Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • రామ్ చరణ్- బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ మూవీ ‘పెద్ది’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం రయ్‌ రయ్‌ మంటూ మొదలుకానుంది. ఇప్పటివరకు నిశ్శబ్దంగా సాగిన ప్రమోషన్లు మే 18 నుంచి వేగం అందుకోనున్నాయి. జూన్‌ 2 వరకు దశలవారీగా భారీ ఈవెంట్లు ప్లాన్‌ చేసినట్లు యూనిట్‌ ప్రకటించింది.  ముందుగా మే 18న ముంబయిలో ట్రైలర్‌ లాంచ్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి చరణ్‌ హాజరవుతాడు. ఆ తర్వాత మే 22న హైదరాబాద్‌ ఉప్పల్‌లో మరో భారీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్‌ చేశారు. దీనికి కూడా చరణ్‌ హాజరవుతాడు. 

    ఆ మరుసటి రోజు, అంటే మే 23న భోపాల్‌లో స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ జరగనుంది. మొదట భోపాల్‌లోనే ట్రైలర్‌ లాంచ్‌ చేయాలని అనుకున్నారు కానీ ప్లాన్‌ మార్చి అక్కడ పాట విడుదలకు నిర్ణయించారు. శృతిహాసన్‌, చరణ్‌పై చిత్రీకరించిన స్పెషల్‌ సాంగ్‌ను భోపాల్‌లో రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఆ ఈవెంట్‌కు చరణ్‌ హాజరవ్వడం లేదట. శృతిహాసన్‌ మాత్రమే పాల్గొననుందని సమాచారం. ఇక తదుపరి ప్రచార కార్యక్రమాల విషయానికి వస్తే.. మే 24న బెంగళూరులో, మే 28న ఢిల్లీలో, మే 30న చెన్నైలో ఈవెంట్లు జరుగుతాయని సమాచారం. జూన్‌ 1న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఓ ప్రత్యేక కార్యక్రమం ప్లాన్‌ చేస్తున్నారట. అలాగే జూన్‌ 2న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ జరగనుంది. జూన్‌ 3న ప్రీమియర్స్‌తో ‘పెద్ది’ సందడి థియేటర్లలో మొదలవనుంది.  

    ప్రస్తుతానికి యూనిట్‌ అనుకుంటున్న ప్రమోషనల్‌ ప్లాన్‌ ఇదే. అయితే రాబోయే రోజుల్లో ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇందులో చరణ్‌ ఎన్ని ఈవెంట్లకు హాజరవుతాడనే అంశంపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. మొత్తంగా, మే 18 నుంచి జూన్‌ 2 వరకు దేశవ్యాప్తంగా ‘పెద్ది’ ప్రచారం రయ్‌ రయ్‌మంటూ సాగనుంది. అభిమానుల్లో ఆసక్తి పెంచేలా యూనిట్‌ వ్యూహాత్మకంగా కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

  • నిత్యం ఏదో ఒక కొత్త ప్రయోగంతో జనంలోకి వచ్చి... సరికొత్తగా వార్తల్లో నిలిచే ప్రముఖ గాయని స్మిత. తాజాగా ఆమె మళ్ళీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాకపోతే, ఇప్పటి వరకు ర్యాప్, పాప్ లాంటి పాటలతో అలరించిన ఆమె ఈసారి అందుకు పూర్తి భిన్నమైన దోవ తొక్కుతున్నారు. మానవ జీవిత పరమార్థాన్ని వివరిస్తూ, మనసును మేలుకొలిపి, చిత్తాన్ని చైతన్యం చేసే తత్వాలను ఆలపిస్తూ, జనం ముందుకు రానున్నారు. తరతరాలుగా మనకు సంస్కృతీ వారసత్వంగా వస్తున్న తెలుగు, సంస్కృత సాహిత్యాల్లోని సుప్రసిద్ధమైన తాత్త్విక కృతులను ఎంచుకొని, వాటిని తనవైన కొత్త బాణీలలో, క్రొంగొత్త ఆర్కెస్ట్రయిజేషన్‌తో ‘తత్త్వమసి... (ఉపశీర్షిక - నాద టు నిర్వాణ)’ పేరిట నవ తరానికి అందించనున్నారు.

    మన చిన్నప్పుడు ఒక దశలో పెద్దవాళ్ళు పిల్లలందరికీ సుమతీ శతకం, వేమన శతకం చెప్పేవారు. మన సినిమాల్లో, రేడియోలో రకరకాల తత్త్వాలు వినిపించేవి. సినీ దర్శకుడు దేవా కట్టా అన్నట్టు, “దురదృష్టవశాత్తూ, మనం, మన సినిమాలు ఆ ఘన సంస్కృతీ వారసత్వాన్ని వదిలేసుకున్నాం. కనీసం బయటైనా అలాంటివి వినడానికీ, స్మిత చేస్తున్న ఓ మంచి ప్రయత్నమే ఇది”. మన భాష, సాహిత్యం, సంస్కృతుల ఖజానా నుంచి ఓ వంద ఆణిముత్యాలను ఏర్చికూర్చి, ఒక్కొక్కటిగా ‘తత్త్వమసి’లో స్మిత అందించనున్నారు. అలా “తరువాతి తరాలకు మన తాత్త్విక చింతనా వారసత్వాన్ని అందించనున్నారు”.

    శివరాత్రితో స్మిత అనుబంధం... ప్రకృతి ఆదేశం...

    ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ అంటూ పాప్ పాటలతో గాయని స్మిత వివిధ ప్రాంతాలకు పర్యటించాలని ప్రయత్నాలు సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి ఎదురైన ఈ ట్విస్టు ఏమిటని ఎవరికైనా అనిపిస్తుంది. అదే అడిగితే, స్మిత సైతం ఇదంతా చిత్రంగా జరిగిందని ఒప్పుకుంటున్నారు. “మ్యూజిక్ వీడియోలు చాలా ఏళ్ళ క్రితమే చేసేశాను. పేరు తెచ్చిన ఆ పాప్ పాటలను జనం ఎదుట వేదిక మీద పాడుతూ, ప్రదర్శన ఇవ్వాలంటే చాలా సన్నద్ధత కావాలి. అందుకే, ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ టూర్‌కి డేట్లు అడిగినప్పుడు... ‘దాన్ని పక్కాగా డిజైన్ చేసి, శారీరకంగా, మానసికంగా సన్నద్ధమయ్యేందుకు కొద్దిగా సమయం కావాల’ని అడిగాను. ఇంతలో ఈ తత్త్వాలను పాడాలనే ఆలోచన వచ్చింది” అని ఆమె వివరించారు.

    రెండు, మూడు నెలల క్రితం శివరాత్రి సందర్భంగా స్మిత వల్లూరుపల్లి, మరో సినీ నేపథ్య గాయని తిరుమల శ్రీనిధి కలసి ‘ఏమి సేతురా లింగా...’ అనే ప్రసిద్ధమైన శివతత్త్వాన్ని కొత్త రీతిలో ఆలపించారు. ఆ గీత రూపకల్పన ఒక రకంగా ఈ భారీ తత్త్వాల ప్రాజెక్ట్‌కు అనుకోని రీతిలో నాంది అయింది. “నిజం చెప్పాలంటే, మహాశివరాత్రికీ, నా జీవితానికీ ఏదో తెలియని బంధం ఉంది. కీలకమైనవెన్నో జరుగుతుంటాయి. ప్రతి ఏటా శివరాత్రి వచ్చిందంటే, ఏదో అతీత శక్తి అంతకు ముందు వరకు అసలు ప్లాన్ చేయనిది ఏదో నేను చేసేలా ముందుకు నెడుతుంది. అలా చేసిన ప్రతిదీ ఓ అద్భుతంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఆత్మ చైతన్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటిదే జరిగింది. ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం పాడగానే, మరిన్ని పాడాలంటూ ప్రకృతి రకరకాల మనుషులు, మార్గాల ద్వారా చెప్పినట్టయింది. అంతే... అలా ఈ 2026లో ఈ ఆధ్యాత్మిక గాన ప్రయాణంలో అడుగులు వేస్తున్నాను” అని స్మిత వివరించారు.

    ఇంతకీ, ప్రకృతి ఆదేశం ఎవరెవరి నుంచి, ఎలా వచ్చిందంటారా? “శివరాత్రికి చేసిన ‘ఏమి సేతురా లింగా...’ తత్త్వం ఫైనల్ అవుట్ పుట్ మా అమ్మ (జోగులాంబ), మిత్రుడు దేవా కట్టా వింటున్నారు. ఆ సమయంలో... ‘నువ్వు ఒకటి కాదు... ఇలాంటి తత్త్వాలు 100 రికార్డు చేయాలి’ అని దేవా కట్టా అన్నారు. అలాగే, ఆ తర్వాత... సిద్ధవైద్యం ‘చక్రసిద్ధ’తో అనారోగ్యాలను దూరం చేసే సింధుజ అమ్మ సైతం ‘ఈ తత్త్వాలు నువ్వు పాడాలి’ అని నాతో అన్నారు. అలా ఆ మాటలన్నీ నాకు ప్రకృతి ఆదేశంగా అనిపించాయి. అలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నా దృష్టిలో ఇది చేస్తున్నది నేను కాదు. ఈ పని చేయడానికి ప్రకృతి నన్ను ఓ సాధనంగా ఎంచుకుంది. అంతే!” అని స్మిత జరిగిన కథ చెప్పుకొచ్చారు. అలా పాప్ పాటల ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్’ పర్యటన కాస్తా అనూహ్యంగా ఇప్పుడు ‘తత్త్వమసి’ అయింది.

    అటు ఆధునిక పాప్... ఇటు ఆధ్యాత్మిక చింతన...

    ఆధునిక పాప్ గీతాలు, ఆధ్యాత్మిక తాత్త్విక చింతన... ఈ రెండు భిన్న ధ్రువాలను స్మిత ఎలా సంబాళించుకుంటారు? “నిజమే. ‘ఓజీ... క్వీన్ ఆఫ్ పాప్‌’కీ, ‘తత్త్వమసి’కీ సంబంధమే లేదు. అది ఆలోచన నుంచి వస్త్రధారణ దాకా అంతా మెరుపులు, తళుకులతో సాగితే, ఇందులో ప్రశాంతత, ఆధ్యాత్మికత, చేనేత వస్త్రాలు చోటుచేసుకుంటాయి. తత్త్వాలు పాడినంత మాత్రాన నాలోని ఆ పాప్ పార్శ్వం చచ్చిపోలేదు, చచ్చిపోదు. గాయనిగా ఈ రెండు భిన్న కోణాలనూ చూపడం నాకిష్టం. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య నా సింగింగ్ జర్నీ సాగుతూనే ఉంటుంది” అని స్థిరచిత్తంతో చెప్పారు స్మిత.

    బలమైన సంకల్పం... భగవదేచ్ఛ...

    ‘తత్త్వమసి’ లాంటి ప్రాజెక్టులు చేయడం అంత సులభమేమీ కాదు. కచ్చితంగా “ఉద్వేగం నిండిన ఓ పిచ్చి ప్రేమ లాంటిది ఏదో ఉండాలి. నాలో అది ఉంది. నన్ను ఎవరన్నా సవాలు చేశారంటే చాలు... దాన్ని నేను ఆషామాషీగా తీసుకోను. బలంగా బదులిస్తా. చిన్నప్పటి నుంచి నన్ను చూసినవారికి నాలోని ఆ లక్షణం, ఆ వ్యక్తిత్వం బాగా తెలుసు. అలాంటి ఛాలెంజ్ ఎదురైనప్పుడల్లా నాలోని ఏదో శక్తి బయటకు వచ్చి, ఆ సవాలును స్వీకరించి, దృఢంగా జవాబిస్తుంది. ప్రతిసారీ అదే జరుగుతుంటుంది. ఈసారీ అదే జరిగింది. అందుకే, ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా, ఏ ప్రస్తావన తెచ్చినా ఆవు కథలాగా నా మాట, పాట, ప్రస్తావన తత్త్వంలోకే వెళుతోంది. దీన్నిబట్టి ఇది ఎంతటి బలమైన సంకల్పమో, ఎంతగా భగవదేచ్ఛో అర్థం చేసుకోవచ్చు” అని స్మిత చెప్పుకొచ్చారు.

    స్మిత తల్లి జోగులాంబ సైతం, “మా అమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ చేపడుతుంది. ఎందుకింత కష్టం అనుకొనే లోగా, దానిలో పూర్తిగా లీనమై పని చేసేస్తుంది. నిజం చెప్పాలంటే, ఇది ఆమె చేస్తున్నది కాదు... ఏదో ఒక దైవిక శక్తి జోక్యంతో సాగుతున్న ప్రయాణం” అని అభిప్రాయపడ్డారు. “దేవుడు ఏదో ఒక నిర్ణీతమైన ప్రణాళికతోనే ప్రతి జీవినీ పంపిస్తాడు. బహుశా స్మితను ఈ వైవిధ్యభరిత ప్రయాణం కోసమే పంపి ఉంటాడు” అని దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు.

    ప్రతి శనివారం ఓ తత్త్వం! వంద వారాల బృహత్ ప్రయత్నం!

    ఇప్పటికే 8 తత్త్వాల గానం, చిత్రీకరణ చేసిన స్మిత మే 16వ తేదీ శనివారం నుంచి వారానికో గీతంతో 100 వారాల పాటు ప్రజల్ని పలకరించనున్నారు. ఆదిశంకరుల ‘భజగోవిందం’ నుంచి అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే...’ దాకా అనేకం ఆ వరుసలో రానున్నాయి. ‘తెలిసితే మోక్షము తెలియకున్న బంధము...’, ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ (అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు), ‘ఎక్కడ మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది…’ (తాళ్ళపాక పెద తిరుమలాచార్య రచన), ‘మానస సంచరరే...’ (సదాశివ బ్రహ్మేంద్రుల కీర్తన)... ఇలా అనేకం ఆ వరుసలో రానున్నాయి.

    అలాగే, అనుభూతి ప్రధానమైన ఈ తత్త్వాలను ప్రేక్షకుల ముందు స్మిత బృందం గానం చేస్తూ, దేశదేశాల్లో అనుభూతి ప్రధానమైన ప్రదర్శనలు ఇవ్వాలని ప్రణాళికా రచన చేస్తున్నారు. ‘ఇండియన్ రాగాస్’ సంస్థ, అలాగే గతంలో ఇళయరాజా – ఏ.ఆర్. రెహమాన్ – కీరవాణి లాంటి పలువురు సుప్రసిద్ధ సంగీత దర్శకుల లైవ్ షోలను నిర్వహించిన ‘దక్షిణ్ స్టోరీస్’ సంస్థ ఈ బృహత్తర ప్రయత్నంలో స్మితకు తోడుగా నిలిచి, ముందడుగు వేస్తున్నాయి. కొన్ని తరాలుగా సంప్రదాయ వస్త్రశ్రేణితో ముడిపడిన కంకటాల సంస్థ ఈ తత్త్వమసిలో తొలి సీజన్ అయిన ప్రథమ పాదాన్ని సమర్పిస్తోంది.

    “ఆదిశంకరుల ‘నిర్వాణ షట్కం’, అన్నమాచార్యుల కీర్తనలు, వేమన సాహిత్యం లాంటివన్నీ భవబంధనాలను తెంచుకొని విముక్తమై, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరిన మహోన్నతుల అద్భుత రచనలు. శతాబ్దాలుగా తెలుగు వారి జీవితంలో భాగమైపోయిన కాలాతీతమైన రచనలు. వాటి లోతైన అర్థం అవగాహన చేసుకొని, అందరికీ తెలిసేలా పాడడం నాకు ఆత్మతృప్తినిస్తోంది” అని స్మిత చెప్పారు. ఈ ప్రాచీన తత్త్వాలకు వాద్యగోష్ఠి, బాణీలలో వాయులీన విద్వాంసులు సాయి, అలాగే సుజన్, సహా ప్రతిభావంతులైన సంగీత కళాకారులు పలువురు పాలుపంచుకుంటూ ఉండడం విశేషం. అలాగే, స్మిత తదితర సినీ, కళా ప్రముఖులెందరో ఉంటున్న భారీ కమ్యూనిటీ గృహ సముదాయంలోనే నివసిస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి ఈ తత్త్వాలకు వీడియో చిత్రీకరణలో కీలక భూమిక వహించడం మరో విశేషం.

    అమ్మ, అమ్మమ్మల ప్రభావంతో...

    “మనం బయట వెతుకుతున్న సత్యం... ఇప్పటికే మనలోనే ఉందని గుర్తుచేసే శాశ్వత సందేశం ఈ తత్త్వమసి” అంటూ ఈ ప్రాజెక్టు విశేషాలను గాయని స్మిత ఇటీవల వెల్లడించారు. అత్యంత సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులతో పాటు ఆప్తులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల మధ్య ఆ ప్రారంభ పరిచయోత్సవం ఆత్మీయంగా జరిగింది. గాయకుడు హేమచంద్ర సంధానకర్తగా వ్యవహరించిన ఆ ఉత్సవంలో ప్రాజెక్ట్ పరిచయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్, స్మిత బృందం రూపొందించిన తత్త్వాల ఆడియో గ్లింప్స్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి ఆవిష్కరించి, అభినందించారు. కొన్ని తత్త్వాల దృశ్యఖండికలను వెండితెరపై ప్రత్యేకంగా ప్రదర్శించారు.

    తత్త్వాలను పాడుతున్నప్పుడు వాటి వీడియో చిత్రీకరణతో పాటు ఆ పాటల భావార్థాలను పక్కనే ఇంగ్లీషు లిపిలో వేయడం విశేషం. తెలుగు తెలియనివారికి కూడా ఆ తత్త్వాల అంతరార్థం తెలిసేందుకు ఈ ఆలోచన ఉపకరిస్తుంది. “స్మిత ఆలోచన, ఆచరణ ఏదైనా మితంగా ఉండదు. అపరిమితంగా ఉంటుంది. బహుముఖ ప్రజ్ఞ గల అమ్మమ్మ తేళ్ళ లక్ష్మీకాంతమ్మ, అమ్మ జోగులాంబల ప్రభావం స్మితపై ఎంతో ఉంది. ‘నాదాధీనం జగత్సర్వం’ అన్నారు పెద్దలు. ఆ నాదాన్ని పట్టుకొని, ఈ తరానికి ఆమె అందిస్తున్న అద్భుతమైన ఆధ్యాతిక ఔషధ గుళిక ఈ ‘తత్త్వమసి’ ” అని సత్యవాణి అనర్గళంగా ఉపన్యసిస్తూ, గాయనిని ఆశీర్వదించారు.  

    “స్మిత ఓ లేడీ అపరిచితుడు!”: హీరో నాని

    ప్రముఖ హీరో నాని ఈ తత్త్వాల ఆలోచనను అమితంగా మెచ్చుకున్నారు. “నాకు రక్తసంబంధీకులైన అక్కాబావ ఒకరైతే, దేవుడిచ్చిన అక్కాబావలు స్మిత దంపతులు. నా దృష్టిలో చాలామంది కన్నా భిన్నమైన, అరుదైన వ్యక్తి స్మిత. ఏ మాత్రం అలసిపోకుండా, ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో పాప్ గీతాలు పాడుతూ, డ్యాన్సులు చేసే అదే వ్యక్తి... ఎంతో భక్తి, వేదాంతాలతో అంతే అద్భుతంగా ఇలా తత్త్వాలూ పాడుతుంది. (చమత్కార ధోరణిలో...) నిజం చెప్పాలంటే, శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ చిత్రంలో లాగా ఆమె ఓ లేడీ అపరిచితుడు. మా కమ్యూనిటీలోని స్మిత వాళ్ళ ‘బి-10’ ఫ్లాట్ తలుపు తడితే... (నవ్వుతూ...) ఆమె ఎప్పుడు శుద్ధ సంప్రదాయ రామాచారి ఫక్కీలో తలుపు తీస్తుందో, ఎప్పుడు ఆధునిక కాలపు రెమో ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియదు. అందుకే, ఆమె ఓ సెపరేట్ పీస్” అని నాని తన మనోభిప్రాయాలు పంచుకున్నారు.

    నిజానికి, పాటలు, ఇలాంటి తత్త్వాలంటే చెవి కోసుకునే హీరో నానితో కూడా ఈ తత్త్వాలలో గొంతు కలిపేలా చేయాలని స్మిత భావించారట. కానీ, హీరో నాని మాత్రం “నాకు పాటలు వినడం చాలా ఇష్టం. అలాగని నన్ను పాడమంటే ఎలా” అంటూ సున్నితంగానే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. లేదంటే, హీరో నాని గొంతు కూడా ఈ వినూత్న ప్రాజెక్ట్‌లో వినిపించేంది.  

    వైజాగ్ సహా వివిధ ప్రాంతాల్లో త్వరలో లైవ్ షోస్!

        “విజయవాడ రోజుల నుంచి గత 40 ఏళ్ళుగా స్మిత నాకు బాగా తెలుసు. అయిదేళ్ళ వయసుకే తాను ఏమవుతానో చెప్పేది. నటి, ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్... ఇలా ఏ వయసుకు ఆ వయసులో ఎప్పటికప్పుడు తాను అవదలుచుకున్నదల్లా చెప్పేది. చెప్పిందల్లా చేసి, చూపించింది. దటీజ్ స్మిత” అని నిర్మాత స్వప్నాదత్ తన చిరకాల అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. స్వప్నాదత్ సహా సినీ ప్రముఖులు నాని, ఐశ్వర్యా రాజేశ్, అల్లరి నరేశ్, సుబ్బరాజు, దర్శకులు నాగ్ అశ్విన్, దేవా కట్టా, స్మిత భర్త శశాంక్ కంచర్ల, తల్లి జోగులాంబ, తదితరులు కలసి ‘తత్త్వమసి’ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. “ఎవరి మాటా వినని సీతయ్య లాగా... ఎవరి మాటా వినదు స్మితక్క. నచ్చినది చేసుకుంటూ ముందు వెళుతుంది” అంటూ ‘అల్లరి’ నరేశ్ చమత్కరించారు. “ఈ తత్త్వాల ప్రయోగం తర్వాత యోగి వేమన లాగా యోగిని స్మిత అంటారేమో” అని సుబ్బరాజు ఛలోక్తి విసిరారు. “ఈ తత్త్వాల వీడియో నాకు కళ్ళు తెరిపించే అనుభవం. పాటల గానంతో పాటు ఆ పాటల చిత్రీకరణ వేళ ఆధ్యాత్మికతను ప్రతిఫలిస్తూ స్మిత చేసుకున్న వస్త్రధారణ, అలంకరణ కూడా కళ్ళకు ఇంపుగా ఉన్నాయి” అని హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ జనం నవ్వుల మధ్య, స్మితకు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.

        స్మితతో పుష్కరకాలం క్రితం పరిచయమై, ఇప్పుడు ఆ పరిచయమే ఓ ప్రపంచంగా మారిపోయిందంటున్న దర్శకుడు దేవా కట్టా మాటల్లో చెప్పాలంటే, “స్మిత ఓ ర్యాడికల్. ఎప్పుడూ ఒకే పని చేస్తూ కూర్చుండిపోకుండా, నూతనత్వం వైపు ప్రయాణించే వ్యక్తి. స్థిరపడిపోయిన భావాలపై తిరుగుబాటు చేసే రెబెలియన్. ఒకసారి నిర్ణయం తీసుకుంటే, ఎంత కష్టమైనా సరే అనుకున్నది చేసే తీరే రకం”. వరుసగా వంద వారాల్లో 100 తత్త్వాల ఆడియో, వీడియో విడుదల, వివిధ ప్రాంతాల్లో షోల నిర్వహణ లాంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయత్నానికి బహుశా అలాంటి వ్యక్తిత్వం, కృత నిశ్చయమే కావాలి. ఈ విషయంలో ‘తత్త్వమసి’ (అది నువ్వే) అంటున్న శ్రేయోభిలాషులతో పాటు తానూ అదే బలంగా నమ్ముతున్న స్మితకు ఆల్ ది బెస్ట్!

    పాతికేళ్ళ పైచిలుకు క్రితమే తెలుగు పాప్ పాటల రంగంలో ‘హాయ్ రబ్బా’ అంటూ తొలి ఆల్బమ్‌తోనే సంచలనం రేపిన చరిత ఆమెది. ఇప్పుడీ ‘తత్త్వమసి’ పేరిట హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు, విదేశాల్లోనూ స్మిత చేయదలుచుకున్న ఈ అనుభూతి ప్రధాన తత్త్వాల ప్రత్యక్ష కచ్చేరీలు సైతం మరో ట్రెండ్ సృష్టిస్తాయేమో చూడాలి. “ఇది కేవలం ఆడియో ఆల్బమ్ కాదు... అలాగని వీడియోనే కాదు... సంప్రదాయ సంగీత కచ్చేరీ కాదు... ప్రవచనాల బోధ కాదు... ప్రజల మనసుకు దగ్గరై, వారిని అనుభూతికి లోను చేసే ప్రత్యక్ష ప్రదర్శన” అంటున్నారు స్మిత. ఆమెకు అన్ని విషయాల్లో అండగా నిలిచే ఆమె భర్త ఓ సామాన్య శ్రోతగా అన్నట్టు, “పరుగులు తీస్తున్న ఈ ఆధునిక, రణగొణధ్వనుల ప్రపంచంలో జీవితం లోతుల్ని మనకు తెలియజెప్పడం ఓ గొప్ప ప్రయత్నం. కచ్చితంగా అత్యుత్తమమైన మంచి ప్రయత్నం.” జీవిత పరమార్థం ఏమిటో, ఆ పరమ లక్ష్యాన్ని ఎలా చేరాలో గుర్తుచేసే గీతాలుగా ‘తత్త్వమసి’ ఆధునికులకు అవసరమైన ప్రయోగమే!

    -    రెంటాల జయదేవ

  • అనుకున్నదే జరిగింది. గత రెండు రోజులుగా వస్తోన్న రూమర్సే నిజమయ్యాయి. బాలీవుడ్ హీరోయిన్, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులను కోరింది. విడాకుల విషయాన్ని మౌనీరాయ్‌తో పాటు ఆమె భర్త సూరజ్ నంబియార్‌ సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పెళ్లైనా నాలుగేళ్లకే తమ బంధానికి ముగింపు పలికారు.

    తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.  పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని.. స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

    తమ వ్యక్తగత జీవితాలపై మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు మండిపడ్డారు. తమ ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రిలేషన్‌ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలంలో తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ గోప్యతను గౌరవించాలని అభిమానులను విజ్ఞప్తి చేశారు.

    కాగా.. మౌని రాయ్,  సూరజ్ నంబియార్ జనవరి 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో డివోర్స్ రూమర్స్ మొదలయ్యాయి. మౌని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సూరజ్‌తో ఉన్న ఫోటోలు, పెళ్లి ఫోటోలు కనిపించడం లేదని అభిమానులు విడాకుల చర్చకు దారితీసింది.

    ఇక మౌనీ రాయ్ సినీ కెరీర్ విషయానికొస్తే 'కస్తూరి', 'దేవోం కే దేవ్...మహాదేవ్', 'నాగిన్' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా  'నాచ్ బలియే 6', 'ఝలక్ దిఖ్లా జా 7', 'జరా నాచ్కే దిఖా' వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది. ఇటీవలే 'టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా'కు హోస్ట్‌గా వ్యవహరించింది.  'బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ', గోల్డ్, మేడ్ ఇన్ చైనా లాంటి చిత్రాల్లో కూడా నటించింది.

     

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి షరామామూలే. ఈ వారంలో కోలీవుడ్ హీరో కరుప్పు ప్రేక్షకుల ముందుకొస్తోంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు అరేయ్ ఆపండ్రా, హరుడు, శివం శైవం అనే తెలుగు మూవీస్ విడుదలవుతున్నాయి. కానీ వీటిపై పెద్దగా బజ్ లేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు.

    ఇక ఈ ఫ్రైడే ఓటీటీల విషయానికొస్తే దురంధర్-2పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ సినిమా మే 15 నుంచే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్(ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు మాత్రమే) కానుంది. దీంతో పాటు తిమ్మరాజుపల్లి టీవీ, తెరచార లాంటి టాలీవుడ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా కర్తవ్య లాంటి డబ్బింగ్ సినిమా, పలు డబ్బింగ్ సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఏయే చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    • ధురంధర్ 2 (హిందీ సినిమా) - మే 15 (ఓవర్సీస్ రిలీజ్)
    • కర్తవ్య (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15
    • బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ఎర్మిన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15
    • ఇట్స్ నాట్ లైక్ దట్(హాలీవుడ్ సిరీస్)- మే 15
    • ది వండర్ ఫూల్స్(కొరియన్ సిరీస్)- మే 15
    • ది క్రాష్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 15

    అమెజాన్ ప్రైమ్

    • ఎగ్జామ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 15
    • డ్రైవర్స్ ఈద్(హాలీవుడ్ సినిమా)- మే 15

    జియో హాట్‌స్టార్

    •    ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 (హిందీ సిరీస్) - మే 15

    ఆహా

    •    తిమ్మరాజుపల్లి టీవీ (తెలుగు సినిమా) - మే 15

    సన్ నెక్ట్స్‌..

    • తెరచాప(తెలుగు సినిమా)- మే 15

    జీ5..

    • టిఘీ (మరాఠీ మూవీ) - మే 15

    మనోరమ మ్యాక్స్..

    • కప్(మలయాళ సినిమా)- మే15

    లయన్స్ గేట్ ప్లే..

    • కౌచర్(హాలీవుడ్ మూవీ)- మే 15

    హులు..

    • రివల్స్(హాలీవుడ్ సినిమా)- మే 15

    ముబీ..

    • ది మిస్టిరీయస్ గేజ్ ఆఫ్‌ ది ఫ్లైమింగో(హాలీవుడ్ సినిమా)- మే 15

     

  • తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా సిద్ధమయ్యారు. ఈ రిలీజ్ అనగానే ఉదయం 9 గంటలకే థియేటర్లకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లాక అభిమానులు షాక్ తిన్నారు. ఈ రోజు సినిమా విడుదల లేదని థియేటర్ యాజమాన్యాల చెతులేత్తేశాయి. దీంతో తమ హీరో మూవీని చూడాలని వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇదంతా సూర్య హీరోగా వచ్చిన కరుప్పు మూవీ గురించే. ఇవాళ రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

    దీంతో ఒక్కసారిగా సూర్య అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. మొదటి షోలు రద్దు కావడంతో పుదుచ్చేరిలోని సూర్య అభిమానులు థియేటర్ల బయట నిరసనలు చేపట్టారు. తమ అభిమాన నటుడి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులు,, టపాసులు, డోలు వాయిద్యాలు, పూల దండలు, పాలతో సిద్ధమైన ఫ్యాన్స్‌ సినిమా హాళ్ల బయట వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కాగా.. ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటించారు. ఫైనాన్స్ సమస్యలతో ఈ సినిమాను అనూహ్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కు చెల్లించాల్సిన రూ. 50 కోట్లకు పైగా బకాయిలు సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం మే 15న థియేటర్లలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. కరుప్పు చిత్రంలో  యోగి బాబు, జాఫర్ సాదిక్, మన్సూర్ అలీ ఖాన్, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంక్కర్ సంగీతం అందించారు.

     

     

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్‌ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సరిగ్గా ఈ సమయంలోనే టాలీవుడ్‌లో సమస్య మొదలైంది. సింగిల్ స్క్రీన్స్‌  ఎగ్జిబిటర్స్‌ తమకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పెద్ది రిలీజ్‌కు ముందే టాలీవుడ్‌లో వివాదం ముదురుతోంది. అది కాస్తా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వార్‌ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారంది. పెద్ది సమయంలో ఇలాంటి వివాదం తలెత్తడంతో నిర్మాతలు రవిశంకర్, నాగవంశీ ఫైరయ్యారు.

    ఇక వివాదం పక్కనపెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పెద్ది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్‌పై ప్రభావం పడనుందా? అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ‘పెద్ది’ సినిమాకు స్క్రీన్ సమస్యలు రావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు రెంటల్ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పెద్దికి థియేటర్లు ఇవ్వొద్దనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.  

    మరోవైపు ఈ వివాదం కూడా టాలీవుడ్‌కు ప్లస్ ‍అవుతుందా? అని కొందరు భావిస్తున్నారు. టాలీవుడ్ ఫ్యూచర్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుందా? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ అదే ఛాలెంజ్‌ను అవకాశంగా మార్చుకుంటే? పీవీఆర్ ఐనాక్స్, ప్రసాద్స్, అల్లు సినిమాస్ వంటి ఇండిపెండెంట్ థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసి.. పరిమిత స్క్రీన్లతోనే భారీ కలెక్షన్లు కొడితే మాత్రం ఇండస్ట్రీ డైనమిక్స్ పూర్తిగా మారిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

    ఎందుకంటే..  స్టార్ హీరోల సినిమాలు తక్కువ స్క్రీన్లతో సక్సెస్ అయితే.. భవిష్యత్తులో పెద్ద నిర్మాతలు సింగిల్ స్క్రీన్ నెట్‌వర్క్‌పై ఆధారపడే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాణ సంస్థ వద్ద ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ లాంటి భారీ ప్రాజెక్టులు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఈ వివాదం ఇలాగే కొనసాగితే.. చివరికి ఎక్కువ నష్టం ఎవరికి? నిర్మాతలకా? ఎగ్జిబిటర్లకా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 
     

  • ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

    ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ..  మొన్ననే ప్రధాని మోదీ  ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని మళ్లీ ట్రెండ్ మొదలుపెట్టారు. ఆ రకంగా ఈ సినిమా మంచి ట్రెండ్‌లో వస్తోంది. ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో చాలా వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

    డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ. ఈ సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం’ అన్నారు.

    నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. మన ప్రధాని మోదీ  కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేయమని ప్రోత్సహిస్తున్నారు. మేము చాలా అడ్వాన్స్‌గా ఈ సినిమా తీశాం. ఈ సినిమాను ఆయన కూడా ప్రశంసిస్తారని నమ్మకం ఉంది. అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ చెప్పాం. తప్పకుండా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

    ‘నేను సైన్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను చాలా ప్యాషన్‌తో చేశాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ అన్నారు. 

  • ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్‌ ఉన్న వీరిద్దరు ఉదయ్‌పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో టాలీవుడ్‌ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.

    అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్‌ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్‌లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్‌స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్‌కు వరల్డ్ వైడ్‌గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. 

    మొదటి ప్లేస్ కూడా వీరిదే..

    ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్‌కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది.
     

  • కన్నడ స్టార్ ధ్రువ్‌ సర్జా హీరోగా నటిస్తోన్న చిత్రం కేడీ ది డెవిల్. ఈ మూవీకి ప్రేమ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేడీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

    తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలోనే ఈ కథ తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇందులో శిల్పా శెట్టి, సంజయ్ దత్ పాత్రలు హైలెట్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఇది అంతం కాదు.. ఆరంభం అనే డైలాగ్‌ ఆడియన్స్‌ను మరింత ఆకట్టుకుంటోంది.

    ఇటీవల ఈ మూవీలో ఓ సాంగ్‌ హిందీ వర్షన్‌ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. లిరిక్స్‌ విషయంలో బూతుపదాలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలొచ్చాయి. దీంతో ఈ సినిమాలోని ఆ పాటను అన్ని సోషల్‌ మీడియా వేదికల్లోనూ తొలగించారు. మరి ఈ సాంగ్ తెలుగు వర్షన్‌ ఉంటుందో.. లేదో సినిమా రిలీజ్‌ అయితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. కాగా.. ఈ మూవీని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. 
     

Sports

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరోసారి 200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. పంజాబ్ విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. 

    ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. ఇక ముంబై విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ హైదరాబాదీ కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి.

    ఆఖరిలో విల్ జాక్స్(10 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు ర్యాన్ రికెల్టన్‌(48) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్‌, జాన్సన్ తలా వికెట్ సాధించారు. 

    అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్‌(17 బంతుల్లో 38), బార్ట్‌లెట్‌(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌ రెండు, బాష్‌, బావా తలా వికెట్‌ సాధించారు.

  • ఐపీఎల్‌-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం  అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

    ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. 

    అయితే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. 

    రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. 

    అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్‌-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.
    చదవండి: ముంబై ఇండియన్స్‌ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్‌ చరిత్రలోనే

     

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నడిపిస్తున్నాడు.  రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సమయంలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించాడు.

    ఇప్పుడు సూర్యకుమార్ కూడా అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను బుమ్రాకు అప్పగించారు. తద్వారా ముంబై ఇండియన్స్ ఓ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్ల సారథ్యంలో ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఒకే సీజన్‌లో ఏ జట్టుకు కూడా ముగ్గురు ఇండియన్స్ కెప్టెన్లగా వ్యవహరించలేదు. ఓవరాల్‌గా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన ఐదో జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

    ఒకే సీజన్‌లో ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడిన జట్లు 
    ముంబై ఇండియన్స్‌ - 2008 (హర్భజన్, పొలాక్, టెండూల్కర్)
    పుణే వారియర్స్‌ - 2013 (మాథ్యూస్, రాస్ టేలర్, ఫించ్)
    ఎస్‌ఆర్‌హెచ్‌ - 2021 (వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే)
    పంజాబ్ కింగ్స్‌ - 2024 (శిఖర్, సామ్ కరన్, జితేష్)
    ముంబై ఇండియన్స్‌- 2026 (హార్దిక్, సూర్య, బుమ్రా)
    చదవండి: IND vs SL: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి ఛాన్స్‌

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్ ద‌క్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. కుడి తొడ గాయంతో బాధపడుతున్న ఓవర్టన్.. తదుపరి చికిత్స కోసం యూకేకు తిరుగు ప్రయాణమయ్యాడు.

    ఈ విషయాన్ని సీఎస్‌కే మేనెజ్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియన్ ఫారెస్టర్‌ను సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరకు అతడితో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

    "జేమీ ఓవర్టన్‌కు కుడి తొడకు గాయమైంది. అతడు తదుపరి చికిత్స కోసం యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఓవర్టన్ లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. కానీ కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం" సీఎస్‌కే యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. 

    కాగా ఓవ‌ర్ట‌న్ దూరం కావ‌డం సీఎస్‌కే నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవ‌ర్ట‌న్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు.

    అటు బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్‌లో కీలక పరుగులు చేస్తూ జట్టుకు కీల‌క ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవ‌ర్ట‌న్ స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన ఫారెస్టర్‌కు అద్భుత‌మైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవ‌ల ముగిసిన పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో ఫారెస్టర్ అద‌ర‌గొట్టాడు. 

    సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న సీఎస్‌కేకు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకం.
    చదవండి: IND vs SL: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. వైభ‌వ్ సూర్య‌వంశీకి ఛాన్స్‌

  • Punjab Kings vs Mumbai Indians Live updates and Highlights:  ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది.

    తిలక్‌ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్‌) కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో పంజాబ్‌ తమ ప్లే ఆఫ్స్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ బౌలర్లలో ఓమర్జాయ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్‌, చాహల్‌ తలా వికెట్‌ సాధించారు.

    విజయానికి చేరువలో ముంబై
    తిలక్ వర్మ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 25 బంతుల్లోనే తిలక్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు కావాలి.

    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ డట్‌
    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రూథర్‌ ఫర్డ్‌.. ఓమర్జాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 52 పరుగులు కావాలి.

    దూకుడుగా ఆడుతున్న తిలక్‌
    15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై విజయానికి 30 బంతుల్లో 72 పరుగులు కావాలి. క్రీజులో తిలక్‌ వర్మ(37), షెర్పేన్‌ రూథర్‌ ఫర్డ్‌(13) ఉన్నారు.

    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ డౌన్‌
    రోహిత్‌ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రోహిత్‌.. చాహల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన నమన్‌ ధీర్‌.. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.5 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 81/2

    ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ర్యాన్‌ రికెల్టన్‌.. ఓమర్జాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.3 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 61/1

    దూకుడుగా ఆడుతున్న రికెల్టన్‌
    3 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్‌ రికెల్టన్‌(24), రోహిత్‌ శర్మ(4) పరుగులతో ఉన్నారు.

    చెలరేగిన పంజాబ్‌ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్‌
    ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 

    పంజాబ్‌ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(57) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓమర్జాయ్‌(17 బంతుల్లో 38), బార్ట్‌లెట్‌(7 బంతుల్లో 18), ప్రియాన్ష్ ఆర్య(22) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్‌ చాహర్‌ రెండు, బాష్‌, బావా తలా వికెట్‌ సాధించారు.

    దూకుడుగా ఆడిన ఓమర్జాయ్‌
    అజ్మతుల్లా ఓమర్జాయ్‌ దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లో 38 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరగాడు. అతడి కంటే ముందు జాన్సన్‌.. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    పంజాబ్‌ ఆరో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన శశాంక్‌ సింగ్‌.. కార్భిన్‌ బాష్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

    పంజాబ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    సూర్యాంశ్ షెడ్గే రూపంలో పంజాబ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సూర్యాంశ్‌ ఔటయ్యాడు.

    పంజాబ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    కూపర్‌ కొన్నోలీ రూపంలో పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 21 పరుగులు చేసిన కొన్నోలీ రాజ్ బావా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 122-4

    పంజాబ్‌ మూడో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌.. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11.2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 107/3
    పంజాబ్‌ తొలి వికెట్‌ డౌన్‌
    50 పరుగుల వద్ద పంజాబ్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన ప్రియాన్ష్‌ ఆర్య.. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న ప్రియాన్ష్‌
    5 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో ప్రియాన్ష్‌ ఆర్య(22), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(23) ఉన్నారు.

    3 ఓవర్లకు పంజాబ్‌ స్కోరెంతంటే?
    3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(9), ప్రియాన్ష్‌ ఆర్య(12) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

    కాగా ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయం కారణంగా దూరంగా కాగా.. ఇప్పుడు పంజాబ్‌తో మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. 

    ముంబై జట్టులోకి శార్ధూల్‌ ఠాకూర్‌తో పాటు రఘు శర్మ తిరిగొచ్చారు. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ కూడా మూడు మార్పులు చేసిది. హర్‌ప్రీత్‌ బ్రాక్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, ఓమర్జాయ్‌ తుది జట్టులోకి వచ్చారు.

    తుది జ‌ట్లు
    ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్‌), రఘు శర్మ

    పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీప‌ర్‌), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్జ్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

  • ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ డాస‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు డాసన్ ప్రకటించాడు. 36 ఏళ్ల డాసన్.. తన వైట్ బాల్ కెరీర్‌ను మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డాసన్ త‌న 19 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు హాంప్‌షైర్ క్రికెట్ క్ల‌బ్ త‌ర‌పున ఆడాడు.

    2026 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా హాంప్‌షైర్ ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో డాసన్ పాల్గోన్నాడు. కానీ టోర్న‌మెంట్ మ‌ధ్య‌లోనే అత‌డు తప్పుకోని అంద‌రికి షాకిచ్చాడు. అయితే న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌టించిన కొద్ది గంటల్లోనే డాస‌న్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

    వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు డాసన్ చెబుతున్నప్పటికి, టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతోనే రెడ్ బాల్ క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలికాడని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

    "నేను ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు.
    వైట్-బాల్ క్రికెట్‌లో నా కెరీర్‌ను మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. హాంప్‌షైర్ తరపున 200కు పైగా మ్యాచ్‌లు ఆడటం నాకు ఎంతో గర్వకారణం. 

    ఈ క్రికెట్ క్లబ్‌తో నాకు ఎన్నో అద్భుతమైన  జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ 19 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని డాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 218 మ్యాచ్‌లు ఆడిన డాసన్‌.. 10828 పరుగులతో పాటు 380 వికెట్లు పడగొట్టాడు. అతడి పేరిట 18 ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్ తరపున 4 టెస్టులు ఆడిన డాసన్.. కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

  • ఈ ఏడాది జూన్‌లో శ్రీలంకలో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ట్రై-సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అస్సాం ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

    ఇక ఈ జ‌ట్టులో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌లనం వైభ‌వ్ సూర్య‌వంశీకి చోటు ద‌క్కింది. వైభ‌వ్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌-2026లో ఈ చిచ్చ‌ర పిడుగు  దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 236.56 స్ట్రైక్-రేట్‌తో 440 పరుగులు సాధించాడు.

    ఇందులో ఏకంగా 40 సిక్సర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా వైభ‌వ్ అద‌ర‌గొట్టాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 175 ప‌రుగులు సాధించి భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి ఇండియా-ఎ జ‌ట్టులో చోటు ల‌భించింది. 

    అదేవిధంగా ఐపీఎల్‌లో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్షుల్ కంబోజ్, సూర్యాంశ్ షెడ్గే వంటి ఆటగాళ్లు కూడా ఈ జ‌ట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 'ఎ' జట్లతో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఈ ట్రై-సిరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.

    ఈ టోర్నీ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరగనుంది. , జూన్ 21న జరిగే ఫైనల్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ'తో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. వైట్-బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్-బాల్ మ్యాచ్‌లు గాలే వేదికగా జరగనున్నాయి.

    భారత-ఎ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్‌), ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్‌), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్‌), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్
    చదవండి: హార్దిక్‌ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!

     

  • ఐపీఎల్‌-2026 లీగ్‌ దశ ముగింపునకు వచ్చింది. ఇంకో పది రోజుల్లో (మే 24) లీగ్‌ స్టేజీ పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన నివేదిక తెరమీదకు వచ్చింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ముగ్గురు కెప్టెన్లపై వేటు పడనుందని దాని సారాంశం.

    ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్‌ పంత్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెగా వేలం-2025లో అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆటగాడిగా, కెప్టెన్‌గా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పూర్తిగా తేలిపోతున్నాడు.

    చెత్త ప్రదర్శన
    గతేడాది చెత్త ప్రదర్శనతో జట్టును ఏడో స్థానంలో నిలిపిన పంత్‌.. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాలు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది.

    వ్యక్తిగతంగానూ పంత్‌ ప్రదర్శన బాగాలేదు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిప కేవలం 251 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి అక్షర్‌ పటేల్‌ కూడా విమర్శల పాలవుతున్నాడు. పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 100 పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.

    అక్షర్‌ అంతంత మాత్రమే
    లీగ్‌ దశలో అక్షర్‌ సేన ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఐదు గెలిచి పట్టికలో ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకుని మరీ.. రహానేకు పగ్గాలు ఇచ్చింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.

    రహానేదీ అదే బాట
    గతేడాది డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌.. పద్నాలుగింట ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటికి పదకొండింటిలో నాలుగు గెలిచి ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక రహానే 11 ఇన్నింగ్స్‌ ఆడి 237 పరుగులే చేశాడు.

    వేటుకు రంగం సిద్ధం
    ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సన్నిహిత వర్గాలు పీటీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు ఐపీఎల్‌ కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌ ఆఖరి నాటికి వాళ్లు తమ పదవులు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందకు సంబంధించిన ఫ్రాంఛైజీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.

    అక్షర్‌ పటేల్‌, అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌ గత రెండు సీజన్లలో సారథులుగా విఫలమవుతున్నారు. ఒక్కసారి కూడా జట్లను ప్లే ఆఫ్స్‌ దిశగా తీసుకువెళ్లలేకపోయారు’’ అని పేర్కొన్నాయి. ముఖ్యంగా పంత్‌ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. అతడి వ్యూహాలు బెడిసికొట్టడం ఫ్రాంఛైజీకి తలనొప్పిగా మారిందని తెలిపాయి.

    మరి హార్దిక్‌ పరిస్థితి ఏంటి?
    పంత్‌, అక్షర్‌, రహానే సంగతి ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యా గురించి మాత్రం సదరు వర్గాలు స్పందించలేదు. 2024లో ముంబై కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌ తొలి ఏడాది అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. 

    గతేడాది ప్లే ఆఫ్స్‌ చేర్చినా.. ఈ ఏడాది పదో స్థానం కోసం ముంబై లక్నోతో పోటీపడుతోంది. ఇప్పటికే గాయం సాకుతో హార్దిక్‌ జట్టుకు దూరమయ్యాడు. త్వరలోనే అతడిపై వేటు పడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా నివేదికలో అతడి పేరు లేకపోవడం గమనార్హం.

    చదవండి: బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్‌

  • తనపై వస్తున్న వదంతులపై ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. తన గురించి రాస్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆసీస్‌ టెస్టు, వన్డే సారథిగా కమిన్స్‌కు గొప్ప రికార్డు ఉంది. మిచెల్‌ స్టార్క్‌తో పాటు పేస్‌ దళంలో బౌలర్‌గానూ కమిన్స్‌ కీలకం.

    అయితే, కమిన్స్‌తో పాటు మరికొందరు సీనియర్‌ క్రికెటర్లు క్రికెట్‌ ఆస్ట్రేలియాను (CA)ను బెదిరిస్తున్నారంటూ ‘ది ఏజ్‌’ కథనం పేర్కొంది. తమ జీతాలు పెంచకపోతే దేశీ టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)ను బహిష్కరిస్తామని వాళ్లు బ్లాక్‌మెయల్‌ చేశారన్నది ఆ కథనం సారాంశం.

    దాదాపు రూ. 7 కోట్లు
    2027-28 సీజన్‌కు గానూ.. ఒకవేళ తాము కోరినట్లు 1 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) చెల్లించకపోతే.. ఈ సీజన్‌లో ఆడేది లేదని ఆటగాళ్లు తేల్చిచెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. బీబీఎల్‌ను వదిలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు వెళ్తామని హెచ్చరించినట్లు తెలిపింది.

    నువ్వు రాసినదంతా కల్పితం
    ఇందుకు సంబంధించిన వార్తను ఓ నెటిజన్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేయగా.. ప్యాట్‌ కమిన్స్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ది హండ్రెడ్‌ లీగ్‌లో నాకు ఆఫర్‌ వచ్చినట్లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నిరభ్యంతర పత్రం విషయంలో నేనేదో డిమాండ్‌ చేసినట్లు.. నా గురించి నువ్వు రాసినదంతా కల్పితం మాత్రమే’’ అని కమిన్స్‌ బదులిచ్చాడు.

    కాగా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన కమిన్స్‌.. ఆ తర్వాత ఆటకు  దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఈ పేస్‌ బౌలర్‌.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ విధులతో బిజీగా ఉన్నాడు.

    అయితే, ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్‌... ఇటీవలే తిరిగి వచ్చి జట్టును విజయపథంలో తీసుకువెళ్తున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కమిన్స్‌ బృందం ప్లే ఆఫ్స్‌ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

    చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర

  • కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్‌ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్‌ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్‌ కోచ్‌గా ఉన్న డిక్‌ అడ్వోకాట్‌ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. 

    ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా  78 ఏళ్ల అడ్వోకాట్‌ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్‌ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్‌లో గ్రీస్‌ జట్టుకు రెహగల్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. 

    గ్రూప్‌ ‘ఇ’లో ఉన్న కురసావ్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న హ్యూస్టన్‌లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్‌కు చెందిన అడ్వోకాట్‌ శిక్షణలోనే కురసావ్‌ దేశం మొదటిసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న అడ్వోకాట్‌ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. 

    ఈ మూడు నెలల కాలంలో కురసావ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఫ్రెడ్‌ రుటెన్‌ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో కురసావ్‌ ఓడిపోయింది. కురసావ్‌ జట్టులోని సీనియర్‌ ప్లేయర్లకు కూడా రుటెన్‌ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. 

    సీనియర్‌ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్‌ను కోచ్‌గా తేవాలని కురసావ్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్‌ సమాఖ్య... అడ్వోకాట్‌ను సంప్రదించగా ఆయన కోచ్‌గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. 

    ఫుట్‌బాల్‌ సర్కిల్‌లో ‘ద లిటిల్‌ జనరల్‌’గా పేరున్న అడ్వోకాట్‌కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్‌ కోచ్‌గా అడ్వోకాట్‌కిది మూడో ప్రపంచకప్‌ కానుంది. 1994లో నెదర్లాండ్స్‌ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్‌ జట్లకు, 16 ప్రొఫెషనల్‌ క్లబ్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.    

Telangana

  • సాక్షి, నల్లగొండ: పట్టణంలోని గొల్లగూడలో ఉన్న భారత ఆహార సంస్థ (FCI) గోడౌన్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్‌లోని రికార్డుల గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు రికార్డు రూమ్ అంతటా విస్తరించడంతో లోపల ఉన్న కీలక పత్రాలు, దస్త్రాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

    ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ప్రస్తుతం ఒకే ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండటంతో మంటలను అదుపు చేయడం సిబ్బందికి సవాలుగా మారింది. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి సుమారు రెండు గంటలుగా అధికారులు శ్రమిస్తున్నా ఇంకా అదుపులోకి రావడం లేదు. ఎఫ్‌సీఐ గోడౌన్‌ పరిధిలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది. ఊపిరి ఆడక స్థానికులు  ఇబ్బందులు పడుతున్నారు.

    వ్యక్తమవుతుఉన్న అనుమానాలు
    గోడౌన్‌లోని ఇతర విభాగాలకు కాకుండా, కేవలం కీలక సమాచారం ఉండే రికార్డు రూములోనే మంటలు చెలరేగడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌సీఐ లావాదేవీలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు కాలిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా కావాలని చేశారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో  పామాయిల్ రైతు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన బయోఫెర్టిలైజర్ స్టాల్ సందర్శకులకు, రైతులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

    పెద్ద సంఖ్యలో రైతులు స్టాల్‌ను సందర్శించి, సుస్థిర పంట ఉత్పత్తి కోసం జీవ ఎరువులు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించడంపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు. దీనిలో భాగంగా సాంకేతిక నిపుణుల బృందంతో రైతులు చర్చించారు. పంట దిగుబడి, నేల సారవంతం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సూక్ష్మజీవ సాంకేతికతల ప్రయోజనాల గురించి ప్రధానంగా చర్చించారు.


     


     

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్‌ ఇయర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో  ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో 15 మార్కులు, సెకండ్‌ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్‌లో మ్యాథ్స్‌ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. 

    ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్‌లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్‌ బోర్డు వర్గాలు తెలిపాయి. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌రెడ్డికి సైతం సమన్లు పంపింది.  జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. 

  • సాక్షి,హైదరాబాద్‌: పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ కోసం దాఖలు చేశాడు. భగీరథ్‌ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తెలంగాణ హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్‌ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. 

  • సాక్షి, హైదరాబాద్‌: నీట్ పేపర్‌ లీక్, పరీక్ష రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో స్పందించారు. నీట్ పేపర్‌ లీక్‌తో విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టారని.. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర ఆందోళనలొ ఉన్నారని ఆయన ట్వీట్‌ చేశారు. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. పేపర్ లీక్‌, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితులు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలి’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం పారదర్శక దర్యాప్తు చేపట్టాలి. వ్యవస్థ వైఫల్యాలతో అమాయక విద్యార్థులు నష్టపోకూడదు. పోటీ పరీక్షలు అవకాశాలకు మార్గం కావాలి గానీ భయానికి కాదు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

     

  • పెద్దపల్లి జిల్లా: పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులు దాటిన విద్యార్థులను సొంత ఖర్చులతో విమానంలో తీసుకెళ్తానని గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాటను గణిత ఉపాధ్యాయుడు నిలబెట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా గణితం బోధిస్తున్న మల్క రాంకిషన్‌రావు ఇచ్చిన మాట ప్రకారం 564 మార్కులు సాధించిన విద్యార్థి శ్రీమంతుల పూర్ణచందర్‌ను విమానంలో బుధవారం విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ వివిధ పర్యాటక ప్రదేశాలు చూపించారు. ఇలాంటి కార్యక్రమాలతో హాజరుశాతం పెరగడంతో పాటు పరీక్షల్లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు. 

    ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక.. డీజీపీ సన్మానం
    సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైన హెడ్‌ కానిస్టేబుల్‌ కూతురు చల్లా యామినిని డీజీపీ సీవీ ఆనంద్‌ బుధవారం తన కార్యాలయంలో సన్మానించారు. 

    సూర్యాపేట జిల్లాలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చల్లా యాదగిరి కుమార్తె యామిని ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఎంసీఈఎంఈలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వెలువడిన ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ ఫలితాల్లో ఆమెకు 119 ర్యాంక్‌ లభించింది. ఆమెకు శాంతిభద్రతల డీజీ మహేశ్‌ భగవత్‌ మెంటార్‌గా వ్యవహరించారు.   

  • సాక్షి,హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్‌-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్‌స్థాయి అధికారుల్ని నియమించింది.

    ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. 

    ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్
    46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం
    68,868 మంది బూత్ లెవెల్  ఏజెంట్స్
    మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లు
    జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలు
    జూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్
    జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
    జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణ
    జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం
    సెప్టెంబర్ 22న ఓటర్ల‌ తుది జాబితా విడుదల

    తెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్
    35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం
    25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్
    మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు  
    జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలు
    జూన్ 24  పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్
    జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
    జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణ
    జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారం
    అక్టోబర్ 1న ఓటర్ల‌ తుది జాబితా విడుదల

    ఈసీ అధికారిని క‌ల‌వ‌నున్న కాంగ్రెస్ నేత‌లు
    హైదరాబాద్: తెలంగాణ‌ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్ర‌వారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాల‌ని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోర‌నున్నారు. 

Andhra Pradesh

  • విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్‌ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.

    ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్‌నగర్‌, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు.

  • సాక్షి,తాడేపల్లి : చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని హెచ్చరించారు 

    ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌లో..  ‘మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా..దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?.

    ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్‌ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా?. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీ పడ్డారన్నది నిజం కాదా?. అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు.చంద్రబాబూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు

    సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి..దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి.. ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా.. వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా..యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే..మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు.

    మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప..వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా?. చంద్రబాబూ.. ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తాం’అని వైఎస్‌ జగన్‌ హెచ్చరికలు జారీ చేశారు. 

     

     

  • సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

    పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

    బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది.  

  • సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. మరో 48 గంటల్లో  నైరుతి రుతుపవనాలు.. అండమాన్‌ను తాకనున్నాయని.. ఈ నెలాఖరులోపే కేరళంలోకి రుతు పవనాలు ప్రవేశించనుందని వెల్లడించింది. మే 16, 17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

    ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి.. అలాగే మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాల రాక ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఉండబోతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంపై రుతుపవనాల రాక దాదాపు షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.

    గతేడాది నైరుతి రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందే.. అంటే మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరుకున్నాయి. వాతావరణ రికార్డుల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మే 20 నాటికి అండమాన్ సముద్రాన్ని కవర్ చేసి.. జూన్ 1 నాటికి కేరళం తీరాన్ని తాకుతాయి. అయితే, 2026 నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి.

  • సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం దారుణ నిర్ణయం తీసుకుంది. నాడు-నేడు స్కూళ్ల కోసం విరాళాలు వసూలు చేయాలని నిర్ణయించింది. విరాళాలు వస్తేనే స్కూళ్లు అభివృద్ధి చేయాలని.. విరాళాలు కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. విరాళాల సేకరణకి ప్రత్యేక డోనార్ పోర్టల్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఇక దాతల దయపైనే పేద పిల్లల పాఠశాలల భవిష్యత్ ఆధారపడి ఉంది.

    మరోవైపు, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారిపోతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్‌ అవుట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంస్కర­ణలను చంద్రబాబు సర్కార్‌ ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ వస్తోంది.

    రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్‌ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్‌ ప్లస్‌ నివేదికలు చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. వేల కోట్ల నిధులను వెచ్చింది. వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. సర్కారు బడుల నిర్వహణలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి, చంద్రబాబు సర్కార్‌కి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

  • సాక్షి,అమరావతి: ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు కొత్త ప్రచారం ప్రారంభించారు. విచిత్రమేమిటంటే, పర్యటనల పేరుతో, ఢిల్లీలో తన ఇంటి కోసం చేస్తున్న దుబారా ఖర్చులను మరిచిపోయిన చంద్రబాబు సర్కార్‌ ప్రజలకు పొదుపు పాఠాలు చెబుతోంది. కానీ సీఎం, మంత్రుల ప్రత్యేక విమానాల ఖర్చులపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘నాదేశం -నా బాధ్యత’ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు చంద్రబాబు. జిల్లా పర్యటనల్లో ఖర్చు తగ్గింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్‌, వారానికి ఒకరోజు ‘నో వెహికల్‌ డే’ అని ప్రకటించింది.

    విచిత్రం ఏంటంటే కేబినెట్ నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదు. దుబారా తగ్గించాలంటూ కేబినెట్‌ మీటింగ్‌లో చంద్రబాబు నీతులు చెప్పారు. ఆ తర్వాత మంత్రి పార్ధసారధి సైతం ఇకపై ప్రత్యేక విమానల్లో ప్రయాణాలుండవని తెలిపారు. అలా మంత్రి పార్ధసాధి చెప్పారో లేదో కొద్ది సేపటికే  నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్‌లో చక్కెర్లు కొట్టారు. సత్యసాయి జిల్లా పర్యటనకు వీటీ- సీవీబీ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారు. 

  • సాక్షి,తాడేపల్లి: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు.

    పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే, దానిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై కూడా దాడులు జరిపారు. ఈ దాడిలో మామిళ్లపల్లి రైతులు గాయపడ్డారు. తర్వాత తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడి ఘటనను బాధిత రైతులు వైఎస్‌ జగన్‌కు వివరించారు. ‘దాడి చేసి తిరిగి మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు’అని  ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు.

     

    ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. ‘రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా?. బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్‌ సెల్‌ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం’ అని హామీ ఇచ్చారు. 

    జగన్ ను కలిసిన మామిళ్లపల్లి రైతులు

     

National

  • చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురువారం లేఖ రాశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ మహిళలకు అత్యధిక ఉపాధి ఇస్తున్న రాష్ట్ర టెక్స్‌టైల్‌ రంగం సంక్షోభంలో ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పత్తి, నూలు ధరలు పెరిగి తీవ్ర సంక్షోభం ఏర్పడిందని విజయ్ తెలిపారు.

    “తమిళనాడు భారత్‌లోనే టెక్స్‌టైల్‌, అపారెల్ ఎగుమతి చేసే అతిపెద్ద రాష్ట్రం. లక్షలాది మంది ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగంపై ఆధారపడుతున్నారు. ఇటీవల పత్తి ధరలు, దాని ప్రభావంతో నూలు ధరలు పెరగడం వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పత్తి ఉత్పత్తి కొరత, ట్రేడింగ్ కార్యకలాపాలు పెరగడం దీనికి ప్రధాన కారణం” అని ఆయన లేఖలో రాశారు.

    గత 2 నెలల్లో పత్తి ధరలు 25 శాతం పెరిగాయని తెలిపారు. ఒక్క క్యాండీ ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగిందని చెప్పారు. నూలు ధరలు కూడా కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగాయని, దీనివల్ల పరిశ్రమకు ముడి సరుకు కొరత తీవ్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు.

    “గత 2 నెలల్లో పత్తి ధర రూ. 54,700 నుంచి రూ. 67,700కు పెరిగింది. ఇది 25 శాతం పెరుగుదల. అదే సమయంలో నూలు ధర కిలోకు రూ. 301 నుంచి రూ. 330కు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు నిరంతర సరఫరా దిగుమతుల ద్వారానే సాధ్యమవుతుంది. అయితే పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం ఉంది” అని ఆయన తెలిపారు. వ్యవసాయం తర్వాత టెక్స్‌టైల్స్‌, అపారెల్ రంగం అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగమని ముఖ్యమంత్రి విజయ్‌ తెలిపారు.

    “ఇలాంటి పరిస్థితుల్లో సుంకం లేకుండా పత్తి దిగుమతులకు అనుమతి ఇస్తే ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోగలదు. లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోకుండా కాపాడడం, టెక్స్‌టైల్‌ విలువ స్థిరత్వాన్ని కాపాడటం ప్రభుత్వంపై ఉన్న బాధ్యత” అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 11 శాతం దిగుమతి సుంకాన్ని 0 శాతానికి తగ్గించి ముడి సరుకు లభ్యతకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు.

  • ఢిల్లీ:  ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు  ఆదేశించింది.  జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మను , కోర్టును లక్ష్యంగా చేసుకుని సందేహాలను రేకెత్తిస్తూ  సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారనే ఆరోపణలపై  అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లపై కోర్టు ధిక్కరణ చట్టం కింద క్రిమినల్ చర్యలను ప్రారంభించాలని కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.

    జస్టిస్  స్వర్ణ కాంత శర్మ ముందు తాము హాజరు కాబోమనే విషయాన్ని  కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్‌ నాయకులు ఆన్‌లైన్‌లో లేఖలు షేర్‌ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కోర్టు ధిక్కరణ చర్యలకు ఆదేశించారు. దీనిలో భాగంగా జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ సైతం.. తనను ఎవరూ బెదిరించలేరంటూ గట్టిగా హెచ్చరించారు.

    ‘ఎడిటెడ్‌ వీడియోలతో నా కుటుంబ సభ్యులను  నిందించారు... ఇది నన్ను మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థను భయపెట్టడానికే చేశారు. నన్ను ఎవరూ బెదిరించలేరు’ అని వ్యాఖ్యానించారు.

    కాగా, ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనూహ్య నిర్ణయాలతో కోర్టు విచారణకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ముందుకు విచారణకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. దాంతో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. 

    విచారణకు  స్వర్ణకాంత శర్మ దూరం..
    ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టిన నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు స్వర్ణకాంత్ శర్మ వెల్లడించారు. న్యాయ క్రమశిక్షణ లో భాగంగా తాను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ గతంలోనే కొట్టేసిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును మరొక న్యాయమూర్తి కి కేటాయించాలని కోరారు.

  • ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై నాగ్‌పూర్‌కు చెందిన ఒక న్యాయవాది ఆరోపణలు సంచలనంగా మారాయి.  బాగ్డోగ్రా నుండి కోల్‌కతా వెళ్తున్న విమానంలో తన 3 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రుల నుంచి దూరంగా కూర్చోబెట్టారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలు విమానయాన సంస్థల సీట్ల కేటాయింపు పద్ధతులు, కుటుంబ సీటింగ్ విధానాలపై ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీశాయి.

    టిక్కెట్ల కోసం రూ. 44 వేలు చెల్లించినా, ఇండిగో తన మూడేళ్ల బిడ్డను తల్లిదండ్రులకు దూరంగా కూర్చోబెట్టిందని, ఇది తమకు తీవ్రమైన మానసిక వేదన కలిగించిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. గౌరవ్ మిశ్రా సుమారు రూ. 43,900 ఖర్చు చేసి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, విమానంలో సీట్ల కేటాయింపు సమయంలో ఇండిగో సిబ్బంది ఆ 3 ఏళ్ల బాబుకు, తల్లిదండ్రులకు వేర్వేరు చోట్ల సీట్లు కేటాయించారు. ఇదే ఆందోళనకు దారి తీసింది.

    ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

    గౌరవ్ మిశ్రా ఆరోపణలు ఏంటి? 
    సీట్ సెలక్షన్ కోసం తాము అదనపు డబ్బులు చెల్లించలేదనే కారణంతోనే, విమానయాన సంస్థ కావాలనే అందరినీ విడివిడిగా కూర్చోబెట్టారని లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ఆయన డీజీసీఏ (DGCA) నిబంధనలను ప్రస్తావించారు.  12 ఏళ్లలోపు పిల్లలకు కనీసం ఒక తల్లి లేదా తండ్రి పక్కన సీటు కేటాయించాలని డీజీసీఏ నిబంధనలు (Rule 3.15) చెబుతున్నాయని, ఇండిగో దీన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. 
    ప్రయాణ సమయంలో విమానం బాగా కుదుపులకు (Turbulence) లోనైందని, ఆ సమయంలో తన పక్కన ఎవరూ లేకపోవడంతో చిన్నారి తీవ్ర భయాందోళనకు గురయ్యాడని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు.  ఇది తమకు  'తీవ్రమైన మానసిక వేదన'గా  కలిగించిందన్నారు.

    ఇదీ చదవండి : రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌
     

    నెటిజన్ల స్పందన 
    ఈ ఉదంతంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. లాభాల కోసం ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తారా? 3 ఏళ్ల పిల్లాడిని ఒంటరిగా కూర్చో బెట్టడం భద్రతా పరంగా కూడా రిస్క్  కొందరు ఇండిగోపై మండిపడ్డారు.  ఫ్యామిలీ మెంబర్లను విడదీసి, సీట్ల కోసం డబ్బులు అడగడం ఇప్పుడు అన్ని విమాన సంస్థలకు ఒక అలవాటుగా మారింది" అని మరికొందరు విమర్శించారు. విమాన సంస్థలు వ్యాపార దృక్పథంతో నిబంధనలను పక్కన పెట్టడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూ. 44 వేలు పెట్టినప్పుడు, సీట్ల కోసం మరో కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టలేరా?" అని కొందరంటే,  ఒకవేళ సీట్లు వేరుగా వచ్చినా,  ఎవర్నో ఒకర్ని అడిగి సీటు మార్చుకోవచ్చు కదా?" అని మరికొందరు సలహా ఇచ్చారు.

    ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందన
    తరువాత ఇండిగో ఈ ఫిర్యాదుపై బహిరంగంగా స్పందిస్తూ, మిశ్రాను నేరుగా సంప్రదించడానికి ప్రయత్నించినా, కానీ కుదరలేదు. తదుపరి సంప్రదింపుల కోసం దయచేసి మీకు అనువైన సమయాన్ని లేదా ప్రత్యామ్నాయ సంప్రదింపు నంబర్‌ను డీఎంల ద్వారా తెలియజేయాలని కోరింది.
     

  • హౌరా: పశ్చిమ బెంగాల్‌ శిబ్‌పూర్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ నేత షమీమ్ అహ్మద్ అలియాస్ బారే ఇంటిపై తాజాగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బంగారు పలకలు అమర్చిన మంచం కూడా బయటపడిందని స్థానికులు చెప్పారు. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఎన్నికల ఫలితాల రోజు షిల్ పారా లేన్‌లో బీజేపీ మైనారిటీ సెల్ విజయోత్సవ ర్యాలీపై బారే బాంబులు, కాల్పులు జరిపించాడన్న ఆరోపణల తర్వాత పోలీసులు ఆయన ఇంటిపై ఈ దాడి చేశారు.

    శిబ్‌పూర్ కేసులో, హెచ్‌ఎంసీ వార్డు 36 అధ్యక్షుడు అహ్మద్ అలియాస్ బారే తన కుటుంబంతో పాటు పరారీలో ఉన్నాడు. అతని భార్య షమీమా బానో అదే వార్డు తృణమూల్ కౌన్సిలర్. ఈ ఇల్లు సాధారణంగా కనిపించిందని, అయితే మెట్లదారి, రహస్య తలుపు ద్వారా రెండో అంతస్తులోని ఫ్లాట్‌కు చేరుకున్నామని హౌరా పోలీసులు చెప్పారు.

    ఇంటి మిగతా భాగంలో సాధారణ ఫర్నిచర్ ఉండగా, రహస్యంగా ఉంచిన రెండో అంతస్తులోని ఫ్లాటులో మాత్రం విలాసవంతమైన ఇంటీరియర్లు, సీసీటీవీ కెమెరాలు, బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్‌రూమ్ ఉన్నాయి.

    స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువను అంచనా వేస్తామని పోలీసులు చెప్పారు. బారే దందాలు చేస్తారని  బీజేపీ నేత ఓంప్రకాశ్ సింగ్ ఆరోపణలు చేశారు.

    కాగా, షమీమ్ అహ్మద్ ఇంట్లో జరిపిన దాడిలో బంగారు మంచంతో పాటు బంగారు సోఫా , తదితర ఖరీదైన వస్తువులు బయటపడ్డాయంటూ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆ బంగారు మంచం, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, సీసీటీవీ కెమెరాలు, అధిక నాణ్యతతో ఉన్న అలంకరణ సామగ్రి భవన బేస్‌మెంట్‌లోని రహస్య గదిలో దొరికాయని కొందరు అంటున్నారు.  అయితే, వీటిని నిర్ధారిస్తూ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

  • సాక్షి, న్యూఢిల్లీ: బిగ్‌ క్యాట్‌లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్‌క్యాట్‌ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ (ఐబీసీఏ) సమ్మిట్‌–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్‌ వీటిని నిర్వహించబోతోంది. భారత్‌లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

    పులుల సంరక్షణలో మనమే ఆదర్శం
    ప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’(ఎన్‌టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్‌ కార్యక్రమంలో టైగర్‌ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్‌ సింహాలు కేవలం భారత్‌లోనే ఉండటంతో గిర్‌ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్‌ లయన్‌’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు.  

    ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే!

    మనుషుల మధ్యే చిరుతల సహజీవనం
    భువనేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్‌టక్‌లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.

    ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

    చీతాల పునరావాసంలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు
    మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్‌ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్‌ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. భారత్‌ ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్‌ క్యాట్‌ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు వేదికగా నిలవనున్నాయి.

         

    ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌
    ఐదు రాష్ట్రాల్లో బిగ్‌ క్యాట్‌లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..
    ఆసియా సింహం – గిర్‌(గుజరాత్‌)
    చీతా – భోపాల్‌(మధ్యప్రదేశ్‌)
    చిరుత  – భువనేశ్వర్‌(ఒడిశా)
    మంచు చిరుత – గ్యాంగ్‌టక్‌(సిక్కిం)
    పులి – చంద్రపూర్‌(మహారాష్ట్ర)  

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కలకత్తా హైకోర్టు ముందు హాజరైన కొన్ని గంటల తర్వాత  ఆమె లాయర్‌ వివరాలను ఇవ్వాలంలూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ).. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు లేఖ రాసింది. న్యాయవాదిగా నమోదు, ప్రాక్టీస్ హోదాకు సంబంధించిన వివరాలను కోరింది. 

    అంతకుముందు మమతా బెనర్జీ న్యాయవాది దుస్తులలో కోల్‌కత్తా హైకోర్టు ముందు హాజరై, బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన ఒక కేసులో వాదనలు వినిపించారు. 

    దాంతో మమతా బెనర్జీ మరోసారి హైలైట్‌ అయ్యారు. దీనిలో భాగంగా ఆమె న్యాయవాది వృత్తికి సంబంధించిన అ‍న్ని వివరాలను తమకు సమర్పించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది బార్‌ కౌన్సిల్‌  ఆఫ్‌ ఇండియా.  ఈ అంశానికి సంబంధించి మే 16వ తేదీ లోగా అంటే శనివారంలోపు ‘లాయర్‌ మమతా’ పూర్తి వివరాలను ఇవ్వాలని స్పష్టం చేసింది.  

    ఈ మేరకు  స్టేట్ బార్ కార్యదర్శికి లేఖ రాసింది బీసీఐ.  మమతా లాయర్‌ దుస్తుల్లో హైకోర్టు ముందు హాజరైన విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని దీనికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరింది బీసీఐ. 

    కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లోమాజీ సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి చవిచూశారు. అయితే ఓ కీలక కేసుకు సంబంధించి ఆమె హైకోర్టుకు హాజరైన క్రమంలో మాజీ సీఎం కాస్తా.. లాయర్‌ మమతాగా అవతారమెత్తారని జనం అనుకుంటున్నారు.

  • ఆ రోజు సూర్యుడి చూపంతా  ఇండియా పైనే!  ఏరోజు? ఎందుకు? ఎలా? ప్రశ్నలన్నీ మనసులోకి వచ్చాయి కదా! ఆగండాగండి. అది ఏప్రిల్‌ నెలాఖరు 27వ తేదీ. ఒక అసాధారణమైన సంఘటన  జరిగింది. ఆ రోజు ప్రపంచమంతా సాధారణం కంటే వేడెక్కింది. అయితే, అత్యంత వేడి నగరాల్లో మొదటి 50 నగరాలు ఒక్క మన దేశంలోనే నమోదయ్యాయి. గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ సంస్థ  ఈ విషయం వెల్లడించింది. 

    యూపీలో ఎక్కువ...
    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బందా నగరం ఏక్యూఐ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగానే ఇక్కడ వేసవిలో తీవ్రమైన వేడి ఉంటుంది. ఇక, ఏప్రిల్‌ 27న బాందాలో ఉష్ణోగ్రతలు 115.16 ఫారహీట్స్‌కు, అంటే 46.2చేరుకున్నాయి. ఆ రోజు భూగోళంపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఆ రోజు తెల్లవారుజామునే బాందాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత 34.72222 డిగ్రీలు. అయితే ఒక్క రోజు డేటాను ఒక ధోరణిగా పరిగణించకపోయినా... దేశం మాత్రం వాతావరణ సంక్షోభం ఎదుర్కొంటోందని వాతావరణ శాస్త్రవేత్త మాక్సిమిలియానో హెర్రెరా తెలిపారు. 

    ముందే వచ్చిన వేసవి.. 
    అయితే వేసవిలో ఎండలు సాధారణమే. కానీ ఈసారి మాత్రం అసాధారణ ఎండలున్నాయి. గతంలో కంటే మన దేశంలో వేసవి ఈసారి ముందుగానే ప్రారంభమైంది. చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌ నెలలోనే తీవ్రమైన వేడి నమోదైంది. ఇది కాలానుగుణ సగటు కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువ. రానురాను దేశంలో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా అంటే... 2050 నాటికి ఆరోగ్యవంతులైన మనుషులు కూడా తట్టుకుని జీవించలేని స్థాయికి చేరుకుంటుందని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రాణాంతకమైన ఈ వేడి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమ వుతారని చెబుతున్నారు. ఈ నెల చివరలో మధ్య, తూర్పు భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ప్రభావం చూపే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హీట్‌ ఇండెక్స్‌ 122 నుంచి 140 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని స్థాయని హెర్రెరా హెచ్చరిస్తున్నారు.  

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

  • కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోవ‌డంతో తృణమూల్ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీకి త‌ల‌నొప్పులు ఎక్కువ‌య్యాయి. సువేందు అధికారి.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే అభిషేక్ బెన‌ర్జీకి జ‌డ్‌ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారు. అంతేకాదు బీజేపీ స‌ర్కారు ఆదేశాల‌తో ఆయ‌న ఇంటి ముందు భ‌ద్ర‌త కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల‌ను కూడా తొల‌గించింది. తాజాగా అభిషేక్ బెన‌ర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెర‌పైకి వ‌చ్చింది.

    బొగ్గు కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రుజిరా రెండు పాన్‌కార్డుల‌ను క‌లిగివున్నార‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ రెండు పాన్‌కార్డుల్లో తండ్రుల పేర్లు వేర్వేరుగా ఉండ‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్ప‌డివుంటార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. రుజిరా బెనర్జీ పేరుతో ఒక‌టి, రుజిరా న‌రులా పేరుతో మ‌రో పాన్‌కార్డు ఆమె క‌లిగివున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ రెండింటిలో తండ్రులు పేర్లు వేర్వేరుగా ఉన్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు రుజిరా ద్వంద్వ‌ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని 'న‌వ భార‌త్ టైమ్స్' నివేదించింది.

    థాయ్‌లాండ్‌ పౌరసత్వం
    రుజిరా నరులా బెనర్జీకి థాయ్‌లాండ్‌ పౌరసత్వం కూడా ఉన్న‌ట్టు వెల్లడైంది. ఆమెకు థాయ్‌లాండ్‌ పాస్‌పోర్ట్ ఉంది. అభిషేక్ బెన‌ర్జీని పెళ్లిచేసుకుని బెంగాల్‌లో స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ ఆమె థాయ్ పౌర‌స‌త్వం వ‌దులుకోలేద‌ని తెలుస్తోంది. దీంతో భారతదేశంలో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవ‌డంతో ఆమె గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. ఆ స‌మ‌యంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజ‌కీయంగా ఎదిగే ద‌శ‌లో ఉన్నారు. అప్ప‌టికే ఆయ‌న ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. అభిషేక్‌, రుజిరా దంప‌తుల‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

    వేర్వేరు తండ్రుల పేర్లు.. వివాదం
    థాయ్‌లాండ్‌లో ఉన్న‌ప్పుడు రుజిరా.. భారత సంతతికి చెందిన వ్యక్తిగా పీఐఓ (PIO) కార్డును కలిగి ఉన్నారు. ఇందులో ఆమె తండి పేరు నిపన్ నరులా అని ఉంది. అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకున్న తర్వాత ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా) కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఇందు కోసం సమర్పించిన పత్రాలలో తన తండ్రి పేరును గురుచరణ్ అహుజాగా పేర్కొన్నారు. ఇది ఇప్పటికీ వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.

    రుజిరాపై విచారణకు డిమాండ్‌
    ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌ల నేప‌థ్‌యంలో రుజిరా బెనర్జీపై విచారణ జరపాలని సోషల్ మీడియాలో నెటిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. రుజిరాపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల గురించి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈ నేప్య‌థంలో సువేందు అధికారి ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

  • న్యూఢిల్లీ: భారత్‌లో జాతీయ రహదారిలో డివైడర్‌కు ఒకవైపు రెండు లేన్ల రహదారి ఉంటే ఎడమ లేన్‌ నెమ్మదిగా వెళ్లే వాహనాలకు, కుడి లేన్‌ వేగంగా వెళ్లే, ఓవర్‌టేక్‌ చేసే వాహనాల కోసం ఉద్దశించారన్న కనీసం ఇంగిత జ్ఞానం దేశంలో అత్యధిక మంది వాహనదారులకు కొరవడిందని, రోడ్డు ప్రమాదాలకు ఇదే ప్రధాన హేతువుగా మారుతోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను పటిష్టపర్చడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు బుధవారం పలు మార్గదర్శకాలను సూచించింది. 

    దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా నిబంధనలను అమలుచేయాలంటూ 14 ఏళ్ల క్రితం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ కేవీ వివ్వనాథన్‌ల ధర్మాసనం విచారించింది. రహదారిపై ఏ వాహనం ఎక్కడుంతో చెప్పే వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌(వీఎల్‌టీడీ)లు, అత్యయిక(ప్యానిక్‌) బటన్‌లను అన్ని వాహకాలను బిగించేలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాయంత్రాంగాలకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిల్‌ను ధర్మాసనం విచారించింది. ‘‘లేన్‌ల పద్ధతి ఎందుకుందో, వాటిని ఎలా ఆచరించాలో, వాటిని పాటించకపోతే జరిగే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయనే స్పృహ భారత్‌లో కొరవడింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఈ లేన్‌వ్యవస్థపై అవగాహనారాహిత్యం, ఆచరణ శుద్ధి లోపించడం. లేన్‌ డ్రైవింగ్‌ను పాటిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వీఎల్‌టీడీలను అమర్చుకుంటే ప్రయాణికులు, డ్రైవర్లకు రోడ్లు ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుంది. 

    ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు రోడ్డు ప్రయాణ భరోసా ఉంటుంది. వీఎల్‌టీడీలను దేశంలో కేవలం ఒక శాతం వాహనాల్లోనే అమర్చారు. వీటిని తప్పనిసరిగా బిగించుకోవాలని 2018లోనే చట్టంచేసినా అది ఆచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమైంది’’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. 

    ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌

    బిగిస్తేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌
    ‘‘సెంట్రల్‌ మోటార్‌ వాహనాల నిబంధనలు, 1989లోని 125హెచ్‌ నిబంధనను ఇప్పటికైనా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పాత వాటితోపాటు కొత్త ప్రజారవాణా వాహనాల్లో వీఎల్‌టీడీలను ఖచి్చతంగా బిగించేలా చూడాలి. ఇకమీదట యథాలాపంగా వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ జారీచేయొద్దు. వీఎల్‌టీడీ, ఎమర్జెన్సీ బటన్స్‌ ఉన్న ప్రజారవాణా వాహనాలకే ఫిట్‌నెస్‌ సరి్టఫికేట్‌ ఇవ్వాలి. కొత్త వాహనాలకు తయారీ యూనిట్లలోనే ఈ వ్యవస్థను బిగించాలని ఉత్పత్తికర్మాగారాలకు సూచిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయాలి. ఫలానా వాహనంలో ఈ వ్యవస్థ ఉందని తెలియజేసేలా వాహన్‌ యాప్‌ లేదా సంబంధిత పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఏఏ వాహనాలకు వీఎల్‌టీడీ ఇన్‌స్టాల్‌ చేసి ఉందో వేటికి సరిగా పనిచేస్తుందో తెలిసేలా సమీకృత వాహన్‌ డేటాబేస్‌ను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలి’’అని ధర్మాసనం ఆదేశించింది. 

    ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

    స్పీడ్‌ లిమిట్‌పైనా అసంతృప్తి 
    ‘‘అత్యధిక వేగంతో వాహనం దూసుకెళ్లకుండా దాని వేగాన్ని నిర్ణీత పరిధిమేరకు కట్టిచేసే స్పీడ్‌ గవర్నర్‌(స్పీడ్‌ లిమిట్‌) ఉపకరణాలనూ వాహనాల్లో అమర్చాలి. ప్రస్తుతం ఎన్ని వాహనాలకు స్పీడ్‌ లిమిట్‌ డివైజెస్‌ (ఎస్‌ఎల్‌డీ) లు అమర్చి ఉన్నాయో, ఇంకెన్ని వాహనాలకు బిగించాల్సి ఉందో తెలిపే వివరాలను సమగ్ర నివేదికను ఈ కేసు తదుపరి విచారణ తేదీలోగా సమర్పించాలి. వాహన్‌/పరివాహన్‌ పోర్టల్‌లోనూ సంబంధిత గణాంకాలను పొందుపరచాలి’’అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశించింది. ‘‘రోడ్డు భద్రతా బోర్డ్‌ ఏర్పాటు చేయాలని ఎప్పుడ ఆదేశించాం. ఇంకా ఏర్పాటు చేయలేదా? ఇదే మీకు చివరి అవకాశం. మూడు నెలల్లోపు అది కొలువు తీరాలి. ఈసారి గడువులోపు రోడ్‌ సేఫ్టీ బోర్డ్‌ను ఏర్పాటు చేసి తీరాల్సిందే’’అని ధర్మాసనం సూచించింది.  

    ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే!

  • బెంగళూరు: ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం కళకళలాడింది. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత్‌తో పాటు మరో 13 దేశాల నుంచి లక్షలాది మంది ఒకచోట చేరారు. “ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో ప్రపంచ ధ్యానం” కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాల్గొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రజలు తమ ఇళ్లలో, కమ్యూనిటీ కేంద్రాల్లో, ప్రజా ప్రదేశాల్లో నుంచి ఆన్‌లైన్ ద్వారా దీనికి హాజరయ్యారు.

    వివిధ వృత్తులు, సంస్కృతులు, మతాలు, సమాజాలకు చెందిన ప్రజలు ఒకచోట చేరి, జీవితం ఒక వేడుక కావాలని, మానవ విలువలు, కరుణ,  శాంతిపై ఆధారపడే సమాజాన్ని నిర్మించాలనే గురుదేవ్ దృష్టిని ప్రతిబింబించే అరుదైన వేడుకను జరుపుకున్నారు.

    ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన ప్రముఖులలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంగ్లికన్ కమ్యూనల్ చర్చెస్ ఆఫ్ ఇండియా సెఫీ డయోసిస్ ఆర్చ్‌బిషప్ బిషప్ డా.మార్విన్ మాథ్యూ, ప్రముఖ తెలుగు సినీ నటుడు డా.మోహన్ బాబు, అలాగే, పరిహారాల కోసం అధ్యక్ష ప్రత్యేక ప్రతినిధులు హెచ్.ఈ. ఎక్వో స్పియో-గార్బ్రా, అరమాన్సా న్టేషీ స్పియో-గార్బ్రా పాల్గొన్నారు.

    సాయంత్రం ధ్యానం, భక్తి సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. వేడుకలలో భాగంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రీ స్కూల్స్‌కు చెందిన 150 మంది పిల్లలు హృదయాన్ని హత్తుకునేలా ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

    వేడుకల సందర్భంగా మరో ప్రతీకాత్మక ఘట్టంగా, గురుదేవ్ పంచవటి వనాలకు (వటవృక్షం, రావి, వేప, మామిడి, ఔదుంభర వృక్షాలకు) నీరు పోసి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ప్రకృతిని సంరక్షించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఈ పంచవటి వనాలు సూక్ష్మ పర్యావరణ వ్యవస్థలుగా గాలి నాణ్యతను మెరుగుపరచడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, ప్రశాంతమైన సామాజిక వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.

    గత నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా, గురుదేవ్ దృష్టి మానసిక ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, నదుల పునరుజ్జీవనం, సహజ వ్యవసాయం, విపత్తు సాయం, ట్రామా కేర్ వంటి అనేక రంగాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రేరణనిచ్చి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది.

    ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు జరుగుతున్న వేడుకలలో భాగంగా, అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించిన అనేక ప్రముఖులు కూడా గురుదేవ్ మానవత్వానికి, అంతరంగ శ్రేయస్సుకు చేసిన సేవలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

    ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రయాణాన్ని “విశ్వవ్యాప్త చైతన్య వికాసం”గా అభివర్ణిస్తూ, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను తాకిందన్నారు.

    మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా మాట్లాడుతూ.. గురుదేవ్ జీవితం “ఆనందమే ఆధ్యాత్మిక మార్గం” అని చూపిస్తోందని, కరుణ మానవత్వానికి ఉన్న గొప్ప శక్తుల్లో ఒకటని అన్నారు.

    బిషప్ డా.మార్విన్ మాథ్యూ మాట్లాడుతూ.. “ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయని అంటాం, ఎనిమిదవ అద్భుతం గురుదేవ్. ఆయన ఎప్పుడూ మతం ఆధారంగా ప్రజలను విభజించరు. బదులుగా, వారు మంచి మనుషులుగా మారేందుకు, తమ మతాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సహాయపడతారు” అని పేర్కొ న్నారు.

    ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. “మనిషిగా పుట్టడం ఎంతో పుణ్యమైన విషయం. మనిషిగా జన్మించడం సులభం కాదు. అలా జన్మించిన తర్వాత ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనలు కలిగి ఉండటం చాలా కష్టం. ఆ తరువాత తనను తాను తెలుసుకోవాలనే కోరిక కలగడం ఇంకా కష్టం. అటువంటి సమయంలో మనకు మార్గనిర్దేశం చేసే ఒక మంచి గురువును పొందడం చాలా అరుదు. నిజమైన గురువును పొందడం మరింత అరుదు. శ్రీ శ్రీ రవిశంకర్ వంటి మహోన్నత గురువును పొందిన తర్వాత ఈ అవకాశాన్ని మనం కోల్పోవద్దు” అన్నారు.

    అంతర్జాతీయ కేంద్రంలో జరిగిన ఈ వేడుకలలో, గురుదేవ్ బోధనల స్ఫూర్తితో ధ్యానం, సేవ, సామాజిక కార్యక్రమాల ద్వారా తమ జీవితాల్లో వచ్చిన మార్పులను పంచుకున్న అనేక మంది వ్యక్తుల కథలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

  • న్యూఢిల్లీ: పాలస్తీనా ఇష్యూ విషయంలో​ ఇజ్రాయెల్ ఒక దేశంగా కొనసాగుతూ, పాలస్తీనీయులకు ప్రత్యేక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసే ‘‘రెండు దేశాల’’ ప్రతిపాదనకు భారత్ మద్దతిస్తున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. అలాగే, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి మూసివేతపై జై శంకర్‌ మాట్లాడుతూ.. “పశ్చిమాసియాలోని ఘర్షణ వల్ల కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర రవాణాపై ముప్పు, ఇంధన మౌలిక వసతుల్లో అంతరాయాలు పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో తెలియజేస్తున్నాయి” అని చెప్పారు.

    లెబనాన్, సిరియా, సూడాన్, యెమెన్, లిబియా దేశాల పరిస్థితులపై కూడా జైశంకర్‌ మాట్లాడారు. “లెబనాన్, సిరియా ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సూడాన్ ఘర్షణ వల్ల భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. యెమెన్‌లో మానవతా ఆందోళనలు, సముద్ర భద్రతా ముప్పులు ఉన్నాయి. లిబియాలో స్థిరత్వం కూడా కీలకం” అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాల పరిష్కారానికి నిరంతర అంతర్జాతీయ సహకారం, దౌత్య చర్చలు అవసరమని జైశంకర్ తెలిపారు.

    “ఇవి అన్నీ కలిపి ఒక స్పష్టమైన వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి. స్థిరత్వం అనేది ఆప్షనల్‌గా ఉండకూడదు, శాంతి విడివిడిగా సాధ్యంకాదు. అంతర్జాతీయ చట్టాలను పాటించడం, పౌరులను రక్షించడం అత్యవసరం. ప్రజా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని  నివారించాలి. ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాల్లో భారత్ నిర్మాణాత్మకంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. స్థిరత్వం పునరుద్ధరణ లక్ష్యంగా సాగుతున్న చర్యలకు మద్దతిస్తుంది” అని విదేశాంగ మంత్రి తెలిపారు.

    పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం మధ్య బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సమావేశం గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఘర్షణ రెండు నెలలకు పైగా కొనసాగుతుండటంతో ఇంధన ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరగడం మధ్య ఈ సమావేశం జరుగుతోంది.

    బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల దౌత్యవేత్తలతో పాటు కొత్త సభ్య దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా సమావేశానికి వచ్చారు.

    బ్రిక్స్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీరును ఖండించాలని అరాఘ్చి కోరారు. యుద్ధోన్మాదాన్ని ఆపేందుకు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు బ్రిక్స్ దేశాలు, ఇతర దేశాలు ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • ఢిల్లీ:  ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఇందన పొదుపు పాటించాలనే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అందుకు శ్రీకారం చుట్టింది ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి తద్వారా ఇంధనం వాడకాన్ని తగ్గించాలనే యోచనతో రెండు రోజుల వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు నడుంబిగించింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.  

    ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో రెండు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఈ మేరకు గురువారం( మే 14వ తేదీ) ఆదేశాలు జారీ చేసిన సీఎం రేఖా గుప్తా.. దీన్ని రేపట్నుంచే(శుక్రవారం) నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 

     ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ రాజధానిలో  ‘మేరా భారత్ మేరా యోగ్దాన్’ (నా భారతదేశం, నా సహకారం) ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. 

    అదే సమయంలో ప్రతి సోమవారాన్ని 'సోమవారం మెట్రో'గా పాటిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. 

    ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షిప్తంగా..

    • ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు  వర్క్ ఫ్రం హోమ్
    • వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయం
    • రేపటి నుంచి నిర్ణయాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశం
    • సీఎం కాన్వాయ్ లో వాహనాలు నాలుగుకు తగ్గింపు
    • నాలుగు వాహనాల్లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలు
    • నా భారతదేశం-  నా సహకారం ఉద్యమాన్ని ప్రారంభించిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
    • ప్రతి సోమవారం "మండే మెట్రో " నిర్వహించనున్న ప్రభుత్వం
    • మంత్రులు అధికారులు ఉద్యోగులు అందరూ ఢిల్లీ మెట్రోలోనే రావాలని ఆదేశం
    • సామాన్య ప్రజలు వారంలో ఏదో ఒక రోజును నో వెహికిల్  డే నిర్వహించాలని ఆదేశం
    • ఆరు నెలల వరకు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయొద్దని నిర్ణయం
    • ట్రాన్స్‌పోర్ట్‌ అలవెన్స్ 10% పెంపు
    • ఏడాది విదేశీ ప్రయాణాలు పూర్తిగా రద్దు
    • 90 రోజులపాటు మై ఇండియా మై కాంట్రిబ్యూషన్ ఉద్యమం
  • హర్దోయ్‌: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వివాహ వేడుక రణరంగంగా మారింది. తను ఆన్‌లైన్‌లో ఎవరితోనైతే మాట్లాడిందో.. పెళ్లి పీటల మీద ఉన్నది ఆ వ్యక్తి కాదని వధువు గుర్తించడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో వరుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. వరుడు దేవేంద్ర సింగ్ పరిమార్ (23)కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ యువతి పరిచయమైంది. ఫోన్లలో మాట్లాడుకున్న వీరిద్దరూ ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

    ఈ క్రమంలో ఈ నెల మే 12న వివాహానికి ముహూర్తం కుదిరింది. వరుడి తరపు వారు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు వృత్తిరీత్యా లాయర్. పెళ్లి పీటల మీద ఉన్న వరుడిని చూడగానే ఆమె కంగుతింది. తను గత కొంతకాలంగా  రాహుల్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నానని.. కానీ అక్కడ ఉన్నది అతను కాదని ఆమె తేల్చి చెప్పింది. వధువు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.

    వరుడు దేవేంద్ర సింగ్‌తో పాటు పెళ్లికి వచ్చిన అతిథులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దేవేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ అలోక్ రాజ్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ మోసం, ఫోటోల మార్పిడి కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

  • నటి కరిష్మా కపూర్ మాజీ భర్త  ఆటో విడిభాగాల కంపెనీ సోనా కామ్‌స్టార్ ఛైర్మన్  సంజయ్ కపూర్‌ ఆకస్మిక మృతిలో కీలక పరిణామం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో "ది స్కిన్ డాక్టర్" (The Skin Doctor) గా పేరుగాంచిన డాక్టర్ నీలం సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.

    డాక్టర్ నీలం సింగ్ వృత్తిరీత్యా డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణుడు).  కేవలం వైద్య విషయాలే కాకుండా రాజకీయాలు, సామాజిక అంశాలు , కరెంట్ అఫైర్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో "సామాజిక సమస్యలపై మాట్లాడే చర్మవ్యాధి నిపుణుడు"గా అని తనను తాను అభివర్ణించుకుంటారు. అయితే అతని ఎక్స్ బయోలో, "నేను ముఖ్యం కాదు; నేను చెప్పేదే ముఖ్యం" అని రాసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అతనికి భారీ ఫాలోయింగ్‌ మాత్రమే కాదు, ఆయన పోస్టులు తరచుగా తీవ్రమైన చర్చలు , విమర్శలకు దారితీస్తాయి. తాజా అరెస్ట్‌ కూడా అందులో భాగమే.

    అరెస్ట్‌కు కారణం ఏమిటి?
    సంజయ్ కపూర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్‌ చేసినట్టు సమాచారం.

    గత ఏడాదిలో  జూన్‌లో సంజయ్ కపూర్ లండన్‌లో పోలో ఆడుతూ మరణించారు. వైద్య నివేదికల ప్రకారం  పోలో ఆడుతుండగా తేనెటీగ మింగిడం వల్ల, అది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం తర్వాత రూ. 30,000 కోట్ల ఆస్తి వారసత్వం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ మరణం వెనుక ఉన్న పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఆయన ఆస్తి , వారసత్వానికి సంబంధించిన అంశాలపై డాక్టర్ సింగ్ ఒక పోస్ట్  పెట్టారు.  

    సంజయ్ కపూర్ భార్య ప్రియా కపూర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అలాగే మరణానికి కొద్దిరోజుల ముందే ఆయన వీలునామా (Will) రాయడంపై  కూడా  సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, కల్పితాలని ప్రియా కపూర్ పేర్కొన్నారు. అయితే, స్క్రీన్‌షాట్‌లు మరియు తొలగించిన పోస్టుల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు.


    డాక్టర్‌ స్పందన 
    బెయిల్‌పై విడుదలైన తర్వాత డాక్టర్ నీలమ్ సింగ్  ఎక్స్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని నమ్మాను, అందుకే విచారణకు హాజరయ్యానని, బెయిల్ మంజూరైందని తెలిపారు. ఈ కేసులో అసలు నేరమేమీ కనిపించడం లేదని,  తనను  ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని జడ్జి వ్యాఖ్యానించారని కూడా తెలిపారు.  తనకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులకు, అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛ మరియు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చకు దారితీసింది.

    ఇదీ చదవండి: రూ. 30 వేల‌ కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం

     

  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో బలమైన గాలుల కారణంగా ఒక వ్యక్తి రేకుల షెడ్‌తో పాటు గాల్లోకి ఎగిరి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఘటన చోటుచేసుకుంది.  బలమైన గాలుల కారణంగా నన్హే మియాన్‌ అనే వ్యక్తి గాల్లో 50 అడుగుల ఎత్తు వరకూ వెళ్లి కిందపడ్డాడు.  దాంతో అతని చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొం‍దుతున్నాడు. 

    తాను తాడు పట్టుకుని ఉన్నప్పుడు బలమైన గాలులు వీయడంతో, తనతో పాటు ఆ రేకుల షెడ్‌ కూడా గాలిలోకి ఎగిరిపోయిందని అతను చెప్పాడు. బలమైన గాలుల కారణంగా ఆ రేకుల షెడ్‌కు కట్టి ఉన్న తాడును ప​ట్టుకున్నానని, అయితే ఆ షెడ్‌తో పాడు తాను గాల్లోకి  ఎగిరిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.  తాను తాడు పట్టుకోవడంతో సేఫ్‌గా ఉంటానని అనుకున్నానని, ఇలా జరుగుతుందని అనుకోలేదన్నాడు. 

    ప్రకృతి గర్జన కారణంగా ఇలా భూమి నుంచి విడిపోయి.. ఒక్కసారిగా ఆకాశం వైపు దూసుకెళ్లి కింద పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ప్రకృతి ముందు మనిషి, టెక్నాలజీ అనే ఏమీ పని చేయదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

     

    కాగా, యూపీలో తుపాన్‌ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా సంభవించిన బలమైన తుఫానులు, భారీ వర్షాల దాటికి సుమారు 100 మంది  ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగులు, వర్షాలు, బలమైన తుఫాను గాలుల కారణంగా ఈ మరణాలు సంభవించాయని రాష్ట్ర విపత్తుల సంఘం పేర్కొంది.

    రాష్ట్ర సహాయక కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు ప్రభావం ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. అనేక చోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

  • చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బిగ్‌ బొనాంజా ప్రకటించారు. గురువారం డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.

    సమాచార, ప్రజాసంబంధాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సవరించిన డీఏ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు లాభం చేకూరుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలను తమిళనాడు సీఎంవో ఎక్స్‌ ఖాతాలో వివరించారు.

    డీఏ పెంపు ఇలా..
    తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 2 శాతం డీఏ పెంపుతో మొత్తం డీఏ 60 శాతానికి చేరింది. దీనితో పోల్చితే బ్యాంకు ఉద్యోగులకు సుమారు 0.70 పాయింట్ల స్వల్ప పెంపు మాత్రమే లభించింది. దీంతో వారికి వచ్చే నగదు ప్రయోజనం తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణానికి వేర్వేరు రంగాలు ఎలా స్పందిస్తున్నాయో ఈ తేడా చూపిస్తోంది. 

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సుల్లో ఎక్కువ సవరణ లభించింది. ఈ నిర్ణయం వల్ల ఏటా అదనంగా సుమారు రూ. 1,230 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం, పెన్షన్ బాధ్యతలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

  • ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.’’ అని ఓ సినీకవి అన్నట్టుగా పెళ్లి వేడుకలు, బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, వధూవరుల కోటి కలల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగాల్సిన పెళ్లి ముచ్చట ఉన్నట్టుండి విచారంగా పోయింది. వేద మంత్రాల మధ్య వైభవంగా వధువుకు తాళి కట్టాల్సిన ముచ్చట ఆసపత్రి ఐసీయూకి చేరింది. ఇంతకీ ఏమైంది తెలుసుకుందాం ఈ కథనంలో.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ భావోద్వేగపూరితమైన వివాహం జరిగింది. పెళ్లి రోజునే వధువు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో బరాత్‌ను ఆసుపత్రికే  తీసుకువచ్చి, వధువు నుదిట సింధూరం అద్ది పెళ్లి చేసుకున్నాడు.

    అసలేం జరిగింది అంటే 
    గోరఖ్‌పూర్ జిల్లా బాన్స్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజా యాదవ్ అనే యువతికి, సన్ని యాదవ్ అనే యువకుడితో మే 13న పెళ్లి జరగాల్సి ఉంది. పూజ ఎల్.ఎల్.బి (LLB) చివరి సెమిస్టర్ చదువుతోంది. పెళ్లి రోజు ఉదయం ఆమె తన సోదరుడితో కలిసి పరీక్ష రాయడానికి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరీక్ష రాసి బైక్‌పై తిరిగి వస్తుండగా, పూజకు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో బైక్ మీద నుండి కింద పడి పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూ (ICU)కి తరలించి చికిత్స అందించారు.

    పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు  ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. చివరికి వధూవరుల కుటుంబాల భారమైన హృదయాలతోనే  కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిని వాయిదా వేయకుండా, నిర్ణయించిన ముహూర్తానికే ఆసుపత్రిలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.

    వరుడు సన్ని యాదవ్ పెళ్లి బట్టల్లో, బంధుమిత్రులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఐసీయూ బెడ్ మీద ఆసుపత్రి దుస్తుల్లో చికిత్స పొందుతున్న పూజ నుదుట సింధూరం దిద్దాడు. అక్కడున్న పండితుడు వేద మంత్రాలు పఠిస్తూ, ఏడు అడుగుల (సప్తపది) ప్రమాణాలను చేయించారు. సింధూర ధారణ ముగిసిన తర్వాత వరుడు తిరిగి గ్రామానికి చేరుకుని మిగిలిన పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేశాడు. వరుడు సన్ని యాదవ్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆపద సమయంలో వధువును వదిలేయకుండా, ఆమెకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న వరుడి గొప్ప మనసును చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టు కున్నారు. ప్రస్తుతం పూజ కోలుకుంటోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.

    నెటిజన్ల ప్రశంసలు
    పెళ్లి ఇంట్లో జరగాల్సిన వేడుక ఆసుపత్రికి మారినప్పటికీ, ఆపదలో ఉన్న వధువుకు తోడుగా నిలిచిన వరుడిని,  అతని కుటుంబాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. "నిజమైన ప్రేమ అంటే ఇదే" అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'హాస్పిటల్ వెడ్డింగ్' ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో  తెగ వైరల్ అవుతున్నాయి. 

    ఇదీ చదవండి: మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్‌!

  • సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్‌కంట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా 1992 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారిణి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సతీమణి టీహెచ్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్‌కంట్యాక్స్‌ అధికారిణిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిణిగా గుర్తింపు పొందారు. 

    తన విధి నిర్వహణలో జాయింట్‌ కమిషనర్‌గా బెంగళూరు, రాయచూర్‌లలో, అడిషనల్‌ కమిషనర్‌గా కర్నూలులో, కమిషనర్‌గా చెన్నైలో, ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్‌ యూనివర్సిటీ, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు.    

     

  • కోల్‌కత్తా: పాఠశాలల్లో ఉదయం వేళ వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాఠశాల ప్రారంభంలో జరిగే ఈ జాతీయ గీతాలాపనలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాల్గొనాలని.. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

    సోమవారం (మే 18 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా ప్రవేశపెట్టనుంది. వచ్చే సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా మారుతుందని.. ముఖ్యమంత్రి సువేందు అధికారి అసెంబ్లీలో మీడియాకు తెలిపారు. గతంలో బెంగాల్‌లోని పాఠశాలల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన' మాత్రమే పాడేవారు.

    గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం 1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమ సమయంలో ఠాగూర్ రాసిన 'బంగ్లార్ మాటి బంగ్లార్ జోల్' పాటను రాష్ట్ర గీతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇప్పుడు బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చడంతో తక్కువ సమయంలో ఈ పాటలన్నింటినీ ఏ క్రమంలో పాడాలనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Business

  • పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో.. పొదుపు, ఖర్చుల విషయంపై నరేంద్ర మోదీ కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు.

    ఖర్చులను, ప్రయాణాలను తగ్గించుకోవాలని, వర్క్-ఫ్రమ్-హోమ్‌ను ప్రోత్సహించాలని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరివర్తనను వేగవంతం చేయాలని హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక నోట్‌ ద్వారా వెల్లడించారు.

    విదేశీ ప్రయాణాలను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలని, దేశీయ విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలని సూచించారు. అంతే కాకుండా.. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లి సమావేశాలు నిర్వహించదానికి బదులు, ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించాలని కోరారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని అన్నారు.

    ఉద్యోగుల పని విధానంలో కూడా మార్పులు సూచించారు. ఇంటి నుంచే పని చేయగల ఉద్యోగులను ''వర్క్ ఫ్రమ్ హోమ్'' విధానంలో పనిచేయాలని ప్రోత్సహించారు. కరోనా సమయంలో ఈ విధానం విజయవంతంగా అమలైనందున, ఇప్పుడు కూడా అది ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడించారు.

    పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ.. సంస్థకు సంబంధించిన భవిష్యత్ వాహనాలన్నీ ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు కార్‌పూలింగ్ లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని సూచించారు.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

  • బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అయోధ్యలోని హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) వారి ప్రీమియం ప్లాటెడ్ డెవలప్‌మెంట్‌లో ఒక భూమిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్లడించింది.

    సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ''ది సరయూ'' అనే ప్రీమియం ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ భూమిని కొనుగోలు చేశారు. సుమారు 2,134 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ స్థలం విలువ దాదాపు రూ.3.31 కోట్లు. ఇందులో క్లబ్ హౌస్, విలాసవంతమైన సౌకర్యాలతో పాటు.. ది లీల నిర్వహించే లగ్జరీ హోటల్ కూడా ఉంది.

    భూమిని కొనుగోలు చేసిన సందర్భంగా.. ''అయోధ్య నన్ను పిలిచినట్టుగా అనిపించింది, నేను ఆ పిలుపుకు స్పందించాను'' అని రణబీర్ కపూర్ పేర్కొన్నారు. కాగా.. ఈయన త్వరలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అందువల్లనే అయోధ్యతో తనకు ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు.

    భారతదేశ చరిత్రలో..  సంస్కృతిలో అయోధ్యకు ఉన్న ప్రత్యేక స్థానం కారణంగా, ఈ భూమిని తన కుటుంబ వారసత్వంలో భాగంగా ఉంచాలని భావించినట్లు రణబీర్ కపూర్ చెప్పారు.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

  • డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ తన ఐపీఓకు ముందు.. ఆకాష్ అంబానీని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 5 సంవత్సరాల కాలానికి ఎండీగా నియమించినట్లు మే 7నాటి ఫైలింగ్‌లో పేర్కొంది.

    ఆకాష్ అంబానీ అక్టోబర్ 2014 నుంచి జియో ప్లాట్‌ఫామ్స్ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (RJIL) బోర్డులో ఉన్నారు. జూన్ 2022లో ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలో 2016లో ప్రారంభమైన ఆరు నెలల లోపే జియో 100 మిలియన్ల చందాదారుల మార్కును సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 30,000 కోట్లకు పైగా లాభాన్ని.. రూ. 1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు ట్రిలియన్‌ డాలర్ల మార్కునకు చేర్చాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన దీనిపై మాట్లాడారు.

    ప్రపంచవ్యాప్తంగా రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా సుంకాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రికార్డు స్థాయిలో 863.11 బిలియన్‌ డాలర్లకు (4.6 శాతం వృద్ధి) పెరిగినట్టు మంత్రి చెప్పారు. ఇందులో వస్తు ఎగుమతులు 0.93 శాతం పెరిగి 441.78 బిలియన్ల డాలర్లుగా ఉంటే, సేవల ఎగుమతులు 8.71 శాతం పెరిగి 421.32 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు వెల్లడించారు. మరో 137 బిలియన్‌ డాలర్లు పెంచుకోవడం ద్వారా ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని సాధించాలని కోరారు.

    స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల మద్దతు..
    పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకోవడం ద్వారా ఆయా మార్కెట్లలో భారత ఉత్పత్తులకు ద్వారాలు తెరుస్తున్నట్టు మంత్రి గోయల్‌ తెలిపారు.

    భారత వస్తువులకు అంతర్జాతీయ విపణిలో ప్రాధాన్యత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 2021 నుంచి ఇప్పటివరకు తొమ్మిది కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు గుర్తు చేశారు. ఇందులో నాలుగు అమల్లోకి రాగా, మిగిలిన ఐదు వచ్చే 12 నెలల్లో ఆచరణలోకి రానున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి చిలీ, మాల్దీవులతో ఒప్పందాలు పూర్తవుతాయని.. కెనడా, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు, రష్యాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.

  • గత రెండేళ్లలో రూ.84,000 కోట్లకు పైగా పెట్టుబడుల మద్దతుతో, తెలంగాణ జీవ శాస్త్రాల పర్యావరణ వ్యవస్థ సుమారు 145 బిలియన్ డాలర్ల విలువను చేరుకోవడం ద్వారా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విస్తరణగా నిలిచింది.

    పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టిఎల్ఎస్ఎఫ్) 7వ బోర్డు సమావేశంలో ఈ పరివర్తనాత్మక పురోగతిని ప్రముఖంగా ప్రస్తావించారు. టిఎల్ఎస్ఎఫ్ సీఈఓ శక్తి ఎం. నాగప్పన్, తన దశాబ్ద కాల పదవీకాలంలో ఈ రంగం సాధించిన వృద్ధిపై సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరియు గౌరవనీయ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుల శక్తివంతమైన నాయకత్వంలో గడిచిన రెండేళ్లు ఒక కీలక మలుపు అని ఆయన నొక్కి చెప్పారు.

    తెలంగాణాలో 2016 నుంచి జీవశాస్త్ర రంగం దాదాపు మూడు రెట్లు అభివృద్ధి చెందింది. దీనితో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్ ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది.

    ఒక విశేషమైన ఘనత ఏమిటంటే, ప్రపంచంలోని అగ్రగామి పది  లైఫ్ సైన్సెస్ కంపెనీలలో తొమ్మిదింటికి చెందిన సాంకేతిక, ఆవిష్కరణ కేంద్రాలకు ఇప్పుడు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఘనత సాధించిన, యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న ఏకైక ప్రాంతం ఇదే. పటిష్టమైన విధాన కార్యాచరణ విధానాలు, వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాలు మరియు లక్షిత సంస్థాగత నిర్మాణం వంటివి దీనికి కీలక చోదకాలుగా ఉన్నాయి. ఇవి తెలంగాణను సమగ్రమైన ప్రపంచ పర్యావరణ వ్యవస్థగా సుస్థిరం చేస్తున్నాయి.

    ఈ పరివర్తన దశలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్ది, విస్తరించడంలో చూపిన నాయకత్వానికి బోర్డు ఏకగ్రీవంగా సీఈఓ శక్తి ఎం. నాగప్పన్‌ను ప్రశంసించింది. ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభినందనలను నమోదు చేసింది. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనను 'సలహాదారు (లైఫ్‌సైన్సెస్)'గా నియమించిందని, అలాగే ఆయన తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఫౌండేషన్ బోర్డులో కొనసాగుతారని బోర్డు పేర్కొంది.

  • ఆర్‌బీఐ నుంచి ఈ ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్‌ వర్షం కురవనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఎన్నో సవాళ్లు ఎరువుతుండడం తెలిసిందే. కరెంట్, ద్రవ్యలోటు పెరిగిపోనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్‌ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాయి.

    గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ రూ.2.69 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌ కింద పంపిణీ చేసింది. 2024–25లో రూ.2.11 లక్షల కోట్లతో పోల్చితే 27 శాతం పెరిగింది. ఆర్‌బీఐ, ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని 2026–27 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 3.75 శాతం అధికం. ఇందులో రూ.75,000 కోట్లు ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వస్తుందని అంచనా వేసింది.

  • టెస్లా తన ఉనికిని భారతదేశంలో విస్తరించడంలో నిమగ్నమైంది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించిన సంస్థ, ఇప్పుడు బెంగళూరులో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా టెస్లా తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

    బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ప్రారంభమైన టెస్లా కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో.. ఆరు సీట్ల ఎస్‌యూవీ టెస్లా మోడల్ YLతో పాటు, మోడల్ Yని కూడా చూడవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల పట్ల దేశంలోని పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా సంస్థ వీటిని తీసుకొచ్చింది. ఇక్కడ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా లభిస్తుంది.

    టెస్లా మోడల్ వైఎల్
    ఇండియన్ మార్కెట్లో టెస్లా మోడల్ వైఎల్ లాంగ్ వీల్ బేస్ వేరియంట్‌ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మోడల్ Y శ్రేణి ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటి ధరలు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమై రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.

    ఈ కారులోని 88 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 681 కిలోమీటర్లు (WLTP సర్టిఫైడ్) రేంజ్ అందిస్తుంది. స్పీడ్‌ విషయానికి వస్తే.. కేఇది వలం 5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మోడల్ వైఎల్ క్యాబిన్‌లో 16 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, హీటెడ్ వెంటిలేటెడ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి.

  • మోటరోలా భారత్‌లో తన తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘మోటరోలా రేజర్‌ ఫోల్డ్‌’ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా సెటప్, ఏఐ (మోటో ఏఐ) ఫీచర్లు, ఫోల్డబుల్స్‌లోనే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫోల్డబుల్‌ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన 6,000ఎంఏహెచ్‌ సిలికాన్‌-కార్బన్‌ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 80డబ్ల్యూ టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్‌: ఇందులో 6.6 అంగుళాల ఎక్స్‌టర్నల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉండగా, అన్‌ఫోల్డ్‌ చేసినప్పుడు 8.1 అంగుళాల భారీ 2కే మెయిన్‌ డిస్‌ప్లేగా మారుతుంది. ఇది 6,200 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, ఆండ్రాయిడ్‌ 16 వెర్షన్‌తో వస్తుంది. దీనికి ఏకంగా 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి.

    కెమెరా విశేషాలు: ఫోటోగ్రఫీ కోసం ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్‌ 50 మెగాఫిక్సెల్‌(ఎంపీ) ఎంపీ ప్రో–గ్రేడ్‌ ఫోల్డబుల్‌ కెమెరా సిస్టమ్‌ను అందించారు. 50ఎంపీ ప్రధాన కెమెరా (సోనీ లైటియా 828) 8కే డాల్బీ విజన్‌ రికార్డింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది. వీటితో పాటు 50ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌ (3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్, 100ఎక్స్‌ సూపర్‌ జూమ్‌ ప్రో), 122 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూ కలిగిన 50ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరాలు ఉన్నాయి.

    ఫిఫా వరల్డ్‌కప్‌ 26 స్పెషల్‌ ఎడిషన్‌: ఫుట్‌బాల్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫిఫా వరల్డ్‌కప్‌ 26 ఎడిషన్‌ను మోటరోలా పరిచయం చేసింది. ఈ వేరియంట్‌ వెనుక భాగంలో 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన అధికారిక ఫిఫా లోగో ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఫిఫా థీమ్స్, వాల్‌పేపర్లతో వస్తుంది.

    ధర, డిస్కౌంట్లు: 12జీబీ + 256జీబీ వేరియంట్‌ రూ. 1,49,999గా, 16 జీబీ + 512 జీబీ ధర రూ.1,59,999గా ఉన్నాయి. ఫిపా వరల్డ్‌కప్‌ 26 ఎడిషన్‌ రూ. 1,69,999 గా నిర్ణయించారు. లాంచింగ్‌ ఆఫర్ల కింద యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

    ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై 18 నెలల వరకు నో–కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కల్పించారు. జూన్‌ 20లోపు కొనుగోలు చేసిన వారికి ఒకసారి ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ (ఒక ఏడాది వరకు చెల్లుబాటు) లభిస్తుంది ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలాడాట్‌ సైట్లలో, ప్రముఖ రిటైల్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

    మోటో బడ్స్‌2 ప్లస్‌: వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవం కోసం ‘మోటో బడ్స్‌ 2 ప్లస్‌’ను కూడా విడుదల చేసింది. ఇవి ‘సౌండ్‌ బై బోస్‌’ టెక్నాలజీతో రూపొందాయి. 11ఎంఎం డైనమిక్‌ డ్రైవర్లు, సెగ్మెంట్‌లోనే ఉత్తమమైన 55డీబీ డైనమిక్‌ ఏఎన్‌సీ (నాయిస్‌ క్యాన్సిలేషన్‌), బ్లూటూత్‌ 6.0 సపోర్ట్‌ ఉన్నాయి. ఇవి కేస్‌తో కలిపి 40 గంటల వరకు ప్లేటైమ్‌ ఇస్తాయి. దీని ధర రూ. 5,999 కాగా, రూ. 1,000 బ్యాంక్‌ డిస్కౌంట్‌తో రూ. 4,999 కే లభిస్తాయి.

  • గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 789.74 పాయింట్లు లేదా 1.06 శాతం లాభంతో 75,478.15 వద్ద, నిఫ్టీ 277.00 పాయింట్లు లేదా 1.18 శాతం లాభంతో 23,689.60 వద్ద నిలిచాయి.

    బ్లాక్ రోజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాలాజీ అమైన్స్ లిమిటెడ్, మోడీ నాచురల్స్ లిమిటెడ్, అమైన్స్ & ప్లాస్టిసైజర్స్ లిమిటెడ్, PNB గిల్ట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, శారదా క్రాప్‌కెమ్ లిమిటెడ్, ఇంటర్‌ఆర్చ్ బిల్డింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • పశ్చిమాసియా యుద్ధం.. ప్రపంచంలోని చాలా దేశాలపైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డబ్బు విలువ తగ్గితే.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.

    మొదటిది, ఇరాన్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు పెరగడం వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు అన్నీ పెరుగుతాయి. ఫలితంగా ప్రతి వస్తువు ఖరీదవుతుంది. ఈ పరిస్థితినే ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరిగితే నగదు విలువ తగ్గిపోతుంది.

    ఇక రెండో కారణం.. దేశాలపై పెరుగుతున్న జాతీయ అప్పులు. ప్రభుత్వాలు భారీ అప్పులు తీసుకున్నప్పుడు వాటిని తీర్చడానికి మరింత కరెన్సీ ముద్రించాల్సి వస్తుంది. ఎక్కువ డబ్బు మార్కెట్లోకి వస్తే కరెన్సీ విలువ తగ్గుతుంది. అందుకే.. కియోసాకి ప్రభుత్వం ముద్రించే డబ్బును ఫేక్ మనీ అంటారు.

    డబ్బును కాపాడుకోవాలంటే.. ప్రతివ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కాబట్టి బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథేరియం వంటివాటితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఇవి కష్టకాలంలో మిమ్మల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేయగలవు. బంగారం, వెండి వంటి విలువ కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరిం  త పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?

    గోల్డ్, సిల్వర్ వంటివి కొనుగోలు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు, అని చాలామంది అనుకుంటారు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించినవాళ్లు మాత్రం.. బంగారం ఎలా కొనాలి?, అని ఆలోచిస్తారు. ఈ ఆలోచన మనిషిలో కొత్త అవకాశాలను వెతకడానికి ప్రేరణ ఇస్తుంది. ధనవంతుల ఆలోచన సమస్యలపై కాకుండా పరిష్కారాలపై ఉంటుందని కియోసాకి స్పష్టం చేశారు.

Politics

  • కడప:  తనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఏ తప్పు చేయని తనపై బురదజల్లారని విమర్శించారు. తాము అధికారంలో లేకపోయినా తమ జపమే చేస్తున్నారని, తాను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదన్నారు. 

    తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి  విరమిస్తారా? అని సవాల్‌ చేశారు. టీడీపీ నేతలు ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ఎల్లో మీడియా మాత్రం వాటిపై స్పందించదని ఈ సందర్భంగా చురకలంటించారు రవీంద్రనాథ్‌రెడ్డి. 

    ‘టీడీపీ వారు వందల ఎకరాలు ఆక్రమించుకుంటే దాని గురించి రాయరు.  ఏ తప్పు చేయని మాపై మాత్రం బురద జల్లుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దోచుకుంటుంటే దాని గురించి పచ్చ పత్రికలు రాయడం లేదు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా?’ అని సవాల్‌ చేశారు. 

  • తాడేపల్లి:  రేపల్లె కాంగ్రెస్‌ నేత మోపిదేవి శ్రీనివాసరావు  వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్‌ జగన్‌. 

    మోపిదేవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్‌ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. అందర్నీ ఆహ్వానించి పార్టీ కోసం పనిచేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు. చేరికల‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యాలయం కార్యకర్తలతో  కిటకిటలాడింది. 

    దీనిలో భాగంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘మోపిదేవి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. నా మీద నమ్మకం ఉంచి పార్టీలోకి వచ్చారు. శ్రీనుకి అన్ని రకాలుగా న్యాయం చేస్తాను. రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ కృష్టకు మీ మద్దతు ఇవ్వాలి. మోహన్ కృష్ణ గెలుపు బాధ్యతలు తీసుకుని గెలిపించాలి. 

    మోపిదేవి శ్రీను చేసే మంచిని జగన్ ఎన్నటికీ మరువడు. అదే చట్ట సభలో కుర్చీ వేసి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తా. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎక్కువ మంది కార్యకర్తలను పరిచయం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అందరికీ హృదయపూర్వక అభినందనలు* అని పేర్కొ‍న్నారు.

    జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు
  • సాక్షి, తిరుపతి: టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.48 కోట్ల కుంభకోణం జరిగిందని, నాలుగు నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్‌ ఏజెంట్స్‌ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్‌ రూ.15 వేలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.

    దీన్ని నెలన్నర క్రితమే తాము బయటపెట్టినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆక్షేపించారు. పదే పదే తాము ప్రశ్నిస్తుంటే చివరికి ఏఐ, ఆటో ఫిల్లింగ్‌ సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. శ్రీవాణి టికెట్ల స్కాంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. భూమన  ఇంకా ఏం మాట్లాడారంటే..:

    నిరంతరాయంగా శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్‌ దోపిడీ:
    శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్‌ దోపిడీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఉదయం 9 గం,కు మొత్తం 800 శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో ఓపెన్‌ చేస్తే కేవలం ఒకటిన్నర నిమిషంలో మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు వస్తోంది. ఇదెలా సాధ్యం! దీని వెనుక మతలబు ఉంది. పెద్ద అవినీతి దాగి ఉంది. ఇంకా కుట్ర కూడా ఉందని మేం చెబుతున్నాం. దీని మీద టీటీడీ ఓ ప్రకటన ఇచ్చింది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ మీద నిరంతర నిఘా పెట్టామని, ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్‌ లాంటి పద్దతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు పొందే అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశామని చెబుతోంది. అలాగే అక్రమ పద్దతుల్లో బుక్‌ చేస్తున్న ఐడీల్ని నిరోధించి దళారుల ఎత్తుగడల్ని తిప్పికొట్టేలా ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నట్లు చెబుతోంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దని టీటీడీ కోరుతోంది.

    టీటీడీ ద్వంద్వ వైఖరి:
    ఇంకా 2024 జూన్‌ నుంచి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్‌ బుకింగ్‌ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించామని, బుకింగ్‌ సైట్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చొరబడటం సాధ్యం కాదంటున్నారు. మరోవైపు మళ్లీ కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్‌ వంటి పద్ధతుల్లో టికెట్లు బుక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

    నాలుగు నెలలుగా రోజుకు 8 టికెట్లూ ఇవ్వలేదు!:
    టీటీడీని నేను ఓ ప్రశ్న వేస్తున్నా. 2024లో అధికారంలోకి వచ్చాక శ్రీవాణి టికెట్ల విధానాన్ని అత్యంత పటిష్టం చేశామని చెబుతున్న మీరు.. ఆటో ఫిల్లింగ్‌ పద్దతుల ద్వారా దళారులు చొరబడుతున్నారని ఒప్పుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 9న ఆన్‌ లైన్‌ విధానం ప్రవేశపెడితే, అప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ప్రతీ రోజూ ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లలో ఒక్కటి కూడా అర్హులకు అందలేదు. నాలుగు నెలలుగా ఈ విషయం మీరు గుర్తించనే లేదా? లేక నిద్రపోయారా? లేక నిద్ర నటిస్తున్నారా? లేదా మా విమర్శలకు భయపడి ఈ వివరణ ఇచ్చారా? అనేది చెప్పాలి.

    TTD టిక్కెట్ల స్కామ్ 48 కోట్లు దోచేశారు

    దళారులు, ట్రావెల్‌ ఏజెంట్లు శ్రీవాణి టికెట్లను రూ.15 వేలకు  అమ్ముతున్నారని నెలన్నర క్రితమే మేం బయటపెట్టాం. ఆన్‌లైన్‌లో కేవలం ఒకటిన్నర నిమిషంలో 800 టికెట్లు అయిపోయినట్లు ప్రకటించిన తర్వాత కూడా దళారుల చేతుల్లో టికెట్లు కనిపిస్తున్నాయి. దీనిపై మేం లోతైన పరిశీలన చేస్తే టీటీడీ ఐటీ జీఎంగా ఓ ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్‌ అర్హత కూడా లేని వ్యక్తిని నియమించారని తేలింది. ఈ వ్యక్తిని గతంలో విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరపమని పంపిస్తే దాదాపు రూ.30 లక్షలు తినేశాడని పట్టుకుని ఆ మొత్తం రికవరీ కూడా చేశాం. అలాంటి వ్యక్తిని జీఎంగా నియమించారు. పెద్దలు తమకు తాబేదారుగా ఉంటాడని అతన్ని ఈ పోస్టులో నియమించారు.

    నిజానికి టీసీఎస్‌ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చాకే ఈ దోపిడీ మొదలైంది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అతనికి అనుంగు శిష్యుడైన మరో బోర్డు సభ్యుడు, స్ధానికుడు కూడా అయిన వ్యక్తి కలిసి రోజుకు రూ.40 లక్షల ఆదాయం శ్రీవాణి టికెట్ల ద్వారా పంచుకుంటున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దాదాపు రూ.48 కోట్లు అలా దండుకున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి చెందాల్సిన రూ.48 కోట్లను వీరు అక్రమంగా దోచుకున్నారు.

    సెక్యూరిటీ ఆడిట్‌ లేకుండానే రోజుకు 800 టికెట్ల జారీ!:
    మేం కొత్త సాఫ్ట్‌ వేర్‌ తెచ్చినప్పుడు శ్రీవాణి టికెట్లను మూడు నెలలకోసారి సెక్యూరిటీ ఆడిట్‌ చేసి కేటాయించే వాళ్లం. కానీ ఇప్పుడు టీసీఎస్‌ ఎలాంటి సెక్యూరిటీ ఆడిట్‌ లేకుండానే రోజుకు 800 టికెట్లను రిలీజ్‌ చేస్తోంది. ఆటో ఫిల్లింగ్‌ ద్వారా ఎవరో దళారులు, ట్రావెల్‌ ఏజెంట్లు దూరుతున్నారని చెప్తున్న టీటీడీ.. మేం తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ లో మూడు నెలలకోసారి ఇచ్చే రూ.300 ఎస్‌ఈడీ టికెట్ల ఫ్రీ బుకింగ్‌ కానీ, కళ్యాణోత్సవం టికెట్లు కానీ, సేవా టికెట్ల డిప్‌లు కానీ, వసతి టికెట్లు కానీ, మూడు నెలలకు ఇచ్చే శ్రీవాణి కోటాలో ఎందుకు ఆటోఫిల్లింగ్‌ జరగడం లేదో సమాధానం చెప్పాలి. కొత్తగా ఆ సాఫ్ట్‌వేర్‌ రూపొందించామని చెప్తున్న టీటీడీ.. ఈ 800 టికెట్లకే ఎందుకు ఆటోఫిల్లింగ్‌ జరుగుతోందో చెప్పాలి.

    అంటే అందరూ కూడబలుక్కుని దోపిడీ చేస్తున్నారు. విజిలెన్స్, ఐటీ రంగం పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా నిస్సత్తువతో మిలాఖత్‌ అయ్యాయి. అటు పెద్దలు, ఇటు దళారులు, ఐటీ, విజిలెన్స్‌ కలిసే ఈ తతంగం నడుపుతున్నారు. ఒక్క రోజులో కనుక్కోవాల్సిన విషయాన్ని మేం పదే పదే చెప్తుంటే, విమర్శల జడివాన పెరిగాక ఇలా జరుగుతోందని, డేగ కన్ను వేశామని కబుర్లు చెప్తున్నారు. కన్ను తెరిచారే తప్ప అది పని చేయడం లేదు.

    సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:
    శ్రీవాణి టికెట్ల స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఏకంగా రూ.48 కోట్ల స్కామ్‌ జరిగింది. మేం శ్రీవాణి టికెట్లు ఆ‹ లైన్‌లో ఇచ్చినప్పుడు రోజుకు 1000 వరకు ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వం దాన్ని మూసేసి ఆన్‌ లైన్‌ విధానం తీసుకొచ్చింది. ఈ నాలుగు నెలల కాలంలో రోజుకు కనీసం 8 మందికి కూడా టికెట్లు దొరకలేదు. దళారులంతా టీటీడీ వెబ్‌ సైట్‌ ద్వారానే టికెట్లు కొంటున్నారు. ఎలా అంటే మీ ఐటీ, విజిలెన్స్‌ విభాగాలు, పాలక మండలి పెద్దలు కుమ్ముక్కు కావడం వల్లే. అలా అంతా ఒక్కౖటై ఒక్కో  బ్రేక్‌ దర్శనం టికెట్‌ రూ.4 వేలకు అమ్ముతున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Advt

  • ఈ రోజుల్లో నగర జీవితంలో ఉన్న రద్దీ, ఒత్తిడి నుంచి కొంత దూరంగా ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి మీ కలను నిజం చేసే ప్రాజెక్ట్ Teamline Eco Resorts ( RERA No.P02000005337 ) ప్రకృతి మధ్యలో, పచ్చని వాతావరణంలో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్, మీకు రిసార్ట్ లాంటి జీవనశైలిని అందించే ప్రత్యేకమైన అవకాశం.

    Teamline Eco Resorts లో ప్రతి విల్లా ప్రకృతి అందాలతో ముడిపడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం – ఇవన్నీ కలిసి మీకు ఒక నిజమైన రిసార్ట్ అనుభూతిని కలిగిస్తాయి. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, వీకెండ్ హాలిడే హోమ్‌గా ఉపయోగించడానికి లేదా భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా తీసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం.

    ఇక్కడి విల్లాలు కేవలం లగ్జరీ మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా జీవించే ఒక కొత్త జీవనశైలిని అందిస్తాయి. ప్రతి రోజు ఉదయం పచ్చని చెట్ల మధ్య సూర్యోదయాన్ని చూస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం.

    ఇంత ప్రీమియం అనుభవం ఇప్పుడు
    ఇక్కడ విల్లా కేవలం

    39 లక్షలు ( 500 sq ft విల్లా & 165 sq Yards Land) + 10 వేలు నెలసరి అద్దె ఆదాయం

    45 లక్షలు ( 750 sq ft విల్లా & 165 sq Yards Land) + 20 వేలు నెలసరి అద్దె ఆదాయం

    65 లక్షలు ( 1250 sq ft విల్లా & 165 sq Yards Land) + 30 వేలు నెలసరి అద్దె ఆదాయం

    ప్రకృతి, ప్రశాంతత మరియు లగ్జరీ జీవితం – ఈ మూడింటి సమ్మేళనం Teamline Eco Resorts.
    మీ కలల విల్లాను ఇప్పుడే బుక్ చేసుకోండి మరియు ప్రకృతి మధ్యలో ఒక కొత్త జీవనాన్ని ప్రారంభించండి.

    యాదాద్రి ఆలయానికి సమీపంలో – తెలంగాణలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన యాదాద్రి ఆలయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో భారీ అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి.

    📍 వరంగల్ హైవే కనెక్టివిటీ – హైదరాబాద్ నుండి వరంగల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఆనుకోని ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది.

    📍 ఆలేర్ టౌన్ లో – రైల్వే స్టేషన్, మార్కెట్, విద్యాసంస్థలు మరియు రోజువారీ అవసరాల కోసం అన్ని వసతులు కలిగి ఉన్నాయి.

    📍 వీకెండ్ రిసార్ట్కు పర్ఫెక్ట్ లొకేషన్ – యాదాద్రి టెంపుల్ 15 నిమిషాలు , AIIMS బీబీనగర్ 45 నిమిషాలు , స్వర్ణగిరి టెంపుల్ 20 నిమిషాలు , జనగాం టౌన్ 10 నిమిషాలు.

    Teamline Eco Resorts లో విల్లా ఓపెన్ ప్లాట్లపై ఇప్పుడు 100% బ్యాంకు రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక భారీ మొత్తంలో ముందస్తు చెల్లింపు (Down Payment) గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అర్హత కలిగిన వారికి పూర్తి బ్యాంకు రుణ సహాయం, సులభమైన నెలవారీ వాయిదా (EMI) పద్ధతులతో మీ కలల విల్లా ప్లాట్‌ను సొంతం చేసుకునే సువర్ణావకాశం. పెట్టుబడి నిర్ణయాన్ని ఇక వాయిదా వేయకండి! 100% బ్యాంకు లోన్ ప్రయోజనంతో ఈరోజే మీ భవిష్యత్తును భద్రపరచుకోండి!

    పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి -  9133332733 , 9000896223

    Teamline Eco Resorts – Nature, Peace & Smart Investment… All in One Place. 🌿

International

  • ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు  కీలక మలుపు తిరిగింది.  తన భర్త ఎరిక్ రిచిన్స్‌ను విషమిచ్చి  హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి.  ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని  ఆధారాలు ఆర్థిక కారణాల  ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు   కొడుకులు తల్లి  దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం.  

    అసలు కేసు  ఏంటి?
    2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే  పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా,  2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి.   అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. 

    ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌

    ఎరిక్ రిచిన్స్‌ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)
    2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు.  ఇదే తరహా  ఆరోపణలతో  విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.

    ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

    కోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్‌విచ్‌లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని,  కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ,  మామూలే అనుకొని  నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.

    మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్‌టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.

    నేను నిర్దోషిని
    అయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను  చేయని నేరానికి నిందించవద్దని, తన  ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు.  స్వయంగా రైటర్‌ అయిన కౌరీ  భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

  • చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్‌తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.

    పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా  ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్‌ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.

    టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి  బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

    అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో  ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని  ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి  అనే విషయాన్ని వెల్లడించలేదు.

    నెటిజన్ల స్పందనలు
    ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో  బాగా గారాబం ఎక్కువై ఉంటుంది  అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.

Family

  • భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే ప్రథమ తాంబూలం. చెట్టును, చేమను, పుట్టను, గుట్టను, రాతిని కూడా దైవ స్వరూపంగా భావించే ఉదాత్తమైన సంప్రదాయం మనది. ఈ వృక్ష సంపదలో అగ్రతాంబూలం అందుకునేది ‘రావి చెట్టు’. ఋగ్వేదం మొదలుకొని భగవద్గీత వరకు ప్రతిచోటా కొనియాడబడిన ఈ మహావృక్షాన్ని ‘కలియుగ కల్పవృక్షం’ అని ఎందుకు అంటారు. ఆధ్యాత్మికంగానే కాకుండా శాస్త్రీయంగానూ ప్రాణికోటిని రక్షించే ఈ అశ్వత్థ వృక్ష వైభవంపై ప్రత్యేక కథనం..

    సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వృక్షాలన్ని నేను రావి చెట్టును అని ప్రకటించిన ఈ వృక్షం సామాన్యమైనది కాదు.. త్రిమూర్తుల సమ్మేళనం. దీని వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీమహావిష్ణువు, అగ్రభాగంలో పరమశివుడు కొలువై ఉంటారని పురాణోక్తి. అందుకే ఈ చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

    దోషాల నుంచి విముక్తికి...
    జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలకు, పితృదోషాలకు రావి చెట్టు చెంత చక్కని పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు రావి చెట్టును వరమిచ్చాడని, ఎవరైతే శనివారం నాడు ఈ చెట్టును పూజించి దీపం వెలిగిస్తారో వారికి తన పీడ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని, తద్వారా వంశాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు.

    శాస్త్రీయ కోణంలో .. 
    రావి చెట్టును కల్పవృక్షం అనడానికి కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదు, బలమైన శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. ప్రకృతిలో 24 గంటల పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువును విడుదల చేసే ఏకైక వృక్షం రావి. దీని విశాలమైన నీడ పర్యావరణంలోని విష వాయువులను హరిస్తుంది. ఆయుర్వేదంలోనూ రావి బెరడు, ఆకులు, పండ్లను ఎన్నో మొండి వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందుకే ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం.

    అనుగ్రహం పొందే మార్గం..
    ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక అశాంతితో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ‘ మంత్రాన్ని జపిస్తూ ఏడు ప్రదక్షిణలు చేయడం విశేష ఫలితాలనిస్తుంది. నమ్మకంతో చేసే ఈ చిన్న ప్రయత్నం అపారమైన మనశ్శాంతిని, కార్యసిద్ధిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ప్రకృతిని ప్రేమిద్దాం.. దైవత్వాన్ని పూజిద్దాం..! 
    – పసుపులేటి వెంకటేశ్వరరావు 

    (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)

  • మన దక్షిణాదిన శుచీంద్రం ప్రముఖ శివ క్షేత్రాలలో ఒకటి. ఎంతో మహిమ గల శైవదేవాలయం. స్వర్గాధిపతి దేవేంద్రుడు శాపవిమోచన పొందిన స్థలం. మరి మనకి కూడా తెలిసీ తెలియక చేసిన తప్పులకి  ప్రార్థనతో పొదవచ్చు. స్త్రీవ్యామోహంతో శాపం పొందిన ఇంద్రుడు ఇక్కడ పాప మోచనం పొంది శుచిత్వం పొందడంతో శుచీన్ద్రం అని పేరు వచ్చింది. ఆ కథ, శుచీంద్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.  

    ఒకసారి అహల్య అందాన్ని చూసి మోహ పరవశుడు అయ్యాడు దేవేంద్రుడు. అప్పుడు ఇంద్రుడు తెల్లవారక ముందే కోడికూత వేసి గౌతమ మునిని స్నానానికి పం΄ాడు. ఆ సమయంలో ఇంద్రుడు గౌతమ ముని వేషంలో అనసూయ దగ్గరకి వచ్చాడు. జరిగిన మోసం గ్రహించి గౌతమ ముని తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఇంద్రుడిని, అహల్యని చూసి శపించాడు. శిలగా మారిన అహల్య శ్రీ రాముని పాదస్పర్శ తగిలి ఇక్కడే శాప విమోచనం పొందింది. 

    ఇక్కడే అత్రి మహా ఋషికి ఆశ్రమం ఉండేది అందుకే జ్ఞానారణ్యం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక చెట్టు మొదలు నరికినప్పుడు శివలింగం కనిపించింది. గొడ్డలి దెబ్బకి శివలింగం నుండి రక్తం కారసాగింది. ఇది దేవాలయ మూలస్థానంగా చెబుతారు. సుచీన్ద్రంలో మహాశివుని ప్రతిష్ట ఉన్నప్పటికీ త్రిమూర్తి సంకల్పం కూడా ఉంది. కారణం ఇక్కడ వృక్షాలలో త్రిమూర్తులు ఉన్నారు అని చెట్లకు పూజ చేస్తారు. 

    తప్పు చేసిన వారు పాప పరిహారంగా సుచీన్ద్రుని దర్శించుకుని భక్తులు పాప విమోచనం పొందుతారు. సుచీన్ద్రుని ముందు మరుగుతున్న నేతిలో వెండి విగ్రహాన్ని వేస్తాడు పూజారి. తప్పు చేసిన వారు ఆ విగ్రహాన్ని చేతితో తీయాలి. పూజారి ఆ చేతిని వస్త్రంతో కట్టి మూడు రోజుల తరువాత విప్పుతాడు. చేతి చర్మం రంగు మారినా వ్రణం ఏర్పడినా ఆ వ్యక్తి తప్పు చేసినట్టుగా నిర్ధారిస్తారు. బ్రిటిష్‌ వారు ఈ విధానానికి స్వస్తి పలికారు. 

    మహాభిషేకం సమయంలో భక్తులు రథం లాగుతారు. ఈ కార్యక్రమానికి సుచీన్ద్రం వాసులు ఎక్కడ ఉన్నా వచ్చి పాల్గొంటారు. ఆ విధంగా తమ పాప ప్రక్షాళనం చేసుకుంటారు. ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి ప్రసిద్ధి. ఇక్కడి స్తంభాలను మీటితే సప్తస్వరాల ధ్వని వినిపిస్తుంది. స్త్రీ రూపంలో చెక్కిన వినాయకుడు, రుద్రవీణ వాయిస్తున్న రావణాసురుడు, నోటిలో తిరుగుతున్న భూగోళం, రామాయణ మహాభారతాల రాతి శిల్పాలు... ఎంత చూసినా అద్భుతమే. 

    మన దేశంలో లాటరీ విధానం ఇక్కడ నుండి ప్రారంభించారు అని అధికారిక పత్రాలు ఉన్నాయి ఇక్కడ. శుచీన్ద్రం రాజ గోపుర పునరుద్ధరణకు డబ్బు అవసరం ఏర్పడింది. అప్పటి తిరువనంతపురం రాజు గారి అనుమతితో ఒక రూపాయి లాటరీ టికెట్‌ అమ్మకం చేశారు. పదివేల రూపాయల బహుమతి. యాభై వేల టికెట్లు అమ్మారు. బహుమతి సొమ్ము పోను మిగిలిన డబ్బుతో ఆలయాన్ని పునరుద్ధరించారు.  

    ఈ ఆలయం మంచి పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. పచ్చని అడవితో పాలార్‌ నదీ ప్రవాహం, శిల్పకళా వైభవం మంచి అనుభూతినిస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నా కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ టూర్‌ శబరిమల యాత్రలో సుచీన్ద్రం వెళ్లడం సులువు. కన్యాకుమారి నుండి 18, నాగర్కోయిల్‌ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది సుచీన్ద్రం శివ క్షేత్రం. సుచీన్ద్రంలో అంతగా లాడ్జీలు లేవు. నాగర్కోయిల్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. 
    – ఇ.ఎస్‌. మాధవన్, విశాఖపట్నం

    (చదవండి: మైసూరు మహాదేవి చాముండేశ్వరి)


     

  • ఓ వ్యక్తి తలచుకుంటే అనితర సాధ్యమైనదంటూ ఉండదు అని నిరూపించాడు ఈ విద్యార్థి. విలాసవంతమైన స్పాన్సర్‌లు, ఎలాంటి సాహసయాత్ర చేసిన నేపథ్యం లేకుండా ఎవరెస్టుని చుట్టేయలని ఉత్సాహం మాత్రం ఆకాశమంత. ఏదైతేనేం తన దగ్గర ఉన్న తక్కువ డబ్బుతోనే ఎవరెస్టు బేస్‌ క్యాప్‌కు చేరుకుని ఓ చిన్నపాటి విజయం సాధించాడు  పైగా తన వయసు యువకులకు జస్ట్‌ ఊహాలాంటి డ్రీమ్‌ని సాధ్యం చేసి..పరిమిత వనరులు, ఆర్థిక పరిస్థితి, మార్గదర్శక లేమి వంటివి ఏమీ పెద్ద అడ్డంకులు కావని ప్రూవ్‌ చేశాడు. 

    కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కేశవ్ సునీష్ బీకామ్‌ విద్యార్ధికి ఎవరెస్టుని అధిరోహించడం అతని డ్రీమ్‌. అలా అని బాగా ధనవంతుల కుటుంబ నేపథ్యమా? అంటే అదీ కాదు. పోనీ సాహసయాత్రలు చేసిన చరిత్ర ఉందా ?అంటే అదీ లేదు. కానీ ఎలాగైనా ఆకోరిక నేరవేర్చుకోవాలన్న ప్రగాఢమైన కోరిక ఒక్కటే బలంగా ఉంది. అదే అతడిని ఇంత పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. 

    అందుకోసం అతను కూరగాయ దుకాణంలో సహాయకుడిగా, ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేసిన పోదుపుతో ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. ఈ యాత్ర కోసం అతడ ఖర్చు చేసిందో ఎంతో తెలిస్తే విస్తుపోతారు. కేవలం రూ. 16 వేలతో ఈ డ్రిమ్‌ని ఫుల్‌ఫిల్‌ చేసుకున్నాడు. అంత తక్కువ డబ్బుతో ఎలా సాధ్యం అంటే..మనసుంటే మార్గం ఉందని అంటాడు కేశవ్‌. 

    నిజానికి ఆ స్టూడెంట్‌ ఆశయం సాధరణమైంది కాదు. ఎందుకంటే ఎవరెస్టు యాత్రకు అయ్యే ఖర్చు సుమారు రూ. 15 లక్షలు. అయితే ఎవరెస్టు శిఖరాగ్రం అతడి స్థోమతకు అందనిది, అందుకని చిన్న చిన్న దశలుగా విభజించుకుని ఒక్కో మైలు రాయిని చేరుకునేలా ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు కేశవ్‌. అలాగే తన స్థోమతకు అనుగుణంగా ఖర్చులు తగ్గించుకునేలా యాత్ర ప్లాన్‌ చేశాడు. సెకండ్‌ క్లాస్‌ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించి సోనౌలి సరిహద్దు ద్వారా నేపాల్‌లోకి ప్రవేశించి, కాలినడకన యాత్ర కోసం సల్లేరికి చేరుకున్నాడు.

    దాదాపు ఎనిమిది రోజులు పైయా, టెంగ్‌బోచే, డింగ్‌బోచే, లుబుచేలా గుండా ప్రయాణిస్తూ..చివరకు ఎవరెస్టుబేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాడు. అలాగే క్యాంప్‌కు సమీపంలో ఉన్న  గోరక్‌షెప్‌కు చేరుకోవడానికి 132 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. మధ్యమధ్యలో టెంట్‌ వేసుకుని నిద్రించాడు కూడా. అలాగే తన బడ్జెట్‌కి అనుగుణంగా స్వయంగా వండుకుని ఆహారం తినేవాడు. 

    ఈ యాత్రకు ఎన్నో అడ్డంకులు..
    అతడు ఈ యాత్రను సెప్టెంబర్ 2025లో ప్రారంభించాడు. జనవరిలో తన అమ్మమ్మ మరణింతో మధ్యలోనే తిరిగి వచ్చేశాడు, కానీ సంకల్పం వదులుకోలేదు. ఆ తర్వాత చిన్న చితకా ఉద్యోగాల్లో చేరి డబ్బు ఆదా చేసి ఏప్రిల్‌ 7న అధిరోహణ పునః ప్రారంభించాడు. అలా రెండో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నాడు. అతడి కథ..చుట్టూ ఎలాంటి వనరులు లేకపోయినా..కనీసం మార్గనిర్దేశం లేకపోయానా..సాధించాలి అన్న తపన ఎవరెస్టు వరకు నడిపించింది. 

    చాలా శ్రమకోర్చి సాధించిన విజయం ఇది. పైగా కేశవ్‌ జస్ట్‌ 21 ఏళ్లకే దాన్ని సాధించాడు. అయితే అతడు శిఖరాగ్రం చేరుకోకపోవచ్చు..సమీపం వరకు వెళ్లి అనుకున్నది సాధించాడు. నిజానికి ఎవరెస్టు శిఖరాగ్రం చేరుకోవడానికి బేస్‌క్యాంప్‌లో ఫిజికల్‌ శిక్షణ, వంటివి చాలానే ఉంటాయి. అయినా ఇంత సాధించిన కేశవ్‌కి అదేమంత కష్టమేమి కాదు. మరి అతడికి ఆల్‌ది బెస్ట్‌ చెబుదామా..!

     

    (చదవండి: ట్రాక్టర్‌ డ్రైవర్‌ కుమారుడు స్పేస్‌ టెక్‌ కంపెనీ సీఈవోగా..!)
     

  • మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు.  గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు.  మేము దగ్గరలో ఉన్న జనరల్‌ ఫిజిషియన్‌కి, న్యూరాలజిస్ట్‌కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి  ఏమైనా సలహా ఇవ్వగలరా?
    – రమేష్, యానాం 

    మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్‌ డైట్‌’ అనే కాన్సెప్ట్‌ ఉంది. ఆ డైట్‌లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్‌. వరకు మాత్రమే వైన్‌ తీసుకుంటారు. 

    అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్‌ డైట్‌’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్‌ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్‌ అబ్‌స్ట్రాక్షన్‌’ అంటారు. 

    నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్‌ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్‌ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్‌ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్‌ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు. 

    దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి.  దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్‌ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు. 

    ముఖ్యంగా ఆల్కహాల్‌ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్‌ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్‌ ది బెస్ట్‌.

    సమస్య నుంచి రిలీఫ్‌కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్‌ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్‌ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది. 
    (డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.  మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com )

    (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే)

  • నూట నలభై అయిదు సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో చదువుకోవడమే గొప్పగా భావిస్తారు. అలాంటి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసే అవకాశం రావడం ఎంత ఘనత! సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీకి తొలి మహిళా ప్రిన్సిపల్‌గా నియామకం కావడం ద్వారా ప్రొఫెసర్‌ సుసాన్‌ ఇలియాస్‌ చరిత్ర సృష్టించారు....

    రాబోయే జూన్‌లో సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కానుంది. సుసాన్‌ ఇలియాస్‌ ఈ ప్రసిద్ధ కాలేజీ మొదటి మహిళా ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

    మూడు దశాబ్దాల అనుభం
    ఫిబ్రవరి 1,1881న దిల్లీలో స్థాపించిన సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ మన దేశంలోని అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీ అంటే... తత్త్వశాస్త్రం, రాజనీతి, లిబరల్‌ ఆర్ట్స్‌... మొదలైన మానవీయ శాస్త్రాలకు ప్రసిద్ధి గాంచిన కాలేజీ. గతంలో ఈ కాలేజీలో పనిచేసిన వారికన్నా భిన్నమైన విద్యా నేపథ్యం నుంచి వచ్చారు సుసాన్‌. 

    ఇంజినీరింగ్, కంప్యూటింగ్‌ పరిశోధనలలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభం ఉంది. ‘ప్రిన్సిపల్‌గా సుసాన్‌ నియామకం సెయింట్‌ స్టీఫెన్స్‌కు అత్యాధునిక సాంకేతికతను తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను’ అన్నారు కాలేజీ చైర్మన్‌ పాల్‌ స్వరూప్‌. ప్రిన్సిపల్‌ ఎంపిక సరిౖయెన విధానంలోనే జరిగిందని అంటారు స్వరూప్‌. 

    ప్రిన్సిపల్‌ పదవి కోసం బహిరంగ ప్రకటన ఇవ్వడం, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, షార్ట్‌లిస్టింగ్, అభ్యర్థుల ప్రజెంటేషన్‌ల తరువాత తుది ఎంపిక జరిగింది. ప్రిన్సిపల్‌గా సుసాన్‌ నియామకాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు కాలేజీ అకడమిక్స్‌ డీన్, చరిత్ర విభాగాధిపతి మలయ్‌ నీరన్‌. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీకి తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా 1906లో సుశీల్‌ కుమార్‌ రుద్ర చరిత్ర సృష్టించారు. తాజాగా అలాంటి ఘనతను సుసాన్‌ సొంతం చేసుకున్నారు.

    ఉన్నతమైన బాధ్యతలు
    సుసాన్‌ చెన్నైలో పుట్టి పెరిగారు. ఆమె విద్యా, ఉద్యోగ ప్రస్థానానికి చెన్నై ప్రధాన కేంద్రంగా ఉంది. భారత్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, అన్నా యూనివర్శిటీ నుండి మల్టీ మీడియా టెక్నాలజీలో మాస్టర్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మద్రాస్‌లో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ చేశారు. 

    ఎన్నో ప్రైవేట్‌ యూనివర్శిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వహించారు. హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో పరిశోధన డైరెక్టర్‌గా, డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ బయో–ఇన్నోవేషన్స్‌ సెంటర్‌కు హెడ్‌గా పనిచేశారు. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (సెన్స్‌) డీన్‌గా, అదే సంస్థలో అడ్వాన్స్‌డ్‌ డేటా సైన్సెస్‌కు డిప్యూటి డైరెక్టర్‌గా పనిచేశారు. 

    తర్వాతి కాలంలో ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలలో ఏఐ అప్లికేషన్‌లపై దృష్టి సారించారు. మెషిన్‌ లెర్నింగ్, ఎక్స్‌ప్లెయినబుల్‌ ఏఐ, మెడికల్‌ ఇమేజింగ్, ఫెడరేటెడ్‌ లెర్నింగ్, రోబోటిక్స్, డిజిటల్‌ హెల్త్‌లాంటి రంగాలలో పరిశోధనలు చేశారు. లక్నోలోని చండీగఢ్‌ యూనివర్శిటీలో ప్రో వైస్‌ చాన్సలర్‌(పరిశోధన)గా పనిచేశారు.

    ఇక ఏఐపై దృష్టి

    సెయింట్‌ స్టీఫెన్స్‌ ఎంతోమంది మేధావులు, నాయకులను తీర్చిదిద్దింది. తమ కాలానికంటే ముందే ఆలోచించే పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు ఈ కాలేజీ పుట్టిల్లు. 

    క్వాంటం కంప్యూటింగ్‌ యుగంలోకి ప్రవేశించడానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకోవాలి. ఎందుకంటే అదే మన సమీప భవిష్యత్‌. 

    ఈ కోర్సులు విద్యార్థులకు మాత్రమే కాదు డిజైనర్‌లు, న్యాయవాదులు, జర్నలిస్ట్‌లతో సహా వివిధ రంగాల వారికి ఉపకరిస్తాయి. ∙యూనివర్శిటీలో ఏఐ సర్టిఫికెట్‌ కోర్సులను ప్రవేశపెట్టనున్నాం. 

    విద్యార్థులను ఏఐకి సిద్ధం చేయడానికి, క్వాంటంపై అవగాహన కలిగించడానికి ప్రిన్సిపల్‌గా పనిచేయడం అనేది గొప్ప అవకాశం. ∙కళాశాల ఘనమైన వారసత్వాన్ని కాపాడుతూనే, పరిశోధనలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తాం.
    – సుసాన్‌ ఇలియాస్‌

    ఎందరో ప్రతిభావంతులు
    భారతదేశ తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని, ప్రముఖ చరిత్రకారిణి ఉపిందర్‌ సింగ్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, నటి రీచా చద్దా, ప్రముఖ న్యాయవాది, ఉమెన్స్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌ వృందా గ్రోవర్, నటి కొంకణ సేన్‌ శర్మ, ఇండియన్‌ ఉమెన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా, సుప్రీం కోర్ట్‌ మాజీ జడ్జీ హిమా కోహ్లీ... సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో చదువుకున్న ఎంతోమంది ప్రతిభావంతులలో కొందరు. 

  • బీపీ ఎక్కువగా ఉంది అని తెలియడం ఆలస్యం. ఉప్పు తగ్గించండి అనేస్తూంటారు డాక్టర్లు. ఏళ్లుగా వింటున్నామీ సలహాను. సరైందే కానీ... ఈ ఒక్క చర్యతోనే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుందా? ఊహూ సాధ్యం కాదంటున్నారు... డాక్టర్‌ ఎరం రావు, డాక్టర్‌ జమునా ప్రకాశ్‌లు! .మరి... ఏం చేయాలి? ఏది సరైన మార్గం?... 

    ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డే (మే-17) నేపథ్యంలో ఈ విషయాలు తెలుసుకోవడం మీకు ఎంతైనా అవసరం.. దేశంలో రక్తపోటు బాధితుల సంఖ్య ఏటికేడాదీ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు ఇందుకు ముఖ్య కారణం. చాలామందికి చిన్నప్పుడే ఏర్పడే రుచి, అభిరుచులు సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం పెద్దలైతే రోజుకు రెండు వేల మిల్లీగ్రాముల సోడియం మాత్రమే తీసుకోవాలి. అంటే సుమారు ఐదు గ్రాముల ఉప్పు. అంతే. కానీ మన దేశంలో సగటు వినియోగం ఎనిమిది గ్రాముల వరకూ ఉన్నట్లు ఇటీవలి లెక్కలు చెబుతున్నాయి. కొందరిలో ఇది మరింత ఎక్కువగానూ ఉండే అవకాశం ఉంది. అయితే “ఉప్పు తగ్గించండి” అనే సలహా ఎందుకు రక్తపోటును తగ్గించడంలో పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు?

    ఇంటి వంటతోనూ చిక్కే...
    భారతీయులు తీసుకునే సోడియంలో 80 శాతం కంటే ఎక్కువ వంట లేదా భోంచేసేటప్పుడు వేసే అదనపు ఉప్పుతోనే వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట తినే అలవాట్లు పెరుగుతున్నప్పటికీ, ఇంటి వంట ఇప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ద్వారా సోడియం ఎక్కువగా అందుతున్న దేశాల్లో ఉప్పు మోతాదును నియంత్రించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు కానీ... దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కుటుంబ సభ్యుల రుచులు, వయసు, అలవాట్లు అన్నీ కలిసి ఉంటాయి. అందుకే కేవలం “ఉప్పు తగ్గించండి” అనే సలహా సరిపోదు.

    అవగాహన పెరగాలి..
    ప్రజారోగ్య ప్రచారాలు సాధారణంగా ప్రజలకు ప్రమాదం తెలుసు, గుర్తు చేస్తే మార్పు వస్తుందని భావిస్తాయి. కానీ వాస్తవం అంత సులభం కాదు. ఒక జాతీయ సర్వే ప్రకారం, అధిక ఉప్పు ఆరోగ్యానికి హానికరం అని తెలిసిన పెద్దలు మూడో వంతు కన్నా తక్కువ. అవగాహన తక్కువగా ఉన్నప్పుడు “ఉప్పు తగ్గించండి” అనే సందేశం  పట్టించుకునేలా ఉండటం లేదు. కారణం పూర్తిగా అర్థం కాకపోతే అలవాట్లను మార్చడం కష్టం.

    రుచిని పట్టించుకోవడం లేదు...
    రక్తపోటును నియంత్రించేందుకు ఉప్పు తగ్గించాలని చాలామంది చెబుతారు. ఏమేం తినకూడదో కూడా చెబుతూంటారు. కానీ... రుచిని మాత్రం పట్టించుకోరు. ఉప్పు తక్కువగా ఉన్న చప్పిడి ఆహారం చాలామందికి రుచిగా అనిపించదు. అందుకే వారు తక్షణ సంతృప్తినిచ్చేందుకు మనకు బాగా పరిచయమైన ఉప్పును మళ్లీ మళ్లీ వాడుతూంటారు. అందుకే... ఉప్పు వాడుతూనే రుచిని కాపాడటం ఎలా? అన్నదానిపై దృష్టి పెట్టి... క్రమేపీ సోడియం మోతాదును తగ్గించాల్సి ఉంటుంది.  అంటే.. ఆహారం రుచిగా ఉండేలా చూసుకుంటూ, సోడియాన్ని నెమ్మదిగా తగ్గించడం.

    ఇక మనం ఏమి చేయాలి?
    1) దేశీ వ్యూహం... WHO లక్ష్యాలకు అనుగుణంగా, 2030 నాటికి భారతదేశం ప్రజల సోడియం వినియోగాన్ని 30% తగ్గించేందుకు వంటగదులు, పాఠశాలలు, మార్కెట్ వ్యవస్థలు — అన్నింటినీ కలిపే సమగ్ర ప్రణాళిక అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు తగ్గించడం మాత్రమే కాకుండా, కుటుంబాలకు ఉపయోగపడే ఆచరణాత్మక మార్గదర్శకాలు కూడా అవసరం.

    2) సంస్థలతో ప్రారంభించాలి...పాఠశాలలు, హాస్టళ్లు, కాంటీన్లు, ప్రభుత్వ ఆహార పథకాలు వంటి సంస్థల ద్వారా అందించే ఆహారాన్ని ఒకేరకమైన మార్గదర్శకాల ద్వారా తయారు చేసి పంపిణీ చేయాల్సిన అవసరముంది. తద్వారా  ఇక్కడ ఉప్పును క్రమంగా తగ్గిస్తే, ప్రజల “సాధారణ రుచి” భావన కూడా మారుతుంది. అప్పుడు ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం తగ్గుతుంది.

    3) తక్కువ ఉప్పుతో కూడా రుచిగా ఉండే పరిష్కారాలు ఇవ్వాలి
    ఈ సందర్భంలో MSG (మోనోసోడియం గ్లూటామేట్) గురించి శాస్త్రీయంగా చర్చించాలి. MSGలో సుమారు 12% సోడియం మాత్రమే ఉంటుంది, కానీ సాధారణ ఉప్పులో 39% సోడియం ఉంటుంది. MSG “ఉమామి” అనే రుచిని ఇస్తుంది. తక్కువ ఉప్పుతో పాటు MSG వాడితే రుచి తగ్గకుండా సోడియాన్ని 40% వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. 

    CSIR–CFTRI నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, ఉప్పు–MSG మిశ్రమాలను ఉపయోగించడం ద్వారా వెజ్ బిర్యానీ, దాల్ సాంబార్, పనీర్ కర్రీ, మురుకు, సేవ్, ఆలూ భుజియా, బ్రెడ్, బన్స్, బిస్కెట్లు వంటి భారతీయ ఆహారాల్లో సోడియం ను 22–32% వరకు తగ్గించవచ్చు.   బాధ్యతాయుతంగా ఉపయోగిస్తే, MSG వాడకం ఫుడ్‌ ఇండస్ట్రీకి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది.

    4) సోడియం గురించి చెప్పే విధానాన్ని మార్చాలి
    “ఉప్పు తగ్గించండి” అన్నదాని బదులుగా, “నెమ్మదిగా తగ్గించండి, రుచి అలాగే ఉంచండి” అనే సందేశం ఇవ్వాలి. చిన్నచిన్న మార్పులు ఎలా చేయాలి? ఉప్పు మళ్లీ వేసే ముందు రుచి చూసే అలవాటు ఎలా చేసుకోవాలి? సహజమైన రుచులను ఎలా పెంచుకోవాలి? ఇలాంటి ఆచరణాత్మక సూచనలు ఎక్కువకాలం కొనసాగుతాయి.

    5) అయోడైజ్డ్ ఉప్పు వాడకం.. 
    భారతదేశంలో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం చాలా విజయవంతమైంది. 2020–21 గణాంకాల ప్రకారం, 94.3% కుటుంబాలు సరైన అయోడిన్ కలిగిన ఉప్పును వాడుతున్నాయి. కాబట్టి లక్ష్యం- మొత్తం ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, కానీ అయోడిన్ లోపం రాకుండా చూసుకోవడం. 

    మొత్తమ్మీద... రక్తపోటును నివారించాలంటే, సోడియం తగ్గింపును చూసే విధానాన్ని మార్చాలి. “ఉప్పు తగ్గించండి” అనే సాధారణ సలహాను దాటి, ఆరోగ్యకరమైన ఎంపికలను ప్రజలకు సులభంగా అనుసరించగల విధంగా చేయాలి. దానికి నెమ్మదిగా ఉప్పు తగ్గించే విధానాలు, సంస్థల ద్వారా మార్పుకు నాయకత్వం, రుచిని కాపాడే పరిష్కారాలు. ఈ చర్యలతోనే సోడియం తగ్గింపు అనేది సంవత్సరానికొకసారి వినిపించే సలహాగా కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య మార్పుగా మారుతుంది.

Guest Columns

  • జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌తో సహా మరో పది కోర్సుల్లో చేరేందుకు ప్రవేశార్హతను నిర్ణయించే నీట్‌ యూజీ పరీక్ష, ఈ ఏడాది ప్రశ్నపత్రం లీక్‌ అయిన కారణంగా రద్దు కావడం గర్హనీయం. 23 లక్షల మంది విద్యార్థులు, రెండున్నర లక్షల సీట్ల కోసం పోటీ పడిన ఈ పరీక్ష ఉన్నఫళంగా రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం వారికీ, వారి కుటుంబాలకూ ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఎంతో భారం.

    దేశంలో వైద్య, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను సొమ్ము చేసుకునేలా ఇబ్బడిముబ్బడిగా కోచింగ్‌ సెంటర్లు వెలిశాయి. వీటివల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇన్ని కష్టాల మధ్య రాసిన పరీక్ష కూడా రద్దు కావడం వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతం.

    ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలకూ ఉమ్మడిగా నిర్వహించే విధానం 2013లో మొదలైంది. ఆ తర్వాత 2019లో దీని నిర్వహణ బాధ్యతల కోసం ప్రభుత్వం ‘నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ’ (ఎన్‌టీఏ)ని స్థాపించింది. కానీ, ఏ సంవత్సరం కూడా ఈ పరీక్షల నిర్వహణ వివాదరహితంగా జరగలేదు. 2024లో కూడా తొలుత పరిమిత సంఖ్యలో పరీక్షను పాక్షికంగా రద్దు చేసి, మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలా పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి.

    ప్రపంచంలోనే ఒక దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే అతి పెద్ద పరీక్ష ‘నీట్‌’. అందుకు తగ్గట్టుగా లోపరహితమైన వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కానీ లేదా హైబ్రిడ్ విధానంలో కానీ నిర్వహిస్తే కొన్ని లొసుగులను అధిగమించవచ్చని నిపుణులు సలహాలిచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు లేవు. లక్షలాది విద్యార్థుల భవి ష్యత్తును, వారి కుటుంబాల ఆర్థిక స్థితిని ఒక్క పెట్టున మార్చగలిగే కీలకమైన పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోవడం దేశానికి సిగ్గుచేటు, ఒక సామాజిక నేరం. ఇప్పుడు ఈ రద్దుపై దర్యాప్తు జరగనుంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

    చ‌ద‌వండి: నీట్‌ పేప‌ర్ లీక్‌.. సంచ‌ల‌న విష‌యాలు

    వ్యవస్థలో దిద్దుబాట్లు జరిగి, లోపరహితమైన, మేలైన పరీక్షా విధానం అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. నీట్‌ పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడం గొప్పతనం కాదు. ఒక్క లోపమూ లేకుండా, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పరీక్షను పక్కాగా నిర్వహించడమే అసలైన గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలి. నీట్‌ పరీక్షను ‘నీట్‌’గా నిర్వహించాలి, ‘డౌట్‌’గా కాదు.

    – డాక్ట‌ర్‌ డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ

Cartoon