Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఇటీవల 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. దీంతో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగమైంది. 27 అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్‌వర్క్ చేపట్టింది. ఓట్లు వేసే ప్రజాప్రతినిధుల సంఖ్యను కూడా ప్రభుత్వం 300కే ఫిక్స్ చేసింది.

  • సాక్షి హైదరాబాద్:నేడు రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ సమ్మట్ లో విద్యుత్ శాఖకు పెట్టుబడులు వెల్లువగా వచ్చాయి. ఈ రోజు మెుత్తంగా రూ. 4లక్షల కోట్లకు చెందిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగా కేవలం విద్యుత్ శాఖలోనే రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గ్లోబల్ సమ్మిట్ కు దేశ, విదేశాలనుంచి దాదాపు 4వేల మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు.

    కంపెనీల వారిగా విద్యుత్ శాఖలో పెట్టుబడులు  

    గ్రీన్ కో ఎనర్జీస్. 3,960 మెగావాట్లు
    పెట్టుబడి: ₹24,000  కోట్లు ములుగు జిల్లా, ఇప్పాగూడెం

    గ్రీన్ కో టీజీ01- 950 మెగావాట్లు 
    పెట్టుబడి : రూ.5,800 కోట్లు  ఆదిలాబాద్ జిల్లా, ఝారి

    శ్రీ సిద్ధార్థ ఇన్ ఫ్రా -900 మెగావాట్లు 
    పెట్టుబడి: రూ.5,600 కోట్లు ఆదిలాబాద్ & నిర్మల్ జిల్లా

    ఆస్తా గ్రీన్ ఎనర్జీ - 750 మెగావాట్లవు 
    పెట్టుబడి: రూ.4,650 కోట్లు నిజామాబాద్ జిల్లా, మైలారం

    సెరూలిన్ ఎనర్జీ సొల్యూషన్ - 900 మెగావాట్లు 
    పెట్టుబడి: ₹5,600 కోట్లు ఆదిలాబాద్ జిల్లా, రామాపుర

    ఆక్సిస్ ఎనర్జీ, 2,750 మెగావాట్లు 
    పెట్టుబడి 31,500 కోట్లు

    ఈకోరిన్ 1,500 మెగావాట్లు
    పెట్టుబడి రూ.16,000

    మై హోమ్ పవర్ 750 మెగావాట్లు
    పెట్టుబడి రూ. 7,000 కోట్లు

    ఆస్తా గ్రీన్ ఎనర్జీ 
    పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300

    యునైటెడ్ టెలికామ్స్

    పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500

    ఏఏమ్ ఆర్ ఇండియా 
    పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750

    ఎఏమ్ గ్రీన్ (ఇండియా)  
    పెట్టుబడి రూ.8,000 కోట్లు – 4,000 జాబ్స్

    ఎఏమ్ గ్రీన్ (ఇండియా)
    పెట్టుబడిరూ.10,000 కోట్లు – 35,000 జాబ్స్

    ఎస్ ఎల్ ఆర్ సురభి పవర్ 
    పెట్టుబడి రూ.3,000 కోట్లు  1,000 జాబ్స్

    అయిత్రా హోల్డింగ్స్

    పెట్టుబడి రూ.4,000 కోట్లు – 9,000 జాబ్స్


    శ్రీ సురాస్ ఇండస్టీస్

    పెట్టుబడి రూ.3,500 కోట్లు – 5,000 జాబ్స్

    సోలానిక్స్ పవర్ - 500 మెగావాట్లు 
    పెట్టుబడి రూ. 2,400 కోట్లు – 500 జాబ్స్

    హైజోన్ గ్రీన్ ఎనర్జీస్ 
    పెట్టుబడి రూ.1250 కోట్లు జాబ్స్ 850

    హైజీనో గ్రీన్ ఎనర్జీస్ 
    పెట్టుబడి  రూ. 1250 కోట్లు జాబ్స్ 850

    సాయిల్ ఇండస్ట్రీస్ 
    పెట్టుబడి1,600 కోట్లు, జాబ్స్ 1,250

    ఆస్తా గ్రీన్ ఎనర్జీ 
    పెట్టుబడి రూ. 5,600 కోట్లు జాబ్స్ 200-300

    యునైటెడ్ టెలికామ్స్

    పెట్టుబడి రూ.2,500 కోట్లు జాబ్స్ 16, 500

    ఏఏమ్ ఆర్ ఇండియా 
    పెట్టుబడి రూ. 1,2500కోట్లు జాబ్స్ 19,750

     

  • సాక్షి, హైదరాబాద్‌: రిలయన్స్‌ అధినేత అంబానీ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న వంతారా జూపార్క్‌ బ్రాంచ్‌ తెలంగాణలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్‌ సిటీలోనే ఈ జూపార్క్‌ ఏర్పాటు కాబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.  

    సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన వంతరా బృందం.. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే కొత్త జూ పార్క్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో MOU కుదుర్చకుంది. వంతారా-అటవీశాఖ అధికారులు సీఎం సమక్షంలో ఒప్పందానికి వచ్చారు. 

    ఈ సందర్భంగా జంతువుల సేవ నినాదంతో వంతారా పని చేయడం అభినందనీయమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేయబోయే జూపార్క్‌లో జంతువులకు.. గుజరాత్‌ జామ్‌ నగర్‌ వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ కల్పించాలని.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అదే సమయంలో.. ఈ నెల చివర్లో తానే స్వయంగా సీఎం రేవంత్‌ వంతారా టీంతో అన్నారు. 

  • రాష్ట్రంలో 2026 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నంబరు 1715) జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 26 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది.

    జనవరి 14న బుధవారం భోగి, వెంటనే 15 జనవరి గురువారం సంక్రాంతి/పొంగల్.. 26 జనవరి సోమవారం గణతంత్ర దినోత్సవం.. ఫిబ్రవరిలో 15న ఆదివారం మహాశివరాత్రి.. మార్చి 3న మంగళవారం రంగుల పండుగ హోలీ, 19 మార్చి గురువారం ఉగాది, 21 మార్చి శనివారం రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్), 22 మార్చి ఆదివారం రంజాన్ తరువాతి రోజు, అలాగే 27 మార్చి శుక్రవారం శ్రీరామ నవమి..

    ఏప్రిల్‌న శుక్రవారం గుడ్ ఫ్రైడే, 5 ఏప్రిల్ ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14 ఏప్రిల్ మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. 27 మే బుధవారం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా).. 26 జూన్ శుక్రవారం మొహర్రం (ఇమామ్ హుస్సేన్ షహాదత్ – 10వ రోజు)..

    10 ఆగస్టు సోమవారం బోనాలు, 15 ఆగస్టు శనివారం స్వాతంత్ర్య దినోత్సవం, 26 ఆగస్టు బుధవారం ఈద్ మిలాద్-ఉన్-నబీ.. 4 సెప్టెంబర్ శుక్రవారం శ్రీకృష్ణ అష్టమి, 14 సెప్టెంబర్ సోమవారం వినాయక చవితి.. 2 అక్టోబర్ శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి, 18 అక్టోబర్ ఆదివారం సద్దుల బతుకమ్మ, 20 అక్టోబర్ మంగళవారం విజయదశమి, 21 అక్టోబర్ బుధవారం విజయదశమి తరువాతి రోజు..

    8 నవంబర్ ఆదివారం దీపావళి, 24 నవంబర్ మంగళవారం కార్తీక పౌర్ణమి / గురు నానక్ జయంతి.. 25 డిసెంబర్ శుక్రవారం క్రిస్మస్, 26 డిసెంబర్ శనివారం క్రిస్మస్ తరువాతి రోజు (బాక్సింగ్ డే)గా ప్రకటించింది.

    ఐచ్చిక సెలవులు (Optional Holidays)గా.. 1 జనవరి గురువారం నూతన సంవత్సరం, 3 జనవరి శనివారం హజ్రత్ అలీ జన్మదినం, 16 జనవరి శుక్రవారం కనుమ, 17 జనవరి శనివారం షాబ్-ఎ-మెరాజ్, 23 జనవరి శుక్రవారం శ్రీపంచమి, 4 ఫిబ్రవరి బుధవారం షాబ్-ఎ-బరాత్… ఇలా మొత్తం 26 ఉన్నాయి. అయితే.. వీటిల్లో ఉద్యోగులు తమ ఇష్టప్రకారం గరిష్టంగా 5 రోజులు మాత్రమే తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

    ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక అయిదు ఐచ్ఛిక సెలవులను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని జీవోలో స్పష్టం చేసింది.

  • భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా... దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ "మేం వేసే ప్రతి అడుగు... చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే" అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. 

    "ఫీనిక్స్" పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చాలనే లక్ష్యంతోనే "తెలంగాణ రైజింగ్"కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్‌సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు  అడుగులు వేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.

    ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగు "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025" అని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2024 - 2025 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు  అయ్యిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు.

    అదేవిధంగా రాష్ట్ర ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతం కాగా, అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమని శ్రీధర్ బాబు తెలిపారు.

    దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మారిన మంథని అనేది ఒక మారుమూల గ్రామమని కాని ఆచిన్న ఊరే "రేపటి తెలంగాణ"కు మార్గదర్శిగా నిలిచిందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ఐటీఐలు, ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, లైఫ్ సైన్సెస్ హబ్ "వన్ బయో", సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ లాంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచపటంలో "తెలంగాణ"ను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు.

    రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా  తెలంగాణతో కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు.

  • సాక్షి, ఫ్యూచర్‌ సిటీ: ప్రపంచ పటంలో తెలంగాణ మంచి రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని.. అది ఎంత కష్టమైనా అందరి  సహకారంతో సాధించి తీరతామని మఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025లో ఆయన ప్రసంగించారు.

    దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నాం. ఇందుకు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో సోనియా గాంధీ, ఆనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

    వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది.

    .. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం.. ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు

    ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం.

    దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో  తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం.

    • కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)

    • పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)

    • రూరల్ అగ్రికల్చర్ రీజియన్  ఎకానమీ (RARE)

    ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం.

    మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీంకు నేను చెప్పేదొక్కటే. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక.. ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. Come and join the rise అని సీఎం రేవంత్‌ తన ప్రసంగం ముగించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్‌ డివిజన్‌లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

    బౌద్ధనగర్‌ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

    ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..

    మేనబావ పనే..!
    పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు. 

    ఘటన స్థలంలో ఉమాశంకర్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

National

  • సాధారణంగా టూవీలర్ నడిపేవాళ్లే హెల్మెట్ ధరిస్తారు. కానీ ఇక్కడ కారు నడిపే వ్యక్తి హెల్మెట్ వేసుకుని కారు డ్రైవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్షన్ అనే వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించి కనిపించారు. గతంలో హెల్మెట్ ధరించనందుకు పోలీసులు అతనికి జరిమానా విధించారని, అందుకే ఇప్పుడు హెల్మెట్ ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.

    2025 నవంబర్ 26న తన ఫోర్ వీలర్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించనందుకు పోలీసులు రూ.1,100 జరిమానా విధించారని గుల్షన్  అన్నారు. ''నేను సీట్ బెల్ట్ ధరించాను, కానీ హెల్మెట్ ధరించనందుకు పోలీసులు నాకు జరిమానా విధించారు" అని అతను చెప్పారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అందుకే జరిమానా విధించినప్పటి నుంచి కారు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరిస్తున్నానని, భవిష్యత్తులో చలాన్‌లను పొందకుండా ఉండాలంటే వేరే మార్గం లేదని అన్నారు.

    ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్లకు జరిమానాలు విధించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోమారు యూపీలో అలాంటి ఘటన తెరపైకి వచ్చింది.

  • ఇటీవల చైనా షాంగై ఎయిర్ పోర్టులో ఇండియాకు చెందిన ఓ మహిళను చైనా అధికారులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆ విషయంపై చైనాను వివరణ కోరింది. భారతీయులు చైనా దేశం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని తెలిపింది. ఈ మేరకు డ్రాగన్ దేశం నమ్మకం కలిగేలా హామీ ఇవ్వాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.

    అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా తరచుగా భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది. ఆ ప్రాంతం చైనాదేనని చెప్పడం అంతేకాకుండా ఆదేశ మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్ భాగంగా చూపడంతో తరచుగా ఈ అంశంలో ఇరు దేశాలకు ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఓ మహిళ యూకే నుండి జపాన్ ప్రయాణిస్తుండగా మార్గం మద్యలో షాంఘై విమానాశ్రయంలో ఆగింది. ఆసమయంలో అక్కడి ప్రభుత్వాలు ఆమె అరుణాచల్ ప్రదేశ కు మహిళ అని తెలిసి తనను వేధించారని తెలిపింది. అంతే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అన్నారని పేర్కొంది. ఈ ఘటనను భారత్ ఆసమయంలోనే ఖండించింది.

    తాజాగా భారత్ చైనాను ఒక వివరణ కోరింది. భారత విదేశాంగ కార్యదర్శ రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ " భారతీయులు చైనా మీదుగా వెళ్లేటప్పుడు వారినే టార్గెట్ గా చేసుకొని ఇబ్బందులు పెట్టమని చైనా తెలపాలి. ఆ మేరకు నమ్మకం కలిగేలా అధికారులు ప్రకటన చేయాలి. ఇష్టానుసారంగా వ్యవహరించకుండా అంతర్జాతీయ ప్రయాణ చట్టాలను గౌరవించాలి. చైనా మీదుగా ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలి" అని రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

    అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఇది వరకే చాలా సార్లు భారత్ చెప్పింది. దాని గురించి మరోసారి మాట్లాడదలుచుకోలేదని రణధీర్ జైశ్వాల్ అన్నారు. అయితే ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని సహృద్భావ వాతరణంలో ఇరు దేశాల మైత్రి సాగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.

  • మహారాష్ట్ర రాజకీయాల్లో మరో చీలిక రానుందా?.. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే వర్గం త్వరలో చీలిపోయే అవకాశం ఉందని తెలిపారు. మహాయుతి మిత్రపక్షంలో  22 మంది ఎమ్మెల్యేలు జంపు జిలానీకి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

    21వ శతాబ్ధపు భారత రాజకీయాల్లో మహారాష్ట్ర రాజకీయాలు గుర్తుండిపోతాయి. ఎత్తులకు పైఎత్తులు, పార్టీల జంప్, ప్రభుత్వాలని కూలగొట్టడం లాంటివి అక్కడ ప్రస్తుతం కామన్‌గా మారాయి. 2022లో  శివసేన పార్టీని చీల్చి 40 మంది ఏమ్మెల్యేలతో ఆపార్టీ మాజీ నేత ఏకనాథ్ షిండే ప్రభుత్వాన్ని కూల్చారు. బీజేపీతో చేతులు కలిపి సీఎంగా మారారు. దాని అనంతరం అజిత్ పవార్ సైతం ఎన్సీపీలో చీలిక తెచ్చి 41 మంది ఎమ్మెల్యేలతో బయిటకి వచ్చారు. తర్వాత బీజేపీ ప్రభుత్వంలో కలిశారు. దీంతో మరాఠా రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరికి అర్థం కాకుండా మారింది.

    ఈ నేపథ్యంలో శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. మహయుతి మిత్రపక్షానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చాలా దగ్గరగా ఉన్నారని.. త్వరలో వాళ్లు ఆయనతో కలిసే  అవకాశాలున్నాయని తెలిపారు. అలా పరోక్షంగా శిండే వర్గాన్ని హెచ్చరించారు. అంతే కాకుండా వర్లీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22 మంది వైస్ కెప్టెన్ అంటారని పరోక్షంగా మంత్రి ఉదయ్ సమంత్ ను ఉద్దేశించి మాట్లాడారు.

    అయితే గతంలోనూ అజిత్ పవార్, శిందేలతో పాటు ఉదయ్ సమంత్ కూడా సీఎం రేసులో ఉండడం తెలిసిందే. కిందటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) మహాయుతిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

  • విమానయాన సంస్థ  ఇండిగో సంక్షోభం మధ్య  ట్రాటా గ్రూపుసొంతమైన ఎయిరిండియా ఇచ్చిన పైలట్ల నియామక ప్రకటన సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసింది.  ఒక పక్క ఇండిగో పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతోంటే సందట్లో సడేమియా అన్నట్టు ఎయిర్‌బస్ A320 మరియు బోయింగ్ B737 విమానాల కోసం పైలట్లు కావాలంటూ ఎయిరిండియా  ప్రకటనలో  జారీ చేయడం నెట్టింట  చర్చకు దారి తీసింది.

    "స్కై ఈజ్ నాట్ ది లిమిట్" ఇది ప్రారంభం మాత్రమే అని టాటా గ్రూప్ కంపెనీలో కెరీర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పైలట్లను కోరుతూ  ఎయిరిండియా ప్రకటించింది.   "భారత విమానయాన భవిష్యత్తును ఏలండి.. అనుభవజ్ఞులైన B737 , A320 పైలట్లను మా పెరుగుతున్న విమానాల సముదాయంలో చేరమని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 22 నాటికి మీ దరఖాస్తులను సమర్పించండి" అని ఎయిర్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.  ఈ ప్రకటన  సోషల్‌ మీడియాలో  నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

    మరోవైపు  గత సంవత్సరం రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన సవరించిన విమాన డ్యూటీ సమయ పరిమితులు (FDTL) నియమాలు,  విమానాల రద్దు,  రీషెడ్యూల్‌తో ఇండిగో తీవ్ర విమర్శలెదుర్కొంటోంది. తీవ్ర పైలట్ల కొరతను ఎదుర్కొంటున్న ఇండిగో కూడా ఇప్పటికే నిపుణులైన పైలట్ల, ఇతర సిబ్బంది నియామకాల కోసం ఇప్పటికే  ప్రకటన జారీ  చేసింది.

    ఇదీ  చదవండి: ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్‌ జర్నీ

    విమాన కార్యకలాపాలు సకాలంలో పనితీరు క్రమంగా మెరుగుపడుతున్నాయని ప్రకటించినప్పటికీ ఇండిగో విమానాలను రద్దు  కొనసాగుతూనే  ఉంది.
    దీంతో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు ఈరోజు 6.9 శాతం పడిపోయాయి . దాదాపు 66 శాతం దేశీయ మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఇండిగోకు ఇది  ఎనిమిది నెలల్లో అత్యధికం  నష్టం.

    ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

  • ఒక ప్రమాదంలో కంటి చూపు పూర్తిగా  పోయింది. కానీ మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పో లేదు. విధికెదురొడ్డి తన జీవితాన్ని తానే అత్యంత దృఢంగా నిర్మించుకున్నారో సాహసి. పట్టుదల, దృఢ సంకల్పానికి తోడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భారతదేశంలోని  తొలి పూర్తి అంధుడైన అధికారిగా నిలిచారు. సైన్యంలో క్రియాశీల విధుల్లో పనిచేస్తున్నలెఫ్టినెంట్ కల్నల్  సి. ద్వారకేశ్ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.

    లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేశ్ ప్రయాణం ప్రతికూలతకు లొంగని అసాధారణ సంకల్పానికి నిదర్శనం. 2014లో పని సంబంధిత ప్రమాదంలో కంటి చూపు కోల్పోయారు.  దీంతో సైనికుడిగా అతడి జీవితం అక్కడితో ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ అతను మాతరం ఫీనిక్స్‌లా తన చరిత్రను తిరగరాసి  చరిత్ర సృష్టించాడు , పూర్తిగా  కంటి చూపు కోల్పోయినప్పటికీ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. అత్యాధునిక AI సాధనాలు, ఇతర సాంకేతికత మద్దతుతో, ద్వారకేశ్ తన దృష్టిగల సహచరుల మాదిరిగానే నైపుణ్యంతో తన బాధ్యతలను  విజయవంతంగా నిర్వర్తిస్తారు.

    సియాచిన్ హిమానీనదం ఎక్కడం నుండి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడం, ఈత, షూటింగ్ , విద్యావేత్తలలో ఒకడిగా రాణించడం వరకు  ప్రతీ సవాలును విజయంగా మార్చుకున్న వైనం స్ఫూర్తి దాయకం.   న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి  దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వికలాంగుల జాతీయ అవార్డును అందుకున్నారు. దేశానికి ఆయన చేసిన అసమానమైన కృషికి గుర్తింపుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగన్ విభాగంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగుల జాతీయ అవార్డు ను లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేశ్‌కు ప్రదానం చేశారు. రుజువు చేస్తుంది.

    ద్వారకేశ్‌ ఏమన్నారంటే..    
    విద్యా ,సాంకేతికత ద్వారానే  నా  వైకల్యాన్ని అధిగమించగలిగాను. అనేక పోటీ పరీక్షలను విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాను. నేను ఇప్పుడు పారా క్రీడలపై, ముఖ్యంగా అంధ క్రీడలపై పూర్తి పరిశోధన చేయగలనని గర్వంగా చెప్పగలను.  వైకల్యాన్ని  శక్తిగా మార్చుకున్నాను. సాధారణ స్థితికి తిరిగి రావడానికి మార్గాలను కనుగొన్నాను.’’అన్నారు. 2009లో,సైన్యంలో అధికారిని అయ్యాను, భారత రాష్ట్రపతిచే కమిషన్ పొందాను. ఇపుడురాష్ట్రపతి నుండి ఈరోజు అవార్డుతో ధన్యుడినయ్యాను అన్నారు.

    ఎవరీ ద్వారకేశ్‌
    ద్వారకేశ్‌ తమిళనాడుకు చెందినవారు.  పాఠశాల రోజుల నుండి ఆర్మీలో  చేరాలనేది అతని కల.  అలా NCCలో చేరారు. 2004లో తమిళనాడు NCC డైరెక్టరేట్ ఉత్తమ NCC క్యాడెట్‌గా ఎంపిక చేసింది. UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి కూడా అర్హత సాధించారు. 

    పట్టుదలే జీవితం
     భారత సైన్యం  సాంకేతిక ప్రవేశం క్యాడెట్ శిక్షణ విభాగం (CTW)లో చేరాడు. ఆ తర్వాత అతను 2009లో ఆర్మీ యొక్క కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ను ఎంచుకున్నారు. 2014లో పూణేలో జరిగిన ప్రమాదంలో గాయం కారణంగా రెండు కళ్ళలో పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రమాదం అతని కళ్ళను కోల్పోయిన తర్వాత, 36 ఏళ్ల  ద్వారకేశ్‌ 2023లో జాతీయ షూటింగ్ పోటీలో స్వర్ణ పతకం గెల్చుకున్నారు.   తాను కంటి చూపును కోల్పోయాను, జీవిత దృష్టిని కాదున్న ఆత్మవిశ్వాసం ద్వారకేశ్‌ది. 

    క్రీడా ప్రయాణం  ప్రారంభం
    2018లో ఖడ్కీలో నియమితులైన ద్వారకేష్‌ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్సెంటర్‌లో కొత్తగా స్థాపించబడిన పారాలింపిక్ నోడ్‌లో పారా-స్పోర్ట్స్‌ను అభ్యసించడం ప్రారంభించారు. 2021లో ఉదయపూర్‌లో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుచు కున్నారు. గాయం తర్వాత అది అతని తొలి పతకం. ఈ గెలుపు  మనోధైర్యాన్ని పెంచే పంచ్ ఇచ్చింది. అప్పటినుంచి పతకాల వేట మొదలైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాక్టీస్ సెషన్‌లు మరియు పోటీలలో మెరుగైన  నైపుణ్యం ప్రదర్శించారు. అక్టోబర్ 2025లో యుఎఇలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్‌లో ఆయన ఇటీవల సాధించిన 624.6 ప్రపంచ రికార్డు స్కోరు పట్టుదలకు  నిదర్శనం. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) కూడా అర్హత సాధించారు.

    ప్రస్తుతం భారత పారా షూటింగ్ జట్టులో భాగం. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్‌లో అధునాతన శిక్షణ పొందుతున్నారు. పారాలింపిక్స్‌లో అసాధారణ విజయాన్ని సాధించడం ద్వారా దేశానికి , కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టడం విశేషం.

    ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

  • ఢిల్లీ: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్‌)కు ఎంపికైన వారికి కేంద్ర ప్ర‌భుత్వం కేడ‌ర్ కేటాయించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సైకిల్‌లో ఐఏఎస్ సాధించిన వారి కేడ‌ర్ కేటాయింపు జాబితా (IAS cadre allocation list) విడుద‌లైంది. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈమేర‌కు జాబితాను విడుద‌ల చేసింది. 

    ఫ‌స్ట్‌ ర్యాంకర్ శక్తి దూబే (Shakti Dubey) తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను తన కేడర్‌గా పొందారు. హ‌రియాణాకు చెందిన రెండో ర్యాంక‌ర్‌ హర్షిత గోయల్.. గుజరాత్ కేడ‌ర్‌కు ఎంపిక‌య్యారు. మహారాష్ట్రకు చెందిన మూడో ర్యాంక‌ర్ డోంగ్రే అర్చిత్ పరాగ్.. క‌ర్ణాట‌క కేడ‌ర్ ద‌క్కించుకున్నారు. నాలుగో ర్యాంక‌ర్ షా మార్గి చిరాగ్(గుజ‌రాత్‌), ఐదో ర్యాంక‌ర్ ఆకాష్ గార్గ్ (ఢిల్లీ) సొంత రాష్ట్రాల్లో కేడ‌ర్ పొందారు. టాప్ 10 ర్యాంకర్లలో ఆరుగురు త‌మ సొంత రాష్ట్ర కేడ‌ర్ ద‌క్కించుకున్నారు. 

    టాప్ 25లో 11 మంది మహిళలు
    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ 22న సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలను ప్రకటించింది. 1,009 మంది అభ్యర్థులు వివిధ స‌ర్వీసుల‌కు ఎంపిక‌య్యారు. వీరీలో 725 మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్ఈ 2024 ఫలితాల్లో యూపీకి చెందిన‌ శక్తి దూబే మొద‌టి స్థానం సాధించారు. టాప్ 5 ర్యాంక‌ర్ల‌లో ముగ్గురు మ‌హిళ‌లు ఉండ‌డం విశేషం. టాప్ 25లో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. 

    దేశంలో అత్యంత పోటీ ఉన్న ప‌రీక్ష‌ల్లో ఒక‌టైన సివిల్స్‌లో ప్ర‌తిఏటా ల‌క్ష‌లాది మంది త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌ల‌తో పాటు ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ A, B ఉద్యోగాలు పొందేందుకు సివిల్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించాలి. 

    టాప్ 10 ర్యాంకర్ల కేడ‌ర్ కేటాయింప‌లు ఇలా ఉన్నాయి..

    ర్యాంక్

    పేరు

    కేట‌గిరీ

    సొంత రాష్ట్రం

    కేడ‌ర్‌

    1శక్తి దూబేజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్
    2 హర్షిత గోయల్జనరల్హ‌రియాణాగుజరాత్
    3డోంగ్రే అర్చిత్ పరాగ్జనరల్మహారాష్ట్రకర్ణాటక
    4షా మార్గి చిరాగ్జనరల్గుజరాత్గుజరాత్
    5ఆకాష్ గార్గ్జనరల్ ఢిల్లీAGMUT
    6కోమల్ పునియాజనరల్ఉత్తరాఖండ్ఉత్తరప్రదేశ్
    7ఆయుషి బన్సల్జనరల్మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్
    8రాజ్ కృష్ణజనరల్బిహార్ బిహార్ 
    9ఆదిత్య విక్రమ్ అగర్వాల్జనరల్హ‌రియాణాఉత్తరప్రదేశ్
    10మయాంక్ త్రిపాఠిజనరల్ఉత్తరప్రదేశ్ఉత్తరప్రదేశ్

    చ‌ద‌వండి: 'ప్యూర్ వెజిటేరియ‌నా.. ఏదో మిస్స‌వుతున్నారు'

  • న్యూఢిల్లీ: వందేమాతరంపై  పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం అసలు ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ నిలదీశారు. కేవలం పశి్చమ 
    బెంగాల్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ డ్రామాకు తెర తీశారంటూ దుయ్యబట్టారు. తొలి ప్రధాని నెహ్రూ వందేమాతరాన్ని అవమానించారన్న మోదీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 

    వందేమాతర రచయిత బంకించంద్ర చటర్జీ బెంగాలీ గనుక, ఆ గేయంపై చిచ్చు రాజేసి ఓట్లు రాబట్టుకోవడమే మోదీ పన్నాగమని ఆరోపించారు. ‘ఇందుకోసం బెంగాల్‌ కే చెందిన మరో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్ర బోస్‌ కు నెహ్రూ రాసిన లేఖను మోదీ అడ్డం పెట్టుకుంటున్నారు. కానీ మోదీ ఆరోపించినట్టుగా వందేమాతరంలోని కొన్ని చరణాలు ముస్లింలను కించపరిచేలా ఉన్నాయని నెహ్రూ ఎన్నడూ అనలేదు. 

    పైగా మోదీ చెబుతున్నట్టుగా వాటిని తీసేయించనూ లేదు. నిజంగా ఆయన అలా చేసి ఉంటే వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే జాతీయ గేయంగా ఆమోదించిన రాజ్యాంగ అసెంబ్లీలో సభ్యుడైన ఆరెస్సెస్‌ నేత శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ అభ్యంతర పెట్టలేదేం?‘అని ప్రశ్నించారు. ముస్లిం సంతుషీ్టకరణ కోసం నాటి ముస్లిం లీగ్‌ నేత జిన్నా డిమాండ్‌ కు లొంగి వందేమాతరంలోని పలు పంక్తులను నెహ్రూ తొలగించారని మోదీ పార్లమెంటులో ఆరోపించడం తెలిసిందే. 

    ఈ విషయమై నెహ్రూ రాసిన లేఖే ఇందుకు రుజువని ఆయన చెప్పారు. ఇదంతా పచ్చి అబద్ధమని ప్రియాంక స్పష్టం చేశారు. వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో చేపట్టిన ప్రత్యేక చర్చలో సోమవారం ఆమె పాల్గొన్నారు. నెహ్రూపై మోదీ ఆరోపణలన్నింటినీ పూర్తిస్థాయిలో తిప్పికొట్టారు. వందేమాతరంలోని కొన్ని పంక్తులపై నెహ్రూ అభ్యంతరాలు లేవనెత్తారన్నది నాటి మతోన్మాద శక్తుల దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదని ఆమె చెప్పారు.

     బోస్‌ కు నెహ్రూ లేఖలో కొద్ది భాగాన్ని మాత్రమే తన వాదనకు అనువుగా మోదీ అన్వయించుకున్నారని ఆక్షేపించారు. ‘నెహ్రూపై మీకెందుకీ అకారణ ద్వేషం? మీకు గనుక దమ్ముంటే నెహ్రూపై మీరు చేస్తాను అన్ని ఆరోపణల మీదా పూర్తి స్థాయిలో ముందుగా సభలో చర్చ చేపడదాం రండి. ఆ తర్వాత ఈ అంశానికి మీరు శాశ్వతంగా తెర వేయాలి.

     మీ రాజకీయ ప్రయోజనం కోసం అవసరమైనపుడల్లా నెహ్రూపై బురదజల్లడాన్ని మానుకోవాలి‘ అంటూ మోదీ సర్కారుకు సవాలు ప్రియాంక విసిరారు. ‘కనీసం ఆ తర్వాతైనా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి నిజమైన సమస్యలపై చర్చిద్దాం. తద్వారా సభా సమయాన్ని సద్వినియోగం చేద్దాం‘ అని సూచించారు. ‘మోదీ దాదాపు 12 ఏళ్లుగా ప్రధానిగా ఉంటున్నారు. దేశం కోసం పోరాడినందుకు నెహ్రూ దాదాపు అంతేకాలం జైల్లో గడిపారు‘ అంటూ తూర్పారబట్టారు. 

    మోదీలో భయం.. 
    ప్రధానికి ఆత్మవిశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోందని ప్రియాంక అన్నారు. ‘కొద్ది రోజులుగా అది కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. మోదీ ఒకప్పటి మోదీ కాదు. అన్నింటికీ భయపడుతూ గడుపుతున్నారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని నానాటికీ బలహీన పరుస్తుండటమే అందుకు కారణం’అని ప్రియాంక అన్నారు.   

     

  • యూపీలోని బదౌన్‌కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి,  సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.

    ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన  పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో  సంప్రదాయ  బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక  పలువురి  దృష్టిని ఆకర్షించింది.

    దైవిక వరుడితో సాంప్రదాయ వివాహం
    ఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు.  ఆమె   సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.

    పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు.  మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.

    వధువు తండ్రి ఏమన్నారంటే 
    ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి  తనతో పాటు  వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.

    ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

    బంగారు ఉంగరం 
    దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక  బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక  ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది.  ఇది తన వివాహానికి  మరొక సంకేతంగా భావించిందట.  తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి. 

    చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు

  • న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, భారీ విమానాల రద్దు, నియంత్రణ చర్యలు లాంటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.వందలాది విమానాలను రద్దు చేసిన అనేకమంది ప్యాసెంజర్లను చెప్పరాని ఇక్కట్ల పాలు చేసింది.  ప్రయాణీకులకు రద్దు చేసిన టికెట్ల ఫీజును పూర్తిగా వాపసు చేయడంతోపాటు, వారి లగేజీని సురక్షితంగా అందించాల్సిన బాధ్యత కూడా ఇండిగోదేనని విమానయాన శాఖ స్పష్టం చేసింది. లేని పక్షంలో నియంత్రణ సంస్థ చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రకటించింది.

    ఈ పరిణామాలతో దిగి వచ్చిన ఇండిగో ప్రయాణీకులకు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు, సంబంధిత చర్యకు ఉపక్రమించింది. ఈ క్రమంలో  రూ.827 కోట్ల విలువైన టిక్కెట్లను తిరిగి చెల్లించిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు  2 వారాల్లో రూ.827 కోట్లు ఇండిగో తిరిగి చెల్లించింది. అలాగే 9,000 బ్యాగుల్లో 4,500 తిరిగి ఇచ్చింది. నవంబర్ 21, డిసెంబర్ 7 మధ్య క్యాన్సిల్‌ 9,55,591 టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

    డిసెంబర్ 1- 7తేదీల మధ్య రూ.569 కోట్ల విలువైన దాదాపు ఆరు లక్షల టిక్కెట్ల రద్దు సొమ్మును తిరిగి చెల్లించినట్లు వారు తెలిపారు. 9వేల బ్యాగుల్లో దాదాపు 4,500 కూడా వినియోగదారులకు డెలివరీ చేశారు. రాబోయే 36 గంటల్లో బ్యాలెన్స్ బ్యాగులను డెలివరీ చేయనున్నట్టు  పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం 138 గమ్యస్థానాలకు గాను 137 విమానాలకు 1,802 విమానాలను నడపాలని యోచిస్తోంది.

    ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్

  • సాక్షి, ఢిల్లీ:  రాజధాని విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. మత్తుపదార్థాలను తరలిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి సీజ్ చేశారు. పట్టుకున్న విదేశీ గంజాయి విలువ దాదాపు రూ. 15 కోట్లు ఉంటుందని తెలిపారు.

    గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతుంది. అధికారులు ఎంతగా కట్టడి చేసినప్పటికీ నిందితులు ఎదో రకంగా మత్తు పదార్థాల స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ గంజాయి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు వారిని పట్టుకున్నారు. 

    కాగా గతంలోనూ ఢిల్లీలో ఎయిర్ ఫోర్టులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన స్మగ్లర్ల నుంచి కస్టమ్స్ అధికారులు దాదాపు రూ.47 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు.

     

International

  • ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, హిజ్బూల్లాతో పూర్తిస్థాయిలో యుద్ధం చేసేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పాటు యుద్ధంతో ఆర్థికంగా, ఆయుధ సామాగ్రి పరంగా కొంత కొరత ఉండగా ప్రస్తుతం  మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.   అంతేకాకుండా ఈ యుద్ధం కోసం ఆధునాతన సాంకేతిక వాడుతున్నట్లు తెలుస్తోంది.

    కాగా కొద్ది నెలల క్రితమే ఇజ్రాయిల్, పాలస్తీనా గాజాలోని హమాస్ తో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో పాటు ఇతర దేశాలు యుద్ధ విరమణకు ఎంతగానో కృషి చేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ మారోసారి యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • శక్తివంతమైన భూకంపం సోమవారం జపాన్‌ను వణికించింది. స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 9.13గం. ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో(కొన్ని మీడియా సంస్థలు 7.2గా ఇస్తున్నాయ్‌) భూమి కంపించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

    భూకంప కేంద్రం హొక్కైడో(జపాన్‌లో రెండవ అతిపెద్ద దీవి) తీరానికి సమీపంలో ఆవోమోరి నగరానికి సమీపంలో.. సముద్ర మట్టానికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. భూకంపం ప్రభావంతో.. సముద్రంలో 10 అడుగుల ఎత్తులో అలల ఎగసి పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    జపాన్ ఉత్తర తీరంలో సంభవించిన ఈ భూకంపం వల్ల ప్రజలకు సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల నేపథ్యంతో ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలు భద్రతా తనిఖీలు ప్రారంభించాయని NHK (జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్) తెలిపింది. 

    భూకంపాలతో అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో జపాన్‌ ఒకటి. పసిఫిక్, యూరేషియన్, ఫిలిప్పైన్ టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ తరచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. గతంలో.. గ్రేట్ కాంటో (1923), కోబే (1995), టోహోకు (2011) అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి దేశానికి పెద్ద నష్టం కలిగించాయి

    జపాన్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 7.0 కంటే ఎక్కువ తీవ్రత గల భూకంపాలు 1900–2016 మధ్య 163 సార్లు నమోదయ్యాయి. అలాగే.. 8.0 కంటే ఎక్కువ తీవ్రత భూకంపాలు 14 సార్లు సంభవించాయి. టోహోకు భూకంపం (2011).. 9.0 తీవ్రతతో జపాన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా నిలిచింది. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కూడా జరిగింది.భారీ సునామీ కారణంగా 15,000 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది జనవరిలో హ్యుగా-నాడా భూకంపం ..  6.9 తీవ్రతతో మియాజాకి ప్రిఫెక్చర్ సమీపంలో సంభవించలేదు. అయితే పెద్ద నష్టం జరగలేదు.

  • కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన యవకుడు బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో అతివేగంతో  లగ్జరీ కారు టెస్లా కారును నడిపి ఒక మహిళ మృతికి కారణ మయ్యాడు. అతనిపై  పోలీసులు  కేసునమోదు చేశారు. డిటెన్షన్ సెంటర్‌కు తరలించిన అతని బెయిల్ ఫీజు రూ. 10.81కోట్లు( 1.2 మిలియన్‌ డాలర్లు) గా నిర్ణయించారు.

    కాలిఫోర్నియాలో 240 కిలోమీటర్ల వేగంతో టెస్లాతో ఎస్‌యూవీని ఢీకొట్టాడు నిందితుడు 28 ఏళ్ల వ్యక్తి  బాదల్ ధోలారియా .శనివారం (నవంబర్ 29) ప్రమాదం జరిగినప్పుడునిందితుడు  మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు ఆరోపించారు. టెస్లా మోడల్ 3ని  కారుతో, ఫోర్డ్ బ్రోంకో అనే ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 41 ఏళ్ల మహిళా ప్రయాణీకురాలు అలిక్స్ మారి స్పార్క్స్ ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె  అక్కడిక్కడే మరణించింది. దీంతో అతనపై సెకండ్ డిగ్రీ హత్య మరియు ఇతర నేరారోపణలు మోపబడ్డాయి.

    డోలారియా అతి వేగం, నిర్లక్ష్యంగా  డ్రైవ్‌ చేసి ఫోర్డ్ బ్రోంకో వెనుక నుంచి ఢీకొట్టాడని శాన్ రామన్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. డోలారియా కస్టడీలో ఉండగా అతని బెయిల్‌ కోసం ఏకంగా 1.2 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించారు. అంతేకాదు "మీరు బలహీనంగా ఉంటే, డ్రైవ్ చేయవద్దు. మీరు జీవితాలతో జూదం ఆడుతున్నారు. మద్యం, గంజాయి, చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలు లాంటి వాహనాన్ని సురక్షితంగా నడపగల మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఏదైనా పదార్థం మన రోడ్లపై మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది." దీన్ని సహించ బోము అని కాంట్రా కోస్టా కౌంటీ జిల్లా న్యాయవాది డయానా బెక్టన్  తీవ్రంగా హెచ్చరించారు.

    ఇదీ చదవండి: IndiGo Crisis: హద్దే లేదు రారమ్మంటున్న ఎయిరిండియా

  • ప్రపంచంలో.. మొట్టమొదటిసారిగా టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేస్తోంది ఆస్ట్రేలియా. మరో రెండు రోజుల్లో (డిసెంబర్‌ 10) ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి రానుంది. ఈ దరిమిలా ప్రపంచమంతా ఇది ఎలా అమలు కానుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మిగతా దేశాలు తమ బాటలో పయనిస్తాయని తానేం ఆనుకోవడం లేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అంటున్నారు. అంతేకాదు.. తాము తీసుకున్నది పరిపూర్ణమైన నిర్ణయమేమీ కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. 

    ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు చిన్నారులకు సో.మీ. నిషేధంపై తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టత ఇచ్చారు. ‘‘ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుకుంటే మీరు పొరపడినట్లే. సో.మీ. ప్రభావం వల్ల ప్రభావితమైన.. వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారు. ఇది తల్లిదండ్రుల బాధను గౌరవిస్తూ.. సోషల్ మీడియా కంపెనీలను బాధ్యత వహించేలా చేసే చట్టం’’ అని అల్బనీస్‌ పేర్కొన్నారు. 

    ..అలాగని మేం దీనిని పరిపూర్ణమైన నిర్ణయం అని అనుకోవడం లేదని కూడా చెబుతున్నారు. ఈ చట్టంలో లోపాలున్నా ప్రాణాలను మాత్రం రక్షిస్తుందని అంటన్నారు. ఈ మేరకు పిల్లల భద్రతకు అవసరమైన అడుగుగా భావిస్తున్నాం అని అన్నారాయన. పిల్లల మానసిక ఆరోగ్యం .. భద్రత నేపథ్యాలే ఈ నిషేధం వెనుక ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు  ఈ నిర్ణయాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారా? అని అడగా.. అలా తాము భావించడం లేదని, అది ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఉంటుందని.. అయితే పాటిస్తే మాత్రం తప్పకుండా మేలే జరుగుతుందని అంటున్నారు. 

    సోషల్‌ మీడియా వాడకానికి మినిమమ్‌ ఏజ్‌ (Online Safety Amendment Bill 2024)ను గుర్తిస్తూ.. ప్రపంచంలోనే మొదటిసారి అమలు కాబోతోంది. దీని ప్రకారం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌, ఎక్స్‌(ట్విటర్‌) వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్‌లు ఉండకూడదు. ఎడ్యుకేషన్‌, ప్రొఫెషనల్‌ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు($49.5 మిలియన్.. మన కరెన్సీలో రూ.4,500 కోట్ల దాకా జరిమానా) చెల్లించాల్సి వస్తుంది.

    తల్లిదండ్రుల బాధను విన్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అల్బనీస్‌ మరోమారు స్పష్టం చేశారు. పిల్లలను ఆన్‌లైన్ బులీయింగ్(వేధింపులు), హానికర కంటెంట్‌కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుండి పరిరక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్‌ ఉద్ఘాటించారు. స్క్రీన్‌లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి నిజజీవిత కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. 

    సవాళ్లు.. 
    వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని.. సంబంధిత డాక్యమెంట్లనూ పరిశీలిస్తామని సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లు చెబుతున్నాయి. అయితే.. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలు వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌(VPN)లు వాడడమో.. లేదంటో ఫేక్ అకౌంట్‌లు వాడో నిబంధల్ని అతిక్రమించే అవకాశం లేదా? అనేది మున్ముందు తెలిసేది.

    రియాక్షన్లు ఇవిగో.. 
    టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతినియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్‌ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని యువత నుంచి ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొంతమంది టీనేజర్లు ఈ నిషేధం వల్ల ఆన్‌లైన్ బులీయింగ్, హానికర కంటెంట్ తగ్గుతుందని భావిస్తున్నారు. మరికొందరు ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించేదిగా చూస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం “ఇది బ్లాక్ అండ్ వైట్ విషయం కాదు” అని.. అంటే పూర్తిగా మంచిదీ చెడిదీ అని చెప్పలేమని అభిప్రాయపడ్డారు.

  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్‌ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా   విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

    "అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు. 

    "మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.

    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్.

  • ఇంట్లో భార్య ఉండ‌గానే గాల్‌ఫ్రెండ్‌తో క‌లిసి థాయిలాండ్‌ టూరుకు వెళ్లిన ప్ర‌బుద్ధుడొక‌రు ఊహించ‌ని రీతిలో దొరికిపోయాడు. భార్య‌తో బిజినెస్ టూర్ అని చెప్పి ర‌హ‌స్య‌ స్నేహితురాలితో షికారుకెళ్లిన అత‌గాడిని అనూహ్యంగా ప్రకృతి ప‌ట్టించింది. ఏంటి న‌మ్మ‌డం లేదా? అయితే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోదాం ప‌దండి.

    మ‌లేసియాకు చెందిన ఓ వ్య‌క్తి ఇటీవ‌ల త‌న సహోద్యోగులతో కలిసి బిజినెస్ ట్రిప్‌ (business trip) వెళుతున్న‌ట్టు భార్య‌తో చెప్పి థాయిలాండ్ వెళ్లాడు. ద‌క్షిణ‌ థాయిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన హాట్ యాయ్‌కు వెళ్లిన‌ట్టు భార్య‌కు తెలిపాడు. క‌డుపుతో ఉన్న భార్య‌కు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌యాణానికి సంబంధించిన‌ అప్‌డేట్స్ ఇస్తుండేవాడు. దీంతో ఆమెకు ఎటువంటి అనుమానం క‌ల‌గ‌లేదు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే మేనేజ్ చేశాడు. కానీ త‌ర్వాత క‌థ అడ్డం తిరిగింది. ప్రకృతి క‌న్నెర్ర చేయ‌డంతో త‌ర్వాత ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్ల‌డించింది.

    ఊహించ‌ని విధంగా భారీ వ‌ర్షాలు థాయిలాండ్‌ను అత‌లాకుత‌లం చేశాయి. కుండపోత వర్షాల‌తో దక్షిణ హాట్ యాయ్ న‌గ‌రంతో పాటు 12 ప్రావిన్సులలో భారీ వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 30 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు నిరాశ్ర‌యుల‌య్యారు. స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొంటున్న మ‌లేసియా మ‌హిళ‌ ఒక‌రిని స‌దరు భ‌ర్త‌గారి భార్య సాయం కోసం అభ్య‌ర్థించింది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న త‌న భర్తను కాపాడాల‌ని కోరింది. అత‌డికి సంబంధించిన వివ‌రాలు కూడా తెలిపింది. ఆమె అభ్య‌ర్థ‌న‌తో భ‌ర్త‌ను కాపాడేందుకు అత‌డు బ‌స చేసిన హోట‌ల్‌కు వెళ్లిన మ‌లేసియా మ‌హిళ‌కు వింత అనుభ‌వం ఎదురైంది. మ‌నోడు ఉన్న‌ది స‌హోద్యోగుల‌తో కాదని, గాల్‌ఫ్రెండ్‌తో అన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. నాలుగు రోజులుగా వారిద్ద‌రూ ఒకే గ‌దిలో ఉన్న‌ట్టు గుర్తించారు. 

    భార్యలూ జాగ్ర‌త్త.. 
    స‌ద‌రు మ‌హిళ ఈ విష‌యాన్ని అత‌డి భార్య‌కు చెప్ప‌లేదు. ఎందుకంటే ఆమె గ‌ర్భిణి, పైగా తండ్రి రాక‌కోసం ఆమె ముగ్గురు పిల్ల‌లు ఎదురు చూస్తున్నారు. త‌నకెదురైన అనుభ‌వాన్ని సోష‌ల్ మీడియా (Social Media) ద్వారా బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. భ‌ర్త‌ల‌ను గుడ్డిగా న‌మ్మే భార్యల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డానికే ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ట్టు వివ‌రించారామె. "జాగ్రత్తగా ఉండండి. మ‌న భర్తలను గుడ్డిగా నమ్మవద్దు" అని ఆమె పేర్కొంది.

    చ‌ద‌వండి: 'ప్యూర్ వెజిటేరియ‌నా.. ఏదో మిస్స‌వుతున్నారు'

    భార్య‌కు చెప్పాల్సిందే..
    ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ (Viral) కావ‌డంతో చ‌ర్చకు దారితీసింది. భ‌ర్త బాగోతం గురించి భార్య‌కు చెప్పాల్సిందేన‌ని ప‌లువురు నెటిజ‌నులు కామెంట్ చేశారు. కొంత‌మంది మాత్రం.. భార్య కుటుంబ స‌భ్యుడికో, స్నేహితుల‌కో తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇలాంటి వాళ్ల‌కు త‌గిన శాస్తి చేయాల‌ని మ‌రికొంద‌రు ఫైర్ అయ్యారు. చూడాలి మ‌నోడి ప‌రిస్థితి ఏంటో!

Andhra Pradesh

  • సాక్షి, ఢిల్లీ: తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ ఎంపీ.. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిపై ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ అర్నబ్‌ గోస్వామి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిగా కాకుండా.. మరెవరిని ప్రశ్నించాలంటూ నిలదీశారాయన. 

    ఇండిగో సంక్షోభ వ్యవహారంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌నాయుడి వైఫల్యాన్ని ఇంతకు ముందు అర్నబ్‌ ప్రశ్నించారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి అసలు లోకేష్‌ ఎవరంటూ నిలదీశారు. అయితే ఈ వైఫల్యాన్ని.. లోకేష్‌ను ఎత్తి చూపడాన్ని టీడీపీ తట్టుకోలేకపోయింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరుతో టీడీపీ నేతలు.. రిపబ్లికన్‌ టీవీని బ్యాన్‌ దిశగా అడుగులు వేసింది. దీంతో అర్నబ్‌ అనూహ్య చర్యకు దిగారు. 

    స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి మరీ.. కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ టీడీపీ అండ్‌ కోను కడిగిపారేశారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు కరెక్ట్‌ అని ఏకిపారేశారు. 

  • సాక్షి, కృష్ణా: బందరులో విగ్రహ రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు కూటమి పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. 

    వాజ్ పేయ్ విగ్రహం పెట్టొద్దంటూ తెలుగు దేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో.. శంకుస్థాపనకు ప్రయత్నించిన బీజేపీ నేతలను అడ్డుకుని నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేసింది. అయితే ఈ పరిణామంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటును ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ శ్రేణులను నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

    Machilipatnam: కూటమి నాయకుల మధ్య వాజ్‌పేయి విగ్రహం చిచ్చు
  • రాయవరం: ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఇప్పుడు 9వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్ధవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  

    పరీక్షల సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీనిద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్‌ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. 

    యువత ఎదుర్కొనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. ‘పరీక్షా పే చర్చ’ మొదటి ఎడిషన్‌ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. 

    విజేతలుగా నిలిస్తే.. 
    పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్‌ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్‌ సావనీర్‌ను పొందే అవకాశముంది.

    లాగిన్‌ అవ్వాలిలా.. 
    విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్‌://ఇన్నోవేట్‌ఇండియా.మైజీవోవీ.ఇన్‌ అని క్లిక్‌ చేయాలి. ఎంటర్‌ కాగానే క్లిక్‌ ఏజ్‌ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్‌ అనే లాగిన్స్‌ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్‌ కాగానే మీ మొబైల్‌ నంబరు లేదా జీమెయిల్‌ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్‌ అయి క్లిక్‌ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్‌ చేయాలి. స్టూడెంట్స్‌కు నేరుగా ఫోన్‌ నంబరు, జీమెయిల్‌ లేని సందర్భంలో టీచర్స్‌ లాగిన్‌ ద్వారా ఎంటర్‌ అయ్యే అవకాశం కల్పించారు. 

    విద్యార్థులు/ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 500 అక్షరాల లోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు.

    క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం 
    పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోగొట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. మనం సంధించే ప్రశ్న ద్వారా నేరుగా ప్రధానిని కలుసుకునే అవకాశం చిక్కుతుంది.  
    – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

    సద్వినియోగం చేసుకోండి 
    ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి.  
    – డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈఓ, అమలాపురం   

  • రామచంద్రపురం: మున్సిపాలిటీలో చక్రం తిప్పుతూ.. అనుకున్న పనులే చేస్తూ.. ఎవరినీ లెక్కచేయకుండా, అన్నీ తానై ఓ ఇంజినీరింగ్‌ అధికారి వ్యవహరిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం రామచంద్రపురంలో చర్చనీయాంశమైంది. అన్ని పార్టీలు ఏకమై ఆ అధికారిని సాగనంపాలని కోరుతుండటం చూస్తుంటే, పరిస్థితి ఎక్కడ వరకూ వెళ్లిందో చెప్పకనే అర్థమవుతోంది. స్థానిక మున్సిపాలిటీలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ అధికారి చర్యలతో వేడిరాజుకుంది. 

    ఆయన్ని సాగనంపాలని కోడై కూస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, కాంట్రాక్టర్లంతా కలసి ఈ అధికారి మాకొద్దు బాబోయ్‌ అంటున్నా నియోజకవర్గ ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత మంది ఎదురు తిరిగితే నాకేంటి నేను ‘డాడీ గారి’ సేవలో ఉంటే చాలు అంటూ ఆ ఉద్యోగి ఏ మాత్రం జంకు లేకుండా ఉంటున్నారని కౌన్సిలర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అంటున్నారు. 

    ప్రస్తుతం రామచంద్రపురం మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు చైర్‌ పర్సన్‌తో కలసి ఆ అధికారిపై స్థానికంగా ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అతనిపై కౌన్సిలర్లతో పాటు తన తోటి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈయన వ్యవహార శైలి బాగోలేదని, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అభియోగాలు మోపారు. 

    టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టు పనులు చేయించడం, ఎం బుక్‌లు సైతం ఆయనే రాయిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లకు నోడ్యూస్‌ సర్టిఫికెట్లను తన వారికే జారీ చేయడంతో పాటు టెండర్లు, నోడ్యూస్‌ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోనే పర్సంటేజీలు మాట్లాడుకోవడం జరిగిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

    కౌంటర్‌ ఓచర్లు సైతం అతను ఇష్టానుసారంగా పెడుతుంటే, దానికి సంబంధించిన సెక్షన్‌ అధికారి వాటిని తిప్పి పంపడం, అవి ‘డాడీ గారి’ వద్ద పంచాయితీ పెట్టడం ఇలా ఎన్నో తంతులు మున్సిపాలిటీలో జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు, సిబ్బంది వాపోతున్నారు. ఏడాది కాలంగా ఇలా ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకూ ఆయన్ని బదిలీ చేయకపోవడం వెనుక మర్మమేమిటో ఫిర్యాదు చేసిన వారికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 

    గతంలోనూ ఇంతే.. 
    సదరు అధికారి గత చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఉండగా అక్కడ కూడా ఇదే తరహాలో కౌన్సిలర్లు వ్యతిరేకించారు. వారు మున్సిపాలిటీలో కాకుండా ఒక కల్యాణ మండపంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించుకోవడంతో దిగి వచ్చిన ప్రభుత్వం అతన్ని రీకాల్‌ చేసింది. మున్సిపాలిటీ నుంచి వేరే శాఖకు బదిలీ చేసిన అనంతరం కూడా కొన్నేళ్లు విధులకు దూరంగా ఉన్న సదరు అధికారిని తీసుకువచ్చి ఇక్కడ పోస్టింగ్‌ ఇచ్చారని కౌన్సిలర్లు చెబుతున్నారు. 

    అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ని ఇక్కడకు ఏ కారణంగా ‘డాడీ గారు’ తీసుకువచ్చారోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు ఆమోదం పొందేలా చూసి మిగిలిన వారిని పక్కన పెట్టి పర్సంటేజీలు దండేస్తున్నారనే ఆరోపణలతో పాటు తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరు అందరిలో మంట రేపుతోంది. 

Business

  • ఫైనాన్షియల్‌ వ్యవహారాలపై చాలామందికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. దాంతో పెద్దగా రాబడులు రాని విధానాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో భారీగా నష్టపోతుంటారు. ఈక్రమంలో ఏది మేలో.. ఏది కాదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బంగారం, బ్యాంకులు, రియల్టీ, స్టాక్‌ మార్కెటు, మ్యూచువల్‌ ఫండ్స్‌.. వంటి ఎన్నో సాధనాల్లో పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి చాలానే ప్రశ్నలుంటాయి. వీటిలో కొన్నింటిపై నిపుణులు ఇస్తున్న సమాధానాలు చూద్దాం.

    బంగారం

    తరచూ బంగారంలో 22 కేరెట్లు, 24 కేరెట్లు అంటుంటారు కదా! ఏది మంచిది?

    ఆభరణాల కోసమైతే 22 కేరెట్ల బంగారాన్ని కొంటే సరిపోతుంది. అలాకాకుండా ఇన్వెస్ట్‌ చేయడానికైతే 24 కేరెట్ల బంగారమే బెటర్‌. దీన్లో తరుగు ఉండదు కాబట్టి స్వచ్ఛమైన 24 కేరెట్ల బంగారమైతే ఎప్పుడు విక్రయించినా అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు మనకు లభిస్తుంది. సాధారణంగా కాయిన్లు, బిస్కెట్ల వంటివి 24 కేరెట్లలోనే లభిస్తుంటాయి. ధర కూడా 22 కన్నా 24 కేరెట్లు కాస్త ఎక్కువ ఉంటుంది. కొందరైతే ఆభరణాల కోసం 18 కేరెట్ల బంగారాన్ని కూడా వాడతారు. ఇది మరికొంత చౌక.

    స్టాక్‌ మార్కెట్లు..

    ఈ ఏడాది చాలా ఐపీఓలు వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇలాగే రావచ్చేమో. మరి  2026లో ఐపీఓల్లో పెట్టుబడి పెట్టవచ్చా?

    ఈ మధ్య కాలంలో చాలా ఐపీఓలు అత్యధిక ధర వద్ద ఇష్యూకు వస్తున్నాయి. లిస్టింగ్‌ నాడు లాభాలొస్తున్నా... అది దైవాదీనమనుకోవాలి. ఎందుకంటే చాలా ఐపీఓలు లిస్ట్‌ అయిన నెల–రెండు నెలలకే నేల చూపులు చూస్తున్నాయి. కాబట్టి ఏ ఐపీఓలో పెట్టుబడి పెట్టినా కంపెనీ ఫండమెంటల్స్‌ చూడండి. ఫండమెంటల్స్‌ బాగుండి, ఆ వ్యాపారానికి భవిష్యత్‌ ఉందనిపిస్తే పెట్టండి. దీర్ఘకాలానికైనా పనికొచ్చేలా ఉండాలి.

    రియల్టీ..

    నేనో స్థలం కొందామనుకుంటున్నాను. గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే మంచిదా... లేకపోతే మామూలు సింగిల్‌గా ఉండే ప్లాటయితే మంచిదా?

    ప్లాట్ల విషయానికొచ్చినపుడు గేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే స్థలానికున్న రక్షణ బయట సింగిల్‌గా ఉండే స్థలాలకు ఉండదు. కబ్జాలకు అవకాశం తక్కువ. కాకపోతే స్థలమన్నది ఎక్కడ కొన్నా ముందుగా చెక్‌ చేసుకుని కొనటం తప్పనిసరి. గేటెడ్‌ అయితే రీసేల్‌ కాస్త సులువుగా అవుతుంది. దీనికోసం 10–20 శాతం ధర ఎక్కువ పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు.  

    బ్యాంకింగ్‌..

    నేను భవిష్యత్‌ లక్ష్యాల కోసం క్రమానుగత ఇన్వెస్ట్‌మెంట్‌ చేద్దామనుకుంటున్నాను. బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేయటం మంచిదా... మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచివా?  

    దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసేటపుడు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవటమే సరైన నిర్ణయం అనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి షేర్‌ మార్కెట్‌కు ఉంటుంది. పైపెచ్చు ఆర్‌డీతో పోలిస్తే దీర్ఘకాలానికి ఫండ్లే మంచి రాబడినిస్తాయి. ఆర్‌డీ సురక్షితమే అయినా రాబడి తక్కువ. స్వల్పకాలానికైతే అది మంచిది.

    ఫండ్స్‌...

    నేను మ్యూచువల్‌ పండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నాను. ప్రస్తుతం నా పోర్ట్‌ఫోలియోలో 22 మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఇది మంచిదేనా? అసలు ఎన్ని ఫండ్స్‌ ఐతే బెటర్‌?

    వాస్తవానికి అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే అన్ని ఫండ్ల పనితీరూ ఒక్కలా ఉండదు. ఇలా పెట్టడమంటే షేర్లలో పెట్టినట్లే. షేర్లలో పెట్టుబడి పెడితే రిస్కు ఎక్కువనే కదా మీరు మ్యూచువల్‌ ఫండ్లు ఎంచుకున్నది. మరి ఇన్ని ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తే అన్నింటి పనితీరునూ ఎప్పటికపుపడు గమనిస్తూ వెళ్లగలరా? అందుకే నా సూచనేమిటంటే కనిష్టంగా 3, గరిష్ఠంగా 5 మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

    ఇన్సూరెన్స్‌...

    క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ అంటే ఏంటి? ఎంతవరకూ ఉపకరిస్తుంది? అది తీసుకోవటం మంచిదేనా?  

    మంచిదే. మీ ఆరోగ్య బీమా ప్రీమియానికి కొంత మొత్తాన్ని జోడించటం ద్వారా ఈ రైడర్‌ను తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల కేన్సర్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, మేజర్‌ అవయవ మారి్పడి వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాస్తవంగా ఆసుపత్రి బిల్లు ఎంతయిందనే అంశంతో సంబంధం లేకుండా ఇన్సూర్‌ చేసిన మొత్తాన్ని కంపెనీ మీకు చెల్లించేస్తుంది. ఆ మొత్తాన్ని మీరు చికిత్సకు, రికవరీకి, ఈ మధ్యలో చెల్లించాల్సిన ఈఎంఐల వంటి ఖర్చులు వాడుకోవచ్చు. ఊహించని వ్యాధులొచ్చినపుడు ఈ రైడర్‌ వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటమనేది తప్పుతుంది. కాబట్టి క్రిటికల్‌ ఇల్‌నెస్‌ రైడర్‌ను తీసుకోవటం సరైనదే.

    ఇదీ చదవండి: ఇండిగో కొంప ముంచింది ఇదే..

  • దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సేర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిరిండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.

    కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావం

    • డైరెక్టరేట్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.

    • సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.

    • ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.

    ఎయిరిండియా దూకుడు

    ఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిరిండియా ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

    ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిరిండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని, తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా, తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది.

    పైలట్-టు-ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణ

    ఎయిరిండియా (Air India) ఒక విమానానికి సగటున 5.4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది. ఇది బఫర్, భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నిబంధనల మార్పును ఎయిరిండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది.

    మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే ‘లీన్ మ్యాన్‌పవర్’(Lean Manpower) వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

    ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..?

  • డిజిటల్ యుగంలో వర్క్‌-లైఫ్‌ సమతుల్యత తీవ్రంగా ప్రభావితమవుతోందనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసు పనివేళల తర్వాత పని సంబంధిత కాల్స్, ఈమెయిల్స్ లేదా ఇతర కమ్యూనికేషన్ల నుంచి దూరంగా ఉండే హక్కును కల్పించే ఒక ముఖ్యమైన ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-శరద్‌చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే ఈ ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025’ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పని భారం పెరిగి, వ్యక్తిగత సమయం కరువవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును కాపాడటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

    రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025

    పనివేళలు ముగిసిన తర్వాత, అలాగే సెలవు దినాల్లో పని సంబంధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు (కాల్స్, ఈమెయిల్స్, మెసేజ్‌లు) స్పందించకుండా ఉండే చట్టబద్ధమైన హక్కును ఉద్యోగులకు కల్పించడం దీని ఉద్దేశం. ఈ హక్కును వినియోగించుకున్నందుకుగాను ఉద్యోగిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేదా ప్రతికూల శిక్షలు ఉండకుండా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది.

    ఈ బిల్లు ఉద్యోగుల సంక్షేమ అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు పనివేళల తర్వాత కమ్యూనికేషన్ నిబంధనలపై ఉద్యోగులతో చర్చలు జరపడం, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై జరిమానా (ఉద్యోగుల మొత్తం వేతనంలో 1% వరకు) విధించడం వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.

    ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే..

    ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు. కేంద్ర మంత్రులు కాకుండా సాధారణ పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టే ఈ బిల్లులు చట్టాలుగా మారడం భారతదేశంలో చాలా అరుదు. అయినప్పటికీ, ఇది ఉద్యోగుల వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

    ఇదీ చదవండి: ‘యూరప్‌ కంటే మనం చాలా నయం’

  • భారతీయ రైల్వేల సమయపాలన (పంచువాలిటీ) 80 శాతానికి పెరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు. ఇది అనేక యూరోపియన్ దేశాల కంటే మెరుగ్గా ఉందన్నారు. మెరుగైన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణ నవీకరణలే ఈ ప్రగతికి కారణమని చెప్పారు.

    ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని అనేక రైల్వే డివిజన్లు ఇప్పటికే 90 శాతం సమయపాలన మార్కును దాటాయని తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే శాఖ అమలు చేసిన నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన కార్యాచరణల ప్రభావమే ఈ విజయానికి ప్రధాన కారణమని హైలైట్ చేశారు.

    ‘రైల్వేల మొత్తం సమయపాలన 80 శాతానికి చేరుకుంది. ఇది ఒక ముఖ్యమైన విజయం. 70 రైల్వే డివిజన్లలో సమయపాలన 90 శాతానికి పైగా ఉంది. అనేక యూరోపియన్ దేశాల కంటే భారతీయ రైల్వేలు సమయపాలనలో మెరుగ్గా ఉన్నాయి’ అని మంత్రి సభకు తెలియజేశారు.

    మెరుగైన సమయపాలనకు కారణాలు..

    • ఇటీవలి సంవత్సరాల్లో రైల్వే ఆపరేషన్లను పర్యవేక్షించడం, మెరుగ్గా నిర్వహించడంలో కొత్త, మరింత కఠినమైన పద్ధతులు అమలు చేశారు. ఈ పద్ధతులు లోపాలను గుర్తించడం, సరిదిద్దడం, రైళ్ల కదలికలను మరింత సమర్థవంతంగా సమన్వయం చేయడంలో సహాయపడ్డాయి.

    • రైల్వే మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో క్రమం తప్పకుండా చేసిన అప్‌గ్రేడ్‌లు రైళ్ల ఆలస్యాన్ని తగ్గించడానికి తోడ్పడ్డాయి. సిగ్నలింగ్ వ్యవస్థల మెరుగుదల, ట్రాక్ మెయింటెనెన్స్ అప్‌డేట్లు సమయపాలనను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.

    ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులు

    ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ప్రాజెక్టుల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రక చర్య అని వైష్ణవ్ అన్నారు. 2014కు ముందు కేవలం రూ.100 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని, అది నేడు అనేక రెట్లు పెరిగిందని నొక్కి చెప్పారు. చారిత్రక సాంస్కృతిక సంబంధాలు ఉన్న యూపీలోని బల్లియా స్టేషన్ నుంచి ప్రస్తుతం 82 రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సభకు తెలియజేశారు.

    రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. భద్రత ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఈ నిర్మాణాలపై ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. అభివృద్ధికి వేగవంతమైన అనుమతులను నిర్ధారించడానికి ప్రత్యేకంగా ఓవర్ బ్రిడ్జిల కోసం 100 కి పైగా డిజైన్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

    ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..?

  • ఓపెన్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఓపెన్‌ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్‌జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.

    ఇటీవలి వారాల్లో చాట్‌జీపీటీ సంభాషణల్లో యాడ్‌ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్‌లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్‌జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్‌లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్‌లు నిజమైనవి కావు’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌

  • తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్‌లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.

    గ్లోబల్‌గా గుర్తింపు కోసం..

    రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.

    ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..

    డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.

    గూగుల్ స్ట్రీట్

    హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్‌ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.

    ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌

  • ట్రంప్‌ మీడియా టెక్నాలజీ గ్రూప్‌ సీఈవో ఎరిక్‌ స్వీడర్‌ ఈ తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు హాజరై కీలక పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అయితే, గతంలో హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.3,500 కోట్లతో నిర్మించనున్నట్లు (ట్రంప్ ఆర్గనైజేషన్-ట్రైబెకా డెవలపర్స్‌ భాగస్వామ్యంతో) వార్తలు వచ్చాయి. ట్రంప్ గ్రూప్ తరఫున లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇది ట్రంప్‌ ఫ్యామిలీ గ్రూప్‌ కావడం విశేషం.

    తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌’ వేదికగా ఏకంగా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు 14 ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్యూచర్‌ సిటీలో ఈ సదస్సు 8, 9 తేదీల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

    భారీ పెట్టుబడుల్లో ముఖ్యాంశాలు:

    టీసీఎస్‌ - టీపీజీ భాగస్వామ్యం: ఐటీ దిగ్గజం టీసీఎస్‌, మరో సంస్థ టీపీజీతో కలిసి రూ.70 వేల కోట్లు (8 బిలియన్‌ డాలర్లు)** పెట్టుబడితో అత్యాధునిక హైపర్‌వాల్ట్‌ డేటా సెంటర్లను స్థాపించనుంది. ఇది అతిపెద్ద వ్యక్తిగత పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది.

    రంగాలు: ఐటీ, పరిశ్రమలు, పర్యాటకం, క్రీడలు, వినోదం, ఉన్నత విద్య వంటి వివిధ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి.

    ఏఐ సిటీ ఏర్పాటు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తూ ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

    అజయ్ దేవ్‌గణ్‌ ప్రతిపాదన: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ముందుకొచ్చారు.

    ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్‌

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఉద్యోగుల వసతి అవసరాలను తీర్చడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో భారీ బల్క్ హౌసింగ్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా బ్యాంక్ దాదాపు రూ.294 కోట్లు (పన్నులు మినహాయించి) వెచ్చించి, అపార్ట్‌మెంట్లలో మొత్తం 200 2 బీహెచ్‌కే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇటీవలి సంవత్సరాల్లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇది అతిపెద్ద సంస్థాగత నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది.

    ఎస్‌బీఐ ఇటీవల జారీ చేసిన టెండర్ పత్రాల ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌లో ముంబయి ఒకటి. దాంతో అక్కడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఈ వ్యూహాత్మక బల్క్ కొనుగోలును నాలుగు క్లస్టర్‌లుగా విస్తరించింది.

    సెంట్రల్ శివారు ప్రాంతాలు (సియోన్ నుంచి ఘాట్‌కోపర్ వరకు). పశ్చిమ శివారు ప్రాంతాలు (అంధేరి నుంచి బోరివలి వరకు). థానే-కళ్యాణ్ బెల్ట్. నవీ ముంబై కారిడార్ (ఖర్‌ఘర్ నుంచి పన్వెల్ వరకు) విభజించింది. ప్రతి క్లస్టర్‌లో 50 యూనిట్ల చొప్పున మొత్తం 200 2-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయనుంది. ప్రతి అపార్ట్‌మెంట్ కార్పెట్ ఏరియా సుమారు 600 చదరపు అడుగులు (55.74 చదరపు మీటర్లు) ఉండాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రాజెక్ట్ 5 ఏళ్లలోపుదై ఉండాలి. మహారెరా కంప్లీషన్ సర్టిఫికేట్ (OC)తో మహారెరా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతి ఫ్లాట్‌కు ఒక కారు పార్కింగ్,  ఒక ద్విచక్ర వాహనం పార్కింగ్ చొప్పున మొత్తం 400 పార్కింగ్ స్లాట్‌లు తప్పనిసరి ఉండాలని చెప్పింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోగా (180 రోజులు) లావాదేవీని పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ బల్క్ కొనుగోలు ద్వారా ఉద్యోగులకు ముంబైలో పెరుగుతున్న ఆస్తి ధరలతో సంబంధం లేకుండా స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలు అందించాలని బ్యాంక్ చూస్తోంది. సిబ్బంది సంక్షేమం, గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం (ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్) రెంటల్ లేదా లీజు ఏర్పాట్ల కంటే నేరుగా రెడీ-టు-మూవ్ గృహాలను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతున్నట్లు ఈ చర్య స్పష్టం చేస్తోంది.

    ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?

  • ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్‌ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని  పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్‌ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.

    ధరల వివరాలు

    నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు  చెల్లించే రుసుం.

    వన్-టైమ్ హార్డ్‌వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.

    హార్డ్‌వేర్ కిట్‌లో ఏముంటాయి?

    రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్‌లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్‌లింక్ లో-ఎర్త్‌ ఆర్బిట్‌ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.

    దీని లక్ష్యం..

    భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్‌లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.

    మార్కెట్ సవాళ్లు

    సాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్‌స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.

    ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?

  • న్యూఢిల్లీ: భారతీయ సంస్థ ఏజీటీసీ బయోటెక్, ఇజ్రాయెల్‌కు చెందిన లగ్జంబర్గ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా సెమియోఫోర్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 50:50 వాటాలతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ద్వారా 18 అధునాతన ఫెరోమోన్, సెమియోకెమికల్ ఆధారిత పంట సంరక్షణ టెక్నాలజీలను ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యీకరించనున్నారు.

    ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో అభివృద్ధి చెందిన సెమియోకెమికల్ టెక్నాలజీ తొలిసారిగా ఇజ్రాయెల్‌కు లైసెన్స్ అవుతున్నది. దీన్ని రెండు దేశాల మధ్య శాస్త్రీయ సహకారానికి మైలురాయిగా భావిస్తున్నారు. పంటలపై రసాయన అవశేషాలు లేకుండా, తేనెటీగలకు హానికరం కాని, వాతావరణానుకూల పద్దతిలో పురుగు నియంత్రణను సాధించడమే ఈ సాంకేతికాల ప్రధాన లక్ష్యం. దీంతో రసాయన పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    సెమియోఫోర్ భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో నియంత్రణ అనుమతులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ కోసం 10 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ద్రాక్ష, యాపిల్, పత్తి, మొక్కజొన్న వంటి పలు పంటలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఉత్పత్తి 75–100 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం రాబట్టే అవకాశం ఉందని కంపెనీలు ప్రకటించాయి.

    ఈ జాయింట్ వెంచర్ ప్రకటన న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎస్‌&టీ క్లస్టర్స్ కాన్ఫరెన్స్ లో భారత, ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. 2026లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి, 2027 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని సెమియోఫోర్ లక్ష్యంగా పెట్టుకుంది.

  • దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

    కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్‌ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

    అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

    కొత్త నిబంధనలు ఇవే..

    • కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.

    • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.

    • రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్‌ చేస్తాయి.

    • తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.

    వీటికి 100% జరిమానా తప్పదు

    • కొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై  100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..

    • స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.

    • ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.

    • వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.

    ఈ జాగ్రత్తలు అవసరం

    • ప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం

    • పెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.

    • నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.

    • అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.
       

Sports

  • పేలవ ఫామ్‌ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన టీమిండియా అవకాశాన్ని చేజార్చుకున్న కరుణ్‌ నాయర్‌.. తాజాగా అదే ఫామ్‌ లేమి కారణంగా దేశవాలీ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఇటీవలే విదర్భ ‍నుంచి తన సొంత జట్టు కర్ణాటక పంచన చేరిన కరుణ్‌.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో దారుణంగా విఫలమై జట్టులో స్థానం కోల్పోయాడు. 

    ఈ టోర్నీలో తొలి 6 మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేసిన కరుణ్‌.. త్రిపురతో ఇవాళ (డిసెంబర్‌ 8) జరిగిన మ్యాచ్‌ నుంచి తప్పించబడ్డాడు.

    ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ వరకు మంచి ఫామ్‌లో ఉండిన కరుణ్‌ పొట్టి ఫార్మాట్‌కు వచ్చే సరికి చాలా ఇబ్బంది పడ్డాడు. కరుణ్‌ గత ఎడిషన్ SMAT ఫామ్‌ ఇందుకు భిన్నంగా ఉండింది. గత ఎడిషన్‌లో విదర్భకు ఆడిన కరుణ్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. 

    కరుణ్‌ను ఐపీఎల్‌ 2026 కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి నెల కూడా కాకముందే కరుణ్‌ ఇంత చెత్త ప్రదర్శనలు చేయడం ఢిల్లీ యాజమాన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

    కరుణ్‌ గత ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అదరగొట్టి (40 బంతుల్లో 89 పరుగులు), ఆతర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు. అయినా కరుణ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం నమ్మకముంచి రీటైన్‌ చేసుకోవడం ఆశ్చర్యకరం.

    ఇదిలా ఉంటే, కరుణ్‌ లేని మ్యాచ్‌లో కర్ణాటకపై త్రిపుర సంచలన విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో ఆ జట్టు కర్ణాటకకు షాకిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు తలో 197 పరుగులు చేయగా.. సూపర్‌ ఓవర్‌లో త్రిపుర ఊహించని విధంగా వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేయగా.. కర్ణాటక వికెట్‌ కోల్పోయి 18 పరుగులకే పరిమితమైంది. దీంతో త్రిపుర సంచలన విజయం నమోదు చేసింది. 

  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ-2025లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (డిసెంబర్‌ 8) జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ చెలరేగిపోయాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. 

    ఫలితంగా తమిళనాడు 3 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తు చేసింది. సాయి సుదర్శన్‌ ఒంటిచేత్తో తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. లక్ష్య ఛేదనలో మిగతా బ్యాటర్లు వరుసగా ఔటైనా, టెయిలెండర్‌ సన్నీ సంధు (30) సాయంతో తన జట్టును గెలిపించాడు.

    తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర.. విశ్వరాజ్ జడేజా (70), సమ్మద్‌ గజ్జర్‌ (66) మెరుపు అర్ద శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వీరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. తమిళనాడు బౌలర్లలో సిలంబరసన్‌ 3, ఎసక్కిముత్తు 2, సన్నీ సంధు, రాజ్‌కుమార్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం ఛేదనలో తమిళనాడు కూడా తడబడింది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే సాయి సుదర్శన్‌ ఒక్కడు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

    తొలుత రిత్విక్‌ ఈశ్వరన్‌ (29), ఆఖర్లో సన్నీ సంధు సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. సుదర్శన్‌ దెబ్బకు తమిళనాడు 18.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జయదేవ్‌ ఉనద్కత్‌ (4-0-30-3), అంకుర్‌ పవార్‌ (3.4-0-26-2) తమిళనాడు ఆటగాళ్లను ఇరుకున పెట్టినప్పటికీ సాయి సుదర్శన్‌ వారిపై ఎదురుదాడి చేసి విజయం సాధించాడు.

     

  • భారత క్రికెట్‌లో షమీ ఉదంతం ఇటీవలికాలంలో తరుచూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. అతను దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నా.. అతని అనుభవం టీమిండియాకు అవసరమైనా, సెలెక్టర్లు ఫిట్‌నెస్‌, ఇతరత్రా కారణాలు చెప్పి అవకాశాలు ఇవ్వడం లేదు. 

    షమీని పక్కకు​ పెట్టడానికి పై కారణాలు కాకుండా చర్చించుకోలేని వేరే కారణముందన్నది చాలా మందికి తెలుసు. అయినా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేరు. ఓ ఆటగాడి కెరీర్‌ను ఆటతో ముడిపెట్టకూడని విషయాల పేర్లు చెప్పి నాశనం చేయడం సమంజసం కాదని కొన్ని గొంతులకు వినిపిస్తున్నా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు. 

    ఆటగాడిగా షమీకి అన్యాయం జరుగుతున్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. భారత సెలెక్టర్ల వద్ద మాత్రం దాన్ని సమర్దించుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి.

    సెలెక్టర్లు చెబుతున్న కారణాల్లో ప్రధానమైంది షమీ ఫిట్‌గా లేడని. వాస్తవానికి వారి ఈ సమర్దనలో అర్దమే లేదు. ఒకవేళ షమీ నిజంగా ఫిట్‌గా లేకపోతే దేశవాలీ టోర్నీల్లో ఎలా అనుమతిస్తారు. అనుమతించినా.. నిజంగా ఫిట్‌గా లేకపోతే అతనెలా రాణించలడు. 

    ఈ ఒక్క విషయం చాలు సెలెక్టర్లు వేరే ఏదో కారణం చేత షమీని టీమిండియాను ఎంపిక చేయడం లేదన్న విషయం అర్దం అవడానికి. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటనకు కొద్ది గంటల ముందే షమీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన చేశాడు. 

    వాస్తవానికి షమీ కాకుండా వేరే ఏ బౌలర్‌ అయినా అలాంటి ప్రదర్శన చేసుంటే ఖచ్చితంగా టీమిండియాలో చోటు దక్కేది. కానీ అక్కడుంది షమీ కాబట్టి అలా జరగలేదు. అలాంటి ప్రదర్శనలు మరిన్ని పునరావృతం చేసినా షమీకి ఇప్పట్లో టీమిండియాలో చోటు దక్కదు. కారణం బహిరంగ రహస్యమే.

    షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చూపిస్తున్న రెండో ప్రధాన కారణం వయసు. ప్రస్తుతం షమీ వయసు 35. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ వయసు దాటిన తర్వాత కూడా సంచలన ప్రదర్శనలు చేసిన పేసర్లు చాలామంది ఉన్నారు. 

    ఇంగ్లండ్‌ పేసర్‌ జిమ్మీ ఆండర్సన్‌ ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆండర్సన్‌ 40 ఏళ్ల వయసులోనూ ఏం చేశాడో జగమంతా చూసింది. అలాంటిది షమీకి 35 ఏళ్లకే వయసైపోయిందనడం ఎంత వరకు సమంజసం. 

    వయసైపోయిన వాడికి అంతర్జాతీయ క్రికెట్‌ అయినా, దేశవాలీ క్రికెట్‌ అయినా ఒకటే కదా. దేశవాలీ క్రికెట్‌లో వయసైపోయినా రాణిస్తున్నవాడు, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేడా..? ఏదో కారణం చెప్పాలని ఇలాంటి పొంతనలేని కారణాలు చెబుతున్నారు కానీ, అసలు కారణం వేరన్న విషయం చాలామందికి తెలుసు.

    షమీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు చెబుతున్న మరో కారణం యువకులకు అవకాశాలు ఇవ్వడం. వాస్తవానికి యువకులకు అవకాశాలు ఇస్తే ఎవ్వరూ కాదనరు. జట్టులో సీనియర్లు తురుచూ విఫలమవుతున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలకు పోవాలి. 

    అయితే ఇక్కడ పరిస్థితి వేరు. కావాలని షమీని పక్కకు పెట్టడానికి అనర్హమైన, టీమిండియాలో పెద్ద తలకాయ అండదండలున్న ఓ పేసర్‌ను యువత పేరుతో ఫ్రేమ్‌లోకి తెచ్చారు. అతని కంటే చిన్నవాడు, అతని కంటే వెయ్యి రెట్లు ఎక్కువ టాలెంట్‌ ఉన్నా మరో పేసర్‌కు మాత్రం అవకాశాలు ఇవ్వరు. 

    పెద్దల అండదండలున్న పేసర్‌  ఎన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా, మళ్లీమళ్లీ తుది జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. వాస్తవానికి ఆటగాళ్ల శారీరక కదలికలు, ఫిట్‌నెస్‌, ఫామ్‌ను బట్టి వయసు ప్రస్తావన వస్తుంది. ఈ మూడు బాగుంటే వయసుతో పనేముంది. పై మూడు అంశాల్లో షమీ పర్ఫెక్ట్‌గా ఉన్నా వయసు పేరు చెప్పి టీమిండియాకు ఎంపిక చేయకపోవడం ఎంత వరకు సమంజసం.

    ఇన్ని కారణాలు చెప్పి షమీని టీమిండియాకు ఎంపిక చేయకున్న సెలెక్టర్లు అంతిమంగా ఒక్క విషయం ఆలోచించాలి. షమీ స్థానంలో అతనిలా రాణిస్తున్న ఎవరినైనా ఎంపిక చేయకపోతే నష్టపోయే భారత జట్టే. అర్హులు జాతీయ జట్టులో లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. 

    షమీ లాంటి ఉదంతాలు జరగడం భారత క్రికెట్‌కు మాయని మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే హర్భజన్‌ సింగ్‌, ఛతేశ్వర్‌ పుజారా లాంటి టీమిండియా మాజీలు షమీకి మద్దతుగా గళం విప్పారు. షమీ చేసిన నేరం ఏంటని బహిరంగంగా ప్రశ్నించారు. భారత సెలెక్టర్లు ఇకనైనా పంతాలు పక్కకు పెడితే భారత క్రికెట్‌కు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. 

  • 2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్‌ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్‌ నుంచి జియో హాట్‌స్టార్‌ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్‌స్టార్‌ ఈ డీల్‌ను వదులుకోనున్నట్లు సమాచారం.

    జియో హాట్‌స్టార్‌ భారత్‌లో స్ట్రీమింగ్‌ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్‌స్టార్‌ ఈ డీల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది.  

    హాట్‌స్టార్‌ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు​ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.

    కాగా, జియో హాట్‌స్టార్‌ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది. 

    దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్‌ రేటు కూడా పెరగడం​ హాట్‌స్టార్‌పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం​.

    ఒకవేళ హాట్‌స్టార్‌ వరల్డ్‌కప్‌ స్ట్రీమింగ్‌ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్‌ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్‌లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే. 

     

     

  • స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్‌ షాక్‌ తగిలింది. డిసెంబర్‌ 10 నుంచి వెల్లింగ్టన్‌ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్‌ బౌలర్లు గాయపడ్డారు. 

    మ్యాట్‌ హెన్రీ కాఫ్‌ ఇంజ్యూరితో, నాథన్‌ స్మిత్‌ సైడ్‌ స్ట్రెయిన్‌తో, మిచెల్‌ సాంట్నర్‌ గ్రోయిన్‌ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మైఖేల్‌ రే, గ్లెన్‌ ఫిలిప్‌ జట్టులోకి వచ్చారు. 

    స్మిత్‌, హెన్రీ తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్‌ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు.  పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టామ్‌ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్‌ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.

    కాగా, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. విండీస్‌ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.

    షాయ్‌ హోప్‌ సూపర్‌ సెంచరీ (140).. జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీ (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.

    72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.

    చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ప్రకటించారు.  ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తించింది.


     

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్‌ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్‌ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత​ సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం​ మ్యాచ్‌ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.

    ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది.  

    ఆ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.  

    ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్‌, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్‌ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా జరుగనున్నాయి.

    సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
    శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక​్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌
     

  • డిసెంబర్‌ 9 నుంచి కటక్‌ (ఒడిషా) వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్‌, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్‌ చేరుకున్నాడు.

    గిల్‌ మెడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్‌ రాకతో టీమిండియాకు ఓపెనింగ్‌ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్‌ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.

    మిడిలార్డర్‌లో ఆడించాల్సి వస్తే మేనేజ్‌మెంట్‌ జితేశ్‌ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్‌ కాగలడని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. ఇది ఆసీస్‌ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.

    మేనేజ్‌మెంట్‌ దగ్గర మిడిలార్డర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోసం​ జితేశ్‌ శర్మ రూపం మంచి ఆప్షన్‌ ఉంది. జితేశ్‌ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.

    గిల్‌ ఆకలితో ఉన్నాడు: గంభీర్‌
    గిల్‌ గాయంపై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ రెండు రోజుల ముందే అప్‌డేట్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిశాక గంభీర్‌ మాట్లాడుతూ.. అవును, గిల్‌ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.

    కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్‌.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  

    సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
    శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌

  • దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో విండీస్‌ వీరుడి రోవ్‌మన్‌ పావెల్‌ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్‌.. నిన్న (డిసెంబర్‌ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్‌ మెరుపులకు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

    క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో పావెల్‌, కాక్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.టాబీ ఆల్బర్ట్‌, సెదిఖుల్లా అటల్‌ తలో 8, షయాన్‌ జహంగీర్‌ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2, అజయ్‌ కుమార్‌, పియూశ్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్‌ తడబడింది. వకార్‌ సలామ్‌ఖీల్‌ (3.3-0-29-4), మహ్మద్‌ నబీ (4-0-12-2), డేవిడ్‌ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్‌ (16), రూథర్‌ఫోర్డ్‌ (19), రసెల్‌ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

  • టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్‌ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది.  

    ప్రసాద్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మద్దతు పొందిన కేఎన్‌ శాంత్‌ కుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్‌కు 749, శాంత్‌ కుమార్‌కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్‌ సుజిత్‌ సోమసుందర్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్‌ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.

    కార్యదర్శి హోదాను సంతోష్‌ మీనన్‌ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్‌ జైరామ్‌పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్‌ పోస్ట్‌ను బీఎన్‌ మధుకర్‌ దక్కించుకున్నాడు. ఎంఎస్‌ వినయ్‌పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.

    ప్రధాన ఫలితాలు  
    - అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు  
    - ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు  
    - కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు  
    - జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు  
    - ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు  

    మేనేజింగ్ కమిటీ సభ్యులు  
    - లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య  
    - ఇన్‌స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్  

    జోన్ ప్రతినిధులు  
    - మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్  
    - శివమొగ్గ – డీఎస్ అరుణ్  
    - తుమకూరు – సీఆర్ హరీష్  
    - ధార్వాడ – వీరాణ సవిడి  
    - రాయచూర్ – కుశాల్ పటిల్  
    - మంగళూరు – శేఖర్ శెట్టి  

    ముఖ్యాంశాలు  
    - ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని స్పష్టంగా పేర్కొంది.  
    - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్‌లు జరగలేదు.  
    - ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్‌ ప్రసాద్‌ ప్యానెల్‌కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు. 

  • భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.

    ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయం‍తో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.

    టైమ్స్ ఆఫ్ ఇండియా'  నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్‌ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.

    సుందర్‌పై వేటు..
    గత కొన్ని మ్యాచ్‌లగా మూడో స్పిన్నర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.

    ఇక సీమర్లగా అర్ష్‌దీప్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కకపోవచ్చు. 

    భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్‌, తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్‌లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.

    భారత తుది జట్టు(అంచనా)
    అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌
    చదవండి: రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!

Movies

  • లేడీ యాక్టర్స్ అనగానే అయితే నటిస్తారు లేదంటే పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు పరిస్థితి ఇలానే ఉండేదేమో కానీ ఇప్పుడు చాలా మారింది. ఓ వైపు యాక్టింగ్‌ మరోవైపు పలు విభాగాల్లో ప్రతిభ చూపిస్తూ ఆల్‌రౌండర్స్ అనిపించుకుంటున్నారు. టాలీవుడ్ లో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? వాళ్ల ఏమేం చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం.

    రీసెంట్‌గా టర్కీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకున్న నటి ప్రగతి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఓ వయసు దాటిన తర్వాత అవకాశాలు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన ఛాన్స్‌ల్ని వదులుకుని గత రెండు మూడేళ్లుగా పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ చాటుకుంది. మొన్నటివరకు దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ గెలిచిన ఈ నటి.. ఇప్పుడు అంతర్జాతీయంగానూ అదరగొట్టేసింది. ఈమెని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం నటీమణులకు ఎంతైనా ఉంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు చూడాల్సిందే)

    మెంటల్ మదిలో, చిత్రలహరి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్.. యాక్టింగ్ మాత్రమే చాలా వాటిలో ప్రతిభ చూపిస్తోంది. ట్రాక్‌పై రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే కారు రేసింగ్ నేర్చుకుంది. మరోవైపు తమిళనాడులో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లోనూ పాల్గొని ప్రతిభ చూపించింది. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు చాలానే టాలెంట్స్ ఉన్నాయని నిరూపించింది.

    ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి కూడా ఇండస్ట్రీలోకి రాకముందు పలు విభాగాల్లో ప్రతిభ చూపించింది. డెంటిస్ట్ డాక్టర్ పట్టా అందుకున్న ఈమె.. టీనేజీలో స్టేట్ లెవల్ స్మిమ్మింగ్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానూ ప్రతిభ చూపించి విజయాలు సాధించింది. హీరోయిన్ సదా అయితే ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయింది. ఈమె ఇన్ స్టా ఓపెన్ చేసి చూస్తే మొత్తం అడవుల్లో తిరుగుతూ తీసిన కృూరమృగాల ఫొటోలే దర్శనమిస్తాయి.

    వీళ్లే కాదు ప్రస్తుత పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక లాంటి హీరోయిన్స్.. ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఫెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే హైదరాబాద్‌లో జిమ్, హోటల్ అంటూ బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రస్తుత తరం హీరోయిన్స్.. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా తమ అభిరుచుల్ని చాటుకుంటున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

    (ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)

  • ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్‌లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

    గత సీజన్‌లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్‌ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.

    (ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)

    పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.

    అయితే యష్‌‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్‌లో 'జార్జ్‌ రెడ్డి', 'కరోనా వైరస్‌', 'ఆశా ఎన్‌కౌంటర్‌' చిత్రాల్లో నటించింది.

    (ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)

  • హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)

    గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్‌లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్‌తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.

    (ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

  • మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్‌ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.

    అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్‌ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్‌ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.

    ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్‌ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్‌ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చారని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. 
     

     

  • 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. తర్వాత నటుడిగా మారిపోయాడు. సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. మధ్యలో దర్శకుడిగా 'కీడా కోలా' సినిమా తీసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా మరో మూవీ చేశాడు. అదే 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)

    మలయాళంలో 2022లో బాసిల్ జోసెఫ్, ధన్య రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా 'జయ జయ జయహే' పేరుతో ఈ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయింది. దీన్ని తర్వాత ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగులో డబ్బింగ్ కూడా తీసుకొచ్చారు. ఈ చిత్రాన్నే ఇప్పుడు తరుణ్ భాస్కర్ రీమేక్ చేశాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో మూవీ అంతా ఉండనుంది. ఈ మేరకు టీజర్‌లో విజువల్స్ చూపించారు.

    భార్యపై ఆధిపత్యం చెలాయించాలని ఓ భర్త అనుకుంటాడు. కానీ ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడుతుంది. దీంతో విషయం ఎక్కడివరకు వెళ్లింది? చివరకు ఏమైంది అనేదే మూవీ కాన్సెప్ట్. ఇప్పటికే డబ్బింగ్ రూపంలో తెలుగులో ఉన్న ఈ మూవీని ఇప్పుడు రీమేక్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇది తెలుగులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి?

    (ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

  • తెలుగు స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించాడు. వ్యక్తిత్వ హక్కులని రక్షించుకోవడంలో భాగంగానే పిటిషన్ వేశాడు. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై.. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే తదుపతి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా చెప్పారు.

    (ఇదీ చదవండి: 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. నందమూరి హీరో ఏమైపోయాడు?)

    ఇటీవల కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇ‍ప్పుడు వీళ్ల బాటలోనే జూ.ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే ఆలోచించాల్సిందే అనమాట.

    ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చిత్రీకరణ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ తదితర దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. 

    (ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

  • ఓటీటీలు వచ్చాక ఆడియన్స్ సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది. క్రైమ్ అండ్ సెస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంటెంట్‌ నచ్చితే చాలు ఓటీటీల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అలా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మర్టర్ మిస్టరీ థ్రిల్లర్‌ రాత్ అకేలి హై. కోవిడ్ సమయంలో ఈ మూవీ రిలీజైంది.

    తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్‌ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సీక్వెల్‌ మూవీ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదకగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే మరోసారి తమ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సీక్వెల్‌లో కొత్తగా చిత్రాంగద సింగ్, రజత్ కపూర్, రేవతి, దీప్తి నావల్, సంజయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో ప్రదర్శించారు.

    ఈ సినిమాకు హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు. స్మితా సింగ్ రాసిన ఈ థ్రిల్లర్ మూవీని ఆర్వీఎస్‌పీ, మాక్‌గఫిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

     

  • తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు వారాల్లో ఈ సీజన్‌కు శుభం కార్డు పడనుంది. రీతూ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మిగిలారు. సుమన్‌, ఇమ్మాన్యుయేల్‌, సంజనా, తనూజ, కల్యాణ్‌, పవన్‌.. వీరందరూ ఆల్‌రెడీ కెప్టెన్‌ అయ్యారు. కానీ భరణి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవ్వలేదు. 

    కూతురి కోరిక నెరవేరినట్లే
    ఫ్యామిలీ వీక్‌లో వచ్చిన కూతురు కూడా కెప్టెన్‌ అవు డాడీ అని అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయినందుకు చాలా ఫీలయ్యాడు భరణి. కానీ ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమోలో భరణి చేతికి కెప్టెన్‌ బ్యాండ్‌ ఉంది. అంటే ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్‌ అయ్యాడన్నమాట! 

    జైలుకు సంజనా
    అలాగే బిగ్‌బాస్‌ ఇచ్చిన గేమ్‌లో సంజనా (Sanjana Galrani)కు జీరో ఉన్న బాక్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను జైల్లో వేశారని భోగట్టా! అదేంటో కానీ మొట్టమొదటిసారి ఇమ్మాన్యుయేల్‌.. సంజనా కోసం స్టాండ్‌ తీసుకున్నాడు. అయితే హౌస్‌ అందరూ దాన్ని వ్యతిరేకించడంతో ఆమె చేతికి జీరో బాక్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

     

    చదవండి: 

  • మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆర్‌ఎక్స్‌100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. మంగళవారం మూవీతో సూపర్‌ హిట్‌ కొట్టేసింది. గతేడాది రక్షణ చిత్రంలో కనిపించిన భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్‌ నెట్టింట చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

    ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు? అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేసింది. సినీ ఇండస్ట్రీ మనల్ని చాలా కఠినంగా మార్చుతుంది.. అంతేకాదు మంద చర్మం గలవారిగా మార్చేస్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికీ సిగ్గుపడతాడు.. అతని సిగ్గువల్ల చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతను అంత ముద్దుగా ఉంటాడా?  దేవుడు అతన్ని దీవించునుగాక.. అంటూ ప్రభాస్‌ సో క్యూట్‌ తెగ పొగుడుతూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

     

  • ఎన్టీఆర్‌.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్‌ అయినా, మాస్‌ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్‌, హరిన్‌ ఇద్దరూ యాక్టింగ్‌నే ఎంచుకున్నారు.

    హీరోగా ఎంట్రీ
    కళ్యాణ్‌ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్‌, రౌడీ బాబాయ్‌, అత్తగారు జిందాబాద్‌, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్‌ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.

    ఆ విషాదంవల్లే..
    నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్‌ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్‌ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్‌ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్‌దాస్‌ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 

    36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ 
    పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్‌ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్‌ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌లో కళ్యాణ్‌ లుక్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. కాగా ఎన్టీఆర్‌ నామకరణం చేసిన వైజయంతి మూవీస్‌ సంస్థతోనే కళ్యాణ్‌ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్‌ 25న విడుదలవుతోంది.

    చదవండి: రాత్రిపూట మనోజ్‌ ఫోన్‌కాల్‌.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్‌ నటుడు

  • హీరోయిన్ సమంత.. గతవారం పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీళ్లిద్దరికీ గతంలోనే వేర్వేరుగా వివాహాలు జరిగాయి కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ విషయం పక్కనబెడితే మరో తెలుగు హీరోయిన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ పెళ్లయిన ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు!

    తెలుగు కుటుంబంలో పుట్టిన సునయన.. 'కుమారి vs కుమారి' అనే సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్, పగలే వెన్నెల, మిస్సింగ్ తదితర చిత్రాల్లో నటించింది. అయితే టాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళంలో ట్రై చేసింది. ఈమెకు హిట్స్ పడ్డాయి. రీసెంట్ టైంలో అయితే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర'లో నటించింది. ఈ ఏడాది వచ్చిన 'కుబేర' మూవీలో నాగార్జున పాత్రకు భార్యగా కనిపించింది.

    అసలు విషయానికొస్తే.. గతేడాది జూన్‌లో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని హీరోయిన్ సునయన బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. కాకపోతే కాబోయే వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు. కొన్నాళ్లకు రూమర్స్ వచ్చాయి. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఖలీద్ అల్ అమేరీతో ప్రేమలో ఉందని టాక్ వినిపించింది. కాకపోతే దీన్ని సునయన ఎప్పుడు ధ్రువీకరించలేదు. తాజాగా ఖలీద్.. సునయతో బంధాన్ని పబ్లిక్ చేశాడు.

    ఖలీద్ పుట్టినరోజు రెండు రోజుల క్రితం జరగ్గా.. సునయనతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. చేతులు పట్టుకుని తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఖలీద్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో గతేడాది వచ్చినవి రూమర్స్ కాదు నిజమేనని క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రిలేషన్ బయటపెట్టారంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారేమో?

    ఖలీద్ విషయానికొస్తే.. యూఏఈకి చెందిన యూట్యూబర్ ఇతడు. సలామా అనే యూట్యూబర్‌ని 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆమెకు విడాకులు ఇచ్చాడో తెలీదు గానీ ఇప్పుడు సునయనతో వివాహానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది.

  • సినిమాల్లో కేవలం స్టార్‌డమ్ ఉంటే చాలదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా ఉండాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్‌ కావాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కొంతవరకు బెనిఫిట్ ఉన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో రావాలంటే సొంతం పనిమీదే ఆధారపడి ఉంటుంది.

    అలా టాలీవుడ్‌ అగ్రకుటుంబం నుంచి వచ్చిన అఖిల్‌ అక్కినేనికి సరైన హిట్‌ పడడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్‌ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మంచి కమ్ బ్యాక్‌ ఇచ్చేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా నటిస్తోన్న యాక్షన్  లవ్‌స్టోరీ చిత్రం లెనిన్ . ఈ మూవీకి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.

    ఇదిలా ఉండగానే అఖిల్‌కు సంబంధించి మరో టాక్‌ వినిపిస్తోంది. లెనిన్‌తో బిజీగా ఉన్న అఖిల్ మరో క్రేజీ ప్లాన్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌ ఇంట్లో ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మీట్ అయినట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో అఖిల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం.

    అయితే ప్రశాంత్‌ నీల్‌ వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌తోనే ఈ మూవీ ప్లాన్‌ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్‌  పర్యవేక్షణలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెనిన్ ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్ తెప్పించే న్యూస్ ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
     

     

  • మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి ఏకంగా 15కి పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మోగ్లీ, సైక్ సిద్ధార్థ్ లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు కార్తీ 'అన్నగారు వస్తారు'.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 19 వరకు కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

    (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ నుంచి 'రీతూ' ఎలిమినేట్‌.. విన్నర్‌ రేంజ్‌లో రెమ్యునరేషన్‌)

    ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ 'కాంత', 'ఎఫ్ 1'తో పాటు త్రీ రోజెస్ సీజన్ 2 అనే తెలుగు వెబ్ సిరీస్ ఉన్నంతలో చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 8 నుంచి 14 వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • ఎల్మ్ అండ్ మార్క్ రాబర్స్ మేరీ గిఫ్ట్ మస్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 08

    • మ్యాన్ vs బేబీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 11

    • గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    • సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12

    • ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12

    • వేక్ అప్ డెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    • కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12

    హాట్‌స్టార్

    • సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 11

    • అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)

    అమెజాన్ ప్రైమ్

    • ద స్ట్రేంజర్స్ ఛాప్టర్ 2 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 08

    • ద లాంగ్ వాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 08

    • మెర్వ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 10

    • టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    ఆహా

    • 3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12

    జీ5

    • సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12

    సన్ నెక్స్ట్

    • అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12

    సోనీ లివ్

    • రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ (హిందీ సిరీస్) - డిసెంబరు 09

    ఆపిల్ టీవీ ప్లస్

    • ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12

    మనోరమ మ్యాక్స్

    • ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12

    (ఇదీ చదవండి: ఆస్తి మొత్తం తిరుమలకు ఇ‍చ్చేసిన అలనాటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణం)

  • సినిమా లేదా సిరీస్‌ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్‌లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్‌ ఉండవంటున్నాడు నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్‌ సిరీస్‌ 'ద ఫ్యామిలీ మ్యాన్‌'. ఈ సిరీస్‌ మూడో సీజన్‌ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

    జీవితంలో మర్చిపోలేను
    తాజాగా ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌ అంతా ఓ చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్‌ అహ్లావత్‌ మాట్లాడుతూ.. పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 1 రిలీజైనప్పుడు మనోజ్‌ రాత్రిపూట నాకు ఫోన్‌ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్‌ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్‌ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్‌లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్‌స్టిట్యూషన్‌ ఓపెన్‌ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. 

    అభద్రతా భావం ఎక్కువ
    ఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్‌ చేసి నీ యాక్టింగ్‌ బాగుంది, నీ ప్రాజెక్ట్‌ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్‌ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్‌(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, జైదీప్‌ అహ్లావత్‌ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్‌ ఆఫ్‌ వాసేపూర్‌ అనే వెబ్‌ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్‌ మూవీలో నటించారు.

    చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి

  • అలనాటి సినీ నటి కాంచన(86) అసలు పేరు వసుంధర.. చాలారోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ మరణించడంతో నివాళి  అర్పించేందుకు ఆమె వచ్చారు.  అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్‌గా తిరిగి మరో ఆటోలో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ… ఒక్కతే తిరుగు పయణమయ్యారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో  అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

    బ్రహ్మచారిణిగా..
    60, 70వ దశకంలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు కాంచన. ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్‌ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్‌ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్‌, శ్రీకృష్ణావతారం , ఆనంద భైరవి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడిపారు. ఆమెది తెలుగు కుటుంబమే.. కానీ, పుట్టింది చెన్నైలో   ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు.

    ఆమె జీవితం గురించి తెలుసుకుంటే నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిని ఆమె ప్రస్తుతం బెంగుళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు.

    తల్లిదండ్రులే శత్రువులయ్యారు
    తన తల్లిదండ్రుల గురించి కాంచన ఇలా చెప్పారు.. 'జీవితంలో ఎన్నో పరుగులు తీశాను.. చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్లు అమ్మానాన్న ఆడేవారు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. ఇప్పటికే చాలావరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్‌లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. అమ్మానాన్న మారుతారేమోనని ఎదురుచూశా. కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్థి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు' అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. తన తల్లిదండ్రులు, దాయాదుల వల్లే సినిమాలు చేయడం ఆపేశానన్నారు. 1983లోనో 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు.

    అర్జున్‌రెడ్డి కోసం 40 ఏళ్ల తర్వాత..
    సుమారు 40 ఏళ్లతర్వాత ఆమె అర్జున్‌ రెడ్డిలో కనిపించారు. సందీప్‌ రెడ్డి, విజయ్‌ దేవరకొండ  ఒకరోజు తనను చూడ్డానికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు.  అర్జున్‌రెడ్డివలో  నానమ్మగా చేయాలని కోరారు.  కథ బాగుందని ఆమె ఓకే చేశారు. సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటిస్తున్నట్లు ఆమె చెప్పారు.

    తిరుమల శ్రీనివాసుడికి రూ. 100 కోట్లు
    జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కాంచన.. అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన అస్తి లేకుండా చేశారు. అయినా  కూడా ఆమె మళ్లీ నిలదొక్కుకున్నారు. చెన్నైలో కలియుగ దైవం వేంకటేశ్వరుడికి  కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో రూ. 15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ రూ. 100 కోట్ల పైమాటేనని  ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తన మదిలో ఎప్పుడూ  వేంకటేశ్వరున్ని ధ్యానిస్తూనే ఉంటానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

    ప్రస్తుతం ఎవరు చూసుకుంటున్నారు?
    కాంచనను ప్రస్తుతం తన చెల్లెలు చూసుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చెల్లెలు, మరిది వాళ్లంతా  అండగా ఉన్నారని చెప్పారు. చాలామంది ఊహించుకుంటున్నట్లు దయనీయ స్థితిలో లేనని, దేవుడి దయ వల్ల చాలా బాగున్నానని ఆమె పంచుకున్నారు. ప్రశాంతంగా పూజ చేసుకుంటూ.. నిత్యం భగవంతుడి ధ్యానంలోనే ఉంటానని తెలిపారు.

  • కృతీ శెట్టి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్‌ సినిమాకే టాలీవుడ్‌ సెన్సేషన్‌ అయింది. ఉప్పెన మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది. వరుస అవకాశాలు రావడంతో యంగ్‌ హీరోలతో జోడీ కట్టింది. అయితే తెలుగులో తన క్రేజ్‌ను, సక్సెస్‌ను అలాగే నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు షిఫ్ట్‌ అయింది. ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తోంది.

    ట్రోలింగ్‌
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై జరిగే ట్రోలింగ్‌ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కృతీ శెట్టి మాట్లాడుతూ.. నేను చాలా సున్నితమైన వ్యక్తిని.. అమ్మ లేకుంటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్నే కాదు. చిన్న వయసులోనే నేను చాలా విషయాలు ఫేస్‌ చేశాను.

    అమ్మ సపోర్ట్‌
    సోషల్‌ మీడియాలో నాపై ట్రోలింగ్‌, ద్వేషం చూసి నాకు చాలా బాధేసింది. ఇక్కడ ఏవీ మన చేతుల్లో ఉండవు. అయినా సరే మనల్నే నిందించినప్పుడు ఇంకా ఎక్కువ బాధేస్తుంది. అప్పుడు అమ్మ అండగా నిలబడి.. నీ వల్ల అయినదానికన్నా ఎక్కువే కష్టపడుతున్నావు అని ధైర్యం చెప్పేది. ఒకానొక సమయంలో నాపై నేను నమ్మకం కోల్పోయాను. 

    తట్టుకలోకపోయా..
    నిజ జీవితంలో నన్నెవరైనా కామెంట్‌ చేసుంటే పట్టించుకునేదాన్ని కాదు. కానీ కెరీర్‌లో ఇలాంటి కామెంట్స్‌ వినేసరికి తట్టుకోలేకపోయాను. అప్పుడు ఫ్రెండ్స్‌ నేను బాధపడనీయకుండా నాతోనే ఉన్నారు. నేను హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు అంటూ కృతీ శెట్టి (Krithi Shetty) కన్నీళ్లు పెట్టుకుంది.

    చదవండి: నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: శింబు

Politics

  • సాక్షి, ఢిల్లీ: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని.. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. సోమవారం లోక్‌సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా(Vande Mataram debate) ఆయన మాట్లాడుతూ.. 

    భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని.. ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.

    ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సామాజిక న్యాయాన్ని, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించారు. కానీ, ఇప్పుడు ఏపీలో రాజ్యాంగ స్పూర్తి, సామాజిక న్యాయానికి విరుద్ధంగా పాలన జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కీలకమైన వైద్య రంగాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి . ..ప్రజలను గాలికి వదిలేశారు. 

    ఏపీలో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదు. రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. విద్యార్థులకు సరైనటువంటి ఆహారం ప్రభుత్వాన్నించకపోవడంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. జాతీయ సంస్కృత  విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు యదేచ్చగా జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ పాలన వైఫల్యమే. ఇది వందేమాతరం స్ఫూర్తిని కాలరాయడమే అని  గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.  

  • సాక్షి, అమరావతి: ఇండిగో సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్‌ మానిటరింగ్‌ చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కొట్టుకున్న సెల్ఫ్‌ డబ్బా ఎంత ట్రోలింగ్‌కు దారి తీసిందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోకేష్‌ ఎవరంటూ ఎవరు? అంటూ జాతీయ మీడియా చానెల్స్‌ ఏకిపారేశాయి. అదే టైంలో.. టీడీపీ నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడిని సైతం రాజీనామా చేయాలంటూ బలమైన డిమాండే వినిపిస్తోంది. ఈ దరిమిలా ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు చంద్రబాబు. 

    మంచి జరిగితే క్రెడిట్‌ను నిసిగ్గుగా తన ఖాతాలో వేసుకునే నారా చంద్రబాబు నాయుడు.. ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్‌ తీసుకున్నారు. ఈ సంక్షోభాన్ని కేంద్రమే పరిష్కరించాలంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారాయన. 

    ‘‘ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు. టైం ఇచ్చినా చేయలేకపోయారు. ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ విషయంపై మేమేం మానిటరింగ్‌ చేయడం లేదు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది. వాళ్లే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. 

    ఏపీలో ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. కానీ, సంక్షోభ బాధ్యతలను మాత్రం భాగస్వామిగా స్వీకరించడం లేదు. పైగా ఇండిగో సమస్యతో దేశం పరువు తీసిన రామ్మోహన్‌నాయుడుతో బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిన పని కూడా చేయలేదు. ఇవేవీ చేయకపోగా.. ట్రోలింగ్‌ దెబ్బకు యూటర్న్‌ తీసుకుని ఇప్పుడు ‘‘అబ్బే.. ఇండిగో సమస్యతో మాకేం సంబంధం లేదని.. అంతా కేంద్రందే’’నంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. 

  • సాక్షి, కోనసీమ: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని.. దురదృష్ట శాత్తు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మెడికల్‌ కాలేజీ ప్రైవేటీకరణ అంశంతో పాటు పలు సమస్యలపై సోమవారం ఆయన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడారు.

    ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేట్పురం చేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు కార్యక్రమాన్ని చేపట్టాం. ఈనెల 10వ తేదీన సేకరించిన సంతకాలను ఆయన జిల్లాల కేంద్ర కార్యాలయాలకు తరలిస్తాం. 15వ తేదీన జిల్లాల నుంచి  సేకరించిక సంతకాల పేపర్లను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తాం. ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు తన తాబేదార్లకు మెడికల్ కళాశాల కట్టుపెట్టి ప్రయత్నం చేస్తోంది. రానున్న కాలంలో  వైద్యం ప్రైవేటు చేతుల్లోకి పూర్తిగా వెళితే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారు.

    .. గడచిన 18 నెలల్లో ప్రభుత్వం ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదు. 18 నెలల్లో ఎన్ఆర్ఈజీఎస్లో ఏడు కోట్ల పని దినాలు తగ్గించారు. ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పేదలకు పని దినాలు కల్పించలేని ఈ ప్రభుత్వం.. అద్భుతమైన ఉద్యోగాలు కల్పిస్తామని ఎలా హామీ ఇస్తుంది?. 

    పేరెంట్స్ మీటింగ్ జరిగిన పాఠశాలలు ఐదేళ్ల క్రితం ఎలా ఉన్నాయో?.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చంద్రబాబు గమనించారా.?. రాష్ట్రంలో  సాగయ్యే ఈ పంటకు కనీస మద్దతు ధర లేదు. రైతులు, విద్యార్థులతో పాటు అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 

    మంత్రులు అకౌంటబిలిటీతో మాట్లాడాలి. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. గడచిన 18 నెలల్లో రాస్తున్న క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు చిన్నారులపై అఘాయిత్యాలు  ఎక్కువైపోయాయి. ప్రజల తరపున పోరాటం చేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటాం’’ అని బొత్స అన్నారు.

    ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశాం: బొత్స సత్యనారాయణ
  • సాక్షి, శ్రీకాకుళం: ఇండిగో సంక్షోభ నేపథ్యంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఏపీలోనూ వైఎస్సార్సీపీ రామ్మోహన్‌ చేతకాని తనం గురించి నిలదీస్తున్నాయి. అటు కేంద్ర మంత్రిగానే కాదు.. ఇటు తన నియోజకవర్గంలోనూ ప్రజలకు మేలు చేయడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. 

    సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. విమానాలు రద్దు అవడంతో ప్రజలు ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల  ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్లు కుప్పకూలాయి.  ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలి.. 

    రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సమస్య వచ్చినప్పుడు మీడియాకు మొఖం చాటు వేస్తె ఎలా? మీ సమాధానం కోసం దేశం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటినా మాట్లాడండి’’ అని తమ్మినేని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. 

    వైఎస్సార్సీపీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవి కుమార్  రామ్మోహన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందింది. కారెక్కినప్పుడు దిగినప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాడు. అహ్మదాబాద్‌లో ఫ్లయిట్‌ కూలి 240 మంది చనిపోతే.. అక్కడికి వెళ్లి రీల్ చేస్తారు. అందుకే రామ్మోహన్ నాయుడు రీల్స్ మంత్రి అని పేరు తెచ్చుకున్నారు. 

    రీల్స్ పై పెట్టిన శ్రద్ధ  తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.  ఏవియేష‌న్ మినిస్ట‌ర్ రామ్మోహ‌న్ నాయుడు చేతకానిత‌నం కార‌ణంగా దేశ ప‌రువు ప్ర‌పంచ‌స్థాయిలో దిగ‌జారింది. కింజరాపు కుటుంబానికి రాజయోగం కల్పించిన శ్రీకాకుళం ప్రజలకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకోచ్చారా?. ఒక్క కేంద్ర సంస్థను అయినా జిల్లాకు తీసుకొచ్చారా? మిమ్మల్ని ఎందుకు గెలిపించారా? అని జిల్లా ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు’’ అని రవికుమార్‌ అన్నారు. 

Family

  • ఇంటికి అందం గృహోపకరణం. ఆ గృహోపకరణాన్ని ఆకర్షణీయమైన డిజైన్‌గా రూపొందిస్తే అది ద్విగుణీకృతమవుతుంది. అలాంటి వాటిని ‘లెదర్‌’తో తయారు చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు రాయదుర్గంలోని ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ–హెచ్‌) హైదరాబాద్‌ క్యాంపస్‌ విద్యార్థులు. తమ సెమిస్టర్‌లో భాగంగా ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులు ఎఫ్‌డీడీఐ–హెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. తేజ్‌లోహిత్‌ రెడ్డి చొరవ, ఫ్యాకల్టీ ప్రతినిధుల ప్రోత్సాహంతో వీటిని తయారు చేశారు.  

    బెడ్‌ ల్యాంపులు, గోడకు వేలాడదీసే ల్యాంప్‌లలో వాడిన లెదర్‌పై రకరకాల చిత్రాలు వేసి అందులో అమర్చిన ల్యాంప్‌ వెలిగిస్తే రంగు రంగుల చిత్రం చూడచక్కగా కనిపిస్తూ విద్యార్థుల ప్రతిభకు పట్టం టడుతోంది. 

    గోడకు, ఇంటి ముందు వేలాడ దీసేలా ల్యాంప్‌లకు చుట్టూరా లెదర్‌ను అమర్చి దానికి రంగులు వేయడంతో ‘ట్రెండీ’గా కనిపిస్తోంది.   

    (చదవండి: జంటలకు ఐవీఎఫ్‌ వైఫల్యం వర్రీ ఉండదు..! క్లినిక్‌లు కూడా..)

  • భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌లలో ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నైలలో కెరీర్‌ ప్లానింగ్‌కే​ ప్రాధాన్యత ఇస్తున్నారు ఐటీ జంటలు. దాంతో ఆ తర్వాత పేరెంట్స్‌గా మారలేకపోతున్నాం అని బాధపడుతున్న జంటలెందరో. సుదీర్ఘ పనిగంటలు, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా జంటలు తమ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. 

    చివకికి ఏక్లినిక్‌ని సంప్రదిస్తే మంచిదన్న టెన్షన్‌తో సన్నిహితులు, బంధువులు సూచనలను ఆశ్రయిస్తారు. చివరికి అక్కడ ఈ ఐవీఎఫ్‌ సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తారు. ఆఖరికి అందులో కూడా వరుస ఫెయిలర్స్‌ చూసి విసిగివేసారిన దంపతులెందరో. కొందరు మాత్రం పట్టుదలతో తల్లిందండ్రలవ్వగా మరికొందరికి మాతం అదొక కలగానే మిగిలిపోతుంది. 

    ​ఆ సమస్యను చక్కబెట్టేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ మరో ముందడుగు వేసింది. సహజంగా గర్భం దాల్చలేక ఇబ్బందిపడి క్లినిక్‌లను ఆశ్రయిస్తే ఆఖరికి ఐపీఎఫ్‌లో కూడా నిరాశను ఎదుర్కొన్న జంటలకు ఊరటనిచ్చేలా..భావోద్వేగ మద్దతను అందిస్తోంది ఒయాసిస్ ఆస్పత్రి.  సౌకర్యవంతమైన టెలి-కన్సల్టేషన్‌లతో మద్దతిస్తోంది దంపతులకు. 

    అంతేగాదు సంతానోత్పత్తి సంరక్షణ వృత్తిపరమైన నిబద్ధతలతో సమలేఖనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అన్ని ఆస్పత్రులు అమలు చేసేందుకు ముందుకొస్తే.. చాలా జంటలకు తల్లిందండ్రులు అయ్యే అవ్వకాశం ఉంటుందని పేర్కొంది. 
    డాక్టర్ వరలక్ష్మి యాకసిరి, ప్రాంతీయ వైద్య విభాగాధిపతి, ఒయాసిస్ ఫెర్టిలిటీ
     

    చదవండి: అతి పిన్న వయస్కురాలైన యువ బిలియనీర్..! ఏకంగా రూ. 10వేల కోట్లు..
     

  • సర్క్‌స్‌లోనూ, పార్క్‌ల్లోనూ జంతవులకు సంబంధించిన ప్రదర్శనల విషయంలో ఏమరపాటు తగదు. వాటికి ఇబ్బంది కలిగించేలా లేదా అవి టెంప్టయ్యేలా ఆహార పదార్థాలు ఉన్నా..వాటిని కంట్రోల్‌ చేయలేం. అందువల్ల జంతువుల సంరక్షకులు ఆ విషయంలో బీకేర్‌ఫుల​గా ఉండాలి. లేదంటే ఈ కీపర్‌కి పట్టిన గతే పడుతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

    అసలేం జరిగిందంటే..చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌ సఫారీ పార్క్‌లో జంతువుల సర్కస్‌కి సంబంధించి లైవ్‌ ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా ఓ నల్ల ఎలుగుబంటి జూ కీపర్‌పై దాడి చేసింది. ఇలా ఎందుకు చేసిందో అక్కడున్న పార్క్‌ నిర్వాహకులెవ్వరికీ అర్థం కాలేదు. ఈ అనూహ్య ఘటనకు తేరుకుని అక్కడున్న మిగతా సిబ్బంది ఆ జూకీపర్‌ని ఎలుగుబంటి దాడి నుంచి రక్షించే యత్నం చేశారు. 

    కానీ అది మాత్రం అతడిని గట్టిగా పట్టుకుని దాడి చేసేందుకే ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఏదోలాగా జూ సిబ్బంది ఆ ఎలుగుబంటి నుంచి అతడిని రక్షించి..దాన్ని సెల్‌లోకి తరలించారు. అది జూకీపర్‌ సంచి నిండా యాపిల్స్‌, క్యారెట్లు తీసుకురావడం చూసి..టెంప్టయ్యి అలా దాడి చేసిందని జూ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. అయితే ఆ ఎలుగుబంటి దాడిలో సదరు జూకీపర్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదని, అలాగే ఆ ఎలుగుబంటి కూడా సురక్షితంగానే ఉందని జూ నిర్వాహకులు తెలిపారు. 

    ఇక ఆ ఎలుగుబంటిని పబ్లిష్‌ షోల నుంచి తొలగించినట్లు కూడా వెల్లడించారు. కానీ నెటిజన్లు లాభం కోసం వాటితో అలాంటి పనులు చేయిస్తే ఫలితం ఇలానే ఉంటుందని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం.

    (చదవండి: షీస్‌ ఇండియా షో..)

     

  • అందచందాలతో అదరగొట్టారు.. ర్యాంప్‌పై హొయలొలికించారు.. ఆహుతులను ఆకట్టుకున్నారు.. ఫ్యాషన్‌ షోకు దేశ నలుమూలల నుంచి 18 నుంచి 81 ఏళ్ల అత్యున్నతమైన 20 మంది ఫైనలిస్టులు విచ్చేశారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని ఫస్ట్‌ బెటాలియన్‌ ప్రాంగణంలో ఉన్న శౌర్య కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి షీ’స్‌ ఇండియా పేరుతో జరిగిన ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. 

    ఈ పోటీలకు ఎత్తు, బరువు వంటి అర్హతలు లేవు. గృహిణుల నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీర్లు వరకు, స్కూల్‌ టీచర్లు నుంచి నర్సులు వరకు, ఫ్యాషన్‌ ఇండస్ట్రీ నుంచి కార్పొరేట్‌ ఐకాన్లు వరకు అందరూ ఒక వేదికపై కలిసి వాక్‌ చేశారు. 

    ఈ గ్రాండ్‌ గాలా ఫినాలేలో గెలుపొందిన మహారాణులను సత్కరించారు. డ్రీమ్‌ఫోక్స్‌ సహకారం అందించిన ఈ కార్యక్రమంలో షీ’స్‌ ఇండియా వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు షారోన్‌ ఫెర్నాండెజ్, శిల్పా జైన్‌ తదితరులు పాల్గొన్నారు.   

    (చదవండి:  Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్‌ మాయాజాలం)

  • డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలైనా ఆ అమ్మాయి ప్రయాణం.. అతి కొద్ది సమయంలోనే అంచెలంచెలుగా ఎదిగి..అత్యున్నత  స్థాయిలో నిలిచింది. కేవలం 29 ఏళ్లకే అత్యంత పిన్న వయస్కురాలైన యువ బిలియనర్‌ రికార్డులకెక్కింది. ఆమె స్థాపించిన కంపెనీ ఏకంగా వేల కోట్ల విలువను చేరుకుంది. అలాగే ఆమె సందప కూడా రూ 10 కోట్లు పైనే నికర విలువను కలిగి ఉండటం విశేషం. ఇంతకీ ఆమె ఎవరు.. అంత చిన్న వయసులో బిలియనీర్‌గా ఎలా అవతరించింది ఆ సక్సెస్‌ మంత్ర ఏంటి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

    ఆ అమ్మాయే బ్రెజిల్‌కు చెందిన లువానా లోప్స్ లారా. స్వయంకృషితో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా అవతరించింది. కేవలం 29 ఏళ్ల వయసుకే ఈ ఘనతను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఆమె స్థాపించిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్‌ఫారమ్ కాల్షి.. ఇటీవలే 11 బిలియన్ డాలర్లు అంటే మన కరెనన్సీలో అక్షరాల రూ. 90 వేల కోట్లకు పైగా విలువను చేరుకోవడంతో ఈ ఘనత సాధించింది.

    బ్రెజిల్‌లో జన్మించిన ఆమె రష్యాలోని బోల్షోయ్ థియేటర్ స్కూల్‌లో ప్రొఫెషనల్ బ్యాలరీనాగా (డ్యాన్సర్‌) ట్రైశిక్షణ పొందింది. ఆ తర్వాత కొంతకాలం ఆస్ట్రియాలో ప్రొఫెషనల్ బ్యాలెరినాగా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాగే విద్యారంగంలో కూడా రాణించిందామె. అమెరికా వెళ్లి అక్కడ ఎంఐటీ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్సులో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే క్లాస్‌మేట్ తారెక్ మన్సూర్ (29 ఏళ్ల) కలిసింది. 

    ఆ తర్వాత 2018లో న్యూయార్క్ నగరంలోని ఫైవ్ రింగ్స్ క్యాపిటల్‌లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తున్నప్పుడూ వారి మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ నేపథ్యంలోనే అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను కాల్షి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారిద్దరు. అనుకున్నట్లుగా 2019లో కాల్షి కంపెనీని ప్రారంభించారు. . అయితే పలు సవాళ్లు అనంతరం 2020లో కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ (CFTC) నుంచి ఆమోదం పొంది.. USలో మొదటి సమాఖ్య నియంత్రిత అంచనా-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. 

    2023లో నియంత్రణ సంస్థలు దాని ఎన్నికల ఆధారిత ఒప్పందాలను నిరోధించినప్పుడు పోరాటం తీవ్రమైంది. నిరుత్సాహపడకుండా, లోప్స్ లారా పోరాడారు. ఫలితంగా 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఎన్నికల ట్రేడింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన దావాలో స్నేహితులిద్దరూ విజయం సాధించారు. అంతుముందు కాల్షి కంపెనీ నికర విలువ రూ. 4,100 కోట్లుగా ఉంది. ఎప్పుడైతే ఎన్నికల ట్రేడింగ్‌ పొందిన రాత్రి ఒక్కసారిగా రూ. 8 వేల కోట్లకు ఎగబాకింది. 

    అలా ఈ స్టార్టప్ సంపదలో దూకుడుగా విస్తరించింది. అంతేగాదు ఈ కాల్షి కంపెనీలో లారా 12 శాతం వాటా కలిగి ఉంది. దీంతో లారా వ్యక్తిగత సంపద  కూడా భారీగా పెరిగింది. ఆమె ఆస్తులు 1.3 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.10 వేల కోట్లకు పైమాట. దాంతో లారా ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కురాలైన స్వయంకృషి బిలియనీర్‌గా నిలిచింది. ఇక లారా తల్లి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా.. తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్. వారిద్దరి స్ఫూర్తితోనే ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, గణితంలో డిగ్రీలు పూర్తి చేసింది. 

    ఇంటర్న్‌షిప్‌ల ద్వారా క్వాంటిటేటివ్ ట్రేడింగ్‌లో అనుభవాన్ని పొందింది. అలా రియల్ వరల్డ్ సంఘటనల ఫలితాలపై.. ట్రేడింగ్ చేయాలనే ఆలోచనతో కాల్షి సంస్థను లారా స్థాపించడం విశేషం. ఇక లారా బిలియనీర్‌ కథ ఆర్జనలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది. దృఢ సంకల్పం, అభ్యున్నలి కోసం చేసే పదునైన ఆలోచనలు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తాయి అనేందుకు లారానే ఒక ఉదాహరణ.

     

    (చదవండి: Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్‌ మాయాజాలం)

     

     

NRI

  • జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్‌ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి  సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం  ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.

    మయూఖ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత  ఏడాది  పౌరసత్వానికి అర్హత  సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్‌ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు.  మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో  కేవలం  అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.

    జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక  శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది  తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు  తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడు

    పంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం  అని మయూఖ్‌ పంజా తెలిపారు. 

     సోషల్ మీడియా మయూఖ్‌ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Cartoon