Archive Page | Sakshi
Sakshi News home page

Tirupati

  • బుచ్చినాయుడుకండ్రిగ: అనారోగ్య సమస్యలు తాళలేక పురుగుల తాగి ఆత్మాహత్య పాల్పడిన సంఘటన బుచ్చినాయుడుకండ్రిగలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్‌ కథనం మేరకు.. బుచ్చినాయుడుకండ్రిగ అరుంధతివాడకు చెందిన బట్టేపాటి దశయ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గత 24వ తేదీ అర్ధరాత్రి పురుగుల నివారణ మందు తాగాడు. ఇది గమనించిన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. మృతుడి కుమారుడు విష్ణువర్థన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

    ముక్కంటి సేవలో

    హైకోర్టు న్యాయమూర్తి

    శ్రీకాళహస్తి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య కుటుంబ సమేతంగా మంగళవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

    తిరుత్తణి ఆలయంలో

    ఆంధ్రా మహిళ వాచ్‌ చోరీ

    తిరుత్తణి: తిరుత్తణి మురుగన్‌ ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలైన్‌లో వెళ్లిన ఆంధ్రాకు చెందిన మహిళ వద్ద ఖరీదైన వాచ్‌ చోరీకి గురైంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీరామ్‌నగర్‌కు చెందిన రాజేంద్రప్రసాధ్‌ కుటుంబంతో కలిసి మంగళవారం ఉదయం తిరుత్తణికి వచ్చింది. ఆలయ మాడ వీధిలో రూ.100 ప్రత్యేక దర్శన క్యూలైన్‌లో కుమారుడు దినేష్‌, కోడలు శ్వేతతో కలిసి రాజేంద్రప్రసాద్‌ స్వామి దర్శానికి వెళ్లారు. ఆ సమయంలో శ్వేత (32) చేతికి కట్టుకున్న బంగారు, వజ్రపు రాళ్లు పొదిగిన రూ. 7 లక్షల విలువైన చేతి వాచ్‌ అదృశ్యమైంది. వాచ్‌ చోరీపై రాజేంద్రప్రసాద్‌ తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి ఆలయంలో మహిళ వద్ద ఖరీదైన వాచ్‌ వినూత్న రీతిలో అదృశ్యం ఘటన కలకలం రేపింది.

    దారి ఆక్రమణ

    రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లి పంచాయతీ వైఎస్సార్‌ నగర్‌లో స్థానిక టీడీపీ నాయకుడు దారి ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా ఆ వీధిలో కాలువ లేకపోవడంతో పైనుంచి వచ్చే మురుగు నీరంతా ఇళ్ల మధ్య నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మొత్తం 20 అడుగుల దారి ఉంటే ఇక్కడ మాత్రం కనీసం ఆరడుగులు దారి కూడా లేకుండా ఆక్రమణకు పాల్పడినట్లు స్థానికులు వాపోతున్నారు. కాపురాలు ఉండే ప్రదేశంలో మురుగునీరు నిల్వ ఉండడంతో ఎక్కడ అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయో? అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులకు పలుమార్లు సమస్య తెలిపినా టీడీపీ నాయకుడికి భయపడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

    అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

    రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు నెలరోజుల పాటు మూసివేశారు. అయినప్పటికీ అధికారుల సమన్యయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి యథావిధిగా వాహనాల రాకపోకలను కొనసాగించారు. నెల రోజుల వ్యవధిలో అండర్‌ బ్రిడ్జి వద్ద వర్షపునీరు వెళ్లేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి అండర్‌ బ్రిడ్జిలో నీళ్లు రావడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతుల కోసం నెల రోజులు బ్రిడ్జిను మూసేసిన అధికారులు వర్షపు నీళ్ళు వెళ్లేందుకు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు.

  • టౌన్‌: మండలంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని కారుమంచువారి కండ్రిగ సమీపంలో కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతుండగా తొప్పాని యశ్వంత్‌ (26) సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే యశ్వంత్‌ మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. యఽశ్వంత్‌ డిప్లొమా వరకు చదివి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. యశ్వంత్‌ మృతితో తల్లిదండ్రులు రవికుమార్‌, లతతో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

    పిడుగు పడి.. కొబ్బరిచెట్టులో మంటలు

    నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని ఎల్‌ఏ సాగరం గిరిజన కాలనీలోని ఓ కొబ్బరి చెట్టుపై మంగళవారం పిడుగుపడింది. దీంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాల మధ్య కొబ్బరిచెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెరుపులు, పిడుగుల దాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీవీలు, ఏసీలు తదితర ఎలక్ట్రానిక్‌ సామగ్రి కాలిపోయాయని స్థానికులు తెలిపారు.

    ఎబోలా వైరస్‌పై సమావేశం

    రేణిగుంట: విదేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్‌ నివారణపై డీఎంహెచ్‌ఓ బాలకష్ణ నాయక్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో డైరెక్టర్‌ భూమి నాథన్‌తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే యాత్రికులపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే విమానాశ్రయంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రేణిగుంట విమానాశ్రయానికి ప్రస్తుతానికి ఇంటర్నేషనల్‌ విమానాలు రాకపోయినా ఇతర విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. ట్రాన్సిట్‌ హబ్‌ల ద్వారా ఆఫ్రికా దేశాలు లేదా ఇతర ప్రభావిత అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించే రోజువారీ ప్రయాణికుల జాబితాల/ప్యాసింజర్‌ మానిఫెస్ట్‌లను వైద్యాధికారులతో పంచుకోవాలని విమానాశ్రయ అధికారులను కోరారు. అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులను తనిఖీ చేసి,తక్షణ క్వారంటైన్‌ నిర్వహణ కోసం తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఒక ప్రత్యేక ఈవీడీ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచుతామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.

  • తిరుపతి కల్చరల్‌: స్వయం ఉపాధి మహిళల అభ్యున్నతికి మార్గదర్శకమని సాక్షి బ్రాంచ్‌ మేనేజర్‌ సత్యేంద్రబాబు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని అనంగా బ్యూటీ స్టూడియో అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మహిళలకు నెల రోజులుగా చేపట్టిన బ్యూటీషియన్‌ కోర్సు శిక్షణ తరగతులు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయశక్తితో ఎదిగి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ద్వారా శిక్షణ పొందిన మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ స్వయం ఉపాధిలో రాణించి అభివృద్ధి పథంలో పయనించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈవెంట్‌ మేనేజర్‌ టి.చంద్రశేఖర్‌, శిక్షకురాలు, మాస్టర్స్‌ ఇన్‌ కాస్మోటాలజిస్ట్‌ వై.శ్యామల, మహిళలు పాల్గొన్నారు.

    ఘనంగా ముగిసిన బ్యూటీషియన్‌ శిక్షణ

  • తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: సూళ్లూరుపేట నియోజకవర్గం తడ దక్షిణ క్యాబిన్‌ వద్ద రైళ్ల రాకపోకల కారణంగా లెవెల్‌ క్రాసింగ్‌ గేటు వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని స్థానిక నాయకులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు సంబంధిత రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసి, తడ సౌత్‌ కేబిన్‌ సమీపంలోని ఎల్‌సీ గేట్‌ నంబర్‌ 49 వద్ద రోడ్డు అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం లెవెల్‌ క్రాసింగ్‌ గేటు తరచుగా మూసివేయడం కారణంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు కూడా ఎక్కువసేపు గేటు వద్ద నిలిచిపోవాల్సి వస్తోందని తెలిపారు. అలాగే శ్రీ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఆలశ్యం అవుతోందని, దీని ప్రభావం వారి దైనందిన జీవన విధానంపై పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు అండర్‌ బ్రిడ్జి నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన రవాణా దృష్ట్యా తక్షణమే సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించి ప్రతిపాదనను పరిశీలించి ఆర్‌యూబీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.

  • – శ్రీసిటీ ఎండీ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి

    శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌–2026లో ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనన్‌తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్‌ సమ్మిట్‌లో డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు.

  • సత్యవేడు: చెదులపాకం(తమిళనాడు)కు చెందిన ఎస్‌.నాగరాజు అనే వ్యక్తిని కత్తితో బెదిరించి 3 గ్రాములు ఉంగరం దోచుకున్న కేసులో సత్యవేడుకు చెందిన సంతోష్‌(19), నితీష్‌కుమార్‌(19), నవీన్‌ కుమార్‌(16) పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి కథనం మేరకు.. తమిళనాడులోని చెదులపాకం గ్రామం నుంచి సత్యవేడు తన స్కూటర్‌పై ఎస్‌.నాగరాజు వస్తున్నాడు. మాదరపాకం చెక్‌పోస్టు వద్ద సత్యవేడుకు చెందిన సంతోష్‌ లిఫ్ట్‌ అడిగాడు. తెలిసిన వ్యక్తి కనుకే తన స్కూటర్‌పై తీసుకుని సత్యవేడులోని శ్రీకాళహస్తి బస్టాండ్‌ వద్దకు వచ్చారు. తన ఇంటి వ ద్దకు వదలి వెళ్లాలని నాగరాజును సంతోష్‌ కోరాడు. అక్కడి నుంచి బయలు దేరి కొంత దూరం రాగానే తన వద్ద దాచుకున్న కత్తితో ఎస్‌.నాగరాజును బెరించా డు. గురుకుల పాఠశాల సమీపంలోని జగనన్న కాలనీ వద్దకు పోవాలని చెప్పాడు. అక్కడ వేచి ఉన్న నితీష్‌ కుమార్‌, నవీన్‌కుమార్‌తో కలసి నాగరాజును చితక బాదారు. అతని వద్ద ఉన్న 3 గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కున్నారు. డబ్బులు ఇవ్వాల ని కోరారు. తన వద్ద డబ్బులు లేదంటే ఫోన్‌ఫే చేయా లని కోరారు. నెట్‌వర్క్‌ అందక ఫోన్‌పే జరగలేదు. వెంటనే బాధితుడు పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫోన్‌ పే నంబర్‌ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. నిందితులను మంగళవారం కోర్టుకు హాజరు పరిచి, రిమాండుకు తరలిచారని ఎస్‌ఐ తెలిపారు.

  • ఉలిక్కిపడ్డ ఎస్వీయూ!

    బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026

    తిరుపతి సిటీ: ఎస్వీయూలో పాలన అస్తవ్యస్థంగా మారింది. రెండేళ్ల నుంచి వర్సిటీలో ఏమి జరుగుతోందో అర్థంకాని పరిస్థితి. రాజకీయ జోక్యాలు, అవినీతి, కుంభకోణాలు, ఫలితాల విడుదలలో జాప్యం తదితర ఘటనలతో నిత్యం వార్తలలో కెక్కుతుండడంతో వర్సిటీ పరువు, ప్రతిష్ట దిగజారుతోందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హత లేని వారిని సైతం పరిపాలనా భవనంలోని పలు కీలక విభాగాలల్లోకి గత రెండేళ్లలో అధికారులు, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని బదిలీ లు చేశారు. దీంతో అవినీతికి మరింత ఆజ్యం పోసినట్లైంది.

    భారీ కుంభకోణం బట్టబయలు

    వర్సిటీలో మంగళవారం భారీ కుంభకోణం బయటపడింది. విద్యార్థులు యూజీ, పీజీ తదితర ధ్రువపత్రాల కోసం వర్సిటీకి రూ.వేల ఫీజులు చెల్లిస్తుంటారు. విద్యార్థులు చెల్లించిన బ్యాంకు చలానాలను పరిపాలనా భవనంలోని పలు విభాగాలకు చెందిన కొందరు ఉద్యోగులు, అధికారులు, బయటి వ్యక్తులతో కలసి డూప్లికేట్‌ చలానాలను కంప్యూటర్‌లో మార్ఫింగ్‌ చేసి, సొమ్ము కాజేసిన ఘటన బయటపడింది. దీంతో ఒక సారిగా వర్సిటీ ఉలిక్కిపడింది. పరిపాలనా భవనంలోని పలు సెక్షన్లలో గందరగోళం నెలకొంది. కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు కలసి వర్సిటీ రబ్బరు స్టాంపులను సైతం ఫోర్జరీ చేసి కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలు అధిక మొత్తంలో ఉన్నట్లు సమాచారం. రూ. లక్షల్లో సొమ్ము కాజేసి వర్సిటీకి శఠగోపం పెట్టినట్లు వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరింత లోతుగా విచారణ చేపడితేగాని అసలు బండారం బయట పడదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

    వర్సిటీకి నష్టం కలిగిస్తే సహించం

    ఎస్వీయూలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్‌ పనిచేస్తుంది. కానీ కొందరు ఉద్యోగులు వర్సిటీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే అసోసియేషన్‌ ఎట్టి పరిస్థితిలో సహించదు. డూప్లికేట్‌ చలానాలను తయారు చేసిన వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, బయట వ్యక్తులు, విద్యార్థి నాయకులు ఉన్నట్లు తెలిసింది. ఓ మహిళా ఉద్యోగి వెరిఫై సిగ్నేచర్‌ను ఫేక్‌ స్టాంప్‌ తయారు చేసి దందా నడిపారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నాన్‌టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా పరిగణిస్తుంది. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. వాస్తవాలు బయటకి రావాలంటే మరింత లోతైన విచారణ చేపట్టాలని అధికారులను కోరుతున్నాం. – శ్రీధర్‌, సుబ్రమణ్యం, నాన్‌టీచింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, అధ్యక్ష,కార్యదర్శులు

  • కాయ కష్టం..

    నేలతల్లిని నమ్ముకుని రూ.వేలు వ్యయం చేసి..కాయకష్టం చేసి మామిడి దిగుబడులు సాధించిన కర్షకులకు గిట్టుబాటు ధర గగనమైంది. తిరుపతి జిల్లాలో సంప్రదాయ పంట మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ పంట ధరలు రెండేళ్లుగా సీజన్‌ ప్రారంభం నుంచే పతనం కావడంతో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ నష్టాల బారిన పడుతున్నారు.

    నాణ్యమైన పంటకు గిరాకీ..

    రైతులు పంట దిగుబడి సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాయలకు దెబ్బలు తగలకుండా, వలల సాయంతో కాయలను దింపి, గ్రేడ్లలో కాయలను మార్కెట్‌కు తరలించడంతో రైతులకు మంచి గిట్టబాటు ధర లభిస్తుంది. నాణ్యత లోపిస్తే పంటకు గిరాకీ లేక రైతు నష్టాలపాలవుతారు.

    – జీ.ఎం.సైదుల్లా. జీ.ఎం.ఎస్‌

    మామిడి మండీ యజమాని. దామలచెరువు

    మా రాష్ట్రంలో కూడా సరైన ధర లేదు

    ఏటా సీజన్‌లో నేను మామిడి వ్యాపారం చేస్తుంటాను. ఇక్కడి నుంచి మామిడి కాయలను కొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటాను. ఈ ఏడాది అక్కడ కూడా సరై ధరలు లేకపోవడంతో ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాం. ప్రతీ సంవత్సరం వందల టన్నుల ఎగుమతి చేస్తుంటాం. ఈ సారి ఉన్నంతలో వ్యాపారా లావాదేవీలు జరుపుతున్నాం.

    – చంద్రశేఖర్‌, వ్యాపారి, మహారాష్ట్ర(నాగపూర్‌)

    గిట్టుబాటు ధర కల్పించాలి..

    మామిడి రైతుల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం నేరుగా పరిశీలించి వారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. రెండేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. గిట్టుబాటు ధర కాదు కదా కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకుని పుణ్యం కట్టుకోవాలి. – పురుషోత్తం నాయుడు,

    రైతు, పూతలపట్టు మండలం

    రోడ్ల పక్కన పారపోసిన నాణ్యతలేని మామిడి కాయలు

    పాకాల: మామిడి మార్కెట్‌ రైతులకు నష్టాల రుచి చూపిస్తోంది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది మామిడి పూర్తి స్థాయిలో కోతకు రాక మునుపే ధరలు లేక రోడ్లపై పారబోయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లు మామిడి రైతులకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, కనీసం ఈ ఏడాదైనా లాభాలు రాకపోతాయా?.. అప్పులు తీర్చి కాస్త ఉపశమనం పొందుదామనుకున్న రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. మామిడికి మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో మరింతగా అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్థితి దాపరించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కలుగు చేసుకుని, మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

    దక్కని గిట్టుబాటు

    ప్రస్తుతం రైతులు 4 టన్నుల కాయలు విక్రయించాలంటే కూలీలు, రవాణాతో కలిపి ఖర్చు రూ.10 వేలు అవుతోంది. దీంతో పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గాలివానలకు భయపడి పంటను ముందుగానే కోయడం, నాణ్యత లేని కాయలను మార్కెట్‌ తరలించడంతో కూడా రైతులు నష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఇలా పక్వానికి రాకుండా తొందరపడి కోసిన కాయలను రైతులు రోడ్ల పాలు చేయాల్సి వస్తోంది. దామలచెరువు మామిడి మార్కెట్లో నాణ్యమైన తోతాపురి టన్ను రూ.10 వేల నుంచి 16 వేలు, బేనిషా రూ.17వేల నుంచి రూ.25 వేలు, మల్లిక రూ.15 వేల నుంచి రూ.25 వేలు, పుల్లూరు రూ.8 వేల నుంచి రూ.16వేలు, ఖాదర్‌ రూ.20వేల నుంచి రూ.27వేలకు విక్రయిస్తున్నారు. నాటు కాయలకు గిరాకీ లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మార్కెట్‌ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదని, అన్ని రకాల కాయలు మార్కెట్లోకి రాలేదని వ్యాపారస్తులు, మండీల యజమానులు తెలిపారు.

  • దర్జాగా చెరువు ఆక్రమణ

    సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రభుత్వ ఖాళీస్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ పాగా వేయడం అక్రమార్కుల నైజం. పొరంబోకు స్థలాలు, వాగులు, వంకలతోపాటు తోపాటు చివరకు చెరువులపైన కూడా కబ్జాదారులు కన్ను పడింది. దీంతో ఏకంగా చెరువును యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. ఇటువంటి ఆక్రమణలు నివారించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. వెంకటగిరి మండలంలోని పారవోలు పంచాయతీ బసవాటి చెరువు రోజురోజుకు ఆక్రమణకు గురవుతోంది. ఈ చెరువు సర్వే నంబర్‌ 13లో 69.95 ఎకరాలు ఉండగా సుమారు 20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నేత సుమారుగా 3.5 ఎకరాలు చెరువును ఆక్రమించి, బోరు వేయడంతోపాటు కంచె వేసి, యథేచ్ఛగా వరిపంట సైతం సాగు చేస్తున్నారు. అయినా సంబంధిత ఇరిగేషన్‌శాఖ అధికారులు తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారా? చెరువు ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీ నేతల అండదండలతో చెరువు ఆక్రమణలకు గురికావడంతోపాటు రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే పాలకులు ఏమీ చేస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు ఆక్రమణలో మరి కొందరు అక్రమంగా బోరు వేయడంతోపాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయడంపై ట్రాన్స్‌కో అధికారులు వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆక్రమణలు ఇలాగే జరిగితే భవిష్యత్తులో చెరువులు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని, దీంతో పంటలు సాగు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవడంతోపాటు, నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు, పాలకులు స్పందించి భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చెరువులను పరిరక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

  • చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట కనుమ లో మంగళవారం ఐషర్‌ వాహనం బ్రేక్‌ ఫెయిల్‌ అయ్యి బోల్తా పడింది.
    కాన్వొకేన్ల చలానాలు.. జన్యూన్‌ ధ్రువపత్రాల మాటేమిటి!

    వచ్చేనెల 5వ తేదీన ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వందలాది మంది విద్యార్థులు కాన్వొకేషన్‌ కోసం రూ.వేలల్లో ఫీజుల చెల్లించారు. ఇందులోనూ మాఫియా హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జన్యూన్‌ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్‌ కార్యాలయంతో సంబంధం లేకుండా జన్యూన్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసి, అవినీతికి పాల్పడినట్లు అరోపణలు వస్తున్నాయి. లా, ఎంబీఏ విభాగాలకు చెందిన చలానాలను డూప్లికేట్‌ చేసి రూ.లక్షలు కాజేశారంటే మిగిలిన యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి విద్యార్థులు చెల్లించిన ఫీజుల పరిస్థితి ఏమిటి, ఎన్ని రోజులుగా వ్యవహారం నడుస్తోందంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

    ఎస్వీయూ పరిపాలనా భవనం

  • తిరుపతి అర్బన్‌: పదో తరగతి సప్లిమెంటరీ హిందీ పరీక్షకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 72 శాతం మంది విద్యార్థులు గైర్హాజరు కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 28 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసినట్లు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌ వెల్లడించారు. 236 మంది విద్యార్థులకు 67 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 332 మంది విద్యార్థులకు 292 మంది హాజరయ్యారని తెలిపారు. 40 మంది విద్యార్థులు గైర్హాజరు హాజరయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షకు సంబంధించి 130 మంది విద్యార్థులకు 109 మంది హాజరయ్యారని చెప్పారు.

    ఇంటర్‌ సప్లిమెంటరీకి 93.93 శాతం..

    తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మంగళవారం 93.93 శాతం మంది హాజరయ్యారని ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఫస్ట్‌ ఇయర్‌ బయాలజీతో పాటు బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌1బీ, జూవాలజీ పరీక్షకు 2,703 మంది హాజరుకావాల్సి ఉండగా 2,539మంది హాజరయ్యారని వెల్లడించారు. దీంతో 93.93 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సెకండ్‌ ఇయర్‌ జువాలజీ, ఎకనామిక్స్‌ పరీక్షకు 1,707 మందికి గాను 1,532మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. బక్రీద్‌ కారణంగా గురువారం జరగాల్సిన ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఫస్ట్‌ ఇయర్‌ ఫిజిక్స్‌, సెకండ్‌ ఇయర్‌ కామర్స్‌, సోషియాలజీ పరీక్షలు యధావిథిగా జరుగుతాయని తెలిపారు.

    భూసేకరణ వేగవంతం చేయండి

    తిరుపతి అర్బన్‌: రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులతో కలసి మంగళవారం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు చెందిన అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుగా నిర్ణయించుకున్న మేరకు దశల వారీగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి వారం పనుల్లో పురోగతి చూపాలన్నారు. అధికారుల సమన్వయంతో ముందడుగు వేస్తేనే విజయవంతంగా ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే ప్రాజెక్టు అధికారి వామనమూర్తి, సదరన్‌ రైల్వే అధికారి శశిభూషణ్‌, తిరుపతి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయభరత్‌రెడ్డి, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • తిరుపతి క్రైం : మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్‌ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు తెలిపారు. మహిళల హక్కులు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్‌ నేరాలపై తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం, పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు, పురుషులతో సమానంగా ముందుకు సాగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలు, పరస్పర గౌరవ భావన పెంపొందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లు, సోషల్‌ మీడియా దుర్వినియోగం కారణంగా మహిళలు, చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల మొబైల్‌ వినియోగంపై పర్యవేక్షించాలని, టెక్నాలజీని అవసరానికి మించి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ చిన్నారులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.

  • తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌–2026 ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. తిరుపతి రూరల్‌, పేరూరు తారకరామ నగర్‌కు చెందిన ఎస్వీయూ విద్యార్థి సి కుష్వంత్‌ ఇంగ్లిష్‌ మెథడాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 115 మార్కులు సాధించి పదో ర్యాంకు కై వసం చేసుకున్నాడు. విద్యార్థి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ ఇంగ్లిష్‌, ఎస్వీయూలో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ ఇంగ్లిష్‌లో తాను పీహెచ్‌డీ చేయాలన్నదే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు.

    శ్రీవారి దర్శనానికి 24 గంటలు

    తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 89,399 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,985 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 06 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

Chittoor

  • పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఒంటరి మదపుటేనుగులు హడలెత్తిస్తున్నాయి. అడవి దాటి వచ్చిన ఆడ ఏనుగులకంటే మదపుటేనుగులే ప్రజల ప్రాణా లు తీస్తున్నాయి. వీటితోనే ఎక్కువగా పంటలు కూడా ధ్వంసమవుతున్నాయి.

