Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర‌ ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

    మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.

    రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూట‌మి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. 

    ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

    పవన్‌వి ప‌చ్చ ద‌గాకోరు మాట‌లు
    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. ప‌చ్చి ద‌గాకోరు మాట‌లే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.

    బాధిత కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాలి
    నాడైనా, నేడైనా వైఎస్సార్‌సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.

    ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్ప‌ష్టం చేశారు.

  • గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్‌డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే. 

    అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్‌డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ భార్గవ్‌ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. 

    తమకు డెవలప్‌ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్‌ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. 

  • తాడేపల్లి:  కూటమి నేతల దౌర్జన్య కాండపై ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ 28 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఎన్‌ఆర్‌ఐ మురళి కుటుంబం.. వైఎస్సార్‌సీపీని ఆశ్రయించింది. దీనిలో భాగంగా తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్‌ఆర్‌ఐ మురళీ భార్య కృష్ణకుమారి మీడియాతో మాట్లాడారు. 

    ‘ 28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం. సినిమా థియేటర్లు, మాల్స్ మేము నిర్మించాం. మా మాల్ ని ఆపేశారు. 90 లక్షలు మేము దాని కోసం అప్పులు చేశాం.  మేము మోసం చేసామంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా మాల్ చుట్టూ టెంట్లు వేసి, జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారు. మేము పోలీసులు కి ఫిర్యాదు చేస్తే తిరిగి మాపై కేసు పెట్టారు. కోర్టు భద్రత కల్పించమని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. మాకు పోలీసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎవ్వరు రక్షణ ఇవ్వడం లేదు. ఎన్‌ఆర్‌ఐలకి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఇదేనా?, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు.  

    ఆయన మద్దతు లేకపోతే ఇది జరుగుతుందా?, మా ప్రభుత్వం లో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024, ఆగస్టు 4వ తేదీన ఎమ్మెల్యేకి చెప్పాము. వాళ్లంతా కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు. ఆ మాల్‌ని లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త దీనికోసం పోరాడుతున్నందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారు. చిలకలూరిపేటలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

    దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ కూటమిలో నేతలు నీచ, నికృష్టంగా ఉన్నారు. విపరీతంగా దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఎన్‌ఆర్‌ఐ ఆస్తులను అక్రమిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారు. టెంట్లు వేసి మనుషులను పెట్టి కబ్జా చేశారు. కోట్ల అస్థిని కాజేయాలని పుల్లారావు చూస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా  ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత‍్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.

    ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత‍్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్‌ ‍ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. 

    ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు 
    స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్‌ అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్‌ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్‌సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.

    ‘‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్‌ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్‌ఎస్‌ చర్యలను ఆపాలి’’ అన్నారు.

    స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు బొత్స పరామర్శ

    మంత్రి లోకేశ్‌ తీరు దారుణం: కురసాల కన్నబాబు  
    బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్‌.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్‌ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్‌తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.

    కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్‌కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది  మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. 

  • అనకాపల్లి జిల్లా: మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసిన మహిళా వీఆర్వోపై కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఎం. ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హాస్టల్‌ ఉండి చదువుకుంటోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన ఆ బాలికకు సమీపంలో ఉన్న మహిళా వీఆర్వో బొల్లం పార్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోమని చెప్పింది. 

    అందుకు బాలిక నిరాకరించడంతో మహిళా వీఆర్వో, ఆమె అక్క సింగారపు అప్పలనర్సలు చెడు ప్రచారం చేయసాగారు. బాలికకు వేరొక వ్యక్తితో శారీరక సంబంధం ఉన్నట్టు వదంతులు సృష్టించి ప్రచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తెలిసిన బాలిక మనస్థాపం చెందడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 6వ తేదీన యలమంచిలి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో వీఆర్వోపై కలెక్టరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

     

  • వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.

    నేరుగా వాట్సాప్‌కు...
    వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్‌ఫోన్‌ వాట్సాప్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్‌ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్‌ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌(డీఐఎల్‌), ఇండియా ఎవిడెన్స్‌ యాక్షన్‌ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

    విత్తనాలు, ఎరువులపై కూడా..
    వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్‌నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.

    ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..
    రైతు భరోసా పోర్టల్‌ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.

    రైతులకు ప్రయోజనం
    ఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్‌ఫోన్‌ ఉంటున్నందున వాట్సాప్‌కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
    – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి 

Movies

  • మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ప్ర‌సాద్ ల్యాబ్‌లోజ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

    నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్‌లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెర‌కెక్కించిన దర్శకుడు రమేశ్‌ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.

    తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.

    ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
     

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఏకంగా రూ.1790 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన పుష్ప-2 రికార్డ్‌ను సైతం అధిగమించింది. 
      
    ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జూన్ 5న స్ట్రీమింగ్‌కు వచ్చేసిన దురంధర్‌-2 వ్యూస్ పరంగా అదరగొడుతోంది. స్ట్రీమింగ్‌కు వచ్చిన మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల మందికిపైగా వీక్షించారు. కేవలం వీకెండ్‌లోనే  5 కోట్ల మందిపైగా వీక్షించినట్లు ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. ఈ మూవీ ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేశ్ బేడీ, గౌరవ్ గేరా, డానిష్ పాండోర్ కీలక పాత్రలు పోషించారు.

     

     

  • పెద్ది మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాన్వీ కపూర్ సీన్స్‌పై తీవ్రమైన విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయాన్ని పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు స్వయంగా ప్రకటించారు. పెద్దిలో జాన్వీ రోల్‌కు అపార్థం చేసుకున్నారని అన్నారు. ఈ కథను ఉప్పెన కంటే చాలా భిన్నంగా రాసుకున్నానని వెల్లడించారు. అయితే విమర్శలు రావడం వల్లే జాన్వీ కపూర్ సీన్స్‌ను తొలగిస్తున్నామని డైరెక్టర్ స్పష్టం చేశారు.

    కొత్త సీన్స్ యాడ్?

    అయితే జాన్వీ కపూర్‌ సీన్స్‌ తొలగించినప్పటికీ పెద్ది మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారట. మరిన్ని కొత్త సన్నివేశాలు యాడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే సెన్సార్ అయిన వర్షన్ నుంచి జాన్వీ కపూర్ సీన్స్ మాత్రమే కాకుండా మరికొన్ని సీన్స్ తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా మరిన్ని సీన్స్ యాడ్ చేయనున్నారని సమాచారం. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ తొలగించి రామ్ చరణ్, జగపతి బాబు మధ్య ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ సెన్సార్ చేయించి థియేటర్స్‌లో పెద్ది కొత్త వర్షన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. 
     

  • తన భార్యతో విడాకుల కోసం పోరాడుతున్న హీరో జయం రవికి మరో షాక్ తలిగింది. ఆయన అభ్యర్థనను మద్రాస్‌ హైకోర్ట్ తోసిపుచ్చింది.  మధ్యంతర భరణం పిటిషన్‌కు సంబంధించిన విచారణ చేపట్టిన న్యాయస్థానం జయం రవికి షాకిచ్చింది. తనకు మరింత సమయం కావాలంటూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనిపై  కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జయం రవికి సూచించింది.

    కాగా.. గతేడాది ఏప్రిల్‌లో విడాకుల వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి రవి తమ పిల్లల పాఠశాల ఫీజులతో సహా మధ్యంతర భరణం చెల్లించలేదని ఆరోపిస్తూ కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ తిరస్కరిండంతో ఆమె మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీనిపై రెండు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.

    ‍అయితే విచారణను పూర్తి చేయడానికి దిగువ న్యాయస్థానానికి ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని కోరుతూ జయం రవి మద్రాస్‌ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు గతంలో నిర్ధారించిన గడువును పొడిగించడానికి నిరాకరిస్తూ జయం రవి పిటిషన్ కొట్టేసింది. దీనిపై కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నటుడిని ఆదేశించింది. కాగా.. తన విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించేది లేదని ఇటీవలే చెన్నైలో జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.

    మరోవైపు జయం రవి సినిమాల విషయానికొస్తే.. రాఘవ లారెన్స్, నివిన్ పౌలీ నటిస్తోన్న 'బెంజ్' చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా తాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'యాన్ ఆర్డినరీ మ్యాన్'లోనూ నటిస్తున్నారు.  ఇటీవలే 'కరతే బాబు' మూవీ చిత్రీకరణ పూర్తి చేశారు. అంతేకాకుండా 'జీనీ', 'బ్రో కోడ్' అనే చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.

  • కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో నటించిన యాక్షన్‌ మూవీ టాక్సిక్..ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. జూన్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో అదే తేదీన రామ్ చరణ్ పెద్ది థియేటర్లలోకి వచ్చేసింది.

    అయితే తాజాగా ఈ మూవీపై కొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్‌పై హీరో యశ్ తీవ్ర అసంతప్తిగా ఉన్నారని టాక్. అందుకే దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించిన వంద రోజుల షూటింగ్‌ను రీ షూట్ చేయాలని అడిగారని ఓ వార్త వైరలవుతోంది. రిలీజ్ తేదీ వాయిదా పడడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది.

    ఈ నేపథ్యంలోనే టాక్సిక్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్పందించింది. రీ షూట్‌ అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఈ చిత్రానికి ఎలాంటి రీషూట్‌లు షెడ్యూల్ చేయలేదని నిర్మాణ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. మొదట 'టాక్సిక్' మూవీని మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ కుదరలేదు.. ఆ తర్వాత జూన్ 4వ తేదీని అనౌన్స్‌ చేసినప్పటికీ మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు చిత్ర నిర్మాతలు ఇంకా కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు.

    'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటిస్తోన్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.

  • తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.

    ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

    దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, ‘నేను ఏలూరుకు చెందినవాడిని. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్‌నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్  ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

    ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు, నిర్మాత కేదార్‌నాథ్, సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇచ్చారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయని, థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారని వారు తెలిపారు. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
     

  • రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.  బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్‌తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్‌గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

    రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్‌గా, రెజ్లర్‌గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 
     

     

  • సూర్యాన్ష్‌, తనీషా మిశ్రా జంటగా నటించిన సినిమా ‘ఒక కోర్టు కేస్‌’. నాగేష్‌ పూడి, ముకేష్‌ పూడి సమర్పణలో ఓపెన్‌ ఐస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గణేష్‌ పూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 17న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ప్రేమలో జరిగే ఘటనలను లీగల్‌ డ్రామాగా మలచడం ఆసక్తిగా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. 

