Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘోర ప‌రాజయాన్ని చ‌విచూసింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 18.5 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ స్పందించాడు. ఈ ఓటమికి బౌలర్ల కంటే బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని సూర్య చెప్పుకొచ్చా డు.

    "మ్యాచ్ ఆరంభంలో మా బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 20 ప‌రుగులకే మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును బ్యాక్‌ఫుట్‌లో ఉంచాం. కానీ ఆ త‌ర్వాత వారు ఆడిన తీరు నిజంగా అద్బుతం. ప‌వ‌ర్‌ప్లే ముగిసిన త‌ర్వాత దాదాపు 15 ఓవ‌ర్ల‌కు మాపై పైచేయి సాధించారు.

    త‌ర్వాత‌ మ‌ళ్లీ వరుసగా వికెట్లు ప‌డ‌గొట్టి మేము తిరిగి గేమ్‌లోకి వ‌చ్చాము. చివ‌రి ఓవ‌ర్‌లో మళ్లీ ప‌రుగులు వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా బౌలింగ్ ప‌రంగా ఫ‌ర్వాదేన్పించాము. బుమ్రా, అర్ష్‌దీప్ జోడీ అద్బుతంగా బౌలింగ్ చేసింది. ఇద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు.

    అయితే బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే ఫ‌లితం మ‌రో విధంగా ఉండేది. 180 ప‌రుగులు పైగా ల‌క్ష్యాన్ని చేధిస్తున్న‌ప్పుడు ప‌వ‌ర్‌ప్లే అనేది చాలా ముఖ్యం. కానీ దుర‌దృష్టవశాత్తూ పవర్‌ప్లేలో మేము రాణించలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడంతో చిన్న చిన్న భాగస్వామ్యాలు కూడా నెలకొల్పలేకపోయాం. 

    కచ్చితంగా ఈ ఓటమిని నుంచి పాఠాలు నేర్చుకుంటాము. మళ్లీ బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం నాకుంది. చెన్నైలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మా బ్రాండ్ ఆఫ్‌ క్రికెట్‌ను కొనసాగిస్తాము . సరైన ప్రణాళికతో బరిలోకి దిగి మళ్ళీ గెలుపు బాట పడతాము" అని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు.  ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. శివమ్ దూబే మినహా మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. 188 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా, స‌ఫారీ బౌల‌ర్ల ధాటికి విల్లవిల్లాడింది.

    ల‌క్ష్య చేధ‌న‌లో సూర్య కుమార్ సేన 18.5 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔటయ్యాడు.

    సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కేశవ్ మ‌హారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో స‌ఫారీలు బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అద‌ర‌గొట్టారు.

    మిల్ల‌ర్ అదుర్స్‌..
    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. 30 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(63) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. బ్రెవిస్‌(45), స్ట‌బ్స్‌(44) రాణించారు.

    భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు. ఇక భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లోనూ త‌ప్ప‌నిసరిగా విజ‌యం సాధించాలి. టీమిండియా త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 26న జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత వెస్టిండీస్‌తో భార‌త్ ఆడ‌నుంది.
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా విధ్వంసక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. లీగ్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో డ‌కౌటైన అభిషేక్‌ ఇప్పుడు సూప‌ర్‌-8 ద‌శ‌లోనూ అదే తీరును క‌న‌బ‌రుస్తున్నాడు.

    అహ్మదాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో శ‌ర్మ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 2 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 15 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి క్యాచ్ అవుట్‌గా అభిషేక్ వెనుదిరిగాడు. 

    టీ20ల్లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్‌గా ఉన్న అభిషేక్‌పై భార‌త అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ అభిషేక్ మాత్రం దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ అంద‌రిని నిరాశ‌ప‌రిచాడు. దీంతో అభిషేక్‌ను ప‌క్క‌న పెట్టి సంజూ శాంస‌న్‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని క్రికెట్ నిపుణులు టీమ్‌మెనెజ్‌మెంట్‌ను సూచిస్తున్నారు.

    అద‌ర‌గొట్టిన మిల్ల‌ర్‌, బ్రెవిస్‌
    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. 30 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు. డేవిడ్ మిల్ల‌ర్‌(63) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. బ్రెవిస్‌(45), స్ట‌బ్స్‌(44) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు

  • టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆ​రంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్లు ​​​‍‍క్వింటన్ డికాక్‌, రికెల్టన్‌ను బుమ్రా ఔట్ చేశాడు.

    మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. 

    బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(32), అర్ష్‌దీప్ సింగ్‌(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.

    టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
    జస్ప్రీత్ బుమ్రా-33    
    రవిచంద్రన్ అశ్విన్‌- 32
    అర్ష్‌దీప్ సింగ్- 32
    హార్దిక్ పాండ్యా-29
    రవీంద్ర జడేజా-22

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్  బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను బుమ్రా ఔట్ చేసిన‌ తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న త‌క్కువే.

    జ‌స్ప్రీత్ అద్భుత‌మైన బంతితో డికాన్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవ‌ర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివ‌రీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా  స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. 

    కానీ బంతి కాస్త లో-బౌన్స్‌గా వచ్చి బ్యాట్‌ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్క‌సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. జ‌స్ప్రీత్ దెబ్బ‌కు డికాక్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌ను కూడా బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు.

    తుది జ‌ట్లు
    భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

    దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి



     

     

  • India vs South Africa Super 8  live updates: అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. 188 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. స‌ఫారీ బౌల‌ర్ల దాటికి 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

    భార‌త బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కేశవ్ మ‌హారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు.

    ఓట‌మికి చేరువ‌లో భార‌త్‌
    15 ఓవ‌ర్ వేసిన కేశవ్ మ‌హారాజ్ బౌలింగ్‌లో భార‌త్ మూడు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్,  అర్ష్‌దీప్ సింగ్ ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ 8వికెట్ల న‌ష్టానికి 88 ప‌రుగులు చేసింది.

    భార‌త్ ఆరో వికెట్ డౌన్‌
    86 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఆరో వికెట్ కోల్పోయింది. 18 ప‌రుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. కేశ‌వ్ మ‌హారాజ్ బౌలింగ్‌లో  ఔట‌య్యాడు. భార‌త విజ‌యానికి 34 బంతుల్లో 102 ప‌రుగులు కావాలి.

    పీక‌ల్లోతు క‌ష్టాల్లో భార‌త్‌.. కెప్టెన్ సూర్య ఔట్‌
    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌(18) ఔట‌య్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వ‌చ్చాడు. భార‌త్ విజయానికి 64 బంతుల్లో 134 ప‌రుగులు కావాలి.

    భార‌త్ నాలుగో  వికెట్ డౌన్‌
    43 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. బాష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

    అభిషేక్ శ‌ర్మ ఔట్‌
    అభిషేక్ శ‌ర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.  15 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్ వ‌చ్చాడు. 7 ఓవ‌ర్లకు భార‌త్ స్కోర్‌: 42/3

    తిలక్ వర్మ ఔట్‌
    5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.

    భారత్ తొలి వికెట్ డౌన్‌
    188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్‌క్రమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.

    భార‌త్ టార్గెంట్ ఎంతంటే?
    అహ్మదాబాద్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. 30 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు.

    డేవిడ్ మిల్ల‌ర్‌(63) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. బ్రెవిస్‌(45), స్ట‌బ్స్‌(44) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు.

    సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్‌
    157 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

    సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్‌.. మిల్ల‌ర్ ఔట్
    డేవిడ్ మిల్ల‌ర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 ప‌రుగులు చేసిన మిల్ల‌ర్‌.. వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో ఔట‌య్యాడు.
    సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్
    డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సౌతాఫ్రికా 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది.

    నిల‌కడ‌గా ఆడుతున్న మిల్ల‌ర్, బ్రెవిస్‌
    30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మిల్ల‌ర్‌, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 64 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సౌతాఫ్రికా 3 వికెట్ల న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది.

    సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్‌
    రికెల్ట‌న్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 6 ఓవ‌ర్ల‌కు ప్రోటీస్ స్కోర్: 41/3
    సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్‌
    12 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌(4).. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

    సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్‌
    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవ‌ర్ల‌కు ప్రోటీస్ స్కోర్: 10/1

    టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూప‌ర్‌-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.

    గ‌త మ్యాచ్‌కు దూర‌మైన లుంగీ ఎంగిడి, జాన్సెన్‌, కేశ‌వ్ మ‌హారాజ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. భార‌త్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను జ‌ట్టులో కొన‌సాగించారు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ మ‌రోసారి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

    తుది జ‌ట్లు
    భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

    దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి
     

     

  • పల్లెకెలె: టీ 20 వరల్డ్‌కప్‌లో  ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 51 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది.  తొలుత బ్యాటింగ్‌ చేసి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్‌.. ఆపై శ్రీలంకను 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి విజయాన్ని అందుకుంది. 

    శ్రీలంక ఆటగాళ్లలో దసునా షనాకా(30) మినహా ఎవరూ రాణించలేదు. దాంతో సొంత గడ్డపై శ్రీలంకకు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌ మూడు వికెట్లు సాధించగా, జోఫ్రా ఆర్చర్‌, డావ్‌సన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో రెండు వికెట్లు తీసి.. శ్రీలంక పతనాన్ని శాసించారు.  ఫలితంగా శ్రీలంకకు ఘోర పరాజయం తప్పలేదు. 

    అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. నిర్ణీతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.  ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌(62)  ఒంటరి పోరాటం చేసి ఇంగ్లండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇంగ్లండ్‌ వికెట్లు ఓ వైపు పడుతున్నా సాల్ట్‌ మాత్రం నిలకడగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. దాంతో ఇంగ్లండ్‌ మూడంకెల స్కోరును దాట కల్గింది. 

  • ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టైటిల్‌ను భారత్‌ వరుసగా రెండో ఎడిషన్‌లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్‌ వేదికగా జరిగిన 2026 ఎడిషన్‌లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్‌ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్‌-ఏపైనే విజయం సాధించే టైటిల్‌ను చేజిక్కించుకుంది.

    నేటి ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్‌లో వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.

    బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు..  లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.

    అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్‌ (4-0-12-3), తనూజా కన్వర్‌ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (4-0-16-1), సైమా ఠాకోర్‌ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటి​కి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. 

    బంగ్లా ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. సర్మిన్‌ సుల్తానా (18), కెప్టెన్‌ ఫాతిమా ఖాతూన్‌ (14), సదియా అక్తర్‌ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్‌ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్‌లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది. 

  • ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్‌కు మాత్రమే పరిమితమైంది. 

    బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు..  లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.

    భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.

    అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్‌లో భారత్‌ శ్రీలంకపై, బంగ్లాదేవ్‌ పాకిస్తాన్‌పై విజయాలు సాధించి తుది పోరు​కు అర్హత సాధించాయి.  
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైనప్పటి నుంచి క్రికెట్‌ అభిమానులు ఓ పదాన్ని తరుచూ వింటూ ఉన్నారు. ఏంటా పదం అంటే.. ప్రీ-సీడింగ్‌. ఈ ప్రీ-సీడింగ్‌ పద్దతిని ఐసీసీ ప్రస్తుత ప్రపంచకప్‌ ఎడిషన్‌ నుంచే ప్రవేశ పెట్టింది.

    రెండు దేశాల్లో (భారత్‌, శ్రీలంక) మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నందున టికెట్లు, ప్రసారాలు, లాజిస్టిక్స్, అభిమానుల ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేయడానికి ప్రీ-సీడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం, జట్లకు ముందే స్లాట్లు కేటాయించబడ్డాయి. పలానా జట్టు సూపర్‌-8కి చేరితే పలానా గ్రూప్‌లో ఉంటుందని ముందే నిర్ణయించబడింది.

    ఐసీసీ ఈ ప్రీ-సీడింగ్‌ విధానాన్ని అభిమానులు, ఆటగాళ్ల సౌకర్యార్థం ప్రవేశపెడితే, దీని పర్యవసనాలు విమర్శలకు దారి తీశాయి. ముందుగా కేటాయించబడిన స్లాట్ల ప్రకారం​ ఆయా గ్రూప్‌ల్లో టాపర్లుగా ఉన్న జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌ సూపర్‌-8 గ్రూప్‌-1లోకి వచ్చాయి. అదే గ్రూప్‌ల్లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సూపర్‌-8 గ్రూప్‌-2లోకి చేరాయి.

    గ్రూప్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టాపర్లుగా సూపర్‌-8కి చేరిన జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌కు అదనపు ప్రయోజనాలు ఏమీ దక్కకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. గ్రూప్‌ దశలో టాపర్లుగా నిలిచిన ఆ జట్లకు అదనపు ప్రయోజనాలు (రెండో స్థానంలో నిలిచిన జట్లతో మ్యాచ్‌లు) కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు. 

    ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రవేశపెట్టిన  ప్రీ-సీడింగ్‌ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ విధానంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు సూపర్‌-8 బెర్త్‌లను డీల్‌ చేసే అధికారాలే వస్తే, తప్పక సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు.

    ఈ అశాస్త్రీయ ప్రీ-సీడింగ్‌ విధానం వల్ల ఇప్పుడు గ్రూప్‌ దశలో టాపర్ జట్లు సూపర్‌-8 దశలో ఒకదానితో ఒకటి పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్లంతా ఒక దానితో ఒకటి తలపడనున్నాయి. 

    నిన్న న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ మధ్య జరగాల్సి తొలి సూపర్‌-8 గ్రూప్‌-2 మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తి తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) మరో రెండు సూపర్‌-8 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం గ్రూప్‌-2లో శ్రీలంక-ఇంగ్లండ్‌, రాత్రి గ్రూప్‌-1లో భారత్‌-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

     

  • పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రూబిన్‌ హెర్మన్‌ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.

    ఫాఫ్‌ డుప్లెసిస్‌ తర్వాత ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్‌గా హెర్మన్‌ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకొని పీఎస్‌ఎల్‌లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్‌, పీఎస్‌ఎల్‌ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్‌ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎ‌ల్‌లో పాల్గొంటుండటం ఆసక్తికరం.

    హెర్మన్ ప్రదర్శనలు  
    29 ఏళ్ల హెర్మన్‌ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్‌లో హెర్మన్‌ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.

    లాహోర్ జట్టు వ్యూహం  
    లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్‌ బలం మరింత పెరుగనుంది. హెర్మన్‌ మిడిలార్డర్‌లో కీలకమైన బ్యాటర్‌. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్‌ ప్రత్యేకత.  

Movies

  • టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు.  

    “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అని విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

    వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

     

  • రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రంగస్థలం'. 2018లో రిలీజైంది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్‌పై ట్రోల్స్ లాంటివి వచ్చేవి. ఈ మూవీ దెబ్బకు వాటన్నింటికి చెక్ పడిందనే చెప్పొచ్చు. అంతలా మెప్పించింది. ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా రామకృష్ణ.. తనకు ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా అన్నారు.

    (ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్)

    'రంగస్థలం' చిత్రంలో నటనకుగానూ రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని అందరం అనుకున్నాం. ఆయనకనే కాదు ఈ సినిమాలో చాలామందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికీ రాలేదు. సౌండ్ డిజైనర్‌కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. కనీసం రాష్ట్రస్థాయి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయితే నేను పనిచేస్తూ ఎంజాయ్ చేసింది 'రంగస్థలం', 'అంతరిక్షం' సినిమాలకే. 'రంగస్థలం' వెరీ రూరల్, రియలస్టిక్ స్టోరీ. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చేవాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. రాష్ట్ర అవార్డ్ ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకుంటారని నాతో అన్నారు. కానీ జరగలేదు' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈయన చెప్పింది కూడా నిజమేనేమో. ఎందుకంటే 2018కిగానూ తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్‌కి అవార్డ్ వస్తుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెద్దగా లేదు. ఒకవేళ ప్రస్తుత టైంలో 'రంగస్థలం' రిలీజయ్యుంటే కచ్చితంగా చరణ్‌కి అవార్డ్ వచ్చి ఉండేదేమో? అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. అవార్డులు రాకపోతేనేం సుకుమార్, చరణ్.. ఎవరికి వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. 

    (ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

  • పవన్ కల్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకుడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మార్చి 26న థియేటర్లలోకి రానుంది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు మొదలుపెట్టారు. గతంలో 'దేఖ్ లేంగే సాలా' పేరుతో ఓ పాట రిలీజ్ చేయగా.. ఇప్పుడు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో మరో సాంగ్ విడుదల చేశారు.

    'మెడపై ముట్టుకుంటే తొడ గొట్టినట్లే..' అంటూ సాగే ఈ పాటలో ఈ ఒక్క లైన్ తప్పితే మిగతా లిరిక్స్ ఏమంత ఆకట్టుకునేలా అయితే లేవు. దానికి తోడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చేలా ఈ సాంగ్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ట్యూన్ కూడా రెగ్యులర్‌గానే అనిపించింది. పాటలో చాలావరకు పవన్ మేనరిజమ్‌నే చూపించారు. సినిమాలో ఓ డైలాగ్‌తో ఈ పాట పుట్టిందని దర్శకుడు హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యాట్యూబ్‌లో ఓకే ఓకే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?

    ఇకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా.. దళపతి విజయ్ చేసిన 'తెరి' రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. టీమ్ ఈ విషయాన్ని ఖండించింది గానీ చాలామంది నెటిజన్లకు ఇంకా ఈ సందేహం అలానే ఉండిపోయింది. దానికి తోడు ఈ మూవీపై ఇప్పటివరకు అయితే పెద్దగా బజ్ కూడా లేదు. అలానే ధురంధర్ 2, టాక్సిక్ చిత్రాలు రిలీజైన తర్వాత వారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరి వాటి నుంచి పోటీ తట్టుకుని ఎలా నిలబడుతుందనేది కూడా చూడాలి.

  • స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన జ్యోతిరాయ్.. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి మేడమ్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కొన్నేళ్ల క్రితం ఉన్నట్లుండి పూర్తిగా సీరియల్స్ చేయడం తగ్గించేసిన ఈమె, సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 'కిల్లర్' పేరుతో తెరకెక్కుతున్న చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: సమంత నుంచి సర్‌ప్రైజ్.. పోస్ట్ వైరల్)

    సీరియల్‌లో పద్ధతి అయిన పాత్రల్లో కనిపించిన జ్యోతిరాయ్.. ఈ సినిమాలో సూపర్ ఉమన్ తరహా పాత్ర చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. టెరర్రిస్ట్(ఉగ్రవాది), వ్యాంపైర్(రక్త పిశాచి), స్పై(గూఢచారి) అనే కన్ఫ్యూజన్.. జ్యోతి పోషించిన పాత్రలో చూపించారు. ఓవైపు ఫుల్ రొమాన్స్ చూపిస్తూనే మరోవైపు ఈమె పాత్రతో యాక్షన్ కూడా చేయించారు. ఈమె భర్త పూర్వజ్.. ఇదే మూవీలో పోలీస్‌గా నటించాడు. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి మూవీ ఎలా ఉంటుందనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

  • ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్

    వయసు పెరుగుతున్నా అదే గ్లామర్‌తో కాజల్

    పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషా

    చీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీల

    జపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్

    అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్

  • బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ది కేరళ స్టోరీ-2 చిత్రంపై మండిపడ్డారు. రెండేళ్ల క్రితం విడుదలైన ది కేరళ స్టోరీ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు కామాఖ్య నారాయణ్‌ తెరకెక్కించారు.  సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా ‘ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్’ను నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ వివాదస్పదంగా మారింది.  ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై దర్వకుడు అనురాగ్‌ కశ్యప్‌ రియాక్ట్‌ అయ్యారు.

    ఫిల్మ్‌ఫేర్ అవార్డుల సందర్భంగా  కొచ్చిలో కనిపించిన అనురాగ్ కశ్యప్‌ను కేరళ స్టోరీ-2పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు కోరడంతో ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ మూవీ కేవలం  డబ్బు సంపాదించుకోవడానికి చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని శక్తులు ప్రజల మధ్య చిచ్చు పెట్టి విభజించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను కూడా కల్పితంగా తెరకెక్కించి కొందరు లాభపడాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

    ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్పారు. అందులో చూపినట్లు ఎవరైనా బీఫ్‌ తినిపిస్తారా.. కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు కదా అంటూ భగ్గున్నారు. ఈ సినిమా మేకర్స్ అత్యాశపరులుగా కనిపిస్తున్నారు. వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలాంటి కథలు తీస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
     

  • ఓటీటీ సినిమాలు అనగానే అయితే రొమాంటిక్ లేదా థ్రిల్లర్స్ ఉంటాయిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిఫరెంట్ స్టోరీలతో తీసిన మూవీస్ కూడా వస్తుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్'. 2024లో వచ్చిన తొలి పార్ట్ అందరికీ షాక్ ఇవ్వగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్ కూడా అదే రేంజులో ఆశ్చర్యపరిచింది. విఘ్నేశ్ కార్తిక్ దర్శకుడు కాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.. లెస్బియన్ పాత్ర చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ యాక్షన్ సినిమా.. 'చథా పచ్చ' తెలుగు రివ్యూ)

    కథేంటి?
    తొలి భాగంలో ఓ నిర్మాతకు స్టోరీ చెప్పడానికి వచ్చిన మహమ్మద్ షరీఫ్(విఘ్నేశ్ రాజా).. స్టోరీలన్నీ చెప్పి చివరకు నిర్మాత కుమార్తెనే(బ్రిగిడ సాగా) పెళ్లి చేసుకుంటాడు. కట్ చేస్తే శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఇదే నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ కోసం వస్తుంది. ఓ మూడు కథలు చెబుతుంది. వీటిలో ఒకటి హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప, ఈ నిర్మాతకే స్టోరీ చెప్పడం వెనక ఓ ఉద్దేశం ఉంటుంది. ఇంతకీ అదేంటి? శిల్ప ఎవరు? షరీఫ్‌తో ఈమెకు సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    సినిమా అంటే ఇలానే ఉండాలి. ఇలానే తీయాలి అని కొన్ని లెక్కలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేస్తూ అప్పుడప్పుడు కొందరు దర్శకులు ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే 'హాట్‌స్పాట్'. 2024లో వచ్చిన ఈ సినిమాలో చిత్రవిచిత్రమైన అంశాల్ని చూపించగా.. ఈసారి సీక్వెల్‌లో మాత్రం సమాజంలోని హాట్ టాపిక్ లాంటి మూడు అంశాలని తీసుకుని వాటిని కన్విన్సింగ్‌గా చెప్పగలిగాడు. మెప్పించాడు కూడా.

    తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలని అభిమానించడం అనేది చాలా సాధారణమైన విషయం. అలా విపరీతమైన ఫ్యానిజం చూపించే ఇద్దరు కుర్రాళ్లకు.. ఓ అజ్ఞాత వ్యక్తి ఎలాంటి గుణపాఠం చెప్పాడు. వాళ్లకు ఎలా కళ్లు తెరిపించాడు అనేది తొలి స్టోరీగా చూపించారు. ఇందులో చెప్పిన పాయింట్స్ గానీ, చూపించిన అంశాలు గానీ పచ్చి నిజాలే. యువత తమ సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా హీరోలకు ఎలా బానిసత్వం చేస్తున్నారు? వాళ్ల సినిమాల రిలీజ్ టైంలో ఎలా కొట్టుకుచస్తున్నారనేది చూపించారు. చివరలో ఇచ్చిన ట్విస్ట్ అయితే ఆలోచన రేకెత్తించడంతో పాటు ఇలా ఉన్నారేంట్రా బాబు అనిపించేలా చేస్తుంది.

    రీసెంట్ టైంలో డ్రస్సింగ్ సెన్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నిరోజుల క్రితం నటుడు శివాజీ.. స్టేజీపై హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ విషయంలో చాలామంది శివాజీని తప్పుపట్టారు. మరికొందరు ఇతడిని సమర్థించారు. అసలు డ్రస్సింగ్ అంటే ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనేది చూపించారు. ఇంటికొచ్చిన అతిథుల ముందు కూడా పొట్టిబట్టలేసుకుని కౌంటర్స్ వేసే ఓ కూతురికి.. వయసైన తండ్రి లాగిపెట్టి కొట్టేలా ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అనేది పాయింట్ స్ట్రెయిట్‌గా చెప్పారు. ఇది చూస్తే కచ్చితంగా చాలామంది అమ్మాయిల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశముంటుంది.

    ఇక మూడోది టైమ్ ట్రావెల్ లవ్ స్టోరీ. 2026లోనూ స్వచ్ఛమైన ప్రేమ కావాలనుకునే ఓ కుర్రాడికి అనుకోకుండా ఫోన్ కాల్ ద్వారా 2050లో ఉండే ఓ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ తెలియకుండానే ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ ఆమెకు ఇతడికి ఓ షాకింగ్ కనెక్షన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ ట్విస్టుకి తొలుత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చి స్టోరీని సుఖాంతం చేశారు. ఏదేమైనా ఈ మూడు స్టోరీలు ప్రస్తుతం సమాజంలో చాలామంది చూస్తున్న చేదు నిజాలే. కానీ కామెడీగా బోల్డ్ టచ్ ఇస్తూ చెప్పడం బాగుంది.

    పైన చెప్పిన మూడు కథలతో పాటు ప్రియా భవానీ శంకర్ చేసిన శిల్ప పాత్రకు ఓ స్టోరీ ఉంటుంది. అదేంటనేది ఇందులో పెద్దగా రివీల్ చేయలేదు. త్వరలో వచ్చే మూడో భాగంలో పూర్తిస్థాయిలో చూపిస్తారేమో?

    నటీనటుల విషయానికొస్తే.. ప్రియాభవానీ శంకర్, భవానీ శ్రీ, తంబి రామయ్య, ఎమ్ఎస్ భాస్కర్, బ్రిగిడ సాగా.. ఇలా ఎవరికి వాళ్లు తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గానూ బాగుంది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే బోల్డ్ సినిమా గానీ అసభ్యకర సన్నివేశాల్లాంటివి లేవు. వీలైతే ఒంటరిగానే చూడండి. కచ్చితంగా నచ్చుతుంది.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: సమంత నుంచి సర్‌ప్రైజ్.. పోస్ట్ వైరల్)

  • దర్శకుడు రాజ్‌ నిడిమోరును పెళ్లి చేసుకున్నాక సమంత ముఖం వెలిగిపోతోంది. ఒకప్పుడు విచారంగా కనిపించే తన ముఖం ఇప్పుడు వెయ్యి ఓట్ల బల్బులా ప్రకాశిస్తోంది. ప్రస్తుతం సంతోషకర జీవితం గడుపుతున్న సామ్‌ మా ఇంటి బంగారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం! ఈ చిత్రం మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    ఏదీ నన్ను కదిలించలేదు
    ఇదిలా ఉంటే తాజాగా తను సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చింది. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? అని ఓ వ్యక్తి అడిగారు. అందుకు సమంత స్పందిస్తూ.. ప్రశంసలు నన్ను కదిలించలేవు. అలాగే విమర్శలు కూడా నన్ను ఎఫెక్ట్‌ చేయవు. కానీ, నెగెటివిటీని నా ఇంటివరకు తీసుకొస్తే మాత్రం మిమ్మల్ని బ్లాక్‌ చేస్తాను.

    దానర్థం అదే..
    అలా నా స్పేస్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. మిమ్మల్ని బ్లాక్‌ చేశానంటే నేను బాధపడ్డానని కాదు. మీలాంటివారికి నాదగ్గర చోటు లేదని అర్థం అని రిప్లై ఇచ్చింది. మీలోని ఓ ఫన్నీ థింగ్‌ ఏంటని అడగ్గా.. కిందపడి మరీ నవ్వుతానంది. ఎక్కువ బాధ లేదా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేస్తారని అడగ్గా.. ధ్యానం చేస్తానని బదులిచ్చింది.

    సినిమా
    మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. ఇందులో సమంత పెళ్లయిన అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఆపద వచ్చినప్పుడు కత్తి పట్టేందుకు కూడా వెనుకాడని శివంగిగానూ అలరించనుంది. గుల్షన్‌ దేవయ్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించింది.

    చదవండి: ఇంకా అదే బాధలో ఉన్న కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌

  • చాలా మంది హాస్య నటులు తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత హీరోలుగా చేశారు. నా కెరీర్‌ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో అలాంటి రిస్క్‌ తీసుకోలేను.  ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి.  థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే మెయిన్‌ లీడ్‌ సినిమాలు చేయాలని లేదు’ అని అన్నారు కమెడియన్‌ సుదర్శన్‌. సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుదర్శన్‌ ఓ కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కమెడిన్‌ సుదర్శన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు.

    'హే బల్‌వంత్‌' లో మంచి క్యారెక్టర్‌ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి.  డ్రింకింగ్‌ సీన్‌, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్‌, సుహాస్‌, నరేష్‌, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.

    ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి


    నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు  వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నటుడిగా సెటిల్‌ అయిపోయిన తరువాత హీరోగా  ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.

    ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్‌ క్లాష్‌ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.

    కొత్త సినిమా విషయాలకొస్తే.. మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను.

  • బిగ్‌బాస్‌ ఫేం, ఆర్జే శేఖర్‌ భాషా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి ప్రత్యూషతో పాటు జయం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీ కోసం జరిగిన ఆడిషన్స్‌లో తాను సెలెక్ట్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. అయితే, హీరోయిన్‌గా ప్రత్యూషను ఎంపిక చేసినట్లు ఆయన అన్నారు. ఈ క్రమంలో దర్శకులు తేజ తమ ఇద్దరితో కలిపి కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని ఆయన గుర్తుచేశారు.

    తాను ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజుల్లో జయం సినిమా కోసం దర్శకుడు తేజ ఆడిషన్స్‌ ప్రకటన ఇచ్చినట్లు శేఖర్‌ భాషా తెలిపారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున​ ఆడిషన్స్‌లో పాల్గొన్నారన్నారు. అయితే, గట్టి పోటీ తట్టుకుని మొదట తాను ఎంపికయినట్లు చెప్పారు.  ' సినిమా షూటింగ్స్‌లో భాగంగా నాతో కొన్ని సీన్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేపించారు. ఆ తర్వాతనే హీరోయిన్‌గా ప్రత్యూష ఎంపిక చేశారు. స్క్రీన్‌పై మా ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూసేందుకు కొన్ని రిహార్సల్స్‌ కూడా చేపించారు. జయం సినిమాకు మేము ఇద్దరం ఫైనల్ అవుతామనే నమ్మకం ఏర్పడింది. 

    కానీ,  హీరోయిన్‌గా ఎంపికైన ప్రత్యూష మరణించడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.  ఆ తర్వాత నిర్మాత కూడా ఈ మూవీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే, అదే కథతో కొద్దిరోజుల తర్వాత నితిన్, సదా కాంబినేషన్‌తో ‘జయం’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా భారీ విజయం అందకున్నప్పుడు జరిగిన విషయం చెబుదామనుకున్నాను. కానీ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందని అప్పట్లో చెప్పలేదు. ప్రస్తుతం ప్రత్యూష మరణంపై కోర్టు తీర్పు రావడంతో  సందర్భం అనిపించి ఈ విషయాన్ని చెబుతున్నాను అని శేఖర్‌ భాషా అన్నారు.

    ‘జయం సినిమాలో ప్రత్యూషను హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్లు కొద్దిరోజుల క్రితం ఆమె తల్లి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.  తేజ గారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ రావడంతో వారి ఆఫీస్‌కెళ్లి వస్తానని చెప్పి ఆమె తిరిగి రాలేదని కూడా తెలిపింది. ఆ తర్వాత సిద్ధార్థ రెడ్డితో ఆమె వెళ్లడం, అనుమాస్పదంగా మరణించడం తెలిసిందే.

  • బిగ్‌బాస్‌ ట్రోఫీ సాధించాలంటే గేమ్స్‌ గెలవడం కాదు, ప్రేక్షకుల మనసు గెలవాలి. అప్పుడే టైటిల్‌ కొట్టడం సాధ్యమవుతుంది. అది ఇమ్మాన్యుయేల్‌కు బాగా తెలుసు. అందుకే షోలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి అందర్నీ నవ్విస్తూ, అన్ని ఆటల్లోనూ టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

    గెలుపు తథ్యం అనుకుంటే..
    అతడి ఆట, మాట, తీరు అన్నీ చూసిన నాగార్జున ప్రతివారం ఇమ్మూపై ప్రశంసల వర్షం కురిపించేవాడు. గోల్డెన్‌ స్టార్‌ బ్యాడ్జ్‌ ఇచ్చేవాడు. ఇంట్లోకి వచ్చినవాళ్లందరూ కూడా ఇమ్మూని ఆకాశానికి ఎత్తేయడంతో తనకు తిరుగులేదనుకున్నాడు. ట్రోఫీ గెలుస్తానని నమ్మకంగా ఉన్నాడు.

    ఫైనల్స్‌లో నాలుగో స్థానం
    కానీ అనూహ్యంగా ఇమ్మూ, తనూజ మధ్య ఉన్న పోటీ.. షో చివరాఖరకు వచ్చేసరికి తనూజ వర్సెస్‌ కల్యాణ్‌గా మారిపోయింది. పవన్‌ కూడా ఇమ్మూని వెనక్కు నెట్టి రేసులో ముందుకు వచ్చాడు. దాంతో ఫైనల్స్‌లో ఇమ్మూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కల్యాణ్‌ ట్రోఫీ గెలవగా తనూజ రన్నరప్‌, పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. అసలు గెలవకపోడమే అనంతమైన బాధ అంటే ఏకంగా నాలుగో స్థానంలో ఉండటంతో ఇమ్మాన్యుయేల్‌ తట్టుకోలేకపోయాడు. 

    విన్నర్‌గా ఎందుకు చూడరు?
    తాజాగా బీబీ ఉత్సవం ప్రోమోలో తనకు అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటో బయటపెట్టాడు. తల్లితో పాటు స్టేజీపైకి వచ్చిన ఇమ్మూ.. కమెడియన్లను విన్నర్‌గా చూడరనే విషయం నాకు తెలుసు. కానీ ఎందుకు చూడరు? మనం గేమ్స్‌ ఆడితే చూస్తారుగా అనుకున్నాను. నా నమ్మకం నిలబడలేదు. అలా అని ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదు. కానీ, అమ్మానాన్న ఇద్దరూ క్యారేజీ కట్టుకుని బైక్‌పై 90 ఊర్లు తిరిగారు. నాకు ఓటేయమని పాంప్లెట్లు పంచారు. 

    హీరో చేతుల మీదుగా సన్మానం
    ఇప్పటికీ నా మైండ్‌లో అదే తిరుగుతోంది అంటూ ఏడ్చేశాడు. అటు ఇమ్మూ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం హీరో నిఖిల్‌.. స్టేజీపైకి వచ్చి ఇమ్మూ తల్లికి శాలువా కప్పి సన్మానం చేశాడు. అలాగే ఇమ్మాన్యుయేల్‌కు బిగ్‌బాస్‌ 9 ఆల్‌రౌండర్‌ అనే ట్రోఫీని అందించాడు. ఏదేమైనా ఎంత కష్టపడ్డా తనకు విజయం దక్కలేదన్న బాధ ఇమ్మూ మనసులో ఇప్పటికీ అలాగే ఉంది!

    చదవండి: హీరోయిన్‌ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే సిగ్గేసింది: బాలీవుడ్‌ హీరో

  • మీరా నందన్‌.. ఈ పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ, 'జై బోలో తెలంగాణ' హీరోయిన్‌ అంటే మాత్రం అందరూ గుర్తు పట్టేస్తారు. 2011లో విడుదలైన ఆ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అందులో తెలంగాణ యువకుడిని ప్రేమించే ఆంధ్రా అమ్మాయిగా మీనా నందన్‌ నటించి, మెప్పించింది. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

    ఆ సినిమా రిలీజ్‌ తర్వాత మీరా నందన్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. మీరా నందన్ మాత్రం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసింది.కొన్నాళ్ల తర్వాత మలాయళంలో కొన్ని టీవీ షోస్‌ కూడా చేసింది. సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్‌గానూ చేసింది.

    2008లో ‘ముల్లా’ అనే మూవీతో హీరోయన్‌గా మారింది. ‘వాల్మీకి’ అనే సినిమాతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత తమిళ్‌‌లో వరుస అవకాశాలు వచ్చాయి. 'జై బోలో తెలంగాణ' తర్వాత తెలుగులోనూ వరుస చాన్స్‌లు వచ్చాయి. కానీ మీరానందన్‌ ఆసక్తి చూపించలేదు. అంతేకాదు కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 2014లో  2024లో తన బాయ్‌ఫ్రెండ్, అకౌంటెంట్ శ్రీజుని వివాహం చేసుకుంది.

    పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చి, తన మకాంను దుబాయ్‌కి మార్చింది.  ప్రస్తుతం ఆమె అక్కడ ఒక ప్రముఖ మలయాళ రేడియో స్టేషన్‌లో రేడియో జాకీ  పనిచేస్తున్నారు. రేడియో రంగంపై ఉన్న ఆసక్తితోనే ఆమె సినిమాలను పక్కన పెట్టి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు సమాచారం.

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ట్రావెల్ ఫోటోలను, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సినిమాల్లో నటించకపోయినా, తనదైన శైలిలో అభిమానులకు చేరువగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

  • సమంత.. టాలీవుడ్‌లో ఈ పేరు వినిపించి చాలాకాలమైపోయింది. ఆరేడేళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసి హీరోయిన్‌గా స్టార్‌డమ్ అనుభవించిన ఈమె.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం, మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడటంతో పూర్తిగా మూవీస్ చేయడం తగ్గించేసింది. మూడేళ్ల క్రితం అంటే 2023లో విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' చేసింది. ఇదేం పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు పోస్ట్ పెట్టింది.

    నటిగా అలరించిన సమంత.. ట్రలాలా పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించింది. 'శుభం' అనే సినిమాతో గతేడాది ప్రేక్షకుల్ని పలకరించింది. ఇది ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈమెనే నిర్మాత కమ్ లీడ్ రోల్ చేసిన 'మా ఇంటి బంగారం'.. థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. అసలు ఈ చిత్రం ఒకటుందని ఆడియెన్స్‌కి గుర్తులేదు. అలాంటిది ఇప్పుడు విడుదల తేదీ ప్రకటించి అందరికీ సామ్.. సర్‌ప్రైజ్ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. పాతిరాత్రి రివ్యూ)

    నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత చాన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న సామ్.. 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్లలో ఒకటైన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడింది. కొన్నాళ్ల పాటు వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు. అయితే గతేడాది వీళ్ల ప్రేమ గురించి చాలా రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సామ్ ఏమైనా విశ్రాంతి తీసుకుంటుందేమో అనుకుంటే.. 'మా ఇంటి బంగారం' సినిమాని రెడీ చేసింది.

    నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత.. ఓ సంప్రదాయ ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. అలానే ఆపద వచ్చినప్పుడు యాక్షన్‌తో అదరగొట్టే పాత్రలోనూ కనిపించనుండటం విశేషం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌తో స్టోరీ ఏంటో చూచాయిగా క్లారిటీ వచ్చింది. ట్రైలర్ వస్తే అసలు కథేంటో తెలుస్తుంది. మరి ఈ మూవీతో సమంత కమ్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి)

  • సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

    'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.

    హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.
    యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతం
    మ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపు

    కేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్ల‍లనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.

    ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.

  • బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాధురి దీక్షిత్‌, జాకీ ష్రాఫ్‌ తాజాగా 'ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో' నాలుగో సీజన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ముందుగా మాధురి దీక్షిత్‌ మాట్లాడుతూ.. 'కర్మ' సినిమా సెట్‌లో తొలిసారి జాకీ ష్రాఫ్‌ను కలిశాను. నేను ఆ మూవీలో ఒక చిన్న పాటలో నటించాను. 

    మొహమాటం
    ఆ సమంలో జగ్గూ దాదా (జాకీ ష్రాఫ్‌), అనిల్‌ కపూర్‌ గారు అక్కడే ఉన్నారు. ఇద్దరూ నా పర్ఫామెన్స్‌ చూస్తున్నారు. నాకసలే అదంతా కొత్త.. వీళ్లిద్దరూ నన్నే చూస్తుండటంతో కాస్త మొహమాటంగా ఫీలయ్యాను. ఇక ఆ సాంగ్‌ చూసిన తర్వాత జగ్గూ దాదా, శ్రీదేవి.. అందులో వారిని ఊహించుకున్నారు అని గుర్తు చేసుకుంది.

    మాధురి అందాన్ని చూసి..
    జాకీ ష్రాఫ్‌ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్‌, నటి సరోజ్‌ ఖాన్‌ ద్వారా నాకు తొలిసారి మాధురి గురించి తెలిసింది. మాధురి అందమైన హీరోయిన్‌ అలాగే అద్భుతమైన డ్యాన్సర్‌ కూడా అని సుభాష్‌ గయ్‌తో చెప్పింది. మాధురిని సినిమాలో ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చింది. అలా తన గురించి తెలిసింది. ఇప్పటికీ నేను మాధురి అందాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటా.. తను నాతో అన్నిరకాల పాత్రల్లో నటించింది. ‍ప్రియురాలిగా, భార్యగా, అలాగే నా అత్తగానూ యాక్ట్‌ చేసింది. అయితే మాధురితో రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు నేను చాలా మొహమాటపడ్డాను. 

    జాకీపై ప్రశంసలు
    కొన్ని భావోద్వేగాలు మనసులోనే కదలాడతాయి. వాటిని పైకి చూపించడం కష్టం. పైగా ఆమె మాట్లాడేటప్పుడు తన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడటడం, పాడటం మరింత కష్టతరం. తను మాత్రం పాత్రలో లీనమైపోయి బోలెడంత ప్రేమను కురిపిస్తుంది అన్నాడు. ఇంతలో మాధురి మాట్లాడుతూ.. జగ్గూ చాలా అమాయకుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు అని జాకీ ష్రాఫ్‌పై ప్రశంసలు కురిపించింది. ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్‌లో చివరగా దేవదాస్‌ అనే సినిమా వచ్చింది.

    చదవండి: పవిత్ర లోకేశ్‌ నాతో ఎలా ఉంటుందంటే?: నరేశ్‌ పెద్ద కుమారుడు

  • చిన్న వయసులోనే కెమెరా ముందు నటించడం మొదలుపెట్టింది షాలిని. బాలనటిగా 50కి పైగా సినిమాలు చేసింది. వాటిలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలున్నాయి. తెలుగులో బెజవాడ బెబ్బులి, జైలు పక్షి, శారదాంబ, చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేసింది.

    బాలనటిగా, హీరోయిన్‌గా..
    1997లో అనియతిప్రావు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. మలయాళంతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తమిళ స్టార్‌ హీరో అజిత్‌ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలు పుట్టాక వారిని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది. అయితే పిల్లలిద్దరూ ఇంతవరకు తన సినిమాలేవీ చూడలేదంటోంది షాలిని. 

    ఒక్క సినిమా చూడలేదు
    తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా పిల్లలు ఇంతవరకు నేను నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదు. ఎప్పుడైనా చూద్దామని ప్లాన్‌ చేసుకుంటారు. తీరా సమయం దగ్గరపడ్డాక తర్వాత చూద్దాం అని వాయిదా వస్తుంటారు. అయితే నేను యాక్ట్‌ చేసిన సాంగ్స్‌ మాత్రం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. కానీ ఒక్క మూవీ కూడా పూర్తిగా చూడలేదు. ఇప్పటికైనా ఒక్క సినిమా అయినా చూడండ్రా.. అని స్టేజీపైనే పిల్లలను అభ్యర్థించింది షాలిని.

     

     

    చదవండి: కుర్రాడైనా ఓకే అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్న హీరోయిన్స్‌

  • హనుమాన్‌ మూవీ సీక్వెల్‌ 'జై హనుమాన్‌' ప్రారంభమైంది. చారిత్రాత్మక పట్టణం హంపిలో పూజా కార్యక్రమం తాజాగా జరిగింది. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మతో పాటు నటుడు రిషభ్‌శెట్టి తన సతీమణి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.  కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న  అంజనాద్రి బెట్టలో లాంఛనంగా మూవీ పనులు మొదలయ్యాయి. 2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్‌.. బాక్సాఫీస్‌ వద్ద  కాసుల వర్షం కురిపించింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని రూ. 300 కోట్లు రాబట్టింది. 

    ఇప్పుడు సీక్వెల్‌లో ఆంజనేయుడి పాత్రలో రిషభ్‌శెట్టి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. రామాయణంతో ముడిపడిన ఈ మైథలాజికల్‌ భారీ యాక్షన్‌ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రశాంత్‌ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది.

    అంజనాద్రి బెట్టలోనే పూజా కార్యక్రమం ఎందుకో తెలుసా..
    'జై హనుమాన్‌' సినిమా పూర్తిగా ఆంజనేయుడి స్వామి చుట్టే తిరుగుతుందని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. అందుకే సెంటిమెంట్‌గా అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమంతో మూవీ చిత్రీకరణను ప్రారంభించారు. మన పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని  హనుమంతుడి జన్మస్థలంగా నమ్ముతారు. హనుమంతుడు అంజనా దేవికి  జన్మించారు. అందుకే ఈ ప్రాంతాన్ని అంజనాద్రి బెట్ట అని ఇప్పటికీ పిలుస్తారు. కొండ పైభాగంలో విశాలమైన హనుమాన్ ఆలయం ఉంది. 

    దాదాపు 575 మెట్లు దాటుకుని పైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుడి విగ్రహం, కొద్ది సమీపంలో రాముడు, సీత మందిరాలు ఉన్నాయి. అక్కడే అంజనా దేవి ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశం పురాణాలలో కిష్కిందగా పిలువబడింది. ఈ కొండ హంపికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మీరు రాతి రథం, హనుమాన్ ఆలయం, యంత్ర హనుమాన్ ఆలయంతో పాటు రాముడు, హనుమంతుడు మొదటిసారి కలిసిన ప్రదేశం ఇలా ఎన్నో మరెన్నో చూడవచ్చు.
     

  • పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్‌ను హద్దుల్లేని  నా అభిమానుల  ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.

    కాగా..కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఐకాన్‌స్టార్‌ ఉత్తమ నటుడిగా అవార్డ్‌ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్‌కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. 
     

     

  • పెద్ద వయసు హీరోలు, పిన్న వయసు హీరోయిన్లు అనేది మన దేశ సినీ తెరపై కనిపించడం అత్యంత సర్వసాధారణ విషయం. అయితే తనకన్నా చిన్న వయసు హీరోతో పెద్ద వయసు హీరోయిన్‌ నటించడం, రొమాంటిక్‌ సీన్లను పండించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్‌ చిత్రాల్లో బాగా పాప్యులరైన ఈ తరహా స్క్రీన్‌ రొమాన్స్‌ ఇటీవలి కాలంలో మన సినిమాల్లోనూ తరచు కనిపిస్తోంది. కనిపించినప్పుడల్లా కొంత చర్చనీయాంశంగా, వార్తాంశంగా మారుతున్నప్పటికీ నడివయసు హీరోయిన్స్‌ పట్టించుకోవడం లేదు.

    తమకన్నా 10 నుంచి– 25 ఏళ్ల వరకు తక్కువ ఉన్న వయసున్న హీరోలతో తెరపై జత కడుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ భార్య, మాజీ మిస్‌ వరల్డ్‌  ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ తన కన్నా 9ఏళ్లు చిన్నవాడైన రణ్‌బీర్‌ కపూర్‌ తో ఏ దిల్‌ హై ముష్కిల్‌ అంటూ రొమాన్స్‌ చేసింది. అయితే ఈ సినిమా కవి హదయాన్ని ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారు కానీ బచ్చన్‌ కుటుంబం మాత్రం దీన్ని జీర్ణించుకోవడం బహుత్‌ ముష్కిల్‌ అంటూ ఆక్షేపించిందని వార్తలు వచ్చాయి.

    సైఫ్‌ అలీఖాన్‌ శ్రీమతి కపూర్‌ వంశ వారసురాలు  కరీనా కపూర్‌ కి అండ్‌ కా అనే సినిమాలో అర్జున్‌ కపూర్‌తో పండించిన డేరింగ్‌ రొమాన్స్‌ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది.  అర్జున్‌ కపూర్‌ ఆమె కన్నా 20ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం.  అలాగే బ్రదర్స్‌ సినిమాలోనూ  తనకన్నా  10ఏళ్ల చిన్నవాడైన సిద్ధార్థ్‌ మల్హోత్రాతో జోడీ కట్టడం ద్వారా కరీనా అలాంటి సాహసాలకు తాను వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.

    టాలీవుడ్‌ ప్రిన్స్‌తో కలిసి వారణాసి ద్వారా టాలీవుడ్‌కి వస్తున్న ప్రియాంక చోప్రా  తన కన్నా నాలుగేళ్లు చిన్నవాళ్లయిన హీరో రణవీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్‌ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో సందడి చేసింది. ఇలా 5ఏళ్ల లోపు చిన్నవాళ్లతో నటించిన వారిలో రాణిముఖర్జీ(షాహిద్‌ కపూర్‌తో) శృతిహాసన్‌(గిరీష్‌ కుమార్‌తో) కొంకణా సేన్‌ శర్మ(రణబీర్‌ కపూర్‌తో)...ఇలా జాబితా ఎక్కువగానే ఉంది.

    వీళ్లందరూ ఒకెత్తయితే ఫిఫ్టీ ప్లస్‌ లో కూడా సింగిల్‌గా ఉంటూ ప్రేక్షకులను తరగని గ్లామర్‌తో కట్టిపడేస్తున్న టబు తన కన్నా వయసులో ఏకంగా పాతికేళ్లు చిన్నవాడైన ఇషాన్‌ ఖట్టర్‌తో  రొమాన్స్‌ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమెకు అతడు ‘ సూటబుల్‌ బాయ్‌’ అనే దర్శక నిర్మాతల అభిప్రాయం ఎలా ఉన్నా ఈ సినిమా విమర్శకుల నోళ్లకు బాగానే  పనిచెప్పింది.

    వృద్ధ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను చూపడానికి,  చూడడానికి అలవాటు పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమ. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ వయస్కుడైన హీరో తో హీరోయిన్లు నటించడం వరకూ కొంచెం మార్పు కనిపిస్తోంది. ఇక తమకన్నా వయసులో బాగా చిన్నవారి పక్కన నటించడం అనేది మన సౌత్‌లో ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.

    పెళ్లికైనా, ప్రేమకైనా  మగవాళ్ల వయసు మహిళల కన్నా ఎక్కువ ఉండాలనే సంప్రదాయం నుంచే సినిమా పాత్రలు కూడా పురుడు పోసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటు సినిమా పాత్రల తీరుతెన్నులు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మరోవైపు నడివయసులోనూ యువతులకు థీటుగా గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్లు పెరగడం కూడా దీనికి దోహదం చేస్తోంది.

  • దర్శకుడిగా, హీరోగా హిట్టయినవారిలో ప్రదీప్‌ రంగనాథన్‌ ఒకరు. కోమలి సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన ఇతడు లవ్‌ టుడేతో డైరెక్టర్‌ కమ్‌ హీరోగా భారీ సక్సెస్‌ కొట్టాడు. ఆ వెంటనే డ్రాగన్‌ సినిమా చేశాడు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 21న ఈ సినిమా వచ్చి ఏడాది అవుతోంది.

    రెండోసారి తప్పక వస్తాం
    ఈ సందర్భంగా అశ్వత్‌.. ప్రదీప్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. డ్రాగన్‌ చిత్రానికి ఏడాది. సెల్ఫ్‌ మేడ్‌ స్టార్‌ ప్రదీప్‌తో కలిసి పని చేసిన అనుభవాన్ని మర్చిపోలేను. ఇద్దరు స్నేహితులు కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో చూపించాం. మమ్మల్ని నమ్మినందుకు ఏజీఎస్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌కు, మా టీమ్‌కు కృతజ్ఞతలు. మేము సెకండ్‌ టైమ్‌ తప్పకుండా వస్తాం అని రాసుకొచ్చాడు. 

    సినిమా
    దీంతో అభిమానులు డ్రాగన్‌ సీక్వెల్‌ ఉంటుందా? అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో డ్రాగన్‌ టీమ్‌ కాంబినేషన్‌లో ఒక కొత్త చిత్రం రాబోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్‌ విషయానికి వస్తే.. ప్రదీప్‌ హీరోగా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. ఈ చిత్రం తెలుగులో రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ పేరిట విడుదలై ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది.

     

     

    చదవండి: సెట్‌లో అందరూ చూస్తుండగా.. : తాప్సీ

  • కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ వేడుకలో పుష్ప-2 చిత్రం సత్తా చాటింది. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ పరిశ్రమ నుందచి  2024 ఏడాదిలో విడుదలైన సినిమాలకు సంబంధించిన నటీనటులకు తాజాగా అవార్డులు అందజేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్ సౌత్‌ ఉత్తమ నటుడిగా పుష్ప-2 చిత్రానికి గాను పురష్కారాన్ని అందుకున్నారు. ఆపై పుష్ప-2 ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డ్స్‌ కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

    టాలీవుడ్‌ నుంచి అత్యధికంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ అందుకున్న నటుడిగా మెగాస్టార్‌ చిరంజీవి(7) ఉన్నారు. అయితే, తాజాగా చిరంజీవితో పాటు సమానంగా ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న హీరోగా బన్నీ నిలిచారు. కానీ, ఫిల్మ్‌ఫేర్‌ నుంచి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, స్పెషల్ లెజెండ్ అవార్డులను చిరు కలిగి ఉండటం విశేషం.

    అల్లు అర్జున్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ 
    1. పరుగు (2008)
    2. వేదం (2010)
    3. రేసుగుర్రం (2014)
    4. పుష్ప: ది రైజ్ (2021)
    5. పుష్ప 2: ది రూల్ (2024)
    6. రుద్రమదేవి (గోన గన్నారెడ్డి పాత్రకు - 2015)
    7. సరైనోడు (2016) ఉత్తమ నటుడు - క్రిటిక్స్ ఛాయిస్

    చిరంజీవి అందుకున్న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ :

    1. శుభలేఖ (1982)
    2. విజేత (1985)
    3. ఆపద్బాంధవుడు (1992)
    4. ముఠా మేస్త్రి (1993)
    5. స్నేహం కోసం (1999)
    6. ఇంద్ర (2002)
    7. శంకర్ దాదా MBBS (2004)

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించమని ముఖ్యమంత్రికి లేఖ పంపింది. ఈ కార్యక్రమం మార్చి 27న హార్వర్డ్‌ స్కూల్‌ క్యాంపస్‌లో జరగనుంది.

    భారత్‌ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవడం విశేషం. “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్‌లో పాల్గొని ప్రసంగించమని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

    ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.

    ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు హార్వర్డ్‌ అధికారులు వివరించారు.

  • సాక్షి,హైదరాబాద్‌: రంజాన్‌ మాసం అంటే హలీమ్‌కి పెట్టింది పేరు. ముస్లిం సోదరులు ఉపవాసం ముగిసిన తర్వాత ఇఫ్తార్‌ సమయంలో హలీమ్‌ వడ్డించడం ఒక సంప్రదాయంగా మారింది. గోధుమలు, మాంసం, పప్పులు, మసాలాలు కలిపి గంటల తరబడి మెల్లగా ఉడికించే ఈ వంటకం బలవర్ధకమైన ఆహారం మాత్రమే కాదు. రంజాన్‌ సమయంలో ఐక్యత, పంచుకోవడం, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది.

    హలీమ్‌కి హైదరాబాద్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం కాలంలో ఇది రాజభవన విందుల్లో మాత్రమే లభించేది.   తర్వాత సాధారణ ప్రజలలో విస్తరించి ప్రతి ఒక్కరినీ మైమరిచిపోయేలా చేసింది.

    2010లో హైదరాబాద్‌ హలీమ్‌కి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (GI) గుర్తింపు కూడా లభించింది. రంజాన్‌ మాసంలో హలీమ్‌ అంటే వంటకం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, సంప్రదాయం. అలాంటి హైదరాబాదీ స్పెషల్‌ హలీమ్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం వీడియోను క్లిక్‌ చేసి వీక్షించండి. 

     

  • ములుగు: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగా ఉన్నాయని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు సీఎం రేవంత్‌. 

    రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని,  ప్రస్తుతం నిధుల కొరత ఉందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింద్నారు.  ఇక కృష్ణా జలాల తరలింపుపై సభలో క్లారిటీ ఇచ్చామన్నారు. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీఓ చర్చిద్దామన్నారు. చౌకబారు రాజకీయాలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం, ఫిబ్రవరి 22వ తేదీ) దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్‌. 

    దీనిలో భాగంగా ఇంజనీరింగ్‌ అధికారులతో నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

  • సాక్షి జగిత్యాల: భీమారం మండలం మోత్కూరావుపేట శివారులో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారంతో  తీవ్ర కలకలం రేగింది.  బండగుట్ట మైసమ్మ గుడి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అక్కడి రైతులు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళుతుండగా కొంతమంది రైతులకు  పెద్దపులి కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.  

    పులి వివరాలు తెలుసుకున్న అధికారులు వెంటనే  అక్కడికి చేరుకొని దాని పాదముద్రికలను గుర్తించారు. మోత్కూరావు పేట-చందుర్తి తొర్ర ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు ధృవీకరించారు. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు. కాగా రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా పులి సంచారం కలకలం రేపుతుంది. గతంలో సిద్ధిపేట–యాదాద్రి–జనగాం సరిహద్దుల్లో పెద్దపులి సంచరించింది. అయితే ఈ బెబ్బులి.. మహారాష్ట్ర అడవుల నుంచి రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లు అధికారులు భావించారు.

    పులి సంచారం  జగదేవ్ పూర్ మండలంలో  జరిగినట్టు ఆనవాళ్లు గుర్తించారు...అంతలోనే అది అక్కడి నుంచి  యాదాద్రి భువనగిరి జిల్లాలో మకాం మార్చింది. రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల మండలాల్లో సంచరించింది. దానితో పాటు అమ్మనబోలు - అనంతారం గ్రామాల మధ్య ఓ వాగులో స్థానికులకు కంటపడినట్లు తెలిపారు.

    అయితే ఇప్పుడు మరోసారి పులి జగిత్యాలలో కంటబడడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పులి అదేనా కాదా అనేది గుర్తించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతకు సంబంధించిన కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

  • సాక్షి హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 

    కాంగ్రెస్‌ పార్టీకి ఈ రెండేళ్లలో అధికంగా డబ్బు సంపాదించి అది కొవ్వుగా మార్చుకున్నారని దీంతో అక్రమ హౌస్ అరెస్టుల పేరుతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ అరాచక పాలన నడుస్తుందన్నారు. అమ్మాయిపై ఒక వర్గం వారు  దౌర్జన్యం చేస్తే మరో వర్గం వారిని అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.

    MLA వెంకటరమణారెడ్డపై దాడి జరిగితే కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించారా? ఎమ్మెల్యేపై దాడి గురించి ఏమైనా ఆరా తీశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల రెస్పాన్సిబులిటీ స్పీకర్ ది కాదా అని ప్రశ్నించారు.

    సీఎం రేవంత్ చాలా డేంజరని ఆరోపించారు. కేసీఆర్ ధోరణిలోనే కాంగ్రెస్‌ సైతం  హౌస్ అరెస్టులు చేస్తుందని వాటిని తాము ఖండిస్తున్నామని అరవింద్ తెలిపారు. సూపర్ మార్కెట్ లోకి వచ్చి గొడవ చేసిన  వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని  MLA క్యాంప్ ఆఫీస్ పై దాడికి వచ్చిన వారిని వెంటనే  అరెస్ట్ చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.

  • సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్‌లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

    హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్‌ మృతి చెందారు. రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.

    శ్రీనివాస్‌ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్‌ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్‌ది హత్యగా తేల్చారు.

  • మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించారు. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్‌లకు అనుగుణంగా సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    గత యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేఏడాది వానాకాలం సీజన్‌లో రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు, 5–6 ఎకరాల చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసి వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది.

    ● రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్‌లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్‌లకు కాకుండా, ఒక్క సీజన్‌కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.

    ● పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం మరోసారి చర్చనీయాంశమైంది. 2025 వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,54,059 మంది రైతులకు రూ. 255.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో బ్యాంకు ఖాతాలు అనుసంధానం ఉన్న మొత్తం 2,14,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.240 కోట్లు జమ అయ్యాయి. అయితే అదేవిధంగా యాసంగి సీజన్‌కు కూడా సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది.

    ● ప్రస్తుతం యాసంగి సీజన్‌ ప్రారంభమై పంటలు విత్తే సమయం దాటుతున్నా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం ఉంచి రావాల్సిన సాయం ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ● ఇప్పటికే పాత రుణాలు ఉన్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు ఆలస్యం రావడం మరింత ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. కొంతమంది రైతులు అధిక వడ్డీతో ప్రైవేట్‌ అప్పులు తీసుకుని సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • చేవెళ్ల: ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడి మోజులో పడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా నిందితులైన మృతుడి భార్య, ఆమె ప్రియుడిని జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన నారగూడెం కృష్ణ(35) జీడిమెట్లకు చెందిన రాజేశ్వరిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి చంద్రారెడ్డినగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

     ఇదిలా ఉండగా, చేవెళ్ల మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన శరత్‌ అనే వ్యక్తి చేవెళ్లలోని గణేశ్‌నగర్‌ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం రాజేశ్వరితో ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇతని మోజులో పడిన రాజేశ్వరి భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఇదే అదనుగా భావించిన శరత్‌ నీ భర్తను అడ్డు తొలగించుకో, నిన్ను బాగా చూసుకుంటా అని నమ్మించాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచి్చన భర్తతో రాజేశ్వరి గొడవ పడింది. అతను నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడికి ఫోన్‌ చేసి రమ్మని చెప్పింది. గాఢ నిద్రలో ఉన్న కృష్ణ కాళ్లు, చేతులు కట్టేసి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. అతడు చనిపోయిన తర్వాత, తెల్లవారుజాము వరకూ ఇంట్లోనే ఉన్న ప్రియుడు ఆతర్వాత జారుకున్నాడు. 

    శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్లు తన భర్త నిద్ర లేవడం లేదంటూ, ఆటోను పిలిపించి పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని చెప్పడంతో, బాడీని ఇంటికి తీసుకెళ్లి బంధువులకు ఫోన్‌ చేసి చెప్పింది. తన కొడుకు మృతికి కోడలే కారణమని కృష్ణ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ భూపాల్‌శ్రీధర్, డీఐ ఉపేందర్‌ ఆధ్వర్యంలో రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని, ఆమె ఫోన్‌ నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు శరత్‌తో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. ఇరువురినీ కోర్టులో హాజరుపర్చిన అనంతరం శనివారం రిమాండ్‌కు తరలించారు.    

     


      

  • పెద్దపల్లిరూరల్‌:  భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు విడాకుల దాకా వచ్చాయి. సుమారు పన్నెండేళ్లపాటు సంసారం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత తలెత్తిన విభేదాలు దంపతుల మధ్య చిచ్చుపెట్టాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కోర్డు విచారణకు వచి్చన మొదటి భార్య పద్మను పెద్దపల్లి బస్టాండ్‌ నుంచి నమ్మించి తన వెంట తీసుకెళ్లిన భర్త వెంకటేశ్‌.. కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట మైసమ్మగుడి ప్రాంతంలో బండరాయితో మోదీ, తీవ్రంగా గాయపర్చి చనిపోయిందనుకుని వెనుదిరిగాడు. ఈ విషయాన్ని పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. వివరాలు.. 

    చిమ్మచీకటి.. మరునాడు రోజంతా.. 
    ఈనెల 19న పెద్దపల్లి కోర్డుకు కేసు విచారణకు హాజరైన దంపతులు పద్మ – వెంకటేశ్‌ విచారణ ముగిసిన తర్వాత వెలుపలకొచ్చారు. పద్మ తన తండ్రి మల్లయ్యతో కలిసి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ వెళ్లేందుకు బస్సు ఎక్కించిన మల్లయ్య.. పనినిమిత్తం ఆయన కాల్వశ్రీరాంపూర్‌ వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన వెంకటేశ్‌.. బస్సు వెనకాలే వెళ్లి అక్కడ నుంచి పద్మను మాట్లాడాలంటూ కిందకు దించాడు. ఆ తర్వాత కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చేందుకు నిశ్చయించుకున్నాడు. 

    కోర్టులో పెట్టిన కేసు వాపస్‌ తీసుకోవాలని పద్మను బెదిరిస్తూ విచక్షణారహితంగా కొట్టి పెద్దబండ రాయితో మోదాడు. తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయిన పద్మ చనిపోయిందనుకుని నిశ్చయించుకున్న వెంకటేశ్‌.. అక్కడి నుంచి వెనుదిరిగాడు. అప్పటికే రాత్రంతా కటికచీకట్లో నరకయాతన అనుభవించిన పద్మ.. మరుసటి రోజు అవే ముళ్లపొదల్లో నిస్సహాయ స్థితిలో పడిఉంది. మల్లయ్య ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. పద్మపై దాడికి పాల్పడ్డాడని అంగీకరించి ఘటనా స్థలాన్ని చూపడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అచేతనావస్థలో ఉన్న పద్మను శుక్రవారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. 

    హత్యాయత్నం కేసు.. అరెస్టు 
    భర్త చేతిలో తీవ్రంగా గాయపడి కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూనె పద్మను ఆమె భర్త వెంకటేశ్‌ హతమార్చేందుకు యతి్నంచాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్టు ఎస్సై లక్ష్మణ్‌రావు వివరించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటి దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో పోల్‌ను ఢీకొట్టిన కారు.. అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వాహనాలు అడ్డంగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ప్రమాదంలో నాలుగు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.

     

     

     

     

     

International

  • ఫ్లోరిడాలోని అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నివాసం మార్-ఎ-లాగో వెలుపల కాల్పులు జరిగాయి.   ఆయుధంతో లోపలికి చొరబడడానికి ఓ దుండగుడు యత్నించగా అతనిపై  సీక్రెట్ ఏజెంట్ కాల్పులు జరిపారు.  అతనికి గాయాలపై అక్కడే కుప్పకూలారు. కాల్పులకు యత్నించిన సదరు దుండగుడు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు.

    ఈ ఘటన అనంతరం అధ్యక్షుడి నివాసం ఎదుట భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రంప్ నివాస ప్రాంతం మార్-ఎ-లాగో పరిసరాలను FBI అదుపులోకి తీసుకుంది.   దాడి నేపథ్యంలో ఫామ్ బీచ్ ప్రాంతంలో రాకపోకలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేసారు. అయితే అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అయితే  ట్రంప్‌ నివాసంలోకి ఆ దుండగుడు ఎందుకు చొరబడటానికి యత్నించాడనే కారణాలు తెలియాల్సి ఉంది. 

  • వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అమెరికా గ్రేట్ ఎగేన్ అంటూ నానా  హాడావిడీ చేస్తూ..  అధిక పన్నులు పెంచుతూ ఇలా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేశారు. అయితే తాజాగా ఆయన నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిపిన సర్వేలలో 60 శాతం అమెరికన్లు  ట్రంప్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దెబ్బమీద దెబ్బ తాకుతుంది. ఇటీవల ఆయన పలు దేశాలపై విధించిన అధిక పన్నులు చెల్లవని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరో షాక్ తగిలింది. అక్కడి ప్రముఖ మీడియా సంస్థలైన ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపీవోస్  నిర్వహించిన సర్వేలలో ప్రతి ముగ్గురు అమెరికన్లు ఆయన పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నాయి.  

    ద్రవ్యోల్బణం విషయంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62 శాతం ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. అదే సమయంలో ఇటు పన్నుల  విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్లు సర్వేలో అవగతమైంది. 

    మెుత్తంగా ట్రంప్ పాలన పట్ల 60 శాతం ప్రజలు వ్యతిరేకతతో ఉండగా.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయని దాదాపు 50 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారి అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి.    

    అయితే ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ డెమోక్రట్ల నేతలపై సైతం అక్కడి ప్రజలు విశ్వసనీయతతో లేరు. ఓవరాల్ గా ట్రంప్ కు 33 శాతం, డెమోక్రట్స్ కి 31శాతం, ఇతరులకు 31శాతం మంది మెుగ్గుచూపారు.

Andhra Pradesh

  • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. కల్తీపాలు తాగి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది. ముృతులు కృష్ణవేణి (85,కనకరత్నం(70)గా పోలీసులు చెబుతున్నారు. మరణాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

    స్థానిక పోలీసుల వివరాల మేరకు.. చౌడేశ్వరి నగర్‌లో పాలు తాగిన చిన్నారులు,వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యానికి గురైన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు రాజమండ్రిలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో పలువురికి కిడ్నీలు పాడైనట్లు తెలుస్తోంది.

    ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు కల్తీపాలే కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితులకు పాలు పోసిన వ్యక్తి గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

  • సాక్షి,నెల్లూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. విద్యుత్‌ ఛార్జీలపై పెంపుపై చేపట్టిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఈ అక్రమ కేసుపై నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ‘2024 డిసెంబర్‌లో జరిపిన నిరసనకు నేడు నోటీసులు పంపించారు. 2024లో జరిగిన నిరసన ఘటనలో పోలీసులు నాపై అక్రమ కేసు నమోదు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదు’అని వ్యాఖ్యానించారు. 

  • సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విమర్శ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడాయన చుట్టూ ముసురుకుంటున్న వివాదం సామాన్యమైంది కాదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మరణానికి కారణమైన విమాన ప్రమాదం చుట్టూ అల్లుకున్న కుట్రకోణాలు రామ్మోహన్‌ నాయుడు వైపు వేలెత్తి చూపుతున్నాయి. ప్రమాదానికి కారణమైన విమాన సంస్థకు, టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. విచారణ సజావుగా సాగాలంటే తక్షణమే రామ్మోహన్‌నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.  

    కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడోసారి ఎంపీని చేసిన జిల్లాకు చేసిందేమీ లేదని, పదవులు అనుభవించడం తప్ప ప్రజలకు ఒరిగిందే మీ లేదన్న వాదన సర్వత్రా ఉంది. ఈ విషయమై ఆ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సారి జిల్లా ప్రజల దెబ్బ ఏంటో చూస్తారని దాదాపు చెప్పుకుంటున్నారు. దానికితోడు కేంద్ర మంత్రి పదవి వచ్చా క మరింత మారిపోయారని, పబ్లిసిటీ తప్ప జిల్లాకు చేసిన మేలేమీ లేదని బాహా టంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాను బాధ్యతలు చేపడుతున్న కేంద్ర పౌర విమానయాన శాఖలో తరచూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. 

    • బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిర్మాణంలో ఉన్న కట్టడం కూలిపోయింది. 

    • లండన్‌ వెళ్లాల్సిన విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయింది. ఈ ఘటన సమయంలో అందరూ విషాద ఛాయల్లో ఉంటే ఘటనా సందర్శన సందర్భాన్ని రీల్స్‌గా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం మరింత విమర్శలకు దారితీసింది. 

    • జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఇండిగో సంస్థ ఆకస్మికంగా రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. వేలాది మంది ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. కొన్ని రోజుల పాటు విమాన సర్వీసులు రద్దయిపోయినా కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు ఏం చేయలేకపోయారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చోద్యం చూశారని దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యారు. జాతీయ మీడియా అయితే ఉతికి ఆరేసింది. ప్రతీదీ వ్యక్తిగత ప్రచారం కోసం తప్ప శాఖ కోసం పనిచేయడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.  

    కుట్ర కోణం ఆరోపణలు..  
    రామ్మోహన్‌ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర విమానయాన శాఖలోనే మరో వివాదం అలుముకుంది. ఈ సారి చిన్నా చితక వ్యవహారం కాదు. ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం దాగిందన్న ఆరోపణలు సంచలనమయ్యాయి. అజిత్‌ పవార్‌ ప్రయాణించిన విమానానికి అసలు విలువ కంటే ఎక్కువగా ఇన్స్యూరెన్స్‌ చేయించడంతో పాటు మరో రూ.210కోట్ల లయబిలిటి  ఇన్స్యూరెన్స్‌ చేయించడం వెనక కుట్ర దాగి ఉందని ఎన్సీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే రోహిత్‌పవార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. విమాన సంస్థ ‘వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌’ పై ఆరోపణలు కూడా చేశారు.  

    టీడీపీకి లింకులంటూ... 
    ప్రమాదానికి కారణమైన విమానానికి చెందిన వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌తో టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీఎస్‌ఆర్‌ సంస్థ అధినేత ఇంట్లో జరిగిన వేడుకలకు ఏపీ నేతలు హాజరయ్యారని, ప్రమాదం జరిగిన వెంటనే వీఎస్‌ఆర్‌ సంస్థ దేశం విడిచి వెళ్లిపోయారని మహారాష్ట్ర నేతలు నేరుగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ ఆరోపణలే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇన్సూ్యరెన్స్‌ కుంభకోణం, వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడిని చుట్టు ముట్టాయి. కుట్ర కోణం ఉందన్న అనుమానం నేపథ్యంలో కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అప్పుడే నిష్పక్షపాత విచారణకు అవకాశం ఉంటుందని రోహిత్‌ పవార్‌తో పాటు మరికొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.   

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతి నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, స్టూడెంట్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.

Business

  • టొయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సంస్థ తన ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ టొయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 (Toyota Land Cruiser 300)కు సంబంధించి 969 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 4 నుంచి 2025 సెప్టెంబర్ 30 మధ్య తయారైన వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి.

    ట్రాన్స్‌మిషన్ సాఫ్ట్‌వేర్ లోపమే కారణం
    కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ట్రాన్స్‌మిషన్ పనితీరును నియంత్రించే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సంభావ్య లోపం గుర్తించారు. ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉపయోగిస్తారు. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్ సరిగా పనిచేయకపోతే, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది.

    ఈ లోపం సరిచేయకపోతే కొన్ని గేర్లలో ట్రాన్స్‌మిషన్ ఓవర్-రివింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్‌మిషన్‌కు నష్టం కలిగించడమే కాకుండా, అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కూడా కలిగించవచ్చు. ట్రాన్స్‌మిషన్ హౌసింగ్ దెబ్బతింటే ఫ్లూయిడ్ లీకేజ్ సంభవించి, చివరికి ట్రాన్స్‌మిషన్ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని సంస్థ స్పష్టం చేసింది. అయితే భారత్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది.

    లెక్సస్ ఎల్‌ఎక్స్‌లోనూ ఇదే యూనిట్
    గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆ మోడల్‌కు సంబంధించి కూడా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రీకాల్ జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది.

    రీకాల్‌లో భాగమైన అన్ని వాహన యజమానులను టొయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సరిదిద్దే చర్యలు ఉచితంగా చేపడతామని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్‌ను లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.

    భారత్‌లో టొయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.15 కోట్లు. ఇందులో 3.3-లీటర్ వి6 టర్బో డీజిల్ ఇంజిన్‌తో కూడిన 10-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 304 బీహెచ్‌పీ పవర్‌, 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  • దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.

    రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపు
    ఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్‌’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.

    కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇన్ఫోసిస్‌లోనూ బలమైన చెల్లింపులు
    ఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.

    ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
     

  • చైనా మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ 5జీ’ పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించారు.

    లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్‌టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్‌ అందుబాటులో ఉండనుంది.

    సిల్క్‌ ఫైబర్‌ ఫినిష్, స్టెల్లర్‌ బ్లూ, లూనార్‌ టైటానియం కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది.

    ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్‌ 4జీ వీఓఎల్‌ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌–సీ పోర్ట్, ఐఆర్‌ సెన్సార్‌ ఉన్నాయి. ఇన్‌–డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లున్నాయి.

  • సాక్షి, హైదరాబాద్‌: ఇళ్లు/ఫ్లాట్‌/యూనిట్‌ విక్రయాల కోసం తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లతో పాటు ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.

    రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ జారీ చేస్తుందని తెలియజేసింది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందిన తర్వాతే విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రమోటర్లు/డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను కోరింది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందకుండానే చట్టవిరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిన పలు సంస్థలకు షోకాజ్‌ నోటీసులను జారీ చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

    నోటీసులు అందుకున్న సంస్థల్లో గోద్రెజ్‌ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్‌ ప్రాజెక్టు, వర్టెక్స్‌ విరాట్‌ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్‌ తదితర సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పొందుపరిచినప్పటికీ.. ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్‌ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిమాణం, ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్‌గా రిజిస్టర్‌ చేసినట్టు గుర్తించింది. ప్రకటనలో మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది.

    ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..

  • ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్‌ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.

    బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

    ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్‌ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.

    హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్‌తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.

    దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.

    ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.

    ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

National

  • ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కామన్ గా మారాయి. తయారీ సంస్థలు సరైన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. అయితే లిఫ్ట్ లో చిక్కుకోబోయిన ఇద్దరు చిన్నారులను ఒక బాలిక మెలకువతో తక్షణమే స్పందించి కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

    ఒక అపార్టుమెంటులోని ఎలివేటర్ లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వారి కుటుంబసభ్యుల కోసం వేచిచూస్తు అక్కడే ఉన్న బాలిక  లిఫ్ట్ ని తన చేతితో ఆపుతుంది. అయితే వారు లిఫ్ట్ ద్వారాల మధ్యలో ఉండగానే ఆ గేట్స్ అకస్మాత్తుగా  క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ చిన్నారి లోపలికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న బాలిక తక్షణమే స్పందించి వారికి తన చేయితే లిఫ్ట్ ని బిగియపట్టింది.

    తన శక్తికి మించిన పనైనా ఏమాత్రం అ ధైర్యపడకుండా బిగుతుగా లిఫ్ట్ గేటును పట్టుకుంది. ఇంతలోనే వారి కుటుంబసభ్యులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా ఆ చిన్నపిల్లలను బయిటకి తీశారు. దీంతో  అంతా ఉపిరిపీల్చుకున్నారు. సాధారణంగా లిఫ్ట్ సెన్సార్స్ ఏదైనా అడ్డు చూపితేనే వెనక్కి వెళతాయి. అయితే ఇందులో చిన్న పాప అడ్డు ఉన్నప్పటికీ ఆ డోర్స్ క్లోజ్ అవడం ఆందోళనకు గురిచేస్తోంది.

    ఈ లిఫ్ట్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక ధైర్యసాహసాలకను  నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.  అదే సమయంలో ఆ ఎలివెేటర్ల భద్రతని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ తయారిలో ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ఏంటని ఇలాంటి వాటి వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. 

  • లక్నో: ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నగ్న రాజకీయాలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ఇప్పటికే నగ్నంగా ఉందనే విషయం​ దేశ ప్రజలకు తెలుసు. మరీ దుస్తులు తీసివేయాల్సిన అవసరం ఏముంది?అని ప్రశ్నించారు.

    ఆదివారం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మీరట్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మేట్రో సేవల్ని ప్రారంభించారు. అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ జరిగింది. ఆ సమ్మిట్‌లో భారత్‌-ఆమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ భారత యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు (ఐవైసీ) చొక్కాలు విప్పి ఆందోళన చేపట్టారు. 

    వారి ఆందోళనపై మీరట్‌ సభలో మోదీ ప్రస్తావించారు. ‘ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ మురికి, నగ్న రాజకీయాలు చేసింది. సైద్ధాంతికంగా దివాలా తీసిన పార్టీ కాంగ్రెస్‌. దేశంలోని పురాతన పార్టీ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నాయకులు చేసిన పనే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ తన సొంత దేశాన్ని కించపరచడంలో బిజీగా ఉంది. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు దేశం విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్‌ దేశంలో జరగడం మనం ఇప్పుడే చూశాము. కానీ కాంగ్రెస్ ఏం చేసింది. దేశం కోసం నిర్వహించిన ప్రపంచ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన మురికి, నగ్న రాజకీయాలకు వేదికగా మార్చింది. 

    కాంగ్రెస్ నాయకులు నన్ను ద్వేషిస్తారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ కార్యక్రమం జరిగే సమయంలో బీజేపీ నాయకులు ఎవరూ అక్కడ లేరని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం నిర్వహిస్తున్న కార్యక్రమం. కానీ ఆ రోజు కాంగ్రెస్ మర్యాదను ఉల్లంఘించింది. కాంగ్రెస్ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది’అని వ్యాఖ్యానించారు.  

     

     

  • జమ్మూకశ్మీర్‌లోని  కిష్వార్తా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో  భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం జరిపిన  కౌంటర్ టెర్రర్ ఆపరేషన్‌లో ముగ్గుర ఉగ్రవాదులు హతమయినట్లు తెలుస్తోంది. జమ్మూలోని. మృతిచెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతిచెందిన ఉగ్రవాదుల నుండి ఏకే-47 రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    అయితే దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని అధికారులు అన్నారు. వేట కొనసాగుతుందని శాంతికి భంగం కలిగించే వారికి ఎట్టిపరిస్థితుల్లో భారత్‌లో ఆశ్రయం దొరకదని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులోకి ప్రవేశించకుండా ఆధునాతన డ్రోన్లు నిఘా కెమెరాలతో పహారా కాస్తున్నాయి. 

    ఈ నేపథ్యంలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు  కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ జమ్మూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు ఆరుగురు టెర్రరిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు.

  • భారత సముద్రజలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఇరానియన్ షిప్‌ను భారత నావికాదళ అధికారులు పట్టుకున్నారు. అనంతరం దానిని సీజ్ చేసి అందులో ఉన్న నలుగురు ఇరాన్ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇరానియన్ షిప్‌లో పెద్దమెుత్తంలో విదేశీ సిగరెట్లు భారత్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన మూడు చమురు నౌకలను అరేబియా మహాసముద్రంలో భారత నావీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరువక ముందే ఆ దేశానికి చెందిన మరో క్రూజ్‌ను ఇండియన్ నేవీ అధికారులు పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలోని ద్వారాకా కోస్ట్‌ వద్ద భద్రతా తనిఖీలు నిర్వహించగా నేవీ అధికారులు అనుమానాస్పదంగా ఒక నౌక వెళ్లడం గమనించారు. దీంతో వెంటనే దానిని పట్టుకొని తనిఖీలు నిర్వహించారు

    దానిలో పెద్దఎత్తున విదేశీ సిగరెట్ల ప్యాకెట్లు గుర్తించారు. దాదాపు 200 కాటన్ల వరకూ సిగరెట్ల కాటన్స్ సీజ్ చేశారు. వాటిలో లక్ష వరకూ సిగరెట్‌ ప్యాకెట్స్ ఉన్నట్లు తెలిపారు. ఇండియామార్కెట్లో వాటి విలువ దాదాపు రూ. 5 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో నలుగురు ఇరానియన్ దేశస్థులు ఉండగా వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ షిప్‌ పేరు ఏఐ ముక్తర్‌గా తెలిపారు.

    అయితే ఫిబ్రవరి 16న గుజరాత్ ఐసీజీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జరిపిన దాడులలో 200 కిలోల నిషేదిత మదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. కాగా  ఫిబ్రవరి 6న ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న మూడు నౌకలను సీజ్ చేసినట్లు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు. వాటి పేర్లు స్టెల్లర్ రూబీ, అస్ఫల్ట్ స్టార్, అల్ జాఫ్జియాగా తెలిపారు.

  • జైపూర్‌: కాసేపట్లో వివాహ వేడుక.. ఇళ్లంతా సందడిగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలకలలాడుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ముహుర్తం ఫిక్స్‌ చేయడంతో అక్కడంతా సందడి నెలకొంది. ఇంతలో పెద్దగా ఏడుస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీశారు. కట్‌ చేస్తూ.. వివాహం చేసుకోవాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లులు జరగాల్సిన ఇంట్లో.. ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామానికి చెందిన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ అక్కాచెల్లళ్లకు కుటుంబ సభ్యులు ఒకేరోజు వివాహం చేసేలా ముహుర్తం పెట్టారు. శనివారం ఇద్దరికీ వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంట్లో పెళ్లి వేడుకలు, సంప్రదాయ ‘బంధోలి’ కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే, శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

    అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాలను ఇంటికి తెచ్చి, పోలీసులకు చెప్పకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించడంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. ఈ సందర్బంగా జస్వంత్ సింగ్ మాట్లాడుతూ.. వారిద్దరిదీ ఆత్మహత్యేనని ఆరోపించారు. బాధితుల తండ్రి, సోదరులు (బాబాయిలు) ఈ పెళ్లి విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని అన్నారు. మొదట కుదిరిన పెళ్లి సంబంధాలను రద్దు చేసి, బాబాయిల ఒత్తిడి మేరకు పోఖ్రాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులతో వారికి పెళ్లి నిశ్చయించారని, ఈ బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు.

    అనంతరం, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాథమిక దర్యాప్తులో పురుగుల మందు తాగినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఘటనా స్థలంలో ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని, కుటుంబ సభ్యులందరినీ విచారిస్తున్నామని ఏడీసీపీ రోషన్ మీనా తెలిపారు. కాగా, వీరిద్దరూ స్కూల్‌లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. 

  • ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ - మీరట్  రాపిడ్ రైల్ మెట్రోను ప్రారంభించారు. 180 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో రైల్ ప్రయాణించనుంది. 55 నిమిషాల్లో 82 కిలోమీటర్ల దూరంలోని గమ్యాన్ని చేరుకుంటుంది. మెట్రో రైల్ రాకతో ఘజియాబాద్, మీరట్ రూట్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. 30 వేల కోట్ల రూపాయలతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టారు. ఘజియాబాద్, మోదీ నగర్, మీరట్  మధ్య ఈ మెట్రో రైలు రాకపోకలు సాగించనుంది.

    భారత రవాణా ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమయ్యింది. దేశంలోనే తొలి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్‌) ‘నమో భారత్’ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక కారిడార్‌తో పాటు, మీరట్ మెట్రోను కూడా ప్రధానమంత్రి  ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
     

    సారాయ్ కాలే ఖాన్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న కీలకమైన 5 కిలోమీటర్ల మేర విస్తరించిన చివరి సెక్షన్‌ను ప్రధాని ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు రాజధాని పరిసర ప్రాంతాల మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ చరిత్రాత్మక ఘట్టం నేపథ్యంలో సారాయ్ కాలే ఖాన్ ప్రాంగణమంతా ఇప్పటికే పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు, ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు.  ఈ ప్రాజెక్టు ద్వారా మీరట్- ఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ అనుభూతి కలగనుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఈ ఆర్ఆర్టీఎస్ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. 

  • డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. సహజీవనం.. అనుమానం.. చివరకు పైశాచిక చేష్టలు.. గురుగ్రామ్‌లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చదువుకోవడానికి త్రిపుర నుండి గురుగ్రామ్ వచ్చిన 19 ఏళ్ల యువతి.. ఓ యువకుడితో సహజీవనం సాగిస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న శివం.. యువతిపై  అమానుషంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలంటూ నిలదీసినందుకు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి, మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. చిత్రహింసలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన శివమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    యువతికి గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన శివం పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ కలిసి సెక్టార్-69లో ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహానికి గురైన శివం ఆమెను గదిలో బంధించాడు. స్టీల్‌ బాటిల్‌తో తలపై కొట్టి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో కూడా దాడి చేశాడు.

    మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆ యువతి.. తన తల్లికి ఫోన్ చేసిన జరిగిన ఘోరాన్ని వివరించింది.. తల్లి ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్ ఆసుపత్రికి తరలించారు. అంనతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడు శివంను అరెస్ట్‌ చేసిన పోలసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    ఫిబ్రవరి 16న జరిగిన గొడవ తర్వాత శివం తనపై అత్యంత క్రూరంగా దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె తలపై స్టీల్ బాటిల్‌తో, మట్టి కుండతో కొట్టాడు. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు వివరించింది. దారుణమైన దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. ఫిబ్రవరి 18 రాత్రి ఆమె నిందితుడి ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసింది. శివంకు అర్థం కాకుండా ఆమె బెంగాలీ భాషలో తన బాధను వివరించింది. తనను ప్రాణాలతో చూడాలనుకుంటే వెంటనే వచ్చి కాపాడండంటూ ఆమె తన తల్లితో చెప్పింది. బాధితురాలి తల్లి వెంటనే 112 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, యువతిని ఆసుపత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

     

  • పూణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్(85) ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప డీహైడ్రేషన్ కారణంగా ఆయన పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన రూబీ హాల్ క్లినిక్‌లో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, చికిత్సలో భాగంగా సెలైన్ ఎక్కించామని ఆస్పత్రి వర్గాలు వివరించాయి.

    శరద్ పవార్ ఆరోగ్యంపై రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్‌, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ ఒక  ప్రకటన విడుదల చేస్తూ ఆయనను మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిపారు.  కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ అభిజిత్ లోధా ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఈ నెలలో పవార్ ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 9న ఛాతీలో ఇన్ఫెక్షన్, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స అనంతరం ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆయన వెంట కుమార్తె సుప్రియ, భార్య ప్రతిభా పవార్ ఉన్నారు.

    శరద్ పవార్ 1990వ దశకంలో నోటి క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్నారు. భారత్, అమెరికాలో పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. శరద్‌ పవార్‌ తన అనారోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు అజిత్ పవార్ కన్నుమూయడం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఈ విషాదం జరిగిన కొద్ది రోజులకే ఆయన తిరిగి అనారోగ్యానికి గురికావడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

  • భారత్‌ అంటేనే ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. భారత్‌లో సీజన్‌ను బట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. ఇలాంటి ప్రదేశాలను కవర్‌ చేస్తూ ఇప్పుడు వందే భారత్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. పర్వతాలు, తీవ్ర ప్రాంతాలు, నదులు, వాటర్‌ ఫాల్స్‌ను దాటుకుంటూ వెళ్తుండటం ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో వందే భారత్‌ రైలు మార్గాలు ప్రయాణీకులను ముఖ్యంగా ఆకర్షిస్తున్నాయి.

    వందే భారత్ రైళ్లు కేవలం వేగం, సౌకర్యం మాత్రమే కాదు.. భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని కిటికీ నుంచి ప్రత్యక్షంగా చూపించే అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. హిమాలయ శిఖరాలు, పశ్చిమ కనుమలు, కేరళ తీరప్రాంతం, కాశ్మీర్ లోయ ఇవన్నీ ఒకే రైలు ప్రయాణంలో చూడగలిగే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రయాణించిన వారు.. తప్పకుండా ఆయా మార్గాల్లో ప్రయాణించాలని సోషల్‌ మీడియా సజెస్ట్‌ చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి నాటికి 164 వందే భారత్ సేవలు 82 మార్గాల్లో నడుస్తూ, దేశవ్యాప్తంగా 274 జిల్లాలను కలుపుతున్నాయి. వీటిలో పలు మార్గాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంతకీ ఆయా మార్గాలు ఎక్కడ.. ఎలా వెళ్తున్నాయో.. తెలుసుకుందాం..

    1. కత్రా-శ్రీనగర్ మార్గం.. 
    మార్గం: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా - శ్రీనగర్
    దూరం: సుమారు 270 కి.మీ
    సమయం: సుమారు 3-4 గంటలు
    ప్రత్యేకత: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెన (359 మీటర్లు), హిమాలయ పర్వతాలు, కాశ్మీర్ లోయ.
    ప్రయాణం: 58 సొరంగాలు, 11 కిలోమీటర్ల పొడవైన పిర్ పంజాల్ సొరంగం, మంచుతో కప్పబడిన శిఖరాలు. మార్చి-అక్టోబర్ మధ్య కాలంలో ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమాలయ పర్వతాలను దగ్గరగా వీక్షించవచ్చు. కత్రా నుంచి శ్రీనగర్ వెళ్తూ కుడి వైపు కిటికీ సీటు తీసుకుంటే వంతెన దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది.


    2.త్రివేండ్రం-ఎర్నాకులం
    దూరం: సుమారు 220 కి.మీ
    సమయం: 3–4 గంటలు
    ప్రత్యేకత: కొబ్బరి తోటలు, బ్యాక్‌వాటర్స్, తీరప్రాంత దృశ్యాలు, ఆలయ పట్టణాలు
    ప్రయాణం: అరేబియా సముద్రం తీరప్రాంతం వెంట రైలు ప్రయాణం. ఎర్రటి కప్పులతో ఉన్న సంప్రదాయ గ్రామాలు, కొబ్బరి చెట్లతో నిండిన కాల్వలు. కొల్లం, అలప్పుజా వంటి సాంస్కృతిక పట్టణాల గుండా ప్రయాణం నడుస్తుంది. డిసెంబర్-మార్చి వెళ్తే బాగుంటుంది. వర్షాకాలం (జూన్–సెప్టెంబర్)లో మరింత పచ్చదనం ఉంటుంది కానీ భారీ వర్షాలు ఉంటాయి. ఈ మార్గంలో పగలు ప్రయాణం చేస్తే కేరళ పచ్చదనం, తీరప్రాంత దృశ్యాలు పూర్తిగా ఆస్వాదించవచ్చు.

     

     

    3. ముంబై-కోల్హాపూర్ మార్గం​.. 
    దూరం: సుమారు 500 కి.మీ
    సమయం: 8 గంటలు 30 నిమిషాలు
    ప్రత్యేకత: పశ్చిమ కనుమలు, మబ్బులతో నిండిన లోయలు, హిల్ స్టేషన్లు ఉంటాయి. 
    ప్రయాణం: ముంబై నగరాన్ని వదిలి పశ్చిమ కనుమల్లోకి ప్రవేశం. సతారా, బెలగావి, ధారవాడ గుండా ప్రయాణం నడుస్తుంది. వర్షాకాలంలో జలపాతాలు, పచ్చని లోయలు కనిపిస్తాయి. శీతాకాలంలో మబ్బులతో నిండిన లోయలు, స్ట్రాబెర్రీ తోటలు, చారిత్రక కోటలు చూడవచ్చు. 
    జూన్ – సెప్టెంబర్ (వర్షాకాలం)లో అద్భుతమైన జలపాతాలు కనువిందు చేస్తాయి.

     

     


    4. ఢిల్లీ ఆనంద్ విహార్-డెహ్రాడూన్ మార్గం..
    దూరం: దాదాపు 302 కి.మీ
    సమయం: 4 గంటల 45 నిమిషాలు
    ప్రత్యేకత: ఉత్తర భారత మైదానాల నుంచి శివాలిక్ పర్వతాల వరకు భౌగోళిక మార్పు.
    ప్రయాణం: గంగానది, అడవులు, దూన్ లోయ, మంచు పర్వతాలు. ఈ మార్గంలో మార్చి-జూన్, సెప్టెంబర్-నవంబర్ మధ్య ప్రయాణించడం కను విందు చేస్తుంది.

    4. ముంబై-మడ్గావ్ (గోవా) కొంకణ్ రైల్వే మ్యాజిక్ మార్గం..
    దూరం: సుమారు 580 కి.మీ
    సమయం: 7 గంటల 45 నిమిషాలు (వర్షాకాలంలో కొంచెం ఎక్కువ)
    ప్రత్యేకత: పశ్చిమ కనుమలు, కొంకణ్ రైల్వే, 84 వంతెనలు, తీరప్రాంత దృశ్యాలు.
    ప్రయాణం: వర్షాకాలంలో జలపాతాలు, ఆకాశం, పచ్చని లోయలు కనిపిస్తాయి. జూన్-సెప్టెంబర్ (వర్షాకాలం) లేదా అక్టోబర్-ఫిబ్రవరి మధ్య ప్రయాణం బాగుంటుంది. ముంబై నుంచి గోవా వెళ్తూ ఎడమ వైపు కిటికీ సీటు తీసుకుంటే సముద్రం, జలపాతాలు బాగా కనిపిస్తాయి.

    6. అహ్మదాబాద్-ముంబై మార్గం.. 
    దూరం: సుమారు 491 కి.మీ
    సమయం: 5 గంటలు 40 నిమిషాలు
    ప్రత్యేకత: ఆరావళి పర్వతాలు, తీరప్రాంతాలు, మహానగర దృశ్యాలు.
    ప్రయాణం: ఎడారి నుంచి తీర ప్రాంతం వరకు విభిన్న భౌగోళిక దృశ్యాలు కనపడతాయి. 

  • న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 131వ ఎపిసోడ్‌లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతికత, సామాజిక స్పృహ, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మేళవిస్తూ సాగిన ఈ ప్రసంగంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్- 2026 విశేషాలను పంచుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నేడు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా, పాడి రైతులకు కూడా సహాయకారిగా నిలుస్తూ అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘జీరో-డిఫెక్ట్’ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను రూపొందించాలని స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, అంతరిక్ష పరిశోధనలు, హరిత ఇంధనం తదితర రంగాల్లో యువత చూపుతున్న ప్రతిభే రాబోయే కాలంలో భారత్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు.

    ఈ క్రమంలో ఒడిశాకు చెందిన యువ రైతు హిరోద్ పటేల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి, నూతన దృక్పథంతో సాగు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన తీరును కొనియాడారు. అవయవ దానం ప్రాముఖ్యతను వివరిస్తూ కేరళకు చెందిన చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహం త్యాగాన్ని ప్రధాని గుర్తుచేశారు. ఆ చిన్నారి మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరికొందరికి ప్రాణదానం చేసిందని, ఇలాంటి ఘటనలు సమాజంలో అవయవ దానంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.

    దేశం బానిసత్వ చిహ్నాల నుంచి విముక్తి పొంది తన స్వంత సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోవాలంటూ ప్రధాని ‘పంచ ప్రాణ్’ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 23 నుంచి రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న రాజాజీ ఉత్సవాల గురించి ప్రజలకు తెలియజేస్తూ, మన వారసత్వాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాగా డిజిటల్ యుగంలో పెరుగుతున్న మోసాల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేవైసీ (KYC) ప్రక్రియ విషయంలో జాగ్రత్త వహించాలని, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు. తన ప్రసంగం ముగింపులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమెకు ఘన నివాళులర్పించారు. జయలలిత వంటి ప్రజానేతలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.

Politics

  • కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీమ ప్రాజెక్టులకు సంబంధించి ఏమి చేశారో ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి చంద్రబాబు నిలిపి వేశారని, ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడటం లేదని, సీమకు ద్రోహం చేసేందుకు చంద్రబాబు 20 టీఎంసీల నీటిని తాకట్టు పెట్టారన్నారు. 

    ‘వైఎస్సార్‌ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ మేలు చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సీమ ప్రజల కోసం ముందు చూపుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందు చూపుతో సీమలోని ప్రాజెక్టులకు నీటిని నిల్వ చేసే చర్యలు తీసుకున్నారు.

    కృష్ణా నదిలో ప్రవాహం లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు రోజుకు 6 టిఎంసి నీటిని వాడుకుంటుంది. ఇలాంటి చర్యలు జరగకుండా సీమ ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణానది లో ప్రవాహం లేకుంటే సీమ ఎడారిగా మారుతుంది అలా కాకుండా సీమ ఎత్తిపోతల పథకం వైఎస్ జగన్ తీసుకొచ్చారు. గుండ్రేవుల రిజర్వాయర్ 2029 ఎన్నికల అనంతరం వాటి పూర్తి చేసేందుకు వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

    రాష్ట్రంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.  వైఎస్ జగన్ పాలనలో పులివెందులలో ఎలాంటి మతపరమైన రాజకీయాలు చేయలేదు. ప్రతి గుడికి జగన్ డబ్బులు చెల్లించారు. పులివెందులలోని ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి సిజిఎఫ్ నిధులను కేటాయించారు. చంద్రబాబు ఇప్పటికైనా వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందించాలి

    కూటమి ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు పాలన అంతా లడ్డు రాజకీయాలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. చంద్రబాబు కుప్పంలో ఎన్ని గుడిలకు నిర్మించారో చెప్పాలి. అలీ బాబా అరడజన్ దొంగ తరహాలో రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలన పూర్తి గా విఫలం చెందింది. రీల్స్ మాత్రమే నారా లోకేష్‌ పరిమితం అయ్యారు. కానీ పనులు చేయడం లేదు. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని హెచ్చరించారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హీరో,తమిళగ వెట్రి కగజం (టీవీకే)అధినేత విజయ్‌ పోటీ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. విజయ్‌ పోటీ చేయనున్న నియోజకవర్గంపై టీవీకే ప్రతినిధులు పరోక్షంగా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

    అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో టీవీకేతో పాటు ఇతర రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా  ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా, చెన్నైలో టీవీకే కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ్‌ పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు.. టీవీకే ఎన్నికల క్యాంపెయిన్‌ మేనేజ్మెంట్‌ సెక్రటరీ  ఆధవ్ అర్జునకి విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల విజ్ఞప్తిని పార్టీ అధినేత విజయ్‌కు వివరిస్తామని అన్నారు.  

    అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ మాట్లాడుతూ..‘మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. మీ తీర్మానాన్ని ‘దళపతి’కి చేరవేరుస్తామని తెలిపారు.

    ఈ సందర్భంగా ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వం పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నమ్ముతుందని, ఉత్తర చెన్నై ప్రాంతం ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పెరంబూర్ నియోజకవర్గం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, సామాజిక సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా టీవీకే గుర్తించింది.

    అందుకు అనుగుణంగా పెరంబూర్‌,కోల్తాపూర్‌,ఆర్కే నగర్ ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏదైనా ఒక స్థానం పోటీ చేసే అంశంపై విజయ్‌ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
     

  • హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. కామారెడ్డిలో బీజేపీకి చైర్మన్‌ పదవి రాకుండా చేశారని రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. బొల్లారం పీఎస్‌ నుంచి రాంచందర్‌ రావును విడుదల చేశారు. 

    కామారెడ్డికి వెళ్లకూడదన్న షరతులతో ఆయన్ను విడుదల చేశారు పోలీసులు. అనంతరం రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

    ఇదిలా ఉంచితే, నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  దాంతో రాంచందర్‌ సహా, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించి వారిని కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే రాంచందర్‌ రావును బొల్లారం పీఎస్‌కు తరలించారు. 

  • తాడేపల్లి:  రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని, దీని వల్ల గ్రామీణ ఆర్దిక వ్యవస్థ కుదేలవుతోందని, బడ్జెట్ లో ప్రభుత్వం పెట్టిన లెక్కలు చూస్తేనే ఇది అర్దమవుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆక్షేపించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మీద ఆధారపడిన రాష్ట్రం ఇప్పుడు వ్యవసాయ సంక్షోభంతో పూర్తిగా తిరోగమనంలో వెళ్తోందన్నారు. తగ్గిపోయిన పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శమని తెలిపారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేస్తానని ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందని, కానీ అప్పట్లో వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి రుణ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ తో ఎప్పుడో చేశారని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

    తిరోగమనంలో రాష్ట్రం
    రెండు రోజుల క్రితం బడ్టెట్ లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎలా ఉందనే అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతీ హామీ ఎంత మందికి అమలు చేస్తున్నారు, ఎంత మందికి ఎగ్గొట్టారనే అంశాలపై మాట్లాడారు. ఇందులో ఆయన మాట్లాడిన వ్యవసాయం సహా ఏ అంశంపైన అయినా ప్రభుత్వం స్పందిస్తుందేమో అని చూశాం కానీ సమాధానం రాలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలన్నీ నిజమేనని తేలిపోయింది. 2025-26 బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ వసూళ్లు 2 కోట్ల 17 లక్షల 976.53 కోట్లు చూపిస్తే, సవరించిన లెక్క లక్షా 96 వేల 903.53 కోట్లకు చేరింది. అంటే 9 నెలల్లో 21,073 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. అంటే మైనస్ ఆరు శాతం అన్నమాట. ఈ సంవత్సరం మళ్లీ రెవెన్యూ వసూళ్లు 2,34, 140.14 కోట్లకు పెరుగుతాయని చూపించారు. 

    రూ. 21 వేల కోట్ల మైనస్ కు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా 37 వేల కోట్లకు పెరుగుతుందని ఎలా చూపిస్తారు. అదే 2025-26  సంవత్సరానికి పన్ను వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 1,28,126 కోట్లు పెట్టారు. సవరించిన లెక్క చూస్తే 1, 11,865 కోట్లకు అంటే 16,261 కోట్లు తగ్గిపోయింది. అంటే 9 నెలల్లోనే 12.69 శాతం తగ్గిపోయింది. ఈసారి మళ్లీ బడ్జెట్ లో పన్ను వసూళ్ల అంచనా 1,37,320 కోట్లకు పెరుగుతుందని చూపించారు. అంటే 22.75 శాతం పెరుగుతుందని చూపించారు. రాష్ట్రం ఎంత సంక్షోభంలో ఉందో దీన్ని బట్టి అర్దమవుతోంది. వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఈ రంగంలో తిరోగమనంలో ఉందని తెలుస్తోంది.

    పడిపోతున్న పన్ను వసూళ్లు
    రైతు కానీ, కౌలు రైతు కానీ, వ్యవసాయ కార్మికుడు కానీ తన ఆదాయం పెరిగి నిత్యావసరాలు కొనుక్కుంటే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కానీ మద్దతు ధరలు లేక అమ్ముకునే పరిస్ధితుల్లోకి వెళ్లడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళుతోంది. ఇలాంటి ప్రధాన కారణాలను పక్కనబెట్టి బడ్జెట్ అంచనాలు పెంచుకుంటూ పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మూలధన వసూళ్లు మాత్రం తగ్గలేదు. అప్పులు 78205 కోట్లు తీసుకుంటామని బడ్జెట్ లో చెప్పి 79456 కోట్లు 9 నెలల్లోనే తీసుకున్నారు. ఇతర రుణాలు 1500 కోట్లు చూపించి 2496 కోట్లు తీసుకున్నారు. ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది అనేది ప్రత్యక్ష పన్ను వసూళ్లలోనే కనిపిస్తోంది. 

    రాష్ట్రంలో 2024-25లో వరి సాగు 13.97 లక్షల హెక్టార్లలో జరిగింది. 78.28 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. 2025-26 ఖరీఫ్ లో 15.59 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. అంటే గత సంవత్సరం కంటే లక్షా 65 వేల హెక్టార్లలో సాగు పెరిగింది. ఉత్పత్తి చూసుకుంటే మాత్రం 78.05 లక్షల టన్నులు మాత్రమే జరిగింది. ఇవి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పరిధిలోని యూనిఫైడ్ పోర్టల్ ఫర్ స్టాటిస్టిక్స్ డేటా ఇది. పెరిగిన సాగు ప్రకారం చూస్తే 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి పెరగాలి. కానీ లక్ష టన్ను ధాన్యం కూడా పెరగలేదు. కానీ రైతులకు ఎరువుల ధరలు పెరిగాయి, యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కున్నారు. రైతుకు ఖర్చు పెరిగింది కానీ దిగుబడి పెరగలేదు’ అని ధ్వజమెత్తారు.

    గణనీయంగా పడిపోయిన సాగు
    జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతు భరోసా కేంద్రం దగ్గర ట్రక్ షీట్ జనరేట్ అయితేనే ధాన్యం వెళ్లేవి. ట్రక్ షీట్ జనరేట్ అయిన దగ్గరి నుంచి ధాన్యం వచ్చే తేదీ లెక్కించేవాళ్లు. ఈ సంవత్సరం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి మధ్యవర్తుల ద్వారా మిల్లర్లకు చేరిపోయింది. మిల్లర్లు చెప్పిన తేదీకి రైతు భరోసా కేంద్రంలో లోడ్ చేశారు. అంటే వాళ్లకు అనుకూలమైన తేదీల్లో లోడ్ చేయించారు. రవాణా, కాటా కూలీ కానీ గతంలో ఇచ్చేవారు కాదు. గత ప్రభుత్వంలో వాళ్ల ఖాతాలకే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. ఈసారి ఈ డబ్బులు కూడా వాళ్లకు అందలేదు. ప్రత్తి విషయానికొస్తే.. ఈ ఏడాది 3.99 లక్షల హెక్టార్లలో సాగు జరిగింది. మొంథా తుపాన్ దెబ్బకు 4 నుంచి 5 క్వింటాల్స్ మాత్రమే ఉత్పత్తి వచ్చింది. దీనికి తోడు రూ.8,110 మద్దతు ధర అయితే క్వాలిటీ లేదని 5 వేల నుంచి 6 వేలకు కూడా కొనుగోలు చేయని పరిస్ధితి. అంటే వేల కోట్లు రైతులు నష్టపోయారు. 

    వేరుసెనగ చూస్తే 5.72 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉంటే ఈ ఏడాది 2.08 లక్షల హెక్టార్లలో మాత్రమే. అంటే కేవలం 42 శాతం మాత్రమే సాగు జరిగింది. గణనీయంగా సాగు పడిపోవడం వల్ల వ్యవసాయ కార్మికులకు పని లేకపోవడం, రైతుకు ఆదాయం పడిపోతాయి. ఆగస్టు వరకూ ఉన్న డ్రై స్పెల్ మూలంగా అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో సాగు 40 శాతానికి పడిపోయింది. కనీస మద్దతు ధరలు లేక తక్కువకు అమ్ముకున్న పరిస్ధితి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కటాఫ్ డేట్ అయిపోయాక కంది సాగు చేశారు. సరాసరి దిగుబడి తగ్గిపోయిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అందుకే కర్నాటక నుంచి ప్రభుత్వం సేకరించాల్సి వచ్చింది. మొత్తం రూ.2400 మద్దతు ధర అయితే రైతులు గరిష్టంగా రూ.1800కు అమ్ముకున్నారు. మినుములు, పెసలదీ అదే పరిస్ధితి. రబీలో వర్షాల కారణంగా మళ్లీ సాగు పెరిగింది. 

    సీమను హార్టీకల్చర్ హబ్ చేసింది వైఎస్సార్, జగన్‌
    ప్రభుత్వం ఇచ్చిన వీక్లీ రిపోర్ట్ లో 2024-25లో హెక్టార్ కు కేజీ 19 కిలోల ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం ఉత్పత్తి పెరుగుతుందన వ్యవసాయ మంత్రి చెప్పారు. ఆయన లెక్క ప్రకారం సాగు చూస్తే 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్ధితుల్లో తీసుకుంటే రబీలో శెనగపంట దిగుబడి పెరిగింది. 5 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 91 వేల టన్నులు మాత్రమే ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నారంటే మెట్ట జిల్లాల్లో రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిసారించాలి. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్సార్ హయాంలో విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడే ఇది హార్టికల్చర్ హబ్ అయింది. గతేడాది సంక్షోభం మొదలైందే హార్టికల్చర్ పంటల నుంచి. ఇదంతా రాయలసీమ ప్రాంతంలోనే జరిగింది. 

    మార్కెటింగ్ మీద దృష్టిపెట్టకపోవడమే ఇందుకు కారణం. గతంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తే, తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే పగలు 9 గంటల విద్యుత్ ఇచ్చారు. అంటే రాయలసీమను హార్డికల్చర్ హబ్ గా మార్చింది వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పంటల ఉత్పత్తి లేక సంక్షోభం రావట్లేదు, కేవలం మార్కెటింగ్ లేకే సంక్షోభం వస్తోంది. 

    రూరల్ ఎకానమీ బలహీనంగా ఉంది. రైతులు, వ్యవసాయ కార్మికుల దగ్గర డబ్బులు ఉంటేనే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు బాగుంటారు. ఈ 20 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా ఎకరం భూమి ధర పెరగలేదు. దీనికి కారణం వ్యవసాయ సంక్షోభమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించాలని కోరుతున్నాం’ అని స్పష్టం చేశారు.

  • సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్‌పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.

    లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి  పేర్కొన్నారు.

  • సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు. అప్పులను బడ్జెట్‌లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగిందని తెలిపారు. ఎవరిది విధ్వంస పాలనలో ప్రజలు గుర్తించాలని కోరారు.

    వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా ఉంది. బడ్జెట్, తిరుమల లడ్డూ అంశాలపై చర్చ లేకుండా చేశారు. బడ్జెట్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఆదాయ, వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ఈ బడ్జెట్ అంతా లోపభూయిష్టంగా ఉంది. అప్పులను బడ్జెట్‌లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు.

    గతంలో అప్పులపై.. బాబు, పవన్, బీజేపీ అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ వృద్ధిపై తప్పుడు లెక్కలు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా డీఎస్డీపీ ఎలా పెరుగుతుంది. ఆదాయం, వ్యయానికి సంబంధించిన లెక్కలకు ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది. రూ.10 లక్షల కోట్లు అప్పు అని తప్పుడు ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పు ఎంత? ఎవరిది ఆర్ధిక విధ్వంసం.. ప్రజలు అర్ధం చేసుకోవాలి. వైఎస్‌ జగన్‌ పాలనలో 15వేలకు పైగా సచివాలయాలు నిర్మించి.. లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా?. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేయడమే విధ్వంసమా?. 17 మెడికల్ కాలేజీలు తీసుకు రావడం విధ్వంసమా?. తెచ్చిన కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామనడం విధ్వంసమా? ప్రజలే తెలుసుకోవాలి. 

Crime

  • సాక్షి,జోగులాంబ: వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవ్వాల్సిన ఇద్దరి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. వధువు ఇంట విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు తరచూ ఫోన్‌లో అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక యువతి తనువు చాలించింది.

    జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక యువతి స్నేహ ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్‌పై కాబోయే వరుడు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. తరుచూ ఫోన్‌ వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.    

Family

  • మనతోపాటు సామాన్యులుగా వచ్చి.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తి ఆదర్శంగా నిలుస్తారు కొందరు. వాళ్లు  కూడా మనలానే పైకి ఎదిగే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు కూడా. కానీ ఆ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకి లోనవ్వకుండా సరైన నిర్ణయాలతో.. ఉన్నతస్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలుస్తారు.  అలాంటి కోవకు చెందిన వాడే రామచంద్ర అగర్వాల్‌. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదంటూ..అచంచలమైన కృషితో వస్త్రపరిశ్రమలో గొప్ప సక్సెస్‌ని అందుకుని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నారు. 

    అయనే కొల్‌కతాకు చెందిన రామ్ చంద్ర అగర్వాల్. 1965లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడి కింద శరీరం అంత చచ్చుబడిపోయింది. అయినా..అతడిలో కష్టపడేతత్వం..అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారిక విద్యను పూర్తిచేసిన వెంటనే చిన్న జిరాక్స్‌ షాప్‌ పెట్టుకున్నాడు. 

    దీంతో త్వరితగతిన ఉన్నతస్థాయికి చేరుకోలేమని గ్రహించి..వస్త్రపరిశ్రమ వైపుకి అడుగులు వేశాడు. అలా కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ప్రారంభించాడు. భారతీయ ఫ్యాషన్‌ వినియోగదారుల ట్రెండ్‌ని అర్థం చేసుకుంటూ..ఈ పరిశ్రమలో విజయం సాధించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంబించాడు. అలా 2000 ప్రారంభంలో ఢిల్లీకి మకాం మార్చి..2001లో తన మొదటి విశాల్‌ మెగా మార్ట్‌ స్టోర్‌ని ప్రారంభించాడు. 

    ఇది మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా ఆకర్షించింది, చేరువైంది కూడా. దాంతో ఈ మార్ట్‌ కిరాణా సామాగ్రి, దుస్తులు..అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసే హాట్‌స్పాట్‌గా మారింది. అలా చుట్టపక్కాల మహా నగరాల వరకు ఈ మార్ట్‌ బ్రాంచ్‌లు విస్తరించాయి. అలా తన దుకాణాన్ని విస్తరించే క్రమంలో దాదాపు భారీగా అప్పులు చేశాడు. సరిగ్గా ఆ టైంలో 2008-09లో ప్రపపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అప్పు పెరిగిపోయింది, మరోవైపు కస్టమర్లు తగ్గిపోతున్నారు. 

    చెప్పాలంటే రామ్‌చంద్రకు కఠినమైన సమయం ఇది. దాంతో 2011లో రూ. 2 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శ్రీరామ్‌ గ్రూప్‌ అండ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీకి దాదాపు రూ. 70 కోట్లకు అమ్మేశారు. కొత్త యజమాన్యంలోకి ఉన్నప్పటికీ విశాల్‌ బ్రాండ్‌ కొనసాగడం విశేషం. ఆ తర్వాత అగర్వాల్‌ వీ2 రిటైల్‌ లిమిటెడ్‌ రూపంలో కొత్త వెంచర్‌ ప్రారంభించాడు. మొదటి స్టోర్‌ జంషెడ్‌పూర్‌లో ప్రారంభించారు. అనతి కాలంలో వేగంగా పుంజుకుని లాభాల బాటలు పట్టింది. కొన్నేళ్లకు ఏకంగా వంద కోట్ల టర్నోవర్‌ని అందుకుంది. పైగా అనేక భారతీయ నగరాల్లో 150కి పైగా ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది. 

    అలా 2025 కల్లా వీ2 రిటైల్‌ భారతదేంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్‌ బ్రాండ్‌లో ఒకటిగా ఉద్భవించింది. పైగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 6వేల కోట్ల టర్నోవర్‌కు మించిపోయింది. ఇంతటి బిజీ పరిస్థితుల్లోనూ ఆనందానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోడాయన. ఆయనకు అందమై భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ల సహాయ సహకారాలతోనే ఇంత పెద్దసక్సెస్‌ అందుకున్నానని చెబుతుంటాడు రామ్‌చంద్ర అగర్వాల్‌.  

     

    (చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?)

     

  • ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారిన ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌  (ఏఆర్‌సీఎఫ్‌) కో–ఫౌండర్‌ సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌– భత్కల్‌లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన అన్నదమ్ములు రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌లకూ స్టూడెంట్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

     ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది. రియాజ్, ఇక్బాల్‌లు ముంబైలో ఉంటూ గ్యాంగ్‌స్టర్స్‌గా మారారు. అక్కడే ‘ఆర్‌ఏఎన్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్‌కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్‌ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్‌ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్‌ సోదరులు, సాదిక్‌ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్‌ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్‌లో శిక్షణ పొంది వచ్చారు. పాకిస్తాన్‌ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. 

    వారణాసిలోని దశాశ్వమేధఘాట్‌లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్‌జీవి ఎక్స్‌ప్రెస్, అక్టోబర్‌ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్‌ మోచన్‌ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్‌ రైళ్లు, 2007 మే 22న గోరఖ్‌పూర్‌లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్‌ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్‌ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్‌ ముజాహిదీన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. 

    ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్‌ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్‌ను టార్గెట్‌ చేశారు. అహ్మదాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘ది పూల్‌ ఆఫ్‌ ఆల్‌ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 17 పేళ్లకు పాల్పడ్డారు. సూరత్‌లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్‌ భత్కల్‌ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్‌ ఫ్యామిలీ రెస్టరెంట్‌ నిర్వహించే అఫ్జల్‌ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి. 

    అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్‌లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్‌ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్‌లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్‌ ఆదేశాల మేరకు ఆతిఫ్‌ అమీన్‌ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్‌ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లా హౌస్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్‌ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.

    దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్‌బ్రాంచ్‌లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్‌ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్‌ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్‌లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్‌లోనే రియాజ్‌ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్‌కు వెళ్లానని, అక్కడి ఎల్‌–18 ఫ్లాట్‌లో డెన్‌ ఉందని బయటపెట్టాడు. ఆ అపార్ట్‌మెంట్‌పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. 

    దీంతో ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్‌ 19న ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌చంద్‌ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్‌పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్‌ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్‌ అమీన్, మహ్మద్‌ సాజిద్‌ చనిపోయారు. ఆ ఎన్‌కౌంటర్‌లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్‌ ఖాన్‌ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్‌ పడింది. (బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్‌ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్‌ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్‌ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్‌!’ వచ్చే వారం) 

  • మనం ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు అందులో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ముందే ఇన్‌స్టాల్ అయి ఉంటాయి (Pre-installed apps). మనం వాటిని వాడకపోయినా అవి మెమరీని ఆక్యుపై చేస్తూనే ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్న సమాజం మన చిన్నతనంలో మన మనసులో కొన్ని 'ప్రోగ్రామ్స్' ఇన్‌స్టాల్ చేస్తారు.

    మనకు తెలియకుండానే మనం ఆ ప్రోగ్రామ్స్ ప్రకారమే ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. దీనినే సైకాలజీలో 'Social & Parental Conditioning' అంటారు. మరి ఈ ప్రోగ్రామింగ్‌ను మార్చడం సాధ్యమేనా?

    1. పేరెంటింగ్ ఎలా ప్రోగ్రామింగ్‌గా మారుతుంది?
    సైకాలజీ ప్రకారం, తల్లిదండ్రుల ప్రవర్తన బిడ్డ మనసులో 'బిలీఫ్ సిస్టమ్' (Belief System) గా మారుతుంది. ఇది మూడు రకాలుగా జరుగుతుంది.

    Direct Commands: "నువ్వు ఎందుకూ పనికిరావు", "అమ్మాయిలు ఇలాగే ఉండాలి", "డబ్బు సంపాదించడం చాలా కష్టం". ఇలాంటి మాటలు పదే పదే విన్నప్పుడు అవి మెదడులో నిజాలుగా రికార్డ్ అయిపోతాయి.

    Observation: మీ నాన్న కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేస్తే.. మీరు పెద్దయ్యాక మీకు తెలియకుండానే అదే చేస్తారు. ఎందుకంటే మీ మైండ్ "కోపాన్ని ఇలాగే వ్యక్తపరచాలి" అని ప్రోగ్రామ్ అయ్యింది.

    Emotional Anchoring: మీరు ఏదైనా సాధించినప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటే.. "నేను ఏదైనా సక్సెస్ సాధిస్తేనే నాకు విలువ ఉంటుంది" అనే ప్రోగ్రామ్ మీలో రన్ అవుతుంది. దీన్నే 'Conditional Love' అంటారు.

    2. మార్కెట్ మోటివేటర్ల పొరపాటు: "Update" vs "Format"
    సో-కాల్డ్ మోటివేషనల్ స్పీకర్లు "ఈ రోజు నుంచి కొత్తగా ఆలోచించు, సక్సెస్ అవుతావు" అని చెప్తారు. ఇది పాత సాఫ్ట్‌వేర్ మీద కొత్త స్టిక్కర్ వేసినట్లు ఉంటుంది.

    ట్రైనర్స్ బాహ్య ప్రవర్తనను మార్చమంటారు. సైకాలజీ అసలు ఆ సాఫ్ట్‌వేర్ కోడింగ్‌ను మార్చమంటుంది (Rewiring).

    మీరు లోపల "నేను దేనికీ పనికిరాను" అనే ప్రోగ్రామ్‌ను రన్ చేస్తూ, పైన "నేను గొప్పవాడిని" అని అరిస్తే.. ఆ రెండింటి మధ్య ఘర్షణ మొదలై మీలో ఒత్తిడి (Stress) పెరుగుతుంది తప్ప వ్యక్తిత్వం మారదు.

    3. మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా? (The Science of Change)
    దీనికి సైన్స్ ఇచ్చే సమాధానం.. ఎస్!ఖచ్చితంగా మార్చుకోవచ్చు! మన మెదడు ఒక రాయిలాంటిది కాదు, అది ఒక ప్లాస్టిక్ లాంటిది. మనం అనుకుంటే కొత్త న్యూరల్ పాత్‌వేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే పాత ప్రోగ్రామింగ్‌ను డిలీట్ చేసి కొత్త కోడింగ్ రాసుకోవచ్చు. దీన్నే Neuroplasticity అంటారు.

    4. Real Personality Development: రీ-ప్రోగ్రామింగ్ ప్రాసెస్
    Genius Matrix Model ఉపయోగించి మిమ్మల్ని మీరు ఎలా రీ-డిజైన్ చేసుకోవాలో చూద్దాం.

    STEP 1: BREAK (డీ-కోడింగ్)
    ముందుగా మీలో ఉన్న బగ్స్ (Bugs) ఏంటో గుర్తించాలి.

    * "నేను ఎందుకు భయపడుతున్నాను? ఇది నా భయమా లేక మా అమ్మ భయమా?"

    * "ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నానా లేక నా ప్రోగ్రామింగ్ తీసుకుంటోందా?"

    మీరు ఆలోచించే ప్రతి నెగటివ్ ఆలోచన వెనుక ఉన్న 'మూలాన్ని' వెతకండి. ఆ మూలాన్ని గుర్తించడమే పాత ప్రోగ్రామ్‌ను 'బ్రేక్' చేయడం.

    STEP 2: BUILD (రీ-కోడింగ్)
    ఇక్కడ మీరు కొత్త అలవాట్లను, కొత్త ఆలోచనా విధానాలను ఇన్‌స్టాల్ చేయాలి.

    * Cognitive Re-structuring: "నేను ఓడిపోతాను" అనే ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు, వెంటనే దాన్ని మ్యాన్యువల్ గా ఆపి.. "నేను నేర్చుకుంటున్నాను" అనే కొత్త లైన్ యాడ్ చేయాలి.

    * ఇది ఒక్క రోజులో జరగదు. పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల పాత ప్రోగ్రామ్ వీక్ అయి, కొత్త ప్రోగ్రామ్ స్ట్రాంగ్ అవుతుంది.

    STEP 3: BEYOND (మాస్టరీ)
    ఒక్కసారి మీరు మీ మైండ్ సాఫ్ట్‌వేర్‌ను కంట్రోల్ చేయడం నేర్చుకుంటే, మీరు కేవలం ఒక 'వ్యక్తి'గా మిగిలిపోరు. మీరు ఒక 'Creator' గా మారుతారు. మీ గతం మీ భవిష్యత్తును శాసించదు. మీరు మీ సొంత లెగసీని క్రియేట్ చేస్తారు.

    5. Self-Reflection: మీ కోడింగ్‌ని చెక్ చేసుకోండి. అందుకోసం ఈ రోజు ఈ చిన్న ఎక్సర్‌సైజ్ చేయండి.
    * మీరు తరచుగా వాడే ఒక నెగటివ్ వాక్యాన్ని రాసుకోండి (ఉదా: "నాకు అదృష్టం లేదు").
    * ఈ మాట మీ మనసులోకి ఎప్పుడు వచ్చింది? మీ ఇంట్లో ఎవరైనా ఇలా అనేవారా?
    * ఈ మాట నిజమేనా? దీనికి వ్యతిరేకంగా జరిగిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.
    * ఇప్పుడు ఆ పాత వాక్యాన్ని కొట్టేసి.. ఒక కొత్త పవర్‌ఫుల్ వాక్యాన్ని రాయండి.

    రిమోట్ కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది!
    బ్రో, మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ప్రోగ్రామ్ చేసి ఉండొచ్చు. అది వారి తప్పు కాదు, వారికి తెలిసింది వారు చేశారు. కానీ ఇప్పుడు మీరు పెద్దయ్యారు. మీ మైండ్ రిమోట్ కంట్రోల్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. పాత ప్రోగ్రామింగ్ ని సాకుగా చూపిస్తూ అలాగే ఉండిపోతారా? లేక దాన్ని రీ-రైట్ చేసి ఒక Real Personality గా ఎదుగుతారా? ఛాయిస్ మీదే!

    సైకాలజిస్ట్ విశేష్ 
    Genius Matrix Hub 
    www.psyvisesh.com
    8019 000066

  • సాక్షాత్కారం


    ‘ఆయనెవరు?’‘సహ ప్రయాణికుడు!’‘ఆమె?’‘ఆయన భార్య.’‘వాళ్లిద్దరితో ఏమిటి బంధం?’‘ఏ బంధుత్వమూ లేదు.’‘మరి బాధ్యత భుజాలకెందుకెత్తుకున్నావ్‌?’ఆత్మ సంధించిన ఆ ప్రశ్నకు రామ్‌ దగ్గర సమాధానం లేదు.‘‘స్ట్రోక్‌ వచ్చింది. మూడు గంటలు గడిస్తేగాని చెప్పలేం. మా ప్రయత్నం మేం చేస్తాం...’’ డాక్టర్‌ మాటలు మనసులో కల్లోలం రేపుతున్నాయి.ఆమెనెట్లా ఓదార్చాలో తెలియక, టీ తాగి వస్తానంటూ రోడ్డు మీదికొచ్చాడు.అడుగులు ముందుకు పడుతున్నాయి. మనసు వెనక్కి నడుస్తోంది.∙∙ రమణీయంగా నవ్వాడు రామ్‌. అతని మొహమే అంత.

    ఆమె నవ్వలేదు. అరవై ఉంటాయా! పైనే ఉండొచ్చు.గర్భగుడిలో అమ్మవారి మోములా ఉంది. ప్రసన్నతలోనే కాస్త తేడా.సాయంత్రం అయిదున్నరకు హైదరాబాదులో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరింది.ఆమె ఫోన్‌ మోగింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని, ‘‘లింగంపల్లి నుంచి ట్రైన్‌ బయల్దేరింది బాబూ. పొద్దున్నే స్టేష¯Œ కు కారు పంపించు’’ అని చెప్పి పెట్టేసింది.ఎదుటి బెర్తు మీది భర్త వైపు చూపు సారించింది. రామ్‌ కనుగుడ్లూ అటు తిరిగాయి.డెబ్భై దాకా ఉండొచ్చు. జర్కిన్‌ వేసుకొని, వెల్లకిలా పడుకొని ఉన్నాడు. క్లీ¯Œ షేవింగ్‌తో మొహం మెరిసిపోతోంది. దర్పానికి సాన పెడుతూ సన్నటి మీసకట్టు. రైలు బయల్దేరే వేళకే.. పవళింపుసేవలోకి వెళ్లడమనే అసహజత్వం, ఆయనలో కనిపిస్తున్న ధనబలం వల్ల వచ్చిన పొగరు కావచ్చు అనుకున్నాడు.

    సైడ్‌ లోయర్‌ బెర్తుపై రెండు కాళ్లూ చాపుకొని, రిలాక్స్‌ అయ్యాడు రామ్‌.అతనికంతా కొత్తగా ఉంది. ఏసీ సెకండ్‌ క్లాస్‌లో తొలిసారి ప్రయాణం.రైలు ప్రయాణమంటే అతనికిష్టం. లోకంలోని భిన్నత్వాన్ని ‘కంప్రెస్‌’చేసి ప్రదర్శించే రైలుపెట్టె అతనికిష్టం. బోగీ నిండా కలకలంగా, కలివిడిగా ఉండే మనుషులు ఇష్టం. ఒంటిగాడు గనుక ఊపుకుంటూ వచ్చి రైలెక్కుతాడు. చపాతీలూ చట్నీలూ పులిహోరలతో తయారయ్యే మనుషులు అతనికిష్టం. వాటిని తనకు కూడా పంచుతూ వారు కురిపించే ప్రేమ ఇష్టం. వారితో పంచుకునే కబుర్లు ఇష్టం. ఇలా అనేక ఇష్టాల్ని ప్రతి ప్రయాణంలోనూ తీర్చే స్లీపర్‌ క్లాస్‌ బోగీని దూరం చేసిందీ ప్రయాణం.‘ఇదంతా నెల్లూరు రైతు సంఘం వాళ్ల వల్ల కదా’ అనుకున్నాడు.

    గుంటూరుకు దగ్గర్లోని ఓ పల్లెటూరి పొలం ఒళ్లో పొట్ట పోసుకుంటూ తల్లిదండ్రులు; పటా¯Œ చెరు ప్రాంతంలో సింగిల్‌ బెడ్రూమ్‌లో చేతులు కాల్చుకుంటూ తను. ఆ రెండెకరాలూ అమ్మే అగత్యం రాకుండా ఏకైక పుత్రుడు ఏదోవిధంగా ఆదుకోగలడన్న ధీమాతో వాళ్లు; ఉద్యోగంలో ఎత్తులకెదిగి, ఆ ఆశయం నెరవేర్చగలనన్న ఆశతో తను.‘‘సార్, మీ ట్రైన్‌ తెల్లవారుజామున 2.50కి నెల్లూరు చేరుకుంటుంది. రెండున్నరకంతా కారు స్టేష¯Œ లో ఉంటుంది. మీరు తిరిగి వెళ్లేవరకు అది మీతోనే ఉంటుంది. డ్రైవర్‌ పేరు చంద్రం. మీకేం కావాలన్నా అతన్నడగండి’’ నిర్వాహకుడొకరు సమాచారమిచ్చి, డ్రైవర్‌ నంబరు పంపాడు.రైలు సికింద్రాబాదు స్టేషన్లో ఆగింది. సైడ్‌ లోయర్‌ బెర్తులోకి ఆర్‌.ఎ.సి.లో టిక్కెట్లు పొందిన దంపతులు వచ్చారు. క్యాబి¯Œ లో లోయర్‌ బెర్త్‌పై పడుకున్న పెద్దాయన అప్పుడే లేచి కూచోవటంతో, ‘‘సార్, నాది సైడ్‌ అప్పర్‌. కాసేపు ఇక్కడ...’’ అని అడిగి, ఆయన అనుమతితో పక్కనే కూచున్నాడు. 

    ‘‘ఎక్కడిదాకా?’’ పెద్దాయన అడిగాడు.‘‘నెల్లూరు సార్‌. మీరు?’’‘‘తిరుపతి. ఏం చేస్తుంటావు?’’‘‘స్వచ్ఛంద సంస్థలో సర్‌’’‘‘అంటే అనాథాశ్రమాలూ, వృద్ధాశ్రమాలూ... విరాళాలూ’’ చివరి మాటకుముందు చిన్న విరామం ఇచ్చి, స్వరానికి కాస్త వ్యంగ్యం జోడించి అడిగాడు. రామ్‌కు ఇలాంటివి అలవాటే. వాళ్ల చిన్నచూపు పట్ల పుట్టే చిన్ననవ్వును తొక్కిపట్టుకోవడం కూడా!‘‘కాదు సర్‌. రెండు రాష్ట్రాల్లో సుమారు రెండువేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించే ప్రాజెక్టుకు హెడ్‌గా ఉన్నాను. గవర్నమెంటు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై నిర్వహిస్తున్న సదస్సుకు స్పెషల్‌ గెస్టుగా రమ్మంటే...’’‘‘ఇంట్రెస్టింగ్‌’’ కళ్లెగరేస్తూ చూశాడాయన.‘‘మీరేం చేసేవారు?’’ వినమ్రంగా అడిగాడు రామ్‌.‘‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో జీఎంగా పనిచేసి రిటైరయ్యాను. నాకూ వ్యవసాయమంటే చాలా ఇష్టం కాని, నాగలి పట్టుకునే అదృష్టం దక్కలేదు...’’‘‘భూమిని కౌగిలించుకోబోయి, ఏకంగా ఆకాశాన్నే అందుకున్నారు. అదింకా పెద్ద అదృష్టమేగా సార్‌’’ అన్నాడు నవ్వుతూ.‘‘ఘటికుడివేనోయ్‌. భలే చెప్పావ్‌’’ పెద్దగా నవ్వేశారాయన.

    ‘‘మీ పేరు?’’‘‘గోపాలయ్య’’. ఎదుటి బెర్తు వైపు వేలు చూపిస్తూ ‘‘మా ఆవిడ... రుక్మిణి’’ అన్నాడు.‘‘నమస్తే అమ్మా. నా పేరు రామ్‌’’ చెప్పి, ‘‘బాలాజీ దర్శనానికేనా?’’ అనడిగాడు.‘‘అవునయ్యా రామూ. ఆయన డిమాండు రోజురోజుకూ పెరిగిపోతంది. ఎంపీలు, ఎమ్మెల్యేల లెటర్లు దొరకటం లేదు. మా ఇద్దరికీ శ్రీవాణి టిక్కెట్లు బుక్‌ చేసుకున్నాం, అది కూడా దొడ్డిదారిన’’ అన్నాడాయన చిరుమందహాసాన్ని మీసాల వెనక దాచుకుంటూ.మరికొన్ని ముచ్చట్లు నడిచినా, ఆమె మాత్రం మాట కలపలేదు.రాత్రి ఎనిమిది దాటుతుండగా ఆమె బ్యాగులోంచి బాక్స్‌ బయటకు తీసింది. ఇద్దరూ ఇడ్లీ తిన్నారు. చెయ్యి కడుక్కోటానికి వెళ్తున్నప్పుడు గమనించాడు... ఆయన తడబడుతూ నడవటం! రామ్‌ తన బెర్తుపైకి ఎక్కి, తెచ్చుకున్న టిఫిను ఇంకో ప్యాసింజరుకు పంచిపెట్టేవాళ్లు ఉండరని గ్రహించి– రైల్లో లభ్యమయ్యే చపాతీలనబడే ఆహారంతో కడుపు నింపుకొని, పుస్తకంలో మునిగిపోయాడు. రాత్రి పది దాటాక నిద్ర పట్టింది.

    తెల్లవారుజామున 2.40 గంటలకు సెల్‌ఫో¯Œ లోని అలారం మోగకముందే, ఏవో శబ్దాలు రామ్‌ చెవులకు లీలగా తాకుతుండటంతో మెలకువ వచ్చింది. కర్టెను పక్కకు జరిపి చూశాడు. మూసి ఉన్న కర్టెను లోపల్నుంచి భార్యాభర్తల మాటలు వినిపిస్తున్నాయి. ఆమె స్వరంలో ఆందోళన.టైమ్‌ చూస్తే, రెండున్నర. తెర కాస్త తొలగించి చూద్దామనుకొని, అంతలోనే విరమించుకున్నాడు. ఆమె స్వరంలో తీవ్రత పెరుగుతోంది. కిందికి దిగి, చెప్పులు తొడుక్కుంటుండగా, ఆమే తెరలోంచి తల బయటికి పెట్టి, ‘బాబూ, నువ్వు నెల్లూరులో దిగుతావు కదూ’ అనడిగింది.‘‘అవునమ్మా’’ చెప్పాడు రామ్‌.‘‘ఈయనకి ఆరోగ్యం బాలేదు. మేమూ ఇక్కడే దిగిపోతే, సాయం చెయ్యగలవా? స్టేషన్‌కు దగ్గర్లో ఆస్పత్రులేమైనా ఉన్నాయా?’’ ఆమె కంఠం కంగారుగా వణుకుతోంది.

    చొరవగా క్యాబిన్‌ కర్టెన్‌ జరిపాడు రామ్‌. లైటు వెలుగుతోంది. పై బెర్తుల్లోని ఇద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. సైడ్‌ లోయర్‌ బెర్తులోని దంపతులు కూచునే నిద్ర పోతున్నారు.పెద్దాయన ఆయాసంతో కిందామీదా అవుతున్నాడు. విపరీతంగా దగ్గుతున్నాడు. స్థిరంగా కూచోలేడు; సుఖంగా పడుకోలేడు. గుండెలపై చేతులుంచుకొని, ఏటవాలుగా కూచున్నాడు. రామ్‌కు భయమేసింది. ఆయన పక్కనే కూచొని, ‘‘ట్యాబ్లెట్లేమైనా ఉన్నాయా?’’ అని అడిగాడు. ‘‘వేసుకున్నాడు బాబూ’’ చెప్పిందామె. ఆయన కూడా సైగలతో అదే విషయం చెప్పాడు. ‘‘హార్ట్‌ ప్రాబ్లమ్‌ ఉందా?’’ మాటల కొనసాగింపు యత్నమది.‘‘లేదు. షుగరుంది, పదేళ్ల పైనుంచే’’ ఆమె సమాధానం.ఆయన మెల్లగా బెర్తుపై పడుకున్నాడు.‘‘సార్‌కి ఇంకేమైనా కంప్లైంట్స్‌ ఉన్నాయా?’’‘‘లేవు. కాకపోతే ఒక వారం రోజుల్నుంచీ పనులనీ, ఫంక్షన్లనీ ఊళ్లు తిరుగుతున్నాం’’.‘‘బాగా అలసిపోయి ఉంటార్లెండి. 

    మరేం ఫర్లేదు. అయిదు నిమిషాల్లో నెల్లూరు వస్తుంది’’.‘‘ఆయన్ని చూస్తుంటే భయమేస్తోంది బాబూ. నెల్లూరులోనే దిగిపోతాం. వెంటనే ఆస్పత్రికి వెళ్తే మంచిదనుకుంటున్నా’’.‘‘అదే మంచి పనమ్మా’’ ఆ మాట అంటూనే, తనకోసం వచ్చే కారు డ్రైవరుకు ఫోన్‌ చేశాడు.‘‘స్టేషన్‌ కు వచ్చాను సార్‌. మీరు దిగింతర్వాత నాలుగో నంబరు ప్లాట్‌ఫామ్‌ కల్లే రండి. ఒకటో నంబరు వైపు బ్రిడ్డి పనులు జరుగుతున్నాయి. రోడ్డు బాలేదు.’’‘‘అలాగేలే గాని, స్టేష¯Œ కు దగ్గర్లో మంచి ఆస్పత్రులేమైనా ఉన్నాయా?’’‘‘అపోలో దగ్గరే సార్‌. పావుగంటలో ఎల్లిపోవచ్చు. ఎందు...’’ చంద్రం ఇంకా ఏదో చెబుతూనే ఉన్నా, రామ్‌ డిస్కనెక్ట్‌ చేశాడు. రామ్‌ తన బ్యాక్‌ ప్యాక్‌ బ్యాగ్‌ను భుజాలకు తగిలించుకున్నాడు. వాళ్లదీ ఒక్కటే పెద్ద బ్యాగు. దాన్ని చేతుల్లోకి తీసుకొని, ‘మీరు సార్‌ని తీసుకొని దిగండమ్మా’ అని చెప్పి, డోర్‌ దగ్గరకు నడిచాడు.ఆమె భర్తను పొదివి పుచ్చుకొని, మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది.

    రైలు ఆగగానే రామ్‌ చకచకా దిగి, బ్యాగులు ప్లాట్‌ఫామ్‌పై ఉంచి, చెయ్యందించి ఆమెను జాగ్రత్తగా కిందికి దించాడు. చెయ్యందించినా పెద్దాయన మాత్రం దిగలేకపోయాడు. కదిలే సమయమైందంటూ రైలు కూత వేస్తోంది. ఆమెలో ఆందోళన. రామ్‌ గభాల్న వెనక్కి తిరిగి, ఆయన్ని వీపుపైకి వాల్చుకొని, కిందికి దింపేశాడు. ఆయన రొప్పుతూనే అయిదారు అడుగులు వేసి, సిమెంటు సోఫాలో కూలబడ్డాడు. ఆమె గబగబా వెళ్లి, పక్కనే కూచుంది.‘‘మెల్లగా నడిపించుకుంటూ రండమ్మా’’ బ్యాగులు తీసుకుంటూ ముందుకు నడిచాడు రామ్‌.భర్త కుడిచేతిని తన భుజాలపై వేసుకొని కదిలిందామె.రామ్‌ మధ్యమధ్యలో ఆగి, వెనుదిరిగి చూస్తున్నాడు. సన్నగా వర్షం మొదలైంది. చల్లటి గాలి దురుసుగా వీస్తోంది. ఆయన అడుగుతీసి అడుగెయ్యటానికి యాతన పడుతున్నాడు.కొంత దూరం నడిచాక ర్యాంపు మొదలైంది. అందులోంచి కిందికి దిగారు. అయిదారు సార్లు ఆగి, సేదదీరి, ఆ దంపతులు దగ్గరయ్యారు. పైకి దారితీసింది ర్యాంపు. ఆయన ఎక్కగలిగే పరిస్థితి కనిపించలేదు. ఆమె కూడా అలసిపోయి, రొప్పుతోంది.
    ‘‘ఎక్కడ సార్‌’’ చంద్రం ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు.

    రామ్‌ గబగబా పైకెక్కి, రెండు బ్యాగులూ అక్కడుంచి, మళ్లీ ర్యాంపు మీంచి కిందికి దిగాడు. ఆమెను పక్కకు తప్పుకోమని, ఆయన్ని భుజాలపై ఎత్తుకొని, నాలుగో ప్లాట్‌ఫామ్‌ పైకి చేరుకున్నాడు. బయటికెళ్లే ప్రధాన ద్వారానికి దగ్గర్లో ఉన్న బెంచీపై ఆమె, ఆయన కూచున్నారు.అయిదు నిమిషాల్లో కారొచ్చింది. చంద్ర సాయంతో ఆయన్ని వెనక సీట్లో కూచోబెట్టారు. ఇరవై నిమిషాల తర్వాత కారు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఆగింది. వీల్‌ చెయిర్లో ఆయన్ని లోపలికి తీసుకెళ్లి, బెడ్‌ మీద పడుకోబెట్టారు. ఇద్దరు నర్సులు వచ్చారు. ఒకరు వైటల్స్‌ చెక్‌ చేయటం మొదలు పెడితే; మరొకరు కార్డియాక్‌ మానిటర్, పల్స్‌ ఆక్సిమీటర్‌ అమర్చారు. ఫ్లూయిడ్స్‌ సిద్ధం చేశారు. ఆమె, రామ్‌ చూస్తూ నిలబడ్డారు. 

    డ్యూటీ డాక్టరు వచ్చి, ఏం జరిగిందన్నట్లు ఇద్దరి వంకా చూశాడు. ఆమె గొంతు బొంగురు పోవటంతో, రామ్‌ వివరించాడు. ‘‘మీరు రిసెప్షన్‌ కౌంటర్‌ దగ్గరకెళ్లండి’’ అని, స్టెత్‌తో పరీక్షించటం మొదలు పెట్టాడు.‘‘ఆయన పేరు చెప్పండి’’ అడిగాడు కౌంటర్లోని వ్యక్తి.‘‘గోపాలయ్య. వయసు 68’’ చెప్పాడు రామ్‌.మిగతా వివరాలూ చెప్పాక, కన్సల్టన్సీ ఫీజు కట్టమన్నాడు. ఆమె తన వానిటీ బ్యాగ్‌లో డబ్బుల కోసం వెతుకుతుండగా, ‘నేను కట్టేస్తాలేమ్మా’ అంటూ ఫోన్‌ పే ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించాడు.‘‘మీ పిల్లలు...?’’ వెయిటింగ్‌ హాల్‌లో పది నిమిషాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు రామ్‌.ఆమె ఫోను మోగింది. కట్‌ చేసింది. మాటల పొదుపరో, ఆ స్థితి కారణంగా మౌనంలో మమేకమైందో అంతుబట్టడం లేదు. రామ్‌కూ, ఆమెకూ మధ్యలో ఓ ఖాళీ కుర్చీ.

    ‘‘ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు’’ కళ్లు తుడుచుకుంటూ చెప్పిందామె.‘‘ఆరోగ్యం బాగాలేనప్పుడు, తిరుపతి రావటం ఆగిపోవాల్సింది!’’ అన్నాడు ఆమె వైపు చూస్తూ.‘‘నేనా మాట అన్నాను బాబూ. మరేం ఫర్వాలేదన్నాడాయన...’’ ఇంకేదో చెప్పబోయిందిగాని, దుఃఖం పొంగుకు రావటంతో మూగవోయింది.‘‘ఆయనకేమీ కాదు. నన్ను నమ్మండి’’.‘‘నమ్మటం తప్ప వేరే దారిలేదు బాబూ’’.కొంత నిశ్శబ్దం తర్వాత ‘‘నీ పూర్తి పేరేంటి?’’ అడిగిందామె. చెప్పాడు రామ్‌.అయిదు నిమిషాలు గడిచాక నర్సు పిలవటంతో ఇద్దరూవెళ్లి డాక్టర్ని కలిశారు.‘‘మీరనుకుంటున్నట్లు ఆయాసం ఒక్కటే ఆయన సమస్య కాదు...’’ డాక్టర్‌ చెప్పటం మొదలు పెట్టాడు. ‘‘కండిషన్‌ క్రిటికల్‌గా ఉంది. పది నిమిషాల్లో స్పెషలిస్ట్‌ వస్తున్నాడు. మూడు గంటలు గడిస్తేగాని చెప్పలేం. కొన్ని ఫామ్స్‌ మీద మీ సంతకాలు కావాలి’’ చెబుతూనే, నర్సు వంక చూశాడు డాక్టర్‌. వాళ్లిద్దరినీ తనవెంట తీసుకెళ్లిందామె.

    సంతకాలయ్యాక ఇద్దరూ మళ్లీ వెయిటింగ్‌ హాల్లోకి వచ్చారు. ఆమె ఫోను మోగింది. కట్‌ చేసింది. ఇద్దరి మధ్యా భయంకరమైన నిశ్శబ్దం. గాయాలపాలైన కాలం ముందుకు కదల్లేకపోతోంది. గాఢమైన వేదనలోంచి గొంతు విప్పిందామె.‘‘అత్తమామలే కాదు, అమ్మనాన్నలు కూడా కులం పేరుతో అడ్డుకున్నారు. కలవటానికి వీల్లేదన్నారు. రచ్చబండ మీద గ్రామబహిష్కార ప్రకటన దగ్గర వికసించిన మా ప్రేమ... ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలసిపోలేదు, అవిసిపోలేదు. ఆయన అందరినీ ఎదిరించారు. నాకోసం ఆస్తులన్నీ వదులుకున్నారు. కట్టుబట్టలతో నగరానికొచ్చాం. ఇప్పటికీ ఆయన నన్ను ‘అమ్మా’ అనే పిలుస్తా...’’ మాట పూర్తి కాకుండానే ఒక్క పెట్టున ఏడ్చేసింది.ఆమెనెలా ఓదార్చాలో అతనికర్థం కాలేదు.

    ఏడ్చీ ఏడ్చీ ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. మెల్లగా దుఃఖాన్ని ప్రేమించటం అలవరచుకుంటోంది.రామ్‌లోనూ సందేహాల చిక్కుముళ్లు బిగుసుకుంటున్నాయి.ఏమవుతుంది? ఏం జరగబోతోంది? ఏమైనా జరిగితే? తన భాగస్వామ్యమేమిటి?...టీ స్టాల్‌ దగ్గర మనుషుల అలికిడికి రామ్‌ అడుగులు అటువైపు మళ్లాయి.కుర్చీలోనే దిగులుముద్దలా కూచొని ఉన్న ఆమె భుజంతట్టి పిలిచాడు రామ్‌.ఆమె కళ్లు విప్పి, మగతగా చూసింది. తన చేతుల్లోని కుంకుమపొట్లం ఆమెకు అందిస్తూ ‘‘అమ్మా, ఆయనకు చెప్పేశాను. దర్శనమిచ్చాడు. అభయమిచ్చాడు. నలభై నిమిషాల తర్వాత మీరు శుభవార్త వింటారు’’ అని చెప్పాడు. కిటికీ తెరిచాడు. ఆకాశం నుంచి తెల్లటి వెలుగు భూమ్మీదకు జాలువారుతోంది.

    కొత్త సంకల్పమేదో చిగురించి, మనసులో బలంగా స్థిరపడింది.‘‘నేను చెప్పేది నిజమమ్మా. నన్ను నమ్మండి’’ నమ్మకాన్ని నిలబెట్టే మాటసాయం తప్ప తనింకేమీ చేయలేడన్న విషయం రామ్‌కు తెలుసు.ఆమె రామ్‌ కళ్లల్లోకి చూసింది, నమ్మకంగా!ముప్ఫయ్యారు నిమిషాల ముళ్ల రక్కుళ్ల తర్వాత... డాక్టర్‌ నుంచి పిలుపు.‘‘హి ఈజ్‌ ఆల్‌రైట్‌. ప్రాణాపాయం లేదు. సాయంత్రం దాకా అబ్జర్వేషన్‌ లో ఉంచాలి.’’‘‘థాంక్యూ డాక్టర్‌’’ ఇద్దరూ ఒకేసారి అన్నారు.వార్డులోంచి ఇద్దరూ తేలికైన అడుగులతో హాల్లోకి నడిచారు. ఫోను మోగింది. ఆమె కట్‌ చేసింది. రామ్‌ బలవంతంపై ఆమె బ్రష్‌ చేసింది. తను వెళ్లి, టిఫిన్‌ పార్సిల్‌ తెచ్చాడు.మరో గంట గడిచింది. పేషెంటును స్పెషల్‌ రూముకు మార్చారు.

    తొమ్మిది కావస్తోంది. అప్పటికే డ్రైవరు అయిదారుసార్లు ఫోన్‌ చేశాడు.‘‘అమ్మా. మీరింక భయపడనక్కర్లేదు. రేపు మధ్యాహ్నానికి డిశ్చార్జ్‌ చేస్తారు. మీకెలాగూ రిటర్న్‌ టికెట్స్‌ ఉన్నాయి కదా, రేపు రాత్రికి ట్రైన్‌లో వెళ్లిపోండి’’ అని చెప్పి, బ్యాగ్‌ తగిలించుకున్నాడు.ఆమె రామ్‌ చెయ్యి పట్టుకొని బెడ్‌ దాకా నడిపించుకెళ్లి, ‘తను వెళ్లిపోతాడంట’ అంది భర్త కళ్లలోకి చూస్తూ. ఆయన తన నోటికి అడ్డంగా ఉన్న మాస్క్‌ను ఎడమచేత్తో తొలగించుకొని, కుడిచేతిని మెల్లగా పైకి లేపాడు. రామ్‌ కరచాలనం చేశాడు.ఆయన రెండు కళ్లనుంచీ బాష్పాలు ధార కట్టాయి. రామ్‌ కళ్లు సజలమయ్యాయి.ఆమె ఆస్పత్రి బయటదాకా వెంటవచ్చి, రెండు చేతులూ జోడించి, ‘‘బాబూ, నువ్వే లేకపోతే ఏమైపోయేవాళ్లమో...’’ అంటూ అతన్ని హత్తుకొని, కన్నీటి పర్యంతమైంది.‘‘అయ్యో, అదేంటమ్మా! నా స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే చేస్తారు’’ అంటూ తనూ నమస్కరించి, గేటు దగ్గర ఆగి ఉన్న కారువైపు వడివడిగా వెళ్లిపోయాడు.

    ఫోను మోగింది. ఈసారి ఆన్‌ చేసిందామె. తిరుమల ఏజెంటు.‘‘ఎన్ని రోజుల నుంచి ప్లాన్‌ చేసుకుంటిరమ్మా... నెల్లూరు దాకా వచ్చి స్వామి ఎదటకు రాలేకపోతిరే!’’‘‘ఆయన చల్లటి చూపుంటే మళ్లీ రాకుండా పోతామా? ఎదటకు వచ్చినా పెద్దాయన్ని మేం కోరబోయేది ‘చల్లంగా చూడ’మనే కదా బాబూ. మనసులో ఘోష పెట్టిన మా మొర ఆలకించాడులే’’.‘‘అరుదుగా లభించే అదృష్టం. ప్రత్యేక దర్శనం మిస్సయ్యారనే నా బాధంతా...’’ ఆమెను వేదనలోకి నెట్టడానికి అవతలి గొంతు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.‘‘సశరీరంగా వచ్చిన స్వామి అనుగ్రహాన్ని మనసారా అనుభూతించిన తర్వాత... కనులకు దక్కని భాగ్యం గురించి కించపడేదేముంది నాయనా’’ ఆమె చెబుతోంది, తన్మయంగా.అలా చెబుతున్నప్పుడు ‘తన ప్రశ్న, రామ్‌ జవాబు’ ఆమె మనసులో మార్మోగుతున్నాయి...‘‘నీ పూర్తి పేరేంటి బాబూ?’’‘‘చుట్టాల్లో రవణా అనే వాళ్లమ్మా. కాలేజీలో గిరీ అనీ, వెంకట్‌ అనీ పిలిచేవాళ్లు. తీరా ఉద్యోగంలో చేరాక ‘రామ్‌’ కుదురుకుంది. ఎవరెలా పిలిచినా పలకడం అలవాటైంది. నిజానికి నా పూర్తిపేరు – సప్తగిరి వెంకటరమణ.’’ 
    -ఎమ్వీ రామిరెడ్డి 

  • ‘డిటెక్టివ్‌ పెద్దబ్బాయి’ అనే బోర్డ్‌ ఉన్న ఇంట్లో ఆయన తన అసిస్టెంట్‌ చిన్నబ్బాయితో పేకాడుతున్నాడు.‘‘రెండో డైమండ్‌ ఆసు బల్ల మీదకి ఎలా వచ్చింది సార్‌?’’ చిన్నబ్బాయి కోపంగా అడిగాడు.‘‘మోటివ్‌ నీకు తెలుసు. గెలిస్తే వెయ్యి రూపాయలు. ఎలా వచ్చాయో పరిశోధన చేసి కనుక్కోవాల్సిన బాధ్యత నీదే.’’ పెద్దబ్బాయి నవ్వుతూ చెప్పాడు.‘‘మీరు డిటెక్టివ్‌గా, నేను అసిస్టెంట్‌ డిటెక్టివ్‌గా ఒకరి కలంలోంచి పుట్టిన పాత్రలం. మన సృష్టికర్త ప్రతీ కేస్‌ని మీరే పరిశోధించేలా రాస్తున్నారు. కాబట్టి అది మీ పని.’’పెద్దబ్బాయి మొబైల్‌ మోగింది. అతను ఎవరి నుంచో చూసి ఆన్సర్‌ చేశాడు.‘‘ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయిని. దయచేసి ఈ ఎడ్రస్‌కి రాగలరా?’’  ‘‘ఎందుకు?’’అవతలివైపు నుంచి చెప్పింది విని చెప్పాడు.‘‘సరే. లొకేషన్‌  పంపించండి. వెంటనే బయలుదేరుతాం.’’లైన్‌  కట్‌ చేశాక తన వంక ప్రశ్నార్థకంగా చూసే తన అసిస్టెంట్‌తో డిటెక్టివ్‌ పెద్దబ్బాయి చెప్పాడు.

    ‘‘ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి. హత్య. డూప్లెక్స్‌ ఇంట్లో మెట్ల మీంచి కిందపడి ఒకరు మరణించారు.’’‘‘ప్రతి మరణం హత్య కానవసరం లేదు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మనం ఇంతదాకా పరిశోధించిన ఏ కేస్‌ అయినా హత్య కాకుండా పోయిందా?’’పెద్దబ్బాయి లేచి షెర్లాక్‌ హోమ్స్‌ పైప్‌ని నోట్లో ఉంచుకుని, ఆయన పెట్టుకునేలాంటి టోపీని పెట్టుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. బీఎండబ్ల్యూ కారు ఎక్కాక చిన్నబ్బాయి డ్రైవ్‌ చేస్తూ చెప్పాడు.‘‘థ్రిల్, సస్పెన్‌ ్స పేరిట మన సృష్టికర్త మనల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడు! నా నెత్తి మీద రివాల్వర్‌ పిడితో విలన్లు ఎన్నిసార్లు బాదారో. నేను నిజం మనిషినైతే ఎప్పుడో చచ్చేవాడిని. లేదా పిచ్చెక్కేది. ఇవాళ్టి కేస్‌లో అలాంటిది కాని, మారువేషాలు కాని ఉండవని ఆశిస్తాను. పెట్టుడు గడ్డం జిగురు భయంకరమైన దురదని పుట్టిస్తుంది.’’

    వారి కారు ఓ డూప్లెక్స్‌ ఇంటికి చేరుకుంది. బయట పోలీస్‌ కార్లు ఉన్నాయి.పెద్దబ్బాయిని చూసి పోలీస్‌ కాన్‌ స్టబుల్‌ సెల్యూట్‌ చేసాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. ఇద్దరూ శవాన్ని చూశారు.‘‘ఆయనకి రేచీకటి. మెట్ల మీంచి కాలుజారి పడ్డాడు. అయినా మీ అభిప్రాయం తెలుసుకుందామని రమ్మన్నాను.’’ ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘ఇది హత్య.’’ పెద్దబ్బాయి పైప్‌ గుప్పుగుప్పున పీలుస్తూ చెప్పాడు.‘‘ఎలా కనుక్కున్నారు?’’‘‘సింపుల్‌. ఇంతదాకా మేము ఎన్నడైనా ‘ఇది హత్య కాదు. ప్రమాదకర మరణం’ అని వెనక్కి తిరిగామా? హత్య అయితేనే మన పాత్రలకి ప్రయోజనం.’’ చిన్నబ్బాయి వివరించాడు.హతుడి వయసు అరవై పైనే ఉండొచ్చు. బట్టతల. సరిగ్గా తల మధ్యలో అయిన పెద్ద గాయం నుంచి రక్తం కారుతోంది. పైన నాలుగో మెట్టు మీంచి కింది మెట్టు దాకా కారిన రక్తపు చుక్కలు కనిపించాయి.

    ‘‘ఇతను సంపన్నుడు. ఇతని వారసుల గురించి వాకబు చేశారా?’’ పెద్దబ్బాయి అడిగాడు.ఇన్‌స్పెక్టర్‌  సైగ చేస్తే సర్వెంట్‌ మెయిడ్‌ చెప్పింది.‘‘ఈరికి మనవడు తప్ప ఇంకెవరూ లేరు. కరోనాలో అంతా పోయారు. ఇందాక ఫోన్‌  చేస్తే ఆయన ఆన్సర్‌ చెయ్యలేదు.’’‘‘ఇవాళ అతను ఇక్కడికి వచ్చి వెళ్ళాడా?’’‘‘ఇవాళ మంగళవారం. ఇక్కడ రైతు బజార్‌ నుంచి కూరలబండి వస్తుంది. నేను కూరలకి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చాడేమో తెలీదు. నేను తిరిగి రాగానే ఈయన ఇలా నేల మీద...’’ ఏడుపు వల్ల ఆవిడ మిగిలిన వాక్యాన్ని పూర్తి చేయలేదు.‘‘ఆ వారసుడి దగ్గర ఈ ఇంటి డూప్లికేట్‌ తాళంచెవి ఉందా?’’‘‘ఉంది.’’పెద్దబ్బాయి అతని నంబర్‌ అడిగి ఫోన్‌  చేశాడు.‘‘నా పేరు పెద్దబ్బాయి. డిటెక్టివ్‌ని. మీ తాతగారిని ఎవరో చంపారు.’’‘‘అరెరే. ఏమైంది?’’ అవతల నుంచి మనవడు ఆదుర్దాగా అడిగాడు.‘‘తల మీద గాయమై మరణించారు.

     అది హత్య. మీరు వెంటనే రండి.’’‘‘అది హత్య అని ఎందుకు అనుకుంటున్నారు?’’‘‘మీరు హంతకుడు కాబట్టి. ప్రతి కథలోనూ డిటెక్టివ్‌ ఎవరు హంతకుడో ఇట్టే కనుక్కుంటాడు.’’‘‘మా తాతయ్యకి రేచీకటి. మెట్లు దిగుతూ కాలుజారి మరణించి ఉండచ్చు.’’‘‘రాగానే ఆ హంతకుడిని అరెస్ట్‌ చేయండి.’’ పెద్దబ్బాయి ఇన్‌ స్పెక్టర్‌ బుల్లెబ్బాయికి చెప్పాడు.‘‘అది మీరు గంభీరంగా ఓసారి పైప్‌ని తీసి దానివంక చూసి చెప్పాలి. అతనే హంతకుడనే ఆధారం ఏమిటి?’’ బుల్లెబ్బాయి అడిగాడు.‘‘అతనికి ఎవరూ అతని తాత ఎలా మరణించారో చెప్పలేదు. అయినా మెట్ల మీంచి జారిపడ్డాడని తెలిసిందంటే అతనే హంతకుడు. ఎవరైనా ఆస్తిని వీలైనంత త్వరగా అనుభవించాలని అనుకుంటారు. అందుకే ఈ దురాగతం చేశాడు.’’ఇంటికి వెళ్ళాక మళ్ళీ పేకాటకి కూర్చున్న చిన్నబ్బాయి చెప్పాడు.‘‘నాకు తెలీలేదు. మీరు నా బాస్‌ కాబట్టి ఈ బల్ల మీదకి రెండు డైమండ్‌ ఆసులు ఎలా వచ్చాయో మీరే కనుక్కోవాలి.’’ 
     ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

  • కొన్ని పనులు చూసేందుకు చిన్నగా ఉన్నా.. అందరి హృదయాలను దోచుకుంటుంది. కాస్త మనసుపెడితే..పెద్దపనులతోనే మన ప్రేమను వ్యక్తం చేయాల్సిన పనిలేదు. చాలా చిన్నపాటి వాటితో కూడా అనంతమైన ప్రేమను చాలా సునిశితంగా వ్యక్తం చేయొచ్చు. అందుకు ఈ ఆటో డ్రైవరే నిదర్శనం. 

    బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్‌ తన ఆటోలో వేలాడిదీసిన చెవిపోగులు కారణంగా ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. అవి ఆయన భార్య చెవిపోగులు. రోజంతా ఆమెతో ఉన్నట్లుగా ఫీలయ్యేలా ఆటోలో అద్దానికి వేలాడదీయడంతో అవి ప్రతి ఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిజానికి చాలామంది ఆ అద్దం ముందు పూలు వంటి ఇతర డెకరేటెడ్‌ ఐటెమ్స్‌ పెట్టుకుంటారు. 

    భార్య గుర్తొచ్చేలా..ప్రతి నిమిషం ఆమెతో ఉన్నట్లుగా ఎదురుగా అలా వేలాడదీయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వచ్ఛమైన ప్రేమ మాత్రం చాలా అద్భుతంగా బయటపడుతుంది అనేందుకు ఈ ఆటోడ్రైవర్‌ చేసిన పనే ఉదాహరణ. సింపుల్‌గా చెప్పాలంటే అతడి ప్రేమ చూస్తే..మనుషులెరగలేరు మాములు ప్రేకాదు..అగ్నికంటే స్వచ్ఛమైనది..అనే పాట గుర్తొస్తోంది కదూ..! నెటిజన్లు సైతం సదరు డైవర్‌పై ప్రశంసలు కురిపిస్తు పోస్టులు పెట్టారు.  

     

    (చదవండి: ఆ అమ్మకు దక్కిన వెలకట్టలేని గొప్ప అనుభూతి..!

     

  • ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి పెద్దగా ఏమి ఆశించారు. పిల్లల క్షేమమే సదా ఆ కాక్షించే ఆ పేరెంట్స్‌ రుణం ఏమిచ్చినా..తీర్చుకోలేం. వాళ్ల ప్రేమ అనంతం, అజరామరం. వాళ్లకు ఎంతో ఇష్టమైన పని, లేదా వాళ్ల లైఫ్‌ డ్రీమ్‌ని నెరవేరిస్తే..ఏ  పిల్లలకైనా అంతకు మించిన గొప్ప విజయం మరొకటు ఉండదు. అలాంటి గొప్ప సక్సెస్‌ని సాధించాడు ఈ కొడుకు. తన అమ్మకు ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. ఏ తల్లైన ఇంతకుమించి ఇంకేం కోరుకుంటుంది పిల్లల నుంచి అనిపిస్తుంది కూడా. 

    అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో మనీష్‌ అనే వ్యక్తి విమానం ఎక్కడం అనేది తనతల్లి చిరకాల కోరిక అని. అది ఈ రోజు నెరవేరబోతుందంటూ..తల్లి కొడుకులిద్దరూ విమానం ఎక్కుతున్న దగ్గర నుంచి లోపల కూర్చొని విండోని వీక్షిస్తున్న ప్రతీది వివరంగా చూపించాడు. 

    తన తల్లి మొత్తం కుటుంబంలోనే విమానం ఎక్కిన ఏకైక మహిళ అని భావోద్వేగంగా అన్నాడు. ఆమె కూడా తన కొడుకుతో విమానం ఎక్కుతూ భావోద్వేగంగా చుట్టూ పరికిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి వీడియోలో. 

    ఆమె ఆ ఫ్టైట్‌లో భోజనం తింటూ సిగ్గుపడుతున్న క్షణాలు, కొడుకుని చూస్తూ..తన కల నెరవేర్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్న కమనీయ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఏ తల్లిందడ్రులైనా..ఇంతకు మించి పిల్లల నుంచి ఏమి ఆశించరేమో అనిపిస్తుంది.  

     

    (చదవండి: బ్యాండ్‌ లేదు.. బరాత్‌ లేదు..సింపుల్‌గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్‌ జంట)