Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భార‌త్–పాక్ మధ్య జరిగిన హై–వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఆధిపత్యం చాటుకుంది. టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి పాక్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మరో విలువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025 టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరిగింది. 

    యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నేడు (ఆదివారం) భారత్–పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడ్డాయి కానీ ఈ కీలక మ్యాచ్‌ను గెలిచి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ సమీకరణలను సులభం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించినా మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. 

    దాంతో నిర్ణీత 19 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్స్‌ ధాటిగా ఆడి మ్యాచ్‌ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది.

    పాక్‌ A జట్టు ఓపెనర్ మాజ్‌ సదాఖత్ (79*)  పరుగులతో పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యశ్‌ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్‌కు క్వాలిఫై అయింది. రెండో బెర్తు కోసం భారత్ Aతో పాటు ఒమన్ A బరిలో ఉంది. ఈ నెల 18న తదుపరి మ్యాచ్‌లో ఒమన్‌తోనే భారత్ A తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సెమీస్‌కు వెళ్లిపోతుంది.

  • ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య వంశీ అద‌ర‌గొడుతున్నాడు. యూఏఈతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన వైభ‌వ్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌పై కూడా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు.

    ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన వైభవ్‌, క్రీజులో సెటిల్‌ అయ్యాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడితో పాటు నమన్‌ ధీర్‌(20 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించాడు. వీరిద్దరి మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-ఎ జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.

    10 ఓవర్లలో భారత్ స్కోర్ 93-3 ఉండగా 43 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయింది. పాక్‌ బౌలర్లలో షాహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మాజ్ సదఖత్, షాహిద్ అజీజ్ తలా రెండు వికెట్లు సాధించారు.

  • సౌతాఫ్రికా క్రికెట్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌ను అద్భుత‌మైన విజ‌యంతో ఆరంభించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 30 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా గెలుపొందింది. 124 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని స‌ఫారీ బౌల‌ర్లు డిఫెండ్ చేసి అద్భుతం చేశారు.

    ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త్ కేవ‌లం 93 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ప్రోటీస్ స్పిన్న‌ర్ సైమ‌న్ హార్మ‌ర్ నాలుగు వికెట్ల ప‌డ‌గొట్టి టీమిండియాను దెబ్బ తీశాడు. అత‌డితో కేశవ్ మ‌హారాజ్‌, జానెస‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది.

    తొలి జట్టుగా రికార్డు..
    👉ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టెస్టుల్లో లోయోస్ట్ టోట‌ల్ డిఫెండ్ చేసిన జ‌ట్టుగా ప్రోటీస్ నిలిచింది. ఇంత‌కుముందు రికార్డు భార‌త జ‌ట్టు పేరిట ఉండేది. ఈ వేదిక‌లో 1973లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 192 ప‌రుగుల‌ను టీమిండియా కాపాడుకుంది. తాజా మ్యాచ్‌లో 124 ప‌రుగులను డిఫెండ్ చేసుకున్న సౌతాఫ్రికా.. భార‌త్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.

    👉అదేవిధంగా సౌతాఫ్రికా స్పిన్న‌ర్ సైమ‌న్ హార్మ‌ర్ కూడా ఓ రికార్డు సాధించాడు. భార‌త్‌పై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన స‌ఫారీ ప్పిన్న‌ర్‌గా హార్మ‌ర్ నిలిచాడు.

    ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి అత‌డు 51 ప‌రుగులిచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు పాల్ ఆడ‌మ్స్ పేరిట ఉండేది. 1996లో కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడమ్స్ 139 ప‌రుగులిచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
    చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్‌
     

  • రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఎ' తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ 'ఎ' ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన  దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది.

    భారత బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు విలవిల్లాడారు.  స్పిన్నర్ నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా 3, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్‌(23), ప్రిటోరియస్‌(21) రాణించారు.

    రుతురాజ్ మెరుపులు.. 
    అనంతరం 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇండియా జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 27.5 ఓవర్లలో చేధించింది. స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (83 బంతుల్లో 9 ఫోర్లతో 68) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుథో సిపామ్లా ఒక్కడే వికెట్ సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో అనధికారిక వన్డే రాజ్‌కోట్ వేదికగానే నవంబర్ 19న జరగనుంది.
    చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్‌
     

  • టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య నెలకొన్న 'బౌనా'(మరగుజ్జు) వివాదం సద్దమణుగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి అప్యాయంగా మాట్లాడు.

    ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే  ప్రోటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను అలింగనం చేసుకుంటా నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

    అసలేమి జరిగిందంటే?
    సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవుమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవుమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు. 

    దీంతో ఆర్‌ఎస్  తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చర్చించాడు. బంతి ప్యాడ్స్‌కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా  "బౌనా భీ హై" అని సమాధనమిచ్చాడు. 'బౌనా' అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం. 

    బవుమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. 

    ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ యాష్‌వెల్‌ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చా రాలేదు.  ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ ప్రిన్స్  చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇక ఈ ​‍మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
    చదవండి: WTC 2025-27 Points Table: టాప్‌-2కు సౌతాఫ్రికా.. మరి భారత్‌ ఏ ప్లేస్‌లో ఉందంటే?


     

     

  • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. పర్యాటక జట్టు నిర్ధేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేధించలేకపోయింది.  35 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. 

    సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో కేశవ్ మహారాజ్‌, జానెసన్ తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో గాయపడి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌కు రాలేదు. గిల్ లేకపోవడం కూడా భారత జట్టుకు చాలా నష్టాన్ని కలిగించిందే అని చెప్పాలి.

    నాలుగో స్ధానానికి ప‌డిపోయిన భార‌త్‌..
    ఇక భారత్‌-సౌతాఫ్రికా తొలి టెస్టు ఫలితంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో  మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ  ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్ధానం నుంచి నాలుగో స్ధానానికి పడిపోయింది. భారత్ పాయింట్ల శాతం 54.17గా ఉంది.

    ప్ర‌స్తుత డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో భార‌త జ‌ట్టు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలుపొంద‌గా.. మూడింట  ఓట‌మి చ‌విచూసింది. మ‌రోవైపు ఈ విజ‌యంతో ద‌క్షిణాఫ్రికా(66.7 శాతం) రెండో స్ధానానికి దూసుకెళ్లింది. అయితే పీసీటీ ప‌రంగా సౌతాఫ్రికా, శ్రీలంక జ‌ట్లు సమంగా ఉన్నాయి.

    కానీ పాయింట్లు ప‌రంగా మాత్రం లంక(16) కంటే సౌతాఫ్రికా(24) ముందుంజలో ఉంది. అందుకే శ్రీలంక మూడో స్ధానంలో కొన‌సాగుతోంది. ఇక ఆస్ట్రేలియా(100.00) అగ్ర‌స్ధానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఆస్ట్రేలియా ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్‌ల‌లోనూ విజ‌యం సాధించింది. సౌతాఫ్రికా ఆడిన 3 మ్యాచ్‌లలో 2 విజయాలు, ఒక్క ఓట‌మి చ‌విచూసింది.
    చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్‌

  • రాజ్‌కోట్ వేదిక‌గా సౌతాఫ్రికా-ఎతో జ‌రుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భార‌త్‌-ఎ బౌల‌ర్లు నిప్ప‌లు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా-ఎ జ‌ట్టు.. భార‌త బౌల‌ర్ల ధాటికి 30.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 132 పరుగులకే కుప్ప‌కూలింది. యువ ఆల్‌రౌండ‌ర్ నిశాంత్ సింధు అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు.

     సింధు త‌న స్పిన్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఈ హ‌ర్యానా ఆట‌గాడు 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.

    సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్‌(23), ప్రిటోరియస్‌(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ మెన్‌ ఇన్‌ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.

    తుది జట్లు
    భారత్‌
    రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్‌(వికెట్ కీపర్‌),  నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్‌దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణ

    సౌతాఫ్రికా
    రివాల్డో మూన్సామి(వికెట్ కీపర్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్‌), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్

  • టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్ అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో శ్రీకాంత్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దనుష్ ఫైనల్లో 252.2 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచాడు. తద్వారా డెఫ్లంపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్‌గా శ్రీకాంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్‌ మహ్మద్ వానియా  250.1 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు పతకాలూ భారత్‌కే దక్కాయి.

    భారీ నజరానా..
    ఇక ఈ డెఫ్లంపిక్స్‌లో సత్తాచాటిన ధనుష్‌ శ్రీకాంత్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
    చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్‌

  • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.

    పిచ్  పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్‌ నుంచే పిచ్‌పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్‌పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది.

     దీంతో స్పిన్నర్లు  బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.

    ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది.  ఇటుంటి పిచ్‌ల వ‌ల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిప‌డ్డాడు. కాగా ఈ పిచ్‌ను భార‌త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేట‌ర్‌  తాయారు చేశాడు. దీంతో గంభీర్‌ను కూడా నెటిజ‌న్లు టార్గెట్ చేశాడు. సోష‌ల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్‌గా అత‌డిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.

    బ్యాటర్లే కొంప ముంచారు..
    ఇక ఈ ఘోర ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్‌ను కోరుకున్న‌ట్లు గంభీర్ ధ్రువీక‌రించాడు. "మేము అడిగిన పిచ్‌ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్ప‌టి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేట‌ర్ మాకు అన్ని విధాల స‌హ‌క‌రించారు. 

    అయితే ఈ వికెట్‌పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్‌లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్‌పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. 

    ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్‌లు మీ టెక్నిక్‌, స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్‌ ఉంటే, ఇలాంటి వికెట్‌పై కూడా ప‌రుగులు సాధించ‌వ‌చ్చు" అని పోస్ట్ మ్యాచ్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.

    సంక్షిప్త స్కోర్లు
    సౌతాఫ్రికా- 159 &153
    భారత్‌- 189 &93.
    చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్‌

  • సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.

    అందుకే ఓడిపోయాం
    ఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.

    వాళ్లిద్దరు అద్భుతం
    ఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్‌ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్‌.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.

    ఇలాంటి పిచ్‌పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్‌ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.

    బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్‌
    కాగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్‌ తెంబా బవుమా, టెయిలెండర్‌ కార్బిన్‌ బాష్‌ అద్భుత బ్యాటింగ్‌తో మెరుగైన స్కోరు అందించారు.

    తొలి ఇన్నింగ్స్‌(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్‌ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. 

    ఆది నుంచే తడబాటు
    ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (1), యశస్వి జైస్వాల్‌ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్‌ జురెల్‌ (13), రిషభ్‌ పంత్‌ (2) నిరాశపరిచారు.

    ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్‌ యాదవ్‌ (1), సిరాజ్‌ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అబ్సెంట్‌ హర్ట్‌ కావడంతో టీమిండియా ఆలౌట్‌ అయింది. 

    కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్‌ మధ్యలోనే నిష్క్రమించిన గిల్‌.. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ పంత్‌.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.

    చదవండి: పంత్‌ ఫెయిల్‌.. గంభీర్‌ ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌.. టీమిండియా ఓటమి

  • సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో​ జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.  124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చ‌తికల‌ప‌డింది. 35 ఓవ‌ర్లు ఎదుర్కొని కేవ‌లం 90 ప‌రుగుల‌కే భార‌త్ కుప్ప‌కూలింది. బౌల‌ర్లకు స్వ‌ర్గధామంగా మారిన ఈడెన్ గార్డెన్స్ వికెట్‌పై భార‌త బ్యాట‌ర్లు పూర్తిగా తేలిపోయారు. సౌతాఫ్రికా స్పిన్న‌ర్లు సైమ‌ర్ హార్మ‌ర్‌, కేశ‌వ్ మ‌హారాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. 

    భార‌త బ్యాట‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(31) టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సౌతాఫ్రికా బ్యాట‌ర్లు కూడా రాణించ‌లేక‌పోయారు. వారు కూడా భార‌త బౌల‌ర్ల ధాటికి విల్లవిల్లాడారు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా స్కోర్ 200 ప‌రుగుల మార్క్ దాట‌లేదంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భార‌త మాజీ స్పిన్న‌ర్ హార్భ‌జ‌న్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    "టెస్టు మ్యాచ్ చూడటానికి ఈడెన్ గార్డెన్స్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం చూసి నేను నేను చాలా సంతోషించాను. కానీ పిచ్ ప్రవర్తించిన తీరు నన్ను షాక్‌కు గురిచేసింది. తొలుత టాస్ గెలిచి దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ బాగా ఆడుతుందని నేను అనుకున్నాను. కానీ మన జట్టు కూడా అదే తీరును కనబరిచి 189 పరుగులకే ఆలౌట్ అయింది. 30 పరుగుల ఆధిక్యం లభించింది. 

    అయితే ఇటువంటి పిచ్‌పై 30 పరుగుల లీడ్ 300 పరుగులగా పరిగణించాలి. అనంతరం సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి 93 పరుగులతో ఉంది. దీంతో భారత్ సునాయసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడో రోజు వికెట్ మరి వింతగా ప్రవర్తించింది.

    ఇటువంటి పిచ్‌లు టెస్టు క్రికెట్ ఉనికిని నాశనం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ ఆడనుంది. అక్కడ ఇరు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయి. ప్రేక్షకులకు అసలైన టెస్టు క్రికెట్ మజాను అందించాయి. ఐదు రోజుల వరకు మ్యాచ్ జరిగేది. కానీ ఇక్కడ మాత్రం పిచ్ భయంకరం‍గా ఉంది. బంతి ఎక్కడ పడుతుందో, ఎలా టర్న్ అవుతోంది బ్యాటర్ అస్సలు అంచనా వేయలేకపోయాడు.

    మీకు ఎంత మంచి బ్యాటింగ్ టెక్నిక్ ఉన్న కూడా ఈ వికెట్‌పై ఆడలేరు. సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటరైనా ఈ పిచ్‌పై ఫెయిల్ అయ్యే వారు. ఓ బంతి ఎక్కువ ఎత్తులో పడి ఒక్కసారిగా టర్న్ అవుతోంది. మరొకొన్ని సార్లు తక్కువ ఎత్తులో ఉండి స్పిన్ అవుతుంది. 

    ఈడెన్‌లో ఇంతకుముందు చాలా టెస్టులు జరిగాయి. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి కండీషన్స్‌ను చూడలేదు. టెస్టు క్రికెట్ పరువు తీస్తున్నారు" అని తన యూట్యూబ్ ఛానల్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్‌ గిల్‌ గాయపడడం కూడా భారత ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మెడ నొప్పి కారణంగా మ్యాచ్‌ మధ్యలోనే గిల్‌ వైదొలిగాడు.
    చదవండి: పంత్‌ ఫెయిల్‌.. గంభీర్‌ ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌.. టీమిండియా ఓటమి
     

  • సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా (IND vs SA)కు చేదు అనుభవం ఎదురైంది. సఫారీలు విధించిన 124 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. ఫలితంగా 30 పరుగుల  తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

    గంభీర్‌ ప్రయోగాలు
    కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసింది. ఇంగ్లండ్‌ పర్యటన, వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టుల్లో మూడో స్థానంలో ఆడించిన సాయి సుదర్శన్‌ను తుదిజట్టు నుంచి తప్పించింది.

    సాయికి బదులుగా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేసింది. వన్‌డౌన్‌లో అతడిని ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సి​క్సర్‌ బాది వాషీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. తద్వారా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

    వాషీ పర్లేదు
    ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా వాషీ కాస్త మెరుగ్గా రాణించాడు. సౌతాఫ్రికా విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (0), కేఎల్‌ రాహుల్‌ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ వాషీ.. 92 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. అయితే, మార్క్రమ్‌ బౌలింగ్‌లో హార్మర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వాషీ ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

    గిల్‌ స్థానంలో జురెల్‌
    ఈ మ్యాచ్‌లో మరో ప్రయోగం... ధ్రువ్‌ జురెల్‌ను నాలుగో స్థానంలో ఆడించడం. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడనొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జురెల్‌ను ప్రమోట్‌ చేశాడు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌. అయితే, కాసేపు క్రీజులో నిలబడ్డా జురెల్‌.. వాషీ మాదిరి పరుగులు చేయలేకపోయాడు. 34 బంతులు ఎదుర్కొని 13 పరుగులే చేసి నిష్క్రమించాడు.

    ఇక ఐదో నంబర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 13 బంతుల్లో కేవలం రెండు పరుగులు చేసి.. అవుటయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన జడ్డూ.. హార్మర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.

    గెలుపు ఆశలు రేపిన అక్షర్‌
    మరోవైపు టెయిలెండర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 13 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హార్మర్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కాగా.. అక్షర్‌ పటేల్‌ గెలుపు ఆశలు రేపాడు. కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులతో సత్తా చాటాడు. 

    అయితే, కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన అతడు.. ఆఖరికి అతడి బౌలింగ్‌లో (34.5)నే బవుమాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో 93 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. మరుసటి బంతికే సిరాజ్‌ అవుట్‌ కావడంతో తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఇక  గిల్‌ ఆబ్సెంట్‌ హర్ట్‌ (0) కావడంతో.. ఆలౌట్‌ అయిన భారత్‌ ఓటమి ఖరారైంది.

    టాస్‌ గెలిచిన.. తొలుత బ్యాటింగ్‌
    రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్‌ రెండు, కుల్దీప్‌ యాదవ్‌ రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది.

    ఇందుకు బదులుగా టీమిండియా 189 పరుగులతో సమాధానం ఇచ్చింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (39) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. సుందర్‌ 29, పంత్‌ 27, జడేజా 27 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్‌ హార్మర్‌ నాలుగు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కేశవ్‌ మహరాజ్‌, కార్బిన్‌ బాష్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    తెంబా బవుమా హాఫ్‌ సెంచరీ
    అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ తెంబా బవుమా హాఫ్‌ సెంచరీ (55 నాటౌట్‌) చేయడంతో ప్రొటిస్‌ జట్టు ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. ఫలితంగా 124 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచగలిగింది.

    తప్పని ఓటమి
    అయితే, ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా ఆది నుంచే తడ‘బ్యాటు’కు లోనైంది. ఆఖరికి 93 పరుగులకు కుప్పకూలి.. 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ప్రొటిస్‌ బౌలర్లలో స్పిన్నర్లు హార్మర్‌ నాలుగు, కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మార్క్రమ్‌ ఒక వికెట్‌ తీశాడు. ఓపెనర్లను అవుట్‌ చేసి యాన్సెన్‌ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. హార్మర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

    సంక్షిప్త స్కోర్లు
    సౌతాఫ్రికా- 159 &153
    భారత్‌- 189 &93.

    చదవండి: తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?: గంభీర్‌పై గంగూలీ ఫైర్‌

  • టీమిండియా- సౌతాఫ్రికా (IND vs SA 1st Test) మధ్య కోల్‌కతా వేదికగా తొలి టెస్టు నేపథ్యంలో ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ చర్చనీయాంశమైంది. బౌలర్ల విజృంభణతో బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.

    సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 31 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిస్తే.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఓ‍పెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul- 39) టాప్‌. ఇటు స్పిన్‌.. అటు పూర్తి బౌన్సీగా కాకుండా ఉన్న ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ వల్ల ఇప్పటికి మూడు ఇన్నింగ్స్‌లో కలిపి రెండు జట్లు ఒక్కసారి కూడా కనీసం రెండు వందల మార్కు చేరుకోలేకపోయాయి.

    మూడో రోజు హాఫ్‌ సెంచరీ
    అయితే, ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా (Temba Bavuma) తమ రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో సత్తా చాటడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ మ్యాచ్‌లో మూడో రోజైనా కనీసం హాఫ్‌ సెంచరీ చూసే భాగ్యం దక్కిందని బ్యాటింగ్‌ అభిమానులు సంబరపడుతున్నారు.

    టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా?
    ఇదిలా ఉంటే.. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై మాజీ క్రికెటర్లు మైకేల్‌ వాన్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భజ్జీ అయితే.. ‘‘టెస్టు క్రికెట్‌ను చంపేస్తారా? మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసిపోతుందా?’’ అంటూ క్యూరేటర్‌ తీరును తప్పుబట్టాడు.

     అస్సలు ఊహించలేదు
    మరోవైపు.. రెండు రోజుల్లోనే ఏకంగా పదహారు వికెట్లు కూలడంతో టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ కూడా క్యూరేటర్‌ పనితీరును విమర్శించాడు. ‘‘తొలిరోజు వికెట్‌ కాసేపు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత చెత్తగా మారిపోయింది. ఇది మేము అస్సలు ఊహించలేదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

    తప్పు మీరు చేసి.. మమ్మల్ని అంటారా?
    ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత జట్టు యాజమాన్యానికి దిమ్మదిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘టీమిండియా కోరుకున్న పిచ్‌ ఇదే. వాళ్లే ఇలా కావాలని అడిగారు.

    నాలుగు రోజుల పాటు పిచ్‌పై నీళ్లు చల్లకుంటే ఇలాగే ఉంటుంది. ఇందులో క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీని తప్పుబట్టడానికి ఏమీ లేదు. వాళ్లు కోరిందే ఇది’’ అని దాదా.. పరోక్షంగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌దే తప్పంతా అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    టీమిండియా ఓటమి
    సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. పర్యాటక ప్రొటిస్‌ జట్టు చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 124 పరుగుల లక్ష్యాన్నిఛేదించే క్రమంలో భారత్‌ 93 పరుగులకే కుప్పకూలింది.

