Archive Page | Sakshi
Sakshi News home page

International

  • సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో మెట్రో స్టేషన్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే మెట్రో స్టేషన్.. ఒక కొత్త ప్రాణానికి పురుడు పోసిన వేదికగా మారింది. అల్ అందలస్ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రియాద్ మెట్రో చరిత్రలో స్టేషన్ ఫరిధిలో ఒక శిశువు జన్మించడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రియాద్ మెట్రో అధికారికంగా ప్రకటించింది.

    ఏం జరిగిందంటే?
    ఓ గర్భిణీ మహిళ స్టేషన్‌లో ఉన్న సమయంలో  అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విషయం గమనించిన మెట్రో ఆపరేషన్స్ టీమ్ తక్షణం స్పందించింది. వెంటనే అంబులెన్స్‌కు సమచారమిచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చేందుకు సమయం పట్టనుండడంతో స్టేషన్‌లోని మహిళా సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. దీంతో సదరు మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    అదరిపోయే గిఫ్ట్‌
    అయితే ఈ సందర్భంగా రియాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులకు ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే రెండు ఫస్ట్ క్లాస్ 'దర్బ్' కార్డులను మెట్రో గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో వారు సంవత్సరం పాటు మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా అత్యవసర సమయంలో స్పందించి ప్రసవం చేసిన సిబ్బందిని అధికారులు ప్రశంసించారు.

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సిబ్బందిని యూఎస్‌ వెనక్కి పిలిపించింది. డబ్ల్యూహెచ్‌వోకు అగ్రరాజ్యం రూ.2 వేల కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించేవరకు యూఎస్‌ ఉపసంహరణ పూర్తికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది

    కొవిడ్‌ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ యూఎస్‌ ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఆరోపించింది. సభ్య దేశాల రాజకీయ ప్రభావం కూడా కారణమేనని తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఎస్‌ పేర్కొంది. అయితే,  డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఉపసంహరణ అమెరికాకే కాకుండా ప్రపంచ మొత్తానికి ఒక నష్టమని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.

    సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా చెప్పగానే సరిపోదని.. సంస్థకు బకాయిపడిన 260 మిలియన్‌ డాలర్లను చెల్లించేవరకు డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్‌ ఉపసంహరణ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ.. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ట్రంప్ ఈ ఉపసంహరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.

     

  • టెహ్రాన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తన వల్లే ఇరాన్‌లో నిరసనకారులకు మరణ శిక్షలు ఆగిపోయాని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలకు ఇరాన్‌ కౌంటరిచ్చింది. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదని ఓ అధికారి చెప్పుకొచ్చారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. వందల మంది నిరసనకారులకు విధించిన ఉరిశిక్ష విధించాలని ఖమేనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అమెరికా ఒత్తిడి వల్ల అక్కడి అధికారులు దాదాపు 800 మందికి మరణ శిక్షను రద్దు చేశారు. అమెరికా కల్పించుకోకపోయి ఉంటే 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారు. వారి ఉరిశిక్షలను నేనే ఆపాను. నేను తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్‌ పాలకవర్గం వెనక్కి తగ్గింది అంటూ వ్యాఖ్యలు చేశారు.

    మరోవైపు.. ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇరాన్‌ న్యాయవ్యవస్థకు చెందిన అధికారి స్పందించారు. ట్రంప్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని క్లారిటీ ఇచ్చారు. నిరసనకారులకు సామూహిక మరణ శిక్ష విధించాలనే నిర్ణయమే తమ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఎవరికీ ఉరిశిక్షలు విధించలేదని తెలిపారు. అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా అంత మొత్తంలో లేదన్నారు. దీనిపై తప్పుడు వార్తలు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని అంతర్జాతీయ మీడియా వర్గాలకు సూచించారు.

    ఇరాన్‌లో నిరసనలు.. 
    ఇదిలా ఉండగా.. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేశారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.

    రెండు వేల మందికిపైగా మృతి
    ఇరాన్‌లో నిరసనలో పాల్గొన్న వారిలో రెండువేల మందికిపైగా మృతి చెందిన విషయాన్ని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారి ఒకరు మరణాల సం​ఖ్యను వెల్లడించారు. ఇరాన్‌ పౌరులు చేపట్టిన ఈనిరసనలను  ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. 

  • ఐటీ ఉద్యోగం, అదీ ఎంఎన్‌సీ  ఉంటే ఐదెంకల్లో జీతం, చక్కని జీవితం. అవసరానికి తగ్గట్లు సెలవులు. వీటితోపాటు  ఇంకా  ఎన్నో మెరుగైనా అవకాశాలు.  ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న ఉద్యోగులకు  జీతంతోకూడిన  లాంగ్‌ సిక్‌ లీవ్‌  కూడా ఇస్తాయి. అలాంటి ఐటీ కంపెనీలో సిక్‌లీవ్‌కు సంబంధించి ఒక విచిత్రకరమైన ఉదంతం హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఈ కథా కమామిష్షు ఏంటో తెలిస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.

    సిక్‌ లీవ్‌  మూడో, ఆరో  నెలలు, మహా అయితే  సంవత్సరం. అలాంటిది 15 ఏళ్లంటే  ఊహించుకోండి. ఒక ఐటీ ఉద్యోగికి ఇది కూడా సరిపోలేదు ఊహించగలరా?   ఈ పదిహేనేళ్లూ కంపెనీ  అతనికి జీతం ఇస్తూనే ఉంది. 15 ఏళ్ల కాలంలో తనకు జీతం  పెరగలేదంటూ కోర్టు కెక్కాడు.  టెక్ దిగ్గజం ఐబీఎంకు  అసాధారణమైన రియల్‌ స్టోరీ. ఇంతకీ ఏమైందీ మరి.

    యూకేకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్, మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెప్టెంబర్ 2008లో ఐబీఎం నుండి అనారోగ్య సెలవు తీసుకున్నారు.  అతనికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

    ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్‌

    ఐదేళ్ల పాటు పనికి దూరంగా క్లిఫోర్డ్ 2013లో ఐబీ ఎంపై అధికారిక ఫిర్యాదు చేశాడు.  ఈ  కాలంలో తనకు ఒక్క ఇంక్రిమెంట్ లేదా జీతం పెంపు కూడా ఇవ్వలేదని  ఆరోపించాడు. అయితే అతను కోర్టులో కేసు వేసినా కూడా కంపెనీ అతని జీతాన్ని ఆప లేదు. ప్రతీ ఏడాది దాదాపు 55.34 లక్షల రూపాయలు పొందుతూనే వచ్చాడు. దీని ప్రకారం  గత 15 ఏళ్లలో అతను అందుకున్న జీతం విలువ మొత్తం. 8 కోట్ల రూపాయలు. దీనికి తోడు కంపెనీ  హెల్త్‌ అండ్‌ ప్రమాద బీమా పథకంలో కూడా చేర్చారు. ఈ పథకం ప్రకారం, అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు ప్రతి సంవత్సరం అతను చివరిగా తీసుకున్న జీతంలో 75 శాతం లభిస్తుంది.

    2022లో మళ్లీ కోర్టుకు
    దాదాపు పదేళ్ల తర్వాత, 2022లో, క్లిఫోర్డ్ మళ్ళీ ఐబీఎంపై దావా వేశాడు. ఈసారి తనపై వైకల్య వివక్ష చూపారని ఆరోపిస్తూ ఉపాధి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ఈ 15 ఏళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని, అయినా తన జీతం మాత్రం కొంచెం కూడా పెరగలేదని ఆరోపించాడు.   కనుక తనకు జరిగిన  నష్టాన్ని భర్తీ చేయాలని కోర్టులో వాదించాడు.

    కోర్టు  తీర్పు ఎలా ఉంది? 
    ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, క్లిఫోర్డ్ వాదనను,డిమాండ్‌ను తిరస్కరించింది. మీ కోసం కల్పించిన ప్రత్యేక ప్రయోజనంతో పాటు అదనపు ప్రయోజనాలను పొందనందుకు , వివక్ష జరిగిందని ఆరోపించరేని కొట్టిపారేసింది. కాబట్టి, క్లిఫోర్డ్ డిమాండ్‌లో న్యాయం లేదని తీర్పు చెప్పింది.

Sports

  • రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో  7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.

    అయితే ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవ‌లం కిషన్‌ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేశాడు. కిషన్‌ ఔటయ్యాక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

    తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది త‌ర్వాత త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను సూర్య అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్‌ దూబే (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 36 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్‌ చేజ్‌ కావడం విశేషం.

    కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెం‍డు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

     

     

  • రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

    న్యూజిలాండ్‌ ఈ స్కోర్‌ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్‌ రవీంద్ర (44), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (47 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. 

    కాన్వే (19), సీఫర్ట్‌ (24), ఫిలిప్స్‌ (19), డారిల్‌ మిచెల్‌ (18), మార్క్‌ చాప్‌మన్‌ (10), జకరీ ఫౌల్క్స్‌ (15 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్‌ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్‌, ఫౌల్క్స్‌ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.

    భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 2, హార్దిక్‌ పాండ్యా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.  

    రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
    ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు.

    మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు.

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

    తుది జట్లు..

    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

    భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

     

  • టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్‌-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  

    ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్‌ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్‌ రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్‌లో పెను సంచలనంగా మారుతుంది.

    కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు. 

    ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్‌ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్‌ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం​ వెనుక భారత క్రికెట్‌లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్‌ నడిచింది.

    సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్‌ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అ‍ప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. 

    ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు.  

    గత కొంతకాలంగా భారత్‌ టెస్ట్‌ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. 

    అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్‌ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్‌లో చేరతాడు.  

    కోహ్లి టెస్ట్‌ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్‌ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. 

    శారీకంగా అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. మెంటల్‌ ఫిట్‌నెస్‌ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్‌ చేస్తే, అతని ఫోకస్‌ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్‌ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్‌ టర్మ్‌ ప్లానింగ్‌ను డిస్టర్బ్‌ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్‌ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

  • రాయ్‌పూర్‌లోని షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. 

    తొలి టీ20లో గాయపడిన అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్‌ రాణాను ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో తెచ్చారు. 

    మరోవైపు న్యూజిలాండ్‌ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్‌ స్థానంలో టిమ్‌ సీఫర్ట్‌.. క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానంలో జకరీ ఫౌల్క్స్‌, జేమీసన్‌ స్థానంలో మ్యాట్‌ హెన్రీ తుది జట్టులో​కి వచ్చారు. 

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

    తుది జట్లు..

    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

    భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
     

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుపై మరోసారి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అండర్‌-19 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ ఫిక్స్‌ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. 

    ఈ మ్యాచ్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో, 181 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో జింబాబ్వే సూపర్ సిక్స్‌కు అర్హత సాధించగా.. స్కాట్లాండ్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 35.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్‌ 26.2 ఓవర్లలో ఛేదించింది. వాస్తవానికి పాక్‌ ఈ లక్ష్యాన్ని 20 ఓవర్లలోపే ఛేదించి ఉండవచ్చు. ఇలా జరిగితే జింబాబ్వే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించి, స్కాట్లాండ్‌ తదుపరి దశకు అర్హత సాధించేది.

    అయితే, ఇలా జరగడం పాక​్‌కు వ్యూహాత్మకంగా కరెక్ట్‌ కాదు. అందుకే ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఆడి జింబాబ్వేకి లబ్ది చేకూర్చి, వారు కూడా లబ్ది పొందారు. 16వ ఓవర్లోనే 96 పరుగులు చేసిన పాక్‌.. 16 నుంచి 25 ఓవర్ల మధ్యలో ఏకంగా 50 డాట్ బాల్స్ ఆడి, విజయాన్ని ఆలస్యం చేసింది.

    పాక్‌కు కలిగే లబ్ది ఏ​ంటి.. టోర్నీ నియమాల ప్రకారం సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధించిన జట్టు, అదే గ్రూప్‌ నుంచి సూపర్‌ సిక్స్‌కు క్వాలిఫై అయిన మిగతా జట్లపై సాధించిన పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ను మాత్రమే సూపర్ సిక్స్‌కి తీసుకెళ్లుంది.

    ఈ లెక్కన జింబాబ్వేతో పోలిస్తే స్కాట్లాండ్‌ సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తే పాక్‌కు రన్‌రేట్‌ కాస్త తక్కువవుతుంది. అందుకనే చాకచక్యంగా స్కాట్లాండ్‌ను సైడ్‌ చేసి, జింబాబ్వేకు, తమకు లబ్ది చేక్చూకుంది.

    పాక్‌ చేసిన ఈ పని అవినీతి కిందికి రాకపోయిన ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని ప్రభావితం చేసిన ప్రక్రియ కిందికి వస్తుంది. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.11 ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఫలితాన్ని మార్చి, నెట్‌ రన్‌రేట్‌ను ప్రభావితం చేస్తే కెప్టెన్‌పై చర్యలు తీసుకోవచ్చు. 

    పై ఉదంతంలో పాక్‌ చేసింది అవినీతి కిందికి రాకపోయినా, ఆట ఆత్మను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. అందువల్ల పాకిస్తాన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.  

    కాగా, గ్రూప్‌-సి నుంచి పాక్‌, జింబాబ్వేతో పాటు ఇంగ్లండ్‌ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. తదుపరి దశలో పాక్‌ భారత్‌తో తలపడనుంది. భారత్ జనవరి 24న జింబాబ్వేపై గెలిస్తే, ఫిబ్రవరి 1న బులావయోలో పాకిస్తాన్–భారత్ పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ సెమీఫైనల్స్ అర్హతను నిర్ణయించే కీలక పోరాటంగా భావిస్తున్నారు.  

     

  • టీ20 వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (జనవరి 23) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ అఘా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌తో స్టార్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది రీఎంట్రీ ఇచ్చారు.

    వీరిద్దరు ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి, బిగ్‌బాష్‌ లీగ్‌లో పాల్గొన్నారు. మరో స్టార్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో అబ్రార్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ తారిక్‌కు చోటు దక్కింది.

    లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరుగబోయే ఈ సిరీస్‌ కోసం పాక్‌ జట్టు శనివారం (జనవరి 24) లాహోర్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌లు జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగనున్నాయి. పాక్‌ గడ్డపై ఆస్ట్రేలియా ఆడబోతున్న రెండో టీ20 సిరీస్‌ ఇది. చివరిగా ఆసీస్‌ 2022లో పాక్‌లో పర్యటించి, ఏకైక టీ20 ఆడింది.

    ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా పరిగణించబడుతోంది. ఈ సిరీస్‌ ముగిసిన వారం రోజుల్లోపే ప్రపంచకప్‌ మొదలవుతుంది. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో పాక్‌ గ్రూప్‌-ఏలో ఉంది. 

    ఈ గ్రూప్‌లో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, భారత్‌ మిగతా జట్లుగా ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్, ఒమాన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.

    ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టు
    సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, మొహమ్మద్ వసీమ్ జూనియర్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్
     

  • టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్‌ శర్మది. హిట్‌మ్యాన్‌ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిళ్లను భారత్‌ కైవసం చేసుకుంది.

    అయితే, కోరుకున్నట్లుగానే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకొన్న రోహిత్‌ శర్మ.. అనూహ్య రీతిలో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వన్డే కెప్టెన్సీ నుంచి మేనేజ్‌మెంట్‌ అతడిని తొలగించింది.

    అగార్కర్‌ అలా
    రోహిత్‌ శర్మ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు వన్డే పగ్గాలూ అప్పగించగా.. వరుసగా రెండు సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027లో రోహిత్‌ ఆడే విషయంపై స్పష్టత లేనందనే అతడిని కెప్టెన్‌గా తప్పించామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చెప్పాడు.

    ఆస్ట్రేలియా గడ్డ మీద హిట్‌
    ఈ క్రమంలో.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్‌ శర్మ అదరగొట్టాడు. సెంచరీ చేసి మరీ తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. అనంతరం బీసీసీఐ ఆదేశాల మేరకు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ బరిలో దిగి అక్కడా శతక్కొట్టాడు.

    అయితే, తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మాత్రం రోహిత్‌ శర్మ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. మూడు వన్డేలలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 26, 24, 11. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఆట తీరుపై విమర్శలు రాగా.. అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే కూడా ఇందుకు మద్దతు ఇచ్చినట్లుగానే వ్యాఖ్యలు చేశాడు.

    డష్కాటే కామెంట్స్‌
    ‘‘తొలి వన్డేలో రోహిత్‌ స్థాయికి తగినట్లు ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్‌లూ అతడికి సవాలుగా మారాయి. ఈ సిరీస్‌కు ముందు పెద్దగా క్రికెట్‌ ఆడకపోవడం వల్లే ఇలా జరిగింది’’ అని డష్కాటే పేర్కొన్నాడు. నిజానికి ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన రోహిత్‌.. దేశీ క్రికెట్‌లోనూ ఆడాడు. అయినప్పటికీ డష్కాటే ఇలా వ్యాఖ్యానించాడు.

    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి డష్కాటే తీరును ఎండగట్టాడు. కోచ్‌ చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుందని.. అతడిని ఒత్తిడిలోకి నెట్టివేయాలనే ప్రయత్నం తగదని చురకలు అంటించాడు.

    కోచ్‌కు ఇచ్చిపడేసిన మనోజ్‌ తివారి
    టీమిండియా సహాయక సిబ్బందిలో భాగమై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని మనోజ్‌ తివారి డష్కాటేను విమర్శించాడు. రోహిత్‌తో నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేయిస్తూనే.. మీడియా ముందుకు వచ్చి అందుకు విరుద్ధంగా మాట్లాడటం ఏమిటని మండిపడ్డాడు. రోహిత్‌ ఫామ్‌ గురించి అడిగినపుడు నోరు మూసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    మరోవైపు.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఓపెనింగ్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను వన్డే జట్టులోకి తీసుకుని.. వరల్డ్‌కప్‌-2027లోనూ ఆడిస్తే బాగుంటుందని ఇర్ఫాన్‌ పఠాన్‌ వ్యాఖ్యానించాడు. అతడి కంటే యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ముందు వరుసలో ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ప్రస్తుతం గిల్‌- రోహిత్‌ ఓపెనర్లుగా ఉన్నారు.

    వరల్డ్‌కప్‌ ఆడకుండా కుట్ర!?
    ఓవైపు అగార్కర్‌, డష్కాటే కామెంట్స్‌.. మరోవైపు ఇర్ఫాన్‌ పఠాన్‌ అంచనాలు.. వీటన్నింటిని చూసి రోహిత్‌ శర్మ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. హిట్‌మ్యాన్‌ను వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

    విరాట్‌ కోహ్లి విషయంలోనూ అగార్కర్‌ ఇలాగే మాట్లాడాడని.. అయితే, అతడు వరుస సెంచరీలు చేయడంతో ఇప్పట్లో అతడికి జోలికి వెళ్లరని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా డష్కాటేకు మనోజ్‌ తివారి చివాట్లు పెట్టిన తీరు బాగుందని.. దిగ్గజ ఆటగాడి పట్ల ఒక కోచ్‌ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నారు.

    చదవండి: IND vs NZ: అతడు అవుట్‌!.. భారత తుదిజట్టులో మార్పు!

  • భారత క్రికెట్‌లో అత్యంత అన్‌ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్‌కు చెందిన జలజ్‌ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.

    20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్‌ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్‌ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్‌లు కొట్టి, కెరీర్‌లు మలచుకున్నారు. కానీ జలజ్‌ మాత్రం దేశవాలీ క్రికెట్‌లో పరిమితమయ్యాడు.

    టెస్ట్‌ ఫార్మాట్‌లో జలజ్‌ సూపర్‌గా సెట్‌ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌.. మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్‌కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.

    2005లో మధ్యప్రదేశ్‌ తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన జలజ్‌.. ఇప్పటివరకు 150 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. 

    జలజ్‌కు లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లోనూ మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్‌లో 109 మ్యాచ్‌ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్‌ టీ20 ఫార్మాట్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో 73 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.

    మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉన్నా జలజ్‌ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌-ఏ జట్లపై అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలు చేశాడు.

    జలజ్‌ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్‌కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్‌.. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్‌ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.

    జలజ్‌ కెరీర్‌లో అత్యుత్తమ రికార్డులు..

    • రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడు

    • ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడు

    గోవా-మహారాష్ట్ర మ్యాచ్‌ విషయానికొస్తే.. జలజ్‌ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్‌ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్‌తో పాటు రామకృష్ణ ఘోష్‌ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్‌ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్‌ స్నేహల్‌ కౌతాంకర్‌ (73) ఒక్కడే రాణించాడు.

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్‌ గైక్వాడ్‌ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్‌ నవలే (46), జలజ్‌ సక్సేనా (4) క్రీజ్‌లో ఉన్నారు. లలిత్‌ యాదవ్‌ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు. 
     

  • ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. హైదరాబాద్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్‌ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.

    కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfaraz Khan) దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.

    ఈసారి ద్విశతకంతో 
    తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో భాగంగా గురువారం హైదరాబాద్‌- ముంబై మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన సిరాజ్‌ సేన.. ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

    227 పరుగులు
    ఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్‌.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సర్ఫరాజ్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

    ఇక సర్ఫరాజ్‌కు తోడు కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌  (104) శతక్కొట్టాడు. సువేద్‌ పార్కర్‌ 75, అథర్వ అంకోలేకర్‌ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్‌ రాయుడు రెండు, నితిన్‌ సాయి యాదవ్‌, కొడిమెల హిమతేజ, కెప్టెన్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    టీమిండియాలో పునరాగమనం చేసేనా?
    దేశీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన సర్ఫరాజ్‌ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.

    ఈ క్రమంలో దేశీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్‌ సెలక్టర్లకు సవాల్‌ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్‌-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్‌ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు.  

    చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ’

  • అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్‌, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్‌ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం​ విజయాన్ని సొంతం చేసింది.

    విండ్హోక్‌లోని నమీబియా క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. పేసర్‌ విల్‌ బైరోమ్‌ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్‌ లచ్‌మండ్‌ (5-1-19-2), కేసీ బార్టన్‌ (4-0-13-2), హేడెన్‌ ష్కిల్లర్‌ (3-0-11-1) కూడా రాణించారు. 

    ఆసీస్‌ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్‌ దిమంత మహావితన డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ విరాన్‌ చముదిత, దుల్నిత్‌ సిగెరా, ఆడమ్‌ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్‌ విమత్‌ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్‌ రింసర, కుగథాస్‌ మథులాన్‌ తలో 6 పరుగులు చేశారు. 

    కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్‌, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. 
     

  • దుబాయ్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్‌ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్‌ 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

    మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్‌ కింగ్‌ 47, జాన్సన్‌ ఛార్లెస్‌ 17, కీసీ కార్తీ 10, జస్టిన్‌ గ్రీవ్స్‌ 12, షిమ్రోన్‌ హెట్‌మైర్‌ 13, క్వెన్టిన్‌ శాంప్సన్‌ 3, మాథ్యూ ఫోర్డ్‌ 27, షమార్‌ స్ప్రింగర్‌ 16 (నాటౌట్‌), మోటీ 2 (నాటౌట్‌) పరుగులు చేశారు.

    ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో రహ్మాన్‌ షరీఫి, రషీద్‌ ఖాన్‌, అహ్మద్జాయ్‌ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్‌ పడగొట్టాడు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్‌ (71), ఇబ్రహీం జద్రాన్‌ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. 

    షమార్‌ స్ప్రింగర్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాశించాడు. షమార్‌ హ్యాట్రిక్‌ సహా 4 వికెట్లు, ఫోర్డ్‌, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్‌ తీశారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌, జద్రాన్‌ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు.

     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఐదు జట్లను చేర్చింది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC). ఇక ఈ దఫా ఇటలీ తొలిసారిగా క్రికెట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీకి అర్హత సాధించడం విశేషం.

    ఏ గ్రూప్‌లో ఏ జట్లు?
    గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌లతో కలిసి ఉంది ఇటలీ. ఇక గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌, పాకిస్తాన్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్‌, ఒమన్‌, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.

    అదే విధంగా గ్రూప్‌-ఢిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వనకు ఈ ఐసీసీ ఈవెంట్‌ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్‌- శ్రీలంక ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.

    ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్‌ ప్రేమికులను ఆకర్షిస్తోంది. దాయాదుల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు కొలంబో వేదిక. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    పాక్‌కు ఓటమి తప్పదు
    ‘‘ఈ పోరు ఉత్కంఠగా సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే, సుదీర్ఘకాలంగా టీమిండియా పాకిస్తాన్‌ను ఓడిస్తూనే వస్తోంది. భారత జట్టుకు పాక్‌ దరిదాపుల్లో కూడా లేదు. టీమిండియాతో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమిస్తేనే పాక్‌ సానుకూల ఫలితం రాబట్టగలదు’’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.

    ఫైనల్‌ చేరేది ఆ జట్లే!
    ఇక ఈ సందర్భంగా టీ20 వరల్డ్‌కప్‌-2026 ఫైనలిస్టులను కూడా మైకేల్‌ క్లార్క్‌ అంచనా వేశాడు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తాయని జోస్యం చెప్పాడు. కాగా టీ20 ఫార్మాట్లో 2007లో మొదలైన ప్రపంచకప్‌ టోర్నీలో ధోని సారథ్యంలోని టీమిండియా విజయం సాధించింది.

    ఆ తర్వాత 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో మరోసారి పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లలో ఆధిపత్యం కనబరిచే ఆస్ట్రేలియా టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ట్రోఫీ గెలిచింది. ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలో 2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా అవతరించింది. ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్‌ రెండో ర్యాంకులో ఉంది. 

    చదవండి: ODI WC 2027: ‘గిల్‌పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ’

Movies

  • బిగ్‌బాస్ రియాలిటీ షో మరింత ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్‌ అమర్‌దీప్‌ చౌదరి. తన అగ్రెసివ్‌ మాటలతో హౌస్‌లో తన ఆటతో మెప్పించాడు. బుల్లితెరపై అలరించిన అమర్‌దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా చేస్తోన్న చిత్రం సుమతి శతకం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.

    అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్‌ దీప్‌ చౌదరి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. టీవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి సినిమాలు చేద్దామని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. తన లైఫ్‌ స్టైల్‌ను మార్చుకుని బతకాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని లగ్జరీ వసతులు ఉన్న కారును వదిలిపెట్టి.. నార్మల్ కారు వాడుతున్నానని అమర్ దీప్‌ వెల్లడించారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ ఆ రోజు వస్తుందని అన్నారు.

    తనకు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని అమర్‌దీప్ అన్నారు. ఆయనకు తాను అభిమానినని.. ఇండస్ట్రీలో తనకు ఆదర్శమని తెలిపారు. ఆయనే నాకు గురువు.. రవితేజను చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు. సింధూరం సినిమాలో రవి తేజలో కనిపించిన ఆ స్పార్క్‌ను నేను పట్టుకుని.. అదే స్పార్క్‌ను ఈ సినిమాలో చూపించానని అమర్ దీప్‌ తెలిపారు. 

     

     

  • అక్కినేని అఖిల్‌ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్‌ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్‌ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటించింది. 

    ‌అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు క్యూట్‌ క్యూట్‌గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

     

     

     

  • ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకుని అవమానపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళం సృష్టించడంతో పాటు ప్రతికూలత వ్యాప్తి చేసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటివి వ్యాప్తి  చేసే వారిపై  చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

     కాగా.. ఇటీవల ది రాజాసాబ్ మూవీ రిలీజ్ తర్వాత ఎస్‌కేఎన్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్‌కేఎన్‌ ఆ తర్వాత కనిపించలేదని విమర్శలు చేశారు. కొందరు సోషల్ మీడియాలో ఎస్‌కేఎన్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపైనే తనపై తప్పుడు ప్రచారం సోషల్ మీడియా హ్యాండిళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్- మారుతి కాంబోలో వచ్చిన ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 

  • అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన  సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.  

    లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రఘునందన్, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. 

  • టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ బాబా బ్లాక్ షీప్.. ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని  దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేశారు.

    తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా ఓ బాక్స్‌ చుట్టే తిరుగుతున్నట్లు టీజర్‌లో అర్థమవుతోంది.  గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఉపేంద్ర కామెడీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు.
     

  • జిమ్‌లో కష్టపడిపోతున్న యాంకర్ అనసూయ

    సిల్క్ చీరలో అందంగా 'ధురంధర్' సారా అర్జున్

    సింపుల్ బట్ బ్యూటీపుల్‌గా కాయదు లోహర్

    సన్నని నడుముతో మాయ చేస్తున్న దిశా పటానీ

    రోజురోజుకీ మెరుపుతీగలా మారిపోతున్న త్రిష

    నవ్వుతూ కితకితలు పెట్టేస్తున్న మృణాల్ ఠాకుర్

  • 'మ్యాడ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంగీత్ శోభన్.. హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతంలో 'కమిటీ కుర్రోళ్లు'తో హిట్ కొట్టిన ఈమె.. అప్పుడు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆకట్టుకుంది. ఇప్పుడు హారర్ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్వించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా 'రాకాస' గ్లింప్స్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: మెగా హీరో పాన్ ఇండియా సినిమాలో మృణాల్ ఐటమ్ సాంగ్?)

    వీరుడు అని పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చిన సంగీత్ శోభన్.. ఓ భయంకరమైన ప్లేసులో చిక్కుకుంటాడు.  అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయమవుతోంది. నయన్ సారిక హీరోయిన్. ఏప్రిల్ 3న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

  • సూర్యుడు అస్తమించాకే చంద్రుడు వస్తాడు.. చంద్రుడు వెళ్లిపోయాకే సూర్యుడు ఉదయిస్తాడు.. నటుడు జయరామ్‌ కెరీర్‌ కూడా అంతే! హిట్లు వచ్చిన వెంటనే ఫ్లాపులు వస్తాయి.. ఆ వరుస ఫ్లాపులు వచ్చాకే మళ్లీ హిట్లు కరుణిస్తాయి. తన కెరీర్‌ అంతా ఇలాగే కొనసాగుతోందంటున్నాడు జయరామ్‌. ఆయన కెరీర్‌ను, స్ట్రగుల్స్‌ను ఓసారి చూసేద్దాం..

    మిమిక్రీ ఆర్టిస్ట్‌ నుంచి హీరోగా..
    జయరాం సుబ్రహ్మణ్యం.. కాలేజీ అయిపోయిన వెంటనే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. తర్వాత కళాభవన్‌ సంస్థలో చేరి మిమిక్రీ నేర్చుకున్నాడు. ఆ మిమిక్రీయే అతడిని నటనవైపు అడుగులు వేసేలా చేసింది. 22 ఏళ్లకే అపరన్‌ అనే మలయాళ మూవీతో హీరోగా మారాడు. 'మెలెపరంబిల్‌ ఆన్వీడు' చిత్రంతో మలయాళ స్టార్‌గా ఎదిగాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు. అయితే జయాపజయాలు ఒకదాని వెంట ఒకటి వచ్చేసరికి తడబడ్డాడు. 

    తడబాటు
    హీరోగా మూడుసార్లు ఫిలింఫేర్‌ అవార్డు గెలిచిన జయరామ్‌ మలయాళ భాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు చిత్రాల్లోనూ నటించాడు. దాదాపు 200కి పైగా చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. కాకపోతే ఇతర భాషల్లో సహాయక పాత్రలు, విలన్‌ పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన తెలుగులో భాగమతి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్‌, ధమాకా, ఖుషి, హాయ్‌ నాన్న, గుంటూరు కారం సినిమాలు చేశాడు. గతేడాది తెలుగులో గేమ్‌ ఛేంజర్‌, మిరాయ్‌.., తమిళంలో రెట్రో, కన్నడలో కాంతార: చాప్టర్‌ 1 సినిమాల్లో కనిపించాడు.

    సక్సెస్‌ వెంటనే ఫెయిల్యూర్‌
    జయరామ్‌ తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. అదేంటో కానీ నేను రెండుమూడు విజయవంతమైన సినిమాలు చేసినవెంటనే కచ్చితంగా రెండు మూడు ఫ్లాపులు వస్తుంటాయి. దాంతో మళ్లీ లేచి నిలబడటానికి ప్రయత్నించేవాడిని. గత 38 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కెరీర్‌ ప్రారంభంలో పెద్దపెద్ద దర్శకులతో హీరోగా అనేక సినిమాలు చేశాను. కానీ అంతలోనే మళ్లీ అపజయాలు ఎదురయ్యేవి. వాటిని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉండేది. కొందరైతే నా మీద ఆశలు వదిలేసుకున్నారు. నా పనైపోయిందన్నారు.

    అదే ఎక్కువ బాధ
    అన్నింటికన్నా బాధేంటో తెలుసా? సక్సెస్‌ అయినప్పుడు అందరూ పొగుడుతారు. కానీ కెరీర్‌ ఒడిదుడుకులకు లోనైనప్పుడు చిన్నచిన్న తప్పుల్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు, ఏదో ఒక రకంగా నిందిస్తారు, దూరం పెడతారు. అది చాలా బాధేస్తుంది. కానీ ఈ అనుభవాల వల్ల చాలా నేర్చుకున్నాను అంటున్నాడు. ప్రస్తుతం జయరామ్‌ ఆశకల్‌ ఆయిరామ్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన కుమారుడు కాళిదాసు కూడా నటించాడు. జి.ప్రజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

    చదవండి: ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్‌ చేస్తాడంతే!

  • తరుణ్‌ భాస్కర్‌, ఈషారెబ్బా జంటగా వస్తోన్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాకు ఎ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించారు. జయ జయ జయహే అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.

    ఈ నేపథ్యంలోనే   ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే భార్య, భర్తల మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కామెడీ సీన్స్ అలరిస్తున్నాయి. భార్యపై భర్త డామినేషన్‌ చేయడం.. ఆ తర్వాత జరిగే సీన్స్‌ ఈ సినిమాపై ఆసక్తి మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. 
     

  • బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించింది రిమి సేన్‌. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లోని ఓ టాప్‌ హీరోకు యాక్టింగ్‌ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.

    యాక్టింగ్‌ రాదన్న కామెంట్స్‌
    ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్‌ అబ్రహం. రిమి సేన్‌ మాట్లాడుతూ.. జాన్‌ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్‌గా పని చేశాడు. యాక్టింగ్‌ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్‌కు బదులుగా స్టైలిష్‌గా, స్క్రీన్‌పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్‌ సినిమాలు. 

    తెలివైనవాడు
    ఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్‌ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు. 

    రానురానూ..
    తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్‌.. రానురానూ పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్‌మెన్‌గా రాణించాడు అని రిమి సేన్‌ చెప్పుకొచ్చింది. జాన్‌ అబ్రహం, రిమి సేన్‌.. ధూమ్‌, గరం మసాలా, హ్యాట్రిక్‌ సినిమాల్లో కలిసి నటించారు. జాన్‌ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.

    చదవండి: కీర్తి సురేశ్‌ హోంటూర్‌.. ఇల్లులాగే లేదు

  • టాలీవుడ్ నటుడు వీకే నరేశ్‌ ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శుభకృత నామ సంవత్సరం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు వీకే నరేశ్. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

    అయితే ఇటీవలే తన 54న పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు వీకే నరేశ్. ఈ బర్త్‌ డే వేడుకల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. హీరో శర్వానంద్, రవిబాబు, నారా రోహిత్, జయసుధ లాంటి పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తుంటే ఫుల్ గ్రాండ్‌గా బర్త్‌ డే వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

    స్పెషల్ ‍‍అట్రాక్షన్‌గా పవిత్రా లోకేశ్..

    అయితే ఈ బర్త్ డే వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. వేదికపైనే నరేశ్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారామె. ఈ సందర్భంగా వీరిద్దరిని గజమాలతో సత్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     

     

  • తెలుగులో చేసినవి రెండు మూడు సినిమాలే అయినా మృణాల్ ఠాకుర్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వినిపించాయి. తమిళ హీరో ధనుష్‌ని పెళ్లి చేసుకోనుందని, ఫిబ్రవరి 14న డేట్ కూడా ఫిక్స్ చేశారని అన్నారు. తీరా చూస్తే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని మృణాల్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. ఈ విషయాలని పక్కనబెడితే ఇప్పుడు మెగా హీరో మూవీలో ఐటమ్ సాంగ్ చేయనుందనే రూమర్ వినబడుతోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)

    ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ 'డకాయిట్‍'లో మృణాల్ హీరోయిన్. మార్చి 19న ఈ మూవీ తెలుగు, హిందీలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో ఓ హిందీ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఈమె స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనుందనే పుకారు తెగ వైరల్ అవుతోంది. 'జిగేలు రాణి' టైపులో దీన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. ఒకవేళ నిజమైతే మాత్రం అభిమానులకు పండగే!

    మరోవైపు 'పెద్ది' వాయిదా పడనుందనే రూమర్స్ గట్టిగా వినబడుతున్నాయి. లెక్క ప్రకారం అయితే మార్చి 27న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ వర్క్ పెండింగ్ ఉండటం, మార్చిలోనే 'ధురంధర్ 2' రిలీజ్ కానుండటం తదితర కారణాల వల్ల వాయిదా గ్యారంటీ అని అంటున్నారు. మే లేదా జూన్‌లో 'పెద్ది' థియేటర్లలోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 'పెద్ది' ఈ తేదీన రాకపోతే.. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీటిలో ఏదేది నిజమనేది తెలియల్సి ఉంది.

    (ఇదీ చదవండి: స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై చీటింగ్ కేసు)

  • సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. కానీ, హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ మాత్రం తన ప్రేమను సీక్రెట్‌గా ఉంచింది. ఒకటీరెండేళ్లు కాదు, ఏకంగా 15 ఏళ్లు! పన్నెండో తరగతిలోనే ఆంటోని తటిల్‌తో లవ్‌లో పడ్డ కీర్తి.. స్టార్‌ హీరోయిన్‌ అయ్యాక కూడా ఆ రిలేషన్‌ను కొనసాగించింది. మనసుపడ్డవాడినే మనువాడింది. 2024లో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

    ఇంటి పేరు
    తాజాగా ఈ దంపతులు తమ హోమ్‌ టూర్‌ వీడియోతో వార్తల్లోకెక్కారు. కొచ్చిలో వాళ్లుంటున్న ఇంటిని చూపించారు. ఆ భవంతికి హౌస్‌ ఆఫ్‌ ఫన్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఫ్యామిలీ ఫోటోలు, పెళ్లి ఫోటోలు, మహానటి సినిమాకుగానూ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు తనపై వచ్చిన వార్తల కథనాల క్లిప్పింగ్స్‌ను కీర్తి చూపించింది. ముఖ్యంగా తన జ్ఞాపకాలకు, అనుభవాలకు వేదికైన మెమొరీ వాల్‌ అన్నింటికంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ఇల్లులా లేదు
    తన పెంపుడు కుక్కలు నైక్‌, కెన్నీ కోసం స్పెషల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేసింది. సాంప్రదాయాన్ని, మోడ్రన్‌ను మిక్స్‌ చేసేలా ఇంటీరియర్‌ డిజైన్‌ ఉంది. బాల్కనీ మాత్రం మొక్కలతో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ భవంతి చూసిన నెటిజన్లు.. ఇది వారి ఇల్లులా కనిపించట్లేదు, కెఫెలా ఉందని, బాగుందని కామెంట్లు చేస్తున్నారు. 

    సినిమా
    హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ సూపర్‌ సక్సెస్‌.. అటు కమర్షియల్‌ సినిమాలతో పాటు ఇటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలూ చేస్తోంది. అయితే భవిష్యత్తులో దర్శకురాలిని అవ్వాలని ఉందని ఆ మధ్య మనసులోని మాట బయటపెట్టింది. గత ఐదారేళ్లుగా తనకు వచ్చిన ఐడియాలను రాసిపెట్టుకున్నట్లు తెలిపింది. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన రౌడీ జనార్దన సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ, మలయాళంలోనూ ఒక్కో సినిమా చేస్తోంది.

    చదవండి: నా ఫోటోలు చూసి అమ్మ ఒకటే ఏడుపు: హీరోయిన్‌

  • ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్‌ చిరంజీవితో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించాడు. ఈ జనవరి 12న రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెప్పించారు.

    ఇప్పటివరకు తాను 9 సినిమాలతో హిట్‌ కొట్టిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్‌తో మొదలైన అనిల్ ప్రయాణం టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2,ఎఫ్‌3 చిత్రాలతో తన మార్క్ చూపించారు. సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన పదో సినిమాకు కూడా రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి.

    అయితే తన మొదటి సినిమా పటాస్ రిలీజై సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తి కావడంతో అనిల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్ చేశారు. పటాస్‌ను గుర్తు చేసుకుంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. తాను ప్రేక్షకుల  హృదయాల్లోకి అడుగుపెట్టి నేటికి 11 ఏళ్లు పూర్తయిందన్నారు. ఇంత కీలకమైన బాధ్యతను నాపై నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో నాకు అండగా నిలిచిన నా మొదటి హీరో శ్రీ నందమూరి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు. ఆ నమ్మకమే నాకు నిర్భయంగా ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిందని ఎమోషనల్‌ పోస్ట్ చేశారు. ఈ సినిమా నా జీవితంలోకి తీసుకువచ్చిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, భావోద్వేగాలు, ఆనందం వెలకట్టలేనివని.. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈ ప్రయాణం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరగనుంది.

    కాగా.. 'అనుపమ' సీరియల్‌లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బాయ్‌ ఫ్రెండ్స్ అండ్ గర్ల్‌ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో జనవరి 25న ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.

    అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది.  ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది.

  • మతం వల్లే తనకు అవకాశాలు తగ్గాయంటూ  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల ఎంత దుమారం రేపాయో తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసిన రెహమాన్‌.. ఇలా మాట్లాడడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై ఆయన వివరణ ఇచ్చినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు. తాజాగా రెహమాన్‌ వివాదంపై ఆయన గురువు, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి (సాలూరి కోటేశ్వరరావు) స్పందించారు. రెహమాన్‌ లాంటి వ్యక్తి అలా మాట్లాడడం చాలా బాధగా ఉందని అ‍న్నారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ మెయిల్‌ కూడా చేస్తానని చెప్పారు.

    తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రెహమాన్‌ చాలా మంచి మనసున్న వ్యక్తి. బాలీవుడ్‌ చరిత్రనే మార్చిన వ్యక్తికి అవకాశాలు రాకపోవడం ఏంటి? అయినా రెహమాన్‌కి బాలీవుడ్‌ అనేది చిన్న తునుపు ముక్క. ఆయన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం..అది కూడా పరాయి దేశం మీడియాలో చెప్పడం..చాలా బాధగా ఉంది. అసలు రెహమాన్‌ ఎప్పుడు ఇలా మాట్లాడడు. సంగీతం తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడుతుంటాడు. 

    సంగీత కచెరీలో లక్షలాది మంది అభిమానుల గట్టి గట్టిగా అరుస్తున్నా..వారితో కూల్‌గా మాట్లాడి.. పాటలు అందించేవాడు. అసలు ఆ వ్యాఖ్యలు చేసింది రెహమానేనా? లేదా ఆయన వెనుక వేరే వ్యక్తులు ఉండి..అలా మాట్లాడించారా? అనే అనుమానం నాకు ఉంది. ఏదేమైనా రెహమాన్‌ చాలా పెద్ద తప్పు చేశాడు. వెంటనే క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టమని మెయిల్‌ చేస్తా. ఆయన నా మాట వింటాడో లేదో తెలియదు కానీ.. తనకు మంచి జరగాలని, ఆయన మీద పడ్డ మచ్చ త్వరలోగా చెరిగిపోవాలని ఆ అల్లాని, భగవంతున్ని కోరుకుంటున్నా’ అని కోటి అన్నారు. 
     

  • మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్.. ఇతడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధానతో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నాడు. తీరా పెళ్లికి కొన్ని గంటల ముందు ఇది కాస్త రద్దయింది. దీంతో పలాష్ గురించి రకరకాల రూమర్స్ వినిపించాయి. స్మృతితో వివాహం పెట్టుకుని మరో మహిళతో రిలేషన్ నడిపాడనే పుకార్లు వచ్చాయి. ఆ విషయాన్ని అందరూ మెలమెల్లగా మరిచిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో పలాష్‌పై చీటింగ్ కేసు నమోదు కావడంతో మరోసారి హాట్ టాపిక్ అయిపోయాడు.

    స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్.. సినిమాలని కూడా డైరెక్ట్ చేస్తుంటారు. అలానే సాంగ్లీకి చెందిన ఫిలిం ఫైనాన్సర్ విద్యన్ మానేతో పలాష్‌కి 2023లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే తాను 'నజరియా' అనే మూవీ తీస్తున్నానని, దానికి పెట్టుబడి పెడతారా అని పలాష్, మానేని కోరాడు. త్వరగా దీన్ని పూర్తి చేసి ఓటీటీలో విడుదల చేస్తే పెట్టుబడితో పాటు లాభాలు కూడా వస్తాయని మానేకు హామీ ఇచ్చాడు. అలానే మూవీలో యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని  పలాష్ నమ్మబలికాడు. దీన్ని నమ్మిన మానే.. విడతల వారీగా రూ.40 లక్షలు పలాష్‌కి ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    నెలలు గడుస్తున్నా సినిమా పూర్తి కాకపోవడంతో.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయమని మానే పలాష్‌ని అడిగాడు. తొలుత ఇస్తానని హామీ ఇచ్చిన పలాష్.. తర్వాత ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశాడు. నంబర్ కూడా బ్లాక్ చేశాడు. దీంతో మానే.. పోలీసులని ఆశ్రయించాడు. పలాష్‌పై ఫిర్యాదు చేశాడు. తన నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, ఆ మొత్తాన్ని తనకు ఇప్పించాలని కోరాడు. దీంతో పలాష్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన ఆధారాలు పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పుకొచ్చారు.

    రెండు నెలల క్రితం స్మృతితో పెళ్లి రద్దు, ఇ‍ప్పుడేమో పలాష్‌పై పోలీస్ కేసు చూస్తుంటే కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లకు తోడు రూ.40 లక్షల మోసం గురించి తెలిసే స్మృతి.. తన పెళ్లిని వద్దనుకుందా అని మాట్లాడుకుంటున్నారు. స్మృతితో విడిపోయిన తర్వాత పలాష్.. కెరీర్‌పై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం మరాఠీ నటుడు శ్రేయస్ తల్పడేతో ఓ మూవీని డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

    (ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

  • అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో హీరోయిన్‌ దివ్య భారతి ఒకరు. బ్యాచిలర్‌ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. చివరగా కింగ్‌స్టన్‌ మూవీతో పలకరించింది. ప్రస్తుతం తెలుగులో గోట్‌ సినిమా చేస్తోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.

    అమ్మ సింగిల్‌ పేరెంట్‌
    దివ్య భారతి మాట్లాడుతూ.. మా అమ్మకు హీరోయిన్‌ దివ్యభారతి అంటే ఇష్టం. ఆమె చనిపోయినప్పుడు తనపై ఇష్టంతో నాకు ఆ పేరు పెట్టారు. మా అమ్మ సింగిల్‌ పేరెంట్‌. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు పేరెంట్స్‌ విడిపోయారు. చిన్నప్పుడు స్కూల్‌కు హాలీడేస్‌ వస్తే నన్ను, తమ్ముడిని.. అమ్మ ఇంట్లో పెట్టి తాళం వేసి పనికి వెళ్లేది. ఒకరోజు మేము తప్పించుకుని బయటకు వెళ్లి ఆడుకున్నాం. అమ్మ అది చూసి గోడకుర్చీ వేయించింది.

    ప్రొఫెసర్‌తో లవ్‌
    ప్రేమ విషయానికి వస్తే.. అలాంటి స్టోరీలేం లేవు. కాకపోతే బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నప్పుడు ఓ అబ్బాయిని చూసి ఇష్టపడ్డాను. తర్వాతి రోజు ప్రొఫెసర్‌ ఫోన్‌ చేసి.. నువ్వు చూసింది నన్నే అన్నాడు. అలా ఆయన ప్రొఫెసర్‌ అని తెలిసి సారీ చెప్పాను. కానీ, తర్వాత కూడా ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. కాలేజీ అయిపోయాక మా అమ్మ.. నువ్వు చూడాల్సిన జీవితం చాలా ఉంది. ఇక్కడే ఆగిపోకు అంది. అలా ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం.

    అమ్మ ఒకటే ఏడుపు
    నా బాల్యం, చదువు అంతా కోయంబత్తూరులోనే జరిగింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కోసం 2014లో చెన్నై వచ్చాను. అప్పుడు మోడలింగ్‌ గురించి పరిచయం ఏర్పడింది. అప్పటివరకు నేను మోడ్రన్‌ డ్రెస్‌ వేసిందే లేదు. ఫ్యాషన్‌ షోలో తొలిసారి పాల్గొన్నాను. కాస్త నడుము కనిపించేలా లెహంగా వేసుకున్నాను. ఆ ఫోటోలు చూసి అమ్మ ఫోన్‌ చేసి ఏడ్చేసింది. 

    ఎందుకిలాంటి డ్రెస్‌లు!
    నేను నిన్ను ఇలా పెంచలేదు, ఎందుకిలాంటి డ్రెస్‌లు వేసుకుంటున్నావు? అని బాధపడింది. అలాంటి అమ్మ ఇప్పుడు నేను హీరోయిన్‌గా చేస్తుంటే సపోర్ట్‌గా నిలబడింది. మోడలింగ్‌ చేస్తున్నప్పుడు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కాకపోతే జనాలు నన్ను ఇష్టపడతారా? అని నాపై నాకే అనుమానం ఉండేది. అందుకే చాలా కథలకు నో చెప్పుకుంటూ వచ్చాను. అలా బ్యాచిలర్‌ సినిమాకు సైతం నో చెప్పాను. ఏడాది తర్వాత మళ్లీ అడిగారు. కథ నచ్చి ఓకే చేశాను. అలా సినీ ఎంట్రీ జరిగింది అని దివ్య భారతి చెప్పుకొచ్చింది.

    చదవండి: రజనీకాంత్‌ సినిమాలు చూడలేం, చిరంజీవి కూడా అంతే!: అనిల్‌

  • 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

    నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.

    'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

    (ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు సిట్‌ చీఫ్‌  సజ్జనార్‌ నోటీసులు ఇచ్చారు. ‘‘నాపై ఏడు కేసులున్నాయని ప్రవీణ్‌ ఆరోపణలు చేశారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి. రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’’ అంటూ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌కు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ నోటీసులు ఇచ్చిన స్పీకర్‌.. రూ.10 కోట్ల నష్ట పరిహారంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.


     

  • సాక్షి, నల్గొండ జిల్లా: మదర్ డెయిరీలో మరో ముసలం పుట్టింది. జనవరి 9 తేదీన చైర్మన్‌గా మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 14 రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. గతంలో మదర్ డైరీ చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డి రాజీనామాతో ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.  ప్రభాకర్ రెడ్డి రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

    తనను చైర్మన్‌ చేస్తే రూ.12 కోట్ల పాల బిల్లులు చెల్లిస్తానంటూ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారని.. చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో మూడు కోట్లు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, 14 రోజుల్లోనే ప్రభాకర్ రెడ్డి రాజీనామా వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒత్తిడితోనే రాజీనామా చేసినట్లు ప్రచారమవుతోంది. ప్రస్తుతం మదర్‌ డెయిరీ రూ. 35 కోట్ల అప్పుల్లో మదర్ డెయిరీ ఉండగా.. పలువురి సొంత రాజకీయ క్రీడలో మదర్ డెయిరీని కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలుర వ్యక్తమవుతున్నాయి.

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో సంచలన మార్పులు తీసుకొచ్చింది. దీంతో, ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే విధంగా రూల్స్‌లో పలు సవరణలు చేసింది.

    వివరాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల నిబంధనల్లోని సివిల్ సర్వీసెస్ రూల్స్‌లో రూల్ 9, రూల్ 25కి సవరణలు చేసింది. ఈ క్రమంలో  ఏడాదికి పైగా అనధికార గైర్హాజరు అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే, ఐదేళ్లకు మించి నిరంతర గైర్హాజరు అయితే సేవల నుంచి తొలగించే విధంగా సవరణ జరిగింది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ టూర్ వెళ్లినా చర్యలు తీసుకునే విధంగా మార్పులు చేశారు. అయితే, చర్యలకు ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు తప్పనిసరి అని నిబంధనల్లో పేర్కొన్నారు. 

  • కరీంనగర్:  ఫోన్ల ట్యాపింగ్‌ అంశానికి సంబంధించి సిట్‌ విచారణ అనేది సీరియల్‌లా సాగుతోందని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది సిరిసిల్ల కేంద్రంగా సాగిందని తాను ముందే చెప్పానని, ఆనాడు అధికారులు పట్టించుకోలేదన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేశారని హరీష్, కేటీఆర్‌ను విచారణకు పిలిచారా.. లేక వారి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని పిలిచారా?అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్‌.

    ‘కేసీఆర్ కొడుకు యువరాజులా ఆడిందే ఆటగా నడుస్తుంటే, మేం మొత్తుకుంటే నాడు అధికారులు పట్టించుకోలేదు. సినిమా యాక్టర్స్, పారిశ్రామికవేత్తల ఫోన్స్ ట్యాప్ చేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పిండు కేసీఆర్ కుటుంబం ట్యాపింగ్‌కు పాల్పడింది. ఒక్కరిని కూడా ఇప్పటివరకూ సిట్ అరెస్ట్ చేయలేకపోయింది. ప్రభాకర్ రావు వ్యవహారం ఎలా సాగుతుందో చూస్తున్నాం. 

    సిట్ సాధించిందేమిటో చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రే అంటాడు తన ఫొన్ ట్యాప్ చేశారని. కానీ చర్యలు ఉండవు.కవిత ట్యాప్ అయినట్టు చెప్పింది, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది. భిక్షాటన చేసేవాళ్లు కూడా కేసిఆర్ హయాంలో ఫోన్ మాట్లాడేందుకు భయపడ్డారు. ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు. సిట్‌ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

NRI

  • డల్లాస్‌, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్‌, డల్లాస్‌లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.

    సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్‌, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్‌రూమ్‌లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్‌ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.

    టీప్యాడ్‌ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్‌ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్‌ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

    కొత్త కమిటీ సభ్యులు 
    లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .

    నూతన ఈసీ సభ్యులు:
    బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.

    రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.

    ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్‌డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్‌కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్‌ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

    టీప్యాడ్‌ 2026 కార్యవర్గం:

    ఎగ్జిక్యూటివ్ కమిటీ:
    లక్ష్మి పోరెడ్డి (President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల,
    రత్న వుప్పల, బాల గణపవరపు.

    బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:
    రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.

    ఫౌండేషన్ కమిటీ:
    రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి

  • చాలామంది భారతీయ యువత డ్రీమ్‌ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్‌ అంటూ బాధపడుతున్నాడు. 

    అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్‌ విజయ వర్గియాకు ఐస్‌ స్కేటింగ్‌ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్‌కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్‌లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్‌ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్‌. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. 

    ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్‌ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్‌ కొద్దిపాటి ట్రీట్‌మెంట్‌కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్‌ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్‌ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్‌ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. 

    తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్‌ ఇన్సురెన్స్‌ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. 

     

    (చదవండి: అందుకేనా జపాన్‌ అంత క్లీన్‌గా ఉంటోంది..!)



     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు..  సైనా నెహ్వాల్‌  రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా బాడ్మింటన్‌ క్రీడకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ క్రీడతో దేశానికి మంచి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

  • సాక్షి, విజయవాడ: ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్ విసిరారు. సుమారు 80 మంది పోలీసు అధికారులు నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. లిక్కర్ కేసు సిట్‌లో ఉన్న కీలక అధికారి పేరుతో వసూళ్లు చేసినట్లు సమాచారం.

    లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ఏఎస్పీ.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. డీజీ స్థాయి అధికారి, డీఐజీ స్థాయి అధికారులు నుండి డబ్బులు వసూళ్లు చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పోలీసులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సైబర్ దాడితో ఏపీ పోలీసుల్లో కలకలం రేగుతోంది.

  • సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలోనే అతిపెద్ద సహకార సంస్థ అయిన విజయ డెయిరీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆళ్ల‌గడ్డలోని వైఎస్సార్‌సీపీ కార్యాల‌యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డెయిరీ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వ ఒత్తిళ్లను ఎండగట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తనను హౌస్ అరెస్ట్ చేయడం, నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

    గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు. జ‌గత్ విఖ్యాత్ రెడ్డి ఒక 'డిఫాల్టర్' అని, ఆయనకు చైర్మన్ అయ్యే కనీస అర్హత లేదని బ్రిజేంద్ర రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ డెయిరీ నడుపుతున్న వ్యక్తి, సహకార డెయిరీకి చైర్మన్ ఎలా అవుతాడ‌ని ఆయన ప్రశ్నించారు.

    అభివృద్ధిని చూసి ఓర్వలేకనే: విజ‌య డెయిరీ చైర్మ‌న్ ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 
    భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి త‌న త‌మ్ముడు భూమా జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డిని విజ‌య డెయిరీకి చైర్మ‌న్ చేయాల‌ని కుట్ర చేస్తోందని విజ‌య డెయిరీ చైర్మ‌న్ ఎస్వీ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు పాల వ్యాపారం నిర్వ‌హిస్తున్న త‌న త‌మ్ముడిని విజ‌య డెయిరీకి చైర్మ‌న్ చేయ‌డం మ్యూచువ‌ల్ కో ఆప‌రేటివ్ సొసైటీ నిబంధ‌న‌ల‌కు పూర్తి విరుద్ధ‌మ‌ని చెప్పారు. సొసైటీలో డిఫాల్ట‌ర్ గా ఉన్న జ‌గ‌త్ విఖ్యాత్‌ రెడ్డికి క‌నీసం కోర్టు మెట్లు తొక్కే అర్హ‌త కూడా లేద‌ని విమ‌ర్శించారు.

    అత‌డి ప్ర‌లోభాల‌కు గురైన ముగ్గురు డైరెక్ట‌ర్లపై అన‌ర్హ‌త వేటు ప‌డింద‌ని చెప్పారు. చేతిలో అధికారం ఉంద‌నే అహంకారంతో పోలీసుల‌తో బెదిరించి, సీఎంవో నుంచి ఫోన్లు చేయించి ప‌దే ప‌దే ఎన్నిక‌ల‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌గ‌త్ డెయిరీ ప్రారంభించిన నాటి నుంచి నంద్యాల‌ విజ‌య డెయిరీ సేల్స్ ప‌డిపోయాయని చెప్పారు. గతంలో రూ. 180 కోట్లు ఉన్న డైరీ టర్నోవర్‌ను తాము రూ. 360 కోట్లకు పెంచామని, రూ. 50 కోట్ల లాభం సాధించామని తెలిపారు.

    రైతులకు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ. 25 కోట్ల బోనస్ అందించినందుకు తనపై విచారణలు చేయిస్తున్నారా? అని నిలదీశారు. తన 58 ఏళ్ల జీవితంలో ఎన్నడూ లేని విధంగా, ఒకే రోజు తనపై మూడు తప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయడం కక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 వేల మంది రైతులు, 700 మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విజయ డెయిరీని కాపాడుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తప్పుడు ఆరోపణలు చేసేవారు దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాలు విసిరారు. న్యాయం జరిగే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  • సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, జోగి రమేష్‌ సోదరులు జైలు నుంచి విడుదలయ్యారు. 

    అనంతరం, జైలు వద్ద జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను 83 రోజులు జైలులో పెట్టారు. జైలులో సామన్య ఖైదీగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశాను అని చెప్పుకొచ్చారు. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారు. నార్కో అనాలసిస్‌, లైడిటెక్ట్‌ టెస్టులకు సిద్దమని చెప్పాను అని అన్నారు. రాక్షసానందం కోసం నన్ను, నా సోదరుడిని అరెస్ట్‌ చేశారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఫేక్‌ సీఎం. సంబంధం లేని కేసులో ఇరికించారు. 

    అక్రమ కేసులు పెట్టి నన్ను, నా సోదరుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నాతో పాటు నా కుటుంబాన్ని సైతం ఇబ్బంది పెట్టారు. నా భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు. కేసులు, అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా. ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటాం. ప్రభుత్వ మోసాలను ఎండగడతాను. లోకేష్ నీ రెడ్‌బుక్‌ను మడిచిపెట్టుకో. మీ బెదిరింపులకు భయపడే వారెవరూ లేరు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చే వరకూ పోరాడతాం. వైఎస్‌ జగన్‌ని సీఎంగా చేసుకుని తీరుతాం. చంద్రబాబు, లోకేష్‌కు మరోమారు సవాల్ చేస్తున్నా. వారం రోజులు టైమ్ ఇస్తున్నా. మీకు దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేద్దాం రండి. దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారు. విద్యార్ధులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక అవస్థలు పడుతున్నారు అని వ్యాఖ్యానించారు. 

    ఇబ్రహీంపట్నం..

    • ఇబ్రహీంపట్నం సర్కిల్‌కి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.
    • మరికొద్దిసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్న జోగి రమేష్..
    • జోగి రమేష్కి స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న అభిమానులు
    • న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

    ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్‌ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అనంతరం, జోగి రమేష్, ఆయన‌ సోదరుడు జోగి రాము పోలీసులు అరెస్టు చేశారు. 

  • సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం వైఎస్‌ జగన్‌ కృషి చేశారని డిబేట్‌లో ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్‌ గీతా గోపినాథ్ అభినందించారు. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటలింగ్  కోసం కృషి చేసిందని గీతా కితాబునిచ్చారు.

    చాలా మంచి భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేసింది.. చాలా క్రియేటివ్ గా చేసిందన్న గీతా గోపినాథ్.. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలు అవలంభించారని పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్ ఫోరం చర్చా గోష్టిలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలోనే గీతా గోపినాథ వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయగా.. వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ప్రశంసలు రావడంతో చంద్రబాబు అండ్ కో అభాసుపాలైంది.

     

  • సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్‌లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది.

     

Business

  • వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఇప్పటికే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

    విన్‌ఫాస్ట్ 2026 ద్వితీయార్థంలో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. వీటిని కూడా కంపెనీ తమిళనాడులోని ప్లాంట్ నుంచి మార్కెట్‌కు సరఫరా చేయనుంది. మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ అంచెలంచెలుగా విస్తరిస్తున్న తరుణంలో.. ఆ విభాగంలో సంస్థ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సంస్థ సంకల్పించింది.

    విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు
    విన్‌ఫాస్ట్ VF6: విన్‌ఫాస్ట్ వీఎఫ్6 ఎలక్ట్రిక్ కారు.. ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ సెటప్‌లు పొందుతుంది. లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. మూడు ట్రిమ్ (ఎర్త్, విండ్, ఇన్ఫినిటీ) లెవెల్స్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 59.6 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఎర్త్ వేరియంట్ 468 కిమీ రేంజ్ అందిస్తుంది. మిగిలిన రెండూ కూడా 463 కిమీ రేంజ్ అందిస్తాయి.

    విన్‌ఫాస్ట్ VF7: టేపింగ్ రూఫ్‌లైన్, యాంగ్యులర్ రియర్ విండ్‌షీల్డ్‌తో స్ట్రీమ్‌లైన్డ్ ప్రొఫైల్‌ కలిగిన విన్‌ఫాస్ట్ వీఎఫ్7, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటివి పొందుతుంది. ఐదు వేరియంట్లలో లభించే ఈ కారు 59.6 కిలోవాట్, 70.8 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలను పొందుతుంది. రేంజ్ అనేది వరుసగా 438 కిమీ, 532 కిమీ వరకు ఉంది.

  • అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.

    పదవీ విరమణ తర్వాత ఆదాయం
    ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.

    వైద్య ఖర్చులు
    వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.

    అప్పులు తీర్చేందుకు
    కొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.

    ఖర్చుల నుంచి రక్షణ
    కాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.

    తక్షణ నగదు లభ్యత
    భూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

    ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..

  • అంచనాలకు అందకుండా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉదయం రూ. 5400 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2840 వద్దకు వచ్చింది. అంటే దాదాపు సగం తగ్గిందన్నమాట. ఇది పసిడి ప్రియులకు కొంత ఊరటను ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో.. తాజా గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 4950 రూపాయలు పెరిగి.. రూ.1,46,400 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. సాయంత్రానికి 2350 రూపాయలు తగ్గి.. రూ. 1,44,050 వద్దకు చేరింది. 

    అదే విధంగా 5400 రూపాయలు పెరిగి రూ. 1,59,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి 2560 రూపాయలు తగ్గి రూ. 1,57,150 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎంత వ్యత్యసం ఉందో చూడవచ్చు.

    చెన్నైలో కూడా 1,46,500 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. 1,59,820 నుంచి 1,58,730 వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,46,550 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర.. సాయంత్రానికి 1,45,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,59,860 నుంచి రూ. 1,57,150 వద్దకు చేరింది.

    వెండి ధరలు
    వెండి ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. అయితే కేజీ సిల్వర్ రేటు రూ. 3.60 లక్షలకు చేరింది. గురువారం (జనవరి 22) రూ. 3.40 లక్షల వద్ద ఉన్న వెండి.. ఈ రోజు (శుక్రవారం) రూ. 20వేలు పెరిగింది. దీంతో రేటు రూ. 3.60 లక్షల వద్దకు చేరింది.

  • యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఓ కొత్త ఐఫోన్ మోడల్ లాంచ్ చేస్తూ ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఐఫోన్ 18 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

    యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ కూడా కొత్త ఫీచర్స్ పొందనున్నాయి. ప్రో & ప్రో మ్యాక్స్‌లలో 6.27 అంగుళాల 120Hz, 6.86 అంగుళాల 120Hz అలాగే ఉన్నాయి. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ పొందుతుంది. ఇందులో భాగంగానే.. ఐఫోన్ 18 ప్రో కోసం A20 ప్రో చిప్ 2nm ప్రాసెస్‌ అందించనున్నారు.

    కెమెరా విషయానికి వస్తే.. ఒక వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో & ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1,34,900 & రూ.1,49,900గా ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే స్టోరేజ్.. కాన్ఫిగరేషన్ అప్‌గ్రేడ్‌లను బట్టి ధరలు మారుతాయి.

  • మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో తన థార్ ధరలను సవరించింది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను రూ. 20వేలు పెంచింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి.

    మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అయిన AX 2WD ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద అలాగే కొనసాగుతుంది. 2WD & 4WD కాన్ఫిగరేషన్‌లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే.. LX ట్రిమ్‌లతో సహా అన్ని ఇతర వెర్షన్‌లు ఇప్పుడు రూ. 20,000 పెరిగాయి.

    ధరల పెరుగుదల తరువాత.. మహీంద్రా థార్ టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 17.19 లక్షలకు చేరింది. ఈ ఆఫ్ రోడర్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో.. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్‌లలో ఒకటిగా నిలిచింది.

    ఇదీ చదవండి: మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?

  • ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.

    ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.

    ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్‌లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

    యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్‌లను నేరుగా ఫీడ్‌లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్‌ సెట్ చేసుకోవచ్చు.

    ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు!

  • శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 769.66 పాయింట్ల నష్టంతో 81,537.70 వద్ద, నిఫ్టీ 241.25 పాయింట్ల నష్టంతో 25,048.65 వద్ద నిలిచాయి.

    ధంపూర్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్, ఆంటెలోపస్ సెలాన్ ఎనర్జీ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, ఎవరెస్ట్ కాంటో సిలిండర్ లిమిటెడ్, బైడ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరవుతారు. ఈ సారి ఆ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ (Emmanuel Macron) హాజరయ్యారు. ఈ సమయంలో మాక్రాన్ ధరించిన సన్‌గ్లాసెస్ ఎందోమందిని ఆకట్టుకుంది.

    మాక్రాన్ ఉపయోగించిన సన్‌గ్లాసెస్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, కొత్తగా కనిపించడంతో.. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా చాలామంది అవి ఏ బ్రాండ్?, అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆలా తెలుసుకునే క్రమంలోనే అవి iVision Tech కంపెనీ తయారు చేసినవని తెలుసుకున్నారు.

    మాక్రాన్ ధరించిన కళ్లజోడు పసిఫిక్ ఎస్1 మోడల్, దీని ధర 659 యూరోలు అని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు వంటి ప్రముఖ వ్యక్తి వాడిన ఉత్పత్తి అంటే, ఆ కంపెనీపై నమ్మకం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీ భవిష్యత్తులో ఇంకా ఎదిగే అవకాశం ఉందని భావించి ఆ సంస్థ షేర్లు కొనడం మొదలుపెట్టారు. దాంతో స్టాక్ మార్కెట్‌లో సంస్థ షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని సీఈఓ స్టెఫానో ఫుల్చిర్ పేర్కొన్నారు.

    ఈ షేర్ ధర పెరగడం వల్ల కంపెనీ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) సుమారు 38 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఒక కళ్లజోడు వల్లే కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది సాధారణంగా ఊహించని విషయం.

    ఈ రోజుల్లో ఫ్యాషన్, టెక్నాలజీ, వ్యాపారం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఒక ప్రముఖ నాయకుడు ఉపయోగించిన వస్తువు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టగలదు. అదే సమయంలో, ఒక చిన్న కంపెనీకి కూడా పెద్ద అవకాశాలు తీసుకురాగలదు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

    ఇదీ చదవండి: ఇప్పుడు 150 టన్నుల బంగారం.. ఏడాది చివరికి నాటికి..

  • ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్‌ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

    ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్‌ కియోసాకి తాజాగా ఒక పోస్ట్‌ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.

    “బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్‌’ పోస్టులో రాసుకొచ్చారు.

    కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్‌డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.

    ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.

Politics

  • సాక్షి, ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వ అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒక్కరూ కూడా భయపడరని వైఎస్సార్‌సీపీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఎంత  ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా  బయటకి వచ్చారని చెప్పుకొచ్చారు.

    జైలు నుంచి విడుదలైన జోగి రమేష్‌ను ఆయన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కలిశారు. అనంతరం దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ..‘కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై ప్రశ్నించినందుకు జోగి రమేష్ అరెస్ట్ చేశారు.83 రోజులు జోగి రమేష్‌, అతని సోదరుడిని జైలు పెట్టారు. జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ఆ రోజే చెప్పం. కోర్ట్ కూడా నమ్మింది బెయిల్ ఇచ్చింది. 

    కూటమి అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన కూటమి అన్యాయాన్ని జోగి ప్రశ్నిస్తున్నాడు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినా, జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినా ఎవరిని బయపెట్టలేరు. అరెస్టులకు ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త భయపడరు. వైఎస్‌ జగన్ నాయకత్వంలో మరింత చురుగ్గా పాల్గొంటారు. జోగి రమేష్ భార్య, కుమారులపై కక్ష పూరితంగా కేసులు పెట్టారు. వ్యక్తుల మీదనే కాకుండా కుటుంబంపైన కేసులు పెడుతున్నారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ మాట్లాడుతూ..‘చేయని తప్పులకు 83 రోజులు జోగి రమేష్‌ను జైలులో పెట్టారు. జైలులో పెట్టడం తప్ప కూటమి నేతలు ఏమీ చేయలేరు. కూటమి చర్యలు చూసి ఆంధ్రప్రదేశ్ అంతా నవ్వుతుంది. జోగి రమేష్ మీదనే కాదు.. కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. ఈరోజు మీరు నాటిన విత్తనం రేపు చెట్టు అవుతుంది. మా నాయకులను ఇబ్బంది పెట్టిన వాళ్లపై 2029లో చట్టబద్దంగా చర్యలు తీసుకుంటాం. జోగి రమేష్ ఎంత  ధైర్యంగా లోపలకు వెళ్ళారో.. అంతే ధైర్యంగా  బయటకి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో జోగి రమేష్ కూటమి పాలనపై పోరాటం చేస్తారు అని తెలిపారు. 

  • తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ వ్యవహార శైలి కాంగ్రెస్‌ పార్టీకి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ ‍గాంధీ సమావేశాన్ని డుమ్మా కొట్టి.. కేరళలోనే ఉండటం చర్చనీయాంశంగా మారింది. అది కూడా మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉండటం మరోసారి అనుమానాలను పెంచింది.

    కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలో కీలక వ్యూహాత్మక సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి సీనియర్‌ నేత శశిథరూర్‌ హాజరుకాలేదు. ఆయన నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న సమయంలో ఆయన కేరళలోనే ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆయన కార్యాలయం స్పందిస్తూ.. కొలికోడ్‌లో జరుగుతున్న లిటరేచర్‌ ఫెస్ట్‌లో పాల్గొనేందుకే థరూర్‌ రాష్ట్రంలో ఉన్నారని తెలిపింది.

    ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేత, నాలుగుసార్లు ఎంపీగా ఉన్న థరూర్‌.. ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో రాష్ట్ర నాయకులు కూడా పార్టీ వ్యవహారాల్లో ఆయన్ను పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కొచ్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ తనతో సరిగా వ్యవహరించకపోవడంపై థరూర్‌ తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికీ తీసుకెళ్లినట్లు తెలిసింది.

  • సాక్షి, విజయవాడ: జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో రసాభాస జరిగింది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఎదుట తూర్పు నియోజకవర్గ జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో, సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

    వివరాల మేరకు.. జనసేన పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రావి సౌజన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సౌజన్య వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు తప్పుబట్టారు. పార్టీలో డబ్బులు వసూలు చేస్తున్నారని సౌజన్యపై ఆరోపణలు చేశారు. దీంతో, తనపై ఆరోపణలు కాదు బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, సమావేశం గందరగోళంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను వారికి సర్ది చెప్పారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఇవాళ సిట్‌ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకు వీరుల ప్రభుత్వం.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు అంటూ వ్యాఖ్యానించారు.

    సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్‌ ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందని సిట్‌ అధికారులను అడిగితే సమాధానం లేదు, మా వ్యక్తిత్వ హననానికి గురిచేసిన వాళ్ల చర్యలు ఏవి అని అడిగాను. వేధింపుల తప్ప.. సిట్‌ అడిగినదాంట్లో ఏమీ లేదని కేటీఆర్‌ అన్నారు.

    ‘‘నాకు మద్దతు పలికిన పార్టీ నాయకత్వానికి- సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలీసుల సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను సిట్‌ను ప్రశ్నించాను. మాపై తప్పుడు ప్రచారం, లీకులు ఇస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాను. ట్యాప్ చేసి హీరోయిన్‌లను బెదిరించినట్లు కథనాలు నిజామా? అని అడిగాను. హీరోయిన్‌పై కథనాలు వాస్తవం కాదని పోలీసులు ఖండించారు.

    ..మా నాయకుల ఫోన్ ట్యాప్ కావడం లేదా అని నేను అడిగా. మంత్రి ఫోన్ ట్యాప్ అయిందని అంటున్నారు.. నిజమేనా అని అడిగాను. సిట్ అధికారులు ఫోన్ కాల్స్ మాట్లాడటమే సరిపోయింది. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకైనా.. ఎన్ని సార్లు అయినా వస్తాం. సింగరేణి టెండర్‌లలో సీఎం - మంత్రుల మధ్య వాటాల పంచాయతీపై హరీష్‌రావు బయటపెట్టారు.

    ..సీఎం అనుచరుడు 3 వందల కోట్ల టెండర్ గురించి గన్ పెడితే, మంత్రి కొడుకు భూ కబ్జాకు పాల్పడితే సిట్‌ ఎందుకు లేదు?. ఖాకి బుక్ అందరికీ ఒకేలా ఎందుకు లేదు? సిట్‌ అడిగిందే అడగడం - తిప్పి తిప్పి అడగడం తప్ప ఏమి లేదు. వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు.. మాకు కుటుంబాలు ఉన్నాయి మీడియా వాస్తవాలను రాయాలి. నన్ను ఒక్కరినే విచారణ చేశారు. తారక రామారావు, సిట్‌ అధికారులు తప్ప ఎవరూ లేరు. మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్‌ చెప్పింది... నేను సహకరిస్తానని చెప్పాను’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ధైర్యం ఉంటే సిట్‌ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్‌ చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లీక్‌లతో కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లీక్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు అంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

    మాజీ మంత్రి హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ బావమరిది కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెడితే సిట్‌ నోటీసులు ఇచ్చారు. సృజన్‌ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఈ డైవర్షన్‌ డ్రామా. నీ చిట్టాలు బయటపెడుతూనే ఉంటాం​. ఇవాళ సింగరేణి స్కాం పార్ట్‌-2 బయటపెడుతున్నాను. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బొగ్గు స్కాంతో తెలంగాణ ప్రతిష్టకు మచ్య పడింది. సింగరేణిలో సోలార్‌ పవర్‌ స్కాం జరిగింది. 127 మెగావాట్ల సోలార్‌ పవర్‌ స్కాం జరిగింది. దీనికి కూడా సైట్‌ విజట్‌ కండీషన్‌ పెట్టారు. 107 మెగావాట్లను రూ.540 కోట్లకు అప్పగించారు. రూ.214 కోట్లను అదనంగా కేటాయించారు.

    మూడు సైట్లలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టాల్సి ఉండగా.. మూడు కలిపి సింగిల్‌ టెండర్‌ పిలిచారు. ఎంఎస్‌ఎంఈలు పాల్గొనకుండా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టారు. గోల్టి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు టెండర్‌ ఇచ్చారు. ఈ స్కాం రామగుండంలో జరిగింది. బొగ్గు స్కాం కుంభకోణంతో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి బీజం పడింది. సీఎం బావమరిది స్కాం ఆధారాలు బయటపెడితే నోటీసులు ఇస్తారా?. కడుపు మంటతోనే కేటీఆర్‌, నాకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు మేము భయపడేవాళ​ం కాదు.

    దేశ వ్యాప్తంగా సోలార్ పవర్ టెండర్లు జరుగుతున్నాయి. దేశం అంతటా మూడు కోట్లకే ఒక మెగావాట్ ఇస్తుంటే.. తెలంగాణలో 5కోట్ల 4లక్షలకు ఒక మెగా వాట్ ఇస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ వాళ్లకు కాకుండా గుజరాత్ సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో మెగావాట్‌కు 7కోట్లకు కట్టబెట్టారు. ఇది కేవలం ఇష్టాలేషన్‌లో జరిగిన స్కాం. రేపు కొత్తగూడెం సింగరేణిలో కిషన్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్న అన్ని స్కాంలపై విచారణ చేయాలని కోరుతున్నాను.

    మూడో స్కామ్ ఉంది ఎక్స్‌క్లూజివ్‌ స్కాం జరిగింది. ఈ స్కాంలో జీవన్ రెడ్డి మరో అధికారి రిజైన్ చేసి వెళ్లారు. ప్రకాశం ఖని స్కాం జరిగింది.. వెయ్యి కోట్ల టెండర్లో జరిగింది. సైట్ విజిట్ పేరుతో ప్రకాశం ఖని టెండర్ పిలిచారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పు అయితే దీని క్యాన్సిల్ చెయ్యాలి. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లతో స్కాం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సైట్ విజిట్‌తో పిలిచిన టెండర్లు అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మీ బావమరిదిపై సిట్ వేయాలి. సింగరేణితో పాటు అన్ని కలిసి సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బెదిరింపులకు నేను భయపడను అంటూ హెచ్చరించారు. 

  • సాక్షి, జగిత్యాల: జగిత్యాల రాజకీయాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

    జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయి. సంబంధిత వారిని అరెస్టు చేస్తారా లేదా అన్నది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా? అన్నది కాంగ్రెస్‌ పార్టీనే తేల్చుకోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఇదే సమయంలో జగిత్యాల రాజకీయాలపై స్పందిస్తూ..‘జగిత్యాల రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదు. జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానం. జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని నా అభిప్రాయం. ఈ వయసులో ఆయనను హింసించడం మహాపాపం.  మానసిక క్షోభకు గురి చేయడం కాంగ్రెస్‌కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పలకరించేవాడిని అంటూ వ్యాఖ్యానించారు.
     

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి రెండేళ్ల పాలనలో ఏ రైతు సమస్య తీర్చారో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పాలని సవాల్‌ విసిరారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన సమగ్ర భూసర్వేనే చంద్రబాబు ఎందుకు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు అని తెలిపారు.

    మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్‌ జగన్‌ హయాంలో ఇచ్చిన పాస్‌ బుక్‌ల మీద అనగాని పచ్చి అబద్ధాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్‌ బుక్‌ అయినా ఇచ్చారా?. జగన్‌ హయాంలో ఇచ్చిన పాస్‌ బుక్‌లు తీసుకుని కొత్త పాస్‌ బుక్‌లు ఇస్తున్నారు. పాస్‌ బుక్‌ల మీద వైఎస్‌ జగన్‌ ఫొటో తీయడం తప్ప మీరు చేసిందేమిటీ?. రెవెన్యూ మంత్రికి రెవెన్యూ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా?. 1802లో మొట్టమొదటి సారి ఇండియాలో సర్వే చేశారు. 1926-32 వరకు తరువాత బ్రిటీషర్లు సర్వే చేశారు. ఈ సర్వేనే ఇప్పటి వరకు ఇండియాలో కొనసాగుతోంది. రెవెన్యూ మంత్రి అనగాని సంస్కారం మరిచి మాట్లాడారు. మంత్రి అనగాని ఆటవిక సమాజంలోకి పయనిస్తున్నారు. అదృష్టం బాగుండి ఆయన మంత్రి అయ్యారు. రూ.25 కోట్లు తీస్తే పార్టీ మారుతానని చెప్పిన వ్యక్తి అనగాని అని ఎద్దేవా చేశారు.

    1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రైతులు ఇబ్బందుల గురించి ఆలోచన చేశారా?. తక్కెళ్లపల్లిలో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన సమగ్ర భూసర్వే మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు. మంత్రి అనగాని తన డిపార్ట్‌మెంట్‌ మీద దృష్టిపెట్టాలి. వైఎస్‌ జగన్‌ చేపట్టిన సమగ్ర భూసర్వేలో కొంచెం కూడా తేడా రాదు. జగన్‌ ఆరు వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి చేశారు. ఈ ఆరువేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన పరికరాలనే బాబు వాడుతున్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ శాఖ కలిపి ఏపీలో భూ సమగ్ర సర్వే చేపట్టారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన డ్రోన్‌ ప్లే డేటా, ఓఆర్‌ఐ కాపీలను బాబు ప్రభుత్వం వాడుతుంది. శాలిలైట్‌తో లింక్‌ చేసి వైఎస్‌ జగన్‌ సమగ్ర భూ సర్వే చేపట్టారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాకే గ్రామాల్లో సర్వేయర్లు వచ్చారు. వైఎస్‌ జగన్‌ తెచ్చి సిస్టం ప్రపంచంలోనే అద్భుత భూ సర్వే అని చెప్పుకొచ్చారు. 

    ప్రతి పొలానికి పక్కా మ్యాప్.. పాసు పుస్తకాలు ముందు పెట్టి..

Family

  • క్రికెట్‌ మైదానంలో ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్‌ చేయడం చూశాం.. కానీ, పెళ్లి మండపంలో ఒక వధువు అంతకంటే వేగంగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి కూతురంటే సిగ్గుతో తలవంచుకుని కూర్చుంటుందనుకుంటే పొరపాటే.. ఈ వధువు వేగం చూస్తే నిష్ణాతులైన క్రికెటర్లు కూడా షాక్‌ అవ్వాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో.. పెళ్లి తంతులో భాగంగా వరుడి తల్లి.. తన కుమారుడికి ప్రేమతో రసగుల్లా తినిపించబోయింది. ఆ మిఠాయి నోటి దగ్గరకు వెళ్లేలోపే స్పూన్‌ పైనుంచి జారి కింద పడబోయింది.

    వధువు మెరుపు క్యాచ్‌! 
    ఆ రసగుల్లా నేలను తాకడానికి ముందే.. పక్కనే ఉన్న వధువు రెప్పపాటు కాలంలో స్పందించింది. తన చేతిని చాచి, గాలిలోనే ఆ రసగుల్లాను అద్భుతంగా క్యాచ్‌ పట్టింది. ఆ మిఠాయి కింద పడి వరుడి దుస్తులు పాడవకుండా, ఫంక్షన్‌ మధ్యలో ఇబ్బంది కలగకుండా తన ‘వికెట్‌ కీపింగ్‌’ నైపుణ్యంతో కాపాడేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 6 ల‌క్ష‌లుగాపై లైకులు, 4 వేల‌కు పైగా కామెంట్లు రావ‌డం విశేషం.

    ధోనీ కూడా గర్వపడతాడు 
    ఈ వీడియో వైరల్‌ (Video Viral) కావడంతో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘ఈమె స్పందన చూస్తుంటే సాక్షాత్తూ ఎంఎస్‌ ధోనీ గుర్తొస్తున్నాడు’.. అని ఒకరు.. ‘ఫీల్డింగ్‌లో ఈమె ముందు సీజన్డ్‌ ప్లేయర్లు కూడా సరిపోరు’.. అని మరొకరు ప్రశంసించారు. ‘బహుశా ఆ రసగుల్లా అంటే వధువుకు చాలా ఇష్టమేమో.. అందుకే అంత ఫోకస్‌తో క్యాచ్‌ పట్టింది’.. అంటూ సరదాగా ఆట పట్టిస్తున్నారు. పెళ్లి వేడుకలో ఈ చిన్న పొరపాటు జరిగి ఉంటే కాసేపు గందరగోళం ఏర్పడేది. కానీ వధువు సమయస్ఫూర్తి ఆ క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా, ఒక ‘మ్యాచ్‌ విన్నింగ్‌’మూమెంట్‌గా మార్చేసింది.

    చ‌ద‌వండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. ఆమె ఫుల్‌ హ్యాపీ!

      

  • పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో ఎండ్‌స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు గురైన కెన్యాకు చెందిన మహిళకు హైదరాబాద్‌లోని ఏషియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) హైటెక్ సిటీ వైద్యులు కొత్త జీవితం అందించారు. విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

    కెన్యాకు చెందిన 55 ఏళ్ల ఫతుమో మొహముద్ డుబో కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కెన్యాలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పారు.  దీంతో ఆమె తన సోదరి, చిన్న కూతురుతో కలిసి మెరుగైన చికిత్స కోసం భారత్‌కు వచ్చారు. AINU హైటెక్ సిటీలో చేరారు. వైద్యులు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత  జీవ దాత ద్వారా కిడ్నీ మార్పిడి చేయాలని  నిర్ణయించారు.  ఆమె సోదరి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు.

    ప్రాణాలు నిలిపిన సోదరి:
    AINU హైటెక్ సిటీ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమె సోదరి కిడ్నీ సరిపోలుతుందని తేలింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఒకే  సెషన్‌లో దాత నుంచి కిడ్నీ తీసి స్వీకర్తకు అమర్చామనీ AINU సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్సను AINU హైటెక్ సిటీ ట్రాన్స్‌ప్లాంట్ విభాగానికి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా, క్రిటికల్ కేర్ నిపుణుల  బృందం విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. "ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు దాత ఎంపిక నుంచి శస్త్రానంతర సంరక్షణ వరకు అన్ని దశల్లో సమన్వయంతో పనిచేశాం. ఎండ్‌స్టేజ్ రీనల్ డిసీజ్ ఉన్న రోగులకు జీవ దాత కిడ్నీ మార్పిడి అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది" అని వెల్లడించారు.

    జన్యుపరమైన వ్యాధి:
    పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అనేది జన్యుపరమైన కుటుంబ సంబంధిత వ్యాధి అని డాక్టర్ కె. క్రాంతి కుమార్ తెలిపారు. ఈ వ్యాధి వచ్చిన వారికి కాలక్రమేణా మూత్రపిండాల్లో అనేక సిస్టులు ఏర్పడతాయని చెప్పారు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్, దీర్ఘకాలిక ఫాలోఅప్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐతే ప్రతి ఒక్కరిలోనూ కిడ్నీ వైఫల్యం కాదని, కొన్ని సందర్భాల్లో మాత్రం క్రానిక్ కిడ్నీ డిసీజ్‌గా మారి, చివరికి ఎండ్‌స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని వివరించారు. వారికి తప్పకుండా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుందన్నారు.

    భారత్‌కు కృతజ్ఞతలు:
    ఈ సందర్భంగా ఫతుమో మొహముద్ డుబో మాట్లాడుతూ, “కెన్యా నుంచి భారత్‌కు రావడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ ఇక్కడి వైద్యులు నాకు మళ్లీ జీవించే అవకాశం ఇచ్చారు. ప్రతి దశను స్పష్టంగా వివరించి మాకు అండగా నిలిచారు. నా సోదరి కిడ్నీ దానం చేయడం వల్లనే నా ప్రాణాలు నిలిచాయి,” అని తెలిపారు. అవయవ మార్పిడుల్లో భారత్ ప్రపంచ స్థాయిలో కీలక కేంద్రంగా ఎదుగుతోందని, దీనికి తాజా శస్త్ర చికిత్స ఒక ఉదాహరణ అని వైద్యులు తెలిపారు.

    కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ దీపక్ రగూరి, డాక్టర్ ఎమ్.డి. తైఫ్ బెండిగేరి, డాక్టర్ . సయ్యద్ ఎమ్.డి. ఘౌస్, డాక్టర్. దీక్ష ప్రియలతో కూడిన వైద్య బృందం నిర్వహించింది.

    (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)

  • మన పెంపుడు శునకం అదోలా ఉందేమిటి? దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని ఉందా? వంటగదిలో కత్తి టమోటాలు కోయడానికి కూడా మొరాయిస్తోందా? అయితే మీ కోసం వచ్చింది అత్యంత పదునైన వైబ్రేషన్‌ నైఫ్‌. స్మార్ట్‌ ఫ్రిడ్జ్‌తో ఉండే ఉపయోగాలేమిటో తెలుసుకోవాలని ఉందా?... ఇలాంటి ఎన్నో సరికొత్త సాంకేతిక పరికరాలకు లాస్‌వెగాస్‌లో జరిగిన సీయీఎస్‌ 2026 వేదిక అయింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేదికలో ప్రదర్శితమైన స్మార్ట్‌ హోమ్‌ టెక్‌ గురించి...

    1. మూగజీవి బాధలు తెలుసుకోవచ్చు
    మన పెంపుడు శునకం శారీరక బాధలు, అనారోగ్య సమస్యలు మనకెలా తెలుస్తాయి? ఆ అరుపుల వల్ల ఏం అర్థమవుతుంది! ఇక చింత అవసరం లేదు. పెట్‌ టెక్నాలజీ కి ప్రసిద్ధి చెందిన ప్రముఖ పెట్‌ స్టార్టప్‌ ‘సాటెల్లై’ సరికొత్త స్మార్ట్‌ డాగ్‌ కాలర్‌ను రూపొందించింది. దీనికి ‘సాటెల్లై కాలర్‌ గో’ అని పేరు పెట్టారు. 

    ఈ పెట్‌సెన్స్‌ మానిటర్‌ లొకేషన్, నిద్ర, ఉష్ణోగ్రత వివరాలతో పాటు శునకం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఏదైనా అసాధారణంగా అనిపించినప్పుడు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ కాలర్‌ జీపీఎస్‌ ట్రాకింగ్, జియోఫెన్సింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. పదిహేను రోజుల బ్యాటరీ లైఫ్‌ ఉండే ఈ కాలర్‌ వాటర్‌–రెసిస్టెంట్‌.

    2. ఇది ఇస్మార్ట్‌ ఫ్రిజ్జ్‌
    స్టోర్‌లలో కిరాణా సామాగ్రి ప్యాకెట్లను స్కాన్‌ చేయడం అనేది సాధారణ విషయమే కావచ్చు. మనం కొన్నవాటిని ఫ్రిజ్జ్‌లో పెట్టే ముందు స్కాన్‌ చేయాల్సి వస్తే? ఇకముందు సార్మ్‌ ఫ్రిడ్జ్‌లలోకి ఏ వస్తువైనా వెళ్లాలంటే ‘స్కానింగ్‌’ పరీక్ష పాస్‌ కావాల్సిందే! పోటీలో భాగంగా కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ ఫ్రిడ్జ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాయి. జీయీ ప్రొఫైల్‌ న్యూ స్మార్ట్‌ ఫ్రిడ్జ్‌ దీనికి ఉదాహరణ. ఈ ఫ్రిడ్జ్‌ ద్వారా ఏ ఆహారపదార్థాలు త్వరగా పాడైపోతాయో తెలుసుకోవచ్చు. 

    ఫ్రిజ్జ్‌లోని వాటర్‌ డిస్పెన్సరీకి సమీపంలో బార్‌కోడ్‌ స్కానర్‌ అమర్చబడి ఉంటుంది. కాఫీ గింజలు, పాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ తరువాత అవి మన వీక్లి షాపింగ్‌ జాబితాలో చేర్చబడతాయి. దీనిని మొబైల్‌ యాప్‌ ద్వారా యాక్సెస్‌ చేయవచ్చు. ఈ ఫ్రిడ్జ్‌లోని వినూత్నమైన ఫీచర్‌లలో టాప్‌–డౌన్‌ కెమెరా ఒకటి. దీనిద్వారా ప్రొడ్యూస్‌ డ్రాయర్స్‌ను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. రెసిపీ జనరేటర్, హ్యాండ్స్‌–ఫ్రీ ఆటోఫిల్‌లాంటి ఫీచర్‌లు కూడా దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ ఫ్రిడ్జ్‌ బార్‌కోడ్‌ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తుంది.

    3. సూపర్‌ క్లీనింగ్‌
    గత ఏడాది సీయీఎస్‌లో తమ ప్రొడక్ట్‌ ప్రైస్‌ జెడ్‌70 రోబోటిక్‌ వాక్యూమ్‌ క్లీనర్‌’ను పరిచయం చేసింది రోబోరాక్‌ కంపెనీ. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో దారిలోని వస్తువులను పక్కకు పెట్టే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ సంవత్సరం మరో రోబోటిక్‌ వాక్యూమ్‌ వేరియంట్‌ ‘డ్రీమ్‌ ఎక్స్‌ 50 అల్ట్రా’ను పరిచయం చేసింది రోబోరాక్‌. మెట్ల పైకి, కిందికి కదలడానికి వీలుగా దీనికి కాళ్లు ఉంటాయి. మెట్లు ఎక్కుతూనే వాటిని శుభ్రం చేస్తుంది. మెట్లను వాక్యూమ్‌ చేస్తున్నప్పుడు ఒక కాలుని కింది మెట్టుపై ఉంచి 90 డిగ్రీలు తిరుగుతుంది.

    4. ఆహా... అల్ట్రా షార్ప్‌ మానిటర్‌
    మల్టిపుల్‌ మానిటర్స్‌ వల్ల ఉపయోగం ఉంటుందనేది కొత్త విషయమేమీ కాదు. సంవత్సరాల క్రితమే ఇది అనుభవంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్ని స్క్రీన్‌లు ఉన్నాయనేది ముఖ్యం కాదు... అధిక రిజల్యూషన్‌ పిక్సెల్స్‌ అనేదే ముఖ్యంగా మారింది. ప్రసిద్ధ డెల్‌ కంపెనీ అధిక రిజల్యూషన్‌ పిక్సెల్స్‌పై దృష్టి పెట్టింది. 

    డెల్‌ వారి అల్ట్రాషార్ప్‌ 52 థండర్‌బోల్డ్‌ మానిటర్‌  6కే రిజల్యూషన్, 120 హెచ్‌ జడ్‌ రిఫ్రెష్‌రేట్‌తో కూడిన 52 అంగుళాల డిస్‌ప్లే. ఎక్కువ గంటలు పనిచేసే వారి కోసం, రెండు లేదా మూడు–మానిటర్‌ల సెటప్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని రూ΄÷ందించారు. ఇతర మానిటర్‌లతో ΄ోల్చితే 60 శాతం తక్కువ బ్లూ టైట్‌ కలిగి ఉంటుందని, కళ్లపై భారం పడదని కంపెనీ తెలియజేసింది. ‘ప్రపంచంలోనే తొలి 52–అంగుళాల అల్ట్రావైడ్‌ కర్వ్‌డ్‌ 6కే మానిటర్‌’గా ‘అల్ట్రా షార్ప్‌’ మానిటర్‌ గురించి ప్రకటించింది డెల్‌.

    5. ఫస్ట్‌ అల్ట్రాసోనిక్‌ నైఫ్‌
    చాలామంది ఇళ్లలో వంటగది కత్తులు అంత పదునుగా ఉండవు. సున్నితమైన టమోటాను కట్‌ చేయడానికి కూడా ఇబ్బంది పెట్టే కత్తులను చూస్తూ ఉంటాం. దీనికి కారణం కత్తిని ఎప్పటికప్పుడు పదును పెట్టక΄ోవడం. ఈ సమస్యను పరిష్కరించడానికి సియాటిల్‌ కంపెనీ అల్ట్రాసోనిక్స్‌ నైఫ్‌ను రూ΄÷ందించింది. ఇది ప్రపంచంలోనే తొలి అల్ట్రాసోనిక్‌ నైఫ్‌. ఈ కత్తి సెకన్‌కు 30,000 కంటే ఎక్కువసార్లు కంపిస్తుంది. 

    అత్యంత పదునుగా ఉండడమే కాదు ముక్కలు కత్తికి అంటుకోకుండా నిరోధిస్తుంది. ఈ నైఫ్‌ను ఉపయోగించడం చాలా సులభం. బ్లేడ్‌ హ్యాండిల్‌పై ఉన్న చిన్న బటన్‌ను నొక్కడం ద్వారా అల్ట్రాసోనిక్‌ వైబ్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. అల్ట్రాసోనిక్‌ నైఫ్‌ పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించడం సాధారణం. కానీ ‘అల్ట్రాసోనిక్‌ సి–200’ అనేది వంటగదిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేసిన నైఫ్‌.

    6. ఇంటి చుట్టూ నిఘా
    మీ ఇంట్లో స్మార్ట్‌ ల్యాంప్‌లు, స్మార్ట్‌ ప్లగ్‌లాంటివి ఉండవచ్చు. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు లైట్లు ఆన్‌ అయ్యే మోషన్‌ సెన్సర్‌ ఉండి ఉండవచ్చు. ఇలాంటి టెక్నాలజీని అఖారా వారి ఆల్‌–పర్పస్‌ ప్రెజెన్స్‌ సెన్సర్‌  ‘ఎఫ్‌పీ 400’ మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఇది ఉనికిని పసిగట్టే పరికరం. ఇంటి చుట్టూ కదలికలను ట్రాక్‌ చేసే మార్గం. వృద్ధులు పడి΄ోతే వెంటనే స్పందిస్తుంది. 

    ఈ సెన్సర్‌ ఇతర అఖారా పరికరాలతో మాత్రమే కాకుండా ఆపిల్‌ హోమ్, గూగుల్‌ హోమ్, అలెక్సాలాంటి ప్లాట్‌ఫామ్‌లతో కూడా లింక్‌ కాగలదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు సెన్సర్‌ నుండి వచ్చే హెచ్చరికలను అనుసరించి లైట్లను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయడం, థర్మోస్టాట్‌లను సర్దుబాటు చేయడం...మొదలైనవి చేస్తాయి.

    అఖారా వారి మరో స్మార్ట్‌హోమ్‌ గ్జాడ్జెట్‌... పీ 100. దీనికి ఎఫ్‌పీ 400తో పోల్చితే అత్యాధునిక సాంకేతిక సామర్థ్యం లేనప్పటికీ సమీపంలోని కదలికలు, కంపనాలు, తలుపు తట్టడంలాంటి శబ్దాలు, డ్రాయర్‌లను తెరవడం, మూయడం... మొదలైన వాటిని పసిగట్టడానికి 9–యాక్సిస్‌ సెన్సింగ్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఆల్‌–ఇన్‌–వన్‌ సెక్యూరిటీ సెన్సర్‌లాంటిది. ‘ఆబ్జెక్ట్‌ స్టేటస్‌’  మోడ్, డోర్‌/విండో మోడ్‌లాంటి రకరకాల మోడ్‌లను సెట్‌ చేసుకోవచ్చు.

    7. ఇంట్లోనే ప్లాస్టిక్‌ కంపోస్టర్‌
    సాఫ్ట్‌ ప్లాస్టిక్‌ను రీసైకిలబుల్‌ బ్లాక్స్‌గా మార్చే ప్రపంచంలోని తొలి హోమ్‌ డివైజ్‌ ‘సాఫ్ట్‌ ప్లాస్టిక్‌ కం΄ోస్టర్‌’ను తీసుకువచ్చింది ‘క్లియర్‌ డ్రాప్‌’ స్టార్టప్‌. ఇది మధ్యలో ఒక స్లాట్‌ ఉన్న చెత్తడబ్బలాగా ఉంటుంది. దీనిలో సంచులు, గ్లోవ్స్‌లాంటి మెత్తని ప్లాస్టిక్‌ వస్తువులు వేయవచ్చు. ఈ బాక్స్‌లో తగినంత ప్లాస్టిక్‌ చేరినప్పుడు ఒక బటన్‌ నొక్కాలి. అప్పుడు కం΄ోస్టర్‌ లోపలి ప్లాస్టిక్‌ను వేడి చేసి, దానిని ఇటుక సైజ్‌లోకి మారుస్తుంది. ఆ తరువాత వీటిని ప్లాస్టిక్‌ను ప్రాసెస్‌ చేసే కేంద్రాలకు పంపవచ్చు. ఈ సాఫ్ట్‌ ప్లాస్టిక్‌ కంపోస్టర్‌  సీయిసి 2026 అవార్డ్‌ గెలుచుకుంది.

    8. ఇక భయం లేదు... అలెర్జీ అలర్ట్‌ ఉందిగా!
    ఫుడ్‌ అలెర్జీలు భయపెడతాయి. ఆ భయాన్ని తొలగించడానికి త్వరలో ‘అలెర్జిన్‌ అలర్ట్‌’ అనే మినీ, పోర్టబుల్‌ ల్యాబ్‌ మార్కెట్‌లోకి రానుంది. ఇది ఆహార నమూనాలను విశ్లేషించి నిమిషాల్లో ఫలితాలను అందిస్తుంది. అలెర్జీ హెచ్చరికలను ఇస్తుంది. ప్రస్తుతం హోటల్‌ చెఫ్‌లు ట్రయల్స్‌లో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. అత్యుత్తమ స్టార్టప్‌ విభాగంలో ‘అలెర్జీన్‌ అలర్ట్‌’ విజేతగా నిలిచింది. 

    ‘అలెర్జీన్‌ అలర్ట్‌’ అనేది బయోమెరియక్స్‌ కంపెనీ ప్రొడక్ట్‌. 1963 నుండి ఈ కంపెనీ క్లినికల్‌ మైక్రోబయాలజీ, అంటువ్యాధి పరీక్ష, ఆహార భద్రత... మొదలైన వాటికి సంబంధించి పనిచేస్తోంది. అలెర్జీ నిపుణులు, ఆహార భద్రతా నిపుణులతో కలిసి రూపొందించిన ఈ పరికరం ఫుడ్‌ అలెర్జీలు ఉన్నవారికి మాత్రమే కాకుండా రెస్టారెంట్లు, హోటల్స్, క్యాటరర్స్‌... ఇలా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. జేబులో సరిగ్గా  సరిపోయే ‘అలెర్జీన్‌ అలర్ట్‌’ ఫుడ్‌ ఇండస్ట్రీకి గేమ్‌ చేంజర్‌ కావచ్చు అంటున్నారు విశ్లేషకులు.

    (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!)

     

  • తెల్లని కాగితం మీద రాసే అక్షరమాల వేడుకలలో ఆధునిక మహిళల అలంకరణగా ఆకట్టుకుంటోంది.పెళ్లి, పుట్టినరోజు, సీమంతం.. వేడుకకు తగినట్టు తమ ప్రియమైన వారి పేర్లు హెయిర్‌ యాక్సెసరీస్‌లలోనూ, గాజులు, ఇతర ఆభరణాలలోనూ వచ్చేటట్టు ప్రత్యేకంగా డిజైన్‌ చేయించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. 

    సాధారణంగా చిన్నపిల్లల కేశాలంకరణలో నేమ్‌ క్లిప్స్‌ చూస్తుంటాం. ఇప్పుడు వెస్ట్రన్‌ లేదా ఇండియన్‌ వేడుకలకు తగినట్టు అన్ని వయసుల వారు తమ కేశాలంకరణలోనూ, ఇతర ఆభరణాలలోనూ అక్షరమాలను అందంగా కూర్చుతున్నారు.

    నెక్లెస్‌... హ్యాంగింగ్స్‌ గానూ...
    చెవులకు జూకాలు, మెడన హారాలలో తమ ప్రియమైన వారి పేర్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. వేడుక అర్థం తెలిసేలా కూడా అక్షరాలమాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, థ్రెడ్‌ జ్యువెలరీలలో సందర్భానికి తగిన అక్షరాలు కనిపిస్తుంటాయి. హల్దీ, మెహెందీ వివాహ వేడుకలలో వధూవరుల పేర్లు కలిసివచ్చేలా డిజైన్‌ చేసిన ఆభరణాలను కొత్త పెళ్లికూతురు ధరిస్తుండటం కనిపిస్తోంది.

    కేశాల అలంకరణలో...
    ఎ నుంచి జెడ్‌ వరకు ఇంగ్లిష్‌ అక్షరాలతో తయారు చేసిన వివిధ లోహపు, బీడ్స్‌ హెయిర్‌ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వరుడి పేరు వచ్చేలా లేదా సందర్భానికి తగిన అర్థం వచ్చేలా, ఫన్‌ని క్రియేట్‌ చేసే విధంగానూ అక్షరాలను తలకెక్కించుకుంటున్నారు. వీటిలో స్వరోస్కి, గోల్డ్, ఎంబ్రాయిడరీ, వివిధరకాల పూసల అందాలు అక్షరాల చుట్టూ చేరుతున్నాయి. జడ ΄÷డవును బట్టి కూడా లోహపు అక్షరాల క్లిప్స్‌ వేల రూ΄ాయల ధర పలుకుతున్నాయి.

    గాజుల్లో..
    డ్రెస్‌కు మ్యాచ్‌ అయ్యేలా రంగు రంగులతో ఉండే చిన్నా పెద్ద గాజుల ఎంపిక సాధారణమే. అయితే వేడుకలలో మాత్రం స్పెషల్‌గా కనిపించేలా అమ్మాయిలు తమ పేర్లతో తయారు చేయించుకున్న గాజులను ధరిస్తున్నారు. వీటి డిజైన్‌కి ఆర్డర్‌పై కస్టమైజ్డ్‌ బ్యాంగిల్స్‌ చేయించుకోవడంపై బాగా ఆసక్తి చూపుతున్నారు.

    వివిధ భాషలలో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవాలి అంటే అందుకు తగిన జ్యువెలరీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌ ΄ోర్టల్స్‌ బాగా సహాయపడుతున్నాయి. అల్ఫాబెట్‌ అక్షరాల మాల క్లిప్పుల సెట్‌ వందల రూ΄ాయల నుంచి నాణ్యత, డిజైన్‌ను బట్టి వేల రూ΄ాయల వరకు ధర పలుకుతోంది.  

    (చదవండి: అందుకేనా జపాన్‌ అంత క్లీన్‌గా ఉంటోంది..!)

     

  • అత్యంత పరిశుభమైన దేశాల్లో ఒకటి జపాన్‌. చాలా పరిశుభ్రంగా ఉడే దేశాల్లో కూడా ఎక్కడో ఒక విషయంలో అధ్వాన్నంగా ఉంటుందేమో గానీ జపాన్‌ మాత్రం సూది మొనంత ధూళి కూడా కనిపించకుండా అందాల మెరిసిపోతుంది. అంత పరిశుభ్రంగానా అని అంతా ఆశ్యర్యపరిచేలా ఉంటుంది. అంతలా స్వచ్ఛత ఉండాలంటే..అక్కడ అందరిలో యూనిట్‌ కంటే..ఎలాంటి మనసతత్వం ఉంటే ఇది సాధ్యమైందో తెలిస్తే అవాక్కవుతారు. ఆ కారణం తెలుసుకున్నా..పాటించాలంటే కాస్త కష్టమే..!

    జపాన్‌​ అంత శుభ్రంగా ఉండటానికి ఆ మానస్తత్వమే కారణమంటూ అక్కడ జరిగిన ఓ సంఘటను భారతీయ మహిళ ఊర్వశి రికార్డు చేసి మరి నెట్టింట షేర్‌ చేశారు. ఆమె షేర్‌ చేసిన వీడియోలో ఎవరో ఒక రెస్టారెంట్‌ వెలుపల వాంతులు చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే అలాంటివి మనదేశంలో చాలా కామన్‌..సాయంత్ర దాక అది అలానే ఉంటుంది. రేపు రోడ్లు ఊడ్చేవాళ్లు వచ్చేదాక అంతే పరిస్థితి అన్నట్లు ఉంటుంది. 

    కానీ జపాన్‌లో ఆ రెస్టారెంట్‌ సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఏ మాత్రం అసహ్యించుకోకుండా నేరుగా చేతులతోనే క్లీన్‌ చేయడం విశేషం. పైగా అతడి ముఖంలో ఎలాంటి చిరాకు, అసహ్యం కనిపించలేదు. ఏదో తన పని తాను చేసుకున్నట్లుగా చాలా నిశబ్దంగా క్లీన్‌ చేసి వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

    ఆ వీడియోకి ఊర్వశి అక్కడ ధూళి కంటే మనస్తత్వం అత్యంత ముఖ్యం అనే క్యాప్షన్‌ జోడించి మరి నెట్టింట పోస్ట్‌ చేశారు. అక్కడ దాన్ని ప్రజా బాద్యతగా భావించి క్లీన్‌ చేస్తారు కాబట్టే జపాన్‌ అంత శుభ్రంగా ఉంటోంది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.  

     

    (చదవండి: పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!)

     

     

  • ప్రేమలో పడటం సులభమే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఒక పెద్ద టాస్క్‌! మన వీరేంద్ర కువేల్కర్‌ మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి, తన గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఒక అదిరిపోయే ‘బైక్‌ డ్రామా’ ప్లాన్‌ చేశాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

    అసలేం జరిగింది? 
    సాదాసీదాగా బైక్‌ మీద షికారు వెళ్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చాడు వీరేంద్ర. పాపం ఆ అమ్మాయి వెనకాల కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటోంది. కానీ వీరేంద్ర మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ‘సిగ్నల్‌’ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ముందుగా ఒక బైకర్‌ వచ్చి ఓవర్‌టేక్‌ చేసి ముందు నిలబడ్డాడు. అతని టీషర్ట్‌ వెనకాల ‘విల్‌’అని ఉంది. వెంటనే రెండోవాడు వచ్చాడు.. అతని టీ షర్ట్‌పై ‘యూ’అని ఉంది. మరో ఇద్దరు తోడయ్యారు.. వారి టీ షర్టులపై ‘మ్యారీ’, ‘మి’అని ఉంది. అక్షరాలు కలిపి చదివితే.. టడడడాయ్‌! ‘విల్‌ యూ మ్యారీ మీ’.. అని ఒక గాలిలో తేలే ప్రపోజల్‌ సిద్ధమైంది. ఆ నలుగురు బైకర్లు వరుసగా కళ్లముందు వెళ్తుంటే, ఆ అమ్మాయి షాక్‌ నుంచి తేరుకుని నవ్వే లోపే.. మన హీరో వీరేంద్ర జేబులోంచి మెరిసే ఉంగరం తీసి ఆఫర్‌ ఇచ్చేశాడు! 

    మాకూ ఇలాంటి గ్యాంగ్‌ కావాలి 
    ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బైకర్స్‌ కమ్యూనిటీ అంతా ‘బ్రదర్‌హుడ్‌ అంటే ఇదీ!’అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘రింగు తెచ్చాడు.. దానికి థ్రిల్‌ కూడా అటాచ్‌ చేశాడు!’.. అని ఒకరు.. ‘ఆయన హ్యాపీ, ఆమె హ్యాపీ, బైకర్స్‌ అందరూ హ్యాపీ!’.. అని మరొకరు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

    ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ సెటప్‌లు లేకపోయినా.. నలుగురు దోస్తులు, రెండు లీటర్ల పెట్రోల్‌ ఉంటే చాలు, ఇలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చని ఈ జంట నిరూపించింది.

    చ‌ద‌వండి: తెల్ల‌వారుజాము నుంచే క్యూ క‌డ‌తారు.. ఒక‌టి మాత్రమే అమ్ముతారు!

     

  • సాధారణ వ్యక్తులకు బరువు తగ్గడమే కష్టమైన టాస్క్‌ అనుకుంటే..అందులోనూ ఇలా పెరిమెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ సవ్యంగా ఉండవు. హర్మోన్ల మార్పులతో ఒక రకమైన చికాకు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. దాంతో కొందరికి విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది కూడా. అందువల్ల ఆ టైంలో బరువుని అదుపులో ఉంచడం అనేది మాములు విషయం మాత్రం కాదు. అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్‌ చేస్తూ వెయిట్‌లాస్‌ అవ్వొచ్చని చెబుతోంది స్వతహాగా ఫోటోగ్రాఫర్‌ అయిన ఈ ఇన్ఫ్లుయొన్సర్‌. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.

    పెరిమెనోపాజ్‌ సమయంలో బరువు తగ్గడం ఎలాగో అందుకు హెల్ప్‌ అయ్యే చిట్కాల గురించి షేర్‌ చేసుకున్నారు ఫోటోగ్రాఫర్‌  . ఆమె ఆ సమయంలోనే తాను ఆరు నెలల్లో 11 కిలోలు వరకు తగ్గానని చెప్పుకొచ్చారామె. ఈ సీక్రెట్‌ ఏంటో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారామె. మొదట్లో పెరిమెనోపాజ్‌లో ఉన్నప్పుడు బరువు తగ్గాను అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా..కానీ ఇప్పుడు గట్టిగా అరిచి చెబుతా. ఎందుకంటే..ఆ సమయంలో తన శరీరం చాలా లావుగా అసహస్యంగా ఉండటంతో..తనను తాను గుర్తించడం మానేసిన దారుణమైన పరిస్థితని చెప్పుకొచ్చారామె. 

    అయితే లాక్‌డౌన్‌ సమయం నుంచి ఇప్పటి వరకు బరువుని అదుపులో ఉంచేలా చక్కటి ఆహారాన్ని తీసుకుని సత్ఫలితాలు పొందానని ఆనందంగా వెల్లడించారామె. భవిష్యత్తులో 50 ఏళ్లు నిండిన నా ఆహార సంబంధాన్ని ఆరోగ్యప్రదంగానే ఉంచుకుంటానంటోంది. తాను ప్రోటీన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, బరువులు ఎత్తడం, చిరుతిళ్లకు దూరంగా ఉండటం అలవాట్లను తన డైట్‌లో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆ సమయంలో బరువు తగ్గాలంటే మన జీవనశైలి ఎలా ఉండాలో కూడా వివరించిందామె.  

    బరువులు ఎత్తడం..
    కండర ద్రవ్యరాశికి, జీవక్రియలు మెరుగుపడేందుకు వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తడం వంటివి చేసేదాన్ని అని తెలిపారామె.

    వాకింగ్‌
    అడుగుల సంఖ్యను రోజు రోజుకి పెంచుతూ అలా పదివేల అడుగులు వేసేలా సెట్‌ చేసుకున్నారట ఆమె. దీంతోపాటు వారానికి రెండుసార్లు యోగా సెషన్‌లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.

    ప్రోటీన్‌కి ప్రాధాన్యత..
    ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే ఆరోగ్యకరమైన ప్రోటీన్లను ఎంపిక చేసుకుని మరి తినేదాన్ని అని చెప్పారు.

    చిరుతిళ్లుకు చెక్‌..
    సంతృప్తిగా తినడం ప్రారంభించడంతో..చిరుతిళ్ల జోలికి వెళ్లిపనే తప్పిందని చెప్పింది. తన అల్పాహారంలో అదనపు కేలరీల ప్రధాన మూలం తన బరువు పెరిగేందుకు కారణమని భావించే వాటికి దూరంగా ఉన్నానని వివరించింది.

    సహజసిద్ధమైన వాటిని తీసుకుంటూ.. ఫిట్‌నెస్‌ యాప్‌తో తన ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేయడం ప్రారంబించారమె. అలాగే వెయిట్‌లాస్‌ ప్రక్రియలో ఇతరులు సహాయం తీసుకుంటూ మనలో మార్పులు వచ్చాయో లేదా అడగి తెలుసుకోవడం తదితరాలను చేయాలని చెప్పొకొచ్చింది ఫోటోగ్రాఫర్‌ కింబర్లీ ఎస్పినెల్‌.

     

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం

    (చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..)

     

National

  • భారతదేశ టెక్ రాజధాని బెంగళూరు భారీ ట్రాఫిక్‌తో అల్లాడిపోతోంది. నెదర్లాండ్స్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్ ప్రచురించిన తాజా ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, 2025లో బెంగళూరు ప్రపంచంలోనే రెండవ అత్యంత రద్దీ నగరంగా పేరుపొందింది. దీంతో సామాన్య ప్రజలతో పాటు, కార్పొరేట్‌  ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ  కావు.  అయితే ట్రాఫిక్‌ మూలంగా  విపరీతంగా బరువు తగ్గిపోయాను అని ఒక టెకీ వాపోతే, దాని ఆరోగ్యం మెరుగైందని  మరొకరు వాదించిన వైనం నెట్టింట  వైరల్‌గా మారింది.


    నగర ట్రాఫిక్‌, వ్యక్తిగత ఆరోగ్య ప్రభావంపై రెడ్డిట్ పోస్ట్  అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ప్రకారం  వైట్‌ఫీల్డ్ నుండి కోరమంగళకు ఒకప్పుడు ఒక ప్రొఫెషనల్ రోజువారీ ప్రయాణం దాదాపు 90 నిమిషాలు. అంటే గంటన్నర.  ఇలా రోడ్డుపై ఎక్కువ గంటలు ఉండటం వల్ల తన  లైఫ్‌ స్టైల్‌. ఆరోగ్యం, దెబ్బతిన్నదని ఆయన రాసుకొచ్చారు.  పని ఒత్తిడితో డెస్క్‌ దగ్గరే  భోంచేయడంతో కనీసం వ్యాయామం కూడా  లేకుండా పోయిందని వెల్లడించాడు. రోజులో ఎక్కువ భాగం అయితే డెస్క్ వద్ద లేదా ట్రాఫిక్‌లో కూర్చుని  గడపాల్సి వచ్చేది.  కాలక్రమేణా, ఒత్తిడి  పెరిగిపోయిందట. వ్యాయామమే లేదని చెప్పాడు.

    బెంగళూరు ట్రాఫిక్ మారలేదుగానీ ఆరోగ్యంపై ప్రభావం మాత్రం స్పష్టంగా ఉందని తెలిపారు. విశ్రాంతి హృదయ స్పందన రేటు 82 నుండి 64కి తగ్గిందని,బరువు తగ్గడానికి  ఎలాంటి ప్రయత్నం చేయకుండానే  దాదాపు ఎనిమిది కిలోల బరువు తగ్గానని  పేర్కొన్నాడు. అయితే ప్రతి వారంలో ఆఫీసుకు వెళ్లే బదులు, వారానికి మూడు రోజులు వర్క్‌ ఫ్రం హోం విధానంకాస్త ఊరటిచ్చిందని పేర్కొన్నారు. ఈ వెసులుబాటు కారనంగా రోజూ ఉదయం జిమ్‌కెళ్లడం, ఫుడ్‌డెలివరీపై ఆధారపడకుండా సమీపంలోని రెస్టారెంట్‌లకు నడవడం లాంటివి రోజువారీ దినచర్యగా సహజంగా అలవడ్డాయని చెప్పుకొచ్చారు.

    ఇదీ చదవండి: చిన్నారిని ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి, కాపాడిన డైపర్‌

    దీంతో చాలామంది తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “నేను ఒక సంవత్సరం పాటు బస్సులో ప్రయాణించాను. రెండు స్టాప్‌లలో బస్సులు మారుతూ 45 నిమిషాల ఒకవైపు ప్రయాణం చేసేవాడిని. ఆసమయంలో నిజంగా ఆరోగ్యంగా, రిలాక్స్‌గా ఉన్నాను.” అని ఒకరు వ్యాఖ్యానించగా దీన్ని కొంతమంది విభేదించారు. బెంగళూరు వంటి నగరాలకు ఇంటి నుంచి పనిచేసే విధానం మంచిదని వ్యాఖ్యానించారు. ప్రయాణానికి వెచ్చించే సమయానికి బదులుగా జిమ్‌కు  వెళ్లవచ్చిన సూచించారు.

    ఇదీ చదవండి: శవం సడెన్‌గా కాళ్లు పైకి లేపింది...ఇదిగో వీడియో!
     

  • ఛత్తీస్‌గఢ్ లోని సియోని గ్రామంలో షాకింగ్‌ ఘటన ఒకటి జరిగింది. తల్లి పొత్తిళ్లలోంచి అకస్మాత్తుగా మృత్యుముఖంలోకి జారిపోయిన 20 రోజుల పాప  అద్భుతంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. అసలే వీధికుక్కల బారిని అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఈ ఘటన మరింత ఆందోళన రేపింది.

    ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని సెవ్ని గ్రామంలో బుధవారం ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తల్లి చేతుల నుండి 20 రోజుల నవజాత శిశువును లాక్కొన్న కోతి బావిలో పడవేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ త్వరితగతిన చర్యలు తీసుకోవడంతో, సకాలంలో నర్సు  చికిత్స అందించడంతో  శిశువుకు పెద్ద ప్రమాదం తప్పింది.  

    శిశువు తల్లి సునీతా రాథోడ్ తన నవజాత శిశువుతో తన ఇంటి బయట కూర్చుంది. ఒక కోతి గుంపు సమీపంలోని పైకప్పుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుండి కిందకు దూకి శిశువును పట్టుకుని టెర్రస్‌పైకి ఎక్కింది. ఈ ఊహించని దాడి  భయాందోళనలకు గురిచేసింది. కుటుంబ సభ్యులు , గ్రామస్తులు సహాయం కోసం కేకలు వేసి, జంతువును భయపెట్టే ప్రయత్నంలో పటాకులు పేల్చారు. ఈ శబ్బాలు విని భయపడిపోయిన కోతి ఇంటి సమీపంలోని బహిరంగ బావిలో శిశువును విసిరివేసి అక్కణ్నించి ఉడాయించింది. క్షణాల్లో, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని  రక్షణ చర్యలు తీసుకున్నారు. వెంటనే ఒక బకెట్‌ను బావిలోకి దించి, నిమిషాల్లోనే శిశువును బయటకు తీశారు.

    డైపర్‌ కాపాడింది
    అప్పటికే శిశువు కొంత నీటికి తాగేసింది. కానీ అదృష్టవశాత్తూ పూర్తిగా మునిగిపోలేదు.  దానికి కారణం ఆమె ధరించిన  డైపర్. అది  పాపాయిని మునిగి పోకుండా కాపాడింది.

    సకాలంలో  స్పందించిన నర్సు 
    అంతేకాదు అక్కడే  ఉన్న,సర్గవాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  పనిచేసే నర్సు రాజేశ్వరి రాథోడ్, శిశువుకు సీపీఆర్‌ చేయడంతో అద్భుతం జరిగింది. గందరగోళం విని బిడ్డ ప్రాణాలను రక్షించేందుకు బిడ్డపాలిట దైవంలా సంఘటనా స్థలానికి చేరుకుంది. CPR  చేసి, బేబీ బాడీని రుద్దడంతో క్షణాల్లో శ్వాస తీసుకొని ఏడుపు ప్రారంభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్యులు నిర్ధారించారు.

    పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న శిశువు తండ్రి అరవింద్ రాథోడ్ మాట్లాడుతూ, తన కుమార్తె ప్రాణాలతో బయటపడటం అద్భుతం అని అన్నారు.  ఈ సందర్భంగా నర్సుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు ఈరోజు బతికి ఉందంటే, నర్సు, శిశువు ధరించిన డైపర్ కారణమని సంతోసం వ్యక్తం చేశారు.

     

  • శ్మశానంలో ఒంటరిగా ఉంటానని పందెం కాసి,చిన్ అలికిడికే ప్రాణాలు పోగొట్టుకున్న గాథలు గురించి విన్నాం.  దెయ్యాలతో మాట్లాడే భేతాళ కథలు విన్నాం. కానీ చనిపోయిన తరవాత శవాలు కదులుతాయని, వాటి శరీర భాగాల్లో ఒక్కసారిగా చలనం వస్తుందని తెలుసా? చాలా అరుదే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శవాల్లో ఇలా కదలికలు కనిపిస్తాయట. అంత మాత్రాన ప్రాణం తిరిగి వచ్చినట్టు కాదు.  మరి అదేంటో చూద్దాం.


    మార్చురీలో లేదా చనిపోయిన తర్వాతమృతదేహాలు కదలడం వినడానికి కొంత భయానకంగా అనిపించినప్పటికీ, దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దీనిని సైన్స్ భాషలో "లాజరస్ సైన్" (Lazarus Sign) లేదా "పోస్ట్మార్టం మూవ్‌మెంట్స్" (Postmortem movements) అని పిలుస్తారు.

     

    మృతదేహాలు కదలడానికి ప్రధాన కారణాలు
    కండరాల సంకోచం (Muscle Contraction) మనిషి చనిపోయిన తర్వాత కూడా శరీరంలోని కణాలు వెంటనే చనిపోవు. నరాలలో మిగిలి ఉన్న విద్యుత్ సంకేతాలు లేదా కండరాలలో నిల్వ ఉన్న క్యాల్షియం వల్ల కండరాలు అకస్మాత్తుగా సంకోచించవచ్చు. దీనివల్ల కాళ్లు లేదా చేతులు స్వల్పంగా కదిలినట్లు అనిపిస్తుంది.

    రిగర్ మోర్టిస్ (Rigor Mortis) : మరణం తర్వాత శరీరం గట్టిపడటాన్ని 'రిగర్ మోర్టిస్' అంటారు. ఈ ప్రక్రియలో రసాయన మార్పుల వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఈ సమయంలో శరీరం ఒక స్థితి నుండి మరో స్థితికి మారినప్పుడు (ఉదాహరణకు వేళ్లు ముడుచుకోవడం) అది కదలికలా కనిపిస్తుంది.

    వాయువుల విడుదల (Gas Accumulation): శరీరం కుళ్ళిపోయే క్రమంలో (Decomposition) లోపల బ్యాక్టీరియా వల్ల గ్యాస్ విడుదలవుతుంది. ఈ వాయువుల ఒత్తిడి వల్ల మృతదేహం ఉబ్బడం, కొద్దిగా పక్కకు తిరగడం లేదా నోటి నుండి శబ్దాలు రావడం (Death Rattle) వంటివి జరుగుతాయి.

    వెన్నెముక రిఫ్లెక్స్ (Spinal Reflexes) : కొన్నిసార్లు మెదడు చనిపోయినా, వెన్నెముకలోని నాడులు (Spinal cord neurons) ఇంకా ఉత్తేజితంగానే ఉండవచ్చు. దీనివల్ల మృతదేహం అకస్మాత్తుగా చేతులు పైకి ఎత్తడం వంటివి చేస్తుంది. దీనినే పైన చెప్పుకున్న లాజరస్ సైన్ అంటారు.

    అయితే వైద్యులు మరణాన్ని నిర్ధారించిన తర్వాత ఇలాంటి కదలికలు సహజమంటారు శాస్త్రవేత్తలు.  ఇవి కేవలం భౌతిక , రసాయన మార్పులే తప్ప, ప్రాణం రావడం వల్ల జరిగేవి కాదని స్పష్టంగా చెబుతారు.

  • చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. తమిళ  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.

    డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్‌) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ..  డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.

    ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ  ప్రధాని మోదీ ఆరోపించారు.

  • న్యూఢిల్లీ : దేశరాజధాని నగరం ఢిల్లీలో శుక్రవారం ఉన్నట్టుండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో కాలుష్య భూతంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ వాసులకు  చాలా ఉపశమనం లభించింది.  గాలి నాణ్యత  మెరుగుపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది.   అయితే ఈ వాతావరణాన్ని భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఎంజాయ్‌ చేయడం విశేషంగా నిలిచింది.

    ఢిల్లీ వాతావరణం చల్లగా ఉండటంతో  సైమన్ వాంగ్  ఆసక్తికర విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. వేడి వేడి చాయ్‌ కప్పును పకోడీలు, వర్షంతో తడిచిన పచ్చగా మెరుస్తున్న పచ్చిక బయలులో  వర్షాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు  కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు.  చాయ్‌, పకోడితో ఈ ఏడాదిలో (2026) చాయ్ పకోడీతో  ఇదే ఫస్ట్‌ బారిష్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్నా..  నాతో చేరండి?”  అనే  క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్‌చేశారు.

    దీంతో నెటిజన్లు కూడా వర్షంలో తడిచిపోయినంత సంతోష పడ్డారు.  చాలా బాగుంది... నేను కూడా వస్తున్నా అని ఒకరు, ఉల్లి పకోడి అయితే సూపర్‌గా ఉంటుంది సార్‌. అని ఒకరు కమెంట్‌ చేయగా,  “సర్, నేను తయారుచేసిన టీని మీరు తప్పక తాగండి అని  మరొకరు కామెంట్‌ చేయడం విశేషం.

    దిగి వస్తున్న కాలుష్యం
    ఢిల్లీ-NCR శుక్రవారం ఉదయం చల్లని శీతాకాల పరిస్థితుల మధ్య 2026లో తొలిసారి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. IMD ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గేఅవకాశం ఉంది. జనవరి 23న, కనిష్ట ఉష్ణోగ్రత 12°C వద్ద నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది 19°C. వర్షం తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది, రోజుల తరబడి ప్రమాదకర కాలుష్యం తర్వాత AQI 'సంతృప్తికరమైన' 201-300  స్థాయికి చేరింది.

     

    సైమన్ వాంగ్
    2020న జూన్‌ 30న భారత రిపబ్లిక్‌కు హై కమిషనర్‌గా సైమన్ వాంగ్ వీ కుయెన్‌ను నియమించింది సింగపూర్‌.  ముందు, అతను జూలై 2015 నుండి జనవరి 2020 వరకు తైవాన్‌కు సింగపూర్ వాణిజ్య ప్రతినిధిగా ఉన్నారు.

     

  • తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రం కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఇది వికసిత కేరళ సమయం.. రానున్నది ఎన్‌డీఏ ప్రభుత్వానికి సమయం అంటూ వ్యాఖ్యలు చేశారు.

    బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘కేరళలో అవినీతి అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకుంది. ఎల్‌డీఎఫ్ హయాంలో బ్యాంకుల్లో జమ చేసిన పొదుపు కూడా ప్రభావితమైంది. సహకార బ్యాంకు కుంభకోణం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు దోపిడీకి గురైంది. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. దోపిడీదారుల నుండి ప్రతి రూపాయిని తిరిగి తీసుకునేలా మేము చూస్తాం. అధికార లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌), కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌)ల అవినీతిని అంతం చేస్తాం. రాబోయే ఎన్నికలు రాష్ట్ర పరిస్థితులను మార్చేస్తాయి. 

    ఇప్పటివరకు మీరు ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ల పాలన మాత్రమే చూశారు. అవి రాష్ట్రాన్ని నాశనం చేశాయి. మూడోవైపు ఉంది. అది బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనను అందిస్తుంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లకి వేర్వేరు జెండాలు ఉన్నప్పటికీ.. వాటి అజెండా ఒక్కటే. అదే అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం. ఇప్పుడు ప్రజల అభివృద్ధికి తోడ్పడే ప్రభుత్వం అవసరం, ఆ పని మేం చేస్తాం. కేరళ ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచి.. మాతో చేతులు కలపాలి అని కోరారు.

    ఇదే సమయంలో శబరిమల ఆలయంలో బంగారు చోరీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. మొత్తం దేశానికి, మనందరికీ అయ్యప్ప స్వామిపై అచంచలమైన విశ్వాసం ఉంది. అయితే, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం శబరిమల ఆలయ సంప్రదాయాలను దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు, ఇక్కడ బంగారం దొంగతనం జరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. స్వామివారి పక్కనుండే ఆలయం నుండి బంగారం దొంగిలించబడినట్లు నివేదికలు వస్తున్నాయి. నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. కేరళలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుంది. దోషులను జైలుకు పంపిస్తాం. దీనిపై విచారణ జరిగేలా చూడటం ‘మోదీ గ్యారెంటీ’ అని పేర్కొన్నారు.

    కాగా, కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ కేరళలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలలో బీజేపీ.. 45 సంవత్సరాల తర్వాత ఎల్‌డీఎఫ్ నుండి తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ప్రధాని ఈ విజయాన్ని అసాధారణమైనదిగా, చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తూ ఇది కేరళలో బీజేపీ ప్రభుత్వానికి పునాది వేసిందని అన్నారు. ఇక, కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

  • పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా,  అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్‌ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.

    ‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్‌స్టా ఖాతాలో  భారతీయ  పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన  ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు,  లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్‌కి  వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి  కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి  కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు  జాగ్రత్తగా  పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్‌లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే  క్యాప్షన్‌తో  షేర్‌ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.

    > ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్‌
    కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్‌లో  ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్‌తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై  ఇది  కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు.
     

  • ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో ఇవాళ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. బహిరంగ సభకు హజరైన జనాల్లో ఓ పిల్లాడు చేసిన పని మోదీ దృష్టిని ఆకర్షించింది. అంతే.. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. 

    తిరువనంతపురంలో శుక్రవారం ప్రధాని మోదీ సభ జరిగింది. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రధాని మోదీ డ్రాయింగ్‌ ఫోటోను ఎత్తిపట్టి చాలా సేపు నిలబడి ఉన్నాడు. అది గమనించిన ప్రధాని మోదీ.. తన ప్రసంగాన్ని ఆపి ఆ బాలుడిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘చిన్నోడా, నువ్వు చాలా సేపు ఫోటో పట్టుకుని నిలబడ్డావు. అలసిపోయి ఉంటావ్‌. ఆ ఫోటోను నాకు ఇవ్వు. దాని వెనకాల నీ చిరునామా రాయు. నేను నీకు వ్యక్తిగతంగా లేఖ రాస్తాను’’ అని అన్నారు. 

    ఈ క్రమంలో.. ఆ పిల్లాడి చేతుల్లోని ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని తన ప్రత్యేక రక్షణ బృందం (SPG)కి సూచించారు. అది ఆ బాలుడి ప్రేమ, ఆశీర్వాదాల ప్రతీక. దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో సభ ఒక్కసారి చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ సమయంలోనే.. మరో మహిళ ఓ పెద్ద పుస్తకాన్ని ఎత్తి మోదీ వైపు ప్రదర్శించింది. మోదీ ఆమెను కూడా గుర్తించి.. ఆమె కూడా నాకు ఏదో ఇవ్వాలని అనుకుంటున్నారు. పెద్ద పుస్తకం తయారు చేసి తీసుకొచ్చారు అని అనడంతో నవ్వులు పూశాయి. 

    ఇక కేరళ సభలో మోదీ రాజకీయ ప్రసంగంలో.. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళలో మార్పు అవసరమని.. అందుకు బీజేపీని ఆశీర్వదించాలని కేరళ ప్రజలను ఆయన కోరారు. ఇప్పటికే ఆ మార్పు మొదలైందని.. ప్రజల ఆశీస్సులతోనే కేరళలో కమల వికాసం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ పర్యటనలోనే ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొత్త రైలు సేవలను ప్రారంభించారు. కేరళ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేరళ ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించారాయన. 

  • ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తాం..అన్న నేతలే పారిపోతుంటే, ఓ బాలుడు మాత్రం అందుకు భిన్నంగా నిలుస్తున్నాడు. చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అవినీతి చూసి ‘ఆ నాకెందుకులే’ అని పక్కకు తప్పుకోకుండా, ప్రశ్నిస్తున్నాడు. విమర్శిస్తున్నాడు. ఇందుకోసం పాఠ్య పుస్తకాలే కాదు, లా పుస్తకాలు కూడా తిరగేస్తున్నాడు. అధికారులకు, నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నెటిజన్లు అతన్ని ‘యూపీ భగత్‌ సింగ్‌’గా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

    ఉత్తరప్రదేశ్‌ లక్నోకు చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్వమిత్‌ గౌతమ్‌. సాధారణంగా 14ఏళ్ల బాలుడు అంటే తొమ్మిది, లేదంటే పదోతరగతి పుస్తకాలతో కుస్తీ పడతారు. మార్క్స్‌,ఎగ్జామ్స్‌,పర్సంటేజ్‌ పేరుతో క్షణం తీరికి లేకుండా స్కూల్‌,ట్యూషన్‌,ఇల్లే జీవితంగా గడిపేస్తుంటారు. కానీ ఈ ఛోటా భగత్‌ సింగ్‌ అలా కాదు. 

    సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించాడు. రాజకీయాలు, నేతలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, మీడియా, వ్యాపారవేత్తల స్కాంలు వంటి అంశాలపై ఆధారాలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు అతన్ని అభినవ భగత్‌ సింగ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌తో పోలుస్తున్నారు. ఈ చైతన్యం పాలకులను, అధికారులను అసహనానికి గురి చేసింది. మైనర్‌ అని కూడా చూడకుండా అతనిపై సెక్షన్‌ 151 ప్రయోగించి అరెస్టు చేశారు. కొద్దిసేపటికే విడుదల చేసినా, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతని వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతూ, ప్రభుత్వాలపై అతను సంధించిన ప్రశ్నలు ప్రజల్లో చైతన్యం రేపుతున్నాయి.

    వెరసీ అతడిని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మక వీడియోలు పోస్ట్‌ చేసినందుకు ఈ చర్య తీసుకోవడం పిల్లల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తింది. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై కేసులు నమోదు చేయడం ప్రత్యేక నిబంధనలతో మాత్రమే సాధ్యం. ఈ కేసు చట్టపరమైన సరళతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. న్యాయవేత్తలు పిల్లలపై ఇలాంటి చర్యలు భయపెట్టే ప్రయత్నం’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

    అశ్వమిత్‌ గౌతమ్‌ కథ ఒక చిన్నారి ధైర్యానికి ప్రతీక. వయసు చిన్నదైనా, ఆలోచనలు పెద్దవిగా మారి సమాజాన్ని కదిలిస్తున్నాయి. పిల్లలపై ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సత్యం, న్యాయం కోసం ప్రశ్నించే స్వరం ఎప్పటికీ ఆగదు. ఈ బాలుడి ధైర్యం కొత్త తరం యువతకు ప్రేరణగా నిలుస్తోంది.