Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • హైదరాబాద్‌, సాక్షి: హైదరాబాద్‌లో కల్తీ డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్‌లోని జెమ్ ఫుడ్స్ గోడౌన్‌పై పోలీసులు దాడి చేశారు. అక్కడ నిల్వ ఉంచిన 30 బాక్సులకు పైగా కుళ్లిపోయిన డ్రై ఫ్రూట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

    పోలీసుల సమాచారం ప్రకారం.. మనీష్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి బూజు పట్టిన జీడిపప్పు, బాదంలను నాణ్యమైనవిగా చూపించి ప్రజలకు విక్రయిస్తున్నాడు. దాంతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. ఈ ఘటనతో కల్తీ ఆహార పదార్థాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • హైదరాబాద్‌:  రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలతో  కలిసి ప్రీ బడ్జెట్ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్ లో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములుగా చేయాలని వ్యవసాయ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు, పూల సాగు చేయించి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. 

    రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ గోడౌన్లు, వేర్ హౌసింగ్ గోదాములపై సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వ్యవసాయ శాఖకు విద్యుత్ ఖర్చులు మిగలడంతో పాటు అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును విక్రయించుకునే అవకాశం, ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ శాఖ సంస్థలపై సోలార్ రూఫ్ టాప్ ల ఏర్పాటుకు సంబంధించి రెడ్కో సంస్థను సంప్రదించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను రైతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

    రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలు పెద్ద సంఖ్యలో పంపిణీ చేస్తుంది అదేవిధంగా విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఈ అంశాన్ని రైతులకు చక్కగా వివరించాలని మంత్రులు సూచించారు. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల కింద వివిధ రకాల పంటలు సాగు చేస్తున్న తీరు, నీటి సరఫరా, యాసంగి వరి సాగు, మార్కెట్లోకి రానున్న ధాన్యం, సేకరణ తదితర అంశాల పై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: శాస్త్రిపురంలోని బాబా కాంటా, ఉడంగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్‌ను కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి, రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

    నిందితులు అబ్దుల్ అలీమ్, జసాని దిల్దార్ అలీలపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కిలోల గమ్ పౌడర్ (Xanthan Gum), 2 కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), 7 ప్యాకింగ్ మెషీన్లు, 3 గ్రైండింగ్ మెషీన్లు, 2 వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: అపరిశుభ్రమైన ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సి.సి.ఎస్ (CCS), స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్‌పురా పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న అపరిశుభ్రమైన, పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

    నిందితుడు హైదరాబాద్‌లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో GEM Foods (ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్) పేరుతో ఒక గోడౌన్‌ను నిర్వహిస్తూ..పాడైపోయిన, బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌గా అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

    వస్తువులను కొనేముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎవరైనా పాడైపోయినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌, ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.
     

  • హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ అయిన కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ PJTAU క్యాంపస్‌లో మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక  మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.

    ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ సీఈఓ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, మరియు PJTAU వైస్-చాన్సలర్ మరియు చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.

    ఈ రైతు మేళా,  రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు ఒక చురుకైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

  • హైదరాబాద్ : దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని గతంలో హెచ్చరించిన తెలంగాణ ఆర్టీసీ.. ఈ మేరకు సమ్మె నోటీసు ఇచ్చింది. ఈరోజు(శుక్రవారం) ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాటు. పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీ ఎండీ లేకపోవడంతో పేషీలోనే సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని వారు హెచ్చరించారు. 

    తమ పెండింగ్‌ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించాలని, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని గత నెలలో ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్‌ను మాత్రం ఇంకా చెల్లించలేదని, ఆర్టీసీకి రావాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

  • సాక్షి, జోగులాంబ గద్వాల: లంచం తీసుకుంటూ  పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కాడు. అయిజా మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా.. క్లియరెన్స్ ఇవ్వడానికి కార్యదర్శి ఏకంగా రూ. 20 వేలు డిమాండ్ చేశారు.

    మొత్తం రూ. 20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకున్న కార్యదర్శి.. శుక్రవారం ఎంపీడీవో  కార్యాలయం ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిపోయాడు. కార్యదర్శి రంగన్నను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

    పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి  మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

  • తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్ర‌ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణించే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటు వ‌చ్చిన‌ట్ట‌యింది.

    కాచిగూడ-మధురై-కాచిగూడ
    రైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

    హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ 
    రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

    చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి
    రైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. 
                   
    3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్య‌క్తం చేశారు. 

  • హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు.కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆయన్ను నిమ్స్‌లో చేర్చగా.. ఈ రోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

    హెచ్‌జే దొర.. ఆయన పోలీస్‌ శాఖలో విశిష్ట సేవలు అందించి, క్రమశిక్షణతో పాటు ప్రజల భద్రత కోసం కృషి చేశారు. దశాబ్దాలపాటు పోలీస్‌ వ్యవస్థలో కీలక పదవుల్లో పనిచేసి, అనేక సంస్కరణలకు మార్గదర్శకుడయ్యారు. ప్రధానంగా గ్రేహౌండ్స్‌ బలోపేతానికి హెచ్‌జే దొర విశేషంగా కృషి చేశారు. 

    ఆయన మరణం రాష్ట్రానికి, పోలీస్‌ శాఖకు పెద్ద నష్టం అని పలువురు భావిస్తున్నారు. సహచరులు, శిష్యులు ఆయనను క్రమశిక్షణా ప్రియుడిగా, నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తుచేసుకుంటున్నారు. 

International

  • దుబాయ్‌లో ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు వర్తించే ఉల్లంఘనలు, జరిమానాలపై కొత్త చట్టానికి దుబాయ్ పాలకుడు, యూఏఈ  ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదం తెలిపారు. పారదర్శకత, న్యాయాన్ని పెంపొందించే ఉద్దేశంతో 2026 సంవత్సరానికి సంబంధించి చట్టం నెం.6ను ప్రకటించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే విధానంపై మరింత స్పష్టత తీసుకొచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు.

    ఈ చట్టం ప్రధానంగా ప్రభుత్వ స్థాయిలో జరిగే ఉల్లంఘనలకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటుచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అధికార దుర్వినియోగాన్ని నిరోధించడం, చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం కూడా దీని ఉద్దేశంగా ఉంది. ఉల్లంఘనలను వాటి తీవ్రత ఆధారంగా చిన్న, మధ్యస్థ, తీవ్రమైనవిగా వర్గీకరించి, ప్రతి ఉల్లంఘనకు తగిన శిక్షను విధించేలా నిబంధనలు రూపొందించారు.

    చట్టం ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు లేదా సంస్థలపై అధికారులు పలు రకాల చర్యలు తీసుకోవచ్చు. జరిమానా విధించే ముందు లేదా తరువాత పరిస్థితిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేయవచ్చు. అవసరమైతే సంస్థలను ఆరు నెలల వరకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేయవచ్చు. అలాగే వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చిన లైసెన్సులు, అనుమతులను రద్దు చేయడం లేదా సవరించడం కూడా చేయవచ్చు. ఉల్లంఘనలకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా కార్యకలాపాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తోంది.

    ఇక చర్యల ప్రక్రియలో పారదర్శకతను తప్పనిసరి చేశారు. ప్రతి ఉల్లంఘనను స్పష్టంగా నిర్వచించాల్సి ఉంటుంది. జరిమానాలు లేదా శిక్షలు నిర్ణయించే సమయంలో ఉల్లంఘన తీవ్రత, అది పునరావృతమైందా లేదా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

    క్రమశిక్షణా చర్యలను ప్రకటించే ముందు సంబంధిత ప్రభుత్వ సంస్థల అధిపతుల అనుమతి తప్పనిసరి. అదేవిధంగా సమాచారం విడుదలలో దుబాయ్‌ మీడియా ఆఫీస్‌తో సమన్వయం చేయాలని కూడా నిబంధనలు పేర్కొంటున్నాయి.

    శాంతి భద్రతను కాపాడుతూ చట్టబద్ధమైన పాలనను మరింత బలోపేతం చేయడమే ఈ కొత్త ఉత్తర్వుల ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీనికి విరుద్ధంగా ఉన్న పాత చట్టాలు రద్దయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

  • వాషింగ్టన్‌: ఇరాన్‌ గగనతలం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిందని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్‌ ఆయుధ నిల్వలు బలహీనపడిన క్రమంలో ఆ దేశ గగనతలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అమెరికా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంపై అమెరికా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘ ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో దాడులు చేశాం. 

    ఫైటర్‌ జెట్లు, బాంబర్లతో ఇరాన్‌పై దాడులు చేశాం. ఇరాన్‌ అణు సామర్థ్యాలు, మిస్సైల్‌ స్థావరాలు, నేవీ  వ్యవస్థను నాశనం చేయడమే మా టార్గెట్‌. ఇరాన్‌ గగనతలం పూర్తిగా  మా గుప్పిట్లోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపేది లేదు. యుద్ధంలో ఏడుగురు అమెరికా సైనికులు మృతి చెందారు. 140 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఇరాన్‌  ఒంటరి అయిపోయింది. ఇరాన్‌ ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇరాన్‌పై దాడులను మరింత ఉధృతం చేస్తాం’ అని అమెరికా పేర్కొంది.

    అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతాన్యాహుల సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌ తమకు సరెండర్‌ కాబోతుందన్న ట్రంప్‌.. తమ దాడులకు ఇరాన్‌ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్‌లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్‌ అన్నారు.

    మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్‌ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని  నెతన్యాహు అన్నారు.

  • ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌దాడులు, ఇరాన్‌ ప్రతిదాడులోగల్ఫ్‌ ప్రాంతం గజగజ లాడుతోంది. ఈ రోజు (శుక్రవారం)దుబాయ్‌లోని కొన్నిప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa) దగ్గర దట్టమైన పొగ  వ్యాపించిన వీడియోలు వైరల్‌గా మారాయి.


    బుర్జ్ ఖలీఫా దగ్గర కనిపించిన పొగ
    ఆన్‌లైన్‌లో  వైరల్‌ అవుతున్న  వీడియోలలో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా భవనాల పైన నుండి భారీ పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. ఆకాశహర్మ్యాల మీదుగా పొగ మేఘాలు అలుముకున్నాయి. ఈ ఘటననగరంలోని కేంద్ర వ్యాపార మండలాల్లో ఆందోళనను పెంచింది. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల భవనాల్లో గణనీయమైన ప్రకంపనలు వచ్చాయని సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధులు వెల్లడించారు.

     >

    ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రతినిధి ప్రకారం, మొదటి పేలుడు సమీపంలోని నిర్మాణాలను కదిలించేంత బలంగా ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండో పెద్ద పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలోని నివాసితులు, కార్మికులలో ఆందోళన రేపింది.అయితే ఇది స్వల్ప నష్టం మాత్రమేనని అధికారులు ప్రకటించారు. 

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌ తమకు సరెండర్‌ కాబోతుందన్న ట్రంప్‌.. తమ దాడులకు ఇరాన్‌ భయపడిందంటూ వ్యాఖ్యానించారు. యుద్ధంపై నిర్ణయం తీసుకోవడానికి టెహ్రాన్‌లో అధికారులు ఎవరూ సజీవంగా లేరని.. ఇరాన్‌ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. లొంగిపోతున్నట్లు ప్రకటించేవారు ఎవరూ లేరని.. మొజ్తబా ఖమేనీ ఎవరికీ తెలియదని ట్రంప్‌ అన్నారు.

    మరో వైపు, తమ దేశం ఎప్పటికన్నా బలంగా మారుతోందంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ కూడా పెట్టారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు.. ఇరాన్‌ కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని  నెతన్యాహు అన్నారు.

     

     

     

     

  • ఇరాన్ కొత్త అత్యున్నత నాయకుడు మోజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపైపలు అనుమానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  అంతర్జాతీయ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల ప్రకారం  శత్రు పక్షం దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని కాలు తీసేసారని, కోమాలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ధృవీకరణఘేదీ లేనప్పటికీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.

    ది సన్ నివేదిక ప్రకారం, మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని బ్రిటీష్ పత్రిక 'ద సన్' (The Sun) నివేదించింది. అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హత్యకు గురైన  ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ  56 ఏళ్ల కుమారుడు మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ,ప్రస్తుతం టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నాడని నివేదించింది. తండ్రిమరణానికి దారి తీసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ  ఖమేనీకి ఒక కాలు (లేదా రెండు కాళ్లు) తొలగించారని, కాలేయం లేదా కడుపు భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఆయన టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ హాస్పిటల్‌లో కోమాలో ఉన్నట్లు ఆ వార్తలు పేర్కొంటున్నాయి.

    దీనికి తోడు ఇరాన్‌ సుప్రీంగా ఎన్నికైన తరువాత తొలిసారి మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక ప్రకటన జారీ అయింది. ఈ కొత్త ఫోటోలను ఇరాన్ మీడియా విడుదల చేసినప్పటికీ, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించినవి లేదా పాత ఫోటోలను ఎడిట్ చేసినవనీ చాలా సంస్థలు అనుమానిస్తున్నాయి.

    అయితే ఏఐ ఫోటో అన్న ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వ అధికారులు, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ ఖండించారు. మొజ్తబా ఖమేనీ "సురక్షితంగా, ఆరోగ్యంగా" ఉన్నారని , భద్రతా కారణాల దృష్ట్యా రహస్య ప్రదేశంలో ఉన్నారని పేర్కొన్నారు. 

     (ఇరాన్‌ వార్‌ : ట్రంప్‌ సరికొత్త వార్నింగ్‌)

    మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై స్పందిస్తూ,  ఖమేనా గాయపడి ఉండవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నారని భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించడంతో అసలు మొజ్తబా ఖమేనీ సజీవంగా ఉన్నారా లేదా అనుమానాలు మరింతగా చెలరేగాయి. అయితే ఖమేనీ కోమాలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు అదికారిక ధృవీకరణ ఏదీ  లేదు

    కాగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో (Operation Epic Fury) మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీనికోల్పోయిన సంగతి తెలిసిందే. అలాగే తల్లి, భార్యను, కొడుకును, అక్కను, ఆమె భర్తను, వారి పిల్లలు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

    ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు


     

  • ఫిబ్రవరి 28న అమెరికాతో కలిసి ఇరాన్‌పై  యుద్దాన్ని  మొదలు పెట్టిన తరువాత  ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. తమ దేశం "ఎప్పటికన్నా బలంగా మారుతోంది" అని గురువారం ఒక వార్తా సమావేశంలో నెతన్యాహు పేర్కొన్నారు. అలాగే తాము ఇరాన్, దాని ప్రాక్సీలపై బలవంతంగా దాడి చేస్తున్నామంటూ ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.

    యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి విలేకరుల సమావేశం నిర్వహించిన నెతన్యాహు ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీని చంపేస్తామని ఒక రహస్య బెదిరింపు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము  చోద్యం చూడటం లేదనీ, పూర్తి బలంతో దాడి చేస్తున్నామన్నారు.   "ధైర్యవంతులు గెలుస్తారు" అనే సూత్రంతో, మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చేస్తామని, శత్రువులను వెంటాడి మరీ దాడి చేస్తామని పేర్కొన్నారు. 

     (ఇరాన్‌ వార్‌ : ట్రంప్‌ సరికొత్త వార్నింగ్‌)

     

    ఇరాన్ తన అణు, బాలిస్టిక్ ప్రాజెక్టులను భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు  నిరోధించాయనీ, ఇరాన్ ఇకపై అదే ఇరాన్ కాదు, పేర్కొన్నారు. అంతేకాదు తాము ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను చంపాయని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), బాసిజ్ దళాలకు తీవ్ర నష్టం కలిగించాయని నెతన్యాహు అన్నారు.

    ఇదీ చదవండి: లవ్‌ జిహాద్‌ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!

Movies

  • టాలీవుడ్‌ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కి కోలీవుడ్‌ నటుడు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్‌ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై  సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది.

    ఎంజీఆర్‌పై వ్యాఖ్యల పట్ల చింతిస్తూ రాజేంద్రప్రసాద్ హృదయపూర్వక క్షమాపణ కోరారు. దీనికి నేను రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తున్నానని  విశాల్ చెప్పారు. ఇది రాజేంద్రప్రసాద్ నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

    అంతకు ముందు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.

    ఏం జరిగిందంటే..
    కాగా ఇటీవల ఓ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్‌ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్‌ సెలబ్రిటీలు విశాల్‌, నాజర్‌ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.

  • కోర్ట్‌ ఫేమ్‌ హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన మూవీ బ్యాండ్‌ మేళం. సతీష్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకున్నాయి.

    ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ
    తాజాగా ఈ మూవీ నుంచి మరో పాట వదిలారు. ఏంటో ఏమో.. పిచ్చిది ప్రేమ.. ఎపుడో సాయం రానే రాదే.. అంటూ పాట మొదలవుతుంది. ఈ లిరికల్‌ వీడియోలో శ్రీదేవితో పాటు నటుడు సాయి కుమార్‌ను చూపించారు. విజయ్‌ బుల్గనిన్‌ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ రాశాడు. సింగర్‌ సునీత అద్భుతంగా ఆలపించింది. 

     

  • హీరోయిన్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ వితికా షెరుకు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఏమైనా చేస్తుంది. భర్త కోసం ఇల్లు కట్టి గిఫ్ట్‌ ఇచ్చింది. చెల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సీమంతం చేసింది. స్నేహితురాలు, మెగా డాటర్‌ నిహారిక ఉండే ఇంట్లో ఆమెకోసం ఓ గదిని ప్రత్యేకంగా అలంకరించి సర్‌ప్రైజ్‌ చేసింది. ఇలా ఎప్పుడూ నా అనుకునేవారికోం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.

    కృతికాకు పండంటి బాబు
    ఇకపోతే 2025 డిసెంబర్‌లో వితికా పెద్దమ్మగా ప్రమోషన్‌ పొందింది. నటి సోదరి కృతికా పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆ పిల్లవాడి నామకరణ వేడుక జరిగింది. ఆ విషయాన్ని వితికా సిస్టర్స్‌ ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. బాబుకు జైవీర్‌ కార్తికేయ అని నామకరణం చేసినట్లు కృతిక కొన్ని ఫోటోలు రిలీజ్‌ చేసింది. వితిక అయితే.. ఊయల ఫంక్షన్‌ కోసం దగ్గరుండి డెకరేషన్‌ చేయించింది. 

    నామకరణ వేడుక
    పూలతో వెంకటేశ్వస్వామిని ఆవిష్కరించింది. అది చూసి కృతిక ఆశ్చర్యపోయింది. తనకోసం ఇంత కష్టపడిందా? అని తెగ సంతోషపడిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నీలాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా అదృష్టవంతురాలు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వరుణ్‌ సందేశ్‌- వతిక 'ధర్మస్థల నియోజకవర్గం', 'డియర్‌ ఆస్ట్రోనాట్‌' సినిమాలు చేస్తున్నారు.

     

     

  • అల్లు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌. ఇప్పటికే తన మాటలు, ప్రవర్తనతో సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయిపోయాడు. ఈ మధ్యే మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంటున్నాడు. అయితే తను కూడా హీరో అవుతానంటున్నాడట!

    వేషాలు వేస్తున్నాడు
    ఈ విషయాన్ని స్వయంగా బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ వెల్లడించాడు. అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవ వేడుకలో అరవింద్‌ మాట్లాడుతూ.. మా నాన్న, నేను, బన్నీయే కాదు.. వాళ్లబ్బాయి అయాన్‌ కూడా ఈ ఇండస్ట్రీలోనే ఉంటాడు. ఆల్‌రెడీ వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు. 

    ఎంట్రీ ఎప్పుడో?
    మా నాలుగు జనరేషన్స్‌ ఈ ఇండస్ట్రీపైనే ఉన్నాయి. అలాంటి చిత్రపరిశ్రమకు ఏదైనా తిరిగివ్వాలన్న సంకల్పంలో నుంచి పుట్టిందే అల్లు సినిమాస్‌ అని పేర్కొన్నాడు. మరి అయాన్‌ బాలనటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇస్తాడా? లేదా పెరిగి పెద్దయ్యాక నేరుగా హీరోగా పరిచయమవుతాడా? చూడాలి!

     

     

    చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌? నటి ఆన్సరిదే

  • ‘ఆయా షేర్‌..’ నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్‌’లోని ఈ పాట ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. నాని వేసిన హుక​్‌ స్టెప్‌కి చిన్న, పెద్దా, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు రీల్స్‌ చేస్తున్నారు. సాహిత్యంపై పట్టున్నవాళ్లు లిరిక్స్‌పై, డ్యాన్స్‌పై అవగాహన ఉన్నవాళ్లు..నాని స్టెప్పులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఈ పాటలో కనిపించిన విజువల్స్‌ మరోఎత్తు. ఈ పాటలో హీరోని మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం అంతా ఇంతా కాదు. హీరోను మురికివాడకు చక్రవర్తిగా చూపించడానికి 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్‌ను నిర్మించారట. 

    ఇందులో ప్రధాన ఆకర్షణగా హీరో హౌస్ (కమాన్ సెట్) నిలిచింది. దీన్ని 60 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు, 25 అడుగుల లోతుతో నిర్మించారట. అంతేకాదు ఇందులో చూపించిన ఇళ్లను నిజంగానే నిర్మించారట. సాధారణంగా సినిమాల్లో ఇళ్ల సెట్లు అంటే డమ్మీ స్ట్రక్చర్స్ వాడుతుంటారు. కానీ ఈ సాంగ్‌లో వాటర్ బాడీ విలేజ్ సెట్ కోసం 60 అసలైన ఇళ్లను నిర్మించినట్లు మేకర్స్‌ తెలిపారు. దాదాపు 50 మంది పనివారు 30 రోజుల పాటు శ్రమించి ఈ విలేజ్ సెట్‌ను రూపొందించారు. 

    ఇక ఈ పాటలో కనిపించే భారీ బిర్యానీ బౌల్‌ని రెడీ చేయడానికి ఏడు మంది దాదాపు ఐదు రోజుల పాటు కష్టపడ్డారట.  దీనికి పాత కాలపు లుక్ రావడం కోసం ప్రత్యేకమైన 'ఏజింగ్ టెక్నిక్స్' వాడటం విశేషం. సినిమాలోని సహజత్వం కోసం 120 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో ఒక డంప్ యార్డ్ సెట్‌ను కూడా వేశారు. దీనికోసం 25 మంది సభ్యులు 30 రోజుల పాటు పనిచేశారు. ఇక్కడ నీటి కొలను సృష్టించడానికి 100 ట్యాంకర్ల నీటిని వినియోగించారు. ఇది నిండటానికే ఏడు రోజుల సమయం పట్టిందంటే సెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక పాట కోసమే ఈ రేంజ్‌లో సెట్‌ వేశారంటే..ఇక సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చదు. సీనియర్ నటుడు మోహన్ బాబు విలన్‌గా నటిస్తున్నాడు. తనికెళ్ల భరణి,కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 21న  ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • మలయాళ స్టార్‌ దర్శకుడు ప్రియదర్శన్‌ సొంత భాషలోనే సెటిలైపోకుండా బాలీవుడ్‌లోనూ అనేక సినిమాలు చేశాడు. హీరా ఫెరి, హంగామా, భూల్‌ భులయ్యా వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా హారర్‌ కామెడీ మూవీ భూత్‌ బంగ్లా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇష్టం లేదు
    అయితే తనకు కామెడీ చిత్రాలకంటే సీరియస్‌ సినిమాలు చేయడమే ఇష్టం అంటున్నాడు తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్‌ మాట్లాడుతూ.. సీరియస్‌ చిత్రాలు తెరకెక్కించడమంటే నాకు చాలా ఇష్టం. కామెడీ మూవీస్‌ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నాకు వేరే ఆప్షన్‌ లేక కామెడీ జానర్‌లో సినిమాలు చేయాల్సి వస్తోంది.

    ఎందుకు చూడరు?
    సీరియస్‌ సినిమాలు చేస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం చూపిస్తారు అదే కామెడీ జానర్‌లో ఉంటే మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఒక మంచి దర్శకుడిగా పరిగణించరు. ఈ విషయంలో నాకు చాలా బాధేస్తుంది. కామెడీ సినిమాలు తీసేవాళ్లను మంచి దర్శకులుగా ఎందుకు చూడరు? మనదగ్గరే కాదు, ప్రపంచమంతటా అలాగే ఉంది. హాస్యభరిత చిత్రాలు చేసేవారిని జోకర్‌లా చూస్తున్నారు. కామెడీ సినిమాలకు ఆస్కార్‌ రావడం కూడా చాలా అరుదు. ఇది నిజంగా బాధాకరం.. కానీ ఇదే జరుగుతోంది అని ప్రియదర్శన్‌ చెప్పుకొచ్చాడు.

  • నటి సంభావన సేత్‌.. భోజ్‌పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్‌ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్‌ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్‌బాస్‌, రాజ్‌ పిచ్లే జనం కా, ఫియర్‌ ఫ్యాక్టర్‌: ఖత్రోన్‌కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.

    రెండో సీజన్‌లో పార్టిసిపేషన్‌
    అయితే తనకు ఓ స్టార్‌ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్‌ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొన్నాను. నాలుగో సీజన్‌లో స్టేజీపై పర్ఫామెన్స్‌ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్‌.. నేను భోజ్‌పురిలో మంచి పేరున్న డ్యాన్సర్‌ అని సల్మాన్‌ ఖాన్‌కు పరిచయం చేశాడు. 

    ఫోన్‌ నెంబర్‌ కూడా..
    అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్‌ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్‌ నెంబర్‌ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. 

    ఏడ్చుకుంటూ వెళ్లా.
    సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్‌.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్‌ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్‌ ఖాన్‌ అభిమానినే అని చెప్పుకొచ్చింది.

    చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్‌? నటి ఏమందంటే?

  • డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోలంతా ఒక్కసారైనా ఈయనతో సినిమా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మాస్‌, యాక్షన్‌ హీరోగా గుర్తింపు పొందాలంటే పూరీతో సినిమా చేయాల్సిందే. ఆయనలా సీన్స్‌, డైలాగులు రాసే డైరెక్టర్స్‌ ఇండియాలోనే లేరు అని ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరోనే చెప్పాడంటే.. పూరీ పెన్‌ పవర్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సరైన హిట్‌ లేకున్నా..యువతలో పూరీకి ఉన్న క్రేజ్‌ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు.

    ప్రస్తుతం పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్, టబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పూరీ ఫోకస్‌ అంతా ఈ మూవీపైనే పెట్టాడు. ఇదిలా ఉంటే.. పూరీ ఇప్పటికే తన వారసుడిని సినిమాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొడుకు ఆకాష్‌ పూరిని చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసి..ఆ తర్వాత హీరోగా మార్చాడు. అయితే ఆకాశ్‌ పూరీకి కూడా ఈ మధ్య సరైన హిట్‌ లేదు. తండ్రి కొడుకులిద్దరు ఓ భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

    మరోవైపు పూరీ తనయ పవిత్ర సైతం సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. బుజ్జిగాడు సినిమాలో పూరి కూతురు పవిత్ర చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. కానీ ఆమె సినిమాల్లోకి రాబోతుందనే వార్తలు మాత్రం తరచూ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ సారి ఆమె నటిగా కాకుండా.. నిర్మాతగా వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్‌’లో పవిత్ర కూడా నిర్మాతగా  చేర్చాబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిల్లో నిజమెంత అనేది తెలియదు కానీ..తాజాగా పవిత్రకు సంబంధించిన ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. 

  • తెలుగు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు చెప్పాడు. తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానన్నాడు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, అనుకోకుండా దొర్లాయని విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు.

    కొద్దిగా నోరు జారా..
    ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. తమిళ సినీ ప్రేక్షకులు ఎంజీఆర్‌ను దైవంలా భావిస్తారు. నేను కూడా ఆయన్ను దేవుడిలాగే భావిస్తాను. తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో కొద్దిగా నోరు జారాను. అది కావాలని అనలేదు. కొందరు దీన్ని పెద్దది చేశారు. ఆయనపై కామెంట్స్‌ చేసేంత ధైర్యం నాకెక్కడిది? నేను చెన్నై ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము నటిస్తుంటే వచ్చి చూసేవారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తప్పుగా మాట్లాడతానా? ఏదేమైనా నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి కామెంట్స్‌ చేయను అని క్షమాపణలు తెలిపాడు.

    పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి

    ఏం జరిగింది?
    కాగా ఇటీవల ఓ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ కాస్త నోరు జారాడు. తెలుగు నటుడు కాంతారావును పొగిడే క్రమంలో ఎంజీఆర్‌పై చులకన వ్యాఖ్యలు చేశాడు. కాంతారావును చూసి ఎంజీఆర్‌ ప్యాంటు తడుపుకునేవాడని కామెంట్స్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్‌ సెలబ్రిటీలు విశాల్‌, నాజర్‌ మండిపడ్డారు. రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రతి తమిళుడి మనసును నొచ్చుకునేలా ఉన్నాయన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్‌ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు.

     

     

  • సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతున్నారు? బరువు పెరిగారా? తగ్గారా? ముఖం కళకళలాడుతోందా? కళ తప్పిందా? హుషారుగా ఉన్నారా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఇలా ప్రతీది కళ్లతోనే స్కానింగ్‌ చేస్తున్నారు సోషల్‌ మీడియా నెటిజన్స్‌. వారి కంటికి ఏదైనా ఫోటో, వీడియో కనిపిస్తే చాలు.. ఏవేవో ఊహించుకుంటున్నారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటి నీనా గుప్తా విషయంలోనూ అలాగే అతిగా ఊహించుకున్నారు.

    విరోష్‌ రిసెప్షన్‌లో..
    ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విరోష్‌ (విజయ్‌ దేవరకండ- రష్మిక మందన్నా) రిసెప్షన్‌కు నీనా గుప్తా, భర్త వివేక్‌తో కలిసి హాజరైంది. స్టైలిష్‌గా తెల్ల చీర కట్టుకున్న ఆమె మెడకు బంగారు నెక్లెస్‌ ధరించింది. కాకపోతే కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపించింది. ఇంకేముంది సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. 66 ఏళ్ల వయసులో నీనా గర్భం దాల్చిందా? ఇది నిజమేనా? అని ఆరా తీస్తున్నారు.

    ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై క్లారిటీ
    దీంతో ఈ రూమర్స్‌పై తాజాగా నీనా గుప్తా స్పందించింది. ఇదేమైనా బదాయి హో సినిమా (ఈ మూవీలో లేటు వయసులో ఓ మహిళ తల్లవుతుంది) అనుకుంటున్నారా? అలాంటిదేం లేదు. నేను గర్భవతిని కాదు. చీర కాస్త బరువుగా ఉంది. అందువల్లే నేను కూడా మీకు లావుగా కనిపించానంతే! ఏదేమైనా ఈ ప్రచారం నన్ను బాధపెట్టడానికి బదులుగా ఆశ్చర్యపరిచింది. ఈ వయసులో ప్రెగ్నెంట్‌ అనుకున్నారంటే మన దేశం ముందుకు పోతున్నట్లే అని పేర్కొంది. నీనా చివగా వధ్‌ 2 మూవీలో యాక్ట్‌ చేసింది.

    ప్రేమ- పెళ్లి
    నీనా గుప్తా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ను ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి భార్యాబిడ్డలున్నారు. అయినప్పటికీ నీనాతో ప్రేమాయణం సాగించాడు. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా గుప్తా జన్మించింది. కానీ నీనా- రిచర్డ్స్‌ మాత్రం పెళ్లి బంధం వరకు వెళ్లకుండానే విడిపోయారు. దాంతో నీనా.. సింగిల్‌ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది. 2008లో వివేక్‌ మెహ్రాను పెళ్లాడింది.

     

     చదవండి: గుండె ముక్కలు.. హీరో బ్రేకప్‌ పోస్ట్‌

  • టాలీవుడ్‌ యంగ్‌ హీరో అల్లు శిరీష్‌ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 6న తన ప్రియురాలు నయనికను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఈ జంట తమకు పుట్టబోయే పిల్లల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. పుట్టబోయే పిల్లలను తెలుగులో మాట్లాడేలా పెంచాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీషే చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీ గురించి వివరించాడు.

    అత్తయ్యకు దొరికిపోయాం..
    మేమిద్దరం ప్రేమలో ఉన్న విషయం మొదట మా అత్తయ్య(చిరంజీవి సతీమణి సురేఖ)కు తెలిసింది. మేమిద్దరం ఓ రోజు కాఫీ తాగేందుకు బయటకు వెళ్లాం. కాఫీ షాపులో మా అత్తయ్యకు తెలిసివాళ్లు కూడా ఉన్నారు. అది మాకు తెలియదు. మేము కాఫీతాగి బయటకు రాగానే.. వాళ్లు మా అత్తయ్యకు ఫోన్‌ చేసి చెప్పారు. అలా మా ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. నేను కూడా నయనికను ప్రేమిస్తున్నానే విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.

    నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు ఇష్టం
    నయనిక సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అంటే నాకు చాలా ఇష్టం.  ఏ విషయానైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. నచ్చకపోతే ముఖం మీదనే నచ్చలేదని చెప్పెస్తుంది. నా సినిమాల్లో నచ్చిన విషయాలను షేర్‌ చేసుకునేది. పెళ్లికి ముందే మేము పిల్లల గురించి కూడా మాట్లాడుకున్నాం. మాకు పుట్టబోయే పిల్లలు ఇంట్లో తెలుగులోనే మాట్లాడాలనేది నా కోరిక. దీనిపై మేమిద్దరం చర్చించుకున్నాం’ అని శిరీష్‌ చెప్పుకొచ్చాడు. 

  • తమిళ హీరో అర్జున్‌దాస్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ సినిమా అప్‌డేట్స్‌ తప్ప పర్సనల్‌ విషయాలను పెద్దగా ఫ్యాన్స్‌తో పంచుకోడు. అలాంటిది ఆయన హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు ఓ పోస్ట్‌ పెట్టడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

    అంతలా ప్రేమిస్తే..
    ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. మనం ఎవర్నైనా గాఢంగా ప్రేమిస్తే.. వాళ్లు మనల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్‌ ఆన్‌ అవుతారు? అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. దీనికి హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. 

    అర్జున్‌దాస్‌కు బ్రేకప్‌
    ఇది చూసిన అభిమానులు అర్జున్‌దాస్‌కు బ్రేకప్‌ అయిందా? అని చర్చిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్‌ అయుంటుంది, అంతా పబ్లిసిటీ స్టంట్‌ అని భావిస్తున్నారు. మరి ఈ పోస్ట్‌ వెనక మర్మమేంటో అర్జున్‌ దాసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

    సినిమా
    కాగా అర్జున్‌ దాస్‌ గతంలో ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్‌ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు. ఇకపోతే ఇతడు చివరగా ఓజీ సినిమాలో యాక్ట్‌ చేశాడు. ప్రస్తుతం కాన్‌ సిటీ సినిమా చేస్తున్నాడు.

    చదవండి: ఆశను కోల్పోవద్దు.. విడాకుల తర్వాత హన్సిక ఫస్ట్‌ పోస్ట్‌

Politics

  • విస్సన్నపేట:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.  తాను జైలు నుంచి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడనని చంద‍్రబాబు అనుకున్నారని, నిక్కర్లు వేసుకున్నప్పటి నుండి తాను రాజకీయం చేస్తున్నానని, ఇటువంటి బెదిరింపులకు భయపడనని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. తాను జైలు నుంచి వచ్చిన తర్వాత తగ్గుతా అనుకున్నావా.. వైఎస్సార్‌సీపీ జెండాను భుజం దింపుతా అనుకున్నావా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. 

    ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్న పేటలో మీడియాతో మాట్లాడారు జోగి రమేష్‌.  ‘ తిరువూరు గడ్డ అంటే వైఎస్సార్‌సీపీ అడ్డా. గ్రామాల్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడు.. జగనన్న ఎప్పుడు సీఎం అవుతాడు అంటున్నారు. నేను చంద్రబాబును ఒక మాటే కదే అన్నాను. కల్తీ లిక్కర్ నారా వారి సారా ఏరులై పారుతుంది  అనే కదా అన్నాను. ఒక్క మాటకే 83 రోజులు జైలుకు పంపించావు.  చంద్రబాబు విద్య,వైద్యాన్ని పడకెత్తించాడు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్  అంటూ మోసగించావు. లోకేష్ ఏమన్నాను చిప్ దొబ్బిందా అన్నాను అంతేగా. దానికై ఇంటిపై యాసిడ్ బాంబులతో దాడులు చేశారు. కల్తీ నెయ్యి గురించి  నానా యాగీ చేస్తున్నారే. సుప్రీంకోర్టు సైతం చెంప చెల్లుమనిపించింది’ అని మండిపడ్డారు.

    ఇరాన్‌లో మాత్రమే ఖాళీ ఉంది..
    చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలా. చంద్రబాబు ప్రధానమంత్రి అవకాశం వస్తేనే వదిలేసుకున్నాడట. ఉపప్రధాని పదవి చాలా చీప్ అట.. మోదీ స్థాయి అయితేనే కావాలట. మోదీ స్థాయి పదవి కావాలంటే చంద్రబాబుకు ఇరాన్‌లో మాత్రమే ఖాళీ ఉంది’ అని ఎద్దేవా చేశారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: ఇరవై నెల‌ల కూట‌మి పాల‌న‌లో కేవ‌లం రూ.1.05 ల‌క్ష‌ల కోట్ల అప్పులే చేశామ‌ని, ఏనాడూ నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్బీసీ) అధిగ‌మించ‌లేద‌ని చెబుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ‌వ్ కి ఇవే మాట‌ల‌ను ఆర్థిక‌ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో రాయించి అధికారికంగా ప్రకాటన విడుద‌ల చేసే ద‌మ్ముందా అంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) స‌వాల్ చేశారు.

    తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక రూ.3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన‌ట్టు పేర్ని నాని కాగ్ లెక్క‌ల‌తో వివరించారు. ఎన్బీసీ దాటి అప్పులు చేయ‌లేదని ప‌య్యావుల ప‌చ్చి అబ‌ద్దం చెప్పాడ‌ని కాగ్ వెబ్‌సైట్ సాక్షిగా ఆయ‌న నిరూపించారు. మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ చెప్పిన‌ట్టు కూట‌మి అప్పులు రూ. 1.05 ల‌క్ష‌ల కోట్ల‌ని వారం రోజుల్లో నిరూపించ‌లేక‌పోతే అబ‌ద్ధాల కేశ‌వ్ అని నేమ్ బోర్డు మార్చుకోవాల‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల‌పై అసెంబ్లీ, మండ‌లిలో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చిన సంబంధిత అధికారుల‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ), మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్ర‌ధానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. చంద్ర‌గిరిలో ఉన్న చంద్ర‌బాబు కుటుంబ సంస్థ‌ హెరిటేజ్ యూనిట్‌లో మెషిన‌రీ అప్‌గ్ర‌డేష‌న్ కోసం ప్ర‌భుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఆయ‌న మండిపడ్డారు. దీనివ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. 
    ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    అప్పుల మంత్రి, అబ‌ద్ధాల కేశ‌వ్‌
    రాష్ట్ర అప్పుల‌పై పచ్చి అబ‌ద్ధాల‌తో వైఎస్‌ జ‌గ‌న్‌ మీద మ‌రోసారి ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ త‌ప్పుడు ప్ర‌చారానికి పూనుకున్నాడు. పేరుకి ఆర్థికశాఖ మంత్రేకానీ నోటి మాట‌లతో ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడే ఆయ‌న‌, తాను చేసిన ఆరోప‌ణ‌లు ఏ ఒక్కదానికీ ఆధారాలు చూపించే ధైర్యం చేయ‌లేదు. ఈ అబ‌ద్ధాల అప్పుల మంత్రి ఏ ఒక్క‌రోజూ డాక్యుమెంట్ ఎవిడెన్స్‌తో మాట్లాడ‌లేదు. వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లో ఆర్థిక విధ్వంసం జ‌రిగింద‌న‌డానికి ఆయ‌న ద‌గ్గ‌రున్న ఆధారాలుంటే చూపించాలి క‌దా. వైఎస్‌ జ‌గ‌న్‌ ప్రెస్‌మీట్‌లో చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని తేల్చేసిన ప‌య్యావుల‌.. ఏయే అంశాలు అబ‌ద్ధాలు చెప్పారు, వాటికి సంబంధించి నిజమైన ఆధారాలు దగ్గ‌రుంటే బ‌య‌ట‌పెట్టాలి.

    మీ రూ.3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కు లెక్క‌లివిగో
    20 నెల‌ల పాల‌న‌లో మా ప్ర‌భుత్వం చేసింది కేవ‌లం రూ.1.05 ల‌క్ష‌ల కోట్ల అప్పేన‌ని, కానీ వైయ‌స్ జ‌గ‌న్ గారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిన‌ట్టు చెప్పార‌ని ప‌య్యావుల చెబుతున్నాడు. కానీ క‌రెక్టుగా చెప్పాలంటే ఆ అప్పు రూ. 3,27,370.37 కోట్లు. (రూ. 3.27 ల‌క్ష‌ల కోట్లు). కాగ్ లెక్క‌ల ప్ర‌కారం 2024-25లో బ‌డ్జెట్ బారోయింగ్స్ రూ.81,082.51 కోట్లని వెబ్‌సైట్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. కానీ దానికి ప‌య్యావుల మాత్రం రూ.69 వేల కోట్లేన‌ని ప‌చ్చి అబ‌ద్ధం చెబుతున్నాడు. ఏప్రిల్ 1, 2025 నుంచి 2026 జ‌న‌వ‌రి 31నాటికి బ‌డ్జెట్ బారోయింగ్స్ రూ. 87,674.04 కోట్లని కాగ్ వెబ్‌సైట్ చెబుతోంది.

    అంటే, ప్ర‌త్యక్షంగా ప్ర‌భుత్వం నుంచి తీసుకున్న అప్పులు రూ. 1.70 ల‌క్ష‌ల కోట్లు. ప్ర‌భుత్వ గ్యారెంటీ ఇచ్చి వివిధ కార్పోరేష‌న్ల ద్వారా తీసుకొచ్చిన అప్పులు మ‌రో రూ. 89,026.82 కోట్లు. ఇవేకాకుండా ఏపీ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ బాండ్ల ద్వారా రూ.11,850 కోట్లు. ఫిబ్ర‌వ‌రి 2026, మార్చిలో ఎస్‌డీఎల్ బాండ్స్  ద్వారా రూ. 9,900 కోట్లు అప్పులు తెచ్చారు. మొత్తం 20 నెల‌ల్లో కూట‌మి ప్ర‌భుత్వం తెచ్చిన అప్పు రూ.3,27,370.37 కోట్లు. ఇవ‌న్నీ రాష్ట్ర ప్ర‌జ‌ల ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి తెచ్చిన అప్పులు.

    అప్పులు రూ.1.05 ల‌క్ష‌ల కోట్లేన‌ని లేఖ ఇప్పించు..
    వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వం రూ.9.74 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌ను వార‌స‌త్వంగా ఇచ్చింద‌ని చెబుతున్న ప‌య్యావుల కేశ‌వ్‌.. ఇదే మాట‌ను రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో రాయించి స్టేట్‌మెంట్ రిలీజ్ చేసే ద‌మ్ముందా? మంత్రి మాట్లాడింది అబ‌ద్ధం కాద‌ని, రెండేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం చేసిన అప్పులు కేవ‌లం రూ. 1.05 ల‌క్ష‌ల కోట్లేన‌ని వారం రోజుల్లో రాయించి ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ అధికారికంగా ఇవ్వ‌గ‌ల‌రా? ఇవ్వ‌లేక‌పోతే పయ్యావుల కేశ‌వ్ ఛాంబ‌ర్ బ‌య‌ట అబ‌ద్దాల కేశ‌వ్ అని పేరు మార్చుకోవాల‌ని ఛాలెంజ్ విసురుతున్నా.

