Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో ప్రభాస్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2పై కూడా ఫోకస్ పెట్టాడు. 

    తాజాగా సింగ్ గీతం సినిమా ప్రమోషన్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నాడు. ఆ ఈవెంట్‌లో కల్కి 2 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే కల్కి 2 చిత్రీకరణ ప్రారంభమైంది. జూలై నుంచి నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని నాగ్ అశ్విన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అన్నీ అనుకున్నట్టు జరిగితే కల్కి 2 చిత్రం 2027 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే నాగ్ అశ్విన్ మాత్రం దీనిపై ఎలాంటి డెడ్‌లైన్ పెట్టుకోలేదని స్పష్టం చేశారు.  

    ఇక ఫౌజీ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా టీమ్‌ ప్రకటించారు. ఈ రెండు థియేటర్లలోకి వచ్చిన తర్వాతే కల్కి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతే సలార్ 2 రానుంది.  

  • 'పెద్ది' సినిమా వచ్చింది. చూసినవాళ్లు మరీ సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉందంటున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ సీన్స్ గురించి మాత్రం ఎడతెగని చర్చ నడుస్తోంది. మరీ దారుణమైన యాంగిల్స్‌లో ఈమెని చూపించారని, ఈమె పాత్రకు అనుమతి లేకుండా హీరో ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్స్‌పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు కూడా సారీ చెప్పేశాడు. దీంతో సమస్య ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ గతంలో ఓ అభిమానితో 'పెద్ది'లో సన్నివేశాల గురించి చాట్ చేసిందంటూ ఇ‍ప్పుడు ఒకటి వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

    వైరల్ అవుతున్న చాట్ ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ టైంలోనే తనని చూపించిన కెమెరా యాంగిల్స్ పట్ల జాన్వీ కపూర్ అసౌకర్యం వ్యక్తం చేసిందట. మరీ ముఖ్యంగా తన శరీరాన్ని జూమ్ చేసి చూపించే సన్నివేశాల్ని సినిమాలో ఉపయోగించొద్దని కూడా మూవీ టీమ్‌ని కోరిందట. తాను ఎందుకు అసౌకర్యానికి గురువుతున్నానో కూడా పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసిందట. ఈ విషయంలో తనకు రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని, ఆయన కూడా కొన్ని కెమెరా యాంగిల్స్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని అందులో ఉంది. ఈ చాట్ గతేడాది అక్టోబరులో జరిగినట్లు కూడా సదరు వీడియోలో ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

    'పెద్ది' రిలీజ్ తర్వాత జాన్వీ కపూర్ చేసిన అచ్చియమ్మ పాత్రపైనే దాదాపు చాలామంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాక్టింగ్ కంటే అందచందాల ప్రదర్శన కోసమే ఈమెని తీసుకున్నారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ పాత్ర తీరుతెన్నులపై పలువురు సెలబ్రిటీలు కూడా పరోక్షంగా పోస్టులు పెట్టారు. ఏదేమైనా ఈ సినిమాకు వచ్చిన పాజిటివిటీ అంతా కూడా జాన్వీ పాత్ర వల్ల నెగిటివ్‌గా మారిపోయిందని చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?)

  • చాలామంది నటీనటులు, తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాం, తమ జీవితం కళామతల్లికే అంకితం లాంటి మాటలు చెబుతూ ఉంటారు. కొందరు మాత్రమే కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడీ లిస్టులోకి తమిళ హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని చేరేలా కనిపిస్తున్నాడు. తన భవిష్యత్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ.

    (ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)

    'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని.. అంతకు ముందు సంగీత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతానికైతే హీరోగా అడపాదడపా మూవీస్ చేస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'నూరు సామి'. తెలుగులో 'వంద దేవుళ్లు' పేరుతో రిలీజ్ కానుంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో చెన్నై వదిలేసి, పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పాడు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు ఏ స్టార్ కూడా తీసుకోడు.

    'నాకు ఎప్పటినుంచి సాధారణంగా బతకడంపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల కారణంగా చెన్నైలో ఉంటున్నాను. శ్రీధర్ వెంబు.. టెంకాశీలో స్థిరపడినట్లు నేను పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో నివసించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే ఏదైనా గ్రామంలో భూమి కొనేందుకు చూస్తున్నాను. గ్రామ జీవితం నిజంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య అనుబంధం లాంటి మంచి విషయాలు గ్రామాల్లో ఉన్నాయి' అని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.

    ఇకపోతే విజయ్ ఆంటోని కుమార్తె మీరా ఆంటోనీ.. మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటినుంచి విజయ్ ఆంటోని ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. సినిమాలు కూడా చాలా తగ్గించేశాడు. చూస్తుంటే రాబోయే రెండేళ్లలో పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసి ఏదైనా పల్లెటూరిలో స్థిరపడిపోతాడేమో?

    (ఇదీ చదవండి: రామ్ చరణ్‌ని సర్‌ప్రైజ్ చేసిన కూతురు)

  • చీరలో మైమరిపించేస్తున్న అనసూయ

    మాయ చేసేస్తున్న రష్మిక మంధాన్న

    క్యూట్ అండ్ స్వీట్‌గా మాళవిక నాయర్

    పట్టుచీరలో చందమామలా రజిష

    బాపుబొమ్మలా హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్

  • తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్‌లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్‌మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.

    ‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్‌కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.

    ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్‌ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్‌మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.

    అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్‌గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.

    ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్‌ల పాత్రల రిప్రజెంటేషన్‌పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్‌లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్‌లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.

    సీనియర్‌, జూనియర్‌ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే  వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్‌ఫార్మర్‌ అయిన ప్రీతి ముకుందన్‌ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్‌ సెన్సేషన్‌ బ్లా‍స్ట్‌లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు సెటైర్‌ పడింది. ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్‌ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.

    బాలీవుడ్‌లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.

    మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్‌కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్‌లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా థియేటర్లలో ఉంది. మిక్స్‌డ్ టాక్ రావడంతో తెలుగులో మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. మిగిలిన భాషల్లో తేలిపోయింది. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం 'పెద్ది' మేనియా కనిపిస్తోంది. రామ్ చరణ్ కూతురే స్వయంగా తండ్రికి విషెస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

    (ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

    'దిస్ ఈజ్ ఫర్ యూ నాన్న, లవ్ యూ సో మచ్' అని క్లీంకార ముద్దుమాటలతో ప్రారంభమైన వీడియోలో.. చరణ్-ఉపాసన ఇంట్లోని పనివాళ్లంతా కలిసి చికిరి చికిరి పాటకు డ్యాన్స్ చేశారు. చివరకు చరణ్ సెక్యూరిటీ గార్డ్‌తోనూ వైరల్ బ్యాట్ స్టెప్ వేయించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో రామ్ చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా కనిపించాడు. చరణ్ అద్భుతంగా నటించాడు. ఏఆర్ రెహమాన్ కూడా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నప్పటికీ.. జాన్వీ కపూర్ సీన్ల వల్ల ఘోరమైన నెగిటివిటీ వస్తోంది. ఈ ‍క్రమంలోనే తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో సదరు సన్నివేశాలని తొలగిస్తామని చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు.. ప్రేక్షకులకు క్షమాపణ కూడా చెప్పాడు. రెండు రోజుల్లో రూ.181 కోట్ల గ్రాస్ కలెక్షన్ ఈ చిత్రానికి వచ్చాయి.

    (ఇదీ చదవండి: 'రెబల్' విషయంలో ప్రభాస్ తండ్రి ముందే హెచ్చరించారు.. కానీ మేమే)

  • 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దీనికంటే ముందు తీసిన 'రెబల్' చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ‍ఫ్లాప్ అయింది. నిర్మాతలు, దర్శకుడు రాఘవ లారెన్స్ మధ్య అప్పట్లో పెద్ద వివాదమే నడిచింది. చెప్పిన బడ్జెట్ కంటే రెట్టింపు ఖర్చు పెట్టించాడని, అలానే బెదిరిస్తున్నాడని నిర్మాతలే స్వయంగా లారెన్స్‌పై పోలీసు కేసు కూడా పెట్టడం అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'రెబల్' గురించి మాట్లాడిన నిర్మాతలు భగవాన్, పుల్లారావు.. మరోసారి పాత విషయాలు గుర్తుచేసుకున్నారు.

    (ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

    'లారెన్స్ మీద కోపంగానే ఉన్నాం. మేం ఒక బడ్జెట్ అనుకున్నాం. సగం సినిమా అయ్యేసరికి అది అయిపోయింది. ఇది పెద్ద లాస్ అని నిర్మాతలుగా మాకు అప్పుడే తెలిసిపోయింది. అయినా సరే మేం ఎక్కడా దాన్ని వదిలిపెట్టకుండా ముహూర్తం నాడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో అలానే పూర్తి చేసి రిలీజ్ చేశాం. లారెన్స్ పేరు ప్రభాస్‌కి మేమే ముందు చెప్పాం. మంచి కాంబినేషన్ అవుతుందని నమ్మాం. కానీ ప్రభాస్ వాళ్ల నాన్న మాత్రం.. లారెన్స్‌తో మీరు పడలేరు, వద్దయ్యా అనేవారు. వేరే ఎవరైనా డైరెక్టర్‌ని ఆలోచించండి అనేవారు. ఆయనతోనే చేస్తామని మేం అనేసరికి, సరే మీ ఇష్టం అని ప్రభాస్ తండ్రి వదిలేశారు'

    'ప్రభాస్ దేవుడు లాంటి మనిషి. 'రెబల్' కోసం జరిగిందంతా చూశారు. దీంతో మీరు చాలా కష్టపడ్డారు. మీకు మరో సినిమా తప్పకుండా చేస్తానని మాటిచ్చారు. కానీ ఆ ప్రామిస్‌ని ఇంకా ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పటికీ ప్రభాస్‌తో మాకు అనుబంధం కొనసాగుతోంది. ప్రతి పండగకు విషెస్ చెబుతుంటారు' అని నిర్మాతలు జె.భగవాన్, జె. పుల్లారావు చెప్పుకొచ్చారు.

    చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉ‍న్న వీళ్లు.. జంబలకడిపంబ, మావిడాకులు,సముద్రం, మనసున్న మారాజు, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, జూనియర్స్, శంఖం, రెబల్, గౌతమ్ నంద, రిపబ్లిక్ లాంటి సినిమాలని నిర్మించారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్‌ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.

    (ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

    మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్‌గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

    'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

    (ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్’. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ రోజు హీరోయిన్ అయేషా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సుధీర్స్ జోకర్’ చిత్రంలో ఆమె షాలినీ అనే క్యారెక్టర్ లో తన అందంతో పాటు పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. రీసెంట్ గా హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘సుధీర్స్ జోకర్’ మూవీ బ్యాంగర్ కు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చూడబోతున్నామనే ఎక్స్ పెక్టేషన్స్ ఈ మూవీపై ఏర్పడుతున్నాయి.

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు పర్లేదని అంటున్నారు. అయినా సరే కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. తొలిరోజు ప్రీమియర్లతో కలిపి సెంచరీ మార్క్ కొట్టగా.. రెండోరోజుకి దారుణంగా వసూళ్లు డ్రాప్ అయ్యాయి. నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ విషయం అర్థమైంది.

    (ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

    గురువారం ప్రపంచవ్యాప్తంగా 'పెద్ది' రిలీజ్ కాగా.. ముందురోజు రాత్రి ప్రీమియర్లు కూడా వేశారు. అలా ప్రీమియర్లు, తొలిరోజు కలిపి రూ.135.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. రెండోరోజులకు కలిపి రూ.181.80 కోట్ల గ్రాస్ వచ్చినట్లు వెల్లడించారు. అంటే రెండో రోజు కేవలం రూ.46.40 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. మరి ఎందుకు ఇంతలా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది అంటే దానికో కారణం ఉంది.

    మిశ్రమ స్పందన రావడంతో పాటు శుక్రవారం ఓ కారణం కాగా హెచ్‌డీ పైరసీ ప్రింట్ కూడా బయటకొచ్చేయడం.. కలెక్షన్లలో ఇంతలా తగ్గుదలకు కారణంలా కనిపిస్తుంది. శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' ఎలాంటి దూకుడు చూపిస్తాడనేది కీలకం. ఎందుకంటే సోమవారం నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వారం పెద్ద చిత్రాలేం లేనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది'కి ఎంతవరకు లాంగ్ రన్ ఉంటుందనేది చూడాలి?

    (ఇదీ చదవండి: ‘పెద్ది’.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు)

  • పెద్ది సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్రపై  విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తెరపై ఆమెను చూపించిన తీరుపై, కొన్ని సీన్లపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతూ.. ఆ సన్నివేశాలను తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా నటి, యాంకర్‌ చేసిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. 

    సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులకే ఉంటుందని అనసూయ అన్నారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి సినిమాలను ముడిపెట్టకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. చిత్రరంగంలో ఉండాల్సిన సామాజిక బాధ్యత, సృజనాత్మక స్వేచ్ఛ గురించి ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టారు.

    ఒకప్పుడు నైతికత..ఇప్పుడు గందరగోళం
    ‘ఒకప్పటి సినిమాల్లోని కథలలో నైతికత కనిపించేది. హీరో పాత్రలు స్ఫూర్తిదాయకంగా, విలన్ పాత్రలు మనం అనుకరించకూడదనే విధంగా ఉండేవి. కానీ, ఈ రోజుల్లో వచ్చే కథల్లో ఆ స్పష్టత లోపిస్తోంది. కేవలం పాత్రను గొప్పగా చూపించడం కోసమే దర్శకులు ఈ విధమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక కథను తెరకెక్కిస్తున్నప్పుడు సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో.. సాంకేతిక నిపుణుల నుంచి దర్శక నిర్మాతలు, నటీనటులు, చివరకు ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ కీలక పాత్రధారులే. అందుకే సినిమా ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలి.

    నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా..
    నేను కూడా గతంలో సృజనాత్మకత విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల వల్లే కొన్ని షోల నుంచి తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల నా ప్రతిభకు తగిన అవకాశాలు రావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినప్పటికీ సిద్ధాంతాల కోసమే నిలబడ్డాను.

    ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు
    సినిమాలకు సృజనాత్మక స్వేచ్ఛ ఎంత అవసరమో, సామాజిక స్పృహ ఉండటం కూడా అంతే ముఖ్యం. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తాయని ఆశించకూడదు. అలాగని, అవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోలేం. సమాజంలో జరిగే ప్రతి తప్పుకూ సినిమాను మాత్రమే నిందించడం సరికాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాలపై చర్చలు జరపడం, కథల్లో పాత్రలను చూపించే విధానాలను ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం వంటివి చూస్తుంటే తనకు సంతోషంగా ఉంది. అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదు, అది సమాజంలో అవగాహన పెంచడమే. నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. ఈ చిత్ర పరిశ్రమ అనే వ్యవస్థలో మనమంతా భాగమేనని గుర్తుచేయడమే నా ఉద్దేశం. ఇకనైనా క్రియేటర్స్, నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు,  ఆడియన్స్ మరింత సామాజిక స్పృహతో, బాధ్యతాయుతంగా కంటెంట్‌ను రూపొందిస్తారని ఆశిస్తున్నాను’ అని అనసూయ తన పోస్టులో రాసుకొచ్చింది.

Telangana

  • సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని... ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. 

    మలేషియా – పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 

    సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

    తెలంగాణ ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్‌కు ఉన్న అనుభవం... గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

    "తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం" అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు.

  • హైదరాబాద్‌: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్‌ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 

    2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  ఈ సంస్థను ఏర్పాటు చేశారు.  2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు.   ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారు. 

    అయితే తాజాగా హైడ్రాపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్‌.  హైడ్రా అనే పేరు హిట్లర్‌కు చాలా ఇష్టమని, హిట్లర్‌కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్‌ తెలిపారు. 

    అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్‌లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. 

    హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
  • హైదరాబాద్: నగర అంతర్గత భద్రతను పటిష్ఠం చేయడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా నిరోధించే లక్ష్యంతో గత రాత్రి సిటీ పోలీసులు 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను నిర్వహించారు. శాంతి భద్రతల పరిర‌రక్ష‌ణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ సోదాలలో సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని, మొత్తం 562 హోటళ్లు, లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, బస చేయడానికి వచ్చిన విజిటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్నారా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలించారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు ఈ సోదాలు కొనసాగాయి.

    ఈ ఆపరేషన్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనార్‌ వీసీ సజ్జనార్‌స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేటలోని పలు లాడ్జీలను ఆయన స్వయంగా సందర్శించారు. గదుల కేటాయింపు ప్రక్రియ, విజిటర్ల వివరాల నమోదు విధానాన్ని పరిశీలించారు. లాడ్జీలలో బస చేసిన పలువురు విజిటర్లతో నేరుగా మాట్లాడి, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారు, నగర సందర్శనకు గల కారణాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    ఈ ముమ్మర తనిఖీలలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జోన్ల వారీగా తనిఖీలు జరిగిన లాడ్జీలు, హోటళ్ల వివరాలు చూస్తే... అత్యధికంగా ఖైరతాబాద్‌లో 119, శంషాబాద్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండలలో 86 చొప్పున, సికింద్రాబాద్‌లో 82, రాజేంద్రనగర్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 చోట్ల ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ సోదాలలో లా అండ్ ఆర్డర్ పోలీసులు  సమన్వయంతో వ్యవహరించి, హోటళ్ల రికార్డులను, గదులను క్షుణ్ణంగా పరిశీలించారు.

    ఈ తనిఖీల నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని నగర సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని తెలుపుతూ, లాడ్జీకి వచ్చే ప్రతి ఒక్కరి నుండి గుర్తింపు కార్డుల ఒరిజనల్ ప్రతిని పరిశీలించి, దాని స్పష్టమైన నకలును సేకరించాలని ఆదేశించారు. రిజిస్టర్లలో విజిటర్ల పూర్తి సమాచారం, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్ , చెక్ అవుట్ సమయాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అసంపూర్ణ లేదా తప్పుడు సమాచారంతో గదులను కేటాయించరాదన్నారు.

    మైనర్లకు గదులు ఇవ్వద్దు 
    మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు ఇవ్వొద్దని, గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ధ్రువీకరించుకోవాలన్నారు. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా త్వరలోనే నూతన డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. భద్రతా నిఘాను బలోపేతం చేయడానికి హోటల్ పరిసరాలలో, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్, రిసెప్షన్ ఏరియాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క కెమెరా నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.

    ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్ 100కి గానీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నిబంధనలను బేఖాతరు చేసే నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,ఫిల్మ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాలలో భారీగా వాన కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కురువడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పలుచోట్ల తాత్కాలికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అప్పటి దాకా ఎండ వేడిమికి తల్లడిల్లిపోయిన పట్టణవాసులకు అకాల వర్షాలు కొంతమేర ఉపశమనం కలిగించాయి.

International

  • ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రాన్‌లో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని తల్లిదండ్రులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

    బెత్లెహెమ్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తండ్రి ఫహద్ అబు హైకల్ మీడియాతో మాట్లాడుతూ ఒక బుల్లెట్ మొదట తన చేతికి తగిలి.. ఆ తర్వాత వెనుక సీట్‌లో తల్లితో కలిసి కూర్చున్న తన కుమారుడికి తగిలిందని చెప్పారు. సైనికుడు నన్ను ఆగమని సైగ చేశారు. నేను కారును పూర్తిగా ఆపి, స్టీరింగ్ వీల్‌పై నా చేతులు పైకెత్తాను. ఆ వెంటనే వారు వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.

    కాల్పులు జరిగిన సమయంలో తాము తమ 11 ఏళ్ల కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణిస్తున్నట్లు అబు హైకల్ చెప్పారు. కారులో ఉన్నవారిని గుర్తించడంలో సైనికులు పొరపాటు పడి ఉంటారనే వాదనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఆ సైనికుడు నాకు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను నన్ను, నా భార్యను, పిల్లలను చూశాడు. కారు కిటికీలకు నల్లటి గ్లాసులు లేవు. అది పట్టపగలు కావడం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారులో కుటుంబం ప్రయాణం చేస్తుందని ఆవ్యక్తికి తెలియదా?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకువస్తోందని భావించి సైనికులు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపినట్లు 'ది గార్డియన్' పేర్కొంది. మిలిటరీ సమాచారం ప్రకారం.. సైనికులు ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించారు.. అందులోని ఓ సైనికుడు ఆ వాహనంపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.

    వారిని వైద్య చికిత్స కోసం తరలించామని ఐడీఎఫ్‌  తెలిపింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. సంబంధం లేని వ్యక్తులకు జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐడీఎఫ్‌ పేర్కొంది. ప్రాథమిక మిలిటరీ విచారణలో గాయపడిన వారు ఎలాంటి శత్రుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోని సాధారణ పౌరులుగా తేలింది. బాధ్యులను శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, సంబంధిత సైనికుడిని బాధ్యుడిని చేయాలని అబు హైకల్ డిమాండ్ చేశారు.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అమెరికా- ఇజ్రాయెల్‌ మధ్య అసలేం జరుగుతోంది?. ఇరాన్ యుద్ధం.. వాషింగ్టన్‌- టెల్ అవీవ్ మధ్య చిచ్చురాజేసిందా?.. అంతర్జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల బృందం.. అక్కడ గూఢచర్యం భయాలతో బర్నర్‌ ఫోన్లను ఉపయోగించినట్లు కథనాలు వెలువడ్డాయి.

    ఇజ్రాయెల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్‌బీసీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంపై ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు, ఉన్నతాధికారుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే ఆందోళనలతో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ అంతర్గత నివేదికను విడుదల చేసింది. డీఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఏడు పేజీల నివేదికతో పాటు ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలను వివరించే ఒక చార్ట్ కూడా ఉంది.

    ఇజ్రాయెల్‌కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ , టెక్నికల్ సర్వైలెన్స్(సాంకేతిక నిఘా) సామర్థ్యాలు క్రిటికల్ స్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక తేల్చింది. అమెరికా రక్షణ శాఖలో ఆందోళనలు పెరగడానికి కారణమైన కొన్ని నిర్దిష్ట సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇరాన్, ప్రాంతీయ భద్రతాంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలో.. అమెరికా నిర్ణయాలను ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వాషింగ్టన్‌లో బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులపై తాము నిఘా పెడుతున్నామనే వార్తలను తోసిపుచ్చింది.

    ఇజ్రాయెల్ అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ.. అక్కడి సంస్థలపై గానీ ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. మా నిఘా వ్యవస్థలు కేవలం శత్రువులను లక్ష్యంగా చేసుకుంటాయి. మిత్రదేశాలను కాదు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి కొట్టిపారేశారు.

    మరోవైపు, పెంటగాన్ దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కథనం పూర్తిగా అవాస్తవం, సరైన అవగాహన లేని వ్యక్తుల సమాచారం ఆధారంగా ఈ కథనాలు సృష్టించారన్నారు. గత ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.

    ట్రంప్ టెహ్రాన్‌తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఏ ఒప్పందాన్ని గౌరవించదని.. మరింత కఠినమైన సైనిక చర్యలే సరైనవని వాదిస్తోంది. ఈ విషయమై ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని.. ఆ తర్వాత ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

    అమెరికా అధికారులు అధికారిక పర్యటనల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రస్తుత, మాజీ అధికారులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా బర్నర్ ఫోన్లు (తాత్కాలిక ఫోన్లు), తాత్కాలిక కంప్యూటర్లు, కఠినమైన కమ్యూనికేషన్ నిబంధనలను పాటిస్తారు. ఇజ్రాయెల్‌ పర్యటనల్లో అమెరికా ఇప్పటికే అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమాచారాన్ని దూకుడుగా సేకరించడంలో ఇజ్రాయెల్‌ దిట్ట అని అందరికీ తెలిసిందేనంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు.

    అమెరికా, ఇజ్రాయెల్‌లు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ రంగంలో సహకరించుకుంటూ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో తలెత్తిన విభేదాల సమయంలో ఇజ్రాయెల్ నిఘా పెడుతోందనే అనుమానాలు మిత్ర దేశాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • విమాన ప్రయాణాల్లో  ప్రయాణికులకు చాలా టెన్షన్‌  ఉంటుంది. విమానంలో ఎలాంటి వస్తువులు తీసుకెళ్లవచ్చు అనే సందేహాలు మొదలు, సయానికి సెక్యూరిటీ చెకప్‌ ముగించుకుని గేట్‌లోకి వెళ్లడం,  లగేజీ నిర్దేశించిన బరువులో ఉందా లేదా చూసుకోవడం దాకా చాలా తతంగమే ఉంటుంది. ముఖ్యంగా పరిమితి కంటే లగేజీ బరువు కాస్త ఎక్కువైనా ప్యాసెంజర్లకు చుక్కలే. అదనపు చార్జీల (Excess baggage fee) మోత మోగుతుంది. ఇక్కడే చాలా వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అర్జెంటీనాలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎక్‌స్ట్రా లగేజీ ఫీజుకు సంబంధించిన  హైడ్రామా  ఊహించని రేంజ్‌కి చేరింది.


    అసలేం జరిగింది?
    ‘మిర్రర్ యూకే’ కథనం ప్రకారం.. అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ (Buenos Aires) లో గ ‘జార్జ్ న్యూబెరీ ఎయిర్‌పార్క్’ లో జెట్‌స్మార్ట్ (JetSmart) విమానంలో ఈ సంఘటన జరిగింది. కొర్డోబాకు వెళ్లాల్సిన ఆ విమానం ఎక్కేందుకు ఒక మహిళా ప్రయాణికురాలు వచ్చింది. అయితే, ఆమె పరిమితికి మించి క్యాబిన్ లగేజీని తీసుకురావడంతో, దానికి అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కోరారు. దానికి ఆమె నిరాకరించడంతో బోర్డింగ్ గేట్ వద్ద వివాదం మొదలైంది.

    గేట్ వద్ద గొడవ జరుగుతున్నప్పటికీ, ఆమె సిబ్బంది కళ్లుగప్పి ‘ఫ్లైట్ JA 3104’ లోపలికి వెళ్ళిపోయింది. ప్రామాణిక బోర్డింగ్ నియమాలను ఉల్లంఘించి ఆమె విమానం ఎక్కేసిందని గ్రహించిన సిబ్బంది, వెంటనే భద్రతా సిబ్బందిని ఎలర్ట్‌ చేశారు.

    నిజానికి బోర్డింగ్ గేట్ వద్దే ముగిసిపోవాల్సిన ఈ గొడవ, ఆమె విమానం లోపలికి వెళ్లడంతో మరింత  వివాదాస్పందగా మారింది. అప్పటికే ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చుని, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఆ సమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి, ఆమెను కిందకు దించేందుకు  ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఆ మహిళ ఒక్కసారిగా ఒక మహిళా పోలీస్ అధికారిణి కుడి చేతిపై గట్టిగా కొరికింది. ఈ ఊహించని ఘటనతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

    ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు

    తీవ్ర ఘర్షణ తర్వాత ఎయిర్‌పోర్ట్ పోలీసుల ఎట్టకేలకు ఆమెను నియంత్రించి, విమానం నుండి కిందకు దించేశారు. దీనిపై అర్జెంటీనా 'నేషనల్ క్రిమినల్ అండ్ కరక్షనల్ ఫెడరల్ కోర్ట్ నెం. 3'  ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. గాయపడిన మహిళా అధికారిణి, షిఫ్ట్ సూపర్‌వైజర్, జెట్‌స్మార్ట్ విమాన సిబ్బంది నుండి దర్యాప్తు అధికారులు స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. ప్రస్తుతం కోర్టు ఈ కేసును పరిశీలిస్తోంది.

    ఇదీ చదవండి: సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్‌, విద్యామంత్రిగా ఆయన?

  • ఇరాన్ వద్ద ఉన్న శుద‍్ధి చేసిన యురేనియం నిల్వను చాలా లోతైన, బలమైన, రక్షణతో కూడిన ప్రదేశంలో భద్రపరచి ఉంచారా? ప్రస్తుతం దాన్ని బయటకు తీసుకురావడం లేదా వినియోగించడం సులభం కాదా? ఆ నిల్వ తక్షణ ప్రమాదం సృష్టించే స్థితిలో లేదని ట్రంప్‌ అంటున్నారు. అందువల్ల దాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వెంటనే సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో ఎంత పెద్ద యుద్ధం ఆగిందో తెలుసా?

    పశ్చిమాసియా ఘర్షణ మళ్లీ తెరపైకి వచ్చిన వేళ వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య సున్నితమైన దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా పలు వివరాలు తెలిపారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వెలికితీసేందుకు అమెరికా సైన్యాన్ని ఇరాన్‌లోకి పంపే సైనిక ప్రణాళికను పరిశీలించినప్పటికీ చివరకు తిరస్కరించినట్టు ట్రంప్ తెలిపారు.

    ట్రంప్ తెలిపిన వివరాలు ప్రకారం.. సరిహద్దులు దాటి చేపట్టాల్సిన ఆ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమని తేలింది. భారీ స్థాయి సైనిక సమీకరణ అవసరమయ్యేది. ఆ క్లిష్టమైన మిషన్ పూర్తి కావాలంటే కనీసం 2 వారాలు పట్టేదని, భారీ స్థాయిలో సైనిక సామగ్రిని ఇరాన్ భూభాగంలోకి తరలించాల్సి వచ్చేదని చెప్పారు. సున్నితమైన అణు పదార్థాన్ని "న్యూక్లియర్ డస్ట్"గా పేర్కొన్న ట్రంప్.. ఆ నిల్వను స్వాధీనం చేసుకునే పలు మార్గాలను పెంటగాన్ అధికారులు పూర్తిగా పరిశీలించారని తెలిపారు.

    యురేనియం సమాధిలో పాతిపెట్టినట్టే.. 
    సైనిక ప్రణాళికను నిలిపివేసినా అలాంటి చర్య చేపట్టే శక్తి వాషింగ్టన్‌కు ఇప్పటికీ ఉందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. "మేము ఇప్పుడే దాన్ని తీసుకోగలం" అని ట్రంప్ అన్నారు. "మనం అనుకుంటే వాళ్లు మమ్మల్ని అడ్డుకోలేరని నేను భావిస్తున్నాను. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. అది సమాధిలో పాతిపెట్టినట్టే ఉంది" అని చెప్పారు. ఆ పదార్థం ప్రస్తుతం సురక్షితంగానే ఉందని, తక్షణ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. శుద్ఙచేసిన యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలంటే టెహ్రాన్‌తో అధికారిక దౌత్య ఒప్పందం అవసరం లేదని కూడా చెప్పారు.

    అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ముఖాముఖి భేటీపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే, వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య దౌత్యం ఖరారైతే, అలాంటి ఉన్నత స్థాయి సమావేశం జరగవచ్చని అంగీకరించారు. "అది జరిగితే... నేను గౌరవప్రదంగానే వ్యవహరిస్తాను" అని ట‍్రంప్‌ చెప్పారు.

    మొజ్తబా ఖమేనీ, తన తండ్రి హత్య అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని చేపట్టారు. ఆయన తండ్రి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక దాడిలో మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కచ్చితమైన దాడులు చేసినప్పటికీ, మొజ్తబా ఖమేనీ సరైన వైఖరి ప్రదర్శిస్తారని తాను ఆశిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. "మేము అతని తండ్రి, అతని భార్య, అతని కుమారుడిని చంపాము. కాబట్టి నేనంటే ఆయను ఇష్టం ఉండకపోవచ్చు. కానీ కొన్ని వర్గాల్లో కాయనకు చాలా మంచి పేరు ఉంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    ఇలాంటి కఠిన వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ..  అక్సియోస్ ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికా సీనియర్ ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం టెన్నెసీలోని ఓక్ రిడ్జ్‌కు వెళ్లి, ఇరాన్‌తో జరగబోయే అణు చర్చల్లో కీలక పాత్ర పోషించనున్న సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు.

    వైట్ హౌస్, యుద్ధ చర్యలు నిలిపివేయడం, సమగ్ర అణు చర్చలు ప్రారంభించడం లక్ష్యంగా టెహ్రాన్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చర్చలకు సంబంధించిన సమాచారం తెలిసిన అమెరికా అధికారులు, ప్రాంతీయ మధ్యవర్తులు తెలిపినట్టు, ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలపై రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.

    ఈ అత్యంత కీలక చర్చలు తుది దశలో ఉన్నట్టు సమాచారం వచ్చినా, స్పష్టమైన పురోగతి సాధించే అవకాశం ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఓ అమెరికా అధికారి, ఓక్ రిడ్జ్‌కు ఉన్నత స్థాయి ప్రతినిధుల పర్యటన ఒప్పందం ఖరారవుతుందనే హామీ కాదని, అయితే చర్చలు తీవ్రమైన దశలోకి ప్రవేశించాయని సూచించే స్పష్టమైన సంకేతమని చెప్పారు.

    అయితే ఈ విభేదాలు ఇప్పటికీ దౌత్య ప్రక్రియకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఇరాన్ శుద్ఙచేసిన యురేనియాన్ని సాఫ్ట్‌ చేసే ప్రక్రియ పూర్తి చేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా 60 రోజుల గడువు కోరుతోంది. ఇరాన్ మాత్రం 90 రోజుల గడువుపై పట్టుదలగా ఉంది.

    ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, నిలిపివేసిన యూఎస్‌డీ 24 బిలియన్ ఆస్తుల విషయంలో దౌత్య చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
     

  • ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్‌మెన్‌ స్క్వేర్‌ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.

    ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్‌మెన్‌ స్క్వేర్‌ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.

    1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్‌ మరణం ఉద్యమానికి నాంది పలికింది.

    హు యాబాంగ్‌ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్‌లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్‌లోని టియానన్‌మెన్‌ స్క్వేర్‌కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.

    రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్‌లో గుమికూడడంతో బీజింగ్‌ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

    పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్‌ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్‌ 3 రాత్రి నుంచి జూన్‌ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్‌లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.

    ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్‌ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.

    ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్‌లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

    టియానన్‌మెన్‌ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్‌లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్‌కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.

    ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్‌ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

NRI

  • హైదరాబాద్‌: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.  ఈ ఘటన  శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. 

    అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే  ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.   ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

Business

  • భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచడంలో భాగంగా.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా, దేశవ్యాప్తంగా 470కి పైగా ప్రాంతాల్లో 1,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇవి కేవలం నగరాల్లో మాత్రమే కాకుండా నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, టెక్ పార్కులు వంటి అనేక సామూహిక ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.

    భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా.. 2026లో కంపెనీ మూడు కొత్త ఎలక్టిక్ వాహనాలను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన మోడళ్లు కూడా ఉండనున్నాయి. ఈ వాహనాలు ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.

    అదే సమయంలో.. కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటివరకు భారత రోడ్లపై మొత్తం 290 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని తెలిపింది. ఈ ప్రయాణాల వల్ల సుమారు 4.17 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఈవీలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.

  • పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజులుగా (మే 31 నుంచి జూన్ 6) పతనమవుతూనే ఉన్నాయి. దీంతో రేటు గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో ధరలు ఎంతలా తగ్గాయి?, అనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో మే 31(ఆదివారం)న 1,57,040 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు జూన్ 6 (శనివారం) నాటికి 1,52,730 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.4,310 తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల రేటు 1,43,950 రూపాయల నుంచి 1,40,000 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.

    చెన్నైలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర వారం రోజుల్లో.. 1,59,600 రూపాయల వద్ద నుంచి రూ.4,690 తగ్గి 1,54,910 రూపాయాల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,300 రూపాయల నుంచి 1,42,000 రూపాయల (రూ.4,300 తగ్గింది) వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మే 31న రూ.1,57,190 వద్ద ఉన్న తులం పసిడి ధర జూన్ 6 నాటికి రూ.1,55,910 వద్దకు (రూ.1,280 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర 1,44,100 రూపాయల నుంచి 14,0150 రూపాయల (రూ.3,950 తగ్గింది) వద్దకు చేరింది. మొత్తం మీద జూన్ నెల ప్రారంభం నుంచి గోల్డ్ రేటు తగ్గుతూనే ముందుకు సాగుతోంది.

    ఇదీ చదవండి: ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!

  • టెక్ రంగంలో ఉద్యోగాలు కోతలు భారీగా పెరుగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై (Layoff.fyi) ట్రాకర్ వెల్లడించింది.

    లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి.

    భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్‌ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.

    ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్‌లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ మొత్తంలో తగ్గిస్తూ, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.

  • ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానం సంపాదించాలనే లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యు మోటార్స్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చెరీ ఆటోమొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలో ఈ రెండు కంపెనీల తొలి ఉత్పత్తిగా 'జెటూర్ టీ2' (Jetour T2) ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నాయి.

    జెటూర్ టీ2 కారు ఇండియన్ మార్కెట్లో 2026 దీపావళి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జేఎస్‌డబ్ల్యు ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఈ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

    జెటూర్ టీ2 ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ మెజెస్టర్, స్కోడా కోడియాక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌ సిస్టం పొందుతుంది. కాబట్టి మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది.

    అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న జెటూర్ టీ2లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 26.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో ఈ వాహనం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 139 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.

    ఫీచర్ల విషయానికి వస్తే.. జెటూర్ టీ2లో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12 స్పీకర్ల సోనీ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అదనంగా లెవల్-2 ఏడీఏఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

    గ్లోబల్ మార్కెట్లలో జెటూర్ టీ2 మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రారంభ దశలో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ కారు లేటెస్ట్ టెక్నాలజీ, మెరుగైన ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లతో ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీ ఇస్తుందని పలువురు భావిస్తున్నారు.

  • దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. గత మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఇది వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న వడ్డీ రేటుగా నిలిచింది. అయితే ఇది ఎప్పుడు జమవుతుందని ఉద్యోగులు ఆతృతగా ఎదురుగా చూస్తున్నారు.

    వడ్డీ జమ ఎప్పుడు?

    వడ్డీ రేటును సీబీటీ సిఫారసు చేసినప్పటికీ, అది ఖాతాల్లో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

    ఆలస్యమైనా నష్టం ఉండదు

    వడ్డీ ఖాతాలో ఆలస్యంగా కనిపిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని చాలామంది సభ్యులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఈపీఎఫ్‌ పథకం నిబంధనల ప్రకారం సభ్యుల అర్హత కలిగిన నిల్వలపై వడ్డీని నిరంతరం లెక్కిస్తారు. ఖాతాలో ఎంట్రీ ఆలస్యంగా నమోదైనా, చెల్లించాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని సభ్యులకు జమ చేస్తారు. అందువల్ల పరిపాలనా ఆలస్యం వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.

    పాస్‌బుక్‌లో ఈ ఎంట్రీ కనిపిస్తే వడ్డీ పడ్డట్టే..

    వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో “Int. Updated up to 31/03/2026” అనే ఎంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత సభ్యులు తమ తాజా బ్యాలెన్స్‌ను పరిశీలించవచ్చు.

    బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే మార్గాలు

    ఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమైందో లేదో కింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.

    🔸 ఉమంగ్ (UMANG) యాప్
    🔸 ఈపీఎఫ్ఓ సభ్యుల ఈ-సేవా పోర్టల్
    🔸 యూఏఎన్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్
    🔸 7738299899కు UAN EPFOHO ENG (లేదా భాష కోడ్‌తో) ఎస్‌ఎంఎస్ పంపడం

    అయితే ఈ సేవలను వినియోగించాలంటే యూఏఎన్ యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.

    స్థిరమైన రాబడితో ఉద్యోగులకు భరోసా

    ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు, బాండ్ ఈల్డ్‌లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వెంటనే వడ్డీ జమ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్లు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మైనింగ్‌ దిగ్గజం ఎన్‌ఎండీసీ తమ ప్రాజెక్టులవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉద్యోగులు.. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై పోటీలు నిర్వహించింది. భూగ్రహాన్ని కాపాడుకోవడం మానవాళి శ్రేయస్సుకి కీలకమని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలో అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఓపెన్‌ ఫర్‌ ది ప్లానెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

    ఇందులో 8,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొంది. మొక్కలు నాటడం, క్లీన్‌–అ–థాన్‌ కార్యక్రమాలు, కొత్త తరం గ్రీన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ కోసం ఈవీ డిస్‌ప్లే జోన్ల ఏర్పాటు మొదలైనవి చేసినట్లు వివరించింది. కార్యకలాపాలు, వ్యవసాయ వాల్యూ చెయిన్స్‌వ్యాప్తంగా వాతావరణంపరమైన రిసు్కలను మదింపు చేసేందుకు కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ వెల్లడించింది. తద్వారా ఆయా సందర్భాలకు అనువైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అటు, క్లైమేట్‌ యాక్షన్, లో-కార్బన్‌ మొబిలిటీపై వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ ప్రత్యేక సదస్సు నిర్వహించింది.

    పర్యావరణహిత మొబిలిటీ దిశగా భారత్‌ గణనీయంగా పురోగతి సాధించినట్లు సియామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కె. బెనర్జీ తెలిపారు. వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, స్వచ్ఛ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగించుకోవడం తదితర చర్యలతో భారత్‌ నిర్దేశించుకున్న తటస్థ స్థాయి ఉద్గారాల లక్ష్య సాధనకు తోడ్పడుతున్నట్లు సిమెంటు తయారీ సంస్థల అసోసియేషన్‌ సీఎంఏ తెలిపింది.

  • న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్‌బాల్‌ పాలక సంస్థ ఫిఫాతో ఎనిమిదేళ్ల డీల్‌ కుదుర్చుకున్న ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌’ (జీఈఈఎల్‌)  క్రీడా ప్రసారాల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ‘యునైట్‌8 స్పోర్ట్స్‌’ పేరిట క్రీడా ఛానళ్ల పోర్ట్‌ఫోలియోను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2026 ఫిఫా వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా టోర్నీలను భారత ప్రేక్షకులకు ప్రసారం చేయనుంది.

    దేశవ్యాప్తంగా 500కుపైగా కేబుల్, డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫారమ్‌లలో యునైట్‌8 స్పోర్ట్స్‌ 1, యునైట్‌8 స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, యునైట్‌8 స్పోర్ట్స్‌ 2, యునైట్‌8 స్పోర్ట్స్‌ 2 హెచ్‌డీ ఛానళ్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ నెట్‌వర్క్‌లో ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి క్రీడల ప్రసారాలు ఉంటాయి.

    ‘‘డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వాముల సహకారంతో వీక్షకులకు అంతరాయం లేని ప్రసారాలు అందించడమే మా లక్ష్యం. రానున్న ఫిఫా ఈవెంట్లను మా ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు మెరుగైన వీక్షణ అనుభూతిని అందిస్తాం’’ అని యునైట్‌8 స్పోర్ట్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ భవేష్‌ జనావ్లేకర్‌ తెలిపారు.

  • దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.

    అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?

    రెడ్డిట్‌లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.

    అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.

    చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారం

    బట్టలు, వాచ్‌లు, పర్‌ఫ్యూమ్‌లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.

    భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

    “సిప్‌ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలు

    ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్‌లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా  పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్‌ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

    మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్‌ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.

    మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం

    ఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది.

  • కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

    ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్‌యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.

    భారీ నీటి వినియోగం!
    యూఎన్‌యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.

    ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.

    విద్యుత్ వినియోగం
    విద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

    ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్‌ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.

    పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు
    అయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.

    ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం.

  • న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగానికి డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వం కూడా గణనీయంగా వ్యయాలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలకు మించి వృద్ధి చెందింది. 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది 7 శాతంగాను, తాజా క్యూ3లో 8 శాతంగాను నమోదైంది. ఇక వినియోగం, పెట్టుబడులు మెరుగ్గా ఉండటంతో  పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7.7 శాతం మేర వృద్ధి చెందింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  

    అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడితే 2028 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ మళ్లీ 7 శాతానికి పైగా వృద్ధి సాధించవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ తెలిపారు. ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లుగా 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం లోపునకు నెమ్మదించినా, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం తీసుకునే పాలసీపరమైన చర్యలనేవి ఎకానమీ మళ్లీ 7 శాతం పైగా వృద్ధి రేటువైపు మళ్లేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. స్థిర ధరల ప్రాతిపదికన వాస్తవ జీడీపీ 2025–26లో రూ. 323.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) పేర్కొంది. ప్రస్తుత ధరల్లో నామినల్‌ జీడీపీ రూ. 346.36 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని వివరించింది. 2025–26లో నిర్మాణం, తయారీ, ట్రేడ్, హోటల్స్, రియల్‌ ఎస్టేట్, ఐటీ తదితర సెకండరీ, టర్షరీ రంగాలు వరుసగా 8.8 శాతం, 9.3 శాతం వృద్ధి చెందాయి. వ్యవసాయం, ఫిషరీ రంగాల దన్నుతో ప్రైమరీ సెక్టార్‌ 3.6 శాతం వృద్ధి చెందింది.  

    పశ్చిమాసియా ప్రభావం క్యూ1లో .. 
    పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం జనవరి–మార్చి త్రైమాసికంలో ఒక నెలలోనే కనిపించింది. కీలకమైన ముడి చమురు, నేచురల్‌ గ్యాస్, ఎల్‌పీజీపరంగా సంక్షోభ పూర్తి ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) కనిపించనుంది. ఇంధనాలు, కమోడిటీల ధరలు భారీ స్థాయిలో తిరుగాడుతుండటం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తదితర సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ 6.9% నుంచి 6.6 శాతానికి తగ్గించింది.  

    సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ దూకుడు.. 
    గ్లోబల్‌ సవాళ్ల నడుమ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా పాలసీలపరంగా నిర్ణయాత్మక చర్యలతో సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌ దూకుడుని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పోస్ట్‌ చేశారు.

  • ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.

    టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.

    ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

    అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్‌ఆర్‌లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

    ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?

    • మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.
    • ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.
    • వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.
    • బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.
    • యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.
    • తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.
    • ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్‌లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.
    • తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.
    • బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.

    ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ

  • ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మానవాళి మనుగడకే సవాలుగా మారనుందా అంటే.. తాజా సాంకేతిక అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు చర్చకు దారితీసింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై అంతర్జాతీయంగా తక్షణమే తాత్కాలిక విరామం(గ్లోబల్‌ పాజ్‌) ప్రకటించాలని ఆంత్రోపిక్ తెలిపింది. తాము రూపొందిస్తున్న ఏఐ నమూనాలు మానవ నియంత్రణ పరిధుల నుంచి తప్పించుకునే సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని సంస్థ బాహాటంగా అంగీకరించడం గమనార్హం.

    స్వీయ నియంత్రణ సాధ్యమేనా?

    ప్రసిద్ధ క్లాడ్ ఏఐ నమూనాల సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు సామాజిక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్‌ పాజ్‌ అత్యవసరమని పేర్కొంది. ‘సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని తట్టుకునేలా సామాజిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, సరిహద్దు ఏఐ (ఫ్రంటీర్‌ ఏఐ) అభివృద్ధిని నెమ్మదిగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే హక్కు ప్రపంచానికి ఉండాలి’ అని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.

    అయితే, ఒకే ఒక్క సంస్థ లేదా దేశం అభివృద్ధిని ఆపితే ప్రయోజనం లేదని, ప్రత్యర్థి శక్తులు మరింత వేగంగా దూసుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అమెరికా, చైనాల వంటి అగ్రదేశాల్లోని ప్రధాన ఏఐ సంస్థలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పరస్పర నిబంధనలను ధ్రువీకరించుకుంటూ ఏకకాలంలో విరామం ప్రకటిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమన్వయ యంత్రాంగం లేకపోతే భౌగోళిక రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ల కారణంగా భద్రతను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

    వైట్‌హౌస్ అభ్యంతరాలు

    ఆంత్రోపిక్ చేసిన ఈ ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాల తీవ్రతను ఆంత్రోపిక్ అతిగా ఊహిస్తోందని, భద్రతా ఆందోళనల ముసుగులో ప్రత్యర్థులను వెనక్కి నెట్టే వ్యూహాత్మక పన్నాగం ఇదంటూ వైట్‌హౌస్ అధికారులు, సహచర టెక్ కంపెనీల ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఏఐ అభివృద్ధిని ఆపడం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుందని అమెరికా అధికారులు భయపడుతున్నారు.

    అయినప్పటికీ, ఆంత్రోపిక్ సంస్థ అత్యంత రహస్యంగా ఉంచిన ‘మైథోస్’ మోడల్ శక్తిని వైట్‌హౌస్ సైతం గుర్తించింది. అసాధారణమైన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు ఉన్నందున ఈ మోడల్‌ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. కేవలం నిశితంగా పరిశీలించిన అతికొద్ది సంస్థలకు మాత్రమే ప్రస్తుతం దీనికి యాక్సెస్‌ కల్పించారు. యూరప్‌కు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్‌ణు ఆంత్రోపిక్ అందిస్తుండటం విశేషం.

    ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

National

  • న్యూఢిల్లీ: ‘‘కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏడు రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే ప్రధాని మోదీ ఆయనను పదవి నుంచి తొలగించాలి" అని కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, దీనిపై గళం వినిపించడమే ప్రస్తుతానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పింది.

    వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ ఉద్యమంగా ప్రారంభమై, జనరేషన్-జీ వల్ల వేగంగా ఎదిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ).. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.

    సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ప్రణాళికలు లేవు" అని చెప్పారు. నేటి నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. "నా తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి వెళ్తున్నాను. వారిని చివరిసారి కలిసి ఏడాదికి పైగా అయింది. గత 15 రోజులుగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెదిరింపుల కారణంగా ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్తాను" అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

    "ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏమి సాధిస్తారని ప్రజలు అంటారు. కానీ వాటి ద్వారా మేము ఇంకా జీవించి ఉన్నామని నిరూపిస్తాం! ప్రభుత్వానికి మేము కేవలం కీటకాల్లా కనిపించవచ్చు. కానీ మేము జీవించి ఉన్నాం. మా హక్కుల కోసం పోరాడే సామర్థ్యం మాకు ఉంది" అని కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్‌లో పేర్కొంది.

    కాగా, విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉన్న దిప్కే శనివారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకుని, నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్‌కు వెళ్లారు. నీట్-యూజీ, సీయూఈటీ, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ జీడీ వంటి ప్రధాన జాతీయ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల చుట్టూ ఈ నిరసన సాగింది.

    దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై పరీక్షలకు సంబంధించిన వివాదాలు ప్రభావం చూపాయని పేర్కొంటూ, భారత విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరే యువత చేస్తున్న ఉద్యమంగా సీజేపీ తన ప్రచారాన్ని మలిచింది. ఈ ఉద్యమం ఆన్‌లైన్‌లో విపరీతంగా ఆదరణ పొందింది. తమకు లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని, సామాజిక మాధ్యమ వేదికల్లో బలమైన జనరేషన్-జీ అనుచర వర్గం ఉందని సంస్థ చెబుతోంది.

    నిరసనకు ముందు సంస్థ తన నిర్మాణాన్ని అధికారిక రూపంలో ఏర్పాటు చేసే చర్యలు కూడా చేపట్టింది. సౌరవ్ దాస్, విజేత దహియా, ఆశుతోష్ రాంకాను అధికారిక ప్రతినిధులుగా ప్రకటించింది. వీరు మాధ్యమాలతో మాట్లాడనున్నారు.

    ప్రతినిధులు నిరసన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని, జాతీయ జెండాలు, పుస్తకాలు తీసుకురావాలని, రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని, నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు.

    వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భద్రతా కారణాలు, ప్రజలకు అసౌకర్యం కలగొచ్చనే ఆందోళనల దృష్ట్యా, తాను వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి రావద్దని మద్దతుదారులను కోరారు. అరెస్టు సహా చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ఉద్యమం రాజ్యాంగ పరిమితులలోనే కొనసాగుతుందని, శాంతియుత భిన్నాభిప్రాయ వ్యక్తీకరణపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ ఉద్యమంలో లడఖ్ ఉద్యమనేత సోనం వాంగ్‌చుక్ కూడా పాల్గొంటున్నారు.

  • బెంగళూరు: తీవ్ర రాజకీయ చర్చలు, పార్టీ సీనియర్ నాయకులతో వరుస సమావేశాల అనంతరం కాంగ్రెస్ నాయకుడు రామలింగారెడ్డి శనివారం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు. దీంతో కర్ణాటకలో పెద్ద రాజకీయ సంక్షోభం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అసమ్మతి చెలరేగింది.

    తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, బెంగళూరు నియోజకవర్గాలతో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా రామలింగారెడ్డికి బెంగళూరు అభివృద్ధి శాఖను ఆశించారు. కానీ రామలింగారెడ్డికి నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

    ఈ క్రమంలో సీఎం డీకే శివకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించడంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. ఈ సమస్య పరిష్కారమైందని తెలిపిన డీకే.. పార్టీలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. ‘‘రామలింగారెడ్డి నా మిత్రుడు. సమస్యలన్నీ సద్దుమణిగాయి. కథలు సృష్టించకండి.. ఆ కథలన్నీ పాతబడిపోయాయి. రాజీనామా వ్యవహారం ముగిసిన అధ్యాయం’’ అంటూ డీకే వ్యాఖ్యానించారు.

    మంత్రివర్గ శాఖల కేటాయింపులు జరిగిన కొన్ని గంటల్లోనే రామలింగారెడ్డి తన రాజీనామాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘నాకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని.. కానీ మధ్యతరహా నీటిపారుదల శాఖను ఇచ్చారు. నా అంతరాత్మకు విరుద్ధంగా నేను పనిచేయలేను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు వేరే దారి ఏముంది? రెండుసార్లు నన్ను పిలిచి ఆ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ చివరకు అది వేరొకరికి దక్కింది.

    ..అందుకే నేను బాధపడ్డాను. అందుకే రాజీనామా చేస్తున్నాను. పదవికి రాజీనామా చేసినప్పటికీ, తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని.. ఎమ్మెల్యేగా కొనసాగుతాను’’ అని ఆయన స్పష్టం చేశారు ఈ వారమే బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురైన మొదటి పెద్ద రాజకీయ సవాలు ఇదే. అయితే, పార్టీ అధిష్టానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో రామలింగారెడ్డి మంత్రివర్గంలోనే కొనసాగనున్నారు.

  • కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ యూసుఫ్ పఠాన్ మధ్య ఎంపీ సీటు విషయమై తాను మధ్యవర్తిగా ఉన్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపడేశారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తానేప్పుడూ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు.

    పశ్చిమబెంగాల్‌లో 'దీదీ' పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎ‍న్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం.. అనంతరం ఆపార్టీలో తిరుగుబాటు మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఏసీబీ దాడులు ఇలా ఒకదాని తర్వాత మరో సమస్యలు మమతను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి పార్టీని చక్కదిద్దే యత్నం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకుగాను మాజీ క్రికెటర్‌ యూసప్ పఠాన్‌ తన సీటును త్యాగం చేయనున్నారని పుకార్లు చెలరేగాయి.

    అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎపిసోడ్‌కి మెుత్తం టీం ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని మధ్యవర్తిగా నియమించారని ప్రచారం జరిగింది. అయితే ఈ వ్యవహారంపై గంగూలీ తాజాగా స్పందించారు "పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున నేను యూసుఫ్ పఠాన్‌ను సంప్రదించి, ఆమె ఆ నియోజకవర్గం నుండి జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగా..ఆయన తన పదవికి రాజీనామా చేయాలని మమతా తరపున  సందేశాన్ని అందించానని ఆరోపణలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు " అని గంగూలీ అన్నారు.

    మమతా ఎప్పుడూ తనను ఇటువంటి రాజకీయ వ్యవహారాల చేరవేయాలని కోరలేదన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులతో తాను ఇదివరకూ ఏ సందర్భంలోనూ రాజకీయ విషయాలలో పాలుపంచుకోలేదని తెలిపారు. భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్  లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ తరపున ఈ స్థానం నుండి గెలుపొందారు.

  • చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామ‌లై స‌రికొత్త రాజ‌కీయయాత్ర‌ అరంభించారు. మారుదాం.. మార్చుదాం ఉద్య‌మ‌ నినాదంతో ఇక‌పై కొత్త ప‌థంలో ముందుకు సాగుతాన‌ని ఆయ‌న శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు క‌లిసి ప్ర‌యాణించేందుకు రావాల‌ని త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆహ్వ‌నించారు. ఇందుకోసం విత్ ద లీడ‌ర్ పేరుతో వైబ్‌సైట్ కూడా ప్రారంభించారు. ఇదిలావుంచితే అన్నామ‌లైకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

    రాజకీయాల్లోకి రాకముందు అన్నామ‌లై ఒక కన్నడ సినిమాలో నటించిన సంగ‌తి వెల్ల‌డైంది. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన రోజుల్లో "కర్ణాటక సింగం"గా గుర్తింపు పొందిన ఆయ‌న వెండి తెర‌పైనా సంద‌డి చేశారు. స్ఫూర్తిదాయ‌క క్రీడా శిక్ష‌కుడి పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అన్నామ‌లై స‌రికొత్త‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన నేప‌థ్యంలో ఈ విష‌యం మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

    రూ.1కే నటించిన అన్నామలై
    భారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన క‌న్న‌డ సినిమా ‘అరబ్బీ’లో అన్నామ‌లై స్విమ్మింగ్ కోచ్ పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం ఆయన కేవలం ఒక రూపాయి మాత్రమే పారితోషికం తీసుకోవ‌డం విశేషం. ఈ సినిమా దర్శకుడు రాజ్‌కుమార్.. మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనామలైను క‌లిసిన‌ప్పుడు ఈ పాత్ర గురించి చెప్పారు. క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న తొలిసారిగా కెమెరా ముందుకు వ‌చ్చారు.

    ఒకటిన్నర రోజులో షూటింగ్ 
    ఒక పాటతో పాటు అన్నామ‌లైకు సంబంధించిన అన్ని సన్నివేశాలను కేవలం ఒకటిన్నర రోజులో చిత్రీక‌రించారు. మొట్ట మొద‌టిసారి కెమెరా ముందుకు వ‌చ్చినా చిత్రబృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ పూర్తి చేశారాయ‌న‌. అనువ‌జ్ఞులైన న‌టుల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఆయ‌న వెండితెర‌పై న‌ట‌న క‌న‌బ‌రిచి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. స్విమ్మింగ్ కోచ్ పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయారు. సినిమాలోని ఆయ‌న పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్రజలకు స్ఫూర్తినిచ్చే కథను విస్తృతంగా చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘అరబ్బీ’ సినిమాలో నటించారని అన్నామ‌లై సన్నిహితులు పేర్కొన్నారు. మొదటి నుంచి ఆయ‌నకు సామాజిక అంశాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉంద‌ని గుర్తు చేసుకుంటున్నారు.

    స్ఫూర్తి గాథ‌
    భారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవిత‌క‌థ ఆధారంగా ‘అరబ్బీ’ సినిమా తీశారు. ఇందులో విశ్వాస్ తన పాత్రను తానే పోషించ‌డం విశేషం. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులతో పాటు తండ్రిని కోల్పోయిన ఆయ‌న‌ ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని పారా స్విమ్మర్‌గా ఎదిగారు. 2016లో అంతర్జాతీయ స్థాయికి చేరుకుని, భారత్ తరఫున కాన్-యామ్ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించారు. కుంగ్‌ఫూ, నృత్యంలోనూ ఆయ‌న ప్ర‌వేశం ఉంది. ‘అరబ్బీ’ చిత్రం కేవలం బయోపిక్ కాదని, తన జీవిత ప్రయాణాన్ని నిజాయితీగా ఆవిష్కరించిన కథ అని విశ్వాస్‌ పేర్కొన్నారు. త‌న‌లా కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

     చ‌ద‌వండి: ప్ర‌జావేదిక ప్రారంభించిన ర‌జ‌నీకాంత్ భార్య‌

  • చెన్నై: తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించేందుకే తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ పార్టీ కూటమి భాగస్వాములను తానే అనుమతించినట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు మిత్రపక్షాలు తనకు తెలిపినప్పుడు తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.

    'మీరు వెళ్ళవచ్చు. అది మీ ఇష్టం, మీ ప్రజాస్వామ్య హక్కు. నేను మిమ్మల్ని ఆపను' అని చెప్పాను. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే నేను వారికి అభ్యంతరం చెప్పలేదని.. ఎందుకంటే రాష్ట్రపతి పాలన వస్తే అది తమిళనాడులో బీజేపీ పాలనకు దారి తీసే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

    గతంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న పార్టీల మద్దతుపైనే ప్రస్తుత (టీవీకే) ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని ఆయన అన్నారు. డీఎంకే అధికారంలోకి రావాలని నమ్మి, మా కూటమిలో భాగమైన పార్టీల మద్దతు వల్లే ఈ రోజు ఈ ప్రభుత్వం నడుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చే ముందు తాము స్టాలిన్‌కు సమాచారం అందించినట్లు కూటమి పార్టీల నాయకులు బహిరంగంగానే అంగీకరించారు’’ అంటూ స్టాలిన్‌ చెప్పుకొచ్చారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపై స్టాలిన్ స్పందిస్తూ... ఎన్నికల ఓటములు పార్టీని నిరుత్సాహపరచలేన్నారు. గెలుపోటములు సహజం. విజయాలు వచ్చినప్పుడు మనం తలబిరుసుగా ప్రవర్తించం.. అలాగని ఓటమికి నిరాశ పడిపోము. మనకు విజయావకాశాలు లభించకపోయినా.. అధికారంలో లేకపోయినా... ప్రతిపక్ష పాత్రలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

     

  • చండీగఢ్‌: పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మరికాసేపట్లో కదులుతుందనగా టాయిలెట్‌ వద్ద ఉండే క్యాబిన్‌ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో రైలు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

    ఈ రోజు (శనివారం) ఉదయం లూథియానా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ-శ్రీ వైష్ణో దేవి కత్రా స్పెషల్ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఒక స్లీపర్ కోచ్‌లోని టాయిలెట్ వద్ద నిర్మాణ లోపంతో బెర్తులు కుదుపులకు గురయ్యాయి. దీంతో  స్లీపర్ కోచ్ దెబ్బతింది. టాయిలెట్ల సమీపంలో కోచ్ బాడీ పగిలిపోయింది. టాయిలెట్ పరికరాలు దెబ్బతిని పట్టాలపై కూలిపోయాయి.

    రైలులో అకస్మాత్తుగా కుదుపు రావడం, కోచ్ ఒకవైపుకు వంగిపోవడాన్ని గమనించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే రైల్వే కోచ్‌ నుంచి దూకేశారు. అయితే వెనువెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, దెబ్బతిన్న కోచ్ నుండి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

    అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని  అధికారులు తెలిపారు. ఒకవేళ రైలు వేగంగా ఉండి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవన్నారు.అయితే దెబ్బతిన్న బోగీ స్థానంలో వెంటనే మరో బోగీ ఏర్పాటు చేసి రైలును ప్రారంభించారు. 

  • బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో డీకే శివకుమార్‌పై విమర్శలు రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అనవసర కథనాలు సృష్టించకూడదని వార్నింగ్ ఇచ్చారు.

    కొత్తగా కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తనకు బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రమాణ స్వీకారం తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట తప్పినందుకు గానూ తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

    దీంతో శివకుమార్ డ్యామేజ్‌ కంట్రోల్‌ పనులు చేపట్టారు. ఆయన రాజీనామాపై స్పందిస్తూ "రామలింగారెడ్డి నాకు ‍అత్యంత సన్నిహితుడు తన అత్యంత సన్నిహితుడు సమస్యలన్నీత్వరలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన కథలు సృష్టించకండి అవన్నీ నిరాధారమవుతాయి.ఇప్పుడు సమస్యలన్నీ సర్ధుకున్నాయి" అన్నారు. అతను వాట్సాప్‌లో రాజీనామా పంపాడని పేర్కొన్నారు.

    కాగా నిన్న (శుక్రవారం) రాత్రి, రామలింగారెడ్డి రాజీనామా అనంతరం శివకుమార్ ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.ఆయనతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విధంగా మాట్లాడారు. కాగా డీకే శివకూమార్‌ క్యాబినేట్ బెర్తులపై మరో మంత్రి కేఎం మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న తనకు మరింత మెరుగైన క్యాబినేట్‌ దక్కాల్సిందన్నారు. ప్రస్తుతం ఆయనకు సివిల్‌ సప్లైస్‌ మంత్రిత్వశాఖ కేటాయించారు.

  • ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్‌పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.

    ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్‌ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్‌ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్‌ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.

    ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్‌ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్‌ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

  • ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. 

    భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.

    అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. 

    కాగా ఈ వారంలోనే భారత్‌కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది. 
     

  • సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో ఆవిర్భవించిన 'కాక్రోచ్‌ జనతా పార్టీ' ఫౌండర్‌ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం,  విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు  సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.

    ఈ నిరసనలో వినిపించిన డిమాండ్‌ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే  ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన  తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

    జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్‌చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం  ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి  తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. 

    కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది.

  • బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలో కోచింగ్ సెంట‌ర్ల ఆధిప‌త్య పోరు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఖాన్ సర్‌, రోష‌న్ ఆనంద్ మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంలో తాజాగా మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. త‌మ కోచింగ్ సెంట‌ర్‌పై రోష‌న్ ఆనంద్ దాడి చేయించాడ‌ని ఖాన్ సర్ ఆరోపించ‌గా, ఇదంతా ఖాన్ స‌ర్ ఆడిస్తున్న నాట‌క‌మ‌ని రోష‌న్ ఆనంద్ ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ఇప్పుడు ఖాన్ స‌ర్ వెంట ప‌డ్డారు.

    పట్నా: ఖాన్ సర్‌గా ప్రసిద్ధి చెందిన ఫైసల్ ఖాన్ ఆచూకీ కోసం బిహార్‌ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయ‌న‌ను అరెస్ట్ చేసే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఫైసల్ ఖాన్‌పై హత్యాయత్నం, ఆయుధాల చట్టం (ఆర్మ్స్ యాక్ట్) కింద నమోదైన కేసు నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయ‌న కోసం గాలిస్తున్నట్టు స‌మాచారం. ఖాన్ సర్ శుక్రవారం పట్నాలోని కోర్టులో లొంగిపోయే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం లేదు. ఆయన కోర్టులో హాజరవుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    ఖాన్ సర్‌ను అప్రతిష్టపాలు చేయడానికే కేసులో ఇరికించార‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయవాది అరవింద్ కుమార్ మవ్వార్ ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు. జూన్ 2న పట్నాలోని ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన విధ్వంస ఘటన నేపథ్యంలో ఫైసల్ ఖాన్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 15 నుంచి 20 మంది వ్యక్తులు  కోచింగ్ సెంటర్‌పై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు రాళ్లు రువ్వారు.

    అల్లర్ల సమయంలో ఖాన్ సర్ విద్యాసంస్థ‌కు చెందిన‌ ఇద్దరు భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో పట్నాలోని కదమ్‌కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఖాన్ సర్‌తో సహా ముగ్గురు వ్యక్తులపై బీఎన్ఎస్‌ సెక్షన్ 109, ఆయుధ చట్టంలోని సెక్షన్లు 25(9), 27, 35 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు గార్డులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఖాన్ స‌ర్‌ను కూడా అదుపులోకి తీసుకోవాల‌ని పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

    ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ఆరోపణలు
    ఇదిలా ఉండగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థ ప్రతినిధులు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. విధ్వంస ఘటనను ఖాన్ సర్ స్వయంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించారని వారు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు వారు వెల్లడించారు. కాగా, ప్రత్యర్థి కోచింగ్ సంస్థకు చెందిన వ్యక్తులే త‌మ కోచింగ్ సెంట‌ర్‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మొద‌ట ఖాన్ సర్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 

    చ‌ద‌వండి:  ఖాన్ స‌ర్‌.. గొడ‌వ‌లొద్దు

Sports

  • భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ను ఇవాళ (జూన్‌ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ పేరును ప్రకటించారు.

    త్వరలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్‌తో ఫైరయ్యాడు. 

    టీ20 ముంబై లీగ్‌లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్‌ నైట్స్‌ ఎంఎన్‌ఈ కెప్టెన్‌గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఉండటం మరో విశేషం. మ్యాచ్‌కు ముందు స్కై శ్రేయస్‌ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

    ముంబై టీ20 లీగ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్‌లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. 

    తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్‌ డాకే 3, యశ్‌ డిచోల్కర్‌ 2, సిద్దార్థ్‌ రౌత్‌, వేదాంత్‌ గోరే తలో వికెట్‌ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్‌ హెర్వాద్కర్‌ (12), నూతన్‌ కుమార్‌ గోయెల్‌ (34), మకరంద్‌ గిరీశ్‌ పాటిల్‌ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.  

     

  • ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించి శ్రేయస్‌కు కొత్త టీ20 కెప్టెన్‌గా పట్టం కట్టారు. సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది.

    యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్‌ జట్టు నుంచి పిలుపందింది. వైభవ్‌ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కింది. తిలక్‌కు మరో జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గాయం కారణంగా గత 2-3 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హర్షిత్‌ రాణాకు మూడు జట్లలో చోటు లభించింది.

    హర్షిత్‌ అంశం ప్రస్తుతం భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026 అత్యుత్తమంగా రాణించిన భువనేశ్వర్‌ కుమార్‌ను కాదని ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా ఇవ్వని హర్షిత్‌కు ఇన్ని అవకాశాలు ఇవ్వడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నా, జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్న భువీపై సానుభూతి ప్రదర్శిస్తున్నారు.

    ఇదే క్రమంలో టీమిండియాకు ఎంపికయ్యే విషయంలో మరో ఆటగాడికి కూడా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. ఆ ఆటగాడు ఆర్సీబీ సారధి రజత్‌ పాటిదార్‌. పాటిదార్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక అతను వరుసగా రెండు సార్లు ఆర్సీబీకి టైటిల్‌ అందించాడు. 17 సీజన్లలో ఒక్క టైటిల్‌ కూడా సాధించలేని ఆర్సీబీ, పాటిదార్‌ సారథ్యంలో వరుసగా రెండు టైటిళ్లు సాధించడంతో అభిమానుల్లో అతడిపై క్రేజ్‌ను మరింత పెరిగింది.

    తాజాగా సీజన్‌లో పాటిదార్‌ కెప్టెన్‌గా సత్తా చాటడమే కాకుండా వ్యక్తిగతంగానూ ఇరగదీశాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 192.69 స్ట్రయిక్‌రేట్‌తో 41.75 సగటున 501 పరుగులు చేశాడు. ఇలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత ఏ ఆటగాడికైనా జాతీయ జట్టు నుంచి పిలుపు అందుతుందని అంతా భావిస్తారు. పాటిదార్‌ విషయంలోనూ అదే జరిగింది.

    తీరా చూస్తే భారత సెలెక్టర్లు తాజాగా ప్రకటించిన జట్ల విషయంలో అతడి పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదు. కనీసం ఐర్లాండ్‌ లాంటి చిన్న జట్టుపై అయినా అవకాశం ఇవ్వాల్సింది. అదీ జరగలేదు. దీంతో పాటిదార్‌పై భువనేశ్వర్‌ కుమార్‌ తరహాలో సానుభూతి వ్యక్తమవుతుంది. పాపం పాటిదార్‌ అంటూ అతని వ్యక్తిగత, ఆర్సీబీ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నారు.

    వాస్తవానికి వారి బాధలో అర్దం ఉంది. ఎందుకంటే, ప్రస్తుత భారత జట్టు నిర్మాణాన్ని బట్టి చూస్తే పాటిదార్‌ లాంటి డాషింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఎంతో అవసరం. నాలుగు, ఐదు స్థానాల్లో బరిలోకి దిగి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల దిట్ట అతడు. ఇలాంటి ప్రదర్శనలను అతడి నుంచి ఇటీవలికాలంలో చాలా చూశాం. కాబట్టి సహజంగానే పాటిదార్‌ లాంటి ప్లేయర్‌ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ జట్టులో పరిమిత బెర్త్‌లకు మాత్రమే ఆస్కారం ఉండటంతో పాటిదార్‌కు మొండిచెయ్యి తప్పలేదు.

    ఆర్సీబీ అభిమానుల్లో ప్రస్తుతం ప్రకటించిన భారత జట్టుకు సంబంధించి మరో అసంతృప్తి కూడా ఉంది. ఛాంపియన్‌ జట్టు నుంచి కనీసం ఒక్క ఆటగాడికి కూడా ప్రాతినిథ్యం లభించలేదని వారు బాధపడుతున్నారు. 

    ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు
    శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

    ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు
    శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి

    ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు
    శ్రేయస్‌  అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవి బిష్ణోయి, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ

     

  • టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన తర్వాత రోహిత్‌ శర్మ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకే పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. రోహిత్‌ గైర్హాజరీలో హార్దిక్‌ భారత టీ20 జట్టు సారథిగా వ్యవహరించడమే ఇందుకు కారణం.

    అప్పుడు కెప్టెన్సీ చేజారింది
    అయితే, అనూహ్యంగా హార్దిక్‌ పాండ్యాను కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను కెప్టెన్‌ను చేసింది బీసీసీఐ. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌ను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాడు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు.

    కాలం గిర్రున తిరిగింది.. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఎదురులేని శక్తిగా ఎదిగిన టీమిండియా.. ఈ ఏడాది స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ గెలిచింది. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్‌ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

    సూర్యపై తప్పని వేటు
    కానీ ఊహించని రీతిలో బీసీసీఐ సూర్యపై వేటు వేసింది. కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టులోనూ స్థానం లేకుండా చేసింది. ఐర్లాండ్‌ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ పగ్గాలు చేపట్టనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    పిల్లాడికి అవకాశం
    ఐర్లాండ్‌తో పాటు.. ఇంగ్లండ్‌ టూర్‌.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల సూర్యవంశీని తొలిసారి టీమిండియాకు ఎంపిక చేసింది. అయితే, ఈ మూడు జట్లలోనూ హార్దిక్‌ పాండ్యాకు చోటు దక్కలేదు.

    హార్దిక్‌కు దక్కని చోటు
    కాగా ఐపీఎల్‌-2026లో హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా.. ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఇక హార్దిక్‌ పది మ్యాచ్‌లు ఆడి కేవలం 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.

    ఇక వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్‌ పాండ్యా.. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదు. అందుకే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడే విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.

    మూడు జట్లలోనూ నితీశ్‌ రెడ్డి
    తాజాగా టీ20 జట్టు నుంచి పూర్తిగా పక్కనపెట్టేస్తూ టీమిండియా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్‌, ఆంధ్రా ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేసింది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్‌.. ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు ఇచ్చారు.

    అందుకే అతడిని ఎంపిక చేశాం
    ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. ‘‘వన్డేల్లో అతడు ముఖ్యమైన ఆటగాడు. అతడితో పాటుగా అరుదైన నైపుణ్యాలున్న నితీశ్‌ రెడ్డి మాకు దొరికాడు.

    రొటేషన్‌ పద్ధతిలో ఇద్దరి సేవలు వాడుకుంటాము. అందుకే హార్దిక్‌కు విశ్రాంతినిచ్చాము. వన్డే వరల్డ్‌కప్‌ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడో లేదో చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు. 

    తద్వారా హార్దిక్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా.. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ నితీశ్‌ రెడ్డినే ఆడిస్తామని అగార్కర్‌ పరోక్షంగా స్పష్టం చేశాడు. అదే జరిగి.. నితీశ్‌ రెడ్డి అద్భుతంగా ఆడితే.. హార్దిక్‌ మున్ముందు జట్టులో కొనసాగడం కూడా కష్టమే అవుతుంది. 

    చదవండి: ‘మేము సెలక్ట్‌ చేయలేదు.. తనంతన తానే ఎంపికయ్యాడు’

  • భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టులో కెప్టెన్లకే గ్యారెంటీ లేని రోజుల్లో, ఓ ఆటగాడు కోచ్‌ అండదండలతో దాదాపు ప్రతి జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఆ ఆటగాడి పేరే హర్షిత్‌ రాణా. ఈ 24 ఏళ్ల కేకేఆర్‌ పేసర్‌కు గంభీర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. గంభీర్‌ కేకేఆర్‌ కోచ్‌గా పని చేసే సమయంలో హర్షిత్‌ను బాగా వెనకేసుకొచ్చాడు. టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాక భారీ లాబీయింగ్‌ జరిపి హర్షిత్‌కు ఏకంగా భారత జట్టులోనే చోటు ఇప్పించాడు.

    అది కూడా ఏదో ఒక ఫార్మాట్‌కే అనుకుంటే పొరపాటే. మూడు ఫార్మాట్ల‌ జట్లలో ఎవరున్నా, లేకపోయినా హర్షిత్‌ పేరు ఉంటుంది. బుమ్రా అయినా ఏదో ఒక సిరీస్‌ జట్టులో ఉండడేమో కానీ, హర్షిత్‌ మాత్రం దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతాడు. హర్షిత్‌కు ఇంతలా అవకాశాలు వస్తున్నాయంటే, అతడేదో భారీ టాలెంటెడ్‌ అనుకుంటే పొరబడినట్లే. ఇప్పటివరకు అతడు టీమిండియా తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు, 9 టీ20లు ఆడినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా లేదు.

    ఇలాంటి ఆటగాడికి భారత సెలెక్టర్లు ఏం చూసి ఇన్ని అవకాశాలు ఇస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఏదో కోచ్‌ అండదండలతో నెట్టుకొస్తున్నాడు కానీ, హర్షిత్‌ దేశవాలీ జట్లకు కూడా చాలా ఎక్కువే. ఇది చాలామంది టీమిండియా అభిమానుల "అభిప్రాయం". తాజాగా గంభీర్‌-హర్షిత్‌ బంధం మరోసారి సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

    ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లలో హర్షిత్‌కు చోటు దక్కింది. ఇతగాడు గాయం కారణంగా ఐపీఎల్‌ 2026లో ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా సెలెక్టర్లు నేరుగా జాతీయ జట్టులో మరోసారి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీమిండియాకు ఎంపిక కావడానికి ఐపీఎల్‌ ప్రదర్శనలు కొలమానం కానప్పటికీ.. దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఇదే తంతు కొనసాగుతుంది.

    ఐపీఎల్‌ ప్రదర్శనలనే పరిగణలోకి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆర్సీబీ వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు మొదటి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో భువీ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఏకంగా టోర్నీ సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండో ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలవడంలో ప్రధానపాత్ర పోషించాడు.

    భువీ లాంటి ఇన్‌ ఫామ్‌ బౌలర్‌ను కాదని గాయపడి 2-3 నెలుల ఆటకు దూరంగా ఉన్న హర్షిత్‌ లాంటి అన్‌ ఫిట్‌ బౌలర్‌కు ఏకంగా మూడు భారత జట్లలో అవకాశం ఇవ్వడాన్ని ప్రతి భారత క్రికెట్‌ అభిమాని తప్పుబడుతున్నాడు. హర్షిత్‌ ఎంపికలో ప్రతిసారి చక్రం తిప్పే కోచ్‌ గంభీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. గంభీర్‌-చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ అర్హతలేని ఆటగాళ్లను ఎంపిక చేసే మాఫియా నడుపుతున్నారని ఫైరవుతున్నాడు.

    కాగా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఇవాళ ప్రకటించిన మూడు వేర్వేరు భారత జట్లకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. భారత సెలెక్టర్లు సూర్యకుమార్‌ యాదవ్‌ను తప్పించి శ్రేయస్‌కు కొత్త టీ20 కెప్టెన్‌గా పట్టం కట్టారు. 

    సూర్యకు జట్టులో స్థానం కూడా గల్లంతైంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్‌ జట్టు నుంచి పిలుపందింది. మూడు వేర్వేరు జట్లలో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో హర్షిత్‌ రాణా ఒకరు. 

  • మ‌రో వారం రోజుల్లో ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు తెర‌లేవ‌నుంది. జూన్ 11 నుంచి జూలై 19 వ‌రకు కొన‌సాగ‌నున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ల‌కు సంబంధించి చాలా టికెట్లు ఇప్ప‌టికే అమ్ముడ‌య్యాయి. అయితే వెబ్‌సైట్ పొర‌పాటు వ‌ల్ల చిన్న త‌ప్పిదం జ‌రిగిపోయింది. వెబ్‌సైట్‌లో త‌ప్పిదం కార‌ణంగా సుమారు 60 మంది అభిమానులు ఉచితంగా టికెట్లు పొందారు. 

    అయితే వీటికి అభిమానులు ఒక్క రూపాయి కూడా చెల్లించ‌క‌పోవ‌డంతో ఫిఫా నిర్వాహ‌కులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. వెబ్‌సైట్ లోపం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన ఫిఫా ఆ 60 టికెట్ల‌ను వెన‌క్కి ఇచ్చేయాల‌ని, వాటి స్థానంలో కొత్త టికెట్లు జారీ చేస్తామ‌ని అభిమానుల‌ను అభ్య‌ర్థించింది. ఉచితంగా వ‌స్తే వ‌దల‌కూడద‌న్న సామెత‌ను ఒంట‌బ‌ట్టించుకున్న అభిమానులు ఫిఫా అభ్య‌ర్థ‌న‌ను ప‌ట్టించుకోలేదు. 

    దీంతో ఫిఫా ఉన్న‌ప‌ళంగా ఆ టికెట్ల‌ను ర‌ద్దు చేసింది. అయితే త‌మ త‌ప్పిదం వ‌ల్లే ఇలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌డంతో అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని ఫిఫా తెలిపింది. అయితే టికెట్లు ర‌ద్దు చేయాల‌ని ముందు నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్ స్పందించ‌డంతో త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. అయితే త‌మ‌కు వ‌చ్చిన టికెట్ల‌కు ఉన్న ధ‌ర మొత్తాన్ని చెల్లిస్తే హ్యాపీగా మ్యాచ్ చూసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

    అయితే ప్ర‌పంచ‌క‌ప్‌ మ్యాచ్‌ల‌కు సంబంధించి టికెట్ల‌న్నీ అమ్ముడ‌య్యాయంటూ ఫిఫా అధ్య‌క్షుడు గియానీ ఇన్ఫాంటినో మూడు నెల‌ల క్రిత‌మే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక జూన్ 11 నుంచి జ‌ర‌గ‌నున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, కెన‌డా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా డిపెండింగ్ చాంపియ‌న్ హోదాతో బ‌రిలోకి దిగ‌నుంది.

    చదవండి: బీసీసీఐ మెచ్చిన తెలుగు క్రికెట‌ర్‌.. భార‌త‌ జ‌ట్టులోకి స్వాగ‌తం!

  • శ్రీలంక‌లో జ‌ర‌గ‌నున్న ట్రై సిరీస్ కోసం ఇప్ప‌టికే భార‌త‌-ఏ జ‌ట్టు ఆ గ‌డ్డ‌పై అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో తెలుగు కుర్రాడు షేక్ ర‌షీద్‌కు చోటు ద‌క్క‌డం ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ధ్రువ్ జురేల్ నేతృత్వంలోని జ‌ట్టులో సాయి సుద‌ర్శ‌న్‌, ప‌డిక్క‌ల్‌, రుతురాజ్, ఆయుష్ బ‌దోని వంటి ఐపీఎల్ స్టార్ ఆట‌గాళ్లు ఉన్నారు. 

    2021 అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ టోర్నీ ద్వారా షేక్ ర‌షీద్ తొలిసారి బీసీసీఐ దృష్టిలో ప‌డ్డాడు. జ‌ట్టు టైటిల్ గెల‌వ‌డంలో షేక్ ర‌షీద్ కీల‌క‌పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత 2022 ఐసీసీ అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఆరంభంలోనే కోవిడ్ బారిన ప‌డ్డాడు. అయితే లీగ్ ద‌శ ఆఖ‌రికి చేరుకున్న క్ర‌మంలో తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన ర‌షీద్ ఆక‌ట్టుకున్నాడు. 

    ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీస్‌లో 108 బంతుల్లో 94 ప‌రుగులు సాధించాడు. ఆ త‌ర్వాత ఫైన‌ల్లోనూ కీల‌క హాఫ్ సెంచ‌రీతో మెరిసిన షేక్ ర‌షీద్ టీమిండియా టైటిల్ గెల‌వ‌డంలోనూ స‌హాయ‌ప‌డ్డాడు.

    ఎవ‌రీ షేక్ ర‌షీద్‌?
    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన షేక్ ర‌షీద్ క్రికెట్ ప్ర‌యాణం అడ్డంకుల‌తో సాగింది. అత‌డి తండ్రి షేక్ వలీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ కొడుకు ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. తండ్రి త్యాగంతో ఇవాళ ఇండియా-ఏ జ‌ట్టుకు ఎంపికైన షేక్ ర‌షీద్ త్వ‌ర‌లోనే జాతీయ జ‌ట్టుకు కూడా ఎంపిక‌వ్వాల‌ని కోరుకుందాం. 

    అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అత‌డికి గుర్తింపు తెచ్చిన‌ప్ప‌టికీ దేశవాలీ క్రికెట్‌లో రాణించాలంటే రంజీ మ్యాచ్‌లు ఆడ‌డం త‌ప్ప‌నిస‌రి. అందుకే 2022లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ర‌ఫున రంజీల్లో అరంగేట్రం చేసిన షేక్ ర‌షీద్ ఓర్పు, టెక్నిక్‌, సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని అల‌వ‌రుచుకున్నాడు. 2025-26 రంజీ సీజ‌న్‌లో షేక్ ర‌షీద్ అద్భుతంగా రాణించాడు. 

