Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఐకాన్ స్టార్ అల్లు ‍అర్జున్ తమ్ముడు శిరీష్‌ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.   అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.

    కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్‌ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. 
     

     

  • తమిళ స్టార్ హీరో సూర్యతో దర్శకుడు పూరి జగన్నాధ్ కొత్త సినిమా ఫైనల్ అయింది. ప్రస్తుతం సూర్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే పూరి దర్శకత్వంలో సూర్య చేయబోయే సినిమా ఉండే అవకాశం ఉంది. అసలు ముందుగా వెంకీ అట్లూరి సినిమా తరువాత సూర్య మరో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దాంతో ఆ స్థానంలో పూరి జగన్నాధ్‌కు అవకాశం దక్కింది.  

    అయితే సూర్యతో సినిమా చేయడానికి దర్శకుడు చందు మొండేటి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తండేల్ సినిమా ముందు నుంచే ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన కార్తికేయ 3 ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.  

    హీరోల డేట్స్ సంపాదించడం పూరి జగన్నాధ్ కు పెద్ద సమస్య కాదు. పూరి-విజయ్ సేతుపతితో చేసిన సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి. 

  • ఎనిమిదేళ్ల క్రితం రష్మిక మెడలో తాళి కడుతుంటే విజయ్‌కు చేతులు వణికాయి. కానీ ఇప్పుడు భయం, బెరుకు ఏదీ లేదు.. మనసంతా గాల్లో తేలుతోంది. చుట్టూ ఉన్న వాతావరణమంతా ప్రేమమయంగా మారింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్‌- రష్మిక రీల్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్‌ చూసి సగటు ప్రేక్షకుడు మురిసిపోయాడు.

    ఆ సినిమాతో పునాది
    ఇప్పుడూ అంతే.. రియల్‌ లైఫ్‌లో విజయ్‌- రష్మిక ఒక్కటైనందుకు ప్రేక్షకలోకం సంతోషంగా శుభాకాంక్షలు చెప్తోంది. కలకాలం కలిసి జీవించమని దీవిస్తోంది. వీరి ప్రయాణానికి పునాది పడింది గీత గోవిందం సినిమాతోనే! పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమా అయిపోయే సరికి మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. డియర్‌ కామ్రేడ్‌ మూవీ చేస్తున్న టైంలోనే స్నేహం ప్రేమగా మారగా.. ఫస్ట్‌ రష్మికనే లవ్‌ ప్రపోజ్‌ చేసింది. 

    గీత గోవిందం ఫస్ట్‌ ఛాయిస్‌ రష్మిక కాదు
    అలా ఈ ఏడడుగల బంధానికి తొలి అడుగు పడింది. అయితే గీత గోవిందం సినిమా ఆఫర్‌ రష్మిక కంటే ముందు చాలామంది హీరోయిన్స్‌కు వెళ్లిందట! వారిలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కూతురు ఐశ్వర్య ఒకరు. ఈమె ఇటీవలే సీతా పయనం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ దీనికంటే ముందు తనకు తెలుగులో గీత గోవిందం ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. నేను చేయని ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి.

    సినిమా
    తెలుగులో 'గీత గోవిందం' కథ విన్నాను. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇది చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందని తెలిసింది. ఏదేమైనా చివరకు సినిమా అద్భుతంగా వచ్చింది అని పేర్కొంది. ఐశ్వర్య.. గీత గోవిందం పోగొట్టుకున్నప్పటికీ సీతా పయనం మూవీతో మంచి డెబ్యూ అందుకుంది. అటు రష్మికకు.. గీత గోవిందం కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగానూ బాగా కలిసొచ్చింది.

    చదవండి: కొత్త కోడలు వచ్చింది.. బాగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ

  • మొబైల్‌ ఫోన్‌ వినియోగం పెరిగాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. అలాగే ఓటీటీలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ అంతా ఎంచక్కా ఉన్నచోటునే చూసే అవకాశం లభించింది. అలా చాలామంది కొరియన్‌ సినిమాలు, సిరీస్‌లకు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా కొందరమ్మాయిలైతే బానిసలైపోయారు!

    ఓటీటీ సినిమా
    దీంతో ఈ కొరియన్‌ కాన్సెప్ట్‌తో ఓ మూవీ తీశారు. ఓజీ హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ వదిలారు. అందులో ఓ అమ్మాయికి చిన్నప్పటినుంచి కొరియా అంటే చాలా ఇష్టం. కనీసం ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్నది తన కోరిక. అనుకున్నట్లుగా పెద్దయ్యాక ఎలాగోలా కొరియా వెళ్తుంది. కానీ అక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అదే ట్రైలర్‌లో చూపించారు.

    మనసు చెప్పేది వినండి
    మనకు నచ్చిన పనిచేయడం కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు. నీవల్ల కాదు అంటారు. తెలియనివారు మనపై ప్రేమ చూపిస్తారు.. బాగా తెలిసినవారు మనల్ని బాధపెడతారు. ఎంత ఏడ్చినా, ఎంత నవ్వినా.. మనల్ని చీరప్‌ చేసి మేమున్నామంటూ మనకోసం నలుగురు వస్తారు. ఈ అనుభవాల్ని మీకు ఎదురవ్వాలంటే మీ మనసు చెప్పేది వినండి అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ బాగుంది. మేడ్‌ ఇన్‌ కొరియా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 12న విడుదల కానుంది.

     

    చదవండి: ఆస్తుల్లేవ్‌.. అద్దె ఇంట్లో ఉంటున్నా: వరలక్ష్మి

  • ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా, రచయితగా పరిచయమవుతున్న తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా'. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నర్సాపురం, విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

    ఈ సందర్భంగా హీరో, రైటర్ ఉలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ మిమ్మల్ని అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలి" అని కోరారు.

    ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక వీడియో సందేశం (AV) ద్వారా ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. చిత్ర బృందం కొత్తవారైనప్పటికీ, చాలా పరిణతితో అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడండి" అని చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది. 

  • ఇప్పటివరకు హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్‌ సరస్వతి చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ హాజరైన వరలక్ష్మి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది.

    రాజకీయాల్లోకి వస్తా..
    నాకంటూ పెద్ద ప్రాపర్టీలు ఏం లేవు. ప్రస్తుతం అద్దె ఇంట్లోనే ఉన్నాను. నా సంపాదనతో నాకంటూ ఒక కారు కొనుక్కున్నాను. అలాగే ఒక చిన్న ఇల్లు కొన్నానంతే! భారీగా ఆస్తులుంటే ఇక్కడెందుకు ఉంటాను? ఇకపోతే నాకు రాజకీయాలంటే ఇష్టం. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా భవిష్యత్తులో తమిళనాడులో లేదా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

    పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చు
    సరస్వతి సినిమా విషయానికి వస్తే.. షూటింగ్‌ అయిపోయాక చిత్రయూనిట్‌ అందరికీ ఒక బంగారు నాణెం బహుమతిగా ఇచ్చాను. కాగా నన్ను తమిళ చిత్రపరిశ్రమ సరిగ్గా వాడుకోలేదు. నాలుగైదు సినిమాలు మినహా తర్వాత అక్కడ ఎవరూ నా టాలెంట్‌ను పట్టించుకోలేదు అని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ఓ ఆసక్తికర రూమర్‌ గురించి చెప్తూ.. నా పెళ్లికి రూ.800 కోట్ల ఖర్చయిందని సోషల్‌ మీడియాలో రాశారు. అది చూసి బాగా నవ్వుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంటే నేనెందుకు ఇక్కడుంటాను? అని వరలక్ష్మి నవ్వేసింది.

    చదవండి: ఒంటరితనం భరించలేకున్నా.. తోడు కావాలి: నటి

  • దాదాపు 40 సినిమాలు చేసిన కమెడియన్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌ కొల్లం సుధి 2023లో మరణించాడు. అతడి మరణంతో ఎంతగానో కుంగిపోయింది కమెడియన్‌ రెండో భార్య, నటి రేణు సుధి. అయితే రానురానూ ఆ బాధ నుంచి తేరుకుంటూ తనకిష్టమైన వ్యాపకాలపై శ్రద్ధ పెట్టింది. రీల్స్‌ చేయడం, సాంగ్స్‌లో యాక్ట్‌ చేయడం, రకరకాలుగా ఫోటోషూట్స్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో తన పేరు మారుమోగిపోయేది. 

    బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు
    కొందరైతే వితంతువై ఉండి ఈ పిచ్చి చేష్టలేంటి? సుధికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావ్‌ అని విమర్శించారు కూడా! అలా ట్రోలింగ్‌ బారిన పడ్డ సమయంలో మలయాళ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసింది. అక్కడ వచ్చిన క్రేజ్‌తో రెండు, మూడు సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. తాజాగా రేణు సుధికి భాగస్వామి కావాలనిపిస్తోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వెల్లడించింది. 

    తోడు కావాలి
    ఒంటరితనం భరించలేకపోతున్నాను. నాకు ఒక పార్ట్‌నర్‌ కావాలనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకుని, నా బాగోగులతో పాటు పిల్లల్ని చూసుకునే తోడు కావాలనిపిస్తోంది అని రాసుకొచ్చింది. గతంలో కూడా రేణు మళ్లీ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటానంది. అప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు వదిలేసి అతడితో మరో ఇంట్లో స్థిరపడతానంది. అలాగే తన పేరు పక్కన ఉన్న సుధిని చెరిపేస్తానంది.

    రెండో పెళ్లి
    మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న కొల్లం సుధిని మొదటి భార్య వదిలేసింది. అప్పటికే వీరికి కుమారుడు రాహుల్‌ సంతానం. భార్య వదిలేశాక సింగిల్‌ పేరెంట్‌గా చాలా ఇబ్బందులు పడ్డాడు సుధి. కొన్నేళ్ల తర్వాత అతడికి రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు రితుల్‌ సంతానం. రేణుకు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం!

  • విజయ్‌ దేవరకొండ, రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. స్నేహితులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, బుధవారం (మార్చి 4) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు నాగార్జున- అమల దంపతులు, నాగచైతన్య, రామ్‌చరణ్‌- ఉపాసన జంట, రాధికా-శరత్‌కుమార్‌ దంపతులు, నమ్రత శిరోద్కర్‌, ఆమె కూతురు సితార.. తదితరులు హాజరయ్యారు.

  • ఒకప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్‌ వృద్ధాశ్రమంలో తల దాచుకుంటోంది. అయితే శ్యామల ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ స్పందించాడు.

    ఒక అడుగు ముందుకేసి..
    శ్యామల, ఆమె కూతురి నిత్యావసరాలు, వైద్యఖర్చుల నిమిత్తం నెలకు రూ.10 వేలప్పున ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ డబ్బు ఆమెకు అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. గతంలో పలువురు సెలబ్రిటీలు పావలా శ్యామలకు సాయం చేశారు. అయితే బన్నీ ఒక అడుగు ముందుకేసి తాత్కాలిక సాయం కాకుండా శాశ్వతంగా ప్రతి నెల ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ పంపేందుకు చర్యలు తీసుకోవడం విశేషం!

  • డెస్టినీ(విధి) అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడదే విజయ్ దేవరకొండ-రష్మికని ఒక్కటి చేసింది. అప్పుడెప్పుడో సినిమా నటులుగా మొదలైన వీళ్ల ప్రయాణం.. ఇప్పుడు భార్యభర్తలుగా మారేందుకు కారణమైంది. ఈ సందర్భంగా వీళ్ల గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దానికి తోడు పెళ్లి ఫొటోలు, సొంతూరిలో విజయ్ సత్యనారాయణ వ్రతం చేయడం, ఊరి వాళ్లందరికీ భోజనాలు పెట్టించడం లాంటి విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు రష్మిక గురించి విజయ్ చేసిన తొలి ట్వీట్ కూడా బయటకొచ్చింది.

    (ఇదీ చదవండి: కొత్త కోడలొచ్చింది.. మంచిగా చూసుకోండి: విజయ్‌ దేవరకొండ)

    తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. సహాయ నటుడిగా పలు సినిమాలు చేసి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి తదితర చిత్రాలతో హీరోగా మంచి ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'గీతగోవిందం' అయితే విజయ్‌ని ఫ్యామిలీ ఆడియెన్స్‌కి దగ్గర చేసింది. ఇందులో రష్మిక హీరోయిన్. ఈ మూవీలోనే విజయ్-రష్మిక కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అదే సినిమాకు చాలా ప్లస్ అయింది కూడా. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగానే రష్మిక పాత్ర గురించి 2018 జూన్ 23న ట్వీట్ చేసిన విజయ్.. ఇప్పుడు దాన్ని నిజం చేశాడు.

    'నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా నడుము నొప్పి లేచినా మీ బరువు బాధ్యత ఎప్పుడు నాదే మేడమ్' అని సదరు ట్వీట్‌లో విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ఇక్కడున్నది సినిమాలో రష్మిక పాత్ర గురించే కావొచ్చు. కానీ ఆరేళ్ల తర్వాత తన ట్వీట్ నిజమవుతుంది, రష్మిక తన భార్య అవుతుందని విజయ్ కూడా ఊహించి ఉండడు. విధి వీళ్లిద్దరిని కలిపింది. ఈ క్రమంలోనే విజయ్ చేసిన పాత ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

  • టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్‌ రిసెప్షన్ నేడు(మార్చి 4) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అయితే ఈ విందు కంటే ముందే..తెలుగు మీడియాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మధ్యాహ్నం ఆయన సతీమణి రష్మికతో కలిసి మీడియా ప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌ మట్లాడుతూ.. తన కెరీర్‌లో మీడియా సహాకారం ఎంతో ఉందన్నారు.‘కెరీర్‌ ప్రారంభంలో     నాకు మీడియా చాలా సపోర్ట్‌ చేసింది. నన్ను ప్రజల దగ్గరకు చేర్చేలా చేసింది మీడియాను. 

    నా ప్రతి ఇంటర్వ్యూను తిరిగి చూసుకునేవాడిని. ఎలా మాట్లాడాను? ఇంకా ఎలా మట్లాడాలి?అనేది తెలుసుకునేవాడిని. ఇప్పుడు పెళ్లి చేసుకొని రష్మికతో కలిసి జంటగా మీ దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఇదో విభిన్న అనుభూతి. కాలం గడిచిపోతోంది. మనం పెద్దవాళ్లం అయిపోతున్నాం, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. కానీ, మిమ్మల్ని మర్చిపోం. మీరు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. తెలుగు మీడియా అనేది మా సొంత మీడియా. మీ ఆశీస్సులు మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలకు ఒక కొత్త కోడలు వచ్చింది. మంచిగా చూసుకోండి’ అంటూ విజయ్‌ నవ్వులు పూయించాడు. 

    కాగా, ఇప్పటికే విజయ్‌-రష్మిక జంట అభిమానుల కోసం ఓ ప్రత్యేక విందును ఇచ్చింది. అలాగే మార్చి 1న హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అహ్మదాబాద్‌తో సహా అనేక ఇతర ప్రధాన కేంద్రాలతో పాటు భారతదేశంలోని 23 నగరాల్లో వేలాది స్వీట్‌ బాక్స్‌లు పంపిణీ చేశారు.కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌  ఇతర రాష్ట్రాలలోని పదహారు దేవాలయాలలో ‘అన్నదానం‘ నిర్వహించారు. వీటిలో బెంగళూరులోని శివోహం ఆలయం,   బృందావనంలోని శ్రీ శ్రీ కృష్ణ బలరాం మందిర్‌ వంటివి ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.  

  • బాలీవుడ్‌ నటి రాజశ్రీ దేశ్‌పాండే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. క్యాన్సర్‌ ప్రారంభదశలోనే దాన్ని గుర్తించడంతో పాటు ఆపరేషన్‌ కూడా చేయించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నేను ఇన్‌ఫిల్టరేటింగ్‌ డక్టల్‌ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్‌ 1లో ఉంది. 

    రొమ్ము క్యాన్సర్‌
    ఇప్పుడు మీరిది చదువుతున్నారంటే ఈ వ్యాధి గురించి నేను నా తల్లిదండ్రులకు చెప్పేందుకు ధైర్యం కూడదీసుకున్నట్లే లెక్క! నేను రొటీన్‌ చెకప్‌కు వెళ్లినప్పుడు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. అదృష్టవశాత్తూ ప్రారంభం దశలోనే గుర్తించగలిగాం. లెక్కలేనన్ని టెస్టులు, శస్త్రచికిత్సలు.. ఇదంతా రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా అనిపిస్తోంది. కానీ మీ ప్రేమాభిమానాలే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించాయి. 

    భయం పటాపంచలు
    సర్జరీ తర్వాత అమ్మానాన్న ముఖం చూడగానే నాలో భయం పటాపంచలై కొత్త శక్తి ప్రవహించింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్తాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు.. నువ్వు స్ట్రాంగ్‌ లేడీవి.. త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    కెరీర్‌
    రాజశ్రీ దేశ్‌పాండే తలాష్‌ (2012) చిత్రంతో బాలీవుడ్‌లో తన కెరీర్‌ ఆరంభించింది. కిక్‌, మామ్‌, ద స్కై ఈజ్‌ పింక్‌, జోరం వంటి చిత్రాల్లో నటించింది. బుల్లితెరపై కుచ్‌ తో లోగ్‌ కహేంగే, 24: ఇండియా సీరియల్స్‌లోనూ యాక్ట్‌ చేసింది. సేక్రెడ్‌ గేమ్స్‌ అనే నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌తో విశేషమైన పాపులారిటీ దక్కించుకుంది.

     

     

    చదవండి: నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్‌ నటి

  • ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్‌లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

    తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోహీరోయిన్లు నిర్మాతలు వస్తూనే ఉంటారు. అలా తీసిన ఓ సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్లే పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ మూవీ గతేడాది మార్చి 21న థియేటర్లలోకి వచ్చింది. అందరూ కొత్త నటీనటులే కావడంతో ఇదొకటి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ చిత్రం ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 06) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

    'అనగనగా ఆస్ట్రేలియాలో' విషయానికొస్తే.. హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్‌లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్‌కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'ఉ‍స్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?)

  • 1990 ప్రాంతంలో కురక్రారు కంటికి నిద్ర కరువు చేసిన నటి రంభ. ఈమె నడక చూడడానికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఈ పదహారు అణాల తెలుగు భామ ఎనిమిది భాషల్లో మొత్తం 100కుపైగా చిత్రాల్లో కథానాయికిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. సర్గం అనే మలయాళ చిత్రంతో 1991లో కథానాయకిగా పరిచయమై , ఆ వెంటనే. మాతృభాషలో (తెలుగు) ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అంతే ఆ తరువాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, బోజ్‌పురి ఇలా ఎనిమిది భాషల్లో నటించారు. 

    తెలుగులో  చిరంజీవి, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలు, అదేవిధంగా తమిళంలో రజనీకాంత్, కమలహాసన్, కార్తీక్, అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టారు. నిర్మాతగాను అవతారమెత్తిన ఈమె కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. కథానాయకిగా ఫుల్‌ఫామ్‌లో ఉండగా ఇంద్రకుమార్‌ అనే లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. వీరి పెళ్లి 2010లో జరిగింది. రంభకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

    కాగా వివాహం తరువాత నటనకు దూరంగా ఉన్న రంభ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ నటిగా రీఎంట్రీ కావడానికి సిద్ధమవుతున్నారు.  ఇటీవల చెన్నైకి చేరుకున్న ఈ భామ సినిమాల్లో అవకాశాల వేట మొదలుపెట్టారు. అందుకుగాను 49 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ శారీరక వ్యాయామాలు చేసి బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకున్నారు. 

    సినిమా అవకాశాలు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా బుల్లి తెర కార్యక్రమంలో పాల్గొంటూ దర్శక, నిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొత్తం మీద తెలుగు, తమిళం భాషల్లో ఒక్కో అవకాశం సంపాదించినట్లు తాజా సమాచారం. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అలా అందాల భామ రీఎంట్రీ షురూ అయింది అన్నమాట.  

  • ధురంధర్‌ సినిమాలో యాక్ట్‌ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్‌ అంటూ సాగే ఐటం సాంగ్‌లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్‌ తెచ్చుకుంది ఆయేషా ఖాన్‌. అయితే గతంలోనూ ఓ సాంగ్‌లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్‌ చేశారని చెప్తోంది. 

    సడన్‌గా తీసేశారు
    తాజాగా ఓ ఈవెంట్‌లో ఆయేషా ఖాన్‌ మాట్లాడుతూ.. టీ సిరీస్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్‌ హీరోయిన్‌గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్‌ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. 

    నిజంగా బాధాకరం
    ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్‌ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్‌ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్‌ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్‌ చేస్తారు.

    ఫేమస్‌ కాకపోయుంటే..
    అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్‌ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.

    సినిమా
    సీరియల్స్‌లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్‌. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్‌ బుష్‌, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్‌, కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌ 2 సినిమాలు చేసింది.

    చదవండి: విజయ్‌- రష్మిక.. ఎవరు ప్రపోజ్‌ చేశారంటే?

  • టాలీవుడ్ నుంచి ఈ నెలలో రాబోతున్న భారీ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. మార్చి 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. విడుదలకు మరో 20 రోజుల మాత్రమే  సమయముంది. సరిగ్గా ఈ సమయంలో కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?

    (ఇదీ చదవండి: అప్పట్లో రూ.9 లక్షలకు ఎకరం అమ్మాను.. ఇప్పుడు రూ.100 కోట్లు: శివాజీ)

    'గబ్బర్ సింగ్' కాంబో రిపీట్ చేస్తూ పవన్-హరీశ్ శంకర్ మరోసారి కలిసి పనిచేసిన సినిమా ఇది. తొలుత 'భవదీయుడు భగత్ సింగ్' పేరుతో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. తమిళ మూవీ 'తెరి'కి ఇది రీమేక్ అని అన్నారు. కానీ తర్వాత తర్వాత టైటిల్ 'ఉస్తాద్ భగత్ సింగ్' అని మారినా సరే రీమేక్ రూమర్స్ మాత్రం ఆగలేదు. దర్శకుడు, మూవీ టీమ్ ఎంతలా ఇది రీమేక్ కాదు బాబోయ్ అని అంటున్నా జనాలు, అభిమానులు కూడా ఎందుకో నమ్మట్లేదు.

    ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే రెండు పాటలు కూడా రిలీజయ్యాయి. వీటిలో ఒకటి ఆకట్టుకోగా.. రెండోది దారుణంగా నిరాశపరిచింది. ఇకపోతే ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవికి బదులు తమన్ పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టులు కొన్ని వైరల్ అవుతున్నాయి. అలానే మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' వాయిదా పడడంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని 'ఉస్తాద్..' టీమ్ భావిస్తోంది. అనుకున్నట్లు 26న కాకుండా ఓ వారం ముందుకు జరిగి 19వ తేదీన తమ సినిమాని రిలీజ్ చేయాలని హరీశ్ శంకర్ అండ్ టీమ్ అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంతవరకు నిజముందనేది ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.

    (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

  • పదిహేను ఇరవైళ్ల క్రితం హీరో, విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ.. తర్వాత చాన్నాళ్ల పాటు తెరపై కనిపించలేదు. రాజకీయాలు, బిజినెస్ అంటూ వ్యక్తిగత విషయాల్లో బిజీ అయిపోయాడు. ఎప్పుడైతే బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చాడు. 'కోర్ట్' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాను గతంలో చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెబుతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఛాన్స్.. వెరైటీ బూతులతో నన్ను తిట్టారు)

    'నేను సినిమాలకు దూరమైన తర్వాత జీవనాధారం కోసం స్థలాలు కొని అమ్మడం చేసేవాడిని. అలా యాదగిరిగుట్టలో రూ.70 వేలకు కొని ఒక్కొ ఎకరం రూ.9 లక్షలకు విక్రయించాను. తర్వాత ఆ స్థలం ధర చాలా పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ 18 ఎకరాలు కొని తక్కువ లాభానికి అమ్మేశాను. అక్కడ ఇప్పుడు ఒక్కో ఎకరం రూ.100 కోట్లు పలుకుతోంది. అంటే రూ.1800 కోట్లు. ఒక్క ఎకరం అయినా ఉంచుకోవాల్సింది అని నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను' అని శివాజీ అన్నాడు.

    రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొని అమ్మేయడం మామూలే అని, ఇప్పటి రేట్లు చూసి నష్టపోయామని అనుకోవడానికి వీల్లేదని కూడా శివాజీ చెప్పుకొచ్చాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఇందులో శివాజీకి జోడీగా లయ నటించింది. బాలనటుడు రోహన్ మరో కీలక పాత్ర చేశాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు.

    (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?)

Sports

  • న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్ సెమీస్‌లో విధ్వంసం సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్ మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించారు. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఫిన్ ‍అలెన్ ఘనత సాధించారు. ఈ విజయంతో న్యూజిలాండ్ టీమ్ వరల్డ్ కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

    కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ భీభత్సం సృష్టించాడు. ఏకంగా పది ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఫిన్ అలెన్ దూకుడుతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 

     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌.. సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

    కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ న్యూజిలాండ్‌ బౌలర్లు ఆది నుంచే నిప్పులు చెరిగారు. క్వింటన్‌ డికాక్‌ (10)ను అవుట్‌ చేసి కివీస్‌ వికెట్ల వేట మొదలుపెట్టిన కోల్‌ మెకాంచీ.. వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్‌ రికెల్టన్‌ (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (18)ను రచిన్‌ రవీంద్ర పెవిలియన్‌కు చేర్చాడు.

    యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ
    అదే విధంగా డారిల్‌ మిచెల్‌ (6)ను కూడా అవుట్‌ చేసిన రచిన్‌ కివీస్‌ శిబిరంలో జోష్‌ నింపాడు. ఇక డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34)ను జేమ్స్‌ నీషమ్‌ అవుట్‌ చేయగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)ను లాకీ ఫెర్గూసన్‌ పెవిలియన్‌కు పంపించాడు. అయితే, మార్కో యాన్సెన్‌ హాఫ్‌ సెంచరీ (30 బంతుల్లో 55) నాటౌట్‌గా నిలవడంతో సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

    ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 12.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్‌ నష్టపోయి 173 పరుగులు సాధించింది. ఓపెనర్లలో టిమ్‌ సీఫర్ట్‌ 33 బంతుల్లో 58 పరుగులు సాధించగా.. ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకం బాదాడు. 

    ఫాస్టెస్ట్‌ సెంచరీ
    కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫోర్‌ బాది కివీస్‌ గెలుపును ఖరారు చేశాడు. రచిన్‌ రవీంద్ర 11 బంతుల్లో 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా అలెన్‌ చరిత్ర సృష్టించాడు. 

  • టీమిండియాతో సెమీ ఫైనల్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో తాము ఇంత వరకు పరిపూర్ణమైన మ్యాచ్‌ ఆడలేదని.. అయినప్పటికీ సమిష్టిగా రాణించి విజయం సాధించామని పేర్కొన్నాడు. కాబట్టి టీమిండియాతో మ్యాచ్‌ గురించి తాము చెందాల్సిన అవసరం లేదన్నాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 లీగ్‌ దశలో నేపాల్‌ వంటి పసికూన చేతిలో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆ తర్వాత సూపర్‌-8లో మాత్రం అదరగొట్టింది. శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మీద విజయాలు సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మూడు మ్యాచ్‌లలో కూడా ఆఖరి వరకు పోరాడి ఇంగ్లండ్‌ గెలిచింది.

    కల నిజమైన తరుణం ఇది
    ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్‌ (Harry Brook) మాట్లాడుతూ.. ‘‘ఆతిథ్య జట్టు (టీమిండియా)తో సెమీ ఫైనల్‌ ఆడటం విశేషం. మా జట్టులోని చాలా మంది కల నిజమైన తరుణం ఇది. ఈ మ్యాచ్‌ కోసం మేము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

    పర్‌ఫెక్ట్‌ గేమ్‌ ఆడలేదు.. అయినా
    పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాం. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో పరిపూర్ణంగా ఆడలేదు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు కీలకంగా వ్యవహరించారు. టీమిండియాతో మ్యాచ్‌లో సైతం పూర్తి స్వేచ్ఛగా.. ధైర్యంగా ఆడతాం.

    ఈ టోర్నీలో కొన్ని ఉత్కంఠ మ్యాచ్‌లలో మేము గెలిచాము. మా బ్యాటర్లు స్పిన్‌ను ఎదర్కోవడంలో ఇబ్బంది పడతారని అంతా అనుకుంటున్నారు. కానీ మేము చక్కగా స్పిన్‌ ఆడగలము.

    వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో
    ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన భారత స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అతడి బౌలింగ్‌లో అత్యుత్తమంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని హ్యారీ బ్రూక్‌ చెప్పుకొచ్చాడు. 

    ఏదేమైనా టీమిండియాకు కఠిన సవాలు తప్పదని సంకేతాలు ఇచ్చాడు.  తాము ఇప్పటివరకు పర్‌ఫెక్ట్‌గా ఆడకపోయినా ఎవరో ఒకరు జట్టును ఆదుకుంటారని.. గతంలో మాదిరే ఈసారి అదే పునరావృతం కావొచ్చని బ్రూక్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కాగా ముంబై వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య గురువారం సెమీ ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

  • న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కివీస్‌ బౌలర్ల ధాటికి టాపార్డర్‌ కుదేలైన వేళ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు.

    చరిత్ర సృష్టించిన సఫారీ క్రికెటర్లు
    కేవలం 77 పరుగులే చేసి సగం వికెట్లు కోల్పోయిన తరుణంలో యాన్సెన్‌ (Marco Jansen) .. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (Trisran Stubss)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఈ జోడీ సరికొత్త చరిత్ర సృష్టించింది.

    సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జట్టుగా నిలిచింది. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు యాభైకి పైగా పరుగులు జోడించిన రెండో జంటగా యాన్సెన్‌- స్టబ్స్‌ నిలిచారు.

    టీ20 ప్రపంచకప్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లలో ఆరు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లకు 50 ప్లస్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీలు
    👉మార్కస్‌ స్టొయినిస్‌- మాథ్యూవేడ్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2021 సెమీ ఫైనల్లో 81*
    👉మార్కో యాన్సెన్‌- ట్రిస్టన్‌ స్టబ్స్‌ (సౌతాఫ్రికా) న్యూజిలాండ్‌ మీద 2026 సెమీ ఫైనల్లో 73
    👉ఏంజెలో మాథ్యూస్‌- కుమార్‌ సంగక్కర (శ్రీలంక) పాకిస్తాన్‌ మీద 2009 ఫైనల్లో 68*
    👉జార్జ్‌ బెయిలీ- ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) వెస్టిండీస్‌ మీద 2012 సెమీ ఫైనల్లో 68
    👉కార్లోస్‌ బ్రాత్‌వైట్‌- మార్లన్‌ సామ్యూల్స్‌ (వెసి​ండీస్‌) ఇంగ్లండ్‌ మీద 2016 ఫైనల్లో 54*
    👉మైకేల్‌ హస్సీ- మిచెల్‌ జాన్సన్‌ (ఆస్ట్రేలియా) పాకిస్తాన్‌ మీద 2010 సెమీ ఫైనల్లో 53*

    169 పరుగులు
    ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. మార్కో యాన్సెన్‌ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. స్టబ్స్‌ 29 పరుగులు చేశాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ 34 పరుగులతో రాణించాడు. 

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా
     

  • న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్‌ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్‌ ముగించగలిగింది.

    టీ20 ప్రపంచకప్‌-2026 తొలి సెమీస్‌ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్‌ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్‌ జట్టు వికెట్లు కోల్పోయింది. 

    టాపార్డర్‌ కుదేలు
    ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (18), క్వింటన్‌ డికాక్‌ (10), ర్యాన్‌ రికెల్టన్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34) కాసేపు నిలబడగా... డేవిడ్‌ మిల్లర్‌ (6) పూర్తిగా నిరాశపరిచాడు. 

    ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29)తో కలిసి మార్కో యాన్సెన్‌ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు.

     27 బంతుల్లో అర్ధ శతకం
    ఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్‌ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ. లాకీ ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్‌. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    మిగిలిన వారిలో కార్బిన్‌ బాష్‌ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్‌ అయ్యాడు. కేశవ్‌ మహరాజ్‌ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. 

    హెన్రీ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో
    కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కోల్‌ మెకాంచీ, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్‌, జేమ్స్‌ నీషమ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్‌ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా
     

  • ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్‌’ బ్యాటర్‌ బాబర్‌ ఆజంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ నుంచి అతడిని తప్పించింది.

    బంగ్లాతో వన్డే సిరీస్‌
    కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్‌ను మాత్రం ఎంపిక చేయలేదు.

    ఆరుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు
    అంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్‌ సమద్‌, మాజ్‌ సదాకత్‌, ముహమద్‌ ఘాజి ఘోరి, సాద్‌ మసూద్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షామిల్‌ హుసేన్‌లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.

    అందుకే బాబర్‌పై వేటు.. వారికి చోటు
    కాగా బాబర్‌ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్‌ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

    ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్‌ ఆజం 17 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్‌ ఫర్హాన్‌కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.

    ఇదిలా ఉంటే.. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు అబ్దుల్‌, మాజ్‌, మసూద్‌, హుసేన్‌ ఇప్పటికే పాకిస్తాన్‌ షాహిన్స్‌ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్‌ ప్లేయర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, పేసర్‌ హ్యారిస్‌ రవూఫ్‌, మొహమ్మద్‌ వసీం జూనియర్‌, ఆల్‌రౌండర్‌ ఫాహిమ్‌ ఆష్రఫ్‌, సల్మాన్‌ ఆఘా, మణికట్టు స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

    బంగ్లాదేశ్‌తో వన్డేలకు పాకిస్తాన్‌ జట్టు
    షాహిన్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అబ్రార్‌ అహ్మద్‌, ఫాహిమ్‌ ఆష్రఫ్‌, ఫైజల్‌ అక్రం, హ్యారిస్‌ రవూఫ్‌, హుసేన్‌ తలత్‌, మాజ్‌ సదాకత్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ వసీం జూనియర్‌, ముహమద్‌ ఘాజి ఘోరి (వికెట్‌ కీపర్‌), సాద్‌ మసూద్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, సల్మాన్‌ ఆఘా, షామిల్‌ హుసేన్‌

    షెడ్యూల్‌
    మార్చి 11- తొలి వన్డే
    మార్చి 13- రెండోవన్డే
    మార్చి 15- మూడో వన్డే
    వేదిక: షేరే బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం, ఢాకా.

