Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • వీకెండ్‌కి టాలీవుడ్‌లో ఒకేసారి 10 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్లు వెలవెలబోతూ, బుక్ మై షోలో టికెట్ల అమ్మకాలు పెద్దగా జరగట్లేదు. ఇటు చూస్తే ప్రచారం మాత్రం హోరెత్తిపోతోంది. ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు సినిమాల సందడి. ఇనస్టాగ్రామ్ తెరిస్తే చాలు రీల్స్ రీల్స్ తో ప్రచారం హోరెత్తింది.

    గివ్-ఎవే పేరిట ఉచిత పొందిన వారు మాత్రమే మొహమాటానికి ట్వీట్లు వేస్తున్నారు. థియేటర్లలో మాత్రం ప్రేక్షకులు కనిపించడం లేదు. వచ్చిన సినిమాల్లో శ్రీవిష్ణు సినిమా ప్రయత్నమైతే గట్టిదే. నిలబడుతుందని ఊహించారు, కానీ కలెక్షన్ పరంగా ఏ మేరకు చేస్తుందో చూడాలి.  

    సరస్వతి సినిమా పెద్దగా చప్పుళ్లు చేయలేదు. ప్రచారం గట్టిగా చేసిన సంప్రదాయిని సుప్పిని.. సినిమా అంతగా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడం కష్టమే. వీకెండ్‌ అయినప్పటికీ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే వారం కూడా పెద్దగా మార్పు ఉండదని అంచనా. ఎందుకంటే మరో 11 రోజులు తర్వాత పెద్ద సినిమా విడుదల కానుంది.  

  • చీరలో కుందనపు బొమ్మలా యాంకర్ అనసూయ

    ఫ్రెండ్ పెళ్లిలో మెరిసిపోతున్న ధన శ్రీ వర్మ

    టైట్ ఫిట్ డ్రస్‌లో కేథరిన్ గ్లామరస్ ధమాకా

    ఆరెంజ్ కలర్ చీరలో అతుల్య అదిరిపోయేలా

    బ్లాక్ ఔట్ ఫిట్‌లో కృతి శెట్టి క్లోజప్ పోజులు

    బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో కల్యాణి ప్రియదర్శన్

  • అల్లు అర్జున్.. తన భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. పెళ్లిరోజు సందర్భంగా కారుని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేశాడు. నిన్ననే ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే బన్నీ.. తన తమ్ముడు శిరీష్‌కి ఈ కారుని పెళ్లి కానుకగా దీన్ని ఇచ్చాడని చాలామంది అనుకున్నారు. కానీ పెళ్లిరోజు సందర్భంగా భార్యకు దీన్ని ఇచ్చినట్లు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)

    ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్.. 2011లో స్నేహని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని పిల్లలు ఉన్నారు. శుక్రవారం(మార్చి 06) వీళ్ల పెళ్లిరోజు. ఈ క్రమంలోనే భార్యకు విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ఇదే రోజున అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ కూడా నయనికతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం విశేషం.

    అయితే పెళ్లిరోజున అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెప్పడంతో పాటు బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మోడల్ కారు ధర రూ.4-5 కోట్ల మధ్యనే ఉంది. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒకటి చేస్తున్నాడు. దీని షూటింగ్ సాగుతోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో షూటింగ్ మొదలుపెట్టొచ్చు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)

  • తమిళ స్టార్ హీరో విజయ్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇతడి భార్య సంగీత.. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం, త్రిషతో విజయ్‌కి రిలేషనే ఉందనే రూమర్స్ ఓ వైపు చక్కర్లు కొడుతుండగానే ఓ పెళ్లికి ఆమెతోనే కలిసి రావడం లాంటివి హాట్ టాపిక్ అయిపోయాయి. అలానే విడాకులు మంజూరు అయ్యేంతవరకు తనని ఇంట్లోనే ఉండనివ్వాలని చెప్పి సంగీత మరో పిటిషన్ వేయడం, భరణంగా రూ.250 కోట్లు ఇవ్వనున్నాడనే కామెంట్స్ చర్చనీయాంశమైపోతున్నాయి. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్.. తన విడాకులపై తొలిసారి స్పందించాడు.

    (ఇదీ చదవండి: బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్.. తన టీవీకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. వీటితో పాటు తన విడాకుల వ్యవహారం గురించి కూడా పరోక్షంగా విజయ్ మాట్లాడారు.

    'నా జీవితంలో జరుగుతున్న పలు సంఘటనల గురించి మీరు కంగారు పడకండి. వాటి గురించి ఆలోచించి మీరు సమయాన్ని వృథా చేసుకోవద్దు. వాటిని నేను పరిష్కరించుకుంటాను. నా సమస్యల గురించి ఆలోచిస్తూ మీరు ఒత్తిడికి లోనవడం నన్ను మరింతగా బాధపెడుతోంది' అని విజయ్.. తన విడాకుల గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడీ వ్యాఖ్యలు, వీడియో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!)

  • కల్ట్ రూరల్ బ్లాక్ బస్టర్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ సత్తాచాటింది. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, స్పెషల్ జ్యూరీ..ఇలా నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ సినిమా అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ దర్శకుడిగా సాయిలు కంపాటి, ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి, స్పెషల్ జ్యూరీగా చైతన్య జొన్నలగడ్డ గద్దర్ అవార్డ్స్ స్వీకరించనున్నారు.

    "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

  • 'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?

    (ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

    గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.

    టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.

    (ఇదీ చదవండి: ‘ధురంధర్‌2’కి పెయిడ్‌ ప్రీమియర్స్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)

    తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్‌డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.

    తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్‌లో చాలామంది పాటించరు.

    తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‪‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.

    (ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్)

  • ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఏ విషయంలో అయినా వీరిద్దరు చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకుంటారు. అందుకే ఈ జంటపై నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా నిక్ జోనాస్ ఒక ఇంటర్వ్యూలో తమ మొదటి డేటింగ్‌కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    నిక్‌ జోనాస్‌ తన మొదటి డేటింగ్‌ అనుభవం గురించి చెబుతూ.. ‘మా మొదటి డేటింగ్‌ చాలా విచిత్రంగా జరిగింది. అందరిలాగా మేం ఒంటరిగా డేటింగ్‌కి వెళ్లలేదు. ప్రియాంక తన స్నేహితురాలితో వస్తే..నేను మా సోదరుడిని తీసుకొని వెళ్లాను. ఈ డేట్‌ ప్లాన్‌ చేసింది ప్రియాంకనే. మొదట ఓ మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌కి వెళ్లాం. అయితే అది ప్రియాంకకు నచ్చలేదు. దీంతో బయటకు వెళ్లాలనుకున్నాం. మాతో పాటు ఇంకో జంట కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం చాలా ఆనందంగా గడిపాం. 

    ఇద్దరం కలిసి డ్రింక్‌ చేయడానికి ఎక్కడికో వెళ్లాం. మేము ఎంత దూరంలో ఉన్న సోదరుడు మా కోసం డ్రింక్స్‌ పంపించి.. దూరంగా వెళ్లిపోయాడు. అంతేకాదు ఆ రోజు టైమ్‌ దొరికినప్పుడల్లా ప్రియాంకకు నా గురించి గొప్పగా చెప్పేందుకు ట్రై చేశాడు. అది ఆమెకు అర్థమై ‘మీ బ్రదర్‌ నీకు బాగానే గ్యాస్‌ కొడుతున్నాడు కదా’ అని నవ్వేసింది. ఇలా ఆ ఈవినింగ్‌ చాలా ఎంజాయ్‌ చేశాం. 

    ఇక ఆ రోజు రాత్రి ఎలా గడిపారనే విషయాన్ని చెబుతూ.. ‘ఆ రోజు నైట్‌ మీమిద్దరం 'ఫ్రెంచ్ కిస్' చేసుకున్నామని నిక్‌ చెప్పాడు. ఆ క్షణం తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం అని, అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఎంతో నిజాయితీగా పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

    కాగా, ప్రియాంక, నిక్‌ల వివాహం 2018లో జరిగింది. ప్రస్తుతం ఈ జంటకి 'మాలతీ మేరీ' అనే కుమార్తె ఉంది. తమ కెరీర్‌లతో బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

  • కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కింది. ఈ లవ్‌బర్డ్స్‌ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుపుకున్నారు. తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్టేజీపై ఫోటో దిగేందుకు వెళ్తుండగా ఆయన వెనకాల ఉన్న ఓ వ్యక్తిని అడ్డుకుని ఆపేశారు.

    ఏం జరిగిందంటే?
    కొందు ఆయన్ను సైడ్‌ యాంగిల్‌లో చూసి జూనియర్‌ ఎన్టీఆర్‌ అనే భ్రమపడ్డారు. అల్లు అర్జున్‌ బౌన్సర్లు ఎన్టీఆర్‌ను ఆపేశారా? అని ఆశ్చర్యపోయారు. కానీ, అక్కడున్నది తారక్‌ కాదు, ఆయనకు డూప్‌గా నటించే ఈశ్వర్‌. తాజాగా ఈశ్వర్‌ అక్కడేం జరిగిందో క్లారిటీ ఇచ్చాడు. అల్లు అ‍ర్జున్‌తో పాటు వీడియోలో ఉన్నది నేనే.. ఆ రోజు ఏం జరిగిందంటే? అల్లు అర్జున్‌ సర్‌ లోపలకు వచ్చే సమయంలో నేను కూడా లోనికి వెళ్తున్నాను. 

    జూమ్‌ చేస్తూ పెద్దగా..
    స్టేజీపై ఫోటో దిగడం కోసం ఆయన సడన్‌గా ఆగిపోయారు. ఆయన బౌన్సర్లు ఏమనుకున్నారంటే నేను ఆయనతో ఫోటో దిగడానికి వెళ్తున్నానని భ్రమపడ్డారు. లేదంటే కెమెరాకు అడ్డొస్తానని భావించి నన్ను ఆపేశారు. అది చాలా చిన్న విషయం. దాన్ని జూమ్‌ చేస్తూ చాలా పెద్దగా చూపించారు. అలా వీడియో చాలా వైరల్‌ చేశారు. దానివల్ల నాకు కూడా మంచి రీచ్‌ వచ్చింది. థాంక్యూ సోమచ్‌ అని వీడియో షేర్‌ చేశాడు. ఇతడు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కొన్ని సన్నివేశాల్లో తారక్‌కు డూప్‌గా నటించాడు.

     

     

    చదవండి: అణిగిమణిగి ఉండాలి.. లేదంటే సైడ్‌ చేస్తారు: అషూ

  • టిక్‌టాక్‌ ద్వారా జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకుంది అషూ రెడ్డి. డబ్‌ స్మాష్‌, రీల్స్‌తో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. ఓటీటీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లోనూ పాల్గొని మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

    ఇప్పటివరకు ఎన్నో చేశా..
    ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ బ్యూటీ తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ విన్నర్‌ నిఖిల్‌ మళయక్కల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. తాజాగా విక్రమ్‌ ఆన్‌ డ్యూటీ ప్రెస్‌మీట్‌లో అషూ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో స్టేజ్‌ పర్ఫామెన్స్‌లు, క్యారెక్టర్‌ రోల్స్‌, హోస్టింగ్‌.. ఇలా అన్నీ చేశాను. 

    హీరోయిన్‌ అంటుంటే..
    తొలిసారి హీరోయిన్‌గా చేశాను. షూటింగ్‌లో అందరూ హీరోయిన్‌గారు అని పిలుస్తూ ఉంటే ఏంటి? నన్నేనా? అని ఆశ్చర్యపోయాను అంది. ఈ సమావేశంలో ఓ విలేకరి అషూను ఓ ప్రశ్న అడిగాడు. నిర్మాత ప్రవీణగారి ప్రాజెక్ట్‌ అంటే బోణీ బాగానే ఉంటుంది. మరి హీరోయిన్‌గా సినిమాలు కొనసాగిస్తారా? అని ప్రశ్న సంధించాడు.

    ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా..
    అందుకు అషూ స్పందిస్తూ.. ఆర్టిస్టులు ఏమాత్రం ఓవరాక్షన్‌ చేసినా ప్రొడక్షన్‌ హౌస్‌ ఓనర్లు, నిర్మాతలు వారిని తీసేయడానికి వెనుకాడరు. సెట్‌లో అయినా, ఇంట్లో అయినా కొంచెం అణిగిమణిగి ఉండాలి అంది. దీంతో వెంటనే నిర్మాత మైక్‌ అందుకుని.. ఎవరూ అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పని వాళ్లు చేసుకుంటూ పోతే ఎవరూ ఇబ్బందిపెట్టరు. సెట్‌కు వచ్చినప్పటినుంచి, బయటకు వెళ్లేవరకు ఇది నా పని అని అంకితభావంతో పని చేస్తే మిమ్మల్ని ఎవరూ టచ్‌ కూడా చేయరు అని క్లారిటీ ఇచ్చింది.

    చదవండి: త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందంటే?

  • అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.

    (ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

    'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.

    శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

    (ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

  • సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే తోటి యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమ-బ్రేకప్, బిగ్‌బాస్ 5వ సీజన్‌లో సిరి హనుమంతుతో చేసిన రచ్చ, ఓసారి డ్రగ్స్‌తో దొరికిపోవడం.. ఇలా చాలాసార్లు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాడు. గత కొన్నేళ్లుగా పెద్దగా కనిపించని షన్ను.. కొన్నిరోజుల క్రితం వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చాడు.

    (ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

    ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్.. గతంలో తనకు జరిగిన చేదు సంఘటనలు, బ్రేకప్, బిగ్‌బాస్ అనుభవం, వైష్ణవితో ప్రేమ-నిశ్చితార్థం ఇలా చాలా విషయాలు గురించి మాట్లాడాడు. మిగతా వాటి సంగతేమో గానీ తనని తాను.. బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని అని చెప్పుకోవడం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది. బ్రేకప్ (దీప్తి సునైనాతో) తర్వాత నిజంగా బాధపడ్డారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ సంగతులు చెప్పుకొచ్చాడు. ఒక టీవీ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని బిగ్‌బాస్ గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.

    'అవును  బ్రేకప్ తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నా వల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు నడిచాను. కానీ ఎందుకు బ్రేకప్ చెప్పావ్? నాకు సమాధానం చెప్పు అని ఒత్తిడి చేయలేదు. చెప్పాలంటే నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని. బ్రేకప్ తర్వాత ఒక్కరిని కూడా టార్చర్ చేసింది లేదు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టింది లేదు. ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ తీసి ఫొటోలు చూసుకోవడమే తప్పితే.. ఇది చేస్తా అది చేస్తా అనే బ్యాచ్ కాదు' అని షన్ను చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: గద్దర్‌ అవార్డ్స్‌-2025 విజేతలు.. ఉత్తమ నటుడు నాగచైతన్య)

    'బ్రేకప్ తర్వాత తనకు ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయింది. అలాంటి టైంలో తన జీవితంలోకి వైష్ణవి వచ్చిందని షన్ను చెప్పాడు. ఈమెకు చాలా దైవభక్తి. ఎప్పటికప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటుంది. అలానే మాకు పరిచయమైంది. తొలుత హనుమాన్ చాలీసా లాంటివి వాట్సాప్‌లో పంపించుకునేవాళ్లం. హనుమాన్ జయంతి సందర్భంగా కరుంగళి మాలతో పాటు హనుమాన్ చాలీసా లాంటివి వైష్ణవి పంపింది. నేను కూడా రామకోటి లాంటివి శ్రీరామనవమి టైంకి పంపించాను. అలా స్నేహితులుగా ఉన్నవాళ్లం కాస్త తర్వాత స్టేజీకి వెళ్లాం'

    'అయితే ప్రేమలాంటివి కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను. నా గురించి అన్ని తెలిసి కూడా వైష్ణవి, వాళ్ల అమ్మ ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇక నా చేతిపై పచ్చబొట్టు గురించి వైష్ణవి చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అది మీకో మెమొరీ. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే ఎప్పుడు తీసేయాలన్నా సరే మీ ఇష్టం అని నాతో చెప్పింది. అది కాదండీ, ఇలా మాట్లాడండి అని పిలవడం తప్పితే ఇప్పటివరకు నన్ను షన్ను అని పిలవలేదు' అని షన్ను.. తనకు కాబోయే భార్య వైష్ణవి గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హీరోగా 'ప్రేమకు నమస్కారం' సినిమా చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.

    (ఇదీ చదవండి: సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య)

  • రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఆ అంచనాలు డబుల్‌ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్‌ బద్దలు అవ్వడం ఖాయమని రణ్‌వీర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్‌ షో నుంచే ‘ధురంధర్‌2: ది రివెంజ్‌’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌ల ద్వారా టికెట్‌ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్‌ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి.  

    హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్‌ ప్రీమియర్స్‌కి టికెట్‌ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్‌ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్‌ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    భారీ రన్‌టైమ్‌..
    ధురంధర్‌ 2 మూవీ రన​్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు.  మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్‌ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు.  ప్రేక్షకుడిని ఎంగేజ్‌ చేసే కంటెంట్‌ ఉంది కాబట్టే.. రన్‌టైమ్‌ విషయంలో మేకర్స్‌ భయపడడం లేదట. మరి ధురంధర్‌ 2 ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

  • హీరోయిన్‌ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌ సరసన గిల్లిలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసి స్టార్‌ స్టేటస్‌ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. 

    అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్‌తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్‌, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్‌ కంటే ముందు వేరే హీరోలతో లవ్‌లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..

    హీరోలతో లవ్‌
    త్రిష తమిళంలో పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్‌ దానంతటవే ఆగిపోయాయి.

    ప్రకంపనలు రేపిన సుచీలీక్స్‌
    అనంతరం త్రిష టాలీవుడ్‌ హీరో రానాకు క్లోజ్‌ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్‌ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్‌ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్‌- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

    పెళ్లి క్యాన్సిల్‌
    వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్‌ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్‌తో త్రిష అంత క్లోజ్‌గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాడని అంటుంటారు.

    విజయ్‌తో లవ్‌
    ఇప్పుడు మరోసారి విజయ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్‌- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!

    చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్‌ కౌంటర్‌

  • ఆర్జేగా కొందరికి తెలిసిన సూర్య.. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని మరింతగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు శుక్రవారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ నటి సుధీర చెల్లి, ఆర్జే శౌర్యతో సూర్య ఏడడుగులు వేశాడు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: టాలీవుడ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)

    ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుంచి పలు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పిన బాధలో ఉన్నప్పుడు ఆర్జేగా ఆఫర్ రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల గొంతులని మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

    ఇక ఆర్జేగా ఫేమస్ అయిన ఇతడు.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో పాల్గొని 8 వారాల పాటు హౌసులో ఉన్నాడు. తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఫైమాతో కలిసి బీబీ జోడీ తొలి సీజన్(డ్యాన్స్ కాంపిటీషన్) లో పాల్గొని విజేతగానూ నిలిచాడు. తన తోటి ఆర్జే, సీరియల్ నటి సుధీర చెల్లి శౌర్యతో ప్రేమలో పడ్డ సూర్య.. గతేడాది అక్టోబరులో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సీరియల్ బ్యూటీస్ అన్షు, ఆషికా తదితరులు వచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    (ఇదీ చదవండి: విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత)

  • తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 జాబితాను శనివారం ప్రకటించారు. అందులో ఉత్తమ నటి అవార్డు స్టార్‌ హీరోయిన్‌ రష్మికను వరించింది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రానికి గానూ రష్మికకు ఈ అవార్డు లభించింది. ఈ విషయాన్ని దర్శకుడు ఎక్స్‌ వేదికగా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. రాహుల్‌ ట్వీట్‌పై రష్మిక కూడా స్పదించింది. 

    ఆయన పోస్ట్‌ని రీట్వీట్‌ చేస్తూ.. ‘రాహులా.. మనం సాధించాం’ అని రాసుకొచ్చింది. దానికి రాహుల్‌ రిప్లై ఇస్తూ..‘ఈ అవార్డుకి మీరు అర్హులు. థ్యాంక్యూ రష్మిక’ అని కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం రష్మిక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

    కాగా, రష్మిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న తన ప్రియుడు, స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ఈ నెల 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

  • వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్వీయదర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సరస్వతి. సాయిమాధవ్‌ బుర్ర కథ అందించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను ఇష్టమొచ్చినట్లు మార్చేశారని సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు సాయిమాధవ్‌. సరస్వతి సినిమా పేరు ప్రస్తావించకుండా ఓ పోస్ట్‌ పెట్టాడు. నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. 

    హర్టయిన సాయి మాధవ్‌
    ఒక్కమాటైనా చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు మార్చేశారు. కథను మానభంగం చేశారు. నాది రివేంజ్‌ డ్రామా కాదు, నా సోల్‌ వేరు, అసలా కథే వేరు అని పేర్కొన్నాడు. ఈ వివాదంపై తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్‌‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఎవరి కథను దొంగతనం చేయలేదు. కాంట్రాక్ట్‌ వేసి డబ్బులు ఇచ్చాకే ఆ కథ (సరస్వతి) నాదయింది. ఆయనపై గౌరవంతో క్రెడిట్స్‌లో తన పేరును పొందుపరిచాం. 

    అందుకే మార్చాం
    కానీ, ఆయన ఆ గౌరవాన్ని మిగుల్చుకోలేదు. ఒకవేళ నా పేరు పెట్టుంటే ఇంకా సంతోషపడేదాన్ని. నాకే సమస్య లేదు! అసలేమైందంటే.. ఆయన చెప్పిన కథ విన్న ప్రతివాళ్లు సాగదీసినట్లుగా ఉందన్నారు. పెద్ద స్టార్స్‌ ఉన్నప్పుడు ఆ కథను యథాతథంగా ముందుకు తీసుకువెళ్లగలమేమో! కానీ మేము మంచి నటులం తప్ప పెద్ద స్టార్స్‌ కాదు! కాబట్టి ఆ కథను జనంలోకి ఎలా తీసుకెళ్లాలి? అని ఆలోచించాం.

    కథ డెవలప్‌ చేసుకున్నా..
    దానిపై చాలా వర్క్‌ చేశాం. ఆ సమయంలో ఆయన ఒక్కసారి కూడా స్టోరీ సిట్టింగ్‌కు రాలేదు. తను పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. సరేలే, బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను. నేనే కథను డెవలప్‌ చేసుకున్నాను. కనీసం ఫోన్‌లో అందుబాటులోకి వచ్చినా కథ మార్చామని చెప్పగలిగేవాళ్లం. అప్పుడేమో ఆయనే అలా చేసి ఇప్పుడలాంటి కామెంట్స్‌ చేయడం కరెక్ట్‌ కాదు. 

    దిగజారను
    అందులోనూ కథను మానభంగం చేశారని పెద్ద పెద్ద వ్యాఖ్యలు మీలాంటి వ్యక్తి నోటి నుంచి రాకూడదు. ఇది సభ్యత అనిపించుకోదు. సెన్సిటివ్‌ టాపిక్‌పై ఎలాంటి పదాలు వాడుతున్నామనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉంటే బాగుండేది. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. నాకు కావాలంటే చాలా కథలు బయటకు తీసేదాన్ని, కానీ నేనలాంటి మనిషిని కాదు. నేను అందర్నీ గౌరవిస్తాను, మర్యాదిస్తాను. ఆయనలా దిగజారి నేను మాట్లాడను వరలక్ష్మి కౌంటర్‌ ఇచ్చింది.

    చదవండి: సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన రాజేంద్రప్రసాద్‌

  • తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌కి ఆయన సతీమణి సంగీత షాక్‌ ఇచ్చింది. తాజాగా కోర్టులో ఆమె  మరో పిటిషన్‌ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో పాటుగా ఉండేందుకు అనుమతి కావాలని పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న సంగీత విడాకులు కేసు ముగిసే వరకు విజయ్‌ ఇంట్లోనే ఉంటానని పేర్కొనడం విశేషం.

    విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కొద్దిరోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో గత నెల 24న ఆమె పిటిషన్‌ వేసింది. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది.  ఏప్రిల్‌ 20న వారి విడాకుల పిటిషన్‌ విచారణకు రానుంది. ఆ రోజు  కోర్టుకు విజయ్‌ హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసు ఇచ్చింది.

NRI

  • లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్‌హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్‌బుక్‌ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.

    సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.

    ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో,  ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్‌తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు.

Telangana

  • హైదరాబాద్: నగరాన్ని క్లీన్‌సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్‌ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌.. ఈ మేరకు పలు సూచనలు చేశారు.  ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్‌ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. 

    నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. మిస్సింగ్‌ అయిన వాళ్ళంతా 10ఏళ్ల లోపు పిల్లలే. సింహాద్రి(10), కోదండ విజయ్(3) నిన్నటి నుంచి మిస్సింగ్ కాగా, ఇవాళ ఉదయం ముగ్గురు ఆడ పిల్లలు సీపల్‌(8), మరియం(5), ఆయాత్‌(7) అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన చిన్నారులు తిరిగి రాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.

  • హైదరాబాద్‌:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 126 మంది మావోయిస్టులు.. ఆయుధాలు విడిచి సరెండర్‌ అయ్యారు. వీరి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు.  లొంగిపోయిన వారిలో సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కుమార్తె మాధవి సైతం ఉన్నారు. 

    దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ దళం మొత్తం సరెండర్‌ అయ్యింది. లొంగిపోయిన వారిలో కీలక మావోయిస్టు నేత సంతోష్‌ ఉన్నారు. 31 ఏకే-47లతో పాటు భారీగా ఆయుధాలను అప్పగించారు సంతోష్‌. ఇక లొంగిపోయిన వారిలో ఏవోబీ కీలకనేత చలసాని నవత సైతం ఉన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మావోయిస్టుల ఆయుధాలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించిన తర్వాత వారితో ముచ్చటించారు. 

    కాగా, మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌కు సమయం దగ్గర పడుతుండటంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోగా, తాజాగా వందకు పైగా మావోయిస్టులు లొంగిపోవడం  ఆ  ఉద్యమం చివరి దశకు చేరిందనేదానికి నిదర్శనం. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్‌ మీదుగా మరో అమృత్‌భారత్‌ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్‌ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్‌కోయల్‌ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.

    జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్‌భారత్‌ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్‌కోయల్‌ అమృత్‌భారత్‌ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్‌ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌ మీదుగా రెండు అమృత్‌భారత్‌ రైళ్లు, వరంగల్‌ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్‌భారత్, హైదరాబాద్‌కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చర్లపల్లి–ముజఫర్‌పూర్‌ జంక్షన్‌(బిహార్‌) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.

    కాగా, హైదరాబాద్‌–నాగర్‌కోయిల్‌ అమృత్‌ భారత్‌ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు.

  • సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్‌ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. 

    నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. 

    మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్‌ హర్" ప్రోగ్రామ్‌కి సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Business

  • భారతదేశంలో చాలామంది వాహనదారులు కారు మరింత అందంగా కనిపించడానికి కొన్ని ఉపకరణాలను జోడించుకుంటూ ఉంటారు. అదులో ఒకటి బంపర్ గార్డ్. దీనినే సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని పిలుస్తారు. ఈ మెటల్ బార్‌లు వాహనం యొక్క ముందు లేదా వెనుక బంపర్‌పై అమర్చబడి ఉంటాయి. ఇవి సాధారణంగా SUVలు లేదా పెద్ద కార్లలో కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి ఇండియాలో చట్ట విరుద్ధం అని తెలుసా?, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    భద్రతా సమస్యలను పరిగణలోకి తీసుకుని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2017లో అధికారికంగా బుల్ బార్‌లను నిషేధించింది. ఈ నియమం దాదాపు అన్ని వాహనాలను వర్తిస్తుంది.

    ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం!
    చూడటానికి బంపర్ గార్డ్‌లు వాహనానికి అదనపు రక్షణను అందిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ భద్రతకు భంగం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వాహనం లోపల ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం కలిగిస్తాయి. కారులోని సెన్సార్లు ఢీకొనే శక్తిని గుర్తించి ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యేలా చేస్తాయి. కానీ కారు ముంచు భాగంలో ఉన్న బుల్ బార్‌లు ఈ సెన్సార్‌లపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పనిచేయకుండా చేస్తాయి.

    బుల్ బార్‌లు పాదచారులకు కూడా హాని కలిగిస్తాయి. ఇవి దృఢంగా ఉండటం వల్ల.. అనుకోని సమయంలో ప్రయాణికులను ఢీ కొంటే తీవ్రమైన గాయలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి వాహనంలో ప్రయాణించేవారికి మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదకరమని అధికారులు వెల్లడించారు.

    జరిమానా ఇలా..
    బుల్ బార్‌ను ఏర్పాటు చేయడం అనేది మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, ముఖ్యంగా సెక్షన్ 190, 191 కింద నేరం. కాబట్టి వాహనదారులకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. బంపర్ గార్డును ఏర్పాటు చేసుకుని డ్రైవర్ లేదా వాహన యజమాని పట్టుబడితే, జరిమానాలు రూ. 1000 - రూ. 5000 వరకు ఉంటాయి. పబ్లిక్ రోడ్లపై వాహనం బుల్ బార్‌ను ఉపయోగిస్తుంటే అక్కడికక్కడే తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంది.

  • సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    వెబ్‌సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.

    ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.

    ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.

    మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.

  • అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది. ఈ సమయంలో ఎప్పడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు యుద్ధం వల్ల ఏమి జరుగుతుందో?, శాంతి స్థాపన ఎలా జరుగుతుందో? అనే విషయాలను వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నేను వియత్నాంలో రెండుసార్లు ఉన్నాను. ఒకసారి 1966-67లో విద్యార్థిగా, ఆ తరువాత 1971-72లో యూఎస్ మెరైన్ కార్ప్స్ పైలట్‌గా. అయితే 2026లోనూ వియత్నాంతో ఎందుకు పోరాడామో నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సమాధానం దొరకలేదు. యుద్ధం వల్ల దాదాపు అందరికీ నష్టమే.

    ఇప్పుడు ఇరాన్ లేదా ఇజ్రాయెల్‌పైకి వెళ్తున్న ప్రతి రాకెట్ లోపల నాలుగు ఫౌండ్స్ వరకు వెండి ఉంటుంది. రాకెట్ పేలిపోయినప్పుడు సిల్వర్ విచ్చిన్నమవుతుంది. ఇది వెండి సేకరించేవారికి మాత్రమే లాభం. యుద్ధంలో పాల్గొనేవారికి మిగిలేది కన్నీళ్లు, ధన నష్టం మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం

    యుద్ధ ఆయుధాలను బంగారంతో తయారుచేస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు యుద్ధం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయుధాలు ఖరీదైనప్పుడు కొనుగోలు చేయడం తగ్గవచ్చు. కాబట్టి ఇలా శాంతి స్థాపనకు సాధ్యమవుతుందని భావిస్తున్నాను. నేను ఈ రోజు యుద్ధం కోసం కాదు, శాంతి & నిజమైన ఆర్థిక విద్య కోసం పోరాడుతున్నాను అని కియోసాకి వెల్లడించారు.

  • మనం ఇంట్లో లేని సమయంలో అతిథులు ఇంటికి వస్తున్నారు.. గుమ్మలోకి రాగానే ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.. హాల్‌లోకి అడుగు పెట్టగానే లైట్లు వెలుగుతాయి.. సోఫాలో కూర్చోగానే ఏసీ ఆన్‌ అవుతుంది. బాల్కనీ వైపు ఉన్న కర్టెన్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మెయిడ్‌(పనిమనిషి) అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ నుంచే ఇవన్నీ సాధ్యం.. ప్రస్తుతం ఇంట్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది.

    రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేసే స్మార్ట్‌ కెమెరాలు, డిజిటల్‌ లాక్స్, స్మార్ట్‌ వీడియో డోర్‌ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్‌గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్‌ చూపిస్తే చాలు ఆటోమెటిక్‌గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్‌ ఉపకరణాలను జోడిస్తున్నారు.

    కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ హైదరాబాద్‌లోని హైఎండ్‌ ప్రాజెక్ట్‌లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్‌లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది.

  • నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్‌ హౌసింగ్‌’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరో

    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్‌లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్‌ హౌసింగ్‌ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.

    కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు.  

    రీ–డెవలప్‌మెంట్‌ అవసరం.. 
    ముంబై తరహాలో హైదరాబాద్‌లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు.

  • ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్.. సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు.

    సీఈఓ సుందర్ పిచాయ్ మొత్తం ప్యాకేజీలో ఎక్కువ భాగం (126 మిలియన్ డాలర్లు) పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ ద్వారా వస్తుంది. అదనంగా పిచాయ్ మూడేళ్లలో నెలవారీగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ పొందతారు. వీటితో పాటు ఆయన యాన్యువల్ సాలరీ 2 మిలియన్ డాలర్లను కూడా పొందుతారు

    గూగుల్.. వేమో & వింగ్ ఏవియేషన్ వంటి ఆటోనమస్ విభాగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొత్త స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. దీనిద్వారా మొత్తం 350 మిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

    2015 ఆగష్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఆయన నాయకత్వంలో గూగుల్ మార్కెట్ కాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. కొన్నిసార్లు నాలుగు ట్రిలియన్ డాలర్లను సైతం అధిగమించింది. పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2004లో గూగుల్ కంపెనీలో చేరిన తరువాత  క్రోమ్‌ను అభివృద్ధి చేయడం & ఆండ్రాయిడ్‌ను నడిపించడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగారు.

  • పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. 
    నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. 
    పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. 
    కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. 
    ఎలాంటి పొల్యూషన్‌ లేని ప్రాంతం.. 
    ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే..  

    ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్‌ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన 
    జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్‌ కమ్యూనిటీలు..    – సాక్షి, సిటీబ్యూరో

    భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్‌  అపార్ట్‌మెంట్ల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలకు షిఫ్ట్‌ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు.  వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌ల లో అపార్ట్‌మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.

    తొలి ప్రాధాన్యత భద్రతకే.. 
    ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్‌లో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, మల్టీపర్పస్‌ హాల్, ఇండోర్‌ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్‌స్కేప్‌ గార్డెనింగ్, స్పోర్ట్స్‌ కోర్ట్‌ క్లబ్‌హౌస్‌ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్‌ దుకాణం, ఫార్మసీ, వెల్‌నెస్‌ సెంటర్‌ కూడా ఉంటాయి.

    సామాజిక బంధాలు.. 
    సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్‌ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.

    మౌలిక సదుపాయాలు.. 
    గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ.  వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్‌లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్‌ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.

    అవసరాలు తీరేలా.. 
    గేటెడ్‌ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేస్తారు. అందుకే గేటెడ్‌లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్‌ స్పేస్, ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, సౌర విద్యుత్‌ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్‌ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్‌లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్‌ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్‌ కమ్యూనిటీలలో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

    నగరం నలువైపులా.. 
    కూకట్‌పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్‌పేటతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్‌ కమ్యూనిటీలో అపార్ట్‌మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్‌ ఎలోన్‌ అపార్ట్‌మెంట్లతో పోలిస్తే గేటెడ్‌ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్‌ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి.

  • ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఇప్పుడు ఉమెన్స్ ఎడిషన్ పేరుతో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది.

    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఉమెన్స్ ఎడిషన్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.

    మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ప్రస్తుత ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 25.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది AX, AX3, AX5, AX7, AX7T, AX7L అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మోడల్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇంజిన్‌ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్ పొందుతుంది.

    ఇదీ చదవండి: టాటా సియెర్రా వాచ్.. కేవలం 500 మాత్రమే!

    ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డాల్బీ అట్మాస్‌తో కూడిన 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కనెక్ట్ చేయబడిన కార్ సూట్, 540-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

  • 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును మునుపటి మాదిరిగానే 8.25 శాతం వద్దనే ఉంచారు. ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత.. వడ్డీ రేటు చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.

    వడ్డీ రేటు 8.25 శాతం వద్ద ఉన్నప్పుడు.. పీఎఫ్ ఖాతాలో ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత మొత్తం ఎంత వడ్డీ వస్తుందనే విషయాన్ని గమనిస్తే.. 2026 మార్చి 31 నాటికి ఖాతాలో రూ. 1 లక్ష ఉంటే రూ. 8250 (8.25 శాతం) వడ్డీ వస్తుంది. అంటే మొత్తం రూ. 1,08,250 అవుతుంది. ఆ తరువాత ఏడాది కూడా ఇదే వడ్డీ ఉంటే.. ఆ మొత్తంపై కూడా వడ్డీ పెరుగుతుంది.

    ఒకవేళా రూ. 5 లక్షలు పీఎఫ్ ఖాతాలో ఉంటే.. వడ్డీ రూ.41250 జమ అవుతుంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే రూ. 82500 వడ్డీ వస్తుందన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఖాతాలో ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ వస్తుంది. అంటే ఏడాది మధ్యలో అకౌంట్ నుంచి మీరు విత్‌డ్రా చేసుకుంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ జమ అవుతుంది.

    పీఎఫ్ వడ్డీ రేటు గతంలో..
    నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: మరో ఫ్లాట్‌ అమ్మేసిన ప్రీతిజింటా.. ఈసారి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్‌. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్‌ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్‌ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో  

    అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్‌ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్‌లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    2008 ఆర్థిక సంకోభం,  కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ షాక్‌కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్‌ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్‌లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 
    150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్‌లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్‌ కంటే దిర్హమ్‌ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్‌లలో 8–10 శాతం వరకు ఉంటుంది.

    మన ఇన్వెస్ట్‌మెంట్‌ విలువ రూ.2,30,872 కోట్లు.. 
    ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్‌ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్‌. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్‌ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్‌ ఏఈడీ(ఇండియన్‌ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).

    ఆర్థిక సంకోభం, కోవిడ్‌ సమయంలో.. 
    దుబాయ్‌ ప్రాపర్టీ మార్కెట్‌ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్‌లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది.  

    అద్దెలపై ప్రభావం.. 
    సాధారణంగా దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత 
    భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్‌ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్‌ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్‌ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది.

  • రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.

    చైనా అనుభవాలే గుణపాఠం

    ‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్‌తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.

    ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?

    భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్‌లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్‌ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్‌కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది.

  • చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.

    ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.

    విశ్వాసానికి మారుతున్న పునాదులు
    కొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.

    టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్‌ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.

    ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.

    దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.

    రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్‌ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.

    ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.

    డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహన
    భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.

    అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.

    ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్‌లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్‌లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.

    దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.

    ముందున్న దారి
    గత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.

    కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.

    మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.


    - హితేంద్ర నాథ్ ఝా, 
    హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్‌సీ & టీపీపీ, 
    ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

National

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగ్రహg వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగురిలో తన పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై  ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక ఎంపిక అంశానికి సంబంధించి  ఏర్పాట్లను సరిగా చేయకపోవడాన్ని ముర్ము ఆక్షేపించారు. 

    9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన ముర్ము.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర  మంత్రుల  నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు.  నేను బెంగాల్‌ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్‌ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు.  ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.

    ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్‌నగర్‌లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా  ప్రస్తావించారు.

    రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదు
    రాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

  • కోల్‌కాతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రకటించారు. నేటి నుంచే( మార్చి 7, శనివారం) ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. ‘యువ సాథీ’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. 21-40ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులుగా మమతా బెనర్జీ తెలిపారు. కేవలం స్కాలర్‌షిప్‌లు తప్ప ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారు మాత్రమే దీనికి అర్హులన్నారు.

    వాస్తవానికి ఏప్రిల్ 1 నుండి ప్రారంభం ఈ పథకం ప్రారంభం కావాల్సిఉందని.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) కానుకగా ఒక రోజు ముందుగానే ఇవాళ నుంచి (మార్చి7) నుంచే అమలు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఓటరు జాబితా సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.

    కాగా, సీఎం తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక గణాంకాలను వెల్లడించారు. బెంగాల్‌లో నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. 'ఉత్కర్ష బంగ్లా' ద్వారా 40 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో 10 లక్షల మందికి ఉపాధి లభించిందని మమతా తెలిపారు.

    బెంగాల్ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (MSME) దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని.. దాదాపు 1.5 కోట్ల మంది ఈ రంగంలో పని చేస్తున్నారని వివరించారు. బెంగళూరు కంటే బెంగాల్‌లోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందంటూ ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు నెలకు రూ.10,000 ఇస్తున్నామని, భూమి లేని రైతులకు కూడా రూ. నాలుగు వేలు సహాయం అందిస్తున్నామని తెలిపారు. బీర్భూమ్ జిల్లాలోని దేవుచా పచామి బొగ్గు గనుల ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని.. రాబోయే 100 ఏళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని మమతా ధీమా వ్యక్తం చేశారు.

  • కనిపెంచిన బిడ్డల  భవిష్యత్తు కోసం కష్టపడం,పెళ్లిళ్లు చేయడం చాలా కామన్‌.  అదే సమయంలో ఒంటరి తల్లితండ్రుల కోసం ఆలోచించడం, వారికి మళ్లీ ప్రేమను పరిచయం చేయడం పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా చూశాం.తల్లిగానీ, తండ్రి గానీ  మళ్ళీ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అనేది ఏ బిడ్డకైనా చాలా అరుదైన, భావోద్వేగంతో కూడిన క్షణం. అలాంటి హృదయాన్ని హత్తుకునే వేడుక ఒకటి నెట్టింట సందడిగా మారింది.

    పూజా భట్నాగర్ అనే యువతికి తన తల్లి వివాహ వేడుకను కళ్ళారా చూసే అదృష్టం దక్కింది. ఆ అద్భుతమైన క్షణాలను ఆమె సోషల్ మీడియాలో పంచు కున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన తల్లిదండ్రుల మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, పూజా తన తల్లి పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో షేర్ చేసింది. తల్లి ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కుమార్తెగా మెరిసిపోతూ కనిపించారు. అలాగే  ఒక ఏడాది క్రితం వివాహ సమయంలో పూజ పోస్ట్ చేసిన మరొక వీడియోలో,సింగిల్‌ మదర్‌గా ఒంటరిగా తన తల్లి  ప్రయాణం గురించి మాట్లాడింది. ఎంతో ధైర్యంగా ఒంటరిగానే తనను పెంచి ప్రయోజకురాల్ని చేసిందని గుర్తు చేసుకుంది. ఇలాంటి తన తల్లికి తన జీవితంలోని కీలక మలుపులో మద్దతు ఇవ్వడం తన బాధ్యత అనిఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది.  

    కుమార్తె భావోద్వేగం
    ఈ సందర్భంగా పూజ చాలా భావోద్వేగానికి లోనైంది.  తల్లి వివాహం సందర్భంగా తాను అనుభవించిన అనుభూతుల గురించి వివరించింది. "ఆ రోజు నేను ఎన్ని ఆనంద బాష్పాలు కార్చానో ఎవరికీ తెలియదు. నా కళ్లముందే మా అమ్మ పెళ్లి జరగడం చూస్తుంటే నేను చాలా అదృష్టవంతురాలిని అనిపించింది. నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుందని అర్థమైంది."  అని పేర్కొంది. ఈ జంటకు ఎవరి దిష్టి తగలకూడదని ఆకాంక్షిస్తూ "No Nazar" అని ఆమె పేర్కొన్నారు. అమ్మ తన ఆత్మబంధువును (Soulmate) పెళ్లి చేసుకోవడం చూస్తున్నారు" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

    నెటిజన్లు  స్పందన
    దీనిపై నెటిజన్లు కూడా ఆనందంగా కమెంట్స్‌ చేశారు. ఒక కూతురుగా తన తల్లి సంతోషం కోసం తీసుకున్న చొరవను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
     

  • లక్నో: ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగానే హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో పైలట్ అప్రమత్తమై,  హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం సహా అందులోని వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కేశవ్ ప్రసాద్ మౌర్య శనివారం ఉదయం లక్నో నుంచి కౌశాంబి జిల్లా పర్యటనకు హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ లోపల పొగలు  రావడం పైలట్ దృష్టికి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్నో విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి, విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు రన్‌వే వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో మౌర్యతో పాటు ఉన్న సిబ్బంది, పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

    నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం.. కేశవ్ ప్రసాద్ మౌర్య ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కౌశాంబి చేరుకోవాల్సి ఉంది. అక్కడ శీతలా దేవి గెస్ట్ హౌస్ సమీపంలో నిర్వహించే ప్రతిష్టాత్మక 'సరస్ మహోత్సవం'ను ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ పండుగతో పాటు జిల్లాలోని పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించడం, వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష జరపడం వంటి కార్యక్రమాలు ఆయన పర్యటనలో భాగంగా ఉన్నాయి. అయితే ఈ అనూహ్య ఘటనతో పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

    హెలికాప్టర్‌లో పొగలు రావడానికి గల అసలు కారణాలపై పౌర విమానయాన శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంజిన్ వైఫల్యమా లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో నిపుణులు విచారణ చేపట్టనున్నారు. వీఐపీల ప్రయాణానికి వాడే హెలికాప్టర్లలో ఇటువంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ  వార్త తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు మౌర్యకు ఫోన్ చేసి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

  • అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్‌ కప్‌ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్‌లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. 15 సెకన్ల అతడి చిన్న వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. 

    ఇప్పుడు అతడిని అందరూ గుర్తు పడుతున్నారు. ఆ వీడియోను అతని యజమాని ట్రక్ డ్రైవర్ నెహ్రూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసి, పోస్ట్ చేశాడు. అరుణ్ నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్‌లో అత్యధికంగా షేర్లు వచ్చిన మీమ్‌లలో ఒకటిగా మారింది. లక్షల మంది ఆ క్లిప్ చూశారు. కానీ, ఆ వీడియోలో కనిపించిన బాలుడి కథ చాలా మందికి తెలియదు.

    ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తెలిపిన సమాచారం ప్రకారం.. అరుణ్ చిన్నప్పటి నుంచే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. అరుణ్ 10 సంవత్సరాల వయసులోనే 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల చదువును మానేశాడు. అతడి కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పని చేయడం తప్ప మరో మార్గం అతనికి లేదు.

    ఆ సమయంలో డ్రైవర్‌ నెహ్రూ అతనిని ట్రక్ క్లీనర్‌గా పనికి పెట్టుకున్నాడు. రోజువారీ పనుల్లో నెహ్రూకి అతడు సాయం చేశాడు. వింత ఏమిటంటే అతని వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండగా ప్రజలు అతని గురించి రాసిన కామెంట్లు చదవడం కూడా అరుణ్‌కు సాధ్యం కాలేదు. లక్షల మంది అతని నవ్వును ప్రశంసిస్తున్నా ఆ ప్రశంసలను చదవలేడు.. అర్థం చేసుకోలేడు.

    క్లీనర్‌ జీవితాన్ని మార్చుతున్న డ్రైవర్‌

    అరుణ్‌ గురించి నెహ్రూ బాగా ఆలోచించాడు. అతని భవిష్యత్తు మార్చాలని నిర్ణయించాడు. నెహ్రూ కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కాలేజీ చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్రజలు ఆన్‌లైన్‌లో అరుణ్‌ను ప్రశంసించడం చూసి ఆ బాలుడి భవిష్యత్తు గురించిహ్రూ బాగా ఆలోచించాడు. అరుణ్‌కు పుస్తకాలు కొనిచ్చాడు. పరీక్ష ఫీజులు చెల్లించాడు. 10వ తరగతి బోర్డు పరీక్షను ప్రైవేట్‌గా రాయించాడు.

    ట్రక్‌లో ప్రయాణిస్తున్న సమయంలో చాయ్ విరామం సమయాల్లో అరుణ్‌కు నెహ్రూ అక్షరాలు, గణితం నేర్పించాడు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అరుణ్. ఈ సంవత్సరం అతని కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్షలో అతను ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడి కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

  • సాక్షి,బళ్లారి: మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాగల్‌కోట జిల్లాలోని జమఖండి పట్టణంలోని ముబారక్‌ అవతి(65) అనే వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. 

    అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాపాయం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటిలేటర్‌పై నుంచి తొలగించిన తరుణంలో శ్వాస ఆగిపోయిందని వైద్యులు కూడా సూచించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోని లోకాపుర వద్ద శ్వాస కదలికలు వచ్చాయి. 

    ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస అలా మందగించి కనిపించకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో వ్యక్తి మరణించినట్లు భావించే అవకాశం ఉంటుందని తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని కూడా వారు సూచించారు. ఈ ఘటన బాగల్‌కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.   

Sports

  • టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్‌గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

    వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ అభిషేక్‌.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. 

    జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్‌లో అభిషేక్ ప్లేస్‌లో ఫినిషర్ రింకూ సింగ్‌నైనా టీమ్‌లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.

    అయితే.. అభిషేక్‌ ఫామ్‌ లేమిపై సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్‌ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్‌‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ  గత వరల్డ్‌కప్‌లో ఇలానే వరుస ఫెయిల్యూర్‌లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్‌లోనూ రాణించలేకపోయాడు.

    ఆ సమయంలో అప్పటి కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. 

    ఆసక్తికరంగా ఫైనల్‌లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.

    దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్‌ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్‌ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!!
     

  • న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. సాంట్నర్‌ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్‌- న్యూజిలాండ్‌ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్‌ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.

    ఎర్రమట్టి పిచ్‌!
    అహ్మదాబాద్‌లో ఈసారి ఎర్రమట్టి పిచ్‌ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్‌ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.

    220 పరుగులకే కట్టడి చేస్తే
    ఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్‌ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో ఫ్లాట్‌ పిచ్‌ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.

    అబద్ధం చెబుతున్నాడు
    ఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్‌ యాదవ్‌.. సాంట్నర్‌కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.

    అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్‌ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్‌రూమ్‌లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్‌ డిమాండ్‌కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.

    చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

  • న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్‌ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

    అయితే, టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్‌ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.

    విశ్రాంతినివ్వాలి
    ‘‘అభిషేక్‌ శర్మకు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్‌లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.

    టీమిండియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. ఫామ్‌లో లేని బ్రాండన్‌ కింగ్‌కు బదులు.. రోస్టన్‌ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్‌ అయినా సరే అతడికి బ్రేక్‌ ఇచ్చారు.

    టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.

    రింకూను ఆడించండి
    టెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్‌ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్‌లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్‌ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.

    అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్‌ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్‌ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. 

    సంజూతో పోలిక వద్దు
    ఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్‌-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్‌ కైఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. 

    ఫైనల్‌లో అభిషేక్‌ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్‌ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌- న్యూజిలాండ్‌ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

    చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

  • అహ్మదాబాద్‌ పిచ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్‌ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్‌ పిచ్‌నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం భారత్‌- న్యూజిలాండ్‌ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్‌ సాంట్నర్‌ పలు విషయాలపై స్పందించాడు.

    హై స్కోరింగ్‌కు అవకాశం
    పిచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్‌ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్‌కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్‌ (Mitchell Santner) పేర్కొన్నాడు.

    మా లక్ష్యం అదే..
    అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్‌లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్‌ వైవిధ్యంతో కూడుకున్నది.

    హృదయాలు ముక్కలు చేస్తాం
    ఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్‌ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్‌ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్‌ కామెంట్‌ చేశాడు.

    కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై గెలిచి టీమిండియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు భారత్‌.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. 

    చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

  • భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.

    యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.

    ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్‌ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 కోసం రాజస్తాన్‌ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.

    పదో తరగతి పరీక్షలు డుమ్మా
    ఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్‌ సూర్యవంశీ పేరు వైరల్‌ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ధ్రువీకరించారు.

    102వ ర్యాంకు
    మరోవైపు.. తాజాగా సంజీవ్‌ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్‌ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్‌ చౌహాన్‌ (Abhishek Chauhan) యూపీఎస్‌సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్‌ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్‌ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    ఉన్నత విద్యావంతుల కుటుంబం
    బిహార్‌లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్‌నగర్‌ బ్లాక్‌లో గల రాజాజన్‌ గ్రామంలో 1999లో అభిషేక్‌ చౌహాన్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్‌ అభయ్‌ కుమార్‌ సింగ్‌, తల్లి అనురాధా రాజ్‌పుత్‌. అభయ్‌ కుమార్‌ సింగ్‌ నలంద ఓపెన్‌ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. 

    ఇక ఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అభిషేక్‌ 2022 నుంచి సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ.. అభిషేక్‌ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

    చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్‌ స్టార్‌ అభిషేక్‌ శర్మ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

    అయితే, టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌, వరుణ్‌ స్థాయి​కి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్‌ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.

    ఏకంగా 64 పరుగులు
    మరోవైపు.. వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్‌లలో రాణించినా.. కీలక నాకౌట్‌ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్‌ బౌలర్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్‌ కూల్చాడు.

    ఆ ఇద్దరిపై వేటు వేయాలి!
    ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి వరుణ్‌ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో ఫైనల్‌ నేపథ్యంలో అభిషేక్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

    ముఖ్యంగా వరుణ్‌ను తప్పించి చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. అభిషేక్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.

    నలుగురు విఫలమైనా.. 
    ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.

    బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..
    అభిషేక్‌ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్‌ వరకూ వచ్చింది. అయితే, బౌలర్‌ ఒక్క ఓవర్‌లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.

    ఇన్నింగ్స్‌లో ఓ బౌలర్‌కు 20 శాతం బౌలింగ్‌ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్‌లో వరుణ్‌ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్‌ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అందుబాటులో ఉంటే బాగుంటుంది.

    నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తా
    అయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్‌ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్‌ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్‌, వరుణ్‌ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. 

    కాగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం ఫైనల్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.

    చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్‌ స్టార్‌

Family

  • ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్‌ ఉమెన్‌గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..

    భావోద్వేగాలపై నియంత్రణ 
    ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.

    నో చెప్పడమే బెటర్‌
    అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్‌ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.

    తప్పుల నుంచి పాఠాలు
    ఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.

    నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం 
    తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్‌ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.

    అసూయ పడకపోవడం 
    మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.

    చ‌ద‌వండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వ‌ర‌కు

    మార్పును స్వీకరించాలి
    ప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్‌ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి. 

  • హిబ్రూ–ప్రభావిత కేఫ్‌ సంస్కృతి సహా పలు ఇతర లక్షణాల కారణంగా మన దేశంలోని హిమాలయ ప్రాంత గ్రామమైన కసోల్‌ ను  ‘మినీ ఇజ్రాయెల్‌‘ గా పేర్కొంటారు.  ఈ ప్రాంతం తొలిసారి ఈ పర్యాటక సీజలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణాన్ని చవిచూస్తోంది. చాలా కాలంగా ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే సందర్శకులపై  ఆధారపడిన స్థానిక వ్యాపారాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.

    సుందరమైన పార్వతి లోయలో  ఉన్న కసోల్,  కల్గా , పుల్గా వంటి సమీప గ్రామాలు సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ బ్యాక్‌ప్యాకర్లకు ఇష్టమైన స్టాప్‌లుగా నిలుస్తూన్నాయి.  చెక్క ఇళ్ళు, ఆపిల్‌ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు ఉపకరించే
    ప్రత్యేక పర్యాటక సంస్కృతికి నిలయాలుగా మారాయి.

    ఇక్కడి చాలా కేఫ్‌లు ఇజ్రాయెల్‌ శైలిలో రూపొందిన వంటకాలను అందిస్తాయి  అతిథులకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా హోమ్‌స్టేలు తరచుగా తమ మెనూలను హిబ్రూలో ముద్రిస్తాయి. అయితే, ఈ సంవత్సరం, సందర్శకుల రాక కనిపించక సందడి తగ్గిపోయింది. ‘‘అంతర్జాతీయ బ్యాక్‌ప్యాకర్లకు బాగా ప్రసిద్ధి చెందిన జిప్సీ హౌస్‌ కేఫ్‌ – హోమ్‌స్టే దగ్గర ఆ తేడా కనిపిస్తోందని సిబ్బంది అంటున్నారు. ‘సీజన్‌ ఇప్పుడే ప్రారంభమైంది కానీ డిమాండ్‌ లో తరుగుదల స్పష్టంగా ఉంది‘ అని ఒక ఉద్యోగి అన్నారు. ‘సాధారణంగా ప్రతి సీజన్ లో మాకు 50 నుంచి 100 మంది ఇజ్రాయెల్‌ పర్యాటకులు వస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు  ఒక్కరు కూడా రాలేదు అని చెప్పారు.

    ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అని  వీరు అంటున్నారు, యుద్ధం  ప్రయాణ సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. అదే ధరమ్‌కోట్‌  కసోల్‌ వంటి బ్యాక్‌ ప్యాకింగ్‌ కేంద్రాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోవచ్చునని విదేశీ పర్యాటకులకు కీలక ప్రవేశద్వారాలుగా ఉంటున్న మనాలి, సిమ్లా వంటి టాప్‌ హిల్‌ స్టేషన్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చునని అంచాన వేస్తున్నారు. స్థానిక ఆపరేటర్ల ప్రకారం, సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు  పార్వతి లోయలో ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు ఫుల్‌ సీజన్‌. ‘ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్‌ బ్యాక్‌ప్యాకర్లు కసోల్‌ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు  అని ఓ ట్రావెల్‌ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి, ఈ సంఖ్యలు వందల్లోనే ఉండవచ్చు’’ అన్నారాయన. ఈ మార్పు బుకింగ్‌ విధానాలలో కూడా కనిపిస్తుందని ట్రావెల్‌ ఏజెంట్లు అంటున్నారు.

    ‘ఇజ్రాయెల్‌ పర్యాటకులు సాధారణంగా తమ బసలను 20–30 రోజుల ముందుగానే బుక్‌ చేసుకుని మార్చి నాటికి రావడం ప్రారంభిస్తారు‘ అని విదేశీ సందర్శకులతో పనిచేసే ట్రావెల్‌ ఏజెంట్‌ రంజిత్‌ రాణా అంటున్నారు.  ‘‘ఈ సంవత్సరం దాదాపుగా ఏ మాత్రం బుకింగ్‌లు లేవు. ఫిబ్రవరిలో వచ్చిన వారు కూడా ముందుగానే వెనుదిరిగారు.’’ అని చెప్పారాయన.

    హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన పర్యాటక డేటా ప్రకారం, కాంగ్రా జిల్లా  సిమ్లా జిల్లా తర్వాత పార్వతి లోయను కలిగి ఉన్న కులు జిల్లా  విదేశీ పర్యాటకుల రాకపోకలలో రాష్ట్రంలోని మొదటి మూడు జిల్లాల్లో ఒకటి.  అందువల్ల అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తేడా వస్తే అది స్థానిక జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్‌ కనెక్టివిటీ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషించింది. టెల్‌ అవీవ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ మార్గం తాత్కాలికంగా మూతబడింది. 

    అలాగే  చాలా కాలంగా భారతదేశానికి వెళ్లే ఇజ్రాయెల్‌ ప్రయాణికులకు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. టెల్‌ అవీవ్‌ నుంచి దుబాయ్‌కు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి...తో  చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు.

  • అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న Sequoia National Park లో ప్రపంచంలోనే పరిమాణం (వాల్యూమ్‌) ప్రకారం అతిపెద్ద చెట్టు ఉంది. దీనిని General Sherman Tree  అని పిలుస్తారు. పార్క్‌లో వచ్చే సందర్శకులు ఒక చిన్న మార్గంలో నడుచుకుంటూ వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఈ భారీ చెట్టు కనిపిస్తుంది. దగ్గరగా చూసినప్పుడు దాని పరిమాణం ఎంత పెద్దదో అర్థమవుతుంది.

    ఈ చెట్టు సుమారు 275 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దాని వయస్సు దాదాపు 2,200 సంవత్సరాలు అని అంచనా. ఈ చెట్టు మొత్తం వాల్యూమ్‌ సుమారు 52,500 క్యూబిక్‌ ఫీట్‌ (దాదాపు 1,486 క్యూబిక్‌ మీటర్లు). అందువల్లే ఇది ప్రపంచంలోనే పరిమాణం పరంగా అతిపెద్ద చెట్టుగా గుర్తించబడింది. నేల దగ్గర ఈ చెట్టు చుట్టుకొలత సుమారు 102 అడుగులు, అడుగుభాగంలో వ్యాసం 36.5 అడుగులు ఉంటుంది. ఇంకా 180 అడుగుల ఎత్తులో కూడా దాని తుంగ వెడల్పు సుమారు 14 అడుగులు ఉంటుంది.

    ఈ చెట్టు Giant Sequoia అనే ప్రత్యేకమైన జాతికి చెందినది. ఈ జాతి చెట్లు చాలా ఎత్తుగా కాకపోయినా, చాలా భారీగా పెరుగుతాయి. జనరల్‌ షెర్మన్‌ చెట్టు తుంగ మాత్రమే దాదాపు 1,400 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో ఉన్న కలప పరిమాణం సుమారు 630,000 బోర్డ్‌ ఫీట్‌. అటవీ నిపుణుల ప్రకారం ఇది సుమారు 120 ఇళ్లను నిర్మించడానికి సరిపడే కలప.

    చ‌ద‌వండి: ఆ ఏడాదిలో అసలు వేసవే లేదు

  • కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వ ఉద్యోగాల్లో  పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా చేసింది. అయితే  ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కనిపించడం లేదు. విధి నిర్వహణలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి చెప్పుకోలేని బాధలతో అల్లాడుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులను పనిసమయం ముగిసినప్పటికీ గంటల తరబడి పనులు చేయిస్తుండటంపై  సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాగేనా మహిళలను గౌరవించేది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

    ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లు ఏవీ? 
    ప్రభుత్వ కార్యాలయాల్లో విధిగా మహిళా రక్షణ సెల్‌ (ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌) ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం చెబుతోంది. కలెక్టరేట్‌ కాంప్లెక్స్, సంక్షేమభవన్, సర్వజనవైద్యశాల, జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, ఆర్‌డీవో కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.  వీటిలో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ కనిపించడం లేదు. వాటి బాధ్యతలను మహిళలకే అప్పగించాల్సి ఉంది. సంబంధిత కార్యాలయాల్లో మహిళలు ఏ విధంగా వేధింపులకు గురైనా, మహిళలకు సంబంధించిన పైళ్లు పెండింగ్‌లో పెట్టినా.. మహిళల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించినా ఈ సెల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మహిళల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ విభాగం ఇన్‌చార్జ్‌లు సంబందిత హెచ్‌ఓడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలుంది. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఏర్పాటులో ప్రభుత్వం చేసిన చట్టం కాగితాల మీద ఉంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు.

    ప్రత్యేక సదుపాయాలు నిల్‌
    అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండాలి.  పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవి కనిపించడం లేదు. అంతేగాకుండా మహిళలకు ప్రత్యేక వెయిటింగ్‌ రూమ్‌ ఉండాలి. మధ్యాహ్నం భోజనం చేయడానికి, అరగంటపాటు విశ్రాంతి తీసుకోవడానికి వెయిటింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఎక్కడా మహిళలకు వెయిటింగ్‌ రూములు లేవు. ప్రస్తుతం గ్రామస్థాయి కార్యాలయం నుంచి మండలం, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాల వరకు  మహిళా ఉద్యోగులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చెప్పుకోలేని బాధలతో సతమతం అవుతున్నారు.

    పస్తులే దిక్కు  
    ప్రభుత్వ మహిళ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వేతనంలో కూడిన 180 రోజుల మెటర్నటీ లీవ్‌లు ఉన్నాయి. అయితే  అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లో మహిళలు 50 శాతం వరకు ఉన్నారు. మహిళ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలల పాటు మెటర్నటీ లీవ్‌లు ఇస్తున్నప్పటికీ ఈ కాలానికి వేతనాలు చెల్లించడం లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు అంతంతమాత్రంగా రూ.20 వేలలోపు  ఉన్నాయి.  వేతనంతో కూడిన సెలవులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  ఆరు నెలలు మెటర్నటీ లీవ్‌ల్లో ఉన్న సమయానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీరికి వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌లు ఇవ్వాలని ఉద్యోగసంఘాలు డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం స్పందిచడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

    సౌకర్యాలు కను‘మరుగు’ 
    జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌లోనే మహిళా ఉద్యోగులకు కనీస సదుపాయాలు లేవు. కలెక్టరేట్‌లో 30 ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, డీఆర్‌డీఏ, డ్వామా, సహకార శాఖ, ప్రణాళిక విభాగం తదితర కార్యాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో మహిళా ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి.  రన్నింగ్‌ వాటర్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్ట్‌ రూములు లేవు. కొన్ని శాఖల్లో ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లు కాగితాల మీదనే కనిపిస్తున్నాయి.  

    రెస్ట్‌ రూములు ఏర్పాటు చేయాలి 
    మహిళా ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుభూతితో వ్యవహించాలి. ప్రధానంగా వార్డు, గ్రామ సచివాయాల్లో పనిచేసే వారికి పని ఎక్కువగా ఉంటోంది. ఉదయం 8 గంటలకే విధులకు వెళ్లి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. మొత్తంగా 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు కచ్చితమైన పని వేళలు అమలు చేయాలి. మహిళలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రెస్ట్‌ రూములు ఏర్పాటు చేయాలి. 
    –  ఎస్‌.చందన,  ఏపీ ఎన్‌జీజీవోస్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు

     సమస్యలను పరిష్కరించాలి 
    ప్రభుత్వ శాఖల్లో మహిళా ఉద్యోగులు సంఖ్య భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లోనే భోజనాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి తగిన వసతి కలి్పంచాలి. ఉమన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లను మరింత పకడ్బందీగా అమలు చేయాలి. మరుగుదొడ్లను ఆధునీకరించాలి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి.  
     – సరస్వతి, మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నేత

  • మార్చి నెల వచ్చేసింది. ఎండ తాపం మొదలైంది. జనాలు అప్పుడే ఎండ వేడిమి తాళలేక ఉసూరుమంటున్నారు. బయటి వెళ్లినవారు మజ్జిగ, చెరుకురసం, పళ్లరసాలను తాగుతూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏటా వేసవి కాలంలో ఇవన్నీ సహజంగా జరిగేవే. అయితే ఒకానొక సంవత్సరం అసలు వేసవే లేకుండా గడిచిపోయింది. ఆ విషయం మీకు తెలుసా?

    అవును..1816 సంవత్సరం వేసవి లేకుండా గడిచిపోయింది. అందుకే దాన్ని ‘The Year without Summer’ అని పిలుస్తారు. ఆ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 0.4–0.7 సెంటిగ్రేడ్‌లు తగ్గాయి. ఆ సంవత్సరం యూరప్‌లో వేసవి ఉష్ణోగ్రతలు సైతం అత్యంత చల్లగా ఉన్నాయి.

    1815 ఏప్రిల్‌లో ఇండోనేషియాలో మౌంట్‌ టాంబోరా విస్ఫోటనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. 1,300 సంవత్సరాలలో ఇది అతి పెద్ద విస్ఫోటనం అంటున్నారు. వాతావరణంపై దాని ప్రభావం పడటం వల్ల వేసవి లేకుండా గడిచిపోయిందంటున్నారు. ఎండలు లేకపోతే హాయిగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మనకు ఎండలు చాలా అవసరం.

    చ‌ద‌వండి: అత్యంత య‌వ్వ‌నంగా 60 ఏళ్ల తాత‌!

    ఎండలు లేకపోతే వర్షాలు సక్రమంగా కురవవు. పంటలు సరిగ్గా పండవు. దీంతో 1816లో ప్రపంచం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్, ఐర్లాండ్, బోర్బన్‌ రిస్టోరేషన్‌ ఫ్రాన్స్ వంటి దేశాలు కరువు బారిన పడ్డాయి. 1816 తర్వాత మళ్లీ ఇప్పటిదాకా వేసవి లేని ఏడాది రాలేదు.

Politics

  • చెన్నై:  త్వరలో తమిళనాడులో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్‌ హీట్‌ ఊపందుకుంది. తమిళనాడులో కొత్తగా ఆవిర్భించిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఎన్నికలకు భారీ హామీలతో ముందుకెళ్లడానికి సిద్ధమైంది. ఈ మేరకు టీవీకే చీఫ్‌ విజయ్‌.. తమ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఇందులో మహిళలకు బంపరాఫర్‌లు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం(మార్చి 7వ తేదీ) తన ఎన్నికల హామీలను ప్రకటించారు విజయ్‌. 

    మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, యువతులకు వివాహ బహుమతిగా బంగారపు ఉంగరం, పట్టు చీరలతో పాటు అన్ని కుటుంబాలకు ఉచితంగా ఆరు ఎల్‌పిజి సిలిండర్లు వంటి అనేక వాగ్దానాలను ప్రకటించారు. తన తమిళగ వెట్రీ కజగం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప 60 ఏళ్ల వయస్సు వరకు  ఉన్న మహిళలందరికీ  నెలవారీ సహాయం అందించబడుతుందని విజయ్‌ స్పష్టం చేశారు.

    మహిళలపై నేరాలకు సంబంధించి జీరో పారదర్శకత విధానాన్ని అమలు చేయడానికి “రాణి వెలు నాచ్చియార్ ఫోర్స్” అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో సుమారు 500 బృందాలను రద్దీ ప్రదేశాల్లో భద్రత కోసం నియమిస్తామన్నారు.  ఈ బృంద సభ్యులు బాడీ కెమెరాలతో  అందుబాటులో ఉంటారన్నారు.

    అలాగే, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించి న్యాయం అందించేందుకు “అంజలై అమ్మాళ్ సూపర్ ఫాస్ట్ మహిళా కోర్టులు” ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ ఉండదని, కేవలం పబ్లిసిటీ కోసమే తపిస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలతో కాలం గడుపుతారని, ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని విమర్శించారు. 

    ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన కురసాల కన్నబాబు.. ‘ కాగ్ నివేదిక చూస్తే.. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే... చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు.. అప్పు చేయని రోజు అంటూ లేదు. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల కన్నా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద అప్పుచేసి 300 కోట్ల పైనే వడ్డీ కట్టారు. వాహనాల పన్ను జీఎస్టీని కేంద్రం తగ్గిస్తే... అది కూడా రోడ్ టాక్స్ కింద మలిచి ప్రజలపై బారాలు మోపుతున్నారు చంద్రబాబు. ఎఫ్ఆర్ఎంబి చట్టం నిబంధనలను ఉల్లంగించారు చంద్రబాబు

    పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర అధోగతి పాలుఅవబోతున్నది.  ఎఫ్ఆర్ఎంబి  లోటు 2.7 శాతం ఉండాల్సింది 3.75 గా ఉంది. మూడు లక్షల 18 వేల కోట్లు రూపాయలు అప్పులు చంద్రబాబు చేసి పెద్ద ఘనతగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.రాజమండ్రిలో కల్తీ పాలతో ప్రజలు చనిపోతే పట్టించుకోవడం లేదు. 

    వేట్లపాలెంలో అనేకమంది చనిపోతే వారి ఊసే పాలకులకు పట్టడం లేదు. శ్రీకాకుళంలో నీరు కలుషితమై ఆరుగురు చనిపోయిన వీరికి పట్టడం లేదు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు పేదల సమస్యలు చర్చించకుండా... ఏకపాత్రాభినయాలు, పేదల పెన్షన్లపై కూడా స్కిట్లు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి గడిపేస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసిన డబ్బు ఏ సంక్షేమ పథకానికి ఖర్చు చేశారు. సూపర్ సిక్స్ హామీలకు ఖర్చు చేశారా చూపండి’ అంటూ సవాల్‌ చేశారు.

    ‘జగన్‌మోహన్‌రెడ్డిన తట్టుకోవడం కష్టం అని ఒకే ఒక కారణంతో మీరు కలిసి ఉంటున్నారు. జగన్‌పై ఉన్న భయం ఒకటే మిమ్మల్ని కలిపి ఉంచుతుంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ నీడ్ శాతం 41.8 శాతం తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోతున్నారు. అంచనాలే అందుకోలేని విధంగా.... మీ బడ్జెట్ ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు రూ. 10వేల 620 కోట్లు తగ్గిపోయాయి. మూలధన వ్యయం రూ. 45 కోట్లు చేస్తామని రూ. 16 కోట్లు చేశారు. రాష్ట్రం దివాళా తీసే దిశగా ఆర్థిక వ్యవస్థ ఉందని కాగ్ నివేదిక వేదిక చెప్పింది.రెవెన్యూలో లోటు పెరిగిపోయింది...365 రోజుల్లో 364 రోజులు అప్పులు చేసే పరిస్థితికి.. రాష్ట్రాన్ని దిగజార్చారు’ అంటూ విమర్శించారు.

  • సాక్షి, తిరుపతి: భగవద్గీతపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ నాయుడు, కిర‌ణ్ రాయ‌ల్‌కు లేదని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసభ్య వీడియోలు తీసే వారితో భగవద్గీత గురించి మాట్లాడించడం దురదృష్టకరమన్నారు. యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించామని భూమన పేర్కొన్నారు.

    టీటీడీ మాన్యువల్ ప్రకారం విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. తాము టీటీడీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆ పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఆ పుస్తకంలో తన పేరు, అప్పటి ఈవో ధర్మారెడ్డి ముందుమాట ఉండడంతో బీఆర్ నాయుడు అసహనం వ్యక్తం చేసి పుస్తకాన్ని విసిరేశారు. భగవద్గీత సారాన్ని 26 పేజీల పుస్తకంగా అందించాం. పండితులతో చర్చకు సిద్ధమని, ఈ గ్రంథం గీతా భావాలకు విరుద్ధమని నిరూపిస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా’’ అంటూ భూమన సవాల్‌ విసిరారు.

    ఈ పుస్తకానికి రూ.50 కోట్లు ఖర్చయ్యాయన్న ఆరోపణలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. రూ.50 కోట్లు ఖర్చు అయ్యిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన స‌వాల్ చేశారు. ఐదు భాషల్లో భగవద్గీత సారాన్ని ముద్రించి భక్తులకు పంపిణీ చేయడం చట్టబద్ధమైన కార్యక్రమం. బీఆర్ నాయుడు చేస్తున్న అన్యాయాలపై పోరాటం కొనసాగుతుందని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు.

     

  • తాడేపల్లి : ఏపీ అసెంబ్లీలో కాకి లెక్కలు చెబుతూ కూటమి ప్రభుత్వం కాలం గడిపిందని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం లెక్కలు వాస్తవాలకు సంబంధంల లేకుండా ఉందని మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ అమలు చేయమంటే.. సూపర్‌ స్కామ్‌ చేస్తున్నారని కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరిని తప్పుబట్టారు చంద్రశేఖర్‌.

    ఈరోజు(శనివారం, మార్చి 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్‌.. అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు మత విద్వేషాలు పెంచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  ఇందుకేనా అసెంబ్లీని నిర్వహించేది? అంటూ ప్రశ్నించారు.  

    ‘ జనంతో నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్.  అదే జనాన్ని పొడిచి ప్రభుత్వంలోకి వచ్చింది చంద్రబాబు. వైఎస్ జగన్‌ని దూషించటం, లడ్డూ ప్రసాదంపై విషం చిమ్మటానికే అసెంబ్లీలో ప్రాధాన్యత ఇచ్చారు. మండలి ఛైర్మన్‌ని మతం పేరుతో అవమాన పరిచారు. లడ్డూ మీద చర్చ జరిగితే వారి పాపాలు బయటకు వస్తాయని భయపడ్డారు. అందుకే ఛైర్మన్‌కి మతాన్ని ఆపాదించారు. మంత్రులేమో కామిడీలు చేస్తుంటే, కామిడీ ఆర్టిస్టులు మంత్రుల్లాగ మాట్లాడుతున్నారు. ఉద్యోగాల కల్పనలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన చంద్రబాబు ఇకమీదట దేశ రాజకీయాల్లోకి వెళ్తారట. ఆర్థిక క్రమశిక్షణ లేని వైనం మీద కాగ్ కడిగి పారేసింది. జాబ్ కేలండర్ అడిగితే లోకేష్ డేట్లు మార్చుకుంటూ పోతున్నారు. లూటీ చేసి లాఠీలతో బెదిరిస్తున్నారన్నారు’ అని విమర్శించారు.

  • సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్‌ నేతలపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్‌ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్‌ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.

    కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్‌కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్‌ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్‌ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్‌ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్‌ చేయించండి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కాగ్‌ రిపోర్టు డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేయలేకపోతున్నానని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏపీలో ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. కల్పిత జీఎస్‌డీపీ గణాంకాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నారంటూ కాగ్‌ లెక్కలను బహిర్గతం చేశారు. తప్పుడు లెక్కలపై బొత్స మండిపడ్డారు.

    విపక్షనేత బొత్స సత్యనారాయణ ట్విట్టర్‌ వేదికగా..‘ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి, మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా, మీరు కాగ్‌ వెబ్‌సైట్ నుండి డాక్యుమెంట్లు డౌన్‌లోడ్ చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు మీరు సిద్ధంగా లేరన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, 23 రాష్ట్రాలకు సంబంధించిన CAG MKI నివేదికలను ఈ ట్వీట్‌కు జతపరుస్తున్నాము. అలాగే వృద్ధి రేట్లు ఎలా గణించారో వివరింగా తెలియజేసే స్లైడ్స్‌ను కూడా ఈ ట్వీట్లో పొందుపరుస్తున్నాం. (https://tinyurl.com/teswmtu2)

    రాష్ట్రం ప్రస్తుతం ఒక ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో అది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మీ ప్రభుత్వం కల్పితమైన GSDP గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న తప్పుడు అభిప్రాయాన్ని కల్పిస్తోంది.

    2024–25లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75% (నామినల్ GSDP) వృద్ధి సాధించిందదని మీ ప్రభుత్వం చెప్తోంది. కాని అదే సమయంలో దేశ వృద్ధి రేటు 9.8% మాత్రమే. అలాగే 2025–26లోకూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 10.75% వృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. కాని దేశ వృద్ధి రేటు 8.0%గానే అంచనా వేశారు. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 వరకు రెండు సంవత్సరాల కాలానికి CAGR 11.09%గా వస్తుంది. అదేవిధంగా రియల్ GSDP వృద్ధిలో ఈ సంవత్సరం రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలలో 3వ స్థానంలో ఉందని మీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.

    అయితే మీ ప్రభుత్వం తరఫున మీరు ఇస్తున్న అంకెలు, గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ విడుదల చేసినవి కావు. ఇవన్నీచంద్రబాబుగారి కార్యాలయం తయారు చేసిన గణాంకాలు, కాకిలెక్కలు. ఈ గణాంకాలు నిజమైతే, అదే స్థాయిలో ప్రభుత్వ ఆదాయాల్లో కూడా వృద్ధి కనిపించాలి. CAG ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు సంబంధించి విడుదలచేసిన గణాంకాలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా వెల్లడి అవుతోంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR మాత్రమే పెరిగాయి.

    11.09% GSDP వృద్ధి చూపిస్తున్న రాష్ట్రం, కేవలం 1.97% పన్ను ఆదాయ వృద్ధిని మాత్రమే సాధించడం ఎలా సాధ్యమో ప్రపంచంలోని ఆర్థిక శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించే విషయం. మీరు చెప్పుకుంటున్నట్టుగా ‘విజనరీ నాయకత్వం’ కింద తయారుచేసిన కల్పిత గణాంకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి 9 నెలలకు సంబంధించి 23 రాష్ట్రాలకు వచ్చిన ఆదాయాలకు సంబంధించిన ఖాతాలనుకూడా CAG అప్‌లోడ్ చేసింది.

    కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్

    ఆ రాష్ట్రాలతో పోల్చి చూస్తే పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. 23 రాష్ట్రాలలో పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది — అంటే కిందనుంచి రెండవ స్థానం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం అదే కాలంలో 9.64% పెరిగింది, కానీ ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు కేవలం 1.97% మాత్రమే పెరిగాయి.

    కానీ, మీరు ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మించి ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధ్యత గల విపక్షంగా వాస్తవాలను మేం శాసన మండలిలో ప్రస్తావించినప్పుడు, రాష్ట్రం చూపుతున్న ఈ నిరాశాజనక ఆర్థిక పనితీరుపై ఒక ఆర్థిక మంత్రిగా మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా, మేం సభద్వారా ప్రజలముందు ఉంచిన ఈ గణాంకాలను ఎగతాళి చేస్తూ, వ్యంగ్యంతో వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇప్పుడు మేము జతపరిచిన అన్ని పత్రాలను మీరు పూర్తిగా పరిశీలించి, మేము చేసిన ఆరోపణలను ఖండించగలరా? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం (State’s Own Tax Revenues) వృద్ధి రేటు CAGR 1.97% కంటే ఎక్కువగా ఉందని మీరు చెప్పగలరా?. పన్ను ఆదాయ వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 22వది కాదని, అంతకంటే మెరుగైన స్థానంలో ఉందని మీరు నిరూపించగలరా?. ఈ గణాంకాలను మీరు ఖండించకపోతే, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిగా మీరు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని భావించినట్టే! అని పోస్టులో పేర్కొన్నారు. 

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లు అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటుంది.. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితో పాటు, మహిళా సాధికారత లక్ష్యంగా మా హయాంలో పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేశాం.

    ..అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాం. దాదాపు 32కు పైగా పథకాల ద్వారా మహిళలకు భరోసా కల్పించాం. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్ర పోషిస్తున్నారు. మహిళల అభ్యున్నతే.. ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

     

     

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, కెమికల్‌ కలిపారని దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చంద్రబాబు ప్లాన్‌. వైఎస్సార్‌సీపీ హయాంలో క్వాలిటీ టెస్టింగ్‌ ల్యాబ్‌ను తీసుకొచ్చాం. మార్కెట్లో ఫిబ్రవరి 24న కేజీ హెరిటేజ్‌ నెయ్యి రూ.541 ఉంది. అదే రోజు మార్కెట్‌లో ఇందాపూర్‌ నెయ్యి రూ.578గా ఉంది. కేజీ అమూల్‌ నెయ్యిని రూ.525కే ఇస్తున్నారు’ అని సజ్జల తెలిపారు.

    అడ్డగోలుగా దోపిడీ చేయటానికే.. 
    తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘నెయ్యి కాంట్రాక్టును కైవసం చేసుకోవటానికే ఇష్టానుసారం మాట్లాడారు. అధిక ధరలతో నెయ్యి కాంట్రాక్టు తీసుకుని స్వామి వారి సొమ్మును కాజేస్తున్నారు. అడ్డగోలుగా దోపిడీ చేయటానికే లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల వెనుక పెద్ద స్కాం ఉంది.

    స్వామి వారి డబ్బును దోచుకోవటానికి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. లడ్డూ ఇష్యూలో ప్లాన్ ప్రకారమే మా పార్టీపై బురద చల్లారు. లడ్డూ కాంట్రాక్టు వెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉంది. దీనిపై సీబీఐ విచారణ జరపాలి. అప్పుడే కుంభకోణాలన్నీ బయటకు వస్తాయి. అమరావతిలో జరుగుతున్న స్కాం మదరాఫ్ ఆల్ స్కామ్స్. నెయ్యి ఇష్యూ అంతకంటే పెద్ద స్కాం. సెప్టెంబరు 18న నెయ్యి గురించి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు.

    జంతువుల కొవ్వు ఉందని అనడమే దారుణం అనుకుంటే బాత్రూమ్ కెమికల్స్ కలిపారని కూడా చంద్రబాబు మళ్లీ మాట్లాడారు. సాధారణ మనుషులు ఎవరూ ఊహించని మాటలతో అందరినీ ఆందోళనకు గురి చేశారు. దీనంతటి వెనుక భారీ స్కాం చేయటానికి పన్నిన కుట్ర దాగి ఉంది. 2023లో జగన్ తిరుమలలో అత్యాధునిక ల్యాబులను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్కటీ చేయలేదు.  

    జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

    బీఆర్ నాయుడి వ్యవహారం బయటపడినా ఆయనను చంద్రబాబు ఎందుకు తొలగించలేదు? మా హయాంలో పృథ్వీ విషయం తెలియగానే రాజీనామా చేయించాం. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. భక్తుల విశ్వాసాలంటే చంద్రబాబుకు లెక్క లేదని అర్థం అయింది’ అని ధ్వజమెత్తారు.

International

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్‌ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్‌ ఇక బెదిరించలేదన్న ట్రంప్‌.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్‌ నిరంతర దాడులతోనే ఇరాన్‌ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై  పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.

    ఇరాన్‌.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్‌ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్‌ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్‌ ఎద్దేవా చేశారు.

    కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.

    మరోవైపు, ఇరాన్‌పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.  ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది.

  • కాఠ్మాండు: నేపాల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్‌ శుక్రవారం ఉదయం మొదలైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4 గంటల వరకు వెల్లడైన ఫలితాలను బట్టి.. జెన్‌ జీ అభిమాన నాయకుడు, మాజీ ‍ కాఠ్మాండు మాజీ మేయర్‌ బాలేంద్ర షా (35)కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) 46 సీట్లలో గెలుపొంది, మరో 73 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్ట్‌ పార్టీ ఒక సీటు గెలుపొంది, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

    ఏ విధంగా చూసుకున్నా ఆర్‌ఎస్‌పీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. 275 మంది సభ్యులు ఉండే ‍ప్రతినిధి సభకు ఈ నెల 5న ఓటింగ్‌ జరిగింది. 165 స్థానాలకు నేరుగా, మరో 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్‌ జరిగింది. 

    మాజీ ప్రధానిపై బలేంద్ర షా ఆధిక్యం 
    జాపా-5 నియోజకవర్గంలో బలేంద్ర షా 55,934 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ (నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ) 10,293 ఓట్లు మాత్రమే సాధించారు. శ్రమ్‌ సంస్కృతి పార్టీకి చెందిన సమీర్ తమాంగ్‌కు 6,324 ఓట్లు పడ్డాయి. కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతోంది. ఆర్‌ఎస్‌పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.

    దిగువ సభలో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 110 స్థానాలు ప్రోపోర్షనల్ రిప్రెజెంటేషన్ విధానం ద్వారా కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 138 స్థానాలు అవసరం. నేపాల్‌లో మొత్తం 1.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సుమారు 60 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీ చేశారు.
     

  • ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అత్యవసర ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అత్యవసర మినహాయింపు ద్వారా (కాంగ్రెస్‌ ఆమోదం అవసరం లేకుండా) ఇజ్రాయెల్‌కు 151.8 మిలియన్ల డాలర్ల విలువైన 12,000 బాంబు కేసింగ్స్‌ను (ఒక్కొక్కటి1,000 పౌండ్ల బరువు) విక్రయించనుంది. 

    ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెంటనే విక్రయించాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్ధించుకున్నారు.  తద్వారా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 36(b)ను  మినహాయించినట్టు  చెప్పారు.   ఈ ప్రతిపాదిత అమ్మకం ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, దాని రక్షణను బలోపేతం చేస్తుందని  అని స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
     

    ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

    అత్యవసర మినహాయింపు (Emergency Waiver) అంటే సాధారణంగా ఇలాంటి అమ్మకాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. అయితే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో "ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్" కింద తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఈ విక్రయాన్ని వేగవంతం చేశారు. అమెరికన్ రక్షణ సంస్థలు తమ అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచడానికి అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఆయుధాల సరఫరా వల్ల ఇజ్రాయెల్ తన రక్షణను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ప్రాంతీయ ముప్పులను అడ్డు కోవడానికి సహాయపడుతుందని బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ తెలిపింది.

    ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్‌ తప్పదా? వైరల్‌ వీడియో

    దీనిపై విమర్శలు
     ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కాంగ్రెస్ సమీక్షను దాటవేయడం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు విరుద్ధంగా ఉందని . డెమొక్రాటిక్ నాయకుడు గ్రెగొరీ మీక్స్ విమర్శించారు. ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, ఇలా "అత్యవసర" అధికారాన్ని వాడటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

  • దుబాయ్‌ విమాన సర్వీసులను ఎమిరేట్స్‌ తాత్కాలికంగా నిలిపేసింది. ఎయిర్‌పోర్టుకు రావద్దని ప్రయాణికులకు ఎమిరేట్స్‌ సూచించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై మరో మిస్సైల్‌ దాడి జరిగింది. ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ భీకర దాడులు చేసింది. వెంటనే అలర్ట్‌ అయిన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. ప్రయాణికులను తరలించారు. మిస్సైల్‌ దాడితో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

    ఇరాన్‌ క్షిపణుల, డ్రోన్లను యూఏఈ వైమానిక దళం అడ్డుకుంది. భద్రత కారణంగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను అధికారులు బంద్‌ చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్‌ వచ్చే, వెళ్లే అన్ని విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇరాన్ దాడి చేసిన పొరుగు దేశాలకు నేను క్షమాపణలు కోరుతున్నారు.

    పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయకూడదని.. నిన్న సమావేశమైన తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్ అంగీకరించింది. పొరుగు దేశాలపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించం. ఆయా దేశాల ప్రాంతాల నుంచి ఇరాన్‌పై దాడి జరిగితేనే.. ఇరాన్ తిరిగి ప్రతిదాడి చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తాత్కాలిక లీడర్‌షిప్ కౌన్సిల్ అంగీకరించింది’’ అని ఇరాన్‌ అధ్యక్షుడు తెలిపారు.



     

  • ఇరాన్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పారు. ఇకపై పక్కదేశాలపై దాడి చేయమన్నారు. "మీరు మా జోలికి రాకుంటే.. మేము మీ జోలికి రామని" తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తి లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అదే విధంగా మీ దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చొద్దని.. అక్కడి నుండి అమెరికా తమపై దాడి చేయకుండా చూసుకోవాలని సూచించారు.

    ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిదాడులతో ఇరాన్ విరుచుకపడింది. ఈ నేపథ్యంలో దుబాయి, కువైట్, బహ్రెయిన్, యుఏఈలతో పాటు ఇతర గల్ఫ్ దేశాలలోని USA స్థావరాలతో ఇరాన్ దాడులు జరిపింది. అక్కడితో ఆగకుండా ఆ దేశంలోని ఆయిల్‌ రిఫైనరీలు, విమానాశ్రయాలపై మిస్సైల్స్‌తో విరుచుకపడింది. దీంతో ఇరాన్ తీరుపై గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు.

  • టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.

    అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు  సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫొటోల్లో  వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.

    ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. 

    ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్‌ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