Archive Page | Sakshi
Sakshi News home page

Family

  • మహిళల్లో వయసుతో సంబంధం లేకుండా సాధారణంగా కనిపించే సమస్య థైరాయిడ్‌. ఈ సమస్యను సహజంగా నియంత్రించడంలో సేతు బంధాసన (Setu Bandhasana) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ‘సేతు’ అంటే వంతెన, ‘బంధ’ అంటే బంధించడం.. ఈ ఆసనంలో శరీరం వంతెన ఆకారంలో ఉండి, గొంతు, మెడ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి పడుతుంది. దీని వల్ల థైరాయిడ్‌ గ్రంథికి రక్త ప్రసరణ మెరుగుపడి, హార్మోన్ల విడుదల సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే ఛాతీ తెరుచుకోవడం వల్ల శ్వాస లోతుగా మారి, ఒత్తిడి తగ్గుతుంది.

    ఉపయోగాలు..
    థైరాయిడ్‌ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. 
    హార్మోన్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. 
    మెటబాలిజం మెరుగై, రువు పెరుగుదల తగ్గుతుంది. 
    గొంతు, మెడ ప్రాంతం బలపడుతుంది. 
    అలసట, నిద్రలేమి తగ్గుతాయి. 
    ఒత్తిడి, ఆందోళన తగ్గించి మనసుకు ప్రశాంతత ఇస్తుంది. 
    ఎండోక్రైన్‌ సిస్టమ్‌ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.  
    వెన్ను, నడుము నొప్పులకు ఒక వరం.

    జాగ్రత్తలు.. 
    మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు ఉన్నవారు డాక్టర్, యోగా గురువు సలహాతో చేయాలి. 
    గర్భధారణ సమయంలో ఈ ఆసనం చెయ్యొద్దు. 
    తీవ్రమైన నడుము నొప్పి లేదా స్లిప్‌ డిస్క్‌ ఉన్నవారు చెయ్యకపోడం మంచిది.

    చేసే విధానం..
    స్టెప్‌ 1: ముందుగా వెల్లకిలా (వెనుక భాగం వెనుకకు ఆనించి) పడుకోవాలి.
    స్టెప్‌ 2: రెండు మోకాళ్లను మడిచి, పాదాలను నేలపై నడుముకు దగ్గరగా ఉంచాలి. చేతులను శరీరానికి పక్కన, అరచేతులు నేలను తాకుతూ ఉండాలి.
    స్టెప్‌ స్టెప్‌ 3: గాలి పీల్చుకుంటూ, నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.
    స్టెప్‌ 4: భుజాలను, చేతులను, పాదాలను బలంగా నేలపై ఆనించి, మీ ఛాతిని గడ్డం వైపు తీసుకురావాలి. ఈ స్థితిలో 15–30 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండాలి.
    స్టెప్‌ 5: శ్వాస విడిచే సమయంలో నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నెముకను నేలపైకి తీసుకువచ్చి, విశ్రాంతి తీసుకోవాలి.

    – పాతర్ల అనిత, యోగాట్రైనర్‌

  • ‘మా అబ్బాయికి ఫోన్‌ ఎప్పుడు ఇవ్వాలి?’‘మా అమ్మాయి ఫోన్‌ లేకుండా అన్నం తినడం లేదు, ఏం చేయాలి?’ అని చాలామంది పేరెంట్స్‌ అడుగుతుంటారు. నేటి హైటెక్‌ యుగంలో పిల్లలకు ఫోన్‌ ఇవ్వడం తప్పనిసరి అవసరంగా మారింది. పిల్లలకు సెల్‌ ఫోన్‌ పరిచయం చేయడం అనేది కేవలం ఒక పరికరాన్ని ఇవ్వడం కాదు, ఒక అపరిమితమైన, నియంత్రణ లేని ప్రపంచానికి వారిని పరిచయం చేయడం. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, శాస్త్రీయ దృక్పథం, పరిష్కారాల గురించి చర్చిద్దాం.

    ఏ వయస్సులో, ఎలా పరిచయం చేయాలి?
    చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వారు అన్నం తినడానికి ఆరు నెలల వయస్సు నుండే ఫోన్‌ చూపిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం.
    » రెండేళ్ల వరకు మొబైల్‌ ఫోన్‌కు పూర్తి దూరంగా ఉంచాలి. ఈ దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ వయసులో వారికి మనుషుల స్పర్శ, మాటలు అవసరం, డిజిటల్‌ బొమ్మలు కాదు.
    » రెండు నుంచి ఐదేళ్ల వరకు వారానికి రెండుసార్లు రైమ్స్‌ లేదా స్టోరీ టెల్లింగ్‌ వీడియోలు చూపించవచ్చు. అయితే, మీరు పక్కనే ఉండి వివరించాలి.
    » ఆరు నుంచి పన్నెండేళ్ల వరకూ హోంవర్క్‌ హెల్ప్‌ కోసం, కొత్త స్కిల్స్‌ (కోడింగ్, డ్రాయింగ్‌) నేర్చుకోవడానికి మాత్రమే. గేమ్స్‌ అనేవి కేవలం వీకెండ్స్‌లోనే.

    ‘బహుమతి’గా ఇవ్వకండి..
    చాలామంది తల్లిదండ్రులు పుట్టినరోజుకో లేదా క్లాసులో ఫస్ట్‌ వచ్చినందుకో స్మార్ట్‌ఫోన్‌ను ఒక రివార్డుగా ఇస్తారు. ఇది తప్పు. ఇలా చేయడం వల్ల పిల్లల మెదడులో ఫోన్‌ అనేది ఒక ‘విలువైన ఆస్తి’గా ముద్రపడిపోతుంది. ఫోన్‌ కేవలం సమాచారం తెలుసుకోవడానికి, అవసరమైనప్పుడు మాట్లాడుకోవడానికి వాడే ఒక ‘టూల్‌’ మాత్రమేనని మొదటి నుంచి అర్థమయ్యేలా చెప్పాలి.

    ‘కో–వ్యూయింగ్‌’ పద్ధతిని పాటించండి
    పిల్లలకు ఫోన్‌ ఇచ్చి మీరు వేరే పనిలోకి వెళ్ళిపోవద్దు. మొదట్లో వారు ఏం చూస్తున్నారో వారితో కలిసి చూడండి. పిల్లలు ఒంటరిగా స్క్రీన్‌ చూస్తున్నప్పుడు వారి మెదడు కేవలం ‘రిసీవింగ్‌ మోడ్‌’లో ఉంటుంది. అదే మీరు పక్కన ఉండి, ‘చూడు ఆ పిచుక ఎంత బాగుందో!’, ‘ఆ రంగు ఏంటి?’ అని అడుగుతుంటే వారి మెదడు చురుగ్గా స్పందిస్తుంది. దీనినే ‘జాయింట్‌ అటెన్షన్‌’అంటారు.

    టెక్నాలజీ కాంట్రాక్ట్‌ ...
    పిల్లల వయస్సు ఎనిమిదేళ్లు దాటితే, వారికి ఫోన్‌ ఇచ్చే ముందే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అది సరదాగా ఉన్నా, నియమాలు స్పష్టంగా ఉండాలి.
    » రోజుకు 30–45 నిమిషాలు మాత్రమే.
    » సైన్స్ వీడియోలు, క్విజ్‌ గేమ్స్‌ మాత్రమే చూడాలి. 
    » రూల్‌ అతిక్రమిస్తే, మరుసటి రోజు ఫోన్‌ ఉండదు.
    ఇలా చేయడం వల్ల పిల్లల్లో ‘సెల్ఫ్‌ డిసిప్లిన్‌’ పెరుగుతుంది.

    కంటెంట్‌ క్యూరేషన్‌...
    సెల్‌ ఫోన్‌ పరిచయం చేసేటప్పుడు మీరు ఇన్‌స్టాల్‌ చేసే యాప్స్‌ విషయంలో జాగ్రత్త వహించండి.
    » ‘ఖాన్‌ అకాడమీ కిడ్స్‌’ లేదా ‘డ్యుయోలింగో’ వంటి యాప్స్‌ ద్వారా భాషా నైపుణ్యాలను పరిచయం చేయండి.
    » గూగుల్‌ ‘ఫ్యామిలీ లింక్‌’ వంటి యాప్స్‌ వాడండి. ఏది పడితే అది క్లిక్‌ చేయకుండా ఫిల్టర్లు పెట్టండి.

    ‘నో ఫోన్‌’ సమయాలు...
    ఫోన్‌ పరిచయం చేసే తొలిరోజే.. అది ఎప్పుడు వాడకూడదో కూడా చెప్పాలి.
    » బాత్రూమ్, బెడ్‌ రూమ్‌లో ఫోన్‌ అస్సలు రాకూడదు.
    » భోజనం సమయంలో నో ఫోన్‌. ఫోన్‌ చూస్తూ తినడం వల్ల పిల్లలకు ఆకలి మీద నియంత్రణ ఉండదు, ఇది భవిష్యత్తులో ఈటింగ్‌ డిజార్డర్లకు దారితీస్తుంది.

    డిజిటల్‌ ఎటికెట్స్‌ నేర్పండి
    ఫోన్‌ అంటే కేవలం గేమ్స్‌ కాదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి? మెసేజ్‌ చేసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి? ఫోటోలు తీసేటప్పుడు ఎదుటివారి అనుమతి తీసుకోవడం వంటి ‘డిజిటల్‌ లిటరసీ’ వారికి పరిచయం చేయండి.

    ‘రియల్‌ వరల్డ్‌’ మర్చిపోవద్దు!
    పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నప్పుడు, అంతకంటే అందమైన ప్రపంచం బయట ఉందని మర్చిపోనివ్వకండి. మట్టిలో ఆడటం, వానలో తడవటం, స్నేహితులతో గొడవపడటం.. ఇవన్నీ ఇచ్చే అనుభూతి ఏ హై–డెఫినిషన్‌ స్క్రీన్‌ ఇవ్వలేదు. అందుకే ఎక్కువ సమయం బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలను ఫోన్‌ నుంచి దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కాని, దానిని ‘ఆరోగ్యకరంగా’ వాడేలా మార్చవచ్చు.

    -సైకాలజిస్ట్‌ విశేష్‌
    - ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌
    www.psyvisesh.com

  • రియో నగరం బ్రెజిల్‌ దేశపు సంస్కృతికి, ఆనందానికి నిలువుటద్దం. ప్రస్తుతం అది ఒక రంగుల ప్రపంచంగా మెరుస్తోంది. రియోలో ఇప్పుడు ఎటు చూసినా జనమే, ఎక్కడ విన్నా సంగీతమే! రంగురంగుల దుస్తులు, మిరిమిట్లు గొలిపే వెలుగులు, గాలిలో రెపరెపలాడే పించాల మెరుపులతో రియో డి జనిరో రత్నంలా మెరిసిపోతోంది. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు రియో కార్నివాల్‌ కోసం స్థానిక వీథులన్నీ కళావేదికలుగా మారిపోతాయి. నిశ్శబ్దాన్ని తరిమికొడుతూ గుండె వేగాన్ని పెంచే సాంబా నృత్యాల జోరుతో ప్రపంచాన్ని మెప్పించే సంబరం మొదలైంది.

    ది గ్రేటెస్ట్‌ షో ఆన్  ఎర్త్‌గా పిలవబడే ఈ రియో కార్నివాల్‌ ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బ్రెజీలియన్ల భావోద్వేగం. దాదాపు 20 లక్షల మంది ప్రజలు రోజూ వీథుల్లోకి వచ్చి సంబరాల్లో పాల్గొంటారు. పోర్చుగీసు వారు 18వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ప్రస్తుతం పోర్చుగీసు, ఆఫ్రికన్‌ సంస్కృతుల కలయికతో ముందుకు సాగుతోంది. క్రైస్తవుల పవిత్ర సీజన్  లెంట్‌ కాలానికి ముందు ఈ వేడుక జరుగుతుంది.

    ఈ కార్నివాల్‌లో సాంబాడ్రోమ్, బ్లాకోస్‌ అని పిలవబడే వీథి పార్టీలు, విలాసవంతమైన పార్టీలకు ప్రసిద్ధి చెందిన మ్యాజిక్‌ బాల్స్‌ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటన్నింటిలో సాంబా స్కూల్‌ పరేడ్‌ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన సాంబా పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఒకరితో మరొకరు పోటీపడతారు. ప్రత్యేకంగా డిజైన్  చేసిన రథాల్లో మెరిసిపోయే దుస్తులు ధరించిన వేలాదిమంది కళాకారులు సాంబాడ్రోమ్‌ స్టేడియంలో ఇచ్చే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్క పాఠశాల ప్రత్యేకమైన థీమ్‌తో ముందుకు వచ్చి సంగీత నృత్యాలతో వివిధ అంశాలను వివరిస్తారు.

    సాంబాడ్రోమ్‌లు టికెట్‌తో కూడినవి అయితే బ్లాకోస్‌ ప్రదర్శనలు మాత్రం ఉచితంగా నగరం మొత్తం కనిపిస్తాయి. సుమారు ఐదువందలకు పైగా బృందాలు నగరం నలుమూలలా సంగీతంతో సందడి చేస్తారు. వింత వింత దుస్తులు ధరించిన స్థానికులు, పర్యాటకులు మ్యూజిక్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారు. కోపకబానా, ఇపనెమా వంటి బీచ్‌లో బ్లాకోస్‌ వేడుకలు రాత్రంతా సాగుతాయి. కార్నివాల్‌లో ఉండే మ్యాజిక్‌ బాల్స్‌ అత్యంత విలాసవంతమైనవి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సెలబ్రిటీలు, సంపన్నులు భారీ సెట్టింగుల మధ్య వినోదాల్లో మునిగిపోతారు.

    కోపకబానా ప్యాలెస్‌లో జరిగే ఈ వేడుకల్లో అతిథులు ఖరీదైన మాస్క్‌లు, డిజైనర్‌ దుస్తుల్లో సందడి చేస్తారు. రియో కార్నివాల్‌ కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది బ్రెజిల్‌ దేశపు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండగలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఎంజాయ్‌ చేస్తారు. ఈ కార్నివాల్‌ వల్ల బ్రెజిల్‌ పర్యాటక రంగానికి భారీ ఆదాయం లభిస్తుంది. ప్రతి ఏడాది సరికొత్త ఇతివృత్తాలతో నిర్వహించే ఈ వేడుకలు పర్యాటకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి.  

  • ఢిల్లీలోని తీహార్‌ జైలులో మసూద్‌ అజర్, ఒమర్‌ షేక్, అహ్మద్‌ జర్గర్‌లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్‌ అన్సారీ, ఆసిఫ్‌ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్‌ అధినేత పార్థ్‌ ప్రతిమ్‌ రాయ్‌ బర్మన్‌ సహా పలువురిని కిడ్నాప్‌ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్‌ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్‌ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్‌గా చేరింది. 

    2001లో ఆసిఫ్‌ రజా ఎన్‌కౌంటర్‌ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్‌పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్‌సీఎఫ్‌... ఐఎంగా ఎలా మారిందంటే..!

    కోల్‌కతాకు చెందిన కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్‌ పెద్ద కొడుకు ఆసిఫ్‌ రజా ఖాన్‌ కోల్‌కతాలోని మౌలానా ఆజాద్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్‌ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. 

    హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ముజాహిద్‌ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్‌ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్‌కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్‌లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్‌ సలీం కూడా హాజరయ్యాడు. 

    ఉత్తరప్రదేశ్‌లో ఆజమ్‌గఢ్‌ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్‌ సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ (2007 నాటి హైదరాబాద్‌ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్‌ ఇంజనీర్‌గా పని చేసేవాడు. ముజాహిద్‌ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్‌ సలీంతో సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. 

    సాదిక్‌ను చితాక్యాంప్‌లోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్‌ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్‌ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్‌ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్‌ మెయిల్‌ ఐడీని ఆసిఫ్‌ రజా ఖాన్‌కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్‌కు తొలి మెయిల్‌ పంపిన ఆసిఫ్‌– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. 

    చీతా క్యాంప్‌లోని మదీనా హోటల్‌ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్‌... ఆసిఫ్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్‌ చేరిన మసూద్‌ అజర్‌ జైష్‌ ఏ మహ్మద్‌ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్‌ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్‌ గ్యాంగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. 

    2001 అక్టోబర్‌ 29న ఢిల్లీ స్పెషల్‌ సెల్‌తో కలిసి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్‌ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్‌ రజా ఖాన్‌ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్‌పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్‌ పరేఖ్, పరేష్‌ షా కిడ్నాప్‌ ఒకటి. 2000 నవంబర్‌లో 11 గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో సిమ్లా మిర్చి రెస్టారెంట్‌ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్‌స్టర్‌ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్‌ రజా ఖాన్‌ బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్‌కోట్‌ కోర్టు నాన్‌–బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. 

    ఆసిఫ్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్‌కోట్‌ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్‌ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్‌ 7న ఢిల్లీ వెళ్లే రాజ్‌కోట్‌ పోలీసులు ఆసిఫ్‌ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్‌ ఔట్‌ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్‌ రజా ఖాన్‌ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్‌ మరణించాడు.

    ఆసిఫ్‌ మృతితో అతడి సోదరుడు అమీర్‌ రజా ఖాన్‌... ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌ (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్‌ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్‌సీఏఫ్‌ కోల్‌కతాలోని అమెరికన్‌ కాన్సులేట్‌ సమీపంలోని యునైటెడ్‌ స్టేట్స్‌ గవర్నమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌పై (యూఎస్‌ఐఎస్‌) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్‌ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. 

    ఇలాంటి దాడులతో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన అమీర్‌ రజా ఖాన్‌ పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్‌ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్‌లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్‌సీఎఫ్‌ను అమీర్‌ రజా ఖాన్‌ 2003లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ కో–ఫౌండర్‌గా వ్యవహరించాడు. 

    అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!
    2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్‌ ముజాహిదీన్‌ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌–లుంబినీ పార్క్‌ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్‌ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్‌–4 ‘అహ్మదాబాద్‌ బ్లాస్ట్‌... ఢిల్లీ అడ్రస్‌!’ వచ్చేవారం.

  • ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట. 

    ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.

    అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్‌ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్‌ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్‌ సేయగా ధన్యుడౌ,/... తుదిన్‌ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది! 

     - ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి)

  • పిల్లలూ! మీరు రోజూ స్కూల్‌కి వెళ్లడానికి, తిరిగి ఇంటికి రావడానికి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటారు కదా! మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో  ప్రాంతానికి చేరుకునేందుకు ఉన్న రకరకాల రవాణా మార్గాల్లో రోడ్లు అత్యంత కీలకమైనవి. మన దేశంలో ఇంకా రోడ్డు లేని అనేక ప్రాంతాలున్నాయి. అక్కడి మనుషులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇంత కీలకమైన రోడ్డు ఎలా వేస్తారో మీకు తెలుసా?

    రోడ్డు నిర్మాణానికి ముందుగా కావాల్సింది ప్రణాళిక (ప్లానింగ్‌). ఆ రోడ్డు ఏయే  ప్రాంతాలను కలుపుతుంది, ఆ రోడ్డు విస్తీర్ణం ఎంత,  రోడ్డు వేసే నేల స్వభావం ఎలాంటిది వంటి అంశాలను ఇంజినీర్లు పరిశీలించి ఓ ప్రణాళిక రూపొందిస్తారు. అనంతరం  సర్వే చేపడతారు. ఆపైన మట్టి పని మొదలవుతుంది.

    ఎగుడుదిగుడుగా ఉండే దారిని చదునుగా చేస్తారు. లోతట్టుగా ఉండే  ప్రాంతంలో బయట నుంచి మట్టి తెప్పించి పోస్తారు. అప్పుడే రోడ్డు వేయడం వీలవుతుంది. అనంతరం రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా సైడు కాల్వలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాటు లేకపోతే వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అనంతరం రాళ్లు, కంకరను పొరలు  పొరలుగా ఆ భూమిపై వేసి రోడ్‌ రోలర్లతో బాగా నొక్కుతారు. దీంతో ఆ ప్రాంతం రోడ్డు వేసేందుకు సిద్ధమవుతుంది. చివరిగా తారు లేదా కాంక్రీట్‌ మిశ్రమాన్ని వేసి రోడ్డుకు చివరి రూపు ఇస్తారు. అలా రోడ్డు సిద్ధమవుతుంది.  

    ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?

  • రోజు మీ భోజనంలో రకరకాల కూరగాయలను భాగంగా చేసుకుంటారు. అవన్నీ తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. నిత్యం మనం తినే ఆహారంలో కొన్ని కూరగాయలు విదేశాల నుంచి వచ్చాయన్న విషయం మీకు తెలుసా?

    టమాటా, బంగాళదుంప, పచ్చిమిర్చి వంటి కూరగాయలు విదేశాల నుండి భారతదేశానికి వచ్చాయి. 16–17 శతాబ్దాలలో పోర్చుగీస్, బ్రిటీష్‌ వారి ద్వారా ఇవి మన దేశానికి చేరుకున్నాయి. చివరకు ఇవి మన వంటల్లో ముఖ్యమైన పాత్ర షోషించడం మొదలైంది. ఇందులో ముఖ్యమైనది టమాటా. ఇది మెక్సికో నుండి పోర్చుగీస్‌ వ్యాపారుల ద్వారా మనకు పరిచయమైంది. ఆ తర్వాత బంగాళదుంప (ఆలూ). ఇది పెరువియన్‌-బొలీవియన్‌ ఆండీస్‌ (దక్షిణ అమెరికా) నుండి మన దేశానికి వచ్చింది. పచ్చిమిర్చి. 

    ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

    ఇది దక్షిణ అమెరికా మూలాలు కలిగినది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ కూడా ఆఫ్రికా, మెడిటరేనియన్‌ ప్రాంతాల నుంచి మన దేశానికి వచ్చినట్లు భావిస్తుంటారు. బీట్‌రూట్‌ అనేది యూరప్, ఈజిప్టు ప్రాంతాల నుంచి వచ్చింది. 

    వీటితోపాటు బ్రోకలీ, లెట్యూస్, ఆస్పరాగస్, స్వీట్‌ కార్న్‌ వంటివి కూడా విదేశీ రకాలుగా పరిగణిస్తారు.   

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ను చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు


     


     

  • పూజలో పూలు వాడతాం. మరి మంత్రపుష్పం ప్రత్యేకత ఏమిటీ అంటే – భగవంతుడికి మనం చేయగలిగిన ఉపచారాలన్నీ చేశాక, పెట్టగలిగిన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టాక... మనల్ని మనం ఆ దేవదేవుడికి సమర్పించుకోవడమే మంత్రపుష్పంలోని పరమార్థం. కిందివైపు ముడుచుకుని ఉన్న కమలంలా నాభికి పైనా, గొంతుకు కిందా 12 అంగుళాల పరిమాణంలో ఉన్న భాగం (హృదయం), మనం తిన్న అన్నాన్ని శరీరభాగాలన్నింటికీ సమానంగా పంచుతుందట.

    దానిపై భాగంలో విచ్చుకున్నట్టు ఉండే సూక్ష్మపద్మంలాంటి చోట నివ్వరిధాన్యపు ముల్లంత (వడ్లగింజ కొస) పరిమాణంలో పసుపురంగు కాంతితో మనలోని పరమాత్మ ఉంటాడంటూ సవివరంగా మన జ్యోతి స్థానాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని మంత్రపుష్పంతో (Mantrapushpam) జతచేసి చదువుతాం. అంటే నాలోని ప్రాణం నీవు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను స్వామీ... అని చెప్పుకోవడం మంత్రపుష్పంలోని పరమార్థం.

    చ‌ద‌వండి: శఠగోపం ఆకారం ఎందుకలా?

  • భీమునిపట్నం: ప్రేమకథా చిత్రాలకు భీమిలి తీరానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఇక్కడ రూపుదిద్దుకుని ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా 1978లో విడుదలైన దర్శక శిఖరం కె. బాలచందర్‌ దృశ్యకావ్యం ‘మరోచరిత్ర’ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. కమల్‌ హాసన్, సరిత జంటగా నటించిన ఈ చిత్రంలోని మెజారిటీ సన్నివేశాలు భీమిలి తీరంలోనే చిత్రీకరించారు. అప్పట్లో అంటే సుమారు 1850 ప్రాంతంలో బ్రిటీష్‌ గవర్నర్‌ నివాసం కోసం సముద్ర తీరాన నిర్మించిన అరుదైన బంగ్లా ‘గాలిమేడ’ ఈ సినిమాతోనే ప్రజలకు చేరువైంది. డచ్‌ గవర్నర్‌ బంగ్లాగా పిలవబడే ఈ కట్టడం సినిమా హిట్‌ అయ్యాక ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ 1990వ దశకంలో ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఆ చారిత్రక గాలిమేడను కూల్చివేసినప్పటికీ, నేటికీ పాతతరం ప్రేక్షకులు ఆ ఖాళీ స్థలాన్ని చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. 

    బాలచందర్‌ మెచ్చిన తీరం 
    బాలచందర్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘కోకిలమ్మ’ సినిమాతో మొదలైన ఈ సినీ ప్రస్థానం ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికైంది. 1986లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా సత్యరాజ్, రేఖలతో తీసిన ‘కడలోర కవిదైగళ్‌’ చిత్రాన్ని భీమిలిలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న సరస్వతి సమాజం పరిసరాల్లోనే చిత్రీకరించారు. ఇదే సినిమాను 1987లో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ‘ఆరాధన’ పేరుతో రీమేక్‌ చేసినప్పుడు కూడా భీమిలినే ప్రధాన లొకేషన్‌గా ఎంచుకున్నారు. సుహాసిని టీచర్‌గా ఉన్న స్కూల్, ఆమె బడికి రావద్దని చెబితే చిరంజీవి ఒంటికాలిపై నిలబడే దిమ్మ, లైట్‌ హౌస్‌ కీపర్‌ క్వార్టర్స్‌లో ఉన్న చిరంజీవి ఇల్లు.. ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉండి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 

    ఎన్నో చిత్రాల నిర్మాణం 
    శుభలేఖ, ముద్దమందారం, మహర్షి వంటి క్లాసిక్‌ చిత్రాలే కాకుండా హిందీ, తమిళ సినిమాలు కూడా ఈ తీరంలో సందడి చేశాయి. 1992లో నటి రోజా, ఆమె భర్త సెల్వమణి కాంబినేషన్‌లో వచ్చిన ‘చామంతి’, నాగార్జున ‘రావోయి చందమామ’, ప్రభుదేవా ‘టైమ్‌’ వంటి సినిమాల చిత్రీకరణ బ్యాంక్‌ రోడ్డులోని ‘ఓషన్‌ వ్యూ’ బంగ్లా వద్ద జరిగింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఆ బంగ్లా కూడా కూలి్చవేతకు గురైంది. గాలిమేడ, ఓషన్‌ వ్యూ బంగ్లా వంటి కొన్ని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయినా, ‘ఆరాధన’ సినిమా స్కూల్, ఆనాటి దిమ్మ, నరసింహస్వామి ఆలయ పరిసరాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. భీమిలి అందాలు వెండితెరపై ఎంతటి మాయాజాలాన్ని సృష్టించాయో చెప్పడానికి ఈ లొకేషన్లే సజీవ సాక్ష్యాలు.

    సందడిగా ఉండేది 
    ఇక్కడ షూటింగ్‌లు జరగడవల్ల ఎంతో సందడిగా ఉండేది, ముఖ్యంగా ఆరాధన షూటింగ్‌  రెండు నెలలకు పైనే జరిగింది. ఇందులో చిరంజీవి హీరోకావడంతో విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి ప్రతి రోజు భారీ ఎత్తున జనం వచ్చేవారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, చిత్ర యూనిట్‌ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. 
    –రాంబోతు సత్యనారాయణ, భీమిలి

    కాలేజ్‌కు వెళ్లేవాళ్లం కాదు 
    ఆరాధన షూటింగ్‌ ఇక్కడే ఎక్కువ రోజులు జరిగింది. చిరంజీవి, సుహాసిని, రాధికను చూడాలని ఎంతో ఆసక్తి ఉండేది. స్నేహి తులంతా కలిసి కాలేజ్‌కి డుమ్మా కొట్టి షూటింగ్‌ చూడడానికి వెళ్లేవాళ్లం. 
    –అయ్యగారి లలితారమేష్‌ భీమిలి

    భీమిలికి మంచి గుర్తింపు 
    ఇక్కడ షూటింగ్‌లు తరచూ జరుగుతుండడంతో భీమిలి ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చింది. దీనికి చారిత్రిక, పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. సినిమా షూటింగ్‌ల వల్ల ఈ ప్రాంతం  
    మరింత గుర్తింపు లభించింది. ప్రభుత్వం చారిత్రక కట్టడాలకు మెరుగులు దిద్దాలి.
    –కంటుభుక్త ముత్యాలరావు, భీమిలి   

     

     

  • శఠగోపం ఆకారమే చాలా ప్రత్యేకం. ఆలయ గోపురాలు దాదాపు ఇదే ఆకారంలో ఉంటాయి. అలాగే చదరంగా ఉండే తలాలకన్నా వంపుగా అర్ధవృత్తాకారంలో (డోమ్‌ తరహా) నిర్మాణాలూ పిరమిడ్‌ తరహాలోనే పనిచేస్తాయి. రాజమందిరాల పై భాగాలు ఇలా ఉండటాన్ని మనం గమనించొచ్చు. అందువల్ల శఠగోపం కూడా అచ్చంగా ఇదే విధంగా పనిచేస్తుంది.

    ఆత్మజ్ఞానానికి ప్రతీకైన సహస్రార చక్రం మన తలకు పై భాగంలో కాస్త ఎత్తులో ఉంటుంది. అదే జ్ఞానులూ, యోగులకు దాదాపు జానెడు ఎత్తులో ఉంటుంది. అలాంటి సహస్రార చక్రం పైన ఈ శఠగోపాన్ని ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనం దేవాలయానికి వెళ్లినప్పుడు ఇన్ని రకాలుగా శక్తిని పొందుతాం కాబట్టి, దాన్ని స్థిరపరచుకోవడానికి కాసేపు అక్కడే కూర్చోమని చెబుతారు. 

    చ‌ద‌వండి: స్వ‌ర్ణ‌గిరికి బ్ర‌హ్మోత్స‌వ సిరి

  • నెల్లూరు జిల్లా: నాలుగడుగులు నడిస్తే ఆయాస పడే ఇప్పటి తరానికి ఆ బామ్మ మాటలు బంగారు బాటలు. కష్టపడి పనిచేస్తే ఎలాంటి జబ్బులు రావనేందుకు ఆమె జీవనశైలి పెద్దబాల శిక్ష. వందేళ్ల వయసు పైబడినా తన పని తానే చేసుకుంటూ ఇంట్లో వారికి సైతం సాయంగా ఉంది. టీవీలు, స్మార్ట్‌ ఫోన్ల మాయలో పడి పిల్లలకు కూడా వ్యాధులతోపాటు ఊబకాయం వస్తుంటే వారి పెద్దలు ఆందోళన పడుతున్నారు. 103 సంవత్సరాల వయస్సులో బామ్మ ఇప్పటికీ వంట చేస్తుంది. ఇంట్లో గేదెలకు గడ్డి తెచ్చి మేతగా వేస్తుంది.

    వంట చేస్తూ..
    పొదలకూరు మండలం, మొగళ్లూరు గ్రామానికి చెందిన అచ్చాల పెంచలమ్మ శతాధిక వృద్ధురాలు. గ్రామంలో ఆమెకంటే పెద్దవారు ఎవరూ జీవించి లేరు. నాలుగు తరాలకు ప్రతినిధిగా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన పెంచలమ్మకు నలుగురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇప్పటికీ బామ్మ హుషారుగా ఉంది. ఆమెకు ఎలాంటి జబ్బులు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాత్రివేళ అప్పుడప్పుడు కాళ్లునొప్పులు వస్తుంటాయని చెబుతోంది. వినికిడి, కంటిచూపు ఈ వయస్సులో కూడా పెంచలమ్మకు బాగున్నాయి. కట్టెల పొయ్యి వద్ద ఆమె ఇంట్లో అందరికీ వంట చేస్తుంది.

    మంచి ఆహారపు అలవాట్లు
    పెంచలమ్మ కాయ కష్టం చేసేవారు. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండటమే కాక జొన్న, రాగి సంగటి తినేవారు. అందువల్లే ఇప్పటికీ ఆమె ఎంత సమయమైనా కూర్చొని లేవగలుగుతున్నారు. వయోభారంతో కొంత ఆలసటగా కనిపించినా పనులు చేస్తూనే ఉంటారు. కుమారుడు మస్తాన్‌రెడ్డి, కోడలు సంపూర్ణమ్మ వ్యవసాయ పనులపై తోటకు వెళ్తే పెంచలమ్మ వంటి చేసి పెడుతుంది. వందేళ్లు పైబడినా బంధువులు, స్నేహితుల పేర్లు వెంటనే తడుముకోకుండా చెబుతుంది. షుగర్, బీపీ వ్యాధులు ఆమె దరిచేరలేదు. ఎలాంటి మందులు కూడా వాడటం లేదని పెంచలమ్మ చెప్పారు. ఇప్పటి తిండిలో శక్తి లేదని, తాను వయస్సులో ఉన్నప్పుడు కల్తీ లేని ఆహారం తినడం వల్లే ఇంతకాలం జీవించి ఉన్నానంటారు పెంచలమ్మ. కల్మషం లేని లేని జీవితం, కల్తీ లేని ఆహారం తింటే ఎవరైనా తనలా జీవించేందుకు అవకాశం ఉంటుందని బామ్మ వెల్లడిస్తున్నారు.

     

Politics

  • హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల హంగ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్‌ పీఠం ఎవరికి అనే దానిపై ఆసక్తి నెలకొంది.  కాంగ్రెస్‌-సీపీఐల మధ్య చర్చలు సఫలం కావడంతో  కొత్తగూడెం మేయర్‌ పీఠంపై పీటముడి వీడింది. 

    కాంగ్రెస్‌-సీపీఐ పొత్తుతో మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో సీపీఐకి మేయర్‌ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. డిప్యూటీ మేయర్‌ పదవి కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. 

    కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లలో ఈ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, సీపీఐ రెండూ సమానంగా 22 సీట్లు గెలవడంతో హంగ్ కౌన్సిల్ ఏర్పడింది. అంటే, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.  అయితే ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 8 సీట్లు వచ్చాయి. సీపీఐకి అవసరమైతే బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని కేటీఆర్‌ ప్రకటించారు కూడా. 

    అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు కూడా. సీపీఐ అనేది తమకు మిత్రపక్షమేనని, కాకపోతే ఇక్కడ విడివిడిగా పోటీ చేశామని నిన్ననే క్లారిటీ ఇచ్చారు. దాంతో కొత్తగూడెంలో కాంగ్రెస్‌-సీపీఐలు కలిసే మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటాయనే సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే  ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొత్తగూడెం కార్పొరేషన్‌లో నెలకొన్న మేయర్‌ పదవిపై సందిగ్థత వీడింది. 

  • హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో మంత్రులందరినీ సీఎం అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు సీఎం రేవంత్‌. 

    దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించాం. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. 

    ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

  • మొయినాబాద్‌: తెలంగాణలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్‌ రాజకీయాలు మరింత హీట్‌ పుట్టిస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులు ఎక్కడ జంప్‌ జిలానీ అంటారో అని ఆయా పార్టీలు వారిని డేగ కళ్లతో కనిపెడుతున్నాయి. 

    దీనిలో భాగంగా వారిని క్యాంప్‌లకు తరలిస్తూ దాచేయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం రిసార్ట్‌ల్లో దాస్తున్న అభ్యర్థులను డైరెక్ట్‌గా చైర్మన్‌, మేయర్‌ ఎన్నికకు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు చేయి జారకుండా పార్టీల జాగ్రత్తలు పడుతున్నాయి. మధ్యలో గ్యాప్‌ ఇస్తే అభ్యర్థులు మాయమైపోతారనే భయంలో పార్టీలు ఉన్నాయి. 

    జగిత్యాలలో ఒకే పార్టీలో క్యాంప్‌ రాజకీయాలు..
    జగిత్యాలలో ఒకే పార్టీలో ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య మొదలైన క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన అనుచరులు 18 మందితో కలిసి హైదరాబాద్ క్యాంపునకు మాజీమంత్రి జీవన్ రెడ్డి బయల్దేరారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు మేజిక్ ఫిగర్ 26 సీట్లు..ఎమ్మెల్యే సంజయ్ వర్గం వైపు తన వర్గీయులతో పాటు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్స్ కలిపి 22కు చేరింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితేనే జగిత్యాల బల్దియా కాంగ్రెస్ వశమవుతుంది. 

    సంజయ్ వర్గంతో కలిసేందుకు  జీవన్ రెడ్డి..ససేమిరా అంటున్నారు. ఆదినుండి పార్టీ జెండా మోసిన వారికే చైర్మన్ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు.రసకందాయంగా జగిత్యాల్లో కాంగ్రెస్ అంతర్గత క్యాంప్ రాజకీయాల కొట్లాట మొదలైంది. ఇక పాలమూరు టూ చీరాల క్యాంపుకు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బయల్దేరారు. రాత్రే ఓ వాహనంలో కొందరు వెళ్లగా నేడు మరో టూరిస్ట్ బస్సులో పయనమయ్యారు. కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యే, పార్టీ ప్రదాన నేతలు సైతం క్యాంపులకు బయల్దేరారు. ఇలా తెలంగాణలో ప్రతీ చోటా క్యాంపు రాజకీయాలే కనిపిస్తున్నాయి. 

  • సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బలం.. మ్యాజిగ్‌ ఫిగర్‌కి చేరుకుంది. బండి సంజయ్‌ సమక్షంలో  రెబల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఆ ఇద్దరి చేరికతో కార్పోరేషన్‌లో 34కి  బీజేపీ బలం చేరుకోగా.. బండి సంజయ్‌ ఎక్స్‌ అఫీషియో ఓటుతో 35కి బీజేపీ బలం చేరింది. కరీంనగర్‌ కార్పోరేషన్‌ దాదాపు బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది.

    కరీంనగర్‌లో ఫలితాల తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 66 డివిజన్లలో 30 సీట్లు గెల్చుకుని బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. ఎక్స్‌ అఫీషియో మెంబర్లగా ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33కి చేరింది. ఇప్పటికే మరో ఐదుగురు ఇండిపెండెంట్స్ బీజేపీలో చేరికతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కరీంనగర్‌లో 30 స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్‌ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. 

    తెరపైకి ఎక్స్‌అఫిషియో ఓట్లు
    ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రాయికల్, మెట్‌పల్లి, జమ్మికుంటలో హంగ్‌ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి చోట్ల ఎక్స్‌అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గపరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్‌అఫిషియో ఓటుహక్కు కలిగి ఉంటారు. తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీ ఉంటే.. ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది. తాజాగా పాత కరీంనగర్‌ జిల్లాలో ఎక్స్‌అఫిషియో ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది.

    కరీంనగర్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మేజిక్‌ ఫిగర్‌ చేరుకోలేదు. అవసరాన్ని బట్టి 10 మంది ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫిషియో ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి. బీజేపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఓట్లు ఉండగా..

    కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌లో, మేడిపల్లి సత్యం చొప్పదండిలో, ఆది శ్రీనివాస్‌ వేములవాడలో, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ ధర్మపురిలో, మంత్రి శ్రీధర్‌బాబు మంథనిలో, హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో, రామగుండంలో మక్కాన్‌సింగ్‌ ఓట్లు వినియోగించుకునే అవకాశముంది. వీరే కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, భానుప్రసాద రావు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు గంగుల కమలాకర్, కేటీఆర్, కోరుట్లలో సంజయ్, హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ఓట్లు అందుబాటులో ఉన్నాయి. 

  • సాక్షి,తాడేపల్లి: ఏయే రంగాలకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.శనివారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఆ బడ్జెట్‌పై బుగ్గన మీడియా మాట్లాడారు.

    అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడమంటే పెద్ద నేరం. బడ్జెట్‌ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజల్ని ఆశపెట్టి  అధికారంలోకి వచ్చారు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్‌ బుక్‌ చూసినట్టే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్‌ను రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పడం లేదు. 

    మా హయాంలో 9శాతం వృద్ధి సాధించాం. గతేడాది ఆదాయం లక్షా 28 వేల 126కోట్లు చూపించారు. సవరించిన ఆదాయం లక్షా 11 వేల 865 చూపించారు. మూడు నెలల్లో 44,500 కోట్లు వస్తుందని చెప్పడం నమ్మేలా లేదు.  మా పాలనలో లక్షా35 వేల మంది యువకులకు ఉపాధి కల్పించాం. మా హయాంలో 10,032 విలేజ్‌ క్లీనిక్‌లు ఏర్పాటు చేశాం. 10,775 రైతుల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి రూ.3700కోట్లు ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. 

  • సాక్షి, గుంటూరు: ఒక మనిషిని ఇబ్బంది పెడితే ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం అని వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై దాడి చేస్తే.. దాడికి గురైన బాధితుడే జైలులో ఉన్నారన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసిన టీడీపీ గూండాలు స్టేషన్ బెయిల్ తీసుకుని బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని  బైరెడ్డి మండిపడ్డారు.

    అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల కోసం పని చేశారు. హోం మంత్రి అర్ధ రహితంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబును ఏమి పీకలేరు. మన తప్పులు మనకి చిన్నవిగా ఎదుట వారికి పెద్దవిగా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న కూటమి నామరూపాలు లేకుండా పోతుంది. అంబటి రాంబాబును జైలులో పెడితే ఆయన కుమార్తె బయటకు వచ్చారు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.

    జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్లు.. కుక్కలు కొట్టినట్టు కొట్టినాకూడా పవన్ కళ్యాణ్ స్పందించడు. పవన్‌కు ప్రతి నెలా ముట్టాల్సింది ముడుతుంది. కూలీ చేసేది జన సైనికులు.. లాభం అనుభవించేది టీడీపీ అంటూ.. జనసేన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. బైరెడ్డి ఓ కథ చెప్పారు.

    పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ ఇద్దరూ కూర్చొని ఉంటే.. చంద్రబాబు వచ్చి.. మూడు వస్తువులను పంచుకోమని చెప్పి.. దుప్పటి, చెట్టు, ఆవు వారికి ఇచ్చారు. లోకేష్‌ పవన్‌తో ఇలా అన్నాడంట.. నీకు పంపకాలు సరిగా రావు.. ఇద్దరికి న్యాయంగా పంచుతానన్నాడు. దుప్పటిని పగలు అంతా నువ్వు వాడుకో.. రాత్రి అయితే తానూ వాడుకుంటానంటూ చెప్పాడు. న్యాయంగా పంచావు తమ్ముడు అన్న పవన్‌ కల్యాణ్‌.. దుప్పటి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పగటి పూట ఎండ వేడికి ఆ దుప్పటిని కప్పుకోలేకపోయాడు. రాత్రికి లోకేష్‌కు ఇచ్చాడు.. చలికి ఆ దుప్పటిని బాగా కప్పుకుని పడుకున్నాడంట. దుప్పటి.. లోకేష్‌కు ఉపయోగపడింది. పవన్‌కు ఉపయోగపడలేదు.

    తర్వాత ఇద్దరూ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఇదీ కూడా న్యాయంగా పంచుతానన్న లోకేష్‌.. పై భాగం అంతా నేను తీసుకుంటా.. కింద భాగం అంతా నువ్వు తీసుకో అన్నాడంట.. అంటే చెట్టుకు నీళ్లు పోసేందంతా పవన్‌ కల్యాణ్‌.. కాసిన పండు తినేదంతా లోకేష్‌.. తర్వాత ఆవు దగ్గరకు వెళ్లారట. అన్నా.. ఇది కూడా న్యాయంగా పంచుతా.. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో.. వెనుక భాగం అంతా నేను తీసుకుంటా.. ఆవుకు రోజూ.. మేత, నీళ్లు పోసేదంతా పవన్‌ కల్యాణ్‌.. వచ్చే పాలు పిండుకునేది లోకేష్‌.. ఇది జన సైనికులు పరిస్థితి ఎలా ఉందంటే.. కూలి చేసేది వీళ్లు.. వచ్చేదంతా తినేది తెలుగు తమ్ముళ్లు’’ అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వివరించారు.

  • హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేయర్‌ ఎన్నికల వ్యవహారం మరింత హీట్‌ పుట్టిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రధాన పార్టీలు కుట్రలు చేసి కరీంనగర్‌లో బీజేపీకి మేయర్‌ పదవి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 

    బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌.. ప్రజా తీర్పును కాలరాసి ఏమైనా కుట్రలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.  ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 

    కుట్రలు చేస్తే కరీంనగర్‌ నుంచి యుద్ధం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ మేయర్‌ ఎలా దక్కించుకుంటాయి?, బీజేపీకి మేయర్‌ పదవి రాకుండా మూడు పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయి. కరీంనగర్‌ వేదికగా మూడు పార్టీల బండారం బయటపడుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రజాతీర్పును కాలరాస్తే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను తిరగనివ్వను’ అని తీవ్రంగా హెచ్చరించారు.

    కాగా, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో  మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. BJP 30 డివిజన్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ స్పష్టమైన మెజారిటీ  ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3 డివిజన్ల చొప్పున గెలిచాయి. ఇండిపెండెంట్లు 8  సీట్లు గెలవగా, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రెండు డివిజన్లలో గెలిచింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నందున, ఇండిపెండెంట్లు మరియు చిన్న పార్టీల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 

  • సాక్షి,గుంటూరు: తన తండ్రిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం  అంబటి మౌనిక తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

    దాడి చేసి, తిరిగి అంబటి రాంబాబుపై కేసులు పెట్టారు. అక్రమ కేసులకు, దాడులకు భయపడేది లేదు.కూటమి నేతలు కావాలని రెచ్చగొట్టి, దాడులకు పాల్పడ్డారు. ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు. అంబటి రాంబాబుకు రక్షణ కల్పించడంలో హోంశాఖ విఫలమైందని మండిపడ్డారు. 

     

  • సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్‌ మేయర్‌ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌. నిజామాబాద్‌లో ఎంఐఎం పార్టీ.. తమకే మద్దతు ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.

    టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నిజామాబాద్‌ మేయర్‌ పీఠంపై కాంగ్రెస్‌ నేతనే ఉంటారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో హాంగ్ వచ్చిన మున్సిపాలిటీల అంశంపై వ్యూహ రచన చేస్తాం. సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్‌గా ఉంటారు. మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది. 90 శాతం గెలవాలని రూల్ ఉందా?. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం మాదే. మెగా గ్రేటర్ ఎన్నికలు కూడా మేమే కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.

    ఇక, అంతకుముందు.. డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యత డీసీసీలకు అప్పగించారు. హాంగ్ వచ్చిన మున్సిపాలిటీలలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుపై సాయంత్రంలోగా మున్సిపాలిటీల వారీగా వివరాలు ఇవ్వాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్‌లో హంగ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారనుంది. 

Movies

  • గులాబీలతో రొమాంటిక్ పోజులిచ్చిన నేహా శెట్టి

    సెల్ఫ్ లవ్ అంటూ స్వీట్ స్టిల్స్‌తో కృతిశెట్టి

    భర్తపై ప్రేమ చూపించేసిన మెగా కోడలు లావణ్య

    గోవాలో భర్తతో ప్రేమక్షణాల్లో గుర్తుచేసుకున్న అమలా పాల్

    అందంగా కనిపిస్తూ నభా నటేశ్ ప్రేమ విషెస్

    గులాబీతో క్యూట్‌గా మాయ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే

  • చివరి సినిమా చేసేసిన తమిళనాడు స్టార్ హీరో విజయ్.. అధికారం సాధించడమే లక్ష‍్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ప్రచారం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నాడు. అలాంటి ఇతడిపై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త్రిషతో బంధాన్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

    (ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా)

    చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో భాగంగా బీజేపీ చీఫ్ నైనర్ నాగేంద్రకు విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ.. 'విజయ్ చాలా అమాయకుడు. ఇప్పటికీ రాజకీయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. మొదటగా అతడు గూడు నుంచి బయటకు రావాలి. మరీ ముఖ్యంగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. అప్పుడే తమిళనాడులోని పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది' అని నాగేంద్రన్ ఆరోపించారు.

    నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తున్నాయి. విజయ్‌ని అభిమానించే వాళ్లతో అధికార డీఎంకే నాయకులు కూడా నాగేంద్రన్ కామెంట్స్‌ని ఖండిస్తున్నారు. విజయ్, త్రిష రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని.. నేతలు బహిరంగ వేదికలపై ప్రస్తావించడం అవమానకరమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

    (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

  • 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో అనుకున్నంత స్పందన రాలేదు. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఇలాంటి రెస్పాన్స్‌తో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి?

    ఫంకీ చిత్రానికి తొలిరోజు నెట్ వసూళ్లు రూ.2.25 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్‌లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మనవరకు మాత్రం ఇంకా పోస్టర్ లాంటిది రిలీజ్ చేయలేదు. వస్తున్న టాక్ బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యాక ఏమైనా పోస్టర్ వదిలితే వదలొచ్చు. లేదంటే లేకపోవచ్చు.

    (ఇదీ చదవండి: 'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం: నిర్మాత నాగవంశీ)

    'ఫంకీ'తో పాటు రిలీజైన మరో తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది సోమవారానికి తేలుతుంది.

    'ఫంకీ' విషయానికొస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. ఓ నిర్మాణ సంస్థలో సినిమా కోసం అవకాశం దక్కించుకుంటాడు. రూ.4 కోట్లతో పూర్తి చేస్తానని రూ.40 కోట్ల బడ్జెట్ చేస్తాడు. అయినా సరే మూవీని పూర్తి చేయడు. దీంతో నిర్మాత కూతురు చిత్ర(కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. రూ.కోటితో మిగిలిన చిత్రమంతా పూర్తిచేయాలనే షరతు పెడుతుంది. మరి అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తయిందా? ఈ క్రమంలో కోమల్-చిత్ర మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కొన్నిరోజులకే చాలా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టైల్‌లో ఉండే ఓ యాక్షన్ మూవీ.. డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించేశారు. కాకపోతే మరీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఆరు రోజులకే స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ విశేషం.

    (ఇదీ చదవండి: కాబోయే భార్యకు ముద్దుపేరు.. అల్లు శిరీష్ వాలంటైన్స్ డే వీడియో)

    మలయాళంలో గత నెల 22న రిలీజైన సినిమా 'చథా పచ్చ'. రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. అద్వైత్ నాయర్ దర్శకుడు. తొలుత తెలుగులోనే జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు గానీ వాయిదా వేశారు. నిన్ననే అంటే ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇంతలోనే ఇప్పుడు ఓటీటీ డేట్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

    'చథా పచ్చ' విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి(అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి(రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్, కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. లిటిల్, సవి.. కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. వీళ్లకు వెట్రి ఎందుకు దూరంగా ఉ‍న్నాడు. లిటిల్, సవి మొదలుపెట్టిన రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

  • సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యామినీ ఈఆర్.. టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'క్వీన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాళ్లమీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు.

    తను ప్రేమించిన వ్యక్తి కలని నిజం చేస్తూ, అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే మూవీలో కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్. ఈ మూవీలో కీలకమైన తండ్రి పాత్ర కోసం 90స్ హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.

  • యవ్వనం కొవ్వొత్తిలా కరిగిపోయినా సరే.. కానీ తాను మాత్రం పెళ్లి చేసుకోనని మొండిగా కూర్చున్నాడు ప్రముఖ నటుడు జితేంద్ర కుమారుడు, నటుడు తుషార్‌ కపూర్‌. అయితే పెళ్లికి విరుద్ధమే కానీ, తండ్రవడానికి కాదని సింగిల్‌ పేరెంట్‌ అయ్యాడు. పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రయిన తొలి బాలీవుడ్‌ సెలబ్రిటీగా గుర్తింపు పొందాడు. తాజాగా ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

    అక్కడే నేర్చుకున్నా..
    తుషార్‌ కపూర్‌ మాట్లాడుతూ.. మా నాన్నలాగే నేను కూడా పాతకాలం మనిషిని. కాకపోతే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండేవి. ఐదేళ్లు అమెరికాలో ఉండటం వల్ల ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నాను. పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఓ బిడ్డకు తండ్రయ్యాను. మా నాన్న అలా కాదు. తను పెళ్లిని గౌరవిస్తాడు. కుటుంబ బంధాలను నమ్ముతాడు.

    40 ఏళ్లకు తండ్రినయ్యా..
    నేను కాస్త మొహమాటస్తుడినే. ఎక్కువగా బయట కూడా తిరగను. అయితే ఒక పిల్లవాడిని పెంచడం పెద్ద కష్టమేమీ కాదు. 40 ఏళ్ల వయసులో తండ్రయ్యాను. తండ్రవడానికి అదే సరైన సమయం అని భావిస్తాను. మన సమాజం మాత్రం 25 ఏళ్లకే పెళ్లి, పిల్లలు అని గోల మొదలుపెడుతుంది. నేను కూడా పెళ్లిని గౌరవిస్తాను, నమ్ముతాను. కానీ ఎందుకో అది నాకు సూటవదనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు.

    ఆ జర్నీ వల్లే..
    39 ఏళ్ల వయసులో ఓసారి తిరుపతికి వెళ్లాను. అప్పుడే నటుడు, నిర్మాత ప్రకాశ్‌ జాను కలిశాను. తిరుపతి నుంచి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు మా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇద్దరం కాసేపు కూర్చుని కాలక్షేపం చేశాం. అప్పుడే అతడో మాటన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ సింగిల్‌ పేరెంట్‌ అవొచ్చుగా.. అదొకసారి ఆలోచించు అన్నాడు. అతడి కుటుంబంలో ఒక అమ్మాయి ఇలాగే సింగిల్‌ పేరెంట్‌ అయిందని తెలిపాడు.

    సినిమా
    వెంటనే నాక్కూడా ఓ బిడ్డ కావాలనిపించింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పటికప్పుడు అన్నీ తెలుసుకుని, ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు. చివరకు ఐవీఎఫ్‌, సరోగసి ద్వారా తండ్రినయ్యాను అని తుషార్‌ చెప్పుకొచ్చాడు. తుషార్‌ కపూర్‌.. ముజే కుచ్‌ కెహ్నా హై, గాయబ్‌, గోల్‌మాల్‌, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, షోర్‌ ఇన్‌ ద సిటీ, ద డర్టీ పిక్చర్‌, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'వెల్‌కమ్‌ టు ద జంగిల్‌' మూవీ చేస్తున్నాడు.

    చదవండి: సూర్య-జ్యోతిక ప్రేమను ఒప్పుకోని హీరో తండ్రి

  • 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు.

  • ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత విక్రమ్‌ భట్‌ ఆర్థిక మోసం కేసులో చిక్కుకున్నాడు. దాదాపు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రమ్‌ దంపతులను పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ చేశారు. అయితే ఈ కేసులో విక్రమ్‌, అతడి భార్య శ్వేతాంబరి భట్‌లకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

    హీరోయిన్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ ఏమందంటే?
    ఇదే సమయంలో పలువురు ఆర్టిస్టులు విక్రమ్‌ తమకు సరిగా జీతాలివ్వలేదని ముందుకొస్తున్నారు. 2023లో వచ్చిన 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌, ఖిలోనా (ఇది మధ్యలోనే ఆగిపోయింది) సినిమాలకు టెక్నీషియన్లకు డబ్బు చెల్లించలేదని పలువురు మీడియా ముందుకొచ్చారు. తాజాగా హీరోయిన్‌ అవికాగోర్‌కు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసిన స్నేహ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించింది.

    స్పందన లేదు
    మిడ్‌డేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహ శర్మ మాట్లాడుతూ.. 1920: హారర్స్‌ ఆఫ్‌ ద హార్ట్‌ సినిమాకు పని చేసిన చాలామందికి పూర్తి వేతనాలు చెల్లించలేదు. మా జీతాలు మాకు చెల్లించమని అడుక్కుంటున్నాం.. కానీ విక్రమ్‌ భట్‌ టీమ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ నుంచి సరైన స్పందన రావడం లేదు. ఒక హెయిర్‌స్టైలిస్ట్‌కి అయితే ఇంటి అద్దె కట్టకపోవడంతో అతడిని ఇంటినుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. మొదట్లో మాకు సమయానికి డబ్బు చెల్లించారు.

    సగమే ఇచ్చి..
    కానీ రెండో షెడ్యూల్‌కు వచ్చేసరికి నిధులు లేవన్నారు. ఓపక్క డబ్బు లేదంటూనే మరో పక్క కొత్త సినిమాను కూడా మొదలుపెట్టారు. 1920 మూవీ కోసం నాకు రోజుకు రూ.18 వేల లెక్కన డీల్‌ మాట్లాడుకున్నాను. అయితే అందులో నాకు సగమే ఇచ్చారు. విక్రమ్‌ భట్‌ కూతురు కృష్ణ భట్‌ను అడిగితే ఆ లెక్కలేవీ తనకు తెలియదంది. పైగా మరికొన్ని రోజులు ఉచితంగా పని చేయమని కోరింది.

    పైసా ఇవ్వడు
    డబ్బు ఇవ్వకపోతే నేనెందుకు పని చేస్తానని కరాఖండిగా రానని చెప్పేశాను. దాంతో మరో మేకప్‌ ఆర్టిస్ట్‌తో ఉచితంగా పని చేయించుకున్నారు అని చెప్పుకొచ్చింది. విక్రమ్‌ భట్‌ మనమంతా ఒకే కుటుంబం అని సెంటిమెంట్‌ డైలాగ్‌ చెప్పి అందరితో ఇలాగే పని చేయించుకుంటాడని, డబ్బు మాత్రం సరిగా ఇవ్వడని పలువురు సిబ్బంది వాపోయారు. కొందరికైతే లక్షలు ముట్టాల్సింది ఉందని, అవేవీ ఇవ్వకుండా మోసం చేశాడంటున్నారు.

    చదవండి: సూర్య -జ్యోతిక ప్రేమను ఒప్పుకోలేదు: హీరో తండ్రి

  • అల్లు వారి కుటుంబంలో పెళ్లి హడావుడి మొదలైపోయింది. బన్నీ సోదరుడు శిరీష్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనికతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. రెండు రోజుల క్రితమే పసుపు దంచుడు కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రేమకథ గురించి, కాబోయే భార్యతో క్యూట్ మూమెంట్స్ ఉన్న వీడియోని షేర్ చేశాడు.

    శిరీష్.. తనకు కాబోయే భార్య నయనికకు 'క్యూటేష్' అనే ముద్దుపేరు పెట్టుకున్నాడు. వీడియోలో అదే విషయాన్ని చూపించాడు. ప్రపంచం తమని కలిపిందని చెప్పుకొచ్చాడు. పారిస్ వీధుల్లో కొన్ని రొమాంటిక్ క్షణాల్ని చూపించడంతో పాటు నిశ్చితార్థానికి సంబంధించిన విజువల్స్‌ని చూపించాడు. ఇకపోతే మార్చి 6న శిరీష్-నయనిక పెళ్లి జరగనుంది.

  • ‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్‌ అల్లు అర్జున్‌కి రావడం, జవాన్‌ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్‌తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్‌ ఇటు బాలీవుడ్‌లో  సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌ సంఘటన తర్వాత అల్లు అర్జున్‌ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్‌గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి.  తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్‌ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    వివాదమా? బాలీవుడ్‌ వ్యూహమా?
    ఇండియన్‌ ఐకాన్‌ స్టార్‌  అల్లు అర్జున్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓ బ్రాండ్‌ స్ట్రాటజిస్ట్‌  అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్‌ పేరు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.

    అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్‌ పెరుగుతున్న పాన్  ఇండియా క్రేజ్‌ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    అయితే ఇలా టాలీవుడ్‌ స్టార్స్‌పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్‌ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్‌ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు.   బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన  దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

    అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందన..
    తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించి వైరల్‌ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్‌ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్‌ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు  ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్‌ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. 

    ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్‌ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

  • ప్రేమించడం ఈజీయేమో కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం మాత్రం కొంత కష్టమైన పనే! కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సూర్య- జ్యోతిక ప్రేమాయణం హీరో తండ్రి, నటుడు శివకుమార్‌కు ఏమాత్రం ఇష్టం లేదట. కానీ సూర్య పట్టుపట్టి సాధించి, ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విశేషాలను శివకుమార్‌ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

    జీవితాంతం ఒంటరిగానే..
    శివకుమార్‌ మాట్లాడుతూ.. మొదట్లో సూర్య ప్రేమను నేను ఒప్పుకోలేదు. పెళ్లంటూ చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానన్నాడు. వెంటనే నాకు నేను నటించిన 150 సినిమాలు కళ్లముందు కదిలాయి. అందులో చాలావరకు ప్రేమకథలే ఉన్నాయి. దీంతో వెంటనే అతడి ప్రేమను అంగీకరించాను.

    ఎలా ఉండేవాడు?
    వాడు మొదట్లో చాలా బిడియంగా ఉండేవాడు. రాధికా శరత్‌కుమారే వాడిని జ్యోతికతో మాట్లాడించింది. అలా మొదలైన మాటలు తర్వాత ప్రేమకు దారితీశాయి. ఎంతో మొహమాటంతో ఉండే వీడేనా ఈరోజు ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని శివకుమార్‌ సరదాగా చెప్పుకొచ్చాడు.

    ప్రేమ- పెళ్లి
    సూర్య, జ్యోతిక అనేక సినిమాల్లో కలిసి నటించారు. 'పూవెల్లం కేట్టుప్పార్‌' మూవీ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ 2006 సెప్టెంబర్‌ 11న పెళ్లితో మరింత బలపడింది. ఈ దంపతులకు కూతురు దియా, కుమారుడు దేవ్‌ సంతానం. సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం 'కరుప్పు' సినిమా చేస్తున్నాడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వేసవిలో విడుదల కానుంది. అలాగే హీరోయిన్‌ నజ్రియాతో సూర్య మరో సినిమా చేస్తున్నాడు.

    చదవండి: కొడుకు- కోడల్ని అభినందించిన మెగాస్టార్‌

  • యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ‘సీతా పయనం’. ముందుగా ఈ చిత్రంలో హీరోగా విశ్వక్‌ సేన్‌ అనుకున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్‌ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతొ విశ్వక్‌ ప్లేస్‌లో కన్నడ స్టార్‌ ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్‌ని హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు అర్జున్‌. కూతురు డెబ్యూ ఫిల్మ్‌ అవ్వడంతో ప్రమోషన్స్‌ భారీగా చేశాడు.మొత్తానికి రిలీజ్‌కి ముందే సీతా పయనంపై హైప్‌ అయితే క్రియేట్‌ అయ్యేలా చేశారు. మంచి అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    వైజాగ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్‌(సత్య రాజ్‌)కి కూతురు సీత(ఐశ్వర్య అర్జున్‌) అంటే ప్రాణం. తల్లి లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. కూతురికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందని భావిస్తాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి టాపిక్‌ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఓ రోజు వర్క్‌ షాప్‌ కోసం వైజాగ్‌ నుంచి తన కారులో హైదరాబాద్‌కి బయలు దేరుతుంది. మార్గ మధ్యలో అభి(నిరంజన్‌) పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటి? ఆ సంఘటనల వల్ల సీతలో వచ్చిన మార్పు ఏంటి? సీత ప్రయాణంలో గిరి(అర్జున్‌), బసవన్న(ధృవ్‌ సర్జా) ఎలా భాగమయ్యారు? పెళ్లే వద్దనుకున్న సీత..చివరకు అభితో ప్రేమలో ఎలా పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    ఎలా ఉందంటే.. 
    సీతా పయనం కొత్త కథేమీ కాదు. మనం ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలతోనే అర్జున్  ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్నిఈ కథ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే.. . తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే విషయాలను గొప్పగా చూపించారు. వీటితో పాటు గో రక్షణ గురించి ఓ ఎపిసోడ్‌ని యాడ్‌ చేశారు. ఈ సినిమాలో ఉన్న మరో గొప్పదనం ఏంటంటే.. ఇందులో అందరూ మంచి వాళ్లే. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఒకటి, రెండు పాత్రలు కూడా ఒక్క సీన్‌తో మంచి వాళ్లు అయిపోతాయి. ఇదంతా చెప్పుకోవాడానికి బాగానే ఉన్నా.. తెరపై చూస్తుంటే మాత్రం అంత రక్తి కట్టించదు. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ‘సీతా పయనం’ చాలా సాఫీగా సా..గుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే కానీ.. కూర్చొబెట్టి హితబోధ చేసినట్లుగా అనిపిస్తుంది.

    తండ్రి కూతురు బాండింగ్‌ని చూపిస్తూ కథ ప్రారంభించాడు దర్శకుడు. కూతురుకి పెళ్లి చేయాలని తండ్రి.. పెళ్లి టాపిక్‌ వస్తేనే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్‌ చేసే కూతురు..మొదటి పది నిమిషాల కథంతా ఇలానే రొటీన్‌గా ఉంటుంది. ఇక సీత వర్క్‌ షాప్‌ కోసం హైదరాబాద్‌కి బయలుదేరినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. మార్గ మధ్యలో అభి పరిచయం అవ్వడం.. గిరి పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఇవన్నీ మొదట రొటీన్‌గానే అనిపించినా.. ఇంటర్వెల్‌ తర్వాత ఆయా సన్నివేశాల వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కి సీత ప్రయాణం ఉంటే.. సెకండాఫ్‌ రిటర్న్‌ జర్నీ ఉంటుంది.  ధృవ్‌ సర్జా ఎపిసోడ్‌ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్‌ భావోద్వేగానికి గురి చేస్తుంది. కొత్తదనం ఆశించకుండా, ఫ్యామిలీతో కలిసి ఓపికతో ఫీల్‌ గుడ్‌ మూవీ చూడాలనుకునేవారిని ‘సీతా పయనం’ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

    ఎవరెలా చేశారంటే..
    సీత పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే డబ్బింగ్‌ విషయం ఇంకాస్త కేర్‌ తీసుకుంటే బాగుండేదేమో. ఇక అభి పాత్రకు నిరంజన్ న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్‌ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. యాక్షన్‌ సీన్లని కూడా బాగానే చేశాడు. ఇక హీరోయిన్‌ తండ్రిగా సత్యరాజ్‌ రెగ్యులర్‌ పాత్రను చేశాడు. హీరో తాతా, ఊరి పెద్దగా ప్రకాశ్‌ రాజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి పాత్ర ఆయన కొత్తేమి కాదు.  బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, సెట్ వర్క్  బాగానే కుదిరింది. కూతురు కోసం నిర్మాతగా మారిన అర్జున్‌.. ఈ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. 
    - రేటింగ్‌ : 2.75/5

     

  • 'హిట్' ఫ్రాంచైజీ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్నీ థ్రిల్లర్సే తీశాడు. ఇప్పుడు రూటు మార్చి తొలిసారి ఓ ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు. అదే 'ఏమో ఏమో ఇది'. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో కాగా ప్రీతి ముకుందన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ బ్రీజ్ పేరిట సినిమా కాన్సెప్ట్ ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు.

    సింగల్ మదర్ పెంపకంలో పెరిగే అభయ్(రోషన్).. ఓ కెఫే యజమాని అయిన అపూర్వ(ప్రీతి ముకుందన్)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఈ జర్నీలో ఏమేం జరిగింది? అనేది సినిమా స్టోరీలా అనిపిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతమందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరాకే థియేటర్లలోకి మూవీ వస్తుందని ప్రకటించారు. గతంలో 'పెళ్లి సందD', 'ఛాంపియన్' చిత్రాలు చేసిన రోషన్.. వాటితో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈసారి ఏం చేస్తాడో చూడాలి?

  • 'కోర్ట్' సినిమాతో గతేడాది హిట్ కొట్టిన జంట శ్రీదేవి-రోషన్. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే నెల 13వ తేదీన థియేటర్లలోకి రానుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఎమోషనల్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు. బ్రేకప్ అయినప్పుడు హీరో బాధపడుతున్నట్లు ఇందులో చూపించారు.

    'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఇది తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. సతీష్ జవ్వాజి దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించాడు. మరి రోషన్-శ్రీదేవి ఈసారి ఏం చేస్తారో చూడాలి? గ్లింప్స్‌లో ఎమోషన్ చూపించినప్పటికీ.. హీరో, తన ఫ్రెండ్‌కి తాళి కట్టడం ఫన్నీగా అనిపించింది.

  • కవల పిల్లల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు క్లీంకార పుట్టగా ఈ ఏడాది జనవరి 31న కవలలు (బాబు, పాప) జన్మించారు. వీరికి ఫిబ్రవరి 11న బారసాల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగా, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. 

    అర్థవంతమైన పేర్లు
    కుమారుడికి శివరామ్‌ కొణిదెల అని, కుమార్తెకు అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు నోరు తిరగని పేర్లు పెడుతున్నారు. ఎంత వెరైటీగా ఉంటే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ రామ్‌చరణ్‌ దంపతులు మాత్రం ఆధ్యాత్మిక భావనకు పెద్ద పీట వేస్తూ మంచి అర్థవంతమైన పేర్లు పెట్టారు. ఈ విషయంపై తమను చాలామంది అభినందిస్తున్నారంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

    కొడుకు-  కోడల్ని అభినందించిన చిరంజీవి
    స్నేహితులు, బంధువులు, అభిమానులు... ఇలా అందరూ కవలల పేర్లు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో చరణ్‌, ఉపాసనను అభినందించాల్సిందే! ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా, దేవుడి ఆశీర్వాదం లభించేలా ఎంతో పవిత్రమైన పేర్లను ఎంచుకున్నారు. అందుకు నాకెంతో గర్వంగా ఉంది. మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది.

    ముందు తరాలకు మార్గనిర్దేశం
    భక్తి, సంస్కృతి మేళవించిన ఈ పేర్లు ముందు తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఉన్నాయి. అలాగే చరణ్‌.. అతడి నానమ్మ అంజనాదేవి పేరు వచ్చేలా కూతురికి అన్వీరా 'దేవి' పేరు పెట్టడం నా మనసును కదిలించింది. చరణ్‌, ఉపాసనతో పాటు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి అని పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌కు ఉసాపన.. లవ్యూ మామయ్య అని కామెంట్‌ పెట్టింది.

     

     

    చదవండి: రాజాసాబ్‌లో డూప్‌.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

  • దర్శకులందరూ హీరోలవుతున్నారు. అలా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కూడా 'డీసీ' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు. నేడు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా.. బ్లడీ వాలంటైన్‌ అంటూ డీసీ గ్లింప్స్‌ వదిలారు. అందులో ప్రేమ కన్నా రక్తపాతమే ఎక్కువ చూపించారు. లోకేశ్‌ పీకలు కోస్తూ కనిపించాడు. చివర్లో కారుపై కూడా రక్తమే కనిపిస్తోంది. చిన్న వీడియోలోనే ఇంత వయొలెన్స్‌ ఉంటే సినిమాలో ఎంతుంటుందో చూడాలి!

    డీసీ విషయానికి వస్తే.. లోకేశ్‌ దేవదాస్‌గా, వామిక గబ్బి.. చంద్ర పాత్రలో కనిపించనున్నారు. వీరి పేర్ల కలయిక ఆధారంగానే డీసీ (దేవదాస్‌ + చంద్ర) అని టైటిల్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకతత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్‌ చేయనున్నారు. కాగా ఖైదీ, విక్రమ్‌, కూలీ సినిమాలతో దర్శకుడిగా క్రేజ్‌ అందుకున్న లోకేశ్‌ హీరోగా ఎలాంటి సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి!

     

    చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శివ జ్యోతి

National

  • బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్‌లోని  బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖ్‌ప్రీత్ కౌర్ (8) కూతురు, ఫతేవీర్ (6) కుమారుడు ఉన్నారు. జస్సీ కౌర్‌కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా.. పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ చేసింది.

    అక్రమ సంబంధం మత్తులో ఉన్న జస్సీ కౌర్ తన పిల్లలను హత్య చేయడానికి కుట్ర పన్నింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్‌ప్రీత్ కౌర్‌కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని మృతిచెందింది. ఆ పాప అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, చుట్టుపక్కల వారిని, బంధువుల్ని నమ్మించింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఆరేళ్ల కొడుకు ఫతేవీర్‌ కౌర్‌కు కూడా ఎలుకల మందు కలిపిన ఆహారం పెట్టింది.

    శనివారం ఆ బాలుడు కూడా మరణించాడు. ఈ విషాదకర ఘటన రెండు వారాల వ్యవధిలో జరిగింది. 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల బాలిక సుఖ్‌ప్రీత్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించగా, శుక్రవారం రాత్రి ఆమె ఆరేళ్ల తమ్ముడు ఫతేవీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వరుస మరణాలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఫూల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కన్నతల్లే హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలు జస్సీ కౌర్ తన నేరాన్ని అంగీకరించిందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.

    "మొదట 8 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ మరణించింది. నిన్న 6 ఏళ్ల ఫతేవీర్ చనిపోయాడు. ఒక పథకం ప్రకారం జస్సీ కౌర్ తన పిల్లలిద్దరినీ చంపేసింది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుందని పోలీస్ అధికారి మనోజ్‌ కుమార్ పేర్కొన్నారు. జస్సీ కౌర్‌కు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్‌తో పాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • ఇప్పుడు దొంగతనాల ట్రెండ్‌ కూడా మారిపోయినట్లు ఉంది.  ముసుగులు వేసుకుని రాత్రి పూట కన్నాలకు వెళుతూ ఉంటారు  కదా.. వారినే సాధారణంగా దొంగలు అనుకుంటాం. ఇప్పుడు దొంగలు కూడా ముదరిపోయినట్లే ఉన్నారు..  వాడు దొంగ అని ముఖం మీద ఏమీ రాసుండదు కాబట్టి వారు కూడా మనలోనే కలిసిపోతున్నారు. 

    మనతో పాటు ఉన్నట్లే  ఉండి వారికి కావాల్సింది దోచుకుపోతున్నారు. ఇటీవల జరిగిన పెళ్లి రిసెప్షన్‌లో జరిగిన చోరీ చూస్తే వీడు నిజంగానే భలే దొంగ అనక తప్పదు. దొంగల్లో భలే దొంగలు ఉండరు.. కానీ చోరీ చేసిన విధానం.. వాడు భలే దొంగ అని కచ్చితంగా అనుకుంటాం​. వారం రోజుల క్రితం రాజస్థాన్‌లోని జగత్పురాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో జరిగిన చోరీ చూస్తే ఔరా అనిపిస్తోంది. 

    పెళ్లి విందు సందర్భంగా వధువు స్టేజ్‌పై ఉంచిన బ్యాగ్‌ను దొంగ దొంగిలించాడు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ. 4 లక్షల నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఎవరికీ తెలియకుండా దొంగ ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. పెళ్లి కొడుకు, వధువు స్టేజ్‌పైకి వచ్చిన వారితో మాట్లాడుతున్న సమయంలో వధువు పక్కనే ఉన్న బ్యాగ్‌ను ముందే పసిగట్టిన ఆ దొంగ.. దాన్ని వెనకాల నుంచి అతిథిలా వచ్చి తీసుకెళ్లిపోయాడు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • మీ స్కూల్‌ గ్రౌండ్‌లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్‌ అప్లికేషన్‌ను తయారు చేసింది. 

    ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్‌ చేసేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్‌ ఫోన్‌ లేదా వెబ్‌ బ్రౌజర్‌ ఉంటే చాలు ఈ అప్లికేషన్‌ పనిచేస్తుంది. దీనికి ఇన్‌స్టాలేషన్‌ కూడా అవసరం లేదు. 

    ఇదీ చదవండి: డ్యాన్సర్‌ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం

    ఈ యాప్‌ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్‌ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్‌ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్‌లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్‌ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్‌   ప్రొఫెసర్‌ ప్రతీప్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్‌ బోధనను  ప్రోత్సహించే కేరళ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్‌ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్‌ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్‌ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్‌ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.

    ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?

  • ఢిల్లీ: ఫోమో, గోట్‌, వైబ్‌, బెట్‌..ఇవి జెన్‌జీలు తరచుగా వినియోగించే పదాలు. కానీ వాటికి బదులుగా ‘మై లార్డ్‌, విత్‌ డ్యూ రస్పెక్ట్‌, లెర్న్‌డ్‌ కౌన్సిల్‌, జ్యూరిస్డిక్షన్’ అనే పదాలతో ఓ 19 ఏళ్ల యువకుడు దేశ అత్యున్నత న్యాయస్థానంలో తన కేసును తానే వాదించాడు. ‘Need ten minutes’ అంటూ  కేసులో విజయం సాధించాడు. న్యాయశాస్త్రంలో అనుభవజ్ఞులైన న్యాయవాదులు సైతం కొన్నిసార్లు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు చేయడానికి వెనుకాడుతారు. అలాంటి పిటిషన్‌ను తానే స్వయంగా దాఖలు చేసి, తన వాదనలతో న్యాయమూర్తులను ఒప్పించాడు.

    సుప్రీంకోర్టు హాలు న్యాయమూర్తులు, సీనియర్‌ అడ్వకేట్లు, అసోసియేట్‌ లాయర్లు, జూనియర్‌ లాయర్లు, వాదులు, ప్రతివాదులతో కిక్కిరిసిపోతున్న సమయంలో, చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఎదుట టెన్‌ మినిట్స్‌ మోర్‌ అనే గొంతు వినిపించింది. ఆ గొంతు నిష్ణాతులైన న్యాయమూర్తి గొంతు అని అనుకుంటే పొరబడినట్లే.. 12వ తరగతి పూర్తి చేసి డాక్టర్‌ కావాలని కలలు కంటున్న 19 ఏళ్ల అథర్వ్‌ చతుర్వేది గొంతు. సరిగ్గా పది నిమిషాల తర్వాత అతనికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 

    సుప్రీం కోర్టు ఆర్టికల్‌ 142 కింద తన ప్రత్యేక అధికారాలను వినియోగించి, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అథర్వ్‌తో పాటు అర్హులైన Economically Weaker Section (EWS) అభ్యర్థులకు ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది.

    వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కి చెందిన లాయర్‌ మనోజ్‌ చతుర్వేది కుమారుడు అథర్వ్‌,  నీట్‌ పరీక్షలో ఒకసారి కాదు రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాడు. 530 మార్కులు సాధించినప్పటికీ ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ పొందలేకపోయాడు. కారణం ప్రైవేట్‌ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం. అదే సమయంలో ఇతర కోటాలో అర్హులైన అభ్యర్థులు అడ్మిషన్‌ పొందినట్లు అతను గమనించాడు.



    ఈ నేపథ్యంలో, జనవరి 6న సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశాడు. విచారణలో కోర్టు, విధానపరమైన లోపాల కారణంగా అథర్వ్‌ లాంటి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని గుర్తించింది. వాదన సమయంలో తగిన సమయం లేదని భావించిన అథర్వ్‌ పది నిమిషాలు అదనంగా కావాలి’ అని చీఫ్‌ జస్టిస్‌ను కోరాడు. ఆ పది నిమిషాల తర్వాతే అతనికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో 2025-26 సెషన్‌లో అతనికి ఎంబీబీఎస్‌ సీటు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన కేసును తానే వాదించి విజయం సాధించిన అథర్వ్‌, ఇప్పుడు వైద్య విద్యను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.

    ఇదే అంశంపై  జబల్‌పూర్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన వాదనలు వినిపించాడు. అథర్వ్‌ వాదనలతో ముగ్ధులైన జబల్‌పూర్‌ హైకోర్టు న్యాయమూర్తి సైతం అతనిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు డాక్టర్ కాదు, న్యాయవాదిగా రాణించాలి. నువ్వు ఎంచుకున్న రంగం తప్పేమో అంటూ ప్రోత్సహించారు’ అని పలు జాతీయా మీడియా  మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

  • బిహార్‌లో జరిగిన ఘటన ఒకటి  తీవ్ర దిగ్భ్రాంతిని  రేపింది. ఒక ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేస్తున్న మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

    బిహార్‌లోని భోజ్‌పూర్‌లో చంద్వా తోలా ప్రాంతంలో జరిగిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వేలాదిమంది గుమిగూడిన జనం మధ్యం వేదికపై  న్యృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో డ్యాన్స్‌ చేస్తున్న నృత్యకారిణిపట్ల కొంతమంది ఆకతాయిలు  నీచంగా ప్రవర్తించారు. ఆమె డ్యాన్స్‌ చేస్తుండగా కొంతమంది నాణేలు విసిరారు. మరికొంతమంది అంతటితో ఆగలేదు.  నాణేలను బలవంతంగా నోటిలోకి దూర్చి, మింగించారు. దీంతో ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి  అయిపోవడంతో  వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో పరిస్థితి అదుపు పోలీసులు జోక్యం చేసుకుని,  అత్యవసర చికిత్స కోసం ఆమెను అరా సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గొంతు నుండి నాణేలను తొలగించారు. ప్రస్తుతం  ఆమె పరిస్థితి విషమంగా ఉందని,  మరో  24 గంటలు గడవాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.

    ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

    తన  భార్య వేదికపై నృత్యం చేస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టడంతో  మింగేసిందనీ, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని బాధితురాలి భర్త రాజు కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు, ఇతర జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షులు , ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.

    ఇదీ చదవండి: బెంగళూరులో తొలి స్టోర్‌ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్‌’ సీఈవో

  • ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ భారతదేశంలో తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో తన తొలి స్టోర్‌ను  లాంచ్‌ చేసింది. ఈ  ప్రారంభోత్సవం సందర్బంగా ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.


    నథింగ్ సిగ్నేచర్ బ్రాండింగ్‌తో  సరిపోలేలా అద్భుతమైన తెల్లటి ఆటోలో సీఈవో CEO కార్ల్ పీ  స్టోర్‌కు రావడం అభిమానులకు ఆకట్టుకుంది. ఆటోలో ఆయన్ని చూడగానే అక్కడ గుమిగూడిన అభిమానుల హర్ష ధ్వానాలు చేశారు. వారి కరతాళ ధ్వనుల మధ్య స్టోర్‌లోకి  బెంగళూరు స్టైల్‌లో కాలు పెట్టారు పీ. ఫ్లాగ్‌షిప్ అవుట్‌లెట్ వెలుపల భారీ జనసమూహం క్యూలైన్లలో వేచి ఉన్నారు.ఆయన రాకతో,అప్పటివరకూ క్యూలో వేచి ఉ‍న్న వేలాదిమంది  అభిమానుల ఉత్సాహానికి అంతులేకుండాపోయింది.

    ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

    "> ఇండియాలో ప్రత్యేకంగా బెంగళూరునే తమ తొలి అవుట్‌లెట్ కోసం ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నథింగ్ అతిపెద్ద మార్కెట్లలో దేశం ఒకటి అని, తమ వినియోగదారులు చాలా మంది భారతదేశంలో మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ బలమైన టెక్ కమ్యూనిటీ కూడా ఉంది, కాబట్టి ఇక్కడ ప్రారంభించడం సహజంగా అనిపించిందన్నారు.  

    ఈ సందర్బంగా ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన బెంగళూరు వాసులకు పీ ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. దీంతో నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నథింగ్‌ బ్రాండ్‌కు కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, మరికొంతమంది లాంచ్ స్థాయిని చూసి ఆశ్చర్య పోయామన్నారు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో నథింగ్‌ బ్రాండ్‌కు  పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు

  • ఢిల్లీ: దేశ రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది.  నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

    అదే విధంగా  61 కిలోమీటర్ల మేర  నోయిడా గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో నెట్‌వర్క్ నిర్మాణానికి కేటాయింపులు చేపట్టనున్నట్లు  తెలిపింది. రూ. లక్ష కోట్ల కేంద్ర సహాయంతో   రూ. 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఫైనాన్స్ మార్కెట్ క్రియేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.  

    స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో రెండు లక్షల  స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింతగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది.

  • మహరాష్ట్ర: ముంబైలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌ కుప్ప కూలింది. ఈ ఘటనలో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. నలుగురికి గాయాలు కాగా..బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

  • భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహ వేడుక ఒక పేదవారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. పెళ్లి సందర్భంగా నిర్వహించే బారత్ ఊరేగింపులో ఒక వ్యక్తి గన్ను పేల్చారు. దురదృష్టవశాత్తు అది 15 ఏళ్ల బాలుడికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

    భోపాల్‌లో గురువారం రాత్రి   పెళ్లి సందర్భంగా ఓకుటుంబ సభ్యులు వేడుక నిర్వహించారు. దీంతో బ్యాండు బాజా నిర్వహించి డ్యాన్సులు చేశారు. ఓవరాక్షన్‌తో ఆ ఊరేగింపు వేడుకలో ఆ పెళ్లికి సంబంధించిన  గుర్తుతెలియని వ్యక్తి పిస్తోలు కాల్చారు. అయితే ఆ తూటా పక్కనే ఉ‍న్న వివేక్ అనే15ఏ‍ళ్ల బాలుడి ఛాతిలోకి వెళ్లడంతో ఆ తీవ్రగాయాల పాలయ్యాడు.

