Archive Page | Sakshi
Sakshi News home page

International

  • మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య 10 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    ట్రంప్ తన ప్రకటనలో.. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ (Joseph Aoun) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో జరిగిన చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు లేదా భారత ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

    ట్రంప్ తన పాత్రను విశేషంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటివరకు ప్రపంచంలో 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన 10వ విజయంగా నిలుస్తుందని తెలిపారు. ఇది ఆయన రాజకీయ దృక్పథాన్ని, అంతర్జాతీయ వ్యవహారాల్లో తన జోక్యాన్ని ప్రతిబింబిస్తుంది.

    వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు '34 ఏళ్లలో తొలిసారిగా సమావేశమయ్యాయని' ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు "శాశ్వత శాంతి"ని సాధించేలా చూడాలని తాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్‌లను ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు.

  • ఇజ్రాయెల్‌-లెబనాన్‌ల మధ్య జ్వాలాగ్ని చల్లారనుందా?, ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? యుద్ధానికి ఇరు దేశాలు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చాయా? అంటే అవుననక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 

    తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రుబియో ఫోన్‌ చేసి చర్చలు జరిపారు. 

    అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్‌ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు.  దాంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్‌. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్‌ ఇచ్చారు.  మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం గమనార్హం.  

  • న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఫోన్‌ చేశారు. హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ భద్రత, స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించారు. ఇరువురు నేతలు పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. పశ్చిమాసియా స్థిరత్వం కోసం భారత్‌, ఫ్రాన్స్‌ సహకారాన్ని కొనసాగిస్తాయని ఇరువురు నేతలు అన్నారు.

    “నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించాం. హార్మూజ్ జలసంధిలో భద్రత, నావిగేషన్ స్వేచ్ఛను అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరంపై ఉందని మాట్లాడుకు‍న్నాం. ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహిత సహకారం కొనసాగిస్తాం” అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

    పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మారుతూ ఉండడడంతో భారత్ ప్రపంచ నాయకులతో ఉన్నత స్థాయి సంప్రదింపులు కొనసాగిస్తోంది. ముందుగా మార్చిలో కూడా ప్రధాన మంత్రి మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడితో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సమన్వయం కొనసాగిస్తామని చెప్పారు.

    ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ మాట్లాడి పశ్చిమాసియా భద్రతా పరిస్థితిపై చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

    గురువారం ఢిల్లీలో మోదీ, ఆస్ట్రియా చాన్స్‌లర్ క్రిస్టియన్ స్టాకర్ పశ్చిమాసియాలో సముద్ర మార్గ రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా కొనసాగాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. “ఇరు పక్షాలు పశ్చిమాసియా ప్రాంతంలో తాజా పరిణామాలపై కూడా చర్చించారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు, దౌత్య ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అందులో సముద్ర రవాణా సురక్షితంగా, అంతరాయం లేకుండా సాగడం అనే అంశం కూడా ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) సీబీ జార్జ్ ప్రెస్ బ్రీఫింగ్‌లో తెలిపారు.

    40 దేశాల నేతల చర్చలు 
    ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఈ కాల్... ఫ్రాన్స్, యూకే కలిసి 40 పైగా దేశాలను ఒకే తాటికి తీసుకొచ్చి సంయుక్త సమావేశం నిర్వహించే నేపథ్యంలో వచ్చింది. దీని లక్ష్యం హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ ఉండేలా చేయడం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 17న) పారిస్‌లో జరుగుతుందని తెలిపారు. 

    హార్మూజ్‌ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.

  • వాషింగ్టన్: ఇరాన్‌కు పెంటగాన్‌ చీఫ్‌ పీట్ హెగ్‌సెత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు, ప్రపంచ ప్రయోజనాల కోసం సరైన ఒప్పందాన్ని, సమర్థంగా కుదుర్చుకోకపోతే పోర్టుల నిర్బంధం, ఆర్థికపరంగా ఒత్తిడి కొనసాగుతాయని తెలిపారు. అవసరమైనంతకాలం నిర్బంధం కొనసాగుతుందని చెప్పారు. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మౌలిక వసతులు, విద్యుత్, ఎనర్జీ రంగాలపై బాంబులు పడతాయంటూ హెచ్చరించారు. 

    శాంతి ఒప్పందాన్ని ఇరాన్‌ తిరస్కరిస్తే సైనిక దాడులను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని హెగ్‌సెత్ హెచ్చరించారు. అమెరికా ఇంతకు ముందుకంటే ఎక్కువ శక్తితో మళ్లీ సిద్ధమవుతోందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

    హార్మూజ్ జలసంధిపై అమెరికా నిర్బంధానికి గురువారం నాటికి మూడో రోజు. అనేక వాణిజ్య నౌకలను వెనక్కి మళ్లించగా, ఇరాన్ పోర్టులకు వెళ్లే, వచ్చే సముద్ర రవాణాపై పూర్తిగా నియంత్రణ సాధించామని అమెరికా దళాలు పేర్కొన్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని ఈ నిర్బంధాన్ని అమలు చేస‍్తున్నారు.

    అంతా గమనిస్తున్నాం: హెగ్‌సెత్‌ 
    తాజాగా నిర్వహించిన పెంటగాన్ సమావేశంలో హెగ్‌సెత్‌తో పాటు సంయుక్త సైన్యాధిపతుల కమిటీ చైర్మన్ జనరల్ డాన్ కేన్, అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్‌సెత్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు.

    “మీరు ఏ సైనిక వనరులను ఎక్కడికి తరలించారో మాకు తెలుసు” అని ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ను ఉద్దేశించి హెగ్‌సెత్‌ చెప్పారు. ఇరాన్ కీలక శక్తి మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయని అన్నారు. ఇరాన్‌ ఎనర్జీ సెక్టార్‌ను తాము ఇంకా ధ్వంసం చేయలేదని, కానీ అమెరికా అమలు చేస్తున్న నిర్బంధం ఇరాన్‌ ఎగుమతులను నిలిపివేయడంతో చమురు ఆదాయం బాగా తగ్గుతోందని తెలిపారు. అదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.

    వ్యూహాత్మక సముద్ర మార్గాలపై దృష్టి సారిస్తూ హార్ముజ్‌లోకి వచ్చే, వెళ్లే రవాణాను అమెరికా నౌకాదళం నియంత్రిస్తోందని తెలిపారు. ఇది తమ మొత్తం నౌకాదళ సామర్థ్యంలో కేవలం 10 శాతంతోనే చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పరిమితమని, మరింత తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందని సూచించారు. ఇరాన్‌కు నౌకాదళం, సముద్ర పరిస్థితులపై అవగాహన లేదని, వారు దేన్నీ నియంత్రించలేరని తెలిపారు.  
     

  • టెల్ అవీవ్: పిల్లలు చదువుకునే స్కూల్లో ఏముంటాయి? స్కూల్‌ బ్యాగులు, పుస్తకాలు, వాళ్లు కూర్చునేందుకు బెంచీలు వంటివి ఉంటాయి. అయితే, ఓ స్కూల్లో మాత్రం 130కి పైగా భయానక ఆయుధాలు కనపడ్డాయి. లెబనాన్‌లోని బింట్ జ్బైల్ ప్రాంతంలోని ఓ స్కూల్లో హెజ్బొల్లాకు చెందిన ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) గుర్తించాయి.

    కలాష్నికోవ్ తుపాకులు, పిస్టళ్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయని ఐడీఎప్‌ ఎక్స్‌లో పేర్కొంటూ వాటి ఫొటోలను పోస్ట్‌ చేసింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుధాలతో పాటు హెజ్బొల్లా జెండాలు, ఇతర ఉగ్రవాద సంస్థల గుర్తులు కూడా అక్కడ కనపడ్డాయి.

    ఇదే సమయంలో ఐడీఎఫ్ మరో ప్రకటనలో.. కేవలం ఒక నిమిషంలో సుమారు 70 హెజ్బొల్లా మౌలిక వసతులను ధ్వంసం చేశామని తెలిపింది. డజన్ల కొద్దీ ఆయుధాలను గుర్తించామని తెలిపింది. అందులో ఆర్‌పీజీలు, కలాష్నికోవ్ తుపాకులు, మందుగుండు సామగ్రి, గ్రెనేడ్లు, స్పై డివైజ్‌లు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయి.

    మరో ఆపరేషన్‌లో పదులకొద్దీ ఉగ్రవాదులను హతమార్చినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా హెజ్బొల్లా ఇంతకు ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై రెండు డ్రోన్ దాడులకు బాధ్యత వహించింది. నహారియా సమీపంలో ఇజ్రాయెల్ సైన్య స్థావరాలపై డ్రోన్ దాడులు జరిగాయి.

    ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లాపై లక్ష్యిత దాడులు కొనసాగుతున్నాయని, దీర్ఘకాల శాంతి దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

    కాగా, ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతోంది. ఇరు దేశాలు మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. ఈ రెండు దేశాల మధ్య చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇటీవల రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపింది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి.
     

  • టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌ ఏప్రిల్‌ 15న ఇరాన్ చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్‌ మధ్య మళ్లీ చర్చలు జరిగేలా చేయడానికి ఇరాన్‌లో మునీర్‌ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా సంకేతాలు ఇచ్చారు. 

    అందుకు సంబంధించే పాక్‌ ప్రతినిధి బృందంతో మునీర్‌ ఇరాన్‌ వెళ్లినట్లు ఆ దేశ సైన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా, మునీర్‌ ఇరాన్‌ పర్యటనపై మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఇరాన్‌ పర్యటన ముగిశాక మునీర్‌ అమెరికాకు కూడా వెళ్లనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి. 

    ఇందులో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమం అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పాకిస్థాన్ అధికారులు భావిస్తున్నారని అల్ జజీరా మీడియా చెప్పింది. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్‌ మునీర్‌ ఇప్పటికే వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సందేశాన్ని కూడా తీసుకెళ్లి మునీర్‌ అమెరికాకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమెరికా-ఇరాన్‌ మధ్య పాకిస్థాన్‌లో లేదా ఇతర దేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
      
    ఇరాన్‌ అణు శుద్ధి ప్రక్రియను ఎంతకాలం ఆపాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు ఐదేళ్లు ఆపాలని, మరికొందరు 20 ఏళ్లు ఆపాలని చెబుతున్నారు. ఇది ఇరు దేశాల మధ‍్య ఉన‍్న ప్రధాన విభేదం. మరొక ప్రధాన అంశం ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వ. ఈ నిల్వను మరో దేశానికి తరలించడం లేదా శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి పలు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.

    ఆ నిల్వతో 10 అణ్వాయుధాలు చేయొచ్చు 
    అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. ఇప్పటికే ఇరాన్ 60% స్వచ్ఛత వరకు 440.9 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వను శుద్ధి చేసింది. ఇది 90% ఆయుధ-స్థాయి స్వచ్ఛతకు చేరడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది.

    ఒకవేళ ఇరాన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిల్వతో 10 అణ్వాయుధాల వరకు తయారు చేయగలదని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఏపీకి ఇచ్చిన ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఐఏఈఏ మార్గదర్శకాల ప్రకారం.. ఇంత అధికంగా శుద్ధి చేసిన అణు పదార్థాన్ని సాధారణంగా ప్రతి నెల తనిఖీ చేయాలి.

    ఈ పరిణామాల మధ్య, మునీర్ ఇరాన్ పర్యటన తరువాత వాషింగ్టన్ వెళ్లే అవకాశం ఉంది. ఇది మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగమని పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి. బుధవారం అరాఘ్చీ టెహ్రాన్‌లో మునీర్‌ను స్వాగతిస్తూ, చర్చలకు సహకరించిన పాకిస్థాన్ పాత్రను ప్రశంసించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ శాంతి, స్థిరత్వం అంశాలను ప్రస్తావించారు.

    ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అందరూ భావించారు. డొనాల‍్డ్‌ ట్రంప్‌ హార్మూజ్‌, ఇరాన్‌ ఓడ రేవుల దిగ్బంధం చేయించడంతో ఇది సమీప భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిణామాలను దారి తీయవచ్చు. 

    ఇరాన్‌ అణు కార్యక్రమం, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చడం, ఇతర "రెడ్ లైన్" అంశాలపై వెనక్కి తగ్గకపోతుండడంతో.. తదుపరి జరిపే ఉన్నత స్థాయి సమావేశమే చివరి ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌ అన్ని అంశాల్లో వెనకడుగు వేసేలా కనపడడం లేదు. ఇటువైపేమో రెండో దశ చర్చలు జరగకపోయినా, అవి మళ్లీ విఫలమైనా భీకర యుద్ధం తప్పదని ఇప్పటికే ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది.

  • ఇరాన్‌తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పదే పదే బోధపడుతూనే ఉంది.  ఇటీవల పాకిస్తాన్‌లో ఇరాన్‌తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్‌కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్‌ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్‌ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. 

    దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్‌ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో  ఏమో కానీ ట్రంప్‌ మాత్రం తన రూట్‌ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్‌పై  యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్‌..   ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్‌హౌస్‌లో డచ్‌ రాజు, డచ్‌ రాణిలతో జరిగిన ప్రైవేట్‌ డిన్నర్‌ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్‌ చెప్పినట్లు సమాచారం. 

    ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఇరాన్‌తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ  పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్‌ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్‌ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 

    ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్‌ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్‌ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్‌తో చర్చలు అవసరమని డచ్‌ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్‌కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక  ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్‌ యోచిస్తున్నారు. 

    దీనిలో భాగంగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

  • కళ్లముందు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తున్నప్పుడు మనల్ని రక్షించుకునేందుకు అందరమూ ముందుగా చేసి పని అక్కడినుంచి పారిపోవడం, ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా పరుగెత్తడం. ఏప్రిల్ 6న ఇండోనేషియాలోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ డుకోనో (Mount Dukono) వద్ద ట్రెక్కింగ్‌ చేస్తున్న పర్యాటకులకు ఊహించని అనుభవం ఎదురైంది. అయితే క్షణాల్లో వారి ప్రాణాలను కాపాడిన గైడ్ నిర్ణయం నెట్టింట విశేషంగా నిలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

    ఛానల్ న్యూస్ ఏషియా నివేదిక ప్రకారం మౌంట్ డుకోనో అగ్నిపర్వతం శిఖరానికి సమీపంలో ఆ బృందం ట్రెక్కింగ్ చేస్తుండగా, కేవలం కొన్ని మీటర్ల దూరంలో అకస్మాత్తుగా విస్ఫోటనం సంభవించింది. క్షణాల్లో బూడిద, శిథిలాలతో కూడిన ఒక ఎత్తైన స్తంభం ఆకాశంలోకి ఎగసి పడింది. దీంతో అక్కడున్న పర్వతా రోహకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.  అక్కడినుంచి దూరంగా వెళ్ళాలనే ఆశతో కొండ కిందికి వెళ్లడం ప్రారంభించారు. కానీ వారి లోకల్‌ గైడ్ వెంటనే జోక్యం చేసుకుని, అందరినీ ఆగి, ఉన్నచోటనే ఉండమని ఆదేశించాడు. "కిందికి వెళ్లొద్దు, పైకే రండి!" అని ఆ గైడ్ గట్టి గట్టిగా  కేకలు వేసి  మరీ అప్రమత్తం చేశాడు. గైడ్ చాకచక్యంతో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గాలి దిశను, బూడిద ప్రవహించే మార్గాన్ని అంచనా వేసిన గైడ్, అందరినీ ఒకే చోట ఉంచడం ద్వారా వారు సురక్షితంగా ఉండేలా చూడడం ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇలాంటి కీలక ప్రదేశాల్లో ట్రెక్కింగ్‌ చేసేటపుడు అనుభవం ఉన్న స్థానిక గైడ్ల సలహాలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది అంటున్నారు.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

    ఎందుకు కిందికి వెళ్లకూడదు అంటే
    సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు దూరంగా వెళ్లాలని అనుకుంటాం. కానీ అగ్నిపర్వతాల విషయంలో, వేగంగా కదిలే వేడి బూడిద మేఘాలు (Ashclouds) విష వాయువులు కొండవాలు గుండా కిందికి ప్రవహిస్తాయి. కిందికి పరిగెత్తితే నేరుగా ఆ ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

    మౌంట్ డుకోనో: ఇది ఉత్తర మలుకులోని హల్మహెరా ద్వీపంలో ఉంది. ఇది తరచుగా విస్ఫోటనం చెందుతూ ఉంటూ, బూడిదను వెదజల్లుతుంటుంది. సాహస యాత్రికులకు ఇది ఇష్టమైన ప్రదేశం అయినప్పటికీ, ఇక్కడి పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి.

    ఇదీ చదవండి: TCS Nasik case: టీసీఎస్‌ మరో కీలక నిర్ణయం

Movies

  • ‘ధురంధర్-1’లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయత్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రతో అక్షయ్‌కు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీనియర్ నటుడు తన రెండో ఇన్నింగ్స్‌ను మరింత జోరుగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

    తాజా సమాచారం ప్రకారం.. టాలీవుడ్ నుంచి అక్షయ్ ఖన్నాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ఆఫర్ అని సినీ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్‌తో తీస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. అలాగే జూ.ఎన్టీఆర్ హీరోగా ఓ మైథలాజికల్ కథను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండిటిలో ఏదో ఒక సినిమా కోసం అక్షయ్ ఖన్నా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.

    అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. టాలీవుడ్ ఎంట్రీ మాత్రం ఖచ్చితమని తెలుస్తోంది. ఎందుకంటే బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్‌ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి వంటి పలువురు నటులు ఇప్పటికే తెలుగు ప్రాజెక్టుల్లో నటించారు. మరికొందరు బాలీవుడ్ నటులు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి అక్షయ్ ఖన్నా లాంటి ప్రతిభావంతుడైన నటుడిని టాలీవుడ్ వదులుకోదు. ఆయనకు మంచి పాత్రలు దక్కడం ఖాయం. 

    • కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..
    • హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..
    • కోట్‌లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..
    • బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..
    • గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ రెజీనా హోయలు.. 

     

     

     

     

     

     

     

  • టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ‍హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ‍కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.

    అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్‌ ఇండియా మ్యాగజైన్‌పై రామ్ చరణ్‌ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్‌లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్‌ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.

    నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్‌డమ్‌ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్‌గా ఉండేవారని.. అదే ఆయనతో  చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్‌ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

  • అప్పుడే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడే సందడి. ఈ ఫ్రైడే నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, తెరచాప, గాలి లాంటి చిత్రాలతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమా పల్లి చట్టంబి థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో బ్యాడ్ బాయ్ కార్తీక్, తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలపై ఆడియన్స్‌లో బజ్ ఏర్పడింది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే తెలుగులో పోచమ్మ వెబ్ సిరీస్, హిందీ నుంచి అస్సీ, దో దివానే షహర్‌ మే, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు ఆసక్తిగా ఉన్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలకు వచ్చేస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిత్రాలు సడన్ స్ట్రీమింగ్ ‍అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఏ ఓటీటీకి రానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్..

    • దో దివానే షహర్‌ మే(బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    • ఆల్ఫా మేల్స్ సీజన్‌-5(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

    • అబ్సల్యూట్‌ వాల్యూ ఆఫ్ రొమాన్స్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

    • 180(మూవీ)- ఏప్రిల్ 17

    • రూమ్‌మేట్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    • గోరిల్లా స్టోరీ(డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 17

    • ఫుల్ స్వింగ్- సీజన్-4(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 17

    • ట్విస్టెడ్‌(హాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 17

    • లెగో — ఫ్రెండ్స్ ది నెక్ట్స్ చాప్టర్-(హాలీవుడ్ సిరీస్) -ఏప్రిల్ 17

    • బెబెఫిన్‌సింగ్-ఎలాంగ్‌మూవీ ఇన్‌ టూ ద పింక్‌ఫాంగ్ వరల్డ్(కొరియన్ మూవీ)- ఏప్రిల్ 19


    అమెజాన్ ప్రైమ్

    • మట్కా కింగ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

    • బాలిస్టిక్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    • బ్రదర్స్ అండర్‌ ఫైర్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 17

    • ది నాపాబాయ్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17

    • ది విజిలర్స్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    జీ5..

    • అస్సీ (హిందీ సినిమా)- ఏప్రిల్ 17

    • ఆశకల్ అయిరామ్(మలయాళసినిమా)- ఏప్రిల్ 17

    ఆహా..

    • పోచమ్మ(తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17

    బుక్ మై షో

    • ది బ్రైడ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    హెచ్‌బీవో మ్యాక్స్..

    • డస్ట్ బన్నీ(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 17

    హులు..

    • షెల్బీ ఓక్స్(హాలీవుడ్)- ఏప్రిల్ 17

    లయన్స్ గేట్ ప్లే

    • గుడ్ బాయ్(హాలీవుడ్)- ఏప్రిల్ 17

  • సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కొత్త కాదు. ఇండస్ట్రీలోకి వచ్చినవారిలో చాలామందికి దాదాపు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని కొందరు హీరోయిన్స్ బయటికి చెబుతుంటారు. మరికొందరు తమ బాధను చెప్పేందుకు భయపడుతూ ఉంటారు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమైపోయింది.

    తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా తాను ఎదుర్కొన్న సంఘటనను వివరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. దక్షిణాది డైరెక్టర్ తనతో ‍అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. కాస్టింగ్ సెషన్ జరుగుతున్నప్పుడు.. అనుచితంగా తన శరీరాన్ని తాకాడని వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఇబ్బందికి గురయ్యానని పేర్కొంది. ముంబయిలో జరిగిన క్యాస్టింగ్ మీట్‌లో ఈ సంఘటన జరిగిందని పంచుకుంది.

    డైసీ షా మాట్లాడుతూ..'దక్షిణాదికి చెందిన ఒక డైరెక్టర్ నన్ను చాలా అసభ్యంగా తాకారు. ఆయన కాస్టింగ్ కోసం ఓసారి ముంబైకి వచ్చారు. అతన్ని కలవడానికి ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం వెళ్లాం. అక్కడ ఆయన మమ్మల్ని ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తున్నారు.  అది నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా శరీరాన్ని తాకారు.. నా చేయి కూడా పట్టుకున్నారు. నన్ను ఎవరైనా తాకితే చాలా భయంగా ఉంటుంది. అందుకే నేను మసాజ్ కూడా చేయించుకోను. ఒక మహిళ కూడా నన్ను తాకడం ఇష్టం లేదు. అదే ఒక పురుషుడు నన్ను తాకితే ఎలా ఉంటుంది. అందుకే నాకు అది నచ్చలేదు. ఆ తర్వాత అతనికి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పా. కానీ చేయలేదు' అని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

    కాగా.. డైసీ షా.. సల్మాన్ ఖాన్‌ సరసన 'జై హో' (2014) చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'హేట్ స్టోరీ 3' (2015)లో కనిపించింది. మొదట కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వద్ద సహాయకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.  'భద్ర', 'బాడీగార్డ్' వంటి చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటనతో పాటు, డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. పలు టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించింది. ఇటీవలే 'రెడ్ రూమ్' ‍అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో వస్తోన్న  థ్రిల్లర్‌ మూవీలో డైసీ హీరోయిన్‌గా నటిస్తోంది. 
     

  • భయం....నవరసాలలో ఈ భయానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ సినిమాలలో భయం అనే ఎమోషన్ ను రకరకాలుగా రక్తగట్టిస్తుంటారు దర్శకులు. ఇప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుడిని ముచ్చమటలు పట్టించడం నల్లేరు మీద నడకే. చాలా సినిమాలలో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాని కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. పైగా హాలివుడ్ లో థ్రిల్లర్, హారర్ సినిమాలకు కొదవే ఉండదు. గడచిన కొన్నేళ్ళలో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పుకునే హాలివుడ్ సినిమాలు ఎన్ని వచ్చినా అలరించినవి కొన్నే. కాని ఇటీవల నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయిన థ్రాష్ సినిమా మాత్రం చూసే ప్రేక్షకులను కుర్చీ అంటుకుపెట్టుకునేలానే కాదు ఒళ్ళంతా ముచ్చెమటలు పోయించినా ఆశ్చర్యపోనక్కరలేదు. హాలివుడ్ టామీవిర్కోలా రాసిన కథను తానే దర్శకత్వం వహించి తెరకెక్కించిన విధానం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. అంతలా ఈ థ్రాష్ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం.

    అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలో అనీవిలే అనే నగరంపై కాటగిరీ5 తో హరికేన్ హెన్రీ విరుచుకుపడుతుంది. ఇంత పెద్ద తుఫాను వస్తుంది అని తెలిసినా తన తన తల్లి ఇల్లుని వదలలేక ఒంటరిగా ఉండిపోతుంది డకోటా.మరో పక్క లీసా తన డెలీవరీ కోసం వెళుతూ డకోటా ఇంటి ముందే నీటిలో చిక్కుకుపోతుంది. ఇంకో వైపు డీ, రాన్ తమ చెల్లేలితోపాటు డబ్బులు కోసం ఆశపడే జంట దగ్గర ఆశ్రయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అనుకున్నట్టుగానే హరికేన్ ధాటికి అనీవిలే రిజర్వాయర్ గోడ కూడా కూలి నీళ్ళు నగరాన్ని ముంచెత్తుతాయి. నీటి తో పాటు తుఫాను సముద్రంలోని సొర చేపలను కూడా నగరంలోకి తీసుకువస్తుంది. 

    ఇక్కడే ఉంది పెద్ద ట్విస్టు. ఓ పక్క నీళ్ళు, మరో పక్క సొరచేపలు వీటి మధ్య డకోటా, లీసా, అలాగే డీ రాన్ లు ఎలా బ్రతికి బట్టకడతారో అన్నదే థ్రాష్ సినిమా. మొత్తం సినిమాలో ఒకే ఒక దగ్గర దర్శకుడు సినిమా లిబర్టీ తీసుకున్నాడు. మిగతా అంతా మనకు యదార్ధంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అయ్యాక చాలా కాలం తరువాత మంచి థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పట్లో హాలివుడ్ సినిమా సెన్సేషన్ ట్విస్టర్ తరువాత అంతకన్నా ఎక్కువ థ్రిల్లింగ్ కలిగించే సినిమా ఈ థ్రాష్ అవుతుంది. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ లవర్స్.
    - హరికృష్ణ ఇంటూరు

     

  • మెగాస్టార్ నటించిన సినిమాల్లో క్లాసిక్ హిట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ఆపద్బాంధవుడు ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. 1992లో విడుదదలైన ఈ క్లాసిక్‌ సూపర్ హిట్ మూవీలో  చిరంజీవి సరసన హీరోయిన్‌గా మీనాక్షి శేషాద్రి కనిపించింది. ఈ మూవీ రిలీజై నేటికి 34 ఏళ్లవుతోంది. అప్పట్లో ఈ చిత్రంలో ఓ సాంగ్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అవురా అమ్మకు చెల్లా అంటూ సాగే పాట సినీ ప్రియులను అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఫ్యాన్స్‌ ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సాంగ్‌ అభిమానులను మెప్పించింది.

    దాదాపు 34 ఏళ్ల తర్వాత హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అవురా అమ్మకు చెల్లా పాటకు స్టెప్పులను రీ క్రియేటే చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆమె ఈ పాటకు చిందేశారు. 62 ఏళ్ల వయసులోనూ అదే స్టెప్పులతో అదరగొట్టారు. ఆమె డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    మీనాక్షి శేషాద్రి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నా తెలుగు సినిమా 'ఆపద్భాంధవుడు'లోని ఈ అందమైన పాటను ఉగాది ఇన్‌స్టాలో పోస్ట్ చేద్దామనుకున్నా.  కానీ కొంచెం ఆలస్యమైంది. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీ అందరి కోసం ఈ సాంగ్ తీసుకొచ్చా. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో.. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని పూడపల్లి అనే మారుమూల గ్రామంలోని సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ పాటను కులు మనాలిలోని పచ్చని ప్రకృతిలో షూట్ చేశారు. డల్లాస్‌లోని నా బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం లుక్‌ను రూపొందించడం చాలా సరదాగా అనిపించింది.' అని పోస్ట్ చేసింది.
     

     

  • అంబటి అర్జున్, రమేశ్ ఇందిర, ప్రియ శతమర్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు, శ్రీ పూజ, కీలక పాత్రల్లో నటించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పోచమ్మ’. శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్ పై శ్రుతి నాయుడు నిర్మించిన ఈ సిరీస్‌కి రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ఆహాలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగా యాక్సెస్ పొందవచ్చు. బుధవారం సాయంత్రం ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

    ఈ కార్యక్రమంలో నటుడు అంబటి అర్జున్ మాట్లాడుతూ  ‘కొన్ని కంటెంట్ లు ముందు సైలెంట్ గా ఉంటాయి, కానీ రిలీజ్ అయ్యాక మంచి సౌండింగ్ చేస్తాయి. ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ లో అలాంటి కంటెంట్ ఉంది. పోస్టర్ , టైటిల్ తోనే మా సిరీస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సిరీస్ కు మా డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరూ హీరోలు. ఆహా టీమ్ ఎంతో ప్యాషనేట్ గా ఈ సిరీస్ మన ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ లో ప్రతి ఆర్టిస్ట్ బాగా నటించారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఇలాంటి మంచి సిరీస్ కు హడావుడి అవసరం లేదు స్ట్రీమింగ్ కాగానే సక్సెస్ అందుకుంటుంది. ఈ నెల 17న ఆహాలో మా  ‘పోచమ్మ’ సిరీస్ తప్పకుండా చూడండి’అన్నారు.

    నటి స్నేహల్ కామత్ మాట్లాడుతూ - ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ జెస్సీ అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం చిక్ మంగళూరులో చేశాం. ఈ సిరీస్ కు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రొడ్యూసర్ శృతి నాయుడుకి థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే రమేష్ ఇందిర మంచి దర్శకుడి కాదు మంచి కోస్టార్ కూడా. నా కోస్టార్స్ అందరితో కలిసి నటించడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.

    నటి శ్రీ పూజ మాట్లాడుతూ - ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న మొదటి రోజే తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఎందుకంటే మా సిరీస్ కు పనిచేసిన వారంతా పని రాక్షసులు. పని రాక్షసులు ఉన్నచోట పరాజయం ఉండదు. ఈ సిరీస్ తమిళం, తెలుగులో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మిమ్మల్ని తప్పకుండా ఎంగేజ్ చేసేలా సిరీస్ ఉంటుంది’ అన్నారు.

    ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ కవిత మాట్లాడుతూ - ‘పోచమ్మ’ కథ విన్నప్పుడే ఈ సిరీస్ సక్సెస్ మీద మాకు నమ్మకం ఏర్పడింది. ఈ సిరీస్ చిత్రీకరణ మొత్తాన్ని పోచమ్మ తల్లే ముందుండి నడిపించింది అనిపించింది. ఈ సిరీస్ చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా పోచమ్మ తల్లి గుడి, విగ్రహాలు మాకు ఎదురయ్యేవి. మా టీమ్ అంతా డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. మిమ్మల్ని ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉంటుంది’అన్నారు.
     

  • సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా  చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీకి సమంత స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే  15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

    ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు మేకర్స్‌. 'తస్సాదియ్యా... తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...' అంటూ సాగే ఈ పాటకి  రెహమాన్ లిరిక్స్ అందించగా చిన్మయి, పుణ్య సెల్వ అద్భుతంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక చీరకట్టులో సమంత వేసిన స్టెప్పులు హైలెట్‌ అని చెప్పొచ్చు. 

  • టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. కోటి రూపాయల పరిహారం కోరుతూ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతోనే తమన్నా పిటిషన్‌ తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మిల్కీ బ్యూటీకి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. 

    అసలేం జరిగిందంటే..

    పవర్ సోప్స్ అనే సంస్థతో 2008లో తమన్నా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే తమన్నాతో పవర్ సోప్స్‌కు అగ్రిమెంట్ కుదిరింది. కానీ గడువు ముగిసినా 2010, 2011లో కూడా ఆ సంస్థ తన ఉత్పత్తులతో పాటు ప్రకటనల్లో మిల్కీ బ్యూటీ ఫోటోలను వినియోగించింది. దీంతో ఒప్పందం అయిపోయినా కూడా తన ఫోటోలను ప్రకటనల్లో వాడారని ఆరోపిస్తూ తమన్నా ఇటీవలే మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా తమన్నా పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నా పిటిషన్‌ను హైకోర్ట్‌ తిరస్కరించింది.   

  • ఖాలీ సమయాన్ని ఎక్కువగా పిల్లలతో గడపడానికి ఇష్టపడే నటుల్లో మంచు విష్ణు ఒకరు. పిల్లలను ఆడించడమే కాదు..వారితో కలిసి ఆయన కూడా అల్లరి చేస్తుంటాడు. షూటింగ్‌ సమయాల్లోనూ అవకాశం ఉంటే పిల్లలను సెట్స్‌కి తీసుకెళ్తుంటాడు. అలాగే మోహన్‌ బాబు కూడా తన మనవళ్లు, మనవరాళ్లతో చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. బయట కానీ, సినిమాల్లో కానీ కాస్త గంభీరంగానే ఉండే ఆయన.. పిల్లల దగ్గరకు వచ్చేసరికి కమెడియన్‌గా మారిపోతాడు. అందుకే తాతయ్య అంటే వారికి చాలా ఇష్టం. ఇక అవ్రామ్‌ అయితే తాతయ్యని ఆటపట్టిస్తుంటాడు.  

    తాజాగా ఆయన తాతయ్యకే వార్నింగ్‌ ఇచ్చాడు.  మోహ‌న్ బాబు, విష్ణు ఇంట్లో కూర్చోని మాట్లాడుకుంటుండగా, అవ్రామ్‌ వ‌చ్చి అల్ల‌రి  చేస్తుంటాడు. ఇది చూసిన మోహ‌న్ బాబు ‘కామ్ గా ఉండాలి. అల్ల‌రి చేయొద్దు’ అన‌గా అవ్రామ్‌..‘ హే బాబు’ అంటూ మోహ‌న్‌బాబును క‌ళ్లలోకి క‌ళ్లు పెట్టి చూసి బెదిరిస్తాడు. అంతేకాదు గ్రౌండ్ చేయ్‌, వెళ్లిపో అంటూ కాసేపు  తాతకే వార్నింగ్‌ ఇచ్చాడు. రచ్చ రచ్చ చేసి చివరకు ‘బాయ్‌ బాబు’ అంటూ ఇంట్లో నుంచి వెళ్లి పోయాడు. 

    మనవడి అల్లరి తట్టుకోలేక..చివరకు మోహన్‌ బాబే సైలెంట్‌ అయిపోయాడు. ఈ ఫన్నీ వీడియోని మంచు విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ..‘విలన్‌లను, విమర్శకులను, కఠినమైన పాత్రలను లయన్‌ కింగ్‌ (మోహన్‌బాబు) ఎదుర్కొన్నారు. కానీ, అవ్రామ్‌ మూడు నిమిషాల అల్లరిని అడ్డుకోవడం మాత్రం ఆయన సాధ్యం కాలేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
     

  • అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ఈ మూవీకి మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్‌’ నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

    తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్‌ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 


     

  • లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా మెప్పించింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీని నయనతార సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్‌ సంస్థ, ఎస్‌ ఎస్‌. లలిత్‌కుమార్‌కు చెందిన సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్లపై  నిర్మించారు.

    ఇదిలా ఉండగా.. నయన్, విఘ్నేశ్ శివన్‌ ఓ శానిటరీ నాప్‌కిన్‌ యాడ్‌లో నటించారు. ఈ యాడ్ ప్రమోషన్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో యాడ్ మేనేజర్ చేసిన కామెంట్స్‌ వివాదానికి కారణమయ్యాయి. 'దయచేసి సహకరించండి.. వీళ్లు సాధారణ ప్రజలు కాదు'.. అంటూ అక్కడున్న ఇన్‌ఫ్లూయన్సర్లను సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన ఇన్‌ఫ్లుయెన్సర్లు నయన్- విఘ్నేశ్ జంటకు అధిక ప్రాధాన్యత కల్పించడాన్ని విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  తాజాగా ఈ  వివాదానికి గల కారణంపై విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చారు.