    ‘‘ప్రేమలో మోసపోయిన ఒక యువకుడు తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం’’ అన్నారు సూర్యాన్ష్‌. ‘‘ప్రేమలో బ్రేకప్‌ తర్వాత జరిగే ప్రతీకారం అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు గణేష్‌ పూడి. ‘‘ఈ కథ విన్నప్పుడే సాధారణ ప్రేమకథ కాదని అర్థమైంది’’ అని తనీషా మిశ్రా పేర్కొన్నారు.  

  • యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్‌ చిలకా, రాజేశ్‌ జగ్తియాని, హిరాచంద్‌ దండ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, ‍అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • గతేడాది నుంచి విడాకుల వివాదంతో వార్తల్లో నిలుస్తోన్న హీరో జయం రవి. తన భార్య వేధింపులతో విసిగిపోయానని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు మంజురయ్యే వరకు సినిమాల్లో నటించని కూడా అన్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని అన్నాడు. పెళ్లయిన మొదటి రోజు నుంచే బ్లాక్‌ మెయిల్ చేశారని.. కనీస గౌరవం కూడా ఇచ్చవాళ్లు కాదన్నారు. ఆఖరికి నేను సంపాదించుకున్న డబ్బుని దాచుకోవడానికి కూడా ఒక అకౌంట్‌ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ వివాదం తర్వాత జయం రవి ప్రముఖ సింగర్‌ కెనీషాతో రిలేషన్‌ కొనసాగించారు. కానీ ఇటీవలే సింగర్‌ కెనీషా కూడా షాకిచ్చింది. రవితో తనకున్న రిలేషన్‌కి బ్రేకప్‌ చెబుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్లిపోతున్నట్లు ఆమె తెలిపారు.

    అయితే తాజాగా కెనీషా మరో షాకిచ్చింది. సడన్‌గా జయం రవితో కలిసి తిరుమలలో కనిపించింది. వీరిద్దరు కలిసి దర్శనానికి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోయారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మరోవైవు జయం రవి ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌ మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

  • తాను ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను దారణంగా కొట్టి చంపారంటూ నటి మంజరి ఫడ్నిస్‌ భోరున ఏడ్చేశారు. 2019 నుంచి ఆ కుక్క తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండేదని.. సొసైటీకి చెందిన ఓ వ్యక్తి అత్యంత కీరాతకంగా దాన్ని కొట్టి చంపేశాడని ఆమె ఆరోపించింది. 

    మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఒక కుటుంబం వదిలేసి వెళ్లిన ఓ కుక్కను సొసైటీ సభ్యులు చేరదీశారు. దానికి ‘మైకీ’ అని పేరు పెట్టి సొసైటీలోనే పెంచుకుంటున్నారు. మంజరి కూడా దానికి స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం లాంటివి చేసేవారు. అయితే కొన్ని రోజుల క్రితం మైకీ కనిపించకుండా పోయింది. పోస్టర్లు వేయించి వెతికినా కూడా దొరకలేదు. బేస్‌మెంట్ ఏరియాలో మైకీ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో, సోసైటీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ మంజరి ఎమోషనల్‌ అయ్యారు. భవిష్యత్తులో ఇలా ఎవరూ జంతుహింసకు పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని  విజ్ఞప్తి చేశారు.

     ప్రస్తుతం మంజరి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హీరోయిన్లు  భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి సహా పలువురు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద దోషులను కఠినంగా శిక్షించాలంటూ మంజరికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మంజరి ఫడ్నిస్ తెలుగులో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం, జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Politics

  • హైదరాబాద్:  రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు.  ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్‌. 

    ‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.  జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. 

    మీనాక్షి నటరాజన్‌కు షాక్‌.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Business

  • భారతీయ రైల్వేలలో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు అందించే లినెన్ కిట్ గురించి అందరికీ తెలుసు. ఇందులో సాధారణంగా బెడ్‌షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. అయితే ఈ వస్తువులను శుభ్రం చేయడానికి రైల్వేలు ఎంత ఖర్చు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?

    లాండ్రీ టెండర్ పత్రం ప్రకారం.. ఒక బెడ్‌షీట్ ఉతకడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 3.16 మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైన భారత రైల్వే వ్యవస్థలో పరిశుభ్రత నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోల‍్చితే ఇది చాలా తక్కువగా ఉందని చాలామంది భావిస్తున్నారు.

    ఉతికేందుకు ఖర్చు ఎంత?
    భారతీయ రైల్వేల డిపార్ట్‌మెంటల్‌ లాండ్రీ టెండర్ డాక్యుమెంట్‌ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రం ప్రకారం.. ఒక బెడ్‌షీట్ ఉతికేందుకు అధికారిక రేటు ఒక్కదానికి రూ. 3.16. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి ప్రయాణంలో భాగంగా పలు లినెన్ వస్తువులు అందిస్తారు. సాధారణంగా వీటిలో బెడ్‌షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. ఈ ఏర్పాటు ముఖ్యంగా సుదూర, రాత్రి వేళల రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల సౌకర్యం అందించాల్సిన దృష్ట్యా అమలులో ఉంది.

    రైల్వే నెట్‌వర్క్‌లో ప్రతిరోజు వినియోగించే భారీ స్థాయి లినెన్‌ను శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలామంది ప్రయాణికులు తరచూ ఆలోచిస్తుంటారు. టెండర్ పత్రం ప్రకారం.. బెడ్‌షీట్ ఉతికే ఖర్చు తక్కువగానే ఉంది. భారీ స్థాయిలో లాండ్రీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఖర్చులను భారతీయ రైల్వేలు ఎలా నియంత్రిస్తున్నాయనే అంశంపై ఇది చర్చకు దారి తీసింది.

    భారతీయ రైల్వేలు ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఏసీ కోచ్‌లు నడుస్తున్నాయి. ఇంత విస్తృత నెట్‌వర్క్‌లో లినెన్ సేవల నిర్వహణకు ప్రత్యేక లాండ్రీ కేంద్రాలు, క్రమం తప్పని శుభ్రపరిచే ప్రక్రియలు అవసరం. ఇటీవల చర్చకు వచ్చిన ఈ టెండర్ సంఖ్య, రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాల నిర్వహణకు అయ్యే నిర్వహణ వ్యయాల్లో ఒక అంశంపై అవగాహన కల్పిస్తోంది.

  • న్యూఢిల్లీ: ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మీషో తాజాగా బీఎస్‌ఈతో చేతులు కలిపింది. తద్వారా ప్రాజెక్ట్‌ శిఖర్‌ (Project Shikhar) పేరుతో కొత్త కార్యాచరణకు తెరతీసింది. ఇందుకు రెండు సంస్థలు అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తాజా ప్రాజెక్ట్‌లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)లు, డిజిటల్‌ బిజినెస్‌లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు వెసులుబాటు కల్పించనున్నాయి.

    వెరసి ఎంఎస్‌ఎంఈలతోపాటు.. అత్యున్నత పనితీరు చూపుతున్న స్వతంత్ర ఈకామర్స్‌ సంస్థలు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీలుగా అవతరించేందుకు దారి ఏర్పడనుంది. దీంతో వృద్ధి అవకాశాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. చురుకైన, ఉపాధి కల్పనకు వీలున్న బిజినెస్‌లు ప్రత్యక్షంగా క్యాపిటల్‌ మార్కెట్లను ఆశ్రయించేందుకు ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ అత్యున్నత అవకాశాలను క‌ల్పిస్తున్నట్లు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో సుందరరామన్‌ రామమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    గత కొన్నేళ్లుగా బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ వందలకొద్దీ సంస్థల లిస్టింగ్‌కు దారి చూపినట్లు తెలియజేశారు. తద్వారా వృద్ధి సంబంధ పెట్టుబడులు, పాలనాప్రమాణాల మెరుగుకు సహకరించినట్లు వివరించారు. మీషోతో తాజా భాగస్వామ్యం ద్వారా ఎస్‌ఎంఈలు, ఈకామర్స్‌ విక్రేతలకు లిస్టింగ్‌ అవకాశాలు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: లీట‌ర్‌పై 20 రూపాయ‌ల డిస్కౌంట్‌!

  • ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ ద‍్వారా వస్తువులు కొనుగోలు చేసేవారు విపరీతంగా పెరిగిపోయారు. అయితే, ఇలా కొనుగోళ్లు చేస్తున్న వారిలో ప్రతిరోజు ఎంతో కొంత మోసపోతూనే ఉన్నారు. ఉదాహరణకు.. ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు మొదట రూ.499 అని కనిపిస్తుంది. కానీ, చెల్లింపు చేసే చివరి దశకు వెళ్లేసరికి డెలివరీ ఛార్జీ, ప్లాట్‌ఫాం ఫీజు, ప్యాకేజింగ్ ఫీజు అంటూ ధర రూ.600 దాటిపోతుంది. మరికొన్ని సార్లు "ఇంకా 2 నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది", "ఈ వస్తువును 20 మంది చూస్తున్నారు" వంటి సందేశాలు చూపించి వెంటనే కొనుగోలు చేయాలనే ఒత్తిడి, ఆత్రుతను తీసుకొస్తారు. 

    వినియోగదారులను ఇలాంటి పద్ధతులతో ప్రభావితం చేసే డిజిటల్ వ్యూహాలను "డార్క్ ప్యాటర్న్స్" అంటారు. ఈ మోసపూరిత పద్ధతుల వల్ల భారత్‌లో ఆన్‌లైన్ కొనుగోలుదారులు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తాజా డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా రూపొందించిన డిజిటల్ డిజైన్ పద్ధతులను కంపెనీలు పాటిస్తూ కస్టమర్లను మోసగిస్తున్నాయి.

    "డార్క్ ప్యాటర్న్స్" అని పిలిచే మోసపూరిత ఆన్‌లైన్ డిజైన్ పద్ధతుల వల్ల వినియోగదారులు ప్రతి ఏడాది రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల మధ్య నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసెస్ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం.. భారత్‌లోని 304 మిలియన్ల ఆన్‌లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు 88 శాతం మంది హిడెన్‌ (మనకు ముందు తెలియని) ఛార్జీలు, తప్పనిసరి అదనపు సేవలు, డ్రిప్ ప్రైసింగ్, సబ్‌స్క్రిప్షన్ వంటి పద్ధతుల కారణంగా నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. డ్రిప్ ప్రైసింగ్ అంటే ప్రారంభంలో ధర తక్కువగా చూపించి, చివరి దశల్లో అదనపు ఛార్జీలు చేర్చే విధానం.

    మోసపూరిత డిజిటల్ పద్ధతులను అడ్డుకోవడంలో ప్రస్తుతం ఉన్న నియంత్రణ చర్యలు కొద్ది మేరకే ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది మోసపూరిత డిజిటల్ పద్ధతులపై భారీ జరిమానాలు అవసరమని చెప్పింది. అలాగే, అమలు చేయడానికి వీలుగా ఉన్న నిబంధనలు అవసరమని సూచించింది.

    50 నగరాల్లోని 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో, ఆన్‌లైన్ చెల్లింపులు చేసే వారిలో దాదాపు 63 శాతం మంది హిడెన్‌ ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఇందులో అదనపు ఖర్చులు కొనుగోలు ప్రక్రియ చివరి దశల్లో మాత్రమే కనిపిస్తాయి. 2024లో నమోదైన 52 శాతంతో పోలిస్తే ఇది బాగా పెరిగింది. 73 శాతం వరకు వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే ఫోర్స్డ్-యాక్షన్ పద్ధతులు వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇవి వినియోగదారులు సాధారణంగా తీసుకోని నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి పెడతాయి.

  • గడిచిన రెండు సెషన్లుగా ఇన్వెస్టర్లను కలవరపెట్టిన నష్టాల పరంపరకు మంగళవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో వ్యూహాత్మక కొనుగోళ్లు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 394 పాయింట్లు పుంజుకొని 73,918.76 మార్కు వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty 50) కూడా 119 పాయింట్లు లాభపడి 23,242.10 వద్ద ముగిసింది. మధ్యాహ్నం సమయంలో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ చివరి గంటలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి.

    మార్కెట్ జోష్‌కు దారితీసిన కారణాలు

    నేటి మార్కెట్ గమనాన్ని విశ్లేషిస్తే ఈ రికవరీకి ప్రధానంగా కొన్ని అంశాలు దోహదపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో..

    ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తగ్గింపు

    పశ్చిమాసియాలో కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో భయాలను తొలగించింది.

    క్రూడాయిల్ ధరలు

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 0.71% తగ్గి బ్యారెల్‌కు 92.75 డాలర్ల వద్దకు చేరింది. భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

    ఆర్‌బీఐ బూస్టర్ డోస్.. బ్యాంకింగ్ రంగం హవా

    నేటి మార్కెట్ ర్యాలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం బూస్ట్‌గా మారింది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు గాను బ్యాంకులు సేకరించే తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ డిపాజిట్ల కోసం యూఎస్ డాలర్-రూపాయి ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

    ఈ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 1,255 పాయింట్లు దూసుకెళ్లింది. ఏప్రిల్ 10 తర్వాత బ్యాంక్ నిఫ్టీ సాధించిన అత్యుత్తమ సింగిల్-డే లాభం ఇదే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల మద్దతు

    గత వారం అమెరికా వాల్ స్ట్రీట్‌లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సెమికండక్టర్, టెక్నాలజీ షేర్లు రాణించాయి.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్‌ప్లస్‌ ట్రాన్స్‌ఫర్‌) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్‌బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.

    గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..

    • 2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)

    • 2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)

    • 2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)

    ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్‌), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.

    చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలు

    ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.

    ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?

    ఆర్‌బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్‌ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్‌బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.

    మరోవైపు ఆర్‌బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్‌బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.

    రిస్క్ బఫర్ నిర్వహణ

    సవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌-ECF) ప్రకారం.. ఆర్‌బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ 2025-26లో ఏకంగా  రూ.1,09,379.64 కోట్లను సీఆర్‌బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.

    ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలు

    ఆర్‌బీఐ వద్ద​ మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.

    రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్‌డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్‌ఎఫ్‌ఏ) ఉంటాయి.

    లిక్విడిటీ: ఆర్‌బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.

    రాబడిలో పెరుగుదల

    కేంద్ర బడ్జెట్‌లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.

    2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్య
    రూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లు

    ఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్‌బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్‌బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్‌బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్‌బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.

    ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?

    సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్‌బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మార్కెట్లోకి తెచ్చింది. లీటరుపై ఏకంగా రూ.20 రూపాయల వరకు తగ్గింపు ఇస్తూ ఢిల్లీలో సరికొత్త ‘ఈ-85 ఫ్యూయల్ స్టేషన్‌’ను ఇటీవల ప్రారంభించింది. అయితే, ఊహించని విధంగా ఈ చౌక ఇంధనాన్ని కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. బంకులు తెరిచినా కొనుగోలుదారులు రాకపోవడానికి గల అసలు కారణాలను పరిశీలిద్దాం.

    అసలు ఏమిటీ ఈ-85 ఇంధనం?

    ఈ-85 అనేది సాధారణ పెట్రోల్ కాదు. ఇది 85 శాతం ఇథనాల్, 15 శాతం సంప్రదాయ పెట్రోల్ కలయికతో తయారైన ఒక మిశ్రమ బయో-ఇంధనం. ముడి చమురు దిగుమతులపై విదేశీ భారాన్ని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. పెట్రోలియం కంపెనీల తయారీ వ్యయం తగ్గడం వల్ల సాధారణ పెట్రోల్ కంటే ఇది లీటరుకు దాదాపు రూ.20 రూపాయల తక్కువ ధరకు లభిస్తుంది.

    ఇంత చౌకగా ఉన్నా ఎందుకు కొనడం లేదు?

    ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో కొన్ని సాంకేతిక, అవగాహనా లోపాలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి.

    ఇంజిన్ల అననుకూలత: సాధారణ పెట్రోల్‌తో నడిచే బైక్‌లు లేదా కార్లలో నేరుగా ఈ-85 ఇంధనాన్ని వాడటం అసలు సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే అవసరం. ప్రస్తుతానికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనాన్ని పోస్తే ఇంజిన్లు పాడైపోయే ప్రమాదం ఉంది.

    అవగాహన రాహిత్యం

    కొత్తగా వచ్చిన ఈ-85 ఇంధనం గురించి సాధారణ వాహనదారులకు కనీస అవగాహన లేదు.

    • ఈ ఇంధనం ఏ వాహనాలకు సరిపోతుంది?

    • దీనివల్ల మైలేజీ ఎంత వస్తుంది?

    • పాత వాహనాలను ఫ్లెక్స్ ఇంజిన్లుగా మార్చవచ్చా లేదా?

    అనే విషయాలపై ప్రభుత్వం, చమురు సంస్థల నుంచి విస్తృత ప్రచారం కరువైంది. దీంతో వినియోగదారులు దీని జోలికి వెళ్లడం లేదు.

    భవిష్యత్తు మార్కెట్ ఎలా ఉండబోతోంది?

    ప్రస్తుతానికి ఈ-85 స్టేషన్లు కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాయి. మార్కెట్లోకి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు, బైకులు అందుబాటులోకి వస్తేగానీ ఈ చౌక ఇంధనానికి డిమాండ్ పెరగదనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం కేవలం బంకులను ఏర్పాటు చేయడమే కాకుండా, వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

  • భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్‌వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

    అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    కీలక అంశాలు..

    భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్‌మెంట​్‌. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.

    ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.

    ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.

    ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్‌షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.

    సరికొత్త ప్లాన్

    2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్‌టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.

    ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

  • సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్‌లైన్లు. ఒక రోజు లీవ్ కావాలన్నా వంద సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది, పది రోజుల సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని మెసేజ్ చేసిన ఉద్యోగికి.. ‘కంగారేం లేదు, పరిస్థితులు సర్దుకోవడానికి మరో రోజు సెలవు తీసుకో’ అంటూ ఓ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల మానసిక పరిస్థితికి పెద్దపీట వేసే ఇలాంటి మేనేజర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంస్థలో పని వాతావరణం, ఉద్యోగుల ప్రవర్తన, యాజమాన్యం తీరు ఎలా ఉండాలో ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు.

    యాజమాన్యం, మేనేజర్ల పాత్ర

    ఈ సంఘటనలో మేనేజర్ చూపిన చొరవ కేవలం ఒక అదనపు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు; అది ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ. యాజమాన్యం, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కింది విషయాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    మానవత్వంతో కూడిన నాయకత్వం: నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకత్వం.

    మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే అలసటను గుర్తించి స్థిరపడటానికి సమయం ఇవ్వడం ద్వారా మేనేజర్ ఉద్యోగిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించగలిగారు.

    నమ్మకాన్ని నిర్మించడం: నిరంతరం పర్యవేక్షించడం కంటే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం వల్ల వారు సంస్థ పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తారు.

    ఆరోగ్యకరమైన పని వాతావరణం అనేది సంస్థ విజయానికి పునాది. కంపెనీల పని వాతావరణం ఇలా మారాలో కూడా నిపుణులు చెబుతున్నారు.

    వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఉద్యోగి ఎక్కువ కాలం ఆ సంస్థలో కొనసాగుతాడు.

    సహకార సంస్కృతి: ఒకరినొకరు వేధించుకునే వాతావరణం కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచే వాతావరణం ఉండాలి. నియమాలు ఉద్యోగులను నియంత్రించడానికి మాత్రమే కాదు, వారి పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి.

    గౌరవప్రదమైన గుర్తింపు: కేవలం కంపెనీ రికార్డుల్లో ఐడీ నంబర్‌గా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువ ఉన్నాయనే భావన కల్పించాలి.

    Boss Gives Employee Extra Day Off After 10-Day Leave To "Settle In", Internet Reactsఉద్యోగుల బాధ్యత ఇదే..

    యాజమాన్యం లేదా మేనేజర్లు ఉదారంగా ఉన్నప్పుడు ఉద్యోగులపై కూడా అంతే బాధ్యత పెరుగుతుంది. మేనేజర్ చూపిన చొరవను ఆసరాగా తీసుకుని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఇలాంటి మేనేజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి’ అని ఒక నెటిజన్లు చెబుతున్నారు. యాజమాన్యం పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు సంస్థ వృద్ధి కోసం ఉద్యోగి తన శాయశక్తులా కృషి చేయాలి. తాము ఎప్పుడు వస్తున్నదీ, పని ఏ స్థితిలో ఉన్నదీ మేనేజర్‌కు ముందుగానే తెలియజేయడం ద్వారా ఉద్యోగులు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతను చాటుకోవాలి.

    ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

  • సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు.. ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటి వరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్‌ లోన్‌ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్‌బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్న వారు కొత్త నిబంధనలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. 

    ‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ..
    రుణాలను అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్‌ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో కొందరు రుణ గ్రహీతలు రెన్యూవల్‌ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌ కోసం రూ.లక్షలు అప్పులు పుట్టక.. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రెండు, మూడు రోజుల్లోనే రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని చెబుతున్నా.. చేసేదిలేక రుణగ్రస్తులు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు.

    నూతన నిబంధనలు ఇలా..

    • బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్‌ అగ్రి లోన్స్‌ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకునే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉండగా.. అంతకు మించి అయితే రుణం పొందలేని పరిస్థితి ఉంది. 

    • వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాస్‌ పుస్తకంతో పాటు తహసీల్దార్‌ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రశీదులు సమర్పించాల్సి ఉంటుంది. 

    • ఇక నాన్‌ అగ్రి రుణం తీసుకునే వారికి ఐటీఆర్, సిబిల్, ఆదాయ ధ్రువీకరణ చేసుకున్నాకే రుణం మంజూరు చేస్తారు. 

    • గతంలో డిఫాల్టర్‌గా ఉండి సెటిల్మెంట్‌ చేసుకున్న వారికి బంగారంపై రుణాలు ఇవ్వబడవు. 

      ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూడు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. 

      రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణాన్ని రెన్యూవల్‌ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. 

      అలాగే బంగారం రుణాల మంజూరు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపై ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచార. 

      అంతేకాక రుణగ్రహీతల బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించినట్లు తెలిసింది. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్‌ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.


    భారీగా రుణాల చార్జీలు..
    వివిధ బ్యాంకులు బంగారం రుణాల్లో భారీగా చార్జీలు పెంచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఉచితంగా ఉండగా.. రూ.3 లక్షలు పైన నామినల్‌ చార్జీలు తీసుకునే వారు. అయితే ఇటీవల బంగారం రుణాలు తీసుకునే వారిపై చార్జీల మోత మోగిస్తోంది. ప్రతి రూ.లక్ష రుణానికి అప్రైజర్‌ చార్జితో పాటు సర్వీస్‌ చార్జి అంటూ సుమారు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.5 లక్షల వరకు రుణానికి అయితే గోల్డ్‌ అప్రైజర్‌కు రూ. 590, ప్రాసెసింగ్‌ చార్జిలు రూ. 295లు వసూలు చేస్తుండగా.. రూ.5 లక్షల పైన రుణానికి అయితే గోల్డ్‌ అప్రైజర్‌కు రూ. 708, ప్రాసెసింగ్‌ చార్జిలు రూ. 590 లు వసూలు చేస్తున్నారు. కాగా, బ్యాంకుల వారీగా చార్జీలు ఉన్నాయి. ఇకనైనా బ్యాంకర్లు వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యూవల్‌ చేయాలని రైతులు కోరుతున్నారు.

     

Sports

  • ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ భవిష్యత్తుపై సంచలన ప్రచారం జరుగుతోంది. తాజాగా న్యూజిలాండ్‌పై లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత స్టోక్స్, సహచర ఆటగాడు గస్‌ అట్కిన్సన్‌ జట్టు నిబంధనలను ఉల్లంఘించి అర్ధరాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ నైట్‌క్లబ్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ వారు ఫుల్లుగా తాగి ఓ రగ్బీ ఆటగాడిపై దాడి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ఈ వివాదం తర్వాత స్టోక్స్‌ తన కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 'ది క్రికెటర్' సీనియర్ జర్నలిస్ట్ జార్జ్‌ దోబెల్‌ ప్రకారం.. అతడు స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పాటు రిటైర్మెంట్ కూడా ప్రకటించవచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.

    ఇదిలా ఉంటే, నైట్‌క్లబ్‌ ఘటనలో స్టోక్స్‌, అట్కిన్సన్‌ ఎవరిపై దాడికి పాల్పడలేదని ECB వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తప్పకపోవచ్చు. స్టోక్స్‌కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలోనూ పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. 

    గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్‌క్ల‌బ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే మ్యాచ్‌కు ముందు వెల్లింగ్ట‌న్‌లోని ఓ నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన బ్రూక్, అక్కడ బౌన్స‌ర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ఇంగ్లండ్‌ భవిష్యత్తు ఆశాకిరణం జేక‌బ్ బెథెల్‌తో కలిసి సదరు బౌన్స‌ర్‌పై దాడి చేశాడు. అయితే దాడి పెద్ద‌ది కాక‌పోవ‌డంతో ఈసీబీ వారిద్ద‌రిని మంద‌లింపుతో స‌రిపెట్టింది. 
     

  • ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 9) జరిగిన తొలి మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్‌వర్త్‌ లూయిస్‌) సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

    36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.

    ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆరో నంబర్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ (86 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. 

    బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (54), నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. తౌహిద్‌ హృదోయ్‌ (31), తస్కిన్‌ అహ్మద్‌ (20) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌ (10-1-38-3) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. లియామ్‌ స్కాట్‌, మ్యాట్‌ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. బార్ట్‌లెట్‌కు ఓ వికెట్‌ దక్కింది.

    లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. 

    బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్‌ (10-1-37-2) బౌలింగ్‌లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం​ అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ (5.2-0-24-2), తస్కిన్‌ (5-0-28-1) కూడా రాణించారు. 
     

  • శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్‌ 9) జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌..  రుతురాజ్‌ గైక్వాడ్‌ (101) సూపర్‌ సెంచరీతో, కెప్టెన్‌ తిలక్‌ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓ‍వర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖర్లో ఆయుశ్‌ బదోని (24), సూర్యాంశ్‌ షేడ్గే (26 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. 

    మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్‌ ఆర్మ 32, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 2, అనుకూల్‌ రాయ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేయగా.. ఐపీఎల్‌ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

    లంక బౌలర్లలో మొహమ్మద్‌ షిరాజ్‌ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్‌, వనుజ సహాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

    అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో)  కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.

    అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్‌ రాయ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్‌ కంబోజ్ ఓ వికెట్‌ పడగొట్టింది. జూన్‌ 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్‌-ఏ, ఆఫ్ఘనిస్తాన్‌-ఏ తలపడనున్నాయి. 

  • భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ గ్రెగ్‌ చాపెల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్‌ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్‌ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.

    గతేడాది కాలంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.

    ఆరెంజ్‌ క్యాప్‌ విజేత
    ఐపీఎల్‌-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్‌.. ఆరెంజ్‌ క్యాప్‌తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్‌ బౌలర్ల బౌలింగ్‌లో సైతం వైభవ్‌ చితక్కొట్టడం విశేషం.

    ఇక ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్‌ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్‌తో ఉతికి ఆరేశాడు.

    సీజన్‌లో 72 సిక్సర్లు బాది క్రిస్‌ గేల్‌ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్‌కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్‌మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్‌ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.

    ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం
    అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్‌ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.

    ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్‌ చేసే జట్టుకు అదనపు పవర్‌హిట్టర్‌ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్‌ కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్‌ చాపెల్‌ పేర్కొన్నాడు.

    ఇలా అయితేనే టీ20 క్రికెట్‌ను కాపాడుకుందాం
    అదే విధంగా.. టీ20 క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్‌ చాపెల్‌ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్‌ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్‌తో ఆడే ప్రయత్నం చేశారు.

    పిచ్‌ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్‌ జనరేట్‌ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్‌లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. 

    చదవండి: అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!

  • అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్‌పూర్‌ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో ఈ మ్యాచ్‌ భాగం కాదు.

    కాబట్టి అఫ్గన్‌తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్‌ మాత్రం దొరికింది. మానవ్‌ సుతార్‌ (లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.

    మూడు వన్డేలు
    ఇదిలా ఉంటే.. జూన్‌ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్‌ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

    మరోవైపు.. ఇషాన్‌ కిషన్‌ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ సాధించారు. దీంతో అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.

    ఇషాన్‌ వద్దు.. 
    ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌కు బదులు యశస్వి జైస్వాల్‌కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.

    స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్‌తో వన్డేలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేస్తాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు, కేఎల్‌ రాహుల్‌ ఐదు, హార్దిక్‌ పాండ్యా ఆరు, వాషింగ్టన్‌ సుందర్‌ ఏడు, హర్ష్‌ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.

    పేస్‌ దళంలో అర్ష్‌దీప్‌ సింగ్‌తో పాటు గుర్నూర్‌ బ్రార్‌ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్‌ నాయర్‌ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇవ్వలేదు.

    జైసూను ఆడిస్తారా?
    ఐపీఎల్‌-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా.. 16 మ్యాచ్‌లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్‌ కిషన్‌ 602 పరుగులతో దుమ్ములేపాడు.

    అంతేకాదు సీజన్‌ ఆరంభంలో ప్యాట్‌ కమిన్స్‌ గైర్హాజరీలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్‌. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్‌ నాయర్‌ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.

    అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేకు అభిషేక్‌ నాయర్‌ ఎంచుకున్న జట్టు
    శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబే, అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, కుల్దీప్‌ యాదవ్‌.

    చదవండి: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

  • జూన్‌ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 ​మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (జూన్‌ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్‌ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. 

    ఇందులో ఇద్దరిపై (జాన్సన్‌ ఛార్లెన్‌, క్వింటన్‌ సాంప్సన్‌) వేటు పడగా.. అల్జరీ జోసఫ్‌కు వర్క్‌లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్‌లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. 

    విధ్వంసకర వీరులు హెట్‌మైర్‌, రూథర్‌ఫోర్డ్‌, షెపర్డ్‌, పావెల్‌, హోల్డర్‌ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్‌ జూన్‌ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్‌ వేదికగా జరుగనుంది.

    శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం విండీస్‌ జట్టు
    షాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్‌

    కాగా, శ్రీలంక క్రికెట్‌ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుం​ది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.

    స్వదేశంలో సిరీస్‌ కోల్పోవడంతో విండీస్‌ జట్టు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్‌లో విండీస్‌ ప్రస్తుతం​ పదో స్థానంలో ఉంది. టాప్‌-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్‌ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య  జరుగనున్న సంగతి తెలిసిందే.

     

  • భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు వెళ్లే భారత టీ20 జట్టు నుంచి స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను తప్పించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన సూర్యకుమార్‌ యాదవ్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫామ్‌లేమితో బాధపడుతున్న సూర్యను తప్పించి.. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. దాదాపు మూడేళ్ల తర్వాత అతడిని జట్టును ఎంపిక చేయడమే కాకుండా.. కెప్టెన్‌గా నియమించింది.

    ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో టీమిండియా జూన్‌ 26 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనుంది. తొలుత ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడి.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. 

    వైభవ్‌ సూర్యవంశీకి చోటు
    ఇందుకోసం ప్రకటించిన జట్టులో తొలిసారిగా పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కగా.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళాన్ని ముందుకు నడిపిస్తాడని యాజమాన్యం తొలుత ప్రకటించింది.

    అందుకే సిరాజ్‌ను తప్పిస్తు న్నాం
    తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ‘‘మా వైద్య బృందంతో చర్చల అనంతరం.. సిరాజ్‌కు విశ్రాంతి కావాలని భావించాము. పనిభారాన్ని తగ్గించే క్రమంలో అతడిని ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటన నుంచి తప్పిస్తున్నాము. సుదీర్ఘమైన అంతర్జాతీయ క్రికెట్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.

    సిరాజ్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణను సీనియర్‌ మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సిరాజ్‌కు బదులు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లలో అతడు టీ20 సిరీస్‌లలో పాల్గొంటాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. 

    ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌కు టీమిండియా (అప్‌డేటెడ్‌)
    శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్‌ కెప్టెన్‌), నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, వైభవ్‌ సూర్యవంశీ, ప్రసిద్‌ కృష్ణ.

    చదవండి: టీమిండియాలో చోటివ్వరా? సెంచరీతో కదంతొక్కాడు!

  • టీమిండియా స్టార్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడేందుకు భారత్‌- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

    ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్‌ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్‌ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ తిలక్‌ వర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

    వైభవ్‌ విఫలం..
    అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11 బంతుల్లో 2), వైభవ్‌ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్‌ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

    శతకంతో కదంతొక్కాడు
    ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.

    మిగిలిన వారిలో ఆయుశ్‌ బదోని 24, సూర్యాంశ్‌ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్‌ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్‌ షిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్‌, వనుజా సాహన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లు
    చివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్‌ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.

    స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్‌ భారత్‌-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

    చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్‌!

  • సొంతగడ్డపై వెస్టిండీస్‌ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

    ఇందులో భాగంగా విండీస్‌ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్‌ 1-0తో శ్రీలంక వశమైంది.

    పదో స్థానంలో...
    ఫలితంగా వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి వెస్టిండీస్‌ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్‌ ద్వారా ఈ సైకిల్‌ (2023-2027)లో విండీస్‌ ఇప్పటికి 32 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.

    ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్‌ పాయింట్లతో వెస్టిండీస్‌ పట్టికలో పదో స్థానంలో ఉంది.

    టాప్‌-8లో ఉన్న జట్లు మాత్రమే
    కాగా పట్టికలో టాప్‌-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలో అడుగుపెడతాయి.

    ఇక విండీస్‌కు ఈ సైకిల్‌లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్‌ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్‌కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది.  

    వరుసగా రెండోసారి..
    ఈ సిరీస్‌లలో వెస్టిండీస్‌ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే విండీస్‌ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్‌ వరుసగా రెండోసారి గ్లోబల్‌ క్వాలిఫయర్‌ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.

    ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్‌, నమీబియా, ఐర్లాండ్‌ వంటి చిన్నజట్లు రీజినల్‌ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్‌ క్వాలిఫయర్‌లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్‌లో వెస్టిండీస్‌కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.

    గత ఎడిషన్‌కు అర్హత సాధించకుండానే..
    స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్‌ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

    ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్‌, టీమిండియాపై వెస్టిండీస్‌ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్‌లో కూడా విండీస్‌కు క్వాలిఫయర్స్‌ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది. 

    చదవండి: పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను

  • ఇండియా-ఏ, శ్రీలంక‌-ఏ మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ స‌మయంలో ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ర‌నౌట్‌కు మ్యాచ్ సాక్ష్యంగా నిలిచింది. విష‌యంలోకి వెళితే.. ఓపెనర్దిద్ద‌రు తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేర‌డంతో రుతురాజ్‌, ప్రియాన్ష్ ఆర్య‌లు ఆచితూచి ఆడారు. ఇద్ద‌రు క‌లిసి చాలా బంతులెదుర్కొని 53 ప‌రుగులు జోడించారు. 

    ఇద్దరి మధ్య భాగ‌స్వామ్యం బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో రుతురాజ్ చేసిన త‌ప్పిదం కొంప‌ముంచింది. ర‌విందు ఫెర్నాండో వేసిన‌ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ తొలి బంతినే గైక్వాడ్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాత బంతికే హైడ్రామా చోటుచేసుకుంది. పాయింట్ దిశ‌గా ఆడిన రుతురాజ్ రెండు ప‌రుగుల కోసం ప్ర‌య‌త్నించాడు. 

    అయితే స్ట్రైక్ ఎండ్‌వైపు ఉన్న ప్రియాన్ష్ ఆర్య రుతురాజ్ రెండో ప‌రుగు కోసం వ‌చ్చిన విష‌యం గ‌మ‌నించ‌లేదు. అప్ప‌టికే క్రీజులో బ్యాట్ పెట్టాడు. కానీ అప్ప‌టికే రుతురాజ్ స్ట్రైక్ ఎండ్‌వైపు వ‌చ్చేశాడు. ఈలోగా బంతిని కీప‌ర్ బౌల‌ర్ వైపు విసిరే క్రమంలో ప్రియాన్ష్‌ బ్యాట్‌ను తొక్కడం కనిపించింది. ఇంతలో కీపర్‌ నుంచి బంతిని అందుకున్న బౌలర్‌ వికెట్లను గిరాటేశాడు. 

    ఈ నేపథ్యంలో ఇద్ద‌రు బ్యాట‌ర్లు ఒకే ఎండ్‌లో ఉండ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రు బ్యాట్‌ను మొద‌ట‌గా క్రీజులో పెట్టార‌నేది అంపైర్లు ప‌రిశీలించారు. రిప్లేలో ప్రియాన్ష్ ఆర్య బ్యాట్ క్రీజుపై ఉంచిన‌ప్ప‌టికీ, ప్రియాన్ష్ కంటే ముందే రుతురాజ్ బ్యాట్‌ను క్రీజులో ఉంచ‌డం క‌నిపించింది. 

    దీంతో అంపైర్లు ప్రియాన్ష్ ఆర్య‌ను ర‌నౌట్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కారణంగా ఈ వింత ర‌నౌట్ జ‌రిగింది. ఇలాంటి వింత ర‌నౌట్ల‌కు పాకిస్తాన్ పెట్టింది పేరు. ఇప్పుడు రుతురాజ్‌, ప్రియాన్ష్‌లు వింత ర‌నౌట్‌తో వార్త‌ల్లోకెక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

    మ్యాచ్ విష‌యానికొస్తే 69 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రుతురాజ్ గైక్వాడ్ (101), కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ (60 బ్యాటింగ్‌) ఆదుకున్నారు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు 150 ప‌రుగులు జోడించారు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో మంచి రికార్డు క‌లిగిన రుతురాజ్ మ‌రోసారి ఆ న‌మ్మ‌కాన్ని నిలుపుకుంటూ సెంచ‌రీతో మెరిశాడు. 

    అయితే సెంచ‌రీ చేసిన మ‌రుక్ష‌ణ‌మే రుతురాజ్ వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ఇండియా-ఏ 45 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 224 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ (14) ఫామ్‌ను కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

    చదవండి: మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్‌ అరుదైన ఫీట్‌!

  • స్వదేశంలో టీమిండియా అదరగొట్టింది. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (126), ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టిన సంగతి తెలిసిందే. 

    మిగిలిన వారిలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (81), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (81) అర్ద శతకాలతో మెరిశారు. కాగా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) గతేడాది కాలంగా టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. 

    గతేడాది ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 800కు పైగా పరుగులు సాధించాడు. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌ సందర్భంగా 165 బంతుల్లో 100 రన్స్‌ చేసిన రాహుల్‌.. టెస్టు కెరీర్‌లో 12వ సెంచరీ నమోదు చేశాడు.

    అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు
    మొత్తంగా ఇప్పటికి టీమిండియా తరఫున 68 టెస్టులు ఆడిన రాహుల్‌ 4153 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సగటు 36.43. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కేఎల్‌ రాహుల్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో లేకుంటే ఈ కర్ణాటక బ్యాటర్‌ నుంచి ఒక్క పరుగు కూడా ఆశించలేమన్నాడు.

    పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే..
    తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ... ‘‘విదేశాల్లో కఠినమైన పిచ్‌ల మీద ఆడటం వల్ల అతడి బ్యాటింగ్‌ సగటు తక్కువగా ఉందని చాలా మంది కేఎల్‌ రాహుల్‌ను వెనకేసుకువస్తారు. కానీ అతడిలో నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను.

    పిచ్‌ గనుక బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకుంటే.. అతడు ఒక్క పరుగు కూడా చేయడు. ఇలా బ్యాటింగ్‌కు వెళ్తాడు. అలా అవుటై పెవిలియన్‌కు చేరతాడు. ఒకవేళ అదే స్థానంలో విరాట్‌ కోహ్లి ఉంటే.. అప్పుడతడు ఫామ్‌లో లేకపోయినా కనీసం 30, 33, 43.. లేదంటే 28 పరుగులైనా చేస్తాడు.

    కొడితే సెంచరీ.. లేదంటే
    కానీ కేఎల్‌ రాహుల్‌ మాత్రం 0- 10 మధ్య కూడా పరుగులు రాబట్టలేడు. ఫామ్‌లో ఉన్నాడంటే సెంచరీ అయినా చేస్తాడు. అది వేరే సంగతి. ఒకవేళ ఫామ్‌లో లేడంటే మాత్రం మనం అతడి నుంచి పరుగులు ఆశించకూడదు.

    కొడితే సెంచరీ.. లేదంటే ఇలా వెళ్లి అలా వచ్చేయడం.. కేఎల్‌ రాహుల్‌లో నేను ఈ రెండు మాత్రమే చూశాను. అతడు మధ్యస్థంగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. అయితే, గత రెండేళ్లుగా అతడి ఆట తీరులో పరిణతి కనిపిస్తోంది. 

    పరిస్థితులను అర్థం చేసుకుని మెరుగ్గా ఆడుతున్నాడు’’ అని అశ్విన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటికి 119 టెస్టు ఇన్నింగ్స్‌ ఆడిన 34 ఏళ్ల కేఎల్‌ రాహుల్‌ ఖాతాలో తొమ్మిది డకౌట్లు, 31 సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు ఉండటం గమనార్హం.

    చదవండి: పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను

Telangana

  • హైదరాబాద్: మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. ప్రత్యేకంగా 553 బస్సులను ప్రారంభించారు సీఎం రేవంత్‌. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ఆడబిడ్డలను లక్ష్మీ దేవితో కొలిచే సంస్కృతి మనది. 

    భూమిని భూమాతగా, దేశాన్ని భారత మాతగా, రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా భావిస్తాం. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మన కీర్తిని ప్రపంచానికి చాటారు. ఆడబిడ్డలకు ఓటు హక్కును కల్పించి వారి చేతికి అధికారం ఇచ్చిన ఘనత నెహ్రూది.  రాష్ట్రపతిగా, మంత్రులుగా ఆడబిడ్డలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో 33 శాతం మహిళలు రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు

    మహిళా స్వయం సహాయక సభ్యుల సంఖ్య కోటి మందికి చేరాలి.  ఈ వేదికగా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. వెయ్యి కాదు… 3 వేల బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు.

    ఇదిలా ఉంచితే, కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభకు బస్సులో రాగా అదే సమయంలో భారీ వర్షం ప్రారంభమైంది. 

     

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు షాక్ తగిలింది. ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అపిడవిట్‌లో వెల్లడించలేదని, ఆస్తుల వివరాలు తెలపలేదని  బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ నామినేషన్‌ను తిరస్కరించింది. కాగా  మధ్యప్రదేశ్‌నుంచి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేశారు.

    కాగా తొలినుంచి మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎ‍న్నికలపై ఉత్కంఠ సాగింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. అయితే కాంగ్రెస్ ఓట్లతో సులువుగా  ఒక రాజ్యసభ సీటు గెలువగలదు. 

    అయితే బీజేపీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ఈ ఉత్కంఠల నడుమ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్‌ మంత్రి కైలాష్‌ విజయవర్గీయ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్‌ను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడింది. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం రద్దవడం సంచలనంగా మారింది.

  • సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్‌మెట్‌, విద్యానగర్‌, అంబర్‌ పేట్‌, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్‌పేట్‌, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.  దీంతో పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే యత్నం చేస్తున్నారు. 

    జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్‌ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద‍్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

     

    ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్..
    నగర ఐటీ కారిడార్‌లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  రాయదుర్గం, ఐకియా, మైండ్‌స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. 

    అంబర్‌పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు
    అంబర్‌పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది.  హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు  వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. 

    ఇద్దరు యువకుల మృతి
    హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

    వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..

    అడిక్‌మెట్‌-36.3 mm

    విద్యానగర్‌- 31.5 mm

    అంబర్‌ పేట్‌-31.3 mm

    ఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్‌పేట్‌-27.5 mm

    నెహ్రూ నగర్‌-21 mm

    మలక్‌పేట్‌-మియాపూర్‌-18 mm

    ఉప్పల్‌-సరూర్‌నగర్‌- 12 mm

     

     

     

     

  • కరీంనగర్ జిల్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 

    వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్‌నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్‌ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

     ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్‌ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.   

  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయిటపడింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జే. బాలు  నివాసంలో ఈ రోజు ( మంగళవారం)  తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని నివాసంతో సహా ఏకకాలంలో పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    కాగా అధికారుల తనిఖీల్లో ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు.. బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు దొరికాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. 

    కాగా మోహన్ నాయక్ పై గతం నుంచే పెద్దఎ‍త్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు పలు మార్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టగా పెద్ద మెుత్తంలో ఆస్తులు బయిటపడ్డాయి.

  • వరంగల్ జిల్లా: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ∙ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్‌ అనే వ్యక్తి ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. 

    ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్‌ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. 

    దీంతో భార్య కోసం వెతికిన నరేశ్‌ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.  

  • సాక్షి, బాసర: గోదావరి నదిలో  నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. చంద్రశేఖర్, రామచందర్, మల్లేశ్‌గా గుర్తించారు. గల్లంతైన వారంతా కాచిగూడ చెప్పల్‌ బజార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న వెంటనే సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

International

  • పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పౌర సమాజ కూటమి ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ)పై అధికారులు నిషేధం విధించిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మందికి పైగా మృతి చెందగా, దాదాపు 200 మంది గాయపడ్డారు.

    శాంతి భద్రతలపై ఆందోళనల కారణంగా గత వారం జేఏఏసీని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణలో ఒక వ్యాపారిని కాల్చి చంపినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆదివారం రావలకోట్ నగరంలో ఘర్షణలు చెలరేగాయి.

    రావలకోట్‌లో అత్యున్నత పౌర అధికారి కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కాల్పుల్లో మృతి చెందిన వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చురీ బయట జేఏఏసీ మద్దతుదారులు గుమిగూడారని చెప్పారు.

    నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించగా, జేఏఏసీ కార్యకర్తలు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడి చేశారని ఆయన తెలిపారు. "భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మృతి చెందారు" అని ఖాన్ చెప్పారు. ఈ చర్యలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఆయన ధ్రువీకరించారు.

    అయితే, స్థానిక నివాసితులు, జేఏఏసీ మద్దతుదారులు అధికారుల వాదనను ఖండిస్తూ, పౌరుల మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

    జూలై 27న జరగనున్న ప్రాంతీయ శాసనసభ ఎన్నికల్లో 45 స్థానాల్లో 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జేఏఏసీ పిలుపునిచ్చిన నిరసనలకు ఒక రోజు ముందు ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు జరిగిన హింసాత్మక ఘటనలు, ఇంటర్నెట్ నిలిపివేత, సంస్థపై నిషేధం, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ ఆరోపణలు, రాజకీయ పక్కనపెట్టివేత వంటి అంశాలపై కూడా ఈ నిరసనలు జరిగాయి.

    జేఏఏసీ సభ్యులు తమను "ఉగ్రవాద" సంస్థగా జాబితాలో చేర్చడాన్ని "అణచివేత"గా పేర్కొన్నారు. తాము చట్టబద్ధమైన ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన కోసమే నిరసనలు చేస్తున్నామని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ సంస్థ హింసాత్మక నిరసనలు నిర్వహించింది.

    పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీపీ) కూడా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)పై నిషేధం విధించిన ప్రాంతీయ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    "చర్చలు అవసరమే. అయితే, ప్రాంత ప్రజలు రాజకీయ హక్కుల నుంచి దూరంగా ఉంచబడుతున్న పరిస్థితుల్లో అవి అర్థవంతంగా ఉండవు. శాంతియుత నిరసన హక్కును పరిరక్షించాలి. ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి" అని పేర్కొంది.

    పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చూడాలని, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించాలని, నిజమైన సమగ్ర చర్చలకు కట్టుబడి ఉండాలని సమాఖ్య ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాన్ని హెచ్‌ఆర్‌సీపీ కోరింది. పరిస్థితిని పరిశీలించేందుకు వీలైనంత త్వరగా నిజ నిర్ధారణ బృందాన్ని పంపనున్నట్లు కూడా ప్రకటించింది.

  • పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

    ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్‌ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్‌ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది.  ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్‌ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు  అనేది పరిశీలిస్తే..

    ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు.  

    లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్‌ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.

    ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్‌కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.

    ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

    సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్‌ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

National

  • సాక్షి, న్యూఢిల్లీ:  గతవారం ఢిల్లీలోని మాలవ్య నగర్‌లోని  హోటల్‌ అగ్నిప్రమాద ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది.ఎనిమిది మంది కుటుంబ సభ్యుల మరణం గురించి తెలియక ముందే ఆ కుటుంబంలోని  చివరి గుండె ఆగిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుత్ను కుటుంబంలోని ఏకైక సభ్యుడు, 80 ఏళ్ల వృద్ధుడు రాధే శ్యామ్ అగర్వాల్ కూడా ఈరోజు కన్నుమూశారు. దీంతో మొత్తం కుటుంబం  ఆహుతైపోయిన ఘటన  కలచి వేస్తోంది. ఆ ఇంట్లో నవ్వుతూ, ఆనందంగా గడిపిన కుటుంబం ఇప్పుడు సమూలంగా సమాధి అయిపోయింది. ఈ ఘోర కలి వార సమీప బంధువుల్లో ఎప్పటికీ పూడ్చలేని ఒక పెద్ద గాయాన్ని మిగిల్చింది.

    అగర్వాల్ కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నుండి తప్పించుకుని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏకైక సభ్యుడు కూడా మృతిచెందడం కూడా కలిచివేసింది.

    శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న రాధే శ్యామ్ అగర్వాల్ సాకేత్‌లోని 'మాక్స్ హాస్పిటల్' ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు.అయితే ఆయన ఆరోగ్యం విషమంగా మారడం, దేనికైనా సిద్ధంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో,దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న 'ఫ్లోరిష్ ఇన్' అనే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ (B&B) హోటల్‌లో బస చేశారు. వారి ఇల్లు గురుగ్రామ్ సెక్టార్ 46లో ఉండటం, అక్కడి నుండి ట్రాఫిక్ సమస్యల వల్ల రాకపోకలు కష్టమవుతాయని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.అదే  ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది.

    ఈ ప్రమాదంలో రాధే శ్యామ్ కుమారుడు వివేక్ అగర్వాల్, భార్య ప్రేమ్ లత అగర్వాల్, కోడలు తర్జని అగర్వాల్, మనవరాళ్లు జివిషా, వార్యలతో పాటు మరో ముగ్గురు బంధువులు మరణించారు.

    తన వాళ్ళు ఇకలేరని ..రారని తెలియకుండానే
    ఆసుపత్రిలో ఉన్న రాధే శ్యామ్ అగర్వాల్‌కు తన కుటుంబం మొత్తం అగ్నిప్రమాదంలో చనిపోయిందనే విషయమే తెలియదు. తనను చూడటానికి ఎందుకు రాలేదని ఆయన నర్సులను, వైద్యులను అడుగుతూనే ఉండేవారు. మనవరాలు జివిషా, బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతూ, తాతగారిని చివరిసారిగా చూద్దామని ఢిల్లీకి వచ్చింది. ఆమె వచ్చినందుకు సంతోషించిన రాధే శ్యామ్, తన మనవరాలు తన కోసమే అంత దూరం నుండి వచ్చిందని నర్సులతో ఎంతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ, తాతయ్యకు వీడ్కోలు పలకడానికి వచ్చిన మనవరాలే ముందుగా అనంత లోకాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం.

  • దేశంలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి డబుల్‌ బోనస్‌ను తెచ్చిపెట్టాయి. ఒకటేమో ఎంతోకాలంగా అందని ద్రాక్షలా ఉన్న బెంగాల్‌లో విజయం సాధించడమైతే. మరోటేమే తమ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, టీఎంసీలను మట్టికరిపించి ఇండియా కూటమిని దెబ్బతీయడం.

    ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత.. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఎన్టీయే జయకేతనం ఎగురవేసింది. దానితో పాటు ఎంతో కాలంగా కాషాయ పార్టీకి కొరకరాని కొయ్యలుగా ఉన్న టీఎంసీ మమతా బెనర్జీ, డీఎంకే స్టాలిన్‌ ఓడిపోవడంతో ఆ పార్టీకి డబుల్‌ బోనస్‌ లభించినట్లయింది. దీంతో జాతీయస్థాయిలో ఎన్డీఏకు ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమిని బలహీనపరిచి జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకుండా చేసుకుంటుంది.

    టీఎంసీలో చీలిక

    టీఎంసీలో మమతా బెనర్జీకి అసమ్మతి సెగ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు అసమ్మతి గళం ఎగురువేశారు.లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. టీఎంసీ సీనియర్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి, అలాగే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజా చీలికతో మమతా బెనర్జీ వైపు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయారు. దీంతో మమతా బెనర్జీకి వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి.

    కాంగ్రెస్‌కు డీఎంకే షాక్

    మరోవైపు డీఎంకే కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చింది. హస్తం పార్టీ మిత్రధర్మాన్ని పాటించకుండా టీవీకేకు మద్దతిచ్చిందని ఆరోపించింది. దీంతో ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగం కాదని స్పష్టం చేసిన డీఎంకే, భవిష్యత్తులో బీజేపీకి వ్యతిరేకంగా మరో కొత్త లౌకిక కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉందని సూచించింది.

    మెజార్టీ లేక వీగిపోయిన బిల్లు 

    కాగా ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ బిల్లులు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ లేక వీగిపోయాయి. ప్రత్యేక మెజారీటీకి 352 మంది ఎంపీల మద్దతు అవసరం ఉండగా 298 సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. దీంతో బిల్లు వీగిపోయింది. కాగా ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, ఎస్పీ తరువాత అత్యధిక ఎంపీ స్థానాలు తృణముల్ 28, డీఎంకే 22 స్థానాలు గెలుపొందాయి.

    ప్రస్తుతం డీఎంకే ఇండియా కూటమి నుంచి వైదొలగగా, టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తామని స్పీకర్‌కు లేఖ రాశారు. దీంతో ఇండియా కూటమికి దాదాపుగా 40 మంది ఎంపీల మద్దతు తగ్గినట్లైంది. త్వరలో జరిగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో  బీజేపీ మరోసారి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

    అయితే డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుండి వైదొలిగినప్పటికీ బీజేపీకి మద్దతివ్వడం అనేది దాదాపు అసంభవం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గుతుందని నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీలలో డీఎంకే ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ బిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించదు. అయినప్పటికీ గతంతో పోలిస్తే లోక్‌సభలో బీజేపీ బలం మరింత పెరిగింది.

    దీంతో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇటు బీజేపీకి విజయం ఇవ్వడంతో పాటు ప్రధాన ప్రతిపక్షాలను మట్టికరిపించాయనేది కాదనలేని సత్యం.

  • బెంగళూరు: ప్రతి తరగతి గదిలో ఇకపై చివరి బెంచ్‌ ఉండదు. యూ ఆకారంలో లేదా వృత్తాకారంలో బెంచ్‌లు ఏర్పాటు చేస్తారు. కేరళలో ఇదే విధానం కొనసాగుతోంది. ఇదేవిధానాన్ని రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.   చదువులో వెనుకబడిన విద్యార్థులను వెనుకబెంచ్‌లో కూర్చొబెడతారనే అపవాదు ఉండేది. దీంతో చివరి బెంచ్‌లో కూర్చునే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. 

    దీంతో ప్రతి ఒక్క  విద్యార్థిపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టేలా వృత్తాకార, లేదా యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు  చేస్తున్నారు. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ఇన్నాళ్లూ తాము చివరి బెంచీకి పరిమితం అయ్యామనే వేదన వారిలో తొలగిపోతుందని భావిస్తున్నారు. సంప్రదాయ వరుస ఆసనాల వ్యవస్థకంటే కేరళ విధానంలో విద్యార్థులను కూర్చొబెట్టడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచినట్లు అవుతుందని విద్యానిపుణుల అభిప్రాయం. 

    యూ ఆకార ఆసనాల వ్యవస్థలో ఉపాధ్యాయులు తరగతి కేంద్రభాగాల్లో  నిల్చొని పాఠాలు చెబుతారు. దీంతో విద్యార్థులందరూ శ్రద్ధగా పాఠాలు వింటారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. అంతేగాకుండా  విద్యార్థులతో బృంద చర్చలు, పాఠ్యాంశాలలో సందేహాలు తీర్చుకునేందుకు  ఈ విధానం అత్యుత్తమమైనదని నిపుణులు భావిస్తున్నారు. 

  • సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానానికి సంబంధించి ఇండియా ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా 12 అణ్వాయుధాలను (Nuclear Warheads) మోహరిం చిందంటూ అంతర్జాతీయ పరిశోధన సంస్థ  (సిప్రి) రిపోర్ట్‌ సంచలనంగా మారింది.  అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే  క్రమంలో ఇప్పటికే దేశం వద్ద 190 అణ్వాయుధాలుఉన్నాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ   SIPRI ఈ నివేదిక  తాజాగా విడుదల చేసింది.

    స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారతదేశం మొట్టమొదటి సారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. భారతదేశం తన దశాబ్దాల కాలపు అణువిధానాన్ని పక్కనబెట్టి, తొలిసారిగా 12 అణు వార్‌హెడ్‌లను వ్యూహాత్మకంగా మోహరించింది. గతంలో అణు వార్‌హెడ్‌లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని (Separate Storage Policy) భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది.

    శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని SIPRI నివేదిక వెల్లడిస్తోంది. అయితే దశాబ్దాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వ కేంద్రాలలో ఉంచే విధానానికి బదులుగా ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొంది.

    ఇదీ చదవండి: 10 రోజులు లీవ్‌ తర్వాత ఉద్యోగికి బాస్‌ బంపరాఫర్‌
    నివేదికలోని ముఖ్యాంశాలు 
    భారత అణు చరిత్రలో ఈ వార్‌హెడ్‌లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు (Operationally Deployed) వర్గీకరించడం ఇదే మొదటిసారి.  ఈ 12 వార్‌హెడ్‌లను క్షిపణులతో అనుసంధానించడం (Mating) లేదా సముద్రగర్భ నిఘా నిర్వహించే అణు జలాంతర్గాములపై (SSBNs) ఉంచడం ద్వారా క్షేత్రస్థాయి దళాల వద్ద సిద్ధంగా ఉంచారు.

    2026 జనవరి నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా (గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది). ఇవి వైమానిక, భూతల మరియు సముద్ర రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి.  

    ఇదీ చదవండి: 40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

    "నో ఫస్ట్ యూజ్" (No First Use) విధానం
    అణ్వాయుద విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ,  ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన "నో ఫస్ట్ యూజ్" (మొదటగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. అంతేకాదు భారతదేశం పమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికే రూపొందించబడింది.భారత్ అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా,  దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది.

  • ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్‌ నుంచి ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్‌ లేకపోతే  ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు  చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.

    బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్‌నుంచి ఫిట్‌గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.  కానీ అంతలోనూ ఊహించని  ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.

    అల్ట్రామారథాన్‌కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ   లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్‌ల సమయంలో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్‌ ఉన్నట్లు తేలింది.  అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా,  ఏళ్లుగా  గుర్తించడని  పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.

    ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.

    పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే,  సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్‌లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది.

     

    40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

    • అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.

    • బయటకు ఎంతో ఫిట్‌గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.

    • ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చు.

    • 40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్‌మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. 

    • పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు  చేయించుకోవాలి.

    • ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

    • రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్‌ను ముందే గుర్తించవచ్చు.

    • వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదు

    • కొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.

    • తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

    • వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.


    మరి ఏం చేయాలి?

    • 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరి

    • వారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.

    • ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.

    అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. 

    ఇదీ చదవండి: 10 రోజులు లీవ్‌ తర్వాత ఉద్యోగికి బాస్‌ బంపరాఫర్‌

  • తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్‌ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

    కాగా, గత నెల  పినరయి విజయన్‌ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్‌ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

    కొచిన్‌ మినలర్స్‌ అండ్‌ రూటైల్‌ లిమిటెడ్‌ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

    కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

     

     

  • న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) హడావుడి నడుమ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఇష్క్ కరో పార్టీ’ (ఐకేపీ) పేరిట ఆయన సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇది కేవలం వ్యంగ్యంగా పెట్టిన పేరు కాదని.. దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగం, పేదరికం, బాలల్లో పౌష్టికాహార లోపం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడటమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు.

    ప్రేమ కాదు.. సామాజిక ఐక్యత
    ఈ విచిత్రమైన పేరు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జస్టిస్ కాట్జూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది ‘వాలెంటైన్స్ డే’ తరహా ప్రేమ వ్యవహారం కాదని, దేశంలోని విభిన్న వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే సామాజిక తత్వమని ఆయన వివరించారు. ప్రజలందరూ తమ విభేదాలను పక్కనబెట్టి ఒకటైనప్పుడే దేశ సమస్యలు అంతమవుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కొత్త పార్టీలోకి రావాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు కాట్జూ బహిరంగంగా ఆహ్వానం పలికారు.

    కాక్రోచ్ పార్టీ వ్యూహంపై కాట్జూ విమర్శలు
    ఇటీవల నీట్ పరీక్షల వివాదంపై జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యూహాలను కాట్జూ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న వారి డిమాండ్ అర్థరహితమన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా, మరో మంత్రి వస్తారని.. దానివల్ల వ్యవస్థలో వచ్చే మార్పు ఏముంటుందని ఎద్దేవా చేస్తూ అభిజీత్ దిప్కేను కాట్జూ విమర్శించారు.

    ఇండియా కూటమిలో ‘కాక్రోచ్’ చర్చ
    ఒకవైపు కాట్జూ ఈ కాక్రోచ్ పార్టీని కొట్టిపారేస్తున్నా, ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఈ డిజిటల్ ఉద్యమాన్ని గమనిస్తున్నాయి. ఇటీవల జరిగిన ‘ఇండియా’ కూటమి ప్రతిపక్షాల సమావేశంలో ఈ పార్టీ గురించిన చర్చ రావడం విశేషం. కొందరు నేతలు ఈ డిజిటల్ నెట్‌వర్క్ వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలపై అనుమానం వ్యక్తం చేయగా.. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మాత్రం దీనిని సమర్థించారు. ఈ ఉద్యమం యువతలోని ఆగ్రహానికి ప్రతిరూపమని, వారు సరైన దారిలోనే వెళ్తున్నారని అభిప్రాయపడుతూ, ప్రతిపక్షాలు వారితో కలిసి పనిచేయాలని సూచించారు.

    ఇది కూడా చదవండి: రిటైర్డ్ జడ్జి ఫ్యామిలీకి కిల్లర్ గ్యాంగ్‌ బెదిరింపులు

NRI

  • టాంపా, ఫ్లోరిడా:  అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి విశేషగా నిలిచింది. అమెరికా స్టెయిన్‌ బ్రెన్నర్ హైస్కూల్ (ఫ్లోరిడా)లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో ద్వితీయ బహుమతి సాధించింది. 

    అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యార్థుల ఆవిష్కరణల పోటీలలో ఒకటైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్‌లో, 35 రాష్ట్రాల నుండి పాల్గొన్న 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన “ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)” అనే వినూత్న ఆవిష్కరణకు గాను ఆమెకు  జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఇషాన్వి జాతీయ స్థాయి ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ ఇన్వెన్షన్ కన్వెన్షన్ నుండి ప్రారంభమైంది.

    స్మార్ట్ కేన్ ప్రత్యేకతలు
    ఈ స్మార్ట్ కేన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడేలా ఆధునిక AI సాంకేతికతతో రూపొందించబడింది.

    రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థ
    ఆన్-డివైస్ (Large Language Models) ద్వారా ప్రాసెసింగ్
    బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశం
    ఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే సామర్థ్యం క‌లిగి ఉంటుంది
    అడ్డంకులను ముందుగానే గుర్తించే (Obstacle Detection) వ్యవస్థ
    తప్పు గుర్తింపులను తగ్గించే False Detection Suppression టెక్నాలజీ
    ఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్

    గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు. ఇషాన్వి విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు.  ఆమె సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మరోవైపు తెలుగు సమాజానికి గర్వకారణమవుతుంద‌ని విధ్యార్దిని ఇషాన్వి సబ్నివీసు తెలిపింది.

    దీనికి హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందిందించింది. ఇషాన్వి లాంటి యువ ఆవిష్కర్తలు ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ భవిష్యత్ టెక్నాలజీ దిశను నిర్దేశిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.

     

Family

  • న్యూఢిల్లీ: భారత ఇంజనీరింగ్ చరిత్రలో మరో సరికొత్త మైలురాయి నమోదైంది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్ టన్నెల్ ‘జోజిలా సొరంగం’ ప్రధాన విభాగం అనుసంధాన ప్రక్రియ (బ్రేక్‌థ్రూ) విజయవంతంగా పూర్తయింది. సుమారు 11,578 అడుగుల ఎత్తులో, 13.153 కిలోమీటర్ల పొడవునా గుర్రపు నాడా ఆకారంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కట్టడాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వీక్షించారు. భారతీయ ఇంజనీర్ల అసాధారణ ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ కశ్మీర్, లడఖ్ ప్రజల జీవితాల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.

    3 గంటల ప్రయాణం.. 15 నిమిషాల్లోనే!
    ప్రస్తుతం సోనామార్గ్‌ నుంచి ద్రాస్, కార్గిల్, లడఖ్ వెళ్లే ప్రయాణికులు అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ గుండా వెళ్లాల్సి వస్తోంది. తీవ్రమైన మంచు తుఫానులు, ప్రమాదకరమైన మలుపులతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం ప్రాణాంతకంగా సాగుతుంది. అయితే 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం పడుతున్న 3.5 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయం కేవలం 15 నిమిషాలకు తగ్గిపోనుంది. ఇది జమ్ముకశ్మీర్‌లోని బాల్తాల్ (సోనామార్గ్), లడఖ్‌లోని మణిమార్గ్‌ (ద్రాస్) ప్రాంతాలను నేరుగా కలుపుతుంది.

    ఏడాది పొడవునా నిరంతర రవాణా
    శీతాకాలంలో భారీ హిమపాతం, మంచు కొండలు విరిగిపడటం వల్ల ప్రతి ఏడాది జోజిలా పాస్ దాదాపు 5 నుండి 6 నెలల పాటు పూర్తిగా మూతపడేది. దీనివల్ల లడఖ్ ప్రాంతానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయి.. రేషన్, మందులు, నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత ఏర్పడేది. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ మెగా టన్నెల్ ద్వారా వాతావరణంతో సంబంధం లేకుండా, ఏడాది పొడవునా కశ్మీర్ నుండి లడఖ్ వరకు వాహనాల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతాయి.

    సైన్యానికి బలం.. పర్యాటకానికి ఊతం
    చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దులు పంచుకునే ఈ అత్యంత సున్నితమైన ప్రాంతంలో భారత సైన్యానికి ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సరిహద్దులకు సైనికులను, భారీ ట్యాంకులను, యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి ఇది దోహదపడుతుంది. దీనితో పాటు, లడఖ్, కార్గిల్, సోనామార్గ్‌లలో ఏడాది పొడవునా పర్యాటకం వర్ధిల్లుతుంది. శీతాకాలంలోనూ పర్యాటకుల రాక పెరగడం వల్ల హోటళ్లు, రవాణా, స్థానిక హస్తకళల రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

    ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్‌’కు పోటీగా ‘సుప్రీం’ మాజీ జడ్జి ‘ఇష్క్‌’ పార్టీ!

  • ఆధునిక యుగంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కొంతమంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే 'సిట్టింగ్ డిసీజ్' అని పిలుస్తున్నారు. ఈ సిట్టింగ్‌ డిసీజ్‌ ఇతర రోగాలకన్న ప్రమాదకరమైనది. చాపకింద నీరులా.. అనారోగ్య సమస్యల్ని మరింత తీవ్రం చేస్తుంది.

    ఆరోగ్య సమస్యలు..
    ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వల్ల వెన్నెముకపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుము, మెడ నొప్పులు వస్తాయి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చు కాక స్థూలకాయానికి దారి తీస్తుంది. రక్తప్రసరణ మందగించి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీనివల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్క్రీన్‌లను నిరంతరం చూడటం వల్ల కళ్లు పొడిబారడం, తలనొప్పి అదనంగా వచ్చే అనారోగ్య సమస్యలు.

    అయితే, ఎంత సేపు కూర్చుంటే, ఎంత ప్రమాదం ఉంటుందనే విషయంలో కొన్ని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.

    • రోజుకి 4 గంటలోపు కూర్చుంటే.. ప్రమాద తీవ్రత కాస్త తక్కువే ఉంటుందట.

    • అదే 4 - 8 గంటలు కూర్చోవడంతో మధ్యస్థ ప్రమాదంగా చెప్పవచ్చు.

    • 8- 11 గంటలు పాటు కూర్చోవడంతోనే మరింత ఎక్కువ ప్రమాదానికి దారి తీస్తుందంటున్నారు.

    • రోజుకి 11 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చోవడం అంటే ప్రమాదం అంచున ఉన్నట్టే. ఎంతలా అంటే.. హఠాత్తుగా గుండెపోటు రావడం, పక్షవాతం, శరీరం చలించకపోవటంవంటి సమస్యలు వస్తాయి.

    ఈ ప్రమాదంనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కనీసం వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

    ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

    20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ చూడటం ఆపాలి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని వస్తువును చూడటం వల్ల కంటి రెటినా పొర చల్లబడుతుంది.

    చిన్న విరామాలు: ప్రతి గంటకు కనీసం 5 నిమిషాలు సీటు నుండి లేచి నడవాలి. దాంతో శరీర కండరాల్లో కదలిక వల్ల రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది.

    సరైన భంగిమ: వెన్నుముక నిటారుగా ఉండేలా కుర్చీలో కూర్చోవాలి. వెన్నుముక వంపుగా ఉంచి.. కుర్చీని ఆనుకుని ఉండటం వల్ల శరీరం మొద్దుబారి, మెదడు నిద్దురను కోరుకుంటుంది.

    స్క్రీన్ ఎత్తు: కంప్యూటర్ మానిటర్ మన కంటి ఎత్తుకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దీంతో మెడ కండరాల్లో నొప్పి రాకుండా ఉంటుంది.

    శారీరక వ్యాయామం: మెడ, చేతులు అలాగే నడుమును క్రమంగా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి. కదలకుండా కూర్చోవడంతో శరీర కండరాలు తిమ్మిరెక్కి, రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.

    హైడ్రేషన్: పని మధ్యలో తగినంత నీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడవచ్చు.