Archive Page | Sakshi
Sakshi News home page

Business

  • జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

    ఏమిటీ టెంపుల్?
    టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.

    నవంబర్ 15న చేసిన పోస్ట్‌లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.

  • హీరో మోటోకార్ప్ & హార్లే-డేవిడ్సన్ కంపెనీలు అభివృద్ధి చేసిన బైకులను ఎప్పటికప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తూ.. ప్రజాదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా HD X440 T పేరుతో ఓ బైక్ లాంచ్ చేశాయి. దీని ధర రూ. 2.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

    నలుపు, ఎరుపు, నీలం & తెలుపు అనే నాలుగు రంగులలో లభించే ఈ లేటెస్ట్ హార్లే-డేవిడ్సన్ హెచ్డీ ఎక్స్440 టీ బైక్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

    కొత్త డిజైన్ కలిగిన ఈ బైకులో 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 27hp & 38Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఎంపికలో లభిస్తుంది. ఈ బైక్ ప్రత్యేకంగా రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్‌ వంటివి పొందుతుంది. రియర్ సబ్‌ఫ్రేమ్ కొత్త టెయిల్ సెక్షన్‌ పొందుతుంది. గ్రాబ్ హ్యాండిల్స్ & పొడవైన సీటు వంటివి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.

    ఇదీ చదవండి: జనవరి నుంచి ఈ కారు ధరల పెంపు!

  • భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.

    పైలట్ల నియామకానికి ప్రణాళికలు

    కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.

    ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు  ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.

    విశ్లేషకుల హెచ్చరిక

    ఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.

    మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్‌లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్‌కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్‌లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.

    విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్‌పై పూర్తి వేవర్‌లను ప్రకటించింది.

    డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశం

    నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.

    ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?

  • అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక రికార్డులు సృష్టిస్తున్నాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న భారీ కొనుగోలు డిమాండ్‌కు తోడు భారత రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాలకు పడిపోవడంతో దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోయాయి. ఇటీవల గ్రాము బంగారం ధర రూ.13,015 (పది గ్రాములకు సుమారు రూ.1,30,150) మార్క్‌ను తాకింది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ధోరణి కొనసాగుతూ 2026లో బంగారం ధరలు మరో 5% నుంచి 30% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరత నేపథ్యంలో బంగారం సురక్షిత ఆస్తిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

    సెంట్రల్ బ్యాంకుల రికార్డు కొనుగోలు

    2025లో ఆర్‌బీఐ తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది. మార్చి 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఆర్‌బీఐ ఏకంగా 64 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశ మొత్తం బంగారం నిల్వలు 880.2 టన్నులకు చేరాయి. దీని మొత్తం విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. చైనా, టర్కీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అక్టోబర్ 2025లో సెంట్రల్ బ్యాంకులు మొత్తంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది 2025లో అత్యధిక నెలవారీ కొనుగోలుగా నమోదైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా ప్రకారం, 2025 సంవత్సరంలో ఈ కొనుగోలుతో మొత్తంగా బంగారం 750-900 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉంది.

    రూపాయి బలహీనత

    అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటు భారత రూపాయి బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలను మరింత పెంచింది. డిసెంబర్ 2025లో డాలర్‌ విలువ సుమారు రూ.90.20కి చేరింది. దాంతో జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. 2025లో రూపాయి సగటు రేటు రూ.86.96/డాలర్‌గా ఉంది. రూపాయి బలహీనత వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ధర కారణంగా కొనుగోలుదారులకు మరింత ఖరీదైనదిగా మార్చింది. తద్వారా దేశీయ ధరలు విపరీతంగా పెరిగాయి.

    ఆర్థిక అస్థిరతలు

    బంగారం ధరల పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక అస్థిరత కూడా దోహదపడుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈజింగ్, పెరుగుతున్న అంతర్జాతీయ అప్పు, అధిక ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్, మిడిల్‌ ఈస్ట్‌ సంఘర్షణల వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చాయి. 2025లో బంగారం ధర 48% పెరిగి 3,896 డాలర్లు/ఔన్స్‌కు చేరింది. దాంతో ఇది 1979 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదలగా ఉంది.

    2026లో బంగారం అంచనాలు

    నిపుణుల అంచనాల ప్రకారం, 2026లో బంగారం ధరలు ఆర్థిక మాంద్యం తీవ్రతపై ఆధారపడి ప్రస్తుత స్థాయి నుంచి 5-15% వరకు పెరగవచ్చు. డబ్ల్యూజీసీ ప్రకారం అంతర్జాతీయంగా ధరలు 4,000-4,500 డాలర్లు/ఔన్స్ మధ్య స్థిరపడవచ్చు. జేపీ మోర్గాన్ ప్రకారం క్యూ4 2025 నాటికి 3,675 డాలర్లు/ఔన్స్‌కు, ‍క్యూ2 2026 నాటికి 4,000 డాలర్లకి చేరవచ్చు.

    ఇదీ చదవండి: సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా

  • సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్‌ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.

    గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్‌ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్‌కుక్‌కు రిపోర్ట్ చేసేవారు.

    టిమ్‌కుక్‌ ప్రయత్నాలు..

    అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్‌లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్‌ హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్‌కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్‌ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.

    యాపిల్‌కు సమస్య

    ఎగ్జిక్యూటివ్‌ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్‌కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్., ఓపెన్‌ఏఐ, వివిధ స్టార్టప్‌లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.

    ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత

  • స్విట్జర్లాండ్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్‌ రాబోయే మూడేళ్లలో సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను పరిశీలిస్తోందని స్విస్ వార్తాపత్రిక ‘సోన్‌టాగ్స్ బ్లిక్’(SonntagsBlick) తెలిపింది. 2023లో క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.

    బ్యాంకు వ్యవస్థలో పునరావృత కార్యకలాపాలను తగ్గించడానికి ఈ ఉద్యోగ కోతలు, విలీన ప్రక్రియ ఎంతో తోడ్పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే యూబిఎస్ ప్రతినిధులు ఈ 10,000 సంఖ్యను మాత్రం కచ్చితంగా ధ్రువీకరించలేదని గమనించాలి.

    క్రెడిట్ సూయిస్ కొనుగోలు (మార్చి 2023) తర్వాత యూబీఎస్‌ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా వీలైనంత తక్కువగా ఉద్యోగ కోతలు ఉండేటా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూబీఎస్‌ ప్రతినిధులు చెప్పారు. బ్యాంకులో ఏవైనా  తగ్గింపులు ఉంటే దానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణ తొలగింపుల (లేఆఫ్స్‌) సంఖ్యను తగ్గించడానికి బ్యాంకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

    ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం

    2024 చివరి నాటికి యూబీఎస్‌లో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 10,000 కోతలు దాదాపు 9 శాతం తగ్గుదలకు సమానం. ఇప్పటికే బ్యాంక్ 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 1,04,427కి తగ్గించింది. అంటే, ఈ విలీనం ప్రభావంతో ఇదివరకే సుమారు 15,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.

    ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

  • హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళా టెక్కీ తను చేస్తున్న ఉద్యోగం ద్వారా ఆమె కలల కారు ‘మినీ కూపర్ ఎస్’ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిహారిక నాయక్ అనే మహిళ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఐకానిక్ వాహనాన్ని డెలివరీ అందుకుంటున్న క్షణాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన 16 ఏళ్ల కెరియర్‌ ప్రయాణం, మంచి జీతంతో ఈ కారును కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు.

    39 ఏళ్ల నిహారిక నాయక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక మిడ్ సైజ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థలో క్వాలిటీ అస్యూరెన్స్ హెడ్‌గా 9 టూ 5 జాబ్‌ పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమె 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ ఉద్యోగాలపై స్పష్టత లేదు. ఐటీ రంగం అస్థిరంగా ఉంది’ అని నిహారిక గుర్తు చేసుకున్నారు. ‘కానీ నేను ఆ రంగాన్ని ఎంచుకున్నాను. 16 సంవత్సరాలుగా దానిలోనే ఉన్నాను’ అని చెప్పారు.

    కెరియర్‌లో వృత్తిపరమైన ఎదుగుదల కోసం ఉద్యోగాలు మారడం ఆమెకు లాభదాయకమైన నిర్ణయంగా అనిపించిందని చెప్పారు. మేనేజర్‌ స్థానంలో ఉన్న ఆమె ప్రస్తుతం అధిక జీతం పొందుతున్నట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా ఒకే టెక్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్న ఆమె తన జీతం ఎంతో సరిగ్గా చెప్పనప్పటికీ సంవత్సరానికి రూ.45 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు ధ్రువీకరించారు. అయితే మొదట్లో ఐటీ ఉద్యోగంలో చాలా తక్కువగా వేలల్లోనే జీతం ఉండేదన్నారు. ఒకే రంగాన్ని నమ్ముకొని అందుకు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే జీతం అదే పెరుగుతుందన్నారు. నిహారిక నాయక్ మినీ కూపర్ ఎస్ ఆన్ రోడ్ ధర హైదరాబాద్‌లో రూ.65 లక్షలుగా ఉంది.

    ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

  • భారతదేశంలో హైదరాబాద్‌ వంటి టెక్ హబ్‌ల్లో యువ ఐటీ నిపుణులు ఆరోగ్య స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబిస్తున్నప్పటికీ, వారిలో కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం కారణంగా నరాల సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ఈ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శాశ్వత నరాల సమస్య సంభవించవచ్చని కొందరు చెబుతున్నారు.

    ఇటీవల క్లినిక్‌కు వస్తున్న యువ ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందని, వీరంతా నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులుగా భావించే ఈ నిపుణులు రోజువారీ సాధారణంగా కనిపించే సమస్యలతో వస్తున్నారని అంటున్నారు.

    సాధారణంగా కనిపించే లక్షణాలు

    • పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపు

    • ఆకస్మిక ఎలక్ట్రిక్ షాక్ లాంటి అనుభూతులు

    • ఏకాగ్రతకు కష్టపడటం

    • విశ్రాంతితో మెరుగుపడని అలసట

    • మతిమరుపు

    • మెట్లు ఎక్కేటప్పుడు అప్పుడప్పుడు బలహీనత

    ఈ తరహా సమస్యలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత స్పష్టంగా గమనిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు

    B12 లోపానికి ప్రధాన కారణాలు

    • టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం

    • డెస్క్‌ల వద్ద ఎక్కువ గంటలు కూర్చోవడం. కదలిక లేకపోవడం, భోజనం సరిగా చేయకపోవడం.

    • చాలా మంది సరైన సప్లిమెంట్స్ లేకుండా ఆహారాన్ని తీసుకుంటారు.

    • మెట్ఫార్మిన్ (డయాబెటిస్ కోసం) లేదా యాసిడ్-తగ్గించే మందులు (పీపీఐ) వంటి వాటిని దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బీ12 మరింత తగ్గుతుంది.

    • క్రమరహిత నిద్ర, పని సంబంధిత ఒత్తిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది కూడా బీ12 తగ్గిస్తుంది.

    శాశ్వత నష్టాన్ని నివారించడం అత్యవసరం

    నరాల ఇన్సులేషన్ (మైలిన్), మెదడు పనితీరు, మానసిక స్థితి సమతుల్యత, ఆరోగ్యకరమైన రక్త కణాలకు విటమిన్ బీ12 కీలకమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువ కాలం లోపం కొనసాగితే నరాల నష్టం కోలుకోలేనిదిగా మారవచ్చు. చాలా మంది యువ నిపుణులు తమ లక్షణాలను కేవలం పని ఒత్తిడిగా లేదా అలసటగా భావించి విస్మరిస్తారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

    ఇప్పుడేం చేయాలి?

    ప్రాథమిక రక్త పరీక్ష ద్వారా విటమిన్ బీ12 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రారంభ దశలో సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా సాధారణంగా పూర్తిగా కోలుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జలదరింపు, తిమ్మిరి, నిరంతర అలసట వంటి సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక నరాల సమస్యలను నివారించడానికి ఏటా విటమిన్ బీ12 స్థాయిలను తనిఖీ చేయాలని, ఏదైనా సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించాలని సిఫార్సు చేస్తున్నారు.

    ఇదీ చదవండి: మిడ్‌నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్‌

  • షెనల్‌.. ఖరీదైన ఫ్యాషన్‌ ఉత్పత్తులకు పేరుగాంచిన ఈ ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గురించి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసేవారికి తెలిసే ఉంటుంది. ‘అమ్మో ఆ బ్యాగ్‌ అన్ని లక్షలా..??’​ అని సామాన్యులు కూడా ఆ బ్రాండ్‌ ఉత్పత్తుల ధరలు విని విస్తుపోతుంటారు. దీనికి బాస్‌ మన భారతీయురాలే. మహారాష్ట్రకు చెందిన లీనా నాయర్.. షెనల్‌కు సీఈవోగా కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ లో ఆమె షెనల్‌కు సీఈవో అయ్యారు.

    కొల్హాపూర్ నుంచి గ్లోబల్ లీడర్ షిప్ వరకు..
    మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన లీనా నాయర్ మహిళలకు పరిమిత అవకాశాలు ఉన్న సంప్రదాయవాద వాతావరణంలో పెరిగారు. ఆమె వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలయ్యారు. తరువాత ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్‌పూర్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్‌లో ఎంబీఏ అభ్యసించారు. అక్కడ ఆమె బంగారు పతకం సాధించారు.

    యూనిలీవర్ లో మూడు దశాబ్దాలు
    లీనా నాయర్ 1992లో యూనిలీవర్ లో మేనేజ్ మెంట్ ట్రైనీగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2016లో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అయ్యారు. ఈ పాత్రను నిర్వహించిన అతి పిన్న వయస్కురాలే కాదు..  మొదటి మహిళ కూడా లీనా కావడం గమనార్హం. యూనిలీవర్ లో, ఆమె 190 కి పైగా దేశాలలో హెచ్‌ఆర్ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

    షెనెల్‌కు సీఈవోగా
    షెనెల్ 2021 డిసెంబర్ 14న నాయర్ ను గ్లోబల్ సీఈవోగా నియమించింది. వేగవంతమైన మార్పు కాలంలో ప్రైవేటుగా నిర్వహించే లగ్జరీ హౌస్ కు మార్గనిర్దేశం చేసే బాధ్యతను ఆమెకు అప్పగించింది. అప్పటి నుండి ఆమె స్థిరత్వం, వైవిధ్యం, హస్త కళా ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆ బ్రాండ్‌ను మరింత విస్తృతం చేశారు.

    ప్రత్యేక గుర్తింపులు
    లీనా నాయర్ ప్రసిద్ధ ఫినాన్షియల్‌ టైమ్స్‌ హీరోస్‌ (FT HERoes) ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ బిజినెస్‌లో చోటు సంపాదించారు. ప్రభావవంతమైన నిర్వహణ ఆలోచనాపరుల థింకర్స్ 50 జాబితాలోనూ స్థానం దక్కించుకున్నారు. లింక్డ్ఇన్ టాప్ వాయిస్ గానూ గౌరవం పొందారు. వ్యాపారం, వైవిధ్యం కోసం ఆమె చేసిన కృషికి ఆమె కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)ను కూడా అందుకున్నారు.

  • భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్‌ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

    ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్‌టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్‌ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్‌ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.

    అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్‌ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్‌లెస్‌ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

    అదేవిధంగా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్‌ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్‌ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్‌లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు.

  • కుర్చీని మడత పెట్టినట్టుగానే ఇంటి పైకప్పునకు ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదూ.. అవును.. ఫోల్డబుల్‌ స్టేర్‌కేస్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. తక్కువ స్థలంలో, అందంగా ఇమిడిపోవడం వీటి ప్రత్యేకత. తక్కువ స్థలం ఉన్న ఇళ్లకు, బాల్కనీలోకి వెళ్లేందుకు, చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌లకు ఈ మడత పెట్టే మెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

    మడతపెట్టే మెట్లు సురక్షితంగానే ఉంటాయి కానీ వీటిని సరిగ్గా బిగించాలి.. లేకపోతే ప్రమాదకరం. ఈ మెట్ల మీదుగా ఎక్కేటప్పుడు ఇరువైపులా హ్యాండ్‌ రెయిల్స్, యాంటీ స్లిప్‌ రింగ్‌లు వంటివి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పిల్లలు, వృద్ధులు కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది.

    ఇంటి విలువను పెంచే మెట్లు.. 
    నిరంతరం, రోజువారి అవసరాలకు వినియోగించే మెట్ల స్థానంలో ఈ మడతపెట్టే మెట్లు అంత శ్రేయస్కరం కాదు. స్టోర్‌ రూమ్‌లు, చిన్న స్థలం ఉండే ఇళ్లు, బాల్కనీలోకి ఎక్కేందుకు, అప్పుడప్పుడు వినియోగించే ప్రాంతాలలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి విలువను పెంచడంలో మెట్లు కూడా భాగస్వామ్యమే. కాబట్టి చిన్న స్థలంలో నిర్మించే డూప్లెక్స్‌ ఇళ్లలో ఈ మడత పెట్టే మెట్లను వినియోగించేటప్పుడు ఇంటీరియర్, రంగులకు అనుగుణంగా ఈ మెట్లను ఎంపిక చేసుకోవాలి. లేకపోతే 
    ఇంటి అందం దెబ్బతింటుంది.

    నాణ్యమైన కలప లేదా అల్యూమీనియంతో ఈ మడతపెట్టే మెట్లను తయారు చేస్తారు. పిల్లల గది, చిన్న హాల్‌లో, ఇరుకైన స్థలంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి నిచ్చెనలు పాదాల కింద స్థిరంగా ఉండవు కాబట్టి బరువైన వస్తువులను మోసుకెళ్తూ ఈ మెట్లను ఎక్కకూడదు. సంప్రదాయ మెట్లతో పోలిస్తే ఇవి చౌక ధరల్లోనే లభిస్తాయి.

Telangana

  • హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. ెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు.

    రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే “టాటా ఇంటర్‌చేంజ్” అని పేరు పెట్టారు.ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే  ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

    ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.మరిన్ని ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని “గూగుల్ స్ట్రీట్” అని ప్రకటించేందుకు ప్రతిపాదనతో పాటు మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

    ఇదీ చదవండి:

    రూ. 11 లక్షల కోట్లు ఇస్తే.. రూ. 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు?

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభలో నిబంధనలకు తిలోదకాలిచ్చేశారని, అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని,  చివరికి డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని కూడా గాలికి వదిలేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు  మండిపడ్డారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సరైన కారణాలు లేకుండా సభను తరచుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన  రూల్స్‌కు విరుద్ధమని హరీష్ రావు వాపోయారు.

    సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనన్నారు.

    గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని హరీష్‌ రావు ఆరోపించారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు కాబట్టి, ఆ పదవి ఖాళీగా ఉండటం వల్ల కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని హరీష్‌రావు పేర్కొన్నారు.

    పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయమని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించిందన్నారు. అయితే ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని హరీష్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
     

    ఇది కూడా చదవండి: రేవంత్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌.. ప్రెస్‌క్లబ్‌లో చర్చకు సిద్ధమా?
     

  • హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ రాష్ట్రం దిశ దిశ మారుతుందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీర్  ఖాన్ పేట్ లో జరుగుతున్న సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. 

    ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనంతో ప్రపంచ నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ  చేరుతుందని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండేళ్ల పాలన, 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలు తదితరాలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని అన్నారు ఇప్పటికే  దేశ విదేశాలకు చెందిన 150 మంది అత్యంత ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని చెప్పారు రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం కోసం విశేష రీతిలో ఏర్పాట్లు జరిగాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

    ‘ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’

  • దుమ్ముగూడెం: కొంతకాలంగా పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థిని సక్రమంగా బడికి పంపించాలంటూ అతడి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న నక్కా మణువరన్‌ తరచూ పాఠశాలకు డుమ్మా కొడుతున్నాడు. 

    విద్యార్థిని రెగ్యులర్‌గా పాఠశాలకు పంపించాలంటూ ఉపాధ్యాయులు అతడి తల్లిదండ్రులను పలుమార్లు కోరినా వారి నుంచి స్పందన లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుడు బి.రవి, ఉపాధ్యాయురాలు రుక్మిణి ఇతర విద్యార్థులతో కలిసి మణువరన్‌ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేశారు. 

    ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ.. పిల్లల విద్యాహక్కు రక్షణ తమ బాధ్యత అని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని అందరినీ చదివించాలని కోరారు. ఈ విషయంలో తల్లిదండ్రులు సహకరించాలని అన్నారు. దీంతో తమ కుమారుడిని సోమవారం నుంచి సక్రమంగా బడికి పంపుతామని తల్లిదండ్రులు చెప్పడంతో ధర్నా విరమించారు.  

  • సాక్షి,హైదరాబాద్‌: ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మార్చేసిందని, ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

    కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్  పదేళ్ల పాటు నియంత పాలన చేశారు. ఆయన కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ బంధీ అయ్యింది. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఏదో మార్పు చేస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అంతే కానీ కాంగ్రెస్‌ పార్టీపై ప్రేమతో కాదు.

    ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండేళ్ల పాలన పై ఉత్సవాలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రతీ సందర్భంలో ఫ్రీ బస్సు, సన్న బియ్యం రెండే విషయాలు చెబుతున్నారు. ఆ సన్న బియ్యంలో కేంద్రం వాటా ఉంది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చారు అంతే. పరిపాలనలో మార్పు రాలేదు. తెలంగాణలో ఇంకేమీ మారలేదు. ఏ రంగంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు.

    కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరాడు. ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా రండి. మా కార్యకర్తలు సమాధానం చెబుతారు. ప్రెస్ క్లబ్ కైనా, ఇంకా ఎక్కడికైన పర్వాలేదు. మా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. భూములు, మద్యం అమ్మకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకోవాలని సూచిస్తున్నా.

    బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పారు.. ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్‌ఎస్‌కి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసే పార్టీలే అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.

    బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించి మోసం చేయడానికి సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారు. వంచించడమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ. హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో గతంలో ద్రుష్టి మళ్ళించారు. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ పేరుతో ప్రజల ఫోకస్ మళ్లిస్తున్నారు. కరప్షన్ లో, డ్రగ్స్, గన్ కల్చర్ లో తెలంగాణ రైజింగ్ అవుతోంది.

    రెండేళ్లలో భూ మాఫియా పడగలెత్తింది. వాటాల కోసం మంత్రుల మధ్య గొడవలు బయటపడుతున్నాయి. పారిశ్రామిక భూములను అప్పనంగా దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణ సంపదను దోచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన పాపలు.. అప్పులు మళ్లీ కాంగ్రెస్ కూడా చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అంటూ బీజేపీ నాయకుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మ్యాచ్ అంటే ఫుట్‌బాల్‌ ప్రేమికులు ఊగిపోతారు. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని వాటిని పరిశీలిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.

    ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు కలిసి పర్యవేక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్‌బాల్‌ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకోవాలి. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్‌బాల్‌ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఫుట్‌బాల్‌ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అలాగే, గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు వస్తున్నారు.

    ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు, హెచ్‌సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్ కోసం మెస్సీ.. వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పాటుచేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

  • హైదరాబాద్‌: గోవాకు వెళ్లిన ఓ జంట కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను రహస్యంగా తీసి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్న గోవాకు చెందిన ఓ వ్యక్తిపై సనత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం..సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళ (35) తన వివాహం కాకముందు 2023లో శ్రీనాథరావు అనే వ్యక్తితో కలిసి గోవాకు వెళ్లింది. వీరికి గోవాలోని  యశ్వంత్‌ (40) అనే వ్యక్తి వసతితో పాటు ఇతర ఏర్పాట్లను చేశాడు. అదే సమయంలో ఆ జంట కలిసి ఉన్నప్పటి వీడియోలను రహస్యంగా తీశాడు. 

    ఈ వీడియోలను భద్రపరిచిన యశ్వంత్‌ తాజాగా శ్రీనాథరావుకు ఫోన్‌ చేసి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించాడు. ఇదిలా ఉండగా సదరు మహిళకు గత ఏడాది వేరొకరితో పెళ్లి జరిగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన బెదిరింపుల విషయాన్ని శ్రీనాథరావు ఆ మహిళ దృష్టికి తీసుకువచ్చాడు. భయాందోళనకు గురైన బాధితురాలు సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని గోవాకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

     

  • దుబ్బాకరూరల్‌: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ కీర్తి రాజ్‌ వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి. 

    తల్లిదండ్రులకు తరుచు తెలుపడంతో నచ్చజెప్పేవారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో  ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

     

     

     

Movies

  • కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు హిట్ అని మేకర్స్ ఘనంగా చెప్పుకొంచారు. కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. అభిమానులు కూడా మా హీరో హిట్ కొట్టేశాడు అని హడావుడి చేస్తారు. తీరా చూస్తే కొన్నిరోజులకు అసలు ఫలితం ఏంటనేది బయటపడుతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయాయి. యాక్టింగ్ పరంగా విజయ్‌ని వంకపెట్టడానికి ఏం లేనప్పటికీ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడంతో చాలావరకు ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. ఈ ఏడాది విజయ్ నుంచి 'కింగ్డమ్' వచ్చింది. మే చివరలో థియేటర్లలో రిలీజైంది.

    (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    విడుదల రోజు.. విజయ్ హిట్ కొట్టేశాడని రష్మిక పోస్ట్ పెట్టింది. తొలిరోజు మూవీ చూసిన చాలామంది కూడా బాగుందనే అన్నారు. కానీ రెండో రోజు నుంచి యావరేజ్ అనే టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు రూ.130 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. తొలి భాగంలో కొంత కథ చూపించారు. కాకపోతే పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన వసూళ్లకు పొంతన కుదరలేదు. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని పక్కనబెట్టేశారని తెలుస్తోంది.

    ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్', రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు 'కింగ్డమ్' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా 'మ్యాజిక్' అనే చిన్న సినిమా తీశాడు. దీన్ని విడుదల చేసే పనుల్లో ఉన్నాడు. 'కింగ్డమ్' సీక్వెల్ లెక్క ప్రకారం వచ్చే ఏడాది మొదలవ్వాలి. కానీ అది ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల క్యాన్సిల్ అయిపోయిందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది కొన్ని నెలలు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

    (ఇదీ చదవండి: గతవారం నిల్.. ఈసారి ఏకంగా థియేటర్లలోకి 15 సినిమాలు)

  • టాలీవుడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లు ఉంటుంది. గతవారం చూసుకుంటే 'అఖండ 2' రిలీజ్ అవుతుందని ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే మూవీని విడుదలకు ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీకెండ్ పూర్తిగా వృథా అయిపోయింది. ఈ వారం ఏమో ఏకంగా 15 చిన్నా చితకా మూవీస్ థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇంతకీ అవేంటి? వీటిలో చూడదగ్గవి ఏవి?

    పేరుకే ఈ వారం 15 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. మూడు మాత్రమే కాస్త చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. వాటిలో కార్తి 'అన్నగారు వస్తారు' అనే డబ్బింగ్ చిత్రం ఒకటి కాగా.. యాంకర్ సుమ కొడుకు రోషన్ 'మోగ్లీ', నందు 'సైక్ సిద్ధార్థ్' ఉన్నంతలో చూడొచ్చేమో అనిపిస్తున్నాయి. వీటికి కూడా పెద్దగా గొప్ప హైప్ ఏం లేదు. హిట్ టాక్ వస్తే తప్ప వీటిపై ప్రేక్షకులు దృష్టిపెట్టరు.

    (ఇదీ చదవండి: హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)

    ఈ మూడు కాకుండా విడుదలయ్యే మిగతా సినిమాల విషయానికొస్తే సకుటుంబానాం, ఈషా, నా తెలుగోడు, పైసావాలా, ఫెయిల్యూర్ బాయ్స్, వన్ బై ఫోర్, ఘంటసాల, ఇట్స్ ఓకే గురు, కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్, డ్రైవ్, లాక్ డౌన్, ఎవడి సినిమాకు వాడే హీరో.. ఇలా బోలెడన్ని ఉన్నాయి. అసలు వీటిలో ఎన్ని మూవీస్.. ఈ వారం వస్తున్నాయని ప్రేక్షకులకు తెలుసో లేదో కూడా తెలియదు.

    ఇలా వస్తే వారంలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. లేదంటే ఒక్కటి కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంటుంది. ఈ విషయమై టాలీవుడ్ నిర్మాతలు కూర్చుని మాట్లాడుకోకపోతే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలకే నష్టం. ఇప్పటికే ఓటీటీల తీరు వల్ల చిన్న బడ్జెట్, మీడియం రేంజ్ హీరోల సినిమాలని థియేటర్లకు వెళ్లి జనాలు చూడటం చాలావరకు తగ్గించేశారు. ఇలా ఇన్నేసి సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం చేస్తే జనాలయినా ఎందుకొస్తారు చెప్పండి? 

    (ఇదీ చదవండి: మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌పై ఓ వెబ్ సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ.. లీడ్ రోల్ చేశాడు. ఇతడు 'ప్రేమమ్' హీరోగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

    నివిన్ పౌలీ, శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'ఫార్మా' వెబ్ సిరీస్.. వచ్చే శుక్రవారం (డిసెంబరు 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. పీఏ అరుణ్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.

    ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు. ప్రారంభంలో సేల్స్ చేయలేకపోతాడు. టార్గెట్స్ అస్సలు సాధించలేకపోతాడు. దీంతో విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటాడు. తర్వాత ఈ ఉద్యోగంలో నిలదొక్కుకుంటాడు. 'కైడోక్సిన్' అనే మెడిసన్ సేల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే ఈ మందు ఎంత ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వినోద్.. అతడి సంస్థపై తిరగబడతాడు? తర్వతా ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఎలానూ తెలుగులోనూ స్ట్రీమింగ్‌కి రాబోతుంది కాబట్టి ఈ జానర్ ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.

    (ఇదీ చదవండి: హోటల్‌ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి)

  • సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చెప్పే విషయాలు నమ్మాలా వద్దా అనే సందేహాలు రేకెత్తిస్తుంటాయి. 'ఉ‍ప్పెన' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి.. కొన్నాళ్ల క్రితం తనకు జరిగిన వింత అనుభవం గురించి బయటపెట్టింది. తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మ లాంటి రూపం కనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది.

    'కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత అనుభవం ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఓ ఆత్మని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత ఆత్మ కనిపించలేదు. మరి అది నాకు సాయం చేయడానికి వచ్చిందో లేదంటే నేను చేస్తున్న ప్రాక్టీస్ వల్ల వచ్చిందో తెలియదు. నాకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకముంది. ఎందుకంటే నేను తుళు జాతికి చెందిన అమ్మాయిని. మా పూర్వీకులని దేవతలుగా పూజిస్తాం. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతుంటారని నమ్ముతుంటాం. ఈ సంఘటన వల్ల ఆ నమ్మకం మరింత బలపడింది' అని కృతి శెట్టి చెప్పింది.

    (ఇదీ చదవండి: ఈ పాపని గుర్తుపట్టారా? తండ్రి స్టార్ హీరో.. తల్లి, అక్క హీరోయిన్సే)

    కార్తీ హీరోగా ఈమె నటించిన లేటెస్ట్ తమిళ మూవీ 'వా వాతియర్'. దీన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కార్తీ.. పోలీసుగా చేస్తుండగా, కృతిశెట్టి.. ఆత్మలతే మాట్లాడే జిప్సీ తరహా పాత్రలో కనిపించనుంది. అయితే కృతి చెప్పింది చూస్తుంటే ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పినట్లు అనిపిస్తుంది. మరి నిజంగా ఈమెకు ఆత్మ కనబడిందో లేదంటే కల్పించి చెబుతోందా?

    కృతి కెరీర్ విషయానికొస్తే.. 'ఉప్పెన'తో సూపర్ హిట్ అందుకుంది. కానీ తర్వాత తెలుగులో చేసిన దాదాపు సినిమాలన్నీ ఫెయిల్. దీంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. కానీ కోలీవుడ్‌లో కూడా ఈమె చేసిన చిత్రాలు పలు కారణాల వల్ల ఆలస్యమైపోయాయి. ఈ మూవీ కూడా రెండు మూడేళ్ల పాటు సెట్స్‌పై ఉండి, ఇప్పుడు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

    (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

  • కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూలీ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా.. బాలీవుడ్ నటుడు ‍అమిర్ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత అమిర్‌ ఖాన్‌తో మూవీ తెరకెక్కించేందుకు లోకేశ్‌ రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అటు కోలీవుడ్.. ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

    అయితే ఇటీవల ఈ సినిమా రద్దైనట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే స్టోరీని మరో నటుడితో లోకేశ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ స్పందించారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఈ విషయంపై మాట్లాడారు. కాగా.. అమిర్‌తో సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

    మరోవైపు లోకేశ్ కనగరాజ్‌ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోగా డీసీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వామిక గబ్బి హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా రజనీకాంత్‌- కమల్‌హాసన్‌లతో లోకేశ్‌ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పాటు ఖైదీ -2 మూవీని ఎప్పుడో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ బిజీగా ఉండడం వల్లే అమిర్‌ ఖాన్‌తో చిత్రంపై రూమర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.  

  • సినీ ఇండస్ట్రీలో వారసులు, నెపోటిజం గురించి మీకు తెలిసే ఉంటుంది. అలా ఈమె కూడా తల్లితండ్రి హీరోహీరోయిన్ కావడంతో సులువుగానే నటి అయిపోయింది. కాకపోతే పట్టుమని ఐదు మూవీస్ చేసిందో లేదో పూర్తిగా మాయమైపోయింది. ప్రస్తుతం తెరపై ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?

    పైన ఫొటోలో కనిపిస్తున్న పాప అక్షర హాసన్. ఈమె తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ చిన్న కూతురు. కమల్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. గతంలో హీరోయిన్ సారికతో రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వాళ్లే శ్రుతి హాసన్, అక్షర హాసన్. శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేసే రేంజుకి వెళ్లింది.

    (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)

    మరోవైపు అక్షర పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా తయారైంది. తల్లిదండ్రుల్లానే అక్షర కూడా ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అలా 2010లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. మణిరత్నం తీసిన 'కడలి' మూవీలో ఈమెనే తొలుత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో లెక్కలు మారిపోయాయి. అలా కొన్నాళ్ల పాటు దర్శకత్వం విభాగంలో మెలకువలు నేర్చుకున్న అక్షర.. 2015లో 'షామితాబ్' మూవీతో నటిగా మారింది.

    తొలి సినిమాలోనే(హిందీ) అమితాబ్ బచ్చన్, ధనుష్ లాంటి స్టార్స్‌తో నటించింది. కానీ ఏం లాభం? ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయింది. తర్వాత హిందీలో మరో మూవీ.. అనంతరం తమిళంలో మూడు చిత్రాలు చేసింది. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా అక్షరకు ఉపయోగపడలేకపోయాయి. చివరగా 2022లో ఓ సినిమాలో కనిపించిన అక్షర.. తర్వాత నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే తల్లితో కలిసి ముంబైలో ఉంటోంది. తాజాగా తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న తన చిన్నప్పటి ఫొటోలని షేర్ చేసింది. అలా ఇప్పుడు మరోసారి అక్షర హాసన్.. వార్తల్లో నిలిచింది.

    (ఇదీ చదవండి: టార్గెట్‌ 'తనూజ'.. బిగ్‌బాస్‌ ఇదేం 'ట్రై యాంగిల్‌')

  • బిగ్‌బాస్‌ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది.  నేడు జరగనున్న ఎలిమినేషన్‌ తర్వాత టాప్‌-5లో ఉండే కంటెస్టెంట్స్‌ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్‌ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని స్టార్‌ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్‌ టీమ్‌ వాటిని కూడా హైడ్‌ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్‌ షాట్స్‌ కూడా ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తున్నారు.

    ట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం)తో రచ్చ
    బిగ్‌బాస్‌ గేమ్‌లో భాగంగా  ట్రై యాంగిల్‌ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్‌ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్‌లో లేదని మొదట తనూజ పాయింట్‌ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్‌ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.

    బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లు
    ట్రై యాంగిల్‌ (త్రిభుజాకారం) పాయింట్‌ గురించి ఈ శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్‌ చేస్తూ బిగ్‌బాస్‌ టీమ్‌ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్‌ టీమ్‌  రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్‌ గేమ్‌ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్‌ ప్రశ్నించలేదు. రింగ్‌ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్‌ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్‌ చేస్తున్నారని చెప్పడం విశేషం.  

    ఒక టాస్క్‌లో కల్యాణ్‌ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్‌ అయ్యావ్‌ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు.  తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్‌ టీమ్‌ టార్గెట్‌ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడుతున్నాడని ఫ్యాన్స్‌ అంటున్నారు.
     

    https://x.com/phantom242628/status/1994974214286389755?s=20

  • మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సోషల్ మీడియా యుగంలో మోసాలు మరింత ఎక్కువయ్యాయి. సైబర్‌ క్రైమ్స్‌తో పాటు ధనార్జనే ధ్యేయంగా పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్‌ కాల్‌, ఆడిషన్స్ పేరిట ఏదో ఒక చోట ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. అలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని తాజాగా ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాణ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరించింది. 

    నిర్మాత నవీన్ యెర్నేని పేరు మీద  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మా దృష్టికి వచ్చిందని తెలిపింది. దయచేసి అది నకిలీ ఖాతా అని గుర్తించాలని ప్రజలను కోరింది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చే ప్రతి కాస్టింగ్ కాల్ మా అధికారిక హ్యాండిల్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని తెలిపింది. మా చిత్రాల పేరు చెప్పుకునే వ్యక్తులు లేదా ఏజెన్సీలతో ఎవరూ సంభాషించవద్దని మేము ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి తప్పుదారి పట్టించే ప్రొఫైల్స్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

     

  • నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. గతనెల థియేటర్లలో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగానే రాబట్టింది. దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.

    అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ బ్రేకప్‌ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. దీంతో ఈ మూవీకి థియేటర్ల వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్‌ రష్మిక లుక్‌పై కామెంట్‌ చేశాడు. క్లైమాక్స్‌ సీన్‌లో ప్రత్యేకమైన లుక్ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏమిటి? ఆమె ముఖం, దుస్తులపై అన్ని రంగులు ఎందుకు? ఇది చాలా పవర్‌ఫుల్‌ మూవీనే.. కానీ అర్జున్ రెడ్డికి, ది గర్‌ఫ్రెండ్‌కి సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించాడు.

    నెటిజన్ ప్రశ్నకు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు. ఈ మూవీకి ఏ సినిమాతోనూ సంబంధం లేదన్నారు. ఈ రంగులు ఆమెను సిగ్గుపడేలా, అవమానించడానికి విక్రమ్ ఉపయోగిస్తాడు.. అలా  వాటిని స్వీకరించడం నేర్చుకుంది. అది ఆమెలో ఇప్పుడొక భాగమని కూడా తెలుసు.. ఆ అంగీకారమే తనను మరింత బలంగా, అజేయంగా చేసిందన్నారు. ఒకప్పుడు ఇంట్రావర్ట్‌గా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు  కళాశాల అందరి ముందు  ఈ రంగులతో నిలబడటానికి ఆలోచించదు.. దాన్ని చెప్పడానికి ఉద్దేశించినదే ఆ రంగుల ఎంపిక. సింపుల్‌గా చెప్పాలంటే మరి నీకు లేని సిగ్గు నాకెందుకు రా యెదవ!అని చెప్పడమేనని రాహుల్ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. 
     

     

  • టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలోకి వచ్చి వీటిని చూసే ప్రేక్షకులు చాలావరకు తగ్గిపోయారు. అదే టైంలో ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం బాగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చిన్న చిత్రాలు కొన్నిసార్లు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు థ్రిల్లర్ సినిమానే 'దివ్య దృష్టి'. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?

    'ప్రేమకావాలి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈషా చావ్లా.. ఓవర్‌నైట్ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమైపోయింది. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ పాత్రలో నటించిందని అంటున్నారు గానీ క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఈమె లీడ్ రోల్ చేసిన చిత్రమే 'దివ్యదృష్టి'. సునీల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 19 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

    (ఇదీ చదవండి: 'గుమ్మడి నర్సయ్య'గా శివన్న.. ఎందుకు చేస్తున్నారో తెలుసా?)

    'దివ్యదృష్టి' టీజర్ బట్టి చూస్తే.. ఓ అమ్మాయికి ప్రమాదవశాత్తూ కళ్లుపోతాయి. అయినా సరే బతుకుతుంది. తర్వాత తన దివ్యదృష్టిని ఉపయోగించి కొన్ని సంఘటనలని ముందుగానే చూస్తుంది. ఇంతకీ ఈమె కళ్లు పోవడానికి కారణమేంటి? ఈమె వెంటపడుతున్న వ్యక్తి ఎవరు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

    ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల విషయానికొస్తే రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, కామెడీ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' జీ5లో, 'స్టీఫెన్' అనే డబ్బింగ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా హాట్‌స్టార్‌లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది.

    (ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. 'స్టీఫెన్' సినిమా ఓటీటీ రివ్యూ)

  • మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్‌ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ని సౌత్‌ బ్యూటీస్‌ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అవుతుంటే.. బాలీవుడ్‌ భామలు మాత్రం కెరీర్‌ విషయంలో తడబడుతున్నారు.  వరుస అపజయాల కారణంగా పాన్‌ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు.

    అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటే
    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో అలియాభట్‌ ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఆమె ఇమేజ్‌ మరింత పెరిగింది. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్‌ మాత్రం  పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    హిట్‌ కోసం కృతి ఎదురుచూపులు
    బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్‌ లేదు. ధనుష్‌తో కలిసి నటించిన  'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.

    కియారాకు వరుస షాకులు
    అందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్‌ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్‌ ఛేంజర్‌ వరకు ఇలా ఆమె నటించిన భారీ​ చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.

    ‘కండీషన్ల’తో రిస్క్‌ చేస్తున్న దీపిక
    బాలీవుడ్‌ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్‌ని రిస్క్‌లో పెడుతోంది. స్పిరిట్‌లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్‌ నచ్చక దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్  నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. 

    అందులో ఒకటి షారుఖ్‌ ఖాన్‌ ‘కింగ్‌’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది. మరొకటి అల్లు అర్జున్‌-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్‌ అంటూ దీపికా తన కెరీర్‌ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. 

    ఒవైపు సౌత్‌ స్టార్ల డామినేషన్‌..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్‌ కెరీర్‌ డేంజర్‌ పడింది. బాలీవుడ్‌లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్‌గా భారీ హిట్‌ పడాల్సిందే. 

  • ఉమ్మడి రాష్ట్రంలో  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య జీవితం నేటి తరానికి సినిమా రూపంలో దగ్గర కానుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన సీపీఐ(ఎంఎల్‌)తో 1981లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రామ సర్పంచిగా తన ప్రస్థానం మొదలైంది. ఇల్లెందు ఎమ్మెల్యేగా 1983, 1985, 1989లలోనూ వరుసగా గెలిచారు. మళ్లీ 1999, 2004లో  విజయం సాధించారు. సుమారు 25 ఏళ్లుగా పదవిలో ఉన్నప్పటికీ  తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు.  కొద్ది పాటి పొలం తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులు లేవు. అలాంటిది కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ ఆయన బయోపిక్‌లో నటించడం విశేషం.

    తండ్రి కోసం ఓకే చెప్పిన శివరాజ్‌ కుమార్‌  
    డైరెక్టర్‌ పరమేశ్వర్‌ హివ్రాలే గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, శివరాజ్‌ కుమార్ గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ చేయడానికి ప్రధాన కారణం ఆయన జీవితం తన తండ్రి డా. రాజ్‌కుమార్‌ సేవా తత్వాన్ని గుర్తు చేయడమే.. నర్సయ్య  సాధారణ జీవనశైలి, ప్రజల కోసం చేసిన త్యాగం, నిజాయితీ ఇవన్నీ శివన్నను ఆకర్షించాయి. తన తం‍డ్రి రాజ్‌కుమార్‌ పేరుతో ఆయన సోదరుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఎన్నో స్కూల్స్‌ నిర్మించారు. ఆపై కళ్యాణమండపాలు, ఆసుపత్రులు వంటి కార్యక్రమాలు చేశారు. ప్రజల కోసం తమకు చేతనైనంత వరకు చేయడం మాత్రమే వారికి తెలుసు. గుమ్మడి నర్సయ్య జీవితం కూడా అంతే. అందుకే శివన్నకు ఈ బయోపిక్‌లో నటించాలని ఆసక్తి కలిగింది.

    ఇరవై రోజుల్లోనే ఫైనల్‌ 
    గుమ్మడి నర్సయ్య స్క్రిప్టును డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌కు పంపించిన వెంటనే బెంగళూరు రావాలని ఆయన మేనేజర్‌ నుంచి కాల్‌ వచ్చినట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే, కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్‌కుమార్‌ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్‌లో పాల్గొన్నారని పంచుకున్నారు. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్‌కుమార్‌ చాలా ఉత్సాహంతో ఉన్నారని ఆయన అన్నారు.

    ప్రభుత్వ కార్యాలయం ఎదుట సాదారణ వ్యక్తిలా..
    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా హంగు, ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గుమ్మడి నర్సయ్య గడిపారు. ఇప్పటికీ సైకిల్‌ మీదే ప్రయాణం. బస్సు, ఆటోలలోనే ఎక్కువగా కనిపిస్తారు. ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధరఖాస్తులు పట్టుకొని నిల్చొని ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ తన పార్టీని అంటిపెట్టుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఓటమి చవి చూసిన తర్వాత నేటి తరం నేతలు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ, నర్సయ్య మాత్రం ఒకటే పార్టీ.. అదే ఎర్రజెండా నీడలో తన పోరాటం కొనసాగిస్తున్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశారు. ఏనాడు కూడా అవినీతిని తన గుమ్మం వద్దకు చేరనీయలేదు. ఒక రాజకీయ నాయకుడి జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. అందుకే కన్నడ స్టార్‌ హీరో ఆయన బయోపిక్‌ చేసేందుకు ఒప్పుకున్నాడు.

    తెలుగు హీరోలు ఎందుకు చేయలేదు?
    తెలుగు హీరోలు ఎందుకు చేయలేదని దర్శకుడిని ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పుకొచ్చారు. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు అన్నట్లు పేర్కొన్నారు. అయితే, చివరకు పాల్వంచకు చెందిన ఎన్‌.సురేశ్‌రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మన తెలుగు హీరోలకు భారీ బడ్జెట్‌ ఉండాలి, ఇతర దేశాల్లో షూటింగ్‌, హీరోయిన్లతో రెండు పాటలు, గ్రాఫిక్స్‌తో భారీ ఫైట్లు ఇలా ఉంటే  ఓకే చెప్తారని తెలిసిందే. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి జీవితం మొత్తం చాలా సాధారణంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఓకే చెప్తారని ఆశించడం కష్టమే..

  • టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వితికా శేరు- వరుణ్ సందేశ్ ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కొత్తింట్లో అడుగుపెట్టిన ఈ జంట సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

    తాజాగా ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్‌ రోజులను గుర్తు చేసుకుంది. నిశ్చితార్థం జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పదేళ్ల మా ప్రేమలో అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు రాలేదని.. కేవలం మా వయస్సు సంఖ్య మాత్రమే పెరిగిందని పోస్ట్ చేశారు. మాకెలాంటి తొందర, గడువులు లేవు.. ఇప్పుడిప్పుడే మేమిద్దరం జీవితం గురించి నేర్చుకుంటున్నామని తెలిపారు. దశల వారీగా జీవితాన్ని నిర్మించుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వితికా శేరు- వరుణ్ సందేశ్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీరిద్దరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.

    కాగా.. ఈ ఏడాది వరుణ్ సందేశ్‌కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.  వరుణ్ సందేశ్‌ పుట్టిన రోజున మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్‌డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. 


     

     

  • అప్పట్లో సీరియల్ పార్వతి దేవిగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక.. శుభవార్త చెప్పేసింది. తాను కూతురికి జన్మనిచ్చినట్లు బయటపెట్టింది. ఈ మేరకు ఓ ఫొటోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో తోటి నటీనటులు, నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

    (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ 9 తనూజ చెల్లి.. ఫోటో వైరల్‌)

    'దేవాన్ కే దేవ్ మహాదేవ్' అనే సీరియల్‌లో పార్వతి దేవిగా నటించిన సోనారిక.. దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. అలా మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించింది. తర్వాత తెలుగులోనూ 'జాదుగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాల్లో మంచు విష్ణుకి జోడీగా చేసింది. కానీ ఇవి హిట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో మళ్లీ కనిపించలేదు. చివరగా 2022లో 'హిందుత్వ' అనే హిందీ మూవీ చేసింది.

    చివరగా సినిమా చేసిన ఏడాదిలోనే వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి గతేడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసిన సోనారిక.. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు డిసెంబరు 5న తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: 60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే.. కానీ తనను చూడగానే: ఆమిర్ ఖాన్)

  • అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్‌మెంట్‌ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్‌ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్‌లో ఉంటారు. బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.

    మూడోసారి ప్రేమలో..
    రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్‌లో లవ్‌లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్‌షిప్‌లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 

    గొడవల్లేవ్‌
    వైవాహిక బంధంలో సక్సెస్‌ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్‌లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్‌ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయిన‍ప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. 

    ఫస్ట్‌ పెళ్లి
    కిరణ్‌ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్‌, కిరణ్‌.. ఆమె పేరెంట్స్‌.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్‌ ఖాన్‌.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్‌ ఖాన్‌, ఇరా ఖాన్‌ సంతానం. 

    రెండో పెళ్లి
    కొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్‌ (Aamir Khan).. 2005లో కిరణ్‌ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్‌ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.

    చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్‌

  • కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య 47వ సినిమా ప్రారంభమైంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.  తాజాగా పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. జీతూ మాధవన్‌ ఇప్పటికే రోమాంచమ్‌, ఆవేశం చిత్రాలతో వరుస విజయాల్ని అందుకున్న  విషయం తెలిసిందే. రేపటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

    భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో  క్యూట్ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తుంది. సూర్యకు జోడీగా వెండితెరపై ఆమె కనిపించనుంది. చాలారోజుల తర్వాత ఒక పాన్‌ ఇండియా సినిమాలో ఆమె భాగం కానుంది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్‌కు నజ్రియా సతీమణి అనే విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌, దర్శకుడు జీతూ మాధవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆవేశం సినిమా భారీ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే.

    ప్రేమలు, కొత్తలోక మూవీస్‌తో పాపులర్‌ అయిన  యంగ్ హీరో నస్లెన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిచడం విశేషం. ‘ఆవేశం’ లాంటి ఒక మాస్ ఎనర్జిటిక్ మూవీ తర్వాత జిత్తు మాధవన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సూర్య కనిపించనున్నారు.
     

  • బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.

    ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్‌ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్‌ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు.
     

  • కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ నటించిన మార్క్‌ ట్రైలర్‌ వచ్చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది. ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా మార్క్‌ సినిమా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్‌ ఇప్పటికే పేర్కొంది. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించారు. దర్శకుడు  విజయ్‌ కార్తికేయ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌  సుదీప్‌కి  47వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ​్‌లో విడుదల కానుంది.
     

  • ఇంట్లో పెళ్లంటే హడావుడి మామూలుగా ఉండవు. అందులోనూ ప్రాణంగా ప్రేమించే చెల్లి పెళ్లంటే సందడి వేరే లెవల్లో ఉంటుంది. కానీ, పండగ వాతావరణాన్ని తనూజ మిస్అయింది. తెలుగు బిగ్బాస్‌ 9లో అడుగుపెట్టిన తనూజ ఎంతోకాలం ఉండననుకుంది. ఇంట్లోవాళ్లు కూడా వెంటనే వచ్చేస్తుందిలే అని పంపించారు. తీరా తన గేమ్తో విన్నింగ్‌ రేస్లో ఉంది. 13 వారాలుగా టాప్ఓటింగ్తో దుమ్ము లేపుతోంది.

    పెళ్లికూతురుకి ఆశీర్వాదం
    అయితే కుటుంబాన్ని మాత్రం చాలానే మిస్అవుతోంది. తను కెప్టెన్అయినవారమే ఫ్యామిలీ మెంబర్స్హౌస్లోకి వచ్చారు. అలా తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తనూజకు కన్నీళ్లాగలేదు. వరుసకు చెల్లే అయినా తల్లిలా తనూజకు ఏడవద్దని సలహా ఇచ్చింది. 'ఓపక్క పెళ్లి పనులు.. మరోపక్క నువ్వు ఇక్కడ షోలో ఏడుస్తుంటే అక్కడ అమ్మ, అక్క ఏడుస్తున్నారు

     నా పెళ్లి విషయం మర్చిపోయింది.
    వాళ్లని హ్యాండిల్చేయలేకపోతున్నా.. నా పెళ్లికి కొద్దిరోజులే సమయం ఉంది. అన్నీ హ్యాండిల్చేయాలి. ప్లీజ్‌, నువ్వు ఏడవకు' అని బతిమాలింది. 'నువ్వు ఒక్కసారి ఏడిస్తే అమ్మ రెండురోజులు ఏడుస్తుంది. నా పెళ్లి విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజు బిగ్బాస్‌, రీల్స్చూస్తుంది.. నువ్వేం చేస్తావో తెలీదు, విన్అవ్వాలి. నేను ఏది కొన్నా ఫస్ట్ఫోటో నీకు పెట్టేదాన్ని.. అది మిస్అవుతున్నా.. అని భావోద్వేగానికి లోనైంది.

    శుభలేఖలో తనూజ పేరు
    తర్వాత గార్డెన్ఏరియాలో చెల్లెల్ని తన చేతులతో పెళ్లికూతుర్ని చేసి ఆశీర్వదించింది. శుభలేఖలో తన పేరు చూసుకుని తనూజ మురిసిపోయింది. తన పెళ్లికి బిగ్బాస్టైటిల్గిఫ్ట్గా కావాలని చెప్పింది. అందుకోసం తనూజ కూడా బాగానే కష్టపడుతోంది. నవంబర్‌ 23 నాటి ఎపిసోడ్లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది.

    పూజ పెళ్లి వీడియో
    అలా నవంబర్చివరి వారంలో తనూజ చెల్లి పూజ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం ఎంతైనా తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు.

    చదవండి: మనస్సాక్షి లేదా? ప్రజల బాధను అవమానిస్తారా? నటి ఫైర్

  • కలర్‌ఫోటో మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్న డైరెక్టర్‌ సందీప్ రాజ్‌. ప్రస్తుతం మోగ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రంలో యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.

    అయితే టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌ రాజ్‌ గతేడాది వివాహబంధంలోకి ‍అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నటి చాందిని రావును ఆయన పెళ్లాడారు. డిసెంబరు 7న తిరుపతితో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. మొదటి పెళ్లి రోజు కావడంతో డైరెక్టర్ సందీప్ రాజ్ తన భార్య చాందిని రావుకు విషెస్ తెలిపారు. హ్యాపీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ క్యూట్‌నెస్‌.. చల్లగుండు బిడ్డ అంటూ సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఈ జంటకు మ్యారేజ్ డే విషెస్ చెబుతున్నారు. 

    కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ.. డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు. 


     

     

  • దొంగతనాల కథాంశం సినిమాలలో మహా గమ్మత్తుగా, థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఏ తరం ప్రేక్షకులనైనా ఇట్టే మెప్పిస్తాయి. దొంగతనానికి సమయం, సందర్భంతో పాటు చక్కటి ప్రణాళిక కూడా చాలా ముఖ్యం. అదే నేపథ్యంలో హాలివుడ్ దర్శకుడు ఓ కొత్త చిత్రాన్ని వినూత్న రీతిలో తెరకెక్కించాడు. దాని పేరే జింగిల్ బెల్ హీస్ట్(Jingle Bell Heist Movie). పేరుకు తగ్గట్టు క్రిస్మస్ పండుగ నేపధ్యంలోనే జరిగే ఓ దొంగతనం పై ఈ సినిమా ఉంటుంది. దొంగతనంతో పాటు ఈ సినిమాలో సెంటిమెంట్, కామెడీ ఎలిమెంట్స్ తో మంచి థ్రిల్లింగ్ గా ఉంటుందీ సినిమా. 

    ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ పెద్ద మాల్ లో పని చేసే  సోఫీ తన కోసం, తన తల్లి ఆసుపత్రి ఖర్చుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. ఓ సమయంలో తన స్టోర్ లోనే కాస్తంత పెద్ద సొమ్మును కాజేస్తుంది. ఇది అక్కడి సీసీటీవిలో రికార్డ్ అవుతుంది. అయితే ఆ సీసీ టీవి ని ఎక్కడ నుండో హాక్ చేసిన నిక్ సోఫీ చేసిన పనికి వీస్తుపోతాడు. అదే అదనుగా నిక్ సో ఫీకి తన వీడియో చూపించి తాను చేయబోయే ఓ పెద్ద దొంగతనంలో సహాయ పడమని బెదిరిస్తాడు. ఇక వేరే దారి లేక సోఫీ నిక్ తో కలుస్తుంది. నిక్ సోఫీ పని చేసే స్టోర్ ఓనర్ లాకర్ ని దోచుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ స్టోర్ ఓనర్  దగ్గర చాలా పెద్ద డబ్బు ఓ సేఫ్ లో ఉంటుంది. 

    ఆ సేఫ్ సూపర్ సెక్యూర్ గా ఉంటుంది. అయితే నిక్, సోఫీ క్రిస్మస్ పండుగ రోజు దొంగతనం చేయాలనుకుంటారు. నిక్ స్టోర్ ఓనర్ సేఫ్ సెక్యురిటీని హాక్ చేసి పాస్ వర్డ్ తెలుసుకోవాలని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ ని ట్రాప్ చేస్తాడు. మరి ఆ ట్రాప్ లో ఇరుక్కుని స్టోర్ ఓనర్ గర్ల్ ఫ్రెండ్ పాస్ వర్డ్ లీక్ చేస్తుందా...సోఫీ నిక్ ఈ దొంగతనాన్ని చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం నెట్ ఫ్రిక్స్ ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న జింగిల్ బెల్ హీస్ట్ మూవీలోనే చూడాలి. ఓ రొటీన్ పాయింట్ ని చాలా విభిన్నంగా చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ సినిమా మాతృక ఇంగ్లీషు అయినా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది.  వీకెండ్ కి వాచ్ బుల్ మూవీ ఎంజాయ్.
    – హరికృష్ణ ఇంటూరు 

Sports

  • మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ త‌న 17 ఏళ్ల సుదీర్ఘ‌ నిరీక్షణకు తెర దించాడు. త‌న కెరీర్‌లో మొట్టమొదటి ఫార్ములా వ‌న్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఆదివారం యాస్ మెరీనా సర్క్యూట్‌లో జరిగిన సీజన్-ముగింపు అబుదాబి గ్రాండ్ ప్రి (Abu Dhabi GP)లో మూడో స్ధానంలో నోరిస్ నిలిచాడు.

    అయితే డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నోరిస్ (423 పాయింట్లు) అగ్ర‌స్ధానంలో నిలిచి తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) కేవ‌లం రెండు పాయింట్ల తేడాతో టైటిల్‌ను కోల్పోయాడు.

    దుబాయ్‌లో జ‌రిగిన చివ‌రి రేసును వెర్‌స్టాపెన్ గెలుచుకున్న‌ప్ప‌టికి.. ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో(421 పాయింట్లు) రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాగా 2008లో లూయిస్ హామిల్టన్ (Lewis Hamilton) గెలిచిన తర్వాత మెక్‌లారెన్‌కు డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ దక్కడం ఇదే మొదటిసారి.
     

  • యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. ‍బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 65 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.

    దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 అధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. అయితే నాలుగో రోజు ఆట సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. హెడ్ ఔటైన వెంట‌నే క్రీజులోకి వ‌చ్చిన స్మిత్ మ్యాచ్‌ను త్వ‌రగా ముగించేందుకు ప్ర‌య‌త్నించాడు.

    ఈ క్ర‌మంలో ఆసీస్ ఇన్నింగ్స్ ఏడో ఓవ‌ర్ వేసిన ఆర్చ‌ర్.. తొలి బంతిని స్మిత్‌కు 146.6 వేగంతో గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఆ త‌ర్వాత బంతిని స్మిత్‌కు 149.5 కి.మీ వేగంతో వేశాడు.   ఆ బంతిని స్టీవ్‌ అప్ప‌ర్ క‌ట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు.

    వెంట‌నే అర్చ‌ర్ స్మిత్ వ‌ద్ద‌కు వెళ్లి టార్గెట్ త‌క్కువ‌గా ఉన్నా అంత దూకుడుగా ఎందుకు ఆడుతున్నావు? "ఓడిపోతాము అని తెలిసిన‌ప్పుడు నువ్వెందుకు అంత వేగంగా బౌలింగ్ చేస్తున్నావు ఛాంపియన్ అంటూ స్మిత్ అంటూ బ‌దులిచ్చాడు. 

    ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. యాషెస్ సిరీస్ అంటే ఏ మాత్రం ఫైర్‌ ఉండాలని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇరు జ‌ట్లు మ‌ధ్య మూడో టెస్టు అడిలైడ్ వేదిక‌గా డిసెంబ‌ర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: IND vs SA: కోహ్లి, రోహిత్‌లకు షాకిచ్చిన గౌతమ్‌ గంభీర్‌!

     

  • వన్డే ప్రపంచకప్‌-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే స‌మాధాన‌మే ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఇద్దరూ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లో రో-కో అద‌ర‌గొట్టారు.

    కోహ్లి రెండు సెంచరీలతో స‌త్తాచాటి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిల‌వ‌గా.. రోహిత్ కూడా ప‌రుగులు వ‌ర‌ద పారించాడు. ప్ర‌స్తుతం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.

    భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్‌-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.

    వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్‌, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్‌ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.

    రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.
    చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ

  • నితీశ్ కుమార్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ నుండి మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఏకైక క్రికెట‌ర్‌. బోర్డర్ గవాస్క‌ర్ ట్రోఫీలో టెస్టు అరంగేట్రం చేసిన నితీశ్‌.. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై స‌త్తాచాటాడు. ప్ర‌తిష్టాత్మ‌క మెల్‌బోర్న్ మైదానంలో సెంచ‌రీ చేసి ఆపై భార‌త జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా మారాడు. 

    గ‌తేడాది టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి.. ఈ ఏడాది ఆస్ట్రేలియా టూర్‌లో వ‌న్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే అద్భుత‌మైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్న నితీశ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం స‌రిగ్గా ఉప‌యోగించుకోవడంలో విఫ‌ల‌మైంది.

    నితీశ్‌ రోల్‌ ఏంటి?
    హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ తీరును చూస్తుంటే నితీశ్ నిజంగా ఆల్‌రౌండరేనా సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. నితీశ్ ప్ర‌ధాన జ‌ట్టుకు ఎంపిక అవుతున్న‌ప్ప‌టికి తుది జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కించుకోలేక‌పోతున్నాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ నితీశ్ తిరిగి స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు. అయితే ఈ సిరీస్‌లో నితీశ్‌తో కనీసం పది ఓవర్లు కూడా బౌలింగ్ చేయించలేదు.

    ఆ త‌ర్వాత సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్ప‌టికి ఈడెన్ గార్డెన్స్ టెస్టు ముందు అత‌డిని జ‌ట్టు నుంచి రిలీజ్ చేశారు. అయితే కోల్‌క‌తా టెస్టులో భార‌త్ ఘోర ఓట‌మి పాల‌వ్వ‌డం, శుభ్‌మ‌న్ గిల్ గాయప‌డ‌డంతో అత‌డికి మ‌ళ్లీ పిలుపు నిచ్చారు.

    అయితే గౌహ‌తి వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు తుది జ‌ట్టులో నితీశ్‌కు చోటు ద‌క్కింది. కానీ ఈ మ్యాచ్‌లో కూడా నితీశ్‌కు ఎక్కువ ఓవ‌ర్లు బౌలింగ్ చేసే అవ‌కాశం ల‌భించ‌లేదు. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి కేవ‌లం ప‌ది ఓవ‌ర్లు మాత్ర‌మే నితీశ్ వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 150 ఓవ‌ర్లు పైగా బౌలింగ్ చేస్తే.. నితీశ్‌కు కేవ‌లం 6 ఓవ‌ర్లు ద‌క్కాయి. నితీశ్ త‌న మీడియం పేస్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్ట‌గ‌ల‌డు.

    ఇంతకుముందు ఆసీస్‌, ఇంగ్లండ్ టూర్‌ల‌లో బంతితో కూడా నితీశ్ స‌త్తాచాటాడు. కానీ స్వ‌దేశంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎందుకు బౌలింగ్ చేయించడం లేదో ఆర్ధం కావ‌డం లేదు. అదేవిధంగా ఆసీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 5 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు.

    దీంతో గంభీర్‌పై అశ్విన్‌, ఆకాష్ చోప్రా వంటి మాజీలు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించారు. హార్దిక్ పాండ్యా స్ధానంలో అత‌డిని జ‌ట్టులోకి తీసుకున్న‌ప్పుడు ఎందుకు బౌలింగ్ చేయించ‌డం లేద‌ని అశ్విన్ ప్ర‌శ్నించాడు.

    నితీశ్‌కు నో ఛాన్స్‌
    సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు కూడా నితీశ్ ఎంపిక‌య్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు. ప్ర‌ధాన ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టులోకి తీసుకుని అత‌డిని బెంచ్‌కే ప‌రిమితం చేయ‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌డుతున్నారు. అదేవిధంగా  మొన్న‌టివ‌ర‌కు టీ20ల్లో భాగంగా ఉన్న నితీశ్‌ను పాండ్యా రావ‌డంతో జ‌ట్టు నుంచి త‌ప్పించారు.

    సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక భార‌త జ‌ట్టులో ఈ ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్‌కు చోటు ద‌క్క‌లేదు. దీనిబ‌ట్టి నితీశ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల‌లో లేనిట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌తో జ‌రిగే ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లో కూడా నితీశ్ ఆడే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. 

    దీంతో ఆరు నెల‌ల త‌ర్వాత శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు నితీశ్‌ తిరిగి భార‌త జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ సిరీస్ శ్రీలంకలో జ‌ర‌గ‌నుందున నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో క‌చ్చితంగా చోటు ద‌క్కుతుందో లేదో తెలియ‌దు. ఉప‌ఖండ పిచ్‌లు ఎక్కువ స్పిన్‌కు అనుకూలించ‌నుంద‌న అక్ష‌ర్‌, కుల్దీప్‌, జ‌డేజాల‌తో భార‌త్ ఆడే ఛాన్స్ ఉంది.
    చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
     

  • యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను  8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.  65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు రెండు వికెట్లు కోల్పోయి చేధించారు. ట్రావిస్ హెడ్ రెండో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచినప్పటికి..  జెక్ వెదర్‌ల్డ్ 17, స్టీవ్ స్మిత్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

    అదరగొట్టిన రూట్‌..
    ఈ పింక్‌బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. వెటరన్ బ్యాటర్ (206 బంతుల్లో 138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ 76 పరుగులు చేశాడు. ఆఖరిలో జోఫ్రా ఆర్చర్( 38 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మరోసారి 6 వికెట్లతో సత్తాచాటాడు.

    అనంతరం ఇంగ్లీష్ జట్టుకు ఆసీస్ ధీటైన సమాధానమిచ్చింది. స్మిత్ సేన తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. స్టార్ మిచెల్ స్టార్క్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జెక్ వెదర్‌ల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65) పరుగులు, స్టీవ్ స్మిత్ (61), (అలెక్స్ క్యారీ 63) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

    ఇంగ్లండ్ ఫెయిల్‌..
    ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తేలిపోయారు. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 241 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ(44), స్టోక్స్‌(50) రాణించినప్పటికి.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలడంతో పర్యాటక జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.

    ఈ క్రమంలో ఆసీస్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మైఖల్ నీసర్ ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 17 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది.
    చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ
     

  • భారత పురుషల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండేవిధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో టీమిండియా సారథిగా శుభ్‌మన్ గిల్ ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపిస్తున్నాడు. 

    ఈ ఏడాది మేలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు జట్గు పగ్గాలను గిల్ చేపట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌కు ముందు వన్డే జట్టు బాధ్యతలను కూడా గిల్‌కే బీసీసీఐ అప్పగించింది. అంతేకాకుండా టీ20ల్లో సూర్యకు డిప్యూటీగా గిల్‌ను ఎంపిక చేశారు.

    దీంతో రాబోయో రోజుల్లో పొట్టి క్రికెట్‌లో కూడా గిల్‌ను సారథిగా నియమించే యోచనలో ఉన్నట్లు ఆర్ధమవుతోంది. అయితే టీ20 ప్రపంచకప్‌-2024 విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. అతడి స్ధానంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా లేదా జస్ప్రీత్‌ బుమ్రా ఎంపిక అవుతారని అంతా భావించారు. కానీ బీసీసీఐ మాత్రం జట్టు బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. 

    అయితే సూర్యను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పు బట్టారు. కానీ సూర్య మాత్రం తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అతడి నాయకత్వంలో భారత్ ఆడిన 22 మ్యాచ్‌లలో కేవలం రెండింట మాత్రమే ఓడిపోయింది.

    అయినప్పటికి టీ20ల్లో కూడా గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని చాలా మంది బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరాడు. అన్ని ఫార్మాట్లలో గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

    "సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ఒకరితో నాకు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్ టీ20ల్లో కూడా కెప్టెన్‌గా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకరు నన్ను అడిగారు. వెంటనే నేను అవునాని సమాధానమిచ్చాను. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి.

    శుభ్‌మన్ ఏ ఫార్మాట్‌లో నైనా జట్టును నడిపించగలడు అని చెప్పా. మూడు నెలల క్రితం అతడు ఇంగ్లండ్‌లో ఏమి చేశాడో మనమందరం చూశాము. బ్యాటింగ్, కెప్టెన్సీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ, కోహ్లి వంటి సీనియర్లు లేనప్పటికి అతడు తన కెప్టెన్సీతో అద్భుతం చేశాడు" అని 'కెప్టెన్'స్ కామ్' పోడ్‌కాస్ట్‌లో దాదా పేర్కొన్నాడు.
    చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
     

  • భారత స్టార్‌ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు మంధాన సోషల్ మీడియాలో ప్రకటించింది.

    "గత కొద్ది రోజులగా నా వ్యక్తిగతం జీవితంపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన అవసరముంది. నా పెళ్లి రద్దైందని క్లారిటీ ఇస్తున్నా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. దయచేసి ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంటుంది.  భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యమని" ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

    ముచ్ఛల్ ఏమన్నాండంటే?
    ఇక స్మృతి మంధానాతో తన బంధం ముగిసిందని పలాష్ ముచ్ఛల్ సైతం ధ్రువీకరించాడు. తాము విడిపోవ‌డానికి సంబంధించిన నిరాధారమైన వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు ముచ్ఛల్ తెలిపాడు.

    "నా వ్యక్తిగత సంబంధం నుండి బయటకు వచ్చాను. నా జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. నిరాధారమైన వార్తలను ప్రజలు అంత సులభంగా నమ్మడం చూసి చాలా బాధగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్ట కాలం. కానీ ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటకు వస్తానన్న నమ్మకం ఉంది.

    ఆధారాల్లేని వదంతులను ప్రచారం చేసేముందు.. ఏది నిజం, ఏది అబద్దమని ఒక్కసారి ఆలోచించుకోవాలి. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నిరాధారమైన వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ముచ్ఛల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.

    కాగా ముచ్చ‌ల్‌- స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి గుండెపోటుకు గుర‌య్యాడు. అత‌డిని హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీంతో త‌న పెళ్లిని మంధాన వాయిదా వేసుకుంటున్న‌ట్లు ఆమె మేనేజర్ మీడియాతో తెలిపాడు. ఆ తర్వాత ముచ్చల్ కూడా అనారోగ్యంతో అస్పత్రిలో చేరాడు. 

    అయితే మంధాన తన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‍స్మృతి చేతికి నిశ్చితార్థం రింగ్ లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. ఈ నేపథ్యంలోనే మంధాన, ముచ్చల్ ఇద్దరూ తాము విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.
    చదవండి: సూపర్‌ సెంచరీ తర్వాత యశస్వి జైస్వాల్‌ కీలక నిర్ణయం

     

  • భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మంధన తన వ్యక్తిగత జీవితంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. వివాహం రద్దైందని స్పష్టంగా తెలిపారు. పలాష్ముచ్చల్పేరు ప్రస్తావనకు రాకుండా విడుదల చేసిన పోస్ట్లో మంధన విధంగా రాసుకొచ్చారు.

    వివాహం రద్దు
    గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. కానీ ఇప్పుడు మాట్లాడటం అవసరం. వివాహం రద్దైంది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను.

    ప్రైవసీ ఇవ్వండి
    ఇదే పోస్ట్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ .. ఇరు కుటుంబాల ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. మేము మా స్థాయిలో ఈ విషయాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

    కెరీర్పై దృష్టి
    మంధన  కెరీర్‌పై దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. నన్ను నడిపించే ఉన్నత లక్ష్యం దేశానికి ప్రాతినిధ్యం వహించడం. భారత జట్టుకు విజయాలు అందించడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు.

    అభిమానులకు ధన్యవాదాలు మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చిందంటూ ప్రకటన ముగించారు.

    కాగా, స్మృతి మంధన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మధ్యే మంధన ముచ్చల్తో పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. అయితే ఏమైందో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. చివరికి మంధన పెళ్లి రద్దైందంటూ బాంబు పేల్చింది. మంధన ఇటీవల భారత జట్టు వన్డే ప్రపంచకప్గెలవడంలో కీలకపాత్ర పోషించింది.

  • దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో సూపర్సెంచరీ అనంతరం టీమిండియా యువ ఓపెనర్యశస్వి జైస్వాల్కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన దేశవాలీ జట్టు ముంబై తరఫున సయ్యద్ముస్తాక్అలీ ట్రోఫీ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. విషయాన్ని ముంబై క్రికెట్అసోసియేషన్సీనియర్అధికారి ఒకరు ధృవీకరించారు.

    జైస్వాల్సయ్యద్ముస్తాక్అలీ టోర్నీలో చివరిగా 2023-24 ఎడిషన్లో కనిపించాడు. టోర్నీలో అతడికి మంచి ట్రాక్రికార్డు ఉంది. 26 ఇన్నింగ్స్ల్లో 136.42 స్ట్రయిక్రేట్తో 648 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్సెంచరీలు ఉన్నాయి

    త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కోసం ఎంపిక చేసిన భారత జట్టులో జైస్వాల్కు చోటు దక్కని విషయం తెలిసిందే. జైస్వాల్కు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో (టీమిండియా) అవకాశాలు రావడం లేదు. అభిషేక్శర్మ విధ్వంసకర ప్రదర్శనలతో జైస్వాల్స్థానాన్ని ఆక్రమించాడు.

    ఇదిలా ఉంటే, భారత వన్డే వెటరన్స్టార్రోహిత్శర్మ కూడా సయ్యద్ముస్తాక్అలీ టోర్నీ ఆడతాడని ప్రచారం జరుగుతుంది. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ప్రకటించిన హిట్మ్యాన్ దేశవాలీ టీ20 టోర్నీ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడని సమాచారం. రోహిత్కానీ జైస్వాల్కానీ ముంబై జట్టుకు ఎప్పుడు అందుబాటులోకి వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు.