    నెట్ బారోయింగ్ ఎక్క‌డా మా ప్ర‌భుత్వం అధిగ‌మించ‌లేద‌ని ప‌య్యావుల మ‌రో అబ‌ద్ధం చెప్పాడు. రాష్ట్ర జీఎస్‌డీపీ మీద 3 శాతం నెట్ బారోయింగ్ దాటి అప్పులు చేసిన‌ట్టు కాగ్ వెబ్‌సైట్‌లో చెప్పింది. ఏపీ ప్ర‌భుత్వం 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వ‌ర‌కు ఎక్క‌డా నెట్ బారోయింగ్ అధిగ‌మించ‌లేద‌ని ఆర్థికశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శితో ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్టేట్‌మెంట్ ఇప్పించే ధైర్యం పయ్యావుల‌కు ఉందా? అసెంబ్లీ, కౌన్సిల్‌లో అప్పుల‌పై త‌ప్పుడు లెక్క‌లు రాసి ఇచ్చారో ఆ అధికారులంద‌రిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్‌, మినిస్ట్రీ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ప‌బ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రి అయిన ప్రధాని మోడీ గారికి ఫిర్యాదు చేస్తాం.

    ఎమ్మెల్యే బాధితురాలికి నేరం జ‌రిగిందా?
    నిందితులను బాధితులుగా చేర్చ‌డ‌మే వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిపాల‌న అంటాడు.. కూట‌మి ప్ర‌భుత్వంలో రైల్వేకోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే ఒక మ‌హిళ‌కు మాయ‌మాట‌లు చెప్పి వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి వేధించి ప‌లుమార్లు అబార్ష‌న్లు చేయిస్తే.. ఆమెకు మీ ప్ర‌భుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలి. మ‌హిళ‌లకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖ‌రి రోజు అని ప‌దే ప‌దే చెప్పుకుని తిరిగే సీఎం చంద్ర‌బాబు.. ఆ బాధిత మ‌హిళ‌కు ఏం న్యాయం చేశాడు?  మీ ముఖ్య‌మంత్రి, మీ ఉప ముఖ్య‌మంత్రి, మీ మంత్రి లోకేష్‌ల‌ను క‌లిసి మొర‌ పెట్టుకుంటే ఆమె జ‌రిగిన న్యాయం ఏంటి? ఆ కూట‌మి ఎమ్మెల్యేని శిక్షించ‌క‌పోగా తిరిగి ఆమె మీద‌నే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా?  ఆ కేసుల‌ను చూసి హైకోర్టు చీవాట్లు పెట్ట‌లేదా?  బాధితుల‌ను వేధించింది మీరు కాదా?

    హెరిటేజ్ మెషిన‌రీ అప్‌గ్రేడ్ కోసం రూ.200 కోట్లు  
    హెరిటేజ్ వ్యాపారం త‌న కుటుంబ స‌భ్యులు జీవనోపాధి కోసం చేస్తున్నార‌ని, వారు ఏనాడూ ప్ర‌భుత్వ టెండ‌ర్ల‌లో పాల్గొన‌లేద‌ని చంద్రబాబు అసెంబ్లీలో ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పాడు. ఎప్పుడెప్పుడు టెండ‌ర్ల‌లో పాల్గొన్నారు. నెయ్యితో పాటు టెండ‌ర్ల‌లో ఏవేవీ స‌ప్లై చేశారు? ఎల్ -3 గా ఎప్పుడు వ‌చ్చారు. 2 వేల కేజీల పాల పొడిని ఏ రేటుకు స‌ప్లై చేశారు వంటి అన్ని వివ‌రాలు ఆయ‌న మాట్లాడిన కొద్ది క్ష‌ణాల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆయ‌న అబ‌ద్ధం చెప్పాడ‌ని ప్ర‌జ‌లే తేల్చేశారు. అవేకాదు.. టీటీడీ సొమ్ము దోచుకోవ‌డానికి హెరిటేజ్ డెయిరీ సిండికేట్ చేసిన దారుణాలు కూడా అన్ని వెలుగులోకి వ‌చ్చాయి. ఇదంతా దేవుడి మ‌హిమ‌. చంద్ర‌బాబు పాపాల‌ను దేవుడే ద‌గ్గ‌రుండి బ‌య‌ట‌పెట్టిస్తున్నాడు.

    ఇది కాకుండా ఈరోజు కేబినెట్‌లో చంద్ర‌గిరి ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ డెయిరీలో రూ. 200 కోట్ల‌తో మిష‌న‌రీ అప్‌గ్రేడ్ కోసం ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీలో ఇచ్చే రాయితీలు కాకుండా టైల‌ర్ మేడ్ ఇన్సెంటివ్స్ సిద్ధం చేసి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్త‌గా 35 మందికి ఉద్యోగాలిస్తార‌ట. నా జీవితం తెరిచిన పుస్త‌కం అని చెప్పుకునే చంద్ర‌బాబు కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ఎందుకు దాచిపెట్టారు?  దీనివ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం ఏమిట‌ని అడిగితే ఫ్లేవ‌ర్డ్ పాలు 131 శాతం అద‌నంగా ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. పన్నీరు 400 శాతం అద‌నంగా వ‌స్తుంద‌ట‌. వాటి వ‌ల్ల ప్ర‌యోజ‌నం ప్ర‌జ‌ల‌కా? లేక హెరిటేజ్‌కా? పైగా ఫుడ్ ప్రాసెసింగ్ పాల‌సీ 4.0 పేరుతో హెరిటేజ్‌కి భారీ రాయితీలు ప్ర‌క‌టించారు. క‌రెంట్ యూనిట్‌కి రూపాయి త‌గ్గింపు. ఐదేళ్లపాటు 100 శాతం జీఎస్టీ రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చారు.

    బీఆర్ నాయుడితో రాజీనామా చేయించ‌లేరా?
    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియో బ‌య‌ట‌కొచ్చినా ఆయ‌న‌తో ఇప్ప‌టివ‌ర‌కు రాజీనామా చేయించ‌ని చంద్ర‌బాబుకి దేవుడంటే భ‌యం, భ‌క్తి ఉంద‌ని ఎలా అనుకోవాలి? వీడియో బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాతైనా ప‌శ్చాత్తాపం చెంద‌కుండా అంతలా బ‌రితెగించి మాట్లాడుతున్న బీఆర్ నాయుడిని వెనకేసుకు రావ‌డం సిగ్గుచేటు. టీటీడీ చైర్మ‌న్‌కి ఉన్న పాత బాగోతాల‌ను ఆపాదించ‌వ‌చ్చా అని ప్ర‌శ్నిస్తున్న ఎల్లో మీడియాకి నా సూటి ప్రశ్న‌.. అలాంటి బాగోతాలున్న వ్య‌క్తిని దేవుడి సేవ‌కు వాడ‌టం క‌రెక్టా? ఇలాంటి బాగోతం గురించి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి తెలిసే టీటీడీ చైర్మ‌న్‌గా నియామ‌కం జ‌రిగింద‌ని బాధితురాలి లేఖ‌ల ద్వారా ప్ర‌పంచానికి తెలిసింది. అయినప్ప‌టికీ ఆయ‌న్ను చైర్మ‌న్‌గా నియ‌మించారు. వీడియోలు బ‌య‌ట‌కొచ్చిన‌ప్పుడైనా నిఆయ‌న‌తో రాజీనామా చేయించి టీటీడీ ప్ర‌తిష్ట కాపాడాల‌ని అనిపించ‌లేదా?  

    ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని

    లోకేష్ పాపానికి హెడ్ మాస్ట‌ర్ బ‌లి 
    రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం బాగోలేద‌ని రోజూ పేప‌ర్ల నిండా వార్త‌లు, సోష‌ల్ మీడియా నిండా వీడియోలు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఏనాడూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించ‌లేదు. రెండేళ్లుగా ఈ స‌మ‌స్య ఉన్నా నాణ్య‌మైన మ‌ధ్యాహ్న భోజ‌నం అందించ‌డానికి ఆయ‌న ఏనాడూ ప్ర‌య‌త్నించ‌లేదు. పిల్ల‌ల ఆవేద‌న ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దేశాలు దాటి క్రికెట్ మ్యాచ్‌లు చూడ‌టంపైన ఆయ‌న‌కున్న శ్ర‌ద్ధ పిల్ల‌లకు మంచి భోజ‌నం పెట్ట‌డం పైన లేదు.

    మ‌ధ్యాహ్న భోజ‌నం బాగోలేద‌ని మైల‌వ‌రం తార‌క‌రామ న‌గ‌ర్ పాఠ‌శాల హెచ్ఎం డ్రామా చేశాడ‌ని ఆంధ్ర‌జ్యోతిలో వార్త రాస్తే, హెచ్ఎం బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తించాడ‌న్న కార‌ణంతో డీఈవో ఆయ‌న్ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ వాస్త‌వానికి వంట బాగోలేద‌ని ఎన్నోసార్లు విద్యార్థులు పోరు పెడుతున్న‌ట్టు హెచ్ఎం ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేదు. ఎంక్వ‌యిరీకి వెళ్లిన అధికారుల ముందు అన్నం బాగుండ‌టం లేద‌ని విద్యార్థులు ఏడుస్తూ చెప్పిన మాట‌ల‌ను కూడా ఈ ప్రభుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు? సోష‌ల్ మీడియా దెబ్బ‌కి నారా లోకేష్ వైఫ‌ల్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గడంతో హెడ్ మాస్ట‌ర్‌ను బ‌లి తీసుకున్నారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకోటి ఉంటుందా? విద్యాశాఖ‌ను నిర్వ‌హించ‌డం చేత‌కాన‌ప్పుడు ఏశాఖా లేని మంత్రి ప‌ద‌వి తీసుకుని లోకేష్ బ‌య‌ట తిరుగుతూ ఎంజాయ్ చేసినా విద్యార్థుల‌కు మేలు చేసిన వాడ‌వుతాడని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు.

  • మచిలీపట్నం: కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పదే పదే రాజకీయ విద్వేషాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు జనసేన నేతలు. గత రాత్రి మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపం రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన జెండా ఏర్పాటుకు జనసేన నాయకుల యత్నించారు. అయితే వారిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 

    అయితే ఈరోజు(శుక్రవారం, మార్చి 13వ తేదీ) మళ్లీ కాంక్రీట్‌తో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు చేశారు జనసేన కార్యకర్తలు.  ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలను అడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  వైఎస్సార్‌సీపీ నేత బొర్రా విఠల్‌ను బలవంతంగా పోలీస్‌ వాహనం ఎక్కించారు. ఇలా ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన జనసేన కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరిపై  వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

     

  • కాకినాడ:   ఏపీలోని రైతులు రుణభారాన్ని మోయలేని స్థితిలోకి రావడానికి చంద్రబాబు సర్కారే కారణమని  వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.  ఏపీలో రైతులపై అత్యధిక రుణభారం ఉందనే విషయాన్ని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారని  కురసాల ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

     మీ నిర్లక్ష్యం కారణంగా... రుణాభారంలో ఏపీ రైతులు రెండవ స్ధానంలో ఉన్నారు. 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున నలుగురు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.  మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ... వైఎస్ జగన్ అమలు చేసిన రైతు భరోసకు కాపీ.మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు మంగళం పాడేశారు. రెండవ ఏడాది రూ.10 వేలు ఇచ్చారు. 

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయంలో 53 లక్షల 58 వేల మందికి ఏటా పెట్టుబడి సాయం అందించారు. మీ హయంలో ఏడు లక్షల మంది రైతులు తగ్గిపోయారు.  పథకమే పూర్తిగా అమలు చేయ్యకుండా ఏడు లక్షల‌మందికి కోత విధించారు. గడిచిన రెండేళ్ళల్లో కౌలు రైతుకు ఒక్క సహయం అందించలేదు. కౌలు రైతుల పట్ల ఎందుకు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. 

    కూటమి పాలన లో ఇప్పటి వరకు 16 సార్ల ప్రకృతి విపత్తు వచ్చాయి. ఏ రైతుకు సాయం అందించారో చెప్పండి. వందల కోట్లు ప్రీయమం కట్టడానికి డబ్బులు లేకపోతే ...రెండేళ్ళ కాలంలో చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పులు ఏమైయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సహయం చేయడ్యానికి బడ్జెట్ లో ఇది పెట్టామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు.

    *కోవిడ్‌లో కూడా పంటలకు మార్కెట్ స్ధిరికరణ చేసి..చివరకు మేము బూడిద గుమ్మడి కాయాలు కూడా కొనుగోలు చేశాం. ఏ సీజన్ లో పంట నష్టపోతే ... ఆ సీజన్ లోనే వైఎస్ జగన్ నష్టపరిహారం అందించారు.

    ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులను కొనే పరిస్ధితిలో ప్రభుత్వం లేదు. అరటిని ఇప్పుడు టన్ను రూ.ఐదు వేలకు అమ్ముకునే దుస్ధితికి రైతు వచ్చాడు. టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పాడేసుకుంటున్నాడు. ఇది రైతుల పట్ల మీ నిర్లక్ష్యం కాదా? చంద్రబాబు’ అని ప్రశ్నించారు కురసాల కన్నబాబు.

     

     

     

  • సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో  చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.

    పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్‌ హ్యాండిల్‌లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.

    ఇదిలా ఉండగా, తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ ప్లానెట్‌ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్‌ అకౌంట్‌లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్‌లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్‌ ప్లానెట్‌ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్‌ చేయించానని, తన పర్మిషన్‌ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే.

    పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం

     

Business

  • భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ రోజు (మార్చి 13) 24 గంటలు గడవక ముందే గోల్డ్ రేటు మరోమారు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు మారిపోయింది. ఈ కథనంలో పసిడి ధరలు ఏ నగరం ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1530 తగ్గి.. రూ.1,60,690 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1400 రూపాయలు తగ్గి.. రూ. 147300 వద్ద నిలిచింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 1530, రూ.1400 తగ్గింది. దీంతో తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 1,60,840 & రూ. 1,47,450 వద్ద ఉన్నాయి.

    చెన్నైలో మాత్రం గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఉదయం ఎంత ధర ఉందో, సాయంత్రానికి కూడా అదే ధర వద్ద నిలిచింది. దీంతో తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162560 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,49,000 వద్ద నిలిచింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    గతంలో వాట్సాప్‌ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్‌పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.

    పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్
    ● ముందుగా పిల్లల ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. 
    ● తరువాత యాప్‌ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.
    ● తరువాత మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి
    ● పిల్లల ఫోన్ నంబర్‌ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
    ● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.
    ● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.

    పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలి
    పిల్లల ఫోన్ స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ &  సేఫ్టీ సెట్టింగ్స్‌ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.

  • Iran War: ప్రపంచవ్యాప్తంగా ఏ ఉపద్రం వచ్చినా, భౌగోళికంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా ముఖ్యంగా యుద్ధం వచ్చిందంటే ముందుగా ప్రభావితమయ్యేది దేశీయ స్టాక్‌ మార్కెట్లు. తాజాగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులతో మధ్యప్రాచ్య  అనిశ్చితి, హార్ముజ్ జలసంధి మూసివేత, చమురు  సంక్షోభం భారత మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది.  ఫలితంగా గత నాలుగేళ్లలో అత్యంత దారుణమైన వారంగా ఈ  వారం నిలిచింది. ఈ దారుణ పతనంతో పెట్టుబడిదారులు దాదాపు రూ.19 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ అనిశ్చితి ప్రపంచ మార్కెట్లను కూడా బలహీనపరిచిందని, కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.