    నిజానికి మేనేజర్ అక్కడ 'మేము సాధారణ ప్రజలం కాదు.. మేము ఇన్‌ఫ్లుయెన్సర్లం' అని చెప్పారని విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వారు ఎడిట్ చేసి పెట్టారని అన్నారు. లైకులు, వ్యూస్‌ కోసం 'మేము' అనే పదాన్ని 'వారు'గా మార్చి వక్రీకరించారని తెలిపారు. ఆ తర్వాత మేము ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించగా.. దానికి ఎక్కువ వ్యూస్‌ వస్తున్నందున ఆ వీడియోను అలాగే ఉంచేలా సహకరించాలని మమ్మల్ని అతను కోరాడని విఘ్నేశ్ వెల్లడించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్‌ పడినట్లైంది.

  • కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ నిలిచిన చిత్రం 'లబ్బర్‌ పందు'.  2024లో సెప్టెంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రం విజయ్‌ గోట్‌ మూవీతో పోటీ పడింది. పెద్దగా ఫేమ్‌ లేని నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. 2024 ఉత్తమ చిత్రాల జాబితాలో 'లబ్బర్‌ పందు' కూడా చేరిపోయింది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్‌తో నిండిన గ్రామీణ క్రికెట్ డ్రామాగా ఈ మూవీని తమిళరాసన్ పంచముత్తు తెరకెక్కించాడు.

    తాజాగా లబ్బర్‌ పందు మూవీని వదులుకోవడంపై స్టార్‌ నటుడు ఎస్‌జే సూర్య స్పందించారు. తనకు మొదట ఆఫర్ చేసిన పాత్రను తిరస్కరించడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. బుధవారం జరిగిన ఎల్ఐకే సక్సెస్ మీట్‌లో సూర్య మాట్లాడారు. ఓ సారి దర్శకుడు లబ్బర్‌ పందు స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించారని తెలిపారు. నా ఇమేజ్‌కు సరిపోయేలా కొన్ని మార్పులు చేయమని నేను అతన్ని అడిగా.. ఆయన దానికి పూర్తిగా అంగీకరించారు. కానీ ఆ మార్పులు పెరుగుతూ పోవడంతో.. నేనే మళ్లీ ఆలోచించానని అన్నారు. నా కోసం మీరు మీ మొత్తం కథను మారుస్తూ ఉంటే.. ఒక డైరెక్టర్‌గా మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతారని అతనితో చెప్పానని వెల్లడించారు. ‍అందుకే నేను ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్‌కు వివరించానని అన్నారు. కాగా.. ఈ మూవీలో అట్టకత్తి దినేష్ పోషించిన ఆ పాత్రను మొదట సూర్యకు ఆఫర్ చేశారు డైరెక్టర్ తమిళరాసన్.

    ఇటీవలే ఎస్‌జే సూర్య ఎల్‌ఐకే చిత్రంలో కనిపించారు. ఈ మూవీకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఈ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఎస్‌జే సూర్య.. ప్రీతి అశ్రాని సరసన నటిస్తున్నారు. 'కిల్లర్' చిత్రంతో దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో కూడా భాగమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు. 'కిల్లర్'తో పాటు, కార్తితో 'సర్దార్ 2', 'బ్రో కోడ్' చిత్రాలు చేస్తున్నారు.

     

     

  • ‘‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’ మూవీకి నాగశౌర్య మా ఫస్ట్‌ చాయిస్‌. ఆయన కథ వినగానే ఓకే అన్నారు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తన నటనతో శౌర్యగారు అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తారు. తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తారు’’ అని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి తెలిపారు. నాగశౌర్య, విధి జోడీగా రామ్‌ దేశినా (రమేష్‌) దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. 

    ఈ సందర్భంగా శ్రీనివాసరావు చింతలపూడి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఆది సాయికుమార్‌ నటించిన ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. సోలో నిర్మాతగా ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’ నా తొలి సినిమా. నాగశౌర్యని ఇప్పటివరకు లవర్‌ బాయ్‌గా చూశారు. ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’లో మాత్రం పూర్తి యాక్షన్‌తో చూస్తారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ మరో స్థాయిలో ఉంటుంది. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. 

    రసూల్‌గారి విజువల్స్, హ్యారిస్‌ జయరాజ్‌గారి సంగీతం మా మూవీకి ప్లస్‌. దాదాపు 400లకు పైగా స్క్రీన్లలో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాలో కూడా రిలీజ్‌ చేస్తున్నాం. మా బ్యానర్‌లో జూన్‌లో ఒక సినిమా స్టార్ట్‌ కాబోతోంది. అలాగే ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది’’ అని చెప్పారు.  

  • టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.

    మధునాయక్‌ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్‌ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.

    మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది.  నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.

     

  • సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సాయి పల్లవి బాలీవుడ్‌లో ఎంట్రీ సినిమా  ఏక్‌ దిన్‌ (ఒక రోజు).. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్‌ విడుదలైంది.  ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్నాడు. సునీల్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న తెలుగులో కూడా విడుదల కానుంది. ఆమిర్‌ ఖాన్‌, మన్సూర్‌ ఖాన్‌, అపర్ణ పురోహిత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

    తాజాగా విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. సాయి పల్లవి ఒక అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న యువతిగా కనిపించనుంది. అయితే,   ప్రేమించిన   అమెతో ఒక్క‌రోజు అయిన సంతోషంగా సమయం గ‌డ‌పాల‌ని హీరో జునైద్ అనుకుంటాడు. సాయి పల్లవి హిందీలో నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తోంది.
     

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో జోరు కనబరుస్తోంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్‌), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారం చేయడంతో 196 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. 

    ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఒక ద‌శ‌లో డికాక్, న‌మ‌న్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియ‌న్స్ 200 ప్ల‌స్ ప‌రుగులు చేస్తుంద‌నిపించింది. 

    కానీ న‌మ‌న్ ధిర్ ఔటైన త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు ప్రబ్‌సిమ్రన్‌, శ్రేయస్ అయ్యర్  పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. 

    పంజాబ్ దూకుడు ముందు ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా సహా అందరూ దారాళంగా పరుగు లిచ్చుకున్నారు. సీజన్‌లో పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతోంది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. గురువారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా బౌండరీ లైన్ వ‌ద్ద అయ్యర్ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌ను క‌ళ్లారా చూసిన‌ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆశ్చ‌ర్య‌పోయారు. 

    మార్కో యాన్సెన్ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడగా.. సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్‌లెట్ ఏ తప్పిదం చేయకుండా అందుకున్నాడు. 

    ఎడమవైపు గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. అప్పటి వరకు అరిచిన ముంబై ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో మౌనం వహించారు. 

    దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ అయ్యర్ కోరాడు. అయితే అయ్య‌ర్ ప‌ట్టిన క్యాచ్‌కు డ‌గౌట్‌లో ఉన్న రోహిత్‌, సూర్య‌కుమార్‌లు ఫిదా అయ్యారు. వాట్ ఏ క్యాచ్ అని రోహిత్ సూర్య‌తో చెబుతున్న‌ట్లు కెమెరాల్లో క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ సీజ‌న్‌లో డికాక్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, ఆడిన తొలి మ్యాచ్‌లోనే శ‌త‌క్కొట్టడం విశేషం. ఈ నేప‌థ్యంలో డికాక్ ఒక్క సెంచ‌రీతో ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    • టీ20 క్రికెట్‌లో డికాక్‌కు ఇది 9వ సెంచ‌రీ. టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి, రిలీ రోసౌ, సాహిబ్జ‌దా ఫ‌ర్హాన్‌లు కూడా 9 శ‌త‌కాల‌తో నాలుగో స్థానంలోనే ఉన్నారు. ఇక విండీస్ వీరుడు క్రిస్ గేల్ 22 శ‌త‌కాల‌తో తొలి స్థానంలో ఉండ‌గా, బాబ‌ర్ ఆజ‌మ్ (11), డేవిడ్ వార్న‌ర్ (10) శ‌త‌కాల‌తో రెండు, మూడు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

    • ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జ‌ట్లు త‌ర‌ఫున సెంచ‌రీలు బాదిన మూడో బ్యాట‌ర్‌గా డికాక్ నిలిచాడు. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ త‌ర‌ఫున ఆర్సీబీతో మ్యాచ్‌లో 108 ప‌రుగులు, 2022లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ర‌ఫున కేకేఆర్‌తో మ్యాచ్‌లో 140 నాటౌట్, తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో అజేయ శ‌త‌కంతో మెరిశాడు. గ‌తంలో సంజూ శాంస‌న్ (ఢిల్లీ, రాజ‌స్తాన్‌, సీఎస్‌కే), కేఎల్ రాహుల్ (పంజాబ్‌, ఢిల్లీ, ల‌క్నో) ఈ ఫీట్ సాధించారు. మ‌రో విశేష‌మేమిటంటే ఈ ముగ్గురు కూడా వికెట్ కీప‌ర్లే కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

    • ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున పంజాబ్‌పై సెంచ‌రీ సాధించిన రెండో బ్యాట‌ర్‌గా డికాక్ నిలిచాడు. 2014లో లెండిల్ సిమ్మ‌ న్స్ (100 నాటౌట్‌) పంజాబ్‌పై తొలి సెంచ‌రీ సాధించాడు.

    • ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు న‌మోదు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో డికాక్ చోటు సంపాదించాడు. స‌న‌త్ జ‌య‌సూర్య (114 నాటౌట్‌) తొలి స్థానంలో ఉంటే డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శ‌ర్మ (109 నాటౌట్‌, 105 నాటౌట్‌) ముంబై త‌ర‌పున‌ రెండుసార్లు త‌న బెస్ట్ స్కోర్లు న‌మోదు చేశాడు.

    • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో డికాక్‌ది రెండో సెంచ‌రీ. సీఎస్‌కే ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ఈ సీజ‌న్‌లో తొలి సెంచ‌రీ సాధించాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముం​బై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు.పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

    చదవండి: ఐపీఎల్‌లో సెంచ‌రీ కొట్టిన అర్ష్‌దీప్‌

  • ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. అయితే అర్ష్‌దీప్ సెంచ‌రీ న‌మోదు చేసింది బ్యాటింగ్‌లో అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఓపెన‌ర్ రికెల్‌ట‌న్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అర్ష్‌దీప్‌ ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. 

    ఐపీఎల్‌లో వంద వికెట్లు సాధించి ఐదో లెఫ్టార్మ్ పేస‌ర్‌గా, నాలుగో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇంత‌క‌ముందు ట్రెంట్ బౌల్ట్ (144 వికెట్లు), ఉనాద్క‌ట్ (114 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), జ‌హీర్ ఖాన్ (102 వికెట్లు) ముందున్నారు. ఇక ప‌వ‌ర్ ప్లేలో అర్ష్‌దీప్ వికెట్ తీసుకోవ‌డం 11 ఇన్నింగ్స్‌ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూరం కావ‌డంతో అత‌డి స్థానంలో క్వింట‌న్ డికాక్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. డికాక్‌తో క‌లిసి రియాల్ రికెల్‌ట‌న్ ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 

    గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్ద‌రు సౌతాఫ్రికాకు చెందిన వారే కావ‌డం విశేషం. ఐపీఎల్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతుంటాయి. ముంబై ఇండియన్స్‌ తరఫున ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు ఓపెనింగ్‌ చేయడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్ మార్కో యాన్సెన్ వేశాడు. ఈ స‌మ‌యంలో స్ట్రైకింగ్‌లో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌తో పాటు బౌలర్ కూడా సౌతాఫ్రికాకు చెందిన వారే ఉండ‌డం మ‌రో గ‌మ‌నించద‌గ్గ అంశం. 

  • షోయ‌బ్ అక్త‌ర్‌.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరిగా పేరు గాంచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బాల్(161.3 కి.మీ/గం) రికార్డు ఇప్పటికే అక్తర్ పేరిటే ఉంది. తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించిన అక్తర్‌.. 2011లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. 

    తాజాగా ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌పై భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. అక్త‌ర్‌కు బౌలింగ్ పట్ల ఉన్న అంకితభావాన్ని మునాఫ్ పటేల్ కొనియాడాడు. "షోయ‌బ్ అక్త‌ర్‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఇవ్వాలి. దాదాపు 15 ఏళ్ల పాటు ఆసియా లాంటి పరిస్థితుల్లో 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అత‌డి ప‌ట్టుద‌ల‌కు హ్యాట్సాఫ్‌. వేగంగా బౌలింగ్ చేయడం వల్ల అక్తర్ రెండు మోకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    రిటైర్మెంట్ తర్వాత అత‌డు స‌రిగ్గా న‌డ‌వ‌డానికి నాలుగైదు సంవత్సరాలు ప‌ట్టింది. అక్త‌ర్ చాలా మొండోడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే పిచ్చి. అలాంటి పిచ్చి ఉన్నవాడు మాత్ర‌మే ఇలాంటి అద్భుతాలు చేయ‌గ‌ల‌డు"అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మునాఫ్ ప‌టేల్ పేర్కొన్నాడు.

    అక్త‌ర్ చివ‌ర‌గా 2011 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాడు.  పాక్‌ తరపున 46 టెస్టులు ఆడి 178 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా అతడి పేరిట 247 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. కాగా షోయబ్‌ తన కెరీర్‌లో నిలకడగా ఒకే వేగంతో బౌలింగ్‌ చేసేందుకు ఎన్నో సవాళ్లును ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌లకు ముందు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు తీసుకునేవాడినని అతడే చాలా సార్లు చెప్పాడు.
    చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధించి బిగ్ న్యూస్‌!
     

  • ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీజన్‌లో పంజాబ్‌కు ఇది నాలుగో విజయం. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ (80 నాటౌట్‌), శ్రేయస్ అయ్యర్ (65) వీరవిహారంతో 196 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ముంబై బౌలర్లలో గజన్‌ఫర్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. 

    ప్రబ్‌సిమ్రన్‌ హాఫ్‌ సెంచరీ
    ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం దిశగా సాగుతుంది. ఓపెనర్‌ ప్రబ్‌సిమ్రన్‌ అర్థసెంచరీతో చెలరేగగా, అయ్యర్‌ (34) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పంజాబ్‌ 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

    • ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ కింగ్స్‌ 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. శ్రేయస్‌ (12), ప్రబ్‌సిమ్రన్‌ (16) క్రీజులో ఉన్నారు. అంతకముందు కూపర్‌ కన్నోలి (17) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.

    తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్‌
    197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్ష్ ఆర్య గజన్‌ఫర్ బౌలింగ్‌లో దీపక్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. అంతకముందు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో పంజాబ్ 21 పరుగులు పిండుకోవడం విశేషం.

    పంజాబ్ టార్గెట్ 196 ప‌రుగులు
    పంజాబ్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల నష్టానికి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో అద‌ర‌గొట్ట‌గా.. న‌మ‌న్ ధిర్ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ఒక ద‌శ‌లో డికాక్, న‌మ‌న్ ధిర్‌ల జోరుతో ముంబై ఇండియ‌న్స్ 200 ప్ల‌స్ ప‌రుగులు చేస్తుంద‌నిపించింది. కానీ న‌మ‌న్ ధిర్ ఔటైన త‌ర్వాత వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ముంబై 195 ప‌రుగుల వ‌ద్దే ఆగిపోయింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయ‌గా, యాన్సెన్‌, శ‌శాంక్ సింగ్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

    బార్ట్‌లెట్ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. పాండ్యా (14)ఔట్‌
    14 ప‌రుగులు చేసిన పాండ్యా మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో గ్జేవియ‌ర్ బార్ట్‌లెట్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. 

    డికాక్ సెంచ‌రీ
    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ సెంచ‌రీ బాదాడు. 53 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకున్న డికాక్‌కు ఐపీఎల్‌లో ఇది మూడో సెంచ‌రీ. ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

    నమన్‌ ధిర్‌ ఔట్‌.. మూడో వికెట్‌ డౌన్‌
    పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ మూడో వికెట్ కోల్పోయింది. అర్థ‌సెంచ‌రీ సాధించిన న‌మ‌న్ ధిర్ శ‌శాంక్ సింగ్ బౌలింగ్‌లో బార్ట్‌లెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ముంబై 15 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. డికాక్ (82), పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.

    7 ఓవ‌ర్లలో ముంబై 67/2
    ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ముంబై ఇండియ‌న్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది. న‌మ‌న్ ధిర్ (34), డికాక్ (25) క్రీజులో ఉన్నారు.

    సూర్య‌కుమార్ గోల్డెన్ డ‌క్‌.. 
    పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష‌దీప్ సింగ్ వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సూర్య‌కుమార్ యాద‌వ్‌ను గోల్డెన్ డ‌క్‌గా పెవిలియ‌న్ చేర్చిన‌ అర్ష‌దీప్ సింగ్ అంత‌క‌ముందు రియాన్ రికెల్‌ట‌న్‌ను ఔట్ చేశాడు. ప్రస్తుతం ముంబై ఇండియ‌న్స్ 3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 15 ప‌రుగులు చేసింది.

    బౌలింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌
    ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్‌ ఎంచుకుంది. ముంబై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మ, మిచెల్‌ సాంట్నర్‌ స్థానం డికాక్‌, మయాంక్‌ రావత్‌ తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

    ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 35 సార్లు త‌ల‌ప‌డగా.. ముంబై ఇండియ‌న్స్ 17 సార్లు, పంజాబ్ కింగ్స్ 17 సార్లు నెగ్గాయి. ఒక మ్యాచ్‌లో ఫ‌లితం రాలేదు. ఇక వాంఖ‌డే స్టేడియంలో మాత్రం పంజాబ్ కింగ్స్ రికార్డు మెరుగ్గా ఉంది. వాంఖ‌డేలో పంజాబ్ ముంబై పై 5 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో ముంబై మూడింటింలో, పంజాబ్‌ రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి.

    ముంబై ఇండియన్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా( కెప్టెన్‌), రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్‌ బుమ్రా.