    చదవండి: ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

  • సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా లక్ష్య ఛేదనకు దిగింది. అయితే, ప్రొటిస్‌ జట్టు విధించిన 124 పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసే క్రమంలో ఆదిలోనే భారత్‌కు షాకులు తగిలాయి.

    ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించగా.. కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్‌ చేరాడు. తొలి ఓవర్లోనే జైసూను అవుట్‌ చేసిన ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌.. మూడో ఓవర్‌ ఆరంభంలోనే రాహుల్‌ను కూడా వెనక్కి పంపి టీమిండియాకు షాకిచ్చాడు.

    ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar), నాలుగో స్థానంలో వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ ఇన్నింగ్స్‌చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఆచితూచి, ఓపికగా ఆడుతూ విజయానికి పునాది వేసే పనిలో ఉన్నారు. 

    ఆచితూచి ఆడకపోతే..
    ఆదివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 10 ఓవర్లు ముగిసే సరికి వాషీ 27 బంతుల్లో 12, జురెల్‌ 23 బంతుల్లో 13 పరుగులతో ఉన్నారు. ఫలితంగా విజయానికి టీమిండియా కేవలం 98 పరుగుల దూరంలో నిలిచింది.

    అయితే, శుక్రవారం నాటి తొలి రోజు ఆట నుంచే ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ భిన్నంగా ఉంది. మొదటి రోజు పేసర్లు విజృంభించగా.. రెండో రోజు స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. తాజాగా ఆదివారం నాటి మూడో ఆటలో మరోసారి పేసర్లు ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్యం చిన్నదిగా కనిపిస్తున్నా.. వికెట్‌ స్వభావం దృష్ట్యా టీమిండియా ఆచితూచి ఆడకపోతే భారీ మూల్యం చెల్లించకతప్పదు.

    మరి ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?
    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా- 2004లో టీమిండియా 117 పరుగుల లక్ష్య ఛేదన
    భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 1993లో టీమిండియా 79 పరుగుల లక్ష్య ఛేదన
    భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 2012లో ఇంగ్లండ్‌ 41 పరుగుల లక్ష్య ఛేదన
    భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా- 1969లో ఆస్ట్రేలియా 39 పరుగుల లక్ష్య ఛేదన
    భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌- 1977లో ఇంగ్లండ్‌ 16 పరుగుల లక్ష్య ఛేదన.

    చదవండి: సన్‌రైజర్స్‌ వ్యూహం.. వాళ్లంతా జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?

Andhra Pradesh

  • తిరుపతి: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన కోటా వివరాలను విడుదల చేసింది టీటీడీ ...నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేయనుంది.

    • 21న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్ల విడుదల
    • 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల
    • 24న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల
    • 24న ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల
    • 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు వృద్దులు, దివ్యాంగుల కోటా విడుదల.
    • 25న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
    • .25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి కోటా ఆన్‌లైన్‌లో విడుదల.

     

  •  సాక్షి,విశాఖ: ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్టును ఆయన తండ్రి అప్పారావు సమర్ధించారు. ఇమ్మడి రవి అరెస్టు వేళ మీడియా తండ్రి అప్పారావును కదలించింది. ‘రవి నేరం చేయలేదని నేను చెప్పను పరిణామాలు చూసి నేరం చేసినట్టు అంగీకరించాల్సిందే. రవి ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతుంది. 

    పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా..?. కోట్లు సంపాదించడం అంటే మాటలా..నేను సాదాసీదా జీవితం గడుపుతున్నాను. రవి తప్పు చేసి చేయలేదంటే ఊరుకుంటారా..?.రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యా, భర్తలిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవి చేసింది తప్పే’అని వ్యాఖ్యానించారు. 

    ఇమ్మడి రవి అరెస్టు ఇలా
    విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్‌ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్‌లో యూజర్లు సినిమా లింక్స్‌ క్లిక్‌ చేస్తే బెట్టింగ్‌ యాప్స్‌,గేమింగ్‌ యాప్స్‌ యాడ్స్‌ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.

    పోలీసుల దర్యాప్తు ఇలా 
    అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్‌ యాప్స్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధిత యాడ్స్‌ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్‌ చేయాలన్నా, డౌన్‌లోడ్‌ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్‌ క్లిక్‌ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్‌ను క్లిక్‌ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. 

    ఇమ్మడి రవి అనుచరులు అరెస్టు
    అలా పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పైరసీ కంటెంట్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్‌ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్‌ అనంతరం కూకట్‌పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్‌ పల్లి నుంచి నెదర్లాండ్‌, ఫ్రాన్స్‌, కరేబీయన్‌ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ ర‌వి ప్ర‌స్తుతం భార్య‌తో విడాకుల కేసులో హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజ‌ర‌వుతున్నాడు. అదే క్ర‌మంలో త‌దుప‌రి విచార‌ణ కోసం అత‌డు ఫ్రాన్స్‌ నుంచి కూక‌ట్ ప‌ల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసుల‌కు లీకైంద‌ని కూడా ఒక గుస‌గుస వినిపిస్తోంది.  

    70కి పైగా పైరసీ సైట్లు 
    కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్‌ డిస్క్‌లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్‌లోడ్‌ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్‌ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్‌వేర్లు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్‌ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్‌లోడ్‌ చేసేవారని,కరేబియన్‌ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. 

    దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడని
    అనంతరం, తెలంగాణ సైబర్‌ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్‌సైట్లను క్లోజ్‌ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్‌ డిస్క్‌లను, బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు.

  • మదనపల్లి:  అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి గ్లోబల్‌ ఆసుపత్రి కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ మేరకు ఆరుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 15 రోజుల పాటు రిమిండ్‌ విధించారు. దాంతో ఆరుగురి నిందితుల్ని సబ్‌ జైలుకు తరలించారు. ఈ రోజు(ఆదివారం) మదనపల్లి ఏరియా  ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం మేజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. ఈ కేసులో ఆంజనేయులు, బాల రంగడు, మహరాజ్‌, పిల్లి పద్మా, సత్య, సూరిబాబులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. 

    కాగా, మంగళవారం( నవంబర్‌ 11వ తేదీ) మదనపల్లిలో కిడ్నీ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. మహిళలను విశాఖ నుండి మదనపల్లికి తీసుకొచ్చి కిడ్నీలను తొలగిస్తున్న ఘటన సంచలనం రేపింది  యమున అనే మహిళ మిస్సింగ్‌ కేసు ఎపిసోడ్‌తో కిడ్నీ రాకెట్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

    ఆమె భర్త మధుబాబు 112  తిరుపతికి కాల్‌ చేయగా, మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్ లో కిడ్నీ రాకెట్ జరిగినట్లు గుర్తించి ఫోటోలు పోలీస్ స్టేషన్‌కు ఎండార్స్‌ చేశారు పోలీసులు.

    సెల్ ఫోన్ సిగ్నల్  ఆధారంగా యమున మొబైల్‌ను ట్రేస్‌ చేశారు  పోలీసులు.  దాంతో గ్లోబల్ హాస్పిటల్‌లో పద్మ కిడ్నీలను  తొలగించే సమయంలో ఆమె మృతి చెందిన విషయం బయటపడింది.  ఇద్దరు మహిళలను మదనపల్లి గ్లోబల్‌ ఆస్పత్రికి తీసుకురాగా, యమున అనే మహిళకు కిడ్నీ తొలగిస్తున్న సమయంలో మృత్యువాడ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి గ్లోబల్‌ ఆస్పత్నిని సీజ్‌ చేయడంతో పాటు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు.  పలువుర్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

  • సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో మూడు సార్లు ఇలానే సీఐఐ సదస్సులు నిర్వహించారు. 2014-19 మధ్యలో లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద 35వేలకోట్లు మాత్రమే రూపాంతరం చెందాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.

    మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం. కానీ పారదర్శంగా ఎంవోయూలు కుద్చుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సీఐఐ సదస్సులో కొత్తగా ఏం తీసుకొచ్చారో క్లారిటీ ఇవ్వలేకపోయారు. వైఎస్ జగన్ హాయంలో 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు జరిగింది. వైఎస్ జగన్ హయాంలో కుదుర్చుకున్న సంస్థలతో చంద్రబాబు మళ్లీ ఒప్పందాలు చేసుకుంటున్నారు.

     వైఎస్సార్‌సీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోయారని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్‌సీపీ పాలనలో బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎవరో చెప్పాలి. నాడు జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో వైఎస్‌ జగన్‌తో పాటు ముకేష్ అంబానీ, అదానీ, దాల్మియా నవీన్ జిందాల్, ఒబారిస్ సంజయ్ బంగర్, భజంక, బీవీఆర్‌ మోహన్ రెడ్డి,జీఎంఆర్‌ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వేదికపై కూర్చున్నారు. 

    కానీ ఇవాళ సీఎం చంద్రబాబుతో వేదికపై రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూర్చున్నారు.  దీనీ ద్వారా పారిశ్రామిక వేత్తలకు వైఎస్‌ జగన్ మీద నమ్మకం ఉన్నట్టా, చంద్రబాబు మీద నమ్మకం ఉన్నట్టా. తండ్రీకొడుకులు ఒకరు ఒకరు తబలా కొట్టుకోవడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. రెన్యూ సంస్థ 2022 ఏడాదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారు. చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారు. 

    లులు ఛైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాసంసుడు. ఏ సదస్సు జరిగిన లులు అధినేత కనిపిస్తారు. లులు సంస్థ పేరు 2014 నుంచి చెపుతున్నారు. ఇప్పటికి కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. మా హయంలో వచ్చిన ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్ కట్టిన పోర్టులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. కరణ్ అదానీ గూగుల్ డేటా సెంటర్ ఎవరి హయంలో వచ్చిందో చెప్పారు. సముద్రతీరంలో వైఎస్ జగన్ పోర్టులు కడితే.. మీరు బికినీ పెస్టివల్ ఎలా నిర్వహించాలని ఆలోచించారు.

    స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే జర్నలిస్ట్ మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్టేషన్ చూస్తే స్టీల్ ప్లాంట్‌ను ఏదొకటి చేసేలా ఉన్నారు. ప్రొడక్షన్ బట్టి జీతం ఇస్తామని సర్క్యులర్ ప్రవేశ పెడతారా. దేశంలో ఎక్కడైనా ఇటు వంటి పరిస్థితి ఉందా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో 5000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఉన్న ఉద్యోగులను కాపాడలేని మీరు, రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా.? వైఎస్‌ జగన్ పాలనలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది కాబట్టి, చంద్రబాబు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని లెక్కలు చెప్పారని ధ్వజమెత్తారు. 

  • ఒంగోలు టౌన్‌: స్పా సెంటర్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేసిన పోలీసులు ఒక విటుడు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాజీరావుపేట పోలేరమ్మ గుడి సమీపంలో ఒక డాబాపై స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా పక్కా సమాచారంతో ఒన్‌టౌన్‌ సీఐ నాగరాజు శనివారం తన సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు. దాడి చేసిన సమయంలో ఒక విటుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

     వారితో పాటు నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. నగరంలో ఎక్కడైనా వ్యభిచార గృహాలు నిర్వహించడం, గంజాయి విక్రయిస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.   

  • సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణ ఘటన జరిగింది. వ్యక్తిని హత్యచేసి ఇంట్లోనే పూడ్చేశారు. కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్‌గా గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ హత్యకు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

    కర్ణాటక రాష్ట్రం అత్తిబెలె సమీపంలో గత నెల 27న శ్రీనాథ్‌ అదృశ్యమయ్యాడు. కుప్పంలో హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్‌ను రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ హత్య చేసినట్లు సమాచారం. ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ప్రభాకర్‌పై హత్య కేసు నమోదైంది. మృతుడు శ్రీనాథ్ కుప్పం వాసి కాగా, కర్ణాటకలోని అత్తిబెలెలో స్థిరపడ్డాడు.

     

  • ఒంగోలు టౌన్‌: చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన గాడితప్పింది. ప్రభుత్వ ఉద్యోగులది ఇష్టారాజ్యమైంది. గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి ప్రాథమిక వైద్యశాలకు చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానస తరుచూ విధులకు డుమ్మా కొట్టి సొంత ప్రాక్టీసు చేసుకుంటున్నారని గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు క్రిష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.   

    డాక్టరమ్మ తరుచూ విధులకు డుమ్మా 
    క్రిష్ణంశెట్టిపల్లి ప్రాథమి వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానస కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఆమె తన భర్తతో కలిసి గిద్దలూరు పట్టణంలో సొంతంగా హాస్పటల్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె తరుచూ విధులకు హాజరు కాకుండా సొంత హాస్పిటల్లో బిజీగా గడుపుతున్నారు. నిబంధనల ప్రకారం పీహెచ్‌సీలో విధులు నిర్వహించే మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు నర్సింగ్‌ సిబ్బంది రోజూ ఫేస్‌ రికగ్నైజ్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనను భేఖాతర్‌ చేస్తున్న డాక్టర్‌ మానస ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను ట్యాంపరింగ్‌ చేసి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. సొంత క్లినిక్‌ నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు వేసుకుంటున్నారు. 

    విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్‌లో అటెండెన్స్‌ వేసుకుంటూ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు నెలనెలా తీసుకుంటున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానసను స్ఫూర్తిగా తీసుకున్న కొందరు నర్సింగ్‌ సిబ్బంది కూడా విధులకు డుమ్మా కొడుతున్నారు. అయినా వారికి పూర్తిస్థాయి జీతభత్యాలు వేస్తున్నారు. డాక్టర్, నర్సులు విధులకు రాకపోవడంతో ఆస్పత్రికి వచ్చే మిగిలిన సిబ్బంది ఏంమి చేయాలో పాలుపోక కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవడం, టైంపాస్‌ కావడానికి బల్లల మీద నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. దీంతో క్రిష్ణంశెట్టిపల్లిలో పేరుకు పీహెచ్‌సీ ఉన్నప్పటికీ వైద్యసేవలు అందక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో పాటు చలికాలం ప్రారంభం కావడంతో గ్రామాల్లో జ్వరాలు, ఇతర సీజనల్‌ వ్యాధులు విస్తరిస్తున్నాయి. ప్రజలు వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.  

    కలెక్టర్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు  
    ఈ విషయం గురించి ఈ ఏడాది జూన్‌ 23వ తేదీన గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. 24వ తేదీన జిల్లా వైద్యాధికారిని కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలతో సహా డీఎంహెచ్‌ఓకు వివరించారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో జూలై 28వ తేదీన మరొకసారి  కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 30వ తేదీన క్రిష్ణంశెట్టిపల్లి పీహెచ్‌సీకి వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమరి్పంచినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా అధికారులకు ముడుపులు ముట్టినందువల్లే డాక్టర్‌ మానసపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు  ఆరోపిస్తున్నారు.    

    ఉన్నతాధికారులకు నివేదించాం 
    డాక్టర్‌ మానసపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ పూర్తి చేశాం. డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు నివేదిక సమరి్పంచాం. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాం. 
    – డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ  

  • సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్‌ తెలిపారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్‌ జగన్‌​ వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు.

    వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉంది. 2025-26లోనైనా  రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.

    మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

    కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు?. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కానీ, అభివృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు?’ అని ప్రశ్నించారు.

Business

  • యమహా కంపెనీ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XSR 155 బైకును ఇటీవలే లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల డిజైన్, ధర, ఇంజిన్ స్పెక్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.

    ఇంజిన్ డీటెయిల్స్
    యమహా XSR 155 బైక్ 155 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 10,000 rpm వద్ద 18.4 hp & 7,500 rpm వద్ద 14.1 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మంచి పనితీరును అందిస్తుంది.

    రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, జే-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. 20.2 bhp పవర్, 27 Nm టార్క్ అవుట్‌పుట్‌ అందిస్తుంది.

    ధరలు
    యమహా XSR 155 ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగులలో లభిస్తుంది. దీని ధరలు రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    ఇదీ చదవండి: వెబ్‌సైట్‌లో మాయమైన రెండు హోండా బైకులు

    డిజైన్
    చూడడానికి యమహా XSR 155 & రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సీటింగ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి వాటిలో తేడాలను గమనించవచ్చు. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ వంటి వాటిలో కూడా చాలావరకు తేడాను గమనించవచ్చు. ఇంజిన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు.

  • హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్తగా విడుదల చేసిన CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP & రెబెల్ 500 మోడళ్లను అధికారిక వెబ్‌సైట్ తొలగించింది. ఈ బైకులను ఎందుకు తొలగించిందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మార్కెట్లో సరైన అమ్మకాలు పొందకపోవడం వల్లనే.. కంపెనీ బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

    హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP
    హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP అనేది 999 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 215 hp & 113 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. అంతే కాకుండా రైడ్-బై-వైర్ థ్రోటిల్‌తో పాటు బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను కలిగిన ఈ బైక్ లైట్ వెయిట్ అల్యూమినియం డైమండ్ ఫ్రేమ్‌ పొందుతుంది. దీని ధర రూ. 28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

    హోండా రెబెల్ 500
    హోండా రెబెల్ 500 ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). ఇది 471 సీసీ లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్ పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 45.60 hp & 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో షోవా డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు, వెనుక వరుసగా 296 mm & 240 mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.

  • తాత మరణించారని, సెలవు కావాలని అడిగిన ఉద్యోగికి.. మేనేజర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మేనేజర్ ఇచ్చిన సమాధానం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    నా తాత ఉదయం చనిపోయారు, నాకు సెలవు కావాలని ఉద్యోగి వాట్సాప్ ద్వారా అడిగారు. దీనికి మేనేజర్ సమాధానం ఇస్తూ.. నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నువ్వు సెలవు తీసుకో.. కానీ వాట్సాప్‌లో అందుబాటులో ఉంటావా?, అవసరమైనప్పుడల్లా డిజైనర్లకు అందుబాటులో ఉంటావా? అని రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    వాట్సాప్ సందేశాల స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ.. నేను గత రెండు సంవత్సరాలుగా ఈ తెలివితక్కువ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. వారు నా పాత్రలను మార్చారు, నాకు పరిధికి మించి పనిని అప్పగించారు. ఎంతోమంది ఉద్యోగులను తొలగించారు. నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయలేదు. నేను నా పనిని & నా బృందాన్ని నిజంగా ఆస్వాదించాను. ఇప్పుడు ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. నా పనిని చూసుకోవడానికి మీకు మరెవరూ లేకపోవడం నా సమస్య ఎందుకు అవుతుంది? మనం మనుషులం, ఫలితాలను వెలువరించే యంత్రాలు కాదని నిర్వాహకులు మర్చిపోతారా? అని ఉద్యోగి రెడ్దిట్ పోస్టులో రాశాడు.

    ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. మేనేజర్ ఇచ్చిన సమాధానాన్ని ఖండించారు. ఉద్యోగి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తాత చనిపోయాడంటే కూడా వాట్సాప్‌లో అందుబాటులో ఉంటావా? అని అడగడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. మీరు ఉద్యోగాన్ని వదిలేయండి అని కొందరు సలహా ఇచ్చారు.

    బ్రదర్, మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధగా ఉంది. ఈ సమయంలో, నిజాయితీగా చెప్పాలంటే, వేరే ఉద్యోగం కోసం వెతుక్కోండి అంటూ మరొకరు సలహా ఇచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో మీ కంపెనీ పేరు, మేనేజర్ పేర్లను వెల్లడించండి అని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: మూడేళ్ల పాత ఫోన్.. ఐ20 కారులోనే ప్రయాణం!: ఎందుకంటే?

  • ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

    బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.

    28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

    దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.

  • హైదరాబాద్: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ ఐసీఎల్‌ ఫిన్‌కార్ప్‌ తాజాగా నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీ) ద్వారా నిధులను సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ఇష్యూ నవంబర్‌ 17న ప్రారంభమవుతుందని సంస్థ సీఎండీ కె.జి. అనిల్‌ కుమార్‌ తెలిపారు.

    13 నుంచి 70 నెలల వరకు కాలవ్యవధికి జారీ చేసే ఈ ఎన్‌సీడీలపై ఈల్డ్‌ (రాబడి) 10.50 శాతం నుంచి 12.62 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఒక్కో ఎన్‌సీడీ ముఖ విలువ రూ. 1,000గా ఉండగా, కనీస దరఖాస్తు మొత్తం రూ. 10,000గా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణకు కంపెనీ వినియోగించుకోనుంది.

  • నటిగా మాత్రమే చాలామందికి తెలిసిన తేజస్వి ప్రకాష్.. ఒక తెలివైన పెట్టుబడిదారు అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసు. ఈమె వద్ద ఆడి కారు ఉన్నప్పటికీ.. ఐ20 కారునే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు.. ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.