    75వేల దిగువకు సెన్సెక్స్‌, మార్కెట్‌ క్యాప్‌ నష్టం
    ఈ వారం వీకెండ్‌ శుక్రవారం రోజు సెన్సెక్స్   1,442 పాయింట్లు కోల్పోయి 75వేల పాయింట్ల  (74,592 పాయింట్ల వద్ద ముగిసింది)దిగువకు చేరింది. ఒక రోజులో దాదాపు రూ.9.8 లక్షల కోట్ల సందప తుడిచి పెట్టుకుపోయింది. ఫలితంగా రూ.19 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. మార్కెట్ వాల్యుయేషన్ రూ.430 లక్షల కోట్లకు చేరింది. FIIలు అమ్మకాల భారీగా కొనసాగుతున్నాయి. ఎల్‌ అండ్‌  టీ టాటా స్టీల్ , SBI, భారత్ ఎలక్ట్రానిక్స్ , మారుతి టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

    మునుపటి శుక్రవారం అంటే మార్చి 6న బీఎస్‌సీ సెన్సెక్స్‌ 78,918 వద్ద ముగిసింది. అప్పటి మార్కెట్ వాల్యుయేషన్ రూ.449.35 లక్షల కోట్లుగా ఉంది.ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. 

    ఇదీ చదవండి: మోదీకి, యోగీకి విజ్ఞప్తి : మహిళ సూసైడ్‌ వీడియో వైరల్‌

    నిఫ్టీ నష్టాలు ఇలా..
    ఇక నిఫ్టీ 468 పాయింట్లు క్షీణించి 23,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జనవరి 5న నమోదైన గరిష్ట స్థాయి 26,373 పాయింట్లు. అంటే 10 శాతం క్షీణించింది. భారత మార్కెట్లు చివరిసారిగా ఈ స్థాయిలో నష్టాలను చవిచూసింది 2022  జూన్‌లో మాత్రమే. బ్రెంట్ ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 102 డాలర్లకు పెరగడం ఈ వారం పెట్టుబడిదారులకు ఒక పీడకల చెప్పవచ్చు.

    ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు

    యుద్ధం చమురు సంక్షోభం- మార్కెట్లు 
    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చమురు సరఫరాపై ప్రభావం ముడిచమురు ధరలను అమాంతం పెరిగాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, మార్కెట్లు మొత్తం రూ.25 లక్షల కోట్లను కోల్పోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా, జపాన్, చైనా , హాంకాంగ్‌ల సూచీలు దిగువన ముగిశాయి.
     (తీవ్ర గాయాలతో కోమాలో ఖమేనీ? సంచలనంగా బ్రిటీష్‌ మీడియా కథనాలు)

  • ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో విక్రయించే తమ వాహనాలపై 2 శాతం ధరల పెంపును ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ ప్రకటించింది.

    2026 ప్రారంభమైన తరువాత బెంజ్ కంపెనీ తన వాహనాల ధరలను పెంచడం ఇది రెండో సారి. సంస్థ జనవరిలో కూడా ధరలను పెంచింది. ఇప్పుడు మరోమారు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు ఫారెక్స్‌లో అస్థిరత మరియు వాహనాల తయారీలో పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు కారణమని పేర్కొంది.

    ధరల పెరుగుదల C-క్లాస్, EQS, E-క్లాస్ LWB, S-క్లాస్, EQA, EQB, EQS, EQE, GLC, GLA, GLE, GLS, CLE క్యాబ్రియోలెట్ వంటి కార్ల మీద మాత్రమే కాకుండా కొత్తగా ప్రారంభించిన V-క్లాస్ వంటి మోడళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

  • న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్‌ ఎక్స్చేంజ్ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ తాజాగా 20 మర్చంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసింది. అంతేకాకుండా పలు లా, ఇంటర్మీడియెరీ సంస్థలను సైతం ఎంపిక చేసుకుంది. శ్రీనివాస్‌ ఇంజేటి అధ్యక్షతన ఎన్‌ఎస్‌ఈ ఐపీవో కమిటీ ఇందుకు అనుమతించింది.

    ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఎస్‌ఈ బోర్డ్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీవోపై ముందుకెళ్లేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజా ఎంపికలను చేపట్టింది. ఎంపికైన మర్చంట్‌ బ్యాంకర్లలో కొటక్‌ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్‌ క్యాపిటల్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ తదితరాలున్నాయి. 

  • కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.

    సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్‌ఎస్ సిస్టమ్‌తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

    రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్‌లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.

    ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్‌కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.

    PRS అంటే?
    PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్‌కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.

    రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు.  ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు.

  • ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. మొహాలీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (డీసీ)ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్‌ తదితర రంగాల్లో గ్లోబల్‌ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్‌ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌ ఉపయోగపడుతుందని వివరించింది.

    కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్‌వో జయేష్‌ సంఘ్‌రాజ్‌కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్‌లో ఇన్ఫికి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

  • చమురు ధరల పెరుగుదల.. స్టాక్ మార్కెట్ క్రాష్ వంటివి జరుగుతున్న సమయంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సంచలన ట్వీట్ చేశారు. ఇందులో..పెట్టుబడిదారులు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో, ప్రైవేట్ క్రెడిట్ ఫండ్‌లు భయాందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు.

    ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. కొన్నిసార్లు పెద్ద మార్పులు జరుగుతాయి. స్టాక్ మార్కెట్ క్రాష్, బ్యాంకులు.. ఫైనాన్షియల్ సంస్థలు కష్టాల్లో పడటం వంటివి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని ఆర్థిక క్రాష్ లేదా మాంద్యం అని అంటారు. కొందరు ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిని కొత్త మాంద్యం లేదా డిప్రెషన్ ప్రారంభమవుతోందని కూడా చెబుతారు.

    ప్రజలు తమ పెట్టుబడులను అమ్మేస్తారు లేదా బ్యాంకుల్లో ఉన్న డబ్బును తీసుకుంటారు. దీన్ని బ్యాంక్ రన్ అని అంటారు. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బు ఎప్పుడూ పూర్తిగా మాయం కాదు. అది ఒక చోటు నుంచి మరో చోటుకు మారుతుంది. అంటే బ్యాంకుల నుంచి బయటకు వెళ్లే డబ్బు, మరో ఆస్తి లేదా పెట్టుబడి వైపు వెళ్తుంది.

    కొంతమంది పెట్టుబడిదారులు ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తెలివిగా తమ డబ్బును.. చమురు, వెండి, బంగారం, డిజిటల్ కరెన్సీలు అయిన బిట్‌కాయిన్, ఈథీరియం వంటి వాటిలో పెట్టుబడిగా పెడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక అనిశ్చితి సమయంలో ఈ ఆస్తులు కొన్నిసార్లు విలువను నిలుపుకుంటాయి.

    ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు

    మార్కెట్ పెరుగుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. పడిపోయే సమయంలో కూడా తెలివైన పెట్టుబడిదారులు లాభాలు పొందగలరని. కానీ దీనికి సరైన సమాచారం, విశ్లేషణ & ఆలోచన అవసరం. భయంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు కలగవచ్చు. కాబట్టి ఆర్థిక సంక్షోభ సమయంలో భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఏ రంగాలు ఎదుగుతున్నాయి, ఏ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి? అనే విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతాము.

  • శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు లేదా 1.93 శాతం నష్టంతో.. 74,563.92 వద్ద, నిఫ్టీ 468.70 పాయింట్లు లేదా 1.98 శాతం నష్టంతో 23,170.45 వద్ద నిలిచాయి.

    ఐసీడీఎస్ లిమిటెడ్, కంప్యూకామ్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, సుమిత్ వుడ్స్ లిమిటెడ్, సెంట్రమ్ క్యాపిటల్ లిమిటెడ్, బర్న్‌పూర్ సిమెంట్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. కృతిక వైర్స్ లిమిటెడ్, ఎస్ఈపీసీ లిమిటెడ్, అకీ ఇండియా లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, లోరెంజిని అప్పారల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అడోబ్‌లో.. దాదాపు రెండు దశాబ్దాలుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా కొనసాగుతోన్న శంతను నారాయణ్‌ ఆ పదవికి రాజీనామా చేయనున్నట్లు కొన్ని వదంతులు వినిపించాయి. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. కొత్త సీఈఓగా వేరొకరు బాధ్యతలు స్వీకరించే వరకు శంతను సీఈఓగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

    అడోబ్ కంపెనీ సీఈఓను ఎందుకు మారుస్తోంది?, లేదా.. శంతను నారాయణ్ ఎందుకు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు అనేదానికి కారణాలు ఏమిటనేది అధికారికంగా వెల్లడి కాలేదు. శంతను సీఈఓగా తప్పుకున్నప్పటికీ.. సంస్థ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.

    అడోబ్ బోర్డు కొత్త సీఈఓను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంస్థలో ఉన్న అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా పరిశీలిస్తుంది. కాగా సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ.. శంతను నారాయణ్ గత 18 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి కృషి చేసారని ప్రశంసించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో అడోబ్ విజయానికి ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని చెప్పారు.

    శంతను సీఈఓగా తప్పుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా సీఈఓగా బాథ్యతలు నిర్వర్తించాను. కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు తాను బోర్డుతో కలిసి పనిచేసి.. బాధ్యతల మార్పు జరిగేలా చూస్తానని తెలిపారు.

    ఇదీ చదవండి: గ్యాస్‌ కష్టాలు.. ఆఫీసుకు రాకండి, ఇంట్లో పనిచేసుకోండి

    ఈ సందర్భంగా తన నాయకత్వ కాలాన్ని గుర్తు చేసుకుంటూ అడోబ్ సంస్థ సాధించిన అభివృద్ధిని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు కంపెనీలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30,000 మందికి పైగా పెరిగిందని చెప్పారు. అలాగే కంపెనీ ఆదాయం కూడా ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువ స్థాయి నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని తెలిపారు. అడోబ్ తయారు చేసిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను చేరుకుందని ఆయన గర్వంగా చెప్పారు.

Sports

  • ఐపీఎల్‌-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది సీజ‌న్‌కు  ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్, యువ సంచ‌ల‌నం హ‌ర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. హర్షిత్ గ‌త నెల‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మాప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డాడు.

    దీంతో త‌న బౌలింగ్ స్పెల్ మ‌ధ్య‌లోనే అత‌డు మైదానాన్ని వీడాడు. ఆ త‌ర్వాత ప‌లు స్కాన్ల త‌ర్వాత అత‌డికి మోకాలి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో రాణా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నాడు. అతడు ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు.

    అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం.  ఈ క్రమంలోనే ఐపీఎల్‌-19 సీజ‌న్ మొత్తానికి దూరం కానున్న‌ట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా త‌మ క‌థ‌నంలో పేర్కొంది. హ‌ర్షిత్ త‌న ఐపీఎల్(2022) త‌న అరంగేట్రం నుంచి కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

    ఐపీఎల్-2024 టైటిల్ కేకేఆర్‌ గెలవడంలో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. గ‌త సీజ‌న్‌లో కూడా హ‌ర్షిత్ 15 వికెట్లతో స‌త్తాచాటాడు. అంతేకాకుండా టీమిండియా త‌ర‌పున కూడా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచాడు. మ‌రోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరాన సైతం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

    గతేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప‌తిరానను రూ.18 కోట్ల‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది. కానీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ప‌తిరాన కూడా గాయ‌ప‌డ్డాడు. అత‌డు ఇంకా శ్రీలంక‌లోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్ స్ధానంలో జింబాబ్వే పేస‌ర్ బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది.
    చదవండి: BAN vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ వింత రనౌట్‌.. క్రికెట్‌ చరిత్రలోనే!
     

  • సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ చేసేందుకు ఆటగాడిని ప్రోత్సహించిన బీసీసీఐ వీడియో అనలిస్ట్‌పై యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చర్య తీసుకుంది. ఆంధ్ర క్రికెట్‌ జట్టు వీడియో అనలిస్ట్‌ రాజా రెడ్డిపై నిషేధం విధిస్తున్నట్లు బోర్డు అంబుడ్స్‌మన్‌ ప్రకటించాడు. 

    రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై బోర్డు విచారణ పూర్తి చేసింది. 2023–24 సీజన్‌లో భాగంగా ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఆటగాడు గిరినాథ్‌ రెడ్డిని ఫిక్సింగ్‌ చేసేందుకు రాజారెడ్డి ప్రోత్సహించాడు. దాంతో ఈ విషయాన్ని అతను వెంటనే టీమ్‌ మేనేజర్‌ జుగల్‌ కిషోర్‌కు తెలియజేశాడు. అనంతరం దీనిపై రాజారెడ్డి వాట్సప్‌ తదితర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటా విచారణ చేపట్టిన యాంటీ కరప్షన్‌ యూనిట్‌ తమ నివేదికను అందించింది.  

  • ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘా వివాదస్పద రీతిలో రనౌటయ్యాడు. అతడు ఔటైన తీరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మాజ్ సదాకత్(75), ఫర్హాన్‌(31) మంచి ఆరంభం ఇచ్చారు.

    ఆ తర్వాత పాక్ వెంటవెంటే మూడు వికెట్లు కోల్పోయి బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్లు సల్మాన్ అలీ అఘా(64), మహ్మద్ రిజ్వాన్‌(44) నిలకడగా ఆడి తమ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. అయితే పాక్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన మోహది హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సల్మాన్ అలీ ఊహించని విధంగా ఔటయ్యాడు.

    ఏమి జరిగిందంటే?
    ఆ ఓవర్‌లో మెహదీ వేసిన నాలుగో బంతిని మహమ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. ఆ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అలీ ఆఘా బ్యాట్‌కు తగిలింది. ఆ సమయంలోనే బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి బౌలర్‌కు ఇవ్వబోయాడు. కానీ అదే సమయంలో బంతిని అందుకున్న మిరాజ్ స్టంప్స్‌ను గిరాటేశాడు.

    వెంటనే రనౌట్‌కు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. స్టంప్స్ కిందపడే సమయానికి సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. సల్మాన్ అలీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే తన గ్లౌవ్స్‌, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు.

