Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026 సీజన్ ఫైనల్ బెర్త్‌ను గుజరాత్ టైటాన్స్ ఖరారు చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్‌.. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

    ఈ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్‌ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సుదర్శన్‌(58) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు. 

    అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్‌ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

    అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో గుజరాత్‌ అమీతుమీ తెల్చుకోనుంది.

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో క్వాలిఫయర్‌-2లో సుద‌ర్శ‌న్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. సుద‌ర్శ‌న్ ఇలా విచిత్రంగా ఔట‌వ్వడం ఇది వ‌రుస‌గా రెండో సారి కావ‌డం విశేషం. అంత‌కుముందు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా సుద‌ర్శ‌న్ హిట్ వికెట్‌గా ఔట‌య్యాడు.

    ఏమి జ‌రిగిందంటే?
    ఈ క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీ సాధించి మంచి రిథ‌మ్‌లో క‌న్పించాడు. అయితే గుజ‌రాత్ ఇన్నింగ్స్ 13 ఓవ‌ర్ వేసిన బ్రిజేష్ శ‌ర్మ.. ఐదో బంతిని సుద‌ర్శ‌న్‌కు ఫుట్‌టాస్‌గా సంధించాడు. ఆ బంతిని ఆఫ్‌సైడ్ డీప్‌స్క్వేర్ దిశ‌గా బౌండ‌రీకి త‌ర‌లించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది.

    గత మ్యాచ్‌లో బ్యాట్ కిందపడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే, ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీద పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్క‌సారిగా సెలైంట్ అయిపోయింది. శుభ్‌మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోయాడు. 

    లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తన మార్క్ స్టైల్‌లో... "ఎక్కడ ఉంది ఫెవికాల్? ఎక్కడ ఉంది?  వ్యాఖ్య‌నించాడు. బ‌హుశా క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ ప్లేయ‌ర్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో హిట్‌వికెట్ అవ్వ‌డం ఇదే తొలిసారి కావ‌చ్చు. సుద‌ర్శ‌న్ మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58 పరుగులు చేశాడు.


     

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 97 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయిన వైభవ్‌.. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్‌పై అదే సీన్ రిపీట్ చేశాడు. 

    ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్‌తో క్వాలిఫయర్‌-2లో వైభవ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను వైభవ్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ సులువుగా తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వైభవ్ నిలిచిపోయాడు.

    రబాడ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి థర్డ్‌మ్యాన్‌లో వైభవ్‌ దొరికపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ ఈ విధంగానే అతడు తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు.

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్‌ అయిన బ్యాటర్ల సరసన వైభవ్ చేరాడు. డేవిడ్ వార్నర్, కె.ఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును అతను సమం చేశాడు.

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్లు వీరే
    వైభవ్ సూర్యవంశీ-3
    డేవిడ్‌ వార్నర్‌-3
    కేఎల్‌ రాహుల్‌-3
    గ్లెన్‌ మాక్స్‌వెల్‌-3
    రుతురాజ్‌ గైక్వాడ్‌-3
     

  • రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్‌-2026లో ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌ను తన విరోచిత ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆదుకున్నాడు. 

    తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్‌.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్‌పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మ

    రోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్‌ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

    వైభవ్‌ సాధించిన రికార్డులు ఇవే
    ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

    అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో పవర్‌ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్‌తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీలో వైభవ్‌ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకోలేకపోయారు. వైభవ్‌ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు.
    చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం



     

     

  • ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన  చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మ‌న్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.

    రియాన్ ప‌రాగ్ 'హెడ్స్' అని కాల్‌ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి,  రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా..  రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.

    ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్‌ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.
    చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం



     

     

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో త‌న బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 15 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ సూర్య‌వంశీ 242 స్ట్రైక్‌రేట్‌తో 680 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ ఉప‌యోగిస్తున్న బ్యాట్ స్పాన్స‌ర్‌షిప్‌కు సంబంధించి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 

    ప్రస్తుతం వైభ‌వ్ సూర్య‌వంశీ వాడుతున్న బ్యాట్‌కు ఎస్ఎస్ (స‌రీన్ స్పోర్ట్స్‌) కంపెనీ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే ఇక‌పై వైభ‌వ్ త‌న బ్యాట్‌పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్ల‌కు ఎక్కువ అని చెప్పొచ్చు. 

    అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్‌ ఎస్‌ఎస్‌తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజ‌మైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభ‌వ్ పోటీగా మార‌నున్నాడు.

    ప్ర‌స్తుతం కోహ్లీ బ్యాట్‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభ‌వ్ బ్యాట్‌కు స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొన‌సాగుతున్నాయి. ఇలా వైభ‌వ్ త‌న బ్యాట్‌తో ప‌రుగుల సునామీ సృష్టించ‌డ‌మే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించ‌బోతున్నాడు.

    చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్‌!

  • Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates:  ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ ఫైనల్ బెర్త్‌ను గుజరాత్ ఖరారు చేసుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

    ఈ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్‌ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సుదర్శన్‌(58) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.  రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు. మే 31న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీతో గుజరాత్‌ తలపడనుంది.

    సుందర్‌ అవుట్‌
    వాషింగ్టన్‌ సుందర్‌(6).. బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 104 పరుగులు చేసిన గిల్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

    శుబ్‌మన్‌ సెంచరీ
    గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గుజరాత్‌ విజయానికి 38 బంతుల్లో 39 పరుగులు కావాలి.

    గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
    సాయిసుదర్శన్‌(58) రూపంలో గుజరాత్ తొలి వికెట్‌ కోల్పోయింది. సుదర్శన్‌ మరోసారి హిట్‌వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.

    విజయం దిశగా గుజరాత్‌
    గుజరాత్‌ టైటాన్స్‌ విజయం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌(39 బంతుల్లో 81), సాయిసుదర్శన్‌(27 బంతుల్లో 51) దుమ్ములేపుతున్నారు. గుజరాత్‌ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాలి.

    దుమ్ములేపుతున్న గుజరాత్‌ ఓపెనర్లు
    6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(30), శుబ్‌మన్‌ గిల్‌(29) ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న గుజరాత్‌
    215 పరుగుల భారీ లక్ష్య చేధనను గుజరాత్‌ టైటాన్స్‌ ఘనంగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(21), సాయిసుదర్శన్‌(14) ఉన్నారు.

    వైభవ్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్‌
    ముల్లాన్‌పూర్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్‌ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 

    అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. ఫలితంగా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.
    వైభవ్‌ సెంచరీ మిస్‌
    రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీని 4 పరుగులు దూరంలో మిస్‌ చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్‌ ఔటయ్యాడు.

    వైభవ్‌ హాఫ్‌ సెంచరీ
    వైభవ్‌ సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 129/5

    రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆర్చర్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా తిరిగి ​క్రీజులోకి వచ్చాడు.

    రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    దసన్‌ షనక రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన షనక.. హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    రియాన్‌ పరాగ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    రియాన్‌ పరాగ్‌ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
    జడేజా రిటైర్డ్‌ హార్ట్‌
    మంచి టచ్‌లో కన్పించిన రవీంద్ర జడేజా(19 బంతుల్లో 34) గాయం కారణంగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 100/2

    మొదలెట్టిన వైభవ్‌
    వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 27) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ స్కోర్‌: 45/2

    రాజస్తాన్‌కు భారీ షాక్‌.. 13 రన్స్‌కే 2 వికెట్లు
    ధ్రువ్‌ జురెల్‌ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 13/2

    రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌
    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ య‌శస్వి జైశ్వాల్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

    ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    గుజరాత్‌ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్‌ సాయికిషోర్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్‌ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జట్లు
    గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

    రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా

  • సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్ర‌వారం జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ప్రపంచ నంబర్ 1, అన్ సే యాంగ్(దక్షిణ కొరియా) చేతిలో సింధు ఓట‌మి పాలైంది. 

    దాదాపు 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో యాంగ్ దూకుడు ముందు సింధు నిలవ‌లేక‌పోయింది. దీంతో ఈ సౌత్ కొరియా సూప‌ర్ స్టార్ 21-17, 21-14 తేడాతో వరుస సెట్లలో సింధుపై విజ‌యం సాధించింది. అన్ సే యంగ్ చేతిలో సింధు ఓడిపోవ‌డం ఇది వ‌రుస‌గా 9వ సారి కావ‌డం గ‌మ‌నార్హం.

    ఇక సింధు ఇంటిముఖం ప‌ట్టిన స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి  మాత్రం సెమీస్‌లో అడ‌గుపెట్టారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఈ భార‌త ద్వ‌యం మలేషియా జోడీ కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్‌పై 19-21, 21-17, 21-13తో అద్భుత విజయం సాధించారు.
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. జ‌ట్టును న‌డిపించ‌డంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో సీజ‌న్ మ‌ధ్య‌లోనే పాండ్యాను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ముంబై యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

    ఇందుకు అత‌డు త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్‌లో పెట్టిన పోస్టులే ఉదాహ‌ర‌ణ‌. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో ముంబై యాజ‌మాన్యం కూడా పాండ్యాను జ‌ట్టు నుంచి రిలీజ్ చేయాల‌ని భావిస్తోంది. ముంబై ఇండియ‌న్స్ నుంచి బ‌య‌టికి రానున్న హార్దిక్ పాండ్యా వ‌చ్చే సీజ‌న్‌లో ఏ జ‌ట్టులోకి వెళ్తే బాగుంటుంద‌నే చ‌ర్చ జోరుగా  సాగుతుంది. 

    సీఎస్‌కే లేదా ల‌క్నోకు పాండ్యా కెప్టెన్‌గా వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ జ‌ట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవ‌కాశం లేక‌పోలేదు. 2022 ఐపీఎల్‌ సీజ‌న్‌లో తొలిసారి ఆడిన‌ గుజ‌రాత్ టైటాన్స్‌ను చాంపియ‌న్‌గా నిలిపాడు హార్దిక్‌ పాండ్యా. త‌ర్వాతి సీజన్లోనూ ఆ జ‌ట్టును ఫైన‌ల్ చేర్చాడు. 

    అయితే గుజ‌రాత్‌ను చాంపియ‌న్‌గా నిల‌ప‌డంతో ముంబై ఇండియ‌న్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధ‌ర‌కు జ‌ట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జ‌ట్టు ప‌గ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. గ‌తేడాది సీజ‌న్‌లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజ‌న్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు ఆట‌గాడిగా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. మైదానంలో ఆట‌గాళ్ల‌తో అగ్రెసివ్‌గా ఉండ‌డం, జ‌ట్టులో సీనియ‌ర్ల‌తో స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం పాండ్యాకు పూర్తి నెగెటివ్‌గా మారిపోయింది. 

    ఈ క్ర‌మంలోనే తాను ముంబైని వీడుతున్న‌ట్లు ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజ‌న్‌లో ముంబై ఆఖ‌రి మ్యాచ్ ఆడిన త‌ర్వాత పాండ్యా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తూ ధ‌రించిన‌ జెర్సీని విప్పి అభిమానుల వైపు విసిరేశాడు. అంతేకాదు రాజ‌స్తాన్‌తో మ్యాచ్ అనంత‌రం చాలా అల‌సిపోయాన‌ని, మారేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప‌రోక్షంగా హింట్ ఇచ్చాడు. మ‌రి ముంబై ఇండియ‌న్స్‌ను వీడ‌నున్న పాండ్యా ఏ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముందో ఇప్పుడు ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

    ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌:
    ముంబై నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే హార్దిక్ పాండ్యా ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న పంత్ ఇప్ప‌టికే తాను కెప్టెన్సీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 27 కోట్లు వెచ్చించిన ల‌క్నో యాజ‌మాన్యం కూడా పంత్ ప్ర‌ద‌ర్శ‌న‌పై అసంతృప్తితోనే ఉంది. పంత్‌ను వ‌దిలేసుకుంటే ల‌క్నో ద‌గ్గ‌రు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ మేర‌కు హార్దిక్ పాండ్యాను మంచి ధ‌ర‌కు త‌మ జ‌ట్టులోకి తీసుకోవ‌డ‌మే గాక కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
    ఐపీఎల్ ఆరంభం నుంచి కొన‌సాగుతున్న జ‌ట్ల‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఒక‌టి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌గా పేరు మార్చుకున్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు త‌లరాత మాత్రం మార‌డం లేదు. ప్ర‌స్తుత ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ అంతంత‌మాత్రంగా రాణించాడు. జ‌ట్టులో ప్ర‌ధాన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీపై పెద్ద‌గా ఆస‌క్తి లేదు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ స్థానంలో హార్దిక్‌పాండ్యాను కెప్టెన్‌గా నియ‌మిస్తే ఆల్‌రౌండర్‌గానూ సేవ‌లందించే అవ‌కాశం ఉంటుంది. అయితే అక్ష‌ర్ ప‌టేల్‌ను ఢిల్లీ రిలీజ్ చేయ‌క‌పోవ‌చ్చు.

    కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌:
    2024లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ త‌ర్వాత ఉన్న‌ప‌ళంగా అయ్య‌ర్‌ను వ‌దిలేసుకుంది. దీంతో అజింక్య రహానేను కెప్టెన్‌గా నియ‌మించింది. అత‌డి కెప్టెన్సీలో కేకేఆర్ పెద్ద‌గా రాణించింది లేదు. ఈ సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో ఆరు వ‌రుస పరాజ‌యాలు ర‌హానేపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి. కామెరున్ గ్రీన్ ట్రేడింగ్‌లోకి వెళ్తే మాత్రం ముంబై ఇండియ‌న్స్ పాండ్యాను కేకేఆర్‌కు బ‌ద‌లాయించే అవ‌కాశ‌ముంటుంది. అప్పుడు పాండ్యాకు కేకేఆర్ కెప్టెన్ బాధ్య‌త‌లు అప్పగించే అవ‌కాశం కూడా ఉంది.

    చెన్నై సూప‌ర్‌కింగ్స్‌:
    ఇక ల‌క్నో త‌ర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వెళ్లేది సీఎస్‌కే జ‌ట్టులోకేన‌ని చాలా మంది అభిప్రాయం వ్య‌క్తం చేశారు.ఈ సీజ‌న్‌లో కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అయితే సీజ‌న్‌లో మ‌ధ్య‌లో వ‌రుస విజ‌యాల‌తో ఊపందుకున్న సీఎస్‌కే ఒక ద‌శ‌లో ప్లేఆఫ్ రేసులోనూ నిలిచింది. అయితే ఇప్ప‌టికే రాజ‌స్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంస‌న్‌ను కూడా రుతురాజ్ స్థానంలో కెప్టెన్‌ను చేసే అవ‌కాశం లేక‌పోలేదు. అయితే ప్ర‌శాంత్ వీర్ లేదా శివ‌మ్ దూబేల‌లో ఒక‌రిని సీఎస్‌కే విడుద‌ల చేస్తే మాత్రం ట్రేడింగ్‌లో సీఎస్‌కే పాండ్యాను ద‌క్కించుకునే అవ‌కాశ‌ముంది.

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌:
    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బ‌లంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ రియాన్ ప‌రాగ్ కెప్టెన్సీ అనుభ‌వ‌లేమి కొట్టొచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే యాజ‌మాన్య హ‌క్కులు చేతులు మార‌డంతో వ‌చ్చే సీజ‌న్‌లో రాజ‌స్తాన్ కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ పాండ్యా రాజ‌స్తాన్‌లోకి వ‌స్తే మాత్రం రియాన్ ప‌రాగ్ స్థానంలో అత‌డికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

    చదవండి: ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!

  • టీమిండియా స్టార్‌ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ రిష‌బ్ పంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. లక్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి పంత్ వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటిచింది. ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

    "రిషభ్ పంత్ లక్నో సూపర్‌ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. క్రికెట్‌లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. ఒక కెప్టెన్‌గా అతడు సూపర్ జెయింట్స్‌కు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. 

    ఇప్పుడు మా దృష్టి అంతా జట్టు ప్రయోజనాల పైనే ఉంది. రాబోయే రోజుల్లో జట్టును మళ్లీ పటిష్టంగా నిర్మించడమే మా లక్ష్యమని లక్నో సూపర్‌ జెయింట్స్  టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

    కెప్టెన్‌గా అట్టర్ ప్లాప్‌
    కాగా ఐపీఎల్‌-2025 వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ స్ధానంలో తమ​ జట్టు పగ్గాలను పంత్‌కు లక్నోకు అప్పగించింది. కానీ లక్నో యాజమాన్యం నమ్మకాన్ని రిషబ్ నిలబెట్టుకోలేకపోయాడు.

    ఐపీఎల్‌-2025, 26  సీజనల్లో అతడి కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ రెం‍డు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. ఈ ఏడాది సీజన్‌లో లక్నో మరింత ఘోరంగా విఫలమైంది. 

    ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంత్ కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. దీంతో అత‌డిపై తీవ్ర స్ధాయిలో విమ‌ర్శలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ల‌క్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకొన్నాడు.
    చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’

  • ఇంగ్లండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్ వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ జట్టులో  డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.

    పదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన కరేబియన్ జట్టు.. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసు​కోలేకపోయింది. అటు విండీస్‌ పురుషల జట్టు కూడా 2016 తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. దీంతో తమ 10 ఏళ్ల సుదీర్ఘ నిర్ణీక్షణకు తెరదించాలని విండీస్ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. 

    అయితే సాధరణంగా ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ వెస్టిండీస్ సెలెక్టర్లు అనూహ్యంగా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. . అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, మాండీ మంగ్రూ, కరిష్మా రామ్‌హారక్, హేలీ మాథ్యూస్, జైదా జేమ్స్ వంటి స్పిన్నర్లు విండీస్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. 

    ఇక ఈ టోర్నీలో విండీస్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి.  వెస్టిండీస్ జట్టు జూన్ 13న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో తన ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది.

    మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కు వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్ హెన్రీ, డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లీన్, షెమైన్ కాంప్‌బెల్, అష్మిని మునిసర్, కరిష్మా రామ్‌హారక్, జాన్నిలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిషా హెక్టర్.
    చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్‌గా అతడే!’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. ఇవాళ జ‌ర‌గనున్న క్వాలిఫ‌య‌ర్‌-2 పోరుతో క‌లిపి ఫైన‌ల్ మ్యాచ్ మాత్ర‌మే మిగిలిఉంది. ఇప్ప‌టికే క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను ఓడించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్లో బెర్తు ద‌క్కించుకోవ‌డం కోసం క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 

    ఇందులో గెలిచిన జ‌ట్టు మే 31న‌ (ఆదివారం) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత ఎవ‌ర‌నేది ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్ అంచ‌నా వేసింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో విజేత‌తో పాటు టైటిల్ గెలుచుకోనున్న జ‌ట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయ‌తో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ద‌మో తెలుసుకోలేక‌పోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజ‌మ‌వుతుందా అనేది చూడాలి. 

    క్వాలిఫయ‌ర్‌-2లో రాజ‌స్తాన్‌ను ఓడించి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్‌కు దూసుకెళ్తుంద‌ని అంచ‌నా వేసింది. కానీ ఫైన‌ల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చ‌తికిల‌ప‌డి గుజ‌రాత్ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంటుంద‌ని పేర్కొంది. ఇక ఆర్సీబీ వ‌రుసగా రెండోసారి చాంపియ‌న్‌గా నిల‌వ‌నుంద‌ని,  ఆ జ‌ట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.

    ఈ సీజ‌న్‌లో ఆర్సీబీ నిల‌క‌డైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ ఆరంభం నుంచే విజ‌యాలు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. కోహ్లి, పాటిదార్‌, ప‌డిక్క‌ల్‌, టిమ్ డేవిడ్‌ల‌తో కూడిన బ‌ల‌మైన లైన‌ప్‌కు తోడు భువ‌నేశ్వ‌ర్‌, హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్ వంటి బౌల‌ర్ల‌తో ప‌టిష్టంగా ఉంద‌ని తెలిపింది. 

    అదీగాక క్వాలిఫ‌య‌ర్‌-1లో గుజ‌రాత్ టైటాన్స్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మ‌విశ్వాసంతో ఫైన‌ల్లో బ‌రిలోకి దిగ‌నుంద‌ని, అదే ఆత్మ‌విశ్వాసంతో గుజ‌రాత్‌ను మ‌రోసారి ఓడించి వ‌రుస‌గా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ద‌క్కించుకోనుంద‌ని తెలిపింది. మ‌రి ఏఐ చెప్పిన జోస్యం నిజ‌మ‌వుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు ఆగాల్సిందే.

    చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే!

  • రాజస్థాన్‌కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్‌, భార‌త అథ్లెట్ సుఫియా సూఫీ సాహ‌స‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. భార‌త సాయుధ ద‌ళాల‌కు నివాళిగా క‌న్య‌కుమారి నుంచి కార‌కోరం వ‌ర‌కు 88 రోజుల పాటు 5వేల కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. 

    ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సుఫియా సూఫీ వెయ్యి కిలోమీట‌ర్ల  మార్క్‌ను చేరుకున్న క్ర‌మంలో ఆ విశేషాలను తన ‘ఎక్స్’ వేదిక‌గా ఫొటో రూపంలో పంచుకుంది. షూస్‌తో వెయ్యి సంఖ్య ఆకారాన్ని తయారు చేసిన సుఫియా .. ‘వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది’ అని కామెంట్ చేసింది. 5 వేల కిలోమీటర్ల టార్గెట్‌లో మొదటి మెట్టును విజయవంతంగా పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని సుఫియా తెలిపింది. 

    కాగా సుఫియా సాహసయాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది నిజంగా అద్భుతం. దేశ భద్రతకు గస్తీ కాస్తున్న సాయుధ దళాలకు మీరు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది’.. ‘రన్నింగ్‌కు షూకు సరైన నిర్వచనం చెప్పారు.. సలాం సూఫీ’..‘కంగ్రాట్స్ సుఫియా.. మీరు ఇలాగే ముందుకు సాగండి’ అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.

    ఎందుకీ మారథాన్‌ రన్‌?
    దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని సుఫియా సూఫీ ప్రారంభించింది. దేశ భద్రత కోసం ప్రాణాలొదిలిన భారత సాయుధ దళాలకు నివాళిగా మారథాన్‌ రన్‌ ప్రారంభించింది. కాగా సూఫీ త‌న ప్ర‌యాణంలో అన్ని ప్ర‌ధాన యుద్ధ స్మార‌క చిహ్నాల‌ను గౌర‌వించ‌నున్న‌ట్లు తెలిపింది. తన సాహసయాత్రను ల‌డ‌ఖ్‌లోని కార్గిల్ దివస్ వ‌ద్ద ముగించ‌నున్న‌ట్లు ఆమె పేర్కొంది. 

    సుఫియా సూఫీ చేస్తున్న ఈ మారథాన్ ఫీట్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు ఆమె అకుంఠిత స్ఫూర్తికి, దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిల‌వ‌నుంది. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సుఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాగా జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ.. సుఫియా సూఫీ మారథాన్‌ను మే 12న అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.

    చదవండి: మెస్సీ ఆడ‌డంపై క్లారిటీ.. అర్జెంటీనా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

  • మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్‌-2026లో గ్రూప్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

    ఐదుసార్లు చాంపియన్‌
    కాగా రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించింది.

    ఘోర పరాభవం
    ముంబై ఇండియన్స్‌ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్‌ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్‌పై నెగిటివిటీ కాస్త తగ్గింది.

    గతేడాది ప్లే ఆఫ్స్‌ చేరినా..  
    అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్‌ చేర్చాడు హార్దిక్‌ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్‌.. 10 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.

    ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్‌ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.

    ముంబై తప్పు తెలుసుకుంది
    ‘‘ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్‌ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్‌ తదుపరి కెప్టెన్‌ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్‌ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

    ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్‌ స్క్రీన్‌పై ‘07:07’ టైమ్‌ను షేర్‌ చేయడంతో.. అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.

    మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతింటే
    ఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్‌ కచ్చితంగా ట్రాన్స్‌ఫర్‌ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.

    ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

    చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దైతే?

  • జూన్‌ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫుట్‌బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్ర‌వారం త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. 2022లో ఫిఫా చాంపియ‌న్‌గా నిలిచిన అర్జెంటీనాను మ‌ళ్లీ మెస్సీనే న‌డిపించ‌నున్నాడు.  26 మంది స‌భ్యుల‌తో కూడిన బృందాన్ని అర్జెంటీనా జ‌ట్టు కోచ్ లియోనిల్ స్క‌లోని ప్ర‌క‌టించారు. ఇటీవ‌లే ఇంట‌ర్ మియామి క్ల‌బ్ త‌ర‌ఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. 

    గాయం కార‌ణంగా అత‌డు ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు దూర‌మ‌వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌కు తెర‌దించుతూ మెస్సీ ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడనున్న‌ట్లు, జ‌ట్టుకు సార‌థిగా అత‌నే వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్క‌లోని వెల్ల‌డించాడు.  ఈ నేప‌థ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ ఆడ‌నున్నాడు. ఎనిమిది సార్లు బాల‌న్ డీ ఓర్‌ అవార్డు గెలిచిన మెస్సీకే సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. 

    ఖ‌తార్‌లో నాలుగేళ్ల క్రితం జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా టైటిల్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే అర్జెంటీనా జ‌ట్టులో రియ‌ల్ మాడ్రిడ్ ప్లేయ‌ర్ ఫ్రాంకో మ‌స్తాన‌టునో పేరు మాత్రం జ‌ట్టులో క‌నిపించ‌లేదు. జూన్ 11న మొద‌లుకానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. 

    గ్రూప్ జెలో ఉన్న‌ అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌ను కన్సాస్‌ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడ‌నుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లు గ్రూప్‌-జెలో ఉన్నాయి. 

    అర్జెంటీనా జట్టు:
    గోల్‌కీప‌ర్స్‌: ఎమిలియానో మార్టినేజ్‌, జిరోనిమా రుల్లి, జువాన్ ముసో
    డిఫెండ‌ర్స్‌: గొంజాలో మాంటిల్‌, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్‌, నికోల‌స్ ఒట‌మెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫ‌కుండా మెదీనా, నికోల‌స్ త‌గ్లియాఫికో
    మిడ్‌ఫీల్డ‌ర్లు: లియాండ్రో ప‌రేడ్స్‌, రోడ్రిగో డీ పాల్‌, ఎక్స్‌కుయ‌ల్ పాలేసియ‌స్‌, ఎంజో ఫెర్నాండేజ్‌, అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్‌, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కో
    స్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్‌) , నికోల‌స్ పాజ్‌, థియాగో అల్మ‌డా, నికోల‌స్ గొంజాలెజ్‌, జులియ‌న్ అల్వరేజ్‌, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్‌, జోస్ మాన్యువెల్ లోపేజ్

    చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆటను, అతడి ప్రదర్శనను క్రీడా నిపుణులు, అభిమానులు క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్‌, సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ మాత్రం వైభవ్‌ను మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌  షాహిద్ అఫ్రిదితో పోల్చడం వివాదాస్పదంగా మారింది.

    ‘15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే నాకు మా షాహిద్ అఫ్రిది గుర్తుకు వస్తున్నాడు. అతడు కూడా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగులు రాబట్టేవాడు. 1996 వన్డే ప్రపంచకప్‌లో 37 బంతుల్లోనే అఫ్రిది సెంచరీ బాదాడు. అప్పుడు అఫ్రిది వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. 

    ఇప్పుడు వైభవ్ కూడా బౌలర్లు ఎంతవారైనా భయం, బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించడంలో విజయవంతమయ్యాడు. ఇక వైభవ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల వయసులో విధ్వంసకర బ్యాటింగ్ ఆడడం అతడి అదృష్టమని చెప్పొచ్చు. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నప్పుడు వయసుతో పని లేకుండా సీనియర్ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది. 

    అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాల్సిందే.’ అని డిమాండ్ చేశాడు.  అయితే వైభవ్ బ్యాటింగ్‌ను మెచ్చుకోవడం నుంచి టీమిండియాలోకి అతడిని తీసుకోవాలని మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతృప్తి చెందిన అభిమానులు షాహిద్ అఫ్రిదితో వైభవ్‌ను పోల్చడంపై మాత్రం మండిపడ్డారు. వైభవ్‌తో అఫ్రిదిని పోల్చవద్దని హితవు పలికారు. 

    ‘భారత్ పట్ల ఎప్పుడు విద్వేష భావంతో ఉండే అఫ్రిదితో పోల్చడం ఏంటి? ఇది వైభవ్‌ను అవమానించడం కిందే లెక్క’.. ‘ఉగ్రవాదులతో కలిసి విందులో పాల్గొనే వ్యక్తితో పోలుస్తారా’ అంటూ కామెంట్లు చేశారు. కాగా పాక్ క్రికెటర్‌గా కొనసాగుతున్న సమయంలో షాహిద్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ బలోచ్ నేత ఉజైర్ బలోచ్‌తో కలిసి డిన్నర్‌లో పాల్గొన్న ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

    ఉగ్రవాదిగా ముద్ర పడిన వ్యక్తితో కలిసి అఫ్రిది భోజనం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్‌ను ద్వేషించే క్రికెటర్లలో అఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. పదే పదే భారత్‌ను కించపరిచేలా మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం అఫ్రిదికి అలవాటుగా మారిపోయిందని గతంలోనూ భారత క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పించారు.

    ఐపీఎల్‌ 19వ సీజన్‌లో వైభవ్‌ సూర్యవంశీ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆడిన 15 మ్యాచ్‌ల్లో 242 స్ట్రైక్‌రేట్‌తో 680 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ, నాలుగు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ పోరులో 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసిన వైభ‌వ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్ర‌పంచ‌ రికార్డు సాధించే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. 

    చదవండి: 'అత‌డు వేలంలోకి వ‌స్తే 30 కోట్లు చెల్లిస్తా!'

Andhra Pradesh

  • ఏపీలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, మన్యం విజయనగరం జిల్లాల్లో  మరో మూడు గంటల్లో తీవ్ర స్థాయిలో పిడుగులు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలన్నాయంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని  చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద హోర్డింగుల వద్ద ప్రజలు నిలబడకూడదని కీలక సూచనలు చేసింది.  

    కాగా ఇదివరకే పలాసలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఉరుములు మెరుపులతో భారీ వానలు పడుతుండడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో రేపు  పలు జిల్లాల్లో వర్షం పడే  అవకాశం ఉందని వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

  • కర్నూలు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.  బైక్‌పై వెళుతుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు గణేకల్‌ గ్రామానికి చెందిన వీరేష్‌, మహేంద్ర, విశ్వనాథ్‌లుగా గుర్తించారు. 

  • సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.

    ‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్‌ వైఎస్సార్‌కు గాదె వెంకటరెడ్డికి  సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం
  • నెల్లూరు జిల్లా: మార్ఫింగ్‌ ఆడియో రికార్డింగ్‌లను వాట్సాప్‌ గ్రూపుల్లో వ్యాప్తి చేయడంతో పాటు తన ఇంటిని ముట్టడిస్తామంటూ జనసేన నేతలు రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నారని, దమ్ముంటే తనను టచ్‌ చేసి చూడండంటూ ఆ పార్టీ నేతలకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వీరి తీరుపై కావలి డీఎస్పీ రమణకుమార్‌కు గురువారం ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేనకు చెందిన చోటా నేతలు ఉద్దేశపూర్వకంగా ఫేక్‌ ఆడియోలను సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 

    ఈ విషయమై పోలీసులకు తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అసత్య ప్రచా రాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా డీఎస్పీకి అందజేసినా చర్యలు చేపట్టకపోవడమేమిటని ప్రశ్నించారు. తన ఇంటిని ముట్టడిస్తామంటూ ఆ పార్టీ నేత లు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వాటికి తాను భయపడేదిలేదని తేలి్చచెప్పారు. ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందానని, వారు తన వెంటే ఉన్నారన్నారు. దమ్ము.. ధైర్యముంటే తేదీ, సమయాన్ని ప్రకటించాలని.. ఎక్కడ్నుంచి వస్తారో రండి.. కార్యకర్తలతో కలిసి తానొస్తానని తెలిపారు. 

    తాను చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను దూషించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అలా కాని పక్షంలో మీరేమి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్‌ ఆడియో రికార్డింగ్‌లను రూపొందించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జనసేనలోని కొందరు నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నోటికి ఏదొస్తే ఆది మాట్లాడుతున్నారని, అదుపులో ఉండాలని హితవు పలికారు. 

    అసత్య ప్రచారాలు చేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే కుహా నా నేతలకు తగిన బుద్ధి చెప్తానని స్పష్టం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పట్టణాధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వెంకటనారాయణ, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి ప్రసన్నాంజనేయులు, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు, రాఘవులు, బీసీ భవన్‌ అధ్యక్షుడు వెంకటరావు, రాజశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.   

International

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్‌హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

    ఇరాన్‌- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.

    ఈ విషయమై తన ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ  " ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.

    ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి  గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్‌లో అమర్చిన ల్యాండ్‌మైన్‌లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. .  ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. 

    ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. 
     

  • టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్‌ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్‌కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్‌ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది.

    ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్‌ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్‌ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది.

    ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది.

    కింగ్స్ కాలేజ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ ఆర్థిక శాస్త్రాన్ని మార్చడంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. తక్కువ బడ్జెట్‌లో ఇరాన్‌ అభివృద్ధి చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పూర్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.

    ఆరాష్-ఎ-కమాంగిర్ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఆయుధమేమీ కాకపోవచ్చని.. కానీ మొబైల్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక రక్షణను విస్తృతం చేయడంలో ఇరాన్ సాధించిన మరో అడుగు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌లు రేడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి. వాటిని గుర్తించడం చాలా సులువు. కానీ వీటికి భిన్నంగా. ఈ చిన్న, చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించవచ్చు.. దాచవచ్చు.. వేగంగా ప్రయోగించవచ్చు. సులభంగా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.

    ఈ కొత్త ఇంటర్‌సెప్టర్ వ్యవస్థకు పర్షియన్ పురాణాల వీరుడి పేరు పెట్టారు. జానపద కథల ప్రకారం.. ఆరాష్-ఎ-కమాంగిర్ అనే ఓ యోధుడు పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్‌పై పడకుండా ఆయన పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్-మధ్య ఆసియా మధ్య సరిహద్దును గీయడానికి ఒక బాణాన్ని సంధించాడు. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్‌ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ఆరాష్-ఎ-కమాంగిర్ అని పేరు పెట్టింది.


     

  • ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ.. మరోసారి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్‌కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన  వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

    వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్‌తో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్‌కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్‌లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్‌పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్‌లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్‌పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు.

    ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్‌పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్‌పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. 

    అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా బాట్ నెట్‌వర్క్‌లు కారణమని ఆరోపించారు. “అమెరికన్లలా నటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పరిశీలిస్తే వాళ్లు పాకిస్థాన్‌లోని బేస్‌మెంట్‌ల్లో కూర్చున్నవాళ్లని తేలుతోంది” అంటూ వ్యాఖ్యానించారు.

Telangana

  • -హైదరాబాద్,: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు–2026లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.

    NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా  2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.

    మంంత్రి మాట్లాడుతూ... ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.

    దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.

    ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్‌లు (FFBs) ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయబడుతున్నాయని, దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.23,501గా ఉండటం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు.

    అయితే, గతంలో అమలులో ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.25,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులకు మరింత అధిక ఆదాయం లభించడంతో పాటు, కొత్తగా ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మంత్రి వివరించారు.

    రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాలపాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. అదనంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పలు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి, ఆయిల్ పామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.

    ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో ఏడు ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత రైతులకు మరింత సమీపంలోనే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

    ఆయిల్ పామ్ రంగం కేవలం రైతుల ఆదాయాన్నే పెంచడం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రాసెసింగ్ మిల్లులు, రవాణా, కోత, నిల్వ, అనుబంధ కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ రంగం దోహదపడుతోందన్నారు.

    పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

    "తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది" అని స్పష్టం చేశారు.

  • హైదరాబాద్‌:  లాయర్‌ మొయిజుద్దీన్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్య కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. వక్ఫ్‌ భూముల వివాదాలే లాయర్‌ హత్యకు కారణమన్నారు. లం ఖాన్ కుటుంబానికి  మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

    ‘మొయిజుద్దీన్‌ స్విమ్మింగ్‌కు వెళ్తుండగా హత్య చేశారు. మొయిజుద్దీన్‌ను హతమార్చాలని ఆలంఖాన్‌ నిర్ణయించుకున్నాడు. మే 23 న శాంతి నగర్ లో అడ్వకేట్ ఖాజా మొయిజుద్దిన్‌ను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీ కోట్టారు. వక్ఫ్‌ భూముల వివాదాలే లాయర్‌ హత్యకు కారణం. జనవరి నుంచి లాయర్‌ హత్యకు రెక్కీ నిర్వహించారు. 23వ తేదీన మొయిజుద్దీన్‌ స్విమ్మింగ్‌ వెళ్తుండగా హత్య చేశారు. లాయర్‌ను చంపేందుకు రూ. 15 లక్షలు సుపారీ ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 10. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. 

     ఆలం ఖాన్ కుటుంబానికి  మొయిజుద్దిన్ పలు విషయాలలో అడ్డు వస్తున్నాడానే కారణంతో హత్య చేయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. లక్డి కాపుల్, మలక్ పేట్ ప్రాంతాలకు చెందిన వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి కేసులలో ఖాజా మొయిజుద్దిన్, ఆలం ఖాన్ కుటుంబానికి వివాదాలు ఉన్నాయి. హత్య చేసేందుకు గత ఆరు నెలల నుండి పలు మార్లు ప్రయత్నం చేసి చివరకు మొయిజుద్దిన్ ను హత్య చేశారు’ అని తెలిపారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

    ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

     


     

     

     

     

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఆస్పత్రులకు మానవ వనరుల కల్పనే ప్రధాన సమస్యగా తయారైంది. కార్పొరేట్‌ ఆస్పత్రులను తలదన్నేలా, విదేశీ రోగులను ఆకర్షించేలా సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘టిమ్స్‌’లో ఆ స్థాయి వైద్య సేవలు అందించే స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం ఇప్పటి వరకు జరగలేదు.

    నిమ్స్, ఎయిమ్స్‌ తరహాలో ప్రత్యేక డైరెక్టరేట్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, స్వతంత్ర నియామకాలతో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆల్వాల్‌ ప్రాంతాల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ ఆస్పత్రుల్లో కార్డియాక్‌ స్పెషాలిటీగా సనత్‌నగర్‌ టిమ్స్‌ను తొలి దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీలు మారగా, తాజాగా జూన్‌ 2న ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా వాయిదా పడింది. సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ తీసుకొని జూన్‌ రెండోవారంలో ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.  

    అటకపైకెక్కిన ప్రత్యేక నియామకాలు 
    టిమ్స్‌ ఆస్పత్రులను (Telangana Institute of Medical Sciences) సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి భిన్నంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా డైరెక్టరేట్‌ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసి, నేరుగా ఈ ఆస్పత్రుల కోసమే వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఒక్కో టిమ్స్‌ ఆస్పత్రికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 4 వేల మందిని నియమించాలని ప్రతిపాదించారు.

    అయితే వైద్య, నర్సింగ్, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిసింది. దీంతో ప్రత్యేక నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక డైరెక్టరేట్‌ కింద టిమ్స్‌ నిర్వహించాలని భావించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఆస్పత్రిలో ట్రయల్‌ రన్‌ కోసం గాంధీ, ఉస్మానియాతోపాటు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఆస్పత్రుల నుంచి కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని తాత్కాలికంగా సనత్‌నగర్‌ టిమ్స్‌కు తరలించి ‘ట్రయల్‌రన్‌’నిర్వహిస్తున్నారు.

    కనీసం 4 వేల మంది వైద్య సిబ్బంది అవసరం...
    1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణకు కనీసంగా 200 మంది స్పెషలిస్టు వైద్యులు, 500 మంది రెసిడెంట్‌ డాక్టర్లు, మూడు షిప్ట్‌ల్లో పనిచేసేందుకు 1,500 వరకు స్టాఫ్‌ నర్సులు, 1500–2000 మంది పారా మెడికల్‌ సిబ్బంది అవసరం ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి కార్డియాక్‌ కేర్, ఐసీయూలు, ట్రామా కేర్, క్యాథ్‌ల్యాబ్‌లు, మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, డయాలసిస్, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి అత్యాధునిక విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే అనుభవజ్ఞులైన సిబ్బంది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 4 వేల మంది వరకు నేరుగా నియమిస్తే తప్ప, ప్రత్యేక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

    చ‌ద‌వండి: వ‌డివ‌డిగా ఫ్యూచ‌ర్ సిటీవైపు అడుగులు

  • నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కింది. 

    జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది.  

Business

  • ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చినా.. వారికి కేటాయించిన బెర్త్‌లు అందించకపోవడం, ఇండియన్ రైల్వే సేవల లోపమే అని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. భోజ్‌పూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

    ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ నుంచి బీహార్‌లోని ఆరా వరకు వెళ్లాల్సిన నలుగురు ప్రయాణికులు.. ఎల్‌టీటీ పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వీరు రైలెక్కిన తరువాత తమకు కేటాయించిన బెర్త్‌లపై రైల్వే సిబ్బంది ఉండటం గమనించారు. తమకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తమ గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ..
    తాము సీట్లను రిజర్వ్ చేసుకున్నప్పటికీ.. నిలబడే ప్రయాణం చేయడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించడానికంటే ముందు.. రైల్వే హెల్ప్‌లైన్, రైల్వే సేవా, రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేశారు. తమకు ఎస్ఎమ్ఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ, ప్రయాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

    బక్సర్ స్టేషన్ వద్ద వచ్చిన టికెట్ ఎగ్జామినర్‌ (TTE) వద్ద కూడా సమస్యను వివరించారు. అయితే.. రైలులో భారీ రద్దీ ఉందని, ఎలాగోలా మేనేజ్ చేసుకోండని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించిందని కోర్టు అభిప్రాయపడింది.

    ఇక రైల్వే శాఖ మాత్రం.. ఈ వివాదం శాంతి భద్రతలకు సంబంధించినదని, ఇది ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిధిలోకి వస్తుందని వాదించింది. తమవైపు నుంచి ఎలాంటి సేవల లోపం జరగలేదని, ఫిర్యాదుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే.. కోర్టు ప్రయాణికులు సమర్పించిన టికెట్లు, ఫిర్యాదు రికార్డులు, మెసేజ్‌లు, ఫోటోలను పరిశీలించిన తరువాత రైల్వే శాఖ సేవలలో స్పష్టమైన లోపం ఉందని తేల్చింది. ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్‌లు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.

    రూ.20,000 పరిహారం
    దీంతో నార్త్ సెంట్రల్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కలిసి ప్రయాణికులకు టికెట్ మొత్తానికి (రూ.1,876.80) 8 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ.20,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం 60 రోజుల్లో చెల్లించకపోతే, 10 శాతం వడ్డీతో చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేసుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.

    వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది ప్రశంసించారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కాబట్టి ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా  ఎదురైతే.. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు.

    ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్!

  • నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఖర్చులను గణనీయంగా పెంచింది. సామజిక కార్యక్రమాల కోసం ఏకంగా రూ.2248 కోట్లు ఖర్చు చేసింది. ఇది గత సంవత్సరం (రూ.2156 కోట్లు)తో పోలిస్తే సుమారు రూ.100 కోట్లు ఎక్కువ.

    కోవిడ్ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం సీఎస్ఆర్ ఖర్చు రూ.9,500 కోట్లు దాటింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరింది.

    ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఒక డెయిరీ రైతు ఆదాయం గణనీయంగా పెరిగి రెండింతలయింది. అంతే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్ కోసం స్కాలర్‌షిప్ సదుపాయాలను అందిస్తున్నారు.

    2020-21లో ప్రారంభమైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ కార్యక్రమం ప్రతి సంవత్సరం సుమారు 5,100 మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది. వీరిలో చాలామంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందారు. వారి కుటుంబాల ఆర్థిక స్థితిలో పురోగతికి సహాయపడుతున్నారు. ఇది సమాజంలో దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు.

    మహిళా సాధికారత విషయంలో కూడా స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ లిటరసీ, ఆర్థిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళల్లో 75% మందికి ఆర్థిక నిర్ణయాలపై విశ్వాసం పెరిగింది. సగం మంది కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మరింతగా పాల్గొంటున్నారు.

    జంతు సంరక్షణ రంగంలో వంతారా ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులకు సంరక్షణ అందించారు. దీనికిగాను అనంత్ అంబానీకి 2025లో గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. నీతా అంబానీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో హ్యూమానిటేరియన్ అవార్డులు వచ్చాయి.

    గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాడి రైతుల రోజువారీ పాలు ఉత్పత్తి 6.14 లీటర్ల నుంచి 10.37 లీటర్లకు పెరిగింది. వారి వార్షిక ఆదాయం సుమారు 64.6% పెరిగింది. మొత్తం కుటుంబ ఆదాయం కూడా సుమారు 56% వరకు పెరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఫౌండేషన్ సేవలు అందించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో వచ్చిన తుపాను హెచ్చరికల సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి మత్స్యకారులు, రైతులను అప్రమత్తం చేసింది. ఈ సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా రిలయన్స్ ఫౌండేషన్ సామజిక కార్యక్రమాల కోసం ప్రతి ఏటా భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది.

  • బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఈ రోజు (మే 29) గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఉన్నట్టుండి పసిడి ధరలు పెరగడానికి కారణాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

    బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై కొనసాగుతున్న ఆందోళనలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపించిందని న్యూస్ ఏజెడ్ తన నివేదికలో వెల్లడించింది.

    మార్కెట్ వివరాల ప్రకారం.. స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు సుమారు 4,505.57 డాలర్లకు చేరింది. అదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగి 4,535.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

    గోల్డ్‌సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ ప్రకారం.. కాల్పుల విరమణ ప్రకటన రాకముందు ధరలు ఇంకా పడిపోతాయని భావించారు. కానీ అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందాలకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో రలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

    అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్‌పై ఉన్న ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. ఇది ప్రపంచ చమురు మరియు వాణిజ్య రవాణాపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే.. ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. అదే.. సమయంలో ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా ఈ ఒప్పందం పూర్తిగా ఖరారు కాలేదని తెలిపింది.

    ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్!

  • వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని బార్బెక్యూ రెస్టారెంట్ తెలిపింది. తాము అందించిన ఆహారం సొంత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గ్రహించిన సదరు యాజమాన్యం.. ఏకంగా కస్టమర్లకు సుమారు రూ.1.4 కోట్లు (1,62,000 అమెరికన్ డాలర్లు / 1.1 మిలియన్ యువాన్లు) తిరిగి చెల్లించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా సంస్థే స్వయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనావ్యాప్తంగా 142 అవుట్‌లెట్లతో విస్తరించిన ప్రసిద్ధ బ్రాండ్ ‘వెరీ లాంగ్ అగో లాంబ్ స్కేవర్స్’ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

    అసలేం జరిగింది? గ్రిల్లింగ్‌లో లోపమే కారణమా?

    ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీకి చెందిన 24 అవుట్‌లెట్లలో దాదాపు 48,000 టేబుల్స్ వద్ద భోజనం చేసిన కస్టమర్లను రెస్టారెంట్ యాజమాన్యం ఈ నెల ప్రారంభంలో స్వయంగా సంప్రదించింది. అంతర్గత నాణ్యత సమీక్షలో ఒక షాకింగ్ నిజం బయటపడటమే దీనికి కారణం. ఆ సమయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రిల్లింగ్ పరికరాల్లో ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం వల్ల, మటన్ కబాబ్‌లు ఆశించిన స్థాయిలో గ్రిల్ కాలేదని కంపెనీ గుర్తించింది. కస్టమర్ల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ తమ బ్రాండ్ విలువలకు కట్టుబడి సదరు మటన్ స్కేవర్ల ధరలో 50 శాతం మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్ చేసింది.

    నిజాయితీయా? మార్కెటింగ్ జిమ్మిక్కా?

    ఈ భారీ వాపసు కార్యక్రమం నెట్టింట వైరల్‌గా మారడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లాభాల కంటే కస్టమర్ల సంతృప్తికే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన రెస్టారెంట్ నిజాయితీ అమోఘం’ అని మెజారిటీ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  • మాజీ ఐఏఎస్ అధికారి 'ధనేంద్ర కుమార్' మరణం తరువాత.. దేశవ్యాప్తంగా ఎయిర్ కండీషనర్(AC)ల భద్రతపై ఆందోళన పెరిగింది. ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఆయన నివాసంలో ఏసీ ఇండోర్‌ యూనిట్‌ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధనేంద్ర కుమార్ పొగ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోగా, ఆయన కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ల వినియోగంలో.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.

    ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. నిరంతరాయంగా ఏసీ ఆన్‌లో ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఏసీలు పేలడానికి కారణాలు
    ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ప్రకారం.. నగరంలో జరిగే అగ్ని ప్రమాదాలలో సుమారు 60 శాతం విద్యుత్ లోపాల వలన సంభవిస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో షార్ట్ సర్క్యూట్లు, ఓవర్ హీటింగ్, హైలోడ్, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

    ఎయిర్ కండీషనర్‌లో అత్యంత కీలక భాగం కంప్రెసర్. వేసవిలో ఏసీని గంటల తరబడి ఆపకుండా వినియోగించడం వల్ల కంప్రెసర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దానికి సరైన విరామం ఇవ్వకపోతే.. అంతర్గత ఉష్ణోగ్రతలు పెరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజంతా లేదా రాత్రంతా ఏసీని నిరంతరాయంగా నడపకుండా మధ్య మధ్యలో ఆపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టైమర్లు, ఇంటెలిజెంట్ ఏసీ కంట్రోలర్లు వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి.

    ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కూడా మరో ప్రధాన కారణం. ఎక్కువసేపు విద్యుత్ సరఫరా జరుగుతుండటం వల్ల వైర్లు వేడెక్కుతాయి. కొన్నిసార్లు వైర్లపై ఉన్న ఇన్సులేషన్ కరిగిపోవడంతో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు అధిక లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ట్రిప్ అవుతాయి. కానీ అవే పనిచేయకపోతే భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది.

    వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కూడా ఎయిర్ కండీషనర్లకు ప్రమాదకరమే. విద్యుత్ సరఫరాలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు కంప్రెసర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లో స్టెబిలైజర్లు, సర్జ్ ప్రొటెక్టర్లు లేదా ఇన్వర్టర్ ఆధారిత ఏసీలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

    దుమ్ము, మురికి పేరుకుపోయిన ఎయిర్ ఫిల్టర్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. గాలి సరైన రీతిలో ప్రవహించకపోవడంతో మిషన్ ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగి అంతర్గత విద్యుత్ లోపాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. అదేవిధంగా పాత వైరింగ్, నాసిరకం కనెక్షన్లు కూడా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతాయి.

    ముందే హెచ్చరిక సంకేతాలు!
    ఎయిర్ కండీషనర్‌లో సమస్యలు తలెత్తే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అసాధారణ శబ్దాలు రావడం, ఏసీ పదేపదే ఆన్-ఆఫ్ అవడం, సమానంగా చల్లదనం రాకపోవడం, కాలిన వాసన రావడం లేదా పొగ కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో తనిఖీ చేయించాలి.

    భద్రత కోసం.. ఇండోర్, అవుట్‌డోర్ వైరింగ్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను తరచుగా శుభ్రం చేయాలి. అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ చెత్త లేదా అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ఏసీఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. అలాగే రిపేర్లు లేదా ఇన్‌స్టాలేషన్ కోసం కేవలం అధీకృత టెక్నీషియన్ల సేవలనే ఉపయోగించాలి.

    నిర్వహణ లేకపోతే..
    ధనేంద్ర కుమార్ విషాద ఘటన ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఎయిర్ కండీషనర్ అనేది కేవలం సౌకర్యం కోసం ఉపయోగించే పరికరం మాత్రమే కాదు. సరైన నిర్వహణ లేకపోతే, విద్యుత్ వ్యవస్థలపై అధిక ఒత్తిడి పెరిగితే అది ప్రాణాంతక ప్రమాదాలకు కూడా కారణమవుతుందని ఈ ఘటన స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: యూపీఐ ద్వారా PF విత్‌డ్రా.. కొత్త రూల్స్ ఇవే!

  • శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,092.05 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో 74,775.74 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్లు లేదా 1.50 శాతం నష్టంతో 23,547.75 వద్ద నిలిచాయి.

    సుప్రియా లైఫ్‌సైన్స్ లిమిటెడ్, త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి లిమిటెడ్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, వోక్‌హార్డ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జయకే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, నాట్కో ఫార్మా లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • టయోటా కంపెనీ భారతీయ మార్కెట్లో 'అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.23.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి ఈ విటారా ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా తయారైన ఈ మోడల్.. ప్రత్యేకమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

    సరికొత్త అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ముందుభాగంలో టయోటా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉపయోగించే స్టైలిష్ డిజైన్ కనిపిస్తుంది. బోనెట్‌, సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యారెక్టర్ లైన్లు, ఏరోడైనమిక్ డిజైన్ గల అలాయ్ వీల్స్ కూడా ఇక్కడ గమనించవచ్చు.

    కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి రంగులలో అందుబాటులో ఉండే.. ఈ కొత్త ఎబెల్లా కారు పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, డయల్ టైప్ గేర్ షిఫ్ట్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఏడు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ లాంచ్.. ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ!

    పనితీరు విషయానికి వస్తే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 171 హార్స్ పవర్, 193 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్టిక్ మోటారును కలిగి.. ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ కొత్త ఈవీ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

  • ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్‌ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్‌ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    “బంగారం ఖరీదవడం లేదు.. డాలర్‌ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్‌ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

    తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.

    1971 నుంచి అమెరికన్‌ డాలర్‌ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    రోమ్‌ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్‌ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.

    డాలర్‌ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్‌ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, రియల్‌ అసెట్స్‌లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు.

Movies

  • కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్‌'. గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించారు. దర్శకుడు  విజయ్‌ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

    తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ‍అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్‌లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది.
     

  • టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్ట్‌లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలంటూ పిటిషన్ వేయగా.. చైతుకు అనుకూలంగా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం..నాగచైతన్యకు అనుకూలంగా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

     కాగా.. పలు అశ్లీల వెబ్‌సైట్‌లు, కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నాగచైతన్య పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా వాడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న పోస్టులపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, వాయిస్, ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది.
     

  • ప్రముఖ బాలీవుడ్ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెరతో పాటు సినిమాల్లో రాణిస్తోన్న ఆదిత్య సీల్- అనుష్క రంజన్ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు.  పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఈ దంపతులు  ప్రగ్నెన్సీని ప్రకటించారు. ఈ జంట తమ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అందమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక క్షణం కోసం వందేళ్లుగా వేచి ఉన్నామని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.

    ఆదిత్య, అనుష్క జంట ప్రెగ్నెన్సీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో నటి బేబీ బంప్‌ ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ జంటకు అనన్య పాండే, మౌనీ రాయ్, సోనాక్షి సిన్హా, వాణి కపూర్, మనీష్ మల్హోత్రా, నీల్ నితిన్ ముఖేష్, సోనాల్ చౌహాన్, రాకుల్ ప్రీత్ సింగ్, కుశాల్ టాండన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

    కాగా.. ఆదిత్య, అనుష్క మొదటిసారి వారి కుటుంబం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు.  ఆ తర్లాత వీరి మొదటి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత.. అనుష్క పుట్టినరోజున పారిస్‌లో ఆదిత్య ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.  ఇక సినిమాల విషయానికొస్తే, ఆదిత్య చివరిగా అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను నటించిన 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో కనిపించాడు.
     

     

  • నిహాల్, ప్రియా దేశ్‌పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. ఈ మూవీలో తెరచాప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కించారు.తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై సంధ్య తిరువీధుల నిర్మించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ ఎలా మెప్పించిందో చూద్దాం.

    కథేంటంటే..

    క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఊర్లో హాస్పిటల్ కట్టిస్తాడు. ఊహించని విధంగా దేవ్‌కి సత్య (అర్జున్), కల్యాణి (కాజల్ తివారి) ఎదురు పడతారు. ఆ ఊర్లో వారికి దేవ్ ఆశ్రయం ఇస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా సత్య, కల్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్‌కి మాత్రమే కనిపిస్తుంటారు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి గతమేంటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..

    ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. కథ చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.  దేవ్ క్యారెక్టర్ పరిచయం.. మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం లాంటి సాధారణ సీన్లతో రోటీన్‌గా అనిపిస్తుంది. అయితే సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది

    సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచే ప్రేక్షకుడికి కాస్తా థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది.  క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుచుంది. అక్కడక్కడా సస్పెన్స్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని అంశాలను మాత్రం దర్శకుడు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్‌గా ఓ థ్రిల్లర్‌ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది.  దర్శకుడు తాను రాసుకున్న కథను అనవసర కమర్షియల్ హంగులు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి థ్రిల్లర్‌ కాన్సెప్ట్ ఇష్టపడేవారు సందిగ్ధం ట్రై చేయొచ్చు.


    ఎవరెలా చేశారంటే..

    దేవ్ పాత్రలో నిహాల్ బాగానే ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్‌పాగ్ అందంతో పాటు పాత్రకు తగ్గట్టుగా నటించింది. అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో మెప్పించారు. విలన్‌గా నవీన్ సంకరపు ఫర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది.  విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా అనిపించాయి.

     

  • రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్‌కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్‌లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.

    తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్‌ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
     

  • ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ సెలబ్రిటీల ర్యాంకులను ప్రకటిస్తుంది. ప్రతి నెల, వారానికి సంబంధించి ఎప్పటికప్పుడు ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ వారంలో పాపులర్‌ సెలబ్రిటీల జాబితాను ఐఎండీబీ వెల్లడించింది. ‍అయితే ఈసారి ఎవరు ఊహించని నటుడు నంబర్ స్థానంలో నిలిచారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారూక్ ఖాన్‌ను సైతం వెనక్కి నెట్టిన ఫస్ట్‌ ప్లేస్ దక్కించుకున్నారు. అతను ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి.

    ఈ వారంలో టాప్‌లో నిలిచిన నటుడు యుధ్వీర్ అహ్లావత్. అతను ఇటీవలే కర్తవ్య అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ బాలీవుడ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ లిస్ట్‌లో  ఐశ్వర్య రాయ్ బచ్చన్, తలపతి విజయ్, షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, మోహన్‌లాల్ లాంటి స్టార్లను అధిగమించి ఏకంగా నంబర్‌వన్ ప్లేస్‌ కొట్టేశాడు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు యుధ్వీర్ అహ్లావత్.. ఐఎండీబీ ర్యాంక్‌తో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. యుధ్వీర్ కర్తవ్య మూవీలో 16 ఏళ్ల హర్యానా బాలుడు హర్పాల్ పాత్ర పోషించారు.

    బాలుడి పాత్రలో కనిపించడంతో యుధ్వీర్‌ అంతా చిన్నపిల్లాడని భావించారు. కర్తవ్యను చూస్తున్న ప్రేక్షకులు యుధ్వీర్‌ను ఒక బాలనటుడిగా గుర్తించారు.  కానీ అతని వయసు అక్షరాలా 33 సంవత్సరాలు. అతను దాదాపు దశాబ్ద కాలంగా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు ఐఎండీబీ టాప్ ర్యాంక్‌తో ఒక్కసారిగా ఫేమస్ ‍అయ్యాడు. 
     

     

  • సినిమా చూడటం సులభమే కానీ తీయడం చాలా కష్టం. 24 విభాగాలు పక్కాగా పనిచేస్తే తప్పితే మూవీ థియేటర్లో రిలీజ్ కాదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఏడాది ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించేవారు. దీంతో సదరు హీరోలంటే ఆడియెన్స్‌కి కూడా ఓ గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. పేరున్న హీరోల మూవీస్ కూడా ఎప్పుడు రిలీజవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అలాంటివి ఏంటి?

    (ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)

    ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చిరంజీవి. 'విశ్వంభర' అనే సినిమా ఈయన 2023లో ప్రకటించారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్. ఏడు లోకాలు. ఇలా చాలానే ప్లస్సులు ఉన్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. రేపో మాపో వచ్చేస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ తప్పితే అసలు సంగతి ఏంటనేది హీరో, దర్శకుడికి తప్పితే మరెవరికీ తెలియదమో?

    యంగ్ హీరో నిఖిల్ చేసిన పాన్ ఇండియా సినిమా 'స్వయంభు'. బాహుబలి తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం కూడా చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హీరోహీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. వేసవిలో రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి గానీ దీని రిలీజ్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు.

    (ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

    మెగాహీరో సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' కూడా ఇలానే తయారైంది. ఈ ప్రాజెక్టు కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ ఆగుతూ ఆగుతూ జరుగుతోంది. బడ్జెట్ సమస్యల కారణంగానే ఇన్నేళ్లుగా సెట్స్‌పై ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పై రెండింటి ఔట్‌పుట్ రెడీ అయిపోయింది గానీ దీనిది ఇంకా చాలా పెండింగ్‌లో ఉంది. అది పూర్తి చేసి ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.

    పైన చెప్పిన సినిమాల్లో పేరున్న హీరోలే నటించారు. బడ్జెట్ కూడా వందల కోట్ల రూపాయలు పెట్టారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావట్లేదు. సినిమాలు ఇలా ల్యాబ్‌ల్లో మగ్గిపోవడం వల్ల నిర్మాతకు వడ్డీ భారం పెరిగిపోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై బజ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. మరి ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో?

    (ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది)

  • 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో నటిగా మారి తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన తేజస్వి మదివాడ.. తర్వాత ఆర్జీవీ తీసిన 'ఐస్‌క్రీమ్'లో హీరోయిన్‌గా చేసింది. తెలుగు బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పెద్దగా మూవీస్ చేయట్లేదు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తన చిన్నతనం ఎంత దారుణంగా ఉండేది అనే విషయాల్ని చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)

    'మా అమ్మనాన్న ఎప్పుడు పెళ్లిచేసుకోలేదు. నాన్న కాలేజీలో, అ‍మ్మ స్కూల్‌లో ఉన్నప్పుడు కిరికిరి పనిచేశారు. దీంతో అమ్మ ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే మా నాన్న.. ఆర్మీలో జాయిన్ అయిపోయారు. దీంతో ఇంటి నుంచి బయటకొచ్చేసిన అమ్మ.. బిహార్‌లో ఉన్న నాన్న దగ్గరకు వెళ్లిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేదంటే చనిపోతానని భయపెట్టింది. దీంతో దగ్గరలోని ఓ గుడికి వెళ్లారు. కలిసుండాలని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేదు. నాకంటే ఐదేళ్ల పెద్దోడైన అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య తర్వాత ముగ్గురు బిడ్డలు చనిపోయారు. తర్వాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు 7 నెలలకే నేను పుట్టేశాను'

    'నేను మూడు నాలుగేళ్లన్నప్పుడు మేం సింగరేణిలో ఉన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్ రావడం నాకు గుర్తుంది. బీహెచ్ఈఎల్‌లో చదువుకున్నాను. నేను స్కూల్ చదువుతున్న టైంలో అమ్మకు క్యాన్సర్ వచ్చింది. అబార్షన్స్ వల్ల ఆమె శరీరంలో పాలు ఉండిపోవడంతో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. నాలుగో స్టేజీలో ఉన్నప్పుడు ఈ వ్యాధి గురించి మాకు తెలిసింది. ఇదంతా నాకు ఆరేడేళ్లు ఉన్నప్పుడు జరిగింది. క్యాన్సర్ గురించి చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది. నేను అది జ్వరం అనుకున్నా. చావు చూసేంతవరకు ఎవరికైనా దాని గురించి తెలియదు. నాకు పదకొండేళ్లు ఉన్నప్పుడు ఓ రోజు అమ్మ చనిపోయింది. దీంతో అప్పటినుంచి నా జీవితం సీరియస్ అయిపోయింది'

    'నేను ఇప్పుడేం ఇండిపెండెంట్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఇలానే పెరిగాను. అయితే మా నాన్న బుర్ర చెడిపోయింది. మరి అమ్మ చనిపోవడం వల్లో ఏమో గానీ తాగుడుకు బానిస అయిపోయాడు. దీంతో ఇంట్లో నా పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో నాన్నని చూడటానికే భయపడి బెదిరిపోయేదాన్ని. 18 ఏళ్లొస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నాకు పన్నెండుపదమూడేళ్లు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యాను. ఇదంతా నాకు నేను చెప్పుకొనేదాన్ని. అలా ఎదురుచూసి 18 ఏళ్లు పూర్తవగానే ఇంటినుంచి బయటకొచ్చేశాను. ఇవన్నీ క్యాజువల్‌గా చెబుతున్నాను గానీ నా జీవితంలో చాలా బాధాకరమైన విషయాలు ఇవి'

    'ఇంటినుంచి బయటకొచ్చేసిన తర్వాత రెండున్నరేళ్లు అనాథశ్రమంలో పెరిగాను. ఆ టైంలో నాకు తిండి పెట్టడంతో పాటు చదువుకు అయ్యే ఖర్చంతా వాళ్లు భరించారు. దీంతో డ్యాన్స్ టీచర్‌గా మారి డబ్బులు సంపాదించి నా కోసం ఖర్చు పెట్టినదంతా ఇచ్చాను. తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో అవకాశం వచ్చింది. తర్వాత సమంత పరిచయమైంది. అలా యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాను. చాలా చిన్నప్పుడే పెద్ద బాధ్యతలు మోయడం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాను' అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.

    (ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)

  • మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్‌  మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకే భారీ ఈవెంట్‌ నిర్వహించారు. అప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

    అదే సమయంలో ‍అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి లీక్‌ల బెడద తప్పడం లేదు.  ఒడిశాలో జరిగిన తొలి షెడ్యూల్ చిత్రీకరణ టైమ్‌లో కొన్ని సీన్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా కీలకమైన ఉగ్రభట్టి గుహ సన్నివేశానికి సంబంధించిన భారీ సెట్ స్టిల్స్ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చాయి. దీంతో మన దర్శకధీరుడిని సైతం లీక్‌ల కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఫోటోలు లీక్ కావడంపై మేకర్స్ నిరాశకు గురయ్యారు. ఇకనుంచి భద్రతను కట్టుదిట్ట చేసేలా చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
     

     

  • హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్‌లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.

    (ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)

    సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)

National

  • సీఎంగా రాజీనామా చేసినా కానీ.. పార్టీపై పట్టు కోసం సిద్ధరామయ్య ప్రయత్నాలు సాగిస్తున్నారు. డీకే శివకుమార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా సిద్ధరామయ్య చక్రం తిప్పుతున్నారు. ఢిల్లీలో వరుసగా పార్టీ పెద్దలతో సుదీర్ఘ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ లేకుండా కోఆర్డినేషన్‌ కమిటీ వేయాలంటూ సిద్ధరామయ్య కొత్త మెలిక పెట్టారు.

    కేబినెట్‌లో తన వర్గానికి చెందిన 15 మంది ఉండేలా సిద్ధరామయ్య ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. తన మనుషులకు డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తన కొడుక్కి వైద్య, విద్య వంటి ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలంటున్న సిద్ధరామయ్య.. కర్ణాటక కాంగ్రెస్‌లో తన ప్రాధాన్యం తగ్గకుండా రాజ్యసభకు వెళితే రాష్ట్రంలో తన పట్టుపోతుందని భయం పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉంటేనే అహిందా వర్గాలు.. పార్టీకి అండగా ఉంటాయని హైకమాండ్‌ను సిద్ధరామయ్య ఒప్పించారు.

    ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభకు పంపిస్తామంటూ కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఆఫర్‌ వచ్చిందని.. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని వినమ్రంగా ఆ వినతిని తోసిపుచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని, ప్రజలు తమకు ఐదేళ్లపాటు పదవీకాలం ఇచ్చారని, ఇంకా రెండేళ్ల కాలం మిగిలి ఉందని, అప్పటివరకు వారి కోసం కోసం పని చేయాల్సి ఉందని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన వెల్లడించారు.

    ఇదిలా ఉండగా, సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు మద్దతుగా ఆయన అనుచరులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం వైఖరిపై మండిపడ్డారు. సిద్ధరామయ్యతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే కురుబ సామాజిక వర్గం నాయకులు సైతం సిద్ధరామయ్య రాజీనామాను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, పదవిలో కొనసాగాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదేశాల ప్రకారమే సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.  
     

     

     

  • సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మంత్రి దిలీప్‌ ఘోష్‌ బైక్‌ రైడ్‌ చేసి ఆకట్టుకున్నారు. కోల్‌కత్తా వీధుల్లో  ఖరీదైన హోండా గోల్డ్‌ వింగ్‌ను రాయల్‌గా చక్కర్లు కొట్టారు.   ఈ రైడ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

    దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్‌ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్‌ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia  ట్యాగ్‌ చేయడం విశేషం ఈ బైక్‌ ధర మార్కెట్‌లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.

    దీనికి సంబంధించిన వివరాలను కూడా  మంత్రి దిలీప్‌   ఎక్స్‌లో షేర్‌ చేశారు,  Honda BigWing సూపర్ బైక్‌ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్‌సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్‌ గురించి రాసుకొచ్చారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నివో ప్రభావంతో ఐఎండీ అంచనాలు తలకిందులయ్యాయి. నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యమవుతోంది. నెమ్మదిగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... జూన్‌ 4,5 తేదీల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళను తాకిన మూడు రోజుల తర్వాత తెలంగాణలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి.

    మే చివరి వారంలో కేరళలోకి  నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ భావించింది. అయితే, ఈ ఏడాది ఇంకా అక్కడ విస్తరించలేదు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సీజన్‌లో వర్షపాతం తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రుతు పవనాల రాక ఆలస్యం కావడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. రుతుపవన గాలులు అరేబియా సముద్రంలోని చాలా భాగాలు, లక్షద్వీప్ ప్రాంతం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోకి మరింత ముందుకు సాగాయి. రుతుపవనాల గమనం ప్రస్తుతం నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అవి సహజంగానే మళ్లీ పుంజుకుంటాయని ఐఎండీ పేర్కొంది.

    రుతుపవనాల విస్తరణకు ఆటంకం కలిగించిన సముద్ర, వాతావరణ పరిస్థితులు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం.. రుతుపవనాల వ్యవస్థ నైరుతి అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా మయన్మార్ వరకు విస్తరించి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది.

    సాధారణంగా జూన్ 1న ప్రవేశించే రుతుపవనాలు.. ఈసారి దాదాపు ఐదు రోజులు ముందుగానే.. మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ గతంలో అంచనా వేసింది. అయితే.. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా రుతుపవన గాలులు తాత్కాలికంగా బలహీనపడ్డాయి. కాగా, ప్రస్తుత మందగమనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాల్లో విస్తరించాయి. ఇప్పుడు వాయవ్య దిశగా వేగంగా కదులుతున్నాయి. ప్రారంభ అంచనాతో పోలిస్తే స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ.. రుతు పవనాల ప్రస్తుత కదలిక సాధారణంగానే ఉన్నాయి.

    సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 27 నాటికి రాజధాని ఢిల్లీకి చేరుకుంటాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా.. జూన్ 25 నుండి 30 మధ్య రుతుపవనాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మందగమనం జూన్ మొదటి వారం వరకు కొనసాగకపోతే.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాల గమనం చాలా వరకు సాధారణంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
     

     

  • మహిళలపై వరకట్న వేధింపులు, హత్యలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళను అత్తారింట్లో వేధించి, ఉరివేసుకుని చనిపోయేలా చేసిన ఒక కేసు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు శుక్రవారం వరకట్న వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  అసలు అబ్బాయిలు అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకోవడం, ఎందుకు, ఆ తరువాత వారిని, వారి కుటుంబ సభ్యులు పీడించుకు తినడం ఎందుకు అని ప్రశ్నించింది.

    జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, భర్త కుటుంబ సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టింది. సమాజానికి ఒక బలమైన హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న సామాజిక పరిస్థితులను ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత వారిని, వారి కుటుంబాలను ఎందుకు అవమానిస్తారు? వధువును, ఆమె కుటుంబంపై  వేధింపులు ఇక చెల్లవనే  సందేశం సమాజానికి వెళ్లాలని పేర్కొన్నారు. చదువుకున్న సమాజంలో కూడా ఇలాంటి ప్రవర్తన సాధారణం అయిపోతుండటంపై జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆవేదన వ్యక్తం చేశారు.  వీరంతా ఉన్నత చదువులు చదవినవారు అంటూ అసహనం ప్రకటించారు.  

    2010లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన (సుచిత్ కేసరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్)కేసు ఇది.  పెళ్లయిన మూడేళ్లలోనే ఒక మహిళ అత్తారింట్లో ఉరివేసుకుని మరణించింది. భర్త, అతని కుటుంబ సభ్యులు నగదు, కారు ఇవ్వాలని నిరంతరం వేధింపులకు గురిచేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

    పెళ్లయిన ఏడేళ్లలోపు అసాధారణ పరిస్థితుల్లో మరణం సంభవించడంతో, ఇది వరకట్న మరణం (Statutory Presumption of Dowry Death) కిందకు వస్తుందని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. ఆమె చనిపోవడానికి కొద్ది రోజుల ముందు కూడా డబ్బుల కోసం వేధించినట్లు వధువు కుటుంబ సభ్యులు సాక్ష్యాలు సమర్పించారు.

    ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు
    పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె ఉరివేసుకోవడం వల్లే చనిపోయిందని తేలినప్పటికీ, దానికి దారితీసిన పరిస్థితులు, నిరంతర వరకట్న వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కోర్టులు నిర్ధారించాయి. దీనితో భర్త కుటుంబ సభ్యులకు సెక్షన్ 304B (వరకట్న మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498A (మహిళలను వేధించడం) కింద శిక్ష పడింది. దీనిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కూడా సమర్థించింది.

     498A కింద పడిన శిక్షలు రద్దు చేయాలంటూ
    మరణించిన మహిళ భర్త తమ్ముడు తనకు సెక్షన్ 498A కింద పడిన శిక్ష నుండి ఉపశమనం కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతని తరపు న్యాయవాది వాదిస్తూ, తన క్లయింట్‌పై కేవలం 498A సెక్షన్ మాత్రమే ఉందని, ఆ నేరం కూడా రుజువు కాలేదని పేర్కొన్నారు. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. కేవలం 498A సెక్షన్ మాత్రమే ,  మూడేళ్లే  శిక్ష పడినందుకు సంతోషించండి అంటూ చురకలేశారు జస్టిస్ నాగరత్న.

    ఈ సందర్భంగా అత్తారింట్లో జరిగే  వేధింపుల తీరును ఆమె ఎత్తిచూపారు.  "ఇది వధువును, ఆమె కుటుంబాన్ని పీడించుకు తినే నైజం. భర్త కుటుంబం వధువు తరపు వారిని 'మీరు అడుక్కునేవాళ్లు (Beggars), డబ్బులు ఇవ్వలేరు' అని నిందించింది. ఆ తండ్రి కూతురిని కాపాడుకోవడానికి ప్రాధేయపడుతుంటే, వారిని భిక్షగాళ్లని పిలుస్తారా? వధువు తండ్రి రూ. 60 వేలు ఇస్తానన్నా కూడా మీరు వారిని అడుక్కునేవాళ్లని అంటారా?" అని జస్టిస్ నాగరత్న నిలదీశారు. ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించగా, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. చివరకు, సుప్రీంకోర్టు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ, నిందితుడి అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ కేసులో పిటిషనర్ తరపున అడ్వకేట్ రిషి జైస్వాల్ హాజరయ్యారు.

     

  • సాక్షి, ఢిల్లీ:  2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్‌ లీక్‌పై ఆరు వారాల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.  పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందంటూ ఆందోళన వ్యక్తంచేసింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై ఆగ్రహం చేసింది.

    పరీక్షలనిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించింది. పేపర్ లీక్‌తోవిద్యార్థులుతీవ్ర మనోవేదనకు గురయ్యారని వ్యాఖ్యానించింది. నీట్‌ కేసులో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించాలని తగిన చర్యలు చేపట్టాలంటూ ఆయాశాఖలకు మధ్యంతర ఉత్తర్వులు  జారీ చేసింది. 

    ప్రస్తుతం కొనసాగుతున్న నీట్ 2026 పేపర్ లీక్ వివాదానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారత సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమైన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం  అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, జూన్ 21న జరగబోయే నీట్ 2026 పునఃపరీక్షలో విశ్వాసం, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పునరుద్ధరించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ విచారణకు ఎన్‌టీఏ, మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.

    నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
  • ముంబై: పుణేలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. శివారు ప్రాంతమైన పింప్రి చించ్వాడ్‌లో ఈ ఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్‌లోని వాన్వాడి ప్రాంతంలో అక్రమ మద్యం సేవించి గురువారం ఎనిమిది మంది మరణించగా.. ఇవాళ (శుక్రవారం) ఉదయం మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 11కి చేరింది. మద్యం సేవించిన తర్వాత బాధితులు స్పృహ తప్పి పడిపోయారని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వారు మరణించినట్లు ప్రకటించారు.

    ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని స్థానిక ఎన్సీపీ నేత యోగేష్ బహాల్ డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారుల అండదండలతోనే అక్రమ, కల్తీ మద్యం బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని.,. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 11 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దందాలో వారు కూడా భాగమయ్యారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

    అయితే, ఎండతీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని పేర్కొంటూ... ఈ 11 మరణాలు కల్తీ మద్యం వల్లే జరిగాయని ధృవీకరించడానికి పోలీసులు నిరాకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరంగా ఆయన  పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని.. దీని వెనుక ఎంతమంది ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.

  • కేరళ రాజకీయాల్లో మరోసారి “వందేమాతరం” వివాదం చెలరేగింది. కొత్త అసెంబ్లీ సమావేశాల తొలి రోజే జాతీయ గీతం ఆలాపన చుట్టూ మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. గవర్నర్ సమక్షంలో పూర్తి “వందేమాతరం” వినిపించాల్సిన కేంద్ర మార్గదర్శకాలను పాటించలేదంటూ బీజేపీ మండిపడుతుండగా.. ఇది ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సంప్రదాయమేనని ప్రభుత్వం సమర్థించుకోవడం, దానికి ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

    తిరువనంతపురంలోని అసెంబ్లీలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రసంగానికి ముందు “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపించారు. అయితే 2026 ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాల్లో పూర్తి ఆరు చరణాలు వినిపించాలని సూచించిందని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ ఏఎన్‌ షమ్షీర్‌ దృష్టికి ప్రోటోకాల్ అంశాన్ని తీసుకెళ్లారు.

    అయితే ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం మాత్రం ఇది కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. అసెంబ్లీలో గతం నుంచే “వందేమాతరం”లో తొలి రెండు చరణాలనే ఆలపిస్తున్న సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌ కూడా ప్రభుత్వ వైఖరినే సమర్థించారు. పూర్తి “వందేమాతరం” ఆలాపన తప్పనిసరి కాదని, 2026 మార్చిలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీంతో ఇది కేవలం ప్రోటోకాల్ వివాదమా? లేక రాజకీయ సంకేతమా? అన్న చర్చ మొదలైంది.

    ఇక బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. “వందేమాతరం”కు 150 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇలా చేయడం జాతీయ గీతానికే అవమానమని విమర్శించారు. గవర్నర్‌ను, లోక్‌భవన్‌ను, జాతీయ వారసత్వాన్ని కూడా అవమానించినట్లేనని ఆరోపించారు. అంతేకాదు.. ప్రభుత్వం జమాత్-ఏ-ఇస్లామీ, సీపీఎం అభిప్రాయాలకు తలొగ్గుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.

    మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం తలెత్తడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి అసెంబ్లీలో “వందేమాతరం” ఆలాపన కూడా చారిత్రక పరిణామమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. 1957 తర్వాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. “వందేమాతరం”లో ఎన్ని చరణాలు పాడాలి అనే అంశం ఇప్పుడు కేరళలో రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగ చర్చకు దారితీసింది.

Politics

  • తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌ అని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్‌తో ఉంటున్నారని అం‍బటి విమర్శించారు.  కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. 

    ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంగ్రెస్‌ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్‌ పార్టీ బీ టీమ్‌. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ బీ టీమ్‌. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్‌ చేస్తుంది.  రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు‌ సంకేతం. 

    చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. 

    దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. 

    కేఎన్నార్ మీద ఎల్లోమీడియా నీచపు రాతలు రాస్తోంది. చంద్రబాబు ఆస్తి రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారు?, సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడవి?, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ, కిరణ్ లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?, వైఎస్ఆర్ సీపీని తొక్కేయటం ఎవరితరం కాదు. మా ఇంటి మీద దాడి, విధ్వంసం  చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు?, త్వరలోనే మళ్ళీ నా పోరాటం ప్రారంభిస్తా. మా‌ ఇంటి నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వస్తా. 29 కిలోమీటర్లు 'వినతి పాదయాత్ర' చేస్తా’ అని పేర్కొన్నారు.

     

  • ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఆది శ్రీనివాస్‌కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్‌. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్‌లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

  • హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ నేతలు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు గోసం-బీజేపీ భరోసా పేరుతో రైతాంగం పడుతున్న బాధలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టామని, నాలుగురోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామన్నారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఎద్దేవా చేశారు.

    ‘ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. మా పర్యటనలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయి. మంత్రులు ఇవే సమీక్షలు, పర్యటనలు ముందే చేస్తే బాగుండేది కదా?, ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి. లారీ, హామాలీల ఖర్చు రైతే ఇస్తున్నాడు.. రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలెక్క మారిపోయారు. 

    ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరీ, బుద్ధి మందగించింది కాబట్టే బీజేపీని విమర్శిస్తున్నారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు డిల్లీ యాత్రలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా?, బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది. 

    మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెట్రోల్ డీజల్ పై అవగాహన లేదు. పెట్రోల్ డీజల్ పై 30 శాతం వ్యాట్ ను ఎందుకు ముఖ్యమంత్రి తగ్గించడం లేదు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా?.. ఎక్స్ గ్రేషియా ప్రకటించారా?, సన్ ప్లవర్, శెనిగలు కొంటున్నామని తుమ్మల చెబుతున్నారు.. మీ కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలి. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోంది. కేంద్రం కొనుగోళ్లు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయలేదా?’ అని ప్రశ్నించారు.

  • తాడేపల్లి:  ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల్లా మహానాడుకు తీసుకెళ్లి పచ్చ కండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం, వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందని ప్రశ్నించారు.  నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారశైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. 

    టీడీపీ కార్యకర్తలతో మహానాడు మీటింగ్ పెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లే రోగులకు ఆటంకాలు కల్పించారు. మీ పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయాల్లోనో, ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ లో ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాలే తప్ప, ప్రభుత్వ ఆస్పత్రులు, గుళ్లు, గోపురాల దగ్గర మీటింగులు పెట్టుకోవడం పద్ధతి కాదు. ఆస్పత్రుల ప్రాంగణాలను వాడుకుంటూ, ఉద్యోగుల్ని కూడా సభల్లో కూర్చోబెడుతున్నారు. 

    వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులా, మీ పార్టీ కార్యకర్తలా అని అడుగుతున్నాను. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఓ గ్రామంలో ఓ ఎస్సై దర్జాగా మహానాడు స్టేజ్ మీద కూర్చొన్నాడు. ఇదేమైనా అధికారిక కార్యక్రమమా ? టీడీపీ సమావేశాల్లో పాల్గొంటే ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా ? ఉద్యోగుల్ని ప్రతిసారీ ఇలాగే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటోంది. 

    గతంలో కడపలో మహానాడు జరిగినప్పుడు కూడా వీఆర్వోల్ని కూడా తెచ్చి కూర్చొబెట్టారు. అప్పట్లో టెంట్లు గాలికి కూలిపోయి వాళ్లంతా గాయపడ్డారు. అప్పట్లోనే మేం ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించాం. గతేడాది కడప మహానాడులో డీఎం అండ్ హెచ్వోను సైతం మెడలో పసువు ట్యాగ్ లు వేసి మరీ కూర్చోబెట్టారు. అలాగే అనకాపల్లిలోని ఓ గుడిలో మీటింగ్ పెట్టుకున్నారు, నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మాలకొండయ్య స్వామి ఆలయంలో, చిత్తూరులో ఎంపీడీవో ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ జెండాలు కట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నాం.

    ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కానీ..
    గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేం ప్రశ్నించినా ఇంకా ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూనే ఉన్నారు. చిన్న తప్పు జరిగితే నిబంధనల పేరుతో ఇతర ఉద్యోగుల్ని ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల్ని రాజకీయ పార్టీల సమావేశాల్లో వాడుకోవడం ఆపాలి. ఏ పార్టీతోనూ ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. ఈ రెండేళ్లలో ఇచ్చిన హామీలు చెప్పడానికి పెట్టాల్సిన మహానాడుల్ని కాస్తా తమ విజనరీ లీడర్ గురించి చెప్పుకోవడానికే పెడుతున్నారు. 

    మీరు అంత విజనరీ అయితే ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారు ? అంటే ఉద్యోగులు, పెన్షనర్లను మీరు మోసం చేస్తున్నట్లే కదా. ఎంతో కాలం ఇలా వారిని మోసం చేయలేరు. వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు, మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఉన్న పీఆర్సీ కమిషనర్ నే రాజీనామా చేయించి ఇంటికి పంపారు. ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఊసేలేదు. రెండేళ్లు కాలయాపన  జరిగినా ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ రెండేళ్లలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటే, ఒక డీఏ మాత్రమే అరకొరగా ఇచ్చారు. డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం.

    40 వేల కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలు
    ప్రభుత్వం నుంచి జీపీఎఫ్ తో పాటు ఇతర బకాయిలు కలిపి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎంతసేపూ గతంలో ఉన్న ప్రభుత్వం తప్పుల గురించి మాట్లాడటమే కానీ మీరేం చేస్తారో చెప్పలేరా ? గత ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఐఆర్ ఇచ్చింది. అలా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్ధీకరించరు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ వాళ్లే ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారు. దాదాపు 7-8 వేల మంది లెక్చరర్లు ఇప్పటికీ క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అన్నారు. 

    అందులో మేం కట్టిన డబ్బు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఆస్పత్రులకు సకాలంలో  ఆ డబ్బు కట్టకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉండాలని ఓ పథకం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అలాగని కొత్త పథకం కూడా అమలు చేయడం లేదు. ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల కోసం ఆప్కోస్ సంస్థ ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా కాదని కావాల్సిన వాళ్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఉద్యోగుల్ని ఘోరంగా వాడుకుంటున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారనే కోపంతో గార్డు, అటెండర్ చేసే పనుల్ని సైతం వెట్టిచాకిరీలా చేయిస్తున్నారు. ఏ సర్వే వచ్చినా వీళ్లకే చెప్తారు. వాళ్లకో జాబ్ చార్ట్ ఉండదు. నిన్న బక్రీద్ పండుగ వచ్చినా సెలవు ఇవ్వకుండా తిప్పారు.

    ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తెచ్చిన జగన్
    ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ రేపు మరో ప్రభుత్వం వచ్చాక, గతంలో ఆ పార్టీ కార్యక్రమంలో కూర్చొన్నారని వీరిపై చర్యలు తీసుకుంటే, ఆ రోజు చంద్రబాబు వచ్చి కాపాడతారా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు మేలు చేస్తే.. తిరిగి దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుకు ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని ఓ బిరుదు ఇవ్చొచ్చు. ఏది కనిపిస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తుంటారు. 

    కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే దాన్ని రివర్స్ చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇదేనా విజనరీ పాలన? రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ  విభాగాల్ని కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తారా ? ఉద్యోగుల్ని చిన్నచూపు చూడటం ఆపి, వారిని నిబంధనల ప్రకారం పనిచేసేలా ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకోవడం ఇకనైనా ఆపాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు.

  • సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు.

    ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, వైఎస్‌ జగన్‌ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో ఆమె ఇంకేమన్నారంటే..

    మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీ
    మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు  ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు.

    రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్‌ జగన్‌ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి.

    మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనే
    ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్‌లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్‌ జగన్‌.

    మహిళలకు రిజర్వేషన్‌పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఎలాగో పార్లమెంట్‌లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు.

    హత్యా రాజకీయాలు టీడీపీవే
    గొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్‌ జగన్‌ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ  రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్‌ జగన్‌ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు.

    మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ ? రాష్ట్రంలో శాంతి భద్రతలపై మీరే మాట్లాడాలి. మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లే పరిస్ధితి ఉందా, వెళ్లినా ఫిర్యాదు తీసుకునే పరిస్ధితి ఉందా ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా అమాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, సోషల్ మీడియాపై దాడులే.

    నువ్విచ్చేది ఏంటి బోడి... మహిళా రిజర్వేషన్లపై లోకేష్ కామెడీ కామెంట్స్

    రైల్వే కోడూరు ఎమ్మెల్యేపైలో మోసం, అత్యాచారం ఆరోపణలపై మహిళా ఉద్యోగి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యల్లేవు. మహిళా స్కూలు ప్రిన్సిపాల్ ను టీడీపీ ఎమ్మెల్యే వేధిస్తే ఎలాంటి చర్యల్లేవు, మంత్రి సంధ్యారాణి పీఏపై లైంగిక వేధింపులపై చర్యల్లేవు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహిళలతో అసభ్య కాల్స్ లో మాట్లాడినా చర్యల్లేవు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన అనంతపురం ఎమ్మెల్యేపైనా చర్యలుండవు. కాబట్టి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది?

    మహిళల్లో దైర్యం నింపిన జగన్ పథకాలు
    స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్టు కొట్టుకోవడం కాదు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ అసలు స్త్రీ శక్తి ఎలా ఉంటుందో చూపించారు. ప్రతీ ఇంట్లోనూ ఓ నమ్మకం కలిగించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే మహిళళకు సాధికారత లభించింది. మహిళలకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మున్సిపల్, జడ్పీ పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఆసరా, కాపు నేస్తం, సున్నా వడ్డీ, జగనన్న తోడు వంటి పథకాలు గత ప్రభుత్వంలో మహిళల స్వయం శక్తిని పెంచాయి. ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్ వంటి అంతర్జాతీయ నెట్ వర్క్ లతో మహిళా సంఘాల్ని అనుసంధానం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే. కానీ చంద్రబాబు రెండేళ్ల పాలనలో మహిళలకు చేసిందేమీ లేదు. కానీ నిత్యం వైఎస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నారు.

    రాష్ట్రంలో మీరు కోల్పోయిన విశ్వసనీయత మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు, లోకేష్ గురించి అర్దమైపోయింది. మహానాడులో పెద్ద పెద్ద మాటలతో పబ్లిసిటీ కింగ్ లు, పరిపాలనలో పిల్లులని నిరూపించారు. హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతీ పథకం మహిళల జీవితాల్లో మార్పు తెస్తే.. మీ పాలనలో మాత్రం ప్రతీకార రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మామా, మరదలు, తమ్ముడు పార్టీ మహానాడు పేరుతో చేసిన మహానాటకం అద్భుతం.

    ఎందుకంటే మామ గారైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, మరదలి బలవన్మరణానికి కారణమయ్యారు, తమ్ముడి గారిని గొలుసులు వేసి కట్టేశారు. ఇవన్నీ నిజాలే. ఆ పార్టీ మామ, మరదలు, తమ్ముడు పార్టీ. మీరు హద్దులు దాటి మాట్లాడితే మేమూ ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ మాట్లాడలేదంటూ మాకు కొన్ని విలువలు ఉన్నాయనే. మీరు దిగజారి మాట్లాడుతుంటే మీ అంత దిగజారకపోయినా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లే అర్హత లేని వాళ్తంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టారాజ్యంగా నిందలేస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా కబ్జాదారులు, బ్యాంక్ దోపిడీ దాడులు, మహిళల్ని లైంగికంగా వేధించిన వాళ్లు, డీఎస్సీ స్కాం దారులే. అదే వేదికపై మహిళా బిల్లును ఓడిన కాంగ్రెస్ తో వెంటనే విందులు చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్లంతా వైఎస్‌ జగన్‌ గురించి, వైఎస్సార్సీపీ గురించి మాట్లాడుతున్నారు.

    లోకేష్‌కు వైఎస్సార్సీపీ ఓపెన్ ఛాలెంజ్
    లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం. చర్చకు సిద్దమని మీరు సవాల్ విసిరారు కదా, దాన్ని స్వీకరిస్తున్నాం. ఏ టీవీ ఛానలో చెప్పండి, అందులో మా పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వచ్చి చర్చలో పాల్గొంటారు. కానీ దాని కంటే ముందు పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.10 వేల కోట్లు ఎప్పుడిస్తారా చెప్పండి, అలాగే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారా చెప్పాలి. డీఎస్సీలో పేపర్ లీక్, మెరిట్ లిస్ట్ మాయం, డేటా లీక్ జరిగాయి. మీరు ఈ డార్క్ ఆపరేషన్ గురించి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు.

    రాష్ట్ర యువత లోకేష్ కు పేపర్ లీకేజ్ అని పేరు పెట్టారు. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్ లు అయ్యాయి?, వాటిపై ఏ చర్యలు తీసుకున్నారు ? అడిగితే కేసులు పెడుతున్నారు. మీ పరీక్షల నిర్వహణలో తప్పులు పెట్టుకుని అడిగిన వాళ్ల మీద కేసులు పెడతామంటే ఎలాగో పేపర్ లీకేజ్ మంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఎన్నో పోరాటాలు చేస్తున్నా మీరు స్పందించడం లేదు. మీ వీధి భాష చూసి మీరు చదివిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ కూడా సిగ్గుపడుతుంది.

    ఓ పారిశ్రామిక వేత్త నుంచి లాబీయింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ఫీజులు కట్టారన్నది వాస్తవమా కాదా లోకేష్ చెప్పాలి. స్టాన్ ఫర్డ్ డిగ్రీ కంటే వీధి భాష, కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ పాలనపైనే ఎక్కువగా పీహెచ్‌డీ చేసినట్లున్నారు. అందుకే ప్రజలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని ఆరె శ్యామల అన్నారు.

Family

  • ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవం తోపాటు సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా మే10న బెంగళూరులో అట్టహాసంగా వేడుకలు జరిగాయి.  ఈ వేడుకలు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నెలరోజుల పాటు ఘనంగా జరిగాయి. శుక్రవారం( మే 29, 2026న) ఈ కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకి భారత ఉపరాష్ట్రపతితోపాటు పలువురు విశిష్ట అతిథులు పెద్దఎత్తున హాజరయ్యారు. 

    ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ యువత అభివృద్ధి, వ్యవసాయోపాధి, స్థిరత్వం, చైతన్య అధ్యయనాలు, విద్యకు సంబంధించిన ఐదు ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించారు.  అలాగే ఈ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ 45 ఏళ సేవలకు గుర్తుగా స్మారక తపాలా స్టాంపును ఆవిష్కరించారు. ఈ వేడుకకు 678 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్‌ ఈ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యక్రమాన్ని అనేక ఖండాలపై లక్షలాది మంది జీవితాలను తాకిన గొప్ప దృష్టికోణాన్ని జరుపుకునే రోజుగా అభివర్ణించారు. మొత్తం 182 దేశాల్లో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. 

    గురుదేవ్‌ రవిశంకర్‌ జ్ఞానం, అవగాహన, శాంతి , సామరస్య విలువలతో మానవాళిని ప్రేరేపిస్తూనే ఉన్నారని కొనియాడారు రాధాకృష్ణన్‌. ఈ మేరకు గురుదేవ్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ..192 దేశాలు కలిసి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించి..ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఒత్తిడి లేని జీవితానికి ధ్యానం ఒక ప్రాథమిక అవసరమనే  అవగాహనను పెంచేందుకు నాంది పలికారన్నారు. 

    అలాగే ప్రపంచ సామరస్యానికి పిలుపునిస్తూ భయం, ఉద్రిక్తత మరియు ద్వేషం లేని ‘వసుధైవ కుటుంబకం’ — ఒకే ప్రపంచ కుటుంబాన్ని మనం కలగనాలి అన్నారు. ఇక ఈ వేడుకలో ప్రారంభించిన ఐదు కార్యక్రమాలు విద్య, ఆవిష్కరణ, స్థిరత్వం, మానవ అభివృద్ధి ద్వారా సమకాలీన సమాజంలోని అత్యవసర అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

    (చదవండి: ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 ఏళ్ల వేడుకలకు ప్రధాని మోదీ)

     

  • అమ్మమ్మలు తాతయ్యలు ఈ తరం ట్రెండీ పుడ్స్‌ ఆస్వాదించడం అరుదు. ఒకవేళ​ తినమని బలవంతం చేసినా అంతగా ఆసక్తి చూపరు, ఇష్టపడరు. కానీ ఈ 92 ఏళ్ల బామ్మ భలే ఇష​ంగా తింటూ మెచ్చుకుంటోంది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

    ఆ వీడియోలో ఒక అమ్మాయ్‌ తన అమ్మమ్మకు పిజ్జా, కూల్‌డ్రింగ్‌ ఇప్పించాలనుకుంటుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పెడుతుంది. ఇంతలో ఆ ఆర్డర్‌ రానే వస్తుంది. ఆ విషయం అమ్మమ్మకు చెప్పి డైనింగ్‌ టేబుల్‌ వద్దకు తీసుకువస్తుంది. తినమంటుంది మనవరాలు. ఆ బామ్మ ఆ పిజ్జాని ఆస్వాదిస్తూ..చూపిస్తున్న హావాభావాలు చాలా క్యూట్‌గా ఉంటాయ్‌. 

    అమ్మమ్మలు ఏకిచిడి, పులిహోర తింటారనుకుంటే పొరపాటు..ట్రెండ్‌ మారింది వాళ్లు కూడా అప్‌డేట్‌ అవుతున్నారు అన్నట్లుగా ఉంది కదా ఈ బామ్మను చూస్తే. ఆమె చాలా చిన్నపిల్లలా ఎంజాయ్‌ చేస్తూ తినడం చూస్తే..మన అమ్మమ్మలకు, బామ్మలకు ఇలాంటి ఫుడ్‌ ఐటెమ్స​ ఇప్పించి చూడాలనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి.. 

    (చదవండి: వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్)
     

  • సాక్షి, హైదరాబాద్‌: ఎండ దెబ్బకు గుండె గుభేల్‌మంటోంది. పగటి ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీల దాకా నమోదవుతుండటం, తీవ్ర వడగాడ్పులు వీయడం, వాతావరణంలో మార్పులతో హృద్రోగాలు పెరుగుతున్నాయి. సమ్మర్‌ హార్ట్‌ ఎటాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడుతున్న వారు, హృద్రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

    శరీర సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ సమయంలో గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే గుండె 10 సార్లు ఎక్కువ కొట్టుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతుండటంతో వేసవిలో హార్ట్‌ ఎటాక్స్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి చెమట రూపంలో సోడియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లిపోతాయి. లవణాలు బ్యాలెన్స్‌ తప్పితే గుండెలయ తప్పుతుంది. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తం చిక్కగా మారి గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.

    వాతావరణంలో మార్పులకు అనుగుణంగా గుండె పనితీరు మారుతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమ్మర్‌ కార్డియాక్‌ అరెస్టు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రతి లక్షలో 200 మంది నుంచి 500 మందిలో గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని.. వేసవి వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమస్య 2–3 రెట్లు పెరుగుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

    దాహం లేకున్నా నీళ్లు తాగండి 
    డీహైడ్రేషన్‌ వల్ల రక్తం చిక్కగా మారిపోతుంది. వేసవిలో దాహం అనిపించినా లేకున్నా అరగంటకోసారి 50 మిల్లీలీటర్ల నుంచి 80 మిల్లీలీటర్ల నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. బీపీకి మందులు (బీటా బ్లాకర్స్‌) వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసవి వేడికి హార్ట్‌ రేటు పెరుగుతుంది. దీన్ని బీపీ మందులు కంట్రోల్‌ చేస్తాయి. దీంతో శరీరానికి అవసరమైన రక్త సరఫరా జరగదు. వేసవిలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. చర్మంలో రక్తనాళాల పరిమాణం పెరిగితేనే చెమట వస్తుంది.

    ఇలాంటి సమయంలో మెదడు, ఇతర శరీర అవయవాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. దీంతో కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు ప్రత్యేకించి వృద్ధులు ఎండలో తిరగొద్దు. అలాగే సాలిడ్‌ ఫ్రూట్‌ జ్యూస్, సోడా, మద్యం, కాఫీ వంటి వాటికి దూరంగా ఉండాలి. 

    – డాక్టర్‌ ఓరుగంటి సాయి సతీశ్,హెచ్‌ఓడీ కార్డియాలజీ యూనిట్‌–1, నిమ్స్‌  

  • జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం పురస్కరించుకుని భారత్ సాధించిన విజయాలతో పాటు మన ముందున్న ఒక పెద్ద సవాలును కూడా గుర్తుంచుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పాల కొరతతో ఇబ్బంది పడిన మన దేశం.. శ్వేత విప్లవం (వైట్ రెవల్యూషన్) సాధించిన అద్భుత విజయంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసి, వినియోగించే దేశంగా ఎదిగింది. అయితే ఇప్పుడు పాలకు డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఆ డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోతే.. రాబోయే రోజుల్లో దేశ అవసరాలకు పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది.

    ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలంటే మనం పశువుల సంఖ్యను పెంచడం కాదు, ప్రస్తుతం మన దగ్గర ఉన్న పశువుల నుండి పాల ఉత్పాదకతను (దిగుబడిని) పెంచడమే ఏకైక మార్గం. భారత్‌లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పశువులు ఉన్నాయి. కానీ ఒక్కో పశువు ఇచ్చే పాల దిగుబడి మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో పశువు నుండి సగటున రోజుకు 7.18 కిలోల పాలు లభిస్తుంటే, మన దేశంలో అది కేవలం 4.87 కిలోలుగా మాత్రమే ఉంది. ఈ పాల దిగుబడిని పెంచడానికి 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.

    ఒకటి పశువులు పాలు ఇచ్చే దశలు, వాటి జాతి లక్షణాలు మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో మేత అందించడం (సైంటిఫిక్ ఫీడింగ్ ప్రాక్టీసెస్) చాలా అవసరం. ఇలా చేయడం వల్ల పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, 

    రెండో మార్గం భారతదేశంలోని మొత్తం పశువులలో 73.5 శాతం ఇప్పటికీ మన దేశవాళీ రకాలే ఉన్నాయి. అయితే ఈ పశువుల జాతుల శాతాన్ని మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2012, 2019 సంవత్సరాల మధ్య కాలంలో విదేశీ, సంకరజాతి పశువుల సంఖ్య 25 శాతానికి పైగా పెరిగింది. దేశంలోని 56 మిలియన్ల రైతులకు చెందిన 92 మిలియన్ల పశువులకు లబ్ధి చేకూరుస్తున్న 'రాష్ట్రీయ గోకుల్ మిషన్' ఇప్పటివరకు 12.2 కోట్ల కృత్రిమ గర్భధారణలు చేసిన 'నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్' వంటి ప్రభుత్వ పథకాలు ఈ మార్పును మరింత వేగవంతం చేస్తున్నాయి.

    మూడోది, పశువుల ఆరోగ్య నియమాలను పాటించడం, పాలు పితికేటప్పుడు పరిశుభ్రతను పాటించడం, గాలి వెలుతురు బాగా వచ్చేలా పాకలను నిర్మించడం. డిజిటల్ సేవల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇవి పశువుల అసలు సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో పాల దిగుబడిని సాధించడంలో ఎంతగానో తోడ్పడతాయి.

    300 మిలియన్ టన్నుల మార్కును దాటడం
    స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశం సాధించిన డైరీ రంగాభివృద్ధిని ఒక గొప్ప విజయగాథగా అభివర్ణించవచ్చు. ప్రభుత్వ విధానాల మద్దతుతో జాతీయ సంకల్పం ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ విజయాన్ని మనం గతంలో ఒకసారి సాధించి చూపించాం. ఇప్పుడు మరోసారి  సాధించలేకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఈసారి మన దేశ పాల ఉత్పత్తిని 300 మిలియన్ టన్నుల సరిహద్దు దాటించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.
    క్యాప్టెన్ (డాక్టర్) ఎ.వై. రాజేంద్ర, సీఈఓ – యానిమల్ న్యూట్రిషన్ బిజినెస్, గోద్రెజ్ ఆగ్రోవెట్

    (చదవండి: వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్)

  • "ఏ చాయ్ చమక్కునే చూడరా భాయ్" అంటూ పొద్దుపొద్దున పొట్టలో టీ చుక్క పడాల్సింది చాలామందికి. అదీగాక కాసేపు చాయ​ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ..ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఘన చరిత్ర ఉంది భారత్‌లో చాయ్‌కి. అలాంటి టేస్టీ టేస్టీ టీల్లో మన భారతీయ మసాలాటీనే అత్యుత్తమ చాయ్‌గా అగ్రస్థానంలో దక్కించుకుంది. 

    ప్రసిద్ధ అంతర్జాతీయ ఫుడ్ ట్రావెల్ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన వంద అత్యుత్తమ మసాలా చాయ్‌ జాబితాలో మన భారతీయ మసాలా టీనే తొలి స్థానం దక్కించుకుంది. భారత్‌లో టీ ఒక పానీయం మాత్రమే కాదు. అది ఒక ఆచారం, సంభాషణను ప్రారంభించేది, పనిమధ్యలో తీసుకునే విరామంలాంటిది, రైల్వేఫ్లాట్‌ఫామ్‌లపై తప్పనిసరిగా ఉండేది, కొన్నిసార్లు ఉచిత చికిత్సలా పనిచేస్తుంది. 

    మన దేశంలో అంత ప్రాముఖ్యత సంతరించుకున్న మన చాయ్‌కే అత్యుత్తమైనదిగా ఫుడ్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ పట్టం గట్టడం విశేషం. అంతేగాదు భారతదేశం అద్భుతమైన టీని అందిస్తుందని కితాబు కూడా ఇచ్చేసింది. దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ టీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  అవేంటంటే..

    మసాలా చాయ్ — 1వ స్థానం
    డార్జిలింగ్ టీ — 6వ స్థానం
    అస్సాం చాయ్ — 13వ స్థానం
    సులేమానీ చాయ్, కేరళ — 39వ స్థానం
    కాంగ్రా టీ, హిమాచల్ ప్రదేశ్ — 41వ స్థానం
    నూన్ చాయ్, జమ్మూ కాశ్మీర్ — 43వ స్థానం

    ప్రపంచ టీ జాబితాలో కేవలం భారతీయ టీలదే ఆధిపత్యం కాదు. హోజిచా టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జపాన్‌కు చెందిన వేయించిన గ్రీన్ టీ. దీని వెనుకే శ్రీలంకకు చెందిన సిలోన్ బ్లాక్ టీ ఉంది. ఇది మృదువైన, అదే సమయంలో ఘాటైన బ్లాక్ టీ రకాలకు ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానంలో సెంచా ఉంది, ఇది జపాన్‌కు చెందిన ఎంతో ఇష్టపడే గ్రీన్ టీ.ఐదవ స్థానంలో చైనాకు చెందిన పు ఎర్ ఉంది, దీనిని ఏజ్డ్ లేదా వింటేజ్ టీ అని కూడా పిలుస్తారు.

    (చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!)

     

     

  • వాయు కాలుష్యం కారణంగా శరీరంలోకి చొచ్చుకుపోయి అవయవాల్లో తిష్టవేస్తున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ రేణువులను తరిమికొట్టడంలో దక్షిణ కొరియా పాపులర్‌ వంటకం కిమ్చి ఎంతగానో తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్లాస్టిక్‌ రేణువులను అదిమిపట్టి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ప్లాస్టిక్‌ పనిపడుతున్న ఆ వంటకంలో ఉన్నది ఏమిటో తెలుసా? ప్రోబయోటిక్స్‌. అంటే లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా అన్నమాట.

    పులియబెట్టడంతో..
    కిమ్చి అనేది దక్షిణ కొరియా సంప్రదాయ వంటకం. క్యా­బేజీ, ముల్లంగి, ఇతర కూరగాయలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తా­రు. కిమ్చిని పులియబెట్టడం వల్ల అందులో లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాకు మైక్రో, నానో ప్లాస్టిక్‌ రేణువులను గట్టిగా అ­తు­క్కునే గుణం ఉందని గుర్తించారు.

    కిమ్చి వంటి ప్రో బయోటిక్స్‌తో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు అందులోని లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా ఉదరంలోకి చేరి నానో ప్లాస్టిక్స్‌కు అతుక్కుంటుంది. అనంతరం శరీర జీర్ణ ప్రక్రియలో భాగంగా ఆ బ్యాక్టీరియా ఆహారంలోని వ్యర్థాలతోపాటు నానో ప్లాస్టిక్స్‌తో సహా బయటకు విసర్జితం అవుతుంది. నానో ప్లాస్టిక్స్‌ శరరీ అవయవాల్లోకి చేరకుండా అడ్డుకోవాలంటే ఆ ప్లాస్టిక్‌ రేణువులు ఉదరం, పేగుల్లో ఉండగానే విసర్జితం అయ్యేలా చూడటమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    ఎలుకలపై ప్రయోగాలతో.. 
    ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. ఎలుకలకు అందించిన ఆహారంలో ప్రో బయోటిక్‌ బ్యాక్టీరియా కలిపినప్పుడు వాటి విసర్జితాల్లో నానో ప్లాస్టిక్స్‌ ఆనవాళ్లు ఎక్కువ మొత్తంలో కనిపించాయని పేర్కొన్నారు. పులియబెట్టిన ఆహారం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడానికి దక్షిణ కొరియా జాతీయ ఆహార సంస్థ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిమ్చి పేరిట ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు హే చూన్‌ చాంగ్‌ బృందం కిమ్చిలో పులియబెట్టిన ఆహారంపై పరిశోధన ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు వ్యవసాయ ఇంజనీరింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న బయోరిసోర్స్‌ టెక్నాలజీ (ఇంపాక్ట్‌ ఫ్యాక్టర్‌ 9.0) అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

    అవయవాల్లోకి ప్లాస్టిక్‌ చేరితే..  
    నానో ప్లాస్టిక్స్‌ అనేవి ఒక మైక్రోమీటర్‌ (మిల్లీమీటర్‌లో వెయ్యోవంతు) పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు. పెద్ద ప్లాస్టిక్‌ పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతూ సూక్ష్మ పరిమాణంలో విభజితమవుతాయి. ఇవి మన ఆహారం, తాగునీటిలో సులువుగా కలిసిపోయి తినేటప్పుడు, తాగేటప్పుడు ఉదరంలోకి చేరిపోతాయి. ఈ ప్లాస్టిక్‌ రేణువులను అలాగే వదిలేస్తే క్రమంగా పేగుల్లోంచి మూత్రపిండాలు, మెదడుకు కూడా చేరి అక్కడే పేరుకుపోయి అవయవాలను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: కోళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ద్రాక్ష పండ్ల పిప్పి (గ్రేప్‌ పోమేస్‌)ని ఉపయోగించవచ్చని వెల్లడైంది. వైన్‌ తయారీ తర్వాత మిగిలిపోయే వ్యర్థ పదార్థం ( పిప్పి) సాంప్రదాయ యాంటీబయాటిక్స్‌ మాదిరిగానే కోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని అమెరికాలో జరిగిన ఒక తాజా అధ్యయనంలో తేలింది.

    ద్రాక్ష పండ్లతో వైన్‌ తయారు చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది టన్నుల పిప్పి (ద్రాక్ష తొక్కలు, గింజలు క్రష్‌ అయిన తర్వాత మిగిలేది) మిగిలిపోతుంటుంది. ఈ వ్యర్థ పదార్థంలో అద్భుతమైన ఆహార ప్రయోజనం దాగి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. బయోఫిల్మ్‌ అండ్‌ మైక్రోబయోమ్స్‌ జర్నల్‌లో ఇటీవల ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. కార్నెల్‌ యూనివర్సిటీ ఆహార శాస్త్ర విభాగం పరిశోధకులు మిలన్‌ కె.శర్మ తదితరులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

    సాధారణ దాణాకు ద్రాక్ష పిప్పి కలిపి..
    అమెరికాలో ఔషధ నిరోధకత, పర్యావరణ నష్టం గురించి పెరుగుతున్న భయాల నేపథ్యంలో.. మాంసం కోసం కోళ్లను పెంచే బ్రాయిలర్‌ ఫారాల్లో యాంటీబయాటిక్స్‌ వాడాకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    కోళ్ల పేగుల్లో వాపును కలిగించే, అనారోగ్యానికి గురిచేసే, పెరుగుదలను తగ్గించే హానికరమైన పేగు బ్యాక్టీరియాను అదుపులో ఉంచడానికి కోళ్ల దాణాలో యాంటీబయాటిక్స్‌ కలుపుతూ ఉంటారు. 30% బియ్యపు తవుడు కలిగిన దాణాలో జింక్‌–బ్రాసిట్రాసిన్‌ అనే యాంటీబయాటిక్‌ను కలిపి ఇస్తుంటారు. తాజా అధ్యయనంలో ప్రయోగాత్మకంగా యాంటీబయాటిక్‌కు బదులు దాణాతో ద్రాక్ష పిప్పిని కలిపి కోళ్లను మేపారు.  

    పులిసిన పిప్పిలో యాంటీబయాటిక్‌ గుణాలు!
    మొత్తం దాణా బరువులో 0.5% మోతాదులో మాత్రమే ద్రాక్ష పిప్పిని కలిపారు. ఎంతో ఆశ్చర్యకరమైన ఫలితంవెలువడింది. కోళ్లకు ఎటువంటి అనారోగ్యం లేకపోగా 20% అదనపు బరువు పెరిగాయి. వైన్‌ తయారీలో భాగంగా ద్రాక్షపండ్లను పులియబెడతారు.

    పులిసిన ద్రాక్షతో వైన్‌ తయారీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలే పిప్పిలో బ్యాక్టీరియాను అరికట్టే యాంటీబయాటిక్‌ గుణాలు ఉండటం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలుభావిస్తున్నారు. పిప్పిలోని ఫ్లేవనా యిడ్లు, పాలిఫెనాల్స్, టానిన్లు వంటి అనేక జీవక్రియాశీల సమ్మేళనాలు బ్యాక్టీరియా నిరోధకంగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.

Advt

  • తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో ‘GVRR బృందావన్’ సరికొత్త కమర్షియల్ సూట్ రూమ్స్ (1BHK & 2BHK) ప్రాజెక్టుతో పెట్టుబడిదారుల ముందుకు వచ్చింది. తక్కువ పెట్టుబడి, పూర్తి భద్రతతో పాటు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నెలవారీ అద్దె ఆదాయం (1BHK కి రూ.20 వేలు, 2BHK కి రూ.32 వేలు) పొందే సువర్ణావకాశం ఇస్తోంది. ఇందులో 3-స్టార్ హోటల్ వసతులు, 9000 చదరపు అడుగుల్లో అత్యాధునిక క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

    యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వార్షిక ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.235 కోట్లకు చేరింది. వారాంతాల్లో 80 వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. స్వర్ణగిరి ఆలయం, బసవపురం రిజర్వాయర్, త్వరలో రానున్న MMTS రైల్వే సౌకర్యం యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉంటూ, స్థిరమైన ఆదాయం అందించే ఈ ప్రాజెక్ట్ వివరాల కోసం వివరాలు అందించాం.

    🌟 యాదగిరిగుట్టలో బంపర్ ఆఫర్! 🌟

    కేవలం ₹40 lakhs పెట్టుబడితో.. ప్రతి నెల ₹20,000 నుండి ₹32,000 వరకు స్థిరమైన అద్దె ఆదాయం!
    ప్రాజెక్ట్: ప్రతిష్టాత్మక GVRR ఎలిగెన్స్ స్టేల్ కమర్షియల్ సూట్ రూమ్స్ & అపార్ట్మెంట్స్.
    లొకేషన్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి కేవలం 800 మీటర్ల దూరంలో!
    లైఫ్ స్టైల్: 3-స్టార్ హోటల్ తరహా అత్యాధునిక లగ్జరీ వసతులు.
    సౌకర్యాలు: 9,000 చదరపు అడుగుల ఎక్స్‌క్లూజివ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్.
    ఆదాయం: ప్రతి నెల స్థిరమైన అద్దె ఆదాయం.

    📊 మీ పెట్టుబడి - ఆదాయం అంచనా కాలిక్యులేటర్

    ఫ్లాట్ రకం ఎంచుకోండి:
    1 BHK (500 Sft)
    ₹40 లక్షలు | అద్దె ₹20K
    2 BHK (800 Sft)
    ₹64 లక్షలు | అద్దె ₹32K
    ఫ్లాట్స్ సంఖ్య:
    1
    మొత్తం పెట్టుబడి: ₹64,00,000
    నెలసరి అద్దె ఆదాయం: ₹32,000
    సంవత్సరపు ఆదాయం: ₹3,84,000
    📞 మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి

    గమనిక: పైన పేర్కొన్న ప్రాజెక్ట్ వివరాలు, ఆదాయ మార్గాలు, వసతులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం.