Archive Page | Sakshi
Sakshi News home page

International

  • రియాద్‌: అరబ్ దేశమైన సౌదీ అరేబియా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ముస్లిమేతర  విదేశీయులకు  మద్యం విక్రయాలకు అనుమతిచ్చేలా షరియా చట్టాల్ని సడలించినట్లు తెలుస్తోంది. విజన్‌  2030 సౌదీ లిబరలైజేషన్ పేరుతో  ప్రస్తుతం దేశాన్ని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి విభిన్న రంగాలకు విస్తరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సౌదీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

    సౌదీ అరేబియా ఇప్పటివరకు షరియా చట్టం ప్రకారం మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. కానీ ఇటీవల ప్రభుత్వం ముస్లిమేతరల (Non-Muslim Expats) కోసం ప్రత్యేకంగా మద్యం విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం సౌదీ అరేబియా దేశ సామాజిక, ఆర్థిక, పర్యాటక రంగాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావించబడుతోంది.

    కొత్త విధానంతో ముస్లిమేతర విదేశీయులు ప్రత్యేక లైసెన్స్ పొందిన స్టోర్లలో మద్యం కొనుగోలు చేయొచ్చు. ఈ కొనుగోళ్ల విషయంలో కఠిన నిబంధనలు వర్తిస్తాయి.  

    సౌదీ అరేబియా విజన్‌ 2030 ప్రణాళికలో భాగంగా పర్యాటకాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మద్యం విక్రయాలతో పాశ్చాత్య దేశాల నుండి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సౌదీ (saudi arabia) యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) ఆధ్వర్యంలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. 

    అయితే, ఈనిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. పలువురు సౌది రాజు తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే మరికొందరు మాత్రం మద్యం అమ్మకాలతో షరియా చట్టాల్ని అతిక్రమించడమేనంటూ తప్పుబడుతున్నారు. 

    ఏది ఏమైనా రాజు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ వర్గాల నుంచి అంటే పర్యాటకరంగం మీద ఆధారపడే హోటల్ యజమానులు, ట్రావెల్ ఏజెన్సీలు సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సడలించిన షరియా నిబంధనలు కారణంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు,పర్యాటక రంగానికి గణనీయంగా ఆదాయ మార్గాలు పెరగడం, కొత్త వ్యాపార అవకాశాలు పుట్టుకు రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

  • బంగ్లాదేశ్‌.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.  ఆ ప్రభుత్వానికి చీఫ్‌ అడ్వైజర్‌గా మహ్మద్‌ యూనస్‌ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగెన ఉన్న భారత్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయి.  గతంలో భారత్‌ చేసిన త్యాగాన్ని మరిచి మరీ బంగ్లాదేశ్‌ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంది. బంగ్లాదేశ్‌ ఏర్పాటులో భారత్‌ది కీలక పాత్ర అనేది చరిత్రను అడిగితే చెబుతుంది,. మరి అటువంటిది బంగ్లాదేశ్‌ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. 

    నిశితంగా గమినిస్తున్న భారత్‌..
    కొంతకాలం క్రితం మహ్మద్‌ యూనస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉన్న సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్‌ తెగ ఆరాటపడిపోతంది. ఆ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురి నేతల వెంట కూడా వస్తుంది. ఈ వ్యవహారాల్ని గమనిస్తు ఉన్న భారత్‌.. వారి వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది.  ఒకనాడు పాకిస్తాన్‌కు మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్‌ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్‌..  బంగ్లాదేశ్‌ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్‌ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్‌ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్‌.. ‘వారి వెనుక ఎవరున్నారు’ అనే విషయంపై కన్నేసి ఉంచింది. 

    గతంలోనే ప్రధాని మోదీ వార్నింగ్‌..!
    ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మహ్మద్ యూనస్‌ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  ఏప్రిల్‌ నాల్గో తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్  వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్‌ యూనస్‌ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్‌ కట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.  ‘మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.

     ఆనాడు యూనస్‌ ఏమన్నారంటే..
    ఏప్రిల్‌ మొదటి వారంలో యూనస్‌.. భారత్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశారు. సెవన్‌ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌ సాగర రక్షకుడిగా  ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూసఫ్‌ తెగ తంటాలు పడిపోతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. 

    భారత్‌పై మరోసారి పరోక్షంగా అక్కసు..
    శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నముహమ్మద్ యూనస్..హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.  ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు. అంటే భారత్‌పై పరోక్షంగా యూనస్‌ వ్యాఖ్యానించట్లైంది. 

    భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్‌గా హాది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశీయుల అనుసరిస్తున్నారని యూనస్‌ అంటున్నారు. అంటే  ఆ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    మరో చోటా నేత సైతం..
    బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు.  దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  కూడా తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.

    పాక్‌ను మోకరిల్లేలా చేసిన వేళను మరిచారా?
    1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. సుమారు 300,000 నుండి 3,000,000 మంది వరకు బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా.  పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 200,000 నుండి 400,000 వరకూ అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్‌కు.   ఆనాడు భారత్‌కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహోసపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్‌ ఆటనును 13 రోజుట్లోనే కట్టించింది. 

    డిసెంబర్‌ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో ఈస్ట్‌ పాకిస్తాన్‌ కాస్తా బంగ్లాదేశ్‌గా మారింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాక్‌ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగబాటుగా కూడా రికార్డులెక్కింది.  పాకిస్తాన్‌ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్‌ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్‌ ఇంతటి త్యాగం చేస్తే.. మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదువ్వడానికి సిద్దం కావడం. ఒకటైతే.. అప్పుడ పాకిస్తాన్‌కు ఎదురైన అతి పెద్ద పరాభవం.. నేటి బంగ్లాదేశ్‌ ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే. 

Movies

  • తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్‌ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్‌ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్‌ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్‌ మెటీరియల్‌ అని ముందుగానే ఫిక్సయిపోయారు.

    అంతా తలకిందులు
    కట్‌ చేస్తే బిగ్‌బాస్‌ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్‌కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్‌ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్‌ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్‌ ఇవ్వడంతో అలర్ట్‌ అయ్యాడు.

    రూటు మార్చాడు
    అప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్‌ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

    జనాలకు కనెక్ట్‌..
    తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్‌ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్‌ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్‌ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్‌ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.

    పారితోషికం ఎంత?
    కల్యాణ్‌ కోసం సోషల్‌ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్‌ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్‌ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్‌ అని గుర్తు చేశాడు. జై జవాన్‌ అన్న నినాదం కూడా అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది.

  • తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్‌ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్‌ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్‌ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. 

    మనింటి అమ్మాయి
    ఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్‌ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్‌ సెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్‌ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్‌ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.

    ఫ్రెండ్‌ కోసం స్టాండ్‌
    అతి చనువుకు, లవ్‌ ట్రాక్‌కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్‌ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్‌ రీతూని సేవ్‌ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. 

    శత్రువు కూడా మిత్రువే!
    వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్‌ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్‌ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.

    గెలిచేవరకు పోరాటం
    అవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్‌ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్‌ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్‌ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్‌ అంతా సాగిందని బిగ్‌బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్‌ గేమ్‌ ఆడింది. ఇమ్మాన్యుయేల్‌తో సమానంగా ఈ సీజన్‌ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. 

    పారితోషికం ఎంత?
    ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్‌ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్‌ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.

    చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో చరిత్ర సృష్టించిన కల్యాణ్‌

  • తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్‌ 21న) జరిగిన గ్రాండ్‌ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్‌ నాలుగో స్థానంలో నిలవగా పవన్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్‌ పవన్‌ కల్యాణ్‌ పడాల గెలిచాడు. బిగ్‌బాస్‌ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్‌ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. 

    సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్‌ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.

    రెమ్యునరేషన్‌ ఎంత?
    సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్‌ ఫిక్స్‌ చేసింది బిగ్‌బాస్‌ టీమ్‌. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్‌ రూ.15 లక్షల సూట్‌కేస్‌ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. 

    రాఫ్‌ టైల్స్‌ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్‌ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు.  ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది.

  • బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. 

    సూట్‌కేస్‌తో బయటకు
    రెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్‌ మహారాజ రవితేజ ఆఫర్‌ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్‌ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్‌ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్‌.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్‌నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. 

    ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలు
    కామనర్‌గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. 

    టాస్కుల బాహుబలి
    కానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్‌ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.

    సంపాదన ఎంతంటే?
    ఇతడి రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది.

  • కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్‌ను నాగార్జున సీజన్‌ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్‌ స్టార్‌.. ప్రేక్షకుల సపోర్ట్‌ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్‌ బిల్డప్‌ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. 

    తప్పెవరిది?
    విన్నర్‌ కాదు కదా రన్నర్‌వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్‌ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. 

    సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి
    సంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్‌ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. 

    కెప్టెన్సీ త్యాగం
    మాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్‌ నుంచి కాపాడుకునే ఛాన్స్‌ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్‌, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్‌ కూడా ఉన్నాయి. 

    ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?
    మొదట నామినేషన్‌ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్‌ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్‌ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్‌ సింహంలా ఎన్నో గేమ్స్‌ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. 

    మరోసారి రుజువైంది!
    కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్‌ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్‌ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్‌లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్‌ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు!

  • బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్‌- 5 నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో  ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్‌ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్‌ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్‌-5 వరకు చేరుకుంది.

    సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో  ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్‌ చేసిందో సంజన జర్నీ  వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.

    సంజన రెమ్యునరేషన్‌
    సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్‌-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్‌ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్‌ వచ్చినట్లు టాక్‌. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది.  ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్‌ కార్యక్రమాన్ని నిర్మాత దిల్‌ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

    టాలీవుడ్ ప్రో లీగ్‌కు  హానరరీ చైర్మన్‌గా దిల్‌రాజు వ్యవరించనున్నారు. క్రికెట్‌-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్‌ను ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.

    ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో  మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. 

     

    *
     

  • 'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్‌ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.

    స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.

    సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్‌లో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.

    అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు.

  • సమంత ఫేస్‌లో కొత్త పెళ్లికూతురి కళ

    గ్రీన్ డ్రస్‌లో మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్

    డ్యాన్స్ చేస్తూ మాయ చేస్తున్న 'ఫౌజీ' ఇమాన్వీ

    'బలగం' ఫేమ్ కావ్య కల్యాణ్ రామ్ వీకెండ్ ట్రిప్

    జిగేలుమనేలా దడపుట్టించేస్తున్న సంయుక్త

    బ్యాంకాక్ ట్రిప్‌లో సీరియల్ బ్యూటీ నవ్వస్వామి

  • శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ వీకెండ్ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్, పాటలతో బజ్ తీసుకొచ్చే కాస్త బజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీలోని ఐ యామ్ ఛాంపియన్ అంటూ సాగే టైటిల్ గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో ఒకప్పటి టాలీవుడ్ బాలనటి కనిపించడం విశేషం. మరి ఈమెని గుర్తుపట్టారా?

    (ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)

    ఛాంపియన్ మూవీలో రోషన్‌తో పాటు ఓ పాటలో కనిపించిన ఈ బాలనటి పేరు అవంతిక వందనపు. తెలుగు మూలాలున్నప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగులో ప్రేమమ్, ఆక్సిజన్, బాలకృష్ణుడు, మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది. తర్వాత ఇంగ్లీష్‌లోనూ పలు సినిమాలు, సిరీస్‌లు చేసింది. మళ్లీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత తెలుగులో 'ఛాంపియన్'లోని స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

    వైజయంతీ మూవీస్ నిర్మించిన 'ఛాంపియన్' చిత్రంతో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వాతంత్ర‍్య బ్యాక్ డ్రాప్‌లోని పీరియాడికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రోషన్ గతంలో 'పెళ్లి సందD'లో హీరోగా నటించాడు. అది అంతంత మాత్రంగానే ఆడింది. ఇదొచ్చిన మూడేళ్లకు ఇప్పుడు 'ఛాంపియన్' అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి?

    (ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)

  • తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్‌ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్‌బాస్‌ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్‌ రాజ్‌పుత్‌ వంటి పలువురు తారలు డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్‌, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.

    బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీకాంత్‌
    హీరో శ్రీకాంత్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్‌పై అన్‌సేఫ్‌ అని రాస్తారో వారు ఎలిమినేట్‌ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్‌ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్‌ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్‌ సంజనా ఎలిమినేట్‌ అయినట్లు లీక్స్‌ వచ్చాయి. 

    రోబో ఎలిమినేట్‌!
    తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్‌ ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్‌, మరోపక్క ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్‌ దేశంలోనే టాప్‌ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్‌బాస్‌ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్‌ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్‌ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..

    &

  • దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?

    పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.

    (ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)

    ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

    గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్‌లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.

    మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. 

    (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్)

  • నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్‌ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నరేశ్‌ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్‌ నుంచే 90 శాతం థియేటర్స్‌ ఫుల్‌ అవుతున్నాయి. 

    కొన్ని ల్యాగ్‌ సీన్స్, సాంగ్స్‌ ట్రిమ్‌ చేశాం. ఆ ట్రిమ్‌ అయిన వెర్షన్‌కూ రెస్పాన్స్‌ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్‌ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్‌ షోస్‌ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్‌. ‘‘థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్‌ చేసి, మా సినిమాను హిట్‌ చేయాలి’’  అని కోరారు వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌. హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్‌ జీవన్‌ కుమార్, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, వంశీధర్‌ కోసిగి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కృష్ణ సౌరభ్‌ మాట్లాడారు. 

  • అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్‌ ప్యాకేజ్‌ మీల్‌లా ఉండేది. బిగ్‌బాస్‌ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. 

    అందరికీ నచ్చేది ఒక్కరే
    ఓన్లీ లవ్‌ ట్రాక్స్‌ అంటే యూత్‌కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్‌ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్‌ ఉంటుంది. 

    బిగ్‌బాస్‌లో కామెడీ అంత ఈజీ కాదు!
    మరి బిగ్‌బాస్‌లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్‌, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్‌ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్‌. 

    నాలుగో స్థానం..
    కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్‌ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్‌ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్‌ అయినట్లు లీక్స్‌ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్‌ రోహిణి సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. 

    నువ్వే రియల్‌ విన్నర్‌
    అతడి విషయంలో బిగ్‌బాస్‌ టీమ్‌, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్‌ అయ్యారు అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ పెట్టింది. బిగ్‌బాస్‌ 9 సీజన్‌ నన్ను చాలా డిసప్పాయింట్‌ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్‌టైనర్స్‌కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్‌బాస్‌కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది.

  • బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్‌ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత  ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది.  ఓటింగ్‌ ప్రకారం కల్యాణ్‌, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్‌ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్‌ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.

    బిగ్‌బాస్‌ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్‌ నిలిచారంటూ వికీపీడియా అప్‌డేట్‌ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్‌ నెట్టింట వైరల్‌  అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్‌ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్‌లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్‌ టీమ్‌తో ఉండవు.

  • టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్‌గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.

    'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు'

    'ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.

    ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్‌కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది.

  • ‘ఎవర్ని చూసుకునిరా ఆ పొగరు.. అని అడుగుతుంటారు. కానీ నన్ను చూసుకునే నాకు ఆ పొగరు’’ అన్నారు ఇటీవల సినీయర్‌ హీరో నందమూరి  బాలకృష్ణ. తాజాగా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ తాండవం బాక్సాఫీస్‌ వద్ద తానాశించినట్టుగా తాండవమాడకపోవడం అనే నిజం నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నారో తెలీదు కానీ... ఆయన గుర్తించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు

    సినీ పండితులు. వాళ్లు చెబుతున్న ప్రకారం...బాలకృష్ణ ఏమీ స్వయంకృషితోనో, ఏ వారసత్వం లేకుండానో ఎదిగిన నటుడు కాదు. ఇప్పటికీ ఆయన ప్రతీ చోటా స్మరించే తండ్రి పేరు... ఎవరి పుణ్యాన తాను  హీరోగా నిలబడగలిగాడో చెప్పకనే చెబుతుంది. మరి బాలకృష్ణకు ఎందుకు ఉండాలి పొగరు? తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌...వీళ్లెవరికీ లేని ప్రత్యేకత ఆయనలో ఏముందని తనను తాను చూసుకోవాలి? తల పొగరు ఉండాలి? తండ్రి వారసత్వంతో పాటు తెలుగు నాట ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం, అలాగే తమ కులమే అన్ని రంగాల్లో ముందుండాలనే కులోన్మాదం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. 

    అవే ఆయన తన నటనా ప్రతిభకు మించిన స్థాయిని ఆయనకు కట్టబెట్టాయనేది బహిరంగ రహస్యం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నోరు జారినా ఎంతమందిని తూలనాడినా ఆయనపై అదే స్థాయిలో ఎవరూ తిరగబడకపోవడానికి ఆయన నటనా ప్రతిభో లేక తిరుగులేని స్టార్‌డమ్మో కారణం కాదనీ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గ బలమేననేది తలపండిన ఆ విళ్లేషకుల మాట.

    దాదాపుగా కొన్ని దశాబ్ధాల పాటు అటు నటనలో గానీ, ఇటు అభిమానధనంలో గానీ చిరంజీవి మెగా స్థాయి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బాలకృష్ణ... ఇటీవల తన వయసు 60 దాటాక కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు దక్కించుకోగలిగారు. దానికి ఆయన సంతోషించవచ్చు... ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. అంతే గానీ ఈ స్వల్పకాలపు విజయాలకే తనకెవరూ సాటిలేరన్నట్టు  మిడిసిపాటు తగదు. అది ఇతరుల కన్నా ఆయనకే ఎక్కువ చేటు చేస్తుందని ఆయన గ్రహించాలి. తనను తాను గొప్పగా చెప్పుకుని చెప్పుకునే స్వోత్కర్షల్లో ప్రమాదం ఏమిటంటే.. నిజంగానే తాను గొప్ప అనే భ్రమల్లోకి వెళ్లిపోవడం అదే ఆయన అఖండ తాండవానికి చావు దెబ్బ కొట్టింది.

    సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో  ఉండాలని ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాప్‌ హీరోలు అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అదే సమయంలో విడుదలైన  అఖండ(Akhanda 2) సినిమా గురించి బాలకృష్ణ మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం... ‘‘నా సినిమాలకు రేట్లు పెంచనవరం లేదు. పెంచకపోయినా నష్టం రాదు’’ అంటూ చెప్పారాయన. అయితే అదే బాలకృష్ణ రెండవ  సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి తనను తాను బాక్సాఫీస్‌ కింగ్‌ లాగో, పాన్‌ ఇండియా హీరోగానో భ్రమించారనీ. అవసరానికి తన స్థాయికి మించి నిర్మాతల చేత భారీ పెట్టుబడులు పెట్టించారనేది సినీ పండితుల వ్యాఖ్య. 

    దాంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే జనం ఎగబడి చూస్తారని అనవసర అపోహలు ఏర్పరచుకున్నారంటున్నారు. అయితే సీనియర్‌ తెలుగు హీరోల్లో  అంతో ఇంతో నాగార్జునని తప్ప మరెవరినీ ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోరు అనే నిజం బాలకృష్ణకి తప్ప అందరికీ తెలుసు. ఆ నిజం ఆయనకు కనపడనీయకుండా తల పొగరు  కళ్లు మూసేసింది. ఆ ఫలితమే ఉత్తరాదిలో అఖండ తాండవం తాలూకు ఘోర పరాజయం. ఇకనైనా బాలకృష్ణ తన భజనపరుల, కులోన్మాదులను కాక వాస్తవ డిమాండ్‌ను స్థాయిని గుర్తించి మసలుకుంటే... గతంలో నిర్మాతలకు అందుబాటులో హీరోగా  ఆయనకు ఉన్న ఇమేజ్‌ అయినా కాపడుకుంటారని సినీ మార్కెట్‌ నిపుణులు అంటున్నారు..

  • దర్శకధీరుడు రాజమౌళి- ‍ప్రిన్స్ మహేశ్‌బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్‌ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్‌ ప్రకటించేందుకే భారీ ఈవెంట్‌ నిర్వహించారు. గ్లోబ్‌ట్రాటర్‌ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. 

    అయితే ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్‌ఆర్‌కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ‍అడ్వెంచరస్‌ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.

    ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్‌పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్‌ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్‌ స్పందిస్తూ.. అంటే బడ్జెట్‌లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

  • ‘బిగ్‌బాస్‌’ షోతో కెరీర్‌ పరంగా ఎదగాలి..  కంటెస్టెంట్స్‌ ఆలోచన ఇది. కంటెస్టెంట్స్‌ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్‌తో షోని సక్సెస్‌ చేసుకోవాలి.. ‘బిగ్‌బాస్‌’ స్ట్రాటజీ ఇది. ఇందులో ఇప్పటి దాకా బిగ్‌బాస్‌ యూనిట్‌ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే ఎనిమిది సీజన్స్‌లో విన్నర్స్‌ కానీ, కంటెస్టెంట్స్‌ కానీ హౌస్‌‌ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్‌కి షో ప్లస్‌ అయిందీ లేదు.

    బిగ్‌బాస్‌ 1విన్నర్‌గా శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్‌లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. 'అనగనగా ఒక రోజు', 'చందమామ' వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌ బాస్‌తో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్‌లో పెద్ద మార్పు అయితే రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా బ్రేక్ రాలేదు. ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నట్లు, షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, అవకాశాలు పెరగలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌పై ఫోకస్ చేస్తున్నాడు.

    బిగ్‌ బాస్‌ 2 విన్నర్‌ కౌశల్‌ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్‌ పేరు మారుమోగింది. కౌశల్‌ ఆర్మీ పేరుతో యువత హల్‌చల్‌ చేశారు. బిగ్‌బాస్‌ షోలో ఏ కంటెస్టెంట్‌కు రాన్నంత ఇమేజ్‌ కౌశల్‌కు వచ్చింది. బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుస ఆఫర్స్‌ వస్తాయని ఆశించారు.  కానీ, షో తర్వాత అతని పేరు క్రమంగా మరుగున పడింది. టాలీవుడ్‌లో పెద్ద అవకాశాలు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్‌లు, చిన్న రోల్స్ చేశాడు, కానీ స్టార్‌డమ్ రాలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగినా, కెరీర్ మలుపు తిరగలేదు. నేడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు, కానీ ఇండస్ట్రీలో హైలైట్ కాలేదు.

    సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌కి ఈ షో కాస్త ఉపయోగపడింది. బిగ్‌బాస్‌ 3 విన్నర్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్‌ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ  బ్రేక్‌ వచ్చే స్థాయిలో కెరీర్‌ పరంగా అద్భుతాలు ఏం జరగలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఆయనకు ఇంకాస్త పేరు అయితే వచ్చింది. కానీ అటు సింగర్‌గాను, ఇటు యాక్టర్‌గానే అంత బిజీ అయితే కాలేదు.

    బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ పరిస్థితి కూడా అంతే . హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో ఫేమస్ అయిన అభిజిత్, షోలో తన ఇంటెలిజెన్స్, స్ట్రాటజీతో విన్నర్ అయ్యాడు. షో అతనికి మరింత పాపులారిటీ ఇచ్చినా, కెరీర్‌లో మార్పు రాలేదు. కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, కానీ హీరోగా హిట్ రాలేదు. ఫిలిం ఇండస్ట్రీలో అతని పేరు ఇప్పుడు తక్కువగా వినిపిస్తోంది.

    బిగ్‌బాస్‌ 5 విజేతగా వీజే సన్నీకి కూడా ఈ షో పెద్దగా ఉపయోగపడలేదు.సీరియల్ యాక్టర్‌గా ఫేమస్ అయిన సన్నీ, షోలో తన హ్యూమర్, టాస్క్ పెర్ఫార్మెన్స్‌తో గెలిచాడు. షో తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు, కానీ అవి వర్కౌట్ కాలేదు. పేరు పెద్దగా వినిపించడం లేదు. సీరియల్స్‌కు తిరిగి వచ్చాడు.

    సీజన్ 6 విన్నర్‌గా సింగర్‌ రేవంత్‌ నిలిచాడు.  సింగర్‌గా ఇండియన్ ఐడల్ విన్నర్ అయిన రేవంత్, షోలో తన వాయిస్, పర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. షో తర్వాత అతని సింగింగ్ కెరీర్ మెరుగుపడింది – 'కల్కి 2898 AD' వంటి సినిమాల్లో సాంగ్స్ పాడాడు. కానీ, పెద్ద స్టార్‌డమ్ రాలేదు. సింగర్‌గా కొనసాగుతున్నాడు, షో అతనికి మధ్యస్థంగా ఉపయోగపడింది. 

    బిగ్‌ బాస్‌ 7 పల్లవి ప్రశాంత్‌ పరిస్థితి కూడా అంతే.'రైతు బిడ్డ'గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్, షోలో అనూహ్య ఫాలోయింగ్ సంపాదించాడు. కానీ, షో తర్వాత అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది – కాంట్రవర్సీలు, లీగల్ ఇష్యూస్ వచ్చాయి. సినిమా అవకాశాలు రాలేదు, పేరు నెగెటివ్‌గా మారింది.

    బిగ్‌బాస్‌ 8 విన్నర్‌గా నిలిచిన  నిఖిల్‌కి కూడా ఈ షోతో పెద్దగా ఒరిగిందేమి లేదు. షో తర్వాత కూడా ఆయన అదే సీరియల్స్‌లో కొనసాగుతున్నాడు. కానీ హీరోగా బ్రేక్ రాలేదు. కెరీర్‌లో పెద్ద మార్పు లేదు.

    బిగ్ బాస్ తెలుగు విన్నర్ల చరిత్ర చూస్తే, షో అందరికీ పబ్లిసిటీ ఇస్తుంది, కానీ దీర్ఘకాలిక కెరీర్ బూస్ట్ చాలా మందికి రాలేదు. రాహుల్ సిప్లిగంజ్, రేవంత్ వంటి వారికి కాస్త ఉపయోగపడినా, మిగతా వారు సీరియల్స్ లేదా చిన్న రోల్స్‌కు పరిమితమయ్యారు. కాంట్రవర్సీలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవారు కూడా ఉన్నారు. మరికొంతమందికి ఈ షో తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి.  మరి సీజన్‌ 9లో ఎవరు విన్నర్‌ అవుతారు? వారి కెరీర్‌ ఎలా ఉంటుందో చూడాలి.

  • ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయటకు కనిపించనవి చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి అంశాల్ని పలు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ రంగంలో జరిగే మాఫియాపై ఓ థ్రిల్లర్ డ్రామా సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడిది హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    కథేంటి?
    కేపీ వినోద్(నివిన్ పౌలీ).. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రారంభంలో ఇ‍బ్బందిపడినా తర్వాత కుదురుకుంటాడు. పనితనం చూపిస్తాడు. ఈ ఫార్మా కంపెనీ.. గర్బిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో వినోద్ కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ మధుమేహం (షుగర్) బారిన పడ్డారని డాక్టర్ శైలజ(శ్రుతి రామచంద్రన్)కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు(రజత్ కపూర్).. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే అలా ఉంది మరి. స్టోరీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. అయితేనేం ఇలాంటి స్టోరీలు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు.

    కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

    కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి.

    దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి.

    - చందు డొంకాన

Sports

  • 2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం​. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్‌ క్రికెట్‌లో చతికిలబడిన భారత్‌.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.

    షాకిచ్చిన దిగ్గజాలు
    ఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

    అప్పటికే (2024 టీ20 వరల్డ్‌కప్‌ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్‌ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్‌ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్‌. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్‌, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్‌ల్లో భారత్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది.  

    టెస్ట్‌ల నుంచి వైదొలుగుతూనే రోహిత్‌ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.

    గిల్‌ జమానా షురూ
    దీంతో టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ శకం మొదలైంది. అయితే రోహిత్‌, కోహ్లి గైర్హాజరీలో గిల్‌కు టెస్ట్‌ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్‌ కెప్టెన్‌గా తొలి పర్యటనలో గిల్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 

     

    చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్‌లో రోహిత్‌, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్‌లో గిల్‌ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.

    5 మ్యాచ్‌ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్‌ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్‌ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌, పంత్‌, జైస్వాల్‌, సుందర్‌, సిరాజ్‌, బుమ్రా, ఆకాశదీప్‌ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్‌, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.

    ఓటమితో ప్రారంభం
    2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో (బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టెస్ట్‌ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్‌ ఇదే.

    విండీస్‌ను క్లీన్‌ స్వీప్‌
    ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ సిరీస్‌లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్‌ స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.

    సొంతగడ్డపై పరాభవం
    ఈ ఏడాది భారత్‌కు టెస్ట్‌ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ ఏడాది భారత్‌కు విండీస్‌పై మినహా ఒక్క టెస్ట్‌ సిరీస్‌ విజయం కూడా దక్కలేదు.

    వన్డేల్లో తిరుగలేని భారత్‌
    ఈ ఏడాది భారత్‌ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.

    మూడోసారి ఛాంపియన్‌
    అనంతరం జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

    ఆసీస్‌ చేతిలో భంగపాటు
    ఈ ఏడాది ఇంగ్లండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి, అనంతరం ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

    రెచ్చిపోయిన రోహిత్‌.. నిరాశపరిచిన కోహ్లి
    ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ, హాఫ్‌ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. విరాట్‌ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

    పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలు
    ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్‌ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. 

    తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను ఘనంగా ముగించింది. ఆసీస్‌తో సిరీస్‌ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్‌, సౌతాఫ్రికాపై సిరీస్‌ విజయాలతో పాటు ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.

    పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని భారత్‌  
    పొట్టి ఫార్మాట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

    ఈ మధ్యలో భారత్‌ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్‌ను (ఫైనల్‌ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. 

    అలాగే టైటిల్‌ గెలిచాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు బాస్‌గా ఉన్న పాకిస్తానీ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.

    ఆసియా కప్‌ తర్వాత భారత్‌ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా నిలిచింది. 
     

  • వన్డే ప్రపంచకప్‌ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్‌ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్‌ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).

    దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్‌ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్‌ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్‌ అనిపించింది. మరో బౌలర్‌ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్‌ (3-0-23-1) కూడా రాణించారు.

    భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్‌ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్‌ చేశారు.

    తుది జట్లు..
    శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్‌), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై

    టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

     

  • వన్డే ప్రపంచకప్‌ గెలిచాక భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సిరీస్‌ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్‌ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.

    మరోవైపు టాస్‌ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్‌ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.

    తుది జట్లు..
    శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్‌), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై

    టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

  • భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (డిసెంబర్‌ 21) జరిగిన అండర్‌-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్‌ బౌలర్‌ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రేను టార్గెట్‌ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం​ చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.

    ఏమన్నావురా..?
    భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్‌ చేశాడు. ఔట్‌ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు. 

    ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    నీ స్థాయి నా కాళ్ల కింద..!
    మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్‌ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్‌తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఔట్‌ చేసిన రజా ఓవరాక్షన్‌ చేశాడు. సూర్యవంశీ​కి ఫియరీ సెండాఫ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

    రజా ఓవరాక్షన్‌కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

    టీమిండియాకు పరాభవం
    348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. 

    పాక్‌ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌, సుజైఫా ఎహసాన్‌ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.

    భారత్‌ తరఫున చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (2), స్టార్‌ ప్లేయర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.

    ఆఖర్లో దీపేశ్‌ దేవేంద్రన్‌ (36) కంటితుడుపుగా బ్యాట్‌ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్‌ స్కోరర్‌. మిగతా ఆటగాళ్లలో విహాన్‌ మల్హోత్రా 7, వేదాంత్‌ త్రివేది 9, అభిగ్యాన్‌ కుందు 13, కనిష్క్‌ చౌహాన్‌ 9, ఖిలన్‌ పటేల్‌ 19, హెనిల్‌ పటేల్‌ 6 పరుగులు చేసి ఔటయ్యారు.

    అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్‌ హుసేన్‌ (56), ఉస్మాన్‌ ఖాన్‌ (35) పర్వాలేదనిపించారు. 

    ఓ దశలో పాక్‌ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్‌ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్‌ కూడా నెమ్మదించింది.

    భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ తలో 2, కనిష్క్‌ చౌహాన్‌ ఓ వికెట్‌ తీశారు. 

    కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ శ్రీలంకను.. పాక్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్‌) భారత్‌ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 
     

  • న్యూజిలాండ్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే, టామ్‌ లాథమ్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘతన సాధించారు. 

    టెస్ట్‌ క్రికెట్‌లోనే కాదు, యావత్‌ ఫస్ట్‌క్లాస్‌ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్‌ జోడీగా కాన్వే, లాథమ్‌ చరిత్ర సృష్టించారు.

    ఈ మ్యాచ్‌లో లాథమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్‌ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ 37, జాన్‌ క్యాంప్‌బెల్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.

    అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నిం‍గ్స్‌ను 306/2 వ‌ద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథ‌మ్ శ‌త‌క్కొట్టారు. దీనికి ముందు విండీస్‌ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా..  కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 575 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కాన్వే డబుల్‌ సెంచరీ, లాథమ్‌ సెంచరీ చేయగా.. రచిన్‌ రవీంద్ర (72 నాటౌట్‌) రాణించాడు. 

  • ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది. దుబాయ్‌ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 21) జరిగిన ఫైనల్లో పాక్‌ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్‌ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌, సుజైఫా ఎహసాన్‌ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.

    భారత్‌ తరఫున చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (2), స్టార్‌ ప్లేయర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది. 

    ఆఖర్లో దీపేశ్‌ దేవేంద్రన్‌ (36) కంటితుడుపుగా బ్యాట్‌ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్‌ స్కోరర్‌. మిగతా ఆటగాళ్లలో విహాన్‌ మల్హోత్రా 7, వేదాంత్‌ త్రివేది 9, అభిగ్యాన్‌ కుందు 13, కనిష్క్‌ చౌహాన్‌ 9, ఖిలన్‌ పటేల్‌ 19, హెనిల్‌ పటేల్‌ 6 పరుగులు చేసి ఔటయ్యారు.

    అంతకుముందు పాక్‌ ఇన్నింగ్స్‌లో సమీర్‌ మిన్హాస్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్‌ హుసేన్‌ (56), ఉస్మాన్‌ ఖాన్‌ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్‌ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్‌ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ తలో 2, కనిష్క్‌ చౌహాన్‌ ఓ వికెట్‌ తీశారు. 

    కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ శ్రీలంకను.. పాక్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్‌) భారత్‌ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. 
     

  • అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ ఇటీవల (డిసెంబర్‌ 13-15) గోట్‌ టూర్‌ పేరిట భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్‌ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. 

    ఈ పర్యటనలో మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్‌లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.

    ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్‌బాల్‌ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.

    వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్‌ గోల్‌ స్కోరర్‌ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్‌ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్‌పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.

    ముంబై ప్రొగ్రామ్‌లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.  ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. 

    మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్‌బాల్‌ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్‌లో ఫుట్‌బాల్‌ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.

    నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్‌బాల్‌ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. 

    భారత ఫుట్‌బాల్‌ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్‌ అంటున్నారు. 

    కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్‌ చేసిన ఫుట్‌బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్‌ల్లో 94 గోల్స్‌ చేసి ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ గోల్‌ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు. 
     

  • ఆసీస్‌ వెటరన్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో స్టార్క్‌కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్‌ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్‌తో  ఇవాళ ముగిసిన మూడో యాషెస్‌ టెస్ట్‌లో స్టార్క్‌ ఈ ఘనత సాధించాడు.

