Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ వ‌రుస‌గా హ్యాట్రిక్ ఓట‌ముల‌ను చ‌విచూసింది. ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. 241 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హార్దిక్ సేన‌.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 222 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది.

    ముంబై బ్యాట‌ర్ల‌లో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌(71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(40), ర్యాన్‌ రికెల్టన్‌(37), సూర్యకుమార్‌ యాదవ్‌(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ రెండు, జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

    సాల్ట్‌, పాటిదార్ విధ్వంసం..
    అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రజత్‌ పాటిదార్‌(53), విరాట్‌ కోహ్లి(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్‌ డేవిడ్‌(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా, శార్థూల్‌ ఠాకూర్‌, మిచెల్‌ శాంట్నర్‌ తలా వికెట్‌ సాధించారు. 
     

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ముంబై బౌలర్లను ఉతికారేశాడు. 

    కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో పాటిదార్‌కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా  20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్‌.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో పాటిదార్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానానికి దూసుకెళ్లాడు.  పాటిదార్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 65 సగటుతో 195 పరుగులు చేశాడు. 

    అతడి స్ట్రైక్ రేట్(214.29) జట్టులోని ఇతర విధ్వంసకర బ్యాటర్లైన టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్,  ఫిల్ సాల్ట్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. అదేవిధంగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ చేసిన కెప్టెన్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ రికార్డును సమం చేశాడు. 2009 సీజన్‌లో డక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కూడా 17 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత గిల్లీ రికార్డును పాటిదార్‌ సమం చేశాడు.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాటిదార్‌తో పాటు ఫిల్ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్‌ కోహ్లి(53), డేవిడ్‌(34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా, శాంట్నర్‌, ఠాకూర్‌ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

  • ఐపీఎల్‌-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్‌తో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విరాట్‌.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

    తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్‌లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్‌తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్‌.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కింగ్‌ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

    కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
    ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సీఎస్‌కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.

    అదేవిధంగా టీ20ల్లో  అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్‌ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు. 

  • ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ పేల‌వ ప్ర‌ద‌ర్శన కొన‌సాగుతోంది. ఆదివారం ఏకనా క్రికెట్ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ పూర‌న్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. అయూశ్ బ‌దోని ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన పూర‌న్ గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది ప‌డ్డాడు. 21 బంతులు ఎదుర్కొన్న పూరన్‌.. 2 సిక్స్‌ల సాయంతో 19 పరుగులు చేశాడు.

    అయితే పూరన్ జిడ్డు ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికి ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ క‌రేబియ‌న్ ఆట‌గాడు ల‌క్నో త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 47 మ్యాచ్‌ల్లో 1422 ప‌రుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ ల‌క్నో త‌ర‌పున‌ 38 మ్యాచ్‌ల్లో 1410 పరుగులు న‌మోదు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో రాహుల్‌ను పూర‌న్ అధిగ‌మించాడు.

    ల‌క్నో త‌ర‌పున టాప్‌-3 ర‌న్ స్కోరర్లు వీరే
    నికోల‌స్ పూర‌న్‌-1422
    కేఎల్ రాహుల్‌-1410
    ఆయుష్ బ‌దోని-1038
    చదవండి: IPL 2026: 'అత‌డే మన బెస్ట్‌ బౌల‌ర్‌.. గెలిచే మ్యాచ్‌ల‌ను ద‌గ్గ‌రుండి ఓడిస్తాడు'

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 12) మధ్యహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

    ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-28-4), అశోక్‌ కుమార్‌ (4-0-32-2), సిరాజ్‌ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి లక్నోను కట్టడి చేశారు. రబాడ (4-0-54-1) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. రషీద్‌ ఖాన్‌ (4-0-25-0) వికెట్‌ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ మార్ష్‌ 11, పంత్‌ 18, బదోని 9, పూరన్‌ 19, అబ్దుల్‌ సమద్‌ 18, ముకుల్‌ ఛౌదరి 18, జార్జ్‌ లిండే 16, షమీ 12 (నాటౌట్‌), ఆవేశ్‌ ఖాన్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు.

    అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. శుభ్‌మన్‌ గిల్‌ (56), బట్లర్‌ (60) అర్ద సెంచరీలతో రాణించి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించి వేగంగా మ్యాచ్‌ను ముగించాడు. మిగతా ఆటగాళ్లలో సాయి సుదర్శన్‌ 15, తెవాతియా 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, దిగ్వేష్‌ రాఠీ తలో వికెట్‌ తీశారు.

     

  • MI vs RCB Live Updates: ఐపీఎల్‌-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.

    ఆర్సీబీ ఘన విజయం
    ఆర్సీబీ తిరిగి గెలుపు బాట పట్టింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. 

    ముంబై బ్యాట‌ర్ల‌లో షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్‌(71 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(40), ర్యాన్‌ రికెల్టన్‌(37), సూర్యకుమార్‌ యాదవ్‌(33) ఫర్వాలేదన్పించారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ రెండు, జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా తలా వికెట్‌ సాధించారు.

    ముంబై నాలుగో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 46 బంతుల్లో 120 పరుగులు కావాలి.
    ఒకే ఓవర్‌లో ముంబై రెండు వికెట్లు డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో తొలి బంతికి ర్యాన్‌ రికెల్టన్‌(37) ఔట్‌ కాగా.. ఐదో బంతికి తిలక్‌ వర్మ(1) ఔటయ్యారు. 9 ముంబై ఇడియన్స్‌కు స్కోర్‌: 85/2

    రోహిత్‌ రిటైర్డ్‌ హార్ట్‌
    ముంబైకి భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తొడ కండరాల గాయం కారణగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చాడు. 7 ఓవర్లకు ముంబై స్కోర్‌: 72/0

    దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు
    3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్‌ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ర్యాన్‌ రికెల్టన్‌(29), రోహిత్‌ శర్మ(9) ఉన్నారు.

    దుమ్ములేపిన ఆర్సీబీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్‌
    వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు బీభత్సం సృష్టించారు.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్‌ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రజత్‌ పాటిదార్‌(53), విరాట్‌ కోహ్లి(50) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. వీరితో పాటు టిమ్‌ డేవిడ్‌(16 బంతుల్లో 34) మెరుపులు మెరిపించాడు.

    ఆర్సీబీ మూడో వికెట్‌ డౌన్‌
    రజత్‌ పాటిదార్‌ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. కేవలం 20 బంతుల్లోనే 53 పరుగులు చేసిన పాటిదార్‌.. శాంట్నర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 194/3

    ఆర్సీబీ రెండో వికెట్‌ డౌన్‌
    ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 38 బంతుల్లో 58 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 185-2

    ఆర్సీబీ తొలి వికెట్‌ డౌన్‌
    ఫిల్‌ సాల్ట్‌ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది.  కేవలం 36 బంతుల్లో 78 పరుగులు చేసిన సాల్ట్‌.. శార్థూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 167/1. క్రీజులో విరాట్‌ కోహ్లి(47), రజత్‌ పాటిదార్‌(9 బంతుల్లో 34)ఉన్నాడు.

    దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు
    7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్‌ సాల్ట్‌(49), విరాట్‌ కోహ్లి(24) ఉన్నారు.

    3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 33/0
    3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(13), ఫిల్‌ సాల్ట్‌(17) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి మిచెల్‌ శాంట్నర్‌, మయాంక్‌ మార్కండే  వచ్చారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్‌ హాజిల్‌వుడ్‌కు విశ్రాంతి ఇవ్వగా జాకబ్‌ డఫీ తుది జట్టులోకి వచ్చాడు.

    తుది జట్లు
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్‌), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 12) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ 4000 ఐపీఎల్‌ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

    గిల్‌ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్‌లో చేరుకోగా.. రాహుల్‌ 105, క్రిస్‌ గేల్‌ 112, డేవిడ్‌ వార్నర్‌ 114, జోస్ట్‌ బట్లర్‌ 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్‌-5లో గిల్‌ రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు. దిగ్గజం విరాట్‌ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. గిల్‌ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.

    బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్‌ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. దిగ్గజం విరాట్‌ కోహ్లి టాప్‌-5లో కూడా లేడు.

    అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్‌ పరుగులు పూర్తి చేసిన టాప్‌-5 భారత ఆటగాళ్లు..
    సూర్యకుమార్‌ యాదవ్- 2714
    శుభ్‌మన్‌ గిల్- 2875
    సురేష్‌ రైనా- 2886 
    ఎంఎస్‌ ధోని- 2887 
    సంజూ శాంసన్‌- 2915

    మ్యాచ్‌ విషయానికొస్తే..  గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-28-4), అశోక్‌ కుమార్‌ (4-0-32-2), సిరాజ్‌ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్‌ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది. 

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ యువ సంచలనం ముకుల్‌ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అశోక్‌ కుమార్‌ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ ముకుల్‌ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్‌ హెల్మెట్‌ను తగిలి థర్డ్‌ మన్‌ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. 

    ఈ దెబ్బకు హెల్మెట్‌ ఉన్నా, ముకుల్‌ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్‌కు కంకషన్‌ టెస్ట్‌ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్‌కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్‌ కవర్‌ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్‌ పరిస్థితి ఏంటో అంచనా వేయడం​ కష్టంగా ఉండేది. 

    ఒకవేళ ముకుల్‌ హెల్మెట్‌ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్‌ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బంతి (154.2) కూడా అశోక్‌ ఖాతాలోనే ఉంది.

    ముకుల్‌ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్‌లో (కేకేఆర్‌పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముకుల్‌ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ముకుల్‌ వింటేజ్‌ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్‌ కూడా ధోని తరహాలోనే వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌గా ఉన్నాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్‌ కృష్ణ (4-0-28-4), అశోక్‌ కుమార్‌ (4-0-32-2), సిరాజ్‌ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్‌ 7 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది. 

  • ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌలింగ్ వైఫ‌ల్యం కొన‌సాగుతోంది. బ్యాటింగ్‌లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.

    220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్‌గా ఉన్న జయదేవ్ ఉనద్కట్ దారుణంగా విఫలమవుతున్నాడు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే జయదేవ్ పూర్తిగా తేలిపోయాడు.

    సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌లో అతడు తీవ్రంగా శ్రమించాడు. పంజాబ్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. ఉనద్కట్ తన మూడు ఓవర్ల కోటాలో 13.30 ఏకానమీతో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతడు విఫలమయ్యాడు.

    ఆ మ్యాచ్‌లో అయితే  ఉనద్కట్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌లలో కూడా అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొత్తంగా అతడు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు సాధించాడు. జ‌య‌దేవ్ ఏకాన‌మీ రేటు 10.90గా ఉంది.

    దీంతో ఇంత‌దారుణంగా విఫ‌ల‌మవుతున్న‌ప్ప‌టికి అత‌డిని ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో కొన‌సాగించ‌డం ప‌ట్ల ఎస్ఆర్‌హెచ్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఉనద్కట్‌ను సైతం ట్రోల్‌ చేస్తున్నారు. "బ్యాటింగ్‌లో కోహ్లి రన్‌ మిషన్‌ అయితే, బౌలింగ్‌లో ఉనద్కట్‌ ఒక రన్‌ మిషన్‌" అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

     'జ‌య‌దేవ్ ఉనద్క‌ట్ మ‌న బెస్ట్ బౌల‌ర్‌..  గెలిచే మ్యాచ్‌ల‌ను ద‌గ్గ‌రుండి ఓడిస్తాడు' అని మరొక నెటిజన్‌ ఈ సెటైరికల్‌ పోస్ట్‌ చేశాడు. అత‌డి స్ధానంలో ప్రఫుల్ హింగే, ఓంకర్ తర్మాలే వంటి యువ పేస‌ర్ల‌కు అవ‌కాశ‌మివ్వాల‌ని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌కైనా ఉనద్కట్‌పై ఎస్‌ఆర్‌హెచ్ వేటు వేస్తుందో లేదో చూడాలి.
    చదవండి: IPL 2026: వైభవ్‌ సూర్యవంశీకి భారీ షాక్‌..! ఒకవేళ అదే జరిగితే?

  • ఐపీఎల్‌ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్‌కు బిగ్‌ న్యూస్‌ అందింది. రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న శ్రీలంక పేసర్‌ మతిష పతిరణ త్వరలో జట్టులో చేరబోతున్నాడు. సొంత దేశ క్రికెట్‌ బోర్డు (SLC) నుంచి అతనికి NOC లభించింది. గాయం కారణంగా పతిరణ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా అతను ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసి, SLC అనుమతితో ఐపీఎల్‌ 2026లో అడుగుపెట్టబోతున్నాడు.

    ఏప్రిల్‌ 14న సీఎస్‌కేతో జరుగబోయే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. పతిరణ రాక కేకేఆర్‌ బౌలింగ్‌ విభాగానికే కాకుండా జట్టు యావత్తుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు హర్షిత్‌ రాణా, ఆకాశ్‌దీప్‌ సేవలు కోల్పోయి పేలవ ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పుడు పతిరణ రాక కేకేఆర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

    కాగా, ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో పాటు ఓ మ్యాచ్‌ అన్యాయంగా వర్షార్పణం అయ్యింది.

    ఇదిలా ఉంటే, పతిరణ గైర్హాజరీలో విదేశీ పేసర్‌గా జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ పలు మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతని నుంచి ఆశించి ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్‌కు చేదు అనుభవాలు మిగిలాయి. చివరికి గాయంతో బాధపడుతున్న గ్రీన్‌తో బౌలింగ్‌ చేయించినా సానుకూల ఫలితాలు రాలేదు. సీజన్‌ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్‌ రూపంలో కేకేఆర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 

  • ఐపీఎల్‌-2026లో శుక్ర‌వారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజ‌స్తాన్ గెలుపొందిన‌ప్ప‌టికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.

    మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్  డగౌట్‌లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం..  మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్‌లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ  ఘటనపై ఐపీఎల్ ఫౌండర్‌, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.

    రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా'  నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. 

    కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్‌ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది.

     బీసీసీఐ యాంటి కరప్షన్‌ యూనిట్‌ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్‌ ఉంది.

    మరోవైపు రుమీ బింద‌ర్ ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన 15 వైభ‌వ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని  టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.
    చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

  • లక్నోపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం 

    లక్నో 164/8(20) 
    గుజరాత్‌ 165/3(18.4)

    లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌
    165 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ లక్ష్యం దిశగా సాగుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ వికెట్‌ నష్టానికి 69 పరుగులుగా ఉంది. గిల్‌ (40), బట్లర్‌ (14) క్రీజ్‌లో ఉన్నారు. 

    గుజరాత్‌ టార్గెట్‌ 165
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో ని​ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్‌ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. 

    ఏడో వికెట్‌ కోల్పోయిన లక్నో
    18.1వ ఓవర​్‌- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి ముకుల్‌ చౌదరి (18) ఔటయ్యాడు.

    ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో
    14.3వ ఓవర్‌-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పూరన్‌ (19) ఔటయ్యాడు.

    నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో
    లక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 96 పరుగులుగా ఉంది. పూరన్‌ (6), సమద్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. 

    రెండో వికెట్‌ కోల్పోయిన లక్నో
    4.1వ ఓవర్‌- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో తెవాతియాకు క్యాచ్‌ ఇచ్చి పంత్‌ (18) ఔటయ్యాడు. 

    మార్ష్‌ (11) ఔట్‌
    1.3వ ఓవర్‌- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. 

    టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
    ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 12) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

    తుది జట్లు..

    గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ 

    ఇంపాక్ట్ సబ్స్‌: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్

    లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

    ఇంపాక్ట్ సబ్స్‌:  మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే సింగం​ సంజూ శాంసన్‌ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ జూలు విదిల్చి సూపర్‌ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్‌ (4-0-18-4), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది.

    ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్‌ సెంచరీకి (400) చేరింది.

    పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్‌ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. 

    వీరిలో రోహిత్‌ శర్మ (554), విరాట్‌ కోహ్లి (440), సూర్యకుమార్‌ యాదవ్‌ (421) వంటి సిక్స్‌ హిట్టింగ్‌ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్‌గా పొట్టి క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్‌ పోలార్డ్‌ (982), ఆండ్రీ రసెల్‌ (784) తదితర విండీస్‌ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ 9, విరాట్‌ కోహ్లి 21, సూర్యకుమార్‌ యాదవ్‌ 23, సంజూ శాంసన్‌ 29 స్థానాల్లో ఉన్నారు. 

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (115 నాటౌట్‌) సూపర్‌ సెంచరీ సాధించి సీఎస్‌కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్‌ నుంచి సీఎస్‌కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.

    ఇందులో ముఖ్యమైనది..
    సంజూ తన ఐపీఎల్‌ కెరీర్‌‌లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్‌లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్‌లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 

    2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్‌లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఉన్నాడు. 

    మెక్‌కల్లమ్‌ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్‌లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్‌లో తొలి సెంచరీలు చేశారు.

    ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు..  
    2008- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌
    2009- ఏబీ డివిలియర్స్‌
    2010- యూసఫ్‌ పఠాన్‌
    2011- పాల్‌ వాల్తాటి
    2012- అజింక్య రహానే
    2013- షేన్‌ వాట్సన్‌
    2014- లెండిల్‌ సిమన్స్‌
    2015- బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌
    2016- క్వింటన్‌ డికాక్‌
    2017- సంజూ శాంసన్‌
    2018- క్రిస్‌ గేల్‌
    2019- సంజూ శాంసన్‌
    2020- కేఎల్‌ రాహుల్‌
    2021- సంజూ శాంసన్‌
    2022- జోస్‌ బట్లర్‌
    2023- హ్యారీ బ్రూక్‌
    2024- విరాట్‌ కోహ్లి
    2025- ఇషాన్‌ కిషన్‌
    2026- సంజూ శాంసన్‌

    పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (2), సీఎస్‌కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్‌ రాహుల్‌ ఈ ఘనతను సాధించాడు. రాహుల్‌ పంజాబ్‌, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. 

  • ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్‌ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్‌లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. 

    ఓవరాల్‌గా సురేఖ కెరీర్‌లో ఇది 12వ ప్రపంచకప్‌ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్‌ నుంచే భారత్‌, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్‌లో భారత్‌ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్‌లో ఆధిక్యం 114-117 తగ్గింది. 

    అయితే మూడో రౌండ్‌ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్‌ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.

    చదవండి: అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు!

  • ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద చిరుతలా పరుగులు పెట్టిన స్ప్రింటర్ గుర్తుకువస్తాడు. పరుగుపందెంలో మిగిలిన వారికీ, ఉసేన్ బోల్ట్‌కి మధ్య ఉన్న దూరం చూసి, ప్రపంచం విస్తుపోయింది.  100, 200, 400 మీట‌ర్ల ఈవెంట్స్‌లో బోల్ట్ ప్ర‌పంచ రికార్డులు నెల‌కొల్పాడు. తాజాగా 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో బోల్ట్ నెలకొల్పిన రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల కుర్రాడు గౌట్‌ బద్దలుకొట్టడం విశేషం. 

    ఆస్ట్రేలియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం ఈ అద్భుతం చోటుచేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసులో గౌట్ 19.67 సెకన్లలో గమ్యాన్ని చేరి సరికొత్త సృష్టించాడు. ఇంతకముందు ఉసేన్ బోల్ట్ 200 మీటర్ల రేసును 19.93 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో గౌట్ ఇదే 200 మీటర్ల రేసును 20.02 సెకన్లలో పూర్తి చేశాడు. 

    తాజాగా తన రికార్డును మరింత సవరించడమే గాకుండా ఏకంగా జమైకా చిరుత బోల్ట్ రికార్డుకు ఎసరు పెట్టి నయా చిరుతగా ఆవిర్భవించాడు. ఇక ఫైనల్లో తన ప్రత్యర్థుల నుంచి గౌట్‌కు పోటీ ఎదురైంది. ఐడాన్ మర్ఫీ 19.88 సెకన్లతో రెండో స్థానంలో, కాలబ్ లా 20.21 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఫైనల్‌కు ముందే లాచ్లెన్ కెన్నెడీ వైదొలగడం కూడా గౌట్‌కు కలిసొచ్చింది.

    ఎవరీ గౌట్‌?
    గౌట్ పేరెంట్స్ అత‌డు పుట్ట‌కముందే ద‌క్షిణ సుడాన్ నుంచి ఆస్ట్రేలియాకు వ‌ల‌స వ‌చ్చారు. క్వీన్స్‌లాండ్‌లో నివాసం ఏర్ప‌ర‌చుకున్న మోనికా, బోనా దంప‌తుల‌కు ఏడుగురు సంతానం. అయితే గౌట్ పూర్వీకుల‌ది ఈజిప్ట్ కావ‌డంతో అత‌డికి ఆ పేరు పెట్టారు. సౌత్ఈస్ట్ క్వీన్స్‌లాండ్‌లోని ఇప్స్‌విచ్ గ్రామర్ స్కూల్‌లో చ‌దువుకున్న గౌట్ చిన్న‌ప్ప‌టి నుంచి సాక‌ర్ ఆడ‌డం నేర్చుకున్నాడు. 

    అలా అథ్లెటిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత పూర్తి అథ్లెటిక్స్‌లోకి మారిన గౌట్ అండ‌ర్ 16 విభాగంలో 100, 200 మీట‌ర్ల ప‌లు రికార్డులు నెల‌కొల్పాడు. 14 ఏళ్ల వ‌య‌సులో గౌట్ 100 మీట‌ర్ల రేసును 10.57 సెక‌న్ల‌లో పూర్తి చేసిస స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల వ‌య‌సులో గౌట్ అండ‌ర్‌-18 విభాగంలో 200 మీట‌ర్ల రేసును 20.87 సెకన్ల‌లో పూర్తి చేసి దేశ‌వాలీలో రికార్డు నెల‌కొల్పాడు. 

    అంత‌ర్జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ స‌త్త చాటిన గౌట్ ఓషినియా అండ‌ర్ 18 అథ్లెటిక్స్ చాంపియ‌న్‌షిప్స్‌లో 200 మీట‌ర్లు, 4x400 మీట‌ర్ల రిలేలో స్వ‌ర్ణ ప‌త‌కాలు కైవ‌సం చేసుకున్నాడు. ఇక ఉసేన్ బోల్ట్, 2009లో 100 మీటర్ల పరుగు పందెన్ని 9.58 సెకన్లలో పూర్తి చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే 150 మీటర్లను 14.35 సెకన్లు, 200 మీటర్లను 19.19 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. 

    2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 2, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 3, 2016 రియో ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సాధించిన ఉసేన్ బోల్ట్, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 11 స్వర్ణాలు సాధించాడు. 

     చదవండి: దేశ ప్రజలను అవమానించిన పాక్‌ క్రికెటర్‌!

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్‌ (115 నాటౌట్‌) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (59 రిటైర్డ్‌ ఔట్‌) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్‌ దూబే (20 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్‌ (4-0-18-4), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్‌కేకు ఈ సీజన్‌లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.

    ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, ఢిల్లీ ఆటగాడు నితీశ్‌ రాణాకు జరిమానా విధించింది.

    సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్‌ స్లో ఓవర్‌రేట్‌ మెయిన్‌టైన్‌ చేసినందుకు గానూ మ్యాచ్‌ ఫీజ్‌లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్‌కు మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్‌ పాయింట్‌ శిక్షగా విధించబడింది. సీఎస్‌కేకు ఈ సీజన్‌లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.

    నితీశ్‌ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్‌లో) ట్రిస్టన్‌ స్టబ్స్‌ గ్లవ్స్‌ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు. 

    దీంతో నితీశ్‌ మధ్యలో కల్పించుకొని స్టబ్స్‌కు వత్తాసుగా ఫోర్త్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్‌ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్‌ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కేటాయించారు.

Movies

  • తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం జననాయగన్ పైరసీ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి గంటపాటు కంటెంట్ లీక్ కావడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఫుల్ సినిమా లీక్ అయినప్పటికీ వెంటనే దానిని అడ్డుకోవడంలో చిత్ర యూనిట్‌ సక్సెస్ అయ్యారు. అయితే కొన్ని క్లిప్పులు మాత్రం వాట్సాప్ ఫార్వార్డుల రూపంలో విస్తృతంగా వ్యాపించాయి.  

    కాగా లీక్ అయిన వీడియోలు చూసి కొంతమంది సోషల్‌మీడియా జనాలు రివ్యూలు చెబుతున్నారు. అయితే లీక్ సీన్స్‌లోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు-నటుడు అమీర్ తమను ఉగ్రవాదులుగా చూపించారు. ఇదేనా మీ రాజకీయం?.. అంటూ ప్రశ్నించారు. సినిమాలో ఇలాంటి రాజకీయ కోణం ఎక్కువగా ఉండటంతోనే ఇంతకాలం సెన్సార్ క్లియర్ కాలేకపోయిందని అమీర్ అనుమానం వ్యక్తం చేశారు. 

    కానీ సగటు సినీ అభిమానులు మాత్రం లీక్ సీన్స్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో రాజకీయంగా ఈ లీకేజీ వ్యవహారం విజయ్ పాపులారిటీని మరింత పెంచుతుందనే చర్చ కూడా నడుస్తోంది. అయితే విజయ్ స్టార్ పవర్ వల్ల లీక్ క్లిప్పులు పాపులారిటీని పెంచినా, నిర్మాతలు మాత్రం భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.  

  • ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే ఇవాళ కన్నుమూశారు. శనివారం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచారు. వేల పాటలతో శ్రోతలను అలరించిన ఆశా భోస్లే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె మరణం పట్ల యావత్ సినీ లోకం నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా ఆశా పాడిన పాటలను అందరూ గుర్తు చేసుకున్నారు.

    ఆశా భోస్లే దాదాపు 20 భాషల్లో పాటలు పాడారు. హిందీతో పాటు తెలుగులోనూ ఆమె తన గాత్రం అందించారు. లతా మంగేష్కర్‌ సిస్టర్‌ అయిన ఆశా తెలుగులో పాడిన పాటలు పాడి ఆడియన్స్‌ను అలరించారు. ఆమె మరణం వేళ... తెలుగులో పాడిన పాటలు ఓ సారి గుర్తు చేసుకుందాం.

    • జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా)
    • ఇసాలకిడీ (పవిత్ర బంధం)
    • వెన్నెల (ఇద్దరు)
    • నాలో ఊహలకు (చందమామ)
    • ఆశా భోస్తే పాడిన తెలుగు పాటలివే..
    • ఇది మౌనగీతం (పాలు నీళ్లు)
    • జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు)
    • శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం)
    • ఓ ప్రేమ (అశ్వమేథం)

       

       

  • టాలీవుడ్ సింగర్ మంగ్లీ కన్నీటి పర్యంతమైంది. తనపై వస్తున్న ‍అసత్య ప్రచారంపై తన బాధను వ్యక్తం చేసింది. ఎవరో వచ్చి నాపై ఆరోపణలు చేస్తే.. ఏది పడితే రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. కేవలం పాటే నా ప్రాణమని మంగ్లీ ఆవేదన తెలిపింది. నిజనిజాలు తెలుసుకోకుండా నా గురించి ఎలాంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరింది. నేను కూడా సోషల్ మీడియా నుంచే వచ్చానని.. కానీ అదే నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

    ఆ వ్యక్తి కేవలం ఫేమస్ అవ్వడం కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నాడని మంగ్లీ అన్నారు. నన్ను, నా ఫ్యామిలీని రోడ్డుకు లాగకండని కోరింది. మీడియా అంటే తనకు చాలా గౌరవం ఉందని.. దయచేసి ఈ విషయంలో మీరు వెనక, ముందు చూసుకోవాలని సూచించింది. ఎవరెవరో నేనంటే పడని వాళ్లు.. నాపై ఆరోపణలు చేస్తుంటారని అన్నారు. నాపై పార్టీ ముద్రలు వేయడంతో 2003 తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు కూడా పాడలేదన్నారు. 
     

  • పెద్దవాళ్లకు మధ్య వయస్కులకు కొరియా ఒక దేశం అని మాత్రమే తెలుసునేమో గానీ నేటి యువత, టీనేజర్స్‌కు అదొక ఎమోషన్‌. కొరియన్‌ కల్చర్‌కు పట్టం కట్టే వెబ్‌ సిరీస్, కె–పాప్‌...వంటివి ఇప్పుడు భారతీయ యువతని ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద వినోదాలు.  అలా మన యువత అభిరుచులలో అగ్రగామిగా మారిన ఆ కొరియన్‌ కల్చర్‌... బహుశా ఈ సినిమా కధకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు.

