్నప్పుడు ఆ సంక్షోభానికి చిక్కకుండా ధనవంతులు కావడానికి ఏం చేయాలో తాను 10 వ్యూహాలను చెబుతానన్న కియోసాకి తన తొలి కిటుకును బయట పెట్టేశారు.

    తొలి వ్యూహం ఇదే.. 
    కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి ప్రపంచ ఇంధన డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.

    కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, ఆస్తులు పోగొట్టుకుని బికారులయ్యే ఈ తరుణంలో ‘నేను ధనవంతున్ని కావాలని ప్లాన్ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ఆయన ఉద్యోగ మార్కెట్‌పైనే రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఆధారపడి ఉంటుందన్న తన ‘రిచ్‌ డాడ్‌’ పాఠాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.

    ‍ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయినా మీరు మాత్రం ధనికులు కావచ్చని తనను అనుసరించేవారికి కియోసాకి సూచించారు. తన నుంచి మరిన్ని సూచనలు రాబోతున్నాయన్న ఆయన ఇవి కేవలం తన సూచనలు మాత్రమేనని, సిఫార్సులు కాదని స్పష్టం చేశారు.

International

  • శ్రీలంక వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్(బెల్ 212) వెన్నప్పువ ప్రాంతంలో కూలిపోయింది. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు కూడా ధ్రువీకరించారు. వెన్నప్పువ–లునువిలా ప్రాంతంలోని గిన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

    దిత్వా తుపాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆదేశానికి భారత్  ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

     

     
  • ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా  ఆదేశంలో ఇప్పటి వరకూ 442 మంది మృతి చెందారు. అంతే కాకుండా ప్రధాన రహదారులు దెబ్బతిని జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు చాలా చోట్ల పనిచేయడం లేదు,

    ఆగ్నేయాసియా ప్రాంతాన్ని తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ తుఫానుల కారణంగా ఆ ప్రాంతంలోని పలు దేశాలలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుఫాన్ కారణంగా ఇండోనేషియాలో పలు భవనాలు నీట మునిగాయి. గాలి తీవ్రతకు కొండచరియలు విరిగిపడగా పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీని కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాన్ వల్ల తన సర్వస్వం కోల్పోయానని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

    మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇండోనేషియా ప్రకృతి విపత్తు శాఖ తెలిపింది. తమ సహాయక బృందాలు ఇప్పటివరకూ వేల సంఖ్యలో ప్రజలను రక్షించాయని తెలిపారు. అయినప్పటికీ ఇంక పెద్ద మెుత్తంలో ప్రజలు నీటిలో చిక్కుకున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఆహారం దొరకక ప్రజలు నిత్యావసర సామాగ్రి ఉన్న దుకాణాలను లూటీ చేశారని తెలిపారు.

    కాగా థాయ్ లాండ్  భారీవరదల కారణంగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 170 కి చేరుకుంది. సోంగ్ల్కా ప్రావిన్సులో నీరు పది అడుగుల మేర నిలిచింది. భారీ వరదల కారణంగా ఈ నెల 11న ఇక్కడ జరగాల్సిన క్రీడా వేదికలను బ్యాంకాక్ కు మార్చారు.

    వియత్నాంలోనూ అకాల వరదలకారణంగా  98మంది మృతి చెందారు. శ్రీలంకలోనూ  వరదల కారణంగా 123మంది మృతి చెందగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఆదేశానికి భారత్  ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సాయం ప్రకటించింది. 

  • మిచిగాన్‌: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అందించే మిలియన్ డాలర్ల ఆఫర్‌ను తిరస్కరిస్తూ, అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఇద్దరు 22 ఏళ్ల కుర్రాళ్లు తమ విప్లవాత్మక ఏఐ ప్రాజెక్ట్‌ రూపకల్పనకు నడుంబిగించారు. సేపియంట్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకులైన గువాన్ వాంగ్, విలియం చెన్‌లు ఎలాన్‌ మస్క్‌ను ఢీకొడుతూ మానవ మేధస్సు కంటే తెలివైన ఏఐని సృష్టించే ఉమ్మడి ‘మెటాగోల్స్’తో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే మొదటి వ్యక్తులం తామే కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.  

    ఈ కుర్రాళ్లు తొలుత ఓపెన్‌చాట్‌తో విజయం సాధించారు. ఇది అధిక నాణ్యత సంభాషణల క్యూరేటెడ్ సెట్‌పై శిక్షణ పొందిన ఒక భాషా మోడల్ (ఎల్‌ఎల్‌ఏం). సంప్రదాయ ఎల్‌ఎల్‌ఎంల పరిమితులను అధిగమించేలా దీనిని తీర్చిదిద్దారు. వీరు రూపొందించిన ఓపెన్‌చాట్ త్వరగా విద్యా వర్గాలలో దూసుకుపోతోంది.  ఈ మోడల్ ఎలాన్ మస్క్ దృష్టిని సైతం ఆకర్షించింది. దీంతో మస్క్ తన కంపెనీ ఎక్స్‌ ఏఐ ద్వారా ఆ కుర్రాళ్లను సంప్రదించి, మిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇచ్చారు. అయితే దీనిని చెన్, వాంగ్ తిరస్కరించారు.

    మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత వారు హైరార్కికల్ రీజనింగ్ మోడల్ (హెచ్‌ఆర్‌ఎం)ను సృష్టించేందుకు సేపియంట్ ఇంటెలిజెన్స్‌ను స్థాపించారు. ఈ హచ్‌ఆర్‌ఎం  మోడల్ కేవలం 27 మిలియన్ పారామితులతో కూడిన ప్రోటోటైప్ అయినప్పటికీ, అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్‌ను కొలిచే సంక్లిష్టమైన పనులైన సుడోకు పజిల్స్, ఏఆర్‌సీ-ఏజీఐ  బెంచ్‌మార్క్‌తో సహా ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్, డీప్‌సీక్ లాంటి ప్రధాన ఏఐ వ్యవస్థలను అధిగమించింది.

    ఈ కుర్రాళ్లు రూపొందిస్తున్న హెచ్‌ఆర్‌ఎం.. గణాంకపరంగా తదుపరి పదాన్ని అంచనా వేసే సాంప్రదాయ ట్రాన్స్‌ఫార్మర్‌ల మాదిరిగా కాకుండా, మానవ ఆలోచనను అనుకరించే రెండు-భాగాల పునరావృత నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఉద్దేశపూర్వక తార్కికతను వేగవంతమైన రిఫ్లెక్సివ్ ప్రతిస్పందనలతో కలుపుతుంది. ఇది ఊహించడం కాదని, ఆలోచించడం అని, ఫలితంగా తమ మోడళ్లు సాంప్రదాయ ఎల్‌ఎల్‌ఎంల కంటే చాలా తక్కువగా భ్రాంతులు కలిగి ఉంటాయని ఆ కుర్రాళ్లు చెబుతున్నారు.  వాతావరణ అంచనా, వ్యాపారం తదితర రంగాలలో ఇప్పటికే వీరి ప్రయోగాలు విజయవంతయ్యాయి.

    ఇది కూడా చదవండి: చాట్‌ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే..

Politics

  • సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్‌ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.

    ‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి

    ..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్‌‌లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

  • విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారాయన. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వలన రైతులు నష్టపోయారని, రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదన్నారు బొత్స.

     ‘రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు..గత ప్రభుత్వ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల సమస్యలు తీవ్రంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంకు లేఖలు రాస్తారా.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు. క్వింటా రేటు రూ. 2300 నుంచి రూ. 1500 లకు పడిపోయింది.ప్రభుత్వ దృష్టి విశాఖ భూముల మీద ఉంది.ఎవరికి 99 పైసలకే భూములు కట్టబెట్టాలని చూస్తుంది. 

    రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇచ్చినప్పుడు ఎందుకు పారదర్శకత పాటించలేదు.కోట్లాది రూపాయల భూములను 99 పైసలకే ఎలా ఇస్తున్నారు.. విశాఖలో భూములను వేలం పెట్టి ఇవ్వాలి. భూములు పేరు చెప్పి దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ పథకాలకు ప్రభుత్వ పెద్దలు పేర్లు మార్చి పబ్బం. గడుపుకుంటున్నారు. 

    గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది.గతంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు తీరకుండానే అమరావతికి భూసేకరణ అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు భూసేకరణ చేయలేకపోయారు. కేజీహెచ్ పై ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదు. లులు ఒక పనికిమాలిన సంస్థ.అటువంటి సంస్థకు భూములు ఇచ్చారు.ఇనార్బిట్ మాల్ కు, లులు సంస్థకు పోలికలే లేదు’ అని మండిపడ్డారు.

    .

     

     

Andhra Pradesh

  • సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  ప్రస్తుతానికి ఇది కారైకాల్‌కి 120 కి. మీ, పుదుచ్చేరికి 90 కి.మీ, చెన్నైకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

    గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల అధికారులు అలర్ట్‌ అయ్యారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు (డిసెంబర్ 1, సోమవారం) సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

    బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్‌ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

     

  • సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి పీఏ బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రి పీఏ సతీష్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిర్యాదు చేస్తే పోలీసులు నన్ను  24 గంటల పాటు విచారించారు.  నా ఫోన్‌, ఇంటి దగ్గర ఉన్న పిల్లల ఫోన్లు లాక్కున్నారు’’ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పీఏ సతీష్‌,  మంత్రి కొడుకు ఫోన్లు ఎందుకు తీసుకోలేదు’’ అంటూ ఆమె ప్రశ్నించింది.

    నిందితులను కనీసం విచారణ చేయకుండా బాధితరాలినే విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆమె వాపోయింది. ‘‘నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయకులను కూడా అనుమతించలేదు. ఆసుపత్రిలో పోలీసులు ఎవరితో మాట్లాడనివ్వలేదు. ఇంటి దగ్గర పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన చెందా. ఈ కేసు దర్యాప్తులో మంత్రి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలి’’ అని బాధితురాలు డిమాండ్‌  చేసింది.

    సతీష్‌ను అరెస్ట్‌ చేయాలి: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి
    మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. సతీష్‌పై కేసు నమోదు చేయకుండా నిందితుడి​​కి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాయడం అన్యాయం. మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

    ..కేసును తారుమారు చేయకుండా నిష్పక్ష పాతంగా పోలీసులు విచారణ చేపట్టాలి. పోలీసులు విచారణ పూర్తి కాకుండా వాయిస్, వాట్సాప్ చాటింగ్ మార్ఫింగ్ అని మంత్రి ఎలా చెప్తారు. సీఎంవో నుంచి పీఏను తొలగించాలని ఆదేశాలు వచ్చిన తరువాతే పీఏను తొలగించడం నిజం కాదా?’’ అంటూ పుష్పశ్రీవాణి మండిపడ్డారు.

  • సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు  సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్‌ కాలు​కి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    పెంచలయ్య హత్య‌ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు

    ..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.

    ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ ఆగ్రహం
    కామ్రేడ్‌ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై  ప్రజానాట్య మండలి, డీవైఎఫ్‌ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్‌ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన  వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.

     

  • సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి తల్లి, కుమారుడిపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కుమారుడు సాంబశివరావు మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో  హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

    దోసకాయలపల్లిలో దారుణం..
    తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ (30)ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములకల్లంకకు చెందిన వ్యక్తి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

     

  • సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమల్లో తన..మన అంటూ ‘పచ్చ’పాతం చూపించే బాబు సర్కారు.. పార్టీ నేతలపైనా అదే పంథాను అనుసరిస్తోంది. మంచీ.. చెడు..న్యాయం.. ధర్మం కాకుండా ‘లెక్క’ల బేరీజులు వేసుకుంటూ మరీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓ మహిళ ఆరోపణలపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌ వ్యవహారంలో సీఎంఓ ఆగమేఘాలపై స్పందించింది. కానీ, తమ పార్టీకే చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి చేసిన ఆరోపణలపై స్పందనే లేకుండా పోయింది.పైగా సదరు మహిళా నాయకురాలిపైనే పోలీసులు వే ధింపులు తీవ్రమయ్యాయి. లాభ నష్టాల బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం స్పందన ఉన్నట్లు ఈ ఘటన ఉదంతం స్పష్టం చేస్తోంది.

    తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ వేమన సతీష్‌ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామ ని నమ్మించి రూ.7కోట్లు తీసుకున్నారని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు సుధా మాధవి ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో హైకోర్టు న్యాయవాది జడ శ్రమణ్‌కుమార్‌ అండతో మీడియా ముందుకు వచ్చి ఆవేదన వెళ్లబోసుకున్నారు. సుధా మాధవి కన్నీళ్లు టీడీపీ పెద్దల్ని కరిగించలేకపోయాయి. పైగా ఆమైపెనే ఒత్తిళ్లు వచ్చాయి. ‘వేమన సతీష్‌పై ఆరోపణలు చేస్తావా...’ అంటూ పోలీసు అధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.

    లాభ నష్టాలు బేరీజు వేసుకుని స్పందన...  
    గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ సతీష్‌ తనకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, వేధింపులకు గురి చేశారని తాజాగా ఓ మహిళ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సీఎంఓ మంత్రి పీఏపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. మరి.. అంతకు మించి ఆరోపణలు వచ్చిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ నాయకుడు వేమన సతీష్‌పై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

    అదే పార్టీకి చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి ఆరోపణలపై సీఎంఓ నుంచి కనీస స్పందన కరువైంది. పైగా సుధా మాధవి సాక్ష్యాధారాలుగా ఉన్న వీడియోలు కూడా విడుదల చేశారు. అయినా పార్టీ నుంచి.. సీఎంఓ నుంచి ఆమెకు కనీస మద్దతు లభించలేదు. పైగా పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాన్ని గమనిస్తే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం చర్యలున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘మనోడైతే ఓ న్యాయం, పేదోడైతే మరో న్యాయం’ అన్నట్లుగా చర్యలున్నాయని వారు వివరిస్తున్నారు. వేమన సతీష్‌కు టీడీపీ పెద్దల మద్దతు ఉండడంతోనే పోలీసు వ్యవస్థ సైతం అండగా నిలుస్తూ దళిత మహిళా నాయకురాలిపై నిరంకుశితంగా వ్యవహరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • కాకినాడ:  ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ చోటు చేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ప్రయాణికుడ్ని జట్టుపట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము కర్చీఫ్‌ వేసుకున్న సీట్లో పురుష ప్రయాణికుడు కూర్చోవడంతో గొడవ ఆరంభమైంది. 

    మాటామాటా పెరగడంతో ఆ పురుష ప్రయాణికుడ్ని జట్టు పట్టుకుని చితకబాదారు. ఆ దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఏం చేయాలో తెలియక, ఈ గొడవ ఎటు తిరిగి ఎటు పోతుందోననే భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఇది తుని-నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసి బస్సులో జరిగింది. 

    ఇదిలా ఉంచితే, ఇటీవల విజయవాడ మార్గంలో మహిళల మధ్య సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుని శారీరకంగా దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం వాగ్వాదం ప్రారంభించారు అది ఆ తర్వాత సోడా బాటిల్‌తో దాడి చేయడం వరకు వెళ్లింది.  

    మహిళల మధ్య తీవ్ర తగాదా
    మరో సంఘటనలో మహిళలు ఒకరినొకరు జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం వంటి హింసాత్మక చర్యలకు దిగారు. ప్రయాణికులు వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో ఈ ఘటన కూడా పెద్ద చర్చకు దారితీసింది..*

National

  • ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అరెస్టైన ముగ్గురు తీవ్రవాదులు నార్త్ ఇండియాకు చెందిన వారని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో వీరిని అదుపులోికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల గురుదాస్ పూర పోలీస్ స్టేషన్ పై బాంబుతో దాడి చేసింది ఈ టెర్రరిస్టులేనని స్పెషల్ సెల్ అడిషనల్ సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహా పేర్కొన్నారు. 

    పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో  హార్గున్ ప్రీత్ సింగ్ (పంజాబ్), వికాస్ ప్రజాపతి (మధ్యప్రదేశ్) ఆరిఫ్ (ఉత్తరప్రదేశ్) రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. వీరు కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసుకున్నారని ఆ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి పలు వీడియోలు చిత్రీకరించారని పేర్కొన్నారు. వీరందరిని షాబాద్ బట్టి అనే వ్యక్తి బయిటి నుండి ఆదేశాలు ఇచ్చేవాడని  సీపీ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ లకు ఆయన స్వయంగా గాని ఆయన అనుచరుల ద్వారా గాని నడిపించేవారన్నారు.

    టెర్రరిస్ట్ గ్రూప్ రిక్రూట్ మెంట్ కోసం సామాజిక మాధ్యమాలను వాడారని వాటి ద్వారానే యువకులను ఉగ్రవాదులుగా నియమించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్టులు ఉగ్రవాదుల విషయంలో కొంత సమాచారం ఇచ్చారని త్వరలో వాటి ఆధారంగా మరిన్ని అరెస్టులు జరుగుతాయని సీపీ ప్రమోద్ కుమార్ కుశ్వాహ పేర్కొన్నారు.

  • కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. 

    చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.

    మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు 
    ఆంచల్‌ మమిద్వార్‌ (21), సక్షం టేట్‌ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్‌ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్‌ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్‌ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్‌ తండ్రి గజానన్‌ మమిద్వార్‌ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్‌ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.

    తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. 
    గురువారం సాయంత్రం, నాందేడ్‌లోని పాతగంజ్‌ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్‌ సోదరుడు హేమేశ్‌ మామిద్వార్‌ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్‌ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు.  

    మా ప్రేమకు చావు లేదు.. 
    సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్‌ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్‌ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

    వారిని ఉరి తీయండి.. 
    ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది.

     ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్‌ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్‌ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించారు. ఆంచల్‌ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

  • శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్‌ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.

    గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • దంతెవాడ: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ రీజియన్‌ దంతెవాడ జిల్లాలో ఇవాళ (ఆదివారం, నవంబర్‌ 30) 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ అమలు చేస్తున్న ‘పూనా మర్గం’ ప్రచారానికి ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు హింసను విడిచిపెట్టి  జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దంతేవాడ పోలీసులు పిలుపునిచ్చారు. 

    తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న మావోయిస్టులు.. దంతెవాడలోని డీఆర్‌జీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    2024-25లో జరిగిన ఆపరేషన్లు, ఎదురుకాల్పులు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్రయోజనాలతో మావోయిస్టులను హింసను విడిచిపెట్టేలా చేశాయని ఎస్పీ రాయ్‌ తెలిపారు. గత 20 నెలల్లో దంతేవాడలో 508 మంది మావోయిస్టులు, అందులో 165 మంది లొంగిపోయారని రాయ్ చెప్పారు.

  • దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గాలి నాణ్యతలు పలు మార్లు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ కేంద్రం తీసుకునే చర్యలు ఫలించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో అడెనోకార్సినోమా అనే ఉపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఢిల్లీ వాసులలో అధికంగా నమోదవుతున్నాయి. ధూమపానం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు అధికంగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.

    ఢిల్లీ నగరం చాలాకాలంగా  గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో వాహనాలతో పాటు పరిసర ప్రాంతాలలో పంటవ్యర్థాలు కాల్చివేయడం తదితర చర్యలతో అక్కడ తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు దాని నివారణకు ఎన్ని చర్యలు చేపట్టిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇటివల అక్కడ నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా సిగరెట్ ఇతరాత్ర దురలావాట్ల ద్వారా అధికంగా సంభవించే  లంగ్ క్యాన్సర్ కేసులు  ధూమపానం అలవాటు లేని వారిలోనూ అధికంగా నమోదవుతున్నాయి.

    ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90 శాతం దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని తెలిపాయి. అదే 2018లో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు 60 నుంచి 70శాతం మంది ధూమపానం అలవాటు లేని వారని తెలిపింది. ఈ గడిచిన దశాబ్దాల కాలంలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ విధంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

    2025లో ది లాన్సెంట్ జరిపిన అధ్యయనం ప్రకారం  అడినోకాన్సిరోమా అనే క్యాన్సర్ రకం గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే అధికంగా ఏర్పడుతాయని స్టడీ తెలిపింది. అయితే సిగరెట్ అలావాటు లేని వారిలోనూ  ఈరకం క్యాన్సర్ కేసులు అక్కడ అధికంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని గాలి కాలుష్యమే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. 

    యువకులు, మహిళలలో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దానికి తోడూ ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఈక్యాన్సర్ కేసులపై ప్రజలకు అవగాహాన కల్పించి  ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్య నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

  • సాక్షి బెంగుళూరు:గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలని వేడెక్కించిన కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు కాస్త చల్లబడ్డట్లు కనిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యతో తనకు విభేదాలు ఏమి లేవని డిప్యూటీ సీఎం డీ.కే శివకుమార్ ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసన్నారు. తమ పార్టీ నేతల దృష్టంతా 2028లో పార్టీని అధికారంలోకి తేవడం పైనే ఉందన్నారు.

    కర్ణాటక కాంగ్రెస్‌లో పుట్టిన అంతర్గత ముసలం గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే శివకూమార్ మధ్య ట్వీట్ల యుద్ధం తీవ్రంగానే నడిచింది. తనను ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు ఎన్నుకున్నారని సిద్ధ రామయ్య, మాట నిలబెట్టుకోవడం కంటే గొప్పది మరోటి ఉండదని శివకుమార్ కామెంట్స్ చేశారు. కాగా ప్రస్తుతం శివకుమార్ మాట్లాడే తీరు చూస్తుంటే ఈ విషయంలో ఆయన కొంచెం మెత్తబడ్డట్లే కనిపిస్తుంది.

    డీ.కే శివకుమార్ మాట్లాడుతూ  "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ అధ్యక్షుడిగా నా పరిధులేంటో నాకు తెలుసు. ఇప్పటి వరకూ తామేప్పుడు భేదాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమిద్దరం కలిసే పని చేస్తున్నాం. కర్ణాటక ప్రజలకు వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చడం కోసం మేమంతా కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 2028, 2029లో అధికారం సాధించడమే మా ముందున్న గమ్యం. దానికోసం మేం పనిచేస్తున్నాం. వివిధ సమస్యలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం". అని శివకుమార్ అన్నారు.

    కాగా  నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో  సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు  చెలరేగాయి. కాగా ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకూమర్ ఇద్దరూ నేతలు సైతం అధిష్ఠానందే ఫైనల్ డెసిషన్ అనడంతో కాంగ్రెస్ హైకమాండ్‌ ఊపిరి తీసుకున్నట్లు కనిపిస్తుంది.

    ఈ వివాదం పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే త్వరలోనే పార్టీ హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

  • సాక్షి ఎరుమేలి: దేవస్వం బోర్డు యాత్రికుల వాహనాల పార్కింగ్‌పై ఫిర్యాదుల కలకలం. దేవస్వం బోర్డు ఒప్పందం కుదుర్చకున్న మొత్తం కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై తక్కణమే రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవాలంటూ మండిపడితున్నారు యాత్రికులు. నిజానికి దేవస్వం బోర్డు ప్రయాణికులు వాహనాల పార్కింగ్‌ ఫీజును రూ. 75గా నిర్ణయించగా, కర్ణాటకు చెందిన యాత్రికుల వాహనాలకు అధిక మొత్తంలో రూ. 250 వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హిందూ సంస్థలు, పోలీసులు జోక్యం మేరకు అదనపు మొత్తాన్ని తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. 

    అదీగాక కొంతమొంది యాత్రికులు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి రెవెన్యూ కంట్రోల్ రూమ్ బృందానికి ఫోన్ చేశారని, అలాగే వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారే గానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని హిందూ సంస్థ ఆఫీస్ బేరర్లు ఆరోపించారు. ఈ మేరకు అయ్యప్ప సేవా సమాజం రాష్ట్ర కార్యదర్శి ఎస్. మనోజ్ నేతృత్వంలో కొందరూ  సంఘటన స్థలానికి చేరుకుని అధిక రుసుములు వసూలు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

    అధిక రుసుములు వసూలు చేసినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించినప్పటికీ, చర్యలు తీసుకోవాల్సింది తాము కాదని చెప్పడం గమనార్హం. అదీగాక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనా చర్యలు తీసుకుంటామనేది పోలీసుల వాదన. గత వారంన్నర కాలంలో యాత్రికుల వాహనాల నుంచి సుమారు మూడు రెట్లు పార్కింగ్ రుసుము వసూలు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కనీసం దేవస్వం బోర్డు సైతం  చర్యలు తీసుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. 

    ఆఖరికి తిరిగి వెళ్లేటప్పుడూ కూడా ..
    దేవస్వం బోర్డు మైదానంలోని కాంట్రాక్టర్లు బిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి పార్కింగ్ రుసుము వసూలు చేస్తారు. పైగా దేవస్వం బోర్డు ఒప్పందం ప్రకారం, పార్కింగ్ రుసుముకు రశీదు ఇవ్వాలి. అంతేగాదు దోపిడీ పెరగడంతో, దేవస్వం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీలు వేసిన రశీదును జారీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా. అదీగాక వాహనాలు పార్కింగ్ మైదానంలోకి ప్రవేశించిన వెంటనే రశీదు జారీ చేయాలన్న ఆదేశం. అయితే అందుకూ విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ మైదానం నుంచి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు డబ్బు వసూలు చేస్తున్నాట్లు సమాచారం.

    నోటీసులు జారీ ..
    యాత్రికుల వాహనాలకు అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో కాంట్రాక్టర్‌కు దేవస్వం బోర్డు నోటీసులు జారీ చేస్తుంది. అలాగే ఒప్పంద ఉల్లంఘనకు గానూ తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొంది. 

    (చదవండి: బుకింగ్‌ పాస్‌లు ఉన్నవారికే శబరిమలకు అనుమతి..! హైకోర్టు)

     

Family

  • పొటాటో బైట్స్‌
    కావలసినవి:  బంగాళాదుంప గుజ్జు – ఒక కప్పు
    ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 3 టేబుల్‌ స్పూన్లు చొప్పున, పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్‌ చేసుకోవాలి), పుదీనా తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, మామిడికాయ పొడి – ఒక టీస్పూన్, మ్యాగీ మసాలా – ఒక టీస్పూన్‌ , కొత్తిమీర చట్నీ – కొద్దిగా, నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూన్, బిస్కట్లు – ఒక చిన్న ప్యాకెట్, కారప్పూస – కొద్దిగా, ఉప్పు – సరిపడా 
    తయారీ: ముందుగా ఒక పాత్రలో బంగాళదుంప గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, మామిడికాయ పొడి, మ్యాగీ మసాలా, కొత్తిమీర చట్నీ, నిమ్మరసం ఇలా అన్నీ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు రెండేసి బిస్కట్స్‌ తీసుకుని వాటి మధ్యలో కొద్దికొద్దిగా ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి, రెండు బిస్కట్స్‌ అతుక్కునేలా, చిత్రంలో ఉన్న విధంగా నొక్కాలి. ఆ తర్వాత అంతా సమాంతరం అయ్యేలా చేసుకుని కారప్పూసలో దొర్లించాలి. అనంతరం టొమాటో సాస్, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుంటే, ఆ బైట్స్‌ భలే రుచికరంగా ఉంటాయి.

