Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు.  

    ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు.  

  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. దీంతో, బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

    వివరాల మేరకు.. రాజమండ్రిలోని రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం సాయంత్రం రెండు పల్సర్‌ బైక్‌లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి రాజమండ్రి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

  • సాక్షి,గుంటూరు: తిరుమల లడ్డూ కల్తీ జరగలేదంటూ సీబీఐ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ పెరిగిపోతుందా? అంటే అవుననే అంటున్నారు జనసేన పార్టీ నేతలు. అందుకు ఇవాళ గుంటూరులో జరిగిన జనసేన జనరల్‌ బాడీ మీటింగ్‌ వేదికైందని గుసగుసలాడుకుంటున్నారు. 

    సోమవారం గుంటూరులో జనసేన జనరల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు.  లడ్డూ వ్యవహారంలో తిప్పికొట్టలేకపోతున్నామంటూ పవన్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం నుంచి వెళ్లిపోయారు. 

  • సాక్షి,ఎన్టీఆర్‌: మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై బాంబు దాడి ఘటనలో పోలీసులు హైడ్రామా క్రియేట్‌ చేశారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై  పోలీసులు డమ్మీ  కేసులు నమోదు నమోదు చేశారు.  వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు.  

    ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై వందలాది టీడీపీ గూండాలు దాడికి దిగారు. పెట్రోల్‌ బాంబులు విసిరారు. మారణాయుధాలు, రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. అయితే, జోగి రమేష్‌ ఇంటికి నిప్పు పెట్టి, దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం, వారిపై బెయిల్‌ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేసేందుకు విజయవాడ నుంచి టీడీపీ గూండాలు వెళ్లడం,వారిని అరెస్టు చేసి బెయిల్‌ ఇవ్వడంపై  పోలీసులు క్రియేట్‌ చేసి హైడ్రామాను చూసి నవ్వుకోవడం ప్రజల వంతైంది.   

  • సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్‌ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్‌ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులలే బాధ్యత అని తెలిపింది.

    కాగా, తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్‌ కుమారుడు.. ఏపీలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జోగి రమేష్‌ ఇంటి వద్ద భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

    జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసుల హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ  కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్‌ చేశారు. అనంతరం, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతావుల్లా, మాధవ్, ఆశ సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. వీరంతా విజయవాడ నుండి దాడికి వెళ్లిన టీడీపీ నేతలు కావడం గమనార్హం. 

    జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana

  • సాక్షి హైదరాబాద్: సినీ నటుడు చిరంజీవిని రాష్ట్ర మంత్రి కొండాసురేఖ తన కూతురుతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి అంజనేయ స్వామి చిత్రపటాన్ని మంత్రి అందజేశారు. ఇటీవల చిరంజీవికి మనవడు పుట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చిరంజీవి కుమారుడు రాంచరణ్‌కు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.

  • సాక్షి, హైద‌రాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయశాంతిరెడ్డి బ‌ల‌న్మ‌వ‌ర‌ణం కేసులో వాస్త‌వాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. త‌న పిల్ల‌లిద్ద‌రితో క‌లిసి శ‌నివారం తెల్ల‌వారుజామున చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో గూడ్స్ రైలు కింద ప‌డి ఆమె బ‌ల‌న్మ‌వ‌ర‌ణానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్ప‌డ్డార‌నే దాని గురించి ఇంకా వెల్ల‌డి కాలేదు. దీంతో విజయశాంతిరెడ్డి మొబైల్‌ ఫోన్‌ను సైబర్‌ క్రైం పోలీసులకు పంపించారు. అందులోని స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తే కార‌ణం తెలిసే అవ‌కాశ‌ముంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

    ఈ కేసులో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని రైల్వే డీఎస్పీ జావిద్ సోమ‌వారం సాక్షి టీవీతో చెప్పారు. ''ఇలాంటి ఘటన జరగటం బాధాకరం. విజయశాంతి రెడ్డి త‌న‌ ఇద్దరు పిల్లలని తీసుకుని జ‌న‌వ‌రి 30 అర్ధరాత్రి చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌కు వచ్చిన త‌ర్వాత‌ కొంతసేపు అటు ఇటు తిరిగారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏమి లేవనీ తెలుస్తుంది. ఏదో బల‌మైన కారణంతోనే ఆమె బ‌ల‌న్మ‌వ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటారు. పార్కింగ్ స్లిప్ వెనకాల రాసిన సూసైడ్ నోట్ ఆమె కారులో మాకు దొరికింది. 28వ తేదీన విజయశాంతి రెడ్డి- సురేంద‌ర్ రెడ్డిల పెళ్లి రోజు అని తెలిసింది. 31 తేదీ సురేంద‌ర్ రెడ్డి పుట్టిన రోజు అని తెలిసింది. మరింత లోతుగా విచారణ చేస్తున్నామ‌''ని రైల్వే డీఎస్పీ జావిద్ తెలిపారు.

    ప్లీజ్‌.. చ‌నిపోవ‌ద్దు 
    మంచి ఉద్యోగం, కుటుంబం ఉన్న విజ‌య‌శాంతి రెడ్డి (Vijayashanti Reddy) ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌నే దానిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. త‌నతో పాటు పిల్ల‌ల ప్రాణాలు తీయ‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. చ‌దువుని, ఉద్యోగం చేస్తున్న ఆమె ఇలా చేయ‌డం ఎంత‌మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని వాదిస్తున్నారు. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డాల‌ని, కనీసం పిల్ల‌ల కోస‌మైనా ఆలోచించాల్సింద‌ని అంటున్నారు. అయితే ఒంట‌రితనం కార‌ణంగా ఆమె ఎంతో బాధ అనుభ‌వించి ఉండొచ్చ‌ని, ఎవ‌రికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణ‌యానికి ఉండొచ్చ‌ని కొంత‌మంది పేర్కొన్నారు. ఏదేమైనా బ‌తికి సాధించాల‌ని, చావుతో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు.

    సూసైడ్‌నోట్ ఏం రాశారంటే..?
     

  • సాక్షి, హైదరాబాద్‌: కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద గన్‌ ఫైర్‌ కేసులో పురోగతి చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు ఇద్దరు నిందితుల్ని గుర్తించగలిగారు. వాళ్లను ట్రేస్‌ చేసి పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

    శనివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు డిపాజిట్‌ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి దుండగులు క్యాష్‌ బ్యాగుతో పారిపోయారు. బుల్లెట్‌ గాయమైన బాధితుడ్ని సకాలంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.6 లక్షల చోరీ జరిగినట్లు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తును ఐదు బృందాలను నియమించారు. అయితే.. 

    బాధితుడి స్కూటీపైనే పారిపోయిన నిందితులు.. కాచిగూడ దగ్గర ఆ బండి వదిలేసి పారిపోయారు. ఈ క్రమంలో.. 800​కు పైగా సీసీకెమెరాలను పరిశీలించిన ప్రత్యేక బృందాలు వాళ్ల ఆచూకీని కనిపెట్టగలిగాయి. నిందితుల్లో ఒకడ్ని పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు.. సెల్‌ఫోన్‌ పవర్‌ డంపింగ్‌ ద్వారా వాళ్ల మొబైల్‌ నెంబర్లు సేకరించగలిగారు. ఆ నెంబర్ల ద్వారా వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని అంటున్నారు. 

    ఫోన్ డంప్.. డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో ఉపయోగించే ప్రక్రియ. ఇందులో ఒక మొబైల్ ఫోన్‌లోని మొత్తం డేటా (కాంటాక్ట్స్, మెసేజెస్, ఫోటోలు, వీడియోలు, యాప్ సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ డేటా) బయటకు తీసి విశ్లేషిస్తారు. ముఖ్యంగా పోలీస్ విచారణలు, క్రిమినల్ కేసులు, సివిల్ లిటిగేషన్, లేదా కార్పొరేట్ దర్యాప్తుల్లో ఆధారాలు సేకరించడానికి ఉపయోగపడుతుంది.

Movies

  • నాని, రామ్‌ చరణ్‌ సినిమాలు అనధికారికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు కొత్త రిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో "ది ప్యారడైజ్" సినిమాపై దాదాపు స్పష్టత వచ్చింది. మార్చి నుంచి తప్పుకున్న ఈ సినిమాను జూన్ చివర్లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులకు కూడా ఓ డెడ్‌లైన్స్ పెట్టి, ఆ గడువులోగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇవి కేవలం యూనిట్ నిర్ణయించిన తేదీలు మాత్రమే. పూర్తిగా క్లారిటీ వచ్చాకనే అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు కాస్త ఎక్కువ టైమ్‌నే తీసుకుంటున్నారు.  

    మరోవైపు రామ్‌ చరణ్‌ "పెద్ది" సినిమా రిలీజ్‌ విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్యారడైజ్‌తో పోలిస్తే పెద్ది షూటింగ్ ముందే పూర్తి అవుతోంది. మొన్నటి వరకూ మే 1న రిలీజ్‌ చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీపై కూడా యూనిట్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన "చికిరి" సాంగ్ పెద్ద హిట్ అయింది. త్వరలోనే సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. ఇక అదే సమయంలో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.  
     

  • వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం డియర్‌ ఆస్ట్రోనాట్‌. ఈ మూవీకి కార్తిక్‌ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వితికా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో వితికా శేరు భర్త వరుణ్‌ సందేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఇవాళ వితికా శేరు బర్త్‌ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. 

    తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా వితికా షేరు కనిపించనున్నారు. అంజలి అనే వ్యోమగామి పాత్రలో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన గ్లింప్ల్ విజువల్స్‌ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని  యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత్ర పెద్ది, గీతా భాస్కర్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తున్నారు.
     

  • అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.

    దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.

    హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

    హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి  అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు.

     

  • టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) పేరు పరిచయం ‍అక్కర్లేదు. తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సంగీత దర్శకుల గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఏఆర్‌ రెహమాన్‌తో పాటు ఎస్ఎస్ తమన్ గురించి వ్యాఖ్యానించారు.

    టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ గుర్తిస్తుందని కోటి అన్నారు. తమన్ కూడా మంచి మ్యూజిక్ అందించారని.. నేషనల్ ‍అవార్డ్ కూడా అందుకున్నాడని.. వరల్డ్ మ్యూజిక్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపారు. బీజీఎం పరంగా తమన్ స్టైల్ చాలా బాగుంటుందని అన్నారు. తమన్ రిపీటెడ్‌గా చేయడంపై చేస్తారన్న ప్రశ్నకు కోటి స్పందించారు.

    ఇక్కడ అతనికి ఒక ప్రొగ్రెషన్ అనేది రిపీట్ అవుతుందని కోటి అన్నారు. తన అనుభవం అంతవరకే.. అది మారదని తెలిపారు. ఎవరికైనా ఒక టైమ్ ఉంటుందని.. అంతవరకే చేయగలరని వెల్లడించారు. కొత్త నీరు వస్తూనే ఉంటోంది.. దాన్ని మనం అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరి స్టాండర్స్ వాళ్లవని సంగీత దర్శకుడు కోటి అన్నారు. మార్కెట్‌ ప్రకారమే మనం ముందుకు వెళ్లాలని సూచించారు. మ్యూజిక్‌లో ‍ప్రజంటేషన్‌ అనేది చాలా ముఖ్యమని తెలిపారు.  ఇప్పుడున్న జనరేషన్‌లో నాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని అన్నారు. 

     

     

     

     

     

  • టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం తన 70వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనదైన కామెడీతో సినీ ప్రియులను దశాబ్దాలుగా అలరించిన బ్రహ్మనందం 42 ఏళ్లుగా వెండితెరపై అలరిస్తున్నారు. తాజాగా తన 70వ బర్త్ డే వేడుకలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.

    ఇన్నేళ్లుగా తాను నటుడిగా కొనసాగుతున్నానంటే అదంతా ప్రేక్షకులు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలే కారణమని అన్నారు. నా సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇవాళ ఈ స్థితిలో ఉన్నందుకు తెలుగు కళామతల్లికి శిరస్సు వంచి పాదాభినందనాలు చేస్తున్నానన్నారు. ఇన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులు గొప్పతనం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని బ్రహ్మనందం తెలిపారు.

    నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కీర్తిశేషులు జంధ్యాల గారు, చిరంజీవి, రామానాయుడే కారణమని బ్రహ్మనందం అన్నారు. నాలో టాలెంట్‌ను గుర్తించి చంటబ్బాయి సినిమాలో నన్ను చిరంజీవి పరిచయం చేశారు. ఆ తర్వాత జంధ్యాల నాకు ఆహా నా పెళ్లంట మూవీలో అవకాశమిచ్చారని తెలిపారు. ఇన్ని వందల సినిమాలు చేయడంలో నా గొప్పతనం ఏమీ లేదన్నారు. మీ అందరి ఆదరణ, ప్రేమ వల్లే ఈ బ్రహ్మనందం ఇక్కడ ఉన్నారని అన్నారు.

     

  • ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్‌ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్‌ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్‌లోనే హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..

    పాప తెచ్చిన సంతోషం
    బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ 2023లో 'యానిమల్‌' మూవీతో సాలిడ్‌ హిట్‌ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్‌ కెరీర్‌లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్‌- ఆలియా భట్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్‌ పార్క్‌ రాబోతోంది.

    అదృష్టం
    బాలీవుడ్‌లో మరో స్టార్‌ జోడీ రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్‌వీర్‌ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్‌ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్‌ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు కూడా సీక్వెల్‌ వస్తోంది. ఈ ఏప్రిల్‌ 17న ధురంధర్‌ 2 విడుదల కానుంది.

    పెద్ది కూడా బ్లాక్‌బస్టర్‌!
    టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్‌ నెక్స్ట్‌ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.

    చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్‌ విన్నర్‌ను గెస్‌ చేస్తే రూ.50 లక్షలు!

  • టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు గురించి ప్రత్యేకంగా పరిచయం ‍అక్కర్లేదు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి బిగ్‌బాగ్ 3వ సీజన్‪లో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

    అయితే గతేడాది వరుణ్ సందేశ్ బర్త్‌ డే కానుకగా ఏకంగా సొంతింటినే గిఫ్ట్‌గా ఇచ్చింది వితికా శేరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది.  అంతేకాకుండా 2025 నవంబర్‌లో తన చెల్లి సీమంతం వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన చెల్లి సీమంతాన్ని తానే దగ్గరుండి మరీ నడిపించింది.  అక్కగా అన్నీ తానై చెల్లి క్రితిక శేరు సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది.

    తాజాగా ఇవాళ తన అక్క వితికా శేరు బర్త్‌ డే కావడంతో చెల్లి క్రితిక శేరు విషెస్ తెలిపింది. తన కోసం అక్క చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది. తన వెంట ఉంటూ అండగా నిలిచిన అక్కకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చాలా కాలంగా నేను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నా.. బాధ్యతలను మోస్తూ.. మన కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కెరీర్‌ను నిర్మించుకుంటూనే ఉన్నావంటూ రాసుకొచ్చింది.  నా చిన్నప్పుడు ఇతరుల్లో ఉన్నంత అనుబంధం మనలో లేదని నాకు అనిపించింది.. కారణాలు తెలియకుండానే నిన్ను చాలాసార్లు ప్రశ్నించానంటూ భావోద్వేగానికి గురైంది క్రితిక శేరు.

    క్రితిక శేరు తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా పెళ్లి తర్వాత.. ముఖ్యంగా ఈ గర్భధారణ సమయంలో ప్రతిదీ మారిపోయింది. దూరం వల్ల నీ ప్రేమ నాకు చాలా స్పష్టంగా కనిపించింది. నువ్వు చిన్న చిన్న విషయాలను గమనించావు. నన్ను భావోద్వేగంగా.. మానసికంగా ఆదుకున్నావు. ఈ ప్రయాణాన్ని నాకు చాలా సులభతరం చేసి మరింత అందంగా మార్చావ్. నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా  నా కోసం నువ్వు నిలబడ్డావ్. చివరికీ ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకున్నా అక్కా. నీ ప్రేమ నాపై ఎల్లప్పుడూ బలంగా ఉంది. నువ్వు నా కోసం చేసిన ప్రతి చిన్న పనికి ధన్యవాదాలు. ఈ రోజు నా బలం, నా మద్దతు.. నాకు అతిపెద్ద ఆశీర్వాదం నువ్వే అక్కా. నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది తెలుసుకున్న అభిమానులు వితికా శేరుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.  

  • వెనక్కి తిరిగి పోజులిచ్చేస్తున్న జాన్వీ కపూర్

    ఆరెంజ్ డ్రస్‌లో మృణాల్ డిఫరెంట్ లుక్

    క్యూట్ అండ్ స్వీట్‌గా కాజల్ అగర్వాల్

    వీకెండ్ ఎంజాయ్‌ వీడియోతో అనసూయ

    హాట్ చాక్లెట్‌లా ముద్దుగుమ్మ సన్నీ లియోన్

    దుబాయి ట్రిప్‌లో హీరోయిన్ దివ్య భారతి

  • ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒకటి! మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. కిషోర్‌ తిరుమల దర్వకత్వం వహించిన ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. 

    వీడియో సాంగ్‌ రిలీజ్‌
    ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ మూవీ జనవరి 13న విడుదలవగా మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'బెల్లా బెల్లా.. ఈసబెల్లా.. బాగున్నావే రసగుల్లా' వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటలో రవితేజ, ఆషికా హుషారుగా స్టెప్పులేశారు. సురేశ్‌ గంగుల లిరిక్స్‌ సమకూర్చిన ఈ పాటను నకాశ్‌ అజీజ్‌, రోహిని ఆలపించారు. ఈ పాటను మీరూ చూసేయండి..

     

    చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ

  • సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే పర్సనల్‌ లైఫ్‌పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్‌ ధనుశ్‌ను ఆమె పెళ్లాడనుందని వార్తలొచ్చాయి. వీటిపై తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ధనుశ్ తనకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే కాదు.. ఒక అన్నలాంటి వాడని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన దో దివానే శహర్‌ మే అనే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ఈ విషయంపై స్పందించింది.

    అంతేకాకుండా తన బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌ గురించి మృణాల్ చెప్పేసింది. నేను యాక్టింగ్ చేయడం అతనికి నచ్చలేదని.. మేము విడిపోవడానికి అదే కారణమని తెలిపింది. నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని అతనే బ్రేకప్ చెప్పేశాడని వెల్లడించింది. ఈ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని.. అలాంటి వాడితో కొనసాగడం కష్టంగా అనిపించిందని పేర్కొంది. అందుకే అతనితో విడిపోవాల్సి వచ్చిందని మృణాల్ చెప్పుకొచ్చింది. బ్రేకప్ తర్వాత అతని గురించి జాలిపడ్డానని తెలిపింది. 

    కాగా.. మృణాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం దో దివానే శహర్ మే. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. అంతే కాకుండా టాలీవుడ్ హీరో అడివి శేష్‌ సరసన డకాయిట్‌లో మృణాల్‌ నటిస్తోంది.  ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది.

  • హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న హీరో సంతోష్ శోభన్.. కాస్త గ్యాప్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మూవీ చేశాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

    అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. అనుకోకుండా ఓసారి కలిసిన హీరోహీరోయిన్లు.. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ లివింగ్ రిలేషన్‌షిప్ మెంటైన్ చేస్తారు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

  • సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ వల్ల కెరీర్‌ తొలినాళ్లలో తనను ఉద్యోగం నుంచి పీకేశారంటున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమాల్‌ మాలిక్‌. ఇతడి తండ్రి డబూ మాలిక్‌ సంగీత దర్శకుడిగా, సింగర్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న కొడుకు, సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ కూడా తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెద్ద కొడుకు అమాల్‌ మాలిక్‌ మాత్రం ఆ స్థాయి గుర్తింపు అందుకోలేకపోయాడు. 

    15 ఏళ్లకే..
    ఇటీవలే ఇతడు హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో పాల్గొన్నాడు. తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమాల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డుపైకి వచ్చి పని వేట మొదలుపెట్టాను. దాదాపు 10 ఏళ్లు ఎంతో కష్టపడ్డాను. అసిస్టెంట్‌గా పని చేశాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండే సినిమాల హార్డ్‌ డిస్కులు తీసిపెట్టుకునేవాడిని. తర్వాత దానితో డబ్బు సంపాదించొచ్చన్నది నా ఆశ.

    అవమానం
    అయితే నా పేరు పక్కన మాలిక్‌ ఉందన్న విషయం తెలియగానే వెంటనే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేవారు. ఇతడు ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఒకవేళ మన సినిమాలోని మ్యూజిక్‌ను బయటవాళ్లకు అమ్మేసినా అమ్మేస్తాడు అని అవమానించి మరీ పక్కనపెట్టేవారు. దానివల్ల నాకు, తమ్ముడికి సరిగా పని దొరక్కపోయేది. మాకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టి మా జర్నీలో కష్టాలే లేవని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని చెప్పుకొచ్చాడు.

    సంగీత దర్శకుడిగా..
    అమాల్‌ మాలిక్‌.. సల్మాన్‌ ఖాన్‌ జై హో సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఏక్‌ పహేలీ లీలా, హీరో, క్యాలెండర్‌ గర్ల్స్‌, హేట్‌ స్టోరీ 3, ఎయిర్‌లిఫ్ట్‌, బాఘీ, బద్రీనాథ్‌ కీ దుల్హానియా వంటి పలు చిత్రాల్లో పాటలు కంపోజ్‌ చేశాడు.

    చదవండి: 50 మంది సెలబ్రిటీలతో గేమ్‌ షో

  • ఇప్పుడంటే టాలీవుడ్‌లో తమన్, దేవిశ్రీ ప్రసాద్ హవా చూపిస్తున్నారు కానీ 2000-10 మధ్యలో వరస సినిమాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. చాలా తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిత్రం, నువ్వు నేను, జయం, మనసంతా నువ్వే, నీ స్నేహం, సంతోషం తదితర చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు. అలాంటి ఈయన.. మహేశ్ బాబు సినిమాకు పాటలు పాడి తప్పు చేశానని అంటున్నారు. గతంలోనే ఈ విషయం చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి అదే అన్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

    ''నిజం' కంటే ముందు 'ఒక్కడు' రిలీజ్ కాకపోయుంటే.. 'నిజం' ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే 'ఒక్కడు' విడుదలైన తర్వాత ఇది చిన్న సినిమా అయిపోయింది. 'ఒక్కడు'లో హీరోయిజం ఫుల్ ఎలివేట్ అయిపోయిన తర్వాత 'నిజం' వచ్చేసరికి హీరోని తల్లిచాటు బిడ్డగా అంగీకరించలేకపోయారు. పాటల విషయానికొస్తే.. నా గొంతుతోనే పాడేశాను. కానీ విడుదలైన తర్వాత వేరే వాళ్లతో పాడించుంటే బాగుండేదని కృష్ణ(మహేశ్ తండ్రి) ఫోన్ చేసి చెప్పారు. వాయిస్ వేరే వాళ్లు కూడా ఉంటే బాగుండేమో చూడండి అని అన్నారు. నిజంగా అప్పుడు ప్రయత్నించాం. తెలుగుని తెలుగులా పాడే వాళ్లతో పాడించాలనేది నా ఉద్దేశం. తెలుగుని ఖూనీ చేసేవాళ్లతో నేను పాడించను. శంకర్ మహదేవన్, కేకే.. వీళ్ల వాయిస్ నాకు ఓకే. కానీ రికార్డింగ్ టైంకి వాళ్లు అందుబాటులో లేరు. దీంతో నేను పాడేశా. నా వాయిస్ మహేశ్‌కి సూట్ కాలేదు. అది నేను ఒప్పుకొంటాను' అని ఆర్పీ పట్నాయక్ చెప్పుకొచ్చారు.

    2003లో మహేశ్ బాబు హీరోగా చేసిన రెండు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో మొదటగా వచ్చిన 'ఒక్కడు' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని తర్వాత కొన్ని నెలలకు 'నిజం' థియేటర్లలోకి వచ్చింది. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేశ్.. భయస్తుడిగా, తల్లిచాటు బిడ్డగా నటించాడు. ఇది ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ మూవీలో మహేశ్ లుక్ కూడా ఏమంత ఇంప్రెసివ్‌గా ఉండదు. ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ ఇంటర్వ్యూ వల్ల 'నిజం' మరోసారి చర్చనీయాంశమైంది.

    ఆర్పీ పట్నాయక్ విషయానికొస్తే.. కెరీర్ పీక్‌లో ఉండగానే సంగీత దర్శకత్వాన్ని పక్కనబెట్టారు. దర్శకుడు కొన్ని సినిమాలు చేశారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. మహేశ్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ థియేటర్లలోకి రానుందని ఇటీవలే ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)

  • సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2026 విజేతగా కర్ణాటక బుల్డోజర్స్ నిలిచింది. ఫైనల్లో బెంగాల్ టైగర్స్‌ను ఓడించిన కిచ్చా సుదీప్ సేన టైటిల్‌ ఎగరేసుకుపోయిది. ఇది కర్ణాటక బుల్డోజర్స్‌కు మూడో టైటిల్ కావడం విశేషం. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత సీసీఎల్ కప్‌ను కర్ణాటక గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోయంబత్తూరులోని ఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ ఫైనల్ పోరు జరిగింది.

    అయితే ఈ కప్ గెలిచాక కర్ణాటక బుల్డోజర్స్ సంబురాలు చేసుకుంది. మ్యాచ్ గెలిచిన కప్‌ అందుకునేందుకు వెళ్లిన కెప్టెన్ కిచ్చా సుదీప్‌ డిఫరెంట్‌ స్టైల్లో అలరించాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా రోహిత్ శర్మ రోబో వాక్ స్టైల్లో వెళ్లి కప్ అందుకున్నారు. తాజాగా సీసీఎల్‌లోనూ అదే సీన్‌ రిపీట్ చేశాడు కిచ్చా సుదీప్. రోహిత్ శర్మ స్టైల్లోనే రోబో వాక్ చేస్తూ సీసీఎల్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ వీడియో నెట్టింట కాస్తా వైరల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో అభిమానులు కిచ్చా సుదీప్‌ ట్రోఫీ వాక్ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

    ఫైనల్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌ను 129 పరుగులకే పరిమితం చేశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కర్ణాటక బుల్డోజర్స్ ఓపెనర్ రాజీవ్ హను కేవలం 35 బంతుల్లో 69 పరుగులు చేసి పరుగులు చేయడంతో సునాయాసంగా విజయం సాధించింది. ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో కర్ణాటక టీమ్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సీజన్‌లో బెంగాల్ టైగర్స్ రన్నరప్‌గా నిలిచింది.

    ఇక కిచ్చా సుదీప్ సినిమాల విషయానికొస్తే  కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్క్‌తో అలరించాడు. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. సుదీప్ ఇటీవల సినిమాల్లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇది మూడు దశాబ్దాల స్ఫూర్తిదాయకమైన ప్రయాణం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

  • రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

    ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్‌ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.

    కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్‌ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది.

     

     

     

     

     

     

  • తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోలున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా తెలుగు బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా పరిచయమవుతున్న 'సుమతీ శతకం' అనే మూవీ విడుదలకు సిద్ధమైంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని వేడుకుంటున్న అమర్‌దీప్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడు? అసలు ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? గతంలో బిగ్‌బాస్ నుంచి వచ్చి హీరోలు అయినవాళ్లు ఎక్కడున్నారు?

    ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం అంత సులభం కాదు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఫేమ్ తెచ్చుకుంటున్న సొహైల్, సన్నీ లాంటి వాళ్లు.. ఆ క్రేజ్ నిజమనుకుని హీరోలుగా పలు మూవీస్ చేశారు. కాకపోతే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీసే చేయడంతో అవి సక్సెస్ కాలేదు. దీంతో కొన్నాళ్లకే ఇండస్ట్రీని పూర్తిగా వదిలేశారు. అమర్‌దీప్ కూడా కొన్నిరోజుల క్రితం ఇదే చెప్పాడు. బిగ్‌బాస్ ఓట్లు దేనికీ పనికిరావు అని అన్నాడు. కానీ ఇండస్ట్రీలో పరిస్థితులు కొత్త హీరోలకు కలిసొచ్చేలా ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

    ఎందుకంటే పాన్ ఇండియా కల్చర్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత తెలుగు ఆడియెన్స్.. చిన్న సినిమాలని అందులోనూ రొటీన్ కమర్షియల్ చిత్రాలు చూసేందుకు మునుపటిలా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అమర్‌దీప్ 'సుమతీ శతకం' ట్రైలర్ చూస్తుంటే ఇది కూడా సాధారణ సినిమాలానే అనిపిస్తుంది. దానికితోడు ఈ వారం దాదాపు 10 వరకు మూవీస్, థియేటర్లలోకి రానున్నాయి. వీటన్నింటిని దాటుకుని అమర్‌దీప్ చిత్రానికి ప్రేక్షకులు వస్తారా అనేది చూడాలి.

    అలానే రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన అమర్‌దీప్.. 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో చూపిస్తా. ఇది హిట్ కాకపోతే మరెప్పుడు ఇలా ఒక్క ఛాన్స్ అని అడగను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. సుమతీ శతకం చూస్తారు. నేనేంటో మీకు తెలుస్తుంది' అని అన్నాడు. మరి ఈ మాట మీద ఎంతవరకు నిలబడతాడో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)

  • ఏదైనా సినిమా రిలీజై హిట్‌ అయితే ప్రశంసలు కురిపిస్తారు. అలాగే అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కథ బాగుండి సూపర్ హిట్ అయిన సినిమాలకు ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకంగా అవార్డులు ఇస్తుంటారు. కానీ రిలీజ్ కానీ సినిమాకు అవార్డ్స్, రివార్డ్స్‌ ఇవ్వడం మీరెక్కడైనా చూశారా? కానీ సరిగ్గా అదే జరిగింది. ఐదేళ్ల క్రితమే షూటింగ్ పూర్తయి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు. కానీ తాజాగా అవార్డుల వేడుకలో మాత్రం ఏకంగా మూడింటిని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరేంటో తెలుసుకుందామా? 

    విమల్, శ్రియా శరణ్ జంటగా నటించిన చిత్రం 'సందకరి'.  తాజాగా ఈ చిత్రం మూడు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29న తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి 2022 సంవత్సరాల వరకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులలో చాలా మంది అగ్రశ్రేణి నటీనటులు, చిత్రాలు, సాంకేతిక నిపుణులను ప్రభుత్వం గుర్తించి అవార్డులు అందించింది.

    అయితే 'సందకరి' అనే సినిమారు 2020 ఏడాదిగానూ మూడు అవార్డులను గెలుచుకుంది. ఇదే ఇప్పుడు ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేసింది. అసలు ఈ సినిమా విడుదల కాలేదని.. మరి ఇలాంటి చిత్రానికి అవార్డులకు ఎలా ఇచ్చారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ మూవీ ఉత్తమ చిత్రం (మూడవ బహుమతి) అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ నేపథ్య గాయకుడు అమ్రిష్  (మేల్), అయ్యప్పన్ ఉత్తమ కళా దర్శకుడిగా అవార్డులకు ఎంపికయ్యారు. రిలీజ్‌ కానీ సినిమాకు అవార్డులు రావడమేంటని కోలీవుడ్‌ ఫ్యాన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.

    అయితే తమిళనాడు రాష్ట్ర అవార్డులకు అర్హత పొందాలంటే ఆ చిత్రం థియేటర్లలో విడుదల అయి ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాకుండా అవార్డుల కోసం ఆ ఏడాదిలో రిలీజైన ఎన్నో చిత్రాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ కాదని.. ఒక మలయాళ రీమేక్‌కు మూడు అవార్డులు ఇవ్వడంపై నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

    కాగా.. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ మూవీ 'మై బాస్'కు రీమేక్‌గా సందకారిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో దిలీప్, మమతా మోహన్‌దాస్ నటించారు.  ఈ తమిళ వర్షన్‌లో విమల్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ మదేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే అనేక కారణాలతో ఇప్పటికీ విడుదల కాలేదు.
     

  • మన దేశంలో రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. సినిమాల్లో, టీవీలో, సోషల్‌ మీడియాలో కనిపించే సెలబ్రిటీలు రియల్‌ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెలుసుకోవాలని అభిమానులు తెగ తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం ఎన్నో గేమ్‌ షోలు, రియాలిటీ షోలు పుట్టుకొచ్చాయి. తాజాగా ద 50 గేమ్‌ షో మొదలైంది. అసలు ఆ షో ఏంటి? దాని స్పెషాలింటీ ఏంటి? అన్నది ఓసారి చూసేద్దాం..

    50 మంది సెలబ్రిటీలు
    బిగ్‌బాస్‌ షోలో 20 మందికి అటుఇటుగా సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపిస్తారు. వందరోజులపాటు టాస్కులు, గేమ్స్‌ ఇస్తారు. చివర్లో ఒకరిని విజేతగా ప్రకటించి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ద 50 షో కూడా ఇంచుమించు ఇలాంటిదే! కాకపోతే ఇక్కడ సెలబ్రిటీలు పది మందో ఇరవైమందో కాదు, ఏకంగా 50 మంది ఉన్నారు. వీళ్లందర్నీ ఒక పెద్ద రాజభవనంలాంటి మహల్‌లో ఉంచుతారు. దీన్నే లయన్‌ హౌస్‌ అంటారు.

    ప్రైజ్‌మనీ ఎవరికంటే?
    సమయానుసారం టాస్కులు ఆడిస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎలిమినేషన్స్‌ కూడా ఉంటాయి. ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకంటే ద 50 అనేది కేవలం యాభై రోజుల గేమ్‌ షో. మరి అన్నీ దాటుకుని చివరిదాకా వచ్చినవారికేమైనా ఉంటుందా? అంటే ఇప్పటికైతే అలాంటి ప్రైజ్‌మనీ ఏమీ ప్రకటించలేదు. కాకపోతే ఎవరు గెలుస్తారో గెస్‌ చేసిన అభిమాని/ ప్రేక్షకులకు మాత్రం ప్రైజ్‌మనీ దక్కుతుంది. అది కూడా అక్షరాలా రూ.50 లక్షల రూపాయలు.

    నో హోస్ట్‌
    లెస్‌ సింక్వాంటె (సింక్వాంటె అంటే 50 అని అర్థం) అనే ఫ్రెంచ్‌ షో ఆధారంగా 'ద 50' రియాలిటీ షోని డిజైన్‌ చేశారు. అయితే మాతృకలో ఉన్న అనేక నిబంధనలను ఇక్కడ కాస్త సడలించారు. ఈ షోకి హోస్ట్‌ అంటూ ఎవరూ ఉండరు. బిగ్‌బాస్‌లో ఎలాగైతే కనిపించని వ్యక్తి ఆదేశాలు ఇస్తాడో.. ఇక్కడ కూడా సింహం మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తి కంటెస్టెంట్లతో గేమ్స్‌ ఆడిస్తాడు, ఛాలెంజ్‌లు విసురుతాడు, ఎలిమినేట్‌ చేస్తాడు. ఫిబ్రవరి 1న ఈ షో మొదలైంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్‌లో రోజూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. కలర్స్‌ టీవీలో రాత్రి 10.30కి ప్రసారమవుతోంది.

    కంటెస్టెంట్లు వీళ్లే..
    తేజస్వి మదివాడ (తెలుగమ్మాయి), కరణ్‌ పటేల్‌, ఊర్వశి ఢోలకియా, రజత్‌ దలాల్‌, మిస్టర్‌ ఫైజు, దివ్య అగర్వాల్‌, మోనాలిసా, విక్రాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శినీ దోశి, రిది డోగ్రా, దుశ్యంత్‌ కుక్రేజా, శివ్‌ ఠాక్రే, నీలం గిరి, చాహత్‌ పాండే, హమీద్‌ బర్క్‌జీ, డింపాల్‌ సింగ్‌, మాక్స్‌టర్న్‌, సుమైరా షైఖ్‌, లవ్‌కేశ్‌ కటారియా, సివెత్‌ తోమర్‌, నేహాల్‌ చుదసమ, కృష్ణ ష్రాఫ్‌, సప్న చౌదరి, నిక్కీ తంబోలి, అర్బాజ్‌ పటేల్‌, వన్హాజ్‌ సింగ్‌, ప్రిన్స్‌ నరౌలా, యువికా చౌదరి, అర్చనా గౌతమ్‌,  బేబికా ధుర్వె, జాన్వీ కిల్లెకర్‌, యంగ్‌ సామీ, అద్నాన్‌ షైఖ్‌, లక్షయ్‌ కౌశిక్‌, అర్చిత్‌ కౌశిక్‌, దిగ్విజయ్‌ రాతే, నటాలియా జన్జోజ్‌సెక్‌, ఖన్జాదీ, ఫైజ్‌ బలోచ్‌, రచిత్‌ రోజా, సిద్దార్థ్‌ భరద్వాజ్‌, డినో జేమ్స్‌, ఆర్య జదావో, సౌరభ్‌ గాడ్గె, మనీషా రాని, ఆరుశి చావ్లా, రిద్దిమా పండిట్‌, శ్రుతికా అర్జున్‌, భవ్య సింగ్‌, ఇమ్మోర్టల్‌ కాక.. పార్టిసిపెంట్లుగా లయన్‌ హౌస్‌లో అడుగుపెట్టారు.

     

     

    చదవండి: ఎక్కువ పారితోషికం.. సినిమాను నాశనం చేస్తున్నారు: నటుడు

  • రామ్ చరణ్ దంపతులకు ఐకాన్  స్టార్ అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు.  ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.

    కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

     

     

International

  • భారత్‌కు ట్రంప్  శుభవార్త చెప్పారు. పన్నులని  28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు చేస్తున్నట్లు తెలిపారు.  మోదీ తనకు గొప్ప స్నేహితుడని ట్రంప్ కొనియాడారు. అమెరికా వెనెజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించందన్నారు. అయితే ట్రంప్ పన్నుల తగ్గింపుపై భారత ‍ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 140 కోట్ల భారతీయుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తన ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడడం చాలా సంతోషకరమన్నారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రపంచ శాంతికి ట్రంప్ నాయకత్వం కీలకం అన్నారు.

    ప్రపంచంలోని రెండు  అతిపెద్ద ఆర్థిక వ్యవస‍్థలు, ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయనన్నారు.కాగా కొద్దిసేపటి క్రితమే  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీతో ఫోన్‌లో మాట్లాడారని స్టేటూన్‌ అంటూ అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తన అధికారిక ట్రూత్ ఖాతలో మోదీతో ఫోన్‌ మాట్లాడిన అంశాలను ట్రంప్ పోస్ట్ చేశారు. 

    ఇందులో " ప్రధాని మోదీతో మాట్లాడడం బాగుంది. ఆయన నాకు మంచి మిత్రుడు. ఇండియాకి చాలా శక్తివంతమైన నాయకుడు. మేమిద్దరం ట్రేడ్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇలా చాలా విషయాల గురించి మాట్లాడాం అనంతరం ఆయన రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాడానికి మోదీ అంగీకరించారు. ఇలా చేయడంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది. అదే విధంగా అమెరికా, వెనిజువెలా దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన చమురు కొనుగోలుకు మోదీ అంగీకరించారు.". అని ట్రంప్ పోస్టు చేశారు.  

    అంతకుమందు భారత్‌లో ఉన్న ఇండియా గేట్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కట్టడం అత్యద్భుతమని పేర్కొంటూ తన సోషల్‌ మీడియా అకౌంట్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఈ కట్టడం గ్రేటేస్ట్‌ ఆఫ్ ఆల్ అన్నారు. అంతకంటే గొప్ప కట్టడాన్ని అమెరికా వాషింగ్టన్‌ డీసీలో నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు.

    ఆపరేషన్ సిందూర్ అనంతరం నుంచి ఇరుదేశాల మధ్య డిస్టెన్స్ కొంచెం పెరిగింది. ఇటీవల రష్యానుంచి చమురు కొనుగోలు చేయకూడదు అంటు ట్రంప్ భారత్‌ని హెచ్చరించారు. ఇండియా  కేర్ చేయకపోవడంతో భారత్‌ వస్తువులపై పన్నును 50 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం అమెరికా భారత్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.  

  • ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలపై  దాడులు జరిపింది.ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను మళ్లీ పుంజుకునేలా చేస్తోందన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు నిర్వహించింది.  హిజ్బుల్లా కార్యకర్తలు ఇజ్రాయెల్ భూభాగం వైపు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను ప్రయోగించడానికి ఉపయోగించిన అల్-ఖియామ్ సమీపంలోని ఒక నిర్మాణాన్ని కూడా సైనికులు కూల్చివేసినట్లు సైన్యం తెలిపింది.

    దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లా (Hezbollah) చెందిన ఆయుధ నిల్వ గిడ్డంగులను లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేసింది. ఈ దాడులకు ముందు, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు, వాటిలో ఆ ప్రాంతంలోని జనాభాకు ముందస్తు ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

    ఈ ఆయుధ కేంద్రాలలో ఒకటి జనసంచారం ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల మధ్యలో ఉంది. లెబనాన్ పౌరులను హిజ్బుల్లా 'మానవ కవచాలు' (Human Shields) వాడు కుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాల నుండి కార్యకలాపాలను కొనసాగిస్తోంది అనడానికి ఇదొక ఉదారణ అని పేర్కొంది. ఈ ఆయుధ కేంద్రాలు ఇజ్రాయెల్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని, అందుకే వాటిని తొలగించడం తప్పనిసరి అని IDF స్పష్టం చేసింది.

    కాగా ఈ దాడులు కేవలం ఆకస్మికమైనవి కావు, దీని వెనుక కీలకమైన కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా ఎటువంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించ కూడదు. కానీ హిజ్బుల్లా మళ్లీ అక్కడ స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.  

    ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం, తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నంత కాలం లెబనాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. హెజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను పౌర గృహాల కింద, స్కూళ్ల సమీపంలో నిర్మించడం అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

  • ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సైన్యానికి బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA)కు చెందిన ఇద్దరు మహిళలు చుక్కలు చూపించారు. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా మారి పాకిస్తాన్‌ సిబ్బంది దాదాపు 200 మందిని హతమర్చారు. మరోవైపు.. బలోచిస్థాన్‌ అంతటా పాక్‌ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ‘హీరోఫ్’ పేరుతో రెండో దశ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు బీఎల్‌ఏ పేర్కొంది. దీంతో, దాయాది పాక్‌కు బీఎల్‌ఏ వెన్నులో వణుకుపుట్టించినట్టు అయ్యింది.

    ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజులుగా దాయాది దేశం పాకిస్తాన్‌లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్‌ ప్రావిన్సులో ఉన్న 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు తమదే బాధ్యత అని తాజాగా బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో పాక్‌ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్‌ అనే యువతి చేసిన దాడిలో పాక్‌ సిబ్బంది సహా వంద మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్‌ హవా బలోచ్ దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక, ఇద్దరు మహిళలు దాడులు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

    ఇదిలా ఉండగా.. బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్‌ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే..  సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్‌ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్‌ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.  ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్‌ఏ పేర్కొంది.

    మీడియా నివేదికల ప్రకారం.. ఆత్మాహుతి చేసుకున్న బలూచ్‌ యోధురాలు హవా బలోచ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె తండ్రి 2021లో పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మరణించినట్టు తెలిసింది. అతడు బీఎల్‌ఏ యోధుడని సమాచారం. సదరు మహిళ తిరుగుబాటులో చేరడానికి ముందు అధికారికంగా విద్యను కూడా పొందినట్టు నివేదించబడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న బలోచ్ వేర్పాటువాద ఉద్యమం ధోరణిని ప్రతిబింబిస్తుంది.

    పాక్‌ ఓవరాక్షన్‌.. 
    పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్‌ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్‌ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్‌.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్‌ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.
     

  • జపాన్ సముద్రగర్భ అన్వేషణలో అద్భుతమైన మైలురాయిని అధిగమించి ప్రపంచ రికార్డును సాధించింది.  పరిశోధకుల బృందం 6,000 మీటర్ల లోతునుండి 'రేర్ ఎర్త్' (అరుదైన మూలకాలు,Rare Earth Elements) మూలకాలను కలిగి ఉన్న అవక్షేపాలను (Sediment) విజయవంతంగా వెలికితీసింది. నీటి అడుగున ఖనిజ సేకరణలో ఇది ఒక రికార్డు. ఈ కీలకమైన ఖనిజాల వెలికితీత కొత్త శక్తి సాంకేతికతలు. ఆర్థిక భద్రతకు మార్గం సుగమం చేస్తాయి, విదేశీ సరఫరాదారులపై జపాన్ ఆధారపడటాన్ని తగ్గిస్తాయిని నిపుణులు భావిస్తున్నారు.

    ఖనిజాల వేటలో సముద్ర మట్టానికి సుమారు 6,000 మీటర్ల లోతులో ఖనిజాలను సేకరించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి పసిఫిక్ మహా సముద్రం లోని మారుమూల ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రయోగం కోసం 'చిమ్యు' (Chikyu) అనే అత్యాధునిక డ్రిల్లింగ్ నౌకను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇంతటి లోతులో ఖనిజాలను సేకరించే ఆపరేషన్నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.

    ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
    ప్రపంచంలోనే తొలి విజయం
    ప్రపంచ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు అని అధికారులు ప్రకటించారు. జపాన్ ఆర్థిక, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (METI), జపాన్ ఏజెన్సీ ఫర్ మెరైన్-ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JAMSTEC) సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. అధునాతన డీప్-సీ డ్రిల్లింగ్ నౌక చిక్యూను ఉపయోగించి, బృందం మారుమూల పసిఫిక్ ద్వీపమైన మినామి టోరిషిమా సమీపంలో ఈ మిషన్‌ను నిర్వహించింది. ఈ పురోగతి కీలకమైన ఖనిజాలలో స్వావలంబన వైపు ఒక అడుగు అని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, జపాన్ అత్యధిక లోతులో సరికొత్త రికార్డు నెలకొల్పడం  విశేషం.

    ఇదీ చదవండి: భర్తను చితకబాదేసిన భార్య, వైరల్‌ వీడియో

    ఈ రేర్‌ఎర్త్‌ మూలకాలు అవసరం ప్రస్తుతం ఆధునిక ప్రపంచానికి చాలా వుంది. ముఖ్యగా ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, సైనిక పరికరాలు , ఇతర హై-టెక్ పరికరాలలో వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన మూలకాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ విజయంతో జపాన్ ఇక ఇతర దేశాలపై ఆధారపడే అవసరం ఉండదు.
    ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

  • మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలో ఫ్యుగో అగ్నిపర్వతం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. చిన్నచిన్న విస్ఫోటనాలు కాస్త ఒక్కసారిగా తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రభావంతో వేల అడుగుల ఎత్తు దాకా బూడిద ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. 

    3,763 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్యుగో అగ్నిపర్వతం తరచుగా చిన్న, మధ్యస్థాయి విస్ఫోటనాలతో(స్ట్రోంబోలియన్ శైలి) క్రియాశీలకంగా(Active Volcano) ఉంటుంది. అయితే ఈసారి విస్ఫోటనాలు సాధారణం కంటే తీవ్రంగా కనిపించాయి. జనవరి చివరి వారంలో ప్రారంభమైన విస్ఫోటనాలు, ఫిబ్రవరి ప్రారంభంలో మరింత తీవ్రతతో కొనసాగాయి.

    ప్రస్తుతానికి బూడిద మేఘాలు 14,000 నుండి 16,000 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. రాత్రి వేళల్లో ఆకాశం మెరిసేపోయేలా.. ప్రవహిస్తున్న లావా దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో.. 15 లక్షల మంది ఉన్న ఈ రీజియన్‌లో ఆందోళనలను రేకెత్తించాయి. అయితే ప్రస్తుతానికి ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు మొదలుకాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు మాత్రం జారీ అయ్యాయి. అదే సమయంలో విమాన ప్రయాణాలకు ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

    సాకటేపెక్వెజ్, చిమాల్టెనాంగో, పనిమాచె, మోరెలియా.. ఇలా చుట్టుపక్కల ప్రాంతా ప్రజలు లావా ఉద్గారాలు, బూడిద వర్షం, అగ్నిపర్వతం బద్ధలయ్యేప్పుడు గర్జనల శబ్దాలతో ఆందోళనకు గురవుతున్నారు. 2018లో జరిగిన ఆకస్మిక విస్ఫోటనం దాదాపు 200 మంది ప్రాణాలు తీసుకుంది. 

     

  • లండన్‌: ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ఫైళ్లు అమెరికాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లాంకీ ఎప్‌స్టీన్‌ పేజీలను విడుదల చేశారు. వాటిల్లో మాజీ యూకే రాయబారి ప్రస్తుత అధికార లేబర్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుడు పీటర్ బెంజమిన్ మాండెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది

    ఎప్‌స్టిన్‌ ఫైల్స్‌లో పీటర్‌ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పీటర్‌ లోదస్తులతో ఉండగా.. ఆయనతో ఓ మహిళా సన్నిహితంగా ఉంది. ఆ ఫొటోలపై దుమారం చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫొటో గురించి అడగ్గా.. 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా'. దాట వేశారు. ప్రస్తుతం,ఈ అంశంపై యూకే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది

    ఇక ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో 2003-04 మధ్య కాలంలో ఎప్‌స్టీన్‌కు పీటర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎప్‌స్టీన్‌ నుంచి పీటర్‌కు సుమారు 75వేల డాలర్లు అందగా.. 25వేల డాలర్లకు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండటం గమనార్హం. పీటర్‌తో అస్పష్టంగా ఉన్న మహిళ గురించి వివరాలు గురించి ఆయన్ని మీడియా ఆరా తీసింది.  

    ఫోటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు. ఆ ప్రదేశాన్ని, స్త్రీని తాను గుర్తించ లేకపోతున్నానని, ఏ సందర్భంలో ఆ ఫొటోను దిగాల్సి వచ్చిందో గుర్తించ లేకపోతున్నారని చెప్పుకొచ్చారు.

Business

  • లక్షలాది మంది ఎయిర్‌టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త. రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను ఎయిర్‌టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఆఫర్‌ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్‌టెల్ పేర్కొంది.

    పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ వివరాలు
    ఎయిర్‌టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను తాత్కాలిక ప్రయోజనంగా అందించింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.17,000 కాగా, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి తొలగించింది.

    ఇప్పటికే క్లెయిమ్ చేసినవారికి ప్రభావం ఉంటుందా?
    జనవరి 16కు ముందే ఆఫర్‌ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.

    ఒక ఆఫర్ ముగిసినా… మరో కొత్త అవకాశం
    పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ రద్దయినా, ఎయిర్‌టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఎయిర్‌టెల్ అడోబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ఎయిర్‌టెల్‌కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4,000 ఖర్చయ్యే ఈ సబ్‌స్క్రిప్షన్ ద్వారా, వినియోగదారులు అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించవచ్చు.
     

  • వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా ? ఇప్పుడైతే వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పీక్ స్టేజ్ లోనే ఉంది — MCXలో వెండి ధర ప్రస్తుతం సుమారు ₹3,00,000/కిలోగా ట్రేడవుతోంది.  ఇలాంటి పరిస్థితిలో చాలా మంది మనసుల్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే.. 1980ల నాటి ‘వెండి పతనం’ మళ్ళీ జరుగుతుందా? ఒకప్పుడు  జరిగినట్లు రాత్రికి రాత్రే ధరలు సగానికి పైగా పడిపోతాయా. 1980 లో జరిగిన వెండి పతనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? అనే భయం నెలకొంది. 

    ఆ రోజు వెండి ధర ఒకే రోజులో 50 డాలర్ల నుండి 10.80 డాలర్లకి పడిపోయింది. అసలు 1980 లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. 1979-1980లో  అమెరికన్ బిలియనీర్ సోదరులు ..వీళ్లను హంట్ బ్రదర్స్  అని పిలుస్తారు. వీళ్లు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి, ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో  ప్రపంచ సరఫరాలో 50-60 శాతాన్ని నియంత్రణ లోకి తీసుకున్నారు. వీళ్లు ప్రపంచంలోనే 50 శాతం వెండి సరఫరాను నియంత్రించారు. అప్పట్లోనే వెండి ధర ఔన్సుకు 50 డాలర్లకు చేరుకున్నాయి. అయితే అప్పట్లో అమెరికన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు నియమించింది.దీని ఫలితంగా 1980 మార్చి 27న ‘సిల్వర్ థర్స్‌డే’ అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది.

    ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు 5-10 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇక చూస్తే ఈ సంవత్సరం కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని పతనానికి  కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.  అయితే ఈ సంవత్సరం 1980లో జరిగినట్లు ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం లేదు. 

    1980 నాటి వెండి మార్కెట్ కు నేటి వెండి మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటే ఇప్పుడు వెండి పెట్టుబడికి డిమాండ్ లేదు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. 

    ప్రపంచదేశాలు వెండిని భవిష్యత్తు అవసరాలకోసం పోగుచేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు వెండి దూరమవుతుంది.  అయితే 1980 లో జరిగినట్లు రాత్రికి రాత్రే వెండి ధరలు ఢమాల్ అయ్యే  ఛాన్స్ లేకపోలేదు..ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే, అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా  తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

     

  • విదేశాల నుంచి వచ్చే వారు సాధారణంగా మిత్రులు, బంధువులకు బహుమతులు తీసుకువస్తుంటారు. అయితే ఇప్పటివరకు దిగుమతి సుంకాలు, పరిమితుల కారణంగా ఎక్కువ విలువైన వస్తువులను తీసుకురావడం సాధ్యపడేది కాదు. ఇకపై ఆ పరిస్థితి మారనుంది.

    అంతర్జాతీయ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్ 2026–27లో కేంద్ర ప్రభుత్వం డ్యూటీ ఫ్రీగా భారత్‌కు తీసుకురాగల వస్తువుల విలువ పరిమితిని పెంచింది.  ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

    కొత్త బ్యాగేజీ నిబంధనలు ఏమిటంటే..
    వాయు లేదా సముద్ర మార్గంలో వచ్చే భారత సంతతికి చెందిన నివాసితులు, పర్యాటకులు  రూ. 75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్‌కు తీసుకురావచ్చు. ఇంతకుముందు ఈ పరిమితి రూ. 50,000 మాత్రమే ఉండేది.

    అలాగే విమాన లేదా సముద్ర మార్గంలో వచ్చే విదేశీ పర్యాటకులకు డ్యూటీ ఫ్రీ అలవెన్స్ రూ. 15,000 నుంచి రూ. 25,000కు పెంచారు.

    అయితే కొన్ని రకాల వస్తువులకు మాత్రం ఈ సడలింపులు వర్తించవు. 50 యూనిట్లకు మించిన తుపాకీ గుళికలు, 100 కంటే ఎక్కువ సిగరెట్లు, 25 కంటే ఎక్కువ సిగార్లు, 125 గ్రాములకంటే ఎక్కువ పొగాకు, 2 లీటర్లకు మించిన మద్యం, ఆభరణాల రూపంలో కాకుండా బంగారం లేదా వెండి, టెలివిజన్లు వీటిలో ఉన్నాయి.

    కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు
    కేంద్ర బడ్జెట్ 2026–27లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

    ఈ నిర్ణయంతో భారత్‌లోకి దిగుమతి చేసుకునే వ్యక్తిగత వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరింత అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ముందుగానే విడుదలైన ఉత్పత్తులు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

  • బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం భారీగా తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి మరింత పడిపోయాయి.

    హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.8300 తగ్గి రూ. 1,38,900 లకు దిగిరాగా సాయంత్రానికి మొత్తంగా రూ.12300 క్షీణించి రూ.1,34,900లకు పడిపోయింది.

    ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.9050 తగ్గి రూ. 1,51,530 లకు తగ్గగా సాయంత్రానికి మరింత రూ.13410 పడిపోయి రూ.1,47,170లకు క్షీణించింది.

    వేగంగా మారిపోతున్న దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మారుతుండటంతో బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘ఈసీ-06’ (EC-06)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రారంభ దశలో యమహా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను బ్లూయిష్ వైట్ అనే సింగిల్ కలర్ ఆప్షన్‌లో అందిస్తున్నారు.

    డిజైన్
    యమహా EC-06 చూడటానికి రివర్ ఇండీ లాగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేకమైన డిజైన్ డీటైల్స్‌ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, రేక్డ్, మస్కులర్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో వంపులు తిరిగిన బాడీ ప్యానెల్స్‌తో ఆధునిక లుక్‌ను కలిగి ఉంది. రివర్ ఇండీతో పోలిస్తే, EC-06లో కాస్త తక్కువ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు.

    బ్యాటరీ, రేంజ్
    ఈ స్కూటర్‌లో 4 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.  దీనికి 8.9 bhp పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ జత చేశారు. EC-06 గరిష్ట వేగం గంటకు 79 కి.మీ.,  ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 169 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్  అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వారెంటీ ఇస్తోంది.

    ఛార్జింగ్ & రైడింగ్ మోడ్స్
    సాధారణ గృహ విద్యుత్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు.  ఫుల్ ఛార్జ్‌కు సుమారు 8 గంటలు పడుతుంది. EC-06లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

    ఫీచర్లు
    ఈ స్కూటర్‌లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ  సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

    సస్పెన్షన్ & బ్రేకులు
    సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. ముందు, వెనుక 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీని ‍ప్ర​త్యేకతగా కంపెనీ పేర్కొంది.

  • దేశంలో 90ల నాటి సాఫ్ట్‌వేర్ బూమ్ మళ్లీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ మార్కెట్ వేత్త, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్.  కేంద్ర బడ్జెట్ 2026ను ఆయన “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించారు. 2047 వరకు డేటా సెంటర్లకు 100% ట్యాక్స్‌ హాలిడే (పన్ను రహితం) అందించే విధాన నిర్ణయాన్ని ఆయన “1,000 పౌండ్ల గొరిల్లా” (అత్యంత శక్తివంతమైన) తరహా నిర్ణయంగా పేర్కొన్నారు.

    ప్రస్తుత డిజిటల్‌ పురోగతిని 1990ల సాఫ్ట్‌వేర్ బూమ్‌తో పోలుస్తూ.. “మనం ఇప్పటికే ఏఐ(AI)ని స్వీకరించాం. ఇప్పుడు ‘ఏఐ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’ను నిర్మిస్తున్నాం. విద్యుత్, కేబుల్స్, మౌలిక సదుపాయాల్లో భారీ మూలధనం పెట్టుబడి పెడుతున్నాం” అని రామ్‌దేవ్‌ అగర్వాల్ తెలిపారు.

    మరోవైపు కేంద్ర బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరగడం వల్ల సమీప కాలంలో మార్కెట్లకు హెడ్‌విండ్స్ ఉన్నాయని అంగీకరించారు. అయితే దేశ దీర్ఘకాలిక ఆదాయ కథ బలంగా కొనసాగుతోందని రామ్‌దేవ్‌ అగర్వాల్ స్పష్టం చేశారు. “4.3% ద్రవ్యలోటు లక్ష్యం, రూ.12.2 లక్షల కోట్ల క్యాపెక్స్ పుష్‌తో, దీర్ఘకాలంలో భారతదేశమే నిజమైన విజేత” అని ఆయన పేర్కొన్నారు.

    బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఫ్యూచర్స్‌పై ఎస్‌టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి పెరిగింది. అలాగే  ఆప్షన్ ఎక్సర్సైజ్‌పై పన్ను 0.125% నుంచి 0.15 శాతానికి ఎగిసింది. ఈ చర్యలు స్వల్పకాలిక ట్రేడింగ్ కార్యకలాపాలను తగ్గించవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

    ఇది  చదివారా? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కొత్త కండీషన్‌

    బడ్జెట్‌లోని సూక్ష్మ అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలవని ఆయన అన్నారు. ఐటీ సేవల నిర్వచనాన్ని విస్తరించడం వల్ల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు (GCC) బదిలీ ధరలపై స్పష్టత లభించిందని, ఇది హైఎండ్ టెక్నాలజీ వ్యాపారాలకు భారత్ స్వాగతం పలుకుతోందనే బలమైన సంకేతం  అని పేర్కొన్నారు.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లలో ఫాగ్-ఎండ్ కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ చివరి గంటలో పుంజుకున్నాయి. 

    బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 944 పాయింట్లు లేదా 1.17 శాతం పెరిగి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 263 పాయింట్లు లేదా 1.06 శాతం పెరిగి 25,088 వద్ద స్థిరపడింది. విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.94 శాతం, మిడ్ క్యాప్ 1.31 శాతం నష్టపోయాయి.

    సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఆర్ఐఎల్, ఎం&ఎం టాప్ గెయినర్లలో ఉన్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ట్రెంట్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Politics

  • సాక్షి, కరీంనగర్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోందన్నారు. ఆరు గ్యాంరటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

    కరీంనగర్ కిసాన్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా ఇవ్వలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో పడినట్టే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది.

    కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగింది. నేను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది. కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. గంగుల కమలాకర్‌ మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

     

  • ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. సర్‌(SIR) విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తమ మాటల్ని వినలేదని, తమను అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై మండిపడ్డారు.

    పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ‘సర్’ పేరిట ఓటర్ల రివ్యూ చేపట్టి.. లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించింది. ఈ నేపథ్యంలో సర్ ద్వారా కలిగిన నష్టంపై వివరించేందుకు, ఫిర్యాదు చేసేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం, మమతా బెనర్జీ.. సీఈసీ వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ఈసీతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో మమత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎల్‌కే అద్వానీ గారిని గౌరవిస్తాను. ఆయన తన తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రాలను అందించగలరా అని అడుగుతున్నాను. ‘సర్‌’ పొంతన లేనిది. తప్పుల తడకగా ఉంది, అసంబద్ధమైనది. ఈ ఎన్‌ఆర్‌సీ కారణంగా బీఎల్‌ఓలతో సహా 150 మందికి పైగా మరణించారు. నేను నా వెంట 100 మందిని తీసుకువచ్చాను. వారిలో కొందరిని ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారు సజీవంగా ఇక్కడే ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.  

    సర్‌ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించం. ఆయన మా మాటల్ని వినలేదు.. మమ్మల్ని అవమానించారు. ‘సర్’ వల్ల పశ్చిమ బెంగాల్‌లో చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. కొందరు సరైన డాక్యుమెంట్లు ఇవ్వలేకపోవడంతో ఓటరు జాబితాలో పేర్లు కోల్పోయారు. ఇంకొందరి ఓట్లు రకరకాల కారణాల వల్ల తొలగించారు అని అన్నారు.

    అయితే, మమత చేసిన ఆరోపణలను ఈసీ వర్గాలు ఖండించాయి. టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో అనుచితంగా ప్రవర్తించారని, సీఈసీ చెప్పేది వినిపించుకోలేదని అధికారులు తెలిపారు. మమత ప్రశ్నలకు సీఈసీ సరిగ్గానే స్పందించారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై బీజేపీ కూడా స్పందించింది. మమతా బెనర్జీది అంతా డ్రామా అంటూ కొట్టిపారేసింది. బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ మమతపై విమర్శలు గుప్పించారు. గంటసేపు ఈసీ ఆఫీసులో ఉండి, మాట్లాడి, సమావేశాన్ని బహిష్కరించానని చెప్పడం ఏంటని ఆయన విమర్శించారు. లోపల జరిగిందొకటి.. బయట మమత చెప్పిందొకటి అన్నారు. డ్రామా నడిపారని, పోలీసుల్ని ఇందులోకి లాగడం సరికాదని సూచించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిట్‌ నోటీసులు, విచారణపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

    రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉద్యమకారుడిని అవమానిస్తారా? అని గగ్గోలు పెడుతున్నారు. ఉద్యమకారులు అనే పదాలు వారే రాసుకుంటున్నారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం. కోదండరామ్‌ తెలంగాణ ఉద్యమకారుడు కాదా?. ఉద్యమాలు నడపలేదా?. ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేశారు?. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా?. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.

    రాష్ట్రంలో పదవులన్నీ తీసుకున్నారు. భూములు పంచుకున్నారు. కాంట్రాక్టులు పంచుకుని.. చేయాల్సిన తప్పులన్నీ చేశారు. తప్పు చేస్తే విచారణ తప్పదు.. విచారణ చేయొద్దని ఎక్కడా లేదు. ఇప్పుడు చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. శిబూ సోరేన్‌ విచారణ ఎదుర్కోలేదా? అని ప్రశ్నించారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాల రాయాలని బీజేపీ SIRను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి అని చెప్పుకొచ్చారు. 
     

  • సాక్షి,ఎన్టీఆర్‌ జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ గూండాలకు పోలీసులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్‌సీపీ సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఐదుగంటల పాటు పోలీసుల సమక్షంలో అరాచకం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. 

    ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీం పట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంపై టీడీపీ గూండాల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిపై   పరామర్శించేందుకు జోగి రమేష్‌ ఇంటికి సజ్జలతో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారు. 

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. గుంటూరు పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేశారు. గుంటూరులో టీడీపీ గూండాలు ఏం చేశారో రాష్ట్రప్రజలు చూశారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణగా ఉన్నారు. అంబటిని కలిసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు యత్నించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. మాజీ హోంమంత్రి ఫోన్‌ చేసినా పోలీసులు స్పందించలేదు. బాధితుడినే పోలీసులు అరెస్టు చేశాను. మా నేతలను ఎస్పీ కార్యాలయంలో ఎదుట గంట సేపు ఎదురు చేయించారు. 

    ప్లాన్‌ ప్రకారం అంబటి రాంబాబు,జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. టీడీపీ గూండాలను పోలీసులు కంట్రోల్‌ చేస్తున్నట్లు యాక్ట్‌ చేశారు. జోగి రమేష్‌ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు?’. అంబటి,జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు చేసిన గూండాలపై కేసులు పెట్టలేదు. దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టలేదు. కూటమి నేతల అరాచకాల్ని ఎదుర్కొంటాం. కూటమి అరాచకాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ శ్రేణులు,నేతల్ని బెదిరింపులు, దాడులు చేసి బెదిరించాలని అనుకోవద్దు. అలా అనుకుంటే భ్రమే అవుతుంది’అని  వ్యాఖ్యానించారు. 

    కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
  • చిత్తూరు, సాక్షి: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు పాల్పడుతోంది తెలుగు దేశం పార్టీ. ఈ క్రమంలో వైఎ‍స్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎ‍స్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వైఎస్సార్‌సీపీ నేతలపై, ఆఫీస్‌లపై జరిగిన దాడులను నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రస్తావించారు. 

    తాజాగా జరిగిన అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. గతంలో వలభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, సీనియర్‌ నేత ముద్రగడ, అలాగే మరో సీనియర్‌ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, చిత్తూరు రెడ్డప్ప నివాసాలపై జరిగిన దాడుల్ని ప్రస్తావించారామె. కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ్య చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై కూటమి పార్టీల శ్రేణులు దాడి చేశాయని గుర్తుచేశారు. 

    దాడిశెట్టి రాజా, ఉప్పల హారికా-ఉప్పల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడితో పాటు విడదల రజిని.. దేవినేని అవినాష్ పై దాడికి యత్నించారని రోజా అన్నారు. మార్గాని భరత్ ఆఫీస్‌పై, నంబూరి శంకర్రావు ఆఫీసుపై,  హిందూపుర్ వైసీపీ ఆఫీస్‌లపై దాడి ఘటనలను ప్రముఖంగా ప్రస్తావించారు. వీటన్నింటితో పాటు తనపైనా ఆర్పీని(జబర్దస్త్‌ కిర్రాక్‌ ఆర్పీ) పెట్టి బూతుల తిట్టించారని అన్నారామె. 

    ఇక.. డెక్కన్ క్రానికల్, సాకక్షి ఆఫీసులపై టీడీపీ అండ్‌ కో పార్టీలు దాడులు చేశాయని.. చంద్రబాబు చెబుతున్న రూల్‌ ఆఫ్‌ లా అంటే ఇదేనా? అని రోజా ప్రశ్నించారు. 

     

     

  • సాక్షి, గుంటూరు: తమపై పక్కా ప్లాన్‌ ప్రకారమే మా ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. తీవ్రమైన పదజాలంతో దాడులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు. అక్కడే ఉండి కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

    మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా?. కాపు మహిళలైన మాపై కూడా దాడులు చేశారు. బండబూతులు తిడుతూ లకారాలతో మాపై దాడులకు పాల్పడ్డారు. తాను అన్నది చంద్రబాబును కాదని మా నాన్న క్లియర్‌గా చెప్పారు. గతంలో చంద్రబాబు కూడా వైఎస్‌ జగన్‌ను అనేక సార్లు అనరాని మాటలు అన్నారు. ఎ‍మ్మెల్యే గల్లా మాధవికి ఏ నైతిక విలువలు ఉన్నాయి?. తాగుబోతులను మాపై ఉసిగొల్పారు. 

    మా నాన్నకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అలా మట్లాడినందుకు క్షమాపణ కూడా చెప్పారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. ఎనిమిది గంటల పాటు మా ఇంటిపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి మాపై దాడులు చేశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు. టీడీపీ గూండాలను కంట్రోల్‌ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్‌ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

    రెండు రోజులుగా మాపై దాడి జరుగుతుంది. లడ్డుపై వేసిన పోస్టర్లు చింపడానికి రాంబాబు వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజ కోసం వెళ్లారు. గుడి నుంచి ఇంటికి వస్తుంటే రాంబాబుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అసభ్యకరమైనపై భాషతో కారుపై దాడి చేశారు. ఒక మహిళ మాట్లాడిన మాటలు చూడండి ఆయన్ను రెచ్చగొట్టారు. దీంతో రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు అని ఆయనే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది. ఇక్కడే ఉంటాను అని చెప్పిన తర్వాత ఆయనపై దాడి చేశారు. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు. హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. మేము వైఎస్సార్‌సీపీ అని అధికారంలో లేమని మాపై దాడి చేశారు. దేవుడి లడ్డూ గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారు.

    	కన్నీరు పెట్టిన అంబటి కూతుర్లు.. నేనూ మీ కాపు మహిళనే

    గల్లా మాధవికి కుటుంబం ఉంది. మీకు కుటుంబం ఉంది కదా?. కొంతమంది మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని బలి పశువును చేస్తున్నారు. మీ అత్మ సాక్షికే వదిలేస్తున్నాను. రాంబాబు దేని గురించి భయపడరు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలను ఉపయోగించి, మహిళలపై దాడి చేస్తున్నారు. రాంబాబు గారిని స్టేషన్‌లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని ఒక డాక్టర్‌.. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమా?. దీనికి పెమ్మసాని భార్య అను సమాధానం చెప్పాలి. మా భద్రత గురించి మా నాన్న ఆందోళన చెంది ఉంటారు. గల్లా మాధవి డైరెక్షన్‌తోనే మాపై దాడి చేశారు అని చెప్పుకొచ్చారు. 

Sports

  • టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20‍లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.

    అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2025 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.

    ఈ క్రమంలోనే అతడికి వరల్డ్‌కప్‌ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.

    టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు
    పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

  • టీ20 వరల్డ్‌కప్‌-2026 వార్మప్ మ్యాచ్‌లు సోమవారం నుంచి షురూ అయ్యాయి. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో  ఇండియా ‘ఏ’ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

    ఓపెనర్ నారాయణ్ జగదీశన్(55 బంతుల్లో 104: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కెప్టెన్ అయుష్ బదోని( 26 బంతుల్లో 60 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 24 బంతుల్లో 38 పరుగులు చేసి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, శుభమ్‌, జస్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

    అనంతరం భారీ లక్ష్య చేధనలో అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సంజయ్ కృష్ణమూర్తి (41),శుభమ్ (28), హర్మీత్ సింగ్ (25), మహ్మద్ మోసిన్ (21) రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఖలీల్ అహ్మద్, తిలక్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా ఫిబ్రవరి 4న సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా  సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. తిలక్ వర్మ మంగళవారం సీనియర్ జట్టుతో కలవనున్నాడు.
    చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కట్‌.. పాకిస్తాన్‌ మరో కొత్త డ్రామా
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 మ‌రో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం క్రికెట్ ప్ర‌పంచంలో పెను సంచ‌ల‌నంగా మారింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15న భార‌త్‌తో జ‌ర‌గాల్సిన లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌ను  బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్ర‌భుత్వం ఆదివారం ఎక్స్‌వేదిక‌గా ప్ర‌క‌టించింది. దీంతో ఆఖ‌రి నిమిషంలో పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై స‌ర్వాత్ర విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

    అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గ‌ట్టిగానే స్పందించింది. నచ్చిన మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాము అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. ఒక‌వేళ పాక్ త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకోక‌పోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కాగా భార‌త్‌-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్‌కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ న‌ష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేసే అవ‌కాశ‌ముంది.

    'ఈమెయిల్' డ్రామా
    కాగా ఈ బాయ్‌కట్ గురుంచి పీసీబీ నుంచి ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స‌మాచారం అంద‌లేదు. ప‌లు రిపోర్ట్‌లు ప్ర‌కారం..ఎలాంటి అధికారిక ఈమెయిల్ ఐసీసీకి పంపకూడదని పీసీబీ నిర్ణయించుకున్న‌ట్లు స‌మాచారం.  దీంతో పీసీబీపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు ఉద్దేశపూర్వ‌కంగానే స‌మాచారం ఇవ్వ‌డం లేదు. ఏదేమైనప్పటికి పాక్‌ తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. అయితే ఇదే విష‌యం చ‌ర్చించ‌డానికి ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
    చదవండి: ఇదంతా బీసీసీఐ వల్లే: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకతో కలిసి భారత్‌ ఆతిథ్యం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి తలనొప్పిగా మారాయి.

    ఇందుకు కారణం.. భారత్‌- బంగ్లాదేశ్‌ (IND vs BAN), భారత్- పాకిస్తాన్‌ (IND vs PAK) దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు... పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌తో మెగా ఈవెంట్లలో తలపడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. 

    మరోవైపు.. ఇన్నాళ్లు భారత్‌ సాయం పొందిన బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు భారత్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోయింది.

    అప్పుడు మొదలు
    ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు పెరరగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు కూడా! 

    అంతేకాదు.. టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించి.. గడువు ఇచ్చినా పంతం వీడకపోవడంతో బంగ్లాను తప్పించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది.

    బంగ్లాకు మద్దతుగా పాక్‌
    ఇక ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్‌.. ఇప్పుడు కేవలం భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమంటూ ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించి ఐసీసీకి అధికారికంగా మెయల్‌ చేయలేదు. ఈ పరిణామాలపై ఐసీసీ కమ్యూనికేషన్స్‌ మాజీ హెడ్‌ సమీ ఉల్‌ హసన్‌ బర్నే స్పందిస్తూ.. తప్పంతా బీసీసీఐపైకి నెట్టాడు.

    బీసీసీఐ నిందలు
    ‘‘ఈ విషయంలో క్రికెట్‌ బోర్డులు మరింత ఆచితూచి వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ను తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సింది. కేకేఆర్‌కు ప్రైవేటుగా విషయం చెప్పి అతడిని రిలీజ్‌ చేయమని చెప్పాల్సింది.

    కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే పెద్దగా మారతాయి. జనవరి 3న వాళ్లు (బీసీసీఐ) చేసిన ప్రకటనే వీటన్నిటికీ మూలం. అయితే, బంగ్లాదేశ్‌ విషయంలో పాక్‌ చేస్తున్న పోరాటం సరైంది కావచు​... కాకపోనూ వచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ఏ బోర్డు అయినా నడుచుకుంటుంది.

    ఏదేమైనా పాక్‌ తదుపరి పరిణామాలకు సిద్ధపడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. న్యాయ బృందంతో చర్చించి.. ఈ విషయంపై ఎలా ముందుకు సాగాలో వారు ఆలోచించుకునే ఉంటారు’’ అని సమీ ఉల్‌ హసన్‌ బర్నే పేర్కొన్నాడు. 

    కాగా పాక్‌ కోసం శ్రీలంకను ఐసీసీ తటస్థ వేదికగా ఏర్పాటు చేసినప్పటికీ.. భద్రతా కారణాలు అంటూ పాక్‌ భారత్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తామనడం గమనార్హం. అందుకే ఐసీసీ ఈసారి పాక్‌కు గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

    చదవండి: పాక్‌ ఓవరాక్షన్‌.. ఐసీసీ కీలక సమావేశం!

  • టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తన రీఎంట్రీలో సత్తాచాటాడు. టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభానికి ముందు నవీ ముంబై వేదికగా అమెరికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తిలక్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

    ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌.. కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. తొలుత  8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి కాస్త ఆచితూచి ఆడిన తిలక్‌.. హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా జోరు పెంచాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌తో కలిసి తిలక్  స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 

    అయితే మంచి టచ్‌లో కన్పించిన తిలక్‌, అమెరికా పేసర్ శుభమ్ రంజన్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్ త‌ర్వాత తిల‌క్ మంగ‌ళ‌వారం(ఫిబ్ర‌వ‌రి 3)న జ‌ట్టుతో క‌లవ‌నున్నాడు. తిల‌క్ దాదాపు నెల రోజుల నుంచి పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తొలి మ్యాచ్‌లోనే ఈ త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

    భారత్‌ భారీ స్కోర్‌
    కాగా జగదీశన్‌ నారయణ్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ ఆయూష్‌ బదోని(60) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ జట్టు మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, శుభమ్‌, జస్‌దీప్‌ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

  • భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకి లేదని స్పష్టం చేశారు. దయచేసి తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. పురుషులందరినీ తక్కువ చేసేలా తాను మాట్లాడానంటూ వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. అసలేం జరిగిందంటే...

    విడాకులు.. వివాదాలు
    గత కొన్ని రోజులుగా మేరీ కోమ్‌ (Mary Kom) వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న మేరీ కోమ్‌- కరుంగ్‌ ఓన్‌కోలర్‌ కోమ్‌ అనూహ్య రీతిలో విడిపోవడం.. అనంతరం పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇందుకు కారణం.

    గల్లీల్లో చాలా మంది ఉన్నారు
    విడాకుల గురించి అధికారిక ప్రకటన చేసిన తర్వాత చాన్నాళ్లు మౌనంగా ఉన్న మేరీ కోమ్‌.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ భర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కోసం కెరీర్‌ త్యాగం చేశానని కరుంగ్‌ అంటున్నాడని.. దేశంలో గల్లీల్లో చాలా మంది ఫుట్‌బాల్‌ ఆడుతుంటారని ఎద్దేవా చేశారు.

    సంపాదన లేని భర్త
    అంతేకాదు.. కరుంగ్‌ చిల్లగవ్వ కూడా సంపాదించలేదని.. తనపై ఆధారపడి బతికాడని మేరీ కోమ్‌ తన మాజీ భర్తను నిందించారు. ఈ నేపథ్యంలో కరుంగ్‌ సైతం ఘాటుగా స్పందించాడు. తన భార్య బాక్సింగ్‌ ప్రయాణం సజావుగా సాగేందుకు తాను ఎన్నో త్యాగాలు చేశానని.. ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ను వదిలేశానని చెప్పాడు.

    సంచనల ఆరోపణలు
    నలుగురు పిల్లల ఆలనాపాలనా కూడా తానే చూసుకొన్నానని.. ఇంటి బాధ్యతలన్నీ తానొక్కడినే నెరవేర్చానని కరుంగ్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. గతంలో ఓ జూనియర్‌ బాక్సర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించిన మేరీ కోమ్‌.. ఆ తర్వాత తమ అకాడమీలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. వారిద్దరి వాట్సాప్‌ చాట్లు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపాడు

    అయితే, మేరీ కోమ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్లు, భార్య కెరీర్‌లో ఎదిగేందుకు వీలుగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చక్కదిద్దే భర్తలను తక్కువ చేసి మాట్లాడిందంటూ భారీ ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్‌ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

    హుందాగానే ప్రవర్తించాను
    ‘‘నా పెళ్లి పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చిందని నేను చెప్పను. చాలా ఏళ్ల పాటు అంతా సజావుగా సాగిపోయింది. అయితే, ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత అంతా మారిపోయింది 2025 ఏప్రిల్‌లో నా విడాకుల గురించి ప్రకటించినపుడు కూడా నాకై నేను నేరుగా మీడియాతో మాట్లాడలేదు

    ఎల్లప్పుడూ నేను హుందాగానే ప్రవర్తించాను. నా మాటలు సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి. ఇది దురదృష్టకరం. యూత్‌ ఫుట్‌బాల్‌కు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. ఫుట్‌బాల్‌ సంస్కృతిని నేను కించపరచలేదు.

    నేనొక బాక్సర్‌ని. అయినప్పటికీ నాకు ఫుట్‌బాల్‌ ఆడటం అంటే ఎంతో ఇష్టం. నా వ్యాఖ్యలతో క్రీడలను, క్రీడాకారులను కించపరచాలని అనుకోలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం గల్లీ నుంచే మొదలవుతుంది. కఠిన శ్రమ, అంకితభావంతో పనిచేస్తే సునిల్‌ ఛెత్రి, భాయ్‌చుంగ్‌ భుటియా లాంటి వాళ్లు పుట్టుకొస్తారు.

    పురుష సమాజానికి క్షమాపణలు
    నా కోసం తన కెరీర్‌ త్యాగం చేశానని నా మాజీ భర్త అన్నాడు. అతడు షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్‌ ఆడేవాడు. ఆ తర్వాత ఆటను వదిలేసి ఢిల్లీకి వచ్చిన తర్వాతే నన్ను కలిశాడు అదే విధంగా.. నా భర్తకు సంపాదన లేదని నేను అన్న మాటలను.. పురుష సమాజాన్ని కించపరచాలని మాట్లాడినట్లు అన్వయించుకుంటున్నారు.

    నా ఈ మాటలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇది కేవలం మా మధ్య జరిగిన విషయానికి సంబంధించినది మాత్రమే. చాలా ఏళ్ల పాటు అనుభవించిన బాధ, డిప్రెషన్‌.. ద్రోహం కారణంగా నాలో పెల్లుబుకిన అసహనం అది. అంతేకానీ మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు’’ అని మేరీ కోమ్‌ స్పష్టతనిచ్చారు.

    చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి శ్రీలంక‌, భార‌త్ వేదిక‌ల‌గా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగ‌నుంది. ఈసారి కూడా ఎలాగైనా గెలిచి టైటిల్‌ను రిటైన్ చేసుకోవాల‌ని మెన్ ఇన్ బ్లూ ప‌ట్టుద‌ల‌తో ఉంది.

    ఈ టోర్నీలో భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా యూఎస్ఎతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం భార‌త తుది జ‌ట్టును టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ పార్ధివ్ ప‌టేల్ అంచనా వేశాడు. ఓపెన‌ర్లుగా అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌కు అత‌డు అవ‌కాశ‌మిచ్చాడు. 

    సంజూ శాంస‌న్ పేల‌వ ఫామ్ క‌న‌బ‌రుస్తుండ‌డంతో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా ఇషాన్ వైపే పార్ధివ్ మొగ్గు చూపాడు. కివీస్‌తో జ‌రిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంస‌న్ కేవ‌లం 46 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇక కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌కు మూడో స్దానంలో, గాయం నుంచి కోలుకున్న తిల‌క్ వ‌ర్మ‌కు నాలుగో స్ధానంలో ప‌టేల్ ఛాన్స్ ఇచ్చాడు. 

    పార్ధివ్ ఎంపిక చేసిన జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ల‌గా శివం దూబే,హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ చోటు ద‌క్కించుకున్నాడు. ఫినిష‌ర్‌గా రింకూ సింగ్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌ను పార్ధివ్ ఎంపిక చేశాడు. యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణాకు మాత్రం అత‌డు ఎంపిక చేసిన జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఈ జ‌ట్టులో స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశం ల‌భించింది.

    పార్ధివ్ ప‌టేల్ ఎంపిక చేసిన ఇండియ‌న్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌
    అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబే ,హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి

  • పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయం పట్ల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి సమయం సమీపించిన తరుణంలో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ పాక్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన ఐసీసీకి ఆగ్రహం తెప్పించింది.

    అత్యవసర సమావేశం
    ఈ నేపథ్యంలో పాక్‌ వైఖరి పట్ల కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యవసరంగా బోర్డు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు టైమ్స్‌నౌ వెల్లడించింది. పీసీబీ గనుక పట్టువీడకపోతే తగిన విధంగా బుద్ధి చెప్పాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం.

    కాగా భారత్‌- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్‌పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తమ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌కు బాసటగా నిలిచేందుకు ఈ మెగా ఈవెంట్‌నే బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాక్‌ ఇప్పుడు ప్రపంచకప్‌ ఆడేందుకు సిద్ధమైంది.

    భారత్‌తో మాత్రం ఆడబోము
    అయితే భారత్‌తో మాత్రం మ్యాచ్‌ ఆడబోమని ప్రకటించింది. నిజానికి జట్లు ఎంపిక, ప్రకటనకు ఐసీసీ ఇచ్చిన తుదిగడువుకు ముందే పీసీబీ తమ జట్టును ప్రకటించింది. కానీ.. తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితేనే ప్రపంచకప్‌ ఆడతామని జట్టును ఎంపిక చేసిన సందర్భంలో తెలిపింది. 

    ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో వరల్డ్‌కప్‌ ఆడతామని ఆదివారం స్పష్టం చేసిన పీసీబీ ఈ నెల 15న కొలంబో (శ్రీలంక) వేదికగా భారత్‌తో జరిగే  మ్యాచ్‌లో బరిలోకి దిగబోమని తెలిపింది.

    పెద్ద ఎత్తున నష్టాలు
    ఈ నేపథ్యంలో పీసీబీపై ఐసీసీ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయంటూ క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  కాగా దాయాదుల ‘ప్రపంచ’ సమరం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. 

    అయితే, పాక్‌ ప్రకటన వారికి షాకిచ్చింది. భారత్‌తో ఆడబోమంటూ పాక్‌ చేసిన ప్రకటన.. ఫ్యాన్స్‌పైనే కాదు దీని తక్షణ ప్రభావం గ్లోబల్‌ బ్రాడ్‌కాస్టర్లపై కూడా పడుతుంది. 

    అసలే 20 జట్లు ఆడుతున్న ఈ మెగా టోర్నీలో ఇక ఒక్క మ్యాచ్‌కు కూడా కిక్కిరిసే మైదానం కనబడక... టికెట్‌ రెవెన్యూ యాడ్‌ రెవెన్యూ, ఓ ప్రపంచకప్‌కు వీక్షకుల సంఖ్య, ఇలా అన్నింటిపైనా ప్రభావం ఉంటుంది. 

    ఇదే జరిగితే ఐసీసీ​కి పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయి. ఫలితంగా పాక్‌ బోర్డు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడక తప్పదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ సైతం భద్రతా కారణాలు అంటూ.. భారత్‌లో మ్యాచ్‌ ఆడలేమని పట్టుబట్టగా ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఇపుడు పాక్‌కు కూడా ఇలాంటి భారీ షాక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    చదవండి: విచారకరం: షాహిద్‌ ఆఫ్రిది పోస్ట్‌ వైరల్‌

  • టీ20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందే ప‌లు వివాదాలతో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్ప‌టికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి త‌ప్పుకోగా.. తాజాగా భార‌త్‌తో మ్యాచ్‌ను బాయ్‌క‌ట్ చేస్తున్న‌ట్లు పాకిస్తాన్‌ ప్రభుత్వం ప్ర‌క‌టించింది.  షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్‌-భారత్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు పాక్‌ సర్కార్‌  నిర్ణయంతో ఈ హైవోల్టోజ్ మ్యాచ్ జరిగే సూచనలు కన్పించడం లేదు. అయితే పాకిస్తాన్‌ నిర్ణ‌యంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ ఆంస‌తృప్తి వ్యక్తం చేసింది. 

    పాక్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌పంచ క్రీడా నియ‌మాల‌కు విరుద్ధ‌మ‌ని తెలిపింది. దీనిపై పీసీబీ నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక స‌మాచారం అందలేదని ఐసీసీ పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్‌ ఎహసాన్ మణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించినందుకు పాకిస్తాన్‌పై చర్యలు తీసుకునే హక్కు  ఐసీసీకి లేదని అతడు అన్నాడు.

    "ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా తమ ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండాలి. ప్రభుత్వ సూచనలను పాటిస్తే సదరు క్రికెట్ బోర్డుపై ఎటువంటి చర్యలు తీసుకోలేము. ఇప్పుడు పీసీబీ విషయంలో అదే జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసింది.

    గతంలో భారత్ కూడా ఇలానే వ్యవహరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు వచ్చేందుకు నిరాకరించింది. భారత ప్రభుత్వం అనుమతించలేదనే కారణాన్ని ఐసీసీ అంగీకరించింది. అప్పుడు బీసీసీఐపై ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు.. ఇప్పుడు పాకిస్తాప్‌పై ఆంక్షలు విధిస్తే అది కచ్చితంగా ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించినట్లే అవుతోంది. 

    మొహ్సిన్ నఖ్వీ కేవలం పాక్ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడే కాదు, పాక్ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా. ఆయన మొదటి నుంచే ఐసీసీ నిర్ణయాలపై ఆసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ ముందుగానే పసిగట్టడంలో విఫలమైంది. ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందని" స్పోర్ట్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి పేర్కొన్నారు.

    ఎహసాన్ మణి గతంలో ఐసీసీ చైర్మెన్‌గా కూడా పనిచేశారు. కాగా  'పరస్పర అంగీకారం'తో సమస్యను ప‌రిష్క‌రించుకోవాల‌ని పాకిస్తాన్‌ను ఐసీసీ కోరింది. ఒక‌వేళ వేళ పాక్ త‌మ మొండిపట్టు వీడకపోతే, ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఐసీసీ ఆదాయంలో మెజారిటీ వాటా భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది. ఇదే విష‌యంపై ఐసీసీ మ‌రో రెండు రోజుల్లో బోర్డు స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
    చదవండి: విచారకరం: షాహిద్‌ ఆఫ్రిది పోస్ట్‌ వైరల్‌
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తూ పాకిస్తాన్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పాక్‌ అనవసరంగా రాద్దాంతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది స్పందించిన తీరు వైరల్‌గా మారింది.

    పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత
    గతంలో శ్రీలంకపై జట్టు పాక్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి దశలో తమకు భద్రత ఉండదంటూ.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆడేందుకు పాక్‌ వెళ్లేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఐసీసీ తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడించింది. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

    ఓ పాడైన కోడిగుడ్డు ..
    ఈ క్రమంలో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత వెటరన్‌ జట్టు బహిష్కరించింది. సెమీస్‌లో కూడా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు నిరాకరించి టోర్నీ నుంచే తప్పుకొంది. ఆ సమయంలో షాహిద్‌ ఆఫ్రిది భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    ముఖ్యంగా శిఖర్‌ ధావన్‌ను ఉద్దేశించి.. ‘‘ఓ పాడైన కోడిగుడ్డు మిగతా వాటినీ చెడగొడుతుంది’’ అంటూ ఆఫ్రిది ధావన్‌ను నిందించాడు. అంతేకాదు.. క్రీడల్లో రాజకీయాలు ఏమిటి? అంటూ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. అయితే, తాజాగా పాకిస్తాన్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో ఆఫ్రిది చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

    విచాకరమే.. కానీ
    ‘‘రాజకీయాలు దౌత్య సంబంధాలకు ముగింపు పలికినపుడు క్రికెట్‌.. అందుకు అనుకూలమైన ద్వారాలను తెరుస్తుందని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. టీ20 ‍ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ ఇండియాతో మ్యాచ్‌ ఆడకపోవడం విచారకరం.

    అయితే, మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇలాంటి సమయంలోనే ఐసీసీ తానేంటో నిరూపించుకోవాలి. ప్రతి సభ్య దేశం పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. అందరికీ న్యాయం దక్కేలా చూడాలి’’ అంటూ షాహిద్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఆడకపోవడం విచారకరం అంటూనే.. ప్రభుత్వం నిర్ణయం సరైందేనన్నట్లుగా ఆఫ్రిది మాట్లాడటం ట్రోల్స్‌కు దారితీసింది.

    వారెవ్వా.. డబల్‌ యాక్షన్‌
    ‘‘ఎల్లప్పుడూ భారత ఆర్మీ, టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతావు కదా!.. షేక్‌హ్యాండ్‌ విషయంలోనూ మీరంతా రాద్దాంతం చేశారు. మరి ఇప్పుడు తటస్థ వేదికపైన మ్యాచ్‌లు నిర్వహిస్తున్నా తప్పుకొంటామని బెదిరించి నవ్వులపాలై.. ఇప్పుడేమో ఇండియా మ్యాచ్‌ ఒక్కటి భద్రత లేదంటూ బహిష్కరిస్తామనడం ఏమిటి?

    పీసీబీ మీ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడాన్ని సమర్థించే నువ్వు.. బీసీసీఐని ఎలా నిందించావు? భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే బీసీసీఐ కూడా నడుచుకుంటుంది’’ అంటూ షాహిద్‌ ఆఫ్రిదికి నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

    చదవండి: పాక్‌ సెమీస్‌, ఫైనల్స్‌ను కూడా రద్దు చేసుకుంటుందా..?

  • టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్‌ ఫైనల్‌ కోసం​ ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. 

    జైస్వాల్ ఈ సీజన్‌లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్‌ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. 

    తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శార్దూల్‌ ముంబై జట్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్‌కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్‌, శార్దూల్‌ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది.  

    కర్ణాటకతో జరిగే క్వార్టర్‌ ఫైనల్‌ కోసం ముంబై జట్టు..  
    - శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) 
    - యశస్వి జైస్వాల్
    - ముషీర్ ఖాన్  
    - అఖిల్ హెర్వడ్కర్  
    - సిద్ధేశ్ లాడ్  
    - సర్ఫరాజ్ ఖాన్  
    - ఆకాష్ ఆనంద్ (wk)  
    - హార్దిక్ తమోరే (wk)  
    - సైరాజ్ పటిల్  
    - శంస్ ములానీ  
    - తనుష్ కోటియన్  
    - తుషార్ దేశ్‌పాండే  
    - మోహిత్ అవస్థ  
    - ఓంకార్ తర్మలే  
    - దివ్యేష్ సక్సేనా  
    - సూర్యాంశ్ షెడ్గే  

     

National

  • ముస్లింలందరూ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో, అదే రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్‌ మాసం ఫిబ్రవరిలో ప్రారంభం కానుండటం విశేషం. చివరగా 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్‌ మాసం మొదలైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో రంజాన్‌ మాసం ప్రారంభమవనుంది. 

    ఇక, ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిలందరూ ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. ఈ రంజాన్ మాసం నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మన దేశంలో ఫిబ్రవరి 18 లేదా 19వ తేదీన రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో, రంజాన్‌ మార్చి 20 లేదా 21 తేదీన వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతం ఆచారాల ప్రకారం, ఉపవాసాన్ని విరమించడానికి, ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు.

    ఇస్లాం క్యాలెండర్ ప్రకారం, రంజాన్ నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభమవుతుంది. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. తొలి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని అంటారు. ఈ సందర్భంగా రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎందుకని పవిత్ర మాసంగా పరిగణిస్తారు. సూర్యోదయానికి ముందు సెహ్రీ, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ ఎందుకు పాటిస్తారు.

    అయితే, రంజాన్ అనేది ఓ నెల పేరు. మనకు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నట్లే. రంజాన్ లేదా రమదాన్ అనేది ముస్లిం క్యాలెండర్‌లో  తొమ్మిదో నెల.  ముస్లింలు ఆచరించేది చంద్రమాన క్యాలెండర్. ముస్లిం క్యాలెండర్  అనేది  ఎలా ఏర్పడిందంటే.. మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా వెళ్లడం జరిగింది. దీన్నే హిజ్రత్  అని కూడా  అంటారు. క్రీస్తు శకం లేదా సామాన్య శకం 622లో ఇది జరిగినట్లు చెబుతారు. దీన్నే హిజ్రీ శకం అని అంటారు.

    మొదటి నెల మొహరం
    క్రీస్తు శకం లేదా సామాన్య శకం 638లో ఈ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్యాలెండర్ ప్రకారం  మొదటి నెల మొహరం, రెండో నెల సఫర్,  మూడో నెల రబీ ఉల్ - అవ్వల్, నాలుగో నెల రబీ ఉల్ -ఆఖిర్, ఐదో నెల జమాది ఉల్ - అవ్వల్, ఆరో నెల  జమాది ఉస్- సాని, ఏడో నెల రజబ్,  ఎనిమిదో నెల షాబాన్,  తొమ్మిదో నెల  రంజాన్, పదో నెల షవ్వాల్,  పదకొండో నెల  జుల్ -  ఖాదా,  పన్నెండో నెల జుల్ -  హిజ్జా. అయితే తొమ్మిదో నెల రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు.  అందుకే ఈ రంజాన్ నెలను పవిత్ర మాసంగా, పవిత్ర పండుగగా ప్రతీ ముస్లింలు ఆచరిస్తారు. ఈ పండుగనే ఈద్-ఉల్-ఫిత్ర అని కూడా పిలుస్తారు.

  • బెంగళూరులో జరిగిన ఒక 'హిట్ అండ్ రన్' (Hit-and-Run) ఘటన సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటి సంపాదిస్తున్న తన సోదరి ప్రాణానికి విలువ లేకుండాపోయిందంటూ   ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెట్టింట  వైరల్‌గా మారింది.బెంగళూరు పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Overlayy అనే AI స్టార్టప్ వ్యవస్థాపకుడు స్నేహిల్ సలూజా, తన సోదరి , ఆమె స్నేహితురాలికి ఎదురైన భయానక అనుభవాన్ని  ట్విటర్‌ ద్వారా పచుకున్నారు. 

    అసలేం జరిగిందంటే..
    స్నేహిల్‌ కారులో ఆయన సోదరి, ఆమె స్నేహితురాలు ప్రయాణిస్తున్నారు. బెంగళూరులోని ఒక రెడ్ లైట్  సిగ్నల్‌ పడినపుడు, స్నేహిల్ సోదరి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఒక మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, తమకుజరిగిన అన్యాయం, ట్రక్కు యజమానిపట్ల పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ విషయం హైవే పోలీసులకు , ట్రక్కు యజమానికి కూడా తెలుసని, అయినా  ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ను అరెస్టు చేయలేదనీ కనీసం FIR (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేయడానికి కూడా పోలీసులు నిరాకరించారని స్నేహిల్ ఆరోపించారు.

    ఇదీ చదవండి: 6 వేల మీటర్ల లోతులో జపాన్‌ ఘనత : ప్రపంచంలోనే తొలిసారి

    పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు
    ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కదా, కేసు ఎందుకు? ఇన్సూరెన్స్‌తో సెటిల్ చేసుకోమని పోలీసులు బాధితులకు సూచించారనేది ఆయన వాదన. మరోవైపు  ట్రక్కు యజమానులు పోలీసులకు క్రమం తప్పకుండా లంచాలు ఇస్తుంటారని, అందుకే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని ఒక అధికారి బాధితులతో అన్నట్లు స్నేహిల్ పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తన సోదరి బెంగళూరు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతోందని, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలపై నమ్మకం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు పూర్తిస్థాయి ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్‌ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు.

    ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

    చట్టాన్ని గౌరవించే, పన్ను చెల్లించే నిపుణులను కూడా రక్షించడంలో వ్యవస్థ విఫలమైందని స్నేహిల్   పేర్కొన్నాడు.  బాధితుల్లో ఒకరు ప్రధాన డేటా కంపెనీలో పనిచేస్తున్న, ఉన్నత IIT-JEE ర్యాంక్ కలిగిన యువ AI ఇంజనీర్. "ఇది 2025లో బెంగళూరు. ఇది 2025లో భారతదేశం" అని ఆయన రాసుకొచ్చారు. కోటి రూపాయల ఆర్జించి పన్నులు కట్టే వారి పరిస్థితి ఇలా ఉంటే, ఇక సాధారణ పౌరులు వ్యవస్థను ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.

     

    నెటిజన్ల స్పందన
    అధికంగా పన్నులు కట్టే నిపుణులకు కూడా దేశంలో రక్షణ లేకపోతే ఎలా  అని నెటిజన్లు కూడా విమర్శించారు.ఈ సంఘటనను సిగ్గుచేటు అని అభివర్ణించారు.ఇటువంటి పరిస్థితుల వల్లే ప్రతిభావంతులైన యువత విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

    ఈ విషయంపై బెంగళూరు సిటీ పోలీస్ లేదా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.


    ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

  • లక్నో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థిర,చర ఆస్తులు అంటే ఒక ప్రదేశం‌ నుంచి మరో ప్రదేశానికి తరలించే వాహనాలు ఇతర ఆస్తులతో స్థిరాస్తులైన ఇళ్లు, స్థలాల వివరాలను అందించాలని సూచించారు. 

    ఇందుకోసం మానవ్‌ సంపద (Manav Sampada) పేరుతో ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,66,261 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. డిసెంబర్‌ 31,2025 నుంచి జనవరి 31,2026 వరకు వారి ఆస్తుల వివరాల్ని పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు. నిర్ధేశించిన గడువు లోపు ఆస్తుల వివరాలు అందించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ గోయల్‌ పర్యవేక్షించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

    సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ ఆస్తులు ఇవేనంటూ సంబంధిత ఆస్తుల వివరాల్ని మానవ్‌ సంపద్‌ పోర్టల్‌లో ఆధాలతో సహా అప్‌లోడ్‌ చేశారు. వారిలో 68వేల మంది ఉద్యోగులు వారి వివరాల్ని ఇవ్వలేదు.  

    ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ సీఎం వారి జనవరి జీతాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇచ్చే వరకు జీతాలు ఇవ్వకూడదని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రమోషన్ల నిలిపివేయడం, వారిపై పెనాల్టీ విధిస్తామని హుకుం జారీ చేశారు.

  • భర్తపై భార్య దారుణంగా దాడిచేసిన వీడియో ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్నప్పటికీ ,అతనిపై హింసకు పాల్పడిన వైనం నెట్టింట భర్తలపై భార్యల హింసగురించి చర్చకు దారి తీసింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం, సీసీ కెమెరాలో బాధితుడ్ని  కొడుతున్న దృశ్యలు నమోదయ్యాయి.  తన భార్య నిర్వాకాన్ని రికార్డు చేసేందుకు,ఆధారాలు సేకరించడానికి  బాధితుడు తన భార్యపై గదిలో రహస్య కెమెరాను అమర్చాడట. ఈ  వీడియోను క్లిప్‌లో, ఆ మహిళ ఆ వ్యక్తిని మంచంపైకి విసిరి, అతనిపైకి ఎగిరి దూకి, రెండు చేతులతోనూ పిడి గుద్దుల  వర్షం కురిపించింది. ఇంతలో మహిళ గదిలోకి వెళ్లి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఫలించలేదు. ఒక బిడ్డను ఎత్తుకుని ఉన్న మరో వ్యక్తి కూడా గదిలోకి వెళ్లాడు. అయినా బాధితుడిపై దాడి కొనసాగుతూనే ఉంది.

    దీంతో నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భార్యల వేధింపులు తాళలేక  తనువు చాలించిన అతుల్ సుభాష్,మానవ్ శర్మ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు.  2025లో ఏప్రిల్‌లో పోస్ట్‌ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడిది, బాధితుడు ఎవరు? అనే వివరాలపై ఎలాంటి ధృవీకరణ లేదు.  

    ఇదీ చదవండి: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు : ఎవరో తెలుసా?

    నెటిజనుల స్పందన
    ఆమెపై కేసు నమోదు చేయాలని కొంతమంది కోరగా, గృహ హింస నుండి పురుషులను రక్షించడానికి, అలాంటి మహిళలను శిక్షించడానికి ఎటువంటి చట్టాలు లేవని వాపోయారు. అదే పురుషుడు మహిళపై దాడిచేస్తే పదేళ్ల దాకా జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు.

    పేలవమైన చట్టాలు, అవినీతి న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ బాధితుడిగా మారుతున్న ప్రతి పురుషుడికి మనం అధికారం ఇవ్వాలి.అలాగే ప్రతి పురుషుడిని ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్న ఇలాంటి మహిళలకు గుణపాఠం నేర్పాలి.   వేధింపులకు గురవుతున్న  వివాహిత పురుషుడు అన్ని అడ్డంకులకు వ్యతిరేకంగా పోరాడాలి.  అంతకానీ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవద్దు  అని ఒక నెటిజన్‌ కోరడం గమనార్హం.

    అయితే వీడియో రికార్డు చేస్తున్నాడు కాబట్టి అతను కావాలనే ప్రతిఘటించడం లేదని కమెంట్‌ కూడా కనిపించింది. 
    ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

  • సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. రూ.5,454 కోట్ల నిధులు తెలంగాణ రైల్వే ప్రాజెక్టులు కేటాయించినట్టు తెలిపారు. త్వరలోనే బుల్లెట్‌ ట్రైన్‌కు హైదరాబాద్‌ హబ్‌గా మారుతుందన్నారు.

    ఈ సందర్బంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ఇచ్చాం. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అన్నీ ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మిస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. బుల్లెట్ ట్రైన్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతుంది. ఇది సౌత్ ఇండియా డైమండ్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు.  అలాగే, 10,134 కోట్ల రూపాయల బడ్జెట్ ఏపీ రైల్వే ప్రాజెక్టులకు కేటాయించాం. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైలుతో 2:55 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు వెళుతుంది అని చెప్పుకొచ్చారు.

    దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా జటిలమైనది. సిబ్బంది మొత్తం మార్చాల్సిన అవసరం ఉంది. కంట్రోల్స్, కమాండ్, టైం టేబుల్ కూడా మార్పు జరగాలి. ఇదంతా కూడా చాలా జటిలమైన ప్రక్రియ. కొత్త జోన్ ఏర్పాటుకు గతంలో మూడు నాలుగు ఏళ్ళు పట్టేది. ఈసారి మేము చాలా ఫాస్ట్ ట్రాక్‌లో పనిచేస్తున్నాం. సజావుగా ఈ మార్పిడి ప్రక్రియ జరిగేందుకు పనిచేస్తున్నాం. సౌత్ కొస్టల్ జోన్ రైల్వే కార్యాలయం నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. చాలా వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని తెలిపారు. 

    • హైదరాబాద్-బెంగళూరు (రెండు గంటల జర్నీ)

    • హైదరాబాద్-చెన్నై(2:55 గంటల జర్నీ)

    • హైదరాబాద్-పుణె (1:45 గంటల జర్నీ)

    • హైదరాబాద్-చెన్నై ,

    • కోల్‌కతా-చెన్నై.

     

  • భారతదేశంలో లగ్జరీ స్టేటస్ సింబల్స్‌ చాలా ఉన్నాయి. వీటి గురించి ఔరా అనిపించే కథనాలు కూడా గతంలో చాలా విన్నాం కూడా. ముఖ్యంగా ఇండియాలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కోసం ఖర్చు చేయడం ఒక విలాసం మాత్రమే కాదు. ఒక స్టేటస్ సింబల్. ఇపుడొక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు. అత్యంత ఖరీదైన డీల్‌గా చరిత్ర సృష్టించిన దీని వివరాలు తెలుసుకుందామా.

    ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నివాసి కిరణ్ కోల్పాకుల సంచలనం క్రియేట్‌ చేశారు. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో తన వాహన నెంబర్ ప్లేట్ కోసం ఒకటీ రెండూ కాదు రూ.2.08 కోట్లు  వెచ్చించారు.

    బిగ్ బాయ్ టాయ్జ్ (BBT) వేలం యాప్ ద్వారా ‘DDC 0001’ అనే ఐడెంటిఫైయర్ ఉన్న వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ రూ. 2.08 కోట్లకు  బిడ్‌ అయింది.  ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు అదుకే ఈ నంబర్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పోటీ పడ్డారు. ఎట్టకేలకు కిరణ్  వింటేజ్ నంబర్ ప్లేట్‌ను ఏకంగా రూ.2.08 కోట్లకు వేలంలో దక్కించు కున్నారు  ఇది దేశంలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచింది. ఈ వేలం ప్రధానంగా లగ్జరీ ప్రీ-ఓన్డ్ కార్లకు ప్రసిద్ధి చెందిన బిగ్ బాయ్ టాయ్స్‌కుప్రత్యేకంగా నిలిచింది.అలాగే అరుదైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని ఈ డీల్ నిరూపించింది.

    ఇదీ చదవండి : అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?

    DDC 0001 ప్లేట్‌ను మొదట  తొలి ఓనర్‌, కంపెనీ వ్యవస్థాపకుడు జతిన్ అహుజా. బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవలే తన కొత్త విభాగం ఆక్షన్ హౌస్‎ను లాంచ్‌ చేసింది. ఈ వేదిక ద్వారా అత్యంత అరుదైన, విలాసవంతమైన వస్తువులను వేలం వేస్తుంది. గత సంవత్సరం, రూ.1.17కోట్లకు 'HR 88 B 8888' ప్లేట్ అమ్మకం చివరికి బిడ్డర్ చెల్లించడంలో విఫలమై నందున రద్దైంది. తరువాత దానిని రూ.26.7 లక్షలకు తిరిగి అమ్మారు. ఇపుడిక రూ.2.08 కోట్లకు DDC 0001  వేలం కొత్త రికార్డు సృష్టించింది.

    బిగ్ బాయ్ టాయ్స్ ఆక్షన్ హౌస్ కేవలం నంబర్ ప్లేట్లు మాత్రమే కాకుండా, ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లను కూడా వేలంలో ఉంచింది. ఇందులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టికి చెందిన మెర్సిడెస్ బెంజ్ CLA 200d, క్రికెటర్ దినేష్ కార్తీక్ కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్ SVR వంటి కార్లు ఉన్నాయి.
     

    ఇదీ చదవండి: బంగారం చూస్తే అలా..వీడేమో ఇలా!


     

Family

  • చర్మ సంరక్షణ ఉత్పత్తులు మనకు మంచి ఫలితాలివ్వాలంటే ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి సంరక్షించే ఉత్పత్తుల విషయంలో ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే ఎంత పరిమాణంలో రాయాలనేది తెలుసుండాలి. లేదంటే అంతలా ఖర్చు చేసి.. కొన్నవి కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. 

    పైగా చర్మ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఏబ్యూటీ ప్రొడక్ట​ అయినా..రాసే పరిమాణం మీదే ఫలితం ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలి అని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అంతేగాదు ఎంతపరిమాణంలో రాయాలో కూడా సవివరంగా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు చర్మ వైద్యనిపుణురాలు డాక్టర్ గుర్వీన్ వారైచ్‌. మరి అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దాం.

    చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో సన్‌స్క్రీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మాన్ని సూర్యుడి నుంచి రక్షించడమే కాకుండా చర్మ పొరను కాపాడుతుంది, నల్లబడటాన్ని నివారిస్తుంది. అలాగే అతినీలలోహిత కిరణాల(యూవీబీ) నుంచి రక్షిస్తుంది. అది ఎంత ఖరీదైన బాటిల్‌ అయినా,  ఎంత ఎస్పీఎఫ్‌ అందించినా..సరైన మోతాదులో అప్లై చేయడం అనేది అత్యంత కీలకం అని చెబుతున్నారు చర్మవ్యాధి నిపుణురాలు.

    ఎంత సన్‌స్క్రీన్ అప్లై చేయాలంటే..
    చర్మవ్యాధి నిపుణులరాలు గుర్వీన్‌ ప్రకారం..ప్రతి చదరపు సెంటీమీటర్‌కు 2మిల్లీగ్రాములు సరైన పరిమాణం. అంటే ముఖం, మెడకు కలిపి..మొత్తం 1.6 నుంచి 1.8 mg అవసరం. ఇది సుమారుగా మూడు వేళ్లకు సమానం. ఈ మోతాదులో ముఖానికి అప్లై చేయకపోతే తగిన ప్రయోజనం పొందలేరని అన్నారామె. మనం ఎంత ఖరీదైనది, సన్‌స్క్రీన్‌ ఎస్పీఎఫ్‌ 50 అయినా సరే తగిన పరిమాణంలో ఉపయోగించకపోతే మెరుగైన ఫలితం మాత్రంపొందలేమని అన్నారు. 

    ప్రయోజనాలు..
    SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ రోజువారీ ఉపయోగం కోసం సరిపోతుంది. ఎండలో ఎక్కువగా ఉండేవారికి SPF 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. ఇలా ఈ సన్‌స్క్రీన్‌ అప్లై యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. అదెలాగంటే..

    • చర్మ రక్షణకు అవరోధంగా ఉన్న వాటిని నివారిస్తుంది. తామర, రోసేసియా, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

    • యూవీబీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ కేన్సర్‌ అవకాశాలను తగ్గిస్తుంది. 

    • గోధుమ రంగు మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు, వర్ణద్రవ్యం వంటి అకాల వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో సహాయపడుతుంది.

    (చదవండి: మాటే మంత్రమై.. ఆ బిడ్డకు ఊపిరి పోసింది..! సినిమాని తలపించే ఘట్టం)