    విదేశీ కలల విహారం...
     ఓ చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి తన కలల్ని నమ్ముకుని విదేశాలకు వెళ్లే  సినిమా కథలు మనం గతంలో చూశాం.  పడమటి సంధ్యారాగం...లాంటి సినిమాల్ని గుర్తుకు తెస్తూనే కొత్తగా అనిపించే సినిమా ‘‘మేడ్‌ ఇన్‌ కొరియా’’. తమిళనాడులోని అందాల ఊటీకి దగ్గరలో ఉన్న లవ్‌ డేల్‌ అనే చిన్న గ్రామానికి చెందిన షెన్‌బా అనే యువతి కలల కధే ఈ మేడ్‌ ఇన్‌ కొరియా. చిన్నప్పటి నుంచే కొరియా అంటే మక్కువ పెంచుకుంటూ వచ్చిన ఓ  అమ్మాయి ఏదో ఒకరోజు అక్కడికి వెళ్లాలని కలలు కంటుంది. అయితే తాను ఆశించిన విధంగా కాకుండా ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి  కొరియాలో అడుగు పెట్టాల్సి రావడం, అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా కనీసం మాట్లాడడానికి తనకు భాష కూడా రాని మనుషుల మధ్య  గడపాల్సి రావడం...వీటి వల్ల ఆమె జీవితం  ఎలాంటి కొత్త మలుపులు తిరుగుతుంది ఒంటరితనం నుంచి ఆత్మవిశ్వాసం వరకు ఆమె ప్రయాణం ఎలా  సాగుతుంది?  అనేదే ఈ కథ.

    కొన్ని నవ్వులు...కొన్ని భావోద్వేగాలు...
    కథలో కొత్తదనం ఉన్నప్పటికీ, దాన్ని చెప్పే విధానం మాత్రం చాలా సేఫ్‌గా, ఎక్కడా రిస్క్‌ తీసుకోకుండా సాగుతుంది. ఇది  కామెడీ సినిమా కాదు. అలాగే హెవీ మెలో డ్రామా కూడా ఉండదు. కొరియాలో షెన్‌బా కొత్త జీవితం ప్రారంభించే భాగాలు ఆసక్తికరంగా కొన్ని చోట్ల నవ్విస్తూ సాగుతాయి. అలాగే  ప్రత్యేకంగా మంచాన పడి ఉన్న వృద్ధురాలితో పెరిగిన అనుబంధం వారిరువురి నడుమ ఒకటి రెండు ఎమోషనల్‌ సీన్స్‌ మనసును తాకుతాయి.  యువత ఆశలకు, తల్లిదండ్రుల నమ్మకాలకు నడుమ సాగే వాగ్వివాదాలు ఎప్పుడూ ఉన్నవే అయినా ఇప్పటికీ ప్రస్తావనార్హమే కాబట్టి ఈ సినిమాలోనూ  కొన్ని అలాంటి బలమైన సన్నివేశాలు ఉంటాయి. అవకాశం ఉన్నా సినిమాలో ఎవరినీ విలన్‌ని చేయకపోవడం హాయిగా అనిపిస్తుంది. అలాగే కధానాయిక పుట్టిన ఊరు లవ్‌ డేల్‌ కూడా ప్రకృతి రమణీయతతో అలరారుతూ మనల్ని ఆకట్టుకుంటుంది.

    ఓజీ చిత్రంలో మనకు సాదా సీదాగా కనిపించిన ప్రియాంక మోహన్‌ ఈ సినిమా ద్వారా తన నటనలోని సత్తాను మనకు ప్రదర్శిస్తుంది. ఓ అమాయక అబల అనే పరిస్థితి నుంచి ఆత్మవిశ్వాసం గల సబలగా మారే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన బలం కాగా ఇండో–కొరియన్‌ కల్చర్‌ మిక్స్‌ కొత్తగా అనిపించడం మరో బలం.

    అయితే కథలోని భావోద్వేగాల్ని లోతుగా అన్వేషించే ప్రయత్నం చేయకుండా, సింపుల్‌గా ముగించేయడం ఎమోషన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు కొంత మేర నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో కధానాయికకు కొరియా అంటే ఎంత ఇష్టమో  అనేది చెప్పడంలో పెట్టిన శ్రద్ధ...ఆమె కొరియా వెళ్లిన తర్వాత ఆమె పొందిన ఉద్వేగం గురించి చెప్పడం మీద పెట్టలేదు. మొత్తంగా చూస్తే  ‘‘మేడ్‌ ఇన్‌ కొరియా’’ ఒక లైట్, ఫీల్‌ గుడ్‌ సినిమా. ఒక వీకెండ్‌లో సరదాగా కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీల్‌ని పొందాలంటే నిస్సందేహంగా మేడ్‌ ఇన్‌ కొరియా బెస్ట్‌ ఛాయిస్‌.  ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

  • అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

    ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్‌ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.

    అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. 

    తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్‌లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది.

  • టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు.  తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

    ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అడ్వకేట్‌ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

    m
     

  • స్టార్స్‌ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు.  టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ డమ్‌ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్‌ వన్‌ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా  మారుతోంది.

    ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్‌ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్‌ పరంగా చూసినా, అల్లు అర్జున్‌ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా  అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్‌ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ.  ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్‌ స్టార్‌ కాస్తా  ఒక్క ఉదుటున నెం1 ఐకాన్‌ స్టార్‌గా చేసింది పుష్పరాజ్‌ పాత్ర. 

    ప్రస్తుతం అల్లు అర్జున్‌ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్‌ సినిమా వండర్‌ అనీ త్వరలోనే మరో టాప్‌ హీరో నెం1 ఛెయిర్‌ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్‌ డమ్‌ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్‌ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.

    పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్‌ లాంటి భారీ హిట్‌ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన లోకేష్‌ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్‌ జోసెఫ్‌లను ఐకాన్‌ స్టార్‌ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

    అంతేకాకుండా   అల్లు అర్జున్‌ ప్రశాంత్‌ నీల్, సందీప్‌ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్‌లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నారు.   మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్‌ల మిశ్రమాన్ని అందించడం ద్వారా   భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.

    ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్‌ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్‌ విన్యాసాలకు  కేరాఫ్‌ లాంటి ప్రశాంత్‌ నీల్‌ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్‌ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్‌ కనగరాజ్‌ ల  వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. 

    ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్‌ సక్సెస్‌కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్‌ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్‌ వంటి  సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్‌ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్‌ బాబు...లతో పాటు పలువురు టాప్‌ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది.

     

  • లెజెండరి సింగర్‌  ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    ఆమె మరణం వేళ ఆశా సింగర్‌గా ఎంత సంపాందించారన్న విషయంపై బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన దిగ్గజ గాయని ఆశా భోస్లే ఆస్తులు దాదాపు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై తన గాత్రాన్ని వినిపించిన ఆమె బాగానే సంపాదించారు.

     అంతే కాకుండా ఆమె సొంత రెస్టారెంట్‌ను ఆశాస్ పేరుతో ప్రారంభించారు. ఇది దుబాయ్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు యూకేలోని బర్మింగ్‌హామ్, మాంచెస్టర్ వంటి నగరాల్లో విస్తరించింది. ఆశా భోస్లే తన డబ్బును రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు. తాజా నివేదికల ప్రకారం కేవలం ముంబై, పూణేలలోని విలాసవంతమైన గృహాలతో పాటు ఆమె ఆస్తుల విలువ రూ.80 -రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. 
     

  • ప్రముఖ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మరణంపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె గాత్ర తరతరాలుగా ఎన్నో రకాల భావోద్వేగాలను మోసుకొస్తూ.. భారతీయ సినిమాకు ఓ శాశ్వతమైన తోడుగా నిలిచిందని ట్వీట్ చేశారు. ఆమె ప్రతి పాటకు తీసుకొచ్చిన అప్రయత్నమైన సౌందర్యాన్ని.. బహుముఖ ప్రజ్ఞను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని మెగాస్టార్ రాసుకొచ్చారు.  భారతీయ సినిమా అత్యంత అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందన్నారు. ఈ సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చిరు పోస్ట్ చేశారు.

    జూనియర్ ఎన్టీఆర్ నివాళి..

    లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారి మరణ వార్త విని తీవ్ర బాధపడ్డానని ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన గాత్రం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణనాడిగా నిలిచిందన్నారు. ఆమె స్వరం లక్షలాది హృదయాలను తాకిందని.. ఆమె తరతరాలుగా నిలిచిపోయే వారసత్వాన్ని వదిలివెళ్లారని సంతాపం వ్యక్తం చేశారు.  అది ఎల్లప్పుడూ గౌరవంతో, ప్రేమతో గుర్తుంచుకోవాలని.. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.

    లెజండరి సింగర్‌, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) ఇవాళ కన్నుమూశారు.  ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు.  ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.
     

     

     

     

  • స్టేజ్‌పై సరదాగా మాట్లాడే టాలీవుడ్‌ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్‌ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్‌ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్‌ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. 

    ఓ సినిమా ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్‌ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు.  సీతారామం ఫేం మృణాల్‌ ఠాకుర్‌ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.

    తాజాగా ఆయన అడివి శేష్‌-మృణాల్‌ జంటగా నటించిన ‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్‌ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్‌ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. 

    ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్‌ తేజ్‌ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్‌) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్‌) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్‌ నవ్వుతూ అన్నాడు. 

  • లెజెండరి సింగర్‌ ఆశా భోంస్లే ఆదివారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆమె అభిమానులు తన జీవిత ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన అక్క లతా మంగేష్కర్‌తో ఉన్న విభేదాన్ని షేర్‌ చేస్తున్నారు. ఒక కుటుంబంలో రెండు గానకోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరిపడిపోయిన ప్రేక్షకులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆందోళన చెందారు.

    అక్కాచెల్లెళ్ళ మధ్య గొడవలు నిజమేనా..?
    లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో  ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. అయితే వారి మధ్య గొడవలు అన్నది కొంతవరకు నిజం, కొంతవరకు అపోహలతో కూడిన విషయమని చెబుతారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్‌ దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. ఆపై ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీ ఉండేది.

    లతా మంగేస్కర్ ఎక్కువగా ప్రధాన హీరోయిన్‌లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్య వచ్చేది. అయితే,  కొంతకాలం దూరం ఉన్న తర్వాత ఇద్దరూ మళ్లీ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేశారు.

    1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్‌కా రీ బెహ్‌కా...’ పాట తరువాత లత, ఆశా కలసి పాడలేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో  ఆశా భోంస్లే  ఒక పాటను పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్‌లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా అన్నారు ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.  ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని వ్యాఖ్యానించారు. లతా మంగేష్కర్  2022లో  కోవిడ్-19,  న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు.

  • ఆమె ఒక అగ్రగామి బాలీవుడ్‌ ప్రముఖుడి కుమార్తె..ఆ తర్వాత అందాల బాలీవుడ్‌ నటి బోలెడన్ని విజయాలు చవిచూసింది. బోలెడు మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే మాత్రమేం...  నిన్నటి బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఆలియా భట్‌ గత కొన్ని వారాలుగా అయోమయానికి గురవుతోంది. తన నాలుగేళ్ల చిన్నారిని ఎలా పెంచాలో తెలీక సతమతమవుతోంది. గత నవంబర్‌ 6, 2022న మాతృత్వంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి, ఆమె తాను చదువుతున్న పిల్లల పెంపకానికి సంబంధించిన పుస్తకాలను ఇన్ స్ట్రాగామ్‌ వేదికగా తరచు పంచుకుంటూ ఉండడం దీనికో  నిదర్శనం. 

    ఈ నేపధ్యంలోనే ఆమె తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు)తో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సద్గురు ముందు తాను ఎదుర్కుంటున్న సమస్య... పిల్లల పెంపకంపై సలహా ఇవ్వమని కోరడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. అయితే దానికి సద్గురు ఇచ్చిన సలహా ఇంటర్నెట్‌ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 

    జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ (జెఐటిఓ) చెన్నైప్లస్‌ ఆధ్వర్యంలో  ఇన్‌ కన్సర్వేషన్‌ విత్‌ మిస్టిక్‌ అనే థీమ్‌తో నిర్వహించిన ఈకార్యక్రమానికి హాజరైన ఆలియా భట్, సద్గురువుతో ఒక వ్యక్తి ఎంత సమయం నిద్రపోవాలి అనే అంశం మొదలుకుని ప్రధానంగా పిల్లల పెంపకం, ఇంటర్నెట్‌ యుగం, ట్రోల్స్, వైఫల్యం పట్ల భయం, అనే విషయాలపై చర్చించారు.

    ఈ సందర్భంగా  ‘మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తమ లాంటి తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?‘ అని ఆలియా భట్‌ సద్గురువును  అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ‘ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు.‘ ఆందోళన చెందే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.  పైగా వారు అంతగా ఆందోళన చెందడం ద్వారా తమకు తామే హాని చేసుకుంటారు’’ అంటూ సద్గురు అలియాకు స్పష్టం చేశారు.  

    దీనికి స్పందిస్తూ, ఆలియా భట్, ‘పిల్లల పెంపకం అనే ఆందోళనను తల్లిదండ్రుల్లో తొలగించగలమని నేను అనుకోను. మీరు  కూడా దీనిని అంగీకరిస్తారని  భావిస్తున్నాను,‘ అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమార్తె రాహాకు ఏం నేర్పించాలనే అంశంపై కూడా తాను మధనపడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో సద్గురు స్పందిస్తూ పిల్లలకు సంతోషంగా ఉండడం సహజంగానే వస్తుందని వారికి మీరు నేర్పించేంది ఏముంటుంది? అంటూ ఎదురు ప్రశ్నించారు. 

    మీ కుమార్తె రాహాకు కష్టపడి ఏదేదో నేర్పించే బదులు  సంతోషంగా ఎలా జీవించాలో తన కుమార్తె రాహా నుంచి నేర్చుకోమని సద్గురు ఆలియా భట్‌కు ఎదురు సలహా ఇచ్చారు. అనవసరమైన హడావిడి లేని తల్లిగా ఉండమని,జీవితంలోని ఆనందాలు ఎలా ఆస్వాదించాలో తన కుమార్తె నుంచి  నేర్చుకోమని ఆలియా భట్‌కు సద్గురు సూచించారు. 

    ఆ సంభాషణలో భాగంగా అలా నేర్చుకోవడం ఎలా అనేది కూడా సద్గురు ఆమెకు వివరించారని ఆయన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ వెల్లడించింది. ఏది ఏమైనా పిల్లల పెంపకంపై  నిత్యం ఆందోళన చెందే తల్లిదండ్రుల ఆలోచనలకు అద్దం పడుతూ అలియాభట్‌ వేసిన ప్రశ్నకు సద్గురు ఇచ్చిన సమాధానం ఓ పెద్ద చర్చనే లేవనెత్తిందని చెప్పాలి.

  • ఓటీటీల్లో సినిమాలతో పాటు డిఫరెంట్ స్టోరీలతో తీసిన బోలెడన్ని వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లలో అలా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న వాటిలో 'ఫ్రమ్' సిరీస్ ఒకటి. హీరో విశ్వక్ సేన్ చెప్పడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరికొందరికి తెలిసింది. ఇప్పుడీ సిరీస్ నుంచి నాలుగో సీజన్ వచ్చేస్తోంది. రీసెంట్‌గా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగా ఇప్పుడు అధికారిక ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

    'ఫ్రమ్' సిరీస్ విషయానికొస్తే.. అమెరికాలోని ఓ రహస్య గ్రామం. ఇక్కడికి ఒకసారి వచ్చినవాళ్లు తిరిగి బయటపడలేరు. పొద్దున్న అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రయితే ఈ ఊరిలో నరరూప రాక్షసుల్లాంటి మనుషులు తిరుగుతారు. వాళ్ల నుంచి ఇక్కడ ఉండే కొందరు ఎలా తమని తాము రక్షించుకున్నారు? ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అక్కడి నుంచి బయటపడ్డారా అనేదే కాన్సెప్ట్. ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 4వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

  • లెజండరి సింగర్‌, క్వీన్ ఆఫ్ వెర్సటిలిటీ ఆశా భోంస్లే(92) కన్నుమూశారు.  ఏప్రిల్ 11, శనివారం నాడు ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరారు.  ఇదే విషయాన్ని ఆమె మనవరాలు జానై భోస్లే తెలిపారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.

    ప్రముఖ సింగర్‌ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆశా భోంస్లే.. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 20 భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడారు. 2006లో ఆమె స్వయంగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, దాదాపు 12,000 పాటలను రికార్డ్ చేశారు.  దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1950వ దశకంలో బాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఆశా భోంస్లే 1952లో సంగ్దిల్ చిత్రంతో గుర్తింపుపొందారు.

    1970 దశకంలో పియా తు అబ్ తో ఆజా , దమ్ మారో దమ్ , చురా లియా హై తుమ్నే  పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా”, “ఉదేన్ జబ్ జబ్ జుల్ఫెన్ తేరీ” వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. ఆపై ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో ఆశా భోంస్లే పాడిన పాటలు ఒక ట్రెండ్ సెట్ చేశాయి. “ఆజా ఆజా,” “పియా తూ అబ్ తో ఆజా,” “యే మేరా దిల్” వంటి డ్యాన్స్ నంబర్లతో అప్పట్లోనే సంచలనం సృష్టించిన ఆశా భోస్లే  కమర్షియల్ పాటలకే పరిమితం కాకుండా గజల్స్ పాడి జాతీయ అవార్డులను సైతం అందుకున్నారు. 90వ దశకంలో ‘రంగీలా’ చిత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆశా భోంస్లే.. సంగీత సామ్రాజ్ఞిగా కీర్తి పొందారు.

  • హీరోయిన్, సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ.. గత నెలలో మరోసారి తల్లయింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ చిన్నారి నూలేకెట్టి వేడుకని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పిన పూర్ణ.. తన కూతురు ఫొటోలని తొలిసారి పంచుకుని, ఆమెకు పెట్టిన పేరు గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)

    'జమీలా అనేది నా అమ్మమ్మ పేరు. చిన్నప్పుడే కోల్పోయిన ఆమె జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు గనక కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నా కుమార్తెని ఒడిలోకి తీసుకున్న ఆ క్షణం.. అమ్మమ్మ నా దగ్గరకు తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. పాప పుట్టడం మా కుటంబానికి అపారమైన ఆనందాన్ని తీసుకొచ్చింది' అని పూర్ణ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

    పాప పుట్టన తర్వాత 28వ రోజున నూలేకెట్టి వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారమని.. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని చిన్నారికి ఆశీర్వాదాలు అందించారని.. హమ్దాన్ పెద్ద అన్నయ్యగా మారి కుటుంబంలో కొత్త బాధ్యతను స్వీకరించాడని పూర్ణ చెప్పుకొచ్చింది. 'దువా జమీలా'కి కుటుంబం ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని రాసుకొచ్చింది.

    కేరళకు చెందిన ఈమె.. సీమటపాకాయ్, అవును తదితర సినిమాలతో తెలుగులో గుర్తింపు సాధించింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ మూవీస్ చేసింది. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తూ, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చివరగా 'అఖండ 2'లో కనిపించింది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ని పెళ్లి చేసుకుంది. 2023లో ఈ దంపతులకు బాబు పుట్టగా, ఇప్పుడు పాప జన్మించింది.

    (ఇదీ చదవండి: 'వారణాసి'లో ఆ సాధువులంతా క్రిమినల్స్: తమిళ హీరో)

  • టాలీవుడ్‌ హీరో అడివి శేష్‌ నటించిన చిత్రం డెకాయిట్‌.. ఏప్రిల్‌ 10న విడుదలైన  ఈ మూవీని దర్శకులు షానియల్‌ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్‌లో సత్తా చాటింది.   సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్‌ ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.

    డెకాయిట్‌ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే,  ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో  ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్‌ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్‌ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్‌ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో సత్తా చాటుతుంది.
     

  • తమిళ హీరో ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారణాసిలోని కొందరు సాధువులు నకిలీ అని, వాళ్లంతా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తాను ఓ మూవీ షూటింగ్ సందర్భంగా తెలుసుకున్నానని చెప్పాడు. ఇతడు హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' మూవీ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని పంచుకున్నాడు.

    (ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్)

    'నాన్ కడవులే(నేనే దేవుడిని) షూటింగ్ కోసం వారణాసి వెళ్లాం. అయితే అక్కడ కనిపించేవారిలో చాలామంది నకిలీ సాధువులే. అలాంటి వాళ్లు 40 శాతం మంది ఉంటారు. వీరిలో కొందరు తీవ్రమైన నేరాలు చేసినవాళ్లు. ఇ‍క్కడికి వచ్చి వేషం మార్చి దాక్కుంటారు. నా వరకు నిజమైన సాధువులు 60 శాతమే ఉంటారు. ఈ నకిలీ స్వాములందరూ తమ అసలు పేర్లు చెప్పారు. స్వామి అని మాత్రమే చెప్పుకొంటారు. వారిలో చాలామందికి రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు ఉండవు. కొంతకాలం అక్కడ దాక్కుని తర్వాత వెళ్లిపోతారు' అని ఆర్య తన అభిప్రాయాన్ని చెప్పాడు.

    కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తే, పోలీసులు తమని ప్రత్యేకంగా హెచ్చరించిన విషయాన్ని ఆర్య బయటపెట్టాడు. పోలీసులు ఇక్కడ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తమ వద్ద సాధారణ తుపాకీలు మాత్రమే ఉన్నాయని, కానీ జనసమూహంలోని కొందరి దగ్గర ఏకే-47 లాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయని తమని పోలీసులు హెచ్చరించిన విషయాన్ని కూడా బయటపెట్టాడు.

    ఆర్య వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇతడి మతాన్ని బయటకు తీస్తున్నారు, ఆర్య అసలు పేరు జంషద్ షీర్ అలీ అని, ఇతడో ముస్లిం కావడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో ఏంటో?

    (ఇదీ చదవండి: ఇన్ స్టాలో అసభ్యకర కంటెంట్.. యాంకర్ విష్ణుప్రియపై కేసు)

International

  • న్యూఢిల్లీ:  తాము చర్చల మధ్యలో ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు చేసిన ఫోన్ కాల్ చేసి మొత్తం చెడగొట్టారని ఇరాన్‌ ఆరోపిస్తోంది.  ఇరాన్-అమెరికా ప్రతిష్టంభనలో ఒక కీలక పురోగతికి దారితీయగల చర్చలను పట్టాలు తప్పించింది మాత్రం కచ్చితంగా నెతన్యాహూ ఫోన్‌ కాలేనని అంటోంది. 

    అమెరికా- ఇరాన్‌ చర్చలు విఫలం చెందిన అనంతరం పాక్‌ నుంచి వెనుదిరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తన సోషల్‌  మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ ద్వారా  పలు ఆరోపణలు చేశారు.  మేం చర్చల్లో బిజీగా ఉన్నాం,  మా చర్చలు కీలక దశకు రాబోతున్న తరుణంలో నెతన్యాహూ నుండి వాన్స్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. 

    ఆ తర్వాత అంతా గందరగోళమైంది. అప్పటిదాకా సజావుగా సాగిన చర్చలు ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ తర్వాత మొత్తం మారిపోయింది. అప్పటివరకూ అమెరికా-ఇరాన్‌ల మధ్య సాగిన చర్చలు మొత్తం ఇజ్రాయెల్‌కు లబ్ధి చేకూర్చాలనే దిశగా వెళ్లిపోయాయి. ఆ ఫోన్‌ కాల్‌తో అమెరికా-ఇరాన్‌ల దృష్టి మళ్లింది’ అంటూ అరాఘ్చీ పేర్కొన్నారు. తాము ఎంతో నమ్మకంతో పాకిస్తాన్‌కు చర్చలకు వచ్చామని, కానీ ఎటువంటి పురోగతి కనబడలేదన్నారు. 

    ఇదీ చదవండి:

     ఇక నుంచి హర్మూజ్‌లోకి ఏ నౌక  వచ్చినా..: ట్రంప్‌

  • టైర్ (లెబనాన్): ఆ పాప వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. యుద్ధంలోనే పుట్టింది.. యుద్ధంలోనే కన్నుమూసింది. తనచుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ పాపను యుద్ధమే బలితీసుకుంది.

    ఇజ్రాయెల్‌ దాడుల్లో ఆ పాప తండ్రి మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడిలో ఆ రెండేళ్ల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన దక్షిణ లెబనాన్‌లో చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక పేరు టలీన్ సయీద్. ఇజ్రాయెల్‌ దాడిలో ఆ పసిపాప అక్క అలైన్ సయీద్ (7) బయటపడింది. గత వారం దక్షిణ లెబనాన్‌లో తన ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడి నుంచి కూడా అలైన్‌ సయీద్‌ ప్రాణాలతో బయటపడింది. 

    స్రిఫా గ్రామంలో సయీద్ ఇంటిపై బుధవారం దాడి జరిగింది. అదే రోజు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇది తమ దేశానికి కూడా వర్తిస్తుందని లెబనాన్‌లో చాలామంది భావించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్‌లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సయీద్ కుటుంబానికి చెందిన మరో నలుగురు బంధువులు కూడా మృతి చెందారు.

    “కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దీంతో మేము గ్రామానికి వెళ్లాం. శవపేటిక వద్ద ప్రార్థనలు చదివి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా ఒక తుపాను మాపై పడుతున్నట్టుగా అనిపించింది” అని నాసర్ సయీద్ (64) అనే వ్యక్తి తమపై జరిగిన బాంబు దాడుల గురించి తెలిపాడు. అతను కూడా ఈ దాడి నుంచి బయటపడ్డాడు.

    ఆదివారం, అతను ఇతర బంధువులతో కలిసి దక్షిణ పోర్ట్ నగరం టైర్‌కు వెళ్లి పచ్చని గుడ్డలతో కప్పిన మృతదేహాలను తీసుకున్నాడు. వాటిలో ఒక మృతదేహం చాలా చిన్నగా ఉంది. అది అతని మనవరాలు టలీన్ సయీద్ మృతదేహం. అలైన్ సయీద్‌ చెల్లెలే టలీన్ సయీద్.

    పసిపాప టలీన్‌ తలపై, కుడి చేతిపై బ్యాండేజ్‌లు, ముఖంపై గీతలు ఉ‍న్నాయి. అది చూసిన వారికి కన్నీరు ఆగలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న ప్రారంభమైంది. లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు పెంచింది. వీటిలో 2,000 మందికి పైగా మృతి చెందారు. అందులో 165 మంది పిల్లలు, దాదాపు 250 మహిళలు ఉన్నారు.

    బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్‌-అమెరికాతో జరిపిన చర్చల్లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు. లెబనాన్ అధికారులతో వేరే మార్గంలో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ చూస్తోంది.
     

  • హర్మూజ్‌ జలసంధిలోకి వచ్చే ఏ నౌకనైన ఇక నుంచి తాము అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. హర్మూజ్‌లోకి రావడానికి ఇరాన్‌ అనుమతి తీసుకుని వారికి సుంకం చెల్లించిన పక్షంలో ఏ దేశ నౌకనైనా తాము బ్లాక్‌ చేస్తామన్నారు. ఇరాన్‌కు సుంకం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.  

    అమెరికాతో  ఇరాన్‌ చర్చలు విఫలమైన అనంతరం  చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌.. హర్మూజ్‌ అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించే ఏ నౌకను కానీ, తిరిగి వెళ్లే ఏ నౌకనైనా తాము అడ్డుకోవడం ఖాయమన్నారు. ఇది ఇప్పట్నుంచే అమల్లోకి వస్తుందన్నారు ట్రంప్‌. ఇరాన్‌కు సుంకం చెల్లించే ప్రతీ నౌకను అమెరికా దళాలు దిగ్బంధిస్తాయన్నారు. 

    ఈ మేరకు తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ట్రూత్‌ సోషల్‌ ట్రంప్‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘. ఇరాన్ హర్మూజ్‌ జలసంధిని తెరవడానికి వాగ్దానం చేసింది, కానీ వారు ఉద్దేశపూర్వకంగా అది చేయలేదు. దీని వల్ల ప్రపంచంలోని అనేక మంది ప్రజలకు, అనేక దేశాలకు ఆందోళన, అవ్యవస్థ, బాధ కలిగింది. వారు నీటిలో మైన్స్‌ వేశారని చెబుతున్నారు, 

    అయితే వారి నౌకాదళం మొత్తం, అలాగే ఎక్కువ భాగం మైన్స్‌ వేసేవాళ్లను మేము తుడిచిపెట్టేశాం.  ఇంకా వాటర్‌ మైన్స్‌ ఉన్నా దాన్ని తొలగిస్తాం. ఆ సమయంలో మాపై దాడి జరిగితే విధ్వంసం సృష్టిస్తాం. అణుకార్యక్రమాన్ని వదలడానికి ఇరాన్‌ ఒప్పుకోవడం లేదు. అందుకే చర్చలు విఫలమయ్యాయి. 

    ఎవరైనా ఇరాన్‌కు సుంకం చెల్లించి హర్మూజ్‌ జలసంధిలోకి రావాలన్నా, అక్కడ నుంచి బయటకు వెళ్లాలన్నా వాటిని అమెరికా దళాలు దిగ్భందిస్తాయి.’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. 

  • పాకిస్థాన్‌ ఇస్లామాబాద్‌లో నిన్న (శనివారం)  అమెరికా - ఇరాన్  మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచం అంతా ఈ భేటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే ఉద్విగ్న సమయాలలో యుద్ధానికి కారణమైన ట్రంప్ మాత్రం ఏ మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరించాడట.. తనకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఆ సమయంలో ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు వెళ్లారట.

    ఇరాన్‌- అమెరికా మధ్య నిన్న జరిగిన శాంతి చర్చలు ఏలాంటి పురోగతి లేకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. అమెరికా డిమాండ్లకు ఇరాన్‌ తలొగ్గకపోవడంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అయితే చర్చల ఫలితం ఏముంటుందా అని ప్రపంచ దేశాలు చాలా ఉత్కంఠగా ఎదురుచూశాయి. అయితే అంత కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎంతో కూల్‌గా ఉన్నారట. అతనికి ఏమి పట్టనట్లు ఒక క్రీడా కార్యక్రమానికి వెళ్లారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    మాయామిలోని ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు ట్రంప్‌తో తన కుటుంబంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి మార్క్‌ రుబియో, భారత్‌లోని అమెరికా రాయభారి సెర్గియో గోర్‌, ఇతర  అధికారులతో కలిసి గంటల సమయం గడిపారు. అధికారులు చర్చల వివరాలు తెలియజేయడానికి వచ్చినప్పటికీ ట్రంప్‌ పెద్దగా పట్టించుకోకుండా గేమ్‌ ఎంజాయ్ చేశారని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో విదేశాంగ శాఖ మంత్రి ట్రంప్‌కు ఫోన్‌ చూపిస్తూ ఏదో చెప్పినప్పటికీ ఆయన ముఖంలో ఏలాంటి భావాలు లేవని తెలిపారు.

    అంతేకాకుండా మ్యాచ్ అనంతరం విజేతలను అభినందించారని వారితో కలిసి గడిపారని కథనాలు పేర్కొన్నాయి.. అయితే గతంలోనూ ఈ చర్చలు గురించి తాను పట్టించుకోనని ఇరాన్‌ సైనికంగా ఎప్పుడో ఓడిపోయిందని అ‍న్నారు. కాగా అమెరికాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చర్చలు జరుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • కంపాలా: తండ్రి దేశాధ్యక్షుడు. కుమారుడు ఆర్మీ చీఫ్‌ జనరల్‌. ఆర్మీ చీఫ్‌ హోదాలో కుమారుడు సహచర దేశానికి మరోసారి రెండు కండీషన్లు పెట్టాడు. వన్‌  బిలియన్ డాలర్లు ఇవ్వాలని, ఆ దేశంలో అత్యంత అందమైన యువతితో తన వివాహం జరిపించాలని ట్వీట్‌ చేశాడు. ఇందుకోసం 30 రోజుల గడువు కూడా ఇచ్చాడు. ‘మా దేశ రాజధానిలోనే మీ రాయబార కార్యాలయం ఉంది. డిమాండ్లను అంగీకరించకపోతే దౌత్యపరమైన ఇబ్బందులు తప్పవు’ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు.

    గతంలోనూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని తనకు వివాహం జరిపించాలని ప్రతిపాదనలు పంపాడు. అందుకు గాను 100 అంకోలే ఆవులను ఆఫర్‌ చేశాడు. ‘రోమన్లు మా ఆవులను తిరస్కరిస్తే.. రోజుల వ్యవధిలోనే మేము రోమ్‌ను స్వాధీనం చేసుకుంటాం’అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించాడు. తండ్రి చివాట్లు పెట్టినా బుద్ధి మార్చుకోలేదు. తాజాగా మరోసారి వింత కోరికతో ఆయన సొంత దేశంలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకీ ఎవరా ఆర్మీ చీఫ్‌ జనరల్‌.  

    ముహోజి కైనెరుగాబా ఉగాండా అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ కుమారుడు, ఉగాండా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ముహోజి కైనెరుగాబా చేసిన తాజా డిమాండ్లు అంతర్జాతీయంగా  వివాదానికి దారితీశాయి. టర్కీ తమ దేశానికి వన్‌ బిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలని, అలాగే ఆ దేశంలో అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరకపోతే 30 రోజుల్లో టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేసి, దౌత్య సంబంధాలను తెంచేస్తామని హెచ్చరించారు. 

    ‘ఉగాండా సైన్యం రెండు దశాబ్దాలుగా సోమాలియాలో అల్-షబాబ్ ఉగ్రవాదులపై పోరాడుతూ త్యాగాలు చేస్తోంది. కానీ టర్కీ మాత్రం అక్కడి పోర్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల ద్వారా లాభాలు పొందుతోందని ఆరోపించారు. అందుకే ‘సెక్యూరిటీ డివిడెండ్’ పేరుతో ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

    ఇది మొదటిసారి కాదు. 2022లో ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. బదులుగా వంద అంకోలే ఆవులను ఇస్తానని మాటిచ్చారు. 

    రోమన్లు మా ఆవులను తిరస్కరిస్తే, మేము రోమ్‌ను స్వాధీనం చేసుకోవాలి. అది మాకు రోజులు మాత్రమే పడుతుంది’అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన తండ్రి, అధ్యక్షుడు యోవెరి ముసేవెనీ, తన కుమారుడి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ‘ మిత్ర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదు’ అంటూ చివాట్లు పెట్టారు. 

    గతంలో ముహోజి కైనెరుగాబా కెన్యాను సైతం ఇలాగే బెదిరించాడు. 2022లో నేను నా సైన్యంతో కలిసి రెండు వారాల్లోనే నైరోబీని స్వాధీనం చేసుకోవచ్చు’ అని ప్రకటించారు. ఈ బెదిరింపుల కారణంగా తాత్కాలికంగా ముహోజి ఆర్మీ చీఫ్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కెన్యాకు అధికారిక క్షమాపణ కూడా చెప్పారు. ప్రస్తుతం ముహోజి వ్యాఖ్యలపై అటు టర్కీ.. ఇటు ఉగాండా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

  • పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్‌ మధ‍్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్‌ చెప్పినట్లే చేస్తారా?

    డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం
    ఇరాన్ అణ‍్వాయుధాలను అభివృద్ధి చేయదన‍్న హామీ కావాలని అమెరికా డిమాండ్‌ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ‍్యక్షుడు జేడీ వాన్స్‌ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్‌ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్‌ మీడియా తెలిపింది.

    ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్‌ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల‍్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్‌ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.

    యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్‌ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్‌ కోరింది.

    అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసం
    ఒప్పందం కుదరకపోవడంతో ఎ‍న్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.

    తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది. 

    అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌లో అమెరికా చేసిన ఆపరేషన్‌లు గుర్తుకు వస్తున్నాయి. 

    అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్‌లోని విద్యుత్‌ ప్లాంట్లు, బ‍్రిడ్జిలను కుప్పకూ​ల్చుతామని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్‌ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది.  

  • వాషింగ్టన్‌: భారతీయ సనాతన ధర్మం గొప్పదనాన్ని, హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానందుదునికి అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సియాటెల్ నడిబొడ్డున స్వామి వివేకానందుని  నిలువెత్తు కాంస్య విగ్రహం ఘనంగా కొలువుదీరింది.

    అమెరికా చరిత్రలో ఒక నగరపాలక సంస్థ (సిటీ గవర్నమెంట్) ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తొలి స్వామి వివేకానంద విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రక ఘట్టం అమెరికాలో స్థిరపడిన ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగేలా చేస్తోంది. నిత్యం లక్షలాది మంది సందర్శకులతో రద్దీగా ఉండే సియాటెల్ డౌన్ టౌన్ లోని ప్రముఖ ‘వెస్ట్ లేక్ స్క్వేర్’ వద్ద ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ స్పియర్స్, సియాటెల్ కన్వెన్షన్ సెంటర్, సియాటెల్ సెంటర్ మోనోరైల్ లాంటి కీలకమైన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

    శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా ఈ విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ అత్యంత ఆకర్షణీయంగా, జీవకళ ఉట్టిపడేలా ఈ కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఐసీసీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం, అమెరికాతో భారత సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. 1893లో జరిగిన చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రాత్మక ప్రసంగం నాటి నుంచి.. నేటి అత్యాధునిక గ్లోబల్ టెక్ హబ్ సియాటెల్ వరకు అమెరికాతో మనకున్న అనుబంధానికి ఈ విగ్రహం ఒక సజీవ ప్రతీకగా నిలుస్తుందని కాన్సులేట్ జనరల్ అభివర్ణించారు. స్థానిక పౌర ప్రముఖులు, ఎన్నారైలు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

  • వాషింగ్టన్‌ : అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు కొత్త టెన్షన్‌ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్‌) ఇప్పుడు ఇరాన్‌కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్‌ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.  

    బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్‌ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్‌ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్‌ ఏర్పాటుచేసిన ఇరాన్‌ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్‌ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.

    దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్‌ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్‌ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్‌ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్‌ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్‌ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది.    

National

  • పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ దేశాలకు దిగుమతయ్యే సింహభాగం గ్యాస్‌ సరఫరా దెబ్బతింది. ఇతర సహజ వనరులు కూడా ప్రభావితమయ్యాయి.

    ఫలితంగా వంటింట్లో విరివిగా వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్‌లు, హైడ్రోజన్ స్టవ్‌లను వినియోగించడం ప్రారంభించారు. అదే సమయంలో తక్కువ ధరలో లభించే వంట గ్యాస్‌ను ఎంచుకుంటూ, తమ బడ్జెట్‌కు అనుగుణంగా వినియోగంలో మార్పులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌లో లభించే వంట గ్యాస్‌ ధరలు, అనుకూల,ప్రతి కూలతలు గురించి ఆరా తీస్తున్నారు.

    ఎల్పీజీ వంట గ్యాస్‌
    ఎల్పీజీ కోట్లాది మంది భారతీయ కుటుంబాలకు ప్రధాన వంట గ్యాస్‌గా కొనసాగుతోంది. ఇది విస్తృతంగా లభిస్తుంది. విద్యుత్ అవసరం లేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడినా వంట చేసుకోవచ్చు. అయితే, ధరలు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. చాలా నగరాల్లో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.900–రూ.1100 మధ్య ఉంటుంది. ఒక సిలిండర్ సాధారణంగా 25–30 రోజుల వరకు వస్తుంది. అంచనా నెలవారీ ఖర్చు: రూ.900 నుంచి రూ.1,200

    ప్రయోజనాలు:
    దేశంలో సులభంగా అందుబాటులో ఉంటుంది
    విద్యుత్ అవసరం లేదు
    అందరికీ తెలిసిన గ్యాస్‌, వినియోగం సులభం

    ప్రతికూలతలు:
    ధరలు మారుతూ ఉంటాయి
    తరచుగా రీఫిల్ చేయాలి
    జాగ్రత్తగా వాడకపోతే భద్రతా సమస్యలు

    ఎలక్ట్రిక్ వంట గ్యాస్‌
    నగరాల్లో ఎలక్ట్రిక్ వంట, ముఖ్యంగా ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరుగుతోంది. ఇది శుభ్రంగా ఉంటుంది. నిర్వహణ సులభం, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ అవసరం ఉండదు. ఇండక్షన్ స్టవ్‌లలో శక్తి సామర్థ్యం ఎక్కువ. ఎందుకంటే అవి నేరుగా పాత్రలను వేడెక్కిస్తాయి.
    అయితే మొత్తం ఖర్చు రాష్ట్రాల వారీగా మారే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది.
    అంచనా నెలవారీ ఖర్చు: రూ.700–రూ.1100

    ప్రయోజనాలు:
    కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కంటే చవకగా ఉంటుంది
    రీఫిల్ అవసరం లేదు
    గ్యాస్ లీక్ సమస్యలు లేక భద్రత ఎక్కువ

    ప్రతికూలతలు:
    విద్యుత్ సరఫరాపై ఆధారపడుతుంది
    పవర్ కట్ సమయంలో ఉపయోగించలేము
    ప్రత్యేక పాత్రలు అవసరం

    హైడ్రోజన్ వంట గ్యాస్‌ 
    హైడ్రోజన్ స్టవ్‌లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. గృహ వినియోగానికి విస్తృతంగా అందుబాటులో లేవు. హైడ్రోజన్ గ్యాస్ నీటి నుంచి తయారు చేస్తారు. కొన్ని కంపెనీలు, శాస్త్రవేత్తలు హైడ్రోజన్ ఆధారిత వంట గ్యాస్‌ సిస్టమ్‌లను పరీక్షిస్తున్నారు. ఇవి ఇంకా విస్తృత వినియోగానికి సిద్ధంగా లేవు.
    అంచనా నెలవారీ ఖర్చు: ఇంకా అందుబాటులో లేదు

    ప్రయోజనాలు 
    శుభ్రమైనది, పర్యావరణానికి అనుకూలం
    ఫాసిల్ ఫ్యూయల్స్‌పై ఆధారాన్ని తగ్గిస్తుంది

    ప్రతికూలతలు:
    వాణిజ్యపరంగా అందుబాటులో లేదు
    ఎక్కువ ఖర్చు, మౌలిక వసతుల అవసరం
    ఖర్చు ఇంకా స్పష్టంగా లేదు

    ప్రస్తుత ధోరణులు
    విద్యుత్ సరఫరా స్థిరంగా, చవకగా ఉన్న నగరాల్లో ఎలక్ట్రిక్ వంట ఎల్పీజీ కంటే కొంత చవకగా ఉంటుంది.
    విద్యుత్ అస్థిరంగా ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ అత్యంత ప్రాక్టికల్, నమ్మదగిన ఎంపిక.
    హైడ్రోజన్ ఇంకా రోజువారీ వినియోగానికి సరైన సమయం కాదు.

