Archive Page | Sakshi
Sakshi News home page

International

  • హాయ్ ఫ్రెండ్స్... లోకంలో వింతలు విశేషాలు అయిపోయాయి, ఇప్పుడు విడ్డూరాలు మొదలయ్యాయి. అసలే అమెరికా ఎన్నికలు అంటేనే ఒక పెద్ద జాతర. అక్కడ ఎవరు గెలిచినా మనకేంటి అనుకుంటాం కానీ, అక్కడ తుమ్మితే ఇక్కడ మన స్టాక్ మార్కెట్ ముక్కు తుడుచుకోవాలి. అయితే తాజాగా మన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) గారికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. "ఒకవేళ డొనాల్డ్ ట్రంప్  బరాక్ ఒబామా తలపడితే ఎవరు గెలుస్తారు?" అని ఎవరో అడిగితే, మన AI గారు కూర్చుని లెక్కలు కట్టేసి ఒక రిజల్ట్ ఇచ్చేసారు. అంటే.. ప్రస్తుతం ఉన్న బైడెన్ గారిని సైడ్ చేసేసి, రిటైర్ అయిపోయిన ఒబామా గారిని మళ్ళీ గోదాలోకి లాగారన్నమాట. ఇది ఎలా ఉందంటే.. రిటైర్ అయిపోయిన సచిన్ టెండూల్కర్ ని పిలిచి, ఇప్పుడున్న బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టమన్నట్టు ఉంది!

    సరే AI విశ్లేషణ ప్రకారం.. ట్రంప్ గారి బలం ఆయన 'బేస్'. అంటే ఆయన ఏం మాట్లాడినా, అది అబద్ధమా, నిజమా అని చూడకుండా జేజేలు కొట్టే ఒక బ్యాచ్. ట్రంప్ మామ స్టైలే వేరు.. "అమెరికా ఫస్ట్" అంటారు, కానీ ఆయన కోపం వస్తే "ట్విట్టర్ ఫస్ట్" అంటారు .ఇక ఒబామా గారి విషయానికి వస్తే.. ఆయన స్పీచ్ ఇస్తుంటే అమెరికా కాదు కదా, పక్కన ఉన్న కెనడా వాళ్ళు కూడా మైమరచిపోతారు. ఆయనకి 'యూత్' లో క్రేజ్ ఎక్కువని AI చెబుతోంది. కానీ పాపం AI కి ఒక విషయం తెలియదు.. ఒబామా గారు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటూ, నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీలు తీసుకుంటూ చిల్‌ అవుతున్నారు. ఆయన్ని మళ్ళీ వైట్ హౌస్ పిలిచి.. ఆ ఫైళ్లు, ఆ గొడవలు చూడమంటే ఆయన ఒప్పుకుంటారా? ఇంకా AI ఏం చెబుతుందంటే, "ఎకానమీ" విషయంలో ట్రంప్ వైపు మొగ్గు ఉందట. అంటే వ్యాపారవేత్త కదా, పైసల లెక్కలు బాగా తెలుసని AI ఫీలింగ్. కానీ అదే AI "సోషల్ హార్మనీ" (సామాజిక సామరస్యం) విషయంలో ఒబామాకి ఓటు వేసింది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కావాలంటే ట్రంప్ ని నమ్ముకోండి, ప్రశాంతత కావాలంటే ఒబామాని నమ్ముకోండి అని! కానీ అమెరికా జనాలకి రెండు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు "మాకు ఆ ఇద్దరూ వద్దు.. మాకు కనీసం సరిగ్గా నడవగలిగే, పేర్లు గుర్తుపెట్టుకునే అభ్యర్థి ఉంటే చాలు" అని మొత్తుకుంటున్నారు.

    ఒకవేళ నిజంగానే వీళ్ళిద్దరూ పోటీ పడితే సోషల్ మీడియా ఎలా ఉంటుందో ఊహించండి! ట్రంప్ గారు ఒబామాని "స్లీపీ బరాక్" అనో లేక ఇంకేదో వింత పేరు పెట్టి పిలుస్తారు. ఒబామా గారు తనదైన శైలిలో ఒక పెద్ద ఇంగ్లీష్ డిక్షనరీ తిరగేసి కౌంటర్లు ఇస్తారు.మధ్యలో ఎలాన్ మస్క్ వచ్చి.. "నేను ఎవరికీ ఓటు వేయను, నేను అంగారక గ్రహానికి వెళ్ళిపోతున్నా" అని ట్వీట్ చేస్తారు. AI కి ఉన్న ఒకే ఒక సౌలభ్యం ఏంటంటే.. అది మనుషుల ఎమోషన్స్ ని లెక్కించదు. కేవలం డేటా చూస్తుంది. కానీ అమెరికా ఎన్నికల్లో డేటా కంటే 'డ్రామా' ఎక్కువ పని చేస్తుంది. ఆ విషయం పాపం ఆ AI కి ఎవరు చెప్తారు?
    ఈ కథనంలో అందరూ మర్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నారు.. ఆయనే జో బైడెన్! పాపం, ఆయన మాజీ ప్రెసిడెంట్. కానీ AI మాత్రం ఆయన పేరు కూడా ఎత్తకుండా ఒబామాని తెచ్చి కూర్చోబెట్టింది. ఇది ఎలా ఉందంటే.. ఇంట్లో పెళ్లి కొడుకు రెడీగా ఉంటే, పాత పెళ్లి కొడుకు ఫోటో చూసి "ఈయనైతే బాగుండు" అని మురిసిపోయినట్టు ఉంది.

    AI ప్రిడిక్షన్ ప్రకారం.. ఈ ఊహాజనిత పోరులో ఒబామాకి కొంచెం ఎడ్జ్ ఉందట. ఎందుకంటే ఆయనకి నెగటివ్ రేటింగ్ తక్కువంట. ట్రంప్ గారికి అభిమానులు ఎంత మంది ఉన్నారో, "ఈయన వద్దు బాబోయ్" అనే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో, ఫైనల్ గా తేలిందేంటంటే.. AI దృష్టిలో పాత కాలపు యుద్ధాలే బాగున్నాయి. ఉన్న వాళ్ళతో ఎలాగో వేగలేకపోతున్నాం, పోనీ లేని వాళ్ళని తెచ్చుకుందాం అనే రేంజ్ కి అమెరికా పాలిటిక్స్ వెళ్ళిపోయాయి. అసలు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే.. ఈ AI చేసే విశ్లేషణలు మాత్రం మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. మరి మీరేమంటారు? ట్రంప్ కావాలా? ఒబామా కావాలా? లేక మన ఊరి సర్పంచ్ నయమా? కామెంట్ చేయండి!

     

  • న్యూఢిల్లీ:  అరబిక్‌ కంట్రీ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాలకు చెందిన కోళ్లు, గుడ్లపై పూర్తిగా నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి తదితర కారణాలతో 40 దేశాల కోళ్లు, గుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధిత జాబితాల భారత్‌ కూడా ఉంది. ఇటీవల కాలంలో కోళ్లకు వస్తున్న రోగాల కారణంగా సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా డ్రగ్‌ అథారిటీ(ఎస్‌ఎఫ్‌డీఏ) స్పష్టం చేసింది. 

    ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలతో పాటు అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉండటంతో సౌదీ అరేబియా  ఈ నిర్ణయం తీసుకుంది. 40 దేశాల ఫౌల్ట్రీ, గుడ్లపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. 2004 నుంచి పలు దేశాలపై ఈ నిషేధం అమల్లో ఉండగా, అందులో ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. 

    ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్‌,  అజర్‌బైజాన్‌, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్‌, బోస్నియా, హర్జేగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్‌, తైవాన్‌, డిజిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్‌, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజక్‌స్తాన్‌, కామెరూన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, లిబియా, మయన్మార్‌, ద యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఈజిప్టు, మెక్సికో, మంగోలియా, నేపాల్‌,  నైగర్‌, నైజీరియా, హాంకాంగ్‌, జపాన్‌, బుర్కినా ఫాసో, సెర్బియా, స్లోవెనియా, ఇవారీ కోస్ట్‌ తదితర దేశాలున్నాయి. 

    భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం?
    ఇది భారత పౌల్ట్రీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  భారతీయ గుడ్లు, కోడి ఉత్పత్తుల ప్రధాన మార్కెట్‌లలో  సౌదీ అరేబియా ఒకటి. ఈ నిషేధం వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎగుమతి ఆగిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్లు, కోడి మాంసం సరఫరా పెరుగుతుంది.  అధిక సరఫరా కారణంగా రైతులు, ఉత్పత్తిదారులు తక్కువ ధరలకు అమ్మకాలు చేయాల్సి రావచ్చు. 

  • జెరూసలేం: ఇజ్రాయెల్‌తో భారత్‌ పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. పలు ఒప్పందాలపై నరేంద్ర మోదీ-నెతన్యాహు సంతకాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధానితో నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌లో పర్యటించాలని నెతన్యాహును ప్రధాని మోదీ ఆహ్వానించారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.

    విద్య, వ్యవసాయం, వాణిజ్యం, సైబర్‌ సెక్యూరిటీ, సర్వీస్‌ సెక్టార్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌లో యూపీఐ వాడకంపైనా భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో పరస్పర సహకారానికి భారత్‌-ఇజ్రాయెల్‌ నిర్ణయించాయి.

    జెరూసలెంలో మోదీ.. 11 కీలక ప్రకటనలు

    వ్యవసాయం నుంచి ఏఐ వరుకు పలు ఎంవోయూలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 16 ఎంవోయూలపై భారత్‌​​-ఇజ్రాయెల్‌ సంతకాలు చేసుకున్నాయి. 11 కీలక ప్రకటనలు చేశాయి. టెక్నాలజీ కేంద్రంగా భవిష్యత్‌ సంబంధాలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌కు త్వరలోనే తుదిరూపు ఇస్తామన్నారు. పశ్చిమమాసియాలో శాంతిస్థాపనకు మోదీ పిలుపునిచ్చారు. సంఘర్షణల్లో మానవత్వం బాధితురాలు కాకూడదన్నారు.


     


     

  • ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌కు ఇరువైపులా బికీనీ ధరించిన ఇద్దరు మహిళలు ఉన్న ఫోటోలు కలకలం రేపుతున్నాయి. ఓ దీవిలోని ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లో హాకింగ్ గడిపినట్లు బయటపడింది. చేతిలో కాక్‌టెయిల్‌ పట్టుకుని, సన్ లౌంజర్‌పై పడుకుని ఉన్న హాకింగ్‌ను ఆ మహిళలు పట్టుకుని ఉన్నారు. 'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం.. హాకింగ్‌తో ఉన్న ఆ ఇద్ద‌రు అమ్మాయిలు.. ఆయ‌న‌కు సేవ చేసేవార‌ని తెలిపింది. వారు హాకింగ్‌కు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సంరక్షకులని.. హాకింగ్‌కు ఉన్న అనారోగ్య కారణాల దృష్ట్యా వారికి 24 గంటల వైద్య సహాయం అవసరం కాబట్టే.. వారు అక్కడ ఉన్నారని వెల్లడించింది.

    ఓ సంద‌ర్భంలో హాకింగ్ జ‌లాంత‌ర్గామిలో ప్ర‌యాణించిన‌ట్లు కూడా ఫోటో ఉంది. అండ‌ర్‌ వాట‌ర్ వెస‌ల్‌ను హాకింగ్‌ కోసం ఎప్‌స్టీన్ మార్పులు చేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2006లో సెయింట్ థామ‌స్‌లోని రిట్జ్ కార్ల‌ట‌న్ హోటల్‌లో జ‌రిగిన సైన్స్ స‌ద‌స్సు స‌మ‌యంలో ఆ ఫోటో తీసిన‌ట్లు భావిస్తున్నారు. సెయింట్ జేమ్స్ దీవిలో ఉన్న ఎప్‌స్టీన్ రిసార్టును విజిట్ చేసిన 21 మంది శాస్త్ర‌వేత్త‌ల్లో హాకింగ్ కూడా ఒక‌రు. హాకింగ్‌కు చెందిన 250 ఫోటోలు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న‌ట్లు సమాచారం.  

    దీనిపై హాకింగ్ కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఆ ఇద్దరు మహిళలు యూకేకు చెందిన ఆయన దీర్ఘకాలిక సంరక్షకులని తెలిపారు ఆయన ప్రవర్తనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా తప్పేనంటూ.. ఆరోపణలను కొట్టిపారేశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో హాకింగ్ పేరు కనీసం 250 సార్లు ప్రస్తావించబడింది. తాజా పత్రాలలో భాగంగా విడుదలైన ఈ ఫోటోలో, హాకింగ్ ఇద్దరు మహిళల మధ్య చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

    స్టీఫెన్ హాకింగ్‌ జనవరి 8, 1942న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాస్మోలజీ (విశ్వాంతరాళ శాస్త్రం)లో పిహెచ్‌డీ చేశారు. 21 ఏళ్ల వయసులో ఆయనకు అరుదైన మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆయన శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైంది. మాట్లాడే శక్తిని కోల్పోవడంతో, ఒక ప్రత్యేకమైన వాయిస్ సింథసైజర్ (కంప్యూటర్ సాయంతో మాట్లాడే పరికరం) ద్వారా తన భావాలను పంచుకునేవారు.

    హాకింగ్ ప్రధానంగా విశ్వం పుట్టుక, నల్ల బిలాలు (Black Holes), సాపేక్ష సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు. హాకింగ్ రేడియేషన్ (Hawking Radiation) బ్లాక్ హోల్స్ నుండి కూడా వికిరణం (Radiation) వెలువడుతుందని ఆయన నిరూపించారు. దీనినే 'హాకింగ్ రేడియేషన్' అంటారు. విశ్వం ఒక బిందువు నుండి ప్రారంభమైందని (Big Bang Theory) గణితశాస్త్ర పరంగా నిరూపించారు. సామాన్యులకు కూడా సైన్స్ అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన అనేక పుస్తకాలు రాశారు. మార్చి 14, 2018న (ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజున) హాకింగ్ తన 76వ ఏట కన్నుమూశారు.

     

     

  • షాపింగ్‌ మాల్స్‌లో షాపింగ్‌ చేయడం, కూపన్స్‌ నింపడం, బంపర్‌ డ్రాలు కోసం  ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ  కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్‌ లగ్జరీ మెర్సిడెస్‌ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?

    ప్రతీ వేసవిలో దుబాయ్‌  'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్‌ సర్వ సాధారణం. కానీ దుబాయ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. 

    ఖలీజ్ టైమ్స్  రిపోర్ట్‌ ప్రకారం సుమిత్‌ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్‌లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్‌ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్‌ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్‌.

    ​కారుతో సరదాగా ఫోటో  కట్‌ చేస్తే
    20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న  సుమిత్‌  దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్  'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్‌ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్‌ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. 

     

    సర్‌ప్రైజ్‌  చేసిన కాల్‌
    ఒకరోజు నైట్‌ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్‌ కాల్‌ వచ్చింది.  మెయిల్‌ చెక్‌ చేసుకోండి అని చెప్పారు.  చెక్‌  చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు.

     (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?)

Sports

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. జింబాబ్వేను 72 ప‌రుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీల‌క పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

    ఇండియా బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిల‌క్ వ‌ర్మ‌(16 బంతుల్లో 44), ఇషాన్ కిష‌న్(38), సూర్య‌కుమార్ యాద‌వ్‌(33), సంజూ శాంస‌న్‌(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    బెన్నెట్ ఒంట‌రి పోరాటం..
    255 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ రియాన్ బెన్నెట్ ఒంట‌రి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 97 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికింద‌ర్ ర‌జా(31) ఫ‌ర్వాలేద‌న్పించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు.

  • టీ20 వరల్డ్‌కప్‌-2026లో జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.

    బ్యాటింగ్‌కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిల‌క్ వ‌ర్మ‌(16 బంతుల్లో 44), ఇషాన్ కిష‌న్(38), సూర్య‌కుమార్ యాద‌వ్‌(33), సంజూ శాంస‌న్‌(24) రాణించారు.

