Archive Page | Sakshi
Sakshi News home page

Rajanna

  • ● రూ.105 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ● తొలి విడతగా 3.01 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి ● 130 మ్యాక్స్‌ సంఘాలకు ఆర్డర్లు అందిస్తున్న అధికారులు ● ఇందిరా మహిళా శక్తి చీరల రంగు, డిజైన్‌లో మార్పులు

    ఇది సిరిసిల్లలోని మరమగ్గాల(పవర్‌లూమ్స్‌) కార్ఖానా. ఇక్కడి సాంచాలపై పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. ఒక్కో మగ్గంపై నిత్యం 80 నుంచి 100 మీటర్ల బట్ట ఉత్పత్తి అవుతుంది. ఒక్కో నేతకార్మికుడు ఐదు నుంచి ఆరు సాంచాలపై వస్త్రం ఉత్పత్తి చేస్తాడు. 10 గంటలపాటు పనిచేస్తే నెలకు కూలీ(వేతనం) రూ.7వేల నుంచి రూ.10వేలు వస్తాయి. అదే ప్రభుత్వం ఇచ్చే చీరల ఆర్డర్ల బట్టను ఉత్పత్తి చేస్తే కార్మికులకు ఇచ్చే వేతనాన్ని(కూలి)ని జౌళిశాఖ నిర్ణయిస్తుంది. దీని ద్వారా మెరుగైన వేతనం అందుతుంది. ఇదే పనికి దాదాపు రెండింతలు అంటే ఒక్కో కార్మికుడికి రూ.12 వేల నుంచి రూ.18వేల వరకు ఆదాయం పొందుతాడు.

    చిలుకపచ్చ రంగులో ఇందిరా మహిళా శక్తి చీరల కొత్త డిజైన్‌

    సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం కానుకగా ఇందిరా మహిళాశక్తి చీరలను అందించేందుకు నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిరిసిల్ల నేతన్నలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుంది. ఈనెల 6న రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజారామయ్యర్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ వస్త్రోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లకు సంబంధించిన విధి విధానాలు వివరించారు. ఈమేరకు తొలివిడతగా 3.01 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను అందిస్తున్నారు. ఈ బట్ట విలువ రూ.105 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆర్డర్లు పొందిన వస్త్రోత్పత్తిదారులు నూలును దిగుమతి చేసుకుని చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. జూలై నెలాఖరులోగా చీరల బట్టను అందించాలని అధికారులు గడువు విదించారు. ప్రభుత్వ ఆర్డర్లతో వస్త్రోత్పత్తి రంగంలో మెరుగైన కూలి రేట్లు, కార్మికులకు వేతనాలు లభించనున్నాయి.

    52 మ్యాక్స్‌లకు నూలు సరఫరా

    సిరిసిల్లలో 130 మ్యాక్స్‌ సంఘాలు ఉండగా 52 సంఘాలకు నూలు అందించేందుకు అర్హత సాధించాయి. నిజానికి మ్యాక్స్‌ సంఘాల్లో బడా సేట్లు ఉన్నారు. మధ్యతరగతి ఆసాములు, వస్త్రోత్పత్తిదారులకు 90 శాతం అరువు(ఉద్దెర)పై నూలును వేములవాడ నూలు డిపో ద్వారా గతేడాది నుంచి అందిస్తున్నారు. చీరల ఉత్పత్తికి అవసరమైన నూలుకు పది శాతం డబ్బును డీడీ రూపంలో మ్యాక్స్‌ సంఘాల ప్రతినిధులు అందిస్తే.. నూలును కొనుగోలు చేసి 90 శాతం అరువుపై సరఫరా చేస్తారు. ఆ నూలు తెచ్చి భీములు పోసి, సాంచాలపై చీరల బట్టను ఉత్పత్తి చేసి, బట్టను జౌళిశాఖకు అందించాల్సి ఉంటుంది. కొంత ఆలస్యమైనా నూలును మ్యాక్స్‌లకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ఇందిరా మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం. గతేడాది తరహాలోనే బార్డర్‌తో కూడిన నాణ్యమైన వైట్‌ కలర్‌ చీరల బట్టను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆ చీరలను కొత్త డిజైన్‌లో ప్రింట్‌ చేయించి పంపిణీ చేస్తారు. ఈసారి చిలుక పచ్చనిరంగులో, ఎర్రని బార్డర్‌తో చీరలను డిజైన్‌ చేశారు. సిరిసిల్లలోని 130 మ్యాక్స్‌ సంఘాలకు ఆర్డర్లు ఇస్తున్నాం. ఇది పూర్తయితే మరో విడత చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు రానున్నాయి.

    –ఎస్‌.సంతోష్‌కుమార్‌,

    చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల

    మరమగ్గాలు

    : 27వేలు

    మ్యూచువల్‌

    ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌

    సొసైటీలు(మ్యాక్స్‌)

    : 130

    మ్యాక్స్‌ల పరిధిలో

    ఉండే మరమగ్గాలు

    : 10,120

    మ్యాక్స్‌ల్లో ఉండే

    ఆసాములు : 1,623

    వస్త్రోత్పత్తిపై

    ఆధారపడిన

    నేతకార్మికులు

    : 10 వేలు

    ప్రభుత్వ ఆర్డర్లతో

    లభించే

    ఉపాధి కాలం

    : 6 నెలలు

  • వేములవాడ: పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలో 30 మంది లబ్ధిదారులకు రూ.9.83 లక్షలు, వేములవాడ రూరల్‌ మండల పరిధిలో 13 మందికి రూ.4.32 లక్షల విలువగల చెక్కులను మంగళవారం అందజేశారు. ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

    పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

    వేములవాడరూరల్‌: నమ్మకం, విశ్వాసంతో కష్టపడి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. మంగళవారం విప్‌ను రూరల్‌ మండల అధ్యక్షుడిగా ఎన్నికై న సోయినేని కరుణాకర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని విప్‌ సూచించారు. ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు, మహిళా అధ్యక్షురాలు సోయినేని లహరి, మాజీ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్‌, బత్తిని ఎల్లయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

    సిరిసిల్లటౌన్‌: తరుచూ వరదలతో ముంపునకు గురవుతున్న శ్రీనగర్‌కాలనీ అభివృద్ధికి పాలకవర్గం పెద్దపీట వేస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ అన్నారు. మంగళవారం 2వ వార్డు సందర్శనలో భాగంగా కచ్చా కాలువలలో పూడికతీత పనులను పరిశీలించారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా బోనాల, వెంకంపేట, సర్దార్‌నగర్‌, పద్మానగర్‌, రాజీవ్‌నగర్‌ మీదుగా ఉదర కాల్వ ద్వారా వచ్చే వరదతో కొత్తచెరువు కింది ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆ నీటిని మానేరులోకి మళ్లించేందుకు శ్రీనగర్‌కాలనీ మీదుగా కచ్చాకాల్వ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్థానిక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు.

    జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి

    కిశోర బాలికలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని చైర్‌పర్సన్‌ జిందం కళ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కౌమార బాలికల హెల్త్‌ స్క్రీనింగ్‌ క్యాంపులో పాల్గొని మాట్లాడారు. 10 నుంచి 19 ఏళ్ల బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, కౌన్సిలర్‌ బత్తుల రమేశ్‌, శ్రీనగర్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి

    సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రం సిరిసిల్లలో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ ఆఫీసులో సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుందరయ్యనగర్‌లో విగ్రహం ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలర్‌ బత్తుల రమేశ్‌, దుబాల వెంకటేశం, కట్ల సతీశ్‌, వెంగళ శ్రీనివాస్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి కోడం రమణ, సూరం పద్మ, గణేశ్‌, రాజమల్లు, శ్రీరామ్‌ సదానందం, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

    ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటికి జీవనాధారమైన ఎగువమానేరు ప్రాజెక్టును కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. మంగళవారం ఎల్లారెడ్డిపేటలో మాట్లాడారు. గతంలో వచ్చిన వరదలతో రైతులకు వరప్రదాయిని అయిన నర్మాల ప్రాజెక్టు అఫ్రాన్‌ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టు గోడలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక తొలగించాలని, గొలుసుకట్టు కాల్వలకు మరమ్మతు చేయాలని కోరారు. నాయకులు మీసం లక్ష్మణ్‌, కుర్ర రాకేశ్‌ తదితరులున్నారు.

  • ● వేములవాడ పట్టణ అభివృద్ధే ధ్యేయం ● ‘సాక్షి’తో మున్సిపల్‌ కమిషనర్‌ గుండ్లూరి లోకేశ్‌

    వేములవాడ: ‘చదువే నిజమైన ఆస్తి’ అని యువతకు సందేశమిస్తూ వేములవాడ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని మున్సిపల్‌ కమిషనర్‌ గుండ్లూరి లోకేశ్‌ పేర్కొన్నారు. ఐఏఎస్‌ లక్ష్యంగా సివిల్‌ కోచింగ్‌తో ప్రయాణం ప్రారంభించారు. 2024లో గ్రూప్‌–1లో సెలెక్టు అయి వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వేములవాడ అభివృద్ధే లక్ష్యమని యువ కమిషనర్‌ వివరించారు. తొలి పోస్టింగ్‌తోనే సేవా దృక్పథంతో ముందుకు సాగుతానన్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’కి పలు విషయాలు వివరించారు.

    కుటుంబ నేపథ్యం.. చదువు

    అమ్మానాన్న మాలతి–ఆంజనేయులు. హైదరాబాద్‌లోని లింగంపల్లిలో ఉంటారు. చెల్లి లత ఎంఫార్మాసీ చదువుతున్నారు. పఠాన్‌చెరువులోని ప్రైవేట్‌ స్కూల్‌లో 1 నుంచి 10 వ తరగతి, ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌, 2022లో సీబీఐటీ నుంచి బీటెక్‌ పూర్తిచేశా. సివిల్స్‌పై దృష్టి పెట్టి 2024లో గ్రూప్‌–1లో విజయం సాధించా. 2025 సెప్టెంబర్‌లో కమిషనర్‌గా సెలెక్టు చేసి ట్రైనింగ్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కమిషనర్‌గా రాజన్న సన్నిధిలో తొలి పోస్టింగ్‌ రావడం నా అదృష్టమే. యూత్‌ ఎదగడానికి శ్రమ, క్రమశిక్షణ, కుటుంబ ప్రోత్సాహం ఉండాలి. నేను నమ్మేది చదువే నిజమైన ఆస్తి. ఈ నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

    తొలి పోస్టింగ్‌ వేములవాడ

    దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సన్నిధిలో తొలి పోస్టింగ్‌ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మానాన్న, చెల్లితో కలసి మంగళవారం రాజన్నను దర్శించుకున్నాము. ఇక్కడి ప్రజలకు, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. వేములవాడకు వేలాది మంది భక్తులు వస్తున్నందున పారిశుధ్యం, స్వచ్ఛ తాగునీటి సరఫరా, పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెడతాం. మునిసిపల్‌లోని ప్రతీ వార్డులో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా స్పష్టమైన ప్రణాళికతో పనిచేస్తాం. వేములవాడ వాట్సాప్‌ చానల్‌ ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ప్రజల సహకారమే ప్రధానం.

    నిరంతర శ్రమ, క్రమశిక్షణ

    నిరంతర శ్రమ, క్రమశిక్షణ, అన్నింటికీ మించి మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను నమ్మే సిద్ధాంతం ఒక్కటే.. ఎవరికై నా ‘చదువే నిజమైన ఆస్తి’. ఆ నమ్మకమే ఎక్కువ గంటలు చదవకుండా టాపిక్‌ వైజ్‌ చదువుకుంటూ ముందుకు సాగాను. టెస్ట్‌ సిరీస్‌ రాసుకుంటూ సరిచేసుకుని ప్రిపేర్‌ అయ్యాను. ప్రస్తుతం యువత సోషల్‌ మీడియా వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దానికంటే తమ కెరీర్‌, జీవిత లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షనైనా సులువుగా సాధించవచ్చు. ప్రస్తుతం ఏఐ వల్ల చాలా జాబ్స్‌ పోతున్నాయి. అందుకే స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవాలి. జాబ్స్‌ మనమే క్రియేట్‌ చేసేలా ముందుకు సాగాలి.

  • బోయినపల్లి(చొప్పదండి): మండలంలో ఇసుక రీచ్‌లు లేక భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. వేములవాడ, పొత్తూరు రీచ్‌ల నుంచి ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. చలాన్‌ చెల్లించి కొందామన్న బోయినపల్లి మండల ట్రాక్టర్లను ఆయా రీచ్‌లకు రానివ్వడం లేదు. దీంతో అక్కడి ట్రాక్టర్‌ యజమానులు బోయినపల్లి మండలానికి ఇసుక సరఫరా చేయాలంటే ట్రిప్పునకు రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం పెట్టలేక చాలా మంది భవన నిర్మాణ పనులు నిలిపివేశారు.

    ఇసుక రీచ్‌ ఉన్న వాహనాలే దిక్కు

    ఇందిరమ్మ ఇల్లుకు ఒక్కో ట్రిప్పు ఇసుకకు రూ.215, ఇతర గృహనిర్మాణాలకు రూ.720 చలాన్‌ చెల్లించాల్సి ఉంది. మన ఇసుక వాహనం కింద బుక్‌ చేసుకున్న వారు తమ వాహనంలో తీసుకెళ్లవచ్చు. కానీ ఇసుక రీచ్‌లు ఉన్న గ్రామాల వారు ఇతర ప్రాంత వాహనాలను రానివ్వడం లేదు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమి చర్యలు తీసుకోవడం లేదు.

    మిడ్‌మానేరు డౌన్‌స్ట్రీమ్‌తో మంజూరుకాని రీచ్‌

    మిడ్‌మానేరు పరిధిలోని మానేరువాగులో గతంలో బోయినపల్లి మండలం మాన్వాడ, వరదవెల్లి, మల్లాపూర్‌ నుంచి ఇసుక రవాణా జరిగేది. కాగా మిడ్‌మానేరు డౌన్‌స్ట్రీమ్‌ నుంచి ఇసుక తీయరాదనే నిబంధనలతో మాన్వాడను ఇసుక రీచ్‌గా అధికారులు గుర్తించలేదని సమాచారం. దీంతో మండలంలోని గృహ నిర్మాణదారులకు ఇసుక దొరకడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక ధరలకు కల్లెం వేయడంతోపాటు రీచ్‌లకు ఇతర గ్రామాల వాహనాలు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

    సిరిసిల్ల: నైపుణ్యముంటేనే ఏ రంగంలోనైనా రాణిస్తారని, నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి సదస్సును జ్యోతి వెలిగించి, జయ జయహే తెలంగాణ గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర అభివృద్ధిలో నేటి యువత, విద్యార్థులు చాలా కీలకమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యా శాఖ వారోత్సవాలను నిర్వహించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఎన్నో అంశాల్లో ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఉన్నత చదువుతోపాటు టెక్నికల్‌ స్కిల్స్‌, సాప్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలని సూచించారు. ఐటీఐ, టాస్క్‌ తదితర సంస్థల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సింగ్‌ పూర్తి చేసి, విదేశి భాష, నైపుణ్యాల్లో పట్టు ఉన్నవారికి టామ్‌ కామ్‌ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకు 45 మందికి విదేశాల్లో కొలువులు వచ్చాయని తెలిపారు. యువత ఉపాధిని పొంది తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత చూసుకోవాలని సూచించారు.

    ధాన్యం తరలింపులో వేగం పెంచాలి

    కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు, రైస్‌ మిల్లులు, గోదాముల్లో అన్‌లోడింగ్‌లో మరింత వేగం పెంచాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం, నిర్దేశించిన మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదాముల్లో హమాలీలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్‌లైన్‌ ట్యాబ్‌ ఎంట్రీ జాప్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీనివాసాచారి, జీఎం ఇండస్ట్రీస్‌ హనుమంతు, డీవైఎస్‌వో రాందాస్‌, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఎల్‌డీఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

  • ● ఇక నుంచి ఎన్‌పీడీసీఎల్‌ సేవలు

    సిరిసిల్ల: జిల్లాలో 56 ఏళ్లుగా విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్న సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) కథ ముగిసింది. ఇకపై ఎన్‌పీడీసీఎల్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్‌గా సేవలు అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ఓపీ నంబరు 08 ఆఫ్‌ 2026 తేదీ 19.05.2026ను డాక్టర్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌(చైర్మన్‌), సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ‘సెస్‌’ లెసెన్స్‌ను పునరుద్ధరించకుండా, 2026 ఏప్రిల్‌ 1 నుంచి ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు తాత్కాలికంగా విద్యుత్‌ పంపిణీ(నిర్వహణ) సేవలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అందిస్తున్నారు.

    పాలకవర్గం ఉండగానే..

    1970లో ‘సెస్‌’ను స్థాపించారు. ప్రస్తుతం 3 లక్షల సభ్యత్వాలున్న ‘సెస్‌’కు వినియోగదారులతో ఎన్నుకోబడిన పాలకవర్గం ఉంది. చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్‌ చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి, 13 మంది డైరెక్టర్లుగా ఉన్నారు. వీరి పదవీకాలం ఇంకా 19 నెలలు ఉంది. కానీ, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు పాలకవర్గం జోలికి వెళ్లకుండానే ‘సెస్‌’ ఉద్యోగులను తమ కంట్రోల్‌లోకి తీసుకుని విద్యుత్‌ పంపిణీ సేవలను అందిస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్‌ తీరుపై ‘సెస్‌’ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించగా, విచారణ వాయిదాలు పడుతూ వస్తుంది. ‘సెస్‌’ పాలకవర్గం వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం, ఎన్‌పీడీసీఎల్‌ వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేయడంతో విచారణ పర్వం కోర్టులో కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో అమలులో ఉన్న విద్యుత్‌ సంస్కరణలను జిల్లాలో అమలు చేస్తూ వినియోగదారుల మన్నలను పొందాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

    సిరిసిల్ల సర్కిల్‌గా నామకరణం

    ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌పీడీసీఎల్‌) సిరిసిల్ల సర్కిల్‌గా ‘సెస్‌’ పరిధి మారనుంది. ఏది ఏమైనా పాలకవర్గాల అవినీతి, అక్రమాలు, నిర్వహణ లోపాలు, ప్రభుత్వ బకాయిలు, పాలకుల రాజకీయ కుట్రలతో 56 ఏళ్ల ‘సెస్‌’ ఇప్పుడు ఉనికి కోల్పోయింది. ఇప్పటికే జిల్లాలో విద్యుత్‌ సేవలు అందిస్తున్న ఎన్‌పీడీసీఎల్‌ తాజా పరిణామాలతో పూర్తిస్థాయిలో ‘సెస్‌’ ను హస్తగతం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ‘సెస్‌’ కథ ముగిసినట్లేనని భావిస్తున్నారు.

  • ● జిల్లా కేంద్రంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

    సిరిసిల్ల: జిల్లాలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోయారు. సిరిసిల్లలో మంగళవారం అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్టణ శివారులోని కలెక్టరేట్‌ వద్ద 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 45.5, కోనరావుపేట మండలం మర్తనపేట వద్ద 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడంతో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం ఎండల ధాటికి వేడి గాలి వీచింది. ఉక్కపోత, వడగాలుల ధాటికి జనం హడలిపోయారు. జిల్లా కేంద్రంతో పాటు, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో రెడ్‌అలర్ట్‌, అన్ని మండలాల్లో ఆరేంజ్‌ కలర్‌ అప్రమత్తతను అధికారులు ప్రకటించారు. పగటి పూట బయట తిరగొద్దని హెచ్చరించారు.

    ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

    వేములవాడ మండలం వట్టెంల వద్ద 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మల్లారం వద్ద 44.8, రుద్రంగి 44.7, బోయినపల్లి 44.6, ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌ 44.6, వేములవాడ అర్బన్‌ మండలం నాంపల్లి 44.5, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల 44.4, మానాల 44.3, ఎల్లారెడ్డిపేట 44.2, గంభీరావుపేట 44, వీర్నపల్లి, పెద్దలింగాపూర్‌ 43.9 గంభీరావుపేట మండలం గజసింగారం 43.8, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ 43.6, ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌ 43.5, ఇల్లంతకుంట 43.4, కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోయినపల్లిలో 33.7 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

Peddapalli

  • జ్యోతినగర్‌: భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడదెబ్బతో అస్వస్థతకు గురైన చాలామంది స్పత్రులకు పరుగెత్తుతున్నారు. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సూరీడు మంగళవారం ఒక్కసారిగా వేడెక్కాడు. ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోత పెరిగింది. ఎలిగేడులో పగలు అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా అంతటా 43 నుంచి 45.7 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు.. ఎలిగేడు, పాలితం, కమాన్‌పూర్‌, ఈసాలతక్కళ్లపల్లిలో వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఉక్కపోతకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉ దయం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో ప్రధాన రహదారులపై జనసంచారం తగ్గింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి...

    పెద్దపల్లి: జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణతోపాటు ఉద్యాన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చే యాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఉద్యా న శాఖ, ఆయిల్‌పామ్‌ అంశాలపై అధికారులతో కలెక్టర్‌ మంగళవారం సమీక్షించారు. 2026–27 సంవత్సరానికి జిల్లాలో 1,150 ఎకరాల ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా నిర్దేశించామని, ఇప్పటివరకు 370 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించారని పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లతోటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. డీహెచ్‌ఎస్‌వో జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

    మక్కలను గోదాములకు తరలించాలి

    పెద్దపల్లిరూరల్‌: మార్క్‌ఫెడ్‌ ద్వారా తూకం వేసిన మక్కలను ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లోని గోదాములను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రంగాపూర్‌లో 5వేల మెట్రిక్‌ టన్నుల మేర సామర్థ్యం గల గో దాములు అందుబాటులో ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసేందుకు గోదాముల్లో అ న్‌లోడ్‌ చేసేందుకు అవసరమైనంత మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మక్కల కొనుగోళ్లు, తూకం, రవాణా ప్రక్రియలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అన్నారు.

    HEAT WAVE

    ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెల్సియస్‌లో)

    మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం

    ఎలిగేడు ఎలిగేడు 35.6 45.7

    పెద్దపల్లి పాలితం 34.2 45.7

    కమాన్‌పూర్‌ కమాన్‌పూర్‌ 35.6 45.6

    పాలకుర్తి ఈసాలతక్కళ్లపల్లి 35.6 45.1

    పెద్దపల్లి భోజన్నపేట 34.9 44.9

    రామగిరి కల్వచర్ల 34.9 44.9

    సుల్తానాబాద్‌ సుగ్లాంపల్లి 34.6 44.6

    ఓదెల ఓదెల 34.2 44.5

    ముత్తారం(మంథని) ముత్తారం 34.2 45.5

    ధర్మారం ధర్మారం 35.5 44.4

    జూలపల్లి జూలపల్లి 35.6 44.3

    రామగుండం మల్యాలపల్లి 36.0 44.1

    సుల్తానాబాద్‌ కనుకుల 34.2 43.9

    కాల్వశ్రీరాంపూర్‌ కూనారం 34.2 43.9

    కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

  • తూతూమంత్రంగా..

    సాక్షి పెద్దపల్లి: మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జి, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఉన్నాయా? ఎన్నిగదులు వినిగిస్తున్నా రు? పెళ్లయిన జంటలు ఉన్నాయా? ఇంటి పైకప్పు, ఫ్లోర్‌కు వాడిన మెటీరియల్‌ ఏమిటి? ఎలాంటి మ రుగుదొడ్డి ఉంది? బాత్‌రూంకు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా? బైక్‌లు ఎన్ని? కార్లు ఎన్ని? ప్రధానంగా తీసుకునే ఆహారం ఏమిటి?.. ఇలాంటి వివరాలు గృహగణనలో ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా అడుగుతున్నారు. వీటిని విన్న ప్రజలు ఇవేమి వింత ప్రశ్నని, ఇలా ఎందుకు విసిగిస్తున్నారని తమను అదోరకంగా చూస్తున్నారని సిబ్బంది వాపోతున్నా రు. తమకు ఏమీలేవు. ఏమీ తెలియదు. తమ పి ల్లాడు లేడని, వచ్చాక రండి అని మరికొందరు స మాధానం ఇస్తున్నారు. వివరాలన్నీ రాసుకుంటే ప్ర భుత్వం నుంచి పథకాలు అందవనే సాకుతో చాలామంది అన్నీఉన్నా ఏమీ లేవని రాసుకోండని సమాధానాలు చెబుతున్నారు. మొత్తంగా జనగణన త ప్పుల తడకగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి సరైన సమాచారం రాక, కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో జగణన ప్రక్రియ పక్కదారి పడుతోంది.

    సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ తక్కువే

    జనగణనలో ఈసారి స్వీయగణనకు అవకాశమిచ్చారు. దీంతో జిల్లాలో ఏప్రిల్‌ 26 నుంచి ఈనెల 10వ తే దీ వరకు 3శాతం మందే తమ ఇళ్ల వివరాలను వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. స్వీయగణన చేసుకున్నవారికి మెయిల్‌కు వచ్చిన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ఐడీని భద్రపరుచుకుని ఎన్యుమరేటర్లకు దా నిని ఇవ్వాలి. కానీ చాలామంది ఐడీ ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం, ఆ ఐడీ తెలిసిన వారు ఇంట్లో సమయానికి లేకపోవడంతో సిబ్బంది మరో సారి ఆ ఇంటికి నమోదు కోసం వెళ్లాల్సి వస్తోంది.

    జిల్లాలో 1,91,510 నివాసాలు..

    జిల్లాలో మొత్తం 1,548 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులు గుర్తించగా, ప్రతీబ్లాక్‌లో 300 నుంచి 800 మంది జనాభా ఉండనున్నారు. ఇప్పటికే పూర్తయి న సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ సహా జనగణన వర కు మొత్తం 1,91,510 ఇళ్లను లెక్కించాల్సి ఉంటుందని అంచనా వేశారు. జనగణనకు 1,152 మంది ఎన్యుమరేటర్లను నియమించగా, 10శాతం మందిని రిజర్వ్‌లో పెట్టారు. 244మంది సూపర్‌వైజర్లును నియమించారు. ఈనెల 11 నుంచి జనగణన 2027 ప్రారంభమవ్వగా, మూడురోజుల పాటు ఇళ్ల మ్యాపింగ్‌ చేశా రు. 14 నుంచి ఇంటింటికీ వెళ్లి గృహగణన ప్రారంభించి జూన్‌ 9 వరకు పూర్తిచేయాలి. మండుతున్న ఎండలు, డోర్‌లాక్స్‌, సమాచారం ఇవ్వడంలో కొందరి నిర్లక్ష్యంతో ఎన్యుమరేటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని, సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. డిజిటల్‌ విధానంలో జరిగే ఈ ప్రక్రియలో డేటా గోప్యతకు పూర్తిభద్రత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

    జనగణనలో ఎన్యుమరేటర్లకు ఇబ్బందులు

    సమాచార గోప్యత పాటిస్తున్న జిల్లావాసులు

    తెలిపిన సమాచారమే నమోదు చేస్తున్న సిబ్బంది

    తప్పుల తడకగానే కొనసాగుతున్న గృహగణన

    జిల్లా సమాచారం

    ఎన్యుమరేటర్లు 1,152

    సూపర్‌వైజర్లు 244

    నివాసాలు 1,91,510

    ఎన్యుమరేటర్‌ ప్రజల ఇళ్లలోకి వెళ్లాలి. వారికి ఇచ్చిన జాబితా ప్రకారం 33 అంశాల్లో కొన్నింటిని పరిశీలించాలి. మరికొన్ని ఇంటి యజమానిని అడిగి వివరాలు నమోదు చేసుకోవాలి. చాలాచోట్ల సిబ్బంది తూతూమంత్రంగానే ఇంటి నంబర్‌, యజమాని పేరు మాత్రమే అడిగి, వారికి నచ్చింది రాసేసుకుంటున్నారు. తప్పుడు సమాచారం నమోదు చేయడం ద్వారా భవిష్యత్‌లో ప్రజలకు అందాల్సిన పథకాల విషయంలో స మస్యలు తలెత్తడంతోపాటు, ప్రజలకు అవసరమైన పథకాలు రూపొందించడంలో యంత్రాంగం విఫలమయ్యే అవకాశాలున్నాయి.

  • ఓదెల: ధాన్యం కొనుగోళ్లలో రైతులు అధైర్య ప డొద్దని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అ న్నారు. కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లిలోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈనెల 27లోగా మక్కలు విక్రయించాలని సూ చించారు. సర్పంచులు పల్లె కనుకయ్య, అంబా ల సారమ్మ, మంగ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆళ్ల సుమన్‌రెడ్డి, బైరి రవిగౌడ్‌, తీర్థాల వీరన్న, పాకాల కరుణాకర్‌రెడ్డి, సమ్మిరెడ్డి పాల్గొన్నారు.

    ఆసియా క్రీడలకు చికిత

    ఎలిగేడు: ఆసియా క్రీడా పోటీల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఆర్చరీ క్రీడాకారి ణి చికితకు దక్కింది. ఈఏ డాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో జపాన్‌ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్లను ప్రకటించారు. మహిళల కాంషౌండ్‌ విభాగంలో మనరాష్ట్రం నుంచి సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత ఎంపికైంది.

    పర్యావరణాన్ని పరిరక్షించాలి

    పెద్దపల్లిరూరల్‌: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా విద్యాధి కారి శారద సూచించారు. కాలుష్య నియంత్ర ణ మండలి ఆధ్వర్యంలో అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కాలుష్యంపై జాతీయ హ రితదళం జిల్లా కో ఆర్డినేటర్‌ గూళ్ల అంజన్‌ కుమార్‌ వివరించారు. విద్యార్థులకు డాన్స్‌, స్కిట్స్‌, యోగా, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పీఎం షేక్‌, హెచ్‌ఎం పురుషోత్తం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    సమస్యలపై అధ్యయనం

    రామగిరి: సింగరేణి కాంట్రాక్టు, పర్మినెంట్‌ కా ర్మికుల పనిపరిస్థితులు, ఒప్పంద విధానాలు, రక్షణ చర్యల గురించి లండన్‌ రీసెర్స్‌ స్కాలర్‌ హేమవైష్ణవి మంగళవారం ఆర్జీ–3 పరిధిలో అ ధ్యయనం చేశారు. ఎస్‌ఎంఎస్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యయన నివేదికను సంబంధిత వర్గాల దృష్టి కి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న, నాయకులు అశోక్‌, శ్రీనివాస్‌, రాజన్న, సంపత్‌, భూమయ్య, అంజీ పాల్గొన్నారు.

    23 నుంచి రీఎగ్జామినేషన్‌

    గోదావరిఖని: అనార్యోగంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులకు ఈనెల 23, 24వ తేదీల్లో మెడికల్‌ రీ ఎగ్జామినేషన్‌ నిర్వహణకు యాజ మాన్యం నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ బోర్డు తో సంబంధం లేకుండా డాక్టర్లే పరీక్షలు చేస్తా రు. మొత్తం 32 మందికి మెడికల్‌ రీఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏరియా లు, డిపార్ట్‌మెంట్‌ల నుంచి రెఫర్‌ చేసిన వారే అర్హులని తెలిపింది. ఈవిషయంపై సింగరేణి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌ రాజ్‌కుమార్‌ మా ట్లాడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడు తూ ఆయా ఏరియాల నుంచి కార్పొరేట్‌కు రెఫ ర్‌ అయిన వారినే పరీక్షిస్తామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఫిట్‌ పర్‌ సేమ్‌జాబ్‌, అండర్‌గ్రౌండ్‌ అన్‌ఫిట్‌, సర్ఫేస్‌ ఫిట్‌, మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వివరించారు.

    ఫ్లైఓవర్లతో ప్రయాణం మెరుగు

    ఓదెల: రైల్వే ట్రాక్‌లపై ఫ్లైఓవర్ల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. ఓదెల, కొ లనూర్‌, పొత్కపల్లి రైల్వేస్టేషన్ల సమీపంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం మంగళశారం స్థల పరిశీలన చేశారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు స్థలాలు పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. సర్పంచులు పల్లె కనుకయ్య, కనికిరెడ్డి స తీశ్‌, అంబాల సారమ్మ, తహసీల్దార్‌ ధీరజ్‌కుమార్‌, ఎస్సారెస్పీ డీఈఈ భాస్కర్‌ ఉన్నారు.

  • మంథని: నిషేధిత గ్లైఫోసెట్‌–41 ఎస్‌ఎల్‌(గడ్డిమందు)ను జిల్లాలో రహస్యంగా విక్రయిస్తున్నారని సమాచారం. గ్లైసెల్‌ బీటీ పత్తి విత్తనాలపై ఈ మందు వినియోగించంతో డిమాండ్‌ అధికంగా ఉంటోంది. మరికొన్ని రోజుల్లో వ్యవ సాయ సీజన్‌ ప్రారంభం కానుంది. వానాకాలం సీజన్‌ ప్రారంభమైతే కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో కొందరు రైతులు ముందుగానే కొనుగోలు చేస్తు న్నారని తెలిసింది. అదికూడా మహారాష్ట్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చి నిల్వ చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    మహారాష్ట్ర నుంచి దిగుమతి

    తెలంగాణలో గ్లైఫోసెట్‌ విక్రయాలపై నిషేధం ఉంది. దీంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి ది గుమతి చేస్తున్నట్లు సమచారం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం వంతెన, పెద్దపల్లి జిల్లా లోని పార్వతి బ్యారేజీలను రవాణాకు వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. ఇలా తీసుకొచ్చిన గడ్డిమందును జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీ గ్రామాల రైతులకు అంటగడుతున్నారు. ప్రభుత్వ అనుమతి విత్తన ప్యాకెట్లు ఒక్కోటి రూ.600 నుంచి రూ.700 ధరతో మార్కెట్‌లో లభిస్తున్నాయి. పేరులేని వితనాలు కిలోకు రూ.2 వేల చొప్పున బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసి పంటలో కలుపు సమస్య రాకుండా గ్లైఫోసెట్‌ వినియోగిస్తారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వివిధ కంపెనీల గడ్డిమందు సరిహద్దులు దాటుతోంది.

    పేరులేని పత్తి విత్తనాలపై వినియోగం

    పొలంగట్లు, వినియోగం లేని స్థలాల్లో వాడే గడ్డిమందును ప్రభుత్వ అనుమతి లేని, పేరులేని బీటీ–3 పత్తి విత్తనాలపై అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్‌ పెరిగింది. సాధారణంగా వేరే పత్తి పంటపై గ్లైఫోసెట్‌ చల్లితే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ, పేరులేని బీటీ–3 పత్తిపై చల్లితే కలుపు సమస్య ఉండదు.

    రూ.500 వెచ్చిస్తే సరి..

    సాధారణంగా ఒక ఎకరం పత్తిలో కలుపు తీయడా నికి కూలీలకు రూ.6 వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు అవుతుంది. గ్లైఫోసెట్‌ ఒకలీటరుకు రూ.500 చెల్లించి పంటపై చల్లితే సరిపోతుంది. మందు చల్లడం ద్వారా మొక్క కింద వరకు విషం చేరే అవకాశం ఉంది. తద్వారా పత్తి ఏరే సమయంలో కూలీలకు చర్మ, కిడ్నీ, కాన్సర్‌ లాంటి వ్యాధులు సోకుతున్నాయని ప్రభుత్వం గుర్తించి దానిని నిషేధించింది.

    సీజన్‌లోనే పర్యవేక్షణ

    విత్తన, ఎరువుల దుకాణాలను తరచూ తనిఖీ చేస్తూ నిషేధిత మందుల విక్రయాలను కట్టడిచేయడమే కాకుండా నిబంధనలు అతిక్రమించిన వ్యా పారులపై పీడీయాక్టు నమోదు చేయాల్సిన అధికారులు.. నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వ్యాపారుల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు తయారైంది. కేవలం సీజన్‌ ఆరంభంలోనే హడావుడి చేసే అధికారులు.. ఆ తర్వాత తనిఖీల విషయం విస్మరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 80వేలకుపైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఇందులో పదిశాతం వరకు గుట్టుచప్పుడు కాకుండా పేరు లేని విత్తనాలతో సాగు చేస్తున్నట్లు తెలిసింది. ప్రాణాంతకమైన గడ్డిమందును కొంద రు రైతులు, సాధారణ ప్రజలు తాగి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలూ కోకొల్లలుగానే ఉన్నాయి.

    విక్రయిస్తే కఠిన చర్యలు

    నిషేధిత గడ్డి మందు విక్రయించేందుకు వీలులేదు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్లైఫోసెట్‌(గడ్డి మందు)పై నిషేధం ఉంది. ఆ మందు వినియోగం తప్పనిసరైతే మా దృష్టికి తీసుకురావాలి. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాం. తప్పనిసరి అని గుర్తిస్తే మా పర్యవేక్షణలో వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.

    – అంజనీ, ఏడీఏ, మంథని

  • పెద్దపల్లిరూరల్‌: విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో చాలామంది తమ ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదే అదనుగా దొంగలు తా ళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసి రాత్రివేళ చో రీలకు పాల్పడుతున్నారు. ఇళ్ల యజమానులు కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ఆటో ద్వారా జిల్లా కేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్లు, ఇళ్ల ఎదుట పార్క్‌చేసిన బైక్‌లు, స్కూటీలు ఎత్తుకెళ్లడంతోపాటు రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చోటుచేసుక్ను ఘటనలే ఇందుకు నిదర్శనం.

    అపరిచితుల సమాచారమివ్వండి

    వీధులు, కాలనీల్లో అపరిచితులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావు సూచిస్తున్నారు. ఇళ్లవద్ద సీసీ కెమెరాలు బిగించుకుంటే మంచిదని పేర్కొన్నారు. ఇంటికి వేసిన తాళం బయటకు కనిపించకుండా పరదా అడ్డుగా ఉంచాలని సూచించారు. టూర్‌ వెళ్తే తమ వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెబితే రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌ చేసే అవకాశం ఉంటుందని వారు వివరించారు.

    పెద్దపల్లిలోని భూంనగర్‌కు చెందిన ముత్యం రవీందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఈనెల 10న తిరుపతి వెళ్లాడు. ఈనెల 12న ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి తలుపుల తాళం పగులగొట్టి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. లోనికి వెళ్లి చూడగా నాలుగు కిలోల వెండి సామగ్రి, తులం బంగారం చోరీకి గురైనట్లు తేలింది.

    సెలవుల్లో ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి విస్తృత ప్రచారం చేస్తున్న పోలీసులు

  • పెద్దపల్లి: మక్కలు విక్రయించేందుకు రైతులు ఇ బ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం.. రైతు నుంచి భూములు కౌలుకు తీసుకునే సందర్భంగా కౌలు తీసుకున్నట్లు స్టాంప్‌పేపర్‌పై ఒప్పందం రాసుకోవాలి. చాలాప్రాంతాల్లో నోటిమాటగా నే కౌలు రైతులు యజమానులకు సొమ్ము చెల్లించి పంటలు వేస్తున్నారు. కానీ, దిగుబడి వచ్చాక మార్కెట్‌లో విక్రయించే సమయంలో నిబంధనలు అడ్డురావడంతో సమస్య ఎదుర్కొంటున్నారు.

    రికార్డుల్లో లేని కౌలు రైతులు

    సాగు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నా.. పట్టాదారుల కాలంలోని రైతులు పంటలు వేయడంలేదు. వారు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఆ వివరాలు సరిపోలక ఇబ్బందులకు గురవుతున్నా రు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 60 వేల మెట్రిక్‌ టన్నుల మక్కల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 9 కేంద్రాలు ఏర్పాటు చేసి కొను గోళ్లు ప్రారంభించారు. సాగు విస్తీర్ణం 18,191 ఎక రాలు ఉండగా.. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఇప్పటివరకు 23 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు.

    మక్కల విక్రయానికి ఇబ్బందులు

  • జ్యోతినగర్‌/రామగుండం/పాలకుర్తి: రామగుండా న్ని అద్భుతంగా నిర్మిద్దామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ అన్నారు. మేడిపల్లి రోడ్డులో సీసీ, బీ టీ రోడ్లు, వరదనీటి కాలువలు, తాగునీటి సరఫరా వ్యవస్థ పనులకు మేయర్‌ మహంకాళి స్వామి, క మిషనర్‌ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎ ల్లయ్యతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అంతర్గాం మండలం ఎక్లాస్‌పూర్‌ ఆర్టీసీ బస్సు ప్రా రంభించారు. రామగుండంలో అత్యాధునిక తాగునీటి వ్యవస్థ పనులు ప్రారంభించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో ఉపాధిహామీ కూలీ లు, రైతులతో మాట్లాడారు. కార్పొరేటర్లు వెంగల బాపు, మేరుగు భూలక్ష్మీ, కొలని కవితారెడ్డి, తోట మమత, స్వప్నప్రియ, వడ్లూరి రవి, ఇసంపెల్లి అంజులు, దారంగుల కుమార్‌, సిరిశెట్టి సతీశ్‌గౌడ్‌, అయేషాఖానం వాజిద్‌ఖాన్‌, తహసీల్దార్‌ రవీందర్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

    ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌

  • పెద్దపల్లిరూరల్‌: పౌరులు మతసామరస్యాలను కా పాడుతూ సోదరభావంతో మెలగాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై లక్ష్మణ్‌రావు, నరేశ్‌తో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలో పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈనెల 28న బక్రీద్‌ సందర్భంగా అందరూ ఐకమత్యంగా, శాంతియుతంగా పండుగ జరుపుకోవాలన్నారు.

    23 నుంచి షటిల్‌ పోటీలు

    పెద్దపల్లి: గోదావరిఖని ఆర్‌సీవోఏ, సీఈఆర్‌ క్లబ్బు ల్లో ఈనెల 23, 24వ తేదీల్లో జిల్లాస్థాయి షటిల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. అండర్‌–11, 13, 15, 17, 19తోపాటు ఓపెన్‌ మెన్‌, ఉమెన్‌ విభాగాల్లో పో టీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలక్రీడాకారులు ఈ నెల 22న 93965 40067, 91778 85183, 98492 18365 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తప్పనిసరి

    పెద్దపల్లి: ఐటీఐలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తప్పనిస రని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేశ్‌ అ న్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. 255 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. సురేశ్‌ మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు అవసరమన్నారు. దేశసేవలో పాలుపంచుకునేందుకు అగ్నివీర్‌, ఆర్మీ, పారామిలిటరీల్లో ఉద్యోగాలు సాధించాలని సూ చించారు. ప్రిన్సిపాల్‌ మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Mancherial

  • మంచిర్యాలటౌన్‌/బెల్లంపల్లి/చెన్నూర్‌: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు మెడికల్‌ షాపుల బంద్‌ తలపెట్టినట్లు జిల్లా కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలని, కార్పొరేట్‌ సంస్థలకు భారీ డిస్కౌంట్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ ఫార్మసీతో మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని, నకిలీ, మత్తు కలిగించే మందులు ప్రిస్కిప్షన్‌ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆరోపించారు. తేలికగా దొరికే ఇలాంటి మందులతో యువత భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో అమ్మే మందులతో చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మెడికల్‌ షాపుల మనుగడకు ఇబ్బందిగా మారే అవకాశముందని తెలిపారు. బెల్లంపల్లిలో సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌కు బెల్లంపల్లి మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సజ్జన్‌ శర్మ, సెక్రటరీ పెద్ది రాజేందర్‌, సభ్యులు వినతిపత్రం అందజేశారు. బంద్‌కు సహకరించాలని చెన్నూర్‌లో డిప్యూటీ తహసీల్దార్‌ సనత్‌కుమార్‌, సీఐ భన్సీలాల్‌కు కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బుద్దారపు ప్రకాశ్‌, బండారి లక్ష్మణ్‌ వినతిపత్రం అందజేసి కోరారు.

    అత్యవసరమైతే సంప్రదించాలి

    ఎవరికై నా మందులు అత్యవసరమైతే అసోసియేషన్‌ సభ్యులు ఎం.చంద్రశేఖర్‌రావును 9849108736, తొగరు సుధాకర్‌ను 9866223544, జి.రాజేంద్రప్రసాద్‌ను 9247393239 నంబర్లలో సంప్రదించాలి. ఆన్‌లైన్‌ అమ్మకాల నిలిపివేతకు చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలి.

    – తొగరు సుధాకర్‌, డిస్ట్రిక్ట్‌ కెమిస్ట్‌,

    డ్రగ్గిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ

  • భీమారం: కాళేశ్వరంలో ఈ నెల 21నుంచి ప్రారంభం కానున్న సరస్వతి నది అంత్యపుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలకు మండలంలోని జోడువాగులపై గల ఇరుకువంతెన వద్ద ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ తెలిపారు. మంగళవారం జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌తో కలిసి జాతీయ రహదారిపై గల ఇరుకువంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ఆధికారులతో చర్చించారు. వారి వెంట ఎస్సై రాజేందర్‌ ఉన్నారు.

    పశువులను తరలిస్తే కఠినచర్యలు

    కోటపల్లి: బక్రీద్‌ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా పశువులను అక్రమంగా తరలించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని డీసీపీ భాస్కర్‌ హెచ్చరించా రు. రాపన్‌పల్లి వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్‌శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు. మహారాష్ట్ర వైపునుంచి ధాన్యం అక్రమంగా రాకుండా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్‌, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

  • ● 2న కుమురంభీం జిల్లాకు రేవంత్‌రెడ్డి

    ఆసిఫాబాద్‌/కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో మా ర్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ జూన్‌ 2న సీఎం కుమురంభీం ఆసిఫాబా ద్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఉమ్మడి జి ల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బుధవారం కుమురంభీం ఆసిఫా బాద్‌ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను ప ర్యవేక్షిస్తారని మంత్రి ప్రత్యేక కార్యదర్శి కాసు ల నానిల్‌కుమార్‌ తెలిపారు. మంత్రులు మ ధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని బే గంపేట నుంచి హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌ క లెక్టరేట్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.15నుంచి సాయంత్రం 4.45వరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షిస్తారు. అ నంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో మంగళవారం క లెక్టర్‌ హరిత, ఎస్పీ నితికా పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, వంజిరీ దాదానగర్‌ ప్రాంతాలు పరిశీలించారు. సీఎం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారని సమాచారం.

  • నెన్నెల: నార్వాయిపేట యూనిట్‌లోని జెండావెంకటాపూర్‌, మెట్‌పల్లి, నార్వాయిపేట తునికాకు కల్లాలను మంగళవారం బెల్లంపల్లి ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌, బెల్లంపల్లి రేంజ్‌ అధికారి పూర్ణచందర్‌తో కలిసి తనిఖీ చేశారు. కాంట్రాక్టర్‌, తునికాకు సేకరణ సిబ్బందితో సలహాలు, సూచనలు చేశారు. తునికాకు నా ణ్యతగా ఉండేలా తేమ లేకుండా ఆరబెట్టాల ని, కూలీలకు గిట్టుబాటు ధర అందేలా చూ డాలని సూచించారు. అకాల వర్షాలకు ఆకు తడిసి పోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రత చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నేరుగా కూలీల ఇళ్లకు వెళ్లి నాణ్యమైన ఆకు సేకరించాలని సూచించారు. ఉపాధి, గిట్టుబాటు ధర లభిస్తుందా? అని ఆరా తీశారు. ఆకు సేకరణ సమయంలో ప్రమాదాలకు గురైతే ప్రమాద బీమా ఉంటుందని చెప్పారు. ఆయన వెంట నార్వాయిపేట ఎఫ్‌ఎస్వో శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

  • దండేపల్లి/జైపూర్‌/లక్సెట్టిపేట/శ్రీరాంపూర్‌: రైస్‌ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేయాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ సూచించారు. మంగళవారం జిల్లాలోని జైపూ ర్‌ మండలం ఇందారంలో సుముఖ గోదాం, జయలక్ష్మి రైస్‌మిల్లు, సీసీసీ నస్పూర్‌లోని గో దాములు, దండేపల్లి మండలం కన్నెపల్లిలోని రైస్‌మిల్లులు, లక్సెట్టిపేట మండలం లక్ష్మిపూ ర్‌, వెంకట్రావుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు సందర్శించారు. ఆయన మాట్లాడు తూ అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా గోదాములు, రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు తె లిపారు. అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంచుకోవాలని, రోజుకు 10నుంచి 15లారీ ల ధాన్యం దిగుమతి చేసుకునేలా చర్యలు తీ సుకోవాలని అన్నారు. ఆయా మండలాల త హసీల్దార్లు వనజారెడ్డి, దిలీప్‌కుమార్‌, రోహిత్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

  • సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ బదిలీల్లో కొందరు ప్రభుత్వ అధికారులు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. రాజకీయంగా పైరవీలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి వరకు జి ల్లాలో పని చేస్తూ మూడేళ్లు పూర్తయినవారికి స్థాన చలనానికి అవకాశముంది. ఇక నాలుగేళ్లు ఒకేచోట సర్వీస్‌ పూర్తయితే తప్పనిసరిగా బదిలీ చేయాలి. జి ల్లాలో సుమారు 4వేల మంది వరకు వివిధ కేడర్‌లో పని చేస్తున్న ఉద్యోగులున్నారు. వీరిలో రాష్ట్ర, మల్టీ, జోనల్‌, జిల్లా స్థాయి పోస్టుల్లో ఉన్నారు. యూని ఫాం ఉద్యోగులైన పోలీస్‌, ఆబ్కారీ, అటవీ, అగ్ని మాపక, రవాణాశాఖ అధికారులు మిన హా ఇతర శాఖల సిబ్బందికి స్థానం చలనం జరుగుతోంది.

    ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేసేలా..

    ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి. వచ్చే నెల 3వ తేదీ లోపు బదిలీ జరిగిన స్థానాల్లో వారంతా విధుల్లో చేరాలి. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు నోడల్‌ ఆఫీసర్లుగా రాష్ట్ర, మల్టీ జోన్‌, జిల్లా స్థాయి ఆ శాఖల్లోని ఉన్నతాధికారులతో కమిటీలు నియమించారు. వచ్చే జూన్‌ ఒకటి నుంచి మళ్లీ బదిలీ లపై నిషేధం అమలు కానుంది. ఈ లోపు నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. శాసనసభ, పార్లమెంట్‌, గ్రామపంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు బదిలీలు జరిగాయి. తాజాగా మళ్లీ సాధారణ బదిలీల్లో భాగంగా అధికారులకు స్థాన చలనం కలగనుంది. ఉద్యోగులు మొత్తం ఐదు చోట్ల ప్రాధాన్యత క్రమంలో బదిలీ స్థానంపై ఎంపిక చేసుకునే అవకాశముంది.

    ఏళ్లుగా కొందరు అధికారుల తిష్ట

    వివిధ కారణాలతో జిల్లాలో కొందరు ఆఫీసర్లు ఏళ్లుగా తిష్ట వేశారు. నాలుగో తరగతి నుంచి గెజిటెడ్‌ ఆీ ఫసర్‌ హోదాలో ప్రమోషన్లు పొందుతున్నా ఇక్కడే ఉంటున్నట్లు సహోద్యోగులే చెబుతున్నారు. కొందరు మారుమూల ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు జిల్లా కేంద్రం, పట్టణాల్లోనే బదిలీ అవుతున్నారు. ఇక కొందరు ఏళ్లుగా తిష్టవేస్తూ పలు కారణాలు చూపుతూ ఆయా శాఖల్లో ప ట్టు పెంచుకున్నారు. దీంతో అర్హులకు బదిలీల్లో నష్టం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.

    నమ్ముకున్న కొందరు అధికారులు!

    కోరుకున్న చోట ఉండేలా ప్రణాళిక!

    బదిలీల్లో కొందరు తెలివిగా తాము కోరుకున్న చోట ఉండేలా ప్రణాళిక వేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీల్లో ఇద్దరికి మినహాయింపు ఉంటుంది. అధ్యక్ష, కార్యదర్శి వర కు అవకాశం కలిగినప్పటికీ కొందరు ఆఫీస్‌ బే రర్‌ కోటాలో ఆ ఆప్షన్‌ ఎంచుకున్నట్లు సమాచా రం. జిల్లా విద్యాశాఖలో నాన్‌ టీచింగ్‌లో ఓ ఉ ద్యోగి ఈ మినహాయింపు వాడుకుని బదిలీని తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అనారో గ్యం, వైకల్యం, స్పౌజ్‌ కోటా చూపిస్తూ జిల్లాలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది మే 31వరకు రిటైర్డయ్యేవారికి మినహాయింపు ఇ వ్వాలి. ఇక జనగణనలో విధుల్లో ఉన్న టీచర్లకు మినహాయింపు ఉండగా, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. ఇక కొన్ని శాఖల్లో ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బదిలీల్లో మొత్తం ఆ శాఖల్లో నిర్వహణకు ఇబ్బంది కలగకుండా కనీసం 40శాతం మించకుండా బదిలీ చేయరాదు. దీంతో ఆ కేడర్‌ ఉద్యోగులు జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ కాకపోయినా సర్వీస్‌ నిండినా, అక్కడే పని చేయాల్సి వస్తోంది.

  • మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరోసారి జోరు పెరిగింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అనుమతి లేకుండానే భూమి ప్లాట్లుగా మారుతోంది. అనధికార లే అవుట్‌ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేస్తున్నా వ్యాపారం సాగుతోంది. మంచిర్యాల నగరంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్‌, నర్సింగాపూర్‌, హాజీపూర్‌ మండలం రాపల్లి, హాజీపూర్‌, దొనబండ గ్రామాల శివారు ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా వెంచర్లకు ప్రభుత్వ భూముల నుంచి పెద్దయెత్తున మట్టి తరలిస్తుండడం గమనార్హం. నాలా కన్వర్షన్‌ చేసిన మీదట లే అవుట్‌ అనుమతి వచ్చిన తర్వాత ప్లాట్లతో వెంచర్‌ తయారు చేయాలి. కానీ రియల్‌ వ్యాపారులు ప్రైవేటు ఇంజినీర్లు, సర్వేయర్లతో హద్దురాళ్లు, సిమెంటు స్తంభాలు పాతి గజాల్లో కాకుండా గుంటల చొప్పున ఫామ్‌ ల్యాండ్స్‌ పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ, బల్దియాలకు కేటాయించిన పది శాతం భూమిని కూడా మిగుల్చుకుని విక్రయిస్తున్నారు.

    నిబంధనలు ఇలా..

    గుడిపేటలో అనుమతిలేని వెంచర్‌లోని

    హద్దురాళ్లను తొలగిస్తున్న కార్పొరేషన్‌ సిబ్బంది

  • మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మార్చురీ గదిలో కొంతకాలంగా ఫ్రీజర్‌ పనిచేయడం లేదు. గతంలో పలుసార్లు మరమ్మతు చేయించినా కొద్దిరోజులే పనిచేసి ఆ తర్వాత మూలన పడింది. దీంతో దానికి మరమ్మతు చేయించడమే మానేశారు. ప్రస్తుతానికి గుర్తు తెలియని మృతదేహాలు కూడా రాకపోవడంతో ఇబ్బంది లేదు. ఇతర మృతదేహాలు వస్తే వెంటనే పోస్టుమార్టం నిర్వహించి మృతుల కుటుంబాలకు అప్పగిస్తుండడంతో సమస్యేమీ లేదు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి సరైన మార్చురీ గది కూడా లేదు. కనీసం ఫ్రీజర్‌ కూడా లేకపోవడం, మరమ్మతుకు గురైన దాని స్థానంలో కొత్త ఫ్రీజర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కరోజు కంటే ఎక్కువ సమయం మార్చురీలో మృతదేహం ఉంటే దుర్వాసన వచ్చే అవకాశముంది. నూతనంగా చేపట్టిన మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పనులు కొనసాగుతుండగా మార్చురీ కోసం నూతన ఫ్రీజర్‌ను కొత్త భవనంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరులోపు కొత్త ఫ్రీజర్‌ను నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనంలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేదవ్యాస్‌ తెలిపారు.

    బెల్లింపల్లిలో మూడింట్లో రెండు మూలకే..

    బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియాస్పత్రి మార్చురీకి నెలలో గరిష్టంగా 25కు పైగా మృతదేహాలు పోస్టుమార్టం కోసం వస్తుంటాయి. రైలు, రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోతే వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరుస్తారు. మృతుల కుటుంబీకుల ఆచూకీ తెలిసేదాకా కనిష్టంగా వారంపాటు మృతదేహా లు కుళ్లిపోకుండా ఫ్రీజర్‌లో భద్రపర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి రెండు మృతదేహాలు వచ్చినపుడు ఫ్రీజర్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రస్తుతం మార్చరీలో ఒకే ఫ్రీజర్‌ మాత్రమే అందుబాటులో ఉంది. రెండు ఫ్రీజర్‌లు మరమ్మతుకు నోచుకోక నిరుపయోగంలో ఉన్నాయి. వీటికి మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. అదనంగా మరో ఫ్రీజర్‌ను అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. కాగా, మార్చురీ గదిని ఆనుకుని చేపట్టిన ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దీంతో రోడ్డు పక్కన, గది ఆరుబయట ఒక్కోసారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మార్చురీ గదికి వెళ్లడానికి సీసీ రోడ్డు నిర్మించాల్సిన అవసరముంది.

  • మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఖాళీ స్థలం చదరపు గజానికి కనిష్టంగా రూ.2,400 కాగా, గరిష్టంగా రూ.15,900 ఉంది. అపార్టుమెంట్లలోని ప్లాట్లు చదరపు అడుగు ధర కనిష్టంగా రూ.1,800 కాగా, గరిష్టంగా రూ.2,500 ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువలకు అనుగుణంగా ఎక్కడా 100 శాతానికి మించకుండా, కనీసం ఐదు శాతం పెంచుతూ సవరణ చేపట్టనున్నారు. దీంతో జిల్లాలోనూ భూముల ధరలు పెరగనున్నాయి. ఖాళీ స్థలం చదరపు గజానికి కనిష్టంగా రూ.4వేలు, గరిష్టంగా రూ.18వేలు కానుంది. అపార్టుమెంట్లలోని ప్లాట్ల ధర కనిష్టంగా రూ.2,500, గరిష్టంగా రూ.3,500 కానుంది.

    ‘రియల్‌’ వ్యాపారం కుదేలే..!

    రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడేళ్లుగా అంతంత మాత్రంగానే సాగుతోంది. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచి ప్రతీరోజు అంతంత మాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వానికీ ఆదాయం తగ్గిపోయింది. గతంలో ‘రియల్‌’ వ్యాపారం బాగా జరిగినప్పుడే భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ‘రియల్‌’ వ్యాపారం కుదేలు కావడంతో పెరిగిన ధరల ప్రకారంగా భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. అంతంత మాత్రంగానే సాగుతున్న ‘రియల్‌’ వ్యాపారానికి భూముల ధరల పెంపు నిర్ణయంతో ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీరోజు 90 స్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, 30లోపు మాత్రమే జరుగుతున్నాయి. భూముల మార్కెట్‌ విలువలు పెరిగితే సామాన్యులకు ఆర్థికంగా భారం కావడంతో పాటు రిజిస్ట్రేషన్లు మరింత తగ్గి ప్రభుత్వానికీ ఆదాయం తగ్గే అవకాశముంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన వెంచర్లు ప్లాట్ల అమ్మకాలు లేక వెలవెలబోతుండగా, కొత్త వెంచర్ల ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

  • దండేపల్లి: మండలంలోని మేదరిపేట పెట్రోల్‌ బంక్‌ సమీపంలో గత మార్చి 9న విద్యుత్‌ ప్రమాదంలో వెల్గనూర్‌కు చెందిన నాగరాజు, మాదాపూర్‌కు చెందిన లక్ష్మీనారాయణ మృతి చెందగా వారి కుటుంబాలకు న్యాయం చేయాలని మేదరిపేటలో మంగళవారం రాస్తారోకో చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంక్‌ యజమాని మామ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరి గిందని ఆరోపించారు. ప్రమాద సమయంలో పరి హారం ఇస్తానని బాండ్‌ రాసిచ్చి రెండు నెలలైనా ఇవ్వడంలేదని ఆరోపించారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 3గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం ఎ స్సైలు తహసీనొద్దీన్‌, సురేశ్‌, ఉదయ్‌కిరణ్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పా రు. కాగా, వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించి బంక్‌ య జమాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకుని వారిని రోడ్డుపక్కన కూర్చోబెట్టారు. ఇంతలో మంచిర్యాల ఏసీపీ ప్రకా శ్‌ వచ్చి బాధిత కుటుంబీకులు, బంధువులతో మా ట్లాడారు. బంక్‌ యజమానితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

  • భీమారం: నకిలీ పత్తి విత్తనాల కేసులో తాండూర్‌ మండల కేంద్రానికి చెందిన సుబ్బారావును మంగళవారం భీమారంలోని ఆవిడం ఎక్స్‌రోడ్డు వద్ద అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై రాజేందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమారంకు చెందిన పెన్కుల రవి వద్ద రెండు రోజుల క్రితం భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి చేసినట్లు తెలిపారు. ఇదే కేసులో కీలక నిందితునిగా ఉన్న సుబ్బారావు పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. ఇదే కేసులో మరొకరు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా నిల్వ చేసినా అరెస్ట్‌ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

    వివరాలు వెల్లడిస్తున్న ఎస్సై రాజేందర్‌

  • నెన్నెల: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పిల్లలు బయట ఆడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు చెట్ల నీడన చేరి క్రికెట్‌, తదితర క్రీడలు ఆడుతూ ఉత్సాహంగా వేసవి సెలవులు గడిపేస్తున్నారు. ఎండకు ఆడే ఆటలను పక్కన బెట్టి చెట్టు నీడన ఆడే ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చిన పిల్లలను ఎండ తీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం వేప చెట్టు నీడన చిన్నారులు క్రికెట్‌ ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.

  • ఆదిలాబాద్‌టౌన్‌: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కారణంగా జనాలు అతలాకుతలం అవుతున్నారు. 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్రీడాకారులు ఎండ నుంచి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు, వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, క్రీడా మైదానాల్లో శారీరక శ్రమ ఎక్కువగా చేసే పిల్లలు ఎండ ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమా దం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు జ్వ రం, వాంతులు, విరోచనాల బారిన పడే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

    జాగ్రత్తలు పాటించాలి..

    ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఆటలు ఆడటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం ద్వారా డీహైడ్రేషన్‌, హీట్‌ స్ట్రోక్‌, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. వి ద్యార్థులు ఆటల సమయంలో త రచూ నీరు తాగాలని, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవడం మంచి దని చెబుతున్నారు. కాటన్‌ దుస్తులు, టోపీ ధరించడంతో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండడంతో తల తిరగ డం, వాంతులు, అధిక చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడ ప్రదేశానికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఖాళీ కడుపుతో ఆటలకు పంపించవద్దని, శిక్షకులు విద్యార్థులకు తగిన విరామం ఇవ్వడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలని పేర్కొంటున్నారు.

    కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు

    ఆస్నాదలో క్రికెట్‌ ఆడుతున్న చిన్నారులు

    పెరట్లో చిన్నారుల క్రికెట్‌

    చెన్నూర్‌రూరల్‌: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులంతా ఒకేచోట చేరి ఆడుతున్న ఆటలు చూడ ముచ్చటగా ఉంటాయి. అందులోనూ క్రికెట్‌ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడతారు. మండలంలోని ఆస్నాద గ్రామంలో మంగళవారం సాయంత్రం చిన్నారులు తమ ఇంటివద్ద ఉన్న పెరట్లో ఇలా క్రికెట్‌ ఆడుతూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.

    ఆటలకు ముందు క్రీడాకారులు వామప్‌ చేసి జాగింగ్‌ చేయడం మంచిది. రన్నింగ్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా వామప్‌ చేయాలని క్రీడా నిపుణులు చెబుతున్నారు. లేదంటే నీరసించిపోయి సామర్థ్యం తగ్గుతుందంటున్నారు. ఆయా క్రీడల్లో పాల్గొనే ముందు తప్పనిసరిగా స్టిల్స్‌ ప్రాక్టిస్‌ చేసి గేమ్‌లోకి దిగితే ఎక్కువ సమయం ఆడే అవకాశం ఉంటుందన్నారు.

  • నిర్మల్‌: వేసవి సెలవులను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు జిల్లావాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా వాటర్‌ పార్కులు, రిసార్టులు జిల్లాలో అందుబాటులోకి రావడంతో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోనే సారంగపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద పచ్చని ప్రకృతి ఒడిలో వండర్‌ల్యాండ్‌ పేరిట వాటర్‌పార్క్‌ ఏర్పాటు చేశారు. కృత్రిమ జలపాతం, రెయిన్‌డ్యాన్స్‌లతో పాటు అరుదైన జిప్‌ సైకిల్‌, జిప్‌లైన్‌, రాకెట్‌ ఎజెక్షన్‌, 360 డిగ్రీల సైకిలింగ్‌, నాలుగుసీట్ల గైరో, క్రేజీ రోలర్‌, బుల్‌రైడ్‌, బౌన్సీ, పిల్లలకు నెట్‌ ట్రాంపోలిన్‌ ఇలా ఎన్నో అడ్వెంచర్లు ఉన్నాయి. వేసవి తాపాన్ని మరిచిపోయేలా వాటర్‌పార్కులు, స్విమ్మింగ్‌పూల్స్‌తో కూడిన రిసార్టుల్లో జిల్లావాసులతో సందడి చేస్తున్నారు. కాస్త ఆసక్తి ఉన్నవాళ్లు కశ్మీర్‌, లద్దాఖ్‌, సిమ్లా, సిక్కిం తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. అంతదూరం వద్దనుకున్నవాళ్లు ఊటీ, కొడైకెనాల్‌ వంటి చల్లని ప్రదేశాలకు కుటుంబంతో కలిసి వెళ్లి కూల్‌గా గడిపేస్తున్నారు. మార్గమధ్యలో ప్రసిద్ధ ఆలయాలు, పేరొందిన టూరిస్ట్‌ ప్రాంతాలనూ దర్శిస్తున్నారు.

    మిత్రులతో కలిసి..

    కుటుంబసభ్యులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. మాకూ ఇలాంటివి తప్పలేదు. దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితులు లేనివాళ్ల కోసం ఇక్కడే ఏదైనా చేయాలన్న లక్ష్యంతో మిత్రులం కలిసి ‘వండర్‌ల్యాండ్‌’ను ఏర్పాటు చేశాం. ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజూ మంచి స్పందన ఉంటోంది.

    – నూకల గురుప్రసాద్‌, వండర్‌ల్యాండ్‌ వాటర్‌పార్క్‌

    కశ్మీర్‌ భూతలస్వర్గమే..

    వేసవిలో ఎటైనా వెళ్లాలనుకునే వారికి మంచి టూర్‌ కశ్మీర్‌. హిమాలయ అందాలతో భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా కశ్మీర్‌ అందాలను తిలకించాల్సిందే. ఈ సీజన్‌లో కుటుంబంతో ‘కూల్‌’గా వాటన్నింటినీ ఆస్వాదించడం ఎప్పటికీ మర్చిపోలేం.

    – నగేశ్‌, టీచర్‌, నిర్మల్‌

    ఈ చిత్రంలో ఉన్న వీరంతా నిజామాబాద్‌, బాన్సువాడకు చెందిన కుటుంబసభ్యులు. వాటర్‌పార్క్‌లో ఓ రోజంతా పిల్లలతో ఎంజాయ్‌ చేయడానికి వచ్చారు. అంతదూరం నుంచి వచ్చిన వారంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటర్‌పార్క్‌లో, రెయిన్‌డ్యాన్స్‌లో చల్లగా సేదదీరారు. పిల్లలతో పాటు పెద్దలూ ఇక్కడి వాటర్‌గేమ్స్‌ను

    ఎంజాయ్‌ చేశారు.

  • బెల్లంపల్లి: వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో వాహనాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఎండలో పార్కింగ్‌ చేసిన వాహనాలు వేసవి తీవ్రతకు పెట్రోల్‌ ట్యాంక్‌ హీటెక్కి మంటలు చెలరేగే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అక్కడక్కడ బైక్‌లు, కార్లు మంటల్లో కాలిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 19న ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఇంజిన్‌లోంచి మంటలు చెలరేగి కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌లు, కార్లను నీడపట్టున పార్కింగ్‌ చేయాలని బెల్లంపల్లికి చెందిన ఓ సీనియర్‌ మెకానిక్‌ గౌరు మహేష్‌ సూచిస్తున్నారు. ఎండలో వాహనాలను పార్కింగ్‌ చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

  • ఆదిలాబాద్‌టౌన్‌/గుడిహత్నూర్‌:ఏడడుగులు నడిచి.. జీవితాంతం కలిసి ఉండాలని ఒక్కటైన మూడుముళ్ల బంధం మరణంలోనూ వీడలేదు.. ఈ జంటను మృత్యువు రోడ్డు ప్రమాదంలో కబళించింది.. అన్న కుమారుడి వివాహ వేడుకలకు వెళ్తుండగా బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది.. మరికొంత దూరంలోనే గమ్యం చేరుకోవాల్సిన వారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు.. దీంతో పెండ్లి బాజాలు మోగాల్సిన కుటుంబంలో చావు డప్పులు మోగే పరిస్థితి.

    అసలేం జరిగిందంటే..

    గుడిహత్నూర్‌ మండలం తోషం గ్రామ పంచాయతీ పరిధి తోయగూడకు చెందిన పెందూర్‌ లక్ష్మణ్‌ (50), పెందూర్‌ శకుంతల (45) దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె పూర్ణబాయికి వివాహమైంది. కుమారుడు అరవింద్‌ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మృతుని సోదరుడు జైనూర్‌ మండలం పాట్నాపూర్‌లో నివాసం ఉంటున్న భీంరావు ఐదారేళ్ల క్రితం మృతి చెందాడు. గురువారం భీంరావు కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. ఆ కుటుంబానికి వీరే పెద్ద దిక్కు. సంప్రదాయం ప్రకారం వీరు పెళ్లి కుమారుడికి హల్దీ కార్యక్రమం మంగళవారం చేపట్టాల్సి ఉంది. దీంతో ఈ దంపతులు ద్విచక్ర వాహనంపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్‌ నుంచి బయల్దేరి వెళ్లారు. ఉట్నూర్‌ సమీపంలోని యేంద వద్ద కారును ఓవర్‌టేక్‌ చేసే సమయంలో బైక్‌ కారుకు తగలడంతో అదుపుతప్పి ఎదురుగా ఉట్నూర్‌ వైపు నుంచి ఆదిలాబాద్‌ వైపు వస్తున్న ఆసిఫాబాద్‌ డిపోకు చెందిన బస్సుకింద పడ్డారు. పెందూర్‌ లక్ష్మణ్‌ తల, శరీర భాగాల పైనుంచి బస్సు టైర్లు వెళ్లడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలైన శకుంతల కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు ఉట్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు ఉట్నూర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

    పెళ్లింట విషాదం..

    ఎంతో సంబరంగా పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పెళ్లికి హాజరు కావాల్సిన బంధువులు అంతిమ యాత్రకు రావడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది.

  • దిలావర్‌పూర్‌: ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు సారంగాపూర్‌ మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు. అతని చిన్న కుమారుడైన రోహిత్‌గౌడ్‌ (24) కోనేరులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    వడదెబ్బతో వృద్ధురాలు..

    భైంసాటౌన్‌: పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన రావుల లక్ష్మీబాయి (68) వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలోనే చనిపోగా, ఆమె కూరగాయలు విక్రయిస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం వారసంతలో కూ రగాయలు విక్రయించేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. వాంతులు చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం ఉదయం స్థానికులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

    గంజాయి పట్టివేత

    ఖానాపూర్‌: గంజాయి అక్రమ రవాణా కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సత్తనపల్లి గ్రామ పరిధిలోని రాంరెడ్డిపల్లి బస్టాప్‌ వద్ద మంగళవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద సుమారు 1.10 కిలోల గంజాయి లభించింది. చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిని బిహార్‌కు చెందిన మనీష్‌ పాస్వాన్‌గా గుర్తించారు. గంజాయిని సీజ్‌ చేసి ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీ సులు తెలిపారు. సీఐ అజయ్‌, ఎస్సై రాహుల్‌ గైక్వా డ్‌, కానిస్టేబుల్‌ బీమ్రాజు, సుధీర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ రెడ్డిని ఎస్పీ అభినందించారు.

  • చెన్నూర్‌రూరల్‌: మండలంలోని ఎల్లక్కపేటలో అదనపు కట్నం కోసం మహిళను హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మృతురాలు చల్ల శారద భర్త చల్ల రమేశ్‌ సోమవారం పథకం ప్రకారం అతని స్నేహితుడైన గందం సారయ్యకు ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. అతని సహాయంతో భార్య శారదను సుత్తితో తలపై గట్టిగా కొట్టడంతో మృతి చెందింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయి మూతపడిన సింగరేణి క్వార్టర్స్‌లో దాక్కున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన సుత్తిని, రక్తపు మరకలు అంటిన దుస్తులను, సెల్‌ఫోన్‌లు స్వాఽధీనం చేసుకున్నారు. అనంతరం రమేష్‌ తల్లిదండ్రులు వెంకమ్మ, అబ్బయ్యతో పాటు సోదరి పుష్పలతను అదుపులోకి తీసుకుని చెన్నూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రిమాండ్‌ నిమిత్తం మంచిర్యాల కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో చెన్నూర్‌ పట్టణ సీఐ బన్సీలాల్‌, ఎస్సైలు శ్యామ్‌ పటేల్‌, రాజశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Nirmal

  • ఖానాపూర్‌: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వహించాలని నిర్మల్‌ డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ యు.కాశీనాథ్‌ సూచించారు. ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు సిబ్బంది పరస్పర సామరస్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్‌ కాశీనాథ్‌ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్పపత్రికి వచ్చే రోగులను జాగ్రత్తగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రిలో సమస్యల గురించి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వంశీమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు.

  • భానుడి భగభగలతో జిల్లా అగ్నిగుండంలా మారింది. ఎప్పుడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. దీంతోప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. భానుడి నిప్పులకు వడగాలులు ‘దెబ్బ’కొడుతున్నాయి. జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాకు హెచ్చరికలు ఉన్నాయి. వైద్యులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. – నిర్మల్‌

    మామడ కేజీబీవీ ఎస్‌వోకు ప్రతిభ పురస్కారం

    మామడ: మామడ కేజీబీవీ విద్యార్థులు పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. దీనికి గుర్తింపుగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి జ్యోతి, పదో తరగతి విద్యార్థిని యశస్విని ప్రశంసాపత్రాలతోపాటు గోల్డ్‌మెడల్‌ అందుకున్నారు.

    జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డులు దాటిపోతున్నాయి. ప్రతీసీజన్‌లో మే 25–30 మధ్య నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు ఈసారి నెల ప్రారంభం నుంచే కొనసాగుతున్నాయి. కొన్ని మండలాల్లో మరీ దారుణంగా ప్రతిరోజూ 45 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గకుండా నమోదవుతున్నాయి. దస్తురాబాద్‌లో మంగళవారం 45.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ 46–47వరకూ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్‌(పాతఎల్లాపూర్‌)లోనూ 45.7, నిర్మల్‌రూరల్‌(అక్కాపూర్‌)లో 45.4, దిలావర్‌పూర్‌ 45.3 డిగ్రీ సెల్సియస్‌ ఉండగా, మిగితా మండలాలూ 44.5కు తగ్గకుండా మండుతుండటం గమనార్హం.

    భయపెడుతున్న వడగాలులు..

    మండుతున్న ఎండలకు తాజాగా వడగాలులు తోడవుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. క్షణాల్లో మనిషిని నీరసపర్చి ‘వడదెబ్బ’ కొడుతున్నాయి. ఇంట్లో వేడెక్కిన పైకప్పు, ఫ్యాన్‌ గాలీ వేడిగా రావడం, సరిపడా నీరు తాగకపోవడంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు వడదెబ్బతో మృతిచెందారు. జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌కు చెందిన లక్ష్మణ్‌, ఖానాపూర్‌ మండలం గోసంపల్లిలో మేకల కాపరి గోవిందు, భైంసా పట్టణానికి చెందిన రావుల లక్ష్మిబాయి వడదెబ్బ కారణంగా చనిపోయారు.

    పనులకు పరేషాన్‌..

    పొద్దున్నే సూర్యుడు ప్రతాపం చూపుతుండటంతో వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సు, ఆటోల డ్రైవర్లు ఎండల్లో, మరోవైపు వడగాలులను తట్టుకుంటూ ఇబ్బందికరంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి వెనుకాడుతున్నారు. ఎండల కారణంగా పట్టణాల్లో చల్లని పానీయాలు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసాలకు డిమాండ్‌ పెరిగింది. ఐస్‌క్రీం పార్లర్లు, జ్యూస్‌ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజులు ఇలాగే ఎండలు, వడగాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ‘వామ్మో.. ఇవేం ఎండలు బాబోయ్‌..’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఎండ వేడికి తలపై చున్నీలు కప్పుకుని వెళ్తున్న యువతులు

    డీఈవోకు సన్మానం

    నిర్మల్‌ రూరల్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మూడో స్థానంలో నిలవడంతో జిల్లా కేంద్రంలోని పెన్షనర్‌ భవన్‌లో డీఈవో భోజన్నను పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. సంఘం ప్రతినిధి ఎంసీ.లింగ న్న మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో జి ల్లా మూడో స్థానంలో నిలిచేందుకు అహర్నిశలు కృషిచేసిన భోజనను అభినందించారు. ఇందులో రిటైర్డ్‌ ఉద్యోగులు జనార్దన్‌, రమేశ్‌, బాలకిషన్‌, విలాస్‌, రాజేశ్వర్‌, రామేశ్వర్‌, రాములు, రమేశ్‌, శేషాద్రి, వేణుగోపాల్‌, పోశెట్టి, రాములు, కమలాకర్‌ పాల్గొన్నారు.

    వ్యాపారుల ఇష్టారాజ్యం..!

    అప్రమత్తంగా ఉండాలి..

    ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

    మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దు.

    దాహం వేసినా వేయకున్నా తరచూ తగినంత నీరు తాగాలి.

    కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలి. కెఫిన్‌, చక్కెర శాతం ఉన్న కూల్‌ డ్రింకులు తాగొద్దు.

    తేలికపాటి దుస్తులు ధరించాలి.

    వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

    వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

    నేడు పోలీస్‌ ప్రజావాణి

    భైంసాటౌన్‌: పట్టణంలోని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోని క్యాంప్‌ కార్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల అందుబాటులో ఉంటారు. భైంసా సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఫిర్యాదుదారులు నేరుగా కలిసి అర్జీలు అందించవచ్చు.

  • భైంసా: ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో రోహిణి కార్తె మొదలవుతుంది. మరోవైపు ఈనెలాఖరుకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసుంటున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చమురు(డీజిల్‌) కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు రోజుల క్రితం కేంద్రం పెట్రో ధరలు రూ.3 పెంచింది. తాజాగా మరో రూపాయి పెంచింది. అయినా జిల్లాలో వాహనాలకు డీజిల్‌ దొరకడం లేదు. ఇప్పటికే అకాల వర్షాలు, పంట కొనుగోలు సమస్యలు, కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడు డీజిల్‌ కోసం పెట్రోల్‌ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు భూములను దున్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో డీజిల్‌ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నిలిచిపోవడం రైతులను కలవరపెడుతోంది.

    చివరి దశకు పంట కోతలు

    జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు మొక్కజొన్న పంట నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హార్వెస్టర్లు, ట్రాక్టర్ల వినియోగం భారీగా ఉండటంతో డీజిల్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే భైంసా డివిజన్‌ పరిధిలోని అనేక పెట్రోల్‌ బంకుల్లో వారం రోజులుగా డీజిల్‌ కొరత కనిపిస్తోంది. కొన్నిచోట్ల పూర్తిగా డీజిల్‌ లేకపోవడంతో రైతులు గంటల తరబడి వేచి చూసినా నిరాశతో వెనుదిరుగుతున్నారు. డీజిల్‌ లేక పంట నూర్పిడి పనులు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే కోసిన వరి, మొక్కజొన్న పంట పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితుల్లో పంట తడిస్తే తీవ్ర నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఖరీఫ్‌ సాగు కోసం భూములను దున్నే పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

    పెరుగుతున్న ఖర్చులు

    ఇప్పటికే పెట్టుబడులు పెరిగి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు భారం అవుతుండగా ఇప్పుడు డీజిల్‌ కొర త మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా భూములు సిద్ధం కాకపోతే ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ప్రత్యేక దృష్టి పెడితేనే..

    వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు ప్రత్యేకంగా డీజిల్‌ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ సీజన్‌ సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆయిల్‌ కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే డీజిల్‌ కొరత జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది.

    మహారాష్ట్ర బాట..

    స్థానికంగా డీజిల్‌ దొరకక కొంతమంది రైతులు పక్కనే ఉన్న మహారాష్ట్ర రాష్ట్రలోని భోకర్‌, ధర్మాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి డీజిల్‌ తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లతో దూర ప్రయాణాలు చేయడం వల్ల సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని పేర్కొంటున్నారు. కొందరు రైతులు రాత్రి వేళలల్లోనే మహారాష్ట్ర బంకులకు వెళ్లి డీజిల్‌ తీసుకొస్తున్నారు.

    20 రోజుల్లో వర్షాకాలం

    ఇంకా 20 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. రైతులు భూములను సిద్ధం చేసే పనులు ప్రారంభించారు. అయితే డీజిల్‌ కొరత ఈ పనులకు కూడా ఆటంకం కలిగిస్తోంది. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ట్రాక్టర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ భూముల్లో ఉన్న ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కోసం రైతులు డబ్బాలు తీసుకెళ్లి పెట్రోల్‌ బంకుల నుంచి డీజిల్‌ తెచ్చుకునేవారు. అయితే తాజాగా వాహనాలను నేరుగా బంకులకు తీసుకురావాలని సూచించడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. పొలాల్లో ఉన్న ట్రాక్టర్లను దూరంలోని బంకుల వరకు తీసుకెళ్లడం సాధ్యం కాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • భైంసాటౌన్‌: భైంసాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు వ్యాపారులకు వంతపాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గాంధీగంజ్‌లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల మధ్య నెలకొన్న విబేధాలకు రైతులను బలి చేస్తున్నారు. అసలే అష్టకష్టాలు పడి పంటలు సాగు చేస్తే, విక్రయానికీ అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని గాంధీగంజ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయానికి తేగా, ట్రేడర్లు మధ్యాహ్నం వరకు బీట్‌ ప్రారంభించలేదు. దీంతో రైతులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్‌ ట్రేడర్లు, కమీషన్‌ ఏజెంట్లను తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రైతుల నుంచి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే ట్రేడర్లు డబ్బు చెల్లించే విషయమై విబేధాల కారణంగా కొనుగోళ్లు నిలిపేసినట్లు తెలిసింది. దీంతోపాటు హమాలీలు, లారీలు, గన్నీ సంచులు లేవంటూ కొనుగోళ్లు చేపట్టలేదని కార్యదర్శితో ట్రేడర్లు చెప్పుకొచ్చారు. అయితే, ప్రస్తుతానికి వచ్చిన లాట్లు కొనుగోలు చేసి, రేపటి నుంచి ట్రేడింగ్‌ చేయబోమని లిఖితపూర్వకంగా పత్రం ఇవ్వాలని కోరారు. దీంతో వారు కొనుగోళ్లకు బలవంతం చేస్తున్నారని కార్యదర్శినే దబాయించే ప్రయత్నం చేశారు. దీనిపై కార్యదర్శి స్పందిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. దీంతో ప్రస్తుతానికి కొనుగోలు చేస్తామని, కానీ, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు బుధవారం తాత్కాలికంగా ఒకరోజు బీట్‌ నిలిపేయాలని ఏఎంసీ కార్యదర్శిని మౌఖికంగా కోరారు.

    తప్పుడు ప్రకటన...

    ఇదిలా ఉండగా, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్ల మధ్య విబేధాలను పరిష్కరించి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాల్సిన ఏఎంసీ అధికారులు వ్యాపారులకు వంతపాడేలా, రైతులను ఇబ్బందులకు గురి చేసేలా తప్పుడు ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన ఎండల నేపథ్యంలో రైతుల ఆరోగ్య దృష్ట్యా అంటూ బుధవారం బీట్‌ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇది రైతులను తప్పుదోవ పట్టించడమేనని తెలుస్తోంది. ఈ విషయమై ఏఎంసీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూర్యానాయక్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

  • ఆసిఫాబాద్‌/కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లాకు వస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ జూన్‌ 2న సీఎం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బుధవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని మంత్రి ప్రత్యేక కార్యదర్శి కాసుల నానిల్‌ కుమార్‌ తెలిపారు. మంత్రులు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌కు చేరుకోనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభ నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ కె.హరిత, ఎస్పీ నితిక పంత్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌ కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌, వంజిరీ దాదానగర్‌ ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.

  • నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో ధాన్యం నిల్వకు మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెనువెంటనే గోదాములకు తరలించాలని చెప్పా రు. ముందస్తు జాగ్రత్త చర్యగా అదనంగా, ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు సమకూర్చుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లో గోదాములు అందుబాటులో ఉంటే, గుర్తించి ధాన్యం అక్కడికి తరలించాలని వివరించారు. ధాన్యం నిరంతరాయంగా తరలించేలా తగినన్ని లారీలు, తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారులు రాజేందర్‌, సుధాకర్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం మహేశ్‌, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి, డీపీవో శ్రీనివాస్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    ఇసుక తవ్వకాలు నియంత్రించాలి..

    జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు పూర్తి స్థాయిలో నియంత్రించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా సాండ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు. కేవలం మన ఇసుక వాహనం యాప్‌ ద్వారానే ఇసుక అమ్మకాలు పారదర్శకంగా జరగాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, భూగర్భ జల అధికారి శ్రీనివాసబాబు, డీపీవో శ్రీనివాస్‌, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.

  • భైంసాటౌన్‌:భైంసాలో మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఎట్టకేలకు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గత నెలలో మొదటి సమావేశంలో గందరగోళం నడుమ ఇద్దరు సభ్యుల ఎన్నిక జరిగింది. ఇందులో మైనారిటీ మహిళా విభాగంలో ఒకరి ఎన్నికను ధృవీకరిస్తూ అధికారులు సర్టిఫికెట్‌ అందించారు. అయితే, మైనార్టీ కోటాలో మరో సభ్యుడి ఎన్నిక కూడా ధృవీకరించాలని ప్రతిపక్ష ఎంఐఎం డిమాండ్‌ చేసింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మరోవైపు మొదటి సమావేశంలో ఎన్నికను బహిష్కరించిన పాలకపక్ష సభ్యులు ఈనెల 12న మరోమారు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఎన్నిక వాయిదా వేస్తూ కమిషనర్‌ ఒకరోజు రాత్రి ఫోన్‌ సందేశ రూపంలో చెప్పడంతో, దీన్ని నిరసిస్తూ పాలకవర్గ సభ్యులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద మూడు రోజులపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే చొరవతో ఆందోళన విరమించిన పాలకపక్ష సభ్యులు ఈ నెల 19న ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ఎన్నికకు మంగళవారం సమావేశం నిర్వహించారు. పాలకపక్ష సభ్యులు 13, ఎక్స్‌ అఫీషియో ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిపి 14 మంది సభ్యులకు మెజారిటీ చేరింది. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కోఆప్షన్‌ సభ్యులుగా ముజీబ్‌ అహ్మద్‌(మైనారిటీ), అల్లకొండ కవిత(జనరల్‌ మహిళ), తోట లింగురాం (జనరల్‌ పురుషులు) ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు సభ్యుల ఎన్నిక కోర్టు తీర్పు నిబంధనలకు లోబడి ఉంటుందని సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

  • నిర్మల్‌ఖిల్లా: సాంకేతిక నైపుణ్యాల సాధనతోనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక శిక్షణ కేంద్రంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం యువత నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పలువురు అధికారులు మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత సాంకేతికతకు తగ్గట్టుగా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో యువతకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుందో వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ నరసింహారెడ్డి, ఎల్డీఎం రాంగోపాల్‌, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, ఐటీఐ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Karimnagar

  • సుల్తానాబాద్‌రూరల్‌: కోడి పందెం ఆడుతున్న 14మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఎలిగేడు మండలం శివపల్లి శివారుల్లోని బోడగుట్ట వద్ద రాహస్యంగా కోడి పందేలు ఆడుతున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేశారు. దుగ్యాల కార్తీక్‌రావు(శివపల్లి), గడ్డం రాజేశ్‌(ఇందారం), ఒజ్జ శంకర్‌(శివపల్లి), బత్తుల రాజు(పెద్దపల్లి), సల్లూరి పవన్‌(మందమర్రి), పొట్లపల్లి మనోహర్‌, ఎండీ.రహీం(గోదావరిఖని), వెన్న రవీందర్‌(ఇందారం), వెల్పుల సతీశ్‌(ఇందారం), పులి నాగరాజు(పెద్దపల్లి), కొల్లూరి మహేశ్‌(రామగిరి), ఎండీ సమాద్‌(జైపూర్‌), సింగరపు అఖిల్‌వర్మ(పెద్దపల్లి)ను అరెస్టు చేసి 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, కారు రూ.40వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పెటీ, అర్గనైజిడ్‌ క్రైం, ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టూ యానిమల్స్‌ యాక్ట్‌ 1960, తెలంగాణ గేమింగ్‌ యాక్ట్‌ 1974 కింద కేసు నమోదు చేశారు. పందెం రాయుళ్లను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు రంజిత్‌రావు, ప్రవీణ్‌, ఎస్సైలు చంద్రకుమార్‌, సనత్‌రెడ్డి, శ్రీధర్‌, నరేశ్‌, పోలీస్‌ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

  • కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మడంలం వెన్నంపల్లికి చెందిన పూసాల వజ్రమ్మ(69) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వజ్రమ్మ తన ఇంట్లో పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. పాము కరిచినచోట పసుపు రాసుకుంది. ఈవిషయాన్ని పక్కింటి వారికి చెప్పగా పెద్దపల్లిలో వడ్రంగి పనిచేస్తున్న ఆమె కుమారుడు రమణాచారికి సమాచారం అందించారు. చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు.

    వడ దెబ్బతో రైతు..

    సిరిసిల్లఅర్బన్‌: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 8వ వార్డు పెద్దూరుకు చెందిన రైతు రాచర్ల రవి (49) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. రవి తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్లు, గ్రామస్తులు కోరారు.

    చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో..

    కోరుట్లరూరల్‌: కరెంట్‌ పెట్టి.. చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కల్లూర్‌ శివారు చెరువు మత్తడి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాదాపూర్‌ గ్రామానికి చెందిన గాండ్ల మోహన్‌ (48) మంగళవారం సాయంత్రం విద్యుత్‌ తీగను చెరువులో వేసి చేపలు పడుతున్నాడు. విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధం

    జగిత్యాలరూరల్‌: జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ బైపాస్‌రోడ్‌ నర్సింగాపూర్‌ వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధమైంది. టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన సంపంగి రవీందర్‌కు చెందిన లారీ జగిత్యాల నుంచి టీఆర్‌నగర్‌కు వెళ్తుండగా.. నర్సింగాపూర్‌ శివారులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలు ఆర్పేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్‌ తెలిపారు.

    మొగ్ధుంపూర్‌లో అగ్నిప్రమాదం

    కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్‌కు తృటిలో ముప్పు తప్పింది. పోచమ్మగుడి ప్రాంతంలోని వరికొయ్యలకు మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించా డు. మంటలు పుట్నాల మిల్లు, రైసుమిల్లు ప్రాంతాలకు విస్తరించాయి. పుట్నాల మిల్లు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్లు కాలిపోగా మంటలు సమీపంలోని రైసుమిల్లు వద్ద నిలిపిన ధాన్యం ట్రాక్టర్ల వద్దకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైసుమిల్లు యజమాని వెంకటేశ్వర్లు హమాలీలతో నీళ్లు పోయించి, మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లో ఫైరింజన్‌ అందుబాటులో లేకపోవడంతో చొప్పదండి నుంచి వచ్చిన ఫైరింజన్‌తో పొలాల్లో వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. రైతులకు చెందిన విద్యుత్‌మోటార్లు, వైర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

  • పెద్దపల్లిరూరల్‌: కారుడ్రైవర్‌గా పనిచేస్తే వచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదు. తక్కువ సమయంలోనే ఆర్థికంగా ఎదగాలన్న దురాశతో ఓ కారును అద్దెకు తీసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డ ఊరడి జనార్దన్‌ను పెద్దపల్లిరూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, పెద్దపల్లి రూరల్‌ ఎస్సై మల్లేశ్‌తో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువమొత్తంలో సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్‌తో జతకట్టాడు. ఇందరూ కలిసి అపహరించిన సొత్తును పంచుకున్నారు. వీరితో వెంకటేశ్‌ సోదరుడు తమ్మిశెట్టి మణికంఠ కూడా చేతులు కలపడంతో ముగ్గురు కలిసి పొద్దంతా కారులో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 2025 సెప్టెంబర్‌లో నల్గొండలో ఓ కారు అద్దెకు తీసుకుని వరంగల్‌, కరీంనగర్‌ మీదుగా పెద్దపల్లికి చేరుకున్నారు. సుల్తానాబాద్‌ శివారులో ఓ ఇంటి ముందు ఉంచిన స్కూటీని అపహరించి పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చేరుకున్నారు. సెప్టెంబర్‌ 15న రాత్రి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం గుంటూరు మీదుగా గోవాకు పారిపోయారు. అక్కడ కొంత బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేశారు. రెండు తులాల బంగారు గొలుసును తమ వద్దనే ఉంచుకున్నారు. మరోసారి పెద్దపల్లి ప్రాంతంలోనే దొంగతనం చేయాలనే ఆలోచనతో ఊరడి జనార్దన్‌ వచ్చి.. కూనారం రైల్వేగేటు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడ్డట్టు తేలింది. నిందితుడి నుంచి రెడ్‌కలర్‌ బలెనో కారు, 20గ్రాముల బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు. అంతర్‌జిల్లా దొంగను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ, ఏసీపీలు అభినందించారు.

    తాళం వేసిన ఇళ్లు టార్గెట్‌

    అనుమానంతో అదుపులోకి

    దొంగతనాలు చేసినట్లు విచారణలో వెలుగులోకి

    నిందితుడి వివరాలు వెల్లడించిన సీఐ ప్రవీణ్‌కుమార్‌

  • ధర్మపురి: నిబంధనలు పాటించనందుకు ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిని సీజ్‌ చేసినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పీఎంజే జువెల్లరీ షాపులో ఇటీవల ఆరుగురు వ్యక్తులు చొరబడి బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులు ఈ లాడ్జిలోనే బస చేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్థానిక ఎస్సై మహేశ్‌ విజయలక్ష్మి లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. యజమాని గుండయ్యను విచారించారు. రికార్డులు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, నిబంధనలు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాలతో.. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి సూచనలతో లాడ్జిని సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ట్రేడ్‌లైసెన్స్‌ లేకుండా గెస్ట్‌హౌజ్‌లు నిర్వహించడం.. గదుల కోసం వచ్చిన వారి నుంచి ఆధార్‌కార్డులు, వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని లాడ్జిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డికి సూచించామన్నారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ మీటర్లను ఉపయోగిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఏఈకి సూచించామన్నారు. మున్సిపల్‌ మేనేజర్‌ గంగాధర్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులున్నారు.

  • కార్యక్రమంలో పాల్గొన్న వారికి

    సర్టిఫికెట్లు అందజేస్తాం

    ‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్‌ 21వ తేదీ వరకు బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు.

    శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్‌(త్రేడింగ్‌), వ్యాక్స్‌, పెడిక్యూర్‌, మెనిక్యూర్‌, బ్లీచ్‌,స్కిన్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, ఫేస్‌ప్యాక్స్‌, హెయిర్‌ కట్స్‌, హెయిర్‌స్టైల్స్‌, హెన్నా ప్రిపరేషన్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, మేకప్స్‌ (బ్రైడల్‌, పార్టీ, లైట్‌ మేకప్స్‌), హెయిర్‌ మసాజ్‌, హెయిర్‌ కట్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ గ్రూమింగ్‌, శారీ డ్రాపింగ్‌.

  • కరీంనగర్‌: ఊపిరాడనివ్వని ఉక్కపోత.. మాడు పగిలేలా దంచి కొడుతున్న ఎండలు.. చెవుల్లో నిప్పులు పోసినట్లు వీచే వేడిగాలులు.. ఉదయం.. మధ్యాహ్నం.. రాత్రి తేడా లేకుండా కొద్దిరోజులుగా వేడెక్కుతున్న వాతావరణం ప్రతీ వ్యక్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం పది గంటలకే ఎండ దంచి కొడుతుండగా.. మధ్యాహ్నం అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తోంది. సాయంత్రం వేడిగాలులు వీస్తుండగా.. పగలూ రాత్రి లేకుండా కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలకు బేజారు అవుతున్నారు. ఉదయం, సాయత్రం పనులు పూర్తిచేసుకుని, మధ్యాహ్నం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు.

    విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌– 2 డిపో నుంచి ఈనెల 30న మైసూర్‌, ఊటీ విహారయాత్రకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామ ని డిపో మేనేజర్‌ ఎం. శ్రీనివాస్‌ తెలిపారు. 30న మధ్యాహ్నం 3గంటలకు కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి రాజధాని ఏసీ బస్సు బయల్దేరుతుందన్నారు. 31న మైసూర్‌ చేరుకుంటుందన్నారు. మైసూర్‌ ప్యా లెస్‌, చాముండే ఆలయం, బృందావన్‌ గార్డెన్‌ సందర్శన తువాత రాత్రి బస అక్కడే ఉంటుందన్నారు. 1న ఉదయం 4గంటలకు మైసూర్‌ నుంచి బస్సు బయల్దేరి ఊటీ చేరుకుంటుందన్నారు. ఊటీలోని వివిధ ప్రదేశాల సందర్శన అనంతరం 3వ తేదీన ఊటీ నుంచి బయల్దేరి బెంగళూరు చేరుకుంటుందన్నారు. అక్కడ బొటానికల్‌ గార్డెన్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, బెంగళూరు ప్యాలెస్‌ సందర్శన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 4వ తేదీన కరీంనగర్‌ చేరుకుంటుందని వివరించారు. ఈ విహారయాత్రకు పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు టికెట్‌ చార్జి ఉంటుందని, ప్రయాణంలో భోజనం, దర్శనాల టికెట్‌ ఖర్చులు ప్రయాణికులే భరించాలని సూచించారు. వివరాలకు 7382847727, 7382850708, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

    చిన్న పిల్లలతో భిక్షాటన చేయించొద్దు

    విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌ బస్టాండ్‌ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్నారనే సమాచారంతో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 స్టిక్కర్లు అతికించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098 జిల్లా కోఆర్డి నేటర్‌ ఆవుల సంపత్‌ మాట్లాడుతూ బస్టాండ్‌ పరిసరాల్లో చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తున్న వారి గురించి విచారించినట్లు తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేయించడం, తప్పిపోయిన పిల్లలు కనిపించడం, ఇంటి నుండి పారిపోయిన పిల్లలు లేదా ప్రేమపేరుతో ఇంటి నుంచి వచ్చి ఒంటరిగా ఉన్న పిల్లలు కనిపిస్తే చైల్డ్‌ హె ల్ప్‌లైన్‌ 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ బృంద సభ్యులు సుందరగిరి సాయికిరణ్‌ గౌడ్‌, ఎడ్ల ప్రియాంక పాల్గొన్నారు.

    పెట్రో ధరలు తగ్గించాలి

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. నాలుగు రోజుల్లో లీటరు పెటోల్‌, డీజిల్‌పై రూ.4 చొప్పున భారం వేసి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని విమర్శించారు. ఒక్కసారి పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, విడతల వారీగా పెంచుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం నీట్‌ పరీక్ష సక్రమంగా నిర్వహించే సత్తా కేంద్రానికి లేదన్నారు. ధరలు పెరిగాయంటూ భవిష్యత్‌లో ప్రజలను గంజినీళ్లు తాగుమని ప్రధాని చెబుతారంటూ ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు తాజొద్దీన్‌, పిట్టల రవీందర్‌, మల్లికార్జున రాజేందర్‌, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్‌, పడిశెట్టి భూమయ్య, వరాల నర్సింగం పాల్గొన్నారు.

    రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

    సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 21 నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈవో వి.ఆంజనేయరావు తెలిపారు. కరీంనగర్‌లోని డాక్టర్స్‌ స్ట్రీట్‌లోని బాలికల జూనియర్‌ కళాశాలలో తొలి సెషన్‌లో భాగంగా ఇంగ్లిష్‌, తెలుగు, మ్యాథ్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులలో మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఉత్తర్వులు అందిన అధ్యాపకులను స్పాట్‌ కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ రిలీవ్‌ చేయాలని సూచించారు.

    మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా తెలంగాణచౌక్‌ ప్రాంతం

    ఉక్కపోత..

    ఉక్కిరిబిక్కిరి

    కరీంనగర్‌లోనే అత్యధికంగా

    ఉత్తర తెలంగాణ జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో ప్రజలు ఉష్ణతాపాన్ని భరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాకు వాతావారణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా, అవి రానున్న మూడు నాలుగు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఇప్పటికే ఎండలకు తాళలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నెల 25 వరకు జిల్లాలో 45 డిగ్రీల కన్నా ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ కొనసాగనుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    జిల్లా అంతటా 43 డిగ్రీలపైనే

    కరీంనగర్‌ సిటీతో పాటు హుజూరాబాద్‌, చొప్పదండి, మానకొండూర్‌లో గరిష్టంగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం కరీంనగర్‌లో గరిష్టంగా 44 డిగ్రీలు, హుజూరాబాద్‌లో 43.5 డిగ్రీలు, చొప్పదండిలో 43 డిగ్రీలు, మానకొండూర్‌లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌లో రోజంతా రద్దీగా ఉండే తెలంగాణచౌక్‌, టవర్‌సర్కిల్‌, బస్టాండ్‌ ఏరియా, కమాన్‌రోడ్‌ ప్రాంతాలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

    ఇళ్లకే పరిమితమవుతున్న జనం

    భానుడి తాపంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు మినహాయించి బయట పనులకు వెళ్లినవారు 11 గంటలలోపు ఇళ్లకు చేరుకుంటున్నారు. గతంలో కన్నా ఈసారి ఎండల తీవ్రత పెరగడం, గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఇంట్లోనూ వేడిని తాళలేక ఏసీలు, కూలర్లు పెట్టుకుంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. రాబోయే 4 రోజుల్లో 45 డిగ్రీలకు దాటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

    జనగణనకు ‘సన్‌’స్ట్రోక్‌

    కరీంనగర్‌రూరల్‌: జనగణనకు వేసవికాలం ఎండలు అడ్డంకిగా మారాయి. ఎండ తీవ్రతకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10గంటల్లోపే గృహాల వివరాలను మొబైల్‌యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎండ వేడికి నెమ్మదిగా పనిచేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నెల 15నుంచి ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకుల్లోని ఇంటింటికి తిరుగుతూ 33 అంశాలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. రెండు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఆందోళనచెందుతున్నారు. ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి 10గంటలవరకు మాత్రమే తమ బ్లాక్‌లోని ఇళ్ల వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. పురుష ఎన్యుమరేటర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలను నమోదు చేస్తున్నప్పటికీ మహిళలు ఉదయంపూట మాత్రమే పనిచేస్తున్నారు. ఎండప్రభావంతో కేవలం రోజుకు 20 గృహాల నుంచి 25 గృహాల వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి వస్తోందని ఎన్యుమరేటర్లు పేర్కొంటున్నారు.

    కరీంనగర్‌ అర్బన్‌: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడంలో బ్యాంకు అనుసంధాన రుణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇకపై రుణాల మంజూరులో సభ్యుల పనితీరును ప్రామాణికంగా భావించా లని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మహిళా సంఘాల పనితీరు ఆధారంగా మార్కులు కేటా యించే పద్ధతిని తీసుకువచ్చింది. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. అందుకోసం సెర్ఫ్‌ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.

    గతానికి భిన్నంగా మార్కుల కేటాయింపు

    స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు గతాని కి భిన్నంగా మార్కులు కేటాయిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు సభ్యులు ఉంటే సమావేశానికి ఒకరు హాజరై ఇద్దరి సంతకాలు చేసేవారు. ప్రస్తుతం అలా కుదరదు. పొదుపు సంఘాల సమావేశాల నిర్వహణ, అప్పులు వసూలు, రుణాల చెల్లింపులు తదితర సనులన్నీ పారదర్శకంగా జరగనున్నాయి. సమావేశ చిత్రాలను ప్రత్యేక పోర్టల్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యురాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. జిల్లాలో 74.7 శాతం సంఘాలు మిగిలిన సంఘాలు కూడా పనితీరును మెరుగుపరుచుకొని ‘ఏ’ గ్రేడు సాధించేలా సీసీలు, మండల సమాఖ్య అధికారులు చొరవ చూపుతున్నారు. జిల్లాలో అత్యధిక సంఘాలు ‘ఏ’ గేడులో ఉన్నాయని, మిగితావాటిని మొదటి గ్రేడు కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వివరించారు.

    కొలమానం ఇలా

    జిల్లాలో స్వయం సహాయక సంఘాలు 12,468 ఉండగా 1,36,536 మంది సభ్యులున్నారు. గ్రేడింగ్‌ విధానంలో మహిళా సంఘాలకు ఎనిమిది అంశాల ఆధారంగా ఏ, బీ, సీ, డీ గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో సంఘం 75శాతానికి పైగా లక్ష్యాలు సాధిస్తే ‘ఏ’ గ్రేడ్‌, 70–75కు ‘బీ’, 60–70కు ‘సీ’, 60శాతం కన్నా తక్కువ సాధిస్తే ‘డీ’, అంతకంటే దయనీయంగా ఉంటే ‘ఈ’ గ్రేడ్‌గా నిర్ణయిస్తారు. ఇప్పటివరకు గ్రామైఖ్య సంఘాలకు మాత్రమే గ్రేడింగ్‌ విధానం అమల్లో ఉంది. ఏ, బీ, సీ గ్రేడింగ్‌లో ఉన్న గ్రామైఖ్య సంఘాలకే సీ్త్ర నిధి రుణాలు కేటాయిస్తున్నారు. గ్రేడింగ్‌లో వెనకబడితే బ్యాంకు, సీ్త్ర నిధి రుణాలు పొందడం కష్టంగా మారనుంది.

    పెరగనున్న అధికారుల పర్యవేక్షణ

    గ్రేడింగ్‌ విధానం అమలులోకి రావడంతో మహిళా సంఘాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరగనుంది. ఇప్పటికే సమావేశాలకు సంబంధించి ఆక్షాంశ, రేఖాంశాలతో కూడిన లైవ్‌ ఫోటో తప్పనిసరి చేశారు. రుణ వాయిదాల రికవరీపై ప్రత్యేక దృిష్టి సారిస్తున్నారు. తరచూ సమావేశాల నిర్వహణతో రుణాల చెల్లింపులో వెనుకబడిన సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రేడింగ్‌లో ఎప్పుడు ముందుండేలా సంఘాల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సమీక్షలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

    జూలైలో ఉపాధ్యాయ బదిలీలు

    కరీంనగర్‌ టౌన్‌: ఉపాధ్యాయులకు జూలైలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉంటాయని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 139 ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 70 మంది మండల టాపర్లను మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్చరర్లుగా, ఎంఈవోలుగా పదోన్నతులు రానున్నాయని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్‌రెడ్డి, అబ్దుల్‌ జమీల్‌, శ్రీకాంత్‌రావు, లక్ష్మీనారాయణ, జాలి మహేందర్‌రెడ్డి, జాలి రాఘవరెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

    44 డిగ్రీలు

    43 డిగ్రీలు

    చొప్పదండి :

    ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల్లోగా పనులు చూసుకోవాలి. బయటకు వెళ్లాలంటే గొడుగులు, టోపీలు, తెల్లని వదులైన దుస్తులు ధరించాలి. ఎండలో తిరగడం వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బ వస్తే సమీప వైద్యులను సంప్రదించాలి.

    – డాక్టర్‌ వెంకటరమణ,

    జిల్లా వైద్యాధికారి, కరీంనగర్‌

  • కరీంనగర్‌/కరీంనగర్‌ అర్బన్‌: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లాస్థాయి మల్టీ మెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ సమావేశం చైర్మన్‌, కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్‌ సెంటర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వైద్య బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అవసరమైతే పోలీసుశాఖ సహకారం తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌ మాట్లాడుతూ భ్రూణహత్యలను పూర్తిగా నివారించడంతో పాటు ఆడపిల్లల విషయంలో వివక్షను తగ్గించి, మహిళల హక్కులను పరిరక్షించే దిశగా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. డీసీపీ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ సనా, ప్రకృతి, ప్రశాంతి, భువన పాల్గొన్నారు.

    ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

    జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరలించిన ధాన్యం మిల్లుల్లో సత్వరమే అన్‌లోడింగ్‌ చేయాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కె.మహేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల డీఎం రజనీకాంత్‌, సహకార అధికారి రామానుజచార్యులు, డీఆర్డీవో గీత పాల్గొన్నారు.

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ శివారులోని సదాశివపల్లిలో రెండు దశాబ్దాలుగా కేన్సర్‌ భయాందోళనకు గురిచేస్తోంది. పదేళ్ల వ్యవధిలో గ్రామంలో 25 మందికిపైగా కేన్సర్‌తో మృతి చెందిన ఘటనలు ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రైస్‌ మిల్లుల కారణంగా గాలి, భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతుచిక్కని మరణాలపై ‘సాక్షి’లో ‘సదాశివపల్లికి ఏమైంది?’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్యశాఖ స్పందించింది. డీఎంహెచ్‌వో వెంకటరమణ హుటాహుటిన వైద్యశిభిరం ఏర్పాట్లు చేశారు. అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హౌజింగ్‌బోర్డు పరిధిలోని సదాశివపల్లిలో కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రారంభ దశలోనే కేన్సర్‌ను గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, అందుకే స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు.

    సలుపుతున్న రాచపుండు

    సదాశివపల్లిని కేన్సర్‌ రూపంలో రాచపుండు సలుపుతోంది. ఇప్పటికే 25 మంది వరకు మృత్యువాతపడగా, వైద్యశిబిరంలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. పరీక్షల్లో 27 మందికి బీపీ, 14 మందికి షుగర్‌ లక్షణాలు ఉన్నట్లు తేలింది. గ్రామ ప్రజలందరికీ సమగ్ర పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు బయటపడే అవకాశముందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. 14ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అందించారు. కేన్సర్‌ నివారణ చర్యలు, జీవనశైలి మార్పులు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. డాక్టర్లు ఉమాశ్రీ, విప్లవశ్రీ, రాజ్‌కుమార్‌, పోచయ్య, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

    అనుమానితులందరికీ వైద్య పరీక్షలు

    సదాశివపల్లిలో అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాం. మంగళవారం నిర్వహించిన వైద్య శిభిరంలో ఇద్దరికి కేన్సర్‌ నిర్ధారణ అయింది. పరీక్షలు రెగ్యులర్‌గా నిర్వహించి ఇంకా ఎవరికై నా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాం. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలు చేపడతాం.

    – డాక్టర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌వో

  • కరీంనగర్‌క్రైం: నగరంలో ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దోపిడీని దృష్టిలో పెట్టుకొని కమిషనరేట్‌ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ గౌస్‌ ఆలం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్‌ కార్డులు, తప్పుడు ఫోన్‌ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసినట్లు విచారణలో తేలిందన్నారు. హోటల్‌, లాడ్జీల్లో రూంలు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్‌ నంబర్‌ పనిచేస్తుందో లేదో క్రాస్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను పోలీసులకు చేరవేయాలన్నారు. ప్రతీ లాడ్జీ, హోటల్‌పై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్‌ పాల్గొన్నారు.

    చెక్‌పోస్టుల తనిఖీ

    బక్రీద్‌ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరి కట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సీపీ గౌస్‌ ఆలం మంగళవారం తనిఖీ చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట, గంగాధర మండలం తుర్కాసినగర్‌, చొప్పదండి మండలంలోని ఆర్నకొండ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీ రిజిష్టర్లను పరిశీలించి, ప్రతీ వాహనం వివరాలను నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును గమనించారు. శిక్షణ ఐపీఎస్‌ సోహం సునీల్‌, రూరల్‌ ఏసీపీ విజయకుమార్‌, సీఐలు బిల్లా కోటేశ్వర్‌, ప్రదీప్‌ కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

    సీపీకి అభినందనలు

    పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసును 11 రోజుల్లో ఛేదించిన సీపీ గౌస్‌ ఆలం, పోలీసు బృందానికి జిల్లా కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ పులి ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, తాడిజెర్రి సర్పంచ్‌ రామిడి రాజిరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ల‌క్నో విధించిన 221 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభ‌వ్ సూర్య‌వంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాశ్ సింగ్‌, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.

    అంతకముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 ప‌రుగులు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 109 ప‌రుగులు జోడించారు.  

    అనంత‌రం వచ్చిన పూర‌న్ (16) ఎక్కువ‌సేపు నిల‌బ‌డ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే ల‌క్నో చివ‌రి ఓవ‌ర్‌లో మూడు వికెట్లు కోల్పోయి 220 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో య‌ష్ రాజ్ 2 వికెట్లు తీయ‌గా, ఆర్చ‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

    ఈ విజ‌యంతో రాజ‌స్తాన్ 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో నిలిచిన రాజ‌స్తాన్ త‌మ చివ‌రి మ్యాచ్‌లోనూ విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోనుంది. రాజ‌స్తాన్ త‌మ చివ‌రి మ్యాచ్‌ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియ‌న్స్‌తో ఆడ‌నుంది.

    చదవండి: వైభవ్‌ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం విజయంవంతంగా సాగుతోంది. మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. జైస్వాల్ ఉన్నంతసేపు సైలెంట్‌గా ఉన్న వైభవ్ అతడు ఔటయ్యాకా ఆటను పూర్తిగా మార్చేశాడు.

    ఇన్నింగ్స్ 8వ ఓవర్ వరకు వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 9వ ఓవర్ వేసిన లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్‌కు ఆ ఓవర్‌లో వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు, రెండు వైడ్లు కలిపి మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 

    ఫిఫ్టీ తర్వాత వైభవ్‌ తన ఆటలో దూకుడును మరింత పెంచాడు. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో జురెల్‌తో కలిసి వైభవ్‌ మరోసారి చెలరేగిపోయాడు. అగ్నికి వాయువు తోడైనట్లు ఈ ఇద్దరు కలిసి ఆ ఓవర్‌లో 29 పరుగులు పిండుకున్నారు. తొలుత ధ్రువ్ జురేల్ తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను వరుసగా 4,6,6 బాదాడు. ఆ తర్వాత ఓవర్ ఐదు, ఆరు బంతులను వైభవ్ సూర్యవంశీ సిక్సర్లుగా మలిచాడు.

    దీంతో చూస్తుండగానే వైభవ్ 80 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇక దిగ్వేష్ రాఠీ వేసిన 13వ ఓవర్లో సిక్సర్‌, ఫోర్ కొట్టిన వైభవ్ 90ల్లోకి అడుగుపెట్టాడు. ఇక మరో సెంచరీ ఖాయమనుకున్న దశలో మోసిన్ ఖాన్ 14వ ఓవర్ తొలి బంతికి రనౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ అదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది.

    అంతకముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 ప‌రుగులు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. 

  • టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత  చాలా బాధాకరమైన దశను ఎదుర్కొన్నట్లు ఆర్సీబీ స్టార్‌ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తనకు అప్పటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌, విక్రమ్ రాథోర్‌ కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. మంగళవారం ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ మూడో ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో పాల్గొన్న కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

    ‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే, రాహుల్ భాయ్, విక్రమ్ రాథోర్‌లతో మనసు విప్పి మాట్లాడగలిగాను. చాలా విషయాలు పంచుకున్నాను. 2023లో టెస్ట్ క్రికెట్‌లో నేను అద్భుతంగా రాణించాను. నేను కెప్టెన్సీ వదిలేసి ఒంటరిగా బాధపడుతున్న సమయంలో వీరిద్దరు నాకు అండగా నిలిచారు. 

    నా కెరీర్ తిరిగి గాడిన పెట్టుకునేందుకు రాహుల్ భాయ్‌తో పాటు విక్రమ్ రాథోర్ ఎంతోగానో సహాయపడ్డారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. క‌ష్ట‌కాలంలో అండగా నిలిచారు’ అని కోహ్లీ తెలిపాడు.

    ర‌విశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న స‌మయంలో కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న కోహ్లీ ఒత్తిడిని భ‌రించ‌లేక‌ 2022లో ఆ బాధ్య‌త‌ల నుంచి తప్పుకు న్నాడు. కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో కోహ్లీ ఆరు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధశతకంతో, 26.5 సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. 

    అయితే 2021 నవంబర్‌లో టీమిండియా హెడ్ కోచ్‌గా వ‌చ్చిన ద్ర‌విడ్‌, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోర్‌తో క‌లిసి కోహ్లీని మ‌ళ్లీ బ్యాటింగ్‌లో ట్ర‌క్ ఎక్కించడంలో విజ‌య‌వంత‌మ‌య్యాడు. ద్ర‌విడ్ కోచ్‌గా వ‌చ్చిన త‌ర్వాత 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 8 టెస్టుల్లో 671 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, రెండు హాప్ సెంచ‌రీలున్నాయి.

    ఇక ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ త‌ర‌ఫున కోహ్లీ త‌న బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 542 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వ‌రుస‌లో కొన‌సాగుతున్నాడు. ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్ చేరిన తొలి జ‌ట్టుగా ఆర్సీబీ నిలిచింది. 

    గ‌తేడాది తొలిసారి చాంపియ‌న్‌గా నిలిచిన ఆర్సీబీ వ‌రుస‌గా రెండో ఏడాది కూడా టైటిల్‌పై క‌న్నేసింది. మ‌రోవైపు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కోహ్లీ ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత‌ అప్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు ఎంపిక‌య్యాడు.

    చదవండి: ప‌రువు తీసుకుంటున్న పాక్‌, బంగ్లా క్రికెట‌ర్లు!

  • బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య సిల్హెట్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారిపోయింది. ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు తిట్ల పురాణంతో అంత‌ర్జాతీయ మ్యాచ్ అన్న విష‌యం మ‌రిచిపోయి ప‌రువు తీసుకుంటున్నారు. షాన్ మ‌సూద్‌, ముష్ఫిక‌ర్ ర‌హీమ్ గొడ‌వ మ‌రవ‌క ముందే తాజాగా నాలుగో రోజు ఆట‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, లిట‌న్ దాస్‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

    పాక్ ఇన్నింగ్స్ 72వ ఓవ‌ర్‌లో ఇది చోటుచేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న రిజ్వాన్.. సైడ్ స్క్రీన్ సరిగా లేదని అంపైర్‌కు ఫిర్యాదు చేస్తూ బౌలర్‌ను ఆపేశాడు. ఇది చూసిన బంగ్లా వికెట్‌ కీపర్‌ లిటన్ దాస్ జోక్యం చేసుకుని రిజ్వాన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. 'ఏం చేస్తున్నావ్‌? అక్క‌డ ఏమి చూస్తున్నావ్‌? ఇక్కడ బ్యాటింగ్ చేయ్' అంటూ లిటన్ దాస్ వ్యాఖ్యానించాడు. 

    లిట‌న్‌కు రిజ్వాన్ కూడా ధీటుగా బ‌దులిచ్చాడు. 'ఇది నీ పని కాదు.. అంపైర్ పని' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇంతటితో ఆగని లిటన్ దాస్.. '50 పరుగులు అయ్యాక ఇప్పుడు యాక్టింగ్ మొదలవుతుంది” అంటూ రిజ్వాన్‌ను ఎగతాళి చేసినట్లు స్టంప్ మైక్ లో వినిపించింది. 

    ఈ వ్యాఖ్యలతో రిజ్వాన్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. తిట్ల పురాణం అనంత‌రం ఇద్ద‌రు కొట్టుకునేందుకు సిద్ధ‌మైన స‌మ‌యంలో అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఇప్ప‌టికే తొలి టెస్టులో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌ రెండో టెస్టులో విజ‌యం కోసం పోరాటం కొన‌సాగిస్తోంది. 

    బంగ్లాదేశ్ నిర్దేశించిన 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 316 పరుగులు చేసింది. విజయానికి మ‌రో 121 పరుగులు అవసరం కాగా, చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చివ‌రి రోజు టార్గెట్‌ను ఛేదించి పాక్ పరువు నిలుపుకుంటుందా లేక బంగ్లాదేశ్ చారిత్ర‌క విజ‌యాన్ని అందుకుంటుందా అన్న‌ది చూడాలి.

    చదవండి: నితీశ్‌రెడ్డిపై అగార్కర్‌ ప్రశంసలు!

  • అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి తెలుగు క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి  తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలెక్షన్‌ కమిటీ హెడ్‌ అగార్కర్‌ నితీశ్‌ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

    ప్రస్తుతం ఉన్న ఆల్‌రౌండర్లలో నితీశ్‌కుమార్‌ ది బెస్ట్‌ అని, అతడి పురోగతి అద్భుతంగా ఉందని తెలిపాడు. రాబోయే రోజుల్లో టీమిండి యాలో నితీశ్‌కుమార్‌ కీలకం కానున్నాడనంటూ పేర్కొన్నాడు. ‘నితీశ్‌కుమార్‌ రెడ్డి ప్రస్తుతం టీమిండియాకు కీలకంగా మారిపోయాడు. ఈ మధ్య కాలంలో ఆటలో అతడు సాధించిన పురోగతి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. 

    రాబోయే కొద్ది నెలల్లో జరగబోయే సిరీస్‌లకు అతడి ఎంపిక చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు నితీశ్‌కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నాం’ అని అగార్కర్‌ వెల్లడించాడు.

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన నితీశ్‌కుమార్‌ రెడ్డి సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో మంచి గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకు 10 టెస్టులాడిన నితీశ్‌ రెడ్డి 396 పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఇక 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన నితీశ్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌ కోటాలో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. 

    ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీమిండియాకు కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా స్థానానికి నితీశ్‌ రూపంలో ఎసరు పడినట్లే. ఇప్పటికీ పాండ్యా ప్రదర్శన అంతరంతమాత్రంగానే ఉంది. అగార్కర్‌ మాటలను బట్టి చూస్తే రాబోయే కాలంలో నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌గా మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టీ20) కీలక ఆటగాడిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    ప్రస్తుతం ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడుతున్న నితీశ్‌కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన నితీశ్‌రెడ్డి 235 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 

    ఎస్‌ఆర్‌హెచ్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను సొంతగడ్డపై మే 22న ఆర్సీబీతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌ టాపర్‌గా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తోంది.

    చదవండి: టీమిండియాలోకి వైభవ్‌.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!

  • వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.

    శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో
    కాగా స్వదేశంలో జూన్‌ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్‌లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్‌బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.

    పేస్‌ దళ నాయకుడిగా సిరాజ్‌
    ఇక ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్‌ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్‌దీప్‌ సింగ్‌కు సెలక్టర్లు చోటిచ్చారు.

    మరోవైపు.. స్పిన్‌ విభాగంలో వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్ష్‌ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.

    అసలు చర్చే జరుగలేదు
    ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్‌ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్‌ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆకిబ్‌ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.

    కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్‌ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్‌గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్‌ నాడు పేర్కొన్నాడు.

    సత్తా చాటినా...
    ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్‌లో బెంగాల్‌ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.

    అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్‌నెస్‌ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్‌ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.

    67 వికెట్లు పడగొట్టినా..
    కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భారత్‌ ఫైనల్‌ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ రైటార్మ్‌ పేసర్‌ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

    ఇక చివరగా 2023 జూన్‌లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్‌ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్‌-2026లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.

    చదవండి: టీమిండియాలోకి వైభవ్‌.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. ల‌క్నో విధించిన 221 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని 19.1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభ‌వ్ సూర్య‌వంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. 

    ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాశ్ సింగ్‌, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 ప‌రుగులు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు.

    మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్‌
    లుహాన్ ప్రిటోరియస్ (7) రనౌట్ కావడంతో రాజస్తాన్ 196 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

    • 93 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ ఔట్‌ అవడంతో రాజస్తాన్‌ 180 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల  నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్తాన్‌ విజయానికి 30 బంతుల్లో 33 పరుగులు అవసరం. 

    వైభవ్ హాఫ్ సెంచరీ.. రాజస్తాన్ 166/1
    రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ లక్నోతో మ్యాచ్‌లో చెలరేగిపోతున్నాడు. 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైస్వాల్ అంతకముందు ఆకాశ్‌సింగ్ వేసిన 9వ ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం రాజస్తాన్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. సూర్యవంశీ (82), ధ్రువ్ జురెల్ (31) పరుగులతో ఆడుతున్నారు.

    జైస్వాల్‌ (43) ఔట్‌..
    యశస్వి జైస్వాల్‌ (43) రూపంలో రాజస్తాన్‌ 75 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్‌ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 110 పరుగులు చేసింది. వైభవ్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (9) పరుగులతో ఆడుతున్నారు.

    దంచుతున్న జైస్వాల్‌.. రాజస్తాన్ 56/0
    221 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఛేద‌న‌ను ధాటిగా ఆరంభించింది. య‌శ‌స్వి జైస్వాల్ దూకుడుతో 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 56 ప‌రుగులు చేసింది. జైస్వాల్ (38), వైభ‌వ్ (11) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    రాజ‌స్తాన్ టార్గెట్ 221 ప‌రుగులు
    జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 220 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 ప‌రుగులు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 109 ప‌రుగులు జోడించారు.  అనంత‌రం వచ్చిన పూర‌న్ (16) ఎక్కువ‌సేపు నిల‌బ‌డ‌లేక‌పోయాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) ప‌ర్వాలేద‌నిపించాడు. అయితే ల‌క్నో చివ‌రి ఓవ‌ర్‌లో మూడు వికెట్లు కోల్పోయి 220 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో య‌ష్ రాజ్ 2 వికెట్లు తీయ‌గా, ఆర్చ‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

    మరో వికెట్‌..
    లక్నో మరో వికెట్‌ కోల్పోయింది. యశ్‌రాజ్‌ బౌలింగ్‌లో ఫెరీరాకు క్యాచ్‌ ఇచ్చి నికోలస్‌ పూరన్‌ (16) ఔటయ్యాడు. స్కోరు 13 ఓవర్లకు 156-2గా ఉంది.

    12 ఓవర్లలో స్కోరు 151-1
    లక్నో స‍్కోరు 12 ఓవర్లలో 151-1గా ఉంది. మార్ష్‌ హాఫ్‌ సెంచరీ బాదాడు. ప్రస్తుతం మార్ష్‌ 67, నికోలస్‌ పూరన్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో
    రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న ల‌క్నో 109 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జోస్ ఇంగ్లిస్ (29 బంతుల్లో 60) యష్ రాజ్ పుంజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్‌ నష్టానికి 116 పరుగులు చేసింది. మార్ష్‌ (46), పూరన్‌ (7) పరుగులతో ఆడుతున్నారు.

    8 ఓవర్లలో రాజస్తాన్‌ 105/0
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ధాటిగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇంగ్లిస్‌ (56), మార్ష్‌ (46) పరుగులతో ఆడుతున్నారు.

    6 ఓవర్లలో రాజస్తాన్‌ 83/0
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ ధాటిగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. ఇంగ్లిస్‌ (49), మార్ష్‌ (31) పరుగులతో ఆడుతున్నారు.

    3 ఓవర్లలో రాజస్తాన్‌ 38/0
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ (20), మిచెల్‌ మార్ష్‌ (15) పరుగులతో ఆడుతున్నారు.

    టాస్‌ గెలిచిన రాజస్తాన్‌
    టాస్ గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యుల‌ర్ కెప్టెన్ ప‌రాగ్ దూరం కావ‌డంతో జైస్వాల్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మ్యాచ్‌కు రాజస్తాన్‌, లక్నో జట్లు చెరో మూడు మార్పులతో బరిలోకి దిగాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఏడుసార్లు తలపడితే రాజస్తాన్‌ ఐదుసార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. చివరి మూడు మ్యాచ్‌లు చూసుకుంటే లక్నోదే పైచేయిగా ఉంది.

    తుది జట్లు:

    లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ మహరాజ్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

    రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (కెప్టెన్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్‌), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సుశాంత్ మిశ్రా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.

    ఇప్ప‌టికే ప్లేఆఫ్స్‌కు సంబంధించి మూడు బెర్తులు ఖ‌రారు కాగా మిగిలి ఉన్న ఒకే బెర్తు కోసం ఐదు జ‌ట్లు (రాజ‌స్తాన్‌, పంజాబ్‌, సీఎస్‌కే, ఢిల్లీ, కేకేఆర్‌) పోటీ ప‌డుతున్నాయి. అయితే ఈ ఐదింటిలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఎక్కువ అవ‌కాశాలున్నాయి. తాము ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ రాజ‌స్తాన్ గెలిస్తే మాత్రం ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండానే 16 పాయింట్ల‌తో ప్లేఆఫ్స్‌కు చేరుకోవ‌చ్చు.

    ఈ నేప‌థ్యంలో ఇవాళ ల‌క్నోతో మ్యాచ్ రాజ‌స్తాన్‌కు కీల‌కం. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ ఓడితే మాత్రం ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవ‌కాశాలు సంక్లిష్టం కానున్నాయి.  

  • రాజస్తాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్‌ అజిత్‌ అగార్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అఫ్గానిస్తాన్‌తో సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలను అగార్కర్ మీడియాకు వెల్లడించాడు. 

    ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు వైభవ్ సూర్యవంశీ పేరును ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని ఒక విలేకరి ప్రశ్న సంధించాడు. దీనిపై అగార్కర్ ఆసక్తికరంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. 

    కానీ ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. ‘వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకముందే టీమిండియాలోకి వచ్చిన జైస్వాల్‌ను మనం మర్చిపోకూడదు. వైభవ్‌ అద్భుతంగా ఆడు తున్నప్పటికీ, అతడి కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు.

    ఇప్పటికే వైభవ్ ‘ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకు కూడా ఆడే అవకాశముంది. ​కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇండియా-ఏ తరఫున వైభవ్‌ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని అగార్కర్ పేర్కొన్నాడు.

    ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ తరఫున ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ క్రీజులోకి అడుగుపెట్టడమే ఆలస్యం..ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.

    ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అగార్కర్ టీమిండియాలో వైభవ్ ఎంపికకు ఇంకా సమయం ఉందని కుండబద్దలు కొట్టాడు.

    చదవండి: అఫ్గాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

  • అఫ్గనిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్‌తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..

    పాపం పంత్‌!
    ఐపీఎల్‌-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించారు. పంత్‌ స్థానంలో సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను గిల్‌ డిప్యూటీగా నియమించారు.

    అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్‌కు చోటు దక్కలేదు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి వికెట్‌ కీపర్‌ కోటాలో ఇషాన్‌ కిషన్‌ చోటు దక్కించుకున్నాడు.  కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్‌ కిషన్‌.. ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. 

    అతడికి ఇదొక గోల్డెన్‌ ఛాన్స్‌
    ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్‌ పాకెట్‌ డైనమైట్‌.. ఏకంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌.. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ తరఫునా సత్తా చాటుతున్నాడు. 

    వారిద్దరికి విశ్రాంతి
    ఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్‌ ఛాన్స్‌ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    అయితే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.

    కొత్త ముఖాలకు చోటు
    తాజా ఎడిషన్‌లో ఆకిబ్‌ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్‌, దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రిన్స్‌ను ఎంపిక చేసింది.

    రోహిత్‌, హార్దిక్‌ డౌటే
    ఇక ప్రిన్స్‌ యాదవ్‌తో పాటు పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌, స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.

    ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్‌తో సిరీస్‌ ద్వారా దిగ్గజ బ్యాటర్‌, వన్డే రారాజు విరాట్‌ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

    అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు
    శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

    అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
    శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

    టీమిండియా- అఫ్గనిస్తాన్‌ టెస్టు, వన్డే సిరీస్‌ షెడ్యూల్‌
    ఏకైక టెస్టు: జూన్‌ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్‌- ఉదయం 9.30 గంటలకు ఆరంభం
    తొలి వన్డే: జూన్‌ 14-  ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం
    రెండో వన్డే: జూన్‌ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం
    మూడో వన్డే: జూన్‌ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.

    చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్‌ కీలక ప్లేయర్లు అవుట్‌

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వేర్వేరు జట్ల‌లో ఆడుతున్న టీమిండియా ఆట‌గాళ్లు మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌లిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంట‌నే టీమిండియా స్వ‌దేశంలో అప్గానిస్తాన్‌తో ఒక టెస్టు స‌హా మూడు వ‌న్డేల సిరీస్ ఆడనుంది. ఈ  నేప‌థ్యంలో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ మంగళవారం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూన్‌ 6 నుంచి ముల్లన్‌పూర్‌ వేదికగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ జరగనుంది.

    ఏకైక టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌ గిల్‌కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌నున్నాడు. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న ప్రిన్స్ యాద‌వ్‌కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.

    ఇక టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్‌ జస్ప్రీ‌త్‌ బుమ్రాలకు అఫ్గాన్‌తో సిరీస్‌కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్‌తో ఒకే టెస్టు మ్యాచ్‌ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్‌ నుంచి బిజీగా క్రికెట్‌ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. 

    ఇక సీనియర్‌ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. 

    ఐపీఎల్‌లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్‌ షమీ విషయంలో సెలెక్షన్‌ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్‌ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.

    అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్‌ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

    అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు: శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

    మ్యాచ్‌ల షెడ్యూల్‌..

    • జూన్‌ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్‌ పూర్‌, ఛండీగఢ్‌)

    • తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)

    • రెండో వన్డే : జూన్‌ 17 (లక్నో)

    • మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)

    చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది!

  • ముంబై ఇండియన్స్‌ జట్టుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌-2026 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో గెలవడం ద్వారా సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేయగలిగింది.

    ఇక ఈ సీజన్‌లో ముంబైకి ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మిగిలిన మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులోకి వచ్చే అంశంపై స్పష్టత లేదు.

    డికాక్‌ దూరం
    ఇలాంటి తరుణంలో ముంబై ఇండియన్స్‌ మరో ఇద్దరు ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైనట్లు ముంబై యాజమాన్యం ధ్రువీకరించింది.

    కాగా కేవలం రూ. కోటికి ముంబై ఇండియన్స్‌ డికాక్‌ను దక్కించుకుంది. ఓపెనర్‌గా మూడు ఇన్నింగ్స్‌లోనే ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 132 పరుగులతో రాణించాడు. మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోకుండా ముంబై పోరాడుతున్న సమయంలో అతడు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపే అవకాశం ఉంది.

    అతడు కూడా అవుట్‌
    ఇప్పటికే గాయం నుంచి తిరిగి వచ్చి రోహిత్‌ శర్మ జట్టుతో చేరినప్పటికీ పంజాబ్‌తో మ్యాచ్‌లో తేలిపోయాడు. డికాక్‌ సంగతి ఇలా ఉంటే.. ముంబై యువ ఆల్‌రౌండర్‌ రాజ్‌ అంగద్‌ బవా కూడా సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు ముంబై పేర్కొంది.

    గత మ్యాచ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో బవా కుడిచేతి బొటనవేలికి గాయమైంది. ఆల్‌రౌండర్‌గా అతడి సేవలు ఉపయోగించుకోవాలని భావించిన ముంబైకి నిరాశే మిగిలింది.

    ఇదిలా ఉంటే.. డికాక్‌, బవా గాయాలపై ముంబై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘క్వింటన్‌, రాజ్‌ బవా.. వారి వారి ఇళ్లలో విశ్రాంతి పొందుతున్నారు. ముంబై ఇండియన్స్‌ వైద్య బృందం వారికి మద్దతుగా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తుంది’’ అని ముంబై తన ప్రకటనలో పేర్కొంది. కాగా ముంబై తమ మిగిలిన మ్యాచ్‌లలో మే 20న కోల్‌కతాతో.. మే 24న రాజస్తాన్‌తో తలపడనుంది.

    చదవండి: సంజూను అసభ్యంగా దూషించిన క్లాసెన్‌!.. వీడియో వైరల్‌

Andhra Pradesh

  • సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేశారని మంత్రి టీజీ భరత్‌.. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సిద్ధార్థ్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

    అయితే, ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ్‌ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి భరత్‌ ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • దేవుడా ప్లీజ్ ఇలాంటి వాళ్ల‌ను ఏం చేయాలో నువ్వే చూడు- సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోకు నెటిజ‌న్ పెట్టిన కామెంట్ ఇది. వృద్ధులు అని కూడా చూడ‌కుండా ఆస్తి కోసం అమ్మ‌నాన్న‌ల‌పై అమాన‌వీయంగా కొడుకు, అత‌డి పిల్ల‌లు దాడికి తెగ‌బ‌డిన వీడియో చూసినవారంతా ఇలాగే స్పందిస్తున్నారు. అస‌లు వీళ్లు మ‌నుషులేనా, మ‌న‌సంటూ ఉందా అంటూ సోష‌ల్ మీడియాలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. సొమ్ముల కోసం క‌న్న‌వారిని కింద‌ప‌డేసి క‌ర్కోట‌కంగా కాళ్ల‌తో త‌న్నుతూ దాడి చేస్తున్న దృశ్యాలు స‌మాజంలో దిగ‌జారుతున్న విలువ‌ల‌కు నిలువెత్తు రుజువుగా సాక్షాత్క‌రిస్తున్నాయి.

    సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఈ ఘోర సంఘటన నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతడి బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

    కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొప్పనాతి కస్తూరిబాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో అత‌డు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    క‌ఠిన చర్యలు త‌ప్ప‌వు: పోలీసులు
    ఈ కేసును తాము ప‌ట్టించుకోవ‌డం లేదంటూ కొన్ని మీడియా ఛానెళ్లలో వ‌చ్చిన వార్త‌ల‌ను మొగల్తూరు పోలీసులు ఖండించారు. ఆ వార్తలు అవాస్తవాలని మొగల్తూరు ఎస్సై జి.వాసు పేర్కొన్నారు. బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టప్ర‌కారం క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

     చ‌ద‌వండి: ర‌ఘురామ కృష్ణంరాజుకు చెంప‌పెట్టు

  • సాక్షి,తాడేపల్లి: ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,లెక్చరర్ పోస్టుల భర్తీలో వికలాంగులకు మోసం చేస్తున్నారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు.

    తమలాంటి దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం అవకాశాలు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు రిజర్వేషన్ ఇవ్వకపోవటంతో ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యాయని తెలిపారు. దివ్యాంగ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు.

    ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రతినిధుల ఆవేదనపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగులకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ని కలిసిన వారిలో ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్‌ వింగ్స్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ఎం. శ్రీనివాసరావు తదితరులున్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ సీఎం నీలం సంజీవరెడ్డికి వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌వేదికగా ట్వీట్‌ చేశారు.

    ఆ ట్వీట్‌లో ‘భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి..లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి.. భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం.నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు.  

     

     

  • సాక్షి,ఢిల్లీ: కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించింది. అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

    అమరావతి నిర్మాణం కోసం రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు ఇవ్వడంతో కొరత ఏర్పడింది. ఈ ఆదేశాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర పెట్రోలియం కార్యదర్శి లేఖ రాశారు. కేంద్రం వార్నింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలను రద్దు చేసింది.

    కాగా, గత నెలలో  ఏపీలో పెట్రోల్‌ సంక్షోభానికి తెరలేపింది కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్‌ డీజిల్‌ను రిటైల్‌ బంకుల నుంచి సరఫరా చేసేందుకు సిద్ధమైంది.  మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్‌ను సరఫరా చేయాలని నిర్ణయించింది.

    కూటమి సర్కార్‌ చర్యలతో  ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఇదే అంశంపై ఏపీ సివిల్‌ సప్లై కమిషనర్‌ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. 

    ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా ఆ అంశానికి సంబంధించి తన తప్పును కూటమి సర్కార్‌ ఒప్పుకుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఆదేశాలు తప్పేనని అంగీకరించారు మనోహర్‌.అందుకు అనుగుణంగా ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.

    పెట్రోల్ ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం
    దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్, డీజిల్‌ ధరలు ఉన్నాయి, వాటిపై ట్యాక్స్‌ను ఎత్తివేసే ఆలోచన ఏమైనా ఉందా’?  అంటూ నాదెండ్ల మనోహర్‌ని మీడియా అడగ్గా.. . ధరల తగ్గింపుపై తర్వాత మాట్లాడదాం’ అంటూ సమాధానాన్ని దాటవేశారు.

    ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు.
    ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను ఆదా చేసేలా ఉండాలని ప్రధాని పిలుపునిస్తుండగా.. రాష్ట్రంలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించగా.. ‘‘ఇది ఇప్పుడు అడిగే ప్రశ్న కాదు, దీనిపై ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు’’ అని సమాధానమిచ్చారు.

National

  • బిహార్‌లో ఆరుగురు యువతులు కొన్ని నెలల క్రితమే బస్ డ్రైవర్లుగా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆడపిల్లలు బస్సులు నడపడం ఏంటని అంటున్నారు. బిహార్‌లో మహిళల భద్రత కోసం ప్రారంభించిన ‘పింక్ బస్’ పథకంలో భాగంగా తొలి మహిళా బస్ డ్రైవర్లుగా ఆరుగురు ముసహర్ దళిత మహిళలు బాధ్యతలు చేపట్టారు. 

    అయితే మహిళా సాధికారత పేరుతో వచ్చిన ఈ పథకంలోనూ లింగ వివక్ష, అవమానాలు వారిని వెంటాడుతున్నాయి. అధికారులు ఇప్పటికీ వారితో పాటు పురుష డ్రైవర్లను పర్యవేక్షణకు పంపుతున్నారు. “ఇది మగవాళ్ల పని” అంటూ కొందరు సహచరులు ఎగతాళి చేస్తున్నారని మహిళా డ్రైవర్లు చెబుతున్నారు. పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని వచ్చిన ఈ యువతులు ఇప్పుడు బిహార్ రోడ్లపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పోరాడుతున్నారు.

    విశాలమైన బస్ డిపోలో 21 ఏళ్ల రాగిణి కుమారి జీన్స్‌, గులాబీ రంగు కుర్తీ, చెప్పులు ధరించి గులాబీ బస్సును కిక్కిరిసిన పార్కింగ్ ప్రాంతం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొస్తోంది. వరుసగా నిల్చున్న పురుష డ్రైవర్లు ఆమెను గమనిస్తున్నారు. బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన గులాబీ బస్ పథకం కింద నియమితులైన తొలి మహిళా బస్ డ్రైవర్లలో ఆమె ఒకరు.  

    “పార్కింగ్ నుంచి బస్సును బయటకు తీసుకురాగలవా?” అని ఓ సహచరుడు అడిగాడు. రాగిణి మాత్రం స్టీరింగ్‌పై నుంచి చూపు తిప్పలేదు. “మా అమ్మాయిలపై మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? కనీసం మమ్మల్ని నమ్మేందుకు ప్రయత్నించండి” అని ఆమె సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి ఆ బస్సు డిపో నుంచి గాంధీ మైదాన్ వైపు బయల్దేరింది. రాగిణి నడిపే మార్గాల్లో అది ఒకటి. బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్ల బృందంలో ఆమెతో పాటు ఇంకో ఐదుగురు ఉన్నారు.

    ఈ నెల బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ నియమించిన ఆరుగురు మహిళలూ ముసహర్ సమాజానికి చెందినవారే. బిహార్‌లో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల్లో ఇది ఒకటి. బిహార్‌ ప్రభుత్వం చేసిన ఈ నియామకాలు మహిళా సాధికారతలో కీలక ఘట్టమని ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆ మహిళలకు అసలు పోరాటం అప్పుడే మొదలైంది. డిపోలో అనుమానం, మహిళలపై ద్వేషభావం, మహిళలకు పూర్తిగా బాధ్యత ఇవ్వటానికి వెనుకాడుతున్న రవాణా వ్యవస్థతో ఆ మహిళా డ్రైవర్లు పోరాడాల్సి వస్తోంది. 

    పితృస్వామ్య  సమాజంలో మార్పు తెస్తారా? 
    బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్లుగా నియమితులైన ఈ ఆరుగురు ముసహర్ మహిళల పేర్లు రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి. ఈ యువతులు పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని బస్సు స్టీరింగ్ పట్టారు. 

    అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛ దక్కలేదు. మహిళల శారీరక సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంలో 100 బస్సులకుగాను కేవలం ఆరుగురు మహిళా డ్రైవర్లే చేరారు. మిగతావారిని కుటుంబాలు ఆ పనులకు పంపలేదు. మరికొందరు అమ్మాయిల పెళ్లిళ్లు జరగడంతో వారు డ్రైవర్లుగా ఉద్యోగాల్లో చేరలేదు. అయినా,  రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి బిహార్ పితృస్వామ్య ఆలోచనలకు సవాల్ విసురుతూ పోరాడుతున్నారు.

    గత ఏడాది ప్రారంభమైన బిహార్ గులాబీ బస్ పథకం పూర్తిగా మహిళల ఆధారిత వ్యవస్థగా మార్చాలనుకున్నారు. మహిళా ప్రయాణికులు, మహిళా కండక్టర్లు, మహిళా నోడల్ అధికారులు, మహిళా డ్రైవర్లు ఉండేలా రూపకల్పన చేశారు. ఆరు నగరాల్లో ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళలకు సురక్షిత ప్రజా రవాణా అందించాలనే ఉద్దేశంతో వచ్చాయి.  

    ఉద్యోగం కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబాలు ఒత్తిడి చేయటం, మహిళల సామర్థ్యంపై పురుష డ్రైవర్ల అనుమానాలు, మహిళా ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు లేని రవాణా కార్యాలయాలు సమస్యలుగా మారాయి. బిహార్ అణచివేతకు గురైన ముసహర్ సమాజానికి చెందిన ఆరుగురు యువతులు తమవారి భవిష‍్యత్తు మారేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పట్టు వదలకుం డ్రైవర్‌ జాబ్‌ చేస్తూ పితృస్వామ్య  సమాజంలో మార్పు తెస్తారన్న భావనను అందరిలో కలిగిస్తున్నారు. 

    “బిహార్ పితృస్వామ్య సమాజంలో ఈ అమ్మాయిల ప్రవేశం విప్లవాత్మకం. వీరు చూపిన ధైర్యం రాష్ట్రవ్యాప్తంగా యువతులకు ప్రేరణ అవుతుంది. పితృస్వామ్య ఆలోచనలను సవాలు చేసే మార్గం ఇది” అని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధా వర్గీస్ చెప్పారు.  

    బస్సు స్టీరింగ్‌ను తాకితే ఆత్మవిశ్వాసం 
    ప్రతి రోజు ఉదయం 6 గంటలకు 21 ఏళ్ల రాగిణి కుమారి పాట్నాలోని బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ డిపోకు చేరుకుంటుంది. “బస్సు స్టీరింగ్‌ను తాకిన ప్రతిసారి నాకు ఆత్మవిశ్వాసం వస్తుంది. బస్సు స్టార్ట్ చేసిన ప్రతిసారి నా కష్టాల ప్రయాణం కళ్లముందు తిరుగుతుంది” అని ఆమె చెప్పింది.

    రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి 2025లో ఔరంగాబాద్‌లోని డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఈ పథకానికి “మహిళలకు భద్రత, గౌరవం అందించేందుకు కట్టుబడి ఉన్న బిహార్ ప్రభుత్వం” అనే నినాదాన్ని ఇచ్చారు. పట్నా, గయా, ముజఫర్‌పూర్, దర్భంగా, భాగల్పూర్, పూర్ణియా నగరాల్లో బస్సులను ప్రారంభించారు.

    పట్నా పున్‌పున్ ప్రాంతంలోని అల్లౌద్దీన్‌చక్ గ్రామం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్‌కు పంపేందుకు రాగిణి తండ్రి తొలుత నిరాకరించాడు. “నాన్న అనుమతించలేదు. అయినా నేను ఇంటి నుంచి వెళ్లిపోయి శిక్షణ తీసుకున్నాను. అది సులభమైన ప్రయాణం కాదు” అని ఆమె చెప్పింది.

    గ్రామంలో పొరుగువారు ఆమె తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. పెళ్లి చేయాలని సలహాలు ఇచ్చారు. ఆమె తల్లి సోనీ దేవి మాత్రం తన కూతురికి మద్దతుగా నిలిచింది. “ఆమె కోరుకున్నది చేయనిచ్చాను. నేను జీవితాంతం పేదరికంలో గడిపాను. ఆమె మాత్రం అలాంటి జీవితం గడపకూడదు” అని చెప్పింది. మసౌర్హిలో చరిత్ర ఆనర్స్ చదివిన రాగిణి ఇప్పుడు తన సహచరులతో కలిసి నెలకు రూ. 3,000 అద్దె చెల్లిస్తూ డిపోకు సమీపంలో ఉంటోంది.

  • ఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి, తన మామ మరణానంతర కర్మకాండలలో పాల్గొనడానికి అనుమతి కోరుతూ 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితుడు,  జేఎన్‌యూ విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖాలిద్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం కొట్టివేసింది. 

    ఈ కేసును విచారించిన ఢిల్లీలోని కర్కర్‌డూమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పాయ్.. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. ఉమర్‌ ఖలీద్‌ మధ్యంతర బెయిల్‌కు సంబంధించి చూపించిన కారణాలను అసమంజసమైనవి పేర్కొంటూ ఆ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేశారు. 

    ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు సూత్రధారులు అనే ఆరోపణలపై ఉమర్ ఖాలిద్‌తోపాటు, పలువురిపై ఉగ్రవాద నిరోధక చట్టమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసులు నమోదు చేశారు.

    ఇదిలా ఉంచితే, 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసు నిందితులు ఉమర్‌ ఖలీద్, షర్జీల్‌ ఇమామ్‌లకు బెయిల్‌ నిరాకరిస్తూ జనవరిలో తానిచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తానే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

    ‘బెయిల్‌ నియమం, జైలు మినహాయింపు అనేది కేవలం వట్టి నినాదం కాదని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం.. నిన్న ఒక కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.నార్కో–టెర్రర్‌ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాకు చెందిన సయ్యద్‌ ఇఫ్తికార్‌ అంద్రాబీకి సోమవారం బెయిల్‌ మంజూరు చేసిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.


     

  • తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో గతంలో కురిసిన వర్షాలు ఎంతగా విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాకాలాల్లో కేరళలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటే.. 2018లో సంభవించిన విపత్తును అత్యంత భయంకరమైన విపత్తుగా గుర్తించారు. 2019, 2020లో వరుస మాన్సూన్‌లలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. 2024 వయనాడ్ విపత్తును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాలు ఈనెల 26న (4 రోజులు అటుఇటుగా) కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

    ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ 
    కేరళలో వర్ష హెచ్చరికలను భారత వాతావరణ శాఖ తాజాగా సవరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పత్తనం తిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో మంగళవారం ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

    అదే విధంగా బుధవారం కూడా నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అలప్పుళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో బుధవారానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.

    ఇక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.

    భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలు నుండి విడుదలైన సుశీల్ ప్రజాపతి అనే అత్యాచార నిందితుడికి, అతని మద్దతుదారులు పూలదండలతో ఘన స్వాగతం పలికిన వీడియో ఒకటి  సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియోలో, నిందితుడు ప్రజాపతిని భుజాలపై మోస్తూ, నినాదాలు చేస్తూ, అదేదో విజయయాత్రలా ఊరేగింపు నిర్వహించడం, ఒకరికొకరు, అందరూ కరచాలనాలు చేసుకుంటూ, నవ్వుతూ వీరోచిత స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

    హీరోలా ర్యాలీ
    నిందితుడు సుశీల్ ప్రజాపతి 'హిందూ యువ వాహిని'నేతగా తెలుస్తోంది.  ఇతనిపై ఒక ఎల్‌ఎల్‌బీ (LLB) విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక లాయర్‌కు పరిచయం చేస్తానన్న నెపంతో నిందితుడు ఆ విద్యార్థినిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనేది ప్రధాన ఆరోపణ. దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మే 17న నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే, రాజకీయ నాయకుడిలా తెల్లటి దుస్తులు, మెడలో కాషాయ కండువాలు,  పూలదండలతో  రోడ్‌షో నిర్వహించడం నెట్టింట తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సమాజంలో ఇలా హీరోలా స్వాగతం పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

    <

     

    ఇదీ చదవండి: నీట్‌ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
    ఇదీ చదవండి: మేయర్‌ పీఠంపై ఇండియన్‌.. ఎవరీ తుషార్‌ కుమార్‌?

  • సాక్షి, న్యూఢిల్లీ :  2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ  వాదించిన ఆయన  కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

    శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్‌ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.

    'ఎమ్ సర్' అరెస్ట్ 
    లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్‌కర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్‌లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.

    ఇదీ చదవండి: నీట్‌లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్‌ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్

    ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?
    లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు  1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.

    ఇదీ చదవండి: నో టాయిలెట్‌, నో లీవ్స్‌ : రూ. 19 లక్షల జాబ్‌ వదిలేశా!

    ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

Movies

  • తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. ‍‍అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.

    ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్‌లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్‌లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్‌లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.

    తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.

    జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.

  • దేశీ లుక్‌లో ముద్దేచ్చేలా మృణాల్ ఠాకుర్

    పలుచని చీరలో 'పెద్ది' కోసం జాన్వీ కపూర్

    ఐస్ క్రీమ్‌తో పోజులిచ్చిన సారా అర్జున్

    ఎర్రచీరలో భయపెట్టేస్తున్న శ్రుతి హాసన్

    బుక్ చదువుతూ అందంగా మీనాక్షి చౌదరి

    గులాబీ చీరలో అను ఇమ్మాన్యుయేల్

  • ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్‌లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?

    (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్‌మెంట్)

    అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.

    'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్‌ అవుతుంది. తర్వాత అతడి ఫోన్‌, పర్స్ మిస​్‌ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

  • టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన భార్య మౌనిక రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి బయటపెట్టారు. తాము నెలకొల్పిన సేవా సంస్థ 'ఐక్య' గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

    (ఇదీ చదవండి: పెద్ది.. జాన్వీకి మైనస్‌ కానుందా?)

    'ఐక్య' స్వచ్ఛంద సంస్థ. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజల కోసం దీన్ని ప్రారంభించాం. దీని కోసం మేం మా సొంత నిధులే ఖర్చు పెట్టనున్నాం. నా భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం మేం రాజకీయాల్లో భాగమయ్యాయం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

    మౌనిక విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలుకి చెందిన భూమా కుటుంబం ఈమెది. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం తరఫున రెండుసార్లు ఎమ్మెల్మేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి కూడా రెండుసార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఈమె.. తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

    భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. తల్లిదండ్రుల రాజకీయ వారసురాలగా అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్నకుమార్తె మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో రాయలసీమ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరి మౌనిక.. ఏ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తారనేది చూడాలి?

    (ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)

  • పంజాబ్‌లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.

    (ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)

    హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్‌కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్‌ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

    పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్‌కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.

    అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష‍్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్‌లో సుఖ్విందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

    (ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా)

  • సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

    'దేవర'లో గ్లామర్‌ షోకే పరిమితం
    భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా  ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.

    'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?
    ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్  చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్‌లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.

    దాచి పెట్టారా?
    గ్లింప్స్‌, ట్రైలర్‌లో జాన్వీ గ్లామర్‌ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్‌ చరణ్‌ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్‌ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్‌ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్‌లో జాన్వీని కావాలనే గ్లామర్‌ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్‌ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్‌లో చరణ్‌ని మాత్రమే హైలెట్‌ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్‌ టాక్‌. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు. 

     

Business

  • పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.

    నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

    నేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

  • వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్‌ రిఫండ్‌లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్‌వర్క్‌ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.

    అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ తేజస్‌ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్‌ రిఫండ్‌ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.

    కొత్త ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాకేజీలు..
    పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అవనీష్‌ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.

  • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.

    మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.

    మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్‌లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.

    ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!

    కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది.

  • వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్‌లో (నవంబర్‌–ఏప్రిల్‌) 13 శాతం పెరిగి 7.94 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్‌ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

    విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్‌ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్‌ ఎడిబుల్‌ నూనెలు ఉన్నాయి. పామాయిల్‌ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్‌ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతులు 3.85 మిలియన్‌ టన్నులకు తగ్గాయి.

    పామాయిల్‌ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్‌ టన్నులకు చేరాయి.

  • సొంత కారు కొనానుకునే మధ్యతరగతి వినియోగదారుడిపై త్వరలోనే డబుల్ ఇంపాక్ట్‌ పడబోతోంది. వాహనంలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయకపోయినా.. పేపర్‌పై కనిపించే మైలేజీ (లేదా రేంజ్) గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న ‘మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్’(ఎంఐడీసీ) స్థానంలో మరింత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు పొందిన ‘వరల్డ్‌వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్’ (డబ్ల్యూఎల్‌టీపీ) విధానాన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఇంధన సామర్థ్యాన్ని మరింత కఠినతరం చేసే కేఫే-3 (కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యుయెల్‌ ఎకానమీ) నిబంధనలను కూడా ప్రభుత్వం అదే సమయంలో అమలు చేయనుంది. ఈ జంట నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల సర్టిఫైడ్ సామర్థ్యం ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు పడిపోనుంది.

    మైలేజీ లెక్కలు ఎలా మారనున్నాయంటే?

    పరిశ్రమ నిపుణుల ప్రకారం.. ఈ కొత్త టెస్టింగ్ విధానం వల్ల వాహనాల నిజమైన సామర్థ్యం ఏమీ తగ్గిపోదు. ప్రస్తుత టెస్టింగ్ విధానం కంటే డబ్ల్యూఎల్‌టీపీ విధానం రోడ్డుపై వాహనం నడిపే నిజమైన (రియల్‌ వరల్డ్‌) పరిస్థితులకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఫలితంగా సర్టిఫైడ్ మైలేజీ గణాంకాలు మారుతాయి.

    పెట్రోల్ కార్లు: ప్రస్తుతం లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారు కొత్త ప్రమాణాల ప్రకారం 21 నుంచి 22 కిలోమీటర్లకు పరిమితం కానుంది.

    ఎలక్ట్రిక్ వాహనాలు: ఒకసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీలు చెబుతున్న ఈవీల రేంజ్.. కొత్త నిబంధనల ప్రకారం 430 - 450 కిలోమీటర్లకు పడిపోనుంది. ‘వాహనం మోడల్, దాని కాన్ఫిగరేషన్‌ను బట్టి అధికారిక ఇంధన సామర్థ్య గణాంకాలు 10 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్(ఐసీసీటీ) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ భట్ అన్నారు.

    ఆటోమొబైల్ సంస్థల ముందు జంట సవాళ్లు

    ఒకేసారి కేఫే-3, డబ్ల్యూఎల్‌టీపీ నియమాలను తీసుకురావడం వాహన తయారీదారులకు సవాలుగా మారనుంది.

    కేఫే-3 నిబంధన: కంపెనీలు విక్రయించే మొత్తం వాహనాల సగటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమితిని ఇది మరింత తగ్గిస్తుంది.

    డబ్ల్యూఎల్‌టీపీ విధానం: ఉద్గారాలను లెక్కించే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. ల్యాబ్‌లలో కాకుండా.. గరిష్ట వేగం, వేగవంతమైన యాక్సిలరేషన్, నిజమైన రోడ్డు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్గారాలను లెక్కిస్తారు. దీనివల్ల కేఫే-3 లక్ష్యాలను అందుకోవడం కంపెనీలకు మరింత భారంగా మారుతుంది.

    ఏయే కార్ల ధర ఎంత పెరగొచ్చు?

    కొత్త ఉద్గారాల నిబంధనలను అందుకోవడానికి కార్ల కంపెనీలు అధునాతన సాంకేతికతను జోడించాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనాల తయారీ వ్యయం పెరిగి ఆ భారం వినియోగదారుడిపై పడనుంది.

    కార్ల విభాగంఆవశ్యక సాంకేతిక మార్పులుపెరగనున్న అంచనా ధర (రూపాయల్లో)
    ఎంట్రీ-లెవల్ చిన్న కార్లుఅప్‌గ్రేడెడ్‌ ఇంజిన్ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌, కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, సెన్సార్లు30,000 - 50,000
    ప్రీమియం హాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్ ఎస్‌యూవీగ్యాసోలిన్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు, క్యాటలిటిక్ కన్వర్టర్లు, మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థలు40,000 - 1,00,000
    పెద్ద ఎస్‌యూవీ, ఎంపీవీభారీ సాంకేతిక మార్పులు, అధునాతన ఉద్గార నియంత్రణ వ్యవస్థలు1,20,000 - 2,00,000

    ‘డబ్ల్యూఎల్‌టీపీ విధానం వల్ల అధికారిక మైలేజీ గణాంకాలు తగ్గి ఉద్గారాల నమోదు పెరుగుతుంది. దీనివల్ల కేఫే-3 నిబంధనలను పాటించడం కంపెనీలకు మరింత వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారుతుంది’ అని మొబిలిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్ నిపుణుడు రణ్‌ధీర్ సింగ్ విశ్లేషించారు.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.

    ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్‌ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.

    AI కారణం అందుకే..
    సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్‌ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్‌ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.

    ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.

    టెక్నాలజీ విప్లవం
    ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్‌ వచ్చిన తర్వాత మొబైల్‌ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.

    మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్‌ ట్రేడ్‌, డాలర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.

    మార్పునకు అవకాశం
    చరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.

    ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్‌లో తేడా!

  • సాక్షి, హైదరాబాద్‌: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్‌ కంపెనీ ‘ఐసాల్వ్‌డ్‌’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్‌డ్‌ ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.

    కంపెనీ ప్రధాన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తి ‘పీపుల్స్‌ క్లౌడ్‌’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్‌ బెనిఫిట్స్‌’, ‘మార్కెట్‌ప్లేస్‌’ల నిర్వహణ, కస్టమర్‌ సపోర్ట్‌ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ యోగేశ్‌ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్‌లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్‌ఆర్‌ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్‌డ్‌ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతోందని తెలిపారు.

    అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ వల్లభి ‘ఐసాల్వ్‌డ్‌’ కార్యాలయాన్ని రిబ్బన్‌ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్‌డ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ప్రగ్యా గుప్తా, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ అఈమ మోషేర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్‌డ్‌లో 65 శాతం జెండర్‌ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్‌ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్‌డ్‌ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.

    హైదరాబాద్‌ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్‌తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్‌ను గ్లోబల్‌ కేపిటల్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్‌కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్‌డ్‌ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!

  • మంగళవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.19 పాయింట్ల (0.15 శాతం నష్టం) నష్టంతో 75,200.85 వద్ద, నిఫ్టీ 31.95 పాయింట్ల నష్టంతో (0.14 శాతం నష్టం) 23,618.00 వద్ద నిలిచాయి.

    డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్, రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రామ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ లిమిటెడ్, డైమైన్స్ & కెమికల్స్ లిమిటెడ్, నియోజెన్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Politics

  • తమిళనాడు సీఎం విజయ్‌ చేసిన పని ఇప్పుడు ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. టీవీకే పార్టీని స్థాపించి, సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్‌.. ప్రతీరోజూ ఏదొక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.  సీఎంగా పగ్గాలు చేపట్టాక మాజీ సీఎం స్టాలిన్‌ను కలవడం దగ్గర్నుంచీ ఆయన చేసిన ప్రతీ పని హైలైట్‌ అవుతూనే ఉంది. అయితే తాజాగా విజయ్‌ చేసిన పని మాత్రం విమర్శకుల నోళ్లకు పని చెప్పింది. 

    ఇంతకీ విషయం ఏంటంటే..  ఎల్టీటీఈ వ్యవస్థాపకుడైన ప్రభాకరన్‌కు సీఎం విజయ్‌ నివాళులు అర్పించడమే. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి  నిషేధించబడ్డ సంస్థ వ్యవస్థాపకుడికి ఎలా నివాళులర్పిస్తారని విమర్శల వర్షం కురుస్తోంది. ప్రధానంగా 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ప్రభాకరన్‌ది కీలక సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆ గ్రూప్‌కు చెందిన సభ్యురాలే ఆత్మాహుతి బాంబు దాడితో రాజీవ్‌గాంధీ హత్యలో ప్రధాన పాత్ర పోషించింది. రాజీవ్‌ గాంధీ  ప్రధానిగా ఉన్న సమయంలోనే తమిళనాడు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన్ను హత్య చేశారు. ఆ నేపథ్యంలోనే ఎల్టీటీఈని బ్యాన్‌ చేసింది

    విజయ్‌ నివాళులు.. కాంగ్రెస్‌ ఏం చెబుతుంది?
    రాజీవ్‌ గాంధీ హత్య కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకరన్‌కు సీఎం స్థానంలో ఉన్న విజయ్‌ ఎలా నివాళులు అర్పిస్తారనేది బీజేపీ ప్రశ్న. దీనిపై కాంగ్రెస్‌, రాజీవ్‌ గాంధీ కుమారుడైన రాహుల్‌ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నిలదీసింది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్‌ సీఎం కావడానికి కాంగ్రెస్‌తో పాటు పలు స్థానిక పార్టీలు సహకరించిన నేపథ్యంలో ఆ పార్టీలకు విజయ్‌ ఏం చెబుతారని బీజేపీ అడుగుతోంది. 

    ఇది కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే నివాళి కాదు
    ఈ అంశాన్ని టీవీకే సమర్థించుకునే పనిలో పడింది.  తమ అధ్యక్షుడు, సీఎం విజయ్‌ అర్పించిన నివాళి కేవలం ప్రభాకరన్‌కు మాత్రమే కాదని, శ్రీలకంలో ఊచకోతకు గురైన వేలాది మంది తమిళులకు నివాళి అంటూ చెప్పుకొచ్చింది.

    విజయ్‌కు సరికొత్త తలపోటు
    సీఎం స్థానంలో ఉన్న విజయ్‌ తెలుసో, తెలియకో చేసిన ప్రభాకరన్‌ నివాళుల అంశం.. ఇప్పుడు టీవీకే పార్టీకి కొత్త చిక్కులు తెస్తుందా అనే చర్చ మొదలైంది. ఏదో బొటాబొటీ మ్యాజిక్‌ ఫిగర్‌తో అందులోనూ కాంగ్రెస్‌ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్‌ను  ఇది కచ్చితంగా ఇరకాటంలో పడేస్తుందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    ఇప్పటికే మాజీ సీఎం స్టాలిన్‌.. విజయ్‌ ప్రభుత్వం విమర్శలు తీవ్రతరం చేశారు. విజయ్‌ ప్రభుత్వం ఎంతో కాలం సాగదనీ,  తమిళనాడులో జరగబోయే రాజకీయ పరిణామాలకు డీఎంకే శ్రేణులంతా సిద్థంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయ్‌ ప్రభుత్వం కూలుపోతుందని, ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చనే సంకేతాలిచ్చారు స్టాలిన్‌. ఈ తరుణంలోనే ఇది చోటు చేసుకోవడంతో టీవీకే శ్రేణుల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. 

     

  • కోల్‌కతా: సీఎం సువేందు అధికారి, సింగం ఐపీఎస్‌ అజయల్‌ పాల్‌ శర్మకు ‘పుప్ప’ భయపడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పశ్చిమ బెంగాల్‌ రీపోలింగ్‌ ఎన్నికల్లో తాజా పరిణామాలు. ఈ నెల 21న జరగనున్న రీపోలింగ్‌ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి పుష్ప అలియాస్‌ జహంగీర్‌ ఖాన్‌ అధికారికంగా ప్రకటించారు.

    ఈ సందర్భంగా జహంగీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఫల్టాలో శాంతి, భద్రతలే నాకు ముఖ్యం. ఆ రెండు ఉంటేనే అభివృద్ధి జరుగుతోంది. సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. నేను అనుకున్నది జరిగింది. అందుకే త్వరలో జరగనున్న ఫల్టా నియోజకవర్గ రీపోలింగ్‌ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. నా నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

    రీపోలింగ్‌ ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం వెనుక పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హస్తం ఉందా? లేదంటే మీరే సీఎం సువేందుకు బయపడి వెనక్కి తగ్గుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ..మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను చెప్పే సమాధానం ఒకటే. ఫల్టా ప్రజల కోసం, ఫల్టాలో అభివృద్ధి కోసం, ఫల్టాలో శాంతిని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. జహంగీర్‌ఖాన్‌ నిర్ణయంపై టీఎంసీ అధికార ప్రతినిధి మీడియాతో అరూప్ చక్రవర్తి స్పందించారు. జహంగీర్‌ఖాన్‌ తన నిర్ణయంపై సమాచారం ఇచ్చారు. అయితే ఆ నిర్ణయానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.

    రీపోలింగ్‌ ఎన్నిక నుంచి తప్పుకున్నానంటూ జహంగీర్‌ఖాన్‌ ప్రకటనపై సీఎం సువేందుకు అధికారి విమర్శలు గుప్పించారు. ఫల్టా నియోజకవర్గంలో జరగనున్న రీపోలింగ్‌లో పోలింగ్ ఏజెంట్ దొరకడని అతను పారిపోయాడు’ అని ఎద్దేవా చేశారు. ఆయనో ప్రముఖ క్రిమినల్‌. ఆయన సంగతిని నాకు వదిలేయండి నేను చూసుకుంటానని అన్నారు.

    ఇటీవల జరిగిన రెండో విడత పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం 95మంది అధికారుల్ని నియమించింది. వారిలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అజయ్‌పాల్ ఉన్నారు. ప్ర‌యాగ‌రాజ్‌లో అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (లా అండ్‌ ఆర్డర్‌)గా విధులు నిర్వహిస్తున్న అజయ్‌ శర్మ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు. 500కి పైగా ఎన్‌కౌంటర్లు చేసిన చరిత్ర ఉంది. ఈసీ ఆయనను సౌత్‌ 24 పరగణ జిల్లా పోలీస్ ఆబ్జర్వర్‌గా నియమించింది. 

    తనిఖీలు నిర్వహించే సమయంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి వద్ద అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆపై జహంగీర్‌ఖాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వరుస పరిణామాలపై జహంగీర్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమాకు జహంగీర్‌ ఖాన్‌ బీభత్సమైన ఫ్యాన్‌. అయినప్పటికీ ఆయన సింగం అయితే, నేను పుష్పని ఫైర్‌ అనుకుంటున్నారా? వైల్డ్‌ ఫైర్‌ అంటూ మాస్‌ డైలాగులు వదిలారు. ఇప్పుడు ఫల్టా రీపోలింగ్‌ ఎన్నికల నుంచి తప్పుకోవడంపై సీఎం సువేందుకు, ఐపీఎస్‌ అజయ్‌ శర్మకు పుష్ప బయపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

    టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎంపీ నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి ఫల్టా నియోజకవర్గం కావడం, చరిత్రలో తొలిసారిగా ఈసీ నియోజకవర్గం మొత్తం రీపోలింగ్‌ నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. రీపోలింగ్‌ ఉన్నా సరే మే 4నుంచి ఇప్పటి వరకు దీదీ,అభిషేక్‌తో పాటు ఇతర సీనియర్‌ నేతలెవరూ ప్రచారం జోలికి వెళ్లలేదు. 

    ఫల్టా నియోజకవర్గంపై ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. రెండో విడుత ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదులు అందాయి. వరుస ఫిర్యాదులతో ఫల్టాలోని మొత్తం 285 కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ 24వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది. 

  • శ్రీకాకుళం:  జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్ ప్రైవేటీక‌ర‌ణ ఆపేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు సూటిగా చెప్ప‌కుండా ఫేక్ ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పి ఇప్ప‌టికీ మ‌త్స్యకారుల‌ను అయోమ‌యంలోకి నెట్టేశాడ‌ని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వైఎస్‌ జ‌గ‌న్‌కు వచ్చిన ప్ర‌జా స్పంద‌న‌, ఆయ‌న ఇచ్చిన పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు మొద‌లైంద‌న్నారు.

    నెల్లూరులో టీడీపీ ప‌నైపోయింద‌ని డిసైడ్ అయ్యాడు కాబ‌ట్టే శ్రీకాకుళంలో నిర్వ‌హించాల్సిన మ‌హానాడును నెల్లూరుకి మార్చేశాడ‌ని అన్నారు. అయినా విధి విచిత్రం కార‌ణంగా చివ‌రికి అది కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. రెండేళ్లుగా చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల‌కు కొత్త‌గా చేస్తున్న‌ది ఏమీ లేక‌పోగా, పోర్టులు, ఫిషింగ్ హార్బ‌ర్‌లు, ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్ల రూపంలో వైఎస్‌ జ‌గ‌న్ సృష్టించిన సంప‌ద‌ను ప్రైవేటీక‌ర‌ణ పేరుతో త‌న బినామీల‌కు అప్ప‌జెప్పే కుట్ర‌లు చేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. 

    రెండేళ్ల‌లో చేసిందేమీ లేక, ఏమీ చెప్పుకోలేక జ‌గ‌న్‌ని తిట్ట‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నారని, చంద్ర‌బాబు పాల‌న రాష్ట్రానికి గొడ్డ‌లిపెట్టులా మారింద‌ని, రెండేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లూ నిర్వీర్యమ‌య్యాయ‌ని, అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు స్ప‌ష్టం చేశారు.  ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

    2024-25 మత్స్య‌కార సేవ‌లో బకాయిలు ఎప్పుడిస్తారు?
    వైఎస్‌సార్సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌త్స్య‌కార భ‌రోసా పేరుతో ప్ర‌తి ఏటా దాదాపు 1.20ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఏటా రూ.10 వేలు చొప్పున‌
    ఆర్థిక సాయం జ‌రిగింది. ఎన్యుమ‌రేష‌న్ ద‌గ్గ‌ర నుంచి సాయం ల‌బ్ధిదారుల అకౌంట్‌లో జ‌మ‌య్యే వ‌ర‌కు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునేవాళ్లం. ప్ర‌తి మ‌త్స్య‌కార కుటుంబానికి ఠంఛ‌న్‌గా వేట నిషేధ స‌మ‌యంలో జ‌మ చేసేవాళ్లం. ఎక్క‌డా పైసా కూడా అవినీతికి తావులేకుండా డీబీటీ ప‌ద్ధ‌తిలో న‌గ‌దు నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మయ్యేది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక మ‌త్స్య‌కార సేవ‌లో పేరుతో ఏటా రూ.20 వేలు ఇస్తాన‌ని చెప్పి 2024-25 సంవ‌త్స‌రానికి పూర్తిగా ఎగ‌నామం పెట్టాడు. 

    డీజిల్ సబ్సిడీ పేరుతో కూడా సీఎం చంద్ర‌బాబు, మంత్రి అచ్చెన్నాయుడు ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతున్నారు. లీట‌ర్‌కి రూ.6 స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పారు. 2014-19 మ‌ధ్య బ్యాక్ ఎండ్ స‌బ్సిడీ పేరుతో మ‌త్స్య‌కారులు వినియోగించుకున్న త‌ర్వాత ఆ అమౌంట్‌ని జ‌మ చేస్తామ‌ని చెప్పారు. కానీ నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో వైఎస్‌సార్సీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాకే ఆ పెండింగ్ బిల్లుల‌ను చెల్లించ‌డ‌మే కాకుండా మ‌త్స్య‌కారుల‌కు డీజిల్‌ స‌బ్సిడీకి సంబంధించి కార్డులు ఇవ్వ‌డం జ‌రిగింది. 

    డీజిల్ కొన్న‌ప్పుడే నేరుగా ఆ స‌బ్సిడీ డ‌బ్బులు ల‌బ్ధిదారుల అకౌంట్‌లో జ‌మ‌య్యే విధానానికి శ్రీకారం చుట్టాం. మోటార్ బోట్ల‌కు నెల‌కు 300 లీట‌ర్లు, మెక‌నైజ్డ్ బోట్ల‌కు 3 వేల లీట‌ర్ల చొప్పున లీట‌ర్‌కి రూ.9లు స‌బ్సిడీ విధానం తీసుకొచ్చాం. 2014-19 వ‌ర‌కు ఉన్న రూ.6 ల సబ్సిడీని రూ.9ల‌కు పెంచి అంద‌జేశాం. పాద‌యాత్ర‌లో మ‌త్స్య‌కారుల క‌ష్టాల‌ను చూసి ప్ర‌మాదవ‌శాత్తు వేట స‌మ‌యంలో మ‌ర‌ణిస్తే రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం దాన్ని అమ‌లు చేస్తూ త‌మ ఘ‌న‌త‌గా చెప్పుకుంటోంది.

    చేసిందేమీ లేక తిట్టడమే పనిగా పెట్టుకున్నారు..
    రెండేళ్లుగా చేసిందేమీ లేక, చెప్పుకోవ‌డానికి ఏమీలేక వైఎస్‌ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే చంద్ర‌బాబు ప‌నిగా పెట్టుకున్నారు.  త‌న పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి స‌మ‌యం, సంద‌ర్భం, వేదిక‌తో సంబంధం లేకుండా నీచంగా దిగ‌జారి మాట్లాడుతున్నాడు. నోరెత్తితో గొడ్డ‌లి పార్టీ అని మాట్లాడుతున్నాడు. నిజానికి రాష్ట్రానికి చంద్ర‌బాబే గొడ్డ‌లి వేటు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు త‌న రెండేళ్ల పాల‌న‌తో తీవ్రంగా వంచించాడు. ఏ వ‌ర్గ‌మూ కూట‌మి పాల‌న‌లో సంతోషంగా లేదు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మ‌హిళ‌లు, వ్యాపారులు, వృద్ధులు.. ఏ వ‌ర్గం చూసినా చంద్ర‌బాబు గొడ్డ‌లి వేటుకి రోదిస్తూనే ఉన్నారు. 

    ఇసుక‌, మ‌ట్టి, గ్రావెల్ వంటి స‌హ‌జ వ‌న‌రులు దోపిడీ ఈ రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న‌ట్టుగా గ‌తంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. ఇవ‌న్నీ మాట్లాడితే చంద్ర‌బాబుకి వ‌ణుకు. త‌న రాజకీయ జీవితంలో కనీసం ఒక్క పోర్టు, ఒక్క ఫిషింగ్ హార్బ‌ర్ నిర్మాణం చేప‌ట్టని చంద్ర‌బాబుకి జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌ని ప్రైవేటుప‌రం చేసే హ‌క్కు ఎవ‌రిచ్చారు?  వైఎస్‌ జ‌గ‌న్ గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బ‌ర్‌లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంట‌ర్లు నిర్మాణానికి శ్రీకారం చుడితే,  ఆ ప‌నుల‌ను ఎక్క‌డిక‌క్క‌డే ఆపేసిన విష‌న‌రీ చంద్ర‌బాబు. మ‌త్స్య‌కారుల కోసం వైఎస్‌ జ‌గ‌న్ గారు సంప‌ద సృష్టిస్తే, చంద్ర‌బాబు ఆ సంప‌ద‌ను త‌న బినామీల‌కు రాసివ్వ‌డానికి పూనుకున్నాడు. 

    వైఎస్‌ జ‌గన్ గారు జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్ ని సంద‌ర్శించి హెచ్చ‌రించ‌బ‌ట్టే ప్రైవేటీక‌ర‌ణ‌పై చంద్ర‌బాబు వెన‌క‌డుగు వేశాడు. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను తెగ‌న‌మ్మ‌డమే ఈ ప్ర‌భుత్వ విధానం. రాబోయే త‌రాల‌కు చంద్ర‌బాబు ఏమీ మిగ‌ల్చ‌డం లేదు. ప్ర‌జ‌ల్లో వీటిపై చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చూడాల‌నేది చంద్ర‌బాబు ల‌క్ష్యం. ఈ వైఫల్యాల‌ను క‌ప్పిపుచ్చ‌డానికే వైఎస్‌ జ‌గ‌న్ గారిని తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. మ‌త్స్య‌కారుల‌కు సంప‌ద సృష్టించ‌డం విధ్వంస‌మా? వాటిని ప్రైవేటుకి దారాద‌త్తం చేయ‌డం విధ్వంస‌మా? చ‌ంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. చంద్ర‌బాబే రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి విధ్వంసం వైపు విజ‌య‌వంతంగా తీసుకెళ్తున్నాడు.

    జువ్వ‌ల‌దిన్నెలో జ‌గ‌న్ పిలుపుతో చంద్ర‌బాబులో వ‌ణుకు
    జువ్వ‌ల‌దిన్నెలో వైఎస్‌ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు చంద్ర‌బాబుకి వ‌ణుకు పుట్టిస్తోంది. అందుకే శ్రీకాకుళంలో పెట్టాల్సిన మ‌హానాడుని నెల్లూరుకి మార్చేశాడు. వైఎస్‌ జ‌గ‌న్ వ‌చ్చిన‌ప్పుడు మ‌త్స్య‌కారుల్లో ఉన్న ఉత్సాహం నేడు చంద్ర‌బాబు వ‌చ్చిన‌ప్పుడు వారిలో క‌నిపించ‌డం లేదు. జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌తోపాటు రాష్ట్రంలోని ఇత‌ర పోర్టులు, హార్బ‌ర్ల విష‌యంలో చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌నుకుంటే నేరుగా చెప్ప‌కుండా, ఫేక్ ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని పిలుపునివ్వ‌డం అంటే ఏమ‌ని అర్థం చేసుకోవాలి. 

    బీచ్ రోడ్డులో సోలార్ ల్యాంప్ లు ప్రారంభించి సాగ‌ర మాల ప్రాజెక్టును ప్రారంభించాన‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు అబ‌ద్ధాలు చెబుతున్నాడు. స్టీల్ బెంచీలు, సోలార్ ల్యాంప్‌లు వేసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టాల‌నుకోవ‌డం కేంద్ర మంత్రిగా ఆయ‌న‌కు త‌గ‌దు. విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు రావాల్సిన పెట్రో కెమిక‌ల్ రిఫైన‌రీ ప్రాజెక్ట‌ను సాధించుకురావాలి. సిమెంట్ రోడ్ల శంకుస్ధాప‌న‌లు చేయ‌డం కేంద్ర‌మంత్రి చేయాల్సిన ప‌నా? అని మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు.

  • ప్రకాశం:  జిల్లా జనసేనలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆయన అనుచరుడే తిరుగుబాటు చేశారు. నిన్న మొన్నటివరకూ జిల్లాలో బాలినేని మౌత్‌పీస్‌గా ఉన్న జనసేన నాయకుడు జడ బాలనాగేంద్ర.. తీవ్ర విమర్శలు చేశారు. 

    ఈరోజు(మంగళవారం, మే 19వ తేదీ) ప్రెస్‌మీట్‌ పెట్టిన బాలనాగేంద్ర.. బాలినేనిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  జనసేనలో బాలినేని పదవులు బేరం పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బాలినేని, ఆయన కొడుకు  ప్రణీత్ రెడ్డి జనసేనను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బాలినేని, ఆయన కొడుకుని పార్టీకి దూరం పెట్టాలని పవన్ కళ్యాణ్‌కి విజ్ఞప్తి చేశారు బాలనాగేంద్ర. 

Education

  • న్యూఢిల్లీ: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ‍ప్రధాన్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కఠిన భద్రతా నిబంధనల మధ్య పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

    మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఆ పరీక్షకు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో ఆవేదన చెందుతున్నారు.

    ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశం నిర్వహించి.. పరీక్ష నిర్వహణలో నిష్పక్షపాతం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. గత పరీక్షా ప్రక్రియలో గుర్తించిన లోపాలు తలెత్తకూడదని అధికారులకు ఆదేశించారు. కఠిన పర్యవేక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టిన ధర‍్మేంద్ర ‍ప్రధాన్‌ పరీక్షా కేంద్రాల్లో అప్రమత్తతతో రీ-నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. 

    అలాగే పరీక్ష ఏర్పాట్లు, భద్రతా పర్యవేక్షణ అమలుపై రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యలతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం, తాగునీరు, ఇతర అవసరమైన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల్లో ఉండాలని ప్రధాన్ అధికారులకు ఆదేశించారు.

    అభ్యర్థులకు ముఖ్య సూచనలు

    • నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21 (ఆదివారం) నిర్వహిస్తారు.

    • ప్రస్తుతం ఉన్న చిరునామా మారితే పరీక్షా నగర ప్రాధాన్యత మార్చుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు నీట్ ఎన్‌టీఏ పోర్టల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే 21 వరకు మార్పులు చేసుకోవచ్చు.

    • విద్యార్థులు మొదటి, రెండో ప్రాధాన్యత పరీక్షా నగరాలను ఎంచుకునే అవకాశం పొందుతారు.  

    • ప్రస్తుతం ఉన్న చిరునామా, పరీక్షా నగర ప్రాధాన్యత మార్పులకు తప్ప ఇతర సవరణలకు అనుమతి లేదు. మే 21 తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోరు.

    • రద్దైన పరీక్షకు చెల్లించిన ఫీజు తిరిగి ఇస్తారు. రీ-ఎగ్జామ్‌కు అదనపు ఫీజు వసూలు చేయరు.

    • పరీక్ష పెన్-అండ్-పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలోనే 13 భాషల్లో నిర్వహిస్తారు. అవి అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ.

    • పరీక్షా ప్రక్రియల నిర్వహణకు విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు ఇస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుంది.

    • సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు, అడ్మిట్ కార్డులు, ఇతర పరీక్షా వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తాత్కాలికంగా జూన్ 14 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

    • 2027 నుంచి నీట్-యూజీని కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తామని ఏజెన్సీ ప్రకటించింది.

    • రీ-ఎగ్జామ్ ఫలితాల విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.

    • అప్‌డేట్లు, పరీక్షా సూచనల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక ఎన్‌టీఏ సోర్సులనే నమ్మాలని అధికారులు సూచించారు.

    • నీట్ (యూజీ) 2026పై మరింత సమాచారం కావాలంటే అభ్యర్థులు 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చు. లేక neetug2026@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చు.

Family

  • మన కడుపులో ఉన్న అవయవాలూ, శరీర భాగాలు, పేగులు... ఇవన్నీ మన పొట్ట అడుగు భాగంలో ఉండే పొరల మీద అమరిపోయి ఉంటాయి.ఏవైనా కారణాల వల్ల  ఈ ΄పొట్ట కండరాలు బలహీనంగా ఉన్నట్లయితే పొట్టలోపల ఉండే భాగాలు...  బలహీనంగా ఉన్న ఆ అబ్డామిన్‌ పొరల్లోంచి దూసుకొని (చర్మంలోనే) బయటకు వెళ్తాయి. ఇలా జరిగినప్పుడు పురుషుల్లోనైతే ఆ పేగులు... వృషణాల సంచిలోకి జారిపోవచ్చు. ఒకవేళ మహిళల్లోనైతే పొట్టలోని ఆ అవయవాలు అబ్డామిన్‌ కండరాలను దాటి లోపలికి వెళ్లవచ్చు. పొట్టలోనివే కాదు... మరే భాగంలోనైనా... ఒక దేహభాగం మరో దేహభాగంలోకి చొచ్చుకు వెళ్లడాన్ని ‘హెర్నియా’ అంటారు. ఇందులో చాలా రకాలుంటాయి. ఈ హెర్నియాలోని రకాలు, అలా జరిగినప్పుడు చేయించాల్సిన చికిత్సల వంటి పలు అంశాలను తెలుసుకుందాం...

    పొత్తికడుపు పొరల్లో బాగా బలహీనంగా ఉన్నచోటి నుంచి పొత్తికడుపులోని కొన్ని భాగాలు దూసుకుపోయి చర్మం కిందికి చేరుకుంటాయి. బయటి నుంచి చూసినప్పుడు అక్కడి చర్మం భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంటుంది. సాధారణంగా పొత్తికడుపు ముందు భాగంలో చర్మం, కొవ్వు, కండరాలు వంటి పలుచోట్ల పొరలు ఉంటాయి. ఇవి పేగులతో పాటు కడుపులోని అంతర్గత భాగాలను తమ తమ స్థానాల్లో ఉండేలా చూస్తాయి. 

    ఈ కండరాలు బలహీనంగా ఉన్న చోట్ల నుంచి కడుపులోని పేగులలో కొంత భాగం బయటకు వచ్చి చర్మం కింది నుంచి ఉబ్బు   కనిపిస్తుంది. చేత్తో ముట్టుకున్నప్పుడు ఆ పేగుల భాగాలూ చేతి స్పర్శకు తెలుస్తుంటాయి. 

    సహజంగా హెర్నియా వచ్చేందుకు అవకాశమున్న భాగాలు...

    కడుపులోని భాగాలు డయాఫ్రమ్‌ అనే భాగాన్ని దాటి ఛాతీ (లోయర్‌ ఛెస్ట్‌)లోకి. 

    కడుపు కింది భాగాల నుంచి పొత్తికడుపు లేదా గజ్జల్లోని లోపలి భాగాల్లోకి. 

    కడుపుకు మధ్యభాగం (మిడ్‌లైన్‌)లోకి. 

    కడుపుపై శస్త్రచికిత్స జరిగినప్పుడు... బలహీనపడ్డ ఆ కోత భాగంలోకి.

    హెర్నియాల్లో రకాలివి... 
    హెర్నియాల్లో అనేక రకాలుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి...

    ఇంగ్వైనల్‌ హెర్నియా : చాలా సాధారణంగా / ఎక్కువమందిలో కనిపించే హెర్నియా ఇది. మొత్తం హెర్నియాల్లో 75% ఇదే కనిపిస్తుంది. ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. రెండు వైపులా కూడా రావచ్చు. సాధారణంగా ఎక్కువ బరువు ఎత్తినప్పుడు కడుపులోని పేగులు... ఇంగ్వైనల్‌ కెనాల్‌ అనే ప్యాసేజ్‌ ద్వారా తొడల (అప్పర్‌ థైస్‌) భాగంలోకి వెళ్తాయి.

    ఫీమోరల్‌ హెర్నియా : ఇది కాస్తంత అరుదుగానే కనిపిస్తుంది. ఇంగ్వైనల్‌ కెనాల్‌ కింద ఉండే ఫీమోరల్‌ కెనాల్‌ ద్వారా కడుపులోని భాగాలు ముఖ్యంగా కొవ్వుపొరలు   తొడల (అప్పర్‌ థైస్‌) దగ్గరికి చొచ్చుకురావడం వల్ల ఈ హెర్నియా కనిపిస్తుంది. సాధారణంగా ఫీమోరల్‌ హెర్నియా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంగ్వైనల్‌ హెర్నియాతో పోలిస్తే ఈ ఫీమోరల్‌ హెర్నియా కాస్త చిన్నదిగా ఉంటుంది.  

    హయటల్‌ హెర్నియా : ఇది చాలామందిలో చాలా సాధారణంగా కనిపించే హెర్నియా. మన ఛాతీలో ఊపిరితిత్తులుండే భాగాన్నీ, కడుపులోని పేగులుండే భాగాన్ని వేరు చేస్తూ... డయాఫ్రమ్‌ అనే పొర ఉంటుంది. ఈ డయాఫ్రమ్‌ నుంచే...ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లే అన్నవాహిక వెళ్తుంది. ఈ అన్నవాహిక కడుపులోకి వెళ్లే చోట డయాఫ్రమ్‌ దగ్గర బలహీనంగా ఉన్న సమయాల్లో కడుపులోని భాగాలు ఛాతీలోకి దూసుకువస్తాయి. ఈ కండిషన్‌నే హయటస్‌ / హయటల్‌ హెర్నియా అంటారు.

    కంజెనైటల్‌ డయాఫ్రమాటిక్‌ హెర్నియా : హయటల్‌ హెర్నియాలోలాగే ఇక్కడ కూడా డయాఫ్రమ్‌ లోంచి ఛాతీలోకి పైకి వస్తాయి. అయితే ఇది పుట్టకతోనే (కంజెనైటల్‌గా)  వచ్చే సమస్య. అంటే పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో అన్నవాహిక కడుపులోకి వెళ్తే చోట డయాఫ్రమ్‌ పూర్తిగా ముసుకుపోయినట్టుగా అభివృద్ధి చెందకపోవడంతో కడుపులోని భాగాలు ఛాతీలోని ఊపిరితిత్తులున్న చోటికి వస్తాయి.

    ఇన్సిషనల్‌ హెర్నియా : సర్జరీ వంటివి చేస్తున్నప్పుడు... కడుపుపైన గాటు పెట్టిన చోట అక్కడి కణజాలం బలహీనం కావచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ గాటు ఉన్న చోటి నుంచి కడుపులోని భాగాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లుగా చర్మం కింది నుంచి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. మునుపు శస్త్రచికిత్స గాయం లేదా మచ్చ ఉన్న ప్రాంతంలో... ఆ  గాయం సరిగా మానకపోయినా లేదా ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఈ తరహా హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. సాధారణంగా సర్జరీ తర్వాత రెండేళ్లలోపు ఇది కనిపిస్తుంది.

    అంబిలికల్‌ హెర్నియా / పారా అంబిలికల్‌ హెర్నియా :  బొడ్డు దగ్గర బలహీనంగా ఉన్న ప్రాంతంలోంచి కడుపులోని భాగాలు బయటకు రావడాన్ని అంబిలికల్‌ హెర్నియా అంటారు. ఇది సాధారణంగా  పుట్టుకతోనే (కంజెనైటల్‌గా) కనిపిస్తుంటుంది. చాలా సందర్భాల్లో చిన్నారికి ఏడాది వయసు వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే అవకాశాలెక్కువ. ఇక పారాంబిలికల్‌ హెర్నియా పెద్దవారిలో వస్తుంది. ఇది నాభి పైభాగంలో కనిపిస్తుంది. ఇందులోకి పేగులు చొచ్చుకుపోయి అక్కడ ఇరుక్కుపోయే ముప్పు ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది. 

    వెంట్రల్‌ హెర్నియా : కడుపు కింది భాగంలో ఉండే పొరల నుంచి అవయవాలు దూసుకు రాకుండా... కడుపు ముందుభాగంలోంచే కడుపులోని అవయవాలు ముందుకు వస్తుంటే దాన్ని ‘వెంట్రల్‌ హెర్నియా’ అని చెప్పవచ్చు. ఒకరకంగా చె΄్పాలంట అంబిలికల్‌ హెర్నియా, బొడ్డు దగ్గర వచ్చే ‘ఎపిగ్యాస్ట్రిక్‌ హెర్నియా’ వంటి వాటిని ‘వెంట్రల్‌ హెర్నియా’గా చెప్పవచ్చు.

    హెర్నియా ఎవరెవరిలో వస్తుందంటే... 
    హెర్నియా అన్నది పురుషుల్లోనూ, మహిళల్లోనూ... ఇలా ఇద్దరిలో వచ్చే కండిషన్‌. చాలామంది పురుషుల్లో వచ్చే హైడ్రోసిల్‌ కండిషన్‌ను హెర్నియాతో పోల్చుకుని... ఆ రెండో ఒకటే అని అపోహ పడుతుంటారు. కడుపు కిందిభాగంలోని పొర... వయసు పెరగడం వల్లగానీ లేదా అరుగుదల వల్లగానీ, దెబ్బతగలడం వల్లగానీ లేదా కొందరిలో సహజంగానే ΄పొట్ట అడుగుభాగంలోని కండరం బలహీనపడ్డ సమయంలో కడుపులోని భాగాలు అందులోంచి దూసుకుని కిందికి వెళ్లడాన్నే ‘హెర్నియా’ అంటారు. 

    స్త్రీ, పురుషుల్లో హెర్నియా పలు రకాలుగా రావచ్చు. అయితే పురుషులకు ఇంగ్వైనల్‌ హెర్నియా వచ్చే అవకాశాలెక్కువ. ఎందుకంటే పిండం శిశువుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వృషణాలు పొత్తికడుపులోంచి నుంచి స్క్రోటమ్‌లోకి దిగేందుకు ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్నే ఇంగ్వైనల్‌ కెనాల్‌ అంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు టెస్టిస్‌ (బీజాలు) కూడా కడుపులోనే ఉంటాయి. మగబిడ్డ పుట్టగానే కడుపులోని ఆ టెస్టిస్‌ (బీజాలు) అదే మార్గం ద్వారా వృషణాల సంచిలోకి జారతాయి. 

    మున్ముందు ఆ కెనాల్‌లోంచే పేగులు కూడా వృషణాల సంచిలోకి జారడం వల్ల ఇంగ్వైనల్‌ హెర్నియా వస్తుంది. ఇక పెద్ద వయసువారిలో ఏదైనా కారణం వల్లగానీ లేదా మలబద్దకం కారణంగా ముక్కినప్పుడు  పొత్తికడుపుపై ఒత్తిడి పెరగడం వల్ల కూడా హెర్నియా వస్తుంది. ఇదే కాకుండా పొత్తికడుపుపై ఇతరత్రా కారణాలతో ఒత్తిడి పడటం కూడా హెర్నియాకు దారితీయవచ్చు. ఇక చిన్నారుల్లో సైతం పుట్టుకతో వచ్చే హెర్నియాలూ ఉండనే ఉన్నాయి. 
    కడుపు కండరాలపై ఒత్తిడి కారణంగా 

    హెర్నియా రావడానికి కారణాలు... 

    క్రానిక్‌ అలర్జీల వల్ల చాలాకాలం పాటు గట్టిగా దగ్గాల్సిరావడం. 

    పురుషుల్లో చాలా ఎక్కువసేపు అదేపనిగా నిలబడే వృత్తులో ఉండటం. 

    గర్భధారణ వల్లగానీ చాలా ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీలు రావడం వల్ల. 

    ఎక్కువ బరువు ఉండటం (బీఎమ్‌ 30 కంటే ఎక్కువగా ఉండటం).

    బరువైన వస్తువులను అకస్మాత్తుగా ఎత్తడం లేదా ఎక్కువ ఫోర్స్‌తో తోయడం.

    మలవిసర్జన సమయంలో ముక్కుతూ చాలా ఎక్కువ ఒత్తిడితో విసర్జనకు ప్రయత్నించడం.  

    పెల్విస్‌ భాగంలో అయిన సర్జరీల వల్ల. 

    చిన్నారుల్లో కంజెనైటల్‌ హెర్నియాలకు కారణాలు... 

    నెలల పూర్తిగా నిండకముందే పుట్టడం (ప్రీ–మెచ్యుర్‌ డెలివరీస్‌). 

    కనెక్టివ్‌ టిష్యూ డిజార్డర్‌ అనే ఆరోగ్య సమస్య ఉండటం. 

    కడుపులోని బీజాలు సంచిలోకి వెళ్లకపోవడం (అన్‌–డిసెండెడ్‌ టెస్టిస్‌). 

    మూత్ర వ్యవస్థ / రీప్రొడక్టరీ సిస్టమ్‌లో ఏవైనా సమస్యలుండటం. 

    మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉండేవారిలో... మరీ ముఖ్యంగా ్ర΄ోస్టేట్‌ సమస్య ఉన్నవారిలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ.

    పెద్దవారిలో కనిపించే లక్షణాలు
    బరువైన వస్తువులు ఎత్తిన తర్వాత పొత్తికడుపు కింది భాగం (గ్రోయిన్‌)లో  చిన్న ఉబ్బ / గడ్డలా కనిపించడం. మొదట్లో దాన్ని చేతితో లోపలికి నెట్టినప్పుడు కనిపించకుండా పోవడం తర్వాత మెల్లగా బయటకు రావడం 

    దగ్గినప్పుడు లేదా గట్టిగా నవ్వినపుపడు ఉబ్బు బయటకు రావడం 

    పడుకున్నప్పుడు ఉబ్బు / వాపు తగ్గిపోవడం. 

    ఎందుకు చికిత్స అవసరమంటే...?
    సాధారణంగా హెర్నియా పెద్దగా నొప్పిని కలిగించదు. కానీ కొంతమందిలో నొప్పి లేదా బరువుగా అనిపించవచ్చు. కాలక్రమంలో ఉబ్బు / వాపు పెద్దదవుతుంది. పురుషుల్లో కొన్ని సందర్భాల్లో స్క్రోటమ్‌లోకి దిగిపోవచ్చు. ఇక పురుషుల్లోనూ, మహిళల్లోనూ కనిపించే హయటస్‌ హెర్నియాలో కడుపులోని యాసిడ్‌ పైకి తోసుకువచ్చే యాసిడ్‌ రిఫ్లక్స్‌ వంటి సందర్భాల్లో ఛాతీలో మంట, తీవ్రమైన అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించి చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. 

    ఇక అప్పుడే పుట్టిన చిన్నారుల్లో కనిపించే కాంప్లికేషన్ల కారణంగా వాటిని సరిదిద్దాల్సిన అవసరం తప్పనిసరి. ఇక పెద్దవారిలో వచ్చే హెర్నియాలు సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా చికిత్స చేయడం అవసరం. ఇందుకు కారణాలు... కొన్ని సందర్భాల్లో హెర్నియా ఎటూ  కదలలేకుండా ‘బిగుసుకుపోవచ్చు’. ఇలా బిగుసుకుపోవడాన్ని ‘ఇన్‌కార్సెరేషన్‌’ అంటారు. 

    ఇలాంటి ‘ఇన్‌కార్సెరేటెడ్‌ హెర్నియా’లో నొప్పితో పాటు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఉదాహరణకు హెర్నియా కండిషన్‌ పెద్దపేగును బాగా బిగదీసి నొక్కుకుపోయేలా చేసినప్పుడు బయటకు వెళ్లాల్సిన గ్యాస్, విసర్జన జరగాల్సిన పదార్థాలూ అక్కడే ఆగిపోవచ్చు. 

    ఇక కొన్నిసార్లు పేగు భాగం ఇరుక్కుపోయి ‘స్ట్రాంగ్యులేషన్‌’ అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు బిగదీసుకుపోయిన చోటి నుంచి కింది భాగానికి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల  తీవ్రమైన నొప్పితో పాటు పేగు దెబ్బతిని అక్కడి కణజాలం నశించిపోయే ప్రమాదం ఉంది. దీన్నే నెక్రోసిస్‌ / గ్యాంగ్రీన్‌గా కూడా చెబుతారు. ఇంగ్వైనల్‌ హెర్నియాలకంటే ఫెమోరల్‌ హెర్నియాల్లో ఈ ముప్పు చాలా ఎక్కువ. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి అది రవాణ సదుపాయానికి కూడా దారితీయవచ్చు. అందుకే హెర్నియా కండిషన్‌ను శస్త్రచికిత్స ద్వారా సరిచేయాల్సి ఉంటుంది. 

    నిర్ధారణ 
    బాధితుల్లోని ఉబ్బు భాగాన్ని భౌతికంగా పరీక్షించడం 
    (ఫిజికల్‌ ఎగ్జామ్‌) ద్వారా హెర్నియాను చాలావరకు నిర్ధారణ చేస్తారు. 
    కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్‌ వంటి ఇమేజింగ్‌ ప్రక్రియలు అవసరం పడవచ్చు. 

    హెర్నియాను ఎలా సరిచేస్తారు?
    హెర్నియాను చిన్నపాటి శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు సరిచేస్తారు. అయితే చిన్నపాటివీ (మైల్డ్‌), కొద్దిపాటి వాటికి వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదు. ఇలాంటి వాటి విషయంలో డాక్టర్లు ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ పద్ధతిని అనుసరిస్తారు. మరీ ప్రమాదకరం కాకుంటే తక్షణం శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని అంచనా వేస్తే తప్పక శస్త్రచికిత్స అవసరం. ఇది మందులతో తగ్గే కండిషన్‌ కాదు. పాతకాలంలో ‘ట్రస్‌’ (సపోర్ట్‌) పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని ఎవరూ అనుసరించడం లేదు.  

    శస్త్రచికిత్సలో రకాలు
    ఓపెన్‌ సర్జరీ / హెర్నియా రిపేర్‌ సర్జరీ :  హెర్నియాను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. అంతర్గత అవయవాల్లోకి చొచ్చుకుపోయిన అవయవాలను / పేగులను లోపలికి యథాస్థానంలోకి నెట్టి, పొరలు బలహీనంగా ఉన్న చోటి నుంచి అవయవాలు మళ్లీ లోనికి జారిపోకుండా అక్కడ ‘మెష్‌’ (వల వంటి భాగాని అమర్చుతారు. మామూలుగానైతే  3–4 అంగుళాల కోత పెట్టి హెర్నియాను సరిచేస్తారు.  సాధారణంగా స్పైనల్‌ అనస్థీషియా ఇస్తారు.

    లాపరోస్కోపిక్‌ హెర్నియా రిపేర్‌ : చిన్న చిన్న గాట్ల ద్వారా అతి చిన్న కెమెరా (లాపరోస్కోప్‌) సహాయంతో శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ను పెట్టి స్లేప్లింగ్‌ చేస్తూ దాన్ని స్థిరంగా ఉండేలా చూస్తారు. ఆ మెష్‌ కారణంగా మళ్లీ అవయవాలు లోపలికి జారవు. ఇందులో కూడా సాధారణంగా జనరల్‌ అనస్థీషియాతో ఇస్తారు.

    లాపరోస్కోపిక్‌ సర్జరీతో ప్రయోజనాలు
    చిన్న గాటు 

    తక్కువ నొప్పి 

    త్వరగా కోలుకోవడం 

    త్వరగా వృత్తులకు వెళ్లగలగడం (అటెండ్‌ కావడం)

    రొబోటిక్‌ సర్జరీ : ఇప్పుడు రొబోటిక్స్‌ సహాయంతో కూడా శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యమే. దీంతో మరింత ఖచ్చితమైన రీతిలో (ప్రెసిషన్‌తో) శస్త్రచికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలన్నీ ఇందులోనూ ఉంటాయి.

    హెర్నియా నివారణ సాధ్యమేనా? 
    హెర్నియాకు కారణమయ్యే కొన్ని అంశాలు మానవ నియంత్రణకు సాధ్యం కావు. అయితే కొన్ని సాధారణ అంశాలు పాటించడం ద్వారా హెర్నియాను చాలావరకు నివారించవచ్చు. అవి...  

    బరువును అదుపులో ఉంచుకోవడం / అధిక బరువు తగ్గించడం ∙

    బరువైన వస్తువులను ఎత్తే సమయంలో జాగ్రత్తగా ఉండటం / అకస్మాత్తుగా ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం / బరువైన వస్తువులను తోసే విషయంలోనూ ఈ జాగ్రత్తలు అవసరం

    చాలాకాలం పాటు దగ్గుతూ / తుమ్ములు వస్తూ ఉండే క్రానిక్‌ పల్మునరీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స తీసుకుంటూ దగ్గు రాకుండా చూసుకోవడం 

    మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవడం 

    పురుషుల్లో ప్రొస్టేట్‌ సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం.

    హెర్నియాలు వారసత్వంగా వస్తుంటాయా?  
    కొంతవరకు అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే జన్యుపరంగానూ, వాళ్ల దేహం తాలూకు స్వభావం వల్ల కడుపు కింది భాగంలోని పొరలు బలహీనంగా ఉండటం జరగవచ్చు. ఇలాంటి కుటుంబాల్లో తర్వాతి తరాల్లోనూ హెర్నియా రావచ్చు. అంతమాత్రాన తర్వాతి తరాల్లో ఇది అందరికీ వస్తుందని కాదుగానీ... హెర్నియా వచ్చేందుకు అవకాశాలు కాస్తంత ఎక్కువ.

    చివరగా... ముందుగా చెప్పినట్టు మైల్డ్‌ కేసుల్లో డాక్టర్లు వెయిట్‌ అండ్‌ వాచ్‌ పద్ధతిలో హెర్నియాను గమనిస్తూ ఉన్నప్పటికీ... డాక్టర్లు సర్జరీ తప్పదని చెప్పినప్పుడు శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. ఎందుకంటే హెర్నియా బిగదీసుకుపోయే  ‘స్ట్రాంగ్యులేషన్‌’ కేసుల్లో అది మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణించవచ్చు. అంతేకాదు... కొన్నిసార్లు ప్రాణాంతకమూ అయ్యే అవకాశాలెక్కువ. అందుకే డాక్టర్ల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.

    డాక్టర్‌ ఎన్‌. భరత్‌కుమార్‌, సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌  

    నిర్వహణ: యాసీన్‌

    (చదవండి: గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?)

     

  • సమ్మర్‌ అనగానే నీటి కొరత, అధిక వేడితో సతమతమవుతుంటాయి పట్టణాలు, మెట్రో నగరాలు. చెట్లను పెంచడం, పచ్చదనం కాపాడుకోవడం వంటివి మాటలకే పరిమితం చేసి..సమస్యకు చెక్‌పెట్టేలా స్వచ్ఛందంగా ముందుకు ఎవ్వరురారు. కానీ ఓ మారుమూల గ్రామంలో ఓ తాత చూస్తుండగానే తన గ్రామం కొండ కోనలు బీడుగా మారిపోయాయి. అక్కడి ప్రజలు నీటి కోసం పడిగాపులు పడేవారు. ఇవన్నీ చూసిన ఓ తాత రోజు కొండలను ఎక్కి మరి చేసిన చిన్న ప్రయత్నం ఆ ఊరి రూపురేఖల్ని మాత్రమే కాదు, అక్కడి ప్రజల కష్టాలకు స్వస్తి పలికేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

    ఆ వ్యక్తే ఇండేనిషియాకు చెందిన సదిమాన్‌.  ఇండోనేషియా సెంట్రల్‌ జావా ప్రావిన్స్లో ఉన్న జెనెంగ్‌ గ్రామం కొన్నాళ్లు పొరిపరిస్థితులు, కాలానుగుణ నీటికొరతతో అల్లాడింది. ఏళ్ల తరబడి కలప నడికివేత, భూమిని చదును చేయడం, పదేపదే సంభవించిన అగ్ని ప్రమాదాలు వంటి వాటికారణంగా కొండ వాలులో అడవి విస్తీర్ణం తగ్గిపోయింది. దీనివల్ల నేలపొడిగా మారి బీడుగా అయిపోయింది. వేసవి కాలంలో స్థానిక ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోతుండేవారు. అక్కడ నీటి బుగ్గలు అదృశ్యం కావడానికి అడవుల నరికివేతే కారణమని సదిమాన్‌ గట్టిగా విశ్వసించాడు. 

    చెట్ల విస్తీర్ణాన్ని  పునరుద్ధరించడం వల్ల భూమి నెమ్మదిగా నీటిని తిరిగి నిలుపుకునే పునరుజ్జీవించేస్తుందనేది ఆ తాత నమ్మకం. 1990 టైంలో ఆయన గెండోల్‌ పర్వతం చుట్టు పక్కల ప్రాంతాల్లో బీడు కొండల అంతటా మర్రి, అత్తి చెట్లను నాటడం ప్రారంభించాడు. ఈ పని చేయడం ఆ తాత వయసు రీత్యా శారీరకంగా చాలా శ్రమతో కూడిన పని. కానీ ఆయన దీన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించాడు. అతని కృషికి ఎలాంటి ఆర్థిక సహాయం గానీ, ప్రజా గుర్తింపు గానీ లభించకపోయినా..మొక్కలు నాటడం, పర్యవేక్షించడం అతని దినచర్యగా మారిపోయింది. 

    పైగా అతడు చేస్తున్న పనికి గ్రామస్తుల నుంచి ఎగతాళి, విమర్శలు ఎదురయ్యేవి. అతడి ఆలోచన అస్సలు ఫలిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇలా మర్రి చెట్లను నాటడాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి మరి బాధించేవారు ఆ తాతని. అయినా డోంట్‌ కేర్‌ అంటూ ఆ తాత కష్టపడి కొండ ఎక్కి మరి శ్రద్ధగా పర్యవేక్షించేవాడు. అందుకోసం తన వద్ద మేకలను అమ్మి మరి మొక్కలు కొనుగోలు చేసి మరి నాటేవాడట. అతడి కృషి ఫలించి నెమ్మదిగా కొండలన్నీ పచ్చగా మారడం ప్రారంభించాయి. 

    కొండలు క్రమంగా ఎక్కువ తేమను నిలుపుకోవడం ప్రారంభించాయి. నేల కోత తగ్గింది, వృక్ష సంపద కూడా పెరిగింది. తద్వారా భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడింది. దాంతో సహజ నీటి బుగ్గలు కనిపించడం ప్రారంభించాయి. అంతేగాదు అక్కడ వ్యవసాయానికి, సమీప గ్రామాలకు నీటి కొరత తగ్గింది. వేసవి కాలంలో సైతం స్వచ్ఛమైన నీరు లభించింది. ఒకప్పుడూ నిస్సారంగా ఉన్న వాలు ప్రాంతాలన్నీ దట్టమైన పచ్చటి అడవులుగా మారాయి.

    ఆ చెట్లే ఎందుకంటే..
    మర్రి, అత్తి చెట్టు నేలను స్థిరీకరించడానికి, భూగర్భ జలాలను నిల్వ చేయడానికి సహాయపడతాయి. ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలలో నీటి పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణకు ఇవి అత్యంత ముఖ్యమైన జాతులని పర్యావరణ శాస్త్రవేత్తలు సదా చెబుతుంటారు కూడా.

    పెద్ద అత్తి చెట్లు ఏడాది పొడవునా పక్షులు, గబ్బిలాలు, ఇతర వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా జీవవైవిధ్యానికి తోడ్పడతాయి. అందువల్లే వీటినే ఎంచుకున్నాడు సదిమాన్‌ తాత. ఆ తర్వాత కొద్దికాలంలో వార్తపత్రికలు, మీడియా ద్వారా అతడి స్టోరీ వ్యాపించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాదు..ఇండోనేషియన్లు ఆ తాతను ఈ పచ్చదనానికి ప్రతీకగా గౌరవించడం ప్రారంభించారు. అంతేగాదు ఈ తాత డబ్బు లేదా ఫేమస్‌ అవ్వడంలో పెద్ద గొప్ప ఉండదని, ఇతరులు ఇబ్బంది పడకుండా చూడటమే గొప్ప అని, అదే మనం వాళ్లకిచ్చే విలువైన బహుమతని అంటున్నాడు సదిమాన్‌.

    (చదవండి: సినిమా ఎంత పనిచేసింది..! మంచి జాబ్‌ లైఫ్‌ని వదులుకుని చివరికి..)