Archive Page | Sakshi
Sakshi News home page

National

  • భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలుకు ప్ర‌యాణికుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. కామాఖ్య –హౌరా మధ్య గురువారం నుంచి ప‌రుగులు తీయయనున్న వందే భార‌త్ స్లీప‌ర్ రైలు తొలి కమర్షియల్‌ జర్నీకి సంబంధించి టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. 

    సోమవారం(జనవరి 19) ఉదయం 8:00 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవ్వగా.. కేవలం 24 గంటల లోపే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్‌ను 17 జనవరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి ఇంటీరియర్స్, సెన్సార్ ఆధారిత లైటింగ్, మెరుగైన బెర్తులు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి. 

    అంతేకాకుండా హౌరా, కామఖ్య మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది. ఈ కారణాలతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

    ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?
    ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి కనీస  ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కామాఖ్య నుంచి హౌరా మ‌ధ్య ప్రయాణానికి ఫస్ట్‌ ఏసీలో రూ.3,855, సెకెండ్‌ ఏసీలో రూ.3,145, థర్డ్‌ ఏసీలో రూ.2,435 ఖ‌ర్చు అవుతోంది.

    నో వెయిటింగ్ లిస్ట్!
    సాధారణ రైళ్లలో లాగా ఇందులో ఆర్‌ఎసీ(RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
     

  • ఊదయ్‌పూర్ అతివేగంగా కారు నడిపి నిర్లక్షంగా వ్యవహరించినందుకు యువకులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆయువకుడు 140 కిలోమీటర్ల వేగంతో సిగరెట్‌ చేతిలో పట్టుకొని కారు నడిపాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనవివరాలు వీడియోలో రికార్డయ్యాయి.

    డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్షంగా వ్యవహరించకూడదని ఎన్నిసార్లు చెప్పినా యువత పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు మనం చేసే తప్పిందం ఖరీదు నిండుప్రాణాలే అన్న సంగతి యువత మర్చిపోతున్నారు. అహ్మదాబాద్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితులు కలిశారు. అనంతరం టీకోసం మిత్రులంతా కారులో బయిలుదేరారు. ఆసమయంలో కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకొని 140 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారు.

    ఆసమయంలో ఎదురుగా కారు రావడంతో వాహనాన్ని కంట్రోల్‌ చేయలేక ఢీకొట్టారు. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అనంతరం కారులోని వ్యక్తులు సహయం కోసం అర్తనాథాలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రమాద ఘటన జరిగిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

  • ముంబై: మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. తన చేతిపై అమ్మా నాన్న.. ఐ లవ్‌ యూ.. నన్ను క్షమించండి అని రాసి తనువు చాలించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

    గంగాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ కడ్ వివరాల మేరకు.. ధ్రువ్ నగర్‌కు చెందిన దీక్షా త్రిభువన్(21) పుట్టుకపోతే దివ్యాంగురాలు. మాటలు కూడా సరిగా రావు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉన్న ఫ్యాన​్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. తన చేతిపై క్షమించండి... అమ్మా నాన్న, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాసిపెట్టి ఉంది. ఆమె మృతిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

    మరోవైపు.. తన కూతురు మృతి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దీక్ష ఎప్పుడూ ధైర్యంగా, అందరితో ఎంతో సేహ్నంగా ఉండేది. ఆమెనే మా భవిష్యత్‌ అనుకున్నాం. ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అసలు ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నారు. అయితే, తాను దివ్యాంగురాలైన కారణంగానే మసస్థాపానికి గురై దీక్ష ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. 

  • సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని వాసులకు వాసులకు ఎయిర్ క్వాలిటీ మెనేజ్‌మెంట్ శుభవార్త తెలిపింది. అక్కడి వాయికాలుష్య తీవ్రత గతంతో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు పేర్కొంది. దీంతో గ్రేడ్‌-4 నేపథ్యంలో విధించే కఠిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇ‍స్తున్నట్లు పేర్కొంది.

    ఢిల్లీ నగరం తీవ్రమైన గాలికాలుష్య సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గాలి నాణ్యత గత ఆదివారం 440కి చేరుకొని అత్యంతప్రమాదర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రేడ్‌-4కు విధించే కఠిన ఆంక్షలు విధిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉదయం గాలినాణ్యత 378గా నమోదైంది.  దీంతో ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇచ్చింది.

    అయితే గ్రేడ్-4 ఆంక్షల సమయంలో నగరంలో కఠిన ఆంక్షలు ఉంటాయి. నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసరమైతే తప్ప డీజిల్ ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. జనరేటర్లతో నడిచే పరిశ్రమలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్‌ హోమ్ సిపారసు చేస్తారు. కాగా సాధారణ సమయంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో శీతాకాలంలో దాని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.

  • బాల్యంలోనే పెళ్లి, 20 ఏళ్ల వయస్సులోనే బిడ్డకు తండ్రి. అయితేనేం కష్టపడి చదివి,  సవాళ్లు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేయలేదు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు. రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతానికి చెందిన రామ్‌లాల్‌ నీట్‌లో విజయం సాధించి శభాష్‌  అనిపించుకున్నాడు. రామ్‌లాల్‌ సక్సెస్‌ జర్నీ గురించి తెలుసుకుందాం.

    రాజస్థాన్‌లోని ఒక చిన్న జిల్లాకు చెందిన  వాడు రామ్‌లాల్. ఎన్నో కష్టాలకోర్చి తన కలను సాకారం చేసుకున్నాడు.  నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, తన వైద్య ప్రయాణానికి మార్గం సుగమం చేసుకున్నాడు.  
    అయితే రామ్‌లాల్‌కి 6వ తరగతి చదువుతున్నప్పుడే  పెళ్లి అయిపోయింది. పెళ్లి, సంసారం, బాధ్యతలు వీటిపై ఎలాంటి అవగాహన లేని సమయంలోనే కొత్త నైపుణ్యాలను నేర్చుకునే సమయంలో 11 ఏళ్లకే   ఒక ఇంటి వాడైపోయాడు. తల్లిదండ్రులు నిశ్చయం.. పైగా చిన్న వయసు. ఎటూ ప్రశ్నించలేని తనం. తలొగ్గడం తప్పడం చేయ గలిగిందేమీ లేదు. 

    అందుకే, పాత విషయాలను పక్కనపెట్టి, రామ్‌లాల్ తన చదువును కొనసాగిస్తూనే,  తన  ఫ్యూచర్‌ ప్లాన్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. తన కలను కుటుంబం ముందు  ఉంచాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. అదృష్టం ఏమిటంటే చదువు విలువు తెలిసిన రామ్‌లాల్‌ భార్య , భర్త ఆశయాలను అర్థం చేసుకుంది. అతనికి అండగా నిలబడింది. ఆమె మద్దతు ,ప్రోత్సాహం లేకపోయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.

    10వ తరగతిలో రామ్‌లాల్ 74 శాతం మార్కులు సాధించి, త్వరలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే అంతిమ లక్ష్యంతో సైన్స్ విభాగాన్ని ఎంచుకున్నాడు. నెలల తరబడి సన్నద్ధమైన తర్వాత,  2019లో నీట్ పరీక్షకు హాజరై, 720 మార్కులకు కేవలం 350 మార్కులు మాత్రమే సాధించాడు.  అయినా నిరాశపడలేదు. తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు.  ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో  కోచింగ్ సంస్థలో చేరాడు.2022లో మరోసారి  నీట్‌ రాశాడు.మునుపటి కంటే మెరుగ్గా 490 మార్కులు సాధించాడు,.  ప్రతీ ప్రయత్నం, వైఫల్యం అతనిలో మరింత ఉత్సాహాన్ని  పెంచింది. మరింత కష్టపడాలనే సంకల్పం పెరిగింది. దాంతో అతను మంచి ర్యాంకు సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేశాడు. చివరికి ఐదు ప్రయత్నాల తర్వాత  2023లోమంచి ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 2023లోనే రామ్‌లాల్‌కు ఒక పాపపుట్టడం విశేషం.

    ఎవరు వ్యతిరేకించినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా సాధించాలనే సంకల్పం, పట్టుదల ఉంటే విజేతలుగా నిలవడంలో ఈ ప్రపంచంలో  ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోలేరు అనడానికి రామ్‌లాల్ ప్రయాణమే నిదర్శనం.
     

  • ఇటీవల మహారాష్ట్రలో ఓ మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనపై తాజాగా  అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎంఐఎం పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. సముద్రం లోని రెండు చివరలు ఎప్పటికీ కలవవు అని తెలిపారు.

    కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం జరిగింది. అక్కడి అకోట్ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ స్థానం కోసం బద్రశత్రువులైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి.  అధికారం కోసం ఉప్పునిప్పులా ఉన్న రెండు పార్టీలు కలవడమేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే దీనిని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. అది తనకు తెలియకుండా జరిగిందని అలా పొత్తు పెట్టుకున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

    తాజాగా ఈ అంశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "అకోలాలో ఎంఐఎం కార్పొరేటర్లు ఐదుగురు గెలిచారు. అయితే అధికారం కోసం ఒక గ్రూపుకు మద్దతిస్తామన్నారు. అయితే ఆ గ్రూపు బీజేపీతో కలిసి ఉన్న సంగతి వారికి తెలియదు. అయితే ఆగ్రూపులో బీజేపీ ఉన్న సంగతి తెలిసిన తర్వాత సపోర్టును ఉపసంహరించుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాయాలని కోరాం" అని ఒవైసీ అన్నారు

    బీజేపీ, ఎంఐఎం పార్టీలు విభిన్న ధృవాలని సముద్రానికి ఉన్న రెండు తీరాల్లాంటివారని అవి ఎప్పటికీ కలవవని ఒవైసీ తేల్చిచెప్పారు. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన నెతలేవరైనా  పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకుంటే అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవల మహాయుతి కూటమి ఆఫర్ చేసిన కోఆప్షన్ మెంబర్ తీసుకున్న ఇంతియాజ్ జలీల్ అనే వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ఒవైసీ పేర్కొన్నారు.

    కాగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో  ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 సీట్లు గెలిచిన ఆపార్టీ  గత నెలలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 85 సీట్లు సాధించింది. దీంతో మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు 200మంది ఉన్నట్లు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. 2017లో జరిగిన ఎ‍న్నికల్లో81 కార్పొరేటర్ స్థానాలు సాధించిన ఎంఐఎం ఈ సారి వాటి సంఖ్య 200కు పెంచుకుంది.

  • ప్రియురాలితో పాటు స్నేహితురాలిని హత్య చేసిన రష్యా జాతీయుడైన అలెక్సీ లియోనోవ్‌(37), కేసులో వెలుగులోకి వచ్చిన విషయం సంచలనం రేపుతున్నాయి. గోవాలో జనవరి 14న మోర్జిమ్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్న ఎలెనా వనీవా , ఎలెనా కస్థానోవాగాను హత్య చేశాడు. వీరిద్దరూ రష్యా జాతీయులే. అప్పుగా తీసుకున్న డబ్బు, 'ఫైర్‌ క్రౌన్‌' (ఫైర్‌ డ్యాన్సర్స్‌ తలపై నిప్పును పట్టుకోవడానికి ఉపయోగించే రబ్బరు కిరీటం) విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటాడని గోవా పోలీసులు తెలిపారు.

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం మృతుల్లో ఒకరైన ఎలెనా కస్థానోవా, ఒక ఫైర్ డ్యాన్సర్. ఆమె ఫైర్ క్రౌన్ అప్పుగా తీసుకుంది. అలాగే మరో మహిళ కూడా డబ్బు అప్పుగా తీసుకుందట. అయితే, ఇద్దరు బాధితులు అలెక్సీకి డబ్బును ,కిరీటాన్ని తిరిగి ఇవ్వడంలో ఆలస్యానికి ఆగ్రహానికి గురైన అతను, జనవరి 14 , 15 తేదీలలో వేర్వేరు రోజులలో  గొంతు కోసి చంపేశాడు. అయితే ముందుగా ప్లాన్‌ చేసినవి కావని, ఆవేశపరుడైన అలెక్సీ  ఆవేశంతో చేసినవని పోలీసు వర్గాల అంచనా.  ఈ హత్యల సమయంలో నిందితుడు మాదకద్రవ్యాల మత్తులో ఉన్నాడా లేదా  అనే  విషయంపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బబుల్ ఆర్టిస్ట్ అయిన ఎలెనా వనీవా జనవరి 10న గోవాకు రాగా, కస్థానోవా గత సంవత్సరం డిసెంబర్ 25 నుండి, నిందితుడితో కలిసి ఉంటోంది. వీరిద్దరూ దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసేవారని మరియు తరచుగా గోవాను సందర్శించేవారట.

    ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

    అలెక్సీ లియోనోవ్‌కు లాంగ్‌ టెర్మ్‌ వీసా 
    అలెక్సీకి భారతదేశానికి దీర్ఘకాలిక వీసా ఉందని , పని నిమిత్తం దేశంలోని అనేక నగరాల్లో , ఎక్కువగా గోవాలో ఉండేవాడు.  ఏవేవో చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. గత డిసెంబరులో గోవాకి వచ్చాడు. అయితే గత నెల రోజులుగా ఎలాంటి పనిలేదు. నిందితుడు దాదాపు నెల రోజులుగా పని చేయడం లేదు.

    సీరియల్ కిల్లరా?100 మంది మహిళల ఫోటోలు
    నిందితుడు తనతో గొడవపడిన మరో ఐదుగురిని కూడా చంపానని చెప్పి, వారి పేర్లను కూడా ప్రస్తావించాడని గోవా పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఆ ఐదుగురూ సజీవంగా ఉన్నారని పోలీసులు విచారణలో తేలింది. అలెక్సీ "మానసిక అనారోగ్యంతో" బాధపడుతున్నాడని ప్పుడూ మాదకద్రవ్యాల ప్రభావంలో ఉంటాడని కూడా పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు నిందితుడి ఫోన్‌లో100 మందికి పైగా మహిళలు, ఇద్దరు పురుషుల ఫోటోలను కూడా గోవా పోలీసులు కనుగొన్నారు. గోవాలో ఇటీవలి కాలంలో పురుషులపై దాడి జరిగిన అనేక కేసుల్లో అతని పాత్ర ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. కానీ అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

    ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

    అసోం మహిళ హత్య కూడా వీడి పనేనా?
    అసోం నివాసి మృదుస్మిత సైంకియా అనుమానాస్పద మరణంపై కూడా అలెక్సీ పాత్రను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెతో అలెక్సీ సన్నిహితంగా ఉండేవాడని, ఇద్దరూ చాలా సార్లు గోవాకు వెళ్లేవారని తెలుస్తోంది. సైంకియా శవమై కనిపించడానికి ఒక రోజు ముందు, (జనవరి 11న)కూడా ఇద్దరూ కలిసే ఉన్నారట. జనవరి 12న తన ఇంట్లో శవమై కనిపించిచింది సైంకియా. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం,  అధిక మోతాదులో డగ్ర్స్‌ తీసుకోవడం వల్ల ఆమె మరణించిందని భావించారు.
     

  • వీధికుక్కల కేసులో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీపై సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదంది. ఇటీవల మేనకగాంధీ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ  సుప్రీంకోర్టును విమర్శించిందని  ఆగ్రహం వ్యక్తం చేసింది.

    వీధికుక్కల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. మేనకాగాంధీ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్‌ని కోర్టు ప్రశ్నిస్తూ" కొద్దిరోజుల క్రితం మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. మీ క్లైంట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు గమనించారా? మీ క్లైంట్ తప్పు చేసింది. అయినా మేము ఏ తనపై ఎటువంచి చర్యలు తీసుకోలేదు. ఇది మా గొప్పతనం కాదా? ఆమె పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అని ప్రశ్నించింది. " మీరేమో కోర్టులకు ఉదాసీనత ఉండాలంటారు మరోవైపు మీక్లైంట్ ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    మీ క్లైంట్( మేనకాగాంధీ) ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉంది, ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసింది. అయితే జంతువుల రక్షణకోసం ఇప్పటి వరకూ తను చేసిన పనులు ఏంటి? వాటి కోసం బడ్జెట్‌లో ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిందా? లేదా వాటికోసం మూగజీవాల ఏదైనా కొత్త పథకాలు వచ్చేలా చేసిందా అని కోర్టు ప్రశ్నించింది.

    కుక్కకాటు వేస్తే వాటికి ఆహారం వేసిన వారిని బాధ్యులు చేయాలని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సరదాకు చేసిన కావని సీరియస్‌గా మాట్లాడినవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా వీధికుక్కలను నియంత్రించలేకపోతే అవి కరిస్తే పెద్దమెుత్తంలో పరిహారం చెల్లించేలా ప్రభుత్వాల్ని ఆదేశిస్తామని ఇదివరకే కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

     

  • న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంత ప్రమాదంలో యువ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరణానికి కారణంగా భావిస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశాడు. 

    నిర్మాణ పనుల కోసం తవ్విన, నీటితో నిండి ఉన్న గుంతలో తన ఎస్‌యూవీ వాహనం పడిపోవడంతో 27 ఏళ్ల యువరాజ్ మెహతా మృతికి సంబంధించి ఒక బిల్డర్‌ను అరెస్టు చేశారు. విష్‌టౌన్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానులలో ఒకరైన అభయ్ కుమార్‌ను అరెస్టు చేశామని, మరో యజమాని మనీష్ కుమార్ కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు మంగళవారం ప్రకటించారు. 

    కాగా గురుగ్రాంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువరాజ్ మోహతా విధినిర్వహణ తరువాత ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్-150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి, పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు  వెల్లువెత్తాయి

  • తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని  అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

    ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్‌ అ‍న్నారు.

    రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని  తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

    అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో  దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది.

  • జెరోధా వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితిన్ కామత్ తన భార్య క్యాన్సర్‌  సోకడం, చికిత్స, కోలుకోవడం గురించి మరోసారి సోషల్‌ మీడియాద్వారా పంచుకున్నారు. ముఖ్యంగా టాటా ముంబై మారథాన్‌లో వైకల్యాన్ని చేర్చడంపై సంతోషాన్ని ప్రకటించారు. టాటా ముంబై మారథాన్‌లో పరుగెత్తిన దివ్యాంగులలో ఉన్న ఉత్సాహం, ఉద్వేగం మాటల్లో చెప్పలేనిదని ఆయన ప్రశంసించారు. అన్నీ సవ్యంగా ఉన్నా జీవితంలో  ఏదో ఒక దాని గురించి ఫిర్యాదు చేసే ముందు ఆలోచించేలా చేస్తుందన్నారు.  

    అదే సమయంలో తన భార్య క్యాన్సర్ కోలుకున్న తీరు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్‌ చేశారు. క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 57 నిమిషాల్లో 10 కి.మీ పరిగెత్తారని వివరించారు. అలాగే మారథాన్‌లో పాల్గొన్న తన భార్య  సీమా కామత్ ఫోటోలతో పాటు, ఆమె రాసిన వ్యక్తిగత బ్లాగుకు వ్యాఖ్యలలో లింక్‌ను పంచుకున్నారు.

    ఇదీ చదవండి: నోయిడా టెకీ విషాదం : కీలక పరిణామం


     

    సీమా కామత్‌ తన బ్లాగులో అందించిన వివరాలు ప్రకారం 2021 నవంబరులో స్టేజ్‌ 2 బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు, ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే, చాలా క్రమశిక్షణగా, ఫిట్‌గా చాలా ఆరోగ్యంగా ఉండే ఆమె కేన్సర్‌ బారిన పడ్డారు. సాధారణంగా చేసుకునే ఫుల్‌ బాడీ టెస్ట్‌లో  భాగంగా జరిగిన మమోగ్రామ్‌ టెస్ట్‌లో ఆమె కుడి రొమ్ములో గడ్డను గుర్తించారు. ఆ తరువాత బయాప్సీ, PET స్కాన్‌ లాంటి పరీక్షల ద్వారా ఆమెకు క్యాన్సర్‌ సోకిందని నిర్ధారించారు.

    దీంతో తాను షాక్‌కు గురయ్యారు. మొదట కుటుంబ సభ్యులు , కొంతమంది స్నేహితులతో  తప్ప మిగతా ఎవ్వరితోనూ దీని గురించి చర్చించలేదు.  అదేదో తప్పు అనే భావం ఉండటం వల్లే  ఇది జరిగిందనీ, "మానసిక అనారోగ్యంలాగే, క్యాన్సర్ కూడా మన దేశంలో నిషిద్ధం" అని చెప్పుకొచ్చారు. కానీ అవగాహనతో ఉండి, ముందస్తు పరీక్షలతో దీన్ని జయించవచ్చు అన్నారామె.

    ఇదీ చదవండి: మంచులో రీల్స్‌..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్‌ వీడియో

    మాస్టెక్టమీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ లతో "ఎమోషనల్ రోలర్ కోస్టర్" లా  గడించిందన్నారు. ఈ రోజుల్లో క్యేన్సర్‌ను ముందుగా గుర్తిస్తే నివారణే సాధ్యమే అన్నారు. అలాగే  ఆరోగ్యంగా ఉండే  వారు కూడా వైద్యులు రొటీన్ స్క్రీనింగ్ చాలా అవసరమని సీమా రాశారు. తీవ్రమైన అనారోగ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతీవవారికి ఆరోగ్య బీమా అవసరమన్నారు. చికిత్స సమయంలో కుటుంబ, సామాజిక మద్దతు ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కి చెప్పారు.  స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారిలో  ధైర్యాన్ని నింపేందుకు మనం చేయాల్సిందంతా చేయాలని సూచించారు. 

    గతంలో తన క్సేన్సర్‌ రికవరీ జర్నీగురించి మాట్లాడిన సీమ జుట్టు ఊడిపోవడం లాంటి కీమో థెరపీ కష్టాలను పంచుకున్నారు.  ఆ బాధలు భరించలేక చనిపోతే మేలు అనుకునేదాన్నని చెప్పారు. ఈ సమయంలో  భర్త నితిన్‌, తన కొడుకు గుండు చేయించుకొనిధైర్యాన్ని నింపారన్నారు. చికిత్సతోపాటు, ఆహారం, వ్యాయామంతో క్యాన్సర్‌ను జయించానని వెల్లడించారు. వ్యాధినుంచి కోలుకున్న తరువాత క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ప్రపంచ పర్యటనలు, మారథాన్‌రన్‌ లాంటి కార్యకల్లాపాలతో బిజీగా ఉంటున్నారు సీమ.
     

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత ఒకటి ఉంటుంది. కేరళ ఘటనలో తప్పెవరిది అనేది తేలకున్నా.. ఇప్పుడు చాలామంది ఈ సామెతను అన్వయింపజేస్తున్నారు. బస్సులో తనను లైంగికంగా వేధించాడని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ పోస్టు చేసిన వీడియో.. ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైన సంగతి తెలిసిందే కదా.. 

    ఈ ఘటనలో ఏం జరిగిందో మరోసారి చూద్దాం. కోజికోడ్‌కు చెందిన దీపక్‌(42) బస్సులో వెళ్తున్నప్పుడు ఓ యువతి పక్కనే నిలబడి వీడియో తీసింది. అందులో దీపక్‌ తనను అసభ్యంగా తాకాడంటూ ఆ వీడియోను తన ఫాలోవర్స్‌కు చేరవేసింది. అంతే.. సదరు వ్యక్తిని తిట్టిపోస్తూ ట్రెండింగ్‌ నడిచింది. ఈ విషయం తనదాకా చేరడంతో ఆ వ్యక్తి భరించలేకపోయాడు. శుక్రవారం(జనవరి 16) ఈ ఘటన జరిగింది. శనివారం దీపక్‌ పుట్టినరోజునే ఈ వీడియో వైరల్‌​ కావడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం బలన్మరణానికి పాల్పడి ఈ తతంగాన్ని ఇంతటితో ముగిద్దాం అనుకున్నాడు. కానీ, నెటిజన్స్‌ మాత్రం ఊరుకోలేదు. 

    తిట్టిపోసిన అదే సోషల్‌ మీడియా ఈసారి ప్రాణాలతోలేని దీపక్‌కు మద్దతు ప్రకటించింది. సదరు యువతి ఫాలోయింగ్‌ను పెంచుకోవాలనే అలా చేసి ఉంటుందా?... పాపులారిటీ కోసం పాకులాడిందా? అనే అనుమానాలతో చర్చ మొదలుపెట్టారు. అయితే దీపక్‌ ఫ్యామిలీ ఈ డబుల్‌ గేమ్‌ సపోర్టును తిరస్కరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంటర్నెట్‌లో అలా ఎలా విచారణ జరుపుతారని.. తమ బిడ్డది తప్పని తేలుస్తారని దీపక్‌ తల్లి అంటోంది. ఆ యువతి కంటే నెటిజన్లే డేంజర్‌ అని అంటోంది.   

    షిమ్జితా ముస్తాఫా.. యాక్టివిస్ట్‌గానూ, సోషల్‌​ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ గుర్తింపు దక్కించుకుంది. దీపక్‌ వేధింపుల వీడియోను పోస్ట్‌ చేశాక.. ఆమెకు అభినందనలు కురిశాయి. అయితే.. దీపక్‌ మరణం తర్వాత ఆమె ట్రోలింగ్‌కు గురైంది. పలువురు నెటిజన్లు ఆమెను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ వీడియోను తొలగించింది. తన చర్యను సమర్థించుకుంటూ మరో వీడియోను పోస్ట్‌ చేసింది(దానికి కామెంట్‌లు చేయకుండా ప్రైవసీ పెట్టుకుంది). పైగా ఈ విషయంలో తనకు పోలీసుల సపోర్ట్‌ లభించిందని చెప్పుకొచ్చింది. కానీ.. 

    కేరళ పోలీసులు ట్విస్ట్‌ ఇచ్చారు. షిమ్జితా నుంచి  ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా ఆత్మహత్యకు ఉసిగొల్పిందంటూ దీపక్‌ కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో షిమ్జితాపైనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. ఆమె కోసం స్పెషల్‌ టీంలు గాలింపు జరుపుతున్నాయి. ఆమె దొరికితేనే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. నెటిజన్ల దెబ్బకు ఆమె సోషల్‌ మీడియా అకౌంట్లు కూడా డిలీట్‌ చేసేసుకుందని తెలుస్తోంది. 

    ఆన్‌లైన్‌ వేధింపులు ఎంతటి విషాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని అంటున్నారు. కేరళ మానవ హక్కుల కమిషన్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కొందరు పురుషులు (వయసు తారతమ్యం లేకుండా పెద్దవాళ్లతో సహా..) బస్సుల్లో ఎక్కి ఆడవాళ్ల మధ్యలో నిల్చుని తమను అనుమానించొద్దు అంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 

Movies

  • టాలీవుడ్‌లో ప్రతి సీజన్‌కి ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ ఉంటుంది. ఒకప్పుడు హారర్ కామెడీ చిత్రాలు వరుసగా వచ్చాయి. అంతకంటే ముందు ప్రేమకథలు హవాను కొనసాగించాయి. ఇటీవల వరకూ యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలు సిల్వర్ స్క్రీన్‌పై ఆధిపత్యం చెలాయించాయి.అయితే ఇప్పుడు పరిస్థితి మరోసారి మారుతున్నట్లు కనిపిస్తోంది.  

    ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలను గమనిస్తే ప్రేక్షకుల అభిరుచి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘రాజాసాబ్’ మినహా మిగతా అన్ని సినిమాల్లో ప్రధాన ఎలిమెంట్ కామెడీనే. మన శంకరవరప్రసాద్,అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసినవి కామెడీ పోర్షన్లే.  

    ఇది కేవలం సంక్రాంతి సినిమాల వరకే పరిమితమా? లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో మరో 2-3 కామెడీ సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ పూర్తిగా కామెడీ వైపు మలుపు తిరిగిందని చెప్పవచ్చు.  

    ఇప్పటివరకు ప్రేక్షకులు కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాల కోసం మాత్రమే థియేటర్లకు వస్తారనే భావన ఉండేది. ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరని అనుకునేవారు. ఆ విషయాన్ని పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా బహిరంగంగానే అంగీకరించారు.  

    ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ యాక్షన్ కథలనే ఎంచుకుంటున్నారు. దాంతో ఒక్కో సినిమాకు ఏడాది పైగా సమయం పడుతోంది. కానీ కామెడీ ట్రెండ్ బలపడితే మాత్రం ఇది శుభపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల స్టార్ హీరోల సినిమాల సంఖ్య పెరుగుతుంది. పాన్ ఇండియా హంగులు తగ్గుతాయి. నిర్మాతలకు భారీ బడ్జెట్‌ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. టాలీవుడ్‌లో కామెడీ చిత్రాల ట్రెండ్‌ మొదలైనట్లు సంక్రాంతి సినిమాలు సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ ట్రెండ్ బలపడితే, ఇండస్ట్రీలో కొత్త మార్పులు తప్పవు. 

  • అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా చీకటిలో. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శోభిత క్రైమ్‌ యాంకర్‌ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్‌ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్‌ ఖరారు చేసింది.

    ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది శోభిత. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈ ప్రమోషన్ ఈవెంట్‌కు ఆమె భర్త నాగ చైతన్య కూడా వచ్చారు. తన సతీమణితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    కాగా.. ఈ మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
     

     

  • కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్‌ జూ పార్క్‌లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు. ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను శివ కార్తికేయన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    కాగా.. శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పొంగల్ ‍కానుకగా ఈ మూవీ రిలీజైంది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీపై కొందరు విమర్శలు చేశారు. ఈ సినిమాను పాలిటిక్స్‌తో లింక్ చేయడంతో వివాదానికి దారితీసింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించింది. 
     

     

  • టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న  సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు.
     

     

  • మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

    అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్‌గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు.  ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్‌ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
     

     

  • చీరలో మాళవిక మోహనన్ సింగారం

    పట్టుచీరలో సిగ్గుపడిపోతున్న సంయుక్త

    జిమ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన నభా

    వియాత్నాం ట్రిప్‌లో హీరోయిన్ మేఘా ఆకాశ్

    టెంపుల్ మార్నింగ్స్ వీడియోతో కావ్య కల్యాణ్ రామ్

    విదేశాల్లో చక్కర్లు కొట్టేస్తున్న ప్రియాంక జవాల్కర్

  • బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్‌ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను  విపరీతంగా ఆకట్టుకుంది.

    ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

    తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్‌.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. 
     

     

  • సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. పీఓవీ(POV) ఆర్ట్స్  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ  చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.  ప్రేమికుల దినోత్సవం కానుకగా  ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.  బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన  ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

    ఈ చిత్రంలో సౌమిత్  పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించగా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  ఈ  సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 
     

  • టాలీవుడ్‌లో ఇప్పుడు బెస్ట్‌ ఫిజిక్‌ను స్క్రీన్‌పై చూపించడానికి  స్టార్స్‌ పోటీపడుతున్నారు.  పెద్ది సినిమా కోసం రామ్‌ చరణ్‌ కఠినమైన కసరత్తులతో ఫిజిక్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్‌గా బయటకు వచ్చిన ఆయన ఫిట్‌ లుక్‌ బాగా వైరల్‌ అయింది. సినిమాకి డైరెక్టర్‌ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్‌లకు ట్రైనర్‌  కూడా అంతే.  మరి రామ్‌ చరణ్‌ లుక్‌ని ఈ రేంజ్‌లో క్లిక్‌ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్‌ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?

    ఆయనే ముంబయికి చెందిన రాకేష్‌ ఉడియార్‌. ఆమిర్‌ ఖాన్‌  సల్మాన్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా బాలీవుడ్‌కి సుపరిచితుడైన రాకేష్‌ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్‌లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.

    రాకేష్‌ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్‌ లోకల్‌ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు.  అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్‌ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది,  ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్‌ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.

    ‘‘నాకు ఎప్పుడూ ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉండేది  దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్‌లో స్వీపర్‌గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్‌ ట్రైనర్‌గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్‌గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్‌నెస్‌ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్‌ చెప్పాడు. సల్మాన్‌ ఖాన్‌ రాకేష్‌  ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను  అర్బాజ్‌ ఖాన్‌(సల్మాన్‌ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్‌ నాకు ఫోన్‌ చేసి, బాడీగార్డ్‌ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్‌ గుర్తు చేసుకుంటాడు.  అప్పటి నుంచీ రాకేష్‌ సల్మాన్‌కు పర్సనల్‌ ట్రైనర్‌గా కొనసాగుతున్నాడు.   ఇక మరో బాలీవుడ్‌ టాప్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్‌కు ఫోన్‌ చేసి తన ట్రైనర్‌గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.

    రామ్‌చరణ్‌తో పరిచయం అలా...
    ‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు రాకేష్‌ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్‌ సల్మాన్‌ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్‌ ఫిజిక్‌తో ఫిట్‌గా కనపడాలని చరణ్‌ అనుకున్నాడు’’ అని రాకేష్‌ చెప్పాడు. అప్పటి నుంచి రామ్‌ చరణ్‌తో రాకేష్‌ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్‌కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్‌ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్‌ వివరిస్తున్నాడు.

    రామ్‌చరణ్‌ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్‌ కపూర్, డైసీ షా  పుల్కిత్‌ సామ్రాట్‌తో సహా తారలెందరికో రాకేష్‌ శిక్షణ ఇచ్చాడు.   ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు  శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్‌ పొందడానికి ఒక ఫిట్‌నెస్‌ ప్రణాళిక  ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్‌ సినిమా కోసం, ఆమిర్‌ఖాన్‌ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది  దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్‌ చరణ్‌ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్‌ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్‌  సల్మాన్, రామ్‌ చరణ్‌ లు  ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్‌ సెషన్‌ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్‌ వెల్లడించాడు. ‘సల్మాన్‌ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా,  జిమ్‌కు వెళ్లడం మానడు.  అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్‌ చెప్పాడు.

  • మనశంకర వరప్రసాద్‌గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

    మెగాస్టార్ తన పోస్ట్‌లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

    మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్‌ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్‌ మెషీన్‌ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.

    కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్‌గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది.
     

     

  • టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌కి చాలా గ్యాప్‌ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌పడింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ అయింది. అయితే తొలి రోజే హిట్‌ టాక్‌​ రావడంతో థియేటర్స్‌ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్‌ కూడా భారీగా వస్తున్నాయి. 

    చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్‌ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్‌. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన పాత చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసుకుంటే.. తనకే ఆసహ్యం కలుగుతుందని చెప్పారు. 

    ‘జాను(2019) సినిమా సమయంలో నాకు మేజర్‌ యాక్సిడెంట్ జరిగింది. నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ దేవుడి దయ, సంకల్ప బలంలో త్వరగానే రికవరీ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను చాలా లావు అయిపోయాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో చాలా లావుగా కనిపిస్తాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే.. ‘ఛీ ఛీ..ఎలా ఉన్నా? నన్ను చూసి టికెట్స్‌ ఎందుకు తెగాలి?’ అనిపించింది. 

    అందుకే సినిమాల ఫెయిల్యూర్‌కి నేను కూడా ఒక కారణం అని భావించా. నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. ముందుగా నా శరీరాన్ని మునుపటి మాదిరిగా మార్చాలనుకున్నా. ముందుగా వాకింగ్‌ ప్రారంభించాను. ఆ తర్వాత రన్నింగ్‌, యోగా చేస్తూ డైటింగ్‌ చేశా.ఇప్పుడు నా లుక్‌ మారింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో స్టైలీష్‌గా ఉన్నానని చెబుతున్నారు. బైకర్‌లో కూడా అలానే కనిపిస్తా.ఇకపై అన్ని మంచి సినిమాలు అందించడానికే కృషి చేస్తా’ అని శర్వా చెప్పుకొచ్చాడు. 
     

  • టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మరోసారి వార్తల్లో నిలిచింది. వీధి కుక్కల్ని అన్యాయంగా చంపేస్తున్నారని సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ఈమె చాలా వ్యాఖ్యలు చేసింది. ఐదు కుక్కలు కరిస్తే మిగతా వాటన్నింటినీ చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. దీనిపైనా స్పందిస్తూ తనకు రాజకీయాలు ఇష్టం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా తను ఒంటరి, ఎవరూ లేరని సంచలన పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్)

    'నన్ను కాపాడటానికి అమ్మనాన్న, అన్నయ్య, భర్త.. ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకపోయినా సరే ఎందరో నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే కామెంట్స్‌పై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధ చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకు ఉంది. నేను ఎప్పటికప్పుడు కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పడు అర్థమైంటుంది' అని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. ఈ మేరకు కాశీలోని గంగ నదిలో బోటులో ఉన్న వీడియోని షేర్ చేసింది.

    ఇదే పోస్టులో వీధి కుక్కలని చంపే విషయమై తన పోరాటం గురించి మరోసారి ప్రస్తావించింది. 'నేను ఎప్పుడూ నా హక్కుల కోసం పోరాడలేదు. వీధి కుక్కల విషయంలో మాత్రం పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పునకు వందలాది వాటిని చంపాలనే నిర్ణయం సరైనది కాదు. ఇది మీకు అర్థమయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటాను' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!)

  • తెలంగాణలో సినిమా టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను  ఆదేశించింది.  ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రానికి టికెట్‌ ధరల పెంపు అంశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది విజయ్‌ గోపాల్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. 

    ది రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరలపై ఈనెల 9న వాదనలు జరగ్గా.. అంతకుముందే అంటే 8వ తేదీ అర్ధరాత్రి ది రాజాసాబ్ మూవీ టికెట్‌ ధరలు, ప్రీమియర్లకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని లాయర్ విజయ్‌ గోపాల్‌ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. కానీ ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది.

  • అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు లేవని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే కనిపించిన కొన్ని సంఘటనలు ఇవన్నీ నిజమేనేమో అనిపించేలా చేశాయి. కానీ అదంతా సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రమేనని క్లారిటీ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అల్లు అర్జున్.. చిరంజీవి కొత్త సినిమాకు తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

    తాజాగా 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చూసిన అల్లు అర్జున్.. చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వింటేజ్‌గా అదరగొట్టేశాడని అన్నాడు. వెంకటేశ్, నయనతార, కేథరిన్, బుల్లిరాజు అలియాస్ రేవంత్ కూడా ఆకట్టుకున్నారని రాసుకొచ్చాడు. హుక్ స్టెప్, మెగావిక్టరీ సాంగ్స్ ఇచ్చిన భీమ్స్‌కి కంగ్రాట్స్ చెప్పాడు. నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటిని ప్రశంసించాడు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రస్తావిస్తూ.. 'సంక్రాంతికి వస్తారు-హిట్ కొడతారు-రిపీట్' అని డైలాగ్ వేశాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు.. సంక్రాంతి 'బాస్'బస్టర్ అని చిరుకి బన్నీ సూపర్ ఎలివేషన్ ఇచ్చాడు.

    చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉందని టాక్ కొందరి నుంచి వినిపించినప్పటికీ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు కూడా.

    (ఇదీ చదవండి: పదేళ్లుగా సినిమాలకు దూరమైనా ఇప్పటికీ.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?)

  • సాధారణంగా హీరోయిన్లు సినిమాలు చేయడం మానేస్తే ఊహించనంతగా మారిపోయి కనిపిస్తుంటారు. చాలా తక్కువమంది మాత్రమే అదే గ్లామర్, అదే ఫిజిక్ మెంటైన్ చేస్తుంటారు. ఈ హీరోయిన్ కూడా సేమ్ అలానే కనిపించి ఆశ్చర్యపరిచింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఈమెని చూసేసరికి ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?

    పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ అసిన్. ఇరవైళ్ల క్రితం తెలుగు, తమిళంలో పలు హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాకు చాలా అంటే చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. ఎంతలా అంటే 2016లో 'మైక్రోమ్యాక్స్' కో-ఫౌండర్ రాహుల్ శర్మని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.

    (ఇదీ చదవండి: కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!)

    కేరళకు చెందిన ఈమె.. 2001లో మలయాళ సినిమాతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. కానీ తర్వాత సొంత భాషలో మరో మూవీ అనేదే చేయలేదు. 2003లో 'అమ్మనాన్న ఓ తమిళమ్మాయి'తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. తర్వాత శివమణి, లక్ష‍్మీ నరసింహా, ఘర్షణ, చక్రం, అన్నవరం తదితర సినిమాలు చేసింది. తమిళంలోనూ గజిని, పోక్కిరి తదితర చిత్రాలతో హిట్స్ అందుకుంది. అనంతరం హిందీలో పలు హిట్ సినిమాలు చేసింది.

    2016లో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిందేమో గానీ 2015లో చివరగా 'ఆల్ ఈజ్ వెల్' అనే హిందీ మూవీలో నటించింది. తర్వాత నుంచి పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. చూస్తుంటే రీఎంట్రీ ఇచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. కానీ ఇప్పటికే హీరోయిన్‌గా ఉన్నప్పటి గ్లామర్‌నే మెంటైన్ చేస్తోంది. ఈమె భర్త రాహుల్ శర్మ.. 10వ వార్షికోత్సవం సందర్భంగా రెండు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఒకటి పెళ్లి ఫొటో కాగా.. మరొకటి ప్రస్తుతంలో దిగిన ఫొటో. అలా ఇప్పుడు అసిన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోతోంది.

    (ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

  • ప్రస్తుతం ఎవరితో మాట్లాడినా సరే ఆరోగ్యం ఉండండి, డైట్ పాటించండి అని చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలకు ఈ విషయంలో పట్టింపులు చాలా ఎక్కువ. స్క్రీన్ పై కనిపించాలి, గ్లామర్‌గా ఉండాలంటే మన తినే చాలా ఆహార పదార్థాలకు వాళ్లు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఫేమస్ ఫిట్‌నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఇప్పుడు అదే చెప్పారు. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా చేసిన ఈయన ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రైనర్ వినోద్ చన్నా.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం, డైట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో చెప్పాడు. దాని వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. 'జాన్ పాటిస్తున్న డైట్ వల్ల ఆయన శరీరం పూర్తిగా ఆ ఆహార విధానానికి అలవాటు పడిపోయింది. జాన్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. నాలుగు ఫుడ్స్ తినమని చెబితే అవి మాత్రమే తింటాడు. వేరే వాటిని అస్సలు ముట్టుకోడు. అంత కఠినంగా ఉంటాడు'

    (ఇదీ చదవండి: క్యారవాన్‌లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే)

    'ఓసారి సినిమా షూటింగ్‌లో జాన్ ఉన్నప్పుడు తైవాన్ రాజకుమార్తె వచ్చారు. డైనింగ్ టేబుల్‌పై ఉన్న ఫుడ్ అంతా అయిపోయిందని నాతో చెప్పింది. కానీ జాన్ ఆ ఆహారాన్ని అస్సలు టచ్ చేయడని, ఆ విషయంలో నాకు వంద శాతం నమ్మకం ఉందని ఆమెతో చెప్పాను. షుగర్(చక్కెర)కు జాన్ చాలా ఏళ్లు దూరంగా ఉన్నాడు. అప్పుడప్పుడు కొంతైనా తీసుకోమని చెప్పాను. అయినా సరే నో చెప్పాడు'

    'పొరపాటున జాన్ గనుక చక్కెర ఉన్న ఆహారం తీసుకుంటే.. అతడికి దగ్గు వచ్చే అవకాశముంది. ఎన్నో ఏళ్లుగా కఠినమైన డైట్ పాటించడం వల్ల ఇప్పుడు జాన్.. బెండకాయ, వంకాయ లాంటివి తినలేడు. ఒకవేళ తీసుకున్నా సరే అతడి కడుపు వాటిని జీర్ణించుకోలేకపోతోంది. శరీరం ఓ నిర్దిష్ట ఆహారానికి అలవాటు పడితే అకస్మాత్తుగా వచ్చే మార్పులని తీసుకోలేదు. జీర్ణ సమస్యలు వస్తాయి' అని వినోద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ విషయంలో ఫిట్‌నెస్, డైట్ పాటించే వాళ్లమధ్య హాట్ టాపిక్ అయిపోయింది.

    (ఇదీ చదవండి: బన్నీ సినిమాతో బిజీ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్)

Sports

  • ఇంగ్లండ్ 'బాజ్‌బాల్' వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై బెడిసికొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లీష్‌ జ‌ట్టు కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క‌ఠిన నిర్ణ‌యాలు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై వేటు వేసేందుకు ఈసీబీ సిద్దమైనట్లు సమాచారం.

    మెకల్లమ్ కాంట్రాక్ట్‌ను పొడిగించే యోచ‌న‌లో ఈసీబీ లేదంట‌. 'ది టెలిగ్రాఫ్' కథనం ప్రకారం.. టీ20 వరల్డ్ కప్-2026  తర్వాత మెక్‌క‌ల్ల‌మ్‌ను హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టుకు ఆల్‌ఫార్మాట్ హెడ్ కోచ్‌గా కొన‌సాగుతున్నాడు. తొలుత కేవ‌లం టెస్టు జ‌ట్టు హెడ్‌కోచ్‌గా మాత్ర‌మే కొన‌సాగిన మెక్‌క‌ల్ల‌మ్‌.. గతేడాది వైట్‌బాల్ క్రికెట్‌లో ప్ర‌ధాన కోచ్ ప‌గ్గాలు చేప‌ట్టాడు.

    అయితే మెకల్లమ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటతీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెకల్లమ్‌ అప్పుడే కొత్తగా టెస్టు కెప్టెన్ అయిన బెన్‌ స్టోక్స్‌తో కలిసి ‘బాజ్‌బాల్‌’కు శ్రీకారం చుట్టాడు. ‘బాజ్‌’ అన్నది మెకల్లమ్‌ ముద్దుపేరు. టీ20 శైలిలో దూకుడుగా ఆడుతూ టెస్టు క్రికెట్ రూపరేఖలనే ఇంగ్లండ్ మార్చేసింది.

    స్టోక్స్‌-మెకల్లమ్‌ ద్వయం కొన్నాళ్లపాటు అద్భుతం చేసింది. కానీ నెమ్మదిగా బాజ్‌బాల్‌కు బీటలు పడ్డాయి. ఇంగ్లీష్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐసీసీ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొం‍టోంది. ప్రతిష్టత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ వరుసగా రెండోసారి కోల్పోయింది.

    అంతేకాకుండా జట్టు ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ క్రమశిక్షణ కూడా లోపించింది. ఆసీస్ పర్యటన మధ్యలో ఆటగాళ్లు 'నూసా' (Noosa) రిసార్ట్‌కు వెళ్లడం, అక్కడ మితిమీరిన విందు వినోదాల్లో పాల్గొనడం వంటి అంశాలపై కూడా తీవ్ర స్దాయిలో విమర్శలు వచ్చాయి. ఆటగాళ్లకు మెకల్లమ్‌ అనుసరిస్తున్న తీరు జట్టు క్రమశిక్షణను దెబ్బతీస్తోందని ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడిని తప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది. ఒకవేళ మెక్‌కల్లమ్ స్ధానంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
     

  • మహిళల ఐపీఎల్‌ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్‌ మారిజాన్‌ కాప్‌ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి ముంబై ఇండియన్స్‌ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది.  

    కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్‌ (4-0-36-0), స్నేహ్‌ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్‌ వేసి 14 పరుగులు సమర్పించుకుంది.  

    ముంబై ఇండియన్స్‌ బ్యాటర్లలో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (65 నాటౌట్‌) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

    మిగతా ప్లేయర్లలో సంజీవన్‌ సజనా (9), హేలీ మాథ్యూస్‌ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్‌ కౌర్‌ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది.

    కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

    పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

    ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.

     

     

  • భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.

    ఓపెనర్లుగా టిమ్‌ రాబిన్సన్‌, డెవాన్‌ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్‌ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం​ ఊరట కలిగించే అంశం. ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. 

    వన్‌డౌన్‌లో రచిన్‌ రవీంద్ర రావడం​ కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్‌ చేస్తుంది.

    న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్‌ మిచెల్‌, ఆతర్వాత మార్క్‌ చాప్‌మన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

    లోయర్‌ ఆర్డర్‌ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కమ్‌ బ్యాటర్‌గా మిచెల్‌ సాంట్నర్‌ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్‌ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.

    న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్‌ ఫామ్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్‌ పేస్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.

    ఐష్‌ సోది డౌటే..!
    భారత్‌పై ఐష్‌ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్‌మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.

    భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్‌ సా​ంట్నర్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, టిమ్‌ రాబిన్సన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌.

  • భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. ఈ మ్యాచ్‌లో పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రకటించాడు.

    రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్‌‌పై మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్‌ జట్టులోకి వస్తే, శ్రేయస్‌ అయ్యర్‌ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు. 

    తిలక్‌ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ అయిన ఇషాన్‌ భర్తీ చేయగలడని మేనేజ్‌మెంట్‌ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్‌ కంటే ఇషాన్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్‌ మాటల ద్వారా స్పష్టమవుతుంది.

    ఇషాన్‌ చివరిగా 2023లో భారత్‌ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్‌కు ఇషాన్‌ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్‌ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    జట్టులోకి వచ్చినా తిలక్‌ గాయపడకుంటే, ఇషాన్‌కు అవకాశం​ వచ్చేది కాదు. తిలక్‌ గాయం ఇషాన్‌కు కొత్త లైఫ్‌ ఇచ్చినట్లైంది.

    వరల్డ్ కప్‌కు ముందు కీలక సిరీస్  
    స్వదేశంలో న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌ ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్‌ జట్టునే ఈ సిరీస్‌కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన వారిలో తిలక్‌ వర్మతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా గాయపడ్డాడు. తిలక్‌ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌, సుందర్‌ స్థానాన్ని రవి బిష్ణోయ్‌ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.

    తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి రావచ్చు.

    షెడ్యూల్‌..
    తొలి టీ20- నాగ్‌పూర్‌
    రెండో టీ20- రాయ్‌పూర్‌
    మూడో టీ20- గౌహతి
    నాలుగో టీ20- విశాఖపట్నం
    ఐదో టీ20- తిరువనంతపురం

     

  • డబ్ల్యూపీఎల్‌ 2026 ఎడిషన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం​ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. 

    యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.

    ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్‌ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.

    17 ఏళ్ల కమిలిని ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.

    వైష్ణవి శర్మతో భర్తీ 
    20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్‌-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. 

    డబ్ల్యూపీఎల్‌ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్‌ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు చాలా కీలకం.

  • భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్‌స్టార్‌ యాప్‌ మరియు వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.

    షెడ్యూల్‌..
    తొలి టీ20- నాగ్‌పూర్‌
    రెండో టీ20- రాయ్‌పూర్‌
    మూడో టీ20- గౌహతి
    నాలుగో టీ20- విశాఖపట్నం
    ఐదో టీ20- తిరువనంతపురం

    ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.

    జట్లు..
    భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, అభిషేక్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, సంజూ శా​ంసన్‌, ఇషాన్‌ కిషన్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తి

    న్యూజిలాండ్: మిచెల్‌ సా​ంట్నర్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, టిమ్‌ రాబిన్సన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారిల్‌ మిచెల్‌, బెవాన్‌ జాకబ్స్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్‌, డెవాన్‌ కాన్వే, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌, ఐష్‌ సోది, క్రిస్టియన్‌ క్లార్క్‌

    ఈ సిరీస్‌ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.

    భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్‌ మూడు, భారత్‌ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

    ఆతర్వాత 2012లో న్యూజిలాండ్‌ తొలిసారి టీ20 సిరీస్‌ ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).

    అనంతరం 2017-18లో న్యూజిలాండ్‌ మరోసారి భారత్‌లో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు భారత్‌ 2-1 తేడాతో కైవసం​ చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ విక్టరీ సాధించింది.

    ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్‌ న్యూజిలాండ్‌లో పర్యటించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.

    2019-20లో భారత్‌ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్‌ కోహ్లి టీ20 కెరీర్‌లోనూ ఈ సిరీస్‌ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.

    అనంతరం 2021-22లో న్యూజిలాండ్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను కూడా భారత్‌ క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది.

    2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. రెండు సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్‌లను కైవసం చేసుకుంది.

    శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకం
    ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో గిల్‌ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

  • ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డారెన్‌ లెహ్‌మన్‌ కొడుకు జేక్‌ లెహ్‌మన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్‌ను 2024-25 సీజన్‌కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక​ ఈ అవార్డు లభించింది.

    ఆసీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్‌ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్‌షైర్‌ కౌంటీతో లోకల్‌ ప్లేయర్‌ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. 

    ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్‌ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్‌ విషయంలో ఇదే జరిగింది. జేక్‌ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం​ వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.

    షెఫీల్డ్ షీల్డ్‌లో రికార్డు ప్రదర్శన  
    జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు.  10 మ్యాచ్‌ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్‌ ఫైనల్లో జేక్‌ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్‌బాల్ టైటిల్‌ను అందించింది.

    తండ్రి వారసత్వం 
    జేక్‌ తండ్రి డారెన్‌ లెహ్‌మన్‌ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్‌ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్‌లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు.  

    ఆస్ట్రేలియాకు ఆడటం నా కల
    జేక్‌ ఆసీస్‌ తరఫున ఆడే అవకాశాల కోసం​ సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్‌ కౌంటీ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు.

     

  • సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సన్నాహకంగా కివీస్‌తో జరిగే ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్‌ సేన ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది.

    హార్దిక్‌ పాండ్యా రీఎంట్రీ
    హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్‌-2025 మ్యాచ్‌లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.

    అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్‌.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌, ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు.

     ఎక్కడికి ఎక్కుపెట్టావు?
    ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్‌ సెషన్‌లో బంతితో, బ్యాట్‌తో హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్‌ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్‌రౌండర్‌.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్‌- హార్దిక్‌ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

    పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్‌ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్‌.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. 

    ఇందుకు హార్దిక్‌.. ‘‘మొదటి టైర్‌లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్‌ టైర్‌లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు.

     బుమ్రా కూడా
    ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా కివీస్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి టీమిండియాతో చేరాడు. 

    కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 జరుగనుంది. ఇందుకు భారత్‌- శ్రీలంక వేదికలు.

    చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!

  • మహిళల ఐపీఎల్‌లో (WPL) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. 

    నిన్న (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్‌లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించింది. 

    అంతకుముందు ఎడిషన్‌లో (2025) తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. 

    లీగ్‌ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

    ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ
    తాజాగా గుజరాత్‌ జెయింట్స్‌పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్‌తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది.

    నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, అనామక ప్లేయర్‌ గౌతమి నాయక్‌ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 

    మంధన (26), రిచా ఘోష్‌ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2, రేణుకా సింగ్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

    అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్‌ (4-0-17-2), లారెన్‌ బెల్‌ (4-1-23-1), రాధా యాదవ్‌ (4-0-34-1), శ్రేయాంక పాటిల్‌ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

    గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్‌ (11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 
     

  • ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్‌ రిపీటైంది.దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. 

    ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్‌ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 

    ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. సెదిఖుల్లా అటల్‌ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ తడబడింది. జియా ఉర్‌ రెహ్మాన్‌ (4-0-36-3), రషీద్‌ ఖాన్‌ (4-0-19-2), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (4-0-29-2), నూర్‌ అహ్మద్‌ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. 

    విండీస్‌ ఇన్నింగ్స్‌లో సాంప్సన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), మోటీ (28), ఫోర్డ్‌ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌ చెరో 4, జాంగూ, హెట్‌మైర్‌, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.

     

  • చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్‌ అయ్యర్‌. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.

    అయితే, తిలక్‌ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.

    శస్త్రచికిత్స విజయవంతం
    పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్‌ టార్షన్‌ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.

    వేగంగా కోలుకుంటున్న తిలక్‌
    స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్‌ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.

    బరిలోకి దిగేందుకు సై
    టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. తిలక్‌ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్‌ ట్రెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కి చేరుకుంటాడు.

    ఒకవేళ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే కివీస్‌తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్‌ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్‌ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్‌ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. 

    కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్‌ వర్మ.. ఆసియా కప్‌-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.

    న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవి బిష్ణోయి.

    చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

  • టెస్టులకు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్‌కు అప్పగించింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).

    అయితే, పూర్తి స్థాయి కెప్టెన్‌గా గిల్‌ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో టెస్టుల్లో వైట్‌వాష్‌ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్‌ తొలిసారి 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.

    అశూ స్పందన ఇదే
    తాజాగా గిల్‌ సేనకు న్యూజిలాండ్‌ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.

    ధోని, రోహిత్‌లను చూసి నేర్చుకో
    కివీస్‌ సిరీస్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్‌  అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!

    వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్‌కు ఏ బౌలర్‌తో బౌలింగ్‌ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్‌తో సిరీస్‌లో ఇది మిస్సయింది.

    ఎంతమాత్రం సరికాదు
    ఈ విషయంలో గిల్‌ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్‌కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫాస్ట్‌ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఎందుకు బరిలోకి దించలేదు.

    అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్‌ వేరే విధంగా ఉండేది. డారిల్‌ మిచెల్‌ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. 

    ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్‌ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్‌.. గిల్‌ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.

    చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగు
    వాళ్లను పక్కనపెడతారా?: గిల్‌పై రహానే, జహీర్‌ ఖాన్‌ ఫైర్‌!

Telangana

  • సాక్షి హైదరాబాద్: యుఏఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌ సిటీని ప్రపంచంలోనే మేటి నగరంగా నిర్మించడానికి యూఏఈ సహాకారం అందించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో భేటీ అయి ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా నిర్మించేందుకు ఇరువైపులా జాయింట్ టాస్క్‌ ఫోర్స్‌  కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

    కాగా హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. దీనిలో 11 టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. 

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను చట్టవిరుద్ధమైన రీతిలో వధించటాన్ని తెలంగాణ జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి ఖండించింది. కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు, తీవ్ర క్రూరత్వ ఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.

    సభ్య సంస్థలు సంకలనం చేసిన క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం.. ఈ కూటమి జనవరి 2026 మొదటి వారాల్లోనే సుమారు 500 వీధి కుక్కల హత్యను నమోదు చేసింది. అలాగే ఇటీవలి కాలంలో పదికి పైగా తీవ్రమైన క్రూరత్వ కేసులను నమోదు చేసింది. వాటిలో కుక్కలను రాడ్‌లతో కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విష ప్రయోగం చేయడం, వాటి అవయవాలను ముక్కలు చేయడం వంటివి ఉన్నాయి. కామారెడ్డి, హన్మకొండ జిల్లాల నుండి అత్యంత తీవ్రమైన సంఘటనలు నివేదించబడ్డాయి. ఇక్కడ స్థానిక పంచాయతీ అధికారులు ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుసరించి వీధి కుక్కలను సామూహిక హత్యలకు ఆదేశించారు. ఈ హింస జంతువుల ప్రవర్తన వల్ల కలిగింది కాదని, మానవ నిర్లక్ష్యం, దీర్ఘకాలిక పరిపాలనా వైఫల్యం వల్ల జరిగిందని ఈ కూటమి పేర్కొంది.

    హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్వహిస్తున్న "కుక్కల తొలగింపు కార్యక్రమాలు" జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 మరియు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నియమాలు, 2023లను ఉల్లంఘిస్తున్నాయని కూటమి గుర్తుచేసింది. తగినంతగా పశువైద్య మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమా​ండ్‌ చేసింది. 

  • సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన  భర్త సుధీర్‌రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • సాక్షి హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి పౌర కేంద్రిత పోలిసింగ్‌ను రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు పేర్కొంది బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా వారి ఇంటి వద్దే ఫిర్యాదుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది.

    ఈ రోజుల్లో పోలీస్‌స్టేషన్ భయంతో చాలా వరకూ నేరాలు వెలుగులోకి రావడం లేదు. పోలీసు స్టేషన్ వెళ్లాలంటే సామాజికంగా తమపై ప్రభావం పడుతుందనే భయంతో పాటు ఆర్థికంగా కొంత భారం కారణంగా  చాలామంది అక్కడికి వెళ్లడానికి  మెుగ్గు చూపరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది.  మహిళలు, చిన్నారుల కేసులతో పాటు  పోక్సో చట్టం ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ బాల్య వివాహాలు, ర్యాగింగ్ లాంటి కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు తెలిపింది.

    వీటితో పాటు శారీరక దాడులు, ఆస్తి వివాదాల కేసులలో బాధితుల ఇంటివద్దే ఫిర్యాదు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. బీఎన్‌ఎస్ న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదు స్వీకరించి అనంతరం ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితులకు అందజేయనున్నట్లు పేర్కొంది.  సాక్ష్యాల సేకరణ అక్కడికక్కడే చేయనున్న తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్లలో ఈ కొత్త నియమాలు సత్వరమే అమలులోకి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

  • సాక్షి హైదరాబాద్:  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి "తెలంగాణ రైజింగ్"లో భాగస్వామ్యం కావాలని  పారిశ్రామికవేత్తలను  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన "ఇండియా పెవిలియన్" ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని పారిశ్రామికవేత్తలను శ్రీధర్ బాబు సాదరంగా ఆహ్వానించారు. 

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ....భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని.... అందుకు అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

    ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఇక్కడి ఎకో సిస్టం వివరాలు మంత్రి పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల  పెట్టుబడులను సమీకరించిందని మంత్రి తెలిపారు.

    2026లో కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఉత్తమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. "తెలంగాణ బ్రాండ్" మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.O, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వాహనాలపై పెండింగ్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాహనదారులను పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దని పోలీసులకు సూచించింది. 

    తెలంగాణలో వాహనాల పెండింగ్‌ చలాన్ల విషయమై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు.. వాహనదారులు చలాన్‌లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటివి చేయవద్దు. వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్‌లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చు. అంతేకానీ.. పెండింగ్ చలాన్‌లను చెల్లించమని బలవంతపెట్టొద్దు అని ఆదేశించింది. 

    ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఆటోమెటిక్‌గా చాలా చలాన్ కట్ అయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని అన్నారు. అయితే సీఎం వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించమని పోలీసులు.. పౌరులను ఆపొద్దని, బలవంతం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది .
     

Business

  • కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన ఘటన, అంతే కాకుండా ఈ రోజు స్టాక్ మార్కెట్ కూడా పెట్టుబడిదారుల కోసం తెరిచి ఉంటుందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) & నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వెల్లడించాయి.

    సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం సెలవు రోజులు. అయితే యూనియన్ బడ్జెట్ 2026ను ఆదివారం (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు, కాబట్టి ఆ రోజు స్టాక్ మార్కెట్ యధావిధిగా తెరిచే ఉంటుంది (స్టాక్ మార్కెట్‌కు ఆదివారం సెలవు లేదన్నమాట).

    బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి గుర్తుగా.. జనవరి 28న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. కాగా జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్‌ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 తేదీలలో జరుగుతుందని, రెండవ భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 మధ్య రెండో సెషన్‌ జరుగుతాయి.

    సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌
    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు.  వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.

  • స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

    విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.

    చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.

    ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి.

  • జనవరి 28 నుంచి 31 వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జరిగే వింగ్స్ ఇండియా 2026లో 'ఎయిర్‌బస్' తన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు & వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్‌ను ప్రదర్శించనుంది. ఇందులో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లార్జ్ సింగిల్-ఐల్ విమానం A321neo, దేశీయ & అంతర్జాతీయ కనెక్టివిటీకి గేమ్‌చేంజర్‌గా నిలిచిన A220 విమానాలతో పాటు H160, H125 హెలికాప్టర్లు స్టాటిక్ డిస్‌ప్లేలో ఆకర్షణగా నిలవనున్నాయి.

    ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. H125 హెలికాప్టర్ ఇకపై కర్ణాటకలోని వెమగల్‌లో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద అసెంబ్లీ కానుంది. కాగా హాల్ Aలోని స్టాండ్ 11 వద్ద A321XLR, H145 మోడళ్లను ఎయిర్‌బస్ పరిచయం చేయనుంది.

    పబ్లిక్ డేస్‌లో ఎయిర్‌బస్ తన స్టాండ్ వద్ద ప్రత్యేక ‘మీట్-అండ్-గ్రీట్’ రిక్రూట్‌మెంట్ ఈవెంట్ నిర్వహించనుంది. డిజిటల్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీ ఉన్నతాధికారులు అభ్యర్థులతో నేరుగా సమావేశమవుతారు. ముఖ్యంగా బిగ్ డేటా, ఐఓటీ, అవియానిక్స్ సాఫ్ట్‌వేర్, ఎయిర్‌ఫ్రేమ్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలు కలిగిన వారిని ఎయిర్‌బస్ కోరుకుంటోంది.

  • కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచమంతా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి తరుణంలో AI కంప్యూట్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి AM గ్రూప్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ఏఐ హబ్ సామర్థ్యం 1 గిగావాట్ ఉంటుంది. దీని కోసం సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఏఐ పెట్టుబడుల్లో ఒకటి.

    ఈ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి ప్రారంభమవుతుంది. 2030 నాటికి ఇది పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందులో సుమారు 5 లక్షల అత్యాధునిక కంప్యూటర్ చిప్‌లు ఉంటాయి. ఇవి భారీ ఏఐ పనులను వేగంగా చేయడానికి ఉపయోగపడతాయి.

    ఈ ఏఐ హబ్‌లు పెద్ద కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు, స్టార్టప్‌లు & ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని వల్ల ఏఐ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రజలకు ఏఐను దగ్గర చేయడానికి ఏఎం సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. చిన్న డెవలపర్లు కూడా పెద్ద ఏఐ టూల్స్‌ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.

    ఈ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరప్రదేశ్‌లో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. టెక్నాలజీ రంగం మరింత బలపడుతుంది. మొత్తం మీద.. ఈ ఏఐ కంప్యూట్ హబ్ భారతదేశాన్ని ప్రపంచ ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్లే కీలక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు.

  • స్మార్ట్‌ఫోన్స్‌ దిగ్గజం ఒప్పో ఇండియా తాజాగా ప్రీమియం రెనో15 సిరీస్‌ ఫోన్లను ప్రవేశపెట్టింది. రెనో15 ప్రో మినీ, ప్రో, రెనో 15 పేరిట మూడు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ట్రావెల్‌ ఫొటోగ్రఫీకి మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రో, ప్రో మినీల్లో 20 ఎంపీ కెమెరా, ప్యూర్‌టోన్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, ఏఐఎడిటింగ్‌ టూల్స్‌ మొదలైన ఫీచర్స్‌ ఉంటాయి.

    పరిశ్రమలోనే తొలిసారిగా హోలోఫ్యూజన్‌ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒప్పో ప్యాడ్‌5 (రేటు రూ. 26,999 నుంచి ప్రారంభం), ఎన్‌కో బడ్స్‌3 ప్రో+ని (ధర రూ. 2,499) కూడా కంపెనీ ఆవిష్కరించింది.

  • దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.

    ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..

    స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలు

    వాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.

    క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్‌లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.

    పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.

    బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.

    ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

  • మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో ఒక్క రోజులోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది.
     

    ఆర్తి సర్ఫ్యాక్టెంట్స్ లిమిటెడ్, పటేల్ రిటైల్ లిమిటెడ్, లక్ష్మీ కాట్స్పిన్ లిమిటెడ్, అంజని పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ లిమిటెడ్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ రసయాన్ లిమిటెడ్, ఆల్మండ్జ్ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీ దిగ్విజయ్ సిమెంట్ కంపెనీ లిమిటెడ్, బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • వజ్రాల కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొంటున్న గందరగోళానికి తెరదించుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ‘డైమండ్’ అనే పదాన్ని కేవలం సహజ సిద్ధంగా లభించే వజ్రాలకే ఉపయోగించాలని స్పష్టం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, మార్కెట్‌లో పారదర్శకతను పెంచేందుకు బీఐఎస్‌ తాజాగా IS 19469:2025 అనే కొత్త ప్రమాణాన్ని ఆమోదించింది. ఇది అంతర్జాతీయ ప్రమాణమైన ISO 18323:2015 (జ్యువెల్లరీ: డైమండ్ పరిశ్రమలో వినియోగదారుల విశ్వాసం)కు అనుగుణంగా రూపొందించినట్లు తెలిపింది.

    కొత్త మార్గదర్శకాల్లోని అంశాలు

    భూగర్భంలో సహజంగా ఏర్పడిన వజ్రాలను మాత్రమే ‘డైమండ్’గా పరిగణిస్తారు. విక్రేతలు వీటిని మరింత స్పష్టంగా చెప్పాలనుకుంటే ‘నేచురల్’, ‘రియల్’, ‘జెన్యూన్’ లేదా ‘‍ప్రీషస్’ వంటి విశేషణాలను జోడించవచ్చు. ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారుచేసే వజ్రాల విషయంలో విక్రేతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని విక్రయించేటప్పుడు కచ్చితంగా ‘laboratory-grown diamond’ లేదా ‘laboratory-created diamond’ అనే పూర్తి పదాలను వాడాలి. ఇకపై ల్యాబ్ వజ్రాల కోసం LGD, lab-grown, lab-diamond వంటి షార్ట్ కట్ పేర్లను వాడటం నిషిద్ధం.

    ల్యాబ్ వజ్రాలను విక్రయించేటప్పుడు ‘నేచర్స్’, ‘ప్యూర్’, ‘ఎర్త్-ఫ్రెండ్లీ’ లేదా ‘కల్చర్డ్’ వంటి పదాలను ఉపయోగించకూడదని బీఐఎస్‌ ఆదేశించింది. కేవలం బ్రాండ్ పేరుతో వీటిని విక్రయించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.

    పరిశ్రమ వర్గాల స్పందన

    బీఐఎస్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని న్యాచురల్ డైమండ్ కౌన్సిల్ (NDC) స్వాగతించింది. ఎన్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ రిచా సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ కొత్త ప్రమాణాలు వినియోగదారులకు ఎంతో కాలంగా అవసరమైన స్పష్టతను ఇస్తాయి. సహజ వజ్రాల విశిష్టతను ఇవి కాపాడతాయి’ అని పేర్కొన్నారు. అటు జ్యువెల్లరీ వ్యాపారులు కూడా ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైమండ్ పదజాలంలో అయోమయం తొలగించడం వల్ల పరిశ్రమ మరింత బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

    ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

  • టయోటా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'ను అధికారికంగా ఆవిష్కరించింది. దీనిని ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఈవిటారా ఆధారంగా రూపొందించారు. కాబట్టి డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వంటివన్నీ కూడా.. దాదాపు విటారాలో ఉన్నట్లుగానే ఉన్నాయి.

    టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా బాడీ షెల్‌ ఈవిటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఒక ప్రత్యేకమైన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు, విభిన్నమైన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది. ఇది ఈవిటారా లాగా లైట్ బార్ ద్వారా కనెక్టెడ్ ఎల్ షేప్ టెయిల్‌లైట్‌లను పొందుతుంది.

    లోపల భాగంలో అర్బన్ క్రూయిజర్ ఈవీ.. ఈవిటారాలో మాదిరిగానే అదే డాష్‌బోర్డ్‌ను పొందుతుంది. ఇది డ్యూయల్ స్క్రీన్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీటు, సన్‌రూఫ్, జేబీఎల్ ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.

    భారతదేశంలో, అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఎంపికలతో (49 kWh & 61 kWh) లభిస్తుంది. 49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 142 bhp & 189 Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటారును.. 61 కిలోవాట్ బ్యాటరీ 172 bhp & 189 Nm టార్క్ అందించే మరింత శక్తివంతమైన మోటారుతో వస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం.

    ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు.. ఈ కారు గురించి తెలుసా?

    టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 5 మోనోటోన్ (కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్) కలర్స్, 4 డ్యూయల్-టోన్ కలర్ (కేఫ్ వైట్/బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్/బ్లాక్ రూఫ్, స్పోర్టిన్ రెడ్/బ్లాక్ రూఫ్ & ఎంటైసింగ్ సిల్వర్/బ్లాక్ రూఫ్) ఎంపికలలో లభిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది.

  • భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను చేరువ చేస్తూ తీసుకువచ్చిన ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ సేవల్లో కీలక మార్పులు చేసింది. అమృత్‌ భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల నిర్మాణం, రిజర్వేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి తీసుకొచ్చింది.

    ఆర్‌ఏసీ విధానానికి స్వస్తి

    అమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రైళ్లలో ఆర్‌ఏసీ విధానం ఉండదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. దీనివల్ల సీటు షేర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణం మరింత సుఖమయంగా ఉంటుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే అవకాశం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.

    ఛార్జీలు ఇవే..

    రైల్వే ఆదాయం, సర్వీసుల నాణ్యతను సమతుల్యం చేస్తూ కనీస ఛార్జీలను నిర్ణయించింది. కనీసం 200 కిలోమీటర్ల దూరానికి టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. దీని బేసిక్ ఛార్జీ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ క్లాస్ (అన్‌రిజర్వ్డ్) కేటగిరీలో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ వసూలు చేస్తారు. దీని ప్రారంభ ధర రూ.36. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.

    అమృత్ భారత్ vs వందే భారత్.. ప్రధాన వ్యత్యాసాలు

    అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌
    సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణంప్రీమియం, వేగవంతమైన ప్రయాణం
    నాన్-ఏసీ(స్లీపర్, సెకండ్ క్లాస్)పూర్తిగా ఏసీ (చైర్ కార్, స్లీపర్)
    ఆర్‌ఏసీ లేదు (కన్ఫర్మ్ లేదా వెయిటింగ్)కేవలం కన్ఫర్మ్ టికెట్లు
    మెరుగైన బెర్త్‌లుఆటోమేటిక్ డోర్లు, వై-ఫై, క్యాటరింగ్

     

    దేశవ్యాప్తంగా కొత్త మార్గాలు

    కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో రైల్వే శాఖ మరో 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.

    కామాఖ్య - రోహ్‌తక్: అస్సాం నుంచి హర్యానా వరకు.

    దిబ్రూగఢ్ - లఖ్‌నవూ: యూపీ, అస్సాం మధ్య.

    సంత్రాగాచి - తాంబరం: కోల్‌కతా, చెన్నై మధ్య.

    హౌరా - ఆనంద్ విహార్ (ఢిల్లీ): కోల్‌కతా నుంచి ఢిల్లీ. ఇవేకాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.

    ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లీ డ్రామాలు? అంటూ ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అని సవాల్‌ విసిరారు.

    కేంద్రమంత్రి బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీకి, ఫాంహౌస్‌కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా?. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులైన తండ్రీ కొడుకులను ఎందుకు విచారించడం లేదు?. దీనికి కారకులైన ఒక్క నాయకుడినైనా అరెస్ట్ చేశారా?. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పారు కదా?. చాలా రోజులు హరీష్ రావు ఫోన్ కూడా మాట్లాడని విషయం మీకు తెలియదా?. కర్ర విరగదు.. పాము చావదన్నట్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేకపోయారు.

    కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉన్నారు. విచారణ పేరుతో సిట్ సాగదీస్తున్న విచారణను చూసి జనం నవ్వుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ అంతా అటెన్షన్‌.. డైవర్షనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద‍మ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి అని సవాల్‌ విసిరారు. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్‌ చేశాడా? సజ్జనార్‌ చేశాడా? నాకు తెలియదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ నిరాధారమైన ఆరోపణలు.. సొల్లు పురాణమే. ముగ్గురు అధికారులు కలిసి ప్రశ్నించారు.  నన్ను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం. నేను ఏమైనా హోంమంత్రినా?. నేను అప్పుడేమైనా హోంమంత్రిగా పని చేశానా?. నేనే వాళ్లకు వంద ప్రశ్నలు వేశాను. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డిని విచారించాలి. 

    రేవంత్‌ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టాను. అందుకే నాకు సిట్‌తో నోటీసులు ఇప్పించాడు. దమ్ముంటే బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించండి. బొగ్గు కుంభకోణానికి కింగ్‌పిన్‌ రేవంత్‌ బావమరిదే. తప్పు చేయకపోతే రేవంత్‌ బావమరిదిపై విచారణకు ఆదేశించాలి. సీఎం, మంత్రుల మధ్య వాటాల పోరాటం రోడ్డు మీదకు వచ్చింది. మేము అన్ని ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాం. రేవంత్‌ నిజాయితీపరుడైతే సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలి.

    చిల్లర రాజకీయాలే.. 
    రేవంత్‌ చిల్లర రాజకీయాలపై మాకు అసహ్యం వేస్తోంది. ఎన్ని సిట్‌ నోటీసులు పంపినా భయపడేది లేదు. సిట్‌ విచారణపై లీకులు ఇస్తారు.. ద‍మ్ముంటే ఈరోజు జరిగిన విచారణ వీడియోలు బయటపెట్టండి. అడిగిందే అడిగారు.. ప్రతీ నిమిషానికి ఫోన్లు వచ్చాయి.. రేవంత్‌ చేశాడా? సజ్జనార్‌ చేశాడా? నాకు తెలియదు. మాకు అరెస్ట్‌లు, పోరాటాలు కొత్త కాదు. తెలంగాణ ‍ప్రజలకు ప్రభుత్వం వ్యవహారం అంతా అర్థం అవుతోంది. అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు. మీవన్నీ కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలే. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు నడవవు. విచారణ పేరుతో సమయం​ వృథా చేశారు. మీరు ఇచ్చిన నోటీసులు గౌరవంగా భావిస్తాం. ఎన్నిసార్లు సిట్‌ అధికారులు పిలిచినా వస్తాను. విచారణకు సహకరిస్తాను అని తెలిపారు. 

    ముగ్గురి మధ్య వాటాల పంచాయితీ.. 
    సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినోళ్ళం. సిట్ నోటీసులు రాగానే పారిపోయేవాళ్లం కాదు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ‌గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నా సిగ్గు రావటం లేదు. రేవంత్ భాష, మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ తయారుచేసిన సైనికులం. రేవంత్ మాదిరి వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు. దర్యాప్తు పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. బొగ్గు కుంభకోణంపై విచారణ జరుపుతాం అని కీలక వ్యాఖ్యలు చేశారు. 
     

    అంతకుముం‍దు.. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావును ఈరోజు సిట్‌ విచారించింది. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో సిట్‌ అధికారులు.. హరీష్‌ను దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం, హరీష్‌ రావు నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. పార్టీ నేతలను కలిసి చర్చించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావును సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై హరీష్‌ విచారణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘కేటీఆర్ ఏమీ తెలియదు. టెలిగ్రాఫిక్ యాక్టు చదివితే ఈ కేసు తీవ్రత ఏంటో కేటీఆర్‌కు  తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి వారున్న శిక్ష తప్పదు. నా ఫోన్, షబ్బీర్ అలీ ఫోన్‌ సహా చాలా మంది ఫోన్స్ ట్యాప్ చేసి.. ప్రైవేట్ సంభాషణలు విన్నారు. బీఆర్ఎస్ నాయకులు.. మహిళా యాక్టర​్‌ల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూశారు. తప్పు చేశారు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన తప్పులపై విచారణ జరుగుతోంది. ఇది రాజకీయ వేధింపులు కానే కాదు, వేధింపులకు పాల్పడాలంటే రెండేళ్ల వరకు ఎందుకు వేచి చూస్తాం. అప్పుడే జైలుకు పంపే వాళ్లం అని వ్యాఖ్యలు చేశారు.

    మరోవైపు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ..‘గతంలో నా ఫోన్ ట్యాప్ అయ్యిందని నన్ను కూడా విచారణకు పిలిచారు. నా కుటుంబ సభ్యులు, మా ఇంటి వాచ్‌మెన్‌ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బీఆర్‌ఎస్‌ హయంలో నాపైనే అధికంగా కేసులు పెట్టారు. గాంధీభవన్‌ లోపలికి వచ్చి మరీ అరెస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను విచారణ చేయవద్దని చట్టం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. 

  • సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్‌ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ  రుణాలు మంజూరు అయ్యేవి.  

    మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు.
    కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..
  • సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పీఎస్‌ ఎదుట ఉ‍ద్రిక్తత నెలకొంది. పోలీసులకు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నినాదాలు చేశాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు.

    కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీష్‌రావును సిట్‌ ప్రశ్నిస్తోంది. ఐదు గంటలుగా హరీష్‌ను విచారిస్తున్నారు. హరీష్ రావు ఆరోగ్యం పై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ విచారణకు న్యాయవాదులను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు విచారణ వీడియో విడుదల చేయాలని కోరారు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం.. హరీష్‌ను ప్రశ్నిస్తోంది. తనకు క్లియరెన్స్‌ ఇస్తూ హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ కాపీల ఉత్తర్వులను సిట్‌కు హరీష్‌రావు అందజేశారు.

    బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్
  • సాక్షి, తాడేప‌ల్లి: పెట్టుబ‌డుల పేరుతో తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ చేసుకుంటున్న ప్ర‌చార‌మంతా వ‌ట్టి బూట‌క‌మేన‌ని, కంపెనీల ఏర్పాటు పేరుతో వేల కోట్ల విలువైన భూములు బినామీల‌కు దోచిపెట్టి ప్ర‌భుత్వ సంప‌ద‌ను దోపిడీ చేస్తున్న‌ది మాత్ర‌మే నిజ‌మ‌ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సింగారెడ్డి సతీష్ కుమార్‌రెడ్డి అన్నారు.

    మంగళవారం ఆయన తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఏటా పెట్టుబడుల పేరుతో చంద్ర‌బాబు చేస్తున్న దావోస్ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ బోగ‌స్ అని, ల‌క్ష‌ల కోట్ల ఒప్పందాలు జ‌రిగాయ‌న చెప్ప‌డ‌మే త‌ప్ప వాటిలో కార్య‌రూపం దాల్చిన వాటి వివ‌రాలు చెప్పే ధైర్యం కూట‌మి ప్ర‌భుత్వానికి లేద‌ని విమ‌ర్శించారు. తమ‌ను తాము పొగుడుకోవ‌డానికో, వైఎస్‌ జ‌గ‌న్‌ని తిట్ట‌డానికే దావోస్ వెళ్లడం దేనిక‌ని స‌తీష్ రెడ్డి మండిప‌డ్డారు.

    ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో భూముల‌ను వేలం వేసి మ‌రీ కంపెనీల‌కు అప్ప‌జెబుతుంటే, చంద్ర‌బాబు మాత్రం ఎక‌రం 99 పైస‌ల‌కే క‌ట్ట‌బెట్టడం దోపిడీకాక ఇంకేమిట‌ని ప్ర‌శ్నించారు. దీనిపై జ‌ర్నలిస్టులు ప్ర‌శ్నిస్తే.. మా ఇష్టం నేనిస్తా అని చెబుతున్న నారా లోకేష్‌కి అధికార మ‌దం త‌ల‌కెక్కింద‌ని మండిప‌డ్డారు. అంత‌గా ఇవ్వాల‌నుకుంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకోవాల‌ని సూచించారు. ఇలాంటి నిరంకుశ నియంత పోక‌డల‌తోనే ఫ్రెంచి విప్ల‌వం పుట్టింద‌నే విష‌యాన్ని చంద్ర‌బాబు తెలుసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. కూట‌మి ప్ర‌భుత్వ విధానాల‌పై తెలుగుదేశం అనుకూల మీడియాలోనే తీవ్ర‌మైన వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    నారా లోకేష్‌కి అధికార మ‌దం త‌ల‌కెక్కింది
    కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్య‌మంత్రిగా పెట్టుబ‌డుల పేరుతో దావోస్ ప‌ర్య‌ట‌నలు చేసే తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ ప‌బ్లిసిటీ పిచ్చికి వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నం వృథా అవుతోంది. పెద్ద మొత్తంలో ప్రజాధ‌నం ఖ‌ర్చు చేసి త‌మ‌ను తామే పొగుడుకోవ‌డం, వైఎస్‌ జ‌గ‌న్‌ని తిట్ట‌డం త‌ప్ప‌, రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులు మాత్రం శూన్యం. 2014-19 మ‌ధ్య జ‌రిగిందే ఇప్పుడూ జ‌రుగుతోంది. ల‌క్ష‌ల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామ‌ని ఎల్లో మీడియాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా రాయిస్తారే కానీ, వాటిలో కార్యరూపం దాల్చిన వాటి వివ‌రాలు మాత్రం ఎప్ప‌టికీ చెప్ప‌రు.

    కానీ వైఎస్సార్‌సీపీ హ‌యాంలో వైఎస్‌ జ‌గ‌న్ కృషితో ఏర్పాటైన ప‌రిశ్ర‌మ‌ల‌కు శంకుస్థాప‌నలు, భూమి పూజ‌లు చేసి తామే సాధించిన‌ట్టుగా క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతుంటారు. కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు నిత్యం వైఎస్‌ జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. సీఎంగా చంద్ర‌బాబు రూ.23 ల‌క్ష‌ల కోట్ల ఎంవోయూలు చేసుకుంటే వాటిలో కార్య‌రూపం దాల్చిన‌వి 5 శాతం కూడా లేవు. పారిశ్రామిక అభివృద్ధి, కంపెనీల ఏర్పాటు పేరుతో ఊరూపేరులోని కంపెనీల‌కు విశాఖ‌లో వేల కోట్ల విలువైన భూములు ఎక‌రం 99పైస‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నారు.

    తెలంగాణ‌లో ప్ర‌భుత్వ స్థ‌లం ఓపెన్‌గా వేలం వేసి ఎక‌రం రూ.170 కోట్ల‌కు విక్ర‌యిస్తుంటే, చంద్ర‌బాబు మాత్రం పెట్టుబ‌డుల పేరుతో త‌న బినామీల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టేస్తున్నాడు. భూ పంపిణీ రూపంలో ఏడాదిన్న‌ర‌లోనే చంద్ర‌బాబు వేల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడు. అప్ప‌నంగా భూములు క‌ట్ట‌బెట్ట‌డంపై జ‌ర్న‌లిస్టులు నారా లోకేష్‌ని ప్ర‌శ్నిస్తే.. విమ‌ర్శ‌లకు స‌మాధానం చెప్ప‌కుండా నా ఇష్టం, నేనిస్తా అంటున్న నారా లోకేష్ అహంకారాన్ని ప్ర‌జ‌లే దించుతారు. అప్ప‌నంగా ఇచ్చుకోవాలంటే హెరిటేజ్ ఆస్తులు ఇచ్చుకో, ప్ర‌జ‌ల సంప‌ద‌ను దోచిపెట్ట‌డానికి నారా లోకేష్ ఎవ‌రు?

    విదేశీ ప‌ర్య‌ట‌నను ర‌హ‌స్యంగా ఎందుకు ఉంచారు?
    ప్రైవేట్ కార్య‌క్ర‌మం అంటూనే నారావారిప‌ల్లెలో కుటుంబంతో క‌లిసి జ‌రుపుకున్న సంక్రాంతి సంబ‌రాల‌ను టీవీల్లో లైవ్ ఇచ్చుకున్న చంద్ర‌బాబు, వారం రోజులు తండ్రీకొడుకులు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు?  క‌నీసం ఏ దేశానికి వెళ్లిందీ ఎందుకు చెప్ప‌లేదు? ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను అంత ర‌హ‌స్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది?  రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌విలో ఉండి ఇలా బాధ్య‌త‌మ‌రిచి వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌ల్లో చాలా అనుమానాలున్నాయి.

    రాష్ట్రంలో దోచుకుంటున్న అవినీతి సంప‌ద‌ను పెట్టుబ‌డుల రూపంలో దాచుకోవ‌డానికే విదేశీ ప‌ర్య‌ట‌నలు చేశార‌ని ప్ర‌జలంతా అనుకుంటున్నారు. దీనికి తండ్రీకొడుకులు చంద్ర‌బాబు, లోకేష్ స‌మాధానం చెప్పి తీరాల్సిందే. టీడీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల‌లో సైతం ప్ర‌భుత్వ పెద్ద‌ల అవినీతిపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌నీతి అనే టీడీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్లో రాష్ట్రంలో ఉన్న అనేక మంది   ఐఏఎస్‌ అధికారులు వంద‌ల కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నార‌ని అభియోగం మోపారు. ఈ 19 నెల‌ల కూట‌మి పాల‌న‌లో ఒక్కో అధికారి రూ. 300 నుంచి రూ. 500 కోట్ల వ‌ర‌కు దోచుకున్నాడ‌ని అందులో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశాడు.

    నిజాయితీ ఉంటే టీడీపీ మీడియా చేసిన ఆరోప‌ణ‌ల‌కైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పుకోవాలి. ప్ర‌జ‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంద‌ని చంద్ర‌బాబే ఐఏఎస్‌ అధికారుల స‌మావేశంలో స్వ‌యంగా ఒప్పుకున్నాడు. చంద్ర‌బాబే దోపిడీకి డోర్లు బార్లా తెర‌వ‌డంతో ఆయ‌న బాట‌లోనే కూట‌మి ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారు. కుటుంబంతో క‌లిసి సంతోషంగా జ‌రుపుకోవాల్సిన సంక్రాంతి సంబ‌రాల‌ను సైతం దోపిడీ మార్గంగా మార్చ‌కున్నారు.

    నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి

    కోడి పందేల‌కు బ‌రులు ఏర్పాటు చేసి కేసినోల త‌ర‌హాలో పేకాట ఆడించి మ‌ద్యం ఏరులై పారించారు. క‌మీష‌న్ల రూపంలో వేల కోట్లు దోచుకుతిన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం లాంటి విధానాలను అవ‌లంభించ‌డం వ‌ల్ల‌నే ఆనాడు ఫ్రెంచి విప్ల‌వం వ‌చ్చింద‌నే విషయాన్ని చంద్ర‌బాబు గుర్తుంచుకోవాలి. అభివృద్ధి జ‌రిగితే నేనే అని, అవినీతి జ‌రిగితే ప‌క్క‌నోళ్ల మీద‌కు నెట్టే చంద్ర‌బాబు విధానం మార్చుకోవాలని సతీష్ రెడ్డి హితవు పలికారు.

     

  • సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం కాస్తా కొట్లాటకు దారి తీసింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేసినట్టు సమాచారం.

    వివరాల మేరకు.. బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ వర్గీయులు.. ప్రభుత్వం స్థలంలో ఉన్న చెట్లు నరికివేశారు. ఈ క్రమంలో చెట్ల నరికివేతపై జనసేన వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం, రెండు వర్గాలతో బుచ్చయ్యపేట ఎమ్మార్వో గ్రామసభ ఏర్పాటు చేశారు. దీంతో, సభలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

    ఎమ్మార్వో నిర్వహించిన గ్రామసభలోనే రెండు వర్గాలు రాళ్ల, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడి పలువురు కార్యకర్తలకు గాయాలైనట్టు సమాచారం. తలలు పగిలినట్టు తెలిసింది. అయితే, పోలీసులు సమయంలో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలి​యాల్సి ఉంది.

    	రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు
  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఎక్కడకు వెళ్ళినా జగన్ నామస్మరణే చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దావోస్ వెళ్లినా చంద్రబాబు జగన్ భజనే చేస్తున్నారన్నారు. బాబు ప్రభుత్వంలో ల్యాండ్, మైనింగ్ మాఫియాలు పెరిగిపోయాయని.. సంక్రాంతి వేడుకల్లో లిక్కర్ మాఫియా రెచ్చి పోయిందని కొరుముట్ల మండిపడ్డారు.

    ‘‘ప్రభుత్వం పది రూపాయలు పెంచగా, లిక్కర్ మాఫియా మరో రూ.60 పెంచి దోపిడీ చేశారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ అమ్మకాలు చేశారు. మందా సాల్మన్ హత్యతో దేశమే ఉలిక్కి పడింది. వైఎస్‌ జగన్‌కు ఓటేశారని పిన్నెల్లి గ్రామం నుంచి 15 వందల కుటుంబాలను బహిష్కరించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చంద్రబాబు తన బినామీలకు వేల కోట్ల విలువైన భూములను దోచి పెడుతున్నారు’’ అని కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.

     

  • సాక్షి, నెల్లూరు జిల్లా: రెడ్డి సామాజిక వర్గంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చిందులు తొక్కారు. ‘‘నన్నే నిలదీస్తారా..? ఎదురు సమాధానం ఇస్తారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో నియోజకవర్గం పొంగురులో 3 ఓట్లు తక్కువ వచ్చాయి. నాకు ఓటు వేయమంటే రెడ్ల పార్టీకి వేస్తారా?. పొంగురు గ్రామంలోని రెడ్డి వర్గానికి బెనిఫిట్స్‌ రాకుండా కట్‌ చేయిస్తా. రెడ్లకు పెన్షన్‌లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం రాకుండా చేస్తా’’ అంటూ బెదిరింపులు దిగారు.

  • సాక్షి, హైదరాబాద్‌: హరీష్‌రావుకు సిట్‌ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యానించారు. విచారణ, కమీషన్ల పేరుతో మా పార్టీని నేతలను వేధిస్తున్నారని.. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో హరీష్‌రావుకు నోటీసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘మీరు ఎన్ని విచారణలైనా చేసుకోండి.. మేం భయపడం. ఈ లొట్టపీసు కేసులో కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారంట.. ఇచ్చుకోండి’’ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. అయినా ఎంక్వైరీలు చేయిస్తున్నారు. డెవర్షన్‌ పాలిటిక్స్‌ రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి  కోల్‌ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయి. సింగరేణిలో స్కామ్‌ను నేను ఆధారాలతో సహా బయటపెడతా.. సింగరేణిలో రేవంత్‌ బావమరిదిని కింగ్‌పిన్‌ చేసి ఆయన రింగ్‌ తిప్పేలా చేశారు’’ అని కేటీఆర్‌ ఆరోపించారు.

    ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సింగరేణి దోపిడీ మొదలైంది. సింగరేణి టెండర్లపై హరీష్‌ చేసిన కామెంట్స్‌పై ప్రభుత్వం ఎందుకు స్పందించదు. బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. నైని కోల్‌ బ్లాక్‌ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉంది. నైని కోల్‌ బ్లాక్‌ కుంభకోణంపై హరీష్‌ మాట్లాడారనే అక్కసుతో నోటీసులు. అసెంబ్లీలో మంత్రులను హరీష్‌ ఫుట్‌బాల్‌ ఆడుకున్నారు’’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

    ఫోన్ ట్యాపింగ్‌తో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు

     

     

     

     

     

Family

  • ల‌దాఖ్‌లోని లేహ్‌–కార్గిల్‌ హైవేలో ఉన్న మేగ్నెటిక్‌ హిల్ ప్రాంతం అయస్కాంత శక్తికి ఒక ఎగ్జాంపుల్‌. ఇక్కడ రోడ్డుపై భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వస్తువులు, వాహనాలు మూవ్‌ అవుతున్నట్టు మనం గమనించవచ్చు. కారును న్యూట్రల్‌ గేరులో పెట్టి స్టార్ట్ పాయింట్‌ దగ్గర ఆపితే, ఆటోమెటిక్‌గా కారు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కొండపైకి వెళ్తుంది.

    మొదట్లో ఇది ఒక భ్రమలా, మాయలా అనిపించవచ్చు. కానీ అక్కడికి వెళ్లినవాళ్లకు ఇది నిజంగా జరిగే అద్భుతంలా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయంపై చాలా మంది పరిశోధనలు కూడా చేస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం ఇది ఒక గొప్ప అనుభూతిని అందించే ప్రదేశంగా మారిపోయింది.

    హిడెన్‌ స్కీయింగ్ ప్యారడైజ్‌

    బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి. రిషికేష్‌ నుంచి బద్రినాథ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న జ్యోషిమఠం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన హిల్‌ స్టేషన్‌ (Hill Station) ఉంటుంది.

    చలికాలంలో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఇష్టపడే వారికి ఔలి కంటే బెస్ట్‌ డెస్టినేషన్‌ ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా స్కీయింగ్‌ కోసం ఔలి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందాదేవి, కామెత్‌ వంటి హిమాలయ పర్వత శ్రేణులు అద్భుతంగా దర్శనమిస్తాయి. ఔలిలో ఒక ఆర్టిఫిషియల్‌ లేక్‌ కూడా ఉంది. చలికాలంలో ఈ సరస్సు చుట్టూ మొత్తం మంచు పేరుకుపోయి, ఈ ప్రదేశం మంచు స్వర్గంలా మారిపోతుంది. జ్యోషిమఠం నుంచి ఔలికి రోప్‌వే ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ ప్రయాణం మొత్తం హిమాలయాల అందాలను ఆస్వాదించేలా ఉంటుంది.

    కుటుంబంతో కలిసి ఒక మంచి హిమాలయన్‌ అడ్వెంచర్‌ ట్రిప్ (himalayan adventure trip) ప్లాన్‌ చేయాలనుకుంటే, మీ లిస్టులో ఔలిని తప్పకుండా టాప్‌ 3 డెస్టినేషన్లలో చేర్చుకోవచ్చు. అలాగే జ్యోషిమఠంలో ఉన్న పాలరాయితో నిర్మించిన నరసింహ స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. 

    చ‌ద‌వండి: ఇక్క‌డ మ‌నుషుల‌ను తాకితే ఫైన్ వేస్తారు!

  • అందరి లాగే తను కూడా ఆ గ్రామానికి కోడలిగా వచ్చింది. తన భర్తతో, కుటుంబంతో సంతోషంగా బతకాలనుకుంది. అంతలోనే భర్తను కోల్పోవడంతో తన బిడ్డతో ఒంటరిగా మిగిలిపోయింది. కానీ ఆ విషాదంలోనే ఉండిపోకుండా తన ఊరికి ఏౖదైనా సహాయం చేయాలనుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గ్రామ సర్పంచ్‌గా గెలిచింది. పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. ఊరిని ప్రగతి మార్గంలో నడిపించింది. అదే నేడు తనను, తన ఊరిని గొప్పస్థానంలో నిలబెట్టింది. అంతేకాదు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డును అందుకోవడంతోపాటు,రూ. 1 కోటి నగదు బహుమతిని సైతం సొంతం చేసుకునేలా చేసింది. ఆమే .. యోగేశ్వరి శత్రుగన్‌ చౌదరి.

    మహారాష్ట్రలోని గోండియా జిల్లా, సడక్‌ అర్జుని తాలూకాకు చెందిన దవ్వా గ్రామం సరికొత్త చరిత్ర సృష్టించింది. పర్యావరణ హిత కార్యక్రమాలలో ముందుండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్లైమేట్‌ యాక్షన్‌ స్పెషల్‌ పంచాయతీ అవార్డు పొందిన గ్రామంగా నిలిచింది దవ్వా. ఇదంతా ఆ ఊరి సర్పంచ్‌ యోగేశ్వరి శత్రుగన్‌చౌదరి వల్లే సాధ్యమైందని ఆ గ్రామ ప్రజలు  చెబుతున్నారు.

    అనుకోని విషాదం
    ఇంటర్‌ పూర్తి చేసిన యోగేశ్వరి 2003లో దవ్వా గ్రామానికి కోడలిగా వచ్చింది. అనంతరం భర్త సహకారంతో బీఏ., బీఈడీ, డీఈడీ చేసి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అంతలోనే భర్త మరణించడంతో.. యోగేశ్వరి జీవితంలో అంధకారం అలుముకుంది. అయితే ఈ విషాదంలోనే ఉండిపోకుండా అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తన ఊరికోసం ఏమైనా చేయాలనుకుంది. ఆ ఆలోచనతోనే ఊరి ప్రజల సహకారంతో సర్పంచ్‌గా గెలిచింది.

    లక్షాపదహారు వేల మొక్కలు నాటింది 
    యోగేశ్వరి పర్యావరణ హితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. గ్రామంలోని నిస్సారమైన నేలలో నీటిని పారించి పంటలు పండించింది. గ్రామపరిధిలోని ఖాళీ స్థలాలలో సుమారు 1,16,000 మొక్కలను నాటి ఆ తాన్ని పచ్చదనంతో నింపేశారు. గ్రామంలోని 400 ఇళ్లకు పైగా సోలార్‌గ్రిడ్లను ఏర్పాటు చేశారు. 

    గ్రామంలోని తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించడం ద్వారా జీరో వేస్ట్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. రైతుల కోసం ప్రత్యేక ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసి, రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. గ్రామం కోసం చేపట్టిన పనులన్నీ పారదర్శకంగా ఉండటం కోసం భువన్‌ యాప్‌ ద్వారా జియో–ట్యాగింగ్‌ చేశారు. 

    (చదవండి: ప్రభుత్వ పాఠశాల విద్యానేపథ్యం..కానీ ఇవాళ మహీంద్రా ఆటోమోటీవ్‌ టీమ్‌ హెడ్‌)

  • విడాకుల క‌ల్చ‌ర్ రోజుకు రోజుకు పెరుగుతోంది. సామాన్యులు, సంప‌న్నులు అనే బేధం లేకుండా విడిపోతున్న జంట‌లు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ఆలుమ‌గ‌ల మ‌ధ్య పూడ్చ‌లేనంత అగాధం ఏర్ప‌డిన‌ప్పుడు విడాకులు అనివార్య‌మ‌వుతున్నాయి. సామాజిక క‌ట్టుబాట్ల‌కు భ‌య‌ప‌డి మిడిల్‌క్లాస్ జంట‌లు ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కేందుకు జంకుతున్నాయి. కానీ ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి, సంప‌న్నులు మాత్రం 'డోంట్ కేర్' అంటున్నారు. క‌లిసి క‌ల‌హించుకునే కంటే.. విడిపోయి ఎవ‌రిదారి వారు చూసుకుని హాయిగా ఉండాల‌న్న ఉద్దేశంతో విడాకులకు మొగ్గు చూపిస్తున్నారు. డివోర్స్‌కు దారి తీస్తున్న‌ కార‌ణాలు చాలానే ఉన్నాయి. స‌రే వాటి గురించి ప‌క్క‌న పెడ‌దాం.

    ఇప్పుడీ విడాకుల గురించి మాట్లాడుకోవ‌డానికి ప్రధాన కారణం జోహూ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీధ‌ర్ వెంబు, ఆయ‌న భార్య ప్ర‌మీలా శ్రీనివాస‌న్‌. వీరిద్ద‌రూ విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టుకెక్కారు. భార్యాభ‌ర్త‌లు విడాకుల కోసం కోర్టుకెళ్ల‌డం పెద్ద విష‌యం కాదు గానీ.. న్యాయస్థానం వేసిన ఆర్డ‌రే ఆస‌క్తిక‌ర అంశంగా మారి ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కింది. విడాకుల విష‌యం తేలేంత‌వ‌ర‌కు 1.7 బిలియ‌న్ డాల‌ర్లు అంటే దాదాపు 15 వేల కోట్ల రూపాయ‌లు త‌మ వ‌ద్ద‌ డిపాజిట్ చేయాల‌ని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ఇది విన్న‌వారంతా.. 'ఆ' అంటూ నోరెళ్ల బెడుతున్నారు. బిలియ‌నీర్ల విడాకులు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కొంత‌మంది స‌మాధాన‌ప‌డుతున్నారు. బిల్ గేట్, జెఫ్ బెజోస్ డివోర్స్ ఉదంతాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు.  

    బెజోస్, స్కాట్ డివోర్స్‌
    జెఫ్ బెజోస్, మెకెంజీ స్కాట్ దంప‌తుల విడాకుల వ్య‌వ‌హారం చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన డివోర్స్‌గా ప్రాచుర్యం పొందింది. త‌మ పాతికేళ్ల వివాహ బంధానికి ముగింపు ప‌లుకుతున్న‌ట్టు 2019, జ‌న‌వ‌రిలో వీరు ప్ర‌క‌టించారు. బెజోస్ నుంచి విడిపోయినందుకు మెకెంజీ స్కాట్‌.. అమెజాన్ స్టాక్‌లో దాదాపు 4 శాతం వాటాను ద‌క్కించుకున్నార‌ని న్యూయార్క్ టైమ్స్ వెల్ల‌డించింది. అప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం ఈ వాటా విలువ‌ 38 బిలియ‌న్ అమెరిక‌న్‌ డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే దాదాపు 3 ల‌క్ష‌ల 20 వేల కోట్ల రూపాయ‌లు. కాగా, మెకెంజీ స్కాట్‌.. గతేడాది చివ‌రిలో 19 బిలియ‌న్ డాల‌ర్ల‌ను సేవాకార్య‌క్ర‌మాల‌కు విరాళం ఇచ్చార‌ని ఫోర్బ్స్ తెలిపింది.

    బిల్‌గేట్స్‌, మిలిందా విడాకులు
    మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్‌, మిలిందా ఫ్రెంచ్ గేట్స్ త‌మ 27 ఏళ్ల వివాహ బంధానికి 2021, ఆగ‌స్టు నెల‌లో ముగింపు పలికారు. మ‌నోవ‌ర్తి కింద మిలిందాకు బిల్‌గేట్స్ 7.9 బిలియ‌న్ డాల‌ర్లు (దాదాపు 65 వేల కోట్ల రూపాయలు) చెల్లించిన‌ట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్ల‌డించింది. జెఫ్రీ ఎప్స్టీన్ తో బిల్‌గేట్స్ (Bill Gates) ఉన్న 'పాత ప‌రిచ‌య‌మే' త‌మ విడాకుల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మిలిందా 'సీబీఎస్ మార్నింగ్'తో చెప్పారు.

    ఆ డ‌బ్బును ప్లాస్టిక్ సర్జరీల‌కు వాడొద్దు
    ఫ్రెంచ్-అమెరికన్ ఆర్ట్ డీలర్ అలెక్ వైల్డెన్‌స్టెయిన్ కూడా విడాకుల కోసం భారీ మొత్తాన్నే వెచ్చించారు. తన భార్య జోసెలిన్ నుంచి 1999లో విడాకులు తీసుకున్నారు. జోసెలిన్‌ను 2.5 బిలియ‌న్ డాల‌ర్లు భ‌ర‌ణంగా చెల్లించాల‌ని అలెక్‌ను అప్ప‌ట్లో కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఏడాదికి 13 మిలియ‌న్ డాల‌ర్ల చొప్పున 13 ఏళ్లు చెల్లించాల‌ని తీర్పు చెప్పింది. భరణంగా వ‌చ్చిన డ‌బ్బును ప్లాస్టిక్ సర్జరీ కోసం వినియోగించ‌రాద‌ని జోసెలిన్‌కు కోర్టు ష‌ర‌తు విధించింది. కాగా, ఆమె విలాస‌వంత‌మైన జీవిత‌మే విడాకుల‌కు కార‌ణ‌మ‌న్న వాద‌న‌లు ఉన్నాయి.

    మీడియా మొఘ‌ల్ కాస్ట్లీ డివోర్స్‌
    మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ (Rupert Murdoch)  నాలుగుసార్లు విడాకులు తీసుకున్నారు. 1999లో త‌న రెండో భార్య అన్నా డిపెస్ట‌ర్ నుంచి ఆయ‌న‌ విడిపోయి 32 ఏళ్ల త‌మ వైవాహిక బంధానికి ముగింపు ప‌లికారు. దీని కోసం 1.7 బిలియ‌న్ డాల‌ర్లు (సుమారు 14 వేల కోట్ల రూపాయ‌లు) చెల్లించారు. అంతేకాదు అన్నా డిపెస్ట‌ర్ న‌లుగురు పిల్ల‌ల‌కు త‌న మీడియా సామ్రాజ్యంలో వాటా ఇచ్చేందుకు కూడా అంగీక‌రించారు. అన్నా డిపెస్ట‌ర్ నుంచి విడిపోయిన‌ 17 రోజుల‌కే వెండి డెంగ్‌ను రూపర్ట్ ముర్డోక్ మూడో పెళ్లి చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

    చ‌ద‌వండి: ఇక్క‌డ మ‌నుషుల‌ను తాకితే ఫైన్ వేస్తారు! 

    పైన చెప్పుకున్న వారే కాదు ఎలాన్ మ‌స్క్‌-జ‌స్టిన్‌, దిమిత్రి రైబోలోలెవ్‌-ఎలీనా, కాన్యే వెస్ట్- కిమ్ కర్దాషియాన్, బెర్నీ ఎలెన్‌స్టోన్‌-స్లావికా, స్లీవ్ వీన్‌-ఎలైన్ త‌దిత‌ర జంటల విడాకులు కూడా అత్యంత‌ ఖ‌రీదైన వాటిలో ఉన్నాయి.

  • బరువు తగ్గడానికి కొవ్వు కరిగించే మందులు, ఇంజెక్షన్‌లపై ఆధారపడుకుండా అత్యంత సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే చాలా ఓపిక, స్ట్రాంగ్‌ మైండ్‌సైట్‌ చాలా ముఖ్యం. అలా నిలకడగా ప్రయత్నానికి బ్రేక్‌ ఇవ్వని వారే అద్భుతాలు సృష్టిస్తారు..మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ టార్న్‌ కౌర్‌. ఆమె కేవలం ఎనిమిది నెలల్లోనే 31 కిలోలు తగ్గి శెభాష్‌ అనిపించుకుంది. అందుకు ఉపకరించిన మూడు వాస్తవిక త్యాగాల గురించి ఇస్టాగ్రామ్‌లో వివరిస్తూ..పోస్టు పెట్టారామె. మరి బరువు తగ్గేందుకు ఆమె వ్యక్తిగతంగా చేసిన ఆ మూడు మార్పులేంటి? అంతలా ఎలా బరువు తగ్గారామె అంటే..

    ఆమె చేసుకున్న వ్యక్తిగత మార్పులు..

    పక్కా ప్లానింగ్‌..
    బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ప్రతిసారి నూటికినూరు శాతం పర్‌ఫెక్షన్‌ ఉండాలనుకునేది. అలా అనుకున్న ప్రతిసారి తన డైట్‌ మళ్లీ మొదటకు రావడం..జరుగుతుండేది. ముఖ్యంగా నిద్ర తర్వాత ప్లానింగ్‌ స్కిప్‌ అవ్వతూ ఇబ్బంది పడేది. అందుకే పరిపూర్ణ కంటే..సవ్యంగా అనుకున్నది ప్రతి రోజు జరిగేలా ప్లాన్‌ ఉంటే సరి అని డిసైడ్‌ అయ్యింది.

    నిర్విరామంగా, స్థిరంగా..
    అస్తామాను బరవు తగ్గాలి అంటూ పరిష్కారాల ​కోసం ప్రయత్నించడం అనేవి వృధా ప్రయాసేనని అంటోందామె. దానికంటే..రోజువారి ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమం తప్రకుండా చేసేలా చూసుకోవడం బెటర్‌. ముఖ్యంగా నిలకడ(స్థిరత్వానికి) ప్రాముఖ్యత ఇస్తేనే..మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

    సాకులు
    సమయం లేదనే మాటకు ఆస్కారం ఇవ్వకూడదంటోంది. సెలవులు, వివాహాలు, సుదీర్ఘ ప్రయాణ రోజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, పని ఒత్తిళ్లు, ఇలా ఎన్ని ఉన్నా..బరువు తగ్గాడానికి బ్రేక్‌ ఇవ్వకూడదని, సమయం లేదనే మాట ఉండకుండా ఉండేలా కేర్‌ తీసుకోవాలంటోంది. ఎందుకంటే ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న చాలామంది బరువు తగ్గుతున్నప్పుడూ మనమెందుకు తగ్గం అనేది విశ్లేషించుకుంటే..పరిష్కారం ఆటోమేటిగ్గా దొరుకుతుందంటోంది.

     

    ఇక ఇక్కడ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తన బరువ తగ్గే జర్నీలో డైట్‌లో మార్పులు చేసుకున్నా మొత్తం 20 ఆహారాల జాబితాను కూడా షేర్‌ చేశారు. అవేంటో చూద్దామా..!


    1. మిల్కీ షుగర్ చాయ్ బదులు - బ్లాక్ కాఫీ

    2. ప్యాక్ చేసిన జ్యూస్‌లు - ఎలక్ట్రోలైట్స్ కోసం దోస, కీర జ్యూస్‌లు లేదా కొబ్బరి నీళ్లు

    3. రాత్రిపూట తెల్ల బియ్యం - క్వినోవా/కాలీఫ్లవర్ బియ్యం

    4. మైక్రోవేవ్ పాప్‌కార్న్ - ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్

    5. చీజ్ క్రాకర్స్ - కాల్చిన చిక్‌పీస్

    6. క్రీమీ పాస్తా - హోల్‌వీట్ నూడుల్స్ + పాలకూర సాస్

    7. షుగర్ తృణధాన్యాలు - దాల్చిన చెక్క, ఆపిల్ & తేనెతో రాత్రిపూట ఓట్స్

    8. క్రిస్ప్స్ ప్యాకెట్లు - వెజ్జీ స్టిక్స్ + గ్రీక్ పెరుగు డిప్

    9. మిల్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ స్క్వేర్

    10. షుగర్ బిస్కెట్లు - బాదం పిండి కుకీలు

    11. బిస్కెట్లు - వేరుశెనగ వెన్న మరియు తేనెతో రైస్ క్రాకర్స్

    12. వేయించిన స్నాక్స్ - బేక్డ్ వెజ్జీ చిప్స్

    13. ఐస్ క్రీం - గ్రీక్ పెరుగు + ఫ్రోజెన్ బెర్రీస్

    14. షుగర్ సాస్‌లు - ఇంట్లో తయారుచేసిన టమోటా/పెస్టో సాస్

    15. వైట్ బ్రెడ్ - హోల్‌గ్రెయిన్ లేదా సీడ్ బ్రెడ్

    16. షుగర్ డ్రింక్స్ - మెరిసే నీరు + నిమ్మకాయ

    17. సూపర్ మార్కెట్ మఫిన్లు - ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ అరటిపండు/ఓట్ మఫిన్లు

    18. చాక్ బార్లు - నట్ + డార్క్ చాక్లెట్ బైట్స్

    19. హెవీ సలాడ్ డ్రెస్సింగ్‌లు - ఆలివ్ ఆయిల్ + బాల్సమిక్ వెనిగర్

    20. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు - ఇంట్లో తయారుచేసిన టర్కీ/వెజ్జీ బర్గర్లు


    బరువు తగ్గడానికి 8 'విచిత్రమైన' అలవాట్లు

    • టెంప్ట్‌ చేసే ఆహారాలు కంట పడకుండా ఉండేలా చేసుకోవడం లేదా దూరంగా ఉండేలా నోటిని అదుపులో ఉంచుకోవడం. 

    • భోజనం తర్వాత ఏమైనా తినాలనిపిస్తే..పుదీనా లేదా ఆరోగ్యకరమైన హెల్దీ ఆకులను తినేలా మెదడుని పాజ్‌ చేయడం

    • ముందుగానే ఇంత తినాలనేలా ప్లాన్‌ చేసుకోవడం

    • ఆహారం సరిపోయిన సంతృప్తిని అందివ్వకపోతే..ఆ కోరికను స్కిప్‌ చేసి..ఏదైనా పనిలో లీనమవ్వడం

    • అలాగే కడుపు నిండింది అని బిగ్గరగా చెబుతూ మన మైండ్‌ని కంట్రోల్‌ చేయడం

    • రెస్టారెంట్‌లలో బ్రెడ్‌ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం.

    • ఫిట్‌గా ఉండే మోడ్రన్‌ దుస్తులు ధరించాలనే విషయాన్ని గుర్తించుకుంటూ..తక్కువగా తినడం తనను ఏదో రకంగా తినాలనిపించేలా చేసే ఆకర్షణీయమైన వంటకాలన్నింటిని చెత్తబుట్టలో వేసేయడం తదితరాలతో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ టార్న్‌ కౌర్‌ విజయవంతంగా బరువు తగ్గారామె. 

    ఈమె వెయిట్‌లాస్‌ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే..ఇక్కడ మనం బరువు తగ్గాలనే విషయంపై గట్టి ఫోకస్‌ తోపాటు ఆ దిశగా మనం తినే ఆహారం, వర్కౌట్లు ఉండేలా కేర్‌ తీసుకోవడమే గాక నిలకడతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం అని చెబుతున్నారు నిపుణులు

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

    (చదవండి: 73 ఏళ్ల​ తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..)

     

     

  • వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పటిలానే ఈసారి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకు వచ్చారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు స్ఫూర్తిని రగిలించే ప్రేరణాత్మక స్టోరీలను షేర్‌ చేసే ఆనంద్‌ మహీంద్రా ఈసారి టాలెంట్‌కి సంబంధించిన ఆసక్తికర కథను పంచుకున్నారు. కార్పోరేట్‌ స్కూల్‌లో చదివినంత మాత్రాన టాలెంట్‌ వాడి  సొత్తు కాదని..సాధారణ స్కూల్‌లో చదవిన వాడు కూడా టాలెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తారని చెప్పే గొప్ప కథ..!.

    భారతదేశంలోని సవాళ్లే మనలోని ప్రతిభకు, ఆవిష్కరణలకు కేంద్రం అని చెబుతున్నారు ఆనంద్‌ మహీంద్రా. అదే మనల్ని మాత్రమే కాదు యావత్తు భారత దేశాన్ని ప్రపంచం ముందు విజేతగా నిలబెడుతోందని అంటూ ఓ మహోన్నత వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. తమిళనాడులో ఓ సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదవిన వేలు సామీ ఇవాళ మహీంద్రా ఆటోమోటివ్‌ వ్యాపార టీమ్‌కి హెడ్‌గా సారథ్యం వహిస్తున్నాడు. 

    అతడి ప్రయాణం తన కంపెనీలో చాలా చిన్నగా ప్రారంభమైందని..అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త మహీంద్రా XUV 7XOలో డావిన్సీ డంపింగ్ టెక్నాలజీని పరిచయం చేశాడని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని అన్నారు. ఆనంద్‌ ఆప్యాయంగా 'వేలు గురు'గా పిలిచే అతడు అన్నా విశ్వవిద్యాలయం నుంచి ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ సీటుని తమిళనాడు నామక్కల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యా నైపుణ్యంతో సాధించాడని చెప్పారు. 

    మహీంద్రాలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరి..ఇవాళ ఏకంగా టెక్నాలజీ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ అయ్యాడని, అలాగే గతేడాదే ఆయన మహీంద్రాలో ఆటోమోటివ్‌ బిజినెస్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యాడని తెలిపారు. స్వదేశ ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ కంపెనీ ఆర్‌ అండ్‌ డీ బృందాలు వేలు ప్రయాణాన్ని పరిచయం చేశాయి. మన స్వదేశీ ఇంజనీర్లు నేర్చుకోవాలనే ఆకలితో ఉన్నారని, అందువల్లే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటున్నారు, పైగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని పరిచయం చేస్తున్నారంటూ..మనవాళ్ల టాలెంట్‌ని, ప్రతిభని కొనియాడుతున్నారు. 

    అంతేగాదు భారతదేశాన్ని ఒక ప్రతిభ కర్మాగారంగా అభివర్ణిచారు కూడా. అంతేగాదు 1991లో, ఆర్థిక వ్యవస్థ తెరుచుకున్నప్పుడు ప్రపంచ కన్సల్టెంట్లు భారతీయ కంపెనీలకు "సహాయం చేయమని" ఎలా సలహా ఇచ్చారో గుర్తు చేసుకుంటూ..మహీంద్రా గ్రూప్  ఆ దిశగానే ముందుకు సాగుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నాం, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ ప్రపంచ స్థాయి సాంకేతికతో సేవ చేసేందుకు సదా ఆరాట పడుతోంది మా గ్రూప్‌ అని చెప్పుకొచ్చారు.

     కాగా, వేలు సామీ 1996లో మహీంద్రాలో జాయిన్‌ అయ్యారు. పవర్‌ట్రెయిన్ అభివృద్ధిలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ..అత్యాధునిక M-హాక్ ఇంజిన్‌ల వెనుక ఉన్న దార్శనికుడిగా పేరుతెచ్చుకున్నాడు. అంతేగాదు ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు కూడా.  ది ఆల్ న్యూ థార్, XUV700, స్కార్పియోన్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ ఉత్పత్తుల ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన టీమ్‌ లీడర్‌ ఆయన.

    (చదవండి: 73 ఏళ్ల​ తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..)

     

  • ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనంటారు. అలా ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తాను ఆ ఉద్యోగం సాధించిన విషయాన్ని తల్లికి చెప్పిన తీరు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల ప్రశంసలు పోందుతోంది.

    మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాకు చెందిన గోపాల్‌ సావంత్‌ ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి.  కుటుంబానికి ఆసరాగా తన తల్లి  కుడాల్‌నగర్‌ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతుంటుంది. తన తల్లి కష్టాన్ని బాల్యం నుంచి చూసిన గోపాల్‌ సావంత్‌ కఠోర దీక్షతో, కృషితో సీఆర్‌పీఎఫ్‌ జవానుగా ఎంపికయ్యాడు. అయితే ఈ సంతోషకరమైన విషయాన్ని తన తల్లికి చెప్పిన విధానమే పలువురి మన్ననలు పోందుతోంది. గోపాల్‌ తన తల్లికి ఇంటి వద్ద చెప్పకుండా.. ప్రతిరోజూ ఆమె రోడ్డు పక్కన కూరగాయలు విక్రయించే

    ప్రాంతానికి వెళ్లి చెప్పాడు. ఆ విషయం చెప్పగానే ఆ తల్లి  భావోద్వేగానికి లోనై, నీళ్లు నిండిన కళ్లతో కొడుకును గుండెలకు హత్తుకుంది. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఇప్పటి వరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. తల్లీ, కొడుకుల అనుబంధానికి ఫిదా అయిపోతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
     

     

International

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. వెనెజువెలా, కెనడా, గ్రీన్‌లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్‌ను ట్రంప్‌ తాజాగా విడుదల చేశారు. దీంతో, ట్రంప్‌ తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా ట్రంప్‌.. మ్యాప్‌ను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

    అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక పోస్టులో గ్రీన్‌లాండ్‌ సరిహద్దులో అమెరికా జెండాను పాతుతున్నట్లు చూపించే చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మైలురాయి బోర్డుపై ‘గ్రీన్‌లాండ్ అమెరికా భూభాగం-2026లో ఏర్పాటైంది’ అని రాసి ఉన్న సూచిక బోర్డు కనిపిస్తుంది.

     

     

    మరో పోస్టులో ఏకంగా అమెరికా మ్యాప్‌ను మార్చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో పాటుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్‌మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సహా ఇతర నాటో నేతలు కనిపించారు. అయితే, ఆ ఫొటోలో ఓ బోర్డుపై అమెరికా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో కెనడా, గ్రీన్‌లాండ్, వెనిజువేలా దేశాలు అమెరికా భాగాలుగా చూపించారు. దీంతో, అమెరికా మ్యాప్‌ ఇప్పుడు సంచలనంగా మారింది.

    గ్రీన్‌లాండ్‌లోకి యుద్ధ విమానం..
    మరోవైపు.. ట్రంప్ తొలి పోస్ట్ పెట్టిన కాసేపటి తర్వాత నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (ఎన్‌ఓఆర్‌ఏడీ) ఎక్స్ వేదికగా కీలకమైన ట్వీట్ చేసింది. ఒక యుద్ధ విమానాన్ని గ్రీన్‌‌లాండ్‌లోని పిటుఫిక్ వైమానిక స్థావరానికి పంపుతున్నామని ఎన్‌ఓఆర్‌ఏడీ కమాండ్‌ ప్రకటించింది. గ్రీన్‌లాండ్‌ భద్రత కోసం రూపొందించిన పలు దీర్ఘకాలిక ప్రణాళికల అమలు కోసమే ఆ విమానాన్ని పంపుతున్నామని వెల్లడించింది. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ల సమన్వయంతోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపింది.

    అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం..
    2025 సంవత్సరం మే నెల చివరి వారంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. కెనడా అనేది అమెరికాలో 51వ రాష్ట్రం అవుతుందన్నారు. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా గవర్నర్ అవుతారని కామెంట్ చేశారు. కానీ కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కెనడా ఎన్నటికీ అమెరికాలో కలవదని తేల్చి చెప్పారు. అయినా ట్రంప్ తన వాదనను కొనసాగించారు.

  • అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా?  తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. 

     హెచ్‌1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


    గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి  గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా  లక్ష  డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.

    ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్‌మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.

    మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది.

     పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్
    ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా  వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.

    జామా ఆందోళన
    ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల  సామాజిక-ఆర్థికంగా అత్యంత  బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్‌లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్‌ కేర్‌ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.

    గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు.

     

  • వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాను అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలనే ఆలోచనతో ట్రంప్‌ ముందుకు సాగుతున్నారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. తన మాట వినని కారణంగా టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్‌ కక్ష సాధింపు చర్యలకు దిగారు.

    అయితే, గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్‌ ఆహ్వానాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌పై ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ను టార్గెట్‌ చేసిన ట్రంప్‌.. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. మాక్రాన్‌ తప్పకుండా శాంతి మండలిలో చేరాల్సిందే. లేని పక్షంలో ఫ్రాన్స్‌ వైన్, షాంపైన్‌ దిగుమతులపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తాను అని హెచ్చరించారు. అనంతరం, ఫ్రాన్స్‌పై టారిఫ్‌లు విధిస్తే.. మాక్రాన్‌ శాంతి మండలిలో చేరాల్సిన అవసరం ఉండదు అని సెటైర్లు సైతం వేయడం గమనార్హం. మరోవైపు.. గ్రీన్‌లాండ్‌ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

    ఇదిలా ఉండగా.. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం కావాలని భారత్‌ సహా కొన్ని దేశాలను డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించారు. ఈ క్రమంలో గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ, పాలన పర్యవేక్షణకు మండలిని తొలుత ఉద్దేశించారు. ఇక, గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ రెండోదశలో భాగంగా దీనిని తెరపైకి తెచ్చారు. అయితే, ట్రంప్‌ ఆహ్వానాన్ని మాక్రాన్‌ తిరస్కరించారు. ట్రంప్‌ హెచ్చరికలపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. దీంతో, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. 

  • నుయుక్‌: పాములు పట్టే వాడు చివరికి పాము కాటుకే బలైనట్లు.. ట్రంప్‌నకు అధికారాన్ని తెచ్చిన మాగా (MAGA) నినాదమే గ్రీన్‌లాండ్‌ వీధుల్లో వ్యంగ్యంగా మారింది. ఒకప్పుడు అమెరికా గర్వానికి ప్రతీకగా నిలిచిన ఆ నాలుగు పదాలు, ఇప్పుడు నిరసనకారుల చేతిలో ఎరుపు టోపీలపై ఆయుధంగా మారాయి.

    ‘మాగా’ అనేది ట్రంప్‌ 2016 ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వినిపించిన స్లోగన్. 1980లో రోనాల్డ్‌ రీగన్‌ ‘Let’s Make America Great Again’ అనే నినాదాన్ని వినిపించగా, ట్రంప్‌ దాన్ని ‘Make America Great Again’గా మార్చి 2015లో అధికారికంగా ట్రేడ్‌మార్క్‌ చేసుకున్నారు. ఎరుపు టోపీపై తెల్ల అక్షరాలతో రాసిన ఈ నినాదం ఆయన మద్దతుదారులలో ఐకానిక్‌ గుర్తుగా నిలిచింది.

    2016లో ట్రంప్‌ సభల్లో మాగా నినాదం భావోద్వేగాన్ని రగిలించింది. ఒక ఆశగా, ఒక ఉద్యమంగా మారింది. మద్దతుదారులు దీన్ని అమెరికా శక్తి, జాతీయ గర్వం, సరిహద్దుల రక్షణకు ప్రతీకగా చూశారు. విమర్శకులు మాత్రం దీన్ని విభజనాత్మకంగా భావించారు. 

    అనూహ్యంగా, డెన్మార్క్‌.. గ్రీన్‌లాండ్‌లో ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కొత్త రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘Make America Great Again’ కాస్తా అక్కడి వీధుల్లో ‘Make America Go Away’గా మారింది. ఈ నినాదంతో ఎరుపు రంగు టోపీలు ధరించి ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

    డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌లో మంచులో గడ్డకట్టే స్థితిలో వేలాది మంది ప్రజలు ఈ టోపీలు ధరించి నిరసన ప్రదర్శన చేశారు. గ్రీన్‌ లాండ్‌ను సైనికంగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యాఖ్యలు, అలాగే యూరప్‌పై కొత్త టారిఫ్‌లు విధించాలన్న నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఈ నిరసనలో పాల్గొన్నవారు అమెరికా అధ్యక్షుడి విధానాలను వ్యంగ్యంగా ఎగతాళి చేస్తూ, గ్రీన్‌ లాండ్‌ స్వతంత్రతను కాపాడాలని గట్టిగా నినదించారు.

    నిరసనకారులు కేవలం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకే కాకుండా, ఆర్కిటిక్‌ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనతో కూడా వీధుల్లోకి వచ్చారు. యూరప్‌లోని అనేక దేశాలు కూడా డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌కు మద్దతు తెలుపుతూ..ట్రంప్‌ చర్యలు పాశ్చాత్య భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించాయి. 

    మొత్తం మీద, ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ స్వాధీనం ప్రయత్నాలు యూరప్‌లో తీవ్ర ప్రతిఘటనకు దారితీశాయి. ‘Make America Go Away’ క్యాప్స్‌ ఇప్పుడు గ్రీన్‌లాండ్‌,   డెన్మార్క్‌ ప్రజల నిరసనకు ప్రతీకగా మారాయి. ఇది కేవలం సెటైరికల్‌ నినాదం మాత్రమే కాదు.. అమెరికా విధానాలపై యూరప్‌ ప్రజల అసహనాన్ని స్పష్టంగా చూపించే చిహ్నంగా నిలిచింది.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ విద్యుత్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు జి.మహేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, చీఫ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డిపి.వెంకటరమణ, ఏపీఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎన్‌వి. సుధాకర్‌ రెడ్డి,  కార్యదర్శులు చంద్రశేఖర్‌, సోమశేఖర్‌ రెడ్డి, ఏపీఈపీడీసీఎల్ అధ్యక్ష, కార్యదర్శులు ఏవి.సత్యనారాయణ, లక్ష్మీరావు తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

  • పల్నాడు జిల్లా: భార్య, బిడ్డల కోసం వెళుతున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. విధి ఆడిన వింత నాటకంలో భార్య బిడ్డలను చూడకుండానే భర్త కన్నుమూశాడు. ఈ హృదయవిదార  ఘటన నడికుడి సమీపంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో మండలంలోని గామాలపాడుకి చెందిన సంకురాత్రి జగపతిబాబు(28) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గామాలపాడుకి చెందిన ముక్కంటి,  వెంకటరావమ్మ దంపతులకు జగపతిబాబు ఏకైక కుమారుడు కాగా కుమార్తె కూడా సంతానం. 

    కారంపూడి మండలం ఒప్పిచర్లకి చెందిన రవళితో జగపతిబాబుకి వివాహాం కాగా వీరికి సాత్విక్‌(3), హేమశ్రీ(1) సంతానం. – నడికుడి మార్కెట్‌యార్డు వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో జగపతిబాబు పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య రవళి ఆమె పుట్టింటికి వెళ్లింది. సంక్రాంతి పండుగ రోజు జగపతిబాబు కూడా అత్తగారింట్లోనే ఉండి ఆ తరువాత గామాలపాడుకి వచ్చాడు. పండుగ ముగియటంతో భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై జగపతిబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో నడికుడి దాటిన తరువాత జామతోట వద్ద టాటా ఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 

    దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లాయి. ఈ ఘటనలో జగపతిబాబు తలకు బలమైన గాయాలు కాగా టాటా ఏసీ వాహనం డ్రైవర్‌ బెల్లంకొండ మండలం చిన్నరాజుపాలెంకి చెందిన  కలపాల వీరయ్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జగపతిబాబు మృతిచెందగా మెరుగైన వైద్యం కోసం వీరయ్యని గుంటూరుకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ జి.పాపారావు పరిశీలన చేశారు. మృతుడు జగపతిబాబు భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

    జగపతిబాబు కుటుంబంలో వరుస మరణాలు 
    రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జగపతిబాబు కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నది. జగపతిబాబు తల్లిదండ్రులు ముక్కంటి, వెంకటరావమ్మలు మృతిచెందగా తోడబుట్టిన చెల్లెలు కూడా మృతిచెందింది. ముక్కంటి తాలుకా కుటుంబ సభ్యులంతా మృతిచెందగా జగపతిబాబు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జగపతిబాబు కూడా మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జగపతిబాబు, రవళి దంపతులకు మూడేళ్ల కుమారుడు సాతి్వక్, ఏడాది వయస్సున హేమశ్రీ సంతానం. పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ జగపతిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగపతిబాబు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో భార్య, పిల్లలు అనాధలయ్యారు.  

    ⇒ సంఘటన గురించి తెలిసిన వెంటనే భార్య, ముక్కుపచ్చలారని పిల్లలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బోరన విలపించారు. నువ్వు లేకుండా మేమేట్లా బతకాలయ్యా అంటూ రవళి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలిద్దరిని నేనేట్ల బ్రతికించాలయ్యా అంటూ రవళి గుండెలు పగిలేలా రోధిస్తుంది. చిన్నారులైన సాత్విక్, హేమశ్రీలు మా నాన్నకి ఏమైందని చూస్తున్న తీరు కూడా అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. బంధువులు, కుటుంబ సభ్యులు చిన్నారులను హత్తుకుని రోదించారు. జగపతిబాబు కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలతో గామాలపాడు విషాదఛాయలు అలుముకున్నాయి.   

  • సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకుంటన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులు ఎందుకు మూసేస్తున్నారో తెలియజేయాలంటూ ఏపీ హైకోర్టు మంగళవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. 

    ఫైబర్‌నెట్‌ కుంభకోణంతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులను న్యాయస్థానాలు కొట్టేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫారసు మేరకు కోర్టులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరాలను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ  ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 

    వీటిని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. కేసులు ఎందుకు మూసివేసారో, ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది. 

    ఏపీలో చంద్రబాబు అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని.. ఈ క్రమంలోనే తనపై దాఖలైన కేసులను కొట్టేయించుకుంటున్నారని ఇటు వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

    చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం

Cartoon