    అయితే మొత్తం ఆరుగురు బ్యాట‌ర్లు కూడా 150+ స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయ‌డం విశేషం. త‌ద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయడం ఇదే తొలిసారి.

    👉ఓ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన జాబితాలో భార‌త్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.

    👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది.

  • టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా సూర్యకుమార్‌ సేన ఈ ఫీట్‌ నమోదు చేసింది.

    మెరుపులు
    చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో టాస్‌ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్‌ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.

    వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్‌ దంచికొట్టిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.

    అతడి స్ట్రైక్‌రేటు 275
    ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్‌, తిలక్‌ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.

    టీమిండియా ప్రపంచ రికార్డు
    ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి.  ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, కెప్టెన్‌ సికందర్‌ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

    డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి
    కాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్‌ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ లీగ్‌ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.

    అయితే, సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

    చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క మ్యాచ్‌లో త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8లో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.

    ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

    అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట​ సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం.

  • జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.

    అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
    ఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (24) నిరాశపరచగా.. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

    హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం
    కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), తిలక్‌ వర్మ దంచికొట్టారు. హార్దిక్‌ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

    హార్దిక్‌ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    రికార్డు స్కోరు
    కాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్‌ నిలిచింది. తాజాగా భారత్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్‌ రాబట్టింది.

    చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్-8 మ్యాచ్‌లో శాంస‌న్‌కు తుది జ‌ట్టులో ద‌క్కింది.

    టీమ్ మెనెజ్‌మెంట్ అత‌డిని ఓపెన‌ర్‌గా పంపింది. అయితే సంజూ క్రీజులో  ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్‌ల‌తో 24 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే  భార‌త స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్స‌ర్‌తో తెరిచాడు. 

    ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు మైదానంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. 

    ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్‌ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా 3 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది.


     

     

  • టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.

    ఆది నుంచి దారుణంగా విఫలం
    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్‌ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

    సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ
    అనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్‌ శర్మ పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.

    దీంతో అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్‌ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

    అర్ధ శతకంతో
    జింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్‌లో తొలి  వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్‌లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

    ఇదిలా ఉంటే..  16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా 16, తిలక్‌ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు.  ఓపెనర్‌ సంజూ శాంసన్‌ 24, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ లీగ్‌ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు సంజూ శాంసన్‌. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.

    అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ జోడీలో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.

    మరో అవకాశం
    అయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్‌ అభిషేక్‌ శర్మతో కలిసి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.  

    ఘనంగానే ఆరంభించాడు.. కానీ
    ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్స్‌ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్‌ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.

    బ్లెసింగ్‌ ముజర్‌బానీ సంధించిన షార్ట్‌ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్‌ బర్ల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్‌ పెవిలిన్‌ చేరగా.. భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

    మారవా సంజూ!
    జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.

    ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ భర్తీ చేశాడు. 

    ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్‌ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్‌ 15, అభిషేక్‌ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది.

    చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా చెన్నై వేదిక‌గా భార‌త్, జింబాబ్వే జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీల‌క మ్యాచ్‌లో భార‌త్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.

    వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రింకూ సింగ్ స్ధానంలో అక్ష‌ర్ ప‌టేల్‌, సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. అభిషేక్‌, సంజూ క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమ‌ర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు ద‌క్కింది.

    తుది జ‌ట్లు
    జింబాబ్వే: 
    తడివానాషే మారుమణి(వికెట్ కీప‌ర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్‌), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ

    భారత్: 
    సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రా

  • హుబ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైన‌ల్లో కర్ణాటకపై  జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి క‌ర్ణాట‌క త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది.

    మయాంక్ అగ‌ర్వాల్‌(130 బ్యాటింగ్‌) సెంచ‌రీతో క‌దం తొక్క‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ 11 ప‌రుగులు చేయ‌గా.. సీనియ‌ర్ బ్యాట‌ర్లు స్మరన్ రవిచంద్రన్, క‌రుణ్ నాయ‌ర్ ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియన్‌కు చేరారు. 

    జ‌మ్మూ కాశ్మీర్ బౌలర్ల‌లో అకిబ్ నబీ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యుద్ద్‌వీర్ సింగ్, సునీల్ కుమార్ త‌లా వికెట్ సాధించారు. ప్ర‌స్తుతం క్రీజులో అగ‌ర్వాల్‌తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. క‌ర్ణాట‌క ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో జ‌మ్మూ కంటే 364 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది.

    అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన జ‌మ్మూ అండ్ కాశ్మీర్ 584 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. జ‌మ్మూ బ్యాట‌ర్ల‌లో దాదాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం విశేషం. శుభమ్ పుందిర్ 121 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్( 70 పరుగులు) రాణించారు. ఒక‌వేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయితే  ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది.
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా మరో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను 76 పరుగులతో చిత్తు చేసిన సఫారీలు.. తాజాగా వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేశారు. తద్వారా సెమీ ఫైనల్‌ రేసులో ప్రొటిస్‌ జట్టు ముందుకు దూసుకుపోయింది. అంతేకాదు టీమిండియా సెమీస్‌ ఆశలను కూడా సజీవం చేసింది.

    పోటీలో నాలుగు
    సూపర్‌-8 దశలో గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, టీమిండియా, వెస్టిండీస్‌, జింబాబ్వే బరిలో నిలిచాయి. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా- టీమిండియా తలపడగా.. మార్క్రమ్‌ బృందం సూర్యకుమార్‌ సేనను చిత్తుగా ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

    మరోవైపు.. వెస్టిండీస్‌ తమ తొలి మ్యాచ్‌లో జింబాబ్వేపై ఏకంగా 107 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా రెండు పాయింట్లతో పాటు నెట్‌రన్‌రేటు పరంగా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇలాంటి తరుణంలో సౌతాఫ్రికా విండీస్‌ను ఓడిస్తేనే టీమిండియా సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి.

    టీమిండియాకు సానుకూలాంశం
    ఈ నేపథ్యంలో గురువారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా విండీస్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేయడం.. టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    నిప్పులు చెరిగిన బౌలర్లు
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. విండీస్‌ బ్యాటర్లలో జేసన్‌ హోల్డర్‌ (49), రొమారియో షెఫర్డ్‌ (52 నాటౌట్‌) రాణించారు. ప్రొటిస్‌ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడ, కార్బిన్‌ బాష్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

    మార్క్రమ్‌ ధనాధన్‌
    ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ నష్టపోయి పనిపూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్‌ డికాక్‌ (24 బంతుల్లో 47) ఫర్వాలేదనిపించగా.. ఐడెన్‌ మార్క్రమ్‌ కెప్టెన్‌  ఇన్నింగ్స్‌ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్‌.. ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    మార్క్రమ్‌కు తోడుగా ర్యాన్‌ రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌) రాణించాడు. వీరిద్దరు కలిసి 49 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా ఇప్పటికే సూపర్‌-8లో రెండు గెలిచిన సౌతాఫ్రికా తదుపరి జింబాబ్వేపై కూడా గెలవాలి.

    అదే విధంగా టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లపై తప్పక విజయం సాధించాలి. అలా అయితేనే నెట్‌రన్‌రేటు లెక్కలతో పనిలేకుండా టీమిండియాకు సెమీస్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

    వెస్టిండీస్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా స్కోర్లు
    వెస్టిండీస్‌: 176/8(20)
    సౌతాఫ్రికా: 177/1(16.1)
    ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం
     
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

  • భారత యువ క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో ఇంకోసారి చాటిచెప్పాడు. డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026 టోర్నీలో భాగంగా ఈ బిహారీ పిల్లాడు.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

    డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం
    ముంబై వేదికగా జరిగే ఈ టీ20 లీగ్‌లో డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. గురువారం నాటి మ్యాచ్‌లో ఇండియన్‌ నావీ జట్టుపై చితక్కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. మొత్తంగా 19 బంతుల్లో 63 పరుగులు సాధించాడు.

    వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం
    వైభవ్‌ సూర్యవంశీ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. వరుణ్‌ చౌదరి బౌలింగ్‌లో ఒకే ఓవర్లో వైభవ్‌ 20 పరుగులు పిండుకోవడం మరో హైలైట్‌. ఇక వైభవ్‌తో పాటు అర్జున్‌ టెండుల్కర్‌ సైతం అద్భుత అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు.

    దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌
    వైభవ్‌, అర్జున్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో డీవై పాటిల్‌ బ్లూ జట్టు ఇండియన్‌ నేవీ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా డీవై పాటిల్‌ బ్లూ జట్టుకు శశాంక్‌ సింగ్‌ (Shashank Singh) కెప్టెన్‌గా ఉండగా.. ఐపీఎల్‌ స్టార్లు యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, జితేశ్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌ కూడా జట్టులో భాగంగా ఉన్నారు.

    కాగా వైభవ్‌ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున చివరగా వరల్డ్‌కప్‌ బరిలో దిగిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఇంగ్లండ్‌తో ఫైనల్లో భారీ శతకం (80 బంతుల్లో 175) బాది భారత్‌కు టైటిల్‌ అందించాడు. 

    ప్రస్తుతం డీవై పాటిల్‌ టీ20 కప్‌ టోర్నీతో బిజీగా ఉన్న వైభవ్‌.. తదుపరి ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలో దిగుతాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 22న నవీ ముంబైలో మొదలైన డీవై పాటిల్‌ టీ20 కప్‌ 2026.. మార్చి 6న ఫైనల్‌తో ముగియనుంది. ఇందులో 16 జట్లు భాగంగా ఉన్నాయి.

    చదవండి: కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!

  • టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మ‌రో కీల‌క పోరుకు  సిద్ద‌మైంది. గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. సెమీస్ రేసులో నిల‌వాలంటే సూర్య సేన‌ క‌చ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క సూచ‌న చేశాడు. 

    ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న అభిషేక్ శ‌ర్మ‌ను త‌ప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అందులో మూడు డ‌కౌట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు మాజీలు సూచిస్తున్నారు.

    "నేను గ‌నుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అత‌డి స్ధానంలో సంజూ శాంస‌న్‌ను అవకాశ‌మిస్తాను. ఏదైనా ప్ర‌య‌త్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తారు. ఇది చాలా కీల‌కమైన మ్యాచ్‌. కాబట్టి ఆట‌గాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.

    తుది జ‌ట్టు ఎంపిక‌లో మార్పులు క‌చ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భార‌త్ స‌రైన వ్యూహాల‌తో బ‌రిలోకి దిగుతోంది. కానీ వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశ‌ముంది. అభిషేక్ శర్మ,  తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేర‌న్న విష‌యం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

  • సౌతాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ మెరుగైన స్కోరు సాధించింది. ప్రొటిస్‌ పేసర్లు నిప్పులు చెరగడంతో ఆదిలో తడబడినా.. ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ ధనాధన్‌ దంచికొట్టడంతో గౌరవప్రదమైన స్కోరుతో ఇన్నింగ్స్‌ ముగించింది.

    టీ20 ప్రపంచకప్‌-2026లో గ్రూప్‌-1 ప్రస్తుత టాపర్‌ వెస్టిండీస్‌- సౌతాఫ్రికా (WI vs SA) మధ్య గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    నిప్పులు చెరిగిన ప్రొటిస్‌ పేసర్లు
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు లుంగి ఎంగిడి, కగిసో రబడ షాకులు మీద షాకులు ఇచ్చారు. తొలుత ఓపెనర్లలో కెప్టెన్‌ షాయీ హోప్‌ (16)ను పెవిలియన్‌కు పంపిన రబడ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ షిమ్రన్‌ హెట్‌మైర్‌ (2)ను కూడా అవుట్‌ చేశాడు.

    హోల్డర్‌, షెఫర్డ్‌ మెరుపులు
    అనంతరం ఎంగిడి రోవ్‌మన్‌ పావెల్‌ (9), రోస్టన్‌ ఛేజ్‌ (2), బ్రాండన్‌ కింగ్‌ (21)లను వెనక్కి పంపగా.. కార్బిన్‌ బాష్‌ షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (12), మాథ్యూ ఫోర్డ్‌ (11) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జేసన్‌ హోల్డర్‌, రొమారియో షెఫర్డ్‌ బ్యాట్‌ ఝులిపించారు.

    హోల్డర్‌ 31 బంతుల్లో 49 పరుగులు చేయగా.. షెఫర్డ్‌ 37 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో హోలర్డర్‌ బాష్‌ బౌలింగ్‌లో అవుట్‌ కాగా.. షెఫర్డ్‌అర్థ శతకం పూర్తి చేసుకోగలిగాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది.

    మెరుగైన భాగస్వామ్యం
    హోల్డర్‌- షెఫర్డ్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. వీరిద్దరు విజృంభించడంతో 83/7గా ఉన్న విండీస్‌ స్కోరు.. 176/8కు చేరుకుంది.

    టీమిండియా భవిష్యత్‌ సౌతాఫ్రికా చేతిలో
    గ్రూప్‌-1 టాపర్‌ విండీస్‌ను సౌతాఫ్రికా చిత్తుగా ఓడిస్తేనే టీమిండియా సెమీస్‌ అవకాశాలు మెరుగుపడతాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక విండీస్‌ గెలిస్తే అనధికారికంగా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకునే వీలుంటుంది. అదే సమయంలో.. టీమిండియా సెమీ ఫైనల్‌ ఆశలు దాదాపు గల్లంతు అవుతాయి.

    చదవండి: IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!

     

  • భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్‌- అంజలిల కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ సానియా చందోక్‌తో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. మార్చి తొలివారంలో ఈ పెళ్లి వేడుక జరుగనుంది.

    ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం అర్జున్‌- సానియాల ప్రీవెడ్డింగ్‌ వేడుకలను జామ్‌నగర్‌లో నిర్వహించింది. భారతీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ.. కుమారులు, కోడళ్లు ఆకాశ్‌, అనంత్‌.. శ్లోకా, రాధికా హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్‌- అంజలి తమ కుటుంబంలోని వ్యక్తులు అంటూ నీతా అంబానీ సచిన్‌ ఫ్యామిలీతో తమకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు.

    ముకేశ్‌ భాయ్‌, నీతా వదినమ్మ.. థాంక్యూ
    ఇందుకు బదులిస్తూ సచిన్‌ టెండుల్కర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వధూవరులకు ఆశీర్వాదాలు ఇచ్చేందుకు ఇంతకంటే గొప్ప వేదికను మేము ఎంపిక చేసే వాళ్లము కాదు. పిల్లల కోసం ఇంతగా ఆలోచించినందుకు మీకు ధన్యవాదాలు. ముకేశ్‌ భాయ్‌, నీతా వదినమ్మ.. అనంత్‌, ఆకాశ్‌లు మా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు ధన్యులం’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు.

    అర్జున్‌- సానియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు
    ఇక కాబోయే దంపతులు అర్జున్‌- సానియా గురించి మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయిని కొడుకు ఇంటికి తీసుకువచ్చి మనకు ప్రత్యేకంగా పరిచయం చేశాడంటే... అప్పుడు మన కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడని అర్థం. అర్జున్‌- సానియా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

    ప్రత్యేకమైన వ్యక్తి
    అర్జున్‌.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ప్రత్యేకమైన వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నావు. నువ్వెంతగా ఆమెను ప్రేమిస్తావో.. ఆమె కూడా నిన్ను అంతగా ప్రేమిస్తోంది’’ అంటూ కాబోయే కోడలిపై ఆప్యాయత, అనురాగాలు కురిపించాడు సచిన్‌. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది.

    అంబానీలతో అనుబంధం
    కాగా ఐపీఎల్‌లో అంబానీల యాజమాన్యంలోని ముంబై జట్టుకు సచిన్‌ టెండుల్కర్‌ ప్రాతినిథ్యం వహించాడు. అదే జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు. ఇక అర్జున్‌ సైతం చిన్ననాటి నుంచే అంబానీల స్కూల్‌లో విద్యార్థి. ముంబై ఇండియన్స్‌ జట్టులోనూ కొన్నాళ్లు ఉన్నాడు. అయితే, ఐపీఎల్‌-2026 వేలానికి ముందు ముంబై అర్జున్‌ను ట్రేడ్‌ చేసింది.

