Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి చిత్రం బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. మార్చిలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, విడుదలను నేరుగా 2027 సంక్రాంతికి లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్‌ఫుల్‌ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. చిరంజీవి సరసన ప్రియమణి భార్య పాత్రలో నటించనున్నారు. కూతురి పాత్రకు కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నారు. కానీ మరో ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉండటంతో షూటింగ్ షెడ్యూల్ ప్లానింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  

    జనవరిలో మన శంకర వరప్రసాద్ విడుదల కాగా, జూలైలో విశ్వంభర థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. 2027 సంక్రాంతికి బరిలో దింపాలని చూస్తున్నారు. అయితే అదే సంక్రాంతికి వెంకటేష్, అనిల్ రావిపుడి కాంబినేషన్ సినిమా ఉంది. బాలయ్య చిత్రం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నాగార్జున కూడా రంగంలోకి దిగితే 2027 సంక్రాంతి సీనియర్ల సంక్రాంతి అయిపోతుంది. ప్రస్తుతాకి ఇవన్నీ అధికారికంగా ప్రకటించలేదు కానీ వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ల మద్య పోటీ ఉండే అవకాశం ఉంది.


  • టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కెరీర్ చాలా డిఫరెంట్. ఎందుకంటే 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత హీరోగా చేసిన మూవీస్ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. దీంతో 'అరవింద సమేత' చిత్రంతో విలన్‌గానూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకు సరైన గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్న టైంలో చాలామంది తనకు మూఢనమ్మకాల గురించి చాలా చెప్పి చూశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: గుండె లోతుల్లో బాధ.. ఎలా చెప్పాలో తెలీదు: నిహారిక)

    నేను కూడా సరైన ఛాన్సులు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇండస్ట్రీలోని వ్యక్తులు చాలా చెప్పారు. ఇన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నావ్. ఈ ఉంగరం వేసుకుంటే స్టార్ అయిపోతావ్ అని అన్నారు. రాగి రేకుపై ఏదో రాసిచ్చి, అది జేబులో పెట్టుకుని తిరిగితే.. నీతో మాట్లాడిన దర్శకనిర్మాతలు వెంటనే అవకాశాలు ఇచ్చేస్తారని కూడా అన్నారు. కానీ నేను అవేవి నమ్మలేదు. కేవలం మీ(అభిమానుల) అభిమానం వల్లే ఇలా ఉన్నాను అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చాడు.

    ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ'. మూఢ నమ్మకాలు, చేతబడులు, బలులు తదితర అంశాలతో తీసిన సినిమా ఇది. దివ్య పిళ్లై హీరోయిన్ కాగా కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆదివారం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నవీన్ చంద్ర తన జీవితంలో జరిగిన తనతో చాలామంది ఇప్పటికీ చెప్పిన మూఢనమ్మకాల గురించి బయటపెట్టాడు.

    (ఇదీ చదవండి: ఆ పిల్లి ఉంటే అందరూ దాసోహమే.. 'హనీ' ట్రైలర్ రిలీజ్)

  • యాంకర్‌గా, నటిగా, నిర్మాతగా.. అన్నిరకాలుగా తన టాలెంట్‌ నిరూపించుకుంది నిహారిక. ప్రస్తుతం ప్రొడక్షన్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేసిన నిహారిక తాజాగా జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. అయితే చెమటలు చిందించే ఎక్సర్‌సైజ్‌లను చూపించడమే కాకుండా మనసులోని సంఘర్షణను బయటపెట్టింది.

    గుండె లోతుల్లో బాధ
    నిహారిక మాట్లాడుతూ.. నా లోపల ఏదో తెలీని బరువు మోస్తున్నా.. అది ఒత్తిడా? బాధనా? అంటే నాకే తెలీదు. కానీ, మనసంతా బరువుగా ఉంది. దాన్ని చెప్పడానికి నాకు పదాలు కూడా దొరకడం లేదు. ఈ భారాన్ని తల్చుకుని కుంగిపోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. కొన్నిసార్లు నేను జిమ్‌కు వెళ్తుంటాను, బరువులు ఎత్తుతాను. 

    మనసు ఇప్పుడిప్పుడే..
    మరికొన్నిసార్లు వాకింగ్‌ చేస్తాను. ఇందులో ప్లానింగ్‌ చేసుకోవడానికంటూ ఏమీ లేదు. గుండెనిండా ఊపిరి పీల్చుకుంటూ నడుస్తానంతే! ఇంకొన్నిసార్లు డ్యాన్స్‌ చేస్తాను, యోగా చేస్తాను. ఇవన్నీ చేస్తుంటే మనసు తేలికపడుతోంది. బయటకు ఏమీ మారలేదు అనిపించొచ్చేమో, కానీ నాలోపల మాత్రం మార్పు మొదలైంది అని చెప్పుకొచ్చింది. వ్యాయామం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఆమె చెప్పకనే చెప్పింది.

     

     

    చదవండి: ఆడవారిపై ఇలాంటి ట్రోల్సా? చెండాలంగా ఉంది: బిగ్‌బాస్‌ బ్యూటీ

  • ఓరచూపుతో మాయ చేసేస్తున్న కాయదు లోహర్

    మత్తెక్కించే పోజులతో బ్యూటీ మృణాల్ ఠాకుర్

    గ్లామరస్ స్టిల్స్ ఇచ్చి రచ్చ లేపుతున్న రష్మీ

    జనవరి జ్ఞాపకాల్లో చాహల్ మాజీ భార్య ధనశ్రీ

    చీరలో నవ్వుతూ మైమరిపించేస్తున్న అనికా

    మరింత అందంగా అదిరిపోతున్న అషూరెడ్డి

  • నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. కరుణ కుమార్ దర్శకుడు. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల,  ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇది భయపెట్టేలా ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)

    నిజ జీవిత సంఘటనల ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అంశాలతో 'హనీ' మూవీ తీశారు. ఈ మూవీలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ దేవత వాహనంగా పిల్లిని చూపించారు. ఇది ఎవరి దగ్గర ఉంటే అందరూ వాళ్లకు దాసోహం అవుతారనే పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

    (ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూత)

  • 'రంభ హో హోహో..' ఈ పాట ఒకప్పుడు చాలా ఫేమస్‌. ధురంధర్‌ సినిమాలో ఈ సాంగ్‌ను వాడుకోవడంతో మరోసారి వైరల్‌ అయింది. అయితే ఈ పాటకు 70 ఏళ్ల నటి కల్పనా అయ్యర్‌ హుషారుగా స్టెప్పులెయ్యడం అంతకంటే ఎక్కువ వైరలవుతోంది. 1981లో వచ్చిన అర్మాన్‌ సినిమాలోని పాటే రంభ హో హో. ఈ డిస్కో సాంగ్‌లో కల్పనా అయ్యర్‌ స్టెప్పులేసింది. 

    పెళ్లిలో డ్యాన్స్‌
    దాదాపు 45 ఏళ్ల తర్వాత మరోసారి ఈ పాటపై కాలు కదిపింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కల్పనా అయ్యర్‌ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ కుమారుడి పెళ్లికి వెళ్లాను. అతడిని నా కొడుకులాగే భావిస్తాను. అందుకే ఫ్యామిలీతో కలిసి ఆ పెళ్లికి హాజరయ్యాను. అందరూ డ్యాన్స్‌ చేయమని కోరితే అప్పటికప్పుడు స్టెప్పులేశా.. అదేమీ ముందుగా ప్లాన్‌ చేసుకోలేదు.

    చాలా స్పెషల్‌
    ఆ వీడియోను సాధారణంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను. ఇంకేముంది, కొద్ది గంటల్లోనే చాలా వైరల్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే వీడియో కనిపిస్తోంది. అందరూ నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందులోనూ నాలుగు దశాబ్దాల కిందట డ్యాన్స్‌ చేసిన పాట మరోసారి గుర్తింపు తెచ్చుకుంటుంటే మరింత స్పెషల్‌గా అనిపిస్తోంది. 

    అవకాశాలు వస్తే అంతే చాలు
    ఈ సాంగ్‌ను ధురంధర్‌ మూవీలో వాడారని విన్నాను. అందుకు దర్శకుడు ఆదిత్య ధర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే! ఆయన వల్లే ఇప్పటి జెనరేషన్‌ ఆ పాటను మళ్లీ పాడుకోగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని చాలా మిస్‌ అయ్యాను. ఈ వైరల్‌ పాపులారిటీ మూలాన అవకాశాలు వస్తే కెమెరా ముందు నటిస్తాను అంటోంది. మరి కల్పనా కోరిక నెరవేరుతుందా? మరోసారి వెండితెరపై కనిపిస్తుందా? అన్నది చూడాలి! వందకు పైగా సినిమాల్లో యాక్ట్‌ చేసిన కల్పనా.. చివరగా హమ్‌ సాత్‌ సాత్‌ హై (1999) మూవీలో కనిపించింది.

     

     

     

    చదవండి: కవలలు పుట్టాక రామ్‌చరణ్‌ ఫస్ట్‌ పోస్ట్‌.

  • ఒకప్పుడు ఆడ, మగ క్లోజ్‌గా కనిపిస్తే చాలు వాళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని రూమర్స్‌ వచ్చేవి. కానీ, ఇప్పుడు కేవలం కలిసి కనిపించినా సరే.. ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌, యాంకర్‌ షెఫాలి బగ్గా డిన్నర్‌కు వెళ్లడంతో వీరు లవ్‌లో ఉన్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఒక ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) పోస్టర్‌ వైరలవుతోంది.

    యాంకర్‌ ఫైర్‌
    ఇందులో చాహల్‌ కుర్చీలో కూర్చోగా అతడి పక్కన మాజీ భార్య ధనశ్రీ వర్మ, ఆర్జే మహవశ్‌, షెఫాలి ఉన్నారు. ఈ ఫోటో మొదట చాహల్‌ కంట పడింది. అది చూసిన అతడు ఇంకో ఇద్దరు ముగ్గుర్ని మిస్‌ అయ్యారంటూ సెటైర్లు వేశాడు. తాజాగా ఈ ఏఐ పోస్టర్‌పై షెఫాలి మండిపడింది. ఇదెంత చెండాలం.. ఆడవారిని ఇలా చూపించడం సిగ్గుచేటు. మీ మనస్తత్వం ఎలాంటిదో ఇక్కడే తెలిసిపోతుంది. మీ పనేదో మీరు చూసుకుంటే బెటర్‌ అని కౌంటరిచ్చింది.

    పెళ్లి- విడాకులు
    ఇకపోతే చాహల్‌.. కొరియోగ్రాఫర్‌, డ్యాన్సర్‌ ధనశ్రీ వర్మను 2020లో పెళ్లి చేసుకున్నాడు. విభేదాలు రావడంతో 2024లో విడిపోయారు. 2025లో విడాకులు తీసుకున్నారు. తర్వాత యాంకర్‌ ఆర్జే మహవశ్‌తో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, సడన్‌గా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో బ్రేకప్‌ అయిపయిందని నెటిజన్లు ఫిక్స్‌ అయిపోయారు. 

    బిగ్‌బాస్‌తో ఫేమస్‌
    అనంతరం షెఫాలీతో కనిపించడంతో మళ్లీ ప్రేమలో పడ్డాడని పలువురు భావించారు. కానీ ఇప్పుడు యాంకర్‌ ఇచ్చిన కౌంటర్‌తో అదంతా ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. కాగా షెఫాలి న్యూస్‌ యాంకర్‌. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

    చదవండి: అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ పార్టీ

  • తెలుగు చిత్రసీమలో విషాదం. 350కి పైగా సినిమాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న రఘునాథ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెలరోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఈయన కూడా కాలం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నటీనటులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.

    (ఇదీ చదవండి: దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్)

    రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి.. ఈయనకు నివాళి అర్పించారు. ఇంత సీనియర్ నటుడు చనిపోతే.. టాలీవుడ్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథ రెడ్డి చేసిన మూవీస్ విషయానికొస్తే.. కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.

    శోభన్ బాబు హీరోగా చేసిన 'సర్పయాగం' సినిమాతో రఘునాథరెడ్డి.. నటుడిగా పరిచయమయ్యారు. చివరగా 2018లో సుమంత 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా.. నటనకు వీడ్కోలు చెప్పేశారు. గతేడాది పలు యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు కొడుకుని కోల్పోయిన బాధతో ఈయన కూడా తనువు చాలించారు.

    (ఇదీ చదవండి: 'చరణ్‌' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం)

  • ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్‌లలో  చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం సిరై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

    సినిమా కథలనేవి సమాజం నుండి పుట్టినవే. మన చుట్టూ జరిగిన ఘటనలను కాల్పనిక సన్నివేశాలతో జనరంజకంగా రూపొందిస్తారు దర్శకులు. అందుకే అడపాదడపా కొన్ని సినిమాలకు  వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా అని ముందే చెబుతారు. నిజానికి వాస్తవ ఘటనలతో సినిమా తీయడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. ఎందుకంటే తీసే సినిమా ఎవ్వరి మనోభావాలను దెబ్బ తీయకుండా, అలాగే వాస్తవంగా జరిగిన ఘటనను అంతే స్పష్టంగా చెబుతూ ప్రేక్షకులను కట్టిపడేయడమంటే కష్టమే. అదే కోవలో వచ్చిన తమిళ చిత్రం ‘సిరై’(Sirai). 

    తమిళ రచయిత తమీజ్‌ అందించిన కథతో దర్శకుడు సురేశ్‌ రాజకుమారి తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సిరై’. విక్రమ్‌ ప్రభు కథానాయకుడిగా ఈ సినిమాలో అలరించారు. సున్నిత మనస్కులు ఈ సినిమాని చూస్తే మాత్రం కంట నీరు పెట్టక మానరు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం. కానిస్టేబుల్‌ కదిరవన్‌ ఓ అండర్‌ ట్రైల్‌ ఖైదీని జైలు నుండి కోర్టుకు విచారణకై తీసుకెళ్లడమే ఈ సినిమా కథాంశం. అబ్దుల్‌ అనే ఖైదీ చుట్టూ సాగుతుందీ కథ. అబ్దుల్‌ ఓ హత్య కేసులో అండర్‌ ట్రైల్‌ ఖైదీగా ఉంటాడు. 

    కోర్టులో తన కేసు విచారణకు రావడంతో కదిరవన్‌తో కలిసి కోర్టుకు బయలుదేరతాడు అబ్దుల్‌. మార్గ మధ్యంలో అబ్దుల్‌ తన కథను కానిస్టేబుల్‌ కదిరవన్‌కు చెబుతాడు. అబ్దుల్‌ అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడని తెలుసుకున్న కానిస్టేబుల్‌ కదిరవన్‌ కోర్టు ప్రాంగణంలోనే సాయపడాలని నిర్ణయించుకుంటాడు. అయితే కోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు కానిస్టేబుల్‌ కదిరవన్‌కు అబ్దుల్‌ వినిపించిన కథేంటి? ఈ కథలో తనకు న్యాయం జరిగిందా? కోర్టులో జరిగిన ఘటనలు ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే జీ5 (Zee5) వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతున్న ‘సిరై’ చూడాల్సిందే. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయి. మరి... ప్రేమను కాపాడిన ఈ పోలీస్‌  కథను మీరూ చూసేయండి.  
    – హరికృష్ణ ఇంటూరు  

  • అల్లు కుటుంబంలో పెళ్లి సందడి. అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్.. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నయనిక అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరగ్గా.. మరికొన్ని రోజుల్లో వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. దీంతో ఇప్పుడు అందరూ కలిసి బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నాడు. దీనికి దుబాయి వేదికగా నిలిచింది.

    (ఇదీ చదవండి: నిజంగా పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల)

    అల్లు శిరీష్, నయనికల బ్యాచిలరేట్ పార్టీ.. శనివారం రాత్రి దుబాయిలో జరిగింది. ఓ పడవలో వీళ్లంతా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ అన్న బాబీ కూడా తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలని పోస్ట్ చేయగా.. బన్నీ భార్య స్నేహ కూడా పలు ఫొటోలని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది.

    (ఇదీ చదవండి: 'చరణ్‌' చేతిలో రెండేళ్ల బిడ్డ.. మెగా ఫ్యాన్స్‌ అత్యుత్సాహం)

  • మలయాళంలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్.. ఈ మధ్యే 'ఛాంపియన్' అనే మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం మరో తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఇవి అలా ఉండగానే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఈమె నటించిన ఓ ఫీల్ గుడ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయింది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి మాస్టర్ మహేంద్రన్ కొత్త తెలుగు సినిమా)

    తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్.. ఓవైపు కంపోజర్‌గా చేస్తూనే మరోవైపు హీరోగానూ అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నాడు. ఇతడు అనస్వర హీరోహీరోయిన్లుగా చేసిన ఓ సిరీస్ 'లక్కీ'. ఇందులో ఓ కుక్క పిల్ల కూడా లీడ్ రోల్ చేసింది. దీని చుట్టూనే సిరీస్ అంతా ఉంటుంది. హాట్‌స్టార్‌లో ఈనెల 20వ తేదీ నుంచి ఇది.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

    'లక్కీ' విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ చిన్న కుక్కపిల్ల హీరోకి దొరుకుతుంది. దీంతో దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంటున్న పాపకు ఇస్తాడు. ఓ రోజు.. రాజకీయ నాయకుడు సదరు పెట్ డాగ్‪‌ని ఎత్తుకుపోతాడు. అసలు ఆ కుక్కపిల్ల సంగతేంటి? చివరకు హీరోకు దగ్గరకు చేరిందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

  • కవలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిశాయి. రామ్‌చరణ్‌- ఉపాసనలకు జనవరి 31న రాత్రి బాబు, పాప పుట్టాడని చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తాజాగా ఈ శుభవార్తను చరణ్‌- ఉపాసన దంపతులు ఓ స్పెషల్‌ ఫోటో ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.

    వాళ్లే గొప్ప బలం
    బాబు, పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడిని కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన జీవితంలో మహిళలే గొప్ప బలం. మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోను జత చేశారు. 

    పెళ్లి
    అందులో చరణ్‌ దంపతులు బ్లాక్‌ డ్రెస్‌ ధరించగా.. రెండు శునకాలను పట్టుకుని ఠీవీగా నిల్చున్నారు. కాగా రామ్‌చరణ్‌, ఉపాసన 2011 డిసెంబర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. 2012 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023లో కూతురు క్లీంకార జన్మించింది. ఇప్పుడు క్లీంకారతో ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి, బుడ్డోడు కుటుంబంలో చేరారు.

    చదవండి: తండ్రి బాటలో రామ్‌చరణ్‌.. ఎంత గొప్ప మనసు

  • బంధువును నమ్మి డబ్బులిచ్చి మోసపోయానంటున్నాడు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, మోడల్‌ ప్రిన్స్‌ యావర్‌. తన డబ్బు ఇవ్వమని అడిగితే.. పెద్ద పెద్దవార్ల పేరు చెప్పి బెదిరిస్తున్నాడంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. అందులో ప్రిన్స్‌ యావర్‌ మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ బలవంతం చేయడం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. నా బంధువుల్లో ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. స్థలం విషయంలో రూ.30 లక్షలు ముంచేశాడు. అయితే నా ఫ్యామిలీతో మాట్లాడి రూ.23 లక్షలు తిరిగిస్తానని నన్ను ఒప్పించాడు.

    పైసా ఇవ్వడం లేదు
    15 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తిరిగివ్వలేదు. అన్ని చోట్లా నన్ను బ్లాక్‌ చేశాడు. అతడి స్నేహితుడికి ఫోన్‌ చేస్తే నువ్వేం చేయలేవంటూ రివర్స్‌లో నన్నే బెదిరిస్తున్నారు. పెద్దవాళ్ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. అందులో కేటీఆర్‌ సర్‌ పేరు కూడా ఉంది. ఈ వీడియో కేటీఆర్‌ సర్‌ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నాను. ఆయన వెనకాల ఇంత జరుగుతుందని కేటీఆర్‌ సర్‌కు తెలియదనే అనుకుంటున్నాను. 

    చచ్చిపోదామనుకున్నా
    ఇకపోతే అతడు చేసిన మోసం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. భయంకరమైన ఆలోచనలు వచ్చాయి. చచ్చిపోవాలనుకున్నాను. కానీ, నాకు నా అభిమానులున్నారు. వారికోసం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకున్నాను. నాలా ఇంకెవరూ మోసపోకూడదు అని చెప్పుకొచ్చాడు. ప్రిన్స్‌ యావర్‌.. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు సీరియల్స్‌ కూడా చేశాడు. పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు.

     

     

    చదవండి: మీరే నా బలం.. 30 ఏళ్లర్నీపై కిచ్చా సుదీప్‌ ఎమోషనల్‌

  • తమిళ నటుడు శివకార్తికేయన్‌కు తెలుగు ఆడియన్స్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. తాను నటించిన లేటెస్ట్ మూవీ 'పరాశక్తి'  చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. పీరియాడికల్ స్టోరీతో తీసిన ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అభిమానలను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.

    తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 7వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సయిన వారు ఓటీటీలో చూసేయండి.

    ఈ మూవీని 1964లో తమిళనాడులో ఓ ఊరిలో జరిగిన ఉద్యమం ఆధారంగా తెరకెక్కించారు. హిందీని జాతీయ భాషగా ప్రకటించిన తర్వాత మధురైలోని ఓ ఊరిలో విద్యార్థులకు, ఓ ఊరివాళ్లకు.. ఓ పోలీస్‌తో ఎలాంటి గొడవ జరిగింది? చివరకు ఏమైంది అనే పాయింట్‌తో మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో​ పలు అభ్యంతరకరమైన డైలాగ్స్‌ ఉండటంతో సెన్సార్‌ బోర్డ్ భారీ కట్స్ చెప్పింది. ఏకంగా 20కి పైగా కట్స్‌ సూచించింది.  సెన్సార్ వివాదం ముగిసిన తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు.
     

     

  • రామ్‌ చరణ్‌, ఉపాసనల కుమార్తె క్లీంకార  ఫొటోను పూర్తిగా ఇప్పటికీ వారు రివీల్‌ చేయలేదు. కానీ, ఏదైన వారు ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు కెమెరాలతో క్లిక్‌మనిపించి సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. అయితే, తాజాగా ఇప్పుడు కూడా రామ్‌ చరణ్‌తో క్లీంకార ఉన్న ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

    నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఉపాసన పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీంతో పెద్ద కూతురు క్లీంకారను తీసుకుని తాజాగా  రామ్‌ చరణ్‌ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ భారీ ఎత్తున చుట్టుముట్టడంతో అతి కష్టం మీద ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అయింది. 

    చరణ్‌ చేతిలో రెండేళ్ల బిడ్డ ఉంది అనే కామన్‌సెన్స్‌ కూడా మెగా ఫ్యాన్స్‌ ప్రవర్తించారు. వారు చేసిన హంగామాకు ఆ చిన్నారి కూడా ఆందోళన చెందింది. దీంతో తొలిసారి చరణ్‌ కూడా సహనం కోల్పోవాల్సి వచ్చింది. సిబ్బంది రక్షణలో క్లీంకారను  ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఆసుపత్రిలోకి చరణ్‌ వెళ్లారు. ఈ క్రమంలో క్లీంకార వీడియోను కొందరు తమ మొబైల్స్‌తో చిత్రీకరించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

    కాపీరైట్స్‌ చర్యలు
    క్లీంకారకు సంబంధించిన Klin Kaara విజువల్స్ ఎవరైనా పబ్లిష్ చేస్తే కాపీరైట్స్‌ చర్యలు తీసుకుంటామని రామ్‌ చరణ్‌ టీమ్‌ హెచ్చరించింది. ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల క్లీంకార విజువల్స్ పలు కెమెరాలలో దొరికాయి. దీంతో అవి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. (క్లీంకార పూర్తి ఫోటోలను కాకుండా తన మొఖం కనిపించని వీడియో, ఫోటోను మాత్రమే ఇక్కడ షేర్‌ చేశామని గమనించగలరు)

  • కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. సినీ ప్రపంచంలో నా మూడు దశాబ్దాల జర్నీని చూసుకుంటే మనసు సంతోషంతో నిండిపోతోంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు.

    మీ వల్లే సాధ్యం
    ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. అభిమానులు.. మీరే నా బలం. నన్ను ముందుకు నడిపించింది మీరే! దర్శకరచయితలు.. మీ కథలకు నేను సరిపోతానని నన్ను నమ్మినందుకు థాంక్యూ. నిర్మాతలు.. మీ ధైర్యం, నాపై ఉంచిన నమ్మకం వల్లే కలలు సాకారమయ్యాయి. సహనటులు, ప్రతి టెక్నీషియన్స్‌కు చెప్పొచ్చేదేంటంటే.. సినిమా అంటేనే టీమ్‌ వర్క్‌. 

    సమిష్టి కృషి
    లైట్‌ బాయ్‌ నుంచి కెమెరామెన్‌ వరకు, ఆర్ట్‌ టీమ్‌ నుంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వరకు, స్పాట్‌ బాయ్‌ నుంచి ఎడిటర్స్‌ వరకు.. మీ అందరి కష్టం సినిమాలో దాగుంది. టీవీ, మీడియా.. ఈ రెండూ నా ఎదుగుదలకు తోడ్పడ్డాయి. కన్నడ చిత్ర పరిశ్రమ.. నాకంటూ పేరుప్రఖ్యాతలు, గుర్తింపునిచ్చిందే ఈ ఇండస్ట్రీ. 

    30 ఏళ్లలో..
    కన్నడ సినిమా ఎప్పటికీ నా గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా కుటుంబసభ్యులు, స్నేహితులు.. మీరందరూ నన్ను మంచి మనిషిగా తీర్చిదిద్దారు. ఈ 30 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఒక్కటే.. విధేయత. ఎంత సక్సెస్‌ వచ్చినా సరే మరింత విధేయతతో, కష్టపడి పని చేయాలి. నాకెంతో ఇచ్చిన ఈ సినిమాకు ఎంతో కొంత తిరిగిచ్చేయాలి అని రాసుకొచ్చాడు.

    సినిమా
    తయ్యావా (1997) అనే కన్నడ సినిమాతో నట ప్రయాణాన్ని ఆరంభించాడు. ఇందుడో సైడ్‌ క్యారెక్టర్‌లో నటించాడు. 2000వ సంవత్సరంలో స్పర్శ మూవీతో హీరోగా మారాడు. హచ్చ (2001) చిత్రంతో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. నంది, హచ్చ, స్వాతిముత్తు, మై ఆటోగ్రాఫ్‌, కెంపె గౌడ, ఈగ.. ఇలా అనేక సినిమాలతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్నాడు. చివరగా మార్క్‌ సినిమాతో అలరించాడు. మై ఆటోగ్రాఫ్‌ సహా పలు సినిమాలకు ఈయనే స్వయంగా దర్శకత్వం వహించాడు.

     

     

    చదవండి: నిజం పెళ్లాన్ని అడిగినట్లే అడిగారు: శ్రీలీల

International

  • రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో  దారుణం జరిగింది. అక్కడ మిలిషీయా గ్రూపులో కంట్రోల్‌లో ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 200 మంది వరకూ మరణించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఈ బుధవారం ఉత్తర కివు ‍ప్రావిన్సులోని రుబియ గనులలో బుధవారం భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.  అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని రుబియాలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 200కుపైగా ప్రజలు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది.

    భారీస్థాయిలో వర్షాలు కురవడంతో చాలా మట్టుకు మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయని వాటిని వెలిక్కితీయడం కష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఎం23 అనే తిరుగుబాటు గ్రూపు ఆదీనంలో ఉంది. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. కొండచరియలు విరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారికి సంఘీబావం ప్రకటించింది. తిరుగుబాటు గ్రూపులో ఈ ప్రాంతంలోని సహాజవనరులను అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించింది.

    ఉత్తర కాంగో ప్రాంతంలో ఉన్న రుబియా ప్రాంతంలనో గనులలో అధిక స్థాయిలో ఖనిజ నిల్వలున్నాయి. దీంతో అక్కడి స్థానిక మిలిషీయా గ్రుపులకు ప్రభుత్వానికి మధ్య తరచుగా యుద్ధం జరుగుతుంది. 

Sports

  • అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాకిస్తాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించింది.

    బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

    భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్‌ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్‌ పటేల్‌ (9.2-1-35-3), ఆయుశ్‌ మాత్రే (8-0-21-3), కనిష్క్‌ చౌహాన్‌ (10-1-30-1), విహాన్‌ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్‌ (5-0-26-1), హెనిల్‌ పటేల్‌ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్‌ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 

    పాక్‌ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖాన్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్‌ (42), ‍కెప్టెన్‌ ఫర్హాన్‌ యూసఫ్‌ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ సెమీస్‌కు అర్హత సాధించాయి. 

    గ్రూప్‌-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌ భారత్‌ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌ తలపడతాయి. 
     

  • టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్‌ పోరుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్‌ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. 

    ఈ నిర్ణయం పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది.  పాక్‌ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

    భారత్‌-పాక్‌ ఇప్పటివరకు కేవలం​ ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

    భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

    కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్‌ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్‌ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 

    ఈ మొత్తం ఎపిసోడ్‌ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్‌ భారత్‌లో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. 

    వేదికలను శ్రీలంక‍కు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్‌ బంగ్లాదేశ్‌కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్‌కు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్‌లో పాక్‌ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది. 

  • టీ20 ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్‌.. అనంతరం ఆసీస్‌ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

    రాణించిన బాబర్‌, సైమ్‌
    పాక్‌ ఇన్నింగ్స్‌లో సైమ్‌ అయూబ్‌ (56), బాబర్‌ ఆజమ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా పాక్‌ ఆటగాళ్లలో ఫకర్‌ జమాన్‌ 10, కెప్టెన్‌ సల్మాన్‌ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్‌ నవాజ్‌ 5, ఫహీం అష్రాఫ్‌ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ 2, గ్రీన్‌, కన్నోలీ, షార్ట్‌, కుహ్నేమన్‌ తలో వికెట్‌ తీశారు.

    తిప్పేసిన నవాజ్‌
    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గ్రీన్‌ (22), స్టోయినిస్‌ (23), జోష్‌ ఫిలిప్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్‌ (1), షార్ట్‌ (2), రెన్‌షా (1), ఓవెన్‌ (8), కన్నోలీ (0), కుహ్నేమన్‌ (5) దారుణంగా విఫలమయ్యారు. 

    ఆడమ్‌ జంపా బ్యాటింగ్‌కు దిగలేదు. పాక్‌ ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ​కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్‌కు ఆసీస్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్‌ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది.

     

     

     

  • పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ భారత దిగ్గజం విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్‌ సెంచరీ చేసిన బాబర్‌.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. 

    ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్‌ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్‌, విరాట్‌ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ (32), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (30), డేవిడ్‌ వార్నర్‌ (28), జోస్‌ బట్లర్‌ (28) ఉన్నారు.

    మరో రికార్డు
    తాజా హాఫ్‌ సెంచరీతో బాబర్‌ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్‌ లెజెండ్‌ క్రిస్‌ గేల్‌ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్‌ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.

    ఫామ్‌లోకి వచ్చిన బాబర్‌
    BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు) చేసిన బాబర్‌.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి, ఫామ్‌లోకి వచ్చాడు.

    మ్యాచ్‌ పరిస్థితి  
    లాహోర్‌ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్‌ చేసింది. సైమ్‌ అయూబ్‌ (56), బాబర్‌ ఆజమ్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్‌ ఖాన్‌ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో డ్వార్షుయిస్‌ 2, గ్రీన్‌, కన్నోలీ, షార్ట్‌, కుహ్నేమన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్‌ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్‌ నవాజ్‌ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన పాక్‌ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

     

  • కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ దేశవాలీ క్రికెట్‌లో అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్‌ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్‌పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ ఉగ్రరూపం దాల్చాడు. 

    40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సహా మ్యాచ్‌ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. 

    ఛేదనలో పడిక్కల్‌కు మయాంక్‌ అగర్వాల్‌ (53), శ్రేయస్‌ గోపాల్‌ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్‌ విధ్వంసకర శతక​ంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్‌ బౌలర్లలో అన్మోల్‌జీత్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా.. సుఖ్‌దీప్‌, ఎమన్‌జోత్‌ చహల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

    అంతకుముందు పంజాబ​్‌ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఉదమ్‌ సహారన్‌ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సహారన్‌ మినహా ఎ‍వ్వరూ రాణించలేదు. అన్మోల్‌ప్రీత్‌ (44), అభిజీత్‌ (33), హర్ప్రీత్‌ బ్రార్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

    కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్‌ షెట్టి 2, విధ్యాదర్‌ పాటిల్‌, మొహిసిన్‌ ఖాన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

    దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ గోపాల్‌ (77), కేఎల్‌ రాహుల్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్‌ అగర్వాల్‌ (32), విధ్యాదర్‌ పాటిల్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్ప్రీత్‌ 4, సుఖ్‌దీప్‌ 3, అన్మోల్‌ 2, చహల్‌ ఓ వికెట్‌ తీశారు. 

    అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్‌ (81), చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు. 

  •  

    ఈ ఏడాది ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ అర్హత సాధించాయి. నేపాల్‌లో జరుగుతున్న క్వాలిఫయర్‌ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు కూడా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.

    ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.

    మరోవైపు థాయ్‌లాండ్‌పై గెలుపుతో ఐర్లాండ్‌ ‍ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ టాప్‌-4లో నిలిచి ప్రపంచకప్‌ టికెట్‌ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక నేరుగా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.

    కాగా, జూన్‌ 12న బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్‌. ఆ ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. 

  • అండర్‌–19 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్‌ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ దిశగా అడుగులు వేసినా, పాక్‌ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది.  

    బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేస్తుంది. పాక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్‌ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

    భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు. 