    ఫార్మాట్లవారీగా స్టార్క్‌ ప్రదర్శనలు..
    103 టెస్ట్‌ల్లో 424 వికెట్లు
    130 మ్యాచ్‌ల్లో 247 వికెట్లు
    65 టీ20ల్లో 79 వికెట్లు

    అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
    మురళీథరన్‌-1347
    షేన్‌ వార్న్‌-1001
    జిమ్మీ ఆండర్సన్‌-991
    అనిల్‌ కుంబ్లే-956
    గ్లెన్‌ మెక్‌గ్రాత్‌-949
    వసీం​ అక్రమ్‌-916
    స్టువర్ట్‌ బ్రాడ్‌-847
    షాన్‌ పొల్లాక్‌-829
    వకార్‌ యూనిస్‌-789
    టిమ్‌ సౌథీ-776
    రవిచంద్రన్‌ అశ్విన్‌-765
    చమింద వాస్‌-761
    మిచెల్‌ స్టార్క్‌-750

    అడిలైడ్‌ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్‌ మూడో టెస్ట్‌లో స్టార్క్‌ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్‌ తొలి రెండు టెస్ట్‌ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.

    రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌ బ్యాటింగ్‌లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన స్టార్క్‌ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

    మూడో టెస్ట్‌లో స్టార్క్‌తో పాటు అలెక్స్‌ క్యారీ (106, 5 క్యాచ్‌లు, 72, ఓ స్టంప్‌, ఓ క్యాచ్‌) విజృంభించడంతో ఆసీస్‌ ఇంగ్లండ్‌పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్‌ మరో 2 మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న మొదలవుతుంది.

    చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

  • దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.

    పాక్‌ ఇన్నింగ్స్‌లో సమీర్‌ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్‌ ఒక్కడే వన్‌ మ్యాన్‌ షో చేశాడు. అహ్మద్‌ హుసేన్‌ (56) సమీర్‌కు అండగా నిలిచాడు. ఉస్మాన్‌ ఖాన్‌ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్‌ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్‌ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్‌ కూడా నెమ్మదించింది.

    చివరి మూడు ఓవర్లలో పాక్‌ టెయిలెండర్లు నికాబ్‌ షఫీక్‌ (12 నాటౌట్‌), మొహమ్మద్‌ సయ్యమ్‌ (13 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్‌ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్‌ పటేల్‌, ఖిలన్‌ పటేల్‌ తలో 2, కనిష్క్‌ చౌహాన్‌ ఓ వికెట్‌ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్‌ శ్రీలంకను.. పాక్‌ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. 

    చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్‌ కాన్వే.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

  • రెండేళ్ల కిందట ఓ భారత ఆటగాడు బీసీసీఐ ఆదేశాలను దిక్కరించినందుకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్‌నూ కోల్పోయాడు. అతడిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ సదరు ఆటగాడు ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా.. మైదానంలోనే తన ప్రతాపం చూపాలని నిర్ణయించుకున్నాడు. 

    ఎప్పటికైనా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు అతడి శ్రమకు ఫలితం దక్కింది. తిరిగి భారత జెర్సీ ధరించేందుకు ఆ ఆటగాడు సిద్దమయ్యాడు. అతడే పాకెట్ డైనమైట్‌, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌. టీ20 ప్రపంచకప్‌-2026కు ఎంపిక చేసిన జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. కెరీర్ ముగిసిపోయిందన్న స్టేజి నుంచి ప్రపంచకప్ జట్టులోకి రావడం అతడు ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈ క్ర‌మంలో అత‌డి క‌మ్‌బ్యాక్ స్టోరీపై లుక్కేద్దాం.

    బీసీసీఐ అగ్ర‌హం..
    ఇషాన్ కిషన్ 2023 ఏడాది ఆఖరిలో భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కానీ ఇషాన్ ‘మానసికంగా ఇబ్బందిపడుతున్నా’ అంటూ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే స్వదేశానికి వచ్చేసిన కిషన్ విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు.  దీంతో అతని ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

    కానీ కిషన్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించింది.  ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ కిషన్ ఆడాడు. రంజీ ట్రోఫీతో పాటు విజయ్ హాజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు సారథ్యం వహించాడు. 

    అడపాదడపా పరుగులు చేస్తూ రాణించినా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. కానీ సెంట్రల్ కాంట్రాక్ట్ మాత్రం తిరిగి దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ గాయపడడంతో కిష‌న్‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అంతా భావించారు. కానీ అదే స‌మ‌యంలో కిష‌న్ కూగా గాయం బారిన ప‌డ‌డంతో ఛాన్స్‌ మిస్సయ్యాడు.

    ఎట్ట‌కేల‌కు..
    అయితే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత కిష‌న్ నిరీక్ష‌ణ ఫ‌లింది. ఏకంగా ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వంటి మెగా టోర్నీలో ఆడేందుకు ఇషాన్ సిద్ద‌మ‌య్యాడు. సెకెండ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా ఈ జార్ఖండ్ డైన్‌మైట్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ రీఎంట్రీకి ప్రధాన మార్గం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 నిలిచింది. ఈ టోర్నీలో కిష‌న్ దుమ్ములేపాడు. కెప్టెన్‌గా, ఒక ఆట‌గాడిగా జార్ఖండ్‌కు తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ టోర్నీలో 10 ఇన్నింగ్స్‌ల్లో 517 పరుగులు చేసి లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా కిష‌న్ నిలిచాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ల కార‌ణంగానే కిష‌న్‌ను భార‌త జ‌ట్టుకు ఎంపిక చేశారు.

    స్పందించిన కిష‌న్‌..
    త‌న రీ ఎంట్రీపై కిష‌న్ స్పందించాడు. తిరిగి జ‌ట్టులోకి రావ‌డం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం గ‌తేడాదిగా చాలా కష్టపడ్డాను. జార్ఖండ్‌కు ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ వ‌చ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదుచూస్తున్నాను అని ఎఎన్‌ఐతో కిషన్ పేర్కొన్నాడు. బ్యాకప్ ఓపెనర్‌గా కిషన్ జట్టులో ఉండనున్నాడు.

    టీ20 వరల్డ్ కప్ 2026 - భారత జట్టు:
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), వరుణ్ చక్రవర్తి.

     

  • తెనాలి: ఐపీఎల్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన వికెట్‌తో సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్‌ యర్రా పృథ్వీరాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన సత్తాను చాటిన ఈ ఎడంచేతి ఫాస్ట్‌ బౌలర్‌ను తాజా ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్‌ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్‌ నుంచి టీమిండియాకు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరాల్లోకి వెళితే...పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్‌లో జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్‌ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగరీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్‌ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్‌ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్‌ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్‌ఓడీ, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.విజయమోహన్‌ తొలి గురువు. క్రికెట్‌లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథ్వీరాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.  



    తండ్రి వారసత్వంగా క్రికెట్‌పై ఆసక్తి... 
    పృథ్వీరాజ్ కు ఆట వారసత్వం అనుకోవచ్చు. తాత ప్రసాదరావు పహిల్వాన్‌. తండ్రి యర్రా శ్రీనివాసరావు స్వస్థలం చీరాల. బాపట్లలో ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్‌గా ఉన్నారు. రెండేళ్లు కాలేజీ చాంపియన్‌. 1985లో గుంటూరు జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టులో ఆడారు. 1986లో జావలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యమే పృథ్వీరాజ్కు క్రికెట్‌పై ఆసక్తిని కలిగించింది. విజయమోహన్‌ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు అండర్‌–14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్‌ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్ గా చేశాడు. 

    19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్‌లోకి...  
    2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికైన పృథ్వీరాజ్ రెండు మ్యాచ్‌ల్లో పన్నెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్‌ అకాడమీ నిర్వహించే ఇండియన్‌ స్పెషలిస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్స్‌ క్యాంప్‌కు ఇండియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజ్  కు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్‌ ట్రోపీలో ఇండియా రెడ్‌ టీమ్‌కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజయ్‌ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు ఆడి, హైదరాబాద్‌పై రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్‌డేలోనే ప్రొఫెసర్‌ ధియోధర్‌ ట్రోఫీకి ఆడారు.  అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు.  



    వార్నర్‌ వికెట్‌తో సంచలనం  
    అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్‌కు చేరింది. వేలంలో కేకేఆర్‌ యాజమాన్యం  కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్‌తో మ్యాచ్‌తోనే జట్టులో బెర్త్‌ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథీ్వరాజ్‌ బౌలింగ్‌లో రెండు క్యాచ్‌లను జారవిడిచారు. అయినప్పటికీ మెయిడెన్‌ వికెట్‌గా వార్నర్‌ను బౌల్డ్‌ చేయడంతో వార్తల్లోకెక్కాడు, అంతకుముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్‌ ముస్తాఫ్‌ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్‌పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌కు నెట్‌ బౌలర్‌గా పృథీ్వరాజ్, కోల్‌కతా నుంచి ఆకాశ్‌దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్‌దీప్‌ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్‌ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు.  

    రంజీ ట్రోఫీల్లో సత్తా  
    మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్‌లో రెడ్‌ బాల్, వైట్‌ బాల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌పై రెండు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెందింది. గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీరాజ్. 2025–26 సీజన్‌ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్‌లో ఏడు పరుగుల సగటుతో 12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత.  

    ఎడమ చేతివాటం ఫాస్ట్‌ బౌలింగ్‌ ప్రత్యేకత  
    ఎడమ చేతివాటం ఫాస్ట్‌ బౌలింగ్‌ పృథ్వీరాజ్‌ ప్రత్యేకత. 145–150 కి.మీ. వేగంతో బౌల్‌ చేయటం, బంతిని రెండువైపులా స్వింగ్‌ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు ఉన్నాయి. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో ప్రముఖ శిక్షకుడు సీడీ థాంప్సన్‌ మెలకువలు నేర్చారు. ఈ ప్రత్యేకతలతోనే గాయాలతో కొన్ని సీజన్లు వైట్‌బాల్‌కు దూరంగా ఉన్నా, మళ్లీ ఘనంగా గుజరాత్‌ టైటాన్‌తో పునరాగమనం చేయగలిగాడు పృథీ్వరాజ్‌. గుజరాత్‌ టైటాన్‌ జట్టు ఆడిన తొలి ఐపీఎల్‌లోనే కప్‌ను గెలుచుకుందనీ, ఆ జట్టులో ఆటతో టీమిండియాకు ఆడే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాడు. 

Politics

  • హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, కృష్ణా జాలాలపై ఒక రోజు, గోదావరి జలాలపై మరో రోజు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్‌ 21 వ తేదీ) కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ స్పందించారు. 

    మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..  తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆరేనన్నారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఆయనే దెబ్బ తీశారన్నారు. కేసీఆర్‌ వస్తే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులను చూపిస్తామన్నారు. కృష్ణా జలాల్లో 36 శాతం వాటా అంగీకరించింది కేసీఆర్‌ మాత్రమేనని, 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామన్నారు. 

    కాగా, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్‌ 21వ తేదీ) బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్‌లో జరిగింది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు.

    ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.  దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్‌ మాట్లాడుతూ..  కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం.

    రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్‌ఆర్‌సీ స్పష్టంగా చెప్పింది.

    గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్‌ విమర్శించారు

  •  హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్‌ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్‌.

    కేసీఆర్‌ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..
    బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్‌ గౌడ్‌. కేసీఆర్‌, హరీష్‌ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్‌ అనవరసరప ఖర్చు చేశాడని,  తామ కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్‌ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు.  ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్‌ఎస్‌ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్‌ గౌడ్‌.
     

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వాటర్‌ గ్రిడ్‌ పనులకు మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వైఎస్‌ జగన్‌ సీఎంగా 50 శాతం పనులు పూర్తి చేశారు. అసలు ఆ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, దాన్ని వీళ్లే మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి సర్కార్‌ తీరును ఎండగట్టారు.

    ‘‘గూగుల్‌ డేటా సెంటర్‌ నుంచి అన్నింటిలో క్రెడిట్‌ చోరీ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ క్రెడిట్‌ చోరీలో భాగంగానే పులివెందులలో రూ.450 కోట్లతో జగన్‌ చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌కు మళ్లీ శంకుస్థాపన చేస్తారట. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. గతంలోనూ వైఎస్సార్‌ పూర్తి చేసిన చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లలను చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేశాడు

    ..ఆనాడు చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలకు నేనే స్వయంగా వెళ్లి వైఎస్సార్‌ ఏం చేశాడో చెప్పా.. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. వీళ్లు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ప్రజలకు అన్నీ తెలుసు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా ప్రతి ఒక్కరికీ వచ్చేది. డిసెంబర్‌ 15 నాటికి వరి మినహా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయ్యింది. ఈ ప్రభుత్వం రైతు బీమా చేసుకునేందుకు ఎటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టలేదు.

    ..ఫలితంగా రైతులు బీమా ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రీమియం కట్టుకునేలే జనవరి 15వరకూ గడువును పెంచాలని నా డిమాండ్‌. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బీమాపై స్పష్టత ఇవ్వాలి. చంద్రబాబు.. అమరావతి, 99 పైసలకే భూముల పందేరంలో బిజీగా ఉన్నాడు. అదేమన్నా అంటే సంపద సృష్టించాను అంటాడు. తండ్రీ కొడుకులిద్దరిదీ ఓన్లీ పబ్లిసిటీ...నో యాక్టివిటీ.

    ..విదేశాలకు వెళ్లి ఓ ఫోటో దిగి పచ్చ పత్రికల్లో వేయించుకుని చెమటోడుస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తారు. ఇండిగో సంక్షోభంలో ఇలా క్రెడిట్‌ చోరీకి పాల్పడాలని అర్నాబ్‌ గోస్వామి వద్ద అడ్డంగా దొరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీరికి బుద్దిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు.

National

  • భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆధునాతన ఆయుధాల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీలో  రూ.79 వేల కోట్ల విలువగల ఆయుధాల కొనుగోలుకు అనుమతులిచ్చారు.

    ఈ నిధులతో ఇండియన్ ఆర్మీకి సంబంధించి నాగ్ మిసైల్ సిస్టమ్ . నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫార్మ్ డాక్స్ నిర్మాణం, నావల్ సర్పేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడో తదితర యుద్ధ సామాగ్రి కొనుగోలుచేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణి వ్యవస్థను ఆర్మీ వాహనాలపై మోహరిస్తారు.ఈ క్షిపణులుశత్రు ట్యాంకులు, బంకర్లు మరియు ఇతర బలవర్థకమైన గోడలను నాశనం చేయగలవు. 

    నేవీకి సంబంధించి  ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నిర్మించనున్నారు. సముద్రం నుండి భూమి మీద చేసే దాడులను ఇవి సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఇవి శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, ఇతర సహాయం  విపత్తు నిర్వహణకు  ఉపయోగపడతాయి. వీటితో పాటు  నావల్ సర్ఫేస్ గన్ మరియు అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలను కొనుగోలు చేయనున్నారు. ఇవి ఇది అణు మరియు తేలికపాటి  జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలవు.

    ఎయిర్‌ఫోర్స్‌ని ఆధునీకరించడానికి కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనున్నారు.  ఈ వ్యవస్థ విమానం టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, లక్ష్యాలను గుర్తించడంతో పాటు  మరియు పైలట్ లేకుండా దాడి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఆయుధాల ఆదునీకరణ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా రక్షణ, సహాయక చర్యలు, శాంతి మిషన్లు, విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.

    అంతేకాకుండా వీటిలో చాలా మట్టుకు భారత్‌లోనే తయారవుతున్నాయని దీనివల్ల  మేకిన్ ఇండియాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

  • కేరళ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇ‍చ్చింది. శబరిమల గ్రీన్‌ఫీల్ ఎయిర్‌ఫోర్టు భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు చేసింది. ఎయిర్‌ఫోర్టు భూసేకరణ రద్దు కోరుతూ గోస్పెల్‌ ఆశియా అనే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా దానిని విచారించిన కోర్టు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    కేరళ ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విమానాశ్రయం కోసం 2570 ఎకరాల భూమి సేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఎయిర్‌ఫోర్టు ఆఫ్ ఇండియా అథారిటీ ప్రకారం పెద్ద విమానాశ్రయాల నిర్వహణకు సైతం 1200 ఎకరాల భూమి సరిపోతుందని నియమం ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్వహణ కోసం అంత పెద్దమెుత్తంలో భూసేకరణ ఎందుకు జరుపుతున్నారో వివరణ ఇయ్యాలని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

    అయితే భవిష్యత్తు అభివృద్ధి కోసం స్థల సేకరణ చేపడుతున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీనికి సంతృప్తి చెందని కోర్టు స్థల సేకరణ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఎరుమేలిలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శబరిమల అయ్యప్ప సన్నిధానానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్టు నిర్మించాలని భావించింది. కోర్టు తీర్పుతో ఎయిర్‌ఫోర్టు నిర్మాణానికి బ్రేక్ పడింది. 

  • మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సంచలన విజయం సాధించింది. 288 పంచాయతీ పరిషత్ స్థానాలకు గానూ 120 సీట్లు సాధించి సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. ఈ విజయంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆనందం వ్యక్తం చేశారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాషాయ పార్టీ జోరు నడుస్తో్ంది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెున్నటికి మెున్న కేరళ కమ్యూనిస్టుల కోటైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, తాజాగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.  ఈ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.  

    ఫడ్నవీస్ మాట్లాడుతూ "ఎన్నికల ప్రచారంలో నేను ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదు. నా ప్రణాళికలను వివరించాను. ప్రజలు దానిని అంగీకరించారు. అని ఫడ్నవీస్ అన్నారు. ఈ విజయం పట్ల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే స్పందించారు. మహాయుతి కూటమి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిందని దానికి మద్ధతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు.

    మున్సిపల్ ఎన్నికల్లో బిీజేపీ 120 సీట్లు సాధించగా, శిండే శివసేన 57 స్థానాలు, అజిత్ ఎన్సీపీ 37 సీట్లు గెలిచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ 31, ఉద్దవ్ శివసేన 10, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 246 మున్సిపల్‌ కౌన్సిళ్లు, 46 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. 

    మున్సిపల్ కార్పొరేషన్ సమరంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబైతో పాటు మరో 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి.

  • రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఎటువంటి రాజకీయ అజెండా లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆదివారం కోల్‌కతాలో జరిగిన సంఘ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంఘ్‌ గమ్యాలను బీజేపీ దృష్టికోణంతో చూస్తున్నారని ఇది చాలా తప్పని మోహన్ భగవత్ హెచ్చరించారు.

    ప్రస్తుతం కాషాయపార్టీ హవా దేశవ్యాప్తంగా నడుస్తోంది. వరుసగా మూడోసారి గెలిచి కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయడంతో పాటు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే చాలా మంది బీజేపీకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్‌ పనిచేస్తుందంటుంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండింటి భావజాలాలు దాదాపు ఒకటే అని అంటుంటారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు.

    స్వయంసేవక్ సంఘ్ భావనలను సంకుచిత భావజాలంతో చూడడం చాలా తప్పని మోహన్ భగవత్ అన్నారు. "చాలా మంది బీజేపీ దృష్టితో సంఘ్‌ని చూస్తారు. ఇది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్‌కు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం హిందూ సమాజం రక్షణ అభివృద్ధి కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది". అని ఆయన తెలిపారు. సంఘ్ ప్రజలను ఉన్నతమైన వ్యక్తులుగా మారేలా చేస్తోందని వారిలో నైతిక విలువలు పెంపోందించేలా శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. తద్వారా వారు భారతదేశ గౌరవాన్ని పెంపొందించడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారని  అన్నారు. 

    సంఘ్‌ కార్యకలాపాలన్ని దేశం బాగు కోసం హిందు సమాజ రక్షణ కోసం ఉంటాయి. అయితే చాలా మంది సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా భావిస్తారని కాని అది అవాస్తవమని తెలిపారు. భారత్ మరోసారి విశ్వగురుగా మారుతుందని ఆ విధంగా సమాజాన్ని రూపొందించడం ఆర్ఎస్ఎస్ బాధ్యతని  మోహన్ భగవత్ పేర్కొన్నారు.

  • అఖిల భారత పంచాయత్ పరిషత్‌ 18 వ జాతీయ మహాసభల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో గదగ్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో జరిగిన సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జనరల్ సెక్రటరీ,  ఆంధ్ర ప్రదేశ్ AIPP అధ్యక్షులు M. చిదంబర రెడ్డి ప్రసంగిస్తూ...స్థానిక సంస్థల అవశ్యకతను, సర్పంచుల విధులు, నిధులు, విడుదల పై చర్చించి 2011 సెన్సెస్ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారని, అప్పటి జనాభా అవసరాలకు, ఇప్పుటి 2025. జనాభా అవసరాలకు సరిపడా సదుపాయాలకు 4 రెట్లు పెరిగినది కావున గ్రాంట్ 4 రెట్లు పెంచవలసిన అవసరం ఉందని, ఇండియా 1 అని నాయకులు మాటలు చెప్తున్నారని, దేశం అంతా పంచాయతీ చట్టాలు ఒకే రకంగా ఉండాలని, అయితే ఒకో రాష్ట్రం లో ఒక విధంగా అమలు చేస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాత్రమే సర్పంచుల విధులు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉద్యోగులు, వారి జీతాలు, పని తీరు సర్పంచుల ఆదేశాలు మేరకే జరుగుతాయని.గ్రామాలకు MLA,MP నిధులు వినియోగించాలి అంటే గ్రామ సభ, సర్వ సభ్య సమావేశం లో పంచాయతీ రిజల్యూషన్ ద్వారా అధికారులు నడుచుకుంటారు.

    స్థానిక సంస్థలలో (సర్పంచి /ఎంపిటిసి/కౌన్సిలర్/జడ్పీటీసీ/కార్పొరేటర్  స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కనీస విద్యార్థత ఉండేలా చట్టం తేవాలని, గౌరవ వేతనం దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని,MLA,MP,MLC లకు పింఛను రిటైర్డ్ అయినాక స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే చట్ట సవరణ చేయాలని , గత ప్రభుత్వం లో  మాజీ ముఖ్యమంత్రి గౌ.శ్రీ.YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా,గ్రంథాలయం, డైరీ ల సముదాయాలు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులు పని చేసేలా చేశారు. ప్రతి రోజూ ఈ సముదాయాలకు వందల సంఖ్యలో ప్రజలు తమ అవసర నిమిత్తం వందలాదిగా వచ్చేవారు. ప్రభుత్వం మార్పు వల్ల, ఇప్పటి ప్రభుత్వo ఉద్యోగులను కుదించి మరీ అన్యాయంగా ఒకరో, ఇద్దరో వస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుందని, ఉద్యోగులను నియామకం చేయాలని. పై విషయాల పై కమిటీ చర్చించి.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గారి దృష్టి కి మరియు ప్రధాన మంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం ఉందని అఖిల భారత పంచాయత్ పరిషద్ అధ్యక్షులు, మాజీ యూనియన్ మినిస్టర్ శ్రీ సుభోద్ కాంత్ సహాయి గారిని కోరగా.. సభలో అందరూ సహకారం అందిస్తామని చెప్పారు
     

  • ఒక పది సెకన్లపాటు నీటమునిగితే అమ్మె, ఆ, ఊ, హే అంటూ ఎంతో ఇబ్బంది పడతాం కదూ. ఎందుకంటే నీటిలో మునిగితే శరీరానికి ప్రాణవాయువు అందక ప్రాణం తల్లడిల్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా 20 అడుగుల నీటి లోతులో భరత నాట్యం చేసి అందరిని సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది.  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా  మారిన ఈ వీడియోన చూసిన నెటిజన్లు  ముక్కున వేలేసుకుంటున్నారు.

    ప్లాస్టిక్ వల్ల కలిగే హాని ఎలాంటిదో అందరికీ తెలుసు అయినప్పటికీ దాని వాడకాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు ఇతర హానికరమైన వస్తువులు సముద్రగర్భంలో పడేయడం ద్వారా జలగర్భంలో నివసించే ఎన్నో రకాల ప్రాణులకు హాని కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినా ఆ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. అయితే సముద్ర కాలుష్యం వల్ల జల చరాలకు కలిగే హాని, ఇతర ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఓ 11ఏళ్ల చిన్నారి టీఏ తారగై ఆరాధన వినూత్న ప్రయత్నం చేసింది.

    తమిళనాడులోని రామేశ్వరం సముద్రతీరంలో 20 అడుగుల లోతులో ఆరాధన భరత నాట్య ప్రదర్శన చేసింది. నీటి అడుగునా ప్రాణవాయువు అందకున్నా తన ప్రదర్శనలో ఆ బాలిక ఏటువంచి అసౌకర్యానికి లోను కాలేదు. సాధారణ ప్రదేశంలో నృత్యం చేసిన మాదిరిగానే నీటిలోనూ తన కళను ప్రదర్శించింది. భరత నాట్యంలోని వివిధ భంగిమలు చేస్తూ అందరిని ఔరా ‍అనిపించింది.

    ఆరాధన తండ్రి ప్రొఫెషనల్ డీప్-సీ- డైవింగ్ కోచ్ దీంతో తన తన పిల్లలైన టీఏ తారగై ఆరాధన, ఎస్‌డీ అశ్విన్‌ బాలకు శ్వాస నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో వారు సులువుగా ఈ ప్రదర్శన చేయగలుగుతున్నారు.  ప్రస్తుతం తారగై ఆరాధన సముద్ర గర్భంలో చేసిన భరత నాట్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     

  • భారతీయ రైల్వేస్‌ కీలక ప్రకటన చేసింది. టికెట్‌ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. లోకల్‌, స్వల్ప దూర ప్రయాణాల టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే..

    అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్‌ రైలు టికెట్‌ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ ఏసీ, నాన్‌-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్‌-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

    పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్‌ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

    చివరిసారి రైల్వే ఛార్జీల పెంపు 2025 జూలైలో జరిగింది. ఆ పెంపుతో రైల్వేకు సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.

     

     

Business

  • 2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

    నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.

    వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్
    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..

    యాన్యువల్ పాస్‌ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్‌ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.

    సాధారణంగా ప్రతి టోల్‌కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్‌తో ఇది చాలా తగ్గుతుంది.

    యాన్యువల్ పాస్‌కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్‌లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.

    యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం.

  • భారతదేశంలో చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అందరికీ లాభాలు వస్తాయని గానీ.. అందరూ నష్టపోతారని గానీ కచ్చితంగా చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు లాభాలు, మరికొన్ని సార్లు నష్టాలు ఉంటాయి.

    లాభ, నష్టాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో.. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. దేశీయ మ్యూచువల్ ఫండ్‌లు బ్రోకరేజ్‌లకు చెల్లించే రుసుము మాత్రమే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో ప్రాథమిక నిర్వహణ ఛార్జీని కూడా తగ్గించింది.

    SEBI బోర్డు సమావేశం తర్వాత, విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నగదు లావాదేవీలపై స్టాక్ బ్రోకర్లకు చెల్లింపును 8.59 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ గతంలో ఆస్తి నిర్వాహకులు చెల్లించే రుసుముపై 2 బేసిస్ పాయింట్ల రుసుమును ప్రతిపాదించింది.

    కొత్త రూల్స్
    ➤కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న పెద్ద వాటాదారులను మినహాయించి, పబ్లిక్ ఇష్యూలలో ఉన్న వాటాదారులకు లాక్ ఇన్ అవసరాలను రెగ్యులేటర్ చేసింది.

    ➤కొత్త నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ పబ్లిక్‌గా విడుదల కావడానికి ముందు, షేర్లకు లాక్-ఇన్ అవసరాలు స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. ఇది లిస్టింగ్ ప్రక్రియలో ఆలస్యాలను పరిష్కరిస్తుందని సెబీ తెలిపింది.

    ➤ఐపీఓకు ముందు షేర్ల లాక్-ఇన్ నిబంధనల సవరణకు సెబీ ఆమోదం తెలపడంతో, అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యాచరణ సవాలు ఇప్పుడు పరిష్కారమైందని.. కార్పొరేట్ కంప్లైయన్స్ సంస్థ MMJC అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి మకరంద్ జోషి అన్నారు.

    ➤పెట్టుబడిదారుల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, జారీ చేసే కంపెనీలు పబ్లిక్ ఆఫర్ పేపర్లలో భాగంగా కీలక సారాంశాన్ని అప్‌లోడ్ చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది.

    ➤మహిళలు, రిటైల్ & సీనియర్ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి.. రుణ ఇష్యూలలో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ చర్యలను ఆమోదించింది.

    ➤రిస్క్ మేనేజ్‌మెంట్ చర్యలకు లోబడి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలను రేట్ చేయడానికి అనుమతించబడతాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే రెగ్యులేటర్ బోర్డు సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. టేకోవర్ కోడ్ నిబంధనలను సవరించడానికి నియంత్రణ సంస్థ కూడా కృషి చేస్తోందని ఆయన అన్నారు.

    ఖర్చులను తగ్గించి.. మ్యూచువల్స్ ఫండ్స్‌లో పారదర్శకతను పెంచడానికి సెబీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఈ ఏడాది (2025) చాలామంది ఇన్వెస్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. దీంతో ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్టర్లు నిపుణుల సలహా లేదా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం.

  • స్టాక్‌ ఎక్స్‌చేంజీలనిర్వహణ సామర్థ్యాలను, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణను, మార్కెట్‌ పర్యవేక్షణనను మెరుగుపర్చేందుకు ఉపయోగపడే కొత్త సాంకేతికతలను పరిశీలించేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. వచ్చే 5–10 ఏళ్లలో ఎక్స్‌చేంజ్ టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందాలి, అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలను అందుకోవాలి, మార్కెట్‌ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపొందించాలి తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు.

    కమోడిటీ, క్యాపిటల్‌ పార్టిసిపెంట్స్‌ అసోసియేషన్‌ 11వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు తుహిన్‌ కాంత పాండే. టెక్నాలజీపరంగా పటిష్టంగా ఉండటం ఎంతో ముఖ్యమని,  ఎక్స్‌చేంజీల్లో చోటు చేసుకునే ప్రతి సాంకేతిక లోపాన్ని సెబీ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అటు నాన్‌–అగ్రి కమోడిటీ డెరివేటివ్స్‌ను సమీక్షించేందుకు కూడా వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాండే చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు.

  • తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.

    మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.

    పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.

    ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.

    ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?

    ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.

  • శాస్త్రీయ రంగంలో ప్రతిభను మరియు "నవ భారత్" స్ఫూర్తిని కొనియాడుతూ జరిగిన ఒక ప్రత్యేక సాయంత్రం వేళ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్‌కు ఘన నివాళులర్పించారు. డాక్టర్ మషేల్కర్ రికార్డు స్థాయిలో 54 గౌరవ డాక్టరేట్లు పొందిన అసాధారణ విద్యా మైలురాయిని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ నిర్వహించారు.

    ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.

    వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు వరకు..
    సభికులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ, ముంబై వీధి దీపాల కింద చదువుకున్న ఒక సామాన్య బాలుడు ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఐకాన్‌గా ఎదిగిన డాక్టర్ మషేల్కర్ ప్రయాణాన్ని వివరించారు.

    "డాక్టర్ మషేల్కర్ జీవిత ప్రయాణంలో నేను ఆధునిక భారతదేశ ప్రయాణాన్ని చూస్తున్నాను," అని అంబానీ పేర్కొన్నారు. "అతను పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గౌరవం వరకు ఎదిగారు. దీనికి కారణం వారి తల్లి అంజనీ గారి ప్రేమ, ఆయన ఉక్కు సంకల్పమే."

    చాలామంది జీవితంలో ఒక డిగ్రీ పొందడానికే కష్టపడతారని, కానీ మషేల్కర్ గారు 54 డాక్టరేట్లు సాధించారని అంబానీ కొనియాడారు. అంత ఎదిగినా ఆయన ఎంతో వినయంగా ఉంటారని, "పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ కిందకే వంగి ఉంటుంది" అనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.

    రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై డాక్టర్ మషేల్కర్ చూపిన ప్రభావం ఈ ప్రసంగంలో ప్రధానాంశంగా నిలిచింది. రిలయన్స్‌ను కేవలం ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ నుంచి సైన్స్ ఆధారిత ఆవిష్కరణల (Innovation) దిశగా మళ్లించడంలో మషేల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మల పాత్ర కీలకమని అంబానీ అంగీకరించారు.

    2000వ సంవత్సరంలో మషేల్కర్ సూచన మేరకు స్థాపించబడిన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కంపెనీ సంస్కృతినే మార్చివేసిందని ఆయన వెల్లడించారు. నేడు రిలయన్స్‌లో 1,00,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారని గర్వంగా చెప్పారు. "రిలయన్స్‌ను ఒక పారిశ్రామిక సంస్థగా కాకుండా, ఒక సైన్స్ కంపెనీగా చూడాలని ఆయన మాకు నేర్పారు," అని అంబానీ అన్నారు. ముఖ్యంగా జియో & గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మషేల్కర్ దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.

    'గాంధీ ఇంజనీరింగ్' మరియు కృత్రిమ మేధ (AI)
    ఈ సందర్భంగా డాక్టర్ మషేల్కర్ రాసిన తాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన ప్రసిద్ధ సిద్ధాంతమైన *"More from Less for More"* (తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం) గురించి వివరించారు. దీనినే ఆయన 'గాంధీ ఇంజనీరింగ్' అని పిలుస్తారు.

    ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుత కృత్రిమ మేధ (AI) యుగానికి అన్వయిస్తూ, అంబానీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: "AI రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలి, కానీ 'కరుణ లేని సాంకేతికత.. కేవలం యంత్రం మాత్రమే' అని మనం గుర్తుంచుకోవాలి." తెలివితేటలతో పాటు సానుభూతిని, సంపదతో పాటు లక్ష్యాన్ని జోడించడం ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాను చూపగలదని ఆయన ఆకాంక్షించారు.

    క్వాంటం కంప్యూటింగ్, సింథటిక్ బయాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ "డీప్-టెక్ సూపర్ పవర్"గా ఎదగాలంటే, పారిశ్రామిక రంగం & విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రసంగం ముగియగానే, అంబానీ "జ్ఞాన యోగి" అని పిలిచిన డాక్టర్ మషేల్కర్‌కు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం సమర్పించారు.

  • బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

    2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.

    వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలు
    వెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.

  • టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్‌పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్
    వాట్సప్‌లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్‌వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్‌పెయిరింగ్ అంటున్నారు.

    ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ ఇలా..
    సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్‌పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్‌కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్‌లో ఇంటర్నల్‌గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది.

    ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్‌ చేస్తారు.

    ఘోస్ట్‌పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలా

    • మీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయవద్దు.

    • వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్‌ చేయండి.

    • Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.

    వీసీ సజ్జనార్ ట్వీట్
    వాట్సాప్ ఘోస్ట్‌పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి'' అని వెల్లడించారు.

  • ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్‌లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.

    ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు.

  • ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్‌ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

    మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే.  అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ కూడా తమ బైక్‌ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.

    భారత్‌లో తయారు చేసే జీ 310 ఆర్‌ఆర్, సీఈ 02 బైక్‌లతో పాటు ఎఫ్‌ 900 జీఎస్, ఎఫ్‌ 900 జీఎస్‌ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్‌లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.

  • దేశంలో ఫుడ్‌ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్‌ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్‌ డెలివరి యాప్‌లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.

    అయితే ఇవే ఫుడ్‌ డెలివరి యాప్‌లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్‌ డెలివరి యాప​్‌లు, రెస్టారెంట్ల మధ్య  నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.

    దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్‌ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.

    రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..

    అధిక కమీషన్లు 
    ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్‌లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్‌కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. 

    సొంత డెలివరీ యాప్‌ల వైపు రెస్టారెంట్లు
    అధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్‌లు, వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.

    బ్రాండ్ విలువకు దెబ్బ
    ఫుడ్ డెలివరీ యాప్‌లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్‌లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.

Andhra Pradesh

  • తాడేపల్లి: తన పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన అందరికీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతల తెలియజేశారు. తనపై వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు  చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానన్నారు వైఎస్‌ జగన్‌. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి మద్దతే తన బలమని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

    కాగా, వైఎస్ జగన్‌ పుట్టిన రోజు నేడు(డిసెంబర్‌ 21, 2025). ఈ సందర్భంగా జననేతకు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు... ఇంకా చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్‌ ట్రెండింగ్‌గా ‘హ్యాపీ బర్త్‌ డే వైఎస్‌ జగన్‌’ నిలవడంతో పాటు ఇటు మిగతా ప్లాట్‌ఫారమ్‌లలోనూ పోస్టులతో సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది.

    వైఎస్‌ జగన్‌ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్‌ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్‌ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

    ప్రస్తుతం ఎక్స్‌లో ‘#HappyBirthdayYSJagan’, ‘#HBDYSJagan’, ‘Jagan Anna’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు గ్లోబల్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండింగ్‌ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. 

    ఇదీ చదవండి: 

    జగనన్న బర్త్‌డే.. సోషల్‌ మీడియా షేక్‌

  • ఆయన పేరు వింటే సంక్షేమం గుర్తుకొస్తుంది..  ఆయన పేరు వింటే పల్లె గడప పులకరిస్తుంది..   పట్టణ ముంగిట అభివృద్ధి పలకరిస్తుంది..  ఆ పేరు ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆ పేరే ఆస్తి.. ఆ పేరే వైఎస్‌ జగన్‌.   గ్రామ, వార్డు సచివాలయాల సృష్టికర్త అతడే..  అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత అతడిదే..  సంక్షేమాన్ని గడపదాకా తీసుకొచ్చిన పేదింటి ముద్దుబిడ్డడతడు..  విద్యార్థులకు ముద్దుల మావయ్య అతడు.. అవ్వాతాతలకు అండగా నిలిచిన మనవడతడు..  అక్కచెల్లెమ్మలు మెచ్చిన నిండు సోదరుడతడే.. రైతన్నలకు ఆత్మబంధువూ అతడే..తెలుగునేల గర్వించదగ్గ నేతల్లో ఒకడు.. ఇలపై అత్యధిక ‘ఫ్యాన్‌’ ఫాలోయింగ్‌ కలిగిన లీడర్లలో ఒకడు. ఆయనే వైఎస్‌ జగన్మోహనుడు.

    బద్వేలు : వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిన నేతగా పేరు గడించారు.  రాజకీయాల్లోకొచ్చిన దశాబ్ద కాలంలోనే వందేళ్ల అనుభవం సంపాదించిన నేతగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. హస్తిన కోటను ఎదిరించిన వైఎస్‌ జగన్‌ రాజకీయ అనుభవం సంపాదించేందుకు నేరుగా ప్రజల వద్దకే తన అడుగుల సవ్వడులను మళ్లించాడు. అదే  ప్రజా సంకల్పయాత్ర. 2017లో ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో మొదలైన ఈ సంకల్ప యాత్ర 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. ఈ సంకల్ప యాత్రలోనే  రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అనే నినాదంపురుడు పోసుకుంది. అదే సంకల్ప యాత్రలో తొమ్మిది ప్రజా సంక్షేమ పథకాలైన నవరత్నాలు రూపుదిద్దుకున్నాయి. 

    పడిలేచిన కెరటం వైఎస్‌ జగన్‌ 
    ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది. గోతులు తీసే చేతులే కరచాలనం చేస్తున్నాయి. మంచివాశ్లనుకున్న వాల్లంతా మంచిని తుంచి రొట్టె ముక్కలా నమిలి మింగేస్తున్నారు. తండ్రి మరణించిన తరువాత పట్టుమని పదిరోజులు కూడా ఇంటి పట్టున ఉండలేదు. ప్రజల కోసం ప్రయాణం మొదలెట్టాడు. ప్రజల గుండె చప్పుడు వింటూ ముందుకు సాగాడు. సాగుతున్నంత సేపు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఎదురుదెబ్బలు తిన్నాడు.. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. 
     
    ఐదేళ్లు ముఖ్యమంత్రిగా .. 
    2014 నుంచి 2019 దాకా ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజ ల పక్షాన పోరాడిన అనంతరం 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించి అధికారం చేపట్టారు. ఆ క్షణం నుంచి సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరుగులు పెట్టించారు. ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లుగానే మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్,వ్యవసాయానికి ఉచిత విద్యుత్,108 వాహనాలు తదితర పథకాలను పునర్జీవం చేయడమే గాకుండా మరింత గొప్పగా అమలు చేసి చూపించారు. అంతేనా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే కొత్త పాలనకు నాంది పలికారు. నవరత్నాలతో సంక్షేమాన్ని పేదింటి గడపకే చేరవేశారు. ఇక కోవిడ్‌ సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి,కమ్మ,ఆర్యవైశ్య,బ్రాహ్మణ,క్షత్రియ,వెలమలతో పాటు ఇతర  ఓబీసీ సామాజిక వర్గాలకు ఈబీసీ నేస్తం కింద అర్హులందరికీ ఆర్థిక సహాయం అందించారు.  జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి పథకం కింద  విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమచేశారు. ఇక కడప గడపలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధిబాట చూపించా రు.  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద లక్షలాదిమందికి ఆర్థిక సాయం చేసి మనసున్న మారాజుగా నిలిచిపోయారు.  

    నేడు జన్మదిన వేడుకలు..
    వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

    మళ్లీ జగనన్న పాలనే రావాలి 
    ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్‌లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్‌ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున  రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్‌  

    లీడర్‌ అంటే జగనే 
    ఇంట్లోవాళ్లకు కష్టమొస్తే మనసు పడే బాధేంటో ఆ క్షణం తెలిసింది.. ఆ కష్టకాలంలో ‘నేనున్నానని’ జననేత భరోసా ఇచ్చినప్పుడు ‘లీడర్‌ అంటే వైఎస్‌ జగన్‌లా ఉండాలని’ ఆ రోజే తెలిసింది.. ఆయన మనసెంత గొప్పదో ఆ పూటే తెలిసింది.. ఇదీ ప్రొద్దుటూరుకు చెందిన సయ్యద్‌ కరీముల్లా కుటుంబ సభ్యుల మనోగతం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సయ్యద్‌ కరీముల్లాకు 2021లో లివర్‌ దెబ్బతింది. దీంతో ఆయన అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ఆశ్రయించారు. సమస్య తీవ్రతను గుర్తించిన రాచమల్లు  సీఎంఓకి ఫోన్‌ చేశారు. కరీముల్లా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం ఒక్క రోజులోనే రూ.25లక్షలు (ఎల్‌ఓసీ) మంజూరు చేయగా ఆపరేషన్‌ విజయవంతమైంది. ‘మా కష్టాన్ని వినడమే కాదు.. నేనున్నానంటూ  ఆదుకున్న మనసున్న లీడర్‌ వైఎస్‌ జగన్‌..’ అని కరీముల్లా సతీమణితోపాటు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. అంతేనా ‘అల్లా ఉన్‌కో అచ్ఛా రఖే’ అంటూ చేతులెత్తి దువా చేశారు. – ప్రొద్దుటూరు  

    మా కుటుంబానికి దేవుళ్లు 
    వైఎస్సార్‌.. వైఎస్‌ జగన్‌ మా కుటుంబానికి  దేవుళ్లు. 2004లో వైఎస్‌ సీఎం కాగానే మా నాన్నకి రూ.56వేలు రుణమాఫీ అయింది. దీంతో పాటు అప్పటి వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్‌ బకాయిలు రూ.6వేలు మాఫీ అయ్యా యి. ఆయన మరణాంతరం ఎలాంటి పథకం  మా కుటుంబానికి అందలేదు.  2019లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక  మా కుటుంబానికి అమ్మఒడితో మొదలుకొని అన్ని పథకాలు వరుసగా వచ్చాయి. పంటల బీమా నష్ట పరిహారం రూ.66వేలు వచ్చింది. దీని తర్వాత ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1.95లక్షలు వచ్చింది, రైతు భరోసా ప్రతి ఏటా పడింది.. నా భార్యకు రూ.50వేలు డ్వాక్రా రుణమాఫీ అయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మా కుటుంబానికి రూ.5లక్షలు పైగా డబ్బులు అందాయి. వైఎస్సార్‌.. వైఎస్‌ జగన్‌ మా పాలిట దైవం. మళ్లీ జగనన్న సీఎం అయితే మా లాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది.    
     – పెసల కొండారెడ్డి,     చియ్యపాడు, చాపాడు మండలం

    ఎప్పటికీ రుణపడి ఉంటా..
    మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా పాలిట దేవుడు. 2023లో విజయవాడ నుంచి పోరుమామిళ్లకు వస్తుండగా నా కారుకు యాక్సిడెంట్‌ అయింది. ఆపరేషన్లకు కోటి రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు.  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ఆస్పత్రిలో ఖర్చయ్యే మొత్తం రూ.70లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఇచ్చి నా ప్రాణాలను కాపాడాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా.  – డి.సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ, 
    కాశినాయన మండలం, వైఎస్సార్‌ కడప  

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్‌ 21వ తేదీ) బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్‌లో జరిగింది. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు. 

    ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.  దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్‌ మాట్లాడుతూ..  కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం. 

    రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్‌ఆర్‌సీ స్పష్టంగా చెప్పింది.

     

     

    గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్‌ విమర్శించారు.

  • సాక్షి హెదరాబాద్: 2026 జనవరిలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  ఈ గిరిజన మహాజాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

    తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు 2026 జనవరి 28న ప్రారంభంకానుంది. 28 బుధవారం నాడు సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. 29 గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దెలపైకి వస్తుంది. జనవరి 30 శుక్రవారం భక్తులు మెుక్కులు సమర్పించుకుంటారు. అనంతరం జనవరి 31వ తేదీన దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.

    సమ్మక్క-సారక్క జాతరను  అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇది వరకే రూ.150 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది.  ఈ నిధులతో జాతర జరిగే ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాల ఏర్పాటు చేయనున్నారు. ఆసియాలోని ‍అత్యంత పెద్దదైన ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. 

  • హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ  విస్తృతస్థాయి సమావేశంలో  అధ్యక్షుడు కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేసీఆర్‌. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. 

    ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానం తనను దూషించడం, అవమానించడమేనని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. అదే సమయంలో  కాంగ్రెస్‌   ప్రభుత్వంపై   వ్యతిరేకత స్పష్టంగా కనిపిందన్నారు. పార్టీ  గుర్తుతో  ఎన్నికలు జరిగితే మన సత్తా ఏమిటో  తేలేదన్నారు కేసీఆర్‌.

    ‘గర్వంతో ఎగిరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్‌ సర్కార్‌ రెండేళ్లలో ఒక్క కొత్త పాలసీ తీసుకురాలేదు. ఉన్న పథకాలు కూడా ఆపేశారు. రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఈ ప్రభుత్వ పాలసీ. ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో రైతుల ఇంటికే యూరియా వచ్చేది’ అని తెలిపారు కేసీఆర్‌.

    ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రశంసించి, దాని వ్యయ పరిమితిని  2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాను,ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తోంది. కేసీఆర్ కిట్ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేస్తోంది. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారు. రైతుల కోసం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఏదైనా ఉంటుందా?అని కేసీఆర్‌ నిలదీశారు.

  • హైదరాబాద్ సాక్షి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన  పాల్గొననున్నారు.  ఈ సమావేశంలో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు ఇదివరకే తెలంగాణ భవన్ చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడున్నట్లు సమాచారం.

  • ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్‌ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్‌ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!

    ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్వయంగా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్‌ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ  ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. 

    నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్‌  పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది.  

    చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    బెట్టింగ్‌ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్‌ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్‌ శాఖలో బలంగా వినిపిస్తోంది.

  • సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్‌ ఛానల్‌పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.

    ఇన్నయ్యను అరెస్ట్‌చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం.

     

     

     

Medak

  • పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి
    ఆర్డీఓ జయచంద్రారెడ్డి

    తూప్రాన్‌: భూ భారతి పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 60 రోజుల కంటే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సాదాబైనామా, ఎన్‌ఎఫ్‌బీఎస్‌, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులు తదితర రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.

  • తెగిన
    అన్నదాతలకు కష్టకాలం వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు చెరువు, కుంటలు, కట్టు కాల్వలు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ. 5.25 కోట్లు అవసరం అవుతాయని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రం బృందం సైతం పరిశీలించింది. అయినా నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో సుమారు 3,500 పైచిలుకు ఎకరాలు బీళ్లుగా మారాయి. – మెదక్‌జోన్‌

    రాయినిపల్లి ప్రాజెక్టు కింద దెబ్బతిన్న కాల్వ

    జిల్లాలో భారీ వర్షాలకు అనేక చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వలు తెగిపోయాయి. దీంతో నీరంతా వృథాగా పోయింది. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ఫలితంగా కొన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. కాల్వలు ధ్వంసం కావటంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటికి శాశ్వత మరమ్మతులు చేస్తే తప్ప, వచ్చే వర్షాకాలంలో నీటి నిల్వ ఉండని దుస్థితి. అంతే కాకుండా అవి తెగిపోయే ప్రమాదం ఉందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.

    ● మెదక్‌ మండలం రాయినిపల్లి ప్రాజెక్టు కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీని పరిధిలో రాయినిపల్లి, పాతూర్‌, తిమ్మనగర్‌, మక్తభూపతిపూర్‌, మల్కాపూర్‌, శివ్వాపల్లి గ్రా మాల పంటలకు ఈ ప్రాజెక్టు నుంచే సాగునీరు అందుతోంది. కాగా గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కట్టు కాలువ పలుచోట్ల ధ్వంసం అయింది. ప్రస్తుతం దానికి మరమ్మతులు చేస్తే తప్ప ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేదు. దీంతో రైతులు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 3 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి.

    ● మెదక్‌ పట్టణ పరిధిలోని అవుసులపల్లికి చెందిన ఖజానా చెరువు భారీ వరద ఉధృతికి తెగిపోయింది. దాని ఆయకట్టు 100 ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం అందులో చుక్క నీరు లేదు. యాసంగి సాగుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం మరమ్మతులు చేస్తేనే వచ్చే వర్షాకాలంలో పంటలు పండించుకునే వీలు ఉంటుంది.

    ● హవేళిఘణాపూర్‌ పెద్ద చెరువు వెనకాల 220 ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ వర్షాలకు ఈ చెరువు కట్ట కొంతమేర తెగిపోవటంతో అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ప్రస్తుత యాసంగిలో ఆయకట్టులో సగం మేర పంటలు పండే అవకాశం ఉంది. కానీ దానికి శాశ్వత మరమ్మతులు అవసరమని అధికారులు చెబుతున్నారు.

    ● అనంతసాగర్‌ ఊరచెరువు ఆయకట్టు 50 ఎకరాలకు పైగా ఉంది. అదిసైతం వర్షాకాలం తెగిపోయి నీరంతా వృథాగా పోయింది. ప్రస్తుతం పశువులకు తాగు నీరు సైతం కరువైంది. దానికి వెంటనే మరమ్మతులు చేస్తేనే వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటుంది. ఖరీఫ్‌ పంటలు పండే అవకాశం దక్కుతుంది.

    నిధులు మంజూరు కాగానే పనులు

    సాగు నీరందించే కట్టు కాల్వలు, చెరువు కట్టల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తాం.

    – శివనాగరాజు,

    డీఈ ఇరిగేషన్‌, మెదక్‌

  • నేడు

    పాపన్నపేట(మెదక్‌): మండల పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ ఏఈ నర్సింలు తెలిపారు. మిన్‌పూర్‌ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు లు చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

    జనవరిలో సర్టిఫికెట్‌

    కోర్సు పరీక్షలు

    మెదక్‌ కలెక్టరేట్‌: వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కో ర్సుల్లో భాగంగా డ్రాయింగ్‌ లోయర్‌ గ్రేడ్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలన్నీ జిల్లా కేంద్రంలో గుర్తించబడిన పరీక్ష కేంద్రంలో ఉంటాయని చెప్పారు.

    వెబ్‌సైట్‌లో మెరిట్‌ లిస్ట్‌

    మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని పలు కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల మెరిట్‌ లి స్ట్‌ విద్యాశాఖ సైట్‌లో పొందుపర్చినట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఖాళీగా ఉన్న అకౌంటెంట్‌ (4), ఏఎన్‌ఎం (5) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అభ్యర్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం సవరణ మెరిట్‌ లిస్ట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌ httpr:// medakdeo.comలో ఉంచినట్లు ఆమె వివరించారు.

    ఆయిల్‌పామ్‌ సాగుతో

    అధిక లాభాలు

    చిన్నశంకరంపేట(మెదక్‌): ఆయిల్‌పామ్‌ సాగు తో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరారంలో సత్యనారాయణ అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్‌ మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేశారని తెలిపారు. అవసరమైన రక్షణ, పంట పెరుగుదలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించే రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అయిల్‌పామ్‌ డైరెక్టర్‌ రంగనాయకులు, మేనేజర్‌ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    పంచాయతీ ముస్తాబు

    అల్లాదుర్గం(మెదక్‌): ఈనెల 22న నూతన సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయాలు ము స్తాబు చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి పంచాయతీకి కొత్తగా రంగులు వేసి కార్యాలయానికి మరమ్మతులు చేస్తున్నారు.

    వణికిస్తున్న చలి పులి

    చేగుంట(తూప్రాన్‌): చలి పులి ప్రజలను వణి కిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతను త ట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకూ చలి తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగ మంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు.

  • నిబంధనలకు ‘బంక్‌’
    పెట్రోల్‌ బంకుల్లో సౌకర్యాలేవి?
    ● కానరాని ఫస్ట్‌ ఎయిడ్‌.. టాయిలెట్లు అంతంతే ● ఉచిత ఎయిర్‌ ఉత్తిదే.. జాడలేని తాగునీరు

    మెదక్‌ కలెక్టరేట్‌: పెట్రోల్‌ బంకుల్లో టైర్లకు గాలి కొట్టిద్దామంటే అవకాశం ఉండదు.. దాహం వేస్తే తాగునీరు దొరకదు.. మరుగుదొడ్లు ఏ ర్పాటు చేయడం లేదు. ఇలా జిల్లాలో పెట్రోల్‌ బంకుల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిబంధనలను వారు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు.

    తనిఖీలో బయటపడ్డ లోపాలు

    జిల్లా కేంద్రం ఏర్పాటు అనంతరం జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వాహనాల సంఖ్యకనుగుణంగా పెట్రోల్‌ బంక్‌లు సైతం వెలిశాయి. జిల్లాలో సుమారు 100 వంద వరకు పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లు ఉన్నాయి. నిత్యం వాహనదారుల నుంచి ఆదాయం పొందుతున్న పెట్రోల్‌ బంక్‌ల యజమానులు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పెట్రోల్‌ బంక్‌లో ఖచ్చితంగా ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, వాహనదారులకు అందుబాటులో తాగునీరు, టాయిలెట్లు, ఉచిత గాలి, ఇంధన కొలతలు, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, సివిల్‌, ఫైర్‌, పోలీస్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. అలాగే ప్రతి బంక్‌లో తప్పనిసరిగా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసే విధంగా అవకాశం కల్పించాలి. ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం జిల్లా కేంద్రంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో అకస్మిక తనిఖీలు చేపట్టగా, అనేక లోపాటు వెలుగుచూశాయి. ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, టైర్లకు ఉచిత గాలి వంటి లోపాలు బయటపడ్డాయి. జిల్లా కేంద్రంలోని ఒక బంక్‌లో తనిఖీలు చేస్తే ఇవన్నీ బయట పడితే, జిల్లాకు దూరంగా ఉన్న బంకులలో ఎన్ని సమస్యలున్నాయోనని వాహనదారులు వాపోతున్నారు.

  • ఆపదలో అప్రమత్తతే ఆయుధం
    కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

    మెదక్‌ కలెక్టరేట్‌: విపత్తుల సమయంలో ప్రాణనష్టాల నివారణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ రామకృష్ణారావు ప్రకృతి విపత్తులు, వైపరీత్యాల నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈనెల 22న విపత్తు నిర్వహణపై మాక్‌ ఎక్సర్‌సైజ్‌ విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పించామని వివరించారు. గత వర్షాకాలం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయని తెలిపారు. ముందస్తు అప్రమత్తత, స్పష్టమైన ప్రణాళికలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాల సమన్వయ చర్యలతో వరదలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మున్ముందు కూడా ఎలాంటి నష్టాలు కలుగకుండా సిద్ధంగా ఉన్నామని వివరించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే వస్తువులతో కూడిన కిట్‌ను ఇటీవల జిల్లాలోని ప్రతి మండలానికి ఒకటి చొప్పున అందించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్‌ఓ భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, అదనపు ఎస్పీ మహేందర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • ఇంటి నుంచే యూరియా బుకింగ్‌

    రామాయంపేట(మెదక్‌): రైతులు శనివారం నుంచి ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రైతులకు బుకింగ్‌ యాప్‌పై అవగాహన కల్పించారు. మొబైల్‌తో రైతులు తమ ఇంటి నుంచే యూరియా బుక్‌ చేసుకోవచ్చని వివరించారు. ఈ యాప్‌ ద్వారా జిల్లా పరిధిలో యూరియా స్టాక్‌ను స్వయంగా రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. బుకింగ్‌ చేసుకోవడానికి గాను భూమి పట్టాదారులు, కౌలు రైతులు, నాన్‌ పట్టాదారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈమేరకు యూరియా బుక్‌ చేసుకున్న రైతులకు ఒక ప్రత్యేకమైన బుకింగ్‌ ఐడీ రూపొందించినట్లు పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా రైతులు బుక్‌ చేసుకున్నా, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి వారికి పంపిణీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.

  • అందరినీ కలుపుకొని పోతా

    నారాయణఖేడ్‌: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారని, రాష్ట్రంలోనే నారాయణఖేడ్‌ నియోజకవర్గం రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ మద్దతు దారులు 167మంది గెలుపొందగా.. బీఆర్‌ఎస్‌ 52 మంది, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. చాలాచోట్ల కాంగ్రెస్‌ నుంచి రెబల్‌గా పోటీ చేయడం కారణంగా బీఆర్‌ఎస్‌కు అన్ని సీట్లయినా వచ్చాయని తెలిపారు. రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్‌లు అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరనీ కలుపుకొని పోతామని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నూతన సర్పంచ్‌లు గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు.

    త్వరలో నల్లవాగు నీటి విడుదల

    కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో నల్లవాగు ప్రాజెక్టు నీటిని వదలనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తైబందీ ప్రకారం ఆరుతడి పంటలకు రెండు, మూడు రోజుల్లో నీటిని వదిలేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీడీసీ మాజీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌, నాయకులు తాహెర్‌, పండరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజుసేట్‌ పాల్గొన్నారు.

    రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

  • చల్మెడలో పెద్దపులి సంచారం

    నిజాంపేట(మెదక్‌): మండల పరిధిలోని చల్మెడలో పులి ఆనవాళ్లు కనిపించాయి. శుక్రవారం ఫారెస్ట్‌ ఆఫీసర్‌ విద్యాసాగర్‌రావు గ్రామంలో పర్యటించా రు. వారం రోజులుగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల, చల్మెడ గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. చల్మెడ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద పొ లంలో రైతు బర్రె పాలు పిండుకొని వస్తున్న క్రమంలో వెనుక నుంచి పులి పరిగెత్తుకొని వస్తున్నట్లు గమనించి కేకలు వేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రైతు వెంటనే పోలీస్‌, ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘ టనా స్థలానికి చేరుకొని అనవాళ్లను సేకరించారు. గ్రామస్తులు మల్లన్న గుట్ట ప్రాంతంలో తిరగవద్దని.. ఎవరికై నా పెద్దపులి కనిపిస్తే సమాచారం అంది ంచాలని ఫారెస్ట్‌ అధికారులు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రాజేష్‌, ఫారెస్ట్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Rangareddy

  • సమస్య

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నిధుల లేమితో రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలకవర్గాలకు సవాల్‌గా మారబోతున్నాయి. సీసీరో డ్లు, డ్రైనేజీ కాల్వలు వంటి అభివృద్ధి పనులకు నోచు కోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్‌ యార్డుల నిర్వహణ, కరెంట్‌ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్‌ నిర్వహణ ఖర్చులు ఆర్థికంగా పెనుభారంగా మారబోతున్నాయి. పంచాయతీ పగ్గాలు చేపబట్టబోతున్న కొత్త పాలకవర్గాలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు పెట్టుకున్నాయి.

    ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

    సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నవంబర్‌ 25న జిల్లాలోని 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈనెల 11న మొదటి విడతలో భాగంగా 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు.. రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఈనెల 14న, మూడో విడతలో 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించింది. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సర్పంచులు సహా వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ఒకే సమయంలో నిర్వ హించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

    పెండింగ్‌లో నిధులు..

    తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం–2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్‌లకు 2024–2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మేజర్‌ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. తండాలు, ఇతర చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. డీజిల్‌ సహా చిన్నచిన్న రిపేర్లు చేయించేందుకు సైతం నిధులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా.. పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. 15వ ఆర్థిక సంఘం విదిల్చే నిధులపైనే కొత్త పాలకమండళ్లు ఆశలు పెట్టుకున్నాయి.

    నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని పల్లెలు

    లెక్క చెప్పాల్సిందే..

    గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఓటమి పాలైన వారు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లో వెల్లడించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఐదు వేల జనాభా ఉన్న చోట సర్పంచ్‌ అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలుగా నిర్ణయించింది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న స్థానాల్లో సర్పంచ్‌ అభ్యర్థి ఖర్చు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడి ఖర్చు రూ.50 వేలుగా నిర్ణయించింది. మెజార్టీ పంచాయతీల్లో ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి రూ.50 లక్షలకుపైనే ఖర్చు చేసినట్లు సమాచారం. తొలి విడత ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు జనవరి 24లోగా, రెండో విడత అభ్యర్థులు 27లోగా, మూడో విడత అభ్యర్థులు జనవరి 30లోగా ఎన్నికల ఖర్చులను సంబంధిత ఎంపీడీఓలకు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆయా అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను పరిశీలించి టీఈపోల్‌ వెబ్‌లో అప్‌ లోడ్‌ చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంది. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లు పంచాయతీరాజ్‌ చట్టం –2018లోని సెక్షన్‌ 23 ప్రకారం పదవిని కోల్పోవడంతో పాటు వచ్చే మూడేళ్ల పాటు మరే ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉండదు.

  • ‘భవిష

    సాక్షి, సిటీబ్యూరో అంతర్జాతీయ నగరాలకు దీటు గా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పర్యావరణానికి అత్య ధిక ప్రాధాన్యత నెట్‌ జీరో సిటీగా రూపుదిద్దుకోనున్న ఫోర్త్‌ సిటీలో ప్రత్యేకంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, హరిత జోన్లుగా విభజించిన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ బృహత్‌ ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మాస్టర్‌ ప్లాన్‌పై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుందని, ఆ తర్వాత ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) మాస్టర్‌ ప్లాన్‌కు ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ)కు ప్రకటన జారీ చేస్తామని ఎఫ్‌సీడీఏ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

    రెండు మాస్టర్‌ ప్లాన్లు

    హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తరహాలో గ్రేటర్‌లో నాలుగో నగరం ఆవశ్యకత ఏర్పడిందని, దీన్ని పట్టణ, పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్‌సీడీఏను ఏర్పాటు చేశారు. 762 చ.కి.మీ మేర విస్తరించి ఉన్న ఎఫ్‌సీ డీఏలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ ఉంటుంది. ఇందులో 15 వేల ఎకరాలు అభయారణ్యం ఉండగా.. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫోర్త్‌ సిటీని అభివృద్ధి చేయనున్నారు. 2 లక్షల ఎకరాల పరిధిలోని ఎఫ్‌సీడీఏకు మరో మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుంది.

    ఫిబ్రవరిలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం

    మీర్‌ఖాన్‌పేటలో ఎఫ్‌సీడీఏ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7.29 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జీ+1 అంతస్తుల్లో, సుమారు 16,393 చదరపు అడుగులు (చ.అ.) విస్తీర్ణంలో హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఆఫీసును నిర్మిస్తు న్నారు. ఫిబ్రవరిలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కాన్ఫరెన్స్‌ హాల్‌, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వంటి ప్రత్యేక గదులుంటాయి. వంద రోజుల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

    భారత్‌ ఫ్యూచర్‌ సిటీ బృహత్‌ ప్రణాళిక సిద్ధం

    నివాస విభాగం: 1,300

    డేటా సెంటర్లు: 500

    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌: 2,000

    ఎడ్యుకేషన్‌ హబ్‌: 500

    లైఫ్‌ సైన్స్‌ హబ్‌: 3,000

    హెల్త్‌ సిటీ: 200

    ఏఐ సిటీ: 300

    ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ స్పోర్ట్స్‌: 100

    ఈవీ అండ్‌ బీఈఎస్‌ఎస్‌: 200

    ప్రత్యేక ప్రణాళికలు

    ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పలు సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలను (ఎంవోయూ) తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు.‘1,300 ఎకరాల్లోని వరంగల్‌లోని కాకతీ య మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌.. 10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుంది. విస్తీర్ణంలో అంతకు వంద రెట్లు పెద్దదైన భారత్‌ ఫ్యూచర్‌ సిటీ పెట్టుబడులు, ఉద్యోగావకా శాల్లో నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగావకాశాల కల్పనే ఫ్యూచర్‌ సిటీ లక్ష్యమని’ ఎఫ్‌సీడీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • చాంపి

    హుడాకాంప్లెక్స్‌: అత్తాపూర్‌లోని విజయానంద్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో కొనసాగుతున్న తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కం ఇంటర్‌సర్కిల్‌ టీ–20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో సరూర్‌నగర్‌ సర్కిల్‌ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సరూర్‌నగర్‌ సర్కిల్‌ జట్టు మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ జట్టుపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టుకు అతిథులు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వీఎస్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ శ్రీదేవి, జాయింట్‌ సెక్రెటరీ య గ్నప్రసాద్‌, విద్యుత్‌సౌధ సీజీఎం హెచ్‌ఆర్‌డీ బి.రవి, మెట్రోజోన్‌ అసిస్టెంట్‌ సెక్రెటరీ సత్యనారాయణ, ట్రాన్స్‌కో, డిస్కం స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎన్‌.జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

    108 అంబులెన్స్‌ల్లో తనిఖీ

    ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో 108 అంబులెన్స్‌ వాహనాన్ని జిల్లా 108 ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ రాజబాబు తనిఖీ చేశారు. 108 అంబులెన్స్‌ వాహనంలో ఉన్న మందులు, వాహనంలో ఉన్న సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌ ఈఎంటీ, పైలెట్‌ చంద్రశేఖర్‌ను అంబులెన్స్‌ వాహన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    సకాలంలో సేవలు అందించాలి

    కేశంపేట: సకాలంలో కాల్స్‌ స్వీకరించి బాధితులకు సేవలు అందించాలని జిల్లా 108 ప్రో గ్రాం కో ఆర్డినేటర్‌ రాజబాబు అన్నారు. మండల కేంద్రంలో 108 అంబులెన్స్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆక్సిజన్‌ సరఫరా, మెడికల్‌ పరికరాల పనితీరును పరిశీలించారు. పైలెట్‌ దీపక్‌తో వివరాలు ఆరా తీశారు.

    నితిన్‌నబిన్‌ను కలిసిన

    శ్రీవర్ధన్‌రెడ్డి

    షాద్‌నగర్‌రూరల్‌: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్‌నబిన్‌ను శుక్రవారం పార్టీ రాష్ట్ర నాయకుడు నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి కేంద్ర మంత్రి బండిసంజయ్‌తో వెళ్లి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీకోసం పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అన్నారు. సామాన్య కార్యకర్త జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం భారతీయ జనతాపార్టీలో ఉందన్నారు. నితిన్‌నబిన్‌ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

    ఆస్పత్రులకు

    షోకాజ్‌ నోటీసులు

    శంకర్‌పల్లి: బయో మెడికల్‌ వ్యర్థాలను డంపింగ్‌ యార్డులో వేస్తున్న కారణంగా ము న్సిపల్‌ పరి ధిలోని 22 ఆస్పత్రులు, క్లినిక్స్‌కు శు క్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ యోగేశ్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బయో మెడికల్‌ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆస్పత్రులు, క్లినిక్స్‌ పాటించడం లేదని అన్నారు. వ్యర్థాలను ప్రభుత్వం సూచించిన ఏజెన్సీలకు అప్పగించాలని, దీనిపై ఇప్పటికే పలుమార్లు మౌఖికంగా హెచ్చరించామని, అయినప్పటికీ వారు తీరు మార్చుకోవడం లేదన్నారు. ప్రస్తుతం షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, పునరావృతమైతే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • అమరుల ఆశయ సాధనకు సైకిల్‌ యాత్ర

    చేవెళ్ల: తెలంగాణ అమరుల ఆశయ సాధన, గ్రామంలో బెల్టుషాపులు తొలగింపు, ఉద్యమకారులకు గుర్తింపు, పాలకుల్లో మార్పు డిమాండ్లతో ఓ వార్డు సభ్యుడు చేపట్టిన సైకిల్‌ యాత్ర శుక్రవారం చేవెళ్లకు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లికి చెందిన ఎన్నారం యాదయ్య ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాగసాన్‌పల్లి 1వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. తన గ్రామంలో పైడిమాండ్లను అమలు చేయాలని కోరుతూ గురువారం ఉదయం అసెంబ్లీకి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. రాత్రి చేవెళ్ల పరిధిలోని దామరగిద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం చేవెళ్లలోని అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌, చాకలి ఐలమ్మ, సర్దార్‌ సర్వాయి పాపన్న, పండుగల సాయన్న, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్‌ జయశంకర్‌, ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిచారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు యాదయ్య ఆలోచనను అభినందించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. సైకిల్‌ యాత్ర ద్వారా ముందు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తానని, అనంతరం అసెంబ్లీకి చేరుకుని, అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులకు తన డిమాండ్లను చెబుతానని స్పష్టం చేశారు. చేవెళ్ల నాయకులు టేకుపల్లి శ్రీనివాస్‌యాదవ్‌, అబ్దుల్‌ గని, బస్తేపూర్‌ నర్సింలు తదితరులు యాదయ్యకు వీడ్కోలు పలికారు.

  • విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

    మంచాల: సర్కార్‌ బడులు అభివృద్ధి పథంలో పయనించాలంటే కచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యా బోధన, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆరుట్ల స్కూల్‌ మాదిరిగా రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, విద్యా కమిషన్‌ సభ్యులు పద్మజాషా, జ్యోత్న్స, శివారెడ్డి, ఎస్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు గిరిధర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఆ గ్రామాల్లో హెచ్‌ఆర్‌ఏ అమలు చేయండి

    ఇబ్రహీంపట్నం రూరల్‌: జీహెచ్‌ఎంసీలో విలీనమైన గ్రామాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలని పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు వర్కాల పరమేష్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పెరిపెరి ప్రాంతాన్ని వెంటనే గుర్తించాలన్నారు. మండలంలోని పెరిపెరిలోకి వచ్చే ఎల్మినేడు, పోచారం, ఉప్పరిగూడ, మల్సెట్టిగూడ, కప్పపహాడ్‌, తుర్కగూడ, చర్లపటేల్‌గూడ, తులేకలాన్‌, కర్నంగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి, నెర్రపల్లి, ఖానాపూర్‌, తులేకలాన్‌, దండుమైలారం వరకు హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • సుప్రీం తీర్పు హర్షణీయం

    బడంగ్‌పేట్‌: 102 ఎకరాలు ఫారెస్ట్‌దే అని సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం సంతోషకరమని అడిషినల్‌ పీసీసీఎఫ్‌ శర్వానంద్‌ అన్నారు. బడంగ్‌పేట సర్కిల్‌లోని గుర్రంగూడ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుర్రంగూడ ఫారెస్ట్‌ రేంజ్‌లో అత్యంత విలువైన 102 ఎకరాల భూమిపై సాలార్‌జంగ్‌ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసి పుచ్చిందని తెలిపారు. సరైన సమయంలో అటవీ అధికారులు వ్యవహరించడంతో 102 ఎకరాలు ప్రభుత్వ పరమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్‌ అధికారి గోపిడి రోహిత్‌రెడ్డి, రేంజ్‌ అధికారి కె.శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ రేంజ్‌ అధికారి కస్లనాయక్‌, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

  • స్వీయ విగ్రహావిష్కరణ

    మొయినాబాద్‌: ఏడాది క్రితం మరణించిన భార్య విగ్రహంతోపాటు తన విగ్రహాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు రైతు కళ్లెం నర్సింహారెడ్డి. మున్సిపల్‌ పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో ఉన్న కళ్లెం నర్సింహారెడ్డి వ్యవసాయ కళాక్షేత్రంలో శుక్రవారం తన కూతుళ్లు, బంధువులు, స్నేహితుల సమక్షంలో స్వయంగా ఆయనే విగ్రహాలను ఆవిష్కరించారు. ముప్‌పై ఏళ్ల పాటు అమెరికాలో వ్యవసాయం చేసి ఉత్తమ అవార్డు అందుకున్న నర్సింహారెడ్డి 2005లో స్వదేశానికి వచ్చి చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో వ్యవసాయ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. గత సంవత్సరం భార్య లక్ష్మి మరణించడంతో ఆమె జ్ఞాపకార్థం ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను ఒంటరిగా ఉంచలేనంటూ తన విగ్రహాన్ని సైతం పక్కనే ఏర్పాటు చేశారు. శుక్రవారం విగ్రహాల ఆవిష్కరణ చేసిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

  • నాయకత

    గురునానక్‌లో జాతీయ స్థాయి బిజినెస్‌ కాన్‌క్లేవ్‌

    ఇబ్రహీంపట్నం రూరల్‌: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వ్యాపార దృష్టిని పెంపొందించేడమే లక్ష్యంగా గురునానక్‌ యూనివర్సీటీ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కామర్స్‌లో జాతీయ స్థాయి బిజినెస్‌ కాన్‌క్లేవ్‌–2025ను శుక్రవారం నిర్వహించారు. పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం కోసం అవగాహన కల్పించారు. గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఛాన్సలర్‌, వైస్‌ చైర్మన్‌ సర్దార్‌ గగన్‌దీప్‌ సింగ్‌ కోహ్లి, వైస్‌ చాన్సలర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌ఎస్‌ సైనీ మార్గదర్శకత్వంలో నిర్వహించారు. సెమినార్‌ ప్రారంభోత్సవానికి రెక్టర్‌ డాక్టర్‌సీ కలైరాసన్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌విశాల్‌ వాలియా, అడ్వైజర్‌ డాక్టర్‌ ఎంపీ సింగ్‌ ఇషార్‌లు హాజరై ప్రారంభించారు. నవీన వ్యాపార దోరణులు, డిజిటల్‌ మార్పులు, నాయకత్వం, సస్టైనబిలిటీ, భవిష్యత్‌ వ్యాపార అవకాశాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రోజ్‌ మేరీ తదితరులు పాల్గొన్నారు.

    కబడ్డీ పోటీల్లో సాయిచరణ్‌ ప్రతిభ

    జాతీయస్థాయిలో గుర్తింపు

    ఆమనగల్లు: భోపాల్‌లో శుక్రవారం జరిగిన జాతీయస్థాయి కబడ్డీ చాంపియన్‌షిఫ్‌ పోటీల్లో దయ్యాలబోడు తండాకు చెందిన ఇంటర్మీడియట్‌ విద్యార్థి సాయిచరణ్‌ అత్యంత ప్రతిభ కనబరిచి బెస్ట్‌ రైడర్‌గా బహుమతిని అందుకున్నాడు. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి సాయిచరణ్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిఫ్‌ పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అండర్‌ 17 విభాగంలో సాయిచరణ్‌ సాయిచరణ్‌ బెస్ట్‌ రైడర్‌ అవార్డు అందుకున్నాడు.

    అధికారులపై చర్యలు తీసుకోవాలి

    ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ టీచర్ల ధర్నా

    ఇబ్రహీంపట్నం: అంగన్‌వాడీ టీచర్లపై అనుచిత వాఖ్యలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన బీఎల్వోల సమావేశంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మీ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు, పారితోషికం తదితర విషయాలపై డీటీ ప్రవీణ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే అనుచిత వాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చూడకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా, తమను అగౌరవ పరిచే వాఖ్యలు చేశాడని మండిపడ్డారు. అనంతరం వారు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తక్షణమే ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి ఎలక్షన్‌ డీటీపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు పి. కృష్ణ, జగన్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బాలమణి, అండాలు, సువర్ణ, యాదమ్మ, మంజుల, విజయలక్ష్మీ, హంసమ్మ, శివరాణి పాల్గొన్నారు. కాగా ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో సీనియర్‌ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

    జింక పిల్లను ఫారెస్ట్‌ సిబ్బందికి అప్పగింత

    కందుకూరు: లేమూరు పరిధిలోని రోబోమాటిక్‌ కంపెనీ ఫారెస్ట్‌ ఫెన్సింగ్‌లో చిక్కుక్కున్న జింక పిల్లను గ్రామస్తులు కాపాడారు. మాజీ సర్పంచ్‌ పరంజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం అటవీ సిబ్బంది అందజేశారు. వీరిలో శ్రీకాంత్‌, కార్తీక్‌, అనిరుధ్‌, ఆకాష్‌, రోబోమాటిక్‌ కంపెనీ సిబ్బంది ఉన్నారు.

Nirmal

  • నిర్మ
    క్రీడల్లో ప్రతిభ కనబర్చాలి
    నిర్మల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులకు క్రీడల పోటీలు నిర్వహించారు.

    కలెక్టర్‌ను సన్మానించిన

    ఎంపీడీవోలు

    నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కలెక్టర్‌ అభినాష్‌ అభినవ్‌, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌ను అన్ని మండలాల ఎంపీడీవోలు శనివారం కలెక్టరేట్‌లోని సన్మానించారు. మూ డు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడా ఇబ్బందులు లేకుండా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎంపీడీవోలు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికారులకు కలెక్టర్‌ ఇచ్చిన ప్రోత్సాహం గొప్పదని, ఆమె మార్గదర్శకత్వంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందని తెలి పారు. అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవోలను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు లక్ష్మీకాంత్‌, గజానన్‌, నీరజ్‌కుమార్‌, రాధ, అరుణ, రమాకాంత్‌ పాల్గొన్నారు.

    ఫొటో ఒక్కటి చాలు. నిండుగా పారుతున్న కడెం నదిని థర్మకోల్‌తో చేసిన తెప్పపై దాటి వెళ్తున్నారు. ఇందులో ఒకరిద్దరే మగవాళ్లు. మిగిలిన వాళ్లంతా మహిళలే. ఇంతకు ముందెన్నడూ వారికి ఇంతదూరం ఉన్న ఆ ఊరు తెలియదు. కఠినమైన ఈ దారీ తెలియదు. అయినా.. విధినిర్వహణ కోసం అలా వెళ్లారంతే. ఈనెల 11న నిర్వహించిన తొలివిడత పంచాయతీ ఎన్నికల కోసం పెంబి మండలంలోని కడెం నది అవతలివైపు ఉన్న అటవీగ్రామం యాపల్‌గూడ పంచాయతీకి మహిళ సిబ్బంది ఇలా ప్రమాదకరమైన తెప్ప ప్రయాణం చేశారు. వీరి పరిస్థితి తెలుసుకుని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషామస్రత్‌ ఖానం స్వయంగా వచ్చి జాగ్రత్తగా వెళ్లివచ్చేలా పర్యవేక్షించారు.

    నిర్మల్‌: జిల్లాలో పల్లెపోరు సాఫీగా పూర్తికావడం వెనుక ఎంతోమంది శ్రమ దాగిఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ఉద్యోగులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పడ్డ కష్టమూ ఉంది. దూరభారాన్ని, చలి వాతావరణాన్ని, కఠినమైన పరిస్థితులనూ లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు ఒకరోజు ముందే వెళ్లి, రాత్రి అక్కడే బసచేసి, వేకువజామునే ఎన్నికలకు అన్నీ సిద్ధం చేశారు. పొద్దున ఏడింటి నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించి, మళ్లీ మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రిదాకా కౌంటింగ్‌, రీకౌంటింగ్‌లూ చేసి ఆ ఊళ్ల ఐదేళ్ల భవిష్యత్తును ప్రకటించి వచ్చారు. ఇలాంటి కఠినమైన పంచాయతీపోరును విజయవంతంగా నడిపించిన వారిలో ఉన్నతాధికారులతోపాటు సిబ్బందిలోనూ మహిళలే అధికంగా ఉండటం విశేషం.

    పంచాయతీలో మహిళాశక్తి..

    జిల్లాలో మొత్తం 400 గ్రామపంచాయతీలు ఉండగా, దస్తురాబాద్‌ మండలం పెర్కపల్లిలో నామినేషన్‌లు రాని కారణంగా ఎన్నిక నిలిపివేశారు. మిగిలిన 399 జీపీల్లో 195 చోట్ల మహిళా అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. జనాభాలోనే కాకుండా పాలనలోనూ మహిళల శక్తి పెరుగుతోంది. రిజర్వేషన్‌ వచ్చిన పంచాయతీల్లోనే కాకుండా జనరల్‌ స్థానాల్లోనూ మహిళ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి పంచాయతీ బరిలో దిగిన మహిళల్లో నిరక్షరాస్యులతోపాటు ఏకంగా డిగ్రీ, పీజీలు చదివినవారూ ఉన్నారు.

    ముగ్గురు ఉన్నతాధికారులూ..

    జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ముందుండి నడిపించిన ముగ్గురు ఉన్నతాధికారులూ మహిళలే కావడం మరో విశేషం. కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, ఎస్పీ జానకీషర్మిలతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నియమించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్‌ ఖానం ఈ ముగ్గురు మహిళాఅధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తూ.. పంచాయతీలను పరిశీలిస్తూ.. విజయవంతం చేశారు.

    పిల్లలు, కుటుంబాలను వదిలి..

    ఎన్నికల డ్యూటీలు నిర్వర్తించిన మహిళల్లో చాలామంది చిన్న పిల్లలను, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను వదిలి విధులకు వచ్చారు. తూర్పు నుంచి పడమరకు, ఈ కొన నుంచి ఆ చివరనకు ఇలా చాలామంది మహిళలకు దాదాపు 100 కి.మీ. దూరంపైనే డ్యూటీలు పడ్డాయి. అయినా.. చాలామంది అతివలు దారి కూడా సరిగా లేని అటవీ గ్రామాలకూ వెళ్లారు. వణికిస్తున్న చలిలో రాత్రిపూట అలాంటి మారుమూల గ్రామాల్లో అరకొర వసతుల్లో బసచేశారు. వేకువజామునే పోలింగ్‌కు సిద్ధమై రోజంతా శ్రమించి విజయవంతంగా పూర్తిచేశారు. రాత్రి 10–11గంటల వరకూ కౌంటింగ్‌ చేసి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకున్నారు.

    ప్రజల సహకారంతో..

    పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. అన్నిశాఖలు, అధికారులు, సిబ్బంది సహకారంతో పోలింగ్‌ విజయవంతంగా పూర్తిచేశాం. ఈ స్ఫూర్తితో రానున్న ఎన్నికలనూ పూర్తిచేస్తామన్న భరోసా ఏర్పడింది.

    –అభిలాషఅభినవ్‌, కలెక్టర్‌

    సమష్టి కృషితో..

    పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేయడంలో సమష్టి కృషి ఉంది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కలిసి ప్రశాంతంగా ఎన్నికలను పూర్తిచేశాం. పోలింగ్‌ సాఫీగా పూర్తికావడానికి ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించారు. –జానకీషర్మిల, ఎస్పీ

Siddipet

  • 432 కేసుల ఉల్లంఘన

    సిద్దిపేటకమాన్‌: జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ ముగిసే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఇటీవల నూతన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్‌ తన మార్క్‌ చాటుకున్నారు. సర్పంచ్‌, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన, మద్యం పంపిణీని అడ్డుకుని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఎవరు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకున్నారు.

    ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 17న మూడవ విడత పోలింగ్‌, కౌంటింగ్‌ ముగిసే వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లాలో మొత్తం 432 కేసులు నమోదు చేశారు. వీటిలో 271 మద్యం కేసులు నమోదయ్యాయి. రూ.37,89,530 విలువగల 5,181 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉచితంగా వివిధ రకాల వస్తువులను పంపిణీ చేసేందుకు పలువురు ప్రయత్నించగా తనిఖీ బృందాలు పట్టుకుని 35 కేసులు నమోదు చేసి రూ.2,29,560 విలువగల వస్తువులను సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.30,36,620 నగదును పోలీసులు సీజ్‌ చేశారని తెలిపారు. అనుమతి లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై 27కేసులు, బాణసంచా కాల్చడంపై 15కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 2,729 మందిని అధికారుల ముందుగానే బైండోవర్‌ చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.

  • ధైర్యంగా పని చేయండి
    ● వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ● అన్ని పనులు చేసుకుందాం ● మా సర్పంచులను తన ఖాతాలో వేసుకుంటున్న సీఎం ● ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా

    సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌ సర్పంచులు ధైర్యంగా పనిచేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలిచిన సర్పంచులను సంగారెడ్డిలో శనివారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. డబ్బులు పంచి గూండాయిజం చేసినా బీఆర్‌ఎస్‌ నాయకులు ధైర్యంగా ఎదుర్కొని సర్పంచులుగా విజయం సాధించారని చెప్పారు. మరో రెండేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్‌ సర్పంచులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సర్పంచులు ఐదేళ్లు పదవిలో ఉంటారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను తాను దగ్గరుండి చేయిస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేని చెక్‌ పవర్‌ సర్పంచులకే ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పడైనా అధికార పార్టీ 90 శాతం స్థానాలను గెలుచుకుటుందని, కానీ ఈ సర్పంచ్‌ ఎన్నికల్లో 40 శాతానికి మించి సుమారు నాలుగు వేల సర్పంచ్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకుందని హరీశ్‌ చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ సర్పంచులను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌ సీఎం కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.

    కొత్త సర్పంచులకు అవగాహన కార్యక్రమాలు

    కొత్తగా సర్పంచులుగా ఎన్నికై న వారికి అవగాహన కల్పించేందుకు పార్టీ ఆధ్వర్యంలో త్వరలో సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి భవిష్యత్‌ ఉంటుందని, గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఆ పార్టీ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీహరి, పట్నం మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

  • మురుగ

    గుంతలమయంగా రోడ్డు

    గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ మండలం బయ్యారం గ్రామ ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాత్రి సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మార్గం గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

    నిలిచిన జీపీ భవన నిర్మాణం

    అక్కన్నపేట: అక్కన్నపేట మండలం కన్నారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. అది ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో శిథిలావస్థలో ఉన్న భవనంలోనే పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

    తొగుట: తొగుట మండల కేంద్రంలో పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్నేళ్లుగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే గుంతలు తవ్వి మురుగు నీటిని పంపిస్తున్నారు. దీంతో దోమలతో సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో డ్రైనేజీ కాలువల నిర్మాణం చేస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  • పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిలు

    సాక్షి, సిద్దిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్‌) ప్రస్తుత పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు పర్సన్‌ ఇన్‌చార్జీలుగా కొనసాగనున్నారు. పీఏసీఎస్‌ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ముగిసింది. వాటినే పర్సన్‌ ఇన్‌చార్జి మేనేజింగ్‌ కమిటీలుగా ఆరు నెలలు పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ గడువు ముగిసిన తర్వాత ఆగస్టు 14న నిరవధికంగా పొడిగింపు ఇచ్చింది. తాజాగా శుక్రవారం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 21 పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిలను జిల్లా సహకార అధికారి వరలక్ష్మి నియమించారు. కొండపాక పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా డీసీఏవో నాగేశ్వర్‌ రావు, చేర్యాల, రేబర్తికి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సతీశ్‌ రెడ్డి, ములుగు, వర్గల్‌లకు శ్రీనివాస్‌ రెడ్డి, హుస్నాబాద్‌, కట్కూర్‌లకు గౌతమ్‌, సిద్దిపేట, గంగాపూర్‌కు అమృతసేనారెడ్డి, దుబ్బాక, మిరుదొడ్డిలకు రాజశేఖర వర్మ, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌లకు రఘోత్తమ్‌రెడ్డి, కోహెడ, బెజ్జంకిలకు రాజమౌళి, పాలమాకుల, నంగునూరులకు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ రెడ్డి, దౌల్తాబాద్‌, కానుగల్‌కు రవి, మిట్టపల్లి, అల్లీపూర్‌లకు యాదగిరి నియమితులయ్యారు. శనివారం వీరంతా బాధ్యతలు స్వీకరించారు.