    బిగ్‌బాస్ 15 విజేత అయిన తేజస్వి ప్రకాష్ నికర విలువ రూ. 25 కోట్లు అని 2024లో పింక్‌విల్లా ప్రచురించిన నివేదిక ద్వారా వెల్లడించింది. ఈమెకు భారతదేశంలోనే కాకుండా దుబాయ్‌లో కూడా కోట్ల విలువైన ఆస్తులను ఉన్నట్లు సమాచారం. అయితే ఈమె ఎప్పుడూ ఐ20 కారును ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు, దానికి కారణం కూడా చెప్పింది.

    ''నాకు నా ఆడి కారు ఇష్టం, కానీ నేను తరచుగా నా i20లో ప్రయాణిస్తాను. ఎందుకంటే అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆడి కారు పార్క్ చేయడానికి స్థలం అవసరం, కానీ i20 విషయంలో అలా కాదు'' అని తేజస్వి ప్రకాష్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆడి కారును ఉపయోగించేటప్పుడు ఏదైనా గీతలు పడితే.. దానికోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను i20ని తీసుకెళ్లడానికి ఇష్టపడతానని ఆమె వెల్లడించారు.

    తేజస్వి ప్రకాష్.. ఏప్రిల్ 2022లో ఆడి క్యూ7 కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 90 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఉంది. అంతే కాకుండా తాను మూడేళ్లకు ముందు లాంచ్ అయిన ఐఫోన్ వారుందుతున్నట్లు చెప్పింది. ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ కొనాలనే ఆలోచన నాకు లేదని స్పష్టం చేసింది.

    తేజస్వి ప్రకాష్ ఇన్వెస్ట్‌మెంట్స్
    తేజస్వి ప్రకాశ్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అంతే కాకుండా జుహులో సామ్స్ సలోన్ అనే సెలూన్ ఉంది. ఎప్పుడూ డబ్బు సంపాదించే ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని ఆమె చెబుతారు. "నేను ఒక ఆస్తిలో పెట్టుబడి పెడితే, ఇంట్లో కూర్చొని దాని నుంచి సంపాదించవచ్చని నాకు తెలుసు. నేను ప్రస్తుతానికి ఆస్తిని ఉపయోగించకపోవచ్చు, కానీ అది నాకు ఆదాయాన్ని సంపాదించిపెడుతుందని అన్నారు. కాలక్రమేణా విలువ తగ్గుతున్న హై హీల్స్, బ్యాగులపై విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా, జాగ్రత్తగా డబ్బును పొదుపు చేయండి ఆమె యువతకు సలహా ఇచ్చింది.

    ఇదీ చదవండి: నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్‌లో వేలమందికి ఉద్యోగం

  • బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్స్‌ తయారీ సంస్థ అల్ట్రా వయొలెట్‌ తమ కొత్త యూవీ స్పేస్‌ స్టేషన్‌ను విజయవాడలో ప్రారంభించింది. ఇందులో ఎక్స్‌–47, ఎఫ్‌77 మాక్‌ 2, ఎఫ్‌77 సూపర్‌స్ట్రీట్‌ తదితర వాహనాలు అందుబాటులో ఉంటాయి.

    చూడటానికి స్టైలిష్ డిజైన్ కలిగిన అల్ట్రా వయొలెట్‌ ఎలక్ట్రిక్ బైకులు.. ఎందుకుని వేరియంట్‌ను బట్టి 2.8 సెకన్లలో గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకోగలవు. ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. వరకు రేంజ్ ఉంటుంది. ఈ బైకులు ప్రస్తుతం దేశీయ విఫణిలో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అమ్మకానికి ఉన్నాయి. ఇవి అత్యుత్తమ పనితీరును అందించడం వల్ల ఎక్కువమంది.. ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

  • సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

    కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్‌లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.

    మొదటి జీతం
    దిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణీకులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందాడు. ఇదే అతని మొదటి జీతం.

    ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించాడు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. నేను చేసిన పనికి యజమాని నా జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచాడు.

    రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయం
    కున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసాడు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నాడు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.

    ఇదీ చదవండి: జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం..

    1700 మందికి ఉపాధి
    1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.

  • టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్‌ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్‌ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర,  హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్‌లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

    మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్‌ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్‌ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్‌ చేసింది.

    ప్లాన్‌ ప్రయోజనాలు
    జియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.

    జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది.

  • ఎప్పుడూ స్టాక్‌ మార్కెట్లను, బాండ్లను విమర్శించే ప్రముఖ పర్సనల్‌ ఫైనాన్స్‌ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి.. తాజాగా మరో ఆసిక్తికర ట్వీట్‌ చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రమాద దశలో ఉందని హెచ్చరించారు.

    ఆయన మాటల్లో.. ప్రపంచ మార్కెట్లలో ఏర్పడిన “ప్రతీ బుడగ” ఇప్పుడు పేలుతున్నదనీ, దీనితో పెద్ద ఎత్తున ధరలు పడిపోతున్నాయనీ తెలిపారు. అయితే, ఈ పరిణామాల మధ్య ఆయన తన ఆస్తులను (బంగారం, వెండి, బిట్‌కాయిన్‌, ఎథీరియం) అమ్మడం లేదని స్పష్టం చేశారు.

    ‘ఎక్స్‌’(ట్విట్టర్)లో చేసిన వరుస పోస్ట్‌లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందని వ్యాఖ్యానించిన కియోసాకి (Robert Kiyosaki).. ప్రభుత్వాలు భారీ అప్పుల భారంతో కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి చివరకు అధిక స్థాయిలో డబ్బు ముద్రించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు.

    అదే సమయంలో, అధిక ముద్రణ వల్ల డాలర్ విలువ పడిపోవడంతో “నకిలీ డబ్బు” (fiat currency) క్రాష్ అవుతుందని, దాంతో సహజంగా విలువ కలిగిన కఠిన ఆస్తులు (Hard Assets) ధరలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

    క్రిప్టో మార్కెట్‌లో భారీగా పడిపోయే ధోరణి గురించి ఆయన మాట్లాడుతూ.. “బిట్‌కాయిన్ క్రాష్ అవుతోంది, ప్రతీ బుడగలు పగులుతున్నాయి. నేను అమ్ముతున్నానా? లేదు. ఎందుకంటే ప్రపంచానికి డబ్బు అవసరం, నాకు కాదు” అని అన్నారు.

    కియోసాకి ప్రకారం.. భారీ అప్పు సంక్షోభం కారణంగా ప్రభుత్వాలు త్వరలో  “ది బిగ్ ప్రింట్” (నోట్ల ముద్రణ) ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం వంటి ఆస్తులు మరింత విలువను సంపాదిస్తాయని ఆయన నమ్మకం.

  • బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో పనితీరు పరంగా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 26 శాతం తగ్గి రూ.174 కోట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.233 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం ఈ కాలంలో 2 శాతం తగ్గి రూ.4,364 కోట్లుగా ఉంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ కాలంలో లాభం రూ.448 కోట్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభం రూ.454 కోట్లతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గింది. జీఎస్‌టీ (GST) రేట్ల మార్పు ప్రభావం సెప్టెంబర్‌ త్రైమాసికం పనితీరుపై ప్రభావం చూపించినట్టు కంపెనీ తెలిపింది.

    బ్యాటరీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని గుర్తు చేసింది. రేట్లు తగ్గిన తర్వాత కొత్త స్టాక్‌ను తెప్పించుకుందామని భాగస్వాములు భావించడంతో డిమాండ్‌ స్తబ్దుగా ఉన్నట్టు వివరించింది. లిథియం అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌ నిర్మాణం ఆశించిన విధంగా పురోగతిలో ఉన్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో అవిక్‌రాయ్‌ తెలిపారు.

Movies

  • మహేశ్ బాబు హీరోగా కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఈవెంట్ జరిగింది. 'వారణాసి' అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో పాటు మూడున్నర నిమిషాల గ్లింప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు మహేశ్ ఫ్యాన్ చేసిన మరో పని కూడా చర్చనీయాంశంగా మారింది.

    హైదరాబాద్ శివారులో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం మహేశ్ కారులో వస్తున్న వీడియోని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో మహేశ్ కారు నంబర్‌తో చెక్ చేయగా.. రెండు చలాన్లు ఉన్నట్లు తేలింది. మహేశ్ బాబు లాంటి హీరో కారుపై చలాన్లు ఉండటంతో ఈ విషయం టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన ఓ అభిమాని.. మహేశ్ కారుపై చలాన్ల డబ్బుని కట్టేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?)

    మహేశ్ బాబు వ్యక్తిగత కారుపై ఉన్న రూ.2070 చలాన్‌ని ఓ ఫ్యాన్ స్వయంగా చెల్లించడం చూసిన పలువురు నెటిజన్లు.. ఇదెక్కడి అభిమానం బాబోయ్ అని మాట్లాడుకుంటున్నారు.

    'వారణాసి' సినిమా విషయానికొస్తే ఇందులో మహేశ్ బాబు, రాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. ఈ లుక్‌తో 60 రోజుల పాటు షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. మరోవైపు గ్లింప్స్ వీడియో బట్టి చూస్తే గతం నుంచి వర్తమానం, భవిష్యత్ కాలాలన్నింటిని మిక్స్ చేస్తూ ఫాంటసీ స్టోరీతీ దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 2027 వేసవిలో రిలీజ్ కానుందని కీరవాణి చెప్పారు.

    (ఇదీ చదవండి: రామ్ చరణ్‌ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్‌ క్రేజీ రికార్డ్!)

  • తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ నెలలో ఓటీటీ సినిమా 'చిరంజీవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఒకప్పటితో పోలిస్తే ఇతడి నుంచి వచ్చే మూవీస్ తగ్గిపోయాయి. అలానే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన ఏం రావట్లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు 'పాంచ్ మినార్' అనే చిత్రాన్ని సిద్దం చేశాడు.

    (ఇదీ చదవండి: రామ్ చరణ్‌ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్‌ క్రేజీ రికార్డ్!)

    ఈ శుక్రవారం(నవంబరు 21) థియేటర్లలోకి సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం, ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీగా నవ్వించే ప్రయత్నం చేశారు. 'పాంచ్ మినార్' విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే హీరో, ఉద్యోగం చేసుకునే హీరోయిన్ ప్రేమలో పడతాడు. జాబ్ చేస్తేనే పెళ్లి అని చెప్పడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా మారతాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గుండాల మధ్య చిక్కుకున్న హీరో.. ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీంతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి?

    (ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?)

  • రామ్‌చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ  పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్‌ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. 

    తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్‌ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు  బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

     

     

  • మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), భాగ్యశ్రీ  హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.  ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్నూలులో ఈనెల 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

    అయితే ఈ మూవీ రిలీజ్‌ తేదీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలపై చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక రోజు ముందుగానే ఆంధ్రకింగ్ వచ్చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 27నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్‌ వెల్లడించారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు అడ్వాన్స్‌గా పండుగ రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌కు రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజు ముందుగానే కంటెంట్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుడగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
     

     

  • మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా 'వసుదేవసుతం'. వైకుంఠ్ బోను దర్శకుడు కాగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ రిలీజ్ అయ్యాయి. రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

    మణిశర్మ సంగీతమందించిన 'ఏమైపోతుందో' అంటూ సాగే ఈ  పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. పవన్, శృతిక పాడారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్‌ అందంగా చూపించారు. పాట రిలీజ్ చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'వసుదేవసుతం'లోని 'ఏమైపోతుందో' పాట చాలా బాగుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.

  • శ్రీరామ్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా రాముడు అందిరివాడు’. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి, జబర్దస్ అప్పారావు, చిట్టి బాబు, గడ్డం నవీన్, లక్ష్మణ్ రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు.  యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ పై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని లువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్‌ చేశారు.

    ఈ సందర్భంగా నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ముందుగా మంచి టైటిల్ తో ప్రేక్షకుల ముందు రావడం గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో ఎంతో పెద్ద హీరోలు పెట్టుకునే స్థాయిలో ఈ చిత్ర టైటిల్ చాలా బావుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని, ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా బావుంటే దూసుకెళ్లిపోయే రోజులు. అటువంటి ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో గద్దర్ నరసన్న పాట పాడటం ప్రత్యేకం. సినిమా బృందం అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థిస్తున్నాను" అన్నారు.

    దర్శకుడు మైకిల్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ సినిమాలోని 4 పాటలు అన్ని నేను రాసాను, దానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ సినిమా కోసం లక్ష్మణ్ గారు ఎంతో పట్టుదలతో నటించారు. హీరో శ్రీరామ్ ఈ సినిమాకు ముందుగా నాంది పలికారు. చాలా కష్టపడి చిన్న స్థాయి నుండి హీరో స్థాయికి వచ్చారు. నటి స్వాతి నవరసాలు పండిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. మా సినిమాను ప్రోత్సహించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. అందరూ మా సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు.

    నిర్మాత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ...ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీరామ్, నటి స్వాతి ఇంకా ఎంతో మంది పేరుగాంచిన నటీనటులకు అందరికీ సినిమాలో నటించినందుకు థాంక్స్. అలాగే దర్శకుడు మైకిల్ తన ప్రాణం పెట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అలాగే మా కోసం వచ్చిన బాబు మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందచేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. నటి స్వాతి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

  • మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు 'వారణాసి' టైటిల్ ఫిక్స్ అయింది. నిన్నటివరకు రకరకాల పేర్లు వినిపించాయి గానీ చివరకు దీనికి జక్కన్న కట్టుబడి ఉన్నారు. అయితే శనివారం రాత్రి హైదరాబాద్‍‌లో 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ పేరిట భారీ ఎత్తున ప్లాన్ చేశారు. చిన్న చిన్న ఇ‍బ్బందులు మినహా ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇంతకీ ఈ కార్యక్రమం కోసం ఎంత ఖర్చు పెట్టారు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?

    సాధారణంగా రాజమౌళి కొత్త సినిమా తీస్తుంటే మీడియా మీట్ పెట్టి ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తుంటారు. ఈసారి మాత్రం ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఏడాది క్రితమే టైటిల్, గ్లింప్స్ లాంటివి రివీల్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. తాజాగా జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో స్వయంగా రాజమౌళి ఇదంతా చెప్పాడు. అయితే అనివార్య కారణాల వల్ల  ఆలస్యమవుతూ ఇన్నాళ్లకు కుదిరిందని అన్నారు.

    (ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

    టైటిల్ లాంచ్‌ని ఏదో ఆషామాషీగా కాకుండా 100x130 అడుగల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, మూవీకి సంబంధించిన స్పెషల్ వీడియోని దీనిపై ప్లే చేశారు. కేవలం ఈ స్క్రీనింగ్ సెటప్ కోసమే రూ.30 లక్షలకు పైగా ఖర్చు చేశారట. మొత్తంగా కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఖర్చులు కలిపి రూ.10-15 కోట్ల వరకు అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇండస్ట్రీలో ఇదో రికార్డ్ అవుతుంది.

    ఎందుకంటే టీజర్ కోసమో, గ్లింప్స్ వీడియో కోసమే ఖర్చు చేయడం లాంటివి విని ఉన్నాం. కానీ మూవీకి సంబంధించిన టైటిల్ లాంచ్ కోసమే ఏకంగా ఈ రేంజులో కోట్లు ఖర్చు పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంకే స్థాయిలో ఖర్చు పెడతారో అనిపిస్తుంది. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి.. ఈసారి ప్రపంచవ్యాప్తం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలనే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూస్తే అది అనిపించింది కూడా.

    (ఇదీ చదవండి: రాజమౌళిపై హనుమాన్‌ భక్తులు ఫైర్‌)

  • ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్‌ (Shweta Menon) ఇటీవలే అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈ పీఠాన్ని దక్కించుకున్న తొలి మహిళగా చరిత్రలో నిలిచింది. 13 ఏళ్లకే సినిమాల్లో అడుగుపెట్టిన శ్వేత.. మోడల్‌గా, నటిగా రాణించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. తాజాగా ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.

    అవార్డులు సూట్‌కేస్‌లో..
    ఓ ఇంటర్వ్యూలో శ్వేతా మీనన్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేర్వేరుగానే చూస్తాను. రెండింటినీ మిక్స్‌ చేయను. ఇంటికొచ్చాక పని గురించి ఆలోచించను. అలాగే నాకు వచ్చిన అవార్డులను ప్రదర్శనకు పెట్టకుండా సూట్‌కేస్‌లో భద్రంగా ఉంచుతాను. నా భర్త, కూతురు అడిగినప్పుడు మాత్రమే వాటిని తీసి బయటపెడుతుంటాను. ఇంట్లో ఒక నటిగా కాకుండా, భార్యగా, తల్లిగా, కూతురిగా మాత్రమే ఉండాలనుకుంటాను.

    నాన్న కొట్టేవాడు
    నాన్న చనిపోయినరోజు నన్ను నేను కోల్పోయినట్లు అనిపించింది. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయినా తను మాతోనే ఉన్నట్లు భావిస్తాను. నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది నాన్న ఒక్కరే! నాన్న చాలా స్ట్రిక్ట్‌.. నన్ను కొట్టేవాడు కూడా.. చిన్నప్పుడు ఆయనంటే ద్వేషం ఉండేది. తన మాట వినాలనిపించేది కాదు. కానీ, నాకు తెలియకుండానే నన్ను అందమైన జీవితం వైపు నడిపించాడు.

    నా కూతురి కోసం బతకట్లేదు
    అమ్మ స్థానం అమ్మదే.. కానీ, నాన్నే నా ప్రపంచం. నా కూతుర్ని నా లైఫ్‌లో మూడో వ్యక్తిగానే చూస్తాను. ఇదే మాట తనకూ చెప్తుంటాను. నా పేరెంట్స్‌, భర్త.. ఆ తర్వాతే నా కూతురికి ప్రాధాన్యతనిస్తాను. నా కూతురి కోసమే బతకట్లేదు. తనకోసం ఏదీ కొనిపెట్టలేదు, ఏదీ వెనకేయలేదు. తనకు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. తన కోసం అన్నీ చేస్తే తనను బలహీనురాలిని చేసినట్లవుతుంది. 

    నాన్న చేసిందే నేనూ..
    తనకు నేనివ్వగలిగేది విద్య, ఆరోగ్యం. ఆ తర్వాత తన భవిష్యత్తు తనే నిర్మించుకోవాలి. తనకోసం ఆస్తులు కూడబెట్టలేదు.. కానీ, విహారయాత్రలకు తీసుకెళ్తా.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తాను. నాన్న ఏదైతే చేశాడో నేనూ ఇప్పుడదే చేస్తున్నా.. ఒక్కోసారి నా కూతురు మేముంటున్న ఫ్లాట్‌ను తనదే అంటుంది. నేను వెంటనే, అది నీది కాదని గుర్తు చేస్తాను. 

    పేరెంట్స్‌ చేస్తుంది తప్పు
    నాకున్నది ఒక్కటే జీవితం. దాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాలి. ఐదు పైసలు కూడా తనకివ్వను. తను నాపై ఆధారపడకుండా ఎదగాలన్నదే నా కోరిక. పిల్లల కోసం డబ్బులు దాచిపెడుతూ తల్లిదండ్రులు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదే వారు చేస్తున్న పెద్ద తప్పు. వేరేవాళ్ల కోసం మనం బతకడం మొదలుపెడితే మన జీవితమైపోవాలి?

    పిల్లలకు కోట్లు కాదు..
    ముందు మీ జీవితాన్ని మీరు అనుభవించండి. దాన్ని చూస్తూ మీ పిల్లలు ఎదుగుతారు. వాళ్లకు అన్నీ అమర్చి పిల్లల్ని శిక్షించకండి. పిల్లలకు కావాల్సింది కోట్లు కాదు, ప్రేమ, మంచి జ్ఞాపకాలు. అలాగే వారికి మంచి విద్య ఇప్పించండి, నచ్చినరంగం వైపు వెళ్లనివ్వండి. అదే మనం చేయాల్సింది అని శ్వేతా మీనన్‌ చెప్పుకొచ్చింది. శ్వేతా మీనన్‌ తెలుగులో రాజన్న సినిమాలో దొరసానిగా నటించింది. గతేడాది నాగేంద్రన్స్‌ హనీమూన్స్‌ వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేసింది.

    చదవండి: బిగ్‌బాస్‌ 9: తర్వాతి టార్గెట్‌ దివ్య

  • తెలంగాణలోని వనపర్తి సంస్థానికి చెందిన అదితీ రావు హైదరీ ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తోంది. హీరో సిద్దార్థ్‌ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈమె పేరు చెప్పి ఓ వ్యక్తి.. పలువురు ఫొటోగ్రాఫర్స్‌ని మోసం చేస్తున్నాడు. ఇది అదితీ దృష్టికి వచ్చేసరికి స్వయంగా దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి హెచ్చరించింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా)

    'వాట్సాప్‌లో నా పేరుతో ఎవరో ఓ వ్యక్తి.. ఫొటోషూట్స్ కోసం పలువురు ఫొటోగ్రాఫర్స్‌కి మెసేజులు చేస్తున్నాడు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే అది నేను కాదు. ఇలా నేను మెసేజ్ చేయను. చెప్పాలంటే నాకు వ్యక్తిగత ఫోన్ నంబర్ ఏం లేదు. నా టీమ్ ద్వారా నేను సంప్రదిస్తాను. కాబట్టి ఆ నంబర్ నుంచి మెసేజులు ఏమైనా వస్తే స్పందించొద్దు' అని అదితీ రావ్ హైదరీ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. సదరు మోసగాడి నంబర్ కూడా వెల్లడించింది.

    2006 నుంచి అదితీ సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో నటించింది. టాలీవుడ్‌లో 'సమ్మోహనం' ఈమెకు తొలి మూవీ. తర్వాత అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లో నటించింది. 'సమ్మోహనం'తో హిట్ కొట్టినప్పటికీ మిగిలనవన్నీ ఫెయిల్ అయ్యాయి. 'మహాసముద్రం'లో నటిస్తున్న టైంలో హీరో సిద్ధార్థ్‌తో అదితీ ప్రేమలో పడింది. తర్వాత మూడేళ్ల పాటు ప్రేమించుకుని 2024లో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

    (ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

  • నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ మూవీ శివ. తెలుగు సినీ ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఈ చిత్రమిది. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీతోనే రాం గోపాల్ వర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ కల్ట్ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.

    ఈ మూవీని తాజాగా 4కె వర్షన్‌లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 14న వచ్చిన ఈ చిత్రం కోసం నాగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త 4కె వర్షన్‌లో రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పట్లోనే రూ.4 కోట్లు రాబట్టిన శివ.. రీ రిలీజ్‌లోనూ సత్తా చాటడం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్‌ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

  • 56వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది, ఇందులో విభిన్న రకాల  సినిమాల ప్రదర్శనతో, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు ప్రత్యేక అభినందన కార్యక్రమంతో పాటు పలు కొత్త టెక్నాలజీ–ఆధారిత ఈవెంట్‌లు ఉంటాయి.

    ముఖ్యాంశాలు
    👉 గ్లోబల్‌ ఫిల్మ్‌ షోకేస్‌: ఈ ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి, వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్‌లు, అనేక అంతర్జాతీయ  ఆసియా ప్రీమియర్‌లు ఉన్నాయి.

    👉50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ను సత్కరిస్తారు, ఇది ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ. ఆయన సినిమా లాల్‌ సలామ్‌ ప్రదర్శిస్తారు.

    👉 జపాన్‌ ’కేంద్రీకరణ దేశం’గా , స్పెయిన్‌ ’భాగస్వామి దేశం’గా  ఆస్ట్రేలియా ’స్పాట్‌లైట్‌ దేశం’గా వ్యవహరిస్తున్నాయి, ఈ దేశాల నుంచి క్యూరేటెడ్‌ ఫిల్మ్‌ విభాగాలు ఉంటాయి.

    👉ఈ ఉత్సవంలో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్‌ ఖోస్లా, రిత్విక్‌ ఘటక్‌ భూపేన్‌ హజారికా, సలీల్‌ చౌదరి లతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత అద్భుత నటి పి. భానుమతి శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఇదే ఫెస్టివల్‌లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.

    👉పనోరమా విభాగం భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది, ఇందులో 25 చలనచిత్రాలు, 20 నాన్‌–ఫీచర్‌ చిత్రాలు ఉన్నాయి. ఈ సినీ ఉత్సతవంలో తమిళ చిత్రం అమరన్‌ ప్రారంభ చలనచిత్రంగా,  కాకోరి ప్రారంభ నాన్‌–ఫీచర్‌ చిత్రంగా ఉంటాయి.

    👉నూతన దర్శకుడి ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్‌ కోసం పోటీలో భారతదేశం  విదేశాల నుంచి ఏడుగురు తొలిసారి చిత్ర నిర్మాతలు పాల్గొంటారు, సినిమాలోకి  కొత్త వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్‌ మైండ్స్‌ ఆఫ్‌ టుమారో‘ (సిఎమ్‌ఒటి)  నిర్వహిస్తున్నారు, దీనిలో భాగంగా 124 మంది యువకులు 48 గంటల చిత్రనిర్మాణ సవాలులో పాల్గొంటారు.

    👉మాస్టర్‌ క్లాసెస్‌ – వర్క్‌షాప్‌లు ప్రధానంగా ఉంటాయి.  విధు వినోద్‌ చోప్రా, ఆమిర్‌ ఖాన్, అనుపమ్‌ ఖేర్‌ , బాబీ డియోల్‌ వంటి ప్రఖ్యాత సినీ ప్రముఖులు 21 మాస్టర్‌ క్లాసెస్‌ , ‘ఇన్‌–కన్వర్సేషన్‌‘ సెషన్ లను నిర్వహిస్తారు.

    👉 ‘సినిమాఏఐ హ్యాకథాన్‌ పేరిట తొలిసారిగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ)  సినిమాటిక్‌ పృజనాత్మకత కలయికను అన్వేషించే హ్యాకథాన్,  ఏఐ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ విభాగంతో పాటు ప్రారంభిస్తారు.

    👉‘ఇఫెస్టా‘ పేరుతో సాంస్కృతిక కోలాహలం మరో ఆకర్షణ. ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా  ’ఇఫెస్టా’ నడుస్తుంది. యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు   కలిగి ఉన్న ఒక శక్తివంతమైన వినోద జోన్ గా ఇది ఉంటుంది.

    👉దక్షిణాసియాలో అతిపెద్ద ఫిల్మ్‌ మార్కెట్‌ ఫిల్మ్‌ బజార్‌:, వేవ్స్‌ ఫిల్మ్‌ బజార్‌  19వ ఎడిషన్, ఉత్పత్తి, పంపిణీ  అమ్మకాల కోసం 300 కంటే ఎక్కువ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌లతో సృష్టికర్తలు, పరిశ్రమలు. ప్రేక్షకులను కలుపుతుంది.

  • ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలతోపాటు చిన్న హీరోల మూవీస్ కూడా థియేటర్లలో రీరిలీజ్ అవుతూ ఎంతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు రిలీజ్ సమయంలో కంటే రీరిలీజ్‌లో మరింత ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా రీరిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా సిని లవర్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

    కార్తీ, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ‘ఆవారా’ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, యూత్‌ను కట్టిపడేసిన సాంగ్స్‌తో ఇప్పటికీ గుర్తుండిపోతోంది. ఈ పాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.

    బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా రికార్డులు సృష్టించిన ‘ఆవారా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా... నవంబర్ 22న తిరిగి థియేటర్లలో! మ్యూజికల్ హిట్‌ను మరోసారి ఎంజాయ్ చేయండి’ అంటూ విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమా 'హౌమ్ బౌండ్'. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్‌గా దీనికి ఎంట్రీ దొరికింది. థియేటర్లలోకి రావడానికి ముందే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానుంది.

    ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా కష్టాలు, కులం కారణంగా ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత, ఆర్థిక అసమానతలు తదితర అంశాలని తీసుకుని ఈ సినిమా తీశారు. పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకోగా.. సెప్టెంబరు 26న థియేటర్లలో రిలీజ్ చేశారు. యావరేజ్ టాక్ దగ్గరే అగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబరు 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    (ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

    'హౌమ్ బౌండ్' విషయానికొస్తే.. మహమ్మద్ షోయబ్ అలీ(ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ముస్లిం, దళిత వర్గానికి చెందిన వాళ్లు కావడంతో సమాజంలో అవమానాలు, అణిచివేతకు గురవుతారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ అయితే తమకు గౌరవం లభిస్తుందని వీళ్లిద్దరూ భావిస్తారు. పరీక్ష రాస్తారు. ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో అలీ ఉద్యోగానికి చేరతాడు. సుధ(జాన్వీ కపూర్) కోసం చందన్ కాలేజీలో చేరతాడు.

    మరి కలిసి ఉండే అలీ, చందన్ మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? కాలేజీ మానేసిన చందన్.. ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసిన షోయబ్.. సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పనికి ఎందుకు చేరారు?వీరిద్దరి జీవితాల్లో కరోనా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా సినిమా. ఇద్దరు స్నేహితులుగా ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతంగా నటించారు. ఓ చిన్న పాత్రలో ఎలాంటి మేకప్ లేకుండా జాన్వీ కపూర్ ఆకట్టకుంది.

    (ఇదీ చదవండి: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌.. ఒక్క సంఘటనతో రాజమౌళి ఫ్రస్టేషన్!)

  • తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్‌) ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్‌ జోన్‌లో నిఖిల్‌, గౌరవ్‌తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.

    ఆ రెండింటి వల్లే..
    నిఖిల్‌ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్‌, దివ్య (Divya Nikhita)ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్‌ అని నాగ్‌ ప్రకటించాడు. షూటింగ్‌ ఆల్‌రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్‌ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్‌ కార్డ్‌గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్‌ జోన్‌లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్‌ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.

    ఆ గేమ్‌ కొంప ముంచింది
    గత వారం కెప్టెన్సీ గేమ్‌లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్‌ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్‌లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్‌ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.

    తనూజపై కుళ్లు?
    ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్‌లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్‌ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్‌ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.

    గండం
    బీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్‌ టాస్క్‌లు చేసినప్పటికీ ఆ క్రెడిట్‌ అంతా సుమన్‌కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్‌ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్‌ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్‌ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి!

     

    చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చైతన్య

  • పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్‌ డైరెక్టర్‌ వీరు దేవ్‌గణ్‌ ఎన్నో సినిమాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.

    ప్రాక్టీస్‌ చేయకుండా దూకేశాడు
    బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్‌ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్‌ చేయకుండానే విమానంలో నుంచి సడన్‌గా దూకి స్కైడైవింగ్‌ చేశాడు' అని నటుడు మాధవన్‌ అజయ్‌ గురించి గొప్పగా చెప్పాడు.

    కళ్ల ముందే ఓ ప్రాణం
    ఇంతలో అజయ్‌ అందుకుంటూ.. నేను షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్‌ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్‌ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్‌ చేసి నా సీన్‌ పూర్తి చేశాను. 

    ఆ హీరోకీ తప్పలేదు!
    హాలీవుడ్‌ స్టార్‌ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్‌లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్‌ చేశాడు. అతడి పారాచూట్‌ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్‌స్ట్రక్టర్‌ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.

    చదవండి: కుమిలి కుమిలి ఏడ్చా!: మంచు లక్ష్మి

  • బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తాజా చిత్రం అఖండ-2(Akhanda 2). బోయపాటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.

    తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీని 2డీతో పాటు త్రీడీ వర్షన్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

     

     

  • ‘తెలుగమ్మాయిలు ఎక్స్‌ఫోజింగ్‌ చేయమంటే చేయలేరు.. అందుకే అవకాశాలు రావు’ అని చెప్పేవాళ్లకు..‘అది తప్పు మేం కూడా కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సీన్స్‌ చేయగలం’ అని నిరూపించడానికే బోల్డ్‌ ఫోటో షూట్‌ చేశానని అంటోంది నటి దక్షి గుత్తికొండ(Dakkshi Guttikonda). ఆర్జీవీ ‘కరోనా వైరస్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. కొత్త పోరడు వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్‌ మీడియా ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలో హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. అయితే ఒకరు ధరించే దుస్తులను చూసి వారి క్యారెక్టర్‌ని అంచనా వేయొద్దని చెబుతోంది దక్ష. తాజాగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో​కి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.

    అలా సినిమాల్లోకి.. 
    చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా..అమ్మ చేయనీయలేదు. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది. మోడలింగ్‌ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. కరోనా సమయంలో ఆర్జీవీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆడిషన్స్‌ కోసం వెళ్లాను. ఒక్కరోజులోనే ఆడిషన్స్‌, లుక్‌టెస్ట్‌ పూర్తి తర్వాత షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. అలా ‘కరోనా వైరస్‌’ సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను.

    ఆర్జీవీ బోల్డ్‌గా చూపిస్తారు కానీ..
    ఆర్జీవీ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చినప్పుడు భయపడ్డాను. మీడియాలో ఆయనను చూపించే కోణం వేరు. ఆయనను బోల్డ్‌గా చూపించారు. నాకే కాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆర్జీవీని కలవాలంటే కాస్త భయమే. కానీ బయట మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకున్నంత సినిమా నాలెడ్జ్‌ ఇంకెవరీకీ లేదు. చాలా తక్కువ మాట్లాడతారు. కరోనా వైరస్‌ సినిమా సమయంలో నేను 12 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గాన్నా. చాలా బాగా చూసుకున్నారు.

    కొత్త అమ్మాయిలకు తప్పవు..
    సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఎక్కడగా అమ్మాయిలకు వేధింపులు ఉన్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది అంతటా ఉంది. కెరీర్‌ ప్రారంభంలో నేను కూడా అది ఫేస్‌ చేశా. కొంతమంది అర్థరాత్రి 2-3 గంటలకు ఫోన్‌ చేసేవారు. చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తామని.. నీ కెరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పి చివరిలో ‘నాకేంటి’ అనేవాళ్లు. స్టార్టింగ్‌లో అలా అడిగితే చాలా ఏడ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి నేనే మారిపోయాను. ఎవరైనా కాల్‌ చేస్తే..‘మీకు అలాంటి వాళ్లు కావాలంటే వేరే వాళ్లు ఉంటారు అక్కడకు వెళ్లండి...ఆర్టిస్ట్‌ కోసం అయితే నా దగ్గరకు రండి’ అని చెప్పేదాన్ని. 

    అర్థరాత్రి ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయకుండా ఉదయం చేసేదాన్ని.కొంతమంది ఫోన్‌ లిప్ట్‌ చేసేవాళ్లు కాదు. నాకే కాదు ఏ అమ్మాయికి అయినా ఇలాంటి వేధింపులు కామన్‌. కొత్తగా ఓ అమ్మాయి వస్తుందంటే చాలు..అలాంటి వెదవలు కాల్‌ చేస్తునే ఉంటారు. అమ్మాయిలు ఎలా డీల్‌ చేశారనేది ముఖ్యం.  కొంతమంది అమ్మాయిలు స్కిన్‌ షో చేసి చాన్స్‌లు కొట్టేస్తారు. అయితే వాళ్లకు నాలుగైదు చాన్స్‌ వస్తాయంటే..అంతకు మించి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు’ అని దక్షి చెప్పుకొచ్చింది. 

  • తొలిసారి రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూశారు. దీంతో దర్శకధీరుడు సైతం సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇ‍చ్చాడు. ప్రియాంక చోప్రా లుక్‌తో ఏకంగా సాంగ్ రిలీజ్‌ చేశారు. అంతే కాకుండా భారీ ఈవెంట్‌తో టైటిల్ గింప్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఈ గ్రాండ్ జరిగింది.

     ఇంత భారీ ఎత్తున చేసిన ఈవెంట్‌లో ఓ చిన్న సంఘటన రాజమౌళికి కోపం తెప్పించింది. ఆడియన్స్‌కు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ అందించాలనే ఉద్దేశంతో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌ను ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయాలని భావించాం.. అందుకే టెస్టింగ్ చేయాలనుకున్నామని రాజమౌళి తెలిపారు. కానీ ఈ గ్లింప్స్‌ టెస్ట్‌ ప్లే సమయంలో కొందరు డ్రోన్ విజువల్స్‌తో లీక్ చేయడం నిరాశ కలిగించిదన్నారు.  ఎందుకంటే ఇది కోట్ల రూపాయల బడ్జెట్, ఎంతో మంది శ్రమతో రూపొందించామని.. ఇలా చేయడంపై దర్శకధీరుడు బాధగా ఉందన్నారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినట్లుగా మా కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని అన్నారు. ఈ సంఘటనతో మేం సరిగ్గా పరీక్షించలేకపోయామని వెల్లడించారు.

    కాగా.. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రగా కనిపించనున్నారు. తాజాగా రిలీజైన టైటిల్ గ్లింప్స్‌ ప్రిన్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో ఈ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. వారణాసి చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

     

  • మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్‌ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్‌ గురించి కాస్త హింట్‌ వచ్చేసింది. భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్‌ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్‌ లైన్‌ మహేష్‌ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే 'ఛిన్నమస్తా దేవి' విజువల్‌ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు  ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.

    ఛిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన  చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు  సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.

    వారణాసితో లింక్‌
    ఛిన్నమస్తా దేవి భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్‌ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.  ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో  స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్‌ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది. 

    ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది. 

  • లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్. ఇటీవలే 'డ్యూడ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీపావళి సందర్భంగా గత  థియేటర్లలోకి వచ్చిన డ్యూడ్‌ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

    ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈనెల 14 నుంచే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ బాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే నంబర్‌వన్ ‍స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా.. మమిత బైజు హీరోయిన్‌గా కనిపించగా.. శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 
     

     

  • రామ్ పోతినేని, భాగ్యశ్రీ  హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.  ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్‌ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.

  • పదిహేనేళ్ల వయసులో తనకు చేదు అనుభవం ఎదురైందంటోంది నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా 'హాటర్‌ఫ్లై'కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ చేదు జ్ఞాపకాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా.. నాకు 15 ఏళ్లు. నేనెప్పుడూ కారులోనే స్కూలుకు వెళ్లేదాన్ని. నా వెంట మా అమ్మ, డ్రైవర్‌, బాడీగార్డ్‌ ఉండేవాళ్లు. 

    అసభ్యంగా తాకాడు
    ఓసారి స్కూల్‌ వాళ్లు మమ్మల్ని హాల్‌ టికెట్స్‌ తీసుకునేందుకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో బయటకు తీసుకెళ్లారు. అప్పుడు నేను చాలా ఎగ్జయిటయ్యాను. కానీ, దారిలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడు. నాకు చాలా చెత్తగా అనిపించింది. నేను చిన్నపిల్లని అన్న విషయం అతడికి తెలుసా? లేదా? అర్థం కాలేదు. అయినా అతడితో నేను గొడవపెట్టుకోలేక అక్కడి నుంచి పక్కకు జరిగాను. తర్వాత జరిగింది నా ఫ్రెండ్స్‌కు చెప్పాను. 

    ఎంతో ఏడ్చా..
    వాళ్లు కూడా అలాంటి సంఘటనలు తరచూ ఎదుర్కొంటున్నామని చెప్పేసరికి షాకయ్యాను. ఇక్కడ నేను మోహన్‌బాబు కూతుర్ని అని నన్ను స్పెషల్‌గా పక్కన పెట్టలేదు! ఇలాంటి చేదు అనుభవాలు అందరికీ జరుగుతుంటాయి. కానీ, చాలామంది తమకలాంటి అనుభవాలు ఎదురవలేదని అబద్ధం చెప్తుంటారు. మీటూ ఉద్యమం సమయంలో అయితే కిందపడి ఏడ్చిన రోజులున్నాయి. మీటూ సమయంలో ఆడవాళ్లు ఎదుర్కొన్న ఎన్నో బాధల్ని బయటకు చెప్పారు. 

    ఇంట్లో దొంగతనం
    అవి నేనూ ఫేస్‌ చేసినందున వాటిని తల్చుకుని కుమిలిపోయాను. పెద్ద కుటుంబం నుంచి వచ్చానని తెలిసి కొందరు కావాలనే నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఎందుకంటే అందరిలాగా మేము బయటకు వచ్చి అన్నీ చెప్పలేం కాబట్టి! ఒకసారి మా ఇంట్లో దొంగతనం జరిగింది. అది నేను బయటకు చెప్పుకోలేకపోయా! రూ.15 వేలే కదా.. పోనీలే అని వదిలేశా.. ఇంట్లో మమ్మల్ని అలాగే పెంచారు అని చెప్పుకొచ్చింది. లక్ష్మీ మంచు చివరగా 'దక్ష' సినిమాలో కనిపించింది.

    చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చై

National

  • ఢిల్లీ:  ఢిల్లీ నగరంలోని ఎర్రకోటకు సమీపంలో  ఇటీవల జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మరొక వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. ఈరోజు(ఆదివారం) అమిర్‌ రషీద్‌ అలీ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న  ఉమర్‌ నబీకి సహచరుడిగా ఉన్న అమిర్‌ రషీద్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రధానంగా ఉమర్‌ నబీ  కారు కొనడంలో అమిర్‌ రషీద్‌ సహకారం అందించాడు. 

    రషీద్‌ అలీ పేరుపైనే దాడిలో ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్‌ అయ్యింది. ఆ రోజు కారు నడిపింది ఉమర్‌ నబీ అనే విషయం ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ల ఆధారంగా బయటపడింది.  కారు కొనడానికి అమిర్‌ కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడని, ఈ దాడిలో అమిర్‌ పాత్ర కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అమిర్‌ రషీద్‌ అరెస్ట్‌తో మరిన్ని విషయాలు తమ దర్యాప్తు ద్వారా రాబట్టవచ్చిన అధికారులు భావిస్తున్నారు.

    కాగా, నవంబర్‌ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు.

    పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్‌ ఉమర్‌ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్‌ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్‌ ఫైళ్లు, ఓపెన్‌ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్‌ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్‌ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్‌ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

    పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్‌ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్‌ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్‌లేకుండా ఉమర్‌ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్‌ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్‌ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్‌ పార్కింగ్‌ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు. 

  • పథనంతిట్టశబరిమలలో కొలువైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానం ఈరోజు (నవంబరు 16) సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది. మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానం చేరుకున్నారు. పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తర్వాత ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయం తలుపులును తెరిచారు. ఆ వెంటనే.. ‘స్వామియే.. శరణం అయ్యప్పా’ అనే భక్తుల శరణుఘోషలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది.