    ప్రస్తుతం ఎడిషన్సయ్యద్ముస్తాక్అలీ టోర్నీలో డిఫెండింగ్ఛాంపియన్గా బరిలో ఉన్న ముంబై ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి ఎలైట్గ్రూప్‌-ఏలో టేబుల్టాపర్గా కొనసాగుతుంది. జట్టుకు నాకౌట్బెర్త్ఇదివరకే ఖరారైంది

    ఎడిషన్లో శార్దూల్ఠాకూర్నేతృత్వంలోని ముంబై జట్టు అదిరిపోయే ప్రదర్శనలు చేస్తుంది. యువ ఓపెనర్ఆయుశ్మాత్రే వరుసగా రెండు సెంచరీలతో సత్తా చాటాడు. శార్దూల్ఠాకూర్స్వయంగా ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై తమ చివరి గ్రూప్మ్యాచ్ను డిసెంబర్‌ 8 ఒడిషాతో ఆడనుంది.

Politics

  • హైదరాబాద్‌:  ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్‌ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందిని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు గ్లోబల్‌ సమ్మిట్‌కు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యువతకు ఉద్యోగి ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్‌ సమ్మిట్‌కు శ్రీకారం చుట్టారన్నారు.

    ‘బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గాడిన పెట్టారు. గతంలో బిఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంట్ గా వున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు వస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు అయింది

    ప్రతి నెల 8వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు కడుతున్నాం. కుటుంబ పాలనలో తెలంగాణను దోచుకుంటుంటే కిషన్‌రెడ్డి ఎందుకు రాష్ట్రాన్ని కాపాడలేదు. రాష్ట్రం అప్పుల దిశగా వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో రాష్ట్రాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ప్రజల ఓట్లతోనే కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్‌రెడ్డి దొంగ లెక్కలతో రూ. 13 లక్షల కోట్లు తెచ్చామని అంటున్నారు. రూ. 13లక్షల కోట్లు ఏ శాఖకు తెచ్చారో కిషన్ రెడ్డి లెక్కలు చెప్పాలి. చౌరస్తాలో మైక్ తీసుకుని దొంగ లెక్కలు చెప్పడం కాదు 13 లక్షలు ఎప్పుడు తెచ్చారో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

    తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రి ఏపీకి తరలించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 18వ లోక్ సభలో చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి మీ నాయకులు ఏపీకి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఇచ్చారా...?, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా...? ఏ రాష్ట్రంలో అయినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బీజేపీ ఇచ్చిందా కిషన్ రెడ్డి చెప్పాలి’ అని సవాల్‌ విసిరారు.

    ఇదీ చదవండి:
     ‘ఏ హామిని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు’

  • నల్లగొండ:  ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  ప్రశ్నించారు. ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, మహిళలకు ఇస్తామన్న ఏ హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈరోజు (ఆదివారం, డిసెంబర్‌ 7వ తేదీ) నల్లగొండ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్‌కి ఏ మాత్రం తేడా లేదు. దేవుడిపై ప్రమాణం చేసి హామీలు ఇచ్చిన రేవంత్ ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలి,  ఒక్క నిరుద్యోగికి కూడా భృతి ఇవ్వలేదు. 

    సన్నబియ్యంలో కేంద్రం 43 రూపాయలు ఇస్తోంది. రాష్ట్ర వాటా కేవలం 15 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో లక్షన్నర కేంద్రం వాట కింద ఇస్తోంది.  మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేయలేదు. ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు చేస్తున్నారు

    తెలంగాణలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు విపరీతంగా భూ దందా సాగుతోంది భూములు అమ్మనిదే పూటగడవట్లేదు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 42 వేల కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే తయారైంది. ాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేళ్లలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: దేవుడంటే భయం లేదు.. ప్రజలంటే బాధ్యత లేని వ్యక్తి చంద్రబాబు.. వెంకటేశ్వర స్వామిని సైతం తన వికృత రాజకీయాల్లోకి లాగారు’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పరకామణి కేసులో రవికుమార్‌ని మా హయాంలోనే పట్టుకున్నాం. దాదాపు 30 ఏళ్లుగా చోరీలు చేస్తున్నా చంద్రబాబు హయాంలో పట్టుకోలేదు’’ అని శివశంకర్‌ పేర్కొన్నారు.

    ‘‘రవికుమార్ ప్రాయశ్చిత్తం చెంది తన ఆస్తిని టీటీడీ కి రాసిచ్చారు. క్లోజ్ అయిన ఆ కేసును మళ్ళీ తిరగతోడి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు దిగారు. రవికుమారే స్వయంగా ఒక వీడియో చేసి తన బాధను వెలిబుచ్చారు. ప్రాయశ్చిత్తం చెందిన వ్యక్తిని మళ్ళీ మళ్ళీ వేధించటం సబబేనా?. హిందూ మతాన్ని ఏమాత్రం లెక్కచేయని వ్యక్తి చంద్రబాబు. విజయవాడలో 40 ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీ ఆస్తులను కాజేయాలని చంద్రబాబు చూశారు. హథీరాంజీ మఠం ఆస్తులని కూడా చంద్రబాబు తన బినామీలకు రాయించారు. గోదావరి పుష్కరాల సమయంలో తన ప్రచార పిచ్చి కోసం 29 మంది చనిపోవడానికి కారణమయ్యారు’’ అని శివశంకర్‌ మండిపడ్డారు.

    ‘‘రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికిన కేసులో A2గా ఉన్న సూరిబాబుకి చంద్రబాబు రూ.5 లక్షలు ఇచ్చారు. తిరుమలలో ఉన్న వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి చంద్రబాబు. ఆరోజు సాధువులు, మఠాధిపతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చేశారు. హిందూ మతం అంటే భయం, భక్తి ఉంటే చంద్రబాబు ఇలా చేసేవారా?. జేఈవోగా సుబ్రహ్మణ్యాన్ని 9 ఏళ్లపాటు ఎందుకు కొనసాగించారో అందరికీ తెలుసు. సదావర్తి సత్రం భూములను కొట్టేయటానికి చేసిన ప్రయత్నాలు దేశమంతా తెలుసు. అనేక భూములను చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టలేదా?. కాశిరెడ్డినాయన సత్రాన్ని కూల్చేశారు. సింహాచలం ఆలయ భూములు రికార్డుల్లో  లేకుండా ఎలా పోయాయి?

    ..విజయవాడ దుర్గమ్మ ఆలయంలో బంగారు ఆభరణాలు దొంగిలించిందీ చంద్రబాబు హయాంలోనే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బ తీశారు. పరకామణి కేసులో రవికుమార్ ఎలా ప్రాయశ్చిత్త పడ్డారో చంద్రబాబు కూడా అలా ప్రాయశ్చిత్తం పడితే మంచిది. అంతేగానీ దుర్మార్గపు రాజకీయాలు చేయవద్దని కోరుకుంటున్నాం’’ అని  శివశంకర్‌ హితవు పలికారు.

  • సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీరు-బాబు-సర్కారు అన్నట్టుగా పరిస్థితి మారిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ చురకలు అంటించారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం మాఫియా చెలరేగుతోందని.. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలిశాయని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు రాలేదు గానీ మద్యం కుటీర పరిశ్రమలు భారీగా పెరిగాయన్నారు.

    ‘‘ఎక్కడ చూసినా పర్మిట్ రూములు, వైన్లు, బార్లు, బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. సీబీఎన్ అంటే చంద్రబాబు కాదు.. చీఫ్ బాట్లింగ్‌ నెట్‌వర్క్. ములకలచెరువులో పాలకాన్లలో కూడా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి తన సొంతంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నా పోలీసులు పట్టుకోలేదు. పాల వ్యాను జయచంద్రారెడ్డి అనుచరుడిదే అని తేలింది. భారీ స్కామ్‌కు కారకుడైన జయచంద్రారెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు?’’ అంటూ నాగార్జున యాదవ్‌ నిలదీశారు.

    ‘‘అద్దేపల్లి జనార్థన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు చెప్పలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నకిలీ మద్యాన్ని పట్టించారని ఆయనపై అక్రమ కేసు పెట్టించారు. జోగి రమేష్‌కి, అద్దేపల్లి జనార్థన్ మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ జనార్థన్‌తో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించి అరెస్టు చేయించారు. కుట్ర పూరితంగానే బీసే నేత జోగి రమేష్ ని అరెస్టు చేశారు. చంద్రబాబు కనుసన్నల్లోనే నకిలీ‌ మద్యం తయారీ. దీన్ని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిని ఎవరినీ వదలేది. అధికారంలోకి వచ్చాక చట్టపరంగా విచారణ జరిపిస్తాం’’ అని  నాగార్జున యాదవ్‌ తెలిపారు.

  • సాక్షి, పశ్చిమగోదావరి: టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. యాదవులపై కూటమి ప్రభుత్వం డైవర్షన​ పాలిటిక్స్‌ చేస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యాదవులకు వైఎస్‌ జగన్‌ మేలు చేశారని.. చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు.

    ‘‘తిరుమలలో గొల్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే. తిరుమలలో యాదవులకు వంశపారపర్య హక్కును తిరిగి తీసుకొచ్చింది జగనే. శ్రీకాకుళం చరిత్రలో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చింది వైఎస్‌ జగనే. విశాఖలో యాదవ మహిళ అని కూడా చూడకుండా మేయర్‌ పదవి నుంచి దించేశారు’’ అంటూ కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

     

     

     

  • సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. టోకెన్‌కు ఇంత అని కమీషన్‌ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం  వ్యవహరిస్తోందని అన్నారు.

    ఢిల్లీ వేదికగా.. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదు. లాటరీ తగిలింది.. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కమీషన్లమయంగా మారింది. టోకెన్‌కు ఇంత అని కమీషన్ పెట్టి ఓపెన్‌గా వసూలు చేస్తున్నారు. గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదు

    ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారు. ఫుట్‌బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వస్తున్న వాటిని సరిగా వినియోగించడం లేదు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50% ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. 

    బీజేపీలో మేమంతా ఒక్కటే.. 
    తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. మేము అంతా ఒక్కటే.. మా మధ్య సఖ్యత ఉంది. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారు. ఆయన నాయకత్వంలో పని చేస్తాం. రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తాము అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

National

  • గోవా: ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై అంజునా పోలీసులు సదరు క్లబ్ యజమానులు, భాగస్వాములు, మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేశారు.

    పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. దీనిలో రోమియో లేన్ చైర్మన్ సౌరభ్ లూత్రా, ఆయన సోదరుడు గౌరవ్ లూత్రా సహా ఇతర మేనేజింగ్ సిబ్బందిని నిందితులుగా పేర్కొన్నారు. సరైన అగ్నిమాపక భద్రతా పరికరాలు, భద్రతా గాడ్జెట్‌లు అందుబాటులో నిందితులు ప్రదర్శనను నిర్వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు. 

     


    ఎఫ్‌ఐఆర్ లోని వివరాలు క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెల్లడించాయి. రెస్టారెంట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు  డెక్‌లో అత్యవసర నిష్క్రమణ తలుపు లేకపోవడం ఎఫ్‌ఐఆర్‌లో గమనించదగిన అంశం.

    v

     

    అత్యవసర పరిస్థితుల్లో జనాన్ని ఖాళీ చేయించడానికి అనుమతించే మార్గం అందుబాటులో లేకపోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్/క్లబ్‌కు సంబంధిత అధికారుల నుండి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేవని తేలింది. 


     


    నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)సెక్షన్లు 105 (నేరపూరిత నరహత్య), 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్య), 125 (ఎ), 125 (బి),  287 (అగ్ని లేదా మండే పదార్థానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించడం)తో పాటు సెక్షన్ 3 (5) (సాధారణ ఉద్దేశ్యం) కింద అభియోగాలు మోపారు. ఈ ఘటనను మానవ తప్పిదంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  

    ఇది కూడా చదవండి: Goa Night Club: ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వైరల్‌ వీడియో

     

  • లేహ్‌: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా  గత మే నెలలో భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సాయుధ దళాల క్రమశిక్షణ, సంయమనంతో కూడిన ప్రవర్తనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. ఆదివారం లేహ్‌(లడఖ్)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ సమయంలో దళాలకు.. దాడులను మరింత తీవ్రతరం చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ, వారు ఉద్రిక్తతలను పెంచకుండా, ఉగ్రవాద ముప్పును సమర్థవంతంగా తటస్థీకరిస్తూ, సంయమనాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ విధంగా వారు శౌర్యం, వ్యూహాత్మక వివేకం రెండింటినీ ప్రదర్శించారని సింగ్ స్పష్టం చేశారు.

    ఆపరేషన్ సిందూర్‌లో సాయుధ దళాలు, పౌర పరిపాలన, సరిహద్దు ప్రాంతాలలో.. ముఖ్యంగా లడఖ్‌లోని పౌరుల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఇది భారతదేశ ఐక్యతను గుర్తు చేస్తుందన్నారు. ఇటువంటి సమయంలో స్థానిక సమాజాల మద్దతు కీలకమని, ఈ సమన్వయమే మనకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందన్నారు. ప్రభుత్వం, సాయుధ దళాలు, పౌరుల మధ్య ఐక్యతను బలోపేతం చేయడం ద్వారా సైన్యం ఈ బంధాన్ని కొనసాగించాలని ఆయన ఉద్ఘాటించారు.

    ఆపరేషన్ సిందూర్‌ విజయానికి సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కూడా  ఒక కారణమని రక్షణ మంత్రి తెలిపారు. కనెక్టివిటీ రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రియల్-టైమ్ నిఘా, ఉపగ్రహ మద్దతు, జాతీయ భద్రతకు వెన్నెముకగా ఉండే లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు ఆపరేషన్‌ సింధూర్‌ను సక్సెస్‌ చేశాయన్నారు. లడఖ్‌తో సహా సరిహద్దు ప్రాంతాలలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం అనేది సైనిక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా, పౌర జీవితానికి, ఆర్థిక వృద్ధికి కూడా మద్దతునిస్తుందని అన్నారు.

    కాగా 2025-26 రెండవ త్రైమాసికంలో భారతదేశం 8.2 శాతం డీజీడీపీ వృద్ధిని సాధించడంలో మెరుగైన కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు దోహదపడ్డాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మృతిచెందారు. వీరిలో పర్యాటకులు అధికంగా ఉన్నారు. ఈ దాడి దేశంలో తీవ్ర కలకలం రేపింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. 

    ఇది కూడా చదవండి: కింగ్‌ చార్లెస్ సర్‌ప్రైజ్‌.. క్రిస్మస్‌ సందడి షురూ!

  • గోవా: గోవాలోని అర్పోరాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశంలోని అందరినీ ఆవేదనకు గురిచేసింది. ఈ నేపధ్యంలో ప్రమాదం జరిగిన ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నైట్‌క్లబ్‌ను ఒక గోల్డ్‌ మెడలిస్ట్‌ స్థాపించాడని తెలియగానే పలువురు ఆశ్చర్యపోతున్నారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి బీటెక్‌లో బంగారు పతకం అందుకున్న సౌరభ్ లూత్రానే ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌ యజమాని. చదువు పూర్తయిన తర్వాత లూత్రా అంతర్జాతీయ క్లయింట్‌ల కోసం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. తరువాత తన కెరీర్‌ను రెస్టారెంట్, నైట్‌లైఫ్ వ్యాపారం వైపు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. 2016లో ఆహారపానీయాల (ఎఫ్‌ అండ్‌ బీ) పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది న్యూఢిల్లీలో  ‘రోమియో లేన్’ అనే బ్రాండ్‌ను స్థాపించారు.

    ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. అంతర్జాతీయంగా కూడా విస్తరించాలని లూత్రా ప్రణాళికలు వేశారు. అతని నైట్‌క్లబ్ వెబ్‌సైట్ ప్రకారం రోమియో లేన్ ప్రస్తుతం భారతదేశంతో సహా నాలుగు దేశాలలోని 22 నగరాల్లో ఔట్‌లెట్‌లను కలిగి ఉంది. ఈ విస్తరణ అతని వ్యాపార దార్శనికతకు నిదర్శనంగా నిలిచింది. అతని బ్రాండ్‌కు లభించిన పలు అవార్డులు.. ఫోర్బ్స్ ఇండియాలో ఈ బ్రాండ్‌ ఫీచర్ కావడం మొదలైనవి అతని వ్యాపార విజయాలకు అద్దం పడుతున్నాయి.

    లూత్రాకు చెందిన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం అతను రోమియో లేన్‌కు మాత్రమే కాకుండా ‘బిర్చ్’, ‘మామాస్ బుయోయి’ తదితర సంస్థలకు కూడా ఛైర్మన్‌గా  ఉన్నారు. ఇది ఆయన నైట్‌లైఫ్, హాస్పిటాలిటీ రంగంలో ఎంతటి విజయం సాధించారో తెలియజేస్తుంది. అయితే గోవాలోని అతని క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం  అతని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఈ నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగి, 25 మంది  ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్యాన్స్ ఫ్లోర్‌లో 100 మందికి పైగా జనం ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు తెలిపారు. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో.. క్లబ్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నియమాలను విస్మరించిందని వెల్లడయ్యింది. మృతులలో ఎక్కువ మంది వంటగది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. పోలీసులు నైట్‌క్లబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 

    ఇది కూడా చదవండి: ‘మా ఆయన సీఎం కావాలి’: సిద్ధూ భార్య

  • ఉత్తర గోవాలోని అర్పోరాలోని బిర్స్ నైట్ క్లబ్ లో అర్థరాత్రి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది మరణించగా 50 మందికి తీవ్రగాయాయలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారిలో అధికమంది క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా మిగితా వారంతా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.. 

    మెహబూబా పాటకు డ్యాన్స్‌.. బ్యాక్‌గ్రౌండ్  మంటలు
    బాలీవుడ్‌ మూవీ షోలే సినిమాలోని మెహబూబా ఓ మెహబూబా పాటకు  డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో అంతా మంచి జోష్‌లో ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఈలలు-కేరింతలు అన్నట్లు ఉంది.  అయితే సడెన్‌గా  అంఆ నిశ్భబ్దం అయ్యారు. డ్యాన్సర్‌ వెనుకాల గోడకు అమర్చిన చెక్క నుంచి మంటల జాడ కనిపించడంతో  ఏదో జరగబోతుందని గ్రహించారు. కొంతమంది  ఏం జరుగుతుందోనని పైకి వెళ్లగా, మరికొంతమంది వంట గదిలో దాక్కునే యత్నం చేశారు. 