    ఇదిలా ఉంటే.. అర్జున్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సానియా.. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు. ఆమె కూడా వ్యాపారరంగంలో ఉన్నారు. అన్నట్లు సానియా చందోక్‌.. అర్జున్‌ అక్క సారా టెండుల్కర్‌కు ప్రాణ స్నేహితురాలు. అర్జున్‌- సానియా వయసులో ఏడాది వ్యత్యాసం ఉంది. అర్జున్‌ కంటే సానియా సంవత్సరం పెద్దదని సమాచారం.

    చదవండి: సోఫీ షైన్‌తో పెళ్లి.. శిఖర్‌ ధావన్‌కు శుభవార్త!.. మాజీ భార్యకు దిమ్మతిరిగే షాక్‌!

  • జింబాబ్వేతో కీలక సూపర్‌-8 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించాలి.

    లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌
    ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్‌లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్‌ అవుతున్నారు. 

    ఈ నేపథ్యంలో లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం సంజూ శాంసన్‌ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.

    ఆ ముగ్గురిపై వేటు!
    అయితే, ఓపెనింగ్‌ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్‌ కిషన్‌- అభిషేక్‌ శర్మను కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్‌ తిలక్‌ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్‌డౌన్‌లో కుడిచేతి వాటం బ్యాటర్‌ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్‌కు అనుకూలమైన చెపాక్‌ పిచ్‌పై చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను కూడా ఆడించాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో స్థానిక ఆల్‌రౌండర్‌, చెన్నై చిన్నోడు వాషింగ్టన్‌ సుందర్‌పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్‌.. రింకూ స్థానంలో అక్షర్‌ పటేల్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

    సఫారీల చేతిలో భారీ ఓటమితో
    కాగా గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్‌ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్‌- సౌతాఫ్రికా మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.

    జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)
    ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి. 

    చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్‌

  • రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ జట్టు అదరగొట్టింది. కర్ణాటక బౌలింగ్‌ను చితక్కొడుతూ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. హుబ్లీ వేదికగా గురువారం నాటి మూడో రోజు ఆటను ఓవర్‌నైట్‌ స్కోరు 527/6తో మొదలు పెట్టిన కశ్మీర్‌.. మరో 57 పరుగులు జతచేసి ఆలౌట్‌ అయింది.

    కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌!
    ఓపెనర్‌ యావర్‌ హసన్‌ (88), కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కన్హయ్య వాధవాన్‌ (70), సాహిల్‌ లోత్రా (72) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుభం పండిర్‌ (121) శతకంతో దుమ్ములేపాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

    ఇదిలా ఉంటే.. ఆట పరంగా అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా మంచి ప్రదర్శన కనబరిచిర పారస్‌ డోగ్రా.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బుధవారం కర్ణాటక ఫీల్డర్‌ను హెల్మెట్‌తో ఢీకొట్టాడు. రంజీ ట్రోఫీలో సీనియర్‌ ఆటగాడిగా అపార అనుభవం ఉన్న పారస్‌ డోగ్రా... కర్ణాటక ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.

    పదే పదే కామెంట్‌
    దేశవాళీల్లో 21వ సీజన్‌ ఆడుతున్న జమ్ముకశ్మీర్‌ సారథి... బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ అనీశ్‌తో గొడవకు దిగాడు. పారస్‌ సంయమనంతో షాట్‌లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ చేస్తున్న అనీశ్‌... పారస్‌ను పదే పదే కామెంట్‌ చేశాడు. దీంతో ప్రసిధ్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్‌... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.

    హెల్మెట్‌తో ఢీకొట్టి
    ఈ క్రమంలో అనీశ్‌ను పారస్‌ హెల్మెట్‌తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్‌ కూడా హెల్మెట్‌ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన కర్ణాటక సీనియర్‌ ప్లేయర్‌ మయాంక్‌ అగర్వాల్‌ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్‌ అంపైర్లు రోహాన్‌ పండిట్, ఉల్హాస్‌ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. 

    భారీ షాకిచ్చిన బీసీసీఐ!
    అయితే, ఈ వివాదం కారణంగా పారస్‌ డోగ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతక్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడికి భారీ జరిమానా విధించింది. ఈ విషయం గురించి.. మ్యాచ్‌ రిఫరీ నారాయణ్‌ కుట్టీ మ్యాచ్‌ అనంతరం వెల్లడించాడు. జమ్మూకశ్మీర్‌ సారథి పారస్‌ డోగ్రా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా రంజీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్‌ను ఫైనల్‌ చేర్చిన కెప్టెన్‌గా పారస్‌ డోగ్రా చరిత్రకెక్కాడు.

    చదవండి: T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు

Movies

  • ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన డైరెక్టర్‌ అనిల్ రావిపూడి. ఏకంగా మెగాస్టార్‌తోనే మ్యాజిక్‌ క్రియేట్ చేశాడు. మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ మల్టీస్టారర్ మూవీ 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

    అయితే ఈ సినిమా హిట్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్‌ సినిమాను కూడా ప్రకటించారు. మరోసారి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టనున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్‌ కొట్టి వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ ట్వీట్ చేశారు. 

    మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. వెంకీమామతో.. "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి..2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం అంటూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబో మల్టీస్టారర్ మూవీ కోసం వెంకీమామ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
     

     

  • టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్‌లో శిరీష్‌- నయనిక గ్రాండ్‌గా బ్యాచిలర్‌ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. 

    తాజాగా అల్లు శిరీష్‌ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్‌లో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి  సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.

    కాగా.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ గతేడాది అక్టోబర్‌ 31న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్‌- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. 
     

     

  • రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే…  నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.

    కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.
     

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం రాగానే కొత్త సినిమాల హడావుడి ఉంటుంది. ఈ ఫిబ్రవరిలో పెద్ద సినిమాలేవీ రిలీజ్‌ కావడం లేదు. ఈ చివరి వారంలో బాక్సాఫీస్‌ సందడి చేసేందుకు విష్ణు విన్యాసం అంటూ వచ్చేస్తున్నాడు శ్రీవిష్ణు.  ఈ మూవీపైనే ఆడియన్స్‌లో కాస్తా బజ్‌ క్రియేట్ అయింది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

    ఇక ఓటీటీల విషయానికొస్తే టాలీవుడ్‌ థ్రిల్లర్‌ మూవీ హనీ భయపెట్టేందుకు వచ్చేస్తోంది. దీంతో పాటు తెలుగు సినిమా డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, అక్యూజ్డ్ అనే డబ్బింగ్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్, హాలీవుడ్‌ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సైతం ఈ ఫ్రైడే ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    •   అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27

    అమెజాన్ ప్రైమ్

    • హనీ(తెలుగు సినిమా)- ఫిబ్రవరి 27

    జియో హాట్‌స్టార్

    •    రోస్లిన్ (తెలుగు వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 27

    •    బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28

    •    బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28

    జీ5

    •  డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27

    •  తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27

    •  క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27

    • అబార్‌ ప్రోలోయ్- సీజన్-2(బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 27

    •  అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28

    ఆహా

    •    సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ షో) - ఫిబ్రవరి 27

    సన్ నెక్స్ట్

    •  హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27

    •  నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27


    ఆపిల్ టీవీ ప్లస్

    •    మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27
       

  • సాధారణంగా రాజకీయ నాయకులు బయట చూడడానికి కాస్త గంభీరంగా ఉంటారు. వారి ప్రసంగాలు, నిర్ణయాలు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి.  నిత్యం జనాల్లో ఉన్నప్పటికీ ‘మనవాడు’ అనే హోదా మాత్రం కొంతమందికే లభిస్తుంది. ఆ కొంతమందిలో తాము కూడా ఉండాలని చాలామంది నేతలు కోరుకుంటారు. అందుకే సామాన్య ప్రజలకు చేరువ కావడానికి 'సినిమా గ్లామర్'ను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకుంటున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ మధ్య జరిగిన తాజా ఇంటర్వ్యూ దీనికి తాజా ఉదాహరణ మాత్రమే. అయితే, ఈ వ్యూహం వెనుక దశాబ్దాల చరిత్ర, అంతర్జాతీయ రాజకీయ తంత్రం దాగి ఉంది.


    ఎన్నికల సమయంలో రాజకీయనాయకులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఓటరుకు దగ్గరవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. రోడ్డు మీద బజ్జీలు వేస్తారు? పిల్లలతో కలిసి ఆటలు ఆడతారు, సెల్ఫీలు, ఇంట్లోకి వెళ్లి భోజనాలు.. ఇలా విచిత్రమైన పనులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే  కానీ, ఓటరుకు మరింత దగ్గరవ్వాలంటే 'తమలోనూ ఒక సామాన్యుడు ఉన్నాడు' అని నిరూపించుకోవాలి. ఇందుకోసం సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారింది.

    పినరయిలోని మరో కోణం
    కేరళ రాజకీయాల్లో పినరయి విజయన్ అంటే అత్యంత కఠినమైన నాయకుడనే పేరుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో పినరయి విజయన్ కు ఉన్న ఆ గంభీరమైన ముద్రను మార్చి, ఆయనలోని నవ్వు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఛానల్ ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. మొదట మమ్ముట్టిని అనుకున్నప్పటికీ, ఇద్దరూ గంభీర స్వభావులే కావడంతో ఆ బాధ్యతను శ్రీనివాసన్ కు అప్పగించారు. శ్రీనివాసన్ అయితేనే పినరయిని నవ్వించగలరని భావించి చేసిన ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయింది. తన చిన్నప్పటి దెయ్యాల భయం గురించి పినరయి సరదాగా చెప్పడం ప్రజల్లో ఆయనపై ఉన్న భయాన్ని పోగొట్టింది.

    నటి నవ్య నాయర్ కూడా గతంలో పినరయి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసింది. అక్కడ ఆమె పినరయిని ‘విజయన్ అంకుల్’ అని పిలిచారు. గంభీరమైన నాయకుడి వెనుక ఉన్న తండ్రిని, భర్తను ప్రజలకు పరిచయం చేయడమే ఆ కార్యక్రమ ఉద్దేశం.

    కలిసొచ్చిన మోదీ ‘మామిడి పండ్ల’ ముచ్చట్లు
    2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. ఇది పూర్తిగా రాజకీయేతర సంభాషణ. మోదీకి మామిడి పండ్లు అంటే ఇష్టమా? ఆయన రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? వంటి వ్యక్తిగత విషయాల గురించి ఇందులో చర్చించారు.మమతా బెనర్జీ తనకు కుర్తాలు పంపిస్తారని చెప్పడం ద్వారా, రాజకీయ వైరం ఉన్నా వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయని సందేశం ఇచ్చారు. ఇది సామాన్య ఓటర్లలో మోదీ పట్ల సానుకూలతను పెంచింది. ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు విమర్శించినా, ఫలితం మాత్రం మోదీకి అనుకూలంగానే వచ్చింది.  

    ఇదే పంథాలో ప్రపంచ నాయకులు
    భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాధినేతలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు బరాక్ ఒబామా ‘బిట్వీన్ టూ ఫెర్న్స్’ వంటి హాస్య ప్రధాన్యత ఉన్న షోలలో పాల్గొన్నారు. తన ‘ఒబామా కేర్’ పథకం గురించి యువతకు చేరవేయడానికి సినీ తారల సహాయం తీసుకున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల సమయంలో డోనాల్డ్‌  ట్రంప్ జో రోగన్ వంటి పాపులర్ పాడ్‌కాస్టర్లతో గంటల తరబడి మాట్లాడారు. తన సోదరుడి మరణం గురించి భావోద్వేగంగా మాట్లాడుతూ ఓటర్లకు చేరువయ్యారు.

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వతహాగా నటుడు కావడంతో, ఆయన తన ప్రతిష్టను పెంచుకోవడంలో సినిమా మాధ్యమాన్ని చక్కగా వాడారు. హాలీవుడ్ నటుడు షాన్ పెన్ ఆయనపై ‘సూపర్ పవర్’ అనే డాక్యుమెంటరీ కూడా తీశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి చూపించుకోవడానికి హాలీవుడ్ దర్శకుడు ఆలివర్ స్టోన్ తో వరుస ఇంటర్వ్యూలు చేయించుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికన్ టాక్ షో హోస్ట్‌లు స్టీఫెన్ కోల్బెర్ట్, కోనన్ ఓబ్రియన్ వంటి వారితో సరదాగా ముచ్చటిస్తూ తన ‘కూల్ ఇమేజ్’ను ప్రదర్శించారు.

    కలిసొస్తున్న ‘గ్లామర్‌’ పాలిటిక్స్
    రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇవి కేవలం ఎన్నికల గిమ్మిక్కులు మాత్రమే కాదు. డిజిటల్ యుగంలో ప్రజలు నాయకుడిలోని 'మానవీయ కోణాన్ని' చూడాలని కోరుకుంటున్నారు.కఠినమైన విధాన నిర్ణయాల కంటే, ఇలాంటి సరదా సంభాషణలే ప్రజల మెదళ్లలో ఎక్కువ కాలం గుర్తిండిపోతాయి.దీంతో పాటు సెలబ్రిటీల ఫాలోయింగ్‌ను వాడుకోవడం ద్వారా యువ ఓటర్లను సులువుగా ఆకర్షించవచ్చు. కేరళలో పినరయి-మోహన్ లాల్ ఇంటర్వ్యూ అయినా, ఢిల్లీలో మోదీ-అక్షయ్ ముచ్చట్లయినా.. అంతిమ లక్ష్యం ఒక్కటే: "నేను మీలో ఒకడిని" అని చాటిచెప్పడం. గ్లామర్,పొలిటికల్‌ పవర్‌ కలిసినప్పుడు పుట్టే ఈ 'కొత్త రాజకీయం' భవిష్యత్తులో మరిన్ని వింత పోకడలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.


     

  • టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.

    వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్‌ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

    'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

    👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్‌ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్‌ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ  భర్త విజయ్‌ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. 

    రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా.  మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి.  ప్రతిరోజు  పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు.  విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.

    అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ'  అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.'

    ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..

    టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

    👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


     

     

  • హీరోయిన్స్‌ దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదం సృష్టించాయి. ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ సంఘటన తర్వాత ఓ మూవీ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడారు. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో రెండు పదాలు వాడారు. అప్పట్లో ఈ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

    తాజాగా శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ నటి అదితి మైకల్ స్పందించింది. శివాజీ సినిమాలు చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని అని తెలిపింది. ఒక అమ్మాయి డ్రెస్‌ గురించి మీరు మాట్లాడుతుంటే భయమేస్తోందని వెల్లడించింది. అప్పుడు మీ సినిమాల్లో హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు.. అప్పుడు మీరెందుకు చెప్పలేదని శివాజీని ప్రశ్నించింది. అప్పుడు మనకెందుకని.. మీరు మీ పని చేసుకుని వెళ్లిపోయారు కదా.. అప్పుడు వాళ్లను ఎందుకు ఆపలేదని నిలదీసింది.

    ఇలాంటి దుస్తులు వేసుకోవడం నాకిష్టమని.. ఇదే నాకు ఫుడ్ పెడుతోందని అదితి తెలిపింది. అలాగని నేను బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లట్లేదు కదా అని పేర్కొంది. ఒకసారి నేను అమీ తుమీ ప్రమోషన్స్‌కు బస్సులో వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి ఏకంగా నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడని వెల్లడించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ అమ్మాయిల రుద్దడం ఆపేయండని శివాజీకి అదితి కౌంటరిచ్చింది. మేము ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. కొందరైతే మీ లో దుస్తులు బయటికి కనిపిస్తున్నాయని సరిగా వేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి మ్యాకల్ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీశాయి. 

    కాగా.. అదితి.. టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అమీ తుమీ, ఏకం, 24 కిస్సెస్, రాధ, షాదీ ముబారక్ లాంటి చిత్రాల్లో నటించింది. మొదట వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన అదితి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 
     

     

  • టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?

    విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో  వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.

    ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో  మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.

    కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం,  ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.

    ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం  రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి.  అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ  డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు.

  • స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

    అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.

    తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్‌మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్‌మెన్‌ థియేటర్‌లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్‌ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

     

     

  • ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్‌ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
     

     

  • ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ దాదాపు రూ. 400  కోట్ల వరకు వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణను (రివ్యూ) పంచుకున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

    రాజేంద్ర ప్రసాద్, నరేశ్‌ వంటి వారితో కేవలం కామెడీ సినిమాలు తీయడం వేరు, కానీ చిరంజీవి వంటి మాస్ హీరోతో పూర్తిస్థాయి యాక్షన్ కామెడీ చేయడం ఒక సాహసమని, దాన్ని అనిల్ రావిపూడి విజయవంతంగా పూర్తి చేశారని పరుచూరి కొనియాడారు. నిర్మాతగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మొదటి ప్రయత్నంలోనే తండ్రిని మళ్లీ ‘ఇంద్రసేనుడిలా’ సింహాసనంపై కూర్చోబెట్టారని ప్రశంసించారు.కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందని, అందుకే రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరిందని ఆయన పేర్కొన్నారు.

    ‘మొదటి సన్నివేశంలో హీరో పాత్రకు పెళ్లి అయిందని భార్యకు దూరంగా ఉంటాడని చూపించారు. రెండో సన్నివేశంలోనే హీరో పాత్ర తీరు చెప్పారు. టీవీ సీరియల్‌తో తన కథను ముడిపెడుతూ చూపించారు. హీరోకు చిన్న కామెడీ టీమ్‌ని పెట్టి ఆ టీమ్‌లో ఒక హీరోయిన్‌ ఉండేలా చూశారు. ఆమెను కామెడీ టీమ్‌లో ఎందుకు పెట్టారు అని అందరికీ అనుమానం కలిగింది. అలా ఎందుకు పెట్టారో చివర్లో చూపించారు. హీరో, హీరోయిన్‌ ఎప్పుడు కలుస్తారు? ఎలా కలుస్తారు.. ఇలా ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం కానీ మనకంటే ముందు రచయిత, దర్శకులు వేసుకొని వాటిని పద్ధతి ప్రకారం స్క్రీన్‌ప్లే చేశారు. మధ్యమధ్యలో ఎమోషనల్‌ డైలాగులతో కూడా ఆకట్టుకున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని చూడాలని అనిపించి మా ఇంటికి వస్తే గేటు దగ్గర నిలబడి రిక్వెస్ట్ చేయి. పైనుంచి చూపిస్తా. పిల్లల్ని చూసి వెళ్లిపో’ అన్న మనిషి ప్రమాదంలో పడితే.. అతడిని హీరో ఎలా కాపాడాడు అనేది గొప్పగా చూపించారు. 

    కామెడీ టీమ్‌లో ఉన్న హీరోయిన్‌.. చివరకు వెంకటేశ్‌ను పెళ్లి చేసుకోవడం ట్విస్ట్‌. ఇందులో మధ్యమధ్యలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. దీన్ని యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌ అని కూడా అనొచ్చు. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు అనిల్‌ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించడానికి, చిరంజీవికి చిన్న సెల్యూట్‌ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్‌లు, అవే మూమెంట్లు అస్సలు ఏమాత్రం తేడా లేదు. మా చిరంజీవి.. ఎప్పటికీ మా చిరంజీవే అనిపించుకున్నారు’అంటూ తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. 

  • టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

    అయితే ఇంతలా గ్రాండ్‌ వెడ్డింగ్‌ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.

    ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. 

    ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్‌ వెడ్డింగ్‌లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్‌గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్‌ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్‌, మైసూర్‌ పాక్‌ అతిథులకు రుచి చూపించారు. 

  • సంచలనం సృష్టించిన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (ఫిబ్రవరి 26) విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.

    అసలేం జరిగింది?
    2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది.  ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్‌ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.  ఈ రోజు సినిమాను వీక్షించిన హైకోర్టు.. సినిమాలో  వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. 

Telangana

  • హైదరాబాద్‌:  తెలంగాణ విద్యా కమిషన్‌ కీలక సిఫారుసులు చేసింది.  సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా విద్యా కమిషన్‌ పలు సిఫారుసులు చేసింది.

    తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు:
    1. ఉపాధ్యాయుల పదోన్నతులు: ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు, పని తీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి.
    2. బోధనా మాధ్యమం: ఇంగ్లీష్ ఉండాలి, నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు.
    3. త్రిభాషా విధానం: ఒకటో తరగతి నుంచే తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.
    4. విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం: విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలి.
    5. EAPCET రద్దు: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి.
    6. D.EI.ED రద్దు: బీఎడ్‌ను పునర్వ్యవస్థీకరించాలి.
    7. పాఠశాలల్లో వంట వండే మహిళలకు చెల్లింపులు: వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.
    8. IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు: నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.
    9. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్: వేరు చేయాలి.
    10. విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణం: వైస్ ఛాన్సలర్ ఛైర్మన్‌గా ఉండాలి

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కనెక్షన్లతో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డు, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరా కొత్త డిస్కమ్‌కు బదిలీ చేసింది. 2,000 మంది ఇంజినీర్లు, సిబ్బంది బదిలీకి ప్రణాళిక సిద్ధం చేసింది.

    మూడో డిస్కమ్ సీఎండీగా ముషర్రఫ్ ఫారుఖీని నియమించింది. పవర్ అంబులెన్స్‌లతో వేగవంతమైన అవుటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటు చేశారు.

     

  • హైదరాబాద్:  గ్రూప్ 1,గ్రూప్ 2 నూతన ఆఫీసర్ల శిక్షణకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్‌రెడ్డి తిలకించారు. ఎంసీహెచ్​ఆర్​డీలో గ్రూప్​-1, గ్రూప్- 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన సీఎం రేవంత్‌ ప్రసంగించారు. ‘మీరు మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు,ఈ రోజు అధికారులు. ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు.  రాంజీ గోండు,కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపైన తిరుగుబాటు చేశారు. 

    కాకతీయ సామ్రాజ్యం పైన సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌర్వించబడుతున్నారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు,అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలి. మొదటి ఎన్నికల్లో దేశంలోనే అత్యదిక మెజార్టీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి తెలంగాణ బిడ్డ. 6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది.  

    టీజీపీఎస్‌ని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షల పైన అవగాహన ఉన్న వాళ్ళని చైర్మన్ గా,సభ్యులుగా నియమించాం. ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్‌లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడింది.  అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదే..ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు. నేను మెకానికల్‌గా మిమ్మల్ని కలవలేదు. ఎమోషనల్,అటాచ్‌మెంట్‌తో కలిసి పని చేశాను. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లి తండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం’ అని స్సష్టం చేశారు.

  • ఖమ్మం:  ఖమ్మం శివారు వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్‌ భూముల్లో మంత్రుల కన్నుపడిన కారణంగానే కూల్చివేతలు చేపట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 26వ తేదీ) బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన కేటీఆర్‌.. ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.  ‘ఇళ్ల కూల్చివేతలపాపం ఆ  ముగ్గురు మంత్రులదే. భూదాన్‌ భూములపై ముగ్గురు మంత్రుల కన్నుపడింది. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం. కేసీఆర్‌ ఆదేశాలతోనే నేను ఇక్కడికి వచ్చాను. అసెంబ్లీలో భూదాన్‌ అంశాన్ని లేవనెత్తుతాం. కూలగొట్టిన చోటే గృహప్రవేశాలు చేయిస్తా’ అని కేటీఆర్‌ వారికి హామీ ఇచ్చారు. 

    ‘2014 ఏప్రిల్‌లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి అంటే దాదాపు 1900 మందికి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు.రెండూన్నర ఏళ్ల కిందట ఏ మాటలైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు. ​ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?, పేదవాడి హక్కులు ఉన్న పేదవాడికి వాడి దగ్గర మరి పట్టాలు ఉన్నా...నోటికాడి ముద్ద లాక్కొని వాళ్లను మెడలు పట్టి గెంటేస్తున్నారు’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

    కాగా, మంగళవారం ఉద్రిక్తత నడుమ వందల సంఖ్యలో ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజాము నుండే అధికారులు భారీ పోలీసు బందోబస్త్‌ నడుమ జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకుని సుమారు 400 ఇళ్లను కూల్చివేశారు. కలెక్టరేట్‌ సమీపాన పదేళ్లుగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే దీనిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎప్పట్నుంచో ఉండే ఇళ్లను కూల్చివేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

    భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్
  • జనగామ:  జిల్లాలోని చిల్పూరు మండలం దేశాయి తండా సమీఫంలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌లోకి ఓ షిప్ట్‌కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ధారావత్‌ చరణ్‌(18) అనే యువకుడు తీవ్ర గాయాలతో బయటపడగా, డ్రైవింగ్‌ చేస్తున్న భూక్య పవన్‌ అనే వ్యక్తి ఆచూకీ లభించలేదు.   అయితే గాలింపు చర్యల్లో అతని  మృతదేహం లభించింది.

    స్టేషన్‌ఘన్‌పూర్‌ నుండి దేశాయి తండా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదవశాత్తూ పల్టీలు కొట్టి రిజర్వాయర్‌లో పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ధారవత్‌ చరణ్‌ అనే యువకుడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    Hyd: రిజర్వాయర్ లో కారు బోల్తా.. డ్రైవర్ గల్లంతు

Business

  • ఒక కారులో సేఫ్టీ అంటే.. అందులోనే సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాదు. బ్రేకింగ్ సిస్టం చాలా అవసరం. ఎయిర్ కండిషనింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు & పవర్ విండోస్ వంటి వాటిలో సమస్య తలెత్తితే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ బ్రేకింగ్ సిస్టం దెబ్బతింటే మాత్రం అది వాహనంలోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తలపెడుతుంది.

    బ్రేక్స్ అనేవి వాహనాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా.. దానిని కంట్రోల్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి వేడి, ఒత్తిడి మధ్య పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే సరైన డ్రైవింగ్ & నిర్వహణ, బ్రేకింగ్ సిస్టమ్ పనితీరును మెరుగుపరచవచ్చు. బ్రేకింగ్ సిస్టం తొందరగా డ్యామేజ్ కావడానికి కారణాలు ఏమిటనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

    హార్డ్ బ్రేకింగ్: అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ప్యాడ్లు, డిస్కులు తొందరగా నశిస్తాయి.
    ఓవర్ స్పీడ్ డ్రైవింగ్: ఎక్కువ స్పీడ్‌లో కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.
    ఓవర్‌లోడింగ్: వాహనంపై అధిక బరువు వేయడం బ్రేక్ భాగాలపై అదనపు ఒత్తిడి పెడుతుంది.
    క్వాలిటీ లేని బ్రేక్ ప్యాడ్లు: నాసిరకం లేదా డుప్లికేట్ భాగాలు త్వరగా దెబ్బతింటాయి.
    బ్రేక్ ఫ్లూయిడ్ సమస్యలు: ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, లీక్ అవడం వల్ల కూడా బ్రేకింగ్ పనితీరు తగ్గుతుంది.
    కాలిపర్ స్టికింగ్: బ్రేక్ కాలిపర్ సరిగా రిలీజ్ కాకపోతే ప్యాడ్లు ఎప్పుడూ డిస్క్‌ను తాకుతూ ఉంటాయి, దీంతో వేగంగా వేర్ అవుతుంది.
    డిస్క్/డ్రమ్ వంకర పడటం: అధిక వేడి లేదా నీటిలో నడపడం వల్ల డిస్కులు వంకరపడే అవకాశం ఉంది.
    మలినాలు చేరడం: బ్రేక్ భాగాల మధ్య మలినాలు చేరితే ఘర్షణ పెరిగి తొందరగా పాడవుతాయి.
    సర్వీసింగ్: సమయానికి చెక్ చేసి సర్వీస్ చేయకపోవడం, ప్యాడ్లు మార్చకపోవడం వల్ల ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి.
    డ్రైవింగ్ అలవాట్లు: గేర్ తగ్గించకుండా బ్రేక్‌లపై మాత్రమే ఆధారపడటం, హాఫ్-క్లచ్ డ్రైవింగ్ వంటి అలవాట్లు బ్రేక్‌ల జీవితం తగ్గిస్తాయి.

  • హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ హైదరాబాద్‌లో దాదాపు రూ. 350 కోట్లతో లగ్జరీ హోటల్‌ని అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. దీన్ని చాలెట్‌ హోటల్స్‌కి ప్రీ–లీజుకి ఇచ్చినట్లు తెలిపింది. 5.3 లక్షల చ.అ. విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాజెక్టులో 330 గదులు ఉంటాయి. 2027–28 నాలుగో త్రైమాసికంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ తెలిపింది.

    ఇరు సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం మైండ్‌స్పేస్‌ రీట్‌కి చెందిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థ సదరు ప్రాపరీ్టని స్థూలంగా నిర్మించి ఇస్తుంది. ఇంటీరియర్స్, హోటల్‌ నిర్వహణ మొదలైన పనులను చాలెట్‌ చేపడుతుంది. ప్రస్తుతం చాలెట్‌కి మొత్తం మీద 3,300 గదుల పోర్ట్‌ఫోలియో ఉంది. మైండ్‌స్పేస్‌ రీట్‌కి హైదరాబాద్‌తో పాటు ముంబై, పుణె చెన్నైలలో ఆఫీస్‌ అసెట్స్, బిజినెస్‌ పార్క్‌లు ఉన్నాయి.

  • హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా కంపెనీకి చెందిన యాక్టివాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి అమ్మకాలు పొందిన ఈ టూవీలర్.. ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 50 లక్షల సేల్స్ సాధించింది.

    హోండా యాక్టివా స్కూటర్ 25 సంవత్సరాల్లో 50 లక్షల (ఒక్క మహారాష్ట్రలో మాత్రమే) అమ్మకాలను సాధించింది. కంపెనీ ప్రకారం.. పూణే, ముంబై, థానే, నాగ్‌పూర్ & నవీ ముంబై వంటి ప్రధాన నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

    హోండా యాక్టివా
    మార్కెట్లో హోండా యాక్టివా రెండు మోడల్స్‌లో లభిస్తోంది. ఒకటి యాక్టివా 6జీ (110సీసీ), యాక్టివా 125 (125సీసీ). యాక్టివా 6జీ ధర సుమారు రూ.81,000 నుంచి రూ. 95,500 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. యాక్టివా 125 ధరలు రూ.91000 నుంచి రూ.96000 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.

    యాక్టివా 6జీ స్కూటర్ 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.8 పీఎస్ పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. యాక్టివా 125 మోడల్ 123.92 సీసీ ఇంజిన్ ద్వారా 9.5 పీఎస్ పవర్, 11.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

  • యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

    “ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”
    జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్‌గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.
    “జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

    యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.

    ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చ
    ఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్‌ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్‌ (Claude) ప్లాట్‌ఫామ్ ఆఫీస్‌ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.

    లీగల్‌ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్‌ఫ్లో మేనేజ్‌మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.

    “భయపడకండి… సిద్ధం అవ్వండి”
    ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు.

  • దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి ఇంకాస్త దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.

    హైదరాబాద్‌, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.200 తగ్గి రూ.1,48,200 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.800 క్షీణించి రూ.1,47,600 లకు దిగివచ్చింది.

    అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.210 తగ్గి రూ.1,61,680 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.870 కరిగి రూ. 1,61,020 లకు క్షీణించింది.

    ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,95,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొబైల్ యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్మూలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటనలు జారీ చేసింది.

    సాధారణంగా కొన్నిసార్లు బ్యాంక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్లు ఉపయోగిస్తున్నప్పుడు.. చివరి దశలో కొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. అవసరం లేని సేవలను కొనుగోలు చేయమని పదేపదే వచ్చే కొన్ని సూచనలు కూడా కనిపిస్తుంటాయి. స్పష్టంగా అర్థం కాని కొన్ని విషయాలు వినియోగదారులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి మోసపూరిత రూపకల్పనలను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. వీటిని నిర్మూలించడానికి ఆర్‌బీఐ కీలక చర్యలు చేపట్టింది.

    2026 సంవత్సరానికి సంబంధించిన 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026' అనే ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, బ్యాంకులు తమ వెబ్‌సైట్లు & మొబైల్ యాప్‌లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్‌ను 2026 జూలై నాటికి తొలగించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

    ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే.. కస్టమర్‌లకు పూర్తి సమాచారం ఇచ్చి, వారి అంగీకారం పొందిన తరువాత మాత్రమే అలాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.

    రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వల్ల.. వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. ముందుగా వారు చెల్లించాల్సిన ఛార్జీలు, తీసుకునే సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. పారదర్శకత & బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరుస్తాయి.

    ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

  • ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) భయాలతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడమనేది ఇన్వెస్టర్ల ’ఓవర్‌రియాక్షన్‌’ అని డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ సీఎండీ సంజీవ్‌ పురి వ్యాఖ్యానించారు. తమ సంస్థ విషయానికొస్తే ఉత్పాదకత, సామర్థ్యాలను పెంచుకునేందుకు ఏఐని వినియోగించుకుంటున్నట్లు చెప్పారు.

    గతంలో ఉన్న సాధనాలతో తయారీ, సరఫరా వ్యవస్థ మొదలైన విభాగాల్లో పరిష్కరించలేకపోయిన సమస్యలను కూడా ప్రస్తుత సాంకేతికతతో పరిష్కరించగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తుల విభాగానికి సంబంధించి పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలను మదింపు చేసేందుకు గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులను టెక్నాలజీతో అధ్యయనం చేస్తున్నట్లు పురి చెప్పారు.

    వ్యాపార ప్రణాళికల విషయానికొస్తే మధ్యకాలికంగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు. గతంలోలాగానే ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని వివరించారు.

  • ఆయుర్వేద వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య మేళా 2026ను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అధికారికంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షెగావ్‌ పట్టణం విశావా గ్రౌండ్, భక్తినివాస్‌ కాంప్లెక్స్‌లో ఈ మేళా ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు కొనసాగనుంది.

    కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, అఖిల్‌ భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థలు బైద్యనాథ్, సిద్ధాయి ప్రధాన ప్రాయోజకులు (స్పాన్సర్షిప్‌)గా వ్యవహరించాయి. తమ స్టాళ్లలో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, ఆయుర్వేదంపై అవగాహన కల్పించే పుస్తకాలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాయి.

    ఈ మేళా ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

  • అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్‌కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్‌రప్టెడ్‌’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్‌ను జోడిస్తూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో కియోసాకి పోస్ట్‌ చేశారు.

    చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్‌ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయి​ందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది.  

    ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్‌కాయిన్ వరకూ...
    డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.

    నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్‌చెయిన్ సాంకేతికత, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.

    ప్రముఖుల అభిప్రాయాలు
    ఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్‌ పాల్‌, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్‌మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఇజ్రాయెల్‌లో అత్యాధునిక ఆవిష్కరణలను హైలైట్ చేసే ఒక టెక్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ముఖ్యమైన భాగం మాత్రమే కాదు, భారత్–ఇజ్రాయెల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కూడా నిదర్శనం.

    ఈ టెక్ ప్రదర్శనలో.. వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల పరిష్కారాలు, బయోటెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, శక్తి వనరులు & అంతరిక్ష వ్యవస్థలు వంటి అనేక కీలక రంగాల్లో ముందంజలో ఉన్న కంపెనీలు, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచ సమస్యలకు సుస్థిర పరిష్కారాలను కనుగొనే దిశగా ఇరు దేశాలు చేస్తున్న సంయుక్త కృషిని ఈ ప్రదర్శన ప్రతిబింబించింది.

    ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జి ప్రయత్నాలకు టెక్ ఎగ్జిబిషన్‌ ఒక నిదర్శనం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం & ఇజ్రాయెల్‌కు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల నాయకులు కలిసి పని చేయడానికి మార్గదర్శం అవుతుంది.వేదిక కల్పించబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం.

    ఈ ప్రదర్శన సందర్భంలో..  మోదీ చాలామంది పరిశోధకులు, కంపెనీల సీఈఓలు & స్టార్టప్ వ్యవస్థాపకులతో నేరుగా మాట్లాడి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగాల గురించి చర్చించారు. ఇజ్రాయెల్ ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం మరోసారి స్పష్టమైంది

    రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350
    ఈ కార్యక్రమంలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350' మోటార్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ బైక్‌ను మోదీ & నెతన్యాహు కలిసి పరిశీలించడం ఒక ముఖ్యమైన సందర్భంగా మారింది. ఇది భారత తయారీ శక్తిని & అంతర్జాతీయ మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ప్రాధాన్యతను సూచించింది. ఇజ్రాయెల్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మంచి ఆదరణ ఉంది.

    రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350లో 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 20.2 బిహెచ్‌పీ పవర్ 27 న్యూటన్ మీటర్ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5గేర్‌ల గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2026 మోడల్‌లో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటి సరికొత్త సౌకర్యాలు చేర్చబడ్డాయి. అదనంగా, యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

    ఇదీ చదవండి: తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

    డిజైన్ పరంగా ఈ బైక్ చాలా ప్రత్యేకంగా ఉంది. బాబర్ శైలి ఆకృతి, ఫ్లోటింగ్ సీటు, ఎత్తైన హ్యాండిల్‌బార్, తెల్లటి సైడ్‌వాల్ టైర్లు వంటివి కలిగి ఉండటం వల్ల గోవన్ క్లాసిక్ 350 చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా రైడర్ల మనసును గెలుచుకుంటోంది.

  • గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి మిశ్రమ ఫలితాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 45.52 పాయింట్ల నష్టంతో 82,230.55 వద్ద, నిఫ్టీ 14.05 పాయింట్ల లాభంతో 25,496.55 వద్ద నిలిచాయి.

    ఎక్స్‌టిగ్లోబల్ ఇన్ఫోటెక్ లిమిటెడ్, రుద్ర గ్లోబల్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ లిమిటెడ్, తేజస్ నెట్‌వర్క్స్ లిమిటెడ్, సనోఫీ కన్స్యూమర్ హెల్త్‌కేర్ ఇండియా లిమిటెడ్, రినైసాన్స్ గ్లోబల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ & సొల్యూషన్స్ లిమిటెడ్, జిందాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్, ట్రాన్స్‌వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, వీఎల్ ఈ గవర్నెన్స్ & ఐటీ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ఆదాయపన్ను ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానుండడం గమనార్హం. దీంతో ముసాయిదా పత్రాలు, నిబంధనలపై భాగస్వాములకు ఆదాయపన్ను శాఖ పంపిణీ చేసింది.  వేతన జీవులు హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.

    ఇకపై ఫారమ్‌ 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని (అసెసీ/పన్ను చెల్లింపుదారు/దాఖలుదారు) వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత, పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్‌ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమ క్లెయిమ్‌లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్‌కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారీన్‌ ట్యాక్స్‌ విత్‌హోల్డింగ్‌ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

  • ఏఐ వినియోగించడం ద్వారా అనూహ్య లాభాలు పేరిట తెరతీసే మార్కెటింగ్‌ గిమ్మిక్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అమర్‌జీత్‌ సింగ్‌ తాజాగా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు స్టాక్‌ మార్కెట్లపట్ల ప్రజలలో విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. ఏఐ వినియోగం ద్వారా అత్యుత్తమ రిటర్నులు ఆర్జించవచ్చంటూ మార్కెట్‌ పార్టిసిపెంట్లు కొంతమంది అతిచేయడాన్ని ఈ సందర్భంగా సింగ్‌ ప్రస్తావించారు. స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, ఐఐఎంకే సంయుక్తంగా నిర్వహించిన ఈవెంట్‌లో సింగ్‌ పలు  విషయాలను పేర్కొన్నారు.

    ఏఐ వినియోగించడం ద్వారా సాధించిన అంశాలను కంపెనీలు అర్ధవంత విధానంలో తెలియజేయవలసి ఉంటుందని సూచించారు. అతిగా ఆర్జించినట్లు లేదా కొన్ని రకాల క్లెయిముల ప్రకటనలు ఇన్వెస్టర్లను మార్కెట్లపట్ల తప్పుదోవపట్టించడంతోపాటు.. విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశమున్నట్లు హెచ్చరించారు. నిజానికి విద్య, పరిశోధన, సమాచారం తదితరాలకు ఏఐ శక్తివంతమైన టూల్‌ అని పేర్కొన్నారు. అయితే ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తికీ వీలున్నదని, వీటిపట్ల అప్రమత్తత అవసరమని తెలియజేశారు.
     

Politics

  • సాక్షి, అమరావతి: తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను పెంచింది వైఎస్సార్‌, వైఎస్‌ జ‌గ‌న్‌లేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి అన్నారు. ఆమె ఇవాళ(గురువారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఇంటి దైవం అంటూనే చంద్ర‌బాబు శ్రీవారి ప్ర‌సాదంపై నింద మోపాడంటూ.. ఆధారాల‌తో కూట‌మికి వ‌రుదు క‌ళ్యాణి కౌంట‌ర్‌ ఇచ్చారు.

    టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిష‌న్ పార్టీ 
    హిందూ మ‌తాన్ని ప‌రిర‌క్షిస్తామంటూనే త‌మ చ‌ర్య‌ల‌తో కూట‌మి నాయ‌కులు అడుగడుగునా హిందూ సాంప్ర‌దాయాల‌ను కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్‌ క‌డ‌ప‌లోని వేంప‌ల్లెలో నందీశ్వ‌ర ఆల‌యాన్ని ప్రారంభిస్తే దానిపైనే ఫేక్ వీడియాలతో తెలుగుదేశం సోష‌ల్ మీడియా విషం క‌క్కింది. టీడీపీ అంటేనే టెంపుల్ డిమాలిష‌న్ పార్టీ అని అర్థం. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉండ‌గా విజ‌య‌వాడ‌లో పుష్క‌రాల పేరుతో 40కి పైగా ఆల‌యాల‌ను కూల్చేస్తే, వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక వాటిని నిర్మించారు.

    చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడే తిరుమ‌లో వెయ్యి కాళ్ల మండ‌పాన్ని కూల్చివేశారు. ముఖ్య‌మంత్రులుగా ఉండి తిరుమ‌ల ప్ర‌తిష్ట‌ను, స్వామి వారి వైభ‌వాన్ని పెంచిన ఘ‌న‌త తండ్రీకొడుకులు వైఎస్సార్‌, వైఎస్‌ జ‌గ‌న్‌ల‌కే ద‌క్కుతుంది. వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక శ్రీవాణి ట్ర‌స్టు ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాల‌నీల్లో 4,111 కొత్త ఆల‌యాల నిర్మాణాలు మొద‌లు పెట్టి ఒక్క‌దానికి రూ.10 ల‌క్ష‌లు కేటాయించ‌డం జరిగింది.

    అందులో 80 శాతం ప‌నులు రామాల‌యాలే. రూ. 411 కోట్ల‌తో 801 పురాత‌న ఆల‌యాల ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేయ‌డం జ‌రిగింది. దుర్గ గుడి అభివృద్ధి కోసం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా ప్ర‌భుత్వ నిధులు రూ.70 కేటాయించిన ఘ‌న‌త వైఎస్‌ జ‌గన్‌కే ద‌క్కుతుంది. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం వైఎస్‌ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా దుర్గమ్మ ఆల‌యంలో రాజ‌శ్యామ‌ల యాగాన్ని నిర్వ‌హించారు.

    వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లో శ్రీవారి వైభ‌వం
    తూర్పు గోదావ‌రి జిల్లా అంత‌ర్వేదిలో ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి ర‌థానికి దుండగులు నిప్పంటిస్తే క‌ళ్యాణోత్స‌వం స‌మ‌యానికి కొత్త ర‌థం త‌యారు చేయించి ఇస్తాన‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ అత్యాధునిక టెక్నాల‌జీతో కూడిన ర‌థాన్ని అంద‌జేశారు. తిరుమ‌ల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన న‌వ‌నీత సేవ కోసం స్వ‌చ్ఛ‌మైన వెన్న‌ను స‌మ‌కూర్చ‌డం కోసం తిరుమ‌లలోని గోశాల‌ను విస్త‌రించ‌డం వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉండగానే జ‌రిగింది. చిన్నారుల్లో భ‌క్తిభావం పెంపొందించ‌డం కోసం గోవింద కోటి, రామ కోటి రాసే వారికి ఉచితంగా పుస్త‌కాల‌ను పంపిణీ చేయ‌డ‌మే కాకుండా వారికి శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌డం జ‌రిగింది.

    టీటీడీ ఉద్యోగుల‌కు ఇళ్ల ప‌ట్టాల‌తోపాటు వేత‌నాలు పెంచ‌డ‌మే కాకుండా కారుణ్య నియామ‌కాలు చేప‌ట్టారు. వంశ పారంప‌ర్య అర్చ‌కుల‌కు రిటైర్మంట్ లేకుండా ఓపిక ఉన్నంత వ‌ర‌కు స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం క‌ల్పించారు. తిరుమ‌ల‌లోని స్వామి వారి గ‌ర్భ‌గుడిని స‌న్నిధి గొళ్ల‌లు తెరిచే సాంప్ర‌దాయాన్ని పున‌రుద్ధ‌రించారు. అమ‌రావ‌తి, చెన్నై, భువ‌నేశ్వ‌ర్‌, జ‌మ్ముక‌శ్మీర్‌, విశాఖ‌ప‌ట్నంతోపాటు అమెరికాలో శ్రీవారి ఆల‌యాల‌ను నిర్మించి స్వామి వారి ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ‌వ్యాప్తం చేశారు. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్ త‌ర‌హాలోనే వైఎస్‌ జ‌గ‌న్ కూడా ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా వేద విద్య‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో అతి ముఖ్య‌మైన గ‌రుడ సేవ‌లో భ‌క్తులంద‌రూ ద‌ర్శించుకునేలా ప్ర‌తి పౌర్ణ‌మికి పున్న‌మి గ‌రుడ సేవ నిర్వ‌హించేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

    బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం వైఎస్‌ జ‌గ‌న్
    మ‌ఠాధిప‌తులు, ఆగ‌మ పండితుల‌తో ఆగస్టు 2022లో రెండో విడ‌త ధార్మిక ప‌రిషత్తును నియ‌మించి నిర్ణ‌యాధికారాల‌ను క‌ల్పించిన ఘ‌న‌త కూడా వైఎస్‌ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. అంతేకాకుండా దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా వివాదాల‌తో కోర్టు కేసుల కార‌ణంగా కాల‌యాప‌న జ‌ర‌గ‌కుండా ప్ర‌త్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చిన వారం రోజుల్లో దేవాల‌య భూములు స్వాధీనం చేసుకునే అధికారం ప్ర‌భుత్వానికి క‌ల్పించి స్వామి వారి ఆస్తుల‌ను కాపాడారు. రూ.5 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉండే ఆల‌యాల‌కు వంశ‌పారంప‌ర్య హ‌క్కుల‌ను స్ధానిక భ‌క్తుల క‌మిటీల‌కు క‌ల్పిస్తూ జీవో ఇచ్చారు.

    జీవో నెంబ‌ర్ 52 ద్వారా గ‌తంలో రూ.5 వేలు వేత‌నాలు పొందేవారికి రూ.10 వేలు, రూ. 10 వేలు పొందేవారికి రూ.15625 ల చొప్పున వేత‌నాలు పెంచుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఆనాడు నిర్ణ‌యం తీసుకుంది. అర్చ‌క సంక్షేమ ట్ర‌స్టు ద్వారా బ్రాహ్మ‌ణుల‌కు రూ.48 కోట్ల మేర ల‌బ్ధి చేకూర్చారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లుగా అరర్చ స‌మాఖ్య నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. 16 ఆగమ వేద పాఠ‌శాల‌ల ద్వారా 400 మంది విద్యార్థుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌తోపాటు వారికి స్టై ఫండ్ కింద రూ. 3 కోట్లు చెల్లించారు. ధూమ‌దీప నైవేద్యాల ప‌థ‌కం గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో కేవ‌లం 1100 ఆల‌యాల‌కు మాత్ర‌మే ఉండ‌గా వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ఆ సంఖ్య‌ను 5338 ఆల‌యాల్లో అమ‌లు చేసింది.