    పనీర్‌ టిక్కా టోస్ట్‌
    కావలసినవి:  పనీర్‌ ముక్కలు – ఒక కప్పు
    బ్రెడ్‌ స్లైసెస్‌ – 4 లేదా 5, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, నూనె – సరిపడా
    చిల్లీ సాస్, టొమాటో సాస్‌ – కొద్దికొద్దిగా
    క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (కాస్త పెద్దగా కట్‌ చేసుకోవాలి)
    నూనె, చీజ్‌ తురుము – సరిపడా
    తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి, పనీర్‌ ముక్కలకు బాగా పట్టించి, వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్‌ స్లైసెస్‌పైన చిల్లీ సాస్‌ కొద్దిగా, టొమాటో సాస్‌ కొద్దిగా పూసుకుని, ఆపైన నాలుగేసి పనీర్‌ ముక్కలను పరచుకోవాలి. అనంతరం ఒకవైపు క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ప్రతి పనీర్‌ ముక్కకు ఆనించి, పైన చీజ్‌ తురుము జల్లుకోవాలి. ఇప్పుడు వాటిని బేకింగ్‌ ట్రేలో పెట్టుకుని, ఓవెన్‌లో బేక్‌ చేసుకుంటే సరిపోతుంది.

    స్పెషల్‌ గువావా
    కావలసినవి: జామకాయ – ఒకటి (పెద్దది)
    చాట్‌ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా – కొద్దికొద్దిగా, పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
    చిక్కటి పాలు – కొద్దిగా (కాచి చల్లార్చినవి)
    తయారీ: ముందుగా పెద్ద జామకాయను ఇరువైపులా కాస్త కట్‌ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి గుంత తీసి, జామకాయను గిన్నెలా తయారు చేసుకోవాలి. ఆ మధ్యలో తీసిన జామకాయ ముక్కల్లో పంచదార, గరంమసాలా వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకుని, పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు గిన్నెలా మార్చుకున్న జామకాయలో కారం, ఉప్పు జల్లి, ఆ గుంతలో ఈ జామ–పంచదార మిశ్రమాన్ని వేసుకుని నింపుకోవాలి. అనంతరం పైన చాట్‌ మసాలా జల్లుకుని సర్వ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పండ్లు ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 

  • చీర కట్టుకుంటే క్లాసిక్‌ క్వీన్‌ , గౌన్‌  వేసుకుంటే గ్లామర్‌ గర్ల్, కేజువల్‌ వేర్‌లో వెళ్తే చీర్‌ఫుల్‌ చిక్‌! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్‌!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్‌ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి 
    ఉన్న ఫ్యాషన్‌  రహస్యాలు, ఫిట్‌నెస్‌ మంత్రాలు మీ కోసం... 

    ఫిట్‌నెస్‌ విషయంలో నేను చాలా కాన్షియస్‌! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్‌ ఫ్రైడ్‌ ఐటమ్స్‌ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్‌ విషయానికి వస్తే, ప్రతి ఔట్‌ఫిట్‌లో చిన్న చిన్న డీటెయిల్స్‌ ఉండాలి, అప్పుడు లుక్‌ కంప్లీట్‌ ఫీల్‌ వస్తుంది.

    సంయుక్తా ముత్యాల వడ్డాణం!
    ‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్‌  ర్యాంప్‌ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్‌ ఫేవరెట్‌! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. డార్క్‌ కలర్‌ శారీస్‌పై ఇది పర్‌ఫెక్ట్‌ చాయిస్‌! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్‌ కలిపిన కాంబినేషన్‌ . పర్ల్‌ వర్క్‌ బ్లౌజ్‌ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. 

    అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్‌ స్టయిల్‌ లోబన్‌ లేదా ఆప్‌డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్‌ కలర్స్‌తో పెయిరప్‌ చేస్తే లుక్‌ మరింత హైలైట్‌ అవుతుంది. ఇయర్‌ రింగ్స్‌ హూప్‌ లేదా స్టేట్‌మెంట్‌ పీస్‌ ఉంటే మోడర్న్‌ వైబ్‌ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్‌ లిప్‌ కలర్‌ వంటి మినిమల్‌ మేకప్‌తో క్లాసీ లుక్‌ క్రియేట్‌ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్‌ ధరించే చీర..బ్రాండ్‌: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్‌: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.  

    (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?)

  • కిషోర్‌ మంచం మీద ఫోన్‌లో స్క్రోల్‌ చేస్తున్నాడు. ఆనంది తనతో మాట్లాడాలనుకుంటుంది, అతను ‘ఒక్క నిమిషం’ అన్నాడు. ఆ ‘ఒక్క నిమిషం’తో రాత్రంతా గడిచిపోతుంది. ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో కనిపించే సైలెంట్‌ డ్రామా. ఇప్పుడు కాపురాలు విడిపోవడంలేదు. కాని, విడిపోయిన రెండు మనసులు ఒకే ఇంట్లో రెండు స్క్రీన్‌ల మధ్య బతుకుతున్నాయి.

    కొత్త మూడో వ్యక్తి...
    ఒకప్పుడు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అంటే అనుమానం. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి పేరు ‘స్మార్ట్‌ఫోన్‌.’ పనికోసం, కాంటాక్ట్‌ కోసం, వినోదం కోసం ఇంట్లోకి ప్రవేశించిన స్మార్ట్‌ ఫోన్‌ మెల్లగా మనుషుల మధ్యకు చేరి మనసుల్ని వేరు చేసింది.

    ఇప్పుడు జంటలు రోజుకు సగటున మూడుగంటలకు పైగా ఫోన్‌లో గడుపుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కనీసం 30 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో దంపతుల మధ్య ‘దూరం’ శారీరకంగా ఉండేది. ఇప్పుడు ఆ దూరం ‘డిజిటల్‌’గా మారింది. మనుషుల మధ్య ‘మొబైల్‌ సిగ్నల్‌’ ఉన్నా, ‘మానసిక సిగ్నల్‌’ ఉండటం లేదు. 

    ఎమోజీలు ఎక్కువ... ఎమోషన్లు తక్కువ...ఒకప్పుడు భోజనాల వద్ద మాట్లాడుకునేవారు. ఇప్పుడు భోజనం ముందు ఫొటో తీస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్‌ స్క్రీన్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటి దంపతులు ఎక్కువగా ‘టెక్ట్స్‌’ చేస్తారు, కాని తక్కువగా ‘టచ్‌’ చేస్తారు. మెసేజ్‌లు ఎక్కువ, మాటలు తక్కువ. ఎమోజీలు ఎక్కువ, ఎమోషన్లు తక్కువ. దీనివల్ల భావోద్వేగ దూరం పెరుగుతోంది. 

    దగ్గరున్నా దూరమే... 
    ప్రేమంటే ఒకరితో ఒకరుండటం. కాని, ఇప్పుడు జంటలు ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ ఆబ్సెంట్‌. ‘‘నువ్వు నాతో ఉన్నావు కాని, నీ మనసు ఫోన్‌లో ఉంది’’ అని భార్య అంటోంది. ఇదేమీ జోక్‌ కాదు. ఎమోషనల్‌ నెగ్లిజెన్స్‌ అనే సైలెంట్‌ సమస్య. మనం ఒకరిని ప్రేమిస్తున్నా, ఫోన్‌ నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆ ప్రేమను ‘పాజ్‌’ చేస్తున్నాము. ఒక సర్వే ప్రకారం, రాత్రిళ్లు ఫోన్‌ వాడటం వల్ల మాట్లాడుకోవడం తగ్గిందని 65శాతం జంటలు చెప్పారు. దీనివల్ల చాలా జంటల మధ్య ఎమోషనల్‌ డిస్కనెక్షన్, అటెన్షన్‌ డెఫిషిట్, జెలసీ, నిద్ర సమస్యలు, ఇంటిమసీ తగ్గిపోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తున్నాయి. 

    సోషల్‌ మీడియా ప్రేమలు...
    ప్రేమకు ప్రైవసీ అవసరం. కాని, ఇప్పుడంతా పబ్లిసిటీగా మారింది. ఇంట్లో ఎలా ఉన్నా, ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలున్నా, సోషల్‌ మీడియాలో ‘హ్యాపీ కపుల్‌’ పోస్టులు పెడుతుంటారు. ఇదో కొత్తరకం మానసిక మాయ. 

    సోషల్‌ మీడియాలో ఇతరుల జీవితం చూసి మన జీవితం తక్కువగా అనిపించడం ‘కంపేరిజన్‌ బర్నవుట్‌’ను పెంచుతుంది. అది ఈర్ష్య, కోపం లేదా విరక్తిగా బయటపడుతుంది. కాపురంలో ప్రేమ చనిపోదు, దాన్ని చంపేది మౌనం. మాటలు తగ్గిన చోట ఊహలు పెరుగుతాయి. ఆ ఊహల వెనుక అభద్రత ఉంటుంది. సైకలాజికల్‌గా చెప్పాలంటే, జంటలు రోజూ కనీసం 20 నిమిషాలు మనసువిప్పి మాట్లాడుకోకపోతే ఎమోషనల్‌ డ్రైనెస్‌ పెరుగుతుంది.

    జంటలేం చేయాలి?

    రాత్రి భోజనం తర్వాత ఫోన్‌ పక్కన పెట్టేయండి. కనీసం గంటైనా ఫోన్‌ పూర్తిగా దూరంగా ఉంచండి.

    నిద్రకు ముందు కనీసం పది నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఫోన్‌లో స్క్రోల్‌ చేయడం కాదు, హృదయాన్ని స్క్రోల్‌ చేయండి.

    సోషల్‌ మీడియాలో ఒక వారం ‘ఫొటోలెస్‌ చాలెంజ్‌’ పెట్టండి. జంటగా గడిపిన సమయాన్ని మీరు మాత్రమే అనుభవించండి.

    రోజుకు కనీసం ఐదు నిమిషాలు కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. స్క్రీన్‌ కన్నా కళ్లు చూడటం ఇంటిమసీని తిరిగి తెస్తుంది.

    ఫోన్‌ రహస్యాలు పెరగడమంటే దూరం పెరగడం. స్మార్ట్‌ఫోన్‌లను కాకుండా, మనసులను ట్రాన్స్‌పరెంట్‌ చేయండి.

    ఫబ్బింగ్‌ సిండ్రోమ్‌... 
    మనిషి మెదడు అనుబంధం కోరుకుంటుంది. మనం ‘చూస్తూ మాట్లాడే’ జీవులం. కాని, ఇప్పుడు మన కళ్ళు స్క్రీన్‌కు, మనసు నోటిఫికేషన్లకు అతుక్కుపోయింది. యూనివర్సిటీ ఆఫ్‌ ఎసెక్స్‌ పరిశోధన ప్రకారం ఫోన్‌ టేబుల్‌పై పెట్టినా కూడా జంటల మధ్య మాటల్లో భావోద్వేగ గాఢత 30 శాతం తగ్గిపోతుంది. 

    దీన్నే ‘ఫబ్బింగ్‌ సిండ్రోమ్‌’ అని పిలుస్తారు. అంటే భాగస్వామిని పట్టించుకోకుండా ఫోన్‌ను ఎక్కువగా పట్టించుకోవడం. ఈ స్థితిలో ఉన్నామని చాలామందికి తెలియదు కాని, దీనివల్ల జంటల మధ్య ఆప్యాయత, నమ్మకం, సహానుభూతి తగ్గిపోతున్నాయి.
    సైకాలజిస్ట్‌ విశేష్‌ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌  

    (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?)

  • నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్‌ స్కాన్‌ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?
    – సుశీల, రాజమండ్రి. 

    మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్‌  గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్‌ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్‌ సమస్యలు. 

    కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. 

    డాక్టర్‌ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్‌ తరచుగా గ్రోత్‌ స్కాన్‌లు సూచిస్తారు. ఈ స్కాన్‌లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్‌ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. 

    డాప్లర్‌ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్‌ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్‌ చేయించుకోవాలి. ప్రోటీన్‌  లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్‌ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. 

    అల్ట్రాసౌండ్‌ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్‌లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్‌  చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. 

    ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్‌లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్‌ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్‌ గ్రోత్‌ రెస్ట్రిక్షన్‌  తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. 
    డాక్టర్‌ కడియాల రమ్య, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌హైదరాబాద్‌ 

    (చదవండి: ‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌, గోళ్ల ఆరోగ్యం కోసం!)
     

  • నిజానికి గోళ్లలో చేరే ఫంగస్‌ను గోరంత సమస్య అనుకుంటే పొరబాటే! అందం, ఆరోగ్యం ఇలా రెండింటిపైనా ప్రభావం చూపించే ఈ సమస్య పూర్తిగా తగ్గాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు! పైనంతా పుచ్చిపోయి, లోపలికంటా పుండుపడిపోయి, ఇబ్బందిగా మారిన గోళ్లు తిరిగి మునుపటి రూపంలోకి రావాలంటే, ఈ అధునాతన పరికరం ఇంట్లో ఉండాల్సిందే!

    ‘ఫంగబీమ్‌’ అనే ఈ డివైస్‌ తక్కువ–స్థాయి లేజర్‌ థెరపీని అందిస్తుంది. డ్యూయల్‌–వేవ్‌లెంగ్త్‌ లేజర్‌ టెక్నాలజీని ఉపయోగించడం ఈ గాడ్జెట్‌ ప్రత్యేకత. దీనిలో 905 నానోమీటర్ల ఇన్‌ఫ్రారెడ్‌ లైట్, 470 నానోమీటర్ల బ్లూ లైట్‌– ఇలా రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటిది గోరు అడుగు భాగానికి లోతుగా చొచ్చుకుపోయి, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ మూలాన్ని లక్ష్యంగా చేసుకునేలా పని చేస్తుంది. రెండవది ఉపరితల స్థాయిలో పరిశుభ్రతను పెంచడానికి, గోరు రూపాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రెండు లైట్‌ థెరపీలు– ఎటువంటి మందులు, రసాయనాలు లేకుండా, నొప్పిలేకుండా ఫంగస్‌ నిర్మూలనకు సహాయపడతాయి.