    మండల పూజ సీజన్‌లో శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు మౌలిక సదుపాయాలను కల్పించింది. అదేవిధంగా కేరళ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వైద్య కళాశాల ప్రొఫెసర్లు మొదలు.. పీజీ విద్యార్థులను రంగంలోకి దింపి.. శబరిమల మార్గంలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంపాబేస్‌లో 24 గంటలూ పనిచేసేలా వైద్య కేంద్రం పనిచేస్తుందని అధికారులు తెలిపారు. వైద్య శిబిరాలు ఎక్కడెక్కడున్నాయి? భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనే అంశాలపై దీర్ఘకాలిక వ్యాధులు, కొమార్బరిటీస్‌తో బాధపడే భక్తులు అత్యవసర స్థితిలో ఎవరిని సంప్రదించాలి? అనే అంశాలపై మళయాలంతోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పైన పేర్కొన్న భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

    ట్రెకింగ్ మార్గంలో..

    పంపాబేస్ నుంచి శబరిమల సన్నిధానం వరకు పలు చోట్ల అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి ఎత్తులో వెళ్తున్నప్పుడు శ్వాస ఇబ్బందులు ఎదురయ్యే భక్తుల కోసం ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో కొన్ని వైద్య కళాశాలలు బేస్ ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ కార్డియాలజీ ట్రీట్ మెంట్, క్యాథ్ ల్యాబ్ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపాబేస్ వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. పంపాకు సమీపంలో ఉన్న అన్ని ఆస్పత్రులలో డీఫిబ్రిలేటర్లువెంటిలేటర్లుకార్డియాక్ మానిటర్లు ఉంటాయని తెలిపారు. నీలక్కల్ బేస్ వద్ద పూర్తిస్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. శబరిమల చరిత్రలోనే తొలిసారి పంపాబేస్, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. అటు అయ్యప్పస్వామి వంశస్తుల రాజ్యంగా పేర్కొనే పందలం వద్ద కూడా తాత్కాలిక డిస్పెన్సరీలు ఏర్పాటయ్యాయి. శబరిమలకు వచ్చే మార్గాల్లో అడూర్, వడసేరిక్కర, పథనంతిట్టల్లోనూ 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయి.

     

    భక్తులకు ప్రభుత్వ సూచనలు

    • ప్రస్తుతం వివిధ వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలి

    • శబరి యాత్రకు కొద్దిరోజుల ముందు నుంచి నడక, తేలికపాటి వ్యాయామాలు చేయాలి

    • పంపాబేస్ నుంచి కొండను ఎక్కేప్పుడు వేగం పనికిరాదు. నిదానంగా కొండను అధిరోహించాలి. అవసరమైతే.. తరచూ విశ్రాంతి తీసుకోవాలి

    • కొండను అధిరోహించేప్పుడు అలసటఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే.. తక్షణం వైద్య సాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలి

    • కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి

    • వివిధ వ్యాధులతో బాధపడేవారు బహిరంగ ప్రదేశాల్లో లభించే చిరుతిళ్లను తినకూడదు

    • నీలిమల, శరణ్‌గుత్తి ప్రాంతాల్లో పాములను పట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ విషకీటకాలు కరిస్తే.. వెంటనే 04735 203232 నంబరుకు కాల్ చేయాలి. తాత్కాలిక వైద్య శిబిరాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి

  • దీపాల కాంతుల్లో పూల పరిమళాల మధ్య అందంగా వివాహ వేడుక సిద్ధమైన వేళ.. నవవధువు శవంగా మారిపోయింది. ఆమె కలలు పంట ఆవిరైపోయింది. తనను తాను పెళ్లికూతురిగా చూసుకుంటూ ముస్తాబవుతున్న తరుణంలో.. యమపాశం తరముకొచ్చింది. పెళ్లి చేసుకోబోయే ప్రియుడే కాలయముడిగా మారిపోయాడు. ఆమె అందమైన ఊహాలోకం కాస్తా నిమిషాల వ్యవధిలో యమలోకానికి పయనమైంది.  

    ప్రాణంగా చూసుకుంటానని సహజీవనంలో మాటిచ్చిన ప్రియుడు.. పెళ్లి పీటల వరకూ వచ్చేసరికి తనలోని సైకోను బయటకు తీశాడు. శారీ కోసం మొదలైన గొడవ ‘స్త్రీధనం( మన భాషలో కట్నం అంటామనుకోండి) వరకూ వెళ్లింది. ఆమె నుంచి డబ్సు ఆశించిన ఆ కసాయి.. ఏడు అడుగులు నడవకుండానే తనలోని కర్కశత్వాన్ని చూపెట్టాడు. ఆ నుదిట తిలకం దిద్దాల్చిన వాడే.. ఆమె రక్తం కళ్ల చూశాడు. ప్రేమగా పిలిచిన వాడే.. ప్రాణం తీశాడు,  పెళ్లి ముహూర్తానికి గంట దూరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

    వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన సజ్జన్‌ బారైయా, సోని హిమ్మత్‌లు  ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరగా లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారు. వారి బంధాన్ని ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయినా తాము పెళ్లి చేసుకుంటామని చెప్పి ఆ బంధాన్ని కొనసాగించారు.  ఇక పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు.  ఆ సమయం కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురుచూశారు. పెళ్లి శుభలేఖలు కొట్టించారు కూడా.  వారి పెళ్లి ముహూర్తం శనివారం రాత్రి(అంటే నిన్న రాత్రి). ఆ రాత్రే ఆ యువతికి కాలరాత్రి అయ్యింది. 

    శారీ కోసం గొడవమొదలైంది వీరివురి మధ్య. అది నగదు వ్యవహారం వరకూ వెళ్లింది. అంతే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ మృగాడిలో ఆవేశం కట్టలు  తెంచుకుంది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అనే సంగతిని మరిచిపోయాడు. ఐరన్‌ పైప్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆపై ఆమె తలను గోడకేసి కొట్టాడు. దాంతో ఆమె ప్రాణం వదిలేసింది. తాను కట్టుకోబోయేవాడు ప్రాణం కూడా తీస్తాడనే ఏనాడు ఆమె కల కూడా కని ఉండదు. కానీ ఆ రాక్షసుడు ఆవేశానికి ఆమె బలైపోయింది.  వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి జరగాల్సిన చోట చావు కేకలు వినిపించాయి. 

    దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు ఏడాదిన్నర కాలంగా లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోవడానికి ఇలా సిద్ధమైన క్రమంలో వారి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా ఆ అమ్మాయి ప్రాణాన్ని ప్రియుడే తీశాడని డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆర్‌ ఆర్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

  • బిహార్ అసెంబ్లీ ఎ‍న్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్,  బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.

    మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్  మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  

    ఆనంద్ మిశ్రా నేపథ్యం

    1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్‌పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్‌ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు.   
     

  • నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో అత్యంత ప్రమాదకరమైన "ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్" (టీఏటీపీ) వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి.ఈ పేలుడు పదార్థం తీవ్రత చాలా అధికంగా ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ పేలుళ్ల ఘటనలో టీఏటిపీనే వాడారని తెలిపాయి.

    ఈనెల 10న ఢిల్లీ ఎర్రకోటలో జరిగిన కారుబాంబు పేలుడుపై ఫోరెన్సిక్ బృందాల విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కారులో అక్రమ రవాణా చేస్త్నున పేలుడు పదార్థాలు "టీఏటీపీ"గా ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. అయితే ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో ఈ పేలుడు పదార్థం వాడినట్లు పూర్తిగా నిర్ధారించపోయిన అదే అయిఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల నుంచే వారికి చేరి ఉండవచ్చని భావిస్తున్నాయి. "టీఏటీపీ"ని పేల్చివేయడానికి, అమ్మెనియం నైట్రేట్ లా కేవలం డిటోనేటర్లు అవసరం లేదని అధిక వేడిమి తాకితే ఆ పేలుడు పదార్థం ఆటోమెటిక్ గా విస్పోటనం చెందుతుందని వెల్లడించాయి. ఈ పేలుడు పదార్థం లక్షణం ఖచ్చితంగా ఆ కారు నడుపుతున్న ఉగ్రవాది ఉమర్ కు తెలుసని అయినప్పటికీ  రద్దీ ప్రదేశాల్లో కారు నడపారని ఫోరెన్సిక్ బృందాలు భావిస్తున్నాయి.

    టీఏటీపీ పేలుడు పదార్థాన్ని "మదర్ ఆఫ్ సైతాన్" గా భావిస్తారు. 2015లో పారిస్ లో జరిగిన బాంబుపేలుళ్లు, 2016 బ్రస్సెల్స్, 2017 మంచెస్టర్ పేలుళ్ల తర్యాత టీఏటీపీ వాడకం గురించి తెలిసింది. ఈ పేలుడు పదార్థం ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థల నుంచే ఉమర్ కు అంది ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లేదా  టీఏటీపీని తయారు చేయాలనుకుంటే దానికి వివిధ రకాల రసాయనాలు అవసరమని వాటిని ఉమర్ ఏలా సేకరించాడు. అతనికి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఎర్రకోట పేలుళ్లకు సంబంధించి ఉమర్ సన్నిహితులు షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇళ్లనుంచి దాదాపు 3 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌:పలు రాష్ట్రాలకు చెందిన సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ,బప్పం టీవీలకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇమ్మడి రవి అరెస్ట్‌ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇమ్మడి రవి అరెస్ట్‌కు ప్రధాన కారణం కాసుల కక్కుర్తే అని తెలుస్తోంది.

    ఇమ్మడి రవి అరెస్టు ఇలా
    విదేశాల్లో ఉన్న ఇమ్మడి రవి భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ సమయంలో రవి గురించి సమాచారం అందుకున్న సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్టుతో ఇమ్మడి రవి తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇమ్మడి రవి విడుదలైన కొత్త సినిమాను పైరసీ చేయడం వాటిని ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తుండేవాడు. తద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని కొత్త మార్గాల్ని ఎంచుకున్నాడు. అందుకు టెలిగ్రామ్‌ను వేదిక చేసుకున్నాడు. టెలిగ్రామ్‌లో యూజర్లు సినిమా లింక్స్‌ క్లిక్‌ చేస్తే బెట్టింగ్‌ యాప్స్‌,గేమింగ్‌ యాప్స్‌ యాడ్స్‌ వచ్చేవి.వాటి ద్వారా భారీ ఆదాయాన్ని గడించాడు.

    పోలీసుల దర్యాప్తు ఇలా 
    అదే సమయంలో తెలంగాణ సీఐడీ పోలీసులు బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌పై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తులో ఉండగా పోలీసులకు ఇమ్మడి రవి సైతం బెట్టింగ్‌ యాప్స్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. ఐబొమ్మ,బప్పం టీవీలో పైరసీ సినిమా చూసే సమయంలో అనైతిక గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌కు సంబంధిత యాడ్స్‌ను ప్రసారం చేసేవాడు. పైరసీ సినిమాను ఓపెన్‌ చేయాలన్నా, డౌన్‌లోడ్‌ చేయాలన్నా, ఇంటర్వెల్ తర్వాత సినిమా చూడాలన్నా, సినిమా చూసే సమయంలో పాజ్‌ క్లిక్‌ మళ్లీ చూడాలన్నా ఆ యాడ్స్‌ను క్లిక్‌ చేసేలా వ్యవస్థను తయారు చేశాడు. 

    ఇమ్మడి రవి అనుచరులు అరెస్టు
    అలా పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌పై దర్యాప్తు చేస్తుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పైరసీ కంటెంట్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు. వారిలో శివాజీ,ప్రశాంత్‌ ఉన్నారు. వారిద్దరూ ఇమ్మడి రవికి ప్రధాన అనుచరులుగా పోలీసులు భావిస్తున్నారు. వాళ్లిద్దరూ అరెస్ట్‌ అనంతరం కూకట్‌పల్లి నుంచి తప్పించుకుని నెలకొకసారి దేశాలు మారుతూ వచ్చాడు. కూకట్‌ పల్లి నుంచి నెదర్లాండ్‌, ఫ్రాన్స్‌, కరేబీయన్‌ దీవుల్ని అడ్డగా చేసుకొని పైరసీ సైట్లను నిర్వహించాడు. ఐబొమ్మ ర‌వి ప్ర‌స్తుతం భార్య‌తో విడాకుల కేసులో హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజ‌ర‌వుతున్నాడు. అదే క్ర‌మంలో త‌దుప‌రి విచార‌ణ కోసం అత‌డు ఫ్రాన్స్‌ నుంచి కూక‌ట్ ప‌ల్లికి రాగా.. రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఫ్రాన్స్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన విషయం అతడి దగ్గరి వ్యక్తుల నుంచి పోలీసుల‌కు లీకైంద‌ని కూడా ఒక గుస‌గుస వినిపిస్తోంది.  

    70కి పైగా పైరసీ సైట్లు 
    కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో అతనిని అరెస్టు చేసే సమయంలో వందల సంఖ్యలో హార్డ్‌ డిస్క్‌లు, ఐబొమ్మ, బప్పం టీవీలో విడుదల చేసేందుకు అప్‌లోడ్‌ చేసిన కొత్తగా విడుదలైన సినిమాలు, సర్వర్లను మెయింటైన్‌ చేసేందుకు వినియోగించిన సాఫ్ట్‌వేర్లు కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను సీజ్‌ చేశారు. 2018 నుంచి నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకున్న ఇమ్మడి రవి ఐబొమ్మ,బప్పంటీవీలలో సినిమాలను అప్‌లోడ్‌ చేసేవారని,కరేబియన్‌ దీవుల్లో సైతం కార్యకలాపాలు కొనసాగించినట్లు తేలింది. ఐబొమ్మ, బప్పంటీవీలను ప్రధానంగా ఉంచుకొని.. అదనంగా మరో 70కి పైగా ఆపరేట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటి ఆధారాల్ని సేకరించారు. 

    దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అన్నాడని
    అనంతరం, తెలంగాణ సైబర్‌ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీని నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్‌సైట్లను క్లోజ్‌ చేయించారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటూ ఇమ్మడి రవి విసిరిన సవాలను స్వీకరించి అతడితోనే ఐబొమ్మ, బప్పం టీవీలను నిలిపివేయించారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్‌ డిస్క్‌లను, బ్యాంక్‌ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు.

    పోలీసుల కస్టడీ పిటిషన్‌లో 
    బెట్టింగ్‌ యాప్‌,గేమింగ్‌ యాప్‌ సంస్థలతో ఇమ్మడికి రవికి సంత్సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇమ్మడి రవికి ఎవరైనా సహకరిస్తున్నారా?. డిసస్టట్రిబ్యూటర్లు సినిమా కాపీనీ పలు డిజిటల్‌  ఛానెళ్లకు ఇస్తుంటారు. ఆ సర్వర్‌లలోకి వెళ్లిమరీ హ్యాక్‌ చేశాడు. ఎంతో పకడ్బందీగా ఉండే సర్వర్‌లలో ఎలా ఎంటర్‌ అయ్యాడు? సినిమాని ఎలా కాపీ చేశాడు? ఆ సినీమాని ఎలా పైరసీ చేశారనే విషయాలు వెలుగులోకి రావాలల్సి ఉంది. ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్న పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.  

    కాగా, అరెస్టు అనంతరం ఇమ్మడి రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

  • రామాయంపేట(మెదక్‌): అమ్మో..నేను డాడీ దగ్గరకు వెళ్లను.. కొడతాడు అని ఆ చిన్నారి హడలిపోతున్నాడు. మారు తండ్రి చేతిలో చావు దెబ్బలు తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి వంశీ (3) మాటలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. మండలంలోని అక్కన్నపేట గ్రామంలో మద్యం మత్తులో చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చిన ముత్యం సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

    కాగా మెదక్‌ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న బాబు తన తండ్రి పేరు ఎత్తితేనే భయకంపితుడవుతున్నాడు. నేను మళ్లీ డాడి దగ్గరికి పోనని, వైరుతో కొడతాడని, కాళ్లతో తంతాడని చెబుతున్నాడు. పోలీసులు, పలు శాఖల అధికారులు శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరామర్శించారు. కాగా అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సత్యనారాయణ భార్యను ఇంట్లో ఉండగా, బాబును టాయిలెట్‌కు తీసుకెళ్తున్నానని చెప్పి బయటినుంచి తలుపుల గొళ్లెం పెట్టాడు. 

    అనంతరం బాబును వైరుతో గంటపాటు ఆగకుండా తీవ్రంగా కొట్టాడు. కాగా, అలిసిపోయి తలుపులు తీసి విలపిస్తున్న తనను కొట్టి గొంతు పిసికాడని భార్య శ్వేత తెలిపింది. ప్రస్తుతం ఆమె కూడా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వంశీ కంటే చిన్నదైన తన కూతురును సైతం భర్త చంపాడని ఆమె ఆరోపించింది. ఏడాది క్రితం ఆమెకు జ్వరం రాగా, ఆస్పత్రికి తీసుకెళ్తానని చెప్పి గంట తరువాత ఆమె మృతదేహంతో వచ్చాడని చెప్పింది. అప్పుడు భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని శ్వేత విలపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని అక్కన్నపేట గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

     

  • మగ సంతానం కోసం పరితపిస్తూ... ఆరుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు ఆ తల్లిదండ్రులు. వారి ఆశలు ఆవిరి కాగా ఐదో అమ్మాయికి చిన్నప్పటి నుంచి పురుషుడి బట్టలు వేసి, కట్టింగ్‌ చేయించి, బాబులా పెంచి మురిసిపోయారు. కానీ పెరుగుతున్న కొద్దీ ఆమెలో అమ్మాయి లక్షణాలు కనుమరుగయ్యాయి. మగ పిల్లలతో సావాసం..ఆటపాటలు ఆమెను అబ్బాయిగా తీర్చిదిద్దాయి. చేసిన తప్పును గుర్తించిన తల్లిదండ్రులు ‘చేతులు కాలాక..ఆకులు పట్టుకున్నట్లు’ వయస్సు వచ్చాక దేవుని గుడిలోని ‘కత్తి’తో పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు.  దీంతో తానేమిటో అర్థం కాక ఒంటరిగా.‘.ప్రేమ్‌’ పేరుతో నిర్జీవమైన బతుకు వెళ్లదీస్తోంది ‘ప్రమీల’. వైజ్ఞానిక ప్రపంచంలో కూడా ‘పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కొడుకే’ అనే భావన ఇంకా వీడటం లేదు అనడానికి సజీవ సాక్ష్యంపై ఈ వారం కథనం. 

    కొడుకు కోసం పరితపిస్తూ... 
    రాణీ శంకరమ్మ ఏలిన మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి మదిర గ్రామం మదిరె కొత్తపల్లి. గ్రామానికి చెందిన లచ్చమ్మ, పెంటయ్య దంపతులు తమకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసేవారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మొదట కూతురు జన్మించింది. రెండోసారి కొడుకు పుడుతాడన్న ఆశతో మరోసారి గర్భం దాల్చింది లచ్చమ్మ. కానీ ఈ సారి ఆడపిల్లే జన్మించింది. ఇలా కొడుకు మీద మమకారంతో వరుసగా ఆరు కాన్పులకు సిద్ధమయ్యారు ఆ దంపతులు. కానీ అందరూ ఆడపిల్లలే జన్మించారు. మగ పిల్లాడిపై ఇష్టంతో ఐదో కూతురు ప్రమీలను అబ్బాయి లాగ పెంచారు. చక్కగా క్రాప్‌ చేయించి, నెక్కర్‌..షర్ట్‌ తొడిగి మగ పిల్లాడిలా అలంకరించి, బడికి పంపి, అబ్బాయిల సరసనే కూర్చుండ బెట్టారు. అభం శుభం తెలియని ప్రమీలను ..తోటి వారు ప్రేమ్‌గా పిలవడం మొదలు పెట్టారు. ఇలా ప్రాథమిక విద్యాభ్యాసం మదిర కొత్తపల్లిలో, 4వ తరగతి నుంచి 5 వరకు పాపన్నపేటలో కొనసాగింది. ఉన్నత పాఠశాలకు రావాల్సిన ప్రమీల బడిలో ఎదురవుతున్న సమస్యలతో చదువుకు గుడ్‌బై చెప్పింది.

    కత్తితో పెళ్లి
    చిన్న చెల్లెలు సుమిత్ర పెళ్లిలో, తల్లిదండ్రులు ప్రమీలకు దేవుని గుడిలోని కత్తితో పెళ్లి చేశారు. ఇంట్లో 5 మంది తోబుట్టువుల పెళ్లి జరిగింది. పెద్దక్క దుర్గమ్మను ఇళ్లరికం తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రమీలకు 13గుంటల భూమి వచ్చింది. ఆ భూమిలో వచ్చే పంటతో జీవనం గడవని పరిస్థితి. దీంతో కూలీ పనులకు వెళ్తూ..ట్రాక్టర్‌ , పిండి మర నడుపుతూ, చేపలు పడుతూ, గేదెలు కాస్తూ బతుకు బండి లాగుతుంది. ఒక్కోసారి ఏ పని దొరకకపోతే పస్తులు ఉంటుంది.