    పంజాబ్ కింగ్స్ తుదిజట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌ కీపర్‌), ప్రియాన్ష్‌ ఆర్య, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), కూపర్ కొన్నోలీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరంభంలో తడబడినప్పటికీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన సీఎస్‌కే గాడిన పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌), సీఎస్‌కే మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. 

    అయితే ఈ మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగుతాడా లేదా అనేది స్పష​త రాలేదు. కానీ ధోని మాత్రం జ‌ట్టుతో క‌లిసి హైద‌రాబాద్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంత‌క‌ముందు చెన్నై నుంచి హైదరాబాద్‌కు బ‌యల్దేరిన సీఎస్‌కే జట్టు ఫొటోలు, ధోని వీడియోనూ చెన్నై సూప‌ర్‌కింగ్స్ ప్ర‌త్యేకంగా పంచుకుంది. ‘మేము వస్తున్నాం, హైదరాబాద్‌’ అని తెలుగులో క్యాప్షన్‌ జత చేసింది. 

    ఆ వీడియోలో ధోని సింహంలా న‌డుచుకుంటూ రాగా.. ధోని ముందు, వెనుక సెక్యూరిటీ బందోబ‌స్తు గ‌ట్టిగా క‌నిపిస్తోంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల‌న్నీ ఇప్ప‌టికే అమ్ముడ‌య్యాయి. కేవ‌లం ధోనిని చూసేందుకే అభిమానులు భారీగా త‌ర‌లిరానున్నారు. మ్యాచ్‌లో ఆడినా ఆడ‌క‌పోయినా త‌లా ఒక్క‌సారి మైదానంలో ద‌ర్శ‌నమిస్తే చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో మాత్రం ధోని బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు అధికారికంగా స‌మాచారం అందింది. 

    ఒక‌వేళ ధోని జ‌ట్టులోకి వ‌స్తే మాత్రం స‌ర్ఫ‌రాజ్‌ఖాన్ డ‌గౌట్‌కు ప‌రిమితం కావాల్సి ఉంటుంది. ఇక సీఎస్‌కే ఈ సీజ‌న్‌లో 5 మ్యాచ్‌ల్లో 2 విజ‌యాలు, మూడు ఓట‌ముల‌తో 8వ స్థానంలో ఉంది. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా 5 మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు, మూడు ఓట‌ముల‌తో ఉన్న‌ప్ప‌టికీ, మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతుంది.

    చదవండి: ఎంసీఏ కీలక నిర్ణయం.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి!

  • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌, ఇంగ్లండ్ వెట‌ర‌న్ డేవిడ్ పేన్ చీల‌మండ గాయం కార‌ణంగా ఐపీఎల్‌-2026 సీజ‌న్ నుంచి వైదొలిగాడు. ఈ విష‌యాన్ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ ఎక్స్ వేదిక‌గా ధ్రువీక‌రించింది. "డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. 

    అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాము"ఎస్‌ఆర్‌హెచ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. వాస్తవానికి ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు జాక్ ఎడ్వర్డ్స్ గాయపడడంతో.. అతడి స్ధానంలో పేన్‌తో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 

    ఆరెంజ్ ఆర్మీ తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పేన్‌, 14 ఎకానమీ రేటుతో 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ కూడా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి పేన్ చేరాడు. మరోవైపు వెన్ను నొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. 

    క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో కమ్మిన్స్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. కమ్మిన్స్ కమిన్స్ ఏప్రిల్ 17న హైదరాబాద్ చేరుకుంటాడు.  ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్  తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

  • ముంబై క్రికెట్ అసోసియేష‌న్ (ఎంసీఏ) కీలక నిర్ణ‌యం తీసుకుంది. 2026-27 సీజ‌న్‌కు సంబంధించి ముంబై జ‌ట్టుకు ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక రాష్ట్ర అసోసియేష‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇదే తొలిసారి. 

    డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ కూడా జాతీయ జ‌ట్టుకు లేదా ఐపీఎల్‌లో అవకాశాలు రాని ఆటగాళ్ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా కాంట్రాక్టులు అమ‌లు చేయ‌నున్న‌ట్లు గ‌తంలోనే ఎంసీఏ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తాజాగా ప్ర‌తిభ ఉన్న ఆట‌గాళ్ల‌కు ప్రోత్సాహ‌కాలు అందించ‌డంలో ముంబై క్రికెట్ అసోసియేష‌న్ అడుగు ముందుకు వేసింది. 

    నివేదిక ప్ర‌కారం ముంబై క్రికెట్ అసోసియేష‌న్ జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌ను మూడు కేటగిరీలు (గ్రేడ్‌-ఏ, గ్రేడ్‌-బి, గ్రేడ్‌-సి) గా విభ‌జించ‌నుంది. గ్రేడ్‌-ఏ కేట‌గిరీ జాబితాలో ఉండే ఆట‌గాళ్లు రూ. 12 ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్షలు అందుకోనున్నారు. గ్రేడ్‌-బి కేట‌గిరి కింద ఆట‌గాళ్లు రూ. 8 నుంచి 12 ల‌క్ష‌ల వ‌ర‌కు, గ్రేడ్‌-సిలో ఉండే ఆట‌గాళ్లు రూ. 8 ల‌క్ష‌లు వార్షిక ఫీజుగా అందుకోనున్నారు. 

    ఎంసీఏ అధ్య‌క్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ.. ‘ఎంసీఏ ముందే హామీ ఇచ్చిన‌ట్లుగా ఆట‌గాళ్ల‌కు వార్షిక కాంట్రాక్ట్‌ను అమ‌ల్లోకి తీసుకురానున్నాం. ఇటీవ‌ల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దీనిపై చాలా ఆలోచించాము. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడే ఆట‌గాళ్లంద‌రికీ ఐపీఎల్‌లో ఆడే అవ‌కాశం రాదు. అందుకే ముంబై త‌ర‌ఫున అన్ని ఫార్మాట్ల‌లో ఆడుతున్న ఆట‌గాళ్ల‌కు వార్షిక కాంట్రాక్ట్‌ను అందివ్వాల‌ని నిర్ణ‌యించాం. ఇది ఆట‌గాళ్ల‌కు ఆర్థికంగానూ ఉప‌యోగ‌ప‌డనుంది’ అని చెప్పుకొచ్చారు.

    నిబంధ‌న‌లు..
    అయితే ముంబై క్రికెట్ అసోసియేష‌న్ అమ‌లు చేయ‌నున్న వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో ఆట‌గాళ్లు చోటు ద‌క్కించుకోవ‌డంలో కొన్ని నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది.

    • ఆట‌గాళ్లు త‌ప్ప‌నిస‌రిగా ఎంసీఏలో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. ఫిట్‌నెస్ ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.

    • గ‌త రెండు సీజ‌న్ల‌లో ఐపీఎల్‌లో పాల్గొన‌డం లేదా భారత జ‌ట్టుకు ఆడిన వారికి ఎంసీఏ కాంట్రాక్టులో చోటు ఉండ‌దు. ఆట‌గాళ్ల‌కు కాంట్రాక్ట్ ఇవ్వ‌డానికి ముందు సెలెక్షన్ క‌మిటీ వారిని సిఫార్సు చేయ‌డానికి అవ‌కాశ‌ముంది.

    • రంజీ ట్రోఫీలో ఆడే ఆట‌గాళ్ల‌కు  భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) మ్యాచ్ ఫీజులు చెల్లిస్తోంది. రంజీ మ్యాచ్ ఆడే ఆట‌గాళ్ల‌కు రోజుకు రూ. 40 వేల నుంచి 60 వేలు చొప్పున బోర్డు చెల్లిస్తుంది. తాజాగా ఎంసీఏ కూడా అంతే మొత్తం ఫీజు చెల్లించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ముంబై ఆట‌గాళ్లు తాము ఆడే ప్ర‌తీ రంజీ మ్యాచ్‌కు బీసీసీఐతో పాటు ఎంసీఏ పారితోషికం కూడా అందుకోనున్నారు. తాజాగా తీసుకొచ్చిన కాంట్రాక్టు విధానం ఆట‌గాళ్ల క‌ష్టానికి ల‌భించిన ప్ర‌తిఫ‌లం అని చెప్పొచ్చు.

  • ఐపీఎల్ 2026 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వైదొలగనున్నాడా? అంటే అవునానే అంటున్నారు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.  ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో  విలవిల్లాడాడు. 

    వెంటనే ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. మళ్లీ ఆఖరిలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికి ఆసౌకర్యంగా కన్పించాడు. అతడు మొత్తంగా ఆరు బంతుల్లో ఒక్క మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ రాలేదు. పంత్ స్దానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఐపీఎల్-2026 సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు రిష‌బ్ పంత్ అందుబాటులో ఉండేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ల‌క్నో జ‌ట్టు చాలా బ‌ల‌హీనంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది.   కేవలం బౌలింగ్ మాత్రమే బాగుంది. ఈ సీజ‌న్‌లో ల‌క్నో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా ప్ర‌త్య‌ర్ధి ముందు 200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచ‌లేక‌పోయింది. 

    మార్‌క్ర‌మ్ ఒక చెత్త క్రికెట‌ర్‌. మిచెల్ మార్ష్‌, నికోల‌స్ పూర‌న్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలి. ఈ ముగ్గురు భారీ స్కోర్‌లు సాధిస్తార‌ని వేచి చూడడం ముందు ఆపండి. వారి స్ధానంలో కొత్త ఆట‌గాళ్లకు అవ‌కాశ‌మివ్వండి. ఏదేమైన‌ప్ప‌టికి వారి బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదు శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో ఇప్ప‌టివ‌ర‌కు 5 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలుపొందింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ల‌క్నో ఏడో స్ధానంలో కొన‌సాగుతోంది.
    చదవండి: వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధించి బిగ్ న్యూస్‌!
     

  • రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనెజర్ రోమీ భిందర్ డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడిన వ్యవహారంపై విచారణ ఓ కొలుక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వైద్యపరమైన కారణాల వల్లే డగౌట్‌లో ఫోన్ చూడాల్సి వ‌చ్చింద‌ని భిందర్ బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. అదేవిధంగా మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో రోమీ త‌న‌ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్‌, మేసెజ్‌లు గానీ చేయ‌లేద‌ని ఏసీయూ నిర్ధారించినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

    ఏదేమైన‌ప్ప‌టికి రోమీ భిందర్ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించినందుకు గాను బీసీసీఐ జ‌రిమానా విధించేందుకు సిద్ద‌మైన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా రోమీ ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీని కేవలం హెచ్చరించి వదిలేయాల‌ని బోర్డు నిర్ణ‌యించుకున్న‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

    అస‌లేమి జ‌రిగిందంటే?
    ఈ ఏడాది సీజ‌న్‌లో భాగంగా ఏప్రిల్ 10న గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో రోమీ భిందర్ డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కారు. ఆ సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉండి ఫోన్ వైపు చూడటం వివాదాస్పదమైంది. 

    బీసీసీఐ  నిబంధనల ప్రకారం..మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. దీంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అత‌డికి నోటీసులు జారీచేసింది. నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్‌ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల‌ని ఏసీయూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్ర‌మంలోనే రోమీ బీసీసీఐ నోటీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.
    చదవండి: విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వ‌ల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్‌

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ జోరును కొన‌సాగిస్తోంది. బుధ‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో బెంగ‌ళూరు జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంది.

    ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండ్‌షో తో అద‌ర‌గొట్టింది. తొలుత బౌలింగ్‌లో ల‌క్నోను 146 ప‌రుగుల‌కే క‌ట్టడి చేసిన ఆర్సీబీ.. అనంత‌రం ఆ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కేవ‌లం 15.1 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేసింది. ఇక ఈ అద్భుత విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ కెప్టెన్ ర‌జత్ పాటిదార్ స్పందించాడు. ల‌క్నోను నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితం చేసిన త‌మ బౌల‌ర్ల‌పై పాటిదార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

    "ఈ మ్యాచ్‌లో మా బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవ‌డం మాకు క‌లిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌల‌ర్లు పిచ్ కండీష‌న్స్‌ను ఉప‌యోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్‌గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. 

    అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్‌లలో భువనేశ్వర్, హాజిల్‌వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మ‌రింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది. 

    ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్‌లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్ర‌స్తుతానికి టైటిల్ గురించి ఆలోచించ‌డం లేద‌న్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్‌పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.
    చదవండి: IPL 2026: సీఎస్‌కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు

Family

  • దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, తీవ్రమైన వేసవికాలంతో పాటు అధిక తేమ కూడా తోడవుతోంది. వాస్తవానికి, రాబోయే కొన్నేళ్లు  దేశ చరిత్రలోనే అత్యంత వేడిగా ఉండే కాలంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది, దీనివల్ల ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిలో భాగంగా, దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు వడగాలుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో సరైన హైడ్రేషన్‌ ఉత్పత్తులపై అవగాహన అవసరం అంటున్నారు వైద్య నిపుణులు.

    ఎలక్ట్రోలైట్‌ల లోపం కీలకం...
    అనారోగ్యం లేదా విరేచనాల సమయంలోనూ, అలాగే రోజువారీ సంరక్షణలోనూ, ఉన్నతమైన హైడ్రేషన్‌ ఉత్పత్తులతో శరీరానికి తగినంత నీరు అందించడంపై అవగాహనను పెరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో, డీహైడ్రేషన్ కు ఇప్పటికీ మజ్జిగ లేదా నిమ్మరసం వంటి ఇంటి చికిత్సలే మొదటి పరిష్కారంగా ఉన్నాయి. ఒక వ్యక్తి డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, వారు కేవలం ద్రవాలను మాత్రమే కాకుండా సోడియం, క్లోరైడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతారు. నిజానికి ఎలక్ట్రోలైట్‌లు శరీరంలోని సంకేత అణువులు. అవి నరాల ద్వారా ప్రయాణించి, కదలికలకు సహాయపడి, వ్యక్తులు చురుకుగా ఉండేలా చేస్తాయి అని అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన వైద్యులు  డా. అశుతోష్‌. మరి అలాంటి ఎలక్ట్రోలైట్‌ల లోపం కండరాల కదలికను తగ్గించి, అలసట  నీరసానికి దారితీస్తుంది. మరి వీటిని పునరుద్ధరించుకోవడానికి ఏం చేయాలి?

    స్పోర్ట్స్‌ డ్రింక్స్, ఎనర్జీ పానీయాలు, గ్లూకోజ్‌ పౌడర్లు  వివిధ ఎలక్ట్రోలైట్‌ ఉత్పత్తులు మార్కెట్లోకి ప్రవేశించడంతో, హైడ్రేషన్‌  ఎలక్ట్రోలైట్‌ విభాగం పోటాపోటీగా మారింది.  పెరుగుతున్న ఆరోగ్య స్పృహ  భారతదేశ వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా హైడ్రేషన్‌ విభాగం విపరీతమైన వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో, వినియోగదారులు అనారోగ్య సమస్యలకు అతీతంగా, శక్తి క్షీణించినప్పుడు లేదా అలసిపోయినప్పుడు వేగంగా కోలుకోవడానికి అనేక రకాల ఆరోగ్యకరమైన హైడ్రేషన్‌ సొల్యూషన్లను కోరుకుంటున్నారు. డీహైడ్రేషన్‌ ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతున్నందున,  విరేచనాలు  రోజువారీ హైడ్రేషన్‌ అవసరాలను తీర్చడానికి కెన్ వ్యూ ఓఆర్‌ఎస్‌ఎల్, ఇఆర్‌జెఎల్‌ వంటి బ్రాండ్స్‌ అందుబాటులో ఉన్నాయి.  వడదెబ్బ, కండరాల నొప్పులు మొదలైన రోజువారీ సందర్భాలలో నీరసంగా అనిపించినప్పుడు లేదా అలసట, బలహీనత కారణంగా నిస్సత్తువగా ఉన్నప్పుడు ఇవి  సహాయకారిగా పనిచేస్తున్నాయి. రోజువారీ హైడ్రేషన్‌ కోసం రూపొందిన ఎలక్ట్రోలైట్‌ డ్రింక్, మూడు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను (సోడియం, పొటాషియం, క్లోరైడ్‌)  విటమిన్‌ సి లను  వేగవంతమైన హైడ్రేషన్ ను అందిస్తూనే, పండ్ల రసాల తరహాలో రుచికరంగా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.అయితే 

     సరైన సందర్భాలకు సరైన హైడ్రేషన్‌ ద్రావణాలను ఎంచుకోవడంపై అవగాహన కల్పించడానికి కల్పించాలి. ఉదాహరణకు, విరేచనాల కోసం డబ్లు్యహెచ్‌ఓ  ఆమోదించిన ఓఆర్‌ఎస్‌  ద్రావణాలు రోజువారీ హైడ్రేషన్‌ కోసం ఎలక్ట్రోలైట్‌ ద్రావణాలు వినియోగించాలి. ఇలాంటి అవగాహన పెంచేందుకు తెలుగు రాష్ట్రాలలో వైద్య నిపుణులు  ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కెన్ వ్యూ బ్రాండ్‌ కలిసి పనిచేస్తోంది అని చెప్పారు సంస్థ కు చెందిన ప్రశాంత్‌ షిండే.

    ఏడాది పొడవునా...డీహైడ్రేషన్‌
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంపై పెరిగిన అవగాహన మహమ్మారి అనంతర ఆరోగ్యం పై దృష్టి సారించడం వంటి అంశాలన్నీ కలిసి, క్రియాశీల నివారణ సంరక్షణ వైపు మార్పును వేగవంతం చేశాయి. చాలా మంది ప్రతిరోజూ తగినంత నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకర అలవాటుగా  పరిగణిస్తున్నారు. అయితే నిలకడ లేని వాతావరణ పరిస్థితులతో పాటు  తీరికలేని జీవనశైలిని గడుపుతున్నందున, డీహైడ్రేషన్‌ కేవలం వేసవి కాలానికే పరిమితం కావడం లేదు. ఎండలో , ఏసీ ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు, అలాగే జ్వరం, జలుబు, దగ్గు వంటి  అనారోగ్యాల సమయంలో కూడా సంభవించవచ్చు.   వడదెబ్బ లేదా నీరసం, బలహీనత కారణంగా నిస్సత్తువగా అనిపించినప్పుడు, రోజువారీ సందర్భాలలో ఎలక్ట్రోలైట్లు  నీరు తగ్గిపోయినట్లు అనిపించినప్పుడు, వాటిని తిరిగి నింపడానికి ఇఆర్‌జెఎల్‌ వంటివి సహాయపడుతుందన్నాయి.