    ఇక డ్యాన్సర్లు, మ్యుజిషియన్లు అంతా బయటకు పరుగులు తీశారు. వారి మ్యూజికల్‌ సామాగ్రిని అక్కడే వదిలి బయటకు వెళ్లిపోయే యత్నం చేశారు. ఆ క్లబ్‌ను అంతే వేగంగా మంటలు చుట్టుముట్టాయి. ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 25 మంది వరకూ ప్రాణాలు కోల్సోగా, అందులో ఎక్కువమంది ఆ క్లబ్‌ సిబ్బంది  ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. ఆ క్లబ్‌ యాజమాన్యం అజాగ్రత్త వల్ల జరిగిందా.. లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. 

     

    ఎంట్రీ-ఎగ్జిట్‌ ద్వారం గందరగోళం
    మంటలు చెలరేగిన తర్వాత అక్కడున్న తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో బయటకు ఎలా వెళ్లాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. చిన్నపాటి, ఇరుకుగా ఉన్నటువంటి ఎంట్రీ-ఎగ్జిట్‌ ద్వారంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. అయితే చాలామంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ , 25 మంది చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

    గోవాలో ఇలా జరగడం ఇదే తొలిసారి.. : సీఎం
    ఈ విషాదకర ఘటనపై గోవా సీఎం ప్రమోద సావంత్‌ స్పందించారు. ‘ గోవాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఆ క్లబ్‌లో పై ఫ్లోర్‌ నుంచి మంటల వ్యాపించాయని,  అక్కడ డోర్స్‌ ఏర్పాటు కూడా సరిగా లేదన్నారు. చాలామంది తప్పించుకునే యత్నం చేశారని, కొంతమంది మాత్రం అక్కడ నుంచి బయటపడలేకపోయి ప్రాణాలు కోల్పోయారన్నారు. చాలామందికి ఏమీ చేయాలో తెలియక అండర్‌ గ్రౌండ్‌ ఏరియాకు వెళ్లి మృత్యువాత పడ్డారన్నారు. 

     గోవా ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం 

     

  • న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్ మహిళా నేత నవజ్యోత్ కౌర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2027లో పంజాబ్‌ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యల దరిమిలా రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ భారత మాజీ క్రికెటర్, రాజకీయ  నేత నవజ్యోత్‌ సింగ్‌  భార్య నవజ్యోత్‌ కౌర్‌ ఏమన్నారు?

    తన భర్త నవజ్యోత్ సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ  ప్రకటిస్తే, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజ్యోత్‌ కౌర్‌ వ్యాఖ్యానించారు. సిద్ధూకు తగిన అవకాశం లభిస్తే రాష్ట్రానికి సేవ చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి  అడుగుపెడతారని ఆమె స్పష్టం చేశారు. అయితే పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, ఐదుగురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, వారు సిద్ధూ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్  ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

    సిద్ధూ దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని, పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామన్నారు. రూ. 500 కోట్ల సూట్‌కేస్ ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడనేది మా విధానం కాదని అన్నారు. పంజాబ్ రాజకీయాల్లో డబ్బు పాత్రపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. అభివృద్ధి ఆధారిత రాజకీయాలకు సిద్ధూ కట్టుబడి ఉంటారని ఆమె అన్నారు.

    క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగినప్పటికీ, నవజ్యోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీతోనూ, పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారని నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాగా గత కొంతకాలంగా సిద్ధూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేయలేదు. రాజకీయాల నుండి దూరమైన తర్వాత, సిద్ధూ ఐపీఎల్ క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే తన అనుభవాలు ప్రేరణాత్మక చర్చలు, జీవనశైలి తదితర విషయాలను తెలియజేస్తూ  ఆయన ‘నవ్‌జోత్ సిద్ధూ అఫీషియల్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను  ప్రారంభించారు. నవజ్యోత్ కౌర్ చేసిన తాజా ప్రకటన దరిమిలా నవజ్యోత్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ద్వారా పంజాబ్‌లో పార్టీ పరిస్థితిని మెరుగుపర్చాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌కు సంకేతాలు పంపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే తదుపరి నిర్ణయంపై సిద్ధూ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

    సిద్ధూ రాజకీయ ప్రయాణం ఇలా..
    నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షడిగా సేవలందించారు.  2004లో బీజేపీ తరఫున అమృత్‌సర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2016లో బీజేపీకి రాజీనామా చేసి, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  2021, జూలై నెలలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 మార్చి  వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో  ఉన్నప్పటికీ   ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా   వ్యవహరించడం లేదు.

    ఇది కూడా చదవండి: నెలాఖరుకు ‘వందేభారత్‌ స్లీపర్‌’.. విశేషాలివే!

  • ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న పల్లెలు ప్రస్తుతం టెక్నాలజీ యుగంలోకి అడుగుపెడుతున్నాయి. ఇంతకాలం విద్యుత్,  తాగునీరు, వైద్యం లాంటి కనీస అవసరాలను పొందలేకపోయిన గ్రామాలు నేడు సెల్ ఫోన్ చేతబట్టి ఆధునికతను అందిపుచ్చుకునే యత్నం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లో ఇంతకాలం మావోయిస్టుల ప్రభావంతో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

    2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడంతో మావోయిస్టుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు ఛత్తీస్‌గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించడమో లేదా లొంగిపోవడమో జరుగుతుంది. దీంతో ఇంతకాలం మావోయిస్టుల ప్రభావంతో కనీస అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను అక్కడి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తోంది.

    ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో ఒకప్పుడు విద్యుత్ లేదు.  రోడ్లు, వైద్యం, ఇతర కనీస అవసరాల సంగతి సరేసరి. ఎన్నో ఏళ్లుగా కొండపల్లి కనీస అభివృద్ధి లేకుండా ఉంది. అయితే ఇప్పుడు ఆ గ్రామంలో రోడ్లు, విద్యుతే కాదు ఏకంగా మెుబైల్ టవర్ పడడంతో అక్కడి ప్రజలు సంతోష పడిపోతున్నారు. గిరిజనుల సంప్రదాయం ప్రకారం మెుక్కి డోలు, డప్పులు వాయించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఇక నుంచి గ్రామంలో సెల్ ఫోన్ల సిగ్నల్స్  వస్తాయని ఆనందపడిపోతున్నారు.

    కొండపల్లి మాదిరిగానే ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంది. "నియాద్ నెల్ల నార్" అనే పథకంలో భాగంగా అక్కడి ప్రభుత్వ మావోయిస్టు ప్రభావిత గ్రామాల రూపు రేఖలను మారుస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకూ 728 కొత్త టవర్లు నిర్మించబడ్డాయి. వాటిలో 116 అత్యంత ప్రభావితమైన ప్రాంతంలో ఉన్నవి. అంతేకాకుండా  69 భద్రతా క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 403 గ్రామాలు అభివృద్ధి బాటలో పయణిస్తున్నాయని అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

    మెుబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో ఆధార్, ఫెన్షన్, రేషన్ లతో పాటు ఇతరాత్ర ప్రభుత్వ కార్యకలాపాల లబ్ధి కోసం పదుల కిలోమీటర్లు గిరిజనులు ప్రయాణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఆ సేవలను ప్రస్తుతం ఇంటినుంచే పొందవచ్చంది.రాబోయే కాలంలో ఈ ప్రాంతాలు మరింతగా అభివృద్ది చెందుతాయని అక్కడి  ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Andhra Pradesh

  • తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్‌ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్‌పర్సన్లు, జడ్సీ వైస్‌ చైర్‌పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

    దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..  ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి‌ సంతకాల ప్రతులను‌10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్‌ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. 

    గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి..  కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్‌ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.

    ఇదీ చదవండి:
    చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్‌

  • తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాలలో కారు బోల్తా పడిన ఘటనలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. శబరిమల నుంచి కోడూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న(శనివారం, డిసెంబర్‌ 6వ తేదీ) తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. 

    ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్‌ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. 

    మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ ముస్తాక్‌ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. 

  • ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు.  

    ‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి ,  కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన  సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.

    కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తన మొబైల్‌లో రికార్డు చేశాడు.

    అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్‌ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

  • సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ ఫీజులు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్‌ ఫీజులను పెంచే నోటిఫికేషన్ అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిలిపివేయని పక్షంలో ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామన్నారు. రాష్ట్రంలోని  రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డులలో గూడ్స్ రవాణా  వాహనాలు నిలిపివేయడానికి నిర్ణయించినట్లు అసోసియేషన్‌ వెల్లడించింది.

    ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు మాట్లాడుతూ..  13 ఏళ్లు దాటిన వాహనాల ఫిట్‌నెస్ ఫీజు కేంద్రం భారీగా పెంచిందన్నారు. వాహన యజమానులు భారీగా ఫీజు చెల్లించాల్సి వస్తోందన్నారు. 20 ఏళ్లు దాటిన పాత వాహనాల ఫీజు రూ33వేల 400కు పెంచారు. పెంపు వల్ల  వేలాది లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతారు. పాత వాహనాలపై అదనపు టెస్టింగ్, ఫిట్‌నెస్ ఛార్జీలు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

    చట్టం అమలు చేస్తే చిన్న వాహన యజమానులు దారుణంగా నష్టపోతారు. సరకు రవాణా యజమానులపై పెను భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా రాష్ట్రం అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అమలు ను వెంటనే నిలిపివేయాలి. వెంటనే ఫీజులు తగ్గించేలా సీఎం చంద్రబాబు  నిర్ణయం తీసుకోవాలి. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే  ఈనెల 9 నుంచి ఆందోళనకు దిగుతాం. రాష్ట్రంలో తిరిగే 10 వేల గూడ్స్ వాహనాలను నిలిపివేస్తాం. అన్ని వాహనాలకు వెహికిల్ లొషన్ ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది.

    ఫ్యాసింజర్‌ వాహనాలకు వీఎల్‌టీడీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం సరైనదే. గూడ్స్ వాహనాలకు వీఎల్ టీడీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తగిన గడువు పెంచి వీఎల్ టీడీ అమలు చేస్తే సరకు రవాణా వాహనాలకు విఎల్ టీడీ ఏర్పాటుకు సహకరిస్తాం. నష్టాల్లో ఉన్న లారీ యజమానులపై భారం పడకుండా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి’’ అని వైవీ ఈశ్వరరావు పేర్కొన్నారు.

  • నెల్లూరు(క్రైమ్‌): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్‌ మసాజ్‌లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్‌లోని ఎవిరీ డే సెలూన్‌ స్పా సెంటర్‌పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు మహేష​​ పై కేసు నమోదు చేశారు.     

     ⇒బాలాజీనగర్‌ సమీపంలోని జగదీష్‌ నగర్‌లో గల యూనిక్స్‌ సెలూన్‌ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్‌పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సాంబశివరావు తెలిపారు.  

     ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ గిరిధర్‌ పాల్గొన్నారు.     

Family

  • దివ్యాంగులకు సాధికారత కల్పించడం అనేది అందరి కర్తవ్యవం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. వారంతా ప్రత్యేక సామర్థ్యంతో తమలోని అసామాన్య ప్రతిభతో ఆకట్టుకుంటారని ప్రశంసించారు. గత మంగళవారం జరిగిన 2025 జాతీయ వికలాంగుల సాధికారత అవార్డుల వేడుకలో దివ్యాంగుల ప్రతిభను మెచ్చుకుంటూ 32 మందికి అవార్డులు ప్రదానం చేశారు. వాళ్లంతా లింగ వివక్షను, వైకల్యాన్ని అధిగమించి అసాధారణ విజయాలను అందుకున్న వారు. అవార్డులందుకున్న ఈ 32 మందిలో ప్రతిఒక్కరిలో ఉన్నా అసామాన్య ప్రతిభ స్ఫూర్తిని రగిలికస్తూ ఉంటుంది. మరి ఆ అసామాన్య ప్రతిభావంతులెవరూ..వారి ప్రత్యేకత గురించి సవివరంగా చూద్దామా..!.

    80% లోకోమోటర్ వైకల్యం ఉన్న యాజీన్‌ జాతీయ వికలాంగులు సాధికారత అవార్డు గ్రహిత. ఆయన కళ్లకు గంతలు కట్టుకుని కీబోర్డుని అవలీలగా ఆలపించగలరు. ఆయన ఊహ గొప్పతనాన్ని చెప్పిన వ్యక్తి. ఒకప్పుడూ తాను సంజు సామ్సన్‌తో ఆడానని, ఇప్పుడూ ఈ వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితమయ్యా..కానీ తనని ఆపేది ఏది లేదని చెప్పుకొచ్చారు. 

    ఇక బెంగళూరుకు చెందిన షీబా కోయిల్‌పిచాయ్  బహుళ వైకల్యంతో పోరాడుతోంది. ఆమె మాట్లాడలేకపోయిన సుమారు మూడు వేలకు పైగా వార్లీ పెయింటింగ్‌లతో తన అనుభవాలను చెబుతుంది. ఆమె రచనలు కర్ణాటకలో రాష్ట్రపతి భవన్, లోక్‌భవన్‌ ప్రపంచ సేకరణలో ప్రచురితమయ్యాయి. ఆమె శిక్షణ పొందిన సంస్థలోనే టీచర్‌గా పాఠాలు బోధిస్తుంది. 

    నాగ్‌పూర్‌కు చెందిన అబోలి విజయ్ జరిత్ దేశంలోని మొట్టమొదటి వీల్‌చైర్ మోడల్, ప్రేరణాత్మక వక్తకూడా. తన కుటుంబమే అతిపెద్ద బలం అంటోంది.

    లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ చంద్రశేఖరన్ పూర్తిగా అంధుడైనప్పటికీ భారసాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన జాతీయ ఈత రికార్డులను బద్దలు కొట్టారు. భారతదేశంలో బ్లైండ్‌ షూటింగ్‌ని ప్రవేశపెట్టిన ఘనత అతడిదే. అలాగే సియాచిన్ హిమానీనదం వరకు ట్రెక్కింగ్‌ చేశారు.

    బెంగళూరుకు చెందిన సీనియర్ యాక్సెసిబిలిటీ స్పెషలిస్ట్ మేఘ పతంగి  దృష్టి లోపంతో బాధపడుతున్నా.. డిజిటల్‌ టెక్నాలజీ లక్షలాదిమంది అంధులకు హెల్ప్‌ అయ్యేలా కృషి చేసింది.  

    ఈ అవార్డు గ్రహీతల్లో చత్తీస్‌గఢ్‌లోని ధమ్తారికి చెందిన బసంత్ వికాస్ సాహు కూడా ఉన్నారు. 95% లోకోమోటర్ వైకల్యంతో జీవిస్తూ.. తన జీవన్ రంగ్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక వికలాంగులు, గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. పైగా తన చేతికి బ్రష్ కట్టుకుని చిత్రలేఖనాలు గీస్తారాయన. ఆయన చిత్రాలు గిరిజన జీవితంపై స్పష్టమైన ఆలోచనను అందిస్తాయి.

    వడోదరకు చెందిన రాజేష్ శరద్ కేత్కర్ భారతీయ సంకేత భాష (ISL)ను సమర్థించే యాక్సెసిబిలిటీ భావనను పునర్నిర్మించారు. ఆయన మార్గదర్శక ISL-ఆధారిత అభ్యాస వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దాంతో లక్షలాది మందికి బధిరులు నడిపే వార్తా వేదికను నిర్మించారు. అలాగే  కమ్యూనికేషన్‌ను సాధికారతగా మార్చారు. 

    చివరగా అవార్డు గ్రహీతలంతా ఒక ఏకైక సత్యాన్ని వివరించారు. అదేంటంటే..వైకల్యం ప్రతిబంధకం, మనల్ని కోల్పోవడం కాదని ప్రూవ్‌ చేశారు. ఆ వైకల్యం మన అభ్యన్నతిని ఏ మాత్రం ఆపలేదని తమ సక్సెస్‌తో నిరూపించారు. 

    (చదవండి: Gucchi Mushrooms: పుతిన్ రాష్ట్రపతి భవన్ విందులో గుచ్చి పుట్టగొడుగుల రెసిపీ..! స్పెషాలిటీ ఏంటంటే..)
     

  • భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. హైదరాబాద్‌ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. డిసెంబర్‌ 2021 అనంతరం తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశంలో ఉన్నారు పుతిన్‌. ప్రధాని మోదీ ఆయనకు రష్యన్‌ ఎడిషన్‌తో కూడిన భగవద్గీతను గిఫ్ట్‌గా ఇచ్చారు కూడా. అలాగే గత శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలకు గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమావేశ ముగిసింది. అయితే  ఆ విందు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది కూడా. ఈ నేపథ్యంలో మెనూలో వడ్డించిన వంటకాలేంటి..వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా..!.

    మోనూ మొత్తం శాకాహార వంటకాలే ఉన్నాయి.భారతదేశం అంతటా ఉన్న ప్రాంతీయ వంటకాల జాబితాను అందించారు. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్‌ నుంచి గుర్‌సందేశ్‌, ఉత్తర భారతదేశం నుంచి పసుపు పప్పు తడ్కా, దక్షిణ ప్రాంతాల నుంచి మురుక్కు టిబెట్‌, నేపాల్‌ సరిహద్దుల నుంచి జోల్‌ మోమో, జమ్మూ కశ్మీర్‌ నుంచి గుచ్చిడూన్‌ చెటిన్‌(వాల్నట్ చట్నీతో వడ్డించే స్టఫ్డ్ మోరెల్ పుట్టగొడుగులు) ఉన్నాయి. 

    ఈ రెసిపీలో గుచ్చి పుట్టగొడుగుల వంటకం అత్యంత స్పెషల్‌. అంత సులభంగా వండుకునే అవకాశం ఉండదే. అలాగే ఎప్పుడు పడితే అప్పుడ తినలేం కూడా. 

    ఎందువల్ల అంటే..
    ఈ కాశ్మీరీ వంటకం దాని మూలం కారణంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్‌ హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో అరుదుగా లభించే పుట్టగొడుగులివి. అందువల్లే ఇది కిలో దాదాపు రూ. 35 వేలు నుంచి రూ. 40 వేలు వరకు పలుకుతుంది. ఇవి అడవిలోనే లభిస్తాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడం సాధ్యం కాదు. వీటికి ఒక విధమైన నేల రకం, నిర్ధిష్ట ఉష్ణోగ్రత అవసరం. హిమపాతం సీజన్‌ ముగిసిన వెంటనే వసంతకాలం సమయానికి హిమాలయ ప్రాంతంలో ఇవి దర్శనమిస్తాయి. 

    అనుకోని అటవీ మంటల తర్వాత కూడా వీటిన సాగు చేయొచ్చట. అదే దీనిలో స్పెషాలిటీ అట. ఈ ప్రత్యేకత కలిగిన గుచ్చి పుట్టగొడుగులను కనిపెట్టడం కూడా సవాలట. కొన్ని వారాలపాటు మాత్రమే సాగయ్యే ఈ పుట్టగొడుగును అన్వేషించడం ఓ టాస్క్‌లా ఉంటుందట. అదీగాక పాకశాస్త్రంలో వీటికి ఉన్న టేస్టే వేరేలెవెల్‌ అట. పైగా సంప్రదాయ వైద్యలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు విరివిగా వినయోగించడంతో వీటికి అధిక డిమాండ్‌ ఉందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులగా ఇవి ప్రసిద్ధిగాంచినవి. 

     

    ఈ మష్రూమ్‌తో చేసే వంటకాలు..
    గుచ్చి పులావ్‌, యాఖ్ని, రోగంజోష్‌, వంటి శాకాహార వంటకాలను చేస్తారుట. పైగా మాంసానికి ప్రత్యామ్నాయ వంటకంగా ఆస్వాదిస్తారట ఆహారప్రియులు. అంత ప్రత్యేకతలు కలిగిన ఖరీదైన పుట్టగొడుగులు కావడంతోనే ఈ గుచ్చి డూన్‌ చెటిన్‌ రాష్ట్రపతి భవన్‌లో వ్లాదిమిర్‌ పుతిన్‌ విందు కోసం మెనూలో స్పెషల్‌గా ఏర్పాటు చేశారట. 

    (చదవండి: దోసెల రెస్టారెంట్‌ కోసం..టెక్‌ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్‌చేస్తే..)
     

     

  • మ‌న దేశం మ‌ధుమేహ రాజ‌ధానిగా మారిపోయింది. 2022 నాటి లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచంలో మ‌ధుమేహ బాధితులు అత్యంత ఎక్కువ‌గా ఉంది భార‌త‌దేశంలోనే. అయితే మధుమేహ బాధితులు అన్నింటికంటే ఎక్కువ‌గా దృష్టిపెట్టాల్సింది వాళ్ల కాళ్ల‌మీదేన‌ని ప‌లువురు ప్ర‌ముఖులు తెలిపారు. ఈ విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు భాగ్యన‌గ‌రంలో ఆదివారం వాక‌థాన్‌ను నిర్వహించారు. ఈ వాక్‌థాన్‌ను మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు, ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ఛైర్మ‌న్ ర‌మేష్ గోరంట్ల‌, టాలీవుడ్ న‌టుడు సుశాంత్‌, కిమ్స్ ఆస్ప‌త్రుల ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌రరావు ప్రారంభించారు.

    మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ.. “మ‌ధుమేహం అనేది చాలా సాధార‌ణంగా మొద‌ల‌య్యే స‌మ‌స్య‌. అస‌లు చాలామందికి అది ఉంద‌న్న విష‌య‌మే మొద‌ట్లో తెలియ‌దు. దాన్ని గుర్తించేస‌రికే చాలా ఆల‌స్యం అవుతుంది. పైగా మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు త‌మ క‌ళ్లు, కాళ్లు, ఇత‌ర అవ‌య‌వాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కంటిచూపు త‌గ్గుతున్నా, కాళ్ల మీద పుళ్లు క‌నిపించినా, ఏమైనా దెబ్బ‌లు తగిలినా వెంట‌నే త‌గిన చికిత్స‌లు తీసుకోవాలి. 

    వాటిలో నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల చాలామందికి కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతోంది. ప్ర‌తిరోజూ త‌గినంత న‌డ‌క‌, యోగా, లేదా మ‌రేదైనా భౌతిక కార్య‌క‌లాపాల‌తో చురుకైన జీవ‌న‌శైలి గ‌డ‌పాలి. స్మార్ట్ ఫోన్లు, ఇత‌ర గాడ్జెట్ల మీద ఎక్కువ‌గా ఆధార‌ప‌డితే శారీర‌క కార్య‌క‌లాపాలు త‌గ్గిపోయి ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ వ‌స్తాయి” అని తెలిపారు. ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ఛైర్మ‌న్ ర‌మేష్ గోరంట్ల మాట్లాడుతూ.. “ఇంత‌కుముందు మ‌ధుమేహం అంటే 50. 60 ఏళ్లు దాటిన‌వాళ్ల‌కే ఉండేది. కానీ ఇప్పుడు బాగా చిన్న‌వ‌య‌సు వాళ్ల‌లో కూడా ఇది ఉంటోంది. 

    పిల్ల‌లు, యువ‌త మామూలుగా ఆట‌లు ఆడుకుంటూ ఉంటారు. ఆట‌ల్లో దెబ్బ‌లు త‌గ‌ల‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే అలాంట‌ప్పుడు మధుమేహం ఉన్న‌వాళ్ల‌యితే వాళ్ల‌కు గాయాలు అంత త్వ‌ర‌గా న‌యం కావు. ఇప్పుడు ఇక్క‌డున్న వైద్యులు, ఇత‌ర ప్ర‌ముఖులు చెప్పేదాన్ని బ‌ట్టి చూస్తుంటే ఇలాంటి గాయాల వ‌ల్ల కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితి కూడా ఏర్ప‌డుతుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు కాళ్ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ధుమేహం స్థాయి ప‌రీక్షించుకోవ‌డంతో పాటు కీల‌క అవ‌య‌వాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి” అని సూచించారు.

    టాలీవుడ్ న‌టుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఇన్నాళ్ళూ క‌ళ్ల‌కు, ఎముక‌ల‌కు, పొట్ట‌లోని భాగాల‌కు.. ఇలా ర‌క‌ర‌కాల వైద్యులు ఉంటార‌ని తెలుసు గానీ, ప్ర‌త్యేకంగా పాదాల కోసం కూడా ఒక ప్ర‌త్యేక వైద్య‌విభాగం ఉంద‌న్న విష‌యం నాలాంటి చాలామందికి తెలియ‌దు. ఇటీవ‌లి కాలంలో చాలామందికి మ‌ధుమేహం ఉంటోంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌ళ్లూ కాళ్ల విషయాన్ని స‌రిగ్గా ప‌ట్టించుకోవాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంట‌నే ఇలాంటి ఫుట్ క్లినిక్‌ల‌కు వ‌చ్చి ప‌రీక్ష చేయించుకోవాలి” అన్నారు.

    ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ, ప్ర‌ముఖ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, “మ‌ధుమేహుల్లో 15-25% మందికి త‌మ జీవిత‌కాలంలో ఎప్పుడో ఒక‌ప్పుడు కాళ్ల మీద పుళ్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే, మ‌ధుమేహ బాధితుల‌కు న‌రాలు పాడ‌వ్వ‌డం వ‌ల్ల ఇలాంటి సాధార‌ణ పుండ్ల వ‌ల్ల వాళ్ల‌కు నొప్పి అంత‌గా తెలియ‌దు. 

    అందువ‌ల్ల వాటిని నిర్ల‌క్ష్యం చేస్తారు. కానీ, మ‌ధుమేహం వ‌ల్ల కాళ్లు తొల‌గించాల్సిన ప‌రిస్థితుల్లో 85% కేవ‌లం ఇలాంటి పుండ్ల‌కు చికిత్స చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే వ‌స్తాయి. స‌రైన స‌మ‌యానికి పుండ్ల‌కు చికిత్స చేయించ‌క‌పోతే పరిస్థితి చాలా విష‌మంగా మారుతుంది. అందువ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారంతా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ కాళ్ల విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి” అని చెప్పారు.

    ఈ సంద‌ర్భంగా ద ఫుట్ డాక్ట‌ర్ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ వూండ్ అనే యాప్‌ను ఆవిష్క‌రించారు. సుర‌క్షిత‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన డ్ర‌సింగ్‌తో ఇంట్లోనే గాయాల‌ను న‌యం చేసుకునేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. నిపుణులైన వైద్యులు దూరంగా ఉండే గాయాల‌ను గ‌మ‌నించి, ఎక్కువ‌గా ఆస్ప‌త్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా చేసి అటు ఆర్థిక‌భారం, ఇటు స‌మ‌యం కూడా ఆదా చేస్తుంది. 

    దీంతోపాటు.. ప్ర‌తి ఒక్క‌రికీ వాళ్ల పాదాల తీరు, సైజుల‌కు అనుగుణంగా పాద‌ర‌క్ష‌లు త‌యారుచేసే ప్ర‌త్యేకమైన మిష‌న్ ఒక‌దాన్ని ద ఫుట్ డాక్ట‌ర్ ఆస్ప‌త్రిలో ఏర్పాటుచేశారు. దీనివ‌ల్ల రోగులు త‌మ కాళ్ల స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌గా గుర్తించ‌డంతో పాటు నూరుశాతం క‌స్ట‌మైజ్డ్ పాద‌ర‌క్ష‌ల‌ను పొందే అవ‌కాశం ఉంటుంది. దానివ‌ల్ల వాళ్ల పాదాల‌కు సంపూర్ణ ర‌క్ష‌ణ, సౌక‌ర్యం ల‌భించి.. కాళ్లు, పాదాల‌కు గాయాలు కాకుండా ఉంటాయి.

    (చదవండి: డయాబెటిక్‌ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం)

  • ఫుడ్‌ రెస్టారెంట్‌ లేదా హోటల్‌ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్‌ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్‌ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్‌ తీసుకుని ఆ యువకుడు సక్సెస్‌ అయ్యాడా అంటే..

    జర్మన్‌లో అధిక జీతం వచ్చే టెక్‌ ఉద్యోగం చేసేవాడు మోహన్‌. స్కాలర్‌షిప్‌పై పారిస్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్‌ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్‌ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్‌ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్‌ చేసుకున్నాడు. 

    అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్‌ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రెస్టారెంట్‌ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు. 

    ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్‌ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్‌ మాములుగా లేదుగా..)
     

  • ఇకముందు... ‘కుక్కలు ఏం చేస్తాయి?’ అనే ప్రశ్నకు– ‘ఇంటికి కాపలా కాస్తాయి’ అనే ఏకైక సమాధానం మాత్రమే వినిపించక΄ోవచ్చు.  ‘ఇంకా ఎన్నో చేస్తాయి’ అని చెప్పవచ్చు. కుక్కలను మరింతగా ఉపయోగించుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరే... డాగోసోఫీ బటన్‌. గృహోపకరణాలను శునకం నియంత్రించడానికి ఈ బటన్‌ ఉపయోగపడుతుంది. 

    కుక్కలు తమ యజమానులకు మరిన్ని ఇంటి పనులలో సహాయం చేయడానికి వీలుగా యానిమల్‌–కంప్యూటర్‌ ఇంటరాక్షన్‌ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. వినియోగదారులు తాము ఎంపిక చేసుకున్న అప్లికేషన్‌ను రిసీవర్‌లో ప్లగ్‌ చేయాలి. తద్వారా ఫ్యాన్‌ ఆన్‌చేయడం, లైట్‌ ఆఫ్‌ చేయడం... మొదలైన వాటికి డాగోసోఫీ బటన్‌ ఉపయోగపడుతుంది. 

    నీలి, తెలుపు రంగులో ఉన్న డోగోసోఫీ బటన్‌ను శునకానికి కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ఈ బటన్‌ చాలా సున్నితంగా ఉంటుంది. కుక్క తన ముక్కుతో బటన్‌ను తట్టడంతో అది యాక్టివేట్‌ అవుతుంది. 

    ఇలా చేయడానికి శునకానికి కొంత శిక్షణ అవసరం ‘డాగోసోఫీ ఈ  పరికరాలను మాత్రమే, ఇంత సంఖ్యలో మాత్రమే నియంత్రిస్తుందనే పరిమితి లేదు. మీ సృజనాత్మకతతో ఎన్ని పరికరాలైనా నియంత్రించేలా శునకానికి శిక్షణ ఇవ్వవచ్చు’ అంటున్నారు డాగోసోఫీ రూపకర్తలు. 

    (చదవండి: మలబద్ధకం నివారణ కోసం..! ఈట్‌ ఫ్రూట్‌)

  • మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్‌ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలు

    ఫైబర్‌ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్‌ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. 

    చిక్కుళ్లలో ప్రోటీన్‌ తోపాటు ఫైబర్‌ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని  తాజాపండ్లు డయాబెటిస్‌ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. 

    పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది.       
    (చదవండి: డయాబెటిక్‌ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం)

  • డయాబెటిస్‌ (మధుమేహం) అంటే కేవలం రక్తంలో చక్కెర మోతాదులు పెరగడం మాత్రమే కాదు. అది దేహంలోని అనేక అవయవాలను నిశ్శబ్దంగా దెబ్బతీసే ప్రమాదకారి. డయాబెటిస్‌ వల్ల మిగిలిన అన్ని అవయవాల్లో కన్నా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలెక్కువ. ఎంత ఎక్కువ అంటే... డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులలో 60% మందికి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా ఆ సమస్య తారస్థాయికి చేరే వరకూ చాలామందికి ఆ విషయం తెలియనే తెలియదు. ఇలా చాపకింద నీరులా నిశ్శబ్దంగా పెరుగుతూపోయే డయాబెటిక్‌ నెఫ్రోపతీ అనే ఈ కిడ్నీల వ్యాధి కారణంగా వచ్చే అనర్థాలూ, లక్షణాలూ, చికిత్స వంటి అంశాలపై అవగాహన కోసం...

    ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే డయాబెటిస్‌తోపాటు దానివల్ల కలిగే అనర్థాలు పెరిగిపోయాయి. టైప్‌ 1 అలాగే టైప్‌ 2... ఈ రెండు రకాల డయాబెటిస్‌లూ నెఫ్రోపతీకి దారితీస్తాయి, అయితే ఎక్కువ మందికి టైప్‌ 2 డయాబెటిస్‌ ఉండటం వల్ల చాలా కేసుల్లో కిడ్నీ పనిచేయకపోడానికి ఇదే కారణం. పైగా కిడ్నీ దాదాపుగా దెబ్బతిని పూర్తిగా పనిచేయకుండా పోయేవరకు చాలామందికి ఈ విషయం తెలియనే తెలియదు.  

    డయాబెటిస్‌తో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయంటే... 
    కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడ΄ోస్తూ, అందులోని వ్యర్థాలూ, విషపదార్థాలను తొలగిస్తూ, వాటిని మూత్రం ద్వారా బయటకు ΄ోయేలా చేస్తుంటాయి. రక్తంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉన్నకొద్దీ కిడ్నీలోని అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా వాటి వడ΄ోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోతుంటుంది. ఒకనాటికి కిడ్నీ పూర్తిగా పనిచేయని పరిస్థితి వస్తుంది. దాంతో జీవితాంతం డయాలసిస్‌ మీద ఆధారపడాల్సి వస్తుంది లేదా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయమే ఉండదు.

    ముందుగానే గుర్తించడం ఇలా... 
    డయాబెటిక్‌ నెఫ్రోపతికి చికిత్స చేసి మళ్లీ మొదటిలా కిడ్నీని పనిచేయించడం అసాధ్యం. అంటే దీనిని రివర్స్‌ చేయలేమని అర్థం. పైగా దాదాపుగా కిడ్నీ పూర్తిగా దెబ్బతినేవరకు దీని లక్షణాలు కనిపించవు. అందుకే నిశ్శబ్దంగా వృద్ధిచెందే ఈ వ్యాధిని తెలుసుకోడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయిస్తుండటం అవసరం.

    ఇవీ వైద్యపరీక్షలు... 
    మైక్రో అల్బుమిన్‌ మూత్ర పరీక్ష : ఈ పరీక్షతో మూత్రంలో కొద్ది మొత్తంలోనైనా లీక్‌ అవుతుండే ప్రోటీన్‌ (అల్బుమిన్‌)ను గుర్తించవచ్చు. కిడ్నీ దెబ్బతినడంలో ఇది తొలి దశ. 

    సీరం క్రియాటినిన్‌ అండ్‌ ఈ–జీఆర్‌ఎఫ్‌ (ఎస్టిమేటెడ్‌ గ్లోమెరులర్‌ ఫిల్టరేషన్‌ రేట్‌) :  ఈ పరీక్షతో కిడ్నీ వడ΄ోత సామర్థ్యాన్ని కొలవవచ్చు. ఈ–జీఆర్‌ఎఫ్‌ తగ్గడం అంటే అది కిడ్నీ పనితీరు తగ్గడానికి ఒక సూచన.

    రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తుండటం : హైబీపీ అన్నది కిడ్నీ దెబ్బతినే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండటం, మందులతో అదుపులో పెట్టుకోవడం అవసరం. 

    వార్షిక ఆరోగ్య పరీక్షలు: మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఎక్కువగా డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆరోగ్య చరిత్ర ఉన్నవారు ప్రతి ఏడాదీ వార్షిక పరీక్షలు చేయించుకుంటూ ఉండటం అవసరం. ఎందుకంటే ఈ డయాబెటిస్‌ ఏ అవయవంపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో ఎవరికీ తెలియదు. అందుకే డయాబెటిస్‌తో బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా ప్రతి ఏడాది అన్ని రకాల వైద్యపరీక్షలూ చేయించుకోవడం మేలు.

    ఎండ్‌ స్టేజ్‌ కిడ్నీ డిసీజ్‌కి చికిత్సలిలా:

    కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిని, కిడ్నీ సామర్థ్యం పూర్తిగా తగ్గినట్లయితే, మూత్రపిండాల మార్పిడి చికిత్స (రీనల్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ) అవసరం 

    డయాలసిస్‌: ఈ ప్రక్రియ ద్వారా రక్తంలోని వ్యర్థాలనూ, విషాలతో కూడిన ద్రవాలను తొలగిస్తారు 

    హీమో–డయాలసిస్‌: శరీరం వెలుపల అమర్చే యంత్రంతో వారానికి పలు మార్లు రక్తాన్ని వడ΄ోయడం 

    పెరిటోనియల్‌ డయాలసిస్‌: కడుపులోని పెరిటోనియమ్‌ అనే పొరలో అమర్చే క్యాథటర్‌ (గొట్టం లాంటి పరికరం) సహాయంతో దేహంలోని వ్యర్థాలూ, విషాలను వడపోయడం 

    చివరగా కిడ్నీ మార్పిడి చికిత్స : చనిపోయిన వ్యక్తి నుంచి సేకరించిన లేదా బతికే ఉన్న దగ్గరి బంధువైన దాత నుంచి తీసుకున్న కిడ్నీని బాధితులకు అమర్చేందుకు చేసే శస్త్రచికిత్స ఇది ∙ఇక టైప్‌ 1 మధుమేహంతో బాధపడే బాధితులకు కిడ్నీ–ప్రాంక్రియాస్‌ మార్పిడి చికిత్స కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు.

    మేనేజ్‌మెంట్‌ : పరిస్థితి డయాలసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకూడదనుకునే బాధితులు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన మందులు వాడుతూ, తమ బీపీ, చక్కెర మోతాదులు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

    చివరగా... డయాబెటిక్‌ నెఫ్రోపతీ అనేది రివర్స్‌ చేయలేని తీవ్రమైన వేదన కలిగించే పరిస్థితి. డయాబెటిస్‌ను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టుకోవడం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులను క్రమశిక్షణతో అవలంబించడం, డాక్టర్‌ సూచనలను తప్పక పాటించడం వంటి జాగ్రత్తలతో చాలా ఖర్చుతో కూడినవీ లేదా బాధించేవైన డయాలసిస్, కిడ్నీ మార్పిడి వరకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని అవగాహన పెంచుకోవడమన్నది అవసరమని అందరూ గుర్తుంచుకోవాలి.          

