Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఐక్యరాజ్యసమితికి  చెందిన  సీనియర్ దౌత్యవేత్త, మొహమ్మద్ సఫా తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇరాన్‌పై అణు ఆయుధాలను ప్రయోగించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. హర్మూజ్ జలసంధి తెరవకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం ఇరాన్‌ సైతం దానికి ధీటుగా ప్రతిస్పందించడంతో పరిస్థితులు చేజారిపోయాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యుఎన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త మహమ్మద్ సఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌పై అణుదాడి చేసే ప్రయత్నాలు అంతర్జాతీయ సమాజం చేస్తోందన్నారు.

    ఈ మేరకు మహమ్మద్ సఫా  తన రాజీనామా లేఖను X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు."ఇక్కడ మీరు చూస్తున్నది టెహ్రాన్ నగర చిత్రం. యుద్ధం కావాలని కోరుకునే వారు, ఎప్పుడూ యుద్ధ భూమిని చూడని వారు దీనిని ఏదో జనాభా లేని ఎడారి అని అనుకుంటున్నారు. కానీ, ఇది దాదాపు ఒక కోటి జనాభా కలిగిన నగరం. ఇలాంటి నగరంపై బాంబులు వేయాలని అనుకోవడం వికృతమైన ఆలోచన. వాషింగ్టన్ లేదా లండన్ వంటి నగరాలపై అణు దాడి జరిగితే ఎంతటి వినాశనం ఉంటుందో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది" అని హెచ్చరించారు.

    మానవత్వానికి వ్యతిరేకంగా జరగబోయే ఈ "నేరానికి" సాక్షిగా ఉండలేక, తన దౌత్య జీవితాన్ని త్యాగం చేసి ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు  సఫా పేర్కొన్నారు.  టెహ్రాన్ కేవలం ఎడారి కాదని, అక్కడ కోటి మందికి పైగా సామాన్య ప్రజలు, పిల్లలు నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితిలోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తివంతమైన లాబీకి తొత్తులుగా మారారని సఫా ఆరోపించారు. 

    అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నా, UN అధికారులు వారిని ప్రశ్నించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధ ముప్పు పొంచి ఉందని, ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం ద్వారా మాత్రమే ఈ వినాశనాన్ని ఆపగలరని ఆయన పిలుపునిచ్చారు.

  • వాషింగ్టన్‌: పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారే అవకాశాలు కనపడుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (మార్చి 30) ఇరాన్‌కు మళ్లీ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌, అమెరికా మధ్య ఒప్పందం త్వరగా కుదరకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఖర్గ్ దీవిని పూర్తిగా పేల్చి నాశనం చేస్తామని అన్నారు. ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ ద్వారా ఈ హెచ్చరిక జారీచేశారు. ఇరాన్ వెంటనే హార‍్మూజ్ జలసంధిని తెరవకపోతే ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    “ఇరాన్‌లో మా సైనిక చర్యలను ముగించేందుకు సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. మంచి పురోగతి జరిగింది. కానీ, ఏదైనా కారణంతో ఒప్పందం త్వరగా కుదరకపోతే, అలాగే హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ దీవిని పేల్చి పూర్తిగా నాశనం చేస్తాం. ఇప్పటివరకు మేము కావాలనే వీటి జోలికి వెళ్లలేదు” అని చెప్పారు. 

    ఇరాన్‌లో గత 47 సంవత్సరాలుగా భయంకర పాలకులు ఉన్న సమయంలో తమ సైనికులు, ఇతరులను ఆ దేశం చంపినందుకు ప్రతీకారంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. కాగా, అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలూ జరగలేదని ఇరాన్‌ అంటోంది. అయితే, ఇరాన్ తస్నీమ్ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికకు పాకిస్థాన్‌ ద్వారా ఇరాన్‌ స్పందనను పంపింది.

    “అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా అన్యాయమైన డిమాండ్లు వస్తున్నాయి. అమెరికా దౌత్యంలో మార్పులు ఉంటున్నాయి. మా వైఖరి స్పష్టంగా ఉంది. యుద్ధం ముగించాలని పశ్చిమాసియాలో వస్తున్న విజ్ఞప్తులకు స్వాగతం, కానీ ప్రారంభించినది ఎవరో గుర్తుంచుకోండి” అని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపింది.

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సోమవారం (మార్చి 30న) కూడా కొనసాగాయి. ఇరాన్‌లో పెంటగాన్‌ కొన్ని వారాల పాటు భూతల దాడులు చేయడానికి సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. దాదాపు 10,000 మంది సైనికులను పంపే ప్రణాళిక ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. గత వారం 3,500 మంది సిబ్బందిని అమెరికా పంపింది. అందులో 2,200 మెరైన్లు ఉన్నారు. ఇంకా వేలాది మంది 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి రాబోతున్నారు. కాగా, ట్రంప్ చాలా కాలంగా ఖర్గ్ దీవిపై దృష్టి సారించారు.  

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్‌ ఎంతకీ తగ్గకపోవడంతో డొనాల్డ్‌ ట్రంప్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరింత దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్‌ నుంచి ఏ ముప్పు వస్తుందోననే భయం ట్రంప్‌లో నెలకొంది. అలాగని కొన్ని రోజుల పాటు వార్‌కు గ్యాప్‌ ఇచ్చారు ట్రంప్‌. అదే సమయంలో ఇరాన్‌కు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తూనే మధ్యవర్తిత్వాన్ని జరుపుతున్నారు. ఇందుకు ట్రంప్‌.. పాకిస్తాన్‌ను మధ్యలో పెట్టుకున్నారు. కానీ ఇరాన్‌ మాత్రం వీటికి ససేమేరా అంటోంది. యుద్ధానికి ఘనమైన ముగింపు ఏంటో తామే ఇస్తామని,  ఇటువంటి అర్థం పర్థం లేని మధ్యవర్తిత్వాలు వద్దనే అంటోంది. 

    మధ్యవర్తిగా తమ పాత్ర పట్ల అమెరికా, ఇరాన్‌లు రెండూ సంతృప్తిగా ఉన్నాయని పాకిస్తాన్ చెప్పిన రోజుల వ్యవధిలోనే, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వాదనలను తోసిపుచ్చింది. మధ్యవర్తి ద్వారా తమకు అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అందాయని పేర్కొంది. అమెరికా తమతో నేరుగా చర్చలు జరపలేదని, మధ్యవర్తిత్వాల ద్వారా యుద్ధం ముగింపు అనేది ఉండబోదని తేల్చిచెప్పింది. ఒకవేళ అమెరికా తమతో తాము పెట్టే కండీషన్స్‌కు డైరెక్ట్‌గా మాట్లాడి ఒప్పుకుంటేనే అప్పుడు యుద్ధం ముగింపు ఆలోచిస్తామని స్పష్టం చేసింది. తమకు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం అనేది వద్దే వద్దని, దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అంటోంది, 

    పాక్‌.. అమెరికా వదిలిన అస్త్రం!
    పాక్‌ అనేది అమెరికా వదిలిన అస్త్రమనే విషయమని ఇరాన్‌కు అర్థమైంది. ఇన్ని ప్రపంచదేశాలు ఉండగా పాకిస్తాన్‌నే మధ్యవర్తిగా అమెరికా పెట్టుకోవడంపై ఇరాన్‌ ఆగ్రహంగా ఉంది. తమకు ఏదో రకంగా నష్టం కల్గించాలనే యోచనతోనే పాకిస్తాన్‌ను అమెరికా వాడుకుంటుందని, ఆ పావులో తాము పడకూడదనే భావన ఇరాన్‌లో స్పష్టంగా కనబడుతోంది. మాట్లాడితే మీరు డైరెక్ట్‌గా మాట్లాడండి.. ఇలా మధ్యవర్తిత్వం, అందులోనూ పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం అంటే సహించలేకపోతోంది ఇరాన్‌. యుద్ధం ముగింపు విషయం తమ వైఖరి స్పష్టంగా ఉందని, దౌత్యం విషయంలో అమెరికా తరచు మాటమారుస్తుందని ఇరాన్‌ అంటోంది. ఒకవేళ తమ మధ్యవర్తిత్వం అనేది చేస్తే అమెరికా తలతూగే ఏ పెద్ద దేశమో చేయాలి కానీ ఇలా పాకిస్తాన్‌ను మధ్యలో తీసుకురావడం ఏంటనేది ఇరాన్‌ ప్రశ్నగా ఉంది. అందుకే యుద్ధం విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపింది. 

    డైలమాలో ట్రంప్‌..
    ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయాక..  పాకిస్తాన్‌తో రాయబారం నడుపుతుంది. ఇరాన్‌తో చర్చలకు ఆసక్తిగా ఉన్న ట్రంప్‌.. అందుకు పాక్‌ను ఎన్నుకున్నారు. ఇరాన్‌ లొంగదనే విషయం ఇప్పటికే అర్థమైన ట్రంప్‌.. ఇక పాక్‌ను మధ్యలో పెట్టారు. అలాగని యుద్ధం చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందేమోననే భయం కూడా ట్రంప్‌లో ఉంది. అందుకే విరామం అంటూ ఒక బిల్డప్‌ ఇచ్చారు.

    ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహూ ట్రాప్‌లో ట్రంప్‌ పడ్డారని, అందుకే ఇరాన్‌పై యుద్ధానికి సై అన్నారనే విమర్శ కూడా ఉంది. ఇక్కడ అమెరికాలోనే ట్రంప్‌పై విమర్శలు వెలుగుచూశాయి. మనకు అవసరం లేని యుద్ధానికి ఎందుకు వెళ్లారంటూ సొంత పార్టీలోనే అసంతృప్తి గళం వినిపించింది. దాంతో పాటు ఆర్థిక నష్టం, ఆయుధ సామాగ్రి కూడా క్రమేపీ తగ్గిపోవడంతో ట్రంప్‌ వెనుకడుగు వేశారు. మరొకవైపు అమెరికాలో తీవ్రస్థాయిలో నిరసనలు కూడా ట్రంప్‌ను డైలమాలోకి నెట్టేశాయి. 

    ప్రస్తుతం ఇరాన్‌ ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. అమెరికాను నాశనం చేసే వరకూ తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలిపింది. మరి అటువంటి సందర్భంలో పాకిస్తాన్‌ మాట.. ఇరాన్‌ వింటుందని అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్‌ నిపుణుల అభిప్రాయం.   ఒకవేళ ఇరాన్‌ చర్చలకు వచ్చినా తాము పెట్టే కండిషన్స్‌కు అమెరికా ఒప్పుకోవాలని కచ్చితంగా కోరుతుంది. అంటే నేరుగా అమెరికానే ఇరాన్‌తో చర్చలు జరిపితేనే ఇది  ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి ఉంది. 

    ట్రంప్‌కు స్పెయిన్‌ షాక్‌..
    ట్రంప్‌నకు మరోషాక్‌ తగిలింది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్‌ అనమతి నిరాకరించింది. ఇరాన్‌పై యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తన వైఖరిని కఠినతరం చేస్తూ, అమెరికా యుద్ధ విమానాలకు తన గగనతలంతో పాటు సైనిక స్థావరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొనే అమెరికా యుద్ధ విమానాలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. 

  • ఇరాన్‌పై అమెరికా- ఇ‍జ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధం, ఇరన్‌ ప్రతిదాడులు భీకరంగా  కొనసాగుతున్నాయి.  ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్‌ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి.  దీనిపై ఇరాన్‌ మోజ్తబా గాయపడినా,  ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు.  ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.

    మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్‌లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్‌తో  మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.

    ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.

    ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్‌కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.

    ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్‌ : నెటిజన్లు మాత్రం ఫిదా

Andhra Pradesh

  • సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్‌లోని సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్‌కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది.  

    తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

  • మచిలీపట్నం: కూటమి ప్రభుత్వం దళారులను అడ్డుపెట్టుకుని సన్నకారు రైతులను దోచుకుంటుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. బందరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వరంగం రైతులను పట్టిపీడుస్తున్నారన్నారు. ఈ రోజు(సోమవారం, మార్చి 30వ తేదీ) ఆక్వారైతు సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌కు పేర్ని నాని ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా అనంతరం మీడియాతో మాట్లాడారు పేర్ని నాని. 

    ‘బందరు మండల పరిధిలోని చిన్న చిన్న రైతులను చెరువులు రిపేర్లు చేయకుండా అడ్డుకుంటున్నారు. రెవెన్యూ యంత్రాంగం మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారు.  వందల ఎకరాల రైతులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఎకరా రెండు ఎకరాల రైతులపై ఆంక్షలు విధిస్తూ వికృత సంస్కృతికి రెవిన్యూ సిబ్బంది పాల్పడుతున్నారు.  

    ఎకరం రిపేరుకు 50,000 బోరు వేసేందుకు మరో 50 వేలు వసూలు చేస్తూ ఆక్వా రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెదపట్నం కానూరు గ్రామాలలో యథేచ్ఛగా మడ అడవులను చెరువులుగా తవ్వుకుంటుంటే పట్టించుకోవడం లేదు. కోన గ్రామంలో 83 సెంట్ల రైతును రికార్డులు చూపించమంటూ ఆర్డీవో నా నా హైరానా చేశారు. రైతు చెరువును పూడ్చమని ఆదేశించడం ఏంటి?,  ముడుపుల మాయలో బందరు ఆర్డిఓ ఎమ్మార్వోలు రైతులపై అగత్యాలకు పాల్పడితే సహించబోం’ అని హెచ్చరించారు. 

    లంచాలు కాదు.. ఇంటికెళ్లి అన్నం తినండి..పేర్ని నాని ఉగ్రరూపం
  • నాయుడుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడు పేట సభ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది.  ఆ సభకు భారీగా జనం తరలివస్తారని అంచనా వేసిన టీడీపీ శ్రేణులకు చేదు అనుభవమే ఎదురైంది. సుమారు 70 శాతం కుర్చీలు ఆ సభా ప్రాంగణంలో ఖాళీగా దర్శనమిచ్చాయి.   

    ఇక చంద్రబాబు మాట్లాడుతుండగా టీడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీ హంగామా చేశాయి. విపరీతమైన హడావుడి మధ్య ఈ సభ ఏర్పాటు చేసినా అది చివరకు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. 

    ఖాళీ కుర్చీలు.. బాబు సభ అట్టర్ ఫ్లాప్

  • సాక్షి, తాడేపల్లి: ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మాతృమూర్తి సువర్ణలత (86) మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. సువర్ణలత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రకాశ్‌ రాజ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

    కాగా, ప్రకాశ్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్నుమూశారు. అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం బెంగుళూరులో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  

    ప్రకాష్ రాజ్ తల్లి మరణంపై వైఎస్ జగన్ ఎమోషనల్
  • ఏపీ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోయారు. మరో ఏడుగురు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా నారాయణరావు పనిచేశారు. మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

    కాగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అణిచి వేసేందుకు భారత ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి.

    ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు. మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర సర్కారు పెట్టుకున్న గడువు రేపటితో ముగియనుండడంతో తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.

    లొంగిపోయిన మావోయిస్టు చెల్లూరి నారాయణ రావు

Sports

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే, రాయల్స్‌ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. 

    ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌ (43), కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్‌ పోరాడటంతో సీఎస్‌కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.

    అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వైభవ్‌ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో ఆదిలోనే రాయల్స్‌ గెలుపును ఖరారు చేశాడు. 

    యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (11 బంతుల్లో 14 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. మధ్యలో జురెల్‌ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

     

     

  • సీఎస్‌కే బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫ్రాంచైజీ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ నిషేధిత కొలతలున్న బ్యాట్‌తో బ్యాటింగ్‌కు దిగి, ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అంపైర్‌ చేతికి చిక్కాడు.  

    ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగగా.. ఫీల్డ్‌ అంపైర్‌కు అతని బ్యాట్‌పై అనుమానం వచ్చి కొలతలు చెక్‌ చేశాడు. 2025 నుంచి అమల్లో ఉన్న నియమాల ప్రకారం బ్యాట్‌ ఎడ్జ్‌ మందం 4 సెంటి మీటర్లు (1.56 అంగుళాలు) దాటకూడదు. అలాగే మొత్తం లోతు 6.7 సెంటి మీటర్లు (2.64 అంగుళాలు), వెడల్పు 10.8 సెంటి మీటర్లకు (4.25 అంగుళాలు) మించకూడదు.

    అయితే సర్ఫరాజ్‌ తెచ్చుకున్న బ్యాట్‌ పరిమితులను దాటి ఉండటంతో అంపైర్లు గేజ్‌ చెక్‌ చేసి తిరస్కరించారు. అనంతరం డగౌట్‌తో ఉన్న సహచరుడు ఉర్విల్‌ పటేల్‌ సర్ఫరాజ్‌కు మరో బ్యాట్‌ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనికి కూడా అంపైర్లు గేజ్‌ చెక్‌ చేసిన అనంతరం సక్రమంగా ఉందని, సర్ఫరాజ్‌ను బ్యాటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆతర్వాత బ్యాటింగ్‌ కొనసాగించిన సర్ఫరాజ్‌ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీసి ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. 

    సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌ (43), కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్‌ పోరాడటంతో సీఎస్‌కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప ఛేదనలో రాయల్స్‌ ఓపెనర్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ గత ఎడిషన్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. వీరి ధాటికి సీఎస్‌కే బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కుప్పకూలింది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రాయల్స్‌ సీఎస్‌కేను 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

    తొలి బంతి నుంచే రాయల్స్‌ బౌలర్లను ఎదుర్కొనేందుకు సీఎస్‌కే బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఆరంభ ఓవర్లలో నండ్రే బర్గర్‌, జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగారు. రెండో ఓవర్‌ చివరి బంతికి తొలిసారి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్‌.. మూడో ఓవర్‌ చివరి బంతికి సీఎస్‌కే సారధి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (6) ఆర్చర్‌ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. ఆమరుసటి బంతికే (3.1 ఓవర్‌) యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రేను బర్గర్‌ మరో అద్భుతమైన బంతితో డకౌట్‌ చేశాడు.

    ఆతర్వాత మాథ్యూ షార్ట్‌ను (2) సందీప్‌ శర్మ.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (17), శివమ్‌ దూబేను (6) రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపారు. కొద్ది సేపటికే కార్తీక్‌ శర్మను (18) బ్రిజేశ్‌ శర్మ.. నూర్‌ అహ్మద్‌ను (1) జోఫ్రా ఆర్చర్‌ ఔట్‌ చేశారు. మరి కొద్ది సేపటికి మ్యాట్‌ హెన్రీని (5) రవి బిష్ణోయ్‌ పెవిలియన్‌కు పంపగా.. ఓవర్టన్‌ (43) ఔట్‌ కావడంతో సీఎస్‌కే ఇన్నింగ్స్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది.

    చివర్లో ఓవర్టన్‌ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్‌కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. అతనికి అన్షుల్‌ కంబోజ్‌ (7 నాటౌట్‌) సహకరించాడు. రాయల్స్‌ బౌలర్లలో ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌తో పాటు కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. సంజూ శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే తలో 6, మాథ్యూ షార్ట్‌ 2, నూర్‌ అహ్మద్‌ 1, మ్యాట్‌ హెన్రీ 5, ఆయుశ్‌ మాత్రే డకౌటయ్యారు.  

  • ఐపీఎల్‌-2024లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గత సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్‌లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌ను కూడా కేకేఆర్‌ ఓటమితోనే ఆరంభించింది.

    ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (43 బంతుల్లో 81), రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్‌ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్‌ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

    ఆరు వికెట్ల తేడాతో
    వాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌.. కేకేఆర్‌ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో సునిల్‌ నరైన్‌కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.

    పవర్‌ ప్లేలో అదే అత్యుత్తమం
    జియోస్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్‌ ప్లేలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌తో బౌలింగ్‌ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్‌ శర్మను టార్గెట్‌ చేసే వీలు ఉండేది.

    నరైన్‌కు రోహిత్‌పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్‌ను త్వరగా అవుట్‌ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్‌ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్‌కు పూర్తి కోటా బౌలింగ్‌ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్‌ సింగ్‌ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.

    వారిద్దరు అద్బుతం
    ఏదేమైనా రోహిత్‌ శర్మ, రికెల్టన్‌లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని.. కేకేఆర్‌ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన సునిల్‌ నరైన్‌.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. తిలక్‌ వర్మ (18) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

    చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. షాకిచ్చిన జియోస్టార్‌!

  • టీ20 ప్రపంచకప్‌-2026 హీరో సంజూ శాంసన్‌ ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్‌. ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆరంభించాడు సంజూ.

    క్లీన్‌బౌల్డ్‌ 
    జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer) రాయల్స్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్‌ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్‌ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్‌ ఆఖరి బంతికే పెవిలియన్‌ చేరాడు.

    రాయల్స్‌ పేసర్‌ నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (Sanju Samson) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్‌కే తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.

    వరల్డ్‌కప్‌ హీరో సంజూ
    కాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఫామ్‌ కోల్పోయిన సంజూ శాంసన్‌కు.. అదృష్టవశాత్తూ సూపర్‌-8 మ్యాచ్‌ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్‌-8 నాకౌట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్‌ కొనసాగించాడు.

    ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్‌తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్‌లోనే సంజూ తడబడ్డాడు.

    కకావికలం
    కాగా తాజా సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.

    కాగా రాయల్స్‌ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్‌ మాత్రే డకౌట్‌ అయ్యాడు. మాథ్యూ షార్ట్‌ రెండు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.

    చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. షాకిచ్చిన జియోస్టార్‌!

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ విచిత్రం​ జరిగింది. 277 మ్యాచ్‌ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా ఇ‍ద్దరూ లేరు. సీఎస్‌కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపీఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘట్టం చోటు చేసుకుంది. తలా, చిన్న తలా అని పిలుచుకునే ధోని-రైనా లేకపోవడాన్ని సీఎస్‌కే అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.

    రైనా కొంతకాలం కిందటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్‌ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్‌కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్‌కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగడించాడు.

    ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. రాయల్స్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కూలింది. నండ్రే బర్గర్‌, జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో సీఎస్‌కే బ్యాటర్లను పెవిలియన్‌కు పం​పారు. 

    రెండో ఓవర్‌ చివరి బంతికి తొలిసారి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్‌.. మూడో ఓవర్‌ చివరి బంతికి సీఎస్‌కే సారధి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (6) ఆర్చర్‌ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. 

    ఆ మరుసటి బంతికే (3.1 ఓవర్‌) యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రేను బర్గర్‌ మరో అద్భుతమైన బంతితో డకౌట్‌ చేశాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాది జోరును ప్రదర్శిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 36-3గా ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), మాథ్యూ షార్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  

    తుది జట్లు..

    సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

    ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌

    రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ

    ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి  సింగ్‌

  • టీ20 ప్రపంచకప్‌-2026 సందర్భంగా బంగ్లాదేశ్‌ మామూలుగా రచ్చ చేయలేదు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో తమ ఆటగాళ్లు, సిబ్బందికి భద్రత లేదని ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చెప్పినా సరే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు.

    అక్కడ మొదలైన వివాదం
    భారత్‌ నుంచి వేదికను శ్రీలంకకు మార్చాలని మొండిపట్టు పట్టగా.. ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రకటించింది. ఈ వివాదానికి మూలకారణం ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తొలగించడమే అని చెప్పవచ్చు.

    కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, ఈశాన్య భారతం గురించి బంగ్లా నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

    ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం
    ఈ పరిణామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాబోమని భీష్మించుకున్న బంగ్లాదేశ్‌.. ఆఖరికి టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

    యూటర్న్‌
    అయితే, ఇటీవల ఎన్నికైన ప్రభుత్వం ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుంది. రాజకీయాలు, క్రీడలను తాము కలపమని.. ఎవరైనా తమ దేశంలో ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే అందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. 

    నిజానికి భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు తెంచుకుంటే బంగ్లా క్రికెట్‌ పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    ఊహించని షాక్‌ 
    అయితే, బంగ్లా ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ను ప్రసారం చేసే టీ- స్పోర్ట్స్‌తో ఒప్పందాన్ని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ రద్దు చేసుకుంది. ఆర్థిక చెల్లింపుల విషయంలో టీ- స్పోర్ట్స్‌ ఆలస్యం చేయడం, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    ఒప్పందం రద్దు కారణంగా
    దీంతో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు ప్రభుత్వం అనుమతినిచ్చినా.. టీ- స్పోర్ట్స్‌ నిర్వాకం వల్ల మ్యాచ్‌లు అక్కడ ప్రసారం కావు. కాగా 2023-2027 వరకు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ కూడా బంగ్లాదేశ్‌లో ప్రసారం చేసుకునేందుకు జియోస్టార్‌ ద్వారా సబ్‌ లైసెన్స్‌ పొందింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అనుమతులు కోల్పోయింది. దీంతో అధికారికంగా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు బ్రేక్‌ పడింది.

    చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

  • సీఎస్‌కేపై రాయల్స్‌ ఘన విజయం
    ఐపీఎల్‌ 2026లో భాగంగా సీఎస్‌కేతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే, రాయల్స్‌ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలగా.. రాయల్స్‌ 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

    రెండో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌.. జురెల్‌ ఔట్‌
    8.3వ ఓవర్‌- 99 పరుగుల వద్ద రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో ధృవ్‌ జురెల్‌ (18) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    వైభవ్‌ ఔట్‌
    17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన అనంతరం వైభవ్‌ సూర్యవంశీ ఔటయ్యాడు. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

    127 పరుగులకు సీఎస్‌కే ఆలౌట్‌
    సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 127 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్టన్‌ (43) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్‌కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. ఓవర్టన్‌కు (7 నాటౌట్‌) అన్షుల్‌ కంబోజ్‌ సహకరించాడు. 

    రాయల్స్‌ బౌలర్లలో ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌తో పాటు కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

    ఎనిమిదో వికెట్‌ డౌన్‌
    12.5వ ఓవర్‌- 82 పరుగుల వద్ద సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి నూర్‌ అహ్మద్‌ (1) ఔటయ్యాడు.

    ఏడో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
    బ్రిజేశ్‌ శర్మ బౌలింగ్‌లో కార్తిక్‌ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్‌ ఖాతాలో తొలి ఐపీఎల్‌ వికెట్‌. స్కోరు: 74-7(11). ఓవర్టన్‌ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్‌ అహ్మద్‌ క్రీజులోకి వచ్చాడు.

    ఆరో వికెట్‌ డౌన్‌
    జడేజా బౌలింగ్‌లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్‌ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్‌ క్రీజులోకి వచ్చాడు.

    సగం వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే
    రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్‌ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).

    కుప్పకూలిన సీఎస్‌కే టాపార్డర్‌
    రాజస్థాన్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్‌.. సంజూ శాంసన్‌ (6), మాత్రే (0)ను ఔట్‌ చేయగా.. ఆర్చర్‌ రుతురాజ్‌ను (6), సందీప్‌ శర్మ షార్ట్‌ను (2) పెవిలియన్‌కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 41-4గా ఉంది. కార్తీక్‌ శర్మ (3), సర్ఫరాజ్‌ ఖాన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 

    పీకల్లోతు కష్టాల్లో సీఎస్‌కే
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్‌, బర్గర్‌ వరుస బంతుల్లో రుతురాజ్‌ (6), ఆయుశ్‌ మాత్రేను (0) ఔట్‌ చేశారు. 

    సంజూ క్లీన్‌ బౌల్డ్‌
    1.6వ ఓవర్‌- నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌కు ముందు వర్షం​ పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్‌ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం​ క్లియర్‌గా ఉంది.

    తుది జట్లు..

    సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

    ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌

    రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ

    ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి  సింగ్‌

     

  • టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వింటేజ్‌ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.

    ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కోల్‌కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో రోహిత్‌ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది.

    గేజ్‌ టెస్టు నిర్వహిస్తుండగా.. 
    కేకేఆర్‌ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్‌ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో.. అంపైర్‌ అతడి బ్యాట్‌ను పరీక్షించాడు. బ్యాట్‌ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్‌ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్‌ తన బ్యాట్‌ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్‌ ఇచ్చాడు.

    నేను ముందే చెప్పాను కదా!
    అయితే, నిబంధన ప్రకారం బ్యాట్‌ను టెస్టు చేసిన అంపైర్‌ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్‌ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్‌మ్యాన్‌ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

    కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్‌.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. 

    ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ అందించిన ఘనత రోహిత్‌ శర్మది. కెప్టెన్‌ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. 

    చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

    ఎందుకంటే, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్‌ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్‌ కూడా ఆలస్యమవ్వవచ్చు. 

    కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ మూడు హోం మ్యాచ్‌లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్‌ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్‌ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. 

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోని, విధ్వ‌సంక‌ర బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం కార‌ణంగా సీఎస్‌కే ఆడే కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యారు. 

    దీంతో జ‌ట్టు బాధ్యత మొత్తం సంజూ శాంస‌న్‌, కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌పైనే ప‌డింది. ఈ క్ర‌మంలో రాజ‌స్తాన్‌తో జ‌రిగే తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఎలా ఉండ‌బోతుందో ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్‌లో యువ ఆట‌గాడు ప్ర‌శాంత్ వీర్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది.

    గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప్ర‌శాంత్ వీర్‌ను రూ. 14.2 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి మ‌రి సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ను ర‌వీంద్ర జ‌డేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు.  ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు జ‌డేజా సీఎస్‌కే నుంచి రాజ‌స్తాన్‌కు ట్రేడ్ అయిన సంగ‌తి తెలిసిందే. 

    అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మ‌థ్యూ షార్ట్‌, ఇంగ్లండ్ పేస‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ సీఎస్‌కే త‌ర‌పున ఐపీఎల్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అన్షుల్ కాంబోజ్‌, ఖలీల్ అహ్మ‌ద్ పేస్ బౌలింగ్ బాధ్య‌త‌ల‌ను పంచుకోనున్నారు. స్పిన్న‌ర్ల‌గా నూర్ అహ్మ‌ద్‌, రాహుల్ చాహ‌ర్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకునే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. సీఎస్‌కే బ్యాటింగ్‌ను సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించ‌నున్నారు.

    సీఎస్‌కే తుది జ‌ట్టు(అంచ‌నా) 
    సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

    రాజ‌స్తాన్ తుది జ‌ట్టు(అంచ‌నా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే

  • గత ఏడాది కాలంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఈ బిహారీ పిల్లాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

    ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 175 పరుగులు సాధించడం విశేషం. తద్వారా భారత్‌ మరోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

    ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఓ ఐదు ప్రధాన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వైభవ్‌ సూర్యవంశీ వాటిని ఈసారి బ్రేక్‌ చేయగలడా?

    అత్యధిక వ్యక్తిగత స్కోరు
    ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ కొనసాగుతున్నాడు. ఈ వెస్టిండీస్‌ దిగ్గజం ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు.

    ఐపీఎల్‌ 2013 ఎడిషన్‌లో కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఇటీవలే వైభవ్‌ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే అని తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్‌లోనే ఈ కుర్రాడు గేల్‌ను అధిగమిస్తాడో? లేదో? చూడాలి.

    ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు
    యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసకర ఆట తీరుకు పెట్టింది పేరు. ఆర్సీబీ తరఫున పుణెపై 2013 నాటి మ్యాచ్‌లో అతడు ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

    ఇక వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో, యూత్‌ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. గేల్‌ రికార్డును వైభవ్‌ ఈసారి బ్రేక్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.

    ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు
    ఐపీఎల్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ క్రిస్‌ గేల్‌ నిలిచాడు. 2012 సీజన్‌లో ఈ విండీస్‌ లెజెండ్‌ 59 సిక్సర్లు బాదాడు. ఇక 2019లో ఆండ్రీ రసెల్‌ 52 సిక్స్‌లు బాదాడు. ఈ రికార్డులను వైభవ్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 24 సిక్సర్లు బాదాడు.

    సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు
    ఐపీఎల్‌ 2024 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 141 బంతులు ఎదుర్కొని 234.34 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతేడాది వైభవ్‌ 122 బంతులు ఎదుర్కొని 206కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు.

    ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
    ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఎ, టీ20 మ్యాచ్‌లలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ఇంత వరకు ఏ ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. క్రిస్‌గేల్‌, రాహుల్‌ శర్మ, రాహుల్‌ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌ ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదగలిగారు.

    చదవండి: జడ్డూ, సందీప్‌ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర

  • భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్‌ చౌబేపై మహిళల కమిటీ హెడ్‌ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్‌బాల్‌ హౌస్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. 

    ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు.  

    వలంకా అలేమావో ఎవరు..?  
    AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్‌ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్‌ బ్రదర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్‌బాల్‌ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా.  

    వివాదం నేపథ్యం  
    మహిళల ఆసియా కప్‌ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్‌లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది.

     

  • కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఆస్ట్రేలియా ప్లేయర్‌ కెమరూన్‌ గ్రీన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందుతుంది. గ్రీన్‌ మరికొంతకాలం బ్యాటర్‌గా మాత్రమే కేకేఆర్‌కు అందుబాటులో ఉంటాడని అతని జాతీయ క్రికెట్‌ బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి స్పష్టం చేసింది. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్‌ కేవలం​ బ్యాటింగ్‌ మాత్రమే చేయడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా మరోసారి వివరణ ఇచ్చింది.

    ఈ విషయాన్ని సీఏ గతంలోనే కేకేఆర్‌ యాజమాన్యానికి తెలియజేసింది. ఇందుకు వారు కూడా సమ్మతించారు. అయితే కేకేఆర్‌ అభిమానుల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో సీఏ మరోసారి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గ్రీన్‌ను కేకేఆర్‌ రూ.25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఇతను ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

    ఇంత భారీ మొత్తం వెచ్చించబడిన గ్రీన్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో అతను బ్యాట్‌తోనూ సత్తా చాటలేకపోవడం వారి అసహనాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్‌లో గ్రీన్‌ 10 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. 

    బౌలింగ్‌లో గ్రీన్‌ అందుబాటులో లేకపోవడంతో కేకేఆర్‌ ఆరుగురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఇది వారిని భారీ మూల్యం​ చెల్లించుకునేలా చేసింది. భారీ స్కోర్‌ (220-4) చేసినా, ఆరో స్పెషలిస్ట్‌ బౌలింగ్‌ ఆప్షన్‌ లేకపోవడంతో కేకేఆర్‌ మ్యాచ్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడిపోవడానికి గ్రీన్‌ పరోక్షంగా కారణమని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. 

    ఇంతమాత్రం దానికి (కేవలం బ్యాటర్‌) అతని​కి 25 కోట్లు దండగ అని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. గతంలో వెంకటేశ్‌ అయ్యర్‌ విషయంలోనూ ఇలానే జరిగింది. అతన్ని కూడా కేకేఆర్‌ మేనేజ్‌మెంట్‌ భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. అతను కూడా గ్రీన్‌ లాగే కేవలం అడపాదడపా బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమై జట్టుకు భారంగా ఉండేవాడు.

    గ్రీన్‌పై వస్తున్న భారీ వ్యతిరేకత నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా అతనికి మద్దతుగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రీన్‌ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు వివరణ ఇచ్చింది.గ్రీన్‌ మరో 10–12 రోజుల పాటు బౌలింగ్‌ చేయడని కూడా స్పష్టం చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటేనే బౌలింగ్‌ చేస్తాడని తెలిపింది. కాగా, 2024 చివర్లో గ్రీన్‌కు వెన్ను శస్త్రచికిత్స జరిగింది.

     

     

  • టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2026 నాకౌట్ మ్యాచ్‌ల‌లో దారుణంగా విఫ‌ల‌మైన వ‌రుణ్‌.. ఇప్పుడు ఐపీఎల్‌-2026లో అదే తీరును క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ త‌ర‌పున వ‌రుణ్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

    ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అయితే చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌ను ఉతికారేశాడు. మ‌రో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్ కూడా వ‌రుణ్‌కు చుక్క‌లు చూపించాడు. ఈ త‌మిళ‌నాడు స్పిన్న‌ర్ మొత్తంగా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో 48 ప‌రుగులిచ్చి వికెట్ లెస్‌గా వెనుదిరిగాడు.

    ఈ నేప‌థ్యంలో చ‌క్ర‌వ‌ర్తిపై భార‌త మాజీ క్రికెట‌ర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ బౌలింగ్‌లో ఇక ఏమాత్రం 'మిస్టరీ' మిగిలిలేదని, అతడి పని అయిపోయందని శ్రీకాంత్ విమర్శించాడు.

    "వరుణ్ చక్రవర్తి బంతిని  స్పిన్ చేయడం నేర్చుకోకపోతే కచ్చితంగా ఇబ్బంది పడతాడు. ఎప్పుడూ గూగ్లీలే వేస్తానంటే కుదరదు. బౌలింగ్‌లో వైవిధ్యం ఉండాలి. తన లెగ్ స్పిన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. అతడి బౌలింగ్‌లో ఇప్పుడు ఎలాంటి మిస్టరీ లేదు.

    అతడి మిస్టరీ కాస్త హిస్టరీ అయిపోయింది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ, బంతిని బ్యాటర్లకు కాస్త దూరంగా వేయాలి. అప్పుడే బ్యాటర్లు షాట్లు ఆడేందుకు భయపడతారు. అంతేకాకుండా పవర్‌ప్లేలో అతడితో బౌలింగ్ చేయించకూడదు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. 

    పవర్ ప్లేలో వరుణ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ ఏకంగా 15 పరుగులు పిండుకున్నాడు. వరుణ్ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులు కూడా కట్టడి చేయలేకపోయాడు. మరి తర్వాతి మ్యాచ్‌లలో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.
    చదవండి: జడ్డూ, సందీప్‌ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర

  • రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా రియాన్‌ పరాగ్‌ ఎంపిక పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి. టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌ పేర్లు కెప్టెన్సీ రేసులో బలంగా వినిపించినా యాజమాన్యం మాత్రం ఆఖరికి పరాగ్‌కే పగ్గాలు అప్పగించింది.  ఈ అసోం ఆల్‌రౌండర్‌ గతేడాది తాత్కాలిక కెప్టెన్‌గా నిరాశపరిచినా అతడిపై మేనేజ్‌మెంట్‌ మరోసారి నమ్మకం ఉంచింది.

    ఇక ఐపీఎల్‌-2026లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్‌ సోమవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాజస్తాన్‌ హెడ్‌కోచ్‌, క్రికెట్‌ డైరెక్టర్‌ కుమార్‌ సంగక్కర రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)ను కెప్టెన్‌ చేయడానికి గల కారణాలు వెల్లడించాడు.

    కఠినమైన పరీక్షలు
    ‘‘రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీ రేసులో సందీప్‌ శర్మ (Sandeep Sharma), రవీంద్ర జడేజాతో కలిపి ఐదుగురు పోటీదారులు ఉన్నారు. వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మేము ఎంతగానో శ్రమించాము. కఠినమైన పరీక్షలు పెట్టాము.

    వీరితో జరిగిన సంభాషణల్లో భాగంగా ప్రతి ఒక్కరు కెప్టెన్‌ క్యాండిడేట్‌ అని నిరూపించుకున్నారు. అయితే, అందరిలోకెల్లా రియాన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. కఠినమైన ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చిన తీరు అమోఘం. అతడు ఎంతగానో పరిణతి చెందాడు.

    అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా
    కెప్టెన్సీ, నాయకత్వం మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండూ అంత తేలికైన విషయాలేమీ కాదు. ఇతరులతో పోల్చి చూసినపుడు అతడు అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపించాడు. ఏదేమైనా ఏ కెప్టెన్‌, నాయకుడు పరిపూర్ణంగా ఉండరు.

    ఆటలో గెలుపు- ఓటములు సహజం. నేను కూడా పొరపాట్ల నుంచి నేర్చుకుని ఎదిగిన వాడినే. రియాన్‌ పరాగ్‌కు క్లిష్ట సమయాల్లో సాయం చేసేందుకు జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.

    వారి మద్దతు ఉంటుంది
    కష్ట సమయంలో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌, సందీప్‌ శర్మ, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, జోఫ్రా ఆర్చర్‌, దసున్‌ షనక.. తదితరులపై అతడు ఆధారపడగలడు’’ అని సంగక్కర చెప్పుకొచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా తమ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్‌ చేసిన రాజస్తాన్‌.. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను జట్టులో చేర్చుకుంది.

    చదవండి: అతడొక అద్భుతమైన ఫీల్డర్‌.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026ను బాల్ టాంప‌రింగ్ వివాదం కుదిపేస్తోంది. ఆదివారం గ‌డాఫీ స్టేడియంలో క‌రాచీ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బాల్ టాంపరింగ్ పాల్ప‌డిన‌ట్లు ఆరోపణ‌లు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్‌ ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని అంపైర్‌లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై లెవల్‌-3 నేరాన్ని మోపారు.

    ఏమి జరిగిందంటే?
    క‌రాచీ కింగ్స్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ  ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌కు అప్ప‌గించాడు. అయితే ఈ క్ర‌మంలో ఫఖర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వ‌ద్ద‌ మాట్లాడుకున్నారు. ఈ స‌మ‌యంలో బంతికి ఒక‌రు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.

    అయితే బంతిని ఫ‌ఖర్ త‌న చేతి వేలితో గీకిన‌ట్లు క‌న్పించింది. దీంతో వెంట‌నే అంపైర్ బంతిని అత‌డి చేతి నుంచి తీసుకుని  టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో బంతిని మార్చ‌డంతో పాటు ల‌హోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫ‌లితమే తారుమారైంది. అయితే ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీరియ‌స్‌గా తీసుకుంది.

    పీసీబీ సీరియ‌స్‌
    మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ జమాన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తదుపరి విచారణ వచ్చే 48 గంటల్లో మరో విచారణ జరగనుంది అని పీసీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

    ఒక‌వేళ విచారణలో బాల్ టాంప‌రింగ్ పాల్ప‌డిన‌ట్లు రుజువైతే జ‌మాన్‌పై ఒక్క మ్యాచ్ నిషేదం ప‌డే అవ‌కాశ‌ముంది. కాగా గతంలో  డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వంటి ఆసీస్ స్టార్‌ ప్లేయర్లు బాల్ టాంప‌రింగ్‌ పాల్పడి కఠిన శిక్షలు అనుభవించిన విషయం తెలిసిందే.
    చదవండి: PSL 2026: పాక్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ జ‌రిమానా.. ఎందుకంటే?

  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అనుసరించిన వ్యూహాలను టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తప్పుబట్టాడు. ఇద్దరు కీలక పేసర్లను కాదని పవర్‌ ప్లేలో కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెండు ఓవర్లు ఎందుకు బౌలింగ్‌ చేశాడని ప్రశ్నించాడు.

    ఆరు వికెట్ల తేడాతో
    అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌ విషయంలో యాజమాన్యం వ్యవహారశైలి ఏమిటో తనకు అర్థం కావడం లేదని చిక్కా విమర్శించాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2026 టోర్నీలో ముంబై బోణీ కొట్టిన విషయం తెలిసిందే. సొంతమైదానం వాంఖడే వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

    తద్వారా పద్నాలుగేళ్ల విరామం తర్వాత తొలిసారి.. ఓ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై జయభేరి మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినా.. ఆ జట్టు అనుసరించిన వ్యూహాలు మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించాయని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నాడు.

    ఇది అసలు అంతుపట్టని విషయం
    తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు అంతుపట్టని విషయం. భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఇవ్వలేదు. సూర్యను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు.

    అతడొక అద్భుతమైన ఫీల్డర్‌
    అతడొక అద్భుతమైన ఫీల్డర్‌. సూర్యకు బదులు రూథర్‌ఫర్డ్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పంపాల్సింది. ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా పంపి సూర్యకు అన్యాయం చేశారు’’ అని చిక్కా ముంబై యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    మరో వ్యూహాత్మక​ తప్పిదం ఇది
    ఇక పవర్‌ ప్లేలో ముంబై అనుసరించిన వ్యూహాలను ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై చేసిన మరో వ్యూహాత్మక​ తప్పిదం ఇది. ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉన్నా.. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. వారిద్దరు ఆలస్యంగా బంతితో రంగంలోకి దిగారు.

    ఇక తన తొలి ఓవర్లోనే బుమ్రా ఐదు స్లో బంతులు ఎందుకు వేశాడో నాకైతే అర్థం కాలేదు. తనదైన సహజశైలిలో స్వింగ్‌, సీమ​ కలగలిపి అతడు బౌలింగ్‌ చేయలేదు. మరోవైపు.. కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు తానే వేశాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ విమర్శించాడు. 

    కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో బౌల్ట్‌ నాలుగు ఓవర్ల కోటాలో 38 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు.. పాండ్యా 3 ఓవర్లలో 39 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. బుమ్రా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 

    ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగానే
    ఇదిలా ఉంటే.. సూర్యను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉపయోగించడంతో విమర్శలు రాగా.. హెడ్‌కోచ్‌ మహేళ జయవర్దనె స్పందించాడు. సూర్య గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నందు వల్లే అతడిని ఎక్కువగా శ్రమపెట్టదలచుకోలేదని తెలిపాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు తీవ్రం కాకుండా చూసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.

    చదవండి: అంతుచిక్క‌ని శార్దూల్ ఠాకూర్‌!

National

  • అప్పు తీసుకున్న డబ్బులే తిరిగి ఇస్తారనే గ్యారంటీ లేని రోజుల్లో... అప్పనంగా  వచ్చి పడిన రూ.కోట్లను సైతం కాదనుకున్న ఓ మహిళా రైతు డబ్బుకి లోకం దాసోహం అనే నేటి నానుడిని తిరగరాస్తోంది. తన అకౌంట్లో పడిన కోట్ల రుపాయలు డబ్బుని తిరిగి ఇచ్చేసి.. నేటి లోకానికి ఆదర్శంగా నిలిచింది

    ఉత్తరప్రదేశ్‌లోని మైనపురి జిల్లా, బిచ్వాన్‌ ప్రాంతంలోని దేవగంజ్‌ గ్రామానికి చెందిన సీత ఒక రైతు..అంతేకాకుండా ఒక చిన్న కిరాణా దుకాణాన్ని కూడా నడుపుతోంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో, అష్టమి రోజున పొలంలో పనిచేస్తుండగా తన బ్యాంకు నుంచి ఒక ఎస్సెమ్మెస్‌ తో ఆమె  ఆశ్చర్యానికి లోనైంది.  తన బ్యాంక్‌ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ అయినట్లు గమనించింది.  ఈ విషయం గురించి మరింత తెలుసుకోవడానికి తన కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్లింది. అయితే అది సెలవు దినం కావడంతో బ్యాంకు మూసివేసి ఉంది.

    దీంతో ఆమె దగ్గరలోని ఏటిఎంకు  వెళ్లి తన ’బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఖాతా నిల్వను తనిఖీ చేస్తే ఆమె జీవితంలోనే అతిపెద్ద షాక్‌ తగిలింది. ఆమె ఖాతాలో ఉన్న నిల్వ రూ9,99,49,588గా చూపించింది. అయితే అది చూసి  ఆమె ఆనందంతో ఉప్పొంగిపోవడమో తన కుటుంబానికి చెప్పి దాన్ని స్వంతం చేసుకోవడానికి పధకం వేయడమో చేయలేదు. ఖాతాలోకి అకస్మాత్తుగా ఇంత భారీ మొత్తం జమ కావడంతో తల్లి, కుమారుడు ఆశ్చర్యపోయారు. ఇంత భారీ మొత్తం తన ఖాతాలోకి అసలు ఎలా బదిలీ అయ్యిందనే విషయంపై ఆమెకు మాత్రం స్పష్టత రాలేదు.

    దీని ఫలితంగా, ఆ డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో...  ఆమె అందులో నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండానే తిరిగి పొలానికి వెళ్లి, తన పనిని యథావిధిగా కొనసాగించింది.  వారు దీనికి సంబంధించిన ఒక వీడియోను చిత్రీకరించగా, అది అప్పటి నుండి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది తన ఖాతాలో ఇంత భారీ మొత్తం జమ అయినప్పటికీ, ఆ డబ్బును ఏమాత్రం ముట్టుకోకుండా ఉన్నందుకు సీత కుటుంబానికి  ఇరుగుపొరుగు   బంధుమిత్రుల  ప్రశంసలు లభించాయి.

    ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీత మాట్లాడుతూ, తన బ్యాంకు ఖాతాలో సాధారణంగా కేవలం అంత డబ్బు ఉండదని, ఆ డబ్బు తనకు చెందింది కానందున, మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకునేలా అధికారులను కోరతానని తెలిపింది. దీనిపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కరీంగంజ్‌ శాఖ మేనేజర్‌ రిషికాంత్‌ పాండే, ఈ సంఘటన సాంకేతిక లోపం లేదా లావాదేవీ పొరపాటు వల్ల జరిగి ఉండవచ్చని అయితే ఈ మొత్తం విత్‌ డ్రా చేసే అవకాశం కూడా లేదని  అన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతమంతటా విస్తత చర్చకు దారితీసింది. ముఖ్యంగా, ఆమె కుటుంబం ఆ అనుకోని నిధులను సులభంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న సమయంలో ఆమె చూపిన నిజాయితీని సోషల్‌ మీడియాలో చాలామంది ప్రశంసించారు.

  • ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర  సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది.   ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.

    ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లానికి  మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.  ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్‌లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.

    ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో  ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.

    పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

    ఇదీ చదవండి : ట్రంప్‌కు ఝలక్‌ : ఇరాన్‌ సుప్రీం కొత్త సందేశం

     

  • న్యూఢిల్లీ: దేశంలో మావోయిస్టులు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌కు డెడ్‌లైన్‌ రేపటితో (మార్చి 31) ముగియనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లొంగిపోయారు కీలక మావో నేతలు. హిడ్మా సహా పలువురు అగ్రనేతలను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

    ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ కగార్‌పై లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్‌ షా ప్రకటన చేశారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైంది. దేశంలో కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉంది. కాంగ్రెస్‌ 60 ఏళ్లపాటు ఆదివాసీల సంక్షేమాన్ని విస్మరించింది. గత పాలకులు ఆదివాసీలను తప్పుదోవ పట్టించారు.

    గత కాంగ్రెస్‌ పాలనలో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. మావోయిస్టుల హింసలో అనేకమంది ప్రజలు నష్టపోయారు. తెలంగాణలో అనేక మంది మావో నేతలు లొంగిపోయారు. దేశంలో 12 రాష్ట్రాలు మావోయిస్టుల వల‍్ల తీవ్రంగా నష్టపోయాయి. కాంగ్రెస్‌ వైఖరి వల్లే దేశంలో నక్సలిజం పెరిగింది. ఎన్డీఏ వచ్చాకే ఆదివాసుల హక్కులను పరిరక్షించాం. 

    నక్సలిజం కథ ముగిసింది. ఆయుధాలు వీడకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆయుధాలు పట్టుకుంటే బుల్లెట్లతో మేము సమాధానం చెబుతాం. గిరిజనులను నక్సలైట్లు తప్పుదోవ పట్టించారు. వారి చేతికి ఆయుధాలు ఇచ్చి హింసకు పురికొల్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లూటీ చేశారు. జనతా సర్కారు పేరుతో ప్రజలను భ్రమలో ముంచారు. జనతా ఆదాలత్ పేరుతో ఎంతోమందిని చంపారు’ అని అమిత్‌ షా అన్నారు. 

    కాగా, దేశంలో ఉన్న మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కారడవుల్లో భద్రతా బలగాలు కాలు మోపాయి. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టల్లో గత ఏడాది 20 రోజుల పాటు పారామిలటరీ బలగాలు యుద్ధాన్ని తలపించే విధంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఇటువంటి ఆపరేషన్లు 2024 నుంచి ఎన్నో జరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వరకు జరిగిన ఆపరేషన్‌లో భధ్రతా బలగాలు విజయం సాధించారు.  
     

  • పెళ్లి కావాలని, పిల్లలు పుట్టాలని, ఇలా అ నేక కోరికలు నెరవేర్చమని దేవుడికి మొక్కుకోవడం, ఆ తరువాత మొక్కులు చెల్లించుకోవడం చాలా కామన్‌. దయచేసి భార్య నుంచి కాపాడు తల్లీ అని మొక్కుకున్న 25 ఏళ్ల యువకుడి మొర ఆలకించిందట అమ్మవారు. అందుకే వినూత్న రీతిలో ఆ దేవికి కృతజ్ఞతలు తెలిపాడు. అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

    విడాకులను వేడుకగా జరుపుకోవడం లేటెస్ట్‌ ట్రెండ్. ఉత్తర ప్రదేశలోని బస్తీ జిల్లా, సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. భార్యతో ఇబ్బందుల పడిన భర్త, ఆమెనుంచి తన విముక్తి కల్పనించమని దేవుడికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు నెరవేరడంతో, వైవాహిక బంధానికి ముగింపు పలికిన సందర్భంగా స్థానిక ఆలయానికి 9 కిలోమీటర్ల 'దండావత్ యాత్ర'ను చేపట్టిన వైనం, చుట్టు పక్కల గ్రామాల్లో చర్చకు దారి తీసింది. 

    ఇదీ చదవండి: ట్రంప్‌కు ఝలక్‌ : ఇరాన్‌ సుప్రీం కొత్త సందేశం

    నార్ఖోరియా గ్రామంలోని మైనిహవాన్ టోలా నివాసి  జోగేష్.  2022లో సమీప గ్రామానికి చెందిన పూజను వివాహం చేసుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు గ్రామంలోనే నివసిస్తున్నారు.  జోగేష్‌ తండ్రి జగదీష్ ఒక రైతు. అతనేమో ఢిల్లీలోని పిఓపి (POP) ఫ్యాక్టరీలలో పనిచేసేవాడు. పెళ్లైన రెండేళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి.  నిరంతరం ఏదో ఒక గొడవ. ఈ ఘర్షణలు, మానసిక ఒత్తిడితో విసిగి పోయిన భర్త, కోర్టును ఆశ్రయించాడు. అదే సమయంలో భార్య బారి నుండి విముక్తి లభిస్తే, తన ఇంటి నుండి ఆలయం వరకు దండావత్‌ యాత్ర చేస్తానని  ‘మా బైదా సమయ్ మాతా’ ఆలయంలో మొక్కుకున్నాడు. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత, ఈ ఏడాది జనవరిలో అతనికి విడాకులు మంజూరైనాయి. దీంతో అతనితో పాటు,అతని కుటుంబం అంతా చాలా సంతోషంగా  ఉంది.

       

    అయిత జోగేష్‌ ఉండేది ఢిల్లీలో ఉన్నందున మొక్కు తీర్చుకోవడం ఆలస్యమైంది.అయితే, పవిత్ర నవరాత్రులు సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు మార్చి 27వ తేదీన, దండావత్ యాత్ర చేయడానికి భాన్‌పూర్ ఎస్‌డిఎం హిమాంశు కుమార్‌నుంచి అనుమతి తీసుకుని మరీ మాతా ఆలయం వరకు 12 గంటల్లో 9 కిలోమీటర్ల దండవత్ యాత్రను పూర్తి చేశాడు.

    చట్టపరంగా, సామాజికంగా తన భార్య నుండి విముక్తి లభించడంతో మొక్కును తీర్చుకోవాలని ఉదయాన్నే అన్నపానీయాలు ముట్టుకోకుండా, తన గ్రామం నుండి భాన్‌పూర్‌లోని అమ్మవారి ఆలయానికి పొర్లు దండాలు పెడుతూ  ఆలయానికి చేరుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రయాణంలో అతని తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామానికి చెందిన అనేకమంది ప్రజలు డప్పులు వాయిస్తూ, అమ్మవారి నామాన్ని జపిస్తూ  ఊరేగింపుగా వెళ్లారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా వారితో పాటు ఉన్నారు.

    సాయంత్రం 6 గంటలకు, రక్తసిక్తమైన మోకాళ్లతో, అలసిపోయిన శరీరంతో గుడికి చేరుకున్న అతను, అమ్మవారి దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. వైవాహిక జీవిత నరకం నుండి బయటపడ్డాక ఇప్పుడు తనకు ప్రశాంతంగా ఉందని అతను మీడియాతో చెప్పాడు.

  • ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు ’ఈ ఫ్యామస్‌ డైలాగ్‌ గుర్తుందా? కానీ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో జరిగిన ఘటన గురించి తెలుస్తే  అవాక్కవ్వాల్సిందే.  ఒక సామాన్య రైతు భార్య బ్యాంకు ఖాతాలోకి ఉన్నట్టుండి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. అయితే డబ్బెవరికి చేదు అని  ఆమె అనుకోలా. ఆమె చేసిన పని ఇపుడు నెట్టింట విశేషంగా నిలుస్తోంది.   

    స్టోరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్‌లోని మైనపురి జిల్లాకు చెందిన ఒక రైతు భార్య రీటా. రాష్ట్రంలోని దేవగంజ్ గ్రామంలో తన భర్త పరాస్‌భన్ బహేలియాతో కలిసి నివసిస్తోంది. ఇటీవల జరిగిన నవరాత్రి ఉత్సవాల సమయంలో, ఆమె కొంత నగదు విత్‌డ్రా చేయడానికి స్థానిక బ్యాంకుకు వెళ్లింది. అయితే, 'మహా అష్టమి' పర్వదినం కారణంగా బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆమె నగదు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత, నగదు విత్‌డ్రా చేయడానికి ఆమె సమీపంలోని ఏటీఎం (ATM) కేంద్రానికి వెళ్లింది. తన బ్యాంకు ఖాతాలో ఏకంగా  రూ.10 కోట్లు(రూ. 9,99,49,588) జమ అయినట్లు  గుర్తించి, రీటా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.  ఆ విషయాన్ని నమ్మలేక, ఖాతాలో ఉన్న మొత్తాన్ని సరిచూసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఆమె మరో ఏటీఎంకు వెళ్లింది. అక్కడ కూడా అదే మొత్తం కనిపించింది. ఆమె ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా, అది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

    ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

    ప్రశంసలందుకుంటున్న ఆమె నిర్ణయం
    పొరపాటున తన 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఖాతాలో జమ చేసిన రూ. 10 కోట్లను  చూసి అత్యాశకు పోలేదు.  రీటా ఆ డబ్బును విత్‌డ్రా చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా, ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఆ డబ్బును ముట్టుకోవద్దని తన కుటుంబ సభ్యులకు  తెగేసి చెప్పింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొరుగువారితో పాటు ఇతరులు కూడా ఆమె నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో   హాట్‌ టాపిక్‌గా మారింది. రీటా నిజాయితీని చాలామంది సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

    బ్యాంక్ అధికారుల ప్రశంసలు 
    ఆమె నిజాయితీపై బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రిషికాంత్ పాండే స్పందించారు. టెక్నికల్‌ ఎర్రర్‌, లేదా పొరబాటున ఇలా జరిగి ఉంటుందని, విచారణ జరిపి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటామని హామీ  పాండే  తెలిపారు.

    సోషల్ మీడియా ఫిదా
    'ఈ డబ్బు నాది కాదు, దీన్ని వెనక్కి తీసుకోండి' అని ఆమె  బ్యాంకు అధికారులతో స్పష్టం చేసింది. దీంతో తన బ్యాంక్ అకౌంట్‌లో పొరపాటున పది కోట్ల రూపాయలు పడినా, ఆశపడకుండా నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలందుకుంటోంది. సాధారణ ప్రజలలో అత్యధికులు నిజాయితీపరులేనని, అందుకే మానవజాతి మనుగడ సాగిస్తోంది  అంటూ  ఎక్స్‌ యూజర్‌ శేఖర్ వెంబు వ్యాఖ్యానించారు.

Business

  • టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు 2026 అపాచీ RTR 160 4V లాంచ్ చేసింది. దీని ధర 1,25,440 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ఇది స్టాండర్డ్ బైక్ కంటే ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది.

    2026 అపాచీ RTR 160 4V ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. USD ఫోర్కులు, TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ చాలా వరకు హైఎండ్ ఫీచర్స్ పొందిందన్నమాట.

    2026 అపాచీ RTR 160 4V పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి డే 17.55 Bhp పవర్ అందించే 160 సీసీ ఇంజిన్ ఉంది. ఈ బైక్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటి ఫీచర్, ఇది రైడింగ్ పరిస్థితులను బట్టి పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి రైడర్‌లకు వీలు కల్పిస్తుంది.

  • దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్‌ఆర్‌) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.

    వేలం వివరాలు..

    సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్‌ఆర్‌ వేలంలో ఆర్‌బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్‌బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.

    రెండో వేలం ద్వారా ఆర్‌బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.

    మిగులు దిశగా నగదు లభ్యత

    ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్‌ఆర్‌ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.

    ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.

    ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

  • స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరూ లాభాలు గడిస్తారని లేదా అందరూ నష్టపోతారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయితే ఇన్వెస్టర్ ఎలా ఉండాలి? ఎలాంటి విధానాలు అనుసరించాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. దీనికి ప్రపంచ దిగ్గజ మదుపరిగా ఎంతోమందికి సుపరిచితమైన 'బఫెట్' ఫార్ములా తెలుసుకుందాం.

    స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నప్పుడు.. కొంతమంది మిస్ అవుతామేమో అనే ఆందోళనతో కొనుగోలు చేస్తుంటారు. నష్టం వస్తే అయ్యో అని బాధపడతారు. ఇలాంటి సమయంలో బఫెట్ చెప్పే మాట ఏమిటంటే.. 'ఎప్పుడూ వెంటపడొద్దు' ప్రతి అవకాశాన్ని వెంటాడాల్సిన అవసరం లేదు.

    ఒక కంపెనీ ఎంత గొప్పదైనా సరే, దాని షేర్ ధర చాలా ఎక్కువగా ఉంటే వెంటనే కొనకూడదు. సరైన విలువ వచ్చినప్పుడు మాత్రమే కొనాలి. ఇది పెట్టుబడిదారులకు ఓపికను, నియంత్రణను నేర్పిస్తుంది. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా.. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

    బఫెట్ తన తత్వాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ. బేస్‌బాల్ క్రీడాకారుడు.. బేస్‌బాల్‌లో మంచి ఫలితం పొందాలంటే సరైన బంతి కోసం ఎదురు చూడాలి. ప్రతి బంతిని కొట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ప్రతి స్టాక్‌ను కొనాల్సిన అవసరం లేదు.

    బఫెట్ చెప్పినట్లుగా.. మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు ఉంటాయి. కానీ మనకు అర్థమయ్యే, మంచి కంపెనీలు మాత్రమే ఎంచుకోవాలి. అవి సరైన ధరలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక అవకాశం వదిలేస్తే.. మిమ్మల్ని ఎవరూ శిక్షించరు. కాబట్టి ఆలోచించాలి.

    ప్రతి స్టాక్ లేదా ప్రతి ట్రెండ్ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి విషయాలను బాగా అర్థం చేసుకోవడం చాలు. అదే నిజమైన విజయం తీసుకువస్తుంది. మీకు జీవితంలో కేవలం 20 సార్లు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తే.. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. తప్పులు తక్కువ చేస్తారు, మంచి అవకాశాలను మాత్రమే ఎంచుకుంటారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదిస్తారు అని పేర్కొన్నారు.

  • ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్‌ టారిఫ్‌లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

    ఐఎంఎఫ్‌ నిబంధనలే కారణమా?

    అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నుంచి పొందిన 2.9 బిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

    మరింత పెరిగే అవకాశం ఉందా?

    ‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

    తీవ్ర స్థాయిలో ఇంధన కొరత

    దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

  • దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పాలనాపరమైన లోపాలు, నైతిక విలువల వివాదంలో చిక్కుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్‌లోని ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్‌ టైర్-1 (ఏటీ-1) బాండ్లను విక్రయించిన వ్యవహారంలో బ్యాంక్ మేనేజ్‌మెంట్ వైఖరిపై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో బ్యాంక్ అనూహ్యంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.

    ఏటీ-1 బాండ్లు అంటే ఏమిటి?

    సాధారణ బాండ్లలాగా వీటికి నిర్ణీత గడువు ఉండదు. వీటిని ‘పెర్పెచువల్ బాండ్స్’ అని పిలుస్తారు. అంటే బ్యాంక్ లాభాల్లో ఉన్నంత కాలం వీటికి వడ్డీ (కూపన్‌) చెల్లిస్తూనే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లినా లేదా మూతపడే స్థితికి వచ్చినా ఈ బాండ్లలోని పెట్టుబడిని బ్యాంక్ పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంటుంది.

    వీటిని ఎందుకు జారీ చేస్తారు?

    అంతర్జాతీయ ‘బాసెల్-3’ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వద్ద కొంత మేర కనీస మూలధనాన్ని ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నష్టాలను తట్టుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈక్విటీ షేర్లను జారీ చేసి కొత్త భాగస్వాములను చేర్చుకోవడం కంటే, బాండ్ల ద్వారా నిధులు సేకరించడం బ్యాంకులకు సులభం. దీనివల్ల బ్యాంక్ యాజమాన్య హక్కులు మారవు.

    దుబాయ్ బ్రాంచ్‌లో మిస్-సెల్లింగ్

    క్రెడిట్ సూయిస్ బ్యాంక్‌కు చెందిన అత్యంత రిస్క్‌తో కూడిన ఏటీ-1 బాండ్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన దుబాయ్, బహ్రెయిన్ శాఖల ద్వారా ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు తప్పుగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలను గుర్తించిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ), బ్యాంక్ బ్రాంచ్‌పై కఠిన ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 26, 2025 నుంచి కొత్త క్లయింట్లను చేర్చుకోవడం లేదా కొత్త ఆర్థిక సేవలను అందించకుండా నిషేధించింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, ఈ నెలలో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. మరో 12 మంది సిబ్బందిపై వివిధ స్థాయిల్లో జరిమానాలు విధించినట్లు మార్చి 23 నాటి ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైంది.

    ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారు?

    ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన చక్రవర్తి బ్యాంక్ తీరును తూర్పారబట్టారు. ‘గత ఎనిమిదేళ్లుగా లోపాలు జరుగుతున్నా బ్యాంక్ మౌనంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు మేల్కొని చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇది మొదట్లో కేవలం డాక్యుమెంటేషన్ సమస్యగా భావించినప్పటికీ ఇది బ్యాంక్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది’ అని చెప్పారు. బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ పుననియామకం విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశన్ నియామక ప్రక్రియ తన పర్యవేక్షణలో కానీ, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్‌ఆర్‌సీ) పరిధిలో కానీ జరగలేదని స్పష్టం చేశారు.

    పెట్టుబడిదారుల్లో ఆందోళన

    ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సంస్థ విలువలు, నైతికత అంశాలపై విభేదించి తప్పుకోవడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో బ్యాంక్ షేర్ల విలువపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే, చక్రవర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను బ్యాంక్ అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అవకతవకలపై ఆర్‌బీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

  • సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.

    ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.

    వెండి ధర
    ఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది.

  • ఇరాన్-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో భారీగా పతనమవుతున్న భారత రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ అత్యవసర జోక్యం వల్ల బ్యాంకులు తమ బిలియన్ల డాలర్ల ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామంతో బ్యాంకింగ్ రంగానికి దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

    ఆర్బిట్రేజ్ పొజిషన్లు అంటే ఏమిటి?

    బ్యాంకులు తమ లాభం కోసం చేసే ఒక తెలివైన వ్యాపారమే ఈ ‘ఆర్బిట్రేజ్’. సాధారణంగా డాలర్ ధర ఆన్-షోర్ మార్కెట్ (భారతదేశంలో)లో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆఫ్-షోర్ మార్కెట్ (దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో)లో డాలర్ ధర ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాంతో భారతదేశంలో తక్కువ ధరకు డాలర్లను కొని, విదేశీ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాంకులకు లాభం. అదే ఆర్బిట్రేజ్. ఇలా బ్యాంకులు ఇటీవల సుమారు 25 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల వరకు పొజిషన్లను నిర్మించుకున్నాయి.

    100 మిలియన్ డాలర్ల పరిమితి

    బ్యాంకులు తమ వద్ద భారీగా డాలర్లను నిల్వ ఉంచుకోవడం కూడా రూపాయి విలువ వేగంగా పడిపోవడానికి ఒక కారణంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ ‘నెట్ ఓపెన్ పొజిషన్’పై పరిమితి విధించింది. అంటే.. ఏ బ్యాంకైనా సరే బిజినెస్‌డే చివరలో తన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (కొన్నవి - అమ్మినవి) విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకుముందు బిలియన్ల కొద్దీ డాలర్లను హోల్డ్ చేసిన బ్యాంకులు, ఇప్పుడు ఆ అదనపు డాలర్లను మార్కెట్‌లో అమ్మేయాల్సి వస్తుంది. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకోనుంది.

    రూ.4,000 కోట్ల నష్టం

    బ్యాంకులు ఈ డాలర్లను లాంగ్‌టర్మ్‌ కోసం వ్యూహాత్మకంగా కొన్నాయి. కానీ ఆర్‌బీఐ ఏప్రిల్ 10 లోపు వాటిని విక్రయించాలని డెడ్‌లైన్ పెట్టడంతో బ్యాంకులు అమ్మాల్సి వస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు లేదా అననుకూల సమయంలో అమ్మడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు నమోదవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం, బ్యాంకులు హోల్డ్ చేసిన ప్రతి డాలర్ మీద రూపాయి కదలిక వల్ల వచ్చే వ్యత్యాసం, మొత్తం బ్యాంకింగ్ రంగానికి కలిపి సుమారు రూ.3,000 కోట్లు నుంచి రూ.4,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.

    బ్యాంకింగ్ రంగంపై ప్రభావం

    ఈ నిర్ణయం వెలువడగానే ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకుల లాభదాయకత (క్యూ4 ఫలితాలు) దెబ్బతింటుందనే ఆందోళనతో బ్యాంక్ షేర్లు ఈరోజు మార్కెట్‌లో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా..  వంటి బ్యాంకులు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయి. రూపాయి విలువ పడిపోతే దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతుంది. ఆ భారీ నష్టాన్ని దేశం భరించడం కంటే బ్యాంకులపై నియంత్రణ విధించి కరెన్సీని కాపాడటమే మేలని ఆర్‌బీఐ భావించింది. అందుకే బ్యాంకుల లాభాలకు గండి పడినా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంది.

    ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల

  • జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, ఏప్రిల్ 01, 2026 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. నిరంతరం పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులను అధికారికంగా భర్తీ చేయడానికే ఈ ధరల పెంపు అని కంపెనీ వెల్లడించింది.

    ధరల పెరుగుదల తరువాత.. కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్, హెక్టర్, విండ్సర్ ఈవీ రేట్లు పెరగనున్నాయి. అయితే ఎంజీ ఎం9 ప్రెసిడెన్షియల్ లిమో, ఎంజీ సైబర్‌స్టర్‌ ధరలు పెరగవు అని కంపెనీ వెల్లడించింది. కొత్త ధరలను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని ఎంజీ డీలర్‌షిప్‌ను లేదా అధికారిక ఎంజీ వెబ్‌సైట్‌ను సందర్శించమని కంపెనీ స్పష్టం చేసింది.

    ఇదిలా ఉండగా.. భారతదేశపు మొట్టమొదటి D+ సెగ్మెంట్ SUVగా నిలవనున్న, రాబోయే మెజెస్టర్ కోసం కంపెనీ బ్రాండ్ ఒక బండిల్డ్ ఓనర్‌షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5-5-5 ప్రోగ్రామ్ పేరుతో.. వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌గా కలపడం ద్వారా దీర్ఘకాలిక యాజమాన్య ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.

  • గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్త. ఇప్పుడు పిక్సెల్ 10 కొనుగోలుపై రూ.10వేలు వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, మంచి కెమెరా పనితీరు, అనేక AI-ఆధారిత ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం చూసేవారికి గూగుల్ పిక్సెల్ 10 ఒక మంచి ఎంపిక. దీని ధర భారతదేశంలో రూ.79999. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 74,999 కే లభిస్తోంది. అంతే కాకుండా.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, ఈఎంఐ రహిత లావాదేవీలపై అదనంగా రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా.. మీరు వన్ కార్డ్ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు.

    గూగుల్ పిక్సెల్ 10 గురించి
    గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షణ పొందుతుంది. పనితీరు పరంగా, పిక్సెల్ 10 టెన్సర్ G5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, దీనికి 12GB వరకు RAM, 256GB వరకు అంతర్గత స్టోరేజ్ లభిస్తాయి. ఇది 4,970mAh బ్యాటరీ పొందుతుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

    కెమెరాల విషయానికి వస్తే, పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా ఉంది.

  • భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీ పతనానికి గురైంది. సోమవారం (మార్చి 30, 2026) నాటి ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 95.45 స్థాయికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఈ అసాధారణ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంట దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    పతనానికి ప్రధాన కారణాలు

    ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం

    పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది డాలర్‌కు విపరీతమైన డిమాండ్‌ను పెంచి, రూపాయిని బలహీనపరిచింది.

    చమురు ధరలు

    భారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవల బ్యారెల్‌కు 115 డాలర్ల మార్కు వరకు వెళ్లడంతో చమురు దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. చమురు కంపెనీలు డాలర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రమైంది.

    ఎల్‌పీజీ దిగుమతులు

    కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంటగ్యాస్(ఎల్‌పీజీ) దిగుమతులపై కూడా యుద్ధ ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో ముందస్తుగా నిల్వలను పెంచుకోవడానికి కంపెనీలు చేస్తున్న కొనుగోళ్లు కరెన్సీ విలువను మరింత తగ్గించాయి.

    విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ

    ఒక్క మార్చి నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 13.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి భారత మార్కెట్ల నుంచి నిష్క్రమించారు. 2020 నాటి కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి.

    ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

    • రూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు (ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు) పెరిగి సామాన్యుడిపై భారం పడనుంది.

    • పెరిగిన చమురు బిల్లుల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు భారీగా విస్తరించే అవకాశం ఉంది.

    • విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారికి ఖర్చు భారీగా పెరుగుతుంది.

    ఆర్‌బీఐ చర్యలు

    రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకుల ఫారెక్స్ పొజిషన్లపై కఠినమైన పరిమితులు విధించడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డాలర్లను విక్రయించడం ద్వారా లిక్విడిటీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అత్యవసర డిపాజిట్ పథకాలను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ స్థిరత్వం ఏర్పడే వరకు రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగేలా కనిపిస్తోంది. యుద్ధం చల్లారకపోతే రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

    ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

  • సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,635.67 పాయింట్లు లేదా 2.22 శాతం నష్టంతో 71,947.55 వద్ద, నిఫ్టీ 488.20 పాయింట్లు లేదా 2.14 శాతం నష్టంతో 22,331.40 వద్ద నిలిచాయి.

    హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, యారో గ్రీన్‌టెక్ లిమిటెడ్, దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నిన్‌టెక్ సిస్టమ్స్ లిమిటెడ్, సెక్‌మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఖండ్వాలా సెక్యూరిటీస్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, సూరత్వాలా బిజినెస్ గ్రూప్ లిమిటెడ్, ఓస్వాల్ ఆగ్రో మిల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.

    భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ కనిష్టానికి రూపాయి విలువ

    గమనిక: రేపు (మార్చి 31) మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.

    రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణ

    గతంలో కిరోసిన్‌ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్‌కేఓ) అందుబాటులోకి రానుంది.

    కొత్త నిబంధనల ముఖ్యాంశాలు

    • ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    • ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్‌లెట్‌లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.

    • ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.

    • పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.

    • ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.

    భద్రతలో రాజీ లేదు

    నిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్‌ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

    ఇంధన భద్రతే లక్ష్యం

    ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్‌వర్క్‌ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

  • హ్యుమానాయిడ్స్ రోబోల తయారీలో చైనా చాలా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే.. అక్కడి కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రోబోలను పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే.. కొత్త రోబోల ప్రదర్శన సమయంలో కొన్ని ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    మార్చి 21న చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు.అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.

    ఈ రోబోట్.. చైనా టెక్నాలజీ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ మోడల్ అని తెలుస్తోంది. సుమారు 35 కేజీల బరువున్న ఈ రోబో ధర 13500 డాలర్లు. దీనిని రీసెర్చ్, ఎడ్యుకేషన్, కమర్షియల్ ఉపయోగం కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్న. ఎంత ప్రమాదకరమైన ప్రదర్శన  చెప్పగా.. చిన్నారికి తగలడం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇంకొకరు పేర్కొన్నారు.

    కంపెనీలకు సూచనలు
    రోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుండా ప్రజలకు ఇబ్బంది, లేకుండా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    గతంలో జరిగిన సంఘటన
    రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్‌లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.

    ఇదీ చదవండి: ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!

  • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్‌’ పోస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.

    డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులు
    ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.

    చమురు సెగ.. అంతం లేని యుద్ధం
    ప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    పాత పద్ధతులకు కాలం చెల్లింది!
    సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

    2026కు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇవే..
    ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం,  వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే.

    "మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు.

     

Politics

  • కోయంబత్తూరు: తమిళనాడు ఎన్నికల వేళ కోయంబత్తూరు-గౌండంపాళయం నియోజకవర్గ అభ్యర్థిగా టీవీకే తరఫున కనిమొళి సంతోష్ పేరును ప్రకటించడంతో వివాదం రాజుకుంది. గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఒక పోస్టులో ఆమె.. “మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను 100 శాతం నయం చేయవచ్చు” అని చెప్పినట్లు ఉంది.

    సెలబ్రిటీ జ్యోతిష్కురాలు కమిమొళి 
    నరసింహనాయకన్‌పాళయం ప్రాంతానికి చెందిన కనిమొళి న్యాయవాది, వ్యాపారవేత్త. అంతేకాదు, తనను తాను సెలబ్రిటీ జ్యోతిష్కురాలినని, వాస్తు నిపుణురాలినని చెప్పుకుంటారు. మెడికల్ ఆస్ట్రాలజీపై ఆమె చేసిన పాత సోషల్ మీడియా పోస్టులను ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తుచేస్తున్నారు. 

    ఒక వీడియోలో కనిమొళి మాట్లాడుతూ.. “మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో ప్రత్యేక శాఖ. క్యాన్సర్ ప్రాణాపాయం కలిగించే వ్యాధి. మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా క్యాన్సర్‌ను కూడా పూర్తిగా నయం చేయవచ్చు” అని చెప్పారు. అలాగే వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి వచ్చే వ్యాధులను గుర్తించవచ్చని, సరైన పరిష్కారాలు తెలుసుకోవచ్చని కూడా తెలిపారు.

    కనిమొళికి ప్రస్తుతం సోషల్ మీడియాలో 1,00,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ప్రచారం చేసిన మెడికల్ ఆస్ట్రాలజీ వీడియోలను డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్ కచ్చి సభ్యులు బాగా షేర్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కనిమొళి మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారని అంటున్నారు.

    ఎలాంటి వారికి టికెట్లిచ్చారు? 
    టీవీకే అధినేత విజయ్ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 234 మంది అభ్యర్థులతో విజయ్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అవి వైరల్ అయ్యాయి.

    అయితే కనిమొళిని అభ్యర్థిగా ప్రకటించడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను నిశితంగా పరిశీలించి ఎంపిక చేశామని విజయ్ ముందుగా చెప్పారు. అయితే, సిన్సియర్‌ నేతలకు సీట్లు రాలేదని కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సూత్రాలకు విరుద్ధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారికి సీట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. 

  • ఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని బీజేపీ లక్ష్యం తమ నాయకుడు రాహుల్‌ గాంధీని బద్నాం చేయడమేని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంల్‌లో చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటరిచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ టార్గెట్‌గా అమిత్‌ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని బద్నాం చేయడమే ఏకైక అజెండా అమిత్‌ షా పెట్టుకున్నారని మండిపడ్డారు. 

    ‘పార్లమెంట్‌లో అమిత్ షా అబద్దాలు చెప్తూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ టార్గెట్ గా అమిత్ షా మాట్లాడారు.  కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అమిత్ షా ఏకైక అజెండా. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను అమిత్ షా తట్టుకోలేకపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అమిత్ షా మాట్లాడాలని అనుకున్నారు. గద్దర్ మాజీ మావోయిస్టు. గద్దర్ తన మావోయిజానికి స్వస్తి పలికి తెలంగాణ సంస్కృతి,చరిత్ర,సాంప్రదాయంపై పోరాటం చేశారు. అలాంటి గద్దర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకుంటే తప్పు ఎట్లా అవుతుంది?, 

    జులై 20 వ తేదీ 2022లో బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నరేంద్ర మోదీ,,అమిత్ షా సభకు గద్దర్ హాజరయ్యారు. గద్దర్‌తో స్టేజ్ పంచునున్నారని అమిత్ షా ఎట్లా మాట్లాడారు...?, బీజేపీ లక్ష్యం రాహుల్ గాంధీని బద్నాం చేయడమే. గద్దర్ గురించి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి నోరు మెదపకుండా కూర్చున్నారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు గద్దర్ బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి తనపై ఉన్న పెండింగ్ కేసులపై చర్చించారు

    ఒక పక్క మావోయిస్టులను లొంగిపొమ్మని చెప్పి ఎప్పుడో లొంగిపోయిన మావోయిస్టు సిద్దాంతాన్ని వదిలేసిన గద్దర్ తో రాహుల్ గాంధీ వేదిక పంచుకున్నారని చెప్పడం దారుణం.  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను గెలిపిస్తారని అమిత్ షా భయపడుతున్నారు. మీ ప్రభుత్వం అజెండా ప్రకారం మార్చి 31,2026 కల్లా నక్సల్స్ రహిత దేశంగా మార్చుకోండి. మేము తప్పుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రపై,రాహుల్ గాంధీపై విషం చిమ్మవద్దని సూచిస్తున్నాం’ అని చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • తాడేపల్లి.  తమ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జున.  చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కారు క్రెడిట్‌ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మేరుగు నాగార్జున. 

    ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు.

    ప్రెస్‌మీట్‌లో మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:

    ప్రజలు వాస్తవాలు చెబుతున్నా పట్టని బాబు
     సీఎం చంద్రబాబు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలే బయటకు వచ్చి, తమకు గత ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చారని చూపుతున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. క్రెడిట్‌ చోరీకి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారినట్లు కనిపిస్తోంది.

    కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలల్లో 5,50,314 ఇళ్లు నిర్మించామని, ఈరోజు 2,50,893 ఇళ్లకు గృహ ప్రవేశం చేశామని చెబుతున్నారు. కానీ 2014–2019 మధ్య గానీ, 2024 నుంచి ఇప్పటి వరకు గానీ ఒక నిరుపేద కుటుంబానికి ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వారి కోసం కనీసం గజం భూమి అయినా చంద్రబాబు కొన్నారా? 

    గత ప్రభుత్వంలో జగన్‌గారు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి, 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, వాటిలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల ఇళ్ల కోసం 17,005 వైయస్సార్‌ జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు ఒక ఊరు మాదిరిగా ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఆ కాలనీల పేరు మార్చి, ఇప్పుడు వాటినే తామే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.

    అదీ గత ప్రభుత్వ చిత్తశుద్ధి
    రాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదన్న లక్ష్యంతో, గత ప్రభుత్వం వ్యవహరించింది. పేదలందరికీ పక్కా ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాలను సేకరించి, అందులో 25,374 ఎకరాలను కొనుగోలు చేసి దాదాపు రూ.11,343 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో కాలనీలు మాత్రమే కాదుం ఊర్లకు ఊర్లే నిర్మించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్న జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్సార్‌గారి వారసుడిగా జగన్‌ నిరుపేదలకు గూడు కల్పించిన విధానం అది.

    ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువ సుమారు రూ.75 వేల కోట్లు
    గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో జంగిల్‌ క్లియరెన్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యాల కోసం మాత్రమే దాదాపు రూ.32,900 కోట్లు ఖర్చు చేశారు. నాడు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల మార్కెట్‌ విలువ సుమారు రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇక లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల దాదాపు రూ.20 లక్షలు. అవేవీ చేయని కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎకరికో పుట్టిన బిడ్డను మా బిడ్డగా చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. టిడ్కో ఇళ్లన్నీ తామే నిర్మించామని చెప్పుకోవడం దారుణం.

    గత ప్రభుత్వంలో 1.24 లక్షల టిడ్కో ఇళ్లు పంపిణీ
    టిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల్లోని 66 ప్రాంతాల్లో లక్షకు పైగా ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. సాలూరు, విజయనగరం, చిత్తూరు వంటి పట్టణాల్లో కూడా టిడ్కో ఇళ్లు పంపిణీ చేశాం. మొత్తంగా 1,24,680 ఇళ్లు అన్ని వసతులతో జీ+3 విధానంలో నిర్మించి ఇచ్చాం.

    గతంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్‌ చోరీ
    ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి కూటమి ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్నవారు కొత్త కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ వైఎస్‌ జగన్‌ గారు చేసిన మేలును మీరు క్రెడిట్‌గా తీసుకోవడం అన్యాయం. అందుకే ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి మీ మాయను, భూంరాంగ్‌ వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడం, టిడ్కో ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయడం..ఈ చరిత్ర మొత్తం గత ప్రభుత్వానిది. ఆ ఘనత అంతా జగన్‌కే దక్కుతుంది.

    ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్ర చంద్రబాబుగారిది. అందుకే ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మేరుగు నాగార్జున హెచ్చరించారు.

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్‌ ఓ పుస్తకం విడుదల చేశారు.

    "మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.

    డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

    స్టాలిన్, విజయ్ నామినేషన్ దాఖలు

    విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి  పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్‌ నామినేషన్ సమర్పించారు. విజయ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్‌లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
     

     

  • హైదరాబాద్‌:  మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కారణంగానే తన గొప్పతనం ఏమిటో తెలంగాణ సమాజానికి తెలిసిందని అంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అసలు కేసీఆర్‌ లేకపోతే తాను లేనంటూ చెప్పుకొచ్చారు రేవంత్‌. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ కేసీఆర్‌ వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. కేసీఆర్‌ లేకపోతే నేను లేను. రావణుడి చెడువల్లే రాముడి గొప్పతనం తెలిసింది. 

    కేసీఆర్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కేసీఆర్‌ను గృహనిర్బంధం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీష్‌రావు ప్రమాదం’ అని పేర్కొన్నారు. 

    CM Revanth : కేసీఆర్ లేకపోతే నేను లేను

Movies

  • అక్కకి బర్త్ డే విషెస్ చెప్పిన లావణ్య

    ఎండలో చిల్ అయిపోతున్న పూజా హెగ్డే

    సెలయేరు దగ్గర ప్రియా వారియర్ హోయలు

    అందంతో రచ్చ లేపుతున్న జోనితా గాంధీ

    ఎర్రచీరలో మెరిసిపోతున్న ఈషా రెబ్బా

    పింక్ డ్రస్‌లో క్యూట్‌గా రెబా మోనికా జాన్

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరోసారి వాయిదా పడింది. మీరు విన్నది నిజమే. గత కొన్నిరోజుల నుంచి ఈ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. టీమ్ మౌనవ్రతం పాటిస్తుండగా.. అభిమానుల మాత్రం అలాంటిదేం ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం ఏం చెప్పనప్పటికీ.. టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్, సోమవారం సాయంత్రం జరిగిన ఓ మూవీ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'పెద్ది' కొత్త విడుదల తేదీని బయటపెట్టేశాడు.

    (ఇదీ చదవండి: తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?)

    మార్చి 27న చరణ్ పుట్టినరోజున 'పెద్ది' రిలీజ్ చేస్తామని తొలుత అనౌన్స్ చేశారు. తీరా డేట్ దగ్గరపడేసరికి ఏప్రిల్ 30న వస్తామని అన్నారు. కానీ ఐటమ్ సాంగ్‌తో పాటు మరో పాట షూటింగ్ పెండింగ్‌లో ఉండటం, ఈ మధ్యే చరణ్ కంటికి గాయం కావడం తదితర అంశాలతో చెప్పిన తేదీకి రావడం కష్టమే అని అంతా భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే లీకులు వచ్చేస్తున్నాయి.

    జూన్ 25న 'పెద్ది' సినిమా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఇది రిలీజ్ అవుతుందని అఖిల్ 'లెనిన్'ని జూన్ 26కి వాయిదా వేశారు. మరి 'పెద్ది' తప్పుకొంది కాబట్టి 'లెనిన్'.. ముందే చెప్పినట్లు మే 1న థియేటర్లలోకి వస్తాడా లేదంటే మరో తేదీ చూసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

    'పెద్ది' తప్పుకొంటే అదే తేదీకి వచ్చేయాలని నిఖిల్ 'స్వయంభు' సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు అదే టైంలో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం', ధనుష్ 'కర'తో పాటు పలు చిత్రాలు లైనులో ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్ని అదే తేదీని టార్గెట్ చేసుకుంటాయో చూడాలి? ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఇప్పుడు 'పెద్ది' కూడా తప్పుకొంది. దీంతో ఈసారి కూడా స్టార్స్ లేకుండానే సమ్మర్ ఉండబోతుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు అనుకోని విధంగా ఓ జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కారణం. ఈ చిత్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  పరిశీలనకు పంపినట్లు వార్తలొస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే కథాంశం ఇందులో ఉండటమే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన 'ధురంధర్', ‍త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' కూడా ఈ తరహా కాన్సెప్ట్‌లతోనే తీశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    యుద్ధ నేపథ్యంలో ఉండే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ పెద్దగా ప్రచారం లేని ఓ తెలుగు మూవీ ఈ రేంజ్‌లో హైలైట్ కావడంతో.. అందులో కంటెంట్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్‌లో ఇలా ఓ సినిమా.. జియో పొలిటకల్ వివాదంలో ఇరుక్కోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.

    ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం- ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చే క్లియరెన్స్‌పై ఈ చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

  • హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్‌లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

    'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

  • శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు తదితర సినిమాలతో అప్పట్లో సక్సెస్ అందుకున్న హీరో వెంకట్.. తర్వాత అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. గతేడాది రిలీజైన 'ఓజీ'లోనూ పవన్ కల్యాణ్‌కి అన్నగా నటించాడు. ఇతడు హీరోగా చేసిన 'హరుడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

    రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డాక్టర్.దిక్కల లక్ష‍్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా మే 8న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. హెబ్బా పటేల్ , సలోని , నటషా , అలీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    (ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు ఈ సినిమా నచ్చితే రూ.1000 కోట్లు)

  • అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వం వహించిన ద్విభాషా సినిమా 'కార్మేని సెల్వం'. సముద్రఖని, గౌతమ్ మేనన్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 3న  తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరుతో  రామానుజన్ ఎంకే ఈ మూవీకి సంగీతమందించారు. ఇప్పటికే విడుదలైన 'అరెరె' పాట ఆకట్టుకుంటోంది. త్వరలో సినిమా థియేటర్లలోకి రానున్న సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్ ఎంకే చిత్ర విశేషాలని పంచుకున్నారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    సినిమాకు సంగీతమందించిన ఘనత ఒక్క వ్యక్తికి కాకుండా, ఓ సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే   2017లో బెంగళూరులో  'Musicloud Studio & Technology'ని ప్రారంభించాను. ప్రస్తుతం 'కార్మేని సెల్వం' ప్రాజెక్టు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను  ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం.

    ఇందులో భాగంగా సౌండ్ ఇంజనీర్లు, వాయిద్య కారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేం సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాం. సినీ  సంగీత రంగంలో ఇదొక  కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. తెలుగులో హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలకు మ్యూజిక్ చేయాలని ఉంది. కార్మేని సెల్వం.. హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది అని చెప్పుకొచ్చారు.

    (ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)

  • హీరోయిన్‌గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్‌తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    201‍1లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు)

  • సినిమా నటీనటులు కొన్నిసార్లు మాట్లాడే మాటలు అతిశయోక్తిలా అనిపిస్తుంటాయి. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు. అయినా సరే హీరోలని పొగిడే క్రమంలో ఇలాంటి చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఫేమస్ కమెడియన్ ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

    తమిళనాడులో వస్త్రదుకాణాలతో గుర్తింపు తెచ్చుకున్న శరవణనన్.. నాలుగేళ్ల క్రితం 'లెజెండ్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సదరు హీరో యాక్టింగ్‌పై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడు 'లీడర్' అనే మూవీతో వస్తున్నాడు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళంలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ఆడియో-ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. ఇందులోనే కమెడియన్ వీటీవీ గణేశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గనక నచ్చితే సులభంగా రూ.1000 కోట్లు వచ్చేస్తాయని అనడం చిత్రంగా అనిపించింది.

    రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలే ఇప్పటివరకు రూ.1000 కోట్ల మార్క్‌ని అందుకోలేకపోయారు. అలాంటిది లెజెండ్ శరవణనన్ సినిమాకు ఇన్ని కోట్ల వసూళ్లు వస్తాయని కమెడియన్ పొగడటం కాస్త అతిలా ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వస్తున్నాయి. తొలి చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన శరవణనన్.. ఈసారి 'లీడర్'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇందులో పాయర్ రాజ్‌పుత్ హీరోయిన్ కాగా ఆండ్రియా, శ్యామ్, లాల్ తదితర స్టార్స్ ఉన్నారు. 

    (ఇదీ చదవండి: రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్)

  • స్టార్‌ హీరోయిన్‌ రవీనా టండన్‌ కూతురు రాషా తడానీ అప్పుడే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. చేసింది ఒక్క సినిమా (ఆజాద్‌)నే అయినా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇక ఆజాద్‌ మూవీలో ఉయి అమ్మా పాటలో డ్యాన్స్‌తో ఇరగదీసి సెన్సేషన్‌ అయింది. ఈ బ్యూటీ శ్రీనివాస మంగాపురం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఘట్టమనేని జయకృష్ణ (రమేశ్‌బాబు తనయుడు) వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు.

    సౌత్‌ సినిమాలంటే ఇష్టం
    ఈ మూవీలో రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు దక్షిణాది సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు.. ఇలా అందరి సినిమాలు చూస్తుంటాను. వాళ్ల సినిమాలన్నీ కొత్త అనుభూతినిస్తాయి. ఇప్పుడదే ఇండస్ట్రీలో భాగం కావడం సంతోషంగా ఉంది. దీన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నాను.

    హీరోయిన్స్‌ కూడా..
    హీరోలే కాదు, అక్కడ హీరోయిన్స్‌ రష్మిక మందన్నా, శ్రీలీల.. ఇలా అందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అలాంటి సినీ ప్రపంచంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు గర్వంగా ఉంది. నా జర్నీ చక్కగా ముందుకు సాగుతుందనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు రాషా.. లైకే లైకా అని ఓ హిందీ మూవీ కూడా చేస్తోంది.

    చదవండి: బాలీవుడ్‌ అంటే భయపడుతున్న నాగచైతన్య? నిజమిదే!

  • స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హవా బాలీవుడ్‌లో చాన్నాళ్ల నుంచి తగ్గుతూ వస్తోంది. దాదాపు సరైన హిట్ కొట్టి పదేళ్లవుతోంది. గతేడాది 'సికందర్' అనే మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 'మాతృభూమి' అనే దేశభక్తి సినిమా చేస్తున్నాడు. దీనిపైనే ఎవరికి పెద్దగా నమ్మకాల్లేవు. అలాంటిది ఇప్పుడు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో జట్టుకట్టాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

    (ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)

    మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు (వారసుడు) సినిమాలతో ఓ మాదిరి హిట్స్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించాడు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులోనే నయనతార హీరోయిన్ అని అంటున్నారు కానీ క్లారిటీ రావాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

  • నోరు జారిన కారణంగా రీసెంట్ టైంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న నటుడు శివాజీ.. గతేడాది 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ కాస్త బిజీగానే ఉన్నాడు. లేటెస్ట్‌గా ఈయన ఓ చిత్రాన్ని నిర్మించి అందులో లీడ్ రోల్ చేశారు. లయ జంటగా నటించింది. ఈ సినిమా ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో రానుంది?

    (ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)

    సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా శివాజీ-లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాని తొలుత ఓటీటీ కోసమే తీశారు. కానీ ఏమైందో ఏమో ఈ నెల 6న థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ శుక్రవారం(ఏ‍ప్రిల్ 03) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

    'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' విషయానికొస్తే.. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ కార్యదర్శి. హర్స్‌లీ హిల్స్‌లో భార్య ఉత్తర(లయ), కొడుకు బిట్టు(రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. దీపావళి నాడు వీళ్ల ఇంటికి ఎస్సై విక్రమ్ వాసుదేవ్(ప్రిన్స్) వస్తాడు. ఇతడికి ఆడవాళ్ల పిచ్చి. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలిసి ఉత్తరపై బలత్కారం చేయబోతాడు. అనుకోని విధంగా బిట్టు చేతిలో ఎస్సై హత్యకు గురవుతాడు. తర్వాత ఏమైంది? హత్య కేసు నుంచి శ్రీరామ్ తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'ప్రేమిస్తే' ఆడిషన్‌కు గ్రీజు పూసుకుని వెళ్లా..)

Telangana

  • హైదరాబాద్‌:  తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అసలు ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా? అని ప్రశ్నించారు. ఉద్యమ కారులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఉద్యమకారులను పట్టించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. 

    ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యమకారులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక వాగ్దానాలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం జాప్యం చేస్తోందని అన్నారు.

    వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి


     

  • హైదరాబాద్‌ దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో సోమవారం(మార్చి 30వ తేదీ )ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ లో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న రాజస్థాన్‌ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా సతీమణితో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సంస్కృతి, సాంప్రదాయాల పరంగా రాజస్థాన్‌కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భగవాన్ శ్రీ రాముడు, జన్మభూమి స్వర్గం కంటే మిన్న అని చెప్పారని.. వారి స్ఫూర్తితోనే రాజస్థాన్ ప్రజలు దేశ అభివృద్ధి, సాంస్కృతిక వికాసంకు గొప్ప సేవ చేస్తున్నారని గవర్నర్ కొనియాడారు. గవర్నర్ సందేశం అనంతరం ఏర్పాటు చేసిన రాజస్థాన్ సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి.  ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి  శశికిరణాచారి, ఇతర లోక్ భవన్ ఉన్నతాధికారులు, రాజస్థాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌: గిగ్ వర్కర్స్ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘శాసనసభలో మంత్రి వివేక్ వెంకస్వామి గిగ్ వర్కర్స్  బిల్లును తేవడం సంతోషంగా ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో గిగ్ వర్కర్స్ తో సమావేశం నిర్వహించారు. లక్షల మంది గిగ్ వర్కర్లు ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లులో వృత్తిపరంగా ఆరోగ్యపరమైన అంశాలు ఉన్నాయి.

    ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ప్రభుత్వం తరుఫున సాయం అందించడం లాంటివి ఉన్నాయి. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో లో గిగ్ వర్కర్స్ చట్టం తేవడం శుభపరిణామం. వారికి వృత్తిపరంగా ఇబ్బంది లేకుండా చట్టం చూసుకుంటుంది. గిగ్ వర్కర్ల బిల్లుపై హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం గిగ్ వర్కర్లకి అండగా ఉంటుంది’ అని అన్నారు.


    మతపరమైన విద్వేషాలను రెచ్చగొడితే చర్యలు   
    మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హేట్‌ స్పీచ్‌ అండ్‌ హేట్‌ క్రైమ్‌ ప్రివెన్షన్‌ బిల్లు-2026ను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును స్పీకర్‌.. సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేశారు. ‘తెలంగాణ విద్వేష పూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు’కు రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మత సామరస్యానికి భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో చేసే పోస్టులతో పాటు అల్లర్లు, ఘర్షణలను ప్రేరేపించేలా చేసే ప్రసంగాలను కట్టడి చేయడానికి ఈ బిల్లును రూపొందించారు.

Family

  • పచ్చగా పరుచుకున్న పచ్చిక, మంచుతో కప్పబడిన భారీ పర్వతాలు, వాటి మధ్యలో బొమ్మల్లా కనిపించే చిన్న చిన్న గ్రామాలు ... అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ పర్వతాలు. ఎండాకాలం రాగానే చల్లదనంతో రారమ్మని ఆహ్వానిస్తాయి. ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ అనే ఈ విశాలమైన పర్వత ప్రాంతం ఫ్రాన్స్‌లోని ప్రకృతి రమణీయతను అత్యంత అందంగా చూపుతుంది. 

    ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌లో ప్రతి దృశ్యం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సూర్యోదయం వేల బాల భానుని కిరణాలు మంచుపర్వతాల మీదుగా, పచ్చని గడ్డిపై పడి ఒక వింతైన బంగారు కాంతిని మనకు చూపుతుంది. చల్లని, స్వచ్ఛమైన గాలి మదిని తాకి వెళ్తుంటే, స్వర్గంలో ఉన్నామా ... అనే అనుభూతి కలుగుతోంది.

    సరస్సుల అందాలు
    ఇక్కడి సరస్సులు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ సంధ్యాకాలం కొత్త రంగుల్లో మెరిసి΄ోతాయి. ఈ సమయంలో కెమెరా కన్నా మనసుతో క్లిక్‌మనిపించే దృశ్యాలు ఎన్నో కనువిందుచేస్తాయి. మేఘాలు పర్వతాల మధ్య నెమ్మదిగా తిరుగుతూ, ఒక నిధానమైన ప్రయాణ అనుభూతిని ఇస్తాయి.

    సందర్శనీయ స్థలాలు
    ఇక్కడి చామోనిక్స్‌లో పర్వత జీవితం సహజంగా కనిపిస్తుంది. మోంట్‌ బ్లాంక్‌ పర్వత శిఖరాలు ఎండాకాలంలో కూడా మంచుతో మెరుస్తుంటాయి. ఆన్నెస్సీలో సరస్సు పక్కన నడక ఒక ప్రశాంత అనుభవాన్ని ఇస్తుంది. లేక్‌ ఆన్నెస్సీ నీరు క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. గ్రెనోబెల్‌లో నగర జీవితం, పర్వత జీవితం రెండింటి మేళవింపు కనిపిస్తుంది.

    నిశ్శబ్ధ సంగీతం..
    ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌లో జీవితం నెమ్మదిగా సాగుతుంది. చిన్న కేఫ్‌లలో కాఫీ తాగుతూ, గ్రామాల్లో నడుస్తూ సమయం గడపవచ్చు. ఇక్కడ ప్రజలు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తారు.

    పర్వతాల మీదుగా ప్రయాణం
    హైదరాబాద్‌ నుంచి ముందుగా ప్యారిస్‌ లేదా జెనీవా వరకు విమానంలో చేరుకోవాలి. 

    జెనీవా నుంచి ట్రైన్‌ లేదా రోడ్డు మార్గంలో ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ కు చేరుకోవచ్చు. 

    రైలు ప్రయాణంలో పర్వతాల అందమైన దృశ్యాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతాయి.

    వుడెన్‌ హౌజ్‌లో బస
    చిన్న చాలెట్స్, వుడెన్‌ హౌసెస్‌ లేదా సరస్సు పక్కన ఉన్న స్టేల్లో ఉండటం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే అనుభూతి పొందవచ్చు. కిటికీ నుంచి పర్వతాలు, మేఘాలు కనిపించే దృశ్యం ఎంతో ఆహ్లాదకరం.

    ఏం చూడాలి?
    మంచు పర్వతాలు
    పచ్చని పచ్చిక మైదానాల
    స్వచ్ఛమైన నీటితో తొణికసలాడే సరస్సులు.
    ఆహ్లాదభరితమైన గ్రామ జీవితం 
    ఇవి అన్నీ కలిసి సహజ సౌందర్యాన్ని కళ్లకు కడతాయి. 

    మరికొన్ని ఆసక్తికరమైనవి: 
    మాంట్‌ బ్లాంక్‌ అనే పర్వత శిఖరం ఇక్కడ అత్యంత ఎత్తైనది.

    ఇక్కడి చాలా సరస్సులు క్రిస్టల్‌ క్లియర్‌గా ఉంటాయి.

    వేసవిలోనూ మంచు శిఖరాలు కనిపిస్తాయి. 

    ఆల్పైన్‌ గ్రామాలు ఎన్నో శతాబ్దాలుగా తమ స్వరూపాన్ని అలాగే కాపాడుకున్నాయి.

    వాకింగ్, సైక్లింగ్‌కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి


    ఛీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు
    ఫ్రెంచ్‌ కంట్రీసైడ్‌లో బ్రెడ్, చీజ్‌తో తయారైన వేడి వేడి వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఫాండ్యూ అనేది ఇక్కడి గ్రామీణుల సంప్రదాయ వంటకం. వైట్‌వైన్, వెల్లుల్లి, ఇతర పదార్థాలను కలిపి తయారుచేసిన ఛీజ్‌లో గట్టిగా కాల్చిన రొట్టెముక్కలను ముంచుకొని, తింటారు. 

    బంగాళదుంప, ఉల్లిపాయలు, వైట్‌వైన్‌.. మొదలైన వాటితో తయారుచేసిన టార్టిఫ్లెట్‌ అనేది అక్కడి బలవర్ధకమైన ఒక వంటకం. ఇక్కడి వంటకాలలో సాస్‌లు ముఖ్యమైనవి. బ్లూబెర్రీ టార్టె అనేది ఇక్కడి పర్వత ప్రాతాలలోనివారికి ఇష్టమైన డిజెర్ట్‌. సంప్రదాయ మూలికలతో చేసే స్థానిక పానీయాలను తప్పక సేవించాల్సిందే.  

    ఎండకాలమే సరైనది...
    ఎండాకాలంలో ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండి, ప్రకృతి ఫ్రెష్‌ ఫీలింగ్‌ను అందిస్తుంది. ప్రతి దృశ్యం కొత్తగా అనిపిస్తుంది.

    ఫ్రెంచ్‌ ఆల్ఫ్స్‌ అంటే ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన జీవన విధానం. ఇక్కడ ప్రతి క్షణం మనసుకు విశ్రాంతి ఇస్తుంది. ఎండాకాలంలో కూడా ఒక చల్లని జ్ఞాపకంగా ఈ ప్రదేశం మనసులో నిలిచిపోతుంది.

    – ఎం.జి.కిశోర్,
    ప్రయాణికుడు.కామ్‌

    (చదవండి: నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌)


     

  • బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయన తన కుమార్తె లారాకు సంబంధించిన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. అంతేగాదు ఆయన దీనిపై ఓ పుస్తకం కూడా రాయాలనకుంటున్నా అంటూ చాలా భావోద్వేగంగా ఆ వ్యాధి గురించి వివరించారిలా.

    హీరో వరుణ్ ధావన్ తన కుమార్తె లారాకు డెవలప్‌మెంటల్ డిస్‌ప్లాసియా ఆఫ్ ది హిప్(DDH) అనే చలన సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో లారా కోలుకోవడానికి సహాయపడిందని ధావన్ తెలిపారు. ఆమెకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, DHH (డెవలప్‌మెంటల్ హిప్ డిస్‌ప్లాసియా) ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అంటే, తుంటి ఎముక సాకెట్ నుంచి జారిపోవడం. 

    ఒక కాలు మరొక కాలు కంటే పొడవుగా పెరుగుతుంది, దీనివల్ల నడవడం చాలా కష్టమవుతుందని అన్నారు. అంటే వాళ్లు సరిగ్గా పరిగెత్తలేరు, నడవలేరు అని చెప్పుకొచ్చారు. దీన్ని పాశ్చాత్య దేశాలలో పుట్టినప్పుడే దీనిని సరిగ్గా నిర్ధారిస్తారు, కానీ భారతదేశంలో అలా కాదని అన్నారు. 

    అయితే తన కూతురికి శస్త్ర చికిత్స చేయావలసిన అవసరం రాలేదన్నారు. ఒకే ప్రక్రియతో ఎముకను తిరిగి యథాస్థానంలోకి పెట్టగలిగారు. ఆమెకు స్పైకా కాస్ట్ వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చిన్నారి రెండున్నర నెలల పాటు ప్లాస్టర్‌ కట్టులో ఉండాలి. ఇది చాలా కష్టం. బిడ్డకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత ఆమె ప్లాస్టర్ కట్టుతోనే మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్లాస్టర్‌ తీసేశారని అన్నారు. తాను దీనిపై పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

    హిప్‌ డెవలప్‌మెంటల్ డిస్‌ప్లాసియా(DDH)అంటే..
    DDH అనేది శిశువులు,చిన్నపిల్లలలో తుంటిలోని 'బాల్ అండ్ సాకెట్' కీలు సరిగ్గా అమరని ఒక పరిస్థితి. సాధారణ పిల్లలలో, తుంటి కీలు తొడ ఎముకను కటి ఎముకకు కలుపుతుంది. తొడ ఎముక పైభాగం బంతిలా గుండ్రంగా ఉండి, గిన్నె ఆకారంలో ఉండే తుంటి సాకెట్ లోపల అమరి ఉంటుంది.

    అయితే, DDH ఉన్న పిల్లలలో, తుంటి సాకెట్ చాలా లోతు తక్కువగా ఉంటుంది మరియు తొడ ఎముక తల గట్టిగా పట్టుకోబడదు. అందువల్ల, తుంటి కీలు వదులుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో తొడ ఎముక సాకెట్ నుంచి బయటకు కూడా రావచ్చు, దీనివల్ల కీలు తప్పిపోతుంది (డిస్లోకేషన్). శారీరక పరీక్ష సమయంలో ఎముకను సాకెట్‌లో కదిలించవచ్చు, కానీ అది స్థానభ్రంశం చెందదు.

    కారణాలు
    ఈ పరిస్థితి ఒకటి లేదా రెండు తుంటి కీళ్లలో సంభవించవచ్చు.అయితే, ఇది సాధారణంగా ఎడమ తుంటి కీలులో ఎక్కువగా కనిపిస్తుంది. DDH వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని కారకాలు ఉన్నాయి.

    • అమ్మాయిలు

    • మొదటి సంతానం

    • కుటుంబాలలో చిన్నతనంలో తుంటి సమస్యలు ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు)

    • గర్భధారణ 28 వారాల తర్వాత బ్రీచ్ పొజిషన్‌లో (పాదాలు లేదా పిరుదులు క్రిందికి) జన్మించిన శిశువులు

    లక్షణాలు
    తుంటి కీలు తప్పిన కొంతమంది శిశువులలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, శిశువుకు ఈ క్రింది లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.

    • కాళ్ళు వేర్వేరు పొడవులలో ఉండటం

    • తొడపై అసమాన చర్మపు మడతలు

    • ఒక వైపు కదలిక లేదా వశ్యత తక్కువగా ఉండటం

    • కుంటుతూ నడవడం, కాలి వేళ్ళపై నడవడం, లేదా తూలుతూ నడవడం

    నిర్ధారణ
    NHS ప్రకారం, శిశువు పుట్టిన 72 గంటలలోపు లేదా 6 నుంచి 8 వారాల వయస్సులో గుర్తిస్తారు. సాధారణంగా నవజాత శిశువుల శారీరక పరీక్షలో భాగంగా వారి తుంటిని తనిఖీ చేస్తారు. ఈ పరీక్షలో, ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడటానికి  శిశువు తుంటి కీళ్ళను సున్నితంగా కదిలించడం కూడా ఉంటుంది.

    ఒకవేళ డాక్టర్,  బిడ్డ తుంటి అస్థిరంగా ఉందని భావిస్తే, 4 నుంచి 6 వారాల వయస్సు మధ్యలో వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.

    కుటుంబ చరిత్రలో లేదా చిన్నతనంలో తుంటికి సంబంధించిన సమస్యలు ఉండి ఉంటే

    గర్భధారణ 28 వారాల తర్వాత  బిడ్డ బ్రీచ్ పొజిషన్‌లో (కాళ్ళు లేదా పిరుదులు కిందికి ఉండేలా) జన్మించి ఉంటే

    కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు పుట్టి, వారిలో ఒక శిశువు బ్రీచ్ పొజిషన్‌లో ఉంటే, ప్రతి శిశువుకు 4 నుంచి6 వారాల వయస్సు వచ్చేసరికి వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.

    ఎదురయ్యే సమస్యలు..

    నడవడంలో ఇబ్బందులు, ఉదాహరణకు కుంటి నడక

    నొప్పి

    తుంటి, వెన్నుపూసల ఆస్టియో ఆర్థరైటిస్

    సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉంటుందని,  వారు సాధారణంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. 

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: ఆ వ్యాయామ మెషీన్‌తో 113 కిలోల నుంచి 90కిలోలు..! ఆ సర్జరీ సైతం..)
     

  • ప్రముఖుల జీవితకథలు పుస్తకాలుగా నిరంతర ఆదరణకు నోచుకుంటాయి. అందులోనూ వారు సినీ తారలైతే ఇక చెప్పేది ఏముంది! సినీ తారల పట్ల అందరికీ ఉండే ఆసక్తి అలాంటిది. సదరు సినిమా తార అనేక విధాలుగా ప్రథమశ్రేణిలో నిలిచిన వ్యక్తి అయితే, చారిత్రకంగానూ ఆ రచనకు ప్రాధాన్యం ఉంటుంది. తొలి భారతీయ బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’ (1936)లో టైటిల్‌ రోల్‌ ధరించడంతో మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎదిగి, దర్శక – నిర్మాత మీర్జాపురం రాజా వారితో వివాహంతో మహారాణిగా మారి, స్వయంగా నిర్మాత అయి, శోభనాచలా సినీ స్టూడియో అధినేత్రిగా నిరూపించుకొని, నూరేళ్ళ నిండు జీవితం గడిపి, ఇటీవలే మరణించిన చిత్తజల్లు కృష్ణవేణి (1924 – 2025) జీవిత కథ అందుకనే ఆసక్తిగా అనిపిస్తుంది.

    జీవితచరిత్రను సైతం కేవలం వివరాలు, విశేషాలను ఏకరవు పెట్టే రూపంలో కాకుండా, కాల్పనిక సాహిత్య మార్గంలో ఒక మంచి నవలను చదువుతున్న పద్ధతిలో అందించడం ఎప్పుడైనా ఆకర్షించే పద్ధతే. సమకాలీన రచయితలు కొందరు ఆ కోవలో అక్షరబద్ధం చేసిన జీవిత కథలు సాహితీ లోకానికి ఇప్పటికే సుపరిచితం. పైగా, రచయిత్రి పల్లవి రాసిన మహానటి సావిత్రి జీవితకథ ‘సావిత్రి’ లాంటివి గతంలో బెస్ట్‌ సెల్లర్స్‌ కావడమూ అందుకు నిదర్శనం. ఆ రకమైన రచనా సంవిధానంలో మెప్పించే మెరుపులు చాలానే ఉంటాయి కానీ, కొన్నిసార్లు... అసలు జరిగిన వాస్తవమేదో, కొసరు కవికల్పన ఏదో తెలియనంతగా పాలు, నీళ్ళు కలసినట్టు సాగిపోతాయి. వీలైనంత వరకు చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను పేర్కొంటూనే, సంఘటనను నాటకీయంగా చెప్పడంలో రచయిత నిజాయతీ, నైపుణ్యం రాణకెక్కుతాయి.  ఉత్తమ పత్రికా రచయితగా నంది అవార్డులు అందుకున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ భగీరథ తన తాజా ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచనలో అక్షరాలా చేసినది అదే!

    ఒక మంచి ఇతివృత్తం చేయి తిరిగిన వ్యక్తి చేతిలో పడినప్పుడు అది కొత్త సొబగులు సంతరించుకోవడం సహజం. రచయితగా, పత్రికా రచయితగా ఎన్నో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న భగీరథ ఈ రచనలో దాన్ని సమర్థంగా వినియోగించారు. ఇటీవల ఎన్టీఆర్‌పై ‘తారకరామం’, ‘శకపురుషుడు’ లాంటి పుస్తకాలు, అలాగే కృష్ణదేవరాయల కాలంపై రాసిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ ద్వారా నవతరం పాఠకులకు సైతం ఆయన సుపరిచితులే. సినీ సుప్రసిద్ధుల జీవిత కథలు రాయడం కూడా ఆయనకేమీ కొత్త కాదు. గతంలో నటి జమున అంతరంగావిష్కరణ ‘జమునా తీరం’, భాగ్యనగర్‌ స్టూడియోస్‌ వ్యవస్థాపక అధినేత బాదం రామస్వామిపై ‘మహర్జాతకుడు’, హీరో జగపతి బాబు తండ్రి – ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌పై ‘దసరా బుల్లోడు’ లాంటి సినీ జీవిత కథలు ఆయన కలం నుంచి వచ్చి, అశేష ఆదరణకు నోచుకున్నాయి. 

    ఇప్పుడు అలనాటి హీరోయిన్‌ కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్‌.ఆర్‌. అనూరాధాదేవి పనుపున భగీరథ ఈ ‘మీర్జాపురం రాణి... కృష్ణవేణి’ రచన చేశారు. కృష్ణవేణి జీవితంతో పాటు ఆ సమకాలీన పరిస్థితుల్ని రచనలో ప్రతిబింబించేందుకు రచయిత కసరత్తు చేశారు. నిజానికి, నటుడు ఎన్టీఆర్‌ – సంగీత దర్శకుడు ఘంటసాల – సుస్వరాల రమేశ్‌ నాయుడు... ఇలా ఎందరో మహామహుల్ని సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది.

    చిన్న వయసులోనే తల్లి లేని బిడ్డగా సవతి తల్లితో ఇబ్బందులు పడడం, పిన్ని – బాబాయ్‌ వద్ద పెరగడం, రంగస్థలంపై ఆసక్తి పెరగడం, అప్పట్లో భానుమతి, రేలంగి, అంజలీదేవి సహా ఎందరినో స్టార్లుగా తీర్చిదిద్ది ‘తారాబ్రహ్మ’గా పేరొందిన సినీ దర్శక – నిర్మాత చిత్తజల్లు పుల్లయ్య గారి ప్రోత్సాహం లభించడం, ఎనిమిది – తొమ్మిదేళ్ళ వయసులోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ’లో టైటిల్‌ రోల్‌ పోషించడం, పితృసమానుడైన పుల్లయ్య గారి మీద అపార గౌరవంతో యర్రంశెట్టి కృష్ణవేణి కాస్తా చిత్తజల్లు కృష్ణవేణిగా మారడం, ఆ పైన హీరోయిన్‌గా రాణించడం, మీర్జాపురం రాజా వారు (మేకా వెంకట్రామయ్య అప్పారావు)తో వివాహం, భర్త జస్టిస్‌ పార్టీ అయితే తాను కాంగ్రెస్‌ సానుభూతిపరురాలిగా ‘మన దేశం’ (1949) లాంటి చిత్ర నిర్మాణం సాగించడం,  ‘కీలుగుర్రం’ – ‘గొల్లభామ’,  'లక్ష్మమ్మ' లాంటి బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాల రూపకల్పన లాంటి తొలినాళ్ళ సినీ చరిత్రలోని ఆసక్తికరమైన ఘట్టాలెన్నో ఈ రచనలో చదవవచ్చు. నిండు నూరేళ్ళు జీవించిన ఆమె ప్రస్థానంలోని అనేక ఘట్టాలను చదువుతుంటే... అచ్చంగా ఓ సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రచనా శైలి సాగుతుంది. ప్రతి సంఘటననూ దృశ్యమానమయ్యే రీతిలో రాయడంతో... ఒక రకంగా ఇది కాగితంపై అక్షరాలలో కనిపించే ఓ బయోపిక్‌ అనవచ్చు.  

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ మొదలు ‘సాక్షి – ఎక్సలెన్స్‌ అవార్డ్‌’ (లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌) సహా ఎన్నో గుర్తింపులు పొందిన సి. కృష్ణవేణి జీవితకథ చదువుతుంటే... కేవలం ఓ వ్యక్తి జీవితంగా అనిపించదు. దాదాపు నూరేళ్ళ కాలగతిలో సమాజంలోనూ, సినిమాలోనూ వచ్చిన మార్పులు సైతం కళ్ళ ముందు రీళ్ళు తిరుగుతాయి. మహిళలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చూస్తూ, సమాజం ఇంతగా పురోగమించని రోజుల్లోనే... కృష్ణవేణి సాగించిన జీవితం, సాధించిన విజయం అబ్బురపరుస్తాయి. ఇవాళ్టికీ ఎందరికో స్ఫూర్తిమంత్రంగా నిలుస్తాయి. 

    అరుదైన ఫోటోలతో పాటు, అవి అందుబాటులో లేని కీలక ఘట్టాలకు రేఖాచిత్రాలను సుప్రసిద్ధ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్‌తో ప్రత్యేకంగా గీయించడం ఈ 516 పేజీల రచనకు వన్నె తెచ్చింది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అనేక అడ్డంకులున్న ఆ రోజుల్లోనే ఎంత సమున్నత స్థాయికి చేరి, నూరేళ్ళ జీవితాన్ని పండించుకుందో తెలిపే ఈ రచన నేటి తరానికీ ప్రేరణనిచ్చే పాఠం. ఆపకుండా చదివించడంతో పాటు... అన్నీ కళ్ళ ముందే జరుగుతున్న అనుభూతిని కలిగించడంతో... ఈ జీవితకథ సినీచరిత్రపై ఆసక్తి గలవారికి అందమైన బహుమానం.

    మీర్జాపురం రాణి... కృష్ణవేణి  (నటి కృష్ణవేణి జీవితకథ), రచన – భగీరథ, ప్రతులకు – నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్‌. మొబైల్‌ – 92474 71361).

    – రెంటాల జయదేవ

  • సాధువులు చూడగానే..ఆధ్యాత్మికంగా చాలా జ్ఞానం ఉన్నవారనే భావనే ఉంటుంది. వారికి ఆధునికత, వివిధ భాషలు తెలిసి ఉండటం అత్యంత అరుదు అని అందరి భావన. గతేడాది కుంభమేళలో మేధావులైన బాబాలను చూసే వరకు అందరి భావన ఇలానే ఉండేది.  అయితే మన చుట్టుపక్కల పరిసరాల్లో తరుచుగా కనిపించే బాబాలు విద్యావంతులేనా అనేది సంశయాత్మక ప్రశ్నే. అయితే ఈ బాబాను చూస్తే ఆ అభిప్రాయం కూడా మారిపోతుందేమో..

    అందుకు సంబంధించిన వీడియని వాసుదేవ్ కచ్ఛవా అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో క్లిప్‌లో సాధుబాబా సమీపంలో పుస్తకాల షాపు వద్ద బల్లపై ఉంచిన పుస్తకాలను తిరగేస్తూ కనిపిస్తారు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఈ పుస్తకాలన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. మీకు ఇంగ్లీస్‌ వచ్చా అని ప్రశ్నిస్తాడు. 

    దానికి ఆ సాధు బాబా ఒక పుస్తకాన్ని తీసుకుని చదవి ఇది రెండొవ అధ్యాయం అని స్పష్టంగా చెబుతాడు. మీకు ఇంత ఇంగ్లీష్‌ ఎలా వచ్చు అని అడగగా..తాను ఇంగ్లీష్‌ చదువుకున్నట్లు చెబుతాడు. ఆ తర్వాత మరో పుస్తకాన్ని ఇస్తూ..చదవమని కోరతాడు. ఆ పుస్తకం వైపు చూస్తూ..'ది సైలెంట్ పేషెంట్'' అని  బదులు ఇస్తాడు. మాకు కూడా ఇంత ఇంగ్లీష్‌ రాదు అనగా, అందుకు ఆ సాధువు వ్యగ్యంగా మీర అంత చదువు చదువుకుని ఉండరు అని కౌంటరిస్తాడు. 

    అందుకు సదరు వ్యక్తి మీరు ఎంత వరకు చదువుకున్నారు అని అడుగుతాడు..దానికి బాబా..తాము సాధువులమని దాన్ని బహిర్గతం చేస్తే తమ సర్టిఫికేట్‌లు విలువని కోల్పోతాయని అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం బాబా క్లాస్‌టాపర్‌..అదరగొట్టేశారు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

     

     

    (చదవండి: నేచర్‌ లవర్స్‌కు డ్రీమ్‌ డెస్టినేషన్‌)