    ఈ పరికరం ప్రధానంగా వినియోగదారులకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌గా పని చేస్తుంది, ఎలాంటి సెట్టింగులు అవసరం లేదు. ఒక్కో గోరుకు కేవలం 7 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ట్రీట్‌మెంట్‌లో ఎటువంటి నొప్పి ఉండదు. దీనితో ఇంట్లో లేదా ప్రయాణంలో ఈజీగా చికిత్స చేసుకోవచ్చు. ఈ డివైస్‌ క్రమం తప్పకుండా వాడటం వలన గోరు రంగు చక్కగా మారుతుంది. గోరు మందం పెరిగి, ఆరోగ్యంగా కనబడుతుంది. ఈజీ చికిత్సను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

    ‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌!
    సాధారణంగా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గాలంటే ఎగ్‌ వైట్స్‌ వాడమంటున్నారు నిపుణులు. ఓ కప్పులోకి ఎగ్‌ వైట్‌ తీసుకుని బాగా మిక్స్‌ చేయాలి. దానిలో కలబంద గుజ్జు కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించుకోవాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. 

    ఎగ్‌ వైట్స్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. మృదువుగా మచ్చలు లేకుండా చేస్తుంది. అయితే 20 నిమిషాల పాటు ఉంచుకున్న తరవాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 

    (చదవండి: అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..! మన ఇండియాలో మాత్రం కాదు..)

  • ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అనగానే భారత్‌లోనే ఎక్కడ అని ఆత్రుతగా వెతక్కండి. ఎందుకంటే..అతి పెద్ద ఆలయం మన ఇండియాలో లేదు కంబోడియాలో ఉంది. చుట్టూ కందకంతో చుట్టుబడి అద్భుతానికి ప్రతిరూపంలా అలారారుతోంది ఆ ఆలయం. అది హిందూ దేవాలయమేనా కాదా అనేది చరిత్రకే తెలియని ఓ మిస్టరీ. ఇప్పటికీ ఈ దేవాలయం చర్చనీయాంశంగా ఉంటుందట. ఎందుకంటే ఇందులో అడగడుగున కనిపించే అద్భుతమైన కళా సంపద, ఆ గోడలపై కనిపించే రాతి కళా నైపుణ్యం మనల్ని కట్టిపడేయడమే కాదు..ఎన్నో అనుమానాలు, సందేహాలను రేకెత్తిస్తుంటదట. మరి అలాంటి ఆలయం ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.

    యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు దక్కించుక్ను కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం దాదాపు 400 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కంబోడియాలోని ఒక అందమైన, కందకంతో చుట్టుముట్టిన  అంగ్కోర్ వాట్ దేవాలయం అతి పెద్ద ఆలయంగా ఖ్యాతీ దక్కించుకుంది. 

    ప్రతి ఏడాది వేలాదిగా ప్రయాణికులను మంత్రముగ్ధులన్ని చేసే ఈ గుడి గొప్ప సంక్లిష్టంగా చెక్కిన ఆలయ సముదాయం. నిజానికి ఈ దేవాలయం దానికదే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది అందులోకి అడుగుపెట్టగానే. దీన్ని 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ II విష్ణువు దేవుని కోసం నిర్మించిన స్మారక చిహ్నంగా చెబుతుంటారు. పశ్చిమాన ఉన్న అరుదైన ఆగ్నేయాసియా దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది.  అంతేగాదు అంగ్కోర్ పురావస్తు ఉద్యానవనానికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది.  

    అది హిందూ దేవాలయమా?
    నివేదికల ప్రకారం, అంగ్కోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత ఆయమే గానీ హిందూ దేవాలయమేనే అనేది నేటికి మిస్టరీనే. ఎందుకంటే దాని సంక్లిష్ట చరిత్ర కారణంగా దీనిని కొన్నిసార్లు హిందూ-బౌద్ధ దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదట హిందూ దేవాలయంగా నిర్మించిన అంగ్కోర్ వాట్ శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. 

    సియామ్ రీప్‌లోని అంగ్కోర్ ఖైమర్ రాజ్యానికి కేంద్రంగా ఉండేది. పైగా ఇది అనేక స్మారక చిహ్నాలు, పట్టణ ప్రణాళికలు,  పెద్ద నీటి జలాశయాలను కలిగి ఉంది. అంగ్కోర్ లోపల, అంగ్కోర్ వాట్, బయోన్, ప్రీహ్ ఖాన్, టా ప్రోహ్మ్ వంటి దేవాలయాలు గొప్ప కళా సంపదకు నిలయంగా ఉన్నాయి.

    అయితే  ఈ ప్రాంతంలో హిందూ మతం క్రమంగా తగ్గుముఖం పట్టి బౌద్ధమతం అభివృద్ధి చెందడంతో, ఆలయం కూడా క్షీణించకుండా  దినదినాభివృద్ధి చెందింది. పైగా ఈ ఆలయానికే బౌద్ధ మందిరాలు కూడా జోడించారు. దాంతో చాలామంది సన్యాసులు ఇక్కడికి తరలివచ్చేవారు. అంగ్కోర్ సామ్రాజ్యంలోని ఇతర నిర్మాణాలను అడవి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఈ ఆలయం చాలా కాలం పాటు సజీవంగా, ప్రార్థనా మందిరంగా ఉంది.

    వందలాది విభిన్న దేవాలయాలు, స్మారక చిహ్నాలకు నిలయంగా ఉన్న అంగ్కోర్ వాట్ ఆలయ సముదాయం గుండా నడవడం, రాతితో చెక్కిన పురాతన ఇతిహాసం గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అర కిలోమీటరుకు పైగా విస్తరించి ఉన్న బాస్-రిలీఫ్ గ్యాలరీలు రామాయణం, మహాభారతం, ఖగోళ యుద్ధాలు, ప్రసిద్ధ క్షీర మహాసముద్ర మథనం వంటి దృశ్యాలను వర్ణిస్తాయి. అంగ్కోర్ వాట్ మూడు స్తంభాలు ఖైమర్ వాస్తుశిల్పానికి విలక్షణమైనది. పైగా హిందూ మతంలోని దేవతల నివాసమైన మౌంట్ మేరు సాంప్రదాయ ఆలయ శిఖరాన్ని(పర్వతాన్ని) సూచిస్తాయి. ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్నట్లు కనిపించినా..దగ్గర నుంచి చేస్తే ఇప్పటికీ ఈ కట్టడం ఎలా మనగలిగింది అనే సందేహం మెదులుతుంటుంది.

    (చదవండి: రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌! అసలేంటి గేమ్‌..)
     

  • వయసు కేవలం నెంబరే అని, అది మా మనసుకు కాదని ప్రూవ్‌ చేసి శెభాష్‌ అనిపించుకుంటున్నారు చాలామంది వృద్దులు. నచ్చిన వ్యాపకం, క్రీడలతో తమ ఆనందాన్ని, అభిరుచిని వెతుక్కోవడమే కాదు. అందులో సత్తాచాటి టైటిల్స్‌ గెలుచుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందినవారే రిటైర్డ్ IAS అధికారి మోహన్‌ వర్గీస్‌  చుంకత్.  ఇంతకీ అసలేంటి గేమ్‌..? ఎలా ఆడతారంటే..

    ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వర్డ్ బోర్డ్ గేమ్ స్క్రాబుల్‌లో IAS అధికారి మోహన్‌ వర్గీస్‌ చుంకత్ సత్తా చాటుతున్నారు.  తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శ మోహన్‌ వర్గీస్‌ స్క్రాబుల్‌ ఆటలో భారతదేశంలోని ఏడుగురు మాస్టర్‌లలో ఒకరు. కొన్నిరోజుల  క్రితం స్క్రాబుల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SAI) యునైటెడ్ కింగ్‌డమ్ అచ్చం చెస్‌ల మాదిరిగానే ఆటగాళ్ల​ నైపుణ్యాన్ని గుర్తించే స్కాబుల్‌ టైల్‌ వ్యవస్థను ప్రాంరభించినట్లు తెలిపింది. ఇంగ్లీష్‌ భాషపై ఉన్న ఆసక్టి, సామర్థ్యంతో గత మూడు దశాబ్దాలుగా పోటీపడుతున్నాడు ఈ స్క్రాబుల్‌ ఆటలో. జనవరి 2015 మరియు డిసెంబర్ 2022 మధ్య రెండేళ్లలో అతని ప్రదర్శన ఆధారంగా జాతీయ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. 

    తనకు ఇంగ్లీష్‌ భాష మక్కువతో తరుచుగా డిక్షనరీ చదువుతూ ఉంటాననే అదే ఈ ఆటలో గెలుపుని సొంతం చేసకోవడానికి కారణమవుతోందని అన్నారు. చెన్నై నివాసి అయిన మోహన్‌ వర్గీస్‌ 1999లో మెల్‌బోర్న్‌తో ప్రారంభించి, రాష్ట్ర ఐఏఎస్‌ హోదాలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 90లలో చదువుకు విరామం తీసుకున్నప్పుడు అమెరికాలోని ఒక క్లబ్‌లో ఆడిన తర్వాత భారతదేశంలో తన అవకాశాన్ని ఎలా అన్వేషించాడో అతను గుర్తుచేసుకున్నాడు. 

    తన కెరీర్‌ కారణంగా వృత్తిపరమై బాధ్యతల నడుమ ఎలా ఈ ఆటక తక్కువ సమయమే కేటాయించాల్సి చ్చేదో కూడా చెప్పారు. అయితే పదవీ విరణ తర్వాత ఆ ఆటను ఉత్సాహంగా ఎంచుకుని పద జాబితాలు, పద అర్థాలపై ప్రాక్టీస్‌ చేస్తూ..ఆ ఆటకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయయాడు. స్కాబుల్‌కి ఈ వ్యూహం చాలా ముఖ్యమైనది. మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవడానికే ఈ గేమ్‌ని ఎంచుకున్నట్లు తెలిపారు. తాను వారానికి రెండుసార్లు ఆడతానని చెప్పారు. ప్రతిసెషన్‌ రెండు నుంచి మూడూ లేదా నాలుగు గంటలు ఉంటుందని చెప్పారు. ఆయన క్రాస్‌వర్డ్‌ ప్రేమికుడు. 

    ఈ ఆటకు చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై వంటి నగరాల్లోనే మంచి ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం భారతదేశంలో ఇది కూడా వృత్తిపరమైన క్రీడగా మారనుంది. ప్రధాన టోర్నమెంట్‌లలో 500-600 మంది పాల్గొంటారని, కానీ స్క్రాబుల్‌ను భారత ప్రభుత్వం ఇంకా క్రీడగా గుర్తించలేదని చుంకత్ చెప్పారు. ఇక్కడ ఇది యాజమాన్య బోర్డు గేమ్ . ఈ ఆటకు కూడా జెండర్‌, వయసు నిబంధన, ప్రవేశ రుసుము తదితరాలు ఉంటాయి. 

    ప్రతి ప్రధాన టోర్నమెంట్‌లో గత ప్రదర్శనల ఆధారంగా, ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆటగాళ్లను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. అందుబాటులో ఉన్న వసనరులతోనే ఈ ఆటలో విజయాన్ని సంపాదించుకోవచ్చని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆటలో ఆటగాళ్ళు అక్షరాల టైల్స్ ఎంచుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఎన్ని అచ్చులు, హల్లులు మిగిలి ఉన్నాయో మానసికంగా లెక్కించాలి,  ఆ తర్వాత హై-పాయింటర్ టైల్స్ (J,Q,X,Z) నుఎ లా ఉత్తమంగా ఉపయోగించాలో అంచనా వేస్తూ ఆడాల్సి ఉంటుందని అన్నారు.

    స్క్రాబుల్ అంటే ఏమిటి?
    ఇదొక క్రాస్‌ వర్డ్‌ గేమ్‌ లాంటిది. 
    ఒక్కొక్క అక్షరం ఉన్న టైల్స్ ఉపయోగించి ఆడే వర్డ్ బిల్డింగ్ బోర్డ్ గేమ్. ఆటగాళ్ళు 15x15 బోర్డుపై పదాలను రూపొందించాలి, పాయింట్లు స్కోర్ చేయాలి ప్రతి మలుపు తర్వాత టైల్స్ గీయాలి.

    (చదవండి: 
     

  • భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది.  ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన  పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. 

    గాడ్ టాక్స్ విత్ అర్జున: 
    ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు. 

    భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు. “కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.” 

    దీని అర్థం ఏమిటంటే: 
    అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:

    “ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.” జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. 

    ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం. 3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు. “సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”

    సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:

    “నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”
    బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ  కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. 

    ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను భారతదేశంలోను స్థాపించారు. ఆయన విశిష్ట గ్రంథం, ఒక యోగి ఆత్మకథ (autobiography of a yogi), లక్షలాది మందికి యోగమును, ధ్యానాన్ని— ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను,—  దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.

    నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా— కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను — పనిచేయడం, కానీ ఫలితాల కోసం  ప్రాకులాడకుండా ఉండటం. యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది—వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.

    (చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!)

  • అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్లేది. అక్కడ ఆడవారు ధరించే నగలు, చూసి తాను కూడా ఒంటినిండా నగలు ధరించి తిరగాలనుకునేది.ఒక రోజు కోతి అడవికి దగ్గర్లో ఉన్న రామాపురం గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాకుమారి ఆమె మిత్రబృందం రావటం గమనించింది. రాకుమారి తన ఒంటిమీది వజ్రాల హారం  చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది.రాకుమారి›స్నానం చేస్తుండగా, కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. 

    అది గమనించిన రాకుమారి, ఆమె మిత్రబృందం ‘పట్టుకోండి పట్టుకోండి!!! కోతి వజ్రాలహారం పట్టుకుని పరిగెడుతోంది!’ అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజ భటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరుగెత్తి, పరుగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడే చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస, పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ‘ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది– నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోటానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు’ అనుకుంది. 

    వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది.అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడటంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి, వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాలహారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి.

    పల్లా శైలజ
     

Karimnagar

  • సర్పం
    పంచాయతీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా హవా
    నామినేషన్‌ అయితే వేద్దాం..

    జగిత్యాలజోన్‌: ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో దాదాపు 3,000 మంది న్యాయవాదులు ఉంటారు. ఎప్పుడు కోర్టుల్లో నల్లకోటు వేసుకుని, నాలుగు గోడల మధ్య ఉండే న్యాయవాదులు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. దాదాపు 90 శాతం న్యాయవాదులు గ్రామాల నుంచి వచ్చి ఆయా కోర్టుల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నవారే. ప్రజలతో ఉన్న సంబంధాలతో పాటు రిజర్వేషన్లు కూడా అనుకూలించడంతో పోటీకి సై అంటున్నారు. వివిధ కోర్టుల నుంచి ఐదారుగురు న్యాయవాదులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల జిల్లాలో పోటీ చేసే న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది న్యాయవాదులు సర్పంచ్‌లుగా గెలుపొందగా, ఇప్పుడు వారిని చూసి మరికొందరు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాల్లో పెద్దగా చదువుకున్న వారు లేకపోవడం, ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడేవారు కరువవడంతో న్యాయవాదులుగా ఉన్నవారిని పోటీ చేయాలని కులసంఘాలే డిమాండ్‌ చేస్తూ గ్రామాలకు పిలుస్తున్నాయి.

    జగిత్యాలజోన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్‌ మీడియా ప్రచారాన్ని విస్త్రృతంగా వాడుకుంటున్నారు. వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి రావడంతో తమకు ఉన్న పరిజ్ఞానంతో ఫొటోలు, వీడియోలతో ఎన్నికల పాటలు చిత్రీకరించి, ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ పాటలన్నీ కూడా యువతను ఉత్తేజపరిచేలా, మహిళలను గౌరవించే విధంగా, గ్రామాభివృద్ధికి పాటు పడేలా, పోటీ చేస్తున్న నాయకుడిని పొగిడేలా.. ఇప్పటికే ట్రెండ్‌లో ఉన్న రాజకీయ, సినిమా, జానపద పాటలను వాడుకుంటున్నారు. ఇందుకోసం, గ్రామంలో కులాల వారీగా, యువజన సంఘల వారీగా, మహిళల గ్రూపుల వారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పోస్ట్‌ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. తాము గెలిస్తే గ్రామాభివృద్ధికి చేయబోయే పనులను కూడా ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఇది చాలదన్నట్టూ తమ బంధువులు, అనుయాయుల సెల్‌ఫోన్లలో స్టేటస్‌లుగాను, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ర్ట్రాగామ్‌ల్లో సైతం పోస్టులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఫొటోలతో డిజైన్‌ చేయించి, గ్రూపుల్లో పెడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వాయిస్‌ మేసేజ్‌లను కూడా జత చేస్తున్నారు.

    రాయికల్‌(జగిత్యాల): సర్పంచ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో కొంత మంది ఎలాగైనా బరిలో ఉండాలని ఉద్దేశంతో ముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, మరికొంత మంది తూతూమంత్రంగా నామినేషన్లు వేసి నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఆలోచిద్దామని వారి నుంచి ఎంతో కొంత తీసుకోవచ్చనే ఆలోచనతో నజరానాకు ఆశపడి నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో బరిలో నిలిచే సర్పంచ్‌ అభ్యర్థులు ఎలాగైనా పోటీ ఉండొద్దనే ఉద్దేశంతో నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా నజరానాలు ప్రకటిస్తున్నారు. కొంత మంది డమ్మీగా నామినేషన్‌ వేసిన అభ్యర్థులను పట్టించుకోకపోవడంతో ఏకంగా డమ్మీ అభ్యర్థులే సర్పంచ్‌ అభ్యర్థులకు దగ్గరగా ఉండే వారితో స్నేహం చేస్తూ ఎంతో కొంత నజరానా ఇస్తే తాము కూడా తప్పుకుంటామంటూ సంప్రదింపులు చేసుకుంటున్నారు. ఏదేమైనా గ్రామాల్లో అసలు అభ్యర్థులకంటే సర్పంచ్‌గా నామినేషన్లు వేసిన కొసరు అభ్యర్థులతోనే పెద్ద తలనొప్పిగా మారింది.

    యువ ఓటర్లకు గాలం

    జగిత్యాలరూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంలో ఒకటి, రెండు ఓట్లు సైతం కీలకంగా మారుతాయి. గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం కూడా అధికంగా పెరుగుతుంది. దీంతో పోటీచేసే అభ్యర్థులంతా ఇటీవల ఓటు హక్కు వచ్చి హైదరాబాద్‌, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న యువ ఓటర్లను ఫోన్లలో సంప్రదిస్తున్నారు. వారి ఖర్చుల నిమిత్తం ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తూ యువ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల రోజు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసేందుకు పోటీదారులు కార్లు, బస్సులు కూడా ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

    పనుల వేళ.. ఎన్నికల గోల

    మానకొండూర్‌: పంచాయతీ ఎన్నికలంటేనే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు వ్యవసాయ పనులు జోరుగా ఉన్న సమయంలోనే రావడంతో పోటీ చేసే ఆశావహులు ప రుగులు తీస్తున్నారు. ఇటు వ్యవసాయ పనులు, అటు ఎన్నికలతో తలమునకలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలవారికి 90 శాతం జీవనాధారం వ్యవసాయ పనులపైనే. కూలీ పనులు చేసుకునే వారికి ఈ సమయమే ఎంతో కీలకం. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రబీ సాగు మొదలైంది. రైతులు వరినార్లు పోస్తున్నారు. ఓ వైపు సాగు పనులు జోరందుకోగా, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో ఆశావహులు ఆగమాగం అవుతున్నారు. బ్యాంకు అకౌంట్‌, ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఫ్లెక్సీ, బ్యానర్లు, కరపత్రాలు, ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. కాగా, ఎన్నికల కారణంగా సాగుపనులు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదని రైతులు భావిస్తున్నారు.

  • సర్పంచ్‌ బరిలో విద్యావంతుడు

    కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం సర్పంచ్‌ స్థానంలో పోటీ చేసేందుకు విద్యావంతుడు, న్యాయ వాది మార తేజ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. తేజ తండ్రి బమార కిశోర్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయవాది. తేజ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. తండ్రి మార కిశోర్‌ మాజీ ఎంపిటిసిగా కూనారంలో సేవ లు అందించారు. తేజ వయసు 26 ఏళ్లు. చిన్నవయసులో సర్పంచ్‌ స్థానాని కి నామినేషన్‌ వేసిన వ్యక్తిగా గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు పేర్కొన్నారు.

  • ఇదీ ప

    సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అని పాలకులు పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు పల్లెల్లోనే ఎన్నికల సందడి మొదలైంది. అసలు గ్రామపంచాయతీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది.. ఆ చరిత్ర ఏమిటో..? ఇప్పటి తరానికి తెలియదు. పల్లెల్లో పాలన ఆరు దశాబ్దాల కిందటే మొదలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్థానిక పాలన ఉండాలని భావించిన అప్పటి పాలకులు పంచాయతీరాజ్‌ సంస్థల ఏర్పాటుకు 1957లో భారత ప్రభుత్వం బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మూడు అంచెల స్థానిక సంస్థల వ్యవస్థ ఉండాలని భావించింది. ఈమేరకు గ్రామపంచాయతీ, పంచాయతీ సమితి(తాలూకా), జిల్లా పరిషత్‌ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని బల్వంతరాయ్‌ కమిటీ సిపార్సు చేసింది. ఈమేరకు జాతీయ అభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్‌ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. ఈ చట్టాన్ని తొలిసారి రాజస్థాన్‌ అమలు చేసింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1959 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అమలు చేశారు. అప్పటి నుంచి అనేక మార్పులతో పంచాయతీరాజ్‌ చట్టం రూపాంతరం చెందింది.

    పరోక్ష పద్ధతిలో ఎన్నిక

    ఆంధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామపంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500లకు పైగా జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీలో ఐదు నుంచి 17 వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని నిర్ధేశించారు. 1964లో జరిగిన ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఎన్నికల్లో వార్డు సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటే.. ఎన్నికై న వార్డు సభ్యుల్లో ఒక్కరిని మెజార్టీ సభ్యుల ఆమోదంతో సర్పంచ్‌గా ఎన్నుకునేవారు. ఇలా ఎన్నికై న గ్రామ సర్పంచ్‌లు అందరూ కలిసి సమితి ప్రెసిడెంట్‌ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష విధానం ఉండేది. 1976 వరకు అంటే 12 ఏళ్ల పాటు ఇదే విధానం కొనసాగింది.

    ప్రత్యక్ష పద్ధతికి 1978లో శ్రీకారం

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. గ్రామసర్పంచ్‌ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై అధ్యయనం చేసింది. నరసింహం కమిటీ ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిపార్సు చేయడంతో అప్పటి నుంచి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి.

    మండల వ్యవస్థతో సమూల మార్పులు

    రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి సీఎం ఎన్టీఆర్‌ తాలూకాలను రద్దు చేశారు. 1987లో మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఎన్నికలు నిర్వహించారు. మండల పరిషత్‌ అధ్యక్షుడిని నేరుగా ఓటర్లు ఓట్లు వేసి ఎన్నుకునే విధానాన్ని అమలు చేశారు. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్‌ల్లో ఒక్కరిని మెజారీ సభ్యుల ఆమోదంతో ఎన్నుకునే విధానం అమలు చేశారు. ఎంపీపీలుగా ఎన్నికై న వారు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకునేవారు.

    1994లో ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం అమలు

    ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం–1994 ద్వారా అదే ఏడాది నుంచి గ్రామాల్లో గ్రామపంచాయతీ సర్పంచ్‌లతోపాటు మండల పరిషత్‌ సభ్యులు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌(జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికలు తెరపైకి వచ్చాయి. ఎంపీటీసీ సభ్యులు మెజార్టీ ఆమోదంతో ఎంపీపీల ఎన్నిక, జెడ్పీటీసీ సభ్యుల మెజార్టీ ఆమోదంతో జెడ్పీ చైర్మన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. 2018లో పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్‌ వర్కర్లను నియమించడం, ప్రతీ ఊరిలోనూ వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటు వంటి సమూలమైన మార్పులకు 2018 చట్టం శ్రీకారం చుట్టింది. గ్రామపంచాయతీలకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారమే ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

    ఆరు దశాబ్దాల గ్రామ‘పంచాయతీ’

    తొలిసారి 1964లో ఎన్నికలు

    పంచాయతీరాజ్‌ చట్టాల రూపకల్పన

  • కులపోళ్ల ఓట్లే కీలకం

    కరీంనగర్‌టౌన్‌: పల్లె సంగ్రామంలో భాగంగా శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఆదివారం రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌, నామినేషన్ల దాఖలు పర్వం షూరు కానుంది. ఈనేపథ్యంలో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పల్లెల్లో తమకు మద్దతు ఇవ్వాలని పగలు ప్రచారం చేస్తూనే..రాత్రి మంతనాలలో ముగినితేలుతున్నారు. గెలుపే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజిక వర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు.

    ఎత్తుకు పై ఎత్తులు

    గ్రామాల్లో వార్డుల వారీగా మొత్తం ఓట్లలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపోటములను నిర్ధారించే పోలింగ్‌ బూత్‌లపై దృష్టి సారిస్తూ, ప్రత్యేకంగా ఒక టీమ్‌ తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. గెలుపుబాటలో పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు ముమ్మరం చేశారు. ఆయా కుల సంఘాల్లో జిల్లా స్థాయి పదువుల్లో ఉన్నవారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

    కులపెద్దలతో మంతనాలు

    ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని ఆప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెనువెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు భిన్న రూపం దాల్చడంతో ఎన్నికల సమయంలోనే సమస్యల పరిష్కారానికి పునాది రాయి పడాలనే ముందుచూపుతో అన్ని సామాజిక వర్గాలు వ్యవహరిస్తున్నాయి.

    రెండు వైపులా వారే..

    పోటీలో ఉండే అభ్యర్థులకు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదయం ఓ అభ్యర్థికి మద్దతుగా కనిపిస్తున్న వ్య క్తులు చీకటి కాగానే మరో అభ్యర్థికి మద్దతుగా వాడలలో కలియతిరుగుతున్నారు. తమ కే ఓట్లు వేయిస్తామని నమ్మబలుకుతున్నారు. మందు, విందు పార్టీల్లో మునిగి తేలుతున్నారు. ఒక్కరుగా కాకుండా కొంత మందిని పోగేసుకుని వెళ్తున్నారు. వీరిని బుజ్జగించడానికి ఆశావహులు తంటాలు పడుతున్నారు. దీంతో పంచాయతీ సమరం రాను రాను రసకందాయంగా మారనుంది.

    పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు

    వీటిపై అన్ని పార్టీల దృష్టి

    గంపగుత్తగా వేసుకునేందుకు ప్రణాళికలు

    సామాజికవర్గాల వారీగా మంతనాలు

    కుల పెద్దలను సంప్రదిస్తున్న నేతలు

    ఓటర్లను ఆకర్షించేందుకు ముందస్తు హామీలు.. నజరానా

  • చికిత

    జమ్మికుంట: ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మున్సిపల్‌ పరిధిలోని కేశవపూర్‌ చెందిన పాతకాల విజయరాణి(35) కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు భర్త కిరణ్‌, ముగ్గురు కొడుకులున్నారు. గంగారపు చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

    దేశరాజ్‌పల్లి వాసి..

    రామడుగు: దేశరాజ్‌పల్లి గ్రామానికి చెందిన కొత్త రేణుక(38) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రేణుక కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. భర్త రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

    తాళం వేసిన ఇళ్లలో చోరీ

    కోరుట్ల: కోరుట్ల పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలు.. పట్టణంలోని రవీంద్రారోడ్‌లో ఇల్లుటపు భూమయ్య ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని బంగారు గొలుసు, ఉంగరం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ వద్ద కటుకం రాజారాం ఇంటి తాళాలు పగులగొట్టి కబ్బోర్డ్‌లోని ఐదు బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, కాళ్ల కడియాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

    అట్టహాసంగా వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

    సిరిసిల్లఅర్బన్‌: సిరిసిల్ల పట్టణ పరిదిలోని రాజీవ్‌నగర్‌ మినీస్టేడియంలో 8వ రాష్ట్ర స్థాయి జూనియర్‌ వాలీబాల్‌ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీకుమార్‌ తెలిపారు. మినీస్టేడియంలో నాలుగు కోర్టులు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభాకర్‌, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

  • పార్ట్‌టైం జాబ్‌ పేరిట   సైబర్‌ మోసం

    జగిత్యాలక్రైం: సైబర్‌ నేరగాళ్లు పార్ట్‌టైం జాబ్‌ పేరుతో ఓ నిరుద్యోగిని నమ్మించి మోసానికి పాల్పడ్డారు. జగిత్యాల పట్టణానికి చెందిన మహ్మద్‌ అయూబ్‌కు ఈనెల 21న టెలిగ్రామ్‌లో పార్ట్‌టైం జాబ్‌లున్నాయని మెసేజ్‌ వచ్చింది. దీంతో అతను లింక్‌ ఓపెన్‌ చేయగా సైబర్‌ నేరగాళ్లు రిజిస్ట్రేషన్‌ కోసం రూ.10 వేలు చెల్లించాలని కోరారు. దీంతో మహ్మద్‌ అయూబ్‌ రూ.10 వేలు చెల్లించాడు. అనంతరం అయూబ్‌ ఐసీఐసీఐ ఖాతాకు రూ.16 వేల వేతనం వేశారు. దీంతో నమ్మిన అతను సైబర్‌ నేరగాళ్లు ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేసి అడిగిన విధంగా దశల వారీగా రూ.1,14,032 వారి ఖాతాలో జమచేశాడు. లింక్‌ క్లోజ్‌ కావడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ పోలీసులు తక్షణమే స్పందించి సైబర్‌ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ.25 వేలు ఫ్రీజింగ్‌ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు.

    జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో బంగారు ఉంగరం మాయం చేసి నకిలీ ఉంగరాన్ని వదిలి వెళ్లిన ఘటన జరిగింది. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలోని ఓ బంగారం దుకాణానికి శనివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి వచ్చి బంగారు ఉంగరం సెలక్షన్‌ చేసుకున్నాడు. అదే తరుణంలో మరో కస్టమర్‌ రావడంతో మాటల్లో దింపి ఓ ఉంగరాన్ని తూకం వేయాలని కోరగా తూకం వేసి యజమాని ఉంగరాన్ని టేబుల్‌పై పెట్టగానే 2 గ్రాముల బంగారు ఉంగరాన్ని కాజేసి నకిలీ ఉంగరాన్ని పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. సీసీపుటేజీల ఆధారంగా చోరీకి పాల్పడ్డట్లు గుర్తించి పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు.

  • స్వగ్

    పెగడపల్లి(ధర్మపురి): బతుకుదెరువు కోసం ఇరాక్‌ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ఆయన మృతదేహం 38 రోజులకు ఇంటికి తీసుకొచ్చారు. వివరాలు.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్‌ (55) జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం ఇరాక్‌ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనికి తగిన జీతం లేక కంపెనీ నుంచి బయటకు వెళ్లాడు. దొరికిన చోట పని చేసుకుంటున్న రమేశ్‌ గత నెల 21న గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం శవపేటికలో ఇంటికి చేరిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

    హన్మాజిపల్లెకు మృతదేహం

    గన్నేరువరం: హన్మాజిపల్లెకి చెందిన పారునంది వీరయ్య(44) గుండెపోటుతో సౌదీ అరేబియాలో ఈనెల 19న మృతిచెందగా.. శనివారం మృతదేహం గ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఉపాధి కోసం వీరయ్య కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా వెళ్తున్నాడు. పది నెలల క్రితం గ్రామానికి వచ్చి మళ్లీ సౌదీకి వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో కారు డ్రైవర్‌ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 19న కారు పార్కింగ్‌ చేసి అందులోనే సేద తీరుతున్న సమయంలో గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే మృతిచెందినట్లు తోటి కార్మికులు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

  • ఖర్చు లేకుండానే గెలిచిన

    కథలాపూర్‌(వేములవాడ): అప్పుడు పురుషాధిక్యంలో గ్రామాలుండేవి. ఎన్నికల్లో ఎవరైనా బరిలో ఉండాలంటే ఏదో అన్నట్లుగా భావించేవారని కథలాపూర్‌ తొలి ఎంపీపీ, జెడ్పీటీసీ అంబల్ల భాగ్యవతి పేర్కొన్నారు. మండలంలోని భూషణరావుపేట గ్రామానికి చెందిన భాగ్యవతి సర్పంచ్‌, ఎంపీపీ, జెడ్పీటీసీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అప్పుడు, ఇప్పుడు ఎన్నికల పరిస్థితులపై ఆమె మాటల్లోనే.. 1981లో భూషణరావుపేట సర్పంచ్‌గా గెలిచిన. ఆ సమయంలో 8 మంది బరిలో ఉండగా నేను ఒక్కదానినే మహిళను. మిగతావారు పురుషులు. ఓటు కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తే మహిళలకు రాజకీయాలెందుకని ప్రశ్నించారు. గెలిచాక వాహ్‌... అని విస్తుపోయారు. ఖర్చు అసలే లేదు. అప్పట్లో బరిలో ఉన్న అభ్యర్థి గురించి పూర్తిస్థాయిలో ప్రజలు సమాచారం సేకరించి స్వచ్ఛందంగా ఓటు వేసేవారు. అప్పట్లో ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం ఎక్కువ. 1987లో కథలాపూర్‌ ఎంపీపీ, 1995లో జెడ్పీటీసీ సేవలందించా. ఎన్నికల ప్రచారం కోసం జీపులో నలుగురం కలసిపోయేవాళ్లం. గ్రామాల్లోకి పోతే ప్రజలే ఆప్యాయంగా పలకరించి తిండి పెట్టేవారు. కాలం మారింది.. ఓట్ల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

  • కన్నీటి సంద్రమైన తంగళ్లపల్లి

    తంగళ్లపల్లి(సిరిసిల్ల): తల్లీకొడుకుల మృతితో కన్నీటి సంద్రమైంది తంగళ్లపల్లి. ఇద్దరి మృతదేహాలకు అంతిమయాత్రను ఒకేసారి నిర్వహించారు. తల్లి మంచికట్ల లలిత, కొడుకు అభిలాష్‌ మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌పై తీసుకెళ్లారు. బెటాలియన్‌ కానిస్టేబుల్‌ అయిన అభిలాష్‌ సహ ఉద్యోగులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి లలిత చితికి పెద్దకూతురు మౌనిక, అభిలాష్‌ చితికి చిన్నకూతురు మానస నిప్పుపెట్టారు. అభిలాష్‌ సోదరీలను ఓదార్చడం ఎవరీ తరం కాలేదు. 7వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే అభిలాష్‌ మృతదేహానికి బెటాలియన్‌ కమాండెంట్‌ సురేష్‌ నివాళి అర్పించారు.

    తల్లి, అన్న చితికి నిప్పుపెట్టిన చెల్లెళ్లు

  • అన్నా.. ఒక్కచాన్స్‌!

    మానకొండూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి గత కొన్నేళ్లుగా రాజకీయంగా ఏదో ఒక పదవి చేపట్టాలని ఆశించగా.. రిజర్వేషన్లు కలిసిరాలేదు. ఈసారి రిజర్వేషన్‌ అనుకూలించడంతో అధికార పార్టీ జెండా పట్టుకున్నాడు. పెద్దసారు తనకే మద్దతిస్తున్నాడంటూ నామినేషన్‌ వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని తిరిగానని, తనకు అన్యాయం చేయొద్దని, ఒక్కచాన్స్‌ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని పార్టీ సీనియర్‌ నాయకుడు అధిష్టానాన్ని ప్రాధేయపడుతున్నాడు.

    గంగాధర మండల పరిధిలోకి చెందిన ఓ రాజకీ య యువనేత ఏళ్లకాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నాడు. గతంలో పలుమార్లు పదవి ఆశించగా.. అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి రావడంతో జిల్లాకు చెందిన పార్టీ పెద్దలీడర్‌తో చర్చించాడు. తప్పకుండా తానే గెలుస్తానని, ఒక్కచాన్స్‌ ఇవ్వాలని కోరాడు. అధిష్టానం పచ్చజెండా ఊపడంతో శనివారం మంది మార్బలంతో నామినేషన్‌ వేశాడు.

    కరీంనగర్‌/కరీంనరగ్‌టౌన్‌/మానకొండూర్‌: గ్రామ పంచాయితీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది. పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగనప్పటికీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్పంచ్‌ నుంచి వార్డుమెంబర్‌ వరకు గెలిపించుకుని పల్లెలపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో దింపితేనే గెలుపు అవకాశాలుంటాయని భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో పార్టీ నుంచి పోటీచేసే ఆశావహల సంఖ్య ఎక్కువ కావడంతో, అవకాశం ఇవ్వకుంటే రెబల్స్‌గా పోటీ చేస్తామంటూ సవాలు విసురుతున్నారు. జిల్లాలో మొదటి విడత నామినేషన్లు ముగియగా.. నేటినుంచి రెండో విడత ప్రారంభం కానున్నాయి.

    తలనొప్పిగా ఎంపిక ప్రక్రియ

    ప్రధాన పార్టీల నుంచి ఒక్కొక్కరే బరిలో నిలిచే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు సైతం గ్రామాల్లో బలంగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించాలని భావిస్తున్నాయి. ఒక్కో పార్టీ నుంచి పదుల సంఖ్యలో టికెట్‌ కోసం ఆశిస్తుండగా.. తొలివిడతలో నామినేషన్‌ వేసినవారు మద్దతును అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. టికెట్‌ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తామని చాలా మంది ముందే ప్రకటన చేస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు ఆఫర్లు, రాబోయే పరిషత్‌ ఎన్నికల్లో అవకాశాలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.

    ఖర్చు ముందే ఫిక్స్‌

    అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు ఆర్థిక పరిస్థితిని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అభ్యర్థికి వ్యక్తిగత ఫాలోయింగ్‌, పార్టీకి, నాయకులకు విధేయతతో పాటు పోటీ చేసే అభ్యర్థికి సొంతంగానే ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్థోమత ఉందా అని చూస్తున్నారు. దీంతో ఆయా పార్టీల్లో ఏళ్లుగా కష్టపడుతున్న పేద కార్యకర్తలు, నాయకులకు చుక్కెదురవుతోంది. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ పలుకుబడి ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన కొందరు ఆందోళన చెందుతున్నారు.

    మండలం సర్పంచ్‌ వార్డు

    చిగురుమామిడి 17 174

    తిమ్మాపూర్‌ 23 212

    గన్నేరువరం 17 140

    మానకొండూర్‌ 29 280

    శంకరపట్నం 27 240

    మొత్తం 113 1,046

    జిల్లాలోని ఐదు మండలాల్లో నేటినుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. చిగురుమామిడి, తిమ్మాపూర్‌, గన్నేరువరం, మానకొండూర్‌, శంకరపట్నం మండలాల్లో మూడురోజులు ప్రక్రియ కొనసాగనుంది. 113 సర్పంచ్‌, 1,046 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, 4న అభ్యంతరాలపై అప్పిల్‌, 5న పరిశీలన, 6న విత్‌ డ్రా ఉంటుంది.

    గ్రామ పంచాయితీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. జిల్లాలో మొదటి విడతలో 92 గ్రామపంచాయతీలు, 866 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. కాగా.. కొత్తపల్లి మండలంలో ఆరు గ్రామ పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు 69 నామినేషన్లు, 62 వార్డుస్థానాలకు 218 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్‌ మండలంలో 14 సర్పంచ్‌ స్థానాలకు 102, 132 వార్డుస్థానాలకు 359 నామినేషన్లు వచ్చాయి. గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల నామినేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఆదివారం పూర్తి సమాచారం ఇస్తామని డీపీవో వెల్లడించారు.

  • ప్రసవ

    కరీంనగర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీలు పెంచాలని, మొదటి కాన్పులు నార్మల్‌ అయ్యేలా చూడాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పీహెచ్‌సీల డాక్టర్లను ఆదేశించారు. వెద్య ఆరోగ్యశాఖ కార్యాలయ మీటింగ్‌ హాల్లో శనివారం ప్రాథమిక, పట్టణ ఆరోగ్య, బస్తీ దవాఖానాల వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలతో సమీక్ష నిర్వహించారు. 12వారాల్లోపు గర్భిణులను 100శాతం రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ 100శాతం టార్గెట్‌ పూర్తి చేయాలన్నారు. అందరికీ వ్యాధిని నిరోధక టీకాలు అందేలా చూడాలన్నారు. పీవో ఎన్సీడీ డాక్టర్‌ ఉమాశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు పాల్గొన్నారు.

    జీవో 46పై భగ్గుమన్న బీజేపీ

    కరీంనగర్‌: బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై కరీంనగర్‌ బీజేపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో ఆందోళన చేపట్టారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జీవో46 ప్రతులు దహనం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ పేరిట కాంగ్రెస్‌ ఇన్నాళ్లు రాజకీయ డ్రామాలు చేసిందని, నేడు జీవో 46జారీ చేసి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు కేవలం 22శాతం రిజర్వేషన్లు ఇవ్వ డం దారుణం అన్నారు. నాయకులు గుగ్గిల్లపు రమేశ్‌, గుజ్జ శ్రీనివాస్‌, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాశ్‌, నరహరి లక్ష్మారెడ్డి, గుంజేటి శివకుమార్‌, శానగొండ వాసు, నాంపల్లి శ్రీనివాస్‌, మాసం గణేశ్‌ పాల్గొన్నారు.

    బీజేపీ ఇన్‌చార్జీల నియామకం

    కరీంనగర్‌: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఇన్‌చార్జీల నియామకం చేపట్టింది. శనివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు నియామకపు ఉత్తర్వులు విడుదల చేశారు. బీజేపీ సీనియర్‌ నాయకులను ఆయా జిల్లాల ఇన్‌చార్జీలుగా నియమించారు. కరీంనగర్‌ జిల్లాకు మహబూబ్‌నగర్‌కు చెందిన న్యాయవాది బండారి శాంతికుమార్‌, జగిత్యాలకు మెదక్‌ జిల్లాకు చెందిన గడ్డం శ్రీనివాస్‌, పెద్దపల్లికి హన్మకొండకు చెందిన రాజమౌళిగౌడ్‌, రాజన్న సిరిసిల్లకు సిద్దిపేటకు చెందిన గంగాడి మోహన్‌రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన కె.ఓదెలును మంచిర్యాల జిల్లాకు, కోమల అంజనేయులును కొమరంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాకు ఇన్‌చార్జీలుగా నియమించారు.

    విద్యార్థుల శాతం పెంచాలి

    జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో విద్యార్థుల నమోదుశాతం పెంచాలని కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, అకడమిక్‌ అడ్వైజర్‌ రామకృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శంకరయ్య పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభు త్వ డిగ్రీ,పీజీ కళాశాలను శనివారం సందర్శించారు. అకడమిక్‌ ఆడిట్‌, రికార్డులు పరిశీ లించారు. అధ్యాపకులు మరింత పరిశోధనలు చేయాలన్నారు. ప్రిన్సిపాల్‌ రమేశ్‌, వై స్‌ ప్రిన్సిపాల్‌ ఓదెలు కుమార్‌, అకడమిక్‌ కో– ఆర్డినేటర్‌ రాజేంద్రం, అధ్యాపకులు గణేశ్‌, శ్యామల, మాధవి, ఉమాకిరణ్‌ పాల్గొన్నారు.

    ముగిసిన చెకుముకి పోటీలు

    సప్తగిరికాలనీ(కరీంనగర్‌): జన విజ్ఞాన వేదిక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చెకుముకి పోటీలు ముగిశాయి. స్థానిక ఓల్డ్‌ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎస్‌.అర్చన, ఎం.సుష్మిత, సానియా, జి.హర్షిత్‌, ఎం.అజయ్‌, ఆర్‌.సామ్రాట్‌, కార్తికేయ, శివరాత్రి రిశాల్‌, శివ స్మరన్‌రెడ్డి, అంజలి, సంజన, వైష్ణవి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌, జైపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌ రావు, దేవేందర్‌, రామరాజు, మల్లేశం, మల్లయ్య పాల్గొన్నారు.

  • పోటీకే సై

    సాక్షి పెద్దపల్లి: సర్పంచ్‌ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో ఎంతో కోలాహలం, పోటాపోటీ ఉంటుంది. అయితే, ఏకగీవ్రంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రూ.10లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని గతంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో 2019 స్థానిక ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా నాయకులు పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యేలా కృషి చేశారు. కానీ, నజారానాను చెల్లించకపోవడంతోపాటు, ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడం, పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు పోటీకిసై అంటుండటం తదితర కారణాలతో పల్లెలు ఏకగ్రీవం వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏకగ్రీవాల కన్నా పోటీలో నిలిచేందుకే ఆసక్తి చూపుతున్నారు.

    గతంలో 107 ఏకగ్రీవం

    గతంలో జరిగిన స్థానిక సంస్థల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీకి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు, స్థానిక ఎమ్మెల్యే మరో రూ.10లక్షలు నజరానా ఇస్తామని ప్రకటించారు. దీంతో రూ.20లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే అభిప్రాయంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 107గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటికి సంబంధించి ఏకగ్రీవ నజారానా కింద రూ.21.20కోట్లు విడుదల కావాల్సి ఉంది. ప్రోత్సాహక నిధులు వస్తాయనే ఆశతో ఎంతోమంది సర్పంచులు అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల వైపు గ్రామస్తులు, నేతలు పెద్దగా ఫోకస్‌ చేయడం లేదు.

    ముగిసిన తొలివిడత నామినేషన్ల ప్రక్రియ

    తొలివిడత నోటిఫికేషన్‌ విడుదలతో గురు, శుక్ర, శనివారాల్లో ఆయా పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు చివరిరోజైన శనివారం కొన్ని పంచాయతీల్లో రాత్రివరకూ కేంద్రాల్లో అభ్యర్థులు బారులు తీరి నామినేషన్లు దాఖలు చేశారు. తొలివిడతలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్‌ పంచాయతీ, చొప్పదండి మండలం దేశాయిపేట పంచాయతీ, రుద్రంగి మండలం గైదిగుట్టతండా పంచాయతీలకు ఒక్కో నామినేషన దాఖలయ్యాయి. దీంతో ఈమూడు పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి.

    జిల్లా జీపీలు ఏకగ్రీవం

    (గతంలో)

    కరీంనగర్‌ 92 16

    పెద్దపల్లి 99 13

    జగిత్యాల 122 37

    సిరిసిల్ల 85 41

    మొత్తం 398 107

  • ప్రకృతిని పరిరక్షించే ఆవిష్కరణలు అవసరం

    కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యార్థులు ప్రకృతిని పరిరక్షించే ఆవిష్కరణలు రూపొందించాలని కలెక్టర్‌ ప మేలా సత్పతి సూచించారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఈటెక్నో పాఠశాలలో శనివారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025–26, ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌ మనాక్‌ 2024– 25 ప్రదర్శనకు హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేపట్టి, జ్యోతి ప్రజ్వల న చేశారు. విద్యార్థుల విజ్ఞాన శాస్త్ర ఆలోచనలు ప్రపంచస్థాయిలో కాకుండా స్థానిక సమస్యలపై ఉండాలన్నారు. వాటి పరిష్కారం దిశగా ఆవిష్కరణలు చేయాలన్నారు. ప్రకృతిని తల్లిలా చూసుకుంటే మంచి ఫలితాలిస్తుందన్నారు. 10 ఏళ్లుగా క్రమం తప్పకుండా జిల్లా నుంచి సైన్స్‌ ఎగ్జిబిట్లు రాష్ట్రస్థాయికి, జాతీయస్థాయికి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కరీంనగర్‌లో సైన్స్‌ మ్యూజియం ఉందని, ప్రభుత్వ, ప్రైవేట్‌ పిల్లలు ఎవరైనా సందర్శించవచ్చన్నారు. డీఈవో శ్రీరామ్‌ మొండయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రపరమైన ఆలోచనలు పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రం వైపు విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో 807 సైన్స్‌ ఎగ్జిబిట్లు, 126 ఇన్‌స్పైర్‌ మనక్‌ ఎగ్జిబిట్లు వచ్చాయన్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి ఎస్‌.భగవంతయ్య, సెక్టోరియల్‌ అధికారులు కర్ర అశోక్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • వివాదాస్పదమైన రోడ్డు తవ్వకం

    కరీంనగర్‌రూరల్‌: పట్టా భూమిలో రోడ్డు నిర్మించా రని ఆరోపిస్తూ ఓ మహిళ ఏకంగా రోడ్డునే తవ్వడం వివాదస్పదంగా మారింది. మరోసారి సర్వే చేసి హద్దులు నిర్ణయించేవరకు ఎలాంటి పనులు చేపట్టరాదంటూ రెవెన్యూ అధికారులు రోడ్డు తవ్వకం పనులను నిలిపివేశారు. కరీంనగర్‌ మండలం నగునూరు శివారులో సర్వేనంబరు 27లో ఓ మహిళకు రెండు ఎకరాల వ్యవసాయ భూముంది. 2021లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పొలంపక్క నుంచి ఉన్న నక్షా రోడ్డును 30 ఫీట్లుగా వెడల్పు చేశారు. గ్రామశివారు నుంచి దుబ్బల మీదుగా చొప్పదండి రోడ్డు వరకు అభివృద్ధి చేసి సోలార్‌ లైట్లు బిగించారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా పట్టాభూమిని కలుపుకుని రోడ్డు వెడల్పు చేశారంటూ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఏడాదిక్రితం సర్వేయర్‌ భూమిని సర్వే చేయగా రోడ్డు మధ్యభాగంలోకి రావడంతో హద్దురాళ్లను ఏర్పాటు చేశారు. అప్పటి పంచాయతీ పాలకవర్గం ఒత్తిడితో సదరు మహిళ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. శుక్రవారం జేసీబీతో రోడ్డుపై ఏర్పాటు చేసిన హద్దురాళ్లలోపు ఉన్న రోడ్డు స్థలాన్ని తొలగించడంతో స్థానికులు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ రాజేశ్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ కనకరాజు మోఖాపై వెళ్లి రోడ్డు తవ్వకం పనులను నిలిపివేయించారు. డీఐతో సర్వే చేసేంతవరకు ఎలాంటి పనులు చేపట్టరాదని సదరు మహిళకు సూచించినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

  • తెలంగాణ ప్రదాత కేసీఆర్‌

    కరీంనగర్‌టౌన్‌: తెలంగాణ తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని, బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం దీక్షా దివస్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం, శాతవాహన యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌ రెండేళ్లలోనే విధ్వంసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి, బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌ నవంబర్‌ 29, 2009లో ఆమరణ దీక్షకు దిగారన్నారు. చరిత్రలో మరుపురాని మధుర ఘట్టం దీక్షా దివాస్‌ అన్నారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, నాయకులు చల్లహరిశంకర్‌, అనిల్‌కుమార్‌, బండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Dr B R Ambedkar Konaseema

  • ఇది క

    సాక్షి, అమలాపురం: దశాబ్దాలు పోరాడి సాధించుకున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఈ రెవెన్యూ డివిజన్‌ దశల వారీగా కుచించుకుపోతోంది. ఎనిమిది మండలాలతో మొదలై చివరకు రెండు మండలాలకు పరిమితమైంది. సుదీర్ఘ చరిత్ర... రెవెన్యూ డివిజన్‌ కన్నా ఎక్కువ హంగులు, అవకాశాలు ఉన్న ఈ డివిజన్‌ ఇప్పుడు కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. మిగిలిన రెండు మండలాలను ఇటు జిల్లా కేంద్రమైన అమలాపురంలో కాని.. అటు కాకినాడ జిల్లా కాకినాడ రెవెన్యూ డివిజన్‌లోకాని కలపాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ నుంచి రాష్ట్రమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాసంశెట్టి సుభాష్‌ వైఫల్యం రామచంద్రపురం డివిజన్‌కు శాపంగా మారింది.

    ఉద్యమాల ఫలితంగా...

    ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ను 2013లో ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఈ డివిజన్‌ పరిధిలో చాలా మండలాలు రాజమహేంద్రరం డివిజన్‌ పరిధిలో ఉండేవి. తరువాత ఎనిమిది మండలాలతో దీనిని ఏర్పాటు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో రామచంద్రపురం, కాజులూరు, కె.గంగవరం, మండపేట ని యోజకవర్గం పరిధిలో కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, అనపర్తి నియోజకవర్గం పరిధిలో అనపర్తి, బిక్కవోలు మండలాలతో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు పెద్ద ఎ త్తున ఉద్యమాలు చేసిన ఫలితంగా ఇది ఏర్పడింది. ఈ కారణంగానే ఇక్కడ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని పుర్వపు రామచంద్రపురం సంస్థాన రాచరికానికి గుర్తుగా అద్భుత నిర్మాణ శైలిలో నిర్మించుకున్నారు. ఇది అందమైన లాన్‌లు, మొక్కలతో అలరిస్తోంది.

    చిన్న జిల్లాల ఏర్పాటుతో

    ఐదు మండలాలకే పరిమితం

    గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరిని కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలుగా విడదీశారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న అనపర్తి, బిక్కవోలు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లడంతోపాటు రాజమహేంద్రవరం డివిజన్‌లో కలిసిపోయాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కాజులూరు మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపారు. ఇది కాకినాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వెళ్లింది. దీంతో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలో ఐదు మండలాలకు పరిమితం అయ్యింది. జిల్లాలు ఏర్పడిన కొత్తలో అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాలను రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని నిర్ణయించారు. అయితే కొత్తపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని అప్పటి కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి చేసిన కృషి ఫలితంగా పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలోని మండలాలను కలుపుతూ కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

    ఎత్తివేస్తారా?

