Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి మిర్యాలగూడ: వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీనేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18మున్సిపాలిటీలు ఉన్నాయని అన్నింటా విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డికి ఈ విజయాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలని మంత్రి కోరారు.

    ఇటీవల ఒకవ్యక్తి తెలంగాణ జాతిపిత అంటూ బయిలుదేరారని.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం మంత్రి పదవికి తాను కూడా రాజీనామా చేశానని తనని కూడా అలానే పిలుస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన   1100 మంది బిడ్డలే రాష్ట్రానికి అసలైన జాతిపితలని మంత్రి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం  నల్లగొండ ముద్దుబిడ్డ శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్ రెడ్డి లాంటి వారు ఎంతో మంది  ప్రాణత్యాగం చేశారని వారంతా ఇప్పుడు స్వర్గంలో ఉన్నారని తెలిపారు. 

    ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, తనతో పాటు సహాచర మంత్రులతో పాటు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలని నిర్ణయించామని తాను తిన్న బియ్యమే ప్రజలకు ఇస్తున్నామన్నారు. దీంతో మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ ఇండస్ట్రీలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. 

     

  • హైదరాబాద్‌: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్న తీరుపై సైబరాబాద్ పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

    ఇటీవల ఐదుగురు బాలలు సైబర్ టవర్ జంక్షన్ వద్ద ఇదే రీతిలో భిక్షాటన చేయిస్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని క్షేమంగా రక్షించారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి వారిని పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, వారిని జైలుకు పంపారు. రక్షించిన పిల్లలకు బాలల సంరక్షణ సంస్థల సహకారంతో పునరావాసం కల్పించి, వారికి కొత్త జీవితాన్ని అందించామని సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం తెలిపారు.

    ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీగా ఉండే రోడ్డు జంక్షన్ల వద్ద చిన్నారులకు మహాత్మా గాంధీ వేషం వేసి, ఒళ్లంతా రంగులు పూసి వారిని భిక్షాటన చేయిస్తున్నా ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చాయన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసం కన్నవారే తమ పిల్లల హక్కులను కాలరాస్తూ, వాహనాల మధ్య వారిని ప్రమాదంలోకి నెట్టడంపై  ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘చిన్నారులతో భిక్షాటనకు చేయించచడం చట్టరీత్యా నేరం. అది తల్లిదండ్రులైనా, సంరక్షకులైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేరని డీసీపీ స్పష్టం చేశారు. రంగుల వల్ల కలిగే శారీరక ఇబ్బందులు, రద్దీ ప్రాంతాల్లో ఉండే ప్రాణాపాయం పిల్లల మానసిక వికాసాన్ని దెబ్బతీస్తాయని’ ఆమె పేర్కొన్నారు.

    "పిల్లలు బడిలో ఉండాలి.. భిక్షాటనలో కాదు" అనే నినాదంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మీ కంటపడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ లేదా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు గానీ సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
     

  • సాక్షి,హైదరాబాద్‌: జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ చూట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు అరవ శ్రీధర్‌పై కేసులు నమోదు చేశారు. అయితే, అరవ శ్రీధర్‌ అసెంబ్లీలో ఉండగా తనకు వీడియో కాల్స్‌ చేశారు. ఇదే అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. 

    పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలిపై బెదిరింపులు, అసత్య ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు. అరవ శ్రీధర్‌ స్త్రీ లోలుడు. ఆయన బాధితుల్లో నేనే కాదు. నాతో పాటు మరో ఐదుగురు ఉన్నారు

    రూ.25 కోట్లు నేను అడగలేదు. డబ్బులు డిమాండ్‌ చేసినట్లు నాపై వస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలే. అరవ శ్రీధర్‌ ప్రతిసారి  అసెంబ్లీ నుండి  కాల్ చేసేవాడు. అక్కడ జరిగే అన్ని విషయాలు చూపించేవాడు. ఇదే అంశంపై ఏపీ  అసెంబ్లీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తాం. సంజీవని ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాకే అబార్షన్‌ అయ్యింది. అతను నాతోనే కాదు. మరో ఐదుగురితో ఇలాగే చేశాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఆయన మోసాలన్నీ నాకు తెలిసి ఇదంతా ఆపేద్దాం అన్నాను. అందుకే సేఫ్ సైడ్‌గా అన్ని ఆధారాలు ఉంచుకున్నాను

    నన్ను అతను పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇల్లు మొత్తానికి తెలుసు. శ్రీధర్‌కు రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ముక్క రూపానంద్ రెడ్డి అండదండలున్నాయి. అతనే వెనక ఉంది శ్రీధర్‌ను నడిపిస్తున్నారు’అని ఆరోపించారు.  

    ఈ సందర్భంగా అరవ శ్రీధర్‌ అరాచకాల్ని బయటపెట్టినందుకు బాధితురాలిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే బహిర్గతం చేయాలని ఆమె తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.

    మహిళా విచారణ కమిటీ వేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను  కోరుతున్నాము. బాధిత మహిళ రూ.25 కోట్లు మహిళా డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎమ్మెల్యే ఆస్తులు రూ.3 లక్షలు మాత్రమే అని అఫిడవిట్‌లో ఉంది. అలాంటిది రూ. 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తారు. అక్రమంగా సంపాదిస్తే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాము. కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన ఎమ్మెల్యేపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు. మరి అసెంబ్లీలో కూర్చొని ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ పైన స్పీకర్ చర్యలు ఉండవా?? అని ప్రశ్నించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటజీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌ సూపరిండెంట్‌ ఇంజనీర్‌ చిన్నారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. రూ.1.40 కోట్ల పనుల బిల్లుల వెరిఫికేషన్‌ పేరుతో ఓ కంట్రాక్టర్‌ను లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు.. చిన్నారెడ్డి ఆస్తులపై ఆరా తీస్తోంది.

     

  • హైదరాబాద్‌: క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు. అది మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుందన్నారు ప్రముఖ  సినీ నటుడు చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి అధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు.

    అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి.

    కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో  క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.

    Chiranjeevi : క్యాన్సర్ మహమ్మారిని తేలిగ్గా తీసుకోకండి..

    క్యాన్సర్ చికిత్స కోసం అనేక రకాలైన అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఎక్కువకాలం బ్రతికే అవకాశం ఉందన్నారు. సమాజంలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. అలాగే క్యాన్సర్‌ను  జయించిన వారు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట మరియు క్యాన్సర్ చికిత్స పొందిన మరియు పొందుతున్న వారు పాల్గొన్నారు.

Movies

  • దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం రెండు ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చ రేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ, ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది.  

    ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సినిమాకు మాక్సిమమ్ రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరిగాలి. దానికి నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు. లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్‌స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు.  

    ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్‌లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సింది. కానీ అది జరగలేదు. నెలలు గడిచిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించారు. అంతేకాక రాజమౌళి ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఓటీటీ డీల్ కోసం జరుగుతోందని అనుకోవాల్సి వస్తోంది.  

    సోషల్ మీడియాలో వారణాసి ఓటీటీ రైట్స్ 600 కోట్లకు పైగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ నటించిన స్పిరిట్ ఓటీటీ డీల్ 170 కోట్లుగా టాక్ ఉంది. అది కూడా పాన్ ఇండియా లెవల్‌లో క్రేజీ ప్రాజెక్ట్. కానీ పాన్ వరల్డ్ స్థాయికి చేరలేదు. సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా క్రేజ్ వేరే. రాజమౌళి సినిమాల స్పాన్ వేరే అయినప్పటికీ లెక్కలు వేసుకుంటే 340–440 కోట్ల మధ్యే డీల్‌ సాధ్యపడొచ్చని అంచనా.


    650 కోట్ల రేంజ్‌లో ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అవి కేవలం క్రేజ్ కోసం పుట్టినవే. నిజంగా అలాంటి హెవీ డీల్ జరిగితే, అమౌంట్ బయటకు రాకపోయినా, డీల్ ఫైనల్ అయిన వార్త మాత్రం ముందుగానే బయటకు వచ్చేది. డీల్ క్లోజ్ అయితే సినిమా చకచకా ఫినిష్ చేయడంపై టీమ్ దృష్టి పెట్టేది.  ప్రస్తుతం వారణాసి ఓటీటీ రైట్స్ 600–650 కోట్ల రేంజ్‌లో క్లోజ్ అయ్యాయని చెప్పడానికి ఆధారాలు లేవు. ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమే. వాస్తవానికి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 400 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయితే అదే పెద్ద డీల్‌ అని చెప్పొచ్చు.  

  • మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. జనవరి 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

    బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచిన ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. అయినప్పటికీ ఫిబ్రవరి 11 నుంచే ఓటీటీకి రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలోనే తాజాగా జీ5 తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. ఇందులో మనశంకర వరప్రసాద్‌గారు ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌కు రానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో టాలీవుడ్ సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా శివ కార్తికేయన్ హీరోగా  నటించిన పరాశక్తి మూవీ స్ట్రీమింగ్ డేట్‌ కూడా తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. 

  • బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. 

    తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్‌ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.

    (ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)

    అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్‌లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు.
     

     

  • సన్నీ మాదాల, మౌనిక  జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే  హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.

    పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు  సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం  ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. 

    దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు.

     

  • పవన్‌ కల్యాణ్  హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు.  ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు.

    అయితే అదే రోజున నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్ రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తోన్న నాని మూవీ వాయిదా పడుతుందా? లేదంటే అదే రోజు రిలీజవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేశారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏకంగా ఏప్రిల్ 30కి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నాని ప్యారడైజ్‌ పోస్ట్‌ పోన్ అవుతుందా?.. ఉస్తాద్ భగత్‌ సింగ్‌తో బాక్సాఫీస్ బరిలో నిలుస్తుందా ‍అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

  • గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.

    కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

    దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్

    కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్‌లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

    భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్‌ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్‌, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.

    ఆ రికార్డ్స్ గల్లంతేనా?

    ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌  దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్‌కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్‌ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది.

  • జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్‌ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్‌ మూవీతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది.

    సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్‌, పిల్లలు రియాన్‌, రాహుల్‌తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?

    కొడుకు అమాయక ప్రశ్న
    జెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్‌ స్కూల్‌ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్‌ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. 

    భార్యాభర్తలిద్దరూ..
    అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్‌, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్‌ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్‌ కాదనిపించడంతో 2016లో నాన్‌వెజ్‌ తినడం మానేశాడు.

    వేగనిజం
    2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్‌కు జై కొట్టారు. వేగన్‌ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.

    చదవండి: బుల్లెట్‌ సునీల్‌గా రాజశేఖర్‌.. గ్లింప్స్‌ చూశారా?

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా అభిమానులకు బిగ్ షాకిచ్చింది మూవీ టీమ్. పెద్ది విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

    పెద్ది మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో మార్చిలో పెద్ది చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

    దురంధర్-2 వల్లేనా?

    అయితే పెద్ది మూవీ వాయిదా వేయడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ సీక్వెల్‌ దురంధర్-2 మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ‍అడివి శేష్‌ నటించిన డకాయిట్ సైతం వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

     

  • 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు హీరో శర్వానంద్‌. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం బైకర్‌. ఇందులో శర్వానంద్‌ బైకర్‌గా నటించాడు. పర్ఫెక్ట్‌ బైకర్‌గా కనిపించేందుకు ప్రత్యేకమైన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. బాగా బరువు తగ్గాడు కూడా! ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానున్నట్లు ప్రకటించారు.

    బుల్లెట్‌ సునీల్‌
    బుధవారం (ఫిబ్రవరి 4న) నాడు బైకర్‌ నుంచి బుల్లెట్‌ సునీల్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ వదిలారు. ఈ స్పోర్ట్‌ క్రికెట్‌ కాదు సునీల్‌, ఎవరూ పట్టించుకోరు. టైం వేస్ట్‌ చేసుకోకు అన్న వాయిస్‌తో టీజర్‌ మొదలైంది. 'సునీల్‌ మాజీ మోటోక్రాస్‌ రేసర్‌, అప్పట్లో బుల్లెట్‌ సునీల్‌ అనేవారు.

    కీలక పాత్రలో రాజశేఖర్‌
    18 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్స్‌.. 57 సౌత్‌ జోన్‌ టైటిల్స్‌.. 100కి పైగా రేసుల్లో పాల్గొన్నాడు' అంటూ రాజశేఖర్‌ను రేసర్‌గా పరిచయం చేశారు. గ్లింప్స్‌లో రాజశేఖర్‌ లుక్స్‌ చూస్తుంటే గట్టి కమ్‌బ్యాక్‌ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో సింహరాశి, అల్లరి ప్రియుడు వంటి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్‌. 2017లో పీఎస్‌ గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కానీ ఆకట్టుకోలేకపోయాడు.

    సినిమా
    బైకర్‌ విషయానికి వస్తే మూడు తరాల నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బైక్‌ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఇండోనేషియాలో చిత్రీకరించారు. మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్‌ చేశారు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహించాడు.

     

    చదవండి: 2 నెలలుగా నరకం చూస్తున్నా: వడాపావ్‌ గర్ల్‌

  • మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా కనిపించనున్నారు.

    తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్‌లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
     

  • ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ది రాజాసాబ్‌తో పాటు చిరంజీవి మనశంకర వరప్రసాగద్‌గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ హీరోగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో ప్రభాస్‌ మూవీ అంత మెప్పించలేపోయింది. మిగిలిన నాలుగు చిత్రాలు ఆడియన్స్‌ను అలరించాయి.

    అంతేకాకుండా చివర్లో విడుదలైన శర్వానంద్ మూవీ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ప్రకటించినట్లుగానే  ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

     

  • జూబ్లీహిల్‌ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శించుకున్నారు. వీరిద్దరు హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ దర్శనం అనంతరం వీరిద్దరు బయటికొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కాగా.. టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్‌ సేతుపతి బర్త్‌డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు.

    కాగా.. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో టబు, విజయ్‌ కుమార్, బ్రహ్మాజీ కీలక  పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. 
     

     

  • డ్యాన్స్‌ రియాలిటీ షోలలో ఒక ప్రభంజనం ఆట. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన ‘ఆట’మరోసారి వచ్చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మరోసారి ఎందరో ప్రతిభావంతులైన డ్యాన్సర్లను వెలుగులోకి తీసుకురాబోతోంది. బుల్లితెర పాపులర్ డ్యాన్స్‌ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతోంది. జీ తెలుగులో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కంటే రెండు రోజుల ముందుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఎపిసోడ్స్‌ రిలీజ్‌ కానున్నాయి.

    16 మంది మధ్య పోటీ
    ఈసారి ఆట షోకి ఎనర్జిటిక్‌ యాంకర్‌ సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటార్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మెగా డాటర్ నిహారిక కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆట షో ప్రారంభ ఎపిసోడ్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడేందుకు సిద్ధమయ్యారు. 

    హిట్‌ సాంగ్స్‌తో మొదలు
    ఇటీవల బ్లాక్‌బస్టర్‌ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి..’, ‘చుట్టమల్లే..’, ‘గిర గిర గిర గింగిరానివే..’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డ్యాన్స్‌ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్‌గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ షోను ఈ వీకెండ్‌ నుంచి చూసేయండి..

     

  • బిజినెస్‌మేన్‌గా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అరుల్ శరవణన్. ది లెజెండ్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయన లెజెండ్‌ శరవణన్‌గా ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లీడర్. ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

    తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఫైట్ సీన్స్ చూస్తుంటే కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చివర్లో పిల్లలందరికీ తండ్రులే హీరోలురా అంటూ చెప్పే డైలాగ్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు.


     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్‌ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈషా రెబ్బ పెట్టిన పోస్ట్‌కు ఓ వ్యక్తి అసభ్యంగా కామెంట్‌ పెట్టాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఈషా.. అతడి ఐడీతో పాటు కామెంట్‌ను చూపించింది.

    కేసు నమోదు
    ఆమె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి ఇలా చెండాలంగా కామెంట్స్‌ పెట్టినట్లు గుర్తించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నారు. కాగా ఈషా రెబ్బ.. ఇటీవల 'ఓం శాంతి  శాంతి శాంతిః' సినిమాలో నటించింది.

    చదవండి: చిన్నతనంలో నేను పడ్డ బాధ.. అందుకే పిల్లలు వద్దు: నటి

  • ఢిల్లీ వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ ఫేమస్‌ అయింది చంద్రికా దీక్షిత్‌. సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఈ అమ్మాయి హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొంది. తాజాగా.. భర్త యుగం గేరాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కింది. భర్త మోసం చేస్తున్నాడంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో చంద్రిక మాట్లాడుతూ.. ఎప్పుడూ గొడవలు, కొట్లాటలేనా అని అడుగుతున్నారు. రెండు నెలలుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకేం తెలుసు? 

    నావల్ల కావట్లే..
    అన్నింటినీ మౌనంగా భరిస్తున్నాను. నా బాధేంటో మీకు చెప్పనా? అటు పిల్లాడిని, ఇటు ఇంటిని.. అన్నింటినీ మ్యానేజ్‌ చేసుకుంటున్నాను. అన్ని బాధ్యతలు నేనే నిర్వర్తిస్తున్నాను. ​అయినా అతడు (భర్త) ఇలా చేస్తుంటే నేనేం చేయాలి? (ఫోన్‌లో చాటింగ్‌ స్క్రీన్‌షాట్‌, భర్తతో క్లోజ్‌గా ఉన్న ఓ అమ్మాయి ఫోటోలు చూపిస్తూ) ఈ అమ్మాయి ఎప్పుడూ నా భర్త చుట్టూనే తిరుగుతోంది. నా భర్త, నా ఇల్లు అని ఏదేదో అంటోంది. ఈ ఫోటోలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. నా మెదడును పని చేయనివ్వడం లేదు. నావల్ల కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది.

    గుర్తుపెట్టుకో..
    దీనిపై ఆమె భర్త యుగం గేరా స్పందించాడు. నీకు అవసరమైంది నువ్వు చూపించావు. నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నాను. కానీ, అదేమంత పెద్ద తప్పు కాదు. సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావ్‌.. అలాంటివి నాదగ్గర చాలా ఉన్నాయి. నేను అనుకుంటే చాలా చేయగలను. కానీ నేనేమీ చేయను. ఇంకోటి.. నీ రెస్టారెంట్‌ నావల్లే నడుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకో అని కౌంటరిచ్చాడు. కాగా చంద్రికా.. ఆర్టిస్ట్‌ యుగం గేరాను పెళ్లి చేసుకుంది. యుగం గేరా.. చంద్రిక కంటే రెండుమూడేళ్లు చిన్నవాడు. ఈ దంపతులకు కుమారుడు రుద్ర సంతానం. 

     

     

    చదవండి: అందుకే పిల్లల్ని కనలేదు: ప్రముఖ నటి

  • కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

    సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.

    చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్‪‌లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్‌లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.

    (ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

    మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్‌ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.

    అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?)

Sports

  • టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా నవీముంబై వేదికగా   సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా  విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగుల  భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగుల వద్దే నిలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో  ఐదెన్ మార్‌క్రమ్ 38 పరుగులు, ర్యాన్ రెకెల్‌టెన్ 44 పరుగులు చేశారు

    భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్‌ దంచికొట్టి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు.

    ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తిలక్‌ హాఫ్‌ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్, అన్రిచ్‌ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.

  • భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్‌ వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.

    జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్‌.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.

    కొండంత లక్ష్యం 
    కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన యువ భారత్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే  కూడా హాఫ్‌ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.

    ఇదే అత్యధిక లక్ష్య ఛేదన
    వీరికి తోడు విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.

    ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్‌ ఐర్లాండ్‌ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్‌ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.

    ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్‌
    మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో  ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.

    ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

  • టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా  సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన ఇషాన్‌ కిషన్‌తో పాటు.. రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు.

    ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసం
    నవీ ముంబై వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్‌ దంచికొట్టి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు.

    ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తిలక్‌ హాఫ్‌ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

    రాణించిన సూర్య, అక్షర్‌, హార్దిక్‌
    మరోవైపు.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30) వేగంగా ఆడే ప్రయత్నంలో.. క్వెనా మఫాకా బౌలింగ్‌లో జార్జ్‌ లిండేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 30) రాణించారు. రింకూ సింగ్‌ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్, అన్రిచ్‌ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

    కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
    చదవండి: T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

  • ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్‌ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.

    ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్‌ సిక్స్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్‌ జట్టుతో తలపడింది.

    ఇద్దరు శతకాలు బాది
    హరారేలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్‌ బ్యాటర్లలో ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగి.. అఫ్గన్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.

    వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్‌ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్ చౌహాన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్‌ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. 

    శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్‌
    ఓపెనర్లలో వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్‌ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.

    మిగతా వారిలో విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్‌ దంచికొట్టడంతో అఫ్గన్‌ విధించిన లక్ష్యాన్ని భారత్‌ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. 

    కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం ఫైనల్‌ జరుగనుంది. 

    చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌తో బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా వచ్చాడు.

    6, 6, 4, 6
    విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్‌.. ధనాధన్‌ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్‌ అతడి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 

    మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్‌ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.

    20 బంతుల్లోనే
    ఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్‌ కిషన్‌. సిక్సర్‌తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.

    కాగా టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా నవీ ముంబైలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 53) రిటైర్డ్‌ అవుట్‌గా నిష్క్రమించారు. 

    టీ20 వరల్డ్‌కప్‌-2026 జట్లు 
    భారత్‌
    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.

    సౌతాఫ్రికా
    ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.

    చదవండి: WC 2026: వరల్డ్‌కప్‌ సెమీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం
    T20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్‌!

  • భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్‌ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.

    ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్‌- పాక్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.

    పాక్‌ ఓవరాక్షన్‌
    అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.

    వందకు వంద శాతం జరుగుతుంది
    ‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్‌ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.

    ఈ మ్యాచ్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్‌ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్‌కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.

    ఇతర బోర్డులకూ నష్టమే
    పాక్‌ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.

    అయినా ఈసారి పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు.  ఈసారి పాక్‌ తటస్థవేదిక మీదే పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.

    ఇప్పటికే బంగ్లా అవుట్‌
    కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. 

    అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్‌ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి:  T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే...

  • భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్‌ దంచికొట్టాడు.

    24 బంతుల్లోనే..
    కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

    సుడిగాలి ఇన్నింగ్స్‌
    వైభవ్‌ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్‌ సదాత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ పెవిలియన్‌ చేరాడు. కాగా ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.

    311 పరుగుల లక్ష్యం
    కాగా వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగారు.

    ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్‌ 310 పరుగులు సాధించింది. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది.

    చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్‌.. తాజాగా భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.

    భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఓవరాక్షన్‌ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.

    భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే..
    ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్‌ క్రికెట్‌ భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్‌ 8 చేరే అవకాశాలను కూడా పాక్‌ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాతో కలిసి గ్రూప్‌-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్‌.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇందుకు వేదిక.

    వాన పడే అవకాశం
    అయితే, ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్‌ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.

    ఇక లీగ్‌ దశలో ఆఖరిగా పాక్‌.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడకపోతే పాక్‌ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.

    నెట్‌రన్‌రేటుపై ప్రభావం
    మరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్‌, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్‌రన్‌ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్‌ ఓడిపోయి సూపర్‌-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.

    తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్‌ సూపర్‌-8 చేరడం కష్టమే అనిపిస్తోంది.  

    చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

  • ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్‌ తప్పిదాలతో అఫ్గన్‌ బ్యాటర్లుకు లైఫ్‌ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు సాధించింది.

    శతక్కొట్టిన ఫైజల్‌ షినోజాదా
    జింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్‌ సదాత్‌ (39), ఖలీద్‌ అహ్మద్‌జాయ్‌ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫైజల్‌ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    ఉజైరుల్లా అజేయ శతకం
    మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్‌.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్‌ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఉజైరుల్లా నియాజాయ్‌ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    ఫైజల్‌- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్‌ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్‌ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.

    ఈ ఎడిషన్‌లో ఇదే  అత్యధిక స్కోరు
    అండర్‌-19 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

    చదవండి: WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

  • టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్‌ అభిషేక్‌ శర్మ. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్‌గా పాతుకుపోయాడు.

    విధ్వంసకర ఇన్నింగ్స్‌కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్‌ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

    మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను నేనే
    ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ (Ricky Ponting) అభిషేక్‌ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కు మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.

    కాగా అభిషేక్‌ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్‌ ఢిల్లీ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్‌ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్‌.. అభిషేక్‌ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్‌ చేసిందని వెల్లడించాడు.

    భవిష్య సూపర్‌స్టార్‌.. వద్దని మొత్తుకున్నా వినలేదు
    "అతడికి మొదటి ఐపీఎల్‌ కోచ్‌ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్‌ మీదుగా స్ట్రెయిట్‌గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.

    అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్‌ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్‌స్టార్‌ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్‌ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.

    ధావన్‌ కోసం ట్రేడ్‌ చేసిన ఢిల్లీ
    కాగా శిఖర్‌ ధావన్‌ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్‌ శర్మను సన్‌రైజర్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఇక సన్‌రైజర్స్‌కు మారిన తర్వాత అభిషేక్‌ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్‌లో 162కు పైగా స్ట్రైక్‌రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడి 1297 రన్స్‌ రాబట్టిన అభిషేక్‌ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.

    చదవండి: భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

  • పొట్టి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌.. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.

    ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌ (Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.

    వరుస వైఫల్యాలు
    గత కొన్నాళ్లుగా సంజూ ఫామ్‌లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.

    తిలక్‌ వర్మ పునరాగమనం
    కాగా తిలక్‌ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్‌ అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చాడు. అయితే, వరల్డ్‌కప్‌ టోర్నీతో తిలక్‌ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. సంజూపై మేనేజ్‌మెంట్‌ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇషాన్‌కు నో ఛాన్స్‌
    ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్‌.. ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.

    ఇక మూడో స్థానంలోకి తిలక్‌ వర్మ తిరిగివస్తాడన్న చహల్‌.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యథావిధిగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌.. మిడిలార్డర్‌, ఫినిషర్‌ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.

    కుల్దీప్‌నకు కూడా మొండిచేయి
    తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చిన చహల్‌.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లను ఎంచుకున్నాడు. 

    ఈ క్రమంలో టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌తో పాటు.. స్పిన్‌ దళంలో కుల్దీప్‌ యాదవ్‌కు చహల్‌ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది.

    టీ20 వరల్డ్‌కప్‌-2026లో అమెరికాతో మ్యాచ్‌కు చహల్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు
    అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    చదవండి: ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి

  • టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌–పాకిస్తాన్‌ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్‌ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్‌ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్‌కాట్‌ డ్రామాకు తెరలేపింది. 

    ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ పాక్‌కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్‌కాట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్‌ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌.

    ఏంటా ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌..?  
    ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి  పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది.  

    ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్‌ భారత్‌తో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్‌ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్‌ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్‌ మొత్తం ఆడి, భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామనేది ఐసీసీ-పాక్‌ క్రికెట్‌ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.

    ఒప్పందాల్లో పాక్‌ భారత్‌తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ‌ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.  

    పాక్‌ జట్టు మొత్తం టోర్నమెంట్‌ ఆడుతోంది. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్‌ వర్గాల్లో భయం మొదలైంది. 

    భారత్‌తో మ్యాచ్‌ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్‌ యూటర్న్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్‌ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

NRI

  • వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని  వైఎస్సార్‌సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్‌ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్‌.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్‌ఆర్‌ఐ  బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

    అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్‌ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని  సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు.

     

Business

  • సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్‌లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్‌లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్‌లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

    43 లక్షల బైక్‌ల ఎగుమతి
    భారత్‌లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్‌లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.

    వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.

    ఆకట్టుకుంటున్న మోడల్స్
    ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్‌కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.

    భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్‌ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్‌ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్‌లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్‌ఫీల్డ్‌కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్‌ఫీల్డ్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్‌ఫీల్డ్‌కు 152 డీలర్‌షిప్‌లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్‌సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్‌కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా??

  • భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.

    దీంతో పాస్‌పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

    సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణ
    కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. పాస్‌పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్‌వర్క్‌ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్‌పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

    అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్‌లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్‌లైన్‌లో పత్రాలు అప్‌లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.

    పోలీస్ వెరిఫికేషన్‌లో కీలక మార్పులు
    పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్‌పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

    మరింత సులభమైన ఆన్‌లైన్ సేవలు
    ప్రభుత్వ పాస్‌పోర్ట్ పోర్టల్‌ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్‌లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.

    మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్‌పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.

    గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలు
    దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్‌పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

  • దేశ ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించే కొత్త తరం రంగాలకి రుణ లభ్యతను పెంచే దిశగా చక్ర–సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని (సీవోఈ) ప్రారంభించినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా రెన్యువబుల్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ సెల్‌ కెమిస్ట్రీ–బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, సెమీకండక్టర్లులాంటి ఎనిమిది వర్ధమాన రంగాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.

    2030 నాటికి ఈ ఎనిమిది రంగాలు దాదాపు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్దాల్లో కొత్త ఆవిష్కరణలు, అధునాతన తయారీ సామర్థ్యాల దన్నుతో భారత్‌ వృద్ధి చెందుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

    శ్వేతపత్రాలు, సెక్టార్‌ రిపోర్టులు, పరిశ్రమ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల నిర్వహణ మొదలైన మార్గాల్లో క్లయింట్లు, ఇన్వెస్టర్లు, విధాననిర్ణేతలు నిర్ణయాలు తీసుకునేందుకు చక్ర సెంటర్‌ తోడ్పడుతుందని వివరించారు. డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు, బహుళపక్ష ఏజెన్సీలు, పరిశ్రమ సమాఖ్యలు, స్టార్టప్‌ల మధ్య సంప్రదింపులకు ఇది సహాయకరంగా ఉంటుందన్నారు.

  • బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి కాస్త ఊరటనిచ్చాయి.

    హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై  రూ.1,46,150లకు దిగివచ్చింది.

    ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.

    అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్‌రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

    ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్‌తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. 

    పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్‌రాక్‌కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.

    రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్‌రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్‌తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్‌రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్‌లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు.

  • అధునాతన బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్‌ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్‌కి సర్టిఫికేషన్‌ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్‌ బాబు చెప్పారు.

    మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్‌ బాబు తెలిపారు.

    ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639  వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్‌ బుక్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. 
     
    మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో  25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది.
     
    ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్‌వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.
     
    సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
     
    విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి.

  • ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు ఇటీవల 2026-27 బడ్జెట్‌లో ప్రకటించడంతో, ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులందరికీ  వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.

    పీక్ ఫైలింగ్ సీజన్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారీ ఫైలింగ్ టైమ్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ సడలింపు ఎంపిక చేసిన కొన్ని కేటగిరీల ట్యాక్స్‌ పేయర్స్‌కు మాత్రమే పరిమితం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే, అదనపు సమయం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉంటుందని, మిగతావారు ప్రస్తుత గడువునే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    జూలై 31 గడువు ఎవరికీ వర్తిస్తుంది?
    వేతన పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు, జీతం, వడ్డీ లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందేవారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు జూలై 31 గడువే కొనసాగుతుంది. వీరికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. అందువల్ల, వారు మునుపటిలాగే తమ ఫైలింగ్ ప్రణాళికలను కొనసాగించాలి.

    ఆగస్టు 31 ఎవరికి?
    ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ బిజినెస్ కేసులు), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు మాత్రమే జూలై 31కి బదులుగా ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(1)(c) కింద ఈ పొడిగింపు వర్తిస్తుంది.

    ఎప్పటి నుంచి అమల్లోకి..?
    ఈ కొత్త గడువు పన్ను సంవత్సరం 2026–27 నుంచి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద సవరణలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఇదే మార్పులు అమలు చేస్తారు.

  • భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.

    ‘మేడిన్‌ ఇండియా ఉత్పత్తులకు గుడ్‌ న్యూస్‌. ఇక వాటిపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్‌ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్‌ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్‌లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్‌ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై (ఎఫ్‌అండ్‌వో) సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

    సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్‌

    అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్‌కి ‘చాలా మంచి‘ డీల్‌ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.

    ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

  • వేదాంత గ్రూప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సంపదలో 75 శాతాన్ని సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ మరణంతో పుట్టెడు దుఖంలో ఉన్న అనిల్‌ అగర్వాల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ఈ సంచలన ప్రకటన చేశారు. అనిల్‌ అగర్వాల్‌కు ఇద్దరు సంతానం కుమారుడు అగ్నివేష్ అగర్వాల్‌, కూతురు ప్రియా అగర్వాల్‌(2013లో ఆకాష్‌ హెబ్బర్‌ను వివాహం చేసుకున్నారు). అనిల్‌ మొత్తం నెట్‌వర్త్‌ సుమారు రూ.3.66 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అందులో తన వ్యక్తిగత సంపదను దానం చేసేందుకు సిద్ధమయ్యారు.

    ప్రధానితో భేటీ.. ఒక భావోద్వేగ ప్రయాణం

    ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా జరిగిన ‘గ్లోబల్ ఎనర్జీ లీడర్స్’ రౌండ్ టేబుల్ సమావేశంలో అనిల్ అగర్వాల్ పాల్గొన్నారు. తన కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపిన చొరవను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అగర్వాల్ తన మనోభావాలను పంచుకున్నారు.

    ‘మా కుటుంబంలో విషాదం తర్వాత నేను హాజరైన మొదటి అధికారిక సమావేశం ఇది. వ్యక్తిగత నష్టంతో కుంగిపోయిన మాకు ప్రధానమంత్రి మోదీ అందించిన ఓదార్పు, సానుభూతి వెలకట్టలేనివి. ఆయన మాటలు నాకు, నా భార్యకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చాయి’ అని అగర్వాల్ పేర్కొన్నారు.

    కుమారుడి ఆశయ సాధనే లక్ష్యం..

    అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కేయింగ్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు. తన కుమారుడి కోరికలకు అనుగుణంగానే ఈ దాతృత్వ నిర్ణయం తీసుకున్నట్లు అగర్వాల్ తెలిపారు.

    ఇకపై తాను వ్యాపార ప్రమోటర్‌గా కాకుండా కేవలం ఒక ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తానని అనిల్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. వ్యాపార నియంత్రణ కంటే సామాజిక ప్రభావానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

    ప్రధాని పరామర్శ

    తీవ్ర దుఖంలో ఉన్న అగర్వాల్ దంపతులను ప్రధాని మోదీ ధైర్యంగా ఉండాలని కోరారు. ‘మీరు దృఢంగా ఉండాలి. మీ పనిని కొనసాగించాలి. అది దేశానికి చాలా ముఖ్యం’ అని ప్రధాని ఇచ్చిన సలహా తమకు ఎంతో ఊరటను ఇచ్చిందని అగర్వాల్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజల బాధలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకునే నాయకుడు ఉండటం అదృష్టమని ఆయన ప్రశంసించారు.

    ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

National

  • ఒక చిన్న బాటిల్‌లో చల్లగా ఉండో ఆ సోడా... ఎప్పుడూ మనల్ని రిఫ్రెష్ చేస్తుంది కదా? కానీ, మీరు ఊహించగలరా... కోకా-కోలా, పెప్సీ రాకముందే అంటే 142 ఏళ్ల క్రితం – భారతదేశంలో ఒక సోడా జన్మించింది! అది కూడా పూణే నగరంలో! ఈరోజు మనం మాట్లాడేది ఆ అద్భుతమైన కథ గురించి – ‘అర్దేషిర్ సోడా’!

    1880లలో... ఇరాన్‌లోని యాజ్డ్ నగరం నుంచి ఒక యువకుడు – అర్దేషిర్ ఖోదాదాద్ ఇరానీ – జీవితంలో ఏమీ లేకుండా, కేవలం 8 రూపాయలతో భారతదేశానికి వచ్చాడు. అది కూడా పూణే నగరానికి రాగానే  అతని జీవితం పూర్తిగా మారిపోయింది.

    ఒక రోజు పూణేలోని ఒక బార్‌లో గొడవ జరిగింది. ఎందుకంటే... ముంబై నుంచి సోడా సప్లై చేసే మూల్స్ (పట్టెగాడిదలు) ఆలస్యమయ్యాయి. సోడా లేకుండా ప్రజలు ఆగ్రహంతో గొడవపడుతున్నారు. అర్దేషిర్ ఆ దృశ్యం చూసి ఆలోచించాడు – "ఎందుకు ఇక్కడే సోడా తయారు చేయకూడదు? అన్న ఆలోచన వచ్చి  అక్కడే అతను ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. చార్‌కోల్ భట్టీ వెలిగించి, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసి, దాన్ని నీటిలో కలిపాడు. ఫిజ్ వచ్చింది! తర్వాత చక్కెర, ఫ్లేవర్స్ కలిపి... 1884లో *అర్దేషిర్ సోడా* పుట్టుకొచ్చింది! గమనించండి – కోకా-కోలా 1886లో పుట్టింది. అంటే అర్దేషిర్ సోడా రెండేళ్ల ముందు!

    ఆ రోజు నుంచి ఈ సోడా పూణే ప్రజల హృదయాల్లో చోటు చేసుకుంది. ఒరిజినల్ సోడా తప్ప... ఇప్పుడు కాఫిన్-ఫ్రీ కోలా, పైనాపిల్, గ్రీన్ యాపిల్, పీచ్, జీరా మసాలా, మసాలా కాలా ఖట్టా, టానిక్ వాటర్... ఎన్నో ఫ్లేవర్స్! అంతేకాదు, నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారవుతుంది. అద్భుతమైన విషయం ఏమిటంటే – ఇప్పటికీ 'రిటర్నబుల్ బాటిల్' సిస్టమ్! 24 గాజు బాటిల్స్ కేస్‌కి 360 రూపాయల డిపాజిట్. ఖాళీ బాటిల్స్ తిరిగి ఇస్తే డబ్బు తిరిగి వస్తుంది. అందుకే ఈ బ్రాండ్ పూణేకే పరిమితమైంది. మార్జ్బాన్ ఇరానీ (అర్దేషిర్ గ్రేట్-గ్రాండ్‌సన్) చెప్పినట్లు – "బాటిల్స్ తిరిగి రాకపోతే, నాకు ఫిల్ చేయడానికి ఏమీ ఉండదు!"పూణేలోని ప్రతి ఇరానీ కేఫ్‌లో – డోరాబ్జీస్, కైకోబాడ్ వంటి సెంచరీ-ఓల్డ్ రెస్టారెంట్స్‌లో – అర్దేషిర్ సోడా తప్పనిసరి! చిన్నారులు పెరిగిన టేస్ట్, ఆ ఫిజ్ సౌండ్, ఆ నాస్టాల్జియా... ఇప్పటికీ అలాగే ఉంది. గ్లోబల్ బ్రాండ్స్ వచ్చినా, ఈ లోకల్ హీరో ఇంకా రాజ్యమే చేస్తోంది!

    స్నేహితులారా, ఇది కేవలం సోడా కాదు... ఒక ఇమ్మిగ్రెంట్ స్వప్నం, ధైర్యం, ఇన్నోవేషన్ కథ! పూణేకి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా అర్దేషిర్ సోడా తాగారా? కామెంట్స్‌లో చెప్పండి! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం... మళ్లీ కలుద్దాం! జై హింద్!

     

  • రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే అక్కసుతో భారత్‌పై భారీగా సుంకాలు మోపిన అమెరికా.. ఉన్నఫళంగా ఎందుకు దిగివచ్చింది? ఏకపక్షంగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా భారత్‌తో డీల్ కుదిరిందని, ట్యాక్స్‌లను 18 శాతానికి తగ్గించామని ఎందుకు ప్రకటించారు?? బెదిరింపులతో లొంగదీసుకుందామని ట్రంప్ భావిస్తే.. ఏకు మేకై కూర్చుంటామంటూ పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా తల వంచిందా?

    ఐరోపా సమాఖ్యతో స్వేచ్ఛాయుత వాణిజ్యంపై భారత్ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు ట్రంప్ మెడలను వంచిందా? బంగారం ధరలు మొదలు.. పలు దేశాల షేర్ మార్కెట్లను మాటలతో శాసిస్తున్న ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..! అహింసామార్గంలో.. శాంతియుతంగా ఎదుటివారి మెడలు వంచేలా చేయడం భారత్ నైజం..!! ఈ విషయంలో భారత్ వ్యూహాత్మక అడుగులు.. వాటి ఫలితాలను గురించి వివరంగా తెలుసుకోవాలంటే.. చదవాల్సిందే

    👉అది అనుకున్నంత ఈజీ కాకపోగా..
    ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు..! బాలిస్టిక్ మిసైల్స్.. యుద్ధ విమానాలతో విరుచుకుపడాల్సిన పని లేదు..! ఆంక్షల ఛట్రంలో ఆ దేశాన్ని బంధించి, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు..! ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే దశలో ఆ దేశాలను దారికి తెచ్చుకోవచ్చు..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే..! ఇదే మైండ్ గేమ్‌తో ఎన్నో దేశాలను దారికి తెచ్చుకున్నాడు. భారత్‌ను కూడా అదే గాడిన కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మగౌరవం ముందు ఓడిపోయాడు. అది అనుకున్నంత ఈజీ కాకపోగా.. అమెరికన్లకే ధరాఘాతంతో శాపంగా మారుతోంది. దీంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల మెట్లు దిగిరాక తప్పలేదు..!

    👉ఆ మౌనమే  ట్రంప్‌ను బెంబేలెత్తించింది..
    భారత్‌ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుంచి ప్రకటనలు లేకున్నా.. తానే భారతీయుల తరఫున ప్రకటనలు చేసుకున్నారు. రష్యా చమురును భారత్ కొనబోదని.. అమెరికా నుంచే కొంటుందని ప్రకటించేసుకున్నారు. అలాంటి ప్రకటనలకు భారత్ తొందరపడి ఏమాత్రం స్పందించలేదు. ‘నో కామెంట్’ అంటూ దాటవేయలేదు. చేసిందల్లా.. మౌనంగా ఉండడమే..! ఆ మౌనమే ఇప్పుడు ట్రంప్‌ను బెంబేలెత్తించింది. వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.

    👉జియోపాలిటిక్స్‌లో మౌనానికి అర్థాలే వేరు..
    సాధారణంగా మౌనం అర్ధాంగీకారం అంటారు. కానీ, జియోపాలిటిక్స్‌లో మౌనానికి అర్థాలే వేరు. ఒక పాలసీని అమలు చేయడానికి ముందు.. దానికి సమ్మతిని ఇవ్వడానికి ముందు చేసే ఆలోచనలు, కసరత్తుకు నిదర్శనమే మౌనం అంటారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. 1988లో అమెరికన్ ఆలోచనాపరుడు నోమ్ చోమ్‌స్కీతోపాటు.. ఆర్థికవేత్త ఎడ్వర్డ్.ఎస్.హెర్మాన్ తమ పుస్తకం ‘ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ద మాస్ మీడియా’లో ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు. ఆంక్షలు, లేదా యుద్ధాలకు ముందు.. నిరసనను వ్యక్తం చేయకుండా.. విధానాలను సాధారణీకరించేందుకు మౌనం దాల్చడం ఓ రాజనీతి అంటారు. అమెరికా సుంకాల విషయంలో భారత్ పాటించిన మౌనం దీనికి చక్కటి ఉదాహరణ..!

    👉కన్జూమర్ సైకాలజీ అంటే ఇదే..
    కొనుగోలుదారులు ఎవరైనా తమకు కావాల్సిన వస్తువు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడే కొంటారు. అది కన్జూమర్ సైకాలజీ. ఈ బేసిక్ నాలెడ్జ్‌ని కూడా మరిచిపోయిన ట్రంప్ చమురు విషయలో భారత్‌పై ఒత్తడి తేవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇక రాజనీతి విషయానికి వస్తే.. అగ్రదేశాలు అంతగా జియోపాలిటిక్స్‌ను వంటబట్టించుకోని రోజుల్లోనే మనదేశంలో ద్వాపరయుగంలో విదురనీతి.. ఆధునిక యుగంలో చాణక్యనీతి అమల్లో ఉన్నాయి. భారత్‌కు రష్యా ముందు నుంచి మిత్ర దేశం. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఆంక్షల ఛట్రంలో రష్యా కూరుకుపోయింది.

    👉భారత్‌ను దెబ్బతీయాలనుకున్నారు కానీ...
    ఈ క్రమంలో చౌకగా చమురు అమ్మేందుకు రష్యా సిద్ధమైనా.. అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ కొనేందుకు ముందుకు రాలేదు. ఐరోపా దేశాలే రష్యా చమురు కొంటున్న తరుణంలో భారత్ కూడా రష్యాకు అతిపెద్ద వినియోగదారుగా మారింది. ఈ చర్య అటు రష్యాకు, ఇటు భారత్‌కు లబ్ధి చేకూర్చింది. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్.. సుంకాలతో భారత్‌ను దెబ్బతీయాలనుకున్నారు. భారత్ తన ప్లాన్-బీని అమలు చేసింది.

    👉ఊహించని పరిణామం..
    అంతే.. కొత్త వినియోగదారులను సొంతం చేసుకుంది. ఐరోపా సమాఖ్యతో 19ఏళ్లుగా కలగా ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకు ముందే.. చైనాకు దగ్గరైంది. ఉప్పు-నిప్పుగా ఉండే తాలిబాన్లను అక్కున చేర్చుకుంది. ఇరాన్‌తోనూ వాణిజ్య ఒప్పందాలకు సిద్ధమైంది. జీయోపాలిటిక్స్‌లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఊహించని ఈ పరిణామం అమెరికా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో.. ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేయాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    👉భారత్‌ స్వరం మార్చింది..
    దౌత్యం విషయంలో భారత వ్యూహాలు మునుపటిలా లేవు. గడిచిన దశాబ్దన్నర కాలంగా వ్యూహప్రతివ్యూహాలు మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంతా భగవతేచ్ఛ.. అని భావించే భారత్.. ఇప్పుడు స్వరం మార్చింది. ప్రేమిస్తే.. ప్రాణమిస్తాం.. వంచిస్తే.. కాలరాస్తాం.. ఎక్కడా తగ్గేదే లే.. అని చాటిచెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. ఏరంగంలోనైనా శత్రువు ఢీ-అంటే ఢీకొడతామని తేల్చిచెప్పింది.

    👉ఇంకా చెప్పాలంటే..
    ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే.. 2019లో ఆంక్షల పేరుతో ఇరాన్, వెనిజెవెలా, భారత్ నుంచి చమురు దిగుమతులను నిలివేశారు. ఆ సమయంలో ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీతో రాయబారాలు నెరిపారు. అప్పటి నుంచే.. భారత్-అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ ఆత్మనిర్భరతతో ఉందనే విషయాన్ని అమెరికాకు చాటి చెప్పింది. అమెరికా సాధారణంగా తన దారికి తెచ్చుకోవాలనుకునే దేశాలపై ప్రయోగించే సామ, దాన, బేధ, దండోపాయాలకు తాము అతీతమని భారత్ నిరూపించింది. ట్రంప్ మాదిరిగా.. దావోస్‌లాంటి వేదికను బెదిరింపులకు వినియోగించుకోకుండా.. అసందర్భ ప్రేలాపనలకు పోకుండా.. మౌనం వహించింది. విజయం సాధించింది.

  • ఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ..  కేంద్ర హోంశాఖ గెజిట్‌ విడుదల చేసింది. ఇప్పటికే మణిపూర్‌ సీఎంగా యుమ్నం ఖేంచంద్‌ను బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత రాష్ట్రపతి పాలనను ఉపసంహరించుకుంది. ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియను అధికారికంగా పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.

    మణిపూర్‌లో మొయితీ-కుకీ తెగల మధ్య ఘర్షణలు.. హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నరపాటు కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చినా.. అలాంటిదేం జరగలేదు. చివరకు.. 2025 ఫిబ్రవరి 13న బీరెన్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా.. తాజాగా మణిపూర్‌కు కొత్త సీఎంగా బీజేపీ నేత, రాష్ట్ర ఖేమ్‌చంద్ సింగ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

    మణిపూర్‌లో గత ఏడాది నుంచి ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. మాజీ సీఎం ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ హైకమాండ్ కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఖేమ్‌చంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అనుభవం, విశ్వసనీయత ఉండటంతో పాటు, ప్రజలతో అనుబంధం కూడా బలంగా ఉండడంతో సీఎం బాధ్యతల్ని   ఖేమ్‌చంద్ సింగ్‌కు అప్పగించేందుకు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది.
     

  • ఫుడ్ డెలివరీ బాయ్‌ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరైన సమయానికి.. సరైన అడ్రస్‌లో ఫుడ్ డెలివరీ చేయటం కోసం ఎంతో కష్టపడుతుంటారు. తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది.  శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను భయంతో గజగజ వణికి పోయాడు..చివరికి  ఆర్డర్‌ను డెలివర్ చేయకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు.

    ఇప్పుడీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతూ నెటిజన్లకు ఆశ్చర్చాన్ని కలిగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఒక డెలివరీ బాయ్ ..ఎప్పటి లాగే.. అతనికి ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది. బిర్యానీ పార్శిల్‌ తీసుకుని ఫుడ్ డెలివరీ చేయాల్సిన అడ్రెస్‌కి వచ్చాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టిన యువతికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి కొంచెం ముందుకు రమ్మంది.  కానీ అతను ముందుకు వెళ్లగా… ఆ లోకేషన్ చూసి షాక్ అయ్యాడు.

    ఆ వ్యక్తి  రాగా అక్కడ శ్మశానం కనిపించింది. ఆ అమ్మాయి శ్మశానం లోపలికి రమ్మంది. అతడు షాక్ అయ్యాడు. తాను లోపలికి రాలేనని, బయటకు వచ్చి పార్శిల్ తీసుకోవాలని అన్నాడు. దానికి ఆ అమ్మాయి..తాను చాలా లోపల ఉన్నానని, బయటకు రాలేనని ..తాను స్మశానంలో ఫ్రెండ్స్‌తో లోపల పార్టీ చేసుకుంటున్నాం” అని చెప్పింది. ఈ మాటలు విన్నాక రైడర్ పూర్తిగా హడలెత్తిపోయి, ఆర్డర్ క్యాన్సిల్ చేసి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది.

    ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగినదో స్పష్టంగా తెలియడం లేదు. కొందరు ఇది ఫేక్ వీడియో అని, మరికొందరు AI ద్వారా తయారైన వీడియో అని చర్చ చేస్తున్నారు. అయినా, రాత్రి సమయాల్లో ఇలాంటి అడ్రస్‌లకు డెలివరీ చేయడం ఎంత భయంకరమో ఈ వీడియో అందరికీ చూపిస్తుంది.

     

  • జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భద్రతా దళాలు బుధవారం స్పెషల్‌ ఆపరేషన్‌తో ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్‌ పూర్తి చేశాయి. 

    భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో.. ఆపరేషన్ క్లిష్టంగా మారినా, సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు సాగి వారిని అంతం చేసింది. ఈ ఆపరేషన్‌లో.. గుహ నుంచి రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నారా? అనే అనుమానంతో  గాలింప చర్యలను ముమ్మరం చేశాయి.

    జైష్-ఎ-మొహమ్మద్ గతంలో కూడా జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో ఆ దాడుల ఆగిపోయాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ఆ సంస్థ యాక్టివ్‌ అయ్యింది. భద్రతా బలగాలు సకాలంలో స్పందించడంతో దాడుల ముప్పు తప్పింది.

    మంగళవారం సైతం ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్, మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి. అయితే ఉగ్రవాదులు ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. ఆ వెంటనే భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభించాయి. ఇవాళ్టి ఉదంపూర్‌ గుహ ఎన్‌కౌంటర్‌లో మరణించింది.. ఆ ఉగ్రవాదులే అయ్యి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. 

    ఇటీవల కిష్ట్వార్ జిల్లాలో జరిగిన "ఆపరేషన్ త్రాషి-1" పేరిట భద్రతా బలగాలు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఆ ఆపరేషన్‌లో జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లతో సుదీర్ఘ కాల్పులు జరిగి, ఒక పారా ట్రూపర్ మరణించగా, పది మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా ఉదంపూర్‌లో జరిగిన ఆపరేషన్‌ దీనికి కొనసాగింపుగా తెలుస్తోంది. 

Family

  • వృత్తిరీత్యా నేను చిన్నపిల్లల వైద్యుణ్ణి. ఈ మధ్యన ఫిట్స్‌ వచ్చాయని ఓ నాలుగు నెలల పాపను తీసుకొని వచ్చారు. కారణాలు ఆరా తీస్తే పాపకు తాటి కల్లు తాగించార ని తెలిసింది. చిన్నపిల్లలకు తాటి కల్లు, ఈత కల్లు లేదా ఎటువంటి మద్యం తాగించినా అది వారికి చాలా ప్రమాదకరం. గతంలో కూడా ఎన్నో కేసులు చూశాను. ఇది నేరం అని కూడా తెలుసు. కానీ నా వద్దకు వచ్చిన పేషెంట్లకు ఎలా చెప్పాలో, చర్యలు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా మద్యం తాగిస్తే పిల్లలకు మంచిదనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. పైగా కల్లు అంటే అసలు మద్యం కాదు కదా అని నాతోనే వాదిస్తున్నారు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. 
    – డాక్టర్‌ పసునూటి సుమంత్, వరంగల్‌

    చిన్నపిల్లల చేత మద్యం తాగించడం ఎంత ప్రమాదమో నిపుణులైన మీరే చెప్పారు. అందుకే, చట్టం కూడా చిన్నారులకు మద్యం ఇవ్వటాన్ని కఠినంగా పరిగణిస్తుంది – శిక్షిస్తుంది. జువనైల్‌ జస్టిస్‌ చట్టం (బాలల పరిరక్షణ చట్టం) లోని సెక్షన్‌ 75 ప్రకారం చిన్నపిల్లలను నిర్లక్ష్యం చేసినా, వారితో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారి మానసిక ఆరోగ్యానికి లేదా శారీరక ఆరోగ్యానికి భంగం కలిగించే ఎటువంటి పనిచేసినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష – లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది.

    అంతేకాకుండా సెక్షన్‌ 77 ప్రకారం: సముచిత అర్హత కలిగిన వైద్యుని ఆదేశం లేకుండా, ఏ వ్యక్తి అయినా పిల్లలకు మత్తు పానీయం/ మాదక ద్రవ్యం/ పొగాకు ఉత్పత్తులు లేదా సైకోట్రోపిక్‌ పదార్థాన్ని ఇచ్చినా, లేదా ఇప్పించినా, వారికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఎన్‌.డీ.పీ.ఎస్‌ వంటి చట్టాలలో నిషేధించబడిన మందులు ఇవ్వాలి అంటే కూడా కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది.

    చ‌ద‌వండి: భార్య‌కు విడాకులు.. పిల్ల‌ల‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలా?

    మత్తుపదార్థాలు ఇవ్వడమే కాదు వాటిని ప్రేరేపించడం కూడా నేరమే! కాబట్టి మీరు మీ వద్దకు వచ్చిన పేషెంట్లను గట్టిగా మందలించాలి. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఏదైనా అపాయం ఉంటుంది అనిపిస్తే – స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారికి లేదా పోలీసులకి ఫిర్యాదు చేయవచ్చు. ఈమధ్య కొందరు చిన్నపిల్లలకు కల్లు పోయటం, పొగాకు ఇవ్వటం వంటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. వాళ్లందరూ కూడా శిక్షార్హులే! ప్రభుత్వ శాఖ వారు ఇటువంటి అంశాలను చాలా సీరియస్‌గా తీసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి ఆగుతాయి.

    – శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
    మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్‌ చేయవచ్చు.  

  • మామూలు నీళ్లు ఎవరైనా తాగుతారు. ఖరీదైన నీళ్లు తాగే వాళ్లనే ‘పెద్దవాళ్లు’ అంటారు. దేశంలో లీటరు 100 నుంచి 1500 వరకూ పలికే మినరల్‌ వాటర్‌ బాటిళ్ల వ్యాపారం జోరు మీద ఉంది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రీమియం వాటర్‌ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. దాంతో ‘వాటర్‌ టేస్టర్ల’ కు గిరాకీ పెరిగింది. నీటి రుచి చూసి మినరల్స్‌ను అంచనా కట్టడం  వీరిని ‘వాటర్‌ సొమెలియర్‌’ అంటారు. ఈ నైపుణ్యంతో వాసికెక్కిన 32 ఏళ్ల అవంతి మెహతా (avanti mehta) చెప్తున్న నీటి సంగతులు...

    ‘మన దేశంలో హిమాలయాల చెంత దొరికే నీటిదొక రుచి, ఆరావళి పర్వతాల వద్ద దొరికే నీళ్లదొక రుచి, సెలయేళ్ల నుంచి, కొండ వాగుల నుంచి, రాతి నేలల నుంచి ఇలా ఒక్కోచోట నుంచి సేకరించే నీటిది ఒక్కో రుచి. అంతేకాదు స్థలాన్ని బట్టి మినరల్స్‌ శాతం మారుతూ ఉంటుంది. పాకేజ్డ్‌ వాటర్‌ కూ మినరల్‌ వాటర్‌కూ వ్యత్యాసం నీళ్లలోని ఖనిజాల శాతమే తేలుస్తుంది. మన దేశంలో 6000 సంస్థలకు పాకేజ్డ్‌ వాటర్‌ లైసెన్స్‌ ఉంటే కేవలం 30 సంస్థలకు మాత్రమే మినరల్‌ వాటర్‌ లైసెన్స్‌ ఉంది. శుద్ధి చేసిన నీరు పాకేజ్డ్‌ వాటర్‌లో ఉంటే రక్షిత పరిసరాలలోని నీటి వనరుల నుంచి సేకరించిన నీరు మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌లో ఉంటుంది’ అంటుంది అవంతి మెహతా.

    ఈమె మన దేశంలో ప్రస్తుతం ‘వాటర్‌ సొమెలియర్‌’గా (water sommelier) గుర్తింపు పొందుతోంది. వాటర్‌ సొమెలియర్‌ అంటే నీటి రుచి నిపుణురాలు. నీళ్లను తాగి ఆ నీటి స్వచ్ఛత, నాణ్యత తెలియచేస్తారు. వైన్‌ రుచి, టీ రుచికి టేస్టర్స్‌ ఉండటం తెలిసిందే. కాని నీళ్ల రుచి చూసే ‘వాటర్‌ సొమెలియర్‌’లు ఇప్పుడు ఉనికిలోకి వస్తున్నారు.

    ‘నేను ఫ్యాషన్‌ రంగంలో ఈ–కామర్స్‌ విభాగంలో పని చేసే దాన్ని. అయితే ‘ఆవా’ అనే మినరల్‌ వాటర్‌ బ్రాండ్‌ మా కుటుంబానికి ఉంది. దేశంలో బాటిల్డ్‌ వాటర్‌కు పెరుగుతున్న గిరాకీని గమనించాక మా సొంత బిజినెస్‌లోకి రావాలని అనుకున్నాను. దేశంలో 70 శాతం నీళ్లు కలుషితంగా ఉన్నాయని ప్రజలు భావించే స్థితి వచ్చింది. మున్సిపల్‌ ట్యాప్స్‌ నుంచి వచ్చే నీళ్లను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బాటిల్డ్‌ వాటర్‌ వ్యాపారం పెరిగింది. అయితే పాకేజ్డ్‌ వాటర్‌నే మనదేశంలో మినరల్‌ వాటర్‌ అనుకుంటూ ఉంటారు. రెండూ వేరు వేరు. అంతెందుకు ఫిల్టర్డ్‌ వాటర్‌కూ, ప్యూరిఫై చేసిన వాటర్‌కూ తేడా ఉంటుంది. నేచురల్‌ మినరల్‌ వాటరంటే సహజసిద్ధంగా సేకరించిందని అర్థం. ఇవన్నీ కూడా వాటర్‌ సొమెలియర్‌ కోర్సులో మాకు నేర్పుతారు. ప్రస్తుతం ప్రపంచంలో సౌత్‌ కొరియాలో, ఇటలీలో వాటర్‌ సొమెలియర్‌ కోర్సులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నేను ఇటలీలో కోర్సు చేసి సర్టిఫికెట్ పొందాను. ఈ కోర్సులో నీటి మూలాలు, నీటి సైకిల్స్, నీటి పరిరక్షణ, వాటిలోని పోషకాల గుర్తింపు ఇవన్నీ నేర్పుతారు’ అని తెలిపింది అవంతి మెహతా.

    ‘మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. అయినా చాలామంది ఏం తింటున్నామన్న దాని మీద తప్ప ఏం తాగుతున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టరు. చైనా, అమెరికాలో పాకేజ్డ్‌ నీటి వ్యాపారం ఒకో దేశంలో 3000 కోట్లకు చేరిందంటే కారణం సరైన నీరు తాగాలనే చైతన్యం వల్లనే. సహజ ఖనిజాలు ఉన్న నీరు శరీరాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మన దేశంలో ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల మంచి నీటి బ్రాండ్లు ప్రీమియమ్‌ బాటిల్డ్‌ వాటర్‌ను అమ్ముతున్నాయి. మా ‘ఆవా’ కూడా ప్రీమియమ్‌ బ్రాండే. మన దేశంలో కొన్ని కొండవాగుల, ఇసుక పాయల నుంచి సేకరించే నీటికి డిమాండ్‌ ఉంది. మంచు ఫలకాల నుంచి సేకరించే నీటిని ‘వింటేజ్‌ వాటర్‌’ అంటారు– ఆ ఫలకాల వయసును బట్టి. కొన్ని మినరల్‌ వాటర్స్‌ను కొన్ని రకాల ఆహారాలకు పెయిర్‌ చేస్తూ రెస్టరెంట్లు ఫుడ్‌ బిజినెస్‌ చేస్తున్నాయి. వెల్‌నెస్‌ క్రేజ్‌ పెరగడం వల్ల ఖరీదైనా సరే మంచిగా ఉన్న నీళ్లు తాగాలని చూస్తున్నారు’ అందామె.

    ‘నీటి వ్యాపారం సాగుతున్న ఈ కాలంలో నా ప్రయత్నమంతా సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడమే. కలుషితాలు చేరకుండా చూస్తే స్థానిక చెరువులు, కుంటల్లోని స్వచ్ఛమైన నీరు గొప్ప శక్తిదాయినిగా మారుతుంది. నీరే భవిష్యత్తులో ఏ దేశానికైనా ఐశ్వర్యం కాగలదు’ అని ముగించింది అవంతి మెహతా. 

    చ‌ద‌వండి: అవాంఛిత రోమాలు.. కార‌ణాలు, ప‌రిష్కారాలు

  • హైదరాబాద్‌ నగరం మరోసారి తన ట్రెండ్‌ సెట్టర్‌ హోదాను నిరూపిస్తోంది. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్‌ సాగర్‌ ప్రాంతాలకే పరిమితమైన ఈ గుర్తింపు, ఇప్పుడు రీల్స్, రిహార్సల్స్‌ కల్చర్, సోషల్‌ మీడియా లైఫ్‌స్టైల్‌ ద్వారా కొత్త మలుపు తిరుగుతోంది. 2026 ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతూ, లక్షల్లో వ్యూయర్స్‌, లైకులతో హైదరాబాద్‌ను డిజిటల్‌ హబ్‌గా మార్చుతున్నాయి. ఇటీవల వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది..! 

    నేటి యువత జీవనశైలిలో భారీ మార్పు కనిపిస్తోంది. రీల్స్‌ ట్రెండ్‌ (Reels Trend) అనే కల్చర్‌ కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం కాకుండా.. విస్తృత స్థాయిలో వేదికలను ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుతోంది. వీళ్లందరికీ నగరం అంటే ఓ లొకేషన్‌ కాదు, ఒక అనుభూతి, ఒక స్టోరీ, ఒక షేర్‌ చేయదగిన క్షణం..నగరం దీనికి అనుగుణంగా మారుతూ.. వారికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు టీ హబ్‌ నుంచి నీలోఫర్, దుర్గం చెరువు వరకు నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక రీల్‌ స్పాట్‌ నుంచి రియల్‌ హబ్‌గా మారుస్తోంది. ఇక్కడికి వచ్చే యువత ప్రతి రీల్‌నీ ఒక లైఫ్‌స్టైల్‌ స్టేట్‌మెంట్‌గా భావిస్తున్నారు.

    రీల్స్‌కు కొత్త అడ్రస్‌.. 
    జూబ్లీహిల్స్‌ అంటే ఒకప్పుడు కేఫ్‌లు, లగ్జరీ రెస్టారెంట్లు, సెలబ్రిటీ నివాసాలు అనే గుర్తింపు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారింది. స్ట్రీట్‌ లైఫ్, నేచురల్‌ లైటింగ్, మోడర్న్‌ ఆర్కిటెక్చర్, మినిమల్‌ వైబ్స్‌.. ఇవన్నీ కలగలిసిన స్పాట్స్‌ యువతను ఓ సరికొత్త ప్రపంచం వైపు లాగుతున్నాయి. రోడ్డు పక్కన చిన్న టీ స్టాల్స్‌ దగ్గర నుంచి, డిజైన్‌ ఉన్న భవనాల వరకు ప్రతి మూల ఒక రీల్‌ ఫ్రేమ్‌లా మారుతోంది. ప్రత్యేకంగా సాయంత్రం, రాత్రి వేళ, సాఫ్ట్‌ సన్‌లైట్‌తో జూబ్లీహిల్స్‌ రోడ్లు ఆర్గానిక్‌ రీల్స్‌కి పర్ఫెక్ట్‌ బ్యాక్‌డ్రాప్‌గా మారుతున్నాయి.

    కార్పొరేట్‌ నుంచి క్రియేటివ్‌ వైపు..
    ఐటీ ఉద్యోగాలతోనే గుర్తింపు పొందిన హైటెక్‌ సిటీ, ఇప్పుడు మరో అవతారం ఎత్తుతోంది. గ్లాస్‌ బిల్డింగ్స్, స్కై వాక్స్, మెట్రో పిల్లర్స్, అర్బన్‌ మోషన్‌.. ఇవన్నీ కలిపి ఫ్యూచరిస్టిక్‌ రీల్స్‌కు సరైన స్పేస్‌గా మారాయి. ఉద్యోగ సమయం తర్వాత, బ్యాగ్‌ పక్కన పెట్టి, ఫోన్‌ చేతిలో పట్టుకుని యువత రీల్స్‌ చేయడం ఇక్కడ సాధారణ విషయం. ‘ఆఫీస్‌ అయిపోయాక రీల్స్‌ తప్పనిసరి’ అన్నట్టుగా మారింది ఈ తరం లైఫ్‌ స్టైల్‌.

    టీ హబ్‌ టు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్స్‌..
    టీ హబ్‌ అంటే కేవలం స్టార్టప్‌లకే పరిమితం కాదు. ఇది ఒక సోషల్‌ స్టేట్‌మెంట్‌ స్పాట్‌గా మారుతోంది. ఇక్కడ రీల్స్‌ అంటే డ్యాన్స్‌ కాదు వాక్‌ అండ్‌ టాక్‌ రీల్స్, మోటివేషనల్‌ వాయిస్‌ ఓవర్స్, డే ఇన్‌ మై లైఫ్, హైదరాబాద్‌ గ్రోత్‌ స్టోరీస్‌ వంటి వైవిధ్యమైన కంటెంట్‌కు కేంద్రంగా మారుతోంది. నగర యువత కేవలం వ్యూస్‌ కోసం కాదు, తమ ఆలోచనల్ని కూడా రీల్స్‌లో చూపిస్తోంది.

    రుచికి రీచ్‌.. నీలోఫర్‌ కేఫ్‌.. 
    2026లో నీలోఫర్‌ కేఫ్‌ మరోసారి వైరల్‌ అవుతోంది.. అయితే ఈసారి లైఫ్‌ స్టైల్‌ రీల్స్‌ వల్ల అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. చాయ్‌ గ్లాస్, ఇరానీ చాయ్‌ ఆవిరి, రాత్రి పూట జిగేల్‌మనే లైట్స్, జనాల హడావుడి.. ఇవన్నీ కలిసి ఒక ఎమోషనల్‌ హైదరాబాద్‌ వైబ్‌ సృష్టిస్తున్నాయి. ఇక్కడ తీసిన రీల్‌ అంటే, అది కేవలం వీడియో కాదు.. నగరంతో కనెక్ట్‌ అయ్యే అనుభూతి.

    అర్బన్‌ నేచర్‌ హాట్‌స్పాట్‌.. 
    దుర్గం చెరువు ఫ్లైఓవర్, లేక్‌ వ్యూ, నైట్‌ లైట్స్‌.. ఇవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ ఫ్రేమ్స్‌. నేచర్‌ ప్లస్‌ సిటీ ఈక్వల్స్‌ టు రీల్‌ అండ్‌ రియల్‌ మ్యాజిక్‌.. ఇక్కడ సన్‌సెట్‌ టైమ్‌లో తీసిన రీల్స్‌ లక్షల్లో వ్యూస్, లైక్స్‌ అందుకుంటున్నాయి. హైదరాబాద్‌ (Hyderabad) అందాలను, పర్యాటకాన్ని మరో కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే మాధ్యమాలుగా ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటివి నిలుస్తున్నాయన్నది వాస్తవం.

    నగరంలో బెంగళూరియన్స్‌ రీల్స్‌? 
    ఇది ఆశ్చర్యంగా అనిపించినా నమ్మదగిన వాస్తవం. సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ ప్రకారం, బెంగళూరు నుంచి వచ్చిన కొంతమంది కంటెంట్‌ క్రియేటర్స్‌ నగరంలోని ప్రముఖ స్పాట్స్‌లో రీల్స్‌ (Reels) షూట్‌ చేస్తున్నారు. తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, క్లీనర్‌ బ్యాక్‌డ్రాప్స్, నాచురల్‌ లైటింగ్, కల్చర్‌ ప్లస్‌ మోడర్నిటీ మిక్స్‌.. వంటివి దీనికి కారణమని స్పష్టమవుతోంది. ఈ కారణంగా హైదరాబాద్‌ సౌత్‌ ఇండియాలో కొత్త రీల్‌ క్యాపిటల్‌గా మారుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    చదవండి: అలాంటి డైట్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి: నటి ఊర్మిళ

  • ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.

    ముఖ్యంగా 2008లో సైజ్‌ జీరో ఫ్యాషన్ క్రేజ్‌ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్‌తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్‌లో కూడా ఇంతలా స్లిమ్‌గా బాడీ మెయింటైన్‌ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..

    ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్‌ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్‌కట్‌లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్‌లాస్‌ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్‌గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. 

    నాజుకైన శరీరం కోసం..
    తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్‌ డైట్‌ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్‌ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. 

    యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. 

    ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..
    చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌కి విదేశీ సూపర్‌ ఫుడ్స్‌కి క్రెడిట్‌ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్‌గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. 

    తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్‌గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.

    (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)

     

Politics

  • సాక్షి, గుంటూరు: ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మూడేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి అంబటి కాపు కులానికి టైగర్‌.. అలాంటి వ్యక్తిని స్టేషన్‌లో నల్లపాడు, పట్టాభిపురం సీఐలు దారుణంగా కొట్టారన్న వైఎస్‌ జగన్‌.. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అన్నింటిపై ఎంక్వైరీలు వేస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.

    ‘‘మా ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తాం. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి. రేపు మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రవాప్తంగా బంద్‌కు కూడా పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు ముర్ఖుడే. వైఎస్సార్‌సీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారు’’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

    ‘‘200మంది సీఐ, ఎస్సైలు వీఆర్‌లో ఉన్నారు. మీకు కావాల్సిన వారినే పోలీసులు నియమించుకున్నారు. బిహార్‌ సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం జంగల్‌ రాజ్‌ నడుస్తోంది. తప్పు చేసిన అధికారుల్ని ఆధారాలతో సహా కోర్టులో నిలబెడతాం’’ అని వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

    ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

     

     

  • సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ( ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించారు. టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది గమనించారు. మొత్తం దాడి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. అంబటి రాంబాబు కుటుంబానికి ఓదార్చారు. ఏ మాత్రం అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

    అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారని మండిపడ్డారు. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. ఈరోజు అంబటి విషయంలో జరిగింది అయితే ఏమి, అలాగే జోగి రమేష్‌ ఇంటిమీద దాడి అయితేనేమి, విడదల రజిని, బొల్ల బ్రహ్మనాయుడి మీద దాడి.. ఇవన్నీ ఇటీవలి కొన్ని ఘటనలు. ఇవన్నీ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను సూచిస్తున్నాయన్నారు. అసలు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు.. వారంతా చేసిన తప్పేమిటి? అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

    తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా..:
    దాదాపు ఏడాదిన్నర నుంచి చంద్రబాబు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య పెట్టే పని చేస్తున్నారు. పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, కుట్రపూరితంగా, ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అంటూ.. రకరకాలుగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబునాయడు, ఆయన కొడుకు లోకేష్, పవన్‌కళ్యాణ్‌.. ఉద్దేశపూర్వకంగా, శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకున్నారు.

    వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ.. రెండు ల్యాబ్‌లు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి. ఆ రెండు ల్యాబ్‌లు వీరు పంపించిన నెయ్యిని పరీక్షించారు. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపనూనె వంటి ఏ అవశేషాలు లేవని సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ నివేదికా ఆధారంగా సీబీఐ, సిట్‌ ఛార్జ్‌షీట్‌ వేసింది.

    వారు నిజంగా తప్పు చేసి ఉంటే..!:
    ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే, ఆ ఛార్జ్‌షీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి పేర్లు ఎందుకు లేవు? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు?. ఎందుకంటే వారు తప్పు చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ల్యాబ్‌లు కూడా వాస్తవం చెప్పాయి. అసలు సీబీఐ ఎందుకు వచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. కేసులో నిజాలు నిగ్గు తేల్చాలని.. సీబీఐ దర్యాప్తు చేసి, వాస్తవాలు వెల్లడించింది.

    క్షమాపణ కోరాల్సింది పోయి..:
    కాబట్టి, చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్‌ చేసిన తప్పుకు చెంపలేసుకుని, క్షమాపణ కోరాల్సింది పోయి.. మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు ప్రచారం చేస్తూ.. వాస్తవాలు వక్రీకరిస్తూ, ఫ్లెక్సీలు పెట్టారు. తప్పుడు సమాచారంతో, రెచ్చగొట్టే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?. మేము కూడా ఇలా ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది చంద్రబాబు?. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ అని చెప్పి మోసం చేశారని ఫ్లెక్సీలు పెడితే ఊర్కుంటారా?. అబద్దాలు చెబుతూ, దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు స్పష్టంగా చెప్పినా, చంద్రబాబు వెనక్కు తగ్గడం లేదు.

    ప్రశ్నిస్తే సహించడం లేదు!:
    ఎవరైనా చంద్రబాబును గట్టిగా నిలదీస్తే, ప్రశ్నిస్తే..ఏం చేస్తున్నారు?. అంబటి రాంబాబు మీద దాడి చేశారు. ఆరోజు ఉదయం గుడికి వెళ్లి పూజ చేసి వస్తుంటే.. ఆ మార్గంలో కట్టెలు పట్టుకుని, పోలీసుల సమక్షంలో రాంబాబును అడ్డగించాలని చూశారు. (అంటూ ఆ ఫోటోలు చూపారు). పోలీసులను పక్కన పెట్టుకుని, కర్రలతో రాంబాబు కారును అడ్డగించి, కారును బాదారు. ఇంకా తనను బూతుల తిట్టి, ఆయన కారుపై దాడి చేస్తే.. రాంబాబుగారు స్పందించారు. తన ఒక్కడి మీద అంత మంది దాడి చేస్తే, తన కారును అడ్డగిస్తే, బూతులు తిడితే.. ఆయన స్పందించారు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి.. కాస్త కటువైన పదం దొర్లింది. ఒకవైపు ఆయన కారుపై దాడి. మరోవైపు బూతులు తిట్టడంతో ఆయన కాస్త గట్టిగా స్పందించారు.

    మరి ఇదే చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌.. మీరు అంత కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితే ఒకటి. రాంబాబు గారు మాట్లాడితే ఒకటినా? అయినా రాంబాబుగారు, ఇంటికి వచ్చిన తర్వాత, మీడియాతో మాట్లాడి, తాను తిట్టినందుకు క్షమాపణ చెప్పారు. తాను ఏ పరిస్థితిలో తిట్టాడన్నది కూడా చెప్పారు. చాలా సంస్కారంగా వివరణ కూడా ఇచ్చారు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. వారు తన కారుపై దాడి చేశారు. తిట్టారు. దాంతో అలా స్పందించాడు. ఆయన క్షమాపణ చెప్పినా.. ఆయన మాటలు వక్రీకరిస్తూ..  ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి సాయంత్రం 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు విధ్వంసం సృష్టించారు.

    స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి. మనుషులతో వచ్చి విధ్వంసం సృష్టించారు. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆయన గల్లా మాధవి భర్త. ఆయన సాక్షాత్తూ అంబటి రాంబాబు ఆఫీసు పగలగొట్టారు. చివరకు నిప్పు పెట్టారు. (అంటూ ఆ ఫోటోలన్నీ చూపారు) ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నా, వెనక్కి తగ్గలేదు.

    వారు కుట్రలో భాగస్వాములే కదా?:
    ఇది హత్యాయత్నం కాక మరేమిటి? పోలీసులు కూడా ఈ కుట్రలో భాగస్వాములు కాదా?. పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేదా?. ఇక్కడికి ఎంత దూరంలో ఎస్పీ ఆఫీస్‌ ఉంది. కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉంది. అక్కడ బెటాలియన్‌ ఉంటుంది. మా పార్టీ నాయకులు ఏ అధికారికి ఫోన్‌ చేసినా ఎవరూ ఎత్తలేదు. మరి ఇది కుట్ర కాదా? ఇది ధర్మమా? న్యాయమా?. మరోవైపు రాంబాబుగారిని అరెస్టు చేశారు. దానికి కారణం ఏం చెప్పారు? చంద్రబాబును తిట్టినందుకు అని చెప్పారు. మరి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి, 5 కార్లు ధ్వంసం చేసి, మొత్తం పగలగొడితే.. ఏం చేశారు?. ఎమ్మెల్యే, ఆమె భర్తను ఏం చేయలేదు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు.

    అక్కడ జోగి రమేష్‌ ఇంటిపై దాడి:
    అక్కడ కూడా పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఇంటిమీద దాడి చేసి, నిప్పంటించారు. అంతకు ముందు విడదల రజిని. ఆమె గుడిలో పూజ చేసి వస్తుంటే, గుడి బయట అడ్డుకుని, తిడుతూ.. పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరిగినా, ఆమెపైనే తిరిగి కేసు పెట్టారు.

    బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?
    చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు జ్ఞానోదయం కలగాలని గుడిలో పూజ చేసి వస్తుంటే, ఆయనపైనా దాడి చేశారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి పైనా అదే స్థితి. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది.

    స్వార్థ రాజకీయాల కోసం..:
    తప్పులన్నీ చంద్రబాబు చేస్తున్నారు. కేసులు మా పార్టీ వారిపై పెడుతున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చినా.. చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా చేస్తోంది ఏమిటి?. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాడు. ఎన్నికల ముందు ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలిచ్చి..ఏవీ చేయకుండా,అన్నీ చేశామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నాడు. అక్రమ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. చివరకు సోషల్‌ మీడియా కార్యకర్తలను కూడా వదలడం లేదు. ఇంకా దారుణంగా గంజాయి కేసులు కూడా పెడుతున్నారు.

    అంతా అరాచకం. ఎక్కడికక్కడ దోపిడీ:
    నకిలీ మద్యం దందా. తన పార్టీ వారికి మద్యం షాప్‌లు. వేలం పాట పాడి బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. మద్యం షాప్‌ల పక్కనే, పర్మిట్‌రూంలు నడుతున్నారు. అలా యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వైన్‌షాప్‌ల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. పర్మిట్‌రూమ్‌ల్లో పెగ్గుల వారీగా అమ్ముతున్నారు. ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి రావడం లేదు. అంతా వాళ్ల జేబుల్లోకి పోతోంది. ప్రతి 5 బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం. దాన్ని తయారు చేసింది తంబళ్లపల్లె నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి. అయినా మా పార్టీ నాయకుడు జోగి రమేష్‌పై అక్రమ కేసు పెట్టి, జైలుకు పంపారు. నకిలీ మద్యం తయారీ. సరఫరా, అమ్మకం అంతా టీడీపీ నాయకులదే. అంత దారుణంగా దోచుకుంటున్నారు.

    జంగిల్‌రాజ్‌కు పరాకాష్ట:
    అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడిపై దాడి. అంబటి రాంబాబు కాపు కులంలో మంచి నాయకుడు. ఆయన ఆ కులంలో ఒక టైగర్‌. అలాంటి ఆయన్ను దారుణంగా హత్య చేయాలని చూశారు. ఇంకా ఆయనను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో అర్ధరాత్రి ముగ్గురు సీఐలు టార్చర్‌ చేశారు. ఒక మాజీ మంత్రిని అలా వేధిస్తారా?. దాదాపు 200 మంది పోలీసు అధికారులకు పోస్టింగ్‌ లేదు. మీకు కావాల్సిన వారిని ఎంచుకుని, జంగిల్‌రాజ్‌ చేస్తున్నారు.

    ఎవ్వరినీ వదిలిపెట్టబోము:
    ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు. చూస్తుండగానే గడిచిపోతాయి. మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. ఇప్పుడు తప్పుడు పని చేస్తున్న పోలీసులను యూనిఫామ్‌తో బోనులో నిలబెడతాం. వడ్డీతో సహా బదులిస్తాం. విచారణ జరిపిస్తాం. ఇప్పుడు తప్పుడు పనులు చేస్తున్న పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.

     

    పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

    విషబీజాలు నాటుతున్నారు:
    ఈ రోజు విషపూరిత విత్తనాలు నాటుతున్నారు. అవి రేపు వృక్షాలవుతాయి. అప్పుడు పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా వైఖరి మార్చుకొండి. ఇలాంటి పనులు ఆపండి. హమీలు నిలబెట్టుకొండి. పిల్లలకు ఫీజులు చెల్లించండి. ఆరోగ్యశ్రీ పక్కాగా అమలు చేయండి. 10 మెడికల్‌ కాలేజీల అమ్మకం ఆపండి. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టండి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి. పెట్టుబడి సాయం చేయండి.

    ఎదుర్కొంటాం.. పోరాడుతాం.. ఎండగడతాం:
    అడిగితే గొంతు పట్టుకోవడం సరికాదు. మీరు ఇలాగే కొనసాగిస్తే.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తాం. గట్టిగా పోరాడుతాం. ఢిల్లీలో కూడా మీ వ్యవహారాన్ని ఎండగడతాం. ఎన్‌హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలా చేస్తే, వైయస్సార్‌సీసీ కార్యకర్తలు భయపడతారనుకుంటే, చంద్రబాబు ఒక మూర్ఖుడు. బంతి నేలకు కొడితే, అంతే బలంతో లేస్తుంది. మా కార్యకర్తలు కూడా అంతే.

    అంత దిగజారిన నాయకుడు ప్రపంచంలోనే ఉండడు:
    చంద్రబాబు ఎంత తప్పుడు మనిషి అంటే, ఆయన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది. ఆయన చేసిన తప్పు ప్రజలందరికీ తెలిసింది. దీంతో తన అబద్దాలు నిజం అని చెప్పడానికి, ఆయన తనకు కావాల్సిన వారితో కమిషన్‌ వేసుకుంటాడట! అలా తనకు అనుకూలమైన నివేదిక తెప్పించుకునే ప్రయత్నం. అందుకే చంద్రబాబు వంటి దిగజారిపోయిన నాయకుడు.. ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు

    అడుగడుగునా అంతులేని అభిమానం..
    తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు అడుగుడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. దీంతో తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్‌లో ఉన్న రాంబాబు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. కుంచనపల్లి క్రాస్‌రోడ్స్, ఖాజా టోల్‌గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్‌ సర్వీస్‌ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్‌ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్‌లోని అంబటి రాంబాబు నివాసానికి శ్రీ వైయస్‌ జగన్‌ చేరుకున్నారు.

    మరోవైపు వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. ఎక్కడకక్కడ జగన్‌గారి వెంట వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టారు. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద అడ్డుగా పెట్టుకుని అడ్డుకున్నారు. అయినా జగన్‌గారి అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలి వచ్చారు. గుంటూరు నగరం జనసముద్రంగా మారింది.

  • వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!

    తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. 

    నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్‌ రాజ్‌ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. 

    తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్‌ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్‌ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్‌సీపీని, జగన్‌ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్‌ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.

    కూటమి ప్రభుత్వంపై  ప్రజావ్యతిరేకత
    ప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్‌ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. 

    పట్టాభిపురం చేరుకున్న YS జగన్

    జగన్‌ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

    ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్‌ జగన్‌ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా  ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.

    ::సిమ్మాదిరప్పన్న

  • సాక్షి,తెలంగాణ భవన్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దివాళా తీసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని అన్నారు.

    బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్కాం లు బయట పెడుతున్నాం. మూసి పేరిట లక్ష యాభై వేల కోట్ల స్కాంను, లగచర్ల స్కాం, హిల్ట్ పాలసీ స్కాంను బయట పెట్టాం. అలాగే అమృత్ స్కాంను కూడా బయట పెట్టాం. సింగరేణిలో భారీ కుంభకోణం తెరలేపితే బయట పెట్టాము.

     గత వారం రోజులుగా మమ్ముల్ని వరుసగా విచారణకు పిలుస్తుంటే మాకు డౌట్ వచ్చింది  కానీ తవ్వితే ఒక స్కాం బయటకు వచ్చింది. దివాళా తీసిన ఓ ఇన్‌ఫ్రా సంస్థకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. ఇది ముఖ్యమంత్రి బినామీ కంపెనీ. ఈ బినామీ కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్టులు ఇస్తున్నారు. 2018 సెప్టెంబర్‌ 27 సదరు కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇన్‌ఫ్రా కంపెనీపై అనుమానం వచ్చింది

    రేవంత్‌ సీఎం కాకముందు ఆ కంపెనీ పేరుతో రిజస్ట్రరయిన కారులోనే తిరిగారు. 2023లో ఆ కంపెనీ దివాళా తీసింది. రేవంత్‌ ముఖ్యమంత్రిగా అదే కంపెనీకి వేలకోట్లు ప్రాజెక్ట్‌లు కట్టబెట్టారు. దివాళా తీసిన కంపెనీకి ప్రాజెక్ట్‌లు ఎలా ఇస్తారు? ఇది క్విడ్‌ ప్రో కాదు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని కంపెనీకి రూ.6వేల కోట్ల పప్రాజెక్ట్‌ పనులు ఇవ్వడం ఏంటి?. అదే కంపెనీ అవకతవకలపై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. గాంధీభవన్‌లో పార్టీ ఫిరాయింపులు సంసారం పెట్టారు.. కనిపించడం లేదా? అని స్పీకర్‌ను ప్రశ్నించారు.

    సిరిసిల్లలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు?. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు.. వాళ్లే బీఫాంలు పంచుతున్నారు. స్పీకర్ గారు.. అయినా మీ కళ్లకు కన్పించడం లేదా?. స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా?. ప్రజలారా.. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటేయాలని అడగండి.

    మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట. కేటీఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా. కేంద్రం నిధులిస్తే.. ఆ నిధులను తినేసి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదు. కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు.. వాళ్లకు ఎందుకు ఓటేయాలి?. అందుకే ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే ఐదేళ్ల అరిగోస తప్పదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Andhra Pradesh

  • సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. టీడీపీ గూండాల దాడితో వణికిపోయిన కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 

    బుధవారం వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన జన సందోహం నడుమ సాగింది. సాయంత్రం అంబటి నివాసానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. తొలుత టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను పరిశీలించారు. ఆ తర్వాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో జగన్‌ వెంట పార్టీ ముఖ్య నేతలు పలువురు ఉన్నారు.

    నేనున్నా తల్లీ.. బాధపడకు.. అంబటి కుటుంబానికి జగన్ ఓదార్పు

     

     

     

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రియతమ నేత వైఎస్‌ జగన్‌ వస్తున్నారనే సమాచారంతో అంబటి ఇంటికి భారీగా తరలి వచ్చినవారిపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.   

    టీడీపీ గూండాలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని హతమార్చాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉల్టా అంబటిపైనే కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయించింది చంద్రబాబు ప్రభుత్వం. దాడితో భయాందోళనకు గురైన అంబటి కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించేందుకు వచ్చారు. 

    జగన్‌ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో అంబటి నివాసం వద్దకు తరలి వచ్చారు. అయితే.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాళ్లను అడ్డుకుని బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పరిస్థితి హీటెక్కింది. అయితే.. జగన్‌ వచ్చాక మరోసారి అలాంటి పరిస్థితే కనిపించింది.

    అంతకు ముందు.. గుంటూరు నగరంలో 
    అంతకు ముందు గుంటూరు నగరంలోకి వచ్చే సమయంలో పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. గుంటూరు నగరంలోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌కు స్వాగతం చెప్పేందుకు వైఎస్సార్‌సీసీ శ్రేణులు  భారీగా తరలివచ్చారు. అయితే, వైఎస్‌ జగన్‌ కాన్వాయి వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిచ్చారు.



    ఫాలో ఆప్‌ వాహనాలను చెక్‌పోస్ట్‌ వద్ద అడ్డుకున్నారు. అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తమను పోలీసులు అడ్డుకున్నారని పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని నెట్టే ప్రయత్నం చేయగా అక్కడ సైతం ఉద్రిక్తత నెలకొంది. ఇలా అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు చేపట్టిన వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడుగడుగున్నా అడ్డంకులు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    అయినప్పటకీ జగన్‌పై ఉన్న అమితమైన అభిమానం ఎప్పటికీ తగ్గదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు. భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో గుంటూరులో వైఎస్‌ జగన్‌ పర్యటన జనసంద్రాన్ని తలపించింది. 

  • సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున​ ఆటవిక పాలనను వైఎస్సార్‌సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది. 

    తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

    ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్  సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్,  ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే  చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.

    వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం. 

    మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. 

    మాజీ మంత్రి ఆదిమూలం  సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. 

    మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు  సంఘానికి నివేదిక ఇచ్చాం.

International

  • ‘‘మిత్రదేశాల్ని అప్పులు అడగాలంటే సిగ్గనిపిస్తోంది. అయినా తప్పడం లేదు. నేను, మన ఆర్మీ చీఫ్‌ ఇద్దరం జోలె పట్టుకుని వీలైనన్నీ ఎక్కువ దేశాలు తిరిగాం. ఇంకా తిరగడానికి కూడా వెనకాడబోం’’ అంటూ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మొన్నీమధ్యే బహిరంగంగా ఒక ప్రకటన చేయడం చూశాం. ​ఈ క్రమంలో సొంత దేశ పౌరులు తమ గురించి ఏం అనుకున్నా దులిపేసుకుంటాం అనే చందాన ఆయన మాట్లాడారు. ఈ లిస్ట్‌లో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్‌ చేరారు.

    అంతర్జాతీయ సమాజంలో పాక్‌ తన పరువు తానే తీసుకుంటోంది. మొన్నీమధ్యే అప్పుల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన్ని పాక్‌ పౌరులు నెట్టింట తెగ ట్రోల్‌ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంతు వచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఆయన.. బలూచ్‌ రెబల్స్‌ను ఎదుర్కోవడం తమ వల్ల కాదనే రీతిలో మాట్లాడడం గమనార్హం. 

    బలూచిస్తాన్‌ అనేది పాకిస్తాన్‌లోనే అతిపెద్ద రీజియన్‌. ఇలాంటి చోట.. తక్కువ సంఖ్యలో దాగి ఉన్న బలూచ్‌ రెబల్స్‌ను ఎదుర్కోవడం మన(పాక్‌) సైన్యానికి పెద్ద సవాల్‌గా మారింది. పైగా  బలూచ్ రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉంటున్నాయి. రైఫిల్స్‌, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్.. ఇలాంటివెన్నో వాళ్లు వాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ కూడా ఎక్కువే. పాక్‌ సైన్యం కూడా మునుపెన్నడూ అలాంటి ఆయుధాల్ని చూసి ఉండదు.. అంటూ ప్రసంగించారాయన. ఈ క్రమంలో అమెరికానే వాటిని సమకూర్చి ఉంటుందని సంచలన ఆరోపణలకు దిగారు. 

    ‘‘ఆ అత్యాధునిక ఆయుధాలు అమెరికన్‌వే. రెబల్స్ నాయకత్వం ఆఫ్గనిస్తాన్‌లో ఉండి.. అక్కడి నుంచి మద్దతు పొందుతున్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడం.. రెబల్స్ ఆధునిక సాంకేతికత వాడటం వల్ల మన (పాక్‌) భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. బీఎల్‌ఏ లాంటి గ్రూపులు క్రిమినల్ గ్యాంగ్స్‌తో కలసి పనిచేస్తూ, ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. సాధారణ పౌరులను, మహిళలను, పిల్లలను చంపే అలాంటి గ్రూపులతో పాక్‌ ప్రభుత్వం ఏనాడూ చర్చు జరపబోదు అని ఖ్వాజా జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. 

    సాధారణంగా ఒక దేశం తన భద్రతా లోపాలను, సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిరంగంగా ఒప్పుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను దెబ్బతీసుకోవడమే. ఇప్పుడు రక్షణ మంత్రి ఖ్వాజా అదే పని చేశారని అక్కడి జనం తిట్టుకుంటున్నారు. సంపాదించేవారని ఆరోపించారు.

    ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో బలూచిస్తాన్‌లో రెబల్స్‌ తిరుగుబాటు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాక్‌ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రెబల్స్‌ వైవిధ్యమైన దాడులకు తెగపడుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూలేని రీతిలో మహిళలతో పాక్‌ ఆర్మీపై బలూచ్‌ రెబల్స్‌ గ్రూపులు ఆత్మాహుతి దాడులు జరుపుతున్నాయి. గతవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు జరిపి 80 మంది ప్రాణాలు తీశాయి. అదే సమయంలో పాక్‌ ఆర్మీ ప్రతిఘటనతో.. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. 

    కిందటి ఏడాది.. బలూచిస్తాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) హైజాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత అమెరికా ఆ గ్రూప్‌ను ఉగ్రసంస్థగా గుర్తిస్తూ.. ఆ రీజియన్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా(KBK ప్రాంతాలను "Level 4: Do Not Travel" జాబితాలో చేర్చింది. అంటే అటువైపు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమైనవని చెప్పడమన్నమాట. ఒక్క బీఎల్‌ఏ మాత్రమే కాదు.. అక్కడి రెబల్స్‌ గ్రూపుల్లో చాలావాటిని అమెరికా ఉగ్రసంస్థగా ఈపాటికే గుర్తించింది కూడా. ఈ తరుణంలో.. అమెరికన్ అత్యాధునిక ఆయుధాలనే బలూచ్‌ రెబల్స్‌ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశంగా కనిపించడమే కాదు.. అంతర్జాతీయంగానూ పాక్‌కు ఇబ్బందులు కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

  • న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సకల ‍ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు చాట్‌ జీపీటీ (ChatGPT) వాడుతున్న యూజర్లు గూగుల్ ‘జెమిని’కి మారాలనుకున్నప్పుడు, తమ పాత సంభాషణలు, డేటాను కోల్పోతామనే ఆందోళన  చెందేవారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ ఇప్పుడు ‘ఇంపోర్ట్ ఏఐ చాట్స్’ (Import AI Chats) అనే కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఫలితంగా యూజర్లు తమ పాత చాట్‌బాట్‌లలోని హిస్టరీని  సులభంగా జెమినికి బదిలీ  చేసుకోగలుగుతారు.

    ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్న ఈ ఫీచర్ గురించి ‘టెస్టింగ్ క్యాటలాగ్’ అనే నివేదిక కీలక వివరాలను గూగుల్‌ వెల్లడించింది. దీని ప్రకారం వినియోగదారులు చాట్‌ జీపీటీ లేదా క్లాడ్ (Claude) వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుండి తమ సంభాషణలను నేరుగా జెమినిలోకి తరలించుకోవచ్చు. దీనివల్ల ఏఐతో గతంలో జరిపిన చర్చలు, డేటా, సందర్భం (Context) ఏమాత్రం చెదిరిపోకుండా జెమినిలో కొనసాగించే అవకాశం  కలుగుతుంది.

    ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించే సమయంలో డేటా భద్రతపై గూగుల్ స్పష్టతనిచ్చింది. వినియోగదారులు దిగుమతి చేసుకున్న ప్రతి సంభాషణ వారి యాక్టివిటీలో భాగంగా సేవ్  అవుతుందని సంస్థ పేర్కొంది. అయితే ఈ డేటాను తమ ఏఐ మోడల్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు, శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తామని గూగుల్ వెల్లడించింది. అలాగే వినియోగదారులు తమ డేటాను ఎప్పుడైనా మేనేజ్ చేసుకునే లేదా డిలీట్ చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది.

    అందిన సమాచారం ప్రకారం ఈ ప్రక్రియ అత్యంత సులభంగా ఉండనుంది. మొదట యూజర్లు తమ పాత ఏఐ ప్లాట్‌ఫారమ్ నుండి చాట్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జెమిని యాప్‌లోని ‘ఇంపోర్ట్ ఏఐ చాట్స్’ బటన్‌ను క్లిక్ చేసి ఆ ఫైల్‌ను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జెమిని మీ పాత సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. తద్వారా మీరు పదేపదే అదే విషయాలను ఏఐకి వివరించాల్సిన అవసరం ఏర్పడదు.

    ఇది కూడా చదవండి: స్క్రీన్ టైమ్‌: సరికొత్త నిర్వచనంలో ‘జెన్ జీ’