    వైఎస్సార్‌ హయాంలోనే శ్రీవారి వైభ‌వం పెరిగింది
    ఆల‌యాల్లో రాజ‌కీయ నేత‌ల జోక్యానికి తావులేకుండా దేవాదాయ శాఖ‌లో కీల‌క‌నిర్ణ‌యాలు తీసుకునేలా 21 మందితో ధార్మిక ప‌రిష‌త్‌ను ఏర్పాటు చేస్తూ 2007లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. శ్రీవారి ఆల‌యంలో పిల్ల‌ల‌కు, క్యూలైన్ల‌లో ఉండేవారికి ఉచితంగా పాలు, అన్న‌ప్ర‌సాద పంపిణీ కార్య‌క్ర‌మానికి కూడా వైయ‌స్సార్ గారే శ్రీకారం చుట్టారు. వేద విద్య‌, విజ్ఙానం, ప‌రిశోధ‌న‌లు ప్రోత్స‌హించే ఉద్దేశంతో 2006లో వైయ‌స్సార్ గారు వేద విద్యాల‌యాన్ని ప్రారంభించారు. ఏడు కొండ‌ల వైభ‌వాన్ని చాటేలా వేంక‌టేశ్వ‌ర‌ భ‌క్తి ఛానెల్‌ను ప్రారంభించారు.

    తిరుప‌తి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఉచిత ల‌డ్డూ ప్ర‌సాదం అందజేయ‌డంతోపాటు అలిపిరి వ‌ద్ద నిత్య హోమం జ‌రిపేలా  కూడా వైయ‌స్సార్ గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే ప్రారంభించారు. 2006లో క‌ళ్యాణమ‌స్తు ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న చేసి మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌లో వివాహం చేసుకునే ప్ర‌తి జంట‌కు బంగారు మంగ‌ళ‌ సూత్రం, వెండి మెట్టెలు, నూత‌న వ‌స్త్రాలు, త‌లంబ్రాలు, పెళ్లి సామాగ్రి, ధార్మిక స్తోత్ర పుస్త‌కం, పురోహితుడు, పెళ్లి భోజ‌నం ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. బంగారు మంగ‌ళ‌సూత్రం, వెండి మెట్టెలు, శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజ‌లు నిర్వ‌హించి 36 వేల నూత‌న జంట‌ల‌కు పంపిణీ చేసే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

    ద‌ళిత గిరిజ‌న గోవిందం పేరుతో విప్ల‌వాత్మ‌క‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టి శ్రీవారిని ద‌ళిత గిరిజ‌న వాడ‌ల‌కు తీసుకెళ్లి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించే భృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం కూడా దివంగ‌త వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే ప్రారంభించారు. మ‌త్స్య‌కారుల‌కు వైదిక క‌ర్మ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చే స‌మానత్వాన్ని కూడా ఆయ‌నే ప్రారంభించారు. హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌, స్వామి వారి ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింపజేయ‌డం కోసం వైయ‌స్సార్ గారు ఎంతో శ్ర‌మించారు. కానీ చంద్ర‌బాబు మాత్రం మా ఇంటి దైవం అంటూనే త‌న త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆల‌య ప్ర‌తిష్ట‌ను మంట‌గ‌లిపేశారు.

  • సాక్షి, తాడేపల్లి: తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు ఉరి బిగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలను ఎండగట్టారు. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని చంద్రశేఖర్ ఆరోపించారు.

    తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం చెప్పిన మాటలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమను శాశ్వతంగా కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఏపీకి కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. పగలు ప్రజల ముందు బీజేపీతో బంధం ఉన్నట్టు నటిస్తూ, రాత్రికి కాంగ్రెస్‌తో ‘హాట్ లైన్’ చర్చలు జరపడం బాబు నైజమన్న చంద్రశేఖర్.. ఏపీలో కాంగ్రెస్‌తో విరోధులుగా ఉంటూ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.

    ఓటుకు నోటు కేసు పత్రాలు తగలబడ్డాయన్న వార్తల వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ‘క్యాట్ వాక్’లు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని... చంద్రబాబుది శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్, వైఎస్‌ జగన్ కృషి కనిపిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు.

    పుట్టిన గడ్డ  సీమకైనా, పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పటికైనా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దని చంద్రశేఖర్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలకు నేడు ఒక దుర్దినమని, మండలి చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

    ఇద్దరు నాయుడుల నాటకాలు..
    సీఎం, నీటిపారుదలశాఖ మంత్రి ఇద్దరు నాయుడు బ్రదర్స్ కలిసి.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నాటకాలు ఆడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో చంద్రబాబు నానా తంటాలు పడుతూ క్యాట్‌ వాక్‌లు చేస్తున్నాడు. జీవితంలో నిజాలే చెప్పని చంద్రబాబు.. తాను ఎప్పుడూ అబద్దాలు చెప్పనంటూ పెద్ద అబద్దం చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉపయోగం లేదని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం రోజుకూ 8 టీఎంసీల నీటిని తోడుకుని పోతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే, మరోవైపు పైనున్న కర్ణాటక నీ హయాంలో నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును మరింత పెంటుకుంటూ.. అదనంగా 120 టీఎంసీల నీటిని వాడుకుంటోంది.

    తెలంగాణ  రాష్ట్రం 8 టీఎంసీలు రోజూ తీసుకుంటుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న నీటి సామర్ధ్యం  0.63 టీఎంసీలు మాత్రమే.  ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?. వాటర్ బోర్డు వ్యతిరేకించినా, పక్క రాష్ట్రం కాదన్న వైయస్సార్సీపీ హాయంలో రూ.990 కోట్లు ఖర్చుపెట్టి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. మీ స్వార్ధం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

    పిల్లనిచ్చిన మామైనా- జన్మనిచ్చిన సీమైకైనా వెన్నుపోటే..
    ఇవాళ శ్రీశైలంలో 795 అడుగులు నీటిమట్టం ఉంటే మచ్చుమర్రి ద్వారా మనం 0.33 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాం. రెండోది 834 అడుగుల నీరున్నప్పుడు మాల్యాల దగ్గర 0.3 టీఎంసీలు మాత్రమే తీసుకునే పరిస్ధితి ఉంది. ఇంకా మీరు సిగ్గుపడరా? ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన మీరు జన్మనిచ్చిన రాయలసీమకు ఏం చేయలేదన్న బాధ్యత మీకు లేదా? కనీస ఇంగితం పనిచేయ లేదా? మీ స్వార్థరాజకీయాలు కోసం పిల్లనిచ్చిన మామైనా, జన్మనిచ్చిన రాయలసీమైనా మీకు ఒక్కటే. వెన్నుపోటు తప్పదు. ఇదే మీ స్వార్థరాజకీయం. మీ వైఖరిపై కచ్చితంగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.

    40 ఏళ్ల నుంచి ఉన్న తెలుగుగంగకు నిధులు కేటాయించి పనులు చేశారా? 3 టీఎంసీల నీళ్లు తీసుకుంటే.. రాయలసీమతో పాటు నెల్లూరు కూడా సస్యశ్యామలం అవుతుంది. దాన్ని కూడా మోసం చేశారు. రాయలసీమ నుంచి హంద్రీనీవా కాలువ పనుల్లోనూ మోసమే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కిలోమీటర్ల మేర 15వేల క్యూసెక్కుల సామర్ధ్యం పెంచడం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేసాం. 

    రెండోది శ్రీశైలం కుడి గట్టు కాలుల కింది 30వేల క్యూసెక్కులు పెంచాం. తెలుగుగంగకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, హంద్రీనీవా కాలువ వెడల్పు పెంచాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరుకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు ప్రారంభించారు. మరోవైపు హంద్రీనీవా సుజల స్రవంతి సామర్ధ్యాన్ని 2వేల క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేలా పనులు ప్రారంభించిన వైఎస్‌ జగన్ వాటిని త్వరిత గతిన పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. అవుకు 2 టన్నెల్స్ ద్వారా దాదాపు  రూ.260 కోట్లు ఖర్చు చేసి 20వేల క్యూసెక్కుల నీళ్లని పంపించగలిగాం. మూడో టన్నెల్ పనులుకు కూడా వైఎస్‌ జగన్ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టాం.

    రాయలసీమ ప్రాజెక్టులన్నీ వైఎస్‌ జగన్ హయాంలోనే..
    27 టీఎంసీల సామర్ధ్యమున్న గండికోట రిజర్వాయరు పనుల్లో రూ.1000 కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయిలు పెట్టి పారిపోయిన చంద్రబాబు... ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదని సిగ్గులేకుండా వైయస్.జగన్ ని విమర్శిస్తున్నాడు. గండికోట ఆర్ అండ్ ఆర్ పూర్తి ఆర్ అండ్ ఆర్ వైయస్.జగన్ హయాంలో రూ.1000 కోట్లు చెల్లించే ప్రాజెక్టు ప్రారంభించారు. చిత్రావతి ఆర్ అండ్ ఆర్ రూ.280 కోట్లు ఇచ్చిన తర్వాతే 10 టీఎంసీలు నింపగలిగాం. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో కూడా లీకేజీ పనులు రూ.90 కోట్లతో పూర్తి చేసి 17 టీఎంసీల నీటిని నింపాం.

    వెలిగొండ ప్రాజెక్టూ వైఎస్సార్‌సీపీ ఘనతే..
    వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడల్లా ప్యాకేజీ ఇవ్వకుండా వైయస్. జగన్ ప్రాజెక్టుని జాతికి అంకితం ఇచ్చారని చెబుతున్నాడు. అసలు నీ హాయంలో ఏడుసార్లు పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ఘన చరిత్ర నీదే చంద్రబాబూ. వెలిగొండను మేం ఆ విధంగా చేయలేదు. 2021 జనవరి 13  నాటికి వైయస్.జగన్ ప్రభుత్వంలో ఒక టన్నెల్ పూర్తి చేస్తే.. 2024 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్ పూర్తి చేశాం. ఒక మిషన్ నిల్చిపోయిన ప్రాంతం తప్ప మిగిలిన పనంతా పూర్తి అయింది. మొదటి, రెండు టన్నెల్‌లను కలిపి జూన్‌లో నీరు విదుదల చేయడానికి మార్చి 6న వైఎస్‌ జగన్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గరకి వచ్చారు. శ్రీశైలంలో 841 అడుగులు నీటిమట్టం ఉండదు కాబట్టి... జూన్‌లో వచ్చే నీటిని విడుదల చేస్తామని చెబుతూ.. రూ.950 కోట్ల ఆర్ అండ్ ఆర్ బాకీ ఉన్నాం. ఆ బకాయిలను జూన్ నాటికి చెల్లించి.. జూన్ నాటికి ఆ నీటిని నల్లమల సాగర్ కి తరలిస్తామని చెప్పారు.

    ఆ రోజు వైఎస్‌ జగన్ రెండు టన్నెల్స్‌ని, నల్లమల సాగర్‌ని జాతికి అంకితం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తాను వచ్చిన ప్రతిసారీ అబద్దాలు చెప్పడం అలవాటు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో చేసిన పని కేవలం 2 కిలోమీటర్ల లైనింగ్ వర్క్ మాత్రమే. రూ.4వేల కోట్లు పెట్టుబడి పెడితే తప్ప వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాదన్న మీరు జూన్ 2026లో ఎలా నీళ్లిస్తామని చెప్పారు. కారణం వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 840 అడగులు ఉండాలి అది జూన్ లోనే సాధ్యమవుతుంది కాబట్టి, మా హయంలో రెండు టన్నెల్స్ పూర్తి అయ్యాయి కాబట్టి.. మీకు నీళ్లివ్వడం సాధ్యమవుతుంది.

    ఇదే పని ఆరోజు మేం 2025లో చెబితే.. ఇవాల్టికి మీరు ఆ పని చేయలేకపోయారు. ఫీడర్ కెనాల్ తవ్వలేదు.. రెండో కెనాల్ లో కోర్టు కేసుల వల్ల ఉండిపోయిన మిషన్ ను కోర్టు కేసుల వల్ల... డిస్ మెంటల్ చేయలేదు. మరి ఎలా నీళ్లు వదులుతున్నారు. రెండేళ్లలో మీరు రెండు దఫాలుగా రూ.200, రూ.350 కోట్లు కేటాయిస్తే.. రెండేళ్లు కలిపి కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.4 వేల కోట్లు అవసరం అని చెప్పిన మీరు రెండేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఎలా ఖర్చు చేయగలిగారు. అటం ఆరోజు వైఎస్‌ జగన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం వల్లే మీకు ఇధి సాధ్యమైంది.

    కానీ చంద్రబాబు మాత్రం పత్రికల్లో 1996 మార్చిలో వెలిగొండ పనులకు శ్రీకారం చుట్టామని ప్రచారం చేసుకుంటూ... ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు మాత్రం 2001లో ఇచ్చారని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. వైయస్.రాజశేఖర్ రెడ్డి  అన్ని అనుమతులు తెచ్చి.. రూ.500 కోట్లతో పనులు ప్రారంభించారు. అంటే మీ హయాంలో ఏ పనీ జరగలేదని అర్ధం అవుతుంది. 9 సంవత్సరాల సీఎంగా ఉండి.. పశ్చిమ ప్రకాశం వాసుల కలల కొండ వెలిగొండ ప్రాజెక్టుకు ఉరలేసింది నువ్వు కాదా చంద్రబాబూ?

    తట్టెడు మట్టి కూడా తీయని చంద్రబాబు ప్రభుత్వం..
    రూ.3543 కోట్లు వెచ్చించిన వైఎస్సార్ 2004లో అన్ని అనుమతులు తెచ్చి 3వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఒక టన్నెల్ ని 11.5 కిలోమీటర్లు, 8వేల క్యూసెక్కుల సామర్ధ్యమున్న మరో టన్నెల్ ని దాదాపు 6 కిలోమీటర్లు పూర్తి చేశారు. రెండూ కలిపి రోజుకు ఒక టీఎంసీ సామర్ధ్యంతో నిర్మించారు. నల్లమలసాగర్ సామర్ధ్యం 53.5 టీఎంసీలు కాగా.. శ్రీశైలంలో 45 రోజుల పాటు మాత్రమే 845 అడుగులపైన నీటి నిల్వ ఉంటుంది.

    రోజుకొక టీఎంసీ తరలిస్తేనే 53 టీఎంసీలు నిల్వ సాధ్యం. ఇందుకు అవసరమైన సొరంగాల తవ్వకం పూర్తైంది. వెలిగొండలో ఇంకా చేయాల్సింది తీగలేరు కెనాల్, గొట్టేపాడు కాలువ, ప్రధాన కాలులను పూర్తి చేయాలి. ఎర్రగొండపాలెనికి నీరు రావాలంటే తీగలేరు కెనాల్ పూర్తి చేయాలి. ఒక తట్టెడు మట్టి కూడా తీయకుండానే మేమేం చేశామని చెప్పుకుంటున్నారు.

    నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో 30 మండలాల ప్రజల 15.25 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఇలాంటి బాగోతాలు చేయడం సిగ్గుచేటని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఐరన్ రాడ్లకు రిబ్బన్లు కట్టి కటింగ్‌లు చేసిన చరిత్ర చంద్రబాబు సొంతమైతే.. బాధ్యతతో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన చరిత్ర వైయస్సార్ దని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పగలు బీజేపీతో సంసారం, రాత్రి కాంగ్రెస్‌తో ప్రేమాయణం చేస్తూ... రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయొద్దని సూచించారు.

    పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...
    రాయలసీమ ఎత్తిపోతల పథకంపై  టీటీపీ నాయకుడే కేసు వేసినా మేం పనులు ఆపకుండా రూ.990 కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణాలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ తగలబడ్డాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ టీటీపీ స్వార్ధ రాజకీయం కోసమే జరుగుతున్నాయి. రాయలసీమ ప్రాంత ప్రజలకు భరోసానిచ్చేలా.. ఎత్తిపోతల నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే 101 టీఎంసీలు ఎత్తిపోతల దగ్గర నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది. 20 ఏళ్లలో ఎప్పుడూ 101 టీఎంసీల నీటిని వాడుకున్న చరిత్ర ఏపీకి లేదు.

    తెలంగాణా రాష్ట్రం 8 టీఎంసీలను 770 అడుగుల నుంచి 800 అడుగుల లూపే తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఏపీలో అతిపెద్ద భూభాగమున్నా.. 834 అడుగుల వరకు 0.3 టీఎంసీల మాత్రమే మనం తీసుకెళ్లగలం. మరి ఈ సోయ ప్రభుత్వానికి లేదా? తెలంగాణాతో ఎందుకు లాలూచీ పడుతున్నారు. చర్చను సజావుగా జరపకుండా అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా సభను ఎందుకు తప్పదోవ పట్టిస్తున్నారు. ? అడిగిన ప్రశ్నలకు ఎందుకు బదులివ్వడం లేదని నిలదీశారు.

    రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలలో ఇవాల ఒక దుర్దినం. మండలి  చైర్మన్ గారి సంతకాన్నే ఫోర్జరీ చేయడం దురదృష్టకరం.  తనకు సంబంధం లేదని చైర్మన్ గారు చెబుతున్నారు.  లఘు చర్చకు అనుమతించిన తర్వాత ముందే ప్రభుత్వం ప్రకటన ఎలా ఇస్తుంది?  చర్చకు అనుమతించిన తర్వాత స్టేట్ మెంట్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్లు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒక పేపర్ చూపించారు. చైర్మన్‌ నేను ఇవ్వలేదని చెబుతుంటే.. పది మంది మంత్రులు పేపర్ చూస్తూ ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు.  అంటే దొంగలు ఎవరు? ఆయన హక్కులకి కూడా భంగం కలిగించడం కాదా? తాను సంతకం చేయడం లేదని చెబుతున్నా.. ఉందని వాదిస్తున్నారంటే తప్పు ఎవరు చేసినట్లు? ఇది  రాజ్యంగ విరుద్దమైన పరిణామమని మండిపడ్డారు.

    చర్చకు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడిగితే చైర్మన్ అనుమతిచ్చారు. ఆయన స్టేట్ మెంట్ చదువుతుంటే ఆ విజువల్స్, వీడియో ఆడియో బయటకు రాదు.. కానీ మంత్రి పయ్యావుల కేశవ్ అర్ధరాత్రి అయినా చర్చిస్తామన్న వీడియో మాత్రమే బయటకు విడుదల చేశారు. చర్చ జరగక ముందే మంత్రులు ఎందుకు పోడియం చుట్టుముట్టారు. కావాలనే చేస్తున్నారని చైర్మన్ చెప్పినా వినలేదు. కూటమి నేతలు అధికార మదాన్ని ప్రదర్శించారు. చర్చ జరిగితే చంద్రబాబు కుటుంబానికే నష్టం కాబట్టి అధికార పార్టీ చర్చ నుంచి నుంచి పారిపోయిందే అధికార పార్టీ. రూ.321 నెయ్యి రేటు ఉంటే.. ఇందాపూర్ రూ.658 కి కట్టబెట్టడానికి మాత్రమే టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఒక స్కామ్ కోసం తీసుకొచ్చిన స్కీమే కల్తీ లడ్డూ అని తేల్చి చెప్పారు.

    అధికార పార్టీ చీకటి దందాలు, లూఠీ వ్యాపారాలు, ఆర్దిక లావాదేవీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. పక్క రాష్ట్రం ఉపముఖ్యమంత్రి చనిపోతే ఆ లింకులు కూడా హెరిటేజ్ కంపెనీకే బయటపడుతుంటే మా కంపనీ హెరిటేజ్ ఫైనాన్స్ చేస్తుంది.. ఆ విమానం కూలిపోతుందని కలగన్నామా అని చెబుతున్నాడు. వీఎస్ ఆర్ విమానాల్లో మీరే జల్సాలు చేస్తున్నారు. విమానయానశాఖా మంత్రి మీ పార్టీ నేత. చనిపోయిన ఎన్సీపీ ఎమ్మెల్యేలు కుట్ర ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. దాన్ని ఖండించకపోగా లోకేష్ కామెడీ చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా ఆ లింకులు చంద్రబాబు దగ్గరకు వస్తున్నాయని తేల్చి చెప్పారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఒళ్ళంతా విషంతో విమర్శలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికకు కాంగ్రెస్‌కు మైలేజ్ పెరుగుతుందన్నారు. బావ బామ్మర్థులు ఒంటి నిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆనాడు వైఎస్సార్‌ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చారని పొంగులేటి గుర్తు చేశారు.

    ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాచరికంతో, జేబులు నింపుకొవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. 38 వేల కోట్ల పాలమూరు ప్రాజెక్టును.. 1లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మాణం జరిపారు. 8వ అద్భుతం అంటూ ఆర్భాటం చేసి ప్రారంభించిన కొద్ది రోజులకే మేడిగడ్డ కూలింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి ఇచ్చినా ముందుకు వెళ్లడం లేదు. కమిషన్లు ఎక్కడ ఎక్కువ వస్తాయో అలాంటి ప్రాజెక్టులను గత ప్రభుత్వ పెద్దలు టేకప్ చేశారు.

    ‘‘రాష్ట్ర ప్రయోజనాల ఒక్క నీటి చుక్కను వదులుకోమంటూ సీఎం, ఉత్తమ్ చెప్తూనే ఉన్నారు. శవాల మీద చిల్లర వేరుకునే ఆలోచనతో బావ బామ్మర్థి ప్రవర్తన ఉంది. వారు పేడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ లో చర్చ పెడదాం.. కుంటి సాకులు చెప్పి పారిపోకండి. విషం చిమ్మడం మానేయండి.. ప్రజల కోసం ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి’’ అంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

  • సాక్షి, అమరావతి: ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నీ.. నేను చెప్తే చంద్రబాబు ఆపారని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇది వాస్తవమా? కాదా? అని మండలిలో ప్రశ్నించాం. దీనిపై సరైన సమాధానం చెప్పడం లేదు’’ అంటూ శాసనమండలి విపక్ష నేతబొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేదే తమ డిమాండ్ అంటూ స్పష్టం చేశారు.

    ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలను ఖండించలేదంటే ఆర్థిక శాఖ మంత్రి దానికి వత్తాసు పలికినట్టే.. అధికారం ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. విలువలను తాకట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్దం అని ఎందుకు చెప్పటం లేదు?. వ్యక్తిగత స్వార్థాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం.. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి.. అవి అనుబంధం వరకే. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని బొత్స నిలదీశారు.

    ‘‘రాజమండ్రిలో కల్తీ పాలపై ప్రభుత్వం చర్చ జరపడం లేదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు. లడ్డులో జంతు కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పారు.. కోర్టు వేసిన సిట్  నిగ్గు తేల్చింది. 329 రూపాయలకు హిందూపూర్ డెయిరీ ఉంటే.. ఈరోజు టీటీడీ 650 రూపాయలు కొంటుంది.. హిందూపూర్ డెయిరీకి.. హెరిటేజ్‌కి ఉన్న సంబంధం అదే. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు.. ఇప్పుడు కో యూనిట్ అంటున్నారు.. డిప్యూటీ సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఈరోజు ఎందుకు చర్చించలేదు.

    ..ఆ దేవదేవుడు కూడా ఇటువంటి దోపిడీలను క్షమించడు. ఈ దోపిడిని అరికట్టాలి. వైఎస్సార్‌ ఏడుకొండలు జీవో ఇచ్చారు. ఏడుకొండలపై ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. 2016లో.. మజ్జిగ సైతం హెరిటేజ్‌లో కొనాలని జీవో ఇచ్చారు. చంద్రబాబు బుర్ర ఏ విధంగా పనిచేస్తుందో అనేదానికి ఇదే నిదర్శనం. మండలిలో ఎందుకు చర్చించడం లేదు.

    ..విజయవాడలో పుష్కరాల పేరు చెప్పి చంద్రబాబు ఎన్ని గుళ్లు కూల్చేశారు. శ్రీశైలంలో లాఠీఛార్జి జరిగింది.. ఎవరిని సస్పెండ్ చేశారు. మీకు దేవుడిపైన దేవాలయాల పైన నమ్మకం లేదు.. కేవలం రాజకీయాలు కుర్చీలపైనే. ప్రజలను దగా చేయడం మోసం చేయడమే మీ ఎజెండా. చంద్రబాబు ధన దాహం కోసం దేవదేవుడు ప్రసాదాన్ని సైతం అవమానించారు. దేవదేవుడు ప్రసాదంపైనే అపోహలు సృష్టించారు.

    తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స

    ..చంద్రబాబు నీ వయసుకి గాని ఆ ముఖ్యమంత్రి పదవి గాని న్యాయమా ఇది.. తప్పుని ఒప్పుకోకుండా ఎన్డీబీ రిపోర్ట్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే నాలుగు ట్యాంకులు పట్టుకోలేదా?. సభలో చర్చ జరిగే వరకు పట్టుబడుతూనే ఉంటాం. చంద్రబాబు మాయ మాటలు, ఊసరవెల్లి మాటలు, ధన దోపిడీ ప్రజలకు తెలిసే వరకు పోరాడతాం. మేము వాకౌట్ చేయలేదు... వారే చైర్మన్ దగ్గరికి వచ్చి హంగామా చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేయటానికి ఇది టీడీపీ ఆఫీస్ కాదు’’ అంటూ బొత్స మండిపడ్డారు.

    మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్: లేళ్ల అప్పిరెడ్డి
    ఈరోజు మండలిలో చీకటి రోజు.. ఇవాళ చర్చజరుపుతామని ఎజెండాలో పెట్టి.. లఘు చర్చలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతుంటే.. మంత్రి మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటున్నారు... ఇంతకన్నా దుర్దినం ఉందా?. హెరిటేజ్‌కి సంబంధించి కంపెనీ ఉత్పత్తులను ఏ విధంగా వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. 1998లోనే హెరిటేజ్ తిరుపతి లడ్డూ నెయ్యి టెండర్లలలో పాల్గొన్నదని సమాచారం ఉంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. మండలిలో చర్చ జరగాలి. తిరుమల ఏడుకొండల అంశంలో వైఎస్సార్‌పై చంద్రబాబు అభాండాలు వేస్తున్నాడు. ప్రజా కోర్టులో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. మండలిలో చర్చ జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్

National

  • షిల్లాంగ్‌: ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌ భ‌ర్త‌ను శాస‌నస‌భ వేదిక‌గా లైవ్‌లో భార్య ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం మీరెప్పుడైనా చూశారా? స‌తీమ‌ణి వ‌రుస‌గా సంధించిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం సీటులో ఉన్న శ్రీవారు స‌మాధానాలు చెప్ప‌డం.. చూసేవారికి భ‌లేగా అనిపించింది. ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో స్వ‌యంగా భార్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముఖ్య‌మంత్రి స‌మాధానం చెప్ప‌డం విశేషం. మేఘాల‌యా శాస‌న‌స‌భ‌లో బుధ‌వారం ఈ ఆస‌క్తిక‌ర అరుదైన దృశ్యాలు క‌నిపించాయి.

    ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు ఆయ‌న భార్య ఎమ్మెల్యే మెహతాబ్ చండీ ఎ. సంగ్మా (Mehtab Chandee A Sangma) ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. మంత్రివ‌ర్గంలో నిర్ణ‌యం జ‌రిగిన మూడేళ్ల‌ త‌ర్వాత కూడా ప‌నులు ఎందుకు ముందుకు సాగ‌డం లేద‌ని అసెంబ్లీ సాక్షిగా అడిగారు. వెట‌ర్న‌రీ కాలేజీ, రెండు ఫిష‌రీస్ కాలేజీలు, డైయిరీ క‌ళాశాల ప‌నులు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు. ఈ మూడింటికీ 2022లో రాష్ట్ర కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింద‌ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వెట‌ర్న‌రీ ట్రైనింగ్ సెంట‌ర్ల‌లో సిబ్బంది కొర‌త ఆధికంగా ఉంద‌ని ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు.

    ఎమ్మెల్యే మెహతాబ్ చండీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం కాన్రాడ్ సంగ్మా స‌మాధానం ఇచ్చారు. పశుసంవర్ధక రంగాన్ని బ‌లోపేతం చేయ‌డానికే ఈ మూడు కాలేజీల‌ నిర్మాణానికి త‌మ ప్ర‌భుత్వం పూనుకుంద‌ని చెప్పారు. రూ.334 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న వెట‌ర్న‌రీ కాలేజీ కోసం రి-భోయ్ జిల్లాలోని కిర్దేంకులై ప్రాంతంలో 800 ఎక‌రాల స్థ‌లాన్ని గుర్తించిన‌ట్టు వెల్ల‌డించారు. వెట‌ర్న‌రీ ట్రైనింగ్ సెంట‌ర్ల‌లో సిబ్బంది నియామ‌కాన్ని త‌క్ష‌ణ‌మే చేప‌డ‌తామ‌ని హామీయిచ్చారు.

    చ‌ద‌వండి: న‌కిలీ డిగ్రీతో ఐదేళ్లు హైకోర్టు జ‌డ్జిగా తీర్పులు!

    నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) త‌ర‌పున గంబెగ్రే నియోజ‌క‌వ‌ర్గానికి మెహతాబ్ చండీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌లతో పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి అయిన త‌న భ‌ర్త‌ దృష్టికి తీసుకొచ్చి అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు మెహతాబ్ చండీ. ఈ వీడియో చూసిన వాళ్లంద‌రూ.. ప్ర‌జాస్వామ్యంలోని గొప్ప‌త‌నం ఇదేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

      

  • ఉత్తరప్రదేశ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితులైన చిన్నారుల మెడికల్ రిపోర్ట్ విడుదలైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మైనర్లపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యుల బృందం బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సీల్డ్‌ కవర్‌లో నివేదికను గురువారం దర్యాప్తు అధికారికి అందజేశారు.

    ఈ నివేదికను రేపు (శుక్రవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్‌ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే అవిముక్తేశ్వరానందపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున  ఈ కేసు వివరాలను వెల్లడించలేమని అధికారులు తెలిపారు.

    శంకరాచార్యపై ఫిర్యాదు చేసిన జగద్గురు రాంభద్రాచార్య శిష్యుడు అశుతోష్ మహరాజ్ మాట్లాడుతూ, ఈ కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మెడికల్ పరీక్షల్లో చిన్నారులపై లైంగికదాడి జరిగినట్లు తేలిందని.. త్వరలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బాధిత విద్యార్థి మొదటిసారిగా 'ఆజ్ తక్' మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తాను చదువుకోవడానికి ఆశ్రమానికి వెళ్లానని.. అక్కడ తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇతర పిల్లలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు.

    కాగా, బుధవారం అర్ధరాత్రి శంకరాచార్య తరపు న్యాయవాది మొబైల్‌కు బెదిరింపు కాల్‌ వచ్చింది. వారణాసి కోర్టు సముదాయాన్ని బాంబుతో పేల్చివేస్తామని, న్యాయవాదిని కూడా చంపేస్తామని ఆ సందేశంలో హెచ్చరించినట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా ప్రయాగ్‌రాజ్ పోలీసులు వారణాసిలో మోహరించారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై  ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

    సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితులలపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది.

     

  • న్యూఢిల్లీ:  నగరంలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నోటీసుపై క్లారిటీ ఇచ్చింది. ఆ నోటీసులో పవిత్ర రమజాన్ నెలలో విద్యార్థులపై కొన్ని పరిమితులు విధించారని పేర్కొనబడింది. ప్రధానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే పెళ్లి చేసేస్తామంటూ సదరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నోటీసుపై స్పష్టత ఇచ్చింది. అది నిజం కాదని,  ఆ నోటీసు నకీలీ నోటీసు అని పేర్కొంది.

    దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు ఈ నోటీసును పూర్తిగా నకిలీది అని ఖండించారు. వారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. ఈ నోటీసుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే యత్నం చేశారని, దీనిపై సైబర్‌ విభాగానికి అధికారిక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కలిసి ఉన్నందుకు ఎలాంటి పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది. 

    ఈ క్రమంలోనే జామియా మిల్లియా ఇస్లామియా ప్రతినిధులు ఒక విన్నపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ‘కేవలం అధికారిక వెబ్‌సైట్‌ లేదా విశ్వ విద్యాలయం నుండి విడుదలైన ప్రకటనలే నమ్మాలి. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల తప్పుదారి పట్టవద్దు’ అని సూచించారు.

    పవిత్ర రంజాన్‌ నెలలో అబ్బాయి-అమ్మాయి  కలిసి నిలబడి ఉన్నప్పుడు నికా ఏర్పాటు చేయాలని  ఫిబ్రవరి 20 తేదీన.. ఒక నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది నోటిఫికేషన్‌లో ఉన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. విశ్వవిద్యాలయ అధికారులు అలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. అందువల్ల దానిని సీరియస్‌గా తీసుకోవద్దని అందరిని కోరుతున్నాము. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే ఆ నోటిఫికేషన్‌ను ప్రచారం చేశారు. విశ్వవిద్యాలయ పరిపాలన అలాంటి నోటిఫికేషన్‌ను ఖండిస్తోంది. ఈ విషయమై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాం’ అని సదరు యూనివర్శిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. 

Family

  • రోజు కాదు రెండురోజులు కాదు ఒక దేశం మరో దేశం కాదు...ఆ ఇద్దరు మిత్రులు ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరి ఏడాదిన్నర పాటు నడుస్తూ 12000 కిలోమీటర్లు నడిచి చైనాకు చేరి తమ యాత్ర ముగించారు. లోయిక్‌ వాయిసాట్, బెంజిమిన్‌ హంబోల్ట్‌ ఈ ప్రయాణంలో గ్రహించింది ఏమిటంటే మనుషులు అట్టే చెడ్డవారు కాదని!

    ‘ప్రపంచాన్ని చూడాలని ఉంది. ప్రకృతితో మమేకమై బతకాలని ఉంది’ అని చాలామంది అంటూ ఉంటారు. కాని ఆ ఇద్దరు యువకులు మాత్రం దాన్ని చేసి చూపించారు. కష్టాలను తట్టుకుంటూ గమ్యాన్ని చేరుకోవడం ఎందుకు సాధ్యం కాదో నిరూపించడానికి ఈ ప్రయాణం చేశారు. 

    దేవుడిచ్చిన రెండు కాళ్లు ఎంత దూరం తీసుకెళ్లగలవో చూద్దామని కూడా వాళ్లు ఈ సుదీర్ఘ ప్రయాణానికి నడుము కట్టారు.  కదలాలనే తలంపు ఉండాలేగాని రూపాయి ఖర్చు లేకుండా తీసుకెళ్లడానికి కాళ్లున్నాయని వీరు నిరూపించారు. అందుకే ఆ పాదాలకు నమస్కారం.

    ఆ ఇద్దరు..
    27 ఏళ్ల బెంజమిన్‌ హంబోల్ట్, 26 ఏళ్ల లోయిక్‌ వాయిసాట్‌ పారిస్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా ఏదో వెలితి. జీవితం మరీ రొటీన్‌ అయిపోతోందన్న తలంపు. అటు ప్రపంచాన్ని, ఇటు తమ అంతరంగాన్ని ఒకేసారి చూడాలన్న కోరిక. అందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. 

    సెప్టెంబర్‌ 2024లో ఉద్యోగాలు వదిలేశారు. వారి స్వస్థలం అన్నేసీ నుండి ప్రయాణం మొదలుపెట్టారు. చైనాలోని షాంఘై చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అందుకోసం వారు ఏ వాహనాన్నీ ఆశ్రయించలేదు. కేవలం కాలినడకనే ఐకానిక్‌ సిల్క్‌ రూట్‌ ద్వారా 16 దేశాలు దాటాలని నిశ్చయించుకున్నారు. 17 నెలలపాటు 8 వేల మైళ్లు (12వేల కిలోమీటర్లు) ప్రయాణం చేసిన వారు ఇటీవల వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు.

    ఏయే దేశాలు దాటి వచ్చారు? 
    ఫ్రాన్నష్‌ నుంచి నడక మొదలుపెట్టిన లోయిక్, బెంజిమిన్‌ తమ ప్రయాణంలో భాగంగా స్విట్జర్లాండ్, ఇటలీ, క్రొయేషియా, బోస్నియా, టర్కీ, రష్యా, ఉబ్జెకిస్థాన్, కిర్జిస్థాన్, కజికిస్థాన్‌ తదితర దేశాలు దాటారు.

    చివరి మజిలిగా చైనానే ఎందుకు?
    చైనానే తమ అంతిమ గమ్యస్థానంగా ఎందుకు చేసుకోవాలనుకున్నారని వారిని అడిగినప్పుడు వారి సమాధానం చాలా బలమైన చరిత్రకు సూచనగా నిలిచింది. ‘ఇది వైరుధ్యాల భూమి. ఇక్కడ పురాతన నాగరికత వేగవంతమైన ఆధునికీకరణను కలుస్తుంది. ఫ్రాన్స్‌లో ఉన్న మాకు ఈ నేలకు చేరుకోవాలని అనిపించింది. మా నిత్యజీవితాల్లో ఒత్తిడి నుంచి దూరం కావాలంటే ఇంత దూరం రాక తప్పదని మాకు అనిపించింది’ అని వారు వివరించారు.

    మనుషులు మంచివాళ్లే
    ఈ ప్రయాణం లోయిక్, బెంజిమిన్‌కు ఎన్నో గొప్ప అనుభవాలు ఇచ్చింది. ‘మేము దారిలో మనుషులను కేవలం మంచినీళ్లు అడిగేవాళ్లం. వాళ్లు మా యాత్ర గురించి తెలుసుకుని నీళ్లతో΄ాటు ఎన్నెన్నో ఇచ్చేవారు. మనుషులు మంచివాళ్లు’ అన్నారు వాళ్లిద్దరు. జిన్జియాంగ్‌ రాజధాని ఉరుంకిలోని ఒక హోటల్‌లో  దిగినప్పుడు అక్కడి సిబ్బంది వారిని హృదయపూర్వకంగా స్వాగతించారు. అంతేకాకుండా స్థానిక పోలీసు అధికారులు మూన్‌ కేక్‌లు, అక్కడి సాంప్రదాయ పెరుగును బహుమతిగా ఇచ్చారు. 

    ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది మంచి మనుషులు తమకు సాయం చేశారని, అందువల్లే తాము సురక్షితంగా గమ్యం చేరామని అంటున్నారు. బోస్నియాలో ల్యాండ్‌మైన్స్‌ ఉంటాయన్న విషయం తమను భయపెట్టిందని, అయితే ప్రమాదమేమీ జరగకుండా సురక్షితంగా వచ్చామని తెలిపారు. తమ నడకలో తాము గొప్పగా ఆస్వాదించింది సూర్యోదయాలను అని వారన్నారు. బాగా నడిచి నిద్రకు సిద్ధమైతే ఆ కమ్ముకొచ్చే నిద్ర గొప్పగా ఉంటుందని కూడా అన్నారు. నిద్ర పట్టక, ఉన్న చోటునే ఉండి వ్యాయామం ఎరగక ఉంటున్నవారు వీరిలా కాకపోయినా కొంతైనా నడిచినా అదే తమకు తాము ఇచ్చుకునే గొప్ప కానుక. 

    (చదవండి: భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐఏఎస్‌ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..)

  • పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్‌ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ సర్వీస్‌లో  ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్‌ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.

    ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్‌లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది.  చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్‌ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్‌లో చేరాలనే ప్లాన్స్‌​ ఏమి లేవు. 

    చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్‌లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్‌ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. 

    ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి..
    ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్‌ అధికారి అయ్యింది అన్నా. 

    అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్‌ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్‌లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్‌గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. 

    ఆమె ధైర్యం ఏ రేంజ్‌లో ఉండేదంటే..
    తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. 

    ఆమె ప్లాన్‌ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. 

    ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్‌లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్‌ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. 

    అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. 

    పెళ్లి, కుటుంబం..
    అన్నా తన ఐఏఎస్ బ్యాచ్‌మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. 

    ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్‌లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. 

    (చదవండి: ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్‌ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..)
     

NRI

  • భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు  డాక్టర్ నేహా గుప్తా కన్నకూతుర్నే హతమార్చి ఏమీ తెలియ నట్టుగా  911 కాల్‌ చేసింది.  ఒక్లహోమాకు చెందిన పిల్లల వైద్యురాలు కాల్‌ రికార్డును దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే 2025 జూన్‌లో జరిగిన సంఘటనను వివరించేందుకు గాను నిందితురాల్ని తాజాగా విడుదల చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని స్వల్పకాలిక అద్దె ఇంటిలోని తన నాలుగేళ్ల కుమార్తెను కొలనులో ముంచి చంపినట్లు పై అభియోగం మోపబడిన నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 

    ఏం జరిగిందంటే..
    ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్‌. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉంగానే నాలుగేళ్ల అరియా కన్నుమూయడం విషాదాన్నినింపింది. 

    కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ తాత్కాలిక అద్దె ఇంట్లో బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో  ఆమెను అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    పోస్ట్‌మార్టం నివేదిక
    శవపరీక్షలో బాలిక ఊపిరితిత్తులలో లేదా కడుపులో నీరు కనిపించలేదు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి, ఆ తరువాతే ఆమెను కొలనులో  వేసినట్టు నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో, ఆరియా తలతి తండ్రి పూర్తి కస్టడీని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గుప్తా మానసిక స్థితి గురించి. తన కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లారని తనకు తెలియదని వాపోయాడు.

    911 రికార్డింగ్‌ వివరాలు
    "మేము నిద్రపోతున్నాము, నాకు ఏదో శబ్దం వినిపించింది ఆమె కొలనులో ఉంది,  ఆమెను కాపాడటానికిప్రయత్నించాను, కానీ నాకు ఈత రాదు" అని అధికారులు విడుదల చేసినమె చెప్పినట్లు వినబడుతుంది. "నేను ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను." అని ఆమె డిస్పాచర్‌తో చెప్పింది.

    ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, గుప్తా, "లేదు, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాము... నేనే... ఆమెను బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసాను" అని తెలిపింది. ఆ అమ్మాయి మేల్కొని ఉందా అని డిస్పాచర్ ఆమెను అడిగాడు, గుప్తా, "లేదు, ఆమె కొలను అడుగున ఉంది... కదలడం లేదు" అని చెప్పింది.

    ఆ తర్వాత గుప్తా తన కూతురిని కొలను నుండి బయటకు లాగడానికి ప్రయత్నించమని అడిగాడు.  అప్పుడు మీరు ఎప్పటికీ చేరుకుంటారని ఆమె డిస్పాచర్‌ను అడిగింది. "వారు దారిలో ఉన్నారు, కానీ మీరు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, ఆమెను బయటకు తీసుకురావడానికి మీరు ఏదైనా మార్గాన్ని కనుగొనాలి" అని డిస్పాచర్ ఆమెకు చెప్పాడు.

    ఆ తర్వాత డిస్పాచర్ ఆమెను కొలను   ఎంత లోతు ఉంటుంది లాంటి వివరాలు అడిగాడు. ""తొమ్మిది అడుగులు ఉందని నేను అనుకుంటున్నాను, ఎంత లోతు ఉందో నాకు తెలియదు," అని గుప్తా  చెప్పింది. "సరే, మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, మేడమ్," అని డిస్పాచర్ మళ్ళీ   చెప్పినపుడు నేను ప్రయత్నిస్తున్నాను," అని సమాధాన మిచ్చింది. కొన్ని క్షణాల తర్వాత, పోలీసు అధికారులు వచ్చినప్పుడు, గుప్తా వారి కోసం తలుపు తెరిచింది. అప్పుడు అధికారులు తన కుమార్తెను నీటిలో నుండి బయటకు తీశారు.

    మరోవైపు ఆరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని  గుప్తా, ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆమె మే నెలలో తిరిగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి: ప్రెగ్నెంట్‌ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త

Andhra Pradesh

  • విజయవాడ: ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీల అంశానికి సంబంధించి మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు విచారణ చేపట్టారు. ఏపీ శాసనమండలిలో చైర్మన్‌తో ఇద్దరు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. చైర్మన్‌తో ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌లు సమావేశమయ్యారు. 

    గతవారం ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఏపీ మండలి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు జారీ చేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఈ నెల 25, 26న విచారణకు హాజరవ్యాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

    ప్రలోభాలకులోనై ఫిరాయించారనే వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు నేపధ్యంలో విచారణకు రావాలని మండలి చైర్మన్‌ నోటీసులు జారీ చేశారు. బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్, పద్మ శ్రీ, సునీతలకు నోటీసులు జారీ అయ్యాయి. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కానీ రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. దీనిపై మండలి చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయగా, వారికి నోటీసులు జారీ చేసిన అనంతరం విచారణ చేపట్టారు.

  • విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి. మండిపడ్డారు. అంబటి అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు.. హైకోర్టు డైరెక్షన్స్‌ పాటించలేదంటూ ధ్వజమెత్తారు.

    మూడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లలో ప్రొసీజర్‌ ఫాలో కాలేదని విమర్శించారు.  అసలు దాడికి పాల్పడిన వారికి స్టేషన్‌బెయిల్‌ ఎలా ఇస్తారని పొన్నవోలు ప్రశ్నించారు. దాడికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామన్నారు. అంబటి ఇంటిపై దాడి వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు పొన్నవోలు.

    కాగా, గత నెల 31వ తేదీ ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. టీడీపీ మూకలు.. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు..  ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు.  అంబటి ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్‌, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.

    తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరి వెళ్లిన సమయంలో గుంటూరు సెంటర్‌లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. 

    మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్

    అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు అంబటి . దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్‌ హల్‌చల్‌ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై దాడికి యత్నించే సమయంలో పోలీసులు చోద్యం చూశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇదిలా ఉంచితే, అంబటి రాంబాబును అరెస్ట్‌కు ముందే రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రాత్రి ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. అంబటిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఉద్రిక్తతల నడుమే అంబటిని అరెస్ట్‌ చేశారు.

Lifestyle

  • రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 

    ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగు తున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి.  

    అనుమానం పెనుభూతమై  
    బిక్కవోలు మండలం రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు.  
    సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు 
    గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

    ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం    కల్పిస్తున్నారు.  
    వన్‌స్టాప్‌ సెంటర్‌ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్‌ ఇస్తారు.

    గొడవలకు కారణాలివీ..

    •  పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. 

    • ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం.  

    • ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. 

    • సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. 

    • ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. 

    • సెల్‌ఫోన్‌లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. 

    • ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం.  


    పరిష్కారాలు ఇలా  

    • సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం..  

    • ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం సమానమనే భావన కలిగి ఉండాలి. 

    • ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. 

    • జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. 

    • పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు.

    వన్‌స్టాప్‌ సెంటర్‌ నంబరు : 181 
    పోలీస్‌ హెల్ప్‌లైన్‌ : 112

    బాధితులు ముందుకురావాలి : క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకొచ్చి, పోలీసు స్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యా భర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం.  – డి.సురేష్‌బాబు, ఎస్సై, రాయవరం   

    సానుకూల దృక్పథం అవసరం : జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్‌ థింకింగ్‌ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి. – డాక్టర్‌ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం   

    ప్రశాంతంగా ఆలోచించాలి  : సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారితీస్తాయి. –డాక్టర్‌ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, జిల్లా మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం