Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి.  ఈ వారం నామినేషన్‌లో కల్యాణ్‌ అయితే పూర్తిగా కంట్రోల్‌ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను  అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు  డీమాన్ పవన్‌ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.

    కల్యాణ్‌, డీమాన్‌ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్‌ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.  ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్‌లో నాగార్జున  ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  కల్యాణ్‌ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్‌ నేమ్‌ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.

    గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్‌ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్‌ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్‌ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు.  జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్‌) కోపం లేదు.  నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు.  వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్‌ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్‌లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు.

  • మీరు ఏ వయసు వాళ్లయినా సరే ఎప్పుడో ఓసారి ఏదో ఓ సినిమా.. థియేటర్‌లో చూసే ఉంటారు కదా! అలానే ప్రతి శుక్రవారం టాలీవుడ్‌లో కావొచ్చు బాలీవుడ్‌లో కావొచ్చు.. కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే ప్రతిసారీ శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారనని ఎ‍ప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏంటి? లేదంటే మరేదైనా నమ్మకాలు ఉ‍న్నాయా?

    (ఇదీ చదవండి: పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?)

    మన దేశంలో శుక్రవారమే సినిమాలని విడుదల చేయాలనే ఆచారం మొదటి నుంచి ఏం లేదు. 1940-50ల్లో వారంలో ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసేవారు. కానీ 1960లో 'మొఘల్ ఏ ఆజం' అనే హిందీ సినిమా.. ఆగస్టు 5న విడుదలై అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. దీంతో అప్పటినుంచి చాలామంది నిర్మాతలు.. శుక్రవారం కొత్త చిత్రాలని విడుదల చేస్తూ వచ్చారు. అలా అదో అలవాటుగా మారిపోయింది. శుక్రవారం అనే కాదు.. గురువారం, శనివారం కూడా కొన్నిసార్లు సినిమాల్ని రిలీజ్ చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి సందర్భాలు ప్రస్తుతం అప్పడప్పుడు కనిపిస్తుంటాయి.

    శుక్రవారమే రిలీజ్ చేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది వీకెండ్ కలిసొస్తుందని. చాలా కంపెనీల్లో శుక్రవారంతో వర్క్ పూర్తవుతుంది. శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. వరసగా సెలవులు కావడం వల్ల చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీస్.. సినిమాల్ని చూసేందుకు ఇష్టపడతారు. మిగతా రోజుల్లో వీళ్లకు సినిమాలు చూసేంత తీరిక ఉండదు. అలా కూడా శుక్రవారం ట్రెండ్ పాతుకుపోయింది.

    స్వాతంత్ర్యం వచ్చాక చాలా ఏళ్ల పాటు మన దేశంలో కలర్ టీవీలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు.. సినిమాలని థియేటర్‌కి వెళ్లి మాత్రమే చూసేవారు. దీంతో అప్పట్లో కంపెనీలన్నీ శుక్రవారం.. సగం రోజు తర్వాత సెలవుగా ప్రకటించేవి. తద్వారా ఉద్యోగులు.. తమ కుటుంబ సభ్యుల్ని తీసుకుని థియేటర్లకు వెళ్లేవారని కూడా అంటుండేవారు.

    (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)

    ఇవన్నీ సాధారణంగా అనుకునేవి. కానీ శుక్రవారం రిలీజ్ విషయంలో మతపరమైన కారణాలు ఉన్నాయనేది మరికొందరి వాదన. లక్ష‍్మీ దేవికి శుక్రవారం చాలా ఇష్టమైన రోజు. హిందూ సంప్రదాయంలో శుక్రవారం నాడు చాలామంది కొత్త పనిని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా సినిమాలని కూడా ఇదేరోజున విడుదల చేస్తే మంచి కలెక్షన్స్, లాభాలు వస్తాయనేది చాలామంది నిర్మాతల నమ్మకం.

    జ్యోతిష్యంలోనూ శుక్రవారానికి మంచి సంబంధం ఉంది. సినిమా, నిర్మాణం, వినోదం, ఇవన్నీ శుక్ర గ్రహానికి సంబంధించినవి. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు కారకంగా కూడా ప‌రిగ‌ణిస్తుంటారు. అందుకే శుక్ర‌వారం సినిమాల‌ని విడుద‌ల చేయ‌డం మ‌రింత పుణ్య‌మ‌ని భావిస్తుంటారు. శుక్రవారం.. శుక్ర గ్రహానికి సంబంధించిన పనులు చేయడం వల్ల కూడా విజయం చేకూరుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఇలా చాలా కారణాల దృష్ట్యా.. ఇండస్ట్రీలో 'శుక్రవారం'కి చాలా ప్రాధాన్యం పెరిగిపోయింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • దెయ్యం సినిమాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి గానీ వాటిలో భయపెట్టేవి చాలా తక్కువ. రీసెంట్‌గా మలయాళంలో రిలీజైన ఓ మూవీ.. హారర్ చిత్రాలంటే ఇష్టపడే ప్రేక్షకుల్ని కూడా భయపెట్టింది. థియేటర్లలో ఆకట్టుకుని మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ వణికించేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

    మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కూడా అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ టైంలో 'డీయస్ ఈరే' అనే హారర్ చిత్రంలో నటించాడు. 'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.  అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

    (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 20 మూవీస్)

    థియేటర్లలో అలరించిన 'డీయస్ ఈరే' సినిమా.. ఇప్పుడు డిసెంబరు 05 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మీరు హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. చిల్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.

    'డీయస్ ఈరే' విషయానికొస్తే.. రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఓ ఆర్కిటెక్ట్. బాగా డబ్బున్న ఫ్యామిలీ కుర్రాడు. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. ఇతడేమో ఇక్కడ పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఖాళీ టైంలో పార్టీలు, ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓ రోజు రోహన్ క్లాస్‌మేట్ కని(సుస్మితా భట్) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు రోహన్, అతడి ఫ్రెండ్.. కని ఇంటికి వెళ్లొస్తారు. అప్పటినుంచి రోహన్ ఇంట్లో రాత్రిపూట వింతైన శబ్దాలు వినిపిస్తుంటాయి. కని ఆత్మనే తనని వేధిస్తోందని రోహన్ భయపడుతుంటాడు. ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? రోహన్ వెంటే ఎందుకు పడుతోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)

    (ఇదీ చదవండి: తెలుగు కామెడీ థ్రిల్లర్‌.. వారం రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్)

  • పసుపు చీరలో అందాల బొమ్మలా మీనాక్షి 

    మోడ్రన్ డ్రస్‌లో అదరగొట్టేస్తున్న శోభిత

    చీరలో నవ్వుతూ మెరిసిపోతున్న అనుపమ

    భర్తతో కలిసి మాల్దీవులు ట్రిప్‌లో మేఘా ఆకాశ్

    ఫ్యామిలీతో కలిసి చిల్ అయిపోతున్న రాశీఖన్నా

    మేకప్ లేకుండా కలువ పూలతో యాంకర్ రష్మీ

  • కార్తీ.. పేరుకే తమిళ హీరో గానీ మన దగ్గర బోలెడంత మంది అభిమానులున్నారు. దీంతో తన సినిమాలు వచ్చేటప్పుడు తెలుగు రిలీజ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. గతేడాది 'సత్యం సుందరం' అనే మూవీతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'అన్నగారు వస్తారు' చిత్రంతో రాబోతున్నాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

    'అన్నగారు వస్తారు'లో కార్తీ.. కాస్త ఫన్ ఎలిమెంట్స్ ఉండే పోలీస్ అధికారిగా కనిపిస్తాడని టీజర్ బట్టి తెలుస్తోంది. కృతిశెట్టి హీరోయిన్‌. నలన్‌ కుమారస్వామి దర్శకుడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశముంది. టీజర్‌ను టాలీవుడ్ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. డైలాగ్స్ ఏం లేనప్పటికీ.. టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది.

    (ఇదీ చదవండి: 'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత)

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే  పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

    మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.

    'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.

    (ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?)

  • ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ, అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలానే ట్రెండింగ్ కూడా అవుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ బాగానే కనిపిస్తున్నాయి. అయితే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లిఖార్జున్ అనే వ్యక్తి మాత్రం ఈ పాటని, మంగ్లీని ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్స్ చేశాడు. దీంతో మంగ్లీ.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

    ఈ క్రమంలో గురువారం ఉదయం నిందితుడు మల్లిఖార్జున్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇతడు ఇలానే అసభ్య కంటెంట్‌తో వీడియోలు చేశాడని గుర్తించారు. మరి స్టేషన్‌లో ఏం జరిగిందో ఏమో గానీ సదరు మేడిపల్లి స్టార్.. ఏడుస్తూ ఇప్పుడు మంగ్లీకి క్షమాపణ చెబుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    'పాట ట్రెండింగ్ ఉంది కదక్క.. కామెంట్ పెట్టిన వాడిని తిట్టాను, మిమ్మల్ని కాదు అక్క. నేను ఎవరినీ తిట్టను అక్క. క్షమించక్క. ఏ మహిళని తిట్టను అక్క, ఎవరిపై కామెంట్ చేయను అక్క. ప్లీజ్ అక్క, క్షమించు అక్క' అని మల్లిఖార్జున్   చెబుతున్న వీడియో ఇప్పుడు కనిపిస్తుంది. మంగ్లీ పెట్టిన ఈ కేసుని.. సోషల్ మీడియాలో వీడియోలు ప్రతిఒక్కరూ గమనించాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా ఆలోచించి మాట్లాడితే బెటర్. లేదంటే పోలీస్ స్టేషన్‌లో చిక్కులు గ్యారంటీ.

    (ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?)

  • ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం ఫేం హరీష్ ధనుంజయ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మరువ తరమా.  అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి  చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించగా గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. నేడు(నవంబర్‌ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    ఒకే ఆఫీస్‌లో పని చేసే రిషి ( హరీష్ ధనుంజయ్),  సింధు( అవంతిక ), అన్వీ (అతుల్య) చుట్టూ తిరిగే ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. సింధుతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు రిషి. రిషి అంటే అన్వీకి చాలా ఇష్టం. కానీ సింధు అంటే అతనికి ఇష్టమని తెలుసుకొని తన ప్రేమ విషయాన్ని తనలోనే దాచేస్తుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న రిషి, సింధు ఓ కారణంగా విడిపోతారు. అదేంటి? విడిపోయిన సింధు మళ్లీ రిషి జీవితంలోకి ఎలా వచ్చింది? అన్వీ తన ప్రేమ విషయాన్ని రిషితో చెప్పిందా లేదా? చివరకు ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

    ఎలా ఉందంటే..
    ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగు తెరకు కొత్త కాదు. గతంలో ఇలాంటి చిత్రాలు చాలా వచ్చినా..ఇప్పటికే ఈ స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ప్రేక్షకుడిని కాస్త ఎంగేజ్‌ చేసేలా లవ్‌స్టోరీని రన్‌ చేస్తే చాలు..ఆ చిత్రాన్ని ఆదరిస్తారు. దర్శకుడు చైతన్య వర్మ అదే ఫాలో అయ్యాడు. కథలో కొత్తదనం లేకపోయినా..కామెడీ, ఎమోషనల్‌ సీన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండదు. కానీ పంచ్‌ డైలాగ్స్‌, కామెడీ సీన్లతో బోర్‌ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. 

    ఇక సెకండాఫ్ ను పూర్తిగా కధ, కధనాలపైనే దృష్టి పెట్టాడు.  ఆడియన్స్ ను ఎమోషనల్ గా కథకి కనెక్ట్ అయ్యేలా చేయడంలో కొంతవరకు సఫలం అయ్యాడు. తెరపై ప్రధాన పాత్రలను చూస్తుంటే.. మన చుట్టుపక్కల వారిని చూస్తున్నట్లు అనిపిస్తుంది. వారి మధ్య సాగే సన్నివేశాలు..మన జీవితంలోనూ లేదా మన స్నేహితుల జీవితంలోనూ చూసినట్లే అనిపిస్తుంది.  ‘అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు’, ‘అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది’ లాంటి ఆకట్టుకునే డైలాగులు సినిమాలో చాలానే ఉన్నాయి. సినిమాలో సాగదీత సీన్లతో పాటు కొన్ని మైనసులు ఉన్నపటికీ.. డైలాగ్స్‌, నేపథ్య సంగీతం వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. మనకి తెలిసిన కథను అంతే అర్థమవంతంగా యదార్ద సంఘటనల ఆధారంగా జరిగిన కథ ఈ మరువ తరమా

    ఎవరెలా చేశారంటే..  
    రిషి పాత్రకు హరీష్ ధనుంజయ్ న్యాయం చేశాడు. తెరపై చూడడానికి చాలా బాగున్నాడు. నటనలోను ఈజ్ తో చేసాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అవంతిక చాలా బాగా నటించింది. అతుల్య పాత్ర పరిధి మేరకు నటించింది. రోహిణి కనిపించింది కాసేపైనా మంచి పాత్ర. భద్రమ్ రెండు మూడు సీన్లు మాత్రమే పరిమితం అయ్యాడు. దినేష్ పాత్ర చేసిన నటుడు హిలేరియస్ గా నవ్వించాడు.  

    సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ బుల్గానిన్ & ఆరిష్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. బీజీఎంతో పాటు పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    - రేటింగ్‌: 2.5/5

  • కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన  క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. నేడు(నవంబర్‌ 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్‌) నాన్న చిన్నప్పుడే ల్యాండ్‌ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్‌), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ పాండ్యన్‌(సూపర్‌ సుబ్బరాయన్‌) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్‌)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్‌ చేస్తారు. 

    మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్‌ నర్సిరెడ్డి(అజయ్‌ గోష్‌) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్‌ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ(Revolver Rita Movie Story In Telugu). 

    ఎలా ఉందంటే.. 
    అనుకోకుండా హత్య చేయడం..ఆ శవాన్ని తరలించే ప్రయత్నం..ఈ క్రమంలో ఒక్కో ట్విస్ట్‌ బయటకు రావడం.. చివరకు ఈ హత్య వెనక కూడా ఓ రహస్యం ఉండడం..ఇలాంటి నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.  రివాల్వర్‌ రీటా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ఓ హత్య చుట్టూ తిరిగే డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌.  కర్మ ఎవరినీ విడిచి పెట్టదు.. దాని ఫలితాన్ని అనుభవించక తప్పదనే కోణంలో ఈ మూవీ కథనం సాగుతుంది. 

    అయితే  దర్శకుడు ఎంచుకున్న ఈ పాయింట్‌ వినడానికి కొత్తగా అనిపిస్తుంది కానీ...తెరపై మాత్రం అది మిస్‌ అయింది. సినిమా చూస్తున్నంత సేపు దృశ్య 2 మొదలు మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాల వరకు చాలా చిత్రాలు గుర్తుకువస్తాయి.  

    కామెడీ అనుకొని రాసిన సన్నివేశాలు కూడా పెద్దగా పేలలేదు. ఉన్నంతలో రాధికా శరత్‌ కుమార్‌, రెడిన్ కింగ్స్లీ  కాస్త నవ్వులు పంచారు. ఇక ట్విస్టులు అనుకొని రాసిన సన్నివేశాలు కూడా డార్క్‌ కామెడీ చిత్రాలు రెగ్యులర్‌గా చూసేవాళ్లు ఈజీగా పసిగట్టగలరు. 
     
    కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ప్రారంభంలోనే పాండిచ్చేరి డాన్‌ పాండ్య- నర్సిరెడ్డి మధ్య వైర్యానికి గల కారణం ఏంటో చెప్పి..  కథను కామెడీ జానర్‌లోని మార్చేశాడు. రీటా ఫ్యామిలీ పరిచయ సీన్లతో పాటు..పాండ్య హత్యవరకు అన్నీ సీన్లు నవ్వులు పూయిస్తాయి.  హత్య తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

    అయితే ద్వితియార్థంలో వచ్చే చేజింగ్‌ సీన్లు.. బోరింగ్‌గా సాగుతాయి.  ఒకటి రెండు చోట్ల రెడిన్ కింగ్స్లీ వేసే పంచ్‌ డైలాగ్స్‌ నవ్వులు పూయిస్తాయి. అంతేకానీ సునీల్‌ సీన్లతో పాటు జాన్‌ విజయన్‌ సన్నివేశాలు కూడా రొటీన్‌గానే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి.  అయితే ముందుగా చెప్పినట్లు ఈ తరహా కథలు చాలానే రావడం..  క్రైమ్‌, కామెడీ సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేకపోవడంతో.. ‘రివాల్వర్‌ రీటా’  తూట సరిగా పేలలేకపోయిందనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు.

    ఎవరెలా చేశారంటే.. 
    టైటిల్‌ రోల్‌ ప్లే చేసిన కీర్తి సురేశ్‌..మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. అయితే కథలోనే కొత్తదనం లేకపోవడంతో.. ఆమె నటనలోనూ కొత్త కోణం ఏది కనిపించదు. రీటా తల్లి చెల్లమ్మగా నటించిన రాధిక శరత్‌ కుమార్‌.. అమాయకత్వపు పనులతో నవ్వులు పూయించింది. సునీల్‌ పాత్ర లుక్‌ చాలా సీరియస్‌గా ఉన్నప్పటికీ.. అది తెరపై కనిపించలేదు.  జాన్‌ విజయన్‌ కూడా రొటీన్‌ పోలీసు పాత్రలో కనిపించాడు. 

    రెడిన్ కింగ్స్లీ ఎప్పటి మాదిరే తనదైన పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. బాత్రూం సీన్‌ ఒక్కటి బాగా వర్కౌట్‌ అయింది. సూపర్ సుబ్బరాయన్, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం ఓకే. దినేష్ కృష్ణన్. బి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రవీణ్. కె.ఎల్ ఎడిటింగ్‌ పర్వాలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. 


     

  • వరస ఫ్లాప్స్ దెబ్బకు కాస్త గ్యాప్ తీసుకున్న రామ్.. తాజాగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. నిన్న రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరీ సూపర్ అని చెప్పట్లేదు గానీ బాగానే ఉందనే టాక్ అయితే వచ్చింది. ఓ రకంగా చూస్తే అటు రామ్, ఇటు భాగ్యశ్రీ కాస్త హ్యాపీ అనే చెప్పొచ్చు. మరి ఈ మూవీకి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి? ఓవర్సీస్ కలెక్షన్ సంగతేంటి?

    (ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ మూవీ రివ్యూ)

    రామ్ కొత్త సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.4 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే రూ.4.5 నుంచి రూ.5 కోట్ల మధ్య నెట్ వసూళ్లు ఉండొచ్చని సమాచారం. ఓవర్సీస్‌లోనూ రెండు లక్షల 75 వేల డాలర్ల వసూలు చేసినట్లు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఈ విషయం 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రానికి కలిసి రావొచ్చు. వచ్చే వారం 'అఖండ 2' ఉంది కాబట్టి ఈ ఏడు రోజుల్లో ఈ సినిమా ఎంత రాబడుతుందనేది చూడాలి?

    'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయానికొస్తే.. 100వ సినిమా చేస్తున్న తెలుగు స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కు అనుకోని ఓ కష్టం వస్తుంది. షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. మొదలవ్వాలంటే రూ.3 కోట్లు అవసరమవుతాయి. ఎవరిని అడిగినా సూర్యకు సాయం చేయరు. ఆస్తిని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో సూర్య అకౌంట్‌లో రూ.3 కోట్లు జమ అవుతాయి. ఆ డబ్బు తన వీరాభిమాని సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ సాగర్ ఎవరు? తన హీరో కోసం సాగర్ ఎలాంటి త్యాగం చేశాడు? సాగర్‌-మహాలక్ష‍్మీ ప్రేమకథకు రూ.3 కోట్లకు సంబంధమేంటనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

  • బాలీవుడ్‌ హీరోయిన్‌, గేమ్‌ ఛేంజర్‌ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్‌ పొందింది. కియారా- సిద్దార్థ్‌జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్‌ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. 

    సిద్దార్థ్‌లోని స అక్షరాన్ని, కియారా(Kiara Advani) లోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం.  అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్‌ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.

    సినిమాలు
    సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్‌బాబు సరసన 'భరత్‌ అనే నేను', రామ్‌చరణ్‌ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ 'వార్‌ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది.  ప్రస్తుతం యష్‌ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్‌ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్‌: ఫోర్స్‌ ఆఫ్‌ ద ఫారెస్ట్‌' మూవీలో యాక్ట్‌ చేస్తున్నాడు.

     

     

    చదవండి: 

  • తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో ఫస్ట్‌ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్‌ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్‌ వన్‌సైడ్‌ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్‌ స్టోరీలో చూసేద్దాం.

    తనూజ చుట్టూ బిగ్‌బాస్‌ 9
    ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్‌ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్‌ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. 

    బలమైన ఓటింగ్‌
    అన్నింటికీ సపోర్టింగ్‌ గేమ్‌ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్‌లో మాత్రం తనకెవరూ సపోర్ట్‌ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో (ఓటీటీ సీజన్‌ మినహా) తొలి లేడీ విన్నర్‌ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్‌ ప్రేక్షకుల ఓటింగ్‌ ఆ రేంజ్‌లో ఉంది.

    నెక్స్ట్‌ పవన్‌ కల్యాణ్‌ పడాల
    మొదట్లో కల్యాణ్‌ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్‌ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్‌ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్‌ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్‌ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్‌ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్‌ తీసుకునేవాడు కాడు. ఇది టాప్‌ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్‌ జవాన్‌ అన్న కార్డు ఉపయోగించారు. 

    మరో పల్లవి ప్రశాంత్‌
    జై జవాన్‌ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్‌లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్‌ టైటిల్‌ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్‌ స్ట్రాటజీలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. జై జవాన్‌ జై కిసాన్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఆల్‌రెడీ నినాదాలు మొదలుపెట్టారు.

    మంచోడే కానీ ఎక్కువ హైప్‌
    కల్యాణ్‌కు యాక్టింగ్‌ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్‌ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్‌ టీమ్‌ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్‌ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    మిగిలింది ఇమ్మాన్యుయేల్‌
    ఇమ్మాన్యుయేల్‌ (Emmanuel) ఆల్‌రౌండర్‌. గేమ్స్‌ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్‌ అంటే భయం. ఎవరైనా నామినేట్‌ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్‌ అయింది. కొన్నిసార్లు సేఫ్‌ గేమ్‌ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. 

    సూట్‌కేస్‌ తీసుకోవడం మేలు
    కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్‌లో తన స్థానం టాప్‌ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్‌ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది.  మరో మూడు వారాల్లో బిగ్‌బాస్‌ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!

    చదవండి: బిగ్‌బాస్‌9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్‌? పవన్‌ ఓడించి మరీ..

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్‌ పాల్గొన్న కార్యక్రమంలో భద్రతా వైఫల్యం బయటపడింది. రిపోర్టర్ల ముసుగులో ఆగంతకులు పోలీసుల కళ్లు గప్పి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

    హైటెక్ సిటీ ఆవాస హోటల్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఏకంగా 8 నేషనల్‌ మీడియా చానెల్స్‌కు చెందిన లోగోస్‌ పట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. అతని వెంట మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఒరిజిల్‌ నేషనల్‌ మీడియా ప్రతినిధులు ఆ ఇద్దరి కదలికలపై అనుమానంతో ప్రశ్నించారు. చివరకు నకిలీ రిపోర్టర్లుగా నిర్ధారించుకుని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసిన మాదాపూర్ పోలీసులు.. ఎంక్వైరీ ప్రారంభించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: కోకాపేటలో రియల్‌ సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) భూముల రెండో విడత వేలంలో మరో రికార్డు నమోదైంది. ఎకరం ధర అత్యధికంగా రూ.151 కోట్లు పలికింది. 

    గోల్డెన్‌ మైల్‌లోని ప్లాట్‌నెంబర్‌ 15, ప్లాట్‌నెంబర్‌ 16 భూములకు శుక్రవారం వేలం జరిగింది. అయితే.. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్ల ధర పలికింది. జీహెచ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ఈ ధరకు భూముల్ని దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో 4.03 ఎకరాలకుగాను రూ.609 కోట్ల 55 లక్షలను హెచ్‌ఎండీ పొందింది. 

    ఇక ప్లాట్ నెంబర్ 16లో(మొత్తం 5.03 ఎకరాలు) ఎకరం ధర రూ.147.75 కోట్లు పలికింది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ తన భూముల్ని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. 

    మొదటి విడత వేలంలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు ఆక్షన్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,708 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్‌ 3, డిసెంబర్‌ 5వ తేదీల్లో  గోల్డెన్ మైల్‌లోని మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. చివరి ఆక్షన్‌ కావడంతో ఈ రికార్డులు బద్ధలు అవుతాయో లేదో చూడాలి. 

  • వనపర్తికి చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి 30 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో ఆయన తండ్రితో పరీక్షల ఫీజుపై గొడవ జరిగింది. దీనికి కలత చెందిన ఆ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. నిమిషాల వ్యవధిలోనే  సైబర్ పోలీసులకు ఓ అలర్ట్‌ వెళ్లింది. ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆ విద్యార్థి దగ్గరకు చేరుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

    హైదరాబాద్ సాక్షి: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఏవరో తిట్టారనే కోపంతో లేదంటే జీవితంలో విఫలమయ్యమనే బాధతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడి తమ జీవితాలను ముగించి తమను నమ్ముకున్న వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపై వెంటనే స్పందించి బాధితుల ఆత్మహత్య ప్రయత్నాలను తెలంగాణ సైబర్‌ పోలీసులు భగ్నం చేస్తున్నారు.  

    తెలంగాణ సైబర్ పోలీసులు ఆత్మహత్యల్ని నిరోధించడానికి సరికొత్త సాంకేతికతను వాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా ఆత్మహత్య ప్రేరేపిత వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులకు సమాచారం చేరేలా సిస్టమ్ రూపొందించారు. హెచ్చరికలు రావడంలో తక్షణమే స్పందించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ అలర్ట్స్ తో గడిచిన నాలుగు వారాల్లో 12 మందిని బలవన్మరణాలకు పాల్పడకుండా కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

    ..నిజామాబాద్ లో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహాత్య చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. ఆ అలర్ట్స్ సైబర్ పోలీసులకు వెళ్లడంతో వెంటనే పోలీసులు అతనిని రక్షించారు. ఇలా గడిచిన 4 వారాలలో 12 మందిని రక్షించినట్లు సైబర్ పోలీసులు తెలిపారు.

    సామాజిక మాధ్యమాలలో ఆత్మహాత్యలకు సంబంధించిన ఏదైనా వీడియోలు లేదంటే ఫోటోలు ప్రచురితమైతే దానికి సంబంధించిన సమాచారం వెంటనే సైబర్ పోలీసులకు చేరుతోంది. ఈ విధంగా సమాచారాన్ని అందించేలా పలు సామాజిక మాధ్యమాలతో తెలంగాణ సైబర్ పోలీసు విభాగం ఒప్పందం జరిపినట్లు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. 

    సోషల్ మీడియాలో ఏవైనా అభ్యంతకర పోస్టులు పెడితే 10 నిమిషాలలోపే మాకు హెచ్చరికలు వస్తాయి. దీంతో మేము సంబంధిత పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేస్తాం అని శిఖా గోయల్ అన్నారు. దీనివల్ల ఇప్పటి వరకూ ఎన్నో ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు.

  • హైదరాబాద్‌: దేశ రాజధానిలో తెలంగాణ ఈగల్‌ టీమ్‌ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో కీలక ఆధారాలను సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తున్న డ్రగ్స్‌ దందాను గుర్తించిచామన్న అధికారులు.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

    హైదరాబాద్‌లో మల్నాడు రెస్టారెంట్‌, మహీంద్రా యూనివర్సిటీ కేసులను విచారించగా ఈ డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. ఢిల్లీలో 20 ప్రాంతాలతో పాటు నోయిడా, గ్వాలియర్‌, విశాఖలో తనిఖీలు నిర్వహించాం. ఒక్క ఢిల్లీలోనే 16 విక్రయ కేంద్రాలను గుర్తించాం. యాభై మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నాం. వీళ్లలో చాలామందిని డిపోర్ట్‌ చేయించే ఉద్దేశంలో ఉన్నాం. 

    నైజీరియాకు చెందిన నిక్కీ ఆధ్వర్యంలో ఈ దందా నడిచింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుంది ఈ నెట్‌వర్క్‌. ఇప్పటిదాకా సుమారు 2 వేల మందికి డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు గుర్తించాం. ప్రముఖ కొరియర్‌, పార్శిల్స్‌ సర్వీసులతోనే ఈ వ్యవహారం నడిచింది. గార్మెంట్స్‌, కాస్మోటిక్స్‌, షూల మధ్యలో ఉంచి పంపిణీ చేశారు.

    వందలాది మ్యూల్‌ అకౌంట్లు చేర్పాటు చేసి లావాదేవీలు నడిపారు. సుమారు 2,000సార్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించాం. 59 మ్యూల్‌ అకౌంట్లు సీజ్‌ చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నాం. హైదరాబాద్‌కు చెందిన 11 మంది డ్రగ్స్‌ పెడ్లర్లను గుర్తించి అరెస్ట్‌ చేశాం అని ఈ భారీ ఆపరేషన్‌ వివరాలు మీడియాకు వెల్లడించారు.

  • ఏందిరాబై మీ ఊరి సర్పంచ్‌ పదవికి పోటీ బాగా ఉందంట గదా... అవు మల్లా ఏమనుకుంటున్నావు... పోటీలో ఎందరు ఉన్నా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ, ఒక్కో అభ్యర్థి రూ.కోటి వరకూ ఖర్చు పెడతా అంటున్నాడు... అగో గిదేంది మరి అంత ఖర్చా... అవురా మరి సర్పంచ్‌ సీటు అంటే అంత క్రేజీ ఉంది.  ఎవరైనా పోటీలో దిగాలంటే కనీసం రూ. కోటి జమ ఉంచుకోవాల్సిందే.. ఇది మేజర్‌ పంచాయతీలలో జరుగుతున్న చర్చ. 

    మోర్తాడ్‌(బాల్కొండ): పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎలక్షన్స్‌ హీట్‌ పెరిగింది. మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవికి పోటీ చేసేవారు రూ. కోటి ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో ఎక్కడ చూసినా ఖర్చుపైనే చర్చ సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి నామమాత్రం లెక్క చూపుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం భారీగా సొమ్ము కుమ్మరించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

    మండల కేంద్రాలు, జాతీయ రహదారిని ఆనుకొన్ని ఉన్న గ్రామాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ సర్పంచ్‌ పదవిని పొందడానికి అభ్యర్థులు రూ. కోటి వరకూ సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్‌ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా ఖర్చు విషయంలో మాత్రం అభ్యర్థులు వెనుకంజ వేయకపోవడం చూస్తుంటే పదవిపై ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదని స్పష్టమవుతుంది. మోర్తాడ్, ముప్కాల్‌లలో సర్పంచ్‌కు పోటీ చేసే అభ్యర్థులు రూ. కోటి వరకూ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమ్మర్‌పల్లి, మెండోరా, బాల్కొండ, వేల్పూర్, అంక్సాపూర్, లక్కోరా తదితర గ్రామాలలో పోటీ చేసే ఆశావాహులు రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

     చిన్నచితకా పంచాయతీల్లో ఆదాయం మాట ఎలా ఉన్నా పదవి పొందాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఖర్చు చేయాలనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు చూపే ఖర్చు క్రమ పద్ధతిలోనే ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం అభ్యర్థుల ఖర్చు అంచనాలను మించిపోతుంది. సర్పంచ్‌ పదవికి ఫుల్‌ డిమాండ్‌ ఉండటం, ఎక్కడ చూసినా రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం పెరిగిపోవడంతో పదవి కోసం అభ్యర్థులు అంచనాలను మించి ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా సర్పంచ్‌ పదవిపై మోజుతో జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎంతో మంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు.    

  • మోర్తాడ్‌(బాల్కొండ): సొంత గ్రామానికి సర్పంచ్‌గా ఎంపిక కాలేకపోయినా ఆర్మూర్‌ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వివిధ శాఖలకు మంత్రిగా, ఒకసారి జడ్పీ చైర్మన్‌గా ఎంపికైన శనిగరం సంతోష్‌రెడ్డి విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నారు. భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌కు చెందిన సంతోష్‌ రెడ్డి 1971లో సర్పంచ్‌గా ఎంపిక కావాలనే ఉద్దేశ్యంతో వార్డు స్థానానికి పోటీ చేశారు. అప్పట్లో వార్డు సభ్యునిగా ఎంపికైన వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్‌ పదవిని పొందేవారు. 

    అలా వార్డు సభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. గ్రామ రాజకీయాలు కలిసి రాకపోవడంతో ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ లో క్రియాశీలక నేతగా గుర్తింపు పొంది 1978లో తొలిసారి ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి ఎమ్మెల్యేగా ఎంపికై ఆర్థిక శాఖ, రోడ్లు భవనాలు, భారీ పరిశ్రమల శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2002లో భీమ్‌గల్‌ జడ్పీటీసీగా గెలిచి బీఆర్‌ఎస్‌ తరఫున జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా కొన్ని నెలలపాటు పనిచేశారు.    

International

  • పుల్వామా అటాక్ కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల లోవీ ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వేలో భారత్ 40 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా 80 పాయింట్లతో మెుదటి స్థానంలో నిలువగా చైనా 73.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.  భారత్ తరువాత 38.8 తో జపాన్ , 32.1తో రష్యా వరుసగా  , నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

    అయితే రక్షణ నెట్ వర్క్ ల అంశంలో భారత్ రెండు స్థానాలు కోల్పోయి 11 స్థానంలో నిలిచింది.  అదే పెట్టుబడులను ఆకర్షించే అంశంలో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచికలో అమెరికా మెుదటి ప్లేస్ లో ఉంది.  ఆర్థిక, మిలిటరీ రంగాలలో మంచి పురోగతి సాధించడంతోనే భారత్ ర్యాంకు మెరుగుపడిందని విశ్లేశకులు అంచనా వేస్తున్నారు. సాంకేతికత, పరపతి, అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను లోవీ ఇనిస్టిట్యూట్ ర్యాంకులను ప్రకటిస్తుంది. భారత్ సైనిక సామర్థ్యం ప్రస్తుతం ఎంతో మెరుగ్గా ఉందని సంస్థ పేర్కొంది.

     

  • ఉక్రెయిన్‌ సంక్షోభ విషయంలో రష్యాపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశ చమురు విషయంలో భారత్‌పై సుంకాల యుద్ధమే చేశారు. రెండు దఫాలుగా 50 శాతం అన్యాయంగా పన్నులు విధించారు. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని.. జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్‌ కుండబద్ధలు కొట్టింది. ఈ క్రమంలో ట్రంప్‌ చేసిన పలు ప్రకటనలనూ (పాక్‌-భారత్‌ ఉద్రిక్తతలను ఆపానంటూ చేసినవి కూడా) ఖండించింది కూడా.  

    ఈలోపు.. షాంగై సదస్సులో పుతిన్‌-మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడంలాంటివి ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ రెండు దేశాలవి డెడ్‌ ఎకానమీలని.. అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ  ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆయన స్వరం మారింది. భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతోందని.. ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని.. భారత్‌తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు. అఫ్‌కోర్స్‌ భారత్‌ వాటిని ఖండించింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో.. 

    రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వాస్తవంగా ఈ ఇద్దరు శక్తివంతమైన నేతల భేటీపై గత ఆరు నెలలుగా ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.  వీళ్ల కలయిక అంటే ఏమాత్రం మిండుగు పడని ట్రంప్‌ ఎలా స్పందిస్తారో ? అనేదే అందుకు ప్రధాన కారణం. 

    వాస్తవానికి రష్యా చమురును భారత్‌కు దూరం చేయాలని ట్రంప్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే ఆ పాచికలేవీ పారలేదు. సరికదా ట్రంప్ నుంచి రష్యా చమురు సరఫరాదారులైన ఆంక్షల ప్రకటన వెలువడగానే భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ మాస్కోకు వెళ్లి పుతిన్‌తో సమావేశం అయ్యారు. అటుపై పుతిన్ సన్నిహితుడైన నికోలాయ్ పెత్రుషెవ్‌తో ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడేమో డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటిస్తారనే ప్రకటన వెలువడింది. 

    పుతిన్‌ ఢిల్లీలో జరగబోయే 23వ రష్యా-భారత్‌ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. అయితే భారత్‌తో భారీ ఎత్తున ఒప్పందాల ఎజెండాతోనే రష్యా అధ్యక్షుడు భారత్‌కు వస్తున్నారా?.. ఉక్రెయిన్‌ సంక్షోభం ముగించేందుకు మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్‌ కోరనున్నారా?  రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్‌ మాటల్ని పట్టించుకోకూడదని చెబుతారా? అసలు ఇవేవీ కావు.. సైనికపరమైన సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నారా?.. పుతిన్ భారత్‌కు ఎందుకొస్తున్నారనే ప్రశ్నలపై చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంతో పాక్‌ క్షిపణులను తుక్కు చేసి ప్రపంచానికి సత్తా చాటిన భారత్‌ ఇప్పుడు రష్యా ఆయుధ సంపత్తిపై ఆసక్తి ప్రదర్శిస్తుందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పైగా మేక్‌ ఇన్‌ ఇండియానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితుల్లో అది కష్టతరమేనన్న అభిప్రాయమూ రక్షణ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే అమెరికా ఆంక్షలను లెక్కచేయని తరుణంలో పుతిన్‌ భారత్‌తో మరో కోణంలోనూ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందులో.. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్తు ప్లాంట్‌లో కొత్త మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా భాగస్వామిగా మారే అవకాశం బలంగానే కనిపిస్తోంది. 

    ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుదీర్ఘంగా భేటీ అయిన పుతిన్.. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు రావడం ట్రంప్‌ను ఒత్తిడికి గురిచేసే అంశమే. అందుకే వీళ్ల దోస్తీపై ఆయన పగబట్టారు. అదీగాక అమెరికా, యూరప్‌ దేశాలకు వ్యతిరేకంగా పుతిన్ ఆసియా దేశాలతో ఓ బలమైన కూటమిగా ఎదిగేతే గనుక.. అందులో భారత్‌ ప్రధాన భూమిక అవకాశాలను తోసిపుచ్చలేం. అందుకే భారత్‌తో మరింత దగ్గరైతే రష్యా మళ్లీ సూపర్ పవర్‌గా ఎదుగుతుందనే భయం ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

    :::వెబ్‌డెస్క్‌ స్పెషల్‌

  • మూడో ప్రపంచ దేశాల వలసల విషయంలో కఠిన వైఖరి అవలంభించబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేశారు. వైట్‌హైజ్‌ సమీపంలో జరిగిన ఉగ్రదాడే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ నేపథ్యంలో అసలు ఆ మూడో ప్రపంచ దేశాలంటే ఏంటనే ప్రశ్న తెర మీదకు వచ్చింది..  

    బుధవారం అమెరికా వైట్ హౌస్ వద్ద అప్గాన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి  నేషనల్‌ గార్డ్స్‌ సిబ్బందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళా సిబ్బంది మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై భగ్గుమన్న ట్రంప్‌.. మరోసారి ఇమిగ్రేషన్ పాలసీపై కఠిన ఆంక్షల ప్రస్తావన తీసుకొచ్చారు. "నేను శాశ్వతంగా మూడో ప్రపంచ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధిస్తాను. బైడెన్ ప్రభుత్వంలో అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని పంపిస్తాను. అదే విధంగా దేశానికి ఉపయోగకరంగా లేకుండా అమెరికాను ప్రేమించకుండా ఉన్న వారిని దేశం నుంచి పంపిస్తాను. అమెరికాలో శాంతిని దెబ్బతీసేవారిని సభ్యత్వం రద్దు చేస్తాను. వారికి మన దేశంలో ఎటువంటి సబ్సిడీలు అందకుండా చేస్తాను" అని ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.  

    మూడో ప్రపంచ దేశాలంటే.. 
    కోల్డ్ వార్ సమయంలో(1947-1991) మెుదటి సారిగా ప్రపంచ దేశాలను విభజిస్తూ పదం వాడారు. పెట్టుబడిదారి  వ్యవస్థ, నాటో కూటమిలో సభ్యత్వం కలిగిన దేశాలను మెుదటి ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. వీటికి అమెరికా నేతృత్వం వహించేది. ప్రణాళికమైన ఆర్థిక వ్యవస్థ వార్సా ఒప్పందంలో (నాటోకి ప్రత్యామ్నాయంగా) భాగమైన దేశాలను రెండవ ప్రపంచ దేశాలుగా పిలిచేవారు. ఈ దేశాలకు యూ.ఎస్.ఎస్ ఆర్ నాయకత్వం వహించేది. ఈ రెండు కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉన్న దేశాలను మూడో ప్రపంచ దేశాలు అనేవారు. అయితే..

    ఆ సమయంలో అభివృద్ధి చెందకుండా ఉన్న దేశాలను, పేదరికంలో మగ్గే దేశాలను మూడో ప్రపంచ దేశాల కేటగిరీలో చేర్చారు. ఈ జాబితాలో ఆనాడు భారత్‌ కూడా ఉండేది. అయితే ఈ భావన కేవలం రాజకీయ పదం మాత్రమే. దీనికంటూ ఓ అధికారిక గుర్తింపులాంటిదేం లేదు.

    ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంతో.. 
    ట్రంప్‌ తాజా ప్రకటన నేపథ్యంతో ఆ మూడో ప్రపంచ దేశాలు ఏంటా? అని వెతుకులాట మొదలైంది. యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకారం.. థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదానికి అసలే అర్థమే లేదు. అయితే ఐక్యరాజ్య సమితి ప్రకారం అత్యంత అభివృద్ధి చెందిన జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. ఇందులో ఆఫ్రికా నుంచి 32 దేశాలు, ఆసియా నుంచి 8 దేశాలు, ఒక కరేబియన్‌ దేశం(హైతీ,), ఫసిఫిక్‌ రీజియన్‌లోని మూడు దేశాలు ఉన్నాయి. ఈ లెక్కన అభివృద్ధి లేకుండా పేదరికంలో మగ్గుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా భావించొచ్చు.

    ఆయన ఉద్దేశం అదేనా?..
    అయితే ట్రంప్‌ డిక్షనరీలో దీనర్థం వేరే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే.. గతంలో ట్రంప్‌ యూఎస్‌కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ లిస్ట్‌లో అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, యెమెన్‌, మయన్మార్‌, చాద్‌,  కాంగో, ఈక్వెటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్‌ దేశాలు ఉన్నాయి. వీటితోపాటు ఏడు దేశాల ప్రయాణికులపైనా అప్పట్లో పాక్షికంగా నిషేధం విధించారాయన. దీంతో తాజా ప్రకటన ఆ దేశాలను ఉద్దేశించేనా? అని విశ్లేషణ నడుస్తోంది. 

    ఇంతకీ భారత్‌ ఎక్కడుంది?
    ట్రంప్‌ థర్డ్‌ వరల్డ్‌ కంట్రీస్‌ ప్రకటనతో రాజకీయ విశ్లేషకులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఆయన ఏ ప్రతిపాదికన ఆ వార్నింగ్‌ ఇచ్చి ఉంటారో అర్థం కాక యూఎస్‌ సాయం మీద ఆధారపడిన పేద దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతానికైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు, లో.. లోయర్‌ మిడిల్‌ ఇన్‌కమ్‌ దేశాలు అనే పాదాలను వాడుతున్నారు. ఒకప్పుడు భారత్‌ థర్డ్‌ వరల్డ్‌ కంట్రీస్‌ జాబితాలోనే ఉండేది. అయితే.. ఇప్పుడు భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. అంతేకాదు.. ఈ మధ్యే జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కూడా.

  • భారీ వర్షాలతో థాయిలాండ్‌ అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టి ధాటికి పెద్ద ఎత్తున  వరదలు రావడంతో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

    దక్షిణ థాయిలాండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.  12 దక్షిణ ప్రావిన్సులలో  ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో 145 మంది మృతి చెందారు. కేవలం సాంగ్లా ప్రావిన్సులోనే 110 మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో భవనాలు నీటమునిగాయని.. వరదల దాటికి రోడ్లు కొట్టకుపోయాయని,  తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది. అయితే.. ఈ వరదల ప్రభావంతో 32 లక్షల మంది ప్రభావితం అయ్యారని ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

    వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాలు జలమయంలోనే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు ప్రజల దైనందిన జీవితం దెబ్బతింది. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో విపత్తు నిర్వహాణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. 

Business

  • రెనాల్ట్ కంపెనీ.. కొత్త తరం డస్టర్ కారును భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అంతకంటే ముందే సంస్థ దీనిని టెస్ట్ చేయడం ప్రారంభించింది. దీంతో ఈ కారుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    కొత్త డస్టర్ కారును.. రెనాల్ట్ కంపెనీ 2026 జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇది కొత్త డిజైన్, ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఏముంటుందనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీనిని ప్రత్యర్థులకు పోటీగా.. వాహన వినియోగదారులను ఆకట్టుకునేలా నిర్మించనున్నట్లు అర్థమవుతోంది.

    ఒకప్పుడు దేశీయ మార్కెట్లో.. మంచి అమ్మకాలతో, వివిధ ఉత్పత్తులను లాంచ్ చేసిన రెనాల్ట్ కంపెనీ.. ప్రస్తుతం కైగర్ కారును మాత్రమే విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు సంస్థ.. తన ఉనికిని విస్తరించుకోవడంలో భాగంగా కొత్త కారును ప్రవేశపెడుతోంది. ఇందులో వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు గ్రిల్ బోల్డ్ RENAULT అక్షరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

    రాబోయే రెనాల్ట్ డస్టర్ కారు.. అనేక పవర్‌ట్రెయిన్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కలిపి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, మొత్తం 128.2 hp ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. 1.2kWh బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జతచేసిన 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, 138 hp గరిష్ట ఉత్పత్తిని అందిస్తుంది. అదనంగా, 98.6 hpని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్-LPG ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్ పొందుతుందని సమాచారం.

  • ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్.. టక్కీట్ సహకారంతో.. మొత్తం లేదు మెట్రో స్టేషన్లలో స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించింది. ఇది ప్రయాణికుల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

    మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్టోరేజ్ లాకర్లు.. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు & ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరచుకోవచ్చు. చేతిలో వస్తువులు లేకుండా.. తిరగాలనుకునే ప్రయాణికులకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ప్రారంభోత్సవం.. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో జరిగింది.

    ఎలా ఉపయోగించుకోవాలంటే?
    లాకర్ ప్యానెల్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మీ వస్తువులు ఎన్ని ఉన్నాయి, ఎంత పరిమాణంలో లాకర్ కావాలనే విషయాన్ని ఎందుకోవాలి. మీరు ఎంతసేపు మీ వస్తువులను అక్కడ ఉంచాలో.. దానికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం కేవలం 30 సెకన్లలోపు పూర్తవుతుంది.

    ఏడు మెట్రో స్టేషన్స్
    మియాపూర్
    అమీర్‌పేట్
    పంజాగుట్ట
    LB నగర్
    ఉప్పల్
    పరేడ్ గ్రౌండ్
    హై-టెక్ సిటీ

  • మూడవ తరం హోండా అమేజ్.. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్-టెస్ట్ ప్రోగ్రామ్ కింద.. పెద్దల ప్రయాణీకులకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ & పిల్లల ప్రయాణీకులకు 4-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కుటుంబ సెడాన్‌లలో ఒకటిగా నిలిపింది.

    క్రాష్ టెస్టింగ్‌లో హోండా అమేజ్ గొప్ప ఫలితాలను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16కి 14.33 పాయింట్లు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 16కి 14.00 స్కోర్ చేసి.. మొత్తం అడల్ట్ సేఫ్టీ టెస్టులో 24కి 23.81 స్కోర్ సాధించింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, లోడ్ లిమిటర్‌లతో కూడిన బెల్ట్ ప్రిటెన్షనర్లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సార్లు, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్‌లు వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు

    పిల్లల సేఫ్టీ విషయంలో.. అమేజ్ CRS ఇన్‌స్టాలేషన్‌లో 12/12 స్కోర్‌ను సాధించింది. ఈ సెడాన్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, ఈబీఎస్ విత్ ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్, రియర్ డీఫాగర్ అండ్ చైల్డ్-సేఫ్టీ లాక్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణంలో రక్షణ కల్పిస్తాయి.

  • ఈ రోజుల్లో ఐఫోన్ కొనుగోలు చేయడం అనేది.. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. ఈ కారణంగానే కొత్త మోడల్ మార్కెట్లోకి రాగానే ఎగబడిమరీ కొనేస్తుంటారు. ధరలు ఎంత ఉన్నప్పటికీ.. తగ్గేదే అన్నట్టు ఈఎంఐ ఎంపిక చేసుకుంటున్నారు. ఇటీవల రూ. 26వేలు జీతం ఉన్న వ్యక్తి.. రూ. 70000 ఐఫోన్ కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఢిల్లీకి చెందిన కవల్జీత్ సింగ్ (ఖడక్ సింగ్ దా ధాబా కో ఫౌండర్, ది చైనా డోర్ ఫౌండర్) తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. రూ. 26,000 జీతం ఉన్న తన ఉద్యోగి రూ. 70,000 ఐఫోన్‌ను ఎలా కొన్నారో వివరించారు. తన ఉద్యోగి ఇంత బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం.. తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయారు.

    ఐఫోన్ కొన్న ఉద్యోగి.. తన కంపెనీలో డెలివరీ డ్రైవర్‌గా చేరారని, కొన్ని సంవత్సరాలలోనే అతడు స్థానిక కార్యకలాపాలను చూసుకుంటున్నారని కవల్జీత్ సింగ్ అన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సంస్థ నుంచి రూ. 14000 అడ్వాన్స్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని 12 నెలల ఈఎంఐ ఆప్షన్ కింద చెల్లింపు ఎంచుకున్నాడు.

    తన జీతం రూ. 26000, ఇప్పుడు ఐఫోన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాడు, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే అతనిపై తన ముగ్గురు పిల్లలు, భార్య ఆధారపడి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. అతడు ఐఫోన్ కొనడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని కవల్జీత్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

    దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు అతని నిర్ణయాన్ని తప్పుపట్టారు. మరికొందరు కవల్జీత్ సింగ్ తక్కువ జీతం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని.. తాను తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు.

  • భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్‌లెట్‌. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది.

    డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.

    బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్‌లెట్‌లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

    యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్‌లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్‌లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్‌ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్‌లెట్‌లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.

    ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్

  • భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇది కొన్ని సర్వేలు అంచనా వేసిన 7.3 శాతం వృద్ధి రేటును మించిపోయింది.

    ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ వస్తువుల వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక సగటున 4.1% పెరిగింది (గత సంవత్సరం 2.7%), తయారీ ఉత్పత్తి 4.9% పెరిగింది (గత సంవత్సరం 3.3%) అన్నారు.

    మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా గ్రామీణ వ్యయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో సుమారు 60% వాటాను కలిగి ఉన్న గృహ వినియోగం బలపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ మూలధన వ్యయం 31% పెరిగింది. ఇది మునుపటి త్రైమాసికంలో 52% పెరుగుదల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, సంవత్సరం క్రితం నమోదైన 10% వృద్ధి కంటే మెరుగ్గా ఉంది.

    సరుకుల ఎగుమతులు 8.8% పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7% తగ్గుదలను ఈ గణాంకాలు తిప్పికొట్టాయి. యూఎస్ సుంకాల అమలు కంటే ముందు ఫ్రంట్ లోడెడ్ షిప్‌మెంట్ల ద్వారా ఈ పెరుగుదల నమోదైంది.

    జీఎస్టీ కోతలతో పెరిగిన డిమాండ్

    భారతదేశం సెప్టెంబర్ 22 నుంచి చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌లో ఇది వినియోగాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి రాకముందే గృహోపకరణాలు, కిరాణా సామాగ్రికి డిమాండ్ పెరిగినట్లు కొన్ని సంస్థలు నివేదికలు రూపొందించాయి. జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ వల్ల సామాన్య ప్రజలకు రూ.2 లక్షల కోట్లు మిగులనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ అదనపు డబ్బు భవిష్యత్తులో వినియోగాన్ని మరింతగా పెంచడానికి దోహదపడుతుంది.

    ఆందోళన కలిగించే అంశాలు

    అద్భుతమైన జీడీపీ వృద్ధి సాధించినప్పటికీ కొన్ని ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది. ముఖ్యంగా పట్టణ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు వెనుకబడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ పుంజుకున్నప్పటికీ స్థిరమైన, సమగ్రమైన వృద్ధికి పట్టణ డిమాండ్, ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణ కూడా కీలకం.

    ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

  • నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.

    జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.

    నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.

    ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..

    ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.

  • భారత్‌లోని చాలామంది అత్యంత ధనవంతులు దేశాన్ని వదిలివెళ్తున్న ధోరణి పెరుగుతోంది. దీనికి కారణం పన్నుల నుంచి తప్పించుకోవడం కాదని.. ఇతర అవసరాలున్నాయని ప్రముఖ ఫైనాన్షియల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అక్షత్‌ శ్రీవాస్తవ అన్నారు. ధనవంతులు తమ కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని, భద్రతను, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే కోరికతోనే దేశం విడిచి పోతున్నారని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

    సంపన్న వర్గాలైన హై నెట్ వర్త్ వ్యక్తులు (HNI) విదేశాలకు మకాం మారుస్తుండడంపై కారణాలు తెలుసుకునేందుకు వెళ్లిన వారితో ఆయన ఈ వివరాలు పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చాలా మంది సంపన్నులు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడానికి ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.

    • నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రధానం. దాదాపు 15 ఏళ్ల కిందట పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ పరిస్థితులు ఇంకా దిగజారాయి.

    • కుటుంబం, పిల్లల భద్రత గురించి చాలా మంది దేశం వీడుతున్నారు.

    • పిల్లలకు ఉన్నత విద్యా, వృత్తిపరమైన అవకాశాలను కల్పించాలనే తపనతో కొందరు ఇతర దేశాలకు వెళ్తున్నారు.

    • దేశంలో మౌలిక సదుపాయాల అంతరాలు, అధిక పని భారంతో కూడిన న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థాగత సమస్యలతో కొందరు బయటకు పోతున్నారు.

    ఈ ధనిక పన్ను చెల్లింపుదారులు దేశం విడిచి వెళ్లడం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా పరిణమించవచ్చని శ్రీవాస్తవ హెచ్చరించారు. ‘భారతదేశంలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ప్రత్యక్ష పన్నులు చెల్లిస్తున్నారు. ఒక హోచ్‌ఎన్‌ఐ పన్ను చెల్లింపుదారుడు దేశం నుంచి వెళ్లిపోతే మిగిలిన 98% మందికి ఇది పెద్ద నష్టం. అంటే, దేశంలో పన్ను చెల్లింపుదారులు అతి తక్కువగా ఉన్న తరుణంలో ఎక్కువ పన్నులు చెల్లించే సంపన్న వర్గం నిష్క్రమిస్తే ప్రభుత్వంపై, మిగిలిన ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది’ అన్నారు.

    ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

  • శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 13.71 పాయింట్లు లేదా 0.016 శాతం నష్టంతో 85,706.67 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్లు లేదా 0.048 శాతం నష్టంతో 26,202.95 వద్ద నిలిచాయి.

    సుదీప్ ఫార్మా లిమిటెడ్, నెక్టార్ లైఫ్ సైన్సెస్, మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, 63 మూన్స్ టెక్నాలజీస్, రికో ఆటో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మాగెల్లానిక్ క్లౌడ్, యాథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్, ఇండో యుఎస్ బయో-టెక్, క్రియేటివ్ ఐ, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ & పెర్‌ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్‌మాన్, అరవింద్ శ్రీనివాస్‌లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.

    ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.

    ఓపెన్‌ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్‌'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్‌మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.

    ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 5న జరగబోయే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆహార ధరల పతనం, ఇటీవల వినియోగ వస్తువులపై ప్రకటించిన పన్ను తగ్గింపుల కారణంగా ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నారు.

    రికార్డు కనిష్టానికి ద్రవ్యోల్బణం

    అక్టోబర్‌లో భారతదేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి చేరుకుంది. ఇది సెంట్రల్ బ్యాంక్‌కు రేట్ల తగ్గింపునకు అవకాశం ఇస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 89.49 వద్ద కొత్త కనిష్టాన్ని తాకినప్పటికీ, దేశీయంగా బలహీనపడుతున్న డిమాండ్‌ను పెంచేందుకు ఆర్‌బీఐ మొగ్గు చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని సూచించాయని పేర్కొన్నారు. ఏడాది మొదటి అర్ధభాగంలో 100 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఆర్‌బీఐ ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.

    ఆర్థికవేత్తల అంచనాలు

    నవంబర్ 18-26 మధ్య నిర్వహించిన రాయిటర్స్ పోల్‌లో 18 మంది ఆర్థికవేత్తలు ఆర్‌బీఐ తన డిసెంబర్ 3-5 పాలసీ సమావేశం ముగిసే సమయానికి రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తుందని అంచనా వేశారు. మరో 18 మంది మాత్రం ఎలాంటి మార్పు ఉండదని భావించారు. డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ ‘2025-2026 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాను మరింత సవరించే అవకాశం ఉన్నందున 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు ఉంటుందనే అంచనాలున్నాయి’ అన్నారు.

    ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

  • సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME), భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పనిచేసే స్వతంత్ర, లాభాపేక్షలేని సంస్థ అయిన నేషనల్‌ ఇండస్ట్రీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్ఐఆర్డిసీ (NIRDC), భారతీయ ఎంఎస్ఎంఈలకు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్’ను మెరుగుపరచడానికి రూపొదించిన స్వదేశీ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఇండ్ఆప్ (InDApp)ను అధికారికంగా ప్రారంభించింది. ఈ అప్లికేషన్‌ను సామాజిక న్యాయం & సాధికారిత, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖల రాష్ట్ర మంత్రి బి. ఎల్. వర్మ ఆవిష్కరించారు.

    ఎన్ఐఆర్డిసీ బహుశాఖ ఫెసిలిటేషన్‌ వ్యూహంలో భాగంగా అభివృద్ధి చేసిన ఇండ్ఆప్ (InDApp), ఎంఎస్ఎంఈల కార్యకలాపాల్లో వేగం, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచే ఒకే వేదికగా పనిచేస్తుంది. ప్రభుత్వ అనుమతులు, రియల్‌టైమ్‌ మార్కెట్‌ సమాచారం, జాతీయ వ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలకు సులభంగా ప్రాప్యతను కల్పించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ సుగమమైన, అవగాహనతో కూడిన వ్యాపార నిర్ణయాలను తీసుకునేలా పారిశ్రామికవేత్తలకు శక్తినిస్తుంది.

    ఈ కార్యక్రమానికి ఎన్ఐఆర్డిసి ఉన్నతాధికారులు.. శంభు సింగ్ (రిటైర్డ్ ఐఏఎస్), నేషనల్‌ చైర్మన్‌ డా. లలిత్‌ వర్మ (ఐఏఎస్, రిటైర్డ్), నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ శుభిష్‌ పీ. వసుదేవ్‌, నేషనల్‌ అడ్మినిస్ట్రేటర్‌ డా. కే.వీ. ప్రదీప్‌ కుమార్‌, నేషనల్‌ డైరెక్టర్‌ (అడ్మినిస్ట్రేషన్‌ & ఎస్టాబ్లిష్‌మెంట్‌); ఎస్. మనోజ్‌, డైరెక్టర్‌ (దక్షిణ ప్రాంతం) సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

    ఇండ్ఆప్ భౌతిక అవుట్‌రీచ్‌ను డిజిటల్‌ సౌకర్యాలతో అనుసంధానం చేస్తూ, దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తల కోసం సులభమైన ఎంగేజ్‌మెంట్‌ మోడల్‌ను సృష్టిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ పరిమాణం, రంగం, భౌగోళిక స్థానం ఏమిటన్నది సంబంధం లేకుండా, మైక్రో, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు పారిశ్రామిక అవకాశాలు, మార్కెట్‌ ధోరణులు, ఎగుమతి ప్రమోషన్‌ పథకాలు, ఆర్థిక సబ్సిడీలు, సాంకేతికత అప్‌గ్రేడ్‌లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తక్షణమే పొందేందుకు అనుమతిస్తుంది. వ్యాపార ప్రయాణంలోని ప్రతి దశలో మార్గనిర్ధేశం చేయడం, సహచరులు, భాగస్వాములు, సహకారులకు కలిసే అవకాశాలను విస్తరించడం ద్వారా ఇది సంపూర్ణ వ్యాపార ‌సహాయక వ్యవస్థగా పనిచేస్తుంది. జాతీయ & గ్లోబల్‌ స్థాయిలో ఉన్న అవకాశాలకు MSME లకు ప్రాప్తిని పెంచడం ద్వారా,ఇండ్ఆప్ (InDApp) భారత MSME ఎకోసిస్టమ్‌లో సమగ్రతను బలోపేతం చేస్తూ పోటీశీలతను పెంచుతుంది.

    మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు, InDAppను ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి అభివృద్ధి చేశారు. అవి..

    • ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ

    • మత్స్య, పశుసంవర్థక & పాడి పరిశ్రమ శాఖ

    • వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ

    • వాణిజ్య & పరిశ్రమ మంత్రిత్వ శాఖ

    • పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

    • కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

    • నూతన & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

  • నవంబర్నెల ముగుస్తోంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ప్రారంభం కాబోతోంది. నేపథ్యంలో రానున్న నెలలో చేయాల్సిన పనుల గురించి చాలా మంది ముందుగా షెడ్యూల్వేసుకుంటూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనవి బ్యాంకు పనులు. అయితే ఇందు కోసం బ్యాంకు బ్రాంచిలు రోజుల్లో తెరిచి ఉంటాయి.. ఎప్పుడు సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. నేపథ్యంలో రానున్న నెలలో బ్యాంకు సెలవులు ఏయే రోజుల్లో ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం..

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) క్యాలెండర్ ప్రకారం.. ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతపు మూసివేత కారణంగా డిసెంబరులో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు దాదాపు 18 రోజులు మూసి ఉంటాయి. సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతోపాటు జాతీయ, ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి.

    సెలవు దినాలలో అన్ని బ్యాంకు బ్రాంచీల వద్ద సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఖాతాదారులు తమ బ్యాంకుల ప్రాంతీయ సెలవు క్యాలెండర్ ప్రకారం బ్రాంచీ సందర్శనలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, సెలవు దినాలలోనూ ఆల్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం లావాదేవీలు వంటి ఆన్లైన్ సేవలను వినియోగించుకోవచ్చు.

    డిసెంబర్లో సెలవులు ఇవే..

    • డిసెంబర్ 1 - అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లలో రాష్ట్ర అవతరణ దినోత్సవం

    • డిసెంబరు 3 - గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ

    • డిసెంబరు 7- ఆదివారం

    • డిసెంబరు 12 - మేఘాలయలో పా టోగన్ నెంగ్మింజా సంగ్మా వర్ధంతి

    • డిసెంబర్ 13 - రెండో శనివారం

    • డిసెంబరు 14- ఆదివారం

    • డిసెంబర్ 18 - మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా

    • డిసెంబర్ 19- గోవాలో విమోచన దినోత్సవం

    • డిసెంబర్ 20 - సిక్కిం, గోవాలో లోసూంగ్ / నామ్సూంగ్

    • డిసెంబరు 21- ఆదివారం

    • డిసెంబర్ 22 - సిక్కింలో లోసూంగ్ / నామ్సూంగ్

    • డిసెంబర్ 24 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో క్రిస్మస్

    • డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత

    • డిసెంబర్ 26 - మిజోరం, నాగాలాండ్, మేఘాలయలలో క్రిస్మస్ వేడుకలు

    • డిసెంబర్ 27 - నాలుగో శనివారం

    • డిసెంబరు 28- ఆదివారం

    • డిసెంబర్ 30 - మేఘాలయలో యు కియాంగ్ నంగ్బా వర్ధంతి

    • డిసెంబర్ 31 - మిజోరాం, మణిపూర్ లలో నూతన సంవత్సర వేడుకలు / ఇమోయిను ఇరాట్పా

  • కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తున్న క్రమంలో ఇప్పటి వరకూ ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా లేదా అనధికారికంగా అనుసరిస్తున్న పలు ప్రక్రియలు ఇప్పుడు అధికారికంగా ఒకే రకంగా ప్రామాణీకరణ చెందుతున్నాయి. అలాంటి ప్రక్రియల్లో ఒకటే ఫుల్అండ్ఫైనల్సెటిల్మెంట్(FnF).

    ఉద్యోగులు రాజీనామా చేసినప్పుడు లేదా వారిని యాజమాన్యాలు తొలగించిన సందర్భంలో గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, శాలరీ బకాయిలు, బోనస్, ఇన్సెంటివ్‌లు, పీఎఫ్‌/ఈఎస్ సంబంధిత ఏర్పాట్లు వంటి అనేక చట్టబద్ధ సెటిల్మెంట్లు ఉంటాయి. వీటిని ఇప్పటి వరకూ కొన్ని కంపెనీలు ఉద్యోగుల సర్వీస్కాలం ముగింపు రోజే అంటే చివరి పనిదినమే చెల్లిస్తుండగా మరికొకొన్ని కంపెనీలు 30 రోజుల చట్టబద్ధమైన కాలపరిమితిలో చెల్లించేవి.

    ఇప్పుడు కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగుల ఫుల్అండ్ఫైనల్సెటిల్మెంట్ డబ్బును రెండు పనిదినాల్లో చెల్లించాలి. ఈ విషయంలో గందరగోళం లేకుండా యాజమాన్యాలన్నీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరించేలా కేంద్ర కార్మిక శాఖ ప్రామాణీకరిస్తోంది. అయితే గ్రాట్యుటీ చెల్లింపునకు మాత్రం విడిగా కాల వ్యవధి ఉంటుంది.

    కాగా 2026 ఏప్రిల్ 1 లోపు నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రం సన్నద్ధమవుతోందని, కొత్త కార్మిక నిబంధనలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అమలు చేయడానికి ఇదే కాలక్రమాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు సూచించిందని కార్మిక కార్యదర్శి వందన గుర్నానీ తెలిపారు.

    కొత్త నిబంధన వల్ల ఉద్యోగులకు ప్రయోజనాలు

    • ఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ రావడంతో కొత్త ఉద్యోగానికి మారుతున్నవారికి లేదా మధ్యలో గ్యాప్‌ తీసుకున్నవారికి ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.

    • కంపెనీలు ఏదైనా కారణం చెప్పి సెటిల్‌మెంట్ ఆలస్యం చేయడం ఇక సాధ్యం కాదు. మోసాలు, అన్యాయాలపై నియంత్రణ పెరుగుతుంది.

    • సెటిల్‌మెంట్ ఆలస్యం కారణంగా వచ్చే వివాదాలు, కేసులు తగ్గుతాయి.

    ఇది చదివారా? ఉద్యోగుల చేతికొచ్చే జీతం తగ్గుతుందా?

    కంపెనీలపై ప్రభావం

    • హెచ్ఆర్‌ & ఫైనాన్స్ ప్రక్రియలలో కఠినమైన క్రమశిక్షణ అవసరమౌతుంది. రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయాలంటే హెచ్ఆర్ఎగ్జిట్ ఫార్మాలిటీలను వేగంగా పూర్తి చేయాలి. ఫైనాన్స్ టీమ్ వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలి. మేరకు సిస్టమ్‌లు ఆటోమేటెడ్ కావాలి.

    • రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ పెద్ద కంపెనీలకు సమస్య కాకపోయినా చిన్న, మధ్య తరహా సంస్థలు వెంటనే చెల్లింపుల కోసం క్యాష్ రిజర్వులు ఉంచుకోవాల్సి ఉంటుంది. లేబర్ కోడ్ ఉల్లంఘనకు జరిమానాలు, లీగల్ ఇష్యూలు వస్తాయి. కాబట్టి కంపెనీలు తమ ఎస్వోపీలను అప్‌డేట్ చేయాలి.

    • రెండు రోజుల్లో సెటిల్‌మెంట్ చేయడానికి మాన్యువల్ ప్రాసెస్ కష్టసాధ్యమౌతుంది. ఫలితంగా ఆటోమేషన్, హెచ్‌ఆర్‌ఎంఎస్‌, పేరోల్ టూల్స్ డిమాండ్ పెరుగుతుంది.

Sports

  • మెగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో మ‌రో జ‌ట్టు యాజ‌మాన్యం మార‌నుందా? ఇప్ప‌టికే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్సీబీ) టీమ్‌ను అమ్మ‌కానికి పెట్టారు. తాజాగా మ‌రో జ‌ట్టు కూడా ఇదే బాట‌లో ప‌యనిస్తోంద‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంతకీ ఆ రెండో జ‌ట్టు ఏది? ఈ రెండు జ‌ట్ల‌ను ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న కొనుగోలుదారులు ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఉందా?

    ఒకటి కాదు, రెండు ఐపీఎల్‌ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త హ‌ర్ష్ గోయంకా (Harsh Goenka) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఆర్సీబీతో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్‌ఆర్‌) జ‌ట్టును విక్ర‌యించ‌నున్న‌ట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ రెండు టీమ్‌ల‌ను ద‌క్కించుకునేందుకు న‌లుగురైదుగురు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా అమెరికా చెందిన వారు ఈ జ‌ట్ల‌ను ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ నాటికి ఆర్సీబీ, ఆర్‌ఆర్ జ‌ట్ల యాజ‌మాన్యం మారే అవ‌కాశాలు ఉన్న‌ట్టు దీన్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.

    రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీకి మనోజ్ బాదాలే య‌జ‌మానిగా ఉన్నారు. ఆయ‌న‌కు చెందిన ఎమర్జింగ్ మీడియా IPL లిమిటెడ్‌కు ఈ జట్టులో దాదాపు 65% వాటా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్, మీడియా-వ్యాపార దిగ్గజం లాచ్లాన్ ముర్డోచ్ మైనారిటీ వాటాదారులుగా కొన‌సాగుతున్నారు. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ సుమారు 15% వాటాను కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం దివంగత షేన్ వార్న్ కుటుంబానికి కూడా చిన్న షేర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైప్ప‌టి నుంచి రాజస్థాన్ రాయల్స్ కార్య‌క‌లాపాలు, వ్యూహాత్మక నిర్ణయాలలో మనోజ్ బాదాలే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, 2008లో ఐపీఎల్ తొలి టైటిల్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలిచిన సంగ‌తి క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండే ఉంటుంది.

    మార్చి నాటికి ఆర్సీబీ అమ్మ‌కం పూర్తి
    2025 ఐపీఎల్ టైటిల్ విజేత  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌చ్చే  ఏడాది సీజ‌న్‌కు ముందే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను నవంబర్ 5న అధికారికంగా ప్రారంభించినట్లు ప్ర‌స్తుత యాజ‌మాన్యం డియాజియో ధ్రువీకరించింది. అమ్మకపు ప్రక్రియ వ‌చ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపింది. 

    చ‌ద‌వండి: స్మృతి పెళ్లి వివాదం.. చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..

     

  • PC: WPL

    భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.

    ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్‌ గెలవాలని యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.

    బీసీసీఐ సుముఖంగా ఉంది
    ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్‌ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

    ఆదరణకు ఇదే నిదర్శనం
    ఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్‌ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్‌ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించారు.

    పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?

    మెగ్‌ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్‌ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్‌ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.

    ఒకటి లేదంటే రెండు జట్లు..
    డబ్ల్యూపీఎల్‌ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్‌ జిందాల్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

  • అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్‌ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.

    ‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్‌ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.

    ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

    మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్‌ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్‌ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్‌ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. కాగా మెస్సీ తన టూర్‌లో భాగంగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్‌ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్‌ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 

  • భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్‌ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది.

    ఈ సిరీస్‌కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్‌- బంగ్లాదేశ్‌ మహిళా జట్ల మధ్య సిరీస్‌ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్‌ను వాయిదా వేశారు.

    టీ20 ప్రపంచకప్‌-2026కి సన్నాహకంగా
    ఈ క్రమంలో శ్రీలంకతో భారత్‌ (IND vs SL T20Is) మ్యాచ్‌లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

    ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా కానున్నారు.

    మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేదికలు ఇవే
    నవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య  ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్‌ టోర్నీ ఆడనుంది.

    భారత్‌ వర్సెస్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం
    👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం
    👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం
    👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం
    👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.

    చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

  • భారత క్రికెట్‌ వర్గాల్లో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్‌ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.

    గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ కోచింగ్‌ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ అకస్మాత్‌ రిటైర్మెంట్‌ ప్రకటనల వెనుక గంభీర్‌ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.

    విమర్శలు.. రాజీనామాకు డిమాండ్‌
    అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్‌లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్‌ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, అశ్విన్‌ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్‌ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.

    అండగా ఉంటామని చెప్పినా..
    ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్‌కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    గంభీర్‌ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!
    ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్‌ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్‌ అలా తయారు చేయించానని గంభీర్‌ అంగీకరించిన విషయం తెలిసిందే.

    అదే విధంగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి, యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఆడించే విషయమై గంభీర్‌ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.

    ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులు
    ఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్‌ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన ఆ క్రెడిట్‌ మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపితేనే గంభీర్‌ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!

    చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్‌ కీలక ప్రకటన

  • భారత క్రికెటర్‌, మహారాష్ట్ర కెప్టెన్‌ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి భారీ హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్‌ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్‌కతా వేదికగా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    రాణించిన హైదరాబాద్‌ బ్యాటర్లు
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (12), అమన్‌ రావు (11) నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్‌ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.

    మిగిలి వారిలో భవేశ్‌ సేత్‌ (19) విఫలం కాగా.. తనయ్‌ త్యాగరాజన్‌ (17 బంతుల్లో 32), కెప్టెన్‌ సీవీ మిలింద్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌), మొహ్మద్‌ అర్ఫాజ్‌ అహ్మద్‌ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్‌ సక్సేనాకు రెండు, ఆర్‌ఎస్‌ హంగ్రేగ్కర్‌, విక్కీ ఓస్త్వాల్‌, రామకృష్ణ ఘోష్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

    దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లు
    ఇక హైదరాబాద్‌ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్‌ పృథ్వీ షా (Prithvi Shaw) 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.

    మరోవైపు... అర్షిన్‌ కులకర్ణి సైతం ధనాధన్‌ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అజిమ్‌ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్‌ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

    ఐపీఎల్‌ జట్లకు సందేశం!
    ​కాగా సచిన్‌ టెండుల్కర్‌ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్‌నెస్‌ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.

    ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్‌ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.

    చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. కాగా సొంతగడ్డపై ఆసీస్‌ ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక​ యాషెస్‌ సిరీస్‌ (The Ashes 2025-26)లో తలపడుతున్న విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా పెర్త్‌ వేదికగా నవంబరు 21న ఇరుజట్ల మధ్య మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్‌.. ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

    ఇక డిసెంబరు 4-8 వరకు ఇంగ్లండ్‌- ఆసీస్‌ మధ్య రెండో టెస్టు జరుగనుంది. డే- నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించే ఈ పింక్‌ బాల్‌ టెస్టు (Pink Ball Test) కంటే ముందు ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది.

    కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ అవుట్‌
    ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల యాషెస్‌ తొలి టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins).. రెండో టెస్టుతో తిరిగి వస్తాడనే ప్రచారం జరిగింది. జట్టుతో పాటు అతడు బ్రిస్బేన్‌కు వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం ఇందుకు కారణం. అయితే, అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.

    ఫలితంగా కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ మరోసారి జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇక కమిన్స్‌తో పాటు మరో పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల నొప్పి నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. 

    దీంతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టు బరిలోనూ దిగుతున్నట్లు ఆసీస్‌ ప్రకటించింది. కాగా పింక్‌ బాల్‌ టెస్టుకు బ్రిస్బేన్‌లోని గాబా మైదానం వేదిక.

    సత్తా చాటిన స్టార్క్‌
    కాగా తొలి టెస్టులో కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ లేని లోటును మిచెల్‌ స్టార్క్‌ పూడ్చాడు. మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. కామెరాన్‌ గ్రీన్‌, స్కాట్‌ బోలాండ్‌, బ్రెండన్‌ డాగెట్‌ అతడికి తోడుగా నిలిచారు. 

    ఇక.. ఇంగ్లండ్‌ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో హెడ్‌ సత్తా చాటగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ లబుషేన్‌ అజేయ అర్ధ శతకం (51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్‌ వెదర్లాడ్‌ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

    యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదే
    స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్‌రాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.

    చదవండి: తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

  • అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. 

    ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 

    డిసెంబరు 14న భారత్‌- పాక్‌ మ్యాచ్‌
    గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌ 1 విజేత, క్వాలిఫయర్‌ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్‌-‘బి’ నుంచి బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, క్వాలిఫయర్‌-2 విజేత రేసులో ఉన్నాయి.

    ఇక అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్‌-1 విజేతతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్‌’లో క్వాలిఫయర్‌-3 విజేతతో తలపడుతుంది.

    కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్‌ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్‌’ వేదికగా రెండో సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌- ‘బి’ గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌ విజేతల మధ్య టైటిల్‌ పోరు జరుగుతుంది.

    సెమీస్‌లోనే ఇంటిబాట
    ఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్‌ మండలి టీ20 రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్‌ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్‌ ఫైనల్‌ చేరింది. టైటిల్‌ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.

    అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:
    ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్‌), ​వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), యువరాజ్‌ గోహిల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఎ.పటేల్‌, నమన్‌ పుష్పక్‌, డి. దీపేశ్‌, హెనిల్‌ పటేల్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ఉద్ధవ్‌ మోహన్‌, ఆరోన్‌ జార్జ్‌.

    స్టాండ్‌ బై ప్లేయర్లు: రాహుల్‌ కుమార్‌, హేముచుందేశన్‌ జె, బీకే కిషోర్‌, ఆదిత్య రావత్‌.

    చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

  • టీమిండియా సిరీస్‌ పరాజయానికి హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్‌వాష్‌ అయిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో ​కోచ్‌ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.

    అది సరైంది కాదు
    ‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్‌ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.

    తప్పంతా వాళ్లదే
    భారత క్రికెట్‌ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్‌ బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.

    కోచ్‌, కెప్టెన్‌ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?

    గంభీర్‌ నా బంధువు కాదు.. 
    గంభీర్‌ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్‌ వివరించాడు.  

    కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్‌కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. 

    ఇక భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్‌ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయిన విషయం తెలిసిందే. 

    చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

National

  • కర్ణాటక పవర్‌ పాలిటిక్స్‌లో పూటకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. ఐదేళ్లు తానే సీఎంనంటూ సిద్ధరామయ్య.. అధిష్టానం తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఇటు డీకే శివకుమార్‌లు పోటాపోటీగా ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ పంచాయితీ ఢిల్లీకి రేపోమాపో షిఫ్ట్‌ అవుతుందనే ప్రచారం ఇవాళ జోరుకుంది. అయితే ఈలోపే..

    కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. పదవీ త్యాగం నేపథ్యంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బెంగళూరులో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2004లో అధికారాన్ని త్యాగం చేశారు. తనకు బదులుగా మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానిని చేశారు’’ అని అన్నారాయన.

    కర్ణాటకలో అధికార పంపిణీపై ఊహాగానాల వేళ ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటనే విశ్లేషణ అక్కడ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగి కర్ణాటక కాంగ్రెస్‌ సంక్షోభం మరింత ముదరకుండా మంతనాలు జరుపుతున్నారు. సీఎం మార్పు నిర్ణయాన్ని ఇక సోనియా గాంధీకే వదిలేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో అధిష్టానంతో చర్చించేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. 

    ఈలోపు రాహుల్‌ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ కర్ణాటక పరిణామాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. డీకే శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘హైకమాండ్‌ పిలిస్తే కచ్చితంగా ఢిల్లీ వెళ్తా. అధిష్టాన నిర్ణయమే నాకు ఫైనల్‌. ఏ విషయంలోనూ నాకు తొందరలేదు’’ అని అన్నారు. మరోవైపు.. డీకే శివకుమార్‌తో ఉన్న ఫొటోను సిద్ధరామయ్య షేర్‌ చేయడంతో ఈ కథ సుఖాంతం అయ్యిందా? అనే చర్చ జోరందుకుంది.

    సీఎం చేంజ్! ఢిల్లీలో అధిష్ఠానం పెద్దల కీలక సమావేశం
  • కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన మనిషి ఆయన. కానీ, బంగారం మీద మోజు ప్రాణం మీదకు తెచ్చింది. నెట్టింట గోల్డ్‌మ్యాన్‌గా వైరల్‌ అయిన ఆయనకు ఓ ముఠా నుంచి బెదిరింపు కాల్‌ వచ్చింది. రూ.5 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడా వ్యక్తి. దీంతో ఈ బెదిరింపుల వ్యవహారం కలకలం రేపింది.

    రాజస్థాన్‌ చిత్తోర్‌గఢ్‌ వ్యాపారి కన్హయ్యలాల్ ఖటిక్‌కు గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోదారా ముఠా నుంచి బెదిరింపు కాల్‌ వచ్చింది. కోరినంతా డబ్బు ఇవ్వకుంటే బంగారం వేసుకునేందుకు ఉండవంటూ ఆ గ్యాంగ్‌ మెంబర్లు ఆయనకు దమ్‌కీ ఇచ్చారు. దీంతో ఆయన కోట్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. తొలుత ఓ నెంబర్‌ నుంచి మిస్డ్‌కాల్‌ వచ్చిందని, ఆ తర్వాత వాట్సాప్‌ కాల్‌ చేసి బెదిరించారని ఆయన చెబుతున్నారు. కాసేపు ఆగి మళ్లీ ఫోన్‌ చేసి బెదిరించారని పోలీసులకు తెలిపాడాయన. 

    ఆ వ్యాపారమే మలుపు
    50 ఏళ్ల వయసున్న కన్హయ్య మొదట్లో తోపుడు బండి మీద గల్లీలు తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్మేవాడు. తర్వాత కశ్మీరీ ఆపిల్‌ వ్యాపారం చేసి లాభాలు అర్జించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి(దివంగత) అంటే అతనికి ఎంతో పిచ్చి. ఆయన సంగీతంలో వచ్చిన పాటలు వినడమే కాదు.. ఆయనలా బంగారం వేసుకుని తిరగడమూ అలవాటు చేసుకున్నాడు. అలా.. మెడలో ప్రస్తుతం సుమారు 3.5 కిలోల బంగారం ఒంటిపై ధరిస్తున్నాడు. ఆయనగారి గోల్డ్‌మ్యాన్‌ వేషాలు వైరల్‌ కావడంతో ‘గోల్డ్‌మాన్ ఆఫ్ చిత్తోర్‌గఢ్‌’ అనే పేరు ముద్రపడింది. 



    మెడలో బంగారంతో చుట్టూ బౌన్సర్లతో బయట తిరుగుతూ హల్‌ చల్‌ చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన టీంతో వైరల్‌ చేయిస్తుంటాడు కన్హయ్యలాల్‌. అయితే ఆ షో ఆఫ్‌ వల్లే ఇప్పుడు బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు

    రోహిత్ గోదారా ఎవరు?
    బికనీర్‌కు చెందిన రోహిత్‌ గోదారా.. ఓ గ్యాంగ్‌స్టర్‌. వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజడంలో పేరుగాంచాడు. దేశంలో వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో 32 కేసులు ఉన్నాయి. అలాగే.. ప్రముఖ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్‌ రాజు దేహత్‌ హత్య కేసులో గోదారానే ప్రధాన నిందితుడు. 2022లో నకిలీ పాస్‌పోర్టు సాయంతో పవన్‌ కుమార్‌ అనే పేరు మీద దుబాయ్‌కి పారిపోయాడని అధికారులు చెబుతున్నాడు. ప్రస్తుతం అతను కెనడాలో ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

  • వర్చువల్‌ క్యూ, స్పాట్‌ బుకింగ్‌ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే శబరిమలలోకి అనుమతించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. అలాగే పాస్‌లోని తేదీ, సమయాన్ని అనుసరించాలని జస్టిస్‌ వి రాజా విజయరాఘవన్‌, జస్టిస్‌ కే వి జయకుమార్‌లతో కూడిన దేవస్వం బెంచ్‌ కూడా ఆదేశించింది. అధిక రద్దీ కారణంగా ఏదైనా అనుచిత ఘటన జరిగితే సహించబోయేది లేదని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుని, పోలీసులను గట్టిగా హెచ్చరించింది ధర్మాసనం. 

    పరిపాలన నిర్లక్ష్యం లేదా అమలులో లోపాల కారణంగా నివారించదగిన అత్యవసర పరిస్థితులకు లక్షలాదిమంది యాత్రికులును బలి చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే నకిలీ పాస్‌లతో వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కూడా ఆదేశించింది. కనీసం తేదీని పాటించకుండా వచ్చేవారిని సన్నిధానంలోకి కూడా అనుమతించకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా బుకింగ్‌ విధానాన్ని తూచా తప్పకుండా పాటించాలని పేర్కొంది. 

    నిజానికి వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా సుమారు లక్ష మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి చేరుకున్నారనే శబరిమల స్పెషల్ కమిషనర్ నివేదిక ఆధారంగా కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఆదేశాలు జారీ చేసింది. అదీగాక హైకోర్టు కూడా యాత్రికుల సంఖ్యపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే వర్చువల్‌ క్యూ బుకింగ్‌లు 70,000, స్పాట్‌ బుకింగ్‌లు 5000 వద్ద ఉన్నాయని, కానీ తనిఖీ చేసేటప్పుడూ..సుమారు 7877 పాస్‌లపై స్పష్టమైన సమాచారం లేదని, స్పెషల్‌ కమిషనర్‌ హైకోర్టుకి నివేదించారు. 

    అలాగే కొందరు నకిలీ పాస్‌లతో వస్తున్నట్లుకూడా హైకోర్టుకి సమాచారం అందింది. ముఖ్యంగా గుంపులు గుంపులుగా వచ్చే చాలామంది యాత్రికుల వద్ద పాస్‌లు లేవని, అమికస్ క్యూరీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే కేరళ హైకోర్టు స్వయంగా ఈ కేసుని పరిగణలోనికి తీసుకుని విచారించి ఇలా ఆదేశాలు జారీ చేసింది.

    (చదవండి: పంపా నుంచి అంతర్రాష్ట్ర కేఎస్‌ఆర్టీసీ సేవలకు అనుమతి)


     

  • హైద‌రాబాద్, న‌వంబ‌ర్ 28, 2025: మ‌న చుట్టూ మ‌న‌కు అస్స‌లు స్నేహంగా లేని శ‌త్రుదేశాలే ఉన్నాయని.. వాళ్ల‌ను అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో గ‌మ‌నించ‌డం చాలా ముఖ్య‌మ‌ని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వినోద్ జి. ఖండారే అన్నారు. భార‌త ర‌క్ష‌ణ శాఖ‌కు మాజీ ముఖ్య స‌ల‌హాదారుగా ప‌నిచేసిన‌ ఆయ‌న‌.. గురువారం న‌గ‌రంలోని సిగ్మా ఎడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్ వారు కొత్త‌గా రూపొందించిన యాంటీ డ్రోన్ వెహికిల్ ఇంద్ర‌జాల్‌ను చూసి, ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపారు.

    ‘‘మీరంతా టెక్నాల‌జీలో ముందున్నందుకు అభినందిస్తున్నాను. మీ క‌ష్ట‌ప‌డేత‌త్వాన్ని, మంచి ప‌నిని కొన‌సాగించండి. త‌క్కువ ధ‌ర‌లో ఉండే ఈ స్మార్ట్ సొల్యూష‌న్లు మ‌న‌ల్ని శ‌త్రువుల కంటే ముందు ఉంచుతాయి.  పాత రోజుల్లో మ‌నం ఆత్మ‌ప్ర‌బోధాన్ని వినేవాళ్లం. మ‌న బ‌లాబ‌లాలు తెలుసుకునేవాళ్లం. అలాగే శ‌త్రుఘోష కూడా వినేవాళ్లం. దాన్నిబ‌ట్టి మ‌న శ‌త్రువు ఎవ‌రు, వాళ్ల బ‌లాబలాలేంటో తెలిసేది. మ‌న చుట్టూ మ‌న‌కు అస్స‌లు స్నేహంగా లేని దేశాలే ఉన్నాయి. మ‌నం వాళ్ల‌ని అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాలి.

    మ‌న‌మంతా ఒక స‌మ‌ర్థ‌మైన ఆధునిక సైన్యం కోసం చూస్తున్నాం. ఇలాంటి స్టార్ట‌ప్‌లు, సిగ్మా లాంటివాళ్లు నిజ‌మైన సైనికులు. వీళ్లే ఎల్ఓసీలో గానీ, ఎల్ఏసీలో గానీ, అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో గానీ, చివ‌ర‌కు  దేశం న‌డిబొడ్డున కూడా మ‌మ్మ‌ల్ని బ‌లోపేతం చేస్తున్నారు. వీళ్లు రూపొందించిన యాంటీ డ్రోన్ వాహ‌నం ఇంద్ర‌జాల్ లాంటివి మ‌న‌కు చాలా అవ‌స‌రం. ఆప‌రేష‌న్ ఇంద్ర‌జాల్ చాలా స్ఫూర్తిదాయ‌కం. ప్ర‌స్తుతం కైనెటిక్, నాన్ కైనెటిక్ యుద్ధాలు జ‌రుగుతాయి. 

    స్లీప‌ర్ సెల్స్ దేశంలోకి ప్ర‌వేశించి దేశ ఆస్తుల‌ను నాశ‌నం చేస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కౌంట‌ర్ డ్రోన్ ప‌రిష్కారాలు చాలా అవ‌స‌రం. ఇలాంటివాటి కోస‌మే మ‌నం చూస్తున్నాం. ఇవి మ‌న‌ల్ని ర‌క్షించ‌డంతో పాటు ముందుండేలా చేస్తాయి. హ్యూమ‌న్ క్యాపిట‌ల్ స్మార్ట్‌గా ఉండాలి, దూర‌దృష్టి క‌లిగి ఉండాలి. ఇది జాతీయ నాయ‌క‌త్వం ఏం ఆలోచిస్తోందో దానికి త‌గిన‌ట్లుగా మ‌నం ప‌రిష్కారాలు సూచించ‌గ‌ల‌గాలి, అప్పుడే మ‌నం యుద్ధాల్లో విజ‌యం సాధించ‌గ‌లం.

    నేను మాట్లాడ‌డం మొద‌లుపెట్టేట‌ప్పుడు జై హింద్ అన్నాను. దానికి అర్థం మ‌న దేశానికి విజ‌యం రావాలని. ఆ విజ‌యం ఒలింపిక్‌ క్రీడ‌ల్లో కావ‌చ్చు, ఆర్థిక‌రంగంలో కావ‌చ్చు, విజ్ఞానంలో, టెక్నాల‌జీలో కావ‌చ్చు, యుద్ధాల్లోనైనా కావ‌చ్చు. చాలామంది సైన్యం అంటే యుద్ధాలు చేయ‌డానికే ఉంద‌నుకుంటారు. కానీ బ‌ల‌మైన సైన్యం యుద్ధాన్ని నివారిస్తుంద‌ని మీరంతా తెలుసుకోవాలి. బ‌ల‌మైన అంటే కేవ‌లం సంఖ్య‌లో కాదు.. సామ‌ర్థ్యంలో. ప్ర‌జ‌లు కావాల‌నుకున్న‌ప్పుడే సైన్యం యుద్ధానికి దిగుతుంది.

    మ‌న‌మంతా దేశ‌మే ముందనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మ‌న‌మంతా మ‌న‌లో విభేదాలు మ‌ర్చిపోయి, దేశం ముందుండాల‌ని తెలుసుకోవాలి. అప్పుడు మ‌న‌కు కేటాయించిన ల‌క్ష్యం.. విక‌సిత్ భార‌త్ 2047ను సుల‌భంగా సాధించ‌గ‌లం. ఇంకా ఆ ల‌క్ష్యాన్ని ప‌దేళ్ల ముందే చేరుకోగ‌లం. వింగ్ క‌మాండ‌ర్ చెప్పిన‌ట్లు ప్ర‌తి ఒక్క పౌరుడూ సైనికుడే’’ అని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వినోద్ జి. ఖండారే అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా.. సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్ భాగ‌స్వామి, డైరెక్ట‌ర్ మంకెన శ్రీ‌నివాస‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్ట‌ర్ సి. దామోద‌ర్ రెడ్డి, డైరెక్ట‌ర్లు సునీల్ కుమార్, మ‌ల్లెల సాయి, సంజ‌య్ కుమార్‌, ఇంద్ర‌జాల్ సీఓఓ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, ఢిల్లీ వ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • సాక్షి, ఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.  ఈ క్రమంలో చెక్‌ఇన్‌ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్‌ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది.  

    తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.

    శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.

    అయితే భక్తుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే(నవంబర్‌ 28, 2025) అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, భక్తులు సహకరించాలని పౌర విమానయాన విజ్ఞప్తి చేసింది. 

  • ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. శుక్రవారం  గోవాలో పర్యటించిన ఆయన.. సౌత్‌ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక కార్యక్రమం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మఠాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • తమిళనాడు మంత్రి పెరియా కరుప్పన్ చిక్కుల్లో పడ్డారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో(డిసెంబర్‌ 27న ఆయన బర్త్‌డే) అశ్లీల నృత్యాల్ని ప్రొత్సహించారాయన. పొట్టి దుస్తుల్లో అమ్మాయిలు డ్యాన్స్‌ చేస్తుంటే సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఆయన జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో దుమారం రేగుతోంది. 

    వీడియోలో మంత్రి పెరియా కరుప్పన్‌.. ముందువరుసలో జిల్లా స్థాయి పార్టీ నాయకులతో కలిసి కూర్చుని ప్రదర్శనను చూస్తున్నట్లు కనిపించారు. ఆ డ్యాన్సర్లను చూస్తూ మీసాలను మెలేశారాయన. ఆ తర్వాత ఆయన వేదికపై ఉన్న కళాకారులను దిగమని సంకేతాలు చేస్తూ.. తన దగ్గరగా నృత్యం చేయమని సూచిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి స్టెప్పులు వేశారు. 

    ఈ వీడియో వైరల్‌ కావడంతో మంత్రి తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి.. డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకల్లో ఇలాంటి నృత్యాలను ప్రొత్సహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మహిళలకు గౌరవం ఇచ్చే తీరు ఇదేనా? అని బీజేపీ నిలదీస్తోంది. అర్థనగ్నంగా ఉన్న మహిళలను తమ వద్దకు పిలిపించుకుని ఇలా మురిసిపోయే నేతలకు.. తమ భద్రత గురించి మహిళలు ఎలా చెప్పుకోగలరు? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

    కరుప్పున్‌ చరిత్ర గురించి పాపం వాళ్లకు తెలియదేమో. ఇది పగటిపూట జరిగిందని అదృష్టం, లేకపోతే ఏమి జరిగేదో ఊహించలేం అంటూ అన్నాడీఎంకే ఘాటు చురకలు అంటించింది. పలువురు నెటిజన్లు సైతం ఈ వీడియోపై మండిపడుతున్నారు. గతంలో ఓ మహిళతో ఆయన్న సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజా ఘటన నేపథ్యంలో ఆ వీడియోను పలువురు తెరపైకి తెచ్చారు. ఈ ఘటనపై డీఎంకే పార్టీ, ఉదయ్‌నిధి ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదు.  

  • అమ్మాయి  కనిపిస్తే చాలు అది  వీధిలోఅయినా, ఆన్‌లైన్‌లో అయినా కావాలని ఏదో కరంగా కమెంట్లు చేయడం, ఉద్దేశపూర్వకంగా వేధించడం, ట్రోలింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారిపోయింది. అలాంటివారికి చెంపపెట్టులాంటిదీ వార్త. అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయికి బుద్ధి  చెప్పేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.  

    బిహార్ షరీఫ్ నివాసి అయిన ఒక యువకుడు అమ్మాయిల ముందు విన్యాసాలు చేయడం, వారిని వేధించడం,అశ్లీల పాటలు ప్లే చేయడం అతని పని. సుభాష్ పార్క్, నలంద కాందహార్‌,  రాజ్‌గిర్ ఫిట్‌నెస్ పార్క్ . ఇవే  అతని అడ్డాలు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృజన్ ఫ్లిప్పర్. 

     అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి చొరబడి  అమ్మాయిలను భయపెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు.  సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు  వైరల్‌గా జిల్లీ పోలీసు యంత్రంగా రంగంలోకి దిగింది. నలంద జిల్లాలో ఒక యువకుడు పాఠశాల విద్యార్థినులను బెదిరించడానికి,  వేధించేందుకు, పట్టపగలు నడిరోడ్డుమీద  ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవాడు. ఈ దృశ్యాలు కనలంద జిల్లాలో వైరల్ అయ్యాయి. ఈ ఆందోళనకరమైన దృశ్యాలపై  జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమ్మాయిలు సురక్షితంగా ఉండేలా అతనిపై  సంబంధిత  అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌  చేశారు. 

     

     ఆన్‌లైన్‌లో షేర్  అయిన ఈ వీడియోల ప్రకారం,   ఇతగాడు ట్రాఫిక్‌లో  రోడ్డు మధ్యలోకి వచ్చి పిచ్చి పిచ్చి స్టంట్స్‌తో అమ్మాయిలపైకి దూకి, భయపెట్టేవాడు. దీంతో బాధిత అమ్మాయిలు, తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై  నలంద పరిపాలనా అధికారులు తగిన చర్యలు  తీసుకోవల్సిందిగా  పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ధోరణులుమరింత ముదిరి, తీవ్రమైన ప్రమాదం జరగక ముందు పోలీసులు త్వరగా చర్యలు తీసుకోవాలని  సోషల్ మీడియా వినియోగదారులు కోరారు. ఇప్పటికే పెరుగుతున్న ఆన్‌లైన్ ట్రెండ్స్‌పై  ఆందోళన రేకెత్తించిందీ ఘటన. ఇంటా, బయటా ఎక్కడైనా అమ్మాయిలను వేధించినా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించే పేరుతో పిచ్చి పిచ్చి "స్టంట్స్‌" చేసినా తగిన గుణపాఠం తప్పదనే సంగతిని గుర్తుంచుకోవాలంటున్నారు పెద్దలు  

    ఇలాంటి వాడిని జూలోని బోనులోపెట్టాలి, ఎవరికి  ఎలాంటి హాని లేకుండా  వాడి  విన్యాసాలుసాగుతాయి , ప్రభుత్వానికి  ఆదాయం  కూడా వస్తుందని నెటిజన్లు ఆగ్రహం  వ్యక్తం చేశారు. వీడికి బుద్ధి చెప్పకపోతే.. ఇలాంటి వాళ్లు మరికొందరు తయరవుతారని మరికొందరు మండిపడ్డారు.  తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు.
     

  • సాక్షి, ఢిల్లీ: దేశరాజధాని వాయు కాలుష్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఊపిరి తీసుకోలేని పరస్థితుల్లో అవస్థతలు పడుతున్నారని.. ఇంత జరుగుతున్న ప్రధాని మోదీ ఏం పట్టనట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. 

    శుక్రవారం వాయు కాలుష్యంపై కొందరు పర్యావరణవేత్తలతో రాహుల్‌ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం తీవ్రతరమవుతోంది. పేద, ధనిక అన్నివర్గాల వాళ్లు కాలుష్యం బారిన పడుతున్నారు. నేనూ ఢిల్లీ వాయి కాలుష్యం బాధితుడినే. విషపూరిత వాయువులతో పిల్లలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు అని అన్నారాయన. 

    ‘‘మోదీగారూ.. భారతదేశపు పిల్లలు మన కళ్ల ముందే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఎలా మౌనంగా ఉండగలరు? ఈ అంశంపై అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి లేదా? ఒక ప్రణాళిక లేదు, బాధ్యతంటూ లేదా?’’ అంటూ ప్రధానిని ఉద్దేశించి ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన. 

    ఇప్పటికైనా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలి. కాలుష్యాన్ని కారకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి.  ఢిల్లీ వాయు కాలుష్య సమస్యపై పార్లమెంటులో చర్చ జరగాలి అని డిమాండ్‌ చేశారాయన. ఈ సందర్భంగా కొందరు చిన్నారుల తల్లులు ఆందోళన వ్యక్తం చేసిన వీడియోలను రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

    మరోవైపు.. వాయు కాలుష్యం సోర్స్ నుంచే అరికట్టాలన్న పర్యావరణవేత్తలు.. చిన్నారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. గత రెండు వారాలుగా ఢిల్లీ వాయు నాణ్యత దారుణంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ పరిణామాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో పిల్లలను పరిస్థితులు చక్కబడేదాకా స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌కు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది కూడా. 

  • భువ‌నేశ్వ‌ర్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం సొంత రాష్ట్ర‌మైన ఒడిశాలో ప‌ర్య‌టించారు. శాసనసభలో ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి ఆమె భావోద్వేగ‌పూరిత‌ ప్ర‌సంగం చేశారు. పాత రోజుల‌ను గుర్తు చేసుకుని పుల‌కించిపోయారు. ఒడిశా శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల‌ను త‌ల‌చుకున్నారు. మారు మూల గ్రామం నుంచి దేశ అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు సాగిన త‌న ప్ర‌స్థానాన్ని స్మరించుకున్నారు. మధుర స్మృతుల‌ను నెమరువేసుకున్నారు. శాస‌న‌స‌భ గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూసి సంతోషం వ్య‌క్తం చేశారు.

    తాను ఒడిశా మంత్రిగా ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో త‌న కార్యాల‌యంగా ఉన్న 11 నంబ‌ర్ చాంబ‌ర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) సంద‌ర్శించారు. బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా జనసమూహం మధ్య ఉన్న వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి పేరు పెట్టి పిలిచి, యోగ‌క్షేమాలు అడ‌గ‌డంతో ఆయ‌న అమితాశ్చ‌ర్యానికి లోన‌య్యారు. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ త‌న‌ను మ‌ర్చిపోకుండా పేరు పెట్టి పిల‌వ‌డంతో త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

    మాజీ ఉద్యోగికి కుశ‌ల‌ప్ర‌శ్న‌లు
    ఆయ‌న పేరు అనంత చరణ్ బెహరా. రిటైర్డ్ గ్రేడ్ -4 ఉద్యోగి. ద్రౌపదీ ముర్ము ఒడిశా మంత్రిగా ఉన్న‌ స‌మ‌యంలో ఆమె కార్యాల‌యంలో 'జమాదార్'గా ప‌నిచేశారు. 2000 నుంచి 2004 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా మంత్రిగా ముర్ము సేవలు అందించారు. అసెంబ్లీకి ముర్ము వ‌స్తున్నార‌ని తెలిసి.. అనంత చరణ్ బెహరా అక్క‌డికి వ‌చ్చారు. జ‌నం మ‌ధ్య‌లో ఉన్న ఆయ‌న‌ను రాష్ట్ర‌ప‌తి గుర్తుప‌ట్టారు. ''అనంతా ఎలా ఉన్నావ్‌? నీ కొడుకు, కూతురు ఇప్పుడు ఏం చేస్తున్నారు?" అని కుశ‌ల ప్ర‌శ్న‌లు అడిగారు. "దేవుడి ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను. పిల్ల‌ల పెళ్లిళ్లు అయిపోయాయి. స‌ర్వీసు నుంచి రిటైర్ అయ్యాను'' అని బెహ‌రా  స‌మాధానం ఇచ్చారు.

    లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్‌..
    ఇన్నేళ్ల త‌ర్వాత కూడా రాష్ట్రపతి ముర్ము తన పేరును గుర్తుపెట్టుకుని పిల‌వ‌డాన్ని లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్‌గా పేర్కొన్నారు బెహ‌రా. త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. "మేడమ్‌ నోటి వెంట నా పేరు విని నేను ఆశ్చర్యపోయాను. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రుల బృందం, అనేక మంది ఇతర వీఐపీల‌ సమక్షంలో ఆమె నన్ను పేరు పెట్టి పిలిచార‌ని'' ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న కుటుంబం గురించి కూడా 'మేడమ్‌'కు తెలుసున‌ని చెప్పారు. త‌న పిల్ల‌ల పెళ్లిళ్ల స‌మ‌యంలో ఆమెకు ఆహ్వానం పంపించిన‌ట్టు వెల్ల‌డించారు.

    ఇదీ చ‌ద‌వండి: మ‌ది నిండా మధుర స్మృతులే..

    మేడ‌మ్ ఏం మార‌లేదు..
    ముర్ము మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను ఎంతో న‌మ్మ‌కంగా ప‌నిచేశాన‌ని చెప్పారు. "అప్పుడు, ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు నగదు రూపంలో చెల్లించేవారు. మేడమ్ తరపున ఆమె వేత‌నాన్ని అకౌంట్స్ విభాగం నుంచి నేనే తెచ్చెవాడిని. నేను ఆమెకు నమ్మకమైన ఉద్యోగిని" అని తెలిపారు. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ ముర్ములో ఎలాంటి మార్పు లేద‌న్నారు. ''గత 20 ఏళ్లలో మేడమ్ ఏమాత్రం మారలేదు. ఆమె ముఖంలో అదే చిరునవ్వుతో ఇప్ప‌టికీ మాట్లాడుతున్నారు. నాతో స‌హా త‌న ఉద్యోగులందరినీ ఎంతో ప్రేమ‌గా చూసుకునే వారు. నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను'' అంటూ అనంత చరణ్ బెహరా (Ananta Charan Behera) ప్ర‌శంస‌లు కురిపించారు. 

  • న్యూఢిల్లీ :  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లు, రక్షణ మరియు వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.

    దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు స్వాగతం పలుకుతారు.  ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశంలో అధికారిక పర్యటన చేస్తారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    చదవండి: లక్ష కంఠ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం

    పుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ  కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

    ఈ ఏడాది ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. తరువాత షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ చైనాలో సమావేశమయ్యారు.

    రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారు

    ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు
     

  • ఉడుపి, సాక్షి,  : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  శుక్రవారం కర్ణాటకలోని ఉడిపిలో లక్ష  కంఠ గీత పారాయణ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు.

    కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర కనక కవచం (బంగారు కవచం )ను  అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీ కృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంలో, విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు సహా దాదాపు 1,00,000 మంది పాల్గొనే ఈ పవిత్ర భగవద్గీత లక్ష కంఠ పారాయణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం ద్వైత వేదాంత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. త్రివర్ణ పతాకాలతో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

    ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ గోవాకు వెళతారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ్ పార్తగలి జీవోత్తం మఠం 550వ వార్షికోత్సవాల్లో  పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం దక్షిణ గోవాలోని  పత్రాగౌలిలో 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.  రామాయణ థీమ్ పార్క్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే స్మారక పోస్టల్ స్టాంపు , నాణెంను విడుదల చేయనున్నారు.
     

     

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్‌ నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ కోసం శుక్రవారం జరిగిన కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మొదటి దశలో రైతుల నుంచి 50 వేల ఎకరాల సమీకరణ చేపట్టగా.. ఇప్పుడు రెండో దశలో మరో 20 వేల ఎకరాలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.

    అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాల భూమి సేకరణ చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16వేల ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించింది. ఇప్పుడు రెండో విడత సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనుంది. 

    వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలను సేకరించనుంది. అసైన్డ్‌ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌ను సీఆర్‌డీఏ విడుదల చేయనుంది.

  • సాక్షి, విజయవాడ: పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం నాటి ఈవో ధర్మారెడ్డి, సీ.ఎస్.వో నరసింహ కిషోర్‌లను విచారించిన సీఐడీ అధికారులు.. ఇవాళ వైవీ సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారని తెలిపారు. గంటన్నరపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు.

    మనోభావాలకు సంబంధించి ఇష్యూను పొలిటికల్‌ ఇష్యూలా మారుస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘పరకామణి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలి. దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. దోషులకు కోర్టు ద్వారా  శిక్ష పడాలి. మీ హయంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారు. ఎవరిని పిలిచినా ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దు. తప్పు ఎవరు చేసిన తప్పే తప్పు. చేసినా దోషులను శిక్షించాలని మేము చెప్తున్నాం. నన్ను పిలిచినా, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారు.’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

    YV Subbareddy: పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలి
  • విశాఖపట్నం జిల్లా: మండలంలోని కొంకసింగి గ్రామంలో అరటా లక్ష్మీపార్వతి(26) గురువారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంబిల్లి మండలం మామిడివాడ దరి కొత్తూరుకు చెందిన ఆమెతో కొంకసింగి గ్రామానికి చెందిన అరటా ప్రసాద్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రసాద్‌ నేవీలో ఉద్యోగం చేస్తూ గత నెల పదవీ విరమణ పొందాడు. వీరికి మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. 

    ఈ నేపథ్యంలో మృతురాలి భర్త ప్రసాద్‌ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కువగా క్రికెట్‌ బెట్టింగులు ఆడేవాడు. దీనివల్ల అధికంగా అప్పులు పాలయ్యాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవులయ్యేవి. ఈ కారణంగానే మనస్తాపం చెందిన లక్ష్మీపార్వతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. నర్సీపట్నంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.    

     

  • కృష్ణలంక(విజయవాడతూర్పు): వారిద్దరు మైనర్లు. ఒకే పాఠశాలలో బాలిక తొమ్మిదో తరగతి, బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ప్రేమ అనే ఆకర్షణకు లోనైన ఆ ఇద్దరు కలసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాణిగారితోట, సిద్దెం కృష్ణారెడ్డి రోడ్డులోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో యూపీ కుటుంబానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి, రాణిగారితోటకు చెందిన బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో స్కూల్‌కు వెళ్లనని ఇంటిలో చెప్పి తండ్రి ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్కూల్‌కు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక ఇంటి నుంచి బయలుదేరి స్కూల్‌కు వెళ్లకపోగా తిరిగి ఇంటికి చేరుకోలేదు. 

    వారి తల్లిదండ్రులు స్కూల్‌ సిబ్బందిని, చుట్టు          పక్కల, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు.        వెంటనే పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా ఇద్దరు కలిసి బస్టాండ్‌కు చేరుకుని హైదరాబాద్‌ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్నట్లు నిర్ధారించుకున్న సీఐ నాగరాజు తన సిబ్బంది అక్కడకు పంపి మైనర్లను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు.    

  • సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మద్దలకట్ట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. బస్సులో ఇరుక్కున ప్రయాణికులను స్థానికులు బయటకుతీస్తున్నారు.

Family

  • బరువు తగ్గడం కొందరికి అతి పెద్ద సవాలు. పైగా అదొక భారమైన సమస్యగా మారిపోతుంటుంది. ఎందుకంటే వారికి సాధారణ ఆహార మార్పులు ఓ పట్టాన పనిచేయవు.  అలా.. బరువు తగ్గినట్టే తగ్గి ..ఇట్టే పెరిగిపోతుంటా. దాంతో విసుగు పుట్టుకొచ్చేస్తుంటుంది కూడా. అలానే ఇబ్బంది పడింది మేకప్‌ ఆర్టిస్ట్‌ అంబికా పిళ్ళై. ఆమెకు బరువు తగ్గడం శారీరకంగా, మాససికంగా పెను సమస్యగా మారింది. ఏ డైట్‌ ఫాలో అయిన ఫలితం శూన్యం. తగ్గినట్టు తగ్గి పెరిగిపోతోంది. చివరికి ఆమె ఏం చేసి బరువు తగ్గగలిగిందంటే..