    మదపుటేనుగుల రూటే వేరు

    పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్‌రేంజిల పరిధి లోని కౌండిన్య అభయారణ్యంలోని ఏనుగులతోపాటు అటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్‌, బన్నేర్‌గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే ఏనుగులున్నాయి. స్థానికంగా ఉన్న గుంపుల్లో మొత్తం 12 మగ ఏనుగులుండేవి. వీటిలో ఏడు మృతిచెందగా ఇప్పుడు ఐదు మగ ఏనుగులు(మదపుటేనుగులు) ఉన్నాయి. గుంపు నుంచి దూరంగా ఉండి ఒంటరిగా సంచరిస్తున్నాయి. ఒక్కో మదపుటేనుగు ఎంపిక చేసుకున్న ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా క్రూ రంగా ప్రవర్తిస్తుంటాయి. జనంపైకి దాడులు చేయడం, లేదా తరమడం చేస్తుంటాయి. మదపుటేనుగులపై జనం రాళ్లు విసరడం, టపాకాయలను పేల్చడం, టైర్లు కాల్చి వాటి శరీరంపైకి విసరడం లాంటి చర్యలతో మగ ఏనుగులు జనంపై కసి పెంచుకున్నాయి.

    ఇంటిని ధ్వంసం చేసింది

    మండలంలోని కౌండిన్య అభయారణ్యంలో సంచరిస్తున్న ఒంటరి మదపుటేనుగు ఓ ఇంటిని ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చిన్నకుంట వద్ద ఉన్న మర్రిమాకులపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాణెమ్మ కుటుంబం పొలం వద్దే ఇల్లు కట్టుకుని నివాసముంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అడవిలోని సోలార్‌ ఫెన్సింగ్‌ను విరిచేసి బయటకు వచ్చిన మదపుటేనుగు రాణెమ్మ ఇంటిని ధ్వంసం చేసింది. ఇంట్లోని ధాన్యం, బియ్యం తదితరాలను ఆరగించింది. ఈ సమయంలో రాణెమ్మ కుటుంబం గంటావూరు గంగజాతరకు వెళ్లి ఉండడంతో ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. ఆపై ఏనుగు పక్కనే ఉన్న వరి పంటను ఆరగించింది. ఆ తర్వాత మామిడి చెట్లను విరిచేసింది. దీన్ని గమనించిన స్థానికులు కేకలు వేస్తూ ఏనుగును తరిమేందుకు యత్నించగా వారిపైకి ఎదురు తిరిగింది. అక్కడికి చేరుకున్న ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌ ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు బాణసంచా పేలుస్తూ భయపెట్టారు. కానీ అది ఏమాత్రం భయపడలేదు. పంటలను ధ్వంసం చేసుకుంటూ తాఫీగా అడవిలోకి వెళ్లింది. కాగా ఇదే ఇంటిని మదపుటేనుగు మూడు దఫాలు ధ్వంసం చేసినట్టు బాధితులు తెలిపారు. గత నెల రోజులుగా రెండు మదపుటేనుగులు వేర్వేరుగా సంచరిస్తూ అటవీ సమీప గ్రామాల్లోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి కూతవేటు దూరంలోనే కుంకీ ఎలిఫెంట్‌ ప్రాజెక్టు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది.

  • చిత్తూరు అర్బన్‌: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన కేసులో ఎం.మేఘనాథనాయుడు (42) అనే ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. మదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్వాతి కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన మేఘనాథనాయుడుకు సుధా అనే మహిళతో 2014లో పెళ్లయ్యింది. వివాహ సమయంలో భారీ కట్న కానుకలు, బంగారు ఆభరణాలు వధువు తరఫున తల్లిదండ్రులు అల్లుడికి ఇచ్చారు. అయితే ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న నిందితుడు అదనపు కట్నం కోసం తరచూ తన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీనిపై బాధితురాలు 2020లో చిత్తూరులోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు సాక్ష్యాధారాలు అందజేశారు. నేరం ఋజువు కావడంతో మేఘనాథనాయుడుకు రెండేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు తీర్పునిచ్చింది.

    బంగారు గొలుసు లాగేశారు!

    పలమనేరు: తన మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొన్నారని ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరులో గంగమ్మ జాతరకు తమిళనాడుకు చెందిన ఉష అనే మహిళ తన బంధువుల ఇంటికొచ్చింది. అయితే ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ అనే మరో మహిళ ఉషపై గొడవకు దిగి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తనకు ఉష రూ.5 లక్షలు బాకీ ఉన్నందునే తాను ఇలా చేశానని నాగరత్నమ్మ చెబుతోంది. ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు విచారిస్తున్నారు.

    టమాట మార్కెట్లో

    అగ్ని ప్రమాదం

    పలమనేరు: పట్టణంలోని టమాట మార్కెట్‌ కమిటీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని వ్యర్థాలు, టమాట బాక్సులున్న చోట మంటలంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరు కుని మంటలను అదుపు చేశారు.

    పిడుగుపాటుకు

    మేకల కాపరి మృతి

    కార్వేటినగరం: పిడుగు పాటుకు మేకల కాపరి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పద్మసరస్సు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన దేశయ్య కుమారుడు జీ.వెంకటస్వామి (60) రోజూమాదిరిగానే మంగళవారం మేతకోసం అడవికి మేకలు తోలుకెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో అటవీ ప్రాంతంలోనే ఉన్న వెంకటస్వామిపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో వెంకటస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్రం పొద్దుపోతున్నా మేకల వద్దకు వెళ్లిన వ్యక్తి రాకపోవడంతో అతన్ని వెదుక్కుంటూ కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ వెంకటస్వామి విగతజీవిగా పడి ఉండడంతో బోరున విలపించారు. తర్వాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.

    త్వరలో దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ

    శ్రీసిటీ (వరదయ్యపాళెం): దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీసిటీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌–2026లో ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషనన్‌తో ఈ మేరకు శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్‌ సమ్మిట్‌లో డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీ ఎప్పుడూ సమగ్ర అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ, ఇతర నైపుణ్యాలు అందించడం ద్వారా వారికి స్వయం ఉపాధి మార్గాలను సృష్టించడమే కాకుండా, సామాజిక సమానత్వం, పారిశ్రామిక పురోగతిపై తమ కట్టుబాటును మరింత బలపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ‘‘ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’’ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌లో కోటి మంది వ్యాపారవేత్తలను తయారు చేయాలనే సంకల్పానికి దివ్యాంగ యువత శిక్షణ కార్యక్రమం తోడ్పాటు అందించనుందని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక శిక్షణ అందించేందుకు శ్రీసిటీ చొరవ చూపడం అభినందనీయమన్నారు.

  • పలమనేరు: పలమనేరు అటవీశాఖ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంలో వన్యప్రాణుల వేట గట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఇప్పటిదాకా నాటుతుపాకులు, నల్లమందు ఉండలు పెట్టి వేటగాళ్లు వేటాడేవారు. కానీ ఇప్పుడు పాత పద్ధతులైన కమ్మీలతో ఉరులేస్తూ వన్యప్రాణుల వేటను కొనసాగిస్తున్నట్టు సమాచారం.

    బీట్లలో పట్టు తగ్గుతోందా?

    కౌండిన్యలోని పలు బీట్లల్లో బీట్‌ఆఫీసర్లు, ఏబీవోలకు కుంకీ ఎలిఫెంట్‌ పనులు, ఇతర పనులను అప్పగించడంతో వీరు బిజీ అయ్యారు. ఇక కొత్తగా విధుల్లో చేరిన మహిళా సిబ్బంది అడవిలోకి వెళ్లడం లాంటి పనులు తక్కువే. ఇదే వేటగాళ్లకు అదునుగా మారింది. పగటిపూట కమ్మీ ఉరులు వేసేందుకు వీలుగా మారింది.

    వేటగాళ్లకు నిలయం కౌండిన్య

    పలమనేరు మండలం నుంచి బైరెడ్డిపల్లె, వి.కోట మండలం వరకు కౌండిన్యా అభయారణ్యం వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి దక్షిణంగా తమిళనాడులోని మోర్ధన అటవీ ప్రాంతం ఉంది. ఈ అడవిలో ఏనుగులతో పాటు వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, అడవి పందులు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులున్నాయి. ఈ అడవికి ఆనుకొని దాదాపు 60 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని కొందరు నిత్యం అడవికి వేటకెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. వన్యప్రాణుల వేటకోసం పాత వేట పద్ధతులను ఎంచుకున్నారు. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులను పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చడం, వాటిల్లో ఏవైరా జంతువులు ఇరుక్కుంటే వాటిని అక్కడే చంపి మాంసాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఈ వేటగాళ్ల కారణంగా ఊరకుక్కలు, అడవిలో మేతకెళ్లే పశువులు, మేకలు తరచూ బలవుతూనే ఉన్నాయి.

    పాత గిరాకీలకే అడవి మాంసం

    వేటగాళ్లు రెగ్యులర్‌గా అడవి మాంసం కొనే పలువురితో టచ్‌లో ఉంటున్నారు. మొత్తం సెల్‌ఫోన్లతోనే వీరి వ్యాపారం సాగుతోంది. ఇళ్లవద్దకే మాంసం కావాలన్నా అందిస్తున్నారు. వన్యప్రాణులను బట్టి ధరలు కిలో రూ.300 నుంచి రూ.400 దాకా ఉన్నట్టు సమాచారం. స్థానిక మార్కెట్‌లో పొట్టేలు మాంసం కిలో రూ.850 దాకా ఉంది. దీనికంటే అడవి మాంసం తక్కువ ధర కాబట్టి రిస్క్‌ అయినా వీటినే కొంటున్నారని తెలిసింది. ప్రస్తుత కొత్త ఎఫ్‌ఆర్వో చాప్లానాయక్‌ అయినా వేటగాళ్లకు చెక్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

  • కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని మంగళవారం రాష్ట్ర సమాచార కమిషనర్‌ చావలి సునీల్‌ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. సూపరింటెండెంట్‌ కోదండపాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రముఖ సినీ డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌ కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

    కడుపు నొప్పి తాళలేక..

    పెనుమూరు(కార్వేటినగరం): కడుపునొప్పి తాళలేక ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుమూరు మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం.. మండల పరిధిలోని చిప్పారపల్లి పంచాయతీ, గాంఽధీపురం గ్రామానికి చెందిన చెంగల్రాయులు భార్య మణెమ్మ(62) కొన్నాళ్లుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి భరించలేని కడునొప్పితో బాధుపడుతోంది. ఆమె భర్త, కుమారుడు మతిస్థిమిత్తం లేకుండా ఉండడంతో ఆమె ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోయింది. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ తెలిపారు.

    కడా పీడీ ఆకస్మిక తనిఖీ

    కుప్పం: కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కుప్పం కడా పీడీ వికాస్‌ మర్మత్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కుప్పం బస్డాండు ప్రాగణంలో ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. అలాగే మండల పరిధిలోని పరమసముద్రం వద్ద నిర్మిస్తున్న హలీఫ్‌ పరిశ్రమ పనులను, ఆ తర్వాత గుడుపల్లె మండలం, కంచిబందార్లపల్లి గ్రామంలో జరుగుతున్న మురుగునీటి కాలువ పనులను పరిశీలించారు.

  • – మహిళకు జీవిత ఖైదు

    చిత్తూరు అర్బన్‌: ప్రియుడు మోజులో పడ్డ ఓ మహిళ తాను కన్న ఇద్దరు బిడ్డల్ని హత్య చేసింది. ఈ కేసు కోర్టులో రుజువు కావడంతో ముద్దాయి సి.పవిత్ర (25)కు జీవితకాలం జైల్లో ఉండాలని శిక్ష విధిస్తూ చిత్తూరులోని తొమ్మిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శరవణకుమార్‌ కథనం మేరకు.. రామకుప్పం మండలం, కవ్వంపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డికి పవిత్రతో పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ పిల్లాడికి ఆరేళ్లు, మరో బాలుడికి మూడేళ్ల వయస్సు ఉండేది. ఈ క్రమంలో తన ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వేమన్నతో పవిత్ర వివాహేత బంధాన్ని కొనసాగించేది. ఓ సారి వేమన్నతో పవిత్ర తిరుపతి వెళ్లగా పెద్దలు పిలిపించి మందలించారు. ఆపై వేమన్న బెంగళూరులో పనిచేస్తూ అప్పుడప్పుడు పవిత్రను కలిసేవాడు. ఎప్పటికై నా తమ అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డు వస్తారని పవిత్ర భావించింది. ఈ నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌ 9న అంగన్‌వాడీలో చదువుతున్న ఇద్దరు పిల్లలను పవిత్ర, వేమన్న తమ వెంట తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలను పవిత్రతో పాటు తన ఇంటి వద్ద వదిలి వేమన్న వెళ్లిపోయాడు. కొద్దిసేపు తర్వాత ఓ నైలాన్‌ తాడు తీసుకుని ఇద్దరు పిల్లల గొంతుకు బిగించి అత్యంత దారుణంగా హత్య చేసిన పవిత్ర వారి మృతదేహాలను ఫ్యానుకు వేలాడదీసింది. ఆపై ఇంట్లో ఉన్న రూ.3 వేల నగదును తీసుకొని వేమన్నతో పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన వేమారెడ్డి తన ఇద్దరు పిల్లలు మిగతా జీవులుగా పడి ఉండడాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి రామకుప్పం ఎస్‌ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేయగా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి న్యాయ స్థానంలో ప్రవేశపెట్టారు సాక్షులను విచారించిన న్యాయస్థానం వేమన్న పై నేరం రుజువు కాకపోగా అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. పవిత్ర పై జంట హత్యల కేసు సాక్ష్యాదారాలతో నిరూపించడంతో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ, రూ.1000 జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

  • చిత్తూరు కలెక్టరేట్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ మరింత చురుగ్గా పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ సూచించారు. నూతనంగా ఎన్నికై న రెడ్‌క్రాస్‌ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులతో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. పేదలకు సహాయ కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు, ఇతర మానవతా కార్యక్రమాల్లో సంస్థ మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తనిల్వ సామర్థ్యం పెంపునకు అవసరమైన నిధులను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం నూతన రెడ్‌క్రాస్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ తేజోమూర్తి, వైస్‌ చైర్మన్‌ గోవర్దన్‌బాబి, కోశాధికారి రాజగోపాల్‌నాయుడును దుశ్శాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, పలువురు రెడ్‌క్రాస్‌ సిబ్బంది సహదేవనాయుడు, గోపి, చిరంజీవి, రమేష్‌ పాల్గొన్నారు.

  • ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం

    గుడిపాల: రెండు బైక్‌లు పక్కపక్కనే వెళ్లడం వల్ల అదుపు తప్పి ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌ తెలిపారు. మంగళవారం గుడిపాల మండలం, బొమ్మసముద్రంలో గంగజాతర సందర్భంగా బొమ్మసముద్రం గ్రామానికి చెందిన ధనుష్‌ ఇంటికి కర్నూలు, హిందూపురానికి చెందిన స్నేహితులు ప్రభాస్‌, అజిత్‌, నితిన్‌లు సోమవారం రాత్రి వచ్చారు. తిరిగి చిత్తూరుకు వెళ్లేందుకు సోమవారం రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి భద్రకళమ్మ దేవాలయం సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జిపై బైక్‌లో పక్కపక్కనే వేగంగా వెళ్లడంతో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో అజిత్‌, ధనుష్‌, నితిన్‌లు తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో చీలాపల్లె సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ప్రభాస్‌(23) పరిస్థితి విషమంగా ఉండడంతో రాణిపేట సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  • ఉచ్చులు బిగుస్తున్నాయ్‌!
    కౌండిన్య అభయారణ్యంలో వన్యప్రాణుల వేట గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. తుపాకుల మోత మోగుతోంది.

    జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు శూన్యం

    బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026

    జిల్లాలో వసతి గృహాల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పెచ్చులూడుతున్న స్లాబులు, మాసిపోయిన గోడలు, తిరగని ఫ్యాన్లు, విరిగిన కుర్చీలు, చాలీచాలని వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పేద విద్యార్థుల విద్యాలయాలను సర్వ హంగులతో తీర్చిదిద్దాల్సిన కూటమి నాయకులు పట్టించుకోవడమే మానేశారు. ‘చదువులకు పెద్దపీట వేస్తాం.. పేద పిల్లల వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, కూరలు వడ్డిస్తాం’ అన్న మాటలు నీటిమూటలుగానే మారాయి. వేసవి సెలవులు ముగుస్తున్నా.. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా ఇంతవరకు వసతుల రూపకల్పనపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన జిల్లా అధికారులు సైతం మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

    రేపటి ఇంటర్‌ పరీక్ష వాయిదా

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఈ నెల 28న జరగాల్సిన ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్‌ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వుల మేరకు ఈ నెల 28న జరగాల్సిన పరీక్ష జూన్‌ 5వ తేదీకి వాయిదా వేశారని తెలిపారు. 28వ తేదీన ప్రభుత్వం బక్రీద్‌ పండుగకు సెలవు దినంగా ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 28న జరగాల్సిన మొదటి సంవత్సరం ఎకనామిక్స్‌ పేపర్‌1, వొకేషనల్‌ బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్‌ పేపర్‌ 1, బయాలజీ పేపర్‌ 1ను, 28వ తేదీ మధ్యాహ్నం జరగాల్సిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్‌ పేపర్‌ 2, వొకేషనల్‌ బ్రిడ్జి కోర్సు, బయాలజీ పేపర్‌లను జూన్‌ 5వ తేదీకి మార్పు చేశారన్నారు. జూన్‌ 5 వ తేదీన జరగాల్సిన ఎథిక్స్‌, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జూన్‌ 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. వాయిదా వేసిన పరీక్షలకు విద్యార్థులు తమ వద్ద ఉన్న పాత హాల్‌టికెట్‌లతోనే హాజరుకావచ్చని, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి మార్పు ఉండదన్నారు.

    కలెక్టరేట్‌లో

    జనగణన కంట్రోల్‌ రూమ్‌

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన ప్రక్రియలో సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూ మ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రజలు ఏవైనా సమస్యలు, సందేహాలున్నట్‌లైతే 08572– 242734, 08572–242733 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ సూచించారు.

    పోలీసు కుటుంబానికి

    ఆర్థిక సాయం

    చిత్తూరు అర్బన్‌: అనారోగ్యంతో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడి మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. సదుం పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన పిటి గిరిబాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతని కుటుంబ సభ్యులకు ఐ డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.లక్ష చెప్పును స్థానిక పోలీసు కార్యాలయంలో మృతుడి భార్య, పిల్లలకు అందజేశారు. అలాగే సోమల స్టేషన్లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన కానిస్టేబుల్‌ రమేష్‌కు రూ.30 వేల చెక్కును ఎస్పీ అందజేశారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

    జిల్లాలో హాస్టల్స్‌ వివరాలు

    ఎస్సీ వసతి గృహాలు 57

    ఎస్టీ వసతి గృహాలు 03

    ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ గురుకులాలు 07

    బీసీ వసతి గృహాలు 38

    ట్రైబల్‌ గురుకులాలు 04

    మహాత్మాగాంధీపూలే గురుకులాలు 05

    ఏపీ రెసిడెన్షియల్‌ గురుకులాలు 02

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వస తి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. మౌలిక వసతులు లేక.. అంద విహీనంగా కొట్టుమిట్టాడుతున్నాయి. చంద్రబాబు సర్కారు చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న చేతలకు అస్సలు పొంతన లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

    అడ్మిషన్లపై అవగాహన ఎక్కడ?

    విద్యాసంవత్సరం ప్రారంభంలోపు వసతి గృహాల పట్ల క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అడ్మిషన్లపై అవగాహన కల్పించనే లేదు. సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారుల అలసత్వ అడ్మిషన్‌ల పై ప్రభావం చూపుతోంది. ఏ హాస్టల్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయి? దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? అనే విషయాలపై ప్రచారం చేయడం లేదు. ఫలితంగా వేలాది మంది నిరుపేద, దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులు హాస్టల్స్‌కు దూరమవుతున్నారు.

    ఉత్తుత్తి ప్రకటనలకే సన్న బియ్యం

    ‘హాస్టల్‌ విద్యార్థులకు సన్న బియ్యంతో రుచికరమైన భోజనం పెడతాం..’ అంటూ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హామీ కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా ఏ హాస్టల్‌లో చూసిన ముక్కిపోయిన బియ్యం మూటలే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా నాసిరకం భోజనాన్నే పేద విద్యార్థులపై రుద్దుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే హాస్టళ్ల రూపురేఖలు మారుస్తామని కూటమి సర్కారు హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి.

    నేటి నుంచి ఏనుగుల గణన

    చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో బుధవారం నుంచి ఏనుగుల గణనను ప్రారంభించనున్నారు. ప్రతి ఏటా నిర్వహించే గజ గణన గత సంవత్సరం నిర్వహించ లేదు. 2024లో జరిగిన లెక్కల ప్రకారం జిల్లాలో 110 వరకు ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. తదుపరి ఇప్పుడు లెక్కింపును ప్రారంభించనున్నారు. 27న చిత్తూరు, 29, 30 తేదీల్లో జిల్లాలో లెక్కింపు చేపట్టనున్నారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులను లెక్కించనున్నారు. జిల్లాలోని చిత్తూరు ఈస్ట్‌, వెస్ట్‌, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పంలోని రేంజ్ల పరిధిలో 66 బీట్లల్లో 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేయనున్నారు.

    ప్రచార ఆర్భాటమే

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాస్టల్‌ విద్యార్థుల కష్టాలు తీరు స్తామని చెప్పారు. హాస్ట ళ్ల రూపురేఖలు మారుస్తామని హామీలు గుప్పించారు. కానీ అవి ఎక్కడా అమలు కాలేదు. హాస్టళ్ల రూపురేఖలు మా రనూ లేదు. అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియపై కనీస అవగాహన కల్పించడం లేదు. సన్న బియ్యం పెడుతామని గొప్పలు చెప్పుకున్న పాలకులు అసలేం పట్టించుకోలేదు. జిల్లాలో మెజారిటీ హాస్టళ్లల్లో మౌలిక వసతులు బాగాలేవు. విద్యాసంవత్సరం ప్రారంభం లోపు అన్ని సౌకర్యాలు మెరుగుపరచా లని డిమాండ్‌ చేస్తున్నాం.

    – ప్రవీణ్‌కుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా

    చక్కని వసతి, వేదిక ఎక్కడ?

    జిల్లాలోని మెజారిటీ హాస్టళ్లల్లో చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కరువైంది. వేసవి సెలవుల్లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయారు. చాలా వసతి గృహాల్లో విరిగిన కిటికీలు, సరిగ్గా వెలగని లైట్లు, ఫ్యాన్‌లు, అధ్వానపు గదులు దర్శనమిస్తున్నాయి. పేరుకేమో కార్పొ రేట్‌ స్థాయి వసతులు అంటారు... తీరా చూస్తే కనీసం కూర్చోవడానికి బెంచీలు, చదువుకునేందుకు స్టడీ టేబుళ్లు కూడా లేవని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

    ప్రతి కుటుంబాన్నీ సందర్శించాలి

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో జరుగుతున్న జనగణన ప్రక్రియలో ప్రతి కుటుంబ వివరాలను కచ్చితంగా, అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో జనగణన పురోగతిపై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత 2011 జనగణనతో పోలిస్తే ప్రస్తుత గణాంకాల్లో కొన్నిచోట్ల వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో ముఖ్యంగా ఖాళీ, తాళం వేసిన ఇళ్లు, ఉపాధి నిమిత్తం వెళ్లిన వలసల కారణంగానే జనాభా నమోదులో ఈ తేడాలు వస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. అధికారులు ప్రతి ఇంటిని పరిశీలించి వాస్తవ సమాచారాన్ని మాత్రమే రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

  • కాణిపాకం: జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం గంటకు పైగా కొనసాగింది. ఈదురుగాలులతో కూడిన గాలీవాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో భారీ వర్షం దంచికొట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లు పడ్డాయి.

    విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

    బలమైన ఈదురు గాలులకు రహదారుల వెంబడి ఉన్న చెట్లు విరిగి రోడ్లపై పడిపోయాయి. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ శాఖ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

    మామిడికి తీవ్ర నష్టం

    అకాల వర్షం, గాలీవానతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే కోత దశకు వచ్చిన పంట నేలరాలిపోయింది. వడగండ్ల వర్షంతో పండ్లు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.

    రోడ్డుపై పడ్డ బండరాళ్లు

    గుడిపాల: చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి చీలాపల్లె సీఎంసీ ఆసుపత్రి వద్ద మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం, ఈదురు గాలులకు పక్కనే ఉన్న గుట్టలో నుంచి బండరాళ్లు ఒక్కొక్కటిగా రోడ్డుపై పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పక్కన ఉన్న గుట్టకు సరైన భద్రత లేకపోవడంతో ఒక్కో బండరాయి రోడ్డుపై పడుతూనే ఉన్నాయి. స్థానికులు రోడ్డుపై ఉన్న రాళ్లను చూసి వాహనాలను ఆపి వాటిని రోడ్డుపక్కలో పడేశారు.

    చిత్తూరులో అలజడి

    చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగర వాసులకు మంగళవారం కాస్త ఉపశమనం లభించింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ గాలులతో కూడిన వర్షం పడింది. దాదాపు గంటకు పైగా గాలీవాన బీభత్సం సృష్టించింది. నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు సైతం పడిపోయాయి. మున్సిపల్‌ కార్మికులు, విద్యుత్‌శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా రోడ్డుపై కూలిన వృక్షాలను తొలగించారు.

    చిత్తూరు విరిగిపడ్డ కొమ్మలను తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

    నగరిలో నేల రాలిన మామిడి కాయలు

  • చిత్తూరు కలెక్టరేట్‌ : గంగాధరనెల్లూరు ప్రాజెక్టులో పనిచేస్తున్న సీడీపీవోను సస్పెండ్‌ చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షకీలా, లలిత డిమాండ్‌ చేశా రు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ఆ సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జీడీ నెల్లూరు సీడీపీవో అంగన్‌వాడీ కార్యకర్తలను, సహాయకులను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తోందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో అంగన్‌వాడీల శ్రమను దోచుకుంటూ, నిరంకుశంగా వ్యవహరిస్తు న్న సీడీపీవోను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జీడినెల్లూరు ప్రాజెక్టు కార్యదర్శి గోవిందమ్మ మాట్లాడుతూ సీడీపీవోపై గతంలో అక్రమామాల చరిత్ర ఉందన్నారు. ఆమె కార్వేటినగరం ప్రాజెక్ట్‌లో పనిచేసిన సమయంలో భారీ అక్రమాలకు పాల్పడగా, అప్పటి కలెక్టర్‌ విచారణ చేయించి చర్య లు చేపట్టారని గుర్తుచేశారు.

    వర్కర్ల మధ్య గొడవలు పెడుతోంది!

    సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గుప్తా మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఉదాసీనత వల్లే సద రు అధికారిణి మరింత బరితెగించినట్లు ఆరోపించా రు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి అండగా ఉండాల్సిన అధికారిణి, వర్కర్ల, హెల్పర్‌ల మధ్య కులాల వారీ గా, వర్గాల వారీగా గొడవలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు సురేంద్రన్‌, వాడ గంగరాజు, అంగనన్‌వాడీ యూనియన్‌ నాయకులు పద్మ, మమత, రెడ్డెమ్మ, భాను, కస్తూరిలతో పాటు జీడీనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పారదర్శక సేవలతో ప్రజ ల వద్దకే పింఛన్‌లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడంలో సచివాలయ సిబ్బంది మరింత జవాబుదారీగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో ప్రతి నెలా సు మారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో పింఛన్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్‌లు పంపిణీ చేయకూడదన్నా రు. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్‌లు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను ప్రతి రెండు నెలలకోసారి డీపీఓ పర్యవేక్షణ లో తప్పనిసరిగా శుభ్రం చేయించాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, వయోజన విద్య డీడీ మహమ్మద్‌ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    లక్ష్య సాధన దిశగా

    అక్షరాంధ్ర ఫేజ్‌–2

    జిల్లాలో 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలనే సంకల్పంతో అక్షరాంధ్ర రెండవ దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 57,325 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. అక్షరాంధ్ర యాప్‌లో అభ్యాసకులు, వలంటీర్‌ టీచర్ల అనుసంధాన (మ్యాచింగ్‌, బ్యాచింగ్‌) ప్రక్రియ మే 28 నుంచి ప్రారంభమై జూన్‌ 30 లోపు పూర్తి కావాలన్నారు.

  • చిత్తూరు కలెక్టరేట్‌: బీఎల్‌ఓలకు 2025–26 సంవత్సరానికి సంబంధించి రెండో విడత గౌరవ వేతనాలను నిధుల చేస్తూ రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలోని 1,776 బీఎల్‌ఓలకు రూ.44 లక్షలను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు కేటాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    ఉద్యోగుల విభజన తుది జాబితా

    చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో జిల్లాల పునఃవిభజన నేపథ్యంలో ఉద్యోగుల తుది జాబితాను మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావ్‌ ప్రకటించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో సబ్‌ఇంజినీర్లు 33, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ 19, సీనియర్‌ సహాయకులు 72, జూనియర్‌ సహాయకులు 51, రికార్డు సహాయకులు 3, అటెండర్లు 30, ఫోర్‌మెన్‌ ముగ్గురిని జిల్లాకు కేటాయించారు. వీరు ఈనెల 31వ తేదీలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు.

    నిందితుడికి రిమాండ్‌

    తవణంపల్లె: ఒంటరిగా ఉన్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్టు తవణంపల్లె ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం.. పుణ్యసముద్రం దళితవాడకు చెందిన లోకయ్య(64) ఎదురుగా ఉన్న ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మైనర్‌ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం కె.పట్నం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర ముద్దాయి లోకయ్యను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

  • శాంతిపురం: కనుమలదొడ్డి నుంచి రాళ్లబూదుగూరు మీదుగా కర్ణాటకలోని కేజీఎఫ్‌ వెళ్లే రోడ్డు పక్కన కర్లగట్ట క్రాసు వద్ద ఉన్న బస్‌ షెల్టర్‌ కుప్పం కూలింది. మంగళవారం సాయంత్రం కొద్ది పాటి వర్షాని తోడు పెను గాలులు వీయడంతో బస్‌ షెల్టర్‌ ముందుకు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేపోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో హెచ్‌పీ (హ్యూలెట్‌–ప్యాకర్డ్‌) సంస్థ ఇనుప పైపులు, రేకులతో ఈ బస్‌ షెల్టరును నిర్మించగా తర్వాతి కాలంలో దాని నిర్వహణ లేకపోవడంతో గాలి తాకిడికి కూలిపోయింది.

Tamil Nadu

  • సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్షం అన్నాడీఎంకే సంక్షోభంలో మునిగిపోతుండగా, అధికార తమిళగ వెట్రి కళగం పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను స్పీడప్‌ చేసింది. అంబాసముద్రం నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన సీఎం, సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలో టీవీకే పార్టీలో చేరారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌ తొలుత టైప్‌ చేసి ఇచ్చిన ఇసక్కి సుబ్బయ్య రాజీనామా లేఖను తిరస్కరించగా, వెంటనే ఆయన తన చేతిరాతతో రాసిన లేఖను సమర్పించారు. దీంతో స్పీకర్‌ ఆయన రాజీనామాను ఆమోదించారు.

    నియోజకవర్గ అభివృద్ధి కోసమే: ఇసక్కి సుబ్బయ్య

    పార్టీ మారిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 2021 నుంచి తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని గుర్తుచేశారు. ఆ సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు పెద్దగా సంక్షేమ పథకాలను గానీ, నిధులను గానీ తీసుకురాలేకపోయాననని ఆవేదన వ్యక్తం చేశారు. తన అంబాసముద్రం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఏకై క లక్ష్యంతో, ప్రజల శ్రేయస్సు కోసమే నేను టీవీకేలో చేరానని ఆయన స్పష్టం చేశారు.

    కోర్టుకు వెళ్తామన్న పళని వర్గం

    ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించిన తర్వాత, మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ ఎడప్పాడి కె. పళనిస్వామి ఆదేశాలను ధిక్కరిస్తూ ఎస్‌.పి. వేలుమణి – సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. ఈ రెబెల్‌ వర్గంలో మంగళవారం రాజీనామా చేసిన ముగ్గురితో పాటుగా ఇసక్కి సుబ్బయ్య కూడా ఉన్నారు. మరోవైపు, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ రెబెల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వర్గం ఇప్పటికే స్పీకర్‌ను కోరింది. అనర్హత వేటు పడుతుందనే భయంతోనే వీరు వరుసగా రాజీనామాలు చేస్తున్నారని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా లేఖలను తక్షణం ఆమోదిస్తున్న స్పీకర్‌ నిర్ణయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తాజా పరిణామాలతో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 43కి పడిపోయింది.

    మళ్లీ పార్టీ మారిన శరవణన్‌

    తమిళనాడు రాజకీయాల్లో సీనియర్‌ నేత, ఎన్నికల వ్యూహకర్త డాక్టర్‌ శరవణన్‌ మరోసారి పార్టీ మారి సంచలనం సృష్టించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున మదురై నార్త్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మదురై మేయర్‌ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన బుధవారం అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర మంత్రి ఆనంద్‌ సమక్షంలో డాక్టర్‌ పి. శరవణన్‌ అధికారికంగా టీవీకే కండువా కప్పుకున్నారు. మదురై జిల్లాలో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ మంత్రి చెల్లూరు రాజుకు అత్యంత ఆప్తులుగా భావించే అన్నాడీఎంకే కీలక నేతలు కుమార్‌ (మదురై అర్బన్‌ ట్రెజరర్‌), పార్తీబన్‌, మారనాడు, జయపాండి ఇప్పటికే టీవీకేలో చేరగా..తాజాగా శరవణన్‌ కూడా వారి బాటలోనే ప్రయాణించారు. కాగా ఇప్పటికే డీఎంకే, బీజేపీ నేతలు ఆయన్ను వ్యంగ్యంగా ’సర్వ కట్చి శరవణన్‌’ (అన్ని పార్టీల శరవణన్‌) అని పిలుస్తుంటారు. ఆ మేరకు ఆయన పార్టీలను మార్చడంలో దిట్ట అన్న విషయం తెలిసిందే.

    మంత్రుల సమక్షంలో టీవీకే తీర్థం

    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కొద్దిసేపటికే.. చైన్నె పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇసక్కి సుబ్బయ్య టీవీకే కండువా కప్పుకున్నారు. రాష్ట్ర మంత్రులు కె.ఎ. సెంగోట్టయన్‌, ఆనంద్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేసి టీవీకేలో చేరడం తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మంగళవారం మరగతం కుమరవేల్‌ (మదురాంతకం), ఎస్‌. జయకుమార్‌ (పెరుందురై), పి. సత్యభామ (ధరాపురం) తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఇసక్కి సుబ్బయ్య వంతు వచ్చినట్లయ్యింది. ఇప్పటికే సీఎం విజయ్‌ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గంతో పాటుగా తాజాగా నాలుగు కలిపి మొత్తం ఐదు స్థానాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టు గెజిట్‌లో ప్రకటించారు.

  • సాక్షి, చైన్నె : తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లేఖలను ఆమోదించ వద్దని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తరపున సీనియర్‌ నేతలు ఓఎస్‌మణియన్‌, అగ్రి కృష్ణమూర్తి, ఎంపి ఇన్బదురైలో స్పీకర్‌ జేసిడీ ప్రభాకర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

    తప్పించుకునేందుకే రాజీనామాలు..

    స్పీకర్‌ను కలిసిన అనంతరం అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో పార్టీ విప్‌ను ధిక్కరించి, విజయ్‌ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినందుకు గాను.. ఫిరాయింపుల నిరోధక చట్టంకింద అనర్హత వేటు వేయాలని తాము ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన గుర్తుచేశారు. తమ ఫిర్యాదు స్పీకర్‌ పరిశీలనలో ఉండగానే.. ఎక్కడ తమపై అనర్హత వేటు పడుతుందోననే భయంతోనే ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత వేటు పడకుండా తప్పించుకోవడానికి వారు ఇచ్చిన రాజీనామా లేఖలను స్పీకర్‌ ఆమోదించడం పూర్తిగా చట్టవిరుద్ధం, నియమ నిబంధనలకు విరుద్ధం. అందుకే వారి రాజీనామాలను తిరస్కరించాలని కోరినట్టు తెలిపారు.

    ఇది సచివాలయమా? లేక టీవీకే కార్యాలయమా?

    సచివాలయం వేదికగా జరిగిన పరిణామాలపై అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు ఇచ్చిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే.. సచివాలయంలోని పై అంతస్తులో ఉన్న ఒక మంత్రి ఛాంబర్‌లో వారికి టీవీకే పార్టీ మెంబర్‌షిప్‌ కార్డులు లభించాయని వారు ఆరోపించారు. అత్యంత వేగంగా కలర్‌ ప్రింట్‌ తీసి, లామినేట్‌ చేసిన గుర్తింపు కార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ ప్రస్తుతం నడుస్తున్నది ప్రభుత్వ సచివాలయమా లేక అధికార టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయమా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో యథేచ్ఛగా ఎమ్మెల్యేల గుర్రపు బేరాల’కు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    కోర్టుకు వెళ్తాం: ఇంబదురై

    అన్నాడీఎంకే లీగల్‌ వింగ్‌ నేత, ఎంపీ ఇన్బ బదురై మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటికీ, దాన్ని వెనక్కి తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌కు ఉంటాయని స్పష్టం చేశారు. స్పీకర్‌ గనుక చట్టప్రకారం వ్యవహరించకుండా, పక్షపాత ధోరణి అవలంబిస్తే తాము ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

    చట్టపరంగానే అన్ని నిర్ణయాలు: స్పీకర్‌ స్పష్టీకరణ

    మరోవైపు, అన్నాడీఎంకే అభ్యంతరాలను పక్కనబెట్టి స్పీకర్‌ తాను చట్ట పరంగానే వెళ్తున్నట్టు స్పందించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇతర పార్టీల ఎమ్మెల్యేకు విజయ్‌ సర్కారు గాలం వేయడంపై వీసీకే నేత తిరుమావళవన్‌ స్పందిస్తూ, ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వాన్ని చివరి వరకు రక్షించేందుకు వెన్నంటి ఉంటామన్నారు. ఇక, టీవీకే చర్యలను సీపీఎం నేత షణ్ముగం,సీపీఐ నేత వీర పాండియన్‌ ఖండించారు. అలాగే, టీవీకే సాగిస్తున్న ఈ బేరసారాలను అంగీకరించ లేమని, కూటమికి గుడ్డిగా మద్దతు ఇవ్వ కూడదంటూ కాంగ్రెస్‌ ఎంపీలు జ్యోతిమణి, మాణిక్యం ఠాకూర్‌ స్పందించడం గమనార్హం. ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అయితే, తీవ్రస్థాయిలో సీఎం విజయ్‌ను, ఆయన పార్టీ వర్గాలను టార్గెట్‌ చేసి విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా తాజా పరిణామాల నేపథ్యంలో ఎస్పీవేలుమణి వెన్నంటి ఉన్నతిరుగుబాటు ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా పళణి స్వామి వద్దకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు రాగా, మంగళవారం ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డి, సీనియర్‌ నేతలు నత్తం విశ్వనాతన్‌, తంగమణిలు పళనితో భేటీ కావడం విశేషం.

  • – ప్రభుత్వం నిర్ణయం

    సాక్షి, చైన్నె: తమిళనాడులో పాఠశాలల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. తీవ్రమైన ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్‌ను జూన్‌ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో 2026–2027 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ గతంలో ఒక షెడ్యూల్‌ విడుదల చేసింది. దాని ప్రకారం.. 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు జూన్‌ 1వ తేదీన, అలాగే 1వ తరగతి నుంచి 3వ తరగతి చిన్నారి విద్యార్థులకు జూన్‌ 4వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్కూళ్ల సెలవులను పొడిగించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పలు సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను, ప్రస్తుత వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ మంత్రి రాజమోహన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ తన పాత నిర్ణయాన్ని మారుస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

    అన్ని స్కూళ్లకు ఒకే రోజే రీఓపెనింగ్‌

    కొత్త ఉత్తర్వుల ప్రకారం.. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, మెట్రిక్యులేషన్‌ , ప్రైవేట్‌ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ జూన్‌ 4వ తేదీన ఒకే రోజున పునఃప్రారంభం కానున్నాయి.పాఠశాలలు తెరిచేలోగా అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులను సిద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా స్కూళ్లలో తాగునీటి సదుపాయం, తగిన ఆరోగ్య, పారిశుద్ధ్య వసతులు మరియు భద్రతా ఏర్పాట్లను ముందస్తుగానే తనిఖీ చేసి నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త విద్యాసంవత్సరం సజావుగా సాగడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం కోరింది.

  • సాక్షి,చైన్నె: తమిళనాడులో కొత్తగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విభాగాల్లో ప్రక్షాళన ఊపందుకుంది. ఇందులో భాగంగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె హైకోర్టు, , హైకోర్టు మదురై బెంచ్‌లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలు

    ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. డీఎంకే లీగల్‌ వింగ్‌కు చెందిన ఈ న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వ న్యాయవాదులను నియమించేంత వరకు విధుల్లో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాదుల నియామక ప్రక్రియ తుది దశకు చేరడంతో, వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. స్టేట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఎడ్విన్‌ ప్రభాకర్‌తో పాటుగా మద్రాసు హైకోర్టులో 24 మంది న్యాయవాదులు, 36 మంది అదనపు న్యాయవాదులు, మరో 54 ప్రత్యేక న్యాయవాదులు రాజీనామాలు ఆమోదించారు. అలాగే, హైకోర్టు మదురై బెంచ్‌ ప్రభుత్వ ప్లీడర్‌ పి. తిలక్‌కుమార్‌తో పాటుగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు 9 మంది, అదనపు న్యాయవాదులు 16 మంది, ఇతర న్యాయవాదులు 21 మంది ఈ జాబితాలో ఉన్నారు.

    కొత్త నియామకాలపై ఉత్కంఠ

    తమిళనాడు ప్రభుత్వానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా.. కొత్త ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోనే ఈ స్థానాల్లో నియమించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదులలో ఆసక్తి నెలకొంది.

  • వేలూరు:కన్నియంబాడి సమీపంలోని ఇటుకల బట్టీల యజమానుల వద్ద ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన టీవీకే కన్నియంబాడి యూనియన్‌ కార్యదర్శి విజయకుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటూ పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. వివరాలు.. వేలూరు జిల్లా కన్నియంబాడి యూనియన్‌ కార్యదర్శి విజయమార్‌ ఈనెల 22వ తేదీన కన్నియంబాడి ప్రాంతంలోని ఇటుకల బట్టీల వద్దకు వెళ్లి ప్రతి నెలా రూ. లక్ష మామూళ్లు ఇవ్వాలని యజమానుల వద్ద డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. దీనిపై యజమానులు, టీవీకే కార్యదర్శి మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వీటిపై ఇరు వర్గాల వారు వేలూరు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఇటుకల బట్టీ ల యజమానులు, కూలీలు, స్థానికు లు టీవీకే కార్యదర్శి విజయకుమార్‌ను అరెస్ట్‌ చేయాలని కోరుతూ కన్నియంబాడి బస్టాండ్‌లో ఈనెల 25న రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ సెంథిల్‌కుమార్‌, పోలీసు లు స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న టీవీకే జిల్లా కార్యదర్శి విజయమోహన్‌ టీవీకే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కన్నియంబాడి యూనియన్‌ కార్యదర్శి విజయకుమార్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • అన్నయ్యపై తప్పుడు ప్రచారం తగదు

    తమిళసినిమా: yðl¯éÃ-ÆŠ‡PMýS$ ^ðl…¨¯]l ™èlÑ$âýæ çÜ…X™èl MýSâê-M>-Æý‡$-yýl$,-M>Ïyîl gñæÌêyýl$ {yýlÐŒl$Þ gñæÆŠ‡-ీÆý‡ G…r-ÆŠ‡-Osñæ-¯ŒS-Ððl$…sŒæ çÜ…çܦ §éÓÆ> ç³Ë$ {Oò³ÐólsŒæ Ð]lÊÅh-MýSÌŒæ BÌS¾-ÐŒl$Þ¯]l$ Æý‡*´÷…-¨…-^éÆý‡$. BĶæ$¯]l ™égêV> Æý‡*´÷…-¨…-_¯]l EÆý‡-Ð]l#-VýSâŒæ A¯ól BÌS¾ÐŒl$ ÌZ° EƇ$$-Ç-O×ñæÄôæ$ A¯ól ´ër¯]l$ çܧé çÜ$§ýlÆý‡Ø¯]l… çÜ…X-™èl…ÌZ çÜ…X™èl §ýlÆý‡Ø-MýS$yýl$, V>Ķæ$-MýS$yýl$, §ýlÆý‡Ø-MýS$yýl$ VýS…OVðS AÐ]l$-Æý‡¯ŒS ´ëyéÆý‡$. D ´ër BÑ-çÙP-Æý‡×æ M>Æý‡Å{MýS-Ð]l*°² ÝùÐ]l$ÐéÆý‡… ÝëĶæ$…{™èl… ^ðlO¯ðl²ÌZ {ç³Ýë§Šæ ÌêÅ»Œæ °Æý‡Óíßæ…-^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ´ëÌŸY° BÌS¾ÐŒl$¯]l$ BÑ-çÙP-Ç…-_¯]l VýS…OVðS AÐ]l$-Æý‡¯ŒS Ð]l*sêÏyýl$™èl*. "" HI Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l…™ø ¯]lsîæ-¯]lr$-ÌS¯]l$ ¯]lsìæ…ç³gôæíÜ JMýS Ð]l$…_ MýS£ýl™ø D BÌS¾-ÐŒl$¯]l$ M>Ïyîl gñæÌêyýl$ Æý‡*´÷…-¨…-^éÆý‡$. A¯]l²Ä¶æ$Å çÜ…X™èl gêq° Câýæ-Ķæ$-Æ>gê sîæÐŒl$ ÌZ¯ól ™éÐ]l¬ G¨-V>Ð]l¬. A…™ólM>-MýS$…yé ç³Ë$ {ç³RêÅ™èl çÜ…X™èl §ýlÆý‡Ø-MýS$ÌS sîæÐŒl$ ÌZϯ]l* ç³° ^ólõÜ AÐ]l-M>Ôèæ… Ð]l*MýS$ §ýlMìSP…-¨. C…™èlMýS$ Ð]l¬…§ýl$ JMýS ´ër¯]l$ Ð]l§ýl-ÌS-MýS$…yé ´ëyólÐé-âýæÏ…. C糚yýl$ JMøP ç³§é-ÌS¯]l$ ´ëyýl$™èl$ ¯é²…. çÜ…X™èl Æý‡…VýS…-ÌZMìS HI Ð]l^óla-íÜ…-¨. °f… ^ðl´ëµÌS…sôæ HI Ýë…MóS-†MýS ç³Ç-gêq¯]l… Ð]l$¯]l-Ͳ ^ðlyýl Vöyýl$™ø…-§ýl¯ól §ýl–Éýl…V> ^ðlº$-™é¯]l$. §é°² ¯]lÑ$à Ð]l$¯]l… ç³° ^ólçÜ$¢…sôæ ™èlÆý‡$-Ðé™èl Ð]l$¯]l Ððl$§ýlyýl$ ç³° ^ólĶæ$§ýl$. HI JMýS ¥ÐŒl$¯]l$ CõÜ¢ §é°° ´ër-ÌS¯]l$ MýS*yé A§ól Æ>çÜ$¢…¨. §é°MìS Ð]l$¯]l… õ³Æý‡$ GÌê ÐólçÜ$-MøVýS-ÌS…. D¯ól-ç³-£ýlÅ…ÌZ Æ>»ZÄôæ$ ™èlÆý‡… BÌZ_…-^èlyýl… AÌSÐ]lÆý‡-^èl$-Mø-Ðé-Í. Æ>Ķæ$yýl… ¯ólÆý‡$aMøÐé-Í. Ý÷…™èl {糆-¿ýæ¯]l$ ÐðlÍMìS ¡Ä¶æ*-ÌS-¯]l²§ól ¯é ¿êÐ]l¯]l. CMýS-´ù™ól Ð]l* A¯]l²Ä¶æ$Å çÜ…X™èl gêq° Câýæ-Ķæ$Æ>-gê VýS$Ç…_ ™èl糚yýl$ {ç³^éÆý‡… fÆý‡$-VýS$-™ø…-¨. BĶæ$¯]l C™èlÆý‡$ÌS MýSr$t-»ê-r$ÌZ E…r$-¯é²Æý‡$. BĶæ$¯]l BĶæ$-¯]lÌZ ÌôæÆý‡$ Ð]l…sìæ °Æ>-«§éÆý‡-OÐðl$¯]l {ç³^é-Æý‡…™ø ´ër* MýS$r$…-º… VýS$Ç…_ ™èl糚V> Ð]l*sêÏ-yýl$-™èl$-¯é²Æý‡$. °gê-°MìS A¯]l²Ä¶æ$Å Câýæ-Ķæ$-Æ>-gê™ø MýSÍíÜ ò³§ýlª Möyýl$MýS$ M>È¢MŠS Æ>gê E¯é²yýl$. Æð‡…yø Möyýl$MýS$ Ķæ¬Ð]l¯ŒS Ôèæ…MýSÆŠ‡ Æ>gê §ýl$»ê-ÄŒæ$ ÌZ E…r$¯é²yýl$. CâýæÄ¶æ$-Æ>-gê íÜ…´ù-°, MýS^ólÈ, íܰÐ]l* A…r* ^éÌê ¼iV> E¯é²Æý‡$. AÌê…sìæ A¯]l²Ä¶æ$Å CâýæÄ¶æ$-Æ>-gê VýS$Ç…_ ™èl糚yýl$ {ç³^éÆý‡… ^ólĶæ$-MýS…-yìl'' A° VýS…OVðS AÐ]l$-Æý‡¯ŒS õ³ÆöP-¯é²Æý‡$.

    తమిళసినిమా: గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్‌ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థక్‌ లైఫ్‌ చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ట్రోలింగ్‌లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్‌ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్‌ నటించిన ఢిల్లీ, అజిత్‌ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించాలని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. అందువల్ల త్రిషను కరుప్పు స్టార్‌ ( బ్లాక్‌ స్టార్‌) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్‌ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్‌ను చూసి న త్రిష ఎంతగానో సంతోషపడి ఇది చాలా అందంగా ఉంటుంది. ధన్యవాదా లు అని పేర్కొని చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్‌ మీడి యాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

    నటి త్రిష

  • తమిళసినిమా: చలన చిత్రానికి ఆద్యుడు ఆల్వా ఎడిసన్‌ కీర్తిని పరస్కరించుకుని ఎడిషన్‌ అవార్డు పేరుతో సెల్వ కుమార్‌ గత 17 ఏళ్లుగా చిత్ర రంగంలోని ప్రముఖులు సేవలను ప్రశంసించే విధంగా, యువ కళాకారుల ప్రతిభన గుర్తించే విధంగా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా 2025 ఏడాదికి గాను ఎడిషన్‌ అవార్డుల ప్రదానోత్సవం వేడుక ఇటీవల చైన్నె, నందంబాక్కం లోని ట్రేడ్‌ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మలేషియా సహాయ మంత్రి రామరాజ్‌తో పాటు రష్యా, మలేషియా, సింగపూర్‌, స్పెయిన్‌ దేశాల రాయబారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు సినీ ప్రముఖులు విచ్చేసిన ఈ వేదికపై దర్శకుడు మారి సెల్వరాజ్‌, నటుడు దవ్‌ రియోరాజ్‌, గాయని సైంథవి మొదలగు పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు అవార్డులను అందుకున్నారు. ముఖ్యంగా ఈ వేదికపై వచ్చే ఏడాది నుంచి నటుడు విజయ్‌ పేరుతో ఎడిసన్‌ అవార్డు ప్రవేశ పెట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా ఎడిసన్‌ మిలియనరి క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎడిషన్‌ అవార్డులను ప్రపంచ దేశాలకు విస్తరించే విధంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు, వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకు రావడమే ఈ క్లబ్‌ ప్రధాన ఉద్దేశం అని నిర్వాహకుడు సెల్వకుమార్‌ పేర్కొన్నారు.

    సర్ధార్‌ – 2 చిత్ర

    స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

  • సాక్షి చైన్నె: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.

    సమస్యల పరిష్కారానికి సీఎం హామీ

    ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్‌, మంత్రి రాజమోహన్‌ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.

    విజయ్‌ నా తమ్ముడు.. :

    ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్‌ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్‌ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్‌ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు.

  • తిరువళ్లూరు: ఒంటరిగా వున్న మైనర్‌ బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 15 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యామూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా మేట్టుకుప్పం గారమానికి చెందిన దశరధన్‌ కుమారుడు జగన్నాథన్‌(35). ఇతను 2023 మే 7న తన ఇంటికి సమీపంలో ఒంటరిగా వున్న 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు గుమ్మిడిపూండి మహిళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పట్లో జగన్నాథన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా ఈ కేసు విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును వెలువరించారు. నిందితుడు బాలికపై అత్యాచార యత్నం చేయడంతో పాటూ బెదిరింపులకు దిగినట్టు నేరం రుజువు కావడంతో 15 ఏళ్ల జైలు శిక్షతో పాటూ విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. బాధిత బాలికకూ ప్రభుత్వం రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని తీర్పును వెలువరించారు. శిక్షపడ్డ అనంతరం నిందితుడ్ని పుళల్‌ జైలుకు తరలించారు.

  • రావిచెట్టు పడి కూలిన ఇల్లు

    పళ్లిపట్టు: ఆర్కేపేటలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఇంటిపై రావిచెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆర్కెపేట ప్రాంతంలో గంటపాటు పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రాఘవనాయుడు కుప్పం అరుంధతియార్‌ కాలనీలో కూలీ పరశురామన్‌ ఇంటిపై రావిచెట్టు కూలింది. అయితే ఇంట్లో ఉన్నవారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇంట్లో చిక్కుకున్న వారిని స్థానికులు సురక్షితంగా రక్షించారు. ఆర్కేపేట నార్త్‌ యూనియన్‌ డీఎంకే కార్యదర్శి సి.ఎన్‌.షణ్ముగం, ఇల్లు కూలి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా, పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పల్లిపట్టు యూనియన్‌న్‌లో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుత్తణిలో గాలివానకు గంటసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కనకమ్మసత్రంలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • –32 వాహనాల ఫిట్‌నెస్‌ రద్దు

    తిరుత్తణి: తిరుత్తణిలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన లోపాలు ఉన్నట్లు గుర్తించి 32 వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను తాత్కాలికంగా రద్దు చేశారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్‌ 4వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేట్‌ పాఠశాలల వాహనాల భద్రతను నిర్ధారించుకోవడానికి వాటిని తనిఖీ చేసి, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు. తిరుత్తణిలోని ఒక ప్రైవేట్‌ కళాశాల ప్రాంగణంలో 43 పాఠశాలలకు చెందిన 275 వాహనాలను తనిఖీ చేశారు. తిరుత్తణి ఎంవీఐ రాజశేఖర్‌, ఆర్డీఓ కనిమొళి, ఏఎస్పీ శుభం దిమాన్‌, జిల్లా విద్యాధికారి లింగేశ్వరన్‌, తిరువళ్లూరు ఎంవీఐ మురుగేశన్‌ సమక్షంలో మంగళవారం పాఠశాల వాహనాలను పరిశీలించారు. 202 వాహనాలను తనిఖీ చేయగా, 170 వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు జారీ చేశారు. 32 పాఠశాల వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను తాత్కాలికంగా రద్దు చేసి, పునః తనిఖీకి ఆదేశించారు. అంతకుముందు తిరుత్తణి అగ్నిమాపకశాఖ అధికారి సంపత్‌ నేతత్వంలోని సిబ్బంది, ప్రైవేట్‌ పాఠశాల వాహనాల డ్రైవర్లకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.

  • వేలూరు: వేలూరు కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులు నిలిచే ప్రాంతాలను దుకాణ దారులు ఆక్రమించుకుని షాప్‌లు ఏర్పాటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కార్పొరేషన్‌ కమిషనర్‌ లక్ష్మణ్‌కు ఫిర్యాదు వచ్చింది. దీంతో మంగళవారం ఉదయం కార్పొరేషన్‌ అధికారులు, రెవెన్యూ, పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు ఒక్కసారిగా కొత్త బస్టాండ్‌కు చేరుకొని బస్టాండ్‌లోని ఆక్రమిత దుకణాలను తొలగించారు. ఆక్రమణలకు పాల్పడితే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు అపరాధం వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ఉన్న ఫలంగా బస్టాండ్‌లోని దుకాణాలను తొలగించడంతో దుకాణదారులు ఆందోళనకు దిగారు. లక్షలు పెట్టి టెండర్‌ ద్వారా తీసుకొని దుకాణాలు నడుపుతున్నామని అయితే కార్పొరేషన్‌ అధికారులు తరచూ వేధింపులకు గురి చేయడం సరికాదని తెలిపారు. దీంతో పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.

  • సాక్షి, చైన్నె: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సీబీఎస్‌ఈ బోర్డు తీసుకున్న ఒక తాజా నిర్ణయంపై తమిళనాడులో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విద్యాసంవత్సరం (2026–27) నుంచే 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలను చదవడం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన కొత్త ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

    చెప్పింది ఒకటి..చేసేది మరొకటా!

    ‘గత ఏప్రిల్‌ 2026లో సీబీఎస్‌ఈ ఒక కీలక ప్రకటన చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం.. 6వ తరగతి నుంచి విద్యార్థులకు మూడు భాషలు తప్పనిసరి అని, అందులో రెండు భారతీయ భాషలు అయి ఉండాలని పేర్కొన్నట్టు వివరించారు. భారతదేశంలోని విభిన్న సంస్క్కృతులు, భాషల పరిజ్ఞానం చిన్న వయసులోనే పిల్లలకు లభిస్తుందనే ఉద్దేశంతో నాడు ఆ నిర్ణయాన్ని స్వాగతించిన వారిలో తాను కూడా ఒకడినని పేర్కొన్నారు. ఇదే ప్రకటనలో 9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేసే విధానాన్ని ఇప్పటికిప్పుడు కాకుండా, మూడేళ్ల తర్వాత.. అంటే 2029–30 విద్యాసంవత్సరం నుంచి మాత్రమే అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే, తాజగా కేంద్రం మాటతప్పడం శోచనీయమన్నారు. సీబీఎస్‌ఈ అన్ని అనుబంధ పాఠశాలలకు పంపిన కొత్త అంతర్గత ఉత్తర్వుల్లో మాట మార్చిందని అన్నామలై ఆరోపించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ విద్యాసంవత్సరం (2026 జూలై 1) నుంచే 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలను కచ్చితంగా చదవాలని, అందులో రెండు భారతీయ భాషలు ఉండాలని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం తీసుకున్న ఈ హఠాత్తు నిర్ణయం వల్ల ముఖ్యంగా తమిళనాడుకు చెందిన సీబీఎస్‌ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారని అన్నామలై పేర్కొన్నారు ఇది అన్యాయమని, పిల్లలపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ కొత్త ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో బోర్డు ప్రకటించిన విధంగానే.. 9వ తరగతిలో మూడు భాషల విధానాన్ని మూడేళ్ల తర్వాత, అంటే 2029–30 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని, అప్పటివరకు పాత పద్ధతినే కొనసాగించి విద్యార్థులకు ఊరటనివ్వాలని అన్నామలై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

  • తిరువొత్తియూరు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడి చేసి ఐఫోన్‌, ల్యాప్‌టాప్‌ దోచుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వడపళనిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ, పుదుపేటలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన అరుంబాక్కం సమీపంలోని 100 అడుగుల రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌ సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న బ్యాగ్‌, ల్యాప్‌టాప్‌, ఐఫోన్‌ సహా రెండు ఖరీదైన సెల్‌ఫోన్లను లాక్కుని పారిపోయారు. కోయంబేడు బస్టాండ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సోమవా రం రాత్రి ప్రత్యేక పోలీసు బృందం మాంగాడు ప్రాంతానికి చెందిన పేరుమోసిన దొంగ విఘ్నేష్‌ సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. అరెస్ట్‌ అయిన విఘ్నేష్‌పై ఇప్పటికే పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో మరొకరు కళాశాల విద్యార్థి అని తెలిసింది.

    రూ.97.73 కోట్లతో

    అభివృద్ధి పనులు

    కొరుక్కుపేట: రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి , ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి కీలక చర్యలో తీసుకున్నారు. ఇందులోభాగంగా, దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్‌ అరక్కోణం స్టేషన్‌యార్డ్‌లో రూ.97.73 కోట్ల విలువైన విస్తృతమైన ఆధునీకరణ పనులను చేపడుతోంది. అరక్కోణం జంక్షన్‌ దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే సబర్బన్‌ రైల్‌ నెట్‌వర్క్‌లలో కూడా ఒకటి. దీనికి పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సుదూర ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌ రైళ్లు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా నడిచేలా చూడడానికి చైన్నె డివిజన్‌ ఈ భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌ రైలు సర్వీసుల కోసం ట్రాక్‌లను వేరు చేయడం ఈ ప్రాజెక్ట్‌లోని ముఖ్యమైన అంశం. ప్రస్తుతం, ఈ రెండు సర్వీసులు ఒకే రైల్వే ట్రాక్‌లోని కొన్ని భాగాలను పంచుకుంటున్నాయి. దీనివల్ల కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి కొత్త, ప్రత్యేకమైన మార్గాలు రైళ్లు ఏకకాలంలో కదలడానికి వీలు కల్పిస్తాయి. దీనివల్ల రైళ్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడి, ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

  • తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీప ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్‌ స్తంభాలు కూలడంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. తిరువళ్లూరులో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు వరకు ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అనంతరం నల్లటి మేఘాలు కమ్ముకుని గంటపాటు ఈదురుగాలులు వీచాయి. వీచింది. గాలులకు తిరుప్పాచ్చూర్‌, కడంబత్తూరు, పేరంబాక్కం, సత్తరై ప్రాంతాల్లో ఏడు విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో కడంబత్తూరు పేరంబాక్కం సమీపంలోని పదికి పైగా గ్రామాలకు విద్యుత్‌ను నిలిపివేశారు. మామిడి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఇటుక బట్టీలకు సైతం నష్టం వాటిల్లింది.

  • సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మెరుపు దాడి రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా పెను తుఫానును రేపింది. ఈ పరిణామం డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే కాకుండా.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌, వీసీకే, లెఫ్ట్‌ పార్టీలు సైతం ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.

    కూటమిపై ఆధారపడడం ఇష్టం లేకనే ప్లాన్‌ బీ?

    ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించినప్పటికీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ (118) ను టీవీకే సాధించలేకపోయింది. ఈ సమయంలో కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇవ్వడంతో విజయ్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. లెఫ్ట్‌ పార్టీలు మినహా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలోనూ చోటు కల్పించారు. అయితే ఐదేళ్ల పాటు కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వాన్ని నడపాల్సి రావడం సీఎం విజయ్‌కు కొంత అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం. దీంతో ఆయన ’ప్లాన్‌ బి’ని తెరపైకి తెచ్చారన్న చర్చ ఊపందుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఫిరాయింపుల నిరోధక చట్టం అస్త్రంతో రాజీనామా ద్వారా తన వైపుకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టినట్టు చర్చ జరుగుతోంది.

    ప్రస్తుతం కూటమి మద్దతుతో ప్రభుత్వం సురక్షితంగా ఉన్నప్పటికీ, విజయ్‌ ఎందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారనే ప్రశ్న మిత్రపక్షాల్లో తాజాగా మొదలైంది. ఉపఎన్నికల్లో టీవీకే ను గెలిపించుకుని క్రమంగా బలాన్ని పుంజుకునే దిశగా విజయ్‌ వ్యూహాలకు పదును పెట్టినట్టుగా చర్చ ఊపందుకోవడం గమనార్హం. మరి కొందరికి సైతం వల వేసినట్టు, తాజాగా ఐదు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఉప ఎన్నికలలో వీటిని చేజిక్కించుకున్న పక్షంలో ఆ తదుపరి మరి కొందర్ని తమ వైపునకు తిప్పుకునే వ్యూహంతో విజయ్‌ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • నాపై కోపంతోనే అబద్ధాలు వళ్లిస్తున్నారు

    మంత్రి సెంగోట్టయన్‌ ఫైర్‌

    సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరుతుండటంపై ఆ పార్టీ నేత ఎడప్పాడి కె. పళనిస్వామి చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి కె.ఎ. సెంగోట్టయన్‌ తిప్పికొట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తానే దగ్గరుండి టీవీకేలో చేర్చుతున్నాననే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎస్‌ తనపై ఉన్న కోపంతోనే ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చైన్నె సచివాలయంలో మంత్రి సెంగోట్టయన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

    సొంత నిర్ణయంతోనే రాజీనామాలు!

    రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. ధన బలాన్ని ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ పరిపాలనా విధానాలను చూసి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నేతలు టీవీకేలో చేరుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరూ గుర్రపు బేరాలకు పాల్పడలేదన్నారు.. అసలు ఈ రాష్ట్రంలో గుర్రపు బేరాలు ఎవరు చేశారనేది ఈ దేశ ప్రజలందరికీ బాగా తెలుసనని పేర్కొన్నారు. గతంలో డీఎంకే మద్దతుతో తానే ముఖ్యమంత్రిని అవుతానని ప్రగల్భాలు పలికిన నేత ఎవరో తెలుసుకుని, ఈ ప్రశ్న ఆయన్నే అడగండి అని ఈపీఎస్‌ను ఉద్దేశించి సెంగోట్టయన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

    దాట వేత : రాజీనామా చేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలకు రాబోయే ఉపఎన్నికల్లో మళ్లీ టీవీకే తరఫున పోటీ చేసే అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు.. ‘మున్ముందు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది‘ అని మంత్రి దాటవేశారు. చివరగా ఎడప్పాడి పళనిస్వామిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ‘అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్‌, పార్టీని కాపాడిన జయలలిత చిత్రాలు తనకు అవసరం లేదని, కేవలం తన ఫోటో ఉంటే చాలని పళనిస్వామి భావించారని మండి పడ్డారు. అలాంటి వ్యక్తికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు’ అని సెంగోట్టయన్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

  • వేలూరు: రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు పంట రుణ మాఫీని పూర్తిగా రద్దు చేయాలని తమిళనాడు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయకుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం రైతు సంఘం ప్రతినిధులతో కలిసి వేలూరు కలెక్టర్‌ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పంట రుణమాఫీ హామీ ఆకట్టుకుందని, ప్రస్తుతం రైతులకు మొండిచెయ్యిఇచ్చే విధంగా రూ.50 వేలు మాత్రం రుణమాఫీ చేయడం నిరాశను మిగిల్చిందన్నారు. ఎన్నికల హామీలో రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయ పంటలపై తీసుకున్న అన్ని రుణాలను పూర్తిగా రద్దు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు లేవ ని, ఎరువులు పూర్తిగా స్టాక్‌ లేదని, ఇందులో వర్షాలు కూడా సక్రమంగా రాకపోవడంతో ఇదే పరి స్థితి కొనసాగితే రానున్న రోజుల్లో రైతులు పంటలు చేయకుండా కుప్పకూలే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం వీటిని పరిశీలించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

  • –స్థానికుల రాస్తారోకో

    తిరువళ్లూరు: విద్యుత్‌ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాన్ని నిరసిస్తూ స్థానికులు మనవాలనగర్‌లో రాస్తారోకోకు దిగారు. ట్రాపిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లోని శిరుతొండన్‌ నగర్‌, జల్లిమేడు, అన్బళగన్‌ నగర్‌, కన్నియమ్మన్‌ నగర్‌ ప్రాంతాల్లో సోమవారం రాత్రి వీచిన గాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాను నిలిపివేశారు. అయితే సరఫరా నిలిచి 24 గంటలు దాటిన సరఫరాను పునరుద్ధరించకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు మంగళవారం సాయంత్రం తిరువళ్లూరు–పూందమల్లి రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళననూ విరమించాలని ఆందోళనకారులను కోరారు. విద్యుత్‌ పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఏడు గంటలలోపు విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనన విరమించారు. అరగంటపాటు ట్రాఫిక స్తంభించింది.

Sports

  • ఐపీఎల్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌గా నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టు.. ఇవాళ (మే 26) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించి, వరుసగా రెండో ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరింది.

    ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ మహోగ్రరూపం (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దాల్చాడు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది.

    ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. వెంకటేశ్‌ అయ్యర్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు, విరాట్‌ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43, పడిక్కల్‌ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్‌ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్‌ డేవిడ్‌ 5 బంతుల్లో 4, జితేశ్‌ శర్మ 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు (నాటౌట్‌) చేశారు. గుజరాత్‌ బౌలర్లలో​ హోల్డర్‌, రబాడ తలో 2, ప్రసిద్ద్‌‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌.. ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. సాయి సుదర్శన్‌ (14) దురదృష్టవశాత్తు హిట్‌ వికెట్‌గా వెనుదిరగడంతో ఈ జట్టు పతనం ప్రారంభమైంది. ఆతర్వాత  కొద్ది సేపటికే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (2).. 51 పరుగుల వద్ద బట్లర్‌ (29), నిషాంత్‌ సింధు (5), హోల్డర్‌ (0) ఔట్‌ కావడంతో పవర్‌ ప్లేలోనే (5.4 ఓవర్లలో) ఓటమి ఖరారైంది. 

    ఆతర్వాత స్వల్ప వ్యవధిలో సుందర్‌ (8), రషీద్‌ ఖాన్‌ (8), రబాడ (9) కూడా ఔట్‌ కావడం 100 పరుగులలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే ఆఖర్లో తెవాతియా (68) బ్యాట్‌ ఝులిపించడంతో జట్టు స్కోర్‌ 100 పరుగుల మార్కు దాటింది. అంతిమంగా గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, భువీ, రసిక్‌, కృనాల్‌ తలో 2, హాజిల్‌వుడ్‌ ఓ వికెట్‌ తీసి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

     

  • ఐపీఎల్‌ 2026 తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసి అతి భారీ స్కోర్‌ చేసింది.

    రజత్‌ పాటిదార్‌ (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మహోగ్రరూపం​ దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు.

    వెంకటేశ్‌ అయ్యర్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు, విరాట్‌ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43, పడిక్కల్‌ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్‌ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్‌ డేవిడ్‌ 5 బంతుల్లో 4, జితేశ్‌ శర్మ 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు (నాటౌట్‌) చేశారు. గుజరాత్‌ బౌలర్లలో​ హోల్డర్‌, రబాడ తలో 2, ప్రసిద్ద్‌‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

    కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌టైమ్‌ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అలాగే ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన జట్టుగానూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.

    ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక స్కోరు
    254/5 RCB vs PBKS ధర్మశాల 2026 *
    233/3 GT vs MI అహ్మదాబాద్ 2023
    228/5 MI vs GT న్యూ చండీగఢ్ 2025
    226/6 PBKS vs CSK వాంఖడే 2014
    222/5 CSK vs DC చెన్నై 2012

    ఐపీఎల్‌ నాకౌట్స్‌/ప్లే ఆఫ్స్‌లో అత్యధిక బౌండరీలు
    38 RCB vs GT ధర్మశాల 2026 *
    33 CSK vs DC చెన్నై 2012
    32 PBKS vs CSK వాంఖేడే 2014
    31 GT vs MI అహ్మదాబాద్ 2023
    31 MI vs GT న్యూ చండీగఢ్ 2025

     

     

  • ఐపీఎల్‌-2026లో ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులు మెరిపించాడు. 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాటిదార్‌.. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు.

    ధర్మశాల మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా కేవలం 33 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాటిదార్‌.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    అతడి విధ్వంసం ధాటికి  బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌తో పాటు విరాట్‌ కోహ్లి(43), కృనాల్‌ పాండ్యా(43), పడిక్కల్‌(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

    ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాటిదార్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్, డ్వేన్ స్మిత్‌ రికార్డును పాటిదార్ సమం చేశాడు. వీరిద్దరూ కూడా 21 బంతుల్లో తమ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.

    IPL నాకౌట్‌లు/ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగవంతమైన 50లు (బంతుల పరంగా)
    16 సురేష్‌ రైనా vs పంజాబ్ కింగ్స్ (వాంఖడే 2014)
    17 ఆడమ్‌ గిల్‌క్రిస్ట్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (సెంచూరియన్ 2009)
    20 ఎంస్ ధోని vs ముంబై ఇండియన్స్‌( బెంగళూరు 2012)
    21 డ్వేన్ స్మిత్ vs సీఎస్‌కే (ఢిల్లీ 2013)
    21 వీరేంద్ర సెహ్వాగ్ vs సీఎస్‌కే (వాంఖడే 2014)
    21 రజిత్‌ పాటిదార్ vs పంజాబ్‌ ధర్మశాల 2026 *

  • ఆర్సీబీతో జరుగుతున్న ఐపీఎల్‌ 2026 తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ రెండో ఓవర్‌ చివరి బంతికి దూకుడు మీద ఉన్న వెంకటేశ్‌ అయ్యర్‌ను (19) ఔట్‌ చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ పట్టి అయ్యర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

    ఈ వికెట్‌తోనే రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో మొదటి ఆరు ఓవర్లలో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వికెట్‌కు ముందు రబాడ మహ్మద్‌ షమీతో (2023 ఎడిషన్‌) కలిసి ఈ రికార్డును షేర్‌ చేసుకున్నాడు. ఈ రికార్డుకు సంబంధించి రబాడ, షమీ తర్వాతి స్థానాల్లో మిచెల్‌ జాన్సన్‌ (16 వికెట్లు, 2013), ట్రెంట్‌ బౌల్ట్‌ (16, 2020) ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 140-3గా ఉంది. వెంకటేశ్‌ అయ్యర్‌ (19), విరాట్‌ కోహ్లి (43), దేవదత్‌ పడిక్కల్‌ (30) ఔట్‌ కాగా.. కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (21), కృనాల్‌ పాండ్యా (25) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లలో రబాడ 1, హోల్డర్‌ 2 వికెట్లు పడగొట్టారు. హోల్డర్‌ 9వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో బంతికి విరాట్‌ కోహ్లి (43) క్లీన్‌ బౌల్డ్‌ చేసిన అతడు.. నాలుగో బంతికి పడిక్కల్‌ను పెవిలియన్‌కు పంపాడు.

     

     

  • ఐపీఎల్‌-2026లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న‌ క్వాలిఫ‌య‌ర్‌-1లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 43 ప‌రుగులు చేసి కోహ్లి ఔట‌య్యాడు.

    ఈ క్ర‌మంలో కోహ్లి ఈ ఏడాది సీజ‌న్‌లో 600 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. త‌ద్వారా  ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్‌ చేశాడు.

    ఇప్పడు ఈ ఏడాది సీజన్‌లో కూడా కోహ్లి  50.00 సగటు, 164.38 స్ట్రైక్‌రేట్‌తో600 పరుగులు చేశాడు. గతంలో  క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. 

    అదేవిధంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడి శిఖర్‌ ధావన్‌, దినేష్‌ కార్తీక్‌, కిరాన్‌ పొలార్డ్‌ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్‌కే దిగ్గజం ఎంఎస్‌ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.
    చదవండి: IPL 2026: ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో కీల‌క పోరుకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ ఎలిమినేట‌ర్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్‌  బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్‌కు భారీ షాక్ త‌గిలింది.

    ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కమిందు మెండిస్ ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌ను వీడి శ్రీలంకకు వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తోంది. మెండిస్ జాతీయ జట్టు కమిట్‌మెంట్స్ కారణంగా జ‌ట్టును వీడిన‌ట్లు సమాచారం. శ్రీలంక జ‌ట్టు త్వ‌ర‌లోనే ఆల్‌ఫార్మాట్ సిరీస్‌ల‌లో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన శ్రీలంక జట్టులో మెండిస్ భాగంగా ఉన్నాడు. 

    ఈ కార‌ణంతో అత‌డు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు ముందు త‌న స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే లంక జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో మెండిస్‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం రాలేదు. గ‌త సీజ‌న్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచినప్ప‌టికి.. ప్ర‌స్తుతం ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులో విదేశీ ఆట‌గాళ్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో మెండిస్‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌లేదు. ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, క‌మ్మిన్స్‌, మ‌లింగ రూపంలో నలుగురు విదేశీ ఆట‌గాళ్లగా తుది జ‌ట్టులో కొన‌సాగుతున్నారు.

    రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టు(అంచనా)
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంబరీష్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 
    ఇంపాక్ట్ సబ్: ప్రఫుల్ హింగే.
     

  • టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ప్ర‌స్తుతం గడ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్‌గా భార‌త్‌కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను అందించిన సూర్య‌కుమార్.. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు. ఐపీఎల్‌-2026లో కూడా సూర్య త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయలేక‌పోయాడు.

    13 ఇన్నింగ్స్‌ల‌లో అత‌డు కేవ‌లం 270 ప‌రుగులు సాధించాడు. ఇప్పుడు అత‌డు త‌న‌ పేల‌వ ఫామ్ కార‌ణంగా భార‌త టీ20 కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్ర‌మాదం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత కెప్టెన్‌గా అత‌డి భ‌విత్య‌వం తేలిపోనుంది. 

    ఈ సిరీస్‌లోనూ సూర్య విఫ‌ల‌మైతే భార‌త టీ20 జ‌ట్టుకు కొత్త కెప్టెన్ రావ‌డం ఖాయం కానుంది. ఇక త‌న ఫామ్‌ను తిరిగి అందుకోవ‌డానికి సూర్యకుమార్‌కు మరో అద్భుత అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ముంబై టీ20 లీగ్‌-2026లో ‘ట్రయంఫ్ నైట్స్ ముంబై నార్త్ ఈస్ట్’ ఫ్రాంచైజీ తరఫున సూర్య బ‌రిలోకి దిగ‌నున్నాడు.

    ఉగాండా పై ఆడ‌నున్న సూర్య‌
    కాగా ఈ టోర్నీ కంటే ముందు సూర్య‌కుమార్ యాద‌వ్ ఉగాండాపై ఆడనున్నాడు. ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఉగాండా 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ముంబై లీగ్‌లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో ఉగాండా తమ తొలి మ్యాచ్‌లో మే 30న ‘ట్రయంఫ్ నైట్స్’ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ట్రయంఫ్ నైట్స్ తరపున సూర్య ఆడనున్నట్లు తెలుస్తోంది.

    సూర్యకుమార్ ట్రయంఫ్ నైట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాబట్టి ఉగాండాపై అతడు ఆడే అవకాశముంది. సూర్య ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడు ఏ జట్టుపై ఆడినా, అది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అని ఎంసీఎ కార్యదర్శి ఉన్మేష్ ఖాన్విల్కర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. 
     

  • ఐపీఎల్‌ 2026 ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో టీమిండియా-ఆఫ్ఘన్‌ జట్ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌, 3 వన్డేల సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు ఆఫ్ఘనిస్తాన్‌ జట్లను ఇవాళ (మే 26) ప్రకటించారు. ఈ రెండూ ఫార్మాట్ల జట్లకు హష్మతుల్లా షాహిది కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల సమ్మేళనంగా ఉంది.

    ఇటీవలికాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో లేకపోయినా, కీలక పర్యటన కావడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారు.

    వన్డే జట్టులో అనుభవజ్ఞులైన రహ్మత్‌ షా, రహ్మానుల్లా గుర్బాజ్‌తో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. వికెట్‌కీపర్లుగా అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌లను ఎంపిక చేశారు.

    బౌలింగ్‌ విభాగంలో స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతడి అనుభవం భారత పిచ్‌లపై ఆఫ్ఘనిస్తాన్‌కు కీలకంగా మారనుంది.

    2027 వన్డే వరల్డ్‌కప్‌ దృష్ట్యా ఇరు జట్లకు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. బెంచ్‌ స్ట్రెంత్‌ను పరీక్షించుకోవడం, కొత్త కాంబినేషన్లను సిద్ధం చేయడం ఈ సిరీస్‌ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. 

    మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో భారత్‌ లాంటి బలమైన జట్టుతో ఆడటం ఆఫ్ఘనిస్తాన్‌కు విలువైన అనుభవాన్ని అందించనుంది. గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఈ సిరీస్‌ పెద్ద పరీక్షగా మారింది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

    భారత‌ పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్‌ వన్డే జట్టు:
    హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అబ్దుల్‌ మాలిక్‌, సెదీకుల్లా అతల్‌, రహ్మత్‌ షా, రహ్మనుల్లా గుర్బాజ్‌, రహ్మనుల్లా జద్రాన్‌, అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, షరఫుద్దీన్‌ అష్రఫ్‌, నంగ్యాల్‌ ఖరోటాయ్‌, ఖైస్‌ అహ్మద్‌, బిలాల్‌ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ, రషీద్‌ ఖాన్‌.

    భారత పర్యటనకు ఆఫ్ఘనిస్తాన్‌ టెస్టు జట్టు:
    హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), అబ్దుల్‌ మాలిక్‌, సెదీకుల్లా అతల్‌, రహ్మత్‌ షా, రహ్మనుల్లా గుర్బాజ్‌, రహ్మనుల్లా జద్రాన్‌, అఫ్సర్‌ జజాయ్‌, ఇక్రామ్‌ అలీఖిల్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, షరఫుద్దీన్‌ అష్రఫ్‌, నంగ్యాల్‌ ఖరోటాయ్‌, ఖైస్‌ అహ్మద్‌, బిలాల్‌ సామీ, జియా షరీఫీ, సలీం సఫీ.

    ఆఫ్ఘనిస్తాన్‌ భారత పర్యటన షెడ్యూల్‌

    • ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌- జూన్‌ 6-10 (ముల్లాన్‌పూర్‌)
    • తొలి వన్డే- జూన్‌ 14 (ధర్మశాల)
    • రెండో వన్డే- జూన్‌ 17 (లక్నో)
    • మూడో వన్డే- జూన్‌ 20 (చెన్నై)

     

     

  • గుజరాత్‌పై ఘన విజయం.. ఫైనల్లో ఆర్సీబీ
    255 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటై 92 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.

    ఆరో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    8.2వ ఓవర​్‌- 65 పరుగుల వద్ద గుజరాత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. డఫీ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వాషింగ్టన్‌ సుందర్‌ (8) ఔటయ్యాడు. 

    51 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన గుజరాత్‌
    5.4వ ఓవర్‌- 51 పరుగుల వద్ద గుజరాత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. రసిక్‌ సలాం​ దార్‌ బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి జేసన్‌ హోల్డర్‌ డకౌటయ్యాడు. 

    పీకల్లోతు కష్టాల్లో గుజరాత్‌
    255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ (29) మూడో వికెట్‌గా, రసిక్‌ సలాం​ దార్‌ బౌలింగ్‌లో నిషాంత్‌ సింధు (5) నాలుగో వికెట్‌గా వెనుదిరిగారు. 

    రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
    3.1వ ఓవర్‌- 27 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    సాయి సుదర్శన్‌ హిట్‌ వికెట్‌
    2.3వ ఓవర్‌- 17 పరుగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. గుజరాత్‌ను దరిద్రం వెంటాడంతో సాయి సుదర్శన్‌ (14) హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. డఫీ బౌలింగ్‌లో బంతి బౌండరీకి వెళ్లినా సుదర్శన్‌ బ్యాట్‌ చేజారి వికెట్లకు తాకింది. 

    పాటిదార్‌ ఊచకోత.. ఆర్సీబీ భారీ స్కోర్‌
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ చేసింది. రజత్‌ పాటిదార్‌ (33 బంతుల్లో 93 నాటౌట్‌; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) ఉగ్రరూపం​ దాల్చడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా చెలరేగారు. 

    వెంకటేశ్‌ అయ్యర్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు, విరాట్‌ కోహ్లి 25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 43, పడిక్కల్‌ 19 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30, కృనాల్‌ పాండ్యా 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43, టిమ్‌ డేవిడ్‌ 5 బంతుల్లో 4, జితేశ్‌ శర్మ 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 15 పరుగులు (నాటౌట్‌) చేశారు. 

    18 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పాటిదార్‌ క్యాచ్‌ను రబాడ మిస్‌ చేయడంతో గుజరాత్‌ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. క్యాచ్‌లు, రనౌట్లు మిస్‌ చేయడంతో పాటు  లేని పరుగులను సమర్పించుకున్నారు. 

    బౌలర్లు ఓ మోస్తరుగా బౌలింగ్‌ చేసినా ఫీల్డర్ల పొరపాట్ల కారణంగా గుజరాత్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. గుజరాత్‌ బౌలర్లలో​ హోల్డర్‌, రబాడ తలో 2, ప్రసిద్ద్‌‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు.

    ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    17.6వ ఓవర్‌- 214 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో టిమ్‌ డేవిడ్‌ (4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

    ఆర్సీబీ నాలుగో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన కృనాల్‌ పాండ్యా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ఆర్సీబీ స్కోర్‌: 204/4

    భారీ స్కోర్‌ దిశగా ఆర్సీబీ
    ఆర్సీబీ భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 16 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో కృనాల్‌ పాండ్యా(43), పాటిదార్‌(49) ఉన్నారు.

    మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
    9వ ఓవర్లో ఆర్సీబీ మూడు బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి జేసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (43) క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. నాలుగో బంతికి వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పడిక్కల్‌ (30) పెవిలియన్‌కు చేరాడు. 

    పవర్‌ ప్లేలో దుమ్మురేపిన ఆర్సీబీ
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లేలో దుమ్మురేపింది. సుడిగాలి ఇన్నింగ్స్‌ తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ (19) ఔటైనా, విరాట్‌ కోహ్లి (34 నాటౌట్‌), దేవదత్‌ పడిక్కల్‌ (23 నాటౌట్‌) మెరుపులు కొనసాగించారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 76-1గా ఉంది. 

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    1.6వ ఓవర్‌- 21 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో గిల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో వెంకటేశ్‌ అయ్యర్‌ (19) ఔటయ్యాడు. 

    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 26) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌ పోటీలో ఆర్సీబీ-గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

    తుది జట్లు..

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్
     

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న కెరీర్‌లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మయ్యాడు. ఐపీఎల్‌-2026 ఎలిమినేట‌ర్‌లో భాగంగా బుధ‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా రాజస్తాన్ రాయల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో సత్తాచాటాలని 15 ఏళ్ల వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు వైభవ్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.

    ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో కనీసం 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో వైభవ్ రెండో స్ధానంలో న్నాడు.  ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ 232.27 స్ట్రైక్ రేట్‌తో  583 పరుగులు సాధించాడు. 

    ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ ఆటగాడు జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ పేరిట ఉంది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో మెక్‌గర్క్ 234.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై  వైభవ్ డబుల్ డిజిట్ స్కోర్ సాధిస్తే స్ట్రైక్ రేట్ పరంగా మెక్‌గర్క్‌ను అధిగమించే అవకాశముంది.

    500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ (232.27) నమోదు చేసిన రికార్డు వైభవ్ పేరిటే ఉంది.

    గేల్ రికార్డుపై కన్ను
    కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డుపై కూడా వైభవ్ కన్నేశాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) పేరిట ఉంది. వైభవ్ మరో 7 సిక్సర్లు కొడితే క్రిస్ గేల్ పేరిట ఉన్న 14 ఏళ్ల సుదీర్ఘ రికార్డు బద్దలవుతుంది.

    ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు
    క్రిస్ గేల్: 59 సిక్సర్లు (14 ఇన్నింగ్స్ -ఐపీఎల్‌ 2012)

    వైభవ్ సూర్యవంశీ: 53 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ - ఐపీఎల్‌ 2026)*

    ఆండ్రీ రస్సెల్: 52 సిక్సర్లు (13 ఇన్నింగ్స్ -ఐపీఎల్‌ 2019)

    క్రిస్ గేల్: 51 సిక్సర్లు (16 ఇన్నింగ్స్ -ఐపీఎల్‌ 2013)
    చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు
     

  • ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన కొద్ది రోజులకే భారత ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అంతర్జాతీయ ఫ్రాంచైజీ క్రికెట్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అతడు.. లంక ప్రీమియర్‌ లీగ్‌లోని క్యాండీ రాయల్స్‌ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూలై 17 నుంచి ప్రారంభంకానున్న ఎల్‌పీఎల్‌ ఆరో సీజన్‌లో విజయ్‌ క్యాండీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు.

    విజయ్‌ ఐపీఎల్‌తో పాటు భారత దేశవాళీ క్రికెట్‌ మొత్తానికి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌తో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటేనే భారతీయులకు ఇతర దేశాల క్రికెట్‌ లీగ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టే విజయ్‌కు లంక ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. 

    విజయ్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలోనే కొత్త అవకాశాలు, మరింత క్రికెట్‌ ఆడేందుకు అంటూ లంక ప్రీమియర్‌ లీగ్‌ ఎంట్రీపై సంకేతాలు ఇచ్చాడు. విజయ్‌.. క్యాండీ రాయల్స్‌లో వనిందు హసరంగ, ఏంజెలో మాథ్యూస్‌, మొయిన్‌ అలీ తదితర స్టార్లతో కలిసి ఆడతాడు.

    35 ఏళ్ల విజయ్‌ భారత్‌ తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు 324 పరుగులు, 9 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌, రైట్‌ ఆర్మ్‌ మీడియం బౌలర్‌ అయిన విజయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 4253 పరుగులు, లిస్ట్‌-ఏలో 2790, టీ20ల్లో 2583 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 154 వికెట్లు కూడా తీశాడు.

    తమిళనాడు జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన విజయ్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ, దేవధర్‌ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలను గెలిపించాడు. 2025-26 సీజన్‌కు ముందు విజయ్‌ త్రిపుర జట్టుకు మారాడు. విజయ్‌ తన చివరి రంజీ మ్యాచ్‌లో గుజరాత్‌పై అజేయంగా 151 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    విజయ్‌ ఐపీఎల్‌ ప్రస్తానాన్ని పరిశీలిస్తే..  2014 అరంగేట్రం చేసిన ఇతగాడు.. 2025 వరకు 78 మ్యాచ్‌లు ఆడి 1233 పరుగులు, 9 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన విజయ్‌ను.. 2026 సీజన్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్‌ విజయ్‌ సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించి 6 మ్యాచ్‌ల్లో 118 పరుగులతో పర్వాలేదనిపించాడు.

     

     

  • పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ త‌న ఆల్ టైమ్ బెస్ట్ వ‌న్డే వ‌ర‌ల్డ్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌కటించాడు. ఈ జ‌ట్టులో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లికి మిస్బా చోటిచ్చాడు. కోహ్లితో పాటు భార‌త పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ ల‌భించింది. అయితే ఈ జ‌ట్టులో బాబ‌ర్ ఆజం కోసం కోహ్లి బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మిస్బా మార్చ‌డం గ‌మ‌నార్హం.

    వ‌న్డేల్లో కోహ్లి సాధ‌ర‌ణంగా మూడో స్ధానంలో బ్యాటింగ్ వ‌స్తాడు. ఇదే స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి కోహ్లి ఎన్నో వ‌రల్డ్ రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. కానీ మిస్బా మాత్రం విరాట్‌కు నాలుగో స్ధానంలో ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లి స్ధానాన్ని బాబ‌ర్‌తో ఈ పాక్ లెజెండ్ భ‌ర్తీ చేశాడు.

    ఇక ఓపెన‌ర్ల‌గా శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్‌, ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌ను అత‌డు ఎంపిక చేశాడు. అయితే వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు బాదిన రోహిత్ శ‌ర్మ‌కు ఈ జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ జోఫ్రా ఆర్చ‌ర్‌, సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్ల‌ర్‌, మార్కో జానెస‌న్ ఈ జ‌ట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్న‌ర్‌కు ఒక్క‌డికే ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది.

    వ‌న్డేల్లో తిరుగులేని విరాట్‌
    విరాట్ కోహ్లి 37 ఏళ్ల వయస్సులోనూ వన్డే క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్‌(14,797) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కోహ్లి(54) పేరిటే ఉంది. వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లి తిరిగి మళ్లీ భారత జెర్సీలో కన్పించనున్నాడు.
    చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు

  • ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన రియాన్‌ పరాగ్‌ ఓ భారీ కెప్టెన్సీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో తొలి సీజన్‌లోనే తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చిన 24వ సారధిగా రికార్డుల్లోకెక్కాడు. తద్వారా లెజెండరీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ సరసన చేరాడు.

    కెప్టెన్‌గా మొదటి సీజన్‌లో తమ జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన కెప్టెన్లు
    షేన్ వార్న్‌ - RR, 2008
    యువరాజ్ సింగ్ - KXIP, 2008
    ఎంఎస్‌ ధోని - CSK, 2008
    వీరేంద్ర సెహ్వాగ్ - DC, 2008
    అనిల్ కుంబ్లే -RCB, 2009
    డేనియల్ వెట్టోరి - RCB, 2011
    గౌతమ్ గంభీర్ - KKR, 2011
    హర్భజన్ సింగ్ - MI, 2012
    రోహిత్ శర్మ - MI, 2013
    కెమరాన్ వైట్ - SRH, 2013
    జార్జ్ బెయిలీ - KXIP, 2014
    స్టీవ్ స్మిత్ - RR, 2015
    సురేష్ రైనా - GL, 2016
    కేన్ విలియమ్సన్ - SRH, 2018
    దినేష్ కార్తీక్ - KKR, 2018
    అజింక్యా రహానే - RR, 2018
    రిషబ్ పంత్ - DC, 2021
    హార్దిక్ పాండ్యా - GT, 2022
    ఫాఫ్ డు ప్లెసిస్ - RCB, 2022
    కేఎల్‌ రాహుల్ - LSG, 2022
    కృనాల్ పాండ్యా - LSG, 2023
    పాట్ కమిన్స్ - SRH, 2024
    రజత్ పాటిదార్ - RCB, 2025
    రియాన్ పరాగ్ - RR, 2026

    కాగా, గత సీజన్‌ వరకు రాజస్థాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్‌ సీఎస్‌కేకు ట్రేడ్‌ కావడంతో.. ఈ సీజన్‌తోనే రియాన్‌ పరాగ్‌ ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రియాన్‌.. సీజన్‌ ఆరంభంలో జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మధ్యలో తడబడినా, చివరికి మళ్లీ పుంజుకొని తన జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.

    ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో (ముంబై ఇండియన్స్‌) రాజస్థాన్‌ జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటి అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకొని ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో అమీతుమీకి సిద్దమైంది. 

    తొలి మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లను దక్కించుకున్న జట్లుగా ఆర్సీబీ, గుజరాత్‌, ఎస​్‌ఆర్‌హెచ్‌ ఉన్నాయి. ఇవాళ (మే 26) జరిగే క్వాలిఫయర్‌-1లో టాప్‌-2 జట్లు ఆర్సీబీ-గుజరాత్‌ తలపడనుండగా.. రేపు (మే 27) జరుగబోయే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌-రాజస్థాన్‌ ఢీకొంటాయి. 

    క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో పోటీపడుతుంది. క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు ఫైనల్లో టైటిల్‌ కోసం పోరాడతాయి.

    బ్యాటర్‌గా విఫలం
    కెప్టెన్‌గా మెప్పించిన రియాన్‌, బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.  12 మ్యాచ్‌ల్లో కేవలం 272 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ బాగానే ఉన్నప్పటికీ, అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాలని జట్టు ఆశించింది.

     

  • తల్లిదండ్రులు ఇద్దరూ క్రీడాకారులే. తండ్రి జయశంకర్‌ భారత పురుషుల బాస్కెట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌ అయితే.. తల్లి ప్రసన్న భారత మహిళల బాస్కెట్‌బాల్‌ జట్టుకు సారథి. ఆ తర్వాత ఇద్దరూ కోచ్‌లుగా మారి ఆటతో ప్రయాణం కొనసాగించారు.

    అలా ఆ అమ్మాయికి చిన్ననాటి నుంచే క్రీడా వాతావరణం అలవాటైపోయింది. అయితే, తల్లిదండ్రుల్లా ఆమె బాస్కెట్‌బాల్‌ను ఎంచుకోలేదు. అందుకు బదులు ‘షాట్‌పుట్‌’ ఆమెను ఎంచుకుంది. ఆ అమ్మాయి పేరు క్రిష్ణా జయశంకర్‌ మీనన్‌. ఇండోర్‌ షాట్‌పుట్‌లో 17 మీటర్ల మార్కు దాటిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఆమె ఇటీవలే చరిత్ర సృష్టించింది.

    ఒలింపిక్స్‌ లక్ష్యంగా..
    అంతేకాదు.. అమెరికాలో NCAA డివిజన్‌ 1 స్కాలర్‌షిప్‌ పొందిన ఏకైక భారత మహిళా షాట్‌పుటర్‌గానూ క్రిష్ణ రికార్డు సాధించింది. తదుపరి అవుట్‌డోర్‌ సీజన్‌పై దృష్టి పెట్టిన ఈ తమిళనాడు అథ్లెట్‌.. కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడలు.. ఆపై లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌-2028లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

    ‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్‌
    క్రీడా కుటుంబంలో జన్మించినప్పటికీ క్రిష్ణ ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. తన ‘కండబలం’ చూసి అందరూ హేళన చేస్తుంటే.. తాను మహిళా అథ్లెట్‌కు నిజమైన ప్రతినిధిని కాదేమోనంటూ కుంగిపోయేది క్రిష్ణ. అలా ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె.. ఎనిమిది సార్లు జాతీయ సెలక్షన్స్‌లో విఫలమైంది.

    నిజానికి షాట్‌పుట్‌ శిక్షణ కారణంగానే ఆమె దేహం కండలు తిరిగింది. త్రోయింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. తనలో ఆడతనం కనిపించడం లేదంటూ కొంతమంది హద్దుదాటి మరీ కామెంట్‌ చేసేవారు.

    ఈ ప్రభావం క్రిష్ణ ఆట తీరుపై పడింది. అయితే, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడింది. తనను గేలి చేసిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెట్టిన క్రిష్ణ.. ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది.

    జమైకాలో ఇలాగే ఉంటారు
    కోవిడ్‌ సమయంలో క్రిష్ణ శిక్షణ కోసం ఇండియాను వీడి జమైకాకు వెళ్లింది. అక్కడ తనలాగా ఉండే కండలు తిరిగిన ఆడ అథ్లెట్ల విజయాన్ని గర్వంగా సెలబ్రేట్‌ చేసుకోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అక్కడ అచ్చంగా తన లాంటి శరీరాకృతితో ఉన్న అథ్లెట్లతో కలిసి ప్రాక్టీస్‌ చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగానే ఇప్పుడు ఈ రికార్డు విజయం ఆమె సొంతమైంది.

    త్యాగాల ఫలితం
    క్రిష్ణ తల్లిదండ్రులది కేరళ. అయితే, బాస్కెట్‌బాల్‌ కోసం వాళ్లు తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. క్రిష్ణ కూడా చిన్ననాటి నుంచే షాట్‌పుట్‌పై దృష్టి సారించింది.

    కఠినమైన శిక్షణ, ఆటను మరింత మెరుగుపరచుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. చాలాకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నగానే కనబడ్డాయి. తన సోదరి నిశ్చితార్థ సమయంలోనూ క్రిష్ణ ప్రాక్టీస్‌ కోసం విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

    అయినా.. కెరీర్‌ కోసం ఇలాంటి త్యాగాలు తప్పవని మొండిగా ముందుకు సాగింది. 23 ఏళ్ల వయసులోనే సరికొత్త చరిత్ర సృష్టించి.. ఒలింపిక్స్‌ పతకం గెలవడమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగిస్తున్న క్రిష్ణ యువతకు ఆదర్శం.

  • త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు (జూన్‌ 12) ముందు ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు మంచి బూస్టప్‌ లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హోవ్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను చేజిక్కించుకుంది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్దిని 19.1 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్‌.. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

    ఇంగ్లండ్‌ బౌలర్లలో డేనియల్‌ గిబ్సన్‌, కెప్టెన్‌ ఛార్లెట్‌ డీన్‌ తలో 3, లిన్సే స్మిత్‌ 2, ఇస్సీ వాంగ్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన జెస్‌ కెర్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. ఇసబెల్లా గేజ్‌ (17), మ్యాడీ గ్రీన్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూజీ బేట్స్‌ (3), కెప్టెన్‌ అమేలియా కెర్‌ (5), బ్రూక్‌ హ్యాలిడే (2), నెన్సీ పటేల్‌ (2), బ్రీ ఇల్లింగ్‌ (3) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు చేయగా.. సోఫీ డివైన్‌, ఇజ్జీ షార్ప్‌ డకౌట్‌ అయ్యారు.

    ఇంగ్లండ్‌ బ్యాటర్లలో సోఫీ డంక్లీ 22, హీథర్‌ నైట్‌ 18, అలైస్‌ క్యాప్సీ 3 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మియా బౌచియర్‌ (19 నాటౌట్‌), ఫ్రేయా కెంప్‌ (7 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్‌, నెన్సీ పటేల్‌, అమేలియా కెర్‌ తలో వికెట్‌ తీశారు. 

    కాగా, ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి వన్డే ఇంగ్లండ్‌, మూడో వన్డే న్యూజిలాండ్‌ గెలవగా.. రెండో వన్డే డ్రాగా ముగిసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. 

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ తుది ద‌శ‌కు చేరింది. మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న క్వాలిఫ‌య‌ర్‌-1లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తుది పోరుకు అర్హ‌త సాధించాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి.

    అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ధ‌ర్మ‌శాల‌లో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అక్యూవెదర్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు.

    మ్యాచ్ ర‌ద్దు అయితే?
    ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లకు ఎలాంటి 'రిజర్వ్ డే' లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలో వర్షం కారణంగా అంతరాయం కలిగితే మ్యాచ్ ఫలితం తేల్చేందుకు అద‌నంగా కేవ‌లం ఒక గంట స‌మ‌యం మాత్ర‌మే ఉంటుంది.

    కానీ ప్లేఆఫ్స్ మ్యాచ్ విష‌యంలో మాత్రం అద‌నంగా రెండు గంట‌ల స‌మ‌యం కేటాయిస్తారు. కనీసం సూపర్‌ ఓవర్‌లో అయినా ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్‌లు ప్ర‌య‌త్నిస్తారు.అప్ప‌టికి కూడా ఆట వీలుకాక‌పోతే మ్యాచ్‌ను అంపైర్‌లు ర‌ద్దు చేస్తారు. అదే జ‌రిగితే లీగ్ దశ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉన్నందున ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

    అప్పుడు గుజ‌రాత్ టైటాన్స్ క్వాలిఫ‌య‌ర్‌-2 ఆడాల్సి ఉంటుంది. కాగా లీగ్ దశ ముగిసేసరికి రెండు జట్లు చెరో 14 మ్యాచ్‌లు ఆడి, 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే గుజరాత్ టైటాన్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్  సాధించడంతో ఆర్సీబీ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్‌ను కైవ‌సం చేసుకుంది.
    చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు

National

  • న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పునకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ మధ్య ఇన్నాళ్లూ సాగిన కోల్డ్‌వార్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం తెరదించబోతున్నట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన బుధవారం బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. రాజీనామాకు కారణాలు, రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌ నాయకత్వం, పార్టీ అధిష్టానం మధ్య ఢిల్లీలో కొన్నిరోజులుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

    ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కాంగ్రెస్‌ పెద్దలు సూచించగా, సిద్ధరామయ్య అందుకు నిరాకరించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామని, 2029 లోక్‌సభ ఎన్నికల ముందు సంస్థాగతంగా పార్టీలో కీలక పాత్ర పోషించాలని కోరగా ఆయన మెత్తబడినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సామాజిక న్యాయం, కులాల సమైక్యత వ్యూహానికి పదును పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

    జాతీయ స్థాయిలో ఓబీసీ కీలక నాయకుల్లో ఒకరిగా సిద్ధరామయ్య ఎదగాలని కాంగ్రెస్‌ నాయకత్వం కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లో తమ పార్టీ తరపున ఓబీసీల ప్రాతినిధ్యాన్ని పెంచాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. సీఎం పదవి నుంచి పక్కన పెట్టడాన్ని సిద్ధ రామయ్య పరపతి, ప్రాధాన్యతను తగ్గించే చర్యగా చూడొద్దని, ఆయనకు మరింత ఉన్నత స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని పార్టీ పెద్దలు పేర్కొంటున్నారు.   

    రాజకీయ భవిష్యత్తుపై అధిష్టానం హామీ  
    జాతీయ స్థాయిలో ఓబీసీ కులాల సమీకరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఢిల్లీలో పార్టీకి సిద్ధరామయ్య అవసరం ఉందని, అలాగే కాంగ్రెస్‌ దీర్ఘకాలిక ఎన్నికల వ్యూహంలో ఆయన రాజకీయ పలుకుబడి కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై సిద్ధరామయ్యకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్‌ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్‌ ఇంఛార్జ్ రణదీప్‌ సూర్జేవాలాతో సమావేశమయ్యారు. వారిద్దరూ తమ అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.

    ఈ భేటీలో సీఎం మార్పుపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక శాసన మండలి ఎన్నికలు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగినట్లు పైకి చెబుతున్నారు. రాజీనామాకు సిద్ధ రామయ్యను ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలిసింది. కానీ, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని కే.సీ.వేణుగోపాల్‌ అన్నారు. భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభ సీట్లు, మండలి సీట్ల గురించి చర్చించామని తెలిపారు.

    ఈ సందర్భంగా ఆయన పక్కన సిద్ధరామయ్య, డీ.కే.శివకుమార్‌ కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థులతోపాటు కర్ణాటక రాజ్యసభ, మండలి స్థానాల అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్‌ చెప్పారు. సీఎం మార్పు నిజమేనా? అని ప్రశి్నంచగా, అది ఊహాగానమేనని సిద్ధరామయ్య బదులిచ్చారు. అలాంటి చర్చ ఏదీ జరగలేదన్నారు.  

    త్వరలో రాజ్యసభకు సిద్ధరామయ్య  
    కర్ణాటకలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచి్చంది. అప్పట్లో సీఎం పోస్టు కోసం సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌ తీవ్రంగా పోటీపడ్డారు. అధిష్టానం సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. శివకుమార్‌ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత సీఎంగా అవకాశం కల్పిస్తామని అప్పట్లో శివకుమార్‌కు అధిష్టానం హామీ ఇచి్చనట్లుగా ఆయన అనుచరులు చెప్పుకున్నారు. అయితే, దీనిపై అధిష్టానం ఏనాడూ బహిరంగంగా స్పందించలేదు. సీఎం మార్పు జరిగితే కొత్త సీఎంగా శివకుమార్‌కు ఎంపిక చేయడం తథ్యమని కర్ణాటక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శివకుమార్‌ వైపు అధి­ష్టానం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. శివకుమార్‌కు సీఎం పదవి కట్టబెట్టాలన్న ఆలోచనను సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాయకత్వ సమస్యపై సిద్ధరామయ్య గానీ, శివకుమార్‌ గానీ బహిరంగంగా వ్యాఖ్యా­నించలేదు. కర్ణాటక సీఎంను మార్చే అంశంపై కాంగ్రెస్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కర్ణాటకలో ఇటీవల 4 రాజ్యసభ స్థానా­లు ఖాళీ అయ్యాయి. వాటికి జూన్‌ 18న ఎన్నికలు జరుగనున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ మూడు స్థానాలు గెల్చుకోనుంది. వాటిలో ఒక స్థానాన్ని సిద్ధరామయ్యతో భర్తీ చేస్తారని అంటున్నారు.  

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.  

    మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, ముఖ్యంగా లోక్‌సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    టీఎంసీ నియంత్రణలో ఉన్న మున్సిపల్ సంస్థల్లో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి. భట్‌పారా మున్సిపాలిటీలో 35 మందిలో 30 మంది, హాలిసహర్‌లో 23 మందిలో 16 మంది, కంచరపారాలో 14 మంది కౌన్సిలర్లు వైదొలిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వంటి కారణాలతో కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

    అవినీతి, దోపిడీ ఆరోపణలు పార్టీపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు అరెస్టు అయ్యారు. సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ మర్మమైన మరణం ఆందోళనను పెంచింది. మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త దేబ్రాజ్ చక్రవర్తిపై విచారణ కొనసాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది.

    కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, బీజేపీ 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం అంతర్గత కలహాలకు దారితీసింది. మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

    మే 22న మేయర్‌తో సహా కౌన్సిలర్లు ప్రధాన ఛాంబర్ వెలుపల సమావేశం నిర్వహించవలసి రావడం, ఎన్నికైన ప్రతినిధులకు అవమానకరంగా మారింది. వరుస రాజీనామాలు మున్సిపల్ సేవలను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రాబోయే వర్షాకాలం ముందు డ్రైనేజీ, పారిశుధ్యం, అత్యవసర సన్నద్ధతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

    కౌన్సిలర్లు అందుబాటులో లేని చోట బీజేపీ ప్రభుత్వం నిర్వాహకులను నియమించడం ప్రారంభించింది. దీంతో, టీఎంసీ సంక్షోభం కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, మొత్తం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ స్థాపించినప్పటి నుండి టీఎంసీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

  • అత్యాచార దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్ మంజూరయ్యాక అతడు హరియాణాలోని రోహ్‌టక్‌లోని సునారియా జైలు నుంచి విడుదలై సిర్సాకు చేరుకున్నాడు. దాదాపు పది కార్లు అతడి ముందు, వెనక ఉండగా దర్జాగా మధ్యలోని కారులో కూర్చొని సిర్సాకు వెళ్లాడు. అత్యాచార దోషి ఇలా ఓ రాజులా విహారానికి వచ్చినట్లు కనపడడంతో తీవ్ర విమర్శలతో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.

    అత్యాచార దోషికి పెరోల్‌ మంజూరుకు కావడంతో దీనిపై సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. “గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరైంది.. ఈ సారి 30 రోజులు దక్కింది. 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇది 16వసారి అతను పెరోల్‌పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసులో అతడు 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో ఉమర్ ఖాలిద్ లాంటి వారు విచారణ కూడా మొదలు కాకుండా దాదాపు 6 ఏళ్లుగా జైలులో ఉన్నారు. ఇదే న్యాయ వ్యవస్థ. ఇకపై మన న్యాయమూర్తులు ఏం ఉపదేశిస్తారో ఆశ్చర్యంగా ఉంది!” అని అన్నారు.

    గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 30 రోజుల పెరోల్‌పై సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ మాట్లాడుతూ.. “ఇప్పటికి 16 సార్లు పెరోల్‌ ఇచ్చారు. తన శిక్ష కాలంలో సగం సమయం అతను పెరోల్‌పైనే గడిపాడు. ప్రశ్న ఏంటంటే, మన చట్టం ఎందుకు వివక్ష చూపుతోంది? అతను తీవ్రమైన నేరస్థుడు కాదా? ఎంతో మంది అండర్‌ట్రయల్స్ సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. కానీ వాళ్లకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హరియాణా ప్రభుత్వం అతనికి ఇస్తున్న మద్దతుపైనా సందేహాలు వస్తున్నాయి” అని అన్నారు. 

    నెటిజన్ల సెటైర్లు ఇలా.. 
    ‘‘ముందే పెట్రోలు ధరలు పెరిగిపోతున్నాయంటే ఆయన పది కార్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. లైఫ్‌ అంటే మినిమం ఇలా ఉండాలి’’

    ‘‘జోక్‌ ఏంటంటే.. 75 శాతం హాజరు లేకపోతే మేము పరీక్ష కూడా రాయలేం. కానీ, ఈ అత్యాచార దోషి జైలుకు హాజరుకాకుండా తన భారీ కాన్వాయ్‌తో తిరుగుతూ విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తున్నాడు’’

    ‘‘ఈ దేశంలో అసలు ఏమి జరుగుతోంది? మీడియాకూ అతడిని అత్యాచార దోషి అని చెప్పే ధైర్యం కూడా లేదు’’

    ‘‘ఈ దేశంలో ఏమి జరుగుతోంది సోదరా? వీళ్లకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు? దీనికి మొత్తం ప్రజలే కారణం. ఈ చెత్త పరిస్థితుల నుంచి మనకు ఎప్పటికీ విముక్తి రాదేమో..’’

    ‘‘ప్రభుత్వం ఇతడి కాన్వాయ్‌లో ఇంకో 10 వాహనాలు చేర్చాలి. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలి. ఈ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతే ఎలా?’’

    ‘‘మోదీ తన కాన్వాయ్‌ను 2 కార్లకు తగ్గించారు. అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ అంతకంటే పెద్ద వ్యక్తినా? పెట్రోల్, డీజిల్ ఖర్చుల నియంత్రణ చర్యల గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయమే అతనికి తెలియనట్టుంది’’.

  • చెన్నై: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన త్రిభాషా సూత్రం అమ‌లుపై  త‌మిళ‌నాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయ‌డం స‌రికాద‌న్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) జారీ చేసిన ఉత్త‌ర్వులను ఉప‌సంహ‌రించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు భిన్నంగా సీబీఎస్‌ఈ వ్య‌వ‌హ‌రించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

    పాఠ‌శాల‌ల్లో త్రిభాషా సూత్రం అమ‌లు చేయ‌డానికి తాను వ్య‌తిరేకం కాద‌ని, కానీ తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మూడు భాషలు అభ్యసించాలని ఒత్తిడి చేయ‌డం త‌గ‌ద‌ని హిత‌వు పలికారు. తక్కువ సమయంలోనే ఒక కొత్త భాషను నేర్చుకోవాలని పిల్ల‌ల‌పై ఒత్తిడి చేస్తే వారి చ‌దువుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో చెప్పిన‌ట్టుగానే 2029 నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమ‌లు చేయాల‌ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖను కోరారు.

    ''ఆరో త‌ర‌గ‌తి నుంచే విద్యార్థులు మూడు భాష‌లు నేర్చుకోవాల‌ని, వాటిలో రెండు భారతీయ భాష‌లు ఉండాలని ఏప్రిల్‌లో సీబీఎస్‌ఈ చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన వారిలో నేనూ ఒకడిని. ఈ నిర్ణయం వల్ల పిల్లలు చిన్న వయస్సు నుంచే అనేక భాషలను నేర్చుకోవడానికి వీలవుతుంది. భారతదేశపు విభిన్న సాహిత్య ప్రపంచంపై వారి అవగాహనను విస్తృతం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థుల‌కు మూడో భాషను 2029-30 విద్యా సంవత్సరం నుంచి మాత్రమే తప్పనిసరి చేస్తామని ఆ ఉత్త‌ర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

    అయితే ఈనెల 15న తన అనుబంధ పాఠశాలలన్నింటికీ సీబీఎస్‌ఈ పంపిన ఉత్త‌ర్వుల్లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే తొమ్మిదవ తరగతి విద్యార్థులు కొత్త‌గా మూడో భాష‌ను నేర్చుకోవాల‌ని ఆదేశించారు. దీని ప్ర‌కారం జూలై 1 నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులు త‌ప్ప‌స‌రిగా మూడు భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో కొత్త భాష నేర్చుకోవాలంటే ఒత్తిడి పెరుగుతోంది. ఫ‌లితంగా విద్యార్థుల చ‌దువుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. సీబీఎస్‌ఈ తాజాగా వెలువ‌రించిన ఉత్త‌ర్వులు తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. త‌క్ష‌ణ‌మే ఈ ఉత్త‌ర్వుల‌ను వెనక్కి తీసుకోవాలి. గ‌త ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ట్టుగానే 2029-30 విద్యా సంవత్సరం నుంచే తొమ్మిదవ తరగతికి త్రిభాషా సూత్రం అమ‌లు చేయాల‌ని కేంద్ర‌ విద్యా మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాన''ని అన్నామ‌లై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 

    ఏమిటీ త్రిభాషా సూత్రం?  
    జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమై, తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్‌ పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

    చ‌ద‌వండి: త‌మిళ‌నాడు ఏఐ మంత్రి ఆయ‌నే

  • ప్రముఖ చలనచిత్ర దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీలకు  భారీ షాక్‌ తగిలింది.  వీరి నిర్మాణ సంస్థ ‘టైగర్ బేబీ’ (Tiger Baby)లో విలువైన డేటాను తస్కరించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ సంస్థ కార్యాలయం నుండి, ముఖ్యమైన సినిమా , OTT సంబంధిత డేటా నిక్షిప్తమై ఉన్న 66 హార్డ్ డిస్క్‌లు దొంగతనం ఆరోపణలపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ నిజాలు తెలిశాయి. 

    ఈ డిస్క్‌ల మార్కెట్ విలువ సుమారు రూ. 13 లక్షలు ఉంటుందని అంచనా.  ఇంకా  విడుదల కాని సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన 2026 మే నెలలో 66 హార్డ్ డిస్క్‌లు దొంగతనానికి గురయ్యాయి. ఈ డిస్క్‌లలో 16TB నుండి 72TB వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందని వారి ఫిర్యాదు ద్వారా తెలుస్తోంది. ఈ ఫుటేజ్‌తోఆటు, రఫ్ ఎడిట్స్, యాడ్ ప్రాజెక్ట్‌లు, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , ముగిసిన సినిమాల బ్యాకప్ డేటా ఉన్నాయి.

    ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ‘మేడ్ ఇన్ హెవెన్’ (Made in Heaven) సిరీస్, అలాగే 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఘోస్ట్ స్టోరీస్’ (Ghost Stories) ప్రాజెక్ట్‌లకు సంబంధించిన డేటా కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటిల్లో కొన్ని డిస్క్‌లు గ్రే మార్కెట్‌లో విక్రయించగా,  గోప్యమైన డేటా లీక్ అయ్యే అవకాశాలపై నిపుణుల విచారణ చేపట్టారు.

    ఇంటిదొంగల పనే 
    మే 21న ఆఫీస్ సిబ్బంది పని కోసం హార్డ్ డిస్క్‌లను వెతకగా అవి కనిపించలేదు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ,  హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న మెహజబీన్ ముస్తాక్ షేక్ అంతర్గతంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. స్టోరేజ్ క్యాబినెట్‌లో ఉన్న అసలైన హార్డ్ డిస్క్‌లను దొంగిలించి, వాటి స్థానంలో ఖాళీ లేదా పాడైపోయిన డబ్బాలను ఉంచినట్లు గుర్తించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఈకేసులో ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్‌ చేశారు.  మొదటివాడు ఆ స్టోరేజ్ క్యాబినెట్‌ను పర్యవేక్షించే ఆఫీస్ ఉద్యోగే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గ్రే మార్కెట్ (Grey Market)లో ఒక్కో హార్డ్ డిస్క్‌ను రూ. 15,000 నుండి రూ. 20,000 లకు విక్రయించినట్లు తెలిపాడు. ఇక రెండో నిందితుడు బోరివలికి చెందిన ఒక వ్యక్తి ఈ డిస్క్‌లను కొనుగోలు చేయగా, పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు వీరికి మే 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

    సైబర్ నిపుణుల దర్యాప్తు
    దొంగిలించబడిన వాటిలో 24 హార్డ్ డిస్క్‌లను నిందితుడు అమ్మేయగా, మిగిలిన వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, హార్డ్‌వేర్ దొరకడం కంటే కూడా అందులోని రహస్య డేటాను ఎవరైనా కాపీ చేశారా? లేదా ఆన్‌లైన్‌లో ఎక్కడైనా లీక్ చేశారా? అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వినోద పరిశ్రమలో డేటా సెక్యూరిటీ (సమాచార భద్రత) ఎంత ముఖ్యమనే దానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.

  • డిస్పూర్‌: ఇస్లాం మత ఆచారం ప్రకారం బక్రీద్ రోజున ప్రత్యేక నమాజ్ అనంతరం జంతువులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ వారం జరగనున్న బక్రీద్‌లో గోమాతను బలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు తీర్మానం చేశాయి. ఈ తీర్మానంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కృతజ్ఞతలు తెలిపారు.

    అస్సాం అసెంబ్లీలో హిమంత మాట్లాడుతూ.. ‘ఈసారి అస్సాంలోని అనేక ముస్లిం సంఘాలు హిందువుల భావాలను గౌరవిస్తూ గోవు బలి చేయకూడదని నిర్ణయించాయి’ అని అన్నారు. హోజాయ్, ధుబ్రి, బోంగాయిగావ్, ఉదర్బోండ్ ప్రాంతాల్లోని ఇద్‌గాహ్, కబ్రిస్తాన్ కమిటీలు అధికారిక ప్రకటనలు జారీ చేసి, బక్రీద్ సందర్భంగా గోవు బలి చేయకూడదని విజ్ఞప్తి చేశాయి. ధుబ్రి టౌన్ ఇద్‌గాహ్ కమిటీ విడుదల చేసిన ప్రకటనలో, బక్రీద్ రోజున గోవు బలి చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది.

    కమిటీలు పేర్కొన్నది ఏమిటంటే, ఇస్లాంలో గోవు బలి తప్పనిసరి కాదు. హలాల్ జంతువులలో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా బలిదానం చేయవచ్చని ఇస్లామిక్ న్యాయశాస్త్రం చెబుతోంది. అందువల్ల గోవు బలి చేయకపోవడం మతపరమైన ఆచారానికి విరుద్ధం కాదని వారు వివరించారు. హిమంత బిశ్వ శర్మ ఈ నిర్ణయాన్ని ‘సామాజిక-మతపరమైన ఐక్యతను బలపరిచే గొప్ప అడుగు’గా అభివర్ణించారు. ఇంకా నిర్ణయం తీసుకోని సంఘాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

     

     

  • ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో జిమ్ ట్రైనర్‌  మహ్మద్ దీపక్  గుర్తున్నారా? ఓ వృద్ధ ముస్లిం వ్యాపారిని వేధింపుల నుండి కాపాడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపక్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతోపాటు, అనేక ఇతర ప్రముఖులు, నేతలు కూడా ఆయనపై  ప్రశంసలు కురిపించారు.. ఆ సంఘటన జరిగిన కేవలం నాలుగు నెలలకే సర్వస్వం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగింది?  

     మానవత్వం చాటుకున్నందుకే ..ఇలా 
    ఆ ప్రశంసలు మాట ఎలా ఉన్నా,ప్రస్తుతం ఆయన భారీ అప్పుల్లో మునిగిపోవడమే కాకుండా, తన జిమ్ వ్యాపారాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మానవత్వాన్ని చాటుకున్నందుకు ఒకవైపు న్యాయపరమైన పోరాటం, మరోవైపు ఆర్థిక దివాలా అంచున ఉన్న కుమార్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.  ఈ ఘటన తర్వాత కుమార్ తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. జిమ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. గతంలో 150 మంది సభ్యులతో కళకళలాడే జిమ్‌కు, ఇప్పుడు రోజుకు కేవలం 15 మంది మాత్రమేపరిమితమైపోయింది. ఆర్థికంగా  చితికిపోయాడు. మతపరమైన విభజన కారణంగా కుమార్ ఒంటరివాడయ్యారు. గత నాలుగు నెలలుగా జిమ్ అద్దె చెల్లించలేక, అటు ఇంటి లోన్ ఈఎంఐలు (EMIs) కూడా నానా కష్టాలు పడుతున్నారు.

    ఖాళీ చేయాలని నోటీసు
    ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి తారస్థాయికి చేరిన వేళ, కుమార్ ఉంటున్న ఇంటి యజమాని ఆయనకు ఎగ్జిట్ (ఖాళీ చేయాలంటూ) నోటీసు ఇచ్చారు. అయితే ఇది కేవలం అద్దె బకాయిల కోసం ఇచ్చిన నోటీసు కాదని, ఆ వృద్ధ ముస్లిం వ్యాపారికి మద్దతుగా నిలిచినందుకు ప్రతికారంగానే తనను ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని కుమార్ ఆరోపిస్తున్నారు. స్థానికంగా తనపై ఉన్న సామాజిక ముద్ర కారణంగానే వ్యాపారం చేసుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మతపరమైన అసహనానికి వ్యతిరేకంగా తాను తీసుకున్న నిర్ణయమే తన ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన వాపోతున్నారు.

    ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్‌ఈ

    కాగా ఈ ఏడాది జనవరి 26న కోట్‌ద్వార్‌లో 'కుమార్' అనే జిమ్ యజమాని, స్థానిక దుకాణదారుడైన వకీల్ అహ్మద్‌ను బజరంగ్ దళ్ సభ్యులు వేధించడాన్ని చూశారు. వకీల్ అహ్మద్ తన షాప్ పేరులో ఉన్న "బాబా" అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పదం కేవలం స్థానిక దేవుడికి మాత్రమే పరిమితమని వారు వాదించారు. అయితే ఈవివాదంలో  కుమార్ జోక్యం చేసుకుని వృద్ధుడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కుమార్ ధైర్యాన్ని, మత సామరస్య నిబద్ధతను అభినందించారు.

    ఇదీ చదవండి: షాకింగ్‌ ఘటన : మృత్యువు ఇలా కూడా..!

  • ‘ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణమైన ఆహారం’ ఉత్పత్తి అయ్యేలా చూడాలన్న నిర్ణయానికొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘ప్రజలు తినే ఆహారం ΄పౌష్టిక విలువలతో కూడిన ఔషధం’గా ఉండేలే గాని, వారిని అనారోగ్యం పాలు చేసే విధంగా ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం ‘సేహత్‌’ (సైన్స్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ హెల్త్‌ త్రూ అగ్రికల్చరల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌– ఎస్‌ఈహెచ్‌ఏటీ) పేరిట ప్రత్యేక మిషన్‌  ప్రారంభమైంది. 

    భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌), భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)లు ‘సేహత్‌ మిషన్‌’ను సంయుక్తంగా అమలు చెయ్యనున్నాయి. వ్యవసాయం, పౌష్టికత, ప్రజల ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించటానికి సేహత్‌ మిషన్‌ దోహదపడుతుంది. 

    దేశం  పోషకాహార లోపం, పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు అనే రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో సేహత్‌ మిషన్‌  ప్రారంభమైంది. సమీకృత సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు, తోటలు, కోళ్లు, పశువుల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. 

    ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్‌ఈ

    సరైన ఆహారపు అలవాట్లు, పంటల ఎంపిక, ఆరోగ్యదాయకమైన పశు పోషణకు సరైన శాస్త్రీయ పద్ధతులను వర్తింపజేస్తుంది. తద్వారా అనారోగ్యాలను నివారించడంలో, వ్యాధుల నిర్వహణకు తోడ్పడటంలో, తద్వారా ఔషధంగా పనిచేయడంలో ఆహారం ΄పోషించే పాత్రను ఈ మిషన్‌ నొక్కి చెబుతుంది. 

    ఇదీ చదవండి: షాకింగ్‌ ఘటన : మృత్యువు ఇలా కూడా..!

Movies

  • సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 

    ఈ సినిమాకు కథ మురళి. త్వరలో విడుదల కాబోతున్న ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉండబోతోందని, త్వరలో ప్రేక్షకులు మహేంద్రగిరి వారహి టీజర్ తో సరికొత్త అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.
     

  • ‘‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్‌తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్‌గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు.  రాత్రిపూట ఆ మ్యాచ్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. స్క్రీన్‌పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అన్నారు  ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    బుచ్చిబాబు  ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్‌గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.

    రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్‌గా తీసుకుంటారు.  పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.

    ఈ సినిమాలో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్‌పై వర్క్ చేశారు. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్‌లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్‌లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్‌గా కనిపిస్తుంది.

    ఇందులో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్‌లో చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్‌లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్‌గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

    ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.

    నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.

    ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్‌ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్‌పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాం.

    శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్‌ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా ఉంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్‌లు, కొండ ప్రాంతాలు, వాటర్‌ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.

    నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్‌లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్‌లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

    రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

    నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.  

    ఈ సినిమాకి మా అబ్బాయి కూడా పని చేశాడు. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్‌ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు.

  • బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే డ్యాన్స్‌ వీడియో ఒకటి గత రెండు రోజులుగా నెట్టింట్‌ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన కొత్త మూవీ ‘చాంద్ మేరా దిల్’సినిమాలోని వీడియో అది. అందులో అనన్య సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆ డ్యాన్స్‌ చూస్తే భరతనాట్యంలా అనిపించినప్పటికీ.. స్టెప్పులు మాత్రం ఇబ్బందికరంగా,వింతగా ఉండడంతో నెటిజన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అలా స్టెప్పులేని భరతనాట్యాన్ని అవమానపరిచిందంటూ అనన్యపై ఫైర్‌ అవుతున్నారు.‘ట్రెడిషనల్‌ భరతనాట్యం వర్సెస్‌ బాలీవుడ్‌ నాట్యం’ అంటూ మీమ్స్‌ కూడా క్రియేట్‌ చేసి.. అనన్యను విమర్శిస్తూ కామెంట్స్‌ పెడుతున్నారు. 

    తాజాగా ఈ ట్రోలింగ్‌ వీడియోపై అనన్య పాండే తండ్రి, ప్రముఖ నటుడు చంకీ పాండే స్పందించాడు. చిన్న క్లిప్పు చూసి జడ్జ్‌ చేయడం కరెక్ట్‌ కాదని, సినిమా చూసి అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాక స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. సినిమాలో భరతనాట్యాన్ని ప్రదర్శించలేదని, అది కల్చరర్‌ ఈవెంట్లలో విద్యార్థులు ప్రదర్శించే ఫ్యూజన్‌ డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌ లాంటిదని చంకీ పాండే వివరణ ఇచ్చారు. చాలా మంది అపార్థం చేసుకొని తన కూతురిని విమర్శిస్తున్నారని ఆయన .పేర్కొన్నారు.

    ‘చాంద్ మేరా దిల్’ విషయానికొస్తే.. లక్ష్య్‌, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి వివేక్‌ సోనీ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాలేజీలోనే ప్రేమించుకున్న ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లోకి వెళ్ళాక వచ్చిన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఈ సినిమా కథ. హైదరాబాద్‌ నేపథ్యంలోనే కథనం సాగుతుంది. 

  • రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నేనెవరు?’. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘నువ్వేకావాలి’, ‘ప్రేమించు’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రశ్నను ప్రతిబింబించేలా “నేనెవరు?” అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనాన్ని సిద్ధం చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. 

    ముఖ్యంగా క్లైమాక్స్,  రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని తెలిపారు. టెక్నికల్‌గా కూడా సినిమా మంచి స్థాయిలో రూపొందిందని, సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తాయని చిత్రబృందం వెల్లడించింది.  మే 29న థియేటర్లలో విడుదల కానున్న “నేనెవరు?” చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.
     

  • ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘బలగం’ ఫేం వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇప్పటికే సినిమా టైటిల్‌తో పాటు హీరోగా దేవిశ్రీని పరిచయం చేస్తూ రిలీజ్‌ చేసి గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా  ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోని రిలీజ్‌ చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్‌ సొంతూరు  వెదురుపాక, అక్కడ అమ్మవారి జాతర విశేషాలను పంచుకున్నాడు.

    తాను చెన్నైలో పెరిగినప్పటికీ.. నాన్నగారి సొంతూరు వెదురుపాక(తూర్పు గోదావరి జిల్లా) కు తరచూ వచ్చేవాడినని దేవి గుర్తు చేసుకున్నాడు. తమ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు వీడియో ద్వారా పంచుకున్నాడు. వెదురుపాక గ్రామ సంస్కృతి, అక్కడి జానపద కళల గురించి వివరిస్తూ.. ఆకారణంగానే తాను ‘ఎల్లమ్మ’ కథకి ఎస్‌ చెప్పానని ఆయన అన్నారు. ఈ వీడియోలో పల్లెటూరి వాతావరణాన్ని, పోలేరమ్మ, ఎల్లమ్మ జాతరను,  శివసత్తుల పూనకాలు, సాంప్రదాయ పులి వేషాలు, డప్పు వాయిద్యాలను చూపించారు. అంతేకాదు ఊరి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. డ్యాన్స్‌ కూడా చేశాడు. 
     

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్‌ నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

    ఆ ట్వీట్‌లో ‘10వ తరగతి చదువుతున్న  సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది.  మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.

    కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.

    ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు.

    మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

     

     

  • విజయవాడ:   ఏపీలో ఒకవైపు తీవ్రమైన ఎండలు.. మరొకవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండతో కాసింత ఉపశమనం పొందామనుకునే లోపే పిడుగులతో కూడిన వర్ష బీభత్సంతో ప్రజలు హడలిపోతున్నారు. 

    ఈ రోజు(మంగళవారం, మే 26వ తేదీ) చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. 

    అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

    తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. మండల పరిధిలోని కారుమంచివారి కండ్రిగ గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతిచెందాడు. - గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద క్రికెట్ ఆడుతుండగా ప్రమాదం జరిగింది.   మృతుడు కారుమంచి వారు కండ్రిగ గ్రామానికి చెందిన  తోప్పని యశ్వంత్(22) గా గుర్తింంచారు. 

    అదేవిధంగా పట్టణంలోని ఎల్ ఏ సాగరం గిరిజన కాలనీలోని పాఠశాల ఆవరణంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు పడి ఆ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. అయితే సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

Business

  • కేంద్ర ప్రభుత్వం పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా, పంపిణీ సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నిబంధనలను సవరించింది.

    పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త నిబంధనలతో గృహ వినియోగదారులు పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. భవిష్యత్తులో పీఎన్‌జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారితే.. మళ్లీ ఎల్‌పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.

    ఈ నిర్ణయం.. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు పొందేవారికి, వలస కుటుంబాలకు, అద్దె ఇళ్లలో నివసించే వారికి, విద్యార్థులు, తరచూ ప్రాంతాలు మారే కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

    దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ వారం 68 శాతం భారత కుటుంబాలు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. గత వారం ఇది 57 శాతంగా ఉండగా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.

    ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన అవసరాలకు పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా పడుతోంది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 20 శాతం మంది తమ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ధరల కంటే రూ.300 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.

  • ఐషర్‌ మోటర్స్‌ తాజాగా వోల్వో గ్రూప్‌తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్‌ సర్వీసెస్ (వీఎఫ్‌ఎస్‌) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.

    ప్రస్తుతం ఐషర్‌ (ఈఎంఎల్‌), వోల్వో గ్రూప్‌నకు వోల్వో ఐషర్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (వీఈసీవీ) పేరుతో జాయింట్‌ వెంచర్‌ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్‌లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్‌ ఉత్పత్తులకు క్యాప్టివ్‌ ఫైనాన్సింగ్‌ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్‌తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్‌ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్‌ చైర్మన్‌ సిద్ధార్థ లాల్‌ తెలిపారు.

  • గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ కంటే తక్కువ జనాభా కలిగిన తైవాన్, భారతదేశాన్ని అధిగమించి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా నిలిచింది. తైవాన్ మార్కెట్ విలువ సుమారు 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ డేటా వెల్లడించింది.

    తైవాన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్. ముఖ్యంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC) అనే చిప్ తయారీ సంస్థ భారీ వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది 49% వరకు పెరగడం వల్ల తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది.

    టీఎస్ఎంసీ ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా.. ఎన్విడియా, ఆపిల్, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్, క్వాల్‌కామ్ ఉపయోగించే అధునాతన చిప్‌లను తయారు చేసి సరఫరా చేస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు ఏఐ, సెమీకండక్టర్ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ.. తైవాన్ మార్కెట్‌లోకి పెద్ద మొత్తంలో నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా తైవాన్ మార్కెట్ వేగంగా ఎదిగింది.

    అయితే.. ప్రస్తుతం భారత్ పరిస్థితి భిన్నంగా మారింది. పెరుగుతున్న ఇంధన ధరలు, రూపాయి విలువ తగ్గడం, కార్పొరేట్ లాభాల మందగింపు వంటి కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు.. భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు. అంతే కాకుండా గ్లోబల్ ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్‌కు ఇంకా పెద్ద స్థాయిలో లిస్టెడ్ కంపెనీలు లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.

    భారతదేశానికి పెద్ద ఆర్థిక వ్యవస్థ, 140 కోట్లకుపైగా జనాభా, వేల సంఖ్యలో లిస్టెడ్ కంపెనీలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఎక్కువగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మార్కెట్లవైపు వెళ్తోంది. కానీ ఇప్పుడు తైవాన్.. భారత్‌ను అధిగమించడం అనేది ఇండియాకు పెద్ద నష్టం కాదు. ఈ సమయంలో కూడా దేశీయ పెట్టుబడిదారుల బలం, SIPలు, రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతుతో భారత మార్కెట్ స్థిరంగా కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు.

  • సామాజిక భద్రతా పథకం ‘అటల్‌ పెన్షన్‌ యోజన’ (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 10 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌ ఎస్‌ రామన్‌ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.

    అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్‌ పేర్కొన్నారు.

    ఎన్‌పీఎస్‌ కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18–25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్‌ చెప్పారు. ఎన్‌పీఎస్‌ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్‌ తెలిపారు. ఈ ఏడాది ఎన్‌పీఎస్‌ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు.

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై అదనపు భారం పడకుండా 76 రోజుల పాటు ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, చాలా రోజులకు ముందే పెరగాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతకాలం వరకు ప్రజలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.

    ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా.. ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉపశమనం కల్పించిందని సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం ఆ సమయంలో పన్ను తగ్గింపులు చేయకపోయి ఉంటే, అప్పుడే లీటరుకు రూ.10 వరకు ధరలు పెరిగేవని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ధరల పెంపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయమని, ఎందుకంటే ఆయా సంస్థలే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురును కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయని వివరించారు.

    ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొంటోందని, దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ముఖ్యంగా 'మూడు ఎఫ్‌లు' - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) విషయంలో దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ ఖర్చులు కూడా అధికమవుతున్నాయని ఆమె హెచ్చరించారు.

    ఇక విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

    ఇంధనంతో పాటు.. ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయని సీతారామన్ తెలిపారు. అలాగే బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. భారతదేశం బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇది ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

    రూపాయి విలువ పడిపోవడంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. రూపాయి బలహీనత, పెట్టుబడుల పరిస్థితులపై ప్రజల నుంచి, వివిధ విభాగాల నుంచి అనేక సూచనలు వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

    ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!

  • ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ సాధారణ వాటాదారులకు దుబాయ్‌ సంస్థ ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన దాదాపు 41.56 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 280 ధరలో చేపట్టిన ఆఫర్‌ జూన్‌ 12న ముగియనుంది.

    ఈ నెల మొదట్లో ఆర్‌బీఎల్‌లో 74 శాతం వాటా కొనుగోలుకి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతిపాదిత 3 బిలియన్‌ డాలర్ల(రూ. 26,850 కోట్లు) డీల్‌ దేశీ బ్యాంకింగ్‌ పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడికాగా.. బ్యాంక్‌ తదుపరి వృద్ధికి నిధులు ఉపయోగపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో ఆర్‌బీఐ సైతం ఇందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. 

Politics

  • హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేవని, మెస్‌ చార్జీలు పెంచినా, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదన్నారు. 

    విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతానని, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే  అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. అవే డబ్బులు విద్యకు ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు సరైన ప్రొటీన్‌ ఫుడ్‌ అందడం లేదన్నారు రాజగోపాల్‌రెడ్డి.

  • సోషల్ మీడియాలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రోజుల వ్యవధిలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎంతలా అంటే భారత్‌లో ప్రధానంగా ఉన్న రాజకీయా పార్టీలను వెనక్కు నెట్టి మరీ ఈ పార్టీ దూసుకుపోయింది  ఏ నోట విన్నా సీజేపీ అనే స్థాయికి ఈ సోషల్‌ మీడియా పార్టీ చేరింది. అయితే దీన్ని నెలకొల్పంది అభిజీత్‌ దిప్కే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన అభిజిత్‌.. ఇటీవల దీన్ని సోషల్‌ మీడియా వేదికగా లాంచ్‌ చేయగా విశేషమైన ఆదరణ లభించింది. 

    అయితే దీనికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్‌ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    ఆ పేరును నాకిచ్చేయండి..
    హరియాణాలోని పానిపట్‌కి చెందిన న్యాయవాది సుధీర్‌ జాకర్ సీజేపీని తన పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తానే పార్టీ జాతీయ కన్వీనర్ అని ప్రకటించుకున్నాడు, దీన్ని అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్‌ దిప్కే నుంచి వేరు చేసి తన పేరుతో పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుధీర్‌ జాకర్‌..  కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాడు. 

    ఆ పేరును తనకు కేటాయించాలని కోరుతూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్‌ చేసుకోవడానికి భారత్‌కు రమ్మంటే రానంటున్న అభిజిత్‌ దీప్కే  నుంచి ఆ పార్టీని వేరు చేయాలని దరఖాస్తులో కోరారు. ‘యువతలో కోపం పెరుగుతోంది. ఎవరైనా ముందుగా ఈ పేరును నమోదు చేసి దుర్వినియోగం చేస్తే ఉద్యమం నశిస్తుంది. అందుకే నేను ముందుకు వచ్చాను’ అని దరఖాస్తు చేసుకునే క్రమంలో చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది. 

    ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత గత గురువారం భారతదేశంలో సీజేపీ ‘ఎక్స్‌’ ఖాతాను నిలిపివేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రెండ్‌లలో  ఒకటిగా అవతరించిన సీజేపీని ప్రస్తుతం బ్యాన్‌ చేశారు.  మరి ఇది పార్టీగా రూపాంతరం చెందుతుందా? తుపాను వేగంతో వచ్చిన ఈ పార్టీకి ఇక్కడతోనే కథ ముగిసినట్లా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా సీజేపీ ఇప్పుడు అసలు స్థాపకుడు అభిజీత్‌ దిప్కే వర్సెస్‌ జాకర్‌ మధ్య యాజమాన్య పోరుకు తెరతీయడం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

  • న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహగానాలు వస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ వేర్వేరుగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాటిచ్చిన మేరకు తనకు సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఐదేళ్లపాటు తననే సీఎంగా కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నారు. సీఎం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, డీకే శివకుమార్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన‍్నదే అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది.