    తాజాగా చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడంతో మండపేట నియోజకవర్గం తూర్పు గోదావరిలో విలీనం కానుంది. దీని పరిధిలోని కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం మండలాలు రాజమహేంద్రవరం డివిజన్‌లో కలవనున్నాయి. దీనితో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ కేవలం రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు పరిమితమైంది. దీనితో ఈ డివిజన్‌ ఎత్తివేస్తారనే ప్రచారం జోరందుకుంది. వీటిని కాకినాడ జిల్లాలో విలీనం చేసి, కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో కలిపివేస్తారని లేదా అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో కలుపుతారనే ప్రచారం జోరందుకుంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్న ఈ డివిజన్‌ను పుష్కర కాలం తరువాత ఎత్తివేసే దిశగా ప్రభుత్వం చూస్తోందని మండిపడుతున్నారు. డివిజన్‌ ఏర్పాటుకు ముందే ఇక్కడ జిల్లా కోర్టులు, ఏరియా ఆస్పత్రి, విద్యాలయాలు, ఆర్టీసీ డిపో ఉన్నాయి. ఇటీవల మూడవ అడిషనల్‌ జిల్లా కోర్టును కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉన్న అతి పెద్ద పట్టణం ఇది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి చెందింది. మరింత అభివృద్ధి చెందుతుందనే దశలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రామచంద్రపురం అభివృద్ధికి శరాఘాతంగా మారింది.

    రెండు విధాలుగా అన్యాయం

    మా నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలని కోరాంలేదా రెవెన్యూ డివిజన్‌కు ఇబ్బంది లేకుండా కొనసాగించాలని డిమాండ్‌ చేశాం. కాని మాకు రెండు విధాలుగానూ అన్యాయం జరిగింది. రామచంద్రపురం పట్టణానికి జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కూడా కొనసాగేలా లేదు.

    – యర్రంశెట్టి రామరాజు, రామచంద్రపురం

    మంత్రి సుభాష్‌ వైఫల్యమే శాపం

    ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘ పోరాటల ఫలితంగా రామచంద్రపురం డివిజన్‌ ఏర్పడింది. స్థానికుల ఆకాంక్షలకు విరుద్ధంగా రెవెన్యూ డివిజన్‌ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలను విభజన చేస్తే ఈ నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాలనే డిమాండ్‌ ఉంది. లేకుంటే రెవెన్యూ డివిజన్‌కు ఇబ్బంది లేకుండా చూడమని స్థానికులు కోరారు. అయితే ఈ రెండూ నెరవేరకుండా పోయాయి. ఇంత జరుగుతున్నా రామచంద్రపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్‌ నోరుమెదకపోవడంపై నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌ సీపీ నేతల మీద, మరీ ముఖ్యంగా సొంత సామాజికవర్గం శెట్టిబలిజ నేతల మీద నోరు పారేసుకోవడం, వ్యక్తగత దూషణలకు దిగడంలో ఉత్సాహం చూపిస్తున్న మంత్రి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కనే ఉన్న టీడీపీకి చెందిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని ఏకంగా జిల్లానే మార్చగా లేనిది మంత్రి హోదాలో ఉండి ఉన్న రెవెన్యూ డివిజన్‌ను కాపాడుకోలేకపోయారనే ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి వైఫల్యమే తమకు శాపంగా మారిందని ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు.

    రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌

    కనుమరుగు

    తొలుత ఎనిమిది మండలాలతో ఏర్పాటు

    పునర్విభజనతో మిగిలినవి కె.గంగవరం, రామచంద్రపురం మండలాలే

    తూర్పులోకి వెళ్లిన మండపేట

    నియోజకవర్గం

    నోరుమెదపని రాష్ట్ర మంత్రి సుభాష్‌

    మండిపడుతున్న

    రామచంద్రపురం వాసులు

  • కేసుల దర్యాప్తులో జాప్యం తగదు

    అమలాపురం టౌన్‌: కేసుల దర్యాప్తులో జాప్యం ఉండకూడదని, దర్యాప్తుల వేగవంతంతోపాటు నిందితుల అరెస్ట్‌, ఆస్తుల రికవరీ కూడా వేగంగా ఉండాలని ఎస్పీ రాహుల్‌ మీనా జిల్లాలోని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు పారదర్శకంగా, వేగంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదైన తీవ్ర నేరాల కేసుల పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ కేసుల్లో నేరస్తులకు తగిన శిక్షలు పడేలా ఆధారాల సేకరణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద నమోదైన అన్ని కేసుల దర్యాప్తును వేగంగా చేయాలని సూచించారు. అదృశ్య (మిస్సింగ్‌) కేసుల పరిశోధన, దర్యాప్తు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రణాళికతో చర్యలు చేపట్టాలని చెప్పారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారమయ్యే వీలున్న కేసులను గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, సుంకర మురళీమోహన్‌, రఘువీర్‌, ఏఆర్‌ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్‌బీ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ మురళీకృష్ణతోపాటు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

    నేడు విద్యుత్‌ బిల్లులు

    చెల్లించవచ్చు

    అమలాపురం రూరల్‌: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అన్ని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం సెలవు రోజు అయినా విద్యుత్‌ బిల్లులు యథావిధిగా చెల్లించవచ్చని కోనసీమ జిల్లా ఎపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎస్‌.రాజేశ్వరి తెలిపారు. సెక్షన్‌ ఆఫీస్‌ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. విద్యుత్‌ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శనివారం ప్రకటనలో తెలిపారు.

    14న యూటీఎఫ్‌ సమావేశం

    రాయవరం: మండలంలోని పసలపూడిలో డిసెంబర్‌ 14న నిర్వహించే యూటీఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్‌, ఎంటీవీ సుబ్బారావు పిలుపునిచ్చారు. పసలపూడిలో శనివారం యూటీఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సన్నాహక సమావేశం రాయవరం మండల శాఖ అధ్యక్షుడు కడలి శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సురేంద్రకుమార్‌, సుబ్బారావు మాట్లాడుతూ యూటీఎఫ్‌ నిరంతరం పోరుబాటలో పయనిస్తుందన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, మహి విభాగం జిల్లా అధ్యక్షురాలు గరగ సీతాదేవి, రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు గారా చిట్టిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పదవ తరగతి మోడల్‌ పేపర్లను వారు ఆవిష్కరించారు.

    5న మెగా పేరెంట్‌, టీచర్‌ మీట్‌

    అమలాపురం రూరల్‌: మెగా పేరెంట్‌ – టీచర్‌ మీట్‌ 3.0 డిసెంబర్‌ 5వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు సమావేశం ఉంటుందని శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు పూర్వపు విద్యార్థులు హాజరవుతారన్నారు. మొదటి 80 నిమిషాలు ఎఫ్‌ఎల్‌ఎం అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌పై సమీక్ష ఉంటుందన్నారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థుల భవిష్యత్తు గురించి విస్తృతంగా చర్చిస్తారని పేర్కొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం ద్వారా సహ పంక్తి భోజనం నిర్వహించాలని తెలిపారు.

    ఉపాధ్యాయ క్రీడా

    పోటీలకు ఎంపికలు

    ఐ.పోలవరం: ఉపాధ్యాయుల క్రీడా పోటీలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌, త్రోబాల్‌ ఎంపికలు సాగాయి. ఐ.పోలవరం, అంబాజీపేట, గొలవిల్లి, ముక్తేశ్వరం, అమలాపురం ఎంపికల పోటీల్లో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు క్రికెట్‌, మహిళలకు త్రో బాల్‌ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 29, 30లలో మండల స్థాయిలోను, 13వ, 14వ తేదీలలో డివిజన్‌ స్థాయిలోను, 20 నుంచి 22వ తేదీ వరకు జిల్లా స్థాయిలోను, వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 4వ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఐ.పోలవరం మండల స్థాయి ఎంఈఓ ఎన్‌. కొండారెడ్డి ప్రారంభించారు.

  • వాడపల

    కొత్తపేట: అనాథ రక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తుల గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు ఏడు ప్రదక్షిణలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామి దర్శనం, తీర్థ ప్రసాదాల స్వీకరణ అనంతరం వేలాది మంది అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రావులపాలెం సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్‌ఐ ఎస్‌ రాము, వాడపల్లిలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ వాడపల్లికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది.

    మార్మోగిన గోవింద నామ స్మరణ

    మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో శనివారం గోవింద నామ స్మరణ మార్మోగింది. ఏడుకొండలవాడా గోవిందా.. వెంకటరమణా గోవిందా.. అంటూ భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్నారు. ప్రాతః కాలంలో స్వామి వారికి సుప్రభాత సేవలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తొలి హారతిని భక్తులు దర్శించుకున్నారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. తమ కోర్కెలు నెరవేరాలని స్వామికి ప్రణమిల్లారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.2,72,239 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు రూ.89,450 విరాళాలుగా అందించారన్నారు. అయిదు వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 2,800 మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. పాశర్లపూడిలంకకు చెందిన పితాని సూర్యనారాయణ, వెంకటరమాదేవి దంపతులు స్వామివారి నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,116 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణికి అందజేశారు.

  • సీ్త్ర శక్తి పథకంతో ప్రయాణికులకు సమస్యలు ఆర్టీసీ యునైటె

    రాజోలు: ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో ప్రయాణికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.ఎస్‌.నారాయణ అన్నారు. శనివారం రాజోలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట యూనియన్‌ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులతో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. సీ్త్ర శక్తి పథకం అమలు చేసే ముందు ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసిన అధికారులు, మంత్రులు ముందస్తు అంచనాలు రూపొందించినా దానికి తగిన విధంగా బస్సుల సంఖ్యను పెంచలేదన్నారు. బస్సుల సంఖ్య పెంచకపోగా కండిషన్‌ లేనివి వినియోగించడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కండక్టర్‌, డ్రైవర్లు విధి నిర్వహణలో ఎంతో అలసి పోతున్నారని, కొన్ని ప్రాంతాల్లో వారిపై దాడులు కూడా జరుగుతున్నాయన్నారు. డోర్‌లు లేని బస్సులలో ప్రమాదాలు జరిగితే వాటికి డ్రైవర్లను బాధ్యులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అన్ని బస్సులకు హైడ్రాలిక్‌ డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. డిపో కార్యదర్శి కె.ఎన్‌.ఎస్‌.వాసు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకానికి జీరో టిక్కెట్‌తోపాటు సాధారణ ప్రయాణికులకు మరో టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా కండక్టర్‌ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రెండు టిక్కెట్లు ఇచ్చే విధానం రద్దు చేసి, డబ్బు ఇచ్చి ప్రయాణం చేసేవారికి మాత్రమే టిక్కెట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. డిపో అధ్యక్షుడు కె.ఎల్‌.ఎస్‌.నారాయణ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సుల్లో 70 మంది మాత్రమే ప్రయాణించే విధంగా నిబంధనలు అమలు చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్‌, డ్రైవర్లపై దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిపో మేనేజర్‌ జి.జేమ్స్‌బాబుకు అందజేశారు. యూనియన్‌ నాయకులు ఖలీల్‌, వై.బి.నీలిమ, జి.హేమవతి, జె.ఎన్‌.వి.వేణి, వీఎండీ కుమార్‌, సతీష్‌, ఏడుకొండలు, సత్యశ్రీనివాస్‌, నారాయణ, హరినాథ్‌, ఎ.ఎస్‌.నారాయణ పాల్గొన్నారు.

  • రత్నగిరిపై భక్తుల రద్దీ

    సత్యదేవుని దర్శించిన 40 వేల మంది

    రూ.40 లక్షల ఆదాయం

    అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ పెళ్లిబృందాలు, నవదంపతులతో పాటు ఇతర భక్తులు కూడా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా తరలి వచ్చారు. దీంతో, ఆలయంలో తెల్లవారుజాము నుంచీ తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. మూడు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. దశమి పర్వదినం కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. నేటి ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు.

  • ఎయిడ్స్‌ నియంత్రణకు నడుం బిగిద్దాం

    అమలాపురం టౌన్‌: సమాజంలో ఎయిడ్స్‌ మహమ్మారి నియంత్రణకు అందరం నడుం బిగిద్దామని డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ ఎం. దుర్గారావు దొర పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తొలుత ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణపై చైతన్యం కలిగిస్తూ ఆస్పత్రి ప్రాంగణం నుంచి మొదలైన కొవ్వొత్తుల ర్యాలీని డీఎం అండ్‌ హెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్‌ నియంత్రణ నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ ఏరియా ఆస్పత్రి నుంచి స్థానిక నల్ల వంతెన వరకూ సాగింది. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఎయిడ్స్‌పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌వీ భరతలక్ష్మి, ఎయిడ్స్‌ నిర్మూలన అధికారులు పాల్గొన్నారు.

  • సర్వేతో నిజమైన

    హక్కుదారులకు లబ్ధి

    అమలాపురం రూరల్‌: గ్రామాలలో ప్రతిపాదిత 22 ఏ భూముల పునఃసర్వే కార్యక్రమంతో నిజమైన హక్కుదారులకు లబ్ధి చేకూరుతుందని ఆర్డీవో కె.మాధవి తెలిపారు. శనివారం అమలాపురం మండల పరిధిలోని ఎ.వేమవరంలో రెవెన్యూ సర్వే విభాగాలు సంయుక్తంగా ప్రతిపాదిత 22 ఏ భూములను క్షేత్రస్థాయిలో పునః సర్వే నిర్వహించాయి. ఈ సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే బృందానికి సూచనలు చేశారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు సహాయ సంచాలకులు కె.ప్రభాకర్‌, తహసీల్దార్‌ వీఎస్‌ దివాకర్‌ పాల్గొన్నారు.

  • జాతీయ స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

    అంబాజీపేట: స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ జీ ఎఫ్‌) జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు అంబాజీపేట జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని మీసాల మౌనిక (పదవ తరగతి) ఎంపికై నట్టు హెచ్‌ఎం కడలి సాయిరామ్‌, పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌ 19 బాస్కెట్‌బాల్‌ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయిందన్నారు. జనవరిలో రాజస్థాన్‌ రాష్ట్రంలోని బర్మర్‌ పట్టణంలో జరిగే బాస్కెట్‌బాల్‌ పోటీలలో పాల్గొంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.