    ఈ సీజ‌న్‌లో షేక్‌ర ర‌షీద్ మూడు శ‌త‌కాల‌తో 627 ప‌రుగులు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 27 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన షేక్ ర‌షీద్ 46 స‌గ‌టుతో 1831 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచ‌రీలు, తొమ్మిది హాఫ్ సెంచ‌రీలున్నాయి. లంక ప‌ర్య‌ట‌న‌లో ముందుగా శ్రీలంక‌, అఫ్గానిస్తాన్‌తో క‌లిసి ఇండియా-ఏ ట్రై వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత‌ రెండు అన‌ధికారిక టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

    శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌, ఎన్‌ జగదీశన్‌, అమన్‌ మోఖడే, షేక్‌ రషీద్‌, జీషన్‌ అన్సారీ

    ఇండియా-ఏ టూర్‌ ఆఫ్‌ శ్రీలంక షెడ్యూల్‌
    జూన్‌ 25- తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)
    జులై 2- రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)

    చదవండి: గంభీర్ చేతిలో అంతుచిక్క‌ని ప‌దార్థం.. ట్రోల్‌ సరికాదు!

  • ఊహాగానాలే నిజమయ్యాయి.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) పురుషుల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు వేసింది. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. 

    మూడేళ్లుగా జట్టులోనే లేడు
    ఐర్లాండ్‌ పర్యటన నుంచే అయ్యర్‌ బాధ్యతలు చేపట్టనుండగా.. ఇంగ్లండ్‌ టూర్‌, ఆసియా క్రీడలు-2026 టోర్నీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ ఏడాదే టీమిండియాకు వరల్డ్‌కప్‌ అందించిన సూర్యను కాదని.. దాదాపుగా మూడేళ్లుగా అసలు టీ20 జట్టులోనే లేని శ్రేయస్‌ అయ్యర్‌ బీసీసీఐ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. 

    గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో సారథిగా, బ్యాటర్‌గా ఈ ముంబైకర్‌ సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. మరోవైపు.. ఐపీఎల్‌-2026లో పరుగుల వరద పారించిన రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి కూడా తొలిసారి టీమిండియా సెలక్టర్లు పిలుపునిచారు.

    ఆ ముగ్గురిపై వేటు.. ఆ ఇద్దరికి విశ్రాంతి!
    ఇదిలా ఉంటే.. స్వదేశంలో దాదాపు మూడు నెలల క్రితం టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన భారత జట్టులోని సభ్యుల్లో ఐదుగురిని ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టూర్లకు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.  వీరిలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేశారు. అయితే, మిగతా నలుగురిని మాత్రం పూర్తిగా పక్కనపెట్టేశారు. వారెవరంటే..

    సూర్యకుమార్‌ యాదవ్‌
    కెప్టెన్‌గా 2023-2026 వరకు టీమిండియాను విజయపథంలో నడిపాడు సూర్యకుమార్‌ యాదవ్‌. అతడి సారథ్యంలో 52 మ్యాచ్‌లలో టీమిండియా ఏకంగా నలభై గెలిచింది.

    అయితే ఒకప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్య గత కొంతకాలంగా విఫలమవుతున్నాడు. దీంతో సెలక్టర్లు నిర్దయగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో కూడా చోటులేకుండా చేశారు.  టీ20 ప్రపంచకప్‌- 2028 టోర్నీని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల సూర్యకు దాదాపుగా వీడ్కోలు పలికేశారు.

    హార్దిక్‌ పాండ్యా
    టీమిండియా టీ20 మాజీ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను కూడా ఈ టూర్ల నుంచి సెలక్టర్లు పక్కనపెట్టేశారు. ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ దారుణంగా విఫలమయ్యాడు.

    అదే సమయంలో వెన్నునొప్పితోనూ ఈ ఆల్‌రౌండర్‌ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 నాటికి అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సెలక్టర్లు టీ20 జట్టు నుంచి అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.

    కుల్దీప్‌ యాదవ్‌
    ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైనప్పటికీ చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు తుదిజట్టులో చాన్నాళ్లుగా చోటు దక్కలేదు. అతడికి బదులు వరుణ్‌ చక్రవర్తికి యాజమాన్యం పెద్దపీట వేసింది. నిజానికి 2024, 2026లలో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్లలో సభ్యుడైనా 31 ఏళ్ల కుల్దీప్‌.. ఈ రెండు టోర్నీలలో కలిపి ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అయితే, ఈసారి అతడిని పూర్తిగా టీ20ల నుంచి పక్కనపెట్టేసి రవి బిష్ణోయికి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.

    రింకూ సింగ్‌
    గత కొంతకాలంగా టీ20 జట్టులో భాగమైన రింకూ.. 2024 వరల్డ్‌కప్‌ జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఏడాది ప్రపంచకప్‌ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడు. అయితే, ఫినిషర్‌గా తన వంతు పాత్ర పోషించడంలో రింకూ విఫలమయ్యాడు. ఐపీఎల్‌లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో సెలక్టర్లు అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.

    జస్‌ప్రీత్‌ బుమ్రా
    టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటిన జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఐపీఎల్‌-2026లో మాత్రం తేలిపోయాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున కేవలం నాలుగు వికెట్లే తీశాడు.

    అయితే, బుమ్రా విషయంలో ప్రదర్శనను బట్టి కాకుండా.. అతడికి విశ్రాంతినిచ్చేందుకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాను యూకే టూర్‌ నుంచి తప్పించారు. అయితే, ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు మాత్రం ఎంపిక చేశారు.

    చదవండి: వైభవ్‌ వచ్చేశాడు!

  • ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌ పరుగుల వరద పారిస్తుంది. ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టగా.. తాజాగా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. 

    గిల్‌ 138 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో మూండకెల మార్కును తాకాడు. ఈ సెంచరీ గిల్‌కు 11వ టెస్ట్‌ సెంచరీ. ఓవరాల్‌గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం​ 26 ఏళ్ల వయసులోనే గిల్‌ ఇన్ని సెంచరీలు చేయడం విశేషం.

    అరుదైన ఫీట్‌
    టీమిండియా కెప్టెన్‌గా గిల్ టెస్టుల్లో వెయ్యి ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ ఈ ఫీట్ సాధించాడు. త‌ద్వారా భార‌త్ త‌ర‌ఫున కెప్టెన్‌గా త‌క్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల మార్క్ దాటిన రెండో క్రికెట‌ర్‌గా నిలిచాడు. మొద‌టి స్థానంలో సునీల్ గావ‌స్కర్ (14 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

    అంతేకాదు కెప్టెన్ అయిన‌ అతి త‌క్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గానూ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా భారత్‌ తరఫున కెప్టెన్‌గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.

    అలాగే అత్యధిక టెస్ట్‌ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్‌-5లోకి చేరాడు. గిల్‌ భారత టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (20) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. సునీల్‌ గవాస్కర్‌ (11), మొహమ్మద్‌ అజహారుద్దీన్‌ (9), సచిన్‌ టెండూల్కర్‌ (7) గిల్‌కు ముందున్నారు. గిల్‌ 6 టెస్ట్‌ శతకాలను కేవలం 15 ఇన్నింగ్స్‌లోనే సాధించడం మరో విశేషం.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ అతి భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 368-3గా ఉంది. రాహుల్‌ (100), యశస్వి జైస్వాల్‌ (24), సాయి సుదర్శన్‌ (81) ఔట్‌ కాగా.. గిల్‌ (103), వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ (50) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో సలీం సాఫి 2, జియా ఉర్‌ షరిఫీ ఓ వికెట్‌ పడగొట్టారు.

     

  • ముల్ల‌న్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశ‌గా అడుగులేస్తోంది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ శ‌త‌కంతో చెల‌రేగిత్‌, కెప్టెన్ గిల్ కూడా సెంచ‌రీ దిశ‌గా ప‌రిగెడుతున్నాడు. సాయి సుద‌ర్శ‌న్ కూడా హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో త‌న చేతిలో ఒక అంతుచిక్క‌ని ప‌దార్థంతో కెమెరా కంటికి చిక్కాడు. 

    అయితే అవి హోమియోప‌తి మెడిసిన్స్ అయ్యే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే చిన్న డ‌బ్బాలో రౌండ్‌గా ఉన్న పిల్స్‌ను చేతిలోకి తీసుకున్న గంభీర్ వాటిని నోటిలో పెట్టుకోవ‌డం క‌నిపించింది. బ‌హుశా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కార‌ణంగా గంభీర్ ఆ పిల్స్‌ను వాడుతున్న‌ట్లు అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    అయితే అవ‌కాశం చిక్కితే చాలు గంభీర్‌ను విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకునే కొంద‌రు ఆక‌తాయిలు త‌మ నోటికి ప‌నిచెప్పారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అడ్డ‌దిడ్డంగా పోస్టులు పెట్ట‌డం క‌నిపించింది. 'గంభీర్ డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడని, వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కొంద‌రు పేర్కొంటే.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావ‌రణాన్ని గంభీర్ పూర్తిగా చెడ‌గొడుతున్నాడ‌ని, అత‌న్ని వెంట‌నే కోచ్ ప‌ద‌వి నుంచి బ‌ర్త్‌ర‌ఫ్ చేయాల‌ని' కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

    అయితే ఆఫ్గ‌న్‌తో టెస్టు ద్వారా సంప్ర‌దాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సాయి సుద‌ర్శ‌న్ ఆక‌ట్టుకున్నాడు. గంభీర్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్‌లో సాయి సుద‌ర్శ‌న్ 104 బంతులెదుర్కొని 13 బౌండ‌రీల సాయంతో 81 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వ‌న్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాల‌ని గంభీర్ త‌న‌కు చెప్పాడ‌ని సాయి సుదర్శన్ మ్యాచ్ విరామ సమయంలో పేర్కొన్నాడు. 

    జైస్వాల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి సాయి సుదర్శన్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలిరోజే టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా 85 ఓవ‌ర్ల‌లో  3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. గిల్ (103), పంత్ (50) పరుగులతో ఆడుతున్నారు. అంత‌క‌ముందు కేఎల్ రాహుల్ (100) శ‌త‌కం సాధించాడు. 

    చదవండి: ఆఫ్గన్‌తో టెస్టు.. గిల్‌ అరుదైన ఫీట్‌!

  • రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.

    తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదే
    ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ  భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్‌తక్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్‌ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్‌లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.

    వైభవ్‌ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

    పరుగుల వరద
    రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలవడంలోనూ వైభవ్‌ కీలక పాత్ర పోషించాడు.

    ఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్‌ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.

    మేము కాదు.. తనంతట తానే సెలక్ట్‌ చేసుకున్నాడు
    అయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్‌ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్‌ ఒక్కటనే కాదు.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.

    టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్‌ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్‌మెంట్‌ వైభవ్‌కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్‌ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు. 

    కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.

    చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్‌

  • 2026 టీ20 ప్రపంచకప్‌ గెలిపించిన తర్వాత కూడా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడింది. త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్లలో అతనికి చోటు కూడా దక్కలేదు. కెప్టెన్‌గా ఉద్వాసన పలికినా, జట్టులో స్థానమైనా లభిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెలెక్టర్లు స్కైపై నిర్దయగా వ్యవహరించారు.

    ఇంత అవమానం జరిగినా స్కై చాలా హుందాగా వ్యవహరించాడు. తన ఉద్వాసన వార్త వెలువడిన గంటలోపే సోషల్‌మీడియా వేదికగా భారత జట్టుకు శుభా​కాంక్షలు తెలిపాడు. "Wishing this highly skilled group all the best for challenges ahead" అంటూ పోస్ట్ చేశాడు.

    స్కై పరిణితి, హుందాతనానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తనపై వేటు పడినా జట్టుకు శుభాకాంక్షలు తెలపడం అతని గొప్పతనం అంటూ కొనియాడుతున్నారు. భారత కెప్టెన్‌గా స్కైకు మంచి ట్రాక్‌ రికార్డే ఉన్నప్పటికీ, వ్యక్తిగంతా ఇటీవలికాలంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా బీసీసీఐ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించింది.

    అతడి స్థానంలో నూతన కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు ఎంపిక చేసింది. భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం భారత జట్లను ఇవాళ ప్రకటించాడు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. 

    అందరూ ఊహించిన విధంగానే యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ​కి తొలిసారి సీనియర్ జట్టులో చోటు లభించింది. వైభవ్‌ మూడు జట్లలో చోటు దక్కించుకున్నాడు. తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు.

    ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు
    శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా

    ఇంగ్లండ్ టీ20లకు భారత జట్టు
    శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, షియువం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, హర్షిత్ రాణా, వ‌రుణ్ చక్రవర్తి

    ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టు
    శ్రేయస్‌  అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), రవి బిష్ణోయి, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ సూర్యవంశీ

     

  • అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా బ్యాట‌ర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్ప‌టికే కేఎల్ రాహుల్ శ‌త‌కంతో స‌రికొత్త రికార్డులు నెల‌కొల్ప‌గా.. తాజాగా టీమిండియా సార‌థి శుబ్‌మ‌న్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. టీమిండియా కెప్టెన్‌గా గిల్ టెస్టుల్లో వెయ్యి ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌లో గిల్‌ ఈ ఫీట్ సాధించాడు. 

    త‌ద్వారా భార‌త్ త‌ర‌ఫున కెప్టెన్‌గా త‌క్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి ప‌రుగుల మార్క్ దాటిన రెండో క్రికెట‌ర్‌గా గిల్ నిలిచాడు. మొద‌టి స్థానంలో సునీల్ గావ‌స్కర్ (14 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన‌ త‌క్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గానూ గిల్ నిలిచాడు. ఇక ఓవరాల్‌గా భారత్‌ తరఫున కెప్టెన్‌గా వెయ్యి పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో గిల్‌ 11వ స్థానంలో నిలిచాడు. ఆఫ్గన్‌పై సాధించిన అర్థసెంచరీ గిల్‌కు తొమ్మిదోది కావడం విశేషం.

    ఇక గిల్ ఇప్ప‌టివ‌ర‌కు 40 టెస్టు మ్యాచ్‌లాడి 2,843 ప‌రుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 8 అర్థ‌సెంచ‌రీలున్నాయి. మ్యాచ్ విష‌యానికొస్తే టీమిండియా భారీ స్కోరు దిశ‌గా అడుగులు వేస్తోంది. 68 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 305 ప‌రుగులు చేసింది. శుబ్‌మ‌న్ గిల్ (65), రిష‌బ్ పంత్ (25) ప‌రుగులతో ఆడుతున్నారు. అంత‌క‌ముందు కేఎల్ రాహుల్ శ‌త‌కం చేసిన వెంట‌నే ఔట్ అయ్యాడు.

    చదవండి: తెలుగోడే అర్హుడు.. అందుకే అక్షర్‌ను తప్పించాం!

  • ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్‌ 6) ప్రారంభమైన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. 164 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తు ఆతర్వాతి బంతికే జియా ఉర్‌ రహ్మాన్‌ షరిఫీ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్‌ ఇలా సెంచరీ చేసిన వెంటనే ఔట్‌ కావడం మూడోసారి.

    ఈ సెంచరీ రాహుల్‌కు 12వ టెస్ట్‌ సెంచరీ. ఆఫ్ఘనిస్తాన్‌పై మొదటిది. 12 సెంచరీల్లో రాహుల్‌ సాధించిన ఆరో దేశం ఆఫ్ఘనిస్తాన్‌. మూడు ఫార్మాట్లో రాహుల్‌కు ఇది 22వ సెంచరీ. టెస్ట్‌ల్లో 12తో పాటు 8 వన్డే శతకాలు, 2 టీ20 శతకాలు రాహుల్‌ ఖాతాలో ఉన్నాయి. 

    ఈ సెంచరీతో రాహుల్‌ భారత్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సునీల్‌ గవాస్కర్‌ (33) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (22), మురళీ విజయ్‌ (12) రాహుల్‌ (11) కంటే ముందున్నారు. తన 12 టెస్ట్‌ సెంచరీల్లో రాహుల్‌ 11 ఓపెనర్‌గా సాధంచగా.. ఒకటి మిడిలార్డర్‌ బ్యాటర్‌గా సాధించాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. 64 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 276-3గా ఉంది. రాహుల్‌ (100), యశస్వి జైస్వాల్‌ (24), సాయి సుదర్శన్‌ (81) ఔట్‌ కాగా.. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (62), వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. 

  • తెలుగు క్రికెట‌ర్ నంబూరి తిల‌క్ వ‌ర్మ‌కు బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం బీసీసీఐ ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు టీమిండియా జ‌ట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీల‌కు వేర్వేరుగా ప్ర‌క‌టించిన జ‌ట్ల‌లో తిల‌క్ వ‌ర్మ చోటు ద‌క్కించుకోవ‌డ‌మే గాక‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 

    అయితే ఉన్న‌ప‌ళంగా అక్ష‌ర్ ప‌టేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి త‌ప్పించి ఆ బాధ్య‌త‌ల‌ను తిల‌క్ వ‌ర్మ‌కు అప్ప‌గించ‌డంపై బీసీసీఐ స్పందించింది. జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన అనంత‌రం సెలెక్ష‌న్ క‌మిటీ హెడ్ అజిత్ అగార్క‌ర్ మీడియాతో మాట్లాడాడు. ‘రాబోయే రెండేళ్ల కాలంలో టీమిండియా చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులోనే 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కూడా ఉంది.  

