Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • పెద్ది సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్‌ 150’ సెలబ్రేషన్స్‌ చేశాం. ఆర్టిస్ట్‌గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్‌గారికి ధన్యవాదాలు. 

    బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్‌లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్‌ డైరెక్టర్స్‌ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తా అంటూ చరణ్‌ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్‌ జాన్వీకపూర్‌ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే  దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్‌ను యాంకర్‌ సుమ జాన్వీతో చెప్పించారు. 


    హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్‌ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ నిర్వహించిన లైవ్‌ మ్యూజికల్‌ నైట్‌ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) పోస్టర్‌ను ఈవెంట్‌ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్‌లో ఆడే జట్ల కెప్టెన్‌లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా జూన్‌ 4న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • నిఖిల్‌ హీరోగా వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్‌ తేదీని ఇంకా ప్రకటించలేదు.

    అయితే ఇవాళ నిఖిల్ బర్త్‌ డే కావడంతో మేకర్స్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మూవీలో యోధుడిగా కనిపించేందుకు నిఖిల్ ఎంతలా కష్టపడ్డారో చూపించే వీడియోను రిలీజ్ చేశారు. యోధుడిలా మారేందుకు 45 రోజులు చాలా కఠినమైన శిక్షణ.. వియత్నాం పోరాట రోజులను పుట్టినరోజు కానుకగా చూపించినందుకు టీమ్ స్వయంభూకి ధన్యవాదాలు.. కష్టపడకుండా ఫలితం రాదు.. అంటూ నిఖిల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే స్వయంభూ థియేటర్లలోకి వస్తుందంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ వీడియోను మీరు కూడా చూసేయండి. 
     

     

  • ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్‌ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్‌ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.

    కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్‌ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్‌ సిరీస్‌కు ప్రశాంత్ పాండియరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్‌ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది.
     

  • ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన తాజా మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉంది.

    బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన తొలివారంలోనే దూసుకెళ్తోంది. ఇండియన్ సినిమాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. దీంతో మేకర్స్‌తో పాటు ధనుశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

    కర అసలు కథేంటంటే..

    ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కరస్వామి అలియాస్‌  కర(ధనుష్‌) ఒక దొంగ. తన తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర  డబ్బు దొంగిలించి.. ఇంట్లో నుంచి పారిపోతాడు. చివరిగా ఒక దొంగతనం చేసి మానేయాలనుకొని  స్నేహితుడితో కలిసి ఓ ఇంట్లోకి వెళ్తాడు. డబ్బులు తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోవాళ్లు పట్టుకొని..పోలీసులకు అప్పగిస్తారు. ఈ కేసు రిటైర్‌మెంట్‌కి దగ్గరగా ఉన్న డీఎస్పీ భరతన్‌(సూరజ్‌ వెంజర్మూడు) చేతికి వెళ్లగా.. కర అతన్ని కొట్టి స్టేషన్‌ నుంచి పారిపోతాడు. ఇకపై దొంగతనాలు చేయనని చెప్పి ప్రియురాలు మల్లి(మమిత బైజు) పెళ్లి చేసుకొని ఓ హోటల్‌లో పని చేస్తారు. కొన్నాళ్ల తర్వాత సొంతంగా హోటల్‌ పెట్టుకోవాలనుకుంటారు.

    లోన్‌ కోసం బ్యాంకుకు వెళ్తే.. షూరిటీ అడుగుతారు. పొలం కాగితాలు పెట్టి లోన్‌ తీసుకుందామని ఊరికి వెళ్లగా.. తండ్రి అప్పటికే వాటిని బ్యాంకుల్లో పెట్టి అప్పు తీసుకుంటాడు. అప్పు కట్టకపోతే పొలాన్ని జప్తి చేస్తామని బ్యాంకు నోటీసులు పంపడం.. కొడుకు డబ్బుల కోసమే తన దగ్గరకు వచ్చాడనే బాధతో కోదండం చనిపోతాడు. తండ్రి చివరి కోరిక మేరకు పార్థివదేహానికి పొలంలోనే పూడ్చేందుకు వెళ్లగా..బ్యాంకు అధికారులు అడ్డుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తండ్రి  చివరి కోరిక నెరవేర్చడం కోసం కర ఏం చేశాడు? బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాలకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ  భరతన్‌ తిరిగి కరను పట్టుకున్నాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు మేనేజర్‌(జయరాం) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్‌ రిలీజ్‌ కాగా.. మెగా ఫ్యాన్స్‌ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్ ‍కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    టికెట్ బుకింగ్స్ ఓపెన్..

    ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్‌ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్‌ 3న స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్‌ ధర రూ.600 ఉండగా..  జూన్‌ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్‌ ధరలపై సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

     

  • రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. దీంతో పాస్‌లు పొందిన ఫ్యాన్స్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఐదున్నర గంటలకే గేట్లు మూసేయడంతో ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు.

    p

    దీంతో పెద్ది సినిమా రిలీజ్ ఈవెంట్ వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పాసులు ఉన్నవారిని అనుమతించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సెలబ్రిటీ పాసులు తీసుకుని వివిధ జిల్లాల నుంచి అభిమానులు విజయవాడ చేరుకున్నారు.  తిరుపతి, నెల్లూరు వంటి సుదూరప్రాంతాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియం ఫుల్ అయిపోందంటూ పోలీసులు అభిమానులను అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులతో అభిమానుల వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. 

    p
     

  • తమిళ స్టార్ కమెడియన్లలో యోగిబాబు ఒకడు. సహాయ పాత్రలతో పాటు అప్పుడప్పుడు హీరోగానూ పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన 'మండేలా'ని ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    యోగిబాబు హీరోగా నటించిన తమిళ కామెడీ డ్రామా మూవీ 'కేనాథ కానం'. ఈ పేరుకు తెలుగులో 'బావి కనబడట్లేదు' అని అర్థం. తమిళనాడులోని చాలా పల్లెటూళ్లలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. తాగేందుకు సరైన నీటి సదుపాయం ఉండదు. అదే అంశాన్ని తీసుకుని ఈ మూవీ తీశారు. కాకపోతే సీరియస్ సమస్యని ఫన్నీగా చూపిస్తూ ఆలోచన రేకెత్తించారు. మార్చి 13న థియేటర్లలో రిలీజై హిట్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఈనెల 15వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

    'కేనాథ కానం' విషయానికొస్తే.. కొడంగిపట్టి అనే ఊరిలో చాలా తక్కువ ఇళ్లు ఉంటాయి. కానీ ప్రతి ఇంటికి తాగునీటి సమస్య ఉంటుంది. దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా సరే ఏం చేయదు. ఈ ఊరిలో నీరు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ప్రజలు.. ఓ తాతని అడిగి ఆ ఊరి శిల్పి అయిన మణివాసగం(యోగిబాబు) ఇంటి దగ్గర ఉందని తెలుసుకుంటారు. దీంతో ఇతడు తన స్థలాన్ని దానం చేస్తాడు. ఊరంతా కలిసి అక్కడ నీటి కోసం తవ్వడం మొదలుపెడతారు. కానీ అక్కడ నీరు పడకపోగా డైనోసర్ ఎముకలు కనబడతాయి. దానికోసం కేంద్రం నుంచి ప్రభుత్వ అధికారులు ఈ ఊరికి ఎందుకొచ్చారు? చివరకు నీటి సమస్య తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • మిల్టెన్ కెనిస్ అనే గుర్రాన్ని దత్తత తీసుకున్న రెజీనా

    మే నెల జ్ఞాపకాలని పంచుకున్న హీరోయిన్ త్రిష

    తెల్లచీరలో అందంగా మెరిసిపోతున్న దివ్యభారతి

    అల్లు స్నేహ మే నెల ఇలా గడిచింది.. ఫొటోలు

    ఆరెంజ్ కలర్ డ్రస్ లో మాయ చేస్తున్న నభా

    మేకప్ లేకపోయినా అందంగా ఆషికా రంగనాథ్

  • ఓటీటీల్లోకి వచ్చే మలయాళ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడిన మూవీస్ కూడా మన దగ్గర బాగానే ఆదరణ తెచ్చుకుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ పోలీస్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    'దృశ్యం' చిత్రాల దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన సినిమా 'ద్రిదమ్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. కానీ ఓ మాదిరి స్పందన మాత్రమే సొంతం చేసుకుంది. యంగ్ హీరో షేన్ నిగమ్ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వస్తుంది.

    'ద్రిదమ్' విషయానికొస్తే.. ఎస్సై విజయ్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ఊరికి పోస్టింగ్ మీద వస్తాడు. చేరిన రెండో రోజే ఓ హత్య, మూడోరోజు ఓ ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం, తర్వాత ఓ బ్లాక్‌మెయిల్ కేసు, తర్వాత మరికొన్ని హత్యలు.. ఇలా వరస కేసులు వస్తూనే ఉంటాయి. వీటని పరిష్కరించడం కోసం విజయ్ ఏం చేశాడు? అసలు ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? కొత్తగా జాయిన్ అయిన విజయ్.. వీటిని ఎలా హ్యాండిల్ చేశాడు? ఇవన్నీ చేసిన తర్వాత విజయ్ కనుక్కొన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)

  • హైదరాబాద్‌ సినీ ప్రియులకు బిగ్‌ గుడ్ న్యూస్‌ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్‌ థియేటర్‌ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్‌లో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

    ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క ఐమ్యాక్స్ థియేటర్‌ కూడా అందుబాటులో లేదు. ఏఎంబీ క్లాసిక్‌ విక్టరీ ఏర్పాటు సినీ ప్రియుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ ఏడాదిలోనే ఐమ్యాక్స్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 
     

     

  • ోపోకిరి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వారిలో  టాలీవుడ్ నటుడు షాయాజీ షిండి. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  తన డైలాగ్స్, మేనరిజంతో ఫ్యాన్స్‌ను తెగ నవ్వించారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వెండితెరపై పవర్‌ఫుల్ విలన్‌గా.. కమెడియన్‌గా మెప్పించారు 

    ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజసేవలో పాటుపడుతున్నారు షాయాజీ షిండే. పర్యావరణ పరిరక్షణ కోసం దాదాపు 6.5 లక్షల చెట్లతో ఒక చిన్న అడవినే సృష్టించాడు. షాయాజీ షిండే నిజ జీవితంలో ఒక అద్భుతమైన హీరో అనిపించుకుంటున్నారు.  ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తూ లక్షలాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. తన తల్లిపై ప్రేమతో మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు.  ‍అమ్మ చనిపోయినప్పుడు ఆమె బరువుకు సమానంగా విత్తనాలు నాటినట్లు తెలిపారు. అవే ఇప్పుడు లక్షల మొక్కలై నాకు తోడుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
     

  • తెలుగులో ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని పరభాషా చిత్రాలు ఇప్పుడు భర్తీ చేస్తున్నాయి. అలాంటి ఓ మూవీనే 'మధువిధు'. మలయాళంలో రిలీజై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. రీసెంట్‌గా సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

    కథేంటి?
    కొచ్చాంబళం అనే ఊరిలో ఒక కుటుంబం ఉంటుంది. అందులో ఐదుగురు మగాళ్లే ఉంటారు. ఆడవాళ్లు లేని కుటుంబం అని, నాగదోషం ఉందని.. కోడలిగా వచ్చేందుకు ఏ అమ్మాయి ఇష్టపడదు. దీంతో ఇదే ఇంట్లో ఉండే అమృత్ రాజ్(షరాఫుద్దీన్)కి 28 సార్లు పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. చివరకు స్నేహ (కల్యాణి పణిక్కర్) ఇతడి జీవితంలోకి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అమృత్ రాజ్ పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    'మధువిధు' అంటే మలయాళంలో హనీమూన్ అని అర్థం. ఆడది లేక బోసిపోయిన ఇంట్లో ఉండే హీరో.. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, ఒంటరిగా కాకుండా భార్యతో కలిసి నిద్రపోవాలని అనుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గట్లే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. 28 సంబంధాలు చూస్తాడు కానీ అందరూ రిజెక్ట్ చేసేస్తారు. అలాంటి ఇతడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి రావడంతో ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు కథ సుఖాంతం అయిందా లేదా అనేది అసలు కథ.

    టాలీవుడ్‌లో ఇప్పుడు డిష్యుం డిష్యుం సినిమాలే ఎక్కువైపోయాయి. ఫ్యామిలీలో ఉండే బంధాలు, భావోద్వేగాలు చూపించే చిత్రాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అలాంటి వాటిని చక్కగా చూపించిన మూవీ ఇది. ఇది పాత కాన్సెప్టే కానీ ట్రీట్‌మెంట్ ఫ్రెష్‌గా ఉంది. ఒక ఊరిలో మగాళ్ల మాత్రమే ఉండే కుటుంబం, అదే ఊరిలో ఆడవాళ్లు మాత్రమే ఉండే మరో కుటుంబానికి ఎలాంటి కనెక్షన్ ఏర్పడింది. 'పెళ్లి' అనేది ఈ రెండు ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు సృష్టిస్తుందని చూపించిన విధానం బాగుంది.

    నాగదోషం ఉందని హీరో ఉంటున్న ఇంటికి ఎవరూ పిల్లనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో హీరోతో పాటు ఇతడి తండ్రి, బాబాయ్ ఎలా ప్రేమలో పడ్డారు? చివరకు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు? అనేది కామెడీగా చూపించారు. పెళ్లీడు వచ్చిన కొడుకు ఇంట్లోనే ఉండగానే తండ్రి పెళ్లి చేసుకోవడం, అప్పటికే కూతురు కూడా ఉన్న కొత్త భార్యని ప్రెగ్నెంట్ చేయడం అనేది వినడానికి చాలా బోల్డ్‌గా అనిపిస్తుంది కానీ ఇందులో అదే కాన్సెప్ట్‌ని ఫన్నీగా డీల్ చేశారు. అది బాగా వర్కౌట్ అయింది కూడా.

    అలకలు, బుజ్జగింపులు, వేడుకలు, వేదన.. ఇలా అన్ని అంశాలని కలుపుకొని ఈ సినిమాని చూపించిన విధానం మెప్పించింది. మరీ ముఖ్యంగా పట్టె మంచం గురించి వచ్చే సీన్స్ అయితే మంచిగా నవ్విస్తాయి. తరచూ ఒకే దగ్గర కేబుల్ వైర్ తెగిపోవడం లాంటి సీన్స్ కూడా నవ్వు తెప్పిస్తాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ ఎక్కడా రాసినట్లు కాకుండా మన పక్కనే జరిగినట్లు అనిపిస్తుంది. అదే ఆ ట్రాక్ బలం.

    ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరో జీవితం ఓ ట్రాజెడీలా ఉంటుంది కానీ దాన్ని ఎక్కడా మెలోడ్రామా చేయకుండా ఫన్నీగా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది ఒక పంజరం లాంటిదని చాలామంది భావిస్తుంటారు. కానీ పెళ్లి అనేది ఓ అందమైన బంధం అనే మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సమస్యలు అన్ని ఇళ్లలో ఉంటాయి. అర్ధం చేసుకుని, మాట్లాడుకుని మమకారాలు పెంచుకుని కలిసుండాలని చెబుతుంది. బోర్ కొట్టకుండా సింపుల్ కంటెంట్‌తో సరదాగా సాగిపోతుంది.

