Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా.. డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఇందులో ''ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన వైమానిక దాడులను, బాంబు దాడులను రద్దు చేశాను'' అని పేర్కొన్నారు.

    ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో చర్చలు ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయికి చేరి, ఆమోదం పొందాయి. కాబట్టి నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా, ఈ సాయంత్రం ఇరాన్‌పై జరగాల్సిన దాడులను రద్దు చేశాను. తుది ఒప్పందానికి అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్, ఇతరులతో సహా ఇందులో పాలుపంచుకున్న అన్ని పక్షాలు, ఈ చర్చలకు ఆమోదం తెలిపాయి.

    ఒప్పందం ఖరారయ్యే వరకు.. నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉంటుంది. తుది ఒప్పందానికి సంబంధించిన సమయం, ప్రదేశం వంటి విషయాలను తాను అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

  • గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో.. జరిగిన ఒక విషాదకర ఘటన భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలావు (Palau) దేశ జెండా కింద ప్రయాణిస్తున్న ఏంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 23 ఏళ్ల యువకుడు ఆదిత్య శర్మ (Aditya Sharma) కూడా ఉన్నాడు. ఈ సంఘటన అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రత, యుద్ధ నిబంధనలు & భారతీయ నావికుల రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

    అమెరికా ఆరోపణలు
    అమెరికా ఆరోపణల ప్రకారం.. ఏంటీ సెట్టెబెల్లో నౌక ఇరాన్ నుంచి చమురును తరలిస్తూ అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించింది. ఈ కారణంగా నౌకపై దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. అయితే.. నౌక యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండిస్తూ అంతర్జాతీయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది.

    ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి తర్వాత ఒమాన్ అధికారులు 21 మందిని సురక్షితంగా రక్షించగలిగారు. అయితే.. ముగ్గురు భారతీయ నావికులు కనిపించకుండా పోయారు. అనంతరం వారి మృతదేహాలను గుర్తించి మరణించినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. మరణించిన వారిలో డెక్ కేడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ ఉన్నారు.

    క్షేమంగా ఉన్నా అని మెసేజ్.. అంతలోనే
    ఆదిత్య శర్మ మరణం హృదయ విదారకంగా మారింది. దాడికి ఒక గంట ముందు మాత్రమే ఆయన తన తండ్రికి వాట్సాప్‌లో ''నేను క్షేమంగా ఉన్నాను'' అని సందేశం పంపారు. ఆ తరువాత జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మరణంతో తీవ్ర వేదనకు గురైన ఆయన తండ్రి, వాణిజ్య నౌకపై క్షిపణులతో దాడి చేయడం యుద్ధ నేరంగా పరిగణించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇప్పటికే.. ఏంటీ మారివెక్స్ నౌకపై కూడా అమెరికా దాడికి గురైంది. అందులోని 24 మంది భారతీయ నావికులను ఒమాన్ అధికారులు రక్షించారు. అదేవిధంగా ఏంటీ జాల్వేర్ ఏంటీ జావీర్‌ అనే మరో నౌక ప్రమాదంలో చిక్కుకోవడంతో భారత రాయబార కార్యాలయం, ఒమాన్ నౌకాదళం సహాయంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది.

    ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రతినిధిని పిలిపించి అధికారిక నిరసన తెలిపింది. భారత ప్రభుత్వం సముద్ర రవాణా రంగంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేసింది.

    ప్రమాదకర పరిస్థితుల్లో నావికులు
    ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ప్రపంచంలోని రోజువారీ చమురు రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల వేలాది మంది నావికులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

  • టెహ్రాన్‌: ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికపై ఇరాన్‌ పార్లమెంట్‌లోని జాతీయ భద్రతా కమిటీ ఛైర్మన్‌ ఇబ్రహీం అజీజీ స్పందించారు. ట్రంప్‌నకు మరింత శక్తిమంతమైన, మరింత బాధాకరమైన ప్రతిస్పందన ఎదురవుతుందని అజీజీ వార్నింగ్‌ ఇచ్చారు.

    "ట్రంప్‌నకు సరైన అవకాశాలు లేవు కాబట్టి అతని చర్యలను ముందుగానే ఊహించవచ్చు. ట్రంప్‌ దాదాపు ఎలాంటి విజయాలు సాధించలేదు. అమెరికా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు ఏమీ అందని విధంగా ఆయన భారీ మూల్యం చెల్లించాడు. 

    ఏదైనా తప్పుడు అంచనాతో అడుగు వేస్తే గతం కంటే మరింత బాధాకరమైన ప్రతిస్పందన వస్తుంది. ట్రంప్‌ హెచ్చరికలు భ్రమలు మాత్రమే. ఇరాన్‌ నుంచి వచ్చే ఏ ప్రతిస్పందనైనా ట్రంప్‌నకు భరించలేని పరిణామాలు తెచ్చిపెట్టవచ్చని ఆయనకు తెలుసు" అని ఆయన చెప్పారు. 

    కాగా, యూఎస్‌ హెచ్చరికలతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అంతర్జాతీయంగా నెలకొంది. 

  • జకర్తా: ఈ తరం యువతను ఉర్రూతలూగించే కొరియన్‌ పాప్‌ బృందం నిర్వహించనున్న ఈవెంట్‌ పాస్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం 20 నిమిషాల్లోనే ఐదు లక్షల పాసులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 

    కొరియన్‌ పాప్‌ బృందం బీటీఎస్‌ వరల్డ్‌ టూర్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ 26, 27 తేదీలలో జకార్తాలోని గెలోరా బుంగ్ కర్నో క్రీడా మైదానంలో మ్యూజిక్‌ కన్సర్ట్‌  నిర్వహించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత బీటీఎస్‌ సంపూర్ణ బృందంగా ఇండోనేషియాలో తొలిసారి ప్రదర్శన ఇవ్వనుంది.

    ఈ కార్యక్రమం కోసం జూన్‌ 9న బీటీఎస్‌ బృం‍దం టికెట్స్‌ను ప్రీసేల్‌ నిర్వహించింది. ప్రీసేల్‌లో పాస్‌లను సొంతం చేసుకునేందుకు ఐదు లక్షలకు పైగా అభిమానులు ఆన్‌లైన్‌లో పోటెత్తారు. అయితే ఈ టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. జూన్‌ 11న మధ్యాహ్నం 12 గంటలకు సాధారణ సేల్‌ ప్రారంభమైనమూడు గంటల్లోపే ముగిశాయి. ఒక నివేదిక ప్రకారం, ఇవి 12 నిమిషాల ముందే పూర్తయ్యాయి.

    బీటీఎస్‌ ఈవెంట్‌ టికెట్లు టికెట్‌.కామ్‌లో విక్రయించారు. వీఐపీ ఎంట్రన్స్‌ పాస్‌ ధర రూ.4.5 లక్షల ఇండోనేషియా రూపాయల వరకు ఉంది. బీటీఎస్‌ ఈవెంట్‌ టికెట్లు అధికారికంగా నిర్ణయించిన ధరకు అమ్ముడైన వెంటనే, కొంతమంది వాటిని రీసేల్‌ మార్కెట్‌లో అసలు ధర కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు మళ్లీ విక్రయించడం ప్రారంభించారు. రీసేల్‌ మార్కెట్లో టికెట్‌ ధరలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.

    ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన ఇప్పటికే ఇరాన్‌ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్‌ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్‌ఫోర్స్‌, రాడార్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స‍్పష్టం చేశారు. 

    అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్‌లోని ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్‌, గ్యాస్‌ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్‌-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.

    ఓవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలు 
    ఓవైపు ఇరాన్‌ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా-ఇరాన్‌ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌, యూరోపియన్‌ దేశాల వర్గాల సమాచారం ప్రకారం, సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్‌ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకిగా మారింది.

    ఇరాన్‌ ఆయిల్‌ అమ్మకాల ద్వారా సంపాదించిన బిలియన్ల డాలర్లు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం, డాలర్‌ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్‌ నిధులను ఫ్రీజ్‌ చేశాయి. అమెరికా మార్కెట్‌ యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఆ బ్యాంకులు ఆంక్షలను పాటించాయి.

    ఇరాన్‌ నిలిపివేసిన 6 బిలియన్ల నుంచి 12 బిలియన్ల వరకు నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కానీ అమెరికా మాత్రం మానవతా సాయం కింద షరతులతో కొద్దికొద్దిగా మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఇరాన్‌తో అమెరికా మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోందని వర్గాలు వెల్లడించాయి. సైనిక దృష్ట్యా ఈ యుద్ధం అంతులేని మార్గమని, ఇరాన్‌పై దాడి చేసి అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

    చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, చివరికి అమెరికా-ఇరాన్‌ సంఘర్షణకు ముగింపు రావాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను తిరిగి ఇరాన్‌ పొందడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • రావల్‌కోట్‌: మరోసారి పాకిస్థాన్‌ ఆర్మీ బరితెగించింది. పీవోకే రావల్‌కోట్‌లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట పీఓకేలో ఘర్షణలు చెలరేగగా.. రెండు రోజుల క్రితం కాల్పుల్లో 30 మందికిపైగా మృతిచెందారు. పాక్‌ నుంచి విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపడుతుండగా.. వారిపై పాక్‌ ఆర్మీ కాల్పులతో విరుచుకుపడుతోంది. గత మూడు రోజులుగా పీవోకే ఘర్షణ వాతావరణం నెలకొంది.

    సాధారణ పౌరులు తమకు అందుబాటు ధరల్లో పిండి, బియ్యం, విద్యుత్‌తో పాటు ప్రాథమిక హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రారంభించిన ఈ  నిరసన ర్యాలీపై పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది. పాకిస్థాన్‌ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల క్రితం (మంగళవారం) పీవోకేలో నిరసనకారులపై పాక్‌ సైన్యం కాల్పులు జరపగా.. మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ నిరసనకారులు డిమాండ్ చేశారు.

    కాగా, పీవోకేలో ఇటీవల ముజఫరాబాద్, రావల్‌కోట్, మీర్‌పూర్ ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కాల్పులు జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి.

  • ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్‌  ప్రావిన్స్  కాల్పుల మోతతో అట్టుడికింది. బుధవారం ఉదయం హెరాత్‌లోని జిబ్రిల్ ప్రాంతంలో, సరైన బురఖా ధరించలేదనే ఆరోపణలతో మహిళలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులపై తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ  కాల్పుల్లో  ఇద్దరు మరణించగా, దాదాపు ముప్పై మంది గాయపడ్డారు.  దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

    మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హెరాత్‌లోని జిబ్రిల్ వాసులు మహిళల అరెస్టులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరిని అణచి వేసేందుకు తాలిబాన్ ఫైటర్లు తూపాకీలను నేరుగా ఛాతీపై గురిపెట్టి కాల్పులు జరిపారని, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు, తాలిబాన్ వ్యతిరేక రాజకీయ నేతలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మహిళల రాకపోకలపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ మహిళలను బయటకు వెళ్లనివ్వవద్దని, ఒకవేళ వారిని బంధిస్తే విడిపించడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేమని హెరాత్‌లోని కొందరు మసీదు ఇమామ్‌లు నిన్న ప్రజలను హెచ్చరించారు.

    తాలిబాన్లు  నిరసనకారుల ఛాతీపై కూడా కాల్పులు జరిపారనీ, కొందరు యువకులు కిందపడి రక్తం ఓడుతుండటం చూశానని  స్థానికులు ఒకరు తెలిపారు. మహిళలు నినాదాలు చేస్తుండగా, తాలిబాన్లు కాల్పులు జరుపుతున్నారు.  తాలిబాన్ల నిబంధనల ప్రకారం బురఖా/హిజాబ్ ధరించని మహిళలను నగరంలోని అన్ని ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారు భారీగా కాల్పులు జరుపుతున్నప్పటికీ, ప్రజలు "విద్య, ఉపాధి, స్వేచ్ఛ" అంటూ నినాదాలు చేస్తున్నట్లు వీడియోలలో కనిపిస్తోంది.

    మరోవైపు తాలిబాన్ల అరెస్టులు, అణచివేతకు భయపడి చాలా మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు కాకుండా ఇళ్లకే తరలించారని నిరసనకారులు చెబుతున్నారు. దీనివల్ల గాయపడిన వారికి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా అందలేదు. తాలిబాన్లు ఆసుపత్రుల్లో కూడా నిఘా ఉంచి, గాయపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారని కొందరు ధృవీకరించారు.

     జిబ్రిల్‌కు అదనపు బలగాల తరలింపు
    జిబ్రిల్‌లో ప్రజా నిరసనలను అణచివేసిన తర్వాత, తాలిబాన్లు వందలాది మంది కొత్త ఫైటర్లను ఆ ప్రాంతానికి పంపారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విడుదలైన వీడియోల ప్రకారం, హెరాత్ నగరం పూర్తిగా సైనిక జోన్‌లా మారిపోయింది. రోడ్లపై, నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫైటర్లను మోహరించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న తాలిబాన్లు కూడా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం.

    అయితే షల్ మీడియాలో ఈ నిరసనల గురించి సోషల్‌ మీడియా ద్వారా  ఉప్పందడంతో ఉదయం నుంచే వారు సాధారణ దుస్తుల్లో భారీగా మోహరించారు. ప్రజలు గుమిగూడటం ప్రారంభించగానే అన్ని వైపుల నుండి ఆయుధాలతో దాడి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి  కూడా నిఘాపెట్టి క్షతగాత్రులకు చికిత్స అందకుండా అడ్డుకున్నారు.

    మానవ హక్కుల సంఘాల స్పందన
    దీనిపై అంతర్జాతీయంగా  కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హెరాత్‌లో ప్రజా నిరసనల అణచివేతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాలిబాన్ల ఆంక్షలు అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై  కాల్పులు  తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలిపే  నిరసనకారులపై చట్టవిరుద్ధంగా బలాన్ని ఉపయోగించడాన్ని  వెంటనే నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని విడుదల చేయాలని కోరింది. మహిళలు, బాలికల హక్కులైన స్వేచ్ఛగా తిరిగే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేసింది,

    హెరాత్‌లో ప్రజా నిరసనలపై తాలిబాన్ల అణచివేతకు ప్రతిస్పందిస్తూ, మాజీ ఆఫ్ఘన్ ప్రభుత్వ విదేశాంగ సలహాదారు రంగిన్ దాద్‌ఫర్ స్పాంటా ఎక్స్‌లో స్పందించారు. "ఈ అణచివేత, చరిత్రలో సాగుతున్న ఈ పాలనను ప్రజలే స్వయంగా ముగించాలి" అని పిలుపునిచ్చారు.

    మరోవైపు, హ్యూమన్ రైట్స్ వాచ్‌కి చెందిన ఆఫ్ఘనిస్తాన్ పరిశోధకురాలు ఫెరెష్తే అబ్బాసి స్పందిస్తూ, హెరాత్ ప్రావిన్స్ నుండి తమకు "ఆందోళన కరమైన నివేదికలు" అందాయని చెప్పారు. తాలిబాన్లు నిరసనకారులపై ఎలాంటి బలాన్ని ప్రయోగించకుండా వెంటనే వైదొలగాలని, శాంతియుత నిరసనల కోసం నిర్బంధించిన వారిని విడుదల చేయాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేశారు.  హింస లేదా బెదిరింపులు లేకుండా శాంతియుత నిరసనలు జరుపుకోవడానికి నిరసనకారులను అనుమతించాలని ఆమె పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్, ఈ అణచివేతను తక్షణమే నిలిపివేయాలని పిలుపునిచ్చారు. నిరసనకారులపై జరిగిన హింసకు పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

     కాగా 2021లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాలిబన్లు మహిళలు, బాలికలపై విస్తృతమైన ఆంక్షలు విధించారు. వీటిలో సెకండరీ, విశ్వవిద్యాలయ విద్యపై నిషేధం, ఉపాధిపై పరిమితులు, దుస్తులు, కదలికలకు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

  • కెనడాలో పరిశోధకులు గడ్డకట్టిన మలంలో మామత్‌ల డీఎన్‌ఏను గుర్తించారు. ఉడుత బిలం (ఉడుత నేలలో తొవ్వితే ఏర్పడిన చిన్న గుహలాంటి నివాస స్థలం) దానిని వేల ఏళ్ల పాటు కాపాడింది. అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్‌లతో పాటు ఇతర జంతువుల ప్రాచీన డీఎన్‌ఏ రూపంలో అత్యంత విలువైన శాస్త్రీయ సమాచారాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడా శాశ్వత మంచు నేలలో భద్రంగా ఉన్న ఉడుతల విసర్జనలో దానిని కనుగొన్నారు.   

    ఆర్కిటిక్ గ్రౌండ్ స్క్విరెల్ అనే ఉడుత జాతి అత్యంత చల్లని ప్రాంతాల్లో, మంచుతో కప్పిన ప‍్రదేశాల్లో జీవిస్తుంది. ఈ ఉడుత సాధారణంగా మనం చెట్లపై చూసే ఉడుత కాదు. ఇది కెనడా, అలాస్కా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసిస్తుంది. బిలాలు తవ్వుకుని జీవిస్తుంది. ఏడాదిలో సుమారు 7 నుంచి 8 నెలలు శీతనిద్రలో ఉంటుంది. బయట ఉష్ణోగ్రత -30°C కంటే తక్కువగా ఉన్నా బతికే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆహారాన్ని బిలాల్లో నిల్వ చేస్తుంది. మంచు నేల (పర్మాఫ్రాస్ట్) ఆ బిలాన్ని వేల ఏళ్ల పాటు భద్రపరచింది.

    గాలి చొరబడని విధంగా మూసివేసిన బిలాల్లో ఉన్న ప్రాచీన మామత్‌ డీఎన్‌ఏ కొన్ని వేళ ఏళ్ల నాటి కాలానికి చెందినది. కెనడా వాయవ్య ప్రాంతంలోని విశాల అరణ్య ప్రాంతం యూకాన్‌లో వేల ఏళ్ల పరిణామ క్రమంపై అవగాహనను దీని ద్వారా పొందవచ్చు. రోమాలతో కూడిన మామత్‌ డీఎన్‌ఏతో పాటు తోడేళ్లు, అడవి ఎద్దులు, గుర్రాలు, చిరుతలు, వందలాది మొక్కలకు చెందిన జన్యు పదార్థాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. 

    ‘‘సాధారణంగా ప్రజలు మామత్‌ దంతం వంటి పెద్ద శిలాజాలను కనుగొనడాన్ని గొప్ప విషయంగా భావిస్తారు. కానీ, ఉడుతల మలాన్ని పరిశీలించడం సాధారణంగా అంత ప్రాముఖ్యంగా కనిపించదు. అయినప్పటికీ, ఆ మలం నుంచే శాస్త్రవేత్తలకు అమూల్యమైన డీఎన్‌ఏ సమాచారం లభించింది’’ అని అధ్యయన ప్రధాన రచయిత, కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలియోజీనోమిక్స్ శాస్త్రవేత్త టైలర్ మర్చీ తెలిపారు. పాలియోజీనోమిక్స్ అంటే ప్రాచీన జీవుల జన్యు సమాచారాన్ని అధ్యయనం చేసే శాస్త్ర విభాగం.

    అధ్యయనం ప్రకారం.. మొదట ఉడుత సూక్ష్మజీవ సముదాయాన్ని మాత్రమే అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. అనంతరం నిజంగా ఆశ్చర్యపరిచే జీవ వైవిధ్యాన్ని గుర్తించారని మర్చీ చెప్పారు. ఈ ఎలుక జాతి జీవులకు ఆహారం, గింజలు, ఆకులు, ఎముకలు వంటి వస్తువులను బిలాల్లో నిల్వ చేసుకునే అలవాటు ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు.

    బిలాలను మంచు నేల మూసేయడంతో
    ఆర్కిటిక్ ఉడుతలు ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే చురుకుగా ఉంటాయి. మిగతా సమయం శీతనిద్రలో గడుపుతాయి. అంటే తమ శరీర కార్యకలాపాలను చాలా వరకు తగ్గించుకుని, దీర్ఘకాలం నిద్రలాంటి స్థితిలో ఉంటాయి.

    అందుకే ఉడుతలు తమ బిలాలను కాయలు, గింజలు, ఆకులు, ఎముకలు, దొరికిన ఇతర వస్తువులతో నింపుతాయి. కాలక్రమంలో కొన్ని బిలాలను శాశ్వత మంచు నేల మూసివేసింది. ఆ ఉడుతల బిలాలు వేల ఏళ్ల క్రితం ఉన్న వస్తువులు, మలం, మొక్కల అవశేషాలు, జంతువుల డీఎన్‌ఏ వంటి వాటిని యథాతథంగా భద్రపరిచాయి. అందువల్ల అవి గత కాలానికి చెందిన సమాచారాన్ని మనకు అందించే నిల్వ కేంద్రాలుగా మారాయి.

    శాస్త్రవేత్తలు పూర్తిగా గడ్డకట్టిన చిన్న గ్రౌండ్ స్క్విరెల్ నమూనాను కూడా గుర్తించారు. “అది ఒక కాలం పాటు నిద్రపోయి మళ్లీ ఎప్పుడూ మేల్కోలేదు... అటు వెళ్తున్న ఒక శాస్త్రవేత్త దానిని గుర్తించాడు” అని శాస్త్రవేత్త టైలర్ మర్చీ చెప్పారు.

    మామత్‌ను తిరిగి జీవంలోకి..! 
    అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ 4,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన రోమాలతో కూడిన మామత్‌ను తిరిగి జీవంలోకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని ఇటీవల ప్రకటించింది.

    అయితే నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఏర్పడే జంతువు మామత్‌ కంటే, మామత్‌ను పోలి ఉండేలా జన్యు మార్పులు చేసిన ఆసియా ఏనుగును ఎక్కువగా పోలి ఉంటుందని వారు భావిస్తున్నారు.

    మర్చీ బృందం ప్రస్తుతం మరో అధ్యయనంపై పని చేస్తోంది. ఉడుతల మలంలో లభించిన డీఎన్‌ఏ రోమాలతో కూడిన మామత్‌ పరిణామ క్రమంపై ఏమి వెల్లడిస్తుందో ఆ అధ్యయనం వివరిస్తుంది.

  • మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్‌, ప్రముఖ దాత బిల్ గేట్స్, దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరయ్యారు.తన జీవితంలో అతడిని కలవడం ఘోర తప్పిదమనీ, గ్లోబల్‌గా తన సేవలను ప్రమాదంలో పడేసిందంటూ సాక్ష్యమిచ్చారు. అంతేకాదు తన వివాహేతర సంబంధాల ఆదారంగా ఎప్‌స్టీన్ తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడంటూ సంచలన విషయాలను వెల్లడించారు.

    అమెరికా పార్లమెంటరీ కమిటీ విచారణలో ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాలు, వారి సమావేశాల ఉద్దేశం, ఎప్‌స్టీన్‌ నేరపూరిత కార్యకలాపాల గురించి  ఏమైనా సమాచారం ఉందా అనే విషయాలపై చట్టసభ సభ్యులు గేట్స్‌ను ప్రశ్నించారు. చట్టసభ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ రహస్య విచారణలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ ఎప్‌స్టీన్‌తో పరిచయం తన ప్రతిష్టకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా తాను చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దెబ్బతినే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందన్నారు. అసలు ఆయన్ని కలవడం తాను చేసిన అతి పెద్ద తప్పిదమని బిల్ గేట్స్ అంగీకరించారు. నిజానికి అతని పరిచయం ప్రపంచ ఆరోగ్య, అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న సంపన్న దాతలను అనుసంధానించడంలో సహాయపడు తుందని తాన నమ్మానని గేట్స్ తెలిపారు. ఈ  ఉద్దేశంతోనే  2011 నుంచి 2014 మధ్య కొన్నిసార్లు  మీట్‌ అయ్యాననీ, అయితే ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదన్నారు.  దీంతో 2014 చివరి నాటికే వారి మధ్య చర్చలు, సంబంధాలు ముగిసిపోయాయని తెలిపారు. అంతేకాకుండా, తాను ఎలాంటి నేరపూరిత చర్యలలో పాలుపంచుకోలేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. అలాగే ప్‌స్టీన్ ప్రైవేట్ దీవులు ప్రైవేట్ దీవి (ఐలాండ్), రాంచ్ లేదా ఫ్లోరిడాలోని నివాసాన్ని సందర్శించాననే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. 

    మెలిందాతో వివాహ జీవితంపై బిల్ గేట్స్‌ను ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ చేశాడా?
    మరోవైపు బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు  ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. తన వివాహ జీవితం వెలుపల ఉన్న సంబంధాల (Extramarital affairs) గురించి ఎప్‌స్టీన్‌కు తెలిసిందని, ఆ సమాచారాన్ని ఉపయోగించి తనతో సంబంధాలు కొనసాగించేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని గేట్స్ అంగీకరించారు.  ఈ విషయాలను ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలని చూశాడన్నారు. ఇవి తన కుటుంబానికి బాధను కలిగించాయని చెప్పారు. తనతో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తానెప్పుడూ సుముఖత చూపలేదని గేట్స్ పదే పదే నొక్కి చెప్పారు.

    తమ మధ్య చర్చలు కేవలం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ అవకాశాలపై మాత్రమే జరిగాయని గేట్స్ స్పష్టం చేశారు.  తాను ఆశించిన ఆర్థిక సహాయాన్ని ఎప్‌స్టీన్‌ అందించలేడని  అర్థమైన తర్వాత, అతనితో సంబంధాలను పూర్తిగా  కట్‌ చేసుకున్నట్లు గేట్స్ తెలిపారు.  ఎప్‌స్టీన్‌ నెట్‌వర్క్‌పై కాంగ్రెస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి, ఈ కేసులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్లు పెరుగుతుండటంతో, దర్యాప్తు అధికారులు మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే విచారణ కమిటీ ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, రిటైల్ దిగ్గజం లెస్లీ వెక్స్‌నర్‌తో సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులను కూడా విచారించింది.

Movies

  • బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆమె టీమ్ పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు నిజం కాదని తేల్చేసింది.

    కొడుకు విహాన్ కౌశల్ జననం తర్వాత కత్రినా పూర్తిగా తన కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. గత రెండేళ్లుగా కత్రినా పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన భర్త విక్కీ కౌశల్, కొడుకు విహాన్‌తో విహార యాత్రలు చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తోంది.

    తాజాగా 2027 ద్వితీయార్థంలో వెండితెరపైకి తిరిగి వస్తారనే ఊహాగానాలు, అలాగే ఓటీటీ ప్రాజెక్ట్‌లలో అడుగుపెడతారనే వార్తలు వినిపించినా, ఇవన్నీ పుకార్లేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. తన నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా కత్రినా విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె సొంత కాస్మోటిక్స్ బ్రాండ్ ‘కే బ్యూటీ’ భారతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంతో పాటు తన వ్యక్తిగత జీవితంలో కూడా బిజీగా ఉన్నారు.  

  • ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్‌ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్‌లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. 

    సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ ఇసాకపట్నం.  టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది.  ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందించారు. ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.

    తాజాగా ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు.  జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ పంచుకున్నారు. ఈ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు  కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
     

  • దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్‌హౌస్‌కు తరలివచ్చారు.

    అంతకుముందు సీనియర్ హీరోయిన్‌ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.

     

  • విశాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న లేటేస్ట్ యాక్షన్‌ మూవీ మకుటం. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో  ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు రవి అరసు కథ అందించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ఈ టీజర్‌లో మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ కనిపించడం హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో అంజలిని మాస్ యాక్షన్‌ను చూడబోతున్నారు. ఆమె సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.  విశాల్ విశాల్ త్రిపాత్రాభినయంతో మూడు డిఫరెంట్ గెటప్స్‌లో అదరగొట్టనున్నారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అంచనాలు పెంచుతున్నాయి. . ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్‍ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై కీలక పాత్రల్లో నటించారు.

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో కూడా థియేటర్లలో పెద్ది హవా కొనసాగుతోంది.  ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి షురూ అవుతుంది. ఈ నెల 12న ఫ్రైడే రోజున చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. సింగ్ గీతం, భారత భాగ్య విధాత, పోలీస్ కంప్లైంట్, కొత్త మలుపు లాంటి సినిమా బాక్సాఫీస్‌ బరిలో నిలవనున్నాయి. వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

    ఇక ఈ శుక్రవారం ఓటీటీల విషయానికొస్తే సూర్య కరుప్పు(తెలుగులో వీరభద్రుడు)పై ఆసక్తి నెలకొంది. భూత్ బంగ్లా లాంటి బాలీవుడ్ మూవీపై కూడా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది. వీటితో రమణి కల్యాణం అనే తెలుగు సినిమా సైతం ఓటీటీలో సందడి చేయనుంది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి  సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి. 


    నెట్‌ఫ్లిక్స్

    •  భూత్ బంగ్లా (హిందీ సినిమా) - జూన్ 12
    • ఐ యామ్ ఫ్రాంకెల్డా (స్పానిష్ మూవీ) - జూన్ 12
    • ది పాలిగమిస్ట్(వెబ్ సిరీస్)- జూన్ 12
    • అవుట్‌ లాస్ట్ ది జంగిల్-(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12
    • ది రెస్ట్ ఈజ్‌ ఫుట్‌బాల్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12

    అమెజాన్ ప్రైమ్

    •  రాఖ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 12
    •  కరుప్పు/ వీరభద్రుడు (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 12
    •  విజిల్(హాలీవుడ్ మూవీ)- జూన్ 12
    •  డాగ్‌51(ఫ్రెంచ్ సినిమా)- జూన్ 12
    •  ఓవర్‌ యువర్ డెడ్ బాడీ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12
    •  ఎవరీ ఇయర్ ఆఫ్టర్‌(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12


    జియో హాట్‌స్టార్

    •    ద్రిదమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 12
    •    అలైస్ అండ్ స్టీవ్- సీజన్ 1(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12
    •    బిలో డెక్‌ మెడిటెరియన్-సీజన్ 11(హాలీవుడ్ సిరీస్)- జూన్ 12

    ఆహా

    •    ష్ సీజన్ 3 (తెలుగు సిరీస్) - జూన్ 12

    జీ5

    • మై హూ నా (హిందీ రియాలిటీ షో) - జూన్ 12
    • తార్ఖతా (బెంగాలీ సిరీస్) - జూన్ 12

    లయన్స్ గేట్ ప్లే

    •    షెల్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 12
    •    విక్కీ క్రిస్టీ బార్సిలోనా (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 12

    సన్‌ నెక్ట్స్

    • రమణి కల్యాణం(తెలుగు సినిమా)- జూన్ 12


    హెబీవో మ్యాక్స్

    • దె విల్ కిల్ యూ(హాలీవుడ్ మూవీ)- జూన్ 12


     

  • రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్‌ టాక్‌తో పాటు.. వివాదానికి కేరాఫ్‌ ‍అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్‌ రోల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ జాన్వీ కపూర్ ఓవర్‌ గ్లామర్‌ సీన్స్‌ అన్ని తొలగించారు. డైరెక్టర్ బుచ్చి సైతం క్షమాపణలు చెప్పారు. జాన్వీ కపూర్‌ సన్నివేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఏదేమైనా విమర్శలు రావడంతో ఆ సీన్స్‌ మూవీ నుంచి తీసేశారు. 

    ఈ వివాదంపై ఇ‍ప్పటికే పలువురు హీరోయిన్స్ స్పందించారు. ‍తాజాగా ఈ లిస్ట్‌లో మరో నటి కూడా చేరిపోయింది.  సినిమాల్లో మహిళల పాత్రలపై ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని  నటి మధుబాల అన్నారు. గతంలో చాలా సినిమాల్లో శృంగారభరిత సన్నివేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. అప్పుడు రాని అ‍భ్యంతరాలు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.

    ఈ సందర్భంగా 1991లో తాను నటించిన ఫూల్ ఔర్ కాంటే చిత్రాన్ని ప్రస్తావించారు. ఈ సినిమాలో ఎక్కువగా అమ్మాయిలను ఈవ్‌ టీజింగ్ తేసే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. ఈ చిత్రంలో కొన్ని పాటలతో పాటు కాలేజీ క్యాంపస్‌లో అమ్మాయిని వెంబడించడం, ఆటపట్టించడం లాంటి సీన్స్‌ రొమాంటిక్‌గా చిత్రీకరించారని మధు వివరించారు. కానీ ఈ సినిమాపై అప్పట్లో ఎలాంటి విమర్శలు రాలేదని వెల్లడించారు.  ఆ దశాబ్దంలోనే అతిపెద్ద హిట్‌లలో ఒక చిత్రంగా నిలిచిందని మధుబాల అన్నారు. పాత సినిమాల్లో శృంగార భరిత సన్నివేశాలు ఒకప్పుడు సర్వసాధారణంగా ఉండేవని పేర్కొన్నారు. ‍అప్పట్లో చాలా అరుదుగా విమర్శలు వచ్చేవని తెలిపారు. 

    ఆ రోజుల్లో ప్రేక్షకులు అలాంటి సన్నివేశాలను ప్రేమ వ్యక్తీకరణగా చూసేవారని మధుబాల తెలిపారు. ఆ సినిమాలో తన పాత్ర కూడా తన వెంటపడే వ్యక్తితోనే ప్రేమలో పడుతుందని ఆమె అన్నారు. అయితే ఇప్పుడు అదే ప్రవర్తనను ప్రేమగా కాకుండా.. వేధింపులుగా చూస్తున్నారని చెప్పారు. సినిమాలు తరచుగా సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయని మధు అన్నారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఈవ్-టీజింగ్ సీన్స్ ఆమోదించేవారని.. కానీ ఇప్పుడు వేధింపులుగానే చూస్తున్నారని ఆమె అన్నారు. సినిమా అనేది సమాజంతో ముడిపడి ఉందని.. మారుతున్న  సాంస్కృతిక విలువలకు అనుగుణంగా సినిమాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మధుబాల అన్నారు.
     

  • సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్‌ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్‌ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 
     

     

  • రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ మెప్పించింది.

    ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. 
     

     

  • ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ మంత్రం జపిస్తోంది. వందల కోట్ల బడ్జెట్, భారీ క్యాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్‌తో ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ పాన్ ఇండియా జోరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో మాత్రం ఒక కొత్త భయాన్ని పుట్టిస్తోంది. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, అందులో తమ పాత్రల నిడివి చాలా తక్కువగా ఉండడం, ప్రాధాన్యత లోపించడం, పైగా ఆ చిన్న పాత్రల వల్ల అనవసర వివాదాలు చుట్టుముట్టడంతో... ఇప్పుడు పాన్ ఇండియా ఆఫర్ వస్తేనే హీరోయిన్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

    రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా సినిమా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకురాగా, అందులో జాన్వీ కపూర్‌ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెరపై ఆమెను చూపించిన తీరుపై సినీ తారలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి, ఆ సీన్లను తొలగించాడు. అయినా కూడా ఈ వివాదం సాగుతూనే ఉంది.

    జాన్వీ పాత్రపై ఇలా విమర్శలు రావడం రెండోసారి. అంతకు ముందు ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘దేవర’లోనూ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంది. అంతేకాదు నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు విమర్శలు వచ్చాయి.

    ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ సమయంలో అలియా భట్‌ పాత్రపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు అలియా రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం కావడంతో అలియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. చివరకు ఈ పాత్ర నిడివి విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వివాదమే నడిచింది.

    రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాటలు రిచ్‌గా ఉంటాయి కానీ, కథ పరంగా చూస్తే హీరో డామినేషన్ ఎక్కువ. ఈ సినిమాలోనూ కియారా పాత్రకు కథను మలుపు తిప్పేంత ప్రాధాన్యత లేకపోవడం, కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కావడంతో బాలీవుడ్ మీడియాలోనూ దీనిపై చర్చ జరిగింది. 'కల్కి'లో దీపికా పాత్ర కథకు కీలకమే అయినప్పటికీ, యాక్షన్ అంతా హీరోల చుట్టూనే తిరిగింది.

    ఇక భారీ అంచనాలతో వచ్చిన డిజాస్టర్‌గా నిలిచిన ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లోనూ హీరోయిన్ల పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ ఈ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు. చివరకు ‘గ్లామర్‌ షో’కే పరిమితం అయ్యారంటూ విమర్శల పాలయ్యారు.

    పాన్‌ ఇండియా సినిమాలు భారీ విజయం సాధించినా హీరోయిన్లకు క్రెడిట్ రావడం లేదు, ఒకవేళ క్యారెక్టర్ బాలేకపోతే మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ భామలు కేవలం 'పాన్ ఇండియా' ట్యాగ్ చూసి మోసపోకుండా, క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా ఉందో చూసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

  • టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీవాన మూవీ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ రోజుల్లో లవ్ గురించి మాట్లాడారు. నేటి తరం లవ్ అంటే జనాల్లేని థియేటర్లకు వెళ్లి.. కార్నర్‌ సీట్‌లో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రెండుసార్లు షాపింగ్ చేశాక.. నేరుగా ఓయో రూమ్‌లోనే ఎండ్‌ అవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి యువత ప్రేమ గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

    ఇది విన్న హీరో విశ్వక్ సేన్.. అంటే ఏంటి సార్ నాకు తెల్వదు అంటూ ఫన్నీగా మాట్లాడారు. మీకు ఎవరితో ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాను చూశారని యాంకర్ ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు.. వాళ్లకు మనవలు, మనవరాలు కూడా ఉన్నారంటూ సరదాగా మాట్లాడారు.

    కాగా.. హర్షిత్‌, స్మేహ ప్రధానపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం దీవాన. ఈ సినిమాకు శ్రీకాంత్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసినిమా జూన్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
     

     

Andhra Pradesh

  • విశాఖ: ఒమన్‌ తీరంలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో తెలుగు ఇంజనీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నంకు చెందిన సురేష్‌ అనే మెరైన్‌ ఇంజనీర్‌ మృతిచెందాడు. భారత్‌కు చెందిన షిప్‌పై  ఒమన్‌ తీరంలో అమెరికా దాడులకు పాల్పడింది. 

    ఈ ఘటనలో మెరైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న విశాఖ వాసి సురేష్‌ మృత్యువాత పడ్డారు. 15 ఏళ్ల క్రితం సురేష​ వివాహం కాగా, ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్‌లుగా మర్చంట్‌ నేవీలో సురేష్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దాంతో విశాఖలోని శ్రీహరిపురం శ్రీనివాస నగర్‌లోని సురేష్‌ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

     

     

  • సాక్షి, విజయవాడ: ఏపీ డీఎస్సీలో ఆరోపణలపై ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.. అధికారులతో మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టించారు. అయితే, నవీన్‌కి మొదటి ర్యాంక్‌పై సమాధానం దాటవేశారు. నవీన్.. సోషల్‌లో ఫస్ట్‌ ర్యాంక్, టీజీటీలో ఆరో ర్యాంక్ పొందగా.. వెరిఫికేషన్‌కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం సమర్థించుకుంది. నవీన్ లాగిన్ బ్లాక్ చేసిన ప్రభుత్వం.. లాగిన్ బ్లాక్‌పై సమాధానం చెప్పలేదు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఈఆర్ టి కన్వీనర్ ఒక్కరినే నియమించడంపై ప్రభుత్వం సమర్థించుకుంది.

    అన్ని విభాగాలు విద్యాశాఖ కమిషనర్ ఆధీనంలో ఉన్నాయంటూ కవరింగ్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా పోస్టులకు పరీక్ష ఎందుకు పెట్టలేదంటూ మీడియా ప్రశ్నించింది. క్వాలిఫికేషన్ లేకుండా ఎలా అర్హత కల్పించారంటూ మీడియా నిలదీయగా.. అది పాలసీ నిర్ణయం అంటూ చంద్రబాబు సర్కార్‌ తప్పించుకుంది. తమిళనాడులో పరీక్ష లేకుండా ఇస్తున్నారంటూ సమర్థించుకుంది. స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం క్వాలిఫికేషన్ లేకపోయినా తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

    ఐదేళ్ల సమయం వాళ్లకి క్వాలిఫికేషన్ సాధించడానికి ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. మళ్లీ ఎందుకు పాలసీ మార్చారంటూ మీడియా ప్రశ్నించగా.. అది ప్రభుత్వం పాలసీ అంటూ సమాధానం దాటవేశారు. అది డీఎస్సీ కోసం మారిన పాలసీ కాదు.. సాధారణంగా మార్చిన పాలసీ అంటూ అధికారులు బుకాయించారు.

  • సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి పంగనామాలు పెట్టింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ ఏడాది అమలు కాని పరిస్థితి ఏర్పడింది. జూన్ 12న పథకం అమలు జరగదని స్పష్టమైంది. రెండో ఏడాదికే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని కొనసాగించలేక చేతులెత్తేశారు. 

    ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అయితే స్కూల్‌ తెరిచేనాటికి ప్రతిఏటా తల్లికివందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండేళ్లలో ప్రతి విద్యార్థికి రూ.17వేలు ఎగనామం పెట్టింది.

    రేపటి నుంచి స్కూల్స్‌ ప్రారంభం అవుతున్నా ఇప్పటి వరకు ఈ ఏడాది తల్లికి వందనంపై చంద్రబాబు సర్కార్‌ స్పష్టత ఇవ్వలేదు. డబ్బులు ఎప్పుడు జమచేస్తారో ప్రకటించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం.. గతేడాది ఏడాది తల్లికి వందనంలో 20లక్షలమంది విద్యార్థులకు కోత విధించింది. రూ.260 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంతమందో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఎప్పుడిస్తారో బాబు సర్కార్‌ చెప్పలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు.  

  • సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం రేపుతోంది. సిద్ధేశ్వరి జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తానని చెప్పిన నగల దుకాణం నిర్వహకుడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.

    కష్టపడి కూడబెట్టిన సొమ్మును సంస్థలో పెట్టుబడిగా పెట్టామని.. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసి, బంగారం ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సెటిల్‌మెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్తి స్థాయిలో బంగారం  తిరిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని బాధితులు తేల్చి చెప్పారు.

     

     

  • విశాఖ :  ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

    నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.  

    భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా  50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

    ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
  • సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు.  ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్‌ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.

    డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్‌ మెడలిస్ట్‌ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్‌ లెటర్‌​ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్‌ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్‌ కలిసి స్కీమ్‌ను స్కామ్‌ చేశారు..

    చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్‌ 74 చూస్తే స్పోర్ట్‌ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్‌ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్‌ చూపించి సబ్జెక్ట్‌ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్‌ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్‌ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్‌ గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు.

    నాకు కడుపుమండి చెప్తున్నా... DSC లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాళ్ళను
  • సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అరెస్ట్‌ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలపై తాజాగా కారుమూరి స్పందిస్తూ.. నేను అరెస్ట్‌ అంటూ ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఇదంతా ఫేక్‌. నేను ప్రస్తుతం తణుకులో ఉన్నాను’ అని స్పష్టం చేశారు. 
     

  • సాక్షి, తాడేపల్లి: రేపు(శుక్రవారం) ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ పిల్లలు, ఇలా దగాపడిన ప్రతీ వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున రేపు నియోజకవర్గ స్థాయిలో ఈ ర్యాలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

    అలాగే, చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతామన్నారు. దీంతోపాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడతున్నట్టు వెల్లడించారు. 

Business

  • రైల్వే టికెట్ బుకింగ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూలై 15 నాటికి పూర్తిగా పునరుద్ధరించిన, ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ప్రస్తుత పోర్టల్‌లో ఉన్న లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.

    సమావేశంలో ఓ విద్యార్థిని క్యాప్చా సమస్యలు, తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్‌సైట్ నెమ్మదించడం లేదా క్రాష్ కావడం, పాతబడిన డిజైన్‌, తరచూ ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, 30 రోజుల్లో కొత్త వెబ్‌సైట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జూలై 15న కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

    రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ మరింత వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం, అధిక ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించడం, చెల్లింపుల ప్రక్రియను మెరుగుపరచడం, మొబైల్, డెస్క్‌టాప్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారు.

  • దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి కోడలైన రాధికా మర్చంట్‌ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వివాహ బంధంలో సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

    అనంత్ అంబానీతో వివాహంపై..

    అనంత్ అంబానీతో తన దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ, ఒక విజయవంతమైన వివాహానికి ‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు’ అన్న భావన కంటే పరస్పర గౌరవమే ముఖ్యమని చెప్పారు. ప్రతి సంబంధంలో రాజీలు సహజమేనని, కొన్ని సందర్భాల్లో అనంత్ తన అభిప్రాయాన్ని పక్కన పెడతారని, మరికొన్ని సందర్భాల్లో తాను రాజీ పడతానని పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేంత వరకు ఆ బంధం సమానత్వంతోనే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

    మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై మాట్లాడిన రాధికా, కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదైనా, జీవిత భాగస్వామి ఎంత సంపన్నుడైనా, ప్రతి మహిళ తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. “మీరు ఎవరి కుమార్తె అయినా, ఎవరి భార్య అయినా, మీ జీవితంలో ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకునే శక్తి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం” అని ఆమె అన్నారు.

    అది ప్రమాదకరం

    ఆర్థికంగా పూర్తిగా ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. “మీకు బయటపడే అవకాశం లేనంతగా ఏదైనా పరిస్థితికి బంధించబడకండి” అని రాధిక సూచించారు.

    సమాజంలో నిజమైన లింగ సమానత్వం సాధించాలంటే మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం, ఆస్తుల సృష్టి వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారత లేకుండా సంపూర్ణ సమానత్వం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాల్లో నిర్ణయాధికారాన్ని పెంచుతుందని, వ్యక్తిగత గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.

    ప్రముఖ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చంట్‌, శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ 1994లో ముంబైలో జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీతో గత ఏడాది జరిగిన ఆమె వివాహం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది.

  • కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్‌బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.

    ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.

    “స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”

    ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్‌ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.

    ఓపెన్‌ఏఐతో విభేదాలూ ఇందుకే..

    ఒకప్పుడు ఓపెన్‌ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్‌ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్‌ఏఐ కూడా ఏఐ రిస్క్‌లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.

    భారత్‌లోనూ నియంత్రణ ఆలోచన

    ఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్‌ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’

  • ప్రముఖ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్‌ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్‌’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్‌’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

    సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, స్టాక్స్‌, బాండ్లు, రియల్ ఎస్టేట్‌, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్‌లు, ఆర్‌ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్‌ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.

    తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్‌”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్‌ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.

    “ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్‌నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్‌నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్‌లు, డెరివేటివ్‌ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో సంఘర్షణ తీవ్రమైన కారణంగా రిస్క్ సెంటిమెంట్ దెబ్బతినడతో నిఫ్టీ 50, సెన్సెక్స్ అస్థిర సెషన్ ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 53.35 పాయింట్లు లేదా 0.23 శాతం తగ్గి 23,161.60 వద్ద, సెన్సెక్స్ 150.63 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణించి 73,832.55 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎటర్నల్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.81 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.67 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ కెమికల్ షేర్లు అత్యధికంగా క్షీణించాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.

  • డిగ్రీ సర్టిఫికేట్లు, క్లాస్‌రూమ్ పాఠాలు మాత్రమే జీవితాన్ని నిర్దేశించలేవని నమ్మే యువ మేధావులకు కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయ విశ్వవిద్యాలయాల చట్రం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని మార్చే సరికొత్త ఆలోచనలతో దూసుకుపోయే యువ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక ‘థీల్ ఫెలోషిప్ 2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) భారీ గ్రాంట్‌తో పాటు అంతర్జాతీయ మార్గదర్శకత్వాన్ని (మెంటార్‌షిప్‌) ఈ ప్రోగ్రామ్ అందించనుంది.

    ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్, పేపాల్ సహ-వ్యవస్థాపకుడు పీటర్ థీల్ 2011లో స్థాపించిన ఈ ఫెలోషిప్, గ్లోబల్ స్టార్టప్ రంగాన్ని శాసించే అత్యుత్తమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.

    అసలు ఏంటి ఈ థీల్ ఫెలోషిప్?

    సాధారణంగా ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయల అప్పులు చేసి డిగ్రీలు పూర్తి చేశాక ఉద్యోగాల కోసం వెతకడం ఒక సంప్రదాయం. కానీ, థీల్ ఫెలోషిప్ దీనికి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన యువకులు తమ రెండేళ్ల కాలపరిమితిలో కాలేజీ చదువులకు స్వస్తి చెప్పాలి. చదువు పక్కన పెట్టి తాము నమ్మిన సరికొత్త వ్యాపార ఆలోచనలను లేదా పరిశోధనలను నిజం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాల్సి ఉంటుంది.

    ఫెలోషిప్ ద్వారా లభించే ప్రయోజనాలు

    • ఎలాంటి ఈక్విటీ (వాటా) ఆశించకుండా రెండేళ్ల కాలానికి 2,50,000 డాలర్లు సహాయం.

    • సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి పెట్టుబడిదారులు (వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు), శాస్త్రవేత్తలు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో నేరుగా పనిచేసే అవకాశం.

    • విద్యా రుణాలు, ఫీజుల ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా టెక్నాలజీలు, ఉత్పత్తులను రూపొందించుకునే స్వేచ్ఛ.

    • ఇప్పటికే ఈ ఫెలోషిప్ ద్వారా లబ్ధి పొంది ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీలను నడుపుతున్న పూర్వ విద్యార్థుల గ్లోబల్ కమ్యూనిటీలో సభ్యత్వం.

    ఏయే రంగాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత?

    టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ఏ రంగంలోని ప్రాజెక్ట్ అయినా ఈ ఫెలోషిప్‌కు అర్హమైనదే. ముఖ్యంగా కింది రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.

    రంగంప్రాధాన్యత గల అంశాలు
    సాంకేతికతఏఐ, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌
    ఆరోగ్యం, జీవశాస్త్రంబయోటెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్స్, హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్
    పర్యావరణంగ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పుల నివారణ, సుస్థిర అభివృద్ధి
    ఇంజినీరింగ్అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్, ఎడ్యుకేట్‌, సోషల్ వెంచర్స్

    అర్హతలు

    ఈ ఫెలోషిప్ కోసం ఎటువంటి నిర్దిష్ట విద్యా అర్హతలు లేదా డిగ్రీలు అవసరం లేదు. కేవలం అసాధారణ సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే బలమైన ఆశయం, సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసే ధైర్యం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.

    దరఖాస్తు విధానం

    ఆసక్తి గల అభ్యర్థులు థీల్ ఫెలోషిప్ అధికారిక వెబ్‌సైట్(https://thielfellowship.org/) ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత నేపథ్యం, తాము చేస్తున్న లేదా చేయబోయే ప్రాజెక్ట్ వివరాలను సమర్పించాలి. తమ ఆలోచనల వెనుక ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలు, ఈ ఫెలోషిప్ తమకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా, పోటీతత్వంతో కూడిన స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా తుది విజేతలను ఎంపిక చేస్తారు.

    ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!

  • సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్‌డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.

    కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్‌ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.

    శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!

    ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్‌లోని సిబ్బంది మ్యాన్యువల్‌గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్‌లో) ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్‌మెంట్ పేర్కొంది.

    ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!

    ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్‌లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్‌ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

    ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!

Telangana

  • ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కావాలని కోరారు. గోదావరి జలాల సమర్థవంతమైన వినియోగం కోసం మహారాష్ట్రతో చర్చలకు కేంద్రం సహాయం చేయాలని.. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: 123 కి.మీ. విస్తరణకు రూ.38,595 కోట్లు.. వెంటనే అమోదించాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం భూ సేకరణ 90 శాతం పూర్తి అయ్యిందని వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు.

    ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం (చౌటుప్పల్-సంగారెడ్డి) కూడా ఏకకాలంలో ఆమోదించాలి. హైదరాబాద్-అమరావతి-బందర్ 12 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్ర అనుమతి ఇవ్వండి. తెలంగాణకు పోర్ట్ కనెక్టివిటీ.. ఎగుమతులకు గేమ్ ఛేంజర్. వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుకు  200 ఎకరాలు సిద్ధంగా ఉందని.. అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

  • సాక్షి, హైద‌రాబాద్‌: జీహెచ్‌ఎంసీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. 54.55 కిలోమీటర్ల మేర మిస్సింగ్‌ లింక్‌ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతిపాదిత రోడ్లలో ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీలో విలీనమైన, శివారు అభివృద్ధి బెల్ట్‌గా మారిన ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. బడంగ్‌పేట్, నాదర్‌గుల్, కుర్మల్‌గూడ, తుర్కయాంజాల్, మల్లాపూర్, జల్‌పల్లి పరిసర ప్రాంతాలతో పాటు శంషాబాద్‌ పరిసరాల్లో గొల్లపల్లి, రాళ్లగూడ, ధర్మగిరి ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. బడంగ్‌పేట్‌ మెయిన్‌ రోడ్‌ నుంచి తుర్కయాంజాల్‌ వరకు, మల్లాపూర్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి కుర్మల్‌గూడ వరకు, కుర్మల్‌గూడ నుంచి నాదర్‌గుల్‌ వరకు, ఆర్‌సీఐ క్రాస్‌ రోడ్‌ నుంచి శ్రీశైలం హైవే వరకు ప్రతిపాదించిన రహదారులు దక్షిణ హైదరాబాద్‌లో కీలక అనుసంధాన మార్గాలుగా మారనున్నాయి.

    ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌కు ఊతం 
    శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గణనీయంగా రోడ్ల విస్తరణ ప్రతిపాదించారు. గొల్లపల్లి ఎన్‌హెచ్‌ జంక్షన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ వరకు, శంషాబాద్‌ రైల్వే క్రాసింగ్‌ నుంచి ధర్మగిరి రోడ్‌ వరకు, శంషాబాద్‌ బస్టాప్‌ నుంచి రాళ్లగూడలోని ఓయాసిస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వరకు పనులు వీటిలో ఉన్నాయి.  

    నార్సింగి– కిస్మత్‌పూర్‌ కారిడార్‌పై ఫోకస్‌ 
    పశ్చిమ హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న నార్సింగి, కిస్మత్‌పూర్, రాజేంద్రనగర్‌ ప్రాంతాలకూ ఈ లింక్‌ రోడ్ల  ద్వారా ఊరట లభించే అవకాశం ఉంది. బైరాగిగూడ నుంచి నార్సింగి  వరకు, ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ నుంచి చేవెళ్ల రోడ్‌ వరకు కిస్మత్‌పూర్‌ మీదుగా, వివేకానంద విగ్రహం నుంచి ప్రతిష్ఠ విల్లాస్‌ వరకు రహదారి విస్తరణ ప్రతిపాదించారు. దర్గా నుంచి ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ వరకు, ఫర్మాయిష్‌ హోటల్‌ నుంచి తారామతి బారాదరి  వరకు (వయా కేంద్రీయ విహార్‌ అపార్టమెంట్స్‌)  రోడ్డు కూడా వీటిలో ఉంది.

    కోర్‌ సిటీలో..  
    ఖైరతాబాద్‌ జోన్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు, నెక్లెస్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పాటిగడ్డ  వరకు, బేగంపేట్‌ రైల్వే స్టేషన్‌ దగ్గరి రోడ్డు కూడా వీటిలో ఉంది. ఈ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం 1,976 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. భూసేకరణ సవాల్‌గా మారనుందన్నారు. 

    చ‌ద‌వండి: హెచ్‌ఎండీఏ భూ వేలంపై నీలినీడలు

  • హైద‌రాబాద్‌: సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థలాన్ని వేలం వేయాలంటూ ఇద్దరు క్లెయిమ్‌దారులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాల 24 గుంటల స్థలం వేలం ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఈ స్థలానికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రెండు సొసైటీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 19న హెచ్‌ఎండీఏ నిర్వహించతలపెట్టిన బంజారాహిల్స్‌లోని రూ.1000 కోట్లు విలువ చేసే భూమి వేలంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

    షేక్‌పేట్‌ మండలం హకీంపేట సర్వేనెంబర్‌ 102/1లో ఉన్న 8.24 ఎకరాల భూమికి సంబంధించి కొంతభాగం తమ సొంత భూములతో కలిసిపోతుందంటూ యమునానగర్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ, థీమ్‌ అంబియన్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఈ నెల 19న వేలం వేయాలని హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలోనే అత్యంత ఖరీదైన స్థలాల్లో ఒకటిగా ఉన్న ఈ భూమి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.

    ఈ భూమికి ఆనుకుని ఉన్న యమునానగర్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ, థీమ్‌ అంబియన్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు డీమార్కేషన్‌ చేయాలని కోరుతున్నాయి. తమ పక్కనే ఉన్న ఈ భూములను సుమారు నాలుగు ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేయాలనుకుంటున్న భూమితో కలిసిపోతున్నట్లు ఈ ఇద్దరు క్లెయిమ్‌దారులు ఆరోపిస్తున్నారు.

    జాయింట్‌ సర్వే నిర్వహించే వరకు  వేలాన్ని నిలిపివేయాలని యమునానగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వారు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ అభ్యంతరాల నడుమ హెచ్‌ఎండీఏ ఈ స్థలాన్ని వేలం వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే. 

    చ‌ద‌వండి: కాంట్రాక్టుల‌పై తెలంగాణ స‌ర్కారు కీల‌క ఉత్త‌ర్వులు

  • హైదరాబాద్‌: SIR ప్రక్రియపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్‌’ మ్యాపింగ్‌లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఒవైసీ. ఈసీ కోరుతున్న 12 డాక్యుమెంట్స్‌లో తెలంగాణలో మూడు డాక్యుమెంట్స్‌ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ‘సర్‌’ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్‌ ఒవైసీ. 

    కాగా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్‌ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

    2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్‌వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.

  • సాక్షి,హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’(TRS)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కవిత పార్టీ టీఆర్‌ఎస్‌పై ఈసీఐకి దాదాపు 700 ఫిర్యాదులు అందడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

    ఈ నేపథ్యంలో కవిత రాజకీయ పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి (BRS) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ‘టీఆర్‌ఎస్‌’ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.

    కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తెలంగాణ రాష్ట్రసామాజిక సేన’ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరు తమ పార్టీకి కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
     

  • సాక్షి, హైదరాబాద్‌: ఎంఎంసీ, సీఎంసీలో రూ.10 కోట్లకు పైబడిన ఈపీసీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త కమిటీలను నియమించింది. టెక్నికల్ బిడ్ల పరిశీలనకు కమిటీ-2కి అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది.

    పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్‌మార్క్‌ల పరిశీలనకు కమిటీ-1, ధర బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ-2, అదనపు పనులు, గడువు పొడిగింపుల ఆమోదానికి కమిటీ-3 ఏర్పాటు చేసింది. ఇంజినీర్-ఇన్-చీఫ్ (పబ్లిక్ హెల్త్)కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌,ఎస్‌బీ, హెచ్‌ఎండీఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులను కమిటీల్లో ప్రభుత్వం స్థానం కల్పించింది. ఎంఎంసీ, సీఎంసీ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

     

  • మేడిపల్లి: వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేసి, ఆపై  రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకొని మోసం చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్‌ ఉదయ్‌ నగర్‌కు చెందిన ఒక మహి భర్తతో  విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా నివసిస్తోంది.

    2019లో ఫేస్‌బుక్‌ ద్వారా అస్సాంలో విధులు నిర్వహిస్తున్న షేక్‌ మహబూబ్‌ హుస్సేన్‌ పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె అతనితో కలిసి బోడుప్పల్‌లో సహజీవనం చేసింది. అయితే, గత ఏడాది కాలంగా మహబూబ్‌ హుస్సేన్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలు గుర్తించింది.

    ఈ విషయంపై అతడిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. పెళ్లి పేరుతో తన వద్ద నుండి రూ.40 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. నిందితుడి కుటుంబ న్యాయవాది కూడా తనకు పలుమార్లు ఫోన్‌ చేసి బెదిరింపులకు గురిచేశాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

National

  • ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్‌డోజర్‌పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్‌ సమయంలో బుల్‌డోజర్‌పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

    ఉమ్రీ కలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు ఉస్మాన్‌ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్‌డోజర్‌ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికంటే ప్రత్యేకంగా తన బరాత్‌ చేసుకోవాలని అనుకున్నాడు.

    వైరల్‌ వీడియోలో ఉ‍న్న దారి ప్రకారం ఉస్మాన్‌ తన స్నేహితులతో కలిసి బుల్‌డోజర్‌పై కూర్చొని గ్రామంలో ఊరేగింపులో పాల్గొంటూ కనిపించాడు. ఒక వీడియోలో అతను సిగరెట్‌ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.

    మరో వీడియోలో పెద్ద శబ్దంతో వినిపించిన డీజే సంగీతానికి అనుగుణంగా బుల్‌డోజర్‌పై ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్‌ సభ్యులు కూడా బుల్‌డోజర్‌పైకి ఎక్కినట్లు వీడియోల్లో కనిపించింది. కదులుతున్న బుల్‌డోజర్‌పై డజన్‌కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్‌ చేస్తూ హ్యాపీగా గడిపారు.

    ఈ విభిన్న పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు భద్రతాపరమైన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ఊరేగింపులో బుల్‌డోజర్‌పై డ్యాన్స్‌ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.

    వీడియోలు మరింత వైరల్‌ అవుతుండడంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించారు. వీడియోల్లో కనిపించిన బుల్‌డోజర్‌ను గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

    ఈ విషయంపై మాట్లాడిన కాంత్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు.. ఊరేగింపులో వినియోగించిన జేసీబీ యంత్రాన్ని గుర్తించామని, చలాన్‌ జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనతో జరిగే వేడుకలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని, ముఖ్యంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.

    ఉస్మాన్‌ పెళ్లి బృందం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైనా, పెళ్లి తర్వాత ఊహించని గుర్తుగా ట్రాఫిక్‌ చలాన్‌ను కూడా పొందింది. 

  • ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ కీలక డిమాండ్లు లేవనెత్తారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను తీవ్రంగా వ్యతిరేకించిన విజయ్‌.. 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య సీట్లను భర్తీ చేసేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పాటు కోయంబత్తూరులో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న రూ.3,284 కోట్ల విద్యా నిధుల విడుదల, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం, శ్రీలంక, పాకిస్తాన్‌లలో బందీలుగా ఉన్న తమిళ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష వల్ల గ్రామీణ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటును కోరుతూ.. కోయంబత్తూరులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని సీఎం విజయ్ కేంద్రానికి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైద్య విద్యను, అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని ఆయన వివరించారు.

    పాక్ జలసంధి ప్రాంతంలో భారతీయ మత్స్యకారుల సాంప్రదాయ చేపల వేట హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్ దేశాల జైళ్లలో మగ్గుతున్న తమిళనాడు మత్స్యకారులను, వారి బోట్లను విడిపించేందుకు అత్యవసర దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రైల్వే మంత్రిత్వ శాఖలు కింది ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

    సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,284 కోట్ల పెండింగ్ నిధులను ముందస్తు షరతులు లేకుండా విడుదల చేయాలన్నారు. అలాగే, ఆధునిక భారతదేశ లౌకిక విలువల చాటిచెప్పే ప్రాచీన తమిళ గ్రంథం 'తిరుక్కురళ్' (Thirukkural)ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాలని కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు.

  • భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. భువనేశ్వర్‌ సమీపంలోని జార్పడా బ్రిడ్జి దగ్గర ఇవాళ (గురువారం) రెండు ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదాన్ని నివారించగలిగారు.

    ప్రాథమిక సమాచారం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి మంచేశ్వర్ వైపు వెళ్తున్నఓ రైలు.. ఎదురుగా వస్తున్న మరో రైలు ఒకే ట్రాక్‌పైకి చేరాయి. ఈ విషయాన్ని సకాలంలో గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై రెండు రైళ్లను సురక్షితంగా నిలిపివేశారు. ఈ ఘటన భువనేశ్వర్‌లోని అత్యంత రద్దీగా ఉండే జార్పడా వంతెన మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై తూర్పు తీర రైల్వే (ఈసీఓఆర్) అధికారులు విచారణ ప్రారంభించారు. ట్రాక్ కేటాయింపులో జరిగిన పొరపాటు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

     

  • తృణమూల్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో, తిరుగుబాటు ఎంపీల జాబితాతో తన పేరును ముడిపెడుతున్న వార్తలను టీఎంసీ సీనియర్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఖండించారు. తాను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని  స్పష్టం చేశారు.

    లోక్‌సభ స్పీకర్‌కు తృణమూల్ "అసమ్మతి" వర్గం సమర్పించిన లేఖపై సంతకం చేసిన వారిలో శతృఘ్న సిన్హా కూడా ఉన్నారనే వార్తల నడుమ, ఎక్స్‌లో  అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన భారత ప్రధానిగా రికార్డు సృష్టించినందుకు ప్రధాని మోదీని అభినందించడంతో పాటు,  ఈ పోస్ట్‌లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా ట్యాగ్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఊహాగానాలకు తెరలేపింది. అయితే ఈ వార్తలను నటుడు శతృఘ్న సిన్హా గురువారం కొట్టిపారేశారు.

    ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని అసమ్మతి వర్గంలో తాను ఉన్నట్లు వస్తున్న పుకార్లను ఖండించారు. కష్టకాలంలో మమతా  తనకు అండగా నిలిచారు, ఈ  కష్ట సమయాల్లోమమతకు అండగా ఉంటానని ప్రకటించారు.  నిజానికి ఆమె ఒత్తిడి మేరకే తాను అసన్సోల్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశానని చెబుతూ.. తాను "దీదీని ఎప్పటికీ వీడను" అని సిన్హా స్పష్టం చేశారు. అటు తాను మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతోనే ఉంటానని, తిరుగుబాటు శిబిరంలో చేరబోనని గాయకుడు, టీఎంసీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ఓడను వదిలేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మరే ఇతర పార్టీలోనూ చేరడం లేదని కూడా స్పష్టం చేశారు.

    కాంగ్రెస్‌లో విలీనం లేదు 
    మరోవైపు, టీఎంసీలో విలీనం అవుతోందన్న వార్తలు నిరాధారమైనవని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో సహా ఇండియా బ్లాక్ నాయకులను కలిసిన మమతా బెనర్జీ, తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వచ్చారు. నకిలీ సంతకాల వివాదంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ సమన్లు జారీ చేసినప్పటికీ, అభిషేక్ బెనర్జీ ఢిల్లీలోనే ఉన్నారు, ఆయన కోల్‌కతాకు ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

    ఎన్నికల సంఘమే తేలుస్తుంది
    తిరుగుబాటు టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్, తమ గ్రూపుకు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మద్దతు ఉందని, ఎన్డీఏకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అయితే, తిరుగుబాటు ఎమ్మెల్యే రీటాబ్రత బెనర్జీ నేతృత్వంలోని వర్గంతో తమ తిరుగుబాటు ఎంపీలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్గం అసలైన టీఎంసీనో ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందన్నారు.

    ఇదీ చదవండి: తాలిబన్ల అరాచకం : నిరసనకారులపై బుల్లెట్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

    శతృఘ్న సిన్హా రాజకీయ ప్రస్థానం:
    కాగా బాలీవుడ్‌ హీరోశతృఘ్న సిన్హా తన రాజకీయ జీవితం  బీజేపీతోనే ప్రారంభమూంది. దశాబ్దాల పాటు ప్రముఖ బీజేపీ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన  సైద్ధాంతిక విభేదాలతో పార్టీని వీడారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2022లో, ఆయన మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం జరిగిన అసన్సోల్ లోక్‌సభ ఉపఎన్నికలో విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ టిఎంసి అభ్యర్థిగా పోటీ చేసి అసన్సోల్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

    ఇదీ చదవండి: రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

  • భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. రాజ్యసభకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.  తరుణ్‌చుగ్‌, రజనీష్‌ అగర్వాల్‌, మహేష్‌ పేర్లను ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు నామినేషన్‌ తిరస్కరణతో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 

    మధ్యప్రదేశ్‌లో రాజ్యసభకు ఖాళీగా ఉన్న మూడు స్థానాలను బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. బీజేపీ తరఫున తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్‌ పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికలు అవసరం లేకుండా పోయాయి. జూన్ 11న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలి ఉండటంతో రిటర్నింగ్ ఆఫీసర్ వారిని ఏకగ్రీవంగా ప్రకటించి సర్టిఫికెట్లు అందజేశారు.

    కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను బీజేపీ అభ్యంతరాల ఆధారంగా రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఒక కేసును అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే నటరాజన్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టి పారేశారు. ఆమె ఇప్పటికే హైదరాబాద్ కోర్టులో ఆ కేసుపై పిటిషన్ వేసి, దాన్ని వ్యతిరేకిస్తున్నారు.

    కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ తిరస్కరణను.. తప్పు, పక్షపాతపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. చట్ట విరుద్ధం’అని సుప్రీం కోర్టులో వాదించారు. మీనాక్షి నటరాజన్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు రిటర్నింగ్ ఆఫీసర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించారు. 

    ఆయన అభిప్రాయం ప్రకారం, నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైన నిర్ణయం, చట్టబద్ధమైనదే అని కోర్టులో వాదించారు. అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పిటిషన్‌ను అంగీకరించకూడదని కోర్టులో ప్రతిపాదించారు. పిటిషన్‌లో ఎన్నికల ఫలితాలపై స్టే కోరినా.. జూన్ 12న కోర్టులో విచారణ జరగనుందని, అప్పటివరకు స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. మీనాక్షి నటరాజన్‌ పిటిషన్‌పై రేపే సుప్రీంకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ శర్మ, అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

  • కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

    ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్‌ పార్ట్‌ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్‌ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

    ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.

    వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్‌స్టాగ్రామ్‌లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.

  • సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

    మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.

    అయితే మిగిలిన వాదనలు, వివరణలు శుక్రవారం వింటామని తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం సాధారణంగా తగదని అభిప్రాయం బలంగానే ‍వ్యక్తి చేసింది. దీంతో ఈ కేసు రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.  

    మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు, రెండు ఉప స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (4), కర్ణాటక (4) మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.

  • లక్నో: ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్, గూగుల్ మ్యాప్స్ తోడు లేకుండా అడుగు బయటకు  అడుగువేయలేం. అయితే అదే టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే జీవితాలే తలకిందులవుతాయని నిరూపించే ఒక ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లో  యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాయడానికి బయల్దేరిన నలుగురు అభ్యర్థులు, గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి, పరీక్షా కేంద్రానికి బదులు పంట పొలాల్లోకి చేరుకున్నారు. తప్పు తెలుసుకుని పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేసరికి సమయం దాటిపోవడంతో, వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది.

    గూగుల్ మ్యాప్స్ మాయ
    విశాల్, ధర్మేంద్ర మాలిక్, అరుణ్ కుమార్, నకుల్ కుమార్ అనే నలుగురు అభ్యర్థులు ముజఫర్‌నగర్‌లోని ‘దీప్‌చంద్ గ్రెయిన్ ఛాంబర్ ఇంటర్ కాలేజ్’లో పరీక్ష రాయాల్సి ఉంది. వారు తమ అడ్మిట్ కార్డ్‌లోని సెంటర్ కోడ్‌ను గూగుల్ మ్యాప్స్‌లో ఎంటర్ చేసి ప్రయాణమయ్యారు. అయితే, ఆ మ్యాప్ వారిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సింది పోయి, షామ్లీ జిల్లాలోని జాంధేరి గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్యకు తీసుకెళ్లింది. చుట్టూ చూస్తే కాలేజీ కాకుండా పంట పొలాలు కనిపించడంతో వారు షాక్‌కు గురయ్యారు. తాము తప్పుడు లొకేషన్‌కు వచ్చామని గ్రహించేసరికే జరగకూడనంత నష్టం జరిగిపోయింది.

    సమయంతో పోరాటం.. చేజారిన అవకాశం
    సమయం మించిపోతుండటంతో ఆ నలుగురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనతో ముజఫర్‌నగర్ వైపు పరుగులు తీశారు. స్థానికులను దారి అడుగుతూ,  పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాగోలా ముజఫర్‌నగర్ చేరుకునేసరికి పరీక్షా కేంద్రం గేట్లు మూతపడ్డాయి. పరీక్ష ప్రారంభ ప్రక్రియ ముగిసిపోవడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో రాత్రింబవళ్లు కష్టపడి చదివినా పరీక్ష రాయకుండానే వారు వెనుదిరగాల్సి వచ్చింది.

Sports

  • బంగ్లాదేశ్‌ వన్డే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌, ఆరు సార్లు వరల్డ్‌ ఛాంపియన్స్‌ అయిన ఆస్ట్రేలియాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 11) జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఈ ఘనత సొంతం చేసుకుంది. 

    ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన బంగ్లా జట్టు, మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్‌ను హస్తగతం​ చేసుకుంది. 2005లో తొలిసారి ఆస్ట్రేలియాపై ఓ వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తాజాగా రెండు వరుస విజయాలు సాధించి సంచలనం సృష్టించింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. వరుణుడు అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 41 ఓవర్లలో 192 పరుగులకు మార్చారు. 

    లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు రెండో బంతికే వికెట్‌ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత ఎక్కడా ఒత్తిడికి లోను కాకుండా 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

    తౌహిద్‌ హృదోయ్‌ (40), కెప్టెన్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (22) అజేయమైన ఇన్నింగ్స్‌లతో బంగ్లాను గెలుపుతీరాలకు చేర్చారు. అంతకుముందు సౌమ్య సర్కార్‌ (42), నజ్ముల్‌ షాంటో (41) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 

    మిగతా ఆటగాళ్లలో తంజిద్‌ హసన్‌ డకౌట్‌ కాగా.. లిటన్‌ దాస్‌ 21, తొలి వన్డే హీరో మొసద్దెక్‌ హొసేన్‌ 15 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బార్ట్‌లెట్‌, మెరిడిత్‌, జంపా, రెన్షా, గ్రీన్‌ తలో వికెట్‌ తీశారు.

    అంతకుముందు ఆసీస్‌ ఖాతా తెరవకుండానే 3 వికెట్లు కోల్పోయి చరిత్రలో ఎన్నడూ లేని అపవాదును మూటగట్టుకుంది. లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) అర్ద సెంచరీలతో రాణించి, ఈ మాత్రం స్కోరైనా అందించారు. మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌ ఇంగ్లిస్‌ (34), గ్రీన్‌ (25), అలెక్స్‌ క్యారీ (13) రెండంకెల స్కోర్లు చేయగా.. షార్ట్‌, కన్నోల్లీ, రెన్షాతో పాటు జంపా డకౌటయ్యారు. 

    బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (7-2-27-3), తస్కిన్‌ అహ్మద్‌ (8-1-33-3), తన్వీర్‌ ఇస్తాం (10-0-45-2) చెలరేగి బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే జూన్‌ 14న జరుగనుంది. కాగా, ఆసీస్‌కు ఇది వరుసగా రెండో ద్వైపాక్షిక సిరీస్‌ ఓటమి. ఈ సిరీస్‌కు ముందు ఆ జట్టు పాకిస్తాన్‌ చేతిలో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 

  • టీ20 ముంబై లీగ్‌లో భారత టీ20 ప్లేయర్‌ శివమ్‌ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్‌ టైగర్స్‌తో ఇవాళ (జూన్‌ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా అతడి జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో (3-0-16-1) రాణించిన దూబే.. ఆతర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ది నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో ఓ బౌండరీ, 5 సిక్సర్లతో విరుచుకుపడి అజేయమైన 45 పరుగులు చేశాడు.

    తద్వారా అతడి జట్టు మరో 9 బంతులు మిడిలుండగానే విజయతీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో దూబేకు దివ్యాంశ్‌ సక్సేనా (34), ప్రసాద్‌ పవార్‌ (26), గౌరవ్‌ జాథర్‌ (11 నాటౌట్‌) సహకరించారు. ఈ జట్టు స్టార్‌ ఆటగాళ్లు ముషీర్‌ ఖాన్‌ (0), అర్జున్‌ టెండూల్కర్‌ (13) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు.

    అంతకుముందు ఆకాశ్‌ టైగర్స్‌ తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (34), జయ్‌ గోకుల్‌ బిస్తా (35) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును తాకలేదు. అంధేరి బౌలర్లలో అశుతోష్‌ 2 వికెట్లు తీయగా.. అర్జున్‌ టెండూల్కర్‌, ముషీర్‌ ఖాన్‌, శివమ్‌ దూబే, ప్రసూన్‌ సింగ్‌, అజయ్‌ మిశ్రా తలో వికెట్‌ తీశారు. 

  • ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడి భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో, ఆమెతో ఉండేందుకు తాత్కాలికంగా జట్టును వీడాడు.

    రెండో టెస్ట్‌ జూన్‌ 17న మొదలు కావాల్సి ఉండగా.. ఆ సమయానికంతా అతడు జట్టుతో కలుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాన్వే తన తొలి సంతానం జనన సమయంలోనూ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ను మిస్ అయ్యాడు. ఒకవేళ కాన్వే రెండో టెస్ట్‌ సమయానికి అందుబాటులోకి రాకపోతే కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌తో కలిసి రచిన్‌ రవీంద్ర ఓపెనింగ్‌ చేస్తాడు.

    కాగా, న్యూజిలాండ్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇప్పటికే తొలి టెస్ట్‌ పూర్తి కాగా, ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడింది. ఆ మ్యాచ్‌లో కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో (1) విఫలమైనా, రెండో ఇన్నింగ్స్‌లో (41) పర్వాలేదనిపించాడు. కాన్వే ఇటీవలికాలంలో బ్యాటింగ్‌లో స్థిరత్వంలేక ఇబ్బందిపడుతున్నాడు. ఓ సిరీస్‌లో రాణిస్తే, మరో సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. తాజాగా విండీస్‌తో జరిగిన సిరీస్‌లో అతడు 452 పరుగులతో సత్తా చాటాడు.

    ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, పేస్‌ బౌలర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ మ్యాచ్‌ గెలిచిన ఆనందంలో వారిద్దరు నిబంధనలు ఉల్లంఘించి నైట్‌క్లబ్‌లో పార్టీ చేసుకోవడంతో పాటు అక్కడు ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు. 

    అక్కడ స్టోక్స్‌ తాగిన మత్తులో సదరు రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఈసీబీ.. స్టోక్స్‌, అట్కిన్సన్‌ నిబంధనలు ఉల్లంఘించారని నిర్దారించి వారిని రెండో టెస్ట్‌ నుంచి తప్పించింది. స్టోక్స్‌ గైర్హాజరీలో రూట్‌ను తాత్కాలిక సారధిగా ప్రకటించింది. 

  • ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. అఫ్గనిస్తాన్‌- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సేన ఓటమి పాలైంది.

    తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్‌ మధ్య మ్యాచ్‌ జరుగగా.. భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 

    అదరగొట్టిన భారత బ్యాటర్లు
    గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌,  వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్‌ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్‌ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.

    మూడో స్థానంలో వచ్చిన ప్రియా​న్ష్‌ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 80 బంతుల్లో 66, కెప్టెన్‌ తిలక్‌ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. 

    మిగతా వారిలో ఆయుశ్‌ బదోని డకౌట్‌ కాగా.. సూయాన్ష్‌ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్‌ ఖాన్‌ (1), విప్రాజ్‌ నిగమ్‌ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్‌ రాయ్‌ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    349 పరుగుల భారీ స్కోరు
    ఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్‌ ఇమ్రాన్‌ మిర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

    పదే పదే ఆటంకం
    అనంతరం అఫ్గన్‌ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం.. అఫ్గన్‌ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్‌ మిర్‌, హసన్‌ ఐసాఖిల్‌ అఫ్గన్‌కు శుభారంభం అందించారు.

    ఇమ్రాన్‌ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్‌ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఖలీద్‌ తనీవాల్‌ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్‌ ఇమ్రాన్‌కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.

    సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్‌
    బహీర్‌ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్‌ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

    భారత్‌ ఓటమి
    అయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్‌ కంటే అఫ్గన్‌ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్‌ విజయం సాధించింది.

    ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్షద్‌ ఖాన్‌, అనుకుల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. 

    మరోవైపు.. అఫ్గన్‌ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.

    చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

  • ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌-2027కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ అందింది. ఈ మెగా ఈవెంట్‌కు అక్టోబరు- నవంబరు మధ్య షెడ్యూల్‌ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరు 4న మొదలై నవంబరు 21న ఫైనల్‌తో వన్డే వరల్డ్‌కప్‌ ముగియనున్నట్లు తెలుస్తోంది.  

    ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మేలో అహ్మదాబాద్‌లో సమావేశమైన సమయంలో వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌కు సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

    అక్కడ ఎనిమిది వేదికలు
    అయితే, ప్రధాన మ్యాచ్‌లనీ సౌతాఫ్రికాలోనే జరుగనున్నాయి. ఇందుకోసం ఎనిమిది వేదికలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈవెంట్లోని 54 మ్యాచ్‌లలో 41 మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే నిర్వహిస్తారు. ఇక జింబాబ్వేకు 8- 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కగా.. నమీబియాలో కేవలం మూడు మ్యాచ్‌లే నిర్వహించనున్నట్లు సమాచారం.

    కాగా సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌, జొహన్నస్‌బర్గ్‌, బ్లోయేమ్‌ఫొంటేన్‌, డర్బన్‌, ఈస్ట్‌ లండన్‌, గెబెర్హ, పర్ల్‌, కేప్‌టౌన్‌లను వరల్డ్‌కప్‌ వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో హరారే, క్వీన్స్‌, విక్టోరియా ఫాల్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌పై జూలైలో జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.

    24 ఏళ్ల తర్వాత
    కాగా దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆఫ్రికా ఖండంలో వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. చివరగా 2003లో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వడం విశేషం.

    చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

  • త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్‌ జట్లను ఇవాళ (జూన్‌ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస్‌ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ పేరును ప్రకటించారు.

    ఈ సిరీస్‌తో పేస్‌ త్రయం ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్‌ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్‌ ఆసీస్‌ బ్యాటింగ్‌ యూనిట్‌పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్‌లో ఆడిన తంజిమ్‌ హసన్‌ షకీబ్‌, రిపన్‌ మొండల్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌లకు చోటు దక్కలేదు. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.

    జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ విషయానికొస్తే.. నజ్ముల్‌ హసన్‌ షాంటో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్‌ హృదోయ్‌ టెస్ట్‌ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, మొమినుల్‌ హక్‌ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్‌ రోబివుల్‌ హాక్‌కు అవకాశం లభించింది.

    ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ జూన్‌ 28 నుంచి హరారేలో జరుగనుంది.

    ఆస్ట్రేలియా సిరీస్‌కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్‌ హొసేన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.

    జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్‌ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్‌, హసన్‌ మహమూద్‌, తౌహిద్‌ హృదోయ్‌, అమిటే హసన్‌, రోబివుల్‌ హాక్‌.

  • అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్‌పూర్‌ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సహా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌ విమానంలో బయల్దేరారు.

     జైస్వాల్‌కు చోటు
    ఇక లెజెండరీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయం వల్ల అఫ్గన్‌తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్‌ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ తెచ్చుకున్నాడు.

    రోహిత్‌ పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం ఫిట్‌నెస్‌ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.

    అతడు జట్టుకు దూరమయ్యాడు!
    ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.

    అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.

    నితీశ్‌ రెడ్డి ఉన్నాడుగా
    కాగా ఇప్పటికే హార్దిక్‌కు బ్యాకప్‌గా మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌, ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డిని అఫ్గన్‌తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్‌మెంట్‌ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే.. అఫ్గన్‌తో ముల్లన్‌పూర్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్‌ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. 

    చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

  • బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహిద్‌ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) కఠిన చర్యలు తీసుకుంది. జూన్‌ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జోష్‌ ఇంగ్లిస్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్‌ పాయింట్‌ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్‌ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.

    రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్‌ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు.

    ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్‌ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్‌కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.

    ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్‌లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్‌ను ఔట్‌ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్‌ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్‌ ఛేదించలేకపోయింది. డక్త్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్‌ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది. 

  • 2026 మే నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినీస్‌ పేర్లను ఐసీసీ ఇవాళ (జూన్‌ 11) ప్రకటించింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల హవా కనిపించింది. గత నెలలో ఆ జట్టు పాకిస్తాన్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం (2-0తో క్లీన్‌ స్వీప్‌) సాధించిన విషయం తెలిసిందే.

    ఈ సిరీస్‌లో విశేషంగా రాణించిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం, స్పిన్‌ బౌలర్‌ తైజుల్‌ ఇస్లాం ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఎంపికయ్యారు. మరో నామినీగా నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఎయిరీ ఎంపికయ్యాడు. దీపేంద్ర గత నెలలో ఆడిన వన్డేల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చెలరేగాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

    ముష్ఫికర్‌ రహీం
    ఈ వెటరన్ బ్యాటర్ మే నెలలో అసాధారణంగా రాణించాడు. పాక్‌పై రెండు టెస్టుల్లో 253 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 137 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపు తిప్పేశాడు.

    తైజుల్‌ ఇస్లాం
    బంగ్లాదేశ్ ప్రధాన స్పిన్నర్ అయిన తైజుల్‌ పాక్‌తో జరిగిన సిరీస్‌లో 13 వికెట్లతో సిరీస్‌ టాప్‌ వికెట్ టేకర్‌గా నిలిచాడు. రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ (6/120) ఇందులో హైలైట్‌గా నిలిచింది.

    దీపేంద్ర సింగ్‌ ఎయిరీ
    ఎయిరీ గత నెలలో జరిగిన వన్డేల్లో ఓ సెంచరీ (యూఏఈపై), రెండు హాఫ్‌ సెంచరీలు (యూఎస్‌ఏపై) సహా 8 వికెట్లు తీశాడు. అతడి ఆల్‌రౌండ్ ప్రదర్శనల వల్ల నేపాల్ కీలక విజయాలు సాధించింది.

    మహిళల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ బౌలర్‌ లారెన్‌ బెల్‌, పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ గుల్‌ ఫెరోజా, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మ్యాడీ గ్రీన్‌ మే నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. 

  • శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్‌-19 జట్టును ప్రకటించింది. యశ్‌వర్దన్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్‌-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్‌-డే మ్యాచ్‌లు ఆడనుంది.

    ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

    కొత్త జట్టు
    బీసీసీఐ జూనియర్‌ క్రికెట్‌ కమిటీ పంథా మార్చింది. అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్‌కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్‌వర్దన్‌ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్‌రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.

    మరోసారి అన్వయ్‌కు చోటు
    గతేడాది నవంబరులో చివరగా అన్వయ్‌ ద్రవిడ్‌ భారత అండర్‌-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ అండర్‌-19 జట్టుతో ఆడిన భారత్‌- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.

    బెంగళూరు వేదికగా ఈ సిరీస్‌లో ఏకైక మ్యాచ్‌ ఆడిన అన్వయ్‌.. అఫ్గన్‌ బౌలర్‌ నజీఫుల్లా అమిరి బౌలింగ్‌లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.

    శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 వన్డే జట్టు
    సాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), వినీత్ వీకే, అర్జున్ రాజ్‌పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్‌ కీపర్‌), అన్వయ్ ద్రవిడ్ (వికెట్‌ కీపర్‌), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్‌ వి, కావ్యా పరేశ్‌ పటేల్‌, మోహిత్‌ ఉల్వా. ఇషాన్‌ సూద్‌.

    శ్రీలంక పర్యటనకు భారత మెన్స్‌ అండర్‌-19 మల్టీ-డే జట్టు
    సాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్‌ కెప్టెన్‌), యశ్‌వర్దన్‌ సింగ్ చౌహాన్ (కెప్టెన్‌), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్‌ కీపర్‌), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్‌ కీపర్‌), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్‌, ప్రణవ్‌ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.

    భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ శ్రీలంక అండర్‌-19 షెడ్యూల్‌ 
    (మూడు వన్డేలు, రెండు యూత్‌ టెస్టులు)
    👉హంబన్‌టోటా వేదికగా మూడు వన్డేలు
    👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ
    👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్‌ టెస్టు
    👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్‌ టెస్టు.

    చదవండి: వైభవ్‌ ధనాధన్‌.. భారత్‌ భారీ స్కోరు

  • ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (జూన్‌ 11) జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టులో ఓ ఆశ్చర్యం చోటు చేసుకుంది. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ రిలే మెరిడిత్‌ ముందుగా ప్రకటించిన జట్టులో లేకపోయినా, అనూహ్యంగా తుది జట్టులో ప్రత్యక్షమయ్యాడు. మరో ఆశ్చర్యం ఏంటంటే, మెరిడిత్‌ దాదాపుగా ఐదేళ్లుగా వన్డే జట్టులో లేడు. అలాంటి ఆటగాడు హఠాత్తుగా తుది జట్టులో ప్రత్యక్షం కావడం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

    ముందుగా జట్టులో లేని మెరిడిత్‌ను తుది జట్టులో తీసుకోవడం ఆసీస్‌ వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో భారీ ఓటమి తర్వాత సిరీస్‌ను కాపాడుకోవాలన్న ఒత్తిడిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెరిడిత్‌ చివరిగా 2021 జులైలో వెస్టిండీస్‌పై ఓ వన్డే ఆడాడు. ఇదే అతని కెరీర్‌లో చివరిది, మొదటది. ఆ మ్యాచ్‌లో  5 ఓవర్లు వేసిన మెరిడిత్‌ 36 పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా‌ తీయలేకపోయాడు. ఆ తర్వాత అతను వన్డేల్లో అవకాశాలు రాక, టీ20 ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం అయ్యాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్‌ బ్యాటింగ్‌ కష్టాలు ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరింత దారుణంగా ఖాతా తెరవకుండానే ఏకంగా 3 వికెట్లు కోల్పోయింది. ఆ దేశ వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత మూడు వన్డేల్లోనూ ఆ జట్టు ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. తాజా ఉదంతంలో ఓపెనర్లు షార్ట్‌, కన్నోల్లీ, నాలుగో నంబర్‌ ఆటగాడు రెన్షా డకౌట్లయ్యారు.

    లబూషేన్‌ (55 నాటౌట్‌), బార్ట్‌లెట్‌ (52) బాధ్యతాయుతంగా ఆడటంతో ఆసీస్‌ అతికష్టం​ మీద 42 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతానికి మ్యాచ్‌ ఇం​కా ప్రారంభం కాలేదు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌, బార్ట్‌లెట్‌తో పాటు కెప్టెన్‌ ఇంగ్లిస్‌ (34), గ్రీన్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మరో బ్యాటర్‌ (జంపా) కూడా డకౌటయ్యాడు. 

    బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (7-2-27-3), తస్కిన్‌ అహ్మద్‌ (8-1-33-3) చెలరేగి బౌలింగ్‌ చేశారు. ఆసీస్‌ ఈ మ్యాచ్‌ కూడా కోల్పోతే, వరుసగా రెండో సిరీస్‌ను చేజార్చుకున్నట్లవుతుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్‌ చేతిలోనూ ఆసీస్‌ 1-2 తేడాతో వన్డే సిరీస్‌ కోల్పోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన ఆసీస్‌ నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

     

  • అండర్‌-13 టెన్నిస్‌లో బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల సృష్టి కిరణ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదు వరుస ఐటీఎఫ్ (ITF) జూనియర్ టైటిళ్లు సాధించిన తర్వాత, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఇదే క్రమంలో సృష్టి మరో ఘనత కూడా సాధించింది.

    ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్‌లో కెరీర్ బెస్ట్ అయిన 357వ స్థానానికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అండర్-13 విభాగంలో అత్యుత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. సృష్టి కేవలం ఎనిమిది ర్యాంకింగ్ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొని ఈ స్థాయికి చేరుకోవడం మరో విశేషం​. 

    సాధారణంగా ర్యాంకింగ్ కోసం గరిష్టంగా 10 టోర్నమెంట్లను పరిగణలోకి తీసుకుంటారు. కానీ సృష్టి ఎనిమిది ఈవెంట్లలోనే అద్భుతమైన పురోగతి సాధించి అత్యుత్తమ ర్యాంక్‌ సాధించింది.

    సృష్టి వరుసగా ఐదు జూనియర్‌ ITF టైటిళ్లు సాధించడంతో పాటు గ్వాటిమాలాలో జరిగిన ITF వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ J100 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలవడం ద్వారా ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 

    చిన్న వయసులోనే సంచలన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న సృష్టి, భారత మహిళల టెన్నిస్‌ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. త్వరలో ఈ అమ్మాయి జూనియర్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

  • ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్‌-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైభవ్‌ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌, కెప్టెన్‌ తిలక్‌ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.

    తొలి మ్యాచ్‌ శ్రీలంకతో
    శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్‌, అఫ్గన్‌ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్‌లో భారత్‌- శ్రీలంక తలపడగా.. తిలక్‌ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.

    లంకతో మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (2) విఫలం కాగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (101) శతకంతో రాణించాడు. తిలక్‌ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్‌లో గట్టెక్కిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో భాగంగా గురువారం అఫ్గన్‌పై భారీ స్కోరు సాధించింది.

    అఫ్గన్‌పై చెలరేగిన ఓపెనర్లు 
    దంబుల్లా వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (69 బంతుల్లో 84), వైభవ్‌ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రన్‌ ఆచితూచి ఆడగా.. వైభవ్‌ ధనాధన్‌ దంచికొట్టాడు.

    రుతు, తిలక్‌ మరోసారి..
    వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియా​న్ష్‌ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్‌ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్‌ బదోని డకౌట్‌ కాగా.. సూయాన్ష్‌ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్‌ రాయ్‌ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్‌ ఖాన్‌ (1), విప్రాజ్‌ నిగమ్‌ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 

    49 ఓవర్లు ఎందుకంటే?
    వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్‌ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్‌ ఇమ్రాన్‌ మిర్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. 

    అఫ్గన్‌ లక్ష్యం 294
    వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్‌ టార్గెట్‌ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.

    చదవండి: ఆసీస్‌ జట్టులో నిఖిల్‌ చౌదరి

  • టీమిండియా వన్డేల్లో తమ ఆధిపత్యం కొనసాగించింది. ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, రేటింగ్‌ పాయింట్లలో మాత్రం తరుగుదల నమోదు చేసింది. ఇక న్యూజిలాండ్‌ రెండో స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటురేటింగ్‌ పాయింట్లు కూడా మెరుగుపరచుకుంది.

    పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి 
    మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్‌ రేటింగ్‌ పాయింట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఇక.. సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి దూసుకువచ్చింది.  

    కాగా స్వదేశంలో చివరగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడింది టీమిండియా. మూడు మ్యాచ్‌లలో రెండింట ఓడి కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుంది. ఈ క్రమంలోనే భారత జట్టు ఒక రేటింగ్‌ పాయింట్‌ (119 నుంచి 118కి) కోల్పోయింది.

    అదే సమయంలో భారత గడ్డపై సత్తా చాటిన న్యూజిలాండ్‌ రెండు రేటింగ్‌ పాయింట్లు పొందింది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌ ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది.

    అయితే, దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడటం ప్రతికూలాంశంగా మారింది. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. అయితే, హార్దిక్‌ పాండ్యా రీప్లేస్‌మెంట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

    ఐసీసీ పురుషుల వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న జట్లు
    1.ఇండియా- 118 రేటింగ్‌ పాయింట్లు
    2. న్యూజిలాండ్‌- 113 రేటింగ్‌ పాయింట్లు
    3. ఆస్ట్రేలియా- 103 రేటింగ్‌ పాయింట్లు
    4. సౌతాఫ్రికా- 102 రేటింగ్‌ పాయింట్లు
    5. పాకిస్తాన్‌- 100 రేటింగ్‌ పాయింట్లు
    6. శ్రీలంక- 96 రేటింగ్‌ పాయింట్లు
    7. అఫ్గనిస్తాన్‌- 93 రేటింగ్‌ పాయింట్లు
    8. ఇంగ్లండ్‌- 89 రేటింగ్‌ పాయింట్లు
    9. బంగ్లాదేశ్‌- 86 రేటింగ్‌ పాయింట్లు
    10. వెస్టిండీస్‌- 73 రేటింగ్‌ పాయింట్లు.

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ జాతీయ జ‌ట్టుకు ఎంపికైన త‌ర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్‌పై మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

    15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.

    చెత్త షాట్ ఆడి..
    కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్‌నెస్ ఈ మ్యాచ్‌లోనూ బయటపడింది.  'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ టీమిండియా ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన అబ్దుల్లా అహ్మద్‌జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

    కానీ ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్‌ను ఆడి తన హాఫ్‌ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్‌-2026లోనూ చాలా మ్యాచ్‌లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్‌ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్‌ పేసర్‌.. ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేసి బోల్తా కొట్టించాడు.

Politics

  • న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్‌ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్‌ ఖూనీ చేస్తోందని చెప్పారు.

    అలాగే, కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్‌ స్పందిస్తూ..  ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత  బీజేపీ-ఈసీ జుగల్‌బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.

    కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.

    ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు. 

  • ఢిల్లీ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రద్దు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌. ఆమెపై తెలంగాణలో ఎటువంటి కేసులు లేకపోయినా కేసులు ఉన్నాయని చెప్పి  ఫిర్యాదు చేయడం, ఆపై మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించడం జరిగిపోయాయని,. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. 

    ఈరోజు(గురువారం, జూన్‌ 11వ తేదీ) ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశానికి మహేష్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు సాగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ దేశంలో తాజా రాజకీయపై చర్చించాం. పెట్రోల్ , డీజిల్, గ్యాస్,నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. 

    వీసీలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వారు చాలా మంది ఉన్నారు. మీనాక్షి నటరాజన్ పై పెద్దలకు వివరణ ఇచ్చాను. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసు లేదు. నోటీస్ మాత్రమే వచ్చింది.. నోటీస్ విషయాలు మెన్షన్ చేయాలనీ నామినేషన్ పత్రాల్లో ఎక్కడా లేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఒక రోజు ముందు నోటీస్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మా పార్టీ నుండి ఎవరు చెప్పలేదు. రాజకీయ కక్షతో నామినేషన్‌ని తిరస్కరించారు. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ గురువారం పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. సంతకాల ఫోర్జరీ కేసులో తనను న్యాయవాదిగా చివరి క్షణంలో తొలగించారని, అది తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని ఆరోపించారు.

    ఇటీవల పలువురు టీఎంసీ నేతలు, ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీకి గుడ్‌ బై చెప్పేసినప్పటికీ ఆమెకు విధేయుడిగా కొనసాగిన కల్యాణ్ బెనర్జీ ఇప్పుడు అంతర్గత విభేదాలను మరింత తీవ్రం చేస్తూ అల్టిమేటం జారీ చేశారు. “అభిషేక్‌ కావాలా? లేక నేను కావాలా?” అని ఆయన ప్రశ్నించారు. దీంతో పార్టీ నాయకత్వంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మరోసారి బయటపడ్డాయి.

    ప్రస్తుతం జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కల్యాణ్‌ బెనర్జీ కూడా టీఎంసీని వీడే అవకాశం ఉంది. ఆయన బహిరంగంగానే మమతా బెనర్జీకి "నన్నా? అభిషేక్ బెనర్జీనా? ఎవరిని ఎంచుకుంటారో తేల్చండి" అని చెప్పడంతో పాటు, "పార్టీ అభిషేక్ లేకుండా నడవదని మమతా భావిస్తే నేను నా నిర్ణయం తీసుకుంటాను" అని హెచ్చరించారు.

    అసలు ఆ ఫోర్జరీ కేసు ఏంటంటే.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా సోవందేబ్ చటోపాధ్యాయ నియామకానికి సంబంధించి టీఎంసీ తీర్మానం పంపించారు. ఆ తీర్మానంపై కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆరోపించారు. వీరు తమ సంతకాలు అనుమతి లేకుండా తీర్మానంలో చేర్చారని అసెంబ్లీ సచివాలయానికి ఫిర్యాదు చేశారు.

    కాగా, సంతకాల ఫోర్జరీ కేసు విచారణలో కలకత్తా హైకోర్టులో అభిషేక్ బెనర్జీ తరఫున వాదిస్తున్న న్యాయవాదిగా కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొకరిని నియమించడంతో ఈ వివాదం మొదలైంది.

    ఆ కేసులో అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక అరెస్టు రక్షణ ఇచ్చింది. అదే రోజు సాయంత్రం 6 గంటలలోపు పశ్చిమ బెంగాల్ సీఐడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం అభిషేక్ ఢిల్లీలో ఉన్నారు.

    కేసు కోసం తాను రాత్రంతా శ్రమించి, అత్యవసర విచారణ కోసం న్యాయమూర్తి ఎదుట వాదించానని కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు. అయితే మరో పిటిషన్ దాఖలైందని, ఇంకొక న్యాయవాది కేసు చూస్తారని తనకు తెలియజేశారని అన్నారు.

    “ఇతరులను అగౌరవపరచే వారి అలవాటు మారలేదు. అతడు (అభిషేక్ బెనర్జీ) అందరూ తనకంటే తక్కువవారనే భావనలో ఉంటాడు. కామాక్ స్ట్రీట్‌లోని ఉద్యోగుల్లా అందరినీ చూస్తాడు. నేను 45 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను” అని కల్యాణ్‌ బెనర్జీ చెప్పారు.

    “అతడు ఎంతో అహంకారిగా మారిపోయాడు. ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదు. అందుకే నేను తప్పుకున్నాను. ఈ ఉదయం దీదీకి కూడా చెప్పాను. నన్ను లేదా అభిషేక్ బెనర్జీలో ఎవరు కావాలో తేల్చుకోండి” అని కల్యాణ్ బెనర్జీ అన్నారు.

    టీఎంసీని వీడిన మరో నేత
    మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సమయంలో ఈ భిన్నాభిప్రాయ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా అభిషేక్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఎంసీని వీడుతున్నారు. గురువారం ప్రకాశ్‌ బారిక్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందు సుష్మితా దేవ్‌, సుకేందు శేఖర్‌ రాయ్‌ కూడా రాజీనామా చేశారు.

    పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత వారం 58 మంది ఎమ్మెల్యేలు మమతకు ఎదురు తిరిగారు. ప్రతిపక్ష నేత పదవికి రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఈ తిరుగుబాటును మమతా బెనర్జీ, ఆమె పార్టీ ఇటీవలి సంవత్సరాల్లో ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన అంతర్గత సవాళ్లలో ఒకటి. 

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్‌-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లు కూడా జెన్‌-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే   సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.

    ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్‌-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.

    నేపాల్‌లో కొంతకాలం క్రితం జెన్‌-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున  గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్‌ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.

    అప్పటి నుంచే  జెన్‌-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్‌ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు  పెడుతున్నారు.

    స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా  ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్‌-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.

    ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు  సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.

    ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన  ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.

    దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.

    పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్‌లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్‌కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. 

    ఈ నేపథ్యం ఏపీలో జెన్‌-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి  వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే  రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్‌లో కూడా అలా చేయబట్టే  ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్‌-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.

    ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న  ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?

    కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్‌ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు  పెట్టిన జనసేన జెన్‌-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్‌లు ఏదైనా మంచి పని చేస్తే పవన్  కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.

    కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్‌ ప్లాన్‌లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!


    -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
     

  • ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పేలుడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌ అయ్యింది. ఈ ఘటనపై ఏపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. సుమోటో కేసుగా స్వీకరించింది. ఈ ఘటనపై రెండు వారాల్లో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. గాయపడినవారి ఆరోగ్య స్థితి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా వివరాలు అందించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.

    విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతున్న పైడిరాజు నిన్న (బుధవారం) ఉదయం మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)–1లో గత సోమవారం సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

    150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్‌ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. లాడెల్‌ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్‌ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్‌ అగ్నిగుం­డంగా మారింది. కాగా, సేఫ్టీ ప్రొటోకాల్స్‌ పాటించలేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.