    రక్తపోటు సమస్యల కారణంగా అంబికాను కార్డియాలజిస్ట్‌లు బరువు తగ్గేందుకు ప్రయత్నించమని సూచించారు. బరువు తగ్గితే ఆమె వాడే అన్ని మందులు ఆపేయొచ్చట. అందుకే తాను చాలామందిని వెయిట్‌లాస్‌ జర్నీలో తనతో కలిసి జాయిన్‌ అవ్వమని పిలునిస్తుందట కూడా. ఈ బరువుని నిర్లక్ష్యం చేస్తే భారీకాయంతో మూల్యం చెల్లించుకుంటామంటోంది. అధిక బరువు.. అన్ని అనారోగ్య సమస్యలకు మూలం కాబట్టి పట్టుదలతో దానిపై యుద్ధం చేయాలని అంటోంది. 

    డైట్‌ మార్పులు.. 
    తగ్గినట్టు తగ్గి..కొన్ని నెలలో బరువు పెరిగిపోవడంతో విసిగిపోయి..డైట్‌లోనే మార్పులు చేసింది. నో బ్రెడ్‌, చపాతీ, రైస్, పరాఠా, మాల్వా పరాఠా అని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యింది. అందుకు బదులుగా కూరగాయలు, చికెన్‌, చేపలు ఎక్కువగా తీసుకునేదాన్ని  అని అంటోంది. చాలామటుకు ఆవిరిలో లేదా రోస్ట్‌ చేసినవి తీసుకునేదాన్ని అని చెప్పుకొచ్చింది. అప్పుడే తన బరువులో స్వల్ప మార్పులు సంభవించాయని అంటోంది. 

    పిండి పదార్థాలకు దూరంగా ఉండటం తోపాటు డీప్‌ ఫ్రై చేసిన ఆహారాలను కూడా దరిచేరనిచ్చేదికాదు. సాధ్యమైనంతవరకు ఆవిరిలో ఉడికించిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి..సుమారు ఐదు కిలోల బరువు తగ్గిందట. అంతేగాదు బరువు తగ్గడంలో తనలా హెచ్చు తగ్గులతో ఇబ్బంది పడుతుంటే గనుక అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తే..సత్వర మార్పుల తోపాటు బరువు తగ్గడం కూడా తథ్యం అని నమ్మకంగా చెబుతోంది. అందుకు సంబంధంచిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

     

    (చదవండి: పొలాల నుంచి డిజిటల్‌ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!)

  • ఓ మారుమూల గ్రామంలో పచ్చటి పొలాల నడుమ పెరిగిన యువకుడు మొబైల్‌ ఫోన్‌తో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అతడి బాల్యం మొత్తం పొలాల మధ్య చిన్న చితక కూలి పనులతో సాగింది. అలా సరదాగా సాగిపోతున్న అతడి జీవితంలోకి సరదాగా కొన్న మొబైల్‌ ఫోన్‌ లైఫ్‌నే టర్న్‌ చేసింది.తొలుత తల్లిదండ్రులు చదువు పాడవుతుందని చాలా బయటపడ్డారు. కానీ అతడు తన క్రియేటివిటీతో సోషల్‌ మీడియా స్టార్‌గా ఎదగడమే కాదు నలుగురికి ఉపాధి మార్గం చూపించే రేంజ్‌కి వెళ్లిపోయాడు. 

    అతడే మహారాష్ట్ర, నెవాషేలోని గోమల్వాడి గ్రామనికి చెందిన రాహుల్‌ రాందాస్‌ తమ్నార్‌. తన బాల్యం ఎండల్లో కష్టపడి పనిచేయడంతో సాగింది. తన చుట్టూ ఉండే పచ్చిన పొలాల మధ్య తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా చిన్న చితక కూలిపనులు చేస్తూ పెరిగాడు. ఒకరోజు తల్లిదండ్రులు అడిగి మరి సరదాగా మొబైల్‌ ఫోన్‌ కొనుకున్నాడు. 

    ఇంత చిన్న వయసులోనూ ఫోన్‌తో ఆడుకుంటూ చదువు పాడు చేసుకుంటాడేమో అని తల్లిదండ్రుల చాలా బయటపడ్డారు. అయితే నేర్చుకోవాలనే ఒకే ఒక్క జిజ్ఞాసతో సోషల్‌ మీడియా గురించి, ప్రమోషన్‌లు, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వంటి వాటి గురించి బాగా తెలుసుకున్నాడు. అయితే ఆ క్రమంలో కొన్ని తప్పులు కూడా జరిగాయి. పలు సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ అతనెప్పుడూ ఆశను వదులుకోలేదు. 

    అలా ఏదో ఒకనాటికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పనతో తన ప్రయత్నాన్ని విరమించలేదు. నెమ్మదిగా అతడి కష్టం ఫలించడం ప్రారంభించింది. రోజుకు రూ. 5వేలు నుంచి రూ. 6 వేలు రూపాయల వరకు సంపాదించడం ప్రారంభించాడు. అలా చాలా కొద్ది టైంలోనే లక్ష రూపాయాలు సంపాదించే రేంజ్‌కి ఎదిగిపోవడమే కాదు, ఏకంగా 400 నుంచి 500 మంది యువతకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేస్తున్నాడు. 

    అతని అంకితభావానికి డిజిటల్‌ స్కిల్‌ అవార్డు సైతం వరించింది. పొలాలతో మొదలైన అతడి ప్రస్థానం డిజిటల్‌ ప్రపంచంలోకి అడుపెట్టి తన జీవితాన్నే కాకుండా ఇతరుల జీవితాన్ని కూడా మార్చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి స్టోరీ వైరల్‌గా మారింది. కేవలం డబ్బు ఉంటేనే గుర్తింపు రాదు, కష్టపడేతత్వం, నేర్చుకోవాలనే ఆరాటం ఉన్నవారికి విజయం వారి ఒడిలోకే వచ్చే వాలుతుంది అనేందుకు ఈ రాహుల్‌ రాందాస్‌నే ఉదాహరణ. 

    (చదవండి: ఆ అమ్మకు SIR సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..! పాపం 40 ఏళ్లుగా..)
     

  • రాజకీయ పార్టీలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. ఈ డ్యూటీ ఒత్తిళ్లతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతుండడం చూస్తున్నదే.  అయితే ఇంతగా దుమారం రేపుతున్న ఎస్‌ఐఆర్‌.. ఓ తల్లి కళ్లలో మాత్రం ఆనందాన్నినింపింది.

    దేశవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓ అమ్మ గర్భశోకాన్ని తీర్చి ఊరటనిచ్చిన కేసు వెలుగులోకి వచ్చింది. రాజకీయ పార్టీల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ఈ డ్రైవ్‌ రాజస్థాన్‌లోని భిల్వారాకి చెందిన ఓ కుటుంబానికి గొప్ప ఊరటనిచ్చింది. 

    40 ఏళ్లుగా కూమారుడి ఆచూకీ కోసం తపిస్తున్న ఆ కుటుంబానికి కొత్త ఆశను అందించి..ఆ కొడుకుని ఆ అమ్మ ఒడికి అందించింది. ఈఘటన రాజస్థాన్‌ భిల్వారాలోని సూరజ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. 40 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఉదయ్‌సింగ్‌ అనే వ్యక్తిని చత్తీస్‌గఢ్‌లో 1300 కిలో మీటర్ల దూరంలో నివశిస్తున్నట్లు గుర్తించి తల్లి దేవిరావత్‌  దరికి చేర్చింది SIR. అతను 1980లో తన ఇంటి నుంచి తప్పిపోయాడు. 

    పాపం అతడి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అతడి ఆచూకీకై  నిరీక్షిస్తూనే ఉంది. నిజానికి ఉదయ్‌సింగ్‌ తప్పిపోయినప్పుడూ చత్తీస్‌గఢ్‌కు చేరుకున్నాడు. అక్కడే ఒక ప్రైవేట్‌ కంపెనీలో గార్డుగా పనిచేసేవాడు. ఆ సమయంలోనే రోడ్డు ప్రమాదంలో ఉదయ్‌ సింగ్‌ తలకు గాయం అవ్వడంతో తన కుటుంబం జ్ఞాపకాలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. అందువల్లే తన కుటుంబం దరిచేరినా..తన ఇంటిని, కుటుంబ సభ్యులను గుర్తించడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. మరి ఈ ఎన్నికల జాబితా స్పెషల్‌ డ్రైవ్‌ ఎలా అతడి ఆచూకిని కనుగొందంటే..

    SIR ఇలా కనుగొంది..
    ఎనికల జాబితా  స్పెషల్‌ డ్రైవ్‌ వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు తన గుర్తింపు పత్రాల విషయమై తడబడ్డాడు, అయితే తన గ్రామం పేరు, కులం పేరు మాత్రం గుర్తుండటం విశేషం. అతడు చెబుతున్న వివరాలను గమనించిన వెరిఫికేషన్‌ అధికారి చిన్న అనుమానంతో రాజస్థాన్‌లో కుమారుడి ఆచూకీకై అల్లాడుతున్న కుటుంబానికి సమాచారం అందించాడు. 

    ఎప్పుడో చిన్నప్పుడు తప్పి పోవడంతో దాదాపు 40 ఏళ్ల తర్వాత తమ కుమారుడేనా అనిపోల్చుకోవడం తల్లి దేవి రావత్‌కి, కుటుంబసభ్యులకు కాస్త కష్టమైంది. అయితే ఉదయ్‌ తన చిన్నప్పటి కుటుంబం జ్ఞాపకాలు, తనకు చిన్నతనంలో నుదిటిపై అయిన పాత గాయాల వివరాలు గురించి పూసగుచ్చినట్లుగా చెప్పడంతో తల్లి తన కొడుకేనని గుర్తించడమే గాక పట్టరాని సంతోషంతో తడిసిముద్దయ్యింది. 

    ఉదయ్‌కి గ్రాండ్‌ వెల్‌కమ్‌...
    గ్రామస్తులు, దూరపు బంధువులు అతడిని కలవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. జస్ట్‌ 150 ఇళ్లు ఉండే ఆగ్రామం ఈ సంఘటనతో మొత్తం పండుగ వాతావరణం తలపించేలా సందడిగా మారిపోయింది. ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడని..అతడి కుటుంబసభ్యులు సాంప్రదాయ ఊరేగింపుతో.. గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు. 

    SIR అంటే..
    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓటరు జాబితాలో సమగ్రతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేకమైన, గడువుతో కూడిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే వార్షిక సవరణ కంటే ఇది చాలా విస్తృతమైనది, లోతైనది. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం ఇందులో ప్రధానమైనది. ముఖ్యంగా మరణించినవారు, ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లినవారు లేదా అర్హత లేనివాళ్లను గుర్తించి తొలగిస్తారు. అలాగే 18 ఏళ్లు నిండినా కూడా ఓటరు జాబితాలో నమోదు చేసుకోని వాళ్లను గుర్తించి  ఓటు హక్కు కల్పిస్తారు. అయితే ఈ ప్రక్రియతో వ్యతిరేక ఓట్లను తొలగించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

    (చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..)

Politics

  • సాక్షి, తాడేపల్లి: గతంలో వేల కోట్లు దోచుకున్న చంద్రబాబు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆ కేసులన్నీ మాఫీ చేయించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

    చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేల కోట్లు దోచుకున్నారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులను విత్ డ్రా చేయిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రివిలేజ్ ఫీజు విషయంలో వేల కోట్లు ఖజానాకు రాకుండా చేశారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయి

    👉ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేసి తమవారి భూములు పోకుండా జాగ్రత్త పడ్డారు. ఫైబర్ నెట్ లో రూ.350 కోట్లు అవకతవకలు చేశారు. సీఐడీ కూడా ఆధారాలతో పట్టుకుంది. అసైన్డ్ భూముల కుంభకోణంతో పేదల పొట్ట కొట్టారు. రూ.4,239 కోట్ల విలువైన భూమిని టీడీపీ నేతలు కొట్టేశారు. రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది.. 

    👉.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే 13 చోట్ల నోట్ ఫైల్ మీద సంతకాలు పెట్టారు. రూ.372 కోట్లు కొట్టేసినట్టు సీఐడీ గుర్తించింది. ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సీఎం హోదాలో బెదిరించి అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు

    👉ప్రశ్నిస్తానన్న పవన్ ఈ కేసులపై ఎందుకు ప్రశ్నించటం లేదు?. పవన్ వలన దమ్మిడి లాభం లేనప్పుడు విమానాల్లో తిరగటం ఎందుకు?. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించుకోవటం ఎందుకు?. అవినీతి, అరాచకాలను ప్రశ్నించలేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్?

    👉తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందువుల మనోభావాలను చంద్రబాబు తీశారు. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు అద్భుతంగా పని చేసింది. అలాంటి వ్యక్తిని విచారణ పేరుతో సీఐడీ వేధిస్తోంది. 

    👉ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పదంగా చనిపోతే మా పార్టీ వారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు

    👉రాజధానిలో దారుణమైన అవినీతి జరుగుతోంది. వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. నేషనల్ హైవేల‌ కంటే ఎక్కువ ధరకు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు

    Chandrashekhar: రైతులపై కేసులు బనాయిస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదు?

    పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీరు లేక జనం అల్లాడిపోతుంటే చంద్రబాబుకు కనపడటం లేదు. వైఎస్సార్ ఫ్యామిలీ వెలిగొండ ప్రాజెక్టును తీసుకువస్తే దాన్ని కూడా చంద్రబాబు ముందుకు పోనివ్వటం లేదు. టెండర్లలో భారీ అవినీతికి పాల్పడుతున్నారు. నీళ్లు ఇస్తామంటూ నిధులు తోడుకుంటున్నారు. రూ.17 కోట్లు దోచుకున్నారు. ఇలాంటివి ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలో నే అట్టడుగున ఉంది. దాన్నిబట్టే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారాయన. 

NRI

  • అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. దాంపత్య జీవితాన్ని విజయవంతంగా నడిపించేందుకు, వివాహబంధాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన  కీలక మార్గాలపై నాట్స్ కాన్సస్ చాప్టర్ నుంచి వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి తాజాగా 'మ్యారేజ్ మెయింటెనెన్స్ కిట్' పేరుతో ఈ వెబినార్ నిర్వహించింది. 

    వివాహ బంధాలపై 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిలేషన్‌షిప్ సైకాలజీ నిపుణుడు ఛార్లెస్ రివర్స్ ఈ వెబినార్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వివాహ బంధం బలహీనపడటానికి ప్రధాన కారణాన్ని ఛార్లెస్ వెల్లడించారు. “జీవిత భాగస్వామి మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మిత్రులైతే, మీరు ఇప్పుడు వారితో వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహరించగలుగుతారా? లేదా మార్చుకోవాల్సి వస్తుందా?" అనే కీలకమైన ప్రశ్నను దంపతులు తమకు తాము వేసుకోవాలని ఆయన సూచించారు. 

    దాంపత్యంలో పురుషులు తమ భార్యల నుండి గౌరవాన్ని ఆశిస్తే, మహిళలు తమ భర్తల నుంచి ప్రేమ, శృంగారం, సంభాషణను కోరుకుంటారని తెలిపారు. ఈ అవసరాలను గుర్తించి తీర్చడమే వైవాహిక జీవిత నిర్వహణకు ముఖ్యమని ఛార్లెస్ రివర్స్ వివరించారు. అలాగే, వాదనలు పెరిగిపోయి గొడవలకు దారితీయడానికి ప్రధాన కారణం ఒకరి మాట ఒకరు వినకపోవడమే అని, స్నేహితుల్లా వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని ఛార్లెస్ తెలిపారు. 

    దాంపత్యంలో పిల్లల కంటే, భార్యాభర్తల బంధానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పిల్లలకు ప్రేమను పంచుకోవడంపై సరైన అవగాహన వస్తుందని ఆయన సలహా ఇచ్చారు. వివాహంలో అనేక సమస్యలకు మూలం, ప్రస్తుత దాంపత్యం కంటే, పరిష్కారం కాని బాల్య సమస్యలే అని వివరించారు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలమని చార్లెస్ సూచించారు. 

    ప్రతి కుటుంబానికి ఉపయోగపడే ఉత్తమ వెబినార్ నిర్వహించినందుకు సెయింట్ లూయిస్ చాప్టర్ సభ్యులను, నాట్స్ విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.

    (చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..)