    అక్ష‌ర్‌ప‌టేల్ అప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులో ఉంటాడా లేదా అనేది సందేహం. అందుకే మాకు తిల‌క్ వ‌ర్మ డిప్యూటీ కెప్టెన్ ప‌ద‌వికి స‌రైనోడిలా క‌నిపించాడు. అక్ష‌ర్ ప‌టేల్ వైస్ కెప్టెన్‌గా త‌న బాధ్య‌త‌లను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించిన‌ప్ప‌టికీ, రాబోయే రెండేళ్ల సైకిల్‌ను దృష్టిలో పెట్టుకొని తిల‌క్ వ‌ర్మ‌ను డిప్యూటీగా ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించాం. అందునా తిల‌క్ వ‌ర్మ ఒక అద్భుత ఆట‌గాడు. డిప్యూటీ కెప్టెన్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ద్వారా మ‌రింత నేర్చుకుంటాడ‌న్న‌ది మా న‌మ్మ‌కం.’ అని చెప్పుకొచ్చాడు. 

    అజిత్ అగార్క‌ర్ చెప్పిన‌ట్లుగానే తిల‌క్ వ‌ర్మ కొన్నేళ్లుగా భార‌త టీ20 జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా మారిపోయాడు. 2024లో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై రెండు శ‌త‌కాలు బాదిన తిల‌క్ వ‌ర్మ‌, ఆ గ‌డ్డ‌పై 3-1 తేడాతో సిరీస్‌ను గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఇక గ‌తేడాది ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త్ గెల‌వ‌డంలో తిల‌క్ వ‌ర్మ‌దే కీల‌క‌పాత్ర‌. ఆ మ్యాచ్‌లో 69 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 

    ఇప్ప‌టిదాకా బ్యాట‌ర్‌గా రాణించిన తిల‌క్ వ‌ర్మ ఇక‌పై వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు స‌వాల్ విస‌రనున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌తో పాటు 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై దృష్టి సారించిన నేప‌థ్యంలో తిల‌క్ వ‌ర్మ బ్యాట‌ర్‌గా భార‌త బ్యాటింగ్‌లో మూల స్తంభాల్లో ఒక‌డిగా ఉండ‌డంతో పాటు డిప్యూటీ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను కూడా స‌మ‌ర్థంగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇక అక్ష‌ర్‌ప‌టేల్ వైస్‌కెప్టెన్ ప‌దవిని కోల్పోయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ స్పిన్న‌ర్‌గా జ‌ట్టులో చోటు కాపాడుకున్నాడు.

    ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్ల‌కు భారత జట్టు: 
    శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్‌ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్‌), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాద‌వ్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ.

    చదవండి: క‌నిపించ‌ని సూర్య‌కుమార్ పేరు.. కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

  • అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.

    కొత్త టీ20 కెప్టెన్‌
    కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్‌ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్‌తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.

    కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదు
    ఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ విరాట్‌ కోహ్లి గురించి అప్‌డేట్‌ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

    కోహ్లి స్థానంలో అతడే
    అదే సమయంలో విరాట్‌ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను అఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపాడు. కాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఐపీఎల్‌-2026 ఫైనల్‌ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

    రోహిత్‌ సంగతేంటి?
    ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్‌డేట్‌ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కు చేరుకోనే లేదు.

    మరోవైపు.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్‌ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.

    అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేటెడ్‌)
    శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే, రోహిత్‌ శర్మ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), హార్దిక్‌ పాండ్యా (ఫిట్‌నెస్‌ ఆధారంగా).

    షెడ్యూల్‌
    జూన్‌ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు.

    చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీ వచ్చేశాడు

  • ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనంగా మారిన 15 ఏళ్ల భారత బుడ్డోడు వైభవ్‌ సూర్యవంశీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. వైభవ్‌ తొలిసారి భారత సీనియర్‌ జట్టుకు ఎంపికై సరికొత్త పలు రికార్డులు నెలకొల్పాడు. త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన మూడు భారత జట్లలో ఈ బిహారి బుడ్డోడు చోటు దక్కించుకున్నాడు.

    తద్వారా అత్యంత పిన్న వయస్సులో భారత సీనియర్‌ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరటి 37 ఏళ్ల పాటు ఉండిన ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 

    సచిన్‌ 1989లో పదహారేళ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్‌ మీద అరంగేట్రం చేయగా.. వైభవ్‌ కేవలం పదిహేనేళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. జూన్‌ 26 నుంచి ఐర్లాండ్‌తో జరుగబోయే సిరీస్‌లో వైభవ్‌ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖరారైంది. ఈ లెక్కన పదిహేనేళ్ల 91 రోజుల వయసులో వైభవ్‌ టీమిండియా అరంగేట్రం చేయడం కూడా ఖరారైనట్లే.

    ఈ క్రమంలో వైభవ్‌ మరో చారిత్రక రికార్డు నెలకొల్పడం కూడా ఖాయమైంది. అత్యంత చిన్న వయసులో టీ20 అరంగేట్రం చేయనున్న ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ జట్ల సభ్యుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పేరిట ఉంది. 

    ముజీబ్‌ 2018లో 16 ఏళ్ల 314 రోజుల వయసులో టీ20 అరంగేట్రం చేశాడు. త్వరలో (15 ఏళ్ల 91 రోజులు) వైభవ్‌ ముజీబ్‌ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్‌గా అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం​ చేసిన ఆటగాడి రికార్డు రొమేనియాకు చెందిన ఎం ఘెరసిమ్‌ పేరిట ఉంది. ఇతను 2020లో 14 ఏళ్ల 16 రోజుల వయసులో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 

  • ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు వేర్వేరు భారత జట్లను ఇవాళ (జూన్‌ 6) ప్రకటించారు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. 

    అందరూ ఊహించిన విధంగానే చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్‌కు మూడు జట్లలో చోటు దక్కింది. 

    తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు.

    ఇదే సందర్భంగా జూన్‌ 25 నుంచి శ్రీలంకలో పర్యటించాల్సిన భారత్‌-ఏ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధృవ్‌ జురెల్‌ ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా దేవదత్‌ పడిక్కల్‌ నియమించబడ్డాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అన్షుల్‌ కంబోజ్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు చోటు దక్కించుకున్నారు.

    శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌, ఎన్‌ జగదీశన్‌, అమన్‌ మోఖడే, షేక్‌ రషీద్‌, జీషన్‌ అన్సారీ

    ఇండియా-ఏ టూర్‌ ఆఫ్‌ శ్రీలంక షెడ్యూల్‌
    జూన్‌ 25- తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)
    జులై 2- రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)

     

  • అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. శ్రేయస్ గత మూడేళ్లగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. ఉన్నపళంగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

    ఐపీఎల్‌-2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన శ్రేయస్.. ఆ తర్వాత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది.

    ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను  అయ్యర్‌కు అప్పగించారు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కొత్త కెప్టెన్‌గా నియ‌మించ‌డంపై బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ స్పందించాడు. శ్రేయ‌స్  ఒక లీడ‌ర్‌గానూ, బ్యాట‌ర్‌గానూ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడ‌ని, అందుకే అత‌డికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగార్క‌ర్ తెలిపాడు.

    "శ్రేయ‌స్ ఇప్ప‌టికే కెప్టెన్‌గా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. అత‌డు గత కొన్నేళ్లుగా వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్ కింగ్స్‌) సమర్థవంతంగా నడిపించడం మ‌నం చూశాము. అయ్య‌ర్‌ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా కూడా అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే రేసులో అత‌డు చివ‌ర వ‌ర‌కు ఉన్నాడు.

    కానీ టీమ్ కాంబినేష‌న్ కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేకపోయాము. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక కెప్టెన్‌ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చింది. రాబోయో రెండేళ్ల కాలం మాకు చాలా ముఖ్యం.

    సూర్యకుమార్‌తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని విషయాలను అతడికి వివరించాము. అందుకు అతడు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలగా శ్రేయస్‌ అర్హుడని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అజిత్‌ పేర్కొన్నాడు.

  • టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్‌గా ముద్ర‌ప‌డిన సూర్య‌కుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడింది. తాజాగా శ‌నివారం ఇంగ్లండ్‌, ఐర్లాండ్ టూర్‌, ఆసియా గేమ్స్‌కు ప్ర‌క‌టించిన టీమిండియా జ‌ట్టులో సూర్య‌కుమార్‌కు చోటు ద‌క్క‌లేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కనీసం సూర్య పేరును ప్రస్తావించలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

    సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ కెరీర్ ఇలా అర్థంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియాకు ఆసియా కప్‌తో పాటు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకు వీడ్కోలు పలుకుతూ బీసీసీఐ చివరి మ్యాచ్ ఏమైనా ఆడిస్తుందేమో అని అభిమానులు ఆశించారు. 

    కానీ  బీసీసీఐ తన పంథా మార్చి ఫామ్‌లో లేని ఆటగాళ్లను నిరభ్యరంతంగా జట్టు నుంచి పక్కనబెట్టేస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్సీ పదవి నుంచి మాత్రమే సూర్యను తప్పిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, ఇవాళ ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ పేరు కనిపించకపోవడంతో అతడి కెరీర్‌కు ముగింపు పడినట్లయింది.

    తుఫానులా దూసుకొచ్చిన సూర్య
    31 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ అనతికాలంలోనే టీ20 క్రికెట్‌లో స్టార్ హోదాను పొందాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరు పొందిన సూర్య మైదానం నలువైపులా షాట్లు ఆడి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 

    దీంతో సూర్యకుమార్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అసమాన ప్రదర్శన కనబరిచిన సూర్య ఆట 2025 నుంచి పతనం దిశగా సాగింది. కెప్టెన్సీ ఒత్తిడిలో తన సహజసిద్ధమైన ఆటకు దూరంగా జరిగిన సూర్యకుమార్ ఫామ్‌లేమితో తంటాలు పడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్య పెద్దగా రాణించింది లేదు. అయితే టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్‌కు సూర్య కెప్టెన్ హోదాలో ఉండడమే అతడికి దక్కిన ఘనత అని చెప్పొచ్చు. 

    ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సూర్యకుమార్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సీనియర్ అయినా, అనుభవం ఉన్నా సరే ఫామ్‌లో ఉన్న ఆటగాడిగే తన మద్దతు ఉంటుందని కోచ్ గౌతమ్ గంభీర్ కుండబద్ధలు కొట్టడంతో సూర్యకుమార్ కెప్టెన్సీతో పాటు జట్టులో అతడి చోటు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 

    ఈ నేపథ్యంలోనే తాజాగా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌, ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన జట్టులో సూర్యకుమార్ చోటు కోల్పోయాడు. సూర్యకుమార్ టీమిండియా తరఫున 113 టీ20లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 25 అర్థసెంచరీలున్నాయి. దీంతో పాటు సూర్యకుమార్ 37 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 

    మొత్తంమీద టీమిండియాలోకి తుఫానులా దూసుకొచ్చిన సూర్యకుమార్ ఐదేళ్లు తిరక్కుండానే అశనిపాతంలా కిందకు పడిపోవడం గమనార్హం. చివరగా ఎన్నేళ్లు ఆడామాన్నది కాదు.. ఆడిన కొద్దికాలంలోనే తన పేరును చరితార్థం చేసుకున్న సూర్యకుమార్‌కు హ్యాట్సాఫ్‌. గుడ్‌బై మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్‌.

    చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీ వచ్చేశాడు.. ఇక దబిడిదిబిడే!

Politics

  • చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ప్రజలకు సరైన సేవ చేయలేకపోతున్నామని చెబుతూ 300 మందికి పైగా ఆ పార్టీ సభ్యులు టీవీకేలో చేరారు. శనివారం చెన్నై సమీపంలోని పనయూరులో  పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా వారు టీవీకేలో చేరి, సీఎం విజయ్‌ నాయకత్వాన్ని కొనియాడారు.

    టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్, అన్నా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కమలక్కన్నన్, మైలాపూర్ మాజీ ఎమ్మెల్యే నటరాజ్, మాజీ మంత్రి ఆనందన్, పరమక్కుడి మాజీ ఎమ్మెల్యే సాధన్ ప్రభాకర్, తిరుపత్తూర్ నగర కార్యదర్శి డిటి కుమార్, మరో 300 మందికి పైగా ఉన్నారు.

    టీవీకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎన్ ఆనంద్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సెంగొట్టైయన్, ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఈ చేరిక జరిగింది.

    మాజీ మంత్రి, సీనియర్ అన్నాడీఎంకే నాయకుడు ఉదుమలై రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. తనతో పాటు త్రిచి ఎన్ ఆర్ శివపతి, కడంబూర్ రాజు, ఎంసి సంపత్, పన్నీర్‌సెల్వం, గోవిందసామి, కొలత్తూర్ కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకులు అధికార టీవీకేలో చేరినట్లు తెలిపారు.

    మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత నాయకత్వాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె హయాంలో అన్నాడీఎంకే కార్యకర్తలు కఠిన క్రమశిక్షణ పాటించారని, ఆమె మరణం పార్టీకి పెద్ద దెబ్బగా మారిందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా అన్నాడీఎంకేలో కొనసాగినా, ప్రజలకు సమర్థంగా సేవ చేయలేకపోయామని, క్లిష్ట పరిస్థితుల్లో పనిచేశామని రాధాకృష్ణన్ తెలిపారు.

    ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌లో ఎంజీఆర్, జయలలిత ఆశయాలు కనిపిస్తున్నాయని, టీవీకేలో లభించిన గౌరవం, గుర్తింపే పార్టీలో చేరేందుకు ప్రేరణగా నిలిచిందని చెప్పారు. టీవీకే కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి సారిస్తూ యువ నాయకత్వానికి మద్దతు ఇస్తామని తెలిపారు.

    పార్టీ క్రమశిక్షణ పట్ల తమ అంకితభావాన్ని ప్రస్తావిస్తూ, నాయకత్వం అప్పగించే ఏ బాధ్యతనైనా నమ్మకంగా నిర్వర్తిస్తామని రాధాకృష్ణన్ చెప్పారు. భవిష్యత్తులో జిల్లాస్థాయి కార్యకర్తలు, సీనియర్ అన్నాడీఎంకే నాయకులు మరింత మంది టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలిపారు.  

    ఈ కార్యక్రమంలో మంత్రి సెంగొట్టైయన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని నమ్మి తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని చెప్పారు. "భారత చరిత్రలో పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే విజయం సాధించిన ఉద్యమం ఏదైనా ఉంటే అది తమిళగ వెట్రి కళగమే. ఎన్ని కూటములు ఏర్పడినా, తమిళ నేలపై పుట్టిన ఎవరూ తమిళనాడులో మా ఉద్యమాన్ని ఓడించలేరు. 

    స్వచ్ఛమైన పాలన అందించగల నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించారు. అది సాధించగల వ్యక్తి ఆయనే. ఎప్పటికీ విజయ్ తమిళనాడు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను విప్లవ నాయకుడు ఎంజీఆర్‌తో ప్రయాణించాను. విప్లవ నాయకురాలు అమ్మతో కూడా కలిసి పనిచేశాను. విశ్వాసం లేని వారు గెలిచారు. ఇతరులను నమ్మిన వారు ఓటమిని చూశారు" అని అన్నారు.

    ఇదే కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. సెంగొట్టైయన్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించే విషయంలో టీవీకే ప్రభుత్వం మాజీ డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను మించి పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత మంత్రివర్గాలతో పోల్చుతూ.. వారి వారసత్వాన్ని టీవీకే ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.

    "అన్నా, ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మలా నిజాయితీగా ఎదిగిన నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ సి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అవుతారని మేము ముందే చెప్పాం. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న పార్టీల నాయకులతో కూర్చున్నారని సెంగొట్టైయన్‌ను అన్నాఏడీఎంకే సభ్యులు ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎంజీఆర్ మంత్రివర్గంలో మంత్రి. కుమార్ అమ్మ మంత్రివర్గంలో మంత్రి. ఇప్పుడు ఇద్దరూ జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా ఉన్నారు" అని చెప్పారు.

  • తాడేపల్లి :  ఏపీలో దోచుకో, దాచుకో అనే రీతిలో పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబే ఎవరు ఎలా దోచుకోవాలో సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమాన్ని నేరుగా ప్రజలకు అందేలే డీబీటీ సిస్టం అమలు చేస్తే చంద్రబాబు మాత్రం డీపీటీ( దోచుకో.. పంచుకో-తినుకో) పద్థతి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దోపిడీనీ కూడా నిఖార్సుగా చేయడంలో చంద్రబాబు నిష్ణాతుడని, కార్యకర్తల నుండి మీడియా సంస్థల వరకు దోచి పెడుతున్నారన్నారు. 

    ఈరోజు(శనివారం, జూన్‌ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడిన టీజేఆర్‌..  చంద్రబాబుకు ఐదు ఎకరాల్లో కడుతున్న ఇంటి నిర్మాణం చేస్తున్నదెవరని ప్రశ్నించారు.  ‘ఆ సంస్థకు నక్కపల్లిలో ఇచ్చిన కాంట్రాక్టులు బయట పెట్టాలి. తెలంగాణలో హెరిటేజ్ ఐస్ క్రీం కంపెనీ నిర్మాణం చేస్తున్న కంపెనీ అమరావతిలో కాంట్రాక్టు సంస్థే. ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకుడుకి పోలవరం కాలువల నిర్మాణం కాంట్రాక్టు ఇచ్చారు. ఎల్లోమీడియా అంతా దొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఇబ్రహీంపట్నం దగ్గర హైడెల్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నారు. టీవీఫైవ్ యజమానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో అంతులేని అవినీతి, దోపిడీ జరుగుతోంది. 

