Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇవాళ జరిగిన కాంగ్రెస్‌ (పార్లమెంట్‌) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ (డెమోక్రాట్లు) సభ్యులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. విమానాశ్రయ భద్రతకు అవసరమైన నిధులను వెంటనే ఆమోదించకపోతే ICE (Immigration and Customs Enforcement) సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నియమిస్తానని హెచ్చరించారు.  

    ICE ఏజెంట్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా భద్రతా తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారుల అరెస్టు చేస్తారని అన్నారు. ముఖ్యంగా సోమాలియా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వారు మిన్నెసోటా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, స్థానిక డెమోక్రాట్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇల్హాన్ ఒమర్ అనే మహిళా సభ్యురాలిని అవినీతిపరురాలిగా ఆరోపించారు.

    ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా విమానాశ్రయ భద్రత Transportation Security Administration (TSA) పరిధిలో ఉంటుంది. అయితే ICE ఏజెంట్లను అక్కడికి పంపడం అనేది అసాధారణ చర్య. 

    ICE ఏజెంట్లు ఇమిగ్రేషన్ అమలు, సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి పనుల్లో ఉంటారు. TSA స్థానంలో ICE ఏజెంట్లు భద్రతా తనిఖీలు చేపడితే ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారవచ్చు.

    కాగా, కాంగ్రెస్‌లో విమానాశ్రయ భద్రతా నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల (ట్రంప్‌ పార్టీ) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్‌ తాజా హెచ్చరికను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.  

     

     

  • పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తయిబా (LeT) ప్రధాన కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. భారత్‌లో అనేక ఉగ్రదాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న LeT మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలఫీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆతర్వాత కత్తులతో పొడిచి హతమార్చారు. సలఫీ.. మసీదులో నమాజ్‌ పూర్తి చేసుకొని బయటికి రాగానే దుండగులు అటాక్‌ చేశారు.

    సలఫీ LeTలో కీలక నేత అని, భారత్‌లో అనేక దాడుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ హత్య LeTలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. కాగా, లష్కర్-ఎ-తయిబా పాకిస్తాన్‌లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రమూక భారత్‌లో అనేక దాడులకు పాల్పడింది. 2008 ముంబై దాడులు సహా అనేక రక్తపాతాల్లో LeT పాత్ర నిరూపితమైంది.

     

  • భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. 

    టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.  

    ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. 

    ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్‌మెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్‌ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

    తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్‌ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్‌ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు.

  • టెహ్రాన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.

    ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్‌ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్‌కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్‌ అధ‍్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.

    పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.

    ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్‌తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.

    ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్‌లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.

    హామీలు అవసరం: పేజెష్కియన్ 
    ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.

    ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్‌-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు.

     

  • ఆమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ కలిసి నడిచారు.. రష్యా అధ్యక్షుడు కలిసి ఫోటోలు దిగారు. మెలానియా ట్రంప్‌ కలిశారు..  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా సమావేశమయ్యారు.  చివరకు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను కూడా బంధించారు. ఇలా రూపకల్పన చేసిన ఆ మహిళకు మిలియన్‌ సంఖ్యలో ఫాన్స్‌ వచ్చిపడ్డారు. 

    కానీ అసలు వాస్తవం ఏంటంటే..కృత్రిమ మేధస్సుతో (AI) రూపొందించిన చిత్రాల్లో జెసికా ఫోస్టర్ అనే మహిళ ఒకటి,. ఆమె ఉనికిలో లేదు.. కానీ ఏఐ జనరేటెడ్‌ టెక్నాలజీ ఆమెను రూపొందించి ఇలా ప్రపంచానికి పరిచయం చేశారు. . ఆమెకు సోషల్‌ మీడియాలో ఒక ఫ్యాన్స్‌ పేజ్‌ కూడా క్రియేట్‌ చేయబడింది. 

    అమెరికా ఆర్మీ సైనికురాలిగా చూపించారు. ఆమెను ‘అమెరికా ఫస్ట్’అజెండాకు సేవలందిస్తున్న అసాధారణ జీవితం గడుపుతున్న మహిళగా చిత్రీకరించారు. హోర్ముజ్‌ జలసంధిలో యుద్ధనౌకపై హీల్స్‌ వేసుకుని నిలబడి ఉండటం.. ప్రసంగాలు ఇవ్వడం, ఇతర మహిళా సైనికులతో పిల్లో ఫైట్స్‌ చేయడం, ప్రపంచంలోని ప్రసిద్ధులైన వ్యక్తులను కలవడం ఇలా అన్నీ ఆమెతో చిత్రీకరించారు.

    ఆమెకు యువత ఫిదా..!
    ఆమెను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఏఐ జనరేటెడ్‌ మహిళలా లేదు. దివి నుంచి దిగివచ్చిన ఒక అందమైన కన్యలా ఉంది. అందుకే యువత ఆమెకు ఫిదా అయ్యారు. లవ్‌ ఎమోజీలతో ఆమెకు మెస్సేజ్‌లు పెట్టారు. 

    ఆమె ఎంత అందంగా" ఉందో అని వ్యాఖ్యానిస్తూ, ఆమె అమెరికా ఫస్ట్ సందేశాన్ని ప్రశంసించిన వారిలో చాలా మంది  పురుషులు తమ ప్రొఫైల్ చిత్రాలలో ఆమెనే పెట్టుకున్నారట. ఆమె కొన్ని ఫోటోలకు 30,000 కంటే ఎక్కువ లైక్‌లు రాగా, ఆమె నిజమైన వ్యక్తి కాదనే విషయం తెలియక లేదా పట్టించుకోక, వినియోగదారులు కామెంట్లను హార్ట్-ఐస్ ఎమోజీలతో నింపేశారు. లక్షల్లో ఫ్యాన్‌ ఫోలోయింగ్‌, 30 వేలకు పైగా లైక్‌లు ఆమె ఫోటోలకు వచ్చాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది.  ప్రస్తుతం ఆమె కోసం సృష్టించిన అకౌంట్లను డిలీట్‌ చేశారు. 

    ఇది నిజంగా పిచ్చే..!
    ఇలా ఏఐ సృష్టికి మనుషులు మోసపోవడం నిజంగానే వారి పిచ్చికి అద్దం పడుతుందని మాజీ ఇల్లినాయిస్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు ఆడమ్‌ కిన్జింగర్ ట్వీట్‌ చేశారు. జెసికా పోస్టర్‌ అనేది అమెరికా ఆర్మీ సైనికురాలు కాదు.. ఏఐ చేత సృష్టించబడిన మహిళ. ప్రజలు కామెంట్లు, ఏమి చెబుతున్నారో చూస్తే ఏఐతో ఇలా మోసపోతారా అనిపిస్తోంది’ అని ఆయన కామెంట్‌ చేశారు. 

  • ఇరాన్‌.. అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోంటుంది.  ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు అయ్యింది. అయినా ఇప్పటికీ ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గలేదు. తొలుత ఇరాన్‌పై యుద్ధానికి దిగినప్పుడు ఆ దేశాన్ని సులువుగానే అదుపులోకి తేవొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకొని ఉంటారు. కానీ ఆ అంచనా తప్పని ట్రంప్‌కు ఈపాటికి అర్థమై ఉంటుంది. అందుకే హార్మూజ్‌ జలసంధి భద్రత విషయంలో పలు దేశాల సాయాన్ని కూడా కోరారు. 

    అదే సమయంలో అమెరికా అత్యాధునిక ఎఫ్‌-35 విమానం.. ఇరాన్‌ దెబ్బకు కుప్పకూలిపోయింది. ఎటువంటి రాడార్‌ వ్యవస్థలకు చిక్కకుండా దాడి చేసే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం కుప్పకూలిపోవడం ట్రంప్‌కు కచ్చితంగా మింగుడు పడని అంశం.  దీన్ని కాసేపు పక్కకు పెడితే ఇప్పుడు ఇరాన్‌ మరో భయాన్ని కూడా పుట్టించిందనేది మరో వార్త.  అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతలకు తావిస్తోంది. 

    హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. అసలు ఇరాన్‌ గతంలో ప్రకటించిన దానికి ఇది రెట్టింపు సామర్థ్యం కల్గి  ఉందని అర్థం. అంతకముందు ఇరాన్‌ తమ బాలిస్టిక్ క్షిపణుల రేంజ్‌ 2,000 కిలోమీటర్లు అని బహిరంగంగానే చెప్పింది. మరి ఇప్పుడు ఈ ట్విస్ట్‌ ఏమిటో అర్థం కావడం లేదు.

