Archive Page | Sakshi
Sakshi News home page

Nirmal

  • జిల్లా మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్‌.44

    స్కూల్‌ బస్సుల తనిఖీ

    నిర్మల్‌టౌన్‌: ఆర్టీఏ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు మంగళవారం కూడా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల తనిఖీలు కొనసాగించారు. జిల్లా కేంద్రంలోని బస్సుల ఫిట్‌నెస్‌, డ్రైవర్ల లైసెన్సులు, వాహన బీమా, అత్యవసరద్వారాలు తదితర భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 10 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎంవీఐ తిరుపతి హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ప్రయాణించే బస్సుల భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తనిఖీల్లో ఆర్టీఏ సిబ్బంది తేజ, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

    నిర్మల్‌: దేశంలో అతిపెద్ద హైవే ఎన్‌హెచ్‌–44. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3,745 కి.మీలతో దేశంలోనే అతి పొడవైన రహదారిగా పేరొందింది. ఈ రహదారి ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఆరులైన్లుగా విస్తరణ జరుగుతోంది దీంతో నాగపూర్‌–హైదరాబాద్‌ మధ్య ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. దీంతో జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్టు పూర్తయితే మధ్యలో ఉన్న జిల్లావాసులకు అటు నాగపూర్‌, ఇటు హైదరాబాద్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఈ మార్పు జిల్లా అభివృద్ధికి కూడా కొత్త‘దారులు’ తెరుస్తుంది.

    పెరిగిన వాహనాల రద్దీ..

    ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే ఎన్‌హెచ్‌ 44 మొత్తం 11 రాష్ట్రాల గుండా వెళ్తుంది. నిర్మల్‌ జిల్లాలో ఇదే ప్రధాన రవాణా మార్గంగా ఉంది. ఈ మధ్యకాలంలో విపరీతమైన వాహన రద్దీతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాలను కలిపే ఏకై క రోడ్డుమార్గం కావడంతో భారీ లారీలు, వాహనాలు వెళ్తున్నాయి. వీటి కారణంగా ప్రయాణికులకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. తరచూ ప్రమాదాలూ జరుగుతున్నాయి.

    ఆరు లేదా ఎనిమిది లైన్లు..

    మామూలు హైవేకు ఎక్స్‌ప్రెస్‌వేకు తేడా ఉంటుంది. హైవే రోడ్డులో నాలుగులైన్లు ఉంటాయి. దీనిపైకి ఎక్కడి నుంచైనా రావడానికి వీలుంటుంది. వీటిపై వేగం గరిష్టంగా గంటకు 80 నుంచి 100 కి.మీలు మాత్రమే ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌వేలో చాలా మార్పులు ఉంటాయి. ఇందులో ఆరు నుంచి ఎనిమిది లైన్లు ఉంటాయి. ప్రస్తుతం నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేలలో చాలా కిలోమీటర్ల వరకు మధ్యలో రావడానికి, వెళ్లడానికి అవకాశం ఉండదు. గరిష్ట వేగం గంటకు 120 కి.మీ ఉంటుంది. ఈకారణంగా దూరం, సమయం రెండూ తగ్గుతాయి. ఇటీవల నిర్మల్‌ సమీపంలోని కడ్తాల్‌, కామారెడ్డి సమీపంలో నిర్మించిన ఫ్‌లైఓవర్లు ఈ ఎక్స్‌ప్రెస్‌వేలకు అనుగుణంగానే ఆరులైన్లతో నిర్మించారు.

    అవకాశం ఉంది..

    సులభమైన, వేగవంతమైన ప్రయాణానికి 44వ జాతీయ రహదారిని ఎక్స్‌ప్రెస్‌వేగా మార్చాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఈమేరకు చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో కూడా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం అందలేదు.

    – నాగేశ్వర్‌రావు, ఎన్‌హెచ్‌–44 పీడీ

    ఎన్నో లాభాలు..

    జిల్లా మీదుగా వెళ్తున్న 44 హైవే కేవలం నాలుగులైన్లు మాత్రమే ఉంది. దీనిని ఆరు లైన్లుగా విస్తరిస్తే తప్ప ప్రమాదాలు, ప్రయాణభారం తగ్గదని చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. ఈక్రమంలో తాజాగా కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో ఈ హైవే కూడా ఎక్స్‌ప్రెస్‌వేగా మారనుందని స్పష్టమైంది. దీంతో ప్రయాణం వేగవంతం అవుతుంది. ఎక్స్‌ప్రెస్‌వే పొడవునా పరిశ్రమలు, లాజిస్టిక్స్‌, గిడ్డంగుల ఏర్పాటు, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిర్మల్‌ వంటి ప్రాంతాలూ పెట్టుబడిదారులను ఆకర్షించే కేంద్రంగా మారుతాయి. పర్యాటకరంగానికీ ఊతం లభిస్తుంది. దూరప్రాంతాల వారికి జిల్లాలోని ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు చేరుకోవడం సులభమవుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకులు వాణిజ్య సముదాయాలు వంటి సేవా, ఉపాధిరంగం అభివృద్ధికి ఊతమిస్తుంది. హైదరాబాద్‌, నాగపూర్‌ మార్కెట్లతో జిల్లా అనుసంధానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలు, సేవా కేంద్రాలు, వాణిజ్య సంస్థలు ఏర్పడితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలూ పెరుగుతాయి.

  • లక్ష్మణచాంద: జిల్లాలో వానాకాలం పంటల సాగు మొదలైంది. వానాకాలం పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారులు అంటున్నారు. జిల్లాకు వానాకాలం పంటకు 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం జిల్లాలో 11 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే యూరియా యాప్‌ బుకింగ్‌పై ఇప్పటికీ చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఇతర రైతులపై లేదా వ్యవసాయాధికారులపై యూరియా బుకింగ్‌ కోసం ఆధారపడాల్సి వస్తుంది. యూరియా బుకింగ్‌తో రైతులకు కొంత మేరకు తిప్పలు తప్పడం లేదు. సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా ద్రావణం మార్కెట్‌లోకి వచ్చింది. నానో యూరియా వినియోగిస్తున్న రైతుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. 2025–26 సంవత్సరంలో జిల్లా మొత్తం నానో యూరియా ద్రావణం 28 వేల లీటర్లు రైతులు వినియోగించారని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ తెలిపారు. ఈసారి సుమారు 35 వేల లీటర్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

    పెరుగుతున్న సాగు వ్యయాలు..

    అధిక దిగుబడుల కోసం అవగాహన లేని రైతులు అధిక ఎరువులు వినియోగిస్తున్నారు. వ్యవసాయాధికారులు యూరియాను మోతాదుకు మించి వినియోగించవద్దని సూచించినా, రైతులు మాత్రం వినకుండా అధిక దిగుబడులు సాధించాలని ఎక్కువ యూరియాను వినియోగించడంతో సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. యూరియా అధిక వినియోగంతో పంట మొక్కల ఆకులు ఎక్కువగా పెరిగి పంట బలహీనపడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా దిగుబడులు తగ్గుతుందని అంటున్నారు. తెగుళ్లు, పురుగుల దాడితో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అధికంగా యూరియాను వినియోగించడం వల్ల నేల సారం కోల్పోయి ఎరువు వృధా అవుతుందని, పంటలు విషతుల్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నానో వైపు అన్నదాతలు దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

    జిల్లా సమాచారం....

    మొత్తం సాగు విస్తీర్ణం 4.40 లక్షల ఎకరాలు

    యూరియా అవసరం

    30 వేల మెట్రిక్‌ టన్నులు

    2025–26 నానో యూరియా వినియోగం

    28 వేల లీటర్లు

    ఈసారి నానో యూరియా వినియోగం

    అంచనా 35 వేల లీటర్లు

    అవగాహన కార్యక్రమాలు...

    జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యూరియాను మితంగా వినియోగించాలని కోరుతూ అన్ని రైతు వేదికల్లో, గ్రామాల్లో, రైతుల పంట పొలాల వద్ద డీఏవో అంజిప్రసాద్‌తోపాటు అన్ని మండలాల ఏవోలు, ఏఈవోలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానోవైపు మళ్లుతున్నారు. అమెరికా – ఇరాన్‌ యుద్ధం కారణంగా యూరియా దిగుమతి తగ్గింది. ఈ నేపథ్యంలోనూ రైతులు నానో యూరియా వాడడం మంచిదని సూచిస్తున్నారు. గత ఏడాది వానాకాలంలో వినియోగించే యూరియా కంటే జిల్లాలో 300 మెట్రిక్‌ టన్నుల వినియోగం తగ్గిందని, అలాగే ఇటీవల ముగిసిన యాసంగిలో 1,800 మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగం తగ్గిందని తెలిపారు. ఇంకా సాధారణ యూరియా వినియోగం తగ్గి రైతులు నానో వినియోగం పెంచాలని డీఏవో అంజిప్రసాద్‌ అంటున్నారు. జిల్లాలో 2025–26లో నానో యూరియా 28 వేల లీటర్లు, నానో డీఏపీ 6 వేల లీటర్లు రైతులు వినియోగించారు. ఈ సారి జిల్లా అంతటా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరింత నానో యూరియా వినియోగించేలా చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు.

  • నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసాటౌన్‌/కడెం/ఖానాపూర్‌: వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలని, భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన హెచ్‌టీ, ఎల్‌టీ లైన్‌ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం భైంసా, కడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్లను సందర్శించారు. నిర్మల్‌, ఖానాపూర్‌లోని విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరఫరా మెరుగుదలకు సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో ట్రిప్పింగ్‌లు తగ్గించేందుకు ప్రస్తుత విద్యుత్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్నారు. అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు లైన్లలోని లోపాలు సరిదిద్దాలని సూచించారు. డిస్టిబ్య్రూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్‌) వైఫల్యాలను తగ్గించేందుకు అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడం, అధిక లోడ్‌ ఉన్న ప్రాంతాల్లో స్పేసర్లు అమర్చడం, ఓవర్‌లోడ్‌ అయిన డీటీఆర్‌లను మార్చడం, ప్రమాదకర ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లపై లైట్నింగ్‌ అరెస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడెం, పెంబి, దస్తురాబాద్‌ మండలాల్లో అటవీ ప్రాంతాల్లో ఈదులుగాలులకు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, సమస్య పరిష్కరించేందుకు ఆటవీ ప్రాంతా గుండా కవర్డ్‌ కండక్టర్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గంగాపూర్‌లో సబ్‌స్టేషన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఖానాపూర్‌ 133 కేవీ అంతరాయం కల్గినపుడు, కడెం, దస్తురాబాద్‌ మండలాలకు తాళ్లపేట్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన 133 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ప్రత్యామ్నాయంగా సరాఫరాకు చేయవచ్చని తెలిపారు. సత్తన్‌పల్లి, బీర్నంది మధ్యలో 33 కేవీ లైన్‌ ఏర్పాటు, కడెం నుంచి దస్తురాబాద్‌ వైపు డబుల్‌ సర్య్కూట్‌ లైన్‌ నిర్మాణం పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎక్కడైనా డీటీఆర్‌లు దెబ్బతింటే ఒకే రోజులో వాటిని మార్చేలా నిల్వలు సిద్దంగా ఉంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ సిబ్బంది భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లు నిబంధనల ప్రకారం రెండు నెలల్లో ఇవ్వాలన్నారు. కుభీర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో తరచూ విద్యుత్‌ సమస్యలు ఎదురవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్‌ఈ జాదవ్‌ సుభాష్‌, భైంసా డీఈఈ తిలక్‌, ఎస్‌ఈ రాథోడ్‌ సుభాష్‌, డీఈఈలు భాస్కర్‌, నాగరాజు, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈఈ రాంసింగ్‌, సబ్‌ ఇంజనీర్‌ స్వాతి, డీఈ ఎంఆర్‌టీ తిలక్‌, ఏడీ శ్రీనివాస్‌, కడెం సర్పంచ్‌ దీకొండ విజయ్‌కుమార్‌, నిర్మల్‌ టౌన్‌, నిర్మల్‌ రూరల్‌ ఉప విభాగాల ఆపరేషన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు

  • నిర్మల్‌చైన్‌గేట్‌: సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలోని 81 టీచర్‌, 430 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పక్షం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

    జిల్లాలో ఖాళీలు..

    జిల్లా వ్యాప్తంగా నిర్మల్‌, ఖానాపూర్‌, ముధోల్‌, భైంసా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 931 సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 850 మంది టీచర్లు, 501 ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 81 టీచర్లు, 430 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 65 ఏళ్లు నిండిన టీచర్లు, ఆయాలతో ఉద్యోగ విరమణ చేయించారు. దీంతో 511 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి.

    భర్తీ ప్రక్రియ ఇలా..

    గతంలో పదో తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్హత ఇంటర్మీడియెట్‌కు పెంచారు. గతంలో మాదిరిగానే కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ కమిటీకి కలెక్టర్‌ ౖచైర్మన్‌గా ఉంటారు. ఆర్డీవో, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌(ఏజెన్సీ), డీఎంహెచ్‌వో, డీడబ్ల్యూవో సభ్యులుగా ఉంటారు. స్థానికులకే ప్రాధాన్యం ఇస్తారు.

    మార్కుల కేటాయింపు..

    మొత్తం 100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు మెరిట్‌ ఆధారంగా అత్యధికంగా 70 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేని వారికి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు కలిపి మెరిట్‌ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. మొదలైన పైరవీలు..

    చాలాకాలం తర్వాత అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అదే విధంగా తమకు పోస్టు ఇప్పించాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు టీచర్‌ పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, ఆయా పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తే పోస్టు ఇప్పిస్తామని దళారులు రంగప్రవేశం చేశారు.

    ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు

    ప్రాజెక్టు టీచర్లు ఖాళీలు ఆయాలు ఖాళీలు

    భైంసా 205 18 205 76

    ఖానాపూర్‌ 249 20 249 110

    ముధోల్‌ 180 12 180 88

    నిర్మల్‌ 297 31 297 156

    మండలాలు 18 క్లస్టర్లు 4 సెక్టార్లు 37

    అంగన్‌వాడీ కేంద్రాలు 931

  • నర్సాపూర్‌ (జి): గ్రామీణులందరికీ మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలోని 30 పడగల సామాజిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. ఓపీ విభాగం, మందుల గది, ల్యాబ్‌, ఇన్‌, ఔట్‌ పేషెంట్‌ విభాగాలు, పలు వార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించిన మందులు, ఓపీ, తదితర రిజిస్టర్లు తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతీరోజు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం కేజీబీవీ పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో సౌకర్యాలు తెలుసుకున్నారు. ప్రతీరోజు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు. తర్వాత చాక్‌పల్లి పరిధిలోని మోతక్‌పల్లి గ్రామం సుద్దవాగు ఇసుక రీచ్‌ను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా జరగకూడదన్నారు. అక్రమ రవాణా చేసే వాహనాలు జప్తు చేయాలని ఆదేశించారు. కేవలం మన ఇసుక వాహనం యాప్‌ ద్వారానే ఇసుక అమ్మకాలు జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట డీఈవో భోజన్న, డీసీహెచ్‌ఎస్‌ కాశీనాథ్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో పుష్పలత, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రమోద్‌చంద్రారెడ్డి, ఏపీవో తిరుపతిరెడ్డి, కేజీబీవీ ఎస్‌వో వీణ, సర్పంచ్‌ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు.

  • నర్సాపూర్‌ (జి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు 24/7 పనిచేస్తున్నారని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. నర్సాపూర్‌(జి) మండలం కుస్లీ గ్రామంలో మంగళవారం ఉదయం కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివి, పెండింగ్‌ చలాన్‌లు ఉన్న 43 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్‌ చలనాలు చెల్లించిన వారి వాహనాలు యజమానులకు తిరిగి ఇచ్చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, మెస్సేజ్‌లు, సోషల్‌ మీడియా లింకులు, ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ట్రాఫిక్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గుడుంబా, కల్లు వంటి మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు కుటుంబాలు, సమాజాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నార్వాడి ప్రవీణ్‌ పాటిల్‌, ఉప సర్పంచ్‌ అల్లూరి రాజు, నిర్మల్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, ఎస్సైలు గణేశ్‌, శ్రీకాంత్‌, రవీందర్‌, లింబాద్రి, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

  • ● అభివృద్ధికీ ‘ఏలేటి’ అడ్డు ● మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

    నిర్మల్‌: జిల్లాలో రైతులు పండించిన వరి, మొక్కజొన్న, జొన్న చివరి గింజ వరకూ కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు కలెక్టర్‌, అధికారులూ శ్రమించారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసం తాము కష్టపడుతుంటే, తరుగు పేరిట ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి రూ.కోట్లు దోపిడీ చేశారని సంచలన ఆరోపణ చేశారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఈసారి ధాన్యంతో సమానంగా మక్కలు కూడా 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెండు పంటలకు ఒకేసారి రావడంతో కొనుగోళ్లపై ప్రభావం చూపిందన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తరు గు పేరిట ప్రతీ సంచికి నాలుగైదు కిలోల చొప్పున దోచుకున్నారని మండిపడ్డారు. మొత్తం 18,92,926 ధాన్యం సంచుల నుంచి రూ.17.41 కోట్లు మింగేశారని ఆరోపించారు. రైతుల గోస ఎమ్మెల్యేకు తగులుతుందన్నారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ, మెడికల్‌ కాలేజీ నిర్మాణాలకు అడ్డుపడుతున్నారని విమర్శించా రు. ప్రజలందరూ ‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలని, ఇష్టానుసారంగా ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జిల్లా మీదుగా రైలు తీసుకురావడానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమణారెడ్డి పాల్గొన్నారు.

Rajanna

  • చొప్పదండి: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని బిహార్‌కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చొప్పదండిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బిహార్‌ రాష్ట్రం అరలియా జిల్లాకు చెందిన నితీశ్‌ కుమార్‌కు నలుగురు అన్నలు ఉండగా పెద్దన్న కామారెడ్డిలో రైస్‌మిల్లులో పని చేస్తుండగా, అతనితో కామారెడ్డికి వచ్చాడు. స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని, రూ.10వేల నుంచి రూ.15 వేలు అవుతాయని చెప్పగా, నితీశ్‌ అన్న అంత డబ్బు లేదని, డబ్బు సర్దుబాటు అవ్వగానే కొనిస్తానని చెప్పి బిహార్‌ పంపించేందుకు చొప్పదండిలోని హరిప్రియ రైస్‌మిల్లులో పని చేసే మరో సోదరుడి దగ్గరకు పంపించాడు. చొప్పదండి నుంచి బిహార్‌ వెళ్లేవారు ఉండటంతో ఈ నెల 13న రైస్‌మిల్లుకు వచ్చాడు. మంగళవారం ఉదయం ఉరి వేసుకుని కనిపించాడు. స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని సోమవారం రాత్రి నితీశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌ రెడ్డి తెలిపారు.

  • జగిత్యాలఅగ్రికల్చర్‌: పంటలు అధిక దిగుబడి సాధించాలనే తపనతో రైతులు అవసరమున్నా.. లేకున్నా భూమిలో రసాయనాలు కుమ్మరిస్తున్నారు. తద్వారా భూసారం దెబ్బతినడంతోపాటు సూక్ష్మ, స్థూల పోషక లోపాలు ఏర్పడి చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో భూమికి సత్తువ కల్పించడంతోపాటు రసాయన ఎరువులు తగ్గించడంలో పచ్చిరొట్ట ఎరువులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తోంది. జగిత్యాల జిల్లాకు 12,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు రాగా.. 11,674 క్వింటాళ్ల జీలుగ, 827 క్వింటాళ్ల జనుము ఉంది.

    పచ్చిరొట్ట ఎరువులంటే..

    పచ్చిరొట్ట ఎరువులను పంట భూమికి రెండు రకాలుగా అందించవచ్చు. మొదటి పద్ధతిలో.. జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవ, పెసర, అలసంద, గోరు చిక్కుడు, మినుము, కంది, వేరుశెనగ, సెస్భెనియా, వెంపలి విత్తనాలను పొలంలో వెదజల్లి, అవి పెరిగిన తర్వాత 50శాతం పూత దశలో(45 నుంచి 60 రోజుల సమయంలో) అదే పొలంలో కలియదున్ని, కుళ్లిన తర్వాత ప్రధాన పంట వేసుకోవాలి. రెండో పద్ధతిలో.. వేప, తంగెడు, కానుగ, గ్లైరిసిడియా, సుబాబుల్‌, గుల్‌మొహర్‌, పొంగామియా చెట్ల ఆకులు, కొమ్మలను పొలంలో వేసి కలియదున్నాలి. వరి సాగు చేసే రైతులు తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటే పొలం సిద్ధం చేసే సమయానికి పూతకు వస్తుంది. ఆ సమయంలో కలియదున్ని నాట్లు వేసుకోవచ్చు. పండ్ల తోటల రైతులు జనుము, జీలుగ చల్లుకుంటే రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు.

    జీలుగ

    చౌడుభూములతో పాటు వరి పండించే భూముల్లో ఎకరాకు 20 కిలోల జీలుగ విత్తనాలను పొలమంతా చల్లుకోవాలి. పెరిగిన జీలుగ పంటను పూత దశలో కలియదున్నడం వల్ల ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఎకరం పచ్చిరొట్టలో 30 నుంచి 32 కిలోల నత్రజని లభిస్తుంది. జీలుగలో 3.5 శాతం నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2 శాతం పొటాష్‌ లభిస్తుంది. నీరు నిలిచినా పంట తట్టుకుంటుంది.

    జనుము

    అన్ని రకాల పంట భూముల్లో సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్టగా.. పశువుల మేతగానూ ఉపయోగపడుతుంది. ఎకరానికి 9.2 నుంచి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పంట ద్వారా ఎకరానికి 5.2 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. ఇందులో 2.3 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 1.8 శాతం పోటాష్‌లు ఉంటాయి. త్వరగా పెరుగుతుంది. నీటి ఎద్దడి, మురుగునీటిని తట్టుకోలేదు.

    పెసర

    తేలిక, బరువైన నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఆహారంగా, పచ్చిరొట్ట ఎరువుగా.. పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరం. ఎకరానికి 15.2 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరాకు అలసంద ద్వారా 4–5 టన్నులు, పిల్లి పెసర ద్వారా 4–6 టన్నుల పచ్చిరొట్ట వస్తుంది. బావులు, గట్ల వెంబడి ఉండే చెట్ల కొమ్మలు, ఆకులను పొలంలో వేసి కలియదున్నితే ఎంతో లాభం.

    ఉపయోగాలివీ..

    పచ్చిరొట్ట పంటల్లో సేంద్రియ పదార్థం ఉంటుంది. దీనివల్ల సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమిని గుల్లపరిచి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. పంట భూమిలో వృథాగా ఉండే పోషకాలను ఉపయోగంలోకి తేస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారిస్తుంది. ఈ జాతి పంటలకు వేర్లు లోతుగా ఉండి భూమి లోపలి పొరలను కూడా ఉపయోగంలోకి తేస్తాయి. నులి పురుగుల ఉధృతిని తగ్గిస్తాయి.

    రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్న రైతులు

    తొలకరిలో జనుము, జీలుగకు అధిక ప్రాధాన్యం

    వరి సాగు చేసే పొలంలో ఏటా జనుము వేస్తాను. రెండు పంటల సీజన్‌కు ఉపయోగపడుతుంది. పంటకు వేసే రసాయన ఎరువులు తగ్గిస్తాను. ఖర్చు తగ్గుతుంది. భూమి సారవంతంగా మారి, దిగుబడి పెరుగుతోంది.

    – స్వామిరెడ్డి,

    శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలం

    వరి వంటి ప్రధాన పంటలకు ముందు జనుము, జీలుగ, పప్పుధాన్యాల పంటలు సాగు చేయడం వల్ల భూమికి సత్తువ వస్తుంది. రసాయన ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం ఉండదు. రైతులు పచ్చిరొట్ట సాగు చేసి కలియదున్నితే చాలా లాభం.

    – సురేష్‌, అసోసియేట్‌ డీన్‌,

    వ్యవసాయ కళాశాల, పొలాస

  • కొత్తపల్లి మండలంలోని రాములపల్లి 50 ట్రాక్టర్ల డంపును, శాంతినగర్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ గర్‌ల్స్‌ స్కూల్‌ ప్రాంతంలో మరో 30 ట్రాక్టర్లు ఇసుక డంపును స్వాధీనం చేసుకున్నారు.

    ఈ నెల 9న కరీంనగర్‌ మార్కెట్‌ పరిధిలో కల్తీ కారం పొడి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి 50 బస్తాల కారంపొడి, పసుపు, దనియాల పొడిని సీజ్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్‌సేఫ్టీ అధికారులకు పంపించారు.

    అక్రమ దందాలపై ఉక్కుపాదం

    అప్పట్లో ఆరోపణలతో సింహభాగం సిబ్బంది అటాచ్‌

    తిరిగి పుంజుకుంటున్న వైనం

    కరీంనగర్‌క్రైం: గతంలో అక్రమ వ్యాపారాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరీంనగర్‌ టా స్క్‌ఫోర్స్‌ విభాగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇసుక అక్రమ రవాణా, రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు, గంజా యి విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై వరుస దాడులు నిర్వహించి గుర్తింపు పొందిన ఈ విభాగం, కొంతకాలంగా వివాదాలు, అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట దెబ్బతిన్నప్పటికీ తిరిగి చురుకుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

    ఆరోపణలతో దెబ్బతిన్న ప్రతిష్ట

    ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన కొందరు సిబ్బందిపై అక్రమ వ్యవహారాల ఆరోపణలు రావడంతో విభాగం ప్రతిష్ట మసకబారింది. పరిస్థితి తీవ్రతరమవడంతో ఒకేసారి సిబ్బందిని వివిధ విభాగాలకు అచాచ్‌ చేసి చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్రమార్కులకు ముందుగానే దాడుల సమాచారం అందిస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా రావడంతో పోలీస్‌ బాస్‌ వారిపై చర్యలు చేపట్టారు.

    రద్దు నుంచి పునరుజ్జీవం దిశగా..

    రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ విభాగాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, కరీంనగర్‌లో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలపై చర్చ జరిగింది. అయితే, విభాగాన్ని పూర్తిగా మూసివేయడం కన్నా దానిని ప్రక్షాళన చేసి మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయాలనే అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారుల్లో వ్యక్తం కావడంతో టాస్క్‌ఫోర్స్‌కు కొత్త దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    మళ్లీ దాడుల జోరు

    ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అక్రమ ఇసుక రవాణా, పేకాట స్థావరాలు, గంజాయి విక్రయాలు, అక్రమ మద్యం, కల్తీ ఆహార పదార్థాల తయారీపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ వ్యాపారాలపై చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ ప్రజల్లో విశ్వాసం సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ను కేవలం దాడుల విభాగంగా కాకుండా, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే ప్రత్యేక యూనిట్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు అక్రమ వ్యాపారాలకు కేరాఫ్‌గా ఉన్న ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్‌ దాడులతో పరిస్థితులు మారిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ దందాలు చేస్తే టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో దాడులు చేస్తామని, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు.

    కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌లో అధికారులు, సిబ్బంది

    ఏసీపీ 1

    ఎస్సైలు 2

    హెడ్‌కానిస్టేబుళ్లు 3

    కానిస్టేబుళ్లు 7

    జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సోమవారం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ సతీశ్‌ ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో దాడి చేసి 150 ట్రాక్టర్ల ఇసుక డంపులను సీజ్‌ చేసి జమ్మికుంట పోలీసుస్టేషన్‌కు అప్పగించారు.

  • గంభీరావుపేట(సిరిసిల్ల ): మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన బంటు జ్యోతి(25) ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందింది. బట్టలు ఉతికేందుకు కుటుంబసభ్యులతో చెరువు వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడింది. స్థానికులు చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

    గాయపడిన ఎలక్ట్రీషియన్‌..

    ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ కట్ట అశోక్‌(32) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కరెంట్‌ షాక్‌తో సోమవారం తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. అశోక్‌ను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే సోమవారం రాత్రి మరణించినట్లు కటుంబ సభ్యులు తెలిపారు. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నిర్లక్ష్యంతోనే అశోక్‌ మరణించాడని ఆరోపిస్తూ మేడారం గ్రాస్తుస్తులు మంగళవారం ధర్మారంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వపరంగా పరిహారం అందించడంతోపాటు మరికొంత ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

    రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

    శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం– మక్త రోడ్డుపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మక్త గ్రామానికి చెందిన నెలవేని రాంచరణ్‌(18) మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మక్త గ్రామానికి చెందిన నెలవేని కరుణాకర్‌–రజిత దంపతులుకు కూతురు, కొడుకు రాంచరణ్‌ ఉన్నారు. రాంచరణ్‌ సాంఘీక సంక్షేమ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు. డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటానని కేశవపట్నంలోని ఆన్‌లైన్‌ సెంటర్‌కు స్నేహితుడు అంజన్‌కుమార్‌తో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మక్త– కేశవపట్నం రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామచరణ్‌ అక్కడికక్కడే మరణించగా, అంజన్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

    డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి 7రోజుల జైలు

    రూ.45వేలు జరిమానా విధించిన మేజిస్ట్రేట్‌

    కోల్‌సిటీ(రామగుండం): మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రామగుండం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని గోదావరిఖని ప్రిన్సిపల్‌ కోర్టు మేజిస్ట్రేల్‌ వెంకట్‌ సచిన్‌ రెడ్డి ఎదుట మంగళవారం హాజరుపరిచారు. విచారణ అనంతరం నలుగురికి మొత్తం రూ.45వేలు జరిమానా విధించారు. ముగ్గురికి రూ.10వేల చొప్పున జరిమానా, మరొకరికి రూ.15వేల జరిమానా విధించారు. మరో వ్యక్తికి ఏడురోజుల జైలు శిక్ష విధించగా కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, హెల్మెట్‌ పెట్టుకోకపోయినా, ధ్రువపత్రాలు లేకపోయినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.

  • గోదావరిఖని: సింగరేణిలో కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శ్రీరాంపూర్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న 335 మంది కార్మిక వారసులకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఇటీవల జరిగిన సభలో కారుణ్య నియామకపత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం.. మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ పూర్తయి, శిక్షణ పూర్తిచేసుకున్న మరో 200 మందికిపైనే ఉన్నారు. 16 నెలల క్రితం మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పటినుంచి వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వం చేపట్టిన కారుణ్య నియామకాలపై ఏసీబీ విచారణ చేపడతున్నామని శాసన మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడంతో ఇక ఇప్పట్లో కారుణ్య నియమకాలు ఉండవనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక మూడు మెడికల్‌ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్నఉద్యోగాలు ఊడపీకే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో ఇప్పటివరకు సుమారు 17వేల మంది కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందారు.

    18 ఏళ్ల క్రితం కారుణ్యం

    సింగరేణిలో 18ఏళ్ల క్రితం కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం 2018 మార్చి 09న మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల కాగా ఏప్రిల్‌లో మెడికల్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్లపాటు రెగ్యులర్‌గా మెడికల్‌ బోర్డు కొనసాగింది. గతేడాది మార్చిలో ఈప్రక్రియ నిలిచిపోయింది.

    చిక్కులన్నీ అధిగమిస్తామని మంత్రులు

    అయినా, బాధితుల్లో తొలగని అనుమానాలు

  • తంగళ్లపల్లి(సిరిసిల్ల): వృద్ధాప్య భారం, నడుము నొప్పితో బాధపడుతూ ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని చింతలఠాన గ్రామానికి చెందిన బొడ్డు ముత్తవ్వ (79) కొంతకాలంగా తీవ్ర నడుము నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కుమార్తె బొడ్డు రాజమ్మ గమనించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్ల ఆసుపత్రికి రాత్రి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    కేన్సర్‌ బాధ భరించలేక..

    తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేన్సర్‌, ఇతర అనారోగ్య సమస్యలు భరించలేక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన ముదాం భాగ్యవ్వ (59) కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం వేకువజామున తన ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగు పొరుగువారు గమనించి సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో ఉంటున్న ఆమె కుమార్తె విజయకు సమాచారం అందించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • జమ్మికుంట(హుజూరాబాద్‌): అక్రమార్కులు మానేరువాగు నుంచి అక్రమంగా ఇసుక తరలించి మండలంలోని విలాసాగర్‌ గ్రామంలో డంపులు ఏ ర్పాటు చేసుకోగా, కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను మంగళవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ భాస్కర్‌ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. విలాసాగర్‌ గ్రామానికి చెందిన 15 మంది వేలంలో పాల్గొనగా ముంజల చక్రపాణి 120 ట్రాక్టర్‌ టిప్పులకు రూ.6,04,000 పాటతో దక్కించుకున్నారు. ఆర్‌ఐ శంకర్‌, సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

  • ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామంలో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను మూసివేశారు. దీంతో గ్రామంలోని విద్యార్థులు తంగళ్ళపల్లిలోని ప్రైవేటు స్కూలుకు బస్సులో వెళ్తుండేవారు. ఈనేపథ్యంలో సర్పంచ్‌ చింతమడక కళ్యాణ్‌, ఉపసర్పంచ్‌ చిక్కుడు సత్యం, గ్రామస్తులు కలిసి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులను గ్రామంలోకి రానివ్వలేదు. మంగళవారం తమ గ్రామంలోని 12 మంది విద్యార్థులను తమ ఊరు పక్కనే ఉన్న రామాజీపేట ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. తమ గ్రామంలోని పాఠశాలను తెరిపించాలని జిల్లా విద్యాధికారిని సర్పంచ్‌ కోరగా, కొంత సమయం తర్వాత ప్రారంభిస్తామని తెలిపినట్లు సర్పంచ్‌ వివరించా రు. తమ గ్రామం నుంచి విద్యార్థులను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాజీపేటకు తీసుకెళ్లేందుకు వ్యాన్‌ పంపిస్తామని, ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హెచ్‌ఎం తెలిపారని సర్పంచ్‌ వెల్లడించారు.

Mancherial

  • ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్‌ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్‌ డైరెక్టర్‌ రాథోడ్‌ జైసింగ్‌, డీసీహెచ్‌ఎస్‌ డా.ఉపేందర్‌ జాదవ్‌, రిమ్స్‌ పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.వంశీకృష్ణ, నర్సింగ్‌ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

  • కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్‌ డిపో సేల్స్‌మెన్‌ చహకటి రాజేశ్వర్‌ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్‌ను బైక్‌పై ఎక్కించుకుని ఆసిఫాబాద్‌కు బయలుదేరాడు. మానిక్‌గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్‌కు స్వల్పంగా రాజేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్‌ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్‌ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • ఆదిలాబాద్‌:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్‌ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్‌ ఆఫ్‌ డిసిగ్నేషన్‌ డ్యూటీస్‌ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్‌ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

    అయినవారికి అందలం..

    సాధారణంగా స్టాఫ్‌ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్‌ ఉద్యోగులకు అవుట్‌ ఆఫ్‌ డిసిగ్నేషన్‌ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్‌ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది.

    ఓడీలతో పెరుగుతున్న డీడీలు..

    అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్‌ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్‌ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు.

    రీజియన్‌ పరిధిలోని ఉద్యోగులు

    డిపో డ్రైవర్లు కండక్టర్లు

    ఆదిలాబాద్‌ 129 204

    ఆసిఫాబాద్‌ 90 111

    భైంసా 33 128

    మంచిర్యాల 149 162

    నిర్మల్‌ 138 204

    ఉట్నూర్‌ 39 46

    మొత్తం 578 855

    వేధిస్తున్న సిబ్బంది కొరత..

    ఆదిలాబాద్‌ రీజీయన్‌ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్‌ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

  • కడెం: నిర్మల్‌–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండెపల్లి, హాజీపూర్‌, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    సమస్యకు చెక్‌

    కడెం ప్రాజెక్ట్‌ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్‌రాక్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు.

    ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

    కడెం ప్రాజెక్ట్‌ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్‌కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్‌ డేంజర్‌జోన్‌లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్‌ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నారు.

    ఈ నెలాఖరుకు పూర్తి

    కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం.

    – వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్‌

  • ఉట్నూర్‌రూరల్‌: ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

    దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్‌

    కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్‌, అతని స్నేహితులు మందమర్రి టోల్‌గేట్‌ సమీపంలోని గోపాల్‌ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్‌ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్‌, అల్లంల ప్రశాంత్‌, బొ మ్మనవేణి వరప్రసాద్‌, ఆకుల రాణాప్రతాప్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్‌ అబ్బు, మహమ్మద్‌ సమీరుద్దీన్‌, అఖిల్‌, మల్యాల చందు, షేక్‌ ఫేరోజ్‌ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆసిఫాబాద్‌ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

    గుప్తనిధులకోసం తవ్వకాలు

    కాగజ్‌నగర్‌రూరల్‌: మండలంలోని ఈజ్‌గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్‌తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌గా రమేశ్‌

    మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్‌ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్‌ తెలిపారు. కాగా రమేశ్‌ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్‌కౌన్సిల్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

  • తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్‌రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్‌, రామయ్య, ప్రమోద్‌, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్‌ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు.

    అనుమానాస్పదంగా ఒకరు..

    తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్‌, సీఐ రవీందర్‌ నాయక్‌, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్‌తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    రోడ్డు ప్రమాదంలో ఒకరు..

    దిలావర్‌పూర్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్‌కు చెందిన ఉప్పల గణేశ్‌ (57)కు దిలావర్‌పూర్‌లోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్‌ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్‌ వాహనంపై వెళ్తుండగా నిర్మల్‌–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు.

    యువతి అదృశ్యం

    సిర్పూర్‌(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్‌ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్‌ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్‌(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో రాంపూర్‌, మైసంపేట్‌ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్‌, మైసంపేట్‌ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్‌డీవో శివకుమార్‌ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్‌ ఖాజా మొయినుద్దీన్‌, ఎఫ్‌ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్‌, ఎస్సైలు సాయికిరణ్‌, సాయికుమార్‌, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

    అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు

    కడెం: మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్‌ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్‌, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.

  • జన్నారం: పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న ఆ యువకుడిని బైక్‌ రూపంలో మృత్యువు కబళించింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం చింతగూడకు చెందిన గుండ మల్లేశ్‌, సుజాత దంపతుల కుమారుడు రాకేష్‌ (22) హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తూ బండ్లగూడలో ఉంటున్నాడు. మంగళవారం అతని పుట్టినరోజు కావడంతో కేక్‌ కట్‌చేద్దామని నార్సింగ్‌లో ఉన్న అతని స్నేహితులు పిలవడంతో సోమవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. యువకుడి మరణంతో చింతగూడలో విషాదం చోటు చేసుకుంది.

  • సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీ యం వేడెక్కింది. జిల్లాలో కొద్ది రోజులుగా బొగ్గు గ నులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖు లు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట గనుల ను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్‌తో పా టు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తె లుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవి త హెచ్‌ఎంఎస్‌కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మి క లోకానికి దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ తోపాటు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నా రు. గతంలో కవిత టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్క డి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు.

    డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్‌

    ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొ న్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకా లంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూ టీ సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రే మ్‌సాగర్‌రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టుపై ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు.

    రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారు

    స్వతంత్ర ప్రతిపత్తిగల సింగరేణి కంపెనీలో మితి

    మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్‌ కేటాయింపు నుంచి డిప్యుటేషన్‌, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్‌బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్‌ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్‌, భూ గర్భగనుల్లో నష్టాలు, ఓపెన్‌కాస్టుల్లో ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీ య జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్ర తిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇ చ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీ లు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.

    సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మా యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్‌ థర్మల్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్‌ బెల్ట్‌ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్‌మీ ట్‌ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

  • భీమిని: ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో చంద్రయ్య సూచించా రు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ, జిల్లా పరిషత్‌ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీలో చేపట్టిన భోజ నశాల పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌కు మరమ్మతు చేయించాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిష త్‌ పాఠశాలలో బూత్‌ స్థాయి అధికారులు, ఏ జెంట్లకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై నిర్వహిస్తున్న శిక్షణకు హాజరై పలు సూచనలు చేశారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్‌ పాఠశాలకు మంజూరైన మూత్రశాలలు త్వరగా నిర్మించాలని ఆదేశించారు. ఎంపీడీవో గంగమోహన్‌, తహసీల్దార్‌ బికర్ణదాస్‌, ఎంఈవో వెంకటస్వామి, ఎంపీవో మహేశ్‌, సర్పంచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులున్నారు.

  • చెన్నూర్‌: చెన్నూర్‌ కోర్టు పరిధిలోని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలని చెన్నూర్‌ మున్సిఫ్‌ కోర్టు సివిల్‌ జడ్జి రవి సూచించారు. స్థానిక కోర్టు సమావేశ మందిరంలో ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ కేసుల ప రిష్కారమే లక్ష్యంగా న్యాయవాదులతో ఏర్పా టు చేసిన సమావేశంలో జడ్జి మాట్లాడారు. కక్షిదారులు రాజీపడేలా న్యాయవాదులు చొర వ చూపాలని సూచించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొలిపాక రవీందర్‌, సీనియర్‌ న్యాయవాదులు రమేశ్‌చందర్‌గిల్డా, మల్లేశంగౌడ్‌, న్యాయవాదులు కాయిత మహేశ్‌, మద్ది కార్తిక్‌, సంజీవ్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

  • మంచిర్యాలటౌన్‌: డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ న రేందర్‌ రాథోడ్‌ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో నరేందర్‌ రా థోడ్‌ను వైద్యులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ అనిల్‌, సూపరింటెండెంట్‌ విశ్వేశ్వర్‌రెడ్డి, డీపీవో ప్రశాంతి, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అధికారి మహ్మద్‌ రషీద్‌, అల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌, కాకినాడ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

  • మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కష్టాలు తీరనున్నాయి. డివిజన్‌కో కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబా టులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రణాళిక రూపొందించారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పడ్డాక విలీనమైన న స్పూరు మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలోని ఎనిమిది గ్రామాలను కలుపుకొని మొత్తం 60 డివి జన్లుగా మారింది. పరిధి పెరగడం, డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకోలేని పరి స్థితి నెలకొంది. దీంతో ప్రజలకు పాలన సౌలభ్యంగా ఉండాలని ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంతో ప్రతీ డివిజన్‌కు ఒక కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇప్పటికే విలీన గ్రామాల్లో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయాలు, నస్పూరు మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి క్వార్టర్లు, భవనాలను డివిజన్‌ కార్యాలయాలుగా వినియోగించుకుంటుండగా, కొత్తగా 45 కొత్త కార్యాలయాలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.1.40 కోట్లు కేటాయిస్తూ రెండు నెలల క్రితం పాలకవర్గం తీర్మానం చేసి ఆమోదించింది. ఇటీవలే టెండర్‌ ప్రక్రియ పూర్తికావడంతో పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, కమిషనర్‌ అన్వేశ్‌ ఈ నెల 13న శంకుస్థాపన చేశారు. ఆగస్టు 30లోపు డివిజన్‌ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించగా, పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

    ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేలా..

    ఎమ్మెల్యే ఆదేశాలతో డివిజన్‌ కార్యాలయాలు నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డు ఆఫీసర్లుగా 54మంది పనిచేస్తుండగా మరో ఆరుగురు అవసరముంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు డివిజన్లకు పక్కనే ఉన్న డివిజన్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్‌లో కార్యాలయాలు లేకపోవడంతో వార్డు ఆఫీసర్లు కూడా ఎప్పుడు కాలనీకి వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతోనే ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. దీంతో కార్యాలయం నిత్యం రద్దీగా మారుతుండడం, ప్రజలకు దూరభారంతో పాటు సమయం వృథా అవుతుండడం ఇబ్బందిగా మారుతోంది. డివిజన్‌ కార్యాలయాలు అందుబాటులోకి వస్తే ఇక ప్రజలు ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో ఉండే వార్డు ఆఫీసర్‌ లేదా కార్పొరేటర్‌కు నేరుగా వివరించే అవకాశముంటుంది. ప్రజల సమస్యలపై వచ్చిన వినతులను వెంటనే మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయానికి పంపించి రెండుమూడ్రోజుల్లోపే పరిష్కరించేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు కాలనీల్లో ఎక్కువగా ఉండగా వాటి పరిష్కారం కోసం అధికారులు చర్యలు వెంటనే తీసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.

  • 7

    ‘కడెం’కు రక్షణగా ట్రాష్‌ రాక్‌

    ‘కడెం’ ప్రధాన కాలువకు రక్షణగా ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తుండగా రూ.2.58కోట్లతో చేపట్టిన పనులు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు.

    అస్మదీయులకు ఓడీ..

    ఆర్టీసీలో సిబ్బంది కొరతతో అధికారులు ఉన్నవారితోనే డబుల్‌ డ్యూటీ చేయిస్తున్నారు. కాగా, కొందరు అవుట్‌ ఆఫ్‌ డిసిగ్నేషన్‌ డ్యూటీలు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

    ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురుస్తుంది.

  • కాసిపేట(బెల్లంపల్లి): సురక్షిత ప్రయాణం, మత్తురహిత సమాజమే లక్ష్యంగా కృషి చేద్దామని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం బెల్లంపల్లి డివిజన్‌ తాళ్లగురిజాల గ్రామంలో బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి యువతకు అరైవ్‌–అలైవ్‌ ద్వారా అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫి క్‌ నిబంధనలు, హెల్మెట్‌, సీటు బెల్ట్‌ వినియోగం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే దు ష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఆర్మీ, పోలీస్‌ శాఖల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులు ఉత్సాహంగా పుష్‌–అప్స్‌ ప్రదర్శించగా వారి ప్రతిభను అభినందించారు. ఓ యువకుడిని సీపీ సన్మానించి రూ.500 నగదు బహుమతి అందజేశారు. బెల్లంపల్లి డీసీపీ భాస్కర్‌, ఏసీపీ కిరణ్‌కుమార్‌, సీఐ హనుక్‌, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

    ప్రజలకు అందుబాటులో ఉండాలి

    పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సూచించారు. బెల్లంపల్లి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్‌ కేసులు, దర్యాప్తు వివరాల గురించి సీఐ హనుక్‌ను అడిగి తెలుసుకున్నారు. సర్కిల్‌ పరిధిలో రోజువారీగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులు పరిశీలించి, పెండింగ్‌ కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తునకు సంబంధించి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గ్రేవ్‌ కేసుల్లో జాప్యం లేకుండా నిందితులను త్వరగా అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరచాలని సూచించారు. విచారణ, దర్యాప్తు సమయంలో భౌతిక సాక్ష్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను వినియోగించాలని తెలిపారు. నేరాల నియంత్రణ, దొంగతనాల నిర్మూలనకు అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే తనిఖీలు చేపట్టాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పెట్రోలింగ్‌ నిర్వహించాలని, డ్రండెన్‌డ్రైవ్‌ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భద్రత, భరోసా కల్పించేలా పోలీస్‌ వ్యవస్థ పనిచేయాలని తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి మొక్కలు నాటారు. డీసీపీ భాస్కర్‌, రూరల్‌ సీఐ హనుక్‌, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

  • శ్రీరాంపూర్‌: సింగరేణిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె ఆర్కే 7గని, ఏరియా స్టోర్స్‌లను సందర్శించారు. హెచ్‌ఎమ్మెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అ హ్మద్‌తో కలిసి కార్మికుల సమస్యలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ గనుల్లో కార్మికులకు గాలి అందక ఇబ్బంది పడుతున్నారని, తాగునీరు కూడా దొరకడం లేదని అన్నా రు. కంపెనీలోని కార్మికుల పిల్లల చదువుల కోసం సీబీఎస్‌ఈ పాఠశాలలు ఏర్పాటు చేయాలని తెలిపా రు. 2 వేల మంది డిపెండెంట్లు ఉంటే కేవలం 335 మందికే భట్టి విక్రమార్క లెటర్లు ఇచ్చారని, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొత్త గనులు లేవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

    అన్నలంతా మా దగ్గరే ఉన్నారు..

    గతంలో అన్నలు ఉన్నప్పుడు కంపెనీ అధికారులు భయపడి చక్కగా పని చేసేవారని, ఇప్పుడు వారు లేరనుకుంటున్నారని, కానీ వారంతా టీఆర్‌ఎస్‌లో ఉన్నారని, కార్మికుల హక్కుల ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. గనిలోకి రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని, తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ పిల్ల కాంగ్రెస్‌ మాకో లెక్కా అని మండిపడ్డారు.

    గేటు వద్ద ఉద్రిక్తత

    ఆర్కే 7, ఏరియా వర్క్‌షాప్‌ వద్ద కవిత కాన్వయ్‌ను గనిలోకి రాకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లకు తాళాలు వేయడంలో కార్యకర్తలు పగలగొట్టి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్‌ బ స్టాండ్‌, సీసీసీలో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం సీసీసీలోని డంప్‌యార్డును పరిశీలించి దాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, బ్రాంచీ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, కార్యదర్శి పీ. అశో క్‌, జిల్లా జిల్లా ఇన్‌చార్జీ చంద్రమోహన్‌గౌడ్‌, ఐత ప్ర శాంత్‌, నాయకులు గోసిక అశోక్‌, సుదర్శన్‌, చెవుల శ్రీను, వినయ్‌, వరలక్ష్మీ, సురేశ్‌ పాల్గొన్నారు.

  • మంచిర్యాలఅగ్రిల్చర్‌: వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్‌ కిషన్‌ జాద వ్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, వివిధ శాఖల అధి కారులు, మున్సిపాలిటీల కమిషనర్లతో వన మహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. శాఖలవారీగా కేటాయించి న లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టా లని సూచించారు. ఈ నెల 18న సీఎం రేవంత్‌రెడ్డి వన మహోత్సవాన్ని ప్రారంభిస్తారని, ఇదేరోజు జి ల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 41లక్షల మొ క్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రహదారుల పక్కన పెద్ద మొక్కలు నాటి జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి రోజువారీగా వివరాలు నవీకరించాలని వివరించారు. మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని, వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.

    అధికారులు అందుబాటులో ఉండాలి

    అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, జెడ్పీ సీఈ వో గణపతితో కలిసి గ్రామాలాభివృద్ధి ప్రణాళికపై డీఎల్పీవో, ఎంపీవో, జీపీవోలతో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామపంచాయతీలు, సభ నగర్‌, నిర్ణయ్‌ యాప్‌, ఈ గ్రామ స్వరాజ్‌ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అత్యుత్తమ ర్యాంకింగ్‌ వచ్చేలా గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విధులకు సకా లంలో హాజరు కావాలని, తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలసుకోవాలని, పన్నులు సకాలంలో వసూలు చేయాలని, అంటువ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీజీజీ కన్సల్టెంట్‌ మహేశ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

  • మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): యూరియా బుకింగ్‌ యాప్‌ వినియోగంపై మంగళవారం మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేంద్రమోహన్‌, వ్య వసాయశాఖ డైరెక్టర్‌ గోపి వీసీలో పాల్గొనగా జిల్లా నుంచి జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, ఏడీఏ మామిడి కృష్ణ, రైతు ఉత్పత్తిదారుల సంఘం డైరెక్ట ర్‌ పూస్కూరి శ్రీనివాసరావు, సీఏసీఎస్‌ సీఈవో వినయ్‌, ఏవో కృష్ణ, ఏఈవో మధుపా, కృషి సఖీ స్వప్న, జాతీయ సహజ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. యూరియా బుకింగ్‌ యాప్‌ వినియోగంలో రైతులు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంద ని, ప్రస్తుతం అందరి సహకారంతో యాప్‌లో యూ రియా బుకింగ్‌ చేసుకుంటున్నారని, దీంతో సమ యం కూడా ఆదా అవుతోందని మంత్రితో సేంద్రియ రైతులు పూస్కూరి శ్రీనివాసరావు, తిప్పని కుమార్‌ తెలిపారు. డీలర్ల వద్ద ఎలాంటి వరుస లేకపోవడంతో యూరియా కొనుగోళ్లు సులభతరంగా మారాయని తెలిపారు. అయితే, యాప్‌లో బుకింగ్‌ పై అవగాహన లేని రైతులకు మీ సేవా కేంద్రం ద్వా రా బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించాలని కోరా రు. జీలుగ, జనుము, పచ్చిరొట్టతో యూరియా వి నియోగం చాలా వరకు తగ్గిందని, రైతు ఉత్పత్తిదా రుల సంఘం ద్వారా 125 మంది రైతులు సహజ వ్యవసాయం చేస్తుండగా చాలా వరకు రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా చూస్తున్నామ ని ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందిస్తూ సేంద్రియ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.

  • మంచిర్యాలఅర్బన్‌: సర్కారు పాఠశాలల్లో విద్యార్థు ల హాజరు ఆశించిన స్థాయిలో నమోదు కావడం లే దు. రెండోరోజు మంగళవారం కారణంతో హాజరు అంతంతేగానే ఉంది. కాగా, మొదటిరోజు కంటే కాస్త పెరిగింది. మొదటిరోజు అమావాస్య కావడంతో 13శాతం హాజరు నమోదు కాగా, రెండోరోజు 24.5 శాతానికి పెరిగింది. ఈనెల 15న జిల్లా వ్యా ప్తంగా 34,192 మందికి గాను 4,369 మంది విద్యార్థులు హాజరు కాగా, మంగళవారం 8,184 మంది బడికి వచ్చారు. కొన్నిచోట్ల పాఠశాలలు సమయాని కి డేటాను అప్‌డేట్‌ చేయకపోవటం హాజరు తక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రైవేట్‌ పా ఠశాలలు కొన్ని తెరుచుకోకపోవటంతో గమన్హారం.

    జిల్లాకేంద్రంలో ఇలా..

    జిల్లాకేంద్రంలో 21 ప్రైమరీ, ఒక అప్పర్‌ ప్రైమరీ, ఆరు హైస్కూళ్లు, ఒక కేజీబీవీ, ఒక మోడల్‌స్కూల్‌ ఉండగా మొత్తం 3,613 మంది విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట ఫలితంగా మొదటిరోజు 49 మంది, మంగళవారం 84మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు పొందారు. దీంతో విద్యార్థుల సంఖ్య 3,697కు చేరింది. పాఠశాలలకు మొదటిరోజు 552 మంది మాత్రమే రాగా, మంగళవారం 732 మంది హాజరయ్యారు. రెండురోజుల వ్యవధిలో విద్యార్థుల సంఖ్య 180 పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన ‘బడిబాట’లో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

Jagtial

  • మెట్‌పల్లి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల్లో కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు బరి తెగిస్తున్నారు. డబ్బుల కోసం నకిలీ పత్రాలు సృష్టిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భారీగా అవినీతి జరుగుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌, స్లాట్‌ బుకింగ్‌ వంటి విధానాలను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల ప్రజలు రైటర్లతో నిమిత్తం లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కానీ ఆన్‌లైన్‌ విధానంపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది రైటర్లనే ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధిక సంపాదన కోసం వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్‌పల్లిలో బయటపడిన రాకేశ్‌ అనే డాక్యుమెంట్‌ రైటర్‌ వ్యవహారమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

    అక్రమాలు అనేకం..

    ఆ ఉద్యోగి పాత్రపై పోలీసుల ఆరా

    నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం

    ఎనిమిది గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం. అలాగే డాక్యుమెంట్‌ రైటర్‌ రాకేశ్‌ ఏర్పాటు చేసుకున్న షెడ్డు మా కార్యాలయం పరిధిలో లేదు. అతడు ఇతరుల ప్రైవేట్‌ స్థలంలో ఏర్పాటు చేసుకున్నాడు. దాని విషయంలో మేం జోక్యం చేసుకోలేం.

    – వెంకటేశ్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, మెట్‌పల్లి

    ఇది మెట్‌పల్లి పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం. కార్యాలయంలోకి ప్రవేశించే చోట కుడి వైపు కనిపిస్తున్నది పాకాల రాకేశ్‌ అనే డాక్యుమెంట్‌ రైటర్‌ ఏర్పాటు చేసుకున్న షెడ్డు. ఇక్కడ కొంతకాలంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడు. స్థానిక తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు నకిలీప్రతాలు సృష్టించి.. తద్వారా ఓ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో పోలీసులు రెండురోజుల క్రితం అరెస్ట్‌ చేసిన నలుగురిలో ఈ రాకేశ్‌ ఒకడు. నిబంధనల ప్రకారం.. రైటర్లను కార్యాలయంలోకి అనుమతించకూడదు. కానీ రాకేశ్‌ ఏకంగా కార్యాలయం ఆవరణలోనే దర్జాగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అఽధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

  • ● భూముల లెక్కలు పక్కాగా.. ● క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం ● డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి..

    జగిత్యాల: నక్ష.. గ్రామీణ ప్రాంతాల్లో అతి ముఖ్యమైంది. భూములకు హద్దులు, దారులు, ఇతరత్రాకు నక్ష ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లోనూ భూముల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఇటీవల నక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సాగు భూములక మాత్రమే ఉండే నక్ష పట్టణాల్లోనూ పటాలను రూపకల్పన చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలు ఎంపికకాగా.. అందులో జగిత్యాల కూడా ఒకటి. సర్వే ఆఫ్‌ ఇండియా, మున్సిపాలిటీ, భూమి కొలతలు, దస్త్రాల నిర్వహణ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొదట హెలికాప్టర్‌, డ్రోన్ల ద్వారా పట్టణం మొత్తం వ్యూ చిత్రీకరించారు. ప్రస్తుతం సర్వేయర్ల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించే పనులు మొదలయ్యాయి. ఇది పూర్తయ్యాక ఆర్వోఆర్‌ పట్టా ఇవ్వనున్నారు.

    డ్రోన్లతో చిత్రీకరణ పూర్తి

    జగిత్యాల మున్సిపాలిటీలోని అన్ని భవనాలను డ్రోన్లతో చిత్రీకరించారు. ప్రస్తుతం గ్రౌండ్‌ట్రూతింగ్‌ పనులను సర్వేయర్లు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రతి భవనం, ఆస్తులను కొలతలు చేయడంతో పాటు, వాటికి బౌండరీలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రతి ఒక్క ఆస్తిని అక్షాంశాలు, రేఖాంశాలతో హద్దులు గుర్తించి సంబంధిత ఆస్తులకు ఆర్వోఆర్‌లో చేర్చి గుర్తింపు కార్డులు అందించనున్నారు. వీటితో పాటు, ప్రభుత్వ స్థలాలైన చెరువులు, ఆలయాలకు సంబంధించిన భూములను పొందుపర్చనున్నారు. తద్వారా వాటిని ఎవరూ కబ్జా చేసే అవకాశం ఉండదు. ఈ నక్షతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా ఎంతో ఉపయోగపడతాయి.

    విస్తరిస్తున్న పట్టణం

    జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, జగిత్యాల ల్యాండ్‌రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు పంపించగా.. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జగిత్యాల ఎంపికవడంతో మేలు జరగనుంది. పైగా ఆక్రమణలకు అడ్డుకట్ట వేయవచ్చు. భూముల లెక్కలు పక్కాగా ఉండేందుకు నక్షలు ఆధారంగా ఉంటాయి.

    50 వార్డులు.. లక్షకు పైగా జనాభా

    జిల్లా కేంద్రమైన జగిత్యాల ఇక నుంచి నక్షతో కూడిన పట్టణంగా ఏర్పాటు కానుంది. ఇక్కడ ఎలాంటి కబ్జాలకు పాల్పడకుండా ఉంటుంది. మున్సిపాలిటీలో 50 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంది. దాదాపు 35 వేలకు పైగా గృహాలుంటాయి. వీటన్నింటిని డ్రోన్ల ద్వారా చిత్రీకరించి పట్టణ మ్యాప్‌ రూపొందించారు.

    గ్రామాల విలీనంతో..

    జగిత్యాల.. జిల్లాకేంద్రం కావడం, చుట్టూ 6 కిలో మీటర్ల మేర విస్తరించడం.. ఇటీవల కొన్ని గ్రామాలు బల్దియాలో విలీనం అయ్యాయి. దీంతోపాటు అక్రమాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో భూముల రక్షణ కోసం నక్ష ఏర్పాటు చేస్తున్నారు. నక్ష ద్వారా సమగ్ర సర్వే చేపట్టి భూములకు రక్షణ కల్పించనున్నారు. ఇది ప్రజల సొంత భూములతోపాటు, ప్రభుత్వ స్థలాల

    పరిరక్షణకు ఎంతో ఉపయోగపడనుంది.

  • మల్లాపూర్‌: కలిసికట్టుగా నడిచారు. మూతబడిన పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి పునర్జీవం పోశారు. మండలంలోని వెంకట్రావ్‌పేట ప్రాథమిక పాఠశాలను మూడేళ్ల క్రితం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేశారు. సర్పంచ్‌ వెంకటేశ్‌, పంచాయతీ పాలకవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై బడి పునఃప్రారంభ ఆవశ్యకతను వివరించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై రప్పించారు. బడిబాటలో 22మందిని చేర్పించారు. మంగళవారం ఎంఈవో కేతిరి దామోదర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంతడపుల పుష్పలతతో కలిసి పాఠశాలను పునఃప్రారంభించారు.

    రాజరాంపల్లితండా పాఠశాల..

    పెగడపల్లి: పెగడపల్లి మండలంలోని రాజరాంపల్లితండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేని కారణంగా నాలుగేళ్ల క్రితం మూతబడింది. సర్పంచ్‌ ఇస్లావత్‌ రమేశ్‌ నాయక్‌ చొరవ చూపి పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయులను రప్పించారు. కొందరు విద్యార్థులు పాఠశాలలో చేరగా ఆ పాఠశాలను మంగళవారం అధికారులు ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పెన్నులు అందించారు. ఏఎంసీ చైర్మన్‌ రాములుగౌడ్‌, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్‌, తహసీల్దార్‌ నిజామొద్దీన్‌, ఎంఈవో సులోచన, ఆర్‌ఐ జమున, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

    వానాకాలం ప్రారంభమైందంటే ఉమ్మడి కరీంనగర్‌లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరి స్థితుల నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో వ్యవసాయశాఖ అధికారులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొ న్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరి ప్రధాన పంటగా మారింది. యాసంగిలో రాష్ట్రం రికార్డుస్థాయిలో వరి ఉత్పత్తి సాధించగా.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అధికంగా సాగైంది. ప్రస్తుత వానాకాలంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజ న్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే వరిసాగు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, నారుమడులు వేయడంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు.

    స్వల్పకాలిక వరి రకాలపై కానరాని ఆసక్తి

    వర్షాభావ సూచనలు, నీటి లభ్యతపై అనిశ్చితి, సాగు ఖర్చుల పెరుగుదలతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం మేలని చెబుతున్నారు. వరివేస్తే 120రోజుల్లోపు పండే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచా రం చేస్తున్నప్పటికీ రైతుల్లో ఆశించిన స్పందన కని పించడం లేదు. అధిక దిగుబడి ఆశతో చాలా మంది దీర్ఘకాలిక వరి రకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    భూగర్భ జలాల్లో క్షీణత

    అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా లోటు వర్షపాతం నమోదైతే.. ఆ ప్రభావం తప్పకుండా భూగర్భ జలాలపై ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పట్లో నీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఉమ్మడి జిల్లాకు సాగు, తాగు నీటికి ప్రాణాధారంగా భావించే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంతోపాటు ఎగువన కూడా లోటు వర్షపాతం నమోదైతే కాలువల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయే ప్రమాదముంది. వరద కాలువలు, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు సంతృప్తస్థాయిలో ఉంటాయి. కాలువల్లో నీరు తగ్గితే.. వీటి పరివాహక ప్రాంతాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పడిపోతాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    (లక్షల ఎకరాల్లో)

    ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో

    సాగు వివరాలు

  • ● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

    జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఇంటింటికీ సంక్షేమం.. అభివృద్ధి ప్రతి గ్రామంలో కొనసాగిందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 6 నుంచి 385 గ్రామాలు, 100కు పైగా మున్సిపల్‌ వార్డుల్లో సభలు నిర్వహించామని, పెండింగ్‌లో ఉన్న 10వేల దరఖాస్తులను పరిష్కరించామని, సీజనల్‌ వ్యాధులు, క్షయ, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పోలీస్‌ శాఖ సమన్వయంతో అరైవ్‌ అలైవ్‌, రహదారి భద్రత చేపట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ, 1500 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేశామన్నారు. మత్తు పదార్థాఆల నివారణపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. 45 రోజుల్లో 85,616 మంది రైతుల నుంచి 5,19,156 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,233 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించామన్నారు. కేంద్రీయ విద్యాలయంతోపాటు, యంగ్‌ ఇండియా స్కూల్‌, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ముందడుగు పడిందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 18 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకొచ్చాయన్నారు. ఈ ఏడాది45 లక్షల మొక్కలు నాటి వచ్చే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.

    జగిత్యాలవాసికి దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం

    మల్యాల: ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లి.. అక్కడి తెలుగు ప్రజలకు సేవలందిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న జగిత్యాలవాసి గుర్రాల నాగరాజుకు అక్కడ వింటర్‌ హీరోగా గౌరవం లభించింది. దక్షిణాఫ్రికాలోని హాల్‌ సంస్థ సామాజిక సేవలో సేవలందిస్తున్న ఎనిమిది మందిని ఎంపిక చేయగా.. జగిత్యాలకు చెందిన నాగరాజు ఎంపికయ్యారు. నాగరాజు 18ఏళ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కరోనాకాలంలో వేలాదిమందికి ఆహారం అందించారు. నాగరాజును జిల్లాకు చెందిన పలువురు ఫోన్‌లో అభినందించారు.

    ఎల్లమ్మకు బోనాలు

    గొల్లపల్లి: మండలంలోని రాఘవపట్నంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు చేశారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సర్పంచ్‌ భవాని, గౌడ సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు తిరుపతి, మాజీ సర్పంచ్‌ తిరుపతి, మాజీ ఎంపీటీసీ రాజేందర్‌, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

  • ● పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు : ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ● సంస్కారం తెలియని ఎంపీ : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

    రాయికల్‌: మండలం ధర్మాజీపేటలో ఆయుష్మాన్‌ భారత్‌ ఆస్పత్రి ప్రారంభం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌గా మారింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఎంపీ, ఎమ్మెల్యే కలిసి ఆస్పత్రిని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఎంపీ రెండు గంటలపాటు ఆలస్యంగా చేరుకున్నారు. అంతసేపు ఎమ్మెల్యే నాయకులతో కలిసి వేచిచూశారు. ఎంపీ వచ్చాక ఆస్పత్రిని ప్రారంభించారు. అదే సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు జైశ్రీరామ్‌, భారత్‌మాతాకీ జై, జై ధర్మపురి అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు జైకాంగ్రెస్‌, జై సంజయన్న అంటూ నినదించారు. కొద్దిసేపటికి సభ ప్రాంగణానికి వచ్చిన ఎంపీ మూడు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు.

    పనికిమాలిన రాజకీయాలు చేయొద్దు

    కేంద్రం నిధులతోనే ఆస్పత్రిని ప్రారంభించామని, తన వద్ద పనికిమాలిన రాజకీయాలు చేయొద్దని, ఫ్లెక్సీలకయ్యే ఖర్చును ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని ఎంపీ అర్వింద్‌ అన్నారు. ఎక్కడా లేని విచిత్ర రాజకీయం జగిత్యాల నియోజకవర్గంలో ఉందని, ఏ పార్టీ నాయకుడు ఎందులో ఉంటారో ఎవరికీ తెలియదని అన్నారు.

    అర్వింద్‌ వ్యాఖ్యలు సరికాదు

    ఎంపీ రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశానని, తీరా వచ్చాక సభ మర్యాద లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. బీజేపీ నాయకులు నినాదాలు చేస్తే తమ కార్యకర్తలూ నినాదాలు ఇచ్చారని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజాసేవే ముఖ్యమని, ఎంపీ అర్వింధ్‌ కేంద్రం నిధులతో ఎన్ని ఆస్పత్రులు ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఇప్పటివరకు 14 పల్లె దవాఖానాలు మంజూరు చేయించానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ దినేశ్‌, ఆత్మ చైర్మన్‌ గంగారెడ్డి, సర్పంచ్‌ గంగారెడ్డి, డీఎంహెచ్‌వో సుజాత, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు.

  • కథలాపూర్‌: కథలాపూర్‌ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 55మంది విద్యార్థులే ఉన్నారు. బడికి జీవం పోయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు, గ్రామస్తులు సమావేశమై ఇంటింటా ప్రచారం చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య 110కి చేరింది. పాఠశాల పునఃప్రారంభమైనా.. కొందరు పిల్లలు రాకపోవడంతో సర్పంచ్‌ నాగం భూమయ్య, హెచ్‌ఎం సుధాకర్‌ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను బైక్‌లపై పాఠశాలకు తీసుకొచ్చారు. పిల్లలు పాఠశాలకు చేరుకునేలా ఆటో సౌకర్యం కల్పిస్తామని సర్పంచ్‌ భూమయ్య తెలిపారు.

Komaram Bheem

  • వాన లేక..

    దహెగాం: మృగశిర కార్తె ప్రవేశించి పది రోజులు కావొస్తున్నా నేటికీ జిల్లాలో భారీ వర్షాలు కురవలేదు. రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడానికి చేలు దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నా కనీసం మట్టిపెల్లలు కరగకపోవడంతో సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది జూన్‌ 15 నాటికి 51.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి ఇప్పటివరకు 70.7 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 43.5 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 38 శాతం లోటు ఉంది. సిర్పూర్‌(యు), కెరమెరి మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు కాగా, మిగతా 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

    4.50 లక్షల ఎకరాల్లో సాగు

    జిల్లావ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ప్రధానంగా 3.70 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో వరి సాగు ఉండనుంది. మిగతా 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయి. గతేడాది ఖరీఫ్‌ ఆరంభంలో మోస్తరు వర్షాలు కురవడంతో జూన్‌ మొదటి వారంలోనే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ట్రాక్టర్‌తో కల్టివేటర్‌ కొడుతుండగా, వర్షాలు లేని ప్రాంతాల్లో దుక్కులు దున్నుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పనులు చేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజూ మబ్బులతో గాలిదుమారం వీస్తోందే గానీ వర్షం మాత్రం పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    వరుణుడి కోసం

    గతేడాది మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురిశాయి. కానీ ఈసారి మే నెలలో ఆశించి న స్థాయిలో వర్షాలు పడలేదు. చిరుజల్లులకే విత్తనాలు విత్తితే నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తొలకరి వర్షాలకే విత్తనాలు విత్తగా, వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మాడిపోయి అన్నదాతలు నష్టాలను చవిచూశారు. ఒకటికి రెండుసార్లు విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. భూమి 2 నుంచి 3 ఫీట్ల లోతు వరకు తడిసిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    ఈ ఫొటోలో ట్రాక్టర్‌ పక్కన నిలబడ్డ రైతు పేరు రత్నం మధుకర్‌. ఈ సీజన్‌లో 20 ఎకరాల్లో పత్తి సాగు చేయడానికి భూమిని ట్రాక్టర్‌తో దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బొర్లకుంట శివారులో మోస్తరు వర్షం కురిసింది. దీంతో కల్టివేటర్‌ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు భారీ వర్షాలేవీ కురవలేదని, వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాడు. ఇలా.. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ రైతులు చేలు సిద్ధం చేసి భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

    చేతిలో మట్టిపెల్ల పట్టుకుని చూపిస్తున్న ఈ రైతు పేరు జాటోత్‌ గోపాల్‌. దహెగాం మండలం కల్వాడ గ్రామం. ఈ సీజన్‌లో సొంతంగా ఉన్న ఐదెకరాలే కాకుండా, మరో పదెకరాలను రూ.1.50 లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగుకు కౌలుకు తీసుకున్న భూమిని దుక్కి దున్నించినా సరైన వర్షం లేక ఇంకా మట్టిపెల్ల లు కూడా కరగలేదు. గతేడాది జూన్‌ 10 నాటికే వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టానని చెబుతున్నాడు.

  • కెరమెరి మండలం సుర్దాపూర్‌ గ్రామానికి చెందిన రైతు బామ్నె రాము 40 ఏళుగా సాగు చేస్తున్నాడు. ఆయనకు అటవీ ప్రాంతంలో వివాదాస్పద మూడెకరాల భూమి ఉంది. రెండు రోజుల క్రితం అటవీ అధికారులు సాగు పనులను అడ్డుకున్నారు. జీవనాధారమైన భూమిని లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెరమెరి రేంజ్‌ పరిధిలో 70 మంది గిరిజనేతర రైతులందరిదీ ఇదే పరిస్థితి..

    కెరమెరి: వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో జిల్లాలో సాగు భూముల లొల్లి మొదలైంది. అటవీశాఖ అధికారులు, పోడు రైతుల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అటవీ భూముల్లో ప్లాంటేషన్‌ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతుండగా, ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. కెరమెరి అటవీ రేంజ్‌ పరిధిలోని గోయగాం సెక్షన్‌ దేవుడ్‌పల్లి బీట్‌లో 450 హెక్టర్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉంది. ఇందులో 70 శాతం సాగులోనే ఉంది. ఇందులో 100 హెక్టార్ల(సుమారు 250 ఎకరాలు)ను ఆధీనంలోకి తీసుకుని ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూమిపై ఆధారపడి కెరమెరి మండలం సుర్దాపూర్‌, ధనోరా, సావర్‌ఖేడా గ్రామాలకు చెందిన సమారు 70 మంది గిరిజనేతర రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

    టైగర్‌ కారిడార్‌ ప్రాంతం

    కెరమెరి మండలం దేవుడ్‌పల్లిలోని 67 కంపార్ట్‌మెంట్‌ అంతా టైగర్‌ కారిడార్‌ పరిధిలోకి వస్తుంది. గతేడాది పెద్దపులి సంచరించగా, చిరుత, ఇతర వన్యప్రాణుల కదలికలు కూడా ఉన్నాయి. తడోబా ప్రాంతానికి కనెక్టివిటీ ఉండటంతో పెద్దపులుల రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016 లో కూడా రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. విత్తనాలు వేసే సమయంలో సాగు పనులను అడ్డుకున్నారు. రైతులు అప్పటి అటవీ శాఖ మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. మళ్లీ ఇప్పుడు అధికారుల చర్యలతో వివాదం తెరపైకి వచ్చింది.

    భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్టువే..

    దేవుడ్‌పల్లి బీట్‌ పరిధిలో గిరిజనేతర రైతులు సాగు చేస్తున్న భూములన్నీ రిజర్వ్‌ ఫారెస్టుకు చెందినవి.. రైతులకు ఎలాంటి పట్టాలు లేవు. గిరిజనులై ఉండి, అటవీ హక్కు పట్టాలు ఉంటే సాగు చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం.

    – మజారొద్దీన్‌, ఎఫ్‌ఆర్వో, కెరమెరి

    ప్రత్యామ్నాయం చూపాలి

    25 ఏళ్లుగా ధనోరా సమీపంలో నాలుగెకరాల భూమి సాగు చేస్తున్నా. ఏటా వడ్డీలకు అప్పులు తెచ్చి పంట లు పండిస్తూ బతుకుతు న్నా. అధికారులు ఈ భూమిని లాక్కుంటే ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి అందించి ఆదుకోవాలి. – షేక్‌ ఫరూక్‌, రైతు, ధనోరా

    ఇరువర్గాల మధ్య వాగ్వాదం

    స్థానిక ఎఫ్‌ఆర్‌వో మజారొద్దీన్‌ సిబ్బందితో కలిసి సోమవారం ధనోరా, సుర్దాపూర్‌ గ్రామాల మధ్య సాగు చేస్తున్న భూములోకి వెళ్లారు. రైతులు మూకుమ్మడి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంత నచ్చజెప్పినా రైతులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం వెళ్లినా రైతులు అడ్డుకున్నారు. సాగు భూముల్లోకి వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా దారి మధ్యలో రాళ్లు వేశారు. ఓ దశలో సహనం కోల్పోయి రాళ్లదాడికి ప్రయత్నించగా, వాంకిడి సీఐ వేణుగోపాల్‌, కెరమెరి ఎస్సై సుధాకర్‌ ఘటనాస్థలికి చేరుకుని రైతులను సముదాయించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.

  • సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బొగ్గు గనులపై రాజకీయం వేడెక్కింది. కొద్ది రోజులుగా బొగ్గు గనులు కేంద్రంగా కార్మిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు పర్యటిస్తున్న క్రమంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం పెరుగుతోంది. రెండురోజులుగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘బాయి బాట’ పేరిట జిల్లాలోని బొగ్గు గనులను సందర్శిస్తున్నారు. కాసిపేట, శ్రీరాంపూర్‌తో పాటు స్థానిక కార్మికులను కలుస్తూ పలు సమస్యలు తెలుసుకుంటున్నారు. కార్మికుల వసతుల నుంచి సంస్థ విధానాలపై తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కవిత హెచ్‌ఎంఎస్‌కు గౌరవాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ‘బాయి బాట’తో కార్మిక లోకానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కవిత టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా పనిచేయగా, తాజాగా కొత్త రాజకీయ పార్టీతో ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు.

    డిప్యూటీ సీఎం, మంత్రుల టూర్‌

    ఇటీవలే జిల్లాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో పాటు మంత్రులు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొ న్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో, సింగరే ణి ప్రాంత ఎమ్మెల్యేలు పర్యటించారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల వారసులకు సంస్థలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. ఒకేరోజు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 335మందికి నియామక పత్రాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు నివాసంలోనే బస చేశారు. శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టుపై ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై బొగ్గు వెలికితీత నుంచి ఉత్పత్తి, రవాణా వరకు మీడియా సమక్షంలోనే అధికారులతో వివరించారు.

    రాజకీయ జోక్యం.. కార్మికుల బేజారు

    స్వతంత్ర ప్రతిపత్తి గల సింగరేణి కంపెనీలో మితి మీరిన రాజకీయ జోక్యం ఇప్పటికే సంస్థ పని తీరు పై ప్రతికూల ప్రభావం చూపుతోందనే విమర్శలు న్నాయి. కంపెనీలో కార్మికుడికి క్వార్టర్‌ కేటాయింపు నుంచి డిప్యుటేషన్‌, బదిలీ లాంటి చిన్న పనుల నుంచి మెడికల్‌బోర్డు ఏర్పాటు, నూతన నియామకాలు, టెండర్లు, సంస్థ లావాదేవీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు ప్రభావితం చేయడంతో కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక గత, ప్రస్తుత ప్రభుత్వాలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు విద్యుత్‌ సంస్థ నుంచే కాకుండా సర్కా రు నుంచి వచ్చే మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతోనూ సంస్థ పరిస్థితి రోజురోజుకూ ఇబ్బంది గా మారింది. ఓ వైపు బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్‌, భూగర్భ గనుల్లో నష్టాలు, ఓపెన్‌కాస్టుల్లో ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల తీరుతో సంస్థకు ఇటీవల ఆశించిన తీరులో లాభాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యట నలో డిప్యూటీ సీఎం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండబోదని ప్రకటించారు. స్వయం ప్రతిపత్తి సంస్థ హోదాను కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటికే కంపెనీలో కార్మికులకు మేలు చేస్తున్నామనే పేరుతో అన్ని రాజకీయ పార్టీలు సంస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏ మేరకు సంస్థ తన స్వతంత్రను నిలబెట్టుకుంటుందనేది కార్మిక వర్గాల్లో పెద్దప్రశ్నగా మిగిలింది.

    ఆరోపణలు,

    విమర్శనాస్త్రాలు

    సంస్థలో 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమయ్యాని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. దీంతో కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే దీనిపై సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఇక జైపూర్‌ థర్మల్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్‌ పనుల్లో అవినీతి జరిగిందని విమర్శించారు. ఈ రెండింటిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాయగా, ఆయన స్పందించారు. దీంతో జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు అధికార పార్టీకి చెందిన కోల్‌ బెల్ట్‌ పరిధి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణల్ని తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఇటీవల టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంచిర్యాలకు వచ్చి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కార్మిక నాయకుడు రాజిరెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించి బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని, కార్మికులకు నష్టం చేస్తున్నారని ఆరోపించారు.

  • 7

    ఉపాధిలో మహిళల జోష్‌

    జిల్లాలో ఉపాధిహామీ పథకంలో మహిళా కూలీలు సత్తా చాటుతున్నారు. పనులకు వచ్చే వారిలో పురుషులతో పోల్చితే మహిళలే అధికంగా ఉంటున్నారు. 9లోu

    ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ఉక్కపోత పెరుగుతుంది. సాయంత్రం అక్కడక్కడ జల్లులు కురుస్తాయి.

    ‘కడెం’కు రక్షణగా ట్రాష్‌రాక్‌

    కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా ప్ర భుత్వం ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టింది. వరదలకు కొట్టుకువచ్చే కట్టెలు, చెత్తను అడ్డుకునే వీలు కలగనుంది. 8లోu

    బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026

  • కౌటాల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత ప్రాజెక్టు ఆ తర్వాత పలువురు సీఎంలు మారినా పూర్తికాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించి.. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడటం మానుకుని, రైతులపై ప్రేమ ఉంటే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సాగు నీరందక ఈ ప్రాంత రైతులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్‌, మండల ఇన్‌చార్జి అనిల్‌ పాల్గొన్నారు.

    ఎస్పీఎంలో స్థానికులకే అవకాశం కల్పించాలి

    కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత అన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాగజ్‌నగర్‌ పట్టణానికి చేరుకోగా, చెక్‌పోస్ట్‌ వద్ద సిర్పూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత పుష్పగుచ్ఛం, హారతితో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పట్టణంలోని ఎస్పీఎం కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మిల్లులో స్థానికులకు 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పించి మిగితా 5 శాతం ఇతర ప్రాంతాల వారికి ఇవ్వాలన్నారు. యాజమాన్యం హైకోర్టులో పెట్టిన కేసును వెనక్కి తీసుకుని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మాజీ మంత్రి బోడ జనార్దన్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కార్మిక గుర్తిపుం సంఘం ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టులో న్యాయవాదిని నియమించామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కావేటి మనోహర్‌, శ్రీనివాస్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకులు, ఎస్పీఎం కార్మికులు పాల్గొన్నారు.

  • ఆసిఫాబాద్‌: జిల్లాలో అర్హులందరికీ బ్యాంకు రుణాలు అందిస్తామని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం 2025– 26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక రుణాల ప్రగతిపై బ్యాంకు, ఇతర శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహంచారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ రాజేశ్వర్‌ జోషి హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,294 స్వయం సహాయక సంఘాలకు రూ.411 కోట్లు రుణ లక్ష్యం కాగా, 2,609 సంఘాలకు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన సంఘాలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. మహిళలు, వ్యాపారం చేసుకునే వారికి పీఎంఈజీపీ, పీఎం ఉపాధి కల్పన పథకం కింద చేతి వృత్తుల వారికి, అర్హులైన యువతకు రుణాలు అందించాలన్నారు. పరిశ్రమలు, డెయిరీలు, గొర్రెల పెంపకం, చేనేత, మత్స్య పరిశ్రమల స్థాపనతోపాటు వ్యవసాయ రంగం, విద్యారుణాలు, గృహ నిర్మాణ రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ నూతన రుణ ప్రణాళిక 2026–27 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు ధనికులు, వ్యాపారవేత్తలకే కాకుండా గ్రామీణ ప్రజలు, సామాన్యులకు రుణాలందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా 2026– 27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,545.80 కోట్ల రుణ ప్రణాళికను ఆమోదించారు. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.2,642 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎల్‌డీఎం హరిప్రసాద్‌, ఏడీసీసీ బ్యాంకు డీజీఎం ఏ.భాస్కర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల అధికారులు, మేనేజర్లు, సెక్టార్‌ అధికారులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

  • మండలం కురవాల్సింది కురిసింది లోటు/అధికం శాతం గతేడాది వర్షం

    జైనూర్‌ 77.2 52.4 – 32 34.8

    సిర్పూర్‌(యు) 69.1 93.7 +36 33.6

    లింగాపూర్‌ 70.6 60.4 – 14 79.3

    తిర్యాణి 66.9 58.9 –12 37.8

    రెబ్బెన 56.4 38.1 –32 61.0

    ఆసిఫాబాద్‌ 73.2 42.3 –42 69.4

    కెరమెరి 52.1 99.7 +91 87.4

    వాంకిడి 74.0 13.5 –82 155.3

    కాగజ్‌నగర్‌ 64.0 13.1 –80 82.8

    సిర్పూర్‌(టి) 66.8 47.6 –29 55.0

    కౌటాల 72.9 42.6 –42 32.4

    చింతలమానెపల్లి 74.8 12.7 –83 12.1

    బెజ్జూర్‌ 84.3 14.1 –83 18.6

    పెంచికల్‌పేట్‌ 74.6 39.1 –48 7.7

    దహెగాం 82.9 25.7 –69 5.9

  • కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ – 2026లో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలంలోని వంజీరి రైతువేదికలో మంగళవారం బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత పేర్ల చేర్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మల్లెపూల మధుకర్‌, రామ్మోహన్‌, బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్‌ లెవల్‌ ఏజెంట్లు పాల్గొన్నారు.

Adilabad

  • వ్యత్యాసం

    – 56 శాతం

    స్థితి

    వర్షాభావం

    సాధారణ

    82.6 మి.మీ.లు

    సాక్షి,ఆదిలాబాద్‌: ఈ వానాకాలంలో చిరు జల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు 82,870 ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించి రైతులు విత్తనాలు విత్తినట్లు చెబుతున్నారు. అనధికారికంగా సుమారు 2లక్షల ఎకరాల వరకు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేసినట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో వర్షాధారంగానే పంటల సాగు ఉండడంతో విత్తనాలు వేసిన రైతులు నింగి వైపు చూస్తున్నారు. రెండు రోజుల్లో వానలు లేకుంటే విత్తన దశలోనే రైతు తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి.

    భారీ వర్షాలు ఏవి..

    ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నైరుతి ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రుతుపవనాలకు ముందు కురిసే తేలికపాటి వర్షాలే ఇప్పటివరకు నమోదైన ట్లు చెబుతున్నారు. గతేడాది వానాకాలం సీజన్‌ కంటే ముందే మే చివరిలోనే జిల్లాలో భారీ వర్షాలు కు రిశాయి. దీంతో రైతులు మొదటి వారంలోనే పెద్ద ఎత్తున విత్తనాలు వేశారు. అప్పట్లో ఆ వర్షాలు రై తుకు కలిసి వచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నా రు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా తలమడుగు, సొనాల మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వర్షాభావ పరి స్థితులే నెలకొన్నాయి. బజార్‌హత్నూర్‌ మండలంలో చుక్కవాన పడలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు సాగు విషయంలో ఆందోళనకు గురవుతున్నారు.

    సమయ ఆందోళన..

    జూన్‌ మొదటి రెండు వారాల్లోనే రైతులు పొడిదుక్కుల్లోనే విత్తనాలు వేస్తారు. వర్షాలు కురిస్తే అవి మొలకెత్తుతాయనే ఆశతో ముందుకెళ్తారు. జూన్‌ చివరి వరకు కూడా పత్తి విత్తనాలు వేయడాన్ని సాధారణ సాగుగానే పరిగణిస్తారు. జూలై మొదటి వారంలో కొంత ఆలస్యంగా, ఆ తర్వాత వారాన్ని పూర్తిగా ఆలస్యంగా పరిగణిస్తారు. సోయా విషయానికొస్తే జూలై లోపే విత్తుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో సాగుతోనే ఉత్పాదకత పెరుగుతుందని రైతుల్లో విశ్వాసం. ఆలస్యంగా సాగు చేయడం ద్వారా చీడపీడలు, ఎదుగుదల లోపం, కాత, పూత సరైన సమయంలో రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమై పంట నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా జూన్‌లోనే విత్తనాలు వేసేందుకు రైతులు మొగ్గుచుపుతుంటారు.

    నింగి వైపు రైతు చూపు

    బజార్‌హత్నూర్‌ మండలంలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు 90 మి.మీ.ల వర్షపాతం కురువాలి. ఇక్కడ ఒక్క మి.మీ. కూడా నమోదు కాలేదు. దీంతో రైతులు విత్తనాలు వేసేందుకు సంకోచించే పరిస్థితి. అయినా 800 ఎకరాల్లో పత్తి విత్తనం పడింది. వరుణుడి కరుణ కోసం కర్షకులకు ఎదురుచూపు తప్పట్లేదు.

    తొందరపడొద్దు..

    ఈనెల 18, 19 తేదీల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు తేలికపాటి వానలే కురిశాయి. వర్షాధారంగానే పంటలు సాగు చేసే పరిస్థితి ఉండడంతో రైతులు మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయడం శ్రేయస్కరం. జూన్‌ చివరి వరకు సమయం ఉన్నందున తొందరపడొద్దు.

    – శ్రీధర్‌ చౌహాన్‌, ప్రధాన శాస్త్రవేత్త,

    వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్‌

    అందుబాటులో పత్తి విత్తనాలు

    జిల్లాలో ఇప్పటివరకు రైతులు రెండున్నర లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయించారు. 11లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. – రవీందర్‌ సింగ్‌,

    జిల్లా వ్యవసాయ అధికారి

  • కై లాస్‌నగర్‌: జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న హత్తిఘాట్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన భూసేకరణకు వడివడిగా అడుగులు వేస్తోంది. 2062.01 ఎకరాల భూ సేకరణకు ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కారు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారంపై ఫోకస్‌ పెంచింది. గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమవుతుంది.

    భూ సేకరణ వేగవంతం

    ఆదిలాబాద్‌ నియోజకవర్గ పరిధి భోరజ్‌ మండలంలోని హత్తిఘాట్‌ ప్రాంతాన్ని ఆనుకుని ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని రేవంత్‌ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ ప్రాంతం అనువుగా ఉందా లేదా అనేదానిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల ఏరియల్‌ సర్వే నిర్వహించి భూములను పరిశీలించారు. అనుకూలమని నిర్ధారించడంతో భూ సేకరణ కోసం ఇటీవల పేపర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. హత్తిఘాట్‌, గూడ, రాంపూర్‌–టి, గిమ్మ–బి గ్రామాల్లోని నీటి ఆధారిత పంటల సాగుకు అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమలను సేకరించనున్నారు. ఆయా గ్రామాల్లోని పట్టా భూములు, వివాదాస్పద, సాదాబైనామా, ఈడీ అటాచ్‌లో ఉన్న భూముల వివరాలన్నింటిపై ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతమైనందున ఆయా భూముల్లో ఈ సారి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆయా గ్రామాల స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఒకవేళ సాగు చేస్తే స్వల్పకాలిక రకాలకు ప్రాధాన్యం ఇచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.

    19 నుంచి గ్రామసభలు

    భూ సేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈనెల 19నుంచి గ్రామసభలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ సభల్లో రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖలతో పాటు భూములు సేకరించనున్న టీజీఐఐసీ అధికారులు పాల్గొనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, జీపీవోలు, మండల సర్వేయర్లతో కూడిన ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయనున్నారు. వీరు ఆయా గ్రామాల్లోని సర్వేనంబర్ల వారీగా పట్టాదారులు, వారికున్న భూవిస్తీర్ణం, సాగుభూమి స్థితి వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ హక్కుదారులే కాస్తులో ఉన్నారా లేక ఇతరులేవరైనా సాగు చేస్తున్నారా అనే అంశాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మార్కెట్‌ వాల్యూ ప్రకారం ఎకరాకు రూ.3.40 లక్షలు పలుకుతుంది. దీని ఆధారంగా ఎకరాకు ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై ఈ సభల్లో నిర్ణయించనున్నారు. భూ వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితే పరిహారం నిర్ణయించి తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. అనంతరం మండల సర్వేయర్లు, టీజీఐఐసీ నుంచి వచ్చే అధికారులతో కలిసి భూముల సర్వే చేపట్టి తుది నివేదిక సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా తగు చర్యలు చేపట్టనుంది. ఈ కారిడార్‌ ఏర్పాటు ద్వారా అభివృద్ధిపరంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయి.

    కసరత్తు చేస్తున్నాం

    హత్తిఘాట్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సంబంధించి భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే భూ యజమానులు, వారి పేరిట ఉ న్న భూ విస్తీర్ణం, సర్వేనంబర్లు తెలిపిలా నోటిఫికేషన్‌ ప్రకటించాం. గ్రామసభలు నిర్వహించి సమగ్ర వివరాలు సేకరిస్తాం. వాటి ఆధారంగా అవార్డు ప్రకటించి తుది జాబితా సిద్ధం చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్‌ఎస్‌ చిత్రు, అదనపు కలెక్టర్‌

    గ్రామాల వారీగా సేకరించనున్న

    భూముల వివరాలు

  • కై లాస్‌నగర్‌: జిల్లాకేంద్రంలో ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ప్రాంతవాసుల కల సాకారం దిశగా అడుగులు వేగవంతమయ్యాయి. మంగళవారం ఓఎల్‌ఎస్‌ సర్వే ప్రారంభమైంది. విమానాయాన శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.

    పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియ : కలెక్టర్‌

    ఆదిలాబాద్‌ జాయింట్‌ యూజర్‌ (డిఫెన్స్‌–సివిల్‌) ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడతామని కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే శంకర్‌, బెంగళూరు కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు, రాష్ట్ర సి విల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డితో కలిసి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విమానాశ్రయ భూసేకరణ చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇప్పటికే 700 ఎకరా ల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదనంగా డిఫెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎయి ర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌) కోసం 1,500 ఎకరాలు, సివిల్‌ ఏవియేషన్‌ రన్‌వే విస్తరణ కోసం మరో 80 ఎకరాలు కేటాయించేందుకు ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. జియో కోఆర్డినేట్ల ఆధారంగా భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామ ని సీఎంవో కార్యాలయం, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి రక్షణ శాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి భూములు అప్పగిస్తామని తెలిపారు. ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి సంబంధించిన లొకేషన్ల పరిశీలన పూర్తయిందన్నారు. రక్షణశాఖ కోరిన 1,500 ఎకరాల భూసేకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులతో కలిసి మ్యాప్‌ల ఆధారంగా మైక్రో లెవెల్‌ సమీక్ష నిర్వహించామని, ప్రాజెక్టు వేగవంతానికి ఈ సమావేశంతో కీలక ముందడుగు పడినందన్నారు. ఎమ్మెల్యే శంకర్‌ మాట్లాడుతూ, జా యింట్‌ యూజర్‌ ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణపై స్ప ష్టత వచ్చిందన్నారు. గతంలో జారీ చేసిన 700 ఎకరాల జీవో ప్రకారం పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 800 ఎకరాల అనుమతుల ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు. తదుపరి విధానపరమైన నిర్ణయాల కోసం త్వరలో ఎంపీ నేతృత్వంలో ఢిల్లీలో ఉమ్మడి సమావేశం జరగనుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటుతో ఆదిలాబాద్‌ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోందని, జిల్లా అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌.చిత్రు, ఎస్‌.రాజేశ్వర్‌, ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు జేపీ సబర్వాల్‌, ఎస్‌.జి.హెడ్గే, ఎస్‌.కె.రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్‌, ల్యాండ్‌ సర్వే ఏడీ ప్రభాకర్‌, తహసీల్దార్లు శ్రీనివాస్‌, గోవింద్‌ పాల్గొన్నారు.

    క్షేత్రస్థాయి పరిశీలన ..

    ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు, కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో మైక్రో లెవల్‌ సర్వే చేపట్టారు. ఎరోడ్రమ్‌తో పాటు ఇందిరమ్మకాలనీ, అనుకుంట, సీసీఐ, ఇందిరమ్మ కాలనీ వంటి ప్రాంతాలను సమగ్రంగా పరిశీలించారు. రన్‌వే విస్తరణతో పాటు ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా మ్యాపుల ప్రకారం భూములను పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు.

  • ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లావ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు నేరాలు అరికట్టేందుకు రాత్రి సమయాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం నెలవా రీ నేర సమీక్ష నిర్వహించారు. కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ బాధితులకు త్వరితగతిన న్యా యం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పటిష్టమైన బీట్‌ వ్యవస్థ అమలు చేయాలన్నారు. గంజా యి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు రాత్రి వేళల్లో బస్సులు తదితర వాహనాల్లో నార్కోటిక్‌ జాగిలాల సాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు డీడీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేషన్లలో 5ఎస్‌ విధానంతో పాటు వర్టికల్‌ విధానం పూర్తిస్థాయిలో అమలు చేయాలని, సీసీటీఎన్‌ఎస్‌ వ్యవస్థ ఎప్పటికప్పుడు నవీకరించి పెండింగ్‌ లేకుండా చూడాలని సూచించారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యా ఖ్యలు, శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల్లో ప్రతిభ కనబ ర్చిన 40 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇందులో అదనపు ఎస్పీ పి.మౌనిక, ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టే, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, ఇంద్రవర్ధన్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, డీసీఆర్‌బీ, ఐటీ కోర్‌, ఎన్‌ఐబీ, కమ్యూనికేషన్‌, ఫింగర్‌ప్రింట్‌ విభాగాల అధికారులు, రిజర్వ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌టౌన్‌: సిమెంట్‌ పరిశ్రమ పునరుద్ధరణ వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లక్ష్యంగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ‘హలో యువత.. చలో సీసీఐ పరిశ్రమ’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర మంత్రులు గతంలో హామీ లు ఇచ్చారని, అయితే ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌, విద్యుత్‌ శాఖలకు సీసీఐ బకా యిలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకో వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు దర్శనాల మల్లేశ్‌, అఖిలపక్ష నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు బండి దత్తాత్రి, మెట్టు ప్రహ్లాద్‌, గోడం గణేశ్‌, యూనుస్‌ అక్బానీ, వెంకటనారాయణ, రాజు, సతీష్‌, కస్తాల ప్రేమల, ఆయా పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

  • ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో మాతాశిశు మరణాలను నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్ప్‌ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని వసతులు, మెరుగైన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై మంగళవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సెక్రెటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్తు ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో రిమ్స్‌ డైరెక్టర్‌ రాథోడ్‌ జైసింగ్‌, డీసీహెచ్‌ఎస్‌ డా.ఉపేందర్‌ జాదవ్‌, రిమ్స్‌ పిడియాట్రిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.వంశీకృష్ణ, నర్సింగ్‌ సిబ్బంది అరుణ, సిమ్మి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

  • కెరమెరి: మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన డీఆర్‌ డిపో సేల్స్‌మెన్‌ చహకటి రాజేశ్వర్‌ తెల్లవారుజామున తన కుమారుడు జగదీశ్వర్‌ను బైక్‌పై ఎక్కించుకుని ఆసిఫాబాద్‌కు బయలుదేరాడు. మానిక్‌గూడ సమీపంలో వాహనానికి పందులు అడ్డురావడంతో బైక్‌ అదుపుతప్పి కిందపడింది. జగదీశ్వర్‌కు స్వల్పంగా రాజేశ్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108లో ముందుగా ఆసిఫాబాద్‌ అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జగదీశ్వర్‌ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • ఆదిలాబాద్‌:సిబ్బంది కొరతతో ఆర్టీసీ సతమతమవుతోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కోసారి 12 గంటల వరకు పనిచేయాల్సిన దుస్థితి. సిబ్బందిలేమి కారణంగా పనిభారం అధికమై ఎంతోమంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్నవారికే డబుల్‌ డ్యూటీ (డీడీ)లు కేటాయిస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది అధికారులు అవుట్‌ ఆఫ్‌ డిసిగ్నేషన్‌ డ్యూటీస్‌ (ఓడీ)లు ఇస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఓడీఎం బదిలీపై వెళ్తూ కొంతమంది ఉద్యోగులకు ఓడీలు ఇచ్చి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా రీజియన్‌ వ్యాప్తంగా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డగోలుగా ఓడీలు ఇస్తూ అక్రమంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.

    అయినవారికి అందలం..

    సాధారణంగా స్టాఫ్‌ తక్కువగా ఉంటే నియామకాల ద్వారా ఖా ళీలు భర్తీ చేస్తారు. లేదంటే స్థానికంగా అందుబాటులో ఉన్న ఉద్యోగులకు ఓడీ పేరుతో విధులు కేటాయిస్తారు. ఆర్టీసీలో నియామకాలు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకే అధికారులు ఓడీలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇక్కడే కొంతమంది ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు వత్తాసు పలికే వారికి అప్పనంగా ఓడీలు కేటాయిస్తున్నారు. ఓవైపు సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఉంటుండగా, తమకు అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను అందలమెక్కిస్తున్నారు. ఇటీవల మంచిర్యాల డిపోలో సీనియార్టీని కాదని, కొంతమంది జూనియర్‌ ఉద్యోగులకు అవుట్‌ ఆఫ్‌ డిసిగ్నేషన్‌ డ్యూటీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. అనారోగ్య కారణాలు, వయస్సు రీత్యా సీనియర్లు విజ్ఞప్తి చేసుకుంటే అవసరాన్నిబట్టి ఓడీలు ఇవ్వాల్సింది పోయి, జూనియర్‌ ఉద్యోగులకు కేటాయించడం విమర్శలకు కారణమవుతోంది.

    ఓడీలతో పెరుగుతున్న డీడీలు..

    అవసరం ఉన్నా, లేకపోయినా కొంతమందికి ఓడీలు కేటాయిస్తుండడంతో మిగిలిన కార్మికులపై భారం పడుతోంది. క్షేత్రస్థాయిలో బస్సులు నడిచేందుకు కీలకంగా వ్యవహరించే డ్రైవర్లు, కండక్టర్లపై డబుల్‌ డ్యూటీల భారం పడుతుంది. సిబ్బంది లేకపోవడంతో వారికి డబుల్‌ డ్యూటీ పేరిట అదనంగా పే చేయాల్సి వస్తుంది. తమవారికి లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న అధికారులు, పరోక్షంగా ఇతర ఉద్యోగులపై పనిభారం నెడుతున్నారు. దీంతో పలు సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు ఆసుపత్రుల పాలవుతున్నారు.

    రీజియన్‌ పరిధిలోని ఉద్యోగులు

    డిపో డ్రైవర్లు కండక్టర్లు

    ఆదిలాబాద్‌ 129 204

    ఆసిఫాబాద్‌ 90 111

    భైంసా 33 128

    మంచిర్యాల 149 162

    నిర్మల్‌ 138 204

    ఉట్నూర్‌ 39 46

    మొత్తం 578 855

    వేధిస్తున్న సిబ్బంది కొరత..

    ఆదిలాబాద్‌ రీజీయన్‌ వ్యాప్తంగా 737 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌ డ్రైవర్లు 583 మంది ఉన్నారు. మిగతా 154 మంది అవుట్‌ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 867 మంది కండక్టర్లు ఉండగా, వీరిలో కూడా సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టుల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు ఇష్టారాజ్యంగా ఓడీలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

  • కడెం: నిర్మల్‌–మంచిర్యాల జిల్లాల ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌ కడెం ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కడెం ప్రాజెక్ట్‌ ప్రధాన కాలువ ద్వారా కడెం, దస్తురాబాద్‌, జన్నారం, దండెపల్లి, హాజీపూర్‌, లక్సెట్టిపేట మండలాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రధాన కాలువకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టింది. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

    సమస్యకు చెక్‌

    కడెం ప్రాజెక్ట్‌ వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, చెత్తాచెదారం ప్రధాన(ఎడమ) కాలువ గేట్లలో ఇరుక్కుని, కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఇబ్బందులు తలెత్తేవి. గతేడాది కాలువ గేటులో భారీ దుంగ ఇరుక్కుపోవడంతో గేటును కిందకు దించలేకపోయారు. ఇలాంటి సమయంలో సాగునీరు వృథాగా పోయో పరిస్థితి నెలకొంటుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువకు రక్షణగా రూ.2.58 కోట్ల వ్యయంతో ట్రాష్‌రాక్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలువ సమీపంలో ఈ ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపట్టడంతో వరదల సమయంలో వచ్చే భారీ దుంగలు, కట్టెలు, చెత్తాచెదారం అడ్డుకుంటుంది. దీంతో ప్రధాన కాలువకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగునీటిని దిగువకు వదిలేందుకు ఆస్కారం ఉంటుంది. కాలువకు అడ్డుకట్టగా భారీ పిల్లర్లను నిర్మించి, మధ్యలో భారీ ఇనుప జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన కాలువకు ప్రస్తుతం ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలోనూతన గేట్లను అమర్చనున్నారు.

    ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

    కడెం ప్రాజెక్ట్‌ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022, 2023లో కడెం ప్రాజెక్ట్‌కు వచ్చిన భారీ వరదల కారణంగా ప్రాజెక్ట్‌ డేంజర్‌జోన్‌లోకి వెళ్లింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.12 కోట్ల నిధులతో ప్రాజెక్ట్‌ వరద గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టారు. ప్రస్తుతం రూ.2.58 కోట్లతో ప్రాజెక్టు ఎడమ కాలువకు రక్షణగా ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నారు.

    ఈ నెలాఖరుకు పూర్తి

    కడెం ప్రధాన కాలువలోకి భారీ దుంగలు వెళ్లి కాలువ గేట్లు ఎత్తేందుకు, దించేందుకు ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ట్రాష్‌రాక్‌ నిర్మాణం చేపడుతున్నాం. వర్షాకాలం సమీపిస్తున్నందువల్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల చివరినాటికి పనులు పూర్తి చేయిస్తాం.

    – వీరన్న, డీఈఈ, కడెం ప్రాజెక్ట్‌

  • ఉట్నూర్‌రూరల్‌: ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు మంగళవారం త న జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్చం అందించి సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే బొజ్జుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురా రోగ్యాలు ప్రసాదించాలని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి మ రింత కృషి చేసి భవిష్యత్‌లో మరెన్నో విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

    దాడి కేసులో ఆరుగురు యువకుల రిమాండ్‌

    కాసిపేట: మండలంలోని సోమగూడెం(కె)లో గత నెలలో జరిగిన దాడి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించా రు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన ముచ్చర్ల సంపత్‌, అతని స్నేహితులు మందమర్రి టోల్‌గేట్‌ సమీపంలోని గోపాల్‌ దాబా వ ద్దకు వెళ్లగా అక్కడ కొంతమంది వ్యక్తులతో పా ర్సిల్‌ విషయమై వాగ్వివాదం జరిగింది. అక్కడి నుంచి వచ్చి సోమగూడెంలోని బంధువుల ఇంటివద్ద ఉండగా దాబా వద్ద ఉన్న వ్యక్తులు ఆయుధాలతో అక్కడికి వచ్చి వారిపై దాడికి పాల్పడడంతో సంపత్‌, అల్లంల ప్రశాంత్‌, బొ మ్మనవేణి వరప్రసాద్‌, ఆకుల రాణాప్రతాప్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు దనకుంట్ల మునియప్ప, మహమ్మద్‌ అబ్బు, మహమ్మద్‌ సమీరుద్దీన్‌, అఖిల్‌, మల్యాల చందు, షేక్‌ ఫేరోజ్‌ను అరెస్టు చేశారు. నిందితుల ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆసిఫాబాద్‌ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

    గుప్తనిధుల కోసం తవ్వకాలు

    కాగజ్‌నగర్‌రూరల్‌: మండలంలోని ఈజ్‌గాం శివారులోని పంటచేలలో గుప్త నిధుల కోసం చేపట్టిన తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం శివారులోని పంట చేనులో పొక్లెయిన్‌తో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెట్టు సమీపంలో తవ్వి పూడ్చిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ముఠాను పట్టుకుని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

    స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌గా రమేశ్‌

    మంచిర్యాల క్రైం: మంచిర్యాల జిల్లా స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా పట్టణానికి చెందిన సమిట్ల రమేశ్‌ను నియమిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుందని రమేశ్‌ తెలిపారు. కాగా రమేశ్‌ 20 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. స్థానిక న్యాయవాదులు, బార్‌కౌన్సిల్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

  • తలమడుగు: చేపలు పట్టడానికి వెళ్లి విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కొత్తూరుకు చెందిన కాటిపల్లి కపిల్‌రెడ్డి (31)మంగళవారం అతని స్నేహితులు శైలేందర్‌, రామయ్య, ప్రమోద్‌, గంగయ్యతో కలిసి చేపలు పట్టేందుకు సమీపంలోని వాగుకు వెళ్లారు. విద్యుత్‌ తీగల సహాయంతో చేపలు పట్టే ప్రయత్నంలో కపిల్‌రెడ్డి షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక తెలిపారు.

    అనుమానాస్పదంగా ఒకరు..

    తానూరు: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బోల్సాలో పాలేరుగా పనిచేస్తున్న కందురోళ్ల పీరాజీ (35) సోమవారం రాత్రి యజమాని పశువుల పాకకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన తోటి పాలేర్లకు చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్పీ సాయికిరణ్‌, సీఐ రవీందర్‌ నాయక్‌, ఎస్సై ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా చాకు, మృతదేహాంపై చింపేసినట్లు ఉన్న చొక్కా, కల్లు సీసాలు, మద్యం బాటిళ్లు గుర్తించారు. భూ వివాదం విషయమై పాత కక్షలతో సమీప బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బెల్‌తరోడా–భైంసా రహదారిపై ధర్నా నిర్వహించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    రోడ్డు ప్రమాదంలో ఒకరు..

    దిలావర్‌పూర్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంజులాపూర్‌కు చెందిన ఉప్పల గణేశ్‌ (57)కు దిలావర్‌పూర్‌లోని పాత బస్టాండ్‌ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉంది. దానిని ము జ్టిగ ముత్యంకు కౌలుకు ఇచ్చాడు. మంగళవారం పంటచేను చూసేందుకు వచ్చాడు. ముత్యంను బస్టాండ్‌ వరకు రమ్మని పిలవడంతో అతని ఎలక్ట్రిక్‌ వాహనంపై వెళ్తుండగా నిర్మల్‌–భైంసా రహదారిపై వెనుకనుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గణేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ముత్యంకు గాయాలు కావడంతో నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవీందర్‌ తెలిపారు.

    యువతి అదృశ్యం

    సిర్పూర్‌(టి): మండలంలోని చీలపెల్లికి చెందిన నిఖిత(21) ఈ నెల 15న రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌ తెలిపారు. గ్రామానికి చెందిన యు.సునీత కుమార్తె నిఖిత 15న రాత్రి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదన్నారు. గతంలో ఆసిఫాబాద్‌ మండలం నవేగాంకు చెందిన రెగర్ల వెంకటేష్‌ నిఖితను తీసుకెళ్లి సిర్పూర్‌(టి)లో వది లేసి వెళ్లిపోయాడన్నారు. ఇప్పుడు కూడా తమ కూ తుర్ని అతనే తీసుకెళ్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీత ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

  • కడెం: సాగు భూముల కోసం మండలంలోని పెత్తర్పు గోండుగూడ వాసులకు అటవీ అధికారులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. మంగళవారం పునరావాసంలో భాగంగా కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో రాంపూర్‌, మైసంపేట్‌ వాసులకు అప్పగించిన సాగు భూములకు హద్దులు ఏర్పాటు చేయించేందుకు వెళ్లిన అటవీ, రెవెన్యూ అధికారులను గోండుగూడ వాసులు మళ్లీ అడ్డుకున్నారు. పునరావాస గిరిజనులతో పాటుగా ఏళ్లుగా ఇక్కడే సాగు చేస్తున్న తమకు సాగు భూములు కేటాయించాలని డిమాండ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పది మంది ఆదివాసీలను జీపులో ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. అడ్డుకునేందుకు వెళ్లిన మహిళలను ఈడ్చుకెళ్లారు. ఓ ఆదివాసీ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పునరావాసంలో భాగంగా రాంపూర్‌, మైసంపేట్‌ వాసులకు భూములు అప్పగించామని, వారికి పట్టాలు సైతం వచ్చాయని, గోండుగూడ వాసులు అడ్డుకోవడం సరికాదని ఎఫ్‌డీవో శివకుమార్‌ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో దేవదాసు, తహసీల్దార్‌ ఖాజా మొయినుద్దీన్‌, ఎఫ్‌ఆర్వోలు గీతారాణి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, అనితా, కల్పనదేవి, వాణి, రామకృష్ణ, కిరణ్‌, ఎస్సైలు సాయికిరణ్‌, సాయికుమార్‌, హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.

    అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు

    కడెం: మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌ జీపీ పరిధిలోని గోండుగూడ వాసులపై అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదని రాంజీగోండ్‌ సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గోండుగూడ ఆదివాసీలు సాగు భూముల కోసం పోరాడితే వారిని అడ్డుకుని ఇందన్‌పల్లి అటవీ రేంజ్‌ కార్యాలయానికి తరలించారన్నారు. ఆదివాసీలకు సాగు భూములు దక్కే వరకు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్‌, తొడసం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.

  • పొట్టకూటి కోసం పిల్లాపాపలతో వందల మైళ్లు ఎండనకా..వాననకా వలస జీవులు ప్రయాణం సాగిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు అధికంగా ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనిముట్ల తయారీ కోసం నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు రాజస్థాన్‌ నుంచి వలస కార్మికులు ఐదారు కుటుంబాలు చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకే వాహనంపై నిర్మల్‌ జిల్లా కేంద్రం నేషనల్‌ హైవే–61 మీదుగా భైంసా వైపు వెళ్లారు. పిల్లాజెల్లతో.. మూటామల్లె సర్దుకుని వలస వెళ్తున్న కుటుంబాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది.

    – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

International

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన రష్యన్ కళాకారుడు, కార్టూనిస్ట్ రాబర్ట్ కుజోవ్‌కోవ్ పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. తూర్పు పోలాండ్‌లోని బియాలా పోలాస్కా పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకులతో కాల్చిచంపారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఇద్దరు బెలారస్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    2021లో రాజకీయ వేధింపుల భయంతో రష్యా విడిచి వచ్చిన కుజోవ్‌కోవ్‌కు పోలాండ్ ఆశ్రయం కల్పించింది. "సెమ్యోన్ స్క్రెపెట్స్కీ" పేరుతో ఆయన రూపొందించిన వ్యంగ్య చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. పుతిన్‌తో పాటు చెచెన్యా నాయకుడు రంజాన్‌ క్యాడీరోవ్‌, అలెంగ్జాండర్‌ లుకాషెంకో వంటి నేతలను లక్ష్యంగా చేసుకుని ఘాటు కార్టూన్లు గీసేవాడు.

    ఇటీవల బెర్లిన్‌లో జరిగిన "రష్యా డే" నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆయన.. పుతిన్‌, జోసఫ్‌ స్టాలిన్‌లను వ్యంగ్యంగా చిత్రీకరించిన పెయింటింగ్‌తో నిరసన తెలిపాడు. మరణానికి ముందు రోజు కూడా ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నట్లు సమాచారం. కుజోవ్‌కోవ్ సన్నిహితులు ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయన్న సంకేతాల మధ్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. దక్షిణ లెబనాన్‌లో మంగళవారం జరిగిన వరుస డ్రోన్ దాడుల్లో కనీసం నలుగురు మరణించగా, పలువురు గాయపడినట్లు లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ (NNA) వెల్లడించింది.

    మయ్‌ఫదౌన్ గ్రామంలో ఓ కారును లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. పేలుడు జరిగిన తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న వారిపై మరోసారి డ్రోన్ దాడి జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనిని "డబుల్ ట్యాప్ స్ట్రైక్"గా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు షౌకిన్ పట్టణంలో జరిగిన డ్రోన్ దాడిలో మరో ఇద్దరు మరణించారు.

    అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య పోరాటం కొంత తగ్గినప్పటికీ పూర్తిగా ఆగలేదని తాజా ఘటనలు సూచిస్తున్నాయి. మంగళవారం మొత్తం దక్షిణ లెబనాన్‌లో డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు, ఫిరంగి కాల్పులు కొనసాగినట్లు ఎన్‌ఎన్‌ఏ తెలిపింది. అదే సమయంలో రాజధాని బీరూట్‌పై కూడా ఇజ్రాయెల్ నిఘా డ్రోన్లు చక్కర్లు కొట్టాయి.

    ఈ ఏడాది మార్చి 2 నుంచి ఇరాన్‌కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తుంది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యల్లో ఇప్పటివరకు 3,820 మందికిపైగా మరణించారు. సుమారు 12 లక్షల మంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణల్లో కనీసం 28 మంది ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు సమాచారం.

     

  • జెన్-ఆల్ఫా (2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారు) పెరుగుతున్న ప్రపంచంలో స్క్రీన్‌లు, స్మార్ట్‌ డివైస్‌లు జీవితంలో సహజ భాగాలు. వారికి ఇంటర్నెట్‌ లేకుండా గడిచిన రోజులు కథల్లో వినే విషయాల్లా అనిపించే అవకాశం ఉంది. డిజిటల్‌ కనెక్షన్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో "ఆఫ్‌లైన్‌ జీవితం" అనే భావనే ఈ కొత్త తరానికి అపరిచితంగా మారుతోంది.

    జెన్ ఆల్ఫా వాళ్లు ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను వాడుతూనే పెరుగుతున్నారు. అది వారి రోజువారీ జీవితంలో సహజ భాగంగా మారిపోయింది. వారు చదవడం, వినోదం పొందడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, విసుగొచ్చినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు మాట్లాడడం వంటి పనులన్నీ ఎక్కువగా డిజిటల్ పరికరాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారానే చేస్తున్నారు.

    అంతకుముందున్న తరాలవారికి ఆన్‌లైన్‌లో ఉండటం ఒక కార్యకలాపం. వారు లాగిన్ అయ్యేవారు, అంతర్జాలంలో కొంత సమయం గడిపేవారు, తర్వాత లాగ్ ఆఫ్ అయ్యేవారు. జెన్ ఆల్ఫాకు మాత్రం ఇంటర్నెట్‌ అనేది వారు పెరిగే వాతావరణంగా మారిపోయింది.

    జెన్ ఆల్ఫా తరం కంటే ముందు ఉన్న తరాలు ఇంటర్నెట్ లేకుండా కూడా జీవితాన్ని గడిపాయి. ప్రత్యక్షంగా మనుషులను కలుసుకోవడం, బయట ఆటలు ఆడటం, పుస్తకాల ద్వారానే సమాచారం తెలుసుకోవడం వంటి "ఆఫ్‌లైన్" జీవన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని తొలి తరంగా జెన్ ఆల్ఫా తరం మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంటర్నెట్ లేని జీవితం ఎలా ఉండేదో జెన్ ఆల్ఫా వారికి పూర్తిగా తెలియకపోవచ్చు.

    అంటే పిల్లల జీవితంలోని అన్ని దశల్లో, అన్ని విధాలుగా వర్చువల్ సంస్కృతి పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచంలో జరిగే సామాజిక, విద్యా, వినోద కార్యకలాపాలకే వారు పరిమితం అవుతున్నారు. జెన్ ఆల్ఫాకు సాంకేతికత కేవలం వినోదం లేదా అభ్యాసానికి ఉపయోగించే సాధనం కాదు. సమాచారం పొందడం, సంభాషించడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించడం వంటి విషయాల్లో అది ప్రధాన మార్గంగా మారుతోంది.

    బ్లాక్‌బోర్డుల నుంచి స్మార్ట్‌బోర్డుల వరకు..
    కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. మనం బ్లాక్‌బోర్డులను ఉపయోగించేవాళ్లమని గుర్తుకు వస్తుంది. ఉపాధ్యాయులు బోర్డులపై రాసేవారు. విద్యార్థులు వాటిని కాపీ చేసేవారు. యువతపై ప్రభావం చూపుతూ వేగవంతమైన సాంకేతికత ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. 2025లో భారత్‌లోని స్కూళ్లలో తరగతి గదుల‍్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.  బ్లాక్‌బోర్డుల స్థానంలో స్మార్ట్‌బోర్డులు వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించడానికి ఎక్కువగా రాయడం లేదు. వీడియోలు చూపిస్తున్నారు, పీడీఎఫ్‌లు తెరిచి బోధిస్తున్నారు.

    మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో చెప్పిన “ఫోన్ ఎక్కువగా చూడొద్దు, కళ్లపై ప్రభావం పడుతుంది” లేదా “స్క్రీన్ సమయం తగ్గించు” అనే మాటలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఒకప్పుడు దృష్టి మళ్లించే వస్తువులుగా భావించిన అదే స్క్రీన్లు ఇప్పుడు తరగతి గదులు, గ్రంథాలయాలు, చదువులో భాగస్వాములుగా మారాయి.

    బియ్యం బస్తాల్లా బ్యాగులు ఉండేవి కదా..
    పాఠశాల బ్యాగు పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. బియ్యం బస్తాల్లా బ్యాగులను మోసుకెళ్లేవాళ్లం. 6వ తరగతికే వెన్నునొప్పి వచ్చేది. ఐదారు సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు ఉండేవి.

    జెన్ ఆల్ఫా పిల్లల సంగతే వేరు. తేలికైన బ్యాగులు ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లకు పిల్లలు బ్యాగులు లేకుండానే వెళ్తున్నారు. ఎందుకంటే పాఠ్యపుస్తకం ఇప్పుడు పీడీఎఫ్ రూపంలో ఉంది. నోట్స్‌ గూగుల్ డాక్‌లో ఉన్నాయి. హోం వర్క్‌ గూగుల్ క్లాస్‌రూమ్‌లో ఇస్తున్నారు. చదువుకు సంబంధించిన అనేక విషయాలు వాట్సాప్ గ్రూపుల్లో లింక్ రూపంలో వస్తున్నాయి. అన్నీ టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌లోని ఒక ఫోల్డర్‌లో క్రమబద్ధంగా, సెర్చ్‌ చేయడానికి సులభంగా ఉంటాయి.

    గత తరాలు పుస్తకాలను చదవడం నేర్చుకున్నాయి. నేటి విద్యార్థులు వీడియోలు, సామాజిక మాధ్యమాలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే డిజిటల్ చిత్రాలు, సమాచారం జోడించి చూపే సాంకేతికత.

    జెన్ ఆల్ఫా, స్క్రీన్ల మధ్య బంధం ఇప్పటికే పెరుగుతుండగా, కోవిడ్-19 మహమ్మారి దాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు మూడు సంవత్సరాలు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తరగతులకు హాజరయ్యారు, పరీక్షలకు సిద్ధమయ్యారు, అసైన్‌మెంట్‌లు సమర్పించారు, స్నేహ సంబంధాలు కూడా పరికరాల ద్వారానే కొనసాగించారు. స్క్రీన్లు ఆప్షన్‌గా కాకుండా అత్యవసరంగా మారాయి.

    దీనిలో ఉన్న మంచి విషయం నిజమే. వీడియోలో అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూసే పిల్లవాడు లేదా రంగులతో కూడిన కిరణజన్య సంయోగక్రియ చలనచిత్రాన్ని చూసే పిల్లవాడు... బోర్డుపై గీసిన చాక్ చిత్రాన్ని చూసే పిల్లవాడితో పోల్చితే దాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటాడు.

    ఇప్పుడు “పుస్తకం ఇంట్లో మరిచిపోయాను” అనే మాట లేదు. “అన్నీ నా చేతిలోనే ఉన్నాయి” అనే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు అదే స్క్రీన్‌పై వారు యూట్యూబ్ చూస్తారు, స్నేహితులతో సంభాషిస్తారు. జెన్ ఆల్ఫా పిల్లవాడికి ఏదైనా అర్థం కాకపోతే పేరాను మళ్లీ చదవడు.. వీడియో కోసం వెతుకుతాడు. అది 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, అవసరమైన భాగానికి నేరుగా వెళ్లిపోవచ్చు.

    ఇప్పుడు దాదాపు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం లభిస్తుంది. మిలీనియల్స్, జెన్ జెడ్ తరాలకు ఆఫ్‌లైన్‌లో ఉండటం రోజువారీ జీవితంలో సాధారణ భాగం. జెన్ ఆల్ఫాకు “ఆఫ్‌లైన్” క్రమంగా ఒక అనుభవం కంటే ఒక భావనగా మారవచ్చు. వారు దాని గురించి వింటారు గానీ, తరచుగా అనుభవించకపోవచ్చు.

  • పారిస్‌: ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరుగుతున్న జీ 7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. గత 16 నెలల తర్వాత ఇద్దరూ బహిరంగంగా కలుసుకున్న తొలి సందర్భం ఇదే.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ ఆతిథ్యం ఇచ్చిన ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు ప్రారంభం కావడానికి ముందు మాక్రోన్ సమావేశ వేదిక వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. కాగా, బుధవారం (జూన్‌ 17)న మోదీ, ట్రంప్‌ భేటీ కానున్నారు. 

    జీ7 సదస్సుకు ప్రపంచ దేశాల నాయకులు హాజరయ్యారు. అమెరికా కుదుర్చుకున్న ఇరాన్ ఒప్పందంపై నేతల మధ్య బహిరంగంగా, స్పష్టమైన చర్చలు జరిగినట్లు సోర్సెస్‌ తెలిపాయి. ట్రంప్, ముగ్గురు అరబ్ దేశాల నాయకులతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో కూడా సమావేశం కానున్నారు.

    ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం పూర్తి వివరాలను మరో 2 రోజుల్లో బహిరంగంగా విడుదల చేస్తానని ట్రంప్ తెలిపారు. అవసరమైతే ఆ పత్రాన్ని కెమెరాల ముందే చదివి వినిపిస్తానని కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఆ ఒప్పందాన్ని పరిశీలన కోసం అమెరికా కాంగ్రెస్‌కు పంపుతానని చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన క్లిష్టమైన అంశాల పరిష్కారానికి జరగనున్న తదుపరి దశ చర్చలు మరింత సులభంగా ఉంటాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.

     

     

     #WATCH | Prime Minister Narendra Modi and other G7 world leaders stand together for a group photo at the G7 Summit, in Evian, France.

    (Video: DD News) pic.twitter.com/MI5YiAys44

Peddapalli

  • ● మేయర్‌ మహంకాళి స్వామి

    యైటింక్లయిన్‌కాలనీ: డ్రైనేజీ పనుల్లో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించద్దని మేయర్‌ మహకాళి స్వామి సూచించారు. కార్పొరేషన్‌ 14వ డివిజన్‌ ఏరియా రాజీవ్‌నగర్‌, లంబడి తండాలోని ప్రధాన డ్రైనేజీల్లో సింగరేణి చేపట్టిన పూడికతీతను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీ సిద్ధార్థనగర్‌, సంతోష్‌నగర్‌, హనుమాన్‌నగర్‌ నుంచి వస్తున్న ప్రధాన ఓపెన్‌ డ్రైనేజీలో పూడికతీతను మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన పర్యవేక్షించారు. కార్య క్రమంలో కాంగ్రెస్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ మారెల్లి రాజిరెడ్డి, కార్పొరేటర్‌ శంకర్‌ నాయక్‌, కాలనీ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేశ్‌, అధికారులతోపాటు నాయకులు రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, మార్క రాజు, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • కోల్‌సిటీ: మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, వినియోగాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రామగుండం బల్దియా కార్యాలయం, పార్కింగ్‌ ప్రాంతంలో నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సహకారంతో తనిఖీలు చేపట్టారు. వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు అఫ్జాలోద్దీన్‌, మనోహర్‌ ఆధ్వర్యంలో సందర్శకుల సామగ్రి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

    సాధారణంగా వానాకాలం ప్రారంభమైందంటే ఉమ్మడి కరీంనగర్‌లో రైతులు వరి నారుమడులు సిద్ధం చేయడంలో బిజీగా ఉంటారు. ఈ ఏడాది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు నమోదవుతాయన్న వాతావరణశాఖ అంచనాలు రైతుల్లో ఆందోళన పెంచుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, సాగునీటి లభ్యతపై సందేహాలు వ్యక్తమవుతుండడంతో వ్యవసాయశాఖ అధికారులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వరి ప్రధాన పంటగా మారింది. యాసంగి సీజన్‌లో రాష్ట్రం రికార్డుస్థాయిలో వరి ఉత్పత్తి సాధించగా, అందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే అధికంగా సాగైంది. ప్రస్తుత వానాకాలంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు ఆలస్యమైతే లేదా తక్కువగా కురిస్తే వరిసాగు ప్రమాదంలో పడే అవకాశం ఉండటంతో, నారుమడులు వేయడంపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు.

    స్వల్పకాలిక వరి రకాలపై కానరాని ఆసక్తి

    వర్షాభావ సూచనలు, నీటి లభ్యతపై అనిశ్చితి, సాగు ఖర్చుల పెరుగుదలతో ఈసారి వరి విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, వరిపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, కంది, పెసర, నువ్వులు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం మేలని వారు చెబుతున్నారు. వరివేస్తే 120రోజుల్లోపు పండే స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేస్తున్నప్పటికీ అన్నదాతల్లో ఆశించిన స్పందన కనిపించడం లేదు. అధిక దిగుబడి ఆశతో చాలా మంది దీర్ఘకాలిక వరి రకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    భూగర్భ జలాల్లో క్షీణత

    అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా లోటు వర్షపాతం నమోదైతే.. ఆ ప్రభావం తప్పకుండా భూగర్భ జలాలపై ఉంటుంది. అదే సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుంచి ఇప్పట్లో నీరు అందించే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, ఉమ్మడి జిల్లాకు సాగు, తాగు నీటికి ప్రాణాధారంగా భావించే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల నుంచి వచ్చే వరదపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంతోపాటు ఎగువన కూడా లోటు వర్షపాతం నమోదైతే కాలువల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గిపోయే ప్రమాదముంది. వరద కాలువలు, ఎస్సారెస్పీ కాలువలు నిండుగా ఉన్నప్పుడు చుట్టుపక్కల భూగర్భ జలాలు సంతృప్తస్థాయిలో ఉంటాయి. కాలువల్లో నీరు తగ్గితే.. వీటి పరివాహక ప్రాంతాలతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పడిపోతాయని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    (లక్షల ఎకరాల్లో)

    ఆరుతడి పంటలే మేలు

    వర్షపాతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలిక వరి రకాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలి. ఎల్‌నినో ప్రభావం ఎంత మేరకు ఉంటుందో, జూలై నెలలో వర్షాలు ఎలా కురుస్తాయో అన్నదానిపైనే ఈ ఏడాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ పరిస్థితి ఆధారపడి ఉండనుంది.

    – శ్రీనివాస్‌, డీఏవో పెద్దపల్లి

    ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో

    సాగు వివరాలు

  • పెద్దపల్లి: అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్‌రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూలమొక్క అందజేశారు.

    ఆయిల్‌పామ్‌ సాగుచేయండి

    జూలపల్లి: ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక ఆదా యం వస్తుందని జిల్లా ఉద్యాన ఆధికారి మహే శ్‌ అన్నారు. వడ్కాపూర్‌లో రైతు దాసరి ప్రశాంత్‌రెడ్డి, పుష్పలత 14 ఎకరాల్లో సాగుచేసిన ఆ యిల్‌పామ్‌ గెలలు పక్వానికి రావడంతో మంగళవారం వాటిని కోసి కంపెనీకి సరఫరా చేశా రు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాంప్రసాద్‌, ఉద్యాన విస్తరణాధికారి మహేశ్‌ తో కలిసి తోట సందర్శించారు. మహేశ్‌ మా ట్లాడుతూ, జిల్లాలో 3,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేశారని తెలిపారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ హరీశ్‌, కంపెనీ ప్రతినిధులు, రైతులు ఉన్నారు.

    క్రికెట్‌ పోటీల్లో ప్రతిభ

    జ్యోతినగర్‌: అల్గునూరులో సోమవారం నిర్వ హించిన అండర్‌–16 సమ్మర్‌ క్రికెట్‌ కప్‌ టీ– 20 లీగ్‌ పోటీల్లో ఎన్టీపీసీకి చెందిన 22 యార్డ్స్‌ క్రికెట్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది. జట్టులోని కె.ఆదిత్య వర్ధన్‌ ప్రతిభ కనబరచడంతో బెస్ట్‌ ఆల్‌ రౌండర్‌ అవార్డు లభించింది. రోహిత్‌ బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు సొంతం చేసుకున్నాడని జట్టు పీఈటీ కోచ్‌ సుధేశ్‌కుమార్‌ తెలిపారు. క్రీడాకారులను అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మ నోహర్‌రావు, ఉపాధ్యక్షుడు మురళీధర్‌రా వు, గోదావరిఖని సీనియర్‌ క్రికెటర్‌, కోచింగ్‌ క్యాంపు నిర్వాహకుడు డి.కిరణ్‌కుమార్‌యాదవ్‌ తదితరులు అభినందించారు.

    నిందితుడిని ఉరితీయాలి

    కోల్‌సిటీ: ఖమ్మంలో బాలికపై అత్యాచారం చేసి భవనం పైనుంచి తోసివేసిన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయాలని మహిళా సురక్ష వేదిక డిమాండ్‌ చేసింది. రామగుండం బల్దియా కా ర్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశా రు. వారు మాట్లాడుతూ, బాలికపై జరిగిన దా రుణం రాష్ట్రాన్ని కలచివేసిందని, ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠి న చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు లలిత, కోట తిరుమల, పైతరి శరణ్య భవాని, ఇందిర, వీణ, వందన, హరిణి, శ్రీజ, ముని గాల సంపత్‌, అడిగొప్పుల రాజు, పైతరి రా జు, సంపత్‌ యాదవ్‌, మ్యాడగోని రవీందర్‌, ఆరెల్లి జలంధర్‌, పొన్నం శశికుమార్‌, రాజ్‌కుమార్‌, పల్లికొండ ప్రశాంత్‌, సంజీవ్‌, గోటిక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

    గ్రామ కమిటీలతో బలోపేతం

    పెద్దపల్లి: సంఘాన్ని బలోపేతం చేయడానికి గ్రామ, పట్టణ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని మున్నూరు కాపు సంఘం జిల్లా కన్వీనర్‌ పెంట రాజేశ్‌ పటేల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా కో కన్వీనర్లను మంగళవారం నియమించాక ఆ యన మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బలమైన సంఘంగా నిర్మిస్తామని, ప్రజాస్వా మ్య పద్ధతిలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహి స్తామని అన్నారు. జిల్లా కన్వీనర్‌గా పెంట రాజేశ్‌, కో కన్వీనర్లుగా జొన్నల రవి, తోముల శ్రీను, దొడ్ల దేవేందర్‌, బాలకృష్ణ, రాజేశంను నియామకం చేసినట్లు ఆయన ప్రకటించారు.

  • పెద్దపల్లిరూరల్‌: పట్టణంలో అమృత్‌ 2.0 పనులు నత్తనడకన సా..గుతున్నాయి. ప్రజల దాహం తీర్చేందుకు రూ.25 కోట్ల అంచనాతో చేపట్టిన పనుల్లో డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు ఉన్న(రాంపల్లి, చందపల్లి)ప్రాంతంలో ఐదేసి వేల లీటర్ల సామర్థ్యం గల సంప్‌లు నిర్మించారు. పలు వార్డుల్లో దాదాపు 25 కి.మీ. మేర పైప్‌లైన్‌ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 కి.మీ. వరకు పూర్తయినట్టు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పట్టణాల్లో తాగునీటి వ్యవస్థను మెరుగుపర్చాలన్న ఆలోచనతో అమల్లోకి తెచ్చిన అమృత్‌ 2.0 పథక ఉద్దేశం అమలుకు నోచడం లేదు.

    కూల్చారు సరే..కొత్తది కట్టేదెపుడో..!

    స్థానిక ఆర్డీవో ఆఫీసులో 50 ఏళ్లక్రితం నిర్మించిన 8,18,280 లీటర్ల సామర్థ్యం గల పాతవాటర్‌ ట్యాంకు కూల్చిన అధికారులు.. అక్కడే 17.50 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో మమరోట్యాంక్‌ నిర్మించాలని నిర్ణయించారు. పాతది కూల్చివేసి 8నెలలు గడిచినా కొత్తదాని పనులు ప్రారంభించనేలేదు. పాతది బలంగానే ఉందని, దానిని కూల్చి ప్రజాధనం వృథా చేశారని పట్టణవాసి ఎన్‌డీ తివారీ స్థానిక అధికారులు మొదలు సీఎంవో ఆఫీసు వరకూ ప్రతీఒక్కరికి ఫిర్యాదు చేశారు. అయినా, కొత్త ట్యాంకు పనులు కార్యరూపం దాల్చలేదు. దీంతో పాత ట్యాంకు నుంచి ఇంటింటికీ తాగునీటి సరఫరా నిలిచిపోయి పట్టణ ప్రజలకు ఇబ్బంది ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై డైరెక్టు పంపింగ్‌ ద్వారా కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తు న్నా.. ఇంకా అక్కడక్కడా తాగునీరందక సమస్యలు ఎదుర్కొంటున్నామనే ఫిర్యాదులు వస్తున్నాయి.

    లీకేజీలు.. భగీరథ వృథా

    పలు ప్రాంతాల్లోని ప్రధాన పైపులు లీకవుతున్నాయి. దీనికితోడు ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పైపుల ద్వారా నీరంతా వృథాగా డ్రైనేజీల్లోకి చేరుతోంది. ఇటీవల ఏడో వార్డు సందర్శనలో మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య నీటివృథాను అరికట్టేందుకు నల్లాలకు డమ్మీ వేయాలని సిబ్బందిని ఆదేశించారు. నీరు అవసరం లేని ఇంటి యజమానులు దుబారాను అరికట్టాలని సూచిస్తున్నారు. ఇలా లీకేజీలను గుర్తించి మరమ్మతు చేయడం నిత్యకృత్యమైంది.

    డిసెంబర్‌ వరకు పనులు పూర్తి

    అమృత్‌ పథకం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించి ఈఏడాది డిసెంబర్‌ వరకు పూర్తిచేస్తాం. పట్టణంలో మరో 10 కి.మీ. పొడవైన పైప్‌లైన్‌తోపాటు చందపల్లి, పెద్దపల్లిలో వాటర్‌ ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. చందపల్లిలో పనులు మొదలయ్యాయి. పెద్దపల్లిలోనూ ప్రారంభిస్తాం. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా మా సిబ్బందితో ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నాం.

    – సతీశ్‌, ఏఈ, మున్సిపల్‌, పెద్దపల్లి

    నత్తనడకన తాగునీటి పథకం పనులు

    పాత ట్యాంకు కూల్చివేసి 8 నెలలు

    ఇంకా ప్రారంభంకాని కొత్త ట్యాంక్‌ నిర్మాణం పనులు

    కొన్ని ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు పడుతున్న జనం

    జిల్లా కేంద్రంలో అమృత్‌ పథకం ద్వారా చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోంది.. ప్రజలకు తాగునీటిని మెరుగ్గా సరఫరా చేసేందుకు వీలుగా పనులు వేగంగా చేయాలి.. ఆర్డీవో ఆఫీసులో కొత్త ట్యాంకు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేయాలి.

    – ఇటీవల జరిగిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నమాటలివి.

  • పెద్దపల్లి: సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్‌, దేశాల భూ పాల్‌, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వెంకటరెడ్డి, డీసీపీ రాంరెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన కా ర్యక్రమాలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని అన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. చట్టం ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు. గడువులోగా సమాచారం ఇవ్వపోతే సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతీ అధికారి ఆర్టీఐ చట్టంలోని అన్నినిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, అందిన ప్రతీదరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, వివిధ శాఖల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ, కమిషనర్‌ సూచించిన మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    చంద్రశేఖర్‌రెడ్డిని కలిసిన సీపీ

    కోల్‌సిటీ: గోదావరిఖని ఇల్లెందు క్లబ్‌కు చేరుకున్న సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డిని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

  • పెద్దపల్లి/ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.15 కోట్లు వెచ్చిస్తున్నామని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు తెలిపారు. హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో స్థపతి వల్లినయాగన్‌ చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.10 కోట్లు కేటాయించడంతోపాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఓదెల మల్లన్న ఆలయ కమిటీ చైర్మన్‌ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.

    విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌

    ఓదెల: విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ విజయరమణరావు హామీ ఇచ్చారు. శివపల్లిలో ఓదెల విశ్వబ్రాహ్మణులు ఆయనను మంగళవారం ఘనంగా సన్మానంచారు. 50ఏళ్ల వయసు నిండినవారికి పింఛన్‌ మంజూరు చేయాలని విన్నవించారు. నాగవెల్లి శ్రీమన్నారాయణ, నాగవెల్లి ఈశ్వర్‌, నూతి సత్యనారాయణ, బీమయ్య, నూతి శంకర్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Movies

  • తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌. మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ విలక్షణ డైరెక్టర్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ధనుష్ త్వరలోనే ఓ సరికొత్త సాహసానికి తెరలేపబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ హీరో మరోసారి దర్శకుడిగా మారి తన తనయుడ్ని హీరోను చేయబోతున్నాడని సమాచారం.

    ధనుష్ తన కుమారుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ మనవడు యాత్ర రాజాను హీరోగా పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆయనే దర్శకత్వం కూడా చేస్తాడట. ఒక స్టార్ హీరో తన కుమారుడిని హీరోగా లాంచ్ చేయడం కొత్త విషయం కాదు. కానీ ఒకవైపు దర్శకుడిగా మరోవైపు కొడుకును హీరోగా పరిచయం చేస్తూ, ఈ సినిమాను తానే నిర్మిస్తాడట ధనుష్. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఇప్పటికే యాత్ర నటన, డ్యాన్స్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతనితో ఓ టెస్ట్ షూట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

    రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్, హీరో ధనుష్‌ల పెద్ద కుమారుడు యాత్ర రాజా. ధనుష్- ఐశ్వర్య భార్యభర్తలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కానీ తల్లిదండ్రులుగా మాత్రం పిల్లల భాద్యతను కలిసే పంచుకుంటున్నారు. ఇక యాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ధనుష్ చాలా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన కుమారుడిని హీరో చేసే భాద్యతను మరో దర్శకుడి చేతిలో పెట్టకుండా తనే ఈ దర్శకత్వం చేసే భాద్యతను తీసుకుంటున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. 

  • మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తీస్తున్న సినిమా 'వారణాసి'. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే చెప్పేశారు. అందుకు తగ్గట్లే షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీకి అనుకోని అవాంతరాలు ఎదురైనట్లు కనిపిస్తున్నాయి. ఓ ముఖ్యమైన విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందని సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపిస్తోంది.

    (ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)

    ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చిన్నాపెద్దా.. ఏ సినిమాలకు అయినా ముందుగా ఓటీటీ డీల్ క్లోజ్ అయితేనే నిర్మాతలు కాస్త రిలాక్స్ అవుతున్నారు. స్టార్ హీరోలు చేసే మూవీస్‌కి ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. కరోనా టైంలో ఇష్టమొచ్చినట్లు సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు మాత్రం ఆచితూచి కొంటున్నాయి.

    ఓటీటీ డీల్ జరగన కారణంగానే చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్‌పై ఇప్పటకీ సస్పెన్స్ తెగట్లేదు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ 'వారణాసి' కూడా వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి రూ.1000 కోట్లకు పైనే బడ్జెట్ పెడుతున్నారని, అందుకు తగ్గట్లే ఓటీటీ డీల్ నుంచి రూ.400-500 కోట్ల వరకు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం పెట్టి మూవీ కొనేందుకు ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపించట్లేదట.

    (ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)

    దీంతో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. మరీ ఇంత మొత్తం కాకపోయినా 'వారణాసి'ని కొనే ఓటీటీ ఏదనేది చూడాలి. మార్కెట్‌లో ఉన్న వాటి బట్టి చూస్తే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ సంస్థలు మాత్రమే పోటీలో ఉంటాయి. మరి వీళ్లలో ఎవరు డిజిటల్ హక్కుల్ని దక్కించుకుంటారనేది చూడాలి?

    గ్లోబల్ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో తీస్తున్న 'వారణాసి'లో త్రేతా యుగాన్ని కూడా చూపించబోతున్నారు. ఇందులో భాగంగానే మహేశ్ కాసేపు రాముడిగా కనిపిస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళి గతేడాది బయటపెట్టారు. ఇకపోతే ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.

    (ఇదీ చదవండి: పెళ్లయిపోయింది.. రష్మిక, సమంతకు అదే పెండింగ్)

  • సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?

    (ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)

    సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్‌డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్‌గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.

    ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్‌లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్‌కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?

    రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్‌టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్)

  • హీరోయిన్ శ్రీలీల బర్త్ డే సెలబ్రేషన్స్‌

    లంగా ఓణీలో ముద్దుగుమ్మలా శ్రీదేవి

    కాక్‌టెయిల్ 2 కోసం కృతిసనన్ ఇలా

    పిల్లలు పుట్టాక కూడా ప్రణీత గ్లామర్

    పసుపు చీరలో సమంత సోయగాలు

    అందాల బొమ్మలా యాంకర్ శ్రీముఖి

  • థియేటర్లలో 'పెద్ది' హవా తగ్గిపోయింది. స్కూల్స్ తెరుచుకోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక దాదాపుగా తగ్గిపోయింది. మరో వారంరోజుల్లో రన్ కూడా కొలిక్కి వచ్చేయొచ్చు. ప్రమోషన్స్ కూడా ఆగిపోయినట్లే. ఈ క్రమంలోనే మూవీ నుంచి పూర్తి వీడియో సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. 'చికిరి చికిరి' పాట వీడియోని సోమవారం వదలగా.. ఇప్పుడు మరో రెండు హిట్ గీతాల్ని కూడా రిలీజ్ చేసేశారు.

    (ఇదీ చదవండి: బాడీ కౌంట్ వివాదంలో యాంకర్ విష్ణుప్రియ!)

    'పెద్ది'లో చికిరి చికిరి పాట తర్వాత రయ్ రయ్ రారా, ఐటమ్ సాంగ్ ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ రెండింటి వీడియోలని కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారు. ఈ క్రమంలోనే మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 'పెద్ది' చిత్రానికి ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు హైప్ బాగానే ఏర్పడింది గానీ రిలీజ్ తర్వాత టాక్ ఓ మాదిరిగా రావడంతో తెలుగులోనూ మాత్రం వసూళ్లు వచ్చాయి. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు.

    (ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)

Sports

  • ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ న్యూజిలాండ్‌కు శ్రీలంక జట్టు ఊహించని షాకిచ్చింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇవాళ (జూన్‌ 16) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

    తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. కెప్టెన్‌ అమేలియా కెర్‌ (45), సోఫీ డివైన్‌ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లతో సత్తా చాటగా.. మిథాలీ అయోధ్య, సుగంధిక కుమారి, కెప్టెన్‌ చమారీ ఆటపట్టు, నిమష మీపగే తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలో తడబడినప్పటికీ (55 పరుగులకే 4 వికెట్లు).. నిలాక్షిక డిసిల్వ (54 నాటౌట్‌), కౌషని నుత్యాంగన (24 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. 

    వీరిద్దరూ సత్తా చాటడంతో లంక జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే (19.4 ఓవర్లు) లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్ల నష్టానికి). కివీస్‌ బౌలర్లలో నెన్సి పటేల్‌ (4-0-23-2), రోస్‌మేరి (4-1-28-0), బ్రీ ఇల్లింగ్‌ (4-0-33-1) రాణించినా నిలాక్షిక, కౌషని జోడీని నిలువరించలేకపోయారు.

    ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. శ్రీలంకకు ముందు ఈ జట్టు విండీస్‌ చేతిలో కూడా చిత్తైంది. లంక విషయానికొస్తే.. ఈ ఎడిషన్‌లో ఈ జట్టుకు ఇదే తొలి గెలుపు. దీనికి ముందు ఇంగ్లండ్‌ చేతిలో ఘోరంగా ఓడింది.

     

  • టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు.

    గుర్బాజ్‌  ఫాస్టెస్ట్‌ సెంచరీ
    ఈ క్రమంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.

    గిల్‌ అజేయ అర్ధ శతకం
    మిగిలిన వారిలో అర్ష్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    లక్నో వేదికగా..
    ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్‌ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్‌ కృష్ణను తప్పించి మరో బౌలర్‌ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.

    యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రం
    అఫ్గన్‌తో తొలి వన్డేలో ప్రసిద్‌ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్‌ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్‌ యాదవ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్‌ యాదవ్‌ అఫ్గన్‌తో సిరీస్‌ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

    గత మ్యాచ్‌లో డెబ్యుడెంట్లు గుర్నూర్‌ బ్రార్‌, హర్ష్‌ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్‌కు కూడా వన్డే క్యాప్‌ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన ప్రిన్స్‌ యాదవ్‌ ఇప్పటికి 20 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.

    అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)
    శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌.

    చదవండి: వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

  • పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం మేర కోత విధించింది. ఇంగ్లండ్‌ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ జూన్‌ 12న మొదలైన సంగతి తెలిసిందే.

    భారత్‌ ఘన విజయం
    పన్నెండు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో.. ఆయా జట్లను గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌-‘బి’గా విభజించారు. గ్రూప్‌- ‘ఎ’లో ఉన్న భారత్‌- పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడ్డాయి. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ స్మృతి మంధాన అర్ధ శతకం (68) సాధించగా.. రిచా ఘోష్‌ మెరుపులు (17 బంతుల్లో 34) మెరిపించింది.

    పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా, సైదా ఇక్బాల్‌ రెండేసి వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్‌, రమీన్‌ షమీమ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ మహిళా జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్‌ అయింది.

    దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చి
    భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. శ్రీచరణి మూడు, షఫాలీ వర్మ ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందుకు గానూ ఐసీసీ పాక్‌ జట్టుకు శిక్ష విధించింది.

    జరిమానా విధించిన ఐసీసీ
    నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. జరిమానా వేసింది. ఒక ఓవర్‌ ఆలస్యంగా వేసినందున మ్యాచ్‌ ఫీజులో ఐదు శాతం కోతతో సరిపెట్టింది. కాగా పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టును ఎదుర్కోనుంది. గ్రూప్‌-ఎలో భాగంగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్‌ వేదిక.

    చదవండి: వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

  • గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్‌- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడుతున్నాడు.

    సూపర్‌ ఓవర్లో లంక విజయం
    ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్‌- ‘ఎ’ జట్టుపై సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది.

    నువ్వు ఇక ఇంటికి వెళ్లు
    ఈ క్రమంలో లంక ప్లేయర్‌ విశేన్‌ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్‌ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్‌.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.

    ఇంతలో లంక సీనియర్‌ ప్లేయర్‌ డిక్‌విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్‌ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్‌ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్‌ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

    స్పందించిన బీసీసీఐ
    ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్‌ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్‌ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.

    ముక్కోణపు వన్డే సిరీస్‌ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.

    ఆటపైనే దృష్టి పెట్టండి
    అక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్‌ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.

    కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా సూపర్‌ ఓవర్‌ విషయంలో కెప్టెన్‌ తిలక్‌ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్‌ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్‌ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. గాయం కారణంగా ఈ ‘రన్‌ మెషీన్‌’ ఆటకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2026 ఫైనల్లో ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఈ సందర్భంగా తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు.

    అకాయ్‌తో కోహ్లి
    ఫలితంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్‌ ముగిసిన వెంటనే అతడు లండన్‌కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో గార్డెన్‌లో తన కుమారుడు అకాయ్‌ను ఎత్తుకుని కోహ్లి ఆడిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

    మరికొన్ని ఫొటోల్లో కోహ్లి సతీమణి అనుష్క శర్మ తమ స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లుగా ఉంది. అయితే, వీరి కుమార్తె వామిక మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక అకాయ్‌ని కోహ్లి ఎత్తుకున్నట్లుగా ఉన్నప్పటికీ అతడి ఫేస్‌ మాత్రం రివీల్‌ కాలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

    లండన్‌లోనే...
    ఈ నేపథ్యంలో.. ‘‘ఇంకెప్పుడు చిన్నారి వామిక, జూనియర్‌ కోహ్లిని చూపిస్తావు భయ్యా!’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 2017లో వివాహం చేసుకున్న విరాట్‌- అనుష్కలకు తొలి సంతానంగా 20121లో కుమార్తె వామిక జన్మించింది.

    అనంతరం 2024లో లండన్‌లో ఈ జంట తమ కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చారు. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్‌లోనే నివసిస్తోంది. కాగా కోహ్లి- అనుష్క తమ పిల్లల్ని సోషల్‌ మీడియా ప్రపంచానికి దూరంగా పెంచుతున్నారు. 

    ఇంత వరకు వారి ఫొటోలను ఎక్కడా రివీల్‌ కాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్‌ భారత వన్డే జట్టుతో చేరాడు. ఇక అఫ్గనిస్తాన్‌ తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

Politics

  • సాక్షి, తాడేప‌ల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్‌రెడ్డి మండిప‌డ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.

    రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ప్రభుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు. ప్రెస్‌మీట్‌లో వీర‌శేఖ‌ర్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

    అప్పుల్లో చంద్ర‌బాబు గిన్నిస్ రికార్డు
    ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.

    ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.

    రాష్ట్ర ఆదాయం ఆవిరి
    వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ, జీఎస్‌టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.

    మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.

    గాడితప్పిన శాంతి భద్రతలు
    రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.

    'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?
    రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జ‌న‌సేన‌ నేతలు గతంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

  • సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్‌గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

    ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..

    రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్‌'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్‌మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.

    దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.

    కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతం
    సాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.

    మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.

    కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్
    హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.

    ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:
    కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.

    ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"

    గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.

    రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..
    మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. 

    ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.

    పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలు
    హోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? 

    మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై  అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు.  ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు.  సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?

    ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్‌ను హోటల్‌లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?

    సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.

    లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి.  కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.

    హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: రాజమ‌హేంద్ర‌వ‌రం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. క‌ల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్‌ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

    బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించే తీరిక లేదా?
    రాజమ‌హేంద్ర‌వ‌రంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘ‌ట‌న‌లో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్‌ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.

    ఖ‌ర్చుల‌న్నీ ప్రభుత్వమే భరించాలి
    మీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్‌ ప్రొక్యూర్‌మెంట్‌ యాక్ట్‌లో పిరియాడిక్‌ చెకప్‌ జరగాలని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్ర‌భుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 ల‌క్ష‌ల‌ పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు.

    ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు:  రితిక్ తండ్రి ల‌వ్‌రాజు
    కల్తీ పాలు తాగి మా బాబు రితిక్‌ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్‌, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. మాకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్‌ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.

    ప్ర‌భుత్వం హామీ నిల‌బెట్టుకోవాలి:  రుహానియా తండ్రి రాకేష్‌
    ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్‌బో చిల్డ్రన్స్‌ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్‌ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్‌ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు.

Telangana

  • సాక్షి,నల్గొండ: భారతదేశంలో బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే, కొన్ని రాజ్యాంగ బద్ద సంస్థలను నిర్వీర్యం చేస్తూ,రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ,సిబిఐ, ఈడీ సంస్థలను వాడుకొని ఇతర పార్టీ నాయకులను భయపెట్టి,అక్రమంగా కేసులు బనాయించి,అన్యాయంగా స్థానిక ప్రాంతీయ పార్టీలను అధికారం నుండి తొలగించే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

    ఈ రోజు నల్గొండ జిల్లాలోని దేవరకొండ,నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ఎస్ఐఆర్ పేరిట ప్రస్తుతం ఎన్నికల కమీషన్ ను అడ్డుపెట్టుకొని దేశ వ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో 86 లక్షల ఓట్లు తొలగించారని, బీహార్‌లో 46 లక్షల ఓట్లు తొలగించారని, ఉత్తరప్రదేశ్ లో సుమారు 2 కోట్లు మొత్తంగా ఇప్పటివరకు 6 కోట్ల  ఓట్లు తొలగించారన్నారు. అస్సాంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉన్నదని అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించలేదని విమర్శించారు.

    నిజంగా దేశ ఎన్నికల కమీషన్ పారదర్శకంగా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓడిపోయేది కాదన్నారు. తెలంగాణలో కూడా బిజేపి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నాయని, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి,ఆ కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

    బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో కలిసే ఉన్నాయని, అందుకే పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను, తొమ్మిది రోజులపాటు రేవంత్ రెడ్డి కాపాడారని స్పష్టం చేశారు. అంతేకాకుండా బీజేపీకి సహాయం చేయడానికి, రాజ్యసభ ఎంపిగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేస్తే,గాంధీ భవన్ నుండి లీకులు ఇచ్చి, ఆమెకు వెన్నుపోటు పొడిచి,మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు లీకులు ఇచ్చి ఆమె నామినేషన్ రద్దు చేయించారని పేర్కొన్నారు.

    అందుకే కాంగ్రెస్, బిజేపి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని వివరించారు. 2018లో చంద్రబాబు సేవామిత్ర మొబైల్ యాప్ ద్వారా వైఎస్సార్‌సీపీకి చెందిన ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తే, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు.

    అదే విధంగా తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి యాప్ తెచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. బీఎల్ఏలు అయ్యప్ప దీక్ష, భీమ్ దీక్ష, హనుమాన్ దీక్ష చేపట్టినట్లే, బిఆర్ఎస్  కార్యకర్తలు,బిఎల్ఏలు ఎస్ఐఆర్ దీక్ష చేపట్టి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బీఎల్ఓలు సర్వేలో భాగంగా ఇంటికి వస్తే ఖచ్చింతంగా నూతన ఓటు నమోదు కోసం ఫారం 6, తొలగించాలంటే ఫారం 7, అభ్యంతరాలు సవరణల కోసం ఫారం 8 నింపి ఇవ్వాలన్నారు. ఇసిఐ నెట్ మొబైల్ యాప్ ద్వారా బూత్ పరిధిలో ఉన్న ఇంటింటికి తిరిగి అర్హులైన అందరి ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని,తర్వాత బిఎల్ఓ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 

    నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఇటీవల ఏం చేసైనా, కిందపడి, మీద పడి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పడం వెనుక , ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్నందునే మాట్లాడారని,అందుకే బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి బిఎల్ఏలు అవసరం లేదని,ప్రభుత్వ ఉద్యోగులను,బిఎల్ఓలను వారు బిఎల్ఏలుగా పని చేసే విధంగా వారిని బెదిరించి పని చేయిస్తారన్నారు. అందుకే బిఎల్ఓలను,బిఎల్ఏలు వెంటవెంటనే అనుసరించి దొంగ ఓట్లు నమోదు కాకుండా,అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలని వివరించారు

    దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్,నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ,సూర్యాపేట శాసన సభ్యులు జగదీష్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి లింగయ్య యాదవ్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: మెట్రో ఫేజ్-2 నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-I ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ఫేజ్-1 టేకోవర్‌కు రూ.15,000 కోట్లు - రూ.1,461 కోట్లు ఈక్విటీ, రూ.13,538 కోట్లు రీఫైనాన్స్ నిధులు విడుదలకు సహకరించాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

    ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ శాంక్షన్ చేసినా నిధులు విడుదల చేయలేదన్న సీఎం.. రాష్ట్రం అన్ని షరతులు పూర్తి చేసిందని.. రూ.84 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించిందని లేఖలో రేవంత్‌ పేర్కొన్నారు. 1,461 కోట్లు ఎస్క్రో అకౌంట్‌లో జమ చేశాం.. అయినా ఐఆర్‌ఎఫ్‌సీ నిధులు ఆపేసిందన్న సీఎం.. ఫేజ్-2లో 7 కారిడార్లు, 122.9 కి.మీ, రూ.38,595 కోట్ల ప్రాజెక్ట్.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

    ఫేజ్-2కి 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్‌ డిమాండ్ చేశారు. కేంద్రం ఒప్పుకోకుంటే రాష్ట్రమే సొంతంగా ఫేజ్-2 చేపడుతుందన్న సీఎం.. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దానం అడగడం లేదన్న సీఎం.. డ్యూ డిలిజెన్స్ తర్వాత శాంక్షన్ అయిన లోన్ ఇవ్వమంటున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని.. బెంగళూరు, చెన్నై, ముంబై దూసుకుపోతున్నాయని.. హైదరాబాద్ వెనుకబడిందని సీఎం రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    తెలంగాణకు చెందిన కేంద్రమంత్రిగా జోక్యం చేసుకోవాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఆర్‌బీఐ డైరెక్ట్ డెబిట్ మెకానిజం, ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చాం. అయినా లోన్ ఆపేశారు. ఆర్‌ఎఫ్‌సీ ప్రభుత్వ రంగ సంస్థే.. కేంద్రం ఆదేశిస్తే వెంటనే నిధులు వస్తాయి. మెట్రో విస్తరణ ఆలస్యమైతే హైదరాబాద్‌కు తీవ్ర నష్టం. వెంటనే నిర్ణయం తీసుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: నారాయణగూడ సర్వే భవన్  డిప్యూటీ డైరెక్టర్ నరహరి అవినీతి అక్రమాల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు రూ.100కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. 

    సర్వే ల్యాండ్ రికార్డ్స్ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న నరహరిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.  ప్రతీ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో క్రింది స్థాయి సిబ్బందితో కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఛత్రినాకలోని నరహరి నివాసం.. నారాయణగూడ సర్వే భవన్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

    ఈ సోదాల్లో నరహరి నివాసంలో రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు రూ.1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి సీజ్‌ చేశారు. అంతేకాదు నరహరి బ్యాంక్‌ ఖాతాల్లో రూ.2.29కోట్లు గుర్తించారు. దీంతో పాటు రూ.5.04కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రంగారెడ్డి జిల్లాలో 5 ఫ్లాట్లు, 1.24 ఎకరాల భూమి, పుప్పాలగూడ, నార్సింగి, రాజేంద్రనగర్‌లో విలువైన ఫ్లాట్లు,గచ్చిబౌలిలో జీప్లస్‌3, ఛత్రినాకలో జీప్లస్‌ 2 భవనాలు గుర్తించారు. నరహరి భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. 
     

  • సాక్షి, హైద‌రాబాద్‌: గ్రేటర్‌ నగరం విస్తరించిన క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు గత ఫిబ్రవరి 10న ముగిసిపోగా, 11 నుంచి స్పెషలాఫీసర్‌ పాలన కొనసాగుతుండటం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ రూపాంతరం చెంది మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కావడంతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలపైనా పలువురు దృష్టి సారించారు. సాధారణంగా అయితే పాలకమండలి గడువు ముగిశాక ఆర్నెళ్ల లోపున కొత్త పాలకమండలి ఏర్పాటు కావాలి. అంటే ఆ లెక్కన ఆగస్టు రెండోవారంలోపున ఎన్నికలు జరగాలి. కానీ ప్రస్తుతమా పరిస్థితి కనిపించడం లేదు.

    ఓటరు జాబితాకు సంబంధించిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. ‘సర్‌’ ముగిశాక  అక్టోబర్‌ ఒకటో తేదీన ఓటరు తుది జాబితా వెలువడనుంది. అంటే, అప్పటిలోగా ఎన్నికలకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన  కార్యక్రమాలు అప్పటి నుంచి వడివడిగా చేపట్టినా, వార్డుల రిజర్వేషన్లు, మేయర్‌ రిజర్వేషన్లు తదితరమైనవి పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించేందుకు డిసెంబర్‌ వరకు పట్టే అవకాశం ఉందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.

    మూడింటికా..
    పాలకమండలి గడువును పరిగణనలోకి తీసుకొని కేవలం జీహెచ్‌ఎంసీకి మాత్రమే తొలుత ఎన్నికలు నిర్వహించి, దాని ఫలితాన్ని బట్టి సీఎంసీ, ఎంఎంసీలకు నిర్వహించనున్నారనే వాదనలున్నప్పటికీ, జీహెచ్‌ఎంసీ స్వరూపం మారిపోయింది. మిగతా రెండు కార్పొరేషన్లలోనూ పాత జీహెచ్‌ఎంసీ ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే  ఎన్నికలు ఒక్క కార్పొరేషన్‌కో.. రెండు లేక మూడు కార్పొరేషన్లకో జరగనున్నాయని చెబుతున్న వారూ ఉన్నారు. మూడు కార్పొరేషన్లకూ ఏకకాలంలో నిర్వహించే అవకాశాన్ని కాదనలేమని  పలువురు భావిస్తున్నారు.

    ఇటీవలే సీఎంసీ, ఎంఎంసీల సొంత కార్యాలయ భవనాలతో పాటు ఒక్కో కార్పొరేషన్‌లో వందల కోట్ల పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఈ అంశాలు ఉపకరించనున్నాయి. ఇక జీహెచ్‌ఎంసీకి సంబంధించి నల్లగొండ ఫ్లై ఓవర్‌ను ఆలోగా  ప్రారంభించడంతో పాటు మూసారాంబాగ్‌ బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నారు. వీటితోపాటు మూడు కార్పొరేషన్ల పరిధుల్లోనూ వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

    చ‌ద‌వండి: రంగుల ప్రపంచంలో గ్రామాలేవీ? 

    స్పష్టతకు అవకాశం.. 
    మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న కేబినెట్‌ సమావేశం జరగనుంది. తొలిసారిగా పేపర్‌లెస్‌ విధానంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ‘ఈ–కేబినెట్‌’ సమావేశంగా చెబుతున్నారు. సమావేశంలో వివిధ అంశాలతోపాటు క్యూర్‌లోని కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి కూడా కీలక చర్చ జరగనున్నందున  చర్చలో ఒక స్పష్టత రాగలదని భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం జరిగే సెన్సస్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు జరిగిన తీరులోనే హడావుడి లేకుండానే నిశ్శబ్దంగానే ఎన్నికల నగారా మోగవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు కూడా జరుగుతోందని సమాచారం.

Business

  • విమాన ప్రయాణం చేసే సమయంలో.. దాదాపు అందరూ సౌకర్యవంతమైన దుస్తులు, సులభంగా తొలగించడానికి వీలయ్యే షూస్, చలిని తట్టుకునేందుకు జాకెట్లు లేదా హుడీలు ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలామంది గమనించని ఒక చిన్న విషయం ఏమిటంటే? సాక్స్ రంగు. ముఖ్యంగా బ్లాక్ కలర్ సాక్స్ ధరించడం విమాన ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలకు కారణమవుతుందని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీనికి గల కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    విమానాల్లో.. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల సమయంలో, క్యాబిన్ లైటింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నల్ల రంగు సాక్స్ విమానంలోని పరిసరాలతో (కింది భాగం) కలిసిపోతాయి. ప్రయాణికులు షూస్ తీసేసి కాళ్లను ముందుకు చాచినప్పుడు లేదా నడిచే మార్గంలో ఉంచినప్పుడు, అవి సిబ్బందికి లేదా ఇతర ప్రయాణికులకు సులభంగా కనిపించకపోవచ్చు.

    విమానాల్లో నడిచే మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. క్యాబిన్ సిబ్బంది ఆహారం, పానీయాలు లేదా ఇతర సర్వీసులను అందించేందుకు తరచుగా ఆ మార్గాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో కాళ్లు స్పష్టంగా కనిపించకపోతే సిబ్బంది వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సర్వీస్ ట్రాలీలు కూడా కాళ్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది చిన్న విషయం లాగా కనిపించినప్పటికీ భద్రత పరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

    ఇంకో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. విమానాల నేలపై వివిధ రకాల సూక్ష్మక్రిములు, వైరస్‌లు కొంతకాలం జీవించి ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షూస్ తీసేసి కేవలం సాక్స్‌తోనే నేలపై నడవడం ఆరోగ్యపరమైన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంటుంది.

    ఈ నేపథ్యంలో.. నిపుణులు లేత రంగుల సాక్స్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. తెలుపు, బూడిద లేదా ఇతర లేత రంగుల సాక్స్ తక్కువ వెలుతురులో కూడా సులభంగా కనిపిస్తాయి. దీంతో సిబ్బంది, ఇతర ప్రయాణికులు వాటిని గుర్తించి ప్రమాదాలను నివారించగలరు.

  • డబ్బు నిజంగా మనిషికి సంతోషాన్ని ఇస్తుందా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. కొందరి అభిప్రాయం ప్రకారం.. సంతోషం అనేది ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం, జీవిత లక్ష్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మరికొందరు మాత్రం ఆర్థిక భద్రత ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని చెబుతారు. ఈ అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

    2019లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్‌లో ఒక రెడ్డిట్.. అపారమైన సంపద (డబ్బు) జీవితంలో నిజంగా సంతోషాన్ని పెంచిందా అని గేట్స్‌ను అడిగారు. దానికి ఆయన సమాధానంగా, ''అవును, నేను ఆరోగ్య ఖర్చులు, విద్య ఖర్చులు, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అది నాకు చాలా పెద్ద ఉపశమనం'' అని చెప్పారు. అంటే డబ్బు వల్ల ఆయనకు లగ్జరీ కంటే ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలేని జీవితం లభించిందని స్పష్టమవుతోంది.

    సంతోషంగా ఉండటానికి బిలియనీర్ కావాల్సిన అవసరం లేదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థిరత్వం ఉంటే సరిపోతుంది, అది మనిషి జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుందని చెప్పారు.

    అయితే నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డేనియల్ కాహ్నెమాన్, ఆర్థికవేత్త ఆంగస్ డీటన్ చేసిన పరిశోధనల్లో.. ఆదాయం పెరిగే కొద్దీ మనిషి జీవితంలో ఒత్తిడి తగ్గి సంతోషం పెరుగుతుంది. కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత అదనపు సంపద సంతోషాన్ని పెద్దగా పెంచదని తెలిపారు.

    ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!: ఎలాన్ మస్క్

  • ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న టోకు ధరల ఆధారిత సూచీ స్థానంలో వచ్చే ఐదేళ్లలోపు దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనుంది.

    దేశవ్యాప్తంగా మే నెలకు అన్ని కమోడిటీలకు సంబంధించి అవుట్‌పుట్‌ పీపీఐ 109.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో ఇది 108.6 శాతంగా ఉంది. తయారీ రంగానికి సంబంధించి ప్రయోగాత్మక ఇన్‌పుట్‌ పీపీఐ మే నెలకు 104.9గా ఉంది. ప్రయోగాత్మక విధానంలో విడుదల చేస్తున్న ఈ డేటా నాణ్యతను పరిశీలించి, భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

    అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉంది. దీంతో భారత్‌ సైతం డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారాలంటూ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చాన్నాళ్లుగా కోరుతోంది. దీనికితోడు నీతిఆయోగ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు పీపీఐకి మారాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఉత్పత్తి తయారీ లేదా సేవను అందించేందుకు కంపెనీకి అయ్యే వ్యయాన్ని ఇన్‌పుట్‌ ప్రైస్‌ రూపంలో, తయారీ అనంతరం ఆయా సంస్థలు విక్రయించే ధరను అవుట్‌పుట్‌ ప్రైస్‌ రూపంలో డేటాను విడుదల చేయనున్నారు.

    ఇన్‌పుట్‌ ధరలు పెరుగుతుంటే (కంపెనీలు వినియోగించే ముడి సరుకులు, విడిభాగాలు, మైక్రోచిప్‌లు తదితర), అంతిమంగా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తుంటాయి. దాంతో రిటైల్‌ ధరలు పెరుగుతాయి. ఈ డేటాకు అనుగుణంగా ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పీపీఐ అవుట్‌పుట్‌ ప్రైస్‌కు రవాణా, పన్నులు, వర్తకుల మార్జిన్‌లు కలసి రిటైల్‌ ధరలు నిర్ణయమవుతాయి.

National

  • ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్‌స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్‌కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్‌లోని 'కియానా హోమ్‌స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.

    రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Andhra Pradesh

  • సాక్షి,కాకినాడ: దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీహెచ్‌ అగ్రహారంలో చిన్నారి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అందులో తాను 40 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట ఉంది. 

    ఆ పామాయిల్ తోటలో చిన్నారి దాటిన కంచె వద్ద రెండు ఆట బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఈ బొమ్మలు అక్కడ కట్టిందెవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. వందల ఎకరాలు గాలింపు చర్యల్లో భాగంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ఎంతవరకు చేశారనేది నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ బొమ్మల్ని కంచెకు కట్టినట్లు తెలుస్తోంది.  ఈ బొమ్మలపై స్పష్టత రావాల్సి ఉండగా.. జ్ఞానేశ్వరి తల్లి భవానీ ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు. 

    జూన్ 6న తుని సమీపంలోని చిన్న అగ్రహారం గ్రామంలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. పోలీసులు విస్తృతంగా శోధన చేపడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి సుంకర భవానీ  సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. మీడియా ఎదుట ఆమె ఏడవకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

    ‘కెమెరా ముందు ఏడవడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఆమె వాపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు తనను మనోవేదనకు గురి చేస్తున్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి తల్లి మాట్లాడుతూ.. జనం సూటి పోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. నిందలు వేయడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. సోషల్ మీడియాలో కామెంట్లు మనో వేధనకు గురి చేస్తున్నాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా పరిష్కారం కాని పరిస్థితిలో, కుటుంబం ఆందోళనతో పాటు సోషల్ మీడియా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది.

    ప్రస్తుత జ్ఞానేశ్వరి కేసు వివరాలు
    జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు అదే కుటుంబానికి చెందిన పెట్ డాగ్ కూడా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది కానీ అసాధారణ ప్రవర్తన చూపించింది. పోలీసులు జీపీఎస్‌ ట్రాకర్ అమర్చారు. కానీ కుక్క ఆరోగ్యం క్షీణించి జూన్ 13న చికిత్సలో మరణించింది. దీంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు,ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌  బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.అడవి జంతువుల ప్రమేయం ఉందేమో తెలుసుకోవడానికి మాంసంతో నింపిన బొమ్మలను పొలాల వద్ద అమర్చారు. కుటుంబ సభ్యులు, పొరుగువారు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పామాయిల్‌ తోటల్లో ట్రాక్టర్లతో గడ్డిని తొలగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను బయటకు పంపుతున్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్‌ జగన్‌కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

Guest Columns

  • తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆడంబరంగా విడుదల చేసిన, రంగురంగుల ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్‌ డాక్యుమెంట్‌ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళికగా ప్రచారం పొందుతోంది. కానీ యువత, గ్రామీణ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రగామి ఆవిష్కరణ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దడం, ఫ్యూచర్‌ సిటీ, కృత్రిమ మేధస్సు కేంద్రాలు, గ్లోబల్‌ పెట్టుబడులు, బుల్లెట్‌ రైళ్లు, మెగా కారిడార్లు నిర్మించడం వంటి భారీ లక్ష్యాలను ఈ పత్రం ప్రతిపాదిస్తోంది.

    మొదటి చూపులో ఇది సాహసోపేత, భవిష్యత్‌ దృష్టితో కూడిన పత్రంలా కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే గ్రామీణ ప్రజలు, రైతులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ విద్యపై ఆధారపడే కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు సమగ్ర సమాధానం ఇవ్వలేకపోయిందనే భావన కలుగుతుంది. ఏ అభివృద్ధి నమూనాకైనా అంతిమ కొలమానం జీడీపీ వృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు, విద్యా నాణ్యత, ప్రాంతీయ సమానత్వం, సామాజిక చలనశీలత వంటివే ముఖ్యమైనవి.

    ఉపాధి కల్పనలో స్పష్టత ఏది?
    ఈ పత్రంలో 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? మహిళల భాగస్వామ్యం ఎంత? వంటి ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం లేదు. చైనా అభివృద్ధి కేవలం బీజింగ్, షాంఘై, షెన్‌ జెన్‌ నగరాల మీద లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ‘పట్టణ, గ్రామస్థాయి సంస్థలు’ (టీవీఈ) పేరుతో లక్షల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించింది. గ్రామాల్లోనే ఉత్పత్తి, ప్రాసెసింగ్, సేవా రంగాలను అభివృద్ధి చేసి కోట్లాది ఉద్యోగాలను సృష్టించింది. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ప్రతి మండలాన్ని ఒక ఉత్పత్తి కేంద్రంగా, ప్రతి జిల్లాను ఒక ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపుతో అభివృద్ధి చేయాలి. నిజామాబాద్‌లో వ్యవసాయ ప్రాసెసింగ్, జగిత్యాల–కరీంనగర్‌ ప్రాంతాల్లో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు, ఆదిలాబాద్‌లో అటవీ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలు వంటి జిల్లా–ప్రత్యేక అభివృద్ధి నమూనాలు రూపొందించాలి. కానీ ప్రస్తుత పత్రంలో ఇలాంటి స్పష్టమైన జిల్లా స్థాయి ఆర్థిక వ్యూహం కనిపించదు.

    ఈ పత్రం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ఏఐ సిటీలు, జ్ఞాన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతోంది. కానీ వేలాది ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి? గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళా శాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు ఎలా బలోపేతం అవుతాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

    ఫిన్లాండ్‌ నమూనా ఈ విషయంలో ఎంతో ప్రాసంగికం. ఫిన్లాండ్‌ విద్యా విప్లవం రాజధానిలో ప్రారంభం కాలేదు. గ్రామీణ పాఠశాలల నుంచే ప్రారంభమైంది. గ్రామంలో చదివే విద్యార్థికి, నగరంలో చదివే విద్యార్థికి ఒకే నాణ్యత గల విద్య అందించాలనే లక్ష్యంతో వారు ముందుకు వెళ్లారు. తెలంగాణ కూడా దీనిని అనుసరించాలి.

    జర్మనీ అనుభవం మరో ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అక్కడ విద్య – ఉపాధి వేర్వేరు వ్యవస్థలు కావు. విద్యార్థి చదువు తున్నప్పుడే పరిశ్రమలో పనిచేసే ద్వంద్వ విద్యా విధానం అమలులో ఉంది. అందువల్ల విద్య పూర్తయ్యే నాటికి ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు అతనికి సిద్ధమై ఉంటాయి. తెలంగాణలో ప్రతి ఐటీఐ, ప్రతి పాలిటెక్నిక్, ప్రతి డిగ్రీ కళాశాలను స్థానిక పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది.

    తెలంగాణలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. వారికి కేవలం స్కిల్‌ హబ్‌లు సరిపోవు. ఉద్యోగ హామీ, అప్రెంటిస్‌షిప్‌ హామీ, స్థానిక పరిశ్రమల అభివృద్ధి, డిజిటల్‌ ఉపాధి అవకాశాలు, గ్రామీణ స్టార్టప్‌ వ్యవస్థలు అవసరం. ప్రతి నియోజకవర్గంలో బీపీఓ కేంద్రాలు, డిజిటల్‌ సేవా కేంద్రాలు, గ్రామీణ ఈ–కామర్స్‌ హబ్‌లు, మహిళా ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

    చ‌ద‌వండి: దేశంలో గిరిజన అభివృద్ధికి సవాళ్లు

    తెలంగాణ రైజింగ్‌ 2047 పత్రం అభివృద్ధిని ప్రధానంగా నగరాల విస్తరణ కోణంలో చూస్తోంది. కానీ 21వ శతాబ్దపు విజయ వంతమైన అభివృద్ధి నమూనా నగరాలు, గ్రామాల మధ్య సమతు ల్యతను సాధించడంలో ఉంది. ఇది గ్రామీణ నిరుద్యోగులను నగరా లకు వెళ్లేలా వలసలను ప్రోత్సాహిస్తుంది. హైదరాబాద్‌ అభివృద్ధి అవసరం. ప్రపంచ పెట్టుబడులు కూడా అవసరం. కానీ అదే సమ యంలో ములుగు గిరిజన విద్యార్థికీ, నాగర్‌కర్నూల్‌ రైతు కుటుంబానికీ, నారాయణపేట మహిళకూ ఈ విజన్‌ ఏం ఇస్తుందో కూడా స్పష్టంగా చెప్పాలి.

    - సీహెచ్‌.వి. ప్రభాకర్‌ రావు 
    సీనియర్‌ జర్నలిస్ట్‌