    అమరావతిలో అడుగుకు రూ.20 వేలకు పైనే ఖర్చు చేయటం అవినీతికి పరాకాష్ట. అమరావతికి కనెక్టివిటీ రోడ్లే వేయలేకపోయిన చంద్రబాబు లక్షల కోట్లతో అమరావతి నిర్మిస్తారట. ఆల్రెడీ ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను కాదని మళ్ళీ వేల కోట్లతో కొత్తవి నిర్మించటం ఎందుకు?, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు తీవ్ర అన్యాయం చేసి, పెద్దలు మాత్రం భూదోపిడీ చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ అడుగుకు రూ.6 వేలు మాత్రమే. కానీ చంద్రబాబు మాత్రం రూ.20 వేలు ఎలా ఖర్చు చేస్తారు?, ఈ ఖర్చులు చూసి దేశ ఆర్ధిక నిపుణులే విస్తుపోతున్నారు. రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చేసే ఖర్చు చూస్తే కల్లు తిరగాల్సిందే. మద్యం, డీఎస్సీ, భూములు, ప్రాజెక్టులు.. ఏదీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు’ అని విమర్శించారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.

    ‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

    మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించింది YSRCP

    ..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

  • బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చేసిన తర్వాత చెన్నై ఈసీఆర్‌లోని ఆయన నివాసం సందడిగా కనపడుతోంది. ఆయన మద్దతుదారులు హడావుడిగా ఫోన్ కాల్స్ చేస్తుండడం, సీరియస్‌గా చర్చల్లో పాల్గొనడం కనిపిస్తున్నాయి. అన్నామలై బీజేపీతో బంధం తెంచుకోవడం చాలా తక్కువ కాలంలో, పెద్ద హడావుడి లేకుండానే ముగిసింది. న్యూఢిల్లీ పర్యటన, పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చల అనంతరం అన్నామలై తన రాజీనామాను ప్రకటించారు.

    ప్రస్తుతం అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమంలో ఇప్పటివరకు 14 లక్షలకు పైగా సభ్యత్వ నమోదులు జరిగాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది. జెన్ జీను ఆకర్షించే ప్రయత్నం వెబ్‌సైట్ (wetheleader.org) ప్రారంభంతో మొదలైంది. ఆ వెబ్‌సైట్‌లో పేరును నమోదు చేసుకుని అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమానికి మద్దతు లేదా దానిపట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు.

    జెన్‌ జీ యువతలో అన్నామలైకు మద్దతు వేగంగా పెరుగుతోంది. సోషల్‌ మీడియా వేదికలపై ఆయన సందేశాలకు భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కొత్త తరహా రాజకీయాలను యువత స్వాగతిస్తోంది. "వి ది లీడర్స్" ఉద్యమంలో వారు స్వచ్ఛందంగా చేరుతుండడమే దీనికి నిదర్శనం.

    డిజిటల్ వేదిక ద్వారా చేసిన ప్రసంగంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలను వేధిస్తున్న ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండటంతోనే బీజేపీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. “ప్రజలు తరచూ నన్ను అడుగుతుంటారు. మీరు తమిళ వ్యక్తా? లేక భారతీయుడా? అని. నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. నేను గర్వించే భారతీయుడిని. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాల్లో పెరిగాను” అని చెప్పారు.

    వైఖరిని చెప్పేసిన ప్రసంగం  
    ఆ వీడియో సందేశం, ఆయనతో జరిగిన సంభాషణల ఆధారంగా చూస్తే.. ప్రాంతీయతను పక్కన పెట్టినా స్థానిక ప్రయోజనాలను వదలకుండా, సమైక్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే, అధికారంలో ఉన్నవారిని జవాబుదారులుగా నిలబెట్టే కొత్త రాజకీయ వేదికను అన్నామలై నిర్మించబోతున్నట్లు కనిపిస్తోంది.

    మరోవైపు, “ఈ ఉద్యమాన్ని ప్రారంభించేందుకు మాకు 3 నెలలు పట్టింది. వి ది లీడర్స్” అని అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన ఓ వ్యక్తి చెప్పారు. ఈ టీమ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు లేరు. “అన్నామలై ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన 25 మంది ఉన్నారు. వారిలో కొందరు ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రులు, కొందరు ఐఐఎం లక్నోకు చెందినవారు, మరికొందరు సాఫ్ట్‌వేర్ రంగం నుంచి వచ్చినవారు” అని ఆ వ్యక్తి తెలిపారు.

    అన్నామలై కొత్త రాజకీయ ప్రయాణంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. యువతను చేరుకోవాలనే ఉద్దేశంతో అన్నామలై ఇప్పుడు సాంప్రదాయ మాధ్యమాలను పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇదే విధానం టీవీకేకు మంచి ఫలితాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే పత్రికా సమావేశానికి బదులుగా, ఈ సారి తన ప్రణాళికను నేరుగా ప్రజలకు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా తెలియజేయాలని ఆయన నిర్ణయించారు.

    జాతీయవాదం+తమిళ గుర్తింపు 
    అన్నామలై టీమ్‌లో ఉన్నవారు మాట్లాడుతూ.. “మా నాయకుడి సిద్ధాంతం జాతీయవాదం-తమిళ గుర్తింపు/తత్వం కలయికగా ఉంటుంది. అవసరమైతే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానైనా ప్రజా సమస్యలను లేవనెత్తుతాం” అన్నారు. మూడు భాషల విధాన అమలుకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన ట్వీట్ దీనికి ఉదాహరణ.

    విజయ్‌కు పోటీగా నిలిచే, ప్రజలను ఆకర్షించే నాయకుడి స్థానం ఖాళీగా ఉందని అన్నామలై భావిస్తున్నారు. ఆ ఖాళీని తాను భర్తీ చేయగలనని అన్నామలై నమ్ముతున్నారు.

    2031 తమిళనాడు ఎన్నికలు లక్ష్యం 
    రానున్న కొన్ని నెలల్లో ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింతగా మమేకమవడం, “వి ది లీడర్స్” అనే వెబ్‌సైట్‌లో లక్షలాది సభ్యులను చేర్చుకోవడం, 2031 తమిళనాడు ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకోవడం అన్నామలై ప్రణాళికగా సోర్సెస్‌ తెలిపాయి.

    తన కొత్త రాజకీయ ప్రయాణంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని వర్గాలు సూచిస్తున్నాయి. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ప్రకటించారు.

    తమిళనాడు స్పష్టంగా కొత్త యుగంలోకి అడుగుపెడుతోంది. కొత్త వ్యక్తులు రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తున్నారు. ఒకవైపు సి జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు.  అధికారిక రాజకీయ ప్రవేశం చేసిన 28 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అసాధ్యాన్ని సాధించారు.

    మరోవైపు ద్రావిడ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రతీదానికి అంతర్గత సవాళ్లు ఉన్నా, గత 6 దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రజా మద్దతుపై అవి ఆధారపడుతున్నాయి.  

    సామాజిక మాధ్యమాల యుగంలోకి మనం మరింతగా ముందుకు వెళ్తున్నాం. అక్కడ క్యాన్సల్ కల్చర్ (ప్రజా వ్యతిరేకత కారణంగా వ్యక్తులు లేదా సంస్థలను సామాజికంగా తిరస్కరించే ధోరణి), ఎవరినీ విడిచిపెట్టకుండా చేసే విమర్శలు చురుకుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని సంపాదించి, దాన్ని నిలబెట్టుకోగలరా? దానికి సమాధానం కాలమే చెబుతుంది.
     

Andhra Pradesh

  • తాడేపల్లి:  రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి..  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్‌-వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్‌కు శుభాకాంక్షలు అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  ఆల్‌ ది బెస్ట్‌ కేఎస్‌ భరత్‌ అంటూ పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్‌, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్‌,.
     

     

     కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్‌కీపర్‌గా 18 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.

    అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.

    లిస్ట్‌-ఏ క్రికెట్‌లో భరత్‌ 82 మ్యాచ్‌లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్‌లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో భరత్‌ 11 మ్యాచ్‌ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు.  

  • సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

    ‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    విజయదుర్గ అధిపతి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి

      

Family

  • ఈ ఎండల్లో చర్మం నిర్జీవంగా, అలసటగా మారడం సహజం. అయితే, మీ చర్మాన్ని చల్లబరిచి, తేమను అందిస్తూ, ఆరోగ్యంగా ఉంచడానికి మన ఇంట్లోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.

    ఎండ తీవ్రత వల్ల చర్మంపై వచ్చే మంట, ఎరుపుదనం, సన్‌బర్న్‌ను తగ్గించడంలో కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చర్మాన్ని శాంతపరచడానికి, చికాకును తగ్గించడానికి అలోవెరా జెల్‌ ఒక ఉత్తమమైన ఔషధం.

    గంధానికి చర్మాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఎండకాలంలో వచ్చే మొటిమలను తగ్గించడానికి, చర్మంపై వచ్చే దురద, మంటను నివారించడానికి గంధం పూత వేసుకోవడం వల్ల తక్షణ ఫలితం కనిపిస్తుంది.

    రోజ్‌ వాటర్‌ చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ, జిడ్డును నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు మూసుకు΄ోకుండా, ముఖాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచే ఒక అద్భుతమైన నేచురల్‌ టోనర్‌గా ఇది పనిచేస్తుంది.

    గ్రీన్‌ టీ కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మంపై వచ్చే మంట, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మొటిమల సమస్యతో బాధపడేవారికి, సున్నితమైన చర్మం గలవారికి చక్కని టోనర్‌గా ఉపయోగపడతాయి.

    దోసకాయలో నీటి శాతం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై వచ్చే వాపును తగ్గించడమే కాకుండా, ముఖానికి తక్షణ చలవను అందిస్తుంది. అలసి΄ోయిన, ఎండ వేడికి గురైన చర్మానికి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. 

    (చదవండి: సైక్లింగ్‌తో యాక్టివ్‌గా..!)
     

  • పిల్లలూ... ఎవరికైనా ఆరోగ్యం హటాత్తుగా పాడైతే, ప్రమాదం జరిగితే అంబులెన్స్‌ వస్తుంది కదా. ‘కుయ్‌కుయ్‌’ అని సౌండ్‌ చేసుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. మరి గంగానదిలో ఉండే డాల్ఫిన్‌కి ప్రమాదం జరిగితే ఎవరు కాపాడతారు? అందుకే మన దేశం ప్రపంచంలోనే మొదటి ‘డాల్ఫిన్‌ అంబులెన్స్‌’ని తయారు చేసింది. దీని పని ఏంటో తెలుసా? నదిలో దారి తప్పిన, గాయపడిన డాల్ఫిన్స్‌ని కాపాడి, మందు వేసి, మళ్లీ నదిలో వదిలిపెట్టడం. ‘నమామి గంగే’ అనే పథకం కింద ఈ అంబులెన్స్‌ని మొదలుపెట్టారు. అంటే గంగమ్మను, గంగలో ఉండే జీవులను కాపాడటమే దీని లక్ష్యం.

    ఈ అంబులెన్స్‌ స్పెషల్‌ ఏంటి?
    ఇది కదిలే హాస్పిటల్‌. మన 108 లాగే ఇది కూడా ఒక మొబైల్‌ ఐ.సి.యు,  అంటే లోపల డాక్టర్ల సామాన్లు, మందులు, ఆక్సిజన్‌ అన్నీ ఉంటాయి. డాల్ఫిన్‌కి ఎక్కడ దెబ్బ తగిలినా వెంటనే ట్రీట్మెంట్‌ ఇవ్వొచ్చు. ఇది ఈ ఏడాది జనవరిలో మొదలైంది. ఇప్పటిదాకా ఎనిమిది డాల్ఫిన్‌లను కాపాడింది. సూపర్‌ కదా!  ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఒక పెద్ద డాల్ఫిన్‌ ఇటీవల కాలువలో ఇరుక్కుపోయింది. నీళ్లు తక్కువై నీరసంగా అయి΄ోయింది. వెంటనే మన ‘డాల్ఫిన్‌ 108’ వచ్చేసింది. 13 గంటలు కష్టపడి, బయటికి తీసి, చెకప్‌ చేసి, రాప్తి నదిలో సేఫ్‌గా వదిలిపెట్టారు. 

    గంగా డాల్ఫిన్‌ అంటే?
    ఇది మంచి నీటి డాల్ఫిన్‌. సముద్రంలో ఉండదు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాంలోని నదుల్లో కనిపిస్తుంది. అత్యధికంగా గంగలోనే. ప్రపంచంలో మంచినీటి డాల్ఫిన్లు కేవలం 5–6 జాతులు మాత్రమే ఉన్నాయి. అందులో గంగా డాల్ఫిన్‌ ఒకటి. అదీ అంతరించిపోయే దశలో ఉంది. అందుకే దీనికి ‘జాతీయ జలచర జంతువు’ హోదా ఇచ్చారు. మన నెమలి, పులి లాంటిదన్నమాట. 

    దీనికి కళ్ళు సరిగా కనిపించవు. ‘క్లిక్‌ క్లిక్‌’ అని సౌండ్‌ చేసి దారి కనుక్కుంటుంది. ఎప్పుడూ నవ్వుతున్నట్టే ఉంటుంది. అందుకే దీన్ని ‘నవ్వే దేవత’ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇవి కేవలం 6,324 మాత్రమే మిగిలాయి. అందుకే ప్రతి డాల్ఫిన్‌ చాలా విలువైనది. మనం నదిని శుభ్రంగా ఉంచితే, డాల్ఫిన్‌ హ్యాపీగా ఈదుకుంటూ ఉంటుంది. సరేనా?.

    (చదవండి: గుప్పెడు పూలు... గుండెనిండా పరిమళం)

     

  • ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్‌. మరి ఆ సైక్లింగ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

    శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
    రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్‌ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

    ఒత్తిడిని తగ్గించే ప్రాణయామం
    యోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.
    ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. 
    భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.
    కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
    భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.
    ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.
    – అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌ 

    (చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..)

  • ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్‌ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్‌ చేస్తే... అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తర్వాత  అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్‌ సక్సెస్‌ జర్నీ... జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది, యువతకు ప్రేరణ కలిగిస్తుంది.  

    కలిఖో పుల్‌... ఆ పేరుకు అర్థం 'మంచి భవిష్యత్తు' అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా.. ఊహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్‌ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్‌. అలా దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని అతడి అత్తయ్య చేరదీసింది. 

    అది అతడి మీద ప్రేమతో కాదు... ఇంట్లో పనులకు పనికొస్తాడని. పదేళ్లకు వడ్రంగిగా... ఆరేళ్ల వరకూ పుల్‌ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్‌ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని 'హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌'లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. 

    అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్‌ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్‌ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్‌ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. 

    జీవితాన్ని మలుపు తిప్పిన ఆ పాట..
    పుల్‌ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్‌ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్‌ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్‌. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్‌ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. 

    ఓరోజు పుల్‌ చదువుతోన్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్‌ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్‌ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్‌, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్‌ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. 

    విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాడు. అదే పుల్‌ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఆత్మహత్యవైపు అడుగులు తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టం మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. 

    నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్‌ చేయించుకోకుంటే గానీ సమస్య తగ్గదనే పరిస్థితి వచ్చింది. 

    డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు. చదువుకుంటూనే పని జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. 

    ఎలాగైనా ఆపరేషన్‌ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్‌ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్‌, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్‌ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. 

    క్రమంగా పుల్‌ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. దాన్నే ఉపాధిగా చేసుకుని అంచలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్‌ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. 

    ఓవైపు ఇంటర్‌ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్‌ హ్యాండ్‌ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు. పాతికేళ్లకే ఎమ్మెల్యే చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్‌ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్‌ సెక్రటరీ బాధ్యతలతో పుల్‌ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్‌ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. 

    అల్సర్‌ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. 

    మంత్రిగా 22ఏళ్లు
    చిన్న వయసులోనే స్థానికంగా పుల్‌ సంపాదించిన పేరు కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడు కాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్‌. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు.  తొలి ఎన్నికల్లో పుల్‌ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు.

    మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 'ఒకప్పుడు ఆపరేషన్‌ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్‌ రెండువేల ఐదొందలు గ్రాంట్‌ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా' అంటూ పుల్‌ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22 ఏళ్లు పుల్‌ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్‌ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. 

    కష్టమే దేవుడని నమ్ముతా..
    ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరదించి, ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. "నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్‌గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. 

    ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్‌గా, కాంట్రాక్టర్‌గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు 12 గంటలు ప్రభుత్వ వాచ్‌మన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు 24 గంట‌లూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు". అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్‌. అయితే పుల్‌ ఆగస్టు 9, 2016న 47 ఏళ్ల వయసులో మరణించాడు.

    చదవండి: బీఎండబ్ల్యూ కారు, రూ. 40 లక్షల జీతం.. కానీ పేదవాడే! 

  • మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్‌కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్‌ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

    కన్సల్టెంట్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ సన్నీ గార్గ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.  పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్‌ 34 ఏళ్ల గుర్గావ్‌ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్‌ఫుల్‌ మ్యాన్‌లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్‌ సన్నీ. 

    ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్‌ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్‌ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు. 

    దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్‌ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్‌ సన్నీ  "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్‌ అని ఎన్నిసార్లు అనుకున్నావ్‌ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం. 

    రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్‌గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ‍ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్‌ సన్నీ. 

    అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్‌ చేస్తూ పోస్టలు పెట్టారు.

     

     (చదవండి: భారత్‌ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు)