Archive Page | Sakshi
Sakshi News home page

International

  • హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బ్రిటిష్ టూరిస్ట్  బీభత్సం సృష్టించాడు. టెర్మినల్-1 వ‌ద్ద ఉన్న 10 సెల్ఫ్ చెక్-ఇన్ కియోస్క్ (Kiosks) మెషిన్లను ఇనుప రాడ్డుతో అత‌డు ద్వంసం చేశాడు. అత‌డి ప్రవర్తన చూసి అక్కడున్న ఇతర ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

    సెక్యూరిటీ సిబ్బంది వచ్చేలోపే 37 ఏళ్ల బ్రిటిష్ టూరిస్ట్ తీవ్ర ఆస్తి న‌ష్టాన్ని క‌లిగించాడు. సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. స‌ద‌రు వ్య‌క్తిని హాంకాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే అతడి వద్ద అనుమ‌తి లేని వయాగ్రా మాత్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

    దీంతో అత‌డిపై విమానాశ్రయ ఆస్తులను ధ్వంసం చేసిన కేసుతో పాటు నిషేధిత మందులను కలిగి ఉన్నందుకు కూడా అద‌న‌పు కేసుల‌ను న‌మోదు చేశారు. కాగా కొన్ని దేశాల్లో వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా వంటి మందులను తీసుకెళ్లడం శిక్షార్హమైన నేరం.

    అయితే అత‌డు విమానాశ్రయానికి వ‌చ్చేట‌ప్ప‌టికి బాగానే ఉన్నాడు. అయితే టిక్కెట్ కొనుగోలు చేసే స‌మ‌యంలో సిబ్బందితో అత‌డికి వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌హనం కోల్పోయిన అత‌డు వీరంగం సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.


     

     

  • ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ తన సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఉగ్రవాదులు స్థావరాలను నిర్వీర్యం చేస్తూ వారికి ఎటువంటి సహాయం అందకుండా అష్ట దిగ్భందనం చేస్తుంది. ఈ నేపథ్యంలో జైషే-ఏ- మహ్మద్ తీవ్రవాది సైపుల్లా ఖాన్ భద్రతా బలగాల కళ్లుగప్పుతూ మారు వేశంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.

    జైష్‌-ఏ-మహమ్మద్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖాన్ ప్రస్తుతం భద్రతా బలగాల కంటపడకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ గుర్తించకుండా ఉండడానికి గడ్డం తీసి ఆడవారిలా బుర్ఖాలు ధరించి తిరుగుతున్నట్లు దోడా సూపరిండెంట్ సందీప్ మెహతా అన్నారు. అంతే కాకుంగా కొన్నికొన్ని సార్లు ఎవరికి అనుమానం రాకుండా స్థానికుల మద్ధతు పొందేందుకు ఆద్యాత్మిక గురువు వేశం వేసి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    గత రెండు నెలలుగా అతని కోసం కిష్వారా, దోడా ప్రాంతాలలో గాలింపులు చేపడుతున్నామని ఈ నేపథ్యంలోనే జనవరి 19న అతని రహస్య స్థావరాన్ని కనుగొని దానిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ స్థావరం 12 వేల అడుగుల ఎత్తులో బంకర్ల మాదిరిగా నిర్మించారని తెలిపారు. ఈ స్థావరం ధ్వంసం అయిన తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని ఉనికిని గుర్తించకుండా ఉండడానికి పలుమార్లు తన వేశాలు మారుస్తున్నాడని తెలిపారు. 

    భద్రతా బలగాలు అతని సహచరుడు ఆదిల్‌ను హత్య చేశాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి చిక్కకుండా ఉండేందుకు అతను మరింత జాగ్రత్త పడుతున్నట్లు సూపరిండెంట్ సందీప్ మెహతా పేర్కొన్నారు.

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.

    ఇజ్రాయెల్ ప్రధాని ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. "భారత ప్రధాని వచ్చేవారం ఇజ్రాయెల్ పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సంబంధాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అంశాలపై చర్చించబోతున్నాం. మనందరికి తెలుసు ఇండియా చిన్న దేశం కాదు. 140 కోట్ల జనాభా ఉన్న దేశం. చాలా శక్తివంతమైనది. చాలా పాపులరైంది" అని అన్నారు.

    ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో రెండు దేశాల సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే టెల్‌ అవీవ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.. "నా మిత్రుడు ప్రధాని నెతన్యూహుతో ఇదివరకే ఫోన్‌లో సంభాషించాను. ఇజ్రాయెల్-ఇండియా వ్యూహాత్మక సంబంధాలపై చర్చించాము. రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం దిశగా చర్చలు జరుపుతున్నాము. అదేవిధంగా టెర్రరిజాన్ని మాత్రం ఎట్టిపరిస్థితిలో సహించేది లేదు. ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించేందుకు భారత్ తన పూర్తి సహాకారాన్ని అందిస్తుంది." అని మోదీ అన్నారు. భారత ప్రధాని ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ వెళ్లనున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని భారత్‌లో పర్యటించాల్సి ఉండగా పలు కారణాలతో ఆయన పర్యటన రద్దైంది.

Movies

  • తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో యాక్షన్ కింగ్‌గా ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జున్ సర్జా, సినీమాల్లోకి రాకముందు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలని అనుకున్నారట. తన తండ్రి తనకోసం ఒక డాక్టర్‌ సీటు ఎలాగైనా సంపాదించి ఇస్తాను నువ్వు చదివి డాక్టర్‌ కావాలి అన్నారట. అయితే తనకు డాక్టర్‌ అవ్వాలని లేదు. అయితే అనుకోకుండా తను సినిమాల్లోకి వచ్చానని. తనకి సినీ హీరో అవుతాడని తెలియదని, తనని సినీమాల్లోకి ఎవరో తోసేశారని అర్జున్ అన్నారు. 

    అర్జున్ సర్జా తాజాగా తన సినీ ప్రయాణంలోని పలు ఆసక్తికర సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న సమయంలో సినిమాలను వదిలేయాలని కూడా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆ సమయంలో శంకర్ తన వద్దకు వచ్చాడు. కానీ అప్పటికి తను కొత్త వాడు కావడంతో మొదట రిజెక్ట్ చేశాను. అయితే దర్శకుడు శంకర్ వెంటపడి మరీ ‘జెంటిల్‌మెన్’ కథ వినిపించారు. కాగా అందులోని సామాజిక సందేశం తనను ఆకట్టుకుంది. దాంతో ఆ చిత్రానికి ఓకే చెప్పాను.

    అయితే ‘జెంటిల్‌మెన్’ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని అర్జున్ గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రం కథలోని సామాజిక సందేశం, పాత్ర బలం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కథను వదిలేస్తే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడు అనిపించింది.  

    1993లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. శంకర్ టేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం, అర్జున్ నటన అన్నీ కలిసి ‘జెంటిల్‌మెన్’ సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలబెట్టాయి. ఆ చిత్రంతో ఆయన స్టార్‌ హీరోగా మారారు. ఆ తరువాత యాక్షన్ కింగ్‌గా ఎన్నో హిట్లు తన కెరీర్‌లో సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు.  

    తాజాగా అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘సీతా పయనం’ వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటించడం విశేషం. కుటుంబ విలువలతో పాటు ప్రేమ, రోడ్ జర్నీ అంశాలను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందుతోంది.  

    అర్జున్ సర్జా చెప్పినట్లుగా ఒక్క నిర్ణయం జీవితాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలదు. అర్జున్ సర్జా కెరీర్‌లో ‘జెంటిల్‌మెన్’ అలాంటి మలుపు.

  • ఓటీటీల్లో సినిమాలు సడన్‌గా ఎంట్రీ ఇస్తుంటాయి. ఈ రోజుల్లో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో ముందుగానే డీల్స్ ఉండడంతో స్ట్రీమింగ్ చేసేస్తుంటారు. మరికొన్ని చిత్రాలు ఒకే ఫ్లాట్‌ఫామ్ కాకుండా రెండు, మూడింటిలోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా మూవీ విడుదలైన కొన్ని నెలలు, ఏడాదిలోపు రావడం చూస్తుంటాం. కానీ తాజాగా ఓ చిత్రం రిలీజైన మూడేళ్ల తర్వాత మరో ఓటీటీకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసుకుందామా?

    బాలీవుడ్‌ మూవీ 8 ఏఎమ్ మెట్రో 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య, కల్పిక గణేశ్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. 2023 మే 19న ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5లో అందుబాటులో ఉంది.

    తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం మరో ఓటీటీకి రావడం విశేషం. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన అందమైన జీవితం అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. 
     

  • తనకు సర్జరీ జరిగిందని  చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్‌తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

    మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. 
     

     

  • టాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు.  అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్‌ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్‌ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.

    కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్‌ ఎవరో తెలుసుకుందాం.

    మానస వారణాసి..

    మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

    శివానీ నాగారం..

    తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్‌ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.

    బేబీ వైష్ణవి చైతన్య..

    బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్‌ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్‌ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్‌ మూవీ మెరిసింది.  ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.

    శ్రీ గౌరి ప్రియ..

    మ్యాడ్ ‍బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.

    కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..

    కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్‌ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

    ఈషా రెబ్బా..

    మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్‌ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్‌ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.

    వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.
     

  • చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఆయేషా

    జిగేలుమని మెరిపించేస్తున్న బిగ్‌బాస్ విష్ణుప్రియ

    పక్షులతో ఆడుకుంటున్న బిగ్‌బాస్ ఫేమ్ దివి

    'రాజాసాబ్' ఫేమ్ మనీషా చీరలో అందాలు

    గ్లామర్‌తో రచ్చ లేపేస్తున్న మంచు లక్ష‍్మీ

    ప్రిన్సెస్‌లా తయారైపోయిన 'రాజాసాబ్' రిద్ధి

  • టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను ‍అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్‌లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.

    అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.

    ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్‌ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది

  • గత కొన్నేళ్లుగా చూసుకుంటే తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు ఎప్పటికప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రేక్షకుల పల్స్ వీళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారా? సరైన స్టోరీలని ఎంపిక చేసుకోలేకపోతున్నారా? తెలియట్లేదు గానీ చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. ఒకవేళ సక్సెస్ అయినా సరే కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ విశ్వక్ సేన్. వరసపెట్టి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

    'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్' లాంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాత చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కెరీర్ ఏ మాత్రం ఆశజనకంగా లేదు. 2024లో ఏకంగా మూడు చిత్రాలతో వస్తే.. వాటిలో 'గామి' ప్రయోగాత్మక చిత్రం కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటే.. 'మెకానిక్ రాకీ' ఘోరంగా దెబ్బతింది. గతేడాది ఇదే టైంకి వచ్చిన 'లైలా' అయితే అల్ట్రా డిజాస్టర్. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' చేశాడు. ఇదీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.

    ఒకప్పటితో పోలిస్తే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ ఎలా తగ్గిపోయిందో.. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అలానే తగ్గిపోతూ వస్తున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడి చేతిలో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్, దర్శకుడిగా చేస్తున్న 'కల్ట్' ఉన్నాయి. ఈ రెండింటితోనైనా విశ్వక్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోవడం గ్యారంటీ.

    (ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)

    విశ్వక్ సేన్ మాత్రమే కాదు టాలీవుడ్‌లో చాలామంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్ దాదాపు ఇలానే ఉంది. గోపీచంద్, రవితేజ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. వీళ్లు సినిమాలైతే చేస్తున్నారు గానీ అటు కంటెంట్ పరంగా ఇటు మార్కెట్ పరంగా రెండూ వర్కౌట్ కావట్లేదు. వసూళ్లు కూడా పెద్దగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, శర్వానంద్, అల్లరి నరేశ్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే.

    పైన చెప్పిన హీరోలు.. తాము అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్పుడో ఇప్పుడో అన్నట్లు వస్తున్నారు. కానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వీళ్లు కాకుండా ఉన్న మిగతా మిడ్, చిన్న రేంజ్ హీరోల పరిస్థితి అయితే అంతకంటే దారుణంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో ఏంటో అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)

  • శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్‌ మూవీ తూ యా మైన్.  సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి  ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ వహించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ‍అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో . ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

    తాజాగా ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం వీక్షించారు. ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆయన ఈ సందర్భంగా తు యా మైన్ చిత్రబృందాన్ని అభినందించారు. మణిరత్నం మాట్లాడుతూ.. " ఈ మూవీతో బిజోయ్ నంబియార్ ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకొచ్చారు. ఇది థియేటర్లలో ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం" అని ప్రశంసించారు.

    ప్రత్యేక ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు సైతం సినిమాపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అద్భుతమైన సినిమాగా అభివర్ణించగా.. మరికొందరు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, స్టోరీ టెల్లింగ్ కొత్త అనుభూతి ఇచ్చాయని పేర్కొన్నారు. మణిరత్నం వంటి లెజెండరీ డైరెక్టర్ నుంచి ప్రశంసలు లభించడం సినిమా విజయంపై మరింత ధీమాగా ఉందన్నారు.

    కాగా.. ఈ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్‌  బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, వినోద్ భానుశాలి, కమలేష్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. యువతను లక్ష్యంగా చేసుకుని.. మునుపెన్నడూ చూడని ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించారు. 
     

  • ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాలని, ఆ రూల్స్‌ ఇవేనంటూ ఓ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. అయితే అదంతా ఫేక్‌ అని, బన్నీని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నకిలీ జాబితా స్పష్టం చేశారని తర్వాత తేలిపోయింది. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం సౌత్‌ స్టార్స్‌ ఇలాంటి నిబంధనలు పెట్టారా? అని చర్చ జరిగింది. 

    అలాంటిదేం లేదు
    తాజాగా ఈ వివాదంపై సౌత్‌ స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌ కేకే. సెంథిల్‌ కుమార్‌ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. సౌత్‌ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రూల్స్‌ అంటూ ఏమీ లేవు. నేనెప్పుడూ అటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. దక్షిణాదిన ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి పని చేశాను. కానీ, ఎప్పుడూ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎటువంటి ఆంక్షలు విధించలేదు. హీరోలు చాలా గౌరవప్రదంగా ఉంటారు. నిజం చెప్పాలంటే వారిని కలిస్తే స్నేహితులను కలిసినట్లే ఉంటుంది.

    చాలా సంతోషం
    నా విషయానికి వస్తే.. టెక్నీషియన్‌గా నేను పని చేసిన సినిమాలకు ఎంతో గుర్తింపు వచ్చింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. నేను బయటకు వెళ్లినప్పుడు కూడా జనం గుర్తుపట్టి మాట్లాడుతుంటారు. మా టాలెంట్‌ గురించి మాట్లాడుతూ మమ్మల్ని జనానికి పరిచయం చేస్తున్న మీడియా, సోషల్‌ మీడియాకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే! పైగా ఈ జనరేషన్‌లో పని చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ. 

    దేవుడికి థాంక్స్‌
    ఎందుకంటే అనేకమంది ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు సినిమాకోసం ఎంతో కష్టపడ్డారు. కానీ, వారికి అంత గుర్తింపు లభించలేదు. ఈలెక్కన నాకు వచ్చిన గుర్తింపు​నకుగానూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. సెంథిల్‌ కుమార్‌.. సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పలు బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ప్రస్తుతం స్వయంభు సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది.

    చదవండి: ఏం కావాలి? ఏది వద్దో నాకు బాగా తెలుసు: శోభిత ధూళిపాళ

  • మహాశివరాత్రి వేడుకల్లో పలువురు సినీతారలు సందడి  చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన వేడుకల్లో దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ కూడా పాల్గొన్నారు. వీరు పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా, శ్రీనిధి, సారా ‍అర్జున్‌ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. భక్తి పాటకు మంత్రముగ్ధులైన ముద్దుగుమ్మలు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. హీరోయిన్స్‌ డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా.. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీరంతా పంచ భూత క్రియ పూజలో పాల్గొన్నారు. 
     

     

     

     

  • రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అప్పుడప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు కూడా వస్తుంటాయి. అలా 2024లో తమిళ వచ్చిన చిత్రం 'హాట్ స్పాట్'. మాట్లాడటానికే భయపడే కొన్ని కాన్సెప్ట్‌లని ఇందులో చూపించారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత డబ్బింగ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు కూడా షాకయ్యారు. దీనికి 'హాట్‌స్పాట్ 2 మచ్' అని సీక్వెల్ తీయగా.. ఇది మాత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? వేటిలోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)

    సీక్వెల్‌లో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రధారి కాగా.. బ్రిగిడ, భవానీ శ్రీ, తంబి రామయ్య తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. తొలి భాగాన్ని తీసిన విఘ్నేశ్ రాజా దీనికి కూడా దర్శకత్వం వహించాడు. గత నెల 23న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటించారు. కాకపోతే అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా, లయన్స్ గేట్ ప్లే, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీ యాప్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఇదివరకు కొన్ని చిత్రాలు రెండు లేదా మూడింటిలోకి వచ్చాయి గానీ ఇలా ఒకేసారి ఆరింటిలో రానుండటం మాత్రం కచ్చితంగా విచిత్రమే.

    హాట్‌స్పాట్ 2 మచ్ విషయానికొస్తే.. సినిమా హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఒకదానిలో చూపించగా.. స్వలింగ సంపర్కుల వివాహం గురించి జరిగే చర్చ మరోదానిలో.. ఓ వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు తదితర అంశాలతో మూడో స్టోరీతో తీశారు. ఈ మూడింటికి ఎలాంటి ముగింపు ఇచ్చారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

  • టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్‌ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ‍సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

    తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌కు హాజరైన వీకే నరేశ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్‌ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్‌కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్‌ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.

    ఆ షూటింగ్‌కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్‌ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్‌కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్‌ ప్రశంసించారు.

     

  • కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్‌ టీమ్‌లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్‌ టీమ్‌ అసలే లేదని చెప్తోంది హీరోయిన్‌ శోభిత ధూళిపాళ.

    24 గంటలు కనిపించాలా?
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్‌ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్‌ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.

    అదైతే తెలుసు
    నాకు పీఆర్‌ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్‌ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్‌తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌లో ఎక్కువ పాపులర్‌ అయింది. గూఢచారి, మేజర్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.

    చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్‌

  • రీసెంట్‌గా వచ్చిన 'శంబాల' సినిమాలో విలన్‌గా చేసిన రవివర్మ మంచి పేరు తెచ్చుకున్నాడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మూడో సీజన్‪‌లోనూ చిన్న పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఒకదానిలో ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ఎంతలా తనని ర్యాగింగ్ చేశాడో చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

    'రాఖీ సినిమాని కేవలం ఎన్టీఆర్, కృష్ణవంశీని చూసే చేశారు. స్టోరీ కూడా నాకు సరిగా తెలియదు. వాళ్లు చెప్పింది చేసేశాను. నేను మొదట నటించిన 'వెన్నెల' మూవీ ప్రివ్యూ చేసిన కృష్ణవంశీ.. బాగా చేశావ్ ఇదెన్నో సినిమా అని అన్నారు. ఇదే తొలి చిత్రమని చెబితే ఆశ్చర్యపోయారు. సరే కలిసి పనిచేద్దాం అని అన్నారు. అలా పిలిచి 'రాఖీ'లో అవకాశమిచ్చారు. అందులో మెయిన్ విలన్ నేను అన్నట్లు చూపించారు గానీ నేనైతే అలా అనుకోలేదు. ఆ మూవీ చూపించిన ప్రభావం నుంచి బయటకు రావడానికి చాలా ఏళ్లు పట్టేసింది. నా ఫ్రెండ్స్ కూడా కొందరు.. మా చెల్లికి ఇలాంటి భర్త వస్తే ఏంటి పరిస్థితి అని భయపడ్డారు'

    'రాఖీ సినిమాలో ఎన్టీఆర్.. నా కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంది. అయితే నా దగ్గరకొచ్చి.. ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్లు పట్టుకోవాలి అని ర్యాగింగ్ చేశాడు. గురువు గారు, నాకు తెలీదు, డైరెక్టర్-మీరు చూసుకోండి అని దండం పెట్టేశా. ఆ రోజంతా కూడా.. నీ పని చెప్తా అని నన్ను ఆటపట్టించారు. ఓ రేంజులో ఆడుకున్నారు. అలానే నా పుట్టినరోజు నాడు నేను చనిపోయే షూటింగ్ జరిగింది. దానిపై కూడా తారక్ కౌంటర్స్ వేస్తూనే ఉన్నారు. అలానే పెద్ద కేక్ కూడా సెట్‌కి తెప్పించి సెలబ్రేట్ చేశారు. తారక్,కృష్ణవంశీ ఇద్దరూ కలిసి నా ముఖమంతా కేక్ పుసేశారు' అని రవివర్మ చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష)

  • హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని నాగేంద్రన్ కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

    స్పందించిన త్రిష..

    'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్‌(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.

    అసలేం జరిగిందంటే..

    అయితే ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. హీరో విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు.. ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా కామెంట్స్ చేశారు. దీంతో పెద్ద వివాదానికి దారితీసింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ వ్యాఖ్యలను ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు.

     

     

  • ఎంతోమంది యాక్టర్స్‌ ఏదో ఒక సమయంలో తిరస్కరణకు గురవుతుంటారు. ఆల్‌రెడీ వేరేవాళ్లను సెలక్ట్‌ చేశాం, నీ ఫేస్‌కు ఈ పాత్ర సూటవదు... ఇలా ఏదో ఒక సాకు చెప్పి వారిని తప్పిస్తుంటారు. అలా ఓ నిర్మాత తనకూ ఓ సాకు చెప్పడంతో గుండు గీసుకున్నానంటున్నాడు బాలీవుడ్‌ హీరో సిద్దాంత్‌ చతుర్వేది.

    పెద్ద సినిమాకు షార్ట్‌లిస్ట్‌
    తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఈ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. చాలామంది నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా రిజెక​్‌ చేస్తూనే వచ్చారు. అయితే అందులో ఒకటి నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక పెద్ద సినిమాకు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లాను. నా పేరు షార్ట్‌లిస్ట్‌ చేయడంతో సంతోషపడ్డాను. కొన్ని వర్క్‌షాప్స్‌కి సైతం హాజరయ్యాను. నా పాత్ర కోసం నేను రెడీ అవుతూ ఉన్నాను. నేను ఫ్రెష్‌ ఫేస్‌ టైటిల్‌ గెలిచిన ఏడాదికే ఈ సినిమా ఆఫర్‌ దక్కించుకున్నాను. 

    రిజెక్షన్‌తో షాక్‌
    దాంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టమేం కాదని భావించాను. ఆ మూవీ దర్శకుడు, కాస్టింగ్‌ డైరెక్టర్‌కు నేను బాగా నచ్చాను. మూడు, నాలుగు నెలలు వర్క్‌షాప్‌కు హాజరయ్యాక నిర్మాత నన్ను స్క్రీన్‌ టెస్ట్‌ చేసి రిజెక్ట్‌ చేశాడు. నేను షాకయ్యాను. అసలేమైందని కాస్టింగ్‌ డైరెక్టర్‌ను అడిగాను. ఉంగరాల జుట్టు ఉంటే హీరో కాలేరు అని ఒక్క ముక్కలో సింపుల్‌గా చెప్పేశాడు. ఒకసారి జుట్టు స్ట్రయిట్‌ చేసుకుని ఆడిషన్‌కు రమ్మన్నారు. వాళ్లు చెప్పినట్లు చేశాక కూడా నన్ను రిజక్ట్‌ చేశారు.

    గుండు గీసుకున్నా..
    చాలా బాధపడ్డాను. నాకసలు జుట్టే వద్దని గుండు గీసుకున్నాను. మా అమ్మకు నా ఉంగరాల జుట్టు అంటే ఇష్టం. అయినా సరే కోపం, బాధతో దాన్ని తీసేశాను. ఇప్పుడీ రోజు సినిమా పోస్టర్‌లో అదే ఉంగరాల జుట్టుతో కనిపిస్తున్నాను. అందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. సిద్దాంత్‌ చతుర్వేది..  గల్లీ బాయ్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన నటించిన దో దీవానే షెహర్‌ మే ఫిబ్రవరి 20న విడుదలవుతోంది.

    చదవండి: భార్యతో విడాకులు, జైలు జీవితం..నరకం అనుభవించానంటున్న సామ్రాట్‌ రెడ్డి

  • టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

    26వ తేదీన ఉదయ్‌పుర్‌లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.

    విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.

    (ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష)

    విజయ్ రష్మిక పెళ్లి సందడి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
  • ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యనే తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్.. విజయ్‌ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు.. ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇప్పుడు త్రిష కూడా స్పందించింది. ఈమె తరఫున లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: అలాంటి కంటెంట్‌కి లేని సమస్య.. టైటిల్స్‌కి ఎందుకు?)

    'ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్‌(త్రిష) ఎప్పుడూ ఊహించలేదు. త్రిష ఎలాంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేరు. భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాం. వ్యక్తిగత విషయాలని పబ్లిక్‌గా చర్చించడం తగదు. త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం' అని లాయర్ నిత్యేష్ నటరాజ్ ప్రకటన విడుదల చేశారు.

    దళపతి విజయ్, త్రిష పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. చివరగా విజయ్ హీరోగా నటించిన 'గోట్' మూవీలో త్రిష, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ చాన్నాళ్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వీటిని విజయ్‌పై విమర్శల చేయడానికి ఉపయోగించడమే ఈ మొత్తం వివాదానికి కారణమైంది.

    త్రిష, విజయపై బీజేపీ నేత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

  • వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్‌ రెడ్డి. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్‌ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

    అందుకే బ్రేక్‌
    నటుడు సామ్రాట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్‌తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్‌ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్‌ కొట్టేసి బ్రేక్‌ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!

    కావాలనే నా ప్రతిష్ట దిగజార్చింది
    పెళ్లి వర్కవుట్‌ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్‌ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మరింత కుంగిపోయాను. 

    బిగ్‌బాస్‌ ఆఫర్‌
    ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్‌ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్‌బాస్‌కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. 

    మరో పెళ్లి చేసుకోను
    మొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్‌బాస్‌ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు.

    చదవండి: 4 రోజుల్లో రిలీజ్‌.. హే భగవాన్‌ టైటిల్‌ ఛేంజ్‌

Telangana

  • హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ల్యాప్‌టాప్స్‌ను చోరీ చేసిన దొంగ‌ల‌ను  గచ్చిబౌలి పోలీసులు ప‌ట్టుకున్నారు. సీఆర్  రావు ఎఐఎమ్ఎస్ ప్రాంగణంలో జరిగిన ఈ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం దొంగిలించిన 60 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ (30) తో పాటు, సాయి చరణ్ (19), అశ్విన్ రావు (19) అనే ఇద్దరు విద్యార్థులు కలిసి ఈ దొంగ‌తానానికి పాల్పడిన‌ట్లు గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ బాలరాజు తెలిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వీరిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఆయ‌న‌ పేర్కొన్నారు. కాగా పటిష్ట బందోబస్తు ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 8న రాత్రి దొంగతనం జరగడం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

    ఈ ఘటనపై ఈ నెల 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్లు 331(4), 305(ఎ) కింద కేసు నమోదు చేశారు.  ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు.
     

  • అమ్మ ప్రేమ ఎక్కడైనా ఒక్కటే. అది మనుషుల్లోనైనా, మూగ జీవాల్లోనైనా. ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టీ ఇటిక్యాల పహాడ్‌ లో ఆవు దూడపై పులి దాడి చేసింది. అయితే పశు యజమాని,  అధికారులు.. ఆవు దూడపై పులి దాడి చేసిన చోటును గాలిస్తుండగా, అది చూసిన ఆవు.. వారిని తన వెంట తీసుకెళ్లింది. 

    తాను ముందుండి దారి చూపిస్తూ అధికారులను తన వెనకాలే రమ్మన్నట్లగా ముందుకు సాగింది.  ఇలా పులి దాడి చేసిన ప్రాంతానికి తీసుకెళ్లింది.  ఇలా బిడ్డపై తన ప్రేమను చాటుకుంది ఆవు..  అయితే పులి దాడి చేసి ఆ దూడను అప్పటికే మింగేసి ఉండొచ్చు.  కాకపోతే ఆవు ఇలా దారి చూపించి తన బిడ్డను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం మాత్రం అమ్మ ప్రేమకు అద్దం పడుతోంది.. తాను ఆవునే కానీ, అంతకుమించి అమ్మను తెలియజెప్పింది.

    వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

  • సాక్షి జగిత్యాల:  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహానం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి  ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్‌పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు..?

    కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచీ తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్‌లో కొనసాగాలా అని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను సంజయ్‌ను  ప్రశ్నించారు.

    కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వారికే తాను మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తమ వర్గంపై  ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు.ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి తనకు  నెలకొందని జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీకి, ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయికాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు.

    స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్‌పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌ : ఆధ్యాత్మికత,సాంకేతికతల సమన్వయానికి నిదర్శనంగా  సూపర్ ఏఐ అకాడమీ (SUPER AI Academy) మహాశివరాత్రి 2026ని ప్రపంచంలోనే తొలి AI మహాశివరాత్రిని నిర్వహించింది . ఈ సందర్బంగా ‘డిజిటల్ నాద యజ్ఞం” ద్వారా 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలను రూపొందించడం విశేషంగా నిలిచింది. కేవలం 50 నిమిషాల్లో 5,700కు పైగా తెలుగు శివ భక్తి గీతాలలో 108 గీతాలను ప్రత్యేక ప్రసారం చేసింది.

    Zoom వెబినార్ ప్లాట్‌ఫారమ్ ద్వారా  ఈ వినూత్న  కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఒకే సమయంలో శివతత్వాన్ని ఆధారంగా చేసుకుని గీతాలను సృష్టించారు. క్రమబద్ధమైన సాహిత్య రూపకల్పన కోసం ChatGPT Custom GPT వినియోగించగా, సంగీత నిర్మాణానికి AI ఆధారిత సంగీత సాధనాలను ఉపయోగించారు. అలాగే దీన్ని వాణిజ్య  కార్యక్రమంలా కాకుండా పరమశివునికి సమర్పించిన సమూహ భక్తి నాదార్పణగా భావించామని నిర్వాహకులు ప్రకటించారు. “

    డిజిటల్ నాద యజ్ఞం”కార్యక్రమంలో శివుని విభిన్న రూపాలైన శివ, రుద్ర, నటరాజ, అర్ధనారీశ్వర, లింగ రూపాలు, శివ తాండవం వంటి ఉత్సాహభరిత భావాలతో కూడిన గీతాలను సృష్టించారు. భాషా, సాంస్కృతిక భక్తి పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిబింబంగా అన్ని గీతాలు తెలుగులోనే ఉండటం విశేషం. వీటిని సమయపాలన, సమన్వయంతో రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి పద్ధతులతో కార్యక్రమం సజావుగా నిర్వహించామన్నారు.

    ఈ కార్యక్రమం Impact Foundation సహకారంతో, District Governor 320H గంపా నాగేశ్వర్ రావు నాయకత్వంలో Impact International ట్రెజరర్ గంపా ఆదిత్య భారత్ సహకారం అందించారు. SUPER AI Academy కోర్ టీమ్ సభ్యులు దాసా అఖిల్, అక్షయ్ కుమార్, సుమంత్, శ్రీధర్ స్వామి, జయ శ్రీ తదితరులు పాల్గొనేవారి సమన్వయం మరియు సాంకేతిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

    ఆధ్యాత్మిక, సాంస్కృతిక సందర్భాల్లో కృత్రిమ మేధస్సును సృజనాత్మకంగా వినియోగించడం సులభమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినట్లు  సూపర్‌ ఏఐ అకాడెమీ  వ్యవస్థాపకులు  Nikeelu Gunda తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి నమోదు, సమాచారం అందించేందుకు AIMahashivaratri. com అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు.ప్రాంతీయ భాషల్లో AI అవగాహన పెంపొందించి, సృజనాత్మకత, ఉపాధి, సాంస్కృతిక పరిరక్షణకు సాంకేతికతను సాధనంగా మార్చడమే  తమ ప్రధాన ధ్యేయమని, గ్రామీణ , ప్రాంతీయ భాషా వర్గాల వరకు కృత్రిమ మేధస్సు విద్యను చేర్చాలని తమ లక్ష్యమని సూపర్ ఏఐ అకాడమీ  ప్రకటించింది. 

Sports

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఆస్ట్రేలియాకు మ‌రోసారి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం పల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

    ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ త‌న 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌల‌ర్ల‌లో హేమంత మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా, క‌మిందు మెండిస్‌, వెల్ల‌లాగే త‌లా వికెట్ సాధించారు.

    నిస్సాంక సూప‌ర్ సెంచ‌రీ..
    అనంత‌రం 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. లంక ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక‌.. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.

    నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గమ‌నార్హం. అత‌డితో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ (51), ప‌వ‌న్ ర‌త్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

    ఆసీస్ ఇంటికే!
    ఈ విజ‌యంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించింది. కానీ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైన ఆసీస్ మాత్రం త‌మ సూప‌ర్‌-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల ప‌ట్టిక‌లో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో  ఉంది. ఆసీస్ సూప‌ర్-8కు చేరాలంటే జింబాబ్వే త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల‌లో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమ‌న్‌పై ఆసీస్ భారీ విజ‌యం సాధించాలి.

  • మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్‌లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్‌ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్‌ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.

    ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.

    ఈ పోడ్కాస్ట్‌లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.

    Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.

    తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.

    సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.

    ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్‌లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.

    PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.

    తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.

    మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.

    ఈ పోడ్కాస్ట్‌లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌  చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్‌ ఆటగాళ్ల పేర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది అని తెలుస్తుంది.

    వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం​ జారీ చేసినట్లు సమాచారం. పాక్‌ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్‌లో బాబర్‌, అఫ్రిది స్థానాల్లో సల్మాన్‌ మీర్జా, నసీం షా, ఫకర్‌ జమాన్‌, ఖ్వాజా నఫాయ్‌ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.

    భారత్‌ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్‌ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్‌ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

    భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్‌, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్‌ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.

    పాక్‌ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్‌ చేస్తున్నాడని మెజార్జీ పాక్‌ క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. 

    నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయట. నఖ్వీ భారత్‌ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్‌ ఆటగాళ్లతో పాటు హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.

    కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై  61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్‌ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్‌ ఆటుఇటైతే పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్‌తో పాటు యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరుకుంటుంది. 

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాం​పియన్‌ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్‌ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్‌ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్‌ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. 

    కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్‌ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.

    టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్‌ గట్టెక్కింది. 

    నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఇంగ్లండ్‌ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ 28, బట్లర్‌ 3, బేతెల్‌ 23, బాంటన్‌ 30, బ్రూక్‌ 14, సామ్‌ కర్రన్‌ 25, ఓవర్టన్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్‌, కలుగమగే చెరో 2, స్మట్స్‌, అలీ హసన్‌, బెన్‌ మనెంటి తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్‌ మనెంటి (60), జస్టిన్‌ మోస్కా (43), గ్రాంట్‌ స్టివర్ట్‌ (45) ఇంగ్లండ్‌ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. 

    బెన్‌ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. 

    ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్‌ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌​ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్‌ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.

    దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్‌ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్‌ కర్రన్‌ స్టీవర్ట్‌ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 

    19 ఓవర్‌లో కర్రన్‌ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్‌ వికెట్‌ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్‌ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్‌లో ఓవర్టన్‌ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్‌ చేశాడు. 

    తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్ని మెప్పించింది. 

  • టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు లగ్జరీ వాచ్‌ల పట్ల ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బరోడా ఆటగాడు ప్రపంచంలో దొరికే దాదాపు అన్ని ఖరీదైన వాచ్‌లు తన కలెక్షన్‌లో కలిగి ఉన్నాడు. తాజాగా హార్దిక్‌ ధరించిన మరో లగ్జరీ వాచ్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 

    నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ Jacob & Co. Epic X Chrono 44mm Titanium వాచ్‌ ధరించి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 29 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా. 

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. వాచ్ డయల్‌పై శివుడి ప్రతిమ చెక్కబడినట్లు తెలుస్తుంది. నిన్న శివరాత్రి కావడంతో హార్దిక్‌ తన భక్తిని ఈరకంగా చాటుకున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

    హార్దిక్‌ వాచ్‌ల కలెక్షన్‌
    హార్దిక్‌ వాచ్‌ల కలెక్షన్‌ గురించి గతంలో చాలా విషయాలు విన్నాం. అతని వద్ద రూ. 100 కోట్ల విలువ గల లగ్జీర వాచ్‌ల కలెక్షన్‌ ఉంటుందని అంచనా. గతంలో హార్దిక్‌ ధరించిన అతి ఖరీదైన వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.

    - Richard Mille RM 27-04 – ధర ₹20 కోట్లు (2025 ఆసియా కప్ ట్రైనింగ్ సమయంలో ధరించాడు)  
    - Richard Mille RM 27-02 – ధర ₹7 కోట్లు (2026 ప్రారంభంలో కనిపించాడు).  
    - Richard Mille RM 56-03 Blue Sapphire – ధర ₹53–54 కోట్లు (ప్రపంచంలో ఈ వాచ్‌లు కేవలం మూడు మాత్రమే తయారు చేశారు).  
    - Rolex Daytona Rainbow – ధర ₹4–5 కోట్లు (సఫైర్లు, డైమండ్లతో అలంకరించిన వాచ్).
    - Audemars Piguet Royal Oak – ధర ₹3.25 కోట్లు (డబుల్ బ్యాలెన్స్ వీల్ ఓపెన్‌వర్క్డ్ & పర్పెచువల్ క్యాలెండర్ (18K రోజ్ గోల్డ్).  
    - Rolex Eye of the Tiger – ధర ₹2–2.5 కోట్లు (ప్రత్యేకమైన Rolex Cosmograph Daytona)

    భారత్‌-పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ హార్దిక్‌ బ్యాట్‌తో ప్రభావం​ చూపించలేకపోయినా, బంతితో సత్తా చాటాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్‌ (తొలి ఓవరే) కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో అతను ఓ క్యాచ్‌ కూడా పట్టాడు. 

    బ్యాట్‌తో రాణించకపోయినా, బంతితో మెరిసి హార్దిక్‌ భారత గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సూపర్‌-8కు అర్హత సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 

    అనంతరం భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి పాక్‌ను 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

     

     

  • న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్ ఆ జట్టు నూతన ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా నియమించబడింది. సోఫీ డివైన్ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కెర్ న్యూజిలాండ్‌ సారధిగా బాధ్యతలు చేపట్టింది.

    25 ఏళ్ల కెర్‌ 2016లో 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కుడి చేతి వాటం బ్యాటర్‌, లెగ్‌ స్పిన్నర్‌ అయిన కెర్‌.. ఇప్పటివరకు 84 వన్డేలు, 88 టీ20లు ఆడింది. వన్డేల్లో 4 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 2304 పరుగులు చేసింది. 

    ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా (232*) ఉంది. అలాగే బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 106 వికెట్లు తీసింది. టీ20ల్లో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 1453 పరుగులు చేసిన కెర్‌.. బౌలింగ్‌లో 2 నాలుగు వికెట్ల ప్రదర్శనల సాయంతో 95 వికెట్లు తీసింది.

    కెర్‌ 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకుంది. అదే ఏడాది ఐసీసీ మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కూడా గెలుచుకొని, ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ ప్లేయర్‌ అయ్యింది.  

    కెర్‌ న్యూజిలాండ్‌ ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత భావోద్వేగానికి లోనైంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నా చిన్ననాటి కల. ఇప్పుడు కెప్టెన్‌గా అవకాశం రావడం గొప్ప గౌరవమని పేర్కొంది. ఈ జట్టులో ఉన్న ప్రతిభ, కృషి, అంకితభావం నన్ను ఉత్సాహపరుస్తున్నాయి. మనం కలిసి గొప్ప విజయాలు సాధించగలమని నమ్ముతున్నాను అంటూ కెర్ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేసింది.

    కెర్‌ ఎంపికపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ బెన్ సాయర్ హర్షం వ్యక్తం చేశారు. కెర్ జట్టులో గౌరవం పొందిన నాయకురాలు. ఆమె నాయకత్వం న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ భవిష్యత్తుకు స్థిరత్వం, నిరంతరతను ఇస్తుందని అన్నారు.  

    కెర్ తన కెప్టెన్సీ కెరీర్‌ను జింబాబ్వేతో జరిగే హోమ్ సిరీస్‌తో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 25న సెడ్డన్ పార్క్‌లో జరిగే మొదటి టీ20 ఈ సిరీస్‌ మొదలవుతుంది.  

    కెర్‌ ముందున్న సవాళ్లు  
    - 2026లో ఇంగ్లండ్‌లో T20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడం.  
    - 2027లో శ్రీలంకలో ICC T20 ఛాంపియన్స్ ట్రోఫీ.  
    - 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, T20 ప్రపంచకప్.  
     

  • టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్‌ తాత అనురాగ్‌ పాండే స్వయంగా వెల్లడించారు. 

    ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్‌ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ పేరు అదితి. ఆమె ఓ మోడల్‌. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.

    ఇషాన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇషాన్‌ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. 

    ఈ ఇన్నింగ్స్‌ ప్రధాన కారణంగా భారత్‌ పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ​మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్‌ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్‌ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.

    పాక్‌పై వీరబాదడు తర్వాత ఇషాన్‌ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్‌నిస్తుంది. వాస్తవానికి ఇషాన్‌-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్‌మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. 

    ఇషాన్‌ తాత తాజా ప్రకటనతో ఇషాన్‌-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్‌ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక​ ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.

    ఎవరీ అదితి హుండియా..?
    ఇషాన్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ మోడల్‌. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్‌లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. 

    అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ జైపూర్‌లో అభ్యసించింది. జైపూర్‌లోని సెయింట్‌ జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్‌ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్‌ మిస్‌ రాజస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది. 

    ఆతర్వాత 2018 మిస్‌ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2018లో మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. 

    ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్‌గా, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్‌లోనూ నటించింది.

    ఇషాన్‌-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్‌ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్‌తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్‌ అభిమానులు గూగుల్‌ చేయడం మొదలుపెట్టారు. 

  • ఆసీస్‌ దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌కు ప్రత్యామ్నాంగా కాదు. స్మిత్‌ ఆసీస్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

    కాలి గాయంతో బాధపడుతున్న హాజిల్‌వుడ్‌ సూపర్‌-8 సమయానికంతా కోలుకుంటాడని ముందుగా భావించారు. అయితే ఇలా జరగకపోగా.. హాజిల్‌వుడ్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. హాజిల్‌వుడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడం​ వల్లనే ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించినట్లు సీఏ తెలిపింది.

    ఆసీస్‌ సెలెక్టర్లు స్పెషలిస్ట్‌ పేసర్‌ అయిన హాజిల్‌వుడ్‌ స్థానాన్ని స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అయిన స్టీవ్‌తో భర్తీ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా స్టీవ్‌ అంతర్జాతీయ టీ20 ఆడక​ ఏడాదైపోయింది. టీ20 ప్రపంచకప్‌లో అతని చివరి ప్రదర్శన 2022లో వచ్చింది. 

    స్టీవ్‌కు టీ20 ప్రపంచకప్‌తో పాటు యావత్‌ టీ20 ఫార్మాట్‌లోనే పెద్ద ట్రాక్‌ రికార్డు లేదు. అయితే స్టీవ్‌ ఎంపిక గత రికార్డులను చూసి కాకుండా, అతని తాజా బీబీఎల్‌ ప్రదర్శన ఆధారంగా జరిగింది. స్టీవ్‌ ఇటీవల ముగిసిన బీబీఎల్‌లో 59.80 సగటున, 167.97 స్ట్రయిక్‌రేట​్‌తో 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  

    ఇవన్నీ పక్కకు పెడితే, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొని సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టీవ్‌ ఎంట్రీ ఆసీస్‌కు ఏమేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. 

    మరోపక్క ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సేవలను కూడా తొలి రెండు మ్యాచ్‌లకు కోల్పోయింది. మార్ష్‌ గాయం కారణంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. తొలుత స్టీవ్‌ను మార్ష్‌కు బ్యాకప్‌గా ఎంపిక చేశారు. 

    అయితే ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం, మార్ష్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఆసీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఆసీస్‌కు చాలా కీలకం. 

    ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌ ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే తర్వాత మూడో స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ గ్రూప్‌ దశలో ఒమన్‌తో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 20న జరుగనుంది.

    అప్‌డేటెడ్‌ ఆసీస్‌ జట్టు..
    మిచెల్‌ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

     

  • టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సల్మాన్‌ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.

    తదుపరి నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్‌-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్‌ దశలో అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

    పటిష్ట స్థితిలో అమెరికా
    ఇందులో భారత్‌, పాకిస్తాన్‌ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్‌, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్‌ ఓడిపోవడంతో అమెరికా సూపర్‌-8 ఆశలు సజీవమయ్యాయి.

    ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్‌-8కు చేరాలంటే పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్‌ గెలిస్తేనే సూపర్‌-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్‌ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు ఉంది.

    పాక్‌ సూపర్‌-8 చేరాలంటే?
    మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్‌ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ను వణికించగా.. తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఇటలీ నేపాల్‌ను చిత్తు చేసింది.

    కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో పాక్‌ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్‌-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్‌ మాదిరే ఈసారి లీగ్‌ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్‌ తమ తొలి రెండు మ్యాచ్‌లలో నెదర్లాండ్స్‌, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్‌రన్‌రేటు -0.403.

    నెట్‌రన్‌రేటు పరంగా
    కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్‌ అమెరికాను దాటి సూపర్‌-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా యూఎస్‌ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్‌కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్‌, టీమిండియా మాత్రమే సూపర్‌-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.

    చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

  • ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు, ఈ జనరేషన్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యావత్‌ పొట్టి ఫార్మాట్‌లో (అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్‌ లీగ్‌లు) 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 

    2015లో కెరీర్‌ మొదలుపెట్టిన రషీద్‌ టీ20 ఫార్మాట్‌లో 517 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతని సగటు 18.5 కాగా.. ఎకానమీ 6.59గా ఉంది. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 5 వికెట్ల ఘనతలు నాలుగు సార్లు.. 4 వికెట్ల ఘనతలు 18 సార్లు నమోదు చేశాడు. రషీద్‌ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు 6-17గా ఉన్నాయి. రషీద్‌ తన జాతీయ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడాడు. 

    అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ తర్వాతి స్థానాల్లో (టాప్‌-5) విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (613), సౌతాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (572), విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (508) ఉన్నారు. 

    రషీద్‌ ఖాతాలో అత్యధిక టీ20 వికెట్ల రికార్డుతో పాటు చాలా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో రషీద్‌ నాలుగు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 432 మంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. టీ20ల్లో ఏ బౌలర్‌ ఇంతమంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేయలేదు. 

    అలాగే రషీద్‌ భారత్‌, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో 100కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరూ సాధించలేదు. రషీద్‌ ఒక్క ఆసియా ఖండంలోనే 400కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరి వల్ల కాలేదు. 2017 నుంచి 2025 వరకు రషీద్‌ ప్రతి ఏడాది కనీసం 50 వికెట్లు తీశాడు. 

    ఇది కూడా ఎవరూ సాధించలేదు. బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ ద్వారా రషీద్‌ 379 వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా కేవలం రషీద్‌కు మాత్రమే సొంతం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విలియం లిల్లీవైట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వసీం​ అక్రమ్‌, టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఖాన్‌ 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్లు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షోయబ్‌ ఖాన్‌ (68) అర్ద సెంచరీతో రాణించగా.. అలీషాన్‌ షరాఫు (40) పర్వాలేదనిపించాడు. 

    ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 4 వికెట్లతో చెలరేగాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ వికెటే రషీద్‌కు టీ20ల్లో 700వ వికెట్‌.

    అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్‌ (53) ఆఫ్ఘన్‌ గెలుపుకు పునాది వేయగా.. ఒమర్‌జాయ్‌ (40 నాటౌట్‌) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

  • టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్‌ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.

    స్పిన్‌ దళంపైనే నమ్మకం
    టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌.. తమ స్పిన్‌ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.

    ఇక బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు సల్మాన్‌ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్‌ ఖాన్‌ ఒక ఓవర్‌ వేసి 17 రన్స్‌, మొహమ్మద్‌ నవాజ్‌ 4 ఓవర్లలో 28 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

    షాహిన్‌ ఆఫ్రిది విఫలం
    ఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్‌ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్‌ ఇలా స్పిన్‌ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్‌ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్‌.

    తద్వారా పొట్టి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్‌ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్‌ నిలిచింది. కాగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.

    టీమిండియా ఇలా
    ఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

    ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టగా.. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు తిలక్‌ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీయగా.. రింకూ సింగ్‌ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.

    ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ యూఎస్‌ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్‌ బౌలింగ్‌ వేయించడం గమనార్హం.

    చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Family

  • మద్యం తాగడం వల్ల  క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని వివరిస్తూ హెచ్చరించడం ఓ రకమైతే, అందుకు భిన్నంగా ఓ చిట్కా ద్వారా కూడా మద్యపాన పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన  ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. ది అడిక్టివ్‌ బిహేవియర్స్‌ వేదికగా ఈ ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది.

    దాదాపు  8,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొనగా వారిని వేర్వేరు గ్రూపులుగా విభజించి, మద్యపానం గురించిన  వివిధ ప్రకటనలను,  సందేశాలను చూపించారు. అలాగే  ‘మద్యపానం అనేది క్యాన్సర్‌ వ్యాధికి  కారణమవుతుందనే అవగాహన కలిగించడంతో పాటు  మద్యం వల్ల కలిగే పలు నష్టాలను  విశదీకరించారు.  మద్యం అతిగా సేవించడం వల్ల క్యాన్సర్‌ మాత్రమే కాదు.  గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చిత్తవైకల్యం (డిమెన్షియా) లతో పాటు అకాల మరణ ప్రమాదం కూడా పొంచి ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7 శాతం అకాల మరణాలకు ఆల్కహాల్‌ వినియోగం కారణంగా తేలింది.

    ‘‘ఇలాంటి అంశాలతో పాటు మద్యం క్యాన్సర్‌ కారకమని చాలా మందికి తెలియదు. మద్యపాన ప్రియులకు తెలియజేయవలసిన ముఖ్యమైన సమాచారం ఇది‘ అని ఆస్ట్రేలియాలోని ది జార్జ్‌ ఇన్సి్టట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ కు చెందిన ఆర్థికవేత్త  వినియోగదారు మనస్తత్వవేత్త సైమోన్‌ పెటిగ్రూ అన్నారు. అయితే ఇలాంటి అవగాహన కలిగించడం అనేది  పరిష్కారంలో ఒక భాగం మాత్రమే, ఈ వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య సంబంధ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి మనం వారికి ఇతర ఆలోచనలను కూడా ఇవ్వాలి‘ అని ఈ పరిశోధన సందర్భంగా పెటిగ్రూ అభిప్రాయపడ్డారు.   దీనికి అనుగుణంగానే సీరియస్‌ ప్రమాదాలతో పాటు మరికొన్ని తేలికపాటి మార్గాలను కూడా సూచించారు. 

    అలాంటి వాటిలో ఒక చిట్కా బాగా ప్రభావం చూపిందని వారు గుర్తించారు.  ‘తీసుకుంటున్న ఆల్కహాల్‌ గురించిన సమాచారాన్ని నిర్ధిష్ట ఆచరణాత్మక చర్యతో పాటుగా వారు తీసుకుంటున్న  పానీయాల విశేషాలు, అలాగే వాటి సంఖ్యను లెక్కించడం  వల్ల  వారు తీసుకునే మద్యం పరిమాణం తగ్గుతుందని మేం కనుగొన్నాం‘ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏతావాతా వీరు చెబుతోంది ఏమిటంటే... లెక్కా గిక్కా ఏం లేకుండా పెగ్గుల కొద్దీ విస్కీలు, బ్రాందీలు, సీలాలకు సీసాలు బీర్లు తాగేసేవారికి... వారు తాగుతున్న మద్యం పరిమాణాన్ని లెక్కించి తెలియజెప్పడం అనేది మద్య పాన తీవ్రతను తగ్గిస్తుంది అని.

  • జీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. ఇటలీలోని లేక్‌ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్‌ డ్రీమ్‌కు ప్రతిబింబంలా  కనిపిస్తా

    విదేశీ వివాహ వేదికలు 

    శాంటోరిని,  గ్రీస్‌: శాంటోరిని ద్వీపం తెల్లని గృహాలు, నీలి ఆకాశానికి ప్రసిద్ధి. సూర్యాస్తమ సమయంలో జరిగే వివాహం జీవితాంతం గుర్తుండే అనుభూతిగా మిగులుతుంది.

    సువాసనల మధ్య వివాహం : ఫ్రాన్స్‌ దేశంలోని లావెండర్‌ పూల తోటల మధ్య జరిగే వివాహం ఒక స్వప్నంలా అనిపిస్తుంది. 

    బీచ్‌లో కళ్యాణం: ఇండోనేషియా దేశంలోని బాలి ద్వీపం సముద్రతీరప్రాంతం ప్రకృతి వైభవానికి ప్రసిద్ధి. అలల శబ్దం, పచ్చని చెట్లు, సంప్రదాయ అలంకరణలు అన్నీ కలిసి ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇలా ప్రతి ప్రదేశం తన ప్రకృతి, చరిత్ర, సంస్కతితో వివాహాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్నిప్రారంభించడం ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. 

    దక్షిణ భారత వివాహ వేడుకలు
    ఈ మధ్య ట్రెండ్‌గా మారిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లేదా ప్లాన్డ్‌ వెడ్డింగ్‌ ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పెళ్లి చేసుకోవడం కొత్త విషయం కాదు. దక్షిణ భారతంలో ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది.

    గోపురం మధ్యలో మంగళ ధ్వని
    తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగే వివాహం ఒక దివ్యానుభూతి. ఈ ఆలయం దక్షిణ భారత సంస్కృతికి ప్రతీక. సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే ఆ వాతావరణం దివ్యానుభూతికి లోను చేస్తుంది. ఇక్కడ ఆలయ నిబంధనల ప్రకారం మాత్రమే వివాహాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించాలి.

    దేవుని సొంత నేలలో: కేరళలోని కుమారాకోమ్‌లోని జలసరి నడుమ ప్రకృతి సాక్షిగా వివాహం జరుగుతుంది. ఈ ప్రాంతం కొబ్బరి చెట్లు, నీటి ప్రతిబింబాలు, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.దక్షిణ భారత వివాహ వేదికలుజీవితంలో వివాహం ఒక కీలక మలుపు. ఈ మలుపును ప్రత్యేకంగా నిలిపే ప్రయత్నమే ప్రత్యేక ప్రదేశాల్లో వివాహం లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. ఇటలీలోని లేక్‌ కోమో తీరం అందమైన వేదికగా నిలుస్తుంది. నీటిలో ప్రతిబింబించే దీపాల కాంతులు, వెనుక నిలిచే పర్వతాలు ఇవన్నీ వెడ్డింగ్‌ డ్రీమ్‌కు ప్రతిబింబంలా కనిపిస్తాయి.

    కోట వైభవం సాక్షిగా: హైదరాబాద్‌లోని చౌమహల్లా  ప్యాలెస్‌లో రాజసంగా వివాహం నిర్వహించవచ్చు. హైదరాబాద్‌లోని ఈ రాజమహల్‌ నిజాం కాలపు వైభవాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడి వేడుకలకు ముందస్తు అనుమతులు అవసరం. 

    ఇదీ చదవండి: వెడ్డింగ్‌ సీజన్‌ : కోటలో రాజసంగా వివాహం

    ఊటి  అసలు పేరు తెలుసా?! 
    మనమందరం సాదాసీదాగా ఊటి అని పిలిచే ఈ హిల్‌ స్టేషన్‌ అసలు పేరు ఉదగమండలం. ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. ఉదగమండలం అనే పేరు తోడా అనే తెగల భాష నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. ఒతకల్‌ మండు లేదా ఉదగై మండలం అనే పదానికి అర్థం పర్వతాల మధ్యలో ఉన్న గ్రామం. నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే తోడా తెగల వారికి ఇది పవిత్ర స్థలం. విదేశీ పాలనకు ముందు ఈ ప్రాంతంలో తోడా తెగలే నివసించేవారు. తర్వాత వారి ఉచ్చారణకు అనుగుణంగా పేరును మార్చుతూ చివరకు ఊటి అని ప్రాచుర్యం పొందింది. అయినప్పటికీ స్థానికులు ఇప్పటికీ ఉదగమండలం అనే పేరును గౌరవంగా ఉపయోగిస్తారు. తెలిమంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని తేయాకు తోటలు, ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి ఉదగమండలం అనే పేరు ఎంతో తగినదిగా అనిపిస్తుంది. 

  • స అష్ట అంగ నమస్కారం... దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. అంటే మన శరీరంలోని అన్ని అంగాలూ నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే నమస్కారం అన్నమాట.. బాగా గౌరవించే వాళ్ల దగ్గర కాస్త ముందుకు వంగి నమస్కారం చేస్తాం. మరి సృష్టికి మూలమైన భగవంతుడికి నమస్కారం చేయాలంటే... ఎంత వంగినా ఇంకా వంగవచ్చునా అనిపిస్తుంది. అందుకే ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనిపించే స్థితిలో నేలకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం.

    భగవంతుడికి పూర్తిస్థాయిలో మోకరిల్లడం ఇందులోని పరమార్థం. అయితే సాష్టాంగనమస్కారం (Sashtanga Namaskaram) పురుషులకు మాత్రమే. స్త్రీలకు వర్తించదు. మనిషి జననానికీ, జీవనానికీ కారణమైన పొట్ట, వక్షభాగాన్ని నేలకు తగిలించకూడదనీ, అందుకే వాళ్లు మోకాళ్ల మీద ముందుకు వంగి నమస్కారం చేస్తే సరిపోతుందనీ శాస్త్రం చెబుతోంది.

    చ‌ద‌వండి: మంత్రపుష్పం పరమార్థం ఏమిటి?

  • ఆరావళి నీడలో వివాహ వైభవంసరస్సుల నగరంలో కళ్యాణ వైభోగంవసంత కాలాన రాజస్థాన్‌లో వివాహాల సందడి నెలకొంటుంది. అక్కడి అందమైన సరస్సుల నడుమ ఉన్న రాజమందిరాలు కమణీయమైన  కళ్యాణ మహోత్సవాలకు ప్రత్యేక వేదికలుగా మారుతాయి.రాజస్థాన్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ అంటే ఒక రాజస అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కూడా. ఇక్కడి ఆరావలి పర్వత సిరుల మధ్య, సూర్యకాంతిని ప్రతిబింబించే జలసిరి సాక్షిగా జరిగే వివాహ వేడుక ఒక కళాత్మక సన్నివేశంలా అనిపిస్తుంది. ఈ భూమిలో పెళ్లి అంటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతి, అంతకు మించి జీవితాంతం నిలిచే మధురస్మృతి.

    సరస్సుల మధ్య  వివాహ వైభవం
    వెడ్డింగ్‌ సీజన్‌లో ఉదయ్‌పూర్‌ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సరస్సుల అందంతో ‘సిటీ ఆఫ్‌ లేక్స్‌’ గా పేరు  పొందిన ఈ నగరం సూర్యాస్తమయం వేళ వర్ణరంజిత దృశ్యంగా మారిపోతుంది. ఉదయ్‌పూర్‌ సిటీ ప్యాలెస్‌ ప్రాంగణంలో జరిగే అలంకరణ, బాల్కనీ నుంచి సరస్సును చూస్తూ గడిపే క్షణాలు వధూవరులకే కాదు అతిథులకు కూడా చిరస్మరణీయంగా నిలుస్తాయి. అందుకే పలువురు ప్రముఖులు ఇక్కడే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు.లేక్‌ పిచోలా మీద వెలిగే దీపాలు నీటిపై ప్రతిబింబించి కొత్త కాంతిని విరజిమ్ముతాయి. ద్వీపం మధ్యలో ఉన్న జగ్‌ మందిర్‌ సాయంత్రం వేళ  స్వర్ణకాంతితో ప్రకాశిస్తుంది. ఫతే సాగర్‌ సరస్సు తీరంలో ప్రభాత వేళ హల్దీ, మెహందీ వేడుకలు మరింత అందంగా కనిపిస్తాయి. పుష్పాల మధ్య నిలిచిన సహేలియోకి బరి ఉద్యానవనం ప్రీ–వెడ్డింగ్‌ వేడుకలకు సజావుగా సరిపోతుంది.

    రాజస వేదికల  ప్రారంభం: రాజస్థాన్‌లో శరదృతువులో ప్రారంభమయ్యే వివాహాల సందడివసంతకాలానికి చేరుకునే సరికి మరింత ఉత్సాహంగా మారుతుంది. పగలు సూర్యకాంతి, రాత్రి దీపాల వెలుగులతో కోటలు మరింత మాయాజాలంలా కనిపిస్తాయి. ఇక్కడి కోటల్లో వైభవంగా కళ్యాణం చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు.  

    పాలరాతి ప్రాంగణాల్లో రంగోలీలు చిత్రకథల్లా విరాజిల్లుతాయి. బ్యాండ్, బాజా, బారాత్‌ సందడితో సాయంత్రపు గాలి కూడా ఉత్సవ వాతావరణాన్ని అలుముకుంటుంది. ఈ రాజస భూమిలో వివాహ వేడుక ప్రకృతి మధ్యలో సాగే ఒక అనుభూతి. పర్వతాల నీడలో, సరస్సుల ప్రతిబింబంలో, ఎత్తైన కోటల మధ్య జరిగే కళ్యాణం ప్రతి క్షణం ఒక గీతంలా నిలుస్తుంది.

    సాంస్కృతిక వేదిక
    రాజస్థానీ పెళ్లి అంటే రంగుల పండుగ. బంధనీ వస్త్రాలు, పగిడీ అలంకారం, జానపద నృత్యాలు ఇవన్నీ కలిసి వివాహాన్ని మరింత ఉత్సవంగా మార్చేస్తాయి. మండపం మధ్య అగ్ని సాక్షిగా జరిగే వివాహానికి పర్వతాలు,  సరస్సులు, కోట శిఖరాలు నిశ్శబ్ద సాక్షులుగా నిలుస్తాయి. స్థానిక కళాకారుల సంగీతం, ఢోలు శబ్దం, షెహ్నాయి స్వరాలు వేడుకకు భావోద్వేగాన్ని జోడిస్తాయి. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక అని చాటుతాయి.

    ఉదయ్‌పూర్‌ రుచులు
    రాజస్థాన్‌ భోజనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. దాల్‌ బాటీ చూర్మా, గట్టే కి సబ్జీ, వివిధ రకాల మిఠాయిలు, కచోరీలు, జిలేబీలు ఇవన్నీ వివాహ విందును మరింత రుచికరంగా మారుస్తాయి. పర్యాటనకు సరైన సమయం శరదృతువు నుంచి వసంతకాలం వరకు ఉదయ్‌పూర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నవంబర్‌ నుంచి మార్చి మధ్య కాలంలో రాజస్థాన్‌ మరింత సుందరంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వివాహాల ఉత్సాహం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. రాజస్థాన్‌లో వివాహ సీజన్‌ అంటే రాజస శోభ, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక సంగీతం  కలిసిన ఒక సుగంధ అనుభూతి. ఫోటోల్లో కనిపించే దృశ్యాల కంటే గుండెల్లో నిలిచే జ్ఞాపకాలే ఎక్కువ. అందుకే అనేక మంది ఇక్కడ వివాహం చేసుకోవాలని కలలు కంటారు.

    ఎలా వెళ్లాలి? : తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌కు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాయుమార్గం ద్వారా మహారాణా ప్రతాప్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి ఉదయ్‌పూర్‌కు ప్రయాణించవచ్చు.  నగరంలోకి ప్రవేశించే సమయంలో పర్వతాల నీడలు, సరస్సుల అందాలు స్వాగతం పలుకుతాయి.

    ఏం చూడాలి?
    ఉదయ్‌పూర్‌లో సిటీ ప్యాలెస్, లేక్‌ పిచోలా, జగ్‌ మందిర్, ఫతే సాగర్‌ సరస్సు,  సహేలియోకి బరి వంటి ప్రదేశాలు వివాహ సందర్బంలో మరింత అందంగా కనిపిస్తాయి. సరస్సుల తీరాలు, కోటల శిల్పకళ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తాయి.

     – ఎం.జి. కిశోర్,ప్రయాణికుడు  

     

Business

  • ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్‌ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్‌ ఫండ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ ఒకటి.

    రాబడులు
    ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్‌ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

    పెట్టుబడుల విధానం
    ఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్‌క్యాప్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.

    ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్‌ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్‌ (ఫ్యూచర్, ఆప్షన్‌ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్‌ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. రియల్‌ ఎస్టెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.

    పోర్ట్‌ఫోలియో
    ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్‌ చేయగా, రియల్‌ ఎస్టేట్‌ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్‌ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్‌ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.

    ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్‌ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.

  • ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.

    జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

    ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు.

  • పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.

    బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

    బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.

    2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

    ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!

    ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్‌బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.

    బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు.

  • ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియన్ మార్కెట్లో ఎక్స్3 30 xDrive ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. రూ. 74.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 & వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

    BMW X3 30 xDrive M స్పోర్ట్ ప్రో కారు.. బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, ఆల్పైన్ వైట్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ & బ్లాక్ సఫైర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది 258 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అప్షన్ ఇందులో ఉంటుంది.

    ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ముందు భాగంలో బ్లాక్ కిడ్నీ గ్రిల్, కార్నరింగ్ లైట్లు, షాడోలైన్ డిటెయిలింగ్‌తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌, రెడ్ కలర్ స్పోర్ట్స్ బ్రేక్స్ పొందుతుంది. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ షేప్ ఎల్ఈడీ ల్యాంప్‌లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & రూఫ్ స్పాయిలర్ ఉండటం చూడవచ్చు.

    ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్,  14.9-అంగుళాల కంట్రోల్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి కాకుండా.. పనోరమిక్ సన్‌రూఫ్, రియర్ సన్‌బ్లైండ్‌లు, హర్మాన్ కార్డాన్ ఆడియో & ట్రావెల్ & కంఫర్ట్ సిస్టమ్ ద్వారా సీమ్‌లెస్ కనెక్టివిటీ, ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

  • ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్‌ కొత్తగా ఎన్హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్స్‌ని ఆవిష్కరించింది.  ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ ఫండ్, ఎన్‌హాన్స్‌డ్‌ వేల్యూ ఇండెక్స్‌ పెన్షన్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్‌ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్‌ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్‌ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్‌ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది.  

    ఓల్డ్‌ బ్రిడ్జ్‌ ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్‌ 
    లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఈ ఫండ్‌ని ఓల్డ్‌ బ్రిడ్జ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్‌–అప్‌ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్‌. కనీసం రూ. 5,000 నుంచి, సిప్‌ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కేవలం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది.

  • ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.

    ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.

    ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.

    ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్
    ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

  • ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్‌ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్‌ అగర్వాల్‌ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్‌లోనే తనను నేరుగా  సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

    బెంగళూరుకు చెందిన గౌరవ్‌ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.

    తాజా అప్డేట్‌లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్‌మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్‌ అగర్వాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

    ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, మెటా ఛీఫ్‌ ఏఐ ఆఫీసర్‌ అలెగ్జాండర్‌ వాంగ్‌, టీసీఎస్‌ సీఈవో కృతివాసన్‌ తదితరులు ఉన్నారు.

  • సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.

    భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్‌టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

    2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.

    మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

    రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో  దోహదపడతాయి.

    భారతదేశంలో నేటి బంగారం ధరలు
    ఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్‌వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్‌ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.

    మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయం

    గత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్‌వేర్ బడ్జెట్‌ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    వేగమే అసలు సవాలు

    ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.

    అపరిమిత అవకాశాలు

    భారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్‌కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.

    ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్‌ పంపిణీ ప్రారంభం

  • జాబ్‌ ఇంటర్వ్యూలలో అభ్యర్థులను అంచనా వేయడానికి ఇంటర్వ్యూయర్లు ఎన్నో సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వారు అడిగే ప్రశ్నలు అక్కడికక్కడే సమాధానం ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాన్ని ఇటీవల ఒక మహిళ ఎదుర్కొని, దానిని ఉద్యోగ అవకాశంగా మార్చుకుంది.

    అనుకోని ప్రశ్న
    కాత్యాయని శుక్లా (Katyayani Shukla) అనే ఉద్యోగ అభ్యర్థిని తన అనుభవాన్ని ‘ఎక్స్‌’(గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. ఆమె ఇటీవల హాజరైన ఉద్యోగ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో ఒక అసాధారణమైన ప్రశ్న అడిగారు.. “మిమ్మల్ని నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం చెప్పండి” అని. ఆ ప్రశ్నకు తక్షణం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోయిన శుక్లా, ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి, తరువాత ఈమెయిల్ ద్వారా సమాధానం పంపుతానని తెలియజేశారు.

    “ఆ ప్రశ్నకు నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పాను” అని ఆమె వివరించారు. కొన్ని గంటల తరువాత సీఈవో ఫాలో-అప్ మెసేజ్ పంపి ఆమె సమాధానాన్ని కోరారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, శుక్లా తన సమాధానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. అదే ఆమెకు ఉద్యోగ ఆఫర్‌గా మారింది.

    కాత్యాయని ఇచ్చిన సమాధానం ఇదే.. 
    సీఈవో అడిగిన గమ్మత్తైన ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పిందో తన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా కాత్యాయని శుక్లా పంచుకున్నారు. తన సమాధానాన్ని క్షమాపణతో ప్రారంభించిన ఆమె.. “నన్ను నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం ఏమిటంటే.. నా జీవితం సవ్యంగా అంటే నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యంగా, వ్యవస్థీకృతంగా ఉంచుకుంటాను” అని రాసుకొచ్చారు.

    తాను రోజూ (వీక్‌ డేస్‌లో) 9 గంటల నుండి 5 వరకు మాత్రమే పని చేస్తానని, పని-వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉంచుతానని చెప్పారు. ‘ప్రతిదీ అర్జెంట్‌ అని చెబుతుంటారు కానీ నిజానికి ఏదీ అర్జెంట్‌ కాదు’ అని తాను నమ్ముతుంటానన్నారు.

    తన సమయం, ఇతరుల సమయం పట్ల గౌరవం చూపడం తనకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కొంతమంది దీనిని ఒక సానుకూల లక్షణంగా చూస్తారని, మరికొందరు వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందని ఆమె అంగీకరించారు.

Politics

  • హైదరాబాద్‌: హంగ్‌ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్‌ దక్కించుకున్న 17 మున్సిపాలిటీలకు గాను 8 హంగ్‌ మున్సిపాలిటీలపై సీనియర్‌ నేతలను అక్కడ ఇంచార్జ్‌లుగా నియమించింది.  దీనిలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కాంగ్రెస్‌ గూండాగిరీ అంటూ ధ్వజమెత్తారు. 

    కాంగ్రెస్‌ అరాచకాలను అడ్డుకుని ఎన్నికైన వారిని సాఫీగా సాగేలా చూసుకోవడమే లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా స్థానిక పార్టీ నేతలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాల పైన పార్టీ మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు. 

    కిడ్నాప్‌ల, దాడులు, అక్రమ ఓట్లతో పదవుల కొల్లగొట్టే కుట్ర చేశారన్నారు. దిగజారిన శాంతిభద్రతలకు నేడు జరిగిన పరిణామాలే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ తొత్తులగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

  • ఉండి(పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు భగ్గుమంది.  ఉండి ఎమ్మెల్యే  రఘరాం కృష్ణరాజుపై తిరుగుబాటు జెండా ఎగురేశారు టీడీపీ నేతలు. ఈ మేరకు ఉండి మండలం వెలివర్రు గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. వెంకటేశ్వరరాజు ఏమన్నారంటే..

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై గౌరవంతో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమించారు. ఉండి నియోజకవర్గంలో  ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్  రఘు రామకృష్ణరాజు అరాచకపాలన నడుస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.నియోజవర్గంలో నిలువు దోపిడీ అవుతుంది. రఘురామ కృష్ణరాజు ఆటలు సాగవు,  తిరుగుబాటు చేస్తాం. నిరుపేదల ఇల్లు, చర్చిలు కూల్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?, కుప్పం, ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • హైదరాబాద్: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు బైంసా, నారాయణపేట్‌లలో బీజేపీ జెండా ఎగురువేయడంపై  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. బైంసాలో తమ కార్యకర్తలను వేధించి,  వందలు కేసులు పెట్టి జైలుకు పంపారని, అయినా ఇక్కడ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. దీనిలో భాగంగా బైంసా ప్రజలకు రాంచందర్‌రావు ధన్యవాదాలు తెలియజేశారు. 

    ‘ మా ఓటు శాతం భారీగా పెరిగింది. 25 మునిసిపాలిటీలలో డిసైడింగ్ పార్టీ గా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్‌గా గెలుస్తున్నాం. చాలా మున్సిపాలిటీల్లో సింగిల్ లార్టెస్ట్ పార్టీగా ఉన్నాం. ప్రతి చోటా మా ప్రాతినిధ్యం పెరిగింది మా పార్టీ బేస్ పెరిగింది. బీఆర్ఎస్‌ 43 నుంచి 27కు పడిపోయింది. 14 శాతం తగ్గింది. 550 వార్డులు నష్టపోయింది బీఆర్ఎస్. 70 గెలిచినా 2003తో పోలిస్తే కాంగ్రెస్‌కు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. రూలింగ్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణ హిస్టరీలో మొదటి సారి మునిసిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకుంది. తెలంగాణ ప్రజలకు, బండి సంజయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్న. ఎలాంటి పొత్తు లేకుండా మా సొంతంగా కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలిచాం. నిజామాబాద్‌లో మాది సింగిల్ లార్జెస్ట్ పార్టీ

    అరవింద్, రాకేష్, ధన్పాల్ సూర్యనారాయణ కష్టపడి పని చేశారు. మజ్లిస్ పార్టీ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి. బీజేపీ ఎక్కడ వస్తుందో అక్కడ ఈ రెండు పార్టీలు ఎంఐఎం తో కలిసి మేయర్, చైర్మన్ రాకుండా చేశాయి. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న దానికి ఏం పేరు ఇవ్వాలి. ప్రజలే వీరి మధ్య సంబంధం ఏంటో చూడాలి. కమ్యునిస్టు పార్టీలు కనుమరుగు అవుతున్నాయి.  వాటికి రేవంత్ రెడ్డి ప్రాణం పోసేలా చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఆలోచన చేయాలి. ఏప్రిల్‌లో ఎస్ఐఆర్ రాబోతుంది. అధికారులు అప్రమత్తంగా దొంగ ఓట్లు తొలగించాలి. ఓటర్లకు తెలియకుండానే వారి ఇళ్లలో ఓట్లను చేరుస్తున్నారు. బీజేపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విప్ జారీ చేశాం’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

  • గుంటూరు: ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. గత కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుకు ఇందుకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు.  ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) అంబటి కుటుంబాన్ని పరామర్శించారు కారుమూరి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

    ‘అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి ఆటవికం, అరాచకం. లడ్డుపై  కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని అంబటి ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలని అంబటి పూజలు చేశారు. అంబటి కారుపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనాదేవి మహిళ మాట్లాడకూడని మాటలు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.పక్కా పథకం ప్రకారం కర్రలు,రాడ్లతో దాడిచేశారు.

    లడ్డుపై విషప్రచారం చేసింది మీరే... దాడులు చేసేది మీరే. చేసినవన్నీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ ఇంటిపై ప్రణాళికాబద్దంగా దాడి చేశారు.. మీ పరిపాలన ఎలా ఉందో ఒకసారి సరిచూసుకోండి. ఇది రాచరిక రాజ్యం కాదు. ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తాం. జగన్ హయాంలో అప్పులపై మీరు అబద్దాలు చెప్పలేదా?, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చెయ్యలేదా?, మంచి పరిపాలన అందించాలే తప్ప ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూస్తే కుదరదు. దివిసీమ ఉప్పెన తరహాలో ప్రజల ఉప్పెనలో మీరు కొట్టుకుపోతారు. 

    రాంబాబు పరిధి దాటి మాట్లాడరు. రాంబాబు అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడలేదు. లడ్డుప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడలేదా?, రైతులు,విద్యార్థులు, ఆరోగ్య శ్రీ, పేదలకు మూడు సెంట్ల స్థలాలు‌ ఇవ్వడం గురించి ఆలోచించండి. మీరే మీ ఎమ్మెల్యేలు అరాచకాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. బిల్ గేట్స్ ను తీసుకొచ్చి షో చెయ్యాలని చూస్తున్నారు. అంబటి రాంబాబును పోలీస్ స్టేషన్‌లో శారీరకంగా హింసించారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి... దాడికి గురైనవారిని జైలులో పెట్టారు. ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. ఇలాగే చేస్తే అన్ని కులాలు ఏకమవుతాయి’ అని హెచ్చరించారు.

    కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

National

  • జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1 ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి 21, 22, 23, 24, 28 తేదీల్లో జ‌రిగిన బీఈ, బీటెక్ పేప‌ర్ 1 ఫలితాల‌ను ఎన్టీఏ వెల్ల‌డించింది. 13,04,653 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌గా 96.26 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్టు ఎన్టీఏ తెలిపింది. 326 న‌గ‌రాల్లోని 658 సెంట‌ర్లలో జేఈఈ మెయిన్ -2026 సెష‌న్ 1 ప‌రీక్ష నిర్వ‌హించారు. ఇందులో ఇండియా వెలుప‌ల నిర్వ‌హించిన 15 సెంట‌ర్లు కూడా ఉన్నాయి. 

    కాగా ఈసారి పేప‌ర్ 1లో 12 మంది 100 ప‌ర్సంటైల్ సాధించారు. బాలిక‌లు ఎవ‌రూ 100 ప‌ర్సంటైల్ సాధించ‌లేక‌పోయారు. గ‌తేడాది రెండు సెష‌న్ల‌లో క‌లిసి మొత్తం 24 మంది 100 ప‌ర్సంటైల్  సాధించారు. వీరిలో ఇద్ద‌రు అమ్మాయిలు ఉన్నారు. 


    జ‌న‌ర‌ల్‌- ఈడ‌బ్ల్యూఎస్‌
    శ్రేష్ట్ జ‌సోరియా (రాజ‌స్థాన్‌)

    బాలికల విభాగం
    ఆషి గ్రేవాల్ (హ‌రియాణా)

    పీడ‌బ్ల్యూబీడీ
    హ‌ర్ష్ జైన్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)

    ఎస్టీ విభాగం
    ద‌క్ష్ షెహ్రా (రాజ‌స్థాన్‌)

    ఎస్సీ విభాగం
    దేవ శ్రీవేద్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

    ఓబీసీ- ఎన్‌సీఎల్‌
    న‌రేంద్ర‌బాబుగారి మ‌హిత్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

    100 ప‌ర్సంటైల్ సాధించిన విద్యార్థులు వీరే
    1. శ్రేయస్‌ మిశ్రా (ఢిల్లీ)
    2. నరేంద్రబాబు గారి మోహిత్ (ఆంధ్రప్రదేశ్‌)
    3. శుభమ్‌ కుమార్ (బిహార్‌)
    4. కబీర్‌ చిల్లర్ (రాజస్థాన్‌)
    5. చిరాన్‌జిబ్‌ కార్ (రాజస్థాన్‌)
    6. భవేశ్‌ పత్రా (ఒడిశా)
    7. అనయ్‌ జైన్ (హరియాణా)
    8. అర్నవ్‌ గౌతమ్ (రాజస్థాన్‌)
    9. పసల మోహిత్ (ఆంధ్రప్రదేశ్‌)
    10. మాధవ్‌ విరాదియా (మహారాష్ట్ర)
    11. పురోహిత్‌ నిమయ్ (గుజరాత్‌)
    12. వివన్‌ శరద్‌ మహీశ్వరి (తెలంగాణ)

  • న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) సాయంత్రం విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. తాజా జేఈఈ ఫలితాల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్‌ సాధించారు. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, ఒక తెలంగాణ విద్యార్థి ఉన్నారు. శరత్‌ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్‌ అనే తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్‌ సాధించిన జాబితాలో  ఉన్నారు. 

    ఓపెన్‌ కేటగిరిలో  పసల మోహిత్‌ అనే విద్యార్థి 100 పర్సెంటైల్‌ సాధించగా, ఓబీసీ కేటగిరిలో టాపర్‌గా నరేంద్ర బాబు నిలిచారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్షను 13.04 లక్షల మంది  విద్యార్థులు రాశారు.  

    కాగా, దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్‌ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్‌కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరు కాగా, రెండు సెషన్లలోనూ భారీగా పోటీ పెరిగింది. 

    జేఈఈ మెయిన్స్‌ 2026 ఫలితాల్లో 100 పర్సెంటైల్‌ సాధించిన వారు వీరే

    • శ్రేయస్‌ మిశ్రా-ఢిల్లీ

    • నరేంద్ర బాబు- ఆంధ్రప్రదేశ్‌

    • శుభమ్‌ కుమార్‌-బిహార్‌

    • కబీర్‌ చిల్లర్‌-రాజస్తాన్‌

    • చిరాన్‌జిబ్‌ కార్‌-రాజస్తాన్‌

    • భవేశ్‌ పత్రా-ఒడిశా

    • అనయ్‌ జైన్‌-హర్యానా

    • అర్నవ్‌ గౌతమ్‌-రాజస్తాన్‌

    • పసల మోహిత్‌-ఆంధ్రప్రదేశ్‌

    • మాధవ్‌ విరాదియా-మహరాష్ట్ర

    • పురోహిత్‌ నిమయ్‌-గుజరాత్‌

    • వివన్‌ శరద్‌ మహీశ్వరి-తెలంగాణ

  • సాక్షి, న్యూఢిల్లీ: సహజీవన ఘటనలపై సర్వోన్నతన్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులే. బంధం ఎంత గాఢమైనదైనా సరే పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవడందాకా ఎందుకు వెళ్తున్నారో మాకైతే అర్థంకావట్లేదు. మేము పాతకాలం మనుషులమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆచితూచి అడుగులేయాలి’’అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఓ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

    అసలేం జరిగిందంటే? 
    నిందితుడు 2022లో ఓ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా 30 ఏళ్ల మహిళకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే నిందితుడికి అప్పటికే వివాహమైంది. ఆ విషయాన్ని దాచిపెట్టి, సదరు మహిళతో ఢిల్లీలో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను తనతో పాటు దుబాయ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా సాన్నిహిత్య వీడియోలను రికార్డ్‌ చేశాడు. 

    పెళ్లి గురించి అడిగితే ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా బాధితురాలిని కాదని 2024 జనవరి 19వ తేదీన నిందితుడు పంజాబ్‌లో మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం నిందితుడు ప్రయతి్నంచగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అతను బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

    మీకెందుకు అంత చనువు? 
    సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ’పెళ్లికి ముందు ఎంత చనువున్నా సరే, వారు అపరిచితుల కిందే లెక్క. ఒకవేళ ఆ మహిళకు పెళ్లి, సాంప్రదాయంపై అంత పట్టింపు ఉంటే, పెళ్లి కాకుండానే అతనితో దుబాయ్‌ ఎందుకు వెళ్లింది?’అని ప్రశ్నించారు. ‘నేటి కాలంలో ఇలాంటి కేసులు చూస్తుంటే మాకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. యువత జాగ్రత్తగా ఉండాలి’అని హితవు పలికారు. మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా అని ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా ‘పెళ్లి చేసుకోవాలనుకోవడం వేరు.

     పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోవడం వేరు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఇద్దరి అంగీకారంతో కొనసాగిన శారీరక బంధంలా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ‘పరస్పర సమ్మతితో కొనసాగిన ఇలాంటి కేసుల్లో విచారణలు జరిపి, దోషులుగా తేల్చి జైలుకు పంపడంలో హేతుబద్ధత లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే బాధితురాలికి నిందితుడు తగు నష్టపరిహారం ఇవ్వాలి’అని జస్టిస్‌ నాగరత్న సూచించారు. ఇద్దరూ మాట్లాడుకుని వివాదపరిష్కారానికి అవకాశాన్ని పరిశీలించాలని కేసును బుధవారానికి వాయిదా వేశారు.

    చ‌ద‌వండి: కొలీగ్‌పై ఫీలింగ్స్ వ‌స్తున్నాయి.. ఏం చేయ‌ను?

  • ఐఏఎస్‌ ఆఫీసర్‌.. మరో ఐఏఎస్‌ను పెళ్లాడటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఐఏఎస్‌ అధికారి హోదాలో ఉన్న వ్యక్తికి..  మూడో పెళ్లి చేసుకున్న క్రమంలో కూడా ఐఏఎస్‌ అధికారిణే భార్యగా వస్తే అది అరుదైన విషయంగానే భావించాలి. 

    చట్టపరంగానే ఇద్దరి భార్యలకు బ్రేకప్‌ చెప్పి.. ఇప్పుడు మూడో వివాహం చేసుకున్నారు ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌. అయితే అంతకుముందు వివాహం చేసుకున్న ఇద్దరూ భార్యలు ఐఏఎస్‌ అధికారిణులే గాక, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఆమె కూడా ఐఏఎస్‌ ఆఫీసరే కావడం విశేషం. 

    వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అవి ప్రసాద్ మూడోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది.

    2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అవి ప్రసాద్‌. ఇప్పటివరకు వివాహం చేసుకున్న ముగ్గురు భార్యలూ IAS అధికారులే కావడం విశేషం. తాజా వివాహం ఫిబ్రవరి 11న కూనో నేషనల్‌ పార్క్‌లో జరిగింది. ఈసారి ఆయన 2017 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అంకిత ధాక్రేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటన ఐఏఎస్‌ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. 

    ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సీతాపూర్‌కి చెందిన అవి ప్రసాద్‌.. 2013లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్‌లో చేరారు. ఆపై ఏడాదికి అఖిల భారత సర్వీస్‌లో 13వ ర్యాంకు సాధించి  ఐఏఎస్‌ హోదా పొందారు. 
        
     

  • కర్ణాటకాలో గతేడాది ఇజ్రాయెల్ మహిళతో పాటు మరోకరిపై అత్యాచారం జరిగిన ఘటనలో గంగావతి జిల్లా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ ఘటనలో అరెస్టైన ముగ్గురిని నిందితులుగా గుర్తిస్తూ వారికి మరణశిక్ష విధించింది. 

    2025 మార్చి 6న ఒక మహిళా ఇజ్రెయెల్ పర్యాటకురాలు, ఆమె సహాయకురాలితో పాటు భారత్‌కు చెందిన ముగ్గురు ఇతర పర్యాటకులు తుంగభద్రా నది ఎడమకాలువ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో మల్లేశ్, సాయి, శరణప్ప అనే ముగ్గురు వారి వద్ద కొచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో వారిపై దాడి చేసి ముగ్గురు మగవారిని అక్కడి తుంగభద్రా లోయలో తోసివేశారు. మిగతా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.

    అయితే ఆ నదిలో పడ్డ ముగ్గురిలో ఇద్దరు ఈత రావడంతో బ్రతికారు. ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు దురదృష్టవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితులను కఠనంగా శిక్షించాలని నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ కేసును విచారించిన గంగావతి జిల్లా కోర్టు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసు అత్యంత అరుదైనదని దీనికి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. 

    ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం..  ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు
  • మరో బిడ్డ రాబోతోందన్న ఆనందంలో ఉన్న  ఒక తల్లి అనూహ్యంగా తీవ్ర విషాదంలో మునిగి పోయింది. రెండోసారి తల్లి కాబోతున్నమహిళ మెటర్నిటీ ఫోటోషూట్‌ చేయించుకుంటూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదటి బిడ్డ, మూడేళ్ల  చిన్నారి నీటి కొలనులో పడి  మరణించిన వైనం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.

    పోలీసుల సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన చరణ్  స్వాతి దంపతులు. వీరికి తొలి సంతానంగా ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతం  స్వాతి రెండోసారి ఎనిమిది నెలల గర్భవతి. ఈ క్రమంలో ఆమెకు మెటర్నిటీ ఫోటోషూట్ జరుగుతోంది. సమీపంలో ఆడుకుంటున్న లక్ష్మీర్‌ జారి అక్కడే ఉన్న చిన్ననీటి కొలనులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించి ఆ చిన్నారికి సాయం అందేలోపే  ప్రాణాలొదిలేశాడు. 

    ఆసుపత్రికి తరలించేటప్పటికి చిన్నారి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఉద్యోగం నిమిత్తం  విదేశాల్లో ఉన్న ఆ చిన్నారి తండ్రి  బెంగళూరుకు రానున్నారని అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి:  పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
    కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్‌

     

  • ఢిల్లీ: గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 4వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. విద్యుత్‌ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. వీబీసీ,గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. 

    వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్  బకాయిలకు తమకు సంబంధం లేదనిన గీతం యూనివర్శిటీ  సుప్రీంలో వాదించింది.  అయితే వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని  సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

    వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని  హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని  ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది. 

     

  • శివాజీనగర(కర్ణాటక): హాసన్‌ జిల్లాలో బేలూరు వద్ద పెళ్లికి వెళ్లి అదృశ్యమైన వివాహిత కేసులో అనూహ్య మలుపు ఇది. ప్రియునితో వెళ్లిపోయినట్లు తేలింది. వివరాలు.. బేలూరుకు చెందిన   ఓ మహిళను కుణిగల్‌ తాలూకా యలియూరువాసి పెళ్లి చేసుకున్నాడు. అతనికి బిహార్‌కు చెందిన వలస కార్మికుడు దేవిడ్‌ పరిచయం. అతడు అప్పుడప్పుడు ఇంటికి వస్తుండగా  ఆమెకు వివాహేతర  సంబంధం ఏర్పడింది. దీంతో ఇద్దరూ బిహార్‌కు పారిపోవాలని పథకం వేశారు. 

    ఆ మేరకు ఫిబ్రవరి 12న  చిక్కమగళూరు జిల్లాలో బంధువుల వివాహానికి వెళుతున్నానని సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు నగలతో వెళ్లింది. ఆరోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని ఫోన్‌లో చెప్పి స్విచాఫ్‌ చేసింది. ఆమె బట్టలు, బ్యాగు రోడ్డుపై పడేసి ప్రియునితో ఉడాయించింది. దీంతో శనివారం పోలీసులు అక్కడ చెరువులు, వాగుల్లో వెతికినా జాడ లేదు. చివరకు మొబైళ్ల లొకేషన్‌ని తనిఖీ చేయగా, తుమకూరు జిల్లా కుణిగల్‌లో ఉన్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

    మహిళ ఆత్మహత్య  
    కోలారు: ఫినాయిల్‌ తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముళబాగిలు తాలూకా  భైరకూరు గ్రామానికి చెందిన చైత్ర (27) అనే వివాహిత ఆదివారం మృతి చెందింది. బెంగుళూరు రూరల్‌ జిల్లా ఆనేకల్‌కు చెందిన చైత్రను ముళబాగిలు తాలూకా భైరకూరుకు చెందిన బాలకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే భర్త మొదటి భార్య, అత్త వేధిస్తున్నారనే ఆవేదనతో ఈ నెల 10న పినాయిల్‌ తాగింది. ఆమెను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. చైత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో బాలకృష్ణ, అతని తల్లి, మొదటి భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Andhra Pradesh

  • శ్రీకాకుళం: యూరియా కోసం సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన యూరియా టీడీపీ నేతలు తీసుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ గార మండలం వమరవల్లి పంచాయతిలోని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియాను  అందరికి సమానంగా అందజేయాలని కోరుతూ  గ్రామ సచివాలయం ఎదుట  రైతులు బైఠాయించార. యూరియాను అక్రమంగా తరలిస్తూ తమకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

    ‘రైతులు కాని వారికి యూరియా ఇస్తున్నారు. టీడీపీ నాయకురాలు భవాని చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. అధికారులు కూడా టిడిపి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇవ్వడం దారుణం. పాస్ బుక్ ప్రకారం యూరియా ఇమ్మని అడిగితే ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఓవైపేమో తమ దేశాన్ని ఒక ప్రయోగశాలగా తమ ప్రజలని బలిపశువులుగా అభివర్ణించారని బిల్‌గేట్స్‌పై సామాజిక మాద్యమాలలో "బిల్‌గేట్స్‌ క్విట్‌ ఇండియా" అని నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. మరోవైపేమో కూటమి ప్రభుత్వం ఆయనకు రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జాతిని తమ ప్రజలను అవమానించిన వారికి ఇంత రాచ మర్యాదలు చేయాల్సిన అవసరం ఏంటని  సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    కొంతమందికి ప్రజల ప్రాణాలన్నా..వారి మనోభావాలన్నా లెక్కే ఉండదు. వారికి కావాల్సింది సంపన్నులకు కొమ్ముకాయడం.. వారిని బుట్టలో వేసే యత్నం చేయడం అంతే.. తాజాగా కూటమి ప్రభుత్వం చేసే పని దానికే నిదర్శనంగా నిలుస్తోంది. ఓవైపేమో  తమ దేశాన్ని పేద ప్రజలని అవమానించిన వ్యక్తిని.. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అని  దేశంలోకి రావద్దంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోనేమో కూటమి నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

    నిరసన ఎందుకు..?

    గతంలో ఓ సందర్భంలో భారత్‌పై బిల్‌గేట్స్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇండియాని ఓ ప్రయోగశాలగా వాడవచ్చని అన్నారు. ఆ దేశంలో ఎటువంటి ప్రయోగాలయినా చేసుకోవచ్చని తెలిపారు. అంటే ఇక్కడి మట్టికి గానీ ప్రజలకు గానీ ఆయన విలువనివ్వలేదు. ఏటువంటి ప్రయోగాలకైనా వీరిని వాడుకోవచ్చనే ఉద్దేశంలో ఆయన మాట్లాడారు. దీంతో ఈ అంశం నెట్టింట్లో తీవ్రంగా ట్రోలయింది. బిల్‌గేట్స్ క్విట్ ఇండియా అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండయ్యింది.

    ఐదుగురు పిల్లల మృతి
    ఇదిలా ఉంచితే 2009లో మెలిండా ఫౌండేషన్ సహాకారంతో రూపొందించిన HPV వ్యాక్సిన్‌ వికటించి ఖమ్మంలో ఐదుగురు చిన్నారులు మృతిచెందారు. మరెంతో మంది ఇతర సమస్యలతో బాధపడ్డారు. ఇది అప్పట్లో చాలా వివాదమైంది. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు తిరిగి ఆ వ్యాక్సిన్ ప్రయోగానికి బిల్‌గేట్స్‌కు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల ప్రాణాలకు ఏమవుతుందా అనే ఆందోళన నెలకొంది.

    ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌
    అయితే ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్ వ్యవహారంలోనూ బిల్‌గేట్స్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన రష్యన్ అమ్మాయిలతో నిద్రపోతున్నాడని లైంగిక సంక్రమణ వ్యాధుల బారిన పడ్డారని దీంతో తన భార్య మెలిండా గేట్స్‌కు రహస్యంగా ఇవ్వగల యాంటీ బయాటక్స్ కోసం అడుగుతున్నారని ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉంది. దీంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశం హాట్‌టాఫిక్‌గా మారింది.

    ప్రపంచవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉండి, మాతృదేశాన్ని అవమానకరంగా మాట్లాడి, ప్రజల చేతిలో నిరసనకు గురువుతున్న వ్యక్తికి.. చంద్రబాబు ఇంత హైప్‌ ఇవ్వడం ప్రజలను ఆవేదనకు గురిచేస్తుంది.

     

     

  • విశాఖ : మాలలు తీసేందుకు అప్పికొండ శివాలయానికి వెళ్లిన శివస్వాములకు చేదు అనుభవం ఎదురైంది. శివస్వాములు మాలలు తీసేందుకు కనీస ఏర్పాట్లు చేయడాన్ని పక్కకు పెట్టిన అధికారులు.. ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. 41 రోజుల దీక్ష అనంతరం అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శివ స్వాములు మాలలు తీయడానికి వెళ్తే ఆలయ అధికారులు శివాలయానికి తాళం వేసేశారు. 

    దాంతో అధికారులు, పోలీసుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని శివస్వాములు మండిపడుతున్నారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదయ, పోలీస్‌ శాఖ వారు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అక్కడ ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియదని, ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అధికారుల తీరును తప్పుబట్టారు.

  • తాడేపల్లి :  ఏపీలోని సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మరణాలపై సీఐడీ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. నాసిరకం భోజనంతో ఎంతమంది పిల్లలని చంపుతారని ప్రశ్నించారు. బిల్‌గేట్స్‌తో కూడా హాస్టల్‌ విద్యార్థుల భోజనం తినిపించగలవా చంద్రబాబూ? అని నిలదీశారు. 

    ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సుధాకర్‌బాబు.. ఏపీలో సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులకు పెడుతున్న నాసిరకం భోజనంపై ధ్వజమెత్తారు. ‘ మీ పిల్లలాంటి వారు కాదా మా పిల్లలు?, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ పిల్లలకు ఇదే భోజనం పెట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక 900 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. సంక్షేమ హాస్టల్‌లో చదువుకునే పిల్లలకు పురుగులతో కూడిన భోజనం పెట్ఠం ఏంటి?, హాస్టల్స్‌లో ఉండే వారిని వెలివేసినట్టుగా ప్రభుత్వ పనితీరు ఉంది. గొప్పలు చెప్పుకునే చంద్రబాబు బిల్‌గేట్స్‌తో హాస్టల్‌లో భోజనం తినిపించగలరా?, దగ్గర్లో ఉన్న ఏ హాస్టల్‌లో ఐనాసరే ఆకస్మిక తనిఖీకి తీసుకెళ్ళాలి. 

    మా ప్రభుత్వ హయాంలో రోజుకొక రీతిలో భోజనం పెట్టారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అంటరానితనంతో వ్యవహరిస్తున్నారు. ఏ.కొండూరులో ఎలుకలు కలిచి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. చంద్రబాబుకు పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపు?, ఇది కచ్చితంగా మానవ హక్కులను ఉల్లంఘించటమే. 900 మంది విద్యార్థులు ఆస్పత్రులు పాలయిన వైనంపై చర్చ కు సిద్దం. విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే లోకేష్ క్రికెట్ చూడటానికి కొలంబో వెళ్లాడా?, ప్రత్యేక విమానాల ఖర్చులో పది శాతం హాస్టల్స్ కి పెట్టినా విద్యార్థులకు మంచి భోజనం దొరికేది. పయ్యావుల కేశవ్ దళిత వ్యతిరేకి.

    నాసిరకం భోజనంతో ఇక్కడ పిల్లలకు చనిపోతుంటే శ్రీలంక వెళ్లి క్రికెట్ చూస్తున్న లోకేష్..

    అందుకే బడ్జెట్‌లోనూ ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనాన్ని చూపించారు. నిధుల కేటాయింపు లేకుండా మాపై వివక్ష చూపించారు. లోకేష్ విమాన ఖర్చులను బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ తన పార్టీకి రెండు కోట్లు ఇచ్చారు సరే..‌మరి విద్యార్థుల కష్టాలు కనపడటం లేదా?, అంబేద్కర్ విగ్రహాన్ని గాలికి వదిలేశారు. అక్కడి మొక్కలకు నీరు పోసే దిక్కు లేదు. జగన్ తెచ్చిన డిజిటల్ బోర్డులు, ఆర్వో ప్లాంట్లు, గోరుముద్ద పథకం ఏమయ్యాయి?, విద్యార్థుల మరణాలు, ఆస్పత్రుల పాలవటంపై సీఐడీ విచారణ చేయాలి. విద్యార్థులకు మేలు చేయని ప్రభుత్వం దిగిపోవాలి’ అని డిమాండ్‌ చేశారు.