    అయితే వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పక్కనే ఉన్న బుందేల్‌ ఖండ్ మెడికల్ కాలేజ్‌కి మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లారు. ఆ యువకుడిని పరిక్షీంచిన డాక్టర్లు అప్పటికే వివేక్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే వారి ఇంటిలో ఆ యువకుడు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నారని ఇప్పుడు అతని మరణంతో ఆ కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని వివేక్ తరపు బంధువులు రోధిస్తున్నారు.

    యువకుడి మరణ వార్త విని ఆసుపత్రి ఎదుటకు పెద్దఎత్తున బాధితుడి బంధువులు చేరుకున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామని మరోకరి కోసం గాలింపులు చేపడుతున్నామని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే ఘటనపై సీసీకెమెరాలతో పాటు డ్రోన్‌ చిత్రాలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.               

Business

  • భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.

    భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.

    స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.

    బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.

    ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!

  • హోండా మోటార్‌సైకిల్‌ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

    హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్‌తో లభిస్తుంది.

    సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

  • బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

    ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.

    చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.

    సిల్వర్ ధరలు
    గత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.

    ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

  • ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.

    ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.

    ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!

    ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్‌టెక్ (సూపర్‌వైజరీ టెక్నాలజీస్) & రెగ్‌టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు.

  • ⁠వీకెండ్‌ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్‌ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్‌ హోమ్స్‌ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్‌ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్‌ హోమ్స్‌లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో  

    ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.

    ఎవరు కొంటున్నారంటే.. 
    విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్‌ హోమ్స్‌ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్‌ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్‌ హౌస్, ఓపెన్‌ జిమ్‌ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.

    అద్దెకు కూడా.. 
    వీకెండ్‌ హోమ్స్‌ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్‌ హోమ్స్‌ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్‌ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్‌ హోమ్స్‌ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్‌ హోమ్స్‌ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్‌ వెండింగ్స్‌ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.

    ఈ ప్రాంతాలలో డిమాండ్‌.. 
    నగరం ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్‌పల్లి, జహీరాబాద్‌ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్‌నగర్, శంకర్‌పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌ ఉంది. చార్టెడ్‌ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.

    కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్‌ హోమ్స్‌ను డిజైన్‌ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.

  • చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.

    ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.

    హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్‌ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.

    కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది.

  • సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.

    ఈసారి మెరుగైన చెల్లింపులు
    ఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

    కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం..  గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.

    ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్‌హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.

    ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం.

  • కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2013లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్‌బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.

    నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.

    కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?

  • అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ జోన్‌కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.

    కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

    ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.

    విదేశీ నివాస కాలం కీలకం

    మీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.

    బంగారం నిబంధనలు

    భారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

    గోల్డ్ బార్లు.. కాయిన్స్

    ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.

    మద్యం, నగదు పరిమితులు

    విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీ
    నగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.

    ‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?

    కస్టమ్స్‌ క్లియరెన్స్‌లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్‌గా పర్సనల్‌ యూజ్‌ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.

    సురక్షిత ప్రయాణం కోసం సూచనలు

    కస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.

    -దవనం శ్రీకాంత్

  • టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్‌లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్‌ఎంఎస్‌కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

    భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితా

    ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

    బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)
    యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14
    కెనరా బ్యాంక్506.28
    పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45
    సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72
    ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89
    బ్యాంక్ ఆఫ్ బరోడా202.42

     

    గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 2020 నుంచి ఎస్‌ఎంఎస్‌ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.

    ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?

    ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్‌ఎంఎస్‌కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్‌ఎంఎస్‌ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్‌టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.

    కేవలం ఎస్‌ఎంఎస్‌లే కాదు.. ఏటీఎంలు కూడా!

    గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్‌డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.

    సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్‌ఎంఎస్‌లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్‌బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.

    ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

  • విలాసవంతమైన గృహ విభాగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గృహ కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సంస్థలు ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవసీ, భద్రత, గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచి్చన బిల్డర్లు.. ఇప్పుడు కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. లగ్జరీ ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసుల నుంచి ఈ తరహా ఇళ్లకు విపరీతంగా డిమాండ్‌ ఉంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఇటువంటి ఫైవ్‌ స్టార్‌ హోమ్స్‌ వస్తున్నాయి.     – సాక్షి, సిటీబ్యూరో

    రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మార్కెటింగ్‌ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్‌ వాడటంతో అర్థమే మారిపోయింది. కొందరు మాత్రమే ఈ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండటంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీకి పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదు నక్షత్రాల రేటింగ్‌ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్‌ ప్రమాణాలను పెంచడంతో పాటు నివాసం ఉండేవారికి స్టార్‌ హోటల్‌ మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి.

    హోటల్స్, ఫ్యాషన్‌ డిజైనర్లతో ఒప్పందం 
    ఇంటర్‌ కాంటినెంటల్, మారియట్, తాజ్, రిడ్జ్, కార్ల్‌టన్, లీలా వంటి స్టార్‌ హోటల్‌ బ్రాండ్స్, అబూజానీ, సందీప్‌ ఖోస్లా వంటి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లతో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం చేసుకొని గృహ నిర్మాణాలను చేపడుతున్నాయి. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్‌ క్లాస్‌గా ఉంటాయి. నివాసితులకు అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని అందించడమే ఈ గృహాల ప్రత్యేకత.

    హెచ్‌ఎన్‌ఐ, ప్రవాసులు కస్టమర్లు.. 
    కరోనా  నుంచి నగరంలో హైఎండ్‌ గృహాలకు ఆదరణ పెరిగింది. ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి నేటి యువ గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. హెచ్‌ఎన్‌ఐలు, ప్రవాసులు, బిజినెస్‌ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్‌ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఇళ్ల కొనుగోలుదారులు సెకండ్‌ లేదా థర్డ్‌ హోమ్‌ బయ్యర్లు ఉంటారు. ఇందులో నివాసం ఉండటం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. హైటెక్‌ సిటీ, గచి్చ»ౌలి, రాయదుర్గం, నియోపొలిస్, నానక్‌రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్, మదీనాగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. వీటి విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభవుతుంది. ధర రూ.6 కోట్ల నుంచి ఉంటుంది.

    వీటి ప్రత్యేకతలివే.. 
    స్టార్‌ హోమ్స్‌ అంటే హోటల్‌ ఆధారిత ప్రాజెక్ట్‌లు. ఇందులో లేఔట్‌ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్‌ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్‌ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే నిర్వహిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేకంగా యాప్‌ ఉంటుంది. ఇందులో నుంచి ఫుడ్, స్పా, సెలూన్‌ వంటివి ఆర్డర్‌ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్‌ చేస్తారు. అలాగే వీటిల్లో సెవెన్‌ స్టార్‌ హోటల్‌లో మాదిరి గ్రాండ్‌ లాంజ్, డబుల్‌ హైట్‌ బాల్కనీ, హోమ్‌ ఆటోమేషన్, బ్యూటీఫుల్‌ వ్యూ, స్కై లాంజ్, స్పా, మినీ థియేటర్, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.

    ప్రైవసీ, భద్రత..
    ప్రైవసీ, భద్రత ఈ ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత. వెంటిలేషన్, ఓపెన్‌ స్పేస్, వేర్వేరుగా ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్‌మెంట్‌ ఫేసింగ్‌ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఈ డిజైనర్‌ హోమ్స్‌లో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.

  • భారతీయ విమానయాన రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో (IndiGo) తన చరిత్రలోనే అతిపెద్ద కాక్పిట్ నియామక డ్రైవ్‌లలో ఒకదాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పల విభాగాల్లో 1,000 మందికి పైగా పైలట్లను నియమించుకునేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, కెప్టెన్లు వంటి అన్ని స్థాయిలలో నియామకాలు జరగనున్నాయి.

    ఈ నిర్ణయం 2025 డిసెంబర్‌లో ఎదురైన తీవ్రమైన సిబ్బంది కొరత, ఆ కారణంగా ఏడు రోజుల్లో వేల సంఖ్యలో విమానాలు రద్దైన ఘటనల తర్వాత తీసుకున్నదిగా తెలుస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన విశ్రాంతి నిబంధనలతో (FDTL) సిబ్బంది లభ్యతపై ఒత్తిడి పెరగడంతో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యగా ఈ భారీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

    డీజీసీఏ కొత్త నిబంధనలు
    విమాన సురక్షత దృష్ట్యా డీజీసీఏ (DGCA) పైలట్లకు సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను సవరించింది. కొత్త నియమాల ప్రకారం పైలట్లకు తగిన విశ్రాంతి సమయం తప్పనిసరి.

    దీంతో రోస్టర్ నిర్వహణలో మార్పులు అవసరమయ్యాయి. కొంతకాలం తాత్కాలిక సడలింపులతో సేవలు నిర్వహించిన ఎయిర్‌లైన్లు, ఇప్పుడు పూర్తి స్థాయి అమలుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పైలట్ల అవసరం ఏర్పడింది.

    నియామకాల్లో ప్రత్యేకత
    ఇండిగో విమానాల్లో ప్రధానంగా ఎయిర్‌బస్ A320 కుటుంబానికి చెందిన విమానాలు ఉపయోగిస్తుండగా, ముందస్తు A320 అనుభవం లేకపోయినా అర్హత కలిగిన పైలట్లను తీసుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉందని సమాచారం.విమానాల సంఖ్య పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్గాల్లో విస్తరణ జరగడం, ప్రయాణికుల రద్దీ పెరగడం వంటి అంశాలు కూడా నియామకాల వేగాన్ని పెంచుతున్నాయి.

    పైలట్ల జీతాలు ఎలా ఉన్నాయంటే..
    భారతీయ విమానయాన రంగంలో పైలట్ వృత్తి అత్యంత అధిక వేతనాలు కలిగిన కెరీర్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా జీతాలు (అంచనా) ఇలా ఉంటాయి..

    ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్: నెలకు రూ.80,000 నుంచి రూ.1.5 లక్షలు
    ఫస్ట్ ఆఫీసర్ (FO): రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలు
    సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (SFO): రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షలు
    కెప్టెన్: రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ

    నడిపే విమాన రకం, అనుభవం, ఫ్లైట్ గంటలు, అంతర్జాతీయ మార్గాలు వంటి అంశాలపై ఆధారపడి ఈ మొత్తాలు మారవచ్చు.

    ఇతర భత్యాలు, సౌకర్యాలు
    జీతంతో పాటు పైలట్లకు పలు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అవి..
    లేఓవర్ అలవెన్సులు (దేశీయ, అంతర్జాతీయ)
    ఫ్లైట్ గంటల ఆధారిత ప్రోత్సాహకాలు
    మెడికల్ ఇన్సూరెన్స్ & లైఫ్ కవర్
    కుటుంబ సభ్యులకు ఉచిత/తగ్గింపు ధరల ప్రయాణ సౌకర్యం
    శిక్షణా అవకాశాలు, టైప్ రేటింగ్ మద్దతు
    పనితీరు ఆధారిత బోనసులు

    కొన్ని ఎయిర్‌లైన్లు పైలట్ల మనోబలాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతున్నాయి.

    ఇతర ఎయిర్‌లైన్లలోనూ నియామకాలు
    భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆకాశ ఎయిర్‌ (Akasa Air) వంటి కొత్త ఎయిర్‌లైన్లు కూడా పైలట్ల నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. వేతనాలు, సౌకర్యాల పరంగా పోటీ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా అనేక ఎయిర్‌లైన్లు భారత పైలట్లకు అవకాశాలు అందిస్తున్నాయి. దీనితో దేశీయంగా జీతాల నిర్మాణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

  • ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ దేశలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ సిటీ’ సారథ్య బాధ్యతలను చేపట్టారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ(గిఫ్ట్ సిటీ) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

    హస్ముఖ్ అధియా స్థానంలో కోటక్

    గత ఏడాది జూన్ నుంచి గిఫ్ట్ సిటీ బోర్డు ఛైర్మన్‌గా (నాన్-ఎగ్జిక్యూటివ్) సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హస్ముఖ్ అధియా స్థానంలో ఉదయ్ కోటక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ శాఖ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన పాత్రకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుందని డిప్యూటీ సెక్రటరీ అంకితా షా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    గిఫ్ట్ సిటీ: ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రం

    గుజరాత్‌లోని 886 ఎకరాల్లో విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్ సిటీ. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక, సాంకేతిక హబ్. వ్యాపారాలకు సులభతర వాతావరణాన్ని కల్పిస్తూ సింగిల్‌ విండో పద్ధతిలో అనుమతులిస్తారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సుస్థిరత, అత్యాధునిక సాంకేతికతకు కీలకంగా మారుతున్నాయి.

    ఉదయ్ కోటక్..

    1985లో కేవలం రూ.30 లక్షల పెట్టుబడితో ఒక చిన్న బిల్లు డిస్కౌంట్ సంస్థను స్థాపించిన ఉదయ్ కోటక్, నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా తీర్చిదిద్దారు. ప్రాథమికంగా ఎటువంటి పెద్ద కార్పొరేట్ నేపథ్యం లేకపోయినా పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానాలతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. 2003లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన మొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా కోటక్ మహీంద్రా రికార్డు సృష్టించింది. భారత ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2026 సంవత్సరంలో ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.

    ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్‌ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ.. మరో వైపు ఇప్పటికే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

    ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసంది.

  • సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. సులేమాన్‌ నగర్‌లోని తన స్వంత కార్యాలయంలోనే కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలంలోనే ఖదీర్‌ మృతి చెందాడు. ఫ్యామిలీ గొడవల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

     

  • బెట్టింగ్‌ యాప్‌లు, సైబర్‌ మోసాలు,  స్కాంలపై  అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇటీవలి కాలంలో  విద్యావంతులు కూడా డిజిటల్‌ అరెస్ట్‌ స్కాం బారిన పడి  కోట్ల రూపాయలు  పోగొట్టుకుంటున్న  కేసులను అనేకం   చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను  ఎక్స్‌లో షేర్‌ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.

    ‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!

    డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.

    దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.

    హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.

    సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్‌ చేశారు.

    ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు



     

  • సాక్షి, హైదరాబాద్‌: వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు వివిధ రకాల పౌరసేవలను మరింత సులభతరం చేసే వాహన్‌ పోర్టల్‌ వచ్చే మార్చిలో అందుబాటులోకి రానుంది. తొలుత సికింద్రాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం గ్రేటర్‌లోని మిగతా రవాణా కార్యాలయాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులతో పాటు ఆటోమొబైల్‌ డీలర్లకు ఈ నెల 16 నుంచి శిక్షణనివ్వనున్నారు. 

    గ్రేటర్‌లో 89 లక్షల వాహనాలు   
    ప్రస్తుతం సారథి పోర్టల్‌తో డ్రైవింగ్‌ లైసెన్సులకు సంబంధించిన పౌరసేవలు అందజేస్తున్న తరహాలోనే  మార్చి నుంచి వాహనాలకు సంబంధించిన 52 రకాల సర్వీసులను ‘వాహన్‌ పోర్టల్‌’ ద్వారా అందజేస్తారు. ఈ  మేరకు  అన్ని వాహనాల వివరాలను వాహన్‌లో నిక్షిప్తం చేస్తారు. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో 89 లక్షల వాహనాలున్నాయి. వీటి వివరాలన్నీ వాహన్‌ పోర్టల్‌లో చేరుస్తారు. కొత్తగా నమోదయ్యే ప్రతి బండి వాహన్‌లో నమోదు చేసిన తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. దీంతో వాహనదారులు స్వయంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. 

    మొదట షోరూమ్‌ రిజిస్ట్రేషన్లతో ప్రారంభించి అనంతరం అన్ని సేవలూ వాహన్‌లోకి తెస్తారు. అంతర్రాష్ట్ర బదిలీలు, జిల్లాల మధ్య వాహనాల బదిలీల కోసం ప్రత్యేకంగా వాహనదారులు ఎలాంటి నిరభ్యంతర పత్రాలు అందజేయాల్సిన అవసరం ఉండదు. వాహన్‌ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే బండి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సదుపాయం లభించనుంది. యాజమాన్య బదిలీలు సులభతరమవుతాయి.  

    రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనల్లోనూ వాహనాల జాడను తేలిగ్గా కనిపెట్టవచ్చు. డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్స్, డూప్లికేట్‌ లైసెన్సులు, చిరునామా బదిలీలు, వాహనాల బదిలీలు, పర్మిట్లు, ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల సర్వీసులు ఆన్‌లైన్‌ ద్వారానే లభిస్తాయి. లెర్నింగ్, డ్రైవింగ్‌ లైసెన్సు, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు మాత్రమే స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది.   

  • ఆడపిల్ల అదృష్టమంటారు. తన విజయానికి తన కూతురే (బంగారు తల్లి) కారణమని ఓ తండ్రి మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా గెలుపొందాక తన కూతురు కాళ్లు మొక్కాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 19వ వార్డునుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. 

    ఆయనకు 584 ఓట్లు రాగా, 207 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్న తరువాత కౌంటింగ్‌హాల్‌నుంచి బయటికి వచ్చిన ఆయన నేరుగా తన కోసం వేచి చూస్తున్న కూతురు సహస్ర రెండు కాళ్లను మొక్కాడు. అనంతరం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యాడు. 

    కాగా, శ్రీనివాస్‌ మొదటినుంచి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజు తన కూతురు సహస్ర పుట్టడంతో తన అదృష్టంగా భావించాడు. ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాడు. అందుకే గెలుపొందగానే తన కూతురు కాళ్లు మొక్కినట్లు అనుచరులు తెలిపారు. 
    – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, హన్మకొండ 

Sports

  • టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ‌నివారం కోల్‌క‌తా వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులకు ఆలౌటైంది.

    కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్‌(24) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అదిల్ ర‌షీద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్చ‌ర్, డాస‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజ‌యాన్ని అందుకుంది.

    టామ్ బాంట‌న్‌(41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాట‌గా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌ముల్ల‌న్‌, బ్రాడ్‌ వీల్, కుర్రీ త‌లా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జ‌ట్టుపై కూడా కొన‌సాగించాల‌ని భావిస్తోంది.

    అయితే ఈ హైవోల్టేజ్ కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యం కార‌ణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంసక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ.. తిరిగి పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇదే జ‌రిగితే సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డ‌నుంది.

    గ‌త మ్యాచ్‌లో సంజూకు అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికి స‌ద్వినియోగ ప‌రుచుకోలేక‌పోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవ‌కాశముండ‌డంతో కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

    న‌మీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ లేదా రింకూ సింగ్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌ముంది. పాక్‌పై కుల్దీప్ యాద‌వ్‌కు అద్భుత‌మైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబ‌ట్టి అత‌డిని తుది జ‌ట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ద‌క్కుతుంది.

    పాక్‌తో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా): సంజు శాంసన్/అభిషేక్ శ‌ర్మ‌,ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

  • టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిఖ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని భార‌త జ‌ట్టును భ‌జ్జీ హెచ్చ‌రించాడు.

    ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భార‌త్ గెలుస్తుంద‌ని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జ‌ట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుత‌మైన స్పిన్న‌ర్ ఉన్నాడు. అత‌డిని భార‌త బ్యాట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఆడాలి. అయితే మ‌న జ‌ట్టుపై పూర్తి న‌మ్మ‌కం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్ప‌టిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగ‌ర‌వేస్తార‌ని ఆశిస్తున్నాము అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.

    కాగా ఉస్మాన్ తారిఖ్ త‌న బౌలింగ్ యాక్ష‌న్‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాట‌ర్లు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి  డెలివరీ చేసే అతడి  బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను త‌ల‌పిస్తోంది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌పై వివాదాలు త‌లెత్తిన‌ప్ప‌టికి.. ఐసీసీ మాత్రం క్లియ‌రెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 4 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పాక్ జ‌ట్టు కూడా అత‌డిపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకుంది.
    చ‌ద‌వండి: T20 WC 2026: భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

  • క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు స‌మయం అస‌న్న‌మైంది. టీ20  ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జ‌ట్లు తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ఇప్ప‌టికే కొలంబోకు చేరుకున్న ఇరు జ‌ట్లు.. శ‌నివారం సాయంత్రం త‌మ ప్రాక్టీస్ సెష‌న్ష్‌లలో పాల్గోనున్నాయి.

    కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్‌ కెప్టెన్  సల్మాన్ అలీ ఆఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియాక‌ప్‌లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మ‌ధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆఘా చెప్పుకొచ్చాడు.

    "క్రికెట్ ఎల్ల‌ప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు తావులేదు. క్రికెట్ ఒక‌ జెంటిల్‌మ్యాన్ గేమ్. ప్ర‌తీ ఒక్క‌రూ హుందాగా వ్య‌వ‌హ‌రించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేప‌టి మ్యాచ్‌లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాలని, రేపటి మ్యాచ్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.

    కాగా పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా ఆసియాక‌ప్‌లో పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త్ క‌ర‌చాల‌నం నిర‌కారించింది.  ఆ త‌ర్వాత భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, అండ‌ర్‌-19 జ‌ట్టు కూడా అదే బాట‌లో న‌డిచింది. అప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ల‌తో భార‌త్ హ్యాండ్ షేక్ చేయ‌లేదు. ఇప్పుడు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశ‌ముంది.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శ‌నివారం కొలంబో వేదిక‌గా జ‌రిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐరీష్ జ‌ట్టు త‌మ సెమీస్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా ట‌క్క‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

    డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో ష‌కీల్ అహ్మ‌ద్ మూడు, క‌లీం రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్ప‌కూలింది.

    ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించ‌గా.. మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో కొలంబో వేదిక‌గా ఆదివారం పాకిస్తాన్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడుతాడా లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు.

    అయితే ఆస్ప‌త్రి నుంచి అభిషేక్  డిశ్చార్జ్ అయినప్ప‌టికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించిక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భార‌త జ‌ట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అత‌డు ప్ర‌స్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

    కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్‌లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఓ నిర్ణ‌యం తీసుకోనుంది.  అయితే అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిషేక్‌ను చూసేందుకు అత‌డి త‌ల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.

     

     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 15) కొలంబో వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దాయాది జ‌ట్టుకు మ‌రోసారి ఓట‌మి రుచిని చూపించాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    అయితే పాక్ జ‌ట్టులో అద్భుత‌మైన స్పిన్న‌ర్లు ఉండ‌డంతో భార‌త్‌కు జ‌ట్టుకు గ‌ట్టి పోటీ ఎదురు కానుంది అని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త టీమ్ మెనెజ్‌మెంట్‌కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీల‌క సూచన చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్‌ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో  స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా గురువారం(ఫిబ్ర‌వ‌రి 12) నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ, అర్ష్‌దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

    "న‌మీబియాతో మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లంద‌రూ వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ ఓ వికెట్ ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అత‌డితో మూడు ఓవర్లు మాత్ర‌మే కెప్టెన్ బౌలింగ్ చేయించాడు. శివమ్ దూబే సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాను పూర్తి చేశాడు. 

    సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌ను రొటేట్ చేసిన విధానం చూస్తుంటే పాక్ మ్యాచ్ కోసం ఒక ప్రణాళికతో ఉన్న‌ట్లు క‌న్పిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌కు అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌ను జ‌ట్టులోకి తీసుకునే అవకాశ‌ముంది. అందుకేనేమో న‌మీబియాతో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు బ‌దులుగా పాండ్యాతో మొద‌టి ఓవ‌ర్‌ను బౌలింగ్ వేయించాడు. అదేవిధంగా శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువ‌గా అనుకూలిస్తాయి. భారత్ గతంలోనూ ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడింది. కాబ‌ట్టి కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవడం మేలు" అని గవాస్కర్ 'స్టార్ స్పోర్ట్స్' డిబేట్‌లో పేర్కొన్నాడు.
    చ‌ద‌వండి: Vaibhav Suryavanshi: క్రికెట్‌కు బ్రేక్‌.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ

International

  • వాలెంటైన్స్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో రాజకీయంగా ప్రభావం కలిగించే డిజిటల్ కార్డుల శ్రేణిని విడుదల చేసింది అగ్రరాజ్యపు వైట్‌హౌస్‌. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోపారి బాధ్యతలు చేపట్టిన తర్వాత  జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనలను ప్రతిబింబించేలా  ఈ కార్డులు ఉండటం గమనార్హం.  ఇలా పలు రకాల వాలెంటైన్స్‌ డే  ప్రేమ సందేశాలను పంపింది వైట్‌హౌస్‌. 

    అంటే, ఇవి సాధారణ ప్రేమ కార్డుల మాదిరి కాకుండా, రాజకీయ పరిణామాలను,  రాజకీయ నేతలను పరిహాసం చేసేలా రూపొందించారు. ఇందులో వెనుజువేలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో కోసం ప్రత్యేకంగా ఒక గ్రీటింగ్‌ కార్డును వైట్‌హౌస్‌ రిలీజ్‌ చేసింది. 

    ఇందులో  నువ్వు నా మనసు దోచావ్‌( You Captured My Heart) అంటూ మదురోపై సెటైర్లు వేస్తూ గ్రీటింగ్‌ కార్డు రిలీజ్‌ చేసింది. ఇందులో మదురోకు కళ్లకు గంతలు కట్టి,  చేతులను బేడీలతో బందించి ఉన్న ఫోటోను పెట్టి.. ఈ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇలా పలు పరిణామాలను జోడిస్తూ వైట్‌హౌస్‌ ప్రేమ సందేశాలను పంపింది.  

    మరో కార్డు ట్రంప్ ఒక “Executive Order 4547” అనే పత్రాన్ని పట్టుకుని, దానిపై “UR My Valentine” అని రాసి ఉన్నట్లు చూపిస్తుంది. మూడవ కార్డుపై డెమోక్రాటిక్ సెనేటర్ క్రిస్ వాన్ హోలెన్ ఎల్ సాల్వడార్‌లో MS-13 గ్యాంగ్ సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిల్మార్ అబ్రెగో గార్సియాతో మార్గరిటాస్ తాగుతున్నట్లు చూపిస్తుంది. నీపై నా ప్రేమ, అక్రమ వలసదారులపై డెమోక్రాట్ల ప్రేమంత బలంగా ఉంది. నీతో ఒక డ్రింక్ తాగడానికి నేను 1,537 మైళ్ళు ప్రయాణిస్తాను’ అని వ్యంగ్యంతో కూడిన వాలెంటైన్స్‌ డే సందేశాలను ఉంచింది వైట్‌హౌస్‌. 

    ఈ కార్డులు సాధారణ ప్రేమ సందేశాల కంటే రాజకీయ హాస్యంతో కూడినవిగా ఉండటంతో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ట్రంప్‌ పైత్యమని పలువురు మండిపడుతున్నారు.

     

  • బ్రెజిల్‌లో ఇటుంబియారాలో దారుణం జరిగింది. భార్య అక్రమ సంబంధం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య మరో వ్యక్తితో ఎఫైర్‌ పెట్టుకోవడంతో భర్త తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటుంబియారా ప్రభుత్వ మున్సిపల్ సెక్రటరీ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. అయితే, భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెపై నిఘా పెట్టాడు.

    ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్‌ను సైతం నియమించి పకడ్బందీగా ప్లాన్‌ చేశాడు.. భార్య తన ప్రియుడిని కలిసినప్పుడు వీడియో ఆధారాలు కూడా సంపాదించాడు. అక్రమసంబంధం నిజమేనని నిర్థారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    ఈ దారుణానికి కొన్ని గంటల ముందు ఆ వ్యక్తి.. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తన పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, "దేవుడు నా పిల్లలను ఎల్లప్పుడూ ఆశీర్వదించుగాక, నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు" అనే క్యాప్షన్‌ను రాశారు. 

    చూడముచ్చటగా ఉన్న వీరి ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భార్యా భర్తల జంట ఎంతో అందంగా ఉండటం.. పిల్లలు సైతం క్యూట్‌గా ఉండటంతో వీరి ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తండ్రి,.. క్షణికావేశంలో పిల్లల ప్రాణాలు తీయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
     


     

  • ఢాకా:  గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో అరాచకమే చూస్తూ వస్తున్నాం.  బంగ్లా అంతటా విధ్వంస చాయలే కనిపించాయి. షేక్‌ హసీనా బంగ్లా ప్రధానిగా వైదొలిగిన క్రమం నుంచి మహ్మద్‌ యూనస్‌ తాత్కాలిక బాధ్యతల్లో ప్రభుత్వం నడిచిన తీరును గమనిస్తే ఆ దేశంలో ఐక్యతా చాయలు సన్నగిల్లడమే కనబడింది. మన రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న బీఎన్‌పీ అధినేత తారిఖ్‌ రెహ్మాన్‌.. పార్టీ అతిపెద్ద విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలకు ఐక్యతా పిలుపే ఆయన తొలి పిలుపు అయ్యింది.

    బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను గత కొంతకాలం నుంచి నిశితంగా గమినిస్తున్న తారిఖ్‌ రెహ్మాన్‌.. ఐక్యతకు పిలుపునిచ్చారు. దేశంలొ ప్రజాస్వామ్యం నెలకొనడానికి త్యాగం చేసిన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు రెహ్మాన్‌ ప్రకటించారు. 

    “మీ స్వచ్ఛంద భాగస్వామ్యంతో, దాదాపు పదిన్నర సంవత్సరాల తర్వాత, ప్రజలకు నేరుగా ఓటు ద్వారా బాధ్యత వహించే పార్లమెంట్, ప్రభుత్వం దేశంలో తిరిగి స్థాపించబడుతున్నాయి,” అని రహ్మాన్ అన్నారు. ఆయన ప్రజలను ఐక్యంగా నిలబడమని కోరుతూ,  ఏ దుష్ట శక్తి దేశంలో మళ్లీ నియంతృత్వాన్ని స్థాపించకుండా, దేశం బానిస రాష్ట్రంగా మారకుండా చూసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

    ఇదీ చదవండి:

    తారిఖ్‌ రహ్మాన్‌ రాక..భారత్‌కు బంగ్లాకు టెన్షన్‌!

  • లైంగిక కుంభకోణంతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein). మైనర్‌ బాలికల అక్రమరవాణా, తన పలుకుబడి పెంచుకోడానికి ప్రముఖుల లైంగిక వాంఛలను తీర్చడానికి వారిని వాడుకున్నాడన్న ఆరోపణలు  సంచలనం సృష్టించాయి. దీంతో 2005లో మైనర్‌ బాలికపై లైంగిక వెధింపుల కేసు నమోదు కావడంతో ఎప్‌స్టీన్‌ బాగోతం బహిర్గతమైంది. అయితే 2008లో దోషిగా తేలినా మామూలు శిక్షతో బయటకు రావడం వివాదాస్పదమైంది. ఆ తరువాత 2019లో మళ్లీ అరెస్ట్‌ అయిన కొద్ది రోజులకే న్యూయార్క్‌ జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  

    దీన్ని అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించినా, జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. బడా బాబుల పేర్లు బయటకు రాకూడదనే కారణంతోనే  విచారణకుముందు ఎప్‌స్టీన్‌ను గుట్టుగా మట్టుబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.  తాజాగా జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంపై అతని కుటుంబం కోసం  పోస్ట్‌మార్టం నివేదిక పరిశీంచిన ఫోరెన్సీక్‌ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ వ్యాఖ్యలు ఈ అనుమానాలను  మరింత ఆజ్యం పోశాయి.

    జెఫ్రీ ఎప్‌స్టన్‌ కన్నమూసి  7 ఏళ్లు గడుస్తున్నా అతని మరణం చుట్టూ ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. అతని ఆత్మహత్యగా నిర్ధారిస్తూ గతంలో వచ్చిన నివేదికలను ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ మైఖేల్ బాడెన్ మరోసారి సవాలు చేశారు. ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జెఫ్రీది  ఆత్మహత్య కాదు, గొంతు నులిమి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    డాక్టర్ బాడెన్ కీలక సాక్ష్యాలు-వాదనలు
    ఎప్‌స్టీన్‌ కుటుంబం తరపున పోస్ట్‌మార్టం ప్రక్రియను పరిశీలించిన డాక్టర్ బాడెన్, తన పరిశీలనలో  ​కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. ఎప్‌స్టీన్ మెడలోని మూడు చోట్ల ఎముకలు విరిగి (ఒకటి హ్యోయిడ్ ఎముక, రెండు థైరాయిడ్ కార్టిలేజ్) ఉండటం ఇందులో ప్రధానమైన అంశంగా మారింది. బాడెన్ తన 50 ఏళ్ల కెరీర్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇలా మూడు ఎముకలు విరగడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. గొంతు నులిమి హత్య చేసిననప్పుడు (Strangulation) మాత్రమే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

    చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ బార్బరా సాంప్సన్ స్వయంగా పోస్ట్‌మార్టం సమయంలో లేకపోయినప్పటికీ, దీనిని ఆత్మహత్యగా ప్రకటించారని బాడెన్ ఆరోపించారు. ఎప్స్టీన్ ఉన్న మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లో భద్రతా నిబంధనల లోపాన్ని ఎత్తి చూపారు. అలాగే జైలు రికార్డులు తారుమారు చేయబడ్డాయని అమెరికా న్యాయశాఖ (DOJ) నివేదిక కూడా ధృవీకరించింది.

    ఆ రాత్రి ఏం జరిగింది? – అనుమానాస్పద అంశాలు
    ఎప్‌స్టీన్ మరణానికి ఒకరోజు ముందు, అతని సెల్‌మేట్‌ను వేరే చోటికి మార్చారు. ఆ రాత్రిఅతడిని గదిలో ఒంటరిగానే  ఉంచారు. నిబంధనల ప్రకారం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఖైదీని పర్యవేక్షించాల్సి ఉండగా, రాత్రి 10:40 తర్వాత ఎటువంటి తనిఖీలు జరగలేదు. పైగా సిబ్బంది తనిఖీలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు.

    ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

    సీసీటీవీ ఫుటేజీలో రాత్రి 10:39 గంటల సమయంలో ఎప్స్టీన్ ఉన్న విభాగం వైపు ఎవరో వెళ్లినట్లు నారింజ రంగు నీడ  (Orange Flash)  కనిపించింది. అది నారింజ రంగు జైలు దుస్తులు ధరించిన మరో ఖైదీ అయి ఉండవచ్చని స్వతంత్ర విశ్లేషణలు చెబుతున్నాయి అంతేకాదు అతని  సెల్‌లో అవసరానికి మించి దుప్పట్లు, బట్టలు ఉన్నాయి. వాటినే తాళ్లుగా మార్చినట్లు గుర్తించారు.

    అధికారిక నివేదికలు దీనిని ఆత్మహత్యగా  చెబుతున్నప్పటికీ, జైలు సిబ్బంది నిర్లక్ష్యం, తప్పుడు రికార్డులు, మెడపై ఉన్న గాయాలతో పలు అనుమానాలకు తావిచ్చాయి. దీనికితోడు డాక్టర్ బాడెన్ చేస్తున్న  తాజా వ్యాఖ్యలు ఈ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరుతో యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల లక్షల పేజీలు, వేలాది ఫోటోలను విడుదల చేసిన తరువాత ఇది మరో  కీలక పరిణామం.

    ఇదీ చదవండి: పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుది రైతులను విస్మరించిన బడ్జెట్.. రైతు, రైతు కూలీల ప్రస్తావనే లేని వ్యవసాయ బడ్జెట్‌ని చూస్తున్నాం.. చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపని మరోసారి తేలిపోయిందని.. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందన్నారు.

    ‘‘ఈ బడ్జెట్ చూశాక ప్రభుత్వం దృష్టిలో అసలు రైతులు లేరని తేలిపోయింది. బస్తా యూరియా కూడా అందించలేని ప్రభుత్వం ఇది. కిలో మంచి విత్తనాలు కూడా అందించలేని దగా ప్రభుత్వం ఇది. కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎలా చెప్పుకుంటున్నారు?. అన్నదాత సుఖీభవ కింద రూ.10,200 కోట్లు బడ్జెట్‌లో పెట్టాలి. కానీ రూ.6,600 కోట్లు మాత్రమే పెట్టటం ద్వారా రైతులను ఏం చేయదలచుకున్నారు?. ప్రభుత్వం దెబ్బకు రైతులంతా కూలీలుగా మారి పోతున్నారు.

    ..బడ్జెట్‌లో అసలు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. రైతుల సంక్షేమం మీద ఈ ప్రభుత్వానికి ఒక వ్యూహం లేదు. ధరల స్థిరీకరణ నిధి కింద వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏటా రూ.3 వేల కోట్లు బెట్టేవారు. గిట్టుబాటు ధరల్లేకపోతే ప్రభుత్వమే ఆదుకునేది. మరి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో ఎందుకు కేటాయించలేదు?. జగన్ తెచ్చిన ఉచిత బీమా సౌకర్యాన్ని ఎత్తేసి రైతుల కడుపు కొట్టారు. చంద్రబాబు ఆక్వా రైతులనూ మోసం చేశారు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చి ఇప్పుడు నిలువునా ముంచారు

    ..వైఎస్సార్‌ హయాంలో హార్టికల్చర్ వచ్చింది. కానీ చంద్రబాబు మాత్రం నిస్సిగ్గుగా తన ఘనత అన్నట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ప్రైవేటీకరణ మీద ప్రేమ.. చివరకు రైతు బజార్లను కూడా నిర్వహించలేక, ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్‌కు భజన చేయటంలో కూటమి ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ప్రతిరోజూ సగటున ఒకరు, రైతు కూలీలు నలుగురు చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను అందుకునేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?.

    ..టీడీపీ ఎమ్మెల్యేనే పల్లె కన్నీరు పెడుతోందని వాపోయాడు. వీటన్నిటి డైవర్షన్ కోసం లడ్డూలో కల్తీ అంటూ కథలు అల్లుతారు. ఏ వర్గానికీ మేలు చేయలేక నిత్యం వైఎస్‌ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మూడో బడ్జెట్ పెట్టినా ఇంకా మోసాలే చేస్తారా?. ఈ బడ్జెట్ కేవలం అంకెల ఆర్భాటమే. అప్పులతోనే బండి నడుపుతామనే సంకేతం ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.

  • విజయవాడ:  ఏపీలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ విమర్శించారు. 100 పడకల ఆసుపత్రులను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన లేదని మంత్రి చెబుతుంటే, చంద్రబాబేమో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేటీకరణ చేస్తామని చెబుతున్నారన్నారుఉ. పీపీపీ విధానానికి ప్రపోజల్స్‌ కూడా సిద్ధం చేసేశామంటున్నారని, పేషెంట్ల వద్ద రుసుము  వసూలు చేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. 

    ‘వంద పడకల ఆసుపత్రుల నిర్వహణను పిపిపికి ఇచ్చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆసుపత్రులను కూడా ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసే నీచ సంస్కృతికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు.

    ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గురించి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ ఈ బడ్జెట్‌ను చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందోనన్న ఆందోళన కనిపిస్తుంది. గత ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 3.42 లక్షల కోట్లు అని లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ప్రసంగంలో 9.70 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కనీస మద్దతు ధరలు ఇవ్వటం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు.

     రాష్ట్రంలో ఒక్క గంజాయికి తప్ప మరో పంటకు మద్దతు ధర లేదు. ఉద్యోగుల ప్రస్తావనే లేకుండా మొండిచేయి చూపించారు.  ఆడబిడ్డ నిధి అన్నారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెబుతున్నారు. అమరావతి పేరు మీద తెచ్చిన అప్పులు ఎన్ని.. తెచ్చిన బకాయిలు ఎలా తీరుస్తారనేది చెప్పలేదు.  అన్నీ వర్గాలను విస్మరించి మీరు తెచ్చిన బడ్జెట్ మీ డొల్లతనాన్ని బయటపెట్టింది. బడ్జెట్ పై ప్రభుత్వాన్ని మండలిలో కడిగేస్తాం’ అని స్పష్టం చేశారు.

    శాసనమండలి మీడియా పాయింట్‌ వద్ద మరో   వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  ఏపీ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఇది నారా వారి నకిలీ బడ్జెట్‌ అంటూ ధ్వజమెత్తారు.

    ‘నారా వారి నకిలీ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. కూటమి నేతల కమిషన్‌ కోసమే ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఉంది. అప్పుల్లో ఏపీని నెంబర్‌వన్‌కు తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఉన్న నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపించారు. ఏ వర్గాన్ని ఈ బడ్జెట్‌ సంతృప్తి పరచలేదు. పేదల కోసం ఏమి చేస్తారో కూడా చెప్పలేకపోయారు’ అని విమర్శించారు.

  • సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. అప్పుల కుప్పలా ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బడ్జెట్ ఇది అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగులను, మహిళల్ని, రైతుల్ని మోసం చేసిన బడ్జెట్. ఇది డబల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ చీటింగ్ సర్కార్.. ఇచ్చిన ఒక్క హామికి కూడా సరైన నిధులు కేటాయించకుండా.. వచ్చే ఏడాదికి మరో లక్ష కోట్ల అప్పుకు రెడీ అయిపోతున్నారు. కేవలం 20 నెలల్లో లక్షల కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టి అసలే లేదు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఈ బడ్జెట్‌లోనూ అదే తీరు: వరుదు కల్యాణి
    ఎన్నికల టైంలో ఊరూరా బాండ్‌లు పంచారు. వాటికీ ఈ బడ్జెట్‌కు సంబంధం ఉందా?. మోదీ, పవన్‌ను పక్కన పెట్టుకొని 164 సీట్లు తెచ్చుకొని ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు. ఈ బడ్జెట్‌లో కూడా అదే తీరు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని నమ్మించి.. దానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

    నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇపుడు బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్‌ ఇస్తామన్నారు.. దాని ఊసు లేదు. రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు..దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.. ఈ మూడు బడ్జెట్‌లలో కేటాయింపులు లేవు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. వీటన్నిమీద కౌన్సిల్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము..

    మాయాబజార్‌ను తలపించింది: పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
    ఈ బడ్జెట్ అంతా ఊహాగానాలే.. నాలుగో తరగతి పిల్లాడు హిస్టరీ రాసినట్లు బడ్జెట్ రాసుకొచ్చారు. బడ్జెట్ ప్రసంగమంతా మాయాబజార్‌ను తలపించింది. ఎన్నికల ముందు 10 లక్షల కోట్లకు పైబడి అప్పులున్నాయని బురదజల్లారు. కూటమి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పు 3.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. మరో లక్ష కోట్లు అప్పు చేస్తామని ముందే చెబుతున్నారు. నిరుద్యోగ భృతికి గత రెండు బడ్జెట్‌లలో కేటాయింపులు సున్నా. మూడో సంవత్సరం కూడా నిరుద్యోగ భృతి కేటాయింపులు సున్నా. ఆడబిడ్డ నిధికి మూడు బడ్జెట్‌లలో కేటాయింపులు సున్నా. 8500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుంటే.. కేవలం 3500 కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్ కు కేటాయించారు.

    30 లక్షల మంది విద్యార్థులను రోడ్డున పడేస్తున్నారు. వైఎస్‌ జగన్ హయాంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. నాడు-నేడు ద్వారా వైఎస్‌ జగన్‌ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఈ ప్రభుత్వం నాడు-నేడుకి రెండేళ్లలో చేసిన కేటాయింపులు సున్నా. ఇప్పుడు కేవలం 1500 కోట్లను నాడు నేడుకి ఇస్తామంటున్నారు...అది కూడా ఇస్తారో లేదో అనుమానమే. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఛైర్మన్‌ను కూడా నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అసలు కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోంది

    ఈ బడ్జెట్ పబ్లిసిటీ ఫుల్.. పనితనం నిల్‌: కల్పలతా రెడ్డి
    బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రజల ఆశలను వమ్ము చేశారు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. మహిళలను నిలువునా ముంచేసి.. బడ్జెట్‌లో మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. బడ్జెట్‌ను తయారు చేసిన ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పీఆర్సీ, ఐఆర్ గురించి కనీస ప్రస్తావన కూడా లేదు. హోంమంత్రి బడ్జెట్ పెట్టడంతో పోలీసులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. పోలీసులకు వెహికల్స్ పెట్టాం.. డ్రోన్లు పెట్టామని హోం మంత్రి చెప్పారు. హోంమంత్రి తమ బకాయిల గురించి మాట్లాడతారని పోలీసులు భావించి భంగపడ్డారు.

    ఈ బడ్జెట్  పనికిరాని బడ్జెట్‌: కుంభా రవిబాబు
    బడ్జెట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ బడ్జెట్‌ పనికిరాని బడ్జెట్. ప్రభుత్వం సంపద సృష్టికి బదులు అప్పులు సృష్టిస్తోంది. అభూత కల్పనగా బడ్జెట్ ఉంది. బడ్జెట్ అంతా అబద్ధాలతో నిండిపోయింది. ఎన్నికల సమయంలో ఏపీ అప్పులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ అప్పు 9.47 లక్షల కోట్లని బడ్జెట్‌లో చెబుతున్నారు. చంద్రబాబు ఎందుకు అప్పులపై తప్పుడు ప్రచారం చేశారో సమాధానం చెప్పాలి

  • సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. సున్నావడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని.. 1 నుంచి 8 పేజీల వరకూ వాళ్ళను వాళ్ళు పొగుడుకోవడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యబట్టారు.

    ఈ బడ్జెట్‌లో ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారెడీ అంటూ బొత్స నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీ రుణాలు ఠంఛన్‌గా అందించాం.. ఈ ప్రభుత్వంలో వాటి ఊసే లేదు.. కేటాయింపులు లేవు. పనికి ఆహార పథకాన్ని నీరుగార్చే విధంగా కేటాయింపులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 3 లక్షల 20 వేల కోట్లు మాత్రమే అప్పులు చేశామని చెప్పాం. కానీ ఇప్పుడు 9 లక్షల కోట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులు చేశామని చెబుతున్నారు.

    ..బడ్జెట్ అంతా తప్పులు తడకగా ఉంది.. ఎంతసేపూ చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్‌ల పొగడ్తలే సరిపోయాయి. ఈ 20 నెలల కాలంలో 20 లక్షల ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ఒక్క కౌలు రైతులకు అయినా నష్టపరిహారం ఇచ్చారా?. ఈ బడ్జెట్ వల్ల సమాజంలో ఏ ఒక్క వర్గానికి ఉపయోగం లేదు.. రాబోయే రోజుల్లో వీటి మీద పోరాడతాం. కచ్చితంగా మండలిలో చొక్కా పట్టుకొని నిలదీస్తాం. సమాధానాలు రాబడతాం’’ అని బొత్స పేర్కొన్నారు.

     

  • సాక్షి,ఏలూరు: జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. శనివారం వేగవరం సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న ఓ ప్రైవేటు స్కూలు స్లాబ్ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 15మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

    స్థానికుల సమాచారం మేరకు.. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు స్లాబ్ వేసే పనులు చేస్తుండగా, అది ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

    ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

     

  • సాక్షి,అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం బిగ్‌ షాకిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్‌లో టోకరా పెట్టింది. పీఆర్సీ, ఐఆర్‌పై ప్రస్తావన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో సీపీఎస్ రద్దుపైనా  ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించ లేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్ లవుతున్నా ఐఆర్ ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.  

  • సాక్షి,విజయవాడ: ఏపీలో  కూటమి ప్రభుత్వం మరోసారి  నిరుద్యోగుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని నయవంచనకు గురి చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతికి పైసా కేటాయించ లేదు. ఆడబిడ్డ నిధి పథకానికి ఈసారి సున్నా పెట్టింది. ప్రతీ మహిళకు రూ.1500 నెలకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినప్పటికీ  ఇచ్చిన హామీకి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా మోసం చేసింది.

    కొత్తగా ఒక్క పథకానికి కూడా నిధులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించింది. 54 లక్షల రైతు కుటుంబాలకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అరకొర కేటాయింపులతో అన్నదాతల్ని వంచనకు గురి చేసింది. ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించి మమ అనిపించింది.  

    ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు
    ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు, అందులోని విద్యార్థుల్ని చిన్నచూపు చూసే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ పాఠశాలలపై బడ్జెట్‌లో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో నాడు నేడు ద్వారా రూ. 7800కోట్ల పనులు చేపట్టింది. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చి దిద్దింది. తాజా, బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం నాడు నేడు పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. కేవలం తూతూ మంత్రంగా రూ.1500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్ నిలిపివేస్తున్నట్టు  మంత్రి పయ్యావుల ప్రకటించారు.

    గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెచ్చిన సంస్కరణలపై కక్ష సాధింపు చర్యగా.. పేద విద్యార్థులకు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్‌లను దూరం చేసిందంటూ ఏపీ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

NRI

  • ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు అంటూ అమెరికాకు తలరి  వెడుతున్న విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన రేపింది. 

    బర్కిలీలోని  యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో కెమికల్ అండ్‌ బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువు తున్న కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు. శనివారం నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు ఐదో రోజుకు చేరాయి. ఇంతవరకూ అతని ఆచూకీ లభ్యం కాకపోవడం అటు అధికారుల్లోనూ, ఇంటు కుటుంబ సభ్యుల్లోనే భయాందోళనలు రేపుతోంది. 

    సాకేత్‌ శ్రీనివాసయ్య  చివరిసారిగా క్యాంపస్ నుండి ఒక కిలోమీటరు దూరంలో కనిపించాడని అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్ట్ మరియు ల్యాప్‌టాప్ ఉన్న బ్యాక్‌ప్యాక్, క్యాంపస్ సమీపంలోని టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని నివాసం సమీపంలో  గుర్తించారు. లేక్ అంజా మరియు చుట్టుపక్కల ఉన్న బర్కిలీ హిల్స్ ప్రాంతాలపై దృష్టి సారించి నగరవ్యాప్తంగాగాలింపు కొనసాగుతోంది.

    మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్  శ్రీనివాసయ్య  ఆదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు ప్రకటించింది.

    కాగా 2025లో ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన శ్రీనివాసయ్య బర్కిలీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతను బెంగళూరులోని శ్రీవాణి ఎడ్యుకేషన్ సెంటర్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం శ్రీనివాసయ్య, మరో ఐదుగురితో కలిసి, హైపర్‌లూప్ మైక్రోచానెల్ కూలింగ్ సిస్టమ్  ఫర్ హైపర్‌లూప్‌ అండ్‌ ఏ మెథడ్‌ దేర్‌ఆఫ్‌’’ కనిపెట్టినందుకు పేటెంట్ కలిగి ఉన్నారు.