    ఇరాన్‌ గోప్యత పాటిస్తుందా?
    ఇరాన్‌ ఏమైనా అత్యాధునిక టెక్నాలజీతో క్షిపణులను తయారు చేసిందా.. లేక  ఎక్కడ నుంచైనా కొనుగోలు చేసిందా అనేది చిక్కు ప్రశ్న. ఇరాన్‌ అప్రకటిత క్షిపణుల సామర్థ్యం అంత ఉంటే భవిష్యత్‌లో పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఇరాన్‌ ఆ రేంజ్‌తో దాడికి దిగితే ప్రపంచానికి తెలియని సామర్థ్యం అనేది ఆ దేశం వద్ద ఉన్నాయని అర్థం చేసుకోవాలి. 

    తన వాస్తవ దాడి పరిధిపై శత్రువులకు స్పష్టత లేకుండా చేయడం ద్వారా, ఇరాన్‌ పరోక్షంగా పైచేయి సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఈ అస్పష్టత అమెరికా,  యూకేల ప్రణాళికలను సైతం క్లిష్టతరం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్‌కే కాదు.. గల్ఫ్‌ దేశాలకు కూడా భయం పుట్టించేది అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

    డియాగో గార్సియా ఒక చిన్నస్థావరం కాదు.. 
     ఇది అమెరికా ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఒక అత్యంత విలువైన కేంద్రం. ఇది ఒక కీలకమైన లాజిస్టిక్స్.  అమెరికా యుద్ధ ప్రణాళికకు కూడా ఇది  వేదికగా పనిచేస్తుంది. ఇది అమెరికా భారీ బాంబర్లు, నిఘా విమానాలకు నిలయంగా చెబుతారు.

    మరి ఆ స్థావరాన్ని ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవడం అనేది  శత్రువు ఇంతకుముందు ఊహించిన దానికంటే ఇరాన్ క్షిపణుల పరిధి చాలా ఎక్కువ అని చూపే ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇరాన్ వార్తా సంస్థ ఒకటి అభివర్ణించింది.

    ఇదీ చదవండి:
    ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!

  • న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. ఈద్, నౌరూజ్‌ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. 

    పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్‌ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

    మరోవైపు, ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు, ప్రతిదాడులను మరింత తీవ్రం చేసుకుంటూ పోతున్నాయి. ఈ వారం ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింతగా పెరుగుతుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సైనిక అధికారులతో సమీక్ష సమయంలో చెప్పారు.

    టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఉగ్ర పాలనపై ముందుండి దాడులను కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌ కట్టుబడి ఉందని కాట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు, అలాగే అమెరికా ప్రయోజనాలకు పశ్చిమాసియాలో ఉన్న ప్రతి ముప్పును తొలగించే వరకు ఆగబోమని అన్నారు. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు తాము ఆగబోమని ఆయన పేర్కొన్నారు.

    దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

    ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ ఏ మాత్రం వెనక్కు తగ్గకపోతుండడంతో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. చమురు, గ్యాస్‌ నిక్షేలపై ఆయా దేశాలు దాడులు చేస్తుండడంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దాడులు ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. 

  • టెహ్రాన్‌: హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తున్నామని ఇరాన్ మరోసారి తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్‌తో ఆయా దేశాలు సంప్రదిస్తే సరిపోతుంది. మేము ఈ జలసంధిని మూసివేయలేదు. మా శత్రువుల నౌకలను మాత్రమే వెళ్లనివ్వడం లేదు. ఇతర దేశాల నౌకలు ఈ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. సంప్రదింపులు జరిపితే వారి నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తాం’ అని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. 

    కాగా, నాటో మిత్రదేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఈ యుద్ధంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు ఓ పోస్టు చేశారు.

    నాటో సభ్యదేశాలను పేపర్ టైగర్స్ అని పిలిచారు, అలాగే చమురు ధరలు పెరుగుతుండడం ఆయా దేశాలకు నచ్చడం లేదని విమర్శించారు. అయినప్పటికీ, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఏర్పాటు చేద్దామనుకుంటున్న కూటమిలో చేరడానికి ఆ దేశాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ట్రంప్ దాదాపు ఏడు రోజుల క్రితం పలు దేశాల మద్దతు కోరారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఏడు దేశాల పేర్లను పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.

    బాగ్దాద్‌లో డ్రోన్ దాడి 
    ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని మంసూర్ ప్రాంతంపై డ్రోన్ దాడి జరిగింది, ఆ డ్రోన్లలో ఒకటి ఇరాక్ గూఢచారి భవనాన్ని లక్ష్యంగా చేసుకుందని ఇరాక్‌ తెలిపింది. ఆ భవనంలో ఇరాక్ భద్రతా సంస్థ పని చేస్తోందని చెప్పింది. అది ఇరాక్‌లో అమెరికా సలహాదారులతో కలిసి పని చేస్తోందని వివరించింది. 
     

  • లాహోర్‌: పాకిస్తాన్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్‌ వార్‌జోన్‌లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.

    కాగా, ఇవన్నీ ప్యాసింజర్‌ విమానాలే. ఒకవేళ వార్‌జోన్‌లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్‌కు చెందిన 30 ప్యాసింజర్‌ విమానాలు ఇరాన్‌ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్‌ ఇన్ఫర్మేషన్‌ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్‌ జోన్‌లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్‌తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.   

  • మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్‌కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్‌కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్‌కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. 

    అయితే ఇరాన్‌కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్‌కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్‌కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్‌కు సహకరిస్తుందని అమెరికా గతంలో  ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

NRI

  • జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్‌లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

    ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.

    పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. 

    వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. 

  • సింగపూర్‌లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్‌కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.

    ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశార

    ఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.

    ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్‌లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.

Sports

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్‌ కింగ్స్‌ బరిలోకి దిగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రధాన బలం. గతేడాది సీజన్‌లో కెప్టెన్‌ా అయ్యర్‌ పంజాబ్‌ను ఫైనల్‌ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్‌కే పరిమితమయింది. 

    కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్‌ కప్పు కొల్లగొడతామని శ్రేయస్‌ అయ్యర్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్‌ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. 

    దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్‌గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్‌గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్‌బ్యాక్‌ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్‌కు వచ్చాం. 

    రన్నరప్‌గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్‌తోనే మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్‌ తెలిపాడు. ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

    చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.  ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. 

    శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.

    ‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్‌ఐతో తెలిపాడు.

    ఐపీఎల్‌లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్‌ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది.

  • బంగ్లాదేశ్‌లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్‌ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్‌ఎస్‌సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్‌ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది. 

    ఈ గెజిట్‌ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్‌ అష్రఫుల్‌ హక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు. 

    కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్‌ స్పోర్ట్స్‌ పాలసీ (ఎన్‌ఎస్‌సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది. 

    అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేయడం కూడా బంగ్లా క్రికెట్‌ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సమయంలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

    చదవండి: కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రానా ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 

    తాజాగా కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్‌ ఆకాశ్‌దీప్‌  నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్‌ దీప్‌ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.

    ‘ఆకాశ్‌ దీప్‌ నడుము కింది భాగం స్ట్రెస్‌కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్‌దీప్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. కోటికి కొనుగోలు చేసింది. 

    మరోవైపు శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్‌లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్‌ బౌలింగ్‌ విభాగంలో వైభవ్‌ అరోరా, ఉమ్రాన్‌ మాలిక్‌, బ్లెసింగ్‌ ముజరబానీ, కార్తిక్‌ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్‌ బౌలింగ్‌ను ప్రారంభించింది.

    చదవండి: అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్‌ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్‌ విధ్వంసరకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

    ప్రాక్టీస్‌లో భాగంగా ​​కేకేఆర్‌ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్‌ నైట్స్‌, గోల్డెన్‌ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడారు. గోల్డెన్‌ నైట్స్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్‌ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్‌ అలెన్‌ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్‌ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్‌ అలెన్‌ సిక్సర్‌గా మలిచాడు. 

    అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్‌ వేయగా ఫిన్‌ అలెన్‌ వికెట్‌ నుంచి పక్కకు జరిగి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్‌ అలెన్‌ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్‌ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్‌ నైట్స్‌ 6 వికెట్ల తేడాతో గోల్డెన్‌ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్‌ నైట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 

    టిమ్‌ సీఫెర్ట్‌ (45), సార్థక్‌ రాజన్‌ (37), రింకూ సింగ్‌ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్‌ అలెన్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్‌ అలెన్‌ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌, పంజాబ్‌, లక్నోతో ఆడనుంది.

    చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

  • బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్‌ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. 

    శివరామకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. 

    నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

    1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్‌ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు. 

    2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్‌ తరఫున శివరామకృష్ణన్‌ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్‌లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. 

    ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా గాయంతో దూరమయ్యాడు. 

    తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా క్రికెట్‌ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్‌ స్టార్క్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్‌ హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్‌ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. 

    కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్‌ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్‌ యాషెస్‌ సిరీస్‌ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. 

    కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్‌ లోకీ ఫెర్గూసన్‌ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్‌ ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. 

    ప్రస్తుతం ఫెర్గూసన్‌ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్‌ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్‌లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్‌లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు.  

  • దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్‌స్టన్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కిర్‌స్టన్‌ పీసీబీ చైర్మన్‌ మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్‌ కల్చర్‌ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. 

    కిర్‌స్టన్‌  మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్‌గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్‌పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. 

    టీమ్ బాగా ఆడకపోతే కోచ్‌ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్‌ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్‌స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్‌పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్‌స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్‌తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

    2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ స్టేజీలోనే పాకిస్థాన్‌ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్‌స్టన్‌ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. 

    అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్‌పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయాన్ని పాక్‌ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్‌ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

    చదవండి: IPL 2026: పంజాబ్‌ ‘కింగ్స్‌’ అయ్యేనా?

  • ఐపీఎల్‌ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోవడం పంజాబ్‌ కింగ్స్‌ నిలకడలేని ఫామ్‌ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన పంజాబ్‌ కింగ్స్‌ (అప్పటి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌) మళ్లీ 2014 ఐపీఎల్‌ సీజన్‌లో ఫైనల్‌ ఆడింది.  ఆ సీజన్‌లో కేకేఆర్‌ చేతిలో ఓడిన పంజాబ్‌ రన్నరప్‌కే పరిమితమైంది.  ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్‌ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్‌ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్‌కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్‌ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. 

    అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్న పంజాబ్‌ రన్నరప్‌గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్‌కు సై అంటోంది. శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ ఈసారైనా ‘కింగ్స్‌’ అవుతుందా? అనేది చూడాలి.

    అయితే పంజాబ్‌కు విదేశీ ఆల్‌రౌండర్లు ప్రధాన బలం. మార్కస్‌ స్టొయినిస్‌, మార్కో యాన్సెన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మిచెల్‌ ఒవెన్‌, కూపర్‌ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్‌రౌండర్ల సొంతం. 

    ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్‌ చేసిన ఆర్యా రెండో బెస్ట్‌ స్ట్రయిక్‌ రేట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్‌ ఎలాగూ ఉంటాడు. అర్ష్‌దీప్‌, ఫెర్గూసన్‌, యాన్సెన్‌, చాహల్‌తో పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం పంజాబ్‌కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్‌ బెంచ్‌ అదనపు బలం.

    పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్‌ కింగ్స్‌ బలహీనత. కెప్టెన్‌ అయ్యర్‌ మినహా ప్రియాన్ష్‌, శశాంక్‌ సింగ్‌, వధేరా, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ముషీర్‌ ఖాన్‌, వైశాఖ్‌లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్‌ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్‌ లేకపోవడం లోటు.

    పంజాబ్‌ కింగ్స్‌ జట్టు:
    స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్‌ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్యా, ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (కీపర్‌), నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చాహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, సూర్యాన్ష్‌ షెగ్డే, విష్ణు వినోద్‌ (కీపర్‌), యశ్‌ ఠాకూర్‌, ముషీర్‌ ఖాన్‌, హర్నూర్‌ సింగ్‌, పైలా అవినాశ్‌, ప్రవీణ్‌ దూబే, విశాల్‌ నిషాద్‌.

    విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మిచెల్‌ ఒవెన్‌, ఫెర్గూసన్‌, కూపర్‌ కానొలీ, బెన్‌ డ్వార్షూయిస్‌.

    చదవండి: జ‌ట్ల‌కు వార్నింగ్‌.. కేకేఆర్ బ్యాట‌ర్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ

  • ఐపీఎల్ 2026 సీజన్ కోసం మూడు సార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తీవ్రంగా శ్రమి‍స్తోంది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన కేకేఆర్‌.. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తమ ట్రైనింగ్ క్యాంపును కేకేఆర్ ఏర్పాటు చేసింది.

    ఈ క్రమంలో శుక్రవారం కేకేఆర్ సభ్యులు రెండు జట్లగా విడిపోయి ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడాడు.  గోల్డెన్ నైట్స్ జట్టుకు రింకూ సింగ్‌ కెప్టెన్‌ కాగా.. 'పర్పుల్ నైట్స్' జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రహానే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

    200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 55 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడితో పాటు కివీ స్టార్ ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడాడు. ఫ‌లితంగా ల‌క్ష్యాన్ని పర్పుల్ నైట్స్ జ‌ట్టు 19.2 ఛేదించింది.

    అయితే ఈ ఏడాది సీజ‌న్‌లో ర‌ఘువంశీ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌పై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. గ‌త సీజ‌న్‌లో కొన్ని సార్లు మూడో స్ధానంలో, మ‌రికొన్ని మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చేవాడు. అయితే ఇప్పుడు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్య ర‌హానే, కామెరాన్ గ్రీన్ వంటి టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు ఉండ‌డంతో ర‌ఘువంశీని మ‌రి ఎలా ఉప‌యోగిస్తారో చూడాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో కేకేఆర్ త‌మ తొలి మ్యాచ్‌లో మార్చి 29న వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
    చదవండి: IPl 2026: 'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్‌

Movies

  • కర్ణాటకలోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించే కొరగజ్జ దైవం కథ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. 'కొరగజ్జ' పేరుతో తీస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ సాపల్య నిర్మిస్తున్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని రీసెంట్‌గా విడుదల చేయాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వాయిదా వేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

    'కొరగజ్జ' చిత్రాన్ని చూసిన అంతర్జాతీయ బృందం ఇచ్చిన సలహా మేరకే వాయిదా వేశారట. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్‌లోకి మార్చితే ఇంకా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని, మరింతమందికి రీచ్ అవుతుందని చెప్పారట. దీంతో సినిమాని 2డీ నుంచి 3డీకి మార్చేందుకు టీంకి చాలా టైం కావాల్సి వస్తోంది.

    ఈ అప్‌గ్రేడ్‌పై దర్శకుడు సుధీర్ అత్తవర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దాదాపు 40 మంది నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం ఈ త్రీడీ ఫార్మాట్ కోసం పనిచేస్తోంది. క్లైమాక్స్‌ను నీటి అడుగున తిరిగి తీశారు. ఈ సన్నివేశాన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉన్న మలయాళ స్టార్ మోహన్‌లాల్‌కు చెందిన 'విస్మయ' స్టూడియోలో చిత్రీకరించారు.

    (ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)

  • రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. లెక్క ప్రకారం ఈనెల 27న చరణ్ పుట్టినరోజు కానుకగా థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యమయ్యేసరికి నెలరోజులు వాయిదా వేశారు. ఏప్రిల్ 30న తీసుకొస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది చాలారోజులైపోయింది. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' వాయిదా గురించి రూమర్స్ వస్తున్నాయి.

    (ఇదీ చదవండి: శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!)

    'పెద్ది' ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో 4 రోజుల టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ఇంకా చేయాల్సి ఉందట. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. టీమ్ మాత్రం కచ్చితంగా చెప్పిన తేదీకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే షూటింగ్ చేస్తున్నారు. కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తోపాటు షూటింగ్ ఇన్ టైంలో పూర్తి చేస్తారా సందేహం కలుగుతోంది.

    మరోవైపు 'పెద్ది' వాయిదాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. చరణ్ పుట్టినరోజున ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అధికారికంగా ప్రకటించారు. దీనిబట్టి చూస్తే దాదాపు ఏప్రిల్ 30నే పాన్ ఇండియా రిలీజ్ అని అనుకోవచ్చు. కానీ ఏమైనా ఆలస్యమైతే మాత్రం జూలైలో తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

    ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'తో హిట్ కొట్టారు. రీసెంట్‪గా పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. దీనికి ఏమంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తమ అశలన్నీ 'పెద్ది'పైనే పెట్టుకున్నారు.