    డీహైడ్రేషన్‌ , పిల్లలు, వృద్ధులు  శారీరకంగా శ్రమతో కూడిన జీవనశైలి కలిగినవారు ఎక్కువ సమయం ఆరుబయట గడిపేవారితో సహా కొన్ని వర్గాలు డీహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతాయి. చిన్న పిల్లలు తమ దాహాన్ని సరిగ్గా చెప్పలేరు, దీనివల్ల డీహైడ్రేషన్‌ కు సులువుగా లోనవుతారు.  వృద్ధులలో  దాహానికి గురి చేసే యంత్రాంగం బలహీనంగా ఉంటుంది, వారు అనారోగ్యం  వేడి సంబంధిత డీహైడ్రేషన్‌ రెండింటికీ గురయ్యే అవకాశం ఉంది. మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు డీహైడ్రేషన్ కు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది వారి డీహైడ్రేషన్ ను జాగ్రత్తగా పరిష్కరించడం అవసరం. ఇలాంటి వినియోగదారుల సమూహాలకు, కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి నీటితో పాటు తగినంత ఎలక్ట్రోలైట్లను తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  అతిసారం అనేది ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య, ఇది చిన్నపిల్లల మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ  సిఫార్సు చేసిన ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్‌ అతిసారం చికిత్సలో ఉపకరిస్తుంది.

    అవగాహన కార్యక్రమాలు... నిర్వహిస్తున్నాం 
    డీహైడ్రేషన్‌ గురించి అవగాహన చాలా తక్కువగా ఉంది. కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి నీరు తాగితే సరిపోతుందని  తరచుగా నమ్ముతారు. అయితే, శరీరంపై డీహైడ్రేషన్‌  మొత్తం శారీరక  విధులపై ప్రభావం, ఎలక్ట్రోలైట్‌ పానీయాలు పోషించే కీలక పాత్రల గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. మా ప్రచారాల ద్వారా  నీరు తాగే అలవాట్లను సరిదిద్దడం, దేశంలో డీహైడ్రేషన్  ఒక కీలకమైన ప్రజారోగ్య సమస్యగా అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నాం –ప్రశాంత్‌ షిండె, కెన్ వ్యూ

  • ‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...

    శివుడే శంకరులుగా...
    హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.

    అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్ర
    శంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.

    ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలు
    బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు. 

    ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా? 

    – డా. కందాళ సత్యనారాయణ మూర్తి

  • మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పుటి కట్టుబాట్లను దాటి మానవు లందరికీ భగవంతుని చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. శ్రీ మహావిష్ణువు శేషపానుపే రామానుజులుగా ఈ భూమిపై అవతరించి వెయ్యేళ్లు దాటింది. ఈ నెల 22న రామానుజ జయంతి. ఈ సందర్భంగా రామానుజులవారి జీవిత విశేషాలు...

    రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరు అనే ఉరిలో కలియుగం మొదలైన 4118 అంటే సామాన్యశకంలోని 1016 వ సంవత్సరంలో.. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో ఆసూరి కేశవ సోమయాజి, కాంతిమతి అనే పుణ్యదంపతుల నోముల పంటగా జన్మించారు..

    గురువుకే గురువు 
    శ్రీరామానుజాచార్యులవారు 16 సంవత్సరాల వరకూ శ్రీపెరంబుదూరులో, ఆ తర్వాత 8 ఏళ్లపాటు తిరుప్పుట్‌ కుళిలోనూ, పదేళ్లపాటు కంచిలో వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. రామానుజులవారి ప్రజ్ఞ గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపుగా మారింది. వారిని చంపడానికి గురుశిష్యులంతా పన్నాగం పన్నారు. సాక్షాత్తూ కంచి వరదరాజస్వామివారే రామానుజులును ఆ ప్రాణాపాయం నుంచి తప్పించారు. చివరికి కంచికి చేరారు. ఆనాటి నుంచి నిత్యం వరదరాజ పెరుమాళ్‌ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చారు రామానుజులు.

    విశిష్టాద్వైతం అంటే? 
    దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం. ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటమే విశిష్టాద్వైతం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో  కలిసి ఒకటిగా ఉండవచ్చని తెలిపారు.

    పాండిత్యం... ప్రాచుర్యం
    రామానుజులవారు శ్రీ భాష్యమనే పేరుతో ప్రస్థాన త్రయానికి భాష్యం రచించారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్టసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ద్రవిడ వేదంపట్ల అందరూ గౌరవ ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు.

    మూర్తీభవించిన సమత
    భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సులో గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు. దేశమంతటా సంచరిస్తూ... తన వాదం ద్వారా ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. 125 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో సమతామూర్తిగా పేరు  పొంది తన అవతార పరమార్థాన్ని నిరూపించుకున్నారు. 
    – డి.వి.ఆర్‌.

  • ఆధునిక కాలంలో బరువు తగ్గడం అనేది చాలా సమస్యాత్మకంగా మారింది. చాలామంది వెయిట్‌లాస్‌ అయ్యేలా సర్జరీలు, మందుల వెంట పరిగెడుతున్నారు. మరికొందరు ఆరోగ్యకరంగా తగ్గేందుకు పాట్లు పడుతున్నారు. ఆ క్రమంలో కొందరు ఇతరులకు ప్రేరణ కలిగించేలా అద్భుతంగా ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గారు కూడా. కానీ వాళ్లందరూ చెప్పేది కొద్దికిద్దిగా తింటూ ఎక్కువసార్లు తినమని, మంచి ఆహారపు అలవాట్లు తదితర టిప్స్‌ ఇస్తే. ఈ వ్యక్తి మాత్రం అత్యంత వింత వెయిట్‌లాస్‌ చిట్కాలు ఇచ్చాడు. అవి చూస్తే ఇవేం చిట్కాలు అనిపించినా..అంతకుమునుపు, తదుపరి పరివర్తన చూస్తే నిజంగా అవే సరైనవా? అనే ఆశ్చర్యం కలుగకమానదు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా

    కువార్‌ కపూర్‌ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన వెయిట్‌లాస్‌ జర్నీని షేర్‌ చేశారు. తాను ఒకప్పుడు 142 కిలోల బరువు ఉండేవాడినని తెలిపాడు. పైగా కొన్ని రకాల వింత ఫిట్‌నెస్‌ టిప్స్‌, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తదితరాలు తన వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ అని చెబుతున్నాడు. వర్కౌట్లు, మంచి ఆహారపు అలవాట్లు వరకు ఓకే. కానీ ఈ వింత ఫిట్‌నెస్‌ టిప్స్‌ ఏంటి..?. బరువు తగ్గడానికి అవెలా ఉపయోగపడ్డాయ్‌?

    డైట్ సోడా తాగడం
    బరువు తగ్గే ప్రయాణంలో డైట్ కోక్, సోడా, శీతల పానీయాలు, ఇతర చక్కెర పానీయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కానీ భోజనంతో పాటు డైట్ సోడా తాగడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుందని కువార్ నొక్కి చెప్పారు. కేలరీలు లేని, సాధారణ ఫిజీ డ్రింక్ లాగే రుచిగా ఉండే సోడాను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

    చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం
    భోజనం తర్వాత చక్కెర లేని చూయింగ్ గమ్ నమలడం వల్ల అతిగా తినాలనే కోరికలను నివారిస్తుందట. కొలెస్ట్రాల్‌ తగ్గేలా ఎక్కువ కేలరీలు తీసుకోకుండా చేస్తుందట.  

    ముందుగా ప్రోటీన్
    ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వింతైన చిట్కా కాదు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లకు ఇది చాలా అవసరం. ప్లేట్‌లో ఎల్లప్పుడూ ముందుగాప్రోటీన్‌, తర్వాత కార్బోహైడ్రేట్లు చేర్చుకోవాలని కువార్‌ పేర్కొన్నారు.

    టీ మాక్సింగ్
    రోజంతా ఎక్కువగా కదలడం, ఉదాహరణకు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కాలు ఊపడం లేదా అటూ ఇటూ తిరగడం వంటివి, మనకు తెలియకుండానే అదనపు కేలరీలను ఖర్చు చేస్తాయంట. పైగా అనుకున్నదానికంటే వేగంగా కేలరీలు ఖర్చు అవుతాయట.

    ఎక్కువగా నిలబడటం
    కువార్ ప్రకారం, మీరు స్క్రీన్ చూసే సమయంలో సగం సేపు కేవలం నిలబడటం వల్ల ఎక్కువ శక్తిని ఖర్చు అవుతుందట. జువారీ కేలరీల ఖర్చులో ఇది కూడా చిన్నగా బరువు తగ్గడంలో హెల్ప్‌ అవుతుందట

    3-2-1 రూల్‌..
    3-2-1 రూల్‌ కువార్‌కు మరింత స్థిరంగా కొవ్వును తగ్గించుకోవడానికి సహాయపడింది. దీని ప్రకారం నిద్రపోయే మూడు గంటల ముందు చివరి భోజనం ముగించడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటానికి సమయం లభిస్తుంది. త్వరిత గతిన బరువు తగ్గడంలో హెల్ప్‌ అవుతుందట.  ఇక రెండు గంటలు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం,ఇక ఒక గంట స్క్రీన్‌టైమ్ కోసం. ఇలా ప్లాన్‌చేస్తే అమాంతం చాలా బరువు తగ్గుతామని చెబుతున్నాడు.

    మంచి అరుగుదల కోసం నడక
    భోజనం చేసిన వెంటనే ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడానికి బదులుగా కండరాలకు చేరవేయడానికి సహాయపడుతుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంటాయి. 

     

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అందరికీ ఈ టిప్స్‌ వర్తించవు. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: వీధి దీపాల కింద చదివి.. బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా..!)
     

  • మురికివాడల్లో పెరిగే నిరుపేద బాలబాలికల్లో అపారమైనే తెలివితేటలు ఉంటాయనేందుకు మరో నిదర్శనం ఇది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర పరిస్థితుల్లో బతుకుతూ..ఊహకే అందని విధంగా బోర్డు ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలవడం మామాలు విషయం కాదు కదా. బహుశా ఈ అమ్మాయి భవిష్యత్తులో మరో స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌గా అవతరిస్తుందేమో..!. ఇంతకీ ఎవరా ఆ అమ్మాయ్‌ అంటే..

    బోఫాల్‌లోని  భీమ్ నగర్‌ అనే ఒక మురికవాడకు చెందిన అమ్మాయి 18 ఏళ్ల చాందిని విశ్వకర్మ. మధ్యప్రదేశ్‌ బోర్డు ఎగ్జామ్‌2026లో కామర్స్‌ విభాగంలో ఆమెకు వచ్చిన మార్కులు తెలిస్తే విస్తుపోతారు. ఆ అమ్మాయి మురికివాడలకు చెందిందేనా అనే అనుమానం వస్తుంది. కటిక దారిద్య్రం మధ్య కష్టపడి చదివి విజయం సాధించిన ఆమె కథ ప్రతిఒక్కరికి స్ఫూర్తి. 

    చాందిని తండ్రి రోజువారీ కూలీ. వడ్రంగి పనిచేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన సంపాదన అరకొరగానే సరిపోతుంది ఇంటికి. చెప్పాలంటే కొద్దిపాటి అవసరాలకు కూడా అక్కరకు రాదు అతడి సంపాదన. ఇంట్లో ఇంతటి ఆర్థిక బాధలు ఉన్నా.. చదువుపైనే అచంచలంగా దృష్టి సారించింది. ఇంటర్‌లో విద్యార్థులంతా వివిధ కోచింగ్‌ సెంటర్లు, ఇతర వనరులపై ఆధారపడగా, ఆమె మాత్రం నిరుపేద పిల్లల కోసం ఉద్దేశించిన ఉచిత పాఠశాల అయిన గురుదేవగుప్త శిక్షా కేంద్రం చదువుకుంది. ఆమె అధ్వాన్నమైన జీవన పరిస్థితులు కారణంగా మిణుకుమిణుకుమనే వీధి దీపాలు, దోమల బెడద మధ్య అహర్నిశలు కష్టపడి చదివింది. 

    ఆ కష్టమే ఆమెను మధ్యప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్‌లో 98.8% మార్కులతో టాపర్‌గా నిలిచేలా చేసింది. ఆమె కామర్స్‌ విభాగంలో 500 మార్కులకు 494 మార్కులతో (98.8%) అసాధారణమైన స్కోరు సాధించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆమె గెలుపు అసాధారణమైనది. పెద్దపెద్ద కాలేజీల్లో చదువుకునే విద్యార్థులందర్ని వెనక్కి నెట్టి మూరిక వాడల నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద అమ్మాయి అగ్రస్థానంలో నిలవడం మాటలకందని విజయం కదూ..!.

    (చదవండి: ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితి నుంచి మున్సిపల్‌ కమిషనర్‌గా..!)

     

  • ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్‌లోకి జంక్‌ ఫుడ్‌ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్‌లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్‌ ఫుడ్‌ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  

    ఎదుగుదలకు హానికరం 
    చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్‌ ఫుడ్స్‌ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. 

    దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్‌ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్‌ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్‌ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి.  

    తల్లిదండ్రుల్లో మార్పు రావాలి 
    చిన్నారులకు జంక్‌ ఫుడ్‌ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. 

    అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.

    అవగాహన కల్పిస్తున్నాం 
    పోషణ్‌ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్‌ ఫుడ్‌ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల     ఉంటుంది.  
    – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి 

    జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు 
    జంక్‌ ఫుడ్‌ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్‌ఫుడ్‌ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  
    – బీఆర్‌కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి

    సంప్రదాయ ఆహారంతో మేలు
    చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్‌ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు,  అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్‌తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి.   

    (చదవండి: మామ్‌ వెయిట్‌లాస్‌ జర్నీ..! నో క్రాష్‌ డైట్‌, నో స్ట్రిక్ట్‌ రూల్స్‌..ఏకంగా 22 కేజీలు..)

  • వైశాఖ మాస శుక్ల పక్ష తదియని అక్షయ తృతీయ (Akshaya Tritiya 2026) అంటారు.. ఇది హైందవ పండుగ లలో విశిష్టమైనది.. విశేషమైనది... ఈ రోజు ఏ పుణ్యకార్యం చేపట్టిన దానధర్మాలు చేసినా, దాని వలన ఫలితం క్షయం కాకుండా ఉంటుంది, అందుకే  ఈ పర్వం అక్షయ తృతీయగా ప్రసిద్ధికెక్కింది... 19, ఆదివారం అక్షయ తదియ సందర్భంగా ఆ విశేషాలు... 

    ఒడిస్సాలో పూరి రధా యాత్ర నిర్మాణం ఈ రోజు మొదలు పెడుతారు. సింహచ లం అప్పన్న స్వామి నిజరూప దర్శనం మరియ చందనోత్సవం ఈ రోజే. భక్తులు తండోపతండాలుగా దర్శనంచేసే ఛార్‌ ధామ్‌ యాత్రలో కేదారేశ్వరుడు, బద్రీనాధ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరిచిన రోజు. భారతంలో పాండవులు అరణ్యవాసంలో వున్నపుడు, సూర్యదేవుడు ఇచ్చిన అక్షయపాత్ర మహిమలు విన్నాం. క్రోధపూరితం అయిన నరసింహస్వామిని శాంతింప చేయడానికి చందన పూత పూస్తారు. ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగు తుంది.

    దానధర్మాల మహిమ
    ఈ రోజు ఏ వ్రతం అయినా జపం అయినా హోమం అయినా, దానధర్మాలు చేసినా, మరేమైనా పుణ్యకార్యం చేపట్టినా, ఫలితాలు క్షయం లేకుండా అంతం లేకుండా వుంటాయని విశ్వాసం. దానధర్మాలు చేస్తే చేసిన వారికీ నిరంతర  సంపద కలుగుతుందని నమ్మకం. వైశాఖ మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వస్త్రాలు, గొడుగు, చెప్పులు, మంచి నీరు, ఆహారం, పళ్ళు ఇవ్వాలని అంటారు. అలా ఇచ్చినందుకు మన ఇంట్లో వాటి కొరత ఉండదని, అక్షయమవుతాయని పెద్దల మాట.   వీలైతే గోవు, భూమి, బంగారం వంటివి దానం చేస్తే ఎంతో ఫలం ఉంటుంది.

    చివరగా....
    ఈ రోజు ఏం చేసినా అక్షయంగా ఉంటుందనడానికి నిదర్శనాలు జీవనది గంగ. పంచమవేదంగా పరిగణించ బడి ప్రజలలో శాశ్వతంగా పదిలంగా వున్న మహా భారతం. ధనవంతులని కుబేర నామంతో వ్యవహరిస్తారు. అన్నపూర్ణ అవతరణతో అన్నం కొదవలేకుండా ఉండడం, మన తెలుగు రాష్ట్రాలని అన్నపూర్ణ అని అంటారు. ఈ రోజు  పాపం చేస్తే ఆ పాపం కూడా అక్షయంగా అంటుకుంటుంది. అందుచేత ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డ పనులు చేయరాదు. 

    పర్వాలకే పర్వం 
    కృతయుగం వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తదియ నాడే ప్రారంభం అయినట్లు పురాణాలలో ప్రస్తావన... భగీరథుడు గంగకోసం తపస్సు చేసి మెప్పించి తరువాత ఆకాశం నుండి గంగ ఉగ్రరూపంతో ఉరికిన రోజు ఇదే. పరశురాముడు పుట్టినరోజు. వీరశైవ మత వ్యవస్థాపకుడు బసవేశ్వరుడు జన్మించిన రోజు. వేదవ్యాసుడు వినాయకుని చేత మహాభారతం వ్రాయడానికి పూనుకున్న రోజు.కుబేరుని శివుడు ధనాధిపతిగా నియమించిన రోజు. మహాలక్ష్మి విష్ణుమూర్తుల వివాహం జరిగిన రోజు. కుచేలుడిని కృష్ణుడు అను గ్రహించిన రోజు. బ్రహ్మ పుత్రుడు అక్షయడు జన్మించినరోజు.  పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర అందించిన రోజు. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు. శంకరాచార్యులు కనక ధారా స్తోత్రం ద్వారా అమ్మవారిని మెప్పించి కటిక దరిద్రురాలైన భక్తురాలి ఇంట్లో కనకవర్షాన్ని కురిపించిన రోజు. 

    – కె. అన్నపూర్ణ 

  • ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్‌లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్‌ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్‌ అని మెచ్చుకోకుండా ఉండలేరు.

    అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌  చేశారామె. ఆ డ్రైవర్‌ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్‌లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. 

    ఇంతకీ  ఆ డ్రైవర్‌ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. 

    నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్‌ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్‌లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ  తన పోస్ట్‌ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్‌ని ప్రశంసిస్తూ  పోస్టుల పెట్టారు.

    (చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..)

     

Telangana

  • హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

    "తెలంగాణ రాష్ట్రం వందలాది మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాల ఫలితం. దశాబ్దాల పోరాటం, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని, రక్తపాతంతో కూడిన దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది అమరుల త్యాగాలను కించపరచడమే." అని మంత్రి మండిపడ్డారు.

    "భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన రాష్ట్ర విభజనకు తేడా తెలియని వారు పార్లమెంట్‌లో ఉండటం దురదృష్టకరం. కోట్లాది మంది ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన తేజస్వి సూర్యపై లోక్ సభ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేస్తున్న. రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను, ప్రాంతీయ సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం భావ్యం కాదు."

    "తెలంగాణ సమాజాన్ని కించపరిచిన తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి" తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి హెచ్చరించారు.

    ఇదీ చదవండి: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

  • మహిళల భద్రత కోసం ఆర్పీఎఫ్‌  హైదరాబాద్ ‘పింక్ పట్రోల్’ డ్రోన్ బృందాలను ప్రారంభించింది. ప్రజా రవాణాలో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి ఒక చారిత్రాత్మక చర్యగా, రైల్వే రక్షణ దళం (RPF), హైదరాబాద్ డివిజన్ “పింక్ పట్రోల్” అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది భారతీయ రైల్వేలలో మొదటిసారిగా మహిళల ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా మరియు వేగవంతమైన స్పందన పోలీసింగ్‌ను కలిపే ప్రత్యేక కార్యక్రమం.

    ఈరోజు(గురువారం,ఏప్రిల్ 16న) భారతీయ రైల్వేల వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇది ముఖ్యంగా ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికుల భద్రత కోసం రూపొందించిన సాంకేతిక ఆధారిత, బహుళస్థాయి భద్రతా వ్యవస్థను అందిస్తుంది.

    ఈ కార్యక్రమం వెనుక స్పష్టమైన వ్యూహాత్మక ప్రణాళిక మాత్రం ఐపీఎస్‌ సోనాలి మిశ్రాది. ఆమె రైల్వే భద్రతలో డ్రోన్ల వినియోగంపై ప్రధాన దృష్టి పెట్టి, ఆధునిక సాంకేతికతతో కూడిన పోలీసింగ్ విధానాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

    సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్  దేవాశ్మిత సి. బెనర్జీ నాయకత్వంలో ఆర్పీఎఫ్‌ హైదరాబాద్ డివిజన్ “పింక్ పట్రోల్” కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అమలు చేసింది.

    ఈ ప్రణాళిక దశలో ఐజీ  అరోమా సింగ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించి, పింక్ పట్రోల్ బృందాలకు డీజీసీఏ ప్రమాణాల ప్రకారం డ్రోన్ పైలట్ శిక్షణ, ధృవీకరణను కల్పించారు.

    అలాగే,  హైదరాబాద్ డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ తక్షణ పరిపాలనా అనుమతులు, ఆర్థిక మంజూరు,  సంస్థాగత మద్దతు అందించి, ఈ కార్యక్రమం వేగంగా అమలులోకి రావడానికి సహకరించారు.

    ఇది రైల్వే బోర్డు, జోనల్ మరియు డివిజనల్ స్థాయిల మధ్య సమన్వయంతో మహిళల భద్రత అనే ఒకే లక్ష్యంపై పనిచేస్తున్న దానికి ఉదాహరణగా నిలుస్తోంది.

    ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్‌లో RPF కమాండ్ వ్యవస్థ మొత్తం మహిళల చేతుల్లో ఉండటం ప్రత్యేకతగా నిలుస్తోంది, ఇది మహిళల భద్రతపై మరింత సున్నితమైన మరియు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని తీసుకువస్తోంది.

    పింక్ పట్రోల్‌లో వినియోగించే ఆధునిక డ్రోన్ల లక్షణాలు

    * తక్కువ వెలుతురు మరియు రాత్రి సమయంలో పని చేసే థర్మల్ ఇమేజింగ్ సెన్సర్లు
    * నైట్ విజన్ ఆప్టిక్స్
    * హై డెఫినిషన్ రియల్‌టైమ్ వీడియో ప్రసారం
    * లాంగ్-రేంజ్ జూమ్ కెమెరా
    * కదులుతున్న రైళ్లను నిరంతరం ట్రాక్ చేసే స్థిరమైన ఎరియల్ ప్లాట్‌ఫార్మ్స్
    * అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన సామర్థ్యం

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

    ఈ మేరకు మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం . బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు.

    ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?. ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారు. నాడు మోదీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.

    తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు.   లోక్ సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.

    ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర.. స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు’అని హెచ్చరించారు.  

     

     

  • హైదరాబాద్‌: పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో  పోల్చుతూ తేజస్వి సూర్య పార్లమెంట్‌లో నిలబడి మాట్లాడటం మన గౌరవం మీద దాడి జరిగినట్లేనని పొన్నం ధ్వజమెత్తారు. ఈ మేరకు గాంధీభవన్‌ నుంచి ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్టాడుతూ.. 

    ‘ఇది మాట కాదు.  ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. ఇది మన పోరాటంపై దాడి. ఇది మన ఆత్మగౌరనానికి అయిన గాయం.  మనకు తెలంగాణ ఎలా వచ్చింది?,  రక్తంతో కాదు… రాజ్యాంగంతో వచ్చింది. హింసతో కాదు…  ప్రజాస్వామ్యంతో వచ్చింది. అలాంటి పవిత్రమైన ఉద్యమాన్ని…దేశ విభజనతో పోల్చే హక్కు ఎవరికీ లేదు’ అని హెచ్చరించారు.

    పార్లమెంట్ అంటే గౌరవం ఉండాలి. అది చౌకబారు రాజకీయాల వేదిక కాదు. ఈ వేదిక నుండి నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆ వ్యాఖ్యలను వెంటనే లోక్‌సభ రికార్డ్స్ నుండి తొలగించాలి.  ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది పార్లమెంటరీ నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలి. అవసరమైతే సభ్యత్వంపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు పొన్నం. 

    తెలంగాణను అవమానిస్తుంటే రాష్ట్ర నుంచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణను కించపరిచే వారికి తగిన బుద్ధి చెప్పాలని పొన్నం పేర్కొన్నారు. 


     

  • హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఫైర్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఎమర్జెన్సీ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందికి “బ్రోంజ్ డిస్క్, ప్రశంసాపత్రం” పురస్కారం దక్కింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఫైర్‌ సర్వీసెస్‌, సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ గార్డ్స్‌​, హోం శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించాయి.

    ఈ పురస్కారాన్ని దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్, ఇతర భద్రతా సంస్థల సిబ్బందికి అత్యుత్తమ విధి నిర్వహణ, ధైర్యసాహసం, విశిష్ట సేవలకుగాను ప్రదానం చేస్తారు. దీన్ని ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా పరిగణిస్తారు.

    తెలంగాణ ఫైర్ సర్వీసెస్ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది ఈ గౌరవాన్ని పొందడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ విక్రం సింగ్‌ మాన్‌ పురస్కార గ్రహీతలను అభినందించారు.

    పురస్కార గ్రహీతల జాబితా

    • బి. సుధాకర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గౌలిగూడ, హైదరాబాద్

    • జి. యాదగిరి లీడింగ్ ఫైర్ ఫైటర్, సెక్రటేరియట్, హైదరాబాద్

    • ఎం.డి. ఘౌస్ పాషా  లీడింగ్ ఫైర్ ఫైటర్, గద్వాల్

    • గడ్డే కృష్ణ ప్రసాద్ లీడింగ్ ఫైర్ ఫైటర్, వైరా, ఖమ్మం

    • సారా రాజేశ్వర్ ఫైర్ ఫైటర్ టెక్నికల్, హయత్‌నగర్, రంగారెడ్డి

    • వగడాని రామ్ బాబు  ఫైర్ ఫైటర్ టెక్నికల్, ఖమ్మం 

    • కె. వినోద్ కుమార్ ఫైర్ ఫైటర్ టెక్నికల్, స్నార్కెల్,    హైదరాబాద్

    • ఎం. ప్రవితన్  ఫైర్ ఫైటర్  గౌలిగూడ, హైదరాబాద్

    • జి. రాకేష్ కుమార్ ఫైర్ ఫైటర్ హైకోర్టు, హైదరాబాద్

    • జుట్టుకొండ వెంకటేశ్వర్లు, ఫైర్ ఫైటర్, హుజూర్‌నగర్ ,నల్గొండ.

Business

  • భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్‌తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.

    12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..
    గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే,  2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.

    ఏడాదిలో 60 శాతం పెరుగుదల
    గత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్‌తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.

    2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!
    మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.

  • ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సందర్భంగా ఏకంగా రూ. 15,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.

    బైబ్యాక్ ముఖ్యాంశాలు
    విప్రో బైబ్యాక్ చేసే షేర్ల మొత్తం విలువ రూ. 15,000 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు  రూ. 250. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 210.15 తో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం 60 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీలో 5.7 శాతం) కంపెనీ వెనక్కి తీసుకోనుంది. 'టెండర్ ఆఫర్' మార్గంలో దామాషా పద్ధతిలో ఈ బైబ్యాక్ ప్రక్రియ జరగనుంది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగిన వారు, ఏడీఆర్ (ADR) హోల్డర్లు ఇందులో పాల్గొనవచ్చు.

    క్యూ4 ఫలితాలు
    మార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో విప్రో ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,569.6 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 1.89 శాతం తగ్గి రూ. 3,501.8 కోట్లుగా నమోదైంది. మరోవైపు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ. 24,236.3 కోట్లకు చేరింది.  2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 13,197.4 కోట్ల నికర లాభాన్ని, రూ. 92,624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

    ఏఐ దిశగా అడుగులు
    ఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని తెలిపారు. ‘మేము 'ఏఐ-ఫస్ట్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. మా ఏఐ నేటివ్ బిజినెస్ యూనిట్ ద్వారా 'సర్వీసెస్-యాజ్-ఎ-సాఫ్ట్వేర్' మోడల్‌కు పెద్దపీట వేస్తున్నాం. ఓలం గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మా భవిష్యత్తు పెట్టుబడులకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.

    • గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు ధర స్వల్పంగా పెరిగి రూ. 210.20 వద్ద స్థిరపడింది. 

  • పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్‌ రేట్లు పెరగకుండా రష్యన్‌ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా నెలరోజుల పాటు సడలించడంతో, ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చిలో భారత్‌ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

    యూరప్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎయిర్‌ (క్రియా) నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకున్న భారత్, ఆ తర్వాతి నెలలో మళ్లీ గణనీయంగా కొనుగోళ్లు చేసింది. మొత్తం 5.8 బిలియన్‌ యూరోల విలువ చేసే రష్యన్‌ హైడ్రోకార్బన్స్‌ని దిగుమతి చేసుకోగా ఇందులో క్రూడాయిల్‌ వాటా 91 శాతం (సుమారు 5.3 బిలయన్‌ యూరోలు)గా నమోదైంది.

    ఇది 2025 మార్చిలో నమోదైన దానితో పోలిస్తే 72 శాతం అధికం. ఇక రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగతా వాటిలో బొగ్గు (337 మిలియన్‌ యూరోలు), ఇతరత్రా ఆయిల్‌ ఉత్పత్తులు (178.5 మిలియన్‌ యూరోలు) ఉన్నాయి. మార్చిలో భారత్‌ క్రూడాయిల్‌ దిగుమతులు మొత్తం మీద 4 శాతం తగ్గినప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు మాత్రం రెట్టింపయ్యాయి.

    ఫిబ్రవరిలో 1.4 బిలియన్‌ డాలర్ల మేర ముడిచమురు దిగుమతి అయింది. ఆంక్షల కారణంగా 2025 నవంబర్‌లో రష్యన్‌ దిగుమతులు నిలిపివేసిన ప్రభుత్వ రంగ మంగళూరు, వైజాగ్‌ రిఫైనరీలు 2026 మార్చి నుంచి తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టాయి.

  • టీసీఎస్‌ (TCS) నాసిక్‌ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్‌ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్‌ ఐటీ పార్క్‌లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

    బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్‌ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.

    ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్‌లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్‌ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్‌లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

    స్పందించిన టెక్‌  మహీంద్రా యాజమాన్యం
    ఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్‌వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.

    తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.

    ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్‌ఆర్‌ సైలెంట్‌!

  • న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఏడు సార్లు గ్రాండ్‌ శ్లామ్‌ చాంపియన్‌గా నిల్చిన టెన్నిస్‌ దిగ్గజం కార్లోస్‌ అల్కరాజ్‌ని తాజాగా తమ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. దీనితో పాటు ఏఐ ఆధారిత మ్యాచ్‌ అనలిటిక్స్, మ్యాచ్‌ల కోసం సన్నద్ధం కావడానికి వ్యక్తిగత స్థాయిలో పనితీరును మదింపు చేసేందుకు ఉపయోగపడే అప్లికేషన్‌ని ఆయన తో కలిసి తమ ఏఐ సాంకేతికత టొపాజ్‌ సహా యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.

    అలాగే సామాజిక ప్రయోజనాల కోసం టె క్నాలజీని ఉపయోగించుకునే దిశగా ఇన్ఫోసిస్, అల్కరాజ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఏఐ ద్వారా టెన్నిస్‌ స్థాయిని మరింతగా పెంచాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఆయనతో భాగస్వామ్యం కీలకమని ఇన్ఫీ తెలిపింది. 

  • కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల రాజీనామాలు, నోటీసు పీరియడ్ల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటజిస్ట్ నిషాంత్ జోషి పంచుకున్న ఒక ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. తన సహోద్యోగికి కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, 90 రోజుల నోటీసు పీరియడ్ తగ్గించాలని కోరగా.. అది ‘వృత్తిపరమైన నైతికత’ (Professional Ethics) అని హెచ్ఆర్ విభాగం బదులిచ్చింది. దీనికి ఆ ఉద్యోగి స్పందిస్తూ.. ‘గత నెలలో కంపెనీ మొత్తం డిజైన్ టీమ్‌ను ఉన్నపళంగా తొలగించినప్పుడు ఈ నైతికత ఏమైంది?’ అని ప్రశ్నించడంతో హెచ్ఆర్ నోట మాట రాలేదని జోషి పేర్కొన్నారు.

    ద్వంద్వ నీతిపై ఆగ్రహం
    ఉద్యోగులు వెళ్లేటప్పుడు మూడు నెలల సమయం కావాలని కోరే కంపెనీలు, వారిని తొలగించేటప్పుడు మాత్రం కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై నిషాంత్ జోషి విమర్శలు గుప్పించారు. ‘సంస్థ మిమ్మల్ని తీసివేయాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే మీ ఆఫీస్ అకౌంట్లు అన్నీ డిసేబుల్ అవుతాయి.. అక్కడ అప్పగింతలు (Handover) ఉండవు, గౌరవం ఉండదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది పని సజావుగా సాగడం కోసం కంటే, ఉద్యోగి వేరే అవకాశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

    నెటిజన్ల మద్దతు
    ఈ పోస్ట్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అనేకమంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా చేర్చుకునే అభ్యర్థి వెంటనే రావాలని కోరుకునే సంస్థలు, పాత ఉద్యోగిని మాత్రం 90 రోజులు వదలకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఐటీ కన్సల్టింగ్ రంగంలో మొదలైన ఈ 90 రోజుల నిబంధన ఇప్పుడు అన్ని రంగాలకు పాకి ఉద్యోగులను వేధించే సాధనంగా మారిందని మరికొందరు విమర్శించారు. వృత్తిపరమైన నైతికత అనేది కేవలం ఉద్యోగులకే కాదు, సంస్థలకు కూడా వర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    మార్పు అవసరం
    ఈ చర్చ ద్వారా కార్పొరేట్ నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది కాలం చెల్లిన పద్ధతి అని, ఇది ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా ఉద్యోగి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు తమ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల కెరీర్ వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకృతం చేయాలని, పరస్పర అవగాహనతో కూడిన పని వాతావరణం ఉండాలని ఈ చర్చ సారాంశం.

    ఇదీ చదవండి: ‘టెక్‌ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో షేర్లకు  అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు తమ గరిష్టాలను కోల్పోయాయి.

    బీఎస్ ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 122.56 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టపోయి 77,988.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 34.55 పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 24,196.75 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 50 ఇండెక్స్ లో హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్ సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.63 శాతం, 0.83 శాతం పెరిగాయి.

    రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్ లూజర్స్ గా ఉద్భవించాయి.

  • భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ 'ఇగ్నిస్' (Ignis) ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసింది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు డీలర్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కోసం కొత్త బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ, అధికారిక నెక్సా (NEXA) వెబ్‌సైట్‌లో మాత్రం ఈ మోడల్ ఇంకా లిస్టింగ్‌లో కనిపిస్తోంది.

