Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని జన్మభూమి జంక్షన్ వద్ద ఆకతాయిల వీరంగం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. నడిరోడ్డుపై బీర్ సీసాలతో హంగామా చేస్తూ కొంతమంది వ్యక్తులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గంజాయి మత్తులో రెండు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో వారిని అదుపు చేయడానికి వెళ్లిన వారిపై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు.  ఈ ప్రాంతంలో తరచూ గొడవలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నివసించే వారు ప్రాణాలు గుపిట్లో పెట్టుకొని తమ గృహాలకు చేరుతున్న పరిస్థితి నెలకొంది.  

    రోజురోజుకి ఆకతాయిల అల్లర్లు పెరుగుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ సరిగ్గా లేకపోవడం మాకు భయాన్ని కలిగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు పెట్రోలింగ్ పెంచి గొడవలను అదుపులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులపై పాము విసిరేందుకు ప్రయత్నించిన ఘటన పాతబస్తీ చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద కలకలం రేపింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో డ్రైవర్‌కు 150 రీడింగ్ రావడంతో ఆటోను సీజ్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

    ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఒక్కసారిగా ఆటోలో నుంచి పామును తీసి పోలీసులపైకి విసిరే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు భయాందోళనకు గురై వెంటనే దూరం తప్పుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ఆటో డ్రైవర్ పాముతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

    ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

     

  • ఇది హస్తినాపురం జెడ్పీరోడ్డులోని ఓ టిఫిన్‌సెంటర్‌. ఇక్కడ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌  విక్రయిస్తుంటారు. కమర్షియల్‌ సిలిండర్‌కు బదులు.. ఇలా డొమెస్టిక్‌  వినియోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న సిలిండర్లను కొంత మంది అక్రమార్కులు కమర్షియల్‌ కేంద్రాలకు చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఈ ఒక్క టిఫిన్‌ సెంటర్‌లోనే కాదు.. జిల్లాలోని చాలా చోట్ల ఇదే తంతు కొన సాగుతోంది.

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లను అందజేస్తోంది. దీపం, ఉజ్వల పథకాల కింద ఉచితంగా అందజేసిన సిలిండర్లతో పాటు ప్రైవేటు సిలిండర్లు కూడా ఉన్నాయి. జిల్లాలో గృహ, వాణిజ్య కనెక్షన్లు 12 లక్షలకుపైగా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, గాయత్రీనగర్, జెడ్పీరోడ్డు, బీఎన్‌రెడ్డి, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఆమనగల్లు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, తుక్కుగూడ, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల తదితర ప్రాంతాల్లోని ఏజెన్సీల పరిధిలో గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన వంట గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఏజెన్సీలు, డెలీవరీ బోయ్స్‌ సహకరిస్తుండటంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.    

    వినియోగదారుల పేరున బుక్‌ చేసి.. 
    రెండు మూడు నెలలకు ఒక సిలిండర్‌ మాత్రమే వినియోగించే వారి నుంచి గ్యాస్‌బుక్‌లను సేకరించి, వారి పేరున సిలిండర్లను బుక్‌ చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో నమోదవుతుండటంతో వారు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలు, డెలివరీ బోయ్స్‌ దీన్ని అవకాశంగా తీసుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. నిజానికి 14.2 కిలోల గృహ సిలిండర్‌ ధర రూ.925 కాగా, 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1,820 ఉంది. వినియోగదారుల పేరున సిలిండర్‌ బుక్‌ చేసిన ఆయా సిలిండర్లను హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీస్టాళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక్కో సిలిండర్‌పై రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీలు/ డెలివరీ పాయింట్లపై నిరంతరం నిఘా పెట్టాల్సిన సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ విభాగం వారికి పరోక్షంగా వారికి సహకరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల నుంచి ప్రతి నెలా వారికి ముడుపులు ముట్ట జెబుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

    వాట్సాప్‌ గ్రూపుల్లో ‘జీపే స్కానర్‌’ చక్కర్లు 
    సివిల్‌ సప్లయ్‌ విభాగం వాట్సాప్‌ గ్రూపుల్లో ఇటీవల ఓ ‘జీపే స్కానర్‌’ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. డీలర్ల సంక్షేమం పేరుతో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 919 రేషన్‌ షాపులు ఉండగా, ఒక్కో షాపు నుంచి నెలకు రూ.2000 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెలా రూ.18.32 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా వసూలైన మొత్తంలో ఉన్నతాధికారుల వరకు వాటాలు అందుతున్నట్లు సమాచారం.  

Movies

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్‌ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్‌కు కొద్ది  రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు.

    ఈ నేపథ్యంలో దర్శకుడు అనీల్ రావిపూడి తన తదుపరి లక్ష్యాన్ని స్పష్టంగా బయటపెట్టాడు. రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే కోరికను ఆయన తాజాగా వెల్లడించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో అనీల్ రావిపూడి మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా పెద్ద హిట్ కావాలని కోరారు. ఆ సినిమా విజయం సాధిస్తే ఆటోమేటిగ్గా రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని ప్రకటించారు. అదే వేదికపై శంకర వరప్రసాద్ పాట స్టెప్‌ను రావిపూడి రీ క్రియేట్ చేశారు. ట్రయిలర్‌ను మొదటగా రామ్ చరణ్‌కే చూపించిన విషయాన్ని బయటపెట్టారు. మా యూనిట్ కాకుండా ట్రయిలర్ చూసిన తొలి వ్యక్తి రామ్ చరణ్. చిరంజీవి గారి ఇంట్లో చరణ్‌కు చూపించాం. చూసి అద్భుతంగా ఉందన్నారని ఆయన తెలిపారు.  

    రామ్ చరణ్‌తో సినిమా చేయాలంటే అది పాన్ ఇండియా స్థాయిలో ఉండాలని అనీల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా హీరో, కథ అన్నీ సెట్ అయితే ఆటోమేటిగ్గా పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు అనీల్ రావిపూడి వెల్లడించారు. రామ్ చరణ్‌తో సినిమా ఓకే చేసుకోవడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను అందుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు.  మొత్తానికి రామ్ చరణ్‌తో అనీల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో మరో భారీ ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్టే.  

  • అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ ఈ ఏడాది అక్టోబరు వరకు ఉండనుందని తెలుస్తోంది. అంటే థియేటర్లలోకి రావడం దాదాపు వచ్చే ఏడాదే అనమాట. సరే ఈ మూవీ సంగతి పక్కనబెడితే బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో పనిచేస్తాడా అనే గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లిస్టులో మరో పేరు వచ్చింది. స్టోరీ ఏంటనేది కూడా టాక్ నడుస్తోంది.

    అట్లీ తర్వాత త్రివిక్రమ్‌తోనే బన్నీ కలిసి పనిచేయబోతున్నాడని కొన్నిరోజుల ముందు రూమర్స్ వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిపోయిన 'గాడ్ ఆఫ్ వార్' అనే స్క్రిప్ట్ మళ్లీ బన్నీ దగ్గరకొచ్చిందని.. ఈ ఏడాదిలో విషయంపై క్లారిటీ రావొచ్చని కొన్ని రోజుల ముందే మాట్లాడుకున్నారు. ఇది నిజమో కాదో అనే సంగతి పక్కనబెడితే కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు తెరపైకి వచ్చింది.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యకీ తప్పని ఇబ్బంది.. వీడియో వైరల్)

    మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బన్నీ-లోకేశ్ కలిసి ఓ మూవీ చేయబోతున్నారని టాక్ అయితే బయటకొచ్చింది. అయితే గతంలో లోకేశ్ రాసుకున్న 'ఇరుంబక్కు మాయావీ' స్క్రిప్ట్‌నే ఇప్పటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేసి బన్నీతో చేయబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఈ స్టోరీ గతంలో సూర్యతో అనుకున్నారు. కానీ కుదర్లేదు. 'కూలీ' టైంలో దీన్ని ఆమిర్ ఖాన్‌తో లోకేశ్ చేయనున్నాడని మాట్లాడుకున్నారు. ఇప్పుడు చూస్తే బన్నీ పేరు తెరపైకి వచ్చింది. నిజమా కాదా అనేది కొన్నిరోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు.

    ఓ ప్రమాదంలో చేతిని కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో తయారు చేసిన చేతిని అమర్చుతారు. దీంతో అతడికి ఎలాంటి సూపర్ పవర్స్ వచ్చాయి? తర్వాత ఏమైంది అనేదే 'ఇరుంబక్కు మాయావీ' స్టోరీ లైన్ అని గతంలోనే లోకేశ్ ఓసారి చెప్పాడు. మరి బన్నీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనా కాదా అనేది చూడాలి? దీనికి అనిరుధ్ సంగీతమందించే అవకాశముందని కూడా మాట్లాడేసుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)

  • పట్టుచీరలో మెరిసిపోతున్న యాంకర్ అనసూయ

    2025లో నా బెస్ట్ గిఫ్ట్.. కొడుకు గురించి లావణ్య పోస్ట్

    బ్లాక్ గౌనులో కాజల్ అగర్వాల్ గ్లామర్ మెరుపులు

    మాల్దీవులు వెళ్లిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్

    డిసెంబరు జ్ఞాపకాలతో ముద్దుగుమ్మ మృణాల్

    దుబాయిలో చిల్ అయిపోతున్న సోనాల్ చౌహాన్

  • వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్‌ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 

    నాకే ఇలా జరుగుతుందంటే..
    కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.

    నిశ్శబ్ధాన్ని వీడండి
    తప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్‌ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్‌ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.

    జైలు జీవితం
    ఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్‌ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్‌ జైలు జీవితం గడుపుతున్నాడు.

    చదవండి: సినిమా ఫ్లాప్‌.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్‌ నటి

  • హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్‌ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్‌ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్‌ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.

    ట్రై చేశా..
    సినిమా రిజల్ట్‌ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్‌ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్‌డ్‌ గేమ్స్‌, అభయ్‌ వంటి ప్రాజెక్టులలో సీరియస్‌ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్‌గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. 

    నేనే ధైర్యం తెచ్చుకుని..
    ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు.

    నా లైఫ్‌ నాది
    మస్తీ 4 మూవీలోని అడల్ట్‌ జోక్స్‌పై జరిగిన ట్రోలింగ్‌ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్‌ను నా ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్‌ చెప్పుకొచ్చింది. 

    చదవండి: 'మా జీవితాల్లో విలన్‌ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు'

  • ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నప్పటికీ.. రీసెంట్ టైంలో ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. కొన్నిరోజుల క్రితం 'రాజాసాబ్' ప్రమోషన్‌లో భాగంగా ఓ మాల్‌కి నిధి అగర్వాల్ వచ్చింది. వెళ్లే క్రమంలోనే అక్కడున్న జనం ఈమెని చాలా ఇబ్బంది పెట్టేశారు. అందుకు సంబంధించిన మాల్ యాజమాన్యంపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఇలానే అల్లు అర్జున్, అతడి భార్య కాస్త ఇబ్బంది పడ్డారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి రకుల్ రొమాంటిక్ కామెడీ సినిమా)

    ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఇకపోతే హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు సినిమాస్ పేరిట కొత్తగా పెద్దగా థియేటర్‌ని నిర్మించాడు. దీని లాంచింగ్ తర్వాత తిరిగెళ్లే క్రమంలో హైటెక్ సిటీలోని ఓ కేఫేకి భార్య స్నేహతో కలిసి వెళ్లాడు. దీని నుంచి బయటకొచ్చే క్రమంలోనే వీళ్లని అక్కడున్న జనం చుట్టుముట్టారు. దీంతో బన్నీ, అతడి భార్య కాస్త ఇబ్బందిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఇదే కాదు కొన్నిరోజుల క్రితం ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత వెళ్లి వస్తున్న టైంలో ఇలాంటిదే జరిగింది. మలేసియాలో 'జన నాయగణ్' ఈవెంట్ ముగించుకుని చెన్నై తిరిగొచ్చిన తర్వాత విమానాశ్రయంలో అయితే హీరో విజయ్‌ని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఇతడు దాదాపు కిందపడిపోయేంత ఇబ్బంది పెట్టారు. ఏదేమైనా ఈ మధ్య సెలబ్రిటీలు బయట తిరగడం చాలా కష్టమైపోతోంది.

    (ఇదీ చదవండి: 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్‌ వచ్చేసింది)

  • త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు.  మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ టీజర్ను విడుదల చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ఉంది. ముఖ్యంగా ప్రకాష్ చెరుకూరి అందించిన సంగీతం మరింత ఇంపాక్ట్చూపుతుంది.

    మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. 'గత కొన్ని రోజులుగా చిన్న సినిమాలన్నీ అద్భుతంగా ఆడుతున్నాయి . దీంతో మా అందరికి ఒక హోప్ వచ్చింది. సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్కి రావడం చాలా ఆనందంగా ఉంది. టికెట్ ధరలు తక్కువ ఉంటే ఆడియన్స్ అందరూ వచ్చి సినిమా చూస్తారని భావిస్తున్నాను. మోడరన్ లైఫ్, పాత పద్ధతిలో ఉన్న వ్యవసాయాన్ని ఎలా కలపొచ్చు అనేది ఈ సినిమాల్లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పాం. 

    మనమందరం కూడా వ్యవసాయం నుంచే వచ్చాము. ఒక్కసారి మనమందరం వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తరాలు కూడా వ్యవసాయం నుంచే వచ్చాయి. వ్యవసాయం గురించి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతూనే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తాం.' అని ఆయన అన్నారు.

    ప్రొడ్యూసర్ అరవింద్ మాట్లాడుతూ .. ' మూవీ మంచి కంటెంట్తో పాటు హైలీ ఎంటర్టైన్అందించేలా ఉంటుంది. ఈ కార్యక్రమానికి పల్స్ ఆఫ్ వర్కింగ్ ఫ్రొం హోం అని పెట్టాం. ఈ సినిమా పల్స్ ఏమిటో ఆడియన్స్ కి తెలియాలని. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో పాటు మీనింగ్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరింత ప్రమోషనల్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాం.' అని ఆయన అన్నారు.

  • పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నశివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'. శ్రీలీల హీరోయిన్ కాగా రవి మోహన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. అధర్వ కీలక పాత్ర చేశాడు. సుధా కొంగర దర్శకురాలు. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం ఈ శనివారం(జనవరి 10న) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు.

    1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా 'పరాశక్తి' తీశారని ట్రైలర్‪‌తో క్లారిటీ వచ్చేసింది. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు.ప్రధాన పాత్రధారులు వేషధారణ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలుగులో దీనికి ఎంతవరకు ఆదరణ దక్కుతుందో చూడాలి?

    ఎందుకంటే 'పరాశక్తి' చిత్రాన్ని జనవరి 10న తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తమిళ వరకు అయితే విజయ్ 'జన నాయగణ్' మాత్రమే పోటీలో ఉంది. తెలుగుకు వచ్చేసరికి 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీ నారీ నడుమ మురారీ'.. ఇలా ఐదు తెలుగు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు 'పరాశక్తి'కి ఏ మేరకు థియేటర్లు లభిస్తాయనేది, సబ్జెక్ట్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి?

  • బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటాం. 

    దారులు వేరు
    మా పిల్లలు తార, ఖుషి, రాజ్‌వీర్‌లకు తల్లిదండ్రులుగా, బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్‌ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో నోట్‌ షేర్‌ చేశారు.

    ప్రేమకథ
    జై- మహి ఓ క్లబ్‌లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్‌ పార్ట్‌నర్‌ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్‌వీర్‌, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్‌ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.

    తెలుగు సినిమా హీరోయిన్‌
    మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్‌కు షిఫ్ట్‌ అయింది. జై భానుషాలి.. హేట్‌ స్టోరీ 2, ఏక్‌ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్‌ చేశాడు. అలాగే పలు సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్‌ బలియే అనే డ్యాన్స్‌ షో సీజన్‌ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.

    చదవండి: హీరో విజయ్‌ సీఎం అవుతాడు: నటుడు సుమన్‌

  • టాలీవుడ్‌కి సంక్రాంతి అతి పెద్ద సీజన్‌. ప్రతిసారి మూడు,నాలుగు సినిమాలు ఈ పండక్కి రిలీజ్‌ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా 7 సినిమాలు(డబ్బింగ్సినిమాలతో కలిసి) రిలీజ్అవుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ లాంటి స్టార్హీరోలతో పాటు శర్వానంద్‌, నవీన్పొలిశెట్టి లాంటి కుర్ర హీరోలు కూడా బాక్సాఫీస్బరిలో ఉన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ ..ఇలా మూడు రోజులకు మూడు సినిమాలతో పాటు ఆ ముందూ వెనుక కూడా కొత్త సినిమాలు రిలీజ్అవుతున్నాయి. అయితే ఒకే సారి ఇన్ని సినిమాలు వస్తే... ప్రేక్షకుల అన్నీ చూడగల్గుతారా? అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి.

    వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి ఏడు సినిమాలు చూస్తే.. తక్కువలో తక్కువ 10-12 వేలు ఖర్చు అవుతుంది. పండగకు ఇంట్లో అయ్యే ఖర్చు అదనం. సగటు ప్రేక్షకుడు ఇంత భరించడం కష్టం. విషయం సినిమాలు రిలీజ్చేస్తున్న నిర్మాతలకు కూడా తెలుసు. కానీ పండక్కి క్లిక్అయితే భారీగా రాబట్టుకోవచ్చనే ఆశతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

     మొత్తం ఏడు సినిమాల బడ్జెట్దాదాపు రూ. 1000 కోట్ల పైనే ఉంటుంది. వాటిల్లో అత్యధికంగా రాజాసాబ్కి రూ. 500 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. తర్వాత చిరంజీవి మన శంకర్వరప్రసాద్సినిమాకు కూడా రూ. 200 కోట్లకు పైగా ఖర్చు అయిందట. రవితేజభర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్‌ ‘అనగనగ రాజు’, శర్వానంద్నారీ నారి మురారి చిత్రాలన్నీ ఒక్కోటి రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కినవే.

     ఇక డబ్బింగ్సినిమాలు జననాయక్‌, పరాశక్తి కూడా భారీ బడ్జెట్చిత్రాలే. మొత్తంగా చిత్రాల బడ్జెట్మొత్తం రూ. 1000 కోట్లు దాటింది. నిర్మాతలకు సేఫ్జోన్లోకి వెళ్లాలంటే..కనీసం రూ. 1500 కోట్ల కలెక్షన్స్రాబట్టాలి. ఇది అసాధ్యం అనే చెప్పాలి. టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్‌, చిరంజీవి సినిమాలకు తొలిరోజు భారీ కలెక్షన్సే వస్తాయి

    హిట్టాక్వస్తే.. రెండు చిత్రాలు భారీగానే వసూలు చేస్తాయి. కానీ మిగిలిన సినిమాల పరిస్థితి అలా కాదు. సినిమా రిలీజ్అయి.. సూపర్హిట్టాక్వస్తే తప్ప.. ప్రేక్షకులకు థియేటర్స్కి వెళ్లరు. టాక్ని బట్టి వాటి కలెక్షన్స్ఉంటాయి. మరి సంక్రాంతికి బాక్సాఫీస్విన్నర్గా ఎవరు నిలుస్తారనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

    సంక్రాంతికి రిలీజ్అయ్యే సినిమాలివే

    1. ది రాజా సాబ్’ (జనవరి 9)

    2. జననాయకుడు(జనవరి 9)

    3. పరాశక్తి(జనవరి 10)

    4. మన శంకర్‌ వరప్రసాద్‌ గారు(జనవరి 12)

    5. భర్త మహాశయులకు విజ్ఞప్తి(జనవరి 13)

    6. అనగనగ ఓరాజు(జనవరి 14)

    7. నారి నారి నడుమ మురారి(జనవరి 14)

  • తమిళ స్టార్‌ హీరో విజయ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్‌ నటుడు సుమన్‌.

    జనాల్లో అనుమానాలు
    తాజాగా సుమన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్‌ అని అర్థం.

    సినిమా వదిలేయాల్సిందే!
    ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్‌ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.

    రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం
    అందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్‌రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. 

    విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌
    మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్‌రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్‌ సీఎం అవుతాడు అని సుమన్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్‌.. గూండా అని పేరెంట్స్‌ తిట్టారు

  • మెగాస్టార్చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌గారు' ట్రైలర్వచ్చేసింది. దర్శకుడు అనిల్రావిపూడి తెరకెక్కించిన మూవీలో వెంకటేశముఖ్యమైన పాత్రలో నటించారు. నయనతార హీరోయిన్‌. సంక్రాంతి కానుకగా జనవరి 12 చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్‌, పోస్టర్స్ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటివరకూ చూడని సరికొత్త చిరంజీవిని ఈ చిత్రంలో చూడబోతున్నారంటూ అనిల్రావిపూడి చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

    తాజాగా విడుదలైన ట్రైలర్ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. తనదైన మార్క్తో ట్రైలర్ను అనిల్కట్చేశారు. కామెడీ పంచ్లతో పాటు చిరంజీవి మెరుపులు కూడా చూడొచ్చు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చిరును ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కూడా చూపించినట్లు తెలుస్తోంది.

  • తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అడపాదడపా మూవీస్ చేసింది. కాకపోతే హిట్స్ దక్కలేదు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఓ హిట్ మూవీ సీక్వెల్‌తో గతేడాది చివరలో వచ్చింది. అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా ఇ‍ప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

    అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీ సినిమా 'దే దే ప్యార్ దే'. 2019లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అద్భుతమైన హిట్‌గా నిలిచింది. మళ్లీ గతేడాది నవంబరు 21న దీని సీక్వెల్‌ని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇ‍ప్పుడీ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ శుక్రవారం (జనవరి 09) నుంచే హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన మలయాళ థ్రిల్లర్ 'ఎకో' తెలుగు రివ్యూ)

    'దే దే ప్యార్ దే 2' విషయానికొస్తే.. తొలి పార్ట్‌లో తనకంటే వయసులో చిన్నదైన ఆయేషాని(రకుల్ ప్రీత్ సింగ్) ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్న ఆశిష్(అజయ్ దేవగణ్).. తన మాజీ భార్య(టబు) అనుమతితో పాటు ఆమె కుటుంబ అంగీకారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రెండో పార్ట్‌లో రకుల్‪‌ తల్లిదండ్రులైన రాజీ ఖురానా(మాధవన్), అంజు ఖురానా(గౌతమి కపూర్).. ఆశిష్‌తో ఈమె పెళ్లికి అడ్డంకిగా నిలుస్తారు. తనకంటే ఏడాది పెద్దవాడైన ఆశిష్‌తో తన కూతురికి రాజ్ పెళ్లి చేశాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    ఇకపోతే ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఎకో, 120 బహదూర్, డ్రైవ్, బ్యూటీ, హక్ లాంటి తెలుగ్ స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే ఎపిసోడ్, ఎల్‌బీడబ్ల్యూ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

    (ఇదీ చదవండి: బాలయ్య అఖండ-2.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఫిక్స్)

  • బిగ్బాస్చరిత్రలో తొలిసారి ఇద్దరు కంటెస్టెంట్స్ఒకేసారి రెడ్కార్డ్‌ జారీ చేశారు. దీంతో తక్షణమే వారు హౌస్‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. తమిళ బిగ్బాస్‌-9లో జరిగిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. హౌస్ట్విజయ్సేతుపతి వారిద్దరిపై విరుచుకుపడ్డారు. రెడ్కార్డ్ఇస్తున్నట్లు ప్రకటించగానే ఇతర కంటెస్టెంట్స్తో పాటు ప్రేక్షకులు కూడా సంబరాలు చేసుకున్నారు. బిగ్బాస్చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం

    బిగ్బాస్తమిళ్ఇప్పటికే 90రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలో ఫైనల్జరగనుంది. క్రమంలో టికెట్ టు ఫినాలే ఏపిసోడ్జరిగింది. కార్ టాస్క్లో భాగంగా నటి సాండ్రాను బలవంతంగా బయటకు నెట్టినందుకు పార్వతి, కమ్రుదిన్‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారిద్దరూ కలిసి సాండ్రాను కాలితో తన్నారు. దీంతో ఆమె కారు నుంచి దూరంగా పడిపోయింది. ఆ తర్వాత కూడా సాండ్రా కాలు కారు డోర్ మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు కూడా వారు కనికరం చూపలేదు. దీంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. దాడి తర్వాత సాండ్ర చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన ఆందోళన తనలో కనిపించింది

    దీంతో ప్రేక్షకులు కూడా పార్వతి, కమ్రుదిన్ తీరుపై విరుచుకుపడ్డారు. ఇక ఇతర హౌస్మెట్స్అయితే, ఏకంగా వారి మొఖంపై ఉమ్మేసినంత పనిచేశారు. టైటిల్రేసులో ఉన్న వినోథ్‌, దివ్యలు కలిసి వారిని కడిగిపారేశారు. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్లో హౌస్ట్విజయ్సేతుపతి వారికి రెడ్కార్డ్ జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు ఏకంగా సంబరాలు జరుపుకున్నారు. కోందరైతే ఏకంగా కేకులు కట్‌ చేశారు. బిగ్‌బాస్‌ షో చాలా భాషలలో టెలికాస్ట్‌ అవుతుంది. కానీ, ఇప్పటి వరకు మహిళా కంటెస్టెంట్‌ ఎవరూ కూడా రెడ్‌ కార్డ్‌ అందుకోలేదు.  తొలిసారి పార్వతిపై బిగ్‌బాస్‌ జారీ చేశాడు.

    క్రమంలో ఇతర కంటెస్టెంట్స్ఎవరూ వారిద్దరికీ సెండాఫ్ఇవ్వలేదు. హౌస్ట్విజయ్సేతుపతి కూడా వారిని స్టేజీపైకి పిలిచి కనీసం ఒక్కమాట కూడా మాట్లడలేదు. హౌస్నుంచి డైరెక్ట్గా ఇంటికి పంపించేశారు. బిగ్బాస్చరిత్రలో ఇంతటి అవమానకరమైన రీతిలో ఎవరూ కూడా ఎదుర్కోలేదు. గేమ్కోసం ఒక స్త్రీని ఇలా బయటకు లాగి, కాళ్ళతో తన్నడం ఏంటి అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బిగ్బాస్ప్రేక్షకులు మాత్రం వారికి తగినశాస్తి జరిగిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

  • శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటించిన చిత్రం ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్‌ శ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలిశెట్టి మూవీస్‌ బ్యానర్‌పై ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ,, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మిస్తున్నారు. సుమన్ , కిట్టయ్య, R.K నాయుడు , సలార్ పూజ , కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు ,సృజనక్షిత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. 

    తాజాగా ఈమూవీ నుంచి టైటిల్‌ పోస్టర్‌ని ప్రముఖ నటుడు సుమన్‌ గారు విడుదల చేస్తూ.. చిత్రబృంధానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ ఉలిశెట్టి గారు మాట్లాడుతూ.. ‘మా సినిమా టైటిల్‌ పోస్టర్‌ని సుమన్‌ గారు రిలీజ్‌ చేసినందుకు ధన్యవాదాలు. ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నటీనటులు అంతా కొత్తవారే అయినప్పటికీ.. చాలా బాగా నటించారు. 

    కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. మంచి కంటెంట్‌లో రాబోతున్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని శ్రీనివాస్‌ ఉలిశెట్టి అందించగా.. నగేశ్‌ గౌరీష్ సంగీతం సమకూర్చాడు. గౌతమ్ వాయిలాడ సిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా పని చేస్తున్నాడు.

  • ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన  మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ శంబాల. యుగంధర్‌ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఈ మూవీ క్రిస్‌మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రావడంతో వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఈ మూవీతో చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ ఖాతాలో హిట్‌ పడింది.

    తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీలో డబ్‌ చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిందీ ట్రైలర్‌ విడుదల చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శంబాల టీమ్‌కు రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ జనవరి 09న బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది.

    కాగా.. ఈ చిత్రంలో అర్చన్‌ అయ్యర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు.  కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.20 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

     

  • టాలీవుడ్‌ హీరో శర్వానంద్‌ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్‌, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్‌ వదిలారు. టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. 

    ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌
    ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మించారు. 

    సంక్రాంతి బరిలో సినిమాలు
    సంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్‌ 'రాజాసాబ్‌', విజయ్‌ 'జననాయగణ్‌' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్‌ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్‌' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి.

     

     

    చదవండి: జన నాయగణ్‌ ట్రైలర్‌లో ఏఐ

  • తెలుగు సినీ సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన రచయిత చంద్రబోస్. ఆయన రాసిన ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్‌ అవార్డునే తీసుకొచ్చిపెట్టింది. చిన్న చిన్న పదాల్లో లోతైన అర్ధాన్ని చెప్పడం ఆయన స్టైల్‌. ఇప్పటికి వరకు ఆయన 3800 పాటలు రాశాడు. వాటిల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అలాంటి ఓ సూపర్‌ హిట్‌ పాట మాత్రం 20 ఏళ్ల తర్వాత బాగా వైరల్‌ అయింది.రాసిన 20 ఏళ్ల తర్వాత ఆ పాటతో చంద్రబోస్‌కి మంచి గుర్తింపు వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబోసే చెప్పారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పాట గురించి చెప్పుకొచ్చాడు.

    సాధన చేస్తే ఫలితం ఉంటుంది..
    సాధన చేస్తే గుర్తింపు, ఫలితం సాధన చేస్తే ఫలితం, గుర్తింపు వస్తూనే ఉంటుంది. మన కష్టానికి ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది. నేను రాసిన ఒక పాటకు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఆ పాట ఇదే. ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే.. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకా నువ్వే, బలపం నువ్వే ప్రశ్న నువ్వే, బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి’. ఇది 20 ఏళ్ల క్రితం బడ్జెట్ పద్మనాభంసినిమా కోసం రాశాను. సినిమా రిలీజ్అయినా పాటకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ అదే పాటను ఒక స్టేజ్‌ మీద పాడిన తర్వాత అది బాగా వైరల్‌ అయి.. నాకు గుర్తింపు వచ్చింది. లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ ఏజెంట్ల మీటింగ్‌లో పాటను పాడాను. వాళ్లంతా ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని వారి బిజినెస్‌ని పెంచుకున్నారు.

    నా భార్య ఏడ్చింది
    ఇదే ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాలోని  ‘ఓరయ్యో..’ అనే ఎమోషన్‌ సాంగ్‌ గురించి మాట్లాడారు.  ఏదైనా పాట రాయాలంటే..  ఆ సన్నివేశాలలో మనల్ని మనం ఊహించుకోవాలి.  రంగస్థలంలోని ‘ఓరయ్యో..’ పాటను నేను అలానే రాశాను. మన ఆప్తులు చనిపోతే ఎలా రోధిస్తాం.. ఎలా బాధపడతారు.. దాన్నే ఈ పాటలో చూపించాను. ‘ఈ సేతితోనే పాలు పట్టాను ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే తలకు పోసాను ఈ సేతితోనే కాళ్లు పిసికాను ఈ సేతితోనే పాడె మొయ్యాలా... ఈ సేతితోనే కొరివి పెట్టాలా... ఓరయ్యో నా అయ్యా.. ’ అనే పల్లవిని ఇంట్లోనే రాశాను. వంట చేస్తున్న నా భార్య దగ్గరకు వెళ్లి పాట సందర్భం చెబతూ... ‘అన్న చనిపోతాడు..తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు.. ఆ సందర్భంలో పాట వస్తుంది’ అంటూ  ఈ పాటను వినిపిస్తే.. తను ఏడ్చేసింది. పాడుతూ నేను ఏడిస్తే.. వింటూ తాను కూడా ఏడ్చేసింది.  రచయిత అనేవాడు ప్రతి సందర్భాన్ని తనదిగా భావిస్తేనే.. తనదైన స్పందన అందిస్తాడు. రచయితకు కావాల్సింది పాండిత్యం.. భాష మీద విపరీతమైన సాధికారతో కాదు.. మనకున్న జ్ఞానం.. మనదైన అనుభవం.. మనలోని స్పందన.. ఈ మూడే రచయితను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి’ అని చంద్రబోస్‌ చెప్పుకొచ్చాడు. 

  • సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎ‍క్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్‌లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్‌ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.

    సినిమా రిలీజ్‌ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్‌ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్‌ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్‌తో పాటు నెటిజన్స్‌ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

    సంక్రాంతికి థియేటర్ల కొరత..

    ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్‌ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్‌ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.

    డబ్బింగ్‌ సినిమాలకు థియేటర్లు?

    సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్‌ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్‌లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్‌ కాంపీటీషన్‌ ఉండే సంక్రాంతికి డబ్బింగ్‌ సినిమాల రిలీజ్‌పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
     

  • మహేష్బాబు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్చిత్రం వారణాసి.. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా రానున్న మూవీపై ఇండియన్సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రమంలో టీజర్విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారుకొద్దిరోజుల క్రితం జరిగిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో #GlobeTrotterevent టైటిల్‌ వీడియోను విడుదల చేశారు. మూవీ కథా నేపథ్యాన్ని తెలిపేలా ఉన్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్అయింది.

     జనవరి 5న పారిస్‌లో టీజర్‌
    వారణాసి నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ ఏమిటంటే.., అభిమానులను ఆశ్చర్యపరుస్తూ మూవీ టీజర్ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ఇప్పుడు చరిత్ర సృష్టించనుంది. పారిస్‌(Paris)లోని 'లే గ్రాండ్ రెక్స్‌'(Grand Rex)లో టీజర్ను విడుదల చేయనున్నారు. 2,702 సీట్లు కలిగిన థియేటర్‌.. యూరప్‌లోనే అతిపెద్దదిగా రికార్డ్క్రియేట్చేసింది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్బాబు వారణాసి చిత్రం నిలుస్తుంది. జనవరి 5 రాత్రి 9 గంటలకు టీజర్విడుదల కానుంది. 

    భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్న ఫిల్మ్స్ ఈ వార్తను ధృవీకరించింది. టీజర్‌ను పెద్ద స్క్రీన్‌పై గొప్ప ఫార్మాట్‌లో ప్రదర్శించడంతుందని ఇది ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తుందని వారు భావిస్తున్నారు. వారణాసిని ప్రపంచ వార్తల్లో ఉంచడానికి రాజమౌళి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 2027లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, షోయింగ్ బిజినెస్‌కు చెందిన ఎస్.ఎస్. కార్తికేయతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. స్వరకర్త ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. కథ స్క్రీన్‌ప్లేను విజయేంద్ర ప్రసాద్ రాశారు.

  • రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్‌'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి'కి రీమేక్‌ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్‌తో ఇది నిజమేనని రుజువైంది.

    తెలుగు మూవీ రీమేక్‌
    భగవంత్‌ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్‌లో ఓ చోట గూగుల్‌ జెమిని ఏఐ మార్క్‌ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    సినిమా
    విజయ్‌ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్‌ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్‌.. ఈ చిన్న మిస్టేక్‌ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్‌ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించగా అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు.  ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది.

     

     


    చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్‌.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు

  • బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన మరో యాక్షన్ చిత్రం అఖండ-2. మైథలాజికల్ టచ్‌తో వచ్చిన ఈ సినిమా డిసెంబర్‌ 12న థియేటర్లలో సందడి చేసింది. వారం రోజులు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    అయితే అఖండ మూవీ థియేట్రికల్ రన్‌టైమ్‌ 2 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ ఓటీటీ విషయానికొస్తే రన్‌ టైమ్‌ భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఓటీటీలో కేవలం రెండు గంటల 20 నిమిషాలు ఉండనున్నట్లు సమాచారం. దాదాపు 25 నిమిషాల సీన్స్ కోత పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఏయే సీన్స్ కట్‌ చేశారనేది ఓటీటీలో చూశాకే క్లారిటీ రానుంది. దీనిపై వచ్చే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్‌, రచ్చ రవి కీలక పాత్రల్లో నటించారు.

    ఈ మూవీ కథేంటంటే..

    చైనా ఆర్మీ జనరల్‌ తన కొడుకు చావుకు కారణమైన భారత్‌పై పగ తీర్చుకునేందుకు భారీ కుట్ర చేస్తాడు. మాజీ జనరల్‌  సహాయంతో బయోవార్‌ ద్వారా భారత్‌ను దొంగదెబ్బ తీయాలనుకుంటాడు. ఇందుకుగాను భారత్‌లో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఠాకూర్‌(కబీర్‌ దుల్షన్‌ సింగ్‌) ని పావుగా వాడుతాడు. అతని సహాయంతో భారతీయులు బలంగా నమ్మే దేవుడు లేడని నిరూపించి..వారిమధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు. అందులో భాగంగా మహా కుంభమేళకు వచ్చిన భక్తులు స్నానం చేసే నదిలో డేంజర్‌ కెమికల్‌ కలిపిస్తాడు. దీంతో నదిలో స్నానం చేసినవారందరూ క్షణాల్లో కుప్పకూలిపోతారు. ప్రతిపక్ష నేత ఠాకూర్‌ ఈ ఘటనను రాద్ధాంతం చేసి దేవుడే ఉంటే ఇలా జరిగేకాదు..అసలు దేవుడు అనేవాడే లేడంటూ సామాన్యులను నమ్మిస్తాడు. జనాలు కూడా దేవుళ్లకు పూజలు చేయడం ఆపేస్తారు. మరోవైపు భక్తులకు వచ్చిన కొత్త రోగానికి వాక్సిన్‌ కనిపెట్టే పనిలో ట్రైనీ సైంటిస్ట్‌, ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ(బాలకృష్ణ) కూతురు జనని(హర్షాలి మల్హోత్రా) సక్సెస్‌ అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఠాకూర్‌ తన మనషులతో ఆ సైంటిస్టులను చంపేయిస్తాడు. జనని తప్పించుకొని పారిపోగా..ఠాకూర్‌ మనషులు ఆమెను వెతుకుతుంటారు. అదే సమయంలో రంగంలోకి దిగుతాడు అఖండ(బాలకృష్ణ). ఆ తర్వాత ఏం జరిగింది? ఠాకూర్‌ మనషుల నుంచి జననిని ఎలా కాపాడాడు? దేవుడే లేడని నమ్మిన జనాలకు.. ఆయన ఉన్నాడు? ఆపద వస్తే వస్తాడు? అని ఎలా నిరూపించాడు? సనాతనధర్మం పాటించే భారతీయులను దొంగదెబ్బ కొట్టాలనుకున్న చైనా ఆర్మీకి ఎలాంటి గుణపాఠం నేర్పించాడు? ఇందులో నేత్ర(ఆదిపినిశెట్టి), అర్చనగోస్వామి(సంయుక్త) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

     

     

National

  • పంజాబ్‌ రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేత ఒకరు హత్యకు గురయ్యారు,. తంగ్‌ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంఛ్‌ చేస్తున్న జర్మల్ సింగ్(50)ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్పి చంపారు. ఓ పెళ్లి వేడుకకు హాజరైన క్రమంలో  ఈ హత్య జరిగింది. అమృత్‌సర్ జిల్లా, వెర్కా బైపాస్ దగ్గర ఉన్న ఒక రిసార్ట్‌లో పెళ్లి వేడుకకు జర్మల్‌ సింగ్‌ హాజరయ్యారు. అయితే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లి అతిథుల్లా  లోపలికి వచ్చి, జర్మల్ సింగ్‌ను దగ్గర నుంచి కాల్చి చంపారుఆయన వేడుకలో పాల్గొంటున్న సమయంలో దాడి జరిగింది. తలకు బుల్లెట్ తగిలడంతో జర్మల్‌ సింగ్‌ మృతిచెందారు. 

    కబడ్డీ ఆటగాడు కన్వర్ దివిజయ్ సింగ్ (రాణా బలాచౌరియా) హత్య జరిగిన కొన్ని వారాలకే చోటు చేసుకోవడం వల్ల రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  అంతకుముందు మూడుదఫాలు జర్మల్‌ సింగ్‌ హత్యాయత్నం జరిగింది. అయితే ఈసారి జర్మల్‌ సింగ్‌ను అతి దగ్గరగా కాల్చి చంపడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ఈ హత్య రాజకీయ ప్రత్యర్థిత్వం లేదా గ్యాంగ్‌స్టర్ సంబంధాలు కారణమా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..



     

  • న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబరు 10న జరిగిన పేలుళ్ల కేసులో దర్యాప్తు అధికారులు పాక్ ప్రేరేపిత ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ను గుర్తించారు. పాకిస్థాన్‌ నుంచి ఈ పేలుడు మాస్టర్‌మైండ్లు కోడ్ భాషల్లో ఉగ్రవాద వైద్యులకు సందేశాలు పంపినట్లు తేల్చారు. ఘోస్ట్ సిమ్ వినియోగించిన ఉగ్రవాదులకు.. వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఈ మేరకు కోడ్ సందేశాలను పంపినట్లు నిర్ధారించారు.

    నిందితులు డాక్టర్ ముజమ్మీల్ గనాయ్, ఆదిల్ రాథర్, ఇతర నిందితులు ఈ సందేశాలను అందిపుచ్చుకునేందుకు డ్యూయల్ ఫోన్ ప్రొటోకాల్ పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితులు రెండుమూడు మొబైల్ హ్యాండ్‌సెట్లను వాడారని, ఒకదాన్ని రోజువారీ పనులకోసం ఉపయోగిస్తే.. మిగతా వాటిని వాట్సాప్ కోసం ప్రత్యేకంగా ఒకటి, టెలిగ్రామ్ కోసం మరోటి వినియోగించినట్లు తేల్చారు. ఈ తరహా ఫోన్లను దర్యాప్తు అధికారులు ‘టెర్రర్ ఫోన్’లుగా అభివర్ణిస్తున్నారు.