    మొదటి, రెండో దశల్లో... జీవనశైలిలో మార్పులు:
    రక్తంలో చక్కెరను అదుపులో ఉంచడం ( గ్లైసీమిక్‌ కంట్రోల్‌) : రక్తంలోని చక్కెర మోతాదులను పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసేందుకు కొన్ని మందులు అవసరమైన వారికి ఇన్సులిన్‌ వంటివి ఇవ్వడం. 

    రక్తపోటును అదుపు చేయడం (బీపీ కంట్రోల్‌) : ఏంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ (ఏసీఈ) ఇన్హిబిటర్స్‌ లేదా ఏంజియోటెన్సిన్‌ రిసెప్టార్‌ బ్లాకర్స్‌ సహాయంతో బీపీని 130 / 80 అనే కొలతకంటే తక్కువగా ఉండేలా మందులివ్వడం 

    ఆహారంలో మార్పులు : తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదులు తగ్గించడం అలాగే ్ర΄ోటీన్‌ నియంత్రిత స్థాయిలోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వంటి జాగ్రత్తలు 

    క్రమ తప్పకుండా చేసే వ్యాయామలు : బరువును ఆరోగ్యకరమైన పరిమితిలోనే ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం 

    దురలవాట్లకు దూరంగా ఉండటం : పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండటం.

    డయాబెటిక్‌ నెఫ్రోపతీ లక్షణాలు 
    సాధారణంగా డయాబెటిక్‌ నెఫ్రోపతీ తాలూకు మొదటి దశల్లో గుర్తించదగిన లక్షణాలేవీ కనిపించవు. అయితే జబ్బు పెరుగుతున్నకొద్దీ ఈ కింద పేర్కొన్న లక్షణాలూ, సూచనలూ కనిపించవచ్చు పాదాలు, చీలమండలు లేదా కళ్ల చుట్టూ ఉబ్బు లేదా వాపు (కిడ్నీల పనితీరు తగ్గడంతో దేహంలోని నీరు బయటకు పోలేకపోవడవంతో ఈ ఉబ్బు / వాపు కనిపిస్తుంది) 

    అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనత

    ఆకలి లేకప​ఓవడం లేదా వికారం 

    మరీ ఎక్కువగాగానీ లేదా తక్కువగాగానీ జరిగే మూత్ర విసర్జన 

    నురుగుతో కూడిన మూత్రం (ప్రోటీన్‌ నష్టం వల్ల)

    నిరంతరం అధిక రక్తపోటు (కన్సిస్టెంట్‌గా హైబీపీ)

    శ్వాస ఆడకపోవడం (దేహంలోని నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల) ఈ లక్షణాలను గమనించినట్లయితే, కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

    డయాబెటిక్‌ నెఫ్రోపతి చికిత్సలు
    దీనికి నిర్దిష్టంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగానూ, వ్యక్తిగతంగానూ (పర్సనలైజ్‌డ్‌ ట్రీట్‌మెంట్‌) చికిత్సలు ఉంటాయి. ఈ వైద్య చికిత్సల ద్వారా కిడ్నీ దెబ్బతినడం మరింత వేగంగా జరగకుండా చూడటంతోపాటు అప్పటికే దెబ్బతిన్నందున ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే లక్ష్యంగా చేస్తారు.

    ఇవీ వాడాల్సిన మందులు 

    ఎస్‌జీఎల్‌టీ 2 ఇన్హిబిటర్లు (ఉదాహరణకు, డపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్‌); అలాగే జీఎల్‌పీ – 1 రిసెప్టర్‌ అగోనిస్ట్‌లు (ఉదాహరణకు లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్‌) అనేవి టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న బాధితుల్లో కిడ్నీ వ్యాధి మరింత వేగంగా పురోగమించకుండా చూడటంతోపాటు గుండెకు సంబంధించిన జబ్బులను తగ్గించడానికి ఉపయోగించే కొత్త మందులివి 

    ఫైనెరెనోన్‌ (కెరెండియా) అనేది ఒక నాన్‌–స్టెరాయిడల్‌ మినరలో కార్టికాయిడ్‌ రిసెప్టర్‌  యాంటాగనిస్ట్‌ డ్రగ్‌. కిడ్నీ వైఫల్యమూ అలాగే గుండె సంబంధిత జబ్బుల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడానికి వాడే మందు 

    అధిక కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడానికి స్టాట అనే మందులు.  
    డాక్టర్‌ గంధె శ్రీధర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ నెఫ్రాలజీ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఫిజీషియన్‌ 

    (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్‌ మాములుగా లేదుగా..!)

  • ‘అతిథి దేవోభవ’ అనే మాటకు కేరాఫ్‌ అడ్రస్‌ మన దేశం. ఈ మాటను మరోసారి నిజం చేసే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో రెండు మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. అమెరికన్‌ వ్లోగర్‌ మాల్వీనా హిమాలయ ప్రాంలోని మారుమూల గ్రామానికి వెళ్లింది. ఎవరూ పరిచయం లేక΄ోయినా, ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు గొప్ప ఆతిథ్యం దొరికింది. 

    తమకు వచ్చిన ఇంగ్లీష్‌లోనే... ‘ప్లీజ్‌ డ్రింక్‌ టీ’ అన్నారు. ‘ప్లీజ్‌ టేక్‌ ఫుడ్‌’ అన్నారు. వీడియోలో... మాల్వీనా ఒక వృద్ధురాలిని పలకరిస్తుంది. ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత మాల్వీనా బయలు దేరేముందు ‘భోజనం చేసి వెళ్లు’ అని పట్టుబడుతూ ఆ బామ్మ ఒకటికి రెండుసార్లు అడగడం నెటిజనులను కదిలించింది. ‘భోజనం వద్దు టీ చాలు’ అని అడిగింది మాల్వీనా. ఆప్యాయత, అనురాగాల రుచుల ఆ టీ ఎన్ని కోట్లు పెడితే మాత్రం వస్తుంది? ఏమంటారు మాల్వీనా! 

    (చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్‌ మాములుగా లేదుగా..!)

  • మనల్ని సంతోషపరచడానికి పెద్ద పెద్ద విజయాలే అక్కర్లేదు. చిన్న చిన్న సందర్భాలు కూడా కారణం అని చెప్పడానికి ఈ వీడియో క్లిప్‌ ఉదాహరణ. మోడల్‌ నవ్య క్రిష్ణ తల్లిదండ్రులు తొలిసారిగా తమ కూతురి ఇమేజెస్‌ను బిల్‌బోర్డ్‌పై చూసి ఎంతో సంతోషించారు. 

    నవ్య తల్లిదండ్రుల ఎక్స్‌ప్రెషన్‌లను ఈ వీడియో స్లోగా రికార్డ్‌ చేసింది. బిల్‌బోర్డ్‌పై కనిపించిన కూతురి ఫొటోగ్రాఫ్‌ని చూసి... ‘ఇది నిజమేనా? మన అమ్మాయేనా!!’ అన్నట్లుగా చూశారు. ఆ తరువాత వారి సంతోషానికి అవధి లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వారి రియాక్షన్‌ తాలూకు వీడియో క్లిప్‌ నెటిజనులకు తెగనచ్చేసింది. 

    ‘నా చిత్రాలు ఎన్నో బిల్‌బోర్డ్‌లపై కనిపించినప్పటికీ... ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఒకింత గర్వంతో, ఆనందంతో మెరిసిపోయే వారి కళ్లు నాకు అపురూపం’ అని తన పోస్ట్‌లో రాసింది నవ్య క్రిష్ణ. ‘పిల్లలు విజయాలు సాధించినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో కనిపించే మెరుపు వెల కట్టలేనిది!’ అని స్పందించారు ఒక యూజర్‌. 

     

    (చదవండి: Bhavitha Mandava: వందేళ్ల ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'షనెల్‌' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..)

International

  • లండన్‌: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలకు సిద్ధమవుతోంది. షాపింగ్ సెంటర్లు, వీధులు, ఇళ్లు క్రిస్మస్ లైట్లు, అలంకరణలు పండుగ థీమ్‌లతో మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్‌ దేశాధినేత, కామన్వెల్త్ దేశాల అధిపతి కింగ్ చార్లెస్ అతని సతీమణి క్వీన్ కెమిల్లాలు తమ 2025 అధికారిక క్రిస్మస్ కార్డును విడుదల చేసి, పండుగ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించారు.

    ఈ కార్డులో క్రిస్మస్ నేపథ్యానికి బదులుగా, ఈ జంట ఇటీవల ఇటలీ సందర్శన సందర్భంగా తీసిన ఫొటో ఉంది.  ఇది ఫోటోగ్రాఫర్ క్రిస్ జాక్సన్ తీసిన ఈ చిత్రం. రోమ్‌లోని విల్లా వోల్కోన్స్కీలో కింగ్ చార్లెస్ (77), క్వీన్ కెమిల్లా (78)లు ప్రశాంత వదనంతో ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో వారి 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోటో తీశారు. ఈ ఫొటోలో క్వీన్ కెమిల్లా.. అన్నా వాలెంటైన్ రూపొందించిన తెలుపు,లేత గోధుమ రంగు కోటు ధరించి కనిపిస్తుండగా, కింగ్ చార్లెస్ నీలిరంగు చారల సూట్‌లో హుందాగా కనిపిస్తున్నారు. కార్డు లోపల ఈ జంట తమ హృదయపూర్వక సందేశాన్ని ‘మీకు హ్యాపీ క్రిస్మస్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూ సంతకాలు చేశారు.

    2005లో వివాహం చేసుకున్న ఈ రాజ దంపతులు, తమ 20 ఏళ్ల బంధాన్ని ఇటలీలో జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, వారు పురాతన రోమన్ ఆక్వా క్లాడియా దగ్గర తీయించుకున్న ఫోటోలను విడుదల చేశారు. 20 సంవత్సరాల తమ వైవాహిక జీవన మైలురాయి గురించి క్వీన్ కెమిల్లా మాట్లాడుతూ, తమ బంధం అపురూపమైనదన్నారు. ఈ క్రిస్మస్ కార్డు కేవలం శుభాకాంక్షలను మాత్రమే కాకుండా, ఈ రాజ దంపతుల మొదటి పర్యటన, వారి 20 ఏళ్ల వివాహ బంధంలోని మధుర స్మృతులను తెలియజేసింది.
     

    ఇది కూడా చదవండి: ఈయన క్లబ్‌లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్‌ బ్యాక్‌గ్రౌండ్‌

  • లాస్ ఏంజెల్స్:  హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. 100 అడుగుల ఎత్తు వరకు లావా చిమ్ముతోంది. ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటైన కిలౌయా విస్ఫోటనం.. ఏడాది  క్రితం (2024 డిసెంబర్ 23న ప్రారంభమైంది. ఇప్పటి వరకు కిలోవేయ అగ్నిపర్వతం 38 సార్లు బద్ధలైంది.

    ఉత్తర వాయువ్య భాగం నుంచి ప్రస్తుతం సుమారు 50-100 అడుగులు(15-30 మీటర్లు) ఎత్తులో నిరంతర లావా ఎగసిపడతోందని యూఎస్ జియోలాజికల్ సర్వీసెస్ హవాయియన్ వల్కానో అబ్జర్వేటరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అగ్నిపర్వత వాయువు, బూడిద వల్ల స్థానిక విమానాశ్రయాలు ప్రభావితమయ్యే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు.

Mahabubabad

  • ‘నోటా’ సంగతేంటి

    ‘నోటా’ గుర్తు ఎవరిని ముంచుతుందో వేచి చూడాలి. అభ్యర్థులకు ఓటు వేయొద్దని భావించే ఓటర్లు నోటాను ఎంచుకోవచ్చు. అభ్యర్థుల ప్రచారంలో నోటాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘అన్నా ఓటు మాత్రం చిత్తు చేయకు.. బ్యాలెట్‌ పత్రంలో చివర ఉన్న నోటాకు మాత్రం వేయకు’ అంటూ వేడుకుంటున్నారు. అసలే అంతుపట్టని గుర్తులతో ఓ పక్క ఆందోళనకు గురవుతుంటే, నోటాతో తంటాలు తప్పవనే భావనలో ఉన్నారు. ముద్ర వేసి మద్దతు తెలపాల్సిన ఎన్నికల్లో ‘స్టాంప్‌’ కొంచె అటు ఇటూ అయినా చెల్లకుండా పోతుంది. గతంలో మన గుర్తు పై మధ్య, చివరన అని చెబుతూ ఓటు వేయాలని ప్రచారం చేసే వారు. ఇప్పుడు కొత్తగా చివరన నోటా రావడంతో చివరి గుర్తులు వచ్చిన అ భ్యర్థులు ఏమని చెప్పుకోవాలో తెలియక, కింద నుంచి రెండోదంటూ పదేపదే ఓటర్లకు వివరిస్తున్నారు.

  • సర్పం
    మూడు రోజుల ముందే ‘అడ్వాన్స్‌’ పేమెంట్స్‌..
    ఎన్నికల బరిలో మూడో తరం..

    హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం జయగిరిలో సర్పంచ్‌ పదవికి ఆఫర్‌ ఇచ్చారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడుపు ఉండడంతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా అవకాశం ఇస్తే రూ.50 లక్షలు గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్‌ ప్రకటించారు. దీనిపై గ్రామ రచ్చబండ వద్ద సమావేశం జరగగా పోటీలో ఉన్న పల్లె దయాకర్‌ (అధికార పార్టీ అభ్యర్థి), కొంగటి మొగిలి, బొజ్జ అశోక్‌, పిట్టల రాజు అక్కడికి చేరుకున్నారు. న్యాయవాది ఆఫర్‌ ప్రకటించడంతో ఎక్కువ వేలం పాడిన వారికే ఏకగ్రీవం చేస్తామని స్థానికులు చెప్పారు. ముందుకు ఎవరు రాకపోవడంతో తాళ్ల వెంకటేశ్‌ వైపు స్థానికులు మొగ్గు చూపారు. ఇందుకు నామినేషన్‌ వేసిన వారు కూడా అంగీకరించారు. దీంతో వెంకటేశ్‌ ఒప్పంద పత్రాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం డబ్బులు అందుబాటులో లేవని, దీనికి బదులు గ్రామంలో ఉన్న ఎకరం భూమిని పంచాయతీ కార్యాలయం పేర రాశారు. దీంతో పాటు పది ఖాళీ బ్యాంకు చెక్కులు సిద్ధం చేశారు. బరిలో ఉన్న వారందరినీ నామినేషన్‌ కేంద్రం(అన్నాసాగరం)కు రావాలని సూచించారు. దీంతో వెంకటేశ్‌, అనుచరులు నామినేషన్‌ పత్రంతో కేంద్రానికి చేరుకున్నారు. మిగతా మరో ముగ్గురు అక్కడకికి చేరుకుని ఉపసంహరణపత్రంపై సంతకాలు చేశారు. అయితే దయాకర్‌ మాత్రం నామినేషన్‌ కేంద్రానికి చేరుకోలేదు. నామినేషనల ఉపసంహరణ ఘట్టం ముగిసే వరకు కూడా పల్లె దయాకర్‌ అక్కడికి రాలేదు. దీంతో జయగిరిలో పోటీ అనివార్యమైంది.

    లింగాలఘణపురం: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు ముందస్తుగానే ఓటు కోసం అడ్వాన్స్‌ చెల్లింపులు చేసినట్లు సమాచారం. మండలంలోని 21 పంచాయతీల్లో జనరల్‌ స్థానాల్లో పోటీ తీవ్రమవుతోంది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రోజల ముందే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. మండలంలోని ఓ జనరల్‌ స్థానంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో ఓ సర్పంచ్‌ అభ్యర్థి ముందుగానే డబ్బులు పంచడంతో విధిలేని పరిస్థితుల్లో మిగతావారు కూడా ఎన్నికలకు మూడు రోజుల ముందే ముట్టజెప్పుతున్నారు. ప్రత్యర్థి ఎంత ఇస్తే అంతకంటే తగ్గేదేలే అన్నట్లు పోటీపడి డబ్బులు పంచుతున్నట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదంటూ ఓటర్లే చర్చించుకుంటున్నారు.

    ఓటంటే..

    అచ్చంగా నీ వ్యక్తిత్వమే.

    నిన్ను పట్టి చూపే ప్రతిబింబమే.

    అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు

    ఏ పాటి వాడో.. అన్నట్టుగా

    ఐదేళ్ల పాటు

    పల్లె గుండైపె ఎగిరే

    సమున్నత నీతి పతాకం.

    ఓటరంటే..

    గ్రామాభివృద్ధికి జీవకర్ర.

    తెల్లటి మనసున్న వాళ్లు

    ఎన్నికలంటే

    మన దారులను

    మనం నిర్మించుకోవడమే.

    ఓటరంటే..

    నోటుకు ఓటు అమ్మని వాళ్లు

    తాయిలాలకు

    సొంగ కార్చని వాళ్లు,

    చుక్కకో, ముక్కకో

    ఓటును ముక్కలు ముక్కలు

    చేయనివాళ్లు.

    ప్రజాసామ్యం

    ఫరిడవిల్లాంటే

    ఓటు పవిత్రతకు

    మనం కవచమై నిలబడాలి.

    ఓటరూ

    జర జాగ్రత్త!

    ఓటు నీ పల్లె భవిష్యత్‌

    డాక్టర్‌ పోరెడ్డి

    ఏటూరునాగారం: ప్రస్తుత ఎన్నికల్లో ఏటూరునాగారం సర్పంచ్‌గా రెండు పర్యాయాలు విధులు నిర్వర్తించిన కుటుంబంలోని మూడో తరానికి చెందిన కాకులమర్రి శ్రీలతకు పోటీ చేసే అవకాశం వచ్చింది. ఏటూరునాగారం జీపీగా ఏర్పడిన సమయంలో తొలి సర్పంచ్‌గా కాకులమర్రి గోపాలరావు ఎన్నికయ్యారు. అనంతరం రెండోసారి గోపాలరావు కుమారుడు చక్రధర్‌రావు 1981లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. వారి ఇరువురి హయాంలో ఏటూరునాగారం అభివృద్ధి సాధించింది. చక్రధర్‌రావు కోడలు కాకులమర్రి శ్రీలత ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తోంది. పూర్వీకుల చేసిన పాలన, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఎన్నిల్లో బలమైన అభ్యర్థిగా బరిలో నిలవడం గమనార్హం.

    ఓటు.. అమ్మితే చేటు

    గ్రామ ఓటరు లా రా.. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలో భాలకు గురవకుండా నిజాయి తీ, అభివృద్ధి పట్ల నిబద్ధత గల వ్య క్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని ఓ యువజన కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆసక్తిగా చూస్తున్న యువకుడు.

    –సాక్షి ఫొటోగ్రాఫర్‌, మహబూబాబాద్‌

    –న్యూశాయంపేట

    జయగిరి గ్రామాభివృద్ధికి

    ఖర్చు చేస్తానని అంగీకారం

    నామినేషన్‌ ఉపసంహరణకు

    అభ్యర్థుల ఒప్పందం

    చివరి క్షణంలో

    చెయ్యి ‘ఇచ్చిన’ దయాకర్‌

    పోటీ అనివార్యం