    హీరోహీరోయిన్లుగా చేసిన షరాఫుద్దీన్, కల్యాణి పణికర్‌తో పాటు మిగతా అందరూ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు ఒక్కటి ఉండవు గానీ మూవీ పూర్తయ్యేసరికి చాలా పాత్రలతో ప్రేమలో పడిపోతాం. అంతలా నచ్చేస్తాయి. సెకండాఫ్‌లో సాగదీత, ఫోర్డ్స్‌గా అనిపించే కొన్ని సీన్స్ తప్పితే ఓవరాల్‌గా మూవీ బాగుంది. డైరెక్టర్ విష్ణు ఆనంద్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ గానీ తమ పనికి పూర్తి న్యాయం చేశారు. కుటుంబం అంతా కలిసి చూడొచ్చు.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • అల్లు అర్జున్‌- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్‌ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్‌ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు.  అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు.  ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్‌ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన‌ ఫెమినా 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
     

  • సౌత్‌లో స్టార్‌ స్టేటస్‌ అందుకుని నార్త్‌లో సెటిలైపోయిన హీరోయిన్లలో తాప్సీ పన్ను ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. వరుసగా హిందీ సినిమాలే చేస్తోంది. తాజాగా తాప్సీ తాను గతంలో ఓ తప్పు చేశానని, అలాంటి తప్పు ఇంకెవరూ చేయకూడదని సుతిమెత్తగా హెచ్చరిస్తోంది.

    ఫ్లాట్‌గా ఉండే నడుము కోసం..
    ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తాప్సీ ఓ పోస్ట్‌ పెట్టింది. 'నాకు నాజూకైన నడుము కావాలని చిన్నప్పటినుంచే అనుకునేదాన్ని. కొంచెం కూడా పొట్ట పైకి కనిపించకూడదని కోరుకునేదాన్ని. అంతా ఓకే కానీ, నడుము కింది భాగంలో కొవ్వు పేరుకుపోయి ఉండేది. ఈ లోయర్‌ బెల్లీ ఫ్యాట్‌ ఎందుకు వచ్చిందనేది అస్సలు అర్థమయ్యేది కాదు. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ వ్యాయామాలు చేశాను. సామర్థ్యానికి మించి వ్యాయామం చేసినప్పుడు నా శరీరం మెదడుకు హెచ్చరికలు పంపేది.

    అది కొవ్వు మాత్రమే కాదు
    శరీరం నుంచి నీరు బయటకు వచ్చేయడానికి బదులు దాన్ని నిల్వ ఉంచుకోవడం మొదలుపెడుతుంది. బెల్లీ ఫ్యాట్‌ అంటే అక్కడ కొవ్వు పేరుకుపోవడం మాత్రమే కాదు, కొందరిలో కొవ్వుకు బదులుగా నీళ్లు నిల్వ ఉంటాయి. వర్కవుట్స్‌ ఎక్కువ చేస్తే ఆ బెల్లీ ఫ్యాట్‌ తగ్గడం కాదు కదా.. మరింత పెరుగుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని చెప్తున్నాను.

    శరీరాన్ని హింసించకండి
    ప్రతి మహిళకు భిన్నమైన శరీరం ఉంటుంది. హార్మోన్ల మార్పుల వల్ల మన శరీరం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఒప్పుకునే తీరాలి. నన్ను నేను చాలా టార్చర్‌ పెట్టుకున్న తర్వాత ఆలస్యంగా ఈ విషయం అర్థం చేసుకున్నాను. మా డాక్టర్‌ ఏం చెప్పిందంటే.. పొట్ట కింద కొద్దిగా కొవ్వు, నీరు నిల్వ ఉండటం అవసరమని తెలిపింది. 

    ఆరోగ్యానికి మంచిదే
    అక్కడున్న అవయవాలకు అవి రక్షణగా పని చేస్తాయంది. కాబట్టి ప్రతి మహిళకు లోయర్‌ బెల్లీ ఫ్యాట్‌ ఉండటం మంచిదే! సోషల్‌ మీడియాలో దిగే ఫోటోల కోసం మీ శరీరాన్ని మీరు హింసించుకోకండి. కొంచెం కొవ్వు ఆరోగ్యానికి మంచిదేనని భావించండి' అని రాసుకొచ్చింది. తాప్సీ చివరగా 'అస్సి' సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో రెండు మూవీస్‌ చేస్తోంది.

    చదవండి: నా గర్భస్రావానికి సీఎం విజయ్‌నే కారణం: బుల్లితెర నటి

  • ఇప్పుడు హీరోలు కూడా ట్రెండ్‌కి తగ్గట్లే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వయలెన్స్, బీభత్సమైన యాక్షన్ లాంటి అంశాలతో సినిమాలు వస్తున్నాయి. నాని 'ద ప్యారడైజ్' ఈ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ మూవీలో ఇప్పుడు చిరంజీవి కూడా నటించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    'దసరా'తో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే 'ప్యారడైజ్'. లెక్క ప్రకారం ఈ పాటికే అంటే మార్చిలోనే రిలీజైపోవాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటివరకైతే ఆగస్టు 21న అని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్ర క్లైమాక్స్‌లోనే చిరంజీవి కనిపిస్తారనేది లేటెస్ట్ రూమర్.

    'ప్యారడైజ్' మొదలైన కొన్నాళ్లకే చిరు-శ్రీకాంత్ ఓదెల్ కాంబోపై ప్రకటన వచ్చింది. నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ మూవీకి 'ప్యారడైజ్'తో లింక్ చేస్తున్నారట. అంటే రెండు చిత్రాల్లోని హీరోల పాత్రలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ రాసుకున్నాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే 'ప్యారడైజ్' విషయంలో హైప్ పెరగడం గ్యారంటీ. అలానే టాలీవుడ్‌లో మరో సినిమాటిక్ యూనివర్స్ మొదలవుతుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

  • దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్‌ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్‌ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది.

    ఆయనలా నటించా..
    ఒక సినిమాలో కుమారిముత్తుతో కలిసి నటించాను. ఆయనలా సరిగా కళ్లు కనిపించనట్లుగా యాక్ట్‌ చేయమన్నారు. నేనలాగే చేశాను. నా పాత్ర చూసి ప్రేక్షకులు ఎంతగానో నవ్వుకున్నారు. అయితే తర్వాత మాత్రం అది తప్పని తెలిసొచ్చింది. కుమారిముత్తు చాలా మంచి మనిషి. ఒకరోజు ఆయన్ని సరదాగా పలకరిస్తూ ఒకప్పుడు నువ్వు ఏమవ్వాలనుకున్నావు? అని అడిగాను.

    చదువు లేదు
    అందుకాయన.. నేను పెద్దగా చదువుకోలేదు. చదువుకుంటే బాగుండేదని చాలాసార్లు అనిపించింది. చదువు లేకపోవడం వల్ల నేను కోరుకున్న ఏ ఉద్యోగమూ చేయలేకపోయాను. పోలీస్‌ అవ్వాలని ఆశపడ్డాను. కానీ చదువు లేదు, పైగా నాకు చూపు సరిగా కనిపించదు. ఒకసారి ఏమైందంటే డ్రైవింగ్‌ నేర్చుకుందామని క్లాసెస్‌కు వెళ్లాను. అక్కడ ఇన్‌స్ట్రక్టర్‌ నా కళ్లపై కుళ్లు జోకులు వేశాడు. రెండు కళ్లు బాగా కనిపిస్తున్నవాళ్లే సరిగా నడపలేకపోతున్నారు. నువ్వు చూస్తే గుడ్డివాడికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లే ఉన్నావు.. అలాంటిది డ్రైవింగ్‌ నేర్చేసుకుందామని వచ్చావా? అని హేళన చేశాడు. 

    అప్పుడే డిసైడయ్యా..
    ఇక నువ్వు కూడా సినిమాలో నాలాగా సరిగా కళ్లు కనిపించనట్లు యాక్ట్‌ చేశావ్‌ అన్నాడు. అంతే.. అతడి మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి. వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాను. బయటకు వెళ్లి మనసారా ఏడ్చేశాను. కొన్ని క్షణాలపాటు నవ్వుకోవడం కోసం ఎదుటివారిని హేళన చేయకూడదని నేర్చుకున్నాను. అయితే ఆ కంటి సమస్యే తన కడుపు నింపుతుందని కుమారిముత్తు అనేవాడు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.

    చదవండి: డోలారే సాంగ్‌ షూటింగ్‌లో రష్మిక మందన్నా ప్రెగ్నెంట్‌?

  • థ్రిల్లర్స్ అనగానే చాలామందికి ఓటీటీలే గుర్తొస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలన్నీ థియేటర్లలో రిలీజ్ అవుతాయి. క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రకరకాల మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అలానే 'పాతాళ్ లోక్' మేకర్స్ నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ రెడీ అయింది. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!)

    'రాఖ్' పేరుతో తీసిన ఈ సిరీస్‌లో అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేశ్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వచ్చే శుక్రవారం(జూన్ 12) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఆర్మీ అధికారికి చెందిన కొడుకు, కూతురు కనిపించకుండా పోతారు. వీళ్లని ఎవరో హత్య చేసేస్తారు. తర్వాత ఇదే క్రమంలోనే ఢిల్లీలో వరస హత్యలు జరుగుతాయి. ఇంతకీ వీటిని చేస్తుంది ఎవరు? పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారా? లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.

    ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే ఇందులో తల్లి పాత్ర చేసింది. 'ధురంధర్' ఫేమ్ రాకేశ్ బేడీ కూడా కీలక పాత్ర చేశారు. మరి ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

International

  • వాషింగ్టన్, డీసీ: అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.

    జూన్‌ 2 రేపు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను క్యూపర్టినో నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో వార్షిక  వనభోజనాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, సేవా భావం ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో  స్థానిక ప్రవాస కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఈ వేడుకలో తెలంగాణ వంటాకాలైన సకినాలు సర్వపిండి , ఇరానీ చాయ్ వేడివేడి సమోసాలు ఇతర హైదరాబాదీ వంటకాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన  టీసీఏ సౌత్ బే లీడర్‌షిప్ బృందం అంజనేయులు, గోపికృష్ణ, శ్రీధర్ వాలంటీర్లకు మేనేజ్‌మెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

    తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఇతర దేశంలోనూ ఘనంగా నిర్వహిస్తున్న.. 22 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

  • సుంకాలు కాదు, పశ్చిమాసియా యుద్ధం కాదు.. అమెరికాతో సంబంధాల్లో తైవాన్ ‘అత్యంత ముఖ్యమైన అంశం’ అని చైనా ఎందుకు చెబుతోంది? ప్రత్యేకించి అమెరికాతో సంబంధాల్లో తైవాన్‌కు చైనా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమేంటి? తైవాన్‌పై సైనిక చర్యకు అవకాశం ఉందని సూచించేలా చేస్తున్న ఇలాంటి ప్రకటనలు ఏమి చెబుతున్నాయి?

    తైవాన్‌ ప్రాదేశిక జలాల చుట్టూ చాలా కాలంగా చైనా యుద్ధ విమానాలు, నౌకలు సంచరిస్తూ కలకలం రేపుతున్నాయి. అవి తమ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు భాగాల ఏడీఐజెడ్‌ (ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్)లోకి ప్రవేశించాయని రెండు రోజుల క్రితం కూడా తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

    బీజింగ్‌లో ఇటీవలే ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఇందులో వాణిజ్యం, పశ్చిమాసియా యుద్ధం కంటే.. తైవాన్ అంశానికే చైనా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో.. “అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశమని షీ జిన్‌పింగ్‌ చెప్పారు. దీనిని సరిగ్గా నిర్వహిస్తే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, చివరకు సంఘర్షణలు కూడా తలెత్తవచ్చు. తైవాన్ స్వాతంత్ర్యం, జలసంధి, ఇరుప్రాంతాల శాంతి అనేవి అగ్ని, నీటిలా కలిసిరాని అంశాలు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం అమెరికా, చైనా మధ్య ఉన్న అతిపెద్ద ఉమ్మడి అంశం. తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్త వహించాలి” అని తెలిపింది.

    తైవాన్‌పై చైనా హక్కుల వాదన
    తైవాన్ అనేది ఆగ్నేయ చైనా తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపం. ఇది తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి వేరుపడింది. ఇది చైనా చివరి సామ్రాజ్య వంశం క్వింగ్ పాలనలో ఉండేది. అయితే, 1895లో జపాన్ అధీనంలోకి వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధంలో (1939-45) జపాన్ ఓటమి తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్‌వోసీ) తైవాన్‌పై నియంత్రణ సాధించింది.

    ఆ సమయంలో జాతీయవాద పార్టీ నాయకుడు చియాంగ్ కై-షెక్ దేశానికి నాయకత్వం వహించారు. అయితే మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టులు ఆయన పాలనను సవాలు చేశారు.

    రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన అంతర్యుద్ధం, జపాన్‌పై పోరాటం కారణంగా తాత్కాలికంగా ఆగింది. అనంతరం కమ్యూనిస్టులు విజయం సాధించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్‌సీ)ను స్థాపించారు.

    చియాంగ్, ఆయన మద్దతుదారులు తైవాన్‌కు వెళ్లి ఆర్‌వోసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్‌సీ, ఆర్‌వోసీ రెండూ భూభాగం, ద్వీపం కలిసిన ఏకైక చైనా తమదేనని ప్రకటించాయి. అయితే దానిపై తమ నియంత్రణ ఉండాలని కోరుకున్నాయి.

    సోవియట్ యూనియన్ పీఆర్‌సీకి మద్దతు 
    సోవియట్ యూనియన్ పీఆర్‌సీకి మద్దతు ఇచ్చింది. అమెరికా ఆర్‌వోసీకి మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కాలక్రమేణా పరిస్థితి పూర్తిగా మారింది. 1960 దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్, చైనా మధ్య విభేదాలు వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా చైనా మిత్రదేశంగా ఉపయోగపడుతుందని అమెరికా భావించింది.

    మరోవైపు, 1969లో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రెండు రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక నోట్‌లో ఇలా రాశారు. “800 మిలియన్ల మంది చైనా కమ్యూనిస్టులు ఒంటరిగా జీవించాలని మేము కోరుకోవడం లేదు. మాకు వారితో సత్సంబంధాలు కావాలి. అంతర్జాతీయ సమాజంలో భాగస్వామిగా, పసిఫిక్ సమాజంలో సభ్యదేశంగా చైనా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.

    మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ రహస్య సమావేశాలు నిర్వహించడం, పాకిస్థాన్, రొమేనియా ప్రభుత్వాల సహకారం లభించడం వల్ల 1979లో అమెరికా, చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. చైనాకు కొత్త నాయకుడు డెంగ్ షియావోపింగ్ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించడం, స్వేచ్ఛాయుత విధానాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో అమెరికా సహకారం కీలకమైంది.

    అతిపెద్ద సవాలు తైవానే.. 
    అయితే తైవాన్ మొదటి నుంచే ప్రధాన వివాదాస్పద అంశంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఓ సారి స్పందిస్తూ.. “మొత్తం చర్చల కాలంలో మాకు ఎదురైన అతిపెద్ద సవాలు తైవానే. చైనాకు తైవాన్ అంశం అంతర్గత వ్యవహారమని మేము గుర్తించాము. అయినప్పటికీ అమెరికా ప్రజలకు తైవాన్ ప్రజలతో సుదీర్ఘ, సన్నిహిత, స్నేహపూర్వక అనుబంధం ఉంది. అది ప్రభుత్వేతర మార్గాల ద్వారా కొనసాగడం ముఖ్యం” అన్నారు. 1979లో ప్రచురితమైన ది వైట్ హౌస్ ఇయర్స్  గ్రంథంలో కిసింజర్ ఇలా రాశారు. “మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. తైవాన్‌లోని 17 మిలియన్ల మంది ముఖ్యమా, లేక భూభాగంలోని 800 మిలియన్ల మంది ముఖ్యమా అన్నది నిర్ణయించాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమెరికా “వన్ చైనా” విధానాన్ని కొనసాగిస్తోంది.

    వన్ చైనా విధానం
    చైనా ఒక్కటే దేశమని, తైవాన్ దానిలో భాగమని గుర్తించే అమెరికా విధానం ఇది. అదే సమయంలో తైవాన్‌తో అనధికారిక సంబంధాలు కొనసాగిస్తోంది. దీనిని వ్యూహాత్మక అస్పష్టతగా పిలుస్తారు. ప్రత్యేకించి అమెరికా నుంచి తైవాన్‌కు ఆయుధాల విక్రయం చైనాకు అభ్యంతరకర అంశంగా మారింది.

    బీజింగ్ ఎప్పుడూ తైవాన్‌ను స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా గుర్తించలేదు. మరోవైపు, తైవాన్ తాము కమ్యూనిస్టు చైనాలో ఎప్పుడూ భాగం కాలేదని చెబుతోంది. చైనా చారిత్రక హక్కుల వాదనను సవాలు చేస్తోంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చైనా-తైవాన్ మధ్య ఆర్థిక సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. తైవాన్‌కు చెందిన అనేక మంది చైనాలో పని చేస్తున్నారు. చైనా పెట్టుబడులు కూడా తైవాన్‌లో ఉన్నాయి. 2012 నుంచి అధికారంలో ఉన్న షీ జిన్‌పింగ్.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్ వంటి ప్రాంతాలపై నియంత్రణ సాధించడాన్ని “జాతీయ పునరుజ్జీవనం” లక్ష్యంలో భాగంగా చిత్రీకరించారు. జాతీయ పునరుజ్జీవనం అంటే చైనా గత వైభవాన్ని తిరిగి సాధించాలనే రాజకీయ లక్ష్యం. ఇందులో తైవాన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం వల్ల చైనాకు నిద్రపట్టట్లేదు. ఎందుకంటే యుద్ధం మొదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యుద్ధం చేయకుండా తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకోలేదు.

    ఆధునిక చరిత్రలో పాశ్చాత్య శక్తులు, జపాన్‌ చేతిలో చైనా ఎదుర్కొన్న అవమానాలను బీజింగ్ తరచుగా ప్రస్తావిస్తోంది. సైన్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ ఐక్యతను పెంపొందించడం, కమ్యూనిస్టు పార్టీ పట్ల విధేయత పెంచడం అవసరమని చెబుతోంది. మరోవైపు, 2016 నుంచి తైవాన్‌లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది.

    ప్రస్తుత అధ్యక్షుడు లై చింగ్-టే సహా ఆ పార్టీ నాయకులు, తైవాన్ ఇప్పటికే స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రజలు తమను చైనీయులుగా కాకుండా తైవానీయులుగా గుర్తించుకుంటున్నారని చెబుతున్నారు. సర్వేలు కూడా చైనాతో ఏకీకరణకు ప్రజా మద్దతు తక్కువగా ఉందని చూపించాయి. చాలా మంది ప్రస్తుత పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత, దూర ప్రాంతాల్లో జరిగే యుద్ధాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చనే అభిప్రాయం బలపడింది. 2027 సంవత్సరం కీలక మైలురాయిగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే అది చైనా ప్రజా విమోచన సైన్యం స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం. 2021లో అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ మాజీ అధిపతి ఫిల్ డేవిడ్‌సన్, ఈ దశాబ్దం ముగిసేలోపు దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ స్పష్టత లేదు.

    చైనా, తైవాన్‌ యుద్ధం జరిగితే?
    విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తైవాన్‌పై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పశ్చిమాసియా యుద్ధం కంటే తీవ్రంగా ఉండొచ్చు. మొదటిగా, ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి చైనా, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను ప్రపంచంతో కలుపుతోంది. యుద్ధం విస్తరితే నౌకల రాకపోకలు ప్రభావితమవుతాయి. 

    రెండో అంశం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ ఆధిపత్యం ఉంది. “సిలికాన్ షీల్డ్” సిద్ధాంతం ప్రకారం, ఈ విలువైన పరిశ్రమ కారణంగా పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో తైవాన్‌ను రక్షించడానికి అమెరికాకు ఇదే బలమైన కారణంగా నిలుస్తుంది. సిలికాన్ షీల్డ్ సిద్ధాంతం అంటే చిప్‌ల తయారీలో తైవాన్ ప్రాధాన్యం కారణంగా దానిపై దాడి చేయడానికి దేశాలు వెనుకాడతాయనే భావన.

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్ చాంపియ‌న్‌గా నిలిచిన ఆర్సీబీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ టిమ్ డేవిడ్ జ‌రిమానా నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు. వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్‌పై చ‌ర్య తీసుకోవ‌డం కంటికి ఇంపుగా మారింది. 

    టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబ‌రాల న‌డుమ ఫైన‌ల్ మ్యాచ్‌లో మైదానంలో దుష్ప్ర‌వ‌ర్త‌న‌కు పాల్ప‌డినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా విధిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అత‌డు ప్రాతినిధ్యం వ‌హించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడ‌కుండా అతడిపై సస్పెన్షన్‌ విధిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది.

    గుజ‌రాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీన‌న్ వైపు ఐస్‌బ్యాగ్‌ను విస‌ర‌డం క‌నిపించింది. ఇది ఫ‌న్నీగా చేశాడా లేక కావాల‌నే చేశాడా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే.. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళిలోని ఆర్టిక‌ల్ 2.9 ప్ర‌కారం మ్యాచ్ స‌మయంలో ఒక ఆట‌గాడు.. జ‌ట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్  రిఫ‌రీ లేదా మూడో వ్య‌క్తిపై అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం లేదా ఏదైనా వ‌స్తువును విస‌ర‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధం. 

    30 ఏళ్ల టిమ్ డేవిడ్ త‌న త‌ప్పును అంగీక‌రించినందున త‌న‌ దుష్ప్ర‌వ‌ర్త‌న‌తో నిబంధ‌న‌లను ఉల్ల‌ఘించినందుకు గాను అత‌డి మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజ‌న్‌లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్ర‌హానికి గురికావ‌డం ఇది మొద‌టిసారి కాదు. 

    ఈ టోర్నీలో అత‌డు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధ‌న‌ను ఉల్ల‌ఘించ‌డం గ‌మ‌నార్హం. మొద‌టిసారి ఈ సీజ‌న్‌లో 20వ మ్యాచ్‌లో (ఒక డీమెరిట్ పాయింట్‌), 54వ మ్యాచ్‌లో రెండో ఉల్లంఘ‌న కింద రెండు డీమెరిట్ పాయింట్లు  కోత ప‌డింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్‌ నిబంధ‌న ఉల్లంఘించ‌డంతో నిబంధ‌న‌ల ప్రకారం వ‌చ్చే సీజ‌న్‌లో అత‌డు తొలి మ్యాచ్ ఆడ‌కుండా సస్పెన్షన్‌ పడనుంది.

    చదవండి: ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!

  • అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. 

    అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్‌లో కాకుండా డబుల్స్‌లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది. 

    దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్‌ డ్రెస్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్‌కార్డ్‌గా క్వీన్స్‌క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది. 

    దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్‌’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది. 

    ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్‌) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్) టైటిల్స్‌తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌లో ఏడు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌, మూడు ఫ్రెంచ్ ఓపెన్‌, ఏడు వింబుల్డ‌న్‌, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.

    చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ క‌వ‌ర్‌లో ఏముంది?

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ చాంపియ‌న్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో గుజ‌రాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కోహ్లీ(75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌డ‌మే గాక రెండోసారి టైటిల్ అందించాడు.

    అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల మ‌ధ్య జ‌రిగిన ఒక స‌న్నివేశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క‌, కోహ్లీ న‌డుచుకుంటూ వెళుతున్న స‌మ‌యంలో, అనుష్క చేతిలో ఒక క‌వ‌ర్ క‌నిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవ‌డానికి అది ఒక‌సారి ఇవ్వాల‌ని అడిగాడు. 

    కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.అయినా కోహ్లీ అదే ప‌నిగా ఆమె చేతి నుంచి లెట‌ర్ తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శ‌ర్మ డ‌గౌట్‌కు చేరుకున్న త‌ర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావ‌న‌డం వీడియోలో క‌నిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంత‌కీ ఆ క‌వ‌ర్‌లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.

    మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు.  ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్‌, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

    అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌గా, వెంక‌టేశ్ అయ్య‌ర్ (32), టిమ్ డేవిడ్ (24) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ర‌బాడ‌లు చెరొక వికెట్ తీశారు.

    చదవండి: కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్‌.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!

  • అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్‌లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో  రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.

    అవినీతి ఆరోప‌ణ‌లు..
    అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఐసీసీ బోర్డు తీర్మానించింది. స‌భ్య‌త్వానికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను ఉల్లంఘించిన కార‌ణమే త‌క్ష‌ణ స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అయితే కెన‌డా క్రికెట్ బోర్డుపై వేటు వేసిన‌ప్ప‌టికీ జ‌ట్టు ఆట‌గాళ్ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడడం ఐసీసీ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని తెలిపింది. 

    జాతీయ పాల‌క‌మండ‌లిని ప్ర‌భావితం చేసే పాల‌న‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆట‌గాళ్లు న‌ష్టపోకుండా చూడ‌డం త‌మ బాధ్య‌త అని ఐసీసీ తెలిపింది.స‌స్పెన్ష‌న్‌లో ఉన్న కెన‌డా క్రికెట్ బోర్డులో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఐసీసీ నార్మ‌లైజేష‌న్ క‌మిటీ ప‌నిచేయ‌నుందని, కెన‌డా క్రికెట్ బోర్డును తిరిగి కొత్త‌గా పున‌రుద్ధ‌రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొంది.

    పింక్‌బాల్  ట్రయల్‌..
    ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్‌కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్‌గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్‌కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

    ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. 

    టెస్టు క్రికెట్‌లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్‌కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. 

    పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్‌కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్‌గా చూస్తున్నారు.

    హాక్-ఐ డేటాకు అనుమతి
    సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .

    వన్డేల్లో హెడ్‌కోచ్‌లకు కొత్త అవకాశం
    ఇక వన్డే మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ బ్రేక్‌లు ఉండటంతో కోచ్‌లు మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్‌లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్‌లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.

    లెగ్-సైడ్ వైడ్ రూల్‌కు శాశ్వత ఆమోదం
    ఐసీసీ లెగ్-సైడ్ వైడ్‌పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

    మ‌రికొన్ని నిర్ణ‌యాలు..
    క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్‌లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. 

    చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్‌!

  • ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్‌గా మారింది. అయితే టిమ్‌ డేవిడ్‌ ఇదంతా ఫన్‌ మోడ్‌లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.

    విషయంలోకి వెళితే.. ఈ సీజన్‌లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్‌ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్‌కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. 

    ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్‌ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. 

    ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్‌, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌గా, వెంక‌టేశ్ అయ్య‌ర్ (32), టిమ్ డేవిడ్ (24) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ర‌బాడ‌లు చెరొక వికెట్ తీశారు.

    చదవండి: IPL 2026: టాప్‌-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!

  • ఐపీఎల్‌లో ప‌రుగుల పండుగ అభిమానుల‌కు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడ‌వ‌లు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్‌ను అల‌రించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ నుంచి తాజా 19వ సీజ‌న్ దాకా ఎన్నో గొడ‌వ‌లు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మ‌రి ఈ సీజ‌న్‌లో అభిమానుల‌కు కిక్ ఇచ్చిన‌ టాప్‌-10 వివాదాలు ఏంట‌నేవి ఇప్పుడు తెలుసుకుందాం.

    1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదం
    ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్‌పై ఎంత ర‌గ‌డ జ‌రిగింద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. 63 ప‌రుగుల‌తో కోహ్లి ఆర్సీబీని విజ‌యం వైపు న‌డిపిస్తున్న స‌మ‌యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్‌ను గిల్ స‌రిగ్గా ప‌ట్ట‌లేద‌ని, చేతుల్లోకి వెళ్ల‌డానికి ముందు బంతి నేల‌ను తాకింద‌ని కోహ్లీ భావించాడు. 

    అయితే అంపైర్ నితిన్ మీన‌న్ ఔట్ ఇవ్వ‌డంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాద‌ని, క్రీజు వ‌ద‌లి వెళ్ల‌న‌ని, థ‌ర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిప‌ట్టు ప‌ట్టాడు. చేసేదేం లేక అంపైర్ త‌న నిర్ణ‌యాన్ని థ‌ర్డ్ అంపైర్‌కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. కోహ్లీ సంబ‌రాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశ‌తో చూస్తూ ఉండిపోయాడు. ఆ త‌ర్వాత 75 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.

    2) షేక్‌హ్యాండ్ వివాదం..
    ఈ సీజ‌న్‌లో అభిమానుల‌కు మ‌రింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మ‌ధ్య జ‌రిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడ‌డం, దానికి కోహ్లీ ధీటుగా బ‌దులివ్వ‌డం జ‌రిగిపోయాయి. అయితే ఈ గొడ‌వ ఇక్క‌డితో స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. 

    మ్యాచ్ పూర్తైన త‌ర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్ర‌మంలో హెడ్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చినా కోహ్లీ అత‌డిని ప‌ట్టించుకోకుండా ప‌క్క‌కు వెళ్లిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ వివాదం హెడ్ భార్య‌ను కూడా తాకింది. ఆమెపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య కామెంట్లు పెడుతూ కొంద‌రు ఆక‌తాయిలు రెచ్చిపోయారు. మ‌రి ఈ వివాదానికి ఈ సీజ‌న్‌తో ముగింపు ప‌డిందా అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి.

    3) టిమ్ డేవిడ్ అనైతిక చ‌ర్య‌
    మే 11న‌ ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్ విజ‌యం త‌ర్వాత ఆర్సీబీ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్ల‌తో అస‌భ్య సంజ్ఞ‌లు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. సీజ‌న్ ప్రారంభానికి ముందు జ‌రిగిన మెగా వేలంలో ముంబై ఇండియ‌న్స్ త‌న‌ను విడుద‌ల చేయ‌డంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసిన‌ట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చ‌ర్య‌ను త‌ప్పుబ‌డుతూ అత‌ని మ్యాచ్ ఫీజులో 30 శాతం జ‌రిమానా విధించ‌డంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.

    4) టాస్ వివాదం..
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య‌ క్వాలిఫ‌య‌ర్‌-2 పోరు సంద‌ర్భంగా టాస్ స‌మ‌యంలో నెల‌కొన్న గంద‌ర‌గోళం వివాదంగా మారింది. మొద‌ట టాస్ వేసిన‌ప్పుడు ప‌రాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫ‌రీ ప్ర‌కాశ్ భ‌ట్ మాత్రం ప‌రాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మ‌ళ్లీ వేయించాడు.  

    రెండో ప్ర‌య‌త్నంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు టాస్ అనుకూలించ‌డంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్ర‌య‌త్నంలో గుజ‌రాత్‌కు టాస్ అనుకూలంగా వ‌చ్చిన‌ట్లు త‌ర్వాత తేలింది. ఈ స‌మ‌యంలో గుజ‌రాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమ‌యానికి గుర‌య్యాడు. కానీ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించ‌డంతో ఈ వివాదంపై పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు.

    5) అంపైరింగ్‌పై ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు 
    ఈ సీజ‌న్‌లో వ‌రుస వివాదాస్ప‌ద అంపైరింగ్ నిర్ణ‌యాలు త‌మ‌ను తీవ్ర ప్ర‌భావితం చేశాయంటూ ఎస్ఆర్‌హెచ్ బీసీసీఐని ఆశ్ర‌యించ‌డం హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో క్లాసెన్ వివాదాస్ప‌ద క్యాచ్‌, కేకేఆర్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ క్యాచ్‌పై, లక్నో ఆట‌గాడు అవేశ్ ఖాన్ బంతి బౌండ‌రీ లైన్‌ను దాట‌క‌ముందే, ఆ తాడును వెన‌క్కి నెట్టేయ‌డంపై ఎస్ఆర్‌హెచ్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఎంసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ చ‌ర్య‌పై ఆట‌గాడికి భారీ జ‌రిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

    6) ప‌రాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘ‌ట‌న‌
    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్ రియాన్ ప‌రాగ్ వేపింగ్ (ఈ-సిగ‌రేట్‌) చేస్తూ కెమెరాల‌కు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం నిషిద్ధం. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట ప‌రువుకు భంగం క‌లిగించినందుకు ప‌రాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానా విధించ‌డంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.

    7) రాజ‌స్తాన్ డ‌గౌట్ మొబైల్ వివాదం
    ఈ సీజ‌న్‌లో వివాదాల్లో హైలైట్‌గా నిలిచిన వాటిలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ డ‌గౌట్‌లో మొబైల్ ఫోన్ క‌నిపించ‌డమే. ఆర్సీబీతో  మ్యాచ్ సంద‌ర్భంగా డ‌గౌట్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మేనేజ‌ర్ రోమి భింద‌ర్ మొబైల్ ఫోన్ ఉప‌యోగిస్తుండ‌డం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చ‌ర్య ప‌ట్ల సీరియ‌స్ అయిన బీసీసీఐ భింద‌ర్ మొబైల్ అనుకోకుండా వాడాన‌ని, మెడిక‌ల్‌రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడిన‌ట్లు తెలిపాడు. త‌న చ‌ర్య ప‌ట్ల‌ క్ష‌మాప‌ణ చెప్పిన‌ప్ప‌టికీ, అత‌డి వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌ని బీసీసీఐ రోమి భింద‌ర్‌కు రూ.ల‌క్ష జ‌రిమానా విధించింది. రోమి భింద‌ర్ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ బీసీసీఐ ఆట‌గాళ్ల‌కు క‌ఠిన ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు జారీ చేసింది.

    8) అబ్‌స్ట్ర‌కింగ్ ది ఫీల్డ్‌
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ల‌క్నోతో మ్యాచ్ సంద‌ర్భంగా కేకేఆర్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట‌య్యాడు.  షాట్ ఆడిన అంగ్‌క్రిష్ సింగిల్ తీయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న గ్రీన్ వ‌ద్ద‌ని వారించ‌డంతో వెన‌క్కి వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ద‌శ‌లో బంతిని అందుకున్న ష‌మీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. 

    ఈ నేప‌థ్యంలో త‌న ర‌న్నింగ్ దిశ‌ను మార్చుకున్న ర‌ఘువంశీ ష‌మీ వేసిన బంతికి అడ్డు రావ‌డంతో అది అత‌డి ప్యాడ్ల‌కు త‌గిలింది. దీంతో ల‌క్నో ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో ఉద్దేశ‌పూర్వ‌కంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్‌క్రిష్ రఘువంశీని ఔట్‌గా ప్ర‌క‌టించాడు.

    9) అర్ష్‌దీప్ ఇన్‌స్టా వివాదం
    పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దాదాపు 200 పైగా పోస్టుల‌ను తొల‌గించ‌డం ఆస‌క్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ప‌లు వివాదాల నేప‌థ్యంలో అర్ష్‌దీప్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తేలింది. టోర్నీ జ‌రుగుతున్న స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్ స‌హా జ‌ట్టు స‌మావేశాల‌కు సంబంధించి కంటెంట్‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసుకోవ‌ద్దంటూ బీసీసీఐ ఆట‌గాళ్ల‌ను హెచ్చ‌రించింది. అందుకే అర్ష్‌దీప్ త‌న ఇన్‌స్టాలో పోస్టులు తొల‌గించి ఉంటాడ‌ని అభిమానులు భావించారు.

    10) జాస‌న్ హోల్డ‌ర్ క్యాచ్ వివాదం
    గుజ‌రాత్ టైటాన్స్‌, ఆర్సీబీ మ‌ధ్య మ్యాచ్‌లో ర‌జ‌త్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డ‌ర్ డైవ్ చేసి ప‌ట్టినప్ప‌టికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్ప‌ద‌మ‌యింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్ర‌మంలో హోల్డ‌ర్ బంతిని తొలుత నేల‌కు ఆనించిన‌ట్లు కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, అంపైర్ ఔటివ్వ‌డం ఆర్సీబీ డ‌గౌట్‌లో ఆట‌గాళ్ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. 

    హోల్డ‌ర్ ప‌ట్టిన క్యాచ్‌పై కోహ్లీ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఔట్ కాద‌ని తెలుస్తున్న‌ప్ప‌టికీ మూడో అంపైర్ పాటిదార్‌ను ఔట్ అని ప్ర‌క‌టించ‌డం అత్యంత వివాదాస్ప‌ద‌మ‌య్యింది.

    చదవండి: భార‌త్‌లో ఫిఫా ప్రసార హ‌క్కులు ఆ సంస్థ‌కే!

  • ఐపీఎల్‌-2026 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మండిపడ్డాడు. అసలు గుజరాత్‌ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.

    జోస్‌ బట్లర్‌ను కాదని నిశాంత్‌ సింధును వన్‌డౌన్‌లో ఎలా ఆడిస్తారని బ్రాడ్‌ ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

    ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్‌ సందర్భంగా గుజరాత్‌ తమ టాపార్డర్‌ను మార్చిన సంగతి తెలిసిందే.

    ఆదిలోనే షాక్‌
    ఓపెనర్లుగా సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగగా.. వన్‌డౌన్‌లో మాత్రం బట్లర్‌ను కాదని నిశాంత్‌ సింధును ఆడించారు. అయితే, సీజన్‌ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్‌ 10 పరుగులే చేయడంతో గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

    ఇలాంటి తరుణంలో అన్‌క్యాప్డ్‌ నిశాంత్‌ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.

    ఈ నేపథ్యంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ గుజరాత్‌ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్‌ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.

    నాకైతే అర్థం కావడం లేదు
    అసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్‌ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్‌ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.

    ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్‌, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్‌ను పరీక్షించేందుకు వీలుకాదు.  

    ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..
    ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్‌ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్‌ బ్రాడ్‌ విమర్శించాడు.

    బహుశా అందుకేనేమో!
    ఇక ఇదే షోలో ఇంగ్లండ్‌ మరో మాజీ ఆటగాడు స్టీవెన్‌ ఫిన్‌స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్‌ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్‌గా ఆడిన అనుభవం బట్లర్‌కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్‌ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.

    అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుజరాత్‌ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్‌ స్టాండింగ్‌ ఇస్తే బట్లర్‌ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.

    కాగా గుజరాత్‌ టాపార్డర్‌ కుదేలు కాగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్‌ విజేతగా నిలిచింది.

    చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశారు?!

  • ఐపీఎల్‌ పందొమ్మిదో సీజన్‌ ముగిసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్‌ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.

    ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్‌ కెరీర్‌ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్‌-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!

    కరుణ్‌ నాయర్‌
    కరుణ్‌ నాయర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్‌లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్‌ బ్యాటర్‌కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్‌-2025లో కరుణ్‌ నాయర్‌ కాస్త ఫర్వాలేదనిపించాడు.

    ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్‌-2026లో రెండు ఇన్నింగ్స్‌ ఆడిన కరుణ్‌ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు.

    వచ్చే సీజన్‌ నాటికి కరుణ్‌ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్‌ నాయర్‌కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!

    టి.నటరాజన్‌
    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నెట్‌ బౌలర్‌గా వచ్చి.. ఐపీఎల్‌లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్‌ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్‌. పది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.

    వరుసగా ఆరు మ్యాచ్‌లలో నటరాజన్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

    అన్రిచ్‌ నోర్జే
    సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ అన్నిచ్‌ నోర్జేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్‌ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.

    తాజా ఎడిషన్‌లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్‌ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్‌లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.

    ట్రెంట్‌ బౌల్ట్‌
    న్యూజిలాండ్‌ సీనియర్‌ పేసర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్‌ బౌలర్‌.. ఇప్పటికి 124 మ్యాచ్‌లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.

    ఇక ఐపీఎల్‌-2026కు ముందు ముంబై ఇండియన్స్‌ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. 

    దీంతో అతడికి బౌలింగ్‌ కోటా పూర్తి చేసే  అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్‌ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.

    హర్షల్‌ పటేల్‌
    ఐపీఎల్‌-2026కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హర్షల్‌ పటేల్‌ను రూ. 8 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్‌ రాణించలేదు.

    ఐదు మ్యాచ్‌లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్‌ నాటికి హర్షల్‌ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్‌రైజర్స్‌ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్‌ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.

    చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌మనీ?

  • భారత్‌లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్‌లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది. 

    ఈ విషయాన్ని జీ ఎంటర్‌టైన్‌మెంట్ సోమవారం అధికారికంగా  వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్‌తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్‌లను భారత్‌లో జీ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది. 

    రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్‌కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్‌ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్‌లో మ్యాచ్‌ల ప్రసార హ‌క్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఆశించింది. కానీ జీ నెట్‌వ‌ర్క్‌ మంచి ధరకే ఒప్పందం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

    2022 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లకు భార‌త్‌లో ప్ర‌సార హ‌క్కుల‌ను అప్ప‌ట్లో వ‌యాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది ప‌క్క‌న‌బెడితే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను భార‌త్‌లో వీక్షించాల‌నుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫ‌లించాయి. ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను జీ నెట్‌వ‌ర్క్ ఇటీవ‌లే కొత్త‌గా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్ల‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. 

    యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డి (ఇంగ్లీష్) లో మ్యాచ్‌లు ప్ర‌సారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో మొత్తం 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొన్న‌టిదాకా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను వీక్షించే భాగ్యం లేకుండా  పోయింద‌ని తెగ బాధ‌ప‌డిపోయిన అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

    భారతీయ బ్రాడ్‌కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. 

    ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్‌లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

    చదవండి: ఆ విషయంలో గిల్‌ తోపు.. రబాడ తక్కువేం కాదు!

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్‌ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

    కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్‌ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌-2026లోనూ కృనాల్‌ అదరగొట్టాడు.

    ఐదుసార్లు
    ఈసారి 226 పరుగులు చేసిన కృనాల్‌.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్‌ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్‌ నిలిచాడు. 

    ముంబై ఇండియన్స్‌ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్‌ గెలిచిన ఈ బరోడా ఆల్‌రౌండర్‌... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.

    కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..
    ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయానంతరం కృనాల్‌ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్‌ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.

    అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.

    వేలం సమయంలోనే సగం గెలిచేశాము
    ఇక తొలి టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్‌ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.

    సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. 

    ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్‌ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.

    కృనాల్‌తో పాటు వీళ్లు కూడా
    ఆర్సీబీ వరుస రెండు టైటిల్‌ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్‌ రజత్‌ పాటీదార్, దిగ్గజ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి, ఫిల్‌ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్‌ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్‌ హాజల్‌వుడ్, రసిఖ్‌ సలామ్, భువనేశ్వర్ కుమార్‌, సుయాశ్ శర్మ, అభినందన్‌కి ఇది రెండో ట్రోఫీ. 

    మరో 10 మంది దేవ్‌దత్‌ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్‌ మల్హోత్రా, కనిష్క్‌ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. 

    చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌మనీ?

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఒక‌టిగా నిలిచిపోనుంది. 2022 సీజ‌న్ నుంచి స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ వ‌చ్చిన గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజ‌న్ల‌లో మూడుసార్లు ఫైన‌ల్ చేర‌డమంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. 

    2022లో చాంపియ‌న్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ 2023లో ర‌న్న‌ర‌ప్‌గా, 2024 సీజ‌న్‌లో లీగ్ ద‌శ‌, 2025 సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌, తాజా సీజ‌న్‌లో మ‌రోసారి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో గుజ‌రాత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుస‌గా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఆట‌గాళ్ల‌కు రేటింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. 

    ఫైన‌ల్ ఆడిన తుది జ‌ట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆట‌గాళ్ల రేటింగ్‌ను విడుద‌ల చేశారు. 10 పాయింట్ల‌తో కూడిన రేటింగ్‌లో జ‌ట్టును అంతా తానై న‌డిపించిన కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్, బౌల‌ర్ క‌గిసో ర‌బాడ చెరో 9 పాయింట్ల‌తో తొలి స్థానంలో నిల‌వ‌గా, సాయి సుద‌ర్శ‌న్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాస‌న్ హోల్డ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ర‌షీద్ ఖాన్‌లు ఏడేసి పాయింట్ల‌తో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. 

    ఇక వికెట్ కీప‌ర్ జాస్ బ‌ట్ల‌ర్ 6.5 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉండ‌గా, వాషింగ్ట‌న్ సుంద‌ర్, ప్ర‌సిధ్ కృష్ణ చెరో 6 పాయింట్ల‌తో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శ‌ర్మ‌, అర్ష‌ద్ ఖాన్‌లు చెరో 4 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా, 3 పాయింట్ల‌తో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.

    ఈ సీజన్‌లో ద్ద‌గా ప్ర‌భావం చూప‌ని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్‌, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్‌తో ఆఖ‌రి స్థానాల్లో ఉన్నారు. లీగ్ ద‌శ‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజ‌యాల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. అయితే ఫైన‌ల్లో ఆర్సీబీ చేతిలో చ‌తికిల‌ప‌డిన గుజ‌రాత్ ర‌న్న‌ర‌ప్‌కు ప‌రిమిత‌మైంది.

    చదవండి: 'కోహ్లీ కాస్త త‌గ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'

  • భారత యువ సంచలనం, రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.

    గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్‌కప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

    ఆరెంజ్‌ క్యాప్‌ విజేత
    ఇక ఐపీఎల్‌-2026లో పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్‌ ఓపెనర్‌గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్‌ ప్లేయర్‌, మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.

    ఈ క్రమంలో ప్రజెంటర్‌, టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.

    నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను
    వచ్చే సీజన్‌లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్‌.. మ్యాచ్‌కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్‌లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.

    ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్‌నెస్‌ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్‌ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్‌గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్‌ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. 

    చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?!

  • జూన్‌ 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (జూన్‌ 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ కొనసాగనుండగా.. పలువురు కీలక ఆటగాళ్లు చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చారు.

    రీఎంట్రీల్లో ఎక్కువ ఆకర్శిస్తున్న పేరు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ది. ఇతను గతేడాది జూన్‌ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా లంక సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినందుకు అతడికి ఈ ఆఫర్‌ వచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.

    అలాగే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అల్జరీ జోసఫ్‌, గుడకేశ్‌ మోటీ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్‌లోడ్‌ విషయం పరిగణలోకి వచ్చినా జేడన్‌ సీల్స్‌, షమార్‌ జోసఫ్‌ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్‌కు ఈ సిరీస్‌ చాలా ముఖ్యం. అందుకే బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇటీవల విండీస్‌ జట్టుకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా ఐదు వన్డే సిరీస్‌లు గెలిచి అజేయ జట్టుగా చలామణి అవుతుంది.

    స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్‌, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రోన్ హెట్‌మైర్, అమీర్ జాంగూ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, జేడన్ సీల్స్, షమార్‌ స్ప్రింగర్‌

    విండీస్‌-శ్రీలంక వన్డే సిరీస్‌ షెడ్యూల్‌
    జూన్‌ 3- తొలి వన్డే (కింగస్టన్‌)
    జూన్‌ 6- రెండో వన్డే (కింగస్టన్‌)
    జూన్‌ 8- మూడో వన్డే (కింగ్‌స్టన్‌)

    ఇదిలా ఉంటే, ఈ విండీస్‌ పర్యటనలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ తర్వాత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ ఆడనుంది. జూన్‌ 11, 13, 14 తేదీల్లో ఇదే కింగస్టన్‌ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి. 

    అనంతరం శ్రీలంక జట్టు విండీస్‌ సెలెక్ట్‌ టీమ్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ (జూన్‌ 18-21) ఆడుతుంది. దీని తర్వాత జూన్‌ 25 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్ట్‌, జులై 3 నుంచి అదే అంటిగ్వాలో రెండో టెస్ట్‌ జరుగనున్నాయి.

     

     

Business

  • భారీ జీతమా?, వర్క్-లైఫ్ బ్యాలెన్సా?, అనే విషయపై చాలారోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రూ.72 లక్షల వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఆ ఉద్యోగ ఆఫర్‌లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు రావాలి, అధికారిక సెలవు విధానం లేదు, అలాగే రీలోకేషన్ సహాయం కూడా ఇవ్వలేదు. ఈ కారణాలతో అభ్యర్థి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే పెంపు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం, వ్యక్తిగత సమయానికి అవకాశం లేకపోవడం వంటి అంశాలు కూడా అతని జాబ్ రిజెక్ట్ చేయడానికి కారణమైంది.

    ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొంతమంది వినియోగదారులు ఇంత పెద్ద జీతాన్ని వదిలేయడం ఆశ్చర్యం అని భావించగా, మరికొందరు మాత్రం డబ్బు కంటే మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

    ఒక వినియోగదారు తాను ఏడాదికి ఒక కోటి రూపాయలకుపైగా సంపాదించినప్పటికీ, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల జీవితం కష్టమైందని చెప్పాడు. మరో వ్యక్తి 2015లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, తక్కువ జీతం ఉన్న కానీ ప్రశాంతమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

    ఈ చర్చ ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో కేవలం జీతం మాత్రమే కాదు, పని వాతావరణం, వ్యక్తిగత సమయం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమవుతున్నాయి. ఎక్కువ డబ్బు ఉన్న ఉద్యోగాలు అన్ని సమయాల్లో సంతోషాన్ని ఇవ్వవు అనే ఆలోచన ఉద్యోగులలో స్పష్టంగా కనిపిస్తోంది.

    ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!

  • 2026 మే నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అనేక కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా టియాగో ICE, టియాగో ఈవీ, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్టర్, బీఎండబ్ల్యూ ఎం440ఐ కన్వర్టిబుల్, మెర్సిడెస్ జీఎల్ఈ, జీఎల్ఎస్ స్పెషల్ ఎడిషన్స్, మినీ కూపర్ ఎస్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇక 2026 జూన్ నెలలో కూడా లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి.

    మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్
    మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ జూన్ 15న భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఇది మొదటిసారి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్‌గా వస్తోంది. ఇందులో 3.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌.. ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 435 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5.7 సెకన్లలో చేరుతుంది. కొత్త డిజైన్‌లో భాగంగా పెద్ద గ్రిల్, కొత్త హెడ్‌లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, లేటెస్ట్ ఎంబీయూఎక్స్ సూపర్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐ
    బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం60ఐ కూడా జూన్ నెలలోనే లాంచ్ కానుంది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో 523 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కూపే SUV డిజైన్‌తో స్పోర్టీ లుక్ కలిగిన ఈ కారు కేవలం 4.3 సెకన్లలో 0-100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

    హోండా జెడ్ఆర్-వీ
    హోండా కంపెనీ తన జెడ్ఆర్-వీ ధరలను ఈ నెలలో (జూన్) ప్రకటించే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ ఎస్యూవీగా 184 హార్స్ పవర్ అందిస్తుంది. లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

    స్కోడా కొడియాక్ ఆర్ఎస్
    స్కోడా కోడియాక్ ఆర్ఎస్ కూడా స్పోర్టీ SUVగా రానుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు స్పోర్ట్స్ డిజైన్, లగ్జరీ ఇంటీరియర్ కలిగి ఉంటుంది. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందనుంది. కాబట్టి సాధారణ కోడియాక్ కంటే 60 హార్స్ పవర్, 80 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌ పొందుతుంది.

    టాటా సియెర్రా ఈవీ
    ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న టాటా సియెర్రా ఈవీ రూపంలో కూడా దేశీయ విఫణిలో లాంచ్ కానుంది. ఇది ఈ నెలలో లాంచ్ కానున్న అత్యంత ఆసక్తికరమైన మోడళ్లలో ఒకటి. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కి.మీకి పైగా రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో రానుంది.

    ఇదీ చదవండి: విన్‌ఫాస్ట్ హవా.. భారత్‌లో 10వేల యూనిట్లు!

  • విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్‌లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్‌సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన కెరీర్ క్రీడల్లో మాత్రమే కాకుండా.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    ➤ఒకటి.. కోహ్లీ విజయానికి కారణం అతని స్థిరత్వం, క్రమశిక్షణ. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు, సంవత్సరాల తరబడి నిరంతర ప్రదర్శనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ఒకేసారి పెద్ద లాభాలు ఆశించడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ (SIP) వంటి విధానంతో నిరంతరంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.

    ➤రెండవది, తక్కువ వయస్సులోనే ప్రారంభించడం. కోహ్లీ 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో ప్రవేశించారు. ఇది అతనికి అనుభవం, తప్పిదాల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. పెట్టుబడుల్లో కూడా ముందుగా ప్రారంభిస్తే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు.

    ➤మూడవది, డైవర్సిఫికేషన్ (పెట్టుబడుల విభజన). కోహ్లీ కేవలం ఒక రంగంలోనే కాకుండా స్పోర్ట్స్, టెక్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా షేర్లు, బాండ్లు, బంగారం వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి.

    ➤నాలుగవది, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. క్రికెట్‌లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కోహ్లీ స్థిరంగా ఆడతాడు. అలాగే మార్కెట్ పతనాలు వచ్చినప్పుడు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

    ➤చివరగా.. వయస్సు, అవసరాల ప్రకారం వ్యూహం మార్చుకోవడం. కోహ్లీ ఇప్పుడు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా రిటైర్మెంట్ దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

    Note: పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

    ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!

  • గత కొన్నేళ్లుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ, ఏఐ ప్రధానమని వినిపిస్తోంది. అయితే.. జాబ్ పోతే ఏముందిలే.. ఇంకో జాబ్ వచ్చేస్తుంది అనేవారికి.. అమెజాన్ మాజీ ఉద్యోగి కథ తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ఇటీవల ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదని ఆయన వెల్లడించడం.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో నెలకొన్న పోటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

    ప్రముఖ ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ఏడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే.. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ చేపట్టిన ఉద్యోగుల తొలగింపులలో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే.. ఆయనకు పెద్దగా సమస్య అనిపించలేదు. ఎందుకంటే ఆయన అనుభవం, నైపుణ్యాల కారణంగా అనేక ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అగోడా, ఉబెర్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

    ఇంటర్వ్యూలలో తనకు కొంత నిరాశ ఎదురైంది. ఆ తరువాత కొంతకాలం ఉద్యోగ అన్వేషణ నుంచి విరామం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి అంతగా ప్రతికూలంగా కనిపించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించగా, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నాడు.

    2026 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జాబ్ కోసం తన బయోడేటాను నాలుగు నుంచి ఐదు సార్లు అప్డేట్ చేసుకున్నాడు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంకు అనుకూలంగా రెజ్యూమే రూపొందించి అప్లై చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ఎంత కఠినంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.

    ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు!

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరికొందరు కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడం, నియామక ప్రక్రియలను నిలిపివేయడం, ఉద్యోగాల కోసం పోటీ మరింత పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు.

  • తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న తన తయారీ కేంద్రం నుంచి 10,000వ వాహనాన్ని విడుదల చేయడం ద్వారా విన్‌ఫాస్ట్ భారతదేశంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. వియత్నామీస్ ఈవీ తయారీ సంస్థ భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించిన ఏడాది లోపే ఈ ఘనతను సాధించడం, దాని స్థానిక కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయని సూచిస్తుంది.

    విన్‌ఫాస్ట్ ఇండియన్ ప్లాంట్ ప్రస్తుతం VF 6, VF 7 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. ఈ రెండు వాహనాలు ఇంకా భారతీయ రహదారులపై పెద్ద సంఖ్యలో కనిపించనప్పటికీ.. స్థానిక తయారీ, సరఫరాదారుల భాగస్వామ్యాలు, డీలర్ నెట్‌వర్క్ విస్తరణతో క్రమంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది.

    తూత్తుకుడిలోని విన్‌ఫాస్ట్ ప్లాంట్, వియత్నాం వెలుపల కంపెనీకి చెందిన మొట్టమొదటి తయారీ కేంద్రం. ప్రస్తుతం దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 50,000 యూనిట్లు. డిమాండ్ పెరిగే కొద్దీ ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో స్థానికీకరణను పెంచడానికి, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లకు భారతదేశాన్ని ఎగుమతి కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కూడా కంపెనీ సన్నద్ధమవుతోంది.

    అయితే.. కార్లను ఉత్పత్తి చేయడం ఒక పని. కానీ ఇప్పటికే స్థిరపడిన దిగ్గజ సంస్థల కంటే, అంతగా ప్రాచుర్యం లేని బ్రాండ్‌ను ఎంచుకునేలా భారతీయ కొనుగోలుదారులను ఒప్పించడమే అసలైన సవాలు. అమ్మకాలు, సర్వీస్ సపోర్ట్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక యాజమాన్య అనుభవం వంటివి కంపెనీ ఎదుగుదలను నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికి కంపెనీ 10,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక బలమైన ప్రారంభం అని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

  • దేశంలో డిజిటల్‌ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.90 లక్షల కోట్లకు చేరగా, మొత్తం లావాదేవీల సంఖ్య 23.2 బిలియన్లుగా నమోదైంది. విలువ, వాల్యూమ్‌ రెండింటి పరంగా ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.

    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే మేలో లావాదేవీల విలువ మరింత పెరిగింది. గత ఏడాది మేలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇది సుమారు 19 శాతం వృద్ధిని సూచిస్తోంది.

    ట్రాన్సాక్షన్లూ రికార్డే..
    లావాదేవీల సంఖ్య పరంగా కూడా యూపీఐ కొత్త గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 23.2 బిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఇది గత ఏప్రిల్‌లో నమోదైన 22.35 బిలియన్లను అధిగమించడమే కాకుండా, గత ఏడాది మేలో నమోదైన 18.67 బిలియన్లతో పోలిస్తే దాదాపు 24 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తోంది.

    డిజిటల్‌ పేమెంట్స్‌ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి సెలవుల ప్రయాణాలు, ఐపీఎల్‌ నేపథ్యంలో పెరిగిన వినియోగదారుల ఖర్చులు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు యూపీఐ లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. వినియోగదారుల నుంచి వస్తున్న సహజమైన డిమాండ్‌ యూపీఐ వృద్ధిని మరింత బలోపేతం చేస్తోందని వారు పేర్కొంటున్నారు.

  • ప్రముఖ నటుడు అశ్విన్ ముష్రాన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో వాహనదారులలో చర్చకు దారితీసింది. ఈ సంఘటన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) వ్యవస్థలో జరిగే మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసింది.

    అశ్విన్ ముష్రాన్ ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్‌ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ ప్లాజా వద్ద ఒక సమస్య ఎదురైంది. టోల్ సిబ్బంది తన ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేదని చెప్పారు. దీంతో తనకు రూ.200 జరిమానా విధించి, చెల్లించాలని కోరారు. అయితే.. జరిమానా చెల్లించిన తరువాత, తన ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను చెక్ చేసుకుంటే, అందులో దాదాపు రూ.3,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు.

    అశ్విన్ ముష్రాన్ వెంటనే.. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో అదే వాహనం అదే టోల్ ప్లాజా గుండా ఎటువంటి సమస్య లేకుండా వెళ్లింది. అనంతరం తన ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించి టోల్ సూపర్వైజర్‌తో మాట్లాడారు. చివరికి సంబంధిత అధికారులు తనకు 200 రూపాయలు తిరిగి చెల్లించినట్లు పేర్కొన్నారు.

    ఈ సంఘటనకు కారణం సాంకేతిక లోపమా?, లేక మోసానికి సంబంధించినదా? అనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేసింది.

    ఫాస్ట్‌ట్యాగ్ మోసాల పట్ల జాగ్రత్తలు

    • ప్రయాణానికి ముందు ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే స్క్రీన్‌షాట్ తీసుకోవాలి.

    • బ్యాలెన్స్ లేదని చెబితే వెంటనే అదనపు చెల్లింపు చేయకుండా, ఖాతా వివరాలను మరోసారి ధృవీకరించమని అడగాలి.

    • ప్రతి టోల్ చెల్లింపు తర్వాత వచ్చిన SMS లేదా యాప్ నోటిఫికేషన్‌ను పరిశీలించడం మంచిది.

    • అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే సంబంధిత టోల్ అధికారులకు లేదా ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ కేర్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలి.

    అశ్విన్ ముష్రాన్ వీడియో వైరల్ అయిన తర్వాత.. చాలామంది నెటిజన్లు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. ఒక్కోసారి రూ.200 చిన్న మొత్తంగా కనిపించినా, వేలాది వాహనాల వద్ద ఇలాంటి ఘటనలు జరిగితే అది పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఫాస్‌ట్యాగ్ ఉపయోగించే ప్రతి వాహనదారులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఈక్విటీల్లో చక్కని వైవిధ్యంతో ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావించే వారికి మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ మంచి ఆప్షన్‌. పెట్టుబడులకు స్థిరత్వం కోసం లార్జ్‌క్యాప్, అధిక రాబడుల కోసం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ మధ్య పెట్టుబడులను విస్తరించడం ద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించేవే మల్టీక్యాప్‌ ఫండ్స్‌. ఇన్వెస్టర్లు తమ అంతటగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో మెరుగైన పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేయడం కంటే మంచి మల్టీక్యాప్‌ను ఎంపిక చేసుకోవడమే చక్కని ఆప్షన్‌ అవుతుంది. కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి.. మధ్యస్థం నుంచి అధిక రిస్క్‌ తీసుకోగలిగితే ఇన్వెస్టర్లకు మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ అనుకూలం.  

    రాబడులు.. 
    ఈ పథకం 2023 జనవరి 30న ప్రారంభం కాగా, నాటి నుంచి ఏటా 23.4 శాతం చొప్పున రాబడిని (పాయింట్‌ టు పాయింట్‌) అందించింది. ఇదే కాలంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌ విభాగం సగటు వార్షిక రాబడి 18.3 శాతంగానే ఉంది. ఇది మెరుగైన పనితీరును తెలియజేస్తోంది. రోలింగ్‌ రాబడులు (వివిధ దశల్లో పెట్టుబడులు) సైతం మూడేళ్ల కాలంలో 23 శాతం చొప్పున ఉన్నాయి. మూడేళ్ల సిప్‌ పనితీరును గమనిస్తే ఏటా 12.8 శాతం చొప్పున రాబడి నమోదైంది. మార్కెట్లో ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ గడిచిన ఏడాది కాల రాబడి 6.45 శాతంగా నమోదైంది.  

    పెట్టుబడుల విధానం..  
    మల్టీక్యాప్‌ ఫండ్స్‌ అన్నవి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ పథకంలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకంలో 96 స్టాక్స్‌ ఉండడం దీన్నే సూచిస్తోంది. పోర్ట్‌ఫోలియోలోని టాప్‌–10 కంపెనీల్లో పెట్టుబడులు 23.19 శాతం మించలేదు. ఇది కూడా రిస్క్‌ వైవిధ్యంలో భాగమే. సెబీ నిబంధనల ప్రకారం అయితే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ కనీసం 25 శాతాన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో, 25 శాతాన్ని మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో, 25 శాతం స్మాల్‌క్యాప్‌ కంపెన్లీలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం నిధులను మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఫండ్‌ మేనేజర్‌ తన విచక్షణ మేరకు ఎక్కడైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. మార్కెట్‌ పరిస్థితులను బట్టి వివిధ రకాల స్టాక్స్‌ వేర్వేరు సమయాల్లో రాణిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో లార్జ్‌క్యాప్‌ కంటే మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు బాగా రాణిస్తాయి. అదే మార్కెట్‌ పతనమవుతున్నప్పుడు లార్జ్‌క్యాప్‌లో నష్టాలు పరిమితంగా ఉంటాయి. మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ వల్ల అన్ని కాలాల్లోనూ లాభపడే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ 5 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చింది.

     

    పోర్ట్‌ఫోలియో 
    ఈ పథకం నిర్వహణలో రూ.5,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గత పనితీరు భవిష్యత్‌ రాబడికి హామీ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఆ పథకం భవిష్యత్‌ పనితీరు ఎలా ఉంటుందో అవగాహనకు డేటా పనికొస్తుంది. ఇందులో 43.67 శాతం లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయించగా, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 27.96 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీలకు 28.37 శాతం చొప్పున కేటాయించింది. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ రంగ కంపెనీల్లో 24.91 శాతం, ఇండ్రస్టియల్స్‌ కంపెనీల్లో 17.13 శాతం, కన్జ్యూమర్‌ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.18 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసింది. మెటీరియల్స్‌ కంపెనీల్లో 9.73 శాతం పెట్టుబడులు ఉన్నాయి.

  • సోమవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 508.40 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో 74,267.34 వద్ద, నిఫ్టీ 165.15 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో 23,382.60 వద్ద నిలిచాయి.

    ఎన్ఐఐటీ లిమిటెడ్, జీ-టెక్ జైంక్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్, లంబోధర టెక్స్‌టైల్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, పశుపతి అక్రిలాన్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జీనా సిఖో లైఫ్‌కేర్ లిమిటెడ్, కోస్టల్ కార్పొరేషన్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్, అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • సాఫ్ట్‌వేర్ రంగంలో భారీ ప్యాకేజీలు, విలాసవంతమైన జీవనశైలి ఒకవైపు ఆకర్షిస్తున్నా.. అంతర్గతంగా ఐటీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో కొత్త రకమైన ఆర్థిక విబేధాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్ తన భాగస్వామితో ఎదుర్కొంటున్న ‘ఆదాయ అసమానత’కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలిసి జీవించడం సులువే అయినా నెలవారీ ఖర్చులు, జీతాల మధ్య ఉండే భారీ వ్యత్యాసం వారి మధ్య ఉన్న ప్రేమను ఎలా దూరం చేస్తోందో సదరు టెక్కీ ఆవేదన వ్యక్తం చేశాడు.

    కార్పొరేట్ ఉద్యోగుల ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ‘గ్రేప్‌వైన్‌’లో ఒక మైక్రోసాఫ్ట్ టెక్కీ ‘గూఫీపాండా’ అనే పేరుతో తన వ్యక్తిగత జీవితంలోని అంశాలను పంచుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. ‘నేను మైక్రోసాఫ్ట్‌లో సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తూ ఏడాదికి రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. నా స్నేహితురాలి వార్షిక ఆదాయం రూ.8 లక్షలు. ఈ ఏడాది ప్రారంభంలో మేమిద్దరం కలిసి ఉండాలని(లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌) నిర్ణయించుకున్నాం. నా ఆఫీస్‌కు దగ్గర్లోనే ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది’ అని పేర్కొన్నాడు.

    ప్లాట్‌ లీజు ఒప్పందంపై సంతకాలు చేసి కొత్త ఇంట్లోకి మారిన తర్వాత నిత్యం వచ్చే బిల్లులు, కిరాణా ఖర్చులు, భారీ సెక్యూరిటీ డిపాజిట్ వంటివి వారి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఇద్దరి జీతాల మధ్య ఏకంగా 6 రెట్లు తేడా ఉండటంతో ఖర్చులను సమానంగా పంచుకోవడం అసాధ్యంగా మారింది.

    టెక్కీ తెలిపిన వివరాల ప్రకారం..

    ప్రస్తుతం అద్దె, రోజువారీ జీవనశైలి ఖర్చులతో కూడిన ఉమ్మడి బడ్జెట్‌లో 85 శాతానికి పైగా అతడే ఒంటరిగా భరిస్తున్నట్లు చెప్పాడు. బంధం న్యాయంగా సాగాలనే ఉద్దేశంతో ఆఫీస్ సీనియర్లను సంప్రదించి ఒక జాయింట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినట్లు తెలిపాడు. అయినా సమస్య సర్దుమణగలేదన్నాడు.

    కారు రిపేర్ బిల్లుతో..

    ఈ ఏర్పాటు కొంతకాలం స్థిరంగా సాగినట్లు అనిపించినా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు అసలు సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల వారి కారు రిపేర్ బిల్లు వచ్చింది. ఈ ఖర్చును ఇద్దరం పంచుకుందామని అతను ప్రతిపాదించగా ఆమె ఆర్థికంగా ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నించినట్లు పోస్ట్‌లో తెలిపాడు. ‘డబ్బు విషయంలో జరిగే ప్రతి చిన్న గొడవ మా మధ్య ఉన్న ఆప్యాయతను, ప్రేమను క్రమంగా నాశనం చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇదే’ అని సదరు టెక్కీ ఆందోళన వ్యక్తం చేశాడు.

    నెటిజన్ల అభిప్రాయాలు

    ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలతో కామెంట్‌ చేస్తున్నారు. ‘ఆమెతో నీకు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉంటే ఆర్థిక భారాన్ని నువ్వే ఎక్కువగా మోయడంలో తప్పులేదు. ఆదాయ అసమానతలు సహజం. భాగస్వామి కెరీర్ ఎదగడానికి నువ్వే సాయం చేయాలి’ అని కొందరు చెబుతున్నారు. ‘ఆమెకు నీతో కలిసి జీవించాలనే నిబద్ధత ఉంటే.. అదనపు ఖర్చుల విషయంలో రక్షణాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నువ్వు ఆమెను జీవిత భాగస్వామిగా చూస్తున్నావా లేక కేవలం రూమ్ మేట్‌లా భావిస్తున్నావా?’ అని కొందరంటున్నారు. 

    నెటిజన్ల నుంచి వచ్చిన ఈ స్పందనపై సదరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మళ్లీ స్పందించాడు. తాను ఆమెను కేవలం ఫ్లాట్ మేట్‌లా కాకుండా తన జీవిత భాగస్వామిగానే భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, సాధారణ డేటింగ్ స్థాయి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సంసారాన్ని నిర్వహించే స్థాయికి మారే క్రమంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు తను ఊహించలేదని అంగీకరించాడు. ‘త్వరలోనే మేమిద్దరం ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘకాలంలో మా బంధం నిలబడటానికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటాం’ అని అతను ముగించాడు.

    ఇదీ చదవండి: రైల్వే సూపర్ యాప్.. పాత యాప్‌ మధ్య తేడా ఏమిటి?

  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కొత్తగా స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (సిఫ్‌) కేటగిరీలో రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఐసిఫ్‌ యాక్టివ్‌ అసెట్‌ అలొకేటర్‌ లాంగ్‌–షార్ట్‌ ఫండ్, ఐసిఫ్‌ ఈక్విటీ లాంగ్‌–షార్ట్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్‌ ఆఫర్లు జూన్‌ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్‌–షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్‌ ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్‌ నరేన్‌ తెలిపారు.

    మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్‌ డెరివేటివ్స్, ఇన్విట్స్‌ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్‌ క్యాప్స్‌వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.  డెరివేటివ్స్‌ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్‌లో తొలిసారి ఇన్వెస్ట్‌ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు.  

    కోటక్‌ ఎంఎఫ్‌ నిఫ్టీ ఫండ్‌ 
    కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది జూన్‌ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్‌కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్‌లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్‌ షా తెలిపారు.  

    మహీంద్రా మాన్యులైఫ్‌ ‘ఎంపవర్‌ సిఫ్‌’ 
    సిఫ్‌ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘ఎంపవర్‌ సిఫ్‌’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్‌లో లాంగ్‌–షార్ట్‌ పొజిషనింగ్, డెరివేటివ్స్‌ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్‌ సిఫ్‌ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్‌ ఇన్‌రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.

  • ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

    గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

    “ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

    కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.

Politics

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.

    ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.

    ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.

    బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.

    సోమవారం కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క‍్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.

    కాగా, బెంగాల్‌ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. 

  • సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు. 

    ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.

    ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్‌ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్‌ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్‌ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

     విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన అనుచరులు కూడా తమ నేతకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కొత్త పార్టీ గురించి అన్నామలైని ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తానని ఆయన తెలిపారు.

    ఇటీవల తమిళనాడులో పార్టీ అధ్యక్ష పదవి మార్పు, అనంతరం జరిగిన పరిణామాలపై అన్నామలై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తుపై అనేక అనుమానాలు తలెత్తాయి.

    అన్నామలై కొత్త పార్టీ స్థాపించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంటున్నప్పటికీ.. ఆయన ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో భేటీ కానుండడం చర్చనీయాంశమైంది. అయితే, ఆయన అనుచరులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లేనని, అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై స్థాపించబోయే పార్టీ పేరు ‘తమిళగ మక్కల్ శక్తి ఖచ్చి (టీఎంఎస్‌కే)’గా వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    బీజేపీ ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. తమిళనాడులో కూడా నాయకత్వ మార్పులపై చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో, ఈ నెల చివర్లో కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ స్థాపనపై వస్తున్న వదంతులు అన్నామలై కేంద్ర నాయకత్వం ముందు తన బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహమని ఆయన ప్రత్యర్థులు గుసగుసలాడుతున్నారు.

    2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం, నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్ వంటి సీనియర్ బీజేపీ నాయకుల ప్రభావం తగ్గిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అన్నామలై కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ స్థానంలో వనతి శ్రీనివాసన్‌కు అవకాశం ఇ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన అన్నామలై చివరికి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని గానీ లేదా కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని గానీ ఆశించే అవకాశంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.

    కొత్త పార్టీ పెట్టబోతున్న అన్నామలై.. వాళ్ళ పరిస్థితేంటి ?

    రాజీనామా నిజమేనా?
    అన్నామలై పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్‌కు తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న అన్నామలై, తన నిర్ణయాన్ని ఖరారు చేస్తూ నబిన్‌ను కలవనున్నారు.

    ఇప్పటికే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ సమావేశం కోసమే కాకుండా తన ఆరేళ్ల రాజకీయ జీవితం పట్ల కృతజ్ఞత తెలిపేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్నన్నారని, ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తనకు కల్పించిన అవకాశాలు, అనుభవాలు, రాజకీయ ప్రయాణానికి సహకరించిన నాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేస్తున్నాయి.  

  • హైదరాబాద్‌:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్‌.. ‘సాక్షి’తో మాట్లాడారు.  ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్‌ మాట్లాడారు. 

    తెలంగాణ ప్రజలపై పవన్‌ నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను అవమానించిన విషయంలో కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి. పవన్ సభ పై బీజేపీ, బిఆర్ఎస్ మౌనం వెనక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బిఆర్ఎస్ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు. 

    పవన్‌.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!

     

     

     

     

     

     

     

  • ఢిల్లీ: సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్‌ 6న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని  పిలుపునిచ్చారు.    

    వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్‌ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి  ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసేందుకు భారత్‌కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.

    అయితే, అభిజీత్‌ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. 

     

Telangana

  • ఆసిఫాబాద్‌: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌.  ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. 

    ఈ మేరకు సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్‌ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్‌కు కిషన్‌రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్‌లు అవసరం లేదు.

    75 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు..  కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్‌రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్‌ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. 

     

     


     

  • హైదరాబాద్‌లోని సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమావేశం నిర్వహించారు. అనంతరం కీలక వివరాలు వెల్లడయ్యాయి. రెండు రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ట్రస్ట్ ద్వారా ఇది అమలు అవుతుంది.

    ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యమని సీఎస్ రామకృష్ణరావు అన్నారు. ఉద్యోగ సంఘాల సూచనలతో ట్రస్ట్ మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ట్రస్ట్‌కు ప్రత్యేక బ్యాంకు ఖాతా.. ప్రభుత్వం-ఉద్యోగుల సమాన వాటా ఉంటుందని వివరించారు. పూర్తి స్వయం ప్రతిపత్తితో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పనిచేయనుంది. లబ్ధిదారుల ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ట్రస్ట్ పాలన, ఆర్థిక నిర్వహణపై ఉద్యోగ సంఘాల నుంచి కీలక సూచనలు వచ్చాయి.

    ట్రస్ట్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
    జాయింట్ స్టాప్ కౌన్సిల్ స‌మావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మ‌న్, డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌ను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక వేతనంపై 1.5% కోత విధించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. ఉద్యోగి వాటాను బేసిక్ పేతో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలని చెప్పారు.

  • హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్‌ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు  వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే వామ్మో అనుకునే ఆశ్చర్యపోతే, ఇప్పుడు రూ. 200 కోట్లను ఎకరం భూమి దాటేసి మరీ రికార్డులను స్పష్టించింది. 

    ఈరోజు(సోమవారం, జూన్‌ 1వ తేదీ) టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో రూ. 204 కోట్లకు పైగా పలికింది రాయదుర్గం భూమి. రాయదుర్గంలో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వెళ్లింది. 

    రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు రికార్డు ధర పలకగా, ఈసారి  అదే పరిధిలో ఎకరం భూమి రూ. 204 కోట్లకు వెళ్లింది. దాంతో రెండు విడతల్లోనూ రెండొందల కోట్ల మార్కను ఎకరం భూమి దాటేయడంతో భూములు మరింత ప్రియం అయిపోతున్నాయని అనుకోవడం మన వంతైంది. రెండు విడతల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల ఆదాయం సమకూరింది.  రెండు రోజుల క్రితం సర్వే నంబర్  83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్‌ దక్కించుకుంది.

Crime

  • ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో ఉంటూ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్‌ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ను యాక్టివేట్‌ చేసినట్లు సోర్సెస్‌ తెలిపాయి.

    రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్‌ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్‌ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    షకీల్‌ ముఠాకు నియామకాల బాధ్యత 
    కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.

    ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్‌ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.

    ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్‌ఐకి ముంబై అండర్‌వరల్డ్‌తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

    తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్‌ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్‌ తెలిపాయి.

    ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్‌ తెలిపాయి.

National

  • బంక్‌ల వద్ద పెట్రోల్‌ కొట్టించుకున్న తర్వాత మనం ఇచ్చిన మొత్తానికి అంత పరిమితిలో పెట్రోల్‌ కొట్టారా.. లేదా అనే అనుమానం సాధారణంగా వాహనదారులకు వస్తూ ఉంటుంది. అందుచేత తాము నమ్మిన బంక్‌లకే ఎక్కువగా వెళుతూ ఉంటారు వాహనదారులు. అయితే ఈ తరహాలో జరిగే మోసాలు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అన్ని బంక్‌లలో ఇలా చేయకపోయినా కొన్ని బంక్‌లు ఈ తరహా మోసాలు చేస్తారనడానికి తాజా ఘటనే నిదర్శనం. 

    తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ తరహా మోసం వెలుగుచూసింది. కొత్త కారు తీసుకున్న వ్యక్తి ఫుల్‌ ట్యాంక్‌ చేయిద్దామని బంక్‌కు వెళితే అతనికి విపత్కరణ పరిణామం ఎదురైంది. తన కారు ట్యాంక్‌ కెపాసిటీ 45 లీటర్లైతే, 52 లీటర్ల పెట్రోల్‌ కొట్టినట్లు బిల్‌ ఇ‍వ్వడంతో ఒక్కసారిగా అతను షాక్‌ తిన్నాడు. 

    తన కారు ట్యాంకు కెపాసిటీ ఎంత అని పలుమార్లు చెక్‌ చేసుకున్న తర్వాత జరిగిన మోసాన్ని గ్రహించాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ 45 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ అని, మరి ఇంకా  ఏడు లీటర్ల పెట్రోల్‌ ఎందుకు ఎక్కువైందని ఆ బంక్‌ సిబ్బందిని ప్రశ్నించాడు. కాన్పూర్‌కు చెందిన చరణ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఈ పరాభవం ఎదురుకాగా,  ఆ మోసం ఎలా జరిగిందో వివరించాడు. తొలుత 41 లీటర్ల ఇంధనాన్ని నింపి ఆపేసి, మళ్లీ పెట్రోల్‌ కొట్టడం ప్రారంభించారన్నాడు.  పెట్రోల్‌ కొట్టడాన్ని మధ్యలో ఎందుకు ఆపారని ప్రశ్నించగా, ఫుల్‌ ట్యాంక్‌ చేసేటప్పుడు రెండు విడతల్లో కొట్టాలని సిబ్బంది బదులిచ్చారని చరణ్‌ సింగ్‌ తెలిపాడు. 

    పెట్రోల్ నింపడంలో ఆలస్యం కావడం, చివరకు మొత్తం 52 లీటర్ల పెట్రోల్ అని పేర్కొన్న బిల్లును చేతికి అందించగానే తాను షాక్‌కు గురైనట్లు తెలిపాడు. దీనిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని నిలదీయగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. మేనేజ్‌మెంట్‌ కూడా సరిగా సమాధానం చెప్పక పోవడంతో అధికారికంగా ఫిర్యాదు చేశాడు. 

    స్థానిక తూనికలు, కొలతల అధికారుల కుమ్మక్కుతో ఒక వ్యవస్థీకృత మోసాల దందా నడుస్తోందని ఆరోపిస్తూ సింగ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పంపిణీ యంత్రాలలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోనని తనిఖీ చేయడానికి జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది.

  • నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి వివాహం మహారాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ లఖానీ కుమారుడు శరంగ్ లఖానీతో రేవ‌తి వివాహం ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన అరుణ్ లఖానీ కుటుంబంతో సుప్రియా సూలే వియ్యమందుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతోంది. అయితే రాజ‌కీయాలు, కుటుంబ వ్య‌వ‌హారాలు వేర్వేర‌ని అరుణ్ లఖానీ స్ప‌ష్టం చేశారు.

    మహారాష్ట్రలో పెద్ద రాజ‌కీయ కుటుంబ‌మైన ప‌వార్ ఫ్యామిలీతో పెళ్లి సంబంధం క‌లుపుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. ప‌వార్ కుటుంబంతో త‌మ‌కు బంధుత్వం కూడా ఉంద‌ని తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీల‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న తాము ఆయా పార్టీల సిద్ధాంతాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బంధుత్వానికి రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌న్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగి ఎంపికైన త‌న‌కు సుప్రియా సూలే అభినంద‌న‌లు చెప్పిన‌ట్టు మ‌రాఠీ న్యూస్ చాన‌ల్‌తో అరుణ్ లఖానీ చెప్పారు.

    గెలుపుపై దీమా
    ప్ర‌జ‌లు త‌మ కోసం ప‌నిచేసే వారినే ఎన్నుకుంటార‌ని అరుణ్ లఖానీ (Arun Lakhani) అన్నారు. చంద్రపూర్-వర్ధా-గడ్చిరోలీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాను విజ‌యం సాధిస్తాన‌నే నమ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్రజలతో త‌నకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. లక్ష్మణరావు మాంకర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవ‌కాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

    పారిశ్రామికవేత్తలకే బీజేపీ ప్రాధాన్యం
    అరుణ్ లఖానీకి బీజేపీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వ‌డంపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత విజయ్ వడెట్టివార్ విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల కంటే పారిశ్రామికవేత్తలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ఖరారు చేసిందని, పూర్తి స్థాయిలో పోటీకి దిగుతుంద‌న్నారు. తగిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించడం ఆ పార్టీ అంతర్గత ఆందోళనలకు సంకేతమని ఆరోపించారు. చంద్రపూర్ స్థానానికి కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ కార్యదర్శి, పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఉన్న శైలేంద్ర అగ్రవాల్‌ను అభ్యర్థిగా నిలబెట్టినట్లు విజయ్ వడెట్టివార్ తెలిపారు.

    18న ఎన్నికలు
    మహారాష్ట్రలో స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన 16 శాసన మండలి స్థానాలకు, నాగ్‌పూర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నికకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా వ్యవహరించే ఈ ఎన్నికలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్నారు. 

  • ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన  ఘటన, వీడియో  నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    బులంద్‌షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.

    అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

    చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత   నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

    ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

    నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
    ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.

    ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!

     కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు

  • నటులుగా వెండితెరపై మెరవడం మాత్రమే కాదు, సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్)తో ఆకట్టుకున్నారు. ఆరోగ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఆలోచనతో చాలా మంది ప్రముఖులు సొంతంగా ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ఒకరు. నటన మాత్రమే కాదు., ఆర్గానిక్ ఫార్మింగ్‌లోనూ సూపర్‌స్టార్ అనిపించుకుంటున్న  మోహన్‌లాల్  పచ్చని స్వర్గం గురించి తెలుసుకుందాం.

    భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూసిన అత్యంత విజయవంతమైన సూపర్‌స్టార్లలో మోహన్‌లాల్ కూడా ఒకరు. అయితే, ఆయన ఆసక్తులు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు.సినిమాతో పాటు థియేటర్, సంగీతం, వ్యాపారం, మ్యాజిక్ వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మోహన్‌లాల్, ఎర్నాకుళం జిల్లా కరూర్ పరిధిలోని ఎలమక్కరలో ఉన్న తన ఇంటి పక్కన గల అర ఎకరం భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రీయ వ్యవసాయం) చేస్తూ ఒక పచ్చని నందనవనాన్ని సృష్టించారు.

    అయితే సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆలోచన  కోవిడ్‌ లాక్‌డౌన్ సమయంలో హఠాత్తుగా ఏమీ ప్రారంభించలేదు. 2010ల మధ్యకాలం కాలంనుంచే ఆయన ఈ పనిలో ఉన్నారు.  అయితే, 2020-2021 కోవిడ్ లాక్‌డౌన్ల సమయంలో సినిమా షూటింగులు, ఇతర వినోద కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయన తన పూర్తి సమయాన్ని ఈ వ్యవసాయంపైనే కేంద్రీకరించారు.

    ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!

    ఇక ఆయన తోటలో పండని  కూరగాయ లేదంటే అతిశయోక్తి లేదు. మోహన్‌లాల్ గతంలోనే ఒక వీడియోలో వెల్లడించినట్టు కాకరకాయ, బీన్స్, బెండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, మొక్కజొన్న, కర్రపెండలం వంటి కూరగాయలు పండిస్తున్నారు.  తాను ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇక్కడ పండిన సొంత కూరగాయలనే తింటానని ఆయన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రం ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు కూడా. స్థలం లేని వారు గ్రో బ్యాగుల్లో (Grow bags) అయినా తమకు కావలసిన కూరగాయలను పండించుకోవచ్చని ఆయన అందరికీ పిలుపునిచ్చారు.  అన్నట్టు మోహన్‌లాల్‌కు పెంపుడు జంతువులన్నా కూడా చాలా ప్రేమ.మరోవైపు కెమికల్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు అప్పటి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కూడా మోహన్‌లాల్‌ను అభినందించారు.

     

    ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!

    'దృశ్యం 3'తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు
    దృశ్యం 3తో మలయాళ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన మోహన్‌లాల్ మోహన్‌ లాల్‌ కరియర్‌పరంగా ఆలోచిస్తే దాదాపు 45 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో 360 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి, రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు ,ప్రతిష్టాత్మక  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం 3' (2026) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మే 31, ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా  రూ. 219.75 కోట్లు  కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

    ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు

  • బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు.  

    ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్.. మోటర్‌కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. 

    ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌తో అతడు వాగ్వివాదానికి దిగాడు.

    వారి మధ్య జరిగిన సంభాషణ

    నిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"

    ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"

    వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"

    ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"

    వ్యక్తి: "లేవను"

    ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"

    వ్యక్తి: "లేవను"

    కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.

    ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.

  • పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం  నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా  ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్‌గా మారింది.

    ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక  ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి  దీపేష్ సాహు  ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.

    ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!


     

    తన పెళ్లి  కబురును దీపేష్‌ ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. 
    ‘నా లైఫ్‌ పార్ట్‌నర్‌తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి  ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.


    వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ  అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు.  అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్‌ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.

    ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!

  • బరువు తగ్గాలంటే వాకింగ్‌ కీలకం అనేది చాలామంది ఫిట్‌నెస్‌ నిపుణులు చెప్పేమాట. రోజుకు 5-10 వేల అడుగులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే బిజీ షెడ్యూల్స్, వర్షంవల్ల, మండే ఎండలు లాంటి వాతావరణ అననుకూలత వల్ల రోజుకు 10వేల అడుగులు వేయడం ఎలా? అనుకుంటున్నారా? అయితే ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకుండానే కేవలం 65 నిమిషాల్లో 10వేల అడుగులు ఎలా పూర్తి చేయాలో ఫిట్‌నెస్ కోచ్ రీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఇండోర్ వర్కౌట్ ప్లాన్ వివరాలు  చూద్దామా.

    వార్మ్-అప్, హై-నీ మార్చింగ్, స్టెప్-అప్స్, వాక్-అండ్-లంజ్, మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాల కలయికతో ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేయవచ్చని రీత్‌ కూర్‌ తెలిపారు. ప్రతిరోజూ 10వేల అడుగులు నడవాలనే ఆలోచన మెరుగైన ఫిట్‌నెస్ , బరువు నిర్వహణతో ముడిపడి ఉంటుంది. అయితే, తీరికలేని పనులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, మరియు ఎక్కువ పని గంటల కారణంగా, చాలా మందికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా అనిపిస్తుంది.అందుకే తగినప్లాన్‌ అవసరం . ఎలా అంటే

    65 నిమిషాల్లో అంటే గంట 5 నిమిషాల్లో 10వేల అడుగుల లక్ష్యాన్ని చేరుకోవాలంటే., సగటున నిమిషానికి 167 అడుగులు వేయాల్సి ఉంటుంది.  అయితే ఒకేసారి 10వేల అడుగులు కాకుండా,   ఫిట్‌ నెస్‌ను బట్టి నెమ్మదిగా ప్రారంభించాలి.


    వార్మ్-అప్ (5 నిమిషాలు)
    వర్కౌట్ ప్రారంభించే ముందు గాయాలు కాకుండా కండరాలను సిద్ధం చేయడానికి ఇది చాలా అవసరం. ఒకే చోట నిలబడి నడవడం (March in place), చేతులు తిప్పడం , పక్కలకు చిన్న అడుగులు వేయాలి. తద్వారా సుమారు 500 అడుగులు వస్తాయి.

    మెయిన్ ఇండోర్ వర్కౌట్ (50 నిమిషాలు)
    బోరింగ్‌గా అనిపించకుండా ఉండటానికి ప్రతి 5 నుండి 10 నిమిషాలకు ఒకసారి క్రింది వ్యాయామాలను మారుస్తూ చేయాలి.

    హై-knee మార్చింగ్ లేదా ఒకే చోట జాగింగ్‌ అంటే మోకాళ్లను పైకి లేపుతూ, చేతులను వేగంగా కదిలిస్తూ  జాగింగ్ చేయాలి. దీనివల్ల దాదాపు 1,200–1,500 అడుగులు వస్తాయి.

    స్టెప్-అప్స్ (5 నిమిషాలు): ఇంట్లోని మెట్లు లేదా ఏదైనా బలమైన కుర్చీ సహాయంతో కాళ్లు మారుస్తూ పైకి, కిందికి అడుగులు వేయాలి. ఇది కాళ్లకు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల 600–800 అడుగులు వస్తాయి.

    ఫ్రీస్టైల్ డ్యాన్స్ లేదా జుంబా (10 నిమిషాలు): మీకు నచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ పెట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేయాలి. దీని ద్వారా 1,500 కంటే ఎక్కువ అడుగులు సాధించవచ్చు.

    వాక్-అండ్-లంజ్ కాంబో (5 నిమిషాలు): గదిలో 10 అడుగులు నడిచిన తర్వాత ఐదు లంజెస్ (Lunges) వ్యాయామం చేయాలి. ఇది లోయర్ బాడీని బలోపేతం చేస్తుంది. దీనివల్ల 500 అడుగులు వస్తాయి.

    సైడ్ స్టెప్స్ & స్కేటర్ జంప్స్ (5 నిమిషాలు): పక్కలకు పెద్ద అడుగులు వేస్తూ చిన్నగా గెంతాలి. ఇది కాళ్లు మరియు కోర్ (Core) కండరాలకు మంచిది. దీనివల్ల 800 అడుగులు లభిస్తాయి.

    పవర్ మార్చింగ్ (10 నిమిషాలు): వేగంగా మెట్లు ఎక్కడం లేదా ఇంట్లోనే వేగంగా అడుగులు వేయడం చేయాలి. దీనివల్ల కేవలం 10 నిమిషాల్లోనే 2,000 అడుగుల వరకు వస్తాయి.

    స్ట్రెచింగ్ (5 నిమిషాలు)
    హై-ఇంటెన్సిటీ వర్కౌట్ పూర్తయిన తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

    నెమ్మదిగా నడవడం, ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం,  బాడీ స్ట్రెచింగ్ చేయడం లాంటి కూల్‌ డౌన్‌ ప్రక్రియ ద్వారా చివరిగా మిగిలిన 500 అడుగులు దీని ద్వారా పూర్తవుతాయి. ఈ విధంగా సరైన పద్ధతిలో సమయాన్ని కేటాయిస్తే, జిమ్‌కు లేదా పార్కుకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని మీ ఫిట్‌నెస్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

    నోట్‌ : సాధారణంగా వాకింగ్‌ చేయడం చాలా సులభం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా మెల్లగా సాధన చేసుకోవచ్చు. అయితే ఏదైనా సమస్య ఉంది అనిపించినపుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
     

     

  • ఒకే వయసు, ఒకే ప్రతిభ, ఒకే కలలు కంటున్న పిల్లల మధ్య భవిష్యత్తు పూర్తిగా వేరుగా ఉండటానికి కారణం ఒక్కటే – చదివే స్కూల్‌. ఇది సాధారణ విద్యా వ్యత్యాసం కాదు, కొత్త అసమానతల అగాథం. పిల్లల మధ్య పోటీ ఇప్పుడు 10వ తరగతిలో కాదు, ఎల్‌కేజీలోనే మొదలవు తోంది. ధనికుల పిల్లలు ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌తో చదువుతుంటే, మిడిల్‌ క్లాస్‌ తల్లిదండ్రులు భారీ ఫీజులు, రుణాలు చెల్లించి ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా విద్య అనేది పెట్టుబడిగా కాకుండా రుణ ఉచ్చుగా మారుతోంది. ఇది ‘ఎవరు బాగా చది వారు’ అనే పోటీ కాదు, ‘ఎవరు మంచి ప్రారంభ స్థానం పొందారు’ అనే అసమాన పోటీగా మారింది. 

    1990ల తర్వాత జనాభా పెరిగింది, చదువు మీద ఆసక్తి పెరిగింది. కానీ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సకాలంలో విస్తరించలేదు. ఇంగ్లీష్‌ మీడియం ఆలస్యంగా ప్రవేశ పెట్టింది. ఈ ఖాళీని ప్రైవేటు రంగం పూరించింది. ఏసర్‌ 2024 ప్రకారం 6–14 వయసు పిల్లల్లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్‌రోల్‌మెంట్‌ 66.8 శాతానికి పడిపోయింది (2022లో 72.9%, 2018లో 65.6%). తెలంగాణలో యూడీఐఎస్‌ఈ 2024–25 డేటా ప్రకారం, క్లాస్‌ 1లో ప్రభుత్వ స్కూళ్ల ఎన్‌రోల్‌మెంట్‌ 26 శాతానికి పడిపోయింది. 2013–14తో పోలిస్తే 40 శాతం తగ్గుదల. ప్రైవేటు స్కూళ్లలో విద్యా వంతులైన తల్లిదండ్రులు, హోమ్‌ సపోర్ట్, సెలెక్టివ్‌ అడ్మిషన్స్‌ ఉంటాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఫస్ట్‌ జనరేషన్‌ లెర్నర్స్, పేదరికం, ఆరోగ్య–పోషకాహార సమస్యలు ఉన్న పిల్లలు ఎలాంటి సెలెక్షన్‌ లేకుండా చేరుతారు. ‘నీళ్లు ఉన్న చోట ఎవరైనా పంట పండించ వచ్చు. ఎడారిలో పంట పండించడం కష్టం’ అన్న సూక్తి ఇక్కడ పూర్తిగా వర్తిస్తుంది. సమస్య ప్రభుత్వ స్కూళ్ల వైఫల్యం కాదు, వ్యవస్థ డిజైన్, అమలు, పెట్టుబడి లోపాల్లో ఉంది. ఒకప్పుడు రైతు కొడుకు డాక్టర్‌ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పుట్టిన కుటుంబం భవి ష్యత్తును చదువు నిర్ణయిస్తోంది.

    విద్యా వర్గ విభజన
    వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అంతర్‌ తరం సామాజిక గతిశీలత (ఒక సామాజిక వర్గం నుంచి మరొక వర్గానికి ఎదగడం) నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ఉంది. పేద కుటుంబాల నుంచి ఉన్నత స్థాయికి ఎక్కడం అరుదైన విషయం. ఇది క్లాస్‌ లాక్‌–ఇన్‌కు (వర్గ బంధనం) దారి తీస్తోంది. ఇలా కొనసాగితే మన సమాజం అవకాశాలు కలిగినవారు, అవకాశాలు కోల్పోయినవారు అనే రెండు భాగాలుగా విడిపోయే ప్రమాదముంది.

    చైనాలో విద్యా వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్య మైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. కానీ మన దేశంలో మిడిల్‌ క్లాస్, పేద వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు లేకపోవడం వల్ల చైనా విద్యార్థులతో పోలిస్తే చాలా తక్కువగా జీడీపీకి దోహదపడుతున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే మన విద్యావ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు కావాలి. అన్ని వర్గాల పిల్లలు ఒకే స్కూల్‌లో చదివే కామన్‌ స్కూలింగ్‌ సిస్టమ్‌ ఉండాలి. దానికి తగినట్టుగా ఆధునిక మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణ, పెట్టుబడుల పెంపు అవసరం. ‘క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ – నాట్‌ ఫర్‌ ది ప్రివిలేజ్డ్‌’ అన్నది మన మార్గదర్శక సూత్రం కావాలి.

    చైనాలో విద్యావ్యవస్థ ద్వారా అన్ని వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నందున వారు ఆర్థిక వ్యవస్థకు భారీగా దోహద పడుతున్నారు. 

    -డా. మేడా జగన్మోహన రావు 
    వ్యాసకర్త విద్యారంగ నిపుణులు

  • సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నిలకకు సంబంధించిన ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పది రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 8తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి. 

  • న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్‌ మెట్రో స్టేషన్ సమీపంలో భవనం కూలిన ‍ఘటన ఒక కుటుంబంలోనే కాకుండా, అక్కడి విద్యార్థులకూ  తీరని విషాదాన్ని పంచింది. ఈ ఘటన అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను కాపాడాలనే ప్రయత్నంలో ప్రమాద స్థలంలోకి వెళ్లిన పార్వతీ ఓజా (50) ప్రాణాలు కోల్పోయారు.

    విద్యార్థులకు ‘పార్వతీ ఆంటీ’
    ఢిల్లీలోని సైదులాబాద్ ప్రాంతంలో ‘ఆంటీ వాలా కిచెన్’ నడుపుతున్న పార్వతి అక్కడి విద్యార్థులకు కేవలం ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక తల్లి చూపించే ఆప్యాయతను కూడా పంచేవారు. హోమ్లీ ఫుడ్‌తో పాటు ఆమె చూపే ప్రేమ కారణంగా పలువురు విద్యార్థులు ఆమెను ‘పార్వతీ ఆంటీ’ అని పిలుచుకునేవారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో కూడా ధరలు పెంచకుండా, విద్యార్థులకు ఆమె చక్కని ఆహారం అందించారని స్థానికులు చెబుతుంటారు.

    ప్రాణాలకు తెగించి..
    ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన సమయంలో  పార్వతి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ లోపల విద్యార్థులు చిక్కుకున్నారని తెలియగానే, వారిని రక్షించేందుకు ఆమె లోనికి వెళ్ళారు. అదే సమయంలో భవనం పూర్తిగా కుప్పకూలడంతో ఆమె శిథిలాల కింద చిక్కుకుపోయారు. 16 గంటల సుదీర్ఘ సహాయక చర్యల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనలో ఆమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ఢిల్లీలో అక్రమ కట్టడాల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. తనిఖీలు లేని భవనాలు ఎలా మరణశాసనంగా మారుతున్నాయనే దానికి ఈ ఘటన  ఉదాహరణగా నిలిచింది. 

  • శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు భయంకరమైన విషసర్పం రెండు గంటలు ఒళ్లంతా చుట్టేసినా సురక్షితంగా బయటపడ్డాడో వ్యక్తి.  ఒడిశాలోని బౌధ్ జిల్లా అదెనిగఢ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తి రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిన ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  ఎట్టకేలకు ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతమని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

    ఏం జరిగిందీ అంటే..
    హరభంగ బ్లాక్ పరిధిలోని అదెనిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు. ఈయన పక్షవాతం (Paralysis) బాధపడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన తన ఇంట్లో పడుకుని ఉండగా, తెరిచి ఉన్న కిటికీ లోంచి ఒక విషసర్పం గదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి గాధనిద్రలో  ఉన్న సాహు ఒంటి మీదికి చేరింది. శరీరంపైఏదో పాకుతున్నట్టు గమనించిన సాహు అసలు విషయం తెలిసి తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడు. కానీ పక్షవాతం కారణంగా కదల్లేని స్థితిలో  ఉన్న ఆయన అక్కడి నుండి త్వరగా తప్పించుకోలేకపోయాడు. ఆ గందరగోళంలో పాము ఆయన చేతికి, అలాగే పక్కనే ఉన్న కుర్చీకి కలిపి గట్టిగా చుట్టుకు పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా  తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.ఏం చేయాలో అర్థం  కాలేదు. కానీ తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము చేసే ఏ చిన్న పొరపాటు జరిగిన అతని ప్రాణాలకే  ప్రమామని గ్రహించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.

     

    ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌

    రెండు గంటల ఉత్కంఠ
    దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు సాహును పాము పట్టు నుండి కృష్ణ చంద్ర సాహును సురక్షితంగా విడిపించారు. అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటి వెలుపల సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ  క్రమంలోసాహుకు హాని ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  ఈ కాలంలో మండించే ఎండలు,  వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులు జాగ్రత్తగా మూసి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు.

    ఇదీ చదవండి: ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్‌ చేస్తే

Andhra Pradesh

  • విజయవాడ: కూటమి సర‍్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్‌లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. 

    పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్‌లైన్‌లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్‌లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.

    నారా లోకేశ్‌కి తప్ప డీఎస‍్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు?  

    జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. 

    సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం.  16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. 

    యువగళంలో పాల్గొని, లోకేశ్‌తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్‌కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు.

  • తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.  

    తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

  • విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్‌ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్‌ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్‌ను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

    ‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్‌లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్‌ను ఏ-1గా అరెస్ట్‌ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్‌సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం  చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్‌కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. 

    సిగ్గుండాలి లోకేష్..! పోస్టుకో రేటు చొప్పున అమ్ముకుంటావా..

    డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచే..
    డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్‌ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.  చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు. 

  • సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

    అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.  
    తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..

    చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
    రెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్‌లో  ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.

    ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.

    ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలు
    ప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్‌తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.

    రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా  4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం.  అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వేశారు.

    మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్

    ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్‌ జగన్‌ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్‌ జగన్‌  పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.

    నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలి
    చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌  జగన్‌ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.

    మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. 

    మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్‌ జగన్‌ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్‌ జగన్‌ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

  • విజయనగరం జిల్లా అనగానే ఠక్కున గుర్తొచ్చేది గురజాడ, గిడుగు. ఈ జిల్లా ప్రాధాన్యత అంతటికే పరిమితం కాదు అన్నది రెడ్డి శంకరరావు ‘విజయనగరం జిల్లా అమరవీరుల చరిత్ర’ చదివితే అవగతమవుతుంది. సాంస్కృతిక జీవనంతో పాటు రాజకీయా లలో, ఉద్యమాలలో పనిచేసిన నూట ముగ్గురు ప్రముఖుల జీవిత చరిత్రలు కనుమరుగై పోకుండా, ఈ ప్రాంత వారసత్వాన్ని నేటి తరానికి అందించడానికి చేసిన ప్రయత్నమిది.

    విజయనగరం జిల్లా బ్రిటిష్‌ కాలంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాలో భాగంగా 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడే వరకు ఉండేది. తరువాత విశాఖ జిల్లాలో కలిసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగం కలిసింది. 1979లో నేటి విజయనగరం జిల్లా ఏర్పడింది. 2022లో ఏర్పడిన పార్వతీపురం జిల్లాలో కొంత భాగం కలిసింది. అలా, నాటి గంజాం జిల్లా నుండి నేటి వరకు విజయ నగరం జిల్లా చరిత్ర అంటే ఉత్తరాంధ్ర చరిత్రే.     

    1834లోనే బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ‘ఈ ఊరు నాది– ఈ అడవి నాది’ అని విల్లంబు ఎత్తి, గిరి జనులను సమీకరించి పోరాడిన కొర్రా మల్లన్న, శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో మొదట అసువులు బాసిన కోరన్న, మంగన్న, గిరిజనోద్యమానికి ఊపిరి పోసిన పల్లె రాములు మాస్టారు, ఆ ఉద్యమ రథసారథలు వెంపటాపు సత్యం, గంటి రాజేశ్వరరావు, ఆదర్శ కమ్యూనిస్టు ఆదిభట్ల కైలాసం వంటి ఎందరో త్యాగధనుల చరిత్రలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. జమీందారీ వ్యతిరేక పోరాటాలు పెద్ద ఎత్తున జరిగిన ప్రాంతమిది. ఆ పోరాటాల ప్రభావం ఎంతగా ఉందంటే 1937లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టెక్కలి, బొబ్బిలి జమీందారులు ఓడిపోయి, రైతు నాయకులైన పుల్లెల శ్యాంసుందర రావు, వి.వి. గిరి గెలుపొందారు. అలాగే మందస జమీందారీ వ్యతిరేక పోరాటం ప్రాణాలకు తెగించి సాగడం, పోలీసు కాల్పుల్లో వీర గున్నమ్మతో సహా మరో ఐదుగురు మరణించడం వంటివి చరిత్రలో నిలవాలంటే, అక్షర రూపంలో నిక్షిప్తం కావాలి. 

    మా కొద్దీ తెల్లదొరతనం అని నినదించిన గరిమెళ్ళ, హరికథా పితా మహుడు ఆదిభట్ల నారాయణదాసు, ప్రజా కళాకారుడు సుబ్బారావు పాణి గ్రాహి, హేతువాది తాపీ ధర్మారావు, వయొలిన్‌ విద్వాంసుడు ద్వారం వెంకట స్వామి నాయుడు, మహాబలుడు కోడి రామమూర్తి, ఆంధ్ర జాలరి సంపత్‌ కుమార్, ఆరుద్ర, ఘంటసాల, సాలూరు రాజేశ్వరరావు – అత్యంత వెనుక బడిన ఈ ప్రాంతం ఇంతమంది ఉద్దండులకు జన్మనివ్వడం ఆశ్చర్యకరమే కాక, గర్వించదగ్గ విషయం. గత చరిత్రను తెలుసుకోవడం, భవిష్యత్తుకు పునాది. అటువంటి చరిత్రను కళ్ల ముందుంచిన పుస్తకమిది.
    – ఎ. అజ శర్మ ‘ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
     

  • సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్‌ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది.  ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్‌కళ్యాణ్‌ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

    ఆ వీడియోలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ, జిందాల్‌ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్‌ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్‌ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. 

    అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్‌ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.  

Family

  • విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్‌ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. 

    పోన్‌ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్‌లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్‌ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్‌ టూర్‌ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్‌ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్‌ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.

    ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్‌ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.

    ‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్‌ వీసా లేదంటే యూరప్‌ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్‌ ఫీజుపై అప్పీల్‌ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.

    ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్‌లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్‌ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్‌ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

    షెంగెన్‌ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్‌ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్‌ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్‌లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్‌లో విధించిన ట్రాఫిక్‌ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్‌ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు.