Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ‘రాజాసాబ్’ సినిమా విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఈ విమర్శలకు కారణం సినిమాలో బాడీ డబుల్‌ను అధికంగా వాడారనే భావన ప్రేక్షకుల్లో కలగడమే. ప్రభాస్ సీన్లలో ఎక్కువగా హెడ్ రీప్లేస్‌మెంట్ టెక్నిక్ ఉపయోగించి బాడీ డబుల్‌తో చిత్రీకరించారని ప్రేక్షకులు అంటున్నారు. దీంతో ఆయన స్వయంగా యాక్షన్, డ్యాన్స్ సీన్లలో పాల్గొనలేదనే అభిప్రాయం బలపడుతోంది.

    అయితే ఇదే సమయంలో విడుదలైన 'మన శంకర వరప్రసాద్' సినిమాలో 70 ఏళ్ల మెగాస్టార్ ప్రతి సీన్‌లోనూ స్వయంగా పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ఫైట్లు అన్నీ ఆయనే చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అవి మరీ అంత క్లిష్టమైన సీన్లు కాకపోయినా, ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా మెగాస్టార్ స్వయంగా చేశారని ప్రేక్షకులు ఆ రెండు సినిమాలను పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 

    70 ఏళ్ల చిరంజీవి ఒక్క సీన్ కూడా డూప్‌కు వదలకుండా చేస్తే మరి 40 ఏళ్లు దాటిన ప్రభాస్ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఫ్యాన్స్ కూడా బలంగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ‘రాజాసాబ్’లో టెక్నికల్ లోపాలు లేదా నిర్లక్ష్యం వల్లనో కానీ హెడ్ రీప్లేస్‌మెంట్ షాట్లు స్పష్టంగా కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసిపోవడమే.

    • మలేసియాలో టాలీవుడ్ నటి రోహిణి..
    • పార్టీలో చిల్ అవుతోన్న జాన్వీ కపూర్..
    • బికినీ పోజుల్లో బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..
    • గోల్డెన్ గ్లోబ్స్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా..
    • బీచ్‌లో ఫ్యామిలీతో బిపాసా బసు చిల్..
    • సముద్రంలో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ ప్రణీత.. 

     

     

     

     

     

     

     

     

  • మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మనశంకర వరప్రసాద్‌ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. పలువురు టాలీవుడ్‌ సినీతారలు మూవీ టీమ్‌ను అభినందిస్తున్నారు.

    తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల సైతం మనశంకర వరప్రసాద్‌కు అభినందనలు తెలిపింగి. 'ఇది మెగా సంక్రాంతి.. హృదయపూర్వక అభినందనలు మామయ్య' అంటూ ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ‍అవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి షో నుంచే సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఈ సినిమాను ఏఎంబీ సినిమాస్‌లో రామ్ చరణ్ వీక్షించారు. 

     

  • సంక్రాంతి బరిలో ఇప్పటికే ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలు దిగాయి. మరో రెండు రోజుల్లో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' సినిమా రిలీజవుతోంది. మీనాక్షి చౌదని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్‌ చేసిన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా భీమవరం బాల్మా.. పాటకైతే నవీన్‌ పొలిశెట్టి చాలాసార్లు స్టెప్పులేశాడు. 

    మూడో సాంగ్‌ రిలీజ్‌
    తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. అదే ఆంధ్రా టు తెలంగాణ సాంగ్‌. 'నాలోన సోకులున్నయ్‌, సొంపులున్నయ్‌ సానా.. నీతానా సొమ్ములుంటే ఎల్దాం ఎక్కడికైనా.. ఆంధ్రా టు తెలంగాణ.. నువ్వు రమ్మంటే నే రానా..' అన్న లిరిక్స్‌తో పాట మొదలవుతుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం సమకూర్చాడు. ధనుంజయ్‌ సీపన, సమీరా భరద్వాజ్‌ కలిసి ఆలపించారు. ఈ స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ శాన్వి మేఘన నవీన్‌ పొలిశెట్టితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ పాటను మీరూ చూసేయండి..

    చదవండి: బాస్‌ చింపేశాడు.. మెగాస్టార్‌పై అల్లు అరవింద్‌ ప్రశంసలు

  • ప్రతి ఏటా సినిమాలతో మాత్రమే కాదు.. క్రీడలతోనూ అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు తెరపై అలరించిన స్టార్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు. సినీ హీరోస్ అంతా అలరించే సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్) మళ్లీ వచ్చేస్తోంది. ఈ ఏడాది సీజన్‌తో అభిమానులను అలరించనున్నారు.

    ఈ ఏడాది సీసీఎల్‌ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌) జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. వైజాగ్  వేదికగా ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో తెలుగు వారియర్స్‌ తన తొలి మ్యాచ్‌ భోజ్‌పురి దబాంగ్స్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌ వేదికగా జరగనున్నాయి. 
     

     

     

  • భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ టీమ్ కాణిపాకం వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారిలో హీరోయిన్స్ ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి, డైరెక్టర్ కిశోర్ తిరుమల కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    రవితేజ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రవితేజ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళే భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీమియర్స్‌ కూడా ప్రదర్శించనున్నారు. 
     

     

  • మెగాస్టార్‌ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్టు అందుకోబోతున్నాడు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి ఎక్కడ చూసినా పాజిటివ్‌ టాకే వినిపిస్తోంది. వింటేజ్‌ చిరును చూశామని అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాడు.

    బాస్‌ ఈజ్‌ బాస్‌
    అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. సినిమా చూసి చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. బాస్‌ చింపేశాడు. బాస్‌ ఈజ్‌ బాస్‌. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్‌ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి- వెంకటేశ్‌ కాంబినేషన్‌ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్‌ మూవీ అని ప్రశంసలు కురిపించాడు.

     

    మన శంకరవరప్రసాద్‌ గారు మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

  • మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్‌ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్‌ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.

    మనశంకర వరప్రసాద్‌ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో ‍అనిల్ రావిపూడిని మెగాస్టార్‌ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్‌ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్‌ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు. 
     

     

     

  • బుల్లితెర జంట, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెరీనా అబ్రహం- రోహిత్‌ సాహ్ని గతేడాది పేరెంట్స్‌గా ప్రమోషన్‌ పొందారు. ఎనిమిదేళ్ల దాంపత్యానికి గుర్తుగా పండంటి పాపాయి జన్మించింది. తనకు టియారా అని నామకరణం చేశారు. తాజాగా తమ కూతురి మొదటి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

    జీవితం పరిపూర్ణం
    ఈ సందర్భంగా టియారా రాకతో తమ జీవితాల్లో వచ్చిన మార్పులు చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మెరీనా మాట్లాడుతూ.. తొలిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నా ప్రపంచమే మారిపోయింది. నన్ను మరింత స్ట్రాంగ్‌గా, అలాగే సాఫ్ట్‌గా, పరిపూర్ణంగా మార్చేశావు. మా జీవితాలను ఎంతో అద్భుతంగా మార్చావు. నా ప్రపంచమే నువ్వయిపోయావు అని పేర్కొంది.

    లవ్యూ టియారా: రోహిత్‌
    'టియారా.. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చాక నిన్ను చూసిన మొదటిరోజు ఇంకా నా కళ్ల ముందే ఉంది. భగవంతుడు ఎంతో అందమైన బహుమతిని నీ రూపంలో ఇచ్చాడు. మమ్మల్ని నీ పేరెంట్స్‌గా ఎంచుకున్నందుకు థాంక్యూ.. వి లవ్యూ టియారా' అని రోహిత్‌ ఎమోషనలయ్యాడు.

    సీరియల్‌, సినిమా
    అమెరికా అమ్మాయి సీరియల్‌తో ఆకట్టుకుంది. సిరిసిరి మువ్వలు, ప్రేమ వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేసింది. ఓ సినిమా సమయంలో రోహిత్‌తో పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో జంటగా పార్టిసిపేట్‌ చేసింది. మెరీనా మధ్యలోనే ఎలిమినేట్‌ అవగా రోహిత్‌ మాత్రం ఫైనల్స్‌ వరకు వెళ్లాడు. సీరియల్స్‌కు దూరమైన వీరిద్దరూ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. రోహిత్‌ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

     

     

    చదవండి: భారీగా పడిపోయిన రాజాసాబ్‌ కలెక్షన్స్‌

  • శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజవ్వగా ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.

    ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీలో ఆత్రేయపురంలో జరిగిన ఈ వేడుకలో హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త తన కోరికను ఆడియన్స్‌తో పంచుకుంది. తనకు ఇక్కడ ఫేమస్ అయిన పూతరేకులు కావాలని అడిగింది. ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూత రేకులు తెచ్చిఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరింది. డ్రై ఫ్రూట్స్‌తో చేసిన పూతరేకులు తీసుకువస్తే.. హైదరాబాద్‌కు పట్టుకెళ్లిపోతానంటూ కామెంట్స్ చేసింది. హీరోయిన్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

  • డార్లింగ్‌ ప్రభాస్‌ నటించిన ఫస్ట్‌ అండ్‌ లేటెస్ట్‌ హారర్‌ మూవీ ది రాజాసాబ్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌ షో నుంచే మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్నప్పటికీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు రాబట్టింది.

    మూడురోజుల్లో ఎంతంటే?
    అయితే తర్వాతి రోజు నుంచి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.183 కోట్లు కోట్లు మాత్రమే వసూలు చేసింది. చూస్తుంటే పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పైగా సోమవారం (జనవరి 12) నాడు చిరంజీవి మన శంకర వరప్రసాద్‌ రిలీజైంది. ఈ సినిమా బ్లాక్‌భస్టర్‌ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రాజాసాబ్‌ వసూళ్లకు పెద్ద దెబ్బే పడేట్లు కనిపిస్తోంది. 

    సినిమా
    మరి సంక్రాంతి బరిలోని సినిమాల పోటీని తట్టుకుని రాజాసాబ్‌ నిలుస్తాడా? ఫైనల్‌గా ఎన్నికోట్ల మేర కలెక్షన్స్‌ రాబడతాడో చూడాలి! ది రాజాసాబ్‌ మూవీ విషయానికి వస్తే.. మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించాడు.

     

     

    చదవండి: ది రాజాసాబ్‌ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

  • ఈ సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్‌గారు రిలీజై థియేటర్లలో అలరిస్తున్నాయి. వీటితో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. ఈ నెల 14న శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఆడియన్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. నారీ నారీ నడుమ మురారి మూవీ టికెట్ ధరలపై క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. కేవలం ఎమ్మార్పీ ధరలకే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా.. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి  వైద్య హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.
     

     

  • బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ మొదట్లో కాస్త లావుగా ఉండేవాడు. కానీ కఠినమైన డైట్‌ పాటించి, వర్కవుట్స్‌ చేసి చాలా సన్నబడ్డాడు. గతేడాది అతడి ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తాజాగా తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

    సరైన సమయం దొరక్క..
    కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. కానీ నా వృత్తిలో సరైన టైమింగ్స్‌ అంటూ ఉండవు, సెలవులు ఉండవు, పండగ హాలీడేస్‌ ఉండవు.    అర్జంట్‌ అంటూ తరచూ ఫోన్లు వస్తుంటాయి. కాబట్టి నేను డైటింగ్‌ను తు.చ తప్పకుండా పాటించడం కాస్త కష్టమైంది. అయితే మా నాన్న.. నేను లావుగా ఉన్నప్పటికీ హ్యాండ్సమ్‌గానే ఉన్నాననేవారు. 

    అమ్మ తిట్టేది
    అమ్మ మాత్రం ఒప్పుకోకపోయేది. ఏం మాట్లాడుతున్నావ్‌? వాడు చాలా లావుగా, బండలా ఉన్నాడనేది. నేను హీరో కావాలని మా నాన్న కోరుకుంటే అమ్మ మాత్రం.. నన్ను ఎగాదిగా చూసి అది జరగదని తేల్చిపడేసేది. ఆమె ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉండేది. కాలేజీకి మంచి డ్రెస్‌ వేసుకుని వెళ్లినప్పుడు అందరూ నాకంటే సన్నగా కనిపించేవారు. 

    కళ్లు తిరిగి పడిపోయా..
    అప్పుడు తొలిసారి బరువు తగ్గాలనుకున్నాను. ఎన్నో డైట్స్‌ ప్రయత్నించాను, కానీ ఏదీ వర్కవుట్‌ కాలేదు. ఒక నెలపాటు డైటింగ్‌ చేయగానే అనారోగ్యానికి గురయ్యేవాడిని. ఒకసారి కాలేజీలో నా క్లాస్‌రూమ్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయాను. అప్పుడే మా అమ్మ నన్ను తిట్టి డైట్‌ మాన్పించింది. నేను చికిత్స ద్వారా బరువు తగ్గానని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. 

    వాటి వల్లే బరువు తగ్గా..
    కాకపోతే బరువుకు కారణమేంటి పరీక్షలు చేయించుకుంటే థైరాయిడ్‌ ఉన్నట్లు తేలింది. శరీరంలో గ్లూటెన్‌ ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశాను. అందుకు బాదం పాలు తోడ్పడ్డాయి. చక్కెర తగ్గించేశాను. వర్కవుట్స్‌ చేశాను. గేమ్స్‌ ఆడాను, ఈత కొట్టాను. బరువు తగ్గాను అని కరణ్‌ జోహార్‌ చెప్పుకచ్చాడు.

    చదవండి: ఓటీటీ మూవీ చీకటిలో.. ట్రైలర్‌ చూశారా?

  • తెలుగు రాష్ట్రాల్లో 'మన శంకరవరప్రసాద్‌ గారు'  థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మూవీకి పాజిటీవ్‌ టాక్‌ రావడంతో థియేటర్స్‌ కూడా పెరగనున్నాయి. అయితే, ఉత్తర అమెరికాలో కూడా చిరంజీవి సత్తా చాటుతున్నారు. ఓవర్సీస్‌లో బాలకృష్ణ అఖండ-2 సినిమాకు వచ్చిన ఫైనల్‌ కలెక్షన్స్‌ను‌ కేవలం ప్రీమియర్స్‌తోనే మన శంకరవరప్రసాద్‌ గారు దాటేశారు. సినిమాకు పాజిటీవ్‌  టాక్‌ రావడంతో అక్కడ బుకింగ్స్‌ జోరు కనిపిస్తుంది.

    బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’.  ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్స్‌ 1 మిలియన్‌ డాలర్స్‌ (రూ. 9కోట్లు) రాబట్టింది. అయితే, 'మన శంకరవరప్రసాద్‌ గారు'  కేవలం ప్రీమియర్స్‌ ద్వారానే 1.2 మిలియన్‌ డాలర్స్‌( రూ.11కోట్లు) రాబట్టాడు. దీంతో ఇండస్ట్రీ కూడా ఆశ్యర్యపోతుంది. భారీ సినిమాలు పోటీ ఉండగా ఇంతటి రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషోలో కేవలం 24గంటల్లో 5లక్షలకు పైగా టికెట్లు కొనుగోలు చేశారు.

    ప్రీమియర్స్‌ పూర్తికాగానే చిత్ర యూనిట్‌  సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. చిరంజీవి, అనిల్‌ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆపై కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ చీకటిలో. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజవుతోంది. సోమవారం (జనవరి 12న) ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శోభిత క్రైమ్‌ యాంకర్‌ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్‌ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్‌ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్‌ ఖరారు చేసింది.

    క్రైమ్‌ యాంకర్‌గా శోభిత
    సమాజంలో జరుగుతున్న నేరాల గురించి అందులో మాట్లాడింది. ఎంత పెద్ద క్రిమినల్‌ అయినా ఏదో ఒక తప్పు చేస్తాడు అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ గురించి ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టింది. దీంతో సదరు సీరియల్‌ కిల్లర్‌.. చిమ్మ చీకటిలో ఇంకో ప్రాణం గాల్లో కలిసిపోతుందని ముందుగానే వార్నింగ్‌ ఇస్తాడు. మరి అతడిని హీరోయిన్‌ పట్టుకుంటుందా? అదే సమయంలో అతడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటుందా? అన్న విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

    సినిమా
    చీకటిలో మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్‌ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి రానుంది.

     

    చదవండి: పీరియడ్స్‌.. నీళ్లలో తడిచా.. బట్టలు మార్చుకుంటానంటే..: హీరోయిన్‌

  • ఒక్కసారి డేట్స్‌ ఇచ్చాక చెప్పిన సమయానికి సెట్‌లో ఉండాల్సిందే! అది హీరోలైనా, హీరోయిన్లయినా! అయితే కొన్నిసార్లు పీరియడ్స్‌ వల్ల నటీమణులు ఇబ్బందిపడుతుంటారు. దాన్ని బయటకు చెప్పుకోలేక, చెప్పినా అర్థం చేసుకోరేమోనన్న భయంతో లోలోపలే మథనపడుతుంటారు. తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటోంది మలయాళ హీరోయిన్‌ పార్వతి తిరువోతు. ధనుష్‌ హీరోగా నటించిన 'మార్యన్‌' అనే తమిళ మూవీలో పార్వతి కథానాయికగా యాక్ట్‌ చేసింది.

     రొమాంటిక్‌ సీన్‌
    ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటనను పార్వతి తాజాగా గుర్తు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. మార్యన్‌ సినిమాలో ఓ రొమాంటిక్‌ సన్నివేశాన్ని బీచ్‌లో షూట్‌ చేశారు. నన్ను పూర్తిగా నీళ్లలో ముంచి తడిపారు. నేను అదనపు డ్రెస్‌ తీసుకెళ్లలేదు. షూటింగ్‌ కొనసాగిస్తూనే ఉన్నారు. నాకేమో చాలా అసౌకర్యంగా ఉంది. అదెవరూ గమనించట్లేదు.

    ఒప్పుకోలేదు
    ఓ పక్క పీరియడ్స్‌.. మరోపక్క నీళ్లలో తడవడంతో చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒకసారి హోటల్‌కు వెళ్లి బట్టలు మార్చుకుని వస్తానని చెప్పాను. వాళ్లు కుదరదన్నారు. అంతే, నా కోపం నషాళానికి అంటింది. నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. కచ్చితంగా వెళ్లి తీరాలి అని గట్టిగా అరిచి చెప్పాను. వెంటనే సెట్‌లో ఉన్నవారంతా షాకై అలా చూస్తున్నారు. వాళ్లు ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఆరోజు సెట్‌లో నాతో కలిపి ముగ్గురు ఆడవాళ్లే ఉన్నారు.

    ఒంటరిగా ఫీలయ్యా
    చాలాసేపటివరకు నా ఇబ్బందిని చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలయ్యాను. నాలో ఓపిక కూడా నశించింది అని చెప్పుకొచ్చింది. పార్వతి తిరువోతు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు మూవీస్‌లో యాక్ట్‌ చేస్తోంది.

    చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Sports

  • ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌  జట్టుతో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఘన విజయం సాధించింది. గ్రేస్ హారిస్ కేవలం 40 బంతుల్లో 85 పరుగులు, స్మృతి మంధాన 32 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేయడంతో ఆర్‌సీబీ యూపీ వారియర్స్‌ ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.

    నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కేవలం 12.1 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది డబ్ల్యూపీఎల్‌ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్‌కు వేగవంతమైన చేజ్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఇది ఆర్‌సీబీ జట్టుకు రెండో విజయం.

    అంతకుముందు టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వారియర్స్‌ జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలింది.
     

  • రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ నామమాత్రపు స్కోరు సాధించింది. నవీ ముంబై వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేయగలింది.

    మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026లో భాగంగా డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా యూపీతో మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూపీకి ఆదిలోనే షాకులు తగిలాయి.

    ఓపెనర్లలో హర్లిన్‌ డియోల్‌ (14 బంతుల్లో 11)ను స్వల్ప స్కోరుకే లారెన్‌ బెల్‌ పెవిలియన్‌కు పంపగా.. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (14), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫోబీ లిచిఫీల్డ్‌ (20)ల వికెట్లు శ్రేయాంక పాటిల్‌ తన ఖాతాలో వేసుకుంది.

    రాణించిన దీప్తి, డియాండ్రా
    ఇక కిరన్‌ నవగిరె (5)తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్వేతా సెహ్రావత్‌ (0)లను నదైన్‌ డిక్లెర్క్‌ అవుట్‌ చేసింది. దీంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీ జట్టును ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, డియాండ్రా డాటిన్‌ ఆదుకున్నారు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా స్టార్‌ దీప్తి... 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 45 పరుగులతో అజేయంగా నిలిచింది.

    వెస్టిండీస్‌ వెటరన్‌ స్టార్‌ డియాండ్ర డాటిన్‌ సైతం 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 40 పరుగులు చేసింది. ఆఖరి వరకు దీప్తి, డాటిన్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో యూపీ 140 పరుగుల మార్కు దాటగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌, డిక్లెర్క్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌ ఒక వికెట్‌ దక్కించుకుంది. ఇక యూపీ విధించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.

    కాగా ఈ సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి గెలుపు నమోదు చేసింది. మరోవైపు.. యూపీ తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలైంది.

    ఆర్సీబీ వర్సెస్‌ యూపీ తుదిజట్లు
    ఆర్సీబీ
    గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్‌), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), రాధా యాదవ్, నదైన్‌ డిక్లెర్క్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్

    యూపీ
    కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్‌ కీపర్‌), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్‌.

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ భారత్‌పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.

    ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!
    అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్‌ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.

    సెక్యూరిటీ టీమ్‌ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ బంగ్లాదేశ్‌ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

    ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్‌ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్‌ హెడ్‌ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్‌ ఒక రకంగా నిందలు వేశాడు.

    దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన ఐసీసీ
    అయితే, నజ్రుల్‌ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్‌ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.

    అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్‌లో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు ఆడకూడదని కాదు. భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్‌ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.

    భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్‌ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్‌ వ్యాఖ్యలను ఖండించాయి. 

    పచ్చి అబద్ధం
    ఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్‌లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్‌ నజ్రుల్‌ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్‌ సెలక్షన్‌ వల్ల బంగ్లాదేశ్‌ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

    కాగా బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.

    చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌

  • టాప్‌ సీడ్‌ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎలీనా స్వితోలినా టైటిల్‌ నిరీక్షణకు తెర దించింది. మూడేళ్ల తర్వాత తన కెరీర్‌లో మరో టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన ఏఎస్‌బీ క్లాసిక్‌ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్‌ స్వితోలినా చాంపియన్‌గా అవతరించింది.

    న్యూజిలాండ్‌ వేదికగా ఫైనల్లో స్వితోలినా 6–3, 7–6 (10/8)తో ఏడో సీడ్‌ వాంగ్‌ జిన్‌యు (చైనా)పై గెలిచింది. ఓవరాల్‌గా స్వితోలినా కెరీర్‌లో ఇది 19వ సింగిల్స్‌ టైటిల్‌. ఈ ఉక్రెయిన్‌ ప్లేయర్‌ చివరిసారి 2023లో స్ట్రాస్‌బర్గ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. 2024లో ఏఎస్‌బీ క్లాసిక్‌ టోర్నీలో స్వితోలినా ఫైనల్‌ చేరినా తుది పోరులో కోకో గాఫ్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.

    గత ఏడాది సెప్టెంబరులో మానసిక సమస్యలతో ఇబ్బందిపడిన స్వితోలినా ఆటకు విరామం ఇచ్చింది. మూడు నెలల తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టిన ఆమె ట్రోఫీని కూడా ముద్దాడింది. టైటిల్‌ నెగ్గిన స్వితోలినాకు 37,390 డాలర్ల (రూ. 33 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  ఈ నేపథ్యంలో తన జీవితంలో ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుందంటూ సోషల్‌ మీడియా వేదికగా స్వితోలినా ఉద్వేగానికి లోనైంది.

    మెద్వెదెవ్‌ టైటిల్‌ నంబర్‌ 22 
    గత ఏడాది ఒక్క టైటిల్‌తో సరిపెట్టుకున్న రష్యా టెన్నిస్‌ స్టార్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఈ సీజన్‌లో మాత్రం ఆరంభంలోనే టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో ప్రపంచ 13వ ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ విజేతగా నిలిచాడు. బ్రాండన్‌ నకషిమా (అమెరికా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మెద్వెదెవ్‌ 6–2, 7–6 (7/1)తో విజయం సాధించాడు.

    95 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. 

    మెద్వెదెవ్‌ కెరీర్‌లో ఇది 22వ సింగిల్స్‌ టైటిల్‌కాగా... 22 టైటిల్స్‌ వేర్వేరు కావడం విశేషం. ఒకసారి గెలిచిన టైటిల్‌ను అతను రెండోసారి సాధించలేదు. బ్రిస్బేన్‌ ఓపెన్‌ విజేత హోదాలో మెద్వెదెవ్‌కు 1,14,060 డాలర్ల (రూ. 1 కోటీ 3 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

    భళా బుబ్లిక్‌... 
    హాంకాంగ్‌: గత ఏడాది నాలుగు టైటిల్స్‌తో అదరగొట్టిన కజకిస్తాన్‌ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ ఈ ఏడాదిలో కూడా శుభారంభం చేశాడు. ఆదివారం ముగిసిన హాంకాంగ్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో బుబ్లిక్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో బుబ్లిక్‌ 7–6 (7/2), 6–3తో టాప్‌ సీడ్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. బుబ్లిక్‌ కెరీర్‌లో ఇది తొమ్మిదో ఏటీపీ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.  

  • బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ అరియానా సబలెంకా కొత్త ఏడాదిని, కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. బ్రిస్బేన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో టాప్‌ సీడ్‌ సబలెంకా.. మార్టా కొస్టుక్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, మ్యాచ్‌ అనంతరం సబలెంకాతో కరచాలనం చేసేందుకు ఉక్రెయిన్‌కు చెందిన మార్టా నిరాకరించింది.

    ఉక్రెయిన్‌లో పరిస్థితుల నేపథ్యంలో రష్యా, బెలారస్‌ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు దూరంగా ఉండాలని తాను పెట్టుకున్న నియమాన్ని ఇక్కడ కూడా 23 ఏళ్ల మార్టా పాటించింది. ఈ విషయంపై సబలెంకా తాజాగా స్పందించింది.

    నేను అసలు పట్టించుకోను
    ‘‘అది ఆమె నిర్ణయం. అందుకు నేనేం చేయగలను?.. ఆమె షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా నాకేమీ తేడా ఉండదు. నేనసలు ఆ విషయాన్నే పట్టించుకోను. ఒక్కసారి కోర్టులో దిగిన తర్వాత నా ధ్యాసంతా ఆట మీదే ఉంటుంది.

    కోర్టులో అడుగుపెట్టిన తర్వాత గెలవాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతాను. మర్టా లేదంటే జెస్సికా పెగులా.. నా ప్రత్యర్థిగా వీరిలో ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలవడం.. ట్రోఫీని అందుకోవడంపై మాత్రమే దృష్టి సారిస్తా.

    నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అథ్లెట్‌గా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేస్తాను’’ అని సబలెంకా.. మార్టాకు పరోక్షంగా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. కాగా 2022 నుంచి రష్యా, బెలారస్‌ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్‌కు మార్టా దూరంగా ఉంటోంది. 

    రూ. 1 కోటీ 93 లక్షలు
    ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సబలెంకా 6–4, 6–3తో మార్టా కొస్టుక్‌ను ఓడించింది.

    78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా ఒక ఏస్‌ సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26... రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 12 పాయింట్లు సంపాదించింది. 

    ఇక సబలెంకా కెరీర్‌లో ఇది 22వ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. విజేతగా నిలిచిన బెలారస్‌ స్టార్‌కు 2,14,530 డాలర్ల (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

    చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌

  • టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ శుభవార్త చెప్పాడు. ప్రియురాలు సోఫీ షైన్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ‘‘చిరునవ్వుల నుంచి కలల దాకా అన్నీ పంచుకున్నాం. ప్రేమ మమ్మల్ని దీవించింది.

    చిరకాల ప్రయాణానికి నాందిగా మేము ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాము’’ అని శిఖర్‌- సోఫీ పేరిట సోషల్‌ మీడియా వేదికగా నోట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్కనీలో ఎర్ర గులాబీలతో అందంగా అలంకరించిన హృదయాకారం ముందుకు శిఖర్‌ చేయి చాచగా.. సోఫీ తన వజ్రపు ఉంగరాన్ని చూపిస్తూ అతడి చేతి మీద చేయి వేసిన ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

    శుభాకాంక్షల వెల్లువ
    కాబోయే వధూవరులు శిఖర్‌ ధావన్‌- సోఫీ షైన్‌లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫిబ్రవరి మూడోవారంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీమిండియా ఓపెనర్‌గా సత్తా చాటిన శిఖర్‌ ధావన్‌ గతంలో.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని 2011లో పెళ్లి చేసుకున్నాడు.

    కుమారుడికీ దూరం
    అన్యోన్యంగా కనిపించిన ఈ జంటకు కుమారుడు జొరావర్‌ ధావన్‌ సంతానం. అంతకుముందు పెళ్లి ద్వారా ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్‌ వాళ్లు కూడా తన సొంత కూతుళ్లలాంటి వారే అని పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే, కొన్నాళ్లకు శిఖర్‌- ఆయేషా మధ్య విభేదాలు తలెత్తి తీవ్రరూపం దాల్చాయి.

    ఈ క్రమంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. కొడుకు కూడా ధావన్‌కు దూరమయ్యాడు. దీంతో కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న ధావన్‌.. కొంతకాలం క్రితం ఐర్లాండ్‌ భామ సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిదాకా తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు ఈ జంట. కాగా సోఫీ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ అని సమాచారం. అబుదాబిలోని ఓ కంపెనీకి ఆమె వైస్‌ ప్రెసిడెంట్‌ అని తెలుస్తోంది.

    చదవండి: బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల వేదికలు మార్చండి!.. స్పందించిన బీసీసీఐ 

  • దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్‌ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ దుమ్ములేపాడు. సెంచరీ మిస్‌ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు.

    బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.

    షామ్స్‌ ములాని అర్ధ శతకం
    ఓపెనర్లు అంగ్‌క్రిష్‌ రఘువన్షి (27), ఇషాన్‌ ముల్‌చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్‌ ఖాన్‌ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హార్దిక్‌ తామోర్‌ (1) నిరాశపరిచాడు.

    ఇలాంటి దశలో ఆల్‌రౌండర్‌ షామ్స్‌ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్‌ పాటిల్‌ (25 బంతుల్లో 33 నాటౌట్‌) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్‌ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్‌ కావేరప్ప, అభిలాష్‌ శెట్టి చెరో రెండు.. విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

    రాణించిన పడిక్కల్‌.. కరుణ్‌ నాయర్‌
    ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (12)ను మోహిత్‌ అవస్థి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ 81 పరుగులతో రాణించగా.. కరుణ్‌ నాయర్‌ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.

    అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్‌) మెథడ్‌లో.. 33 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్‌కు దూసుకువెళ్లింది.

    చరిత్ర సృష్టించిన పడిక్కల్‌
    ఈ సీజన్‌లో పడిక్కల్‌ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్‌లో దేవదత్‌ పడిక్కల్‌ ఏడు ఇన్నింగ్స్‌ ఆడి 737 పరుగులు సాధించాడు.

    ఇక ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నారాయణ్‌ జగదీశన్‌ (2022-23లో 8 ఇన్నింగ్స్‌లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్‌లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 

    చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

  • స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్‌ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

    ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్‌ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్‌ పేసర్‌.

    ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి
    అదే విధంగా.. న్యూజిలాండ్‌ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్‌ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

    బుమ్రా గైర్హాజరీలో
    ఈ క్రమంలో కివీస్‌పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్‌ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌.. ‘‘జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్‌లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

    కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్‌ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్‌ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.

    మండిపడ్డ టీమిండియా హర్షిత్‌ రాణా
    ఈరోజు సిరాజ్‌ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు న్యూజిలాండ్‌తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్‌ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.

    ఆల్‌రౌండర్‌గా 
    ఇక టీమిండియా మేనేజ్‌మెంట్‌ తనను ఆల్‌రౌండర్‌గా చూడాలని భావిస్తోందని హర్షిత్‌ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియం వేదిక.   

    చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

  • ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ దారుణంగా విఫలమయ్యాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డాడు. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై వైభవ్‌ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.

    భారత్‌ అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అదరగొట్టి.. సౌతాఫ్రికాతో మూడు యూత్‌ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు వైభవ్‌. అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి ముందు అతడు ఫామ్‌లోకి రావడంతో భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

    స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ అదరగొట్టి
    అదే జోరును కొనసాగిస్తూ స్కాట్లాండ్‌తో అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 వార్మప్‌ మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. జింబాబ్వే వేదికగా.. స్కాట్లాండ్‌ జట్టుపై ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 50 బంతుల్లోనే 96 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో డీఎల్‌ఎస్‌ పద్ధతి ప్రకారం భారత్‌.. పసికూన స్కాట్లాండ్‌పై 121 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

    ఒకే ఒక్క పరుగు
    జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్‌ సూర్యవంశీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అయితే, జింబాబ్వేలో ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో సోమవారం నాటి వార్మప్‌ మ్యాచ్‌లో మాత్రం వైభవ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (49)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు.. నాలుగు బంతులు ఎదుర్కొని  కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు.

    ఇంగ్లిష్‌ పేసర్‌ సెబాస్టియన్‌ మోర్గాన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో థామస్‌ ర్యూకి క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ పెవిలియన్‌ చేరాడు. పసికూన స్కాట్లాండ్‌పై చితక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. తాజాగా పటిష్ట ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తేలిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 

    భారత్‌ మెరుగైన స్కోరు
    ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. వైభవ్‌తో పాటు వేదాంత్‌ త్రివేది (14), విహాన్‌ మల్హోత్రా (10) విఫలమైనా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 99 బంతుల్లో 82 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    మిగిలిన వారిలో ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ 48, కనిష్క్‌ చౌహాన్‌ 45 (నాటౌట్‌) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో ఐదు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్‌ మోర్గాన్‌ రెండు, మ్యానీ లమ్స్‌డన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్‌-19 వరల్డ్‌కప్‌ మొదలుకానుంది.

    చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

    భద్రత విషయంలో.. 
    ఈ క్రమంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్‌లో తాము టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.

    అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వేదికలను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.

    స్పందించిన బీసీసీఐ
    ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.

    బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు.

    టీ20 ప్రపంచకప్‌-2026లో బంగ్లాదేశ్‌ షెడ్యూల్‌
    ఫిబ్రవరి 7- వెస్టిండీస్‌తో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా
    ఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా
    ఫిబ్రవరి 14- ఇంగ్లండ్‌తో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా
    ఫిబ్రవరి 17- నేపాల్‌తో- ముంబైలోని వాంఖడే వేదికగా.

    చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

  • న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.

    వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్‌కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.

    ఊహించని ఆటగాడు
    ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ సుందర్‌ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్‌ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్‌కోట్‌లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. 

    ఢిల్లీకి చెందిన ఆయుశ్‌ బదోని బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన బదోని.. రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్‌లలో కలిపి 963 పరుగులు చేశాడు.

    ఫామ్‌లో లేడు
    ఇక లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆయుశ్‌ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్‌ల (1, 12, 3 నాటౌట్‌)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు. 

    అయినప్పటికీ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

    ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌ వేదిక. ఇదిలా ఉంటే పంత్‌ స్థానంలోధ్రువ్‌ జురెల్‌ జట్టులో చేరిన విషయం తెలిసిందే.

    న్యూజిలాండ్‌తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్‌డేటెడ్‌)
    శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), ఆయుశ్‌ బదోని.

    చదవండి: ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్‌ కోహ్లి

  • వన్డే క్రికెట్‌లో తాను ఛేజింగ్‌ ‘కింగ్‌’నని టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.

    మా అమ్మకు పంపిస్తాను
    ఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.

    గుర్గావ్‌లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.

    దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు
    నా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.

    ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌- కివీస్‌ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడాయి.

     93 పరుగులు
    టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

    మిగిలిన వారిలో శ్రేయస్‌ అయ్యర్‌ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్‌లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్‌గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.

    చదవండి: క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

  • భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్‌ టీమిండియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. 

    టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరుగబోయే మ్యాచ్‌లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.

    భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉ‍ద్రిక్తతల నేపథ్యం
    బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.

    ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్‌ చేసింది. భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

    ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌ విధుల నిమిత్తం భారత్‌కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ  వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

    బోణీ కొట్టిన టీమిండియా
    తొలి వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల​్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం భారత్‌ విరాట్‌ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49), ఆఖర్లో ఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది. 
     

  • లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు. 

    విరాట్‌ సత్తా చాటడంతో న్యూజిలాండ్‌పై భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్‌కు ముందు సచిన్‌ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.

    ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్‌పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.

    విరాట్‌ టెస్ట్‌ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్‌ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్‌ను నేరుగా టార్గెట్‌ చేశాడు.

    ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే వికాస్‌ సోదరుడు విరాట్‌ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్‌ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్‌ షేర్‌ చేశాడు.

    ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్‌పై ఈగ కూడా వాలనివ్వని వికాస్‌ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్‌పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్‌ జనవరి 14న న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్‌ రాజ్‌ కోట్‌ వేదికగా జరుగనుంది. 

Telangana

  • సాక్షి, హనుమకొండ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మానవత్వాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మానసిక వికలాంగురాలిపై 55 ఏళ్ల వృద్ధుడు పోలేపాక ప్రభాకర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు తరలించారు.  

    జరిగిన సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మానసిక వికలాంగురాలిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.  
     

  • నల్లగొండ: నల్లగొండలో రోహింగ్యాలు హల్‌చల్‌ చేశారు. నల్లగొండ సమీపంలో ఉన్న ఓ పైపుల కంపెనీలో చోరీకి పాల్పడ్డారు. బ్యాటరీలతో పాటు ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు రోహింగ్యాలు.  ఈ చోరీకి పాల్పడిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫీక్ ఆలంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

    రూ. అరవై లక్షల విలువైన సామాగ్రితో పాటు ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు 2012-2013లో హైదరాబాద్‌ నగరానికి వచ్చారని, గతంలో ఓ కేసుకు సంబంధించి జైలుకు వెళ్లొచ్చారని, అయినప్పటికీ తీరు మారలేదని పోలీసులు అంటున్నారు. ఈ దొంగతనం కేసులో మరో నలుగురు రోహింగ్యాలు పరారీ అయినట్లు సమాచారం.

     

  • హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టింది పోలీస్‌ శాఖ. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి  రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం​ ప్రబాకర్‌, డీజీపీ శివధర్‌రెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ముందుగా అరైవ్ అలైవ్” థీమ్ సాంగ్‌ను సీఎం రేవంత్‌ ఆవిష్కరించారు. 

    దీనిలో భాగంగా డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశం. అరైవ్ అలైవ్ అనేది ఒక కార్యక్రమం  కాదు ఇది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం మరింత ఉత్తేజం ఇస్తోంది. ప్రజలందరు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్రంలో సుమారు 30 వేల కిలోమీటర్ల రహదారి నెట్‌వర్క్‌ ఉంది. ఏడాదికి 27 వేల  రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 

    గత ఏడాది 800 హత్యలు జరిగితే   7500 మంది రోడ్ల ప్రమాదాల్లో మరణించారు. హత్యలో కన్నా రోడ్డు ప్రమాదాల్లో నే ఎక్కువగా మరణించారు.2025 మరణాలు తగ్గాయి యాక్సిడెంట్లు పెరిగాయి. రోడ్డు ప్రమాదాల పై చాలా మందికి సీరియన్ నెస్ ఉండటం లేదు. 72 శాతం ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నరు.. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే అరైవ్ అలైవ్ లక్ష్యం నెరవేరుతుంది. హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. డ్రైవింగ్‌ చేసేటప్పుడు మొబైల్ పోన్ వాడకూడదు. రేపటి నుండి 10 రోజుల వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌ ప్రకటన చేశారు. డీఏ ఫైల్‌ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు. 

     పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు 
    తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్‌ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.

    2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.

    పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్‌తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.

    జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
    తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.

    జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు. 

    ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు 

  • ఖమ్మం జిల్లా: అంతర్జాతీయ స్థాయిలో హవాలా రూపంలో సైబర్‌ ఆర్థిక నేరాలు విస్తరించడంతో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం, హవాలా రూపంలో డబ్బు చేతులు మారడంతో కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, ఐటీలకు సమాచారం అందించనున్నట్లు సీపీ సునీల్‌దత్‌ వెల్లడించడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టినట్టయింది. సైబర్‌ మోసాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాన నిందితులైన పోట్రు మనోజ్‌కల్యాణ్‌, ఉడతనేని వికాస్‌చౌదరి, మోరంపూడి చెన్నకేశవరావు పరారీలో ఉన్నా ఎంతో కాలం తప్పించుకోలేరని పోలీసులు ప్రకటించడంతో కేసులో ఒక్కొక్కరి చిక్కుముడి వీడుతున్నట్టయింది. 

    నిందితుల బంధువులు, స్నేహితుల అకౌంట్లను పరిశీలి స్తుంటే బయటపడుతున్న నిజాలు పోలీస్‌ శాఖ ను విస్మయపరిచాయి. రూ.వందల కోట్ల లావా దేవీలు జరగడం, ఇందులో మహిళలను కూడా గుర్తించడం సంచలనంగా మారింది. పోట్రు మనోజ్‌కల్యాణ్‌ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్‌ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహ కృష్ణ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్‌ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్లు.. మొత్తం రూ.547 కోట్ల సైబర్‌ క్రైం లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు.

    పోట్రు ప్రవీణ్‌ వ్యవహారంతో..
    కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ ముఠా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్‌ చేస్తూ రూ.10కోట్లు కొల్లగొట్టినట్లు గత నవంబర్‌ 29న స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎస్‌ఓటీ) బెంగుళూరు, సైబర్‌క్రైం సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేయడంతో అతి పెద్ద మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌ కేంద్రంగా రిడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరుల బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొట్టి పోట్రు ప్రవీణ్‌తో పాటు పోట్రు ప్రకాష్‌, ఏపూరి గణేష్‌, మోరంపూడి చెన్నకేశవ సైబర్‌ నేరానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.

    డిసెంబర్‌ 24న మరో కేసులో..
    గతేడాది డిసెంబర్‌ 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్‌ వీఎం బంజరు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు మరో కేసులో ఇంకొందరి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. పోట్రు ప్రవీణ్‌తో పాటు మనోజ్‌కల్యాణ్‌, ఆయన భార్య మేడా భానుప్రియ, మేడా సతీష్‌, ఉడతనేని వికాస్‌, మోరంపూడి చెన్నకేశవరావు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వారికి సహకరించిన జుంజునూరి శివకృష్ణ, వడ్లముడి నరేంద్రకుమార్‌, మల్లాడి శివ, సాధు పవన్‌, సాధు సంధ్య, సాధు శ్రీలేఖతో పాటు బ్యాంక్‌ అకౌంట్లు ఇచ్చి సహకరించిన జొన్నలగడ్డ తిరుమలసాయి, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్‌, గోళ్లముడి నాగముకేష్‌, కంచపోగు శ్రీనివాస్‌, రాయల అజయ్‌కుమార్‌, రాయల గోపి, పాల గణేష్‌, రాయల గోపీచంద్‌, కందుకూరు జగదీష్‌, తాటికొండ రాజు(కరీంనగర్‌)ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు.

    పెట్టుబడి ఆశ చూపించి..
    సైబర్‌ నేరగాళ్లు అకౌంట్లలోని డబ్బులను కొల్లగొట్టేందుకు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతర్జాతీయ సైబర్‌ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్‌ సెంటర్లు నిర్వహిస్తూ దేశంలోని పౌరులను బురిడీ కొట్టించేందుకు పెట్టుబడి, మ్యాట్రిమొని, రివార్డు పాయింట్లు, గేమింగ్‌, బెట్టింగ్‌, షేర్‌మార్కెట్‌ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ పేరుతో మోసగించి లింకుల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, ఆస్తులను కొనుగోలు చేసిన వారిని గుర్తించి జప్తు చేస్తామని సీపీ వెల్లడించడంతో అక్రమార్కుల్లో టెన్షన్‌ మొదలైంది.

  • సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.

    అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. 

    రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.

    పోలవరం-నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Business

  • భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా  ప్రయాణించే భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత టాన్సిట్‌ (ప్రయాణ) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఒక సంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయం ప్రకటించారు.

    జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ జనవరి 12 నుంచి 13 వరకు రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇది మెర్జ్ తొలి భారత పర్యటన కాగా ఫెడరల్ ఛాన్సలర్‌గా ఆయన చేపట్టిన మొదటి ఆసియా పర్యటన కూడా కావడం విశేషం.

    ఈ నిర్ణయం ప్రకారం.. జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ప్రత్యేక ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. అయితే, ప్రయాణికులు విమానాశ్రయం పరిధిని దాటి బయటకు వెళ్లకూడదు. అంటే వీసా లేకుండా జర్మనీలోకి ప్రవేశించడానికి మాత్రం అనుమతి ఉండదు.

    ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.

  • ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్‌కు సవాలుగా మారింది.

    ఏమిటీ దాడులు?

    ఇవి సాధారణంగా మనం చూసే వైరస్‌లు లేదా ఫిషింగ్ లింక్‌ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్‌ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్‌మెంట్‌ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.

    సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.

    ఐఓఎస్‌ 26 అప్‌డేట్ ఎందుకు ముఖ్యం?

    ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్‌ 26 వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్‌లు కేవలం ఐఓఎస్‌ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్‌ 18) యాపిల్ ఇకపై ప్యాచ్‌లను అందించదని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: పండుగ షాపింగ్‌.. భారీ డిస్కౌంట్లు కావాలా?

    ఇప్పుడేం చేయాలి?

    • మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్‌డేట్ చేయండి.

    • కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్‌ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.

    • మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్‌లోని ‘లాక్‌డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్‌మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.

    • సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి.

  • పండుగ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇటు వీధులన్నీ రంగురంగుల వెలుగులతో, అటు ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో కళకళలాడుతుంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. వంటి ఈ-కామర్స్‌ సైట్లు ప్రత్యేక ఈవెంట్లతో ఆఫర్లు ప్రకటిస్తాయి. దాంతో వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తాయి. అయితే, ఈ ఆఫర్ల వెల్లువలో పడి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలో వివరించే చిట్కాలు చూద్దాం.

    ముందస్తు ప్రణాళిక

    సేల్ ప్రారంభం కావడానికి ముందే మీకు కావాల్సిన వస్తువులను ‘విష్‌లిస్ట్’లో చేర్చుకోవడం ఉత్తమం. దీనివల్ల ధర తగ్గినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, ఎంత వరకు ఖర్చు చేయాలనే దానిపై ఒక బడ్జెట్ వేసుకోవడం వల్ల అనవసరమైన కొనుగోళ్లను నివారించవచ్చు.

    ధరల పరిశీలన

    ఒక సైట్‌లో తక్కువ ధర కనిపిస్తోందని వెంటనే కొనేయకండి. వేర్వేరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ధరలను పోల్చి చూడండి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కొన్ని టూల్స్ లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగించి, గత కొన్ని నెలల్లో ఆ వస్తువు అత్యల్ప ధర ఎంత ఉందో తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ‘భారీ డిస్కౌంట్’ అని చూపించేవి నిజానికి సాధారణ ధరలకంటే తక్కువ ఏమీ ఉండకపోవచ్చు.

    బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్

    పండుగ సేల్స్ సమయంలో ఈ-కామర్స్ సంస్థలు నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% నుంచి 15% వరకు తగ్గింపును ఇస్తుంటాయి. మీ దగ్గర ఆ బ్యాంక్ కార్డు లేకపోతే, స్నేహితులు లేదా బంధువుల కార్డులను ఉపయోగించి డబ్బు ఆదా చేయవచ్చు. కొన్ని వెబ్‌సైట్లు లేదా యాప్స్ ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనంగా కొంత మొత్తం క్యాష్‌బ్యాక్‌ ద్వారా వాలెట్‌లోకి వస్తుంది.

    నో-కాస్ట్ ఈఎంఐ

    ఖరీదైన వస్తువులు (ల్యాప్‌టాప్స్, ఫ్రిజ్‌లు, ఫోన్లు) కొనేటప్పుడు ‘నో-కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల వడ్డీ భారం లేకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. అయితే, దీనిపై ఉండే ప్రాసెసింగ్ ఫీజును గమనించడం మర్చిపోవద్దు.

    ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

    మీ పాత వస్తువులను మార్పిడి చేయడం ద్వారా కొత్త వస్తువు ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పండుగ సమయాల్లో ఎక్స్ఛేంజ్ వాల్యూపై అదనపు బోనస్ కూడా లభిస్తుంది. వస్తువును ఇచ్చే ముందు అది పని చేసే స్థితిలో ఉందో లేదో సరిచూసుకోండి.

    సైబర్ భద్రత అత్యంత ముఖ్యం

    షాపింగ్ హడావిడిలో సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉంది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు లేదా యాప్స్ ద్వారానే షాపింగ్ చేయండి. వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ల్లో వచ్చే ‘భారీ బహుమతులు’, ‘లింక్‌లపై క్లిక్ చేయండి’ వంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చెల్లింపులు చేసేటప్పుడు సురక్షితమైన గేట్‌వేలను మాత్రమే వాడండి.

    ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

  • భారత పునరుత్పాదక ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన ఇంధన దిగ్గజం యూనిపర్ (Uniper)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి ఏటా 5 లక్షల టన్నుల వరకు పునరుత్పాదక అమ్మోనియాను యూనిపర్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఈమేరకు యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్, ఏఎం గ్రీన్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ కుమార్ చలమలశెట్టి ఒప్పంద పత్రాలను  మార్చుకున్నారు.

    ఒప్పందంలోని అంశాలు..

    • ఏడాదికి గరిష్టంగా 5,00,000 టన్నుల గ్రీన్ అమ్మోనియాను యూనిపర్ కొనుగోలు చేయనుంది. 

    • ఒక భారతీయ సంస్థ ఇటువంటి భారీ స్థాయి అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. 

    • ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1 ఎంటీపీఏ (ఏటా మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం) ప్లాంట్ నుంచి 2028 నాటికి మొదటి విడత ఎగుమతి ప్రారంభం కానుంది. 

    • ఈ అమ్మోనియా యూరోపియన్ RFNBO (Renewable Fuel of Non-Biological Origin) సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

    ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ చలమలశెట్టి మాట్లాడుతూ.. ‘గ్లోబల్‌గా ఎనర్జీ పరంగా వస్తున్న మార్పులో భారత్ పాత్రకు ఈ భాగస్వామ్యం ఒక మైలురాయిగా నిలుస్తుంది. మా ప్రత్యేకమైన క్లీన్ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గ్రీన్ అమ్మోనియా.. కెమికల్స్, అల్యూమినియం వంటి కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే పరిశ్రమలు తమ ఉద్గారాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. 

    యూనిపర్ సీఈఓ మైఖేల్ లూయిస్ స్పందిస్తూ.. ‘భారత్, యూరప్ మధ్య మొట్టమొదటి భారీ స్థాయి సరఫరా కేరిడార్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ద్వారా ఎరువులు, రిఫైనింగ్ వంటి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని తెలిపారు. ఏఎం గ్రీన్ కో-ఫౌండర్ మహేష్ కొల్లి మాట్లాడుతూ, తమ పెట్టుబడిదారులు (Gentari, GIC, ADIA) సహకారంతో ప్రపంచ స్థాయి నాణ్యతతో సరైన ధరలో గ్రీన్ అమ్మోనియాను అందించే పర్యావరణ వ్యవస్థను నిర్మించామని తెలిపారు.

    ఇదీ చదవండి: బ్యాంకింగ్ పారదర్శకతపై సందిగ్ధత

  • బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.

    అసలు వివాదం ఏమిటి?

    సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్‌బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..

    • టాప్ 100 ఎన్‌పీఏల వివరాలు.

    • బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.

    • యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.

    • ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్ బ్యాంకులపై ఆర్‌బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.

    ఆర్‌బీఐ వర్సెస్ బ్యాంకులు

    ఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్‌బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.

    సీఐసీ కీలక నిర్ణయం

    ఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్‌ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.

    డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్‌ బెంచ్‌ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.

    ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు..

  • ప్రస్తుతం ఉన్న జాబ్‌ మార్కెట్‌లో రూ.కోట్లలో జీతం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ భారీ జీతం వెనుక ఉన్న పని ఒత్తిడి వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను, సంతోషాన్ని హరిస్తే? సరిగ్గా ఇదే ఆలోచనతో, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న క్లూలీ (Kluly) అనే ఏఐ స్టార్టప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) డేనియల్ మిన్ తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏడాదికి ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2.7 కోట్లు) వేతనం ఉన్న కొలువును వదులుకుని ఆయన కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు.

    చిన్న వయస్సులోనే..

    ప్రఖ్యాత వార్టన్ స్కూల్ నుంచి మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన డేనియల్ మిన్ మే 2025లో తన 21వ ఏటనే క్లూలీలో చేరారు. మిన్ తన ప్రతిభతో తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ విజయం వెనుక ఉన్న శ్రమ క్రమంగా అతని మానసిక స్థితిపై ప్రభావం చూపడం మొదలైందని తాను చెప్పారు.

    రాజీనామా అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ మిన్ తన మనసులో మాటను పంచుకున్నారు. ‘కెరీర్ ప్రారంభంలో రోజుకు 12 గంటలు కష్టపడటం సహజమని నేను భావించాను. కానీ, కాలక్రమేణా ఆ ‘గ్రైండ్’(నిరంతర పని) నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నా స్నేహితులతో కలిసి డిన్నర్ చేయడం లేదా నా సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటి చిన్న చిన్న సంతోషాలను కూడా నేను కోల్పోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిన పని, క్రమేణా భారంగా మారిందని, పని కాకుండా అసలు వేరే జీవితమే లేకుండా పోయిందని వెల్లడించారు.

    సీఈఓ ముందే..

    కంపెనీ సీఈఓ రాయ్ లీ తన పనితీరును గమనించి రాజీనామా గురించి అడిగినప్పుడు డేనియల్ మిన్ తన భావోద్వేగాలను దాచుకోలేకపోయారు. తన రాజీనామా నిర్ణయాన్ని చెబుతూ ఆయన సీఈఓ ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, రాయ్ లీ ఎంతో సానుభూతితో స్పందించారని, ఉద్యోగం కంటే వ్యక్తిగత సంతోషమే ముఖ్యమని తనను ప్రోత్సహించారని మిన్ తెలిపారు. ‘తమ ఉద్యోగుల శ్రేయస్సును కోరుకునే ఇలాంటి బాస్ దొరకడం అదృష్టం’ అన్నారు.

    సోషల్ మీడియా స్పందన

    డబ్బు కంటే మానసిక ప్రశాంతత ముఖ్యం అని భావించి డేనియల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘గ్రైండ్ కల్చర్ పేరుతో యువతను శ్రమదోపిడీకి గురిచేయడం సరికాదు’ అని కొందరు కామెంట్‌ చేశారు. ‘మీ నిజాయితీకి హ్యాట్సాఫ్’ అంటూ కొందరు కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి, కెరీర్ ప్రారంభంలోనే భారీ ప్యాకేజీని వదులుకుని డేనియల్ మిన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి చర్చకు దారితీసింది.

    ఇదీ చదవండి: ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం

Andhra Pradesh

  • విజయవాడ:    రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయం సాధించాలనే టార్గెట్‌ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ప్రజల నుండి ఈ ఆదాయాన్ని వసూలు చేసేందుక కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ. 13 ఏల కోట్లు కొత్త ఆదాయం టార్గెట్‌ను పెట్టకున్నట్లు హెచ్‌ఓడీ సదస్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. 

    SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం సాధించాలనే ప్రతిపాదించారు. 55వ GST కౌన్సిల్ సమావేశంలో  సెస్ పరిశీలనలో ఉంది. ఇక  ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు సాధించే ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. 

    ఆన్‌లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు,  రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు,  విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు.

  • కాకినాడ:  జిల్లాలోని రౌతులపూడి మండలం సార్లంక గిరిజన గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్ర వేళ సార్లంక గిరిజన గ్రామంలోని  పూరిళ్లు దగ్ధమయ్యాయి,. 

    ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు బూడిదయ్యాయి. ఇళ్లలోని వస్తువులు కాలి బూదిదం కావడంతో ఆ గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాము సర్వస్వం కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. 
     

  • విజయవాడ.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల్లో అపచారాలు, దారుణాలు, దుర్ఘటనలు నిత్యకృత్యమయ్యాయని, వాటిని సమీక్షించి సరిదిద్దాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేయడంతో కూటమి నాయకులు చివరకు ఆలయాల అర్చకులపైనా దాడులు చేస్తున్నారని వైయస్సార్‌సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు.« ధార్మిక సంస్థలకు లీజు పేరుతో ఆలయాలకు చెందిన విలువైన భూములు కాజేసేందుకే కొత్తగా జీఓ నెం:15 జారీ చేశారని ఆరోపించిన వారు, ప్రభుత్వం తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

    రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాల్లో ఇటీవల వరసగా అపచారాలు, దుర్ఘటనలు జరుగుతున్నాయని, దీంతో దర్శనాల కోసం వచ్చే భక్తులు తగ్గిపోతున్నారని చెప్పారు. మరోవైపు అర్చకుల మీదా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేసిన వారు, వాటిని అరికట్టేందుకు తక్షణం ప్రత్యేక చట్టం తేవాలన్నారు.  దుర్గ గుడి ఘాట్‌ రోడ్‌ వద్ద ఉన్న  ‘శ్రీ కామధేనువు అమ్మవారి’ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

     దుర్గగుడిలో జరుగుతున్న అపచారాలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టేలా చూడాలని, ఆ దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని.. ముఖ్యంగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కోరారు. అమ్మవారికి ప్యాకెట్‌ పాలతో అభిషేకాలను తీవ్రంగా తప్పు పట్టిన వారు, తక్షణం గోశాలను కానూరు నుంచి కొండ మీదకు తరలించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో భక్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. తనకుతాను సనాతన హిందూవాదిగా ప్రకటించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇకనైనా స్పందించాలన్నారు. 

     

  • విజయవాడ: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ మేరకు సోమవారం(జనవరి 12వ తేదీ) మద్యం ధరలకు పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది.  మద్యం ధరలు తగ్గిస్తానని  ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వగా, ఇప్పుడు మాత్రం ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు. 

    బాటిల్‌పై రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో బాటిల్‌పై రూ. 10 పెంచిన బాబు సర్కార్‌.. ఇప్పుడు మరో రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు లిక్కర్‌ సిండికేట్‌కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. బార్లకు అదనపు రిటైల్‌ ట్యాక్స్‌ తొలగించింది. 

    అయితే సంక్రాంతి పండుగను క్యాష్‌ చేసుకోవడానికే ఏపీ ప్రభుత్వం మద్యం ధరను పెంచిందని పలువురు విమర్శిస్తున్నారు.   సంపద సృష్టిస్తానని పదే పదే ఎన్నికల్లో  ప్రచారం చేసిన బాబు.. మరి ఇప్పుడు లిక్కర్‌ ధరల పెంపు ద్వారా సంపద సృష్టిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

     కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత గురువారం (జనవరి 8 వ తేదీన)  సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా పెంపునకు ఉత్తర్వులు ఇచ్చింది  ప్రభుత్వం.  మద్యం సీసాపై (బీరు, వైన్‌ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

  • కాకినాడ:: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పూజారి సుందర సీతారామయ్యశర్మపై దాడి అమానుషమని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ ఆక్షేపించారు. పదునైన ఆయుధంతో పూజారిపై దాడి, నాగరిక సమాజాన్ని తలదించుకు ఘటన అని ఆయన అభివర్ణించారు. పూజారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

    దాడిలో తీవ్రంగా గాయపడి, కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పురోహితుడు సుందర సీతారామయ్య శర్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..:

    క్షమించరాని నేరం
    భగవంతుడి సేవలో ఉన్న పూజారిపై కిరాతక దాడి జరగడం దురదృష్టకరం. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పౌరహిత్యం చేస్తున్న పేద బ్రాహ్మణుడిపై ఇలా దాడి చేయడం క్షమించరాని నేరం. వేట కొడవలితో దాడి చేయడం, ఆ పని చేసిన వ్యక్తి నైజాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీకి చెందిన గ్రామ నాయకుడి కుమారుడు కొండమూరి శివయ్య, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేరాలకు మానసిక పరిస్థితి పేరిట ముసుగులు వేయడం చాలా పెద్ద తప్పు. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే.

    కూటమి పాలనలో ఏ ఒక్కరికీ భద్రత లేదు
    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయి. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. మహిళలు, చిన్నపిల్లలు, దేవాలయ సేవకులకూ భద్రత లేకుండా పోయింది. పేద బ్రహ్మణ కుటుంబానికి చెందిన సుందర సీతారామయ్య శర్మ అప్పుల్లో కూరుకుపోయి పురోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గం. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

    కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు
    రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరగాలి. తిరుపతి తొక్కిసలాట, సింహాచలంలో అమాయక భక్తుల మరణాలు, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటనలు.. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే. కూటమి నేతల అండతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. పూజారిపై జరిగిన దాడి ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ హెచ్చరించారు.

  • శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం. వేకువ జామున నది, కాలువల్లో ఈత కొట్టించి, ప్రత్యేక వ్యాయామం చేయించి, బాదం పిస్తా పెట్టి పెంచుతారు. సాధారణ దాణాతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం తప్పని సరి. రాగులు, బియ్యం, పాలిష్‌ తవుడు రెండుసార్లు, దినుసులు, నూకలు, అన్నం బాగా కలిపి గోధుమలతో సిద్ధం చేసి రోజుకు ఐదారుసార్లు తినిపిస్తారు. అలాగే దాణా పెట్టిన ప్రతిసారి బాదం, జీడి పప్పు పెడతారు. 

    బొబ్బిలి సెంటిమెంట్‌ 
    పౌరుషానికి ప్రతీకంగా భావించే బొబ్బిలిని ఇక్కడ పందెందార్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. అక్కడ గుడ్లను తీసుకువచ్చి ఇక్కడ పొదిగిస్తారు. పండక్కి ఒక పది నెలలు ముందుగా పక్కా ప్రణాళిక ప్రకా రం చేస్తారు. పుట్టిన పుంజులను ఎంతో శ్రద్ధతో పెంచి పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతారు. బలిష్టంగా తయారవ్వడాని వాటికి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. 
      
    ఈ జాతికే డిమాండ్‌..   
    కోడి పందాలను రెండు రకాలుగా పెడతారు. అందులో మొదటిది కాళ్లకు కత్తి కట్టి పందానికి దించితే పందెం ప్రారంభం నుంచి 20 నిమిషాలకు ముగు స్తుంది. రెండోది ‘డెంకీ’ ఈ పందెంలో కాళ్లకు కత్తి లేకుండా నేరుగా పుంజుకు పుంజుకు పోటీకి ఉసిగొల్పుతారు. ఇందులో రూ.లక్షలు పందెం కాసి, గంటలు కొద్దీ పందాలు జరుపుతారు. కాకి, డేగ, కాకి నెమలి, పింగళి, నెమలి, కాకిడేగ, కక్కిరి, పాసి వంటి జాతులకు డిమాండ్‌ బట్టి రూ.ఐదు వేలు నుంచి లక్ష వరకూ ఇస్తారు. నదీ తీర ప్రాంతాలతోపాటు కొండపక్కల ఉన్న గ్రామాల్లో పందెందార్లు ప్రస్తుత కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకులాం, అంబాజీపేట, జలుమూరు మండలం మాకివలస, పర్లాం, చెన్నా యవలస, సారవకోట మండలం బొంతు, పోలాకి మండలం గంగివలస, సరుబుజ్జిలి మండలం యరగాం, పెద్దసవలాపురం, తెలికిపెంట తదితర గ్రామాలలో ఈ కోళ్ల పెంపకం జరుగుతుంది.  

  • సంక్రాంతికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా.. కానీ ఆ సామంత గ్రామాల్లో మాత్రం పండగ అయిపోయింది. గిరిజనులుగా పిలిచే సామంతులకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారమే అసలైన పండగ. ఆదివారం నాడు వారు అమ్మవారి ప్రతి రూపంగా భావించే వేప చెట్టును పసుపు, కుంకుమతో అలంకరించారు. అమ్మవారి ప్రతి రూపంగా భావించే గజముద్దను పూలతో అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు.  
     – ఇచ్ఛాపురం రూరల్‌

    ఊరికి స్వాగతం 
    పెద్ద పండుగకు ఊరికి వచ్చే వారిని ఓవీపేట వాసి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పాలకొండ–ఆమదాలవలస రోడ్డు లచ్చయ్యపేట కూడలికి ఓవీపేట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రా మానికి బస్సు సదుపాయం లేదు. దీంతో పండగకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఆయన ఉచితంగా ఆటో నడుపుతున్నారు. 20వ తేదీ వరకు ఉచితంగానే బండి నడుపుతానని ఆయన చెబుతున్నారు.
    –శ్రీకాకుళం జిల్లా

     

     

National

  • న్యూఢిల్లీ: ‘గతేడాది జరిగిన కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. కరూర్‌ తొక్కిసలాటపై విజయ్‌ సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆరు గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన సీబీఐ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లారు.

    విచారణలో కరూర్‌ తొక్కిసలాటపై విజయ్‌ సీబీఐ అధికారులకు ఏం చెప్పి ఉంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయ్‌ కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీ బాధ్యత వహించబోదని సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన విజయ్‌ని.. తొక్కిసలాట ఘటనపై విచారణ అధికారులకు ఏం చెప్పారని మీడియా ప్రశ్నించింది. తొక్కిసలాట తీవ్రత తగ్గించేందుకు వేదికను విడిచివెళ్లానని తెలిపారు. ఇదే విషయాన్ని విజయ్‌ పలు పార్టీ బహిరంగ కార్యాక్రమాల్లో చెప్పుకొచ్చారు.

    ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కాలేదని, విజయ్‌ స్టేట్మెంట్‌ను వెరిఫై చేసిన తర్వాత మళ్లీ పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పినట్లు సమాచారం. ‘విజయ్‌ను విచారించడం పూర్తి కాలేదు. సంక్రాంతి పండుగ కారణంగా విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశాం. పండుగ తర్వాత సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తామం’అని సీబీఐ విచారణ అధికారులు జాతీయ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.  

    మరోవైపు తమిళనాడు పోలీసులు మాత్రం కరూర్‌ తొక్కిసలాటకు విజయ్‌ కారణమని ఆరోపిస్తున్నారు. సభ నిర్వహించే సమయం కంటే ఆలస్యంగా వచ్చారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సమయం గడిచే కొద్దీ అభిమానులు,పార్టీ కార్యకర్తలు విజయ్‌ను చూసేందుకు భారీ ఎత్తున గుమిగూడారు. ఊపిరాడడక జనసందోహాన్ని కట్టడి చేసే సమయంలో ఈ ఘోర జరిగినట్లు స్పష్టం చేస్తున్నారు. సభకు వచ్చిన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆహారం, మంచినీరు,టాయిలెట్‌ సౌకర్యం కల్పించడంలో టీవీకే విఫలమైందన్నారు.  

    తొక్కిసలాటపై అధికార డీఎంకే పార్టీ కుట్రకు పాల్పడిందని విజయ్‌ ఆరోపించారు. డీఎంకే మాత్రం పోలీసుల వైఫల్యం వల్లే భారీ ప్రాణ నష్టం జరిగిందని విజయ్‌ ఆరోపణల్ని ఖండించింది. కాగా, గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ ప్రసంగించిన భారీ రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇది ఇటీవలి తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.  

     

  • ముంబైలో బతుకుతున్న దక్షిణాది ప్రజలకు  తమిళనాడు బీజేపీ నేత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ముంబై వెళ్లినఅన్నామలై ముంబై కేవలం మహారాష్ట్రకు చెందిన నగరం మాత్రమే కాదని, అది ఒక అంతర్జాతీయ నగరమని అన్నారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అభ్యర్థి  మేయర్‌గా ఎన్నికైతేనే దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

    దీంతో ఈ వ్యాఖ్యలు ముంబై అస్తిత్వాన్ని, మరాఠీ ప్రజల ప్రాముఖ్యతను తగ్గించేలా ఉన్నాయంటూ శివసేన , ఎంఎన్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అన్నామలై చేస్తున్న ఈ ప్రయత్నం చివరకు ఇక్కడ దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న దక్షిణాది వారిని రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉందన్న ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాజ్ థాక్రే.. అన్నామలైను రసమలై అని ఎద్దేవా చేస్తూ.. శివసేన పాత నినాదం హటావో లుంగీ, బజావో పుంగీ ని మళ్ళీ గుర్తు చేస్తూ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చారు.

    ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ముంబై గడ్డపై కాలు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. శివసేన పత్రిక సామ్నాలో అన్నామలై ముంబైలో అడుగు పెడితే కాళ్లు తీసేస్తామని హెచ్చిరంచారు. దీనికి అన్నామలై కూడా తగ్గకుండా సమాధానమిచ్చారు. తాను ముంబై వచ్చి తీరుతానని, దమ్ముంటే తన కాళ్లు నరకాలని సవాలు విసిరారు.ముంబై అభివృద్ధిలో దక్షిణాది వారి పాత్ర కూడా ఉందని ఆయనంటున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చివరకు ధారవి వంటి ప్రాంతాల్లో నివసించే వేలాది మంది దక్షిణాది కూలీలు, వ్యాపారుల భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్న ఆందోళన అక్కడి దక్షిణాదివారిలో వ్యక్తమవుతోంది.

  • రాష్ట్రంలో రేపటి నుంచి (జనవరి 13) కైట్ ఫెస్టివల్ 2026 ప్రారంభం కాబోతుంది.  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా ఎగురవేసే పతంగులను ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో అసలు పతంగుల చరిత్ర ఏంటి ? ఏఏ దేశాలలో వాటిని ఎగురవేస్తారు? రాష్ట్రంలో నిర్వహించే ట్ కైట్ ఫెస్టివల్ ప్రత్యేకతలు.. తెలుసుకోవాలని ఉందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.


    శ్రీరాముడు ఎగరవేసిన పతంగి

    తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ సంతోషంగా వేడుకను జరుపుకుంటారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం చాలా పాపులర్ అయితే ఈ గాలిపటాలకు ఘనమైన చరిత్రే ఉంది. పురాణాల ప్రకారం శ్రీరామ చంద్రుడు మకర సంక్రాంతి రోజున గాలిపటాన్ని ఎగురవేసారని అది ఇంద్రలోకానికి వెళ్లిందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని తులసిదాసు రామచరితమానస్‌లోనూ ప్రస్థావించారు. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభమైందని నమ్ముతారు.

    చారిత్రక ఆధారాలు
    చరిత్రప్రకారం 5వ శతాబ్ధంలో చైనాలో  సైనిక అవసరాల కోసం చెక్క గాలిపటాన్ని తయారు చేశారని దీనిని సైనిక సమాచారం కోసం, గాలిదిశను తెలుసుకోవడం కోసం వినియోగించేవారని ఆధారాలున్నాయి. అనంతరం భారత్‌కు చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్‌త్సాంగ్‌ వచ్చినప్పుడు వీటిని తీసుకవచ్చారని చరిత్రకారులు చెబుతుంటారు. అంతేకాకుండా మెుగలుల కాలంలో సైతం గాలిపటాల క్రీడలు నిర్వహించేవారని ఆ తరువాతి కాలంలో క్రమంగా ఆటలుగా మారాయని చెబుతుంటారు.

    శరీరానికి కలిగే మేలు
    గాలిపటాలు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేస్తారు  దీంతో సూర్యరశ్మి శరీరానికి సమృద్ధిగా తాకి విటమిన్ డీ లభిస్తుందని చెబుతుంటారు. చలికాలంలో వీటిని ఎగరవేస్తారు గనుక చలినుంచి రక్షణ కోసమనే వాదన ఉంది. అంతేకాకుండా గాలిపటాన్ని నియంత్రించడం అనేది ఒక విన్యాసం. దీని ద్వార కళ్లకు, మెదడుకు చక్కటి వ్యాయామం కలుగుతుంది. ఏకాగత్రను పెంచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

    ప్రపంచవ్యాప్తంగా
    అయితే ఇంత ఘనమైన చరిత్ర ఉన్న పతంగులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఎగురవేస్తున్నారు. అమెరికా, బ్రెజిల్, యూరప్, ఫ్రాన్స్‌లతో పాటు చైనా, జపాన్, థాయిలాండ్‌, ఇండోనేషియాలతో పాటు ఇతర దేశాలలో గాలిపటాలు ఎగురవేయడాన్ని పెద్ద వేడుకలాగా నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేక పోటీలు నిర్వహించి ఘనంగా వేడుకలు జరుపుతారు. భారత్‌లోనూ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో పతంగుల పండుగ నిర్వహిస్తారు. గుజరాత్‌లో నిర్వహించే కైట్‌ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా చాలా ఫేమస్

    కైట్‌ ఫెస్టివల్-2026

    హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్-2026 జనవరి 13 నుంచి 18 వరకూ జరగనుంది. ఈ వేడుకల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లయర్స్ థాయిలాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆల్జీరియా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, శ్రీలంక, రష్యా, స్విట్జర్లాండ్, తదితర దేశాల నుంచి పాల్గొననున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఫెస్ట్ సందర్భంగా  సాంస్క్రృతిక ప్రదర్శనలతో పాటు వివిధ రకాల ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఫెస్ట్‌లో మాంజా దారంతో పతంగులు  ఎగురవేయడం నిషిద్దమని కేవలం పత్తితో తయారు చేసిన దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలని నియమం విధించింది. తెలంగాణలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ 2011 నుంచి ప్రారంభమయ్యింది.


     

     

     

  • స్వామి వివేకానంద జీవితం ఎంతో మందికి ఆదర్శ ప్రాయమని  ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ యుంగ్ లీడర్స్ 2026 ముగింపు కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. యువత రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకూడదని మీ విజయం దేశాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. 2047 వికసిత్ భారత్ ప్రయాణం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు.  

    2014లో తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో అక్కడున్న వారిలో చాలామంది చిన్నపిల్లలని అక్కడి యువతనుద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్‌ సెక్టార్‌లో అనేక మార్పులు తెచ్చామని ఐఐటీలను కూడా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు. యవత చాలా యాక్టివ్‌గా ఉండాలని ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ యువతకు సూచించారు. నేడు స్వామివివేకానంద జయంతి ఈ రోజును భారత్ జాతీయ యువజన దినంగా జరపుకుంటుంది.

     

     

  • భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలో నక్సల్ అణచివేతలో విశేష కృషి చేసిన తెలుగు ఐపీఎస్‌ అధికారి, నువాపడా జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ప్రతిష్టాత్మక డీజీపీ డిస్క్ అవార్డు (2024–25) ప్రదానం చేశారు.

    నువాపడా జిల్లా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల నక్సల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఆపరేషన్లు అత్యంత క్లిష్టమైనవిగా ఉన్నప్పటికీ,ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర సమర్థవంతమైన వ్యూహాలతో నక్సల్ దాడులను అణచి వేయడంలో, వారి ప్రాభవాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు.



    నక్సల్ అణచివేతతో పాటు, నువాపడా జిల్లాలో క్రైమ్ కంట్రోల్, శాంతి భద్రతా పరిరక్షణలో ఆయన విశేష కృషి చేశారు. ప్రజలలో భద్రతా నమ్మకం పెంచడం, చట్టాన్ని కాపాడుతూ.. నేరాలను తగ్గించడం వంటి అంశాలు ఈ అవార్డు పొందడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. కటక్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా డీజీపీ.. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే అధికారుల ధైర్యం, క్రమశిక్షణ, ప్రజా సేవా తపనకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

    ఒడిశాలో పనిచేస్తున్న తెలుగు అధికారిగా గుండాల రెడ్డి రాఘవేంద్ర ఈ అవార్డు పొందడం తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారుల ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత గౌరవమే కాకుండా, తెలుగు అధికారుల ధైర్యం, క్రమశిక్షణ, ప్రజా సేవకు నిదర్శనంగా నిలుస్తోంది.

    చలపతిని సైతం ఎన్‌కౌంటర్‌లో..
    ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్‌ చలపతి నాలుగున్నర దశాబ్దాల క్రితం నక్సల్‌బరీ ఉద్యమంలోకి వచ్చారు. రెండున్నర దశాబ్దాల నుంచి ఉత్తర కోస్తాతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన చలపతి ఎన్‌కౌంటర్‌లో తెలుగు ఐపీఎస్‌ అధికారి గుండాలరెడ్డి రాఘవేంద్ర కీలక పాత్ర పోషించారు. కూంబింగ్‌ బృందానికి నాయకత్వం వహించారు.  

    గతేడాది ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌ బలగాలు కూంబింగ్‌ చేపట్టి,సోమవారం మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందగా వారిలో చలపతి కూడా ఉన్నారు. ఇలా నక్సల్స్‌ అణిచివేతకు సత్తా చాటిన ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు డీజీపీ నుంచి డిస్క్ అవార్డును అందుకున్నారు. 

  • ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్‌ దిగిందా లేదా?’’ అంటాడో హీరో. ఇప్పుడీ డైలాగును ఐఐటీ మద్రాస్‌ కూడా గర్వంగా కొట్టేయవచ్చు. అవును మరి.. ప్రపంచంలోని ఏ దేశానికీ లేని సరికొత్త, వినూత్నమైన తుపాకీ గుండును ఈ సంస్థ విజయవంతంగా తయారు చేసి పరీక్షించింది కూడా. ఈ సరికొత్త తుపాకీ గుండును, ధనుష్‌ హోవిట్జర్‌, కే-9 వజ్ర-టీ, బోఫోర్స్‌ వంటి తుపాకుల్లో పెట్టి కాల్చామనుకోండి... ఒకొక్కటీ మామూలు బుల్లెట్ల కంటే సగం దూరం ఎక్కువ ప్రయాణిస్తాయి. అదే సమయంలో వీటి విధ్వంసక శక్తి ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఈ అద్భుత ఆవిష్కరణ విశేషాలు...

    దేశ సరిహద్దుల రక్షణలో శతఘ్ని వ్యవస్థల పాత్ర చాలా కీలకం. అయితే వీటితో ఒక చిక్కుంది. ధనుష్‌ హోవిట్జర్‌సహా 155 మిల్లీమీటర్ల గుండ్లు వాడే తుపాకులు ప్రయాణించగలిగే దూరం 40 కిలోమీటర్లకు మించదు. అందుకే మన భద్రత దళాలు వీటిని సరిహద్దుల్లో అతి దగ్గరి నుంచి జరిపే దాడులకు మాత్రమే ఉపయోగిస్తూంటారు. కొంచెం ఎక్కువ దూరంలోని లక్ష్యాలను తాకాలంటే ప్రళయ్‌ (150 - 500 కిలోమీటర్లు) లేదా పినాక (40 - 90 కి.మీ)లు వాడాల్సి ఉంటుంది. తుపాకులతో పోలిస్తే రాకెట్లతో పనిచేసే క్షిపణుల తయారీ, మోహరించడం రెండూ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఇలా కాకుండా.. తూపాకులతోనే వంద కిలోమీటర్ల దూరాన్ని కూడా తాకగలిగితే...? ఐఐటీ మద్రాస్‌ అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించిన రామ్‌జెట్‌ ఇంజిన్లు సరిగ్గా ఇదే పని చేస్తాయి. 


     

    ఏమిటీ రామ్‌జెట్‌? 
    రాకెట్‌ ఇంజిన్‌ మాదిరిగానే ఇది కూడా ఓ ఇంజిన్‌. అంతే. కాకపోతే.. రాకెట్‌ ఇంజిన్ల మాదిరి వీటిల్లో బోలెడన్ని విడిభాగాలు ఉండవు. గాలిని పీల్చుకుని, తనలోని ఇంధనానికి కలిపి ముందుకు దూసుకెళుతూంటుంది. ధ్వని కంటే మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్లగలదు. ఇంజిన్లతో పనిచేసే క్షిపణులు రష్యాతోపాటు ఫ్రాన్స్‌, ఇండియా, ఫ్రాన్స్‌, చైనా, స్వీడన్‌, యూకేల వద్ద మాత్రమే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా వద్ద కూడా లేవు. ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ టెక్నాలజీ క్షిపణుల కంటే చాలా తక్కువ సైజులో ఉండే తుపాకీ గుళ్లలోకి చేరిపోయింది. భారత ఆర్మీ బోర్డు, ఐఐటీ మద్రాస్‌లు సంయుక్తంగా తయారు చేసిన రామ్‌జెట్‌ ఆధారిత తుపాకీ గుండ్లను ప్రోఖ్రాన్‌లో విజయవంతంగా పరీక్షించారు. ప్రొఫెసర్తు పి.ఎ.రామకృష్ణ, హెచ్‌ఎస్‌ఎన్‌ మూర్తి,  జి.రాజేశ్‌, ఎం.రామకృష్ణ, మురుగయన్‌, లాజర్‌లతోపాటు విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ పి.ఆర్‌.శంకర్‌,  లెఫ్టినెంట్‌ జనరల్‌ హరి మోహన్‌ అయ్యర్‌, డాక్టర్‌ యేగేశ్‌ కుమార్‌ వేలరిలతో కూడిన బృందం రామ్‌జెట్‌ ఆధారిత తుపాకీ గుండ్ల తయారీలో కీలకపాత్ర పోషించారు.


    క్షిపణుల్లోనూ వాడవచ్చు: ప్రొఫెసర్‌ రామకృష్ణ
    రామ్‌జెట్‌ టెక్నాలజీని బోఫోర్స్‌ మినహా ఇతర క్షిపణుల్లో వాడేందుకు తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఐఐటీ మద్రాస్‌లోని ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విభాగపు అధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.ఎ.రామకృష్ణ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. తొలుత తాము 76 మిల్లీమీటర్‌ తుపాకులతో రామ్‌జెట్‌ ఆధారిత తుపాకీ గుండ్లను పరీక్షించి చూశౠమని, ఆ తరువాత దశలవారీగా 155 మిల్లీమీటర్ల శతఘ్ని వ్యవస్థకు విస్తరించామని వివరించారు. గత ఏడాది సెప్టెంబరులో దియోలాలీలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్టిలరీలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, తుపాకీ నుంచి గుండు చాలా స్పష్టంగా బయటపడటంతోపాటు స్థిరమైన వేగంతో ప్రయాణించిందని, రామ్‌జెట్‌ ఇంజిన్‌ కూడా సకాలంలో మండిందని ఆయన వివరించారు. డిసెంబరులో వీటిని పోఖ్రాన్‌లోని ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో పరీక్షించామని తెలిపారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి తుదిమెరుగులు దిద్దుతున్నామని, అన్నీ సవ్యంగా సాగి భద్రత దళాలు వాడటం మొదలుపెడితే ఖర్చు కలిసిరావడమే కాకుండా.. వ్యూహాత్మకంగానూ ఎన్నో ప్రయోజనాలుంటాయని చెప్పారు.

  • కొచ్చి: కేరళలోని కొచ్చిలో భూటాన్ కార్ల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. భూటాన్ నుండి అక్రమంగా భారత్‌కు తరలించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును.. భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వాహనంగా నమ్మించి, విక్రయించిన ఘటనపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన రోహిత్ బేడీ అనే వ్యక్తి ఎడపల్లి(కేరళ)కి చెందిన మహమ్మద్ యాహ్యాను నమ్మించి, కారు విక్రయానికి రూ. 14 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.

    విలాసవంతమైన కార్లను తక్కువ ధరకే విక్రయించడానికి మోసగాళ్లు వాటిని ‘ఎంబసీ వెహికల్’గా చెబుతుంటారు. దీనిని నమ్మిన బాధితుడు, దఫదఫాలుగా నగదు రూపంలోనూ, బ్యాంక్ బదిలీల ద్వారా కారు కొనుగోలుకు మొత్తం సొమ్మును చెల్లించాడు. గత ఏడాది అక్టోబర్‌లో కస్టమ్స్ విభాగం చేపట్టిన ‘ఆపరేషన్ నుంఖోర్’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ ల్యాండ్ క్రూయిజర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూటాన్ నుండి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుని, నకిలీ పత్రాలతో భారత్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.

    తాను కొనుగోలు చేసిన కారు ఎంబసీ వాహనం కాదని, అక్రమంగా స్మగ్లింగ్ చేసినదని గుర్తించిన బాధితుడు యాహ్యా, తనను మోసం చేసిన బ్రోకర్‌పై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో దీని వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూటాన్‌లో పన్నులు తక్కువగా ఉన్న కారణంగా, అక్కడి నుంచి  కార్లను దిగుమతి చేయడం లేదా పాత కార్లను కొనుగోలు చేసి భారత్‌కు తరలించడం లాంటి పనులను ముఠా సభ్యులు చేస్తుంటారు. అలాగే భారీ దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా భారత సైన్యానికి చెందిన నకిలీ ఎన్‌ఓసీలను సృష్టిస్తారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి, కేరళ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు భారీ ధరలకు ఆ కార్లను విక్రయిస్తుంటారు.

    బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రోహిత్ బేడీపై ఐపిసి సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), 420 (చీటింగ్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ అనూప్ సి నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కొనుగోలుకు సంబంధించిన పత్రాలను, బ్యాంక్ లావాదేవీల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 

    ఇది కూడా చదవండి: పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ

Politics

  • సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్‌ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్‌ని ప్రదర్శించడంలో పవన్‌ కళ్యాణ్‌ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‌

    అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలోనే జరిగాయి.

    పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా  32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. 

    కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్‌ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి. 

    టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్

    పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్‌కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్‌ జగన్‌ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు.

  • పాలమూరు:  అబద్ధాలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు కేటీఆర్‌. ఈరోజు( సోమవారం, జనవరి 12వ తేదీ) మహబూబ్‌నగర్‌ జిల్లాల పాలమూరులో పర్యటించిన కేటీఆర్‌ మాట్లాడుతూ..   కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ఏ వర్గానికీ న్యాయం చేయలేదన్నారు. 

    ‘రెండేళ్లలో ఏ వర్గానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయి. మూటలు కట్టి డబ్బులను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. మనం సబ్జెక్ట్‌ మాట్లాడితే.. రేవంత్‌ బూతులు  మాట్లాడుతున్నారు. సంస్కారం అడ్డొస్తుందని మేం తిట్టడం లేదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. కాంగ్రెస్‌ సొంత పార్టీ నేతలే  ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆరోపించారు.
     

    KTR: ఈసారి కాంగ్రెస్ పార్టీ పండబెట్టి తొక్కుతాం
  • సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.

    ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్‌మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

    Ananthapuram: డబ్బులు ఇవ్వలేదని ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరులు దాడి
  • సాక్షి, తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో యువత మాత్రం అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో 8 త్రైమాసికాలకు గానూ ఫీజు రీయింబర్స్‌మెంట్లు, రూ.4,900 కోట్ల విద్యా దీవెన (Vidya Deevena), రూ2,200 కోట్ల వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు పేరుకుపోయాయని.. అలాగే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మోసం ద్వారా యువతను తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 

    ఏపీలో కూటమి పాలన పరిస్థితులు యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇకనైనా మేల్కొని యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని.. వివేకానందుడి ప్రముఖ సూక్తిని ఒకదానిని(Arise, Awake, and facilitate..) ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌  హితవు పలికారు. 

    YS Jagan: ప్రమాదంలో ఏపీ భవిష్యత్తు.. అయోమయంలో యువత..
  • సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై సంచలన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం సూచనలు బీజేపీకి అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.

    కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఉపాధి హామీ కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించాం. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. వంద రోజుల పని దినాలను 125కి పెంచాం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయ పీక్ సీజన్‌లో కూలీల కొరత లేకుండా ఈ పథకంతో లబ్ది జరుగుతుంది. వ్యవసాయ సీజన్ లేనప్పుడు 125 పని దినాలు దొరికేలా కొత్త చట్టం చేశాం. రాష్ట్రాలకి అదనపు భారం వేయడమే కాదు.. కేంద్రం కూడా అదనంగా ఖర్చు పెడుతుంది. కేంద్రం కూడా 340 కోట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రాష్ట్రానికి వస్తాయి.

    కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశాం. పథకాన్ని నీరుగార్చడం కాదు పటిష్ఠం చేశాం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా బాధ్యత కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ దేశంలో రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది అని చెప్పుకొచ్చారు.

    బీఆర్‌ఎస్‌కు కౌంటర్‌..
    బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి..‘బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించాం కదా. గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వస్తామా?. మళ్లీ గెలిచి దేశంలో ప్రధానిగా మోదీ అధికారంలోకి వస్తారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసు’ అని అన్నారు.

    ఎంఐఎంపై వ్యాఖ్యలు..
    పాకిస్తాన్‌లో హిందువులు లేకుండా చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటి?. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం నేతలు ఉన్నారు. అవగాహన లేకుండా దుందుడుకుగా వ్యవహరించడం అసద్‌కు అలవాటు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్‌ భూభాగంలో ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దేశం అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి పెట్టాం. దేశ రక్షణకు మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదు అని ఘాటుగా విమర్శలు చేశారు. 

International

  • గత కొంతకాలంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్‌ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

    వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్‌లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్‌లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా  ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.

    అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్‌లాండ్‌ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్‌లాండ్ కోసం డెన్మార్క్‌తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.

    రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్‌మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్‌లాండ్‌పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు.

  • ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్‌ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్‌ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. 

    డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్‌కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్‌ పెరుగుతూ వచ్చింది. 

    ఈ నేపథ్యంలో భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.

    తాను ట్రంప్‌తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్‌ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు.

Crime

  • సాక్షి,హైదరాబాద్‌: కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రదర్శనలో దుర్ఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్‌లో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా చూస్తుండగా ఓ అభిమాని ఆకస్మికంగా కుప్పకూలి మృతి చెందాడు.

    థియేటర్‌లో ఉన్న ఇతర ప్రేక్షకులు వెంటనే స్పందించి అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు వెలువడేందుకు వైద్య పరీక్షలు, విచారణ కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో థియేటర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మెగాస్టార్ అభిమానుల ఉత్సాహం మధ్య ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేసింది.  

    కాగా, మృతుడు 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ఉదయం 11.30 గంటల షో చూడటానికి సినిమా థియేటర్‌కు వచ్చారు. సినిమా మధ్యలో, అకస్మాత్తుగా తన సీటులో కుప్పకూలిపోయాడు. తోటి ప్రేక్షకులు భయపడ్డారు. తర్వాత తేరుకుని వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆనంద్ చనిపోయినట్లు ప్రకటించారు. గుండెపోటు మరణానికి కారణమని అనుమానిస్తున్నారు
     

Family

  • ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి రామ వైద్యనాథన్ నృత్య రూపకంగా *‘మాల్యద – ఆండాళ్ పవిత్ర మాల’*ను హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 18న సాయంత్రం 6:30 గంటల నుంచి రవీంద్ర భారతి వేదికగా జరుగుతుంది. ఈ ప్రదర్శనకు HCL Concerts మద్దతు అందించగా, రవీంద్ర భారతి సహకరిస్తోంది. ప్రజలకు ప్రవేశం ఉచితం మరియు ముందుగా వచ్చిన వారికి ముందు ప్రవేశం కల్పించబడుతుంది.

    ఈ నృత్య రూపకం జయసుందర్ డి రచించిన Maalyada: The Sacred Garland పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. 9వ శతాబ్దానికి చెందిన తిరుప్పావైలోని అంతర్ముఖ ఆధ్యాత్మిక భావాలను, ఆండాళ్ తన స్నేహితులతో చేసే సహజ సంభాషణల ద్వారా ఈ రచన వివరిస్తుంది. ప్రాచీన శాస్త్రోక్తులను ప్రస్తావిస్తూ, ఆండాళ్ కవిత్వంలోని భక్తి, తత్వం, జ్ఞానాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

    పుస్తకానికి స్వరంగా నిలుస్తూ, నర్తకి మరియు కొరియోగ్రాఫర్ అయిన రామ వైద్యనాథన్, ఆండాళ్ మరియు ఆమె స్నేహితులు శ్రీకృష్ణుని అన్వేషణలో సాగించే ప్రయాణాన్ని నృత్య రూపంలో ఆవిష్కరిస్తారు. ఈ ప్రయాణం నవ విధ భక్తి — దైవ సాక్షాత్కారానికి దారి తీసే తొమ్మిది భక్తి మార్గాల అనుభూతిని ప్రతిబింబిస్తుంది.

    ఈ ప్రదర్శనకు సంగీతాన్ని సుధా రఘురామన్ అందించగా, గానం: సుధా రఘురామన్, వేణువు: జి. రఘురామన్, నట్టువాంగం: హిమాన్షు శ్రీవాస్తవ, మృదంగం: సుమోద్ శ్రీధరన్ మరియు సన్నిధి వైద్యనాథన్, లైట్స్: సూర్య రావు. నృత్యంలో రామ వైద్యనాథన్‌తో పాటు రేషిక శివకుమార్, సయాని చక్రబర్తి, శుభమణి చంద్రశేఖర్, వైష్ణవి ధోరే పాల్గొంటారు.

    ఈ ప్రత్యేక నృత్యావిష్కరణను ఆస్వాదించేందుకు నగర కళాభిమానులను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.