    సిద్ధరామయ్యకు క్షేత్రస్థాయిలో ప్రజాబలం, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నాయి. డీకే శివకుమార్‌కు మంచి వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్‌గా అనుభవం ఉంది. సిద్ధరామయ్యను మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్ఠానం ఉంది. సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు, తదితర అంశాలను సిద్ధరామయ్య వివరించారు. ఏ మార్పు అయినా  రాజ్యసభ ఎన్నికల తర్వాత ఉండొచ్చు.

    దీనికి మించి ఏమీ లేదు: వేణుగోపాల్‌ స్పష్టం 
    ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం మార్పు వార్తలన్నీ ఊహగానాలేనని తెలిపారు. రాజ్యసభ , కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించామని, ఇవి కాక మరే విషయాలపైనా చర్చించలేదని చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా ఉన్నారు.

    ‘‘మీవన్నీ కేవలం ఊహాగానాలే, అందులో నిజం ఏమీ లేదు. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సమావేశం నిర్వహించాం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, కర్ణాటక ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి, నేను ఈ చర్చలో పాల్గొన్నాం. మొత్తం చర్చ రానున్న రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే సాగింది. కర్ణాటక రాజ్యసభ, కౌన్సిల్ స్థానాల అభ్యర్థుల పేర్లను ఇతర రాష్ట్రాల స్థానాల అభ్యర్థులతో పాటు ప్రకటిస్తాం. ఈ రోజు మేం తీసుకున్న నిర్ణయం ఇదే, దీనికి మించి ఏమీ లేదు" అని వేణుగోపాల్‌ అన్నారు.

  • వైఎస్సార్‌ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎస్ మాల్ అంశం టీడీపీలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ప్రొద్దుటూరు మాజీ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ప్రవీణ్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

    ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌లో వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఈ మాల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రవీణ్‌ రెడ్డి కలెక్టర్‌, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

    ప్రవీణ్‌ రెడ్డి ఫిర్యాదుతో ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌లో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు వెళ్లారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రవీణ్‌ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై రాళ్లదాడి చేశారు.ప్రతిగా ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్లు విసిరారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అదనపు బలగాలను మోహరించారు.
     

  • తాడేపల్లి : కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా, ఇంతవరకూ ఎన్నికల హామీలు నెరవేర్చలేదని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విఫలమైందని, దాన్నుంచి తెప్పించుకునేందుకు జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయని,  ఏ వర్గానికీ కూడా మేలు జరిగిన పరిస్థితే లేదన్నారు.

    ఈరోజు(మంగళవారం, మే 26వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. మాట్లాడితే అసెంబ్లీకి రమ్మంటారు.. వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలుసన్నారు. జగన్ మీడియా సమావేశంలో సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు. ఇప్పటివరకు మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. 

    కనీసం అప్పులు దేనికి ఖర్చు చేశారో కూడా చెప్పటం లేదు. వైఎస్సార్‌సీపీ రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని గతంలో ప్రచారం చేశారు. కానీ వైఎస్సార్‌సీపీ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసింది. సంక్షేమం, అభివృద్ధి అజెండా గా మా ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..

    గతంలో పవన్ 35 వేల మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అఘాయితులపై మాట్లాడే దైర్యం చేయటం లేదు. అప్పట్లో సుగాలీ ప్రీతి విషయంలో ఊగిపోయారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేస్తూ లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి మేలు జరగటం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మెగా డీఎస్సీ అన్నారు. దాన్ని కూడా సరిగ్గా నిర్వహించకపోవటంతో అనేక విమర్శలు వస్తున్నాయి. డిఎస్సీ లో పేపర్ లీక్ దగ్గర నుంచి అనేక మోసాలు చేశారు..

    ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారు. కక్ష్య కట్టుకుని ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.మెడికల్ కళాశాలల పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరం అస్తవ్యస్తం చేశారు. పోర్ట్స్ కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధం అయ్యారు. మంత్రులు తమ శాఖల సంగతి వదిలేసి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. క్యాబినెట్ మొత్తం జగన్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలను చేపలు తిననివ్వకుండా చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ముందు పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మమత బెంగాల్ ఆహార సంస్కృతిపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. 

    “బెంగాల్ ప్రజలు చేప-అన్నంతో జీవిస్తారు. బీజేపీ వాళ్లు బెంగాల్ ప్రజలను చేపలు తినొద్దు, మాంసం తినొద్దు, గుడ్లు తినొద్దు అంటున్నారు. మరి వాళ్లు ఏమి తింటారు?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయితే, అధికారంలోకి వచ్చినా అలాంటి చర్యలు తీసుకోబోమని బీజేపీ అప్పట్లోనే హామీ ఇచ్చింది. అనురాగ్ ఠాకూర్ సహా పలువురు బీజేపీ నేతలు బహిరంగంగా మాఛ్-భాత్ విందుల్లో పాల్గొన్నారు. బెంగాలీ సంస్కృతిపై తమకు అనుబంధం ఉందని చూపించే ప్రయత్నంలో నామినేషన్ ర్యాలీల్లో చేపలు చేతబట్టి కనిపించారు. ఇప్పుడు బీజేపీ చెప్పింది చెప్పినట్లు చేస్తోంది. 

    ఇప్పుడు సీఎం ఏం చేశారు? 
    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. వాటిల్లో తక్కువ ధరలో చేప కూరతో భోజనం అందించే పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో రూ.5కే ఫిష్‌ రైస్‌ మీల్స్‌ అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

    అలాగే, అన్నపూర్ణ యోజన, మద్యం దుకాణాలపై నిబంధనలు, ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఆయన ప్రకటించారు. సువేందు అధికారి మాట్లాడుతూ.. మే 27 నుంచి అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.3,000 అందిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటర్ పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు.

    “అన్నపూర్ణ యోజన దరఖాస్తు పత్రాలు రాష్ట్ర సచివాలయం నుంచి అందిస్తాం. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు భారతీయులందరికీ అర్హత ఉంటుంది” అని కల్యాణి, నాడియా జిల్లాలో జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం సువేందు అధికారి మీడియాతో చెప్పారు. ప్రత్యేక ఆయుష్ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందులో ఆయుర్వేదం, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి ఉంటుందన్న విషయం తెలిసిందే.

    మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సువేందు అధికారి వరుసగా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తూ రాష్ట్రానికి సంబంధించి కీలక  నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పడింది.

  • తాడేపల్లి:  మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్‌కేస్‌’ అని విమర్శించారు. పేపర్‌ లీక్‌, డేటా డిలీట్‌, సూట్‌కేస్‌ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

    ‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్‌కేస్‌ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు.  నారా లోకేష్‌ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ,  స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. 

    నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు.  వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్‌ లీక్‌ చేస్తారు.. వారే డేటా డిలీట్‌ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్‌లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు.  చంద్రబాబు, లోకేష్‌, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.

    లోకేష్‌కు,  వైఎస్ జగన్‌కు పోలికే లేదు.  వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్‌రూమ్స్, టోఫెల్‌, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్‌లను తొలగించారు.  ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్‌ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే.  డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.  నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు.

Telangana

  • హైదరాబాద్‌: పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. 

    కాగా, ఈనెల 16న బండి భగీరథ్‌ను అరెస్టు చేసి, పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్‌ విచారించారు.

    మరోవైపు, భగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని భగీరథ్‌ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్‌పై రిలీజ్‌ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది.  

  • సాక్షి,హైదరాబాద్‌: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్‌కి సుచరిత ఎకరాకు లక్షరేట్‌ కార్డ్‌ ఫిక్స్‌ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్‌కి 30లక్షలు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్‌గా సుచరిత కారు డ్రైవర్‌ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్‌ నీళ్లు నమిలారు.

    ఎమ్మార్వో సుచరిత శామీర్‌పేట్‌ ఆఫీస్‌నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం  మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

    ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ  కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

    2024లో శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Family

  • అది కీలకమైన మెదడు కణమైనా.... లేదా కాళ్లూ చేతుల్లో ఉండే మామూలు కణమైనా... అది ఏదైనా సరే... దేహంలోని ప్రతి జీవకణానికీఆహారం, ఆక్సిజన్‌ అందడం అవసరం. ఒకవేళ అలా అందకపోతే... కీలకమైన మెదడూ, గుండె లాంటి వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో... మనం అంత ప్రధానం అనుకోని మిగతా కణజాలానికీ అలాంటి ప్రమాదమే జరుగుతుంది. అంటే... కాళ్లూ, చేతుల విషయంలోనూ జరుగుతుంది. అలా కణజాలానికి తగినంత ఆక్సిజన్, ఆహారం అందనందువల్ల వచ్చే అనారోగ్యం... ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’. ఈ సమస్య ఏమిటో, దానితో వాటిల్లో అనర్థాలేమిటో చూద్దాం...

    మన కాళ్లూ, చేతుల్లోని ప్రతి కణానికీ రక్త సరఫరా నిరంతరాయం జరుగుతూనే ఉండాలి. అలా జరిగినప్పుడే అవి సమర్థంగా తమ విధులు నిర్వహించగలుగుతాయి. ఏదైనా కారణాల వల్ల మన కాళ్లూ, చేతులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటంగానీ లేదా వాటిల్లో కొవ్వు పేరుకోవడంగానీ జరిగితే... నిరంతరమూ కొనసాగాల్సిన రక్తసరఫరా సాఫీగా జరగకపోవచ్చు. 

    అలా రక్తసరఫరా జరగనందువల్ల వచ్చే ఆరోగ్య సమస్యను ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’ (ప్యాడ్‌) అంటారు. పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ అనే ఈ వ్యాధి స్త్రీలూ, పురుషులూ అనే తేడాలేకుండా అందరిలో కనిపించే అవకాశముంది.

     పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిజీస్‌ ఉన్నవారిలో కాళ్లలోని పిక్కలు, నడుం కింది భాగం (హిప్‌)లో తరచూ తీవ్రమైన నొప్పితో కూడిన తిమ్మిర్లు (క్రాంప్స్‌) వస్తాయి. చాలా సందర్భాల్లో నడుస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ లక్షణం... అంటే పిక్కలు పట్టేయడం  ఎక్కువగా కనిపింవచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. అంటే ఆ సమయంలో కాలూ, చేతిలోని సదరు భాగానికి తగినంత రక్తసరఫరా అందకపోవడం వల్లనే ఇలా తిమ్మిర్లు వచ్చే అవకాశాముంది. ఇలాంటప్పుడు ఆ భాగానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వగానే ఆ నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. 

    కొందరిలో తాత్కాలికంగా స్పర్శ తెలియకుండా పోవడం (నంబ్‌నెస్‌) లేదా  సూదులతో పొట్లుగా అనిపించడం (టింజ్లింగ్‌). 

    మరికొందరిలో ఒక్కోసారి ఆ కాలు లేదా చేయి బలహీనంగా మారినట్లుగా అనిపించవచ్చు. 

    ఇంకొందరిలో విశ్రాంతిగా ఉన్నప్పుడు పాదాలకింద మంటగా ఉన్నట్లుగా లేదా పాదాలు, కాలివేళ్ల కింది భాగంలో నొప్పిగానూ, మంటగానూ ఉన్నట్లు అనిపించడం. ఇక కొందరిలో పాదాలకు లేదా కాలి కింది భాగంలో ఏదైనా పుండు వంటిది వస్తే అది ఒక పట్టాన మానకపోచ్చు.

    పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిజీస్‌ తర్వాతి దశలో కాలు/చేయి తాలూకు రంగు మారడం, అది చల్లబారినట్లుగా ఉండటం మామూలే. ఈ దశలో కొంతమందిలో కాలు /చేతి పైన ఉండే వెంట్రుకలన్నీ రాలిపో ఇక రక్తసరఫరాకు పూర్తిగా ఆటంకం ఏర్పడి గ్యాంగ్రీన్‌లా పరిణమించిన కొందరిలో... కాలు / చేయి తొలగించాల్సిన (యాంప్యుటేషన్‌కు వెళ్లాల్సినంత) తీవ్రమైన పరిస్థితి కూడా రావచ్చు.

    గుండె జబ్బులకూ/ స్ట్రోక్‌కూ అవకాశం:
    పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉందంటే అది కేవలం కాలూ, చేతికే పరిమితం అవుతుందనేందుకు వీల్లేదు. అంటే... ఎవరిలోనైనా పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉందంటే ఆ వ్యక్తిలో రక్తం సాఫీగా ప్రవహించేలాంటి తత్వం (టెండెన్సీ) లేదని అర్థం. ఇది కాళ్లూ, చేతుల్లోనే ఉంటే తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ కీలకమైన అవయవాలైన గుండె లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అదెంతో ప్రమాదకరంగా పరిణమిస్తుంది. 

    అంటే పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉన్నవారికి గుండెపో పక్షవాతం ముప్పుండే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారు తమ ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డాక్టర్‌ పర్యవేక్షణలో వారు సూచించిన విధంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 

    నిర్థారణ: 
    ఫిజికల్‌గా బయటకు కనిపించే లక్షణాలతోపాటు... ‘పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌’ను నిర్ధారణ చేయడానికి ‘యాంకిల్‌ బ్రాకియల్‌ ఇండెక్స్‌’ (ఏబీఐ) అనే పరీక్ష తోడ్పడుతుంది. ఇందులో ఎంతమాత్రమూ నొప్పి ఉండదు. ఈ పరీక్షలో అల్ట్రా సౌండ్‌ తరంగాల సహాయంతో భుజాలు / పాదాలు ఉండాల్సిన రక్తపోటునుకొలుస్తారు. ఈ ఏబీఐ పరీక్ష ద్వారా వచ్చిన ఫలితాలనూ, వ్యాధి ఉందని అనుమానిస్తున్న వ్యక్తిలోని రిస్క్‌ ఫ్యాక్టర్లనూ సరిపోల్చి చూస్తారు. 

    ఈ పరిశీలన తర్వాత... వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందా, లేదా అన్న విషయాన్ని ఫిజీషియన్‌ నిర్ణయిస్తారు. ఏబీఐ టెస్ట్‌లో... మొదట భుజం లేదా చేతిలోని రక్తపోటు (బ్లడ్‌ ప్రెషర్‌)ను... మామూలు బీపీ యంత్రంలో కొలవడంతోపాటు, డాప్లర్‌ అని పిలిచే ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్‌ స్టెతస్కోపు సహాయంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 

    ఈ వ్యాధినిర్థారణ కోసం శరీరంపై గాటు పెట్టకుండా కూడా నిర్ధారణ చేసే (నాన్‌ ఇన్వేజివ్‌) పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ సహాయంతో  ఈ నిర్ధారణ ప్రక్రియ జరుగుతుంది. ఉదాహరణకు... మాగ్నెటిక్‌ రిజోనెన్స్‌ యాంజియోగ్రఫీ (ఎమ్మార్‌ఏ), సీటీ యాంజియోగ్రఫీ వంటి ఇమేజింగ్‌ టెక్నిక్స్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధినిర్ధారణకు తోడ్పడతాయి.

    ఈ వ్యాధి ఎవరెవరిలోనంటే.. 

    వయసు యాభై ఏళ్లు పైబడ్డ ఏ వ్యక్తిలోనైనా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అయితే పెరిగే వయసు(ఏజింగ్‌)తోపాటు మరికొన్ని అంశాలూ ఈ వ్యాధికి కారణమవుతుంటాయి. అవి... 

    పొగతాగే అలవాటు ఉండటం ∙వ్యాయామం చేయకపోవడం 

    స్థూలకాయం ∙డయాబెటిస్‌ ∙నియంత్రణలో లేని రక్తపోటు / రక్తపోటు పెరగడం 

    రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం 

    ఈ లక్షణాలతో పాటు కుటుంబ సభ్యుల్లో పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌ ఉండటం అనేది ఆ ముప్పును మరింత పెంచే అంశం. అంటే కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకూ ‘ప్యాడ్‌’ రిస్క్‌ ఉందనే అంశాన్ని గుర్తెరిగి... దగ్గరి కుటుంబ సభ్యులంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    కారణాలు...
    పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌కు అనేక అంశాలు కారణమవుతుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది...  రక్తనాళాల్లోపల రక్తం ప్రవహించే పైప్‌ లోపలి పొర గట్టిబారడం. ఈ కండిషన్‌ను అథెరోస్కీఫ్లోరోసిస్‌ అంటారు. నునుపుగా ఉండే తలం మీద ద్రవం ఎలాంటి అంతరాయమూ లేకుండా సాఫీగా జారిపోతుంటుంది. ఒకవేళ ఆ తలం గరుగ్గానూ, గట్టిబారినట్లుగా మారడం వల్ల  రక్తసరఫరా సాఫీగా జరగదు. దాంతో రక్తసరఫరాకు  అంతరాయం ఏర్పడుతుంది. 

    ఇలా రక్తనాళంలోని  లోపలి తలం గరుగ్గా, గట్టిబారినట్లుగా మారడానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కొవ్వు, కొలెస్ట్రాల్‌ వంటివి రక్తప్రవాహం సాఫీగా వెళ్లే ఆ పైప్‌లోపలి తలంపై అంటుకుని అక్కడ గారలా ఏర్పడటం వల్ల రక్తప్రవాహానికి అంతరాయాలు, అడ్డంకులు ఏర్పడవచ్చు. దాంతో ఒకచోట క్రమంగా రక్తానికి ఏదైనా తట్టుకుంటూ తట్టుకుంటూ ఉండటం వల్ల క్రమంగా అక్కడ రక్తం గడ్డకట్టినట్లుగా ఓ ఉండలాగా (క్లాట్స్‌) ఏర్పడవచ్చు. ఇది ఒక్కోసారి రక్తనాళాన్ని బ్లాక్‌ చేసి రక్తసరఫరాను అపేయవచ్చు.

    చికిత్స
    పెరిఫెరల్‌ ఆర్టీరియల్‌ డిసీజ్‌కు చికిత్స చేసే ముందర బాధితుల ఫిట్‌నెస్, వ్యాధి తీవ్రత వంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కేవలం బాధితుడి జీవనశైలిలో మార్పులు చేయడంతోనే వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశముంది.ఉదాహరణకు బాధితుడికి పొగతాగే అలవాటు ఉంటే, పూర్తిగా  మానేయడం ద్వారా మున్ముందు కాలూ / చేయి కోల్పోయే పరిస్థితి తప్పిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులతో పాటు, వ్యాధి మరింత ముదరకుండా కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు మూసుకుపోయిన చోట వాటిని తెరచేందుకు అవసరమైన చికిత్స ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది.

    వాడాల్సిన మందులురక్తనాళాలు మూసుకుపోవడం అన్నది కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల జరుగుతుంటే దేహంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను నియంత్రించడానికి అవసరమైన మందులు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో కాలు /చేయి తిమ్మిర్లు తగ్గడానికి, నొప్పి తగ్గడానికి కూడా మందులు వాడాల్సి రావచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో రక్తనాళాల్లో ఏర్పడ్డ రక్తపు గడ్డ (క్లాట్‌)ను కరిగించే మందులూ ఉపయోగించాల్సి రావచ్చు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు బాధితులకు రక్తపోటును నియంత్రించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.

    ఒకవేళ జీవనశైలి మార్పులూ... మందులూ సరిపోకపోతే?
    కొందరిలో కేవలం జీవనశైలి మార్పులతోనూ లేదా మందులు వాడటం వల్ల  గాని ఈ జబ్బు అదుపులోకి రాకపోతే అప్పుడు కూడా రక్తనాళాల్లో  రక్తసరఫరాను సాఫీగా జరిగేలా చూడటానికి అనేక ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... ఎక్కడైతే రక్తసరఫరాకు అడ్డంకి ఏర్పడి... తట్టుకుంటూ రక్తసరఫరా జరుగుతుంటుందో 

    ఆ ప్రాంతాన్ని అక్కడికక్కడే తెరచి సాధారణ రక్తసరఫరాను పునరుద్ధరించవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియను గతంలోలా సంప్రదాయిక సర్జరీ రూపంలోగాక ఎలాంటి గాటూ లేకుండానే కొన్ని ప్రక్రియల ద్వారా చేయడమిప్పుడు సాధ్యమవుతుంది.

    గాటు పెట్టకుండా రక్తప్రవాహాన్ని సరిచేయడం ఇలా...
    రక్తప్రవాహానికి అడ్డుపడ్డ క్లాట్‌ను తొలగించి, రక్తసరఫరాను పునరుద్ధరించడానికి ఈ కింది పద్ధతులను అవలంబిస్తారు.  

    యాంజియోప్లాస్టీ : గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డు పడ్డప్పుడు చేసినట్లుగానే కాళ్లూ/ చేతుల తాలూకు రక్తనాళంలోనూ... అడ్డు పడ్డ ప్రాంతానికి ఒక బెలూన్‌ లాంటి దాన్ని పంపి... ఆ బెలూన్‌ను రక్తం ఆగిన చోట ఉబ్బేలా చేస్తారు. దాంతో రక్తనాళంలోని ఆ ప్రదేశంలో అడ్డు తొలగిపోయి, రక్తసరఫరా మామూలుగా అవుతుంది.

    అథెరెక్టమీ: ఈ ప్రక్రియలో రక్తనాళం (ధమని)లోకి ఒక క్యాథెటర్‌ను పంపుతారు. రక్తనాళంలోకి వెళ్లే ఒక నునుపైన పైప్‌ లాంటి దాన్ని క్యాథెటర్‌ అంటారు. దీని ద్వారా రక్తనాళం లోపలి ఉన్న గారను తొలగిస్తారు. గట్టిగా మారి ఉన్న ప్రాంతాన్ని నున్నగా అయ్యేలా చేయడం, లేదా షేవ్‌ చేసినట్లుగా నునుపుగా మార్చడం జరుగుతుంది.

    స్టెంట్‌ వేయడం: గుండెకు రక్తసరఫరా చేసే రక్తనాళం సన్నబడ్డప్పుడు ఆ సన్నటి ప్రాంతాన్ని మళ్లీ మామూలుగానే తెరుచుకుని ఉంచేలా చేస్తారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోకి పైప్‌ లాంటి దాన్ని వేసి తెరచి ఉండేలా చేసినట్లే (స్టెంట్‌ వేసినట్లే)... అచ్చం అదే తరహాలో కాలు / చేతిలోని రక్తనాళాల్లోని మూసుకుపోయి ఉన్నభాగానికి ఒక స్టెంట్‌ వేస్తారు. దాంతో మూసుకుపోయిన భాగం తెరచుకుంటుంది. ఫలితంగా ఎలాంటి అంతరాయం లేకుండా రక్తసరఫరా సాఫీగా జరిగిపోతుంది.  

    స్టెంట్‌ గ్రాఫ్ట్స్‌: కొన్ని సందర్భాల్లో ఈ స్టెంట్‌లలో సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ వంటిదాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. 

    కేవలం ఇలాంటి మార్గాలే కాకుండా కొన్నిసార్లు సాంప్రదాయికంగా చేసే శస్త్రచికిత్స ద్వారా రక్తనాళంలో ఏర్పడ్డ అడ్డంకిని తొలగించాల్సి రావచ్చు. ఒక్కోసారి రక్తనాళం అంతా మూసుకుపోతే బైపాస్‌ కూడా చేయాల్సి రావచ్చు. 

    వ్యాయామం లేకుండా ఉండటం వంటి బద్ధకంగా ఉండే జీవనశైలి, పొగతాగడం వంటి దురలవాట్ల కంటే మన దేహంలోని అవయవాలు విలువైనవి కాబట్టి... అలాంటి దురలవాట్లను వదులుకొని, చురుకైన జీవితం గడపడం అవసరం. దాంతో ఎవరిపైనా ఆధారపడకుండా జీవనం సాగించవచ్చు.

    డాక్టర్‌ రాజా వి కొప్పాల సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ , రేడియాలజిస్ట్‌

    నిర్వహణ: యాసీన్‌

    చదవండి: అచ్చం సంతూర్‌ యాడ్‌ మాదిరిగా 47 ఏళ్ల మామ్‌..! నో ఐస్‌ బాత్‌, నో క్రేజీ డిటాక్స్‌..