    వినియోగదారుల నిర్ణయం
    నగరాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా ఉంటే, ఎలక్ట్రిక్ వంట ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. తరచుగా పవర్ కట్‌లు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఎల్పీజీ ఇప్పటికీ భద్రతా పరంగా వినియోగంలో ఉంది. హైడ్రోజన్ భవిష్యత్తులో ఆశాజనకమైనది. కానీ ప్రస్తుతానికి వినియోగం సులభం కాదు. ఎల్పీజీ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్.. హైడ్రోజన్ వంట ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరుగుతోంది. చాలా కుటుంబాలకు ఎల్పీజీ ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినదే. కానీ ఎలక్ట్రిక్ వంట వైపు మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. భవిష్యత్తు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

  • ఢిల్లీ: వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా రేపు(సోమవారం, ఏప్రిల్‌ 13వ తేదీ) ఢిల్లీలో నారీ శక్తి వందన సమ్మేళనం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.   ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. 

    వివిధ రంగాలకు చెందిన  ప్రభుత్వ, విద్యా, విజ్ఞాన, క్రీడలు, వ్యాపార, మీడియా, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాల మహిళా ప్రతిభావంతులు హాజరవుతారు. వికసిత భారత్ 2047 లక్ష్యానికి మహిళా ఆధారిత అభివృద్ధి కీలకమని ఈ సమ్మేళనం ద్వారా తెలియజేయనున్నారు ప్రధాని మోదీ. పార్లమెంట్‌ నుండి పంచాయతీల వరకు అన్ని స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. 




     

  • యూఏఈ  భారత్‌కు ఎల్లప్పుడూ ప్రధాన భాగస్వామి అని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు. యూఏఈ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులు జరిపిన నేపథ్యంలో ఆ పరిస్థితులపై చర్చించారు. 
     

    ఈ సందర్భంగా జైశంకర్‌ మట్లాడుతూ భారత్‌కు యూఏఈ ఒక అత్యంత ముఖ్యమైన మరియు నమ్మకమైన భాగస్వామన్నారు. రక్షణ, వాణిజ్యం మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత దృఢంగా ఉన్నాయని తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో మరియు ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేయడంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.

    టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ మరియు పెట్టుబడుల రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించేలా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. అనంతరం యూఏఈ ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. కాగా ఇటీవల ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలలలోని అెమెరికా స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నడుమ జైశంకర్ యూఏఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

  • హిందువులందరికీ ఎంతో ప్రత్యేకమైన అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యుల్‌ను జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది. జులై 3 నుంచి ప్రారంభమై 57 రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు తెలిపింది. ఆగస్టు 28 రక్షా బంధనం పర్వదినం రోజున యాత్ర ముగుస్తుంది.

    2026కు సంబంధించి అమర్‌నాథ్ యాత్ర వివరాలను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌ ప్రకటించారు. జులై 3న యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు.  జూన్‌ 29న జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పరమేశ్వరునికి ప్రథమ పూజ నిర్వహించనున్నారు. ఈ యాత్రకోసం ఏప్రిల్‌ 15 నుంచి రిజిష్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. దీనికి భక్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్దతులలో రిజిష్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

    అమర్‌నాథ్ గుహలో పరమేశ్వరుడు మంచు లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడుతుంది. చంద్రుని కళలకు అనుగుణంగా ఈ లింగం పరిమాణం పెరగడం, తగ్గడం ఇక్కడి గొప్ప విశేషం. సౌత్ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ గుహలో ఏర్పడుతుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని శివుని స్వరూపంగా భక్తులు  విశ్వసిస్తుంటారు. 

    ఎన్నోరకాల సవాళ్లు, వ్యయప్రయాసాలను తట్టుకుని , తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ భక్తుల అమర్ నాథ్ యాత్రను నిర్వహిస్తారు. 70 ఏళ్ల పై బడిన వారిని అమర్ నాథ్ యాత్రకు అనుమతించరు. భక్తులు రెండు మార్గాల ద్వారా ఈ యాత్రను పూర్తి చేసుకోవ‌చ్చు. ఒకటి పహల్గామ్ మార్గం కాగా, మరొకటి బల్తాల్ మార్గం. పహల్గామ్ మార్గంలో 34 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది.  ఈ రెండు మార్గాల నుంచి హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 

  • కేంద్రప్రభుత్వం తీసుకవచ్చిన మహిళా బిల్లును అడ్డుకంటే చరిత్ర హీనులవుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని.. మహిళల ప్రాతినిథ్యం పెరగాల్సిందేనన్నారు.

    అయితే అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్లకు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కోరారు. కాగా ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ ఎంపీలకు త్రీ-లైన్‌-విఫ్‌ జారీ చేసింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపింది. 

  • లెజెండరీ సింగర్‌ ఆశా భోంస్లే మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని అధికారిక ఎక్స్‌ ఖాతా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. "భారతదేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ స్వరాలలో ఒకటైన ఆశా భోంస్లే గారి మరణం పట్ల తీవ్రంగా విచారిస్తున్నాను. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను తాకింది." అని రాసుకొచ్చారు.

    ఆశా భోంస్లే రాగాలైనా, స్వరకల్పనలైనా, ఆమె స్వరంలో కాలాతీతమైన ప్రకాశం ఉండేది. ఆమెతో తనకు కలిగిన అనుభవాలను నేను ఎప్పటికీ మదిలో పదిలపరుచుకుంటాను అని  మోదీ అన్నారు. ఆమె సేవలు తరతరాలకు స్పూర్తినిస్తునే ఉంటారని ఆశా భోంస్లే పాటలు ఎప్పటికీ ప్రజల మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆమె కుటుంబంతో పాటు అభిమానులకు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. 

    కాగా క్వీన్‌ ఆఫ్‌ వెర్సటాలిటీ ఆశా భోంస్లే ఏప్రిల్‌ 11 నిన్న శనివారం ఛాతీ ఇన్ఫెక్షన్‌ సమస్యతో ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం చికిత్సపొందుతూ మృతిచెందారు. ప్రముఖ సింగర్‌ లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోంస్లే తన ఎనిమిది దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్‌లో దాదాపుగా 20 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. దాదా సాహెబ్‌ ఫాల్కే, పద్మ విభూషణ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు.

  • కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా  కలకలం రేపుతోంది.

    కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్  పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

    అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.

    ‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

  • ఢిల్లీ: ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపి (BJP) తన ఎంపీలకు 'త్రీ-లైన్ విప్' జారీ చేసింది. ఈ సమావేశాల సమయంలో పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ విప్ స్పష్టం చేశారు.

    కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ ఈ మూడు రోజుల పాటు సభలోనే ఉండాలని.. ఈ సమయంలో ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని, హాజరు కచ్చితంగా ఉండాలని విప్ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ముఖ్యంగా, రిజర్వేషన్ల అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

    2023 నాటి 'నారీ శక్తి వందన్ అధినియం' ప్రకారం.. మహిళా రిజర్వేషన్లు తదుపరి జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) తర్వాతే అమలు కావాల్సి ఉంది. అయితే, జనాభా గణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

    మరోవైపు, ప్రధాని మోదీకి ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టాలన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే  బిల్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై స్పష్టత లేకుండా, ఈ చారిత్రాత్మక చట్టంపై అర్థవంతమైన చర్చ జరపడం అసాధ్యమని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

     

Politics

  • చెన్నై: తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత, సినీనటుడు “కెప్టెన్” విజయకాంత్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన భార్య ప్రేమలత పోరాడుతున్నారు. విజయకాంత్‌ 2023 డిసెంబరు 28న కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం సినీనటుడు విజయ్‌ కూడా టీవీకే పేరుతో పార్టీని స్థాపించారు. అయితే, కొందరు విజయకాంత్‌ను విజయ్‌తో పోల్చుతుండడం సరికాదన్నట్లు ప్రేమలత మాట్లాడారు. తాజాగా ఆమె తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

    విజయ్‌ను కొందరు విజయకాంత్‌తో పోల్చుతుండడం పట్ల తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేనని తెలిపారు. విజయకాంత్ కేవలం నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదని, ప్రజల మధ్య వారి కోసం నిలిచిన నాయకుని చెప్పారు.

    “కెప్టెన్ ప్రజల నాయకుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వచ్చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడికి వెళ్లేవారు. ప్రజలతో నిలబడేవారు. నాయకుడు వేరుగా, ప్రజలు వేరుగా ఉంటే ఆ బంధం నిలబడదు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. 

    విజయకాంత్ కలలు, లక్ష్యాలను నెరవేర్చడమే డీఎండీకే లక్ష్యం. రాజకీయాల్లో లింగ వివక్ష లేదు. నేను పురుషుడు, మహిళ అనే కోణంలో ఆలోచించను. సరైనది ఏదైతే అదే చేస్తాం. మాతృభాషను రక్షించాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష మన కళ్లలా.. ఇతర భాషలు కళ్లద్దాల్లా.. అవసరమైనప్పుడు వాడుతాం. తమిళనాడులో ఎప్పటినుంచో రెండు భాషల విధానం ఉంది. మూడు భాషల విధానం లేదు’ అని తెలిపారు.

  • పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14న) క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌కు ఇదే చివరి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో అనేక ముఖ్య అజెండా అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది. 

    ఈ సమావేశం అనంతరం నితీశ్‌ కుమార్ సీఎం పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఏప్రిల్ 15న బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్‌ చౌదరి బాధ్యతలు చేపట్టే ఛాన్స్‌ ఉంది. ఇటీవలే నితీశ్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    జేడీయూ వర్కింగ్ ప‍్రెసిడెంట్‌, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్‌ విధానాలను, పాలనా మోడల్‌ను కొనసాగిస్తుందని అన్నారు.  

    కాగా, నితీశ్‌ కుమార్‌ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. సీఎం పదవి నుంచి ఏప్రిల్‌ 14వ తేదీన వైదొలగనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. బీజేపీ నేత బిహార్‌ సీఎం అవుతుండడం ఇదే తొలిసారి. 
     
    ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిహార్‌లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.

    జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. 

  • తాడేపల్లి : అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు లెక్కలపై వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందంటూ చెప్పటంపై సజ్జల ధ్వజమెత్తారు. మీ మాయ మాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టొద్దంటూ హితవు పలికారు. 

    అమరావతి ల్యాండ్ బ్యాంక్  ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు నిన్న మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పి దొరికిపోయారని సజ్జల స్పష్టం చేశారు. 

    చంద్రబాబూ.. మీరు చెబుతున్న లెక్కలు కరెక్టే అయితే, ఈ కింది ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు?

    • మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే.

    • ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.10 కోట్లు అని మీరంటున్నారు.

    • కానీ, అక్కడ మీరు మీ ఇంటి కోసం కొన్న 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500. మీ దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు.

    • నిజానికి రాజధానిలోని ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్‌ఆర్‌ఓ) ప్రకారం గజం భూమి ధర రూ.6 వేలు మాత్రమే.

    • ఆ లెక్క  ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు.

    • అయినా కూడా మీ లెక్క ప్రకారమే, మీరు కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం మీరు 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే.

    • అంతకు మించి ఒక్క పైసా రాదు.

    • మరోవైపు మీరు ఇప్పటికే ఆ మేరకు ఖర్చు పెట్టేశారు.

    • మేము ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదు.

    • అమరావతిలో మీరు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్‌ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైగానే.

    • ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే మీరు చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు.

    • కాగా, ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది అప్పు.

    • ఇంకా తెచ్చేది కూడా అప్పు.

    • దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది.

    • పోనీ మీరు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే, ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని మీరు, 15 ఏళ్లు పడుతుందని మీ కొడుకు అంటున్నారు.

    • మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా?

    • లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా?

    • నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా.

    • మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి?

    • మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చు.

    • కానీ, మన రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి?

    • ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదు.

    • ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసు.

    • ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలు.

    • అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్‌ ‘ఎండ మావి’జన్‌ కావాలా?

    • అందులో పదో వంతు ఖర్చుతో అదీ దశలవారీగా రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్‌ గారి మార్క్‌ గ్రోత్‌ ఇంజన్‌ ‘మావిగన్‌’ కావాలా?అని ప్రశ్నించారు. 

  • సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్‌ నాయకురాలు హసీనా సయ్యద్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

    ఈ విషయమై హసీనా సయ్యద్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్‌ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్‌ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.

    నాయకత్వంపై ధ్వజం..
    ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్‌ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్‌’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Business

  • ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.

    దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్‌లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.

    దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.

    ఇదీ చదవండి: టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?

    ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్‌ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.

  • సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..

    దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    డీయాక్టివేట్‌ చేయడం ఇలా.. 
    ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్‌కు వెళ్లండి
    ➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
    ➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.
    ➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంటర్ చేయాలి.
    ➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
    ➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.

  • వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్‌లో, తక్కువ శ్రమతో స్టయిలిష్‌గా పూర్తి 
    చేసే గాడ్జెట్లు మీకోసం!

    స్ప్రే టచ్‌! 
    మీ కిచెన్‌లో టేస్ట్‌ మాత్రమే కాదు, హెల్త్‌ కూడా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ స్మార్ట్‌ ఆయిల్‌ స్ప్రేయర్‌ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్‌ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్‌ మ్యాజిక్‌ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్‌తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్‌ ఫ్రయ్యర్‌లో చికెన్‌ రోస్ట్‌ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్‌ కూడా తగ్గుతుంది! సలాడ్స్‌ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్‌ ఫినిషింగ్‌ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!

    వంటింట్లో ఆర్గానిక్‌ ఫామ్‌!
    బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్‌ మేకర్‌! ఇందులో ఉన్న స్మార్ట్‌ ‘నాబ్‌’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.

    దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్‌మెంట్‌ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్‌ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!

    స్నాక్‌ పార్ట్నర్‌!
    సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్‌ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్‌ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్‌ డిష్‌ నట్‌ బౌల్‌!

    ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్‌ టైమ్‌ను క్లీన్‌గా, స్టయిలిష్‌గా మార్చే చిన్న మ్యాజిక్‌ బౌల్‌! ఇందులో డబుల్‌ డిష్‌ బౌల్స్‌ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్‌ నట్స్‌ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్‌లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.

    2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

    FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!

  • ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తొలగించింది.

    మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.

    మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్‌గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.

    జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.

    మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు.

  • భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    వెండి ధరలు
    ఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.

    వెండి రేటు పెరగడానికి కారణాలు
    పారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.
    పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.
    బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.
    డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.
    సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్‌లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.
    ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.
    ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.

    ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!

  • రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..

    ఆస్తి అంటే..
    కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.

    తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారం
    రియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..

    ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.

    రీట్స్‌: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్‌లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.

    క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.

    సొంతిల్లు సాకారమయ్యే టిప్స్
    సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్‌లో ఈ వ్యూహాలు అనుసరించండి..

    ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.

    లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.

    పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.

    కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం.

    "పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు."

  • ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్‌ గ్రూప్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

    భారత్‌లో నేచురల్‌ డైమండ్‌ జ్యుయలరీ మార్కెట్‌ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్‌ పేర్కొంది. డైమండ్స్‌ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్‌ జెడ్, మిలీనియల్స్‌ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.

    ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్‌ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్‌ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ ఎస్‌వీపీ శ్వేతా హరిత్‌ తెలిపారు.

  • న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై ఆయిల్‌ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్‌పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్‌ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

    అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది.

Andhra Pradesh

  • సాక్షి,విజయవాడ: తిరువూరు టీడీపీలో వాట్సాప్ మెసేజ్, ఆడియో కలకలం రేపుతున్నాయి. టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో కేశినేని చిన్ని, శావల దేవదత్తు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని దేవదత్తు వద్ద.. కేశినేని చిన్ని కోట్లు వసూలు చేశారని మెసేజ్‌లో ఉంది. ఆడియోల్లో తాను ఆర్థికంగా చితిపోయానని దేవదత్తు మాట్లాడారు.    
     

  • పన్నెడ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెదబయలు మండలం పన్నెడ గ్రామంలో ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి మృత్యవాత పడిన ఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. వాగులో ఈతకు వెళ్లడంతో ముగ్గురు బాలురు మృతిచెందారు. మొత్తం ఐదుగురు బాలురు బ్యాచ్‌గా ఈతకు వెళ్లగా, ఇద్దర్ని స్థానికులు రక్షించారు. మృతి చెందిన బాలురుని ప్రదీప్‌(11), హర్షిత్‌(10), బబ్లూ(11)లుగా గుర్తించారు.

    ఇటీవలే ల ఏజెన్సీలోని వాగులో స్నానానికి దిగి ముగ్గురు బాలికలు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దుర్ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. 

  • వైఎస్సార్‌జిల్లా: ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇంటర్ విద్యార్థిని కీర్తన తల్లిదండ్రులను ఎంపీ అవినాష్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉన్నారు.

    అనంతరం,ఎంపీ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓ దుర్మార్గుడి చేతిలో కీర్తన మరణించడం అత్యంత బాధాకరం. తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో ఆడబిడ్డలపై ఇటువంటి దాడులు మితిమీరిపోతున్నాయి.

    తీవ్రమైన, కఠినమైన చర్యలకు ప్రభుత్వం వెనుకాడకూడదు.ఎవరికైనా ఇటువంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా కఠినంగా చర్యలు తీసుకోవాలి. రెండేళ్లుగా ఇలా ఆడబిడ్డలపై, చివరికి చిన్నారులపై దాడులు పెరిగిపోయాయి. చివరికి ఇంటికి వచ్చి గొంతు కోసే పరిస్థితులు నెలకొన్నాయి.

    ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి. గంజాయి ఎక్కడంటే అక్కడ దొరుకుతోంది...గ్రామానికి రెండు మూడు బెల్టుషాపులు ఉన్నాయి.ఇలాంటి మత్తు పదార్థాల వల్ల మనుషులు కూడా మృగాలుగా మారుతున్నారు. గంజాయి, బెల్టు షాపులను తక్షణమే అరికట్టాలి’ అని డిమాండ్‌ చేశారు.

  • సాక్షి,తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన  ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

    ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ  ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు.
      
    ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
     

     

  • సాక్షి, పుత్తూరు: పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్‌​ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‍ప్రజాసమస్యలపై నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్‌ చేసి, మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు.

    ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తేలేదని అన్నారు. బలిజలు, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లేనని చెప్పారు.

    కాగా, కొన్ని రోజుల క్రితం పోలీసులు తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.  రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. 

    తంబిరెడ్డి జాడకోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్‌గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.

    మరోవైపు, బాపట్లలో ఆదివారం (ఏప్రిల్‌ 12) చెరుకుపల్లి ఎస్సై అనిల్‌కుమార్‌ ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డిని చితకబాదారు. వైఎస్సార్‌సీపీ నేతల పోస్టులను స్టేటస్‌ పెట్టుకున్నందుకు దాడి చేశారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. 

  • సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు.  

    అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నందిగామ నందిగామ సీఐ చావన్ అన్నారు. కీసర టోల్‌గేట్‌ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ అతివేగంగా లారీ నడపటం వల్లే డివైడర్ ఎక్కి ట్యాంకర్ కారుపై పడిందన్నారు. లారీ టాంకర్ ఒక్కసారిగా కారుపై పడటంతో లాయర్ శ్రీనివాస్ మృతి చెందారు. లారీ ఫిట్‌నెస్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. టోల్‌గేట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? లేదా  అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

    కాగా, అతి వేగంగా వస్తోన్న ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్‌ ప్లాజా వద్ద జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు (55) ఏపీ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది. ఈయన శనివారం కారులో హైదరాబాద్‌ వెళ్తున్నారు. కీసర టోల్‌ప్లాజా వద్దకు కారు రాగానే..వెనుక నుంచి ఫ్లైయాష్‌ లోడుతో వస్తోన్న ట్యాంకర్‌ అతి వేగంగా వచ్చి ప్లాజా దిమ్మెను ఢీకొంది. అనంతరం అదుపు తప్పి శ్రీనివాసరావు కారుపై పడిపోయింది.

    దీంతో కారు నుజ్జునుజ్జయింది. ట్యాంకర్‌ కారుపై పడిన 3 నిమిషాల పాటు అందులో ఉన్న శ్రీనివాసరావు హారన్‌ మోగించినట్లు స్థానికులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భారీ ప్రొక్లెయిన్లు, గొలుసుల సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తీశారు. ఆ తర్వాత ట్యాంకర్‌ కింద ఉన్న కారును మరో పొక్లెయిన్‌తో బయటకు తీయగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కా­గా, ట్యాంకర్‌ను అతివేగంగా నడపటం వల్లే ఈ ప్ర­మాదం జరిగిందని, ఆ సమయంలో డ్రైవర్‌ నిద్ర­మత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపై విచారణ చేస్తున్నామని సీపీ చెప్పారు.  

  • సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఖాజీపేట ఇంటర్ బాలిక హత్య కేసులో బిగ్‌ట్విస్ట్  చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేష్ తల్లి సుజాత.. మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడు, కీర్తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తనకు తెలియదన్నారు. తన కొడుకు జేబులో ఒక లెటర్ దొరికింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోందని ఆమె తెలిపారు.

    ‘‘నా కుమారుడు కీర్తన వెంట తిరుగుతున్నట్టు ఆమె తల్లిదండ్రులకు తెలిసినా.. నాకెప్పుడూ చెప్పలేదు. హత్య జరిగిన రోజు బయటకు వెళ్లి కొద్దిసేపటికే  నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక నన్ను గుండెలకు హత్తుకొని ఏడ్చాడు. నా ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని ఆడగటానికి వెళ్తే కత్తి తీసుకొని గొంతు కోసుకుంటానని బెదిరించిందని చెప్పాడు. ఈ పెనుగులాటలో కీర్తన గొంతు తెగిందని ఏమైందో తర్వాత తనకు తెలియదని భయంతో వచ్చానని చెప్పాడు. నా కొడుకు అమాయకుడు. ఇంతటి ఘోరం చేసుంటాడని అనుకోవడం లేదు. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి. మరో రకంగా వద్దు. మరో రకంగా శిక్షించేటట్లయితే... నా కుమారుడితో పాటు నన్నూ శిక్షించండి’’ అంటూ సుజాత పేర్కొంది.

    తన కొడుకు చంపాలని వెళ్లి ఉంటే కత్తి తీసుకువెళ్ళేవాడు కదా అంటూ తల్లి ప్రశ్నిస్తోంది. పెనుగులాటలో పొరపాటున ప్రమాదం జరిగిందని కొడుకు తనకు చెప్పాడన్న తల్లి.. ముందే బాలికను పెళ్లి చేసుకుంటానని తన కొడుకు ఆమె తండ్రిని అడిగాడని సుజాత అంటోంది. ‘‘ప్రేమించుకున్నాం కదా పారిపోయి పెళ్లి చేసుకుందామని నా కుమారుడు అడిగాడు. బాలిక రానని చెప్పింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తన కుమారుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారని పుకార్లు ఉన్నాయి. చట్టప్రకారం తప్పుచేసి ఉంటే శిక్షించండి. ఎన్‌కౌంటర్‌ చేస్తే.. నన్ను కూడా చంపేయండి’’ అంటూ వెంకటేష్‌ తల్లి వ్యాఖ్యానించారు.

Telangana

  • సంగారెడ్డి: ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్‌లో చోటుచేసుకుంది. భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లోని సంగమేశ్‌, మల్లమ్మ  శ్రీజ, దొడ్డి అమోస్‌కు గాయాలు అయినట్లు తెలిపారు. 

    గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఇంట్లో దాదాపు 10 డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నట్లు తెలిపారు. ఇంట్లో అన్ని గ్యాస్ సిలిండర్లను ఎందుకు నిల‍్వ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

    పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్‌ కొరత వస్తుందన్న వదంతులతో ఇటీవల చాలా మంది అవసరానికి మించి ‍గ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేసుకున్నారు. కొందరు అక్రమంగా గ్యాస్‌ సిలిండర్లను అమ్ముకుంటున్నారన్న ప్రచారమూ జరిగింది. అయితే, సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్‌లో భారత్ గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి ఇంట్లోనే గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. గ్యాస్‌ కంపెనీలో పని చేస్తున్నప్పటికీ అతడి ఇంట్లో అన్ని సిలిండర్లను ఎందుకు నిల్వ చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి ఉంది.

  • సాక్షి,మంచిర్యాల: పార్టీ పేరు మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన పల్లిలో బీఆర్‌ఎస్‌ కారకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత నష్టపోయాం. మళ్లీ టీఆర్‌ఎస్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. మేం తప్పులు చేశాం.. అందుకే ఓడిపోయాం. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు.. బాధపెట్టొద్దు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది.. ఓట్లు వేయాలి కదా. మాకు ఏ పార్టీతో పొత్తులు ఉండవు’ అని స్పష్టం చేశారు.

  • సాక్షి, మంచిర్యాల: రాష్ట్రంలో దోచుకో..దాచుకో లాంటి కొత్త స్కీమ్‌ నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. క్యాతనపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్  నీచమైన రాజకీయాలకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. కౌన్సిలర్లను కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకుంటే కౌన్సిలర్ భూమాగౌడ్ ఇల్లు కూలగొట్టారని అన్నారు. అయినప్పటీకి బీఆర్ఎస్ కార్యకర్తలు తలొగ్గలేదని క్యాతనపల్లిలో చూపెట్టిన స్ఫూర్తిని పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా చూపాలన్నారు.

    మాజీ ఎమ్మెల్యే సుమన్‌ను అక్రమ కేసులు పెట్టి  ఆదిలాబాద్ జైల్లో పెట్టించి సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారని మున్సిపల్ ఎన్నిక సమయంలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించినా మంత్రి వివేక్‌ చూసుకుంటూ కూర్చున్నారని అన్నారు. సింగరేణిలో సైట్ విజిటేషన్ కార్యక్రమం పెట్టి కాంట్రాక్టర్లను సీఎం బంధువులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లో మెడికల్ బోర్డు పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 16 వేల ఉద్యోగాలపై ఏసీబీతో విచారణ జరిపిస్తామని సీఎం అనడం శోచనీయమని, కాంగ్రెస్‌ నాయకులను సింగరేణి కార్మికులు అడ్డుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు.

    ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని, కాంగ్రెస్ చేసే దోపిడిపై బీజేపీని సీబీఐచే విచారణ జరిపించాలని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణాలో లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు 52 కోట్లు కేటాయించి, ప్రాజెక్ట్ కడతామని మాయమాటలు చెప్తోందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాబోయే సింగరేణి ఎన్నికల్లో TBGKSను గెలిపించాలని కేటీఆర్ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్‌ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కారు నంబర్‌ ప్లేట్‌ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    వివరాల మేరకు.. జూబ్లీహిల్స్‌ పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్‌ ప్లేట్‌ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్‌ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Family

  • 92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్‌ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్‌ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్‌ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.

    రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్‌ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్‌రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్‌ లేదా పాస్టల్‌ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్‌ సిల్క్‌ చీరలనే ఇష్టపడేవారట. 

    ముక్కుపుడక..
    ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. 

    ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు,  బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్‌గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా  ఆభరణాలను ఎంచుకునేవారట. 

    అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్‌ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్‌'(తాయ్‌ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్‌ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్‌తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్‌కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె.

     

    (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..)

     

  • ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్‌తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్‌ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్‌ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.

    ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్‌ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.

    ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..
    ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్  సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.

    ప్రభావం ఎలా ఉంటుందంటే..

    • ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుంది

    • బలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి

    • తక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుంది

    • శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుంది

    ఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.

    ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్‌తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్‌ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్‌ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. 

    యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.

    నివారణ..
    ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. 

    ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

    (చదవండి: రెండేళ్లుగా వ్యాన్‌లోనే బందీ..! పాపం చివరికి..)

     

  • కొన్ని ఘటనలు ఎంత అమానుషంగా ఉంటాయంటే మనిషన్నవాడే కనుమరుగైపోతున్నట్లుగా ఉంటుంది. కన్నతండ్రే ఘోరంగా ప్రవర్తించడం చూస్తుంటే..చిన్నచిన్న జంతువులే తమ పిల్లలను కంటికిరెప్పలా కాచుకుంటాయే మరి విచక్షణ జ్ఞానం ఉన్న మనకేమవుతోందో అర్థమవడం లేదు. స్వలాభం, స్వప్రయోజనం ఇంతేనా జీవితం. ఒక మనిషిని బాధపెడితేనే మనం సుఖంగా ఉంటాం. ఈ ప్రకృతి నినాదం జంతువులు అర్థ చేసుక్నుట్లు స్వార్థపూరిత మనుషులకు అర్థం కాదేమో కాబోలు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే పాపం ఆ పసివాడికి కన్నతండ్రే దారుణంగా విధించిన శిక్ష తెలిస్తే..ఏ మనిషివిరా నువ్వు అన్నంత కోపం కట్టలు తెంచుకుంటుంది. 

    అసలేం జరిగిందంటే..ఫ్రాన్స్‌లోని హాగెన్‌బాచ్ గ్రామంలో, నవంబర్ 2024 నుంచి తొమ్మిదేళ్ల బాలుడు యుటిలిటీ వ్యాన్‌లో బంధించబడ్డాడు. ఆ సమీపంలోనొ ఒక వ్యక్తి ఆ వ్యాన్‌ నుంచి బాలుడి అరుపుల్లా వినిపిస్తున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి రాగానే అక్కడే నిరుపయోగంలోని ఓ వ్యాన్‌ కనిపించింది. అందులో బాలుడి అరుపులేంటి అన్నట్లుగా నమ్మశక్యంగా చూశారు. 

    చివరకి ఆ వ్యాన్‌ చుట్టూ ఉన్న చెత్తను తొలగించి బలవంతంగా డోర్‌ తెరవగా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అక్కడ ఆ బాలుడు నగ్నంగా తీవ్ర పోషకాహార లోపంతో కనపించాడు. అలా కూర్చొనే ఉండటంతో నడవలేని స్థితికి వచ్చేసి ఉన్న పసివాడిని చూసి పోలీసులే దిగ్బ్రాంతి చెందారు. కదలికలు లేకుండా అన్నేళ్లు అలా నిర్బందించి ఉండటం వల్ల అతడిలో కలికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ వ్యాను స్విట్జర్లాండ్‌, జర్మనీ సరిహద్దులకు సమీపంలో హాగెన్‌బాక్‌లో ఉంది. 

    పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా..భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రే దీనంతటికి కారణమని తేలింది. ఏడేళ్ల వయసున్న బాలుడిని తన భార్య మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చించాలి ఫోర్స్‌ చేసిందని, గత్యంతరం లేక ఇలా వ్యాన్‌లో దాచినట్లుగా తండ్రి చెప్పాడు. తీరా అతడి భార్యను విచారిస్తే..తనకసలు ఆ బాలుడి గురించి ఏమి తెలియదని బుకాయించింది. అనుమానంతో పోలీసులు ఆ దపంతులపై పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఆ బాలుడికి 12 ఏళ్ల సోదరి కూడా ఉందని తెలిసింది. అంతేగాదు స్కూల్‌లో మంచిప్రతిభ కనబర్చేవాడని, అలాగే అతడికి ఎటువంటి మానసిక సమస్యలు లేవని వెల్లడించారు పోలీసులు

    ఆమెను కూడా రెండేళ్లక్రితం అంటే పదేళ్ల వయసులో సామాజిక సేవల సంరక్షణలో ఉంచినట్లు వెల్లడైంది. అయితే ఆ బాలుడు విచారణలో తన తండ్రి తన భార్యతో సమస్యలున్నాయని, అందువల్ల తానిలా బంధింపబడక తప్పలేదని చెప్పుకొచ్చాడు. అతడికి తండ్రే స్వయంగా రెండుసార్లు ఆహారం, వాటిర్‌ బాటిల్స్‌ విండో గుండా విసిరేవాడని చెప్పుకొచ్చాడు. ఆ బాలుడు వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్‌లలోనే మలమూత్రాదులు వెళ్లేవాడినని చెబుతుంటే..మరి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయారు పోలీసులు. 

    2024లో చేసిన చివరి స్నానం..ఇక అక్కడ నుచి అలానే వ్యాన్‌లో మగ్గిపోయాడు ఆ పసివాడు. దీంతో పోలీసులు ఆ బాలుడి తండ్రిపై అపహరణ, మైనర్‌ సంరక్షణలో విఫలమవ్వడం తదిరత కేసులన్నిటిని నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేగాదు ఇందుకు సహకరించిన ఆమె భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కానీ ఆ పసివాడికి ఇది జీవితాంత ఓ పీడకలలా వెంటాడుతుంది. అంతతొందరగా బయటపడి..అందరి పిల్లల్లా హాయిగా జీవితాన్ని గపడానికి చాలా ఏళ్లే పట్టొచ్చు. 

    (చదవండి: స్లాబ్‌లో.. మట్టికుండ సగానికి తగ్గుతుంది ఎండ...)
     

  • వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో  ఇల్లు  కొలిమిలా అనిపించడం మనకు చిరపరిచితమే.   ఫ్యాన్లు పూర్తి వేగంతో తిరుగుతున్నా గాలి సరిపోనట్టుగా ఉక్కపోతగా అనిపిస్తుంది. దానికి కారణం...  ఇంటి పైకప్పు నుంచి వెలువడే వేడి , ఇంటి పైకప్పు రోజంతా వేడిని పీల్చుకుని, దానిని నెమ్మదిగా మన  నివాస స్థలంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అదే మనకు తీవ్రమైన తాపాన్ని కలిగిస్తుంది. 

    తత్ఫలితంగా పుట్టే భరించలేని ఉక్కపోత నుంచి ఎయిర్‌ కండిషనర్లు ఉపశమనం కలిగిస్తాయి, కానీ అవి జేబుకు మాత్రమే కాదు పర్యావరణానికి కూడా చిల్లులు పెడతాయి. ఏటా అంతకంతకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. విద్యుత్ పై ఎక్కువ ఆధారపడకుండానే మన ఇల్లు చల్లగా మార్చగలిగితే ఎంత బాగుంటుందో కదా... ఊహకే ఆనందాన్ని ఇచ్చే ఈ భావన వాస్తవంలో సాధ్యమేనా? అంటే  ఒక సులభమైన, కాలపరీక్షకు నిలిచిన శీతలీకరణ చిట్కా ద్వారా దీన్ని సాధ్యం చేయవచ్చునని సంప్రదాయ పద్ధతిలో నిర్మాణాలు సాగించేవారు చెబుతున్నారు.
    వంటికి... ఇంటికీ కూడా... ఫిల్లర్‌ స్లాబ్‌

    ఈ సమస్యకు సమాధానం  సాదాసీదా మట్టి కుండల రూపంలోనే ఉంది. వంటిని చల్లబరిచే చల్లని నీటి కోసం ఫ్రిజ్‌ కు బదులు మట్టి కుండను ఎలా నమ్ముతున్నామో అలాగే ఇంటి చల్లదనానికి కూడా అవే ఉపకరిస్తాయి అని అంటోంది ఫిల్లర్‌ స్లాబ్‌ అనే నిర్మాణ శైలి. ఫిల్లర్‌ స్లాబ్‌ అనే పేరున్న ఈ పురాతన నిర్మాణ పద్ధతి ఓ సాంప్రదాయ జ్ఞానాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువస్తోంది. 

    ఈ పద్ధతిలో, కాంక్రీటు పోయడానికి ముందు మట్టి కుండలను పైకప్పు లోపల తలక్రిందులుగా ఉంచుతారు. నిర్మాణం గట్టిపడిన తర్వాత, ఈ కుండలు స్లాబ్‌ లోపల చిన్న గాలి గదులను సృష్టిస్తాయి. ఈ గదులు సహజమైన ఇన్సులేషన్‌గా పనిచేస్తాయి, పైకప్పు నుంచి ఇంటిలోకి వేడి బదిలీని నెమ్మదింపజేస్తాయి. తక్కువ కాంక్రీటు వాడకంతో, పైకప్పు మొదటి నుంచే తక్కువ వేడిని గ్రహించి నిల్వ చేసుకుంటుంది  దాని స్వభావ రీత్యా, వేడి చొచ్చుకుపోవడాన్ని మట్టి, నిరోధిస్తుంది. ఫలితం? ఎలాంటి యాంత్రిక జోక్యం లేకుండానే, ఇళ్లు చెప్పుకోదగిన రీతిలో చల్లగా ఉంటాయి, 

    కొన్నిసార్లు ఇతర సాధారణ నిర్మాణ శైలి ఇళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ కూడా చల్లగా ఉంటాయి. అంతేకాకుండా మట్టి కుండలు అందుబాటు ధర్లోనే లభిస్తాయి.  ఇవి పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇందులో ఎలాంటి సంక్లిష్టమైన సాంకేతికత లేదు ఇది కేవలం సాంప్రదాయ జ్ఞానంలో పాతుకుపోయిన ఆలోచనాత్మకమైన రూపకల్పన మాత్రమే.  దీనివల్ల కలిగే ప్రయోజనాలు సౌకర్యానికి మించి ఉంటాయి. ఇళ్లలో వేడి తగ్గడం అంటే ఎయిర్‌ కండిషనర్లపై ఆధారపడటం తగ్గడం, దీనివల్ల విద్యుత్‌ బిల్లులు తక్కువ రావడంతో పాటు కార్బన్‌ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. 

    కాలక్రమేణా, ఇది నివాస గృహాలకు మాత్రమే కాక భూగ్రహానికి కూడా గణనీయమైన రీతిలో మంచి మార్పును తీసుకురాగలదు. ఆసక్తికరంగా, వేసవిలో ఇళ్లను చల్లగా ఉంచే అవే గాలి బుడగలు శీతాకాలంలో వెచ్చదనాన్ని నిలుపుకోవడానికి కూడా సహాయపడతాయి, తద్వారా నివాసాలు ఏడాది పొడవునా మరింత సౌకర్యవంతంగా మారతాయి. ఆధునిక నిర్మాణం తరచుగా  వాతావరణానికి అనుగుణమైన రూపకల్పనను విస్మరిస్తుంది. మరోవైపు ఎయిర్‌ కండిషనర్ల వాడకం సర్వసాధారణం కాకముందే,  దేశవ్యాప్తంగా సాంప్రదాయ వాస్తుశిల్పం అప్పటికే తెలివైన, సుస్థిరమైన మార్గాలలో పర్యావరణానికి అనుగుణంగా మారుతోంది.

    ఆధునిక సమస్యలకు  పరిష్కారాలు ఎల్లప్పుడూ కొత్తవిగానే ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఫిల్లర్‌ స్లాబ్‌ వంటి పద్ధతుల పునరుజ్జీవనం మనకు గుర్తు చేస్తుంది.  నగరాలు వేడెక్కుతూ, ఇంధన అవసరాలు పెరుగుతున్న కొద్దీ, మనం నిర్మించే విధానంలో చేసే చిన్న మార్పులు, మనం జీవించే విధానంలో పెద్ద మార్పులకు దారితీయగలవు.  ఒక మట్టి కుండ వంటి అత్యంత సాధారణ చవకైన వస్తువు  చల్లదనాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే  పర్యావరణ నష్టాన్ని కూడా నివారించే శక్తి కలిగి ఉంది అని మనం గుర్తిస్తే...మన నివాసాలు బాగుంటాయి..భవిష్యత్తు భధ్రంగా ఉంటుంది.

    (చదవండి: స్నేహితుడి కోసం ఏకంగా రూ. 37 లక్షల లగ్జరీ కారులో..!)

  • స్నేహానికి ఉన్న శక్తి మరొకటి లేదు. ట్రెండ్‌ మారినా..స్టేటస్‌ మారినా..ఫ్రెండ్‌ మారడు అనేందుకు ఈ వ్యక్తే నిదర్శనం. ఎంత పెద్ద హోదాలో చక్కటి లైఫ్‌ లీడ్‌ చేస్తున్నా.. కేవలం తన స్నేహితుడి కోసం నిస్వార్థంగా చేస్తున్న అతడి సాయం చూస్తే..కళ్లల్లో నీళ్లు తిరుగతాయ్‌..!. ఇంతకీ అతడేం చేశాడంటే..

    గురుగ్రామ్‌లో ఒక విలాసవంతమైన కారు డిక్కీలో బేకరీ ఉత్పత్తులు అమ్ముతున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇంతకీ అందులో అంత ఆసక్తికరమైనది ఏం ఉందంటే.. హర్ష్‌ చౌహన్‌ అనే అకౌంట్‌ నుంచి షేర్‌ అయిన ఆ వీడియోలో ఆ వ్యక్తి తన ఖరీదైన కారు డిక్కీని తెరిచి, అమ్మకానికి ఉంచిన బేకరీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ కనిపిస్తాడు. 

    నీద్గగర రూ. 37 లక్షల ఖరీదు చేసే కారు ఉంది మరి ఇదేంటన్‌ యూజర్‌ చౌహన్‌ అడగ్గా..తాను జర్మనీలో మెడికల్‌ రీసెర్చ్‌ సైంటిస్టునని బాంబు పేలుస్తాడు. ఇదంతా కేవలం తన​ స్నేహితుడికి మద్దతు ఇచ్చేందుకని కూల్‌గా చెబుతాడు. వైరల్‌ అవుతున్న వీడియోలోని కథ నిజమేనా కాదా అని పలువురు మీడియా ఔత్సాహికులు ఆరా తీయగా..అతడు జర్మనీ నుంచి తిరిగి వచ్చిన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ అవధేష్‌ అని తేలింది. అతడితో మాట్లాడగా..తాను జర్మనీలో మూడేళ్లుగా మెడికల్‌ రీసెర్చ్‌ సైంటిస్టుగా పనిచేస్తున్నాని, ప్రస్తుతం ఉద్యోగానికి బ్రేక్‌ తీసుకున్నట్లు అవధేష్‌ పేర్కొన్నాడు.

    ఆ నేపథ్యంలోనే తన కారుని తాత్కాలిక చట్కారా ఆన్ వీల్స్' అనే స్టాల్‌గా ఉపయోగించి బేకర్‌ ఉత్పత్తులు అమ్ముతూ.. స్నేహితుడికి ఫుడ్‌ వ్యాపారంలో సాయం చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక్కడ భారత్‌లో తన స్నేహితుడు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాక..తాను తిరిగి జర్మనీకి వెళ్లిపోతానని చెబుతుండటం విశేషం. అందుకు సుమారు ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపాడు. 

    ఎంత పెద్ద హోదాలో ఉన్నా..మారిపోని ఫ్రెండ్‌ ఇతడే అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. స్నేహం కోసం కొందరు ఎంత దూరమైన వెళ్తారు. అలాంటి వ్యక్తులను పొందడం అనేది కొన్ని కోట్ల కన్నా విలువైన సంపద అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు అతడి నిస్వార్థ సేవకు మాటల్లేవ్‌ బ్రో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

     

    (చదవండి: ఫేస్‌ పౌడర్‌' వెనుక ఇంత స్టోరీ ఉందా..!)