    ఆటలాడుతూ..
    పదేళ్ల వయస్సు నుంచి ప్రమీల కాస్తా పూర్తిగా ప్రేమ్‌గా మారింది. మగ పిల్లలతో కలిసి కబడ్డీ, ఖోఖో, చిర్రగోనే, చెట్లు ఎక్కడం, ఈత కొట్టడం లాంటి ఆటలు ఆడేది. నాగలి దున్నడం, నాటు వేయడం, కలుపు తీయడం, పంటకోయడం, వరి కొట్టడం, పార పని చేయడం, లాంటి చెమటోడ్చే పనులు చేస్తూ, జీవనం కొనసాగిస్తూ వచి్చంది. స్నేహితులతో కలిసి బైక్, ట్రాక్టర్‌ నడపడం అలవాటు అయ్యింది.

    ఆడపిల్లననే విషయమే మరిచిపోయా
    అమ్మానాన్న మగ పిల్లాడి లాగా పెంచడంతో ఆడ పిల్లననే విషయాన్ని మరిచిపోయా. నాలో ఆడపిల్ల లక్షణాలు లేవు. నాకు ఉన్నదంతా మగ స్నేహితులే. ప్రాణ స్నేహితుడు మా పెద్దనాన్న కొడుకు లక్ష్మణ్‌ చనిపోవడం నన్ను కలచి వేసింది. మగ స్నేహితులు ఎప్పుడు నన్ను ఆడపిల్లగా చూడలేదు. వేధింపులకు గురి చేయలేదు. నన్ను ఇలా మార్చిన అమ్మానాన్నపై కోపం లేదు. నేను వస్తుంటే మా పటేల్‌ వస్తుండు అని అమ్మ గర్వంగా ఫీలయ్యేది. కానీ, తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరి జీవితం ఎలా... భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న బెంగ నన్ను కుంగదీస్తుంది. పని దొరకని నాడు పస్తులుండాల్సి ఉంటున్న. చేత కాని సమయంలో నాకు అండగా ఎవరు ఉంటారనే ఆందోళన వెంటాడుతుంది. పాఠశాలలో , అంగన్‌వాడీలో గాని ఏదైనా అటెండర్‌ పని ఇప్పించి ఆదుకోవాలి.
    – ప్రమీల (అలియాస్‌ ప్రేమ్‌)

    మానసిక ఆలోచనలు ప్రభావం చూపుతాయి 
    మధ్యలో లింగత్వ మార్పుపై మానసిక ఆలోచనలు 50 శాతం వరకు ప్రభావం చూపొచ్చు. కానీ పూర్తి మార్పుకు అదొక్కటే కారణం కాకపోవచ్చు. కచ్చితమైన కారణం తెలియాలంటే æకార్యో టైపింగ్‌ టెస్ట్‌ చేయించాలి. ట్రాన్స్‌ మారి్పడిని సామాజిక వాతావరణం, పెరిగిన నేపథ్యం, స్నేహ సమూహాలు ప్రభావితం చేస్తాయి. మగ పిల్లలు లేరన్న కారణంతో వారిని మగ పిల్లాడిలా పెంచడం సరికాదు.     – డాక్టర్‌ దీక్ష, పీహెచ్‌సీ, పొడిచన్‌పల్లి

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో, ఆయన విచారణకు హాజరు కానున్నారు.

    వివరాల ప్రకారం.. హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలో పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు రామగుండంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక, ఇప్పటికే మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు, వారి కుటుంబీకులు, బంధువులు, పలువురిని సీబీఐ విచారించింది. కాగా, రామగుండం కమిషనరేట్ కేంద్రంగా గత నెల రోజుల నుంచీ ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది. అయితే, పుట్ట మధు సీబీఐ విచారణతో ఈకేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 
     

  • కరీంనగర్ జిల్లా: డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన ఒక యువకుడు కోర్టులో రూ.5వేల జరిమానా కట్టాల్సి వస్తుందన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సూర విజయ్‌ (28) స్థానికంగా కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ప్రియాంక, ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఇటీవల డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుపడ్డాడు. 

    ఈ నెల 14న పోలీసులు కరీంనగర్‌ కోర్టులో హాజరు పరిచారు. మేజి్రస్టేట్‌ లేకపోవడంతో కేసు వాయిదా పడింది. రూ.5వేల జరిమానా కట్టాల్సి ఉందని, ఎక్కడ నుంచి తేవాలని శనివారం భార్య ప్రియాంకకు చెప్పి బాధపడ్డాడు. మధ్యాహ్నం బెడ్‌రూంలో పడుకుంటానని, పిల్లలను ఇంటి ఎదుట ఆడించాలని భార్యకు చెప్పి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి సూర నాగమ్మ ఇచి్చన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. 

  • నవాబుపేట/షాద్‌నగర్‌ రూరల్‌: తమ్ముడి ప్రేమ పెళ్లికి సహకరించాడనే కోపంతో అన్నను కిడ్నాప్‌ చేసి, దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం యన్మన్‌గండ్లలో వెలుగు చూసింది. నవాబుపేట ఎస్‌ఐ విక్రమ్‌ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌ నగ ర్‌ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ (35) ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నా డు. వీరి కుటుంబం షాద్‌నగర్‌లోని అయ్యప్పకాలనీలో నివాసం ఉంటోంది. రాజశేఖర్‌ తమ్ముడు చంద్రశేఖర్‌ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. 

    చంద్రశేఖర్‌ వారి స్వగ్రామమైన ఎల్లంపల్లికి చెంది న ఒక యువతిని చాలారోజు లుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 8న చంద్రశేఖర్‌ తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 12న యువతి సోద రుడు వెంకటేశ్‌.. చంద్రశేఖర్‌కు అతని అన్న రాజశేఖర్‌ సహకరించాడన్న కోపంతో మరికొందరితో కలిసి రాజశేఖర్‌ ఇంటికి వచ్చాడు. మాట్లాడుతామ ని బయటికి తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం మార్గమధ్యలో కొట్టి చంపేశారు. 

    తర్వాత నవాబుపేట మండలంలోని యన్మన్‌గండ్ల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. రాజశేఖర్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న యన్మన్‌గండ్లలో స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట పోలీసులు విచారణ చేపట్టగా షాద్‌నగర్‌లో కిడ్నాప్‌ అయిన రాజశేఖర్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసిన నవా బుపేట పోలీసులు శనివారం బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.విచారణ ముగిసిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.   

Politics

  • పట్నా:  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర ప్రధాన పార్టీ ఆర్జేడీలో విస్త్రత చీలికను తెచ్చిపెట్టింది. ప్రధానంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంలో తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య ఇంటి నుంచి బయటకు వచ్చేయగా, మరో ముగ్గురు కుమార్తెలు సైతం అక్కబాటలోనే పయనించారు. 

    లాలూకు ఉన్న ఏడుగురు కూతుళ్లలో ముగ్గురు రాజ్యలక్ష్మీ రాగిణి, చంద్రలు ఆ కుటుంబాన్ని వీడారు. వీరంతా తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి వయల్దేరివెళ్లిపోయారు. రోహిణి శనివారం(నవంబర్‌ 15వ తేదీ) నాడు కుటుంబాన్ని వీడి వెళ్లిపోగా, ఇప్పుడు మరో ముగ్గురు కూతుళ్లు పట్నాలోని ఇంటి నుంచి వెళ్లిపోవడం లాలూకు తీవ్ర మనోవేధనకు గురిచేస్తోంది. 

    ఒకవైపు పార్టీ ఘోరంగా ఓడిపోయిందనే అపదాదుతో పాటు, ఇప్పుడు కూతుళ్లు ఒకరి వెంట ఒకరు ఇంటిని విడిచి వెళ్లిపోవడం లాలూను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

    ఒకప్పుడు బిహార్‌లో ప్రధాన రాజకీయ కేంద్రంగా వెలిగిన లాలూ ఇల్లు.. ఇప్పుడు బోసిపోయింది. ప్రస్తుతం లాలూ వెంట పెద్ద కూతురు మీసా భారతి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది,. 

    లాలూ-రబ్రీదేవిల సంతానంలోమీసా భారతి పెద్ద కుమార్త కాగా, రోహిణి, చంద్ర, రాగిణి యాదవ్‌, హేమా యాదవ్‌, అనుష్కా రావు(ధన్ను), రాజ్యలక్ష్మీలు మిగతా కుమార్తెలు. కాగా, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌లు కుమారులు.  వీరిద్దరూ బిహార్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు.  ఇందులో తేజస్వి యాదవ్‌ ఆర్జేడీలోనే కొనసాగుతుండగా, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మాత్రం జనశక్తి జనతా దళ్‌ పార్టీని స్థాపించి వేరి కుంపటి పెట్టుకున్నారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 26న జనశక్తి జనతాదళ్ పార్టీని స్థాపించారు. బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 

  • విశాఖపట్నం:  చంద్రబాబు ఆంధ్రుల ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్నారని :మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర, మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తమ లక్ష్యమని చంద్రబాబు తేల్చేశారని,  సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ఈ మేరకు రాజన్నదొర, సీదిరి అప్పలరాజులు సంయుక్త ప్రకటనలో ఏమన్నారంటే..

    ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా, నాటి సీఎం వైఎస్‌ జగన్‌ అడ్డుకున్నారు. అప్పుడు విపక్షంలో ఉన్న సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. నాటి ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోలేక పోతోందని దుమ్మెత్తి పోశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా యూటర్న్‌ తీసుకున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ, ఒకవైపు ప్రజలను మభ్య పెడుతూ, మరోవైపు ఆ దిశలో కేంద్ర చర్యలను పూర్తిగా సమర్థిస్తున్నారు. అందుకు నిన్నటి (శనివారం) చంద్రబాబు మాటలే నిదర్శనం.

     ‘పని చేయకున్నా జీతాలివ్వాలా? తెల్ల ఏనుగులా మారితే ఎలా? ఎన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులిస్తాయి? ఊర్కే జీతాలు ఎందుకిస్తాయి?’ అనడం.. సీఎం చంద్రబాబు దిగజారిన వైఖరికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసినట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులను కూడా దారుణంగా వంచించారు. నిలువుగా దగా చేశారు.

    అదే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొన్నాళ్ల క్రితం కేంద్రం ప్యాకేజీ ఇస్తే, అది తమ ఘనత అన్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని, తమ చొరవ వల్లే కేంద్రం ఆ నిధులు ఇచ్చిందని డబ్బా కొట్టుకున్నారు. నిజానికి కేంద్రం ఆ నిధులు ఇచ్చింది స్టీల్‌ ప్లాంట్‌ను గట్టెక్కించడానికా? లేక ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకా? అన్నది చూస్తే.. రెండోదే ఖాయంగా తేలుతోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడడంలో సీఎం చంద్రబాబు ఇసుమంతైనా చొరవ చూపడం లేదు. పైగా తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. అయినా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

    తమ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా చంద్రబాబు కానీ, పవన్‌కళ్యాణ్‌ కానీ నోరు మెదపడం లేదు. కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. పరోక్షంగా లక్షలాదిపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తీపి తీపి మాటలతో నమ్మించిన కూటమి నేతలు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో రాష్ట్రప్రజలను నిండా ముంచేశారు. కేంద్రంతో కలసి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కళ్ల ఎదుటే ఉరి తీస్తున్నారు. 

    32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ఏకపక్షంగా ప్రైవేటీకరిస్తున్నా కిక్కురుమనడం లేదు. కేంద్ర నిర్ణయాన్ని అపే సంఖ్యా బలం ఉన్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు? ఇందుకా ప్రజలు మీకు ఈ స్థాయిలో ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించింది.

    గత ప్రభుత్వ హయాంలో సీఎం శ్రీవైఎస్‌ జగన్, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను బలంగా వ్యతిరేకించినందునే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఏడాదిలోపే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తూ వచ్చింది. ఉద్యోగుల తొలగింపు మొదలుకుని అనేక నిర్ణయాలను తీసుకున్నా చంద్రబాబు సర్కారు కిమ్మనలేదు.  ఇకనైనా టీడీపీ కూటమి ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలి’ అని డిమాండ్‌ చేశారు. 

  • విజయవాడ:  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమనే విషయం మరోసారి రుజువైందన్నారు. ఆయన కేవలం ప్రైవేటు రంగానికి మాత్రమే అనుకూలమనేది ఆయన విశాఖ కార్మికులపై చేసిన వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ‘స్టీల్ ప్లాంట్ కార్మికులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 

    చంద్రబాబు తన వ్యాఖ్యలను బేషరతుగా  ఉపసంహరించుకోవాలి. విశాఖ ఉక్కు అంటే భారతదేశానికి ఒక బ్రాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో అవార్డులను సాధించింది. విశాఖ నగర అభివృద్ధిలో స్టీల్ ప్లాంట్ పాత్ర ఎంతో ఉంది. నిన్నటి వ్యాఖ్యలతో చంద్రబాబుకు పబ్లిక్ రంగం పై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది

    విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అందరూ కోరుతున్నారు. సొంత గనులు ఇవ్వలేకపోతే సెయిల్ లో విలీనం చేయాలిటిడిపి ఎంపీలకు సిగ్గులేదు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు ఇవ్వాలని అడగడం చేతకాదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కుసొంత గనులు ఇవ్వాలని కేంద్రమంత్రిని టిడిపి ఎంపీలు అడుగుతున్నారు. 

    విద్యా, వైద్యం , టూరిజాన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు. అన్నీ ప్రైవేట్ పరం చేసి ఎవరిని పరిపాలన చేయాలనుకుంటున్నావ్ చంద్రబాబు. సంపద సృష్టి అంటే కార్పొరేట్లకు ఊడిగం చేయడమేనా  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం చంద్రబాబు నైజం. చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగుజాతిని అవమానించినట్లే. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయితే చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయం. స్టీల్ ప్లాంట్ కోసం త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం’ అని హెచ్చరించారు.

    చంద్రబాబు బుద్ది అది... రెచ్చిపోయిన CPI రామకృష్ణ

     

  • పాట్నా: గోరుచుట్టుపై రోకటి పోటులా అన్న చందంగా తయారైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పరిస్థితి. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాభవంతో సతమతమవుతున్న లాలూకు ఇప్పుడు కుటుంబ వ్యవహారం మరింత  తలనొప్పిగా మారింది.  

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. అసభ్యకరంగా తిట్టారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడను. నన్ను అనాథను చేశారని అన్నారు.  

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తరువాత ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ (ఆర్జేడీ) ఇలా ఎందుకు ఓడిపోయింది? అని. ఈ పరాజయానికి కారణం ఎవరు? కానీ మీరు సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు తీస్తే చాలు.. వెంటనే ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. అవమానిస్తారు, దుర్భాషలాడతారు. నన్ను కూడా అలాగే చేశారు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు.  

    నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వీ యాదవ్‌, సంజయ్‌ యాదవ్‌, రమీజ్‌ అడగండి. వాళ్లందరూ ఒక్కటై.. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు’ అని సింగపూర్‌ వెళుతూ పాట్నా ఎయిర్‌పోర్టులో మీడియా ఎదుట వాపోయారు.    

    Latest and Breaking News on NDTV

    కుటంబంలో కిడ్నీ చిచ్చు 
    2022లో తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రోహిణీ ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణీ వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే ఆరోపణలు,పుకార్లు లాలూ కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై రోహిణీ ట్వీట్‌ చేశారు. 

    ఆ ట్వీట్‌లో ‘నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న నా వాళ్లే నాపై దూర్భషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతి ఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్‌ను తీసుకున్నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను,పిల్లల్ని,నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవడానికి కిడ్నీ ఇచ్చాను. అలలాంటి ఇప్పుడు వాళ్లకు నేను చెడ్డదాన్నయ్యాను’ అని ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు.  

    కాగా లాలూ కుటుంబంలో తాజాగా పరిణామాలు బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రోహిణి ఆచార్య ఆరోపణలు, ఆమె కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిపి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 

     

  • సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక మాఫియాన్ని నడుపుతున్నారా?. రాష్ట్రంలో రాజకీయ రక్తపాతాన్ని పారిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో తీవ్రమైన దారుణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘హనీట్రాప్ చేసిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో పెట్టారు. అక్రమాలు బయట పెట్టిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. రెడ్‌బుక్‌ వైఎస్సార్‌సీపీ నేతలపైనే కాదు.. అధికారులపై కూడా ప్రయోగించి వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. 

    ‘‘కూటమి నేతలు.. భారీగా భూ దోపిడీ, ఇసుక, మైనింగ్ స్కాంలు‌ చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఏపీలో ఉంది డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదు.. ట్రబుల్‌ ఇంజిన్‌ సర్కార్. కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. కూటమి నేతల దోపిడీని వైఎస్సార్‌సీపీ బయటపెడుతోంది. కూటమి నేతలు టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ను మానసికంగా వేధించారు. సతీష్‌ మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం. సతీష్‌ మృతిపై ఎల్లో మీడియా కట్టుకథలు చెబుతోంది.

    ..ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్టుమార్టం జరగక ముందే హత్య అని టీడీపీ నేతలు ఎలా చెప్పారు?. గొడ్డలి వేటు గాయాలతోనే సతీష్ రైలు ఎక్కాడా?. రక్తపు మరకలు‌ ఎవరూ చూడలేదా?. హత్య జరుగుతుంటే జనం ఎవరూ చూడలేదా?. కట్టుకథలను టీడీపీ నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?. సతీష్ వీపు మీద గొడ్డలి వేటు ఉన్నట్టు ఎల్లో మీడియా ఎలా ప్రచారం చేసింది?’’ అంటూ చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

    Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

    ..చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం మాత్రం చేసుకుంటుంది. జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు టీడీపీ స్టిక్కర్లు వేస్తున్నారు. గోమాంసం విచ్చలవిడిగా ఎగుమతి అవుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మహిళలపై జనసేన నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ చోద్యం చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులను చంద్రబాబు దారుణంగా అవమానించారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్‌లలో తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. ప్రయివేటు వ్యక్తుల భూములను హెలికాప్టర్ నుండి చిత్రీకరించే‌ పవన్‌కి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఆక్రమణ ఇల్లు కనపడలేదా?’’ అంటూ చంద్రశేఖర్‌ నిలదీశారు.

  • పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్‌ సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. 

    ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్‌ కిశోర్‌ డిమాండ్‌ చేశారు. బిహార్‌ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 

    ‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్‌ 21వ తేదీ నుంచి పోలింగ్‌ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. 

    ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్‌సురాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్‌ సింగ్‌ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్‌ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు.  
     

Family

  • పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అలానే ఈసారి గురువు గొప్పతనాన్ని ఆవిష్కరించే వీడియోతో మన ముందుకొచ్చారు. ముందుండి గొప్పగా నడిపించే గురువు ఉంటే ఏ విద్యార్థి అయినా మహనీయుడు(రాలు) అవుతాడంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. 

    మహీంద్రా ఆ వీడియోలో ఉపాధ్యాయులు విద్యార్థిలోని ప్రతిభను ఎలా సానపెట్టి బయటకు తీసుకోస్తారో వివరించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలో ఒక చిన్నారి తన గురువుని అనుకరిస్తూ..అత్యంత అద్భుతంగా అభినయిస్తూ చేసిన డ్యాన్స్ అందరీ మనసులను దోచుకుంది. వావ్‌ ఏం బాగా చేసింది అనేలా..అత్యద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. తన గురువు తోపాటు కాలు కదిపిన ఆ చిన్నారి స్టెప్పులకు కళ్లు ఆర్పడమే మర్చిపోయేలా చేస్తుంది. 

    ఇంత అద్భుతంగా ఆ చిన్నారిని తీర్చిదిద్దిన ఆ గురువు ముందుగా ప్రశంసనీయడు అని మెచ్చుకున్నారు మహీంద్రా. ఉపాధ్యాయుడి శక్తిమంతమైన ప్రమేయం..విద్యార్థిని ఉన్నతంగా మార్చగలదు అనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ అని అన్నారు. విద్యార్థి ఆత్మవిశ్వాసంతో కనబర్చే ప్రతిభ..అతడి గురువు గైడెన్స్‌ ఏవిధంగా ఉందనేది చెప్పకనే చెబుతుందన్నారు. 

    నిజమైన గురువులు చేతలతోనే గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారు..వాళ్ల వల్లే అభివృద్ధి చెందాలనే కోరిక బలీయమవుతుందని అన్నారు. ప్రతి విద్యార్థికి అద్బుతంగా రాణించేలా చేసే ఉపాధ్యాయుల ఆశీర్వాదం లభిస్తే..వాళ్లకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అంటూ గురువు విశిష్టతను నొక్కి చెప్పారు మహీంద్రా.

     

    (చదవండి: 1996లో బ్యాంక్‌ పాస్‌ బుక్‌ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..)
     

  • ప్రస్తుత కాలంలోని బ్యాంక్‌ పాస్‌ బుక్‌లు గురించి తెలిసిందే. కానీ 1996ల టైంలో ఉండే పాస్‌బుక్‌ గురించి ఈ జనరేషన్‌కి అంతగా ఐడియా ఉండదు. నెటింట ఆ కాలం నాటి పాస్‌ బుక్‌ తెగ వైరల్‌గా మారింది. అది ఒక పెన్షన్‌ అందుకునే ఖాతాదారుడి పుస్తకం. అందులో సేవింగ్స్‌ చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వచ్చిన పెన్షన్‌ తక్కువే అయినా..ఎంత అద్భుతంగా డబ్బుని పొదుపు చేశారో చూస్తే..ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్‌గా తెలుస్తోంది.

    ఒక సోషల్‌ మీడియా వినియోగదారుడు నెట్టంట తన తాత గారి 199ల నాటి ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) పాస్‌ బుక్‌ని వీడియో తీసి పోస్ట్‌చేశాడు. ఇప్పుడు ప్రతిది డిజిటల్‌గా మారిన తరుణంలో ఈ పాస్‌బుక్‌ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాస్‌బుక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జైపూర్‌ అండ్‌ బికనీర్‌ది. ఆ సమయంలో ఎస్‌బీఐ అనుబంధ బ్యాంక్‌ పాస్‌బుక్‌లు ఇలా ఉండేవా ఆ బ్యాంక్‌బుక్‌ని చూడగానే అనిపిస్తుంది. 

    వీడియోలో ఆ వ్యక్తి పాస్‌బుక్‌ డిజైన్‌, ఫోటో పేజీ, ఎంట్రీ పేజీ, తాతాగారి పెన్షన్‌ పొదుపు డబ్బు ఇలా ప్రతీది చూపిస్తాడు. తన తాత ఫోటో ఉన్న మొదటి పేజీ నుంచి పాస్‌ బుక్‌ ముద్రణ, కాగితం నాణ్యత, పాత కాలపు టెంప్లేట్‌..పెన్షన్‌, పొదుపు ఎంట్రీలతో సహా అన్నింటిని క్లియర్‌గా చూపిస్తాడు వీడియోలో. అందులో తాతగారి పెన్షన్‌ రూ. 5000 కాగా, పొదుపు రూ. 25 వేలకు చేరుకున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. 

    అంతేగాదు ఆ బుక్‌ చివరి పేజీలో నిరంతర పెన్షన్, నగదు సర్టిఫికేట్ మొదలైన పదాలు చూడగానే అవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 80 సెకన్ల నిడివి గల ఈ వీడియో, చిన్నా పెద్దా ప్రతి ఎంట్రీని చేతితో రాసిన కాలం నాటి బ్యాంకింగ్ ప్రక్రియను గుర్తు చేస్తోంది.

     ఆ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ కాలం నాటి పాస్‌బుక్‌ల ఫాంట్, ఇంక్, ప్రింట్ లుక్, చేతితో రాసిన ఎంట్రీలు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాయి అని కామెంట్లు చేస్తూపోస్టులు పెట్టారు. అంతేగాదు బ్రో ఈ అకౌంట్‌ ఇంకా యాక్టివ్‌గానే ఉందే అని ప్రశ్నించారు కూడా.

     

    (చదవండి: గాజు డిస్క్‌: చిన్నదేగానీ..చిరంజీవి)

     

  • ఒంటిపైన తెల్లటి మచ్చలతో కనిపించే బొల్లి వల్ల ప్రాణహాని ఉండదు. కానీ ఒంటిపై తెల్లటి పొడలు మచ్చలు మచ్చలుగా కనిపిస్తుండటం వల్ల బాధితులు నలుగురిలోకి రావడానికి సామాజికంగా ఇబ్బంది పడతారు. అది అంటువ్యాధి కాదని తెలియక చాలామంది వాళ్ల పట్ల వివక్ష చూపుతారు. ఒక రకంగా చూస్తే మన సొంత వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) అన్నది మన సొంతకణాలపైనే దాడి చేసే ఆటో ఇమ్యూన్‌ సమస్య కూడా ఒక అంశం కావడంతో ఒకప్పుడు దీనికి అంతగా చికిత్స ఉండేది కాదు. అయితే ఇటీవల దీనికి మంచి మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లిష్‌లో విటిలిగో అని పిలిచే ఈ బొల్లి వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.

    ప్రాణహాని కలిగించకపోయినా వివక్షకు కారణమయ్యే ఈ వ్యాధి విస్తృతి మన జనాభాలోని దాదాపు 0.5 శాతం మందిలో కనిపిస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. 
    మచ్చలు... పాటర్న్స్‌ బట్టి వాటిల్లో రకాలు...  

    ఈ బొల్లి మచ్చలు రకరకాల పాటర్న్స్‌లో కనిపిస్తాయి. ఉదాహరణకు కొందరిలో ఈ తెల్లమచ్చలు కొద్దిపాటి  పొడల్లాగా వస్తాయి. అయితే వాటి సైజు పెరగదు. ఎప్పటికీ అవి చిన్నవిగానే కనిపిస్తుంటాయి. మరికొందరిలో మాత్రం ఇవి పెద్దవిగా విస్తరిస్తూ ఒక తెల్లమచ్చతో మరొకటి కలిసివపోడం వల్ల శరీరమంతా తెల్లబారి΄ోతుంది. ఆ పాటర్న్స్‌ కనిపించే తీరును బట్టి వీటిని మూడు రకాలుగా వర్ణించవచ్చు. 

    ఫోకల్‌ పాటర్న్‌... ఈ తెల్లని మచ్చలు చర్మంలో ఏదో ఒకచోటికి మాత్రమే పరిమితం అవుతాయి.

    సెగ్మెంటల్‌ పాటర్న్‌... ఈ మచ్చలు శరీరమంతటా కాకుండా ఏదో ఒక వైపునకే... అంటే ముందువైపునకుగానీ లేదా వెనకవైపునకే పరిమితం కావడం. 

    జనరలైజ్‌డ్‌ పాటర్న్‌... ఒక చోటికి మాత్రమే పరిమితం కాకుండా చర్మంపై అనేక ప్రాంతాలకు విస్తరించడం. అలాగే ఏదో ఒక వైపునకు మాత్రమే ఉండకుండా శరీరమంతటా కనిపించడం. 

    ఈ తెల్లటి మచ్చలు సాధారణంగా చేతులు, వేళ్ల చివరలు, పాదాలు, భుజాలు, ముఖం, పెదవులు లాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. కొందరిలో బాహుమూలాలు, పొత్తికడుపు కింది భాగం, నోటి చుట్టూ, కంటి చుట్టూ, మర్మావయవాల ప్రాంతంలో ఉంటాయి. ఈ మచ్చలకు తోడు... విటిలిగో ఉన్నవారిలో ఆ తెల్ల మచ్చలు విస్తరించిన ప్రాంతంలో ఉండే వెంట్రుకలు (ఉదాహరణకు మాడు, కనురెప్పలు, కనుబొమలు, గడ్డంలోని ప్రాంతాల్లోనివి) తెల్లగా మారిపోతాయి. నల్లటి మేనిఛాయ ఉండే వారిలో ఈ తెల్లమచ్చలు / రంగు కోల్పోయిన ప్రాంతాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. 

    అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు... 
    శరీరంపై ఉండే ఆ మచ్చల పరిమాణం, అవి వచ్చిన చోటు, అక్కడ అవి ఎంతమేర విస్తరించాయి... లాంటి అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అలాగే చికిత్స ప్రక్రియలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి. ఇక చికిత్సా ఫలితాలు  కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో ఫలితం చాలా వేగంగా కనిపిస్తే, మరికొందరిలో చాలా ఆలస్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలివి... 

    మెలనిన్‌ కణాలు మరింత నాశనం కాకుండా చూడటం : ఈ ప్రక్రియలో చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్‌ కణాలు మరింతగా నాశనమై΄ోకుండా చేస్తారు. అంతేకాదు... రంగు కోల్పోయిన శరీర భాగానికి మునుపటి రంగు వచ్చేలా చేస్తారు. 

    స్టెరాయిడ్‌ క్రీములు : కొన్ని రకాల స్టెరాయిడ్‌ క్రీముల్ని పైపూతగా (టాపికల్‌ మెడిసిన్స్‌గా) వాడాల్సి ఉంటుంది. అవి చర్మానికి సాధారణ రంగు వచ్చేలా చేయడంతో పాటు మచ్చలు మరింత విస్తరించకుండా సహాయపడతాయి. అయితే అవి స్టెరాయిడ్స్‌ అయినందున వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకుని వాటిని కచ్చితంగా డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. లేదంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. 

    ఫొటో థెరపీ : ట్యాబ్లెట్లు, లోషన్‌ రూపంలోని సోరాలెన్స్‌ అనేవి ఈ తరహా చికిత్సలో ఉపయోగపడతాయి. అయితే ఈ ట్యాబ్లెట్‌లు లేదా క్రీములను సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ అవుతూ వాడాలి. అయితే సూర్మరశ్మికి బదులుగా హానికరం కాని మోతాదులో అల్ట్రావయొలెట్‌ కిరణాలకు ఎక్స్‌΄ోజ్‌ అయ్యేలా కూడా చేయవచ్చు. 

    దీన్ని ‘పూవా’ థెరపీ అంటారు. మరికొంతమందికి న్యారో బ్యాండ్‌ అల్ట్రా వయొలెట్‌ – బి కిరణాలతోనూ, ఎక్సైమర్‌ లేజర్‌ అనే ఫొటో థెరపీ ప్రత్యామ్నాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎక్సైమర్‌ లేజర్‌ను కొన్ని నిర్దిష్టమైన ప్యాచ్‌ల దగ్గరే ఉపయోగించడాని వీలుంది. 

    ఈ ఫొటో థెరపీ ప్రక్రియల కోసం హాస్పిటల్‌కు రాలేని వారికి ఇంట్లోనే ఉపయోగించుకునేలా హోమ్‌ బేస్‌డ్‌ ఫొటో థెరపీ పరికరాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటిని డాక్టర్‌ చెప్పిన విధంగా మాత్రమే వాడాల్సి ఉంటుంది. 

    డి–పిగ్మెంటేషన్‌ ట్రీట్‌మెంట్‌ : కొంతమందిలో దాదాపు 80 శాతం పైగా శరీరం తెల్లబడిపోతుంది. ఇలాంటివారిలో నల్లగా ఉన్న మిగతా ప్రాంతాన్ని కూడా తెల్లగా చేస్తారు. 

    ఇతర ప్రక్రియలు : జింక్‌గో బైలోబా, లీవామీసోల్‌... లాంటివి ఇమ్యూన్‌ మాడ్యులేటర్స్‌. అంటే ఇవి బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచడం ద్వారా విటిలిగోతో పోరాడతాయి. ఇవి టాబ్లెట్ల రూపంలోనూ లభ్యమవుతాయి. 

    శస్త్రచికిత్స (సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌): వీటిల్లో పంచ్‌ గ్రాఫ్టింగ్, స్ప్లింట్‌ స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ వంటి రకరకాల సర్జరీ ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఇతరచోట్లలో ఉన్న రంగునిచ్చే పిగ్మెంట్‌ కణాలను (మెలనోసైట్స్‌ను)... అవి కోల్పోయిన ప్రాంతంల్లోకి బదిలీ చేసేందుకు అవకాశం ఉంది. 

    అయితే ఇతరత్రా సాధారణ చికిత్సల వల్ల ఎలాంటి ఫలితాలూ రాని సందర్భాల్లో మాత్రమే ఈ శస్త్రచికిత్స పద్ధతిని అవలంబిస్తారు. శరీరంలోని కొన్ని భాగాల్లో (అంటే... పెదవులు, చేతుల వేళ్ల చివరి భాగాలు, కాళ్ల చివరన ఉండే భాగాలకు) వచ్చిన మచ్చల విషయంలో సాధారణ చికిత్స ప్రక్రియలు అంతగా సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ శస్త్రచికిత్స ప్రక్రియలు అవసరం కావచ్చు. 

    అయితే పక్కలకు విస్తరించని విటిలిగో మచ్చలతో బాధపడే పేషెంట్ల విషయంలోనే ఈ శస్త్రచికిత్స విధానాన్ని ఆలోచిస్తారు. వ్యాప్తి చెందక΄ోవడం అంటే... ఒక ఏడాది వ్యవధిలో మచ్చ సైజు విస్తరించక΄ోవడం, కొత్త ప్రాంతాల్లో మచ్చలు రాకపోవడాన్ని మచ్చలు వ్యాప్తిచెందని పేషంట్లుగా పరిగణిస్తారు. ఈ సర్జికల్‌ ప్రక్రియలో ఇతర చోట్ల నుంచి చర్మాన్ని తీసుకుని గ్రాఫ్ట్‌ చేస్తారు. 

    ఇప్పుడు అభివృద్ధి చెందిన ఆధునిక శాస్త్రవిజ్ఞాన ప్రక్రియల వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. సర్జరీ తర్వాత మళ్లీ అక్కడ సాధారణ పిగ్మెంట్‌ వచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అయితే ఒక్కోసారి అనుకున్న ఫలితాలు వచ్చేందుకుగాను... సర్జరీ తర్వాత సాధారణ వైద్యచికిత్స కూడా అవసరం కావచ్చు. 

    చివరగా... ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్స ప్రక్రియల వల్ల విటిలిగో రోగులు మునుపటిలా ఆత్మన్యూనతకు గురికావాల్సిన అవసరంగాని, బాధపడాల్సిన పరిస్థితిగాని లేదు. అనేక వినూత్న చికిత్స ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందున వాటి సాయంతో మళ్లీ మేని రంగును మామూలుగా మార్చుకునేందుకు చాలా అవకాశాలున్నాయి.  

    బొల్లి వ్యాధి కారణాలు ఏమిటంటే... 
    మానవ చర్మంలోని మెలనోసైట్స్‌ అనే కణాల్లో రంగును ఇచ్చే పిగ్మెంట్‌ను కలిగి ఉంటాయి. ఈ రంగునిచ్చే పిగ్మెంట్‌ వల్లనే పదార్థం వల్ల మేనికి రంగు సమకూరుతుంది. ఉదాహరణకు ఒకరి చర్మంలో మెలనోసైట్స్‌లో పిగ్మెంట్‌ మోతాదులు ఎక్కువగా ఉంటే వాళ్ల చర్మం నలుపు మొదలుకొని, తక్కువగా ఉన్నవారి చర్మం తెల్ల రంగు (ఫెయిర్‌) వరకు రకరకాల షేడ్స్‌లో మేని రంగు ఉంటుంది. ఈ మెలనోసైట్స్‌ అన్నీ ఒకేచోట కుప్పగా ఉన్నప్పుడు అక్కడ నల్లటిరంగు పుట్టుమచ్చ వస్తుంది. 

    ఏదైనా కారణాల వల్ల ఒకరి చర్మంలో ఈ మెలనోసైట్స్‌ దెబ్బతినడం వల్ల అక్కడి పిగ్మెంట్‌ లోపించినప్పుడు అక్కడి చర్మం తన సహజమైన రంగును కోల్పోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలా చర్మపు రంగు లోపించడానికి... రంగును ఇచ్చే పదార్థమైన పిగ్మెంట్‌లోని కణాలను సొంత వ్యాధి నిరోధకత దెబ్బతీయడం (ఆటోఇమ్యూన్‌ అంశం) కూడా ఒక కారణం కావచ్చు.

    ఈ వ్యాధిగ్రస్తుల్లోని చాలామందిలో ఇది జన్యుపరంగా వచ్చే అవకాశాలెక్కువ. ఇక మరికొందరిలో ఏ కారణమూ లేకుండానే ఇది కనిపించవచ్చు. కారణం ఏదైనా బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచులు ప్యాచులుగా కనిపిస్తాయి. ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అని పిలుస్తారు. వైద్య పరిభాషలో దీన్ని ‘ల్యూకోడెర్మా’  అంటారు.

    ఈ మచ్చలు హాని కలిగించవు కానీ... 
    ఈ విటిలిగో మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటి కారణంగా ఆరోగ్యానికి సైతం హాని కూడా ఏదీ ఉండదు. కానీ చూడటానికి (లుక్స్‌ పరంగా) ఇది ఏమాత్రం బాగుండదు. కాబట్టి ఎంతగా హానికరం కాక΄ోయినప్పటికీ ఈ వ్యాధి కారణంగా బాధితులు వివక్షకు ఆత్మన్యూనతకూ లోనయ్యే అవకాశాలూ ఎక్కువే.

    డాక్టర్‌   స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌  

    (చదవండి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?)


    డా‘‘  స్వప్నప్రియ, 
    సీనియర్‌ డర్మటాలజిస్ట్‌  

  • భారతదేశంలోని ఫర్టిలిటి కేర్ అందించే అగ్రగామి సంస్థలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ, 16 సంవత్సరాల విశ్వసనీయతతో, అధునాతన సంతానోత్పత్తి చికిత్సల ద్వారా జన్మించిన 11 మంది ప్రతిభావంతులైన పిల్లలకు ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్‌షిప్‌లను అందించి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ హయత్ ప్లేస్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విద్యా రంగం, కళలు, సంస్కృతి, క్రీడలు  ఆవిష్కరణలు/అసాధారణ విజయం అనే నాలుగు విభాగాల్లో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఒబ్స్టెట్రిక్స్  గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పట్ల యువ విజేతల నిబద్ధతను ప్రశంసించారు.

    హైదరాబాద్‌లోని ఒబ్స్టెట్రిక్స్  గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎల్. జయంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, "వంధ్యత్వం రోజురోజుకూ పెరుగుతున్న ఆరోగ్య సమస్య అన్నారు. దంపతులు ఎదుర్కొనే భావోద్వేగపరమైన  వైద్య సమస్యలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. బలమైన వైద్య ప్రమాణాలతో, రోగి-కేంద్రీకృత సంరక్షణను అందించే ఒయాసిస్ ఫెర్టిలిటీ వంటి సంస్థలు అలాంటి దంపతుల పాలిట వరం,గొప్ప భరోసా ఇస్తుందని జయంత్‌ రెడ్డి అన్నారు.

    వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా... IVF ఇతర అధునాతన సంతాన సాఫల్యత చికిత్సల ద్వారా జన్మించిన పిల్లల ప్రతిభను, దృఢ సంకల్పాన్ని గౌరవిస్తూ వారికి ఒయాసిస్ ఆయుష్మాన్ స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆ పిల్లల ప్రతిభను సత్కరించింది, అదే సమయంలో సైన్స్ వ్యత్యాసాలను కాదు... అవకాశాలను సృష్టిస్తుందని సమాజానికి చాటింది. గత 16 సంవత్సరాలుగా ఒయాసిస్ ఫెర్టిలిటీ వేలాది మంది దంపతుల తల్లిదండ్రులవ్వాలనే కలను నిజం చేయడంలో సహాయపడింది. 

    సంతాన సాఫల్యత చికిత్సలో నిరంతరం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. CAPA–IVM (ఇన్ విట్రో మెచ్యూరేషన్) మరియు అడ్వాన్స్‌డ్ జెనెటిక్ టెస్టింగ్ (PGT-A) వంటి మార్గదర్శక ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ సంస్థ... దేశవ్యాప్తంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ సంతాన సాఫల్య చికిత్సను అందుబాటులో ఉంచేందుకు, విలువలతో కూడిన చికిత్స అందించేలా వ్యక్తిగతీకరించేందుకు కృషి చేస్తూనే ఉంది.

    (చదవండి: డిజిటల్‌ ప్రేమలు... డిస్కనెక్టెడ్‌ మనసులు...)

     

  • చర్మానికి శుభ్రత, మెరుపు, టోనింగ్‌ వంటి ప్రయోజనాలను అందించే ‘బీ–గ్లో టీ.ఐ.ఏ సోనిక్‌ స్కిన్‌ కేర్‌ సిస్టమ్‌’ ఒక అధునాతన సౌందర్య సాధనం. ఈ ఆల్‌ ఇన్‌ వన్‌ డివైస్‌ చర్మాన్ని ప్రత్యేకంగా మెరిపిస్తుంది. యవ్వనంగా బిగుతుగా మారుస్తుంది. ఈ వినూత్న పరికరం మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. శుభ్రపరచడం, యాంటీ–ఏజింగ్, డ్యుయల్‌పల్స్‌ కాంటూరింగ్‌ వంటి ఫలితాలను పొందొచ్చు.

    ఈ పరికరం పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌. ఇందులో మార్చుకోగలిగే సిలికాన్‌ బ్రష్‌ హెడ్‌ ఉంటుంది. ఇది అల్ట్రా–హైజినిక్‌ శుభ్రతను అందిస్తుంది. చేతులతో శుభ్రం చేయడం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక దీని వినియోగం తర్వాత, బ్రష్‌ను సులభంగా శుభ్రం చేయడానికి సిలికాన్‌ హెడ్‌ను తొలగించవచ్చు. దీని టైటానియం అప్లికేటర్‌ను శరీరంలో ముడతలు వచ్చే అవకాశం ఉన్న చోటల్లా ఉపయోగించవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

    దీని ప్రత్యేకమైన పల్సేషన్‌ చర్మాన్ని ఇట్టే మెరుగుపరుస్తుంది. రంధ్రాలను తగ్గిస్తుంది. అంతే కాదు, ఇది డబుల్‌ చిన్‌ సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. ఈ రీచార్జ్‌ చేయదగిన సోనిక్‌ పరికరం దవడలు, బుగ్గలు  వంటి ముఖ కండరాలను బలపరచి, ముఖాకృతిని అందంగా మారుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహించి, చర్మాన్ని కాంతిమంతంగా, శక్తిమంతంగా కనిపించేలా చేస్తుంది. దీనికి చార్జింగ్‌ వెనుక వైపు పెట్టుకునే వీలుంటుంది. వీటిలో చాలా కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

    చలికాలం వచ్చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతుంది. అలాంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది ఆలివ్‌ ఆయిల్‌. ఇది పొడిబారిన చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పైగా ఇది చర్మంపై త్వరగా వృద్ధాప్యఛాయలు రాకుండా కాపాడుతుంది. ఇది అన్ని వయసుల వారికి అనువైన చక్కని, ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది. 