     

  • అండర్‌–19 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్‌ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ దిశగా అడుగులు వేసినా, పాక్‌ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది.  

    బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేస్తుంది. పాక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్‌ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

    భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు.

    ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్‌ సందర్భంగా పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ తర్వాత అతను డ్రెస్సింగ్‌ రూమ్‌లో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. 

    ఇవి మ్యాచ్‌ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్‌ లేదా చీటింగ్‌) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్‌ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్‌ ఫోన్‌ వాడకూడదు. ఆర్టికల్‌ 4.1.2 ప్రకారం ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు కూడా వాడకూడదు.  

     

  • టీ20 ప్రపంచకప్‌ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్‌ క్రికెట్‌ బోర్డు కీలక అడుగు వేసింది. ప్రపంచకప్‌ గ్యాప్‌ను కవర్‌ చేసుకునేందుకు స్వదేశంలో కొత్త టీ20 టోర్నీని ప్రకటించింది. ఈ టోర్నీకి ఓడొమ్మో (ODOMMO) బంగ్లాదేశ్‌ టీ20 కప్‌గా నామకరణం చేసింది. మూడు జట్లు (ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI) పోటీ పడే ఈ టోర్నీ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.  

    టోర్నీ లాంచ్‌ విషయాన్ని ఆ దేశ యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహ్బూబ్‌–ఉల్–ఆలమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచకప్‌ ఆడకపోయినా, ఆటగాళ్లకు పరిహారం ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

    కాగా, భారత్‌లో భద్రతా సమస్యల కారణంగా బంగ్లాదేశ్‌ జట్టు ప్రపంచకప్‌కు వెళ్లేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌కు వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కింది.

    ODOMMO టోర్నీ వివరాలు  
    - జట్లు: ధూమకేతు XI, దుర్బార్‌ XI, దురొంటో XI  
    - కెప్టెన్లు: లిటన్‌ దాస్‌ (ధూమకేతు), నజ్ముల్‌ హొసైన్‌ షాంటో (దుర్బార్‌), అక్బర్‌ అలీ (దురొంటో)  
    - మ్యాచ్‌లు: గ్రూప్‌ స్టేజ్‌ ఫిబ్రవరి 5, 6, 7; ఫైనల్‌ ఫిబ్రవరి 9  
    - ప్రారంభం: ప్రతి మ్యాచ్‌ రోజు సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, 6 గంటలకు మ్యాచ్‌  
    - ప్రైజ్‌ మనీ: మొత్తం 2.5 కోట్లు టాకా, ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులు కూడా ఇవ్వబడతాయి  
     

  • భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్‌ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్‌ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్‌లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.  

    ఈ మ్యాచ్‌లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్‌ సూర్యవంశీ ​కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. వైభవ్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్‌ చేసిన ఈ స్కోర్‌ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్‌ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్‌లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వైభవ్‌పై కట్టలు తెంచుకుంది.

    వీరిద్దరితో పాటు మరో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) కూడా విఫలం కావడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్‌ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్‌ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్‌ పేసర్‌ మొహమ్మద్‌ సయ్యమ్‌ భారత టాపార్డర్‌ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. 

    మరో 62 పరుగుల తర్వాత భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్‌ మల్హోత్రా (21) అహ్మద్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్‌ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్‌ త్రివేది (50), అభిగ్యాన్‌ కుందు (12) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు.

    కెప్టెన్సీ నుంచి తీసేయండి..!
    ఇటీవలికాలంలో ఆయుశ్‌ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్‌పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్‌లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  • టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్‌కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.

    అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్‌లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక  స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.

    అసలంకపై వేటు..
    కాగా ఈ మెగా టోర్నీ కోసం లం‍క సెలెక్టర్లు  గత డిసెంబర్‌లో 25 మం‍ది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

    షనక కెప్టెన్‌గా గతంలో లంకకు ఆసియాకప్‌ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతున్నారు.

    టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు
    పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

  • జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి)  విజయం సాధించింది. దీంతో క్లీన్ స్వీప్ ప్రమాదం నుంచి పర్యాటక విండీస్ తప్పించుకుంది. వర్షం, మెరుపులు కారణంగా ఈ మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు.

    తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెప్ షాయ్ హోప్‌(25 బంతుల్లో 48), షిమ్రాన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 48 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సఫారీ బౌలర్లలో ఎంగిడీ, మఫాక, కేశవ్ మహారాజ్ తలా వికెట్ సాధించారు.

    అనంతరం డీఎల్‌ఎస్ పద్దతి ప్రకారం.. దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 10 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ త్వరగా ఔటైనప్పటికి క్వింటన్ డికాక్ (28) శుభారంభం ఇచ్చాడు. కానీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

    విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమయ్యారు. కరేబియన్ బౌలర్లలో గుడికేష్ మోటీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన సౌతాఫ్రికా.. సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

  • అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మ‌రో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. సూప‌ర్ సిక్స్‌లో భాగంగా బులవాయో వేదిక‌గా భారత్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీల‌క మ్యాచ్‌కు పాక్ ఆట‌గాడు మహ్మద్‌ షయాన్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.

    అత‌డి స్దానంలో అలీ హసన్ బలోచ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. మ‌రోవైపు భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. ఉద‌వ్ మోహ‌న్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి వ‌చ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆసియాక‌ప్ ఫైన‌ల్లో ఎదురైన ప‌రాభావానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది.

    తుది జ‌ట్లు
    పాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీప‌ర్‌), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజా

    భార‌త్‌ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్‌), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీప‌ర్‌), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Politics

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్‌ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి ర‌మేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

    ‘‘అంబటి రాంబాబు, జోగి ర‌మేష్‌ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు  ‘జంగిల్‌రాజ్‌’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ స‌ర్కార్‌ను ద‌హించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు.

    ..చంద్రబాబూ గుర్తుంచుకోండి..  ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్‌ రాజ్‌’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

     

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు హత్యకు టీడీపీ చేసిన కుట్ర బట్టబయలైంది.అంబటి ఇంటిపై దాడిలో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దంపతులదే కీలక పాత్ర అని తేలింది. 

    అంబటి రాంబాబు గల్లా మాధవికి దొరికి ఉంటే అంత్యక్రియలు జరిగిపోయేవని అని స్వాతిరెడ్డి అలియాస్‌ స్వాతిచౌదరి ట్వీట్‌ చేశారు. అంబటిని హత్య చేసేందుకు టీడీపీ కుట్రపన్నిందని స్వాతిచౌదరీ ట్వీట్‌ ద్వారా స్పష్టమైంది. హత్యచేసేందుకు ప్లాన్‌ వేసుకున్నారన్న విషయం స్వాతిచౌదరి ట్వీట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది.   

  • సాక్షి,హైదరాబాద్‌: సిట్‌ అంటే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ కాదని.. సిట్‌ అంటే సీఎం ‘సీఎం ఇన్‌స్ట్రక్షన్‌ టీమ్‌’ అంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సిట్‌ విచారణపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఎద్దేవా చేశారు.

    తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌పై నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను సిట్‌ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో కేసీఆర్‌ సిట్‌ విచారణపై హరీష్‌ రావు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో..సిట్ పేరిట జరుగుతోంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి నోటీసుల వెనుక చట్టం లేదు, కేవలం రాజకీయ ప్రతీకారం,రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉంది. సిట్‌ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారు. నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదు.

    కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో ఈ రాష్ట్రానికి తెలియదా? ఇంటలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్నా నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం మీ చౌక బారు రాజకీయానికి నిదర్శనం. పదేళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించి తీరు ప్రజాస్వామ్యానికి అవమానకరం.

    పాలన చేతకాక, హామీలు నెరవేర్చలేక, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అయ్యింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్ రెడ్డి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట. ఇలాంటి రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం.

    చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి. సిట్‌ అంటే సిట్‌ కాదు. ఇది CIT సిట్..‘సీఎం ఇన్‌స్ట్రక్షన్ టీమ్’. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారు పోలీసులు. సిట్ స్వతంత్రంగా పని చేయడం లేదు, సీఎం కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకే పని చేస్తోంది. సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.

    మీరు ఇచ్చిన నోటీసులు చట్ట బద్దం కావు మీరు అనుసరించిన విధానం రాజ్యాంగం బద్దం కాదు. అయినా సరే.. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా కెసిఆర్ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. అధికారం మదంతో సిట్ పేరిట నువ్వు చేస్తున్న డ్రామాలు నీ వికృత వైఖరికి, నీ పరిపాలనా చేతగానితనానికి నిదర్శనం. కేసీఆర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నా.. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నట్లు?. మా నాయకులు, కార్యకర్తలను ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు, అదుపులోకి తీసుకున్నారు.

    గజ్వేల్ నుండి హైదరాబాద్ దాకా వేలాది మంది పోలీసులను మోహరించారు. బీఆర్‌ఎస్‌  నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. రెండేళ్లుగా చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదు అందుకే రేవంత్ రెడ్డి..సిట్టూ.. లట్టు.. పొట్టు అంటూ టైం పాస్ చేస్తున్నడు. దర్యాప్తు పేరు చెప్పి ముందే తీర్పు రాయడం కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి.  

    ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రశ్నించాలి. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే నోటీసులు, మాట్లాడితే అరెస్టులు. ఇది కాంగ్రెస్ న్యూ డెమోక్రసీ మోడల్ రైతుల కష్టాలు పట్టవు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు,  అవ్వా తాతలకు పింఛన్లు పెంచరు. ఆరు గ్యారెంటీల అమలు చేయరు కానీ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన భయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భయపడే ప్రభుత్వాలే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తాయి. చరిత్ర సృష్టించిన నాయకుడిని,కేసులు పెట్టి చిన్నబుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ. చరిత్రను చెరిపేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరు’ అని పేర్కొన్నారు.

  • నెల్లూరు:  సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తిరుమల లడ్డూలో  కల్తీ జరిగిందని గతంలో చంద్రబాబు మాట్లాడరని,  సీబీఐ రిపోర్ట్‌ ప్రకారం అందులో ఎలాంటి కొవ్వు లేదని స్పష్టమైందన్నారు.  దాంతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని తేటతెల్లమైందన్నారు. 

    చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగా రిపోర్ట్‌ రాలేదని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను బలి పశువును చేశారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబపై హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు.

     

  • విజయవాడ: వరుసగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. నిన్న(శనివారం) అంబటి రాంబాబు ఇంటిపై దాడి, ఈరోజు(ఆదివారం) జోగి రమేష్‌ ఇంటిపై జరిగిన దాడులను పేర్ని నాని తీవ్రంగా ఖండించారు.  

    ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అంబటి ధ్వజమెత్తారు. ‘ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కిందస్థాయి సిబ్బందిని నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ చేస్తున్న దాడులను అడ్డుకోవద్దని పైస్థాయి అధికారుల నంచి ఆదేశాలున్నాయని కింద స్థాయి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచకం చేస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. లేకంటే వేలాది మంది ప్రాణాలకు ముప్పు. టీడీపీ దాడులను పోలీసులు అడ్డుకోవడం లేదు. ప్రశ్నించే వాళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి’ అని పేర్కొన్నారు. 

  • సాక్షి,విజయవాడ: ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌ ఇంటికి వందలాది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పెట్రోల్‌ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జోగి రమేష్‌ నివాసం అగ్నిప్రమాదం చోటు చేసుకుని మంటలు, పొగలు ఎగిసి పడుతున్నాయి. 

    జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోకకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్‌ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. జోగి రమేష్‌ తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నారు.   

    నా కుటుంబం హత్యకు కుట్ర  
    పెట్రోల్‌ బాంబులు వేసిన తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడులకు తెగబడ్డారు.అయితే,ఈ దాడుల్ని జోగి రమేష్‌ ఖండించారు. ఘటన జరిగే సమయంలో తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

    చంద్రబాబు,లోకేష్‌ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?
    ఏపీలో విధ్వంసకాండ జరుగుతోంది. నా ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సారధ్యం.. లోకేష్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు,లోకేష్‌ నన్ను మట్టు బెట్టాలనుకున్నారా?.నన్ను,నా పిల్లలను దహనం చేయాలని అనుకున్నారా?. పెట్రోల్‌ బాంబులు వేసి నా కుటుంబాన్ని హత్య చేసే కుట్ర.గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను దించి దాడులు చేస్తున్నారు.  

    ప్రభుత్వమే పెట్రోల్‌ బాంబులు వేయిస్తోంది.మా ఇళ్లపై దాడులు చేస్తే వైఎస్సార్‌సీపీ జెండాను వీడుతామా?. వైఎస్సార్‌,వైఎస్‌ జగన్‌ అడుగుజాడల్లో నడిచేవాళ్లం మేం. ప్రజాగొంతుకలపై దాడి చేస్తారా?. మీ దాడులను ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీరు హద్దు మీరిపోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. ఏడాది కాలంలోనే ప్రభుత్వం ప్రజల్లో అసహ్యం పెరిగింది. లోకేష్‌ నీ పిల్ల చేష్టలు, రాక్షసానందం మానుకో. ఈ దాడులను రాష్ట్ర ప్రజలు ఖండించాలి. అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో మమేకం అవుతాం. దాడులు జరుగుతుంటే పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. 

     

     

     

  • సాక్షి,గుంటూరు: నాన్నతో పాటు తమని చంపాలని చూశారని మీడియా ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన అంబటి రాంబాబు ఇంటిని ఆదివారం వైఎస్సార్‌సీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా అంబటి మౌనిక మీడియాతో మాట్లాడారు.  

    మా నాన్నపై హత్యాయత్నం జరిగింది. మా నాన్నను రాడ్లతో చంపేందుకు యత్నించారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించారు. ఇంట్లో మహిళలు,పిల్లలు ఉన్నారని తెలిసి.. మా ఇంట్లో చొరబడి దారుణంగా దాడులు చేశారు. మాపై కూడా హత్యాయత్నం జరిగింది.’అని వాపోయారు. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: హత్యానేరం కన్నా.. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ మహా పాపమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఒకవైపు ఆదివారం నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ సిట్‌ విచారణ కొనసాగుతున్న వేళ..  మరోవైపు సీఎల్పీ మీడియా హాల్‌లో పలువురు నేతలు ఈ అంశంపై మీడియా మాట్లాడారు. 

    మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కావడానికి సిగ్గుచేటు ఫోన్ ట్యాపింగ్. విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..

    గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్‌ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారు

    అన్ని ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టినా బీఆర్‌ఎస్‌లో మార్పు రాలేదు. తెలంగాణ లో ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అనుకుంటున్నారు. ప్రజా పాలనలో అంబేద్కర్ రాజ్యంగం అమలు అవుతుంది. కేసీఆర్ రాజ్యాంగం ముగిసి చాలారోజులైంది. 

    ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నిజాయితీగా ఉద్యమం చేయలేదు. రాజకీయం కోసం ఉద్యమాన్ని వాడుకున్నారు. విచారణ ఎదుర్కొంటున్న  రూంలో కూర్చుని కేసీఆర్ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ రూంలో కూర్చుని బజ్జీలు తిని ముచ్చట్లు పెట్టి వచ్చేవాళ్ళం. కేసీఆర్ ఆ రూంలో కూర్చొని ఏం చేస్తే తనకి బెనిఫిట్ అవుతుందా? అని ఆలోచించేవారు. సకల జనుల సమ్మె, సాగర హారం లాంటి అనేక కీలక ఘట్టాల్లో కేసీఆర్ బయటకి రాలేదు. తెలంగాణ కోసం కేసీఆర్ నటించాడు. అసలు తెలంగాణ బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ పార్లమెంట్‌లోనే లేడు. 
    దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అని తేలిపోయింది. కూలీ బ్యాచ్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే భయపడుతామా?. 

    కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్‌ అన్నారు.

  • సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.

    ‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్‌ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్‌ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్‌ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.

    ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్‌ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్‌ బుక్‌లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్‌ గేట్‌ ఎదుట వెయిట్‌ చేయించారు. లోకేష్‌ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

     


     

     

     

Telangana

  • మేడారం(ములుగు జిల్లా): మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో మా ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాల చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదన్నారు. భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకం తానన్నారు. మేడారంలో  మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ‘తనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక  కొందరు చేసే కుట్రలకు భయపడే రకం కాదు

    జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నాం. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్నీ పరిశుభ్రపరుస్తున్నాము. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. విఐపిల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయింది

    ఆ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. గట్టమ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నాము. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగాము. భక్తితో బాధ్యతతో  సంయమనంతో దైవ దర్శనానికి రండి అని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసింది

    బ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నాము. అందరికీ అభినందనలు. సమ్మక్క సారలమ్మతో మాకు భావోద్వేగా బంధం ఉంది అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టాము. గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము. గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయింది. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి రెండు లక్షల మంది భక్తులే వచ్చేవారు. కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఓకే రోజూ 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం వల్ల భక్తులు విపరీతంగా తరలివచ్చారు. త్రాగునీరు టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశాం. సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించారు.. వారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. 

    ఆదివారం ఈ విషయంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటన చేశారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మంత్రి జూపల్లి అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. 

    ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ఎక్సైజ్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు. నిజామాబాద్‌లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేయడంతో సౌమ్య గాయడి.. చికిత్స పొందుతూ కన్నుమూసింది.

    మోస్రా కన్నీరు
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మోస్రా గ్రామానికి సౌమ్య మృతదేహం చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు ఊరంతా ఆమె మృతదేహం చూసి కన్నీరు పెట్టుకుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది భారీగా తరలి వచ్చి నివాళులర్పించారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మరికాసేపట్లో సిట్‌ విచారణ జరపనుంది. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి ఆయన నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంటే ముందే పోలీసులు, సిట్‌ బృందం నందినగర్‌లోని నివాసానికి చేరుకుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తూ.. మిగతా వాళ్లను బయటకు పంపించేశారు. అంతకు ముందు.. 

    ఎర్రవెల్లి ఫాంహౌజ్‌ నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కేసీఆర్‌ హైదరాబాద్‌ బయల్దేరారు. ఆ సమయంలో ఒంటి మామిడి వద్ద మిగతా వాహనాలను అడ్డుకుని.. కేసీఆర్‌ కాన్వాయ్‌ను మాత్రమే అధికారులు ముందుకు అనుమతించారు. ఇటు.. 

    ఎలక్ట్రానిక్‌ పరికరాలతో నందినగర్‌ నివాసానికి సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఇంటి రెండో ఫ్లోర్‌లోని ఓ గదిలోని కేసీఆర్‌ను విచారించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఆ గదిని అధికారులు ఆ పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే.. కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డింగ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

    నందినగర్‌ నివాసంలో ఉండేందుకు కుటుంబ సభ్యులైన హరీష్‌రావు, కేటీఆర్‌, సంతోష్‌రావులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విచారణ రూమ్‌లోకి కేసీఆర్‌ వెంట లాయర్‌కు కూడా అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేతలను గంటల తరబడి సిట్‌ అధికారుల ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్‌ఎస్‌ ఆందోళనల నడుమ.. కేసీఆర్‌ను ఎంతసేపు విచారిస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Business

  • కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ప్రపంచ స్థాయి ‘ఛాంపియన్స్’గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వినూత్నమైన మూడంచెల వ్యూహాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈక్విటీ, లిక్విడిటీ, ప్రొఫెషనల్ సపోర్ట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

    దేశంలోని ఎంఎస్‌ఎంఈలు కేవలం చిన్న సంస్థలుగానే మిగిలిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఛాంపియన్లుగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు.

    పెట్టుబడి మద్దతు

    ఎంఎస్‌ఎంఈలకు రుణ భారంతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. భవిష్యత్తులో దిగ్గజ సంస్థలుగా ఎదిగే అవకాశం ఉన్న ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక ‘ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. 2021లో ప్రారంభించిన ‘సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫండ్’కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించి మైక్రో ఎంటర్‌ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్‌ను పొందేలా చర్యలు తీసుకున్నారు.

    లిక్విడిటీ సపోర్ట్

    చిన్న పరిశ్రమలకు చెల్లింపుల సమస్య లేకుండా ఉండేందుకు TReDS (Trade Receivables Discounting System) ప్లాట్‌ఫారమ్‌ను మరింత శక్తివంతం చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులను తప్పనిసరిగా TReDS ద్వారానే జరపాలి. ఇది కార్పొరేట్ రంగానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. TReDS ప్లాట్‌ఫారమ్‌పై ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కోసం క్రెడిట్ గ్యారెంటీ మద్దతును ప్రభుత్వం కల్పిస్తుంది.

    ‘జెమ్స్‌’తో అనుసంధానం: ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జెమ్స్‌)ను TReDSతో అనుసంధానించడం ద్వారా వేగంగా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ పొందే వెసులుబాటు కలుగుతుంది.

    ప్రొఫెషనల్ సపోర్ట్

    చిన్న సంస్థలు చట్టపరమైన నిబంధనలను తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు ‘ప్రొఫెషనల్ సపోర్ట్’ అందించనున్నారు. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలిచేందుకు ప్రత్యేకంగా ‘కార్పొరేట్ మిత్ర’లను అభివృద్ధి చేస్తారు. ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్పొరేట్ మిత్రలకు శిక్షణ ఇచ్చి ఎంఎస్‌ఎంఈలకు సరసమైన ధరలకే సేవలు అందేలా ప్రభుత్వం సహకరిస్తుంది.

    కొరియర్ ఎగుమతులపై పరిమితి ఎత్తివేత

    ఎంఎస్‌ఎంఈ రంగం ప్రపంచ మార్కెట్లకు చేరువయ్యేలా చేసేందుకు పన్ను ప్రతిపాదనల్లో కీలక మార్పు చేశారు. ప్రస్తుతం కొరియర్ ద్వారా చేసే ఎగుమతులపై ఉన్న రూ.10 లక్షల గరిష్ట విలువ పరిమితిని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ఈ-కామర్స్ ద్వారా విదేశాలకు వస్తువులను పంపే చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది.

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

  • కేంద్ర బడ్జెట్‌ 2026–27లో క్యాన్సర్ రోగులకు కీలక ఉపశమనం లభించింది. 17 క్యాన్సర్ సంబంధిత మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో క్యాన్సర్ చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.

    “రోగులకు, ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో 17 మందులు లేదా ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదిస్తున్నాను” అని ఆమె పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంగా తెలిపారు.

    అదేవిధంగా, ఔషధాలు, మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఆహారం (FSMP) వ్యక్తిగత దిగుమతులపై సుంకం మినహాయింపు పొందే జాబితాలో మరో ఏడు అరుదైన వ్యాధులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యతో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కూడా ఆర్థిక భారంలో తగ్గుదల కలగనుంది.

    ఈ నిర్ణయంతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యవసర క్యాన్సర్ మందుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు అధిక కస్టమ్స్ సుంకాల కారణంగా ఖరీదైన చికిత్సలు అందని ద్రాక్షలా మారిన పరిస్థితి ఉండగా, తాజా ప్రతిపాదనతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. అలాగే దేశంలో క్యాన్సర్ చికిత్స అందుబాటును పెంచడంతో పాటు, ప్రజారోగ్య రంగంలో ప్రభుత్వ సంకల్పాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • కేంద్ర బడ్జెట్‌ 2026లోని ప్రతిపాదనలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధన–అభివృద్ధిపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని వారు ప్రశంసించారు.

    సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా భారత్‌
    కేంద్ర బడ్జెట్‌ 2026 భారతదేశాన్ని విశ్వసనీయ సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామిగా నిలబెడుతుంది. సుపరిపాలన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రభుత్వం ప్రాధాన్యంగా గుర్తించడం ప్రోత్సాహకరం. ఇది ఆవిష్కరణ, సమర్థత, స్కేలబుల్ డిజిటల్ పరిష్కారాలను అందించడంలో భారతీయ ఐటీ పరిశ్రమ పాత్రను బలోపేతం చేస్తుంది. ఇండియాఏఐ మిషన్, నేషనల్ క్వాంటం మిషన్, నేషనల్ రీసెర్చ్ ఫండ్, అలాగే ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 వంటి కార్యక్రమాలు భవిష్యత్తుకు సిద్ధమైన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.
    — అతుల్ సోనేజా, సీఓఓ, టెక్ మహీంద్రా

    క్రిప్టో రంగానికి దీర్ఘకాలిక లాభం
    భవిష్యత్తు సాంకేతికతల పట్ల కేంద్ర బడ్జెట్‌ స్పష్టమైన నిబద్ధతను చూపుతోంది. ఇండియాఏఐ మిషన్‌కు రూ.2,000 కోట్లు, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు రూ.500 కోట్లు కేటాయించడం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. క్రిప్టో రంగానికి ఇది తక్షణ ధరల ప్రభావం కన్నా, బలమైన ఆర్ & డి, టాలెంట్ అభివృద్ధి, నియంత్రిత, ఇండియా-ఫస్ట్ వినియోగాల నిర్మాణానికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తుంది. బ్లాక్‌చెయిన్ ఎంటర్‌ప్రైజ్ స్వీకరణకు, సురక్షిత ఆర్థిక మౌలిక సదుపాయాలకు కీలకమవుతుంది.
    — విక్రమ్ సుబ్బూరాజ్, సీఈఓ, జియోటస్.కామ్

    తెలంగాణ లైఫ్ సైన్సెస్ వృద్ధికి ఊతం
    కేంద్ర బడ్జెట్‌ లైఫ్ సైన్సెస్ రంగంపై చూపుతున్న దృష్టి తెలంగాణలో వృద్ధికి మరింత ఊతమిస్తుంది. లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30లో పేర్కొన్న అధునాతన తయారీ, ఆవిష్కరణలు, ఆర్ & డి లక్ష్యాలు ఈ బడ్జెట్‌తో మరింత వేగం పొందనున్నాయి. దీని ద్వారా 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల లక్ష్యాలు సాధ్యమవుతాయని, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్ స్థానం బలపడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
    — శక్తి ఎం. నాగప్పన్, సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్

  • కేంద్ర బడ్జెట్‌ 2026-27లో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం గణనీయంగా పెరిగిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, బీఎస్ఎన్ఎల్ మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్‌వర్క్ రోలౌట్‌తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

    గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి రూ.53,000 కోట్ల కేటాయింపు ఉండగా, తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.73,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇది దాదాపు 40 శాతం వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా, బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

    “బీఎస్ఎన్ఎల్ ఏఆర్‌పీయూ (సగటున ఒక్కో యూజర్‌ ద్వారా వచ్చే ఆదాయం) రూ.90 నుంచి రూ.99కు దాదాపు 9 శాతం పెరిగింది. త్వరలో మూడు అంకెల స్థాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా మూడు విభాగాల్లోనూ ఆదాయం పెరిగింది. అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరం ఉంది. తద్వారా బీఎస్ఎన్ఎల్‌ను పునరుజ్జీవన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం,” అని మంత్రి తెలిపారు.

    ప్రతిపాదిత అదనపు బడ్జెట్‌లో గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్ట్ అయిన భారత్ నెట్‌కు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్‌కు స్పెక్ట్రమ్ కోసం సుమారు రూ.1.39 లక్షల కోట్ల విలువైన కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. టవర్లు, మౌలిక వసతులు, బ్యాటరీలు వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయని సింధియా తెలిపారు. గతంలో రూ.4,495 కోట్లుగా ఉన్న సవరించిన అంచనాలను రూ.6,800 కోట్లకు పెంచామని, ఇది దాదాపు 50 శాతం వృద్ధి అని వివరించారు. ఈ బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, పట్టణీకరణ, ఆరు రాష్ట్రాల్లోని ఐదు బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 4,000 ఈ-బస్సుల ప్రవేశపెట్టడం, అలాగే ఆరోగ్యం మరియు విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

  • కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత ప్రభుత్వం దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కొన్ని పథకాలను ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ‘వికసిత్ భారత్’ దిశగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే కొన్ని వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేశారు.

    ప్రపంచానికి తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ అడుగులు వేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా కేంద్రం పలు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చిప్ తయారీ నుంచి చౌకైన క్రీడా సామాగ్రి వరకు.. ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించేలా కేటాయింపులు జరిపినట్లు పేర్కొన్నారు.

    ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 2.0

    సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఐఎస్‌ఎం 2.0ను ప్రకటించారు. కేవలం చిప్ తయారీ మాత్రమే కాకుండా, సెమీకండక్టర్ పరికరాలు, మెటీరియల్స్ ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇందుకోసం పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధన, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

    బయోఫార్మా ‘శక్తి’

    ఫార్మా రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER)లను ఏర్పాటు చేస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల నెట్‌వర్క్‌ను రూపొందిస్తారు.

    అరుదైన ఖనిజాల అభివృద్ధి పథకం

    చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేస్తారు. అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, శాశ్వత అయస్కాంతాల తయారీకి ఈ పథకం ఊతమిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అత్యంత కీలకం.

    డెడికేటెడ్ కెమికల్ పార్కులు

    దేశీయ రసాయన ఉత్పత్తిని పెంచడానికి రూ.600 కోట్లతో మూడు ప్రత్యేక కెమికల్ పార్కులను ‘ఛాలెంజ్ రూట్’(సాధారణంగా ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టును ఒకే చోట కాకుండా ఏ రాష్ట్రం అయితే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య నిర్వహించే పోటీనే ఛాలెంజ్ రూట్) ద్వారా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నారు.

    ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్‌)

    ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం కేటాయింపులను ఏకంగా రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల విడిభాగాలు భారత్‌లోనే తయారవుతాయి.

    టెక్స్‌టైల్స్ రంగం - ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్

    వస్త్ర పరిశ్రమ బలోపేతానికి నేషనల్ ఫైబర్ స్కీమ్, టెక్స్‌టైల్ విసర్తణ, ఉపాధి పథకాలు ఉన్నాయి. పాత టెక్స్‌టైల్ క్లస్టర్లను ఆధునీకరించడం వీటి ప్రధాన ఉద్దేశం.

    ఇతర కీలక మౌలిక సదుపాయాల పథకాలు

    కంటైనర్ తయారీ: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ వాటాను పెంచడానికి రూ.10,000 కోట్లతో కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్.

    ఇండస్ట్రియల్ క్లస్టర్లు: దేశవ్యాప్తంగా ఉన్న 200 పాత పారిశ్రామిక వాడలను (Clusters) ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించనున్నారు.

    హైటెక్ టూల్ రూమ్స్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యాధునిక టూల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహాయం అందిస్తారు.

    క్రీడా సామగ్రి: సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా సామగ్రిని తయారు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

    నిర్మాణ పరికరాలు: అధిక విలువ కలిగిన నిర్మాణ, మౌలిక సదుపాయాల యంత్రాల తయారీని దేశీయంగా బలోపేతం చేయనున్నారు.

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

  • బడ్జెట్‌ 2026 దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ)ను 50-150 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించిన తరువాత మదుపరులు ఈక్విటీ మార్కెట్ల నుండి పారిపోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు ఆదివారం ప్రత్యేక సెషన్‌ తీవ్ర నష్టాలతో ముగించాయి.

    ఫ్యూచర్ ట్రేడ్స్ పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.1 శాతం నుంచి 0.15 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

    ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,843 పాయింట్లు లేదా 2.23 శాతం 80,723 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 495 పాయింట్లు లేదా 1.96 శాతం నష్టపోయి 24,825 వద్ద నిలిచింది.

    సెషన్‌లో అంతకుముందు సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు పడిపోయి 79,899.42 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 24,572 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది.

    విస్తృత మార్కెట్లు కూడా భారీ అమ్మకపు ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 2.7 శాతం నష్టపోయాయి. పెట్టుబడిదారులలో భయాన్ని సూచించే ఫియర్ గేజ్ - ఇండియా వీఐఎక్స్ దాదాపు 12 శాతం పెరిగింది.

    రంగాలవారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని సూచీలు పడిపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 6 శాతం, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4 శాతం, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2 శాతానికి పైగా క్షీణించాయి.

    నిఫ్టీలోని 50 స్టాక్‌లలో భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. వాటి షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, నెస్లే ఇండియా, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్‌లో ప్రముఖంగా ఉన్నాయి. మరోవైపు విప్రో, టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ లాభాలను అందుకున్నాయి. ఒక్కొక్కటి 2 శాతం లాభపడ్డాయి.
     

  • భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.

    పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్‌లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్‌లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్‌లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.

    ఎందుకు ఈ నిర్ణయం?

    క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

    దీనివల్ల కలిగే ప్రయోజనాలు

    అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలోని కీలక ప్రకటనలు

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం చేయడం విశేషం. రూ.53.47 లక్షల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్‌ మంత్రి ప్రకటనలు కీలకంగా కింది విధంగా ఉన్నాయి.

    ఆదాయపు పన్ను

    • పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఈసారి పన్ను శ్లాబుల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ సరళీకరణపై దృష్టి సారించారు.

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

    • ఐటీ రిటర్నులను సవరించుకునే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు.

    • మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే పరిహారంపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు.

    • విదేశీ విద్య, వైద్యం, టూర్ ప్యాకేజీలపై ‘ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్’ (టీసీఎస్‌)ను 5% నుంచి 2%కి తగ్గించారు.

    మౌలిక సదుపాయాలు, రవాణా

    • దేశాభివృద్ధికి ఇంజిన్లుగా భావించే మౌలిక సదుపాయాల కల్పనకు రికార్డు స్థాయిలో రూ.12.2 లక్షల కోట్లు కేటాయించారు.

    • మెట్రో నగరాలను అనుసంధానిస్తూ 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.

    • కొత్తగా 20 జాతీయ జల మార్గాలను అభివృద్ధి చేయనున్నారు.

    • అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లను కేటాయించారు.

    సాంకేతికత, పరిశ్రమలు

    • భారత్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా చిప్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.40,000 కోట్లు కేటాయించారు.

    • ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా సహా 5 రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు.

    • ఎంఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.10,000 కోట్ల నిధిని ప్రకటించారు.

    ఆరోగ్య, రక్షణ రంగాలు

    • క్యాన్సర్ మందులు: 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. దీనివల్ల ప్రాణరక్షక మందులు చౌకగా లభించనున్నాయి.

    • దేశ భద్రత కోసం రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లను కేటాయించారు.

    ఆర్థిక లోటు, వృద్ధి రేటు

    భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి నమోదు చేస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

    2026-27 సంవత్సరానికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు.

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

  • కొనేటప్పుడు తక్కువ ధర, అమ్మేటప్పుడు ఎక్కువ ధర కావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. నివాసం ఉండేందుకు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోసం కొనుగోలు చేసే వారు ఇంకొందరు. ఏదేమైనా భవిష్యత్తు అవసరాల కోసం ఇంటిని విక్రయించే సమయంలో అధిక ధర రావాలని కోరుకోవడం సహజం. అయితే సాధారణ ఇళ్లతో పోలిస్తే నిర్వహణ బాగున్న ఇంటికే ధర అధికంగా వస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న టిప్స్‌తో సొంతింటిని లాభదాయక ఆస్తిగా ఎలా మార్చుకోవచ్చో ఒకసారి చూద్దాం.

    ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకోవడంతోనే సరిపోదు. ఎలాంటి సమయంలో విక్రయించాలో కూడా తెలిసుండాలి. లేకపోతే ప్రాపర్టీ అమ్ముడుపోకపోవడమే కాదు ఇష్టం వచ్చిన రేటుకు అడిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మార్కెట్‌ బాగున్నప్పుడే ఇంటిని విక్రయించాలే తప్ప ప్రతికూల సమయంలో అమ్మాలనుకుంటే మాత్రం మనం పెట్టిన ధర కంటే తక్కువకు పోయే ప్రమాదం ఉంటుంది.

    రీసెర్చ్‌ చేశాకే నిర్ణయం.. 
    ముందుగా మీ ఇల్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్ల ధరలు ఎంత ఉన్నాయో పరిశోధన చేయాలి. రీసేల్‌ ప్రాపరీ్టల మార్కెట్‌ ఎలా ఉంది? ఎంత రేటుకు పోతున్నాయో పరిశీలించాలి. ఒకట్రెండు రీసేల్‌ ప్రాపర్టీ యజమానులతో మాట్లాడి.. ఇల్లు కొనేందుకు ముందుకొచ్చే కొనుగోలుదారుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత మీరు విక్రయించాలనుకున్న ఇంటికి ఒక ధరను నిర్ణయించుకోవాలి. అంతే తప్ప మీ పెట్టుబడి, అవసరాలు, లాభం అన్నీ కలుపుకొని ఇంటికి రేటు కట్టకూడదు. అలా చేస్తే అంత రేటుకు రీసేల్‌ ప్రాపర్టీ కొనేబదులుగా కొత్త ఇల్లే వస్తుందని కస్టమర్లు భావిస్తారు.  

    అందమైన ఇంటికే అధిక ధర.. 
    సాధారణ ఇళ్లతో పోలిస్తే మీ ఇంటికి ధర రావాలంటే ముందుగా కొంత ఖర్చు పెట్టక తప్పదు. కంటికి ఇబ్బెట్టుగా, బెదురుకొట్టే రంగులు కాకుండా లేత రంగులను వేసుకోవాలి. మనసుకు ప్రశాంతత కలిగించే తెలుపు, నీలం వంటి వర్ణాలను ఉపయోగించాలి. సాధారణ ఇళ్లతో పోలిస్తే ఆహ్లాదకరంగా, అందంగా ఉండే ఇళ్లు 40–50 శాతం వేగంగా అమ్ముడవుతాయని, 10 శాతం ధర అధికంగా పలుకుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నల్లాలు, పైప్‌లైన్ల లీకేజీలు ఉంటే రిపేర్‌ చేయించాలి. దీంతో ఇంటి యజమానిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తెగిపోయిన విద్యుత్‌ వైర్లు, పలికిన స్విచ్‌ బోర్డ్‌లు వంటివి ఏమైనా ఉంటే సరిచేయాలి. లేకపోతే విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.  

    పరిసరాలు పరిశుభ్రం
    విక్రయించే ఇంటిని మాత్రమే అందంగా తీర్చిదిద్దితే సరిపోదు.. పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వరద, మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే అందమైన పువ్వులు, సువాసన వెదజల్లే మొక్కలను పెంచాలి. దీంతో కొనుగోలుదారులకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇల్లు కొనేందుకు వచ్చే కస్టమర్లు ఇంటి లోపల గదులు, కిచెన్, బాత్‌రూమ్‌ వంటి వాటిని పరిశీలిస్తారు. ఇంటి లోపల వస్తువులను ఆకర్షణీయంగా సర్దుకోవాలి. ఇష్టం వచి్చనట్లు వస్తువులు ఉంటే అందవిహీనంగా కనిపించడమే కాకుండా ధర కాస్త తగ్గే ప్రమాదం ఉంటుంది.

    మొదటి 5 నిమిషాలు కీలకం..  
    రీసేల్‌ ప్రాపర్టీలు కొనే కస్టమర్లు ఇల్లు చూసే తొలి ఐదు నిమిషాలు కీలకం. అందుకే ఇంటి లోపలికి రాగానే ఆహ్లాదభరిత వాతావరణం కనిపించేలా అందమైన కర్టెన్లు, లేతరంగులతో స్వాగతం పలికేలా చూసుకోవాలి. బెడ్‌రూమ్, కిచెన్‌లో వస్తువులను సరైన రీతిలో సర్దిపెట్టుకోవాలి. వంట గదిలో నూనె మరకలు వంటివి ఉంటే శుభ్రం చేసుకోవాలి. బాత్‌రూమ్‌లో దుర్గంధం లేకుండా చూసుకోవాలి. బాల్కనీలో దుస్తులు ఆరబెట్టేందుకు ఏర్పాటు చేసే తీగలు వంటివి అడ్డుగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. పూల కుండీలలో అందమైన మొక్కలు పెంచుకోవాలి.

    రీసేల్‌ చెక్‌ లిస్ట్‌ 

    • ఇంటిని శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా ఉండాలి. ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి.

    • మార్కెట్‌లో వాస్తవ ధర ఎంతో ఉందో తెలుసుకున్న తర్వాతే ఇంటికి ధరను నిర్ణయించాలి. అత్యాశకు పోకుండా కస్టమర్‌కు బేరసారాలకు అవకాశం ఇవ్వాలి.

    • అశుభ రోజులు, ప్రతికూల సమయంలో కాకుండా పండుగలు, శుభదినాలలో ఇంటిని విక్రయించడం వల్ల కస్టమర్లు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

    • నమ్మకమైన మధ్యవర్తులు, ఏజెంట్లు, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రాపరీ్టల రీసేల్‌ చేస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది.

    • కస్టమర్లతో విక్రయ ఒప్పందం, ఇతరత్రా డాక్యుమెంటేషన్‌ పక్కాగా చేసుకోవాలి.  

    పక్కా డాక్యుమెంట్లు.. 
    ఇంటి రిజిస్ట్రేషన్‌ కాగితాలు, నల్లా, విద్యుత్‌ బిల్లులు, ఇంటి పన్ను రశీదులు, ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఇల్లు కొనే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ధర అధికంగా వస్తుంది. ఇంటిపై బ్యాంక్‌ రుణం, ఇతరత్రాలు ఏమైనా ఉంటే కస్టమర్లకు ముందుగానే వివరించాలి.  

  • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి?, ఖరీదైనవిగా మారిన వస్తువులు ఏవి? అనేది తెలుసుకుందాం.

    చౌకగా లభించే వస్తువులు
    విమాన భాగాలు
    మైక్రోవేవ్ ఓవెన్లు
    EV బ్యాటరీలు
    సోలార్ ప్యానెల్‌స్
    డయాబెటిక్ & క్యాన్సర్ మందులు
    భారతదేశంలో తయారయ్యే స్మార్ట్‌ఫోన్‌లు
    టాబ్లెట్‌లు

    ఖరీదైనవిగా మారే వస్తువులు
    లగ్జరీ గడియారాలు
    దిగుమతి చేసుకున్న మద్యం
    సిగరెట్లు
    బీడీలు
    పాన్ మసాలా
    గుట్కా
    కొన్ని ఎరువులు
    దిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు & సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

  • దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.

    కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)

    • రవాణా: రూ. 5,98,520 కోట్లు

    • రక్షణ: రూ. 5,94,585 కోట్లు

    • గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు

    • హోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లు

    • వ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు

    • విద్య: రూ. 1,39,289 కోట్లు

    • ఇంధనం: రూ. 1,09,029 కోట్లు

    • ఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లు

    • పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు

    • ఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లు

    • వాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లు

    • సాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లు

    • శాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లు

    • పన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లు

    • విదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లు

    • ఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లు

    • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812

    బడ్జెట్‌లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.

    గ్రామీణ భారతం, వ్యవసాయం

    గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.

    విద్య, ఆరోగ్యం, ఐటీ

    మానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.

    ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026 సమగ్ర స్వరూపం..

  • ఈవీలు కొనుగోలు చేసేవారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వాహనాల ధరలు తగ్గే చర్యలు తీసుకుంది. కేంద్ర బడ్జెట్‌ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ (Basic Customs Duty) సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించారు.

    ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా లిథియం-అయాన్ సెల్ తయారీకి మద్దతు ఇవ్వడానికి క్యాపిటల్ గూడ్స్, కొన్ని విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని సున్నాకి తేవడానికి లక్షణాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి.

    ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ పరిస్థితి
    ప్రస్తుతం 35 రకాల క్యాపిటల్ గూడ్స్ (ఈవీ బ్యాటరీ తయారీకి అవసరమైన మెషినరీ/భాగాలు) పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంది. గత బడ్జెట్‌లోనే (2025-26) ప్రభుత్వం దీన్ని గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు తాజా బడ్జెట్‌ 2026-27లో లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ భాగాలపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించాలని ప్రతిపాదించారు.

    తగ్గనున్న ఈవీల ధరలు
    ఈవీల ధరలో అధిక మొత్తం (సుమారు 40-50%) బ్యాటరీలకే ఉంటుంది.  కస్టమ్స్ డ్యూటీ తగ్గితే, బ్యాటరీ తయారీకి ఉపయోగించే ముఖ్యమైన భాగాలు, మెషినరీ దిగుమతులు చౌకగా అవుతాయి. దీంతో దానికి సంబందించిన ఖర్చు నాటకంగా తగ్గి ఈవీలు, బ్యాటరీల ధరలో కూడా తగ్గుదలకు దారితీస్తుంది. అంతిమంగా ఈవీల ధరలు సుమారు 10-15% వరకు తగ్గొచ్చు.

  • మధ్యతరగతి వేతన జీవుల విదేశీ ప్రయాణాలకు, అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. గతంలో ఈ విభాగంలో భారంగా మారిన 5 శాతం టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వేతన జీవుల నెలవారీ బడ్జెట్‌పై పడే అదనపు భారం తగ్గడమే కాకుండా చేతిలో నగదు లభ్యత పెరుగుతుంది. ఈ మార్పు వేతన జీవుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.

    టీసీఎస్ అంటే ఏమిటి?

    సాధారణంగా మనం విదేశీ పర్యటనల కోసం ప్యాకేజీలు కొన్నప్పుడు లేదా విదేశాలకు డబ్బు పంపినప్పుడు బ్యాంకులు లేదా ట్రావెల్ ఏజెంట్లు కొంత మొత్తాన్ని పన్ను రూపంలో ముందే వసూలు చేస్తారు. దీనినే టీసీఎస్‌ అంటారు. ఇది మన ఆదాయపు పన్నులో ముందుగానే చెల్లించాలి.

    వేతన జీవులపై ప్రభావం

    గతంలో 5 శాతం టీసీఎస్.. అంటే ఎక్కువ సొమ్ము ప్రభుత్వం వద్ద ఉండిపోయేది. ఇప్పుడు అది 2 శాతానికి తగ్గడం వల్ల ఆ మిగిలిన 3 శాతం నగదు పన్ను దారులకు మిగులుతుంది. విదేశీ విద్య కోసం లోన్ తీసుకోకుండా సొంతంగా డబ్బు పంపే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరట. విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునేటప్పుడు ముందస్తుగా చెల్లించాల్సిన నగదు తగ్గుతుంది.

    ఉదాహరణకు..

    ఒక వేతన జీవి తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారనుకుందాం. ఆ టూర్ ప్యాకేజీ ధర రూ.10 లక్షలు అనుకుంటే, పాత, కొత్త రేట్ల ప్రకారం తేడా ఇలా ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం, ఈ ప్యాకేజీ ధరపై 5 శాతం టీసీఎస్ వర్తించేది. అంటే ఆ వ్యక్తి ప్యాకేజీ ధరతో పాటు అదనంగా రూ.50,000 పన్ను రూపంలో ముందే చెల్లించాల్సి వచ్చేది.

    అయితే, కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల అదే రూ.10 లక్షల ప్యాకేజీపై ఇప్పుడు కేవలం రూ.20,000 మాత్రమే పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా సదరు ప్రయాణికుడికి తక్షణమే రూ.30,000 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.

  • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్‌ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.

    బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపం

    రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు

    పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు

    పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు

    మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు

    రుణాల రికవరీ రూ.38,397 కోట్లు

    ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు

    అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు

    మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు

    మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు

    రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు

    వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు

    మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు

    మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు

    వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు

    రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు

    నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు

    ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు

    ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. జోగి రమేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌.. జోగి రమేష్‌ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్‌కు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు.

    ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు. జోగి రమేష్‌ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ నివాసంపై దాడి వెనుక కుట్ర బట్టబయలైంది. మాజీ మంత్రి నివాసంపై టీడీపీ పథకం ప్రకారం దాడికి పురిగొల్పింది. జోగి నివాసంపై దాడికి పిలుపునిచ్చిన టీడీపీ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో ప్లాన్‌ అమలు చేసింది.

    అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చిన ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు.. ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జోగి రమేష్‌ ఇంటివద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు.. ఆయన నివాసంపై కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబ్‌లతో దాడి చేశారు.
     

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో హాజరు పరిచారు. అంతకుముందు నల్లపాడు పీఎస్‌ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. రాత్రి నుంచి నల్లపాడు పీఎస్‌లో అంబటి రాంబాబును ఉంచిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం, జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. 

  • సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్‌కు షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్‌ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

    తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతి­భద్రతల సమస్య ఉందని పిటిషన్‌లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

    కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.

    ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది.

  • సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగానే ఉందని, రాష్ట్రానికి దీని వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే విదిల్చారని, అంతకు మించి రాష్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు మాత్రం జీడీపీలో 4.3 శాతానికి తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్‌లో చెప్పిన దాని కన్నా ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడేమంటారని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకేమన్నారంటే..:

    కేంద్ర బడ్డెట్‌ నిరాశాజనకం:
    కేంద్ర బడ్జెట్‌ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ,  ద్రవ్యలోటు రూ.16,95,765 కోట్లుగానూ చూపారు. జీడీపీలో గత సంవత్సరాలతో పోలిస్తే అప్పు 4.3 శాతానికి తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఖర్చు మాత్రం చేయడం లేదు. గతేడాది జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.67 వేల కోట్లకు పైగా కేటాయించినా, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో ఏపీలోనే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టడం విశేషం. రోడ్లు, రైలు మార్గాలకు రూ.5,98,520 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా ప్రాజెక్టుల ఊసే లేదు.

    అప్పుల్లో కేంద్రానికి రివర్స్‌లో ఏపీ సర్కార్‌:
    కేంద్రం అప్పు తగ్గించుకుంటూ వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి రాష్ట్ర అప్పు, కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు అన్నీ కలిపి చూస్తే ఏకంగా అది రూ.3,14,644 కోట్లు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ఆ 5 ఏళ్లలో రెండేళ్లు కోవిడ్‌ వంటి సంక్షోభం ఉన్నా కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం మీరు రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆ సంఖ్యను దాటేశారు. కాగ్‌ లెక్కల ప్రకారం కేవలం ఆర్బీఐ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.81,597 కోట్లు అప్పు చేశారు. ఇది బడ్జెట్‌తో పోలిస్తే రూ.10 వేల కోట్లు ఎక్కువ. మరో రూ.3,300 కోట్లు ఫిబ్రవరి 3న తీసుకుంటున్నారు. ఇలా బడ్జెట్‌లో చెప్పిన దాని కన్నా రూ.15 వేల కోట్లకు పైగా అదనంగా అప్పులు చేస్తున్నారు. అప్పట్లో మేం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు మీ అప్పులకు రాష్ట్రం వెనెజులా అవుతుందా?.

    చంద్రబాబు మ్యాటర్‌ వీక్‌. పబ్లిసిటీ పీక్‌:
    ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర అభివృద్ధి రుణాలు రూ.77,040 కోట్లుగా ఉన్నాయి. దానికి ఈ నెలలో తీసుకునే రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రుణం రూ.80,340 కోట్లు అవుతుంది. కాగ్‌ లెక్కల ప్రకారం రుణాలు రూ.77,040 కోట్లు కాగా.. డిసెంబర్‌ 2న రూ.3 వేల కోట్లు, డిసెంబర్‌ 30న రూ.4 వేల కోట్లు, జనవరి 6న రూ.6,500 కోట్లు, జనవరి 27న రూ.2,500 కోట్ల అప్పు చేయగా, ఫిబ్రవరి 3న మరో రూ.3,300 కోట్ల రుణం తీసుకుంటున్నారు. అన్నీ కలిపితే రూ.96,340 కోట్లకు చేరతాయి. అవే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపి రూ.89,320 కోట్లు ఉన్నాయి.

    ఒక్క రాజధాని పేరు మీదే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ, ఇతర సంస్థల నుంచి రూ.47,387 కోట్లు ఇప్పటివరకూ అప్పు చేశారు. మేం ఎవరితో పోల్చుకున్నా తక్కువ అప్పులు చేశాం. అయినా పచ్చమీడియా సాయంతో మాపై దుష్ప్రచారం చేశారు. 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.5 లక్షల కోట్లు ఉంటే.. మేం దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.3.32 లక్షల కోట్లకు పెరిగింది. మీ హయాంలో ప్రతీ సంవత్సరం 22.6 శాతం అప్పుల్ని పెంచితే, కరోనా వంటి సంక్షోభాలు ఉన్నా 13.5 శాతం మాత్రమే అప్పులు పెంచాం. అయినా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ‘మ్యాటర్‌ వీక్‌ పబ్లిసిటీ పీక్‌’ అని చెప్పడానికి ఇదే నిదర్శనమని బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరించారు.

  • సాక్షి, తాడేపల్లి: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైఎస్సార్‌సీపీ నేతలకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులతో ఆదివారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 

    ‘‘రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోంది. చంద్రబాబు ఆటవిక పాలన చేస్తున్నారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు. ఎవరూ ప్రశ్నించకుండా దాడులు చేయిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ అండగా ఉంటుంది’’ అని ఆ ఇద్దరు నేతలకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. 

  • సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్సార్‌సీపీ నేతల బృందం చేరుకుంది. నిన్న అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అంబటి ఇంటిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.

    అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎంపీ మోదుగుల, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ, నియెజకవర్గ ఇన్‌ఛార్జిలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్‌, డైమండ్‌ బాబు, గజ్జల భార్గవ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌, వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.

     

  • సాక్షి, తిరుపతి: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు సర్కార్‌.. అకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి చంద్రకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం మరో డైవర్షన్‌కు తెరలేపింది

    రెండుసార్లు సింఘాల్‌ను ఈవోగా నియమించింది సీఎం చంద్రబాబే. నెయ్యి వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం.. సింఘాల్‌ని బాధ్యుడిని చేసింది. సెప్టెంబర్ 10, 2025 నుండి టీటీడీ ఈవోగా పనిచేస్తున్న సింఘాల్.. గతంలో చంద్రబాబు హయాంలోనే టీటీడీ ఈవోగా పనిచేశారు. 2017 మే 6 నుండి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా సింఘాల్‌ పనిచేశారు.

     

     

  • సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌కు దేవుడు వాతలు పెట్టాడని.. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపం పండి లడ్డూలో కొవ్వు వాడలేదని వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  బరి తెగించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ఫ్లెక్సీలు పెట్టారని మండిపడ్డారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 ప్రకారం చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ మీద కేసులు పెట్టాలన్నారు.

    ‘‘తప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం వల్లనే అంబటి వెళ్లి ఆ ఫ్లైక్సీ లు తొలగించాలన్నారు. చంద్రబాబు పెట్టించిన తప్పుడు ఫైక్సీలకు పోలీసులు కాపలా ఉండటం దురదృష్టం. ఏపీలో పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది. డీజీపీ సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి బయటకు వస్తుంటే అంబటిపై దాడికి యత్నించారు. టీడీపీ మహిళలు కూడా సభ్యత మరిచి పచ్చిగా వినలేని భాషతో మాట్లాడారు.

    ..తన మాటలను వెనక్కి తీసుకుంటున్నాని, విచారిస్తున్నానని అంబటి చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబుపై దాడి చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?. ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడం, డబ్బులతో రాజకీయం చంద్రబాబు బ్రాండింగ్‌’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

     

     

National

  • బరేలీ: తొమ్మిదేళ్ల ప్రేమ.. తర్వాత పెళ్లి.. రెండు నెలలకే విషాదంగా మిగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జితేంద్ర కుమార్ యాదవ్(33) తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం కలకలం రేపింది. మొదట ఆత్మహత్యగా అంతా భావించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. జితేంద్రను భార్య జ్యోతి గొంతు నులిమి చంపినట్లు తేలిపింది. ఈ ఘటనలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ హత్యకు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా సహకరించారు. ఆ సమయంలో వారు అతడిని గట్టిగా పట్టుకోగా.. జ్యోతి గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    అసలేం ఏం జరిగిందంటే..
    మృతుడు జితేంద్ర, జ్యోతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్ 25న ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది వారాలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్యోతి బ్యాంకు ఖాతా నుండి జితేంద్ర రూ.20 వేలు డ్రా చేసి ఆన్‌లైన్ జూదంలో పోగొట్టడమే వారి మధ్య వివాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు తెలిపారు. జనవరి 26న ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ.. దాడికి దారితీసింది. ఆ సమయంలో జ్యోతి తన తండ్రి కాళీచరణ్, తల్లి చమేలి, సోదరుడు దీపక్‌లను ఇంటికి పిలిచింది.

    కాళ్లు, చేతులు కదలకుండా..
    వారందరూ కలిసి జితేంద్ర కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా పట్టుకోగా, జ్యోతి అతని గొంతు నులిమి హత్య చేసింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం తమ అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేశారు.

    పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినా, జితేంద్ర సోదరుడు అజయ్‌ కుమార్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో అది ఉరి వల్ల జరిగిన మరణం కాదని.. గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. దీంతో పోలీసులు సెక్షన్లు మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించింది. జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా, జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ బస్ కండక్టర్‌గా పనిచేస్తోంది. ఆర్థిక వివాదాలు కారణంగానే హత్యకు ఒడిగట్టినట్లు ఆమె పేర్కొంది.

  • ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పదమూడేళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. నిందితుడు ఆ బాలుడిని నైలాన్‌ తాడుతో ఎనిమిది సార్లు ఉరి బిగించి.. ముఖంపై ఇటుకతో దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం బాక్స్‌లో దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను అదే మంచంపై పడుకోబెట్టాడు.

    పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆ బాలుడు ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆధారాలు దొరకకుండా.. మృతదేహాన్ని నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌కు తరలించి అక్కడ ఒక మంచం(బెడ్ బాక్స్)లో దాచాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    బాలుడు అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం సోదాలు నిర్వహించగా.. సమీపంలోని భవనంపై బాలుడి జాకెట్, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో  సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించగా.. బాలుడు ఆ భవనంలోకి వెళ్లడం రికార్డయ్యింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రెహాన్‌ పోలీసులనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. గాలింపు సమయంలో నిందితుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. పోలీసుల వెంటే తిరిగాడు. అయితే, అతని చేతులు, మెడపై ఉన్న గీతలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు ప్రశ్నించగా.. పని చేసే చోట గాయాలయ్యాలంటూ బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు గత నాలుగు నెలలుగా పనికి వెళ్లడం లేదని తేలింది. చివరికి రెహాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. బెడ్ బాక్స్‌లో బామ్మ పడుకున్న మంచం కిందే మృతదేహం ఉందని చెప్పాడు. పోలీసులు ఆ వృద్ధురాలిని పక్కకు జరిపి మంచం తెరవగా, దుప్పటిలో చుట్టిన బాలుడి మృతదేహాం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

     

     


     

  • ఫిబ్రవరి 1  ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్‌ బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష నాయకులు, ఇతర పలువురు రాజనీయ నాయకులు, ఆర్థిక వేత్తలు మాత్రం సామాన్యులకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అటు సోషల్‌మీడియాలోవ్యంగ్యోక్తులు, విమర్శలు వెల్లువెత్తాయి.

    నిర్మలా సీతారామన్ ప్రసంగం బడ్జెట్ ముగిసిన వెంటనే, టాక్స్‌ విధానంలో ఎలాంటి ఉపశమనం రాకపోవడంతో సోషల్ మీడియాలో  కామెడీ మీమ్స్ వెల్లువెత్తాయి.సెలబ్రిటీలు, వేతన జీవులు మధ్యతరగతి ఆందోళనల వరకు ఫన్నీ, క్రియేటివ్‌ మీమ్స్  నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

    ఇదీ చదవండి: దురంధర్‌ రంభ హో ఫీవర్‌ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

    సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ఉద్దేశించి, "ఫిబ్రవరి నెల మొత్తం మూడ్ ఒకే మహిళపై ఆధారపడి ఉంటుంది" అని ఒక మీమ్ పేర్కొనగా, మరో మీమ్‌లో, "మీ ఫండ్ నుండి కొంచెం డబ్బు వస్తే చాలా బాగుంటుంది" అంటూ  ఇంకో మీమ్‌ను చూడవచ్చు. బడ్జెట్ 2026 అసలీ జాంజ్‌..పర్సు బరువు, సహనానికి పరీక్ష, మీమ్స్ పండుగ". అనే మరో ఫన్నీ మీమ్‌  కూడా ఉంది.

    మరోవైపు తాజా బడ్జెట్‌పై బెంగాల్‌ సీఎం మమతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్, జైరాం రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం పారదర్శకంగా లేదని, కీలక కార్యక్రమాలు , పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు.మరో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సామాన్య ప్రజల కోసం కాదని, పెద్ద కార్పొరేట్ల కోసం అని, ఇందులో ఏమీ లేనప్పుడు ప్రజలు దీనిని ఎలా స్వాగతించగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఈ బడ్జెట్‌లో ఏమీ లేదు. ఇది పూర్తిగా డొల్ల అని ఆయన అన్నారు.

    ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్‌ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీ


    కేంద్ర బడ్జెట్ 2026
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 11.2 లక్షల కోట్ల నుండి 2027 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం లక్ష్యాన్ని రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. టైర్-2 , టైర్-3 నగరాలతో సహా దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆమె అనేక చర్యలను కూడా ప్రకటించిన సంగతి  విదితమే.

     

  • అయోధ్య: అయోధ్యలో శ్రీరామాలయ నిర్మాణ పనులు ఏప్రిల్‌ 30వ తేదీకల్లా పూర్తవుతాయని భావిస్తున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,900 కోట్లు కాగా, జీఎస్‌టీ సహా ఇప్పటికే రూ.1,600 కోట్లు చెల్లించామన్నారు. ఆలయ నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం ముగిసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

    ఈ ప్రాజెక్టులో కీలక నిర్మాణాల బాధ్యత తీసుకున్న లార్సెన్‌ అండ్‌ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సంస్థలు ప‌నులు పూర్తి చేసి ఏప్రిల్‌ 30వ తేదీ కల్లా వైదొలగుతాయని నృపేంద్ర మిశ్రా (Nripendra Misra) వివరించారు. అదే రోజుకు అన్ని రకాల బిల్లుల చెల్లింపులు, ఇతర పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ రెండు కంపెనీలు తాము చేపట్టిన పనులకు మూడేళ్ల వారెంటీ ఇచ్చాయని నృపేంద్ర మిశ్రా అన్నారు.

    నిర్వహణ పనుల నిమిత్తం నిపుణుల బృందాలను ఆలయ సముదాయంలోనే అందుబాటులో ఉంచుతాయన్నారు. ఏప్రిల్‌ 30వ తేదీ తర్వాత ఆలయ సముదాయం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధీనంలోకి వస్తుందని మిశ్రా వివరించారు.

    కాగా, అయోధ్య శ్రీరామాలయ నిర్మాణాన్ని 2020 ఆగస్టు 5న ప్రారంభించారు. 2024 జనవరి 22 నుంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు. భ‌క్తుల నుంచి సేక‌రించిన విరాళాల‌తో ఆల‌య నిర్మాణాన్ని త‌ల‌పెట్టారు. రూ. 3,000 కోట్లకు పైగా విరాళాలు వ‌చ్చాయి.

    చ‌ద‌వండి: ఫిబ్రవరిలో ఉక్క‌పోత‌.. ఐఎండీ  

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై  వ్యాపారవేత్త, మాజీ షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జ్‌ అష్నీర్ గ్రోవర్ స్పందించారు. టైమ్‌ వేస్ట్‌ తప్ప ఏమీలేదంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన తన స్పందనను ఎలాంటి మొహమాటం లేకుండా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. అంతేకాదు తాను ఒకప్పుడు రియాలిటీ షోలో తిరస్కరించిన ఒక పిచ్‌తో తాజా కేంద్ర బడ్జెట్‌ను పోల్చారు.

    ఈ ఏడాది బడ్జెట్‌పై భారీ అంచాలను పెట్టుకున్న వ్యాపారవేత్తలతోపాటు, సామాన్యులు కూడా  నిర్మలమ్మ తాజా పద్దుపై పెదవి విరిచారు.  ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయం సంపాదించేవారికి పన్నుల ఉపశమనం ఉంటుందని భావించిన వేతన  జీవులకు నిరాశే ఎదురు  కావడం విమర్శలకు తావిచ్చింది.  అటు స్టాక్‌మార్కెట్‌ను ప్రతికూలంగానే స్పందించింది. బడ్జెట్ ప్రసంగానికి ముందు దూసుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ  భారీ నష్టాలతోముగిసాయి. గ్రోవర్ పోస్ట్ చేసిన సమయంలోనే ఈక్విటీ మార్కెట్లు  భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 80,931 వద్ద, నిఫ్టీ 24,826వద్ద భారీ నష్టాలను చవిచూశాయి.

    ఇదీ చదవండి: దురంధర్‌ రంభ హో ఫీవర్‌ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

    గ్రోవర్ విమర్శలపై నెటిజన్లు కూడా స్పందించారు. షార్క్ ట్యాంక్ పిచ్‌లు  కనీసం 10 నిమిషాల్లో ముగుస్తాయి. ఇది నిజంగా టైం వేస్ట్‌ బడ్జెట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. దీని వల్ల మనకు ఒక సంవత్సరం నష్టం జరిగిందని మరో యూజర్‌ నిరాశను వ్యక్తం చేయగా,   బడ్జెట్‌లో సారం లేదనడానికి మార్కెట్ పతనమే రుజువు అని మరొకరు వ్యాఖ్యానించారు.  

    ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్‌ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీ

  • ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, జీవితంలో వర్తమాన క్షణాలను ఆస్వాదించడానికి వయసుతో పనేముంది. సమయం, సందర్భం కలిసి వస్తే మనసు నాట్యమయూరే అవుతుంది. ఇక నాట్యంలో ఆరితేరిన వారైతే.. ఇక చెప్పేదేముంది ఉరిమే ఉత్సాహంతో ఉర్రూతలూగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నా ఈ వీడియోను చూస్తే ఎంతటివరైనా కాలు కదపాల్సిందే.. పక్కా.! 

    ఆ సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మరెవ్వరో కాదు  బాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి కల్పనా అయ్యర్. వయసు 70 ఏళ్లు అయితేనేం  అందమైన డ్యాన్స్‌తో  మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. తన  కరియర్‌లో  ఐకానిక్‌ సాంగ్‌  ‘రంభా హో హో హో’ పాటకు అత్యంత అ‍ద్భుతంగా నృత్యం చేశారు. తాజాగా   ఈ పాటను దురంధర్‌లో వాడుకోవడంతో మరింత ఇంట్రస్టింగ్‌మారింది. దురంధర్ సినిమా  అటు కలెక్షన్లనుంచి  ఇటు వివాదాల కారనంగా అనేక కారణాలతో వార్తల్లో నిలిచింది. ఐకానిక్ రెట్రో పాట  'రంభ హో' వాడుకోవడం వాటిలో ఒకటి.

    1981లో వచ్చిన 'అర్మాన్' చిత్రంలో ఈ పాటలో నటించిన సీనియర్ నటి కల్పనా అయ్యర్, దాదాపు 40 ఏళ్ల తరువాత ఆ మ్యాజిక్‌ను పునఃసృష్టించారు. దీంతొ అభిమానులు నాస్టాల్జియాతో పులకరించారు. స్వయంగా కల్పనా తన ఇన్‌స్టాఖాతాలో   శుక్రవారం ఈ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇలా అన్నారు. “ఒక స్నేహితురాలు నాకు ఈ క్లిప్‌ను పంపింది, ఇది నిన్న రాత్రిది, ఇలా చేశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. చాలా కాలంగా డ్యాన్స్ చేయలేదు. ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. సిద్ధాంత్ పెళ్లి.” అని ఆమె పేర్కొన్నారు.  నలుపు-బంగారు బ్లౌజ్‌ ఊదా రంగు పట్టు చీరలో ఆమె స్టెప్పులుకు సోషల్‌ మీడియా ఫిదా అవుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కల్పనా అయ్యర్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది  

    ఎవరీ కల్పనా అయ్యర్‌
    బాలీవుడ్‌లో విలన్ పాత్రలకు, ముఖ్యంగా 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రంలో తన నటనకు బాగా గుర్తుండిపోయే కల్పనా అయ్యర్, మిస్ ఇండియా 1978 పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్ 1978లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, టాప్ 15 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచారు. ఎక్కువగా బోల్డ్  అండ్‌  గ్లామరస్ పాత్రలను పోషించారు. 1980 నాటి 'ప్యారా దుష్మన్' చిత్రంలోని "హరి ఓం హరి", ఆ తర్వాత 1981లో 'అర్మాన్' చిత్రంలోని "రంభ హో" వంటి జనాదరణ పొందిన డ్యాన్స్ నంబర్లతో డ్యాన్సింగ్‌  క్వీన్‌గా పాపులర్‌ అయ్యారు.

  • ఢిల్లీ:  కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన నిధులు కేటాయించలేదన్నారు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. పోలవరం ప్రాజెక్టు నిధులు తగ్గడంతో పాటు ఆ ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకే పరిమితం చేశారన్నారు. ‘కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేలేకపోయింది. వైజాగ్‌కు హైస్పీడ్‌ రైట్‌ కారిడార్‌ కేటాయింపు జరగాలి. జగన్‌ ప్రభుత్వ పాలనను ఎకనామిక్‌ సర్వే కీర్తించింది. జగన్‌ పాలనలో డిజిటల్ ల్యాండ్ సర్వే అద్భుతంగా చేశారని వెల్లడించింది. రాష్టానికి హై స్పీడ్ రైల్ కారిడార్ రాలేదు. గ్రామీణాభివృద్ధికి నిధులు తగ్గాయి. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం. గ్రామీణ సడక్ యోజన పథకానికి నిధులు పెంచాలి’ అని పేర్కొన్నారు.

    రాష్ట్రాలపై భారం వేస్తున్నారు
    వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే దురాలోచన చేస్తున్నారని, రాష్ట్రాలపై భారం వేస్తున్నారన్నారు. పేదల చేతికి నిధులు అందితేనే మనీ సర్క్యులేషన్‌ జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమన్నారు. పోలవరంకు అరకొర నిధులు కేటాయించడమే కాకుండా ఆ ప్రాజెక్టు ఎత్తు  41.15 మీటర్ల లెవెల్‌కు తగ్గించారన్నారు. ఇదిలాగే కొనసాగితే పోలవరం  పూర్తికి పదేళ్లు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ కేటాయింపులు సవరించాలి’ అని పేర్కొన్నారు. 

    పోలవరంకు నిధులు తగ్గించడం అన్యాయం
    బడ్జెట్ లో పోలవరంకు నిధులు తగ్గించడం అన్యాయమన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి.  కూటమి ప్రభుత్వం రాష్ట్నానికి తగిని నిధులు తీసుకురాలేదన్నారు. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని తేలిందని మేడా రఘునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.

    కేంద్ర బడ్జెట్‌ ఏపీకి నిరాశే మిగిల్చింది
    కేంద్ర బడ్జెట్‌ ఏపీకి నిరాశే మిగిల్చిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి. పోలవరంకు 57 వేల కోట్ల రూపాయలను 30 వేల కోట్లకు తగ్గించారన్నారు.27 వేల కోట్ల రూపాయల గ్రాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘పోలవరం ఎత్తు తగ్గించారు... నిధులు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి  రాష్ట్ర ప్రజల పై భారం మోపుతున్నారునేరాలు అరికట్టాల్సిన పోలీసులే...నేరాలను దగ్గరుండి చేయిస్తున్నారు. అంబటి రాంబాబు బండిని  అడ్డగించి మారణాయుదలతో దాడి చేయించారు. ఆ తర్వాత ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి దిగారు. రాష్ట్రానికి నిధులు తగ్గితే...మాట్లాడని కేంద్ర మంత్రి దాడులకు పురికొల్పుతున్నారు’ అని మండిపడ్డారు.

     ఏపీలో గుండాల రాజ్యం నడుస్తోంది
    మరో వైఎస్సార్‌సీపీ ఎంపీ గొల్లబాబూ రావు మాట్లాడుతూ.. ‘ ఏపీలో గుండాల రాజ్యం నడుస్తోంది. అంబటి రాంబాబును చంపాలని ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు లేదన్న విషయాన్ని డైవర్ట్ చేసేందుకు దాడులు చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ పై ప్రస్తావన లేదు. ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు.

  • కోల్‌కతా: 2026-27 కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం తర్వాత, ఢిల్లీకి బయలుదేరే ముందు కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప, సామాన్య ప్రజలకు ఈ బడ్జెట్‌లో ఒరిగిందేమీలేదని, ఇది ప్రజా వ్యతిరేకమైందనీ పేర్కొన్నారు. ప్రధానంగా బెంగాల్‌కు కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆమె  ధ్వజమెత్తారు.

    లోక్‌సభలో  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆమె విమర్శులు గుప్పించారు. "ఇది  యాంటీ యూత్‌,  యాంటీ పూర్‌, యాంటీ బీసీ ఎస్టీ, మైనార్టీ, మహిళా వ్యతిరేక, రైతు వ్యతిరేక, విద్యా వ్యతిరేక" అని బడ్జెట్‌ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండి పడ్డారు. ఈ బడ్జెట్‌ను అలాగే ఎలాంటి దూరదృష్టిలేని  దిశానిర్దేశం లేనిదని, వ్యాఖ్యానించారు. ఇది మొత్తంగా అబద్దాల పుట్ట అన్నారు. 

    ఇదీ చదవండి: నిర్మలమ్మ చీర : గ్రహ గతుల విశ్లేషణ ఇదీ!

    పన్నులను రాష్ట్రాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేంద్రం, తామేదో ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను, రాజ్యాంగ నిర్మాణాన్ని, స్వతంత్ర సంస్థలను కేంద్రం నాశనం  చేస్తున్న కేంద్రానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదంటూ ఘాటుగా విమర్శించారు.

    అలాగే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడు కారిడార్ల అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము ఆ ప్రాజెక్టులపై పని చేస్తున్నామన్నారు. పురూలియాలోని 'జంగల్ సుందరి' ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే  రూ. 72వేల కోట్లు పెట్టుబడి పెడుతోందని గుర్తు చేశారు. హిమాలయాలను దాటిపోయేంత అసత్యాల పుట్ట అని అభివర్ణించారు. అర్థిక వ్యవప్త గాడి తప్పిందనీ, సెన్సెక్స్‌, నిఫ్టీ కుప్పకూలిందన్నారు. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బడ్జెట్‌పై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తాను రేపు పార్లమెంట్ కల్పించిన వేదికద్వారా మాట్లాడతానని రాహుల్ లేకరులతో అన్నారు.

  • న్యూఢిల్లీ: ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అదే సమయంలో, సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయంది. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తున్న పొడి వాతావరణం ఈ మార్పులకు కారణమని పేర్కొంది.

    ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర (Mrutyunjay Mohapatra) శనివారం మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తమ్మీద చూస్తే ఈ ఫిబ్రవరి నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి మించి ఉంటాయన్నారు.

    ఉష్ణోగ్రతలు(Temperature) ఎక్కువగా ఉండటం వల్ల పంటల పెరుగుదల వేగం పుంజుకుంటుందన్నారు. గోధుమ, బార్లీ వంటి పంటలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కోతకు వచ్చే అవకాశముందన్నారు. ఫలితంగా, కంకుల్లో గింజలు సరిగా లేక, తాలు గింజల కారణంగా దిగుబడి తగ్గుతుందని వివరించారు.  

    పెరిగిన అంతర్జాతీయ పర్యాటకులు
    సాక్షి, న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. 2020లో 63.37 లక్షలుగా ఉన్న అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య వరుసగా, 2021లో 70.10 లక్షలు, 2022లో 1.43 కోట్లు, 2023లో 1.88 కోట్లు, 2024లో 2.05 కోట్లుగా ఉందని వివరించింది.

    విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాంతాలు, ట్రావెల్‌ ట్రేడ్‌ రంగంతో కలిసి పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని వెల్లడించింది. ప్రచార కార్యక్రమాలకు ఐదేళ్లలో రూ.205 కోట్ల మేర ఖర్చు చేసినట్లు పేర్కొంది.

    చ‌ద‌వండి: చెత్త కొండ‌ల‌కు కాలం చెల్లిన‌ట్టే!

    పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు బలమిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. భారత్‌ను ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.  

  • ఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్‌. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మార్గనిర్ధేశనం చేస్తోందని వ్యాఖ్యానించారు.  

    అంతేకాదు కేంద్ర బడ్జెట్ అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సరైన సమతుల్యతను సాధించిందన్నారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌. ప్రపంచంలో భారత్‌ బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.   

  • న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ వెలువడిన అనంతరం రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. 
    ప్రతిపక్ష నేతలు ఈ బడ్జెట్‌ను వాస్తవాలకు దూరం అని విమర్శించారు. నిరుద్యోగంతో పాటు సామాన్యుల సమస్యలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

    వాస్తవాలకు దూరం
    ‘సమాజ్‌వాదీ’ నేత అఖిలేష్ యాదవ్ : ఈ బడ్జెట్ క్షేత్రస్థాయి వాస్తవాలకు చాలా దూరంగా ఉందని, ప్రజలకు ఇది ఎలాంటి ఆశను కల్పించలేకపోయిందని విమర్శించారు.

    నిరుద్యోగాన్ని విస్మరించారు
    శశి థరూర్ (కాంగ్రెస్): దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు నిరుద్యోగమని, బడ్జెట్‌లోని వృద్ధి చర్యలు నిజంగా ఉద్యోగాలను సృష్టిస్తాయా అనే విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

    వికసిత్‌ భారత్ వైపు అడుగులు
    ప్రభుత్వ ప్రతినిధులు ఈ బడ్జెట్‌ను దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా అభివర్ణించారు.

    నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి): 
    ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూనే మౌలిక సదుపాయాల కల్పన, ఏఐ-ఆధారిత పాలన ద్వారా 2047 నాటికి ‘వికసిత్‌ భారత్’ నిర్మించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

    పరిశ్రమలు - వ్యాపార వర్గాల స్పందన
    పారిశ్రామిక రంగానికి సంబంధించి బడ్జెట్ కొన్ని రంగాలకు ఊరటనిచ్చింది.

    బ్యాంకింగ్ రంగం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు తమ అంచనాలను కొంత తగ్గించుకున్నప్పటికీ, ఎంఎస్‌ఎంఈల కోసం తీసుకున్న ప్రత్యేక చర్యలను సానుకూల అంశంగా గుర్తించాయి.

    ఎగుమతిదారులు - వ్యాపారులు: విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ (టీసీఎస్‌) తగ్గించడం, విద్యా సంబంధిత లావాదేవీలపై టీడీఎస్ (టీడీఎస్‌) సడలించడాన్ని ప్రశంసించారు. ఇది ఖర్చులను తగ్గించి వ్యాపారాలకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    టెక్ - ఏఐ స్టార్టప్‌లు: ‘ఇండియా ఏఐ’ మిషన్ విస్తరణను స్వాగతించినప్పటికీ, కంప్యూట్ వనరుల కేటాయింపులను రూ. 2,000 కోట్ల నుంచి ₹5,000 కోట్లకు పెంచి ఉంటే బాగుండేదని సూచించారు.

    ఆర్థికవేత్తలు - విశ్లేషకులు
    బడ్జెట్‌లోని లోతుపాతులను ఆర్థిక నిపుణులు ఈ విధంగా విశ్లేషించారు..

    సానుకూల అంశాలు: కొత్త పన్ను విధానంలో పన్ను రహిత పరిమితిని రూ.12–12.75 లక్షలకు పెంచడాన్ని మధ్యతరగతికి గొప్ప వరంగా పేర్కొన్నారు. అలాగే మౌలిక సదుపాయాలకు రూ. 12.2 లక్షల కోట్ల కేటాయింపులను ప్రశంసించారు.

    హెచ్చరిక: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా విధిస్తున్న సుంకాల వల్ల భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. బడ్జెట్ లక్ష్యాలు యువతకు తగినన్ని ఉద్యోగాలను ఇస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకమని అభిప్రాయపడ్డారు. 

  • కేంద్ర బడ్జెట్ రోజున, ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ చీర  ఎపుడూ ప్రత్యేకంగా ఉంటుంది.  మరో విధంగా చెప్పాలంటే బడ్జెట్‌లో లభించే కేటాయింపులు, ఊరటలు, తాయిలాలతో  నిర్మలమ్మ చీరపై కూడా అంతే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ చీరల వెనుక అర్థం పరమార్ధం ఉందంటున్నారు పండితులు.

    కేంద్ర బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ధరించే చీర కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు, అది బడ్జెట్  స్వభావాన్ని సూచించే ఒక దృశ్య సంకేతం. రంగు, ఆకృతి, ఆ డిజైన్‌లోని సంయమనం  దేశప్రజలకు రాబోయే ఆర్థిక నిర్ణయాలకు మానసికంగా సిద్ధం చేస్తాయట.  

    బడ్జెట్‌ ప్రసంగంలో ఎపుడూ  చేనేత చీరలకే ప్రాధానమిచ్చే నిర్మలా ఈ సారి అదే సంప్రదాయాన్ని పాటించారు. తమిళనాడు పురాతన నేత వారసత్వాన్ని గౌరవిస్తూ, చేనేత కాంచీవరం పట్టు చీరలోకనిపించారు. 2026 బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాఘ పూర్ణిమ రవి పుష్య యోగంలో తన తొమ్మిదవ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా విత్తమంత్రి చీరఎంపిక క్రమశిక్షణ, నియంత్రిత అధికారం, గంభీరతను ప్రతిబింబిస్తుంది. ఈ చీరను అర్థం చేసుకోవడానికి ఈ నేపథ్యం చాలా అవసరమని అంటున్నారు.

     ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్‌ పెట్టుబడులు


    నిర్మలమ్మచీర,   గ్రహ గతుల విశ్లేషణ
    2026, ఫిబ్రవరి 1,ఆదివారం
    ఆదివారం: సౌర అధికారాన్ని, ఆజ్ఞను సూచిస్తుంది.
    మాఘ నక్షత్రం: చట్టబద్ధత , శక్తికి ప్రతీక.

    గ్రహాల స్థితి: మకర రాశిలో గ్రహాల కూటమి, ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు, కుంభంలో రాహువు , మీనంలో శని ఉండటం వల్ల... ఈ రోజు భావోద్వేగాల కంటే వ్యవస్థాత్మక నిర్మాణం , నియంత్రణకు ప్రాధాన్యతనిస్తుంది.

    చీర రంగు పర్పుల్-మెజెంటా, నియంత్రిత శక్తికి నిదర్శనం. పర్పుల్ , మెజెంటా మిశ్రమ రంగు ధైర్యానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది కుజ శక్తిని సూచిస్తుంది. ఇది భావోద్వేగాలకు లొంగకుండా, దృఢమైన నిర్ణయాలు తీసుకునే ధోరణిని తెలుపుతుంది. ప్రజాకర్షక (Populist) పథకాల కంటే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణకే మొగ్గు చూపుతారని ఇది సూచిస్తోంది.

    పసుపు-బంగారు అంచు (Border): పరిమిత వృద్ధి ఇది  గురు గ్రహానికి (అభివృద్ధి, సంక్షేమం) సంబంధించినవిగా భావిస్తారు. అయితే, ఈ రంగు చీర మొత్తం కాకుండా కేవలం అంచుకే పరిమితం కావడం గమనార్హం. అంటే, వృద్ధి ,సంక్షేమం గురించి చర్చ ఉంటుంది, కానీ అవి ఆర్థిక పరిమితులకు లోబడే ఉంటాయి.

    ప్యాటర్న్ అడ్డ , నిలువు గీతలు : శని , క్రమశిక్షణకు సంకేతం.
    చీరపై ఉన్న సమాంతర , నిలువు గీతలు అనేవి క్లాసిక్ శనిగ్రహ చిహ్నాలు. శని ప్రభావానికి , మకర రాశి తత్వానికి నిదర్శనం. ఎలాంటి  పూల డిజైన్లు (Motifs) లేకపోవడం వల్ల, ఈ బడ్జెట్ సెంటిమెంట్‌పై కాకుండా పాలసీ స్ట్రక్చర్  పైనే ఆధారపడి ఉంటుందని పండితుల అంచనా. నిర్మల ఈ చీరను ఎంచుకోవడం అంటు తన వస్త్రధారణ ద్వారా దేశానికి 'క్రమశిక్షణ' అనే సందేశాన్ని పంపినట్టు భావిస్తున్నారు.  సంక్షేమ పథకాలు భావోద్వేగ ప్రాతిపదికన కాకుండా, వ్యవస్థాత్మక పద్ధతిలో, దీర్ఘ కాలిక ప్రయోజాలను ఆశించేలా,  నియమపాలన, సంస్థాగత బలంపై దృష్టిపెట్టేలా తమ బడ్జెట్‌ ఉండబోతోందని అంచనాలను దేశప్రజలకు అందించినట్టన్నమాట.

Family

  • బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్‌ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్‌ మెస్మరైజ్‌ చేస్తోంది. ఆరు గజాల బాటిల్‌ గ్రీన్‌ షేడ్‌ సిల్క్‌ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్యూటీఫుల్‌ ఫోటోలను షేర్‌ చేశారామె. 

    ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్‌ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి  జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్‌ని హైలెట్‌ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్‌లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్‌ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్‌ ఫ్యాషన్‌స్టైల్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి.  

    జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్‌, హెయిర్‌స్టయిల్‌ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా కనబడేలా చేసింది.

     

    (చదవండి: కిచెన్‌పై బడ్జెట్‌ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!)

     

  • కేంద్ర బడ్జెట్ 2026–27 దేశవ్యాప్తంగా గృహాలు, ఆహార సంబంధిత వ్యాపారాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే మార్పులను ప్రవేశపెట్టింది. ఈసారి ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, దేశీయ తయారీకి మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించి మరీ ధరలను సర్దుబాటు చేసింది. అవేంటో సవివరంగా చూద్దామా..!.

    • శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా బయోగ్యాస్ ఆధారిత CNG ఉత్పత్తి ఖర్చును తగ్గించింది.  ఈ సంస్కరణ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తోంది. ఫలితంగా వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలను సరఫరా చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలను అందించనుంది.

    • మైక్రోవేవ్ ఓవెన్లు మైక్రోవేవ్ ఓవెన్లు వాటి తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయించబడినందున అవి మరింత సరసమైన ధరలో లభించనున్నాయి.  దేశీయ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగంలో విలువ జోడింపును పెంచడం, దిగుమతి చేసుకున్న భాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, తయారీ ఖర్చులను తగ్గించడమే దీని లక్ష్యం.

    • సీఫుడ్ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి, సీఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉపయోగించే ఇన్‌పుట్‌లకు సుంకం లేని దిగుమతి పరిమితిని 1% నుంచి 3%కి పెంచారు. ఇది ప్రాసెసర్‌లకు ముడి పదార్థాలు, పరికరాలను సోర్సింగ్ చేయడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది.

    • ఫిబ్రవరి 1, 2026 నుండి 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 49 పెరిగింది, దీనితో ఢిల్లీలో కొత్త రేటు రూ. 1,740.50కి చేరుకుంది. నెలవారీ ధరల సర్దుబాటులో భాగమైన ఈ సవరణ, రోజువారీ కార్యకలాపాల కోసం LPGపై ఎక్కువగా ఆధారపడే రెస్టారెంట్లు, హోటళ్ళు, కేఫ్‌లు, వీధి ఆహార విక్రేతలను ప్రభావితం చేస్తుంది. అయితే, దేశీయ LPG సిలిండర్ ధరలు మారవు.

    • కాఫీ రోస్టింగ్, బ్రూయింగ్  వెండింగ్ మెషీన్లపై ప్రభుత్వం ఇప్పటికే ఉన్న మినహాయింపులను ఉపసంహరించుకుంది. ఈ చర్య అటువంటి పరికరాల ధరను పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ యంత్రాలను సాధారణంగా కేఫ్‌లు, రెస్టారెంట్లు, కార్యాలయ స్థలాలు, వాణిజ్య పానీయాల కౌంటర్లలో ఉపయోగిస్తారు. వీటిలో చాలా వరకు దిగుమతి చేసుకున్న మోడళ్లపై ఆధారపడి ఉంటాయి. సవరించిన సుంకం నిర్మాణం అమలులోకి రావడంతో, వ్యాపారాలు అధిక పెట్టుబడి లేదా భర్తీ ఖర్చులను ఎదుర్కోవలసి రావచ్చు. కాఫీ సేవ రోజువారీ కార్యకలాపాలకు అంతర్భాగంగా ఉన్న సంస్థలకు నిర్వహణ ఖర్చుల భారం అధికమవనుంది.

    • పాల ధరలు2026–27 బడ్జెట్ కింద కొత్త సవరణలు లేకుండా పాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

    (చదవండి: ఆర్థిక చరిత్రలోనే తొలిసారి ఇలా..! కానీ 1999లో మాత్రం..)

     

  • గుడి గంటల నాదం, తీరాన్ని తాకుతున్న అలల నాదంతో శ్రుతి కలిపిన వేళ, ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, పంచభూత క్షేత్రాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల పండితుల శక్తివంతమైన, ధ్యానమయమైన వేద మంత్రోచ్ఛారణల నడుమ, శుక్రవారం సాయంత్రం రామేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో సోమనాథ జ్యోతిర్లింగ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి.

    తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు అపార భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఈ కార్యక్రమం , రామేశ్వర తీరాన్ని ప్రార్థన, భక్తి, ఆధ్యాత్మిక జాగృతి  కేంద్రంగా మార్చివేసింది.

    రుద్రాభిషేకం అనేది ప్రాచీన వేద సంప్రదాయంలో భాగమైన పవిత్ర కర్మ. ఇందులో పరమశివుడు రుద్రుడి కరుణామయ స్వరూపంలో పూజింపబడతాడు. ఈ పూజ వలన భక్తులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని, కోరికలు సాకారం అవుతాయని భక్తుల విశ్వాసం. పాలు, నెయ్యి, తేనె, నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో లింగాభిషేకం చేయడం, నిరంతర మంత్రోచ్ఛారణల ద్వారా మనస్సు, పరిసర వాతావరణం శుద్ధి అవుతాయని, అడ్డంకులు వ్యతిరేక భావనలు తొలగిపోతాయని భావిస్తారు.

    గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలు, అమర్నాథ్, పశుపతినాథ్ ఆలయాల నుండి వచ్చిన ప్రముఖ పండితులు సామూహికంగా ఈ మహా పూజకు ప్రారంభించారు. ఈ పవిత్ర కర్మలో భాగంగా, ఆయా ఆలయాల నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన తీర్థ జలాలను సమర్పించడం భారతదేశ ఆధ్యాత్మిక ఏకత్వాన్ని ప్రతిబింబించింది.

    ఈ సందర్భానికి మరింత విశిష్టత చేకూర్చుతూ, ప్రకృతిలోని పంచభూతాలను సూచించే పంచభూత క్షేత్రాల నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలను కూడా ఈ రుద్రాభిషేకంలో సమర్పించారు. ఈ పవిత్ర జలాల సంగమం ప్రకృతి, భక్తి, వేద జ్ఞానాల సమన్వయాన్ని ప్రతిఫలించింది.

    “గురుదేవ్ సృష్టించిన దైవిక వ్యవస్థ, ఇక్కడ ఏర్పడిన అపార ఆధ్యాత్మిక వైభవం కారణంగా ఈ మహా రుద్ర పూజను తరతరాలు గుర్తుంచుకుంటాయి,” అని వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన పండిత్ రమానంద్ దుబే అన్నారు. “జ్యోతిర్లింగాలు అన్నీ ఇక్కడే కొలువై ఉన్నట్లుగా అనిపిస్తోంది.”

    సాయంత్రం కార్యక్రమంలో, 7వ శతాబ్దానికి చెందిన ప్రముఖ శైవ నాయనార్ సంత్ తిరుజ్ఞానసంబందర్ రచించిన పవిత్ర కొలారు పతిగాన్ని ప్రపంచవ్యాప్తంగా 180కు పైగా దేశాలలోని దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఏకకాలంలో పారాయణ చేశారు. ఆలయాలు, ఇళ్లు, సామాజిక కేంద్రాల నుండి భక్తి స్వరాలు ఏకకాలంలో మార్మోగుతూ, భౌగోళిక సరిహద్దులను దాటి శాంతి సామరస్యాలకు చిహ్నంగా, శక్తివంతమైన విశ్వ ప్రార్థనగా మారాయి.

    ఈ మహా రుద్ర పూజతో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత నాలుగు దశాబ్దాలుగా, ఈ సంస్థ ధ్యానం, ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలు, మానవతా సహాయం, విద్య, పర్యావరణ పరిరక్షణ, శాంతి నిర్మాణ కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి చేరువైంది. రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమం సేవ, అంతర్గత పరివర్తన వైపు మానవాళి సాగించే నిరంతర ప్రయాణానికి స్ఫూర్తిగా నిలిచింది.

  • కొన్ని ఘటనలు ఎంతో ఆలోచించేలా చేస్తాయి. కొత్త స్ఫూర్తిని నింపుతాయి. చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తే మనం, ఇలాంటి బామ్మను చూసి ఎంతో ప్రేరణ పొందుతాం. కష్టం ఏదైతేనేం..దాన్ని అధిగమించేలా నవ్వుతూ మనపని మనం ఎలా చేసుకుంటూ పోవాలో ఈ బామ్మని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఆత్మగౌరవం అనే మాటకు అసలైన అర్థంలా అనిపిస్తుంది ఈ బామ్మ జీవన విధానం..

    ఆ బామ్మ పేరు 89 ఏళ్ల కమలాబెన్‌ మెహతా. ముంబై లోకల్‌ రైళ్లలో నిశబ్దంగా బ్రాస్‌లెట్‌లు అమ్ముతు ఉంటుందామె. ఆమెను చూడగానే ఈ వయసులో ఇంతలా ‍కష్టపడుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఆమె ఎవరి నుంచి సానుభూతిని, దాతృత్వాన్ని ఆశించకుండా కష్టపడుతున్న తీరు నిజంగా మనసుని కదిలిస్తుంది. చనిపోయేదాక ఆత్మగౌరవానికి భంగం కలగకుండా బతకడం అంటే ఇదే కదా అనిపిస్తుంది  ఆ బామ్మని చూస్తే. 

    అందుకు సంబంధించిన పోస్ట్‌ని ఓ ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు ఆమెతో మాటలు కలపగా తనపేరు కమలాబెన్‌ అని, తన వయసు 89 ఏళ్లని ఆ బామ్మ చెప్పిందని పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన కుటుంబంతో కలిసి జీవించడానికి తన వంతుగా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేందుకే ఈ పని చేస్తున్నట్లు తెలపింది. తాను ముంబైలోని నలసోపారాలో నివశిస్తున్నట్లు పేర్కొంది. 

    ఆమెకు సాయం చేయాలని.. తన దగ్గరున్న బ్రాస్‌లెట్‌లు కొందామనుకున్నా.. అంత మొత్తం లేకపోవడంతో ఆ బామ్మ ఇంటి అడ్రస్‌ అడగగా, ఆమె అందుకు నిరాకరించింది. పైగా తన కుటుంబ తన వల్ల అవమానపాలు కాకూడదు అంటూ అక్కడ నుంచి మౌనంగా నిష్క్రమించిందని పోస్‌లో రాసుకొచ్చాడు సదరు ప్రయాణికుడు.  

    నిజానికి ఆ వయసులో ఈ బామ్మ ఏ రకంగానైనా సంపాదించొచ్చు. కానీ తన ఆత్మగౌరవం కోసం శరీరం సహకరించి వృద్ధాప్యంలో కూడా అచంచలమైన పట్టుదలతో చేతితో తయారు చేసిన బ్రాస్‌లెట్లు అమ్ముతూ సంపాదించాలనుకోవడం నిజంగా ప్రశంసనీయం..స్ఫూర్తిదాయకం. చివరి క్షణం వరకు తలెత్తుకునే బతకాలి కానీ, చేయిచాచి కాదు అని చెంపపగిలేట్టు సమాధానమిచ్చే ఘటన ఇది. ఇంకెందుకు ఆలస్యం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓలుక్కేయండి మరి.

     

    (చదవండి: అరుదైన ఘనత సాధించిన తొలి మహిళ..! ఏకంగా ఐదు హిమాలయాలు..)

     

  • భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ అండ్‌ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ సుఫియా వంద గంటల్లోపూ కఠినమైన మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్‌ను పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డులకు ఎక్కింది. ఇంతవరకు ఏ మహిళ సాధించిన ఘనత ఇది. హిమాలయాల్లో మొత్తం ఐదు ఎత్తైన పర్వత పాస్‌ల మీదుగా దాదాపు 470–480 కి.మీ. దూరం వేగవంతంగా రన్‌ చేసి రికార్డు సృష్టించింది. వంద గంటల లక్ష్యాన్ని  తృటిలో అధిగమించి..కేవలం 98 గంటల 27 నిమిషాల్లో పరుగును పూర్తి చేసింది. ఈ మేరకు సూఫీ తాను సాధించిన ఘనతను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఇలా వివరించింది. 

    తాను ఈ రికార్డును 2023లో అధికారికంగా ఆమోదించారని, కానీ సర్టిఫికేట్‌ రావడానికి ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చిది. ఐదు హై పాస్‌ల ద్వారా మనాలి నుంచి లేహ్ వరకు అత్యంత వేగవంతమైన పరుగు, హై-ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్నింగ్ ఛాలెంజ్… లక్ష్యం: 100 గంటలు. ఇక్కడ సూఫీ దాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసింది. అయితే అధికారిక సర్టిఫికేట్‌ ఇండియన్ కస్టమ్స్ ద్వారా చేరుకోవడానికి చాలా సమయం తీసుకోవడం విశేషం. 

    ఈ పోస్ట్‌పై నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తాయి. సూఫీ సాధించిన విజయం నిజంగా ప్రశంసనీయం. తదుపరి ఛాలెంజ్‌ ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కూడా. కాగా సూఫీకి ప్రపంచ రికార్డులు కొత్తేమి కాదు. ఆమె గతంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగవంతంగా పరిగెత్తిన మహిళగా, అలాగే భారతదేశం అంతటా 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రన్‌ను తదితరాలను పూర్తిచేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులను నెలకొల్పొందామె. ఇవేగాక దేశంలో కఠినమైన భూభాగాల్లో  అల్ట్రా-డిస్టెన్స్ రన్‌లను కూడా చేపట్టింది.

    (చదవండి: తండ్రి ప్రేమ..! కీ ప్యాడ్‌ ఫోన్‌ అయితేనేం..)

     

  • ఎన్ని డబ్బులున్న కొనలేనివి చాలనే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమ.. నోచుక్నుపిల్లలందరూ చాలా అదృష్టవంతులే. కంటిపాపలా కాచుకునే వాళ్లకు మించిన స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ కానరాదు. అలాంటి భావోద్వేగ సన్నివేశమే నెట్టింట వైరల్‌గా మారింది. అతడి వద్ద ఖరీదైన గాడ్జెట్‌ లేకపోతేనేం..తన కూతురి కళను పొందుపర్చుకోవాలన్న అతడి తాపత్రయం అందరి మనసులను గెలుచుకుంది. ఇది కథ తండ్రి ప్రేమ అనిపించేలా ఉంది ఆ ఘటన.

    అందుకు సంబంధించిన వీడియోని జితేందర్‌ సారస్వత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. రిపబ్లిక్‌ డే వేడుకల నేపథ​ంయలో కూతురు పాఠశాలలో పలు ఈవెంట్లు నిర్వహించారు. అందులో భాగంగా ఒక డ్యాన్స్‌ కార్యక్రమంలో కూతురు అద్భుతంగా నృత్యం చేస్తోంది. అయితే ఆ తండ్రి తన కూతురు డ్యాన్స్‌ని ఓ చిన్న కీప్యాడ్‌ఫోన్‌లో రికార్డు చేసేందుకు అక్కడే ఉన్న చిన్నారుల జన సముహానికి వెనుకవైపు నిలబడి ప్రయత్నిస్తున్నాడు. 

    ఆ ఫోన్‌ని చూసి ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో జాగ్రత్తగా రికార్డు చేసుకుంటున్న తీరు అందరి హృదయాలను తాకింది. ఆ వీడియోకి జితేందర్‌ మా సోదరు అందరు హృదయాలను గెలుచుకున్నాడు. అతడు కొత్త ఫోన్‌ తీసుకోవాలంటారా..మా ఈ కొత్త రీల్‌ని చూసి చెప్పండి అంటూ పోస్ట్‌ చేశాడు. తల్లిదండ్రుల ప్రేమ ముందు ఖరీదైన గాడ్జెట్లతో పని ఏమందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తూ పోస్ట్‌ చేయడం విశేషం.

     

    (చదవండి: హార్డ్‌వర్క్‌ చేయకపోతే..ఎవ్వరు కాపాడలేరు..! నెట్టింట వైరల్‌గా పోస్ట్‌)