    ఏమిటా కోడ్స్?
    ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు పాకిస్థాన్ నుంచి వచ్చిన కోడ్‌లను గుర్తించారు. వాటిల్లో ‘ఉకాసా’, ‘ఫైజాన్’, ‘హాష్మీ’ అనే కోడ్‌లు ఎక్కువగా ఉన్నట్లు నిగ్గుతేలింది. ఆ కోడ్‌లను డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు నిందితులు ఘోస్ట్ సిమ్ కార్డులను ఎలా పొందగలిగారనేదానిపై జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన ఓ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఉగ్ర డాక్టర్లకు పాకిస్థాన్ లేదా పీవోకేకు చెందిన మాడ్యూల్స్ ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు అనుమానిస్తున్నారు.

  • యల్లాపుర: కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది ఓ వివాహిత.. తన బాల్య స్నేహితుడి చేతిలో హత్యకు గురైంది. హత్య అనంతరం ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర పట్టణంలో ఈ ఘటన జరిగింది. తాను వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె స్నేహితుడే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితురాలిని హత్య చేసిన  నిందితుడు రఫిక్ ఇమామ్‌సాబ్ సమీపంలోని అడవిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు.

    బాధితురాలు రంజిత బనసోడే, నిందితుడు రఫిక్ ఇద్దరూ పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె భర్తతో వేరుగా ఉంటూ.. యల్లాపురలో తన కుటుంబంతో నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సహాయకురాలిగా పనిచేస్తోంది. రఫిక్ తరచుగా రంజిత ఇంటికి భోజనానికి వచ్చేవాడు.

    అతను పెళ్లి చేసుకోమని రంజితను ఒత్తిడికి గురిచేసేవాడు. పెళ్లికి రంజితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన రఫిక్.. రంజిత పనివేళ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పదునైన కత్తితో దాడి చేశాడు. రంజితను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత రఫిక్ సమీప అడవిలో ఉరేసుకుని మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతని వద్ద తాడు, మద్యం సీసా కూడా లభించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎం.ఎన్. తెలిపారు.

  • వెనిజువెలాపై అమెరికా దాడిపై ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ట్రంప్ మాదిరిగా భారత ప్రధాని మోదీ సైతం పాకిస్థాన్‌పై దాడి చేయాలన్నారు.‍ అలా దాడి చేసి 26/11 ఘటన బాధ్యుల్ని భారత్ తీసుకురావాలని  సూచించారు. అమెరికా ఆపని చేయగా లేనిదీ.. భారత్ ఎందుకు చేయలేదని అన్నారు.

    26/11 ఉగ్రవాద దాడి ఘటన దేశాన్ని ఎంతగానో కలిచివేసింది. ముష్కరుల కిరాతకంగా అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో   170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మసూద్ అజర్ పాకిస్థాన్‌లో స్వేచ్చగా తిరుగుతున్నాడు. అయితే ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.

    భారత ప్రధాని మోదీకి, అసదుద్దీన్ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. "మోదీజీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. పాకిస్థాన్‌కు ప్రత్యేక బలగాలను పంపండి.26/11 ఉగ్రదాడి సూత్రధారులను వెనక్కి తీసుకరండి. ట్రంప్ అలా చేసినప్పుడు మీరు ఎందుకు చేయాలేరు.  ట్రంప్ కంటే మీరు ఎందులో తక్కువ కాదు". అని అసదుద్దీన్ అన్నారు.

    అయితే గతంలోనూ ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహంపై అసదుద్దీన్ వ్యంగ్యంగా స్పందించారు. ఆప్‌ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. శుక్రవారం వెనిజువెలాపై, అమెరికా ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. ఆదేశ అధ్యక్షుడితో పాటు అతని భార్యను బందీగా అమెరికా తరలించిన సంగతి తెలిసిందే.

  • త్రిసూర్‌: కేరళలోని త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కి పైగా బైక్‌లు దగ్ధమయ్యాయి. స్టేషన్‌కు అనుకుని ఉన్న పెయిడ్-పార్కింగ్ ప్రదేశంలో ఇవాళ ఉదయం(ఆదివారం జనవరి 4) 6.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కరెంట్‌ తీగ బైక్‌లపై తెగిపడడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్ 2 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో జరిగింది.

    నిత్యం పార్కింగ్‌ షెడ్‌లో 500కిపైగా వాహనాలు పార్కింగ్‌ చేస్తారు. వాహనాల్లోని ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో కొన్ని నిమిషాల్లోనే తీవ్ర నష్టం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు అరగంటలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తమ వాహనాలు బూడిదగా మారిన దృశ్యం చూసి యజమానులు షాక్‌కు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు నిర్థారణ కాలేదు.

    ఈ ప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్, ఇతర కారణాల వల్ల జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన రైలు సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలోనే పార్కింగ్ ప్రదేశం ఉన్నప్పటికీ, సమయానికి చర్యలు తీసుకోవడంతో రైల్వే మౌలిక వసతులకు మంటలు వ్యాపించలేదు. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

     

  • వెనిజువెలాలో ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలోని ఇండియా ఎంబసీ అక్కడి భారతీయులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపింది.

    శుక్రవారం వెనిజువెలాపై అమెరికా ఆకస్మిక దాడులు జరిపింది. ఆ దేశంలోని కరాకస్ నగరంపై మిసైళ్లతో విరుచుకపడింది. సైనికస్థావరాలు, జనావాసాలపై పెద్దఎత్తున దాడులు చేసింది. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్‌నూ బందీలుగా పట్టుకొని న్యూయార్క్ తరలించింది. అయితే తాజాగా భారత్ ఈ ఘటనపై స్పందించింది. వెనిజువెలాపై దాడి చేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

    ఈ ఘటనపై భారత్ స్పందిస్తూ... "ప్రస్తుతం వెనిజువెలాలో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ జరుగుతున్న పరిస్తితులను భారత్ నిశితంగా గమనిస్తుంది. ఇరువర్గాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి" ‍అని భారత్ ప్రకటన విడుదల చేసింది. వెనిజువెలాలో  శాంతి, స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు భారత్ పూర్తి మద్ధతు అందిస్తుందని తెలిపింది.

    అదేవిధంగా వెనిజువెలా, కారకస్‌లోని ఇండియా ఎంబసీ అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. ఎవైనా సమస్యలుంటే వెంటనే అక్కడి రాయభార కార్యాలయాన్ని సంప్రదించాలని అక్కడి భారత ప్రజలకు సూచించింది. 

  • బెంగళూరు: బసవేశ్వర నగరలో గతనెల 24న చోటు చేసుకున్న బ్యాంక్‌ మహిళా ఉద్యోగి భువనేశ్వరి హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగు చూసింది. భార్యను పిస్తోలుతో కాల్చేందుకు భర్త బాలమురుగన్‌ బిహార్‌లో 15 రోజుల పాటు  శిక్షణ తీసుకున్నట్లు మాగడిరోడ్డు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. బాలమురుగన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. 

    దంపతుల మధ్య విభేదాలు రావడంతో భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వేరే ఇంట్లో నివాసం ఉంటోంది. భార్యను హత్య చేయాలని భావించిన బాలమురుగన్‌  బిహార్‌కు వెళ్లి అక్కడ ఓ వ్యక్తితో రూ.50 వేలకు పిస్తోల్‌ కొనుగోలు చేసి   15 రోజుల పాటు అక్కడే మకాం పెట్టి గన్‌ ఫైరింగ్‌పై శిక్షణ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. గతంలో తమిళనాడుకు చెందిన వ్యక్తికి భార్య హత్యకు రూ.1.25 లక్షలు సుపారీ ఇచ్చాడు. అయితే సుపారీ కిల్లర్‌ ఆమెను హత్యచేయకుండా వెనక్కి వచ్చేశాడు. దీంతో బాలమురుగన్‌ గతనెల 24 తేదీన నడిరోడ్డులో భార్యపై పిస్తోల్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. 

  • ధెంకనల్: ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని ఒక క్వారీలో విషాదం చోటుచేసుకుంది.  గోపాల్‌పూర్ గ్రామం సమీపంలోని స్టోన్ క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్, మైనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు  భావిస్తున్నారు. ఈ ఘటన మోతంగా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.

    ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్డీఎప్‌) బృందాలు, డాగ్ స్క్వాడ్‌ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాయి. భారీ బండరాళ్ల కింద నలుగురు కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రాళ్లను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

    ధెంకనల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటిల్, ఎస్పీ అభినవ్ సోంకర్‌లు ఘటనాస్థలిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నప్పటికీ, ప్రమాదానికి గల సరైన కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక అధికారి నవఘన మల్లిక్ మాట్లాడుతూ, శిథిలాలను తొలగించి, బాధితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

    ఈ దుర్ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కార్మికుల భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, ఈ ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
     

  • ఈ చిత్రంలో కనిపిస్తున్న చిరుత దేశంలోనే అత్యంత అరుదైన రకానికి చెందినది. సాధారణ చిరుతలు ముదురు నల్లరంగు మచ్చలతో కనిపిస్తే ఈ చిరుత మాత్రం లేత గోధుమ వర్ణం శరీరంతో లేత గులాబీ మచ్చలతో దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఇలా ట్రాప్‌ కెమెరాకు చిక్కింది. 

    హోలేమట్టి నేచర్‌ ఫౌండేషన్‌కు చెందిన వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్‌ గుబ్బి, ఆయన బృందం ట్రాప్‌ కెమెరాల చిత్రాల ఆధారంగా దీన్ని అరుదైన చిరుతపులిగా తేల్చింది. ఇది ఆడ చిరుత అని.. దీని వయసు సుమారు ఆరేళ్లు ఉండొచ్చని అంచనా వేసింది. రాజస్తాన్‌లోని రణక్‌పూర్‌ ప్రాంతంలో 2021లో ఇలాంటి చిరుత కనిపించగా కర్ణాటకలో ఈ తరహా చిరుత కనిపించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఎరిథ్రిజం లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన మార్పుల వల్ల చిరుత శరీర రంగు ఇలా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

     దక్షిణాఫ్రికా, టాంజానియా తదితర ఆఫ్రికా దేశాల్లో అక్కడక్కడా అరుదుగా కనిపించే ఈ రంగు చిరుతలను స్థానికంగా ‘స్ట్రాబెర్రీ చిరుత’అని పిలుస్తున్నారు. అయితే సంజయ్‌ గుబ్బి బృందం మాత్రం దీనికి ‘శాండల్‌వుడ్‌ చిరుత’ అనే పేరును ప్రతిపాదించింది. కర్ణాటక గంధపు చెక్కలకు ప్రసిద్ధి చెందినందున ఈ పేరు ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ఇది ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుందని ఈ పేరు పెట్టింది.    

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ అనూహ్యంగా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన మేనమామ, దివంగత కాంగ్రెస్ దిగ్గజం గనీ ఖాన్ చౌదరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.

    వచ్చే ఏప్రిల్‌తో మౌసమ్ నూర్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఆమె త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిల్లా నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె 2009 నుండి 2019 వరకు మాల్దా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా గతంలో పశ్చిమ బెంగాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు.

    న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మౌసమ్ నూర్ అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్ సమక్షంలో ఆమె పార్టీలోకి తిరిగి ప్రవేశించారు. పార్టీ అగ్రనేతలు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ చేరికతో బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

    కాంగ్రెస్‌లో చేరికపై మౌసమ్ నూర్ స్పందిస్తూ ‘పశ్చిమ బెంగాల్‌కు మార్పు అవసరం, ఆ మార్పు నా నుండే మొదలు కానివ్వండి’ అని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, కాంగ్రెస్ సిద్ధాంతాలైన లౌకికవాదం, అభివృద్ధి, శాంతిపై మాల్దాలోని ప్రజలకు గట్టి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తానని మౌసమ్ నూర్ అన్నారు. 

    ఇది కూడా చదవండి: Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు

International

  • లిమా: ప్రపంచ రాజకీయాలపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశమైంది. బల్గేరియాకు చెందిన వంగాబాబా గతంలో యుద్ధాలు, విపత్తులు, నాయకుల పతనాలను ముందుగానే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహా జోస్యాలతో పెరూ శామన్లు రంగంలోకి వచ్చారు. కొత్త సంవత్సరం ముందు వారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో త్వరలో అధికారాన్ని కోల్పోతారని ప్రకటించగా.. ఐదు రోజుల్లోనే అమెరికా ప్రత్యేక దళాలు ఆయనను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది

    ఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది ప్రపంచ రాజకీయాలు, నాయకుల భవిష్యత్తు, దేశాల మార్పులు వంటి అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించే ప్రత్యేక పద్ధతి. పెరూ దేశంలోని శామన్లు (ఆధ్యాత్మిక జ్యోతిష్కులు) ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు ఇలాంటి జోస్యాలు చెబుతారు. ఆశ్చర్యకరంగా.. మదురోపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం వెలుగులోకి వచ్చిన ఐదు రోజులకే అమెరికా వెనెజువెలాలో గోప్యంగా ఆపరేషన్ నిర్వహించింది.

    ఈ చర్యలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెద్ద చర్చాంశమైంది. సుదీర్ఘకాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు మదురోకు మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఆయన పాలనపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభం వంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రత్యేక దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి.

    పెరూ శామన్ల జోస్యం చెప్పిన కొద్ది రోజుల్లోనే మదురోను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకోవడం వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. లాటిన్ అమెరికా దేశాలు ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మదురో పతనాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తుండగా, మరికొందరు అమెరికా జోక్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    ఇలాంటి ఆధ్యాత్మిక జోస్యాలు గతంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బల్గేరియాకు చెందిన వంగాబాబా ‘బాల్కన్ నోస్ట్రడామస్’గా ప్రసిద్ధి పొందారు. ఆమె చేసిన అనేక జోస్యాలు.. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు నిజమయ్యాయని అనేక మంది విశ్వసిస్తారు. వంగాబాబా జోస్యాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్లే, ఇప్పుడు పెరూ శామన్ల జోస్యాలు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నాయి.

  • నిన్న-మొన్నటి వరకూ ఇరాక్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయిల్‌.. ఇప్పుడు లెబనాన్‌పై యద్ధం చేయడానికి సిద్ధమవుతుందా?,  ఇజ్రాయిల్‌  సైనిక దళాలు తమ సరిహద్దు గోడను దాటి లెబనాన్‌లోకి వెళ్లడానికి కారణం ఏమిటి?, ఇజ్రాయిల్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

    ఒక దేశం సైనిక దళాలు.. వేరొక దేశంలోకి ప్రవేశించాయంటే కారణం లేకుండా వెళ్లవు. ఇప్పుడు ఇజ్రాయిల్‌ కూడా తమ సరిహద్దు గోడను దాటి కేవలం 150 మీటర్ల దూరంలోకి వెళ్లాయి. దక్షిణ లెబనాన్‌లోని జెజైన్‌ జిల్లాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ఇజ్రాయిల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ దాడులకు కూడా పాల్పడిందని స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు స్పష్టం చేయింది. 

    దీనిపై లెబనాన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్‌ దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయిల్‌ వైమానిక దళాలు స్పందించాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి. 

    నెతన్యాహూ తిరిగొచ్చిన తర్వాతే ఈ దాడులు
    ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మిలటరీకి ప్రత్యేక ఆదేశాల జారీ చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ ఎటువంటి సైనిక చర్యలు ఉండొద్దని పేర్కొన్నారు. అయితే ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. ఆ దేశ సైనిక దళాలు.. లెబనాన్‌న టార్గెట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

  • నైజీరియాలో ఘోరం జరిగింది. అక్కడి ఓ గ్రామంపై క్రిమినల్ గ్యాంగులు విరుచుకపడ్డాయి. గ్రామస్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారి ఇళ్లను దగ్ధం చేశాయి. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మంది పౌరులు మృతిచెందారు. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు.  

    నైజీరియా దేశంలోని నార్త్‌ నైజిర్ రాష్ట్రంలో  కసువాన్‌జీ గ్రామంలోని ప్రజలపై  శనివారం సాయంత్రం దోపిడి దొంగలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారి ఇళ్లను తగలబెట్టారు. అక్కడి దుకాణాలను లూటీ చేసి, పిల్లలను ఆడవారిని అపహరించారు. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించగా వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

    అపహరించిన వారికోసం గాలింపులు చేపడుతున్నామని దాడులు జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బలగాలను మెహరించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే దాడులు జరుగుతున్న సమాచారం పోలీసులకు తెలిపామని అయినప్పటికీ సరైన సమయానికి వారు అక్కడికి  చేరుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    కాగా నైజిరియాలో చాలాకాలంగా గ్యాంగ్‌ దాడుల కాల్పులు, పిల్లలు, ఆడవారి అపహరణ చాలా కామన్‌గా మారింది. ఉత్తర నైజిరియాలో పేదరికం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి యువత క్రిమినల్ గ్యాంగులలో చేరుతూ దోపిడీ అపహరణలు జీవన ఆధారంగా మలుచుకుంటున్నారు.  పిల్లలను, ఆడవారికి అపహరించి రాన్సమ్ ( విడుదలకు చెల్లించే డబ్బు) డిమాండ్ చేస్తున్నారు.

  • ప్రపంచవ్యాప్తంగా వెనెజువెలాకు అందాల భామల దేశంగా పేరుంది. ఇందుకు కారణం. ఆ దేశం ఇప్పటివరకూ 7 మిస్‌ యూనివర్శ్‌ టైటిల్స్‌.  6 మిస్‌ వరల్డ్‌ టైటిల్స్‌ గెలుచుకుంది. ఇదే కాదు.. వెనెజువెలా ప్రకృతి సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం, లాస్‌ రోక్యూస్‌ దీవులు, ఒరినుకో డెల్టి వంటి సహజ అద్భుతాలు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.

    ఇకపై వెనెజువెలాను మేమే పాలిస్తాం
    వెనెజువెలాలో పాలకుల నియంతృత్వం పోకడలు ఒకటైతే, ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం ఏంటి? ఒక దేశాధ్యక్షుడిని నిర్భందించి మరొక దేశంలో ఉంచొచ్చా? అనేది ప్రస్తుత ప్రశ్న. ఇది ట్రంప్‌ విపరీత ధోరణికి కూడా అద్దం పడుతోంది. 

    ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం అరెస్ట్‌ చేయొచ్చా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐక్యరాజ్యసమిత భద్రతా మండలి అనుమతి కావాలి. అందుకు సహేతుకమైన కారణాలు ఉండాలి. అయితే ఐక్యరాజ్యసమితికి ట్రంప్‌ నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ దేశంపై యుద్ధం చేయడం, ఆ దేశాధ్యాక్షుడిని భార్య సమేతంగా అరెస్ట్‌ చేయడం జరిగిపోయింది. అమెరికా కాంగ్రెస్‌కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్‌. అంటే ఇక్కడ నియంతృత్వ పోకడ తనలో కూడా  ఉందని ట్రంప్‌ నిరూపించుకున్నట్లే అయ్యింది. 

    ఒక దేశాన్ని మరొక దేశం పాలించొచ్చా?
    1945 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నియమావళిపై అమెరికానే తొలి సంతకం చేసింది. ఆ నియమావళిలో ముఖ్యంగా పేర్కొంది ఏమిటంటే.. ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు.  రెండోది ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. మరి వీటిని ట్రంప్‌ తుంగలో తొక్కారు. ‘ఐక్యరాజ్యసమితి లేదు.. ఏమీ లేదు.. అంతా మేమే’ అనే అగ్రరాజ్య పోకడను ప్రదర్శించారు. ఒక దేశంపై మరొకదేశం బల ప్రయోగం చేయడం నేరం. సహేతుకమైన కారణాలు ఏవీ కూడా యూఎన్‌ఓకు సమర్పించకుండా ఇలా చేయడం ఇంకా పెద్ద నేరం. 

    పైనిక చర్యలకు ప్రత్యేక పరిస్థితి..
    ఒక దేశం.. మరొక దేశంపై సైనిక చర్యగా దిగాలంటే.. అది వారిని వారు కాపాడుకునే క్రమంలోనే చేయాలి. అంటే ఒక దేశం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు. ఇక్కడ అదే రూల్‌ను ట్రంప్‌ అప్లై చేసినట్లు కనబడుతోంది. వెనెజువెలాను నార్కో-టెర్రరిస్టుగా అభివర్ణిస్తున్న ట్రంప్‌..  ఇప్పుడు ఆ బూచిని వారిపైకి తోసి అందుకే యుద్ధం చేశామని తన వైఖరిని  ఐక్యరాజ్యసమితి ముందు సమర్ధించుకోవచ్చు. అయితే  ఈ విషయం కూడా యూఎన్‌ఓకు ముందుగానే చెప్పాలి. మరి ఇలా చేయలేదు కాబట్టి.. అమెరికాపై యూఎన్‌ఓ  ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

    వేరే దేశాలు చేస్తే.. శాంతి మంత్రం
    వేరే దేశాలు ఏమైనా వారి వారి అంతర్గత సమస్యలతో యుద్ధం వరకూ వెళ్తే అక్కడ ట్రంప్‌ ఎంటర్‌ అయ్యిపోతారు. ఇప్పటివరకూ అదే జరుగుతూ వస్తుంది. భారత్‌-పాక్‌ యుద్ధం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇరాన్‌- ఇజ్రాయిల్‌ యుద్ధం  ఇలా ఏమి జరిగినా తాను ఉన్నానంటూ ఒక శాంతి కటింగ్‌ ఇస్తారు ట్రంప్‌. మరి ఇప్పుడు ఆ శాంతి మంత్రం పక్కకు వెళ్లిపోయిందా.. అనేది మరొక ప్రశ్న. 

    అమెరికాకు అనుకూలంగా ఉన్నవారికే..
    ఇప్పుడు తమ అనుకూలరితో వెనెజువెలాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ట్రంప్‌. అందుకు మచాడోను ఎన్నుకోవచ్చు. ఎప్పట్నుంచో ట్రంప్‌కు మచాడో అనుకూలంగా మాట్లాడటం, నోబెల్‌ పురస్కారం గెలుచుకున్న సమయంలో కూడా ట్రంప్‌కు ఆ బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించడం వంటి వ్యాఖ్యలు అమెరికాపై భక్తిని చాటుకున్నాయి.  ముందుగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వారితో ఏర్పాటు చేసి తాము చెప్పినట్లు ఉండేలా చేయడమే ట్రంప్‌ లక్ష్యంగా కనబడుతోంది. 

    ట్రంప్‌ చేతిలో మరింత నలిగిపోయే ప్రమాదం..!
    మరి ఇప్పుడు ఆ దేశం పరిస్థితి అధ్వానంగా మారింది.  పాలకుల కారణంగా గత కొన్నేళ్లుగా వెనెజువెలా పయనం తిరోగమనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు మధురోను అమెరికా న్యూయార్క్‌ జైల్లో పెట్టినా అతనికి మద్దతు రాకపోగా, అక్కడ శాంతి వచ్చిందంటూ  ఆ దేశానికే చెందని నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మచాడో వ్యాఖ్యానించడం ఆ దేశ పాలకుల చర్యలకు అద్దం పడుతోంది. 

    ఇప్పుడు ట్రంప్‌ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడితే వెనెజువెలా శాంతి వస్తుందా?, శాంతి బహుమతి గెలిచిన మచాడో దేశాధ్యక్షురాలిగా ఎన్నికతై గాడిలో పెట్టగలరా?, ఆ దేశ చమురు నిల్వలను వెనెజువెలాకే పరిమితమవుతాయా? లేక అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతాయా? అన్నది కాలమే చెబుతుంది. 

  • ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తరకొరియా జపాన్‌ భూభాగంలో బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. దీంతో ఒక్కసారిగా జపాన్ అప్రమత్తమైంది. అత్యవసరంగా సమవేశమై హెచ్చరికలు జారీ చేసింది. 

    జపాన్ మీడియా కథనాల ప్రకారం.. జపాన్ సముద్ర తీరం నుండి 200 మైళ్ల దూరం వరకూ ఆ దేశానికి చెందిన జలాలుగానే పరిగణిస్తారు. తాజాగా ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    ఆ క్షిపణులు దాదాపు 950 కిలోమీటర్ల పాటు ప్రయాణించాయని తెలిపాయి. అమెరికా, జపాన్ దేశాలకు సంబంధించిన కీలకమైన రక్షణ స్థావరాలతో పాటు దక్షిణ జపాన్‌లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని ఆయన తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ హెచ్చరిక జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

    ‍అయితే నార్త్ కొరియా ఇదివరకే జపాన్ మీదుగా తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ విషయంలో ఇది వరకే జపాన్ ఎన్నో సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు జపాన్‌లో ఉన్నాయి. యుఎస్,నార్త్‌కొరియాకు అస్సలు పొసగదు. దీంతో జపాన్‌తో కూడా ఆ దేశం దూరంగా ఉంటుంది.

    అయితే వెనిజులాపై అమెరికా దాడిని నార్త్‌ కొరియా తీవ్రంగా ఖండించింది. ఈదాడి అమెరికా క్రూర స్వభావాన్ని మరోసారి తేటతెల్లం చేసిందని అక్కడి ప్రభుత్వవర్గాలు వ్యాఖ్యానించాయి.

  • కరాకస్‌: అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్‌ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం

    నికొలస్‌ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్‌ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.

    మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్‌ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్‌ సారథ్యంలోని యునైటెడ్‌ సోషలిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు.

    సత్యసాయి బాబా భక్తుడు
    మదురోకు భారత్‌తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. సత్యసాయి బాబా బోధనలు, ఆధ్యాత్మికత ఆయనపై ప్రభావం చూపాయి. మదురో తరచుగా బాబా ఆశ్రమాన్ని సందర్శించేవారని, ఆయన బోధనలను తన జీవితంలో అనుసరించేవారని చెబుతారు.

  • థాయిలాండ్‌లో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఓ భారత పర్యాటకున్ని అక్కడి ట్రాన్స్‌జెండర్లు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    థాయిలాండ్‌లోని పట్టాయాలో  52 ఏళ్ల రాజ్ జసూజా అనే భారత పర్యాటకుడిపై అక్కడి ట్రాన్స్‌ జెండర్లు తీవ్రంగా దాడిచేశారు. డిసెంబర్‌ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్ జసూజా అక్కడి ట్రాన్స్ జెండర్ల సర్వీసుకు వారు అడిగిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నించాడు.

    దీంతో ఆగ్రహం చెందిన సెక్స్ వర్కర్స్ కారు లోంచి అతనిని లాగి పడేశారు.  అనంతరం అతని తలపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దాడిని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో  వారు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు.

    అయితే థాయిలాండ్‌లోని పట్టాయాలో ఇటువంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఇండియన్ టూరిస్ట్‌పై అక్కడి సెక్స్ వర్కర్ దాడి చేశాడు. అక్టోబర్‌లో ముగ్గురు ట్రాన్స్‌ మహిళలు హోటల్‌లో ఉన్న ఇద్దరు భారతీయులపై దాడి చేసి వారి వద్ద నుంచి డబ్బు దోచుకెళ్లారు.

  • వాషింగ్టన్‌: ‘.. ప్లేసు నువ్వు చెప్పినా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే… దమ్ముంటే నన్ను పట్టుకో’అంటూ సినిమా స్టైల్లో సవాలు విసిరిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. తమ నివాసంలో నిద్రిస్తున్న మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి మరి మదరు ఛాలెంజ్‌ను గుర్తు చేసింది.  

    వెనెజువెలా అప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతి, కరువు, చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం వెనెజువెలా ప్రజలకు మరింత భారంగా మారింది.

    రివార్డు ప్రకటన, సవాలు
    ఆ తర్వాత మదురోను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందిస్తే భారత కరెన్సీలో రూ.400 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో మదురో మరింత రెచ్చిపోయారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు బహిరంగంగా సవాలు విసిరారు. ‘పిరికోడా.. నేనిక్కడే మిరాఫ్లోర్స్ (వెనెజువెలా) అధ్యక్ష భవనంలో ఉంటా. ఆలస్యం చేయొద్దు, వచ్చి పట్టుకోండి’అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

     

    ఆపరేషన్ అబ్సల్యూట్‌ రిసాల్వ్
    మదురోను పట్టుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ అబ్సల్యూట్‌ రిసాల్వ్’ పేరుతో సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారు జామున (స్థానిక సమయం) వెనెజువెలా రాజధాని కరాకస్‌ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్‌డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్‌లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్‌ ఫోర్సెస్‌ పెద్ద ఎత్తున విమానాలు,ఫైటర్‌ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో టియునా మిలిటరీ కాంపౌండ్‌ ప్యాలెస్‌లో పడక గదిలో నిద్రిస్తుండగా మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి.  

     చివరికి అమెరికా సైన్యం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను ట్రంప్ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. మదురో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి..‘సవాలు చేసిన వారిని మేం పట్టుకున్నాం’ అంటూ జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి.

    భార్యపై కేసులు
    వారిపై నార్కో-టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్‌లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతం మదురో దంపతులు బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.  వారిని విచారిస్తున్నారు. మదురో చేసిన హాస్య వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.‘నన్ను పట్టుకోగలిగితే పట్టుకో’ అన్న సవాలు చివరికి ఆయనను అమెరికా జైలులోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

     

     

     

Sports

  • టీమిండియా అప్‌ కమింగ్‌ స్టార్‌, మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓ అద్భుతమైన రికార్డు సాధించాడు. దేశవాలీ వన్టే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. రుతు కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు కర్ణాటక ఆటగాడు మనీశ్‌ పాండే పేరిట ఉండేది. మనీశ్‌కు ఈ మైలురాయిని తాకేందుకు 99 ఇన్నింగ్స్‌లు పట్టింది.

    వీహెచ్‌టీ చరిత్రలో మనీశ్‌ తర్వాత 100 సిక్సర్ల మార్కును తాకిన రెండో ఆటగాడు కూడా రుతురాజే. రుతురాజ్‌ సాధించిన ఈ సిక్సర్ల రికార్డు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత వీహెచ్‌టీ ఎడిషన్‌లో రుతు 100 సిక్సర్ల రికార్డును సాధించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రుతు.. ఓ సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేశాడు.

    ఓవరాల్‌గా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉన్న రుతు.. తాజాగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున అద్భుత శతకం బాదాడు. అయినా అతనికి త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌లో అవకాశం రాలేదు. చాలాకాలం క్రితమే రుతు భారత టీ20 ఫార్మాట్‌ నుంచి ఔటయ్యాడు.

    ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాలో విపరీతమైన పోటీ ఉన్న కారణంగా రుతు అద్భుతంగా రాణిస్తున్నా అవకాశాలు రావడం లేదు. త్వరలో రుతు ఐపీఎల్‌-2026లో సీఎస్‌కేకు నాయకత్వం వహించనున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు రుతు సీఎస్‌కే కెప్టెన్సీ కూడా ఊడుతుందని ప్రచారం జరిగింది. అయితే మేనేజ్‌మెంట్‌ ఇతనిపై భరోసా ఉంచింది. 

  • మహిళల ఐపీఎల్‌ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్‌ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

    33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్‌ ఈ సీజన్‌ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌ నియామకంతో గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్‌లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్‌ వేలంలో వారియర్జ్‌ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.

    లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్‌ ఓ వన్డే ప్రపంచకప్‌, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్‌ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.

    లాన్నింగ్‌ సారథ్యంలో వారియర్జ్‌ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్‌ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్‌ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. 

    కాగా, డబ్ల్యూపీఎల్‌ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఓపెనర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్‌ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్‌ జెయింట్స్‌తో) ఆడనుంది. 

  • రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌..  గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. 

    లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌.. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్‌ నుంచే విరాట్‌ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్‌ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.

    28000 అంతర్జాతీయ పరుగులు
    అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.

    15000 వన్డే పరుగులు
    308 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్‌.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లో విరాట్‌ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్‌ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.

    అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు
    విరాట్‌ మరో 42 పరుగులు చేస్తే సచిన్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.

    అత్యధిక వన్డే పరుగులు
    న్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్‌ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్‌ న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.

    ఐపీఎల్‌లో 9000 పరుగులు
    ఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్‌ కూడా ఆడనున్న విరాట్‌.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్‌ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్‌లు) ఉన్నాయి. 

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్‌-2026 తమ గ్రూప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ యూత్  మరియు స్పోర్ట్స్ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్‌ నుంచి వారి స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను (కేకేఆర్‌) తొలగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

    ముస్తాఫిజుర్‌ ఉదంతంపై బీసీబీ ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకుంది. ఇందులోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించారు. ఈ విషయమై ఐసీసీకి లేఖ రాయాలని తీర్మానం చేశారు. భారత్‌లో తమ ఆటగాళ్లు రక్షణ లేదని, అందుకే తమ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరుతామని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ తెలిపారు. ఆటగాళ్ల భద్రత, గౌరవం తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు.

    కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్‌ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది.

    కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు గ్రూప్‌-సిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌, ఇటలీ, ఇంగ్లండ్‌, నేపాల్‌ మిగిలిన జట్లుగా ఉన్నాయి. భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాల్లో బంగ్లాదేశ్‌ తమ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

    గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ ఆడబోయే మ్యాచ్‌లు  
    - ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై)  

    ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును కూడా ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస​్‌, వైస్‌ కెప్టెన్‌గా మొహమ్మద్‌ సైఫ్‌ హస్సన్‌ ఎంపికయ్యారు.ఇటీవల జరిగిన ఐర్లాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ రీఎంట్రీ ఇచ్చాడు.

    వికెట్‌ కీపింగ్‌, బ్యాటర్‌ జాకిర్‌ అలీ, బ్యాటర్‌ మహిదుల్‌ ఇస్లాం అంకోన్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నా, స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటోపై వేటు పడింది.  

    టీ20 ప్రపంచకప్‌ 2026కు బంగ్లాదేశ్‌ జట్టు..

    - లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్)  
    - మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్)  
    - తంజీద్ హసన్  
    - మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్  
    - తౌహిద్ హ్రిదోయ్  
    - షమీమ్ హసన్  
    - ఖాజీ నూరుల్ హసన్ సోహాన్  
    - మహెది హసన్  
    - రిషాద్ హసన్  
    - నసుమ్ అహ్మద్  
    - ముస్తాఫిజుర్ రహ్మాన్  
    - తంజీమ్ హసన్ సకిబ్  
    - టాస్కిన్ అహ్మద్  
    - మొహమ్మద్ షైఫుద్దిన్  
    - షొరీఫుల్ ఇస్లాం  

     

  • ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ ప్రొవిజనల్‌ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీ​ని (వైస్‌ కెప్టెన్‌) ప్రకటించలేదు.

    ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఎట్టకేలకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్‌కు బ్యాకప్‌గా మరో పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ ఎంపికయ్యాడు. షాహీన్‌ తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.

    స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్‌ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. మెయిన్‌ స్క్వాడ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు.  

    టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు
    - సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్)  
    - బాబర్ ఆజమ్  
    - షాహీన్ అఫ్రిది (ఫిట్‌నెస్ అనిశ్చితి)  
    - ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్)  
    - షాదాబ్ ఖాన్  
    - మొహమ్మద్ నవాజ్  
    - ఫహీమ్ అష్రఫ్  
    - హారిస్ రౌఫ్ (షాహీన్‌కు ప్రత్యామ్నాయం)  
    - ఫకర​్‌ జమాన్‌
    - మొహమ్మద్‌ వసీం జూనియర్‌
    - నసీం షా
    - అబ్దుల్‌ సమద్‌
    - సాహిబ్‌జాదా ఫర్హాన్‌
    - సైమ్‌ అయూబ్‌
    - సల్మాన్‌ మీర్జా
    - అబ్రార్‌ అహ్మద్‌

    కాగా, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ గ్రూప్‌-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్‌లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది.

     

  • సాధారణంగా ఏ దేశ క్రికెట్‌లో అయినా దేశవాలీ ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లకు జాతీయ జట్టు అవకాశాలు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దేశవాలీ టోర్నీల్లో శతక్కొట్టుడు కొట్టి, పరుగుల వరద పారించినా జాతీయ జట్టు అవకాశాలు రావు. బ్యాటింగ్‌ ఆధిపత్యం నడుస్తున్న జమానాలో చచ్చీ చెడి వికెట్లు తీసినా పట్టించుకునే నాథుడే లేడు.

    తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం​ ఎంపిక చేసిన భారత జట్టును చూస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. ప్రస్తుతం దేశంలో దేశవాలీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ జరుగుతుంది. ఈ టోర్నీలో కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ 5 మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు. అయినా అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు.

    మరో యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో ఇతగాడు ఇరగదీస్తాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ చేశాడు. అయినా ఇతనికి కూడా టీమిండియాలో చోటు దక్కలేదు. 

    రుతురాజ్‌ విషయంలో మరింత విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో అద్భుతమైన సెంచరీ చేసినా మొండిచెయ్యే ఎదురైంది.

    అద్భుత ప్రదర్శనలు చేస్తున్న మరో ఆటగాడు ధృవ్‌ జురెల్‌. ఇతగాడు కూడా విజయ్‌ హజారే ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. మరో యంగ్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పరిస్థితి కూడా ఇదే. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో సుడిగాలి శతకం బాదాడు. 

    వీహెచ్‌టీలో సత్తా చాటుతున్న దేశీయ టాలెంట్‌ గురించి అయితే చెప్పక్కర్లేదు. అనామక బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నారు. కాస్తోకూస్తో అనుభవం ఉండి, గుర్తింపు ఉన్న ఆటగాళ్లకే అవకాశాలు లేనప్పుడు వీరు టీమిండియా బెర్త్‌లు ఆశించడం అత్యాశే అవుతుంది.

    బౌలింగ్‌ విషయానికొస్తే.. బ్యాటర్లు రాజ్యమేలే జమానాలో చచ్చీ చెడీ వికెట్లు తీస్తున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి సెలెక్టర్లు మరోసారి మొండిచెయ్యి చూపారు. షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నా, సెలెక్టర్లు అతన్ని కరుణించడం లేదు. షమీ విషయంలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందన్నది జగమెరిగిన సత్యం.

    దేశవాలీ టోర్నీల్లో అద్భుతమంగా రాణిస్తూ టీమిండియా బెర్త్‌లు దక్కించుకోలేకపోతున్న షమీ లాంటి బౌలర్లు చాలామంది ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ స్పిన్నర్‌ జీషన్‌ అన్సారీ, మహారాష్ట్ర పేసర్‌ రామకృష్ణ ఘోష్‌, ఆంధ్రప్రదేశ్‌ మీడియం పేసర్‌ సత్యనారాయణ రాజు లాంటి వారు ప్రస్తుతం జరుగుతున్న వీహెచ్‌టీలో చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నా, టీమిండియా బెర్త్‌ దక్కలేదు.

    ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమవ్వవచ్చు. ఉన్నది 11 బెర్త్‌లు, ఎంతమందికి అవకాశాలు ఇస్తారని చాలామంది అడగవచ్చు. ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం ఉండదు. అయితే ఇలా జరుగుతూపోతే మాత్రం దేశీయ క్రికెట్‌లో సత్తా చాటాలన్న తపన ఆటగాళ్లలో చచ్చిపోయే ప్రమాదం ఉంది. 

    ఏదైనా ప్రత్యామ్నాయం చూపకపోతే దేశీయ క్రికెట్‌కు విలువే లేదు. ఇప్పటికే దేశీయ క్రికెట్‌ నామమాత్రంగా మారిందని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎవరి దృష్టిలోనో పడి, ఐపీఎల్‌ అవకాశాలు వస్తే.. వచ్చి అక్కడ కూడా రాణిస్తేనే టీమిండియా అవకాశాలు వస్తాయన్నది జగమెరిగిన సత్యం.

    ఇలా ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా బెర్త్‌ దక్కించుకోవడమన్నది అందరికీ సాధ్యపడదు. ఏదో హర్షిత్‌ రాణా లాంటి వారిని మాత్రమే ఇలాంటి అదృష్టాలు వరిస్తాయి. హర్షిత్‌ రాణా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని చర్చించక తప్పదు. 

    ప్రస్తుతం వీహెచ్‌టీలో రాణిస్తున్న పేస్‌ బౌలర్లు హర్షిత్‌కు ఏ విషయంలో తీసిపోతారు. వారికంటే హర్షిత్‌కు ఉన్న అదనపు అర్హతలు ఏంటి..? దీనికి సమాధానం భారత సెలెక్టర్ల వద్ద కానీ, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వద్ద కానీ ఉండదు. మొత్తంగా దేశీయ క్రికెట్‌కు విలువే లేకుండా పోయిందన్నది సగటు భారత క్రికెట్‌ అభిమాని అభిప్రాయం. 

  • క్రికెట్‌ చరిత్రలో మనకు తెలీని చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందులో ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. అది 1997. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన కుడి చేతి వాటం మీడియం పేసర్‌ ఆంధొని స్టువర్ట్‌ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రోజు.

    ఈ బౌలర్‌ అంతర్జాతీయ కెరీర్‌ నిడివి కేవలం​ 12 రోజులు మాత్రమే. అయితేనేం, చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధొని తన స్వల్ప కెరీర్‌లో ఆడిన 3 వన్డేల్లోనే చారిత్రక ప్రదర్శనలు చేశాడు. అందులో ఒ‍కటి తన మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేయడం​.

    మెల్‌బోర్న్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆంథొని హ్యాట్రిక్‌ (ఇజాజ్ అహ్మద్, మొహమ్మద్ వసీమ్, మొయిన్ ఖాన్) సహా 5 వికెట్ల ప్రదర్శన (5/26) నమోదు చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు (ఇంజమామ్-ఉల్-హక్, షాహిద్ ఆఫ్రిది) కూడా పట్టుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. తద్వారా నాటికి ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

    ఇక్కడ విశేషమేమింటంటే.. హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న మ్యాచే ఆంథొనికి కెరీర్‌లో చివరిది. సంచలన ప్రదర్శన నమోదు చేసిన తర్వాత అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. తొలుత గాయం, ఆతర్వాత పేలవ ఫామ్‌ కారణంగా ఒక్క అవకాశం కూడా రాలేదు.

    ఏడాది కాలంలోనే జాతీయ జట్టు సహా దేశవాలీ జట్టు నుంచి కూడా కనుమరుగైపోయాడు. అవకాశాల కోసం ఎదురుచూసీ, చూసీ చివరికి 2000 సంవత్సరంలో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆటగాడిగా కెరీర్‌ ముగిసాక ఆంధొని న్యూజిలాండ్‌లో కోచింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. 

    ఆతర్వాత స్వదేశంలోనూ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 56వ పడిలో ఉన్న ఆంథొని తన దేశవాలీ జట్టు న్యూ సౌత్‌వేల్స్‌కే కోచింగ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. 12 రోజుల్లోనే అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా, హ్యాట్రిక్‌ కారణంగా ఆంథొని చరిత్రలో నిలిచిపోయాడు. 

    సంచలన ప్రదర్శన తర్వాత అతనికి మరో అవకాశం రాకపోవడం మరో విశేషం. చరిత్రలో ఇలాంటి ఎన్నో విశేషాలు ప్రస్తుత తరం క్రికెట్‌ అభిమానులకు తెలీవు.  

     

     

  • ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస​్‌ వ్యవహరించనున్నాడు. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) మొహమ్మద్‌ సైఫ్‌ హస్సన్‌ ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఐర్లాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ రీఎంట్రీ ఇచ్చాడు.

    వికెట్‌ కీపింగ్‌, బ్యాటర్‌ జాకిర్‌ అలీ, బ్యాటర్‌ మహిదుల్‌ ఇస్లాం అంకోన్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఫామ్‌లో ఉన్నా, స్టార్‌ బ్యాటర్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటోపై వేటు పడింది.  

    టీ20 ప్రపంచకప్‌ 2026కు బంగ్లాదేశ్‌ జట్టు..

    - లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్)  
    - మొహమ్మద్ సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్)  
    - తంజీద్ హసన్  
    - మొహమ్మద్ పర్వేజ్ హొసైన్ ఎమోన్  
    - తౌహిద్ హ్రిదోయ్  
    - షమీమ్ హసన్  
    - ఖాజీ నూరుల్ హసన్ సోహాన్  
    - మహెది హసన్  
    - రిషాద్ హసన్  
    - నసుమ్ అహ్మద్  
    - ముస్తాఫిజుర్ రహ్మాన్  
    - తంజీమ్ హసన్ సకిబ్  
    - తస్కిన్ అహ్మద్  
    - మొహమ్మద్ షైఫుద్దిన్  
    - షొరీఫుల్ ఇస్లాం  

    కాగా, ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు గ్రూప్‌-సిలో పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌, ఇటలీ, ఇంగ్లండ్‌, నేపాల్‌ మిగిలిన జట్లుగా ఉన్నాయి. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌ ఫిబ్రవరి 7 నుంచి తమ జర్నీ ప్రారంభిస్తుంది.

    గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌ ఆడబోయే మ్యాచ్‌లు  
    - ఫిబ్రవరి 7: వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 9: ఇటలీ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)  
    - ఫిబ్రవరి 17: నేపాల్ vs బంగ్లాదేశ్ (ముంబై)  

    ముస్తాఫిజుర్‌ తొలగింపు
    బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. వేలంలో కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    ఐపీఎల్‌పై బ్యాన్‌
    ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని బంగ్లా క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించాడు. టీ20 వరల్డ్‌కప్‌-2026లో తమ లీగ్‌ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని  కోరనున్నట్లు తెలుస్తోంది.

     

  • యాషెస్ సిరీస్ 2025-26లో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఘనంగా ఆరంభించింది. సిడ్నీ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టు పైచేయి సాధించింది. అయితే వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 45 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యపడింది.

    తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్‌(72), హ్యారీ బ్రూక్‌(78) ఉన్నారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. 57 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 
    ఈ సమయంలో రూట్‌, బ్రూక్ అద్భుతమైన పోరాటం కనబరిచారు. మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 

    వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 154 పరుగుల భాగస్వా‍మ్యాన్ని నెలకొల్పారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌, మైఖల్‌ నీసర్‌, స్కాట్‌ బోలాండ్‌ తలా వికెట్‌ సాధించారు. కాగా ఇప్పటికే యాషెస్ సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చ‌విచూసిన ఇంగ్లండ్‌.. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకుంది.

    తుది జ‌ట్లు
    ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ కారీ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్

    ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్

  • బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. ఈ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్‌కు మొదటి ఓవర్‌లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

    తొలి రెండు బంతుల్లోనే ఇన్ ఫామ్ మాథ్యూ గిల్క్స్, సామ్ కాన్‌స్టాస్ వికెట్లను సిడ్నీ కోల్పోయింది. ఈ సమయంలో వార్నర్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి వార్నర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ముఖ్యంగా హరికేన్స్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లిస్‌ను వార్నర్ ఉతికారేశాడు.

    ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో వార్నర్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు.  ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో తన 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ(బీబీఎల్ సెంచరీ)కు డేవిడ్ భాయ్ తెరదించాడు. 

    మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్నిహోబర్ట్ హరికేన్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. దీంతో సిడ్నీ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

    కోహ్లి రికార్డు సమం..
    అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 9 సెంచరీలు చేయగా.. వార్నర్ కూడా సరిగ్గా తొమ్మిది సతకాలు నమోదు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌(22) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో పాక్ స్టార్ బాబర్ ఆజం ఉన్నాడు.
    చదవండి: మహ్మద్ షమీ కెరీర్ ముగిసిన‌ట్లేనా..?

  • మ‌హ్మ‌ద్ ష‌మీ.. వ‌న్డే క్రికెట్‌లో తిరుగులేని ఫాస్ట్ బౌల‌ర్. అమ్రోహా అనే చిన్న గ్రామం నుంచి వచ్చి ‍తన పేస్ బౌలింగ్‌తో వరల్డ్ క్రికెట్‌ను శాసించిన ధీరుడు అతడు. వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలవడం నుంచి ఒక వన్డే మ్యాచ్‌లో 7 వికెట్ల తీయడం వరకు ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. 

    ఈ బెంగాల్ స్పీడ్ స్టార్‌ కేవలం 108 వన్డేల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకుని భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా షమీ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. షమీ బౌలింగ్ ప్రదర్శనను మాత్రం సదరు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మర్చిపోడు. 

    కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలోనూ షమీ తన వంతు పాత్ర పోషించాడు. అటువంటి షమీ ఇప్పుడు జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు.

    కెరీర్ ముగిసినట్లేనా?
    మహ్మద్ షమీ గతేడాది మార్చి నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి  అతడిని సెలక్టర్లు మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో సెలక్టర్లపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయనున్నారని జోరుగా ప్రచారం జరిగింది.

    కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అతడికి మరోసారి మొండి చేయి చూపించింది. కివీస్‌ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసేటప్పుడు సెలక్షన్ కమిటీ  షమీ పేరును కనీసం పరిశీలించలేదంట. షమీ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికి.. అంతర్జాతీయ క్రికెట్‌కు కావాల్సిన అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్‌ను అతడు ఇంకా అందుకోలేదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 

    ముఖ్యంగా గాయం తర్వాత అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గిందని, కేవలం కేవలం సీమ్ పొజిషన్‌పైనే ఆధారపడుతున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా వన్డే వరల్డ్‌కప్‌-2027 సమయానికి అర్ష్‌దీప్ సింగ్‌, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లను పూర్తి స్ధాయిలో సిద్దం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. 34 ఏళ్ల షమీని జట్టులోకి తీసుకోకపోవడానికి ఇదొక కారణమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    అగార్కర్‌పై విమర్శలు..
    సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్య బృందం తనకు క్లియరెన్స్ ఇచ్చినా జట్టులోకి తీసుకోకపోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ను షమీ బహిరంగంగానే విమర్శించాడు. డొమాస్టిక్ క్రికెట్ ఆడుతున్నవాడిని అంతర్జాతీయ స్దాయిలో ఆడలేనా అని ప్రశ్నించాడు. అందుకు అగార్కర్ కూడా సమాధానమిచ్చాడు. షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం చెప్పేవాడిని, కేవలం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడిని తీసుకోవడం లేదని షమీ చెప్పుకొచ్చాడు.

    దేశవాళీ క్రికెట్‌లో అదుర్స్‌..
    ష‌మీ ప్ర‌స్తుతం దేశ‌వాళీ క్రికెట్‌లో సీజ‌న్‌లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ త‌ర‌పున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజ‌య్ హ‌జారే ట్రోఫీలోన అత‌డు అద‌ర‌గొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.

    కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్‌, అర్ష్‌దీప్ సింగ్‌
    చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను?
     

  • విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో కేరళ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేరళ 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. కుమార్‌ కుశాగ్ర (137 బంతుల్లో 143 నాటౌట్‌; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకం సాధించాడు. అనుకూల్‌ రాయ్‌ (72 బంతుల్లో 72; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. నిధీశ్‌ 4, బాబా అపరాజిత్‌ 2 వికెట్లు తీశారు.

    రోహన్, సంజూ సెంచరీలు
    అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని కేరళ కేవలం రెండే వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహన్‌ కున్నుమ్మాళ్‌ (78 బంతుల్లో 124; 8 ఫోర్లు, 11 సిక్స్‌లు), సంజూ సామ్సన్‌ (95 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు)ల మెరుపు శతకాలు సాధించారు. సంజూ కాస్త ఆచితూచి ఆడినప్పటికి.. రోహన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

    అహ్మదాబాద్ మైదానంలో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరితో పాటు బాబా అపరాజిత్‌ (41 నాటౌట్‌; 1 ఫోర్‌), విష్ణు వినోద్‌ (40 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఇక సంజూ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌ సన్నాహకాలగా ఈ దేశవాళీ టోర్నీని ఉపయోగించుకుంటున్నాడు. టీ20 జట్టులో శుభ్‌మన్‌ గిల్‌ లేకపోవడంతో శాంసన్‌ ఓపెనర్‌గా మరోసారి బరిలోకి దిగనున్నాడు. శాం‍సన్‌కు ఇది నాలుగో లిస్ట్‌-ఎ సెంచరీ కావడం గమనార్హం.
    చదవండి: IPL 2026: వారు తొలిగిస్తే నేనేం చేయగలను?

  • చెన్నై: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) పురుషుల విభాగంలో నిరుటి రన్నరప్‌ హైదరాబాద్‌ తుఫాన్స్‌ ఆట ఈ సీజన్‌లో ఓటమితో మొదలైంది. టోరీ్నలో తమిళనాడు డ్రాగన్స్‌ శుభారంభం చేసింది. శనివారం హోరాహోరీగా జరిగిన తొలి మ్యాచ్‌లో డ్రాగన్స్‌ షూటౌట్‌లో 4–2తో హైదరాబాద్‌ తుఫాన్స్‌పై గెలుపొందింది. తమిళనాడు గోల్‌కీపర్‌ ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌ షూటౌట్‌లో పాదరసంలా స్పందించాడు. దీంతో హైదరాబాద్‌ స్ట్రయికర్లు కొట్టిన రెండు గోల్స్‌ను సమర్థంగా అడ్డుకొని తమిళనాడును గెలిపించాడు. అతని ప్రదర్శన వల్లే డ్రాగన్స్‌ ఒక బోనస్‌ పాయింట్‌ను కూడా పొందింది. అంతకుముందు నిరీ్ణత సమయం ముగిసే సమయానికి 3–3తో స్కోరు సమమైంది.

     హైదరాబాద్‌ స్ట్రయికర్‌ అమన్‌దీప్‌ లక్రా (12, 18వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో రాణించినా... చివరకు ఫలితం నిరాశపరిచింది. ఆట మొదలైన నాలుగు నిమిషాలకే తమిళనాడు బోణీ కొట్టింది. ఉత్తమ్‌ సింగ్‌ (4వ ని.) గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత మరో ఐదు నిమిషాలకే థామస్‌ సార్స్‌బై (9వ ని.) గోల్‌ చేయడంతో డ్రాగన్స్‌ ఆధిక్యం కాస్తా 2–0తో రెట్టింపైంది. అయితే కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌ ఈ ఆధిక్యానికి గండి కొట్టింది. అమన్‌దీప్‌ (12వ ని.) గోల్‌ చేయడంతో తుఫాన్స్‌ 1–2తో తొలి క్వార్టర్‌ను ముగించింది. మళ్లీ రెండో క్వార్టర్‌ మొదలైన మూడు నిమిషాలకే అతనే గోల్‌ సాధించి స్కోరును 2–2తో సమం చేశాడు. తర్వాత మూడో క్వార్టర్‌లో తమిళనాడు తరఫున కార్తీ సెల్వం (32వ ని), హైదరాబాద్‌ జట్టులో ఆర్థర్‌ డి స్లూవెర్‌ (37వ ని.) చెరో గోల్‌ చేయడంతో ఈ క్వార్టర్‌లోనూ ఇరుజట్లు 3–3తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆఖరి క్వార్టర్‌లో ఇటు తుఫాన్స్, అటు డ్రాగన్స్‌ గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో 4–2తో పైచేయి సాధించిన డ్రాగన్స్‌ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో సూర్మ హాకీ క్లబ్‌తో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌... రెండో మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో రాంచీ రాయల్స్‌ తలపడతాయి.  

    ఎస్‌జీ పైపర్స్‌ గెలుపు  
    రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో సూర్మ హాకీ క్లబ్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన సూర్మ అమ్మాయిల జట్టు అన్నింటా ఓటమినే మూటగట్టుకుంది. శనివారం జరిగిన తాజా పోరులో సూర్మ హాకీ క్లబ్‌ 1–3తో ఎస్‌జీ పైపర్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి క్వార్టర్‌లోనే సూర్మ క్లబ్‌ ప్లేయర్‌ పెన్ని స్క్విబ్‌ (12వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. సూర్మ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మరుసటి నిమిషంలోనే పైపర్స్‌ లోరా రియెరా (13వ ని.) గోల్‌ స్కోరు 1–1తో సమం చేసింది. ఆ తర్వాత పైపర్స్‌ క్రీడాకారిణిలు జ్యోతి సింగ్‌ (18వ ని.), సునెలిత టొప్పొ (58వ ని.) చెరో ఫీల్డ్‌ గోల్‌ చేసి ఎస్‌జీ పైపర్స్‌ను గెలిపించారు. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌తో రాంచీ రాయల్స్‌ తలపడుతుంది.     

  • బెంగళూరు: ఆంధ్ర జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి పోరాడినా ఓటమి తప్పలేదు. విజయ్‌ హజారే వన్డే టోరీ్నలో గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర  చివరకు 7 పరుగుల స్వల్ప తేడాతో గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. భారత ఆల్‌రౌండర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌  (111 బంతుల్లో 130; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) గుజరాత్‌ను గెలిపించాడు.  

    ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీస్కోరు చేసింది. ఒక దశలో గుజరాత్‌ స్కోరు 29/3 కాగా...అక్షర్‌ జట్టును ఆదుకున్నాడు. అక్షర్, విశాల్‌ జైస్వాల్‌ (60 బంతుల్లో 70; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆరో వికెట్‌కు 142 పరుగులు జత చేశారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టగా, నితీశ్‌కుమార్‌ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఓపెనర్‌ సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (125 బంతుల్లో 102; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో ఆంధ్రను చివరి దాకా రేసులో నిలిపాడు.

     అయితే ఆంధ్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేయగలిగింది. శ్రీకర్‌ భరత్‌ (39; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ధనుశ్‌ (30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించగా...ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఐదు మ్యాచ్‌లాడిన ఆంధ్రకిది నాలుగో పరాజయం! ఇదే వేదికపై మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో హరియాణాతో ఆంధ్ర తలపడుతుంది.  

     

Business

  • భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ఇది కేవలం మనకు గుర్తింపుగా మాత్రమే కాకుండా.. అనేక వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే దీనిని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. కొన్నిసార్లు ఆధార్ సెంటర్లకు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి.. వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

    ఇదివరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్‌తో వాట్సాప్‌లోనే ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్‌తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. మైగవ్ హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.

    వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్
    ➤ముందుగా మీ మొబైల్‌లో మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు +91-9013151515 ను సేవ్ చేయండి
    ➤నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత.. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు "హాయ్" లేదా "నమస్తే" వంటి మెసేజ్‌ పంపండి.
    ➤చాట్‌బాట్ అందించే ఎంపికల నుంచి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి
    ➤మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి.. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయండి.
    ➤వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
    ➤వెరిఫికేషన్‌ పూర్తియన తర్వాత, చాట్‌బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.
    ➤అందులో నుంచి ఆధార్ కార్డును ఎంచుకుంటే.. అది పీడీఎఫ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌లో కనిపిస్తుంది.

    యూజర్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్‌లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.

    ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!

  • ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి సుజుకి.. తన విక్టోరిస్ కారు కోసం 70,000 బుకింగ్స్ అందుకుంది. కాగా అందులో 35వేలు కంటే ఎక్కువ డెలివరీలు పూర్తి చేసింది.

    గత ఏడాది దేశీయ విఫణిలో లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టోరిస్.. అరీనా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. దీని ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    మారుతి సుజుకి విక్టోరిస్ చూడటానికి కొంత.. గ్రాండ్ విటారా మాదిరిగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే రకమైన ఛాసిస్ & ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. కాబట్టి విక్టోరిస్ 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ &1.5L స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలలో అమ్మకానికి ఉంది.

    ఇదీ చదవండి: ఇన్నోవా క్రిస్టాకు కౌంట్‌డౌన్!.. నిలిపివేతా?

    విక్టోరిస్ కారులో.. గ్రాండ్ విటారాలో అందుబాటులో లేని అనేక ఫీచర్స్ ఉన్నాయి. అందులో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్‌తో కూడిన 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు.. హ్యాండ్స్-ఫ్రీ జెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్, 8 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.

    బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.

    బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.

  • డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన విధంగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 70/10/10/10 ఫార్ములా ప్రకారం.. మీరు డబ్బును ఖర్చు చేస్తే.. తప్పకుండా ఆర్ధిక ఇబ్బందుల నుంచి భయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు వివరంగా..

    ఏమిటీ 70/10/10/10 ఫార్ములా
    మీరు సంపాదించే డబ్బు లేదా నెలవారీ సంపాదనను నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. ఎంత డబ్బు దేనికి ఖర్చు చేయాలనే విషయాన్ని ముంచుగానే ఊహించాలి. అప్పుడే.. నెల చివరలో కూడా డబ్బు కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు.

    70 శాతం: మీ నెల జీతంలో 70 శాతం డబ్బును.. ఇంటి అద్దె, నిత్యావసర వస్తువుల కోసం, ప్రయాణ ఖర్చులకు, పిల్లల ఖర్చులు, బీమా వంటి వాటికోసం కేటాయించాలి. అంటే.. ప్రస్తుత జీవన విధానం కోసం ఆ డబ్బును వెచ్చించాలన్నమాట.

    10 శాతం: మీ నెల జీతంలో 10 శాతాన్ని పొదుపు (సేవింగ్స్) చేయడానికి కేటాయించాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించాలన్నమాట. ఎందుకంటే.. భవిష్యత్తు కోసం కూడా తప్పకుండా కొంత డబ్బు పొదుపు చేయాల్సిందే.

    10 శాతం: మీ నెల సంపాదనలో మరో 10 శాతం.. అత్యవసర నిధి మాదిరిగా.. అంటే ఎమర్జెన్సీ సమయంలో ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మిక వైద్యం కోసం.. కొన్ని గృహోపకరణాల కోసం కూడా దీనిని కేటాయించుకోవచ్చన్నమాట.

    10 శాతం: మిగిలిన 10 శాతం.. ఈఎంఐ, లేదా అప్పులు వంటివి చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేలా అప్పు లేదా ఈఎంఐ లేకపోతే.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, విదేశీ విద్య కోసం కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.

    మీ జీతం నెలకు లక్ష రూపాయలు అనుకుంటే.. అందులో రూ. 70వేలు (70 శాతం) ఇంటి అద్దె మొదలైనవాటికి, మిగిలిన 30 శాతాన్ని ఫార్ములా ప్రకారం కేటాయించుకోవాలి. ఈ ఫార్ములా మీరు పాటిస్తే.. ఉన్న డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుంది.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్‌పై భారీ దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బంధించిన సంఘటన (US attack on Venezuela) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి వంటి సేఫ్‌ హెవెన్ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    బంగారం, వెండి ధరలపై ప్రభావం
    భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం, వెండి వైపు మళ్లుతారు. ఈ దాడి కారణంగా అనిశ్చితి పెరిగి, సేఫ్‌ హెవెన్ డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

    ప్రస్తుత ధరలు (జనవరి 4 నాటికి భారత మార్కెట్‌లో) 24 క్యారెట్ బంగారం  10 గ్రాములకు సుమారు రూ.1,35,800 నుంచి రూ.1,37,000 వరకు (MCX ఫ్యూచర్స్ ప్రకారం) ఉంది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.1,24,500. ఇక వెండి కిలోకు సుమారు రూ.2,40,000 నుంచి రూ.2,46,000 వరకు ఉంది.

    మరింత పెరిగే అవకాశం
    నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఉద్రిక్తతలు కొనసాగితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 4,380 నుంచి 4,500 డాలర్లకు చేరవచ్చు. భారత్‌లో 10 గ్రాముల ధర రూ.1,40,000 స్థాయిని తాకే అవకాశం ఉంది.

    వెండి ధరలు మరింత గణనీయంగా పెరిగి, అంతర్జాతీయంగా ఔన్స్‌కు  75-78 డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇది సప్లై చైన్ డిస్టర్బెన్స్ (వెనెజువెలా ప్రాంత షిప్పింగ్ రూట్లు ప్రభావితం) కారణంగా కూడా జరుగవచ్చు. అయితే, ఈ పెరుగుదల తాత్కాలికమే కావచ్చు. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు స్థిరపడవచ్చు లేదా కొద్దిగా పడిపోవచ్చు. 2026లో మొత్తంగా బంగారం ధరలు ఔన్స్‌కు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా క్రిస్టా కారును టయోటా కంపెనీ నిలిపివేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ దీనిని 2027 నాటికి దశలవారీగా తొలగించనున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    టయోటా కంపెనీ 2025లో మొదటిసారిగా.. తన ఇన్నోవా క్రిస్టా కారును దశలవారీగా తొలగించాలని ప్రణాళిక వేసింది, కానీ హైక్రాస్ ప్రవేశపెట్టిన తర్వాత.. కూడా క్రిస్టా ఉత్పత్తిని విస్తరించాలని నిర్ణయించుకుంది. అయితే కఠినమైన ఉద్గార నిబంధనలు కారణంగా.. దీనిని నిలిపివేసేందుకు ఇప్పుడు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    కఠినమైన CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ) నిబంధనల ప్రకారం.. కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే.. చాలాకాలంగా ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా కొనసాగించిన కారు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త క్రిస్టా కారును కొనుగోలు చేయలేమని తెలుస్తోంది.

    ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. ఇది 148 BHP & 343 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ కార్ల విక్రయాలను తగ్గిస్తున్నాయి. ఇది కూడా టయోటా కంపెనీ తన క్రిస్టా కారును నిలిపివేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది.

  • ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికమ్‌ కంపెనీ రిలయన్స్ జియో.. ఎ‍ప్పటికప్పుడు చవక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి నెలా నంబర్ ను రీఛార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏడాది పొడవునా సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

    రూ.3,599 ప్లాన్
    ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్‌ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.

    రూ.3,999 ప్లాన్
    లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ  365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.

    రూ .1,748 ప్లాన్
    కాలింగ్ ఒక్కటే ఉంటే చాలు మొబైల్ డేటా అవసరం లేదు అనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో వ్యాలిడిటీ 336 రోజులు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్‌ ఓన్లీ ప్యాక్‌ కాబట్టీ ఎలాంటి డేటా రాదు. 3,600 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియోఏఐ క్లౌడ్, జియో టీవీలకు యాక్సెస్ పొందుతారు.

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

    ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.

    2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు
    ➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు
    ➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు
    ➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు
    ➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు
    ➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు
    ➤సేల్స్‌ఫోర్స్: 4,000 ఉద్యోగాలు
    ➤జీఎం: 3,420 ఉద్యోగాలు
    ➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు
    ➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు
    ➤వాల్‌మార్ట్: 1,500 ఉద్యోగాలు

    ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.

    ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.

    ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..

    ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.

  • పసిడి, వెండి ప్రియులకు గత వారం బాగా కలిసొచ్చింది. 2025 డిసెంబర్ చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి 4 వరకు గడిచిన ఏడు రోజుల్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి.

    బంగారం ధరలు ఎంత తగ్గాయంటే
    గత డిసెంబర్ 28న రూ.1,42,420 ఉన్న 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములకు) ధర.. ఈ జనవరి 4 నాటికి రూ.1,35,820కు పడిపోయింది. అంటే వారం రోజుల్లో 6,600 తగ్గింది.

    అలాగే 22 క్యారెట్ బంగారం (పది గ్రాములకు) డిసెంబర్ 28న రూ.1,30,550 ఉన్న ధర, జనవరి 4 నాటికి రూ.1,24,500కు వచ్చింది. ఇక్కడ కూడా వారంలో 6,050 తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల మధ్యలో కొన్ని రోజులు ధరలు కొద్దిగా పెరిగినా, మొత్తంగా గత వారం చివరి నుంచి భారీ క్షీణతే కనిపించింది.

    వెండి ధరల్లో క్షీణత
    వెండి ధరలు కూడా ఈ వారంలో గణనీయంగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర డిసెంబర్ 28న  రూ.2,85,000 ఉండగా, జనవరి 4  నాటికి రూ.2,57,000కు తగ్గింది. అంటే కేజీకి రూ.28,000 తగ్గింది. మధ్యలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, మొత్తంమీద వారంలో భారీ పతనమే నమోదైంది.

    ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణాలు
    2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయులకు చేరుకున్న నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో భారీ కరెక్షన్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు ఇవే..

    • రికార్డు ధరల నుంచి ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో భారీ అమ్మకాలు జరిగాయి.

    • అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్ (CME) సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై మార్జిన్ అవసరాలను పెంచడంతో చిన్న ట్రేడర్లు పొజిషన్లు మూసివేయడం లేదా లిక్విడేషన్ జరగడం.

    • డిసెంబర్ చివరి రోజుల్లో మార్కెట్ లిక్విడిటీ తక్కువగా ఉండటంతో ధరలు మరింత అస్థిరంగా మారాయి.

    • ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, ఇన్‌ఫ్లేషన్ కూలింగ్ సిగ్నల్స్ వంటివి కూడా ప్రభావం చూపాయి.

    ఈ తగ్గుదల పసిడి ప్రియులకు, ముఖ్యంగా వివాహాలు, పండుగల సీజన్‌లో కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఊరట కలిగించింది. అయితే మార్కెట్ నిపుణులు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోళ్లు చేసేవారు మార్కెట్‌ను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Family

  • యుద్ధం ఆమెకు విషాదాన్ని మిగిల్చినా..ఆమె సేవతో మనసులను రంజింప చేసింది.అపరిచితుల దయ మధ్య పెరిగి పెద్దదై జీవితాన్ని సార్థకం చేసుకునేలా బతికి చూపించింది. ఓ అనాథ తిరగరాసిన ఈ కథ..యువతకు స్ఫూర్తి, విలువలను నేర్పించే ఓ గొప్ప పాఠం. ఆమె స్ఫూర్తిదాయకమైన కథేంటంటే..

    1945లో రెండొవ చైనా-జపనీస్ యుద్ధంలో జపాన్ ఓటమి అనంతరం సుమారు నాలుగువేల మంది జపనీస్‌ పిల్లలు చైనాలో నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఈశాన్య చైనా, ఇన్నర్‌ మంగోలియా ప్రాంతాలలో ఉన్నారు. ఈ పిల్లల్లో చాలామందిని చైనీస్‌ కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ అనాథల్లోని ఒకటే ఈ జు యాన్‌ చిన్నారి కథ..!.

    ఆమె లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో సకురా యమమోటోగా జన్మించింది. ఆమె తండ్రి విమానం కూలిపోవడంతో మరణించగా, తల్లి ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. దాంతో ఆమె కనీసం ఏడాది కూడా నిండకమునుపే ఓ చైనీస్‌ కుటుంబం దత్తత తీసుకుంది. అయితే ఆమె పెంపుడు తండ్రి సైన్యానికి వెళ్లిపోవడంతో అతని భార్య ముగ్గురు పిల్లల్ని పెంచడం కష్టంగా భావించి తన పొరుగింటి వాళ్లకు దత్తతగా ఇచ్చేసింది ఆమెను. 

    అలా ఆమె జు జెన్స్‌ దంపుతులకు చేరింది. వాళ్లు ఆమెకు జు యాన్‌ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. ఆమె పుట్టుకతో ఎంతో విషాదాన్ని చూడటంతో బాధను దిగమింగి ఎంతో స్థైర్యవంతురాలిగా పెరగాలన్న ఉద్దేశ్యంతో జు యాన్‌ అని పేరుపెట్టారట ఆ పెంపుడు తల్లిదండ్రులు. అయితే వాళ్లకు పిల్లలను పెంచిన అనుభవం అంతగా లేకపోవడంతో తన తల్లికి ఇచ్చి పెంచమని చెప్పింది జు పెంపుడు తల్లి. 

    అలా అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగిన ఆమెకు, మంచి ప్రేమ, సంరక్షణ లభించాయి. 1962లో స్థానిక ఆస్పత్రిలో వైద్య శిక్షణ పూర్తి చేసుకుని, తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో వైద్యురాలిగా పనిచేసేందుకు వెళ్లింది. అలా ఆమె ఎన్నో ప్రసవాలు చేసింది. ఆమె పురుడుపోసిన నవజాత శిశువులందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారు కూడా. తనను చైనీస్‌ ప్రజలు రక్షించారు, ఫలితంగా శిశువులకు సేవ చేశానని అనుకునేదామె. 

    1980లో తన బిడ్డతో షెన్యాంగ్‌కు తిరిగి వచ్చి నిర్మాణ సంస్థలో పనిచేయడం ప్రారంభించింది. పదవీ విరమణ తర్వాత స్వయంగా చైనా సంప్రదాయ వైద్యాన్ని నేర్చుకుని మళ్లీ సేవ చేయడం ప్రారంభించింది. అప్పుడే తాను జపనీస్‌ అనాథనని తెలుసుకుని భావోద్వేగానికి గురైంది. యుద్ధసమయంలో చైనా, జపాన్‌ వేర్వేరు పద్ధతుల్లో టీకాలు వేసేది. దాని కారణంగానే నాటి చైనా జపాన్‌ యుద్ధ సమయంలో నిరాశ్రయలైన పిల్లల్లో ఆమె ఒక్కత్తినని తెలుసుకుంటుంది. 

    అయితే ఆమెలాగా యుద్ధం కారణంగా అనాథగా మారిని చాలామంది రెడ్‌క్రాస్‌ సొసైటీ సాయంతో తమ వాళ్లను కలుసుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే జు యాన్‌  ఆ పని అస్సలు చేయలేదు. 

    నిజానికి ఆ సమయంలో జపనీస్‌ యుద్ధ అనాథలు దాదాపు 120 మంది ఉండగా ఇప్పుడు కేవలం ఐదుగురే మిగిలి ఉండటం విశేషం. అయితే జు తనను తాను ఎప్పుడూ చైనీస్‌గానే భావించాను కాబట్టి తనవాళ్లను కలిసే ప్రయత్నం చేయలేదంటోంది. పైగా తనకు రక్షణ కల్పించిన ఈ నేల నా ఇల్లు తన స్వదేశం అని సగర్వంగా చెబుతోందామె.

    (చదవండి: ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్‌ స్టేషన్‌..! మన హైదరాబాద్‌కి జస్ట్‌..)
     

  • రోమ్‌లో ఉంటే రోమన్‌లాగా ఉండాలి అని విన్నాం కానీ మనం ఉన్న చోటునే రోమ్‌లాగా తీర్చిదిద్దుకోవాలి అనే మాట విన్నామా?  చుట్టూ కొండల నడుమ, మధ్యలో సరస్సు దాని చుట్టూ ఇళ్లు, రాతి రహదారులు... అచ్చం ఇటలీని పోలినట్టు తీర్చిదిద్దబడిన ఆ సిటీని చూస్తే కళ్లు అప్పగించాల్సిందే. భారతదేశంలోనే ఏ హిల్‌ స్టేషన్‌కూ లేని ప్రత్యేకతలెన్నో ఉన్న ఆ పర్వత పట్టణం పేరు లావాసా.

    పూణే సమీపంలో  కొలువుదీరిన లావాసాను  ’ఇటలీ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. దాని పాస్టెల్‌–రంగు భవనాల, సరస్సు సమీపంలో విహారయాత్రలు  ఇరుకైన వీధుల నడుమ నడవగలిగే బౌలేవార్డ్‌లు సందర్శకులకు యూరోపియన్‌ అనుభూతిని అందిస్తాయి ఇదే ఇతర భారతీయ హిల్‌ స్టేషన్ల నుంచి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.

    అన్నింటికంటే విశేషం ఏమిటంటే...  క్రమక్రమంగా విస్తరించిన ఊటీ లేదా సిమ్లా వంటి సాంప్రదాయ హిల్‌ స్టేషన్ ల మాదిరిగా  కాకుండా, ఈ నగరాన్ని  ప్రణాళికాబద్ధంగా రూపొందించడం,భారతీయ కొండ వాతావరణంలో యూరోపియన్‌ అనుభూతిని పునఃసృష్టించడం, ప్రణాళికాబద్ధమైన కృషితో ప్రపంచ ఆకర్షణను మిళితం చేయడం అనే లక్ష్యాలతో ఇది రూపొందింది. పర్యాటకం, నివాస జీవితం  విశ్రాంతి మూడింటిని కలగలిపి ఓ సుందరమైన ప్రదేశంలో మిళితం చేసి లావాసాను పునాదుల స్థాయి నుంచే  నిర్మించారు. 

    ఈ సిటీ లే అవుట్‌, డిజైన్ ఇటలీలోని తీరప్రాంత పట్టణం అయిన పోర్టోఫినో నుంచి ప్రేరణ పొందింది, ఇది పాదచారులకు అనుకూలమైన వీధులు, టెర్రకోట పైకప్పులు  రాళ్లతో చేసిన దారులతో ఉంటుంది. భవనాలు పీచ్, ఆలివ్‌  వంటి తేలికపాటి పాస్టెల్‌లతో పెయింట్‌ చేశారు,  తోరణాలు  టెర్రస్‌లు యూరోపియన్‌ ఆకర్షణను అందిస్తాయి. ఫోటోగ్రాఫర్‌లు, ప్రయాణికులు, వారాంతపు సందర్శకులను ఆకర్షించే విశ్రాంతి, సెలవుదినం లాంటి వాతావరణాన్ని సృష్టించడానికి రూపకర్తలు బహిరంగ ప్రదేశాలు, నడవగలిగే వీధులు  సరస్సు వీక్షణలపై దృష్టి సారించారు. దాస్వే సరస్సు చుట్టూ ఉన్న విహార ప్రదేశం. 

    కేఫ్‌లు, బోటిక్‌లు  బహిరంగ సీటింగ్‌ ప్రాంతాలతో  ఇటాలియన్‌ ఓడరేవు పట్టణాల తరహాలో రిలాక్సడ్‌ వాటర్‌ ఫ్రంట్‌ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని ఇస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఈ విహార ప్రదేశంలో నడవడం లేదా సైక్లింగ్‌ చేయడం వల్ల చాలా మంది సందర్శకులు  యూరోపియన్‌ హాలిడే పట్టణంలో ఉన్నట్లు స్పష్టమైన అనుభూతిని పొందుతారు. పర్యావరణపరంగా సున్నితమైన పశ్చిమ కనుమలలో ఉండటం వల్ల, లావాసా రూపకల్పన సమయంలో పర్యావరణ అడ్డంకులు ఎదుర్కుంది. 

    నీటి వినియోగం, కొండ–వాలు స్థిరత్వం  అటవీ సంరక్షణపై దృష్టి సారించి, హరిత చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని సమీక్షించే క్రమంలో అధికారులు పలు దఫాలు నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు.  అది పర్యావరణ ప్రమాదాలను తగ్గించుకుంటూ పట్టణం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. వారాంతపు విహారయాత్రకు లావాసా సరైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలం పూర్తయిన తర్వాత  పచ్చని కొండలు  స్పష్టమైన సరస్సు కళ్లు విప్పార్చుకునేలా చేస్తాయి. అనువైన నెలలు.
    లావాసా ప్రత్యేకతలు

    భారతదేశంలోని మొట్టమొదటి  ప్రణాళికతో కూడిన కొండ నగరం

    • ఈ పట్టణంలో బోటింగ్‌  విశ్రాంతి కార్యకలాపాల కోసం రూపొందించిన మానవ నిర్మిత సరస్సు ఉంది.

    • వీధులకు కోమో  జెనీవా వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరస్సులు  కొండల పేర్లు ఉంటాయి.

    • మిగిలిన హిల్‌ స్టేషన్స్‌కు భిన్నంగా ఈ సిటీలో సాంస్కృతిక ఉత్సవాలు సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి.

    • సాహస కార్యకలాపాలలో ఉన్నవారి కోసం కొండలపై ట్రెక్కింగ్, విహార ప్రదేశాలలో సైక్లింగ్‌  సరస్సులో జల క్రీడలు ఉన్నాయి.

    తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఇండియన్‌ ఇటలీకి చేరుకోవాలంటే పూణే లేదా ముంబై మీదుగా వెళ్లవలసి ఉంటుంది.  పూణే నుంచి దూరం దాదాపు 60కి.మీ కాగా, ప్రయాణ సమయం 2 గంటల వరకూ పడుతుంది   ముంబై నుంచి 190 కి.మీ దూరంలో ఉంది, ప్రయాణ సమయం దాదాపు 5 గంటలు పడుతుంది.

    (చదవండి: నటుడు ఆర్నాల్డ్‌ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..)

  • ఏ డైట్‌ అయినా హెల్దీగా ఉండేందుకు బరువు తగ్గడం కోసం లేదా అదుపులో ఉంచుకునేందుకు. చెప్పాలంటే స్లిమ్‌గా..చూడచక్కని ఆకర్ణణీయమైన లుక్‌ కోసం అంతలా డైట్‌పై ఫోకస్‌ పెడుతుంటారు. అయితే మన హాలీవుడ్‌ ఐకాన్‌, మాజీ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌ మాత్రం కొత్త ఏడాదిలో సరికొత్త క్రాష్‌ డైట్‌ని ఫాలో అవుతున్నాననంటూ తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇదేమి త్వరితగతిన బరువు తగ్గి..స్లిమ్‌గా మారే డైట్‌ మాత్రం కాదట. ఎందుకోసమో వింటే షాక్‌ అవుతారు. అందుకోసం ఇలాంటి డైట్‌లు కూడా ఉంటాయా? అని విస్తుపోవడం మాత్రం ఖాయం.

    78 ఏళ్ల హాలీవుడ్‌ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఆస్ట్రియన్-అమెరికన్ చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ బాడీబిల్డర్. అంతేకాకుండా ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్ రిపబ్లికన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) రాజకీయ నాయకుడు. ఆయన 2003, 2011ల మధ్య కాలిఫోర్నియాకు 38వ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 

     ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా టైమ్‌ మ్యాగ్జైన్‌లో చోటు సైతం దక్కించుకున్నారు. అలాంటి వ్యక్తి ఈ కొత్త ఏడాదిలో ప్రత్యేకమైన క్రాష్‌ డైట్‌ ప్రారంభిస్తానంటూ చేసిన పోస్ట్‌ అదర్ని విస్తుపోయేలా చేయడమే కాకుండా అమితంగా ఆకర్షించింది. అసలేంటి ఈ డైట్‌ అంటే..

    ఆర్నాల్డ్‌ ప్రకారం క్రాష్‌డైట్‌ బరువు తగ్గడం కోసం కాదట..ప్రతికూలతలను తొలగించే లక్ష్యంతో మానసిక రీసెట్‌ కోసం అనుసరించే డైట్‌ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. సాధారణంగా క్రాష్‌ డైట్‌ అనగానే..త్వరితిగతిన మార్పులు, ఫలితాన్ని అందుకునేవి అనే అందరూ భావిస్తారు. కానీ ఇది అందుకు విరుద్ధం. అయితే తాను చెప్పే డైట్‌ బాడీ కోసం కాదని, మెదడు కోసమని చెప్పుకొచ్చారు. 

    ఈ డైట్‌ ప్రకారం..ఒక వారం పాటు ప్రతికూలత ఆలోచనలు, విషపూరితమైన ఆలోచనలు, ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి వంటి ఏమి లేకుండా వ్యవహరించడం. ఇది ఒక్కసారి ప్రయత్నిస్తే..మానసిక శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుందని అన్నారు. నిజానికి ప్రతికూలత అనేది భావోద్వేగపరంగా శరీరానికి చాలా హానికరమని నొక్కి చెప్పారు. నెగిటివిటీ అనేది మనల్ని అక్షరాల చంపేస్తుందని హెచ్చరించారు.

    నటుడు ఆర్నా ల్డ్‌సందేశం ఒకరకంగా ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసినా..ప్రేరణగా నిలిచింది. అంతేగాదు డైట్‌లు అనేవి కేవలం శారీరక అనుకూలత కోసమే కాదు, మానసిక ఆరోగ్యం కోసం ఏర్పరచుకోవచ్చు అని సరికొత్త ఆలోచనకు నాంది పలికారు ఆర్నాల్డ్‌. ఇక్కడ ఆయన ఉద్దేశ్యం ఏంటంటే మానసిక-శారీరక శ్రేయస్సు కోసం ఇలాంటి "జీరో నెగటివిటీ డైట్" తప్పక తీసుకోవాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. 

    అంతేగాదు ఆశావాదులే ఎక్కువకాలం జీవిస్తారని పలు అధ్యయనాల్లో కూడా నిరూపితమైందని గుర్తు చేశారు. అందువల్ల మనం నిరాశవాదం, విమర్శలు, కోపాన్ని త్యజిద్దాం అని ప్రజలను కోరారు. అందుకోసం మన రోజులో ఇవి లేకుండా ఉండే క్రాష్‌ డైట్‌ని జీవితంలో భాగం చేసుకుందామని అన్నారు. 

    ఈ డైట్‌లో ఏం చేయాలంటే..

    • ప్రతి రోజు మూడు పూటలా కనీసం ఓ పదినిమిషాలు సోషల్‌ మీడియాను చూడకుండా ఉండటం. 

    • ఉద్యోగ దరఖాస్తులుపై మనసు లగ్నం చేయడం లేదా చేయవలసిన ముఖ్యమైన పనులపై ఫోకస్‌ పెట్టడం

    • రోజు మనకు ఎదురయ్యే సవాళ్లకు కృతజ్ఞత చెప్పడం. ఎందుకంటే అవి మనలోని అంతర్గత శక్తిని బహిర్గతం చేస్తాయి. 

    చివరగా ఆర్నాల్డ్‌ ప్రతికూలతలను తగ్గించుకోవడం అనేది మనల్ని మనం ఉద్ధిరించడానికే కాదు..జీవితాన్ని మారుస్తుంది, కాపాడుతుంది కూడా. 

    (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా)
     

  • పేరుకు న్యూ ఇయరే గానీ తెల్లారిలేస్తే మళ్లీ అదే తిండి. అవే సరదాలు. అవే సినిమాలు. అందుకే దాదాపుగా అందరికీ తెలిసినవే అయినా అవే ఆరోగ్య సూత్రాల్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. అవే జాగ్రత్తల్ని చెబుతూ హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే రెజల్యూషన్స్‌ తీసుకుంటూ మనం మాత్రం మళ్లీ వాటిని మరుసటి ఏడాదికి వాయిదా వేయడం లేదా?  కాకపోతే ఒకసారి చెబితే కొందరైనా సీరియస్‌గా తీసుకుని ఆచరిస్తారనీ, దాంతో వాళ్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆయుర్దాయం మరింతగా పెంచుకుని హెల్దీగా మారకపోతారా... కొత్త ఏడాదిని హెల్దీ న్యూ ఇయర్‌గా మార్చుకోకపోతారా అనే ఆకాంక్షతో ప్రముఖ హాస్పిటళ్లకు చెందిన పెద్ద డాక్టర్లంతా మరోమారు మనకు సుద్దులు చెబుతున్నారు. కొందరైనా ఆచరించి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటే... ఈ ఏడాదికి ఈ ఆరోగ్యవచనాల లక్ష్యాలూ, ప్రయోజనాలూ నెరవేరినట్టే!  ఐదు ప్రముఖ హాస్పిటల్స్‌ నుంచి ఐదుగురు పెద్ద డాక్టర్లతో కొత్త ఏడాదిని హెల్దీగా మార్చుకునేందుకు సూచనలతో ప్రత్యేక కథనం...

    ఆహార పరమైన సూచనలు...

    వేళకు తినండి. ఆహారం తక్కువ మోతాదుల్లో తీసుకుంటూ రోజులో ఎక్కువసార్లు తినండి. దీనివల్ల  జీర్ణవ్యవస్థపై భారం పడదు. దాంతో అది చాలాకాలం ఆరోగ్యంగా ఉంటుంది. 

    రాత్రి భోజనం మితంగా ఉండాలి. ఓ ఆంగ్ల నానుడి ప్రకారం ఉదయం భోజనం రాజభోజనంలా, మధ్యానం మధ్యస్తంగా, రాత్రిభోజనం పేదవాడి భోజనంలా ఉండాలన్నది ఒక సూక్తి. 

    తినే సమయంలో మీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ)ని పరిగణనలోకి తీసుకోండి. బీఎమ్‌ఐ అంటే ఒకరి బరువు డివైడెడ్‌ బై వాళ్ల ఎత్తు స్క్వేర్‌ అని అర్థం. అంటే ఒక వ్యక్తి బరువు 80 కిలోలు అనుకుందాం. అతడి ఎత్తు 1.8 మీటర్లు అయితే 80 డివైడెడ్‌ బై 1.8 స్క్వేర్‌. ఫలితంగా దాదాపు 24.69గా వచ్చే ఆ విలువను బీఎమ్‌ఐ పట్టికతో సరి΄ోల్చుకుని ఎవరికి వారు తాము ఏ స్థూలకాయం పరిధిలో ఉన్నరన్నది తెలుసుకోవచ్చు. 

    ఒకవేళ తమ బీఎమ్‌ఐ ప్రకారం ఎక్కువ ఊబకాయ పరిధిలోకి వచ్చేవారు  బరువు తగ్గాలనుకున్నవారు డాక్టర్‌ సలహా మేరకు ఎలాంటి జీవనశైలి నియమాలు పాటించాలో, బరువు తగ్గడానికి ఏయే ఆరోగ్యకరమైన పద్ధతులు అవలంబించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అదనపు బరువు ఉన్నవారు తమ కండరాలను (మజిల్‌ మాస్‌ను) కాకుండా అదనపు కొవ్వును మాత్రమే కరిగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 

    శాకాహారం తీసుకునేవారు అన్ని రకాల తాజా ఆకుకూరలూ, కాయగూరల వెరైటీలు తీసుకోవాలి. అదే మాంసాహారం తినేవారైతే రెడ్‌మీట్‌కు బదులు... ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే చేపలు తీసుకోవడం మంచిది. వాటితోపాటు తాజా పండ్లూ తీసుకోవాలి.
    డాక్టర్‌ సోనిక రెడ్డి, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

    ఒత్తిడి నియంత్రణ కోసం... 

    తీవ్రమైన ఒత్తిడితో పోలిస్తే పరిమితమైన ఒత్తిడి వల్ల పనులు సమయానికి పూర్తయ్యేలా చేయడం వల్ల కాస్తంత ప్రయోజనం ఉంటుంది. కానీ మితిమీరిన ఒత్తిడి ఆరోగ్యానికి ఎప్పటికీ హానిచేసేదే. 

    మానసిక ఒత్తిడి పురుషుల కంటే మహిళలకే ప్రమాదకరం. 

    ఒత్తిడి విషయానికి వస్తే పని ప్రదేశంలో ఒత్తిడి ఎదురైనప్పుడు మనం తప్ప ఇతరులైతే అంత పర్‌ఫెక్ట్‌గా చేయలేరనే భావనను వదిలిపెట్టి కొలీగ్స్‌తో పని షేర్‌ చేసుకుని ఓ టీమ్‌వర్క్‌లా చేసే పని ఒత్తిడిని తగ్గిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. 

    పెంపుడు జంతువులో ఆడుకునేవారికీ, అక్వేరియమ్‌లో చేపలను చూస్తూ ఉండేవారికి, ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తుండేవారికి ఒత్తిడి తగ్గి, గుండెజబ్బులూ నివారితమవుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది. 

    ప్రకృతిసిద్ధమైన నీటి ప్రవాహం వంటి ధ్వనులూ... సంగీతం వంటివి ఒత్తిడిని తగ్గించే స్వాభావికమైన మందులు అనుకోవచ్చు. 

    కోపం, విచారం వంటి ఫీలింగ్స్‌ను అణిచేయకుండా ఇతరులను ఆటంకపరచని రీతిలో వ్యక్తం చేయడమే మంచిది. 

    మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఒప్పుకోవడం మంచిది. ఈగో కారణంగా ఒప్పుకోలేక΄ోతే అది మరింత ఒత్తిడి పెంచుతుంది. ఇంకా హాని చేస్తుంది. 

    చక్కటి హాస్యంతో కూడిన సినిమాలు చూస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండేవారికి రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి జబ్బులు రావడం తక్కువ. తమ సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ కారణంగా ఇలాంటివారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కాబట్టి మంచి ఆరోగ్యకరమైన హాస్యానురక్తిని పెంచుకోండి.
    డాక్టర్‌ మంజుల రావు, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌

    చెడు అలవాట్లకు దూరంగా...
    సిగరెట్, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్‌ పొగలో కనీసం 6000 హానికరమైన వ్యర్థ పదార్థాలుంటాయి. అందులో క్యాన్సర్‌కు కారణమయ్యేవి కనీసం 60 పదార్థాలుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 సెకండ్ల వ్యవధిలో ఒకరు సిగరెట్‌ కారణంగానే ్ర΄ాణాలు వదులుతున్నారని అంచనా. 

    గుండెకు సంబంధించిన వ్యాధులతో చని΄ోయేవారిని పరిశీలించినప్పుడు వారిలో కనీసం 40 శాతం మంది తమ పొగతాగే అలవాటు కారణంగా తమ గుండెకు చేటు తెచ్చుకున్నవారేనని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే ఊపిరితిత్తులు, హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లు వచ్చినవారిలో దాదాపు 80 శాతం మంది తమ పొగతాగడం అలవాటు కారణంగా ప్రాణాంతకమైన ఆ జబ్బును తమ చేజేతులారా తెచ్చుకున్నవారే. 

    పొగతాగే అలవాటు వల్ల రక్త΄ోటు పెరుగుతుంది. అది గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ సిగరెట్‌ పొగవల్ల దేహంలో పేరుకునే కార్బన్‌ మోనాక్సైడ్‌ వల్ల దేహం తనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్‌ను అంతగా తీసుకోలేక΄ోవడం, ఫలితంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం జరుగుతాయి.ఇవన్నీ ఆరోగ్యానికి చేటు చేసే పరిణామాలే. 

    పరిమితంగా రెడ్‌ వైన్‌ వంటి మద్యం తీసుకుంటే అది గుండెకు మేలు చేస్తుందనీ, రెండు పెగ్గులకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే మాటలన్నీ కేవలం అ΄ోహ మాత్రమే. ఎంత పరిమితంగా తీసుకున్నా మద్యం చేసే చేటు మాత్రం అపరిమితం. కాలేయం మొదలుకొని, రక్తనాళాలూ, రక్తప్రసరణ వ్యవస్థ, గుండె, కిడ్నీలు... అన్నిటికంటే ముఖ్యంగా కీలకమైన మెదడు... ఇలా దేహంలోని అన్ని  అవయవాలనూ, సంబంధిత వ్యవస్థలను మద్యం దెబ్బతీస్తుంది. 

    పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆ అలవాట్లు ఉన్నవారు క్రమక్రమంగా కాదు... తక్షణం వాటిని మానేయాలి. మంచి ఆరోగ్యం కోసం ఇలా మానేయడం అవసరం కూడా.
    డాక్టర్‌ పి. కిరణ్మయి, సీనియర్‌ ఫిజీషియన్, డయాబెటాలజీ అండ్‌ థైరాయిడ్‌ స్పెషలిస్ట్‌ 

    వ్యాయామం తప్పనిసరి... 
    ఒకేచోట కదలకుండా చాలాసేపు కుదురుగా కూర్చొని ఉండటం గానీ, ఏ పనీ చేకుండా బద్ధకంగా కాలం గడపడం గానీ దేహానికి చేటు చేస్తాయని చాలా అధ్యయనాల్లో తేలిన విషయమే. 

    పొగతాగే అలవాటు వల్ల దేహానికీ, దేహంలోని అవయవాలూ, వాటి వ్యవస్థలకు ఎలాంటి హాని చేకూరుతుందో, శారీరక శ్రమలేకుండా ఉండటం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అలాంటి అనర్థాలే వస్తాయంటూ అనేక అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 

    ఒక అధ్యయనం ప్రకారం... క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల గుండె బలంగా తయారవుతుంది. దాంతో రక్తపోటు అదుపులో ఉండటం, రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో ప్రతి కణానికీ తగినంత ఆహారం, ఆక్సిజన్‌ అందడం, గుండె కొట్టుకునే లయ (రిథమ్‌) క్రమం తప్పకుండా కొనసాగడం, ఎముకలకు తగిన న్యూట్రిషన్‌ అందడం, కండరాలు బలిష్టంగా ఉండటం, వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో కొలాజెన్‌ తగ్గడం వల్ల చర్మం వదులవుతూ వృద్ధాప్యం తాలూకు చిహ్నాలు కనిపించడంవంటి ఏజింగ్‌ అనర్థాలు నివారితమై చాలాకాలం పాటు యౌవనంగా ఉండటం వంటి అనేక ప్రయోజనాలూ చేకూరతాయి. 

    నడక లేదా ఇతరత్రా తేలికపాటి వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గడం, నిద్రలేమి వంటివి నివారితం కావడం, ఫలితంగా మంచి గాఢమైన నిద్రపట్టడం, రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతుంది. 

    వ్యాయామం చేయడం అన్నది బోరుగా అనిపిస్తే ఆరుబయట ఉల్లాసంగా ఆటలాడటం, ఈదడం, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు చెప్పుకుండా నడవడం వంటి ప్రక్రియల ద్వారా దేహానికి వ్యాయామాన్ని సమకూర్చడం చాలా ఆహ్లాదకరమైన, సంతోషదాయకమైన మార్గాలు. దేహానికి ఆహారం ఎంత అవసరమయో, వ్యాయామమూ అంతే అవసరమని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అందుకే జిమ్‌లో చేరేందుకూ.. కుదరక΄ోతే కనీసం ఆటలాడేందుకైనా షూలేస్‌లు కట్టుకోవడం మొదలుపెట్టండి.
    డాక్టర్‌ ఆరతీ బెల్లారీ,సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌

    రిలాక్సేషన్, విశ్రాంతి, నిద్ర విషయంలో... 
    రోజంతా పని చేస్తూనే ఉండకుండా, మధ్యమధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం.ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక అలసట తగ్గి, పని మీద ఏకాగ్రత, సామర్థ్యం మెరుగవుతాయి.

    వారంలో కనీసం ఒక రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి ముఖ్యం. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రకృతిలో నడక, తోటలో గడపడం, పనుల్లో బాగా బిజీగా ఉండేవారు... ఒకవేళ వాళ్లు మంచి యుక్తవయసులో ఉన్న యువత అయితే ట్రెక్కింగ్‌ లేదా హైకింగ్‌ వంటివి తమ ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వీళ్లంతా ఒక స్నేహబృందంగా ఏర్పడి వెళ్లడం ఒత్తిడిని తగ్గించి మంచి ప్రయోజనాన్నిస్తుంది. 

    శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి.  ఎలాంటి అంతరాయం లేని 6 నుంచి 8 గంటల రాత్రి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరంలో, మెదడులో, కండరాల్లో పునరుత్తేజం తెచ్చే సహజ ప్రక్రియ.

    నిద్రలోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. తగినంత నిద్రలేక΄ోతే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఉంటాయని ఎన్నో అధ్యయనాలలో తేలింది. 

    తగిన నిద్ర వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతాయి.

    తక్కువగా నిద్ర ΄ోయేవారిలో రక్త΄ోటు, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, మైగ్రేన్‌ వంటి ఆరోగ్య సమస్యల ముప్పు పెరుగుతుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి.

    ప్రతిరోజూ రాత్రిఒకే సమయానికి పడుకోవడం (సాధారణంగా రాత్రి 9 తర్వాత), ఉదయం ఒకే సమయానికి (సాధారణంగా ఉదయం 6 గంటలకు) నిద్రలేవడం చాలా ముఖ్యం. దీనివల్ల మన శరీర గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) సరిగ్గా పనిచేస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

    చాలా తక్కువ నిద్ర (నాలుగు గంటల వ్యవధి కంటే తక్కువ నిద్రించడం) కూడా మంచిది కాదు, అలాగే అవసరానికి మించిన నిద్ర (ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్ర΄ోవడం) కూడా సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అధిక నిద్రకు డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలతో సంబంధం ఉండవచ్చు.

    ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్ర కొంత భిన్నంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా పెద్దలలో రోజుకు 7–9 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని నిద్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ శరీరం సూచించే అవసరాన్ని గమనిస్తూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే మంచి ఆరోగ్యానికి మార్గం. 
    డాక్టర్‌ ఎల్‌.సునందిని, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ 

    (చదవండి: ఆ కారణంగానే శాకాహారిగా మారా..!: నటి జెనీలియా)

  • ఇటీవల కాలంలో వేగనిజం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు వేగన్‌గా మారుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ నటి, ప్రముఖ బాలీవుడ్‌ హీరో భార్య జెనీలియి డిసౌజా కూడా పూర్తిగా శాకాహారిగా మారినట్లు వెల్లడించారు. అయితే తాను మొదట్లో పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, తర్వాత పూర్తిగా వేగన్‌గా మారిపోయానని అన్నారు. ఎందువల్ల ఈ మార్పు, దానికి గల కారణాలను కూడా ఆమె షేర్‌ చేసుకున్నారు. 

    చాలామంది ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మొక్కల ఆధారిత ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారి జాబితాలోకి తాజాగా జెనీలియా డిసౌజా కూడా  చేరారు. ఆమె 2020 నుంచి వేగన్‌గా మారారట. సోహా అలీఖాన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో జరిగిన సంభాషణలో జెనీలియా తాను 2017లో మాంసాహారం నుంచి పూర్తిగా శాకాహారానికి మారినట్లు చెప్పారు. తాను 2017 నుంచి మాంసం తినడం మానేసినట్లు తెలిపింది. 

    అయితే పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం తీసుకునేదాన్ని కాదని, కొద్దిగా పాల ఉత్పత్తులు, చీజ్, గుడ్లు వంటివి తీసుకునేదాన్ని అని అన్నారు. చాలామంది కూరగాయలు తినడం మొదలు పెడితే ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తరుచుగా చాలామంది చెబుతుండే వారు. తనకు కూడా అలాంటి అనుభూతే కలిగిందని అంటోంది జెనీలియా. ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశ్యంతోనే ఈ రకమైన జీవనశైలిని అవలంభించానని అన్నారామె. 

    తాను మాంసం తినే కుటుంబంలో జన్మించానని, తనకు పెద్దగా శాకాహారం అంటే ఏంటో తెలియదని అన్నారు. తాను బఠానీలు, బంగాళదుంపలు, పనీర్‌ మాత్రమే శాకాహారం అనుకునేదాన్ని, ఆ తర్వాత తెలిసింది అంతకుమంచి మంచి ప్రోటీన్‌ మాంసకృత్తులు ఉన్నా ఆహారాలు శాకాహారంలో కూడా ఉన్నాయని. అయితే తాను జంతు ప్రేమికురాలినే అయినప్పటికీ..అప్పుడు మాత్రం మాంసాన్ని ఇష్టంగా ఆస్వాదించేదాన్ని అని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడైతే మాంసాహారాన్ని పరిమితం చేయడం మొదలు పెడతామో..అప్పుడు..ప్రతిది హాయిగా ఆస్వాదించగలుగుతాం, చాలా తేలికగా కూడా ఉంటుందన్నారామె. 

    ఎలా మొదలైందంటే..
    మహమ్మారి సమయంలో 2020లో తాను పూర్తిగా వేగన్‌గా మారానని జెనీలియా పేర్కొన్నారు. తన భర్త రితేష్‌ కారణంగా ఇదంతా జరిగిందన్నారు. 2016లో ఆయన మాంసం తింటుంటే ఏదో బాగోలేని అనుభూతి కలుగుతోందని మానేశారు..అయితే అప్పటికీ తాను మాంసహారిగానే ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అలా జనవరి 1, 2017న తాము దీన్ని పూర్తిగా మానేయాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. 

    అయితే అప్పటికీ తాము గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకునేవాళ్లం. కరోనా మహమ్మారి సమయం ప్రతిఒక్కరూ బిక్కుబిక్కుమంటున్న టైంలో రితేష్‌ ఎందుకు జంతు ఉత్పత్తులను కూడా మానేయకూడదు అని అడిగారు. దాంతో తాను సరే ఈ మార్పు ప్రయత్నించి చూద్దాం అన్నాను. రాను రాను అది అద్భుతంగా అనిపించడం ప్రారంభించింది, మా రోటీలో కొద్దిగా పాలు, లేదా వెన్న తినిన ప్రతిసారి కడుపు నిండిన అనుభూతి కలిగింది. 

    ఇలా మారడం అంత ఈజీ కాదు, అలానే పూర్తిస్థాయిలో శాకాహారిగా మారలేరు కూడా. రోజులు గడుస్తున్న కొద్దిపూర్తిగా వేగన్‌గా మారడం ఎలా అనేది అవగతమవుతుంటుందని, ఇంకా ఇప్పటికీ తాను నేర్చుకుంటూనే ఉన్నానని చెప్పుకొచ్చారు జెనీలియా. 

    పూర్తి శాకాహారంతో ఆరోగ్యంగా ఉండగలమా..?
    శాకాహారులుగా ఉన్న చాలామంది పోషకాహార లోపాలు ఎదుర్కొంటున్నారు కదా, మరి అలాంటప్పుడూ ఇది ఏవిధంగా ఆరోగ్యానికి మంచిది అనేది అందరిలోనూ ఎదురయ్యే సందేహం. అయితే పోషకాహార నిపుణులు ప్రాథమికంగా ఏ ఆహారమైన తీసుకునే విధానం బట్టే అన్ని ప్రోటీన్లు పుష్కలంగా తీసుకోవడం సాధ్యమవుతుందంటున్నారు. 

    మాంసం తినేవారికి సైతం బీ12 లోపం ఉంటుందనేది గుర్తెరగాలి. అందువల్ల ఇలా శాకాహారిగా మారాలనుకునే వాళ్లు..అన్ని విటమిన్లు, ప్రోటీన్లు అందేలా సవ్వంగా మార్పులు చేసుకోవాలి. అలాగే మొక్కల ఆధారిత ఆహారాలు మన శరీరానికి అన్నింటిని అందించలేకపోవచ్చు గానీ..ఆ లోపాన్ని ఆయా సప్లిమెంట్స్‌తో ఈజీగా భర్తీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. 

    (చదవండి: ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ రేంజ్‌కి..!)
     

Politics

  • విశాఖపట్నం:  ఏపీ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలనలో అనని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శంచారు. ఈరోజు(ఆదివారం, జనవరి 4వ తేదీ) విశాఖ నంచి మీడియాతో బొత్స మాట్లాడుతూ..‘ కూటమి నేతలకుఉ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. కూటమి పాలనలో  అంతా ఇబ్బందులు పాలవుతున్నారు.

    రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కూటమి నేతల దగ్గర మాత్రం యూరియా ఉంటుంది. దాన్ని వార బ్లాక్‌ మార్కెట్‌లో అత్యధిక ధరకు అమ్ముకుంటున్నారు.

    కూటమి నేతలు బ్లాక్‌ మార్కెట్‌లో  విచ్చలవిడగా యూరియా అమ్ముతున్నారు. పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల తరఫున ప్రభుత్వమే  పంటలకు ఇన్సూరెన్స్‌ చెల్లించింది తక్షణమే ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్‌ చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు.

    ఆ క్రెడిట్‌ కచ్చితంగా వైఎస్‌ జగన్‌దే
    భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ముమ్మాటికీ వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు బొత్స సత్యనారాయణ. ‘ భూ సేకరణ జగన్ చేశారు. నిధులు కేటాయించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రారభోత్సవానికి నేను వెళ్లాను. అప్పుడు ప్రభుత్వ పెద్దలు జీఎంఆర్‌న అభినందించారు.

    ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు జీఎంఆర్‌ పేరు ఎందుకు చెప్పడం లేదు?, విశాఖ మాస్టర్ ప్లాన్ ఏమైంది..?, ఎందుకు ఫైనల్ చెయ్యడం లేదు..?. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే..కనెక్టింగ్ రోడ్స్ పూర్తయ్యేవి. రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ అని అన్నారు. ఒక్క అమ్మాయిని అయినా తీసుకొచ్చారా..?, ఉత్తరాంధ్ర ఎప్పుడూ సురక్షితమే. ఈ మధ్య కాలంలో పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు.

  • సాక్షి, విజయవాడ: రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సీఎం చంద్రబాబు స్పందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి తాను నిలిపివేయించినట్లు రేవంత్‌ ప్రకటన ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 40 టీఎంసీల నీరు రాయలసీమకు అందిస్తామని చంద్రబాబు ప్రజలను భ్రమపెడుతూ వచ్చారు. పథకాన్ని ఆపేయడానికి సీఎం అంగీకరించినట్లు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన అసలు నిజాలను బయటపెట్టింది’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

    ‘‘అదే నిజమైతే అది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినవారు అవుతారు. నిగూఢ ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తాయి. సీఎం చంద్రబాబు వాస్తవాలను వెల్లడించాలి. చీకటి ఒప్పందాలను దాచి పెట్టుకోవడానికే ఇరిగేషన్‌పై ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించాలి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా సాగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రకటనకు సమాధానం ఇవ్వాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, గుంటూరు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ను చంద్రబాబే కాంగ్రెస్‌ పార్టీలోకి పంపారని చెప్పుకొచ్చారు.

    మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కుట్రపన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి, ఈనాడు దాయడానికి ప్రయత్నించాయి. వైఎస్ జగన్‌.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే  చంద్రబాబు దాన్ని ఆపేయడం దుర్మార్గం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా ఇరుక్కున్నారో అందరికీ తెలుసు.

    గతంలో చంద్రబాబు హయాంలోనే కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచింది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు బయటపడ్డాయి. చంద్రబాబే.. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ మాట్లాడుకుంటానే ఉంటారు. చంద్రబాబు తీరు వల్ల రాయలసీమకు, కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అడిగితే తిరుమలను కూడా చంద్రబాబు ఇచ్చేస్తారేమో అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
     

  • సాక్షి, హైద‌రాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా.. సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాటలతో  చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌కి  చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు.

    శాసనసభ సాక్షిగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చంద్రబాబు తప్పుకి నిష్కృతి లేదని ధ్వజమెత్తారు. కేవలం స్వప్రయోజనాల కోసమే పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్ర‌బాబే రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ నిలిపివేశాడని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటి గండమేనన్న శ్రీకాంత్ రెడ్డి, ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడ్డంలో విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు. 
    ఇంకా ఆయన ఏమన్నారంటే..

    రాయ‌ల‌సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
    రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధిపై చంద్ర‌బాబు మొద‌టి నుంచీ వ్య‌తిరేక‌త క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్‌, లా యూనివ‌ర్సిటీ, హైకోర్టుల‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించుకుపోయాడు.  రాయ‌ల‌సీమ ప్రయోజ‌నాల కోసం ఈ ప్రాంత నాయ‌కులు త‌క్ష‌ణం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. వైయ‌స్ జ‌గ‌న్ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తాప‌త్ర‌య‌ప‌డి రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయ‌న‌తో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుద‌ల చేయించిన‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌ట‌మే కాకుండా త‌న మాట‌ల‌పై నిజ‌నిర్ధార‌ణ‌కు అన్ని పార్టీల నుంచి నాయ‌కుల‌ను పంపిస్తాన‌ని కూడా స‌వాల్ చేశాడు.

    చంద్ర‌బాబు కార‌ణంగానే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టు ఆగిపోయింద‌ని తేట‌తెల్లం అయ్యింది. చంద్రబాబు చేసిన పాపానికి రాయ‌ల‌సీమ ప్రాంతంతో పాటు ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు సైతం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌కు చంద్ర‌బాబే మ‌ర‌ణశాస‌నం రాశాడ‌ని స్పష్టంగా తేలిపోయింది కాబ‌ట్టి, రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌యోజ‌నాల కోసం ఈ ప్రాంతానికి చెందిన నాయ‌కులు త‌క్ష‌ణం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలి. ప‌ద‌వులు ముఖ్యంకాదు, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ప‌నిచేయాలి. ఇప్ప‌టికైనా చేసిన త‌ప్పుకి బాధ్య‌త వ‌హించి రాయ‌ల‌సీమ ప్రాజెక్టును చంద్ర‌బాబు త‌క్ష‌ణం పూర్తి చేసేవర‌కు వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు.

    చంద్ర‌బాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా..
    చంద్ర‌బాబు ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న ప్ర‌తిసారీ పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు క‌ట్టుకుంటూనే ఉన్నాయి. గ‌తంలో కర్నాట‌క రాష్ట్రం ఆల్మ‌ట్టి ఎత్తు పెంచుతుంటే చంద్ర‌బాబు మౌనం వ‌హించాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఎత్తు పెంచుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ ముందు ఏపీ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించ‌డంలోనూ చంద్ర‌బాబు ఫెయిల‌య్యాడు. అడుగ‌డుగునా త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు తాక‌ట్టు పెడుతూనే ఉన్నాడు. ఇలాంటి చంద్ర‌బాబును గెలిపించినందుకు రాష్ట్ర ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తున్నారు.

    ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాల‌కు మంచి జ‌ర‌గాల‌ని వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయ‌కులు కూడా రాయ‌ల‌సీమ ప్రాంత ప్ర‌జ‌ల గురించి ఆలోచించాలి. పాల‌మూరు- రంగారెడ్డి చేసుకుంటూ ఏపీలో రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టుకు మ‌ద్ధ‌తివ్వాలి. క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డి పోల‌వ‌రం ప్రాజెక్టును నాశ‌నం చేస్తే, వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం అయ్యాక‌నే కేంద్రంతో మాట్లాడి మ‌ళ్లీ గాడిన‌పెట్టారు. నిధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టును వ్యూహాత్మ‌కంగా పక్క‌న‌పెట్టి బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును తెర‌పైకి తెచ్చిన చంద్ర‌బాబు, కొన్ని రోజులు హ‌డావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించాడు.

    నీటి హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ స్కీం
    శ్రీశైలం జలాశయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం.

    కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్‌ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్‌ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి నెల‌కొంటోంది.

    రోజూ 3 టీఎంసీలు త‌ర‌లించేలా..
    ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల నుంచి రాయ‌ల‌సీమను కాపాడుకునేంద‌కు రోజుకు 3 టీఎంసీలు త‌రలించేలా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నాటి సీఎం వైఎస్‌ జ‌గ‌న్ ప్రారంభించారు. ప్రాజెక్టుకు సంబంధించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కూడా తీసుకొచ్చారు. కానీ ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవ‌నే కార‌ణం చూపెట్టి చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌ను ప‌క్క‌న పెట్టేసింది. చంద్ర‌బాబు త‌న కేసుల‌కు భ‌య‌ప‌డి పూర్తికావొచ్చిన ద‌శ‌లో ఉన్న ప్రాజెక్టును నిర్ధాక్షిణ్యంగా ప‌క్క‌న‌పెట్టి రాయ‌లసీమకి మ‌ర‌ణ‌శాస‌నం రాశాడని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయింది.

    చంద్ర‌బాబు చేసిన ఈ పాపానికి ఏకంగా రాజ‌కీయాల నుంచి వైదొలిగినా చేసిన పాపం పోదు. రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబు ఎప్పుడూ ద్వేష‌పూరితంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. వైయ‌స్సార్సీపీ తీసుకొచ్చిన లా యూనివ‌ర్సిటీని, హైకోర్టును అమ‌రావ‌తికి త‌ర‌లించాడు. కేంద్రం అనంత‌పురంకి ఎయిమ్స్ ఆస్ప‌త్రిని కేటాయిస్తే మంగ‌ళ‌గిరికి త‌ర‌లించుక‌పోయాడు.

    తెలంగాణలో పాల‌మూరు జిల్లా క‌రువును పార‌దోల‌డానికి అక్క‌డి పాల‌కులు ప్ర‌య‌త్నిస్తుంటే చంద్ర‌బాబు మాత్రం రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి తీవ్ర‌మైన అన్యాయం చేస్తున్నాడని  శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్‌ జ‌గ‌న్, రేవంత్‌రెడ్డిల మాదిరిగా తాము ప్రాతినిథ్యం వ‌హించే ప్రాంతానికి మేలు చేయాల‌ని ఆలోచించ‌కుండా, చంద్ర‌బాబు నిర్ధాక్షిణ్యంగా రాయ‌ల‌సీమ‌ను చంపేస్తున్నాడని ఆక్షేపించారు. ముఖ్య‌మంత్రిగా ఉండి రాష్ట్ర హక్కుల విష‌యంలో రాజీ ప‌డడం ద్వారా... ఏకంగా రాయ‌ల‌సీమ‌ను ఎడారిగా మార్చే కుట్ర‌కు తెర‌లేప‌డంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

     

  • సాక్షి, తెలంగాణ భవన్‌: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కట్టుకథలు చెప్పారని ఆరోపించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు. తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్‌ పార్టీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

    తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..‘అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. నల్లగొండ జిల్లాకు మరణశాసనం రాసింది కూడా కాంగ్రెస్‌ పార్టీనే. విభజనలో సెక్షన్‌-84 పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు. 11వ షెడ్యూల్‌లో మన ప్రాజెక్ట్‌లను ఎందుకు పెట్టలేదు?. కాంగ్రెస్‌ చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్‌లను 11వ షెడ్యూల్‌లో పెట్టకపోగా విభజన చట్టంలో రక్షణ కల్పించామని సీఎం చెబుతున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌కు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.

    కుట్రపూరితంగా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మీద సీఎం రేవంత్‌ కక్ష గట్టారు.. పాలమూరుపై పగబట్టారు. కాంగ్రెస్‌ తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది. తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. రేవంత్‌ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోంది. కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. 2004-14 వరకు కాంగ్రెస్‌ పాలనలో 6.64 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతలు, డిండి ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తామని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. 

    చంద్రబాబు ముఖం మీదే కేసీఆర్‌ చెప్పారు..
    టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్‌ ఎప్పుడో ఒప్పించారు. 2016లోనే టెలీమెట్రీ ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతానికే రేవంత్‌ అన్యాయం చేస్తున్నారు. శాసన సభను రేవంత్‌ తప్పుదోవ పట్టించారు. తనకు అనుకూలంగా ఉన్న పేజీలను చదివారు. సభలో అసలైన పేజీలను రేవంత్‌ చదవకుండా వదిలేశారు. ఫస్ట్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లోనే ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై ప్రశ్నించాం. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నీటి హక్కులపై కేంద్రాన్ని నిలదీశాం. కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యం. పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్‌ అని ఆనాడే కేసీఆర్‌ చెప్పారు. చంద్రబాబు ముఖం మీదే బల్లగుద్దినట్టు కేసీఆర్‌ మాట్లాడారు. ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్ కాంగ్రెస్. రేవంత్‌ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పచెబుదామంటారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్, చంద్రబాబు లోపాయికారి ఒప్పందం కుదిరింది అని విమర్శించారు. 

    60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ వల్లే నీటి సమస్యలు..
    అసెంబ్లీలో అబద్ధాలు ఆడినందుకు రాజీనామా చేయాలి. కాంగ్రెస్‌ మాత్రం ఒక్క ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ కూడా కేంద్రానికి పంపించలేదు. మీ పాలనలో మూడు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి. అరెంజ్‌మెంట్‌, అగ్రిమెంట్‌కు తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి 11 ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లను పంపించాం. ఏడు ప్రాజెక్ట్‌లకు అనుమతి తీసుకొచ్చాం. తెలంగాణకు కేసీఆర్‌ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?. రేవంత్‌ అబద్దాలను చేసి నిజమే ఉరేసుకుంటుందేమో. బీఆర్‌ఎస్‌ హయంలోనే అత్యధికంగా కృష్ణా నీళ్ల వినియోగం జరిగింది. ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని కేసీఆర్‌ పరుగులు పెట్టించారు. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ మరణశాసనం రాసిందని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లు నీటి హక్కుల కోసం కేంద్రంపై కేసీఆర్‌ పోరాడారు. 2023లోనే 66:34 లేకుండానే అగ్రిమెంట్‌ చేశాం. కృష్ణా జలాల్లో 50:50 నీటి వాటాల కోసం కేంద్రానికి 28 లేఖలు రాశాం. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ వల్లే నీటి సమస్యలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. 

    రేవంత్‌వి బలుపు మాటలు: కేటీఆర్‌
    అంతకముందు కేటీఆర్‌ మాట్లాడుతూ..‘నదీ జలాల మీద కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా  ద్రోహానికి పాల్పడుతోంది. అధికార మదంతో విర్రవీగుతూ, బలుపు మాటలతో రేవంత్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఉరితీయాలి.  రేవంత్‌కి ఒక్క భాషలో తిట్లు వస్తే మాకు నాలుగైదు భాషల్లో తిట్టడానికి వచ్చు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప తెలంగాణకు ఏం కావాలో.. రేవంత్‌కు తెలియదు. రేవంత్ మాటలతో కేసీఆర్ స్థాయి తగ్గదు. కేసీఆర్‌ గురించి ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని ఊరి వేయాలి?. అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలియదు.. బేసిన్ అంతకంటే తెలియదు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉంది అని అడిగే రేవంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు. 

Andhra Pradesh

  • సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శమివ్వడం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. పోలీసు అతిథి గృహం ముందు పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించాయి. టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం తిరుమలలో మద్యం పట్టుబడుతోంది.. అయినా భద్రత వ్యవస్థ మేల్కోవడం లేదు. అలిపిరి తనిఖీ కేంద్ర దాటుకొని నిత్యం మద్యం తిరుమలకు చేరుతోంది.

    కాగా, గత ఏడాది డిసెంబర్‌లో భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలచివేసింది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

     

     

     

  • సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావ‌డంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్‌సీపీ హయాంలోనే అనుమతులు సాధించడం, ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యిందని చెప్పుకొచ్చారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి.  #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం.

    ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్త‌యింది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది’ అని పోస్టు చేశారు.

Wanaparthy

  • పకడ్బందీగా ఓటరు జాబితా

    వనపర్తి టౌన్‌: పురపాలికల వార్డుల వారీగా ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి పుర కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాను ఆయన పరిశీలించి మాట్లాడారు. అక్టోబర్‌ 1, 2025 నాడు ప్రచురించిన అసెంబ్లీ తుది ఓటరు జాబితా ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు, మృతిచెందిన ఓటర్లను పరిగణలోకి తీసుకోమని తెలిపారు. తుది ఓటరు జాబితా పార్ట్‌ల వారీగా వార్డుల మ్యాపింగ్‌ చేపట్టాలని, ఇంటి చిరునామా ఆధారంగా వార్డు ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఒక ఇంట్లో ఉన్న ఓటర్లందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, అదేవిధంగా కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల పేర్లు వారి సొంత వార్డులోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పుర కార్యాలయంలో ప్రదర్శించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మార్పుచేర్పులు ఉంటే 5వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని కోరారు. తుది ఓటరు జాబితా జనవరి 10న అన్ని మున్సిపాలిటీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. వార్డుల వారీగా తప్పులు లేని ఓటరు జాబితా సిద్ధం చేసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, పుర సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘పాలమూరు’కు పెద్దపీట హాస్యాస్పదం

    వనపర్తి రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పెద్దపీట వేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని.. అంత ప్రాధాన్యమిస్తే పనులు ఎందుకు పూర్తి కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.74 వేల కోట్లు వ్యయం కానుండగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం రూ.32 వేల కోట్లు ఖర్చుచేసి 90 పనులు పూర్తి చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. ఇరుపార్టీల నాయకులు ప్రాజెక్టుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని.. పాలమూరు బీడు భూములకు సాగునీరు ఇవ్వడానికి యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌ పనులు పూర్తి చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు వంటి వలసల జిల్లా ఆకలి తీర్చే ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నీరుగార్చేందుకు వీబీజీ రాంజి పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని.. ఈ బిల్లు ద్వారా చేసిన పనులకు 40 శాతం నిధులు పంచాయతీలే భరించేలా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చర్చలకే పరిమితం కాకుండా కేంద్రంపై పోరాటానికి అఖిలపక్షాన్ని పిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, ఎండీ జబ్బార్‌, లక్ష్మి, జీఎన్‌ గోపి, పరమేశ్వరాచారి, మేకల ఆంజనేయులు, మహబూబ్‌ పాషా, బాల్యానాయక్‌, ఆర్‌ఎన్‌ రమేష్‌, కృష్ణయ్య, వెంకట్రాములు తదితరలు పాల్గొన్నారు.

  • శిథిలం నుంచి సుందరీకరణ

    మక్తల్‌: మక్తల్‌లో ప్రసిద్ధిగాంచిన పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో శిథిలాస్థకు చేరిన కోనేరు సుందరీకరణ దిశగా పయనిస్తోంది. గతంలో ఇదే కోనేరు నుంచి తీసుకెళ్లి ఆంజనేయస్వామికి పుష్కర స్నానం చేయించి పూజలు చేసేవారు. కాలక్రమంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో కోనేరు దుస్థితిని గమనించిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి.. మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం కోనేరు పూర్వవైభవం సంతరించుకోగా.. భక్తులు స్నానాలు ఆచరించేందుకు సౌకర్యాలు కల్పించారు.