Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సూపర్‌స్టార్‌ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమాకు తెలుగు హక్కుల ధరను రూ.60 కోట్లుగా మేకర్స్ నిర్ణయించారు. జైలర్ చిత్రం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దాని సీక్వెల్‌కు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.  

    జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఆ విజయాన్ని బట్టి సీక్వెల్‌కు భారీ రేట్లు చెప్పడం సహజమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే జైలర్‌కు ముందు, ఆ తర్వాత రజనీకాంత్‌కు తెలుగులో పెద్ద విజయాలు లేకపోవడం గమనార్హం.  

    రజనీకాంత్ నటించిన 'కూలి' చిత్రం తెలుగు రైట్స్ రూ.52 కోట్లకు (జీఎస్టీతో కలిపి) అమ్ముడయ్యాయి. వేట్టయాన్ సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. కానీ పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. ఈ లెక్కలన్నీ పరిశీలించి జైలర్-2కు రూ.60 కోట్ల రేటు ఫిక్స్ చేశారు. దాంతో జైలర్-2కు ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనే చర్చ మొదలైంది.

    జూన్ 12న థియేటర్లలోకి రానున్న జైలర్-2కు ముందు రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమా విడుదల కానుంది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే జైలర్-2కు థియేటర్లు దొరకడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల చివరి రేటు అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.  

    తమిళ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్‌లో విగ్రహాల స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్  పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ కనిపించనున్నారు. ఈ కథలో ఎస్‌జే సూర్య కొత్త విలన్‌గా పరిచయం కానున్నారు.  

  • సినిమా సెలబ్రిటీల ప్రేమ అనేది చాలా సాధారణమైన విషయం. ప్రేమలో పడటం, డేటింగ్ చేయడం లాంటివి వింటూనే ఉంటాం. హీరోయిన్ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో గతంలో డేటింగ్ చేసింది. మరి ఏమైందో ఏమో వీళ్లిద్దరూ విడిపోయారు. అలాంటిది తాజాగా తమన్నా చేసిన కామెంట్స్.. మళ్లీ ఈమె ప్రేమలో పడిందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)

    'ప్రేమ అనేది ఓ లావాదేవి కాదు. మనం ఎదుటి వ్యక్తికి ప్రేమ ఇస్తున్నప్పుడు తిరిగి దాన్ని ఆశించడం కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్ని సార్లయినా ప్రేమలో పడే అవకాశముంది. అది కేవలం ఒక్కరితే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి డిసైడ్ అయితే ఎన్నిసార్లయినా ప్రేమ పుడుతుంది. బంధాలు మనల్ని బంధించేవిగా ఉండకూడదు. మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలి' అని తమన్నా చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.

    'లస్ట్ స్టోరీస్ 2' షూటింగ్ టైంలో తమన్నా, విజయ్ వర్మ డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్లే బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. తమన్నా ఇలా డౌట్ వచ్చే కామెంట్స్ చేస్తుండగా.. విజయ్ వర్మ కూడా మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రీసెంట్‌గానే ఒకటి రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి.

    (ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి'కి నీటి కష్టాలు!)

  • మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'వారణాసి'. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే మూవీ టీమ్‌కి ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. చాలామందికి ఉన్నట్లే 'వారణాసి' బృందానికి కూడా నీటి కష్టాలు ఎదురయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

    (ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)

    మే 18 నుంచి హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్ ఏరియాలో వేసిన సెట్‌లో నీటి అడుగున సన్నివేశాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. శుద్ధి చేసిన నీరు భారీ మొత్తంలో అవసరముంది. దీంతో 10,000 లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని మూవీ టీమ్.. హైదరాబాద్ వాటర్ బోర్డుకి ధరఖాస్తు చేసినట్లు సంబంధిత లెటర్ ఒకటి వైరల్ అవుతోంది.

    అయితే 'వారణాసి' టీమ్ రిక్వెస్ట్‌ని హైదరాబాద్ వాటర్ బోర్డ్ తిరస్కరించిందట. నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వివిధ ప్రాంతాల నుంచి నీటి డిమాండ్ పెరగడంతోనే.. నిర్మాతలకు వాటర్ ట్యాంకర్లు పంపించలేమని బోర్డ్ బదులిచ్చిందట. దీంతో నీటి కష్టాలు ఏర్పడ్డాయి. అయితే దీనికి వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదంటే వేసవి పూర్తయిన తర్వాత షూటింగ్ చేస్తారా అనేది చూడాలి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

    షూటింగ్‌కి బ్రేక్ దొరకడంతో ఈ మధ్యే జర్మనీ వెళ్లిన మహేశ్ బాబు.. బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ నీటి కష్టాల వల్ల వాయిదా లాంటివి జరగవుగా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

    (ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం)

  • తెలుగులో చాన్నాళ్ల నుంచి గీత రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఈయన సోదరుడు రాజేంద్ర గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    (ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)

    రాజేంద్ర.. వ్యాపారం కోసం బెంగళూరు నుంచి అన్నమయ్య జిల్లా కలికిరి నగరానికి వచ్చారు. తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో శనివారం రాత్రి బసచేశారు. ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేసుకున్న తర్వాత కలికిరి క్రాస్ రోడ్‌లో ఓ హోటల్‌లో టిఫిన్ చేశారు. తర్వాత వెంటనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

    (ఇదీ చదవండి: సమంత 'బంగారం'.. ఇలా అయిందేంటి?)

  • స్టైల్ మార్చి గ్లామర్ చూపిస్తున్న ఐశ్వర్యా రాజేశ్

    సింహంతో ఫొటోలు పోజులిచ్చిన హన్సిక

    ఒంపుసొంపులతో మాయ చేస్తున్న అనుపమ

    మత్తెక్కించేలా అదరగొట్టేస్తున్న శ్రద్ధా దాస్

    కుందనపు బొమ్మలా 'రాంబాయి' తేజస్వి

    చిరిగిన జీన్ డ్రస్‌తో ప్రగ్యా జైస్వాల్ స్మైల్

  • సమంత ఒకప్పుడు స్టార్ హీరోయినే కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎంతలా అంటే ఈమె సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ అవుతుందనే సంగతే జనాలకు తెలియనంతగా! కొన్నిరోజుల క్రితం కమెడియన్ వెన్నెల కిశోర్‌తో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు గానీ అదేం వర్కౌట్ అయినట్లు కనిపించలేదు. తీరా కట్ చేస్తే 'పెద్ది' వల్ల ఏర్పడిన కన్ఫ్యూజన్ దెబ్బకు సమంత సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా పడిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

    (ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)

    చివరగా విజయ్ దేవరకొండ 'ఖుషి'లో హీరోయిన్‌గా కనిపించిన సమంత.. తర్వాత ఓ వెబ్ సిరీస్ చేసింది గానీ సక్సెస్ అందుకోలేకపోయింది. గతేడాది రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి మరోసారి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ వేసవిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్లే మే 15న వస్తుందని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.

    మరి ఏమైందో ఏమో జూన్ తొలివారానికి వాయిదా పడే అవకాశముందనే రూమర్స్ వచ్చాయి. ఇంతలో 'పెద్ది'.. జూన్ 4 అనేసరికి 'మా ఇంటి బంగారం' ఆలోచనలో పడింది. ఇప్పుడు మే, జూన్ కాదు ఏకంగా జూలైకి వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో రాబోయే కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

    నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. గృహిణి పాత్ర చేసింది. కానీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని టీజర్‌తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఔట్‌పుట్ అంతా సిద్ధమైన వాయిదా వేయడం, అది కూడా రెండు నెలలు పాటు అనేది కాస్త చిత్రంగా అనిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీపై ఉన్న హైప్ కూడా తగ్గిపోయే ప్రమాదముంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి?

    (ఇదీ చదవండి: రజనీ సినిమాలో చిరంజీవి భార్య.. భర్తని తలుచుకుని ఎమోషనల్)

  • సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్‌ వీర్ పహారియాతో బ్రేకప్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తారా కానీ.. పహారియా కానీ స్పందించలేదు. విడిపోవడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

    అయితే అంతలోనే తారా సుతారియాపై మరో రూమర్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడిది బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌.. హీరోయిన్‌ అనన్య పాండేతో రిలేషన్‌ కొనసాగించారు. అయితే గతేడాది చివర్లో ముంబైలో జరిగిన కచేరీ వివాదం తర్వాత తారా, వీర్ పహారియాపై బ్రేకర్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బాలీవుడ్ భామ యశ్ చిత్రం టాక్సిక్‌లో కనిపించనుంది. 

     

  • కొన్నేళ్ల క్రితం మరణించిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన.. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తని తలుచుకుని భావోద్వేగానికి గురైంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఈమె, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 'జైలర్ 2' సినిమాలో నటించిన సంగతి బయటపెట్టింది. అలానే భర్త చిరంజీవికి సంబంధించిన జ్ఞాపకాలని పంచుకుంది.

    (ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)

    'ఈ రోజు ఒక తేదీ మాత్రమే కాదు మనద్దరి డ్రీమ్ ఒక్కటైన రోజు. నా ప్రతి అడుగులోనూ నిన్ను ఫీలవుతున్నాను. నువ్వు ఆయనని(రజనీకాంత్) ఆరాధించావు. నీ కోరిక వల్లే ఆయనని నేను కలిశాను. ఇది అసలు నేను కలలో కూడా ఊహించని విషయం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం 'జైలర్ 2'లో లభించింది. మనం సాధించాం. నా భర్తకే ఈ సినిమా అంకితం చేస్తున్నాను. ఈ సక్సెస్ అంతా అతడికే చెందుతుంది' అని మేఘనా సర్జా భావోద్వేంగా రాసుకొచ్చింది.

    రజనీతో దిగిన ఫొటోలోని పంచుకున్న మేఘనా సర్జా.. తన భర్తకు ఎంతో ఇష్టమైన భాషా బొమ్మపై స్వయంగా రజనీతో సంతకం కూడా చేయించింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    అల్లరి నరేశ్ 'బెండు అప్పారావు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మేఘనా.. తర్వాత కన్నడ, మలయాళ మూవీస్ చేస్తూ వచ్చింది. అలా హీరో చిరంజీవి సర్జాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ భర్త చనిపోయిన తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. మరి 'జైలర్ 2'లో ఈమె ఎలాంటి పాత్ర పోషించింది? ఏ మేరకు ఈమెకు గుర్తింపు తీసుకొస్తుందనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ఆ కెపాసిటీ నాకు లేదు.. అందుకే రజనీకాంత్ సినిమా నుంచి తప్పుకున్నా)

  • డైరెక్టర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారిలో రవిబాబు ఒకరు. తన టాలెంట్‌తో దర్శకుడిగా మాత్రమే కాదు.. హీరోగా కూడా మెప్పించారు. అలా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం రేజర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మే 8న విడుదల కానుంది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఇండస్ట్రీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో ఒళ్లు బలిసి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

    అంతేకాకుండా హీరోల అభిమానుల గురించి కూడా రవిబాబు ప్రస్తావించారు. వారి వల్లే హీరోలకు క్రేజ్ ఉందన్న మనందరికీ తెలుసు కదా అన్నారు. అలాంటప్పుడు ఫస్ట్ రోజే వాళ్ల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు లాగడమేంటని ప్రశ్నించారు. మొదటి రోజు ఫ్యాన్స్‌కు ఉచితంగా సినిమా వేయొచ్చు కదా అని సూచించారు. నువ్వు రెండో రోజు నుంచి రూ.1000 తీసుకున్నా ఫర్వాలేదని రవిబాబు అన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


     

  • స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశమొస్తే ఏ దర్శకనిర్మాత వదులుకోడు. దీన్ని ఉపయోగించి స్టార్‌డమ్ సొంతం చేసుకోవాలని అనుకుంటారు. కానీ తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి మాత్రం కమల్-రజనీ సినిమా నుంచి తప్పుకొన్నాడు. గతేడాది నవంబరులో ఇది జరిగింది. తొలుత ఇతడినే డైరెక్టర్ అని ఘనంగా ప్రకటించారు. కట్ చేస్తే కొన్నిరోజులకే సదరు ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాడు. ఇన్నాళ్లకు అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

    (ఇదీ చదవండి: 'టాలీవుడ్‌లో కుల పిచ్చి ఎక్కువ'.. కమెడియన్ మహేశ్)

    'నిజం చెప్పాలంటే ఆ సినిమా చేయడానికి సిద్ధమవగానే చాలా ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీస్తూ సినిమాలు చేశాను. కానీ రజనీ సినిమాని డీల్ చేసే కెపాసిటీ నాకు లేదనిపించింది. ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలని ఇతరులకు ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది. నాకు స్టోరీ సరిగా చెప్పడం రాదు. అదే టైంలో ఎవరైనా మార్పులు చెబితే ఎదురుతిరగకుండా ఓకే చెప్పేస్తాను'

    'ఇలాంటి పెద్ద సినిమా చేస్తే అందులో నా ఒక్కడి నిర్ణయమే ఉండదు. సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్‌కి నేను పూర్తిగా న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభంలోనే సినిమా నుంచి తప్పుకొన్నా. రజనీ-కమల్‌తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో నాకు కోరిక ఉంది. వారితో గడిపిన కొన్నిరోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కానీ అది నా జీవితంలో తీసుకున్న కష్టమైన నిర్ణయం. ఇలా చేయడానికి ముందే స్వయంగా రజనీకాంత్‌ని కలిసి విషయం చెప్పాను' అని సుందర్.సి వివరణ ఇచ్చాడు.

    గతంలో రజనీకాంత్‌తో 'అరుణాచలం', కమల్ హాసన్‌తో 'సత్యం శివం' సినిమాలు చేసిన సుందర్.సి.. తర్వాత నుంచి మాత్రం హారర్, మిడ్ రేంజ్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గత నెలలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ప్రస్తుతం నయనతార లీడ్ రోల్‌లో 'ముకుతి అమ్మన్ 2' అనే మూవీ చేస్తున్నాడు.

    (ఇదీ చదవండి: ఒకే పెళ్లి వేడుకలో సమంత, నాగచైతన్య)

  • కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌గా రాణిస్తున్న నటుడు శివకార్తికేయన్‌. ఈయన పరాశక్తి చిత్రం తర్వాత దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువబడింది. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బడ్జెట్‌  ఎక్కువ అవుతుందనే కారణంగా ఈ చిత్రాన్ని డ్రాప్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. 

    దీంతో ఇటీవల తాయ్‌ కిళవి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకున్న శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్నారు. దీనికి సెయోన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది పక్కా రూరల్‌ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. సంతోష్‌ నారాయణ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

     ఇదిలా ఉంటే తాజాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించే చిత్రం డ్రాప్‌ కాలేదని ఆ చిత్రం సమర్పకుడు టీజీ త్యాగరాజన్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రం డ్రాప్‌ కాలేదని చెప్పారు.  

  • యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మాతగా తొలి సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’తోనే హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. అందులో ఒక నటుడు లతీష్‌. తిమ్మరాజుపల్లి టీవీలో విలన్‌ సిద్ధయ్య పాత్రలో నటించి..ఆకట్టుకున్నాడు. తొలి మూవీతోనే నటుడిగా మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటున్నాడు లతీష్‌. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. తన సినీ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

    నగరిలో మాది వ్యవసాయ కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి.అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి నన్ను చదివించారు. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ సినిమా చూసి, అందులో నా పర్ఫామెన్స్ చూసి మాట్లాడాడు.

    చదువు పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు బెంగళూరులో ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్‌కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని అంటూ చెప్పారు. కానీ ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. మహిపాల్ వద్ద కొన్ని రోజులు అసిస్టెంట్‌గా పని చేశాను. ఆ తరువాత కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ టైంలో యూట్యూబ్‌లోనే ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. మళ్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేశాను.

    షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను. ఆ టైంలో కెమెరా కొనేందుకు ఇంట్లో వాళ్లనే డబ్బులు అడిగాను. నిర్మించేందుకు డబ్బులు పెట్టేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. నాకు ఏ అసోసియేషన్‌లోనూ మెంబర్ షిప్ లేదు. వేరే డైరెక్టర్ మీద ఆ కథను రిజిష్టర్ చేయించాను. నిర్మాత కూడా నన్నే డబ్బులు అడిగాడు. ఆ తరువాత నేను డా. షేక్ జాన్ బషీర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.

    తిమ్మరాజుపల్లిలో నాది విలన్‌ పాత్ర అనగానే.. ఒకప్పుడు విలన్‌గా నటించి తర్వాత హీరోలు అయిన నటులంతా గుర్తుకు వచ్చారు. సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం వెయిట్ పెరిగాను. ఏకంగా ముప్పై కిలోలు పెరిగి ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయా. సిద్దయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా? అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది.

    కిరణ్ అబ్బవరం అన్న సినిమా చూసిన తరువాత టీం అందరినీ మెచ్చుకున్నారు. అందులో మరీ ముఖ్యంగా ప్రదీప్ అన్నని, నన్ను ఎంతో ప్రశంసించారు. బయట ఇంత సైలెన్స్‌గా ఉన్నావ్.. స్క్రీన్ మీద అలా కనిపించావ్ ఏంట్రా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా చేశావ్ అని కిరణ్ అన్న మెచ్చుకున్నారు. నరేష్ అగస్త్య కూడా చాలా పొగిడారు. మా బషీర్ సార్ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. నలుగురు శిష్యులు ఒకే సినిమాలో నటించడంతో బషీర్ సార్ కూడా సంతోషించారు. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లిన తరువాత నా గురించి చెప్పి.. నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను.

    ప్రస్తుతం బీ స్టూడియోలో పార్ట్ టైంగా పని చేస్తున్నాను. చాలా మంది నుంచి ఫోన్స్ వస్తున్నాయి. చాలా కథలు వింటున్నాను. కానీ ఇంత వరకు ఏదీ క్లారిటీ రాలేదు. త్వరలోనే అన్నీ ఓ కొలిక్కి వచ్చేలా ఉన్నాయి.

  • అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ‍అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ‍అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.

    డకాయిట్ కథేంటంటే..

    తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.

     

  • మలయాళ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతన్నాయి. చిన్న సినిమాలైనా సరే వసూళ్లపరంగా రాణిస్తున్నాయి. ఇటీవల వాలా-2 సైతం ‍అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత మరో మలయాళ మూవీ భరతనాట్యం- 2 మోహినియాట్టం సైతం కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది.

    తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ శుక్రవారం అంటే మే 8వ తేదీ నుంచి ఓటీటీ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ డార్క్ కామెడీ మూవీలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్  కీలక పాత్రల్లో నటించారు. 
     

     

  • రకుల్ ప్రీత్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ పతి పత్నీ ఔర్‌ వో దో. ఈ సినిమాకు ముదస్సర్‌ అజీజ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సారా అలీ ఖాన్, వామికా గబ్బీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

    ట్రైలర్ చూస్తుంటే పెళ్లి తర్వాత మరో ఇ‍ద్దరు అమ్మాయిలతో రిలేషన్‌ నేపథ్యంలో కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు అమ్మాయిలను ఎలా డీల్ చేశాడన్నదే పతి పత్నీ ఔర్‌ వో దో. ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కథ ఉండనుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ప్రజాపతి పాండే పాత్రలో  ఆయుష్మాన్‌ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     

  • కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన పాన్‌ వరల్డ్‌ చిత్రం టాక్సిక్‌. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చిలోనే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషంలో జూన్‌ 4వ తేదికి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌లో కూడా ఈ చిత్రం విడుదల కావడం లేదు. సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చిందని..ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. సినిమా ప్రమోషన్స్‌ కోసమే వాయిదా వేస్తున్నట్లు యశ్‌ ప్రకటించారు. కొత్త తేదిని త్వరలో ప్రకటించనున్నారు.

    ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ గాసిప్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ.. చిత్రబృందానికి వింత విజ్ఞప్తి చేసిందట. షూటింగ్‌ సమయంలో కథ డిమాండ్‌ మేరకు యశ్‌, కియారాల మధ్య కొన్ని బోల్డ్‌ సీన్లు చిత్రీకరించారట. 

    ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని కియారాకి ముందే చెప్పారట. ఆమె అన్నింటికి ఒప్పుకొనే సినిమాకు సైన్‌ చేసిందట. ఇష్టంతోనే బోల్డ్‌ సీన్లు చేసినప్పటికీ.. ఫైనల్‌ కట్‌ చూసి ఇప్పుడు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బోల్డ్‌ సీన్లు తెరపై మరింత ఘటూగా ఉన్నాయని..వాటిని అలాగే చూపిస్తే తన ఇమేజ్‌పై ప్రభావం పడుతుందని భయపడుతుందట. అందుకే వాటిని తొలగించడా లేదా నిడివి తగ్గించే ప్రయత్నం చేయమని దర్శకురాలికి రిక్వెస్ట్‌ చేసినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

    అయితే ఆయా సన్నివేశాలు కథకి చాలా కీలకమని..వాటిని తొలగిస్తే సినిమాలోని భావోద్వేగ తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారట. మరి కియారా రిక్వెస్ట్‌ మేరకు ఆ సీన్లను తొలగిస్తారా లేదా అలానే ఉంచుతారా అనేది తెలియాలంటే రిలీజ్‌ వరకు ఎదురు చూడాల్సిందే.  

  • యూట్యూబర్‌ కెరీర్‌ స్టార్ట్ చేసిన టాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడిన కొద్దిమందిలో మహేశ్ విట్టా ఒకరు. చాయ్ బిస్కెట్ వెబ్ సిరీస్‌ల ద్వారా వినోదాన్ని పంచిన మహేశ్.. ఆ తర్వాత బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్‌ సినిమాల్లో కమెడియన్‌గా తన నటనతో ప్రత్యేక ముద్రవేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూ హాజరైన మహేశ్ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ గురించి ప్రస్తావించారు. తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

    సినీ ఇండస్ట్రీలో కుల పిచ్చి ఎక్కువని సంచలన కామెంట్స్ చేశారు. ఆడిషన్ పూర్తయిన తర్వాత నాకు రావాల్సిన రోల్స్‌ను చివరి నిమిషంలో వేరేవాళ్లకు ఇచ్చేవారని అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేయడం కూడా ఆపేసే వారని తెలిపారు. ఇక్కడ టాలెంట్‌ కంటే.. కులం ముఖ్యమని నాకు అర్థమైందన్నారు. అలా నాకు ఎన్నో అవకాశాలు రాకుండా పోయాయని మహేశ్ విట్టా ఆవేదన వ్యక్తం చేశారు.

    గత ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ..' నేను చాలా పాత్రలకు ఆడిషన్లు ఇచ్చేవాడిని. నన్ను సెలెక్ట్ కూడా చేసేవారు. షూటింగ్ తేదీలు కూడా ఫిక్స్ చేసేవారు. కానీ చివరి నిమిషంలో నాకు ఫోన్ చేయడం ఆపేయడం.. నా స్థానంలో మరో నటుడిని తీసుకోవడం జరిగేది. మొదట్లో ఇదంతా నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ విషయంపై ఆరా తీశా. నా స్థానంలో వచ్చిన వ్యక్తి నిర్మాత, దర్శకుడి సామాజిక వర్గానికి చెందినవాడేనని తెలిసి షాక్ అయ్యా. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం క్యాస్ట్ కారణంగా నాకు అవకాశాలు దక్కకపోవడం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసింది' అని అన్నారు.

    కాగా.. యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్‌లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు.  బిగ్‌బాస్ షోలోనూ రెండుసార్లు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సినిమాలు చేస్తూనే శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
     

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. 

    అయితే గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ చివ​రి ఓవర్‌ వరకు సాగింది. ఈ మధ్యలో పం​జాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బార్ట్‌లెట్‌ (4-0-38-2), అర్షదీప్‌ సింగ్‌ (4-0-24-2), జన్సెన్‌ (4-0-33-1), విజయ్‌ కుమార్‌ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. 

    ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్‌లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌ వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (5), నిషాంత్‌ సంధు (15), తెవాతియా (2), హోల్డర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. బట్లర్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అర్షద్‌ ఖాన్‌ (8 నాటౌట్‌) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.

    అంతకుముందు పంజాబ్‌ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. సూర్యాంశ్‌ షేడ్గే (57), మార్కస్‌ స్టోయినిస్‌ (40), ఆఖర్లో మార్కో జన్సెన్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్‌ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. 

    మిగతా బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్‌ సుతార్‌ (1-0-27-0), అర్షద్‌ ఖాన్‌ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్‌ 15, కూపర్‌ కన్నోల్లీ డకౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 19, నేహల్‌ వధేరా, జేవియర్‌ బార్ట్‌లెట్‌ డకౌటయ్యారు. విజయ్‌ కుమార్‌, అర్షదీప్‌ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. 
     

  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచే వేధిస్తున్న గాయాల సమస్య ఆ జట్టును మరోసారి గట్టి దెబ్బేసింది. గత మ్యాచ్‌లోనే (ముంబై ఇండియన్స్‌) అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ రామకృష్ణ ఘోష్‌ తన తొలి మ్యాచ్‌లోనే గాయపడి సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఘోష్‌ కుడి పాదానికి ఫ్రాక్చర్‌ అయ్యింది.

    ఘోష్‌ సీజన్‌ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం​ అధికారికంగా ప్రకటించింది. ఘోష్‌ తన తొలి మ్యాచ్‌లోనే ఓ మోస్తరు ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలకమైన సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్‌ తీశాడు. ఈ వికెట్‌కు ముందే ఘోష్‌ అందరి మన్ననలు అందుకున్నాడు. విల్‌ జాక్స్‌ను ఔట్‌ చేయడానికి అతను పట్టిన అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

    వాస్తవానికి ఘోష్‌ తన తొలి బంతికే గాయపడ్డాడు. ఫాలో త్రూలో అతని కాలు మెలిక పడినట్లు క్లియర్‌గా తెలిసింది. అయినా అతను మరో 17 బంతులు బౌలింగ్‌ చేశాడు. 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ కూడా చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మంచి ఇంప్రెషన్‌ తెచ్చుకున్న ఘోష్‌ అదే మ్యాచ్‌లో గాయపడటం దురదృష్టకరం.

    ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపు అనంతరం కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఘోష్‌పై ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లోనూ మంచి సామర్థ్యం చూపించాడని కొనియాడాడు. 

    ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి ముంబైను 159 పరుగులకే కట్టడి చేసిన సీఎస్‌కే, ఆతర్వాత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్‌లో అన్షుల్‌ కంబోజ్‌ (4-0-32-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-2), జేమీ ఓవర్టన్‌ (4-0-23-1) రాణించగా.. బ్యాటింగ్‌లో రుతురాజ్‌ (67 నాటౌట్‌), కార్తీక్‌ శర్మ (54 నాటౌట్‌) సత్తా చాటారు.

    గాయాల శాపం
    ఈ సీజన్‌లో సీఎస్‌కేకు గాయాల శాపం వెంటాడుతోంది. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, అయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ జట్టు దిగ్గజం ధోని కాలి కండరాల గాయంతో సతమతమవుతూ ఇంకా బరిలోకి దిగలేదు. 

    ప్రస్తుతం రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎస్‌కే త్వరలోనే ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సీఎస్‌కే 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
     

  • టీమిండియా టెస్ట్‌, వన్డే.. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.

    త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.

    గిల్‌.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్‌ నటీమణులు సారా అలీ ఖాన్‌, అవ్‌నీత్‌ కౌర్‌, సోనమ్‌ బజ్వా ప్రేమాయణం​ సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.

    తన పెళ్లి, డేటింగ్‌పై వచ్చిన వార్తలను గిల్‌ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్‌ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే, గిల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ గత సీజన్‌లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

    ఈ సీజన్‌లో గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

    ఇవాళ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్‌ షేడ్గే (58), మార్కస్‌ స్టోయినిస్‌ (29) కలిసి పంజాబ్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 126-5గా ఉంది.

  • కేకేఆర్‌ వెటరన్‌ బ్యాటర్‌ మనీశ్‌ పాండే చరిత్ర సృష్టించాడు. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ తర్వాత ఐపీఎల్‌ అన్ని ఎడిషన్లలో (19) కనీసం ఒక్క మ్యాచ్‌ ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ తరఫున బరిలోకి దిగడంతో ఈ రేర్‌ ఫీట్‌ను అందుకున్నాడు.

    ఐపీఎల్‌ అరంగేట్రం ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మనీశ్‌.. అప్పటి నుంచి వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున నిరంతర ప్రయాణం కొనసాగించాడు. ప్రతి సీజన్‌లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి స్థిరత్వాన్ని చాటుకున్నాడు. ఈ సీజన్‌లో మనీశ్‌కు సన్‌రైజర్స్‌ మ్యాచే తొలి మ్యాచ్‌. 

    ఈ మ్యాచ్‌లో అతను రమన్‌దీప్‌ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అతనికి బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ బ్యాటర్లు మనీశ్‌ వరకు రాకుండానే ఛేదించారు.

    ధోనీ కూడా చేరొచ్చు
    విరాట్‌, రోహిత్‌, మనీశ్‌ సరసన ధోని కూడా చేరే అవకాశం ఉంది. ధోని సైతం గత 18 ఐపీఎల్‌ ఎడిషన్లలో కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాడు. ఈ సీజన్‌లో అతను బరిలోకి దిగాల్సి ఉంది. ధోని గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

    ఐపీఎల్‌లో మనీశ్‌ ప్రస్థానం
    ముంబై ఇండియన్స్‌తో కెరీర్ ప్రారంభించిన మనీశ్‌.. ఆపై ఆర్సీబీ, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మొత్తం ఏడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌లో 175 మ్యాచ్‌లు ఆడిన మనీశ్‌ సెంచరీ, 22 అర్ద సెంచరీల సాయంతో 3942 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్‌ రేట్‌ 121.5గా ఉంది. 

  • ఐపీఎల్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ షాకిచ్చింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ‍మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధిం‍చింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. 

    కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్‌(29), రింకూ సింగ్‌(22 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్‌, కమ్మిన్స్, శివాంగ్‌ కుమార్‌ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. 

    ఓ దశలో 105/2తో ప‌టిష్టంగా క‌న్పించిన స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం 60 ప‌రుగుల వ్య‌వ‌ధిలో 8 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

  • పంజాబ్‌పై గుజరాత్‌ గెలుపు
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్‌ సుందర్‌ (40 నాటౌట్‌) సిక్సర్‌ బాది గుజరాత్‌ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. 

    అయితే గుజరాత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ చివ​రి ఓవర్‌ వరకు సాగింది. ఈ మధ్యలో పం​జాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బార్ట్‌లెట్‌ (4-0-38-2), అర్షదీప్‌ సింగ్‌ (4-0-24-2), జన్సెన్‌ (4-0-33-1), విజయ్‌ కుమార్‌ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. 

    ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్‌ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్‌లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌ వచ్చింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (5), నిషాంత్‌ సంధు (15), తెవాతియా (2), హోల్డర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. బట్లర్‌ (26) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అర్షద్‌ ఖాన్‌ (8 నాటౌట్‌) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.

    నాలుగో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    14.5వ ఓవర్‌- 124 పరుగుల వద్ద గుజరాత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్‌ ఇచ్చి సాయి సుదర్శన్‌ (57) ఔటయ్యాడు.

    మూడో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    11.3వ ఓవర​్‌- 94 పరుగుల వద్ద గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్టోయినిస్‌ బౌలింగ్లో విజయ్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి నిషాంత్‌ సింధు (15) ఔటయ్యాడు.

    రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    8.1వ ఓవర్‌- 69 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి బట్లర్‌ (26) ఔటయ్యాడు. 

    ఆదిలోనే గుజరాత్‌కు షాక్‌
    1.3వ ఓవర్‌: 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (5) రెండో ఓవర్‌లోనే అర్షదీప్‌ బౌలింగ్‌లో కూపర్‌ కన్నోల్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

    పంజాబ్‌ స్కోర్‌ 163-9
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. సూర్యాంశ్‌ షేడ్గే (57), మార్కస్‌ స్టోయినిస్‌ (40), ఆఖర్లో మార్కో జన్సెన్‌ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ (4-0-24-4) పంజాబ్‌ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్‌ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టారు. 

    మిగతా బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్‌ సుతార్‌ (1-0-27-0), అర్షద్‌ ఖాన్‌ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్‌ ఆర్మ 2, ప్రభ్‌సిమ్రన్‌ 15, కూపర్‌ కన్నోల్లీ డకౌట్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 19, నేహల్‌ వధేరా, జేవియర్‌ బార్ట్‌లెట్‌ డకౌటయ్యారు. విజయ్‌ కుమార్‌, అర్షదీప్‌ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. 

    పతనం అంచుల్లో పంజాబ్‌
    పంజాబ్‌ కింగ్స్‌ మరోసారి వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లో సిరాజ్‌, 18వ ఓవర్‌లో హోల్డర్‌ ఈ ఘనత సాధించారు. తాజాగా హోల్డర్‌ స్టోయినిస్‌ (40), బార్ట్‌లెట్‌ (0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. 

    ఆరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    15.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద పంజాబ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ షేడ్గే (57) ఔటయ్యాడు. 

    పీకల్లోతు కష్టాల్లో పంజాబ్‌
    8.4వ ఓవర్‌- 47 పరుగుల వద్ద పంజాబ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. హోల్డర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (19) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    కష్టాల్లో పంజాబ్‌
    6.3వ ఓవర్‌- పంజాబ్‌ జట్టు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తాజాగా నేహల్‌ వధేరాను (0) హోల్డర్‌ ఔట్‌ చేశాడు. బట్లర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. 

    మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    5.2వ ఓవర్‌- 35 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మానవ్‌ సుతార్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15) ఔటయ్యాడు. 

    తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌
    పంజాబ్‌ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వరుస బంతుల్లో ప్రియాంశ్‌ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్‌ చేశాడు.

    తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
    0.2వ ఓవర్‌- ఇన్నింగ్స్‌ రెండో బంతికే పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో నిషాంత్‌ సంధుకు క్యాచ్‌ ఇచ్చి ప్రియాంశ్‌ ఆర్మ (2) ఔటయ్యాడు.

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నగుజరాత్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 3) జరుగుతున్న 46వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. 

    ప్రస్తుతం పంజాబ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్‌ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి, ఓ మ్యాచ్‌లో ఓడగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొంది.

    తుది జట్లు..
    పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్

  • ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ రోవ్‌మన్ పావెల్ మరోసారి తన సంచలన ఫీల్డింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పావెల్ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

    ఎస్‌ఆర్‌హెచ్ డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌ను సూపర్ క్యాచ్‌తో పావెల్ పెవిలియన్‌కు పంపాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన  కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని క్లాసెన్  లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాలిలోకి లేచింది.

    ఈ క్రమంలో డీప్ మిడ్ వికెట్ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన రోవ్‌మన్ పావెల్..  తన కుడివైపు గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఉప్పల్ మైదానంలో ప్రేక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

    కాగా ఈ క్యాచ్‌ను అందుకునే క్రమంలో పావెల్‌ తలకు గాయం కూడా అయ్యే అవకాశముండేది. అయినప్పటికి రిస్క్‌ తీసుకుని మరి పావెల్‌ బంతిని ఒడిసిపట్టాడు. కాగాఇదే సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పావెల్‌ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. 

    ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 19 ఓవర్లలో 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సీఎస్‌కే చిచ్చర పిడుగు




     

     

  • శ్రీలంక క్రికెట్‌ బోర్డు చారిత్రక సిరీస్‌ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్‌ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్‌ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్‌లో పర్యటించింది. 

    ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్‌కు వెళ్లనుంది.

    ఈ సిరీస్‌ పూర్తి షెడ్యూల్

    వన్డేలు – సబీనా పార్క్, కింగ్‌స్టన్
    జూన్ 3 – తొలి వన్డే
    జూన్ 6 – రెండో వన్డే
    జూన్ 8 – మూడో వన్డే

    టీ20లు – సబీనా పార్క్
    జూన్ 11 – తొలి టీ20
    జూన్ 13 – రెండో టీ20
    జూన్ 14 – మూడో టీ20

    టెస్టులు – సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియం, ఆంటిగ్వా
    జూన్ 25 నుంచి తొలి టెస్టు
    జూలై 3 నుంచి రెండో టెస్టు

    ఇరు జట్లకు కీలకం
    ఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్‌వాష్ చేసింది.

    కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 డిజాస్టర్‌ తర్వాత శ్రీలంక క్రికెట్‌ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్‌ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది. 
     

  • ఉప్పల్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు  నిరాశపరిచారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌కు  ఓపెనర్లు ఎప్పటిలాగే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 45 పరుగుల వద్ద అభిషేక్ రూపంలో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది.

    అయినప్పటికి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై మాత్రం విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కిషన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ హెడ్‌గా తోడుగా నిలిచాడు.

    వీరిద్దరి ధాటికి 9 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది. అయితే 9వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆఖరి బంతికి హెడ్(61) ఔటయ్యాడు. హెడ్ ఔటైప్పటికి ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ 9 ఓవర్లకు 105 పరుగులగా ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది. 

    ప్రతీ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో వెన్నుమకగా నిలిచిన క్లాసెన్ సైతం నిరాశపరిచాడు. 11 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత డెబ్యూ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ కూడా వెంటనే ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు అనికేత్ వర్మ, ఆరోరా కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి కిషన్ క్రీజులో ఉండడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ సాధిస్తుందని భావించారు.

    కానీ 42 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం లోయార్డర్ బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ కేవలం 60 పరుగుల వ్యవధిలో మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధంచారు.
     

  • కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా, ఓవరాల్‌గా మూడో బౌలగా రికార్డు నెలకొల్పాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 

    నరైన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి (2012) కేకేఆర్‌కు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మిగతా ఇ‍ద్దరు బౌలర్లు చహల్‌ (228), భువనేశ్వర్‌ కుమార్‌ (215) ఒకటికి మించి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు.

    నరైన్‌ తన 197 మ్యాచ్‌ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఓ 5 వికెట్ల ప్రదర్శన, ఏడు 4 వికెట్ల ప్రదర్శనల సాయంతో 201 వికెట్లు తీశాడు. నరైన్‌ ఎకానమీ (6.79) టాప్‌-2 బౌలర్లు చహల్‌ (8.02), భువీ (7.68) కంటే తక్కువ ఉండటం​ మరో రికార్డు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాల్టి (మే 3) మధ్యాహ్నం మ్యాచ్‌లో నరైన్‌ ఈ చారిత్రక మైలురాయిని అధిగమించాడు. 

    ఈ మ్యాచ్‌లో నరైన్‌ 4 ఓవర్లలో 31 పరుగులకు 2 వికెట్లు తీశాడు. తొలుత తీసిన సలీల్‌ అరోరా వికెట్‌ నరైన్‌కు డబుల్‌ సెంచరీ వికెట్‌. ఆతర్వాత అతను కీలకమైన ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కూడా తీసి సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బ కొట్టాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ కేకేఆర్‌ బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నరైన్‌తో పాటు వరుణ్‌ చక్రవర్తి (4-0-36-3),  వైభవ్‌ ఆరోరా (2.3-0-23-1) కార్తీక్‌ త్యాగి (3-0-24-1), గ్రీన్‌ (3-0-34-1), అనుకూల్‌ రాయ్‌ (1-0-8-1) సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెట్టారు. 

    సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌ (61) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. ఇషాన్‌ కిషన్‌ (42) రాణించాడు. మిగతా ఆటగాళ్లలో అభిషేక్‌ శర్మ 15, క్లాసెన్‌ 11, స్మరణ్‌ రవిచంద్రన్‌ 4, అనికేత్‌ వర్మ 6, సలీల్‌ అరోరా 2, కమిన్స్‌ 10, శివాంగ్‌ కుమార్‌ 1 పరుగుకు ఔటయ్యారు. హర్షల్‌ పటేల్‌ 1, ఎషాన్‌ మలింగ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

     

     

  • ఐపీఎల్‌ 2026 మధ్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టైటిల్‌ ప్రధాన పోటీదారుల్లో ఒకటైన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్య హక్కులు చేతులు మారాయి. స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ నేతృత్వంలోని కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 1.65 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15,660 కోట్లు)గా అంచనా వేయబడింది.

    మిత్తల్ కుటుంబం ఈ ఫ్రాంచైజీలో సుమారు 75 శాతం వాటాను కలిగి ఉండనుంది. అదార్‌ పూనావాలా 18 శాతం వాటాను పొందగా, మిగిలిన 7 శాతం వాటా ప్రస్తుత పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. ప్రస్తుత ప్రధాన యజమాని మనోజ్‌ బదలే ఫ్రాంచైజీతో అనుబంధాన్ని కొనసాగించనున్నారు.

    లక్ష్మీ మిత్తల్‌కు రాజస్థాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను ఇక్కడే జన్మించారు. అందుకే రాజస్థాన్ రాయల్స్‌తో అనుబంధం తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన జట్టులో భాగమవడం నాకు ఎంతో గౌరవంగా ఉందని ఆయన  చెప్పుకొచ్చారు.

    ఒప్పందంలో భాగమే..!
    ఈ కొనుగోలు మిగతా రాయల్స్‌ ఫ్రాంచైజీలకు కూడా వర్తించనుంది. రాజ​స్థాన్‌ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని పార్ల్‌ రాయల్స్‌, కరీబియర్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని బార్బడోస్‌ రాయల్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. తాజా డీల్‌తో ఈ ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు కూడా చేతులు మారాయి. ఈ ఫ్రాంచైజీల్లో కూడా 75 శాతం వాటా మిత్తల్‌ గ్రూప్‌ ఆధీనంలోకి రానుంది.

    అనుమతులు మిగిలి ఉన్నాయి
    ఈ ఒప్పందం అమలుకు బీసీసీఐ, సీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సహా సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం. అన్ని అనుమతులు లభిస్తే 2026 మూడో త్రైమాసికంలో ప్రక్రియ పూర్తికానుంది.

    అతిభారీ డీల్స్‌లో ఒకటి
    ఈ కొనుగోలు ఐపీఎల్ చరిత్రలోనే అతి భారీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే ఎలాంటి జంఝాటం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 
     

  • ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ యువ ఆట‌గాడు కార్తీక్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు త‌న బ్యాట్ ఝుళిపించాడు. ఈ ధనాధన్ లీగ్‌లో భాగంగా శనివారం చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 160 పరుగుల లక్ష్య చేధనలో అతడు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

    రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న కార్తీక్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే తరపున హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కార్తీక్ నిలిచాడు. కార్తీక్ కేవలం 20 ఏళ్ల 6 రోజుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా ముంబైపై తక్కువ వయసులో 50కు పైగా పరుగులు చేసిన జాబితాలో కార్తీక్ మూడో స్ధానంలో నిలిచాడు. తొలి రెండు స్ధానాల్లో సంజూ శాంసన్‌, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.

    కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో కార్తీక్ శర్మను రూ.14 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. అయితే సీజన్ ఆరంభ మ్యాచ్‌లలో అతడు రాణించకపోవడంతో ఫ్యాన్స్ విమర్శించారు. కానీ ఇప్పుడు తనలోని అసలైన ఆటను కార్తీక్ బయటపెట్టాడు.
    చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీ 'అన్ ప్రొఫెషనల్'?.. తన వ్యాఖ్యలపై జితేష్‌ క్లారిటీ
     

  • IPL 2026 SRH vs KKR Live Updates: ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ‍మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధిం‍చింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. 

    కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్‌(29), రింకూ సింగ్‌(22) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్‌, కమ్మిన్స్,శివాంగ్‌ తలా వికెట్ సాధించారు. 

    మూడో వికెట్‌ డౌన్‌
    రఘువంశీ(59) రూపంలో కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    133 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన రహానే.. షకీబ్‌ హసన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    విజయం దిశగా కేకేఆర్‌
    11 ఓవర్లకు కేకేఆర్‌ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో రహానే(36), రఘువంశీ(37) ఉన్నారు. కేకేఆర్‌ విజయానికి 54 బంతుల్లో 56 పరుగులు కావాలి.

    7 ఓవర్లకు కేకేఆర్‌ స్కోరెంతంటే?
    7 ఓవర్లకు కేకేఆర్‌ వికెట్‌ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో రహానే(27), రఘువంశీ(17) ఉన్నారు.

    కేకేఆర్‌ తొలి వికెట్‌ డౌన్‌
    49 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 29 పరుగులు చేసిన ఫిన్‌ అలెన్‌.. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌
    166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లకు కేకేఆర్‌ స్కోర్‌ 22/0. క్రీజులో రహానే(15), ఫిన్‌ అలెన్‌(7) ఉన్నారు.

    కేకేఆర్‌ టార్గెట్‌ ఎంతంటే?
    ఉప్పల్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు  నిరాశపరిచారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ట్రావెస్‌ హెడ్‌(61), ఇషాన్‌ కిషన్‌(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్‌ తలా రెండు వికెట్లు సాధంచారు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిదో వికెట్‌ డౌన్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన పాట్‌ కమ్మిన్స్‌ అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో వికెట్‌ డౌన్‌
    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. 14వ ఓవర్‌ వేసిన వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో  అనికేత్‌ వర్మ ఔట్‌ కాగా.. 16వ ఓవర్‌లో ఆరోరాను నరైన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    122 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన స్మరణ్‌ రవిచంద్రన్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    క్లాసెన్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన క్లాసెన్‌.. గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 121/3

    కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌
    కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 61 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దుమ్ములేపుతున్న హెడ్‌
    8 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌(55), ఇషాన్‌ కిషన్‌(18) ఉన్నారు.

    ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    అభిషేక్‌ శర్మ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ.. కార్తీక్‌ త్యాగీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 45/1

    దూకుడుగా ఆడుతున్న హెడ్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ దూకుడుగా ఆడుతున్నాడు.హెడ్ కేవ‌లం 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 27 ప‌రుగులు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌ 3 ఓవ‌ర్ల‌కు 37/0

    ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ మైదానం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు.

    అతడి స్ధానంలో స్మరణ్ రవిచంద్రన్ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా హర్షల్ పటేల్ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కేకేఆర్ కూడా తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ఫిన్ అలెన్‌తో పాటు మనీశ్ పాండేకు అవకాశమిచ్చారు.

    తుది జట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్ : అజింక్య రహానే(కెప్టెన్‌), అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్‌), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తి

    సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో  ముంబై ఇండియ‌న్స్ ఆట దాదాపు ముగిసిన‌ట్లే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసిన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ చేరే అవ‌కాశాలు కోల్పోయింది. పాయింట్ల పట్టిక‌లో 9వ స్థానంలో కొన‌సాగుతుంది. శ‌నివారం సీఎస్‌కే చేతిలో ఓట‌మి చ‌విచూసిన త‌ర్వాత ముంబై ఇండియ‌న్స్ విష‌యంలో ఒక అంశం చ‌ర్చ‌కు దారి తీసింది. 

    టీమిండియాకు ఆడుతున్న ఆట‌గాళ్ల‌లో ఎక్కువ మంది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులోనే ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా స‌హా రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌లు కీల‌క ఆట‌గాళ్లు. ఇందులో రోహిత్ గాయంతో డ‌గౌట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఇక మిగిలిన ఆట‌గాళ్ల‌లో కెప్టెన్ పాండ్యా సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సూర్య‌కుమార్‌, తిల‌క్ వ‌ర్మ‌, బుమ్రాలు దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డం ముంబై కొంప ముంచుతుంది. 

    ఈ సీజ‌న్‌లో బుమ్రా ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున 9 మ్యాచ్‌లాడి కేవ‌లం మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక సూర్య‌కుమార్ పేల‌వ ఫామ్ ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. తొమ్మిది మ్యాచ్‌లు క‌లిపి కేవ‌లం 20 స‌గ‌టుతో ప‌రుగులు సాధించాడు. తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీ సాధించిన‌ప్ప‌టికీ ఆ మురిపెం ఒక్క మ్యాచ్‌కే ప‌రిమిత‌మైంది. ఈ ముగ్గురు అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్లు విఫ‌లం కావ‌డంపై ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే స్పందించాడు. 

    సీఎస్‌కేతో మ్యాచ్ అనంత‌రం ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో జ‌య‌వ‌ర్ద‌నే మాట్లాడాడు. ‘నిజానికి ఈ ముగ్గురి వ‌ల్లే ముంబై ఇండియ‌న్స్ దారుణ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే సూర్య‌, తిల‌క్‌, బుమ్రాలు ఇప్ప‌టికే వారేంటో నిరూపించుకున్నారు. ఒక్క‌సారి సూర్య‌కుమార్ ట‌చ్‌లోకి వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే అత‌డు కుదురుకోవ‌డానికి రెండు, మూడు ఇ న్నింగ్స్‌లు చాలు. 

    కానీ ఈ సీజ‌న్‌లో మాకు ఆ స‌మ‌యం దాటిపోయింది. ఇక తిల‌క్ వ‌ర్మ ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే ఉన్నాడు. త‌న‌దైన రోజున ధాటిగా ఆడ‌గ‌ల స‌త్తా ఉన్న తిల‌క్ వ‌ర్మ అనుభ‌వం పెరిగిన కొద్దీ ఆట‌లో మ‌రింత రాటుదేలుతాడ‌న్న నమ్మ‌కం నాకుంది. అయితే తిలక్ వ‌ర్మ టీ20 క్రికెట్‌లో అన్ని ర‌కాల పాత్ర‌ల‌ను పోషిస్తున్నాడు. టీ20 క్రికెట్ ఆడ‌డం అంత ఈజీ కాదు. ఒక్కోసారి ప‌రిస్థితి చేయి దాటిపోతుంది. బుమ్రా రాణించ‌క‌పోవ‌డం వ‌ల్ల ముంబై ఇండియ‌న్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. 

    కానీ బుమ్రా ఒక్క‌డే కాదు ముంబై బౌల‌ర్లంతా క‌లిసిక‌ట్టుగా ఆడ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. మిగ‌తా బౌల‌ర్లు కూడా వికెట్లు తీస్తే బుమ్రాపై ఒత్తిడి త‌గ్గ‌డంతో పాటు వికెట్లు తీసే అవ‌కాశ‌ముంటుంది.’ అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: అదే జ‌రిగితే ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియ‌న్స్‌!

  • రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ "అన్‌ప్రొఫెషనల్" అనడం సోషల్‌ మీడియాలో పెను దుమారం రేపింది. జితేష్ ఇటీవల సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జితీష్ మాట్లాడుతూ.. "వైభవ్‌కు అస్సలు ప్రొఫెషనలిజం లేదు. 

    ప్రతీ ఒక్కరూ అతడిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు మైదానంలో బాగానే ఉంటున్నాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాడు. నేనూ అతడిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినవద్దని చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట వినడం లేదు అని చెప్పుకొచ్చాడు.

    అయితే వైభవ్ పట్ల జితేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీశాయి. తను చేసిన కామెంట్స్‌పై తాజాగా జితేష్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ తనకు మంచి స్నేహితుడని, ఆన్‌ది ఫీల్డ్, ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉంటాడో అన్నది వివరించాని జితేష్ తెలిపాడు. తన వ్యాఖ్యలను తప్పు ఆర్ధంగా చేసుకున్నారని ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు చెప్పుకొచ్చాడు.

    "వైభవ్ 15 ఏళ్ల పిల్లవాడు. అతడికి ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అతడు నా గదికి వచ్చి కూడా ఐస్‌క్రీమ్ తింటాడు. నేను తినను, అతడు మాత్రమే తింటాడు. ఒక చిన్న పిల్లాడు ఐస్‌క్రీమ్ కాకుండా ఇంకేం తింటాడు? వైభవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు మా ఇంటికి కూడా వస్తాడు, నా భార్యతో మాట్లాడతాడు.

    యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటాడు. అతడు నాకు తమ్ముడి లాంటి వాడు. బయట వ్యక్తులు ఏమునుకున్నా నేను పట్టించుకోను. నేను అతడి అల్లరిని ఉద్దేశించి ప్రొఫెషనల్‌గా లేడు అన్నా. అతడు అంత చిన్న వయస్సులో అద్బుతంగా రాణిస్తున్నాడు కాబట్టి, అందరూ అతడి నుంచి ఎక్కువగా  క్రమశిక్షణను ఆశిస్తున్నారు. 

    కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే.. అతడికి ఇంకా 15 ఏళ్లే. ఒక చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడిలాగే ఉండనివ్వండి. నేను అతడికి పూర్తి స్వేఛ్చ ఇస్తాను. నీకు ఇంకా పదిహేనేళ్లే కదా, టీవీ చూసుకో, నీకు నచ్చినవి తిను, కేవలం నీ బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టు అని చెబుతూ ఉంటా" అని జితీష్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 404 పరుగులు చేశాడు.

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షెడ్యూల్‌లో వారం రోజ‌ల పాటు గ్యాప్ రావ‌డంతో ఆర్సీబీ త‌మ ఆట‌గాళ్ల‌ను విహారయాత్ర కోసం మాల్దీవులకు పంపింది. టోర్నమెంట్ కీలక దశ ప్రారంభమయ్యే ముందు తమ ప్లేయర్లను మానసిక ఉల్లాసంగా ఉంచేందుకు ఆర్సీబీ మేనెజ్‌మెంట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది.

    ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ జట్టు స్టార్ పేసర్ జాకబ్ డఫీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. రజత్ పాటిదార్ సేన ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరింట విజయం సాధించింది. 

    ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే అహ్మదాబాద్ వేదికగా తాము ఆడిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మే 7న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. 

    విరాట్ కోహ్లి,  పడిక్కల్‌, పాటిదార్ వంటి స్టార్‌ బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, హాజిల్‌వుడ్ దుమ్ములేపుతున్నాడు. బెంగళూరు జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ పటిష్టంగా ఉంది. కాబట్టి మరోసారి ఆర్సీబీ టైటిల్ సొంతం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
    చదవండి: అంతా అయిపోయింది.. మాకేది కలిసి రాలేదు: హార్దిక్‌ పాండ్యా

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శ‌నివారం సీఎస్‌కేతో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓట‌మి పాలైన ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత క్లిష్టం చేసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవ‌లం రెండు విజ‌యాలు మాత్ర‌మే సాధించిన ఐపీఎల్ మాజీ చాంపియ‌న్ ఇప్పుడు ప్లేఆఫ్ చేర‌డం దాదాపు అసాధ్య‌మే. 

    అయితే కొంత అదృష్టం క‌లిసి రావ‌డంతో మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్ అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్పొచ్చు. కానీ ప్లేఆఫ్స్ చేరే క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌ ముందున్న దారి చాలా కఠినమ‌ని చెప్పొచ్చు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. 

    జట్టు నెట్ రన్ రేట్ (-0.803) సైతం చాలా దారుణంగా ఉండటం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. అయితే ప్రస్తుతం ముంబై వద్ద ఉన్నది కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే. అంటే, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై తన మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ క‌చ్చితంగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

    ఒకవేళ ముంబై అదృష్టం క‌లిసి వ‌చ్చి ఐదు మ్యాచ్‌లు గెలిచి న‌ప్ప‌టికీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు తమ మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. అదే స‌మ‌యంలో ముంబై తాము ఆడ‌బోయే ఐదింటిలో ఒక్క‌టి ఓడినా సీజ‌న్‌లో వారి ప్ర‌యాణం ముగిసిన‌ట్లే. 

    ముంబై త‌మ త‌ర్వాతి మ్యాచ్‌ల్లో భాగంగా సోమ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో, మే 10న రాయ్‌పూర్ వేదిక‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, మే 14న టేబుల్ టాపర్స్ పంజాబ్ కింగ్స్‌తో ధర్మ‌శాల‌లో తలపడాల్సి ఉంది. ఆ తర్వాత మే 20న‌ కోల్‌క‌తా నైట్ రైడర్స్‌, మే 24న రాజస్తాన్ రాయ‌ల్స్‌తో ఆడాల్సి ఉంది. 

    ఈ ఐదింటిలో గెల‌వ‌డంతో పాటు ర‌న్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. గణాంకాల పరంగా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ప్రస్తుత ఫామ్ చూసుకుంటే మాత్రం అద్భుతం జరిగితే తప్ప ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.

    చదవండి: ఐపీఎల్‌కు ధోని గుడ్‌బై.. వీడియో వైర‌ల్‌!

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫలం కావడంతో ముంబై ఈ ఘోర ఓటమిని మూట కట్టుకుంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని సీఎస్‌కే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బౌలర్లు మరోసారి విఫలమయ్యారు.

    ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ తాము మెరుగ్గా రాణించలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

    "కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, సీజన్ మొత్తం మాకు కలిసిరాలేదు. ఈ రోజు సీఎస్‌కే అన్ని విభాగాల్లో మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో మా స్కోర్ ఈజీగా 190 దాటుతుందని అని అనుకున్నాము. కానీ 10 ఓవర్ల తర్వాత మా రిథమ్‌ను కోల్పోయాం.  చివర్లో మెరుపులు మెరిపించడంలోనూ విఫలమయ్యాం.

    ఒకవేళ ఈ పిచ్‌పై 180 నుంచి 190 పరుగుల స్కోర్ వచ్చి పరిస్థితి మరో విధంగా ఉండేది. పిచ్ కాస్త స్లోగా ఉంది. అందుకే క్రీజులోకి రాగానే షాట్లు ఆడేందుకు కష్టమైంది. క్రీజులో సెటిల్ అయిన ప్రత్యర్ధి జట్టు బ్యాటర్లు సైతం ఇబ్బంది పడ్డారు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం చాలా అవ‌సరం. కానీ ఈ రోజు మా బ్యాట‌ర్లు బంతిని స‌రిగ్గా హిట్ చేయ‌లేక‌పోయారు. వారు మాకంటే బాగా బ్యాటింగ్ చేశార‌ని హార్దిక్ పేర్కొన్నాడు.

    అదేవిధంగా బౌలింగ్‌లో మీరు మరింత దూకుడుగా ఉండాల్సిందా? అన్న ప్ర‌శ్న కూడా పాండ్యాకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో ఎదురైంది. అందుకు హార్దిక్ కాస్త వ్యంగ్యంగా స‌మాధ‌న‌మిచ్చాడు. "ఇంకా ఎంత దూకుడుగా ఉండాలో నాకు తెలియ‌దు.  బహుశా వాళ్లను అవుట్ చేయడానికి నిప్పులు కురిపించే బంతులు వేయాలేమో. మా ద‌గ్గ‌ర ఉన్న ఆప్ష‌న్స్‌తోనే మేము బరిలోకి దిగాము" అని పాండ్యా వ్యాఖ్య‌నించాడు.
    చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ది చెర‌గ‌ని ప్ర‌స్థానం. ఐదుసార్లు ఐపీఎల్ చాంపియ‌న్ స‌హా అత్య‌ధిక సార్లు ఫైన‌ల్స్ ఆడిన జ‌ట్టుగా, ఎక్కువ‌సార్లు ప్లేఆఫ్ చేరిన జ‌ట్టుగా సీఎస్‌కే చ‌రిత్ర సృష్టించింది. వీట‌న్నింటికి మూల కార‌ణం ఎంఎస్ ధోని అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ధోని ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. 

    గాయంతో తొలి అంచె పోటీల‌కు దూరంగా ఉన్న ధోని గాయం నుంచి కోలుకున్న‌ప్పటికీ రెండో అంచె పోటీల్లోనూ బ‌రిలోకి దిగ‌లేదు. దీంతో ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లేనంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తూ ధోనికి సీఎస్‌కే జట్టు సభ్యులు గాడ్ ఆప్ ఆన‌ర్ ఇచ్చిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    విష‌యంలోకి వెళితే.. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత సీఎస్‌కే జ‌ట్టు స‌భ్యులు ధోనికి హార్డ్ ఆఫ్ గాన‌ర్ ఇవ్వ‌డం క‌నిపించింది. సీఎస్‌కే సాధించిన ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు చాంపియ‌న్స్ లీగ్ ట్రోఫీలు, ధోని సాధించిన ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను స్టాండ్స్‌పై ఉంచారు. ఆ త‌ర్వాత ఆట‌గాళ్లంతా ధోనికి చ‌ప్ప‌ట్ల‌తో స్టేజీ మీద‌కు ఆహ్వానించారు.

    ఆ త‌ర్వాత ప్ర‌స్తుత సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌తో క‌లిసి ధోని తాను ఐపీఎల్‌లో సాధించిన ఐదు ట్రోఫీల‌తో ఫొటో సెష‌న్‌కు ఫోజిచ్చాడు. ఆ త‌ర్వాత సైలెంట్‌గా కింద‌కు దిగిన ధోని త‌ల‌ను కింద‌కు వేసుకుంటూ భారంగా అడుగులు వేయ‌డం క‌నిపించింది. ఇదంతా చూస్తుంటే ధోని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లుగా అనిపిస్తోంది. సీఎస్‌కే సొంత‌గ‌డ్డ‌పై మ్యాచ్ ఆడ‌డం మ‌రో ముఖ్య విష‌యం. 

    ఇదే మంచి త‌రుణ‌మ‌ని భావించిన ధోని సీఎస్‌కే అభిమానుల స‌మ‌క్షంలో ఐపీఎల్‌కు గుడ్‌బై ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ధోని సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్ ఆడ‌కుండానే వీడ్కోలు ప‌ల‌క‌డంపై సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇది నిజం కాద‌ని, క‌చ్చితంగా ధోని మాకోసం ఒక మ్యాచ్ ఆడి తీరుతాడ‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

    2023లో ఆఖ‌రిసారి ధోని నేతృత్వంలో ఐపీఎల్ చాంపియ‌న్‌గా నిలిచిన సీఎస్‌కే ఆ త‌ర్వాత రెండు సీజ‌న్ల‌లో లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైంది. ఐపీఎల్‌లో ధోని ఇప్ప‌టివ‌ర‌కు 278 మ్యాచ్‌లాడి 5,439 ప‌రుగులు సాధించాడు. ఇందులో 24 అర్థశ‌త‌కాలు ఉన్నాయి. 2023 సీజ‌న్ త‌ర్వాత ధోని నుంచి రుతురాజ్ గైక్వాడ్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్య‌తలు తీసుకున్నాడు. 

    ఇక ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో సీఎస్‌కే ఇప్ప‌టివ‌ర‌కు 9 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు మాత్ర‌మే సాధించి ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో ఉంది.ప్లేఆఫ్ చేరాలంటే ఇక‌పై సీఎస్‌కే మిగిలిన ఐదు మ్యాచ్‌లు క‌చ్చితంగా గెల‌వాల్సిందే. ఏ ఒక్క‌టి ఓడినా సీఎస్‌కే ప్లేఆఫ్ అవ‌కాశాలు మరింత సంక్లిష్టమవుతాయి. ఇక శనివారం ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

    చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

  • ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ పోరులో 0–3తో వరుస సింగిల్స్‌ మ్యాచ్‌లలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 11–21, 9–21 స్కోరుతో క్రిస్టో పొపోవ్‌ చేతిలో ఓడిపోయాడు.  39 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. 

    రెండో సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ కూడా ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. 16–21, 18–21తో వరుస గేమ్‌లలో అలెక్స్‌ లేనియర్‌ చేతిలో పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌ కూడా 41 నిమిషాల్లో ముగిసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో సింగిల్స్‌లో కూడా హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ నిలవలేకపోయాడు. 

    ఈ మ్యాచ్‌లో టోమా జూనియర్‌ పొపోవ్‌ 21–19, 21–16తో ప్రణయ్‌ను 48 నిమిషాల్లో  చిత్తు చేశాడు. సెమీస్‌లో ఓటమితో భారత్‌ కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. ఫలితం తేలిపోవడంతో తర్వాతి రెండు డబుల్స్‌ మ్యాచ్‌ల అవసరం రాలేదు. మోచేతి గాయం కారణంగా లక్ష్య సేన్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు.  

    చదవండి: ‘పాండ్యాపై విద్వేషం.. కరువైన మద్దతు!’

National

  • ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా.  ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు.  

    ఉద్యోగం చేసే చోట  సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్‌ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు.  మరి  స్వే‍చ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్‌ చూపెడుతున్నప్పుడు  అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కూడా అదే చేశాడు.  

    ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్‌ డ్రైవర్‌ తన కారులో పెట్టిన నోట్‌ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్‌ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్‌లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్‌ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్‌ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొం​దుపరిచాడు. 

    డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. 

    ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్‌ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని,  కారు డోర్‌ను నెమ్మదిగా మూయాలని కోరాడు.  మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు.  ఇది హైదరాబాద్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ నోట్‌గా తెలుస్తోంది. 

    హైదరాబాద్ క్యాబ్‌లు వెనుకాడవు అనే క్యాప్షన్‌తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్‌’లో ఆ నోట్‌ను ఫోట్‌ తీసి పోస్ట్‌ చేశాడు.  ఇది వైరల్‌గా మారిన వైనంలో వార్త అయ్యింది. 

     


     

  • చెన్నై: విమానం నుంచి దూకడం అంటే అది నిజంగా చాలా ప్రమాదకరమైన చర్య.  అయినప్పటికీ, ప్రపంచంలో కొన్ని అరుదైన సంఘటనల్లో ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తలుపు తెరిచి బయటకు దూకిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో అస్వస్థతకు గురైన ఆ ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచి కిందికి దూకేశాడు. 

    ఈరోజు(ఆదివారం, మే 3వ తేదీస్త్ర తెల్లవారుజామున ఎయిర్‌ అరేబియా విమానం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. ఇలా రెండుసార్లు వాంతులు చేసుకున్న తర్వాత భయపడి పోయిన సదరు ప్రయాణికుడు.. అత్యవసర ద్వారం ఓపెన్‌ చేసి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. 

    విమానం ల్యాండ్‌ అయ్యి టాక్సీవేపై కదులుతున్న సమయంలో కాబట్టి ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు విమానాశ్రయ అదికారులు తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానం నుంచి దూకిన వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది  వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే స్వల్పంగా గాయపడినట్లు పేర్కొన్నారు. అతనికి ప్రాథమిక చికత్స అందించారు. ఈ ఘటనతో ప్రధాన రన్‌వే ఒక గంట పాటు మూసేశారు. కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. 

    ప్రయాణికుడు విమానంలో రెండు సార్లు వాంతులు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇది అతని మానసిక, శారీరక స్థితి ప్రభావం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే,  సాధారణంగా బలమైన లాకింగ్‌ సిస్టమ్‌ ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తలుపు ఎలా తెరవగలిగాడు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. భద్రతా లోపాలు ఉన్నాయా? అనే కోణంతో పాటు ప్రయాణికుడి మానసిక స్థితిని పరీక్షీస్తున్నారు.

  • మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌లో ఘోర పడవప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. అయితే ఆ ఘటనకు బాధ్యులైన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో పాటు పరిహారం సైతం ప్రకటించింది. కాగా ఈ ఘటనలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. 

     రోషన్ ఆనంద్ వర్మ (బాధితుడు)
    "పడవ బలమైన అలలకు చిక్కుకోవడంతో అరగంట పాటు తీవ్ర గందరగోళం నెలకొంది. కుర్చీలు, బల్లలు, ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. క్రూయిజ్‌లోకి నీరు రావడం మొదలైంది. దానిలోని ఒక భాగం అప్పటికే విరిగిపోయింది. మృత్యువు మా కళ్లెదుటే ఉంది, కానీ మేము ఆశ వదులుకోలేదు. 11 ఏళ్ల చిన్నారితో కలిసి ఒడ్డు వైపు కదిలాం. ఎలాగోలా మాకు మద్దతు లభించి, సురక్షితంగా పైకి ఎక్కగలిగాం," అని ఆయన అన్నారు.

    మా కుటుంబ మంతా వెంటనే అప్రమత్తమై లైఫ్‌ జాకెట్లు ధరించడం వల్లే ప్రాణాలతో బయటపడగలిగామని భావోద్వేగానికి గురయ్యారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ క్రూయిజ్‌ను నిర్వహించారని ఆయన ఇంకా ఆరోపించారు. "ఇది స్పష్టమైన నిర్లక్ష్యం. ప్రయాణికుల భద్రత కంటే లాభానికే ప్రాధాన్యత ఇచ్చారు," అని వర్మ అన్నారు.

    అత్యవసర పరిస్థితి సమయంలో యాజమాన్యం, క్రూయిజ్ సిబ్బంది ఇద్దరూ విఫలమయ్యారని వర్మ ఆరోపించారు. "సిబ్బంది నుంచి సరైన సూచనలు అందలేదు, అలాగే సకాలంలో సహాయం కూడా అందించలేదు. ఒకవేళ రెస్క్యూ బోట్ వెంటనే వచ్చి ఉంటే, ప్రతి ప్రయాణీకుడినీ కాపాడి ఉండేవారు," అని ఆయన పేర్కొన్నారు.

    సవితా వర్మ అనే మరో బాధితురాలు మాట్లాడుతూ  16 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చి, తన మేనకోడలు పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలిసి జబల్‌పూర్ వచ్చానని  ఆసుపత్రిలో సహాయం అందించేవారు ఎవరూ లేకపోగా, కనీస వైద్యం అందకుండానే రూ.4,700 బిల్లు వసూలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకోగా ఇప్పటి వరకూ రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.

  • హర్యానా: గురుగ్రామ్‌ వజీర్‌పూర్‌లో  విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో పాటు తన భార్యని చంపారు. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించగా ప్రాణాలతో బయిటపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    వివరాల్లోకి వెళితే

    ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు  ఓ వ్యక్తి కుటుంబం గత కొంతకాలంగా వజీర్‌పూర్‌లో నివాసం ఉంటుంది. ఇతను స్థానికంగా సెలూన్‌ నడుపుతాడు. అయితే శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో అతని సోదరుడు ఇంటికి వచ్చేసరికి  కుటుంబ సభ్యులంతా  అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను  ఆసుపత్రికి తీసుకెళ్లగా మహిళ మరియు నలుగురు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

    ఈ ఘటనలో  35 ఏళ్ల భార్య, 14, 12, 10 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కుమార్తెలు మరియు 8 ఏళ్ల కుమారుడు మృతిచెందారు. అయితే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

    పోలీసుల వివరాల ప్రకారం  నిందితుడు తొలుతగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి అనంతరం కత్తితో తన మణికట్టును కోసుకున్నాడని తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు జీవించడానికి ఇష్టపడలేదని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు..  విషం ఇచ్చారా లేక గొంతు నులిమి చంపారా అనేది దర్యాప్తులో తేలుతుందని, ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

  • బెంగళూరు: ప్రియుడితో దిగిన ఫొటోను భార్య తన భర్తకు పంపడంతో అతను  ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన రాఘవేంద్ర వాడకర్‌  మలేషియాలో ఉంటన్నాడు. వారం రోజుల క్రితం దాండేలికి వచ్చాడు. ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిన భార్య తాను.. నీతో సంసారం చేయటం ఇష్టంలేదని పేర్కొంది. 

    మరో యువకుడితో ఆమె కలిసి ఉన్న ఫొటోను రాఘవేంద్రకు పంపించి వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకుంది.  నీతో కలిసి  జీవించడం ఇష్టం   లేదని,  కావాలంటే చచ్చిపో అంటూ తేల్చి చేప్పింది. దీంతో రాఘవేంద్ర బుద్ధి మాటలు చెప్పాడు. అయినా భార్య పట్టించుకోలేదు. దీంతో చాకుతో కోసుకోని వాట్సాప్‌లో పొటోలు  పంపాడు.  

    నీవు చచ్చినా నాకు ఎలాంటి ఇబ్బందిలేదంటూ భార్య చెప్పడంతో  జీవితంపై విరక్తి చెందిన రాఘవేంద్ర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య తీరు గురించి లేఖ రాశాడు. దాండేలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
     

     

  • తిరువనంతపురం: కేరళ రాజకీయ ముఖచిత్రం రేపు తేలిపోనుంది. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య జరిగిన ఉత్కంఠభరిత అసెంబ్లీ ఎన్నికల సమరానికి మే 4న తెరపడనుంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో కేరళ ప్రజలతో పాటు యావత్ దేశం ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

    పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు
    సోమవారం ఉదయం 8 గంటలకు 43 ప్రాంతాల్లోని 140 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు సహా సుమారు 15 వేల మంది సిబ్బందిని ఈ విధుల్లో నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నానికల్లా విజేత ఎవరనే దానిపై స్పష్టమైన ట్రెండ్ వెలువడే అవకాశం ఉంది.

    భారీ పోలింగ్.. బరిలో 883 మంది
    ఈ దఫా కేరళ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో 79.63 శాతం భారీ పోలింగ్ నమోదైంది. సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 883 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో రాష్ట్ర చరిత్రలోనే ఇదొక హోరాహోరీ పోరుగా మారింది. పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదు కావడంతో ఓటర్ల నాడిని పసిగట్టడం రాజకీయ విశ్లేషకులకు సైతం సవాలుగా మారింది.

    అగ్నిపరీక్షలో పార్టీలు.. 
    ఈ ఫలితాలు మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. 2016 నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అధికార ఎల్‌డీఎఫ్ భావిస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యంత హోరాహోరీ పోరు తప్పదని, యూడీఎఫ్‌కు స్వల్ప ఆధిక్యం రావచ్చని అంచనా వేస్తున్నాయి.

    ఇది కూడా చదవండి: కాసేపట్లో నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే  ‘నీట్ యూజీ 2026’ (NEET UG) పరీక్ష నేడు(ఆదివారం మే 3) జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 నిమిషాల వరకు ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు సమయపాలన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు తెరుచుకుంటాయి. అయితే, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

    పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) తప్పనిసరి. దానికి తోడుగా ప్రభుత్వం జారీ చేసిన పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ వంటి ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్లాలి. స్మార్ట్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్లు, పేజర్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించరు. ఒకవేళ పొరపాటున తీసుకువచ్చినా, వాటిని భద్రపరచడానికి కేంద్రాల వద్ద ఎలాంటి సదుపాయం ఉండదు, వాటికి విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

    డ్రెస్ కోడ్: బూట్లు వేసుకుంటే నో ఎంట్రీ
    విద్యార్థుల వస్త్రధారణపై స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అబ్బాయిలు సాధారణ ప్యాంట్లు, జీన్స్ ధరించవచ్చు కానీ, బూట్లకు బదులుగా కేవలం స్లిప్పర్స్ (చెప్పులు) మాత్రమే వేసుకోవాలి. అలాగే క్యాప్స్, మఫ్లర్లు తలకు ధరించకూడదు. ఇక అమ్మాయిలు లెగ్గింగ్స్ లేదా సాధారణ ప్యాంట్లు వేసుకోవచ్చు. వీరు కూడా సింపుల్ శాండల్స్ ధరించాలి తప్ప షూస్ వేసుకోకూడదు. ముఖ్యంగా చేతులకు మెహందీ పెట్టుకోకూడదు. అలాగే హ్యాండ్‌బ్యాగ్‌లు లేదా పర్సులు లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదు.

  • డిస్పూర్‌: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రసవత్తర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీ వల నుంచి అభ్యర్థులను కాపాడేందుకు ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా సీనియర్ నేతలను హుటాహుటిన రంగంలోకి దించింది.

    కాంగ్రెస్ క్యాంపులోకి బీజేపీ వల?
    ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. శనివారం గౌహతిలో జరిగిన ఆరు పార్టీల ప్రతిపక్ష కూటమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకున్నారని, తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి తాము పూర్తి అప్రమత్తంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీజేపీకి గెలుపుపై నమ్మకం ఉంటే తమ నేతలను ఎందుకు సంప్రదిస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

    ఎగ్జిట్ పోల్స్ అబద్ధం.. 75 సీట్లు మావే!
    ఎన్డీఏ కూటమికి 88 నుంచి 100 స్థానాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ కేవలం అధికారులపై, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకేనని విమర్శించారు. ప్రతిపక్ష కూటమి కచ్చితంగా 70 నుంచి 75 స్థానాలు (మొత్తం 126 సీట్లలో) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నందున, ఢిల్లీ, గౌహతిలలో ప్రత్యేక లీగల్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ తెలిపారు.

    సీఎం రేసులో గౌరవ్ గొగోయ్?
    అస్సాం ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తేల్చి చెప్పారు. మరోవైపు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ మాట్లాడుతూ.. కూటమికి 70కి పైగా సీట్లు వస్తాయని, గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఎన్డీఏ గ్రాఫ్ పడిపోతోందని అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు లూరిన్‌జ్యోతి గొగోయ్ సైతం వ్యాఖ్యానించారు.

  • చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు (మే 4)న వెలువడనున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిశ్రమంగా ఉండటంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన దళపతి విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ‘రిసార్ట్ పాలిటిక్స్’కు తెరతీసింది.

    పూంజేరి రిసార్ట్‌లో భారీ ఏర్పాట్లు
    మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ  ఏర్పాట్లు చేసింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే  ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ‘గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దు’ అని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన  వ్యాఖ్యానించినట్లు సమాచారం.

    ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
    కౌంటింగ్ రోజున ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) వినతిపత్రం సమర్పించాలని పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునకు విజయ్ సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ పార్టీ లీగల్ వింగ్‌ను ఆయన అప్రమత్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే, ఏఐఏడీఎంకే మరియు టీవీకే కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేయడంతో ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    విజయ్‌కు పాలిటిక్స్ ఒక హాబీ: డీఎంకే
    మరోవైపు, అధికార డీఎంకే పార్టీ మాత్రం తామే అత్యధిక స్థానాలు సాధించి మళ్లీ అధికార పీఠం దక్కించుకుంటామని అత్యంత ధీమాగా ఉంది. కౌంటింగ్ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించింది. డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణిధరన్ మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాల్లో డీఎంకేకు ప్రతిపక్షం ఎవరనేదే ఈ ఎన్నికల ప్రధానాంశమని వ్యాఖ్యానించారు. సర్వేల ప్రకారం 40% నుండి 55% మద్దతుతో స్టాలిన్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయ్ ఏమాత్రం రాజకీయ నాయకుడు కాదని, రాజకీయాలు ఆయనకు కేవలం ఒక హాబీ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. 

  • న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘రైల్ వన్’ (Rail One) యాప్ ఇప్పుడు ప్రయాణికుల పాలిట తలనొప్పిగా మారింది. యాప్‌లో బుక్ చేసిన వెంటనే వచ్చే ఒక చిన్న ‘బిల్లు’ (ఇన్‌వాయిస్), రైళ్లలో  వివాదాలకు దారి తీస్తోంది. అది అసలు టికెట్టే కాదని, కేవలం బిల్లు మాత్రమేనని టీటీఈలు చెబుతుంటే.. ప్రయాణికులు నివ్వెరపోతూ భారీగా జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ఇంతకీ ఈ యాప్‌లో అసలు ఏం జరుగుతోంది?

    టికెట్ కాదు.. అది కేవలం ‘బిల్లు’ మాత్రమే
    గతంలో ఉన్న అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్‌) యాప్ సేవలను రైల్వే శాఖ ఇటీవల ‘రైల్ వన్’ యాప్‌లోకి అనుసంధానం చేసింది. అయితే, సాధారణ బోగీల్లో ప్రయాణించడానికి ఈ యాప్‌లో టికెట్ బుక్ చేసినప్పుడు, రీయింబర్స్‌మెంట్ కోసం ఒక ఇన్‌వాయిస్ (బిల్లు) జనరేట్ అవుతోంది. దీన్నే అసలైన టికెట్ అని అనుకుంటున్న చాలా మంది ప్రయాణికులు, రైలెక్కి స్లీపర్ లేదా ఏసీ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేయమని టీటీఈలను కోరుతున్నారు. తీరా అది ప్రయాణానికి పనికిరాదని టీటీఈలు తేల్చిచెబుతూ ఫైన్లు వేస్తుండటంతో, వేరొకరు బుక్ చేసి పంపారని ప్రయాణికులు వాదనలకు దిగుతున్నారు.

    స్క్రీన్‌షాట్ రాదు.. షేర్ చేస్తే చిక్కులే
    ఆ ఇన్‌వాయిస్ అడుగు భాగంలో స్పష్టంగా ‘ఇది ప్రయాణ టికెట్ కాదు’ అని రాసి ఉన్నప్పటికీ, ఎవరూ దానిని గమనించడం లేదు. పాత యూటీఎస్ యాప్‌లో బుకింగ్ సమయంలో ఇలాంటి బిల్లు వచ్చేది కాదు. దానికి తోడు, సరికొత్త రైల్ వన్ యాప్‌లో టికెట్ స్క్రీన్‌షాట్ తీయడం కుదరదు. కానీ, అక్కడే ఉన్న ‘షేర్’ ఆప్షన్ ద్వారా పంపితే కేవలం ఇన్‌వాయిస్ మాత్రమే ఇతరులకు వెళ్తోంది. ఆప్షన్‌లో పేపర్‌లెస్ టికెట్ విధానం మాత్రమే ఉండటంతో, షేర్ చేసిన ఆ బిల్లునే అసలు సిసలైన టికెట్ అని ప్రయాణికులు పొరబడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

    ప్రయాణం పూర్తయ్యాకే బిల్లు ఇవ్వాలి
    ఈ గందరగోళానికి చెక్ పెట్టాలంటే రైల్వే శాఖ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయం ముగిసిన తర్వాతే ఇన్‌వాయిస్ జనరేట్ అయ్యేలా నిబంధనలు మారిస్తే ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని త్రిస్సూర్ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. కృష్ణకుమార్ సూచిస్తున్నారు. అలాగే ప్రయాణికులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇన్‌వాయిస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేలా రైల్ వన్ యాప్‌లో తగిన మార్పులు తీసుకురావాలని ఆయన రైల్వేను కోరారు.

    ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?

Business

  • ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్త M440iను భారతదేశంలో రూ.1.09 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఇది మునుపటి మోడల్ కంటే కూడా భిన్నంగా.. ఫోల్డబుల్ హార్డ్-టాప్ రూఫ్‌ పొందుతుంది.

    M440i కన్వర్టిబుల్‌ 3.0-లీటర్, ఆరు-సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా.. 369bhp పవర్, 500Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, బీఎండబ్ల్యూ xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ (AWD) పొందుతుంది. 4.9 సెకన్లలో 0 నుంచి 100kmph వేగాన్ని అందుకునే ఈ కన్వర్టిబుల్ టాప్ స్పీడ్ 250 కిమీ/గం.

    డిజైన్ పరంగా.. ఈ మోడల్ పెద్ద కిడ్నీ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన బాడీవర్క్, స్పోర్టీ బంపర్‌లు పొందుతుంది. ఇది స్టాగర్డ్ సెటప్‌తో కూడిన 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, వెనుక భాగంలో వ్రాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి.

    లోపల క్యాబిన్‌లో 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉన్నాయి. దీనికి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్ అప్‌హోల్స్టరీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది మెర్సిడెస్-బెంజ్ CLE క్యాబ్రియోలెట్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది.

    ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు NHAI హెచ్చరిక!

  • రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    పాసివ్ ఇన్‌కమ్ గురించి చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాసివ్.. అంటే ఎలాంటి కష్టం లేకుండా డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రారంభంలో చాలా శ్రమ, సమయం, జ్ఞానం అవసరమైన ప్రక్రియ. ముందుగా ఒక వ్యవస్థను నిర్మించాలి. ఆ తర్వాతే అది మనకు డబ్బు తీసుకువస్తుంది.

    పూర్తిగా యాక్టివ్ వర్క్
    ముందు పాసివ్ అనే పదం కొంచెం తప్పుదోవ పట్టిస్తుంది. ప్రారంభ దశలో.. ఇది పూర్తిగా యాక్టివ్ వర్క్. అంటే.. మీరు పెట్టుబడి పెట్టాలి, నేర్చుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉదాహరణకు.. ఒక అద్దె ఇల్లు కొనాలంటే మీరు మార్కెట్, ఖర్చులు, లాభాలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు.

     
     

    కష్టపడి నిర్మించిన ఆస్తుల ద్వారా ఆదాయం!
    చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. పాసివ్ ఇన్‌కమ్ అంటే ''ఎటువంటి శ్రమ లేకుండా వచ్చే ఆదాయం'' అని భావించడం. నిజానికి అలాంటి ఆదాయం ఉండదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది లీవరేజ్ ఆధారంగా వస్తుంది. అంటే.. మీరు ఒకసారి కష్టపడి నిర్మించిన ఆస్తులు తరువాత మీకు ఆదాయం తీసుకువస్తాయి. ఇవి రియల్ ఎస్టేట్, వ్యాపారం, రాయల్టీలు, లేదా డివిడెండ్లు కావచ్చు.

    పాసివ్ ఇన్‌కమ్ సాధించాలంటే మూడు ముఖ్యమైన దశలు

    • మొదటిది, ఆర్థిక విద్య. మీరు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంది విస్మరించే అంశం.

    • రెండవది, నిజంగా డబ్బు తెచ్చే ఆస్తిని సృష్టించడం లేదా కొనుగోలు చేయడం. ఇది కేవలం భవిష్యత్తులో పెరుగుతుందని ఆశించే ఆస్తి కాకుండా, ప్రతి నెలా ఆదాయం తెచ్చే ఆస్తి కావాలి. 

    • మూడవది.. ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ స్ట్రక్చర్ ద్వారా ఆ ఆస్తిని రక్షించడం.

    మధ్యతరగతి ఎందుకు ఇక్కడే ఆగిపోతుంది అంటే, వారికి ఒకే మార్గం చూపించారు. మంచి ఉద్యోగం పొందాలి, డబ్బు సేవ్ చేయాలి, రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టాలి. కానీ ఇది పాసివ్ ఇన్‌కమ్ నిర్మించడానికి ఇది సరిపోదు. ఇది కేవలం జీవనోపాధి కోసం మాత్రమే.

    చివరగా, మనం తెలుసుకోవాల్సిన అంశం ''పాసివ్ ఇన్‌కమ్ ఎలా సంపాదించాలి?'' కాదు. దాన్ని సాధించడానికి నేను ఏమి నేర్చుకోవాలి?. పాసివ్ ఇన్‌కమ్ అనేది ఒక్కసారిగా వచ్చే విషయం కాదు. ఇది మీరు సంపాదించిన జ్ఞానం, తీసుకున్న నిర్ణయాలు, నిర్మించిన ఆస్తుల ఫలితం.

    ఇదీ చదవండి: 'బంగారం 8000 డాలర్లకు': జర్మన్ బ్యాంక్ అంచనా!

  • ,

    గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 80 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 100 కోట్లు. ఇక ఆదాయం రూ. 256 కోట్ల నుంచి రూ. 268 కోట్లకు చేరింది. 

    2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 12.75 మేర తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ. 526 కోట్ల నుంచి రూ. 455 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 1,199 కోట్ల నుంచి రూ. 1,239 కోట్లకు చేరింది. 18 కోట్ల పైగా డీమ్యాట్‌ ఖాతాలు గల తొలి డిపాజిటరీగా ఆవిర్భవించినట్లు సంస్థ ఎండీ నేహల్‌ వోరా తెలిపారు.

  • బంగారం ధరల్లో ఊహకందని మార్పు జరుగుతున్న సమయంలో జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు (డాయిష్ బ్యాంక్) ఓ సంచనల ప్రకటన చేసింది. ఇది పసిడి ప్రియులలో భయాన్ని కలిగించింది.

    డాయిష్ బ్యాంక్ ప్రకారం.. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో బులియన్ వాటా ప్రస్తుతం ఉన్న సుమారు 30% నుంచి 40%కి పెరగవచ్చని సమాచారం. దీన్నిబట్టి చూస్తే రాబోయే ఐదేళ్లలో (2031 నాటికి) బంగారం ధరలు ఔన్సుకు 8,000 డాలర్లకు చేరవచ్చు. అంటే 80% పెరుగుదల ఉంటుందని అంచనా.

    దేశాలు తమ రిజర్వులను.. యూఎస్ డాలర్ నుంచి బులియన్ వైపు మళ్లిస్తున్నందున, రోజురోజుకు విచ్ఛిన్నమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వల్ల బంగారం అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా మారవచ్చు. కాబట్టి బంగారం రానున్న రోజుల్లో మరింత ప్రియం అవుతుంది.

    పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రక్షణ పొందటానికి.. ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలోని కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు మరింత బంగారాన్ని జోడించనున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర బ్యాంకులు 225 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని తమ నిల్వలకు చేర్చాయని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. ఇదే కాలంలో.. ప్రపంచ నిల్వలలో యూఎస్ డాలర్ల వాటా 2000ల ప్రారంభంలో 60% కంటే ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది సుమారు 40%కి పడిపోయింది.

    బంగారం కొనుగోళ్లు ఇకపై చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి ప్రధాన దేశాలకే పరిమితం కాలేదని డాయిష్ బ్యాంక్ తెలిపింది. కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలకు కూడా కొనుగోళ్లు విస్తరిస్తున్నాయి. ఈ పరిస్థితులు బంగారం ధరలను భారీ పెంచనున్నాయి.

    ఈ అంచనా ప్రకారం.. భారతదేశంలో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతాయు. ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ రేటు రూ.1,50,930 వద్ద ఉండగా.. ఇది భవిష్యత్తులో రూ.2.5 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే బంగారం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందనేది వాస్తవం.

    ఇదీ చదవండి: అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!

  • పత్తి వంటి కీలక ఉత్పత్తుల రవాణా (షిప్‌మెంట్‌లు)లో తగ్గుదల కారణంగా టెక్స్‌టైల్స్, గార్మెంట్‌ ఎగుమతులు 2025–26లో 2.2% తగ్గి 35.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) ఈ విషయాలు వెల్లడించింది. రూపాయిపరంగా కూడా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2.1% తగ్గాయి.

    ఆర్థిక సంవత్సరంలో పత్తి టెక్స్‌టైల్స్‌ (–3.9%), రెడీమేడ్‌ దుస్తులు (–1.4%), కార్పెట్లు (–5.3%) వంటి ప్రధాన విభాగాల్లో తగ్గుదల ధోరణి కనిపించింది. అయితే హస్తకళల ఎగుమతులు మాత్రం స్వల్పంగా 1.5% పెరిగాయి. ‘‘రూపాయి, డాలర్‌ మారకం వృద్ధిలో వ్యత్యాసం ఒక వ్యవస్థాత్మక సమస్యకు సంకేతం.

    భారత్‌ విలువపరంగా ఎక్కువగా ఎగుమతులు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో తక్కువ ఆదాయం ఆర్జిస్తోంది. ఉదాహరణకు, మ్యాన్‌–మేడ్‌ టెక్స్‌టైల్స్‌ రూపాయి పరంగా 3.6%  పెరిగినా, డాలర్‌ పరంగా 0.8% తగ్గాయి. అలాగే, గార్మెంట్స్‌ ఎగుమతులు రూపాయి పరంగా 2.9% పెరిగినా, డాలర్‌ పరంగా 1.4% క్షీణించాయి’’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

    కరెన్సీ క్షీణత వల్లే వృద్ధి కనిపిస్తోందే తప్ప పోటీ సామర్థ్యాల వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి కీలకమైన గ్లోబల్‌ మార్కెట్లలో భారత్‌ విస్తరించలేకపోవడమో, లేదా మార్కెట్‌ వాటాను కోల్పోవడమో జరుగుతోందని, ముఖ్యంగా కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాల్లో ఇది ప్రస్ఫుటంగా ఉంటోందని వివరించారు. 

  • భారతదేశంలో టోల్ వసూలు విధానాన్ని సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన సాంకేతిక వ్యవస్థ ఫాస్ట్‌ట్యాగ్ (FASTag). ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు చేరుకున్నప్పుడు, FASTag లోని చిప్‌ను స్కాన్ చేసి టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా వాహన యజమాని ఖాతా నుంచి కట్ అవుతుంది. దీనివల్ల నగదు చెల్లింపుల అవసరం తగ్గి, ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది.

    అయితే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్గదర్శకాల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరిగా వాహనం ముందు విండ్‌స్క్రీన్‌పై అతికించాలి. కానీ కొందరు వాహనదారులు దాన్ని చేతిలో పట్టుకొని స్కాన్ చేయిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.

    విండ్‌స్క్రీన్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను అమర్చడం వల్ల.. టోల్ గేట్ల వద్ద సులభంగా స్కాన్ అవుతుంది. వాహనాలు ఆగకుండా ముందుకు సాగుతాయి. తద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ను పలు వాహనాల్లో ఉపయోగించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ను సరిగ్గా అమర్చకపోతే దానిని బ్లాక్ చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరించింది.

    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ మోసం!
    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్‌సైట్‌లు, అనధికారిక లింక్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ పాస్‌లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్‌లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్‌ఫామ్‌లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్‌ఫామ్‌లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్‌లను నమ్మకూడదని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

    ఇదీ చదవండి: ట్రంప్ లేటెస్ట్ పోస్ట్.. వచ్చేవారం నుంచి కొత్త సుంకాలు!

  • టీవీఎస్‌ మోటార్‌ ఏప్రిల్‌లో 4,73,970 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన  4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్‌ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన  6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి.

    దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.

  • అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.

    నౌక వివరాలు
    మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్‌కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.

    మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్
    2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.

    ‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.

    ప్రాంతీయ ఉద్రిక్తతలు
    ప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

    ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  • హైదరాబాద్‌: పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులకు సంబంధించి తెలంగాణలోని వర్గల్‌లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు న్యూట్రిషన్‌ నెక్ట్స్‌ సహ వ్యవస్థాపకులు వెంకట ధర్మేంద్ర బొప్పన తెలిపారు. కొత్తగా పిల్లుల కోసం పేరెంట్‌ పేరిట, శునకాల కోసం బోనస్‌ పేరిట ట్రీట్స్‌ ఆహారోత్పత్తులను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు.

    అంతర్జాతీయ పోషకాహార ప్రమాణాలకి అనుగుణంగా వీటిని తయారు చేస్తున్నట్లు చెప్పారు. 2027 నాటికి పెంపుడు జంతువుల సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్‌ వార్షికంగా 5.2 శాతం వృద్ధి రేటుతో 8.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుందని వ్యవస్థాపకుడు, సీఈవో సి. ప్రహర్ష తెలిపారు. తెలిపారు.

    ఇందులో ఆహారం, ట్రీట్స్‌ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, 2.52 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పుణె, ముంబై తదితర ఐదు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాల్లోను విస్తరించినట్లు చెప్పారు.

  • అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్‌లో గత వారం మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. ఒకవైపు పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, మరోవైపు వెండి మాత్రం పరుగులు తీస్తోంది. మే 3 నాటికి ముగిసిన వారపు ట్రేడింగ్‌ను పరిశీలిస్తే, విలువైన లోహాల ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

    బంగారం బేజారు.. వెండి జోరు!
    అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం బంగారం ధరల్లో కొంత మేర సడలింపు కనిపించింది. అయితే, వెండి మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది.
    హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,53,710 ఉండగా మే 3 నాటికి అది రూ.1,50,930లకు దిగివచ్చింది. అంటే రూ.2,800 తగ్గింది. 
    22 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర ఏప్రిల్ 27న రూ.1,40,900 ఉండగా మే 3 నాటికి అది రూ.1,38,350లకు క్షీణించింది. అంటే రూ.2,550 కరిగింది.

    ఇక వెండి విషయానికి వస్తే ​కేజీ ధర ఏప్రిల్ 27న రూ.2,70,000 ఉండగా తగ్గుతూ పెరుగుతూ మే 3 నాటికి మళ్లీ రూ.2,70,000 వద్దకే వచ్చి ఆగింది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో మాత్రం వెండి ధర వారం మొత్తంలో కేజీకి రూ.5,000 పెరిగింది.

    ధరల ఒడిదుడుకులకు కారణాలు

    మార్కెట్ నిపుణులు, 'రాయిటర్స్' నివేదికల ప్రకారం, ప్రస్తుత ధరల మార్పులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

    ప్రపంచ మార్కెట్ సంకేతాలు: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పరిస్థితులు పసిడి ధరపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా 2026లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

    మారిన డిమాండ్: పారిశ్రామిక అవసరాల రీత్యా వెండికి డిమాండ్ పెరగడం దాని ధర పెరగడానికి ఊతమిచ్చింది. ఇదే సమయంలో బంగారంపై ఇన్వెస్టర్లు కొంత లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ధరల తగ్గుదలకు కారణమైంది.

    పెట్టుబడిదారుల ధోరణి: సురక్షితమైన పెట్టుబడిగా భావించే ఈ లోహాల విషయంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి కూడా మార్కెట్ కదలికలను శాసిస్తోంది.

    ఇదీ చదవండి: ఇల్లు కొంటే.. ఇన్ని ఖర్చులా?

  • బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లను అందిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ ‘ఐటెల్‌’ భారత స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయతలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశ డివైజ్‌ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయత, అందుబాటు ధరల ప్రాధాన్యత’ అనే నివేదికలో ఐటెల్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల 2,086 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

    డ్యూరబులిటీ ఇండెక్సులో అగ్రస్థానం
    రూ.10,000 లోపు ధర కలిగిన మొబైల్‌ విభాగంలో 0.86 మన్నిక(డ్యూరబులిటీ) సూచికతో ఐటెల్‌ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత శాంసంగ్‌ (0.79), వివో (0.72) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్‌ విభాగంలో 91% మంది వినియోగదారులు ఐటెల్‌ మన్నికైన బ్రాండ్‌ అని వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోనూ 85% స్కోరుతో ఐటెల్‌ రెండో స్థానంలో నిలిచింది.

    నివేదికలో మరిన్ని అంశాలు
    దాదాపు 81% మంది వినియోగదారులు ఐటెల్‌ను బలమైన, మన్నికకు మారుపేరుగా భావిస్తున్నారు. 79% మంది దీని డిజైన్‌ సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు.  74% మంది ఈ బ్రాండ్‌ను అత్యంత నమ్మదగినదిగా గుర్తించారు.  85% మంది తాము చెల్లించే ధరకు తగిన గొప్ప విలువ (వాల్యూ ఆఫ్‌ మనీ) లభిస్తుందని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది భవిష్యత్తులో ఐటెల్‌ ఫీచర్‌ ఫోన్‌ను, 30% మంది ఐటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.

International

  • ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్‌- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.

    ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్‌లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. 

    అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.

    తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ  కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ మధ్య సీజ్‌ ఫైర్‌ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andhra Pradesh

  • విశాఖ, సాక్షి: గాజువాక వికాస్‌నగర్‌లో ప్రమాదం జరిగింది. జాకీతో బిల్డింగ్ లిఫ్ట్ చేస్తుండగా భవనం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో  వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న భద్రతా బలగాలు వెంటనే  అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

  • రాయచోటి: పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరిగిందని, ఇది ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదనడానికి నిదర్శమన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. నిన్న దశరధరామిరెడ్డికి తనపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారని, నిన్నే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు దాడి జరిగేది కాదన్నారు. 

    కూటమి నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని, ఇప్పటివరకూ ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

    వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి 40 స్టేషన్లలో తిప్పుతున్నారని, మరి ఇప్పుడు కళ్ల ముందే టీడీపీ మూకలు రెచ్చిపోయి ఒక వైఎస్సార్‌సీపీ నేతపై దాడి చేస్తే పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

     

     

     

  • సాక్షి, తిరుపతి: లడ్డూలో జంతుకొవ్వు కలవలేదని సీబీఐ సిట్‌ తేల్చిందని వైఎస్సార్సీపిీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  తిరుపతిలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్‌గా మారిపోయిందని చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కంటే ముందే ఈ నివేదిక ఎల్లో మీడియాకు చేరిందన్నారు.  

    దినేష్‌ కుమార్‌ అనే వ్యక్తికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా దినేశ్‌ కుమార్ నివేదిక ఇచ్చారని తెలిపారు. రిపోర్టులో కక్ష‍ పూరితంగానే చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులని చెప్పారన్నారు. దినేష్ కుమార్ అనే అధికారి పచ్చి అవినీతి అధికారిగా ముద్రపడిన వ్యక్తి అటువంటి వారికి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే ఇలా రిపోర్టు ఇచ్చారని పేర్కొన్నారు.

    సీబీఐ సిట్‌లో తమని దోషులుగా నిర్ధారించలేదని అందుకే చంద్రబాబు నాయుడు పన్నాగం పన్ని ఎలాగైనా తమను దోషులుగా నిలబెట్టాలనే ఈ కమిషన్‌ని నియమించారని తెలిపారు. లడ్డూ వ్యవహారంలో సరైన విచారణ లేకుండా ఏకపక్ష నివేదిక ఇచ్చారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు అని చెప్పిన మిగతా వారిని మాత్రం ఎటువంటి విచారణకు పిలవలేదన్నారు. 

  • తెలుగు రాష్ట్రాల్లో భానుడు దగదగలు మండిపోతున్నాయి. రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రెంటచింతల, కర్నూలు, చిత్తూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్, నల్లగొండ, నిజమాబాద్, కరీంనగర్‌లలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 

    ఎండలు మండిపోతుండడంతో ప్రజలెవ్వరూ ఏదైనా అత్యవరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బయిటకి రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

  • సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి. దశరథరామిరెడ్డిపై మంత్రి అనుచరులు వేట కొడవళ్లతో దాడి చేశారు. మంత్రి అనుచరుల దాడిలో దశరథరామిరెడ్డి సహా పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దశరథరామిరెడ్డితో పాటు మరో ఇద్దరి కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

    దశరథరామిరెడ్డికి చెందిన కళ్యాణ మండపంలో అద్దాలు, వాహనాన్ని మంత్రి అనుచరులు ధ్వంసం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన ఓ స్థల వివాదంలో సెటిల్‌మెంట్‌ చేస్తామంటూ మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. నిన్న(శనివారం) రాత్రి నుంచి స్థలంలో టీడీపీ మూకలు తిష్ట వేశారు. ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) వైఎస్సార్సీపీ వైస్ చైర్మన్ దాశరథామిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు.

    15మందికిపైగా గాయాలు
    ఈ టీడీపీ మూకల దాడిలో సుమారు 15 మందకి పైగా గాయాలయ్యాయి.  అందరి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి, ఫంక్షన్ హాల్ మేనేజర్ జాకీర్, మరోక వ్యక్తి ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరిని తిరుపతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

     

  • సాక్షి, పల్నాడు జిల్లా:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌ వచ్చానని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని.. 70కి పైగా జర్నలిస్ట్‌లపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.

    ‘‘మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు, ఐఏఎస్‌లను కూడా రెడ్‌బుక్ వదల్లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. అందుకే పోలీస్ శాఖ ర్యాంక్‌ పడిపోయింది. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించామంటూ నిరసన ర్యాలీ చేస్తే నాపై కేసు పెట్టారు. కట్టుకథలు అల్లీ మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. గుడికి వెళ్లి వస్తుంటే నా మీద దాడి చేసి.. కేసు కట్టారు.

    ..ప్రతిపక్ష గొంతు వినపడకూడదని కుట్రపన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. మీ అక్రమ కేసులకు మేం భయపడం. మీరు హామీలను నెరవెర్చకుంటే ఆందోళన చేస్తాం. నేను ఎందుకు భయపడాలి?. మీరు నాటిన విష విత్తనం వృక్షమైతే ఎలాంటి పరిస్థితులుంటాయో ఆలోచించుకోండి’’ అంటూ విడదల రజిని వ్యాఖ్యానించారు.

  • సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో 9వ తరగతి విద్యార్ధి కిడ్నాప్‌ ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. విద్యార్ధి కిడ్నాప్ వ్యవహారమంతా డ్రామాగా పోలీసులు తేల్చేశారు. చదువుపై ఆసక్తి లేక... ఇంట్లో చెప్పలేక.. భయంతో ఇంటి నుంచి విద్యార్థి వచ్చేశాడు. సైకిల్‌పై ట్యూషన్‌కు బయలుదేరి సైకిల్‌ను మచిలీపట్నం బస్టాండ్‌లో పెట్టిన ఆ బాలుడు.. బస్ ఎక్కి పెడన వెళ్లాడు. అక్కడ నుంచి రైలులో విజయవాడకు వచ్చాడు.

    విజయవాడ వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురైన బాలుడు.. నిజం చెబితే ఏం తల్లిదండ్రులు ఏమంటారోననే భయంతో బాలుడు కిడ్నాప్ కథ అల్లాడు. ట్యూషన్‌కు వెళ్తుంటే తనను బైక్‌పై ఇద్దరు కిడ్నాప్ చేశారంటూ ఆ బాలుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు.  ఆ బాలుడు ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు.

    బంధువుల సాయంతో తల్లిదండ్రులు.. బాలుడిని మచిలీపట్నం తీసుకొచ్చారు. ఏం జరిగిందో ప్రశ్నించడంతో పోలీసుల ఎదుట బాలుడు నిజం ఒప్పుకున్నాడు. బాలుడు, తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. పిల్లలను నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని పోలీసులు సూచించారు.

Telangana

  • ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాలను వరుణుడు కాస్త చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు ( ఆదివారం) భారీ వర్షాలు కురిశాయి.  ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి. కోనసామ జిల్లాల్లోనూ భారీ జల్లులు పడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టం ఉండే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. నల్లగొండ, పెద్దవూర, తిప్పర్తిలో భారీ జల్లులు కురిశాయి. గుర్రంపూడి, సూర్యాపేట, కోదాడలో కుండపోతగా జల్లులు పడుతున్నాయి.  భారీగా కురిసిన వర్షం దాటికి హుూజుర్‌నగర్‌లో వృక్షాలు నేలకొరిగాయి. మిర్యాలగూడ, నకిరికేల్‌లో భారీ జల్లులు పడ్డాయి. సిద్ధిపేటలో భారీగా వర్షం కురవడంతో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. ఇన్నిరోజులు భానుడు భగభగలతో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వరుణుడు కరుణించడంతో కాస్త సేద తీరారు.

  • కరీంనగర్: కరీంనగర్‌ నడిబొడ్డున జ్యువెలరీ షాపులోదొంగతనం జరిగి, అక్కడ కాల్పుల ఘటన జరగడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. కరీంనగర్‌లో తెలంగాణ భద్రతా ఉందా? లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు కరీంనగర్‌ సీపీపై విరుచుకుపడ్డారు కౌశిక్‌రెడ్డి.  పదకొండు గంటలకు సంఘటన జరిగితే ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని, సీపీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 

    ‘కరీంనగర్‌లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. పోలీస్ వ్యవస్థ డేంజర్ లో ఉంది. గాయపడ్డ నలుగురికి ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరిది..,?, పదకొండు గంటలకు సంఘటన జరిగితే ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు. కరీంనగర్ సీపీ గడ్డి పీకుతుండా...?, వెపన్స్ పట్ఠుకుని  కరీంనగర్‌లోకి ఎలా వచ్చారు..?, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బండిసంజయ్ రాజీనామా చెయ్యాలి. సీపీని సస్పెండ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

     

  • కరీంనగర్: కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దొంగతనానికి పాల్పడింది అంతరాష్ట్ర దొంగల ముఠానే అని తెలిపారు మల్టీజోన్‌ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి. దొంగలు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదని, వారి ముఖాలను ఐడెంటీఫై చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దొంగల్లో ఒక అతను తెలుగులో మాట్లాడితే, మరొకరు హిందీలో మాట్లాడారన్నారు. ఈ తరహా ఘటన తాజాగా చందానగర్‌లోనూ జరిగిందన్నారు ఐజీ.

    కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీ షాప్‌లో దోపిడీ కేసుకు సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. కిలో వరకు బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు సిబ్బంది చెప్తున్నారు. ఎంత జ్యువెలరీ పోయింది అనేది లెక్కలు తేలిన తర్వాత చెప్తాం. దొంగలు వాహనాలు మార్చుతూ పారిపోతున్నారు.’ అని ఆయన పేర్కొన్నారు. దొంగల కోసం 12 దర్యాప్తు బృందాలతో గాలిస్తున్నామన్నారు. ఐదుగురు నిందితులు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. నార్త్‌ ఇండియాకు చెందని గ్యాంగ్‌గా అనుమానిస్తున్నామన్నారు. 

    ఇదీ చదవండి: 

    కరీంనగర్‌ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు

     

     

     

     

     

  • సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం రేగింది. దొంగల ముఠా రెచ్చిపోయారు. జ్యోతినగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాపులో తుపాకులతో ఐదుగురు దొంగలు చొరబడ్డారు. షాపులోని సిబ్బందిపై కాల్పులు జరిపిన దొంగలు.. భారీగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. గాయపడిన నలుగురి సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

    రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగలు షాపులో 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు షాపును  సిబ్బంది  ఓపెన్‌ చేశారు. లాకర్‌లో ఉన్న బంగారు అభరణాలను డిస్‌ప్లే పెడుతుండగా దొంగలు ప్రవేశించారు. లోపలికి వస్తూనే సిబ్బందిపై కాల్పులు జరిపారు జ్యువెలరీలో సుమారు 20 నిమిషాల పాటు పెనుగులాట జరిగింది. రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

     

  • హైదరాబాద్‌: పగలూ రాత్రీ తేడా లేకుండా కాలంతో పరుగులు పెడుతూ పనిచేయాల్సి వచ్చే కఠోరశ్రమతో కూడుకున్న రంగం  జర్నలిజం అని.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఆదర్శాలు, విలువలతో వచ్చి, ఆచరణలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

    ‘హైబిజ్ టీవీ’ మీడియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒకప్పుడు అలా కష్టాలు అనుభవించినవాణ్ణే. అయితే, ప్రగాఢమైన అభిరుచితో వదలకుండా కృషి చేస్తే గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఇవాళ మీడియా ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా ఉందన్నారు.

    జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు లోతుగా ఆలోచించి, మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. అందుకు ప్రభుత్వం ఓ వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు దశాబ్దాల క్రితమే చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, “1992లో హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేసిందే... మా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు మేము చేస్తున్న మంచి పనులను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నాం. అంతెందుకు... మా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అనుకూల, క్రియాశీలక విధానాల వల్ల గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కమర్షియల్ స్పేస్ నూటికి నూరుపాళ్ళు నిండిపోయింది.

    అలాగే, గత రెండేళ్ళలో ప్రతి 3 రోజులకు ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (‘జీసీసీ’ - ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో విదేశీ సంస్థల తాలూకు అనుబంధ సంస్థలు భారత్‌లో రావడం) హైదరాబాద్‌లో నెలకొనడం జరిగింది. ఒక్క గత ఏడాదిలోనే 70 జీసీసీలు వచ్చాయి. అలాగే, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామం ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్‌తో అనుసంధానమైంది. ఎక్కడికైనా సెకనులో వెయ్యో వంతులో సమాచారాన్ని పంపే వీలు కలిగింది. ఇది డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పరాకాష్ఠ” అని శ్రీధర్ బాబు వివరించారు.

    శనివారం అట్టహాసంగా సాగిన ఈ మీడియా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ అధ్యక్షుడు – రాజ్యసభ మాజీ సభ్యుడు వివేక్ గుప్తా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ‘భార‌తీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి, ‘లైఫ్ స్పాన్’ అధినేత నరేంద్ర రామ్ నంబుల, ‘క్రెడాయ్ - హైద‌రాబాద్’ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి, అలాగే ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్ట‌ర్ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్ట‌ర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్ట‌ర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) త‌దిత‌రులు పాల్గొన్నారు.

    2026కు గాను నిర్వహించిన తాజా అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల కుటుంబాలలోని ప్రతిభావంతులైన పిల్లల చదువులకు ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయల చొప్పున హైబిజ్ టీవీ - లైఫ్ స్పాన్ సంస్థలు ఆర్థికంగా చేయూత అందించడం విశేషం. అలా తమ ప్రతిభతో స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల్లో ఏ. వికాస్ గౌడ్ (97.02% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణుడు), ఏ. స్రవంతి (ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని), ఎన్. సమీక్ష (97.10% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి)..

    ఎస్. అనుశ్రిజ (బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని), ఎస్. అశ్వంత్ కుమార్ (97% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి), టి. తరళశ్రీ (97% మార్కులతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పూర్తి), ఎస్. సిరి (97.1% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), ఇ. వినీత్ (98% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), సహస్ర (ఇంటర్మీడియట్ పూర్తి), హెచ్. సాయి కిరణ్ (పదో తరగతి పూర్తి) తదితరులున్నారు. ఉపకార వేతనాల చెక్కును మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం, ఆ కుటుంబాల సంతోషంతో సభావేదిక కళకళలాడింది.

    ‘హైబిజ్ టీవీ - మీడియా అవార్డ్స్ 2026’లో భాగంగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఐదుగురికి ‘లెజెండ‌రీ పుర‌స్కారాలు’ అంద‌జేశారు. ఈ ‘లెజండరీ పురస్కారాలు’ అందుకున్న వారిలో... జాతీయ జర్నలిస్టు భూపేంద్ర చౌబే (మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్ఎన్ - న్యూస్18, ఇండియా ఎహెడ్, ఎన్డీ టీవీ), తెలుగువారైన వెటరన్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు (ఆలిండియా రేడియో), ఆంగ్ల పత్రికా ప్రపంచంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సీహెచ్. సుశీల్ రావు (టైమ్స్ ఆఫ్ ఇండియా - దక్కన్ క్రానికల్), పలు మీడియాల్లో ప్రసిద్ధురాలైన సి. మృణాళిని, ప్రకటనల రంగంలో విస్తృత సేవలు అందించిన శ్రీనాథ్ అయ్యర్ (హిందూ, హిందుస్థాన్ టైమ్స్) ఉన్నారు.

    ఈ సందర్భంగా భూపేంద్ర చౌబే మాట్లాడుతూ, “ఒక రకంగా ఇవాళ జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ భాషల్లోని మీడియాయే చాలా శక్తిమంతంగా ఉంది. అదే సమయంలో, రానున్న రోజుల్లో మీడియా సంస్థల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం ఎక్కువ కానుంది” అని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ నగరంలో ఓ తెలియని ఆత్మీయత ఉంది. నేను యూపీకి చెందినవాడిని అయినప్పటికీ, తెలుగు భాష, తెలుగు సినిమా, తెలుగు సంగీతం అంటే మక్కువ ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.

    ఈ అవార్డుల ఉత్సవానికి అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టెస్ట్ మ్యాచ్‌ల నుంచి వన్డేలు, 50 ఓవర్లు, ఇప్పుడు టీ20లకు క్రికెట్ మారినట్టే... కాలంతో పాటు మీడియా సైతం ఎంతో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా... ఏ రంగంలోనైనా గుర్తింపు అనేది మరింత శ్రమించడానికి ప్రేరణనిస్తుంది. దాదాపు 20 ఏళ్ళు యూత్ లీడర్‌గా ఎన్.ఎస్.యు.ఐ లాంటి వాటిలో నిరంతరం పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అదే విధంగా మీడియా మిత్రులు తమ రంగంలో మరింత కృషి చేయడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.

    అందుకు తగ్గట్టే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కేట‌గిరీలో క‌లిపి 60 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులను ‘హైబిజ్ టీవీ’ మీడియా పుర‌స్కారాల‌తో సత్కరించింది. లోతైన పరిశోధనతో ఎన్నో విశేషాలను వెలికితీసి, తెలుగు సినీ రంగ చరిత్రను అక్షరబద్ధం చేయడంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తూ, గతంలో ప్రభుత్వ నంది, గద్దర్ అవార్డులను అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ – రచయిత డాక్టర్ రెంటాల జయదేవను “తెలుగు సినీ చరిత్రకు ఉత్తమ డాక్యుమెంటేషన్ చేస్తున్న అరుదైన జర్నలిస్టు”గా గుర్తించి, అవార్డుతో గౌరవించింది. జయదేవను మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి, ఉత్తమ ‘తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం’గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన రచన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం గురించి తెలుసుకున్నారు.

    ‘సాక్షి’ మీడియా గ్రూపు నుంచే మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలలో బొంబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గుండాల శ్రీనివాసరావు (ప్రింట్ స్పెషల్ జ్యూరీ- అప్ కంట్రీ), అలాగే ప్రకటన, మార్కెటింగ్ రంగాలకు చెందిన శ్రీనివాస్ (ఎడ్యుకేషన్ స్పెషల్స్), వెంకటేశ్ (రిటైల్ యాడ్స్), వేణు (ఇంజనీరింగ్ కాలేజెస్) ఉన్నారు.

    ఇక, వ్యవసాయ రంగంపై విశేష కృషి చేస్తున్న అంకితభావం గల జర్నలిస్ట్ వలేటి గోపీచంద్ (ఆకాశవాణి), సినీ రంగ పాత్రికేయానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చల్లా శ్రీనివాస్ (జ్యోతి), ఎడిటోరియల్ విభాగంలో సీనియరైన భాస్కర్ తాటికొండ (హన్స్ ఇండియా), పొలిటికల్ రిపోర్టింగ్‌లో సీనియరైన గూడ ఆంజనేయులు గౌడ్, టీవీ రంగంలో పాపులరైన కాట్రగడ్డ అజిత (99 టీవీ), న్యూస్ యాంకర్లు స్వర్ణ రోజా (రాజ్ టీవీ), అపర్ణ (వి6), వినోదరంగంలో పేరు తెచ్చుకున్న టీవీ జర్నలిస్ట్ తారక్ (ఎన్టీవీ), టీవీ రిపోర్టర్ సత్యనారాయణ, ప్రింట్ జర్నలిస్ట్ పి. జగదీశ్వర్ (నవ తెలంగాణ), అలాగే మంగుమూరి శ్రీనివాస్, వి. సురేశ్ తదితరులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.

    విసుగూ, విరామం లేకుండా విజేతలందరికీ మంత్రే స్వయంగా అవార్డులు అందించడం గమనార్హం. అవార్డు అందుకున్న విజేతలందరూ తమ సంతోషం వ్య‌క్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి ‘హైబిజ్ టీవీ’ త‌గిన గుర్తింపునిచ్చింద‌నీ, ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని క‌లిగిస్తోంద‌నీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని కోరారు.

    ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి మీడియా అవార్డ్స్ విజేతలకు ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలు సైతం అందించేందుకు ‘క్రెడాయ్’ ముందుంటుందని ‘క్రెడాయ్ - హైద‌రాబాద్’ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి ప్రకటించడం విశేషం. “హైదరాబాద్ నగరంలోని ఈ ప్రాంతం (హైటెక్ సిటీ)లో స్థిరాస్తి విలువ గత పాతికేళ్ళలో వంద రెట్లు పెరిగింది. కేవలం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదీ అతి తక్కువగా కేవలం 12.5 శాతమే ఉన్నది స్థిరాస్తి రంగమే. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే స్థిరాస్తుల రంగంపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేలా మీడియా మరిన్ని కథనాలు అందించా”లని జైదీప్ రెడ్డి అభ్యర్థించారు.

    విజేతలను ఎంపిక చేసిన విశేష అనుభవజ్ఞుల బృందం పక్షాన సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ గత ఆరేళ్ళ అవార్డుల ప్రస్థానాన్ని వివరించారు. “మీడియా రంగంలో అందరికీ తెలిసేది జర్నలిస్టులే. కానీ, అడ్వర్టయిజింగ్, సర్క్యులేషన్ వారు ఈ పరిశ్రమలో అన్ సంగ్ హీరోస్” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ ఎం. ర‌వీంద‌ర్ రెడ్డి, ‘సాక్షి’ మీడియా గ్రూప్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, మార్కెటింగ్ విభాగంలో ఉన్నత పదవి నిర్వహించిన రమణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయి శేఖర్, ‘మిసిమి’ సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక అధిపతి – ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘ఆలిండియా రేడియో’ విశ్రాంత ఉన్నతోద్యోగి సి.ఎస్. రాంబాబు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, ‘హైబిజ్ టీవీ’కి చెందిన సుశిక్షితులైన సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Hyderabad City

  • హైదరాబాద్‌: గాంధీభవన్ లో మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

    ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.

    బూత్ స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ కోసం వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్ (BLA)” నియామకాన్ని పూర్తి చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేస్తేనే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు,మరియు డివిజన్ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో మధుయాష్కి గారు,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు. ఉప్పల్ నియోజకవర్గం కోర్డినేటర్ శశికళ యాదవ్ గారు,బండి రమేష్ గారు,కోలన్ హనుమంత్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు

Politics

  • సాక్షి, నెల్లూరు: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పార్టీ.. గుణపం పోటు పార్టీ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. వివేకాను హత్య చేసిన వారిని మీ వెనుక వేసుకొని.. వైఎస్సార్‌సీపీని గొడ్డలి పార్టీ అనడం కాదన్నారు. చంద్రబాబు గుణపం పోట్లకు ఎవరూ అనర్హం కాదని కాకాణి ఎద్దేవా చేశారు.

    గుణపం చంద్రబాబు చేతిలో పెడితే సింబాలిక్‌గా వుంటుంది. అమరావతిని గుణపంతో తవ్వి కోట్లు కొల్లగొడుతున్నారు. దోపిడీ విజనరీతో అవినీతితో రాజ్యం ఏలుతున్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్లు దోచుకుంటున్నారు. శాశ్వత సచివాలయం, ప్రభుత్వ భవనాలు పేరిట కాంట్రాక్టుల మాటున కొల్లగొడుతున్నారు’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Family

  • నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో కవి. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు నవ్వు నలభై విధాలా మేలు అంటున్నారు. చిన్న చిరునవ్వు స్నేహపరిమళాలనూ వెదజల్లుతుంది. మానసిక వేదనను దూరం చేస్తుంది. నేడు ‘ప్రపంచ నవ్వుల దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

    సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: వేగవంతమైన ఆధునిక జీవన విధానంలో నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీబిజీగా గడుపుతుంటాం. వృత్తిపర, వ్యక్తిగత, కుటుంబపరమైన ఒత్తిళ్లు సరేసరి. వీటికి తోడు మారిన ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే బ్రెయిన్‌ స్ట్రోక్, హార్ట్‌ స్ట్రోక్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్, జాగింగ్, రన్నింగ్‌తోపాటు వివిధ ఆటలు ఆడుతున్నారు. వీటికి తోడు నవ్వడం కూడా ఒక అంశంగా ఉంటే మరిన్ని మంచి ఫలితాలిస్తాయని చెబుతున్నారు. అయితే, సందర్భం లేకుండా నవ్వడం, ఎదుటివారిని అపహాస్యం చేస్తూ వెకిలిగా నవ్వడం వంటి వాటిని ఉద్దేశించి ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేది కూడా ఉంది. కాగా, నవ్వుల్లోనూ అనేక రకాలున్నాయి. నోరు మూసుకొని లోలోపలే నవ్వుకోవడాన్ని ముసిముసి నవ్వు అంటుంటారు. పెదవులు విప్పకుండా వచ్చే ప్రశాంతమైన నవ్వును చిరునవ్వు అని, మందహాసం అని కూడా అంటారు. పగలబడి నవ్వడం, గట్టిగా నవ్వడాన్ని పకపక నవ్వు అంటారు. ఎగతాళి చేసేలా పెద్దగా నవ్వడాన్ని వికటాట్టహాసం అంటారు. అపహాస్యం చేసే నవ్వును వెకిలి నవ్వుగా పేర్కొంటారు.

    సామాజిక మాధ్యమాల్లో పుట్లకొద్ది కామెడీ
    ఫోన్‌ వాడుతున్న వారిలో దాదాపు అందరూ సామాజిక మాధ్యమాల ప్రభావంలో ఉంటారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి వాటితోపా టు వాట్సాప్‌లో కామెడీ కోసం కొన్ని గ్రూపులు ఏ ర్పాటు చేసుకొని అందులో రకరకాల హాస్య సన్నివేశాలను పోస్ట్‌ చేస్తుంటారు. ఈమధ్య కాలంలో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో హాస్యం పండించే వీడియోలను ఎక్కువగా చూస్తున్నట్టు తెలుస్తోంది.

    నలుగురు దోస్తులు కలిస్తే..
    నలుగురు దోస్తులు కలిస్తే చాలు ఏదో ఒ క కామెడీ పండిస్తారు. ఇది మనకు తెలియకుండానే మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. చా య్‌ తాగుతూ, అల్పాహారం తింటూనో మా ట్లాడుకుంటారు. అదే సందర్భంలో ఎవరినో ఉద్దేశించి కామెడీగా నవ్వుకోవడం పరిపాటి. వాకింగ్‌ చేస్తూ మాట్లాడడం, మధ్యమధ్యలో నవ్వులతో ఉల్లాసం పొందుతారు. అలాంటి నవ్వుల కోసమైనా దోస్తులతో కలవాల్సిందే. 

  • బయటికి బయల్దేరారు. మీ కారు ‘కీ’స్‌ కనిపించలేదు! లేదా, టీవీ ఆన్‌ చే శారు. రిమోట్‌ కనిపించలేదు! ‘కీ’స్‌ కోసం, రిమోట్‌ కోసం ఇంట్లో అవి ఉండే చోటంతా వెతికారు. కానీ కనిపించలేదు! ఇల్లంతా గాలించారు, అయినా కనిపించలేదు! కీస్‌ కానీ, టీవీ రిమోట్‌ గానీ అంతలా ఎలా మాయం అయినట్లు?! సరే.. ఇంట్లోంచే కాదు, ఈ విశ్వంలోనే మీ కారు తాళాలు, టీవీ రిమోట్‌ అదృశ్యం అయ్యాయనే అనుకుందాం. అప్పుడు అవి ఏ జగత్తులలోకి వెళ్లిపోయినట్లు?

    ఈ ప్రశ్నకు భౌతికశాస్త్రం (సాధారణ ఫిజిక్స్‌) ఏమంటుందంటే – ఇక అవి పోయినట్లేనని! అదే క్వాంటమ్‌ ఫిజిక్స్‌ అయితే, ‘‘ఎక్కడికీ పోవు. ఎక్కడికి పోయాయో ఆ సమాచారాన్ని కనిపెడితే అవి ఎక్కడున్నాయో తెలుస్తుంది’’ అంటుంది! ‘‘లేనివి ఎలా ఉంటాయి?’’ అని సాధారణ ఫిజిక్స్‌ అంటే.. ‘‘లేకుండా ఎలా పోతాయి?’’ అని క్వాంటమ్‌ ఫిజిక్స్‌ అంటుంది! గత యాభై ఏళ్లుగా రెండిటి మధ్యా ఇదే ఘర్షణ. అయితే  ఇప్పుడా మహా శాస్త్ర యుద్ధం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు ఈ విశ్వానికి మరో మూడు కొత్త డైమెన్షన్‌లు ఉన్నట్లు కనిపెట్టటమే అందుకు కారణం. 

    ఏ థియరీ కరెక్ట్‌?! 
    క్వాంటమ్‌ ఫిజిక్స్‌ థియరీనే కరెక్ట్‌ అంటున్నారు ‘స్లోవాక్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌’ సీనియర్‌ శాస్త్ర పరిశోధకులు రిచర్డ్‌ పిన్‌కాక్‌! ‘‘ఆ విషయం మీరెలా చెబుతారు?’’ అని ఆయన్ని అడిగితే, ఈ విశ్వంలో ఉన్నవి ఇప్పటి వరకు మనమంతా అనుకుంటున్నట్లు 4 డైమెన్షన్‌లు మాత్రమే కాదు, మరో మూడు డైమెన్షన్‌లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుని చూస్తే, అదృశ్యమైపోయిన వస్తువును కూడా, అంజనం వేయకుండానే అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు’’ అని పిన్‌కాక్‌ చెబుతున్నారు!

    ఆ నాలుగు.. ఈ మూడు
    భారత జాతీయ చిహ్నంలో మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా, ‘కనిపించని నాలుగో సింహం’ కూడా, ఆ వెనుక వైపు ఉంటుంది. అదే విధంగా ఈ విశ్వానికి నాలుగు డైమెన్షన్‌లు ఉన్నాయి. అంటే నాలుగు కొలమానాలు. అవి : పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు, సమయం. అయితే ఈ నాలుగే కాకుండా, కనిపించని మరో మూడు కొలమానాలు కూడా ఉన్నాయని తాజాగా పిన్‌కాక్‌ ప్రకటించారు! ఆ మూడు కొలమానాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి వస్తువు ఎక్కడ ఉండి ఉంటుందో కనిపెట్టొచ్చని చెబుతున్నారు. అంటే, సాధారణ ఫిజిక్స్‌ భావిస్తున్నట్లు ‘సమాచారం’ అన్నది లుప్తమైపోదు. క్వాంటమ్‌ ఫిజిక్స్‌ భావిస్తున్నట్లు ‘సమాచారం’ నిగూఢంగా ఉండిపోతుంది’!

    మెలిక, ముడి, బాహ్య బలం
    కొత్తగా శాస్త్ర పరిశోధకులు కనిపెట్టిన అదనపు డైమెన్షన్‌లు ఈ మూడూ! ఇవి పొరలుగా మడత పడి ఉంటాయి కనుక పైకి కనిపించవని, వాటి లోపలికి వెళ్లి చూడగలిగితే అదృశ్యమైపోయిన వస్తువు తాలూకూ సమాచారం (అద్కెడుందో, ఎలా ఉందో..) తెలుస్తుందని పిన్‌కాక్‌ బృందం భావిస్తోంది. సైన్స్‌ చరిత్రలో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ‘ఇన్ఫర్మేషన్‌ పారడాక్స్‌’ అనే పెద్ద చిక్కుముడిని విప్పడానికి ఈ ఏడు (ఇప్పటికే ఉన్న 4, కొత్తగా కనిపెట్టిన 3) డైమెన్షన్‌ల తాజా సిద్ధాంతం ఉపయోగపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా, బ్లాక్‌ హోల్స్‌ (కృష్ణ్ల బిలాలు) అంతమైపోయేటప్పుడు ఏం జరుగుతుందో ఈ థియరీ వివరిస్తుందట! 

    మనమున్నది త్రీడీ ప్రపంచం
    సాధారణంగా మనం దేనినైనా త్రీ–డైమెన్షనల్‌ (త్రీడీ) లోనే చూడగలం. అసలు మనం నివసిస్తున్న ప్రపంచమే త్రీడీ ప్రపంచం. ఒక వస్తువు స్థానాన్ని, రూపాన్ని చెప్పటానికి ఉపయోగించే 1. పొడవు, 2. వెడల్పు, 3. ఎత్తు లేదా లోతుల కొలమానాలు అవి. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఈ మూడు కొలమానాలకు ‘సమయం’ అనే కొలతను జోడించటంతో త్రీడీ కాస్తా 4డీ అయింది. ‘‘మీరు ఒక స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు అతడి ఉనికి (స్థలం)తో పాటుగా అతడిని ఏ సమయంలో కలవాలనుకుంటున్నదీ ముఖ్యం అవుతుంది. అంటే స్థలం, కాలం విడదీయలేవి..’’ అంటారు ఐన్‌స్టీన్‌. అందుకే ఇది త్రీడీ కాదు, 4డీ ప్రపంచం అని ఆయన సిద్ధాంతం.

    హాకింగ్‌ వల్లే ‘ఫిజిక్స్‌ వార్‌’
    గతంలో శాస్త్రవేత్తలు, బ్లాక్‌ హోల్స్‌ అంటే అన్నీ మింగేసే శూన్య ప్రదేశాలని, వాటిలో పడిపోయినదేదీ ఇక బయటకు రాలేదని అనుకునేవారు. ఆ భావనను సమర్థించే విధంగా 1970లో స్టీఫెన్‌ హాకింగ్,  బ్లాక్‌ హోల్స్‌ నుండి రేడియేషన్‌ వస్తుందని, ఆ ప్రభావంతో కాలక్రమేణా ఆ బ్లాక్‌హోల్స్‌ ఉనికే లేకుండా (సమాచారం లేకుండా) ఆవిరైపోతాయని ప్రతిపాదించారు. అయితే క్వాంటమ్‌ ఫిజిక్స్‌ నియమాల ప్రకారం ఏ సమాచారం కూడా పూర్తిగా నాశనం కాకూడదు. మరి బ్లాక్‌ హోల్‌ ఆవిరైపోతే అందులోని సమాచారం ఏమవుతుంది? దానికి సమాధానమే ఈ ఏడు డైమెన్షన్‌ల థియరీ అంటున్నారు పిన్‌కాక్‌. 

    ‘మంటల్లో పుస్తకం’.. మంచి ఉదాహరణ 
    క్వాంటమ్‌ ఫిజిక్స్‌ ప్రకారం ఏ సమాచారమూ పూర్తిగా నశించదు అనేందుకు పరిశోధకుడు రిచర్డ్‌ పిన్‌కాక్‌ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒక పుస్తకాన్ని మంటల్లో వేశారనుకోండి. ఆ పుస్తకం కాలిపోతుంది. కానీ సిద్ధాంతపరంగా, ఆ మంటల నుండి వచ్చిన పొగ, బూడిద, వేడిని పరిశీలిస్తే.. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం తిరిగి సేకరించవచ్చు అంటారు పిన్‌కాక్‌! పుస్తకాన్ని పునర్నిర్మించటానికి అగ్ని నుండి వెలువడిన ప్రతి కాంతి రేణువును, గాలిలోని ప్రతి కంపనాన్ని (వేడిని), మసిలోని ప్రతి రేణువు కచ్చితమైన స్థానాన్ని గుర్తించగలిగితే అది సాధ్యమేనంటారు పిన్‌కాక్‌. దానర్థం,  సమాచారం రూపు మారుతుంది తప్ప, పూర్తిగా నిర్మూలన జరగదని. 

    ఎలా నిరూపించగలం?
    ఒకవేళ ఈ ఏడు కొలతల సిద్ధాంతం నిజమే అయితే, మనం ‘కాలుజా–క్లీన్‌ పార్టికల్స్‌’ అనే ప్రత్యేక కణాలను గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఇవి మనకు తెలిసిన భారీ కణాల కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అతిపెద్ద యంత్రం ‘లార్జ్‌ హ్యాడ్రాన్‌ కొలైడర్‌’ సామర్థ్యం కూడా వీటిని కనిపెట్టడానికి సరిపోదు. అయితే విశ్వం పుట్టినప్పుడు వెలువడిన కిరణాల (కాస్మిక్‌ మైక్రోవేవ్‌ రేడియేషన్‌) ద్వారా లేదా స్పేస్‌టైమ్‌లోని ఆదిమ గురుత్వాకర్షణ తరంగాల ద్వారా వీటి జాడను కనుగొనే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతికత ఇందుకు సరిపోదు. కాబట్టి, ఈ సిద్ధాంతం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది ఒక పరిశోధన స్థాయిలోనే ఉంది. దీనిని నిరూపించాలంటే మనం మరికొంత కాలం వేచి చూడాలి.
    ∙ సాక్షి స్పెషల్‌ డెస్క్‌

    బ్లాక్‌హోల్‌ ‘మెమరీ చిప్‌’
    తాజా పరిశోధకుల సిద్ధాంతం ప్రకారం, ఒక బ్లాక్‌ హోల్‌ సాధ్యమైనంత సూక్ష్మ పరిమాణాలకు ఆవిరైపోతున్నప్పుడు, దాని ఏడు డైమెన్షన్‌లు ప్రాథమికంగా ఒక ముడిలా చిక్కువడిపోతాయి. ఆ ముడి తగినంత చిన్నదిగా మారినప్పుడు, ఈ దాగి ఉన్న డైమెన్షన్‌లు ముడుచుకోవటం వల్ల ఒక బాహ్య బలం (బయటి నుంచి లోపలికి నెట్టే శక్తి) ఏర్పడి అది బ్లాక్‌హోల్‌ పూర్తిగా కూలిపోకుండా నిరోధిస్తుంది. చివరికి అక్కడ ఒక అతి సూక్ష్మమైన పదార్థం మిగిలిపోతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్‌ కన్నా 1000 కోట్ల రెట్లు చిన్నది. ఇది చూడడానికి ఏమీ లేనట్టు అనిపించినా, ఆ ‘మెలిక పడిన ముడి’ లోపల బ్లాక్‌ హోల్‌ మింగేసిన సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. అంటే, సమాచారం ఎక్కడికీ పోలేదు! ఒక చిన్న జ్ఞాపకంలా ఆ ఏడు కొలతల ‘మెమరీ చిప్‌’ ముడిలో దాగి ఉంటుందన్నమాట.

    విశ్వానికి ‘టార్షన్‌ ఫీల్డ్‌’ మెలిక 
    మూడు అదనపు కొలమానాలైన మెలిక, ముడి, బాహ్య బలాల ఉనికిని  నిరూపించటానికి రిచర్డ్‌ పిన్‌ కాక్‌ ‘స్పేస్‌టైమ్‌’  (స్థలం–సమయం) నిర్మాణాన్ని కొత్త కోణంలో చూశారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం ప్రకారం స్పేస్‌టైమ్‌ అనేది ఒక నాలుగు కొలతల షీట్‌ (చాప) లాంటిది. అది వంగగలదు, సాగగలదు. అయితే తాజా సిద్ధాంతం ప్రకారం, ఈ స్పేస్‌టైమ్‌లో ఏడు కొలతలు ఉన్నాయి. మనకు కనిపించని ఆ మూడు అదనపు కొలతల్ని పట్టుకోగలిగితే బ్లాక్‌ హోల్స్‌లో సమాచారం ఎలా దాగి ఉంటుందో వివరించడం సాధ్యమవుతుంది అంటారు పిన్‌కాక్‌! ఈ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ‘స్పేస్‌టైమ్‌’ (నాలుగు కొలతల ఏకీకృత నిర్మాణం) వల్ల ఈ విశ్వం వంగే గుణాన్ని, సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మూడు అదనపు కొలమానాలలో ఒకదాని వల్ల అది ‘మెలిక’ కూడా పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు ‘టార్షన్‌ ఫీల్డ్‌’ అని పిలుస్తున్నారు. బ్లాక్‌హోల్స్‌ అదృశ్యమైనట్లు కనిపించినప్పుడు అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవటానికి ఈ టార్షన్‌ ఫీల్డ్‌ ఉపయోగపడుతుంది.  

    కృష్ణబిలాలు అదృశ్యం కాకుండా, ఎంతగానో కుంచించుకుపోతాయి. వాటి అంతర్గత డైమెన్షన్‌లు ముడివడి, మెలిక తిరిగి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దాంతో సమాచారం అంతా ఒక చిన్న శాశ్వత చిహ్నంలా ఎప్పటికీ దానిని పట్టుకునే ఉంటుంది.   

    విశ్వానికి ఏడు డైమెన్షన్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఇప్పటికే ఉన్న పొడువు, వెడల్పు, ఎత్తు / లోతు, కాలం అనే నాలుగు డైమెన్షన్‌లతో పాటుగా, ‘దాగి ఉన్న’ పొరల్లాంటి డైమెన్షన్‌లు మరో మూడు కూడా ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయని వారు భావిస్తున్నారు.