    2017లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇగ్నిస్, తన విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్‌తో యువతను ఆకట్టుకుంది. 2020లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ద్వారా మరిన్ని అప్‌డేట్లను పొందిన ఈ కారు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 83bhp శక్తిని, 113Nm టార్క్‌ను అందించేది. ఫీచర్ల పరంగా 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ స్విచ్‌లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. భద్రత కోసం ఏబీఎస్‌, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్‌ల వంటి ప్రామాణిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండేది.

    పంచ్‌కు పోటీ వస్తోందా?
    ఇగ్నిస్ నిష్క్రమణతో మారుతి సుజుకి తన దృష్టిని ఇప్పుడు సరికొత్త మైక్రో ఎస్‌యూవీ వైపు మళ్లించింది. ప్రస్తుతం 'Y43' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త కారు, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి బలమైన మోడళ్లతో పోటీ పడనుందని చెబుతుతున్నారు. ఇగ్నిస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ, మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో బ్రెజ్జా కంటే దిగువన ఉండి, నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

    రాబోయే Y43 మోడల్ 1.2 లీటర్ 'డ్యూయల్ జెట్' పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇగ్నిస్ కేవలం హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా మాత్రమే పరిమితమవ్వగా, కొత్త మోడల్ పూర్తిస్థాయి మైక్రో ఎస్‌యూవీ లుక్, ఫీచర్లతో రానుంది. పంచ్ వంటి కార్లు ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో, మారుతి కూడా తన కొత్త ఉత్పత్తితో గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

  • సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్‌ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.

    కోట్లలో డౌన్‌లోడ్‌లు.. వందల కోట్లలో ఆదాయం!

    టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్‌డ్రెస్ లేదా న్యూడిఫై యాప్‌లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్‌లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్‌ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్‌లో 18, గూగుల్ ప్లే స్టోర్‌లో 20 ఇలాంటి యాప్‌లను పరిశోధకులు గుర్తించారు.

    సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!

    వినియోగదారులు యాప్‌ స్టోర్‌ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్‌లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్‌ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్‌లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.

    నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్‌ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్‌లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్‌లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్‌వేర్‌లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.

    అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి

    నగ్నత్వ యాప్‌ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.

    దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?

    బ్లూమ్‌బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్‌లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్‌లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్‌లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు

Andhra Pradesh

  • కాకినాడ: జిల్లాలోని పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేసిన ఘటనలో ఐదుగురికి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. 

    ఈ తేనెటీగల దాడిలో మొత్తం 24 మందికి గాయపడ్డారు. అందులో 19 మందికి స్వల్పంగా గాయపడగా, ఐదుగురి తేనెటీగల దాడి బారిన పడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి సామాజిక కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తుండగా, తీవ్రంగా గాయపడిన ఐదుగుర్ని మాత్రం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

  • కుప్పం:  అక్రమ కేసును బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్‌ మంజూరైంది. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది, 33 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన పూడి శ్రీహరికి బెయిల్‌ మంజూరు చేసింది కుప్పం కోర్టు. నిన్న(బుధవారం, ఏప్రిల్‌ 15వ తేదీ)   పూడి శ్రీహరిని ఉదయం 8 గంటలకు అరెస్టు చేయగా, ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 16వ తేదీ) ఉదయమే వైద్య పరీక్షలు చేశారు. 

    అయితే  అరెస్టు చేసిన తర్వాత 33 గంటల పాటు శ్రీహరిని కోర్టు హాజరుపరచలేదు పోలీసులు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీహరిని ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు.  ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్‌ మంజూరు అయ్యింది.

    Breaking News: పూడి శ్రీహరికి బెయిల్ 

  • సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు.    

  • తిరుపతి:  వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించి కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడమే కాకుండా, ఇంకా కోర్టులో హాజరు పరచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పూడి శ్రీహరిని అరెస్టు చేసి 30 గంటలకు పైగా దాటినా ఇంకా పోలీసుల నిర్బంధంలోనే ఉంచారు. 

    ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 16వ తేదీ) ఉదయమే పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు చేసినా కోర్టులో మాత్రం హాజరుపరచలేదు పోలీసులు. పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. 

     పూడి శ్రీహరిని ఇంకా కోర్టులో హాజరుపరచకపోవడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ పని చేయలేదు పోలీసులు. 

    YSRCP శ్రీహరి అరెస్ట్, కుప్పం పోలీసుల తీరుపై అనుమానాలు
  • సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి పేలుడు ఘటనపై సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. వెంకన్న ఇంట్లో గ్యాస్ లీకై తొలుత అగ్ని ప్రమాదం జరగ్గా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలాయి. మంటలు ఆర్పే సమయంలో స్థానికుడు వీడియో తీస్తుండగా బ్లాస్టింగ్‌ జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన నలుగురు మృతిచెందగా. 18 మంది గాయపడ్డారు. సెల్‌ ఫోన్‌లో బ్లాస్టింగ్‌ దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో పేలుడు దృశ్యాలు వైరల్‌గా మారాయి.

    కాగా, బుధవారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో కదిరి పట్టణ శివారులోని కుమ్మరవాండ్లపల్లి.. కదిరి–రాయచోటి రోడ్డుకు అతి సమీపంలోని ఓ ఇంటి నుంచి పొగలు మొదలయ్యాయి.. స్థానికులంతా గుమికూడారు. ఇంట్లో వారు మాత్రం అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. మంటలు ఆర్పుదామన్న ఆత్రుతతో స్థానికుల్లో కొందరు లోపలికి వెళ్లారు. ఇంతలోనే భారీ పేలుడు.. ఆ ఇంటితో పాటు ఇరువైపులా ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. లోపలికి వెళ్లిన వారిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

    LIVE Video: కదిరి పేలుడు లైవ్ వీడియో

    కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్‌స్టిక్స్‌ పేలుడు జరిగిన ఇంట్లో పదేళ్లుగా తెలంగాణవాసులు ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు పెట్టుకుని ఉంటున్నా ఎవరికీ అనుమానం రాకపోవడం గమనార్హం. వారు కదిరి చుట్టుపక్కల రహదారుల నిర్మాణం, వెంచర్లు, రైతుల భూముల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా పెద్దపెద్ద రాళ్లను బ్లాస్టింగ్‌ చేసేందుకు వెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు.

     

     

National

  • అధికారం కోసం రాజ‌కీయ నేత‌ల వార‌సులు ఎగ‌బ‌డుతున్న ప్ర‌స్తుత రోజుల్లో బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్‌ త‌న‌యుడు నిశాంత్ భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. డిప్యూటీ సీఎం అయ్యే అవ‌కాశం వ‌చ్చినా కాద‌నుకున్నారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందిన త‌ర్వాతే ప‌ద‌వి చేప‌ట్టాల‌ని, అప్ప‌టి వ‌ర‌కు జ‌నం మ‌ధ్య ఉండేందుకే ఆయ‌న మొగ్గుచూపారు.  

    బిహార్‌లో తొలి బీజేపీ ముఖ్య‌మంత్రిగా స‌మ్రాట్ చౌద‌రి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో  ఆ రాష్ట్ర రాజ‌కీయాలు (Bihar Politics) మ‌రో మ‌లుపు తిరిగాయి. నితీశ్ కుమార్ సీఎం ప‌ద‌విని వ‌దిలిపెట్టి హ‌స్తిన బాట ప‌ట్ట‌డంతో కాషాయ‌పార్టీకి తొలిసారి బిహార్ ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కింది. అయితే నితీశ్ ఢిల్లీకి వెళ్తూ త‌న కొడుకు నిశాంత్ కుమార్‌ను బిహార్ కేబినెట్‌లోకి ప్ర‌వేశ‌పెడ‌తార‌న్న వార్త‌లు షికారు చేశాయి. జేడీ(యూ) సీనియర్ నాయకులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్‌లు బుధవారం సమ్రాట్ చౌదరితో కలిసి ప్రమాణ స్వీకారం చేయ‌డంతో ఈ ఊహాగానాల‌కు తెర‌ప‌డిపోయింది. నితీశ్ వార‌సుడిగా కాకుండా త‌ను తానుగా ప‌ద‌వి సంపాదించుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని జేడీ(యూ) పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

    పార్టీకే ప‌రిమిత‌మ‌వుతా
    ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని నిశాంత్ కుమార్‌ను ఒప్పించేందుకు పార్టీ నాయ‌కులు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అయితే తాను డిప్యూటీ సీఎం కావ‌డానికి ఇంకా స‌మ‌యం ఉంద‌ని పార్టీ నేత‌ల‌కు ఆయ‌న చెప్పారు. కొంత‌కాలం పార్టీకే ప‌రిమిత‌మ‌వుతాన‌ని స్పష్టంచేశారు. ఉప ముఖ్యమంత్రి ప‌ద‌వి చేప‌ట్టాల‌ని నిశాంత్‌ను కోరుతూ మంగ‌ళ‌వారం అర్ధరాత్రి వరకు పార్టీ నాయ‌కులు చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ ఆయ‌న స‌సేమీరా అన్నారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు అవసరమైన అనుభవం తనకు ఇంకా రాలేదంటూ ఈ ప్ర‌తిపాద‌న‌ను సున్నితంగా తిర‌స్క‌రించారు.

    త‌న భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో ఎక్కువ సమయం గడపాల‌ని అనుకుంటున్నారు. కేత్ర‌స్థాయిలో ప‌నిచేయ‌డం ద్వారా అనుభ‌వం గ‌డించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ అనుభ‌వం ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అర్థం చేసుకోవడానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని నిశాంత్ న‌మ్ముతున్నారు. అయితే నితీశ్‌ కుమార్ వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి నిశాంత్‌.. డిప్యూటీ సీఎం అయితే బాగుండేద‌ని పార్టీలోని ఒక వర్గం భావిస్తోందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు ఒక‌రు అన్నారు.

    ఆరు నెల‌ల త‌ర్వాతే ప‌ద‌వి!
    ఆరు నెలల పాటు తాను ఏ పదవినీ స్వీక‌రించే అవ‌కాశం లేదని నిశాంత్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. 44 ఏళ్ల నిశాంత్ కుమార్ గత నెలలో అధికారికంగా జేడీ(యూ)లో చేరారు. ఆయ‌న పార్టీలో చేరే సమయంలో ఆయన తండ్రి నితీశ్‌ కుమార్ అక్కడ లేక‌పోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నితీశ్‌, నిశాంత్ ఎల్లప్పుడూ వార‌స‌త్వ రాజకీయాలను వ్యతిరేకించారని, అందుకే నిశాంత్ ప్రజల  నమ్మకాన్ని సంపాదించుకున్నాకే ప‌ద‌వి చేప‌ట్టాల‌ని కోరుకుంటున్నారని పార్టీ నాయకుడొక‌రు అన్నారు. "తన తండ్రి రాజ్యసభకు వెళ్లాల‌ని నిర్ణయించుకున్న తర్వాతే నిశాంత్ బిహార్ రాజకీయాల్లోకి వచ్చారు. నితీశ్ కుమార్ ఇప్పుడు ఢిల్లీకి మారినందున, పార్టీని బలోపేతం చేయడంపై నిశాంత్ కుమార్ దృష్టి పెట్టాలనుకుంటున్నారు" అని వివ‌రించారు.

    చ‌ద‌వండి: కేర‌ళ ఎన్నిక‌ల్లో జ‌రుగుతోంది ఇదే!

    నిశాంత్ నెగ్గుకొస్తారా?
    నితీశ్ కుమార్ హ‌స్తిన బాట ప‌ట్ట‌డంతో బిహార్‌లో జేడీ(యూ) భ‌విష్య‌త్తు మ‌న్ముందు ఎలా ఉండ‌బోతోందో ఊహించ‌డం క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ‌ విశ్లేష‌కులు అంటున్నారు. బీజేపీ వ్యూహాల‌ను త‌ట్టుకుని పార్టీని కాపాడుకోవ‌డం క‌త్తి మీద సామేనేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. బిహార్ కేబినెట్‌లో నిశాంత్ చేరితేనే బాగుండేద‌ని పేర్కొంటున్నారు. ఆరు నెల‌లు అనుభ‌వం గ‌డించిన త‌ర్వాత ప‌ద‌వి తీసుకుంటాన‌ని చెప్ప‌డం ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు సూటుకాదంటున్నారు. ఎందుకంటే 6 నెల‌ల త‌ర్వాత ప‌రిస్థితుల‌ను ఎవ‌రూ ఊహించ‌లేరని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో నిశాంత్ ఎలా నెగ్గుకొస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. 

  • చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

    పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్‌లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.

    ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.

    ‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు.

  • సాక్షి,న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగనుందంటూ విపక్షాల ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు. 

    బిల్లుతో దక్షిణాదిలో పార్లమెంట్‌ స్థానాలు 129 నుంచి 195కు పెరుగుతాయి. బిల్లుతో లాభం తప్ప నష్టం జరగదు. బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం. కర్ణాటక, తెలంగాణ బాగా లాభపడతాయి. ఈ బిల్లుతో తెలంగాణలో ఎంపీల సంఖ్య 17 నుంచి 26కు.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుతాయి. 

    అలాగే తమిళనాడులో 59కి, కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలు.. కర్ణాటకలో 28 నుంచి 42 స్థానాలకు పెరుగుతాయి. మేం సందేహాలకు సమాధానం ఇస్తాం.. వాకౌట్‌ చేయాల్సిన పనిలేదని విపక్షాల ఆరోపణలకు అమిత్‌షా ఎద్దేవా చేశారు. కాగా, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్‌ నిర్వచించే ప్రక్రియనే డీలిమిటేషన్‌ అంటారు. 

  • సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్‌ టర్న్డ్‌ పొలిటీషియన్‌ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు  ఆసక్తికరంగా మారాయి.

    నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే  పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే  తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ,  తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని  వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని  పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?...  కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.

    పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం,   పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు.  

    ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని  ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు.  టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.

    ముఖ్యమైన  హామీలు

    • మహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.

    • నిరుపేద వధువులకు 8 గ్రాముల  (కాసు) బంగారం , పట్టుచీర.

    • మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.

    • 5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.

    • వరి పంటకు క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర (MSP).

    • ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. 
      దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.

    • రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.

    • విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు  చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై  విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.

      ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

  • న్యూఢిల్లీ: సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్నీ తీసివేయలేమని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయంలో తరుణ వయస్సు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశంపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. 

    సామాజిక సంస్కరణ పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని తొమ్మిది న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ప్రస్తుతం శబరిమల కేసుకు సంబంధించిన కీలక రాజ్యాంగ ప్రశ్నలపై వాదనలు వింటోంది.

    ముఖ్యంగా మత స్వేచ్ఛ, సామాజిక సంస్కరణ మధ్య సమతుల్యతపై చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పరిమితులను అత్యవసర మత ఆచారంగా పరిగణించలేమని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు, బాలికలు ఆలయంలోకి రాకూడదనే ఆచారాన్ని దాదాపు అంటరానితనంతో సమానమని పేర్కొంది.

    తాజాగా జరిగిన విచారణ సమయంలో మత సంబంధిత విషయాల్లో ప్రజాహిత వ్యాజ్యాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వాదనలకు స్పందిస్తూ.. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని కోర్టు ఎలా ప్రకటించాలన్నదే అత్యంత కఠినమైన సమస్యగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. 

    కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అనుచితమని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మతంపై నమ్మకం లేని వారు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరైనదేనా? అని అన్నారు. అయ్యప్ప ఆలయాలు ఎన్ని ఉన్నా శబరిమలలోని ఆలయం చాలా విశిష్టమైనదని తెలిపారు. ఆచారాలను మహిళలపై వివక్షగా భావించొద్దని అన్నారు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయని చెప్పారు.

  • సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది.  స్పైస్‌జెట్, ఆకాసా ఎయిర్‌ విమానాలు  ఢీకొన్నాయి.  అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. 

    స్పైస్‌జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, నిలిచి ఉన్న అకాసా విమానాన్ని ఢీకొట్టింది. ఈ స్వల్ప ప్రమాదంలో రెండు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. స్పైస్‌జెట్ విమానం కుడి వింగ్‌లెట్ దెబ్బతినగా, అకాసా విమానం ఎడమ వైపు హారిజాంటల్ స్టెబిలైజర్‌కు దెబ్బ తగిలింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి

  • ఢిల్లీ: దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను కేంద్రం ఇవాళ(ఏప్రిల్‌ 16, గురువారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటిపై చర్చలో భాగంగా ప్రధాని సభలో ప్రసంగిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయ రంగు పులమొద్దన్నారు.

    ‘‘దేశ ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి నష్టపోవద్దు. క్షేత్రస్థాయిలో  మహిళా నాయకత్వం సిద్ధంగా ఉంది. నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని వారంతా భావిస్తున్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత నాది. బీసీ వర్గాల్లో జన్మించిన నాకు ప్రధాని పదవి దక్కడం రాజ్యాంగ నిర్మాతల చలవే.

    ..డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. గ్యారెంటీగా అంశాన్ని ఈ విషయాన్ని చెపుతున్నా. ఇప్పుడున్న నిష్పత్తిలో నియోజకవర్గాల్లో పెరుగుతాయి. మా విధానాల్లో స్పష్టత ఉంది. గతంలో జరిగిన మహిళలకు జరిగిన వివక్ష అనే పాపాన్ని కడిగేస్తున్నాం. సాంకేతిక అంశాలతో వ్యతిరేకించొద్దు. బిల్లును ఎలాగా ఆమోదించాలో సమయం నిర్ణయిస్తుంది. మూడు దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. ఈ బిల్లును తేవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు’’ అని ప్రధాని మోదీ అన్నారు.

    డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ విపక్షాలను హెచ్చరించారు. “దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. మహిళా రిజర్వేషన్ గొప్ప బిల్లు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం నా అదృష్టం. ఈ బిల్లులతో దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నాం. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అవుతుంది. దేశ రాజకీయాల్లో, వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం.

    ..మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారు. రాజకీయాల్లో తమ శక్తిని చాటేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఎవరికైనా అవకాశమిస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుంది. రాజకీయాల్లో సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళలు పుష్కలంగా ఉన్నారు. దేశ ప్రగతిలో మహిళలకూ బాగస్వామ్యం కల్పించాల్సిందే. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు.. మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదు. అది వారి హక్కు" అని మోదీ వ్యాఖ్యానించారు.

    మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయం చేయొద్దు

    “ఈ బిల్లును తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, ఉత్తరాది, దక్షిణాది అనే భేదభావం మాకు లేదు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం” అని మోదీ స్పష్టం చేశారు.

    ఈ బిల్లుతో కేవలం దేశంలోని మహిళలకు వారి హక్కులను కల్పిస్తున్నాం. ఈ బిల్లుపై క్రెడిట్ నాకు అవసరం లేదు. మీరే (విపక్షాలను ఉద్దేశిస్తూ) తీసుకోండి.. మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండి. ఈ బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండి. మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిద్దాం” అని మోదీ విపక్షాలను కోరారు.
     

  • TCS Nasik case టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్‌ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై లైంగిక వేధింపులు,మత మార్పిడి ఆరోపణల కేసులో రోజుకో పరిమాణం చోటు చేసుకుటోంది. ముఖ్యంగా మతమార్పిడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో సంచలన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, హిందూ మహిళలు నగరంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఘీ కొనసాగుతున్న  ఈ ఆందోళనలు, ఆఫీస్‌పై దాడుల  నేపథ్యంలో టీసీఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది.
     
    బలవంతపు మత మార్పిడులు జరిగాయని ఆరోపిస్తూ, ఏప్రిల్ 16, 17 తేదీలలో దేశవ్యాప్త నిరసనలకు బజరంగ్ దళ్ బుధవారం పిలుపునిచ్చింది. దీనికి తోడ స్థానిక రాజకీయ పార్టీలు కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్ననేపథ్యంలో, నాసిక్ బ్రాంచ్ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని (work from home) కోరింది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ పరిణామం గురించి తెలిసిన ఒక కంపెనీ అధికారి మీడియాకు తెలిపారు. నాసిక్ బీపీఓ యూనిట్ 5000 చదరపు అడుగుల కార్యాలయ స్థలం, ఇక్కడ సుమారు 170 మంది ఉద్యోగులు రెండు షిఫ్టులలో పనిచేస్తారు. ప్రస్తుతం, టీసీఎస్ కార్యాలయం ఉన్న అశోకా బిజినెస్ ఎన్‌క్లేవ్ గేటు బయట నాసిక్ పోలీసుల బృందం మోహరించి ఉంది అయితే పోలీసులు ప్రాంగణాన్ని అధికారికంగా సీల్ చేశారన్న వాదనలను కంపెనీ అధికారి ఖండించారు.

    ఇదీ చదవండి: టీసీఎస్‌ వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్‌

    కాగా టీసీఎస్ నాసిక్ బీపీఓ యూనిట్‌లో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆరోపిస్తూ మార్చిలో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు సమయంలో, 2022 మరియు 2026 మధ్య ఎదుర్కొన్న మానసిక మరియు లైంగిక వేధింపులకు సంబంధించి, అలాగే మానవ వనరుల విభాగం చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులు మరో ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ) విచారిస్తోంది.

    ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్‌ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి
     

  • ఢిల్లీ: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ) 10వ తరగతి బోర్డు ఫ‌లితాలు బుధ‌వారం విడుద‌ల‌య్యాయి. ప‌రీక్ష రాసిన వారిలో 93.66% మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఈసారి కూడా బాలిక‌లే పైచేయి సాధించారు. బాలికలు 94.99 శాతం ఉత్తీర్ణత నమోదు చేయ‌గా, బాలురు 92.69 శాతం మంది ఉత్తీర్ణుల‌య్యారు. మొత్తంగా చూస్తే ఉత్తీర్ణ‌త శాతం గ‌తేడాది (93.66)  కంటే ఈసారి 0.04 శాతం పెరిగింది.

    ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా 24.72 ల‌క్ష‌ల మంది ప‌రీక్షలు రాయ‌గా వారిలో 23.16 ల‌క్ష‌ల మంది పాస‌య్యారు. ఈ ఏడాది 10వ తరగతి బోర్డు పరీక్షల్లో మొత్తం 2,21,574 మంది విద్యార్థులు (8.96 శాతం) 90 శాతానికి పైగా మార్కులు సాధించగా..  55,364 మంది విద్యార్థులు (2.24 శాతం) 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. టాప‌ర్స్ వివ‌రాల‌ను సీబీఎస్ఈ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. పులువురు విద్యార్థులు వందకు వంద శాతం స్కోరు సాధించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

    ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్ద‌రు విద్యార్థుల‌కు 100 శాతం మార్కులు వ‌చ్చిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. బిధాన్‌నగర్‌లోని భవన్స్ గంగాబక్స్ కనోరియా విద్యామందిర్ విద్యార్థిని అనిషా ఘోష్, రాజ్‌పూర్ సోనార్‌పూర్‌లోని బీడీఎం ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి జయశిర్ష్య బసు 500కి 500 మార్కులు సాధించారు. 

    కాగా, మెడిసిన్ చ‌ద‌వాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని జయశిర్ష్య బసు తెలిపాడు. 12వ త‌ర‌గ‌తిలో పీసీఎంబీ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ) కోర్సులో చేరాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు. వంద శాతం మార్కులు సాధించ‌డం ప‌ట్ల అనిషా ఘోష్ ఆనందం వ్య‌క్తం చేసింది. అయితే క‌వ‌ల సోద‌రి అనిష్క‌కు 496 మార్కులు రావ‌డం కొంచెం నిరాశ‌కు గురిచేసింద‌ని తెలిపింది. తామిద్ద‌రం క‌ష్ట‌ప‌డి చ‌దివామ‌ని, స్కూల్ కూడా బాగా స‌హ‌క‌రించింద‌ని చెప్పింది.

    చ‌ద‌వండి: 'నాన్న‌'గా గ‌ర్వించే క్ష‌ణం!   

    పూరీకి చెందిన టీనా రాత్, ఘజియాబాద్‌కు చెందిన దక్ష్, గురుగ్రామ్‌కు చెందిన తానయ్ శ్రీవాస్తవ, సోనిపట్‌కు చెందిన మనన్ కూడా వంద శాతం స్కోరు చేసిన‌ట్టు మీడియా వెల్ల‌డించింది. కోచింగ్ కంటే సొంత ప్రిప‌రేష‌న్ ద్వారానే మంచి మార్కులు సాధించామ‌ని ప‌లువురు టాప‌ర్లు తెలిపారు. రోజుకు దాదాపు 13 గంట‌లు చదివాన‌ని దక్ష్ వెల్ల‌డించాడు. తాను 10 నుంచి 12 గంట‌ల పాటు ప్రిప‌రేష‌న్ సాగించాన‌ని టీనా రాత్ తెలిపింది. కార్డియాక్ సర్జన్ కావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పింది. 

    అప్పుడు, ఇప్పుడు సేమ్‌
    సీబీఎస్ఈ టెన్త్ 2026 ఫ‌లితాల్లో విజ‌య‌వాడ‌, తిరువ‌నంత‌పురం రీజియ‌న్లు 99.79 శాతం ఉత్తీర్ణ‌త‌తో టాప్‌లో నిలిచాయి. గ‌తేడాది ఫ‌లితాల్లో కూడా ఈ రెండు రీజియ‌న్లే మొద‌టి స్థానంలో ఉండ‌డం విశేషం. కాగా, విజ‌య‌వాడ రీజియ‌న్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. 

  • సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ విభజనపై బెంగళూరు సౌత్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌ విభజనతో ఏపీ విభజనను పోల్చారు. ఏపీ విభజనను బ్రిటీష్ కంటే చెత్తగా కాంగ్రెస్‌ చేసింది’ అని వ్యాఖ్యానించారు. 

    అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తాము సీట్లను, ప్రభావం తగ్గిపోతుందనే భావన  దక్షిణాది ప్రాంతాల్లో నెలకొంది. అయితే, ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి  పెంచుతుంది. తద్వారా ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. 

    సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరిగితే నేనే కేంద్రాన్ని ప్రశ్నిస్తా:ఎంపీ తేజస్వీ

     

Politics

  • తాడేపల్లి: తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతి అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరోసారి స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో మహిళలకు ‘గోల్డెన్‌ పిరియడ్‌’ అనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 

    ‘జగన్ పాలనలో  మహిళల భద్రత కోసం దిశ చట్టం, యాప్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకువ‌చ్చారు. ప్రతి పథకంలో మహిళలకే ప్రాధాన్యం. అమ్మ ఒడి, చేయూత, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉదాహరణలు. స్థానిక సంస్థల్లో 50% కంటే ఎక్కువగా మహిళలకు అవకాశం క‌ల్పించిన ఘ‌న‌త‌ వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వానిది. మహిళా బిల్లుకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యలు అభ్యంతరకరం. 

    కూటమి పాలనే మహిళలకు డార్క్ పిరియడ్.  సాక్షాత్తు ఎంపీగా ఉన్న శ‌బ‌రినే సీఎంవో అధికారి అవ‌మాస్తే సీఎం చంద్ర‌బాబు ఖండించ‌లేదు.  మహిళలపై అవమానకర వ్యాఖ్యల చేసిన‌ చరిత్ర టీడీపీదే. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చంద్రబాబును మ‌హిళా ఎంపీ శ‌బ‌రి నిల‌దీయాలి.  సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తున్నది టీడీపీనే.  మహిళల గౌరవం గురించి మాట్లాడే ముందు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

  • తాడేపల్లి : ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్‌ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

    దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు జోగి రమేష్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షులు హాజరయ్యారు. 

    ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిన నాయకుడు జగన్. అన్ని రంగాల్లోనూ జగన్ బీసీలకు అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారు. ఏ సంక్షేమ పథకమూ అందటం లేదు.కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగింది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది..’అని స్పష్టం చేశారు.

    BC నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి.. కీలక సమావేశం

     ఈ నెల 26న బీసీ గళం సమావేశం
    ఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు సజ్జల. దీనిలో భాగంగా ఆ సమావేశం పోస్టర్‌ను విడుదల చేశారు.

  • సాక్షి, నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ నిర్వహించిన మత్స్యకార భేటీ అద్భుత విజయం సాధించిందని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా గంగపుత్రులు నీరాజనం పట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనకు లభించిన భారీ స్పందన చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపిందని కాకాణి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..

    అడ్డంకులు సృష్టించినా ఆగని జన ప్రవాహం:
    జువ్వలదిన్నెలో వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడింది. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ అనుమతిని ఆఖరి నిమిషం వరకు పెండింగ్‌లో పెట్టారు. రవాణా శాఖ అధికారులతో వాహనాలను నిలిపివేసి, బారికేడ్లు పెట్టినా జనం ఆగలేదు. వేట సాగనివ్వమని, పథకాలు ఆపేస్తామని స్థానిక నేతలు మత్స్యకారులను బెదిరించినా, 4 వేల మందికి పైగా తరలివచ్చి వైఎస్‌ జగన్‌కి నీరాజనం పట్టారు. అది చూసి ఓర్చుకోలేకనో పచ్చ మీడియా రోత రాతలు రాస్తోంది. ఆ మీడియాల సర్టిఫికేట్లు మాకవసరం లేదు.

    ఆనం గారూ.. ఆ ఘటన మీకు గుర్తుందా?:
    జువ్వలదిన్నెలో వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. 2011లో సోంపేట మత్స్యకారులపై కాల్పులు జరిగినప్పుడు ఆనం మంత్రిగా ఉన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయినట్లు ఉన్నారు. మత్స్యకారుల రక్త చరిత్ర జగన్‌ది కాదు. మీ హయాంలో జరిగిన కాల్పులది. సోంపేటలో థర్మల్‌ ప్లాంట్‌ వద్దు అన్నదే వైఎస్‌ జగన్‌. కానీ, మీరు మాత్రం అన్నీ మర్చిపోయారు. చంద్రబాబులా మతిమరుపుతో మాట్లాడుతున్నారు.

    ఇంకా తమ ప్రాంతానికి వచ్చి, తమ వలలు తెంపి చేపలు వేటాడుతున్న పొరుగు రాష్ట్ర మెకనైజ్డ్‌ బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటే, వాటిని విడిచిపెట్టింది టీడీపీ నేతలు. ఈ విషయం ఆనంకు తెలియదా? జువ్వలదిన్నె హార్బర్‌ పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే 2019–24 మధ్య జరిగాయి. అందుకే ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని అదే పనిగా అబద్దాలు వల్లె వేయొద్దని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మంత్రి ఆనంకు హితవు చెప్పారు.

    మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ భరోసా: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
    వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌ పర్యటనకు రావడం మత్స్యకారులకు భరోసానిచ్చింది. కావలి నియోజకవర్గంలో దురాయి వేసినా, ఎన్ని అంక్షలు పెట్టినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన వారందరికీ పార్టీ తరపున ధన్యవాదాలు. మత్స్యకారులకు ఆస్తిగా ఇచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణ చర్య సరికాదు. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్ధితుల్లోనూ దాన్ని అడ్డుకునేలా చూస్తాం. మత్స్యకారులకే హార్బర్‌ చెందేలా చేస్తాం.

    పొరుగు రాష్ట్రాల మెకనైజ్డ్‌ బోట్లు ఇక్కడ చేపల వేటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయని, అవి వలలను తెంపి, తమ బోట్లను కూడా ధ్వంసం చేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు మొర పెట్టుకుంటే జగన్‌ హామీ ఇచ్చారు. మరో వైపు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న బోట్లను దొంగచాటుగా ఎత్తుకుని పోతే వాటిని తీసుకుని రాకుండా ప్రభుత్వం, అధికార పార్టీ మీన మేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికైనా ఆ బోట్లను వెనక్కి తీసుకుని రావాలి. మత్స్యకారులకు వైఎస్‌ జగన్‌ ఎప్పటికీ అండగా ఉంటారు.

    డిఫెన్స్‌ అకాడమీకి జువ్వలదిన్నె భూమి ఇవ్వడం తప్పు: పి.చంద్రశేఖర్‌రెడ్డి
    మత్స్యకారులకు తోడుగా నిల్చేలా వైఎస్‌ జగన్‌ 10 పిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఆయన ఏ మంచి పని చేసినా కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఆ దిశలోనే జువ్వలదిన్నె హార్బర్‌కు చెందిన భూమిని ఒక ప్రైవేటు డిఫెన్స్‌ అకాడమీకి ఇవ్వడం దారుణం. మరో చోట భూమి ఇచ్చే అవకాశం ఉన్నా ఫిషింగ్‌ జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ భూమి కేటాయించం తప్పు.

    మత్స్యకారులకు రూ.10 వేలు ఇచ్చిన ఘనత జగన్‌ది: కిలివేటి సంజీవయ్య
    నాడు సూళ్లూరుపేటలో జగన్‌ని కలిసిన మత్స్యకారులు చేపల వేట నిషేధ సమయంలో తమను ఆదుకోవాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం అక్కడి మత్స్యకారులకు రూ.5 వేలు ఇస్తోందని వారు చెప్పగా, తాము అధికారంలోకి వస్తే, రూ.10 వేలు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మాట నిలబెట్టుకున్నారు. మత్స్యకార భరోసా కింద వారికి ఆర్థిక సాయం చేశారు.

    వైఎస్‌ జగన్‌పై మత్స్యకారులకు అపార విశ్వాసం: కాకాణి పూజిత
    వైఎస్‌ జగన్‌ది జువ్వెలదిన్నె పర్యటన సందర్బంగా ఎన్ని అడ్డంకులు పెట్టినా పెద్ద సంఖ్యలో హాజరైన మత్స్యకారులు తమకు కేవలం ఆయన వల్లే మేలు జరుగుతుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. అదే వారు బలంగా నమ్ముతున్నారు కూడా. అదే నిజం. వైఎస్‌ మాట మీద నిలబడతారు. రేపు అధికారంలోకి వచ్చాక, జువ్వెలదిన్నె హార్బర్‌ను మత్స్యకారులకు అప్పగిస్తారు.

  • సాక్షి, న్యూఢిల్లీ: డీలిమిటేషన్‌ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని.. మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బెంగళూరు సౌత్‌ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు.  

    1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు ఈ బిల్లును విస్మరించాయి. కానీ, ప్రధాని మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు.  కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. 

    రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్‌ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్‌ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు. డీలిమిటేషన్‌ వద్దని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ, అదే జరిగితే కేరళలో పది సీట్లు పెరుగుతాయి. ఇది కేరళకు లాభమే గానీ నష్టం కాదు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థమే లేదు. 

    డీలిమిటేషన్‌ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ఓ కొలిక్కి వస్తోంది. ఈరోజు కోసం దేశం 40 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. 2029లో అమలయ్యే మహిళా రిజర్వేషన్లతో దేశం అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సూర్యనారీశక్తి బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం చావడానికైనా నేను సిద్ధం’’ అని తేజస్వీ సూర్య ప్రసంగించారు.

    రేవంత్‌ది ఫూలిష్‌ ప్రతిపాదన..

    సీఎం రేవంత్‌ ప్రతిపాదనపై స్పందిస్తూ.. 
    డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాదనను చర్చ సందర్భంగా తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ‘‘రేవంత్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన హైబ్రిడ్‌ వాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. జీఎస్‌డీపీ ఆధారంగా సీట్ల సంఖ్య పెంచమని రేవంత్‌ అన్నారు. ఆ సలహా ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు. ఆయనత ఎచ్చిన ప్రతిపాదన ఫూలిష్‌గా ఉంది. జీఎస్‌డీపీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఆ లెక్కన సీట్ల సంఖ్య మారుతూ ఉండాలా?. ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం.. ఒకరికి ఒక్క ఓటే ఉంటుంది. డీలిమిటేషన్‌ ఏపీ, తెలంగాణలో 52 శాతం సీట్లు పెరుగుతాయి.  తమిళనాడులో 49 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో 23.9 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు అనేది రాజ్యాంగబద్ధమే.  డీలిమిటేషన్‌తో సీట్ల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయమే జరుగుతుంది’’ అని తేజస్వీ అన్నారు.