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

  • పొట్టి క్రికెట్‌ మహా సంగ్రామంలో తొలి సెమీ ఫైనల్‌ పోరుకు తెరలేచింది. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య జరిగే ఈ మెగా మ్యాచ్‌కు కోల్‌కతా వేదిక. ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. ప్రొటిస్‌ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

    టాస్‌ సందర్భంగా కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు ఇంకాస్త సహకరిస్తుందని అనిపిస్తోంది. అందుకే తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాం. ఆది నుంచే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సి ఉంటుంది. మ్యాట్‌ హెన్రీ తిరిగిఇ వచ్చాడు. సోధి స్థానంలో నీషమ్‌ కూడా తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.

    మా తుదిజట్టులో మూడు మార్పులు
    ఇక సౌతాఫ్రికా సారథి ఐడెన్‌ మార్క్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీలో ఇప్పటి వరకు మా జట్టులోని ప్రతి సభ్యుడు తమ వంతు సహకారం అందించడం సంతోషకరం. ఈ మ్యాచ్‌లోనూ గొప్పగా రాణించి మంచి స్కోరు నమోదు చేస్తామని ఆశిస్తున్నా. గత రాత్రి కూడా మేము ప్రాక్టీస్‌ చేశాము.

    మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. రబడ, యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌ తిరిగి జట్టులోకి వచ్చారు’’ అని పేర్కొన్నాడు. కాగా సూపర్‌-8 దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా తొలి టైటిల్‌ వేట దిశగా సెమీస్‌ రూపంలో మరో ముందడుగు వేసింది. గత ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సఫారీలు ఈసారి పట్టు వదలకుండా పోరాడేందుకు సిద్ధమయ్యారు

    నిలకడైన ఆట.. ప్రొటిస్‌దే పైచేయి
    మరోవైపు.. సౌతాఫ్రికా మాదిరే ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని న్యూజిలాండ్‌ సైతం ఈసారి ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ ఎడిషన్లో ప్రదర్శనల పరంగా కివీస్‌ కంటే సఫారీలే ఓ అడుగు ముందున్నారు. 

    ఇక సూపర్‌-8 దశలో పాకిస్తాన్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ రద్దు కాగా.. శ్రీలంకపై గెలిచిన న్యూజిలాండ్‌ సెమీస్‌ రేసులో ముందుకు దూసుకువచ్చింది. ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడినా.. పాక్‌ శ్రీలంకపై నామమాత్రపు విజయంతో సరిపెట్టుకోవడంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టగలిగింది.

    తుదిజట్లు ఇవే
    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అలెన్‌, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కోల్ మెక్‌కాంచీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

    సౌతాఫ్రికా
    ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి.

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తోంది పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా వంటి చిన్న జట్లపై గెలుపొందిన సల్మాన్‌ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.

    పాకిస్తాన్‌కు భంగపాటు
    ఇక సూపర్‌-8 దశలోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోగా.. తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉండగా.. లంక గట్టి పోరాటం చేయడంతో పాకిస్తాన్‌కు భంగపాటు తప్పలేదు.

    లంకపై గెలిచినా న్యూజిలాండ్‌తో పోటీలో నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో విఫలమైన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

    భారీ జరిమానా
    ఏకంగా 50 లక్షల రూపాయలు (పాక్‌ కరెన్సీలో) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందనే వార్తలూ ఊపందుకున్నాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో.. హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌కు వ్యతిరేకంగా పాక్‌ ఆటగాళ్లు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. కోచ్‌ ఏకపక్ష నిర్ణయాల కారణంగా డ్రెసింగ్‌ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పటికే పీసీబీ అధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

    తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక వేటే!
    జియో సూపర్‌ కథనం ప్రకారం.. ‘‘టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలోనే చాలా మంది పాకిస్తాన్‌ ప్లేయర్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులను కలసి కోచ్‌ గురించి ఫిర్యాదు చేశారు. కీలక విషయాలను సైతం కెప్టెన్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్న తీరును వారి దృష్టికి తీసుకువచ్చారు.

    సొంత నిర్ణయాలతో యాజమాన్యం విషయాల్లోనూ హసన్‌ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరును వివరించారు. ఇందుకు సీనియర్‌ అధికారులు సానుకూలంగా స్పందించి.. సమీక్ష జరుపుతున్నారు. 

    కోచ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, హసన్‌కు రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. కాబట్టి ఇప్పట్లో అతడిని తొలగించే ప్రయత్నం జరగకపోవచ్చు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 

    చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

  • టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.

    ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌
    అయితే, సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్‌ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్‌ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.

    ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్‌ సేన తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను గంటపాటు వాయిదా వేసుకుంది.

    టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌
    కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్‌ సెషన్‌ను ఆరంభించింది. 

    గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

    అవును.. మా వాళ్లు చెప్పారు
    ఈ విషయం గురించి టీమిండియా కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్‌ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్‌ పేర్కొన్నాడు.

    కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్‌ కావడంతో వరుణ్‌ చక్రవర్తి, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, తిలక్‌ వర్మ మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.  

    చదవండి: IND vs ENG: అభిషేక్‌ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ను పేలవంగా ముగించింది. సూపర్‌-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

    గుర్రుగా ఉన్న పీసీబీ
    ఐసీసీ ఈవెంట్లో పాక్‌ సెమీ ఫైనల్‌ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్‌ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సైతం సల్మాన్‌ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

    సెలక్టర్‌ పదవికి రాజీనామా
    ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత పాక్‌ బోర్డులో తొలి వికెట్‌ పడింది. అలీం దర్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్‌ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్‌ అక్టోబరు 11, 2024లో పాక్‌ జట్టు సెలక్టర్‌గా నియమితుడయ్యాడు.

    ఆకిబ్‌ జావేద్‌, అజర్‌ అలీ, అనలిస్టు హసన్‌ చీమాతో కలిసి సెలక్టర్‌ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్‌ హసన్‌ అతి జోక్యం వల్ల అలీం దర్‌ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.

    బాబర్‌ ఆజం వద్దు అన్నందుకేనా?
    బాబర్‌ ఆజం, షాదాబ్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్‌ భావించగా.. ఆకిబ్‌ జావేద్‌ మద్దతుతో హసన్‌  ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్‌ రిజ్వాన్‌ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్‌ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.

    అంతేకాదు ఆకిబ్‌ జావేద్‌ కోచ్‌ హసన్‌కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

    అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్‌ వద్దన్నా.. హసన్‌, జావేద్‌ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్‌ ఆజం, షాదాబ్‌, ఉస్మాన్‌ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. 

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడుతున్నాడు.

    మూడు డకౌట్లు
    విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.

    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు భారత జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్‌ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్‌ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.

    అదొక్క మార్పు సరిపోతుంది
    ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో బ్యాటింగ్‌ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.

    ఒకవేళ అభిషేక్‌ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. లోయర్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.

    అయితే, అభిషేక్‌ శర్మ గత సిరీస్‌లో ఇంగ్లండ్‌ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. 

    అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్‌ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్‌ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 

    గతేడాది ఇంగ్లండ్‌పై ఇరగదీసిన అభిషేక్‌
    కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.

    చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

  • టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌  తర్వాత టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్‌కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్‌పై చారిత్రక ఇ​న్నింగ్స్‌ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    అప్పటికే స్టార్‌ డమ్‌ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కా​ర్తీక్‌ సంజూను  దిగ్గజలు ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. 

    అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్‌. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.

    డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్‌ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.

    వాస్తవానికి సంజూ టాలెంట్‌ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్‌ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.

    కాగా, విండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్‌ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్‌లో భారత్‌ ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. 

  • శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార్‌ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్‌కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్‌కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్‌ సర్కిల్స్‌తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. 

    ఎస్‌కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.  ఎస్‌కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.

    కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడంలో ఎస్‌కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్‌కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్‌ కెరీర్‌ కోసం సమయం వెచ్చించే వారు.  ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

International

  • ఇండియాలో ఉన్నప్పుడు సరే... కానీ కుటుంబ సభ్యులతో కలిసి  కారు నడుపుతూ విదేశాల్లో తిరగడం అంటే ఆ అనుభూతి వేరే లెవెల్‌... ఆ అనుభూతి మన స్వంతం కావాలన్నా, విదేశాల్లో వ్యక్తిగత వాహనం నడపాలన్నా... మళ్లీ అక్కడ  లైసెన్స్‌ తీసుకోక తప్పదు..ఈ ఆలోచనతోనే చాలా మంది విదేశాల్లో ఉన్నప్పుడు తమకు  డ్రైవింగ్‌ వచ్చిన సంగతి మర్చిపోతారు. అయితే భారతీయులు భారతీయ లైసెన్స్ తోనే డ్రైవ్‌ చేయడానికి అనుమతించే 21 దేశాలు ఉన్నాయి తెలుసా?

    ఆస్ట్రేలియా: నార్తర్న్‌ టెరిటరీ, న్యూ సౌత్‌ వేల్స్, విక్టోరియా మినహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలలో  డ్రైవ్‌ చేయడానికి ఆస్ట్రేలియా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమచేతి డ్రైవింగ్‌ ఓకే.

    భూటాన్‌: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు తమ స్వంత వాహనాలతో ఒక సంవత్సరం వరకు భూటాన్‌ లో డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తారు. అయితే మన కరెన్సీలో రూ.4490  చెల్లింపుతో పాటు. వాహన పత్రాలు  వారి చెక్‌ పోస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో రిజిస్ట్రేషన్‌ వంటి అన్ని అవసరమైన నిబంధనలను పాటించాలి,  ప్రమాదకరమైన పర్వత రోడ్ల కారణంగా భూటాన్ లో స్థానిక గైడ్‌ లేదా లైసెన్స్ పొందిన డ్రైవర్‌ లేకుండా భూటాన్ లో కారు అద్దెకు తీసుకోవడం నిషేధం అనే విషయం గమనించడం ముఖ్యం. ఎడమ చేతివైపే డ్రైవ్‌.

    కెనడా: ఈ దేశంలో మన లైసెన్స్‌ను డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది కానీ  ఇది అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే  కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు, ఒంటారియోలో బస మూడు నెలల కన్నా తక్కువ ఉంటే,  స్వంత లైసెన్స్ తప్ప మరే ఇతర పత్రాలు అవసరం లేదు. అయితే, అంతకన్నా ఎక్కువగా ఉంటే,  అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా అవసరం. ఈ దేశంలో కుడి చేతివైపు డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది.

    ఫ్రాన్స్, మొనాకో: ఫ్రాన్స్ , మొనాకోలు  భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ పై  లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌తో ఆరు నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తాయి. ఇక్కడ కుడి చేతి డ్రైవ్‌ ఉంటుంది.

    ఫిన్లాండ్‌: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ ను ఫిన్లాండ్‌  ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది, ఇక్కడ కూడా కుడి చేతి డ్రైవ్‌  చేయాలి.

    జర్మనీ: జర్మనీలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆరు నెలల వరకు మన లైసెన్స్‌తో డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తారు. ఇక్కడా కుడి చేతి డ్రైవ్‌.

    హాంకాంగ్‌: భారతీయ లైసెన్స్ పై  డ్రైవ్‌ చేయడానికి 12 నెలల వరకు అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ ఉంటుంది.

    ఐస్లాండ్‌: ఐస్లాండ్‌ మన లైసెన్స్ పై ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ కుడి చేతి డ్రైవ్‌ చేయాలి.

    ఇటలీ: భారతీయ లైసెన్స్ పై రెండు సంవత్సరాల వరకు డ్రైవ్‌ చేయడానికి ఇటలీలో,  అనుమతి ఉంది, దానితో పాటు  అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా ఇక్కడ పనికొస్తుంది. ఇక్కడ  కుడి చేతి డ్రైవ్‌ ఉంటుంది.

    మలేషియా: ఇటీవలి కాలంలో మన దేశ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్న  మలేషియా భారతీయ లైసెన్స్ పై మూడు నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది.

    నేపాల్‌: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు దేశంలో డ్రైవింగ్‌ చేయవచ్చు.  గరిష్టంగా ఒక నెల వరకు అందుబాటులో ఉండే పర్మిట్‌ను పొందడం ద్వారా స్వంత వాహనాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌..

    న్యూజిలాండ్‌: భారతీయ లైసెన్స్ పై  న్యూజిలాండ్‌లో 18 నెలలు డ్రైవ్‌ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎల్లప్పుడూ లైసెన్స్ అనువాద కాపీ లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కలిగి ఉండాలి. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్‌ ఉంటుంది.

    నార్వే: నార్వే దేశం లో డ్రైవ్‌ చేయడానికి,  ఇక్కడి డ్రైవింగ్‌ లైసెన్స్ పై  మూడు నెలల వరకు డ్రైవ్‌ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో,  అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ అవసరం కావచ్చు. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ చేయాలి.

    సౌదీ అరేబియా: మన  డ్రైవింగ్‌ లైసెన్స్ తో ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్‌ చేయడానికి సౌదీ అరేబియా అనుమతిస్తుంది. అయితే, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ కూడా కలిగి ఉండటం మంచిది. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌...

    సింగపూర్‌: 12 నెలల వరకు సింగపూర్‌ లో తిరగడానికి, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ లేదా  మన లైసెన్స్‌ కొన్ని చట్టపరమైన నిబంధనలతో  చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్‌ ఉంటుంది.

    స్పెయిన్‌: చట్టపరమైన అనువాద పత్రం లేదా అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ చూపిస్తే స్పెయిన్‌ విదేశీ లైసెన్స్ పై ఆరు నెలల వరకు డ్రైవింగ్‌ చేయడానికి అనుమతిస్తుంది. ఈ దేశంలో కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

    స్వీడన్‌: ఈ దేశంలో..కారు అద్దెకు తీసుకోవడానికి నడపడానికి,  ఆంగ్లంలో అనువదించిన డ్రైవింగ్‌ లైసెన్స్ ఉండాలి. విదేశీ లైసెన్స్ డ్రైవింగ్‌ చేయడానికి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు అనుమతి ఉంది. ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ చేయాలి.

    స్విట్జర్లాండ్‌: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ తో స్విట్జర్లాండ్‌ లో ఒక సంవత్సరం వరకు డ్రైవ్‌ చేయవచ్చు. ఆంగ్లంలోని డ్రైవింగ్‌ లైసెన్స్ కాపీతో  ఈ దేశంలో వాహనాన్ని లీజుకు తీసుకోవచ్చు. కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

    యునైటెడ్‌ కింగ్‌డమ్‌: ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌  వేల్స్‌తో సహా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మనల్ని 12 నెలల వరకు డ్రైవ్‌ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ లో పేర్కొన్న వాహనాలని మాత్రమే నడపగలరని గమనించడం ముఖ్యం. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్‌ చేయాలి.

    అమెరికా: యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా భారతీయ లైసెన్స్ లో ఉన్న అదే  రకం కార్లను ఒక సంవత్సరం వరకు అద్దెకు తీసుకుని నడపడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది.

    యుఎఇ: ఇక్కడ డ్రైవింగ్‌ చేయడానికి పర్యాటకులు భారతీయ  లైసెన్స్ ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.  ఇక్కడ కుడివైపు డ్రైవ్‌ ఉంటుంది. అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ అవసరం.. భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్ తో డ్రైవ్‌ చేయడానికి మనల్ని అనుమతించే దేశంలో కూడా, అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ను దగ్గర ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇది పొందడానికి ప్రొసీజర్‌ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే పర్మిట్‌ ప్రాసెస్‌ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది  ఇది జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

  • UAEపై గడిచిన కొద్ది గంటల్లో 129 డ్రోన్‌ అటాక్స్ జరిగినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు ప్రకటించాయి. వాటితో పాటు నాలుగు బాలిస్టిక్ మిసైల్స్ దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది.  ఈ దాడులలో  ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని 78 మందికి గాయాలైనట్లు తెలిపింది. 

    అమెరికాపై కోపంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతుంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తుంది. అయితే దాడులలో రక్షణ స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాలపైనా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై గడిచిన కొన్ని గంటల్లో 129 డ్రోన్‌ అటాక్స్ జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను చాలా మాట్టుకు గాలిలోనే కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. 

    ఈ దాడులలో 78 మంది ప్రజలు  గాయపడ్డారని  వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. క్షతగాత్రులలో  వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నట్లు సమాచారం. వారిలో భారతీయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు యుఎఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలెవ్వలరూ ఇండ్లనుంచి బయిటకి రావొద్దని కిటీకిల నుంచి దూరంగా ఉండాలని సూచించింది.

  • ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా యుద్ధంలోకి తాము కూడా దిగే పరిస్థితి రావచ్చని పాకిస్థాన్ సంకేతాలు ఇచ్చింది. సౌదీ అరేబియాతో తమకు ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కారణంగా చూపింది. ఈ ఒప్పందం నాటోను పోలి ఉంటుంది. ప్రతీకార దాడుల్లో ఇరాన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. 

    సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించవద్దని ఇరాన్‌ను హెచ్చరించినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. సౌదీ అరేబియాతో తమకు రక్షణ ఒప్పందాన్ని ఉన్నట్టు ఇరాన్‌కు అర్థమయ్యేలా చేశానని దార్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధానికి కూడా ఈ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టంగా తెలిపారు.

    ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఇతర దేశాలనూ తాకిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.

    మంగళవారం రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సీఐఏ ప్రధాన కార్యాలయం (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రధాన కేంద్రం)పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఒక రోజు ముందు సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగింది. దాంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి.  

    ఇరాన్‌తో పాక్‌ చర్చలు
    పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందం రియాద్‌పై ప్రభావం చూపిందని, భారీ దాడులు జరగకుండా చేసిందని దార్ చెప్పారు. ఇతర దేశాల కంటే సౌదీ అరేబియాపై దాడులు తక్కువగా జరిగాయని ఆయన తెలిపారు. దీనికి ప్రతిగా సౌదీ భూభాగాన్ని ఇరాన్‌పై దాడులకు వినియోగించరాదని హామీ ఇవ్వాలని టెహ్రాన్‌ కోరిందని దార్ తెలిపారు.  

    గత సంవత్సరం సెప్టెంబర్‌లో సౌదీ-పాక్‌ మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. బుధవారం సౌదీ అరేబియా స్పందిస్తూ.. ఇరాన్ చేసిన దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన అర్ధరాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

    పాకిస్థాన్‌కు ప్రమాదకరం 
    ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ విమానాలను మోహరించడం పాకిస్థాన్‌కు ప్రమాదకరం. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే 4 కోట్ల షియా జనాభా పాకిస్థాన్‌లో ఉంది. గత వారం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత పాక్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ హింసలో దాదాపు 35 మంది మరణించారు.

    అంతేగాక, అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌లతో సరిహద్దు ఘర్షణలో పాకిస్థాన్ నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్‌తో పెట్టుకుంటే పాకిస్థాన్ సమస్యలు మరింత పెరుగుతాయి. 

  • అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన షిప్‌పై సబ్‌ మెరైన్‌ అటాక్‌తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో  ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం   85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి  జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.

    ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్‌పై యుఎస్‌, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, రాడార్‌ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.

    శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్‌ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.  గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. 

    శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి

    అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం 

  • టెహ్రాన్‌: ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.

    “దేశానికి నాయకత్వం వహించే సామర్థ‍్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్‌లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌​గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్‌ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.

    కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.

    మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. 

    ఇరాన్‌లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్‌లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.

    మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్‌పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.

    వైట్ హౌస్‌లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. 

  • ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్‌ సైతం తగ్గేదిలేదంటూ పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది. అయితే మారణహోమం ఎలా మెుదలైందనే విషయంపై ట్రంప్ మాట్లాడారు. తమ మిత్రదేశం కోసమే అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వ్యాఖ్యల్ని ఖండించారు. యుద్ధాన్ని తానే ప్రోత్సహించాననే విధంగా సమాధానం ఇచ్చారు.

    ఇరాన్‌పై అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ" పేరుతో దాడులు ప్రారంభించింది. టెహ్రాన్‌పై విరుచుకపడుతూ ఆ దేశ సుప్రీం నేత ఆయాతుల్లా ఖమేనీ, ఆయన భార్యతో పాటు ఇతర కీలక నేతలను మట్టుబెట్టింది. ఈ దాడులలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌  చిన్నాభిన్నం అయ్యింది. అయితే ఈ యుద్ధంపై అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో స్పందించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయబోతుందని తెలిసిన తర్వాతే అమెరికా ఈ దాడులలో పాల్గొందన్నారు.

    అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీనిపై స్పందించారు." నాకు తెలిసి మెుదటగా ఇరాన్ దాడికి ప్రణాళికలు రచించింది. అయితే నేను అది జరగనివ్వకూడదు అనుకున్నా. అయితే ఈ సందర్భంలో నేను ఇజ్రాయెల్‌ని కొంత ఒత్తిడి చేసి ఉండవచ్చు" అన్నారు.   ‍అమెరికాలోని ఆయన అధ్యక్ష కార్యాలయంలో  జర్మన్ ఛాన్సిలర్‌ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    అమెరికా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాడార్‌ సిస్టమ్స్ ఏవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. అదే విధంగా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు ఈ దాడులలో మృతి చెందారని ‍ప్రకటించారు. అయితే ఇరాన్‌తో అణుచర్చలు విఫలమైతే ఈ సారి దాడి మరింతగా పెద్దగా ఉంటుందని తొలుత నుంచి ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.

    అయితే ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌ గల్ప్ కంట్రీస్‍లోని అమెరికా స్థావరాలపై విరుచుకపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా బాలిస్టిక్‌ క్షిపణిలతో దాడి చేస్తుంది.  ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

  • టెహ్రాన్‌: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారని పేర్కొన్న తర్వాత పశ్చిమాసియాలోని లక్ష్యాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్‌ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. ఇరాన్‌ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్‌ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సాయం అందించిందా?

    ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు.. యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి.  దీంతో ఇరాన్‌ పెద‍్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహీద్ క్లాస్‌ కమికాజే డ్రోన్లు, ఫత్తాహ్ క్లాస్‌ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియవు.

    ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్‌కు చైనా ఆయుధాలు అందించిందని వివరించింది. చైనా తయారీ సీఎం302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్-చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి.

    ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ, వాటిలో అనేక సిస్టమ్స్‌ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్‌ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెప్పారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్‌ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అన్నారు.

    1979 నుంచే ఆయుధాల సరఫరా షురూ..
    ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో 1979-1989 మధ్య ఇరాన్‌ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య, 1986లో హై-2, సీ-801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది.  

    స్టాక్‌హోమ్ పీస్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఇరాన్‌కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించింది.

    అయితే, 2005 సెప్టెంబర్‌లో ఇంటర్నేషనల్‌ ఆటోమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ‍్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు.

    చైనా ఇంకా ఎలా సాయపడింది?
    ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫత్తాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహీద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్‌ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ధి చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్‌, సీ-802 వంటివి చైనా సిస్టమ్స్‌ ఆధారంగా ఇరాన్‌ ఉత్పత్తి చేసుకుంది.

    అయినా చైనా ప్రత్యక్ష విక్రయాలకన్నా ద్వంద్వ వినియోగ (డ్యూయల్‌ యూజ్‌) భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకూ, సైనిక ప్రయోజనాలకూ ఉపయోగపడే సాంకేతిక భాగాలు.

    క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్‌పై చైనా ప్రోపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రోపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్‌కు అందించింది.

    అలాగే, ఇరాన్‌కు చైనా సోడియం పెర్‌క్లోరేట్ సరఫరా చేసింది. ఇది అమోనియం పెర్‌క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమోనియం పెర్‌క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ, వేల ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు, ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది.  
     

  • వాషింగ్టన్‌: మీరేమో ఇరాన్‌పై యుద్ధం ఐదారు వారాలు కొనసాగిస్తాం’ అని అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. పదిరోజుల్లో దాటితే దాడులు చేసేందుకు మన దగ్గర సరిపడ ఆయుధాలు లేవని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. 

    అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్‌ తన దాడులను తీవ్రతరం చేసింది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా సైతం అదే స్థాయిలో దాడుల్ని కొనసాగిస్తోంది.  

    ఈ క్రమంలో ట్రంప్‌కు పెంగటాన్‌ రిక్వెస్ట్‌ చేసింది. ఇరాన్‌పై దాడి చేస్తూ వెళితే 10రోజుల తర్వాత మిసైళ్లు లేవని తెలిపింది. ఇప్పటికే ఇంటర్‌ సెప్టార్‌ మిసైళ్ల కొరత ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మనకే ప్రతికూల ప్రభావం పడుతుందని, యుద్ధానికి  భారీగా ఖర్చవుతుందంటూ పెంటగాన్‌ వాపోతుంది’మరి  ఆయుధాల కొరతపై ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తారు. తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చాంశనీయంగా మారింది. 

    ఇరాన్‌పై దాడులు, ఇటీవలి అనేక ఇతర సైనిక ప్రయత్నాల తర్వాత ఆయుధాల కొరత తగ్గించేలా పెంటగాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు ట్రంప్ పరిపాలన విభాగం వైట్ హౌస్‌లో అతిపెద్ద యుఎస్ రక్షణ కాంట్రాక్టర్ల కార్యనిర్వాహకులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం.  

    ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని దిగ్భందనం చేసింది. గీత దాటితే నౌకల కింద బాంబులు పెట్టి పేల్చేస్తానమి హెచ్చరిస్తోంది. హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసిన అంశంలో డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ప్రపంచానికి ఇంధన సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పిస్తున్నారు. హర్మూజ్‌ జలసంధిలో ప్రస్తుతం 700నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు గమ్య స్థానానికి వెళ్లేలా తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు.

  • బలూచిస్తాన్: పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్‌లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. పాక్ భద్రతా దళాలే లక్ష్యంగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) జరిపిన జంట దాడులు ఆ ప్రాంతాన్ని  అతలాకుతలం చేశాయి. పంజ్‌గుర్, తుర్బాత్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వ్యూహాత్మక దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడులకు తామే బాధ్యులమని బీఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రామ్ బెలూచ్ అధికారికంగా ప్రకటించారు.

    పంజ్‌గుర్ జిల్లాలోని చిత్కాన్ ప్రాంతంలో ఉన్న ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్సీ) ప్రధాన కార్యాలయంపై బీఎల్ఎఫ్ పోరాట యోధులు విరుచుకుపడ్డారు. కార్యాలయ ఆవరణలోని నిఘా విభాగం లక్ష్యంగా గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడటంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ దాడిలో నిఘా కార్యాలయాలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మెరుపు దాడితో పాక్ రక్షణ దళాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి.

    మరోవైపు తుర్బాత్ సమీపంలోని అబ్సర్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఎఫ్ మరో ఘాతుకానికి పాల్పడింది. కోహ్దా యూసఫ్ ప్రాంతం గుండా రెండు వాహనాలు, మోటార్ సైకిళ్లతో వెళ్తున్న పాక్ సైనిక బృందంపై రిమోట్ నియంత్రిత ఐఈడీ (ఐఈడీ) బాంబుతో దాడి చేశారు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన పాక్ దళాలు పరిసర ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ స్థానిక పౌరులను వేధింపులకు గురిచేస్తున్నాయని బీఎల్ఎఫ్ ఆరోపించింది.

    ఈ దాడుల నేపథ్యంలో ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో పాక్ సైన్యం కఠినమైన కర్ఫ్యూను విధించింది. దీంతో మార్కెట్లు, వ్యాపార సముదాయాలు మూతపడటమే కాకుండా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పాలు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న వేళ మానవతా దృక్పథంతో ఆంక్షలు సడలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

    ఇది కూడా చదవండి: ‘రాజ్యసభ’ బరిలో హేమాహేమీలు.. ఖరారు చేసిన బీజేపీ

National

  • సాక్షి చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ తేలింది. కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి డీఎంకే అంగీకరించింది. దీంతో ఇంతకాలం ఇరుపార్టీల మధ్య నడిచిన సందిగ్ధతకు తెరపడింది. రెండు పార్టీలు కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

    గత కొంతకాలంగా తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడిచింది. కాంగ్రెస్‌ పార్టీకి  ఈ సారి కాంగ్రెస్‌కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని పట్టుబట్టింది. అయితే తాజాగా ఇరుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ ముగిసింది అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది.  

    కాంగ్రెస్  25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. ‍తాజాగా మరో మూడుసీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానం కాంగ్రెసుకు కేటాయించారు.  ఆ రాష్ట్రంలో మెుత్తం 234 సీట్లున్నాయి. కాగా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫిలీం స్టార్ విజయ్ పార్టీ, దివంగత నేత మాజీ సీఎం జయలలిత మిత్రురాలు శశికళ నూతన పార్టీ పెట్టడంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ సారి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

     

  • ఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత, సీపీఐ(మావోయిస్టు) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత  అజ్ఞాతంలోకి వెళ్లారు. నేపాల్‌లో గణపతి ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గణపతి.. లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుతో మావోయిస్టులో అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.

    వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన గణపతి.. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యుల కోరిక. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

    గణపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ అని.. వారి సాయుధ పోరాట ముగింపునకు దారితీసే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి.. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్టు నెట్‌వర్క్‌ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణపతి.. షార్ట్ కట్‌లో పార్టీలో ఎదిగాడన్న వాదన కూడా ఉంది.

    1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీర్పూర్‌లో ఆయన జన్మించారు. ఉద్యమంలో గణపతిని టీచర్ అని పిలిచేవారు. 1970లో రైతు పోరాటాలు జగిత్యాల జైత్రయాత్ర ద్వారా పోరాటానికి దిగారు. నక్సల్స్‌ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్‌గా గణపతికి గుర్తింపు పొందారు. ఇప్పటికీ గణపతి భార్య సుజాత ఉద్యమంలో కొనసాగుతున్నారు. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్.

  • పాట్నా: బిహార్‌ రాజకీయాల్లో పెను సంచలనం జరగనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. బీజేపీకి ముఖ్యమంత్రి స్థానం కట్టబెట్టి  నితీశ్ కుమారునికి  ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా బీజేపీతో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

    బిహార్‌ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారాయి. నిన్నటి వరకూ నితీష్ కుమార్ కుమారుడు.. నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నారని ఆయన కోసం రాజ్యసభ సీటు సైతం కేటాయించారని జేడీయూ సీనియర్ నేత శ్రవణ్ కుమార్ తెలిపారు. దీంతో నితీష్ కుమార్ వారసుడి ఎంట్రీ ఖరారైందని అంతా భావించారు. అంతలోనే ఊహించని ట్విస్ట్ జరిగింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. 

    దీనికోసం ఢిల్లీలో ఒప్పంద కూడా జరిగిందని జేడీయూ కీలక నేత చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇది చాలా బాధపడాల్సిన సమయం అని అంతా ఢిల్లీలోనే జరిగిందని ఆయన ఆ నేత తెలిపినట్లు ప్రచురించాయి. అయితే నితీష్‌ కుమార్‌ని వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో నామినేట్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది.  ఆయన స్థానంలో నితీష్ కుమారుడు నిశాంత్‌ కుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. 

    కాగా  గతేడాది బిహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి స్థానం బీజేపీకి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ చివరికి నితీష్‌ కుమారే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ముఖ్యమంత్రి మార్పు జరగనుందనే ప్రచారం జోరందుకుంది.

    ఇది చదవండి: రాజ్యసభ బరిలో నితీష్‌ తనయుడు నిశాంత్?

     

     

  • ‘అమ్మ’ గొప్పదనం గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి మరీ బిడ్డల్ని కాపాడు కుంటుంది. తరతరాల చరిత్ర ఈ సత్యాన్ని పదే పదే నిరూపిస్తూనే ఉంది. పిల్లల్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టిన సంఘటనలు చాలానే ఉన్నాయి.  తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఉదంతం బిడ్డలపై తల్లి ప్రేమ, చూపించే ధైర్య సాహసాలపై మరోసారి చర్చకు తావిచ్చింది. మాతృత్వం గౌరవాన్ని మరింత ఇనుపడింపజేసిన ఈ సంఘటన మంగళవారం జరిగింది.


    ఇండియా టుడే రిపోర్ట్‌ ప్రకారం తమిళనాడులోని నంబియూర్ సమీపంలో అయియంకట్టు తొట్టంలో తన కూతురిని కాపాడటానికి 55 ఏళ్ల మహిళ లోతైన బావిలోకి దూకేసింది. ఊంజపాళయంకు చెందిన సుందరం కుమార్తె దివ్య (27)  స్పెషల్‌ నీడ్‌ చైల్డ్‌. ‌ఇందుకోసం చికిత్స కూడా పొందుతోంది.  ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బావిలోకి దూకేయడంతో అక్కడే ఉన్న తల్లి ముత్తుమణి క్షణం కూడా ఆలోచించికుండా కూతుర్ని కాపాడేందుకు  సాహసానికి పూనుకుంది. వెంటనే తాను కూడా బావిలోకి దూకేసి, కుమార్తెను గట్టిగా పట్టుకుంది. 

    సహాయం కోసం ఆమె వేసిన కేకలు ఆ ప్రాంతం అంతటా ప్రతిధ్వనించాయి. దీంతో పొరుగువారు అప్రమత్తమై కడ్తూర్ పోలీసులకు, నంబియూర్ అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేదాకా ఆమె బిడ్డను కాపాడుకుంది. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ముత్తుమణి ధైర్యాన్ని స్థానికులు ప్రశంసలు కురిపించారు. తల్లీ బిడ్డల్ని కాపాడిన అగ్నిమాపక శాఖ కృషిని కూడా కొనియాడారు ఈ సంఘటనపై పోలీసులు సాధారణ విచారణ ప్రారంభించారు.

  • ఇరాన్‌పై  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ఆందోళన చెందుతున్నట్టుగా నిత్యావసర ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.  పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పూణేలో  నిత్యాసవరాలు ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి, అన్ని రాష్ట్రాల్లోనూ నూనె ధరలు మరో 10-15శాతం పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

    యుద్ధ వాతావరణం నేపథ్యంలోని పూణేలోని సామాన్యులవంటగదిపై ప్రభావం చూపుతోంది. వంట నూనెలు, పప్పుధాన్యాలు , డ్రై ఫ్రూట్స్ ధరలు పెరిగిపోయాయి.  హోల్ సేల్ మార్కెట్‌లో లీటరుకు  రూ. 3-4 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల సోయాబీన్, పామాయిల్ వంటి వాటిని బయోడీజిల్ తయారీకి మళ్లిస్తున్నారు. దీనివల్ల ఆహార అవసరాలకు నూనెల కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయి.

    డ్రై ఫ్రూట్స్: ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన షిప్‌మెంట్‌లు ఆగిపోవడంతో ఖర్జూరం ధరలు 10-20శాతం పెరిగాయి. బాదం, పిస్తా ధరలు కూడా 5-8శాతం వరకు పెరిగాయి. 

    ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

    ఇతర రాష్ట్రాల పరిస్థితి
    ప్రస్తుతం భారతదేశం వంట నూనెల అవసరాలలో సుమారు 60 శాతం  దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ మార్పులు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  కూడా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు లీటరుకు 5 - 10 వరకు పెరిగాయి. పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ నూనెకు ప్రధాన కేంద్రమైన గుజరాత్‌లో ఎగుమతులు ప్రభావితమై దేశీయంగా ధరల్లో కొంత అస్థిరత కనిపిస్తోంది. సోయాబీన్ , ఆవనూనె ఎక్కువగా పండే  మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా స్థానిక మార్కెట్లలో ధరలు స్వల్పంగా పెరిగాయి.

    ఇదీ చదవండి: దేశంలో చమురు నిల్వల పరిస్థితి ఏంటి? ఎల్‌పీజీ దొరుకుతుందా?

  • H K Dua ప్రముఖ జర్నలిస్టు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత హరి కృష్ణన్ దువా (88) కన్నుమూశారు. అనారోగ్యంతో మూడువారాల క్రితం ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.జర్నలిస్టిక్ దిగ్గజం ఇక లేరంటూ పలువురు కాంగ్రెస్‌  నాయకులు, జర్నలిస్టులు,ఇతర ప్రముఖులు  దువాకు నివాళులర్పిస్తున్నారు.

    మాజీ దౌత్యవేత్త,రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడిగా, NDA , UPA ప్రభుత్వాల కింద సేవలందించారు దువా. హిందూస్తాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ట్రిబ్యూన్‌లలో సంపాదకీయ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు.

    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ  శశి థరూర్  "జర్నలిస్టిక్ లెజెండ్‌’’ అంటూ హెచ్.కె. దువా మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. పద్మభూషణ్, మాజీ ఎంపీ, ఎడిటర్, మాజీ ప్రధానమంత్రి మీడియా సలహాదారు, డెన్మార్క్‌లో భారత మాజీ రాయబారిగా పనిచేశారని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా దువా  భార్య ఆదిత్య, పిల్లలకు తన ప్రగాఢ సానుభూతి  తెలిపారు. 

    "సత్యం, సంపాదకీయ స్వాతంత్ర్యం , ప్రజా సేవ పట్ల నిబద్ధత ప్రజా చర్చను సుసంపన్నం చేసిన ప్రముఖ జర్నలిస్ట్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , దువా మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ జర్నలిజంలో ఒక మహోన్నత వ్యక్తి అని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నివాళులర్పించారు. 

    హెచ్‌.కె దువా ప్రస్థానం
    పత్రికా స్వేచ్ఛ , ప్రజాస్వామ్య హక్కుల కోసం  పోరాడిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హరికృష్ణన్ దువా జూలై 1, 1937న ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సర్గోధలో జన్మించారు. చిన్న వయసులోనే జర్నలిజంలో ప్రతిభ కనబరిచిన ఆయన 1987లో హిందూస్తాన్ టైమ్స్‌కు ఎడిటర్ అయ్యారు. 1994లో, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చీఫ్ ఎడిటర్‌గా మారారు. 2001లో, డెన్మార్క్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. 2003లో తిరిగి వచ్చిన తర్వాత, ది ట్రిబ్యూన్‌కు చీఫ్ ఎడిటర్‌గా 2009 వరకు పదవిలో ఉన్నారు. 2008లో పద్మవిభూషణ్‌  అవార్డ్‌ దక్కింది. 2009లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

    అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డి దేవెగౌడ ప్రధానులుగా ఉన్నప్పుడువారికి మీడియా సలహాదారుగా పనిచేశారు. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. దువా అనేక ముఖ్యమైన పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా కూడా ఉన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం కురుక్షేత్ర విశ్వవిద్యాలయం ఆయనను డి.ఎల్.ఐ.టి. అవార్డుతో సత్కరించాయి. రాజకీయ, దౌత్య, సామాజిక , మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు హెచ్‌కె దువా మృతికి సంతాపం తెలిపారు.

  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, నాలుగు రోజులుగా మూసి ఉన్న వెజ్ బిర్యానీ దుకాణం ఫ్రీజర్‌లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలోని GCRG కళాశాల ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణ యజమాని అజయ్ పాల్ కొనుగోలు కోసం బైటికి వెళ్లాడు నాలుగు రోజుల తర్వాత  తిరిగి షాప్‌కు వచ్చి, డీప్ ఫ్రీజర్‌ను చెక్‌ తనిఖీ చేస్తుండగా లోపల డెడ్‌ బాడీని గుర్తించి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలుసుai మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం మిత్తం తరలించారు.

    మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ,ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని బక్షి కా తలాబ్ (BKT)లోని కిషున్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్ పాల్‌గా గుర్తించారు. ఈ  దుకాణం మూడు వైపులా టిన్ షీట్‌లతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణం అని, సరైన గేట్ లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం తీవ్ర గాయాలైన గుర్తులు లేవు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నామని వెల్లడించారు.పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని  చెప్పారు.

    ఇదీ చదవండి: లిఫ్ట్‌లో షాకింగ్‌ యాక్సిడెంట్‌.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

    ప్రాథమిక దర్యాప్తులో అతని చెప్పుల్లో  ఒకటి  కళాశాలకు దగ్గరగా ఉన్న రోడ్డు మూలన, మరొకటి  మరొకటి దుకాణం లోపల గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ  ఫుటేజ్‌ ఆధారంగా  మృతుడు దుకాణంలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించాడు, చివరిగా ఎప్పుడు తెరిచారు అనే విషయాలను కూపీ లాగుతున్నారు.
    ఇదీ చదవండి: సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా!

  • గుజరాత్‌లోని వల్సాద్‌లో అత్యంత భయానకమైన లిఫ్ట్‌ ప్రమాదంఆందోళన రేపింది. లిఫ్ట్‌లోంచి బయటకు వస్తూండగానే అమాంతం లిఫ్ట్‌ కిందికి కదిలి పోయింది. హైటెక్ లిఫ్ట్‌తో కూడిన 14 అంతస్తుల భవనంలో జరిగిన ఈ ఘటన తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌గా మారింది. గుజరాత్‌లో చాలా భవనాల్లో లిఫ్ట్‌లు శిథిలావస్థలో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

    వల్సాద్ నగరంలోని తితాల్ రోడ్‌లోని సర్దార్ హైట్స్‌లోని విలాసవంతమైన సబర్మతి భవనంలో ఈ సంఘటన జరిగింది.  లిఫ్ట్‌లో ఉన్న ఒకవ్యక్తి తాను దిగాల్సిన ఫ్లోర్‌కు సంబంధించిన అంతస్తు కోసం బటన్‌ నొక్కాడు.  లిఫ్ట్ కావలసిన అంతస్తుకు చేరుకుంది. లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోవడంతోనే అతడు బయటకు అడుగు పెడుతుండగాఅకస్మాత్తుగా అధిక వేగంతో  లిఫ్ట్  కిందికి వెళ్లిపోయింది. అయితే ఈ  ఘటననుంచి  అతను ప్రాణాలతో తృటిలో తప్పించుకోవడం విశేషం. లిఫ్ట్ లోపల ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో ఈ దిగ్భ్రాంతికరమైన క్షణాలు స్పష్టంగా రికార్డైనాయి.

    ఇదీ చదవండి: మూడేళ్లకు రూ. 74 లక్షలు : నటి లగ్జరీ ఫ్లాట్‌ డీల్‌ హాట్‌ టాపిక్‌

    సాంకేతిక లోపమే కారణమా?
    టెక్నికల్‌  లోపం కారణంగానే ఇలా  తలుపు తెరిచి ఉండగానే  లిఫ్ట్ కదిలి  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు . ఈ లిఫ్ట్‌ను ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందని, లిఫ్ట్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు రెండు రోజుల ముందే భవనాన్ని సందర్శించారని భవనం ఛైర్మన్ మీడియాకు తెలిపారు.

    ఇదీ చదవండి: సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా!


     

     

    లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా, లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినప్పుడు ప్రాణాపాయం కలగకుండా  తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

    • లిఫ్ట్ బటన్ నొక్కగానే తలుపులు తెరుచుకుంటాయి. కానీ, లోపల 'క్యాబిన్' (ఫ్లోర్) ఉందో లేదో చూసుకోకుండా అడుగు వేయకండి. కొన్నిసార్లు సాంకేతిక లోపం వల్ల క్యాబిన్ రాకముందే తలుపులు తెరుచుకోవచ్చు.

    • లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కకూడదు.  ఓవర్‌లోడ్ వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది.

    • ముఖ్యంగా చిన్న పిల్లలతో లిఫ్ట్‌ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి. చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లండి. లిఫ్ట్ లోపల బటన్లతో ఆడుకోకుండా చూడండి.

    • కదులుతున్న లిఫ్ట్ తలుపులకు ఆనుకుని నిలబడాలి.. అలాగే తలుపులు మూసుకుంటున్నప్పుడు చేతులు లేదా కాళ్లు అడ్డు పెట్టకండి. ఎందుకంటే ఒక్కోసారి సెన్సార్లు పని చేయకపోతే ప్రమాదం జరగొచ్చు. 

    • లిఫ్ట్ లోపల గెంతడం లేదా అల్లరి చేయడం వల్ల లిఫ్ట్ 'సేఫ్టీ గ్రిప్స్' లాక్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.

    • చీర కొంగులు, పొడవైన దుస్తులు లేదా బ్యాగ్ బెల్టులు తలుపుల మధ్య చిక్కుకోకుండా చూసుకోండి.

    • ఒక వేళ లిఫ్ట్‌ మధ్య ఆగిపోతే ఆందోళనపడవద్దు. లిఫ్ట్ ఆగిపోగానే ఊపిరి ఆడదనే భయం అస్సలు వద్దు.  లిఫ్ట్‌లోని 'Alarm' లేదా 'Call' బటన్‌ను నొక్కాలి.

    • ప్రశాంతంగా ఉంటూ ఫోన్‌ ద్వారా మెయింటెనెన్స్ టీమ్‌కు, లేదా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి.  టెక్నీషియన్లు వచ్చే వరకు లోపలే సురక్షితంగా ఉండటం ఉత్తమం.

    • అలాగే లిఫ్ట్ ఫ్లోర్ల మధ్యలో ఆగినప్పుడు, తలుపులు బలవంతంగా తెరిచి బయటకు దూకడానికి ప్రయత్నించకండి. లిఫ్ట్ ఒక్కసారిగా కదిలితే ప్రాణాపాయం కలగవచ్చు.

    • అపార్ట్‌మెంట్‌ కమిటీలు అసోసియేషన్లు కనీసం నెలకు ఒకసారి గుర్తింపు పొందిన టెక్నీషియన్లతో లిఫ్ట్ కండిషన్‌ను చెక్ చేయించాలి.లిఫ్ట్ లోపల కెమెరా, ఎమర్జెన్సీ లైట్లు పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

    • లిఫ్ట్‌కు తప్పనిసరిగా Automatic Rescue Device (ARD) సిస్టమ్ ఉండాలి. ఇది కరెంట్ పోయినప్పుడు లిఫ్ట్‌ను దగ్గరలోని ఫ్లోర్‌లో ఆగేలా చేస్తుంది.

    • ఒకవేళ భవనంలో మంటలు (Fire) చెలరేగినప్పుడు లేదా భూకంపం వచ్చినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. మెట్లు మాత్రమే ఉపయోగించాలి అనేది గుర్తుంచుకోవాలి. 
       

  • ‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక.  సంగీత్‌,  మెహిందీ అంటూ సాగే  ప్రీ వెడ్డింగ్‌ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి  హృదయాన్ని ఆకట్టుకునే  దృశ్యం  ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.

    సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది.  ఇంతలో  చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    హైలైట్  ఏంటంటే  పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్‌కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం  వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఏకంగా  82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.


    నెటిజన్ల సంబరం
    ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.

    (విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌)

     "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్‌కు వీరు స్టెప్పులేశారు.

    ఇదీ చదవండి: వెజ్‌ బిర్యానీ షాప్‌ ఫ్రీజర్‌లో డెడ్‌బాడీ, షాకైన ఓనర్‌

     

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తోంది. మహారాష్ట్ర నుంచి ఖాళీ అవుతున్న ఏడు స్థానాలకు గాను నలుగురు కీలక నేతలను బరిలోకి దించుతున్నట్లు బుధవారం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, ప్రముఖ నేతలు మాయా చింతామన్ ఇవ్నతే, రాంరావు వాడ్కుటేలకు చోటు దక్కింది. మార్చి 16న జరగనున్న  రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

    మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు శివేష్ కుమార్‌లను బరిలోకి దించారు. నితిన్ నబిన్ నియామకం పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. గత జనవరిలో జె.పి. నడ్డా స్థానంలో బాధ్యతలు చేపట్టిన 45 ఏళ్ల నబిన్, బీజేపీలో మూడవ తరం నాయకత్వ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ వంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో ఎదిగి, నేడు ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నబిన్, ప్రస్తుతం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    హర్యానాలో రాజ్యసభ అభ్యర్థిగా కర్నాల్ మాజీ ఎంపీ సంజయ్ భాటియాను పార్టీ ఎంపిక చేసింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితునిగా పేరున్న భాటియా, తనలాంటి సాధారణ కార్యకర్తకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో భాటియా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక అస్సాం నుంచి తెరష్ గోవాలా, జోగెన్ మోహన్; ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, ఒడిశా నుంచి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజిత్ కుమార్‌లను బీజేపీ అధిష్టానం నామినేట్ చేసింది.

    ఇది కూడా చదవండి: ‘ఇది రంగుల పండుగ మాత్రమే కాదు’..’ .. సీఎం హోలీ సందేశం

Business

  • పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్‌ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్‌ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్‌, లండన్‌ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్‌ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

    దుబాయ్‌కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్‌ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

    సాధారణంగా ట్రేడింగ్ హబ్‌ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్‌కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్‌రైటింగ్ చేస్తాయి.

    ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్‌ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.

    విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్‌24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా పేరొందిన ఎమిరేట్స్‌  బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

    గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్‌, న్యూయార్క్‌ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్‌ ఛేస్‌ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి.

  • మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం భారత కరెన్సీపై తీవ్రంగా పడింది. అమెరికా–ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 67 పైసలు క్షీణించి 92.16 వద్ద ముగిసింది. ఇది తాత్కాలికంగా నమోదైన ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

    ఫారెక్స్ మార్కెట్ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ‘రిస్క్ ఆఫ్’ పరిస్థితుల కారణంగా డాలర్ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీల బుట్టతో పోలిస్తే గ్రీన్‌బ్యాక్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని దాటి ట్రేడ్ అవుతోంది.

    ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 92.05 వద్ద ప్రారంభమై, ఒక దశలో 92.35 వద్ద ఆల్‌టైమ్ ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 92.16 వద్ద ముగిసి, గత ముగింపు స్థాయి 91.49తో పోలిస్తే 67 పైసల నష్టాన్ని చవిచూసింది. సోమవారం రూపాయి 41 పైసలు బలహీనపడి 91.49 వద్ద స్థిరపడగా, హోలీ సందర్భంగా మంగళవారం ఫారెక్స్ మార్కెట్ మూతపడింది.

    ఇరాన్‌పై అమెరికా దాడులు, అలాగే హోర్ముజ్ జలసంధి మార్గంగా ఇంధన సరఫరాలకు ఉన్న ముప్పు కారణంగా ప్రపంచ చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్‌కు 1.29 శాతం పెరిగి 82.46 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

    ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,122.66 పాయింట్లు క్షీణించి 79,116.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 385.20 పాయింట్లు పడిపోయి 24,480.50 వద్ద స్థిరపడింది.

    మొత్తంగా, ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు, విదేశీ నిధుల ఉపసంహరణ, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్‌జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్‌సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసినట్లు పేర్కొంది.

    900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్‌ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్‌వర్క్‌లో ఏఐ మోడల్‌ను అమలు చేయడానికి అనుమతి లభించింది.

    ఈ డీల్‌తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్‌జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్‌జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్‌ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్‌సైట్ పేర్కొంది.

    ఇదిలా ఉండగా, సెన్సార్‌ టవర్‌ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్‌ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్‌బాట్ యాప్, అమెరికాలో యాపిల్‌ యాప్‌ స్టోర్‌ చార్టుల్లో చాట్‌జీపీటీ యాప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్‌జీపీటీ మొబైల్ యాప్‌ యూఎస్‌లో అన్‌ఇన్‌స్టాల్‌ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది.

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మధ్యప్రాచ్యంలో ఏర్పడుతున్న పరిస్థితి గురించి మదుపరులు ఆందోళన చెందడంతో భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడవ సెషన్‌లోనూ క్షీణించాయి. సెన్సెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.

    నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 1.6 శాతం లేదా 385.2 పాయింట్ల నష్టంతో 24,480.5 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.40 శాతం లేదా 1,122.66 పాయింట్లు నష్టపోయి 79,116.19 వద్ద ముగిసింది. 

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో ఎన్బీ ట్రేడ్‌& ఫైనాన్స్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌, సాధన నైట్రో కెమ్‌, పాదం కాటన్‌ యార్న్స్‌, ఎఫ్‌ మెక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎకో హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌, రూబీ మిల్స్‌, మార్గ్‌ టెక్నో ప్రాజెక్ట్స్‌, పిక్చర్‌హౌస్‌ మీడియా, శ్రీ హవిషా హాస్పెటాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను మించి పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.2 శాతం, 2.1 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్ అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బుధవారం సెషన్ ను లాభాలతో ముగించిన ఏకైక సెక్టోరల్ సూచీ నిఫ్టీ ఐటీ.

  • సొంతిల్లు ప్రతి ఒక్కరికీ జీవిత కల. చాలా మంది హోమ్ లోన్‌ తీసుకుని తమ సొంతింటి ప్రయాణాన్ని మొదలు పెడుతుంటారు. అయితే సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఎంత పడితే అంత ఈఎంఐ (నెలసరి వాయిదా) పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడం ఎంత రిస్కో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సోషల్‌ మీడియా ముందుకు తీసుకొచ్చారు.

    బెంగళూరులో ఒక వ్యక్తి కేవలం మూడు హోమ్‌ లోన్‌ ఈఎంఐలు చెల్లించకపోవడంతో తన రూ.1.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కోల్పోయిన సంఘటన చర్చనీయాంశమైంది. గృహ రుణాల్లో దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    గోయెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పొరుగువారు స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి ప్రముఖ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే అక్టోబర్‌లో ఉద్యోగం కోల్పోవడంతో ఆర్థిక ఒత్తిడి మొదలైంది. జనవరి నాటికి వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు సర్ఫాసి యాక్ట్‌ (SARFAESI Act) కింద రికవరీ చర్యలు ప్రారంభించింది.

    సర్ఫాసి చట్టం ప్రకారం బ్యాంకులు.. కోర్టు జోక్యం లేకుండానే బకాయిలను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపే ఆస్తిని రూ.95 లక్షలకు వేలం వేశారు. ఆ మొత్తంలో రూ.80 లక్షలు బకాయిలకు సర్దుబాటు కాగా, ఎనిమిదేళ్ల పాటు ఈఎంఐలు చెల్లించిన రుణగ్రహీత చేతికి కేవలం రూ.15 లక్షలు మాత్రమే మిగిలాయి.

    తుది ఈఎంఐ పూర్తయ్యే వరకు తనఖా పెట్టిన ఆస్తిపై పూర్తి హక్కులు రుణగ్రహీతకు ఉండవని గోయెల్ హెచ్చరించారు. ఆకస్మికంగా ఆదాయం ఆగిపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

    ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగానే బ్యాంకును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి రుణ పునర్వ్యవస్థీకరణ, కాలపరిమితి పొడిగింపు వంటి అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ నష్టం లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

    ఫైనాన్షియల్ ప్లానర్లు సాధారణంగా నెలవారీ ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకూడదని సూచిస్తున్నారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నిధులను వినియోగించుకోవడం వంటి ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించవచ్చు.

  • పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ​్‌కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.

    హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్‌ సరఫరాకు బ్రేక్

    ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్‌ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలు

    సౌదీ ఆరామ్‌కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.

    రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్‌) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.

    ఇదీ చదవండి: ఏజీఆర్‌ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డి(నంద్యాల),  ఎస్‌ఈసీ సభ్యునిగా వైసి గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి (పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ (పార్లమెంటు) పోరెడ్డి నరసింహారెడ్డి (ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.

    కాగా, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్ల నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్‌నాథ్‌ నియమితులయ్యారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడి అమానుష‌మ‌ని, ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయాల‌ని కోరుతూ శాంతియుతంగా నిర‌స‌న తెలియజేస్తున్న అక్క‌చెల్లెమ్మ‌లను దారుణంగా వేధించింద‌ని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అంగ‌న్‌వాడీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వేత‌నాలు పెంచుతాన‌ని, సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు గ్రాట్యుటీ చెల్లిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, రెండేళ్లుగా మ‌భ్య‌పెడుతూ వ‌చ్చార‌ని వివ‌రించారు.

    టెంట్‌లో ఉండి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ ఉన్న మ‌హిళ‌లను వేకువ జామున ఒక్క‌సారిగా ఈడ్చి వ్యాన్‌ల‌లోకి త‌ర‌లించ‌డం హేయమ‌ని చ‌ర్య‌గా పేర్కొన్నారు. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌కు వైయ‌స్సార్సీపీ అండ‌గా ఉంటుంద‌ని, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ త‌ర‌ఫున పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఖ‌చ్చితంగా మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. 
    ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    రెండేళ్లుగా మ‌భ్య‌పెడుతున్నారు
    ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తున్న అంగ‌న్‌వాడీల ప‌ట్ల ప్ర‌భుత్వం అత్యంత అమానుషంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు పిలుస్తామ‌ని ముందురోజు రాత్రి న‌మ్మ‌బ‌లికి వేకువ‌జామున టెంట్లు కూల్చేసి అక్ర‌మంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అంగ‌న్‌వాడీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వేత‌నాలు పెంచుతాన‌ని, సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు గ్రాట్యుటీ చెల్లిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్‌వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.

    ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్‌వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగ‌న్‌వాడీల ప‌ట్ల ప్ర‌భుత్వం పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును వైయ‌స్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండ‌గా ఉండి వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తుంది.

    హామీ అమ‌లు చేయాల‌ని కోర‌డం త‌ప్పా?
    శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్‌వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్‌వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్‌లలోకి ఎక్కించేశారు. గ‌తంలోనూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న అంగన్‌వాడీల‌ను గుర్రాల‌తో తొక్కించిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. అంగన్‌వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్‌ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.

    రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్‌ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్‌ చేసి కనీసం టాయిలెట్స్‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్‌వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

    మూల్యం చెల్లించుకోక తప్ప‌దు
    అంగ‌న్‌వాడీలు మాత్ర‌మే కాదు.. టీచ‌ర్లు, ఇత‌ర ఉద్యోగ సంఘాల నాయ‌కులు, పెన్ష‌న‌ర్లు ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే అనేక‌సార్లు విన‌తులు, నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. అయినా ప్ర‌భుత్వం నుంచి క‌నీస స్పంద‌న ఉండ‌టం లేదు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఉన్న పీఆర్సీ చైర్మ‌న్ తో రాజీనామా చేయించిన చంద్ర‌బాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ క‌మిష‌న్ వేయ‌కుండానే కాల‌యాప‌న చేస్తున్నారు.

    క‌నీసం ఒక‌టో తేదీన జీతాలు ఇస్తామ‌న్న హామీని కూడా నిల‌బెట్టుకోలేదు. ఉద్యోగుల‌కు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బ‌కాయిలు ఇవ్వ‌కుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీల‌కు 99పైస‌ల‌కు వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్ట‌డానికి ఉత్సాహం చూపిస్తున్న ప్ర‌భుత్వం... ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించడం లేదు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేయ‌క‌పోతే దానికి ఖ‌చ్చితంగా మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దని న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి హెచ్చరించారు.

  • సాక్షి, తాడేపల్లి: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్‌కి మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని, సభలో అడుగుపెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

    రాజకీయ లబ్ధి కోసం ఇన్నాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆలయ ప్రతిష్టను మసకబార్చిన కూటమి నాయకులు.. మాట్లాడాల్సిన సబ్జెక్టుని పక్కన బెట్టి శాసనమండలి చైర్మన్‌ని చర్చలోకి లాక్కురావడమే కాకుండా ఆయన్ను కులమతాల పేరుతో కించపరచడం దారుణమని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఈరోజును చీకటిరోజుగా చూడాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    కల్తీ నెయ్యి పేరుతో టీటీడీ నిధుల దోపిడీకి పాల్పడిన హెరిటేజ్‌ అంశం మండలిలో చర్చకు రావడంతో దానికి సమాధానం చెప్పలేక సభలో లేని వైఎస్‌ జగన్‌, మండలి చైర్మన్లు క్రిస్టియన్లు అని మాట్లాడుతూ సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత హేయమైన చర్య. పైగా మీ నాయకుడు జగన్‌ అంటూ మండలి చైర్మన్‌కు పార్టీని ఆపాదించి అవమానించారు. ఇది దారుణం. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ చేసిన టీటీడీ నిధుల దోపిడీపై వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వం సభను పక్కదోవ పట్టించడానికి చైర్మన్‌ని రాజకీయాల్లోకి లాగి మతాన్ని, పార్టీని ఆపాదించింది.

    అధికార పక్ష సభ్యుల అనైతిక ప్రవర్తన:
    అధికార పార్టీ సభ్యులం అన్న విషయమే మరిచిపోయి వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతుండగా ప్రసంగానికి పదులసార్లు అడ్డుతగలడమే కాకుండా మంత్రులంతా పోడియం చుట్టుముట్టి సభలో ఆందోళన చేయడం సిగ్గుచేటు. నేను ఫలానా మతం అని మండలి చైర్మన్‌ చెప్పుకునే దుస్థితి కల్పించినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి. పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోతే ఎవరికైనా కులమతాలు అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తామని కూటమి నాయకులు చెప్పకనే చెబుతున్నారు.

    అచ్చెన్నాయుడిపై చర్య తీసుకోవాలి:
    ఇప్పటికైనా సీఎం చంద్రబాబు కలగజేసుకుని మంత్రి కె.అచ్చెన్నాయుడిని రాబోయే మూడేళ్లపాటు సభలో అడుగుపెట్టకుండా శాశ్వతంగా సభ నుంచి సస్పెండ్‌ చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే సరిపోదు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేయాలి. శ్రీవారిని రాజకీయాల్లోకి లాగినందుకు కూటమిని ప్రజలు అసహ్యించుకుంటుంటే దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కులమతాలతో రాజకీయాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు.

  • సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ, కల్తీ నెయ్యి, హెరిటేజ్‌ ఇందాపూర్‌ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో లఘు చర్చ సందర్బంగా సభలో రగడ చోటుచేసుకుంది. అధికార పక్షం అడుగడుగునా అడ్డుకోవడంతో చివరకు సభ వాయిదా పడింది. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

    విలువలు మంటగలిపేలా అచ్చెన్న వ్యాఖ్యలు: లేళ్ల అప్పిరెడ్డి
    శాసనమండలి చరిత్రలో ఇవాళ జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైఎస్సార్‌సీపీ.. సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ నాలుగుసార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చింది. మండలిని కూడా స్తంభింపజేశాం. ఎట్టకేలకు బీఏసీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారు.

    తిరిగి వైఎస్సార్‌సీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించినా.. మంత్రులు అడుగడుగునా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా సాక్ష్యాత్తు ఛైర్మన్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అధికారాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఛైర్మన్‌ మతాన్ని ఉద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువల్ని మంటగలిపేలా ఉన్నాయి.

    మంత్రులు ఆరోపణలు చేస్తున్నా ఆధారాలు ఉండట్లేదు. దీంతో వారు కంగుతిన్నారు. అందుకే ఏదో విధంగా సభను డైవర్ట్‌ చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  ఇందులో భాగంగానే సభలో లేని జగన్మోహన్‌ రెడ్డిగారితో పాటు ఛైర్మన్‌ మతాల ప్రస్తావన తెచ్చారు. లడ్డూ కల్తీ ఆరోపణలు చేసిన ప్రభుత్వం.. ఇందాపూర్‌ లింకులు బయటపడే సరికి ఆత్మరక్షణలో పడిపోయింది. చివరికి హెరిటేజ్‌ కోసమే లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి తెచ్చారని తేలిపోయింది. మా సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఛైర్మన్‌ కు ఇచ్చాం. దీనికి సమాధానాలు చెప్పలేక ఛైర్మన్‌ మత ప్రస్తావన తీసుకురావడం దారుణం. మోషేను రాజు ఛైర్మన్‌ గా ఉండటం మీకు ఇష్టం లేదా, ఎందుకు ఆయనపై అడుగడుగునా వివక్ష చూపుతూ అవమానిస్తున్నారు?.

    చంద్రబాబు తీరును ఆధారాలతో ఎండగట్టాం: పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి
    తిరుమల లడ్డూ నెయ్యిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే 14 రోజులుగా ప్రయత్నిస్తున్నాం. ఇవాళ మండలిలో చర్చ ప్రారంభమయ్యాక ప్రతీ అంశంపై ఆధారాలు సమర్పించి మాట్లాడాం. ఇన్ని ఆధారాలతో రాజకీయ కుట్రను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. అధికార పక్షం వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉంది. సభలో లేని వైఎస్‌ జగన్‌ ప్రస్తావన తెచ్చి ఆయనపై విమర్శలు చేశారు. తన కుమారుడి పట్టాభిషేకం కోసం వైఎస్‌ జగన్‌ను అడ్డు తొలగించుకోవాలన్న రాజకీయ కుట్రే ఇందులో ఉంది.

    మీ హయాంలో టీటీడీలో నాలుగు నెయ్యి ట్యాంకర్ల నెయ్యిని కల్తీ పేరుతో వెనక్కి పంపి, తిరిగి వైష్ణవీ డెయిరీ ద్వారా లోపలికి పంపుకున్నారు. కల్తీ జరిగితే అది జరిగింది మీ ప్రభుత్వంలోనే, దాన్ని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు కిలో నెయ్యి రూ.300కు తీసుకుంటే, మీ హెరిటేజ్‌ అనుబంధ సంస్థ ఇందాపూర్‌ డెయిరీకి కిలో రూ.600 కు ఇచ్చేలా టెండర్‌ కట్టబెట్టారు. భోలేబాబా, ప్రీమియర్‌ డెయిరీ కూడా మీ హయాంలోనే 95  శాతం నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు అదే ప్రీమియర్‌ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేకపోతే వైఎస్సార్సీపీకి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారు. భోలేబాబాకు అనుమతులు ఇచ్చింది మీ హయాంలోనే. ప్రజలకు మేం చెప్పాలనుకున్నది సభలో చెప్పాం. ప్రజలే దీనిపై నిర్ణయిస్తారు.

    హెరిటేజ్‌పై దొరికిపోయిన ప్రభుత్వం: తూమాటి మాధవరావు
    గత వారం అసెంబ్లీలో జరిగిన తిరుమల లడ్డూ చర్చలో హెరిటేజ్‌కు టీటీడీతో సంబంధాలు లేవని, కేజీ నెయ్యి కూడా సరఫరా చేయలేదని, టెండర్లలో పాల్గొనలేదని చంద్రబాబు ప్రకటించారు. కానీ 1998లో టీటీడీకి కేజీ రూ.70 చొప్పున టెండర్‌ లేకుండానే హెరిటేజ్‌ పాల పౌడర్‌ సరఫరా చేసిందని మేం ఆధారాలు బయటపెట్టాం. నిబంధనలకు విరుద్దంగా టెండర్‌ లేకుండా ఎలా డబ్బులు చెల్లిస్తారని టీటీడీ ఆపేస్తే.. తిరిగి బోర్డుకు పంపి ఆమోదం తీసుకుని చెల్లింపులు చేసారు. అదే విషయం ఇవాళ ప్రశ్నిస్తే 1998 విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. పాల పౌడర్‌ తిరుమలలో దేనికి వాడారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.

    2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో టీటీడీ టెండర్లలో పాల్గొని ఎల్‌–3గా వచ్చారని కూడా ఆధారాలు చూపించాం. కేజీ రూ.117.75 చొప్పున టిన్నుల్లో సరఫరా చేస్తామని టెండర్‌ వేశారు కదా అని అడిగితే మేం ఎల్‌–1కాదని బుకాయించారు. దీనిపై నిలదీస్తే మాపై దాడికి ప్రయత్నించారు. మా సభ్యుడు చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతుంటే ఆర్ధికమంత్రి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనుమతించాలని మండలి ఛైర్మన్‌ ను అడుగుతుంటే నన్ను అడ్డుకున్నారు. మా గొంతు నొక్కేందుకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెనక్కి తగ్గేది లేదు.

    అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి: తోట త్రిమూర్తులు
    లడ్డూపై చర్చించాలని పది రోజులుగా కోరుతున్నా వెనక్కి పారిపోయిన ప్రభుత్వం.. ఎట్టకేలకు ఒప్పుకున్నట్లు చూపించి డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేసింది. ఇందాపూర్‌ డెయిరీకి, హెరిటేజ్‌ కూ ఉన్న సంబంధం, వీళ్ల అవినీతి బయటపెట్టే సరికి జీర్ణించుకోలేకపోయారు. అందుకే సభను పక్కదారి పట్టించేలా సభలో లేని జగన్మోహన్‌ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చి ఆయనపై ఓ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్‌ జగన్‌ పలుమార్లు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి.

    కడప జిల్లాలో తాజాగా నందేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయినా ఆయన హిందూ మతానికి వ్యతిరేకం అని ముద్ర వేసేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో రెండు కొండలుగా ఉన్న తిరుమలను ఏడు కొండలంటూ జీవోలు ఇచ్చిన చరిత్ర ఉంది. వైఎస్సార్‌ ఇచ్చిన జీవోల్ని రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబా కాదా అనేది ప్రజలు గమనించాలి. ఎప్పుడూ తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే భక్తి ఉందని  చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా ఆయనకు తలనీలాలు సమర్పించారా చెప్పాలి. లడ్డూ నెయ్యిపై చర్చ పెట్టి తిరుమల ప్రతిష్టను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు. సభలో లేని వైఎస్‌ జగన్‌ ప్రస్తావన తెచ్చినందుకు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.

    లడ్డూ నెయ్యిపై వాస్తవాలు చెప్పేశాం: వంకా రవీంద్రనాథ్‌
    ఇవాళ మంత్రులు తొలిసారి మండలిలో సభ్యులపై అనుక్షణం దాడికి ప్రయత్నించారు. మా వాదన వినిపించకుండా అడ్డుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు చేరడం వారికి ఇష్టం లేదు. అయినా మా సభ్యులు లడ్డూ నెయ్యి మీద ప్రజలకు ఆధారాలతో వాస్తవాలు చెప్పారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పాలు, ఇతర కల్తీల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వచ్చే మూడు రోజుల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని కోరుకుంటున్నాం.

    ఛైర్మన్‌ను మతం పేరుతో అవమానిస్తారా?: వరుదు కల్యాణి
    పది రోజులుగా లడ్డూ నెయ్యి మీద చర్చ అడుగుతుంటే ఇవాళ్టికి ఒప్పుకున్నారు. కానీ మా సభ్యులు మాట్లాడుతుంటే అధికార పక్షం దిగజారిపోయి ఛైర్మన్‌ ను కూడా మతం పేరుతో టార్గెట్‌ చేసే ప్రయత్నం చేసింది. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేమా అనే పరిస్ధితిని కూటమి మంత్రులు కల్పించారు. లౌకిక దేశంలో ఇలాంటి ఘటనలు దురదష్టకరం. దీన్ని బట్టి ఈ చర్చకు మీరు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.

    లడ్డూ నెయ్యి మీద అనవసర ఆరోపణలు చేసి చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. దీనిపై సమాధానం అడిగితే చెప్పరు. తిప్పిపంపిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ ఎందుకు వాడారని అడిగితే సమాధానం లేదు. పాల ధర 2 రూపాయలు పెరిగితే నెయ్యి ధర 250 రూపాయలు ఎక్కడైనా పెరుగుతుందా చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్‌ బంధాన్ని మా సభ్యులు బయటపెడితే సమాధానం చెప్పలేకపోయారు. ఈవోను ఎందుకు మార్చారంటే చెప్పరు. చర్చ జరగడం ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు

    ఆధారాలు బయటపడే సరికి అడ్డుకునే యత్నం: ఎంవీ రామచంద్రారెడ్డి
    బడ్జెట్‌ సమావేశాలు పెట్టినప్పటి నుంచీ చంద్రబాబు లడ్డూపైన చేసిన వ్యాఖ్యలపై చర్చ అడుగుతుంటే ఇవాళ స్వల్ప చర్చకు అనుమతించారు. ఇవాళ హెరిటేజ్, ఇందాపూర్‌ బంధంపై మా సభ్యులు ఆధారాలు బయటపెడుతుంటే మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాలతో పాటు అన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు ఎక్కడున్నారు. సభలో డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా పూజించే శ్రీవారి జోలికి రావొద్దని, మీ తప్పులకు పశ్చాత్తాపం చెందాలని అధికారపక్షాన్ని కోరాం.

    ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయి: కల్పలతారెడ్డి
    లడ్డూ నెయ్యిపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే వాయిదా తీర్మానాలు ఇచ్చాం. ఎట్టకేలకు చర్చకు ఒప్పుకున్నా వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. తిరుమల లడ్డూ కల్తీపై వాళ్లు చేసిన తప్పుడు ఆరోపణలకు ఎక్కడ కౌంటర్‌ ఇస్తామో అని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా మా సభ్యులు మాత్రం ఆధారాలతో అన్ని విషయాలు బయటపెట్టారు. ప్రజలకు ఈ విషయాలు తెలిసేలా చేశారు. మంత్రుల తీరునూ ప్రజలు గమనించారు.

    ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు: మొండితోక అరుణ్‌కుమార్‌
    ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా మార్చింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. టీడీపీ కండువా కప్పుకున్న వారికి 40%, సానుభూతి పరులకు 20% మాత్రమే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఇన్సెంటివ్‌లు ఇవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేల సంతకాలు కావాలని వేధించిన ప్రభుత్వం ఇది. తమకు న్యాయం చేయండని ధర్నా చేసినందుకు లాఠీఛార్జి చేశారు. టీడీపీ బడా నేతల కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తారు. కానీ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.

    సుమారు 500 మంది నారా లోకేష్‌ను కలవడానికి వస్తే కుదరదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ను కలిసేందుకు కేవలం ఐదుగురికే అనుమతిచ్చారు. ఎంఎస్‌ఎంఈలపై మండలిలో మా ప్రశ్నకు మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తాం. కోర్టుకు వెళతాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు మేం అండగా ఉంటాం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్‌లు విడుదల చేయాలి.

  • సాక్షి, అమరావతి: మండలి  ఛైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండలి ఛైర్మన్‌ను క్రిస్టియన్‌ అంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను క్రిస్టియన్‌  అనడానికి నువ్వు  ఎవరు?’’ అంటూ మండిపడ్డ మండలి ఛైర్మన్‌.. తాను క్రిస్టియన్‌ కాదని స్పష్టం చేశారు. తాను హిందువునని.. క్రిస్టియన్‌ కాదని మండలి ఛైర్మన్‌ తెలిపారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు  క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. 

    బాబూ.. మీ మంత్రులకు ఇదేనా నేర్పింది?: బొమ్మి ఇజ్రాయెల్‌
    శాసనమండలి మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. కులాల మధ్య కుంపటి పెట్టిన వ్యక్తి చంద్రబాబు  అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే మంత్రులు నడుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘సభ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు.. ఛైర్మన్‌ను అవమానించారు. ఛైర్మన్ దళితుడనే కారణంతో ఆయన్ని అవమానించారు. మీ నాయకుడు, మీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ మంత్రి అవమానించారు. అయ్యా చంద్రబాబు.. మీ మంత్రులకు ఇదేనా మీరు నేర్పింది?

    ..దళితులు, క్రిస్టియన్ల పట్ల మీకెందుకు అంత వివక్ష. లోకేష్ సమక్షంలోనే అచ్చెన్నాయుడు మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడితో లోకేష్ ఇలా మాట్లాడించారా?. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్, ఇందాపూర్, సంఘం డెయిరీలు, వైష్ణవి కంపెనీలను కాపాడుకోవడానికే మీ ప్రయత్నం. కచ్చితంగా దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. తిరుమల లడ్డూపై చర్చకు రావాలని మేం వారం రోజుల నుంచి కోరుతున్నాం. చర్చకు రాకుండా పారిపోతున్నారు. ఈరోజుకి ఎట్టకేలకు చర్చకు అంగీకరించారు. చర్చకు పదే పదే మంత్రులు అడ్డుపడ్డారు’’ అంటూ  బొమ్మి ఇజ్రాయెల్‌ మండిపడ్డారు.

    నువ్వు క్రిస్టియన్.. మండలి చైర్మన్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

     

Andhra Pradesh

  • సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్‌లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

    వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.

    సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్‌ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్‌ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్‌లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.

    మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్క­సారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచె­దురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరి­పడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలి­పోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి.

  • సాక్షి, రాజమండ్రి: కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతుంది. తాజాగా ఈ ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా  కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  • సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. పేకాట.. ఒకరి ప్రాణం తీసింది. చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాళ్యంలో ఘటన జరిగింది. పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య పాత బాకీ విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి నాటు తుపాకీతో సాయికుమార్‌ను ఢిల్లీ బాబు కాల్చి చంపాడు.

  • సాక్షి, అమలాపురం: ‘అధికారం ఒకరిది... పెత్తనం మరొకరిది’’ అన్నట్టుగా ఉంది రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో రాజకీయం. మిత్రధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న లీడర్‌ విత్‌ క్యాడర్‌ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరిస్తున్నామనే వంకతో ప్రభుత్వ పథకాల పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. తద్వారా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేస్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీలో ఉండి కూడా తమకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరిని అడగాలో తెలియని దైన్య స్థితిలో జనసేన శ్రేణులు మధనపడుతున్నాయి. 

    గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గెలిచారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాలకు చెందినవారే అయినా ఉద్యోగ రీత్యా ఎన్నికల ముందు వరకు స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవు. అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గ ఓటర్లకు తెలియకుండానే విజయాలు సాధించారు. ఆ తరువాత కూడా వారు స్థానికులతో పెద్దగా సంబంధాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. కనీసం క్యాడర్‌తో కూడా సన్నిహిత సంబం«ధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీకి చెందిన నాయకులు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కనబెట్టి నేరుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  

    రాజోలులో.. 
    రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీలలో వర్గ పోరు అధికంగా ఉంది. ముఖ్యంగా రాజోలు జనసేనలో సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతున్న వర్గ పోరు పోలీసు స్టేషన్‌ల వరకు చేరిన విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రాజోలు పార్టీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై స్వీకరించిన వినతులలో కొన్నింటిని మాత్రమే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళుతున్నారు. మరికొన్ని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడం లేదా నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమం పేరుతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధ పల్లంరాజుల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఈ ముగ్గురికి ఎటువంటి అధికార హోదా లేకపోవడం ఇక్కడ గమనార్హం.  



    పి.గన్నవరంలో.. 
    పి.గన్నవరంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు వంటి పార్టీ సీనియర్‌ నాయకులకు పొగబెట్టిన ఇక్కడ నాయకులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ డి.వి.వి.సత్యనారాయణ వంటి వారు లీడర్‌ విత్‌ క్యాడర్‌ అంటూ నియోజకవర్గంలో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. ఫించన్లకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నేరుగా అధికారులకే సిఫారసులు చేసేస్తున్నారు. 

    ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కొన్నింటికైనా పరిష్కారం చూపిస్తున్నారు. కలెక్టరేట్‌తోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన అధికారులే నేరుగా అర్జీలు స్వీకరిస్తుంటే టీడీపీ నాయకులు లీడర్‌ విత్‌ క్యాడర్‌ పేరుతో అవే సమస్యల పరిష్కారం కోసం అంటూ చేస్తున్న హంగామా, ప్రచార ఆర్భాటం చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.  

    అక్కడ అణగిమణగి.. 
    జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పదవులు కూడా లేని నాయకులు పెత్తనం చేస్తుంటే పార్లమెంట్‌  పరిధిలో మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా అణగిమణగి ఉండాల్సిందే. స్థానిక ఎమ్మెల్యేలను కాదని వీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పెత్తనాలు చేయడమనేది కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్‌ ఆశించిన బండారు శ్రీనివాసరావు కొత్తపేటలోను, రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలోను, పవన్‌ కళ్యాణ్‌కు సన్నితంగా ఉన్న పార్టీ నాయకులు నల్లా శ్రీధర్‌ అమలాపురంలోను, నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌ రామచంద్రపురంలోను కిమ్మనకుండా ఉండాల్సిందే. 

    ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కనీసం వీరి ఉనికిని కూడా గుర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే జనసేన నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పెత్తనం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సీనియర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, పార్టీ పెద్దలకు చెప్పినా సర్దుకు పొమ్మంటున్నారే తప్ప పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో లోలోనే మధనపడుతున్నారు.   

Family

  • మార్చి నెల అనగానే మహిళా దినోత్సవం అని ఠక్కున గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉండే..అంతగా గుర్తించని శక్తిమంతమైన మహిళలు ఎందరో ఉన్నారు. ఒక్కోక్కరిని కదిలిస్తే వాళ్ల కన్నీళ్లు ఇంకిపోయేలా పడుతున్న బాధలు, వేదనలు తెలుస్తాయి. అయినా వాటన్నింటిని పంటి బిగువున పెట్టి..పనులకు వచ్చేస్తుంటారు. ఏం కాదు, ఏం జరగలేదు అన్నట్లుగా చకచక పనులు చేసుకుపోయే ఆ మహిళామూర్తుల జీవితాలు ఎందరికో ఆదర్శం..స్త్రీ శక్తికి నిదర్శనం. అలాంటి నారీమణే ఈ శాంతి. ఎవరీమె అంటే..

    ఆమె నాలుగిళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ.. బతుకు బండిని లాగిస్తుంటుంది. ఆమెకు ఇంట్లో ఎంత కష్టం ఎదురైనా..తప్పక పనికి టెన్షన్‌గా వచ్చేయాల్సిందే. ఆమె అవసరం కష్టాలు అలాంటివి. భర్త ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగి. కొండంత ఆశలతో కుటుంబంతో సహా మహాగనగరానికి వస్తే..దేవుడి స్క్రిప్ట్‌ మరోలా రాసిపెట్టి ఉందామెకు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు ఆంటిజం బాధితుడు, కాగా కూతురు ఇటీవలే పదినెలల క్రితం అనుహ్యంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. 

    కూతురు చనిపోయినా కనీసం రెండు వారాల కూడా ఇంట్లో కూర్చోకుండా పనులకు వెళ్లిపోయేది. ఎందుకంటే..కొడుకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఇంట్లో కూర్చొంటే కష్టం. గుండెల్ని పిండేసే బాధ అయినా సరే మౌనంగా పనికి రాకపోతే..నెల వచ్చేటప్పడికీ తడిసిమోపిడి అవుతాయి ఖర్చులు. ఎందుకంటే కొడుకు తన పనులు తానుచేసుకోగలగాలి, తనే కాళ్లపై నడవగలగాలి అదే శాంతి ఆకాంక్ష. అందుకోసం ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి. 

    అతని చికిత్స సెషన్‌కు రూ. 13000 ఖర్చు అవుతుంది. భర్త సంపాదనలో ఎనిమిదివేలు నేరుగా ఇంటి అద్దెకు వెళ్లిపోతాయి. మిగతా డబ్బులు అతడి స్కూల్‌ఫీజ్‌, ఆహారానికి, ట్రీట్‌మెంట్‌ ఖర్చు అయిపోతుంది. ఇక్కడ శాంతి హాయిగా పనులకు వెళ్లే వెసులుబాటు కూడా లేదామెకు. ఎందుకంటే కొడుకుకి అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకోవాలి. ఆమె ఉదయం స్కూల్‌లో కొడుకుని దించడం నుంచి మొదలవుతుంది ఆమె రోజు. 

    ఆ తర్వాత పనికోసం ఇళ్లకు వెళ్లి..మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడానికి ఇంటికి వెళ్లి..3 గంటల కల్లా కొడుకుని స్కూల్‌ నుంచి తీసుకువస్తుంది. ఆ తర్వాత మళ్లీ పనికోసం ఇళ్లకు వెళ్లి ఇంటికి ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ చుట్టుపక్కల వాళ్లే కాస్తచేదుడువాదోడుగా ఉంటారు. ఆమె పనికి వెళ్లినప్పుడు కొడుకు బాగోగులు వాళ్లు చూసుకుంటారు. కానీ ఇంత కష్టాన్ని, భారాన్ని మోస్తున్నా..అవేమి ఆమె కళ్లల్లో కనిపించదు, కనీసం కన్నీటి చారను బయటకు కనపడనివ్వకుండా..చకచక పనులు చేసుకుంటూ పోతున్నా ధీశాలి ఈ శాంతి. 

    ఒక్కసారి తరచి చూస్తే ఇలాంటి శాంతి లెందరో మన సమాజంలో ఉన్నారు. వాళ్లందరికీ జోహార్లు..ఎందుకంటే పిల్లలను కోల్పోయి..మరోవైపు కుటుంబ కోసం ఆహర్నిశలు కొవ్వుత్తిలా కరిగిపోతూ..ఇంటికి వెలుగుని పంచే ఇలాంటి మహిళామణులే అసలైన హీరోలు. ఇక్కడ ఈ శాంతి ఇవేమి కోరుకోవడం లేదు, కేవలం తన కొడుకు బాగైతే చాలు.. అదొక్కటే ఆమెను అచంచలంగా నడిపిస్తోంది. 

    (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)
     

  • స్త్రీల జీవితంలో నెలసరి మొదలైనప్పటి నుంచి, నెలసరి ఆగిపోయే వరకు, ఆ తరువాత తీసుకోవాల్సిన ఆరోగ్య రక్షణ చర్యలు,  సమస్యలు, వాటి పరిష్కారాల గురించి...

    ప్రతి స్త్రీ జీవితంలో టీనేజ్, పునరుత్పాదక వయస్సు, మెనోపాజ్‌ అనే ముఖ్యమైన మూడు దశలుంటాయి.  ఈ మూడు దశల్లో హార్మోన్‌ మార్పులు, శారీరక మార్పులు ఎక్కువ. అందుకే వీటిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

    టీనేజ్‌ దశలో...
    యుక్తవయస్సులో నెలసరి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మొదటి నెలసరి వచ్చినప్పుడే పరిశుభ్రత గురించి తెలియజెప్పాలి. శుభ్రమైన ప్యాడ్లు వాడాలి. ప్రతి నాలుగు గంటలకు మార్చాలి. వేడినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రులు ధైర్యం చెప్పాలి. శరీరంలో జరిగే మార్పులను అంగీకరించేలా కౌన్సెలింగ్‌ అవసరం. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పాఠశాలల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా వేయించాలి. 

    సాధారణంగా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య నెలసరి సరిగా రాకపోవడం సాధారణ విషయమే. ఆ తర్వాత హార్మోన్లు సర్దుబాటుతో 18 నుంచి 19 సంవత్సరాల నాటికి నెలసరి క్రమబద్ధంగా మారుతుంది. బరువు పెరగడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. 

    వ్యాయామం, సరైన ఆహారం, బరువు నియంత్రణ అవసరం. అవసరమైతే థైరాయిడ్‌ పరీక్ష చేస్తారు. అధిక రక్తస్రావం ఉన్నవారికి రక్తహీనత రాకుండా విటమిన్లు ఇస్తారు. అల్ట్రాసౌండ్‌ ద్వారా గడ్డలు లేదా సిస్టులు ఉన్నాయా పరిశీలిస్తారు. కొన్నిసార్లు విటమిన్లు మాత్రమే సరి΄ోతాయి.

    పునరుత్పాదక వయస్సులో...
    20 నుంచి 40 సంవత్సరాల మధ్య దశలో వివాహం, గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సంరక్షణ ముఖ్యమైనవి. వివాహం ప్లాన్‌  చేసుకునే ముందు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా టీకాలు వేయించుకోక΄ోతే రుబెల్లా, చికెన్‌ఫాక్స్‌, హెచ్‌పీవీ టీకాలు వేయించుకోవాలి. పాప్‌ స్మియర్‌ పరీక్ష, లైంగిక వ్యాధుల రక్తపరీక్షలు చేయించుకోవాలి. 

    గర్భధారణ ప్లానింగ్‌కు ముందు థైరాయిడ్, బీపీ, షుగర్, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నాయో లేవో చూసుకోవాలి. కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకోవాలి. నెలసరి తరువాత స్తనాన్ని స్వయంగా పరీక్షించుకోవాలి. స్తనంలో గడ్డ, నొప్పి, నిపల్‌ నుంచి స్రావం, ఇతర మార్పులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.

    40 సంవత్సరాల తరువాత చాలామందికి మూత్రంలో మంట, నొప్పి, జ్వరం కనిపిస్తాయి. రోజుకు 3 నుంచి 3.5 లీటర్లు నీరు తాగాలి. పరిశుభ్రత పాటించాలి. మలబద్ధకం లేకుండా పండ్లు, కూరగాయలు తినాలి.  యోని లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స చేయక΄ోతే గర్భాశయానికి వ్యాపించి, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి వస్తుంది. దీనిని స్కాన్‌ , రక్తపరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేస్తారు.

    మెనోపాజ్‌ దశలో...
    నెలసరి ఒక సంవత్సరం పాటు రాకపోతే సహజ మెనోపాజ్‌ అంటారు. ఈ దశలో హార్మోన్‌ మార్పుల వల్ల వేడి ఆవిర్లు, చిరాకు, దిగులు, నిద్రలేమి వస్తాయి. కాఫీ, మసాలా పదార్థాలు తగ్గించాలి. ప్రాణాయామం, యోగా, ధ్యానం చేయాలి.

    ఈస్ట్రోజన్‌  తగ్గడం వల్ల ఎముకల బలహీనత పెరుగుతుంది. ΄ోషకాహారం తీసుకోవాలి. చర్మం, యోని పొడిబారడం ఉంటుంది. అవసరమైతే లూబ్రికెంట్లు, మాయిశ్చరైజర్లు వాడాలి. కొందరికి హార్మోన్‌  చికిత్స అవసరం పడుతుంది. బీపీ, షుగర్, గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. పాప్‌ స్మియర్, మామోగ్రఫీని డాక్టర్‌ సూచన మేరకు కొనసాగించాలి.

    మహిళల ఆరోగ్యం వయస్సు మార్పులు, హార్మోన్‌ మార్పులు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు పరీక్షలు, అవగాహన, సరైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  

    (చదవండి: 24 ఏళ్ల వయసులో 197 దేశాలు..!)

  • విదేశీ టూర్‌ వ్లాగర్‌ అనగానే మంచి ఆదాయం, వీసా, మంచి ఆంగ్ల భాషా నైపుణ్యం తదితరాలతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే సాధ్యం. అది కూడా డబ్బున్నవాళ్లకే సాధ్యం, అని అందరి మదిలో నాటుకున్న భావన. అయితే అందరి అంచనాలను బ్రేక్‌ చేస్తూ ఓ గ్రామీణ యువకుడు..ఎలాంటి బడ్జెట్‌, కనీసం ఇంగ్లీష్‌ భాషా నైపుణ్యం, వివిధ వీసాలు కూడా లేకుండానే ఏకంగా 197 దేశాలు చుట్టేస్తూ..గ్రేట్‌ ట్రావెల్‌ వ్లాగర్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు. అది కూడా తన సొంత డబ్బుతోనే ఇన్ని దేశాలు చుట్టేసి రావడం విశేషం. కేవలం 24 ఏళ్లకే ఇన్ని దేశాలంటే మాటలు కాదుకదా..!. మరి ఆ యువకుడు ఎవరు..?, ఏమా కథ చూద్దామా..!. 

    బిహార్‌లోని ముంగేర్‌, భాగల్పూర్‌ల మధ్య ఒక చిన్న గ్రామానికి చెందని శుభమ్‌ కుమార్‌ అనే యువకుడు  197 దేశాలు పర్యటించాడు. అదికూడా కేవలం భారతీయ పాస్‌పోర్ట్‌తో, తన సొంత డబ్బుతో చుట్టొచ్చాడు. సాధారణంగా విదేశీ ప్రయాణం అంటే.. చేతినిండా డబ్బు, బహుళ వీసాలు పొందే సామర్థ్యం, మంచి ఆంగ్లభాషా నైపుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. తనవద్ద ఇవేమి లేకపోయినా..కేవలం తనకున్న ఇష్టం, ప్యాషన్‌తో అలవోకగా దేశాలు చుట్టేశాడు. నిజానికి శుభమ్‌ది మధ్య తరగతి నేపథ్యం. 

    తండ్రి ప్రభుత్వ పాఠశాల టీచర్‌. ఇరుకైన గ్రామదారుల నడుమ చిన్న చిన్న గదులతో ఉండే ఇల్లు. సోషల్‌ మీడియాలో తన హోమ్‌టూర్‌ వీడియోలతో వేలాదిగా అభిమానులను సంపాదించుకున్న అతడి జర్నీ..నెమ్మదిగా ట్రావెల్‌ వ్లాగ్‌ పేరుతో విదేశీ టూర్‌లు పర్యటించే రేంజ్‌కు చేరుకున్నాడు. అతడి వీడియోలు చాలా నేచురల్‌గా, వాస్తవికతకు దగ్గరగా ఉండటంతో అందరూ సులభంగా కనెక్ట్‌ అయ్యేవారు. 

    అలా అతడి యూట్యూబ్‌ ఛానెల్‌కి ఏకంగా మూడు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఆరు లక్షలకు పైగా ఫోలోవర్లు ఉన్నారు. అతని ప్రతి ట్రావెల్‌ వీడియో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల వ్యూస్‌ వస్తుంటాయి. ఇదంత శుభమ్‌కి ఒక్కరాత్రిలో సంపాదించిన ఘనత మాత్రం కాదు. 

    జర్నీ ఎలా ప్రారంభమైందంటే..
    తనకేమి బహుళ వీసాల సామర్థ్యం లేదని, అలాగే ఇంగ్లీష్‌పై అంత పట్టు కూడా లేదని ఓపెన్‌గానే చెప్పేశాడు శుభమ్‌. కేవలం ఇండియా పాస్‌పోర్ట్‌తోనే పర్యటిస్తున్నట్లు తెలిపాడు. తనకు 13 లేదా 14 ఏళ్ల వయసు నుంచి విదేశాలు పర్యటించాలనే కోరిక బలంగా ఉండేదని అలా ఈ ట్రావెల్‌ వ్లాగ్‌గా వీడియోలు చేస్తూ..తన కోరికను నెరవేర్చుకున్నానని అంటున్నాడు. సరిగ్గా 2018లో లేహ్-లడఖ్ పర్యటనతో మొదలైంది అతడి ప్రస్థానం. 

    ఓ పక్క పాఠశాల తరగుతులు..మరోవైపు ఈ విదేశాల టూర్లుతో బిజీగా ఉండేవాడు. తన తొలి అంతర్జాతీయ పర్యటన మాత్రం నేపాల్‌, తర్వాత రష్యా, థాయిలాండ్‌, లావోస్‌..అలా 2019 నాటికి చైనా నుంచి తన మొదటి గ్లోబల్‌ వ్లాగ్‌ పోస్ట్‌ చేశాడు. అలా చేస్తున్నప్పుడు సవాళ్లు మాములుగా లేవని..తన టూర్‌ ఖర్చుల కోసం కోచింగ్‌ సెంటర్లను కూడా మినహాయించాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు శుభమ్‌. అంతేగాదు 16 ఏళ్ల వయసుకి రష్యా వెళ్లి అక్కడ భూభాగంలో దాదాపు 3 వేల కిలోమీటర్లు హిచ్‌హైక్‌ చేశాడు. 

    అలాగే తల్లిదండ్రులకు ఐఏఎస్‌కి ప్రిపేరవ్వుతా, ఢిల్లీ వెళ్తానని అబద్ధం చెప్పి..మలేషియా విమానం ఎక్కాడు. అయితే ఇక్కడ విదేశీటూర్‌లకు వెళ్లాలంటే ఎంతో స్ట్రాంగ్‌ పాస్‌పోర్టులు చాలానే ఉండాలి. కేవలం భారత పాస్‌పోర్ట్‌తో అన్ని దేశాలు చుట్టిరావడం చాలా కష్టం.. ఎందుకంటే  డాక్యుమెంటేషన్ ఒత్తిడి, పరిమిత వీసా యాక్సెస్, వీసా స్టాంపులకు పాస్‌పోర్ట్‌లో తగినంత ఖాళీ పేజీలు ఉండాలి కూడా. ఆ క్రమంలో  ఈక్వెడార్ పర్యటనకు దాదాపు బహిష్కరింపబడతానని భయపడ్డాడట శుభమ్‌. 

    ఎందుకంటే అప్పటికే తన పాస్‌పోర్ట్‌లో ఖాళీ పేజీలు లేనందున తనకు ఈక్వెడార్‌లోకి ప్రవేశం దాదాపుగా నిరాకరిస్తారనే అనుకున్నాడు. పైగా అప్పటికే ఆరు పాస్‌పోర్ట్‌లను నింపాడు. అయితే శుభమ్‌ ప్రతి దేశానికి ఈ పాస్‌పోర్ట్‌తోనే వెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నాడట. అలాగే దీంతోనే వెళ్లగలను అని పూర్తిగా విశ్వసించాడట. ఆ నమ్మకంతోనే విజయవంతంగా విదేశాలు చుట్టిరాగలిగాను అంటున్నాడు శుభమ్‌. 

    16 ఏళ్లకు మొదలు పెట్టిన ఈ జర్నీని ఏడేళ్లు తన తండ్రి ఇచ్చిన డబ్బులతో పర్యటించగా, 23 ఏళ్లు వచ్చేటప్పటికీ తన పూర్తి సొంత నిధులతో టూర్‌లు ప్లాన్‌ చేసుకున్నాడట. అంటే శుభమ్‌ అప్‌లోడ్‌ చేసే వీడియోల ద్వారా వచ్చిన ఆదాయం..అలాగే ఆయా దేశాల్లో ఉంటూ కొంత సంపాదించిన డబ్బుతో తన ప్రయాణానికి నిధులు సమకూర్చుకునేవాడట. అలా శుభమ్‌ శుభప్రదంగా 197 దేశాలు పర్యటించాడు. అంతేకాదండోయ్‌ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సైతం అతడికి ఫోన్‌చేసి మరి అభినందించారట. 

    ఇప్పుడు అతని టూర్‌ బకెట్‌ లిస్ట్‌లో బ్రెజిల్‌ దేశం ఉంది. ప్రస్తుతం అక్కడే ఉన్నాడట శుభమ్‌. పరిమిత వనరులే ఉన్నా..గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కూడా..తన ఆసక్తితో ఇంతటి అనితరసాధ్యమైనదాన్ని సాధించి చూపించి..ఇతర ట్రావెల్‌ వ్లాగర్లకు, నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు కదా..!.

     

     

    (చదవండి: అత్యంత విషపూరితమైన పాయిజన్‌తో..ప్రాణాంతక వ్యాధులకు చెక్‌..!)

Telangana

  • మంచిర్యాల జిల్లా: పోలీసు సబ్‌ డివిజన్‌ కేంద్రం బెల్లంపల్లి తర్వాత తాండూర్‌ పోలీసుస్టేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న స్టేషన్‌లో గత రెండు నెలలుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడి ఎస్సై కిరణ్‌కుమార్‌ గత డిసెంబర్‌ 30న హాజీపూర్‌ పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యారు. మాదారం ఎస్సై ఇన్‌చార్జిగా కొనసాగుతూ శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌–చంద్రాపూర్‌ జాతీయ రహదారి ఈ స్టేషన్‌ మీదుగానే సాగుతుంది. రెగ్యులర్‌ ఎస్సై లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో డిమాండ్‌ ఉన్న ఠాణా కావడంతో సబ్‌ డివిజన్‌ డివిజన్‌లోని ఓ గ్రామీణ ప్రాంత పోలీసుస్టేషన్‌ ఎస్సై తాండూర్‌కు బదిలీ కోసం ఓ ప్రజాప్రతినిధి అనుయాయుల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 

    సానుకూలత వ్యక్తమైనా మరో ఠాణాకు ఆయనకు సంబంధించిన ఎస్సైని బదిలీ చేయించే విషయంలో పేచీ పడినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే బదిలీ ప్రక్రియ నిలిచినట్లు తెలుస్తోంది. ఆ ఎస్సైతోపాటు మరో ఇద్దరు ఎస్సైలు కూడా ప్రయత్నాలు చేసి అర్థంతరంగా మానుకున్నట్లు తెలుస్తోంది. బదిలీపై రావడానికి ముగ్గురు ఎస్సైలు సిద్ధంగా ఉన్నా ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశమైంది. తాండూర్‌ ప్రాంతంలో జాతీయ రహదారిపై పలు చోట్ల బ్లాక్‌స్పాట్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పలువురి మృతి, గాయపడిన సంఘటనలు, మందుబాబులు, ఆకతాయిల ఆగడాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటుంటాయి.

    గంజాయి రవాణా మార్గం
    రాష్ట్రంలోకి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, బల్లార్షా తదితర ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవా ణా జరుగుతోంది. తాండూర్‌, బెల్లంపల్లి, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సై పోస్టును భర్తీ చేస్తే శాంతిభద్రతలు పరిరక్షించే అవకాశం ఉంటుందని మండల వాసులు కోరుతున్నారు.

    నకిలీ పత్తి విత్తనాలకు అడ్డా...!
    పత్తి విత్తనాలు ఈ ప్రాంతానికి చేరుకోవడం, గుట్టుగా విక్రయించడం కొంతకాలంగా సాగుతోంది. నాలుగేళ్ల క్రితం రూ.కోటికి విలువైన పత్తి విత్తనాలను పట్టుకుని పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. గత ఏడాది తాండూర్‌లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. తాండూర్‌ కేంద్రంగా భీమిని, కన్నెపల్లి మండలాలకు సరఫరా అవుతాయనే ఆరోపణలున్నాయి.