    పొడి చర్మాన్ని మసాజ్‌ చేయడానికి ఆలివ్‌ ఆయిల్‌ ఉత్తమమైన నూనెలలో ఒకటి. ప్రతి రాత్రి పడుకునే ముందు, కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె తీసుకొని శరీరమంతా పూయండి. మరొక మార్గం ఏమిటంటే, గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేసి స్నానానికి ఉపయోగించడం కూడా ఉత్తమమే!

    (చదవండి: Anupama Parameswaran: నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!)

     

     

     

     

     

     

     

  • టేస్టీ తమలపాకు రైస్‌ 
    కావలసినవి
    తమలపాకులు – 4 లేదా 5
    జీలకర్ర, మిరియాలు – అర టీ స్పూన్‌ చొప్పున
    అన్నం – ఒక కప్పు
    (మరీ మెత్తగా ఉyì కించకూడదు)
    ఉల్లిపాయ ముక్కలు – కొన్ని
    వెల్లుల్లి రెబ్బలు – 4
    పసుపు – పావు టీస్పూన్‌
    ఉప్పు – రుచికి సరిపడా
    నువ్వుల నూనె, నెయ్యి, ఆవాలు, మినప్పప్పు – ఒక టీస్పూన్‌ చొప్పున
    కరివేపాకు రెబ్బలు – కొన్ని
    ఇంగువ – చిటికెడు (అభిరుచిని బట్టి)

    తయారీ: ముందుగా తమలపాకులను శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు తమలపాకులు, మిరియాలు, జీలకర్ర కలిపి పేస్ట్‌లా గ్రైండ్‌ చేసుకోవాలి. కొద్దిగా నీటిని జోడించవచ్చు. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకుని, తాలింపు రెడీ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకుని, అందులో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. 

    ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. పసుపు వేసి, ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేవరకూ వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో గ్రైండ్‌ చేసుకున్న తమలపాకు పేస్ట్‌ వేసి, కొద్దిగా నీళ్లు జోడించి 3 నిమిషాలు వేయించుకోవాలి. అనంతరం అన్నం, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలపాలి. అనంతరం ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకుని, అన్నం మెతుకులు విరిగిపోకుండా మెల్లగా కలపాలి.

    అవకాడో లడ్డూ
    కావలసినవి
    అవకాడో పేస్ట్‌ – ఒకటిన్నర కప్పు 
    (గింజ తీసి, ముక్కలు చేసుకుని మిక్సీ పట్టుకోవాలి)
    కొబ్బరి పాలు, పీనట్‌ బటర్‌ – 6 టేబుల్‌ స్పూన్లు చొప్పున
    తేనె లేదా పంచదార పొడి – తగినంత
    రోల్డ్‌ ఓట్స్‌ – పావు కప్పు 
    (పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
    బాదం పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు
    నెయ్యి – కొద్దిగా
    ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (గ్రీన్‌)
    కొబ్బరి తురుము – కొద్దిగా 
    (అభిరుచిని బట్టి)

    తయారీ: ముందుగా ఒక బౌల్‌లో రోల్డ్‌ ఓట్స్‌ పౌడర్, కొబ్బరి పాలు, పీనట్‌ బటర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, అవకాడో పేస్ట్, ఫుడ్‌ కలర్‌ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.

    అనంతరం రుచికి సరిపడా తేనె లేదా పంచదార పొడి వేసుకుని, బాగా కలిపి ముద్దలా చేసుకుని, చేతులకు నెయ్యి పూసుకుని, చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లించి సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

    బనానా–చాక్లెట్‌ వొంటన్స్‌
    కావలసినవి: అరటిపండు గుజ్జు – పావు కప్పుపైనే
    చాక్లెట్‌ పౌడర్‌ – 5 టేబుల్‌ స్పూన్లుపైనే
    జీడిపప్పు, వాల్‌నట్స్, బాదం పప్పు – 4 టేబుల్‌ స్పూన్ల చొప్పున (నేతిలో దోరగా వేయించి మిక్సీలో పౌడర్‌ చేసుకోవాలి)
    గుడ్డు తెల్లసొన – ఒకటి
    పంచదార పొడి – కొద్దిగా (అభిరుచిని బట్టి)
    చీజ్‌ – 2 టేబుల్‌ స్పూన్లు
    వొంటన్‌ రేపర్స్‌ – 20 (మార్కెట్‌లో దొరుకుతాయి)
    నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

    తయారీ: ముందుగా ఒక బౌల్‌లో అరటిపండు గుజ్జు, చాక్లెట్‌ పౌడర్, జీడిపప్పు మిశ్రమం, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో చీజ్, గుడ్డు తెల్లసొన వేసుకుని బాగా కలిసి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వొంటన్‌ రేపర్స్‌లో పెట్టుకుని.. నచ్చిన షేప్‌లో మడిచి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అభిరుచిని బట్టి పంచదార పొడితో గార్నిష్‌ చేసుకుంటే, ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. 

    (చదవండి: ట్రెండ్‌గా..మోడర్న్‌ ఊయలలు..!)

  • సమయం రాత్రి 10:47 గంటలు. అనూష ఫోన్‌ చేతిలో పట్టుకుని కూర్చుంది. స్క్రీన్‌ మీద ‘‘సీన్‌’’ అని కనిపిస్తోంది కానీ రిప్లై లేదు. ఆ నిశ్శబ్దం ఆమె మనసులో తుఫాను రేపుతోంది.తల్లి పిలిచినా వినిపించడం లేదు. కళ్ళలో తడి, మనసులో ఆందోళన, గుండెలో నొప్పి. మెదడులో ఒకే ఆలోచన – ‘ఆకాశ్‌కు నేను అంత ముఖ్యం కాదా?’ ఇది అనూష ఒక్కరి సమస్య మాత్రమే కాదు, వేలాది యువ హృదయాల్లో ప్రతి రాత్రి జరుగుతున్న డిజిటల్‌ డ్రామా. 

    ఈ తరంలో ప్రేమ ఫోన్‌లో మొదలవుతోంది, ఫోన్‌లోనే ముగుస్తోంది. ప్రేమలో ఓపిక పోయింది, అర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు బంధాలు షార్ట్‌ వీడియోస్‌లా మారాయి. చూసి, వెంటనే మరచిపోతున్నారు. కాని, సున్నిత మనస్కులు ఆందోళనలో, డిప్రెషన్‌లో చిక్కుకుపోతున్నారు. 

    వాంఛగా మారిన ప్రేమ
    ఒకప్పుడు ప్రేమంటే మనసుల కలయిక. ఇప్పుడది బాడీ ఇమేజ్‌ల కలయిక అయింది. స్మార్ట్‌ఫోన్లు పిల్లలకు 13 ఏళ్ల వయసులోనే అశ్లీల కంటెంట్‌ను అందిస్తున్నాయి. ప్రేమంటే శరీరాన్ని సంతృప్తిపరచడమే అని పోర్నోగ్రఫీ వారి మెదడుకు చెబుతోంది. కాని, ప్రేమంటే శాంతి అని మనసు హెచ్చరిస్తోంది. ఈ గందరగోళమే వారిలో అపరాధభావం, అభద్రత, ఒంటరితనాలకు కారణమవుతోంది. అందుకు వారిని తప్పుపట్టకుండా, సరైన మార్గంలో నడిపేందుకు ప్రాధాన్యమివ్వాలి. 

    డోపమైన్‌ అడిక్షన్‌... 
    ప్రేమంటే మెదడులో జరిగే రసాయన అద్భుతం. ఆక్సిటోసిన్, డోపమైన్, సెరటోనిన్‌ – ఇవే మనం ప్రేమగా అనుభవించే హార్మోన్‌లు. కానీ స్మార్ట్‌ఫోన్‌ వాటిని హైజాక్‌ చేస్తోంది. ప్రతి నోటిఫికేషన్‌కు డోపమైన్‌ విడుదలవుతోంది. ఇప్పుడు ప్రేమలోని ఆనందానికి కాదు, ఫోన్‌ వల్ల విడుదలయ్యే డోపమైన్‌ ఇచ్చే ఆనందానికి బానిస అవుతున్నారు. ప్రేమ కంటే రెస్పాన్స్‌ టైమ్‌ ముఖ్యమైపోయింది. ఇప్పుడీ డిజిటల్‌ యుగం కొత్త మానసిక వ్యాధి – డోపమైన్‌ అడిక్షన్‌. 

    ఎందుకింత గాఢత?
    టీనేజ్‌ వయస్సులో మెదడులోని ప్రీఫ్రంటల్‌ కార్టెక్స్‌ (తర్కం, నియంత్రణ కేంద్రం) ఇంకా ఎదగలేదు. కాని, అమిగ్డాలా (భావోద్వేగ కేంద్రం) చాలా చురుకుగా ఉంటుంది. అందుకే టీనేజ్‌ ప్రేమలు విపరీతంగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. వాళ్లు ప్రేమను కాకుండా, ప్రేమ ఇచ్చే ఫీలింగ్‌ ను ప్రేమిస్తారు. స్మార్ట్‌ఫోన్‌ ఆ ఫీలింగ్‌ను 24 గంటలూ ఇస్తుంది. అందుకే ఫోన్‌ లేకపోతే విరక్తి, సైలెన్స్‌ అంటే తట్టుకోలేని ఆందోళన. ఇది నిజానికి ఫీలింగ్‌ అడిక్షన్‌. 

    ప్రేమంటే చాట్‌ విండో... 
    ఇప్పుడు ప్రేమంటే కవిత్వం కాదు, చాట్‌ విండో. ‘టైపింగ్‌’... అని కనిపిస్తే గుండెల్లో ఉత్సాహం. ‘లాస్ట్‌ సీన్‌’ అని కనబడితే బాధ. లైక్స్, హార్ట్‌ ఎమోజీలు, ఫోటోలు – ఇవే కొత్త అఫెక్షన్‌ సింబల్స్‌. ఈ ప్రేమలో ముఖాలు కనెక్ట్‌ అవుతున్నాయి కాని, మనసులు డిస్కనెక్ట్‌ అవుతున్నాయి. 

    ఒకప్పుడు ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక. ఇప్పుడు రెండు స్క్రీన్‌ల కలయిక. ఒకప్పుడు బ్రేకప్‌ అంటే కన్నీళ్లు, ఉత్తరాలు, జ్ఞాపకాలు. ఇప్పుడు బ్రేకప్‌ అంటే – ‘బ్లాక్డ్‌’. ఒక క్లిక్‌తో మనిషిని జీవితంలో నుంచి తొలగించవచ్చు. కాని, మనసులోంచి? అసాధ్యం.

    పెరుగుతున్న ఒంటరితనం...
    ఇప్పుడు పిల్లలు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటారు కాని, మనసు లోపల మాత్రం ఖాళీగా ఉంటారు. వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నా, వారిని అర్థం చేసుకునే ఒక్క మనసు కూడా ఉండదు. జర్నల్‌ ఆఫ్‌ అడాల్సెంట్‌ హెల్త్‌ (2024) ప్రకారం రోజుకు ఐదు గంటలకు పైగా సోషల్‌ మీడియా వాడే టీనేజ్‌లో డిప్రెషన్‌ రేటు27 శాతం ఎక్కువగా ఉంది. వారు ఫోన్‌లో కనెక్ట్‌ అవుతున్నారు కాని, మనసుతో కనెక్ట్‌ అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.

    ఎలా రక్షించాలి ఈ తరం మనసును
    1. ప్రేమలో కూడా ఫోన్‌కు ఒక సమయం ఉండాలి. ప్రతిరోజూ ప్రతి నిమిషం కనెక్ట్‌ కావడం కాదు,
    కొంచెం దూరంగా ఉండటం, వేచి ఉండటం నేర్చుకోవాలి. దూరం బంధాలను బలపరుస్తుంది. 
    2. మీ ప్రేమకు ‘నో’ చెప్పారంటే మీరు ఓడిపోయినట్లు కాదు. ప్రేమలో ‘లేదు’ కూడా ఒక జవాబు అని అర్థం చేసుకోవాలి. భావోద్వేగ అవగాహన నేర్పాలి.
    3. చాట్‌లో ఉన్న ఎమోజీల కంటే కళ్లలో కనిపించే భావం గొప్పది. ముఖాముఖి సంభాషణ మీ ప్రేమను బలపరుస్తుంది.
    4. పిల్లలతో ప్రేమ, శరీరం, భావోద్వేగాల గురించి మాట్లాడాలి. సిగ్గు పడకుండా సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అందించాలి. ఎందుకంటే తెలియకపోవడం కంటే తప్పుగా తెలుసుకోవడం ప్రమాదం.
    5. ‘‘ఏం చూస్తున్నావు?’’ అని అడగడం కాదు,‘‘ఏం ఫీలవుతున్నావు?’’ అని అడగాలి. పిల్లల మనసులను ఫోన్‌తో కాకుండా మన ప్రేమతో నింపాలి. 
    సైకాలజిస్ట్‌ విశేష్‌, ఫౌండర్, జీనియస్‌ మేట్రిక్స్‌ హబ్‌ 

    (చదవండి: గాజు డిస్క్‌: చిన్నదేగానీ..చిరంజీవి)

     

  • ఎంత పెద్దవారైనా బాల్యపు ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటారు. అది సాధ్యం కాదని నిరుత్సాహపడకుండా పెద్దవాళ్లు కూడా ఊయల ఎక్కి చిన్ననాటి ఆనందాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఇంటి అలంకరణలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారిన మోడర్న్‌ ఉయ్యాలలు ఇంట్లో ఉండటం ఇప్పుడో ట్రెండ్‌గా మారింది.. జూలా లేదా స్వింగ్‌ అని పిలిచే ఊయలను ఇంట్లో అలంకరించి, ఆనందాన్ని పొందుదాం. ఊయల పెట్టేంత పెద్ద పెద్ద లోగిళ్లు ఈ రోజుల్లో సాధ్యం కాదని నిరుత్సాహం అక్కర్లేదు. చిన్న స్పేస్‌లో కూడా ఏర్పాటు చేసుకోదగిన మోడర్న్‌ ఊయలలు నేడు అందుబాటులో ఉన్నాయి.

    ట్రెండ్‌ ఎందుకు పెరిగిందంటే... 
    చిన్న అపార్ట్‌మెంట్లు, బాల్కనీలు పెరిగిన నేపథ్యంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగలిగే అవకాశాన్ని ఒక ‘స్వింగ్‌’ సెటప్‌ అందిస్తుంది. మోడర్న్‌ ఫర్నిచర్‌తో కలిపి వుడ్‌ + మెటల్‌ చెయిన్‌ + కాటన్‌ మెటీరియల్‌తోనూ ఊయలలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులు ఉన్నాయి. ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ మార్కెట్లోనూ ఇవి లభిస్తున్నాయి. 

    వీటి అమరికకు... 
    ఇంట్లో సర్దుబాటు స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. స్థలాన్ని బట్టి ఊయల ఎంపిక చేసుకోవాలి. అటూ ఇటు తిరుగుతున్నప్పుడు తగలకుండా, ఒక కార్నర్‌ ప్లేస్‌ ఊయలకు కేటాయించడం మంచిది.

    మెటల్‌ + వుడ్‌ కలిపి ఉండే ఊయల ఎంచుకున్నప్పుడు కుషన్లు, వాటి రంగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

    మ్యాక్రోమేడ్‌ హ్యాంగింగ్‌ స్వింగ్‌ తక్కువ స్పేస్‌ తీసుకుంటుంది, లైట్‌ వెయిట్, మోడర్న్‌ బోహో లుక్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. 

    టాయ్‌ స్వింగ్స్‌ ఇంటి అలంకరణకు మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిని లివింగ్‌ లేదా డైనింగ్, కిడ్స్‌ రూమ్, బాల్కనీ కార్నర్‌ లలో ఉపయోగించవచ్చు. 

    సీలింగ్‌–మౌంటెడ్‌ రౌండ్‌ స్వింగ్‌ అంటే హాల్‌ లేదా బాల్కనీలో వీటిని వేలాడదీయవచ్చు. ఇది ఫ్యామిలీ కార్నర్‌గా మారిపోతుంది.

    ఫోల్డబుల్‌ ఊయలను అవసరమైనప్పుడు మాత్రమే పెట్టి, తర్వాత తీసి, మడిచి జాగ్రత్త చేయవచ్చు. స్మార్ట్‌ అర్బన్‌ లివింగ్‌కి సరైన ఆప్షన్‌.

    బాంబూ స్వింగ్స్‌ నేచురల్‌ లుక్‌లో కనిపిస్తాయి. ఇవి సస్టెయినబుల్‌ డెకర్‌లో ఒక భాగం.

    వాల్‌–మౌంటెడ్‌ హ్యాంగింగ్‌ చెయిర్స్‌ చిన్న బెడ్‌రూమ్‌ లేదా స్టడీ కార్నర్‌లో కూడా సులభంగా ఫిట్‌ అవుతాయి.

    డెకర్‌ టిప్స్‌

    ఊయల చుట్టూ ఇండోర్‌ ప్లాంట్స్‌ పెడితే రిలాక్సింగ్‌ లుక్‌ వస్తుంది.

    కుషన్‌లు, లైట్‌ బ్లాంకెట్స్‌తో కంఫర్ట్‌ టచ్‌ ఇవ్వచ్చు.

    ఊయల కింద చిన్న రగ్‌ లేదా ఫ్లోర్‌ లాంప్‌ పెడితే మంచి లుక్‌ వస్తుంది.

    ఎకో ఫ్రెండ్లీ టచ్‌తో పాత కుర్చీ ఫ్రేమ్‌ని రీయూజ్‌ చేసి ఊయలగా మార్చుకోవచ్చు. ‘సస్టైనబుల్‌ లివింగ్‌‘కి ఇది ఒక అందమైన ఉదాహరణ. 

    ఊయల అంటే ఒక జ్ఞాపకం. ఒక రిలాక్సేషన్‌ స్పాట్‌. మోడర్న్‌ హోమ్‌లలో ఇది ఇప్పుడు కేవలం సీటింగ్‌ ఆప్షన్‌ మాత్రమే కాదు, డిజైన్‌ స్టేట్‌మెంట్‌ కూడా. 

    (చదవండి: గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్‌ తప్పనిసరా..?)

  • ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్‌! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్‌ క్యాలెండర్‌ (పావుకోన్‌) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్‌ ఫెస్టివల్‌ అంటారు. 

    ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్‌ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్‌’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్‌ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్‌ పండుగతో ఈ ఫెస్టివల్‌ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు. 

    ప్రతి దేవాలయంలో ఒడాలన్‌ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్‌ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్‌ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

    ఆధ్యాత్మికతలో ఆదర్శం!
    బాలీలో మరొక ముఖ్యమైన పండుగ న్యేపి (మౌన దినం) గురించి చెప్పుకోవాల్సిందే! సకా క్యాలెండర్‌ ప్రకారం బాలి ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుంటూ న్యేపీని ఆత్మపరిశీలన దినంగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో జరుగుతుంటుంది. 

    న్యేపి రోజున, ద్వీపం మొత్తం 24 గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. విమానాశ్రయాలను మూసివేస్తారు. వీధులు నిర్మానుష్యంగా ఉంటాయి. స్థానికులంతా ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. 

    (చదవండి: గాజు డిస్క్‌: చిన్నదేగానీ..చిరంజీవి)

International

  • అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్ కు చెందిన ఓవ్యక్తికి  బర్డ్ ప్లూ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి " హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులలో సోకడం ఇది మెుదటిసారని డాక్టర్లు తెలిపారు.

    వాషింగ్టన్ లోని ఓ వ్యక్తికి "ఎచ్5ఎన్5 ఏవియన్ ఇన్‌ప్లూయింజా" వైరస్ సోకడం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు అంటుకోదని కానీ ఈ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలను అధ్యయనం చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాధితుడు బహుశా కోళ్ల ద్వారనే వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.అయితే ఈ వైరస్ సోకిన వ్యక్తి వృద్ధుడని అతనికి ఇతర ఆరోగ్యసమస్యలున్నాయని డాక్టర్లు తెలిపారు.

     సాధారణంగా ఇన్‌ప్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని ఈ వైరస్ సోకిన జంతువుల లాలాజలం, మలపదార్థాలు, పాడి పశువుల పాల ద్వార వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని తెలిపారు. ఇది ఒకప్రాణి నుంచి మరోప్రాణికి సోకే అవకాశం శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నామని వారికి కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు పేర్కొన్నారు.

    ‍అమెరికాలో బర్డ్ ప్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని అక్కడి వైద్యశాఖ ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని  అయితే అలా అని దానిని తేలికగా తీసుకోకూడదని డాక్టర్లు తెలిపారు. బర్డ్ ప్లూ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ఆరోగ్యశాఖ తెలిపింది. కోళ్ల పరిశ్రమలలో విధులు నిర్వహించే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.