    అంతేకాకుండా బంగ్లా కెప్టెన్ మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ లిట్టన్ దాస్‌తో సల్మాన్ వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌లు జోక్యంతో చేసుకోవడంతో సల్మాన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

    రూల్స్ ఏమి చెబుతున్నాయి?
    బంతి లైవ్‌లో ఉన్న‌ప్పుడు బ్యాట‌ర్ బంతిని బ్యాట్‌తో కానీ చేతితో కానీ ట‌చ్ చేయ‌కూడ‌దు. ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాటర్ కావాలని బంతిని తాకినా లేదా ఫీల్డర్‌ను అడ్డుకున్నా‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ గా పరిగణిస్తారు. ఒకవేళ మిరాజ్ స్టంప్స్ పడగొట్టకుండా.. ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అప్పీల్‌ చేసినా సల్మాన్‌ ఔటయ్యే వాడు. ఎందుకంటే అప్పటికే సల్మాన్‌ క్రీజుకు సుమారు ఒక అడుగు దూరంలో ఉండి, బంతిని బౌలర్‌కు అందించడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది.



     

     

  • సొంతగడ్డపై టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలిచింది. గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి.. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన ఏకైక జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

    కానీ.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచినా టీమిండియా ప్రదర్శన సగటు అభిమానితో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌కు కూడా సంతృప్తినివ్వలేదు. ఇక సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తుగా ఓడింది.

    చాంపియన్‌గా
    ఆ తర్వాత వరుస విజయాలతో టైటిల్‌ దిశగా అడుగులు వేసి చాంపియన్‌గా అవతరించింది టీమిండియా. అయితే, ఫీల్డింగ్‌ మాత్రం చెత్తగా ఉందనే విమర్శలు మూటగట్టుకుంది. సెమీస్‌, ఫైనల్లో భారత ఫీల్డర్లు కాస్త ఫర్వాలేదనిపించగా.. అంతకు ముందు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.

    ఫీల్డింగ్‌లో ‘వరస్ట్‌’!
    ముఖ్యంగా సూపర్‌-8 చేరిన జట్లలో Catching Efficiencyలో ఇంగ్లండ్‌ అత్యుత్తమంగా 87.2 శాతం నమోదు చేయగా.. టీమిండియా 72.7 శాతంతో అత్యంత చెత్త రికార్డుతో అట్టడుగున నిలిచింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    భారత మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు
    ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ఇంకాస్త మెరుగ్గా ఫీల్డింగ్‌ చేయాల్సింది. క్యాచ్‌లు పట్టడంలో సఫలమైన విషయంలో మిగతా జట్లతో పోలిస్తే మరీ వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యమే.

    ఒత్తిడిలో ఒక్కోసారి ఇలాంటివి జరగవచ్చు. అలాంటపుడు కూర్చుని చర్చించుకుని లోపాలు సరిచేసుకోవాలి. అలా కాకుండా పదే పదే అవే తప్పులు పునరావృతం చేస్తే ముందుకు సాగడం కష్టమవుతుంది. కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నారు. కొన్నిసార్లు అత్యంత సులువైన క్యాచ్‌లు వదిలేశారు.

    ఫీల్డింగ్‌ విషయంలో మనం కాస్త వెనుబడి ఉన్నామనే చెప్పవచ్చు. ఏదేమైనా పగటి పూట ఫీల్డింగ్‌ చేయడానికి.. రాత్రి లైట్ల వెలుగులో ఫీల్డింగ్‌ చేయడానికి తేడా ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రొఫెషనల్‌ అనిపించుకున్న ఆటగాళ్లు ఇలాంటి కారణాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరు’’ అని అంజుమ్‌ చోప్రా చెప్పుకొచ్చింది.

    టీ20 ప్రపంచకప్‌-2026లో సూపర్‌-8 జట్ల క్యాచింగ్‌ సామర్థ్యం
    ఇంగ్లండ్‌- 87.2%
    జింబాబ్వే- 85.4%
    వెస్టిండీస్‌- 84.6%
    న్యూజిలాండ్‌- 83.9%
    పాకిస్తాన్‌- 83.3%
    సౌతాఫ్రికా- 81.1%
    శ్రీలంక- 77.8%
    ఇండియా- 72.7%.

    చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

  • వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్‌ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్‌లో చిక్కుకుపోయాడు. 

    ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్‌ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌లో మోతీ లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.

    మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ సీజన్‌ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్‌ కెప్టెన్‌గా షాహీన్‌ అఫ్రిది వ్యవహరించనున్నాడు.

    లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదే
    ఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్,     సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే 
    చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్‌?

  • భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కొత్త కోడలి రాకతో పరివారంలో సందడి నెలకొంది. ఈ క్రమంలో సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌ తమ్ముడు అర్జున్‌ టెండుల్కర్‌- మరదలు సానియా చందోక్‌లను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    సానియా పాపిట్లో అర్జున్‌ తిలకం దిద్దుతున్న ఫొటోను పంచుకున్న సారా.. ‘‘నా చిన్ని తమ్ముడు.. ఇకపై సానియాకే సొంతం. ఈ విశ్వం మీపై అంతులేని ప్రేమ, ఆశీర్వచనాలు కురిపించాలి. మీ హృదయం కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కాలి.

    మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మీ ఇద్దరిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజు మీ పెళ్లి రోజే అని చెప్పడంలో సందేహంలేదు’’ అని తమ్ముడు, మరదలిపై ప్రేమను కురిపించింది. తనకు సోదరిలేని లోటు తీర్చేలా సానియాను ఇచ్చినందుకు అర్జున్‌కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు కూడా తెలిపింది.

    కాగా సచిన్‌- అంజలి దంపతుల ఏకైక కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ వివాహం మార్చి 5న సానియా చందోక్‌తో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకు భారత క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్ర సింగ్‌ ధోని, గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ తదితరులు సతీసమేతంగా తరలివచ్చారు. ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించింది.

    ఇదిలా ఉంటే.. తమ్ముడి పెళ్లిలో సారా కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సంగీత్‌, మెహందీ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సారా టెండుల్కర్‌ మరింత అందంగా కనిపించింది. 

    ఇక అర్జున్‌- సానియా సంగీత్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. వారి పట్ల మరోసారి సారా ప్రేమ చూపగా.. సానియా ఇందుకు.. ‘‘ధన్యవాదాలు.. లవ్‌ యూ సోదరి’’ అంటూ జవాబు ఇచ్చింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలు సానియా. ఆమె కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది.
     

  • ఐపీఎల్‌-2026 సీజన్‌ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

    ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్‌-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్‌ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

    అతడికి పవర్‌ప్లేతో డెత్‌ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్‌ సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్‌ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.

    ముస్తాఫిజుర్‌పై వేటు..
    కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్‌ చేయాలని కేకేఆర్‌ సూచింది.

    బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్‌ హర్షిత్‌ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.

    కేకేఆర్ పూర్తి జట్టు:
    అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.
    చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

  • పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్‌ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఉక్కుపాదం మోపింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, పాక్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.

    కరచాలనానికి నిరాకరించి
    ఇందుకు ప్రతిగా పాక్‌ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌-2025లో భారత క్రికెట్‌ జట్టు పాక్‌ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్‌ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.

    మొట్టికాయలు వేసిన ఐసీసీ
    అదే విధంగా టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేసిన పాక్‌ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.

    చెలరేగిన వివాదం
    అయినా సరే బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాక్‌ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్‌ లీగ్‌-2026’ వేలంలో సన్‌ గ్రూపునకు చెందిన కావ్యా మారన్‌ నేతృత్వంలో‌ని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.

    టీమిండియాతో మ్యాచ్‌లో అతి చేస్తూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్‌ కోసం సన్‌రైజర్స్‌ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్‌ (ఇంగ్లండ్‌)’ విదేశీ లీగ్‌ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. 

    సన్‌రైజర్స్‌ తాజాగా విదేశీ లీగ్‌లో పాక్‌ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్‌ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..

    భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు
    👉పాకిస్తాన్‌ మాజీ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌, టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో తన బౌలింగ్‌ యాక్షన్‌తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌.. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమానులైన షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.

    👉ఇక అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MCL)లో గతేడాది పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం సీటెల్‌ ఆర్కాస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్‌నకు చెందినది. 

    👉కాగా ఇమాద్‌ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్‌కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్‌ మరో క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

    👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్‌ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ కొనగా.. మరో పాక్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫొనిక్స్‌ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్‌ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్‌ ఆయుబ్‌, హ్యారిస్‌ రవూఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వంటి వాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 

    చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు
     

  • మరో రెండు నెలల్లో ఫుట్‌బాల్‌ సాకర్‌ ఫీవర్‌ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్‌ 11 నుంచి జూలై 19 వరకు సాకర్‌ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. 

    దీంతో ఇరాన్‌ జట్టు ఫిఫా వరల్డ్‌కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌ జట్టు ఫిపా వరల్డ్‌కప్‌ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్‌ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌సోషల్‌ వేదికగా స్పందించారు. 

    ‘ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టు సాకర్‌ ప్రపంచకప్‌లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్‌ వరల్డ్‌కప్‌కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.

    2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో (4-2) ఫ్రాన్స్‌ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్‌ జూలై 19 వరకు జరగనుంది. 

    మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్‌లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్‌-జిలో ఉన్న ఇరాన్‌.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

    చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!

  • క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే రిలీజ్‌ చేసింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

    ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత సీజన్‌ మాదిరిగానే ఓపెనర్లగా అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌లను అతడు ఎంపిక చేశాడు. అదేవిధంగా మూడో స్ధానంలో పాకెట్‌ డైనమెట్‌ ఇషాన్‌ కిషన్‌కు అవకాశమిచ్చాడు.

    ఆ తర్వాత వరుసగా నాలుగు ఐదు స్దానాల్లో క్లాసెన్,నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాన్స్‌ ఇచ్చాడు. అయితే ఐపీఎల్‌ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌కు ప్రధాన ఆల్‌రౌండర్‌గా చోప్రా చోటు కల్పించాడు. ఏడో స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్‌గా అతడు తీసుకున్నాడు. 

    కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో కమ్మిన్స్‌తో పాటు జయదేవ్ ఉనద్కత్ ,శివమ్ మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్‌గా జీషన్‌ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే రూ.8 కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ను ఆకాష్‌ చోప్రా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

    ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టు ఇదే
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావి
    చదవండి: IPL 2026: 'ధోని, రుతురాజ్‌ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్‌ బోన్‌'

  • టీ20 వరల్డ్‌కప్‌-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్‌ వరకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడనున్నాడు. 

    ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు సీఎస్‌కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్‌ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్‌ రాకతో సీఎస్‌కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.

    "సీఎస్‌కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్‌కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది.

    అతడు భవిష్యత్తులో కెప్టెన్‌ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు.
    చదవండి: స‌న్‌రైజ‌ర్స్‌లోకి పాక్ ఆట‌గాడు.. బీసీసీఐ స్పంద‌న ఇదే
     

  • భారత క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వనిష్కను శనివారం ఉత్తరాఖండ్‌లోని మస్సూరి హిల్‌ స్టేషన్‌లో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పెళ్లికి కూడా కొద్ది మంది సెలబ్రెటీలకు మాత్రమే ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. 

    అయితే ఈ వివాహానికి క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సహా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రింకూ సింగ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కుల్దీప్‌ నుంచి పెళ్లి ఆహ్వానం అందుకున్న టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ శుక్రవారమే డెహ్రాడూన్‌లో అడుగుపెట్టాడు.

    కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, మా అన్న పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ ధూంధాంగా ఎంజాయ్‌ చేస్తానని పేర్కొన్నాడు. కాగా గతేడాది జూన్‌లోనే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లక్నో వేదికగా తన స్నేహితురాలు వనిష్కతో కుల్దీప్‌ యాదవ్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. 

    వాస్తవానికి పెళ్లి గతేడాది నవంబర్‌లోనే కావాల్సి ఉండగా.. ఈలోగా టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల కావడం, కుల్దీప్‌ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో కుల్దీప్‌ యాదవ్‌ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. 

    ప్రపంచకప్‌ గెలిచిన ఆనందానికి తోడు ఇప్పుడు కుల్దీప్‌ పెళ్లి కూడా తోడవ్వడంతో ఆ సంతోషం రెట్టింపుగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. తుదిజట్టు పటిష్టంగా ఉండడంతో కుల్దీప్‌కు జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు యజ్వేంద్ర చాహల్‌ 2023 తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడం గమనార్హం.

    చదవండి: IPL 2026: ధోనికిదే చివరి సీజన్‌!

  • ఐపీఎల్‌-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో వెంకటేశ్‌ అయ్యర్‌ ఒకడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఈ ఆల్‌రౌండర్‌ అందుకు తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు.

    గతేడాది ఐపీఎల్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ పదకొండు మ్యాచ్‌లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో సేవలు అందించనేలేదు. దీంతో ఐపీఎల్‌-2026 వేలానికి ముందు కేకేఆర్‌ అతడిని వదిలేసింది.

    రూ. 7 కోట్లకు కొనుగోలు
    ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వెంకటేశ్‌ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే వెంకటేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లలో అతడికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం లేదన్నాడు.

    తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చు
    ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది ఆడించిన తుదిజట్టుతోనే ఆర్సీబీ కొనసాగుతుందని అనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్‌ అయ్యర్‌కు తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చు. ముఖ్యంగా ఆరంభ మ్యాచ్‌లలో అతడి అవసరం ఉండదనే అనిపిస్తోంది.

    దేవదత్‌ పడిక్కల్‌ కచ్చితంగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉంటాడు. గాయం వల్ల గతంలో రెండు మ్యాచ్‌లు మిస్సయ్యాడు. అయితే, ఇప్పుడు అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా దేవదత్‌ పడిక్కల్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్‌ ఆప్షన్‌గా సూయశ్‌ శర్మ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండనే ఉంటాడు.

    లెఫ్టాండర్‌ కావడం వల్ల 
    ఏదేమైనా వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా అద్భుతమైన ఆటగాడే. అతడు జట్టుతో ఉండటం అదనపు బలం. ఏ క్షణంలోనైనా.. ఏ పరిస్థితుల్లోనైనా అతడు అందుబాటులో ఉంటాడు. అతడి అనుభవం జట్టుకు మేలు చేస్తుంది. 

    ముఖ్యంగా అతడు లెఫ్టాండర్‌ కావడం వల్ల పడిక్కల్‌కు సరైన బ్యాకప్‌ ఆప్షన్‌గా పనిచేస్తాడు’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. కాగా గతేడాది ఆర్సీబీ టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.

    ఐపీఎల్‌-2026 ఆర్సీబీ జట్టు
    రజత్ పాటిదార్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్‌ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జేకబ్‌ బెతెల్‌, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్‌, అభినందన్ సింగ్‌, సూయశ్‌ శర్మ, వెంకటేశ్‌ అయ్యర్‌, మంగేశ్‌ యాదవ్‌, జేకబ్‌ డఫీ, సాత్విక్‌ ఒస్త్వాల్‌, జోర్డాన్‌ కాక్స్‌, విహాన్‌ మల్హోత్రా, కనిష్క్‌ చౌహాన్‌, విక్కీ ఒస్త్వాల్‌.

    చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

  • 'ది హండ్రెడ్' లీగ్‌-2026 వేలంలో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడం పెను వివాదానికి దారితీసింది. గురువారం లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌(స‌న్ గ్రూప్‌) యాజ‌మాన్యం ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది.

    వేలంలో మరో పాకిస్తానీ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌ టీమ్‌ తీసుకుంది. అయితే ఫోనిక్స్‌ యాజమాన్యానికి భారత్‌లో ఎలాంటి సంబంధం లేదు. కానీ భార‌త్‌కు చెందిన సన్‌గ్రూప్ యాజ‌మాన్యం  ఒక పాక్‌ ఆటగాడిని ఎంచుకోవాల్సిన అవసరం ఏముందని అన్ని వైపులనుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌ వేలంలో ఎంచుకున్న తర్వాత కూడా వివాదం ముదరడంతో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తప్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పైగా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో, అంతకు ముందు కూడా ‘టీ’ తాగుతున్న ఫోటోలతో పలు సందర్భాల్లో భారత్‌పై అబ్రార్‌ తన విద్వేషాన్ని ప్రదర్శించాడు.

    అలాంటి క్రికెటర్‌ను ఎంచుకున్న సన్‌రైజర్స్‌...అతడిని కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తికరం. అయితే ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ వ్యవహారంలో బోర్డు జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "ఇది మాకు సంబంధించిన విష‌యం కాదు. అదొక విదేశీ లీగ్‌. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము" అని రాజీవ్ శుక్లా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

    కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా మార్చారు.
    చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు
     

  • ఎంఎస్‌ ధోనీ లేకుంటే చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఐపీఎల్‌ ప్రారంభంమైనప్పటి నుంచి ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. 

    మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహా మిగతా సీజన్లలో సీఎస్కే కనీసం ప్లేఆఫ్‌ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్‌కు తొలుత రుతురాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో మరోసారి ధోనీనే జట్టును నడిపించాడు. 

    తాజాగా ఐపీఎల్‌ 18వ సీజన్‌ మార్చి 28 నుంచి షురూ కానున్న నేపథ్యంలో సీఎస్కే ఈసారి టైటిల్‌ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

    ‘ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించడం కష్టంగా ఉంటుంది. అలాగే ధోనీ లేకపోతే ఐపీఎల్‌ కూడా ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. బహుశా ధోనీకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ కావొచ్చు. సంజూ శాంసన్‌ జట్టులో చేరడం, రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ఉండడంతో ఈసారి ధోనీ వారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎందుకంటే సంజూతో పాటు రుతురాజ్‌ చాలాకాలం పాటు సీఎస్‌కేలో కొనసాగే అవకాశముంది. 

    అయితే ఈ సీజన్‌లో ధోనీ ఎన్ని మ్యాచ్‌లు ఆడుతాడన్నది సరిగ్గా తెలియనప్పటికీ జట్టుతో ఉంటే చాలు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొండంత బలం ఉంటుంది. ముఖ్యంగా చెన్నై భవిష్యత్తు కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ ఎదిగేందుకు ధోనీ సలహాలు చాలా వరకు ఉపయోగప డనున్నాయి. అంతేకాదు రుతురాజ్‌ ఇప్పటికే కెప్టెన్‌గా చేసిన అనుభవం ఉండడం కూడా కలిసొచ్చే అంశం. 

    ఇక ధోనీ ఫిట్‌నెస్, బ్యాటింగ్‌ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. పైగా ఇదే సీజన్‌ అతనికి చివరిది కూడా అయ్యే చాన్స్‌ ఉంది. అందుకే ఈ సీజన్‌లో కప్‌ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లుగా ఉంది’ అని పఠాన్‌ పేర్కొన్నాడు. 

    అయితే ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభానికి ముందు ధోనీకి ఇదే లాస్ట్‌ సీజన్‌ అనే మాట వినిపించడం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ సీజన్‌లో ధోనీ సీఎస్‌కే తరఫున కెప్టెన్‌గా ఆడతాడా లేదంటే ఆటగాడిగా కొనసాగుతాడా అనే దానిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పష్టతనిచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడుతాడని, కానీ అతని రోల్‌ ఏంటనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ డిసైడ్‌ చేస్తుందని స్పష్టం చేశారు.

    చదవండి: ‘సౌతాఫ్రికా ఒక తెలివితక్కువ టీమ్‌’

  • టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా.. మూడుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్‌గా.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డులు సాధించింది.

    సెమీస్‌ దాకా వైఫల్యాలు
    నిజానికి లీగ్‌ దశలో భారత్‌ అజేయంగా నిలిచినా.. ఆయా మ్యాచ్‌లలో తమ ప్రదర్శన కోచ్‌ గౌతం గంభీర్‌కు సైతం సంతృప్తినివ్వలేదని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) స్వయంగా చెప్పాడు. ఇక భారీ అంచనాలతో తొలిసారి బరిలోకి దిగిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత కూడా సెమీస్‌ దాకా వైఫల్యాలు కొనసాగించాడు.

    మరోవైపు.. సంజూ శాంసన్‌కు ఆది నుంచి తుదిజట్టులో చోటులేని పరిస్థితి. అయితే, నాకౌట్‌ మ్యాచ్‌లలో అంటే వెస్టిండీస్‌తో సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 నాటౌట్‌, ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో రాణించి దుమ్ములేపాడు.

    టైటిల్‌ పోరులో విధ్వంసకర అర్ద శతకం
    ఇక అభిషేక్‌ శర్మ సైతం అసలైన టైటిల్‌ పోరులో విధ్వంసకర అర్ద శతకం (21 బంతుల్లో 52)తో సత్తా చాటాడు. అదే విధంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జట్టులోని ప్రతి సభ్యుడూ కీలక సమయాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషించారు.

    ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడిన్‌ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గేమ్‌ను టీమిండియా బాగా అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో వారు అద్భుతం చేశారు. బుమ్రా ఆడిన తీరు చూస్తే.. సూపర్‌స్టార్ల నుంచి ఏ జట్టైనా కోరుకునేది ఇదే కదా అనిపిస్తుంది.

    రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం
    అభిషేక్‌ శర్మ ఆటకు నేను వీరాభిమానిని. అయితే, టోర్నీ ఆరంభంలో అతడు డకౌట్లు కావడం.. ఆ తర్వాత కూడా విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఒత్తిడిలోకి కూరుకుపోయాడు.

    అయితే, తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌ ఝులిపించాడు. కొంతమంది రాస్కెల్స్‌ ఉంటారు.. నిప్పుతో చెలగాటం ఆడటం వారికి సరదా! ఫైనల్లో అభిషేక్‌ శర్మ విజృ​ంభించిన తీరు చూస్తే మీకే ఇది అర్థమవుతుంది. అందరూ అతడే ఒత్తిడిలో ఉంటాడనుకుంటే.. అతడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు’’ అని బ్రాడ్‌ హాడిన్‌ ప్రశంలస వర్షం కురిపించాడు. 

    చదవండి: తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే

Social Media

  • ఇప్పుడు ఎక్కడ చూసినా  గ్యాస్‌ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి.  ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్‌ సిలిండర్ల ప్యానిక్‌ బుకింగ్స్‌ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్‌ సిలిండర్‌ అంశం ఒకటి.

    అయితే ఈ క్రమంలోనే తాజాగా  ఓ వీడీయో వైరల్‌గా మారింది.  ఈ వీడియోను చూస్తే గ్యాస్‌ సిలిండర్‌ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు.   నెట్టింటిలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్‌ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్‌ పనిముట్ల సాయంతో కట్‌ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు.  

    ఇలా ఫుల్‌ గ్యాస్‌ సిలిండర్‌ లేదనే చింతను తీర్చుకున్నాడు.  ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

    ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్‌ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

     

Andhra Pradesh

  • విజయవాడ:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. భూదాహం తప్పితే ఇంకోటి లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత వడ్డే శోభానాధ్రీశ్వరరావు  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రభుత్వంలో చాలా వేగంగా రైతుల నుంచి భూములు లాక్కొంటున్నారని ధ్వజమెత్తారు. చట్టంతో పనిలేకుండా అనుకున్నదే తడువగా ముందుకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు.  ‘‘నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని’’ అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని వడ్డే శోభానాద్రీశ్వరరావు సెటైర్లు వేశారు.

    ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి లాక్కున భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారు.  వేల ఎకరాల భూమిని తీసుకుని కార్పొరేట్లకు ఇచ్చే చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైన చర్య. పేదల పొట్టకొట్టి వారి నోటి వద్ద కూడు తీసి బడా కంపెనీలకు ఇచ్చే ఆలోచన చంద్రబాబు చేయడం తగదు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనను విరమించుకోవాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. 

    ఏపీ ప్రభుత్వం 26 లక్షల ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్రాజెక్టుల కోసం కేటాయించే ప్రణాళికను రూపొందించింది. ఇది చట్ట విరుద్ధం , రాజ్యాంగ విరుద్ధం. నా దాహం తీరనిది..నేనొక భూ పిపాసిని అనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనలను మానుకోవాలి. ఏపీలో ప్రతీ ఇంటిమీద , ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానల్స్ పెట్టండి. కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయండి. లేకపోతే చంద్రబాబు భూ బకాసురుడు అనే నింద మోయాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు.

  • సాక్షి, తాడేపల్లి: మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించి ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారిగా హెచ్‌జే దొర సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చక్కటి కృషి చేశారని పేర్కొన్నారు.

    పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. హెచ్‌జే దొర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం వారికి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • సాక్షి, విజయవాడ: హెరిటేజ్‌కి రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు హెరిటేజ్ ఫుడ్స్ నిర్వహిస్తుండగా.. చంద్రగిరి మండలం కాశీపెంట హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌కి కేబినెట్‌ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. హెరిటేజ్ టెక్నాలజీ అప్ గ్రేడేషన్ కోసం సబ్సిడీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

    ఐదేళ్ల పాటు 100 శాతం జీఎస్టీ రియంబర్స్‌మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులో యూనిట్ కి రూ.1 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. హెరిటేజ్ నెయ్యి ఉత్పత్తి 566 శాతం, ఫ్లేవర్డ్‌ పాలు 131, పన్నీర్ 400 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద భారీ రాయితీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెరిటేజ్ రాయితీలను మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో వెల్లడించలేదు. అజెండాలో చివరి అంశంగా పెట్టి.. ఏపీ కేబినెట్‌ ఆమోదించింది.

National

  • ఆగ్రాలో ఒక మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నాలుగేళ్లు సహజీవనంచేసి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఆరోపణలు గుప్పిస్తూ చనిపోయే ముందు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కూడా విజ్ఞప్తి చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో  సంచలనంగా మారడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసలు స్టోరీ ఏంటంటే..

    ప్రాథమిక సమాచారం ప్రకారం,  బాధిత మహిళది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా. ఆమె అంతకుముందే విడాకులు తీసుకుని, ఆగ్రాలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోపనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే కానిస్టేబుల్‌తో పరిచయమైంది. దీంతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.  పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కుటుంబం ఒప్పుకోదు అంటూ  పెళ్లికి నిరాకరించాడు. చివరికి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో వివాదం రేగింది. తీవ్ర  ఆవేదనతో వీడియో సందేశం రికార్డ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.
     

    ఆ వీడియోలో ఇలా పేర్కొంది..
    తాను కలిసి  జీవించిన గౌతమ్‌ చేతిలో ఏళ్ల తరబడి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మాట తప్పాడని పేర్కొంది. గౌతమ్‌తో జీవించిన కాలంలో  తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని ఆమె పేర్కొంది.  ఫిర్యాదు చేయడానికి తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు, తమ చేతుల్లో ఏమీ లేదని, ఆ కానిస్టేబుల్‌పై ఎటువంటి చర్యలూ తీసుకోలేమని అక్కడివారు చెప్పినట్లు ఆమె తెలిపింది. తాను బతికి ఉన్నప్పుడు తనకు న్యాయం జరగలేదని, కనీసం తన మరణం తర్వాత అయినా తనకు న్యాయం జరగాలని ఆశించింది.  అంతేకాదు గౌతమ్, అతని కుటుంబ సభ్యులు తనను ఎంతో మోసం చేశారని, మానసికంగా వేధించారని, చివరికి ఈ దారుణ నిర్ణయం తీసుకునేలా తనను నెట్టారని ఆమె ఆరోపించింది. ఏళ్ల తరబడి అతనితో కలిసి జీవించిన తర్వాత, ఇప్పుడు అతను వేరొక మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని ఆమె వాపోయింది.

    "నా మరణానికి జేవీ గౌతమ్, అతని కుటుంబం మొత్తం కారణం. వారు నన్ను ఎంతగానో మోసం చేశారు. మానసికంగా ఎంతగా వేధించారంటే, చివరికి నేను చనిపోయేలా నన్ను బలవంతం చేశారు."  అని చెప్పింది. అలాగే ‘‘అతని అన్నయ్య ఒకవైపు నన్ను పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. మరోవైపు, నా కుటుంబం నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదని జేవీ గౌతమ్ నాతో చెబుతున్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ కనీసం ఏ అమ్మాయినీ మోసం చేయకు," అని పేర్కొంది.

     

    ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో  కానిస్టేబుల్ జె.వి. గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఆమె మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుమార్తెకు న్యాయం జరగాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
     

  • ఢిల్లీ: వంటగ్యాస్‌ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్‌లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్‌ బుకింగ్స్‌ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్‌ బుక్‌ చేయొద్దన్నారు. బ్లాక్‌ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్‌ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్‌ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్‌పీజీ బదులు ప్రజలు పీఎన్‌జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని  కేంద్రం సూచించింది.

    ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్‌, గ్యాస్‌ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ గోడౌన్‌ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్‌లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్‌లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్‌ పెరిగింది.

    గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

     


     

  • కుంభమేళా సోష‌ల్‌మీడియా సంచ‌ల‌నం మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రేమ వివాహం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఆమెది బాల్య వివాహ‌మ‌ని వీహెచ్‌పీ ఆరోపించింది. దీంతో ఈ పెళ్లి నెట్టింట చర్చకు దారితీసింది.

    ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 2025 మహా కుంభమేళా  సందర్భంగా విశేష గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే  ఇటీవల (మార్చి 11, 2026న ) తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్ ఖాన్‌ (Mohammed Farman Khan)ను పెళ్లాడింది. కేరళలోని అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారీ వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే మోనాలీసా మైనర్‌శ్రీ అనీ, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం గురువారం నాడు డీజీపీతో పాటు పూవార్ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసింది. 

    ఈ మతాంతర వివాహం చట్టవిరుద్ధమని, ఎందుకంటే వధువు మైనర్ అని (18 ఏళ్లలోపు) విహెచ్‌పీ తన ఫిర్యాదులో ఆరోపించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం-2012 కింద విచారణ జరపాలని,అలాగే వివాహాన్ని నిర్వహించిన వారిపైనా, అందులో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ విహెచ్‌పీ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ విలయిల్ కేరళ డీజీపికి, పూవార్ SHOకు ఫిర్యాదు చేశారు. 

    ఈ ఫిర్యాదు ప్రకారం.. తమ వాదనకు ఆధారంగా, జనవరి 21, 2025న జరిగిన మోనాలిసా 16వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సోషల్ మీడియా వీడియో దృశ్యాలను వీహెచ్‌పీ ప్రస్తావించింది. కనుక  18 ఏళ్ల లోపే జరిగిన మోనాలిసా భోంస్లే వివాహం చెల్లదని, ఆ జంటపైనా, ఆలయ అధికారులపైనా, అలాగే వారికి అండగా నిలిచిన రాజకీయ పోషకులపైనా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.

    ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు

    మెనాలీసా క్లారిటీ
    తమ వివాహం చట్టబద్దమైందనీ, లవ్‌ జిహాద్‌ కాదనీ కొత్త జంట తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని స్పష్టం చేశారు. ఇద్దరమూ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని వివరించారు. అలాగే జనవరి 1, 2008న జన్మించిందంటూ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రాన్ని కూడా వారు సమర్పించారు. అయితే మెనాలీసా కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో రక్షణ కోరుతూ తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. 18 సంవత్సరాలు నిండాక, చట్టబద్ధంగా నచ్చిన భాగస్వామితో జీవించడానికి స్వేచ్ఛ ఉందని పోలీసు అధికారులు వివరించారు. దీంతో వివాహం ప్రక్రియను ముగించారు.  

    ఇదీ చదవండి : లవ్‌ జిహాద్‌ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!

    కాగా మెనాలీసా-ఫర్మాన్ ఖాన్‌ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరైనారు.

  • పశ్చిమాసియా యుద్ధం భారతదేశ చమురు పరాధీనతను కళ్లకు కట్టింది. విదేశాల నుంచి ముడిచమురు, ద్రవరూప పెట్రోలియం గ్యాస్, ద్రవరూప సహజవాయువు దిగుమతులు హఠాత్తుగా ఆగిపోతే భారత్‌ కష్టాలకడలిలో పడిపోవడం ఖాయమని వార్తలు వినవస్తున్నాయి. ఈ పరిస్థితిని చాన్నాళ్ల క్రితమే ఊహించిన భారత్‌ ముందుజాగ్రత్తగా భారీ స్థాయిలో పెట్రో ఉత్పత్తులను నిల్వచేసుకునే రహస్య భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించుకుంది. వీటిల్లో మిలియన్ల మెట్రిక్‌ టన్నుల కొద్దీ ముడిచమురు ఉత్పత్తులను దాచిపెడుతోంది.

    భారత్‌ తన 90 శాతం ముడిచమురు, 60 శాతం ఎల్పీజీ, 50 శాతం సీఎన్‌జీ (CNG) అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ సరకును నిల్వచేసుకోవడంపై దృష్టిసారించింది. ఈ కారణంగానే హార్మూజ్‌ జలసంధి వంటి కీలక చమురు సరఫరా మార్గాలు మూతబడినా వెంటనే కంగారుపడకుండా తన చమురు నిల్వలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్‌ వంటి దేశాలు ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించి చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నాయి.

    మూడు చోట్ల మహా గుహలు! 
    చమురు ఉత్పత్తుల దిగుమతులు ఆగిపోయాయనే దిగులుతో భారత్‌ నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూర్‌లో కేంద్రప్రభుత్వం మూడు భూగర్భ రహస్య నిల్వకేంద్రాలను నిర్వహిస్తోంది. ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో పదేళ్ల క్రితమే 4 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును నిల్వచేసే భారీ భూగర్భ కేంద్రాన్ని నిర్మించారు.

    ఇందులోని ముడిచమురు (Crude Oil) పది రోజులపాటు యావత్‌ భారతదేశ అవసరాలను తీర్చగలదు. బాంబు, డ్రోన్‌ దాడులను తట్టుకునేలా అత్యంత లోతులో వీటిని నిర్మించారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, చమురు ఒలికిపోవడం వంటి లీకేజీ సమస్యలూ ఇక్కడ దాదాపు ఉండవు. గతంలోలాగా ఒకటి రెండు దేశాలపై ఆధారపడకుండా ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధసంక్షోభంలో చిక్కుకున్నాసరే మిగతా దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు భారత్‌ చేసుకుంది.

    అంతర్జాతీయ చమురు సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశంతో తాత్కాలికంగా రష్యా చమురును కొనేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇవ్వడంతో వేగంగా భారత్‌ పావులు కదిపింది. దక్షిణాసియాలో ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన 30 మిలియన్‌ బ్యారెళ్ల చమురును భారత్‌ కొనుగోలుచేసింది. దీనికితోడు గత పది రోజుల్లోనే ఒక్క అంగోలా నుంచే 34 లక్షల బ్యారెళ్ల ముడిచమురును భారత్‌ కొనేసింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో నుంచి మరో 19 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలుచేసింది. ఇలా వచ్చిన సరకును వీలైనంత వరకు భూగర్భం కేంద్రాల్లో దాచేస్తోంది. ఎల్పీజీ స్టోరేజీ సైతం ఊపందుకుంది.

    అరకిలోమీటర్‌ లోతులో..
    కర్ణాటకలోని మంగళూరులో (Mangaluru) ఏర్పాటుచేసిన స్టోరేజీ సామర్థ్యం ఏకంగా 80,000 టన్నులు. ఇది అరకిలోమీటర్‌ లోతులో ఉంది. ఇదిగాక విశాఖపట్నంలో మరో ఎల్పీజీ నిల్వకేంద్రం ఉంది. దీని సామర్థ్యం 60,000 టన్నులు. ఇవిగాక మరికొన్ని రహస్య భూగర్భ రాతి గుహలను నిర్మించి మరింత ఎక్కువ చమురును నిల్వచేయాలని కొన్ని నెలల క్రితం పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను తమిళనాడులోని పాడూర్‌లోనూ దాచేస్తోంది. ఒడిశాలోని ఛందీఖోల్‌లో మరో దానిని నిర్మించనున్నారు.

    చ‌ద‌వండి: సిలిండ‌ర్లు దాచారో.. జైలుకే!

    భూగర్భ గుహలు అనేవి వ్యూహాత్మకంగా సురక్షితమైనవి. భూమి మీది నిల్వకేంద్రాల నుంచి ఎండాకాలంలో కొంతమేర పెట్రో ఉత్పత్తులు వేడికి ఆవిరవుతాయి. భూగర్భంలో ఆ నష్టభయం ఉండదు. యుద్ధకాలంలో తొలిసారిగా స్వీడన్‌లో ఈ ప్రణాళికను అమలుచేశారు. తర్వాత ఫిన్లాండ్, జపాన్, దక్షిణకొరియా తదితర దేశాలు ఇదే బాటలో పయనించాయి. 1990లో గల్ఫ్‌ యుద్ధం నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో భారత్‌ ఈ అండర్‌గ్రౌండ్‌ స్టోరేజీలకు అంకురార్పణ చేసింది.  
    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

  • కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మరో దశ సమావేశాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కోల్‌కతాలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో అధికార టీఎంసీ మినహా, రాష్ట్రంలోని చాలా రాజకీయ పార్టీలు ఒకటి లేదా రెండు దశల ఎన్నికలు కోరాయని, భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి సూచనలే చేశారని చెప్పారు.

    పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికలకు సంబంధించిన హింసను అరికట్టడం సులభమవుతుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. ‘288 సీట్లున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాం. పశ్చిమ బెంగాల్‌లోనూ ఒకే దశలో నిర్వహించడం అసాధ్యమైతే కాదు. అయితే.. ఇక్కడ భద్రతా అంశాల దృష్ట్యా అది అసంభవం అనిపిస్తోంది’ అని అన్నారు.

    ఎన్నికల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఈసీకి ప్రధాన ఆందోళనగా మారాయని, అయితే గట్టి నిఘా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు హామీ ఇచ్చారని అధికారి తెలిపారు.

    చ‌ద‌వండి: ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను తొల‌గించాలంటూ..   

Family

  • సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్‌కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్‌... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్‌గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.

    సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్‌ డిజైన్స్‌ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్‌లో చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్‌ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్‌ లుక్‌ను తీసుకువస్తున్నాయి.

    ఫ్రెష్‌ ఫ్లవర్‌ దుపట్టా...

    గులాబీలతో..  రెడ్‌ లేదా పింక్‌ రోజ్‌ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్‌ లేదా పింక్‌ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్‌ లుక్‌తో కనిపిస్తారు. 

    మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్‌ సింపుల్‌గానూ, క్లాసీ లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్‌ డ్రెస్‌ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. 

    వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్‌తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్‌ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్‌ కోసం వాడతారు.

    పువ్వుల బ్లౌజ్‌ డిజైన్స్‌...

    ఫ్రంట్‌ ఫ్లోరల్‌ టాప్‌ స్టైల్‌లో బ్లౌజ్‌ మొత్తం పూలతో కవర్‌ చేస్తారు. 

    పువ్వులను బ్లౌజ్‌ బోర్డర్‌కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్‌ థ్రెడ్‌తో నెటెడ్‌ మెటీరియల్‌ మీద ఫిక్స్‌ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్‌ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్‌ మీద డిౖజైన్‌ చేస్తున్నారు. డిజైన్‌ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. 

  • కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్‌ 1వ తేదీన ఇక ఏటా అంత‌ర్జాతీయ‌ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్‌ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!

    కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్‌ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.

    2.5 కోట్ల రైతుల పంట 
    ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.

    3,400 కోట్ల డాలర్ల వాణిజ్యం
    ప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.

    పుట్టిల్లు ఇథియోపియా
    అనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.

    కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్‌ ఫీల్డ్‌ స్కూల్స్‌ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్‌ స్కూల్స్‌ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్‌ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్‌కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. 

    ఏడో స్థానంలో భారత్‌
    కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్‌ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 

    17వ శతాబ్దంలో బాబా బుడాన్‌ ఎమెన్‌ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్‌ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్‌ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.

    చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!

    కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.
    – క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్‌ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్‌.

    నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌  

  • ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్‌–ఎఫ్‌ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..

    మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.

    ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్‌ మార్కెట్‌లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!

    మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌’ చెబుతోంది.

    ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.

    మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?
    ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్‌లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్‌ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

    పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.

    సాధికార మహిళా రైతులు
    వారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. 

    ఆహార కొరత తగ్గుతుంది.

    అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. 

    రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.

    రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది.  

    (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!)

  • కొందరి ప్రతిభ అసాధారణంగా బయటకొస్తుంది. సాధారణంగా చిత్ర కళాకారులు ప్రయాణం చేతిలో పెన్సిల్‌ పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. కానీ కొందరి విధివంచితులకు ఆ అవకాశమే లేకుండా చేసి వెక్కిరిస్తుంటుంది. అయినప్పటికీ వారి కళా ప్రయాణం ఆగదు..పైగా విభిన్న ప్రతిభపాటవంతో ప్రపంచమే చేతులెత్తి సలాం కొట్టేలా చేస్తారు. అంతేగాదు అసాధారణ ధృడ సంకల్పం ముందు ఎంతటి వైకల్యమైన వెలవెలబోవాల్సిందే..!. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు.

    ఆ యువకుడే చత్తీస్‌గఢ్‌కు చెందిన గోకరణ్ పాటిల్. పుట్టుకతో చేతులు, వినికిడి లోపంతో జీవిస్తున్న వ్యక్తి శక్తిమంతమై సృజనాత్మక వ్యక్తీకరణ రూపంగా మారాడు. గోకరణ్ పాటిల్ చత్తీశ్‌గఢ్‌లోని భిలాయ్‌లో పెరిగాడు. అక్కడ అతను తన తల్లి, తోబుట్టువులతో పెరిగాడు. రోజువారీ పనులకు అతడి శారీరక లోపాలు పెను సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ పాటిల్‌ వెనక్కి తగ్గలేదు. అలా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడూ అందరిలా చేతితో పెన్సిల్‌ పట్టుకోలేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అని అనుకున్నాడు పాటిల్‌. అలా కాలి వేళ్ల మధ్య పెన్సిల్‌ పట్టుకుని రాయడం ప్రారంభించాడు. 

    అతనికి తన పాదాలపై ఉన్న అద్భుతమైన నియంత్రణకు ఉపాధ్యాయులు అబ్బురపడి..డ్రాయింగ్‌ వేసే దిశగా ప్రోత్సహించారు. దాంతో పాటిల్‌ ఆ మార్గంలోనే గట్టిగా సాధన చేశాడు. కాలక్రమేణ చిత్రీకరణ ఒక గొప్ప శక్తిగా రూపాంతరం చెందింది. అతి కాస్తా తన అభిరుచి, ఫ్యాషన్‌గా మారిపోయింది. అతడికి ఈ కళ ఒకరకంగా అపారమైన ఏకాగ్రత అబ్బేలా చేసింది. ఆ నేపథ్యంలోనే వివరణాత్మక చిత్రపటాలు, శక్తిమంతమైన ప్రకృతి దృశ్యాలతో ప్రేక్షకులను అలరించాడు. అలా చివరికి  లలిత కళలలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. పాటిల్‌ చిత్రీకరణ సాంకేతికతపై మంచి పట్టుని సంపాదించుకున్నాడు. 

    ప్రపంచ దృష్టించిన ఆకర్షించేలా రికార్డు..
    పాటిల్‌ అంకితభావం చివరికి అతనికి అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిపెట్టింది. యుక్తవయసులో, ఒక గంటలోపు తన కాలి వేళ్లను ఉపయోగించి అత్యధిక సంఖ్యలో డ్రాయింగ్‌లను సృష్టించిన తర్వాత అతను గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాడు. ఈ ఘనత వేగం కంటే అతడు వేసిన తీరు అతడిని వార్తల్లో నిలిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నిజానికి పాదాలతో బొమ్మలు చిత్రించాలంటే..బ్రష్‌ను నియంత్రించడానికి సమతుల్యత, కండరాల బలం, తీవ్రమైన ఏకాగ్రత, నిరంతర సాధన చాలా అవసరం. 

    అయితే పాటిల్‌ వాటిన్నింటిని మరింత మెరుగపరుచుకున్నాడు. అదే అతడని ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా చేసింది. పాటిల్‌ చిత్రాలు కళాభిమానులు, ప్రభుత్వ అధికారులు, సోషల్‌ మీడియా ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. అంతేగాదు ఈ అభిరుచి కాస్తా.. స్థిరమైన జీవనోపాధిగా మార్చుకున్నాడు. అంతేగాదు పాటిల్‌ వ్యక్తిగతంగా సక్సెస్‌ అయితే చాలు అనుకోలేదు. ముఖ్యంగా తనలాంటి విద్యార్థులకు, వినికిడి లోపం ఉన్నవారికి క్రియేటివిటీ, సాంకేతికత నైపుణ్యాలను నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందిస్తుండటం విశేషం.  

    (చదవండి: 109 కిలోల నుంచి 72 కిలోలకు తగ్గిన డయాబెటిస్‌ డాక్టర్‌..!)

     

Cartoon