Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి  అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చడానికి  ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ నుండి అధికారులు కింది స్థాయి సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

    ఈ సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ ఆర్టీసీ బస్ స్టేషన్ లో అధిక రద్దీ కారణంగా క్యూలైన్ లలో ప్రయాణికులు  ఇబ్బందులపై  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క తో పాటు డీజీపీ,ఆర్టీసీ ఎండీ ,జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్తితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

    ప్రయాణికులను మేడారం తీసుకొస్తున్న బస్సులు కొద్దిసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల  మేడారం బస్ స్టేషన్ లో గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా మంత్రికి పోలీసులు సూచించారు. దీంతో వెంటనే వాటిని క్లియర్ చేసి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలని క్లియరెన్స్ చేస్తూ వాహనాల వేగాన్ని పెంచాలని  ఈ సందర్భంగా మంత్రి వారికి  సూచించారు.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి  సిట్‌ నోటీసులు జారీ చేసింది.   ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణను ఎర్రవల్లిలోని తన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించాలని కోరిన బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తిని సిట్‌ తిరస్కరిచింది. నివాసంలో కేసీఆర్‌ను విచారించనుంది. 

    ఈ మేరకు  శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 1 మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌ నందినగర్‌ నివాసంలో విచారణ చేపడతామని తెలిపింది. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

  • నిజామాబాద్ : నిజామాబాద్‌ మున్సిపల్ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు కోట్లలో ఆస్తి పన్ను చెల్లించారు. రూ. 8 కోట్లకు పైగా ఆస్తి పన్ను చెల్లించారు కాంగ్రెస్‌ అభ్యర్థి. 2009 నుంచి ఆస్తి పన్ను బకాయిపడ్డారు సదరు అభ్యర్థి.  అయితే ఎన్నికల బరిలో ఉండటంతో నో డ్యూస్‌ కోసం బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

    దాంతో ఒకేసారి పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించారు. 8 కోట్ల 16 లక్షల 65 వేల రూపాయిలను ఆస్తి పన్ను రూపంలో చెల్లించారు. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు చెల్లించడంతో కార్పొరేషన్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అదే సమయంలో వందలాది మంది అభ్యర్థులు పన్ను బకాయిలు చెల్లించారు. ఒక్క కార్పొరేషన్‌లోనే రూ. రూ. 8.5 కోట్లకు పైగా బకాయిల వసూలైనట్లు తెలుస్తోంది.   

    కాగా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.

    రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.

    ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారుల వద్ద సమర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయంలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్వీకరించారు.

    రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ పై అప్పీల్ చేసుకున్న అభ్యర్థుల కేసులను ఫిబ్రవరి 2న అధికారులు పరిశీలించనున్నారు.

    ఫిబ్రవరి 3వ తేదీ నాటికి ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజున తుది అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల పోరాటంలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టతకు వస్తుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 
     

  • సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్‌ సీపీ గౌస్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది

    ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్‌ సీపీ గౌస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సీపీ గౌస్‌ మత మార్పిడులపై పాల్పడుతున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. కౌషిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారం. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. 

    గురువారం కరీంనగర్‌ జిల్లాలోని వీణవంక స్థానిక సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్తున్న పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో కలిసి వెళ్తున్న తమని పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాడి కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కరీంనగర్‌ సీపీ గురించి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కొద్ది సేపటి క్రితం ఐపీఎస్‌ అధికారుల సంఘం ఖండించింది. క్షమాపణ చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

     

Sports

  • వడోదర: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌ ‘ఎలిమినేటర్‌’కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ 11 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. లీగ్‌ చరిత్రలో ముంబైతో తలపడిన ఎనిమిది సార్లూ ఓటమి చవి చూసిన గుజరాత్‌ 9వ ప్రయత్నంలో తొలిసారి గెలుపు రుచి చూసింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి, 3 ఓడిన గుజరాత్‌ 10 పాయింట్లతో రెండో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 

    టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. యాష్లీ గార్డ్‌నర్‌ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జార్జ్‌ వేర్‌హామ్‌ (26 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించగా... అనుష్క శర్మ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సోఫీ డివైన్‌ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) రాణించారు. 

    అమేలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులే చేయగలిగింది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (48 బంతుల్లో 82 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి వరకు పోరాడినా... విజయం మాత్రం దక్కలేదు. ఆఖరి 2 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, హర్మన్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 24 పరుగులు రాబట్టగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా... ఎలిమినేటర్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ముంబైకి ఇంకా ఉన్నాయి. 

    నేడు విశ్రాంతి దినం. ఆదివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కచి్చతంగా గెలవడంతోపాటు రన్‌రేట్‌లో ప్రస్తుతం తమకంటే (–0.164) ఎంతో ముందున్న ముంబైను (+0.059) కూడా దాటాల్సి ఉంటుంది.   

    స్కోరు వివరాలు  
    గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) సజన (బి) షబ్నిమ్‌ 5; సోఫీ డివైన్‌ (సి) కెర్‌ (బి) సివర్‌ బ్రంట్‌ 25; అనుష్క (సి) షబ్నిమ్‌ (బి) కెర్‌ 33; గార్డ్‌నర్‌ (స్టంప్డ్‌) ఫిర్దోస్‌ (బి) కెర్‌ 46; వేర్‌హామ్‌ (నాటౌట్‌) 44; భారతి (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–21, 2–69, 3–71, 4–142. బౌలింగ్‌: షబి్నమ్‌ 4–0–29–1, సివర్‌ బ్రంట్‌ 4–0–36–1, వైష్ణవి 2–0–21–0, అమన్‌జోత్‌ 2–0–13–0, అమేలియా కెర్‌ 4–0–26–2, మాథ్యూస్‌ 4–0–40–0.  

    ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సజన (సి) భారతి (బి) కాశ్వీ 26; మాథ్యూస్‌ (బి) డివైన్‌ 6; సివర్‌ బ్రంట్‌ (సి) అనుష్క (బి) డివైన్‌ 2; హర్మన్‌ప్రీత్‌ (నాటౌట్‌) 82; అమేలియా కెర్‌ (సి) మూనీ (బి) వేర్‌హామ్‌ 20; అమన్‌జోత్‌ (స్టంప్డ్‌) మూనీ (బి) రాజేశ్వరి 13; సంస్కృతి (ఎల్బీ) (బి) వేర్‌హామ్‌ 0; పూనమ్‌ (సి అండ్‌ బి) గార్డ్‌నర్‌ 2; ఫిర్దోస్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–23, 2–33, 3–37, 4–82, 5–126, 6–127, 7–155. బౌలింగ్‌: రేణుక సింగ్‌ 2–0–11–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–12–1, రాజేశ్వరి గైక్వాడ్‌ 4–0–46–1, సోఫీ డివైన్‌ 4–1–23–2, జార్జియా వేర్‌హామ్‌ 4–0–26–2, యాష్లీ గార్డ్‌నర్‌ 3–0–26–1, తనూజ 1–0–11–0. 

  • డబ్ల్యూపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్‌ (44 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది. 

    భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో బెత్‌ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్‌ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్‌ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (4-0-29-1), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు. 

    హేలీ మాథ్యూస్‌ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.  ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 

    ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్‌ల కోసం గుజరాత్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్‌ 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో టేబుల్‌ చివరి స్థానంలో ఉంది. 
     

  • అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు ఫైసల్‌ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 163 పరుగులు చేశాడు. ఫైసల్‌తో పాటు కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ (89) కూడా సత్తా చాటడంతో  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

    అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్‌ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్‌ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్‌ గ్రూప్‌ 1 (సూపర్‌ సిక్స్‌) నుంచి సెమీఫైనల్‌ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్‌ ఖరారు చేసుకుంది. 

    ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్‌ రేసులో ఉండిన శ్రీలంక  టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌ నుంచి వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్‌-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్‌ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో బెర్త్‌ కోసం భారత్‌, పాకిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.

    ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారీ శతకం బాదిన ఫైసల్‌ షినోజాదాపై సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ జరుగుతుంది. ఫైసల్‌ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్‌-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. 

    సాధారణంగా పాకిస్తాన్‌ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్‌ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్‌ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు. 

  • ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ 2026కు సర్వం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటుండగా.. అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల పూర్తి వివరాలను ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో చూద్దాం.

    ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (సి), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్‌హాక్ ఫరూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదీన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, దర్విష్‌ రసూల్‌, ఇబ్రహీం జద్రాన్. 
    రిజర్వ్‌లు: AM ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.

    ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్‌, ఆడమ్‌ జంపా.

    కెనడా: దిల్‌ప్రీత్ బజ్వా (సి), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ బుట్టర్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తాత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్‌ శర్మ, శ్రేయాస్‌ మొవ్వ, యువ్‌రాజ్‌ సమ్రా.

    ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

    భారత్‌: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్‌.

    ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

    ఇటలీ: వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, JJ స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.

    నమీబియా: గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్‌మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్‌, డబ్యూపీ మైబుర్గ్‌, మ్యాక్స్‌ హెయింగో 
    రిజర్వ్: అలెగ్జాండర్ వోల్స్చెంక్.

    నేపాల్: రోహిత్ పౌడెల్ (సి), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్‌ మల్లా, లోకేశ్ బామ్‌.

    నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), కోలిన్ అకెర్‌మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాక్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్‌ వాన్‌డర్‌ మెర్వ్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌, సాకిబ్ జుల్ఫికర్.

    న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, కైల్ జామిసన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, బెన్ సియర్స్ (రిజర్వ్).

    ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితెన్ రామనంది, హస్నైన్ అలీ షా.

    పాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.

    స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్. రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్, మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.

    దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్ మరియు ట్రిస్టన్ స్టబ్స్.

    శ్రీలంక: దసున్ షనక (సి), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా, జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్ననాయక్, సహన్ అరాచిత్‌వెల్లంగా, రాంత్‌నిలంగా, రవాణి వాన్‌గే, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌, ట్రవీన్‌ మాథ్యూ

    యూఏఈ: ముహమ్మద్ వసీమ్ (సి), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిత్ ఖాన్, సోహైబ్ సింగ్, సిమ్రాన్‌జీత్ ఖాన్, సిమ్రాన్‌జీత్.

    యూఎస్‌ఏ: మోనాంక్ పటేల్ (సి), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మొహమ్మద్ మొహిసిన్‌, శుభమ్‌ రంజనే.

    వెస్టిండీస్: షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడన్‌ సీల్స్‌, రొమారియో షెపర్డ్‌.

    జింబాబ్వే: సికందర్ రజా (సి), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, రిచార్డాన్ మైగర్రాబనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన​్‌ మేయర్స్‌, రిచర్డ్‌ నగరవ, బ్రెండన్‌ టేలర్‌

  • మహిళల ప్రీమియర్ లీగ్‌-2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్‌లో ఇంకా కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ టోర్నీలో భాగంగా గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు మరో రెండు స్ధానాల కోసం నాలుగు జట్లు పోటీ పడతున్నాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

    పాయింట్ల పట్టికలో ఆర్సీబీ(12) అగ్రస్ధానంలో ఉంది. ఆ తర్వాత స్దానంలో గుజరాత్ జెయింట్స్‌(8 పాయింట్లు), ముంబై ఇండియన్స్‌(6), ఢిల్లీ క్యాపిటల్స్‌(6), యూపీ వారియర్స్‌(4) ఉన్నాయి.

    గుజరాత్ జెయింట్స్‌
    గుజరాత్ జట్టు శక్రవారం వడోదర వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మిగితా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఫలితం వరకు ఎదురు చూడాలి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోతే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది.

    ముంబై ఇండియన్స్‌
    గుజరాత్‌తో జరిగే మ్యాచ్ ముంబై జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే  పాయింట్ల పరంగా గుజరాత్‌తో సమంగా నిలుస్తోంది. అయితే గుజరాత్‌(-0.271) కంటే ముంబై(+0.146) రన్‌రేట్ మెరుగ్గా ఉన్నుందన హర్మన్ సేన ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

    ఢిల్లీ క్యాపిటల్స్‌
    జేమీమా రోడ్రిగ్స్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ విజయం సాధించాలి. అదేవిధంగా ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఫలితం కూడా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసును  ప్రభావితం చేస్తుంది. ఢిల్లీ రన్‌రేట్ ప్రస్తుతం -0.164 ఉంది. భారీ విజయం సాధిస్తేనే 2 పాయింట్లతో పాటు రన్‌రేట్ కూడా గణనీయంగా మెరుగపడుతోంది.

    యూపీ వారియర్స్‌
    ఇక యూపీ వారియర్స్ ప్లే ఆఫ్స్ చేరే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. యూపీ ఖాతాలో ప్రస్తుతం 4 పాయింట్లే ఉన్నాయి. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో యూపీ భారీ విజయం సాధించాలి. అలాగే ముంబై ఇండియన్స్ గుజరాత్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోవాలి. అప్పుడు 6 పాయింట్లతో ముంబై, యూపీ, ఢిల్లీ సమంగా నిలుస్తాయి. ఆ సమయంలో రన్‌రేట్ ఆధారంగా మూడింటిలో ఓ జట్టు ఫ్లేప్స్‌లో అడుగుపెడుతోంది

  • భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం 15 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టును ఇవాళ (జనవరి 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మోనాంక్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. గత ఎడిషన్‌లో (2024) ఆడిన 10 మంది ఆటగాళ్లు, ఈసారి కూడా చోటు దక్కించుకున్నారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చారు.

    యూఎస్‌ఏకు ఇది రెండో టీ20 ప్రపంచకప్‌. గత ఎడిషన్‌లో ఈ జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి, సూపర్‌-8కు కూడా అర్హత సాధించింది. ఈసారి కూడా యూఎస్‌ఏ సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. ఆండ్రీస్‌ గౌస్‌, మోనాంక్‌ పటేల్‌ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లుగా ఉన్నారు. బౌలింగ్‌లో నేత్రవల్కర్‌, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్ కీలకమయ్యే అవకాశం ఉంది.

    గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌ లాంటి జట్లతో పోటీపడాల్సి ఉన్న యూఎస్‌ఏ.. ఇదే గ్రూప్‌లోని నమీబియా, నెదర్లాండ్స్‌పై సంచలన విజయాలు సాధించే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి 7న టీమిండియా మ్యాచ్‌తో యూఎస్‌ఏ తమ రెండో ప్రపంచకప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

    టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం యూఎస్‌ఏ జట్టు..  
    మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.  

    గ్రూప్-ఏలో యూఎస్‌ఏ మ్యాచ్‌లు  
    - ఫిబ్రవరి 7: ఇండియా vs USA (ముంబై)  
    - ఫిబ్రవరి 10: పాకిస్తాన్ vs USA (కొలంబో)  
    - ఫిబ్రవరి 13: నెదర్లాండ్స్ vs USA (చెన్నై)  
    - ఫిబ్రవరి 15: నమీబియా vs USA (చెన్నై)  

     

  • టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందో అంచనా వేయడం​ కష్టం. ఎందుకంటే, తక్కువ వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. ఒక్క చిన్న తప్పిదం.. ఒక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేస్తుంది. ఇక్కడ చిన్న జట్టు, పెద్ద జట్టు అన్న తేడా పెద్దగా ఉండదు. 

    ఆ సమయానికి ఎవరిది పైచేయి అయితే, వారే మ్యాచ్‌ గెలుస్తారు. చిన్న జట్లతో పోలిస్తే పెద్ద జట్లే అధిక అంచనాల ఒత్తిడిలో ఉంటాయి. ఈ కారణంగానే ఫలితాలు తారుమారవుతాయి. పొట్టి ఫార్మాట్‌లో ఇలాంటి ఘటనలను తరుచూ చూస్తుంటాం.

    మెగా టోర్నీ అయిన ప్రపంచకప్‌ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఈ టోర్నీ తొలి ఎడిషన్‌ నుంచే ఇలాంటి సంచలనాలు నమోదవుతూ వచ్చాయి. త్వరలో ప్రారంభం కానున్న 2026 ఎడిషన్‌ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో నమోదైన టాప్‌-5 అతి పెద్ద సంచలనాలపై ఓ లుక్కేద్దాం.

    తొలి ఎడిషన్‌లోనే..!
    పురుషుల టీ20 ప్రపంచకప్‌ తొలి ఎడిషన్‌లోనే (2007) అతి పెద్ద సంచలనం నమోదైంది. కేప్‌టౌన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. జింబాబ్వే ఆటగాళ్లు బ్రెండన్ టేలర్ (60*), ఎల్టన్ చిగుంబురా (3/20) ఈ మ్యాచ్‌ హీరోలుగా నిలిచారు.

    ఇంగ్లండ్‌కు నెదర్లాండ్స్‌ షాక్‌
    రెండో ఎడిషన్‌లో (2009) మరో సంచలనం నమోదైంది. లార్డ్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై చిన్న జట్టు నెదర్లాండ్స్‌ 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం​ సాధించింది. ఇక్కడ గమనించదగ్గ మరో విశేషమేమిటంటే.. నెదర్లాండ్స్‌ ఇంగ్లండ్‌ను వారి స్వదేశంలోనే ఓడించడం. టామ్ డి గ్రోత్ (49), ర్యాన్ టెన్ డోషాటే (2/35) నెదర్లాండ్స్‌ హీరోలుగా నిలిచారు.

    పెను సంచలనాల ఎడిషన్‌
    2022 ఎడిషన్‌లో రెండు భారీ సంచలనాలు నమోదయ్యాయి. శ్రీలంకకు నమీబియా.. సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్‌ ఊహించని షాక్‌లు ఇచ్చాయి. నమీబియా తరఫున జాన్ ఫ్రైలింక్ (44), డేవిడ్ వీజ్, బెర్నార్డ్ స్కోల్జ్ (తలో 2 వికెట్లు) హీరోలుగా నిలువుగా.. నెదర్లాండ్స్‌ తరఫున కాలిన్ అకర్మాన్ (41*), బ్రాండన్ గ్లోవర్ (3/9) అద్భుతం చేశారు.

    పాక్‌ను మట్టికరిపించిన పసికూన
    2024 ఎడిషన్‌లో మరో పెను సంచలనం నమోదైంది. తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన యూఎస్‌ఏ.. బలాడ్యులమని విర్రవీగే పాక్‌కు కర్రు కాల్చి వాత పెట్టింది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ ఆటగాళ్లు మోనాంక్ పటేల్ (50), సౌరభ్ నేత్రవల్కర్ (2/18 + సూపర్ ఓవర్ ) అద్భుత ‍ప్రదర్శనలు చేసి యూఎస్‌ఏకు చారిత్రక విజయాన్ని అందించారు.  

    ఇదే ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు కూడా పెను సంచలనాలు నమోదు చేసింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా లాంటి మెగా జట్లకు షాకిచ్చి సెమీఫైనల్‌ వరకు వెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు త్వరలో ప్రారంభం కాబోయే 2026 ఎడిషన్‌లోనూ పెను సంచలనాలు సృష్టించే ఆస్కారం ఉంది. ఆఫ్ఘన్‌తో పాటు యూఎస్‌ఏ, నేపాల్‌ కూడా పెద్ద జట్లకు షాకిచ్చే అవకాశం ఉంది.  
     

  • టీ20 ప్రపంచకప్‌-2026కి మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి శ్రీలంక, భారత్ వేదికలగా షురూ కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 20 జ‌ట్లు పాల్గోనున్నాయి. ఈ 20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున ఉంటాయి. భారత్‌, పాక్‌ గ్రూప్‌-ఎలో పోటీపడనున్నాయి.

    ఆఖ‌రి నిమిషంలో బంగ్లాదేశ్ త‌ప్పుకోవ‌డంతో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవ‌కాశ‌మిచ్చింది. భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న యూఎస్ఎతో త‌ల‌ప‌డ‌నుంది.  సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

    అదేవిధంగా ర‌న్న‌ర‌ప్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి జ‌ట్లు కూడా ప‌టిష్టంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మెగా ఈవెంట్‌లో 300 పరుగుల భారీ మార్కును దాటే సత్తా ఉన్న జట్లు ఏవనే విషయంపై శాస్త్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

    "ఆస్ట్రేలియా, భార‌త జ‌ట్ల‌కు 300 ప‌రుగులు మార్క్ దాటే సత్తా ఉంది. ఈ రెండు రెండు జట్లలోనూ విధ్వంసం సృష్టించే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో ఎవరైనా ఒకరు సెంచరీ సాధిస్తే, జట్టు స్కోరు 300కు చేరువవ్వడం కష్టమేమీ కాదు. ఇక భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టైటిల్‌ను రిటైన్ చేసుకునేందుకు మెన్ ఇన్ బ్లూ ప్రయత్నిస్తుంది. 

    అంతుకుతోడు ఈ టోర్నీ సొంతగడ్డపై జరగుతోంది. కాబట్టి భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. టీ20 ఫార్మాట్‌లో పది నుంచి పదిహేను నిమిషాలు ఆట మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. ఆ సమయంలో భారత్ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుందన్నపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

    అయితే భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 300 పరుగులు పైగా చేసిన ఏకైక జట్టుగా ఇంగ్లండ్‌ కొనసాగుతోంది.
     

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2026లో సంచలనం నమోదైంది. మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలో స్థానిక జోడీ ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ టైటిల్‌ గెలిచింది. ఇదే జోడీ గతేడాది కూడా టైటిల్‌ ఎగరేసుకుపోయింది. తద్వారా వరుసగా రెండు ఎడిషన్లలో టైటిల్‌ గెలిచిన జోడీగా 37 ఏళ్ల కిందటి రికార్డును బద్దలు కొట్టింది. 1988-89లో యానా నవోత్న-జిమ్‌ పగ్‌ జోడీ వరుసగా రెండు ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు గెలిచింది.

    తాజా టైటిల్‌తో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. మార్గరెట్‌ కోర్ట్‌-కెన్‌ ఫ్లెచర్‌ జోడీ (1963-64) తర్వాత స్వదేశంలో వరుసగా రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్‌ టైటిళ్లు సాధించిన జోడీగా చరిత్ర సృష్టించింది.

    రాడ్‌ లేవర్‌ ఎరీనాలో ఇవాళ జరిగిన ఫైనల్లో ఒలివియా గడెకీ-జాన్ పియర్స్ జోడీ ఫ్రెంచ్‌ జంట క్రిస్టినా మ్లాడెనోవిక్-మాన్యుయెల్ గినార్డ్పై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గడెకీ-పియర్స్‌ జోడీ టైబ్రేక్‌లో 5-7 వెనుకబడినప్పటికీ, చివరి ఆరు పాయింట్లలో ఐదు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

     

  • టీ20 ప్రపంచకప్‌-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్‌. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్‌, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్‌ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొం‍దుతున్నాడు.

    అయితే  శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్‌లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్‌.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

    కాగా తొలుత న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే  జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది.
     
    మయాంక్ ఫిట్‌..
    మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్‌లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్‌ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.

    అతడు కూడా తిలక్‌తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్‌లో భాగం కానున్నాడు. ఇక కివీస్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
    చదవండి: వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి సౌతాఫ్రికా అవుట్‌

  • టీ20 ప్రపంచకప్‌-2024లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌ అంచనాలకు మించి రాణించింది. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌పై సంచలన రీతిలో 84 పరుగుల తేడాతో గెలిచి క్రికెట్‌ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది రషీద్‌ ఖాన్‌ బృందం.

    సంచలన రీతిలో సెమీస్‌లోకి
    ఇక సూపర్‌-8లో ఏకంగా ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో ఓడించి.. అఫ్గనిస్తాన్‌ సంచలనం సృష్టించింది. అనంతరం బంగ్లాదేశ్‌పై 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, సెమీస్‌లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడటంతో ఫైనల్‌ చేరాలన్న అఫ్గన్‌ ఆశలు కరిగిపోయాయి.

    ఏదేమైనా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను ఓడించిన అఫ్గనిస్తాన్‌కు ప్రశంసలైతే దక్కాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అఫ్గనిస్తాన్‌పై ఓ మోస్తరుగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉపఖండ పిచ్‌లపై ఈ ఈవెంట్‌ జరుగనుండటం వారికి సానుకూలాంశంగా మారింది.

    షెడ్యూల్‌, మ్యాచ్‌ టైమింగ్స్‌ కలిసివస్తాయా?
    కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. నాలుగు గ్రూపులుగా విభజించారు. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, యూఏఈ, కెనడాలతో కలిసి అఫ్గనిస్తాన్‌ గ్రూప్‌-డిలో ఉంది.

    అయితే, ఈసారి లీగ్‌ దశలో షెడ్యూల్‌, మ్యాచ్‌ టైమింగ్స్‌ కూడా అఫ్గనిస్తాన్‌కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, యూఏఈలతో మ్యాచ్‌లు మధ్యాహ్నం వేళ (ఉదయం 11 గంటలకు ఆరంభం) జరుగనున్నాయి. ఇందుకు చెన్నై, అహ్మదాబాద్‌, ఢిల్లీ ఇందుకు వేదికలు. కాగా రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

    అందుకు భిన్నంగా డే మ్యాచ్‌లలో తేమ ప్రభావం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. తమకు ప్రధాన బలమైన స్పిన్‌ దళంతో అఫ్గన్‌ అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా చెన్నై పిచ్‌ స్పిన్‌కు ఎంత అనుకూలమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    మేటి స్పిన్‌ దళం
    ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌ జట్టులో కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ వంటి మేటి స్పిన్నర్‌తో పాటు నూర్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీ వంటి క్వాలిటీ స్పిన్‌ బౌలర్లు ఉన్నారు. వీరికి తోడు ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ కూడా ఉండనే ఉన్నాడు. 

    ప్రస్తుతం ఇంతకంటే అత్యుత్తమ స్పిన్‌ దళం ఉన్న మరో జట్టు లేదనే చెప్పవచ్చు. కాబట్టి మంచు ప్రభావం లేని మధ్యాహ్న మ్యాచ్‌లలో వీరు తమ స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

    ఆల్‌రౌండర్ల బలం
    అదే విధంగా జట్టులో మెరుగైన ఆల్‌రౌండర్లు ఉండటం కూడా అఫ్గనిస్తాన్‌కు కలిసి వచ్చే అంశం. గుల్బదిన్‌ నైబ్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌ బ్యాట్‌తోనూ సత్తా చాటగలరు. ఇక అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కూడా  లోయర్‌ ఆర్డర్‌లో సేవలు అందించగలడు. 

    కాబట్టి ఈసారి ఉపఖండ పిచ్‌లపై జరిగే వరల్డ్‌కప్‌ టోర్నీలో అఫ్గనిస్తాన్‌కు స్పిన్నర్లుగానే కాకుండా.. ఆల్‌రౌండర్లుగా రెండు పాత్రలు పోషించగల ఆటగాళ్లు ప్రధాన బలంగా మారనున్నారని ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 

    కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లోనూ స్పిన్‌ ఫ్రెండ్లీ అయిన అమెరికా- వెస్టిండీస్‌ పిచ్‌లను సమర్థవంతంగా ఉపయోగించుకున్న అఫ్గన్‌ సెమీస్‌ వరకు చేరిన విషయం తెలిసిందే. 

    చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్‌కు షాక్‌.. తొలిసారి స్పందించిన శ్రీలంక

  • ఆస్ట్రేలియన్ ఓపెన్-2026లో స్పెయిన్‌ సంచలనం, ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. అల్కరాజ్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. హోరాహోరీ సాగిన ఈ పోరులో  6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు.

    మొదటి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికి..  జ్వెరెవ్ గట్టి పోటీనిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. దీంతో విజేతను తేల్చేందుకు ఐదో సెట్‌ను నిర్వహించారు.

    అల్కరాజ్ అద్బుత పోరాటం..
    అయితే ఈ మ్యాచ్ మూడో సెట్‌లో అల్కరాజ్ కుడి కాలికి గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక దశలో కదలడానికి కూడా ఇబ్బంది పడిన అల్కరాజ్.. మ్యాచ్ మధ్యలోనే వైదొలగడతాడని అంతా భావించారు. కానీ అల్కరాజ్ మాత్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు.

    మెడికల్ టైమ్ అవుట్ తీసుకుని తిరిగి కోర్టులో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదో సెట్‌లో 3-5తో అల్కరాజ్‌ వెనుకబడినప్పటికీ.. తర్వాత తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అల్కరాజ్‌.. రెండు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ లేదా నోవాక్ జోకోవిచ్‌లతో తలపడే అవకాశముంది. సెకెండ్ సెమీఫైనల్లో శనివారం జానిక్ సినర్, జోకోవిచ్‌లు అమీతుమీ తెల్చుకోనున్నారు.

  • టీమిండియా మోస్ట్‌ ప్రామిసింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దేశవాలీ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.

    కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్‌, మయాంక్‌ రాణించినా, ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఎదురీదుతోంది. 

    రెండో రోజు టీ విరామం సమయానికి సగం​ వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.

    శ్రేయస్‌ గోపాల్‌ (17), కృతిక్‌ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన దేవదత్‌ పడిక్కల్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. 

    వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్‌ (32) క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్‌ బ్రార్‌ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ కీలకమైన మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ తీశాడు.

    అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అభిజీత్‌ గార్గ్‌ (81), ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్‌ మల్హోత్రా (25), ఆయుశ్‌ గోయల్‌ (23), సుఖ్‌దీప్‌ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు. 

  • న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బెన్‌ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా కైల్‌ జేమీసన్‌ స్థానాన్ని సియర్స్‌ భర్తీ చేస్తాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

    ఆడమ్‌ మిల్నే గాయపడటంతో అప్పటివరకు ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఉన్న జేమీసన్‌ ప్రధాన జట్టులోకి ప్రమోట్‌ అయ్యాడు. ఇప్పుడు జేమీసన్‌ స్థానాన్ని సియర్స్‌ భర్తీ చేశాడు. సియర్స్‌ ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్‌లోపు జట్టుతో కలుస్తాడు. 

    సియర్స్‌కు ప్రపంచకప్‌ అవకాశం కల్పించడంపై న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ హర్షం వ్యక్తం చేశాడు. సియర్స్‌ చాలా కష్టపడి ఫిట్‌నెస్‌ సాధించాడని కితాబునిచ్చాడు. ప్రధాన జట్టులో ఎవరికైనా గాయాలైతే సియర్స్‌ మొదటి ఆప్షన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు.

    తాజాగా ముగిసిన న్యూజిలాండ్‌ టీ20 టోర్నీ సూపర్ స్మాష్‌లో సియర్స్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి, రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీనికి ముందు కౌంటీ డివిజన్ వన్ టోర్నీలోనూ అతను సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20లు ఆడిన సియర్స్‌ 23 వికెట్లు తీశాడు. 140 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం సియర్స్‌ ప్రత్యేకత. బౌన్స్‌ అతని అదనపు బలం.

    టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు  
    మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ, బెన్ సియర్స్ (రిజర్వ్)

    ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు గ్రూప్‌-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో అఫ్గనిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యూఏఈ మిగతా జట్లుగా ఉన్నాయి. న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. 

    ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారత్‌ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరుగనుంది.

Movies

    • బ్లాక్ శారీలో బిగ్‌బాస్ దివి అందాలు..
    • టాలీవుడ్ నటి సాహితి దాసరి స్టన్నింగ్ గ్లామర్ పిక్స్..
    • డిఫరెంట్ డ్రెస్‌ల్లో రెజీనా కసాండ్రా లుక్స్..
    • సముద్రపు ఒడ్డున చిల్ అవుతోన్న ఆండ్రియా జెరెమా..
    • పింక్ శారీలో బాలీవుడ్ భామ నైరా బెనర్జీ అదిరిపోయే గ్లామర్..
       

     

     

     

     

     

     

  • టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్‌ జీవింత్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ చిత్రంలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇ‍ప్పటికే ట్రైలర్ రిలీజ్‌ కాగా.. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో అభిషన్ జీవింత్ మాట్లాడారు.

    టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి అభిషన్ జీవింత్ కామెంట్స్ చేశారు. నా సినిమాకు రాజమౌళి సార్ ట్వీట్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన వల్లే నా సినిమా తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరైందని అన్నారు. టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి  ట్వీట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ మాట్లాడారు. మీ వల్లే ఆ సినిమా నాకు ప్రత్యేకంగా గుర్తుండి పోతుందని అభిషన్ ఆనందం వ్యక్తం చేశారు.

    కాగా.. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్‌ లవ్‌. ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.

     

  • హాయిగా ఆడుతూ పాడుతూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాల్సిన సమయంలో కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. నటిగా జర్నీ మొదలుపెట్టినప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించే చేయి లేకున్నా స్వయంకృషితో ఎదిగింది. కాళ్లలోని ఐరన్‌ రాడ్స్‌ తన ముందడుగును ఆపలేకపోయాయి. నా అనేవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కెమెరా ముందు మాత్రం బలవంతంగా నవ్వు పులుముకునేది. తనే కీర్తి భట్‌. ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న కారణంగా వార్తల్లో ఉన్న కీర్తి గురించే ప్రత్యేక కథనం.

    యాక్సిడెంట్‌తో జీవితం తలకిందులు
    కీర్తి భట్‌ కన్నడ అమ్మాయి. 2017లో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో కుటుంబాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు, అన్నవదిన అందరూ దూరమయ్యారు. తీవ్ర గాయాలపాలైన కీర్తి కొన ప్రాణంతో బయటపడింది. కొంతకాలం కోమాలో ఉండి కోలుకుంది. అయితే యాక్సిడెంట్‌ వల్ల తను తల్లయే అదృష్టాన్ని కోల్పోయింది. ఎవరూ లేని అనాథగా బతుకు వెల్లదీస్తూనే తన కెరీర్‌ను తనే నిర్మించుకుంది. 

    ఫస్ట్‌ లవ్‌
    అలాంటి సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమ పేరుతో వెంబడించాడు. అతడి ప్రేమ నిజమేననుకుంది, కరిగిపోయింది. ఇకపై తాను అనాథ కాదనుకుని పొంగిపోయింది. అతడి కుటుంబాన్ని తన కుటుంబంగా భావించింది. కానీ అదంతా కపట ప్రేమ అని కొంతకాలానికే అర్థమైపోయింది. తన డబ్బును వాడుకుంటున్నారని ఆల్యంగా తెలుసుకుంది. తాను నటించే సీరియల్‌ హీరోతో షోకి వెళ్లినా ప్రియుడు, అతడి తల్లి అనుమానించేవారు. ఆఖరికి కీర్తి దత్తత తీసుకున్న పాప కూడా కన్నకూతురేనేమో అని డీఎన్‌ఏ టెస్టుకూ సిద్ధపడ్డారు.

    బిగ్‌బాస్‌ షో
    ఇక భరించలేకపోయింది. అతడి ప్రేమకు దండం పెట్టేసి ఆ రిలేషన్‌ నుంచి బయటకు వచ్చింది. ఇంతలో తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ నుంచి ఆఫర్‌ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయేసరికి ఆమె గుండె ముక్కలయింది. ఆ బాధను దిగమింగుకుని బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. ఆరో సీజన్‌లో ఫస్ట్‌ లేడీ కెప్టెన్‌గా నిలిచింది. ఫినాలేలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 

    ఎంగేజ్‌మెంట్‌
    బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక హీరో, దర్శకుడు విజయ్‌ కార్తీక్‌ రూపంలో తనకు తోడు దొరికింది. తను ఎప్పటికీ తల్లి కాలేదని తెలిసినా.. కీర్తియే తనకు చిన్నపాప అంటూ అతడి కుటుంబం అంతా ప్రేమగా చూసుకుంది. ఈ సంతోషం జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంది. 2023లో కీర్తి- విజయ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో బ్రేకప్‌ చెప్పుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయామని కీర్తి అంటుంటే.. నా దగ్గర డబ్బుల్లేవని మరొకర్ని చూసుకుంటుందని విజయ్‌ కార్తీక్‌ ఆరోపించాడు.

    బ్రేకప్‌
    అతడి ఆరోపణలకు తోడు సోషల్‌ మీడియాలో తనపై వదంతులు సృష్టిస్తుండటంతో కీర్తి మనస్తాపానికి గురైంది. తనకేదైనా జరిగితే అసత్య ప్రచారం చేస్తున్నవారే బాధ్యులు అని మండిపడింది. ఏదేమైనా ఈ బాధలో నుంచి కీర్తి బయటకు వచ్చి మళ్లీ మామూలు జీవితం గడపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కీర్తి.. మనసిచ్చి చూడు, మధురానగరిలో, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది.

     

     

     

    చదవండి: అదే నన్ను కుంగదీస్తోంది.. నాకేదైనా జరిగితే..: కీర్తి భట్‌

  • కోలీవుడ్ సూపర్ స్టార్‌ రజినీకాంత్ పాలిటిక్స్‌లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకెలాంటి బాధ లేదన్నారు. ఆయనకు ఏది నచ్చితే కుటుంబమంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు.

    అంతేకాకుండా రజనీ- కమల్‌హాసన్‌ సినిమాపై జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించారు. ఈ కాంబినేషన్‌ మూవీకి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. అవీ ఓకే అయితే  త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు.  కాగా.. అభిషన్‌ జీవింత్‌, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం విత్‌ లవ్‌. ఈ మూవీకి మదన్‌ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజ్ కానుంది.

     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.

    జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్‌ మూవీని కట్‌ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

    రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  ఈ చిత్రం ప్రారంభంలో  3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు,  బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్‌ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని  చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్‌ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్‌ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.

    నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్‌ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్‌ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద  ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ  స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
     

  • అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ సోదరి సునయన రోషన్‌. మద్యపానం అనే వ్యసనం నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలను తాజాగా గుర్తు చేసుకుంది.

    అదే పెద్ద విషయం
    సునయన మాట్లాడుతూ.. సమస్యను అంగీకరించడం అన్నింటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తించామంటే అక్కడే మార్పు మొదలవుతుంది. తిండి, మద్యపానం.. ఇతరత్రా ఎన్నో అలవాట్లు వ్యసనంగా మారుతుంటాయి. మనం అందులో పూర్తిగా మునిపోతున్నామన్నది మనకే అర్థం కాదు. నేను తాగుడుకు బానిసయ్యాను. తర్వాత ఒకానొక సమయంలో స్వీట్లు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ లాగించడం మదలుపెట్టాను. 

    ఒక్క అడుగు
    వాటన్నింటినీ వదిలించుకోవడం, దూరం పెట్టడం అంత ఈజీ కాదు. ధృడ సంకల్పం, మనచుట్టూ ఉండేవారి సపోర్ట్‌తోనే వ్యసనాల నుంచి బయటకు రాగలం. ఒక్క అడుగు ముందుకేసి వాటిని జయించొచ్చు. భయపడకుండా ముందడుగు వేయండి. ఓపెన్‌గా మాట్లాడండి అని ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌కు హృతిక్‌ రోషన్‌ స్పందిస్తూ లవ్యూ దీదీ అని కామెంట్‌ పెట్టాడు. తండ్రి రాకేశ్‌ రోశన్‌ సైతం నువ్వొక ఇన్‌స్పిరేషన్‌ అని కామెంట్‌ చేశాడు.

    వ్యసనంగా..
    గతంలోనూ సునయన తన తాగుడు వ్యసనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొద్దిగా మొదలైన తాగుడు తర్వాత తీవ్రంగా మారిందని తెలిపింది. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే మద్యపానం సేవించడం వల్ల తాను ఏం చేస్తున్నాననే విషయాలను కూడా మర్చిపోతున్నట్లు తెలిపింది. డీ అడిక్షన్‌ సెంటర్‌కు కూడా వెళ్లానని, చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించానంది.

    చదవండి: ఫలక్‌నుమాదాస్‌.. విశ్వక్‌తో ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న హీరో ఎవరంటే?

  • సూర్య శ్రీనివాస్, సంజీవ్, స్వాతి కశ్యప్  నటించిన తాజా చిత్రం జమానా.  భాస్కర్ జక్కుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల అయింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..

    మ్యూజియంలో దొంగతనంతో సినిమా ప్రారంభమవుతుంది. హీరో సూర్య ఒక దొంగ.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. ఒక పెద్ద స్కాం చేసి సెట్ అవుదాం అనుకుంటాడు. అదే సమయంలో స్వాతితో ప్రేమలో పడతాడు. ఇంతలో ఇంకో గ్యాంగ్ సంజీవ్.. ఒక లోకల్ రౌడీ షీటర్, ఒక రాజకీయ నాయకుడు , ఒక మాఫియా లీడర్. ఇలా ఒక పెద్ద టీం ఉంటుంది.. ఈ అన్ని టీం లకు ఒకరికి తెలీకుండా ఒకరు డీలింగ్స్‌ ఉంటాయి. అసలు గ్యాంగ్స్‌ చేసే స్కామ్స్‌  ఏంటో తెలియాలంటే జమానా సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..

    ఫస్ట్ హాఫ్‌లో హీరో చేసే స్కాం ల చుట్టే తిరుగుతుంది.  సంజీవ్ ఎపిసోడ్ .. పది లక్షలు ఎపిసోడ్ ప్రథమార్థంలో ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. ఇంకా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అసలు ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌  బ్యాంగ్ పడుతుంది.  డైరెక్టర్ భాస్కర్ జక్కుల తాను  తీసుకున్న లైన్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. 

    ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్‌లో కథ పరిగెడుతుంది . మరీ  ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. అతను రాసుకున్న కథ, కథనం చాలా బాగుంది. ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించాడు. దర్శకుడి మేకింగ్ కూడా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా క్లైమాక్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది.  డైరెక్టర్ సినిమా మొదటి నుంచి చివరి వరకు.. ప్రేక్షకుల్లో థ్రిల్లింగ్‌ కలిగించాడు. థ్రిల్లింగ్ మూవీస్ ఇష్టపడే వారికి జమానా ఓకే.

    ఎవరెలా చేశారంటే..

    హీరో సూర్య చాలా అద్భుతంగా చేశాడు. హీరోయిన్ స్వాతి కశ్యప్ తన గుడ్ లుక్‍తో అదరగొట్టేసింది. సాంకేతికత విషయానికొస్తే విజువల్ పరంగా కూడా గ్రాండ్‌గా ఉంది.  కేశవ కిరణ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు.  వర్మ ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్  వాల్యూస్ నిర్మాణ సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.

  • టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్‌ జీవింత్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం విత్ లవ్. ఈ మూవీలో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు మదన్ దర్శకత్వం వహించారు.

    తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కాలేజీ నేపథ్యంలోనే సాగే ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజినీకాంత్, మాగేశ్ రాజ్ నిర్మించారు. 
     

     

  • బొమ్మలరామారం సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు తిరువీర్‌. ఘాజి, ఏ మంత్రం వేసావె, మల్లేశం చిత్రాల్లో నటించాడు. జార్జ్‌ రెడ్డి, పలాస 1978 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మసూదతో హీరోగా మారాడు. ద గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షోతో గతేడాది మంచి హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు అని కొత్త సినిమా చేస్తున్నాడు. 

    నా డైరెక్షన్‌లో చేయాల్సింది!
    జీజీ విహారి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. శుక్రవారం (జనవరి 30) నాడు భగవంతుడు మూవీ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నా ఫస్ట్‌ సినిమా ఫలక్‌నుమా దాస్‌లో తిరువీర్‌ నాతోపాటు కలిసి నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని చెప్పాడు. 

    మరో సినిమా
    బహుశా ఫలక్‌నుమా దాస్‌లో విలన్‌ పాత్ర కోసం మొదట తిరువీర్‌ను అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ, చివరకు అది జరగలేదు. ఇకపోతే తిరువీర్‌ చేతిలో మరో మూవీ కూడా ఉంది. అదే ఓ సుకుమారి. తిరువీర్‌ హీరోగా, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్‌ దర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.​

    చదవండి: అమ్మానాన్న ఆనంద భాష్పాలు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా అర్జున్‌

  • సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టేసిన కోలీవుడ్ భామ ఐశ్వర్య రాజేశ్. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకేటేశ్ హీరోగా నటించారు. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా మెప్పించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    అయితే ఈ మూవీతో టాలీవుడ్‌లోనూ ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఐశ్వర్య ఆసక్తికర కామెంట్ల్ చేసింది. ప్రతి ఒక్క అమ్మాయి ఏదొక టైమ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారని తెలిపింది. నైట్ అమ్మాయిలు కొంచెం సెక్సీగా ఉండే దుస్తులు వేసుకుంటారు కదా.. నువ్వు ‍‍అలాగే వేసుకుంటే 'ఐ వాంట్ సీ యువర్ బాడీ'అని నాతో అన్నారని గుర్తు చేసుకుంది. అది చూసి ఇలా ఎంతమంది అమ్మాయిలని చేసుంటారని నాకు అనిపించిందని ఐశ్వర్య రాజేశ్ వెల్లడించింది. అయితే ఆ వ్యక్తి ఎవరనే విషయం మాత్రం వెల్లడించలేదు. అంతేకాకుండా మా నాన్న గారు నా చిన్నప్పుడే చనిపోయారంటూ ఎమోషనలైంది.  డ్రెస్‌ల విషయంలో మనం సందర్భానికి తగినట్లుగా వేసుకోవడం మంచిదని ఐశ్వర్య రాజేశ్ అన్నారు. 
     

     

  • స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త సినిమా రిలీజైన ప్రతిసారీ ఇక్కడా ఆదరణ బాగానే వస్తూ ఉంటుంది. అలాంటిది కార్తీ లేటెస్ట్ మూవీ తెలుగు వెర్షన్‌ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అదే 'అన్నగారు వస్తారు'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    తాత(రాజ్ కిరణ్)కి ఎన్టీఆర్ అంటే అంతులేని అభిమానం. సరిగ్గా ఎన్టీఆర్ మరణించిన సమయానికి మనవడు పుడతాడు. దీంతో తన అభిమాన హీరో అంతా గొప్పవాడు కావాలని మనవడికి రామారావు(కార్తీ) అని పేరు పెడతాడు. తాత ఒకలా అనుకుంటే మనవడు మరోలా తయారవుతాడు. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు గానీ చేసేవన్నీ దొంగపనులు. కొందరు రాజకీయ నాయకులతో కలిసి అవినీతి చేస్తుంటాడు. ఇతడికి ప్రేతాత్మలతో మాట్లాడే ఓ ప్రియురాలు (కృతిశెట్టి) ఉంటుంది. ఓ సందర్భంగా మనవడి బుద్ధి గురించి తాతకు తెలిసిపోతుంది. తర్వాత ఏమైంది? రామారావు శరీరంలోకి అన్నగారి ఆత్మ ఎందుకు ప్రవేశిస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఎప్పుడో మరణించిన ఓ మహానటుడి ఆత్మ, ఓ సాధారణ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి, ప్రజలకు మంచి చేస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో సినిమా తీయాలనుకోవడం ఆసక్తికరమే. చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ తీయడమే గజిబిజి గందరగోళం అయిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ చేయదు. పాటలో, డైలాగ్సో, సీన్సో.. ఏదో ఒకటి బాగున్నా సరిపెట్టుకోవచ్చులే అనుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఎంగేజ్ చేయదు. చూస్తున్నంతసేపు ఇలా చాలా అనిపిస్తాయి.

    తమిళ స్టార్ హీరో ఎమ్‌జీఆర్ రిఫరెన్సులతో ఈ సినిమా తీశారు. ఫస్టాప్‌లో హీరో తాతయ్య ఎమ్‌జీఆర్ వీరాభిమాని కావడం, మనవడిని అలానే పెంచాలనుకోవడం, ఇదంతా నచ్చని మనవడు.. నటిస్తూ పెరగడం, అవినీతి పోలీస్ కావడం.. ఇలా పర్లేదులే ఏదో ఉందిలే అన్నట్లు మూవీ సాగుతుంది. భక్త వత్సలం అనే పాత్ర దగ్గరకు రామారావు వెళ్లేంతవరకు కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. తర్వాత కూడా అసలు కాన్‌ఫ్లిక్ట్ ఏంటో చెప్పకుండా స్టోరీని అటుఇటు తిప్పుతున్నట్లు అనిపిస్తుంది. విలన్ భక్త వత్సలం.. ముఖ్యమంత్రితో కలిసి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తాడు. అదేంటో చెప్పకుండా చూపించకుండానే చిత్రాన్ని ముగించేశారు.

    రామారావు పాత్ర.. ఉన్నట్టుండి అన్నగారిలా మారిపోయి ఫైట్స్ చేసేస్తుంటాడు. జనాల్ని కాపాడేస్తుంటాడు. ఇతడిలోకి అన్నగారి ఆత్మ లేదా తాతయ్య ఆత్మ ఏమైనా ప్రవేశించిందా అంటే అదేం ఉండదు. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే లాజిక్ ఉండదు. జనాలకు మంచి చేసే పసుపు ముఖం అని ఓ గ్రూప్ ఉంటుంది. వీళ్ల పాత్రలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. హీరోయిన్ కృతిశెట్టి పాత్ర అయితే అసలు ఎందుకుందో అర్థం కాదు. చెప్పాలంటే ఆమె పోర్షన్ అంతా తీసేసినా సరే సినిమాలో పెద్దగా పోయిదేం ఉండదు.

    లెక్క ప్రకారం డిసెంబరు తొలివారంలో సినిమాని తెలుగు, తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు. నిర్మాత గతంలో చేసిన అప్పులు ఇప్పుడు ఆర్థిక సమస్యలుగా మారి కోర్టు కేసుల వరకు వెళ్లడంతో వాయిదా పడింది. సంక్రాంతికి విజయ్ 'జన నాయగణ్' రాలేకపోవడంతో దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. తమిళంలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేయలేదు. కట్ చేస్తే నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీని చూసిన చాలామంది.. కార్తీ ఇలాంటి మూవీ అసలు ఎందుకు చేశాడు? అని బుర్రగోక్కుంటున్నారు.

    రామారావుగా చేసిన కార్తీ, తాతగా చేసిన రాజ్ కిరణ్ తప్పితే ఈ సినిమాలో మరో పాత్ర, ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. సత్యరాజ్, కృతిశెట్టి లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్లని సరిగా ఉపయోగించుకోలేదు. అలానే తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్ పేరుని ఉపయోగించుకున్నప్పుడు ఆయన ఫొటోలనే చూపించాలి. కానీ అలాంటిదేం లేకుండా తెరపై ఎమ్‌జీఆర్, డబ్బింగ్‌లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇది కాస్త కన్ఫ్యూజన్‌కి గురిచేసింది. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'అన్నగారు వస్తారు'ని లైట్ తీసుకోవడమే బెటర్.

    -చందు డొంకాన

    (ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

  • మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తోన్న ‍మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ సినిమా వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో మెప్పించనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజమౌళి ట్వీట్‌ చేశారు. 

    కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు -రాజమౌళి కాంబోలో తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్‌ కూడా పూర్తయింది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు.  ఈ మూవీ టైటిల్ రివీల్ చేసేందుకు గ్లోబ్ ట్రాటర్‌ పేరుతో బిగ్ ఈవెంట్ నిర్వహించారు. 
     

  • ఒకప్పటి చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సారా అర్జున్‌ బాలీవుడ్‌ మూవీ 'ధురంధర్‌'తో హీరోయిన్‌గా మారింది. యలీనా జమైల్‌ పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు 'యుఫోరియా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

    ఆరోజు మర్చిపోలేను
    సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్‌ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ సందర్భంగా తను హీరోయిన్‌ అయ్యాక పేరెంట్స్‌ రియాక్షన్‌ గురించి చెప్పుకొచ్చింది. ధురంధర్‌ సినిమాలో నన్ను చూసి అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారు. ఆ రోజు నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సంఘటన నా జీవితంలోనే ప్రత్యేకమైనది అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ తర్వాత విదేశాల్లో యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలనుకున్నాను. 

    ధురంధర్‌
    అంతలోనే యుఫోరియా సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే ధురంధర్‌ సినిమాకు సంతకం చేశాను. కానీ అదే మొదటగా రిలీజైంది అని తెలిపింది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.

    చదవండి: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి  మూవీ.. ఎక్కడంటే?

  • ఆదా శర్మ ప్రధాన పాత్రలో చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఏకంగా రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు గెలిచింది. ఈ చిత్రానికి గానూ సుదీప్తో సేన్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలోనూ అవార్డ్ వరించింది.

    తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు.  తాజాగా సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌నువిడుదల చేశారు. పార్ట్‌-2కు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా కీలక పాత్రల్లో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే ముగ్గురు హిందూ అమ్మాయిల జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు మహిళలు ఎలా మోసపోయారనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.

    కాగా.. 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ కేరళకు చెందిన కొంతమంది మహిళలు ఇస్లాంలోకి ఎలా మారారు అనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా మహిళలు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వారు  అదృశ్యమైనట్లు వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్‌ 'ద కేరళ స్టోరీ'ని తెరకెక్కించారు. 

  • బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు చేశారు. ఈరోజు(జనవరి 30) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని సహించడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి అతడిని ఊరు నుంచి గెంటేస్తాడు. వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులని ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతకు ఏమైంది? ధర్మ-శ్వేత ఒక్కటయ్యారా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    సమాజంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థని ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు.. తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కొడుకుతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. అబ్బాయిలు, స్నేహితులుగా మారితే.. అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి.. అతన్ని ఊరి నుంచి పంపేస్తాడు. ర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ఫ్లాట్.

    రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నారు. ఏదేమైనా చేయండి కానీ పెళ్లి విషయంలో చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇందులోనూ అదే అంశాన్ని చూపించారు.

    సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. కాకపోతే స్టోరీలా ఊహించేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే తీశారు.

    నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్‌గా చేసి అనుశ్రీ.. ఆమె సోదరుడి పాత్రలో నరసింహ ఆకట్టుకున్నారు. దేవగుడి వీరారెడ్డిగా రఘు కుంచె ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్‌లో మదిన్ సంగీతం బాగుంది. నిడివి కూడా పర్లేదు. నిర్మాణ విలువలు ఓకే ఓకే.

  • ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న చిత్రం "నారీ నారీ నడుమ మురారి". శర్వానంద్‌ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మించాడు. జనవరి 14న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

    వచ్చే వారం ఓటీటీలో..
    అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్‌ వీడియో అధికారిక పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. మరి థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయినవారు ఎంచక్కా వచ్చే వారం నారీ నారీ నడుమ మురారి చూసేయండి..

    శర్వా అలా అన్నాడో లేదో..
    నారీ నారీ నడుమ మురారి టీమ్‌.. జనవరి 23న సంక్రాంతి విన్నర్‌ బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌ అంటూ సెలబ్రేషన్స్‌ జరిపారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్‌ మాట్లాడుతూ.. ఈ మూవీ ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగువారాలు ఆడుతుందన్నాడు. థియేటర్ల సంఖ్య కూడా పెంచామని తెలిపాడు. శర్వానంద్‌ అలా అన్నాడో లేడో రెండు వారాల్లోనే మూవీ ఓటీటీలో రిలీజ్‌ అవుతుండటం గమనార్హం. ఒక్కసారి సినిమా ఓటీటీకి వచ్చాక థియేటర్లలో ఆడటం కష్టమే!
     

     

     

Andhra Pradesh

  • అమరావతి:  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.   ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్‌ చేస్తున్న వ్యవహారం తాజాగా బయటపడింది. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చి మరీ మహిళకు వీడియో  కాల్‌ చేశారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు మీడియాకు విడుదల చేసింది.  అసెంబ్లీ చరిత్రలో​ ఎవరూ చేయని గలీజు పని చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌. అసెంబ్లీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీధర్‌ వీడియో కాల్‌ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

    కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వికృత చేష్టలను తెలియజేసే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్‌లు, ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్న శ్రీధర్‌ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

    తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్‌ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్‌ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్‌ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. 

    వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు.  తాజాగా ఓ మహిళతో అసెంబ్లీ వేదికగా చాటింగ్‌ చేస్తున్న వీడియో బయట పడటంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ మానసిక దారిద్ర్యంపై విమర్శల వర్షం కురుస్తోంది.  

    ఇవీ చదవండి

    అరవ ఆగడాలు మరిన్ని..

    నువ్‌ మోసపోయావ్‌.. వదిలేయ్‌..

    అరవ శ్రీధర్‌ నాపై లైంగిక దాడి చేశారు’

  • బోయపాలెం: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడీపీ గూండాలు నానా హంగామా చేసి విడదల రజినీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజినీ ఓ గుడిలో పూజలు చేశారు. 

    అయితే విడదల రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు.. గుడి బయట హల్‌చల్‌ సృష్టించారు. గుడి బయట నానా హంగామా చేసి.. పూజను అడ్డుకోవడానికి యత్నించారు.  దీనిలో భాగంగానే విడదల రజినీ కారును సైతం అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 

    ఈ ఘటనపై విడదల రజినీ మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో టీడీపీ నాయకులు చేసిన విష ప్రచారంతో కూటమి ప్రభుత్వం బాగా డ్యామేజ్ అయ్యింది. లడ్డూ విషయంలో అబద్ధాలు ప్రచారం చేసిన కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని బోయిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించాము. కొంతమంది టీడీపీ గుండాలు గుడి బయట హల్‌చల్‌ చేశారు. నేను కారు ఎక్కి కూర్చున్న తర్వాత కారు కదలనివ్వకుండా కారు పై దాడి చేశారు. నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలు,  మా నేతలు వారి దాడిని తిప్పి కొట్టారు. టీడీపీ వాళ్ల ఉడత ఊపులకు భయపడే వాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. ఓవరాక్షన్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు.

     

  • సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని, ప్రతిపక్షం మీద బురద జల్లాలని చేసిన కుట్రను ల్యాబ్‌ రిపోర్ట్‌లు భగ్నం చేశాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అబద్దాల పునాదుల మీద అసత్యాలు పోగుచేసి జగన్‌గారి మీద, వైఎస్సార్‌సీపీ మీద బురద జల్లాలని చేసిన కుట్ర పటాపంచలైందన్నారు.

    దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్థల నివేదికల ద్వారా ఈ కుట్రలు భగ్నమై నిజం బయటికి వచ్చిందన్నారు. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇంకా దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనే వృథా ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

    కల్తీ నెయ్యి కుట్రకు అప్పుడే బీజం:
    చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 సెప్టెంబరు 17న కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఈ కుట్రకు చంద్రబాబు నాంది పలికారు. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్నారు. అంతటితో ఆగకుండా పందికొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని, దాంతోనే లడ్డూలు తయారు చేశారని, వాటిని ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలతో దేశంలోని భక్తులంతా ఉలిక్కిపడ్డారు. పంది కొవ్వు, పశువుల కొవ్వేమిటి!. లడ్డూ ప్రసాదంలో కలిశాయని ఓ ముఖ్యమంత్రే చెప్తున్నాడని ఆశ్చర్యపోయారు. ఏ ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న అనుభవజ్ఢుడని చెప్పుకునే రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణలు ఇవి. వీటిని ఆరోజే విజ్ఞులైన వారంతా ఖండించారు.

    ఏ కొవ్వూ లేదని తేల్చిన ల్యాబ్‌లు. ఆ నివేదికలతో సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ :
    రాజకీయాల్లో ప్రత్యర్థులపై కక్ష సాధించాలంటే వేరేలా ప్రయత్నాలు చేయొచ్చు కానీ హిందూ ధర్మానికి భంగం కలిగేలా ప్రపంచంలో అందరూ కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో పందికొవ్వు కలిసిందని చేసిన ఆరోపణ సహించరానిది. అంతకు ముందే టీటీడీ ఛైర్మన్‌ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు.. చీవాట్లు పెట్టి మీ సిట్‌ కాదు సీబీఐ ఆధ్వర్యంలో సిట్‌ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ శాంపిల్స్‌ ను సెకండ్‌ ఒపీనియన్‌ కోసం మళ్లీ ల్యాబ్స్‌ కు పంపమని ఆదేశించింది. ఆ శాంపిల్స్‌ పరిశీలించిన ప్రతిష్టాత్మక ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ.. అందులో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని తేల్చి చెప్పాయి. ఆ నివేదికల ఆధారంగా, చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని సిట్‌ తేల్చింది. అదే విషయాన్ని పొందుపర్చిన సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయినా మీడియా బలంతో, అధికార బలంతో జగన్మోహన్‌ రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి ఫొటోలతో దారుణంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు.

    మీ హయాంలో నెయ్యిపైనే ల్యాబ్‌ రిపోర్టులు:
    చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చాక జూన్‌ 12, జూన్‌ 25, జూలై 6, జూలై 12 తేదీల్లో వీఆర్‌ డెయిరీ నుంచి లడ్డూ ప్రసాదానికి నెయ్యి ట్యాంకర్లు వెళ్తే శాంపిల్స్‌ తీసుకున్నారు. ఇది జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. ఈ శాంపిల్స్‌ ను ల్యాబ్స్‌ కు పంపించి, నెయ్యి కల్తీ జరిగిందని ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా ల్యాబ్‌ రిపోర్ట్స్‌ లోనే ఇలా జరగొచ్చు అని చెప్తే.. వాటిని పట్టుకుని చంద్రబాబు నానా రాద్దాంతం చేశారు. దీని మీద సుప్రీంకోర్టు వెళ్తే చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత సిట్‌ వేస్తే విచారణ జరిపి తాజాగా నివేదిక ఇచ్చింది. దున్నపోతు ఈనిందంటే కట్టేయండి అన్న చందాన పవన్‌ కళ్యాణ్‌ కూడా తిరుపతి వెళ్లి, మెట్లు కడిగి, అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024 జూన్, జూలైలో తీసుకున్న శాంపిల్స్‌ లో పూర్తి పరీక్షలు చేయకుండా, సెకండ్‌ ఒపీనియన్‌ కూడా లేకుండా అయోధ్యకు పంపిన లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసారు.

    ఆ డెయిరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే:
    నెయ్యి కల్తీ పేరుతో ఆధారాలు లేకపోయినా రాజకీయంగా వైఎస్సార్సీపీపై బురదజల్లడంతో పాటు శ్రీవారిని కూడా అడ్డుపెట్టుకుని ఆయన ప్రసాదంలో పందికొవ్వు పేరుతో కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. ఇవాళ ఏ కొవ్వూ లేదని తేలిపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిప్పి పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి వాడామని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు కల్తీ నెయ్యిని ఎందుకు వాడారో చెప్పండి. తిప్పిపంపిన ట్యాంకర్లను తిరిగి తెప్పించి వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది అపచారం కాదా వీళ్లు చెప్పాలి.

    నెయ్యిపై రిపోర్ట్‌ ఇచ్చిన సంస్థలు రెండూ ప్రతిష్టాత్మకమైనవే. ఇందులో ఒకటి హర్యానాలోని కర్నాల్‌ లో ఉన్న నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ (ఎన్డీఆర్‌ఐ), అలాగే గుజరాత్‌ లోని ఆనంద్‌ లో ఉన్న నేషనల్‌ డెయిరీ డెవలప్మెంట్‌ బోర్డ్‌ (ఎన్డీడీబీ). టెండర్లు దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ నెయ్యి పంపిణీ మొదలుపెట్టింది చంద్రబాబు హయాంలోనే. మేం అనుమతి ఇచ్చినా చంద్రబాబు హయాంలో సరఫరా చేస్తుంటే సరి చూసుకోవాలిగా. మీ పాలనలో సరఫరా అయిన నెయ్యికి కూడా మేం ఎలా బాధ్యత వహిస్తాం ?, భోలేబాబాకు తొలుత అనుమతి ఇచ్చింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. ముందు హర్ష డెయిరీగా పేరు పెట్టుకుని, ఆ తర్వాత పేరు మార్చుకున్నారు. భోలేబాబాకు పాలు లేవని ఇవాళ పచ్చమీడియాలో రాతలు రాస్తున్నారు. అటువంటి డెయిరీకి మీరు అనుమతి ఎలా ఇచ్చారు?.

    చంద్రబాబు అధికారంలో ఉండగా అనుమతిచ్చిన భోలే బాబాగా చెప్తున్న హర్ష డెయిరీ కిలో నెయ్యి రూ.291కి ఎలా ఇచ్చింది?, ఇప్పుడు ఇంత చౌకగా ఎలా నెయ్యి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్న వారు ముందు దీనికి సమాధానం చెప్పాలి. హిందూ ధర్మాన్ని గౌరవించే వారు ఇలాంటి చేష్టల్ని ఖండించాల్సిందే.

    అధికారులు రాజకీయ కుట్రలో భాగం కావద్దు:
    చిన్నప్పన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తి. ఆయన దగ్గరే జీతం కూడా తీసుకున్నాడు. చిన్నప్పన్‌ పీఏ అయితే ఛార్జిషీట్‌ లో వైవీ సుబ్బారెడ్డి పేరు ఉండాలిగా, ఎందుకు లేదు. లడ్డూకు నామాలు పెట్టి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లకు అడ్డూ అదుపూ లేదు. టీటీడీ బోర్డు ఛైర్మన్‌ డబ్బు కోసం దేనికైనా సిద్దపడే వ్యక్తి. ఆయనకు వెంకటేశ్వరస్వామి మీద కాదు డబ్బుల మీద, బూతు బొమ్మలు చూపించడం మీద, నూజేన్‌ ఆయిల్‌ లాంటి ఉత్పత్తులు తయారు చేసి డబ్బులు దండుకోవడంలో, జూబ్లీ పార్క్‌ ల్లో డబ్బులు కాజేసే కార్యక్రమంలో ఉంది. ఆయన అపవిత్రుడు కాబట్టే కొండమీద అపచారాలు జరుగుతున్నాయి.

    మేం నాస్తికులు అంటున్న ఆయన పెద్ద ఆస్తికుడు మరి. ఐఏఎస్‌ అయిన శ్యామలరావు, ఐఆర్‌ఐఎస్‌ వెంకయ్య చౌదరికి ఏం పోయేకాలం వచ్చింది. మీరు భగవంతుడి దగ్గర కాపలా కాయకుండా నాటకాలు నడిపిస్తే భగవంతుడు క్షమించడు. వీరిద్దరిపై మాకు గౌరవం ఉంది. ధర్మాన్ని పాటించాల్సిన వీళ్లు చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగస్వాములై మా మీద బురదజల్లుతున్నారు. కానీ ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోండి. లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన వాళ్లు పుట్టగతుల్లేకుండా పోతారు.

    మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
    తిరుమలలో వాడిన నెయ్యికి సంబంధించి సీబీఐ సిట్‌ పూర్తి వాస్తవాలతో కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఎందుకు మాట్లాడటం లేదు?. ఉప ముఖ్యమంత్రి ఆయనకు ఓ పార్టీ ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చంద్రబాబు చెంచా అని మేం అనుకుంటున్నాం. కానీ జనం మాత్రం చంద్రబాబు చెంచా అనే అనుకుంటున్నారు. చంద్రబాబు చెప్పింది మాత్రమే వినకుండా పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. పవన్‌ ఇంతవరకూ పొలిటిషియన్‌ గా మారలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌ చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ల అవినీతిలో నాకు భాగం లేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. ఆయన బీజేపీ, టీడీపీ.. ఇలా ఎవరికి ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తున్నారు.

    అధికారం కోసం ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు. భగవంతుడు లేదు, తండ్రి లేదు, పిల్లనిచ్చిన మామ లేదు, పవన్‌ కళ్యాణ్‌ కూడా లేదు. ఆయనకు కొడుకు మాత్రమే ఉండాలి. కొడుకు వారసుడు కాబట్టి తనను మాత్రమే చంద్రబాబు లెక్క చేస్తాడని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

  • సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..  లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా? అంటూ నిలదీశారు.

    ‘‘వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కాకుండా.. కేసు పెట్టకుండా.. విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్‌ విచారణలో జంతు కొవ్వులేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారు’’ అని నాగేశ్వర్‌ మండిపడ్డారు.

    కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది.  హర్యానాలోని ‘ఐసీఏఆర్‌– నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’, గుజరాత్‌లోని ‘నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) నియమించిన విషయం తెలిసిందే. 

    Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?
     

     

  • సాక్షి, తాడేప‌ల్లి: స‌త్య‌మేవ జ‌య‌తే అని మ‌హాత్మా గాంధీజీ చెప్పిన‌ట్టు తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలోనూ నిజ‌మైంద‌ని.. సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా కూట‌మి నాయ‌కులు చేసిన కుట్ర‌లు, చెప్పిన అబ‌ద్ధాలు ప్ర‌జ‌ల‌కు తెలిసిపోయాయ‌ని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన మ‌హాత్మా గాంధీజీ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు పాల్గొన్ని ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

    అనంత‌రం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయ‌న చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తి ప్ర‌తి ఒక్క‌రూ స్ఫూర్తి పొందాల‌ని, ఆయ‌న చూపించిన అహింసా మార్గంలోనే స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు. పేద రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కానికి మ‌హాత్మా గాంధీ పేరును తొల‌గించ‌డంపై వారు మండిప‌డ్డారు. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో గాంధీజీ స్ఫూర్తితో గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌ గ్రామ స్వ‌రాజ్యం తీసుకొచ్చార‌ని, శాశ్వ‌త భూ హ‌క్కు- భూ ర‌క్ష ప‌థ‌కం ద్వారా వందేళ్ల త‌ర్వాత భూ స‌ర్వేనిర్వ‌హించి ద‌శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించార‌ని కొనియాడారు. వారు ఇంకా ఏమ‌న్నారంటే..

    కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్, పార్టీ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్య‌క్షులు వెన్న‌పూస ర‌వీంద్ర‌రెడ్డి, మల‌సాని మ‌నోహ‌ర్‌రెడ్డి, న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి, అంకంరెడ్డి నారాయ‌ణ‌ మూర్తితో పాటు పలువురు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

    చివ‌రికి స‌త్యమే గెలిచింది: లేళ్ల అప్పిరెడ్డి
    శాంతి, స‌త్యం అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగ‌ని పోరాటం చేసిన గొప్ప యోధుడు మ‌హాత్మా గాంధీజీ. దేశాన్ని ఏక‌తాటిపైకి తీసుకొచ్చి అంద‌రికీ స్వాతంత్ర్య కాంక్ష‌ను ర‌గిలించ‌డంలో ఆయ‌న చేసిన కృషికి కొల‌మానం లేదు. భార‌త జాతి నిర్మాణంలో ప్ర‌ముఖ పాత్ర పోషించి ప్ర‌పంచంలో భార‌త‌దేశానికి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయ‌న చూపిన తెగువ‌, మ‌హాత్ముడు చేసిన పోరాటం త‌ర‌త‌రాల‌కు ఆద‌ర్శం. గాంధీజీ మ‌న‌దేశంలో పుట్ట‌డం మ‌న అదృష్టం. కానీ కూట‌మి ప్రభుత్వం ఏర్పాట‌య్యాక రాష్ట్రంలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

    రాజ‌కీయ క‌క్ష‌లు, దోపిడీ, అరాచ‌కాల‌తో పాల‌న సాగిస్తున్నారు. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ‌ను చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు వాడుకుంటూ నిర్వీర్యం చేశారు. పౌరుల హ‌క్కుల‌ను కాల‌రాస్తూ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన వారి మీద గంజాయి, దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆఖ‌రుకి రాజ‌కీయ లబ్ధి కోసం దిగ‌జారిపోయి తిరుమ‌ల ల‌డ్డూ గురించి విష ప్ర‌చారం చేశారు. అయినా స‌రే స‌త్య‌మేవ జ‌య‌తే అన్న‌ట్టు సీబీఐ ద‌ర్యాప్తు త‌ర్వాత ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు క‌ల‌వ‌లేద‌ని తేలిపోయింది.

    గాంధీజీ మార్గం అనుస‌ర‌ణీయం: దొంతిరెడ్డి వేమారెడ్డి
    ఆంగ్లేయుల నిరంకుశ పాల‌న నుంచి దేశానికి స్వేచ్ఛా ఊపిరి ఊదిన మ‌హాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని ప్ర‌తి ఒక్క‌రూ అల‌వ‌ర్చుకోవాలి. దేశం కోసం నిస్వార్థంగా ఆయ‌న చేసిన పోరాటం, త్యాగం దేశప్ర‌జ‌లంతా నిత్యం స్మరించుకుంటారు. ఆయ‌న చూపించిన అహింసా మార్గంలో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిఒక్క‌రూ పోరాడాలి.

    గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో అనుబంధం: మ‌ల్లాది విష్ణు
    మ‌హాత్మా గాంధీజీకి గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో మంచి అనుబంధం ఉంది. ఉప్పు స‌త్యాగ్ర‌హం, చీరాల‌-పేరాల ఉద్య‌మం ప్రారంభించారు. ఆయ‌న ఇక్క‌డి నాయ‌కుల‌ను స్వాతంత్ర్య పోరాటంలో కార్యోన్ముఖుల్ని చేసి ముందుకు న‌డిపించారు. శాంతి, అహింసా మార్గంలో ఓర్పు స‌హ‌నంతో బ్రిటీష్ నిరంకుశంత్వంపై పోరాడి విజ‌యం సాధించ‌డంలో గాంధీజీ పాత్ర గురించి ఎంత‌చెప్పుకున్నా తక్కువే. ఆయ‌న మార్గంలోనే దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. రాష్ట్రంలో వ‌ల‌స‌ల నివార‌ణ‌కు ఆయ‌న పేరుతోనే మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని అనంత‌పురంలో ప్రారంభించారు. రైతు కూలీలు, కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. వైఎస్‌ జగన్‌ మ‌రో అడుగు ముందుకేసి గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించారు. అవినీతి, ప‌క్ష‌పాతానికి తావులేకుండా గ‌డ‌ప వ‌ద్ద‌కే పాల‌న అందించారు.

    అంట‌రానిత‌నంపైనా పోరాటం: గోరంట్ల మాధ‌వ్‌
    స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయ‌డ‌మే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న‌ అస్ప్ర‌శ్య‌త నివార‌ణ కోసం దీన‌జనోద్ధ‌ర‌ణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజ‌యం సాధించారు. అంట‌రానిత‌నంతో వెనుక‌బ‌డిన‌ వ‌ర్గాలకు జ‌రుగుతున్నఅన్యాయంపై గ‌ళ‌మెత్తి వారికి అండగా నిల‌బ‌డ్డారు. ఆయ‌న చూపించిన మార్గంలోనే వైయ‌స్ జ‌గ‌న్ గారు ఐదేళ్ల పాల‌న అందించ‌డంతో పాటు పార్టీని ముందుకు న‌డిపిస్తున్నారు.

    అణుబాంబుల కన్నా అహింసే ప‌వ‌ర్‌ఫుల్‌: జూపూడి ప్ర‌భాక‌ర్‌
    అంట‌రానితనాన్ని దేశం పార‌ద్రోలాలంటే న్యాయ‌వాద వృత్తిని వ‌దిలేయ‌డ‌మే కాకుండా త‌న వేష‌ధారణలో మార్పులు చేసి అతి సామాన్యుడిగా మారిపోయాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప‌ను చూపించాల‌ని అహింసా మార్గాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన గొప్ప సామాజిక మేధావి గాంధీజీ. అణుబాంబుల క‌న్నా గొప్ప‌దైన అహింసా శాంతి సందేశాన్ని పంపాడు. ఐదేళ్ల వైయ‌స్సార్సీపీ పాల‌న‌లో గాంధీజీ వైయ‌స్ జ‌గ‌న్ గారు గాంధీజీ అడుగుజాడ‌ల్లోనే న‌డిచారు.

    గాంధీజీ పేరును తీసేయ‌డం దుర్మార్గం - వెలంప‌ల్లి శ్రీనివాస్‌
    మ‌హాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం అంద‌రికీ అనుస‌ర‌ణీయం. ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డిచి శాంతియుతంగా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాలి. రైతు కూలీల‌కు ప‌నులు క‌ల్పించి వారికి చేదోడుగా నిలుస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తోంది. మ‌హాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దివంగ‌త వైయ‌స్సార్ తీసుకొచ్చిన ఉపాధి హామీ ప‌థ‌కం ఎన్నో ల‌క్ష‌ల కుటుంబాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి ప‌థ‌కం నుంచి గాంధీ పేరును తీసేయ‌డం ఆయ‌న్ను అవ‌మానించ‌డ‌మే

  • సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు  పచ్చి అబద్దాలని, సీబీఐ ఛార్జిషీట్ ద్వారా ఈ విషయం వెల్లడైందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన లేబొరేటరీల సాక్షిగా ఈ విషయం తేట తెల్లమైందన్న ఆయన... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

    తాడేపల్లి వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... తన వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన బాబు.. అది తప్పని తెలిసినా క్షమాపణ చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా సిట్ నివేదికతో తనను తాను సమర్థించుకోలేని సీఎం.. మరింత దిగజారి లడ్డూపై మరలా దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఈ నేపధ్యంలో బాబును ప్రజా క్షేత్రంలో బోనులో నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. గతంలో చంద్రబాబు బోలే బాబా డెయిరీని ప్రోత్సహిస్తే... వైఎస్సార్‌సీపీ హయాంలో బ్లాక్ లిస్ట్‌లో  పెట్టిన విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టిందని... తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే ఆనందపడాల్సింది పోయి.. మరలా విష ప్రచారానికి తెర లేపడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్లను రాక్షస తెగ అనడంలో తప్పులేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నోరెత్తకపోయినా.. మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.తన వ్యాఖ్యలకు కట్టుబడిలేకపోతే... చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకా ఏమన్నారంటే...

    చంద్రబాబు వ్యాఖ్యలు వెనుక రాజకీయ దురుద్దేశం..
    2024 సెప్టెంబరులో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న  సీఎం చంద్రబాబు  వ్యాఖ్యలతోనే వివాదం మొదలైంది. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో మనం గమనించాల్సిన ప్రధాన అంశం... జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకమైన లేబోరేటరీ రెండూ తమ రిపోర్టులో చంద్రబాబు చేసిన నీచమైన, అన్యాయమైన, పాపిష్టి ఆరోపణలు అబద్దం అని తేల్చాయి.  లడ్డూలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం పక్కాగా నిరూపితమైంది. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్నది బట్టబయలైంది.

    అయితే తన దుర్మార్గమైన వ్యాఖ్యలతో కోట్లాది మంది స్వామి వారి భక్తులను షాక్ కి గురి చేసింది మాత్రం చంద్రబాబే. దాన్ని అంతే గట్టిగా తిప్పికొట్టకపోతే... ఆయన తనంతట తాను నేను తప్పు చేశాను, ఆ మాట వాడకుండా ఉండాల్సింది అని అనకపోతే అది అలాగే నిల్చిపోయే అవకాశం ఉంది కాబట్టి... అందరూ ముక్తకంఠంతో చంద్రబాబూ నువ్వు తప్పు చేశావని చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబుకు మాత్రం తప్పు జరిగింది.. క్షమాపణ చెప్పాలన్న విచక్షణ లేదు. పైగా మరింత దిగజారి ఆయనతో పాటు సైతాను లక్షణాలతో ఒక కూటమిగా చేరిన వారందరూ ఇంకా కల్తీ జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. దాన్ని కూడా కచ్చితంగా ఎండగట్టాలి. అదే విధంగా చంద్రబాబు ముందు చెప్పిన అబద్దపు ఆరోపణలనూ ఎండగట్టాలి. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది.

    అడ్డంగా దొరికి మరింత అడ్డగోలు ప్రచారం..
    అసలు నెయ్యే సరఫరా చేయలేదు, కెమికల్స్ కలిసిన నెయ్యిని వాడారని ఆరోపిస్తున్నారు. ఇవే బ్యానర్లను వేసి రాష్ట్ర మంతా ప్రచారం చేస్తున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ... దారుణమైన రాజకీయ ఆరోపణలు చేసిన చంద్రబాబు దాన్ని సమర్ధించుకోవడానికి తగిన ఆధారాలు లేని పరిస్థితుల్లో.. అడ్డగోలుగా ఇంకా మరింత దుర్మార్గమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు, సీబీఐ దర్యాప్తు ప్రధానంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆంశంపైనే సాగింది. ఇక చంద్రబాబు చెబుతున్నట్టు నెయ్యి సరఫరా దారులను చూస్తే... ప్రస్తుతం బోలే బాబా అని చెబుతున్న సరఫరాదారులు గతంలో చంద్రబాబు హయాంలో హర్ష డెయిరీ పేరుతో ఉన్నదాన్నే పేరు మార్చారు. బాబు హయాంలో 2018 ప్రాంతంలో ఆ డెయిరీ తనిఖీకి వెళ్లి, అర్హత పత్రం ఇచ్చి, సఫ్లై ఆర్డరు కూడా ఇచ్చారు. ఆ రోజు ఉన్న డెయిరీ మా హయాంలో వచ్చేసరికి రిజెక్ట్ అయింది. ఇప్పుడేమే వాళ్లే వేరే కంపెనీల ద్వారా వచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. మరలా అది కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న సాంపుల్స్ ను బట్టే చెబుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో బోలేబాబా  డెయిరీయే హర్ష డెయిరీగా పేరు మార్చుకుని వచ్చింది. మరలా 2019లో మేం దాన్ని రిజక్ట్ చేస్తే... 2024 చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరఫరా చేసిన నెయ్యిని టెస్ట్ చేసారు. అది కూడా  ఏ ఆర్ డెయిరీ నుంచి వచ్చిన నెయ్యి శాంపిల్స్ పరీక్షించారు. 

    అయితే ఈ ఏ ఆర్ డెయిరీతో పాటు మరో రెండు సంస్థలకు బోలేబాబా సరఫరా చేశాడు. అది కూడా 2019-24 మధ్యనే ఇదంతా జరిగిందని చెబుతున్నారు. మా విచారణలో అక్కడకి వెళ్లి ఖాలీ డ్రమ్ములు, ఇన్ వాయిస్ లు చూసి పట్టుకున్నామని ఛార్డిషీట్ లో ఉంది. వాళ్లెవరు అన్నది విచారణలో తేలుతుంది. కానీ రికార్డుల్లో బోలేబాబా అని లేదు, ఏ ఆర్ డెయిరీ అని మాత్రమే ఉంది. సిట్ ఛార్జ్ షీట్ లో బోలేబాబా అన్నది లేదు.. ఈ డెయిరీలో ద్వారా సరఫరా చేశారని చెబుతున్నారు. అది విచారణలో తేలుతుంది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కానీ, టీటీడీ బోర్డు, సభ్యులు ఉన్నారని మాత్రం ఆరోపణ కానీ, ప్రస్తావన కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

    బోలేబాబాను ప్రోత్సహించిందే బాబు..
    అంటే బోలేబాబాను గతంలో ఎంకరేజ్ చేసిందీ చంద్రబాబూ, తాజాగా చంద్రబాబు జూన్ 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్ నుంచే విచారణకు పంపించారు. ఈ శాంపిల్స్ కూడా బోలేబాబకు సంబంధించినది కాదు... ఏ ఆర్ డెయిరీ కి బోలేబాబా సరఫరా చేసిందన్నది మా విచారణలో తేలిందని సిట్ తెలిపింది. అది విచారణలో తేలుతుంది.  అలాంటప్పుడు వైవీ సుబ్బారెడ్డి హయాంలో, వైఎస్.జగన్ హాయంలో ఏ రకంగానూ తప్పు జరగలేదు.

     మరో అంశం అప్పన్న లావాదేవీలపై మాట్లాడుతున్నారు. అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పీఏగా ఉన్నారన్న విషయం కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య అప్పటి టీటీడీ పర్చేజింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నారన్న విషయం దర్యాప్తులో కానీ, మీడియాలో కానీ ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు?.  నిష్పాక్షపాతంగా విచారణ జరుగుతుంటే ఇవన్నీ ప్రస్తావనకు ఎందుకు రావడం లేదు? కేవలం సుబ్బారెడ్డి పీఏ అని చెప్పడం ద్వారా మరో నీచమైన రాజకీయాని తెరతీయాలనుకుంటున్నారు.

    సుప్రీం కోర్టు సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టింది.  బాధ్యతాయుతమైన స్ధానంలో ఉండి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. బోర్డు తరపున నుంచి ఎలాంటి విచారణ లేకుండా ఈ రకంగా బాధ్యతలేకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే.. చంద్రబాబు ఆయన అనుచర వర్గం ఓ రాక్షస తెగ మాదిరిగా వ్యవహరిస్తూ.. సైకోల మాదిరిగా ఎదుటివాడు కోలుకోకుండా దారుణంగా దెబ్బకొట్టడంతో పాటు వారి చేతిలో ఉన్న ప్రసార సాధనాల ద్వారా దుష్ర్పచారం చేయడమే వీరి లక్ష్యం. ప్రాణాలు తీయకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే వీరి లక్ష్యం. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేయడమే షాక్. ఒక మనిషి ఇంత అన్యాయమైన, నీచమైన ఆరోపణ చేయగలడా? అది కూడా ముఖ్యమంత్రి స్దానంలో ఉన్న వ్యక్తి ఇంతటికి దిగజారాడా అన్న షాక్ సిబీఐ నివేదిక చూసిన తర్వాత అయినా వచ్చి ఉంటుంది.

    వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పటిష్ట చర్యలు...
    సిట్ నివేదికలో పామొలిన్ ఇతర రకాలు కలిసిందని చెబుతున్న నేపధ్యంలో.. దాంతో తయారు చేసిన లడ్డూ రెండు రోజుల పాటు ఉంటుందా? ఛార్జిషీట్ లో ఫైల్ చేసిన దానికి కూడా ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. కోర్టులు వాటి ఆధారంగా  నిర్ణయాలు తీసుకుంటారు. టీటీడీ లాంటి పెద్ద వ్యవస్ధలు స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. అయినప్పటికీ కూడా వైయస్.జగన్ హయాంలో టీటీడీలోని వ్యవస్ధలను మరింత సమర్ధవంతంగా పనిచేయించడానికి కావాల్సిన అన్ని చర్యలను తీసుకున్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం గతంలో కంటే మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నారు. పరకామణి కోసం కూడా నూతన భవనాన్ని నిర్మించి, మరింత మెరుగైన టెక్నాలజీని కూడా వైయస్.జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

    టీటీడీ బోర్డు ద్వారా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. గతంలోనూ నెయ్యి సరఫరా ఈ కంపెనీలు చేశాయి. ఈ నేపధ్యంలో 2019-24 లో మాత్రమే అని ఎలా చెబుతారు?. ఒక్కటి అయితే వాస్తవం.. టీటీడీ నిర్వహణలో సాధారణంగా జరిగే తనిఖీలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అవి గతంలోనూ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. కేవలం చంద్రబాబు అన్న ఒక్క మాట మొత్తం జాతి దృష్టిని ఆకర్షించింది. అది అబద్దం అనేది మా వాదన. మిగిలినవన్నీ కోర్టులో తేలుతాయి. ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? ఒకవేళ ఉంటే ఆయన హయాంలోనే బోలేబాబా వచ్చింది. అప్పుడు మంచిదైన బోలేబాబా.. ఇప్పుడెలా కల్తీ అయింది, అది కూడా ఆయన హయాంలోనే తేలింది.  

    మరో కుట్రకు తెరలేపే ప్రయత్నం..
    వాస్తవానికి ఎల్లో మీడియాలో చెబుతున్నట్టు మా హాయంలో బోలేబాబా అనే సంస్ద లేదు. ఒక్కసారి 2019 సెప్టెంబరులో వస్తే... అది డిస్ క్వాలిఫై చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. అదే చంద్రబాబు హయాంలో సాంకేతికంగా తనిఖీ చేసి మరీ హర్ష డెయిరీ పేరుతో బోలే బాబా ను నెయ్యి సరఫరాకు ఎంపిక చేసారు. ఇప్పుడు ఈ బోలే బాబా పరోక్షంగా ఇతర సంస్థల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్నారు. అది కోర్టులో తేలుతుంది.  ఒకవేళ టీటీడీ వ్యవహారాల్లో ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందను కుంటే.. ఇప్పుడున్నది చంద్రబాబు ప్రభుత్వం ఆయనకే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మా అనుమానం ఏమిటంటే.. ఇందులో కూడా మరో మహా కుట్రకు కూడా తెరలేపినా  ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 

    సిబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడివిట్ లో  లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని తేలితే.. ఆనందంగా ఫీలవ్వాలి. కల్తీ జరిగిందని చెప్పినందుకు.. అది నిజం కాదని తెలిసినప్పుడు నాలుక్కరుచుకోవాలి, లేదంటే దాటవేసే ప్రయత్నం చేస్తారు. కానీ కల్తీ నిజమని హెర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టడం చూస్తుంటే మరింత ఆశ్చర్యం కలుగుతోంది. ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు  అనేకమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని భావించగా... లడ్డూలో జంతుకొవ్వులు కలవలేదని తెలిసి అందరూ ఆనందపడే సమయంలో మరలా అదేప్రచారం చేస్తున్న వీళ్లను రాక్షస తెగ లాగా..  అనడంలో ఏం తప్పు ఉంది?

    బాబు పాపం మరింత బయటపడ్డం ఖాయం..
    ఆరోజైనా, ఈరోజైనా చంద్రబాబుకి నిజంతో పనిలేదు. వైఎస్.జగన్ ఎప్పుడూ నిజాలనే నమ్ముతారు. కానీ చంద్రబాబు తానే కొన్ని అబద్దాలను క్రియేట్ చేసి.. వాటినే ప్రచారం చేస్తాడు. అందుకోసం తన ఎల్లో మీడియాను వాడుకుంటాడు. అందుకే నివేదికలో వాస్తవాలు ప్రజలకు తెలిస్తే తనకు రాజకీయంగా పెద్ద దెబ్బ తగులుతుందని భావించి.. ముందే ప్రజల మనస్సులో వాస్తవాలు నాటుకుంటాయి. జంతు కొవ్వు కలవలేదన్న నిజం ప్రజల గ్రహించేలోపే... వారి మైండ్ లో కల్తీ జరిగిందన్న ప్రచారం బలంగా చేయడం ప్రారంభించారు. తద్వారా అసలు నిజం మరుగునపడిపోతుంది. మరలా వైయస్సార్సీపీని టార్గెట్ చేయవచ్చు.. మేం చేసిన పాపం పోతుందని భావించారు. కానీ వాస్తవాలు ప్రజలు గ్రహించారు. చంద్రబాబు చేసిన ఆరోపణ తప్పైందని ప్రజలు గ్రహించారు. ప్రజలు ఈ మాట చెబుతున్నారు అంటే.. జాతీయ స్ధాయిలో కీలకవ్యక్తిగా చెప్పుకునే వ్యక్తి ఇలాంటి ఆరోపణ చేయడం దారుణం అన్న మాట జాతీయస్ధాయిలో కూడా వ్యక్తమవుతోంది.  తాము చేసిన పాపాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు ఆయన భాగస్వామ్యులు మందుకు వెళ్లే కొద్ది వారు చేసిన పాపం మరింత బహిర్గతమవుతుంది. వాళ్లు ఎంత నికృష్టులో అన్న విషయం కూడా బయటపడుతుంది.

    ఇలాంటి ఆరోపణ చేశారు కాబట్టే.... వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్ళారు. సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించి దర్యాప్తునకు ఆదేశించారు.  వైవీ సుబ్బారెడ్డి అత్యంత నిష్టాగరిష్ట భక్తుడు.. ఆయన 30 దఫాలుకు పైగా శబరిమల వెళ్లారు. గోవులను అమితంగా ప్రేమించి, పూజిస్తారు. అలాంటి వాళ్లపై కూడా క్రిస్టియన్ అంటూ దుష్ర్పచారం చేశారు. ఒక అబద్దాన్ని నిజం చేయడానికి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏకంగా పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసాయని ఆరోపించాడు. ఈ లడ్డూలనే అయోధ్యకు కూడా పంపించారని ఆరోపించారు. ఇప్పుడు తీరా సీబీఐ నివేదికలో అలాంటిదేమీ లేదని తెలిసిన తర్వాత వీరిద్దరూ ఎందుకు నోరు మెదపడం లేదు? 

    ఇవాళ తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని కానీ, లేదా నోరు జారి మాట్లాడానని ఎందుకు చంద్రబాబు చెప్పడం లేదు?. ఈ మాట మీడియా చంద్రబాబును ఎందుకు అడగడం లేదు?. ఆయన తనను ప్రశ్నించని వాళ్లనే కూర్చోబెట్టుకుంటాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని  కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు?  వైఎస్సార్‌సీపీ తరపున మేం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం.. ఆయన బయటకు వచ్చి తన వ్యాఖ్యల మీద అయినా నిలబడాలి, లేదా తన తప్పైందని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వైయస్సార్సీపీకో, టీటీడీ మాజీ చైర్మన్ లకో క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు... కనీసం దేవుడి పట్ల అపచారం చేశాననో.. భక్తుల మనోభావాలు దెబ్బతీశాననో చెబితే చాలు. అందుకు చంద్రబాబు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్  సిద్దంగా ఉన్నారా లేదో వేచి చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

    మనకు అనుకూలంగా వస్తే ఒకలా లేదంటే మరొకలా మాట్లాడాల్సిన పనిలేదు. నివేదిక అంతా సవ్యంగా ఉందని మేం చెప్పడం లేదు.. మేం చెప్పేది ఒక్కటే దర్యాప్తు సంస్ధలు కూడా టాంపర్ చేయలేని ఫ్రూప్.. రెండు జాతీయ సంస్ధలు ఇచ్చిన రిపోర్ట్స్ లో చాలా స్పష్టంగా నెయ్యిలో జంతుకొవ్వు లేదని స్పష్టమైంది.  ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా చంద్రబాబు చెప్పింది పచ్చి అబద్దమని రుజువైందని ఆయన స్పష్టం చేశారు.

    దేవుడితో పెట్టుకొని మహా పాపం చేశారు బాబును బోనులో నిలబెట్టాల్సిందే!

     

Politics

  • ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

    ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.

    అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

    సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.

    ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.

  • నల్లగొండ:  మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోయిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌. గతంలో బీఆర్‌ఎస్‌ అవినీతి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్‌ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. 

    ఈరోజు(శుక్రవారం, జనవరి 30వ తేదీ) నల్లగొండలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ..  ‘ కాంగ్రెస్ గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదు. యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామన్న భావనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి 35 శాతం ఓట్లు ఇచ్చి 8 మంది ఎంపీలను గెలిపించారు. 

    నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు, స్మార్ట్ సిటీ, అమృత్, గృహ నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి పథకాలకు వేగంగా నిధులు వస్తాయి. తెలంగాణ భవిష్యత్తు బీజేపీతోనే సురక్షితం. నల్లగొండ కార్పొరేషన్ లో 48 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాం. నల్లగొండ కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం మా పార్టీకే లభిస్తుంది’ ధీమా వ్యక్తం చేశారు. 

  • ఎర్రవల్లి: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన తనయుడు కేటీఆర్‌, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిలు భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్‌, జగదీష్‌రెడ్డిలు సమావేశమయ్యారు.  రాబోయే మున్సిపల్‌ ఎన్నికలు, సిట్‌ నోటీసులపై వీరు ప్రధానంగా చర్చించే అవకాశాం ఉంది. 

    కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అంశానికి సంబంధించి కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  విచారణకు శుక్రవారం(జనవరి 30వ తేదీ) హాజరు కావాలని సిట్‌ నోటీసుల్లో పేర్కొనగా, అందుకు కేసీఆర్‌ తనకు సమయం కావాలని అడిగారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికల బిజీలో ఉన్నానని, అందుచేత కొంత సమయం కావాలని సిట్‌ను కోరారు.  

    అదే సమయంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తానని, మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు. విచారణ వాయిదా వేయాలని సిట్‌ను కోరారు.  ఈ మేరకు సిట్‌కు కేసీఆర్‌ లేఖ రాశారు. కేసీఆర్‌ రాసిన లేఖపై సిట్‌ స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్‌ నిర్ణయించింది. తదుపరి సిట్‌ విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుంది. 

    ఫామ్ హౌస్ కు జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్‌తో కీలక భేటీ

National

  • బెంగళూరు:  ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ టైకూన్‌, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీజర్ రాయ్(డాక్టర్ చిరియాంకందత్ జోసెఫ్ రాయ్) ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్‌మండ్ టౌన్‌లోని తన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపార పరిశ్రమ వర్గాలను ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది.

    సీజర్ రాయ్) బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. 2005లో ఆయన కాన్ఫిడెంట్‌ గ్రూప్‌ను స్థాపించారు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో విస్తరించింది.

    అప్పులు లేకుండా వ్యాపారం నడిపిన మోడల్‌తో ప్రసిద్ధి గాంచారు సీజర్‌ రాయ్‌. : రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, విస్తృత నెట్‌వర్క్ తో వ్యాపార వర్గాల్లో గుర్తింపు పొందారు. ఈరోజు ఐటీ శాఖ ఆయన నివాసంలో దాడులు చేస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

  • త‌ల‌లో తెల్ల‌వెంట్రుక‌లను క‌వ‌ర్ చేయ‌డానికి క‌ల‌ర్ వేయ‌డం ఇప్పుడు కామ‌నైపోయింది. తెల్ల‌బ‌డిన జ‌ట్టును న‌ల్ల‌గా మార్చ‌డానికి ఎక్కువ మంది హెయిర్‌డై పెట్టుకుంటారు. మ‌రికొంద‌రు గోరింటాకు పేస్టు కూడా త‌ల‌కు అప్లై చేస్తుంటారు. కాస్త భిన్నంగా క‌నిపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డేవారు ర‌క‌ర‌కాల రంగులు ట్రై చేస్తుంటారు. ఓ పోలీసు ఉన్న‌తాధికారి కూడా ఇలాగే చేసి చిక్కుల్లో ప‌డ్డారు. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌?

    రష్మి రంజన్ దాస్.. ఒడిశాలోని జ‌గ‌త్‌సింగ్‌పూర్‌ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)గా విధులు నిర్వ‌హిస్తున్నారు. 49 ఏళ్ల రంజన్ దాస్‌కు స్ట్రిక్ట్ ఆఫీస‌ర్‌గా పేరుంది. అసాంఘిక శ‌క్తుల‌పై ఆయ‌న క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంతా అనుకుంటూ ఉంటారు. బుధవారం నాడు (జ‌న‌వ‌రి 28) ఆయ‌న ఫొటో ఒక‌టి విప‌రీతంగా వైర‌ల్ (Viral) అయింది. ఈ ఫొటోలో త‌ల‌కు ఎర్ర‌రంగుతో ఆయ‌న డిఫ‌రెంట్‌గా క‌నిపించారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఆయ‌నపై మీమ్స్, జోక్స్ (Jokes) పోటెత్తాయి. ఫ‌లితంగా ఉన్న‌తాధికారులు సీరియ‌స్‌గా స్పందించారు.

    పోలీసు విభాగంలో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రు యూనిఫాంను గౌర‌వించాల‌ని.. క్రమశిక్షణ, హుందాత‌నానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రష్మి రంజన్ దాస్ వ్య‌వ‌హారం త‌న దృష్టికి వచ్చిన వెంటనే చర్య తీసుకున్నట్టు తెలిపారు. హ్యుమ‌న్‌రైట్స్ ప్రొటెక్ష‌న్ సెల్‌కు దాస్‌ను ఎటాచ్ చేసిన‌ట్టు పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. కాగా, ఈ వ్య‌వ‌హారంపై మీడియాతో మాట్లాడ‌డానికి దాస్ నిరాక‌రించారు.

    ముందే హెచ్చ‌రించినా..
    త‌ల‌కు ఎరుపు రంగు తీసివేయాల‌ని గ‌తంలోనూ ఉన్న‌తాధికారులు అనధికారికంగా దాస్‌ను హెచ్చ‌రించిన‌ట్టు స‌హ‌చ‌ర ఉద్యోగులు తెలిపారు. పై అధికారుల మాట‌ల‌ను అత‌డు ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో తాజాగా చ‌ర్య తీసుకున్న‌ట్టు చెప్పారు. పోలీసు మాన్యువల్‌లో(Police Manual) హెయిర్ స్టైల్స్‌కు సంబంధించి స్పష్టమైన నియమాలు లేనప్పటికీ.. గౌర‌వ భావం క‌లిగేలా క్రమశిక్షణగా ఉండాల‌ని ఆశిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తానికి దాస్ వివాదంతో.. క్ర‌మ‌శిక్ష‌ణ‌, హుందాత‌నం విష‌యంలో ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే స‌హించ‌బోమ‌ని సందేశాన్ని పోలీసు ఉన్న‌తాధికారులు ఇచ్చారు.

    చ‌ద‌వండి: ఏసీబీలో ప‌నిచేస్తూనే.. రూ.20 కోట్లు పోగేశాడు 

  • వీధికుక్కల కేసుపై తీవ్ర చర్చోప చర్చలు నడుస్తుండగానే కుక్కల దాడికి సంబంధించి మరో ఘటన వెలుగు చూసింది.  బెంగళూరులోని ఒక నివాస ప్రాంతంలో పెంపుడు కుక్క ఒక మహిళపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన  దృశ్యాలతో నెటిజనులను కలవరపాటుగా గురిచేశాయి.  

    పలు మీడియా నివేదికల ప్రకారం  ఈ ఘటన జనవరి 26న చోటు చేసుకుంది. ఉదయం సుమారు 6:54 గంటలకు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని టీచర్స్ కాలనీలో మార్నింగ్‌ వాక్‌కోసం వెళ్లిన మహిళపై ఒక పెంపుడు కుక్క దాడి చేసింది. తనదారిన తాను పోతూ ఉండగానే ఉన్నట్టుడి దాడిచేసింది.  మెడ, ముఖం, చేతులు మరియు కాళ్లను కరిచేసింది. దీంతో ఆమెకు 50కి పైగా కుట్లు పడ్డాయి. ఆమెను రక్షించడానికి వచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేసి, నానా బీభత్సం  చేసింది. మరో ఇద్దరు కూడా సాయానికి ముందుకు వచ్చారు. మొత్తంమీద చాలా ధైర్యంగా మహిళ తనను తాను విడిపించుకుంది.

    బాధితురాలి నుండి కుక్కను దూరం చేయడానికి ఆ వ్యక్తి దాని మెడ పట్టుకుని లాగడం ఫుటేజీలో కనిపిస్తుంది.  మహిళ ఎలాగోలా లేచి, ఇంటి లోపలికి వెళ్లి, తన వెనుక గేటు మూసివేసింది. ఆమెకుముఖం, చేతులు , కాళ్ళకు గాయాలయ్యాయి మరియు ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్క యజమాని నిర్లక్ష్యంపై హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
     

  • ఢిల్లీ: కేంద్ర జలవివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో  పాల్గొన్న తెలంగాణ ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జా మాట్లాడుతూ.. ‘ తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించాలని  ప్రతిపాదించాం. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశాం. 

    రెండు రాష్ట్రాల మధ్య పలు జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలపై అనేక అంశాలు ఉన్నాయి, అందుకే సమావేశానికి వచ్చాం. ఈ సమావేశంలో ఏపీ తన అజెండాను చెప్పలేదు. తదుపరి సమావేశం  కేంద్ర జల సంఘం(సీడబ్యూసీ) నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నారు.

    తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన ఉభయ రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ తొలి సమావేశం ఈరోజు(శుక్రవారం. జనవరి 30వ తేదీ) జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సమావేశం.. సుమారు రెండు గంటల పాటు సాగింది.

    ప్రధానంగా పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్‌ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల పత్రాలనూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

  • విమాన ప్రమాదంలో పవార్ ఆకస్మిక మరణం తర్వాత  బారామతికి  వచ్చిన విలాస్ ఝోడపే గురువారం బారామతిలోని నీరా నది ఒడ్డున తన తలనీలాలు సమర్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

    పలు నివేదికల ప్రకారం  నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ తాలూకాకు చెందిన పార్టీ కార్యకర్త, అజిత్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు తన జుట్టు కత్తిరించుకోనని ప్రతిజ్ఞ చేశారు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన జరిగింది. నాయకుడిపై తనకున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన ఏడాదికి పైగా జుట్టు కత్తిరించుకోలేదు. కానీ దాదా అకాల మరణంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ఝోడపే నాగ్‌పూర్‌లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల సమయంలో అజిత్ పవార్‌ను కలిశారు. ఆ సీనియర్ నాయకుడు అతని పొడవాటి జుట్టును గమనించి, నాయకులకు ఇలాంటి రాజకీయ బలం, మద్దతు అవసరమని చెప్పారు. అలాగే ప్రజా సేవ,పార్టీ సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పవార్ అతన్ని ప్రోత్సహించేవారు.

     జనవరి 28వ తేదీ ఉదయం పవార్‌ను కలవడానికి ఝోడపే ముంబైకి చేరుకున్నారు, అదే సమయంలో ఘోర విమాన ప్రమాదం వార్త వెలువడింది.  పవార్ అకాల మరణంతో ఆ ప్రతిజ్ఞ నెరవేరలేదు.ఇంతలోనే అజిత్‌ పవార్‌ ఆకస్మికమరణం ఆయనను కలిచి వేసింది తీవ్ర దిగ్భ్రాంతికి గురైన అతను వెంటనే బారామతికి బయలుదేరాడు.  నాగ్‌పూర్‌లోని తన భార్యకు,  ఇద్దరు పిల్లలకు సమాచారం ఇచ్చి వారిని కూడా రమ్మని చెప్పాడు. అలా ఆ కుటుంబం పవార్‌ అంత్యక్రియలకు హాజరైంది.

    తలనీలాలు
    అంత్యక్రియల తర్వాత, ఝోడపే నీరా నది వద్ద తలనీలాలు సమర్పించి,  దీన్ని పవార్ స్మృతికి అంకితం చేశారు. స్థానికులతో మాట్లాడుతూ, తాను ఎవరి కోసం ఈ ప్రతిజ్ఞ చేశానో ఆ వ్యక్తి ఇప్పుడు మనతో లేరు. ఇక్కడ నా తలనీలాలు సమర్పించడం ద్వారా, నేను ఈ త్యాగాన్ని అజిత్ దాదా వారసత్వానికి అర్పిస్తున్నాను  అంటూ భవోద్వాగానికి లోనయ్యాడు.

    అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి,   పైలట్‌, సుమిత్కపూర్, కెప్టెన్ సాహిల్ మదన్, కోపైలట్‌, శంభవి పాఠక్‌తో సహా మరో నలుగురు కూడా మరణించారు.

    ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా

    అజిత్‌ పవార్‌ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని ప్రకటించిన  ముఖ్యమంత్రి  మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అధికార లాంఛనాలతో డిప్యూటీ సీఎం అంత్యక్రియలను నిర్వహించారు.  పవార్‌కు తుది నివాళులర్పిందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సహా పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రజలు . సీనియర్ నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు దివంగత అజిత్ పవార్  అస్థికలను సోన్‌గావ్‌లో కర్హా మరియు నీరా నదుల సంగమంలో నిమజ్జనం చేశారు. కుమారులు పార్థ్ పవార్ ,జయ పవార్ ఈ క్రతువులను నిర్వహించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

     

  • ఒక మంచు చిరుత (Panthera uncia) చేసిన అరుదైన వేట దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బర్ గ్రామంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో జరిగిన  ఈ ఘటనను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆండ్రెస్ నోవాలెస్‌ తన కెమెరాలో బంధించారు. భారీ హిమపాతం తర్వాత ఆకాశం నిర్మలంగా మారిన సమయంలో కిబ్బర్ లోయ మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

    ఓ మంచు చిరుత తన రెండు పిల్లలను లోయ కింద వదిలిపెట్టి.. ఒంటరిగా కొండ పైకి వెళ్లి అక్కడ మేత మేస్తున్న ఐబెక్స్(అడవి మేక జాతి) మందపై దాడి చేసింది. ఒక పెద్ద ఐబెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దానిపైకి దూకింది. ఐబెక్స్ తనను తాను రక్షించుకోవడానికి అత్యంత వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో రెండు జంతువుల మధ్య పెనుగులాట జరిగింది. ఒక దశలో రెండు జంతువులు లోయ అంచున మృత్యువుకు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే, సరిగ్గా ఆ సమయంలో చిరుత పట్టు సడలడంతో.. ఐబెక్స్ చాకచక్యంగా దిశ మార్చుకుని అక్కడి నుండి తప్పించుకుంది.

    ఆండ్రెస్ నోవాలెస్ ఈ అనుభవాన్ని పంచుకుంటూ.. తన జీవితంలోనే అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. హిమాలయాల్లో మనుగడ సాగించడం ఎంత కఠినమో, ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో ఇప్పటికే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇది అద్భుతం.. ప్రకృతి అసలైన రూపం ఇది" అంటూ నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

     

  • ఎదురెదురుగా వాహనాలు వచ్చినా... ఒకదానితో ఒకటి ఢీకొనవు... అంతే కాకుండా ప్రమాదానికి ఆస్కారముందని డ్రైవర్లను అప్రమత్తం కూడా చేస్తాయి... దీంతో ప్రమాదాలు విపరీతంగా తగ్గే అవకాశముంటుంది.... అవును మీరు వింటున్నది వాస్తవమే. ఈ ఏడాది చివరి నాటికి ఈ అధునాతన టెక్నాలజీ రోడ్లపైకి వచ్చే అవకాశముంటుంది. కార్లలో అమర్చే V2V చిప్ ద్వారా ఇది సాధ్యమే.

    2026 చివరి నాటికి కొత్త వాహనాలలో V2V చిప్ చేరే అవకాశముంటుంది. కొత్త కార్లలో కంపెనీల నుంచే చిప్‌ యాడ్‌ అయిన తర్వాత వాహనాలు చేతికి అందుతాయి. చిప్‌ ధర కేవలం 5వేల రూపాయల నుంచి నుండి 7 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పటికే... ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ....

    రెనాల్ట్ ఇండియా కంపెనీ.... తన పాపులర్ ఎస్ యూవీ డస్టర్ వాహనానికి సంబంధించి మూడవ తరం మోడల్ ను ఇటీవల జనవరి 26న భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆ వాహనంలో చిప్‌ అమర్చి ఉన్న తీరును.. అది పని చేస్తున విధానాన్ని... టీజర్ ను విడుదల చేసి ఫస్ట్ లుక్ ను చూపించింది. ఈ కారు భద్రత కోసం లెవల్ -2 ఏడీఏఎస్ ఫీచర్లను పొందే అవకాశం ఉందని ప్రతినిధులు వెల్లడించారు.

     

  • జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ  ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే.  కన్న కూతురి  కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.

    పెచియమ్మాళ్‌ అలియస్‌ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రార​ంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో  వివాహబంధంలోకి అడుగుపెట్టింది.  దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని  రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

    ఇక్కడే పెచియమ్మాళ్‌ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం,  ప్యాంట్‌ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

    ఇదీ చదవండి: స్టార్‌ సింగర్‌ రిటైర్మెంట్‌ వెనుక రహస్యం ఇదేనట!

    చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్‌గా, కూలీగా, టీ  మేకర్‌గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ,  బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.

    ఆమె మహిళ  అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్‌ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా  ముత్తు  లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్‌గా  మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. 
     

  • ఢిల్లీ: తీహార్‌ జైల్లో ఉమర్‌ ఖలీపై తోటి ఖైదీలు దాడికి పాల్పడ్డారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.  ఆరేళ్ల క్రితం దేశ రాజధానిలో 53 మంది మరణాలకు, 700 మందికిపైగా గాయాలపాలు కావడానికి కారణమైన భారీ అల్లర్ల కేసులో నిందితుడు, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్‌పై తోటి ఖైదీలు మూకుమ్మడి దాడి చేశారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    ఉమర్‌ ఖలీపై దాడి జరిగిందంటూ పలు సోషల్‌ మీడియా పోస్టులు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగా దాడి జరిగిందా? దాడి చేసిన వారు ఎవరు? దాడి చేయడానికి కారణం ఏమిటి? దాడి తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వంటి వివరాలపై స్పష్టత కోసం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    ఇదే కేసులో 
    ఇదే కేసులో జనవరి 5న సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆరేళ్ల క్రితం దేశ రాజధాని భారీ అల్లర్ల కేసులో నిందితులు, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్, షర్జీల్‌ ఇమామ్‌లకు బెయిల్‌ తిరస్కరించింది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్‌ ఇచ్చేది లేదని జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ వీఎన్‌ అంజారియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.

    అల్లర్లకు భారీ స్థాయిలో కుట్ర పన్నడం, అమలు చేయడం, అల్లరిమూకలకు మార్గదర్శకం వహించడం, అల్లర్లలో భాగస్వాములుగా మారడం దాకా ప్రతిదశలో వీళ్ల పాత్ర ఉన్నట్లు తెలిపే బలమైన సాక్ష్యాధారాలు ఉన్న కారణంగా ఖలీద్, ఇమామ్‌ల బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘ ఉమర్‌ ఖలీద్, షర్జీల్‌ ఇమామ్‌లకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

    చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక)చట్టం(ఉపా)లోని సెక్షన్‌ 43డీ(5) ప్రకారం నిందితులపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలుంటే బెయిల్‌ను కోర్టు తిరస్కరించవచ్చు. దీని ప్రకారం వీళ్ల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు అర్హమైందే. కేసు కీలక దర్యాప్తు, విచారణదశలో ఉన్న ఈ తరుణంలో వీళ్లిద్దరికీ బెయిల్‌ ఇవ్వడం సముచితం అనిపించుకోదు. కేసు విచారణ ఆలస్యమైనంత మాత్రాన నిందితులకు కొత్తగా ఒనగూరేది ఏమీ ఉండదు. నేరంలో లోతైన ప్రమేయం ఆధారంగా ఏడుగురు నిందితులను ఒకే గాటన కట్టట్లేము. అందుకే ఇతర ఐదుగురు నిందితులైన గుల్ఫిషా ఫాతిమా, మీరన్‌ హైదర్, షిఫా ఉర్‌ రెహ్మాన్, మొహమ్మద్‌ సలీమ్‌ ఖాన్, షాదాబ్‌ అహ్మద్‌లకు బెయిల్‌ ఇస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. 

    11 షరతులు విధించిన కోర్టు
    ఈ సందర్భంగా ఈ ఐదుగురికి కోర్టు 11 షరతులు విధించింది. ‘‘ తలా రూ.2 లక్షల పూచీకత్తుతో వ్యక్తిగత బాండ్‌ సమర్పించండి. దేశం దాటి ఎక్కడికీ పోవద్దు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోనే అధికారులకు అందుబాటులో ఉండాలి. పాస్ట్‌పోర్ట్‌లను అధికారులకు ఇచ్చేయాలి. ఢిల్లీ జైసింగ్‌ మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌కు ప్రతి సోమ, గురువారాలు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలి. మీరు ఉండబోయే ఇంటి అడ్రస్, వాడబోయే ఫోన్‌ నంబర్, ఈమెయిల్‌లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలి. కేసు పూర్తయ్యేదాకా కేసు వివరాలు ఎక్కడా ఎవరితో పంచుకోవద్దు. ప్రచారసభల్లో ప్రసంగాలు చేయొద్దు. భౌతికంగా, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మాధ్యమాల్లో ఎలాంటి అంశాలను ప్రచారంలోకి తేవొద్దు’’ అని కోర్టు వాళ్లకు సూచించింది.

    వీళ్లది కీలక పాత్ర..
    ‘‘ ఉమర్‌ ఖలీద్, ఇమామ్‌లు భారీ కుట్రలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వ్యూహరచన, అల్లరిమూకలను రెచ్చగొట్టడం, లక్షిత ప్రాంతాల్లో గుమిగూడేలా చేయడం, ప్రణాళిక అమలులో వీళ్ల పాత్ర ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంచేస్తున్నాయి. ట్రంప్‌ పర్యటన సందర్భంగా జనం రోడ్లమీదకొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు చేసేలా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఖలీద్‌ విద్వేషపూరిత ప్రసంగాలిచ్చాడు. భారత్‌లో మైనార్టీలు హింసకు బలవుతున్నారనే వాదనలు నిజమని అంతర్జాతీయ సమాజం విశ్వసించేలా ప్రసంగాలిచ్చారు. జేఎన్‌యూ వర్సిటీలో ముస్లిం స్టూడెంట్స్‌ ఆఫ్‌ జేఎన్‌యూ వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి అందర్నీ సమీకరించాడు. ఇతని పాత్ర ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. జనాన్ని పోగేసేందుకు అలీగఢ్, ఇతర ప్రాంతాల్లోనూ పర్యటించాడు’’ అని ధర్మాసనం తన తీర్పులో పలు అంశాలను ప్రస్తావించింది.

    గుల్ఫిషా ఫాతిమా పాత్రపై..
    ‘‘ఇక మరో నిందితురాలు గుల్ఫిషా ఫాతిమా.. స్థానిక మహిళలను పోగేసి నిరసన ప్రదర్శనల ప్రాంతాలకు తరలించారని, ఉద్యమ సంబంధ వస్తువుల సేకరణకు సాయపడ్డారని చేసిన వాదనల్లో పస లేదు. అందుకే ఆమెకు బెయిల్‌ ఇస్తున్నాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. పౌరసత్వ సవరణచట్టం–2020, జాతీయ పౌరపట్టీ (ఎన్‌ఆర్‌సీ)లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ చట్టవ్య తిరేక విద్వేషక ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఇమామ్‌ను పోలీసులు 2020 జనవరి 28వ తేదీన, సెప్టెంబర్‌ 13వ తేదీన ఖలీద్‌ను అరెస్ట్‌చేశారు.

    ఈ కేసులో బెయిల్‌ కుదరదని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది సెప్టెంబర్‌ రెండో తేదీన ఇచ్చిన తీర్పును ఖలీద్, ఉమర్‌తోపాటు మరో ఐదుగురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా గత ఏడాది డిసెంబర్‌లో వాదనలు పూర్తయ్యాయి. నిందితుల తరఫున కపిల్‌ సిబల్, అభిషేక్‌ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్‌ ఖుర్షీద్, సిద్ధార్థ్‌ లూథ్రా హాజరై వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించగా తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది డిసెంబర్‌ 10వ తేదీన రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువర్చింది.

    సాక్ష్యాధారాల పరిశీలన, సాక్షుల విచారణ తర్వాత లేదా ఏడాది తర్వాత ఉమర్, ఇమామ్‌లు తాజాగా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఉత్తర ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని, ఇలాంటి వ్యూహరచన, అమలు అనేవి దేశ సార్వభౌమత్వంపై దాడి అని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా వాదించారు. అందుకే అత్యంత కఠినమైన ఉపా, భారత శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని వాదించారు.

  • బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పోస్ట్, గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక శారీరక వెతల గురించి  చెప్పకనే చెబుతుంది.అతని పోస్ట్‌లోని వివరాల ప్రకారం క్యాబ్‌ డ్రైవర్‌గా తాను గాడిద చాకిరీ చేస్తున్నా సంతృప్తికర జీవితం గడపలేకపోతున్నానని వాపోయాడు.  

    వ్యాపారంలో నష్టపోయిన కారణంగా అప్పులు మిగిలాయి. దీంతో అందుకే  ఖర్చుల నిమిత్తం యల్లో బోర్డు క్యాబ్‌ను అద్దెకు తీసుకుని, ఊబర్ . రాపిడోతో పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు డ్రైవ్ చేస్తాను.  సుమారు 4 వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో 1.5 వేలు కారు అద్దెకు, 1.2 వేలు సీఎన్‌జీకి ,  ఫుడ్‌, వాటర్‌ కోసం 200 రూపాయలు ఖర్చవుతాయి.  ఇక తనకు మిగిలిని రోజుకు దాదాపు 1000 రూపాయలు మిగులుతాయి. ఇలా బతకడం చాలా  కష్టంగా  ఉందని  చెప్పుకొచ్చాడు.

    తనకు వచ్చే రాబడి పరిస్థితి ఇలా ఉంటే, శారీరక శ్రమ మరింత దారుణంగా ఉంటుందని తెలిపాడు. కాళ్లు నొప్పులు..  ఇక  చాలు బాబోయ్‌.. అని మోకాళ్లు  మొరాయిస్తుంటాయి. రోజులో కేవలం 6 గంటల నిద్ర.  ఇక తనకు సమయం మిగిలడంలేదనీ, అందుకే సోషల్‌మీడియాలో మధ్య ఏ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండటంలేదని చెప్పాడు.  ఇక ఇంధన కోసం పొడవైన క్యూలలో వేచి ఉండాలి.. అసలు ఇది ఒక జీవితమేనా? అనిపిస్తుంటుంది. తమ లాంటి డ్రైవర్లు తాము పనిచేసే యాప్‌ల నుండి నిరంతర ఒత్తిడి గురించి  ఎంత చెప్పినా తక్కువే,   అందుకే దీన్ని'గాడిద చాకిరీ'  అంటాం. “యాప్ 'ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్' లాగా పనిచేస్తుంది. వచ్చిన రైడ్‌ను  త్వరగా, అంటే 5-6 సెకన్లలో అంగీకరించకపోతే, మరొకరు తీసుకుంటారు.  రైడ్‌లనువెంటనే యాక్సెప్ట్‌ చేయకపోతే రేటింగ్‌ పడిపోతుంది అని  వివరించాడు.  

    ఇదీ చదవండి: స్టార్‌ సింగర్‌ రిటైర్మెంట్‌ వెనుక రహస్యం ఇదేనట!

    ట్రాఫిక్‌లో నానా కష్టాలుపడి ఇంటికి రాగానే, ఎంత అలిసిపోయినా కారు కడగాల్సిందే. ఇంతక చేసినా తమ  కష్టానికి ఏమీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాదిమంది ఉద్యోగాల వాస్తవికత ఇదే. అయితే దోపిడీ చేసేవాడు.. లేదా దోపిడీకి గురయ్యేవారు.  లేదా దోపిడీ చేసేవాడిగా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవాడిగా ఉండాలి.చౌక శ్రమ వల్లే ఇతరులు ఈ సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు అని  పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్  కావడంతో నెటిజన్లు అతనిపై సానుభూతిని  ప్రకటించారు. ఏమీ చేయలేని పరిస్తితిలో ఉన్నాం. మీ ప్రతి మాటలో మీ మానసిక,శారీరక బాధను రెండూ అర్థం చేసుకోగలం అంటూ సానుభూతి  వ్యక్తంచేశారు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి అని  మరికొందరు చెప్పారు.  చాలామంది గిగ్ కార్మికులను గౌరవించాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు.

Business

  • యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్‌లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లిన ఆర్థిక మంత్రులు, నేడు టాబ్లెట్ ద్వారా పూర్తిగా కాగిత రహితంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న చరిత్ర, ఆలోచన, ఆధునికత మొదలైన విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.

    తొలినాళ్లలో.. భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి బడ్జెట్ పత్రాలను బ్రీఫ్‌కేస్‌లో పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఈ బ్రీఫ్‌కేస్ బ్రిటిష్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటన్‌లో అప్పటి ఆర్థిక మంత్రి విలియం ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ ఉపయోగించిన “గ్లాడ్‌స్టోన్ బాక్స్”కు అనుకరణగా ఇది ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. దశాబ్దాల పాటు చాలామంది ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగానికి బ్రీఫ్‌కేస్‌తోనే వెళ్లడం ఆనవాయితీగా మారింది.

    ఇదీ చదవండి: 2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!

    కాలం మారింది.. ఆలోచనలు మారాయి. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్రీఫ్‌కేస్ సంప్రదాయానికి ముగింపు పలికారు. బ్రీఫ్‌కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన 'బహి ఖాతా'ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2021లో సీతారామన్ పూర్తిగా కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ను ఉపయోగించి బడ్జెట్ పత్రాలను డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టాబ్లెట్‌ను కూడా బహి ఖాతా ఆకృతిని తలపించే ఎరుపు రంగు కవర్లో తీసుకెళ్లడం విశేషం. ఇది సంప్రదాయం & ఆధునికత కలయికకు ప్రతీకగా నిలిచింది.

    బడ్జెట్ మార్పుకు కారణం!
    బడ్జెట్ సమర్పించడంలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. కాగిత వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ పత్రాలను వేగంగా, సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అంతే కాకుండా.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును ఆధునీకరించడం అని తెలుస్తోంది.

  • ఏటీఎం అంటే అందరికీ తెలిసింది డబ్బులు విత్‌డ్రా చేసుకునే మెషిన్ అని మాత్రమే. కానీ ఇకపై ధాన్యం కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలను బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద, బీహార్ ప్రభుత్వం పాట్నాలో మూడు ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి మనదేశంలో మొట్టమొదటి ధాన్యం ATM.. 2024 ఆగస్టులో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మొదలైంది. ఇప్పుడు బీహార్‌లో కూడా ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు.

    ధాన్యం ATM అనేది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా తమను తాము ధృవీకరించుకుంటారు. ఆ తరువాత బియ్యం, గోధుమలు వంటి అవసరమైన ధాన్యం సెలక్ట్ చేసుకుంటారు. ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి.. ఆ మెషిన్ ధాన్యం అందిస్తుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా డిజిటల్‌గా పూర్తవుతాయి.

    ఒక ధాన్యం ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. గంటకు కేవలం 0.6 వాట్స్ విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. సోలార్ ఫలకాలు & ఇన్వర్టర్లతో కూడా నడిచే విధంగా వీటిని రూపొందించారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.

    బీహార్‌లో ప్రస్తుతం 8.5 కోట్లకు పైగా PDS లబ్ధిదారులు ఉన్నారు. 50,000కి పైగా రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం ATMలు ప్రవేశపెట్టడం వల్ల అక్రమ రవాణా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు తక్కువ ధాన్యం ఇవ్వడం.. లేదా బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం వంటి సమస్యలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని నిపుణుల అభిప్రాయం.

  • రష్యాకి చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ (యూఏసీ)తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఏరోస్పేస్‌ సంస్థ ఫ్లెమింగో ఏరోస్పేస్‌ ఫౌండర్‌ శుభకర్‌ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి దశలో ఆరు ఐఎల్‌–114–300 రకం విమానాలను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటి విలువ 180–200 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని చెప్పారు.

    వీటిని పూర్తిగా దేశీయంగానే తయారు చేసేలా, సాంకేతికంగా కూడా తోడ్పడేలా ఈ భాగస్వామ్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఇక్కడే విమానాల అసెంబ్లీ, కస్టమైజేషన్, మెయింటెనెన్స్‌ మొదైలనవి చేపట్టవచ్చని పేర్కొన్నారు. 2032 నాటికి వీటిని పూర్తి స్థాయిలో దేశీయంగా రూపొందించగలమన్నారు. ప్రాంతీయంగా స్వల్ప, మధ్య స్థాయి దూరాలకు ఈ 68 సీటర్ల విమానాలు అనువుగా ఉంటాయని శుభకర్‌ వివరించారు.

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.

    కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.

    బడ్జెట్ - ప్రసంగ సమయం
    ➤2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)
    ➤2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)
    ➤2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)
    ➤2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)
    ➤2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)
    ➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు
    ➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)
    ➤2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు) మొత్తం 8 బడ్జెట్‌లు.. 793 నిమిషాలు / 13 గంటల 13 నిమిషాలు

    ఇక 9వ బడ్జెట్‌తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

  • గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.

    ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.

    వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.

    బంగారం ధరలపై విలియం లీ స్పందన
    బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.

    పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.

    ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!

  • శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్ల నష్టంతో 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్ల నష్టంతో 25,320.65 వద్ద నిలిచాయి.

    పరాస్ పెట్రోఫిల్స్ లిమిటెడ్, రేమండ్ రియాల్టీ లిమిటెడ్, రేమండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, భారత్ బిజ్లీ లిమిటెడ్, భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్ లిమిటెడ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. తన రౌండ్ లోగోను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా అప్‌డేట్ చేసింది. ఈ కొత్త లుక్‌ను సెప్టెంబర్ 2025లో మొదట iX3లో ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కంపెనీ ఫిబ్రవరి నుంచి అన్ని ఇతర కార్లకు దీనిని ఉపయోగించనుంది.

    బీఎండబ్ల్యూ కొత్త లోగోలో చెప్పుకోదగ్గ అప్డేట్ కనిపించదు, కానీ సూక్ష్మమైన మార్పులు గమనించవచ్చు. ఇది వరకు ఉన్న బ్రాండ్ లోగోలో బ్లూ, వైట్ ప్రాంతాలను విభజించిన క్రోమ్ ఉండేది. కొత్త లోగోలో ఇది కనిపించదు. BMW అక్షరాలు కూడా స్లిమ్ చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ కూడా మ్యాట్ ఫినిషింగ్‌ పొందుతుంది.

    వారసత్వాన్ని నిలుపుకుంటూనే.. లోగోకు మరింత ఖచ్చితత్వాన్ని తీసుకురావాలనున్నామని, ఈ కారణంగా చిన్న చిన్న అప్డేట్స్ చేసినట్లు BMW బ్లాగ్స్ బ్రాండ్ డిజైన్ బాస్ ఆలివర్ హీల్మెర్‌ వెల్లడించారు. అప్డేట్ లోగోతో కూడిన వాహనాలు యూరోపియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.

  • ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా ద్రవ్యపరమైన స్థిరీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

    మరోవైపు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను పరిశీలిస్తే.. విధానపరమైన రేట్లను తగ్గించే దిశగా అడుగులేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తద్వారా వృద్ధికి తోడ్పాటు అందించాలని వ్యాపారాలు, కుటుంబాలపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థికవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. కార్మిక, వ్యవసాయ చట్టాల సవరణ, రైల్వే, రహదారులపై భారీ పెట్టుబడులు, ఆర్థిక ప్రోత్సాహకాలు, తక్కువ పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే వృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించిందని, ఇప్పుడు ప్రైవేట్‌ రంగం దేశీ అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది.

    అంతేకాదు.. యూరోపియన్‌ యూనియన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం కూడా అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ జియోపాలిటిక్స్‌ ద్వారా ఏర్పడుతున్న అనిశ్చితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే.. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంది.

    సామాజిక ఆర్థిక పరిస్థితులు

    • భారత్‌ కచ్చితంగా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ. చైనాసహా ఇతర ధనిక దేశాల తలసరి ఆదాయాలు మనకు నాలుగు రెట్లు ఎక్కువ.

    • దేశంలో యాభై శాతం జనాభాకు రేషన్‌ బియ్యం కావాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే దిగువ, మధ్య తరగతి వర్గాల వారు మరిన్ని కొనుగోళ్లు చేసేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది కూడా.

    • నిరుద్యోగం, తగినన్ని అవకాశాలు లేకపోవడం ఇప్పటికీ దేశంలో అధికంగా ఉంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.

    • పోషకాహార లోపం సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు తగిన మౌలిక సదుపాయాలు లేవు.

    • మూలధన, శ్రామిక ఉత్పాదకత కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది ఇటీవలి కాలంలో వేగంగా తగ్గిపోతోంది.

    • రూపాయి బలహీనపడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వేగంగా వైదొలగుతూండటం కూడా ఏమంత మంచి పరిణామాలు కావు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ విదేశీ రుణభారం తగ్గకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

    • చాలాకాలంగా దేశీ ఎగుమతుల్లో పెరుగుదల లేకుండాపోయింది. పైగా చైనా ఉత్పత్తులపై ఆధారపడటం ఏటికేటా పెరిగిపోతోంది.

    • బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిస్క్‌ క్యాపిటల్‌ తగినంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రుణాల కోసం డిమాండ్‌ పెరగడం లేదు. అయితే డిపాజిట్ల క్రెడిట్ల నిష్పత్తి మాత్రం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిపోయింది. పొదుపు తగ్గడం లేదా పెట్టుబడి విషయంలో ప్రాథమ్యాలు మారిపోవడం దీనికి కారణం కావచ్చు. బంగారం, రియల్‌ ఎస్టేట్‌, క్రిప్టో తదితర ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటూ ఉండవచ్చు.

    • పెద్ద పెద్ద వ్యాపారాలు, అధికాదాయ, ధనిక కుటుంబాలకు మినహా చిన్న, ప్రైవేట్‌ రంగ వ్యాపార వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.

    • ఎగుమతులు పెరగకపోవడం, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న నిబంధనలను కొన్నింటిని తొలగించింది.

    • భారతీయ నగరాలు కొన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలోకి చేరాయి. మహా నగరాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ నత్తనడకన సాగుతోంది.

    • రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలపై రుణభారం పెరిగిపోతోంది.

    క్లుప్తంగా చెప్పాలంటే.. మనం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సమాజంగా పరిణమించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట. కాబట్టి.. అభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు చాలా కుటుంబాలు రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భారీ పెట్టుబడులతో సామాజిక, ఆర్థిక పురోగతికి పునాదులు వేయాలి.

    ప్రజలందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తేలేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కాస్తా దీర్ఘకాలంలో మధ్యాదాయ దేశంగానే మిగిలిపోయేలా చేస్తుంది. ఈ ట్రాప్‌ నుంచి తప్పించుకోవాలంటే...

    • ద్రవ్య స్థిరీకరణను వాయిదా వేయాలి. ఎందుకంటే.. వడ్డీరేట్లు స్థిరంగా ఉన్నాయి.. తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉంది.

    • స్పెక్యులేషన్‌కు అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులను నియంత్రించాలి. తద్వారా అందుబాటులో ఉన్న మొత్తం రిస్క్‌ క్యాపిటల్‌ను మెరుగ్గా వాడుకునేందుకు వీలు ఏర్పడుతుంది.

    • నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టాలి. కాలుష్య నివారణకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు, గృహ వసతి కల్పనకు ప్రయత్నాలు ముమ్మరం కావాలి.

    • చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈక్విటీ మద్దతు కల్పించాలి. రుణ సౌకర్యం కల్పించడం ఒక్కటే సరిపోదు.

    • ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా పడిఉన్న మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మార్చేలా ప్రోత్సహించాలి. కొన్నేళ్లపాటు డివిడెండ్లను త్యాగం చేయాల్సి వచ్చిన వెనకాడరాదు.

    • ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు లేకుండా చూడాలి. ఎనిమిదో పే కమిషన్‌ ద్వారా గ్రామీణ, నగర ప్రాంతాలు రెండింటిలోనూ తగిన వేతన పరిమితులు ఏర్పాటయ్యేలా చూడాలి.

    • పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

    • యూరప్‌తో కుదిరిన ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ ద్వారా గరిష్టంగా లాభం పొందేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు పెద్ద కంపెనీలకు కూడా లక్ష్యాల ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలి.

    • ఇన్నోవేషన్‌ ద్వారా విలువను జోడించడంలో భారీ కార్పొరేషన్ల పాత్రను గుర్తించి తగు విధంగా ప్రోత్సహించాలి.

    మొత్తమ్మీద చూస్తే.. ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ఆర్థికవేత్తల వ్యూహంపై పునరాలోచన జరగాలి. వివిధ దేశాలతో చేసుకున్న ఫ్రీట్రేడ్‌ అగ్రిమెంట్‌ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. భారీ కార్పొరేషన్లకు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఆర్థికపరమైన మద్దతుకు ప్రాధాన్యత కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ఉండేందుకు కార్మిక, పెట్టుబడి ఉత్పాదకతలను పెంచే విషయమై దృష్టి పెట్టాలి. యువతకు పబ్లిక్‌ సర్వీసుల్లో అవకాశాలను సృష్టించాలి.

    - అనిల్‌ కె.సూద్‌, అధ్యాపకులు, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ కాంప్లెక్స్‌ ఛాయిసెస్‌, హైదరాబాద్‌.

International

  • వాషింగ్టన్‌ డీసీ: అయతుల్లా ఖమేనీ.. ఇరాన్ సుప్రీం లీడర్..! ఇప్పుడు ఇతణ్ని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు అమెరికా సిద్ధమైందా?? 1979లో రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి ఇరాన్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్‌జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా ట్రంప్ తన సైన్యంతో టెహ్రాన్‌పై దాడికి సన్నద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అవుననే సమాధానం చెబుతున్నాయి. 

    మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్‌లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పుడు ఇరాన్ సమీపంలోని జలాల్లో పూర్తిస్థాయిలో మోహరించింది. అదే సమయంలో.. వెనిజెవెలా మాదిరిగా సైబర్ దాడి చేసేందుకు అమెరికా సైబర్ కమాండ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోంది.

    వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు. ఆ ఏడాది జనవరి 3న ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్‌ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.

    గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి.

    ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్‌లోనే ఉన్నాడా? లేక రష్యాలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలయ్యాయి. అయితే.. అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఖమేనీ ఉనికిపై ఓ స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనా.. యుద్ధ విమానాలు, సేనలను ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నా.. ప్రజలకు నష్టం కలగకుండా.. కలుగులో దాక్కొన్న ఖమేనీ, నియంతృత్వ భావాలున్న ఇతర నాయకులే అమెరికా లక్ష్యమని స్పష్టమవుతోంది. అంటే.. పరిమిత ప్రాంతాలపైనే.. ఇంకా చెప్పాలంటే నిర్ణీత భవనాలు, బంకర్లపైనే అమెరికా దాడులు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ గార్డ్స్, సైన్యాధికారులు కూడా తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా ట్రంప్ సేనలు ఇరాన్ పెద్దలను బంధించేందుకు దాడులు జరిపే అవకాశాలున్నాయి. 

     

  • రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి దుబాయ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రెసిడెన్షియల్ విల్లాను నిర్మించనున్నారు. ఎక్స్ పో సిటీలో కన్‌స్ట్రక్షన్స్‌ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ ఈ ప్రాజెక్టును ప్రకటించింది. 

    నిర్మాణపు అన్ని దశలలో రోబోట్లు ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ సహాయంతో విల్లాను నిర్మిం చడానికి  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలు....  మరియు నిపుణులను ఆహ్వా నించింది. 

     

Family

  • యూట్యూబర్‌, అంకుర్‌ వారికు ఆర్థిక నిర్వహణకు చెప్పిన ఇదే రూల్‌ సత్సంబంధాలకు వర్తిస్తుందన్నారు. అందరు భావోద్వేగ శక్తిని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించేస్తుంటారిని అన్నారు. మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఇదే రూల్‌ పాటిస్తే..జీవితంలో మంచి రిలేషన్స్‌, అభ్యున్నతి రెండూ సునాయసంగా సాధించగలుగుతామని అన్నారు. మన ఎనర్జీని సరైన విధంగా వినయోగిస్తే..మంచి సంబంధాలను నెరపడమేగాక, అవి మన విజయానికి, ఎదుగదలకు ఉపకరిస్తాయని అన్నారు. మరి అదెలాగంటే..

    భావోద్వేగ శక్తిని ఇలా హ్యండిల్‌ చేయండి అంటూ ఆర్థిక నిపుణుడు అంకుర్ వారికు 50-30-20 రూల్‌ గురించి వివరించారు. ఆర్థిక శాస్త్రంలో సరైన ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఈ రూల్‌ భావోద్వేగ ప్రాధాన్యతను కూడా ఎలా మార్గనిర్దేశితం చేస్తుందో వివరించారు. మన ఎనర్జీలో సగం పని, కుటుంబం, కచ్చితంగా కేటాయించాలి. ఇక   30% మనకు సురక్షితంగా అనిపించే బంధాల కోసం ఎనర్జీని ఖర్చు చేయాలి. మిగిలిన 20% వ్యక్తిగత ఎదుగుదల, అభిరుచులు, స్వీయ పరిశీలనపై దృష్టిపెట్టాలని అన్నారు.

    ఈ విధంగా భావోద్వేగ శక్తిని విభజించడం ద్వారా అలసిపోకుండా బాధ్యతలు, అర్థవంతమైన సంబంధాలు, స్వీయ-సంరక్షణ తదితరాలను సమతుల్యం చేయడం సులభతరమవుతుంది. వ్యక్తిగతంగా ఎదుగుదల, బాధ్యతలను పోషిస్తూనే మానసిక, భావోద్వేగ స్థితిని బలోపేతం చేసుకోవడానికి ఈ రూల్‌ హెల్ప్‌ అవుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి వ్యక్తిగతం 20% ఎనర్జీని ఖర్చు చేయడం అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. నెటిజన్లు కూడా అందుకు మద్దతిస్తూ..20% వ్యక్తిగత సంరక్షణకు అత్యవసరం అని..అందరూ దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారంటూ పోస్టులు పెట్టడం విశేషం.

    (చదవండి: రెండేళ్లకే రెండు గిన్నిస్‌ రికార్డులు..!)

     

  • పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లుగా ఈ బుడతడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఎత్తుకు సరిపోని స్నూకర్‌ గేమ్‌ని ఆడి అందర్ని అబ్బురపరుస్తున్నాడు. పెద్దవాళ్లు ఆడగలిగే ఈ గేమ్‌ తన ఎత్తు కారణంగా ఇబ్బందిపడ్డా కూడా..ఆశ్చర్యపోయే విధంగా షాట్‌లు కొట్టి గిన్నిస్‌ రికార్డులకెక్కడు. 

    ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ఈ రెండేళ్ల బాలుడు జూడో ఓన్స్‌ ఒక ఆటలో రెండు ట్రిక్‌ షాట్‌ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ధృవీకరించింది. స్నూక్‌ర్‌ క్రీడా పూల్‌ క్యూ క్రీడను పోలి ఉంటుంది. టేబుల్‌పై పెద్ద సంఖ్యలో బంతులు పెట్టి ఆడతారు. క్యూ బాల్‌తో ఇతర బాల్‌లను కొట్టినప్పుడూ నేరుగా నిర్ధేశిత హోల్‌లో పడేలా చేస్తారు. ఇక జూడ్‌ అక్టోబర్ 12, 2025న పూల్‌లో బ్యాంక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 

    ఈ ఘనత సాధించడానికి 41 రోజుల ముందు స్నూకర్‌ గేమ్‌లో డబుల్‌ షాట్‌(టేబుల్‌ అంచులకు తాకిస్తూ) చేసిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇక్కడ డబుల్ పాట్ అనేది ఒకే స్ట్రైక్‌లో రెండు బంతులను క్యూ బాల్‌తో జత చేసి నిర్దేశిత హోల్‌లో పడేలా చేస్తే బ్యాంక్‌ షాట్‌ అంటారు. నిజానికి ఎత్తు రీత్యా అంత ఎత్తులో ఉండే టేబుల్‌పై ఆడే క్రీడను జూడో కిచెన్‌ స్టూల్‌ సాయంతో నుంచొని ఆడటం విశేషం. అలా అయినా అతని వయసుకి ఆడటం కష్టమే కానీ ఈ చిచ్చరపిడుగు అదేమంతా కష్టం కాదంటూ అవలీలగా చేసి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. 

    కాగా, జూడ్‌ తండ్రి లూక్‌​ ఒక మినీ టేబుల్‌ని కొన్నప్పుడే అతనికి స్నూకర్‌, పూల్‌ ఆటలను పరిచయం చేశాడు. ఆ చిన్న వయసులోనే తన చిట్టి చేతులతో చాలా సునాయాసంగా క్యూని తీసుకుని అవలీలగా బాల్స్‌ అన్నింటిని కొట్టేసేవాడని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట షేర్‌ చేసేవాడు జూడో తండ్రి లూక్‌. ఇక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ క్రెయిగ్‌ గ్లెండే కూడా ఇంత చిన్న వయసులోనే జూడ్‌ ఇంత ప్రతిభ,అంకితభావం, ఉత్సాహాన్ని చూపించడం అత్యంత ప్రత్యేకమని అన్నారు. 

    (చదవండి: Intermittent Fasting: అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు! నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)
     

Crime

  • వామ్మో.. ఈయ‌న‌గారి తెలివి మామూలుగా లేదు. ప‌నిచేస్తున్న సంస్థ‌కే పంగ‌నామం పెట్టి మ‌స్తు పైస‌లు వెన‌కేసుకున్నాడు. అవినీతిని నిరోధించాల్సిన పోలీసే లంచాలు మ‌రిగి పెడ‌దారి ప‌ట్టాడు. కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తులు వెన‌కేసుకుని అడ్డంగా దొరికిపోయాడు. పాపం పండ‌డంతో కోర్టు మెట్లు ఎక్కి విచార‌ణ ఎదుర్కొంటున్నాడు. 

    విజయనగరం క్రైమ్‌/గుర్ల: విజయనగరం అవినీతి నిరోధ‌క‌ విభాగం (ఏసీబీ)లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరిన నెట్టి శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు అక్షరాలా రూ.20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గుతేల్చారు. ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దాడుల వివరాలను సంబంధిత వ్యక్తులకు ముందుగానే ఆయన చేరవేసేవాడు. దీనికోసం రూ.వేలు, రూ.లక్షల్లో తీసుకునేవాడు.

    ఆయనపై అనుమానం వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారులు ఏడా­దిన్నర క్రితం ఎస్పీ ఆఫీస్‌కు బదిలీ చేసి నిఘా పెట్టారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్‌మెంట్, బంధువుల ఇళ్లలో గురువారం సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్టుచేసి విశాఖప‌ట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

    చ‌ద‌వండి: పాపం.. మ‌హిళా కానిస్టేబుల్ విషాద‌గాథ‌