    బాధ్యతల స్వీకరణ

  • ‘ఉపాధి’ చట్టాన్ని కొనసాగించాలి

    చేర్యాల(సిద్దిపేట): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్‌మావో అన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాత బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారిపై నిరసన చేపట్టి వీబీ జీ రాం జీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ పేరుతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి సాధారణ పథకంగా అమలు చేయాలని చూస్తుందన్నారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం మహాత్ముడిని అవమానపర్చడమే అన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై భారం మోపుతుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అరుణ్‌, నర్సిరెడ్డి, శ్రీహరి, శోభ, రాజు, మైసయ్య, రవీందర్‌, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

    సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకట్‌మావో

Srikakulam

  • అతివకు ఆసరా

    నా యుక్త వయస్సులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరి మహిళగా మిగిలిపోయాను. పింఛన్‌ కోసం ఎంతో మందిని కలిసినా ఎవరూ దయ చూపించలేదు. మా గ్రామంలో సాయిలక్ష్మీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో జగనన్న ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌ ఆసరా నా జీవనానికి అండగా నిలబడింది. ఆ ఆసరానే నా జీవితానికి ‘పూల బాట’గా మారింది. మా గ్రామ దేవత ఆలయం చెంత పూల వ్యాపారం, దేవుని పూజా సామగ్రి కొట్టును పెట్టుకున్నాను. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష 50వేలు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాను. జగనన్నే ఉండి ఉంటే నాకు ఇచ్చిన ఇంటి నిర్మాణం కూడా పూర్తయి ఉండేది.

    – సాడి మీనాక్షి, లొద్దపుట్టి జంక్షన్‌,

    ఇచ్ఛాపురం మండలం

  • విద్యాభివృద్ధి
    వైఎస్‌ జగన్‌ రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్‌ చేశారు

    నా పేరు డబ్బీరు హరీష్‌. మాది టెక్కలి. ఓ సాధారణ కుటుంబం. నాన్న విశాఖలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి వద్దనే టైలరింగ్‌ చేస్తుంటారు. 2022లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలో మెకానికల్‌ విభాగం సీటు సాధించాను. అప్పటికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంజినీరింగ్‌లో అయితే చేరాను గానీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ వైఎస్‌ జగన్‌ హయాంలో ఐదు దఫాలుగా రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో అందాయి. రెండేళ్లు చక్కగా చదువుకుని మూడో ఏడాదికి వచ్చేశాను. ప్రభుత్వం మారాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బు పడలేదు. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నాను. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుంది. ఇటీవల అప్పు చేసి మరీ రూ.46 వేలు ఫీజు కట్టాం.

  • ఉపాధి

    శ్రీకాకుళం రూరల్‌: హెచ్‌పీసీఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, బొల్లినేని మెడిస్కిల్‌ సంయుక్తంగా బ్యుటీషియన్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్‌ (నర్సింగ్‌), ప్రొడక్షన్‌ మిషన్‌ ఆపరేటివ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ మేడపై ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

    పలాస: రామకృష్ణాపురం వద్ద సత్యసాయి విద్యావిహార్‌లో ఇటీవల రూ.లక్షా 40వేలు విలువైన ఐరన్‌ పోల్స్‌ను దొంగిలించిన కేసులో గౌరీశంకర్‌, మోహనరావు, తాతారావు, ప్రకాశరావు అనే నలుగురిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపరచగా పాతపట్నం సబ్‌ జైలుకు తరలించినట్టు తెలిపారు.

    అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్‌ శాఖ పలు కార్యక్రమాలను ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్‌ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్‌ ఈఈ సురేష్‌కుమార్‌, కమర్షియల్‌ ఏడీఈ రామ్మోహన్‌, డీ–1 ఏఈ జె.సురేష్‌కుమార్‌, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు.

    ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్‌ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్‌ పాలిటెక్నిక్‌ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్‌ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్‌పాల్‌, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్‌చార్జ్‌ పీడీ ఎస్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

    శ్రీకాకుళం రూరల్‌: మునసబుపేట గాయత్రీ కళాశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొ మ్మాళి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు(60), అనపాన గణేష్‌ ద్విచక్రవాహనంపై కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాయత్రీ కళాశాల సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ వెనుక కూర్చున్న భాస్కరరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • సంప్ర

    శ్రీకాకుళం రూరల్‌ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత వరప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్‌రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్‌ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్‌ స్వాతి సోమనాథ్‌, తోటకూర ప్రసాద్‌, కళాసుధ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  • నువ్వే అన్నా!
    నాయక రత్నం

    రోజు జగనన్న ప్రభుత్వంలో ఫీడర్‌ అంబులెన్స్‌ లేకపోతే నాప్రాణాలు పోయేవి. నా బిడ్డతో ఈరోజు క్షేమంగా ఉన్నానంటే అది జగనన్న పెట్టిన భిక్షే. సరిగ్గా రెండున్నరేళ్ల కిందట డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రివేళ జోరువాన, ఎటూ కదల్లేని పరిస్థితిలో సైతం టెక్నీషియన్‌ మా గ్రామానికి వచ్చి ఫీడర్‌ అంబులెన్స్‌ ద్వారా మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం తప్పి డెలివరీ జరిగింది. వైద్యులు ఎంతో చక్కగా వైద్యాన్ని అందించి నా ప్రాణాలు కాపాడారు. జగనన్నకు ధన్యవాదాలు.

    – గొందర లక్ష్మీ, కేరాసింగి గ్రామం.

    సంక్షేమ సంతకం

  • మత్తుతో జీవితం చిత్తు

    శ్రీకాకుళం క్రైమ్‌ : పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభ్యుదయ సైకిల్‌ యాత్ర వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్‌ జెట్టి, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29తో ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరగాల్సివుండగా, జనాదారణ పెరగడంతో యాత్ర పొడిగించామని, వచ్చే నెల 3న ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరుగుతుందని వెల్లడించారు.

    టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

  • దేవుడి కంటే ముందు గుర్తొచ్చేది జగనే

    రోజు నేను ఇలా మా కుటుంబంతో ఆనందంగా జీవించి ఉన్నానంటే వైఎస్‌ జగన్‌ చేసి న మేలే అందుకు కారణం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి నన్ను బతికించా రు. మాది పోలాకి మండలం పాలవలస గ్రామం. నా భర్త జోగారావుతో కలిసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్నాను. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉన్నంతలో ఆనందంగా ఉండే మాపై ఎవరి దిష్టి పడిందో గానీ, మాయదారి రోగం నన్ను అనారోగ్యం పాలుచేసింది. తొలుత ఆస్పత్రుల్లో డాక్టర్లకు చూపించిన తర్వాత పెద్ద జబ్బు అని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలీలేదు. చేతిలో డబ్బుల్లేవు. పెద్దాస్పత్రికి వెళ్లలేను. అలాంటి టైములో నా పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి మా వివరాలు ఇచ్చిన వెంటనే నాకు పూర్తి ఉచితంగా చికిత్స చేశారు. దాదాపు నెలరోజుల తరువాత పూర్తిగా వ్యాధి నయమైందని డాక్టర్లు మాకు చెప్పినపుడు దేవుడి కంటే ముందు జగన్‌ మాకు గుర్తొచ్చాడు. లక్షల్లో ఖర్చు అయ్యే ఇలాంటి వైద్యం మాలాంటి కుటుంబాలకు సాధ్యం కాని పని. మాలాంటి అనేకమంది దీవెనలు ఉన్నంతవరకు జగన్‌కు అంతా మంచే జరుగుతుంది. మాఅందరి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. – రాజులమ్మ

    ఆరోగ్యశ్రీ

Sangareddy

  • ఖైదీల

    జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర

    సంగారెడ్డి టౌన్‌: జైలులో ఖైదీలకు సరైన ఆహారాన్ని అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. శనివారం కంది లోని సెంట్రల్‌ జైలును తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులోని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

    పుస్తకపఠనంపై దృష్టి పెట్టాలి

    సివిల్‌ జడ్జి అసదుల్లా షరీఫ్‌

    జోగిపేట(అందోల్‌): విద్యార్థులు మొబైల్‌ ఫోన్ల వినియోగం తగ్గించి.. పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని జోగిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి, మండల సర్వీస్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ పేర్కొన్నారు. శనివారం మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో జోగిపేటలోని తెలంగాణ మైనారిటీస్‌ పాఠశాల, కళాశాలలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. జడ్జి షరీఫ్‌ మాట్లాడారు. విద్యార్థులకు చట్టాలపై ప్రాథమిక అవగాహన, ఆన్‌న్‌లైన్‌ మోసాలపై వివరించారు. అనవసర లింకులు ఫేక్‌ మెసేజ్‌లు నుంచి దూరంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులు, విద్యహక్కు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్‌. శివప్రసాద్‌, సారా వెంకటేశం, జోగిపేట్‌ ఏఎస్‌ఐ అంజయ్య, తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లీగల్‌ సర్వీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

    భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి

    డిప్యూటీ కలెక్టర్‌ ప్రతిభ

    మునిపల్లి(అందోల్‌): భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్‌ ప్రతిభ ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆమె శనివారం సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ సేవ ద్వారా భూ భారతికి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గంగాభవానీ, ఆర్‌ఐ, సుభాష్‌, గ్రామ పాలన అధికారులు అంజన్‌ కుమార్‌, చంద్ర ప్రకాష్‌, నర్సింలు, శివగౌడ్‌, ధనుంజయలు పాల్గొన్నారు.

    వంటకాల ప్రదర్శన

    ఉత్సాహంగా ఫుడ్‌ ఫెస్టివల్‌

    ఝరాసంగం(జహీరాబాద్‌): మండలంలోని బర్దిపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్‌ ఫెస్టివల్‌ను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం పాఠశాల విద్యార్థులు ఘుమఘుమలాడే వంటకాలను ఇంటి నుంచే తయారు చేసుకుని వచ్చి, ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వివిధ రకాల వంటలు వాటిని ఆహారంగా తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులు వివరించారు. పలు రకాల వంటకాలను గుర్తించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణప్రియ, ఉపాధ్యాయులు జీవన్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • పాఠశాలల తనిఖీ

    జహీరాబాద్‌ టౌన్‌: మొగుడంపల్లి మండలంలోని పలు పాఠశాలలను శనివారం తనిఖీ కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రాయిపల్లి తండా, మన్నాపూర్‌ ప్రాథమిక పాఠశాలలను నోడల్‌ అధికారి ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిమ్మల కిష్టయ్య, వాహబోద్దీన్‌లు తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, బోధన ప్రణాళిక, విద్యార్థుల హాజరు శాతం వంటి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు.

    ఇన్‌చార్జి మంత్రిని కలిసిన కార్పొరేటర్‌

    పటాన్‌చెరు టౌన్‌: స్థానిక డివిజన్‌లో పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరయ్యాయని కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం నిధుల మంజూరు పత్రంపై సంతకం చేయించేందుకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వివేక్‌ వెంకట స్వామిని హైదరాబాద్‌లో కలిశారు. గ్రేటర్‌కు మంజూరైన నిధుల్లో ఒక కోటి నిధులు ఖర్చు చేసేందుకు సంతకం తీసుకున్నట్లు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్‌ కార్పొరేటర్‌ పుష్ప నాగేష్‌, నవీన్‌ రెడ్డి, సందీప్‌ పాల్గొన్నారు.

  • అవార్డు కోసం కృషి

    స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. జాతీయస్థాయికి కూడా ఎంపికయ్యేలా కృషి చేయాలని ఆయా పాఠశాలల కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, పాఠశాలల హెచ్‌ఎంలకు సూచించాం.

    – వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి

    రూ. లక్ష ప్రోత్సాహం

    జిల్లాలో అధిక రేగింగ్‌ కలిగి పాఠశాలలను ఇటీవల జిల్లా బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అందులో అన్ని అర్హతలు కలిగిన ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది. జహీరాబాద్‌ మండల పరిధిలోని గోవింద్‌పూర్‌, కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ ప్రాథమిక పాఠశాలలు, అలాగే పటాన్‌చెరులోని శిశు విహార్‌, పలు ప్రైవేట్‌ పాఠశాలలు ఎంపికై న వాటిలో ఉన్నాయి. త్వరలో రాష్ట్ర బృందం వీటిని పరిశీలించనుంది. రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి రూ.లక్ష స్కూల్‌ గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది.

  • ముఖ్య

    నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లపై ముఖ్యమంతి, మంత్రులు, సంబంధించిన ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాం. అ సమయంలో అధికారులు నామమాత్రంగా చిన్న ప్రకటన బోర్డులను తొలగించారు. గోపనపల్లి తండా నుంచి కొల్లూరు రింగ్‌ రోడ్డు వరకు ఉన్న రేడియల్‌ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి కాకపోయినా మధ్యలో ర పకటన బోర్డులను ఏర్పాటు చేశారు. – ఈశ్వరగారి రమణ, తెల్లాపూర్‌, నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

    ప్రభుత్వ ఖజానాకు గండి

    హోర్డింగ్‌ల వలన ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతుంది. దీనిపై అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రమాదకరంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లపై చర్యలు తీసుకోవాలి. హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – సురేష్‌ కుమార్‌, తెల్లాపూర్‌

  • ‘స్వచ్ఛ’ పాఠశాలలు!
    ● ఎస్‌హెచ్‌వీఆర్‌ కింద 8 స్కూళ్లు ఎంపిక ● త్వరలో రాష్ట్ర స్థాయి బృందం రాక ● రూ.లక్ష గ్రాంట్‌ ఇవ్వనున్న కేంద్ర సర్కార్‌

    న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత కలిగిన పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించడానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎస్‌హెచ్‌వీఆర్‌ (స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌) పేరుతో ప్రతియేటా జిల్లా, రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాలు అందిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను జిల్లాలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి.

    ఎనిమిది పాఠశాలల ఎంపిక

    జిల్లాలో 864 ప్రాథమిక, 187 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలలు, 22 కేజీబీవీలు, 10 మోడల్‌ పాఠశాలలు ఉన్నాయి. అలాగే 109 గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, 500 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వాటిలో తాగునీరు, మరుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా అమలు చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్‌ ఇచ్చింది. పాఠశాలల పరిస్థితుల వివరాలను హెచ్‌ఎంలు యూడైస్‌ లాగిన్‌తో ఎస్‌హెచ్‌వీఆర్‌లో సెప్టెంబర్‌లోనే నమోదు చేశారు.

  • హోర్డ
    ఎక్కడ చూసినా అవే దర్శనం
    ● ప్రమాదాలకు ఆస్కారం ● ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ● పట్టించుకోని అధికారులు

    రామచంద్రాపురం(పటాన్‌చెరు): జీహెచ్‌ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలలో అక్రమ హోర్డింగ్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నగర శివారు ప్రాంతాలైన తెల్లాపూర్‌, ముత్తంగి, అమీన్‌పూర్‌ డివిజన్‌లలో పురోగతి దిశగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలలో రియల్‌ వ్యాపారంతో పాటు అనేక వాణిజ్య సంస్థల హోర్డింగ్‌లకు మంచి డిమాండ్‌ వచ్చింది. రోడ్లు, ఇళ్లపై ఇష్టానుసారంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై గతంలో కొందరు మంత్రులకు సైతం ఫిర్యాదు చేశారు. రోడ్డ మధ్యలో చిన్నపాటి ప్రకటన బోర్డులను దర్జాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వందల సంఖ్యలో ఉన్నాయని అధికారులే చెబుతున్నా.. వీటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ హోర్డింగ్‌ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరుగుతోంది. ప్రతి ఏటా లక్షలాది రూపాయల ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది.

    అధికారుల అండదండలు

    అక్రమ హోర్డ్‌ంగ్‌ల ఏర్పాటు దారులకు స్థానిక అధికారుల అండదండాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం రేడియల్‌ రోడ్డు డివైడర్‌పై అనేక ప్రకటన బోర్డులను ఏర్పాటు చేశారు. వాటిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నామమాత్రం తొలగించి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తుంది. వీటిపై విజిలైన్స్‌ అధికారులతో విచారణ చేయించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

    అక్రమాలే కాని చర్యలేవి..?

    గత ప్రభుత్వం హోర్డింగ్‌లకు సంబంధించిన అనుమతులను పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. కానీ చూస్తుండగానే అనేక కొత్త హోర్డింగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ అక్రమాలే అని అధికారులే చెబుతున్నా..చర్యలు మాత్రం తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కాగా, రోడ్డు మధ్యలో, పక్కలో ఏర్పాటు చేసే హోర్డింగ్‌లపై ఉండే ప్లేక్స్‌లు ప్రమాదకారంగా మారుతున్నాయి. ఈదురుగాలులు వీచినప్పుడు అవి చినిగి విద్యుత్‌ తీగలపై పడుతున్నాయి. పలు సందర్భాలలో రోడ్లపై పడిన దాఖలాలు ఉన్నాయి.