    (ఇదీ చదవండి: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్‌)

  • ఫ్రెండ్ పెళ్లిలో అల్లు స్నేహా చీరలో ఇలా

    డిజైనర్ డ్రస్‌లో మెరిసిపోతున్న శ్రీలీల

    సెల్ఫీలన్నీ ఒకేసారి పోస్ట్ చేసిన రకుల్

    కాన్ఫిడెన్స్‌తో పోజులిచ్చిన జ్యోతిక

    ఎర్రని గౌనులో ధగధగమనేలా శాన్వి

    గ్లామర్ చూపించేస్తున్న అనన్య నాగళ్ల
     

  • హిట్టు పడితే యాక్టర్స్‌ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్‌ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్‌ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్‌ లెగ్‌ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్‌ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్‌ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.

    వరుస ఫ్లాప్స్‌
    ఇలాంటి ట్రోలింగ్‌ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్‌ జాతర, రాబిన్‌ హుడ్‌, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కూడా తనను ఈ ఫ్లాప్‌ ట్యాగ్‌ నుంచి గట్టెక్కించలేకపోయింది.

    వెళ్లిపోదామనుకున్నా..
    అయితే ఈ ట్రోలింగ్‌ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్‌ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్‌కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్‌. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది. 

    అదే భయం
    మరో హీరోయిన్‌ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్‌ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీలో నటించారు. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.

    చదవండి: ఐశ్వర్యరాయ్‌కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్‌

  • 'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

    ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్‌లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్‌ని పక్కనబెట్టేశాడు. రైటర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 

    తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.

    ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్‌ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 ‍అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.

    ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.

    (ఇదీ చదవండి: డూప్‌, VFX కాదు.. నిజంగా ధురంధర్‌ హీరోనే!)

  • సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్‌లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్‌లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్‌ఎక్స్‌ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.

    డూప్‌ కాదు
    కానీ ధురంధర్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్‌, వీఎఫ్‌ఎక్స్‌ జోలికి పోకుండా రియల్‌ స్టంట్‌ చేశాడు. సినిమాలో సీక్రెట్‌ ఏజెంట్‌గా మారేందుకు హమ్జా (రణ్‌వీర్‌ సింగ్‌) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. 

    కదలకుండా కూర్చున్న హీరో
    అందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్‌ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్‌ యాక్టర్‌ అని కితాబిస్తున్నారు.

    సినిమా
    సినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ధురంధర్‌ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 తెరకెక్కింది. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది.

     

     

    చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్‌ ఇదే

  • ఓ సినిమా హిట్-ఫ్లాప్ అనేది చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల మూవీస్ ఓ మోస్తరుగా ఉన్నా ఆడేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అభిమానుల కోసం స్పెషల్‌గా తీశామని దర్శకులు చెబుతున్నా ఎందుకనో పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇందుకు లేటెస్ట్ ఉదాహరణ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఉగాది కానుకగా థియేటర్లలోకి వచ్చింది. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది.

    (ఇదీ చదవండి: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్‌)

    విడుదలైన రోజు ఉగాది కావడం, 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ షోలు పడకపోవడంతో ఉన్నంతలో ఆడియెన్స్ ఈ మూవీకి వచ్చారు. దీంతో రూ.30 కోట్లకు పైనే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ రెండురోజుకి(శుక్రవారం) వసూళ్లలో విపరీతమైన డ్రాప్ కనిపించింది. కేవలం రూ.9 కోట్లే వచ్చాయని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వీకెండ్ అయ్యేసరికి మరింతగా వసూళ్లు తగ్గిపోవచ్చు.

    ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. రాశీఖన్నా పాత్ర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండాఫ్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీలీల కనిపిస్తుంది. ఈమె వరకు యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఎందుకనో ఈ మూవీ కూడా ఈమెకు కలిసివచ్చేలా కనిపించట్లేదు. 'ఉస్తాద్..' సక్సెస్‌పై ఈమె బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మూవీ కోసం రెండు మూడు చిత్రాలు కూడా వదిలేసుకుంది. చూస్తే ఇప్పుడి పవన్ కల్యాణ్ కూడా ఈమెని కాపాడలేకపోయాడనిపిస్తోంది.

    తెలుగులో గత ఐదేళ్ల నుంచి శ్రీలీల సినిమాలు చేస్తోంది. తొలి చిత్రం 'పెళ్లి సందడి' పర్లేదనిపించింది. రవితేజతో చేసిన 'ధమాకా' సూపర్ హిట్ అయింది. తర్వాత చేసిన వాటిలో 'భగవంత్ కేసరి' మాత్రమే హిట్ అనిపించింది. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర వరకు అన్ని ఫెయిల్యూర్సే. తమిళంలో ఈ సంక్రాంతికి వచ్చిన మొదటి మూవీ 'పరాశక్తి'ది కూడా ఇదే ఫలితం. ఇప్పుడు పవన్ 'ఉస్తాద్..' కూడా ఇదే లిస్టులో చేరేలా కనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

  • తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

    రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్‌టీరియస్‌'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

    'మిస్‌టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్‌ ఎస్సై రాంఖీ(అబిద్‌ భూషన్‌) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్‌ కేసుని ఏసీపీ ఆనంద్‌ సాయి(బలరాజ్‌ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్‌(రోహిత్‌ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్‌)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్‌ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా  ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? ‍లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్‌ ఎలా ముగించాడు?‌ ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)

  • పిల్లి కళ్ల హీరోయిన్‌ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్‌.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్‌లాగే కనిపించే స్నేహా ఉల్లాల్‌ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్‌ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..

    సినిమా
    'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్‌. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్‌ లవ్‌' (2005) చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్‌ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.

    సల్మాన్‌ ఎలాంటివాడంటే?
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్‌ తొలినాళ్ల గురించి ఓపెన్‌ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్‌ ఖాన్‌ నాకెంతో సపోర్ట్‌ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్‌ చూపించలేదు.

    అలా ఫేమస్‌
    నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్‌లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్‌ వరల్డ్‌ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.

    ఐశ్వర్యకు సారీ
    నేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్‌కమ్‌ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్‌కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్‌తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్‌ పేర్కొంది.

    చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి

  • ‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు  మళ్లీ ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయ్యారు. ‘శంబాల’ తరువాత దర్శక, నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తారా? అని అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఎదురుచూపుకి సమాధానంగా సందీప్ కిషన్‌తో ఓ భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ మూవీని మేకర్స్ ప్లాన్ చేశారు.

    ఈ సినిమా ప్రకటన కోసం ఓ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో ఒక సింహం, తోడేలు కనిపిస్తున్నాయి. యుద్ధభూమి బ్యాక్ గ్రౌండ్ లో సింహం, తోడేలు మధ్య ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ అలా నిటారుగా నిల్చుని ఉంది. ‘కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు’ అనే క్యాప్షన్ చూస్తే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

    ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు సక్సెస్ ఫుల్ హీరో సందీప్ కిషన్‌ను ఎంచుకున్నారు. ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఇది దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్. ఈసారి సృజనాత్మక, సాంకేతిక ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాని రూపొందించేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఒక గొప్ప సినిమా అనుభూతిని అందించడానికి, నిర్మాతలు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో అన్ని విధాలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026లో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.

  • చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్‌కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?

    (ఇదీ చదవండి: దురంధర్‌-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి)

    రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.

    అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్‌లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కలెక్షన్స్‌.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్‌)

  • ఇప్పటివరకు తేజ సజ్జాను హీరోగానే చూశాం.. కానీ త్వరలో అతడిని ఓ హోస్ట్‌గానూ చూడబోతున్నాం. బాలీవుడ్‌లో వచ్చిన ద ట్రైటర్‌ షో త్వరలోనే తెలుగులోనూ రానుంది. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోకి తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ అధికారికంగా వెల్లడించింది.

    మొహమాటం లేదు
    ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో తేజ సజ్జా పెళ్లి వార్తలపై స్పందించాడు. త్వరలోనే నా పెళ్లి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిర్మొహమాటంగా సిల్వర్‌ జ్యువెలరీ వేసుకుని మరీ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను. ఇకపోతే ఇక్కడ స్వయంవరం జరగడంలేదు, కాబట్టి నా పెళ్లి గురించి చర్చ వద్దు అని చెప్పాడు.

    టాలీవుడ్‌లో పెళ్లి సందడి
    కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్‌ సోదరుడు, హీరో శిరీష్‌ మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. కొంతంకాలంగా ప్రేమలో ఉన్న నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.

    చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి

  • విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ కాంబో కలిసి వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘వంద దేవుళ్లు’ అనే చిత్రం రాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్ అదిరిపోయింది.

    విజయ్ ఆంటోని ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రని పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్రయూనిట్‌కు విష్ణు మంచు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ను టీం అలరించనుంది.
     

  • బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి పునర్నవి భూపాలం పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, ఫోటోగ్రాఫర్‌ హేమంత్‌ వర్మతో ఏడడుగులు వేసింది. తన పెళ్లిలో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో దిగిన సెల్ఫీ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు పునర్నవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గతేడాది డిసెంబర్‌లోనే తన ప్రియుడిని పరిచయం చేసింది పునర్నవి. హేమంత్‌ వర్మకు ఎస్‌ చెప్పానంటూ ఫోటోలు షేర్‌ చేసింది. 

    సినిమా
    ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. నెల తిరిగేలోపు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పునర్నవి.. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కూడా పిట్టగోడ, మనసుకు నచ్చింది, సైకిల్‌ వంటి పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది. తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పైచదువుల కోసం లండన్‌ వెళ్లిపోయింది. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉండేది.

    చదవండి: కోర్ట్‌ జంట బ్యాండ్‌ మేళం ట్రైలర్‌

  • నటిగానే కాకుండా నిర్మాతగానూ దూసుకెళ్తున్నారు మెగా డాటర్‌ నిహారిక. సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని.. చిన్న బడ్జెట్‌తో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఆమె బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం కమిటీ కుర్రోళ్ళు సూపర్‌ హిట్‌ అయింది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరో. ఏప్రిల్‌ 3న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో నిహారిక బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై స్పందించారు.

    నాన్నకే చెప్పా.. 
    నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2023లో ఈ జంట విడిపోయింది.అయితే విడిపోవాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే నిహారిక ఈ విషయాన్ని ముందుగా నాన్న నాగబాబుతో పంచుకుందట. ‘రిలేషన్‌షిప్‌ నుంచి బయటకు రావాలని అనుకున్నప్పుడు ముందుగా మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. ఆయన విషయం మొత్తం విని సైలెంట్‌ అయ్యారు. నేను సంతోషంగా లేననే విషయం వాళ్లకు కూడా తెలుసు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదని నాన్నగారే సలహా ఇచ్చారు’ అని నిహారిక చెప్పారు.


    విడిపోవాలని పెళ్లి చేసుకోరు..
    చాలా మంది ‘ఈ మధ్య విడాకులు కామన్‌ అయిపోయాయి’ అంటున్నారు. కానీ గతంలోనూ భార్యభర్తలు మధ్య విబేధాలు, గొడవలు జరిగేవి. కానీ తిరిగి ఇంటికి వెళ్తే..మా నాన్న పోషించగలరా అన్న భయంతో అలాగే కొనసాగేవారు. అప్పట్లో ఒక మహిళ తన అవసరాల కోసం కూడా అబ్బాయిపై ఆధారపడేది కానీ ఇప్పట్లో అమ్మాయిలు వాళ్లకేం కావాలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగా చూసుకునే పేరెంట్స్‌ ఉంటున్నారు. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు.  మా మధ్య వచ్చిన విభేదాలు సవరించలేనివి అనిపించింది అందుకే విడాకులు తీసుకున్నాం. పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఒకరినొకరు బాగా కొట్టుకొని విడిపోతే అది తొందరగా మరచిపోతారు కానీ ఇలా విడిపోతే ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం’ అని నిహారిక అన్నారు. విడాకుల తర్వాత మాజీ భర్తలో టచ్‌లో ఉన్నారా అని యాంకర్‌ అడగగా.. ‘అలాంటిదేమి లేదు. ఇంతవరకు మేము మళ్లీ కలుసుకోలేదు. ఫోన్‌ కాంటాక్ట్‌ కూడా లేదు’ అని నిహారిక చెప్పుకొచ్చింది. 

  • కొందరు పెళ్లంటేనే ముఖం చాటేస్తారు. అలాంటివారిలో బాలీవుడ్‌ నటి దివ్య దత్తా ఒకరు. 48 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. దివ్య దత్తా మాట్లాడుతూ.. గతంలో నేను రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాను.. కానీ, అవేవీ నాకు సరిపోవని అర్థమైంది. మా ఆలోచనలు భిన్నంగా ఉండేవి. 

    సింగిల్‌గా ఉన్నానని..
    దాంతో ప్రేమికులుగా కంటే స్నేహితులుగానే బాగుంటామనిపించింది. అయితే ఇప్పటికీ నేను సింగిల్‌గా ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. జీవితంలో ఓ తోడు లేకుండా ఏం చేస్తున్నావు?, అసలు పెళ్లెందుకు చేసుకోలేదు? అని ప్రశ్నిస్తుంటారు. నా జీవితంలో ఏది ముఖ్యం? ఏది అవసరం అనేది నాకు బాగా తెలుసు.

    ప్రశాంతంగా ఉంటా..
    నాకు కరెక్ట్‌ అనిపించే వ్యక్తి తారసపడ్డప్పుడు కచ్చితంగా ప్రేమలో పడతాను.. కానీ అలాంటి వ్యక్తి దొరక్కపోతే ఇలా ఎప్పటికీ ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉంటాను. అంతేతప్ప ఓ తోడుండాలి కదా అని ఎవరో ఒకర్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ సమాజ ఆమోదం కన్నా మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యం.

    సినిమా
    పైగా రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ జీవితాంతం కలిసుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని తెలిపింది. దివ్య దత్తా.. వీర్‌ జార, ఢిల్లీ 6, భాగ్‌ మిల్కా భాగ్‌ , హీరోయిన్‌, బ్లాక్‌మెయిల్‌ వంటి పలు సినిమాలతో గుర్తింపు పొందింది. చివరగా ఛావా మూవీలో యాక్ట్‌ చేసింది.

    చదవండి: ధురంధర్‌ 2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తెలుగులో కూడా..

Andhra Pradesh

  • అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో  వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్‌సీపీ శ్రేణులు. 

    ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు పోలీసులు.  దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్‌ బెయిల్‌  ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్‌ బెయిల్‌పై పంపించడం ఏంటని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. 

     

    పల్నాడులో టీడీపీ గూండాలు  దాడులు
    ల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు.  ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • సాక్షి విజయవాడ: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలతో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి , ఏలూరు,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.  

    పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నిలబడరాదని ​ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. అదేవిధంగా వర్షం సమయంలో ​​ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వీలైనంత తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్త ఎండీ ప్రకటన విడుదల చేశారు.

    ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
     

  • తిరుమల:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో మరో వివాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు గైర్హాజరయ్యారు. కనీసం సీఎం చంద్రబాబు స్వాగత కార్యక్రమంలో కూడా బీఆర్‌ నాయుడు కనిపించలేదు. టీటీడీ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి.. సీఎం  చంద్రబాబుకు ఎందుకు స్వాగతం చెప్పలేదు.. సమీక్షా సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారనేది అనేక సందేహాలకు తావిచ్చింది.

    బీఆర్‌ నాయుడిని సీఎం చంద్రబాబు కావాలనే దూరం పెట్టారా? అనే అనుమానం వస్తుంది. ఇటీవల బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియోలు సోషల్‌  మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం కావచ్చొనది పలువురి అభిప్రాయంగా ఉంది. 

    వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో సీఎం చంద్రబాబు.. టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. మరి అటువంటి సమావేశానికి టీటీడీ చైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు హాజరు కాలేదనేది ఇక్కడ ప్రశ్న. టీటీడీలో అంతర్గత విభేదాలా.. లేక ప్రోటోకాల్‌ వివాదమా? అనేది అధికార వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

    BR నాయుడుకు షాక్ ఇచ్చిన చంద్రబాబు?

     

National

  • ముంబై: రిటైర్డ్‌ మర్చంట్‌ నేవీ ఆఫీసర్‌, స్వయం ప్రకటిత జ్యోతిష్కుడు అశోక్‌ ఖారత్‌ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతోంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్‌ ఖారత్‌తో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, అధికార ఎన్సీపీ నాయకురాలు రూపాలి చకాంకర్ కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి ఆమె రాజీనామా చేశారు. 

    మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఎన్సీపీ నుంచి ఇప్పటికే ఇద్దరు నాయకులు పదవులు కోల్పోయారు. ఇప్పుడు రూపాలి చకాంకర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ కూటమిలో ఎన్సీపీ నుంచి పదవి కోల్పోయిన మూడో నేత రూపాలి. ఆమె కంటే ముందు ధనంజయ్ ముండే, మాణిక్‌రావ్‌ కొకాటే మంత్రి పదవులకు రాజీనామా చేశారు.

    ఎన్సీపీలో నాయకత్వ బలహీనత 
    మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటన ఎన్సీపీ నాయకత్వ బలహీనతను కూడా బయటపెట్టింది. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత పార్టీ అధినేత సునేత్ర పవార్.. రూపాలి చకాంకర్‌ తీరును బహిరంగంగా ఖండించలేదు. త్వరగా చర్యలు తీసుకోలేదు.  

    మరోవైపు, 2025 మార్చిలో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కారడ్ బీడ్.. జిల్లా మసాజోగ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. తర్వాత ముండే రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. 

    2025 డిసెంబర్‌లో మరో ఎన్సీపీ మంత్రి మాణిక్‌రావ్‌ కొకాటే నాసిక్ కోర్టు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత రాజీనామా చేశారు. ప్రభుత్వ ఫ్లాట్ పొందేందుకు పత్రాల్లో మార్పులు చేసిన కేసులో ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. సిన్నర్ ఎమ్మెల్యేగా ఉన్న కొకాటే 1995 కేసులో ముఖ్యమంత్రి ప్రత్యేక కోటా కింద అక్రమంగా పొందిన వ్యవహారానికి సంబంధించిన కేసులో దోషిగా తేలారు. 2025 ఆగస్టులో ఆయన ఫోన్‌లో కార్డులు ఆడుతున్న ఫొటో బయటపడటంతో వ్యవసాయ శాఖ నుంచి ఆయనను తొలగించారు. తర్వాత క్రీడలు, మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మళ్లీ నియమించారు. వ్యవసాయ శాఖను తర్వాత దత్తాత్రయ భార్నేకు అప్పగించారు.

    సునేత్రకు పార్టీపై పట్టు ఉందా? 
    చకాంకర్ ఘటన నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. సునేత్ర పవార్ ఇప్పటివరకు చకాంకర్ రాజీనామా స్వీకరించానని మాత్రమే తెలిపారు. లైంగిక దాడి ఆరోపణల కేసులో తన అధికారాన్ని చూపే అవకాశం ఇది అని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఆ అవకాశాన్ని ఆమె కోల్పోయారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, చకాంకర్ ఇప్పటికీ ఎన్సీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు, అంతర్గత క్రమశిక్షణ చర్యలు ఇంకా లేవు. అజిత్ పవార్ మరణం తర్వాత సునేత్ర పవార్ పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, అంతర్గత వ్యవహారాలపై పూర్తి నియంత్రణ ఇంకా చూపలేకపోతున్నట్టు కనిపిస్తోంది.  

  • న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.

    కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్‌లెట్లు, కమ్యూనిటీ కిచెన్‌లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.

    మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.  
     

  • డెహ్రాడూన్‌: పశ్చిమాసియాలో యుద్ధం గురించి ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పశ్చిమాసియాలో యుద్ధం గురించి స్పందించారు.  ఉత్తరాఖండ్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా మాట్లాడారు.

    ‘చర్చలు, దౌత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీకు తెలుసు, ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధం జరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న దాడులు భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికీ ఆందోళనకర విషయం. భారత్ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. యుద్ధానికి పరిష్కారం యుద్ధంతో లభించదని మోదీ చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు చేయాలి. ప్రధాని మోదీ ప్రయత్నానికి దేశ ప్రజలు మద్దతు ఇవ్వాలి’ అని అన్నారు.

    కాగా, యుద్ధం ముగింపు గురించి అమెరికా చెబుతున్న మాటలను ఇరాన్‌ నమ్మడం లేదు. ఇరాన్ ఐఎస్ఎన్ఎ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ దేశ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అమెరికా సైనిక చర్యలు ముగింపు దశకు చేరవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తాము నమ్మడం లేదని చెప్పారు. 

    “ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్‌ నమ్మడం లేదు. అమెరికా సైనిక కార్యకలాపాల్లో మార్పు కనపడడం లేదు. ట్రంప్ చేసిన ప్రకటన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదు. ఇప్పుడు ట్రంప్‌కు గుణపాఠం నేర్పాలని ఇరాన్‌ నిర్ణయించింది” అని అన్నారు. కాగా, శుక్రవారం ట్రంప్ ఇరాన్‌లో సైనిక చర్యలను ముగించే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. కానీ, ఆ తర్వాత కాల్పుల విరమణ అమలు చేయాలని అనుకోవడం లేదని తెలిపారు. 
     

  • ఇరాన్‌పై దాడులకు అమెరికా భారత భూభాగాన్ని వాడుకుంటుందన్న వ్యాఖ్యలపై  భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదని అవి పూర్తిగా అవాస్తవాలని తెలిపింది. 

    ప్రస్తుతం మధ్యప్రాచ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్, అమెరికాలు పరస్పర దాడులతో తీవ్రకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు జరుపుతుంది. ఇదిలా ఉండగా టెహ్రాన్‌పై దాడులకు భారత భూభాగాన్ని యుఎస్‌ఏ వాడుకోనుందని LEMOA ఒప్పందాన్ని అనుసరించి కొంకణ్ తీరంలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేయనుందని కథనాలు ప్రచురితమయ్యాయి.

    దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. అమెరికాతో అటువంటి ఒప్పందం ఏమి జరగలేదు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని ప్రకటనలో పేర్కొంది. ఇటువంటి ప్రకటనలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని  భారత విదేశాంగ శాఖ అధికారిక ఖాతాలో పేర్కొంది

    LEMOA నేపథ్యం
    లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (LEMOA) అనేది 2016లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన ఒక ద్వైపాక్షిక లాజిస్టిక్స్ ఒప్పందం. ఇది ఇరు దేశాల సాయుధ దళాలు ఒకరి సైనిక సౌకర్యాలను మరొకరు ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతులకు, సరఫరాలకు విశ్రాంతికి తదితర సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తుంది. 

    అయితే ఈ ఒప్పందం ఒకరి భూభాగంపై మరొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించదు దానికి ప్రత్యేక  ఆమోదం అవసరం. కానీ ఈ ఒప్పందం కింద అమెరికా మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగగా భారత్ దానిని ఖండించింది.

Business

  • భారతదేశంలో డయాబెటిస్ (షుగర్) చికిత్సలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ.. ప్రముఖ ఔషధ సంస్థలు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 'సెమాగ్లూటైడ్' (Semaglutide) ఆధారిత కొత్త మందులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సెమాగ్లూటైడ్ ఔషధానికి భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన వెంటనే ఈ కంపెనీలు తక్కువ ధరలతో జనరిక్ వేరియంట్లను విడుదల చేశాయి.

    టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) చికిత్సలో కీలకంగా భావించే GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) థెరపీని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కంపెనీలు ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న డయాబెటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త లాంచ్‌లు దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన, అందుబాటు వైద్య సేవలను అందించనున్నాయి.

    మనదేశంలో డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. GLP-1 ఆధారిత చికిత్సలు ఈ పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.

    ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (DCGI) ప్రకారం.. దేశంలో సుమారు 8.9 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు, ఇది మొత్తం వయోజన జనాభాలో 10.5 శాతంగా ఉంది. ఊబకాయం దాదాపు అన్ని వయసుల వారిలో వేగంగా పెరుగుతోంది. పెద్దల్లో మహిళల్లో ఊబకాయం శాతం 12.6% నుంచి 24.0%కి, పురుషుల్లో 9.3% నుంచి 22.9%కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

    సెమాగ్లుటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మందులు బరువు తగ్గడంతో కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు కడుపు నిండినట్లు సంకేతాలు పంపి, జీర్ణక్రియను నెమ్మదింపజేసే ఒక సహజ హార్మోన్‌ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా తక్కువ తింటారు.. క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది.

    ఇవి తక్కువ తినడానికి మరియు మరింత సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆవిష్కర్త అయిన నోవో నార్డిస్క్, 20 మార్చి 2026న పేటెంట్ ప్రత్యేకతను కోల్పోకముందే, ప్రారంభ మార్కెట్ వాటాను చేజిక్కించుకునే ప్రయత్నంలో, గత సంవత్సరం భారతదేశంలో తన సెమాగ్లుటైడ్ బ్రాండ్‌లైన వెగోవి మరియు ఓజెంపిక్‌లను విడుదల చేసింది.

  • పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.

    ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.  ఆ ఆఫర్‌ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.

  • బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.

    మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.

    చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.

    దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది.

  • డిసెంబర్ 2020లో యాపిల్ కంపెనీ ఒరిజినల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్‌ విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల ధర భారతదేశంలో రూ. 67,900గా ఉంది. ఈ కొత్త హెడ్‌ఫోన్‌లు యాపిల్‌ హెచ్‌2 చిప్‌తో పనిచేస్తాయి. ‘మునపటి తరంతో పోల్చితే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావంతమైన యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఏఎన్‌సి)ను అందిస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది. విమానం, రైలు శబ్దాల వంటి బాహ్య శబ్దాలను ఈ అప్‌గ్రేడ్‌ సమర్థవంతంగా నిరోధిస్తుంది.

    ఈ హెడ్‌ఫోన్‌ల కోసం ప్రీ-ఆర్డర్లు మార్చి 25న ప్రారంభమవుతాయి, కాగా డెలివరీలు ఏప్రిల్ ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ హెడ్‌ఫోన్‌లో అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిని అప్డేట్ చేసింది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

    యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్
    భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత, ప్రీమియం వినియోగదారుల మధ్య iPhone, MacBook, iPad వంటి పరికరాలు ప్రతిష్టాత్మక గుర్తుగా మారాయి. మెరుగైన కెమెరా నాణ్యత, సేఫ్టీ ఫీచర్స్, ఎకోసిస్టమ్ సమగ్రత వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా.. EMI ఆఫర్లు, ఆన్‌లైన్ విక్రయాలు.. భారతదేశంలో స్థానిక తయారీ పెరగడం వంటి అంశాలు కూడా యాపిల్ ఉత్పత్తుల చేరువను పెంచాయి.

  • అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.

    అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణ
    మార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

    అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."

    మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలు
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల  మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • లెక్సస్ ఇండియా.. కొత్త తరం లెక్సస్ ES 500eని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ అందిస్తున్న మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం ఇదే. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

    లెక్సస్ ES 500e కారు 74.69kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 338bhp శక్తిని ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంది, ఇది 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌పై 580 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

    డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ES డ్యూయల్ L-ఆకారపు LED DRLలతో అప్‌డేటెడ్ స్టైలింగ్ లాంగ్వేజ్‌ను అనుసరిస్తుంది. అయితే హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌పై దిగువన ఉన్నాయి. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ కలిగిన ఈ కారు.. సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ను పొందుతుంది. వెనుక భాగంలో లెక్సస్ అక్షరాలతో కూడిన ఒక సొగసైన కనెక్టెడ్ LED లైట్ బార్ ఉంటుంది.

    లోపల, క్యాబిన్‌లో 12.3-అంగుళాల హుడ్‌లెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో లెవెల్ 2 ADAS, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 17-స్పీకర్ల మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ IRVM, సాఫ్ట్-క్లోజ్ డోర్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి.

  • దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్‌బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

    అసలు ఏం జరిగింది?
    ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.

    సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.

    ఎస్‌బీఐ తదుపరి చర్యలు
    ఈ నోటీసుపై ఎస్‌బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్‌బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది.

  • భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కోసం దరఖాస్తు చేసే విధానంలో.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి.. పాన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే మార్చి 31 తరువాత అదనంగా గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

    ఈ కొత్త నియమాల ప్రకారం.. PAN కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఆధార్‌తో పాటు మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ ఇచ్చే అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న సరళమైన విధానం కంటే కాస్త కఠినమైన ధృవీకరణ ప్రక్రియగా మారనుంది.

    Image

    కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి..  PAN కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు చిన్న మార్పులు లేదా వేరియేషన్లు ఉన్నా పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఏప్రిల్ నుంచి అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇది వ్యక్తుల గుర్తింపు వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడానికి తీసుకున్న చర్యలలో భాగం అని తెలుస్తోంది.

    సైబర్ నేరాలు
    ఇటీవల కాలంలో ఈ పాన్ డౌన్‌లోడ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. సెకన్ల వ్యవధిలో పాన్ డౌన్‌లోడ్ చేసుకోండంటూ.. కొందరు సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ నమ్మి ఓపెన్ చేయాలని చూస్తే యూజర్లు మోసపోతారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగానే.. కేంద్రం కొత్త డాక్యుమెంట్స్ కూడా అందించాలని ద్రువీకరించింది.

    ఇదీ చదవండి: తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?

  • ఒకప్పుడు 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌. దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఒక భారత సంతతి యువకుడు తిరగరాశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే అపర కుబేరుడిగా అవతరించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మన సూర్య మిధా.

    18 ఏళ్ల రికార్డు బ్రేక్‌
    గతంలో మార్క్ జుకర్‌బర్గ్‌ తన 23వ ఏట బిలియనీర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందే, అంటే 22 ఏళ్లకే 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18,000 కోట్లు) నెట్‌వర్త్‌తో జుకర్‌బర్గ్‌ను అధిగమించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ సూర్యనే!

    విజయానికి బాట వేసిన 'మెర్కోర్'
    సూర్య సాధించిన ఈ అసాధారణ విజయానికి మూలం ఆయన స్థాపించిన 'మెర్కోర్' అనే ఏఐ (AI) స్టార్టప్. 2023లో తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్‌లతో కలిసి ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.

    మెర్కోర్ అనేది ఒక కృత్రిమ మేధ (AI) ఆధారిత రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్. కంపెనీలకు కావాల్సిన సరైన ప్రతిభావంతులను గుర్తించేందుకు ఇది 'AI అవతార్‌'లను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారులను నేరుగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నియామక ప్రక్రియను ఈ ప్లాట్‌ఫారమ్ సులభతరం చేస్తుంది.

    2025 అక్టోబర్ లో జరిగిన 'సిరీస్-సి' ఫండింగ్‌లో ఈ సంస్థ ఏకంగా 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    ప్రస్తుతం ఈ సంస్థలో బ్రెండన్ ఫుడీ సీఈవోగా, ఆదర్శ్ హిరేమత్ సీటీవోగా వ్యవహరిస్తుండగా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    ఢిల్లీ టూ కాలిఫోర్నియా..
    సూర్య మిధా మూలాలు భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మౌంటైన్ వ్యూలో జన్మించిన సూర్య, జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల అంశంపై విద్యనభ్యసించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువతో, స్నేహితులతో కలిసి ప్రారంభించిన స్టార్టప్ నేడు ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది.

  • దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ఏమిటీ ఆందోళనకర ధోరణి?

    రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్‌సీఎల్‌టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్‌) ఆశ్రయిస్తున్నారు.

    ‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.

    కేసు నేపథ్యం ఇదే..

    రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్‌సీఎల్‌టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) సేల్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.

    దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్‌ఫుడ్‌ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.

    ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Telangana

  • వరంగల్‌:  వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి గాయపడిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. 35వ డివిజన్ లోని నాలుగు జెండాల ప్రాంతంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి.  చిన్నారి ఒంటరిగా వెళుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి గాయపడింది. ఆ సమయంలో స్థానికులు ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. 

    ఆ చిన్నారి మీద కుక్కలు పడిన సమయంలో స్థానికులు చూసి గట్టిగా కేకలు వేయడంతో ఆ కుక్కలు పారిపోయాయి. చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో  రికార్డయ్యింది.  ప్రస్తుతం గాయపడిన ఆ  చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

  • హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్‌మెంబర్‌ బిల్‌ పెడతామని  తెలంగాణ మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలేనని అన్నారు.

    ‘ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల చట్టం ఫైల్ పై సంతకం చేశారు. అప‍్పటి గవర్నర్ తమిళిసై కూడా ప్రసంగంలో అసెంబ్లీ లో చెప్పారు. 840 రోజులు అయినా అమలు చేయడం లేదు. వచ్చే శుక్రవారం రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం తెలపాలని  సభలో అడుగుతాం. 

    గతంలో అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టిన చరిత్ర ఉంది. మీరు ప్రవేశ పెట్టలేదని మేము ప్రవేశ పెడతాం. స్పీకర్, చైర్మన్ సభ్యులను అందరినీ కలుస్తాం. బీజేపీ వ్యతిరేకించినా ఏం ఇబ్బంది లేదు. ఫైల్ దొరకడం లేదని అంటున్నారు. ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా? ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్ని ప్రమాదం  కాలిపోయిందా? అనే అనుమానం ఉంది. 

    మిగిలింది ఒక బడ్జెట్ మాత్రమే.. ఇచ్చిన హామీలను ఇంకా ఎప్పుడూ అమలు చేస్తారు? ఆరు గ్యారెంటీల చట్టం అయితే అన్ని వర్గాల వారికి లాభం అవుతుంది. ప్రజల తరుఫున ఈ బిల్ పెడుతున్నాం. పబ్లిక్ డొమైన్ లో బిల్ పెడతాం. అన్ని పార్టీలకు సహకరించాలని లేఖ రాస్తాం. నందమూరి తారక రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ బిల్ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిల్ పెట్టిన చరిత్ర కూడా ఉంది’ అని తెలిపారు. ప‍్రజలకు న్యాయం జరగాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. 

    చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
     

  • హైదరాబాద్‌: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు.

    ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని, ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోందని సజ్జనార్‌ అన్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని చెప్పారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు.

    అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని సజ్జనార్‌ వివరించారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని చెప్పారు.

    ‘ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.

    తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ.. వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు చిక్కబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ఎక్స్‌లో సజ్జనార్‌ చెప్పారు. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: జియాగూడలో కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌ H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, ట్రేడ్‌ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్లు నిర్థారించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్‌ చేశారు.

    నిందితుడు అబ్దుల్ రషీద్.. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాల్లో  కల్తీ ఆహారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్‌ కోరారు.

Politics

  • కరీంనగర్ : జీవన్‌రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్థాపం చెంది ఉండవచ్చని, ఆయన మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదన్నారు. 

    ఈ మేరకు జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారని నిర్ణయంపై సాక్షీ టీవీతో శ్రీధర్‌బాబు మాట్లాడారు. జీవన్ రెడ్డికి భవిష్యత్ లో న్యాయం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారని, పార్టీ ఆదేశం మేరకే ఆయనతో చర్చలు జరిపామన్నారు. తప్పకుండా జీవన్‌రెడ్డి పునరాలోచన చేస్తారని అనుకుంటున్నానన్నారు. 

     కాగా, జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి రాజీనామా ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్‌ రెడ్డి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్‌లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో  సమావేశమైనట్టు తెలుస్తోంది. 

    కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రాజీనామా కోసం ఇప్పటికే ఫంక్షన్ హాల్ బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

    మరోవైపు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైంది. కరీంనగర్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం.. జగిత్యాలకు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, మేడిపెల్లి సత్యం భేటీ అయ్యారు. 

Family

  • ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో విదేశీ విద్యా ప్రాధాన్యతల విషయంలో భారతదేశపు విద్యార్థుల ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ , సింగపూర్, న్యూజిలాండ్‌  దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారతీయులు మొగ్గు చూపడం పెరుగుతోంది.

    అమెరికా, కెనడా, బ్రిటన్‌ (యూకే),  ఆస్ట్రేలియా లాంటి ఇంగ్లీష్‌ మాట్లాడే దేశాలకు, ముఖ్యంగా స్టెమ్‌ (ఎస్‌టిఇఎమ్‌)  కోర్సుల కోసం అమెరికాకు ఇప్పటికీ అత్యధిక డిమాండ్‌ ఉన్నప్పటికీ.. విద్యార్థులు  తమ ఎంపికలను చురుకుగా విస్త్రుతం చేసుకుంటున్నారు. విద్యకయ్యే మొత్తం ఖర్చు, విద్యాసంస్థల నాణ్యత, వీసా నిబంధనలు, ఇంటర్న్‌షిప్‌  ఉపాధి అవకాశాలు, అలాగే విద్యార్థుల భద్రత వంటి అంశాలు వారి వారి నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

    పెట్టుబడిపై రాబడికే పెద్ద పీట...
    ‘నేటి భారతీయ విద్యార్థులు విదేశీ విద్య విషయంలో మరింత ఆచరణాత్మకంగా  ’పెట్టుబడిపై రాబడి  ఆధారిత విధానంతో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ (ఎస్‌టిఇఎమ్‌) ప్రోగ్రామ్‌ల కోసం స్పెయిన్, జర్మనీ   న్యూజిలాండ్‌ వంటి దేశాలకు ఇటీవల బలమైన డిమాండ్‌ కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చు, స్పష్టమైన వీసా నిబంధనలు,  చదువు–ఉపాధికి మధ్య మెరుగైన సమన్వయం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం,‘ అని  ఆక్సిలో ఫిన్ సర్వ్‌ ఓవర్సీస్‌ లోన్‌ సీబీవో  శ్వేతాగురు  విశ్లేషించారు.  భారతీయ విద్యార్ధుల సంఖ్యకు సంబంధించి సాంప్రదాయేతర యూరోపియన్‌ దేశాలు, 2023 నుంచి 2025 మధ్య  బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇదే ధోరణి 2026లో కూడా కొనసాగుతుందని విదేశీ విద్యా మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

    భారతీయ విద్యార్థులు తమ మొదటి ఎంపికగా ఈ కొత్త దేశాల వైపు మొగ్గుచూపుతుండడానికి  కారణం..‘ సంప్రదాయంగా పేరొందిన దేశాలతో పోలిస్తే.‘కొన్ని దేశాలు పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ కోర్సులను దాదాపు సగం ఖర్చుతోనే అందిస్తున్నాయి. అంతేకాకుండా, వీసా సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు త్వరగా పెట్టుబడిపై రాబడి కూడా లభిస్తుంది‘ అని  శ్వేతా గురు వివరించారు. విదేశీ విద్య రంగంలో వస్తున్న ఈ మార్పులు.. విద్యార్థుల పరిణతి చెందిన, పరిశోధనాత్మక నిర్ణయాలను  సూచిస్తున్నాయి. భారతీయ విద్యార్థులలో నవతరం ఇప్పుడు ఈ కొత్త దేశాలను కేవలం ’ప్రత్యామ్నాయంగా’ కాకుండా తమ వ్యూహాత్మక ’మొదటి ఎంపికగా’ పరిగణిస్తోంది.

    మార్పును సూచిస్తున్న కొన్ని గణాంకాలు..
    స్పెయిన్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): 2023లో 865గా ఉన్న భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 2025 నాటికి 1,192కి పెరిగాయి. ఇది రెండేళ్ల వ్యవధిలో 17 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. అందుబాటులో ఉండే ట్యూషన్‌ ఫీజులు, ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధించే కోర్సుల సంఖ్య పెరుగుతుండటంతో... బిజినెస్, డేటా అనలిటిక్స్, ఇంజనీరింగ్,  పబ్లిక్‌ పాలసీ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో వృద్ధి కనిపిస్తోంది.

    పోర్చుగల్‌– లిథువేనియా (ఉన్నత విద్య కోసం మాత్రమే): పోర్చుగల్‌లో 2023లో 980 మంది మన విద్యార్థులు చేరగా, 2025 నాటికి ఆ సంఖ్య 1,350కి  పెరిగింది. ఇదే సమయంలో లిథువేనియాలో ప్రవేశాలు 1,120 నుంచి 1,557 కు పెరిగాయి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌  అప్లైడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల ద్వారా ఈ దేశాలు భారతీయ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

    ఇటలీ , నెదర్లాండ్స్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): ఇటలీలో 2023లో 4,145గా ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 5,196కి పెరిగింది. డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఈ దేశం ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మరోవైపు, స్టెమ్‌  ఏఐ,, ఫిన్ టెక్, సస్టైనబిలిటీ (సుస్థిరత) ఆధారిత పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా.. నెదర్లాండ్స్‌లో అడ్మిషన్లు 2,871 నుంచి 3,512 కు పెరిగాయి.

    జర్మనీ (ఉన్నత విద్య, పీజీ – స్టెమ్‌ కోర్సులకు): ఇంగ్లీష్‌ మాతృభాష గా లేని యూరోపియన్‌ దేశాలలో భారతీయ పీజీ  స్టెమ్‌ విద్యార్థులకు జర్మనీ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ లేదా పూర్తిగా ఉచిత ట్యూషన్‌ ఫీజు, బలమైన పరిశోధనా విధానం,  పరిశ్రమలతో అనుసంధానం ఇందుకు ప్రధాన కారణాలు. ఇంజనీరింగ్, ఆటోమోటివ్‌ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్‌  అప్లైడ్‌ సైన్సెస్‌ ప్రోగ్రామ్‌లను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇక్కడ వేగంగా పెరుగుతోంది.

    సింగపూర్‌ (ఉన్నత విద్య కోసం మాత్రమే): సింగపూర్‌లో భారతీయ ఉన్నత విద్యా ప్రవేశాలు 2023లో 2,850 నుంచి 2025లో 3,250కి పెరిగాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌  స్టెమ్‌ ఆధారిత ప్రోగ్రామ్‌లకు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. తక్కువ కాలవ్యవధి గల కోర్సులు, గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమలతో బలమైన అనుసంధానం,  ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో చదువు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. బిజినెస్‌ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ , ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక కోర్సుల్లో  ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది.

Cartoon