Archive Page | Sakshi
Sakshi News home page

Politics

  • సాక్షి, చిత్తూరు జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుప్పం పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించారు.  

    అయితే కుప్పం డీఎస్పీ పార్ధసారధి అనుమతి ఇవ్వకపోవడంతో మోహిత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పూడి శ్రీహరి గారు ఎలా ఉన్నారో చూడాలని అడిగితే అనుమతి ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మాకు ఆందోళన కలిగిస్తోంది. పబ్లిక్ సర్వెంట్ ఇలా మాట్లాడటం బాధాకరం.  

    తిరుచానూరు ఘటనపై కోర్టు ఇప్పటికే పోలీసు అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబు మానవ హక్కుల గురించి మాట్లాడుతారు. కానీ కుప్పం మీ ఇలాకాలో జరుగుతున్నది ఏంటి? వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు ఆపాలి. లేని పక్షంలో కుప్పం నుంచే ఆందోళన చేస్తామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. 

  • సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.

    ‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు  నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది.

    ..నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.

    పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ 
    అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.

    అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నా.

    ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది

  • సాక్షి, చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్ పెడితే, పూడి శ్రీహరి, గిరీష్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. యూనిఫాం లేకుండా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని ఫాలో కావడం లేదు. సెక్షన్‌ 24,25 కింద న్యాయ పోరాటం చేస్తాం’’ అని పొన్నవోలు తెలిపారు.

    ‘‘తప్పు అని ఎత్తి చూపిస్తే.. అరెస్ట్ చేస్తున్నారు. గిరీష్‌రెడ్డికి సెల్ఫ్ బాండ్‌పై బెయిల్ మంజూరు చేశారు. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారు. హైకోర్టు పదే పదే చెప్పినా కూడా 111 సెక్షన్‌లు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఏపీలో ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు దాని కింద పనిచేస్తున్నారు’’ అంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు.

  • న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను ఇచ్చింది. రాఘవ్‌ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని గంటలకే రాఘవ్ చద్దాకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటరిగీ భద్రత మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యే వరకు తక్షణమే రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 

    ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాఘవ్‌ చద్దా భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు, రాఘవ్ చద్దా మధ్య పెరుగుతున్న విభేదాల మధ్య చోటుచేసుకుంది. రాఘవ్‌ చద్దా భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వచ్చాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏప్రిల్ 2న ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్‌ స్థానం నుంచి తొలగించింది. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శాపూర్వకంగా మాట్లాడలేదని ఆరోపించింది. 
     
    బీజేపీతో టచ్‌లో రాఘవ్ చద్దా: ఆప్
    రాఘవ్ చద్దా బీజేపీతో సంప్రదింపులు జరిపారని, ఆయనకు భద్రత ఇవ్వడం ఒక ఒప్పందంలో భాగమని ఆప్ ప్రతినిధి ప్రియాంక కక్కర్  అన్నారు. “మా వద్ద ఈ సమాచారం ఉంది, బీజేపీ అగ్రనేతలతో రాఘవ్ సమావేశమై, అతనికి జెడ్ ప్లస్‌ భద్రత ఇవ్వాలని, రాజ్యసభ ఉపనేతగా అతని స్థానంలో వచ్చిన అశోక్ మిట్టల్‌పై దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరం. రాఘవ్ గుర్తుంచుకోవాలి, ఆయనను రాజ్యసభకు వరకు తీసుకెళ్లింది అరవింద్ కేజ్రీవాల్” అని ఆమె తెలిపారు.  

    పంజాబ్ ప్రభుత్వం ఎందుకు తీసేసింది?
    రాఘవ్‌ చద్దాకు పంజాబ్ ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్న విషయంపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ, ఆయనకు భద్రతను తొలగించడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలు అనుమానాలు రేకెత్తించింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాఘవ్‌ చద్దాను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. 
     

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్‌ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

    ‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం.  సివిల్‌ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్‌ చేశారు. పోలీసులు సివిల్‌ డ్రస్‌లో వచ్చి అరెస్ట్‌ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 

    శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్‌ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్‌పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్‌ చేశారు. 

    ‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు.

    మూడు రోజుల నుంచి రెక్కీ... YSRCP పూడి శ్రీహరి అరెస్ట్
  • సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూట‌మిలో విభేదాలు భ‌గ్గుమన్నాయి. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. అవ‌నిగ‌డ్డ అన్న క్యాంటీన్ ఓపెనింగ్ ఉద్రిక్త‌త‌కు దారితీసింది. శిలాఫ‌ల‌కంపై ఏఎంసీ ఛైర్మ‌న్ కొల్లూరి వెంక‌టేశ్వ‌ర‌రావు పేరు లేక‌పోవ‌డంతో రచ్చ మొదలైంది. ఏఎంసీ ఛైర్మ‌న్ పేరు లేని శిలాఫ‌ల‌కం మాకొద్దంటూ శిలాఫ‌ల‌కం బోర్డును  వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గీయులు పీకేశారు.

    శిలాఫ‌ల‌కాన్ని స‌మీపంలోని పంట‌కాలువలో ప‌డేసేందుకు య‌త్నించారు. వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గాన్ని అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కుడు క‌న‌ప‌ర్తి శ్రీనివాస్ అడ్డుకున్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డితే కుల వివ‌క్ష చూపుతున్నారంటూ వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గం మండిపడ్డారు. శిలాఫ‌ల‌కం వ‌ద్ద భైఠాయించి వెంకటేశ్వ‌ర‌రావు వ‌ర్గీయులు నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్ సిబ్బందితో గొడ‌వ‌కు దిగారు. కార్యక్రమం రచ్చ రచ్చగా మారడంతో  అవ‌నిగ‌డ్డ అన్న క్యాంటీన్ ప్రారంభానికి నోచుకోలేదు.

Sports

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రావ‌డం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి త‌న కెరీర్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెన‌ర్‌గానే బ‌రిలోకి దిగేవాడు. 

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్ర‌ధాన జ‌ట్టులో స‌భ్యుడిగానే ఆడాడు. అయితే  ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి చీల‌మండ గాయంతో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. 

    ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో క‌నిపించ‌డంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే క‌నిపించింది. అయితే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ బ్యాట‌ర్ల‌కు ఉప‌యోగ‌క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే కోహ్లి ల‌క్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జ‌ట్టులో లేక‌పోయేస‌రికి అభిమానులు కంగారు ప‌డిన‌ప్ప‌టికీ కెప్టెన్ ప‌టిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు. 

    తొలిసారి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 

    ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. 


     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. 

    మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. 

    మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ క‌ళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన‌ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవ‌త‌ల ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    ఇక మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు.

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది.  ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ఆర్సీబీ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ వేసిన బంతి పంత్‌ను గాయపర్చింది. లక్నో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. 

    12 పరుగుల చేసి మార్కరమ్‌ ఔటైన తర్వాత పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌ హాజిల్‌వుడ్‌ వేశాడు. హాజిల్‌వుడ్‌ వేసిన తొలి మూడు బంతులను పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. నాలుగో బంతిని పంత్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్సయ్యి పంత్‌ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బులెట్‌లా దూసుకురావడంతో దెబ్బకు పంత్‌ మోచేతి వాచిపోయింది. 

    ఈ సమయంలో పంత్‌ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పంత్‌ డగౌట్‌కు వెళ్లిపోతున్న క్రమంలో హాజిల్‌వుడ్‌కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 

    క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన పంత్‌ ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్‌ తర్వాతి మ్యాచ్‌ ఆడేది అనుమానమే. మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు.

  • వినోద్‌ కాంబ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో భారత క్రికెట్‌ వర్గాల్లో అతడి పేరు మారుమ్రోగిపోయింది. అతడి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌ టెండుల్కర్‌కు కాంబ్లీని పోటీగా భావించేవారు.

    అయితే, సచిన్‌ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా దిగ్గజంగా నీరాజనాలు అందుకునే స్థాయికి చేరుకోగా.. చెడు వ్యసనాల వల్ల కాంబ్లీ కెరీర్‌ నాశనమైంది. ముఖ్యంగా మితిమీరిన స్థాయిలో మద్యం తాగడం అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి.

    మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌
    ఈ క్రమంలో 2024 డిసెంబరులో వినోద్‌ కాంబ్లీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో థానెలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో.. 1983లో టీమిండియాకు తొలిసారి వరల్డ్‌కప్‌ అందించిన భారత క్రికెటర్ల బృందం అతడికి ఆర్థికంగా సాయం చేసింది. కాంబ్లీ స్థానిక స్నేహితులు సైతం అతడికి అండగా నిలిచారు.

    ఆర్థిక సాయం అందిస్తున్నాం
    అయితే, కాంబ్లీ ఇంత వరకు పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. ఈ నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ స్నేహితుడు మార్కస్‌ కౌటో తాజాగా షాకింగ్‌ విషయం వెల్లడించాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితులందరినీ ఒక్క చోట చేర్చేలా వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాను. అందులో చాలా మంది క్రికెటర్లే ఉన్నారు. కాంబ్లీకి మేమంతా ఆర్థికంగా సాయం అందిస్తున్నాం.

    గత ఆరు నెలలుగా కాంబ్లీ జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ తన పరిస్థితి దిగజారిపోతోంది. వినోద్‌ మెదడులో రక్తం గడ్డ కట్టింది. అయితే, ఇప్పుడు ఆ గడ్డను తీసేస్తే ప్రాణాలకే ప్రమాదం అట. అతడు ముందుజాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి సర్జరీ కష్టం అన్నారు.

    ఏ క్షణాన్నైనా  బ్రెయిన్‌స్ట్రోక్‌ 
    దాని వల్ల ఏ క్షణాన్నైనా వినోద్‌కు బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే, అతడి మనో సంకల్పం వల్ల ఇప్పటికైతే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వినోద్‌ ఇప్పటికే మద్యం మానేశాడు.

    సిగరెట్లు అడుక్కుంటున్నాడు
    అయితే, సిగరెట్‌ తాగే అలవాటు మానుకోలేక సతమతమవుతున్నాడు. ఆటో డ్రైవర్లను కూడా సిగరెట్లు అడుగుతున్నారు. వాళ్లు కూడా సరేనని.. వినోద్‌ కాంబ్లీతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు. కానీ.. తమ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకోలేకపోతున్నారు’’ అని మార్కస్‌ చెప్పుకొచ్చాడు. 

    చదవండి: సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌.. టాప్‌-5 ప్లేయర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రెండు వ‌రుస‌ విజ‌యాల‌తో జోష్ మీద క‌నిపిస్తున్న చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల‌కు శుభ‌వార్త‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్త‌న్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్‌కే యాజ‌మాన్యం కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేర‌కు అనుకున్న‌దానికంటే ముందుగానే ధోని సీఎస్‌కే జ‌ట్టుతో జాయిన్ అవ్వ‌నున్నాడు. 

    ఏప్రిల్ 23న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ధోని బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కండ‌రాల గాయంతో టోర్నీలో సీఎస్‌కే ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న ధోని కేకేఆర్‌తో జ‌రిగిన నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. 

    కానీ ధోని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడ‌లేదు.  కండ‌రాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ఆడ‌తాడా లేదా అన్న‌ది స్ప‌ష్టంగా తెలియదు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల‌న్నీ ఇప్ప‌టికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో  మాత్రం క‌చ్చితంగా బ‌రిలోకి దిగ‌నున్నాడు.

    స‌ర్ఫ‌రాజ్ స్థానానికి ఎస‌రు?
    అయితే ధోని జ‌ట్టులోకి రానుండ‌డంతో ఎవ‌రు త‌మ‌ స్థానాన్ని త్యాగం చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. శాంస‌న్‌, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, శివ‌మ్ దూబేలను ప‌క్క‌న‌బెట్టే సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి సీఎస్‌కే ముందున్న ఆప్ష‌న్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. 

    ప‌రుగులు సాధిస్తున్న‌ప్ప‌టికీ వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. దీంతో ధోని జ‌ట్టులోకి వ‌స్తే స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌పై వేటు ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇక సీఎస్‌కే సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.

    చదవండి: బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

    కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

    • లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జితేశ్‌ ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ముకుల్‌ చౌదరీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంతకముందు 49 పరుగులు చేసిన కోహ్లి అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    పడిక్కల్‌ (10) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. అవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పడిక్కల్‌ హిమ్మత్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోహ్లి (45), పటిదార్‌ (7) క్రీజులో ఉన్నారు.

    కోహ్లి దూకుడు..
    లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి దంచికొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్న కోహ్లి 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది.

    • 147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఫిల్‌ సాల్ట్‌ (7) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. కోహ్లి (12), పడిక్కల్‌ (5) క్రీజులో ఉన్నారు.

    ఆర్సీబీ టార్గెట్‌ 147 పరుగులు
    ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో కృనాల్‌ ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.

    పంత్‌ ఔట్‌..
    లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.  

    • 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్‌ రాయ్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గాయపడిన పంత్‌ మరోసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.

    నాలుగు వికెట్లు డౌన్‌ 
    లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌కు క్యాచ్‌ ఇచ్చుకుని అబ్దుల్‌ సమద్‌ డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది. 

    • లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ బౌల్డ్‌ అయ్యాడు. 35 బాల్స్‌ ఆడిన కృనాల్‌ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది. 

    • లక్నో సూపర్‌జెయింట్స్‌ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పూరన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.

    • ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ పంత్‌ గాయానికి గురయ్యాడు. హాజిల్‌వుడ్‌ వేసిన బంతి పంత్‌ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.

    తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో
    ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన మార్క‌ర‌మ్ ర‌షీక్ స‌లామ్ బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో వికెట్ న‌ష్ట‌పోయి 32 ప‌రుగులు చేసింది. 

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ల‌క్నోలు ఇప్ప‌టివ‌ర‌కు ముఖాముఖి పోరులో 6 సార్లు త‌ల‌ప‌డ‌గా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ విజ‌యాలు సాధించాయి. అయితే చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డిన రెండు సంద‌ర్భాల్లో ఇరుజ‌ట్లు చెరొక‌ మ్యాచ్‌ నెగ్గాయి.

    ఆర్సీబీ తుదిజ‌ట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్‌ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.

    ల‌క్నో తుది జ‌ట్టు: మార్క‌ర‌మ్‌, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

  • సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్‌ హిట్‌ అవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.

    ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.

    వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ (2028)తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్‌ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.

    విషమ పరీక్ష
    ఈ టూర్‌లో అటు సారథిగా, ఇటు ప్లేయర్‌గా సూర్యకుమార్‌కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్‌ గంభీర్‌ 2028 ఒలింపిక్స్‌ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్‌ ఒలింపిక్స్‌ సమయానికి ఫిట్‌గా ఉంటాడా అనేది అనుమానమే.

    ‘సూర్యకుమార్‌ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనకు అతడే కెప్టెన్‌ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

    గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్‌ కనీసం ఒక్క హాఫ్‌సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్‌... వరల్డ్‌కప్‌ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. 

    సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్‌పై 18 పరుగులు, ఇంగ్లండ్‌పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్‌... న్యూజిలాండ్‌తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌ కాగల అర్హత ఉన్న టాప్‌-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?

    శుబ్‌మన్‌ గిల్‌
    ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్‌ గిల్‌. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్‌ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్‌-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.

    అయితే, ఐపీఎల్‌-2026లో గనుక బ్యాటర్‌గా గిల్‌ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్‌లేమి కారణంగా గిల్‌ను టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.

    హార్దిక్‌ పాండ్యా
    నిజానికి 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కెప్టెన్‌ కావాల్సింది హార్దిక్‌ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.

    ఆ సమయంలో.. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది.

    సంజూ శాంసన్‌
    జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్‌... టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్‌-8 నాకౌట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 రన్స్‌తో దుమ్ములేపాడు.

    ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.

    అక్షర్‌ పటేల్‌
    టీ20 వరల్డ్‌కప్‌-2026లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్‌ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.

    శ్రేయస్‌ అయ్యర్‌
    ముంబై సారథిగా, ఐపీఎల్‌లో వివిధ జట్ల కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెలిచింది. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఇరగదీసి ఫైనల్‌కు చేర్చాడు. 

    అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

    చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

  • టీమిండియా మాజీ ఆట‌గాడు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ కోచ్‌ మునాఫ్ ప‌టేల్ భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌ గౌత‌మ్ గంభీర్ విష‌యంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొల‌గిస్తే టీమిండియాలో విప‌త్తు త‌ప్ప‌దంటూ బీసీసీఐని హెచ్చ‌రించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.  

    అయితే గంభీర్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు మిశ్ర‌మ ఫలితాల‌ను అందుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ,  ఆసియా క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు భార‌త్ గంభీర్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే వ‌చ్చాయి. అయితే ఇదే స‌మ‌యంలో జ‌ట్టులో సీనియ‌ర్లైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకోవ‌డం వెనుక గంభీర్ పాత్ర ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. 

    వ‌న్డే, టీ20 ఫార్మాట్‌లో గంభీర్ కోచ్‌గా ప‌ర్వాలేద‌నిపించినప్ప‌టికీ టెస్టు ఫార్మాట్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అత‌న్ని కోచ్‌గా త‌ప్పించాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే మునాఫ్ ప‌టేల్ గంభీర్‌కు అండ‌గా నిలిచాడు. మునాఫ్ ప‌టేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. 

    గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అత‌ని తత్వాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. 

    విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. త‌న క‌ఠిన నిర్ణ‌యాల‌తో శ‌త్రువుల‌ను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా త‌న ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నాడ‌ని మాత్రం బలంగా చెప్ప‌గ‌ల‌ను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్‌సీఏ క్రికెట్ అకాడ‌మీలో సౌక‌ర్యాల్లో కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని మునాఫ్ పేర్కొన్నాడు. 

    ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్‌, రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు వినియోగించే ఎన్‌సీఏ అకాడ‌మీలో ప్ర‌స్తుతం బ‌ల‌మైన వ్య‌వ‌స్థ క‌నిపించ‌డం లేద‌ని తెలిపాడు. వెంట‌నే ఎన్‌సీఏ అకాడ‌మీని ప‌టిష్ట‌ప‌రిచేందుకు బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవస‌ర‌ముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెర‌పిస్టులు, కోచ్‌లు, స‌రైన శిక్ష‌ణ వంటి ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌ను మ‌రింత మెరుగుపరచాల‌ని మునాఫ్ వెల్ల‌డించాడు. 

    కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచే ల‌క్ష్యంతో బీసీసీఐ 2000 సంవ‌త్స‌రంలో బెంగ‌ళూరు కేంద్రంగా ఎన్‌సీఏ అకాడ‌మీని స్థాపించింది.  ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

    చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌!

  • రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌, డెన్మార్క్‌కు చెందిన స్టార్‌ షట్లర్‌ విక్టర్ ఆక్సెల్సెన్ సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నాడు. 32 ఏళ్ల వ‌యసులోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అభిమానుల‌ను షాక్‌కు గురి చేశాడు. గత రెండేళ్లుగా తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన దీర్ఘకాలిక తీవ్రమైన వెన్ను గాయం కారణంగా ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సెల్సెన్‌ తెలిపాడు.

    త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని ఆక్సెల్సెన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. గత సంవత్సరం ఏప్రిల్‌లో శస్త్రచికిత్స జరిగింది. విస్తృతమైన పునరావాసం పొందాను, కానీ అక్టోబర్‌లో నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి, నేను ఆశించిన స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న చేయలేక‌పోతున్నా. వెన్నునొప్పి కార‌ణంగా  ఆట‌పై కూడా స‌రిగ్గా దృష్టి పెట్టలేక‌పోతున్నా. దీంతో ఆట‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్లుగా అనిపించింది. 

    అందుకే ఈ నిర్ణ‌యం. డాక్ట‌ర్‌తో మాట్లాడిన త‌ర్వాతే రిటైర్మెంట్‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాను. డాక్ట‌ర్ కూడా దీర్ఘ‌కాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దీనిని అంగీక‌రించ‌డానికి క‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ ప‌రిస్థితులు ఈ నిర్ణ‌యం తీసుకునేలా చేశాయి. త్వ‌ర‌లో వెన్నుకు స‌ర్జ‌రీ జ‌ర‌గ‌నుంది. అది విజ‌య‌వంతం కాక‌పోతే మ‌రోసారి ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇక‌పై ఆడ‌డం  కుద‌ర‌ద‌ని తెలిసే ఈ నిర్ణ‌యం తీసుకున్నా.

    1994లో జ‌న్మించిన ఆక్సెల్సెన్ ఆరేళ్ల వ‌య‌సులోనే బ్యాడ్మింట‌న్ ఆట‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.  2010లో అత‌ను బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ జూనియ‌ర్ చాంపియ‌న్‌షిప్‌ల‌ను గెలుచుకొని  చ‌రిత్ర సృష్టించాడు. అలా చేసిన మొద‌టి యూరోపియ‌న్ ఆట‌గాడిగా నిలిచాడు. అదే సంవ‌త్స‌రం, అత‌ను సీనియ‌ర్ స్థాయిలో అరంగేట్రం చేసి, సైప‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ టైటిల్ గెలుచుకోవ‌డం ద్వారా త‌న కెరీర్‌ను ఘ‌నంగా ప్రారంభించాడు. 2014లో స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గెలిచాడు.  

    ఇక ఒలింపిక్స్ విష‌యానికొస్తే 2016లో కాంస్యం, 2020, 2024 ఒలింపిక్స్‌లో ఏకంగా స్వ‌ర్ణాలు గెలుచుకున్నాడు. ఇక ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌లో 2014లో కాంస్యం గెలిచిన ఆక్సెల్సెన్ 2017, 2022లో స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్నాడు. 2020, 2022లో ప్ర‌తిష్ఠాత్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌ను కైవ‌సం చేసుకొన్నాడు. అంతేకాదు 180 వారాల‌కు పైగా విక్ట‌ర్ ఆక్సెల్సెన్ నంబ‌ర్‌వ‌న్ స్థానంలో కొన‌సాగాడు.  సింగిల్స్‌లో 572 విజ‌యాలు, 160 ఓటముల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు.

     

  • రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సెలక్టర్లు ఈ బుడ్డోకి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదే భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

    ప్రస్తుతం ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న 15 ఏళ్ల వైభవ్‌ (Vaibhav Suryavanshi)... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టడం నిశ్చయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్‌ 19వ సీజన్‌ అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. అనంతరం జింబాబ్వేతోనూ టీ20 సిరీస్‌ ఆడనుంది. 

    ఈ పర్యటనలకు కుదరకపోయినా..
    ఈ పర్యటనల కోసం త్వరలోనే జట్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 35 మంది ప్రాబబుల్స్‌ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో వైభవ్‌ పేరు కూడా ఉంది. 

    ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ టెండూల్కర్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... ఆ వయసుకన్నా ముందే వైభవ్‌ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌తో పాటు దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సూర్యవంశీని సీనియర్‌ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

    ఆసియా క్రీడల వరకైనా
    ఈ నేపథ్యంలో ఒకవేళ తక్షణమే అతడికి అవకాశం కల్పించకున్నా... ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా క్రీడల వరకైనా సీనియర్‌ టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయమే. ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనుండగా... అదే సమయంలో టీమిండియా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. 

    ఆ సమయంలో రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయాల్సి వస్తే... అందులో ఒక దాంట్లో సూర్యవంశీని ఎంపిక చేయొచ్చు అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘35 మంది ప్రాబబుల్స్‌ నుంచి సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వారందరి వీసా పనులు ప్రారంభమయ్యాయి. 

    టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు

    వైభవ్‌ను ఎంపిక చేయాలంటే..
    వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శనను సెలక్టర్లు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో నాలుగో ఓపెనర్‌ అవసరమేముంది. అంతకు కావాలి అంటే యశస్వి జైస్వాల్‌ కూడా ఉన్నాడు. 

    వైభవ్‌ను ఎంపిక చేయాలి అంటే అభిషేక్, సంజూలను తీసుకోకపోవడానికి బలమైన కారణం అంటూ ఉండాలి. వారిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టినా... కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఆసియా క్రీడల సమయంలో మాత్రం రెండు జట్లు అనివార్యమే కాబట్టి వైభవ్‌ను ఎంపిక చేయవచ్చు’ అని అయన అన్నారు. 

    పసిడి పతకాలు
    కాగా 2023లో తొలిసారి ఆసియా క్రీడలకు బీసీసీఐ పురుష, మహిళా జట్లను పంపగా.. రెండు జట్లు స్వర్ణ పతకాలు గెలిచాయి.  రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో టీమిండియా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు గోల్డ్‌ మెడల్‌అందుకున్నాయి.

    చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

  • ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర గాయమైనా.. అదృష్టం వల్లే తాను బతికి బయటపడ్డాడని పేర్కొన్నాడు. కాగా తన కౌంటీ జట్టు డర్హమ్‌కు చెందిన అకాడమీ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో స్టోక్స్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

    బంతి బలంగా ముఖానికి తగలడంతో స్టోక్స్‌ నొప్పితో విలవిల్లాడాడు. ఈ ఘటనలో అతడి జైగోమాటిక్‌ ఎముక (cheekbone) విరిగిపోయింది. దీంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ వచ్చే నెలల నుంచి కౌంటీ జట్టు తరఫున బిజీ కానున్నాడు.

    బతికి ఉన్నానంటే అది అదృష్టమే
    ఈ సందర్భంగా ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో మాట్లాడుతూ.. ‘‘ప్రమాదకర ఘటన. పరిస్థితి చేజారిపోయిందనుకున్నా. నిజం చెప్పాలంటే క్షణకాలంలో అంతా జరిగిపోయింది. తల పక్కకు తిప్పడంలో కొంచెం ఆలస్యం చేసినా.. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు.

    నా ముఖానికి శస్త్ర చికిత్స జరిగింది. చీక్‌బోన్‌ విరిగిపోయింది. నిజానికి బతికి ఉన్నానంటే అది అదృష్టమనే చెప్పాలి. ఇందుకు దేవుడికి కృతజ్ఞుడిగా ఉంటాను. దాదాపు నెలరోజుల తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టగలననే నమ్మకం వచ్చింది.

    భయాకన అనుభవం
    డర్హమ్‌ తరపున ఆట మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా అదొక భయాకన అనుభవం. ఇప్పుడు అంతా సర్దుకుంది’’ అని బెన్‌ స్టోక్స్‌ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. కాగా కెప్టెన్‌గా గత కొంతకాలంగా స్టోక్స్‌ వైఫల్యాలు చవిచూశాడు. ముఖ్యంగా అతడి సారథ్యంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ టెస్టు సిరీస్‌ 2025-26లో ఇంగ్లండ్‌ ఘోర పరాభవం ఎదుర్కొంది.

    ఆతిథ్య ఆసీస్‌ చేతిలో 4-1తో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. అయితే, మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు గెలవడంతో అదృష్టవశాత్తూ వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది. కాగా జూన్‌ 4 నుంచి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే టెస్టు సిరీస్‌తో మళ్లీ ఇంగ్లండ్‌ తరఫున స్టోక్స్‌ పునరాగమనం చేసే అవకాశం ఉంది.

    చదవండి: సిగ్గెందుకు?.. అతడిపై వేటు వేయండి: సెహ్వాగ్‌

  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ విమర్శల వర్షం కురిపించాడు. చేసిన తప్పు ఒప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదని.. ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. ఐపీఎల్‌-2026లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేకేఆర్‌ ఇంత వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు.

    పాతిక కోట్లు కుమ్మరించి
    దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించి పాతిక కోట్లు కుమ్మరించి కొనుక్కున్న కామెరాన్‌ గ్రీన్‌ వల్ల కేకేఆర్‌కు లాభం లేకుండా పోయింది. వెన్నునొప్పి కారణంగా ఆరంభ మ్యాచ్‌లలో అతడు బౌలింగ్‌ చేయలేకపోయాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు.

    ఇక ఇప్పుడు బౌలింగ్‌ చేస్తున్నా గ్రీన్‌ (Cameron Green) ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. జట్టుకు అతడు భారంగా మారాడు. ఈ నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ గ్రీన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు నుంచి అతడిని తప్పించి వేరే ఆటగాడికి చోటు ఇవ్వాలని కేకేఆర్‌ నాయకత్వ బృందానికి సూచించాడు.

    తప్పు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు?
    ‘‘మీ దగ్గర చాలా డబ్బు ఉన్నపుడు ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టడంలో తప్పులేదు. కామెరాన్‌ గ్రీన్‌ వంటి ఆటగాడి కోసం రూ. 25 కోట్లకు పైగా వెచ్చించినపుడు అతడు మీకు ఖరీదైన ఆస్తిగా మారాడు. మీరు అతడిని తుదిజట్టులో ఆడిస్తుంటే ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.

    ఒకవేళ అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే.. కోట్లు పెట్టి కొని అలాంటి ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం ఏమిటనే ప్రశ్నలు, విమర్శలు వస్తాయి. అయితే, చేసిన తప్పు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు?.. అవును.. తప్పు జరిగిపోయింది అని అంగీకరించండి.

    వేటు వేయండి
    కామెరాన్‌ గ్రీన్‌ను తప్పించి వేరే ఆటగాడికి తుదిజట్టులో చోటు ఇవ్వండి. బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా అతడి వల్ల ఏమాత్రం ఉపయోగం లేనపుడు ఇంకా కొనసాగించడం ఎందుకు? అతడు ఉన్నందువల్ల జట్టుకు ఒరిగేదేమీ లేదు అనుకుంటే.. కూర్పుకు తగినట్లు వేరొకరిని తీసుకోండి’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ వేదికగా పేర్కొన్నాడు.

    కాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌.. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో 56 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ విఫలమవుతున్న అతడు ఒక్క వికెట్‌ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం తలపడ్డ కేకేఆర్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఏప్రిల్‌ 17న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఇందుకు అహ్మదాబాద్‌ వేదిక.

    చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

  • ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. చెన్నై విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.

    తద్వారా ఇప్పటికి ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేకేఆర్‌ ఇంత వరకు బోణీ (ఒక​ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు) కొట్టలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green), కెప్టెన్‌ అజింక్య రహానే, వైస్‌ కెప్టెన్‌ రింకూ సింగ్‌పై అభిమానులు సైతం మండిపడుతున్నారు.

    విధ్వంసకర బ్యాటర్‌ కాదు
    ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ రింకూ సింగ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘రింకూ సింగ్‌ విధ్వంసకర బ్యాటర్‌ కాదు. అప్పుడెప్పుడో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదాడు. ఇప్పటికీ దాని గురించి మనం మాట్లాడుకుంటాము.

    కానీ ఇప్పుడు అతడు స్ట్రైక్‌ రొటేట్‌ చేసేందుకు మాత్రమే చూస్తున్నాడు. అయినప్పటికీ బ్యాటింగ్‌ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. రన్‌రేటు 10- 12కు పెరిగి పోతున్నా అతడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్నాడు.

    ఫినిషర్‌గా మాత్రమే రాణించగలడు
    బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడో స్థానమే అతడికి సరైంది. ఫినిషర్‌గా మాత్రమే రాణించగలడు. ఐదు ఓవర్లలో యాభై పరుగులు అవసరమైన వేళ అతడు అద్భుతం చేయగలడేమో!.. కానీ ఐదో స్థానంలో వచ్చి ఇన్నింగ్స్‌ నిర్మించడంలో అతడు దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఈ పాత్రలో ఏమాత్రం సరిపోడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఫైర్‌ అయ్యాడు.

    12 బంతులలో 6 పరుగులే
    బ్యాటర్ల వైఫల్యం వల్లే కేకేఆర్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయన్న చిక్కా.. అంగ్‌క్రిష్‌ రఘువంశీ ఒక్కడే మెరుగ్గా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా చెన్నైతో మ్యాచ్‌లో రింకూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేసి అవుటయ్యాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శివం దూబేకు క్యాచ్‌కు ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో రమణ్‌దీప్‌ సింగ్‌ కేకేఆర్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌ (35)గా నిలిచాడు.

    చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

  • ఐపీఎల్‌ 2026లో కేకేఆర్‌ జట్టు దారుణ అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఈ ఫ్రాంచైజీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఎడిషన్‌లో ఇలా జరగలేదు. తొలిసారి కేకేఆర్‌ ఓ ఎడిషన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.

    ఈ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌, లక్నో, సీఎస్‌కే చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం వల్ల ఒక్క పాయింట్‌ను మాత్రమే సాధించగలిగింది.

    19 ఏళ్ల ఫ్రాంచైజీ చరిత్రలో ఇంత దారుణ అనుభవాన్ని ఎన్నడూ ఎదుర్కోని కేకేఆర్‌ ఈ సీజన్‌లో అజింక్య రహానే నేతృత్వంలో ఎదుర్కొంటుంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడం.. కొందరు ఆటగాళ్లు సామర్థ్యం మేరకు రాణించలేకపోవడం.. గాయాలు.. గెలుపు మొమెంటమ్‌ లేకపోవడం​.. రహానే నాయకత్వంలో లోపాలు ఈ సీజన్‌లో కేకేఆర్‌ వరుస పరాజయాలకు కారణాలుగా చెప్పవచ్చు.

    తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలింగ్‌లో పర్వాలేదనిపించినప్పటికీ.. బ్యాటింగ్‌లో తస్సుమనిపించింది. రహానే స్వయంగా డిమోషన్‌ తీసుకొని నరైన్‌ను ఓపెనర్‌గా పంపినా, ఎలాంటి సత్ఫలితం రాలేదు. ఆపద్భాందవుడు రఘువంశీ కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. 

    మిగతా బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు షరామామూలుగా వైఫలల్యాలను కొనసాగించారు. ఈ మ్యాచ్‌ ఓటమి నుంచి తేరుకోకముందే కెప్టెన్‌ రహానేకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌కు గానూ అతని మ్యాచ్‌ ఫీజ్‌లో రూ. 12 లక్షల కోత విధించారు.

    ప్రస్తుతం కేకేఆర్‌ -1.383 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 17న అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది.

     

     

Movies

  • టాలీవుడ్ హీరో సత్యదేవ్‌ నటిస్తోన్న తాజా చిత్రం రావు బహదూర్. ఈ సినిమాలో దీపా థామస్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వెంకటేష్‌ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్‌ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్‌లో సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు, నమ్రాతా శిరోద్కర్‌ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో.. ఏప్లస్‌ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓ సుందరి అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందిచగా.. విజయ్ యేసుదాస్ ఆలపించారు. ఈ పాటను స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల,  బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రావు బహదూర్ చిత్రం ఈ ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

     

  • తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. పాటే నా ప్రాణమని చెప్పిన మంగ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంపై సీపీ సజ్జనార్‌ను కలిపి ఫిర్యాదు చేసిన మంగ్లీ.. తన లాయర్‌తో డీజీపీని కలిశారు.  ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడారు. ఈ వివాదంతో 30 రోజులుగా నా ప్రోగ్రామ్స్‌ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దయచేసి చెబుతున్నా.. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు నమ్మకండని విజ్ఞప్తి చేసింది. సోషల్‌మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైనా కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

    మంగ్లీ మాట్లాడుతూ..'నాకు పాటల ప్రపంచ తప్ప మరేది తెలియదు.  సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి లోలోపల కుమిలిపోతున్నా. ఇక నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే, విచారణకు సిద్ధం.  ఆరోపణలు నిజమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నేను కూడా పేదరికం నుంచే వచ్చా. ఆ బాధేంటో నాకు తెలుసు. నాపై కోపం ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశా' అని అన్నారు. 

    అసలేం జరిగిందంటే..

    సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసానికి పాల్పడ్డారని సుబ్బారావు అనే న్యాయవాది ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారం చేస్తోన్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
     

  • మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ ఇప్పటికే ది గోట్ లైఫ్‌ ఆల్ టైమ్ వసూళ్లు అధిగమించింది. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-6 ప్లేస్‌లో నిలిచింది. ఏప్రిల్‌ 2న రిలీజైన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత సాహు గారపాటి కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. 

    యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నట్లు షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ ఏప్రిల్ 24న తెలుగులో విడుదల కానుందని వాళా-2 పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.

    వాళాకు సీక్వెల్‌..

    2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు విపిన్‌ దాస్‌ కథ అందించారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.  వాళా అంటే మలయాళంలో అరటి మొక్క ‍అని అర్థమట. ఏ పని లేకుండా సోమరిగా తిరిగేవాళ్లను ఇదే పేరుతో పిలుస్తారట.

     

     

  • ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం చిత్రాల ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తోన్న ఇంటెన్స్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ మూవీతో సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ నటి రషా తడాని తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తోంది.  ఈ మూవీని చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌  నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు లుక్ చూస్తుంటే విలన్‌గా అలరించనున్నట్లు అర్థమవుతోంది. ఈ మూవీని తిరుపతి నేపథ్యంలో రూపొందించారు. టీజర్‌లో డైలాగ్స్, ఫైట్ సీన్స్‌ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉండనున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. కాగా..  ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. 

     

  • రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.

    నిర్మాణ సంస్థ తమ నోట్‌లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్‌ఫెక్షన్‌తో మీ ముందుకొస్తాం. జూన్‌లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.

    పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.

    కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్‌ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.

     

  • మెగా హీరో వరుణ్ తేజ్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో పాటు బరి అనే చిత్రంలో నటిస్తున్నారు. బరి మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయ అయిందని నిహారిక కొణిదెల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం గాయానికి సర్జరీ జరిగిందని తెలిపారు. వరుణ్ తేజ్‌ గాయం నుంచి కోలుకుంటున్నారని ఇన్‌స్టాలో పంచకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. 

    కాగా.. ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘కమిటీ కుర్రోళ్లుతో భారీ హిట్ అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌  యుదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. తన సొంత ఫ్యామిలీ బ్యానర్‌లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ కొరియన్ కనకరాజు చిత్రంలోనూ నటిస్తున్నారు. 
     

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్‌ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్‌కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్‌లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.  ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

    తాజాగా ఈ మూవీ గురించి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మాట్లాడారు. ధురందర్: ది రివెంజ్ ఫెయిల్ అవ్వాలని ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నారని వెల్లడించారు. అలా కోరుకున్న వారిలో స్టార్ డైరెక్టర్స్ సైతం ఉన్నారని కునాల్ కోహ్లా సంచలన కామెంట్స్ చేశారు. దురంధర్‌-2 బాక్సాఫీస్ వద్ద తొలి వారాంతమే ఫెయిల్ అవుతుందని ఊహల్లో తేలియాడారని అన్నారు. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా ఈ మూవీ రాణించిందని పంచుకున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే వసూళ్ల వేటతో అదరగొట్టేసింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వెయ్యి కోట్లు వసూళ్లు చేసి సత్తా చాటింది.

    కునాల్ కోహ్లీ మాట్లాడుతూ..'బాలీవుడ్ పరిశ్రమ మొత్తం సినిమాకు మద్దతు ఇవ్వకపోయినా ఆడుతోంది. ధురందర్‌కు బాలీవుడ్‌లో ఎవరూ కూడా మద్దతు ఇవ్వలేదు.  అగ్రశ్రేణి దర్శకులు సైతం ఫెయిల్ ‍అవ్వాలని కోరుకున్నారు. మొదటి సోమవారం నుంచే దురంధర్‌-2 ప్రదర్శన ఆగిపోతుందని అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సోమవారం నుంచే వసూళ్లపరంగా మరింత దూసుకెళ్లింది. సన్నీ డియోల్ నటించిన 'బోర్డర్ 2' విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ ఫ్లాప్ అవుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. రూ. 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. బోర్డర్- 2కు సైతం ఎవరూ మద్దతు ఇవ్వలేదు.  కానీ అది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు" అన్నారు.

    అలాగే ఎవరీ మద్దతు లేకపోయినా  తన 'హమ్ తుమ్' (2004) మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అయిందన్నారు. ఈ  చిత్రంతో తనకు ఎదురైన అనుభవాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోని వారు నా చిత్రాన్ని మెచ్చుకునే అవకాశం లేదని.. ప్రీమియర్ షో హాజరుకావద్దని  ఆదిత్య చోప్రా తనకు సలహా ఇచ్చారని ఆయన పంచుకున్నారు. కానీ సినిమాకు నేను వెళ్లానని.. అక్కడ వచ్చిన స్పందన తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు.. చాలా నిరాశతో ఆదిత్య చోప్రాకు ఫోన్ చేశా.. ఇది వాళ్లకు నచ్చే రకం సినిమా కాదని నాకు తెలుసు.. అందుకే నిన్ను వెళ్లవద్దని చెప్పానని అన్నాడు. అంటే పరిశ్రమలోని 99 శాతం మంది మీరు విజయం సాధించాలని కోరుకోరని కునాల్ కోహ్లీ స్పష్టం చేశారు. తన తొలి చిత్రం 'ముఝ్సే దోస్తీ కరోగే!' (2002) సరిగ్గా ఆడకపోయినప్పటికీ.. స్వయంగా ఫోన్ చేసి అభినందించిన రాకేష్ రోషన్‌ను కోహ్లీ ప్రశంసించారు.
     

  • మలయాళ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం పళ్లి చట్టంబి. ఈ మూవీలో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు డీజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ముందుగా చెప్పిన ప్రకారం ఈ రోజే సినిమా విడుదల కావాల్సి ఉంది.

    మలయాళంలో మాత్రం ఈ రోజే విడుదల చేసిన మేకర్స్.. తెలుగు విడుదల వాయిదా వేశారు. టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 17న రానుంది. సాంకేతిక సమస్యస కారణంగానే ఈ మూవీ తెలుగు రిలీజ్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బన్ని వాస్‌ వర్క్స్‌ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.  ఏప్రిల్‌ 17న విడుదల చేస్తామని తాజాగా ప్రకటించారు.

    కాగా.. ఈ చిత్రంలో విజయ్‌ రాఘవన్, సుధీర్, బాబురాజ్‌ కీలకపాత్రలు పోషించారు.  1950-60ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 
     

  • యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సతీమణి రహస్య గోరఖ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు తినడానికి కూడా డబ్బులు లేని సమయంలో తనను నమ్మిందని కిరణ్ ‍అబ్బవరం కొనియాడారు. మూవీ ఆఫర్ల కోసం నేను తిరుగుతున్న రోజుల్లో ఇంటి నుంచి నాకోసం లంచ్ బాక్స్‌ తెచ్చేదని వెల్లడించారు. నా భార్య నా దగ్గర ఏమీ లేనప్పుడే నా చేయి పట్టుకుందని ఎమోషనల్ అయ్యారు.

    ఆ తర్వాత రహస్య గోరఖ్ తన భర్త గురించి మాట్లాడారు. నేను మాత్రం పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అని.. కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడ్ని అని కామెంట్స్ చేసింది. పెళ్లయ్యాక తను కష్టపడతాడు.. నేను ఖర్చు పెడతాను అనుకున్నానని తెలిపింది. కానీ అతనికి చుట్టూ జనం ఉండాలి.. సందడి సందడిగా కనిపించాలని అన్నారు. లైఫ్‌లో ఇలాంటి పార్ట్‌నర్‌ ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకుంటారని రహస్య గోరఖ్ ప్రశంసలు కురిపించింది. 

  • గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్‌. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్‌ చూసిన తర్వాత అందరూ ఇది కూడా కేజీయఫ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ అని ఫిక్స్‌ అయ్యారు. కానీ ఇది అలాంటి కథ కానే కాదు అంటున్నాడు హీరో యశ్‌. ఇంతవరకు ఇలాంటి కథాంశంతో ఒక్క చిత్రం కూడా రాలేదని..ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ మూవీ అంటున్నాడు. 

    తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాక్సిక్‌ సినిమా గురించి మాట్లాడారు. ‘టీజర్‌ రిలీజ్‌ తర్వాత అందరూ ఇది గ్యాంగ్‌స్టర్‌ కథ అంటున్నారు. కానీ పదేపదే చెబుతున్నా.. ఇది గ్యాంగ్‌స్టర్‌ సినిమా కాదు. యాక్షన్‌ మాత్రమే కాదు బలమైన ఎమోషన్స్‌ ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు కొత్త ప్రపంచంలోకి వెళతాడు. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే నా నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కచ్చితంగా ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. 

    అలాగే యశ్‌ రావణుడిగా, రణ్‌బీర్‌ రాముడిగా కలిసి నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘తొలిభాగంలో రణ్‌బీర్‌తో నాకు ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఇద్దరం పలుమార్లు కలుసుకున్నాం. రణ్‌బీర్‌ ఓ అద్భుతమైన నటుడు. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అది ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది’అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగం విడుదల కానుంది.
     

  • రీసెంట్ టైంలో అడవి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అనగానే చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తీశారు. ఇప్పుడు ఈ తరహాలోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో మలయాళంలో తీసిన పాన్ ఇండియా మూవీ 'కాటాలన్'. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)

    ట్రైలర్ చూస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఇందులో హీరో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అయిత హీరోహీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గన్ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్ పేల్చడం లేదంటే రక్తపాతం సృష్టించడం లాంటివి కనిపిస్తున్నాయి. అలానే ట్రైలర్‌కి మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. 'మార్కో' లాంటి వయలెంట్ మూవీ తీసిన నిర్మాతలే దీన్ని తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్.. ఇందులో ఓ విలన్‌గా చేయడం విశేషం.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

International

  • దక్షిణ మధ్య తుర్కియేలోని ఓ పాఠశాలలో ఒక విద్యార్థి కాల్పుల కలకలం సృష్టించాడు. దీంతో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ‍్యాయి. బుధవారం కహ్రామన్మరాస్ ప్రావిన్స్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిల్పులు జరిపినట్లు గవర్నర్ ముకెర్రెం ఉన్న్లుయెర్ తెలిపారు. కాల్పులు చేసిన విద్యార్థి కూడా మృతి చెందాడు.

    “తొమ్మిది మంది మృతి చెందడం విచారకరం… 13 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు, అందులో ముగ్గురి మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది” అని అంతర్గత మంత్రి ముస్తఫా చిఫ్ట్చి తెలిపారు.

    కాల్పులు జరిపిన విద్యార్థి తన తండ్రికి చెందిన తుపాకులను ఉపయోగించినట్లు భావిస్తున్నామని ఉన్న్లుయెర్ తెలిపారు. అతని తండ్రి మాజీ పోలీసు అధికారి. ఆ విద్యార్థి ఆయుధాలను బ్యాక్‌ప్యాక్‌లో దాచుకుని, రెండు తరగతి గదుల్లోకి వెళ్లి కాల్పులు జరిపినట్లు తెలిపారు.

    తుర్కియేలో  రెండు రోజుల వ్యవధిలో రెండు పాఠశాలల్లో కాల్పులు జరగడం గమనార్హం. మంగళవారం దక్షిణ-తూర్పు సాన్‌లియుర్ఫా ప్రావిన్స్‌లోని ఒక పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఓ మాజీ విద్యార్థి కాల్పులు జరిపి 16 మందిని గాయపర్చి, ఆత్మహత్య చేసుకున్నాడు.

  • వాషింగ్టన్‌: చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, ఇరాన్‌పై యుద్ధంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌లో యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం ముగుస్తుందంటూ వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఇరాన్‌పై మరిన్ని దాడులకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.

    అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం.. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫాహాన్‌లోని భూగర్భ స్థావరాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్ చేపట్టనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా పశ్చిమాసియాలో 10 వేల మంది సైనికులను పంపింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న వేళ ఈ సైనిక చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

    వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏప్రిల్ నెలలోనే 10 వేలకుపైగా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. వీరిలో 6 వేల మంది సైనికులు ప్రస్తుతం నమీబియా తీరానికి సమీపంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ (CVN-77) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమవుతారు. మరో 4,200 మంది సైనికులు బాక్సర్ అంఫిబియస్ రెడీ దళంలో చేరి, ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి చేరుకోనున్నారు. ఈ గ్రూప్‌లో 800కి పైగా మెరైన్లు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లు ఉన్నాయి.

    అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్‌లో భూసైనిక చర్యల కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ప్రత్యేక దళాలను ఇరాన్ భద్రపరిచిన యురేనియంను వెలికితీయడం, భద్రపరచడం, అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలోని దీవులు, తీరప్రాంతాల్లో ల్యాండింగ్ ఆపరేషన్లు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.

    ఇదే సమయంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇరాన్ యుద్ధం చాలా త్వరలో ముగియబోతోంది. వచ్చే రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన, కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేదని, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

    ఈ పరిణామాలు, ఇరాన్‌తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ‘యుద్ధం ముగుస్తోంది’ అని చెబుతున్నా, మరోవైపు అమెరికా భారీగా సైనిక బలగాలను సమీకరిస్తోంది. ఇది కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టం కావచ్చని సంకేతాలు ఇస్తున్నాయి.

  • టెహ్రాన్‌: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ ఇరాన్ చేరుకున్నారు. ఉన్నత స్థాయి చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చల పునఃప్రారంభంపై ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అందుకు సంబంధించిన పాక్‌ ప్రతినిధి బృందంతో మునీర్‌ ఇరాన్‌ వెళ్లినట్లు పాకిస్థాన్ సైన్యం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

    యుద్ధం వేళ అమెరికాకు పాక్‌ టీమ్‌ పలు ప్రతిపాదనలు చేయనుంది. టీమ్‌లో ఆసిమ్‌ మునీర్‌తో పాటు అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ తెహ్రాన్ కూడా ఉన్నారు. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్‌ మునీర్‌ వివరిస్తారు. అమెరికా పంపిన సందేశాన్ని ఇరాన్‌కు ఇచ్చాక రెండో దశ చర్చల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అంతకుముందు టెహ్రాన్‌లోని విమానాశ్రయంలో ఆసిమ్‌ మునీర్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వాగతం పలికారు. 

    కాగా, యూఎస్‌-ఇరాన్‌ మధ్య రెండు రోజు‍ల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందన‍్నారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. 

    మరోవైపు, కాల్పుల విరమణ విషయంలో లెబనాన్‌ను చేర్చాలని అమెరికాపై ఇరాన్ ఒత్తిడి పెడుతోందని హెజ్‌బొల్లా ప్రతినిధి తెలిపారు. హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఒత్తిడి సాధనంగా ఉపయోగించి, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చాలని ఇరాన్ ప్రయత్నించిందని తెలిపారు. “ఇరానీయులు అమెరికాపై అధిక ఒత్తిడి పెడుతున్నారు, అమెరికా కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చాలి అనే షరతులు పెట్టారు. అది చేయకపోతే, హార్మూజ్ ఆంక్షలను కొనసాగిస్తారు” అని తెలిపారు.

  • బీరుట్‌: లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను చారిత్రక చర్చలని పేర్కొంటున్నారు. అయితే, అటు చర్చలు జరుగుతుండగానే ఇటు లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్‌ మళ్లీ భీకర దాడులకు దిగింది. 

    దక్షిణ లెబనాన్ పట్టణాలపై మరిన్ని ఘోర దాడులను ప్రారంభించింది. లెబనాన్ ప్రభుత్వ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన దాడుల్లో 13 మంది మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులు అమెరికాలో సమావేశమైన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరిగింది.

    హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగం
    ఇరాన్‌ మద్దతు ఉన్న హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపామని ప్రకటించింది. హిజ్బుల్లా సుమారు 30 రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో మెటులా, కఫర్ గిలాడి, కిర్యాత్ ష్మోనా ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎంతగా కొనసాగుతున్నాయో ఇది సూచిస్తోంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. సైడాన్ జిల్లా అల్-బబ్లియా ప్రాంతంలో డ్రోన్ దాడి, ఖలీలా పట్టణంపై వైమానిక దాడి జరిగినట్లు సమాచారం.

    గాజాలో వాడిన విధానాలను దక్షిణ లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్నట్లు తెలుస్తోంది. హారెట్జ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉపయోగించిన విధానాల‍్లాగే దక్షిణ లెబనాన్ గ్రామాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ సైనికులను ఉటంకిస్తూ వెలువడింది.

    ఇళ్లను ప్రణాళికాబద్ధంగా కూల్చివేస్తున్నారు. కొందరు సైనికులు రోజువారీగా కూల్చిన భవనాల సంఖ్య ఆధారంగా లక్ష్యాలు నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతాలను దాటి మరింత లోతుగా దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాయి. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు స్పందించలేదు.

  • ఇస్లామాబాద్‌: పీటీఐ వ్యవస్థాపకుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పరిస్థితులు, అలాగే ఆయన భార్య బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి బుష్రా బీబీని జైల్లో ఏకాంతంగా ఉంచి, మానసికంగా కుంగదీసే ప్రయత్నం జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, జైల్లోనే ఆయనను, ఆయన భార్య బుష్రా బీబీని చంపేందుకు ప్రస్తుత ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

    ఇమ్రాన్ ఖాన్‌పై అవినీతి కేసులు, అక్రమ ఆస్తుల వ్యవహారాలు, హింసాత్మక నిరసనలకు సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసి, కొన్ని తీర్పులలో జైలు శిక్షలు విధించారు. అదే సమయంలో ఆయన భార్య బుష్రా బీబీ కూడా అవినీతి, అక్రమ ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ప్రతిపక్షం ఆరోపణల ప్రకారం, ఈ అరెస్టులు రాజకీయంగా దెబ్బతీయడానికి, విపక్షాన్ని అణగదొక్కడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలుగా భావిస్తున్నారు.

    రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరు నెలలుగా ఒంటరి నిర్బంధంలో ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, కుడి కన్నులో దృష్టి దాదాపు కోల్పోయారని సమాచారం. తాజాగా ఆయన భార్య బుష్రా బీబీ కూడా అదే విధంగా ఒంటరిగా ఉంచుతున్నారని,వారానికి ఒకసారి 30 నిమిషాల పాటు మాత్రమే భర్తను కలిసే అవకాశం ఇస్తున్నారని, అది కూడా తరచుగా నిరాకరిస్తున్నారని ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్ తెలిపారు.

    ఇమ్రాన్ సోదరి అలీమా ఖానుం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తూ, ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెయిల్ విచారణను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. కేసులు బలహీనమైనవని, ఒకసారి విచారణ జరిగితే ఆయనకు బెయిల్ తప్పదని, అందుకే విచారణనే జరగనివ్వడం లేదని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి సాధనంగా మారిందని, న్యాయం జరగకుండా అడ్డు కుంటుందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

    ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరతను మరింతగా పెంచుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి, అరెస్టులు, ఆరోగ్య సమస్యలు పాకిస్థాన్‌లో చర్చకు దారితీస్తున్నాయి.  

     

     

  • హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    అయితే, తాము ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్‌ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్‌ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.

    మరోవైపు,  రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్‌-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు.

    ..కానీ, యుద్ధం కారణంగా ఇరాన్‌ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్‌ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్‌ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ  ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

     

     

     

     

  • వాషింగ్టన్‌: ‘లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు ఆపాలి’.. ఇరాన్‌ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. అమెరికా-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప‍్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న మొదలైంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు జరిపింది. 

    దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 2,000 మందికి పైగా మృతి చెందగా, అందులో 165 మంది పిల్లలు, 250 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.

    లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి దౌత్య చర్చలు నిర్వహించాయి. ఇజ్రాయెల్‌, లెబనాన్‌కు మధ్య దౌత్య సంబంధాలు లేవు. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మధ్య ఘర్షణను ముగించాలనే లక్ష్యంతో అమెరికాలో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక అవకాశమని చెప్పారు. హెజ్బొల్లా ప్రభావం లేకుండా చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు.

    అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. లెబనాన్, ఇజ్రాయెల్ పక్షాలు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అన్ని ప్రభుత్వేతర ఉగ్రవాద గ్రూపులను నిరాయుధీకరణ చేయాలని కోరింది. అంటే ఇందులో హెజ్బొల్లా కూడా వస్తుంది.

    లెబనాన్ కాల్పుల విరమణ కోరింది. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. లెబనాన్‌లో హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఆ గ్రూపు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ తెలిపింది. గాజా యుద్ధం కొనసాగిన సమయంలో (2023, 2024లో) కూడా హిజ్బుల్లాతో ఇజ్రాయెల్‌ పోరాడింది.

    అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్, లెబనాన్ రెండు పక్షాలు హెజ్బొల్లా ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేయడానికి అంగీకరించాయి. హెజ్బొల్లా దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు అమెరికా మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు.
     

  • ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు కాస్ట్‌లీ దెబ్బ తగిలింది. ఈ దేశానికి చెందిన అత్యంత విలువైన డ్రోన్‌ ఒకటి ప్రమాదానికి గురైంది. అమెరికా అధికారిక ప్రకటనతో ఈ విషయం ధృవీకరణ అయ్యింది. హర్ముజ్‌ జలసంధిలో గల్లంతైన ఆ డ్రోన్‌ విలువ రూ.22,000 కోట్లుగా తేలింది.

    అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధిలో అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ ఫోర్‌సీ(MQ-4C) ట్రిటాన్‌తో నిఘా నిర్వహిస్తోంది. దీని విలువ 238 మిలియన్‌ డాలర్లు. ఈ కాస్ట్‌లీ డ్రోన్ ప్రమాదాన్ని ‘క్లాస్ A మిషప్’గా నమోదు చేశారు. ఈ ఘటన ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన మరుసటిరోజే (ఏప్రిల్‌ 9) జరిగింది.

    అధికారుల వెల్లడించిన ప్రకారం.. డ్రోన్ 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 10,000 అడుగుల కిందకు పడిపోయింది.  VVPE804 అనే కాల్‌సైన్‌తో మూడు గంటల సాధారణ మిషన్‌లో ఉన్న ఈ డ్రోన్ అకస్మాత్తుగా 7700 ఎమర్జెన్సీ కోడ్ ప్రసారం చేసింది. ఇది సాధారణంగా విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే సంకేతం. ఆ అత్యవసర సంకేతం ఇచ్చిన తర్వాత అది కనపడకుండా పోయింది. అది హర్ముజ్‌లో గల్లంతైనట్లు అధికారికంగా ధృవీకరించారు.

    MQ-4C ట్రిటాన్ అమెరికా నౌకాదళంలో అత్యంత ఆధునిక డ్రోన్‌లలో ఒకటి. దీన్ని అధిక ఎత్తులో, దీర్ఘకాలిక మిషన్ల కోసం రూపొందించారు. సముద్రంపై ఎక్కువసేపు పర్యవేక్షించేందుకు, సైనిక కదలికలపై నిఘా కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన నార్త్రోప్ గ్రుమ్మాన్ లిమిటెడ్‌ సర్వీసెస్‌గా వీటిని తయారు చేసింది. మొత్తం 68 డ్రోన్లు ఫ్లస్‌ 2 ప్రోటోటైపులను అమెరికా సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 48 డ్రోన్లను రంగంలోకి దించింది. మరో విశేషం ఏంటంటే.. ఆస్ట్రేలియా కూడా నాలుగు డ్రోన్లను ఆర్డర్‌ చేసింది.  అయితే తాజా డ్రోన్ నష్టం అమెరికా నౌకాదళానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు. 

  • పారిస్‌: పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్‌ జలసంధి దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. హార్మూజ్‌ జలసంధిలో స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి ఏకంగా 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది.

    హార్మూజ్‌ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్‌ 17న) జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రపంచానికి కీలకమైన హార్మూజ్‌ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా తీసుకునే చర్యలకు సహకరిస్తాయని ఆయన చెప్పారు. 

    యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.

    “హార్మూజ్ జలసంధి మూసివేత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి గ్లోబల్ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడం కీలకం. నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణ లక్ష్యంతో 40 కంటే ఎక్కువ దేశాలతో యూకే సంప‍్రదింపులు జరుపుతోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ షిప్పింగ్ రక్షణకు సమన్వయ, స్వతంత్ర, బహుళజాతీయ ప్రణాళికపై సమావేశం నిర్వహిస్తాయి” అని కీర్ స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు.

    మంగళవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ... యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు చర్చలను పునఃప్రారంభించాలి, అపోహలను తొలగించాలి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని కోరారు. అన్ని పక్షాలు కాల్పుల విరమణను గౌరవించాలని చెప్పారు.

    “హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా మళ్లీ తెరవడం చాలా ముఖ్యం. ఎటువంటి నియంత్రణలు, టోల్‌లు ఉండకూడదు. ప్రధాన భాగస్వాముల మద్దతుతో చర్చలు త్వరగా పునఃప్రారంభం కావాలి” అని ఎమ్మాన్యుయేల్‌ అన్నారు.

    కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరలేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్-యూకే ప్రతిపాదన ఇస్లామాబాద్ చర్చల అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.

    పాక్‌లో మరోసారి అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం (ఏప్రిల్‌ 14) ప్రకటించారు. రెండు రోజు‍ల్లో చర్చలు జరగనున్నాయని, ఇవి కూడా పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.  

  • టెహ్రాన్‌: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో తమ దేశం యుద్ధాన్ని కాకుండా శాంతి చర్చలు కోరుకుంటుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.  ఇదే విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఎన్‌ఏ)ధృవీకరించింది.

    పశ్చిమాసియా యుద్ధం. ఆ యుద్ధం కారణంగా ఇరాన్‌కు వాటిల్లిన నష్టం, హర్మూజ్‌ జలసంధిని అమెరికా మూసివేత వంటి పరిణామాలు, పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్‌ల మధ్య జరిగిన చర్చలతో పాటు ఇతర అంశాలపై పెజెష్కియాన్‌ ఐఆర్‌ఎన్‌ఏతో మాట్లాడారు. 

    ఈ సందర్భంగా పెజెష్కియాన్‌  తమ దేశం యుద్ధాన్ని కాకుండా చర్చలను కోరుకుంటోందన్నారు. అయితే అమెరికా తన ఇష్టాన్ని మా రుద్దడానికి లేదంటే లొంగిపోయేలా చేసేందుకు అమెరికా చేస్తున్న ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందన్నారు. అదే సమయంలో ఇరాన్‌లో అపార ప్రాణ నష్టానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ సమాజం ఖండించాలని స్పష్టం చేశారు.  అంతర్జాతీయ చట్టం, మానవతా సూత్రాల ప్రకారం పౌరులను, ఉన్నత వర్గాలను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కీలక కేంద్రాలను ధ్వంసం చేయడాన్ని సమర్ధించకూడదని స్పష్టం చేశారు. 

  • పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్‌లో ఉండాలని.. టోల్‌ వసూలు చేయాలని ఇరాన్‌ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్‌ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నేసినట్లు చర్చ మొదలైంది.

    దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై  కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..

    మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.

    చైనాకు..
    మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్‌ ఈస్ట్‌ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.

    మలక్కా డైలమా
    చైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.

    చైనాకు చుక్కలే
    ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్‌లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.

    భారత్‌కు ఫ్లస్‌
    భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్‌ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. 

    అంత వీజీ కాదు
    మలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్‌ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే.

Business

  • ప్రపంచ పసిడి రాజధానిగా పిలిచే దుబాయ్‌లో అక్షయ తృతీయ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న రానున్న ఈ శుభదినాన్ని పురస్కరించుకుని, అక్కడి ప్రముఖ జ్యువెలరీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. భారతీయ సమాజానికి ఎంతో ముఖ్యమైన ఈ పండుగ నాడు బంగారం కొనుగోలు చేయడం శ్రేయస్కరమని భావిస్తారు కాబట్టి, కస్టమర్లను ఆకర్షించేందుకు జీరో మేకింగ్ ఛార్జీలు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ వోచర్లతో మార్కెట్ కళకళలాడుతోంది.

    ముఖ్యంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్, మీనా జ్యువెలర్స్ వంటి బ్రాండ్లు ప్రత్యేక అక్షయ తృతీయ కలెక్షన్లను పరిచయం చేశాయి. మలబార్ గోల్డ్ వజ్రాల ఆభరణాలపై 40% వరకు తగ్గింపుతో పాటు, పాత బంగారం మార్పిడిపై 'జీరో-లాస్' పథకాన్ని అందిస్తోంది. అలాగే, మీనా జ్యువెలర్స్ వజ్రాలు, పోల్కీ ఆభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను, భారీ కొనుగోళ్లపై గోల్డ్ బార్లను బహుమతిగా ఇస్తోంది.

    మరోవైపు, సిరోయా జ్యువెలర్స్ వజ్రాల ఆభరణాలపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ ప్రకటించగా, అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై 80% వరకు తగ్గింపును ఇస్తోంది. మే 5వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు, కస్టమర్లకు ధరల పరంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున నేరుగా షోరూమ్‌లను సంప్రదించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.

    ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్ల దుబాయ్‌లోని భారతీయ ప్రవాసుల నుండి మంచి స్పందన లభిస్తుందని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంతోపా దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో, ఈ ఏడాది కూడా విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • ప్రభుత్వ రంగం నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా 'ఎయిర్ ఇండియా' కష్టాలు తీరడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసిన కాలానికి) ఈ విమానయాన సంస్థ ఏకంగా రూ. 22,000 కోట్లకు (2.7 బిలియన్ డాలర్లు)పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు వాటాదారుల నుంచి భారీగా నిధుల సమీకరణకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    అంతర్జాతీయ పరిణామాలు, సాంకేతిక సమస్యలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సమస్యలు, పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇవి ఆపరేటింగ్ ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా, ఆదాయ మార్గాలను కూడా ప్రభావితం చేశాయి.

    సంక్షోభ నివారణకు మెజారిటీ వాటాదారు అయిన టాటా గ్రూప్, 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఎయిర్‌ ఇండియాకు అవసరమైన నగదును ఇన్ఫ్యూషన్ (నగదు ఇంజెక్షన్) రూపంలో అందించే విషయమై ఈ రెండు సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య సంస్థల నుండి అందే నిధులు అవసరానికి సరిపోతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    నిధుల సమీకరణ పరిమాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాటాదారుల నుండి వచ్చే మొత్తం సరిపోకపోతే, ఎయిర్ ఇండియా ఇతర ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అటు టాటా గ్రూప్ గానీ, ఇటు ఎయిర్ ఇండియా ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

  • లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్' తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్‌ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధం చేసింది. ఈ కొత్త రైలుకు సంబంధించిన విశేషాలు మీకోసం..

    ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ 
    ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్‌ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్‌ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్‌ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది.

    ఏసీ లేకపోయినా.. గాలికి డోకా లేదు!
    నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి.

    అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి  1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది.

    ప్రయాణికులకు మరిన్ని ఫీచర్లు
    కేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్‌రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు.

    12 కోచ్‌ల ఆటోమేటిక్‌ డోర్‌ క్లోజ్‌నాన్‌ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది. ట్రయల్స్ పూర్తయి, సర్టిఫికేషన్ లభించిన వెంటనే ఈ 'వందే భారత్' స్టైల్ లోకల్ రైలు ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది.

  • హైదరాబాద్: భారతదేశాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ ప్రోడక్ట్ లీడర్‌గా నిలబెట్టే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకమైన ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (IKP Knowledge Park) ‘ఐకేపీ ఏఆర్‌కే’(IKP ARK) పేరుతో సరికొత్త వెంచర్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. లోతైన శాస్త్రీయ పరిశోధనలు (Deep-Science) చేసే స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రోగ్రామ్ ఒక వారధిలా పనిచేయనుంది.

    చాలా స్టార్టప్‌లు అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పటికీ, సరైన సహకారం, రెగ్యులేటరీ నిబంధనలపై అవగాహన లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, ఐకేపీ ఏఆర్‌కే ఒక వినూత్న నమూనాను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన నిపుణులు నేరుగా ఆయా కంపెనీలతో కలిసి పనిచేస్తూ, వ్యాపార విస్తరణలో వ్యవస్థాపకులకు వెన్నుదన్నుగా నిలుస్తారు.

    ఎంపికైన ప్రతి స్టార్టప్‌కు సుమారు రూ.2 కోట్ల వరకు విలువైన ప్రయోజనాలను ఐకేపీ కల్పిస్తోంది. ఇందులో ప్రాజెక్ట్ మైలురాళ్ల ఆధారిత నిధులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సీడీఎస్‌సీవో, ఎఫ్‌డీఏ వంటి సంస్థల నుండి రెగ్యులేటరీ అనుమతులు పొందడంలో సాంకేతిక మద్దతు ఉంటుంది. ఐకేపీకి ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ పెట్టుబడిదారుల నెట్‌వర్క్ ద్వారా స్టార్టప్‌లు తమ వ్యాపార నమూనాలను మెరుగుపరుచుకుని నిధులు సేకరించుకునే అవకాశం కలుగుతుంది.

    ఈ ప్రోగ్రామ్ 12 నెలల కాలపరిమితితో మూడు దశల్లో సాగుతుంది. మొదటి దశలో వ్యాపార ప్రణాళిక (బ్లూప్రింట్) సిద్ధం చేయడం, రెండో దశలో నిర్వహణపరమైన ముప్పులను తగ్గించడం, చివరి ఎనిమిది నెలల్లో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి సిరీస్-ఎ ఫండింగ్ సాధించడంపై దృష్టి సారిస్తారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ప్రయోగశాలలోని ఆవిష్కరణలు వేగంగా ప్రజలకు చేరువవుతాయని ఐకేపీ సీఈఓ డాక్టర్ సత్య ప్రకాష్ డాష్ పేర్కొన్నారు.

    తొలి విడతలో భాగంగా మెడ్‌టెక్, హెల్త్‌టెక్ స్టార్టప్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (TRL 3+) కలిగి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. గత రెండు దశాబ్దాలుగా సుమారు 1,900 కంపెనీలకు అండగా నిలిచిన ఐకేపీ, ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా భారతీయ స్టార్టప్ వ్యవస్థలో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది.

  • దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్‌బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

    ఎవరి ఖాతాలు మూతపడతాయి?
    మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.
    మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.
    జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు.
    కేవైసీ అప్‌డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.

    ఎందుకీ కఠిన నిర్ణయం?
    బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.

    ఖాతాను కాపాడుకోవాలంటే..
    మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:
    మీ సమీపంలోని పీఎన్‌బీ బ్రాంచ్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.
    మీ అకౌంట్‌లో కొంత మొత్తాన్ని జమ చేయండి.
    కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.

    తీసుకెళ్లాల్సిన పత్రాలు
    ఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.
    ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ తో యుద్ధం ముగియబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన తరువాత నిఫ్టీ 50, సెన్సెక్స్ భారీగా ఎగిశాయి.

    నిఫ్టీ 1.63 శాతం లేదా 388.65 పాయింట్ల లాభంతో 24,231.30 వద్ద, సెన్సెక్స్ 1.64 శాతం లేదా 1,264 పాయింట్లు పెరిగి 78,111.24 వద్ద ముగిశాయి.

    ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్ స్టిట్యూట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.20 శాతం, 2.35 శాతం పెరిగాయి.

    రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్ట్రక్షన్ డ్యూరబుల్ టాప్ గెయినర్‌గా  నిలిచింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ తక్కువ పనితీరు కనబరిచింది.

  • ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి తన మూడవ మోడల్ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ (VF MPV 7)ను అధికారికంగా విడుదల చేసింది. వినూత్న ఫీచర్లు, శక్తివంతమైన రేంజ్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. ప్రధానంగా ఫ్లీట్ (Commercial) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.

    బుకింగ్స్ ప్రారంభం
    విన్‌ఫాస్ట్‌ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ కారు అమ్మకాలకు బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు కొనే ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది చివర్లో  'లిమో గ్రీన్' పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

    డిజైన్
    ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. దీని కొలతలు చూస్తే 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు ఉంటుంది. ఏకంగా 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం(బూట్ స్పేస్) ఇచ్చారు.

    ఎక్స్‌టీరియర్
    ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ "V" లోగోతో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్‌ని ఇస్తాయి. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు దీని ప్రధాన ఆకర్షణ.

    ఇంటీరియర్, ఫీచర్లు
    క్యాబిన్ లోపల ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతను జోడించారు. 10.1-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథరెట్ ఇంటీరియర్, USB-A, USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు ఇ​చ్చారు. ఇక ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.

    పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్
    ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో 60.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే  517 కిలోమీటర్ల (ARAI గుర్తింపు పొందిన) ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. 201 హెచ్‌పీ శక్తిని, 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.

  • రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతూ పాటలు వినే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. లేదంటే మీరు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణికుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

    రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు.. క్వైట్ అవర్స్

    రైల్వే శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కింది నిబంధనలు అమల్లో ఉంటాయి.

    • మొబైల్ ఫోన్లలో పాటలు వినాలన్నా లేదా వీడియోలు చూడాలన్నా కచ్చితంగా ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ వాడాలి. లౌడ్‌ స్పీకర్ ఆన్ చేయడం నిషిద్ధం.

    • ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కవారికి ఇబ్బంది కలగకుండా తక్కువ స్వరంతో మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ మాట్లాడితే రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.

    • వ్యక్తిగత బెర్త్ లైట్లు మినహా కోచ్‌లోని మిగిలిన అన్ని లైట్లు ఆపివేయాలి. తద్వారా తోటి ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా చూడాలి.

    ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు

    ఈ నిబంధనలు రిజర్వ్‌డ్ కోచ్‌ల్లో ప్రయాణించే అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత ప్రయాణికులు వెంటనే రైలులో అందుబాటులో ఉండే ఆర్‌పీఎస్‌ఎఫ్‌/ ఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి లేదా టికెట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ‘ప్రయాణికుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు’ అని రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలో తెలిపారు.

    రైలు ప్రయాణాన్ని సుఖమయం చేయడంలో తోటి ప్రయాణికుల సహకారం ఎంతో అవసరం. కాబట్టి ప్రయాణికులు ఈ నియమాలను పాటించి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ కోరుతోంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల అమలుపై మరింత నిఘా పెంచనున్నట్లు సమాచారం.

    ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల!

Andhra Pradesh

  • సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు.

  • సాక్షి,తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్ స్టిక్స్, గ్యాస్‌ సిలిండర్లు పేలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    ఈ ప్రమాదంలో పలువురు గాయపడటం బాధాకరమని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. పేలుడు తీవ్రతతో ఇళ్లు ధ్వంసమవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

    మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్‌ జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

    సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

     

Family

  • అంతకంతకూ క్షీణిస్తున్న భూసారాన్ని మనకు మనమే తక్షణం కాపాడుకోవాలి. లేదంటే, మరో నాలుగైదు దశాబ్దాల్లో మానవ జాతికి మనుగడే ఉండదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు... ప్రపంచ వ్యాప్తంగా భూసార పరీక్షలు సాగించిన పరిశోధకుల మాట. కానీ, అత్యంత కీలకమైన ఈ అంశం పట్ల ఎంతమందికి చైతన్యం ఉంది? పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ ఎక్కువవుతున్న చెట్ల నరికివేత లాంటి అంశాలపై జనంలో ఎంతో కొంత అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. మరి, మనకు ఆహారం అందించే పుడమి తల్లి చేవ చచ్చి, చేష్టలుడిగి, జీవచ్ఛవమవుతున్న దుఃస్థితి గురించి ఎవరికి పడుతోంది? భవిష్యత్ మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిస్థితిపై సాగిన ఓ ప్రజా ఉద్యమమే... ‘సేవ్ సాయిల్’. ఉద్యమ స్థాయిలో సాగిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమం.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్ మానస పుత్రిక.

    100 రోజులు.. 27 దేశాలు.. 30 వేల కిలోమీటర్లు...
    ‘సేవ్ సాయిల్’ ఉద్యమం చేపట్టిన ఆయన అందులో భాగంగా నాలుగేళ్ళ క్రితం 2022లో 100 రోజుల పాటు 27 దేశాల మీదుగా దాదాపు 30 వేల కిలోమీటర్లు మోటార్ సైకిలుపై ప్రయాణించారు. భారతదేశంతో పాటు ఐరోపా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాల మీదుగా ఆ యాత్ర సాగింది. అదో ప్రపంచవ్యాప్త బృహత్తర ప్రయత్నం. అయితే, వివిధ దేశాల్లోని వైవిధ్యభరితమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, కొన్ని పదులు, వందలమంది తెర వెనుక ఉండి శ్రమిస్తే కానీ సాధ్యం కాదు.

    యాత్రలో భాగంగా మొత్తం 691 కార్యక్రమాలుగా సాగిన ‘సేవ్ సాయిల్’ (Save Soil) విషయంలోనూ అదే జరిగింది. ఈ ప్రజాచైతన్య ఉద్యమంలో తెర వెనుక హీరోలు ఎందరో. అలాంటి పదుల మంది స్వచ్ఛంద సేవకులు, కార్యకర్తల వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, ఆ వంద రోజుల ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు... అన్నీ అనేక విధాలుగా మానవాసక్తికరమైన కథనాలే. ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలోని అలాంటి తెలియని తెర వెనుక కథలు తాజాగా పుస్తకరూపం సంతరించుకున్నాయి. ‘సేవ్ సాయిల్ – 100 డేస్ దట్ మూవ్డ్ ది వరల్డ్’ అన్న పేరుతో పెంగ్విన్ బుక్ హౌస్ వారు ప్రచురించారు.

    నాలుగేళ్ళలో.. 410 కోట్ల మందికి...
    హైదరాబాద్‌లో ఏప్రిల్ 14వ తేదీ, మంగళవారం సాయంత్రం వినూత్న రీతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సద్గురు కుమార్తె అయిన రాధే జగ్గీ (Radhe Jaggi) ఈ సంకలన గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు – సంగీత దర్శకుడు రామ్ మిరియాల, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ – మోడల్ శిల్పారెడ్డితో కలసి పుస్తక సంపాదకురాలి చర్చా గోష్ఠి ఫక్కీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. “ప్రపంచవ్యాప్తంగా గత నాలుగేళ్ళలో దాదాపు 410 కోట్ల మందికి చేరువైన ‘సేవ్ సాయిల్’ ఇవాళ అతి పెద్ద ప్రజా చైతన్య ఉద్యమం” అని రాధే వివరించారు.

    ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనుభవం రాధేది. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం స్థాపించిన ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఆ యాత్రలో అనేక వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. మట్టితో ముడిపడిన కథాంశంతో రాధే బృందం చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఉద్యమ సందేశాన్ని మరింత వ్యాపింపజేశాయి. అలా యాత్రలో ప్రత్యక్ష భాగస్వామి అయిన రాధే తన అనుభవంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకుల అనుభూతులనూ, వారు ఎదుర్కొన్న సంఘటనలనూ సంకలించారు. వెరసి, విభిన్న వర్గాలకు చెందిన 86 మంది వేర్వేరు వ్యక్తుల విభిన్న అనుభవాల సమాహార రూపం... ‘సేవ్ సాయిల్’ గ్రంథం. ఆ వాలంటీర్ల కథలు, అప్పటి ఫోటోలతో పుస్తకాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఎక్కడ, ఏ పేజీ అయినా తీసుకొని చదువుకొనేలా అనుభవాలను రాశిపోసిన ఈ రచన నేలతల్లి పరిరక్షణ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను పరిచయం చేస్తుంది.

    ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో వణికి... 
    యూరోపియన్ ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ, ఎర్రటి ఎండలో ఎడారి తుపానులకు ఎదురొడ్డుతూ సాగిన ఉద్యమ యాత్ర ఇది. ఐక్యరాజ్య సమితి హాళ్ళ నుంచి రోడ్డు పక్క టీ షాపుల దాకా ఆగిన ప్రతిచోటా నేలతల్లిని కాపాడుకోవాలన్నదే ప్రధాన సందేశం. ఓ దేశంలో అసలు కార్యక్రమానికి ముందు కిచెన్‌లో ఇరుక్కుపోయిన క్షణాలు, డ్రోన్‌ను నోట కరుచుకొని ఓ వాలంటీర్ చెట్టెక్కిన సంగతులు, వాహనం క్లచ్ పాడైపోయి బాగు చేయాల్సిన క్షణంలో చిమ్మచీకటి వేళ అపరిచిత వ్యక్తులు అందించిన సాయాలు, ఈ ఉద్యమం కోసం తెలుగునాట ఓ వ్యక్తి కాలినడకన కొన్ని పదుల కి.మీ.లు నడక సాగించడం... ఇలా ఎన్నెన్నో కథలు ఈ పుస్తకంలో చదవవచ్చు.

    “పలువురిని ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను వారి మాటల్లోనే అందించాం. ఈ పుస్తకం చదువుతుంటే, ఆ సంఘటలన్నీ కళ్ళ ముందు కదలాడి, ‘సేవ్ సాయిల్’ ప్రపంచ యాత్రలో మీరూ స్వయంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది’’ అని రాధే వివరించారు. “రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను కూడా వాళ్ళ మీదే పెట్టడం సరైంది కాదు. మనందరం సహజసిద్ధంగా మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. రైతులకు అండగా నిలవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు సైతం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, నేలతల్లి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.

    ఏం చేస్తున్నామని సిగ్గేసింది: రామ్ మిరియాల 
    ‘వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3 నుంచి 6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేలతల్లి ఎదుర్కొంటున్న సార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ‘సేవ్ సాయిల్’ ఉద్యమ లక్ష్యం. శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు, సామాన్య పౌరుల నుంచి పాలకుల దాకా అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వానికి నేలలో జీవం ఎంత ముఖ్యమైనదో చాటుతోంది. ఈ లక్ష్యాలన్నీ నచ్చి దీనిలో నేనూ భాగమయ్యాను’ అని సినీ గాయకుడు రామ్ మిరియాల వివరించారు.

    “వయసు మీద పడినవారే ఎంతో చేస్తుంటే, వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామని నాకే సిగ్గేసింది. అందుకే, నా వంతుగా ఈ ప్రజా చైతన్య ఉద్యమం కోసం స్వయంగా ఓ పాట రాసి, స్వరపరిచి పాడాను” అని రామ్ చెప్పుకొచ్చారు. మనిషికీ, మట్టికీ ఉన్న బంధాన్నీ, అలాగే మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్నీ చెప్పిన “నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ...” అనే ఆ పాట పాడి, వినిపించారు. “దేశమంటే మట్టేనోయ్... మట్టి లేకపోతే మనిషెక్కడోయ్...” అంటూ వినూత్న ధోరణితో ఆలోచింపజేశారు. మట్టిని ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ సాగిన రామ్ మిరియాల పాట ఆహూతులను అలరించడమే కాక, మట్టిపై ప్రేమను మరింత పెంచేలా సాగింది.

    అందుకే... సమంతను భాగస్వామిని చేశా: శిల్పారెడ్డి 
    ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “సేవ్ సాయిల్ ఉద్యమం తాలూకు లక్ష్యం నన్నెంతో ప్రేరేపించింది. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే, మహా ఉపద్రవం తప్పదు. అందుకే, మానవాళి భవిష్యత్తు కోసం నా వంతుగా ఇందులో నేనూ భాగమయ్యాను. సినీ నటి సమంత లాంటి నా ఆత్మీయ మిత్రులనూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనూ ఈ కృషిలో భాగం చేశాను. స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్ళి, యాత్రలో పాల్గొన్నాను. మహా సముద్రం లాంటి ఈ ప్రయత్నంలో నేను ఓ నీటిబిందువును మాత్రమే” అని వినయంగా పేర్కొన్నారు. ఆహూతుల సందేహాలకు సైతం సమాధానాలిస్తూ, చర్చా గోష్ఠిగా సాగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జంట నగరాలలోని వివిధ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనడం విశేషం.

    చ‌ద‌వండి: వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం

    ఏమైనా, ‘మనం ఈ నేల నుంచి పుట్టాం. ఈ నేలపైనే జీవిస్తాం. ఇక్కడే కన్నుమూస్తాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఆ వాస్తవం ఇప్పటికైనా గుర్తించి, మన నేలతల్లి జవజీవాలను మనమే పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికైనా తెచ్చుకుందాం. లేదంటే భావితరానికి బతుకే లేదు’. ఈ సద్గురు సందేశం ఆలోచించి తీరాల్సిందే కాదు... తక్షణమే ఆచరణలోకి దిగాల్సినది. ‘సేవ్ సాయిల్’ పుస్తకంలోని విభిన్న అనుభవాలు అక్షరాలా అందుకు మరో ప్రేరణ.

    - రెంటాల జయదేవ

  • పిల్లలకు అక్షర జ్ఞానాన్నే కాదు. ఈ రోజుల్లో ఆర్థిక అక్షరాస్యతను అందించడమూ అవసరమే! చాలా మంది డబ్బు సంపాదించడంపైన దృష్టి పెడతారు.  కొందరు మాత్రం ఆ డబ్బును సరిగ్గా వినియోగించి, ఆర్థిక సమస్యలు లేకుండా కూల్‌గా ఉంటారు. ‘డబ్బు ప్రాముఖ్యత, ఖర్చుల నిర్వహణ, పొదుపు.. అలవాట్లు పెంపొందితే పెద్దయ్యాక ఆర్థిక భారాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది’ అంటున్నారు నిపుణులు. వేసవి సెలవుల్లో పిల్లలకు తీరికగా, అర్థమయ్యేలా చెప్పే  మనీమేనేజ్‌మెంట్‌ గురించి మరింత వివరంగా!

    పిల్లలకు పెద్దలు ఇచ్చే కానుకలలో జీవితకాలం గుర్తుండి΄ోయేది డబ్బును ఎలా నిర్వహించాలో తెలిసే జ్ఞానం కూడా. ఆ ఆలోచన అమలు భవిష్యత్తులో పిల్లలు ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుంది.  

    అవసరాలకు.. కోరికల మధ్య తేడా! 
    పిల్లలకు స్టేషనరీ అవసరం ఉండి షాపింగ్‌కు తీసుకెళుతుంటారు పెద్దవాళ్లు. అక్కడ పిల్లలను ఆకట్టుకునే చాక్లెట్లు, బొమ్మలు ముందుంటాయి. ఇలాంటప్పుడు పిల్లల మనసు బొమ్మలు, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. ముందుగా అవే ఎంచుకుంటారు. అవసరమైనవి కొనడానికి వాయిదా వేయడం లేదా పెద్దలను మరికొంత డబ్బు ఇవ్వమని అడగడం సహజంగా జరుగుతుంటుంది. ‘ఏది అవసరం, ఏది కోరుకోవడం..’ అనే ఎంపిక ముందు ఇంటి వద్దే ఇవ్వడం మొదలుపెట్టాలి.

    తప్పిదాల నుంచి పాఠాలు
    ఈ రోజుల్లో చాలావరకు తల్లీతండ్రీ ఇద్దరూ సంపాదనపరులై ఉంటున్నారు. కోరింది ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో ఖర్చు శాతమూ పెరిగింది. తాము చేస్తున్న ఆర్థిక తప్పిదాలు ముందు పెద్దలు అర్థం చేసుకోవాలి. విద్య, వైద్యం, కుటుంబంలో వచ్చే అత్యవసర ఖర్చుల గురించి పిల్లలతో చర్చించడం వల్ల వారిలో ‘ఖర్చు’ పట్ల అవగాహన పెరుగుతుంది.

    సొంత డబ్బు...
    స్కూల్‌ లేదా ఏదైనా ΄ోటీల్లో పాల్గొనప్పుడు సంపాదించుకున్న ప్రైజ్‌ మనీని, అమ్మమ్మ, తాతయ్య, బంధువులు.. ఇచ్చిన మొత్తాన్ని, కిడ్డీ బ్యాంక్‌లో డబ్బు దాచుకోవడానికి ప్రోత్సహించాలి. పొదుపు మొత్తాలకు వడ్డీ రూపేణా వచ్చే వీలున్న పోస్టాఫీసు, బ్యాంకులు పిల్లల కోసం ఇస్తున్న అవకాశాల గురించీ తెలియజేయాలి. వారు ఆదా చేసిన డబ్బు మొత్తాల నుంచి కొనుగోళ్లు కూడా చేయించాలి. దీనివల్ల ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాలపట్ల అవగాహన పెంచుకుంటారు.  

    పంచుకోవడమూ అవసరమే! 
    ఖర్చు, పొదుపు, డొనేషన్‌ .. ఇలా మూడు బాక్స్‌లను చేయించి, వాటిని నిర్వహించమని చెప్పాలి. ఏ బాక్స్‌లోని డబ్బు ఎలా ఖర్చు అవుతోందో గమనించమనాలి. డబ్బు కేవలం మనకోసం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలియజేయాలి.  

    ఆటగా... అభ్యాసం...
    పిల్లలకు రకరకాల నోట్లు, నాణేలు, కార్డులను చూపించాలి. వాటిని వరుసక్రమంలో అమర్చుతూ, వాటి పేర్లు, ఆకారాలు, పరిమాణాలు, రంగులు, విలువ, చిహ్నాల గురించి మాట్లాడాలి. షాపింగ్‌కు తీసుకెళ్లినప్పుడు బిల్లు కౌంటర్‌ వద్ద పిల్లలకే డబ్బు ఇచ్చి, చెల్లింపులు చేయించాలి. 

    ఈ రోజుల్లో తప్పనిసరిగా మారిన డిజిటల్‌ పేమెంట్స్‌ నిర్వహణ గురించి తెలియజేయాలి.కార్డు ద్వారా బిల్‌ చెల్లించాల్సి వస్తే, కౌంటర్‌ వద్ద కార్డును ట్యాప్‌ చేయించడం, తిరిగి తీసుకోవడం గురించి చెప్పాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ వాలెట్‌ బ్యాలెన్స్‌ను పిల్లలకు చూపించి,  కొనుగోలు పూర్తయ్యాక, బ్యాలెన్స్‌ ఎలా మారుతుందో చెప్పవచ్చు.

    కొనుగోలు రసీదులను చూపించి, వస్తువులు, వాటి విలువ, మొత్తం లెక్కించమని చెప్పవచ్చు. ఎఐ అప్లికేషన్‌ను ఉపయోగించి ఫ్యామిలీ, ట్రావెల్‌ బడ్జెట్‌ను రూపొందించమని సూచించవచ్చు. పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్‌ నేర్పడం అనేది ఒక్కరోజులో పూర్తి కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. తల్లిదండ్రులు ఎగ్జాంపుల్‌గా ఉండి, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ఇస్తే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. 
     

    నేరుగా తెలుసుకునేలా చేస్తాను...
    మా ఇద్దరి పిల్లలు ఐదు, ఏడు తరగతుల్లో ఉన్నారు. ఇద్దరూ పోటీల్లో పాల్గొన్నప్పుడు వచ్చిన క్యాష్‌ ప్రైజ్‌ మనీని ఎలా పొదుపు చేసుకోవాలో చెబుతుంటాం. విడిగా బ్యాంక్‌ అకౌంట్‌ తీశాం. కిడ్డీ బ్యాంక్‌ నిండిపోయినప్పుడు ఆ అకౌంట్‌లో వేస్తుంటారు. 

    వారికి అవసరమైనవి, కావాలనుకున్నవి ఆ మొత్తం నుంచి కొనుగోలు చేయమని కూడా చెబుతుంటాం. తమ దగ్గర పొదుపు మొత్తం పెరుగుతున్నప్పడు వాటిని ఎందులో పెట్టుబడిగా పెడితే బాగుంటుంది అనే విషయాల గురించి అడుగుతుంటారు.  హెల్త్‌ ఇన్సూరెన్స్, ప్రీమియమ్‌ గురించి కూడా చెబుతుంటాం. బయట కొనుగోలు చేసే వస్తువులు ఇంట్లో సొంతంగా తయారు చేయవచ్చా అనేది ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల డబ్బు ఆదా అవుతుందనే విషయాలు వారికి అర్థమవుతుంటాయి. 
    – శకుంతల కస్తూరి, గృహిణి, బీహెæచ్‌ఇఎల్, హైదరాబాద్‌ 

    నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

  • ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు నగరానికి చెందిన ఓ గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వెంటనే అడ్మిట్‌ చేయించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఎక్టోఫిక్‌ ప్రెగ్నెన్సీగా గుర్తించి ఆఫరేషన్‌ చేశారు. ఈ క్రమంలో ఆ తల్లి మృత్యువాత పడింది. ట్యూబ్‌ పగిలిపోవడంతోనే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పుకొచ్చారు.  ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో తరచూ నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.  

    తల్లి గర్భాణికి గండం తప్పనంటోంది. గర్భసంచిలో గర్భం దారి తప్పుతోంది. ఇందుకు ఇన్‌ఫెక్షన్లు, వరుస అబార్షన్లే ప్రధాన కారణమని తెలుస్తోంది. అండాశయం, గర్భాశయ నాళాల్లో గర్భం(ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ) ఏర్పడుతోంది. మాతృమరణానికి దారి తీస్తోంది. ఈ విషయంలో తల్లులు అప్రమత్తంగా వ్యవహరించకుంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.  

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాణిపాకం జిల్లాలో ఎక్టోఫిక్‌ ప్రెగ్నెన్సీ కేసులు పెరుగుతున్నాయి. గర్భం సరైన స్థానమైన కాకుండా గర్భాశయ నాళాలు (ఫాలోపియన్‌ ట్యూబ్స్‌), అండాశయం లేదా పొత్తికడుపులో ఏర్పడుతోంది. దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. 

    జిల్లాలో ఒక జిల్లా ప్రభు త్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు 4, సీహెచ్‌సీలు 8, పీహెచ్‌సీలు 50, ప్రైవేటు ఆస్పత్రులు వెయ్యి వరకు ఉన్నాయి. వీటిలో ప్రతి నెలా 7వేలకు పైగా గర్భణులు గుర్తిస్తుండగా.. 5వేల ప్రసవ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రతి 100 గర్భధారణల్లో కనీసం 1–2 కేసులు ఎక్టోఫిక్‌గా నమోదవుతున్నాయని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రమవుతోందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. 

    నిర్లక్ష్యం చేస్తే  
    ప్రారంభంలో ఇది సాధారణ గర్భంలా కనిపిస్తుంది. కడుపులో ఒక వైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. అసాధారణ రక్తస్రావం, తల తిరగడం, బలహీనత, భుజం లేదా వెన్ను నొప్పి, చికిత్స ఆలస్యం అయితే ట్యూబ్‌ పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అత్యవసర శస్త్రచికిత్స అవసరం, తల్లి ప్రాణానికి ప్రమాదం తప్పదు. 

    పెరుగుదలకు ప్రధాన కారణాలు 
    గర్భాశయ నాళాల్లో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడడం.. వరుసగా అబార్షన్లు, సేఫ్టీ లేకుండా లైంగిక సంబంధాలు, గతంలో ట్యూబ్‌ సర్జరీలు, ఆలస్యంగా పెళ్లిళ్లు, గర్భధారణలో ఆలస్యం, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ల పెరుగుదల తదితర కారణాలు. 

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
    ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకూడదు. సేఫ్‌ సెక్స్‌ పాటించాలి. వరుస అబార్షన్లను నివారించాలి. గర్భం అనుమానం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. రెగ్యులర్‌ చెకప్‌లు తప్పనిసరి.  

    ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అంటే! 
    గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోíపిక్‌ ప్రెగ్నెన్సీ అంటారు. అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్‌ గర్భం అంటారు. వందలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఇలా ఎందుకు అవుతుందో..అంతు చిక్కదు. అండవాహికకు ఇన్‌ఫెక్షన్, ఆఫరేషన్‌ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా స్కాన్‌ చేసినప్పుడే తెలుస్తుంది.  

    అజాగ్రత్త వద్దు  
    అండం, వీర్యకణం అండవాహికలో ఫలదీకరణం చెంది గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహిక, పొట్టలో గర్భం ఏర్పడితే దాని ఎక్టోఫిక్‌ గర్భం అంటాం. వందలో ఒకరికి జరుగుతుంది. అండవాహికకు ఇన్‌ఫెక్షన్, ఆఫరేషన్‌ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈ విషయంలో అజాగ్రత్త వద్దు. వైద్యులను తక్షణమే సంప్రదించాలి.  
    – షాలిని, గైనిక్‌ వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో), చిత్తూరు  

    వైద్యులను సంప్రదించాలి  
    నెలసరి రక్తస్రావం ఆగినా, తిరిగి అడపాదడపా రక్త స్రావం కనిపిస్తూ ఉన్నా.. పొత్తి కడుపులో ఒక పక్క భరించలేనంత నొప్పి బలహీనత, కళ్లు తిరగడం, గర్భధారణ అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ చూస్తున్నాం. ఈ కేసుల్లో చాలా వరకు మాతృమరణాలకు దారితీస్తున్నాయి.  
    – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, చిత్తూరు   

    (చదవండి: తొలి అంధ-బధిర న్యాయవాది: చిమ్మచీకటి నుంచే సక్సెస్‌ అందుకుంది..!)

  • మనదేశంలో ఉన్న ప్రతి సౌకర్యం సక్రమంగా ఉన్నవారికే. పుట్టుకతో దివ్యాంగులు లేదా ప్రమాదవశాత్తు దివ్యాంగులైన వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించే యత్నం చేయడం లేదనేది చాలామంది నిపుణుల వాదన. ఇంతలా ఏఐ సాంకేతికత వేగంగా దూసుకొస్తున్నప్పటికీ.. వాళ్ల విషయంలో ఇంకా పక్షపాత బుద్ధి, చిన్నచూపు మారడం లేదు. దాన్ని మార్చేందుకు కంకణం కట్టుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ..అందర్నీ చైతన్యవంతుల్ని చేసేలా ఆలోచింప చేసింది ఈ మహిళ. పైగా అందర్నీ బలవంతులుగా మార్చుదాం అనే సరికొత్త నినాదం ప్రతి ఒక్కరి మనసులో నాటేలా చేస్తోంది. 

    ఆ అమ్మాయే హబెన్‌ గిర్మా. అమెరికాకు చెందిన గిర్మాది ఎరిట్రియన్‌ వలస కుటుంబ నేపథ్యం. ఆమె పుట్టుకతో చెవిటి అంధ వ్యక్తి. కాలక్రమేణ అవయవాలు క్షీణించే సమయానికి తన బాల్యం గురించి క్షణ్ణంగా అర్థం చేసుకుంది. నెమ్మది..నెమ్మదిగా కనుమరుగవ్వుతున్న దృష్టి, కోల్పోవుతున్న వినికిడి శక్తికి భయపడలేదామె. తన సవాళ్లకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. అలాగే ఆమె తన సహాయక సాధనాలను అదనపు వస్తువులుగా కాకుండా తన జీవితంలో ఒక భాగంగా భావించడం నేర్చుకుంది. 

    సాధారణ పాఠశాలలో చదువుకుంది, బ్రెయిలీ నేర్చుకుంది. చాలామంది అంధ బధిరలకు లభించని అన్ని సౌకర్యాలతో పెరిగిందామె. ఇలాంటివి తనలాంటి వాళ్లందరికీ అందుబాటులో ఉంటే..వాళ్లు కూడా శక్తిమంతులవుతారనేది ఆమె ఆకాంక్ష. స్వతహగా చదువులో అపార ప్రతిభ కనబర్చే గిర్మా హార్వార్డ్‌ యూనివర్సిటీలో చదివే ఛాన్స్‌ కొట్టేసింది. అంతకుముందెన్నడూ అంధ బధిరలు లేని ఆ ప్రదేశంలో హెచ్‌ఎల్‌ఎస్‌లో చేరిన 'తొలి అంధ బధిర విద్యార్థి' గిర్మానే. అక్కడ పాఠాలు వినేందుకు డిజిటల్‌ రీడింగ్‌లను, బ్రెయిలీ డిస్‌ప్లేను ఉపయోగించింది. సోక్రటిస్‌ పద్ధతిలో వేగవంతంగా అర్థం చేసుకునే తర్కాన్ని అవపోశన పట్టింది. 

    అలాగే తరగతిగది చర్చలను వాయిస్‌ ట్రాన్స్‌లిటర్ల సాయంతో తన ఇయర్‌ఫోన్‌లో వినిపించేలా ఒక వ్యవస్థను రూపొందించింది. అలాగే ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాలలో ప్రజలు నేరుగా తనకు చెప్పలేని వాటిని టైప్‌ చేసేందుకు బ్రెయిలీ డిస్‌ప్లేకు బ్లూటూత్‌ కీబోర్డుని జత చేసింది. ఇలా ఇన్ని సౌకర్యాలతో తాను లా చదివి ఉత్తీర్ణురాలయ్యా..మరి నాలాంటి మిగతా వాళ్ల పరిస్థితి ఏంటనే ఆమె మదిని తొలిచేస్తున్న ప్రశ్న అది. ఆ నేపథ్యంలోనే ఆమె లా అనంతరం బర్కిలీలోని డిసేబిలిటీ రైట్స్ అడ్వకేట్స్‌లో స్కాడెన్ ఫెలోగా చేరి, ఆ తర్వాత అక్కడ స్టాఫ్ అటార్నీగా పనిచేశారు. 

    పైగా అక్కడ వికలాంగులకు సాంకేతికత అందుబాటులో ఉంచేలా చేయడంలో సహాయ సహకారాలు అందించింది. అంతేగాదు వర్చువల్ వ్యాపారాలకు అమెరికన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ వర్తిస్తుందని వాదించారామె. దివ్యాంగులకు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా అన్నింట సాంకేతికత అందుబాటులో ఉండేందుకు కృషి చేశారామె. ఆమె కృషిని గుర్తించిన అమెరికా వైట్‌హౌస్‌ 2013లో ఆమెను ఛాంపియన్ ఆఫ్ చేంజ్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె పబ్లిక్ స్పీకర్‌గా, యాక్సెస్ అడ్వకేట్‌గా మారారు. 

    దివ్యాంగులకు విద్యను చేరువ చేసే సాంకేతికతను పొందడంలో ఉండే అడ్డంకులను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేశారామె. 2019లో తన ఆత్మకథ హబెన్: ది డెఫ్‌బ్లైండ్ వుమన్ హూ కాంకర్డ్ హార్వర్డ్ లా'ను ప్రచురించారు. ఇదే ఆమె తొలి పుస్తకం కూడా. అది వైకల్యం చుట్టూ ఉన్న ప్రజల భాషను మార్చేందుకు ఉపకరించింది. అంతేగాదు వికలాంగులు స్ఫూర్తికోసమే ఉన్నారనే భావనను గిర్మా పదే పదే వ్యతిరేకించేవారు. దానికి బదులుగా వాళ్లను గౌరవంగా బతికేలా సౌకర్యాలు అందివ్వండని విజ్ఞప్తి చేస్తోంది. 

    ఆమె పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ వ్యవస్థలలో దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినప్పుడు ప్రతిభ అసాధారణంగా ఉండదని, తాము కూడా మీలాంటి వాళ్లమనే భావన ఇరువురిలో కలుగుతుందని అంటోందామె. దయచేసి ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తోంది. పైగా తాను సవాళ్లను అధిమించిన గొప్ప వ్యక్తిని కాదని, సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో సాధారణ వ్యక్తులు సాధించిన విజయంగా పరిగణించండి చాలు అని అంటోంది. అంతేగాదు మనం మాత్రమే బలవంతులం అవ్వడం కాదు, అందరూ ఇదే కోవకు చెందుతారు అని గుర్తురెగండి అని కోరుతోందామె.

    (చదవండి: 98 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా బామ్మ..!)

     

     

  • పసిపిల్లలు సహజంగానే ముద్దుగా అనిపిస్తారు. వారి అమాయకపు మోము ఎవ్వరినైనా.. ఇట్టే కట్టిపడేస్తుంది. కొందరు చిన్నారులను చూడంగానే ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంటుంది కూడా. కానీ ఈ చిన్నారిని చూడగానే వాసుదేవ నందనుడు, ఆ నందగోపాలుడే గుర్తుకొస్తాడు. చిన్ని కృష్టుడిలా ముద్దుగా ఆకర్షిస్తున్న ఈ చిన్నారిని చూసి ఎవ్వరూ కళ్లు తిప్పుకోలేరు. 

    అంత అందంగా ముగ్ధమనోహరంగా ఉందా ఆ పాపాయి. ఆ జగన్నాథుడే మళ్లీ ఈ భువిపై ఇలా చిన్ని కృష్ణుడిలా అవతరించాడా అన్నంతగా అందంగా ఉంది ఆ చిన్నారి. ఆ చిన్నారి చిరునవ్వు నుంచి ఆడుకుంటున్న విధానం అన్ని చూస్తే..ఒక్కసారిగా మన కళ్లముందు శ్రీకృష్ణుడి బాల్య జ్ఞాపకాలు కదలాడతాయి. 

    అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనికి “అచ్చం చిన్ని కృష్ణుడిలాగే ఉన్నాడు!” అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. అంతేగాదు ఈ వీడియోకి వేలల్లో లైక్‌లు, వ్యూస్‌ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి మరి..!.

     

    (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!)

     

  • మే నెల ఇంకా రాకమునుపే ఎండలు మండిపోతున్నాయి. చైత్రంలోనే  చెమటలు పట్టేలా భానుడు భగభగలాడిస్తున్నాడు. ముఖ్యంగా ఈ వేడి గాల్పులకు పెద్దలు, చిన్నారులే అల్లాడిపోతుంటారు. ఉదయం ఏడింటి కల్లా చుర్రుమంటున్న సూర్యుడి తాపానికి చిన్నారులు తాళ్లలేక వాడిపోగా, పెద్దలు నిసత్తువతో ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు మన పూర్వీకులు ఎన్నో గొప్ప సహజసిద్ధమైన ఔషధ పానకాలను అందించారు. ఇప్పుడు చెప్పబోయే పానకంలో అలాంటి గుణాలే ఉన్నాయి. దీని ముందు  ఏ షెర్బత్‌లు, జ్యూస్‌లు నిలువలేవు. దీని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే విస్తుపోతారు. 

    వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానం. దీన్ని ఒడియా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. అచ్చం మన ఉగాది పచ్చడిలా వాళ్లు ఈ మారేడు పానకాన్ని తయారు చేసుకుంటారు. వాళ్ల సంవత్సరాది వైశాఖ మాసంలో వస్తుంది. వాళ్లకి అప్పుడు వసంతకాలం అన్నమాట. వాళ్లు కూడా మనలా ఈ రోజు నంచే చలివేంద్రాలు ఏర్పాటు చేసి లాంఛనంగా ఈ మారేడు పానం వితరణను ఆనవాయితీగా చేస్తుంటారు. వేసవి ప్రారంభానికి గుర్తుగా ఈ పానకం తయారు చేస్తారు ఒడియా ప్రజలు. ఇదెలా తయారు చేస్తారంటే..

    పండిన మారేడు పండును పగలగొట్టి, లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ గుజ్జులో తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి (లేదా మిక్సీ పట్టి) 15-20 నిమిషాలు నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని జల్లెడ (strainer) ద్వారా వడపోసి, పీచు, గింజలను వేరు చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి.ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి, చల్లటి నీరు లేదా ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చ. ఈ చల్లని పానీయం వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా ఆరోగ్యప్రదం కూడా. 

    ఆరోగ్య ప్రయోజనాలు..

    ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.

    వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

    యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. 

    మలబద్ధకాన్ని, ఎసిడిటీ సమస్యను దూరం చేస్తుంది. 

    మొటిమలను నివారిస్తుంది. 

    దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కేన్సర్‌ బారినపడకుండా రక్షిస్తుంది. 

    బాడీని హైడ్రేటెడ్‌ ఉంచుతుంది

    బరువుని అదుపులో ఉంచుతుంది. 

    అలాగే కంటి సమస్యలు, గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

     

    (చదవండి: weight loss Tips: ఏడు వారాలకే జూనియర్‌ ఎన్టీఆర్‌ 9 కిలోలు..!)

     

National

  • మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్‌లో  విషాదం చోటు చేసుకుంది. కోతులను తరమబోయి ఒక రిసార్ట్ ఉద్యోగి మరణించిన ఘటన దిగ్భ్రాంతి రేపింది. విద్యుత్ షాక్‌తో  అక్కడి కక్కడే మరణించాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    పోలీసుల కథనం ప్రకారం, ఖజురహో రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక రిసార్ట్ పైకప్పుపైకి కోతి వచ్చింది. దీంతో ఇనుప రాడ్‌తో కోతిని తరమడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో కోతిని భయపెట్టి, దాన్ని తరిమికొట్టడానికి రాడ్‌ను పైకి ఎత్తినప్పుడు, అది రిసార్ట్ పైకప్పుపై ఉన్న హై-వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది. 33 kV హై-టెన్షన్ తీగ కావడంతో తీవ్రమైన విద్యుదాఘాతానికి రాను రైక్వార్‌  చనిపోయాడు. ఖజురహో నివాసి అయిన  రాను ఐదు రోజుల క్రితమే ఆ రిసార్ట్‌లో చేరాడు.

    బమితా పోలీస్ స్టేషన్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం  తరలించారు. రిసార్ట్ పైకప్పుకు సమీపంలో హై-టెన్షన్ లైన్ ఉండటం నిబంధనలను ఉల్లంఘించిందా లేదా ఈ సంఘటన రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని బమితా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ వాల్మీకి చౌబే తెలిపారు. 

    ఇదీ చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

     రిసార్ట్ యజమాని జయ్ తివారీ మాట్లాడుతూ, కోతిని తరిమికొట్టే ప్రయత్నంలో ఈ విషాద సంఘటన జరిగింది. రిసార్ట్ పైనుంచి నేరుగా 33 కేవీ రైల్వే లైన్ వెళుతుంది. దానిని తరలించడానికి అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, రైల్వే అధికారులు తొలగించడానికి నిరాకరించారు. మృతుడికిను రైక్వార్‌కు ఇద్దరు చిన్న పిల్లలన్నారని తెలిపారు. 

  • ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. బిల్లులో ఈ విషయం స్పష్టంగా ఉందన్న సమాచార శాఖ.. పార్లమెంట్‌ చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని తెలిపింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిలిమిటేషన్‌ ఉంటుందన్న అపోహలను కేంద్రం కొట్టిపారేసింది. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    తమిళనాడులో 58కి, కేరళంలో 30కి పెరుగుతాయన్న కేంద్రం.. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గవని తెలిపింది. రాష్ట్రాలకు చట్టబద్ద రక్షణ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులోని అంశాలను ముక్కలుగా చదవి విశ్లేషించొద్దని కేంద్రం పేర్కొంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్‌సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    డీలిమిటేషన్‌ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్‌ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఇప్పటికే తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి.

    రేపటి (ఏప్రిల్‌ 16, గురువారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్‌తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.

     

  • సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్‌ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్‌లో ఉద్యోగి.

    ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.

    దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

  • న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం తీసుకొస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ స్వార్థంతో డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చారు. డీలిమిటేషన్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం మద్దతు ఇస్తాం. ప్రభుత్వం విపక్షాలను అణగదొక్కాలని చూస్తోంది’ అని అన్నారు.

    రేపటి నుంచి పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. లోక్‌సభలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ఈ బిల్లులపై చర్చ, ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 18 గంటల సమయం కేటాయించారు.

    రాజ్యసభలో ఏప్రిల్ 18న చర్చ, ఓటింగ్ జరగనుంది. అక్కడ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. అదనంగా, ఏప్రిల్ 16, 17 తేదీల్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎన్నికపై కూడా చర్చ జరగనుందని సమాచారం.

  • సాక్షి,పట్నా: బిహార్‌ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత,సమ్రాట్ చౌదరి బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి బిహార్‌లో తొలి ముఖ్యమంత్రి ఈయనే కావడం విశేషం. ఆయనతో పాటు, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కు చెందిన విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

    విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. అయితే నూతన సీఎం సమ్రాట్ చౌదరి ఆస్తులు, విద్యార్హతలపై నెట్టింట ఆసక్తి  నెలకొంది.

    ఆస్తుల వివరాలు
    సమ్రాట్ చౌదరి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన రూ.9.29 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉండగా, ఆయన సతీమణి మమతా కుమారి రూ.2.01 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. వీరిద్దరి చర, స్థిరాస్తుల మొత్తం విలువ కలిపి  మొత్తం రూ.11.31 కోట్లకు పైమాటే. గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఆయన చరాస్తులు మరియు స్థిరాస్తుల వివరాలను అందించారు.  దీని ప్రకారం  తారాపూర్ ఎమ్మెల్యే అయిన సమ్రాట్ చౌదరి కుటుంబం వద్ద రూ. 1,71,550 నగదు ఉంది. అఫిడవిట్‌లో తనకు ఎలాంటి అప్పులు లేవని చౌదరి ప్రకటించారు.

     ఈ దంపతుల పేరిట బ్యాంకు డిపాజిట్లు మొత్తం రూ.27 లక్షలు ఉండగా, ఒక్కొక్కరి వద్ద రూ.20 లక్షల విలువైన బంగారం ఉంది. అంతేకాకుండా, వీరి వద్ద రూ.75,000 విలువైన వెండితో పాటు, షేర్లు, బాండ్లు , మ్యూచువల్ ఫండ్లలో రూ.32 లక్షల విలువైన పెట్టుబడులు కూడా ఉన్నాయి.

     

    విద్యార్హతలు, వివాదాలు
    సమ్రాట్ చౌదరి విద్యా అర్హతలు చర్చనీయాంశంగా మారాయి. బిహార్‌లోని ముంగేర్ జిల్లా, లఖన్‌పూర్ గ్రామంలో 1968 నవంబర్ 16న జన్మించారు. ఆయన తండ్రి శకునీ చౌదరి కూడా బిహార్‌లో సీనియర్ నాయకుడు. రికార్డుల ప్రకారం ఆయన తమిళనాడులోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి ప్రీ-ఫౌండేషన్ కోర్సు (PFC) పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు, ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్లు (కొన్నిసార్లు) సాహిత్యంలో డాక్టరేట్ (డి.లిట్.) ఉందని పేర్కొంటుండగా, ప్రశాంత్ కిషోర్ వంటి ప్రతిపక్ష నాయకులు ఆయన పదో తరగతి పరీక్షలోకూడా ఉత్తీర్ణుడు కాలేదని ఆరోపించారు.

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది. అరెస్టు అయిన ఉద్యోగులలో ఒకరి భార్య  సంచలన వ్యాఖ్యలు చేసింది.

    ఈ కేసులో ప్రధాన నిందితుడు డానిష్ షేక్  భార్య  ఫిర్యాదుదారులలో ఒక మహిళకు, తన భర్తకు మధ్య ఉన్న చెడిపోవడంతోనే ఈ పరిమాణానికి దారి తీసిందని, అదే ఇతరుల జీవితాలను నాశనం చేసిందని ఆరోపించింది ఈ కేసులో తన భర్తతో సహా ఇతర పురుషులందరూ నిర్దోషులని, వేర్వేరు సమస్యలు, కేసులను కలిపివేశారని ఆమె ఆరోపించింది.


    నిందితుడి భార్య సంచలన ఆరోపణలు
    కేవలం వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం విఫలం కావడంవల్ల తలెత్తిన వివాదమని ఆమె పేర్కొంది. డానిష్ షేక్‌, బాధితురాలిగా చెబుతున్న మహిళకు మధ్య సంబంధం ఆఫీసులో అందరికీ తెలుసంటూ ఆమెపై పలు  ఆరోపణలు చేసింది. ఆ మహిళ తన భర్త (నిందితుడు) కోసం గంటల తరబడి వేచి చూసేదని, ఆమె అతనిపై ఇష్టంతోనే తన ఆహార్యాన్ని, అలవాట్లను మార్చుకుందని ఆరోపించారు.ఉపవాసాలు చేయడం, దుస్తులు మార్చుకోవడం  లాంటి  ప నులెన్నో చేసిన తన భర్తకు ఆకర్షించిదని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కలత చెందారని ఆమె పేర్కొంది. ఆ సంబంధం ముగిసిన తర్వాత, ఫిర్యాదుదారురాలి తల్లిదండ్రులు కొంతమంది రాజకీయ నాయకులను సంప్రదించి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని ఇతర పురుషుల పేర్లను కూడా చేర్చి పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆమెను ఒప్పించారని ఆమె ఆరోపించింది.

    కేసు పూర్వాపరాలు, అరెస్టుల పర్వం
    పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి తన సహోద్యోగి ఒకరు తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళా ఉద్యోగి ఆరోపించడంతో ఈ కేసు ప్రారంభమైంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ఇలాంటి అనుభవాలే ఎదురైన మరో ఏడుగురు మహిళలు ముందుకు రావడంతో ఈ కేసు మరింత ముదిరింది.మొత్తం 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో, 8 మంది ఉద్యోగులపై మొత్తం 9 FIRలు నమోదయ్యాయి.

    ఇప్పటివరకు 7 గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా మెమోన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ ,ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్ ఉన్నారు. ప్రధానంగా రేప్, మానసిక , లైంగిక వేధింపులతో మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు సంచలనం రేపాయి. అలాగే ఫిర్యాదులను పట్టించుకోలేదనే కారణంతో HR ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్‌పై కూడా కేసు నమోదైంది.

    ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులందరినీ టీసీఎస్‌ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ COO ఆర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమగ్ర అంతర్గత విచారణకు ఆదేశించారు. 

    ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్‌ : తీవ్ర ఘర్షణ, కట్‌ చేస్తే!

    సిట్‌ విచారణ
    ఈ కేసు తీవ్రత దృష్ట్యా నాసిక్ పోలీసులు ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కేవలం ఒక మహిళా ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు, విచారణ కొనసాగుతున్న కొద్దీ మరికొంతమంది బాధితులు ముందుకు రావడంతో మరింత విస్తృతమైంది.ఈ కేసులో ఒకవైపు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు, మరోవైపు వ్యక్తిగత కక్షలనే వాదనలు వినిపిస్తుండటంతో సిట్  విచారణ కీలకంగా మారింది.

    ఇదీ చదవండి: ఎల్‌పీజీ యథాస్థితికి రావాలంటే ఎన్నే‍ళ్లు పడుతుందో తెలుసా?

    నిదా ఖాన్‌పై ఆరోపణలు
    బాధితుల నుండి వచ్చిన 70కి పైగా ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, హెచ్‌ఆర్ మేనేజర్  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) వాటిని పట్టించుకోలేదని  సిట్‌ వెల్లడించింది. కార్యాలయంలోని లైంగిక వేధింపుల నివారణ (పోష్) కమిటీలో సభ్యురాలిగా ఉన్నప్పటికీ, ఫిర్యాదులను  పక్కన పెట్టి, నిందితులను రక్షించడానికి ప్రయత్నించిన హెచ్‌ఆర్ మేనేజర్ నిదాఖాన్‌ను పోలీసులు కీలక 'సూత్రధారి'గా గుర్తించారు. నిందితుల మధ్య జరిగిన సుమారు 78 అనుమానాస్పద కాల్ రికార్డులు, ఈమెయిళ్లు, చాట్ సంభాషణలతో సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆర్థిక లావా దేవీలు జరిగినట్లు కూడా అనుమానిస్తున్నారు. 

  • ఢిల్లీ: సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.70గా నమోదైంది. గతేడాది 93.66 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 94.99శాతం ఉండగా బాలురుది 92.69శాతంగా ఉంది. 

    ప్రాంతాల వారీగా చూస్తే త్రివేండ్రం అత్యధికంగా 99.79శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సంస్థల వారీగా చూస్తే కేంద్ర విద్యాలయాలు (KV) అత్యుత్తమ ఫలితాలను సాధించాయి. వీటి ఉత్తీర్ణత శాతం 99.57శాతంగా నమోదైంది. ఫలితాల తర్వాత సప్లమెంటరీ పరీక్షలు మే మధ్యలో ప్రారంభం కానున్నాయి. అలాగే లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ విండో ఏప్రిల్ 16 నుండి 20 వరకు అందుబాటులో ఉంటుంది.
     
    గతంలో ఫలితాల సమయంలో వెబ్‌సైట్లు మొరాయించడం, సర్వర్లు డౌన్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యేవి. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకునేలా డిజీలాకర్‌, ఉమాంగ్‌ యాప్స్‌లలో అందుబాటులోకి తెచ్చింది. తద్వారా విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే కేవలం నిమిషాల వ్యవధిలో స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

     

  • ఇరాన్‌ వార్ నేపథ్యంలో  ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది.  భారతదేశంలో కూడా ఎల్పీజీ దిగుమతుల్లో కష్టాలు, నష్టాలు, అధిక ఖర్చులు, సరఫరా అంతరాయాలు లాంటి సమస్యలు తప్పడం లేదు ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి చర్యలు ఇంకా ఒక కొలిక్కి‌ రాని  నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు  ఎంత కాలం పట్టవచ్చు? ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వత నష్టం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది?  

    ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి నాలుగు ఏళ్లు పట్టవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న దిగుమతి నష్టాలు, వ్యయ ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, ప్రభావిత సరఫరాదారుల నుండి అందిన సమాచారం ప్రకారం, పునరుద్ధరణకు కనీసం మూడేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆ అధికారి పేరు వెల్లడించకుండా తెలిపారు.

    మరోవైపు  దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. దొరుకుతుందా లేదా అనే ఆందోళన ప్రజల్లో రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. నిల్వలు కేవలం 15 రోజుల డిమాండ్‌కు మాత్రమే సరిపోతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో నష్టం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

    ఇండియా- సవాళ్లు
    భారతదేశం తన ఎల్పీజీ సరఫరాల కోసం పశ్చిమ ఆసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది.  తన మొత్తం వినియోగంలో 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం, ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల కారణంగా ఆ సరఫరాలు దెబ్బతిన్నాయి.

    ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో  ప్రస్తుత సంక్షోభంతో  ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.  హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా గతంలో 90 శాతం దిగుమతులు ఈ మార్గం ద్వారానే వచ్చేవి. యుద్ధ వాతావరణం వల్ల మార్చి 24 నాటికి ఇది 55 శాతానికి పడిపోయింది. రూబిక్స్ డేటా సైన్సెస్ , వయానా ట్రేడ్‌ఎక్స్‌ఛేంజ్ ఏప్రిల్ నివేదిక ప్రకారం, దారి మళ్లించినా,ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సరఫరాలో 40-50 శాతం వరకు ఉండవచ్చు.

    15 రోజులకు మాత్రమే నిల్వ సామర్థ్యం
    దేశంలో  సరిపడా ఎల్‌పీజీని  నిల్వ చేసుకునే  సామర్థ్యం కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం.  ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌  దాడులు మొదలైనప్పటినుంచీ 14.2 కేజీల   డొమెస్టింగ్‌ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర  రూ. 115 పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై  భారం తీవ్రంగా పడుతోంది. అలాగే చమురు కంపెనీలపై సబ్సిడీ ఒత్తిడి పెరుగుతోంది.

    ప్రభుత్వ చర్యలు
    సరఫరా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలపై దృష్టి సారిస్తోంది.  కోవిడ్ సమయంలో అనుసరించిన పద్ధతుల్లో ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడంతోపాటు, స్థానిక ఉత్పత్తిపై దృష్టి సారించింది. రిఫైనరీల ద్వారా వంట గ్యాస్‌  ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది.  తద్వారా గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సరఫరాలో  ఇబ్బంది కలగకుండా ఉండాలని   భావిస్తోంది.

     (ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాకు మరో షాక్‌!)

    గల్ఫ్ దేశాలపై ఆధారపడటం
    2025 ఆర్థిక సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఎల్‌పీజీ వినియోగానికి  92 శాతాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ , ఒమన్ దేశాలు కలిసి సరఫరా చేశాయి. ఇరాన్ దాడుల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొన్న యూఏఈ, దిగుమతులలో 41 శాతం వాటాను కలిగి ఉండగా, ఖతార్ 22 శాతం వాటాను కలిగి ఉంది అక్కడ యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి, చివరికి వినియోగదారునిపై భారం పడుతోంది.

    ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్‌ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా?

  • ఆమ్ ఆద్మీ పార్టీ (AAP),  పంజాబ్‌కు చెందిన ఎంపీ రాఘవ్ చద్దాకు మరో  ఎదురుదెబ్బ  తగిలింది.  రాజ్యసభలో తమ పార్టీ ఉప నాయకుడి పదవి నుండి తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం  ఆయనకు కల్పిస్తున్న 'Z+' శ్రేణి భద్రతను ఉపసంహరించుకోవడం వార్తల్లో నిలిచింది. 

    ఎన్‌డీటీవీ రిపోర్ట్‌ ప్రకారం  రాఘవ్‌ చద్దాకు, ఆప్‌తో   పెరుగుతున్న, తీవ్రమైన విభేదాల పరంపరలో ఈ తాజా చర్య చోటుచేసుకుంది. 37 ఏళ్ల చద్దా భద్రత కోసం నియమించిన పంజాబ్ పోలీసు అధికారులు, సిబ్బందిని వెంటనే ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

     ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్‌ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా?

    కాగా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి చద్దా వెనుకంజ వేస్తున్నారని, అవసరమైన సమయాల్లో పార్టీకి అండగా  మాట్లాడటం లేదనే ఆరోపణలతో ఏప్రిల్ 2న ఆయన్ను రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుండి తొలగించింది. అయితే పార్టీ ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా  కొట్టిపారేసిన చద్దా, తాను పార్లమెంటుకు వెళ్ళింది ప్రజల సమస్యలను లేవనెత్తడానికే తప్ప, గొడవలు సృష్టించడానికి కాదని, పార్టీకి ప్రతీ సందర్భంలోనూ మద్దతుగా  నిలిచానని వివరణ ఇచ్చారు. 

    ఇదీ చదవండి: సముద్రంలో ఘోర ప్రమాదం : 250 మంది గల్లంతు

  • ఉదయం అల్పాహారం  అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ, దోసె.  మీకు కూడా  దోసె తినడం ఇష్టమా? అయితే, ఒక ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్  కీలక హెచ్చరిక చేస్తున్నారు మార్నింగ్‌ ప్లైన్ దోసె (Plain Dosa) తినడం మానేయమని ప్రజలను కోరుతున్నారు. అయితే దోసె అనారోగ్యకరమైందా? ఎలా తినాలి?  తెలుసుకుందాం.

    ప్రధానంగా దక్షిణ భారతదేశంలో   దోసె అనేది ఒక  ఎమోషన్‌. రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే తేలికైన, పోషకమైన టిఫిన్‌ అనుకుంటాం. కొందరు ఉపవాసాల సమయంలో, మరికొందరు బరువు తగ్గించుకునే  డైట్‌లో కూడా దీన్ని చేర్చుకుంటారు. అయితే ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. బరువు తగ్గాలనుకుంటే అల్పాహారంలో దోసె తినడం మానుకోవాలని ఇటీవల ఒక వీడియోలు పేర్కొన్నారు. విచిత్రంగా అనిపిస్తోందా? దీనికి గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు.

    దోశలో స్వతహాగా అనారోగ్యకరమైనదేమీ లేదు.. అది కేవలం బియ్యం, మినపపప్పును పులియబెట్టి తయారు చేస్తారు. సాంబార్ కూడా ఒక పప్పు పదార్థమే కాబట్టి దానిలో అరోగ్యకరమే .అసలు సమస్య అది కడుపు నింపే గుణం విషయంలోనే ఉందని సింగ్ వెల్లడించారు.

    దోసె సులభంగా జీర్ణమైనప్పటికీ, గంటలోపే  ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువ కావడంతో అదనపు కేలరీలను తీసుకుంటాం అని సింగ్‌ చెప్పారు. దాన్నే ‘హై గ్లైసెమిక్ రెస్పాన్స్’ అంటారు. దోసె తిన్న వెంటనే,  రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతుంది. వెంటనే ఆకలి వేయడానికి కారణం ఇదేనట. మితంగా తినాలి. వెంటనే దోసెకు చెక్‌  పెడదాం అనుకుంటున్నారా. ఆగండాగండి. ఈ సెలబ్రిటీ ట్రైనర్ దగ్గర ఒక పరిష్కారం ఉంది. కడుపు నిండింది అనే ఫీలింగ్‌ రావడానికి దోసె లోపల రుచికరమైన ఫిల్లింగ్‌ను జోడించుకోమని సూచిస్తున్నారు. అంటే తురిమిన పనీర్‌ దట్టించిన దోసె కానీ,  మసాలా   దోసె గాని తీనమని సలహా ఇచ్చారు.

     

    మరి దోసె ఆరోగ్యకరమైందేనా? 
    ఆరోగ్యకరమైందే.  కానీ మితంగా తినాలి. పులియబెడతాం కాబట్టి, కడుపుకు తేలికగా ఉంటుంది, శక్తి కోసం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. అధిక కేలరీలు గల చట్నీలకు బదులుగా సాంబార్ వంటి ఆరోగ్యకరమైన సైడ్ డిష్‌లతో కలిపి తీసుకుంటే మంచిది. మినప పప్పు  కలుస్తుంది కాబట్టి  కొంత ప్రోటీన్ ఉంటుంది. దీంతోపాటు సాంబార్‌తో కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఇంకా పెరుగుతుంది. పులియబెట్టడం ఇతర అల్పాహారాలతో పోలిస్తే దోస సులభంగా జీర్ణమవుతుంది.  మరీ సాదా దోసెలాగా కాకుండా పనీర్‌, కార్న్‌, మసాలా మష్రూమ్‌ లాంటివి యాడ్‌ చేసుకుంటే కడుపూ నిండుతుంది. ఎక్కువ సేపు ఆకలీ వేయదు. 

  • తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం ప్రారంభమైంది. దేశ సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షాత్మక విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఏర్పడిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. డిలిమిటేషన్‌ను ప్రస్తుతం వెంటనే అమల్లోకి తీసుకురాకూడదని, దక్షిణాది రాష్ట్రాల వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.

    ఆ ప్రకటనలో కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ డిలిమిటేషన్ అంశంపై స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు:“దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మేము సహించము. మా హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో పోరాటం చేస్తాము.”దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయని, కానీ ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ, విధానాల అమలు విషయంలో జరుగుతున్న వివక్షను ఇకపై సహించబోమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతం కోసం కాకుండా — సమానత్వం, న్యాయం, ఫెడరల్ స్ఫూర్తి కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.“దక్షిణాది ఒకటైతే దేశ రాజకీయ దిశ మారుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది వివక్షపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు.

    దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న మొత్తం ఎంత, తిరిగి వాటికి లభిస్తున్న వాటా ఎంత అనే ప్రశ్న నేపథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి దక్షిణాది హక్కుల పరిరక్షణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.

    అందులో భాగంగా హోసూర్‌లో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా డిలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగడంలో అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజలందరూ ఉప్పొంగే తరంగంలా ముందుకు వచ్చి ఉద్యమానికి సిద్ధం కావాలని, రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పిలుపునిచ్చారు.

  • చెన్నై: మోదీ స‌ర్కారు త‌ల‌పెట్టిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌రోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా గురువారం రాష్ట్ర‌ వ్యాప్తంగా న‌ల్ల‌జెండాలు ఎగుర‌వేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రిగితే స‌హించ‌బోమ‌ని మ‌రోసారి తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. బుధవారం ఈ మేర‌కు ఎక్స్‌లో వీడియో సందేశం విడుద‌ల చేశారు.

    "నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్‌కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గ‌ళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర‌ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ త‌న సందేశంలో పేర్కొన్నారు.

    ఎంపీల‌తో అత్య‌వ‌స‌ర భేటీ
    నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో డీఎంకే ఎంపీల‌తో స్టాలిన్ ఈ రోజు ఉద‌యం అత్య‌వ‌స‌ర భేటీ నిర్వ‌హించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో త‌మ పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి ఎంపీల‌తో ఆయ‌న‌ చ‌ర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. 

    కేంద్రానికి మరోసారి సీఎం స్టాలిన్ హెచ్చరిక

    స్టాలిన్‌కు ఓట‌మి భ‌యం: అన్నామ‌లై
    స్టాలిన్ వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు, జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు అన్నామ‌లై స్పందించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో స్టాలిన్ ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. డీలిమిటేష‌న్ అంశాన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వివాదం చేస్తున్నార‌ని ఆరోపించారు. కోయంబ‌త్తూరులో అన్నామ‌లై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వ‌ర‌గా అమ‌లు చేయాల‌ని త‌మిళ‌నాడు మ‌హిళ‌లు కోరుకుంటున్నారని చెప్పారు. త‌మిళ‌నాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని, డీఎంకే ప్ర‌భుత్వం పోవాల‌ని భావిస్తున్నార‌ని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి ముఖ్య‌మంత్రి అవుతార‌ని జోస్యం చెప్పారు. 

      చ‌ద‌వండి: గెలిస్తే ఏఐ యూనివ‌ర్సిటీ, మంత్రిత్వ శాఖ‌

Telangana

  • సాక్షి, ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జావిద్‌ మృతి చెందారు. ఖమ్మం- హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జావీద్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్‌ పోలీసులు..  రూరల్ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.

    భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి
    జావిద్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేవన్నారు. జావిద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గత పది సంవత్సరాల పాటు పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని గుర్తు చేశారు. 

    ఖమ్మం నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన సానుభూతి తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. నగరంలోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులో నగదు డిపాజిట్‌ కోసం వచ్చిన రిటైర్డ్‌ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి.

    హబ్సిగూడ బ్యాంక్‌కు వచ్చిన నాచారానికి చెందిన లక్ష్మినారాయణ.. పీన్‌ఎన్‌బీ బ్యాంక్‌లో డిపాజిట్‌ ఫారం నింపుతుండగా గుండెపోటుకు గురయ్యారు. బ్యాంక్‌ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.


     
     

     

  • ఆదిలాబాద్‌టౌన్‌: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్‌ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్‌ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్‌ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్‌ థియేటర్‌లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్‌ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్‌ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్‌ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్‌ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.

    ‘లైక్‌’ల కోసం..
    ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్‌ వైద్యులు, వారి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్‌చల్‌ కావడంతో రిమ్స్‌లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్‌’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్‌ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్‌ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ను ఫోన్‌లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.