Archive Page | Sakshi
Sakshi News home page

International

  • వాషింగ్టన్‌: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ మేఘాలను కమ్ముకొనేలా చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఇరాన్‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన ఏఐ (కృత్రిమ మేధ) చిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ యుద్ధ విమానాలపై అమెరికా దళాలు విరుచుకుపడుతున్నట్లు ఉన్న ఈ కాల్పనిక చిత్రాలు మళ్లీ యుద్ధం తప్పదా? అన్న సంకేతాలను పంపుతున్నాయి.

    ‘బింగ్‌.. బింగ్‌.. గాన్‌!’

    ట్రంప్ షేర్ చేసిన ఒక చిత్రంలో.. అమెరికా యుద్ధనౌక హై-పవర్ లేజర్ ఆయుధంతో ఇరాన్ జెండా ఉన్న విమానాన్ని గాలిలోనే పేల్చివేస్తున్నట్లు ఉంది. దీనికి "లేజర్స్: బింగ్, బింగ్, గాన్!!" అనే శీర్షికను ఆయన జోడించారు. మరో చిత్రంలో ఇరాన్‌కు చెందిన 'ఫాస్ట్ బోట్ల' సమూహంపై అమెరికా డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు చిత్రీకరించారు. దీనికి "బై బై, ఫాస్ట్ బోట్స్" అని క్యాప్షన్ ఇచ్చారు.

    ‘లైఫ్ సపోర్ట్’పై కాల్పుల విరమణ!

    గల్ఫ్ రీజియన్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఎంతో కాలం నిలవదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. చర్చల పునరుద్ధరణ కోసం ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. "ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ‘లైఫ్ సపోర్ట్’ మీద ఉంది. తన ప్రియమైన వారు బతికే అవకాశం కేవలం ఒక శాతమే ఉందని డాక్టర్ చెప్పే పరిస్థితిలో ఆ ఒప్పందం ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    యుద్ధానికే మొగ్గు?

    హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మాటిమాటికీ మూసివేయడం, చర్చల పట్ల టెహ్రాన్ మొండి వైఖరితో ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా 'పూర్తి విజయం' సాధిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించే అంశాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ (CNN) కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇరాన్ తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Sports

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐదో ఓటమి ఎదురైంది. మం‍గళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. 

    ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో పాట్ కమ్మిన్స్‌(19) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్‌, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

    గుజరాత్‌ బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(61), వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ప్రపుల్‌ హింగే, షకీబ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(5)తో పాటు జోస్‌ బట్లర్‌(7) విఫలమయ్యాడు.  ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానానికి చేరుకుంది.

  • ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆరంభంలోనే  శుభ్‌మన్ గిల్‌, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్‌ను సుదర్శన్ ఆదుకున్నాడు.

    ఈ తమిళనాడు క్రికెటర్‌ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఐపీఎల్‌-2026 సీజన్‌లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

    👉ఐపీఎల్ చరిత్రలో 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముం‍దు ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 24 ఏళ్ల వయసులోపు  రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

    👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2014-2017), కె.ఎల్. రాహుల్ (2018-2021), విరాట్ కోహ్లి (2023-2025), సాయి సుదర్శన్ (2024-2026) ఉన్నారు.

    👉గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన మొదటి ఆటగాడు కూడా సుదర్శనే కావడం గమనార్హం.

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కేకేఆర్ బుధవారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. 

    చక్రవర్తి  ప్రస్తుతం ఎడమ చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు గాయంతోనే బరిలోకి దిగాడు. అయితే ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్‌కు మధ్యలో 6 రోజుల గ్యాప్ రావడంతో అతడు కోలుకుంటాని కేకేఆర్ మేనెజ్‌మెంట్ భావించింది. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు చక్రవర్తి దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అత‌డి గాయంపై కేకేఆర్ సహాయ కోచ్ షేన్ వాట్సన్ అప్‌డేట్ ఇచ్చాడు.

    "వైభ‌వ్ గ‌త రెండు మ్యాచ్‌ల‌లోనూ చాలా నొప్పితో బాధ‌ప‌డ్డాడు. అయిన‌ప్పటికి అత‌డు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉంటాడా? లేదా అన్న‌ది క‌చ్చితంగా తెలియ‌దు. కానీ అత‌డు టీమ్ సెల‌క్ష‌న్ అందుబాటులో ఉండాల‌ని మేము ఆశిస్తున్నాం" అని వాట్సన్ ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో పేర్కొన్నాడు.

    కాగా క్రిక్‌బ‌జ్ నివేదిక ప్ర‌కారం.. వ‌రుణ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అతను కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ క‌న్పించాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 మ్యాచ్‌లు ఆడిన చ‌క్ర‌వ‌ర్తి.. 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
    చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!

  • వైభవ్ సూర్యవంశీ... ఈ యువ క్రికెటర్ గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అద్భుత బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో కూడా దుమ్ములేపుతున్నాడు.

    వైభవ్ 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్‌లో అదరగొడుతున్న వైభవ్‌ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'ఇంపాక్ట్ సబ్' నిబంధన కారణంగా వైభవ్‌ ఒక ఆల్‌రౌండ్ క్రికెటర్‌గా ఎదగలేకపోతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 

    కాగా ఈ ఏడాది సీజన్‌లో వైభవ్‌ను రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వాడుకుంటోంది. రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఈ యంగ్ కిడ్ గ్రౌండ్‌లో కాకుండా బెంచ్‌పైనే కనిపిస్తున్నాడు.

    "వైభవ్ సూర్యవంశీని కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఒక క్రికెటర్ అంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. ఒక 'కంప్లీట్ క్రికెటర్'గా ఎదగాలంటే కచ్చితంగా ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంజమామ్ హల్ హక్ గొప్ప బ్యాటర్ మనందరికి తెలుసు. కానీ అతడు ఫీల్డ్‌లో కాస్త నెమ్మదిగా ఉంటాడు. అయినప్పటికి అతడు మైదానంలో ఉండి ఫీల్డింగ్ చేసేవాడు.

    ఫీల్డ్‌లో ఉంటేనే వారి లోపాలు, బలాలు అన్నీ స్పష్టంగా తెలిసేవి. కానీ ఇప్పుడు  'ఇంపాక్ట్ సబ్' వల్ల ఫీల్డ్‌లో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించడం లేదు. కేవలం 6 బంతులు ఆడే హిట్టింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ప్లేయర్లను వాడుకోవడం సరికాదు.

    ఆటగాడి నుంచి అన్ని కోణాలూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆశించకపోయినా, కనీసం అతను మైదానంలో ఉండి గేమ్‌ను ఆస్వాదించాలి. ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌లో రాణించాలనే కసి ఒక ఆటగాడి మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు. 

    ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ఆటగాళ్లను కష్టపడే స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందుకే ఇంపాక్ట్‌ రూల్‌ను బీసీసీఐ రద్దు చేయాలని కోరుకుటున్నాను" అని మంజ్రేకర్ స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మంజ్రేక‌ర్ పేర్కొన్నాడు.

  • IPL 2026 SRH vs GT Live Updates: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది.  గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్‌, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు.

    ఓటమి దిశగా ఎస్‌ఆర్‌హెచ్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

    పీకల్లోతు కష్టాల్లో సన్‌రైజర్స్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన క్లాసెన్‌.. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 56/6

    ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సైల్ ఆరోరా.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 54/4. క్రీజులో సైల్‌ ఆరోరా(16), హెన్రిచ్‌ క్లాసెన్‌(13) ఉన్నారు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ డౌన్‌
    ఇషాన్‌ కిషన్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 29/3

    ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అభిషేక్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. డేంజరస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌.. మొహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    సాయి,వాషీ హాఫ్‌ సెంచరీలు.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ ఎంతంటే?
    టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(61), వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ప్రపుల్‌ హింగే, షకీబ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(5)తో పాటు జోస్‌ బట్లర్‌(7) విఫలమయ్యాడు.

    14 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 107/3
    14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(55), వాషింగ్టన్‌ సుందర్‌(14) ఉన్నారు.

    గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
    26 ప‌రుగుల వ‌ద్ద గుజ‌రాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన జోస్ బ‌ట్ల‌ర్‌.. ప్ర‌పుల్ హింగే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 6 ఓవర్లకు గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్‌: 34/2

    గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
    15 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. ప్రపుల్‌ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగాయి.

    తుది జ‌ట్లు
    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

    గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్

  • ఐపీఎల్ 2026 సీజ‌న్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇప్ప‌టికీ ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ముంబై, ల‌క్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌, పంజాబ్‌, గుజ‌రాత్‌కు ప్లేఆఫ్స్ చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. 

    కానీ టీ20 మ్యాచ్‌లు కావ‌డంతో ఏ క్ష‌ణంలో ఏం జ‌రుగుతుంద‌నేది ఊహించ‌డం క‌ష్టం. అందుకే సీజ‌న్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు పూర్త‌ య్యాకే ప్లేఆఫ్స్ చేరే జ‌ట్ల‌పై క్లారిటీ రానుంది. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించ‌డానికి వ‌చ్చే అభిమానుల‌కు, ఆట‌గాళ్ల‌కు చీర్‌గ‌ర్ల్స్ త‌మ నృత్యాల‌తో అల‌రించ‌డం చూస్తూనే ఉంటాం. 

    అయితే ఆదివారం రాయ్‌పూర్‌ వేదికగా ముంబై ఇండియ‌న్స్‌, ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్ స‌మ‌యంలో జ‌రిగిన ఆస‌క్తికర ఘట‌న కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. విష‌యంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ స‌మ‌యంలో స్ట్రాట‌జిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ స‌మ‌యంలో ముంబై ఇండియ‌న్స్‌కు చెందిన చీర్ గ‌ర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. 

    అందులో ఒక చీర్‌గ‌ర్ల్ అక్క‌డే ఉన్న పోలీసుల‌ను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్క‌డే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గ‌ర్ల్స్ నృత్యాల‌ను క‌ళ్ల‌ప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు తెగ వైర‌లవుతోంది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. 

    తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ న‌ష్టానికి 166 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 167 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 19వ సీజ‌న్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్ల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ఆర్సీబీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌లో కేకేఆర్‌ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియ‌న్స్ పంజాబ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

    చదవండి: అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్‌పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.

    పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్‌కు మాత్రమే జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్‌తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

    మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు.  

    211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 

    వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

    చదవండి: ‘బౌలర్ల‌కు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’

  • ఢాకా వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన తొలి టెస్టులో 104 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. 268 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప‌ర్యాట‌క పాక్ జ‌ట్టు 52.5 ఓవ‌ర్ల‌లో 163 ర‌న్స్‌కే కుప్ప‌కూలింది. బంగ్లా పేసర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాట‌ర్లు విల‌విల్లాడారు.

    ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 9.5 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. పాక్‌ బ్యాటర్లలో అబ్దుల్లా ఫజల్(66) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

    ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  బంగ్లాదేశ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 413 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.  కెప్టెన్‌ నజ్ముల్‌ హోస్సేన్‌ షాంటో(101) సెంచరీతో కదం తొక్కగా..మోమినల్ హక్(91), ముష్ఫికర్‌ రహీమ్‌(71) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అబ్బాస్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌ కూడా బంగ్లాదేశ్‌ కూడా ధీటుగా బదులిచ్చింది. 

    అరంగేట్ర ఆటగాడు అజాన్ అవైస్(103) శతక్కొట్టగా.. అబ్దుల్లా ఫజల్(60), సల్మాన్‌ అలీ అఘా(58), మహ్మద్‌ రిజ్వాన్‌(59) రాణించారు. బంగ్లా స్పిన్నర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ 5 వికెట్ల సత్తాచాటాడు. 17 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్‌ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 

    బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాకిస్తాన్‌ చతికిలబడింది. కాగా బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో పాకిస్తాన్‌ ఓడించడం ఇదే తొలిసారి.

    బంగ్లా జట్టు స్వదేశంలో పాకిస్తాన్‌తో మొట్టమొదటి టెస్టు 2002లో ఆడింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పాక్‌పై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ మ్యాచ్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.
    చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!

  • సాధారణంగా 50 ఓవర్ల క్రికెట్‌లో ఓ జట్టు 400 పరుగులు సాధిస్తే అతి భారీ స్కోర్‌గా చెప్పుకుంటాం. అటువంటిది జింబాబ్వే వేదికగా జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఓ జట్టు ఏకంగా 822 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

    మాస్వింగో 50 ఓవర్ల ఫస్ట్ లీగ్‌లో భాగంగా సోమ‌వారం స్కోర్పియన్ క్రికెట్ క్లబ్, మీథేన్ లయన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన  స్కోర్పియన్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 822 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

    ఓపెనర్లు విల్ఫ్రెడ్ మాటెండే, తకుండా మడెంబో ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశారు. వారిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాలేదు. వారి విధ్వంసం ధాటికి ఫీల్డ‌ర్లు కేవ‌లం ప్రేక్ష‌క పాత్ర పోషించారు. తకుండా మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్స్‌లతో 302) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా..  విల్ఫ్రెడ్ మాటెండే(75 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్స్‌లతో 203) ద్విశతకం బాదాడు. వీరిద్దరితో పాటు గార్భియల్‌ జయ(49 బంతుల్లో 110) మెరుపు సెంచరీ సాధించాడు.

    కుప్పకూలిన మీథేన్‌
    అనంతరం 822 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మీథేన్ లయన్స్ జట్టు, కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీంతో స్కోర్పియన్ క్రికెట్ క్లబ్ ఏకంగా 794 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ ఇది అధికారిక 'లిస్ట్ ఏ' మ్యాచ్ అయ్యుంటే, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక తిరుగులేని రికార్డుగా నిలిచిపోయేది.
    చదవండి: Shreyas Iyer: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
     

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)పై భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గావ‌స్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్ల‌కు స‌మాన అవ‌కాశాలు రావాలంటే బౌల‌ర్లు నాలుగు ఓవ‌ర్ల‌కు ప‌రిమితం కాకుండా ఐదు ఓవ‌ర్లు వేసేలా నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించాల‌ని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివ‌ల్ల జ‌ట్టులోని బెస్ట్ బౌల‌ర్ సేవ‌ల‌ను మ‌రింత‌గా ఉప‌యోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.

    మిడ్‌-డే కాల‌మ్‌లో గావ‌స్క‌ర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. 

    జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్‌లో బౌలర్‌ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్ల‌కు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవ‌కాశ‌మున్న‌ప్ప‌టికీ, ఒక అదనపు ఓవర్‌ను వేయించ‌డం ద్వారా ఉత్త‌మ ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవ‌కాశ‌మున్న‌ప్పుడు, బౌల‌ర్‌కు మాత్రం ఒక ఓవ‌ర్ ఎక్కువ‌గా వేసేందుకు ఎందుకు అనుమ‌తించకూడదన్నది నా ప్రశ్న.

    ఈ మేర‌కు నిబంధ‌న‌లు సవ‌రించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల  ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జ‌ట్టులో ముగ్గురు బెస్ట్ బౌల‌ర్లు ఉన్న‌ప్పుడు వారితో త‌లా ఐదు ఓవ‌ర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్‌లో రాసుకొచ్చారు. 

    ఈ నిబంధ‌న‌ను ఐపీఎల్‌లో ప్రయత్నించ‌డానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావ‌స్క‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. టీ20 ఫార్మాట్ అయిన‌ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్ర‌య‌త్నిచ‌డం ద్వారా ఫ‌లితాలు చూడ‌వ‌చ్చ‌న్నారు. వ‌చ్చే సీజ‌న్ లేదా ఐపీఎల్ 2028 సీజ‌న్ నుంచి ఈ నిబంధ‌న‌ను ఉప‌యోగిస్తే చూడాల‌ని ఉందని గావ‌స్క‌ర్ తెలిపారు.

    చదవండి: పాక్‌ బౌలర్‌ ప్ర‌పంచ రికార్డు!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌ట్టు వ‌రుస ఓట‌ములు చ‌విచూస్తున్న‌ప్ప‌టికీ వైభ‌వ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో ద‌నాధ‌న్ ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే గ‌ట్టి పునాది వేస్తున్నాడు. ప్ర‌స్తుతం సూర్య‌వంశీ 11 మ్యాచ్‌ల్లో 440 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 

    సీజ‌న్ ఆరంభంలో వ‌రుస విజ‌యాల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన రాజ‌స్తాన్ క్ర‌మంగా  ఓట‌ములు ఎదుర్కొంది. 11 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాలు, 5 ఓట‌ములతో రాజ‌స్తాన్ పాయింట్ల పట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్ త‌న త‌ర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడ‌నుంది. మ్యాచ్‌కు వారం రోజులు గ్యాప్ రావ‌డంతో రాజ‌స్తాన్ ఆట‌గాళ్లు బ్రేక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. 

    ఈ నేప‌థ్యంలోనే రాజ‌స్తాన్ యాజ‌మాన్యం తాజాగా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఫ‌న్నీ వీడియోలను త‌మ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభ‌వ్ సూర్య‌వంశీ చ‌పాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభ‌వ్ మాస్ట‌ర్ చెఫ్ అవ‌తారంలో చ‌పాతీలు కాలుస్తూ క‌నిపించాడు.

    'నేను చేసే చ‌పాతీల‌తో పోలిస్తే మా అమ్మ చేసే చ‌పాతీలు భిన్నంగా ఉంటాయి. చ‌పాతీలు కాల్చ‌డం కంటే బౌల‌ర్ల‌ను ఉత‌క‌డం మేలు' అని న‌వ్వుతూ పేర్కొన్నాడు. వైభ‌వ్ చ‌పాతీలు కాలుస్తున్న‌ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

    చదవండి: ఆస్ట్రేలియ‌న్ టెన్నిస్ దిగ్గ‌జం క‌న్నుమూత‌!

  • బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆట‌గాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్ప‌టికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెల‌కొల్ప‌గా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్న‌ర్ నోమ‌న్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్‌ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవ‌ర్‌లో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్‌ను పెవిలియ‌న్ చేర్చ‌డం ద్వారా నోమ‌న్ అలీ ఈ ఫీట్ సాధించాడు. 

    త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయ‌స్కుడిగా నోమ‌న్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమ‌న్ అలీ ప్ర‌స్తుత వ‌య‌స్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమ‌న్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్‌ట‌న్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వ‌య‌సులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. 

    అంతేకాదు పాక్ త‌ర‌ఫున త‌క్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో చోటు ద‌క్కించుకున్న నోమ‌న్ అలీ ఆ జ‌ట్టు మాజీ ఆల్‌రౌండ‌ర్ అబ్దుల్ ర‌జాక్ రికార్డును స‌వ‌రించాడు. 2021లో పాకిస్తాన్ త‌ర‌ఫున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నోమ‌న్ అలీ 100 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన త‌ర్వాత కానీ అత‌డికి తొలి మ్యాచ్‌ ఆడే అవ‌కాశం ల‌భించ‌లేదు. 

    2024లో సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ టెస్టు సిరీస్‌ను 1-0తో పాకిస్తాన్ గెల‌వ‌డంలో నోమ‌న్ అలీ పాత్ర కీల‌కం. 22 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు సాధించిన నోమ‌న్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి ప‌ది వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మ్యాచ్ విష‌యానికొస్తే చివ‌రి రోజు ఆట‌లో పాకిస్తాన్ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డుతోంది. 

    బంగ్లా విధించిన 268 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించే క్ర‌మంలో త‌డ‌బడుతున్న పాకిస్తాన్ ప్ర‌స్తుతం 38 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగుల‌తో ఆడుతోంది. సాద్ ష‌కీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజ‌యానికి మ‌రో 128 ప‌రుగులు అవస‌రం.

    చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’

  • ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గ‌జం మాల్ అండ‌ర్స‌న్ (91) క‌న్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి అన్‌సీడెడ్ ప్లేయ‌ర్‌గా మాల్ అండ‌ర్స‌న్ చ‌రిత్ర సృష్టించాడు. వ్య‌వ‌సాయక్షేత్రంలోని మ‌ట్టికోర్టుపై ప్రాక్టీస్‌ను ఆరంభించిన అండ‌ర్స‌న్ ఆ త‌ర్వాత టెన్నిస్‌లో దిగ్గ‌జ ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు. 

    1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండ‌ర్స‌న్‌, మూడు డ‌బుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియ‌న్‌షిప్ సాధించిన అన్‌సీడెడ్ క్రీడాకారుడిగా  అండ‌ర్స‌న్ నిలిచాడు. ఇక ప్ర‌తిష్ఠాత్మ‌క డేవిస్ క‌ప్‌ను కూడా అండ‌ర్స‌న్ రెండుసార్లు సాధించి చ‌రిత్ర సృష్టించాడు.

    ఆట‌కు వీడ్కోలు ప‌లికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగిన పాట్ రాఫ్టర్‌ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశ‌నం చేశాడు. మాల్ అండ‌ర్స‌న్ మ‌ర‌ణంపై పాట్ రాఫ్ట‌ర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. 

    నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్‌లో మెళుకువ‌లు తీర్చిదిద్దడంలో మాల్ అండ‌ర్స‌న్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డ్డారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నా" అని పాట్‌ రాఫ్టర్ పేర్కొన్నాడు.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ వ‌రుస‌గా నాలుగో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యింది. 200 ప‌రుగుల‌కు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా స్పిన్న‌ర్లకు అనుకూలించే ధ‌ర్మ‌శాల పిచ్‌పై పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ ఒక్క ఓవ‌ర్ కూడా స్పిన్న‌ర్ల‌తో వేయించ‌క‌పోవ‌డం ఆ జ‌ట్టును దెబ్బ‌తీసింద‌ని చెప్పొచ్చు. 

    మ‌రోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్న‌ర్‌తోనై బౌలింగ్ చేయించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఇక మ్యాచ్ ఓట‌మి అనంత‌రం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధ‌ర్మ‌శాల వంటి ఫ్లాట్ పిచ్‌పై 210 ప‌రుగుల ల‌క్ష్యం చాలా ఎక్కువ‌. కానీ సీమ‌ర్ల‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మ‌రో 20 నుంచి 30 ప‌రుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహ‌ల్‌తో ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌క‌పోవ‌డం వెనుక ఒకటే కార‌ణం. 

    బంతి సీమ‌ర్ల‌కు బాగా అనుకూలిస్తుంద‌ని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమ‌ర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విస‌రడంలో విఫ‌ల‌మ‌య్యారు. 

    మా బౌల‌ర్లు భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్‌లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికల‌న్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని  అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయంతో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

    చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌-పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ వివాదాస్సదమైంది. ఈ మ్యాచ్‌ అనంతరం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం వివాదానికి దారి తీసింది.

    ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆల్‌రౌండర్ మాధవ్‌ తివారి అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మాధవ్‌కు ఈ అవార్డు అందజేసిన వ్యక్తి ఓ వివాదాస్పద కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతని పేరు గౌతమ్‌ మల్హోత్రా. పంజాబ్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపించింది. ఈ కేసులో అతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.

    ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసులు నమోదయ్యాయి. మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సంబంధించిన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది.

    లైవ్‌లా బిజ్ నివేదికల ప్రకారం, గౌతమ్ మల్హోత్రా రూ.2.5 కోట్ల లంచాల వ్యవహారంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే లిక్కర్ వ్యాపారంలో అక్రమ లాభాలు పొందినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే అనంతరం సరిపడా ఆధారాలు లేవన్న కారణంతో 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది.

    అయినా సరే, ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని ఐపీఎల్ అవార్డు కార్యక్రమానికి ఎంపిక చేయడం బీసీసీఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం క్లియరెన్స్‌  లభించిన వ్యక్తిని ఆహ్వానించడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. మాధవ్ తివారి అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో ఓటమి ఖాయమనే స్థితికి చేరింది.

    కానీ కెప్టెన్ అక్షర్‌ పటేల్‌, అనుభవజ్ఞుడు డేవిడ్‌ మిల్లర్‌ జట్టును పోటీలో నిలబెట్టారు. చివర్లో అశుతోష్‌ శర్మ, మాధవ్ తివారీ, ఆకిబ్‌ నబీ వేగంగా పరుగులు చేసి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించారు.

    ఈ మ్యాచ్‌లో మాధవ్ తివారీ రెండు కీలక వికెట్లు తీసుకోవడంతో పాటు కేవలం 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

     

  • 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణ‌యం అప్ప‌ట్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. త‌మ దేశంలో మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ తొల‌గించ‌డంపై బీసీబీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆటగాళ్ల భ‌ద్ర‌తకు సంబం ధించి కార‌ణాలు ఎత్తిచూపుతూ ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌మ మ్యాచ్ వేదిక‌ల‌ను భార‌త్ నుంచి శ్రీలంక‌కు మార్చాల‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్య‌ర్థ‌న‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) తోసిపుచ్చింది. 

    అయితే ఆట‌గాళ్ల భ‌ద్ర‌తపై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదిక‌ల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావ‌డం, ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ స‌జావుగా సాగిపోయింది. 

    తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్య‌క్షుడు త‌మీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ జ‌ట్టు వైదొల‌గడం వెనుక అప్ప‌టి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. 

    ‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వివాదం జ‌రిగిన‌ప్పుడు మొద‌ట నేనే గ‌ళం విప్పాను. నిజానికి గ‌త బీసీబీ ప‌రిపాల‌న విభాగం వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రైన‌ది కాదు. ఈ విష‌యంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక ప‌రిష్కారం క‌నుగొన‌డానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట విన‌కుండా త‌ప్పు చేసింది. దీనివ‌ల్ల బంగ్లాదేశ్ జ‌ట్టు తీవ్రంగా న‌ష్ట‌పోయింది. 

    ఇక‌ 1996-97 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌డం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచిన‌ప్పుడు బంగ్లాదేశ్ అంత‌టా ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మ‌ల్ని క్రికెట్‌వైపు ఆకర్షించాయి. ప్ర‌తీ ఒక్క‌రు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా త‌యార‌వ్వాల‌నుకున్నారు. అప్ప‌టి నుంచే బంగ్లా క్రికెట్ క్ర‌మంగా ఎదుగుతూ వ‌చ్చింది. 

    స‌రైన చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి వైదొల‌గ‌డం బాధాక‌రం. ఆ జ‌ట్టులో ఉన్న కొంద‌రు ఆట‌గాళ్ల వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌క‌పోవ‌చ్చు. అయితే ఇప్పుడు స‌మ‌స్య‌లు అన్నీ స‌మ‌సిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొన‌సాగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ప్ర‌స్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మ‌న్హాస్‌తో నాకు మంచి అనుబంధముంది. ఇద్ద‌రం క‌లిసి ఐపీఎల్‌లో ఒకే జ‌ట్టుకు ఆడాం.  

    ఢాకా ప్రీమియ‌ర్ లీగ్ ఆడేందుకు ఆయ‌న చాలాసార్లు బంగ్లాదేశ్‌కు వ‌చ్చారు. నేను అధ్య‌క్ష హోదాలో ఇంకా ఆయ‌న్ను క‌ల‌వ‌లేదు. బ‌హుశా అది త్వ‌ర‌లో జ‌ర‌గ‌వ‌చ్చు. ఇక ప్ర‌స్తుతం బంగ్లాదేశ్‌లో భ‌ద్ర‌త చాలా బాగుంది. త్వ‌ర‌లోనే బీసీసీఐతో స‌మావేశం జ‌రిపి ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వ‌హించేందుకు క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. త్వ‌రలోనే భార‌త్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య సిరీస్‌తో ఇరు దేశాల మ‌ధ్య క్రీడా బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.

    చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్‌.. ఇదిగో సాక్ష్యం!

Telangana

  • ఎర్రవల్లి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటలైజేషన్ పద్ధతిలో జరపాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు.

    ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి మండలానికి, మున్సిపల్ బాడీల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

    డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని అనుకుంటుండడంతో రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్ లలో, బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని, ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.

    సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్‌చార్జిల వివరాలు

    • ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శి

    • జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి

    • ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి

    • జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు -  పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి

    • మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు-  గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి

    • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి

    • మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి

    • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు-  రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి

    • వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు-  సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

    • మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — మహమూద్ అలీ, మాజీ మంత్రి

    • గద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు—  మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి

    • మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు —   పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్

    • హైదరాబాద్ జిల్లా—   తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

    • నల్గొండ, సూర్యాపేట జిల్లాలు —  ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి
       

  • కరీంనగర్‌: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర జరిగింది. దీనికి  బండి సంజయ్, హంపీ పీఠాధిపతి విద్యారణ్యస్వామి హాజరయ్యారు.

    ‘‘నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. నా కొడుకు కూడా అదే చెప్పాడు. నా కొడుకుకైనా, సామాన్యులకైనా చట్టం ఒకటే అని నమ్మేవాణ్ని. నేను ఏ దారిలో పోతే నా భార్య కూడా అదే దారిలో ప్రయాణం చేసి నా గెలుపులో భాగస్వామ్యమైంది. కన్న పేగు డిప్రెషన్‌లోకి పోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. నన్ను, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. 

    శ్రీరామచంద్రుడికే అరణ్యం తప్పలేదు.. నేనెంత? అంజన్నకు నిప్పు పెడితే లంకను ఎలా దగ్ధం చేశాడో ఈ సంజయ్ కూడా అదే చేస్తాడు. కుట్రలు, కుతంత్రాలు చేస్తుండో ఏ ఒక్కణ్నీ వదిలిపెట్టను. నా కొడుకుతో నేను మాట్లాడకపోవడం, టైం ఇవ్వకపోవడం నాదే తప్పు. 

    నా కార్యకర్తలే నా కుటుంబం అని తిరిగా. నా కొడుకు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. మనల్ని సవాల్ చేస్తే ముడుచుకుని కూర్చుందామా? గిరి గీసి కొట్లాడదామా..? అంజన్న వారసుడిగా ఈ కరీంనగర్ గడ్డ నుంచి గాండ్రిస్తూ వీటిని ఛేదిస్తానని చెబుతున్నా. నా కుమారుడు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడుతుంది. నా కుమారుడిని క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు’’ అని వార్నింగ్‌ ఇచ్చారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ సిట్‌ బృందం బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసింది.  పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిట్‌ విచారణకు హాజరు కావాలని సూచించింది.

    భగీరథ్‌ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్‌లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. 

    భగీరథ్‌.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. 

    సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్‌పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.

    దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది.

  • సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. సిట్‌ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్‌ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్‌ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్‌ మధ్యంతర బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

    కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే 
    బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు  తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.

    బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

    బండి భగీరథ్ కేసులో ట్విస్ట్.. టార్గెట్ బండి సంజయ్!

    బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్‌ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్‌ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. 

    ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్‌ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్‌ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది. 

    మైనర్‌ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్‌ మీడియా వైరల్‌ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్‌ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్‌ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.

    ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె.

Politics

  • చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్‌ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 

    టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు.

     “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.

    ఎవరూ నన్ను సంప్రదించలేదు 
    తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ,  డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. 

    ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.

    భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. 

    కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది.

  • పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇ‍ప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది?  

    తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్‌ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

    టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తి
    పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.

    మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్‌లో వీడియో పోస్ట్‌ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.

    అన్నాడీఎంకేలో అలజడి
    తమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్‌ను షణ్ముగం మంగళవారం కలిశారు.

    అస్సాంలోనూ అసంతృప్తి
    అస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్‌ గోగోయి సిబ్‌సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్‌పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్‌కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.

    సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్‌ షాపులను మూసివేయాలని సీఎం విజయ్‌ నిర్ణయం తీసుకున్నారు.  
    ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్‌ తీసుకున్న మరో  నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ‌గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్‌ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.

    రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు?  
    గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.

    విజయ్‌తో సంబంధం  
    ఎన్నికలకు ముందు విజయ్‌ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

    తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    అయితే, విజయ్‌ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి విరిచేవారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.  

  • తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

    మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరిగింది. స్పీకర్‌గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్‌కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. 

    “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి  వ్యాఖ్యానించారు. 

    ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్‌ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్‌ నమస్కారం చేశారు.

    నేను విజయ్ ఒకటే కాలేజ్ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్

    ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 

    2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్‌ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. 

National

  • భోపాల్‌: సుమారు 50 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల లక్కు లక్కలా అతుక్కుంది. కొన్నేళ్ల క్రితం యాభై మంది బ్యూరోక్రాట్లు ఒకే ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ పెట్టిన పెట్టుబడితో పోలిస్తే 11 రెట్లు పెరిగింది.

    జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని కోలార్ ప్రాంతానికి సమీపంలో గురాడి ఘాట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్‌లో ఒకే రోజు 50 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిని భవిష్యత్తులో ప్లాట్లుగా మార్చాలని నిర్ణయించారు.

    భూమి కొనుగోలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా కేడర్‌కు చెందిన అధికారులు ఉన్నారు. కొనుగోలు చేసిన 16 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ రూ. 3,200 కోట్లతో వెస్ట్రన్‌ బైపాస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమి. కానీ బైపాస్‌ ఆమోదం వచ్చిన 10 నెలల్లోపే ఆ భూమి నివాస ప్రాంతంగా మార్చారు. ఫలితంగా వ్యవసాయ భూమి ధరతో పోలిస్తే నివాస ప్రాంతం ధర అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ భూమి విలువ దాదాపు 11 రెట్లు పెరిగింది.

    భూమి నివాస ప్రయోజనాల కోసం విభజించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి హౌసింగ్‌ సొసైటీ అభివృద్ధి కాలేదు. సాధారణ ప్రక్రియ ప్రకారం, మొదట ప్లాట్లు కేటాయించాలి లేదా భూమిని రిజిస్టర్డ్‌ సొసైటీకి బదిలీ చేయాలి. కానీ ఇలాంటివి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చారు. 2022 ఏప్రిల్‌ 4న ఒకే రిజిస్ట్రేషన్‌ పత్రం ద్వారా 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలో 50 మంది షేర్‌హోల్డర్లు కలసి ఆస్తిని సొంతం చేసుకున్నారు. భూమి రూ. 5.5 కోట్లకు రిజిస్టర్‌ చేయబడింది. అయితే ఆ సమయంలో దాని మార్కెట్‌ విలువ రూ. 7.78 కోట్లుగా ఉందని దైనిక్‌ భాస్కర్ నివేదించింది.

    ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత, కుటుంబ సభ్యుల లేదా బినామీ పేర్లలో ఉన్న స్థిర ఆస్తుల (భూమి, ఇల్లు) వివరాలను ప్రతి సంవత్సరం జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియలో (IPR) ఐదు ఎకరాల భూమిని 50 మంది బ్యూరోక్రాట్లు కొనుగోలు చేసినట్లు చూపించినా, ఆ భూమి మొత్తం 41 మంది పేర్లలోనే ఉందని రికార్డులు వెల్లడించాయి. పదహారు నెలల తర్వాత, 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ రూ. 3,200 కోట్ల వెస్ట్రన్‌ బైపాస్‌ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతిపాదిత మార్గం ఆ భూమి నుండి 500 మీటర్ల దూరంలోనే వెళ్లనుందని సమాచారం.

    2022లో ఈ ఐదు ఎకరాల భూమి చదరపు అడుగుకు దాదాపు రూ. 81.75 రేటుకు కొనుగోలు చేశారు. 2024 జూన్‌లో భూమి వినియోగం మారిన తర్వాత రేటు చదరపు అడుగుకు రూ. 557కు పెరిగింది. 2026 నాటికి ప్రస్తుత మార్కెట్‌ రేటు చదరపు అడుగుకు రూ. 2,500 నుండి రూ. 3,000 మధ్య ఉంది. అందువల్ల ఆ భూమి మార్కెట్‌ విలువ రూ. 55 కోట్ల నుండి రూ. 65 కోట్ల మధ్యగా ఉందని అంచనా.

  • గత ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో పోలో ఆడుతూ మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కాపూర్రూ. 30,000 కోట్ల వారసత్వ సంపద కోసం కపూర్ కుటుంబం మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో దాఖలవుతున్న పిటిషన్ల వెల్లువను చూసి, "చూస్తుంటే మహాభారతం కూడా చిన్నదిగా కనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

    మే 18న జరగాల్సిన 'రఘువంశీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' (RIPL) బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించిన మధ్యవర్తిత్వ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు జరుగుతున్న 'మోసపూరిత ప్రయత్నం'గా ఈ సమావేశాన్ని ఆమె అభివర్ణించారు. ఈ పిటిషన్‌ను విన్న జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్, దేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటైన కపూర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వివాదం మహాభారతం కంటే పెద్దదిగా మారుతోందని వ్యాఖ్యానిస్తూ, ఈ కేసును మే 14న (గురువారం) విచారణకు స్వీకరిస్తామని తెలిపారు.వివాదాస్పద కుటుంబ ఆస్తిలో అధిక భాగం RIPL ఆధీనంలో ఉంది.

    కాగా గత వారం, ఢిల్లీ హైకోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించింది. రాణి కపూర్ తన కుటుంబ ట్రస్ట్‌ను మోసపూరితమైందిగా ప్రకటించాలని సివిల్ సూట్ దాఖలు చేశారు. మధ్యవర్తిత్వం పూర్తయ్యే వరకు సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ కుటుంబ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని రాణి కపూర్ కోరారు.

    మరోవైపు  సంజయ్ కపూర్ రెండో భార్య, నటి కరిష్మా కపూర్ పిల్లలైన కియాన్, సమీరా కపూర్, ప్రియా కపూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియా కపూర్ తన తండ్రి వీలునామాను ఫోర్జరీ చేశారని వారు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.  కాగా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ సంజయ్ కపూర్ రాసిన వీలునామాకు (Will) వర్తించదు. దానిపై విడిగా న్యాయ పోరాటం జరుగుతోంది. 

    ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌?

    గత ఫిబ్రవరిలో ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శలపై ఢిల్లీ హైకోర్టు కూడా  అసహనం వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని,  "గౌరవంగా ప్రవర్తించాలని" కోర్టు హెచ్చరించింది.దీంతో ఈ వివాదం, రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

    ఇదీ చదవండి: విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం

  • బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.

    'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.

    ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి  మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ  కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని  ప్రశంసించారు.

    45 ఏళ్ల వేడుకలు
    ఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్;  కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్,  మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా,   ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్‌ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు  హాజరు కానున్నారు.

    ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది.
     

  • సాక్షి, చెన్నై: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్‌ తమ బీఎస్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి (ఇంటర్మీడియెట్‌) పూర్తి చేసిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి వయోపరిమితి లేదని ప్రకటించింది.

    సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సుల్లా కాకుండా, దీనికి జేఈఈ స్కోరుతో సంబంధం లేదని వివరించింది. అభ్యర్థులు ‘క్వాలిఫైయర్‌ ప్రాసెస్‌’ ద్వారా నేరుగా అడ్మిషన్‌ పొందవచ్చని, ప్రస్తుతం నాలుగు విభాగాల్లో ఈ బీఎస్‌ డిగ్రీలను అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బీఎస్‌ ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్, బీఎస్‌ ఇన్‌ ఎల్రక్టానిక్‌ సిస్టమ్స్, బీఎస్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డేటా సైన్స్, బీఎస్‌ ఇన్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీ కోర్సులు ఉన్న­ట్టు తెలిపారు.

    ఈ కోర్సులను రెగ్యులర్‌ కాలేజీ డిగ్రీ చదువుతూనే సమాంతరంగా పూర్తి చేయవచ్చని వివరించారు. తరగతులు ప్రధానంగా ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతాయని, పరీక్షలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో నేరు­గా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అవసరాన్ని బట్టి సర్టిఫికెట్, డిప్లొమా, లేదా పూర్తి డిగ్రీ పొంది ఏ దశలోనైనా కోర్సు నుంచి వైదొలగవచ్చునని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజులో 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో, మే 31లోపు  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

    డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌కు దరఖాస్తులు 
    సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభు­త్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు మే 2026 సెషన్‌ డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈనెల 13 నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని సర్వీస్‌ కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇంటర్‌ విద్యశాఖలో లైబ్రరీ సైన్స్‌ జూనియర్‌ లెక్చరర్‌ (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలకు https://psc.ap.gov.in/లో చూడవచ్చు.

    చ‌ద‌వండి: గుడులు, లాకర్లలో బోలెడంత‌ బంగారం..

    ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్‌ టీచర్ల పునరుద్ధరణ 
    సాక్షి, అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 740 మంది కాంట్రాక్ట్‌ టీచింగ్‌ ఫ్యాకల్టీలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడా­ది జూన్‌ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు 11 నెలల వ్యవధికి రెన్యూవల్‌ చేశారు. 2026–­27­కి ఒక నెల విరామంతో అవకాశం ఇస్తున్నామని, పనిచేయకపోతే జీతం లేదనే షరతుతో పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

  • సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది.  బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్  శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట  రాజికీయాలు మరింత వేడెక్కాయి.

    ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో  సమావేశ మయ్యారు.  ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

    కొత్త నాయకత్వం
    రెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్‌గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం  రేపింది.


    విజయ్‌తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీ
    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.

    డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

    కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది.

     

  • తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి,  రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ తీసుకున్న తాజా నిర్ణయంపై  హీరో విశాల్‌ స్పందించారు.  తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్‌ చేసిన సీఎం విజయ్‌ నిర్ణయంపై  విజయ్‌ చిరకాల మిత్రుడు,  విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్‌  ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా  విశాల్‌ స్పందించారు. 

    రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై  మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి,  అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    "ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది.  వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్‌కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్‌లో తన సంతోషాన్ని ప్రకటించారు.

    చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

     కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే  పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఇతర  కీలక నేతలను  గౌరవప్రదంగా కలుసుకోవడం  కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది.

     

     

  • ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

    తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

    కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.

    పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. 

    విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. 

  • సాక్షి,న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్‌ పేపర్‌ లీకేజీ మాస్టర్‌మైండ్‌ రాజస్థాన్‌కు చెందిన మనీష్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్‌లో పేపర్‌ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్‌ లీక్‌ చేసినట్లు  పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.   

    మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్‌ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్‌ పేపర్‌లోని 120 ప్రశ్నలు.. నీట్‌ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్‌ యూజీ 2026  పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

    పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్‌వోజీ ఇద్దరిని మాస్టర్‌మైండ్స్‌గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్‌వర్క్‌పై విచారణ కొనసాగుతోంది.

    22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్‌టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్‌ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది. 

  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన కొరత లేదంటూనే పెంపు సంకేతాలిచ్చారు. మే 12ననిర్వహించిన 'CII వార్షిక బిజినెస్ సమ్మిట్-2026'లో దేశంలోని ఇంధన నిల్వలు, ధరల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితేనాలుగేళ్లుగా  ఇంధన పెంచలేదు, ధరలు పెరగబోవని చెప్పడం లేదంటూ మెలిక పెట్టడం చర్చకు దారి తీసింది.

    అయిదు రాష్ట్రాల  ఎన్నికల తరువాత  వంట గ్యాస్‌, పెట్రోవాత తప్పదనే వివిధ అంచాలన మధ్య దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం LPG ఉత్పత్తిని గతంలో ఉన్న సుమారు 35,000 టన్నుల నుండి 54,000 టన్నులకు పెంచిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెరిగే అవకాశం  లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇటీవలే ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

    నాలుగేళ్లుగా పెంచలేదు
    పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ,ప్రపంచ మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అలా చేయని ఏకైక దేశం మనదే అని  కూడా ప్రకటించారు. ధరలు 50 నుండి 60 శాతం వరకు పెరిగిన అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.  అయినా  పెరగవని తాను చెప్పడంలేదంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు ఇటీవల ప్రధాని మోదీ డీజిల్‌, పెట్రోల్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని, పొదుపుగా వాడాలని సూచించడం  ప్రమాద హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు.

    రాష్ట్ర ఎన్నికల కారణంగానే ధరల పెంపును వాయిదా వేస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ధరల నిర్ణయానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా LNG, 45 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజుకు రూ. 1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని, వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఆర్జించిన లాభాలన్నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?

    సముద్ర మంథన్ స్కీమ్ ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని  మంత్రి వెల్లడించారు. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉండాలని, ఆ దిశగా అదనపు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు. 

    ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్‌ బినాలే లుక్‌,స్పెషల్‌ ఏంటంటే?

    కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో నెలకు చేరుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై పడనుందనే ఆందోళన నెలకొంది. 

    ఇదీ చదవండి: ‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’

  • ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయల్సి రావడం పట్ల లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నీట్ 2026 పరీక్షను రద్దు చేసి, 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృథా చేశారంటూ ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

    ‘‘వారి కలలను బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. కొందరు తండ్రులు అప్పులు తీసుకున్నారు, కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు, లక్షలాది మంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. దానికి ప్రతిఫలంగా, వారికి పేపర్ లీకులతో షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొంది. 

    ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. ప్రతిసారి పేపర్‌ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోంది. నిజాయితీగల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాలి. ఒకరి తల రాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థం ఏముంటుంది? ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విష కాలంగా మారింది’’ అని విమర్శించారు.

    కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్, పరీక్షలో అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైద్య ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐకు ఈ కేసును అప్పగించింది.

    ఓ ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర సంస్థల నుంచి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని ఎన్‌టీఏ చెప్పింది. విచారణకు అవసరమైన పత్రాలు, రికార్డులు అందజేస్తుందని తెలిపింది.

    దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. దీన్ని మే 3న పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించారు. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

  • పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించారు.   పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు.

    ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరేముందు, ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ డాలర్ విలువ రూ. 100కు చేరువవుతోందన్నారు. పెట్రోల్‌ డీజిల్‌ పొదుపుగా వాడాలి, వర్క్‌  ఫ్రం హోం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రపై ఆయన గట్టి  చురక లేశారు.

    ముందు రూ. 8,000 కోట్ల విమానాన్ని అమ్మండి
    ధర్మం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి (Austerity begins at home)"  అన్న  అవిముక్తేశ్వరానంద ముందు రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మేసి, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు ఆవుల సంఖ్య తగ్గి పోతోందంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

    ఉత్తరప్రదేశ్‌లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక  సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాయకులు ,రాజకీయ పార్టీలు గోవధను అరికట్టడంలో విఫలమయ్యారు. అందుకే, తాము గోవులను ప్రేమించే ఓటర్లను సంప్రదించి,వారిలో అవగాహన కల్పిస్తున్నా మన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.

    ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?

    కాగా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్దం, హర్మోజ్‌ జలసంధి మూసివేత సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఆ ఏడాదిందా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్‌ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్వామి అవిముక్తేశ్వరానంద  ఘాటుగా స్పందించడం గమనార్హం​.
     

    ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్‌ బినాలే లుక్‌,స్పెషల్‌ ఏంటంటే?

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య  దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్‌) రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన షూటర్‌గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ‘రాజ్ సింగ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    రాజ్ సింగ్ ఎవరు? 
    బల్లియాలోని ఆనంద్ నగర్‌కు చెందిన రాజ్ సింగ్ స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. అఖిల భారత క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే ఇతడి పేరు గతంలో ఒక కాల్పుల ఘటనలోనూ వినిపించింది. ప్రొఫెషనల్ షూటర్లతో సహా కనీసం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా, అయోధ్యలో రాజ్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బిహార్‌లోని బక్సర్‌లో మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్‌ను తదుపరి విచారణ నిమిత్తం కోల్‌కతాకు తరలించారు.

    నా కొడుకు నిర్దోషి.. పోలీసులదే కుట్ర
    తన కొడుకును ఈ కేసులో అకారణంగా ఇరికించారని రాజ్ సింగ్ తల్లి జామవంతి సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో తాము ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నామని, 2026 మే 9 ఉదయం అయోధ్యలో గుడికి వెళ్లామని ఆమె ఆజంగఢ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో ఐదుగురు వ్యక్తులు తన కొడుకును బలవంతంగా ఎత్తుకెళ్లి, ఆ తర్వాత బక్సర్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని ఆమె మండిపడ్డారు. తమకు కోల్‌కతాతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడికి ఎన్నడూ వెళ్లలేదని పేర్కొన్నారు.

    ఫోన్ రికార్డులే సాక్ష్యం.. దర్యాప్తు ముమ్మరం
    రాజ్‌ సింగ్ లక్నోలో పెళ్లికి హాజరై, మార్కెట్లో షాపింగ్ చేసినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తల్లి జామవంతి చెబుతున్నారు. ‘నా కొడుకుకు న్యాయం జరగాలి, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి’ అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ దారుణాన్ని ముందస్తు కుట్రగా అభివర్ణించడంతో బెంగాల్ ఎస్టీఎఫ్, సీఐడీ, యూపీ, బీహార్ పోలీసుల సంయుక్త బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశాయి.

  • బీదర్‌: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. బీదర్‌లో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.  బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది. ఈ ఘటనలోఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. వారిని బీదర్‌ ఆసుపత్రికి తరలించారు.

  • కదులుతున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు తోటి ప్రయాణికులు, రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సమయానికి స్పందించడం మాత్రమే కాదు, సమయస్ఫూర్తితో  వ్యవహరించి క్షేమంగా ప్రసవంజరిగేలా చూసిన ఘటన మానవీయ కోణాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన పుణే-సుపాల్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల రుఖ్సానా ఖాతూన్, ఆమె భర్త జమీల్ బేలవర్ కలిసి పుణే నుండి బీహార్ వెళ్లేందుకు జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. రైలు అహల్యనగర్ స్టేషన్‌కు సమీపిస్తుండగా, రుఖ్సానాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి.  సమీపంలో లేని ఆసుపత్రి, కిక్కిరిసిన జనరల్ కోచ్, వేగంగా కదులుతున్న రైలు కావడంతో వైద్య సాయం అందడం కష్టంగా మారింది.

    'ఆపరేషన్ మాతృశక్తి'
    ఈ అత్యవసర పరిస్థితిపై సమాచారం అందుకున్న సెంట్రల్ రైల్వే వెంటనే 'ఆపరేషన్ మాతృశక్తి'ని యాక్టివేట్ చేసింది. ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ సోమనాథ్ పాఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ మహిళ ఉన్న కోచ్‌కి చేరుకున్నారు. ఆమె నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆ సమయంలో ఆసుపత్రికి తరలించడం అసాధ్యమని గుర్తించారు. అందుకే  రైలులోనే సురక్షిత ప్రసవం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ఆర్పీఎఫ్‌ సిబ్బంది, కోచ్‌లోని తోటి మహిళా ప్రయాణికులు కలిసి రుఖ్సానా చుట్టూ దుస్తులు, దుప్పట్లతో ఒక సురక్షితమైన తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేసిన ఈ పనితో రుఖ్సానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు వినగానే తోటి ప్రయాణికులు సంతోషంతో  ఊపిరి పీల్చుకున్నారు.

     అనంతరం రైలు అహల్యనగర్ స్టేషన్‌కు చేరుకోకముందే రైల్వే అధికారులు అక్కడ 108 అంబులెన్స్‌ను, డాక్టర్లను సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బందిని మరియు సహకరించిన ప్రయాణికులను అందరూ అభినందిస్తున్నారు.

     

Business

  • రాజుల గురించి, రాజకుటుంబాల గురించి చాలామంది పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా అంతరించిపోయినప్పటికీ.. కొన్ని రాజ కుటుంబాలు మాత్రం తమ సంపదను కాపాడుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో మేవార్ రాజ కుటుంబం ఒకటి.

    ప్రస్తుతం ఈ కుటుంబం వివిధ వ్యాపారాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది. వీరికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని జాహ్నవి కుమారి మేవార్ వెల్లడించారు. ఈమె చదువుకునే రోజుల్లో పలు ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు.

    వ్యాపార జీవితానికి బలమైన పునాది
    జాహ్నవి కుమారి చిన్నప్పటి నుంచే రాజభవన వాతావరణంలో పెరిగింది. ఇతర పిల్లల్లానే ఆమె కూడా సాధారణ బాల్యాన్ని అనుభవించినప్పటికీ, ఆమె చదువు రాజభవనం లోపలే తన బంధువులతో కలిసి సాగింది. చిన్న వయసులోనే ప్రముఖులు, విదేశీ అతిథులను కలవడం వల్ల ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అనే నైపుణ్యాలు సహజంగానే వచ్చాయి. ఇవే తర్వాత ఆమె వ్యాపార జీవితానికి బలమైన పునాది అయ్యాయి.

    ఆమె కుటుంబానికి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, విద్య వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తండ్రి ఆఫీస్‌ పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి కుర్చీలో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయాలని పట్టుబడే ఆ చిన్నారి, తర్వాత నిజంగా కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.

    మూడు ఉద్యోగాలు చేస్తూ..
    అయితే.. రాజ కుటుంబానికి చెందిన వారికి కూడా డబ్బు డబ్బు సమస్య ఉంటుందని జాహ్నవి స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అవసరమైన ఖర్చులు మాత్రమే కుటుంబం భరించింది. అదనంగా.. ఆమె క్యాటరింగ్, క్లబ్ ప్రమోషన్, టెలిమార్కెటింగ్ వంటి మూడు ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించింది. దీని ద్వారా కష్టపడి సంపాదించే విలువ ఆమెకు అర్థమైంది.

    తన ఇరవై ఏళ్ల ప్రారంభంలోనే.. జాహ్నవి కుటుంబ పెట్టుబడి వ్యవస్థను మార్చడం ప్రారంభించింది. పెట్టుబడుల్లో పారదర్శకత, బాధ్యత, దీర్ఘకాల లాభాలపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి.. కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టే బంధువులు, స్నేహితులు తమ ఖర్చులను తామే భరించాలి అనేది. మొదట ఆమె తండ్రి దీనికి వ్యతిరేకించినా, తర్వాత అదే నిర్ణయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసింది.

    పెట్టుబడి విధానంలో మార్పు!
    అంతేకాకుండా.. ఆమె పెట్టుబడి విధానాన్ని కూడా పూర్తిగా మార్చింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. బ్యాంకర్లు, సలహాదారులు, అకౌంటెంట్లు వంటి మధ్యవర్తులు ఖర్చును పెంచుతారని, బాధ్యతను తగ్గిస్తారని ఆమె భావించింది. అందుకే ఆమె కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాల వైపు మళ్లించింది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టింది.

    ఒక యువతి, అది కూడా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, పెద్దవారి మధ్య తనను తాను నిరూపించుకోవడం ఆమెకు సులభం కాలేదు. చాలామంది ఆమె సామర్థ్యాన్ని అనుమానించారు. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె జీవితంలో మరో ముఖ్యమైన విషయం “సంపదను ముందుగా కాపాడుకోవాలి, తర్వాతే పెద్ద రిస్క్‌లు తీసుకోవాలి” అనే పాఠం. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన అనుభవజ్ఞులైన సలహాదారులు నేర్పారు. సంపదను కేవలం ఖర్చు చేయడం కాదు, దాన్ని తరతరాలకు నిలబెట్టడం ముఖ్యం అని అర్థం చేసుకుంది.

    ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?

  • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్ర‌జ‌లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

    సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్‌గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.

    నిజం ఏమిటంటే?
    సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్‌గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్‌లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

    అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.

    ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?
    వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.

    ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.

    ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!

  • భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

    స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్‌ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

    100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు.. త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.

    దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, "బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

    జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.

    గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.

    తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

    ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

    యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.

    ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుంచి, వర్తక వ్యాపారం నుంచి తయారీ.. ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.

    ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు.

  • అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలలోనే కొనసాగే వీలున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) చీఫ్‌ ఎకనమిస్ట్‌ అల్బెర్ట్‌ పార్క్‌ పేర్కొన్నారు.

    వెరసి తాజా అంచనాల ప్రకారం.. 2026లో బ్యారల్‌ ముడిచమురు 96 డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చు. 2027లో బ్యారల్‌ చమురు 80 డాలర్ల స్థాయిలో కదిలే వీలుంది. వెరసి ముడిచమురు ధరలు అధికస్థాయిలలో కొనసాగనున్నట్లు భావిస్తున్నామని వివరించారు.

    ఈ నేపథ్యంలో స్పాట్‌ ధరలతో పోలిస్తే ఫ్యూచర్స్‌ మార్కెట్లో అధిక(ప్రీమియం) ధరలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చమురు సరఫరాల కొరత ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. చమురు ధరల ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిలో 0.6 శాతం కోత పడవచ్చని వెరసి 6.3 శాతానికి ఆర్థిక పురోగతి పరిమితంకావచ్చని అంచనా వేశారు.

  • న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్ర‌వ్యాన్ని కాపాడుకునేందుకు దేశ ప్ర‌జ‌లు ఏడాది పాటు బంగారం కొన‌కుండా ఉంటే చాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై దేశవ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఆదివారం సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్రధాని మోదీ చేసిన ప్ర‌క‌ట‌నపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని ప్ర‌తిపాద‌న‌పై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌ను కొంత‌ మంది స‌మ‌ర్థిస్తుండ‌గా, మ‌రి కొంత మంది ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆపేస్తే న‌గల ప‌రిశ్ర‌మ నాశ‌మవుతుంద‌ని, కోట్లాది మంది ఉపాధికి దూర‌మ‌వుతార‌ని భ‌యాందోళ‌నలు చెందుతున్నారు.

    ఈ నేప‌థ్యంలో బంగారం దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డానికి టైటాన్ సీఎఫ్‌ఓ అశోక్ సోంతాలియా ఓ ప‌రిష్కారాన్ని సూచించారు. మ‌న దేశంలో పోగుప‌డి ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. బిజినెస్ టుడేతో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. ''ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న ప్ర‌భావం బంగారం కొనుగోళ్ల వైపు ఉంటుందా, సరఫరా వైపు మ‌ళ్లుతుందా అని వేచిచూస్తున్నాం. బంగారం దిగుమతుల గురించే కేంద్ర స‌ర్కారు ఎక్కువ ఆందోళనగా ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సమస్యను అధిగ‌మించ‌డానికి స్వల్పకాలిక, దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాలు ఉన్నాయి. మ‌న దేశంలో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌, దేవాల‌యాలు, లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చ''ని అశోక్ సోంతాలియా పేర్కొన్నారు.

    నిశితంగా ప‌రిశీలిస్తున్నాం
    బంగారం కొనుగోళ్లు హ‌ఠాత్తుగా నిలిచిపోతే కోట్లాది మంది ఉపాధికి విఘాతం క‌లుగుతుంద‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారాన్ని నిశితంగా ప‌రిశీలిస్తున్నామ‌ని అశోక్ సోంతాలియా చెప్పారు. తమ ప్ర‌తిపాద‌న‌ను వెంట‌నే ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న ప్ర‌భావం బంగారం కొనుగోళ్ల‌పై ఎలా ఉంటుందో చూడ‌టానికి రెండు వారాలు వేచి చూస్తామ‌న్నారు. అలాగే ప‌సిడి కొనుగోళ్ల నియంత్ర‌ణ ప్ర‌భుత్వం ఎలాంటి విధాన ప్రకటన చేస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాల‌ను వారం ప‌ది రోజుల పాటు నిశితంగా గ‌మ‌నిస్తామ‌న్నారు.

    చ‌ద‌వండి: ఓబీసీ క్రిమిలేయ‌ర్ కిరికిరి తేలింది!

    ప‌సిడి అమ్మ‌కాల నియంత్ర‌ణ‌లో న‌రేంద్ర మోదీ స‌ర్కారు సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తుందన్న న‌మ్మ‌కాన్ని అశోక్ సోంతాలియా (Ashok Sonthalia) వ్య‌క్తం చేశారు. దేశ ప్ర‌యోజ‌నాల‌తో పాటు న‌గల ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బ‌తీయ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఆభరణాల పరిశ్రమ కూడా న‌ష్ట‌పోకుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

    జీజేసీ అభ్యంత‌రం
    కాగా, పుత్త‌డి కొనుగోళ్ల‌ను నియంత్రించాల‌న్న ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న‌పై అఖిల భారత ర‌త్నాలు, ఆభ‌ర‌ణాల మండ‌లి (జీజేసీ) అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. బంగారం అమ్మ‌కాలు త‌గ్గితే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా కోట్లాది మందికి ఉపాధి క‌ర‌వుతుంద‌ని ఆందోళ‌న చెందింది. అనేక రంగాలపై ప్ర‌తికూల ప్ర‌భావం ఉంటుందని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థపై కూడా భారం ప‌డే అవకాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవ‌ల రంగాల‌తో పాటు లాజిస్టిక్స్‌, జ్యుయెల్ల‌రీ డిజైన్, ఈ- కామ‌ర్స్ త‌దిత‌ర రంగాలు కూడా దెబ్బ‌తింటాయ‌ని అంచ‌నా వేసింది. 

    విదేశీ వ‌ద్దు.. స్వదేశీ ముద్దు
    అమెరికా- ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో ప‌శ్చిమ ఆసియాలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల కార‌ణంగా ఇంధ‌న విప‌త్తు నెల‌కొంద‌ని, దీన్ని అధిగ‌మించ‌డానికి దేశ ప్ర‌జ‌ల‌కు 7 ర‌కాల చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సూచించారు. వ‌ర్క్ ఫ్రం హోమ్‌, బంగారం కొనుగోళ్ల నిలిపివేత‌, ప్ర‌జా ర‌వాణా వాడ‌కం, ప‌రిమితంగా వంట నూనెలు, విదేశీ వ‌స్తువుల‌ వినియోగం, సేంద్రియ వ్య‌వ‌సాయం, విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ర‌ద్దు వంటి అంశాలను ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. 
     

     

  • భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్‌డే'గా మారింది. ఒక్కరోజులోనే భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 1,450 పాయింట్లకుపైగా కుప్పకూలడంతో, పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉదయం వరకు స్థిరంగా కనిపించిన మార్కెట్.. మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 467 లక్షల కోట్ల నుంచి రూ. 456.9 లక్షల కోట్లకు పడిపోయింది.

    ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించడంతో.. మళ్లీ యుద్ధ భయం పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, భారత మార్కెట్ కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

    అంతేకాకుండా.. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతుండటం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఫలితంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారీగా షేర్లను అమ్ముతూ భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలోనే వారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

    పలు రంగాల షేర్లు ఈ పతనంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యోల్బణ ప్రభావంతో రుణాలు తిరిగి రాకపోవచ్చనే భయాలు కనిపించాయి. ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా చమురు ధరల అస్థిరత కారణంగా నష్టాలను చవిచూశాయి.

    మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్‌పై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. సరఫరా వ్యవస్థ దెబ్బతింటే దేశ ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో భయం, అనిశ్చితి, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో)

  • కరోనా విపత్తు రోజుల మాదిరి తిరిగి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) విధానానికి మళ్లాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మర్నాడే ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్‌ ఇందుకు అనుకూలంగా స్పందించింది. 

    పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఐటీ కంపెనీలు రిమోట్‌ లేదా హైబ్రిడ్‌ వర్క్‌ నమూనా (కొన్ని రోజులు కార్యాలయం, కొన్ని రోజులు ఇంటి నుంచి)కు వీలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ విధులు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, ఆఫీస్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

    ‘‘పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో కంపెనీలు క్యాంపస్‌లలో ఇంధన నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. అవసరం లేని వసతుల వినియోగాన్ని క్రమబద్దీకరించుకుంటున్నాయి. అవసరానికి అనుగుణంగా రిమోట్, హైబ్రిడ్‌ పని నమూనాలతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి’’అని నాస్కామ్‌ తన ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తున్నామని.. పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వంతో సంప్రదిస్తూ, సమన్వయంతో దీన్ని అధిగమిస్తామని పేర్కొంది.

    నాస్కామ్‌లో 3,500 ఐటీ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొన్ని అంశాలపై పిలుపునివ్వడం తెలిసిందే. కరోనా సమయంలో అనుసరించిన వర్చువల్‌  (ఆన్‌లైన్‌) సమావేశాలు, సదస్సులతోపాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు మళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.

  • మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం నష్టంతో 74,559.24 వద్ద, నిఫ్టీ 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం నష్టంతో 23,379.55 వద్ద నిలిచాయి.

    బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్, ఏషియన్ స్టార్ కంపెనీ లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, సెమాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్, ప్రేమ్కో గ్లోబల్ లిమిటెడ్, జీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • భారతదేశంలో ఉద్యోగ సంస్కృతి మరింత కఠినమైపోతోందని, కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తుంటే.. సంస్థలు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాయని ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

    గుర్లీన్ అనే మహిళకు, ఒక సంస్థ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించినప్పటికీ.. కంపెనీ కఠినమైన పర్యవేక్షణ విధానాల కారణంగా తిరస్కరించింది. ఈ సంఘటన ఆధునిక ఉద్యోగ సంస్కృతి, ఉద్యోగుల గోప్యత, మరియు రిమోట్ వర్క్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

    గుర్లీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నంతసేపు కెమెరా (వెబ్‌క్యామ్) ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా.. ప్రతి 10 నిమిషాలకు ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్‌షాట్ తీసి పనితీరును కూడా సంస్థ పరిశీలిస్తుందని వెల్లడించింది.

    ఉద్యోగులపై ఇలాంటి నిరంతర నిఘా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఒత్తిడి కలిగిస్తున్నదని గుర్లీన్ పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగికి శిక్షలాగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

    వర్క్-ఫ్రం-హోమ్ విధానం అసలు ఉద్దేశం.. ఉద్యోగులకు సౌకర్యం, స్వేచ్ఛ, సమతుల్య జీవనశైలిని అందించడం. కానీ ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ వల్ల ఉద్యోగులు భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. సంస్థలు మనుషులను నియమించుకుంటున్నాయా? లేక రోబోలను నియమించుకుంటున్నాయా? అని ఆమె ప్రశ్నించారు.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఉద్యోగులపై అధిక నిఘా పెట్టడం అనేది నమ్మకంలేని పని సంస్కృతికి సంకేతమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు కార్యాలయంలో పని చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ ఒత్తిడిగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరికొందరు కంపెనీల విధానాలను సమర్ధించారు.

    ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!

  • భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.

    ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటు

    ద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.

    ‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్‌ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్‌బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక పేర్కొంది.

    ఆహార భద్రత - వాతావరణ సవాళ్లు

    గత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.

    విధాన రూపకర్తలకు పరీక్ష

    ఆర్‌బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
    వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్‌బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!

Movies

    • హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..
    • సమ్మర్‌లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..
    • యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..
    • యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..
    • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్..

     

     

     

     

     

     

     

  • సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు  విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం  రామ్ జగదీష్  డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ నటి జయసుధ చేతుల మీదుగా విడుదల చేశారు.

    ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు అభినందనలు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌లు అద్భుతంగా నటించారు. విజయ్ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశాడు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో కూడా చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. ‘రమణి కళ్యాణం’ కూడా అలాంటి సినిమానే.  మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. మే 22న ఈ సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

    డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ఇది మంచి టీమ్ సపోర్ట్‌తో చేసిన సినిమా. ఈ కథను నమ్మి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. హీరో, హీరోయిన్‌లు చాలా ప్యాషన్‌తో సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రామ్ జగదీశ్ నా ఫ్రెండ్. ఈ సినిమాలో ఆయన చాలా చక్కని మాటలు రాశారు. నా రైటింగ్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమాలు థియేటర్స్‌లోనే చూడాలి. ఆ అనుభూతి వేరు. అందరూ సినిమాలను థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. మాకు ఎంతో సపోర్ట్ చేసిన జయసుధ గారికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, చైతు జొన్నల గడ్డ కీలక పాత్రల్లో నటించారు.

     

     

     

  • దసరా బ్లాక్‌ బస్టర్‌ తర్వాత హీరో నాని- శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్‌’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్‌, ఆయా షేర్‌ పాట ఫ్యాన్స్‌ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్‌ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. 

    ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.

    రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..

    ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

    దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది.  మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్‌ పాత్రలో మోహన్‌ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్‌ 21న థియేటర్లలో సందడి చేయనుంది.

     

  • తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ బాగుండాలంటే పర్సంటేజీ విధానంలో సింగిల్‌ స్క్రీన్లు రన్‌ చేయడం తప్పనిసరి అని తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. సింగిల్‌ స్క్రీన్ల మనుగడకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, నిర్మాతల మద్దతు కావాలని కోరింది. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అంతా ఓ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. నిర్మాతలందరు అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరారు. సింగిల్ స్క్రీన్స్‌పై  సవతి ప్రేమ వద్దని అన్నారు.

    దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడుతూ..'ఎగ్జిబిటర్స్ బ్రతుకు పోరాటం  ఈ పర్సంటేజ్ విధానం. నిర్మాతలందరు అర్థం చేసుకొండి. మాకు సపోర్ట్ చేయండి. తెలుగులో సింగిల్ స్క్రీన్స్  అంతరించిపోతున్నాయి. ఇప్పుడంతా ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. థియేటర్‌ను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్ స్క్రీన్‌ను కాపాడుకోవాల్సిన అవసరముంది. గవర్నమెంటు జీవో ఇచ్చినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో టికెట్ రేట్లు పెంచం' అని అన్నారు.

    ఎగ్జిబిటర్ శ్రీధర్ మాట్లాడుతూ..'2008 నుంచి పర్సంటేజ్ కోసం కొట్లాడుతున్నాం. హరిహర వీరమల్లు టైంలో మాట్లాడితే థియేటర్స్ మూసేస్తున్నామని నెగిటివ్ ప్రచారం చేశారు. నిదానంగా అన్నీ ప్రొడక్షన్స్ హౌస్‌లు పర్సంటేజ్ పద్ధతి వైపే వస్తున్నాయి. అందరూ ఈ విధానానికి వస్తే మేము ధియేటర్స్ నడుపుతాం'అని అన్నారు.

    చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..'నిర్మాతకు ఎగ్జిబిటర్‌ బిడ్డతో సమానం. చాలా కాలం నుంచి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి దారుణంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ బిర్యానీ అయితే మల్టీప్లెక్స్ ఆవకాయ లాంటిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముగ్గురు కలవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. 
     

  • టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్‌తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. 

    జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్‌కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు  గొప్పగా ఉండాలని  అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్‌ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్‌ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

     

     

     

  • ఇన్నాళ్లు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దళపతిగా ఉన్న విజయ్.. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. సినిమాల్లో తన మార్క్‌ క్రియేట్‌ చేసిన విజయ్.. రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు.  పోటీ చేసిన తొలిసారే సీఎంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే జన నాయగన్ తన చివరి చిత్రమని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    దీంతో కోలీవుడ్‌లో ఇకపై దళపతి అన్న పేరు వినిపించదు. మరి విజయ్‌ ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ మొదలైంది. విజయ్ సీఎం కావడంతో కోలీవుడ్‌లో తదుపరి దళపతి ఎవరన్న విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుత తమిళ హీరోల్లో ఎవరికీ అంతటి స్టార్‌డమ్ ఉందో మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

    తదుపరి దళపతి ఎవరు?

    విజయ్ తర్వాత కోలీవుడ్‌లో అంతే రేంజ్‌లో క్రేజ్ ఉన్న హీరో అజిత్ కుమార్. గతేడాది రెండు సినిమాలతో అలరించిన అజిత్.. ప్రస్తుతం రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కోలీవుడ్‌ దళపతిగా నిలుస్తారేమో వేచి చూడాల్సిందే. ఇక అజిత్ తర్వాత వరుసలో ధనుశ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరికి విజయ్ రేంజ్‌లో మాస్ ఇమేజ్‌ దక్కడం కష్టంగానే అనిపిస్తోంది. శివ కార్తికేయన్ వరుస సినిమాలతో అలరిస్తున్నా.. ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగా ముద్ర వేసుకున్నారు. దీంతో విజయ్‌లా మాస్ ఇమేజ్ దక్కడం అసాధ్యమేనని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కోలీవుడ్ దళపతి ఎవరు ‍అవుతారో వేచి చూడాల్సిందే.

     

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్‌ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్‌ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

    తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 

  • ఒకప్పటితో పోలిస్తే మన దేశానికి సంబంధించిన వివిధ భాషల సినిమాలు, నటీనటులు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైంలో యాక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల కెరీర్ మొత్తంలో మహా అయితే పదుల సంఖ్యలో లేదంటే వందల్లో మాత్రమే మూవీస్ చేస్తున్నారు. కానీ కొందరు నటీనటులు మాత్రం వేల చిత్రాల్లో నటించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ సృష్టించారు. ఇంతకీ ఎక్కువ చిత్రాల్లో కనిపించిన నటి/నటుడు ఎవరంటే?

    (ఇదీ చదవండి: ఓటీటీలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. ట్రైలర్ రిలీజ్)

    సుకుమారి
    మలయాళ చిత్రసీమకు చెందిన ఈమె.. 1940లో పుట్టి 2013లో చనిపోయారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ, సింహళ, ఫ్రెంచ్, ఇటాలియన్, బెంగాలీ, తుళు, ఇంగ్లీష్ భాషల్లో కలిపి మొత్తంగా 2500కి పైగా సినిమాల్లో కనిపించారు. ఈమెనే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

    మనోరమ
    గోపిశాంత అలియాస్ మనోరమ స్వతహాగా తమిళ నటి. 1500కి పైగా సినిమాల్లో కనిపించిన ఈమె 5000కి పైగా నాటకాల్లోనూ వివిధ పాత్రలు పోషించారు. అలానే అన్నాదురై, కరుణానిధి, జయలలిత, ఎమ్జీఆర్, స్టాలిన్, ఎన్టీఆర్, విజయ్ లాంటి ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత ఈమె సొంతం.

    జగతి శ్రీకుమార్
    మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు, దర్శకుడు, సింగర్ అయిన శ్రీకుమార్ ఆచారి అలియాస్ జగతి శ్రీకుమార్ నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 1500కి పైగా మూవీస్‌లో కనిపించారు.

    బ్రహ్మానందం
    తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం తన కెరీర్ మొత్తంలో 1100కి పైగా మూవీస్ చేశారు. 1000కి చిత్రాల్లో కమెడియన్ గా చేసిన గిన్నిస్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నారు. కమెడియన్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న రికార్డ్ కూడా ఈయన పేరిట ఉంది.

    శక్తి కపూర్
    బాలీవుడ్‌కి చెందిన శక్తి కపూర్.. 1975 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో యానిమల్, ఎల్ 2 ఎంపురాన్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించారు. 1980-90 మధ్య కాలంలో 100కి పైగా సినిమాలు చేసిన ఈయన.. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 700కిపైగా మూవీస్‌లో కనిపించారు. ఈయన కూతురు శ్రద్ధా కపూర్ ప్రస్తుతం హీరోయిన్‌గా చేస్తోంది.

    అనుపమ్ ఖేర్
    హిందీ నటుడు అనుపమ్ ఖేర్. 1982 నుంచి ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ టైంలో పలు పాన్ ఇండియా చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 540కి పైగా సినిమాల్లో కనిపించారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగానూ పలు చిత్రాల్ని తెరకెక్కించడం విశేషం.

    మమ్ముట్టి
    మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్ అలియాస్ మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 74 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ హీరోగా మూవీస్ చేస్తున్న ఈయన కెరీర్ మొత్తంలో 450కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఇందులో 400కి పైగా సినిమాల్లో హీరోగా నటించడం విశేషం. ఈయన కొడుకు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియాలోని ప్రధాన భాషల్లో హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

    (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)

  • హీరోయిన్ లయ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. హిట్ పెయిర్ అయిన శివాజీ సరసన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి పాత్రలు వస్తే చేయడానికి రెడీ అంటోంది.

    అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అప్పట్లో తాను ఓ సినిమా చేసినందుకు చాలా బాధపడ్డానని తెలిపింది. ‍స్వయంవరం తర్వాత వడ్డే నవీన్ సరసన మా బాలాజీ అనే మూవీలో విడో పాత్రలో కనిపించానని వివరించింది. అయితే ఆ సినిమా కథ  రెమ్యునరేషన్‌ గురించి తాను అడగలేదని తెలిపింది. అయితే ఇలాంటి తప్పులు చేయకూడదని తర్వాత అనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కేవలం కోడి రామకృష్ణ గారిపై ఉన్న గౌరవంతో కథ వినకుండానే చేశానని తెలిపింది. ఆ సినిమాను ఇప్పటి వరకు తాను చూడలేదని లయ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడో పాత్రలో నన్ను నేను చూసుకోలేకపోయానని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 
     
     

  • ఒకప్పుడు తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా సినిమాలు చేసిన జ్యోతిక.. రీసెంట్ టైంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. హిందీలోనూ అడపాదడపా మూవీస్ చేస్తోంది. ఈమె నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    'సిస్టమ్' పేరుతో తీసిన సినిమాలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, అశుతోష్ గోవారికర్ ప్రధాన పాత్రలు పోషించారు. అశ్విని తివారీ దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చే శుక్రవారం(మే 22) నుంచి ‍స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

    రిలీజ్ చేసిన ట్రైలర్ బట్టి చూస్తే కోర్టులో న్యాయవాదిగా పనిచేసే లాయర్ సోనాక్షి.. న్యాయాన్ని గెలిపించకుండా డబ్బులు తీసుకుని కేసుల్ని తారుమారు చేసే పనిచేస్తుంటుంది. దీనికి జ్యోతిక కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాంటి వీళ్ల జీవితాల్లో తర్వాత ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. వ్యవస్థ ఏం చేసింది? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. 

    (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)

  • రాజకీయాల్లో ఎంట్రీకి ముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యలతో రిలీజ్ కాలేదు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సినిమా త్వరలోనే విడుదల అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్టబొమ్మ హీరోయిన్‌గా కనిపించనుంది.

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ గతంలో రద్దైనట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా జన నాయగన్ డీల్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలను సంప్రదించినట్లు లేటేస్ట్ టాక్. ఓటీటీ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో చర్చలు జరుపుతోందని కోలీవుడ్‌లో టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ డీల్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

  • తెలుగు ప్రేక్షకులకు మన తన అని భేదముండదు. బాగుండాలే గానీ ఏ భాష సినిమా అయినా చూసేస్తుంటారు. మిగతా భాషలతో పోలిస్తే తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్బింగ్ అవుతుంటాయి. అలా సూర్య 'కరుప్పు'.. 'వీరభద్రుడు'గా ఈ వారం థియేటర్లలోకి రానుంది. దీనిపై పెద్దగా బజ్ ఏం లేదు. ట్రైలర్ కూడా పర్లేదనిపించింది. కానీ ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీపై తెలుగు నెటిజన్లు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. గతంలో ఇతడు టాలీవుడ్‌ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    గతంలో ఓ అవార్డ్ షోలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడతాడు అని చెప్పుకొచ్చాడు. 'యానిమల్' గురించి మరో సందర్భంలో మాట్లాడుతూ హింసను, మహిళలను అగౌరవపరిచే సన్నివేశాలని ప్రజలు ఆస్వాదించడం చూసి తాను బాధపడ్డానని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని అన్నాడు.

    తీరా చూస్తే ఇప్పుడు ఇతడు తీసిన సినిమాలో మరీ 'యానిమల్' అంత హింస కాకపోయినా కొంతమేర యాక్షన్ ఉంది. అలానే తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందేందుకు మెగా హీరోలైన పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కుదిరితే రామ్ చరణ్‌తో సినిమా చేస్తానని అన్నాడు. అప్పుడేమో తెలుగు సినిమాల్ని అవమానించి.. ఇప్పుడు తన సినిమా కోసం తెలుగు హీరోల అభిమానుల్ని కాకా పట్టేస్తున్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పాత వీడియోలు ట్విటర్(ఎక్స్)లో వైరల్ అవుతున్నాయి.

    గతంలో తెలుగు సినిమాల్ని కించపరిచి ఇప్పుడు అదే మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఆశించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు నటుడు-దర్శకుడు ఆర్జే బాలాజీపై వస్తున్నాయి. ఇతడిపై పెరుగుతున్న నెగిటివిటీ.. సూర్య 'వీరభద్రుడు' ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపిస్తుందా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సూర్యకు తెలుగులో మార్కెట్ ఉంది కానీ దర్శకుడిపై వస్తున్న ట్రోల్స్ ఏం చేస్తాయనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ప్రభాస్ రీల్ మదర్.. ఒకప్పటి హీరోయిన్.. చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్)

NRI

  • లండన్‌: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్‌ వీసాపై స్కాట్లాండ్‌కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్‌ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్‌ అందిపుచ్చుకుని స్కాటిష్‌ గ్రీన్‌పార్టీ తరఫున ఎడిన్‌బర్గ్‌ అండ్‌ లూథియన్స్‌ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్‌ ఆఫ్‌ స్కాటిష్‌ పార్లమెంట్‌(ఎంఎస్‌పీ) సభ్యుడయ్యాడు. 

    తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్‌ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్‌కు వచ్చాడు. ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్‌డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్‌డీ విద్యార్థులూ స్కాట్లాండ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్‌జెండర్‌ అయిన మణివణ్ణన్‌ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్‌ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్‌గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. 

    ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను

    విదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్‌ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్‌ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్‌బర్గ్, లూథియన్స్‌ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్‌ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్‌ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

    విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్‌లర్, మాజీ ఎంపీ రాబర్ట్‌ జెన్‌రిక్‌ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్‌కు గ్రీన్స్‌ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్‌అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్‌ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్‌ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది.  

    ఇదీ చదవండి: విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం

Family

  • మొక్కలు నేల మీదే పెరుగుతూ ఉంటాయన్నది అపోహ. కానీ అవి నేల మీదే కాదు... మానవుల చర్మం సహా అన్ని రకాల జంతువుల దేహాల మీదా, మొక్కల మీద కూడా పెరుగుతుంటాయి. మనుషుల చర్మం మీదే కాదు... వెంట్రుకల మీదా, గోళ్ల మీద కూడా పెరుగుతాయి. దీనికి తార్కాణాలను మనం చాలాసార్లు అనుభవించే ఉంటాం. కానీ అవి మన దేహం మీద పెరిగే ‘ఫంగస్‌’ కారణంగా అని తెలియదు. ఉదాహరణకు తప్పని పరిస్థితుల్లో తడి అండర్‌వేర్‌ తొడుక్కున్న సమయాల్లో గజ్జల్లో ఒరుసుకుపోయినట్లు కావడం, తొడలు, పిరుదులు, ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద చర్మం నల్లబారి దురదగా అనిపించడం, గోరు మీద గోరుచుట్టు... ఇవన్నీ ఫంగస్‌ పెరుగుదల వల్ల కనిపించేవే. వీటినే ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ లేదా ఫంగల్‌ డిసీజెస్‌గా పేర్కొంటారు. సాధారణంగా మన దేహంలోని అనేక చోట్ల పెరిగే ఫంగల్‌ డిసీజెస్‌ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం...

    నిజానికి ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ అనేవి దేహంలో అక్కడా ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా రావచ్చు. అందుకే ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అబిక్విటస్‌ అంటారు. నిజానికి నేల (సాయిల్‌) మీద లేదా పండ్ల మీద కూడా కుళ్లుతున్నచోట ఇవి  మొలుస్తుంటాయి. పండ్లు కుళ్లడానికి కారణం ఈ ఫంగసే. 

    వృథా పదార్థాలన్నీ మళ్లీ ఖనిజలవణాల్లా  రూపంలోకి మారిపోయి తమ మౌలికమైన అణువులుగా తనలో  కలిసిపోడానికి ప్రకృతి తన కోసమే ఈ ఫంగల్‌ రూపాలనుసృష్టించుకుందని చెప్పవచ్చు. అలా చూసినప్పుడు ఫంగస్‌ జీవులు ప్రకృతికి మేలే చేస్తాయి.

    పూర్తిగా మొక్కలూ కావు... సూక్ష్మజీవులూ కావు... 
    జీవశాస్త్రపరం (బయలాజికల్‌)గా చూసినప్పుడు మొదట్లో వాటిని మొక్కల్లోని ఒక విభాగంగా చూసేవారు. అందుకే వృక్షశాస్త్రం (బాటనీ)లోని ఒక విభాగంగానే వాటి అధ్యయనం కొనసాగేది. కానీ వాటిలోనే పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అవి పూర్తిగా మొక్కలూ కావనీ, అలాగని పూర్తిగా సూక్ష్మజీవుల కింద కూడా వాటిని పరిగణించలేమని తేలింది. 

    దాంతో ఫంగస్‌లను ఇప్పటికీ వృక్షశాస్త్రవిభాగంలోనే చదువుతున్నప్పటికీ... వాటి గురించి చాలా లోతుగా, సూక్ష్మంగా అధ్యయనం చేసేవారు మాత్రం ఫంగస్‌లను ‘మైకాలజీ’ అనే ఓ ప్రత్యేక శాస్త్రవిభాగంగా పరిణమిస్తుంటారు.

    ఫంగస్‌ రకాలు... 
    ఫంగస్‌లోని రకాలను వర్గీకరించేటప్పుడు వాటిలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు...

    ఆకృతిని బట్టి : వాటి ఆకారాన్నీ / ఆకృతిని బట్టి వర్గీకరణ చేస్తే... ఈస్ట్‌ అనీ, మౌల్డ్స్‌ అనీ వర్గీకరించవచ్చు, ఇందులో ఈస్ట్‌ అనేవి ఆహారాన్ని పులిసేలా చేస్తూ మనకు ఉపయోగపడుతుంటాయి. కానీ మౌల్డ్స్‌ మాత్రం ఆహారానికి బూజులా పట్టి మన ఆహారాలను తినడానికి యోగ్యం కాకుండా చేస్తాయి. (ఉదాహరణకు బ్రెడ్‌ను అలాగే వదిలేస్తే ఆకుపచ్చరంగులో బూజు రావడం మనకు తెలిసిందే).

    స్పీషీస్‌ (ప్రజాతులను) ఆధారంగా: ఫంగస్‌ ప్రజాతులను అంటే వాటి స్పీషీస్‌ను బట్టి చూసినప్పుడు... డెర్మటోఫైట్‌ స్పీషీస్, క్యాండిడా స్పీషీస్, మలేసేజియా స్పీషీస్‌ అనే రకాలు ఉంటాయి. మన దేహంపై వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌లో చర్మంపై వచ్చేవి డర్మటోఫైట్స్‌ స్పీషీస్‌కు చెందినవనీ, ఇక గజ్జలు లేదా చర్మం ముడతల్లో వచ్చే ఎర్రటి ఇన్ఫెక్షన్‌ను క్యాండిడా స్పీషీస్‌వని చెప్పవచ్చు.

    ఇన్ఫెక్షన్‌ తీవ్రతను బట్టి :  చర్మంపై వాటి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ఉపరితలానికే పరిమితమయ్యేవి (సూపర్‌ఫీషియల్‌), చర్మంలోపల చాలా లోతుగా ఇన్ఫెక్ట్‌ చేసేవి (డీప్‌ స్కిన్‌) అని వర్గీకరించవచ్చు. సాధారణంగా చాలా రకాల ఇన్ఫెక్షన్స్‌ పైపైనే వస్తాయి. కానీ ఎయిడ్స్‌ వ్యాధి సోకినవారిలో వచ్చేవి చాలా డీప్‌ స్కిన్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ అయి ఉంటాయి.

    ఎన్విరాన్‌మెంట్‌ను బట్టి చూస్తే : మన పర్యావరణంలో అవి పెరిగే చోటను బట్టి కూడా ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు నేల మీద పెరిగేవాటిని జియోఫిలిక్‌ అనీ, జంతువులపై నివసించేవాటిని జూఫిలిక్‌ అనీ, కేవలం మానవుల దేహంపైనే పెరిగేవాటిని ‘యాంథ్రపోఫిలిక్‌’ అని అంటారు.

    సాధారణంగా అడల్ట్స్‌లో వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు

    టీనియా కార్పోరిస్‌ : ఇది టైకోఫైటాన్‌ రబ్రబ్‌ అనే పంగ్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌. ఇది  పాదాలూ, చేతులు, మర్మావయవాలు (ప్రైవేట్‌ ΄పార్ట్స్‌) మినహా దేహంలో ఎక్కడైనా వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది అన్ని వయసుల వారిలోనూ రావచ్చు. ముఖ్యంగా పాడిపశువుల, పందుల పెంపకంలో నిమగ్నమయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరిలో వారాలూ, నెలలూ, కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల పాటు కూడా ఏమాత్రం మానకుండా అదేపనిగా కనిపిస్తూ ఉంటుంది. చాలాసందర్భాల్లో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం దురద రావచ్చు. కొందరిలో మాత్రం చిన్నవి మొదలుకొని పెద్దగా ఉండే ఎర్రటి, గుండ్రటి, అంచులు ఉబ్బినట్టుగా కనిపించే ప్యాచ్‌లు రావచ్చు. 

    ఈ గుండ్రటి అంచులు అన్ని పక్కలకూ వ్యాప్తిస్తూ... మధ్యలోని చర్మం మామూలుగా ఉండవచ్చు. ఇలా వచ్చే రింగులు ఒకదారితో మరొకటి కలిపిపోయేంతగా విస్తరిస్తూ పెద్దగా పెరగవచ్చు. కొన్నిసార్లు పగుళ్లూ, పొక్కల వంటివి (బ్లిస్టర్స్‌ అండ్‌ గ్రాన్యులోమా) వంటివీ కనిపించవచ్చు. వీటినే మాజోకాస్‌ గ్రాన్యులోమా అని పిలుస్తారు. కొన్నిసార్లు కొందరిలో అంతగా ప్రకాశవంతంగా లేని వెండిరంగులో ఉండే సోరియాఫార్మ్‌ మచ్చల వంటివీ కనిపించవచ్చు. ఇది జంతువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.

    టీనియా క్రూరిస్‌ (ధోబీస్‌ ఇచ్‌) : ఇది ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద కనిపించే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. దీన్నే సాధారణంగా అందరూ ‘ధోబీస్‌ ఇచ్‌’ లేదా ‘జాక్‌ ఇచ్‌’ అని పిలుస్తారు. ఒక్కోసారి ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద గడ్డ›రూపంలో వచ్చి బాధిస్తుంటుంది. ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర చెమట పట్టి తడిగా, చెమ్మతో ఉండే చోట్ల ఇది ఎక్కువగా వస్తుంటుంది. సాధారణంగా బిగుతైన దుస్తులు ధరించడం వల్లా... అలాగే స్థూలకాయం కారణంగా బట్టలు బిగుతుగా ఉన్నప్పుడూ... ఇక చాలాకాలంగా కార్టికోస్టెరాయిడ్స్‌ వాడుతున్నవారిలోనూ ఈ సమస్య కనిపించడానికి అవకాశాలు ఎక్కువ. 

    డయాబెటిస్‌ ఉన్నవారిలో ఈ సమస్య తరచూ వస్తూ ఉంటుంది. నెలల నుంచి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ. గతంలో పాదాలకు ‘టీనియా పెడిస్‌’ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశాలు మరీ మరీ ఎక్కువ. ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద ఎర్రటి / నల్లటి మచ్చలతో... అలాగే తరచూ దురదతో చాలా అసౌకర్యానికి గురిచేస్తుంటుంది. అయితే ఇది వృషణాల సంచి చర్మంపైనా లేదా పురుషాంగం పైనా పాకడం మాత్రం చాలా చాలా అరుదు.

    టీనియా మ్యాన్యువమ్‌ : ఇది చేతులకు వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఒక్కోసారి కాళ్లలో కూడా రావచ్చు. చేతులపై దురద వస్తుంటుంది. ఇన్ఫెక్షన్‌ వచ్చిన చోట... మధ్యనుండే చర్మం బాగానే కనిపిస్తున్నా అంచులు స్పష్టంగా అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంటుంది. అరచేతుల వెనకవైపున కనిపిస్తూ... ఒక్కోసారి అరచేతుల్లో పగుళ్లు కనిపిస్తుంటాయి. దీనికి పూత మందులు పనిచేయవు. నోటి ద్వారా (ఓరల్‌గా)  ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్‌ వంటి మందులు వాడాలి.

    టీనియా పెడిస్‌ (అథ్లెట్స్‌ ఫూట్‌) : ఆటలాడే వయసున్న పిల్లల్లోనూ, యుక్తవయసువారిలోనూ ఇది కనిపించడం వల్ల దీన్ని ‘అథ్లెట్స్‌ ఫూట్‌’ అంటారుగానీ... ఆటలకూ దీనికి సంబంధం ఉండదు. అయితే అరుదుగా కొందరిలో 50 ఏళ్ల వయసు వారిలోనూ కనిపించవచ్చు. అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. బిగుతుగా ఉండే ΄పాదరక్షలు (ఫుట్‌వేర్‌) వాడేవారిలోనూ, పాదాలకు చెమట ఎక్కువగా పట్టేవారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 

    ఇందులో ప్రధానంగా రెండు రకాల లక్షణాలు కనిపిస్తాయి. పాదానికి వచ్చినప్పుడు చర్మం పొట్టులా రాలవచ్చు. అలాగే కొందరిలో కాలి బొటనవేలి కింద పగులులా రావచ్చు. సాధారణంగా కాలివేళ్లలో నాలుగు, ఐదో వేలి మధ్యన కనిపిస్తుండవచ్చు. ఎక్కువగా నీళ్లలో ఉండేవారిలో కనిపిస్తుంటుంది. ఇందులో రెండు రకాలుంటాయి. 

    మడమకూ, మడమ అంచులకు మాత్రమే పరిమితైన దాన్ని ‘మోకాసిన్‌ టైప్‌’ అంటారు. ఒకవేళ పాదం / మడమ అంతటా నీటిబుడగలు, తిత్తుల రూపంలో కనిపిస్తే దాన్ని ‘బ్లూలస్‌ టైప్‌’ అంటారు. కాస్తంత వదులుగా, సౌకర్యంగా ఉండే పాదరక్షలు ధరించడం, స్నానం తర్వాత పాదాలను బెంజోల్‌ పెరాక్సైడ్‌తో శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చు. అలాగే క్లాకిమాజోల్, మైకోనజోల్, కీటోకెనజోల్, ఎకోనజోల్‌ వంటి పూతమందులతోనూ దీనికి చికిత్స అందించవచ్చు.

    క్యాండిడియాసిస్‌ : ఇది ఈస్ట్‌ తరహా ఫంగస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌. సాధారణంగా నోటిలోనూ లేదా ప్రైవేట్‌ పార్ట్స్‌ (మర్మావయవాల) వద్ద వస్తుంటుంది. అక్కడ నిత్యం చెమట పడుతూ తడిగా, చెమ్మగా ఉండటం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. క్యాండిడే అబ్బిలెన్స్‌ అనే ఒక రకం ఫంగస్‌... మానవుల నోటి నుంచి మలద్వారం వరకు ఉండే జీర్ణవ్యవస్థకు చెందిన మార్గం (గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ ట్రాక్‌)లో కాలనీలుగా ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉంటుంది. 

    దీని లక్షణాలను బ్యాక్టిరియల్‌ లక్షణాలుగా పొరబడి యాంటీబయాటిక్స్‌ వాడేవారిలో దీని తీవ్రత మరింత పెరిగి బాధిస్తుంది. స్థూలకాయం, డయాబెటిస్, ఎయిడ్స్, చర్మం ఎక్కువగా పట్టే గుణం, ఎండోక్రైన్‌ సమస్యలూ, స్టెరాయిడ్స్‌ వాడటం, దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. చర్మం ఎర్రబారడం, దోక్కుపోయినట్టుగా ఉండటం వంటి లక్షణాలతో వ్యక్తమవుతుంది. కొందరు మహిళల్లో ఇది రొమ్ముల కింది భాగంలో ఎర్రబారినట్టుగా వ్యక్తమవుతుంది.

    ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద వచ్చే క్యాండిడియాసిస్‌ : ఇది పురుషుల్లో మర్మావవం వద్ద... అలాగే మహిళల్లో యోని వద్ద కనిపిస్తుండే ఒక రకం ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇందులో వుల్వైటిస్, వుల్వోవెజినైటిస్, బెలనైటిస్, బెలనో΄ోస్థైటిస్‌ వంటి రకాలు ఉంటాయి. పూతమందులతో, నోటి ద్వారా వాడే మందులతో ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించవచ్చు.

    శోభి మచ్చలు (పిటిరియాసిస్‌ వెర్సికలర్‌) : తెలుగులో శోభిమచ్చలు అని పిలిచే ఈ తెల్లమచ్చలు / తెల్లపొడ కూడా ఒక రకం ఫంగస్‌ వల్లనే వస్తుంది. ఈ సమస్యలో ఎలాంటి నొప్పీ, బాధా లేకపోయినప్పటికీ కాస్తంత అసహ్యంగా కనిపిస్తూ కాస్మటిక్‌గా ఇబ్బందిని కలిగిస్తుంది. ఒక్కోసారి ఒక మచ్చపైకి మరో మచ్చ పెరుగుతూ ‘మలసేజియా ఫర్‌ఫర్‌’ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. 

    ఎక్కువగా బాగా వేడి వాతావరణంలో ఉండేవారిలోనూ, బాగా చమటలు పడుతూ అవి త్వరగా ఆరి΄ోని పరిస్థితుల్లోనూ, జిడ్డు చర్మం ఉన్నవారిలోనూ ఈ సమస్య ఎక్కువ. అలాగే ఎయిడ్స్‌ వంటి జబ్బు ఉన్నవారిలో ఈ ఫంగస్‌ వచ్చే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. వేసవిలో బాగా పెరుగుతుంది. కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా కనిపిస్తుంటుంది. కొందరిలో కాస్త దురదలూ కనిపించవచ్చు.

    కొందరిలో ఈ సమస్యతో ఒక్కోసారి చర్మం పొట్టులా, పొలుసుల్లా రాలిపోతూ ఉండవచ్చు. ఛాతీ, భుజాలూ, మెడ, వీపు, పొట్ట, అరుదుగా కొందరిలో ప్రైవేట్‌ పార్ట్స్, తొడల వద్ద ఈ సమస్య కనిపించవచ్చు. కర్రదీపంలో చూసినప్పుడు ఈ సమస్య ఉన్నచోట చర్మం నీలి, ఆకుపచ్చ మెరుపుతో కనిపిస్తుంది. ఈ సమస్యకు కీటకెనజోల్‌ షాంపూలు వాడుతూ, కీటకెనజోల్‌ క్రీమ్, క్లాట్రిమాజోల్‌ క్రీమ్‌ వంటి పూత మందులు వాడుతూ... నోటి ద్వారా (ఓరల్‌గా) ఇట్రకెనజోల్, ఫ్లూకెనజోల్‌ వంటి మందులు తీసుకోవడం ద్వారా చికిత్స చేయవచ్చు.

    వెంట్రుకల్లో వచ్చే టీనియా రకాలు  
    టీనియా క్యాపిటిస్‌ : ఇది రోమం అంకురంలో వచ్చే ఇన్ఫెక్షన్‌. టీనియా క్యాపిటిస్‌   మాడు మీద వస్తే పేనుకొరుకుడులా కనిపిస్తుంది. పిల్లల్లో యుక్తవయసుకంటే ముందుగా అంటే... 6 – 10 ఏళ్లవారిలో ఎక్కువగా వస్తుంటంది. తలలో పొలుసుల మాదిరిగా కనిపిస్తాయి. వెంట్రుకలు విరిగిపెతుంటాయి. తలలో మొటిమల్లా వస్తూ కొన్నిసార్లు అక్కడ చీము వంటి స్రావం కనిపిస్తుండవచ్చు. 

    చివరగా... అక్కడి వెంట్రుకలన్నీ గుండ్రని ఆకృతిలో రాలిపోయి మచ్చలా (స్కారింగ్‌ అలొపేషియాగా) కనిపిస్తుంటుంది. ఇది స్కూలు పిల్లల్లో వచ్చినప్పుడు ఒక చిన్నారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో ఉండే స్కూళ్లలో పిల్లలను దగ్గర దగ్గరగా కూర్చోబెట్టినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. 

    ఒక్కోసారి ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడినప్పుడూ ఇది వ్యాప్తి చెందుతుంటుంది. ఇందులోని ఒక రకాన్ని ‘బ్లాక్‌ డాట్‌’ అంటారు. ఇందులో మాడుపైన రోమమూలంలో వెంట్రుక విరిగిపోతుంది. వెంట్రుక మూలం దగ్గర క చుక్కలాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి ఉబ్బిన చుక్కల గుంపు అంతా ఒక ప్యాచ్‌లా కనిపిస్తుంటుంది.

    ఇక ‘గ్రే ప్యాచ్‌’ అనే మరోరకం మచ్చ వచ్చిన చోట కూడా వెంట్రుకలన్నీ విరిగిపోయి... అక్కడ ఓ గోధుమ రంగు ప్యాచ్‌లా అది కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్‌లో పొలుసులన్నీ కాస్తంత ఎరుపురంగుకు తిరిగి మచ్చలా కనిపిస్తాయి. ఈ సమస్యలోనూ వెంట్రుకలన్నీ విరిగి రాలిపోయి పేనుకొరుకుడు మచ్చలా కనిపిస్తాయి. కర్రమంట వెలుగులో చూస్తే ఈ మచ్చ... ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది.

    టీనియా బార్బే : ఇది మాత్రం గడ్డంలో వచ్చి... అక్కడ పేనుకొరుకుడులా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీసంలోనూ కనిపిస్తుంది. గడ్డం లేదా మీసంలోని వెంట్రులన్నీ రాలిపోవడంతో అక్కడ పేనుకొరుకుడు మచ్చ కనిపిస్తుంది.

    ఆగ్మినేట్‌ ఫ్యాలుక్యులైటిస్‌ : ఇది కూడా కీకన్‌ లాగే ఎర్రటి మచ్చలతో కనిపించేదే అయినా... దీనిలో నొప్పి తీవ్రత తక్కువ.

    ఫేవస్‌ : ఇందులో రోమమూలంలో ఎర్రగా కనిపిస్తుంటుంది. వెంట్రుకలు ఒకదానితో మరొకటి కలిసి పోయినట్లుగా చిక్కుబడినట్టుగా అల్లుకుపోయి కనిపిస్తుంటాయి. వెంట్రుకల మొదళ్లలో మొదటి ఎరుపురంగులో కనిపించేవి కాస్తా తర్వాత ఉబ్బినట్టుగా పసుపు పొక్కుల్లా కనిపిస్తుంటాయి. 

    రోమంతో పాటుగా అక్కడి చర్మం కూడా శిథిలమై వెంట్రుక కుప్పగా పడిపోవడం వల్ల అది పసుపు పొక్కులా కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఒక్కోసారి వెంట్రుకలన్నీ రాలిపోయి పేనుకొరుకుడుగా కనిపించవచ్చు.

    పిల్లల్లో సమస్య నివారణ / చికిత్స...
    స్కూలు పిల్లల తల ఆరోగ్యంగా ఉందా లేదా అని తల్లిదండ్రులు తరచూ వాళ్ల తలలను / మాడును పరిశీలిస్తూ ఉండాలి.

    కీటోకొనజాల్‌తో పాటు సెలేనియమ్‌ సల్ఫైడ్‌ ఉన్న షాంపూలతో తల స్నానం చేయిస్తూ ఉండటం వల్ల ఫంగస్‌ల వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు.

    పైపూత (టాపికల్‌ మెడిసిన్‌)గా రాయాల్సిన యాంటీ ఫంగల్‌ పూత మందులను వాడటం ద్వారా కొన్ని రకాల ఫంగస్‌లకు చికిత్స చేయవచ్చు.

    నోటి ద్వారా యాంటీ ఫంగల్‌ మందులు ఇవ్వడం ద్వారా చేసే చికిత్స : గ్రీసియోఫల్విన్‌ మందులుగా చెప్పే యాంటీ ఫంగల్‌ మందులతో ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించవచ్చు. ఇక వాటితో పాటు టెర్బినాఫిన్స్, ఇట్రాకెనజోల్, ఫ్లూకోనజోల్, కీటాకెనజోల్‌ వంటి మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ల విచక్షణ మేరకు చర్మంపైన వచ్చే ఎర్రటి మచ్చలను తగ్గించడానికి అవసరమైతే కొన్నిసార్లు కార్టికోస్టెరాయిడ్స్‌ కూడా ఇవ్వాల్సిరావచ్చు. పరిస్థితి కాస్త తీవ్రమై... ఇన్ఫెక్షన్‌ గనక మొదటి దశ దాటిపోతే అది బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కూడా సోకే (సెకండరీ బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌) దశకు చేరితే అప్పుడు యాంటీబయాటిక్స్‌ కూడా ఇవ్వాల్సి రావచ్చు.

    గోళ్లకు వచ్చే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌...

    టీనియా అన్‌గ్యువమ్‌ : ఇది గోరు (నెయిల్‌ ప్లేట్‌)కు వచ్చే ఫంగస్‌. ట్రైకోఫైటాన్, రబ్రమ్, ట్రైకోఫైటాన్‌ మెంటారోఫైట్స్, ఎపిడర్మోఫైటాన్‌ ఫ్లోకసమ్‌ వంటి ఫంగల్‌ రకాల వల్ల ఈ ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి. ఇందులో గోటికి ఇరువైపులా ఉండే గోరుభాగం పైకి వచ్చిన చర్మం ముడతల నుంచి వ్యాపిస్తుంది. గోరు తన పారదర్శకతను క్రమంగా కోల్పోతుంది. 

    శిథిలం అవుతుంది. కట్‌ చేసినప్పుడు స్పష్టంగా తెగకుండా... పొట్టుగా రాలిపోతుంది. యుక్తవయసుదాటిన వారిలో, బలహీనమైన గోళ్లు ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలెక్కువ. ఇందులో డిస్టల్‌ అండ్‌ ల్యాటరల్‌ సబ్‌ అన్‌గ్యువల్‌ ఒనైకోమైకోసిస్, సూపర్‌ఫీషియల్‌ వైట్‌ ఒనైకోమైకోసిస్, ప్రాక్సిమల్‌ సబ్‌ అన్‌గ్యువల్‌ ఒనైకోమైకోసిస్‌ వంటి రకాలూ ఉంటాయి. 

    త్వరగా చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గే అవకాశం. పూతమందులు పనిచేయవు. ఇట్రకెనజోల్, టర్బినాఫిన్‌ వంటి మందులు వాడాలి. చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, ఎప్పుడూ తగిన హైజీన్‌ పాటిస్తూ శుభ్రంగా ఉండేవారిలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు చాలా తక్కువ. అందుకే ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నివారణలో కీలక భూమిక పోషిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి.

    డాక్టర్‌ విజయ గౌరి బండారు, సీనియర్‌ కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌ అండ్‌ కాస్మటాలజిస్ట్‌ 

  • "వెర్రి వేయి రకాలు - పిచ్చి పలు రకాలు" అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. క్రియేటివిటీ ఉండోచ్చు మరి అధ్వాన్నమైన సృజనాత్మకతను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడో ఓ టీవీ స్టార్‌ క్రియేటివిటీ కూడా అలానే ఉంది. వెరైటిగా కనపడాలని అనుకుందో లేక కొత్తగా ఆలోచించాలనుకుందో గానీ ఆమె ధరించిన డ్రెస్‌ మాత్రం ఒక్కసారిగా అందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేసింది. 

    అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు సంక్షోభం, తోపాటు తర్వలో ఆహార సంక్షోభం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఆ స్టార్‌ డ్రెస్‌ అందరికి కోపం తెప్పించడమే కాదు..ఏమనుకుంటున్నావ్‌ అంటూ తింట్ల దండకం అందుకున్నారు. 

    ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) వేడుకలో, రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మెర్సీ అటాంగ్ సుమారు 500 బ్రెడ్‌లతో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చింది. ఆమె రెడ్‌కార్పెట్‌ పైకి రావడంతో ఒక్కసారిగా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. 

    ఆ దుస్తులను డిజైన్‌ చేసింది టియానాస్ ఎంపైర్‌కు చెందిన డిజైనర్‌ టోయిన్ లవానీ.  ఆ టీవీ స్టార్‌ అటాంగ్ బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసే నిమిత్తం వాళ్లు ఇలా రూపొందించారట. అంతేగాదు సదరు టీవీ స్టార్‌ అటాంగ్‌ సైతం తన వ్యాపారాన్ని ప్రమోట్‌ చేసుకునేందుకు ఇంతకన్న మంచి ప్రదేశం ఏముంటుంది అని ప్రశ్నించడం శేషం. 

    బ్రెడ్‌ డ్రెస్‌పై వెల్లువెత్తిన వ్యతిరేకత..
    ఆ లుక్‌ సృజనాత్మకతకు నిదర్శనంగా ఉన్నా..సోషల్‌ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహారాన్ని ఫ్యాషన్‌గా ఉపయోగిస్తారా..?, కనీసం నైతికత కూడా లేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇది చాలా అసభ్యకరం, అసలు ఆ దుస్తులు రూపొందించిన డిజైనర్లు నిజంగా ఫ్యాషన్‌ డిజైనర్లేనా? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: Tara Sutaria: బ్లేజర్‌ జస్ట్‌ రూ. 65 వేలు..కానీ హ్యాండ్‌ బ్యాగ్‌ మాత్రం అన్ని లక్షలా..!)

     

     

  • గర్భం దాల్చక ముందు ఏదైన అనారోగ్యం సమస్య బారినపడితే రిస్క​ తక్కువగా ఉంటుంది. పైగా ఏదోరకంగా చికిత్స పొంది ఆ రోగం బారి నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యొచ్చు. అదే గర్భం దాల్చక అది కూడా క్రిటకల్‌ స్టేజ్‌లో అంటే ఏ ఐదు లేదా ఆరో నెలలో ప్రాణాంతక అనారోగ్య సమస్య బయటపడితే..ఇక ఆ బాధ మాటలకందనిది. అను క్షణం ఓ నరకం ఏ జరుగుతోందన్న టెన్షన్‌ వెంటాడుతూ ఉంటాయి. అలాంటి బాధనే చవిచూసింది ఈ గర్భిణి.

    ఈ బాధకర ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళకు గర్భం దాల్చిన ఐదోనెలలో బ్లడ్‌ కేన్సర్‌ బారిన పడినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె అక్యూట్‌ లింఫోబ్లాస్లిక్‌ లుకేమియాదో బాధపడుతోంది. గర్భధారణ సమయంలో కేన్సర్‌కి చికిత్స చేయడం అంటే అత్యంత సవాలుతో కూడుకున్నది. 

    ఎందుకంటే కీమోథెరపీ వంటి ఇతర చికిత్సలు పుట్టుబోయే బిడ్డకు ప్రమాదకరంగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. దాంతో ఢిల్లీ వైద్యులు సురక్షితంగా గర్భాన్ని పొడిగిస్తూనే వ్యాధిని నియంత్రించడానికి చికిత్స అందించింది. గర్భధారణ సమయంలో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అనేది అత్యంత అరుదైన ప్రమాదకరమైన పరిస్థితి. దీనికి తక్షణమే చికిత్స అవసరం. 

    పిండం సంరక్షణ చూస్తూనే తీవ్రమైన ఈ కేన్సర్‌ని నియంత్రించడం అన్నది భయానక సవాలు అని చెబుతున్నారు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ వైద్యులు. ఎట్టకేలకు వైద్యుల ప్రయత్నం ఫలించి 32 వారాల నాలుగు రోజుల సమయంలో అత్యవసర సిజేరియన్‌ చేశారు. శిశువు బరువు 1.28 కిలోలు అని, ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. ఇక నవజాత శిశువుకు ప్రత్యేక నియోనాటల్ సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి ల్యుకేమియా కోసం తదుపరి చికిత్స అందిచనున్నట్లు తెలిపారు.

    అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా అంటే..
    ఎముక మజ్జ (bone marrow) ను ప్రభావితం చేసే వేగవంతమైన కేన్సర్. ఇది తెల్ల రక్త కణాల (lymphocytes) అపరిపక్వ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం (ముఖ్యంగా 2-5 ఏళ్లు). అలాగే పెద్దలలో కూడా రావచ్చు.

    లక్షణాలు: తీవ్రమైన అలసట, జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు, సులభంగా గాయాలు కావడం లేదా రక్తస్రావం, ఎముకల నొప్పులు.

    చికిత్స: కీమోథెరపీతో చికిత్స చేస్తారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే చాలా మంది పిల్లలలో, కొంతమంది పెద్దలలో కూడా ఈ కేన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎక్కువే. 

    (చదవండి: మెరుగైన ఆరోగ్యం కోసం వంట నూనెలో చిన్న మార్పు)
     

  • ప్రస్తుతం అందరిలో ఆరోగ్య స్పృహ చికిత్స నుంచి నివారణ వైపు మారుతోంది. చాలా ఏళ్లుగా ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత గానీ చికిత్స గురించి ఆలోచించేవారు కాదు.  కానీ ఇప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్యం అనేది రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుందనే  సంగతి గుర్తిస్తున్నారు. ఆ దిశగా అవగాహన పెంచుకుంటున్నారు.. ఈ మార్పులో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది రోజువారీ జీవితంలో అత్యంత స్థిరమైన అంశాలలో ఒకటి. 

    భారతీయ గృహాలలో, వంట చేయడం అనేది కేవలం పోషణకు సంబంధించినది మాత్రమే కాదు. ఒకరి పట్ల చూపే శ్రద్ధ, సంప్రదాయానికి సంబంధించినది. రోజూ ఉపయోగించే అన్ని పదార్థాలలో వంట నూనెకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది.  మొత్తం ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అవగాహన పెంచుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, మధుమేహం వంటి జీవనశైలి సంబంధిత పరిస్థితులు సర్వసాధారణం అవుతున్నందున, ఉపయోగించే నూనెలో కొవ్వుల నాణ్యతపై దృష్టి సారిస్తున్నారు. 

    ఆరోగ్యదాయకమైన వంట నూనెలో తక్కువ సంతృప్త కొవ్వులతో పాటు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFA, MUFA) మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ను సమతుల్య నిష్పత్తిలో ఉండాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవన్నీ రైస్ బ్రాన్ ఆయిల్‌లో సమృద్ధిగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. రోజువారి వంట అవసరాలకు అత్యుత్తమైనది తేల్చి చెప్పారు. 

     

     

  • 79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్‌ నటి తారా సుతారియా. తన స్టైలిష్‌ లుక్‌తో ఆ వెంట్‌లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్‌ ఇచ్చేసిందామె. ఎయిర్‌పోర్ట్‌ నుంచే పవర్‌ డ్రెస్సింగ్‌ అవుట్‌ఫిట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్‌ ఫ్యాషన్‌ని ఎలా నిశబ్దంగా సింపుల్‌గా ప్రదర్శించాలో తన లుక్‌తో అద్భుతంగా చూపించారామె. 

    తారా సుతారియా ఎయిర్‌పోర్ట్‌లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్‌లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్‌ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్‌గా అదే బ్రాండ్‌కు చెందిన బ్యాగీ ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్‌తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789. 

    బటన్ క్లోజర్‌తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్‌ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్‌ డ్రెస్‌కి అనుగుణంగా నలుపు రంగు జిల్‌ లెదర్‌ హైహిల్స్‌ని ధరించింది తారా. తన లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్‌ బ్యాగ్‌ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది. 

    ఈ బ్యాగ్‌కు తీసివేయగల చైన్‌ షోల్డర్‌ స్ట్రాప్‌, లోపల జిప్‌ పాకెట్‌ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్‌గ్లాసెస్‌ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్‌ ఆ గాగుల్స్‌ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట.  ఈ బ్యూటీ తన లగ్జరీయస్‌ అవుట్‌ఫిట్‌ లుక్‌తో ఈ కేన్స్‌ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్‌ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!. 

     

    (చదవండి: గోల్డ్‌ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్‌ స్టన్నింగ్‌ లుక్‌!)
     

  • భారతదేశ జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి  అంబానీ కుటుంబం అంతా ఇటలీలోని వెనిస్‌కు చేరి అత్యంత అద్భుతమైన కళాత్మక దుస్తుల్లో కనిపించి అబ్బరుపరిచారు. తాజాగా ఈ 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన – లా బినాలే డి వెనిజియాలో అంబానీ చిన్న కోడలు సరికొత్త లుక్‌కి సంబంధించిన ఫోటోలు సన్సేషన్‌ సృష్టిస్తున్నాయి. 

    ఎప్పటిలాగే రాధికా ఈ వేడుకలో తన గ్లామర్‌ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రియా కపూర్ మే 11న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో రాధికా ఫ్యాషన్‌ను భారతీయ హస్తకళలను మేళవించిన డిజైనర్‌వేర్‌ ఆధునిక కాలపు అందగత్తెలా మెరిశారామె. కస్టమ్‌ ఎర్డెమ్‌  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులలో రాధికా లుక్‌ అదుర్స్‌ అనిపించింది. 

    యూరోపియన్‌ కౌంచర్‌ సౌందర్యాన్ని, భారతీయ వస్త్రాల గొపతనాన్ని మేళవించేలా డిజైన్‌ చేసింది. భారతీయ ఫ్యాబ్రిక్‌పై పూల మోటిఫ్‌లతో అలంకరించిన మెటాలిగ్‌ గోల్డ్‌ బ్రోకేడ్‌ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఒక రకంగా ఈ డ్రెస్‌ ప్రపంచ వేదికపై భారతీయ నేత కార్మికుల నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది. ఈ డిజైనర్‌వేర్‌ ఆఫ్-షోల్డర్ డ్రేప్డ్ కార్సెట్ విత్‌ నేలవరకు జాలువారే కేప్‌ని కలిగి ఉంది. 

    దాంతో రాధికా లుక్‌ని రాజసం ఉ‍ట్టిపడేలా చేసింది. దీనికి మ్యాచింగ్‌గా స్ట్రెయిట్-కట్ బేజ్ రంగు ప్యాంటుతో జతచేసి,ఆధునిక ఫ్యాషన్‌తో కలగలిసిన భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగా రాధికా మెరిసే ఐషాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలతో తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. హెయిర్‌ని కూడా పాపిడి తీసి మొత్తాన్ని కర్ల్స్‌లో వదిలేయడంతో మరింత గ్లామరస్‌గా కనిపించింది. కాగా రాధికా శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. అలాగే ఆమె  తల్లిదండ్రులతో కలిసి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా కార్పొరేట్ ప్రపంచంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

     

    (చదవండి: వెనిస్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నీతా అంబానీ కుటుంబం)

     

Andhra Pradesh

  • విజయవాడ: పటమట ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్ అయిన సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్‌ గోడ కూలింది. దీంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ‍్యాయి. 

    ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని 302 ఫ్లాట్‌లో ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు.

  • సాక్షి, తాడేపల్లి: మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. మొక్కజొన్న రైతులకు అండగా నిలిచేందుకు రేపు(మే 13, బుధవారం) చలో మామిళ్ళపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ.. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దళారీలకే గ్యాంగ్‌స్టర్‌గా మారారంటూ మండిపడ్డారు.

    ‘‘మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. పంటను దాచుకున్న రైతులపై దాడులు చేయించారు. మామిళ్ళపల్లిలో రైతుల గోదాముపై దాడి చేయటం దారుణం. మొక్కజొన్నకు కేంద్రం రూ.2,400 మద్దతు ధర ప్రకటిస్తే నరేంద్ర మాత్రం రూ.1,652కే కొనుగోలు చేస్తున్నారు. తన సంగం డెయిరీకి అనుబంధ సంస్థల కోసం అతి తక్కువకే కొంటూ రైతులను మోసం చేస్తున్నారు. తనకు మొక్కజొన్న అమ్మకపోతే దాడులు చేయిస్తారా?. టీడీపీ మండల స్థాయి నేతలే ఈ దాడుల్లో పాల్గొన్నారు. అది నా గోదామని ధూళిపాళ్ళ అబద్దాలు చెప్తే అధికారులే నమ్మలేదు. దాడులు చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఎమ్మెల్యే నరేంద్ర మైండ్ బ్లాంక్ అయింది

    ..అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతీకారంగా మా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మొక్కజొన్న దాచుకున్న ఐదుగురు రైతులు సహా మొత్తం 15 మంది రైతులపై కేసులు పెట్టించారు. కర్ణాటక, తెలంగాణలో మొక్కజొన్నకు రూ.2400 కొంటుంటే ఏపీలో ఎందుకు కొనటం లేదు?. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని తీసుకురావద్దు. అక్రమంగా నిల్వలు ఉంచిన ధూళిపాళ్ళపై డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించడం లేదు?. అప్పట్లో సీజ్ ద షిప్ అన్నట్టుగా ఇప్పుడు సీజ్ ద సంగం డెయిరీ అని ఎందుకు అనటం లేదు?’’ అంటూ అంబటి మురళీకృష్ణ దుయ్యబట్టారు.

  • సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.

    ఇవాళ (మంగళ­వారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌.. వారిని ఆశీర్వదించారు. 

  • ‘‘మా  నాన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పోలీసులు నా మనషులే.. ఏమనుకుంటున్నావ్‌.. నేను తల్చుకుంటే నిన్ను, నీ భర్తను ఏమైనా చేయగలను’’ అంటూ  అంటూ టీడీపీ మహిళా నేత ఒకరు బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు.. తన కాపురం చెడగొట్టద్దని వేడుకంటే చంపేస్తానని బెదిరిస్తోందని వాపోతోందామె. 

    సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేట పట్టణానికి చెందిన కర్లకుంట కృష్ణదీప్తి తాజాగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్‌)ను ఆశ్రయించింది. టీడీపీకి చెందిన మల్లవరపు అభినయ సింధూర తన కాపురంలో నిప్పులు పోసిందని.. గట్టిగా నిలదీస్తే తెలుగు దేశం పెద్దలు పేర్లు చెబుతోందని చెబుతోంది. 

    ‘‘నా భర్త కాళీ.. ముగ్గురు సంతానంతో సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యేగారి కూతురునంటూ 10 నెలల కిందట మల్లవరపు అభినయ సింధూర నా భర్తకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె మోజులో పడి నా భర్త ఇంటికి కూడా రాలేదు. ఆయన్ని వదిలేయాలని బతిమాలితే.. ‘నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మా మావయ్య’ అని బెదిరిస్తోంది. నా భర్తకు విడాకులివ్వాలని నాపై ఒత్తిడి చేస్తోంది. మాట వినకపోతే నా భర్తను అక్రమ కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తోంది. నన్ను, నా బిడ్డలను చంపేస్తానంటోంది.. 

    .. హానీ ట్రాప్‌ లేడీలా వ్యవహరిస్తున్న సింధుర మీద టూటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ప్రభాకర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి నా భర్తను కూడా మందలించారు. మనసు మార్చుకున్న నా భర్త.. మా కోసం దిగివచ్చాడు. దీంతో రేప్‌ కేసు పెడతానంటూ సింధూర నా భర్తపై బెదిరింపులకు దిగింది. నీ భార్యను వదిలి రాకపోతే ఆత్మహాత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. అయినా వినకుంటే నన్ను హత్య చేయిస్తానని నా భర్తకు నరకం చూపిస్తోంది. 

    ఇప్పటికే మేం ఆర్థికంగా దెబ్బతిని.. అప్పులలో కూరుకుపోయామని ఉన్నాం. మా బతుకు మమ్మల్ని బతుకనీయండి అని  వేడుకున్నా సింధూర కనికరించడం లేదు. అధికార పార్టీ నేతల అండ దండలు చూసి ఆమె రెచ్చిపోతోంది. ఆమె నుంచి మాకు ప్రాణహని ఉంది. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అని ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో బాధితురాలు కృష్ణదీప్తి పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Guest Columns

  • ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల్లో ‘ఆస్కార్‌’, ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ ముందు వరుసలో ఉంటాయి. 1929 నుండి ఆస్కార్‌ అకాడమీ సినిమాలోని వివిధ విభాగాల్లో కనబరచిన ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు ఇస్తోంది. అదే బాటలో హాలీవుడ్‌ ఫారిన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ 1944 నుండి గోల్డెన్‌ గ్లోబ్‌ పేరిట అవార్డులు అందిస్తోంది. ఆస్కార్‌ తర్వాత గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కార ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది. ఈ పురస్కారాలు సినిమా నిర్మాణ విలువలకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెడతాయి.

    అవార్డుల ఎంపికలో మానవ సృజనాత్మకతనే ప్రమాణంగా తీసుకొనే ఈ సంస్థలను ఈ మధ్య  సినిమాలో పెరుగుతున్న కృత్రిమ మేధ ఇరకాటంలో పడేసింది. 2025లో ‘యాజ్‌ డీప్‌ యాజ్‌ ద గ్రేవ్‌’ అనే సినిమాలో నటిస్తున్న వాల్‌ కిల్మేర్‌ అనే నటుడు ఆకస్మాత్తుగా చనిపోయాడు. వాల్‌ కుటుంబం అనుమతితో ఆయన రూపాన్ని, గొంతును కృత్రిమ మేధ సాయంతో సృష్టించి ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు అవార్డు ఎంట్రీకి అవకాశం కల్పించాలా వద్దా అనే చర్చ వచ్చింది.

    సాంకేతిక సృష్టి నటుడికి ప్రత్యామ్నాయం కాదని ఆ సినిమాకు పోటీలో అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆ సంస్థలు అవార్డుల కోసం వచ్చే సినిమాల్లో టెక్నాలజీ వాడుక విషయంలో కొన్ని విధి విధానాలను రూపొందించాయి. 2027 నుండి సినిమాల ఎంట్రీ సమయంలో వీటి పరీక్ష ఉంటుంది. సినిమా నిర్మాణం మానవ సృజనాత్మకతకు గీటురాయి. సహజమైన పువ్వుకు, ప్లాస్టిక్‌ పూవుకు ఉన్న తేడా తెలిసిందే. సాంకేతికత అనివార్యమైన విభాగాలు మినహా మిగతా వాటిలో మానవ సృజనకే ఈ సంస్థలు పెద్ద పీట వేసేందుకు నిర్ణయించాయి. ప్రత్యేకంగా నటన, రచనల్లో మానవ ప్రమేయం లేకుంటే ఆ యా విభాగాల్లో చిత్రం పోటీ పడే అర్హత లేకుండా చేశాయి.

    చ‌ద‌వండి: ఓబీసీ క్రిమిలేయ‌ర్ కిరికిరి తేలింది!

    ఈ సందర్భంగా 2023 మేలో జరిగిన హాలీవుడ్‌  సినిమా రచయితల ఐదు నెలల సమ్మె గమనార్హం. సినిమా స్క్రిప్ట్‌ విషయంలో నిర్మాతలు చాట్‌ జీపీటీని వాడుకోవడంపై ఈ సమ్మె జరిగింది. చాట్‌ జీపీటీ పనిని కూడా తమ గిల్డ్‌లోని ఓ రచయితకు అప్పగించాలనే ఒప్పందంపై ఆ సమ్మె ముగిసింది. యంత్ర నిర్మిత కళను వ్యతిరేకిస్తున్న ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ల బాటలో మిగతా సంస్థలు నడిస్తే కళ బతుకుతుంది. కళాకారులకు గౌరవం దక్కుతుంది.

    – బద్రి నర్సన్‌, కథా రచయిత