Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

    టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో నటి లయ గురించి మాట్లాడుతూ వంశీ నందిపాటి..‘నందులను పందుల్లా పెంచింది’అని  వ్యాఖ్యానించారు.

    ఈ మాటలు అక్కడే ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేయగా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం నిర్మాతకు తగదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులను తక్కువ చేసి మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిని అవమానించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదని సినీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.

    వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆయనపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కొందరు ఆయనను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వంశీ ఉద్దేశం అంతకంటే వేరుగా ఉండవచ్చని అంటున్నారు.

  • హీరో వెంకటేశ్ పేరు చెప్పగానే చాలా రీమేక్స్ గుర్తొస్తాయి. 'దృశ్యం' వాటిలో ఒకటి. గత కొన్నాళ్ల ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలతో చాలామంది ఆడియెన్స్‌కి దగ్గరయ్యారు. రాంబాబు పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే మూడో పార్ట్ నుంచి వెంకీ సైడ్ అయ్యాడనే రూమర్స్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమని కూడా అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

    మలయాళంలో తొలుత మోహన్ లాల్ హీరోగా 'దృశ్యం' సినిమా వచ్చింది. థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త సెన్సేషన్ సృష్టించింది. దీన్ని తెలుగు, తమిళ, హిందీతో పాటు చాలా భాషల్లో రీమేక్ చేశారు. ఆయా భాషల్లోనూ హిట్ అయింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించాడు. గతేడాది జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మూడో భాగాన్ని మొదలుపెట్టారు. కొన్నాళ్ల క్రితం పూర్తి చేశారు. ఈ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగానూ ప్రకటించారు.

    (ఇదీ చదవండి: తమిళ బోల్ట్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)

    మలయాళంతో పాటు హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా 'దృశ్యం 3' కూడా రెడీ అయిపోతోంది. ఈ ఏడాదిలోనే హిందీ వెర్షన్ కూడా థియేటర్లలోకి రానుంది. కానీ తెలుగులో మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. దీంతో అసలు తీస్తారా లేదా అనే సందేహాలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. మూడో పార్ట్ నుంచి వెంకీ తప్పుకొన్నారట. రెమ్యునరేషన్ విషయమే కారణమని అంటున్నారు. ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.

    ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' చేస్తున్న వెంకటేశ్.. దీని తర్వాత అనిల్ రావిపూడితో కలిసి మరోసారి పనిచేయబోతున్నారనే మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ 'దృశ్యం 3' చేస్తే అప్పటికే మలయాళ, హిందీ వెర్షన్స్ థియేటర్లలో రిలీజై, ఓటీటీలోకి కూడా వచ్చేస్తాయి. భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియెన్స్ చూసే అవకాశాలే ఎక్కువ. ఈ కారణం కూడా వెంకటేశ్ తప్పుకోవడానికి కారణమయ్యుండొచ్చని అంటున్నారు.

    (ఇదీ చదవండి: వైరల్ అయిపోతున్న 'ఆయా షేర్' పాట రిలీజ్)

  • నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. లెక్క ప్రకారం మార్చిలోనే థియేటర్లలోకి రావాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. నాని పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి తొలి పాట రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' అంటూ సాగే ఈ గీతం.. ప్రోమోతోనే ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్తి పాట కూడా అలానే అదరగొడుతోంది.

    మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'ప్యారడైజ్' సినిమా తీస్తున్నారు. ఇందులో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా చేస్తోంది. మోహన్ బాబు విలన్ కాగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. విడుదలకు ఇంకా చాలారోజులు ఉంది కానీ హైప్ అయితే ఈ మూవీపై మామూలుగా లేదు.

  • చీరలో బిగ్‌బాస్ విష్ణుప్రియ సోయగాలు

    వైట్ డ్రస్‌లో ఏంజెల్‌లా మృణాల్ ఠాకుర్

    సెల్ఫీతో గ్లామర్ చూపించేస్తున్న హన్సిక

    థాయ్‌ల్యాండ్‌ ఏనుగుల రిసార్ట్‌లో రీతూ వర్మ

    ఫ్రెండ్ పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్న దివ్యభారతి

    అక్కతో కలిసి రిసార్ట్‌లో నేహా శర్మ చిల్ మోడ్

  • ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇతర భాషల చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా గతవారం ఓటీటీలోకి వచ్చిన తమిళ బోల్డ్ మూవీ 'హాట్‪‌స్పాట్ 2 మచ్'. ఏకంగా ఆరు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి వచ్చింది. అయితే అన్నింటిలోనూ ఒరిజివల్ వెర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కోసం డబ్బింగ్ రూపంలోనూ తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)

    2024లో తొలి పార్ట్ రిలీజ్ కాగా ఈ ఏడాది థియేటర్లలో సీక్వెల్ రిలీజ్ చేశారు. ప్రియాభవనీ శంకర్ లీడ్ రోల్ చేసింది. మొత్తంగా మూడు బోల్డ్ స్టోరీలని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ అనే కాన్సెప్ట్స్‌ని షాకిచ్చే స్టైల్లో ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు శుక్రవారం(ఫిబ్రవరి 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

    'హాట్‌స్పాట్ 2' విషయానికొస్తే.. శిల్ప(ప్రియా భవానీ శంకర్) అనే అమ్మాయి ఓ నిర్మాత దగ్గరకు స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి వస్తుంది. మూడు కథలు చెబుతుంది. వీటిలో మొదటిది హీరోలని పిచ్చిగా అభిమానించే ఓ ఇద్దరు కుర్రాళ్ల గురించి కాగా.. రెండోది డ్రస్సింగ్ సెన్స్ గురించి.. మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అనేలా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఈ నిర్మాత దగ్గరకే ఎందుకొచ్చింది? ఈ స్టోరీలు చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి?  అనేదే స్టోరీ.

    (ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

  • గతేడాది రిలీజైన 'కోర్ట్' సినిమాతో ఆకట్టుకున్న రోషన్-శ్రీదేవి.. మరోసారి జంటగా నటించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో దీన్ని తెరకెక్కించారు. సతీష్ జవ్వాజీ దర్శకుడు కాగా విజయ్ బుల్గానిన్ సంగీతమందించారు. మార్చి 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఎంటర్‌టైనింగ్‌గా ఆకట్టుకునేలా ఉంది.

    (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)

    'బ్యాండ్ మేళం' సినిమా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ. బావమరదలు అయిన హీరోహీరోయిన్ మధ్య గిల్లికజ్జాలు, ప్రేమ, బ్రేకప్ లాంటివి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పాత్రధారులైన రోషన్, శ్రీదేవి చూడటానికి బాగానే ఉన్నారు. మరి ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?

    (ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

  • టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.

    (ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

    కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్‌పుర్‌లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్‌లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.

    ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్‌లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 3వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

    అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.

    (ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?)

  • ‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్‌లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు  కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్‌ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 

    2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది.  ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

  • రెండేళ్ల క్రితం వచ్చిన 'కల్కి 2898 AD' ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు చేశారు. చివరలో ప్రభాస్‌ని కర్ణుడి పాత్రలో చూపించి సీక్వెల్‌పై అప్పుడే హైప్ పెంచారు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే దీపిక.. ఈ మూవీ నుంచి తప్పుకోవడం లాంటివి జరగడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. దానికి తోడు ప్రభాస్ కూడా పలు మూవీస్‌తో బిజీగా ఉన్నాడు.

    (ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

    కొన్నిరోజుల క్రితమే ఎట్టకేలకు 'కల్కి' సీక్వెల్ షూటింగ్ మొదలైంది. తొలి భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్రలో భయపెట్టిన కమల్ హాసన్ ఇందులో పూర్తిస్థాయి పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అమితాబ్.. ఎప్పటిలానే అశ్వద్ధామగా అలరించబోతున్నాడు. తాజాగా వీళ్లిద్దరూ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ ఫొటోలని అమితాబ్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల తర్వాత కమల్‌తో మళ్లీ కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు.

    'దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి ఇస్తోంది. చివరగా మేమిద్దరం 1985లో 'గిరఫ్తార్'లో కలిసి నటించాం' అని అమితాబ్ రాసుకొచ్చారు. వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరి ప్రభాస్ ఎక్కడున్నాడు? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్' షూటింగ్స్‌తో బిజీగా ఉన్న డార్లింగ్ హీరో.. మరి ఈ సెట్స్‌కి ఎప్పుడొస్తాడనేది తెలియాల్సి ఉంది.

    ఇదే సినిమా తొలి భాగంలో సుమతిగా కీలక పాత్ర చేసిన దీపికా పదుకొణె.. సీక్వెల్ నుంచి తప్పుకొంది. చాన్నాళ్ల క్రితమే నిర్మాణ సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు. సాయిపల్లవిని తీసుకున్నారనే టాక్ వినిపించింది. కానీ నిర్మాణ సంస్థ ఈ విషయం ఎప్పుడు ప్రకటిస్తుందో ఏంటో?

    (ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

  • అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్‌పుర్‌లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?

    (ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

    విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్‌లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.

    'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.

    మరో మూవీ ఈవెంట్‌లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్‌కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్‌ గ్యాప్‌ ఎంతంటే?)

  • ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు, ఇష్టపడే వాళ్ల సంఖ్య బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు.. వీటిపట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ కొరియన్ కాన్సెప్ట్ మూవీలో 'ఓజీ' ఫేమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడీ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో తీసిన తమిళ సినిమా 'మేడిన్ కొరియా'. దీన్ని ఓటీటీ కోసమే రూపొందించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించాడు. గత నెలలో ఈ చిత్ర గురించి ప్రకటన రాగా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

    చిన్నప్పటి నుంచి కొరియా అంటే ఇష్టం పెంచుకున్న ఓ అమ్మాయి.. పెరిగి పెద్దయిన తర్వాత అనుకున్నట్లే కొరియా వెళ్తుంది. ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? చివరకు ఏం తెలుసుకుంది అనేదే స్టోరీలా అనిపిస్తుంది. గత నెలలో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తే కాన్సెప్ట్‌పై ఇంకాస్త క్లారిటీ రావొచ్చు.

    ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రానున్నాయి. వాటిలో నవీన్ చంద్ర 'హనీ', అక్యూజ్డ్ అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. అలానే డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్‌ప్రైజ్ చిత్రాలు కూడా అందుబాటులోకి రావొచ్చేమో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

  • గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటి అనుపమ పరమేశ్వరన్. నిరంతరం షూటింగులతో బిజీగా ఉండే ఈ మలయాళ కుట్టి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితాన్ని మలుపు తిప్పిన చేదు జ్ఞాపకాన్ని పంచుకుంది. ఆమె ఆహారపు అలవాట్లనే మార్చేసి, ఆమెను కొన్నాళ్ల పాటు శాకాహారిగా మార్చిన ఆ ‘మటన్ బిర్యానీ’ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    అసలేం జరిగింది?
    బ్లాక్ బస్టర్ హిట్ 'కార్తికేయ-2' షూటింగ్ సమయంలో సెట్‌లోకి ఓ చిన్న మేకపిల్ల వచ్చిదంట. ఆ సమయంలో అక్కడే ఉన్న అనుపమ..దానితో కాసేపు ఆడుకొని, వదిలిపెట్టేసిందట. కట్‌ చేస్తే.. అదే రోజు మధ్యాహ్నం లంచ్‌ చేస్తుంటే.. అసిస్టెంట్ వచ్చి నవ్వుతూ  ‘మేడం.. మీరు తింటున్నది పొద్దున్నే మీరు ఎంతో ప్రేమగా ఆడుకున్న ఆ మేకపిల్లతో తయారు చేసిన బిర్యానీయే’ అన్నారట. ‘ఆ మాట విన్న వెంటనే ఆమె గొంతులో ముద్ద దిగలేదు.ప్లేటు పక్కన పడేశా. వాంతులు కూడా చేసుకున్నా. ఆ రోజు నుంచి మటన్‌ తినడమే మానేశా. చాలా రోజుల పాటు మటన్‌ విషయం వస్తే.. ఆ మేకపిల్ల గుర్తుకు వచ్చేది. ఈ మధ్యే మళ్లీ తినడం స్టార్ట్‌ చేశా’ అని ఓ ఇంటర్వ్యూలో అనుపమ చెప్పుకొచ్చింది. 

    అనుపమ కెరీర్‌ విషయానికొస్తే..గత ఏడాది తెలుగులో ‘కిష్కింధపురి’, ‘పరదా’తో పాటు, మలయాళం, హిందీలో కలిసి మొత్తం ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం.ఆర్జే షాన్ దర్శకత్వంతో ఓ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌ చేస్తోంది. 

  • సాంకేతికత ఎంత ఎదిగితే అంత ముప్పు కూడా ఉంటుందనే మాట నిజమనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న దృశ్యాలు అసలు-నకిలీల మధ్య తేడాను చెరిపేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే.. అవి నిజమా కాదా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నాం. అలాంటి ఓ ఫన్నీ ఏఐ వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు గల్ల పట్టుకొని కొట్టుకుంటున్నారు.

    ఏఐతో క్రియేట్‌ చేసిన ఈ వీడియోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘సినిమా చనిపోయింది’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో మహేష్ బాబు, రాజమౌళి అత్యంత సహజంగా గొడవ పడుతుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఏఐతో ఏదైనా సాధ్యమే’, ‘బహుశా పాస్‌పోర్ట్ విషయంలోనే(వారణాసి షూటింగ్‌ మొదలైనప్పుడు మహేశ్‌ పాస్‌పోర్ట్‌ లాక్‌ చేసినట్లుగా జక్కన్న ఓ పోస్ట్‌ పెట్టాడు) ఈ గొడవ జరుగుతుందేమో’, ‘వారణాసి ప్రచారం సమయంలో కచ్చితంగా ఈ వీడియోను ప్లే చేస్తా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమది ఇలాంటి వీడియోల వల్ల సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    వారణాసి విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేశ్‌బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమరన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు .వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుది. 

  •  శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు యదునాథ్‌ మారుతీ రావు తెరకెక్కించిన ఈ మూవీని హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న రిలీజ్‌ కానుంది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్‌ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్‌ సంగీతం అందించారు.
     

  • అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 6న అల్లు శిరీష్‌-నయనికల వివాహం జరగనుంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్‌ తన నివాసంలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. అందులో రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. తర్వాత కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. అయ్యప్పమాలలో ఉన్న రామ్‌ చరణ్‌ మద్యం పార్టీలో పాల్గొనడం ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ సమాధానం ఇచ్చారు.

    చరణ్‌ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్‌కు సమాధానంగా ఆయన రిప్లై ఇచ్చారు. పార్టీ ప్రారంభం కాకముందే రామ్‌ చరణ్‌ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్‌ చెప్పారు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణ లేదన్నారు. చరణ్‌ కూడా కేవలం హాల్‌ వరకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకొచ్చారు. తమకు శుభాకాంక్షలు చెప్పిన వెంటనే అక్కడి నుంచి తిరిగెళ్లిపోయారని గుర్తుచేశారు. ఆ తర్వాతనే అక్కడ పార్టీ మొదలైందని తెలిపారు. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో  అందరికీ తెలుసని  గుర్తుచేశారు. మాలలో ఉన్నప్పుడు బయట కనీసం నీళ్లు కూడా చరణ్‌ తీసుకోరని శిరీష్‌ తెలిపారు.

    సుమారు 20ఏళ్లగా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మాలలో రామ్ చరణ్ కనిపిస్తూనే ఉంటారని అందరికీ తెలిసిందే. ఏడాదిలో కనీసం 100రోజులకు పైగానే ఆయన భక్తి మార్గంలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల తనను తాను క్రమశిక్షణగా ఉండటం కోసం ఆపై భక్తి మార్గంలో ఉండటం వల్ల మంచి జరుగుతుందని ఆయన గతంలో చెప్పారు. చరణ్‌ గురించి పూర్తి విషయాలు తెలీకుండానే ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా అభ్యంతరం తెలుపుతున్నారు.

Andhra Pradesh

  • సాక్షి,తాడేపల్లి: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందడంతో పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై  వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

    శ్రీకాకుళం డయేరియా ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందించారు. ‘తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం ..ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. వెంటిలేటర్‌పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి.

    ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ది చెబుతారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని  వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 

  • సాక్షి రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో దురదృష్టవశాత్తు మరోకరు ప్రాణాలు వదిలారు. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు ఈ రోజు ప్రాణాలు వదిలారు. దీంతో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అయితే కల్తీపాలు తాగి ఇదివరకూ నలుగురు మృతి చెందగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

    కల్తీ పాలు తాగి ఇదివరకే దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన  యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్‌కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారు. తాజాగా వీరిలో ఒక బాలుడు మృతి చెందారు.  

  • పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల  పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైఎస్‌ జగన్‌ పులివెందులకు బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు.  పులివెందులలోని భాకరా­పురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

    25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యా­హ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

    పులివెందుల చేరుకున్న జగన్
  • ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు చనిపోగా సోమవారం మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది.  మృతులను  నర్సింగ్‌రావు సురేష్‌లుగా గుర్తించారు. 

    దాదాపు 75 మంది డయేరియా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోల్కొండ రేవు, దమల వీధి, బొడ్డెమ్మకోవెల మరియు మంగువారితోట వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుండి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.. పిల్లలు వృద్ధులు ప్రభావితమైన వారిలో ఉన్నారు. దీంతోఆందోళనకర పరిస్థితులునెలకొన్నాయి. డయేరియా అధికారులు ఆలస్యంగా స్పందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 

    మరోవైపు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించి, ఆలస్యం లేకుండా ప్రయోగశాల పరీక్షలకు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

  • సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్‌ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.

    జీవోలు  746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్‌ జగన్‌ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది.

     

  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు.

    మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణ
    పాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.

    ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజని
    కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.

    రెయిన్‌బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.

    ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారు

    ఆరోగ్య శాఖ నిద్రపోతుంది..! కల్తీ పాల ఘటనపై రజిని

    బాధితులకు అండగా ఉంటాం: తానేటి వనిత
    ఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి.

National

  • పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత ’కుండలి’ (జాతకం) సరిపోలేదనే  కారణం చూపించి పెళ్లి నిరాకరించడం అంటే అనేది భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 69 పరిధిలోకి వస్తుందని  అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.  ఈ సెక్షన్‌ మోసపూరిత మార్గాల ద్వారా లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఒక మహిళను మోసం చేసిన మగవాడికి  బెయిల్‌ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ, జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

    తమ వివాహానికి ఎటువంటి అడ్డంకులు లేవని నిందితుడు పదేపదే మహిళకు హామీ ఇవ్వడం ఆధారంగా శారీరక సంబంధాలు కొనసాగించాడని  తెలుస్తోంది.  అందువల్ల, ’జాతకం’  సరిపోకపోవడం అంటూ కారణం చూపడం అంటే అతని ప్రవర్తన బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ 69 కింద నేరం అవుతుందని జస్టిస్‌ శర్మ వెల్లడించారు.

    ఓ మహిళతో సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడనే ఫిర్యాదుతో గత జనవరి 4 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఓ నిందితుడి బెయిల్‌ మంజూరు సమయంలో వాదోపవాదాల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తమ  సంబంధం ఏకాభిప్రాయంతో ఏర్పడిందని,  తామిద్దరూ ఎనిమిది సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసని నిందితుడు తరపు లాయర్‌ వాదించాడు.  ఈ కేసులో అత్యాచారం లాంటివేవీ జరుగనందున తమ క్లయింట్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పొందడానికి అర్హుడని బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరాడు.

    నిందితుడు తనను మోసం చేశాడని ఓ మహిళ మొదటి ఫిర్యాదును గత నవంబర్‌ లో దాఖలు చేసింది. అయితే  నిందితుడు అతని కుటుంబం ఇచ్చినట్లు చెబుతున్న వివాహ హామీ ఆధారంగా ఆ తర్వాత దానిని ఉపసంహరించుకుంది.  కానీ జాతకాలు  సరిపోలడం లేదనే కారణంతో వారు మరోసారి వివాహానికి నిరాకరించారు. దీంతో బాధితురాలు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

    ఈ సంఘటనల క్రమం చూస్తే ఇది ‘సంబంధం చెడిపోవడం‘ మాత్రమే కాదని, జాతకం కలవాలని అనుకున్నప్పటికీ. దరఖాస్తుదారుడు అతని కుటుంబం .. అంతకు ముందు పదేపదే వివాహ హామీలు ఇవ్వడం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ‘సంబంధం విఫలమైనందున లేదా వివాహం కార్యరూపం దాల్చనందున క్రిమినల్‌ చట్టాన్ని అమలు చేయలేమనే ప్రతిపాదనలో ఎటువంటి వివాదం లేదు. అయితే, ఈ దశలో ప్రస్తుత కేసు వేరే ప్రాతిపదికన ఉంది‘ అని కోర్టు పేర్కొంది. ‘గతంలో  హామీ ఇచ్చినప్పటికీ జాతకాలు సరిపోలడం లేదనే కారణంతో వివాహం చేసుకోవడానికి నిరాకరించడం, , ప్రాథమికంగా దరఖాస్తుదారుడు ఇచ్చిన వాగ్దానంలోని వాస్తవికతపై ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ దశలో అలాంటి ప్రవర్తన బిఎన్‌ఎస్‌  సెక్షన్‌ 69 కింద నేరంగా పరిగణన పొందుతుంది అంటూ కోర్టు తేల్చింది.

  • న్యూఢిల్లీ: అజిత్‌ పవార్‌ విమానం ప్రమాదంపై  డీజీసీఏ చర్యలు చేపట్టింది. వీఎస్‌ఆర్‌ వెంచర్స్‌కు చెందిన 4 విమానాలపై నిషేధించింది. స్పెషల్‌ ఆడిట్‌ ఆధారంగా డీజీసీఏ చర్యలు చేపట్టింది.

    గత నెల చివర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌  విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లా లోని పవార్‌ స్వస్థలమైన బారామతిలో బుధవారం ఉదయం విమానాశ్రయంలో దిగేందుకు కొద్ది క్షణాల ముందు రన్‌వేకు కేవలం 100 అడుగుల దూరంలో ఈ దారుణం జరిగింది.

    రన్‌వే కన్పించకపోవడంతో మరో రౌండ్‌ చుట్టి తిరిగి వచ్చే క్రమంలో విమానం అదుపు తప్పింది. క్షణాల వ్యవధిలోనే శరవేగంగా కింద పడిపోయింది. నేలను ఢీకొట్టగానే మంటలు చెలరేగి పేలిపోయింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు ముక్కలైంది. దాంతో పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు కూడా అక్కడికక్కడే మరణించారు.

  • చైన్నై:  తమిళనాడులో ఎన్నికల వేళ మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని శశికళ ప్రకటించింది. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగిన సభలో పార్టీ జెండా ఆవిష్కరించింది. తెలుపు, నలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. దివంగత నేతలు జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్‌ గుర్తులతో జెండా ఉంది. అయితే పార్టీ పేరు మాత్రం త్వరలోనే ప్రకటిస్తానని శశికళ తెలిపింది. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంది.

    అయితే ఈ రోజు ఉధయం (మంగళవారం) దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శశికళ.. త్వరలోనే ఒక శుభవార్త వింటారని బహిరంగంగా ప్రకటించారు. దీంతో రేపోమాపో శశికళ తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ, కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు సర్వత్రా వినిపించాయి. ఇంతలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

    కాగా శశికళ ,జయలలితకు అత్యంత సన్నిహితురాలు ఆమె  మరణానంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవించి, తదనంతరం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, గత  కొంతకాలంటా చెన్నై వేదికగా తన మద్దతుదారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతురాలైనప్పటికీ, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారనే మాట వినిపిస్తోంది. 

    ఈ క్రమంలోనే ఆమె అనుచరులు సైతం ‘చిన్నమ్మ’ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. దీంతో తమిళనాట పొలిటికల్ హీట్ మరింత ముదిరింది. తమిళనాడులో ఇదివరకే ఫిలిం స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

  • ఢిల్లీ: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై దేశవ్యాప్తంగా దుమారం చేలరేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా  ఆ ఘటనను మాజీ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటన జాతిద్రోహ చర్యగా అభివర్ణించారు. ‌

    ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ చర్యలపై 270కి పైగా మాజీ న్యాయమూర్తుులు, అధికారులు కలిసి సంయుక్తంగా కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇది అకస్మికంగా జరిగింది కాదు.  ఈ కుట్రను ముందుగానే ప్లాన్ చేశారు. ప్రపంచ సాంకేతికతకు చెందిన నాయకులకు, అంతర్జాతీయ ప్రతినిధులకు అతిథ్యం ఇస్తున్న తరుణంలో ఇలాంటి నిరసన చేయడం సరికాదు. ఇది జాతిద్రోహం. ఇది భారత దేశ ప్రతిష్ఠకు తీరని భంగం అని ‍అన్నారు.

    ప్రపంచస్థాయికి కార్యక్రమాలు జరుగుతున్న వేదికలపై నిరసన తెలిపితే.. భారతదేశం ప్రపంచస్థాయి పెట్టుబడులకు మార్గంగా కాకుండా నిరసనలు జరిగే దేశంగా గుర్తింపు పొందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల భారత్‌కు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు  మన దేశ శాస్త్రవేత్తల కృషిని, ఇంజనీర్ల కోరికను, 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలను అపహాస్యం చేస్తుందని పేర్కొన్నారు.

    ప్రజాస్వామ్యంగా నిరసన తెలపడమనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ, దేశాన్ని బహిరంగంగా ఇబ్బంది పెట్టే విధంగా అది ఉండకూడదన్నారు. ప్రభుత్వ విధానాల పట్ల ఏదైనా వ్యతిరేకత ఉంటే "మేధోపరమైన కఠినత్వం మరియు పార్లమెంటరీ చర్చ" ద్వారా వాటిని వ్యక్తపరచాలని పేర్కొన్నారు.  ఇటువంచి చర్యల వల్ల హానీ ప్రభుత్వాలకు కలగదని... ప్రజలకు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సంయుక్త ప్రకటనలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్‌ఎన్‌ ధింగ్రా, త్రిపుర మాజీ డిజీపీ బీఎల్‌ వోహ్రా తదితర ప్రముఖులున్నారు.

    అయితే ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ నిరసన చేపట్టడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్‌ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? అని ప్రశ్నించారు. కాగా గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రతిష్ఠ దిగజార్చేలా కాంగ్రెస్ నిరసన చేపట్టిందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

  • తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ఇదీ చదవండి: గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం

    ప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ  నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని  దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్‌లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ  గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు.

     దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను  ఆశ్రయించాడు. అతని  ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్‌ తురువేకెరె పోలీస్ స్టేషన్‌లో తమకు అందిన ఫిర్యాదు   మేరకు  ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 
    ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!

  • తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్‌ చేస్తే ఇద్దరూ కలిసి  ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాలు ఇలా ఉన్నాయి.

    కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం  తెలిసింది. 

    జయలక్ష్మి  సోదరి, ఆమె కొడుకే  హత్య చేశారని  చిక్కనాయకనహళ్లి పోలీసుల  ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్‌ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగాఅసలు విషయం తెలిసింది.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!

    పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్‌ అనే వ్యక్తితో  లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్‌ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు  లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్‌ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మ , శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి  రావాల్సిన సాయం అందదని,  ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట.

  • న్యూఢిల్లీ:  కేరళ రాష్ట్ర పేరు కేరళంగా  మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి కేరళ కాస్తా కేరళం అయ్యే చాన్స్‌ ఉంది. అయితే కేరళ పేరు మార్పు బిల్లును  కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపాల్సి ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత ఈ  బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.

    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • కేరళ పేరు కేరళంగా మార్పు
    • అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్‌-2కు ఆమోదం
    • గోండియా-జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ఆమోదం
    • విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు  ఆమోదం
    • మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
    • మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ మీదుగా మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు
    • బొగ్గు, స్టీల్, ఇనుము, సిమెంట్ ,స్టోన్  చిప్స్ , ఫ్లై యాష్ ,ఫర్టిలైజర్స్, లైమ్ స్టోన్, మ్యాంగనీస్ ,  ఆహార ధాన్యాల రవాణాకు కీలకం కానున్న మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్.. ప్రతి ఏడాది  52 మిలియన్ టన్నుల సరుకు రవాణా  
    • 9072 కోట్ల రూపాయలతో 307 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం..2031 కల్లా నిర్మాణం పూర్తి
    • జ్యూట్ మద్దతు ధర క్వింటాలు 5,295 రూపాయల పెంపుకు  క్యాబినెట్ ఆమోదం
    • పంట వ్యయంపై 61% పైగా లాభం వచ్చేలా మద్దతు ధర నిర్ణయం
    • శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సివిల్ ఎన్‌క్లేవ్‌ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
    • 1,677 కోట్ల రూపాయలతో నిర్మాణం కానున్న సివిల్ ఎన్‌క్లేవ్‌
    • ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో  15 విమానాలు పార్కింగ్ చేసే సదుపాయం  
    • గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు నార్త్ సౌత్ కారిడార్ నిర్మాణానికి  క్యాబినెట్ ఆమోదం
    • కారిడార్ నిర్మాణానికి ఒక వెయ్యి 67 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం
       
  • జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్‌(Jharkhand Air Ambulance Crash) లో  ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.  రాంచీ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే  జరిగిన ఎయిర్ అంబులెన్స్‌ ప్రమాదంలో రోగి సంజయ్ కుమార్ షా (41), అతని భార్య అర్చన దేవి, బంధువు ధ్రువ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, నర్సు సచిన్ కుమార్ మిశ్రా , ఇద్దరు పైలట్లు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్‌రాజ్‌దీప్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అత్యంత విషాదకరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి.

    సంజయ్ గత సోమవారం, జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలోని చాంద్‌వాలోని  తన హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, వైద్యులు అతన్ని ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రికి పంపించాలనుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే అవకాశం లేకపోవడంతోఅతని కుటుంబం బంధువులను సంప్రదించి ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 7.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. 

    క్షణాల్లో అంతా అయిపోయింది
    రాంచీ విమానాశ్రయంలో సంజయ్‌ను అలా పంపించి ఇంటికి వచ్చారో లేదో ప్రమాదం  జరిగిందని, అంతా ఒక్క క్షణంలో ముగిసిపో​యిందంటూ సంజయ్ అన్నయ్య విజయ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో  సంజయ్‌తోపాటు, అతని భార్య అర్చన కూడా  చనిపోవడంతో  ఇద్దరు పిల్లలను అనాథలుగా మారారని కుటుంబం వాపోయింది. రాంచీలో మెరుగైన వైద్య సౌకర్యాలు ఉంటే, సంజయ్‌ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదనీ,అతనికి సరైన చికిత్స అందించి ఉంటే, విలువైన ప్రాణాలను కాపాడగలిగేవారమని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

     

    మరోవైపు  ఈ ప్రమాదంలో మరణించిన డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా  కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. తన కొడుకును డాక్టర్‌గా చేయడానికి  ఉన్న భూమ నంతా అమ్మేశానని, ఇపుడు అతనే లేకుండా పోయాడని భావోద్వేగానికి లోనయ్యారు. అతని ఏడేళ్ల కొడుకు ఉన్నాడు... అతను ప్రతిభావంతుడు మరియు ఒడిశాలోని కటక్ నుండి MBBS పూర్తి చేసి రాంచీలోని సదర్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేరారని గుప్తా తండ్రి బజరంగీ ప్రసాద్  తెలిపారు.

    ఎంతోమంది ప్రాణాలు కాపాడిన పైలట్‌ దుర్మరణం
    ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో మరణించిన పైలట్ వికాస్ భగత్ తండ్రి  డీఎస్‌ భగత్ తన కొడుకు మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఎయిర్ అంబులెన్స్ నడపడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడిని తన కొడుకు ఈ రోజు అతను ప్రాణాలు కోల్పోయాడని వాపోయారు. సంఘటనకు ముందు తన తల్లితో మాట్లాడాడు అంటూ తన ఏకైక  కుమారుడి మరణాన్ని తలుచుకుని కుమిలిపోయారు.  

     

  • జార్ఖండ్‌లో విషాదం జరిగింది. అత్యవసర చికిత్స నిమిత్తం రాంచీ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్‌ అంబులెన్స్ దురదృష్టవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో  కెప్టెన్‌ తో సహా అందులో ప్రయాణిస్తున్న 7గురు అక్కడిక్కకడే మృతిచెందారు. ఈ ప్రమాద వివరాలను అక్కడి అధికారులు అధికారికంగా ధృవీకరించారు.

    ప్రమాదంలో మృతిచెందిన వారు కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవ్రాజ్ దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనాదేవీ, దురుకుమార్‌గా గుర్తించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ఆ సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పాటు పెద్ద ఎత్తున గాలులు వీచినట్లు అక్కడి స్థానికులు తెలిపారు.

    రోగి తరుపు బంధువు మాట్లాడుతూ "ఈ నెల 16న రాంచీలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సంజయ్‌కుమార్‌ని చేర్చాము. అతను అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు.  అయితే పేషెంట్ పరిస్థితి విషయమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ తరలించాలని డాక్టర్లు తెలిపారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. దీంతో ఎయిర్‌అంబులెన్స్‌లో ఢిల్లీ వెళ్లేలా ఏర్పాటు చేశాం" అని అన్నారు. 

    ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం!

    కాగా ఉదయం లేచి చూసే సరికి ఎయిర్‌ అంబులెన్స్‌ క్రాష్ అయిన వార్త విన్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాతావరణ కారణాలతో ఫ్లైట్ క్రాష్ అయి ఉండవచ్చని ప్రమాదంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

  • న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుతం జరుగుతున్న పది, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు, సబ్జెక్ట్ నిపుణులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారం కోసం  కొన్ని విద్యాసంస్థలు పరీక్ష జరుగుతుండగానే లేదా ముగిసిన మరుక్షణమే ‘ప్రశ్నాపత్రం విశ్లేషణ’ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తీరుపై బోర్డు  మండిపడింది.

    పరీక్ష కొనసాగుతున్న సమయంలో ప్రశ్నాపత్రం బయటకు రావడం అసాధ్యమని, ఒకవేళ ఎవరైనా విశ్లేషణలు జరిపితే దానిని ‘స్కామ్’ లేదా ‘ఫేక్ అనాలసిస్’గా పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇటువంటి తప్పుడు పద్ధతులకు పాల్పడే పాఠశాలలు, నిపుణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యాపించే తప్పుడు వార్తలు, ప్రశ్నాపత్రాల లీకేజీ పుకార్ల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్ఈ సూచించింది.

    పరీక్షల సమయంలో కొంతమంది అక్రమార్కులు నకిలీ ప్రశ్నాపత్రాలను చలామణి చేస్తున్నారని బోర్డు పేర్కొంది. పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని బోర్డు  హెచ్చరికలు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ‘ఎసెన్షియల్ రిపీట్’ నిబంధనపై కూడా బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన బోర్డు పరీక్షల్లో మొదటి విడతలో హాజరుకావడం ప్రతి విద్యార్థికి తప్పనిసరి. కనీసం మూడు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకాని పక్షంలో వారిని ‘ఎసెన్షియల్ రిపీట్’ కేటగిరీ కింద పరిగణిస్తారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మొదటి విడత పరీక్షలు రాయలేమని, నేరుగా రెండో విడతకు అనుమతించాలని విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాలను బోర్డు తోసిపుచ్చింది.

    ఇది కూడా చదవండి: ఏఐ విప్లవం: భారత్ ముందున్న అతిపెద్ద సవాల్

  • న్యూఢిల్లీ: ప్రకటనల సంబంధిత డేటాకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గోప్యత, అంగీకార నిర్దేశకాలను వర్తింపజేస్తామని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదిక వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ విషయంలో ఎన్‌సీఎల్‌ఏటా విధివిధానాలకు కట్టుబడతామని పేర్కొన్నాయి.

    ఎన్‌సీఎల్‌ఏటా నిర్దేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థలు పెట్టుకున్న పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీ ధర్మాసనం విచారణ జరిపింది. ట్రిబ్యునల్‌ నిర్దేశాలను మార్చి 16 కల్లా అమలు చేయాలని మెటా, వాట్సాప్‌ నిర్ణయించినట్టు వాటి తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ దాఖలు చేసిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. దాంతో వాట్సాప్, మెటా పిటిషన్లను పరిష్కరించినట్టు భావించాలని ధర్మాసనం పేర్కొంది.

    ప్రైవసీ పాలసీ ఉల్లంఘనకు సంబంధించి వాట్సాప్‌కు సీసీఏ గతంలో రూ.213.14 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. డేటా షేరింగ్‌ పేరిట పౌరుల భద్రతతో ఆటలాడటాన్ని అనుమతించబోమని ఫిబ్రవరి 3న మెటా, వాట్సాప్‌లను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. 

    చ‌ద‌వండి: ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్‌

  • న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఈ సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో అగ్రగామిగా నిలుస్తోంది. గ్లోబల్ జాబ్ పోర్టల్ ‘ఇన్‌డీడ్’ (Indeed) 12 దేశాల్లో నిర్వహించిన తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయ యజమానులు, అభ్యర్థులు ఏఐ వినియోగంపై అత్యంత సానుకూలత కనబరుస్తున్నారు.

    బ్రిటన్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా అభ్యర్థులు ఉద్యోగ వేటలో ఏఐ సాధనాలను వాడేందుకు విముఖత చూపుతుండగా, భారత్‌లో కేవలం 5 శాతం మంది యజమానులు, 8 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ సాంకేతికతకు దూరంగా ఉండటం గమనార్హం. గత దశాబ్ద కాలంలో భారత్ మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ విద్య వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగంగా స్వీకరించడంతో ఏఐ అనేది ఒక అడ్డంకిలా కాకుండా అవకాశాలను మెరుగుపరిచే ఒక సాధనంగా భారతీయులు భావిస్తున్నారు.

    నియామక ప్రక్రియలో ఏఐ ప్రవేశం కేవలం ఒక మార్పు మాత్రమే కాదని, అది అపారమైన వేగాన్ని ఇస్తుందని భారత్‌లోని పలు సంస్థలు నమ్ముతున్నాయి. వేల సంఖ్యలో వచ్చే దరఖాస్తులను వడపోసి, సరైన అభ్యర్థులను గుర్తించడంలో ఏఐ ఒక అద్భుతమైన ‘ఎనేబులర్’గా పనిచేస్తోంది. అయితే ఈ సాంకేతికత స్క్రీనింగ్, మ్యాచింగ్‌కు మాత్రమే పరిమితం కావాలని, తుది నిర్ణయం మాత్రం మానవ మేధస్సుతోనే జరగాలనే ఒక అప్రకటిత ఒప్పందం యజమానులకు, అభ్యర్థులకు మధ్య కొనసాగుతోంది.

    మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ పునీత్ చందోక్ అంచనా వేసినట్లుగా, రాబోయే మూడేళ్లలో ఏఐ ఉద్యోగాలను హరించడం కంటే సృష్టించడమే ఎక్కువగా ఉంటుందనే ధీమా భారత మార్కెట్లో కనిపిస్తోంది. భారీ జనాభా, తీవ్రమైన పోటీ ఉన్న భారతదేశంలో నియామకాల్లో జరిగే గందరగోళాన్ని తగ్గించడానికి ఆటోమేషన్ ఒక ఒక అనివార్యమైన అవసరంగా మారింది. ఆటోమేటెడ్ వ్యవస్థలు కేవలం 'కీ వర్డ్స్' ఆధారంగా ప్రొఫైల్స్ ఎంపిక చేస్తున్నాయని, అభ్యర్థిలోని ప్రతిభను, అనుభవాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

    ఏఐ ఏజెంట్స్‌ అల్గారిథమ్స్ నమూనాలను మాత్రమే గుర్తించగలవు కానీ, ఒక వ్యక్తిలోని పట్టుదలను, సృజనాత్మకతను అంచనా వేయలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఏఐని స్వీకరించడంలో ముందున్నప్పటికీ, నియామకాల్లో పారదర్శకత, వివక్ష లేని అల్గారిథమ్స్, పటిష్టమైన పర్యవేక్షణ మార్గదర్శకాలు అత్యవసమని చెబుతున్నారు. సాంకేతికతను వాడుకోవడమే కాకుండా, దాన్ని ఎంత నైతికంగా అమలు చేస్తున్నామనేదే భారత్ ముందున్న అసలైన సవాలని నిపుణులు అంటున్నారు. నియామక ప్రక్రియలో మానవత్వపు విలువలను కోల్పోకుండా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే భారత్‌ ఈ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదని సూచిస్తున్నారు. 

    ఇది కూడా చదవండి: అమెరికా: మంచు తుపాను బీభత్సం.. స్తంభించిన జనజీవనం 

Sports

  • టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ రెండు వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది.  

    ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ తారిక్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

  • టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో జింబాబ్వేతో సూప‌ర్‌-8 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ త‌గిలింది. విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జ‌ట్టును వీడాడు. త‌న తండ్రి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బ‌య‌లు దేరి వెళ్లిపోయాడు.

    దీంతో మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌కు రింకూ దూర‌మ‌య్యాడు. అత‌డు ఎప్పుడు తిరిగి వ‌స్తాడ‌న్న‌ది కూడా స్ప‌ష్ట‌త లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్‌పై చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది.

    ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ముందుగానే బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి.. డ‌కౌటై పెవిలియ‌న్‌కు చేరాడు.

    అయితే సౌతాఫ్రికా చేతిలో భార‌త్ ఓట‌మి పాల్వ‌డంతో టీమిండియా త‌మ సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రగ‌నున్న మ్యాచ్ భార‌త్‌కు చాలా కీల‌కం. ఇటువంటి మ్యాచ్‌కు ముందు రింకూ జ‌ట్టును వీడ‌డం గ‌ట్టి ఎదురు దెబ్బ‌గానే చెప్పుకోవాలి.

  • టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో భాగంగా ప‌ల్లెక‌లే వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే ప‌రిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది.

    ఓపెన‌ర్ సైమ్ అయూబ్‌(9), కెప్టెన్ స‌ల్మాన్ అఘా(5) నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫ‌ఖర్ జ‌మాన్(25), బాబ‌ర్ ఆజం(25),షాదాబ్ ఖాన్‌(23) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లైమ్ డాస‌న్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఓవ‌ర్ట‌న్, జోఫ్రా అర్చ‌ర్ త‌లా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.

    తుది జ‌ట్లు
    ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

    పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
     

  • బిహార్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. 14 ఏళ్ల వైభ‌వ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన వైభ‌వ్‌.. త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం వ‌ణికించాడు.

    కేవ‌లం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచ‌రీ చేసి త‌న పేరును ఐపీఎల్ చ‌రిత్ర‌లో సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌ష్కుడిగా వైభ‌వ్ నిలిచాడు. అత‌డు 206.56 స్ట్రైక్ రేట్‌తో కేవ‌లం 7 మ్యాచ్‌ల్లోనే 252 ప‌రుగులు చేశాడు. 

    దీంతో వైభ‌వ్ “ టాటా కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా  టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు.

    ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను టాటా మోటార్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా టాటా కర్వ్ టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 22 లక్షలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ కారు అత్యాధునికమైన డీజిల్ ఇంజిన్ ,డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ వంటి ఫ్యూచ‌ర్స్ క‌లిగి ఉంది.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా పల్లెకెలె వేదిక‌గా పాకిస్తాన్‌,ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

    ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

    తుది జ‌ట్లు
    ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్

    పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్‌), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా సెమీఫైన‌ల్‌కు చేరుతుందా?  లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెల‌కొంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్ ఘోరంగా ఓడిపోవ‌డంతో ప‌రిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ మూడో స్ధానంలో ఉంది. నెట్‌ర‌న్ రేట్‌(-3.800) భారీగా ప‌డిపోయింది.

    దీంతో భార‌త్‌ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో భారీ విజ‌యాల‌తో పాటు, ఇతర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్ రెండింటిలోనూ భార‌త్ విఫ‌ల‌మైంది.

    21 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన స‌ఫారీల‌ను భార‌త బౌల‌ర్లు ఆప‌లేక‌పోయారు. మిడిల్ ఓవ‌ర్ల‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటూ ఓట‌మిలో త‌మ వంతు పాత్ర పోషించారు. ఈ నేప‌థ్యంలో భార‌త బౌలింగ్‌పై పాకిస్తాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త వద్ద స‌రైన ఫాస్ట్ బౌల‌ర్లు లేర‌ని అక్త‌ర్ అన్నాడు. అదేవిధంగా  హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు.

    "సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భార‌త బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అత‌డిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.

    వారిద్ద‌రూ ఏమి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టే మాల్క‌మ్ మార్ష‌ల్‌లు కారు. డెత్ ఓవ‌ర్ల‌లో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. ప్రోటీస్‌తో మ్యాచ్‌లో అదే జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా 45 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ పేర్కొన్నాడు.
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భార‌త జ‌ట్టు ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింది. లీగ్ స్టేజిలో వ‌రుస విజ‌యాలతో అద‌ర‌గొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీల‌కమైన సూప‌ర్‌-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఘోర ఓట‌మి చ‌విచూసిన భార‌త్‌ .. త‌మ సెమీస్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది.

    సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లోనూ భార‌త్ క‌చ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జ‌ట్ల ఫ‌లితాల‌పై కూడా ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌ చేసిన ఓ ప్ర‌యోగం బెడిసి కొట్టింది.

    అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌కు కాద‌ని వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు తుది జ‌ట్టులో ఛాన్స్ వ‌చ్చారు. సుంద‌ర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ ఓపెన‌ర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్య‌లు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అత‌డు అన్నాడు.

    "గంభీర్ వ్యూహ‌త్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడ‌మచేతి వాటం బ్యాట‌ర్ల‌ను ఆడించాల్సిన అవ‌స‌రం ఏముంది?  గంభీర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్‌రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని క‌చ్చితంగా పెంచుతోంది.

    భార‌త జ‌ట్టు వ‌ద్ద చాలా అప్ష‌న్స్ ఉన్నాయి. అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోతున్నాడు. కుల్దీప్ యాద‌వ్‌, అక్ష‌ర్ ప‌టేల్ వంటి మ్యాచ్ విన్న‌ర్ల‌ను భార‌త్ సరిగ్గా ఉప‌యోగించుకోలేక‌పోతుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అనంత‌రం కుల్దీప్ యాద‌వ్‌ను సూర్య వెన‌క్కి నెట్టివేసిన వీడియో ఒక‌టి వైర‌లైంది.

    బహుశా సూర్యకుమార్‌తో ఉన్న గొడవ వల్లే కులదీప్‌ను తప్పించారని  అంద‌రూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్న‌ర్‌ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అత‌డి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.

    గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెన‌క్కి వ‌చ్చేశాడు. ఇప్పుడు అదే త‌ర‌హా రాజకీయాల‌ను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ త‌న సొంత‌ప్ర‌యోగాల‌తో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షెహ‌జాద్ పేర్కొన్నాడు.

  • ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల సిరీస్‌ను భార‌త మ‌హిళ‌ల జట్టు ఓట‌మితో ఆరంభించింది. ఈ సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో 6 వికెట్ల తేడాతో భార‌త్ ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హ‌ర్మ‌న్ సేన 48.3 ఓవ‌ర్ల‌లో 214 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

    బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు ఆదిలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. స్టార్ బ్యాట‌ర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వ‌ర్మ‌(4) వ‌రుస బంతుల్లో పెవిలియ‌న్‌కు చేరారు. అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. 

    ఆ త‌ర్వాత భార‌త్‌ మ‌ళ్లీ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాట‌గలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించ‌గా.. మేఘాన్ షాట్, అలానా కింగ్‌, మెక్‌గ్రాత్ త‌లా వికెట్ సాధించారు.

    215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. ఓపెన‌ర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32) అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు.  అనంతరం బెత్ మూనీ (76 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు, దీప్తీ శ‌ర్మ‌, క్రాంతి గౌడ్ త‌లా వికెట్ సాధించారు.
     

  • మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్ ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ వేదిక‌గా ఇంగ్లండ్‌-శ్రీలంక జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.

    ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధించ‌గా.. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ త‌మ స్ధానాల‌ను ఖాయం చేసుకున్నాయి.

    భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
    ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు జూన్ 14న ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా అమీతుమీ తెల్చుకోనున్నాయి.  భార‌త్‌కు ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. గ్రూపు-ఎలో భార‌త్‌, పాక్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెద‌ర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది
    భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ 
    జూన్ 14 - పాకిస్తాన్‌తో.. ఎడ్జ్‌బాస్ట‌న్
    జూన్ 17- నెద‌ర్లాండ్స్‌తో.. లీడ్స్‌
    జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్ట‌ర్‌
    జూన్ 25- బంగ్లాదేశ్‌తో.. మాంచెస్ట‌ర్‌
    జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్‌

  • ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్‌ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్‌లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్‌ ఆస్ట్రేలియా సిరీస్‌తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్‌ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడనుంది. 

    అనంతరం బంగ్లాదేశ్‌ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్‌ టీమ్‌ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆస్ట్రేలియా టూర్  
    సెప్టెంబర్‌ 24-తొలి వన్డే, డర్బన్‌
    సెప్టెంబర్‌ 27-రెండో వన్డే, జోహనెస్‌బర్గ్‌
    సెప్టెంబర్‌ 30-మూడో వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్‌

    అక్టోబర్‌ 9-13: తొలి టెస్ట్‌, డర్బన్‌
    అక్టోబర్‌ 18-22: రెండో టెస్ట్‌, గ్కెబెర్హా
    అక్టోబర్‌ 27-31: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్

    బంగ్లాదేశ్ టూర్  
    నవంబర్‌ 15-19: తొలి టెస్ట్‌, జోహనెస్‌బర్గ్‌
    నవంబర్‌ 23-27: రెండో టెస్ట్‌, సెంచూరియన్‌

    డిసెంబర్‌ 1- తొలి వన్డే, ఈస్ట్‌ లండన్‌
    డిసెంబర్‌ 4- రెండో వన్డే, గ్కెబెర్హా
    డిసెంబర్‌ 7- మూడో వన్డే, కేప్‌టౌన్‌

    డిసెంబర్‌ 10- తొలి టీ20, కింబర్లీ
    డిసెంబర్‌ 12- రెండో టీ20, బెనోనీ
    డిసెంబర్‌ 13- మూడో టీ20, సెంచూరియన్‌

    ఇంగ్లండ్‌ టూర్‌
    డిసెంబర్‌ 17-21: తొలి టెస్ట్‌, జోహనెస్‌బర్గ్‌
    డిసెంబర్‌ 26-30: రెండో టెస్ట్‌, సెంచూరియన్‌
    2027 జనవరి 3-7: మూడో టెస్ట్‌, కేప్‌టౌన్‌

    జనవరి 10- తొలి వన్డే, పార్ల్‌
    జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్‌
    జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్‌

    ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్‌ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు.  
     

  • ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. బ్రిస్బేన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. 

    కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (53), వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్‌ (43), రిచా ఘోష్‌ (23) కూడా సహకరించడంతో భారత్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది. 

    వీరు మినహా భారత ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్‌ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్‌, శ్రీచరణి తలో 2, ఓపెనర్‌ ప్రతీక రావల్‌ డకౌటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది. 

    మెగాన్‌ షట్‌ (9-1-42-2), సోఫీ మోలినెక్స్‌ (5-1-17-1), తహ్లియా మెక్‌గ్రాత్‌ (4-0-16-1), డార్సీ బ్రౌన్‌ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్‌ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.

    కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్‌ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

  • భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ తన రెండో వివాహం అనంతరం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిన కథనాలపై తీవ్రంగా స్పందించాడు. కొద్ది రోజుల కిందట ధవన్‌ అమెరికా ఆధారిత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సోఫీ షైన్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నాడు. 

    ఈ వేడుక తర్వాత ధవన్‌, అతని మాజీ భార్య అయేషా ముఖర్జీకి సంబంధించిన పలు పోస్ట్‌లు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకుల సమయంలో అయేషా ధవన్‌ను "నిన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు" అన్నట్లు.. సోఫీతో వివాహం తర్వాత "నన్ను అభినందించవా..?" అని ధవన్‌ అయేషాకు కౌంటరిచ్చినట్లు పలు స్క్రిప్ట్‌లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

    వీటిపై ధవన్‌ అదే సోషల్‌మీడియా వేదికగా స్పందించాడు. ఆ స్క్రిప్ట్‌ను పూర్తిగా ఖండిస్తూ.. అందులో ఎంతమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. "నేను ఎప్పుడూ గతాన్ని మోసుకెళ్లలేదు. పాజిటివిటీని నమ్ముతాను. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబం, మిత్రులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు. దయచేసి నా పేరుతో తప్పుడు కథనాలు సృష్టించవద్దు" అంటూ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.  

    కాగా, ధవన్‌.. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయ మహిళల అయేషా ముఖర్జీని 2011లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడి, ఆతర్వాత ప్రేమ వివాహానికి దారి తీసింది. అయేషా ఓ మాజీ కిక్‌ బాక్సర్‌. ఆమెకు ధవన్‌కు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. తొలి భర్తతో అయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయేషా-ధవన్‌కు జోరావర్‌ అనే పేరు గల కుమారుడు ఉన్నాడు.

    అయేషా.. ఆమె మొదటి భర్తతో కలిగిన సంతానం, జోరావర్‌తో కలిసి ధవన్‌తోనే ఉండేది. అయితే మనస్పర్దల కారణంగా అయేషా-ధవన్‌ 2023లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అయేషా జోరావర్‌ను తీసుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. 

    ఆ సమయంలో అయేషా తండ్రి-కొడుకులను కలవనివ్వలేదనే వార్తలు వచ్చాయి. జోరావర్‌ను మిస్‌ అవుతున్నట్లు ధవన్‌ చాలా సందర్భాల్లో సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ధవన్‌ ఏనాడూ అయేషా గురించి చెడుగా మాట్లాడలేదు. తాజాగా వస్తున్న వదంతులు ధవన్‌ ఎంత జెంటిల్మెనో మరోసారి రుజువు చేశాయి.

    అయేషాతో విడాకులైన చాన్నాళ్లకు ధవన్‌-సోఫీ మధ్య ప్రేమ మొదలైంది. 2025లో వీరిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగం చేశారు. ఈ ఏడాది జనవరి 12న వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. సోఫీ షైన్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ, Northern Trust Corporationలో ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్రికెట్ సహచరులు పాల్గొన్నారు. 

Business

  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

    భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.

    టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.

    ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

    రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.

    ఎవరీ రూబెన్ సింగ్?
    బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు.

  • మొబైల్‌ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ బ్యాంకింగేతర అనుబంధ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఎయిర్‌టెల్‌ మనీ లిమిటెడ్‌పై భారీ ప్రణాళికలు ప్రకటించింది. రానున్న కొన్నేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులకు తెరతీయనున్నట్లు పేర్కొంది. వీటిలో 70 శాతం ఎయిర్‌టెల్‌ సమకూర్చనుండగా.. మిగిలిన 30 శాతం ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా లభించనున్నట్లు తెలియజేసింది.

    ఎయిర్‌టెల్‌ మనీ ఇటీవలే(2026 ఫిబ్రవరి 13న) ఆర్‌బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను పొందింది. పటిష్ట డిజిటల్‌ ఆస్తులు, 500కుపైగా సైంటిస్టులతో నడుస్తున్న భారీ డేటా ఎనలిటిక్స్, లోతైన నిర్వహణా సామర్థ్యాలు కలిగిన కంపెనీగా ఎయిర్‌టెల్‌ కొత్తతరహా డిజిటల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసులను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.

    డిజిటల్‌ ప్లాట్‌ఫామ్, సమీకృత చానళ్ల ద్వారా గత రెండేళ్లుగా క్రెడిట్‌ ఇంజిన్‌ను నిర్మించినట్లు పేర్కొంది. దీంతో దేశీయంగా పటిష్ట రుణ సర్వీసుల మోడళ్లలో ఒకటిగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఇప్పటికే రూ. 9,000 కోట్లకుపైగా రుణాల విడుదల ద్వారా ప్లాట్‌ఫామ్‌ అత్యున్నతస్థాయి(హైపర్‌స్కేల్‌)ని అందుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు పటిష్ట అండర్‌రైటింగ్‌ విధానాలు, క్రమశిక్షణాయుత పోర్ట్‌ఫోలియో నిర్వహణ, రియల్‌టైమ్‌ రిస్క్‌ పర్యవేక్షణ దోహదపడినట్లు వివరించింది.

  • కార్లు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఎంచుకుంటారు. ఇందులో కూడా కొంత తక్కువ ధరలో లభించే కార్లు అయితే బెస్ట్ అని భావిస్తారు. కాబట్టి ఈ కథనంలో అత్యుత్తమ మైలేజ్ (ఏఆర్ఏఐ) ఇచ్చే రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరలో లభించే 10 కార్ల గురించి తెలుసుకుందాం.

    • మారుతి సుజుకి సెలెరియో (రూ. 4.69 లక్షల నుంచి రూ. 6.73 లక్షలు):  25-26 కిమీ/లీ పెట్రోల్ & 35 కిమీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి స్విఫ్ట్ (రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షలు): 24.8 కిమీ/లీ పెట్రోల్ & 32.85 కిమీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి డిజైర్ (రూ. 6.26 లక్షల నుంచి రూ. 8.031 లక్షలు): 24.8 కి.మీ/లీ పెట్రోల్ & 33.73 కి.మీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (రూ. 4.99 లక్షల నుంచి రూ. 6.84 లక్షలు): 25.19 కి.మీ/లీ పెట్రోల్ & 33.47 కి.మీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి ఆల్టో కే10 (రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షలు): 24.9 కిమీ/లీ పెట్రోల్ & 33.40 కిమీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షలు): 25.30 కిమీ/లీ పెట్రోల్ & 32.73 కిమీ/కేజీ సీఎన్‌జీ

    • మారుతి సుజుకి బాలెనో (రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షలు): 22.35 కిమీ/లీ పెట్రోల్ & 30.61 కిమీ/కేజీ సీఎన్‌జీ

    • టాటా టియాగో (రూ. 4.57 లక్షల నుంచి రూ. 7.82 లక్షలు): రూ. 19 కి.మీ./లీటర్ పెట్రోల్

    • హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ (రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.92 లక్షలు): 16-18 కి.మీ/లీ పెట్రోల్

    • రెనాల్ట్ క్విడ్ (రూ. 4.30 లక్షల నుంచి రూ. 6.45 లక్షలు): 22 కి.మీ/లీ పెట్రోల్

  • రాబర్ట్ కియోసాకి అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బుక్.. తన జీవితాన్ని మార్చేసిందని, మిలియనీర్‌ను చేసిందని హెచ్‌బీ క్యాపిటల్ ఫౌండర్ & సీఈఓ 'హన్నా హామండ్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    13 ఏళ్ల వయసులో నా దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉండేది. ఈ పుస్తకం నా జీవిత దిశనే మార్చేసింది. చిన్నప్పుడే కియోసాకి నాకు హీరో అయ్యారు, అని హన్నా హామండ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కష్టపడి పనిచేసి, ఆర్థిక జ్ఞానం పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాను. దీని ఫలితంగా 25 ఏళ్లకే మిలియనీర్‌ అయ్యానని ఆమె పేర్కొంది.

    నా జీవితంలో నేను ఊహించని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ జో పోలిష్ ద్వారా రాబర్ట్ కియోసాకిని కలుసుకోవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇంటి దగ్గరలోనే కియోసాకి నివసిస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదు.

    ఈ సందర్భంలో ఆమె తన జీవితాన్ని తిరిగి ఒకేసారి నెమరు వేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం జీవితం దుర్భరంగా ఉండేది.ఇప్పుడు నా బాల్యంలో ఆశను నింపిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నాను. ఆ పుస్తకంలోని మాటలు నన్ను కష్టకాలంలో నిలబెట్టాయి, ముందుకు నడిపించాయని హన్నా హామండ్ పేర్కొన్నారు.

  • ఇటీవల దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలకు రీకాల్ జారీ చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారీ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం ఏకంగా 4,12,774 వాహనాల మీద పడింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.

    రియర్ సస్పెన్షన్ టో లింక్‌లలో సమస్య ఉండటం వల్లనే కంపెనీ ఈ భారీ రీకాల్ ప్రకటించింది. ప్రభావిత వాహనాలకు పరిష్కారంగా డీలర్లు టో లింక్‌లను ఉచితంగా భర్తీ చేయాలని రెగ్యులేటర్ సూచించింది. అంతే కాకుండా.. బ్యాటరీ వైఫల్యాలు & బ్రేక్ పెడల్స్‌లోని లోపాల కారణంగా ఫోర్డ్ అమెరికాలో మరో 40,655 వాహనాలకు రీకాల్ జారీ చేసింది.

    భారత్‌కు ఫోర్డ్ కంపెనీ
    అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్.. తమిళనాడులోని చెన్నై ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.

    ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

    కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.

  • జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్‌బీఐ బులెటిన్‌ తెలిపింది. 2026–27 బడ్జెట్‌లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్‌బీఐ బులెటిన్‌ పేర్కొంది. రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.

    ఆర్‌బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్‌ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్‌బీఐ బులెటిన్‌ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్‌ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.

  • మంగళవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 974.77 పాయింట్ల నష్టంతో 82,319.89 వద్ద, నిఫ్టీ 253.65 పాయింట్ల నష్టంతో 25,459.35 వద్ద నిలిచాయి.

    డాల్ఫిన్ ఆఫ్‌షోర్ ఎంటర్‌ప్రైజెస్ (ఇండియా) లిమిటెడ్, రీగాల్ రిసోర్సెస్ లిమిటెడ్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, ఎంబీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అకీ ఇండియా లిమిటెడ్, యాత్ర ఆన్‌లైన్ లిమిటెడ్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఆరే డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • కేటీఎం కంపెనీ 250 డ్యూక్ 2026 ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్లేట్ గ్రే, సిల్వర్ మెటాలిక్ అనే రెండు రంగుల్లో లభించే ఈ బైక్ ధర రూ. 2.13 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    సిల్వర్ మెటాలిక్ వెర్షన్‌ బైక్.. బూడిద రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & సిల్వర్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు 250 డెకాల్స్‌ పొందుతుంది. అయితే స్లేట్ గ్రే బైక్ నారింజ రంగు ఫ్యూయెల్ ట్యాంక్ & బూడిద రంగు ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లతో వస్తుంది. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్, 240 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది.

    2025 డ్యూక్ 2026 మోడల్ ఎలాంటి యాంత్రిక మార్పులకు లోను కాలేదు. కాబట్టి ఇందులో అదే 248.8 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9250 rpm వద్ద 30.75 BHP & 7,250 rpm వద్ద 25 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

  • తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.

    మంగళవారం జూబ్లీహిల్స్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు.

    2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

    రాష్ట్ర వృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, అది పక్కా ప్రణాళికతో కూడిన ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగిందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో పని చేస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

    రాష్ట్ర అభివృద్ధికి త్రిముఖ వ్యూహం

    తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘క్యూర్ - ప్యూర్ - రేర్’ అనే వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. అభివృద్ధిని కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు పని సంస్కృతిని పూర్తిగా మార్చేశాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

    ‘రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కంపెనీల కంటే బలమైన ఎకో సిస్టమ్‌కే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే భవిష్యత్తు కోసం వేచి చూడకుండా ఆ భవిష్యత్తును మనమే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం కేవలం అనుమతులు ఇచ్చే యంత్రాంగంలా కాకుండా పరిశ్రమలతో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాంచందర్ రావు, డా.నాగేశ్వర్ రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ కన్వీనర్ పంకజ్ దివాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు) నిర్వహణలోని మొత్తం ఆస్తులు (మేనేజ్డ్‌ ఫండ్స్‌ ఇండస్ట్రీ ఏయూఎం) 2025 మార్చి నాటికి రూ.212 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత జీడీపీలో 64 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 73 శాతానికి పెరగనున్నాయి. ఈ వివరాలతో క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ (క్రిసిల్‌ రేటింగ్స్‌ సంస్థ) ఒక నివేదికను విడుల చేసింది. గృహ పొదుపులు ఈక్విటీ, ఏఐఎఫ్‌ల్లోకి వస్తుండడాన్ని ప్రస్తావించింది.

    2025 మార్చితో ముగిసిన ఐదేళ్ల కాలంలో మేనేజ్డ్‌ ఫండ్‌ అసెట్స్‌ ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని.. అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 11 శాతాన్ని మించినట్టు తెలిపింది. సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా పేర్కొంది. ఏఐఎఫ్‌లు చాలా వేగవంతమైన వృద్ధిని చూస్తున్నాయని.. మేనేజ్డ్‌ ఫండ్స్‌ పరిశ్రమ (నిపుణులు నిర్వహించే ) మొత్తం ఆస్తుల్లో ఏఐఎఫ్‌ల వాటా 2020 మార్చి నాటికి 4 శాతంగా ఉంటే, 2030 మార్చి నాటికి 9 శాతానికి చేరనున్నట్టు తెలిపింది.  

    క్యాపిటల్‌ మార్కెట్ల వైపు పొదుపు నిధులు

    గృహ పొదుపుల్లో ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా 2020లో 4 శాతంగాఉంటే, 2025 నాటికి 15 శాతానికి చేరిందని.. రిస్క్‌ తీసుకునే ధోరణి, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో భాగస్వామ్యం పట్ల ఆసక్తికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. రిటైర్మెంట్‌ ఫండ్స్, జీవిత బీమా ఆస్తులు సైతం స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితం అవుతుండడం, ఆదాయ స్థాయిలు పెరుగుతుండడం, 8వ వేతన కమిషన్‌ వంటివి అనుకూలిస్తున్నట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి రిటైర్మెంట్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.53.39 లక్షల కోట్లు, జీవిత బీమా నిర్వహణ ఆస్తులు రూ.67.79 లక్షల కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (రీట్‌లు), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు) నిర్వహణ ఆస్తులు 2020 మార్చి నాటికి రూ.2.60 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.7.78 లక్షల కోట్లకు పెరిగినట్టు, ఇది ఏటా 25 శాతం వృద్ధికి సమానమని తెలిపింది.

    ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • దేశీయ రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించుతూ డ్రైవర్లే యజమానులుగా సాగే ప్రక్రియకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘భారత్ టాక్సీ’ అనే సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ను అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల లాభార్జనే ధ్యేయంగా సాగే ప్రస్తుత వ్యవస్థకు భిన్నంగా ఇది డ్రైవర్ల సంక్షేమం, యాజమాన్య భాగస్వామ్యం ప్రాతిపదికన పనిచేయనుంది.

    డ్రైవర్ల చేతికే లాభాలు

    ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, గుజరాత్‌కు చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ ప్లాట్‌ఫామ్ లాభాల పంపిణీ విధానాన్ని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సంస్థ గడించే నికర లాభాల్లో 80 శాతం మొత్తాన్ని కిలోమీటర్ల ప్రయాణం ఆధారంగా నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని సహకార సంస్థ బలోపేతానికి, సాంకేతిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తారు. ‘ప్రస్తుత ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్లకు కనీస బేస్ రేటును కూడా ఖరారు చేయడం లేదు. కానీ భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్ల కనీస ఆదాయానికి భరోసా ఇస్తాం’ అని షా స్పష్టం చేశారు.

    రూ.500తో యజమానిగా.. ‘అమూల్’ తరహా మోడల్

    భారత్ టాక్సీ నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాత అమూల్ డెయిరీ కోఆపరేటివ్‌తో అమిత్ షా పోల్చారు. 36 లక్షల మంది మహిళలు కేవలం రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన అమూల్ నేడు రూ.1.25 లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. కేవలం రూ.500 చెల్లించి భారత్‌ ట్యాక్సీలో షేర్ కొనడం ద్వారా ప్రతి డ్రైవర్ ఈ సంస్థలో సహ యజమాని కావచ్చు. సభ్యుల సంఖ్య పెరిగిన తర్వాత డ్రైవర్లే డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం జరిగినా ప్రశ్నించే హక్కు డ్రైవర్ల ప్రతినిధులకు ఉంటుంది.

    15 కోట్ల మంది డ్రైవర్లే లక్ష్యం

    ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్‌, రాజ్‌కోట్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2 ఏళ్లలో 15 కోట్ల మంది డ్రైవర్లను చేర్చుకోవడమే స్వల్పకాలిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా అంటే 3 ఏళ్లలో దేశంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని చూస్తోంది.

    మార్కెట్ దిగ్గజాలకు పోటీ

    ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి 25-30% వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా భారత్ టాక్సీ ప్రస్తుతం ఎటువంటి కమీషన్ వసూలు చేయడం లేదు. ఈ లాభాల భాగస్వామ్య వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి మూడు ఏళ్ల సమయం పడుతుందని అంతవరకు డ్రైవర్లు సహకరించాలని అమిత్ షా కోరారు.

    ఇదీ చదవండి: పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..

Telangana


  • సాక్షి హైదరాబాద్‌:TGSRTC ప్రయాణికుల మరింత సౌకర్యవంతమైన సేవల కోసం "మీ సేవ మీ టికెట్" పేరుతో నూతన మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఈ రోజు మంగళవారం  సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శ్రీ  పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ  వికాస్ రాజ్,  తెలంగాణ ఆర్టీసీ వీసీ & ఎండీ  వై.నాగిరెడ్డి , మీసేవ కమీషనర్  శ్రీ రవికిరణ్ తో పాటు ఇతర అధికారులతో కలిసి  మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.

    ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సుదూర ప్రయాణాలకు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. యాప్ ద్వారా మెుత్తం 1,710 ఓపీఆర్ఎస్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉండనున్నాయన్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ జంట నగరాల పరిధిలో కార్యకలాపాల కోసం T24 టికెట్‌ను కూడా మీటికెట్  మొబైల్ యాప్‌లోనే పొందవచ్చని తెలిపారు.  

     

  • హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు చేశారు. దీనిలో భాగంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారే రక్ష అని అన్నారు. ఆ దేవాలయాన్ని తాము అధికారంలోకి వచ్చాక గోల్డెన్‌ టెంపుల్‌గా  మారుస్తామన్నారు. 

    హిందుత్వమే తమ ఎజెండా అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం కోసమే జీహెచ్‌ఎంసీ ముక్కలు చేశారని,.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎంఐఎంకు బుద్ధి చెబుతామన్నారు. శాంతి భద్రతలు కాపాడాలి... కానీ బాన్సువాడలో ఎంఐఎం ఒత్తిడితో బీజేపీ కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలను అరెస్టు చేశారంటూ బండి సంజయ్‌ మండిపడ్డారు.

     

     



     

  • సాక్షి హైదరాబాద్: దుండిగల్ బౌరంపేటలో దారుణం జరిగింది. ఓ కసాయి తల్లి అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. 2 నెలల పసికందుని అదేపనిగా ఏడుస్తున్నాడనే కోపంతో  కట్టెలపొయ్యిలో వేసింది.  దీంతో అపం శుభం తెలియని ఆ పసికందు అగ్నికి ఆహుతయ్యాడు. పసికందు ఏడిస్తే నలుగురికి తెలుస్తోందనే కారణంతో అతని నోట్లో గుడ్డలు నొక్కినట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • హైదరాబాద్‌: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందనే వార్తలకు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి  ప్రెస్‌మీట్‌ మరింత బలం చేకూరుస్తుంది.  తాజాగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయిన అంశాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లు మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ పేర్కొన్నారు. దేవ్‌ జీ అలియాస్‌ తిప్పరి తిరుపతి, రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి తదితర మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి బయటకొచ్చారన్నారు.

    కాగా, మార్చి నెల మావోయిస్టుల లొంగిపోవడానికి కేంద్రం విధించిన గడువు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మరికొంతమంది ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. ఆపరేషన్‌ కగార్‌ వంటి ఆపరేషన్లతో కేంద్ర ప్రభుత్వం.. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోతున్నారు. అడవుల్లో మావోయిస్టులు.. వాటిని వదిలి జనావాసంలోకి వస్తున్నారు.  పలువురు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ వంటి చర్యలకు ఎదురెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన వారు ఉన్నారు. 

  • హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1లోని జలగం వెంగళరావు పార్కు మలుపు మృత్యువుకు పిలుపుగా మారింది. రోజూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అటు జీహెచ్‌ఎంసీ ఇటు ట్రాఫిక్‌ పోలీసుల్లో చలనం కరువైంది. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఆ దిశగా ముందడుగు పడడం లేదు. రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ వాహనదారులు, పాదచారులను మృత్యువు కాటేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 

    • మూడేళ్లలో ఈ రోడ్డులో వెంగళరావు పార్కు మలుపు వద్ద 46 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నారు.  

    • ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వాహనాలు నుజ్జునుజ్జయి పోలీస్‌స్టేషన్ల ఆవరణలో తప్పుపట్టిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్లు వేయడంలోగానీ, ఈ మలుపులో ప్రమాదం పొంచి ఉందన్న జాగ్రత్తలను సూచించడంలోగానీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రోడ్డు ప్రమాదాలు జరగగానే అటు పంజగుట్ట పోలీసులు, ఇటు బంజారాహిల్స్‌ పోలీసులు ఆ రోజు హడావుడి చేసి కేసులు నమోదు చేసి చేతుల దులుపుకొంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

    • నిమ్స్‌ ఆస్పత్రి వైపు నుంచి ఎఫ్‌సీఎల్‌ చౌరస్తాకు వెళ్లే ఈ మలుపు వద్దనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నా తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

    • ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..
      జలగం వెంగళరావు పార్కు ప్రారంభమైన చోట ఫుట్‌పాత్‌ను కొంత తగ్గించి రోడ్డును విస్తరించాలి.
    •  ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించి పాదచారులు రోడ్డెక్కకుండా చూడాలి. 
    •  ఈ మలుపు వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 
    •  ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 
    •  అడ్డుగా ఉన్న భారీ చెట్లను తొలగించాలి. 
    • రోడ్డు విస్తరణపై, ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేసి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. 
    • రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ఈ పరిధి మాది కాదంటే మాది కాదంటూ పోలీసులు చేతులెత్తేయకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. 

    చ‌ద‌వండి: వెంటాడిన విధి.. దూసుకొచ్చిన మృత్యువు

Politics

  • తాడేపల్లి:  కూటమి నేతలకు దేవుడిపై నమ్మకం ఉందని ఎలా నమ్మమంటారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్న కూటమి నేతలకు దేవుడంటే నమ్మకం ఉందని ఎలా అనుకోవాలన్నారు. 

    ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే  బరితెగించి మరీ మాట్లాడారని, పవన్‌ పని గట్టుకుని తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇదంతా చూస్తుంటే దేవుడంటే భయలేకుండా బరితెగించి మాట్లాడమేనని పేర్ని నాని ధ్వజమెత్తారు. 

    ఈరోజు(‍మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ క్లియర్‌గా చెప్పింది. అయినా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ మాట్లాడుతున్నారు. పవన్‌, లోకేష్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. 

    పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

    • బందిపోట్లకు మించిన ఆలోచనా ధోరణి ఉన్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
    • తిరుమల లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు ఉందంటూ ఈరోజు కూడా మాట్లాడారు
    • ఇంతకు మించిన బరితెగింపు లేదు
    • తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం జగన్ పై ఆరోపణలు చేశారు
    • చంద్రబాబుకు దేవుని‌మీద భక్తి, భయం ఏదీ లేదు
    • అందుకే విజయవాడలో అనేక ఆలయాలను చంద్రబాబు కూల్చారు
    • ప్రసిద్ధ కాశీనాయన క్రేత్రంలో సత్రాలను కూల్చింది కూడా ఈ చంద్రబాబు ప్రభుత్వమే
    • కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?
    • పవన్ మంత్రిత్వ శాఖ అధికారులే సత్రాన్ని కూల్చారు
    • పవన్ ఆదేశాలు లేకుండా కూల్చటం సాధ్యం అవుతుందా?
    • సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించలేదా?
    • ఇది నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కాదా?
    • తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే బాధ్యత లేదా?
    • తిరుచానూరులో వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చిందెవరు?
    • గోదావరి పుష్కరాలలో 29 మంది చావుకు కారణం ఎవరు?
    • తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చిందెవరు?
    • ఈ పాపాలన్నీ చేసింది చంద్రబాబే
    • అలాంటి చంద్రబాబు.. జగన్ మీద విషం కక్కుతారా?
    • రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారు
    • పెంటపాడులో రథాన్ని తగులపెడితే ఎందుకు నిర్మాణం చేయలేదు?
    • అంతర్వేదిలో రథం తగుల పడితే కోటి ఖర్చుతో జగన్ హయాంలో కొత్తది నిర్మించారు
    • రామతీర్థంలో రూ.3 కోట్లతో రాతి నిర్మాణంతో ఆలయాన్ని జగనే నిర్మించారు
    • చంద్రబాబు హయాంలో కూలదోసిన విజయవాడ ఆలయాలను కూడా జగనే నిర్మించారు
    • కొన్ని వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను జగనే నిర్మించారు
    • తిరుమలలో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానన్న చంద్రబాబు, పవన్ ఇప్పుడు కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు?
    • చంద్రబాబుకు దమ్ముంటే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయగలరా?
    • గదులు తీసుకోవాలన్నా లంచాలు ముట్టచెప్పాల్సిందే
    • కొండ మీద అవినీతి జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారు?
    • జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టు కింద 5,263 పనులు ఆలయాల్లో చేసినమాట నిజం కాదా?
    • రెండో సంతకంతో నియమించిన ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదు?
    • తిరుమల నుండి జీఏడీలోకి ఎందుకు పంపారు?
    • జులైలో నెయ్యి శాంపిల్స్ తీసి నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపారు
    • ల్యాబు రిపోర్టు ప్రకారం కల్తీ కలిశాయని వెనక్కు పంపారు
    • అవి రాఘవేంద్ర క్రషర్ దగ్గర పార్క్ చేశారు
    • ఆ ట్యాంకర్లను మళ్ళీ వైష్ణవి డెయిరీ పేరుతో కొండ మీదకు పంపారు
    • చంద్రబాబు కూటమి ప్రభుత్వమే ఈ పాపపు పని చేసి, జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేశారు
    • వైష్ణవి, బోలేబాబా డెయిరీలు ఎవరివి?
    • పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరూ బోలేబాబా, వైష్ణవి డెయిరీలకి ఓనర్లు
    • టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డెయిరీకి ఉన్న సంబంధం ఏంటి?
    • పొమిల్ జైన్, విపుల్ జైన్ లకు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయి
    • ఏఆర్ డెయిరీ ఓనర్ రాజురాజశేఖర్‌తో చంద్రబాబుకు సంబంధం ఉందా లేదా?
    • దిండిగల్ లో హెరిటేజ్ ఫ్యాక్టరీని కట్టించింది ఎవరో చంద్రబాబుకు గుర్తుందా?
    • జగన్ హయాంలో నిబంధనలు మార్చారంటున్న చంద్రబాబు.. మరి ఇప్పటికీ దాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు?
    • పాలకమండలిలో సభ్యులుగా ఉన్న పార్థసారథి, ప్రశాంతిరెడ్డి రికమెండేషన్ చేశారు
    • వారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నారు
    • 2022 లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోలేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు
    • ఆ రిపోర్టును పైవారికి పంపకుండా కింద వారు తొక్కి పెట్టారని సీబిఐ చెప్పిందా లేదా?
    • ఆల్ఫా, మాల్ గంగా, ప్రీమియర్ డెయిరీలు కల్తీ నెయ్యి సరఫరా చేశారంటున్న చంద్రబాబు మరి అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు కొనసాగించారు?

     

  • హైదరాబాద్‌:  మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా క్యాతన్‌పల్లిలో అధికార పార్టీకి తమ నేతలు లొంగలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. తమ ఒక్కో కౌన్సిలర్‌కు రూ. 3 కోట్లు ఆఫర్‌ చేశారని కేటీఆర్‌ అన్నారు. తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. 

    క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌లో మళ్లీ ఎన్నికలు పెట్టాలని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. క్యాతన్‌పల్లి స్పష్టమైన మెజార్టీతో గెలిచామన్నారు. ఇక పొత్తు ధర్మం పాటిస్తున్న సీపీఐకి ధన్యవాదాలు తెలియజేశారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

    కాగా, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 10 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను దక్కించుకుంది.  అయితే మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడుతూ, రాజకీయ పార్టీల మధ్య పోటీ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌, సీపీఐ కూటమి కలిసి ఎక్కువ వార్డులు గెలిచినప్పటికీ, కాంగ్రెస్ కూడా గణనీయమైన స్థానాలు సాధించింది. ఈ కారణంగా చైర్మన్‌ పదవి ఎవరికీ దక్కుతుందనే అంశం ఇంకా తేలలేదు, ఎన్నికల ప్రక్రియలో వివాదాలు, వాయిదాలు చోటు చేసుకుంటున్నాయి. 


     

  • వరంగల్‌: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల పురోగతిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రికి కేవలం రంగులు వేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగించడంలో విఫలమైందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, మంత్రులు ఎవరికి నచ్చినట్లు వారు డేట్‌లైన్‌లు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.

    గోదావరి జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని ఆలోచించారని, కానీ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించేవాళ్లమని తెలిపారు.

    అలాగే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, బీఆర్‌ఎస్ నిర్మించిన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు నిలిపివేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కక్ష్యపూరిత చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకుని నీటిని విడుదల చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇకపై సీఎంను ప్రతి అడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.

  • సాక్షి, అమరావతి: నారా లోకేష్‌ వ్యాఖ్యలపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. వెయ్యిలోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని లోకేష్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘హెరిటేజ్‌ 750 ఎంఎల్‌ నెయ్యి రిలయన్స్‌లో 456కి దొరుకుతుంది. హెరిటేజ్‌లో లీటర్‌ ఆవు నెయ్యి 608 రూపాయలకు దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.

    ‘‘హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ని ఎందుకు మర్చారో​ లోకేష్‌ చెప్పాలి. మొదట ఇందాపూర్‌ని మ్యాన్‌ఫాక్చర్‌ అని చెప్పారు. తర్వాత కో మ్యాన్‌ఫ్యాక్చర్‌ అని ఎందుకు మర్చారు? అంటూ బొత్స నిలదీశారు.

    కాగా, శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీకి బొత్స స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. మండలిలో శాంతి భద్రతల అంశం చర్చలో సంబంధం లేని అంశాలను టీడీపీ ప్రస్తావించింది. ‘‘వైఎస్సార్ తండ్రిని ఎవరు చంపారు?. తన తండ్రిని చంపిన వారిపై వైఎస్సార్ కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు ఇలా మాట్లాడి ఉండేవారా?. సభకు సంబంధం లేని అంశాలను ప్రస్తావించడం సరికాదు’’ అని బొత్స మండిపడ్డారు.

    హెరిటేజ్ నెయ్యి కల్తీనా? నిజం ఒప్పుకున్న లోకేష్

International

  • కువైట్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు  ఆ దేశ మిలటరీలో సేవ చేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. 2012 జనవరి 1 తర్వాత జన్నించిన వారికి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది.

    2015లో వచ్చిన సైనిక చట్ట సవరణలో కువైట్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి 18 ఏళ్లు దాటిన యువకులు దేశ మిలటరీలో పనిచేయడం తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేసింది. అయితే కుటుంబంలో ఒకే కుమారుడు ఉంటే సైన్యంలో కాకుండా ఇతర ప్రభుత్వ రంగాలలో విధులు నిర్వహించవచ్చని తెలిపింది. కొత్తగా చేసిన సైనిక చట్ట సవరణలో రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది.

    సైనిక సేవ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నాలుగు విభాగాల్లో మోహరిస్తున్నట్లు తెలిపింది. కువైట్ సాయుధ దళాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ నేషనల్ గార్డ్‌, కువైట్ అగ్నిమాపక దళాలలో యువత సేవలందించాలని పేర్కొంది.2015 చట్టంలోని లోపాలను అధిగమించడానికే ఈ నిబంధనలు తీసుకవచ్చినట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.

     ఇజ్రాయెల్ , దక్షిణ కొరియా, సింగపూర్ ,స్విట్జర్లాండ్  ఫిన్లాండ్ తో పాటు మరికొన్ని దేశాల్లో 18 ఏళ్లు దాటిన యువత సైన్యంలో పనిచేయడం తప్పనిసరి మరికొన్ని దేశాల్లో మహిళలు సైతం సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.

  • టెహ్రాన్‌: ఇరాన్‌లో  ఓ ట్రైనీ హెలికాప్టర్ జనావాస ప్రాంతాల్లో కుప్పకూలింది. మధ్య ఇరాన్‌ ప్రాంతంలోని ప్రూట్‌ మార్కెట్‌ ప్రదేశంలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లతో పాటు నలుగురు మృతిచెందారు. రాజధాని టెహ్రాన్‌కు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫహాన్ ప్రావిన్సులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

    అయితే ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ ఆర్మీ ట్రైనీ ట్రయల్స్  జరుపుతుందని తెలుస్తోంది. ఇద్దరు ఫైలట్లతో పాటు మరో ఇద్దరు సాధారణ ప్రజలు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే ఇటీవలే F-4 ఫాంటమ్ జెట్ కూలిన ఘటనలో ఒక ఫైలట్ మృతిచెందాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది.

    అయితే ఈ ప్రమాదం జరిగిన ఇస్ఫహాన్ ప్రావిన్సులో ఇరాన్ అణుస్థావరం ఉంది. గతేడాది ఇరాన్‌ లోని మూడు అణు స్థావరాలపై ఇస్ఫహాన్ ఫోర్దో,  నతాంజ్‌ అణుస్థావరాలపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే.

  • బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్ సైనిక దళాలపై జరిగిన దాడికి BLA దే బాధ్యత అని ‍ప్రకటించింది. బలూచిస్థాన్‌నికి స్వతంత్ర్యం కల్పించేంతవరకూ ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.

    ఫిబ్రవరి 22న  అలహాబాద్ ప్రాంతంలోని మాచ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై మెరుపుదాడి జరిగింది. ఈ అటాక్‌లో పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యతని BLA ప్రకటించింది. పాక్‌ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని BLA స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు.

    అయితే అంతకుముందు బలూచిస్థాన్‌ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. BLA ఆర్మీకి  వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు  రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్‌ను కట్ చేసింది. 

    అయితే బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్‌వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి   అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

  • ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మెక్సికన్ కార్టెల్ కింగ్‌, కరడుగట్టిన నేరస్థుడు జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత 'ఎల్ మెంచో'(Nemesio Oseguera Cervantes) నెమెసియో ఒసేగురా సెర్వంటెస్‌ని మెక్సికో సైనిక ఆపరేషన్‌లో మట్టు బెట్టింది.  మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఎల్ మెంచో అధ్యాయం ముగిసిపోవడంతో మెక్సికోలో హింస చెలరేగింది. అయితే ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నందున, మెక్సికో అంతటా హై అలర్ట్ ప్రకటించారు.  అయితే ఎల్ మెంచో అంతం వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి  వచ్చాయి. అసలు  ఆ ఆపరేషన్‌ ఎలా జరిగింది. కీలక సమాచారాన్ని అందించింది ఎవరు?  తెలుసుకుందాం.


    జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో మెక్సికన్ సైన్యం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఎల్ మెంచో మరణ వార్తతో అతని అనుచరులు మెక్సికో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు  వందలాది వాహనాలకు, పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారు. ప్రధాన నగరాల్లో భారీగా కాల్పులు, పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా, గ్వాడలజారా వంటి నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

    మెక్సికన్ భద్రతా దళాలు నిర్వహించిన హై-స్టేక్స్ ఆపరేషన్‌ చారిత్రాత్మక విజయం తరువాత  డ్రగ్స్ అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే ఆపరేషన్‌ ఎలా జరిగింది. అతని గర్ల్‌ఫ్రెండ్ కదలికలే అతన్ని పట్టించడంలో కీలక పాత్ర పోషించాయని మెక్సికన్ అధికారులు సోమవారం తెలిపారు."ఎల్ మెన్చో"తో రాత్రి గడిపిన తర్వాత, ఆ మహిళను ట్రాక్‌ చేసి, ఆ ప్రాంతంలోనే ఉంటున్నట్లు ధృవీకరించిన తర్వాత, ప్రత్యేక దళాలు తమ ప్లాన్‌ అమలు చేశాయని మెక్సికన్ రక్షణ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపారు.

    ఆపరేషన్ ఎలా జరిగింది?
    మెక్సికన్ రక్షణ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎల్ మెంచో ప్రియురాలిపై  నిఘా పెట్టిన మెక్సికన్ నిఘా  వర్గాలు  ఈ సారి విజయాన్ని సాధించాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఎల్ మెంచో అక్కడ ఉన్నాడని నిర్ధారించుకున్న మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

    మెక్సికన్ సైన్యం, నేషనల్ గార్డ్,  ఆరు హెలికాప్టర్లతో ఈ దాడి జరిగింది. ఎల్ మెంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అతని అనుచరులు సైన్యాన్ని అడ్డుకోవడానికి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు.

    భీకర పోరాటం 
    కాల్పుల మధ్య ఎల్ మెంచో ఒక పొదలో దాక్కున్నాడు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో అతను, అతని ఇద్దరు బాడీగార్డ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఈ ఆపరేషన్ , దాని తర్వాత చెలరేగిన హింసలో మొత్తం 70 మందికి పైగా మరణించారు. ఇందులో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక జైలు అధికారి మరియు 30 మందికి పైగా నేరస్థులు ఉన్నారు.


    మరోవైపు ఎల్ మెంచో మరణం తరువాత  అనతి ని కుడిభుజంగా చెప్పుకునే ఎల్ తులి  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చనిపోయిన ప్రతి సైనికుడికి 20,000 పెసోలు (సుమారు రూ. 84,000) బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు.  జాలిస్కో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధనం, నిప్పు పెట్టడం వంటి దాడులకు పాల్పడ్డాడు. అయితే, సైన్యం అతన్ని కూడా గుర్తించి కాల్చి చంపింది. అతని వద్ద నుండి 1.4 మిలియన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రతా కార్యదర్శి ఒమర్ గార్సియా హర్ఫుచ్  తెలిపారు.

    కాగా  ఇలాంటి డ్రగ్‌ మాఫియా కింగ్‌లను పట్టుకోవడంలో వ్యక్తిగత సంబంధాలు కీలకమైన బలహీనమైన లింక్‌గా ఎలా మారుతాయో తాజాగా ఘటన పెద్ద ఉదాహరణ. గత పదేళ్లుగా  జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌ని  అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా క్రూరమైన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతని వ్యక్తిగత సంపద ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు)  పై మాటేనని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అంచనా. ఎల్ మెన్చో ఒక్కడే  కాదు అతని కుటుంబం  పాత్ర కూడా ఈ నేర కార్యకలాపాలలో తక్కువేమీ కాదు. అతని కుమారుడు, కుమార్తె, సోదరుడు. వీరు  ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు లేదా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇతని భార్య రోసలిండా గొంజాలెజ్-వాలెన్సియాను 2021 నవంబరులో అరెస్టు చేశారు. 
     

Family

  • ఒక్క అందాల నటి నిధి అగర్వాల్‌ని చూస్తేనే కళ్లు అప్పగించేస్తాం.. అలాంటిది ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకేసారి అరడజను మంది నిధి అగర్వాల్‌లను చూస్తే.. కళ్లు బైర్లు కమ్మడమే తరువాయి కదా..! ఇలాంటి అద్భుతం ఒక్కటేనా..? అంటే కాదు! నేల మీద నడుస్తున్నా చుట్టూ రంగు రంగుల నీళ్ల ప్రవాహంలో తేలిపోతున్నట్టు, గాంధీ తాత ఫొటోలోని కళ్లు ఆర్పి తెరుస్తున్నట్టు.. వగైరా వింతైన అనుభవాలు, జీరో గ్రావిటీ రూమ్, ఇన్ఫినిటీ వెల్, పారడాక్స్‌ టన్నెల్, పారడాక్స్‌ సోఫా, వాకింగ్‌ కెలిడియోస్కోప్‌లతో కూడిన పారడాక్స్‌ మ్యూజియం భాగ్యనగరంలో ఏర్పాటైంది. 

    యూరప్‌కు చెందిన మిల్టోస్, కంబౌరిడెస్‌ సాకిస్‌ టానిమానిడిస్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రణవ వన్‌లో నెలకొల్పిన ఈ పారడాక్స్‌ మ్యూజియంను ప్రముఖ టాలీవుడ్‌ సినీ నటి నిథి అగర్వాల్‌ సోమవారం ప్రారంభించారు. 

    ఈ సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు మాట్లాడుతూ ఆప్టికల్‌ ఇల్యూజన్ల మిశ్రమమైన ఈ మ్యూజియం విజ్ఞాన, వినోదాల మేళవింపుగా పేర్కొన్నారు. 2022 నుంచి ఒస్లో, లండన్, పారిస్, మియామి, స్టాక్‌హోమ్, బెర్లిన్, షాంఘై, బార్సిలోనా, ముంబై వంటి నగరాల్లో వీటిని వరుసగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.  

  • హాంకాంగ్‌కు చెందని కవితా బిశ్వాస్‌ టీచింగ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తుండేవారు. పూర్తికాల ఉద్యోగం తోపాటు యోగా, నృత్య సాధనతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవతం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఆకస్మత్తుగా నలభైల మధ్యలో మోకాలి నొప్పి బారిన పడింది దాంతో ఆమె లైఫ్‌ఎంతో ఘెరంగా మారిపోయిందంటే..మళ్లీ నడుస్తానన్న ఆశ ఆవిరైపోయింది. కానీ ఆమె ఆ సమస్యను ఎలాంటి మోకాలి ఆపరేషన్‌ చేయించుకోకుండానే జయించింది. పట్టుదలతో అనారోగ్య సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే..ఏ సమస్య అయినే ఇట్టే మాయం అయిపోతుందనడానికి ఆమె ఉదంతమే ఉదాహరణ. 

    హాంకాంగ్‌ పాఠశాలలో టీచర్‌గా సాగిస్తున్న కవితా బిశ్వాస్‌  జీవితాన్ని మోకాలి నొప్పి..ఆమె జీవితాన్ని చాలా దుర్భరంగా మార్చేసింది. భరించలేని నొప్పి, నడక కష్టమై ఎక్కడకు వెళ్లలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది. కనీసం ఓ పదినిమిషాలు నడవాలంటే ప్రాణమే పోయేంత పరిస్థితి. చివరికి కర్ర సాయం లేకుండా నాలుగు అడుగులు కూడా వేయలేని దారుణమైన పరిస్థితికి చేరిపోయింది. ఆఖరికి ఎయిర్‌పోర్ట్‌లో సైతం వీల్‌చైర్‌ ఆధారం తీసుకోవాల్సి వచ్చిందామెకు. ఆమె ట్రీట్‌మెంట్‌ కోసం భారత్‌కు వచ్చారు. ఇక్కడి వైద్యులు మోకాలి లిగమెంట్‌ దెబ్బతిందని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదని చెప్పారు. 

    అయితే ఆమె వయసు ఈ చికిత్సకు అర్హమైనది కాకపోవడంతో..మందులు, వ్యాయామాలను కొనసాగించి చూడమని సూచించారు. దాంతో తిరిగి హాంకాంగ్‌ వచ్చేశారు. ఇక ఎప్పటిలా తనకు తానుగా స్కూల్‌కి, నృత్యసాధన సాధ్యం కాదని అర్థమైపోయింది కవితకి దాంతో ఫిజియోథెరపీ తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారామె. ఓపక్కన  చికిత్స తీసుకుంటూనే..చిన్నగా నడవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేసింది. మోకాలి వంచలేదని తెలుసు కానీ..వర్కౌట్లు చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుందని అలానే బాధనంతటిని పట్టి బిగువున అదిమపట్టి చేస్తుండేది.  గోడ ఆధారిత వ్యాయామాలు, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు సాయంతో కండరాలు బలోపేతం చేసే కొద్దిపాటి వ్యాయామాలు చేస్తుండేది. 

    అలాగే ఆహారంలో మార్పులు చేసుకుని 92 కిలోలు నుంచి 74 కిలోలకు చేరుకుది. సుమారు 18 నెలల తర్వాత, కర్ర సాయం లేకుండా తనంతట తానుగ నడవగలిగింది. అంతేగాదు సుమారు 45 నిమిషాల వరకు నడవగలగడంతో..మళ్లీ నా స్వతంత్ర వచ్చింది అంటూ సంబరపడిందామె. ఇక్కడ కవిత తన నొప్పి, వాపులకు అనుగుణంగా వ్యాయామాలు చేసుకునేలా సర్దుబాటు చేసుకుంది. అలా ఈ సమస్య నుంచి బయపటపడే ప్రయత్నం చేసింది. 

    అంతేగాదు ఈ మహిళ అనుభవం..మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్వహించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తేటతెల్లం అయ్యింది. మూడేళ్ల క్రితం కవిత ఎయిర్‌పోర్టుకి వీల్‌చైర్‌పై వస్తే..ఇపు​డు ఆమె ధీమాగా నడుచుకుంటూ వెళ్లింది. ఆ మహిళ స్టోరీ..ఏ అనారోగ్య సమస్య అయినా..ధైర్యంగా ఉండి వైద్యనిపుణుల సాయం తీసుకుంటే..సులభంగా బయటపడొచ్చని చెప్పకనే చెబుతోంది.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: నయనేంద్రియానం కార్నియా ప్రధానం..!)

     

  • వ్యాపార ప్రపంచంలో  అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్‌ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్‌. ఇవాళ కోకిల్‌ బెన్‌ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్‌గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్‌సిటీకీ కేరాఫ్‌గా నిలిచారామె. 

    ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్‌ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్‌డేట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్‌ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్‌ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్‌. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్‌తో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. 

    కోకిలాబెన్‌ నేపథ్యం..
    1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్‌లోని ఆడెన్‌లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. 

    అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్‌.

     

    (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌)
     

  • ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి అతడు / ఆమె నేర్చుకునే మొత్తం జీవన నైపుణ్యాల్లో దాదాపు 80 శాతానికి పైగా కంటిచూపు వల్లనే సాధ్యమవుతుంది. పైగా ఈ యుగంలోని చిత్రవిచిత్రాలన్నీ చూడాలంటే కన్నుంటేనే సాధ్యం. అందుకే ‘కన్నుంటేనే కలికాలం’ అన్న నానుడి స్థిరపడింది. జనసామాన్యంలోని ఈ మాటే ఈరోజుల్లో  కంటికి ఉన్న ప్రాముఖ్యతనూ, ప్రాధాన్యాన్నీ నొక్కి చెబుతుంది. 

    మరి ఇంతటి విలువైన కంటిచూపును ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు నేత్రదానం తర్వాత కంటి చూపు పొందడం సాధ్యమవుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. పైగా ఈ కంటిదానం సమయంలో మొత్తం కనుగుడ్డును స్వీకరిస్తారనే అపోహ కూడా చాలామందిలో ఉంటుంది. నిజానికి కార్నియా అనే పారదర్శకమైన పొర దెబ్బతినడం వల్ల వచ్చిన దృష్టిలోపాన్ని మాత్రమే నేత్రదానంతో సరిచేయడం సాధ్యమవుతుంది. 

    పైగా ఇలా నేత్రదానం చేసిన కేసుల్లో కనుగుడ్డు మొత్తం కాకుండా కేవలం ‘కార్నియా’ అనే నల్లగుడ్డుపై ఉండే పోరనే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నేత్రదానమనేది ఎప్పుడెప్పుడు ఎంతమేరకు సాధ్యం?  ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా కంటి చూపును పొందడం ఏయే సందర్భాల్లో సాధ్యమవుతుంది? ఏయే సందర్భాల్లో అది సాధ్యం కాదు... అలా సాధ్యం కాక΄ోవడానికి కారణాలేమిటి... వంటి అనేక అంశాలపై  అవగాహన కోసం... ఈ కథనం. 

    కంటితో చూడటాన్ని సాధ్యం చేసే కంటి నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను ‘కార్నియా’ అంటారు. నిజానికి నేత్రదానం చేసిన వారి నుంచి కంటిని తీసుకునే సమయంలో కనుగుడ్డునంతా స్వీకరించరు.  కేవలం కార్నియా అని పిలిచే ఈ నల్లగుడ్డుపై ఉండే పారదర్శకమైన పొరను మాత్రమే తీసుకుంటారు.

    కార్నియా అంటే..?
    ఇది కంట్లో ఉండే ఒక పారదర్శకమైన పొర. కంటిలోని నల్లగుడ్డుపై ఉండటం వల్ల... ఇది పారదర్శకమైన పొర కావడంతో ఇది కూడా నల్లగా కనిపిస్తుంది. ఇది కంట్లోని ఐరిస్‌ అనే భాగాన్ని, ప్యూపిల్‌నూ, యాంటీరియర్‌ ఛేంబర్‌ను కప్పి ఉంచుతుంది. 

    ఇది బయటి నుంచి వచ్చే కాంతికిరణాలను కంటిపై పడేలా చూస్తూ... మొదట కంట్లోకి ప్రవేశించేలా... అటు పిమ్మట కంటి వెనక ఉండే పొర రెటీనాపై ప్రతిబింబించేలా చేస్తుంది. ఇది పారదర్శకంగా ఉంటేనే చూపు ఉంటుంది. ఇది పారదర్శకత కోల్పోవడం వల్ల చూపునూ కోల్పోవడం జరుగుతుంది.  

    కార్నియా మార్పిడి చికిత్స అంటే..?
    కార్నియా గాయపడటం లేదా దెబ్బతినడం వల్ల కలిగిన అంధత్వాన్ని కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ అంటారు. కార్నియా దెబ్బతినడం వల్ల ఎవరైనా కంటి చూపు కోల్పోతే... అలాంటి వారికి దెబ్బతిన్న కార్నియా స్థానంలో మంచి కార్నియాను అమర్చడం ద్వారా వారు కోల్పోయిన చూపును తిరిగి తెప్పించడం సాధ్యమే. అంటే కార్నియా దెబ్బతినడం వల్ల వచ్చిన అంధత్వానికి మాత్రమే కార్నియా ద్వారా చూపు తెప్పించవచ్చు. 

    ప్రస్తుతానికి కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ఈ ప్రక్రియ ఒక్కటే అందుబాటులో ఉంది. ఇప్పటికి ఇది మాత్రమే సాధ్యం. ఇంకా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటిచూపును ΄పొందేందుకు పెద్దగా అవకాశాలేమీ లేవు. అయితే కేవలం కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌నే కాకుండా ఇతరత్రా కారణాల వల్ల కోల్పోయిన కంటి చూపును ΄పొందడానికి ప్రయత్నాలూ, పరిశోధనలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

    తొలిసారి కార్నియా మార్పిడి చికిత్స నేపథ్యమిలా..
    తొలిసారిగా కార్నియా మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్‌ ఎడ్వర్డ్‌ జిమ్‌ అనే వైద్య నిపుణుడు 1905లో చేశారు. కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతానికి పైగా ఉంటాయి. అయితే ఎవరైనా కళ్లు దానం చేసిన వ్యక్తి మరణించాక ఆరుగంటలలోపే అతడి నుంచి కార్నియాను స్వీకరించి, ఐ–బ్యాంక్‌లో భద్రపరచాల్సి ఉంటుంది. అటు తర్వాత సేకరించినప్పటికీ అది కార్నియా మార్పిడికి ఉపయోగపడదు.

    కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌కు దారితీసే పరిస్థితులు 

    కంటికి అయ్యే గాయాల కారణంగా కార్నియా దెబ్బతినడం 

    రసాయన ప్రమాదాలకు గురికావడంతో కార్నియా గాయపడటం లేదా కాలి΄ోవడం (కార్నియల్‌ బర్న్‌) 

    పోషకాహార లోపం వల్ల కార్నియా దెబ్బతినడం (మరీ ముఖ్యంగా చిన్న వయసులో వైటమిన్‌ ఏ లోపం వల్ల) 

    కంటికి... మరీ ముఖ్యంగా కార్నియాకు వచ్చే ఇన్ఫెక్షన్స్‌ (కార్నియల్‌ అల్సర్స్‌ – నిజానికి మిగతా కారణాల కంటే కార్నియల్‌ ఇన్ఫెక్షన్‌తోనే అంధత్వాలు వచ్చే అవకాశం ఎక్కువ) 

    పుట్టుకతో లేదా జన్యుపరంగా వచ్చే కొన్ని రకాల సమస్యలు 

    ఆపరేషన్‌ తర్వాత వచ్చే కాంప్లికేషన్లతో ఒకవేళ పైన పేర్కొన్న కారణాలతో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తే దాన్ని కార్నియా మార్పిడి (కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) చికిత్సతో బాధితులకు చూపు తెప్పించవచ్చు.

    కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఎప్పుడెప్పుడంటే... 
    కంటి చూపునకు సంబంధించిన  కొన్ని సమస్యలున్నప్పుడు (ఆప్టికల్‌)  :  సూడోఫేకిక్‌ బుల్లోస్‌ కెరటోపతి, కార్నియల్‌ డీజనరేషన్, కెరటోకోనస్, కెరటోగ్లోబస్, కార్నియల్‌ డిస్ట్రఫీ వంటి కొన్ని కంటి సమస్యలు ఉన్నప్పుడు కంటిచూపును మెరుగుపరచడానికి. 

    కంటిలోని భాగాలను సమీకృతంగా (ఇంటెగ్రల్‌గా) ఉంచడానికి (టెక్టానిక్‌) : ‘స్ట్రోమల్‌ థిన్నింగ్‌ డెస్మాటోసీల్‌’ అనే సమస్యలున్నప్పుడు కంటిలోని భాగాలను బయటికి రాకుండా నియంత్రించి వాటిని ఏకీకృతంగా లోపలే కలిపి ఉంచడానికి.  
    చికిత్సలో భాగంగా చేసే ట్రాన్స్‌ప్లాంట్స్‌లో (థెరటిక్‌) : ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు చికిత్సకు ఎంతమాత్రమూ సహకరించకుండా ఉండే కార్నియల్‌ భాగాన్ని తొలగించి, ఆ ప్రదేశంలో కొత్త కార్నియా ఉంచి చూపు తెప్పించడానికి. 

    అందం కోసం (కాస్మటిక్‌): కంటి నల్లగుడ్డు భాగంలో తెల్లమచ్చలు ఉన్నప్పుడు...ఆ   కార్నియల్‌ స్కార్స్‌ను తొలగించి, అందాన్ని ఇనుమడింపజేయడం కోసం.

    ఎవరెవరిలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సాధ్యం కాదంటే... 
    కొందరిలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా చూపు తెప్పించడం సాధ్యం కాదు. అది ఎవరిలోనంటే... ∙రెటీనా లోపం లేదా ఆప్టిక్‌ నర్వ్‌ లోపంతో అంధత్వం వచ్చినవారు 

    రెటినైటిస్‌ పిగ్మెంటోజా అనే కండిషన్‌ కారణంగా చూపు కోల్పోయిన వారు 

    వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చిన మాక్యులార్‌ డీజనరేషన్‌ అనే సమస్య కారణంగా చూపు పోగొట్టుకున్నవారు ∙ఆప్టిక్‌ అట్రోఫీతో బాధపడుతున్నవారు 

    రాడ్‌ అండ్‌ కోన్‌ డిస్ట్రఫీ అనే జబ్బుల కారణంగా చూపు కోల్పోయిన వారు ∙నీటికాసుల (అడ్వాన్స్‌డ్‌ గ్లకోమా)తో కంటిచూపు కోల్పోయినవారు, 

    కాంతికి స్పందించని (లైట్‌ పర్‌సెప్షన్‌ లేని) కళ్లలో ఈ చికిత్స సాధ్యం కాదు. ఇక్కడ పేర్కొన్న అన్ని సందర్భాల్లోనూ కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో ఏమాత్రం ప్రయోజనం చేకూరదు.

    నేత్రదానం ఎందుకు చేయాలి? 
    భారతదేశంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల మంది కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా అంధులుగా మారుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పైగా ప్రతి సంవత్సరమూ ఈ కార్నియల్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా ఏడాదికి 25,000 నుంచి 30,000 వరకు కొత్త కేసులు ఈ అంధుల జాబితాకు జత అవుతున్నాయన్నది మరో అంచనా. నేత్రదానం అంటే కార్నియాను ఇవ్వడం వల్ల వీళ్లకు అంధత్వాన్ని దూరం చేసి, కంటిచూపు ప్రసాదించవచ్చు.  

    నిజానికి మన దేహంలోని కొన్ని కణజాలాలను కృత్రిమంగా సృష్టించడం సాధ్యం కాదు. ఒకరి నుంచి దానంగా స్వీకరించిన కణజాలాన్ని వేరే చోట అమర్చగలగడం  సాధ్యమవుతుంది. అందువల్ల అలాంటి కణజాలాలు అవసరమైనప్పుడు వాటిని దాత ఇచ్చినప్పుడే స్వీకరించడం సాధ్యమవుతుంది. అలాంటివాటిల్లో కార్నియా ఒకటి. ఒకవేళ పిల్లల్లో ఇలా కార్నియా లోపం వల్ల అంధత్వం వస్తే... ఆ పిల్లలకు తెలిసే ఒకే ఒక రంగు... నలుపు! ఈ రంగురంగుల ప్రపంచాన్ని వాళ్లు చూడటమే సాధ్యం కాదు. 

    ఆ చిన్నారి జీవితాల్లోంచి ఆ నలుపును తొలగించి, వాళ్ల జీవితాలను రంగుల మయం చేయడానికి కార్నియాలు లభ్యం కావడమన్నది ఎంతగానో అవసరం. అందువల్ల వ్యక్తులంతా తమ మరణానంతరం కార్నియాను నిరుపయోగంగా మట్టిలో కలిసి΄ోయేలా చేయడానికి బదులు, వాటిని దానంగా ఇవ్వడం ద్వారా ప్రతి వ్యక్తీ మరో ఇద్దరికి చూపును తెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే అలా కంటిచూపునకు దూరమైన వ్యక్తులకు ఈ లోకం చూపించడానికి నేత్రదానాలు పెరగడం ఎంతగానో అవసరం.

    నేత్రదానం చేయడానికి ఎవరెవరు అర్హులు ? 
    ఏడాది వయసుకు పైగా ఉన్నవారెవరైనా తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి అర్హులవుతారు. అలాంటి వారిలో ఈ కింద పేర్కొన్న సమస్యలునప్పటికీ వారు తమ మరణానంతరం నేత్రదానం చేయవచ్చు. అవి... 

    పాక్షికంగానే కనుచూపు ఉన్నవారు (పూర్‌ సైట్‌), ∙

    కళ్లజోడు వాడేవారు 

    డయాబెటిస్‌తో బాధపడేవారు 

    రక్తపోటుతో బాధపడేవారు (చక్కెర వ్యాధి, హైబీపీ ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు. ఇలాంటి రుగ్మతలు ఉన్నప్పటికీ నేత్రదానానికి వారు పూర్తిగా అర్హులే) 

    రెటీనా లేదా ఆప్టిక్‌ నర్వ్‌ లోపం వల్ల అంధత్వం వచ్చినవారూ... వీరంతా ఎంతగా వయసుపైబడ్డవారైనప్పటికీ  నిరభ్యంతరంగా నేత్రదానం చేయవచ్చు.

    కార్నియాల లభ్యత అవసరమైన మేరకు ఎందుకు ఉండటం లేదంటే? 
    నేత్రదానం అని చెప్పే ఈ కార్నియా దానాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా జరగడం లేదనే చె΄్పాలి. దాంతో బాధితులకు అవసరమైనన్ని కార్నియాలు లభ్యం కావడం లేదు. చాలా అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని ఇవే... 

    నేత్రదానం విషయంలో అవగాహనలోపం ∙నేత్రదానం తర్వాత కార్నియాలను నిలువ చేయడానికి అవసరమైననన్ని కేంద్రాలు (ఐ బ్యాంకులు) లేకపోవడం, 

    నేత్రదానాన్ని ్ర΄ోత్సహించే వారి సంఖ్య అంతగా లేక΄ోవడం (మోటివేషన్‌ లేక΄ోవడం) 

    సామాజిక, మతపరమైన కారణాలతో నేత్రదానానికి ముందుకు వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండటం.

    కార్నియా సేకరణ ఎలా జరుగుతుందంటే..? 
    నేత్రదానం చేస్తానని వాగ్దానం చేసిన వ్యక్తి మరణించిన వెన్వెంటనే... బంధుమిత్రులు ‘ఐ బ్యాంక్‌’కు సమాచారమివ్వాలి. ఎందుకంటే... మరణించాక ఆరు గంటలలోపే దాత నుంచి కార్నియాను సేకరించాలి. లేకపోతే ఆ కార్నియా నిరుపయోగంగా మారిపోతుంది. ఈలోపు ఐ–బ్యాంక్‌ నుంచి సిబ్బంది వచ్చే లోపు మరణించిన వ్యక్తి కళ్లపైన తడి దూదిని ఉంచాలి. ఆ గదిలో ఉన్న ఫ్యాన్‌ను స్విచ్‌–ఆఫ్‌ చేయాలి. 

    మరణించిన వ్యక్తి తల భాగం మిగతా శరీరానికి ఆరు అంగుళాల ఎత్తుండేలా మృతుడి తలకింద తలగడ అమర్చాలి. ఐ–బ్యాంక్‌ సిబ్బంది వచ్చాక... ఇక్కడ పేర్కొన్నట్లుగా ఉంచిన మృతుడి పార్థివ శరీరంలోని కళ్లలోని కార్నియాతోపాటు 10 సి.సి.ల రక్తపు నమూనానూ సేకరిస్తారు. కార్నియా తొలగింపు తర్వాత  ఐ–బ్యాంక్‌ సిబ్బంది ఆ ప్రదేశంలో కృత్రిమ కార్నియాను అమర్చి కంటి ఆకృతిలో ఎలాంటి తేడా కనిపించకుండా  చూస్తారు.

    చూపు పొందడానికే అవకాశాలెక్కువ... 
    కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కాకసోవడానికి అవకాశాలు చాలా తక్కువ. శస్త్రచికిత్స విజయవంతమై చూపు పొందడానికే అవకాశాలెక్కువ. ఈ మాట చె΄్పాల్సిన అవసరమేమిటంటే... సాధారణంగా మిగతా అవయావాల మార్పిడి తాలూకు శస్త్రచికిత్స చేసినప్పుడు శరీరం ఆ అవయవాలను అంత తేలిగ్గా తనవిగా ఆమోదించదు. తనది కాని బయటి పదార్థం (ఫారిన్‌బాడీ) పరిగణించి, దాన్ని రిజెక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది.  కానీ కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అలాంటి అవకాశాలు చాలా తక్కువ. 

    అందుకే దాదాపు 90 శాతం కేసులకు పైగా విజయవంతం అవుతాయి. పైగా పైన పేర్కొన్న రిస్క్‌ ఉన్నందున మిగతా అవయవ మార్పిడి శస్త్రచికిత్స కేసుల్లో శరీరానికి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గించడానికి  ఇమ్యూనోసప్రెసెంట్‌ ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కార్నియాకు అలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేత్రదానం విషయంలో ఉన్న మంచి సౌకర్యం. కంటి ఆపరేషన్‌ అయినవాళ్లు కూడా నేత్రదానానికి అర్హులే.

    ఏయే సందర్భాల్లో రిస్క్‌ ఉంటుందంటే... 
    కార్నియాను అమర్చే సమయంలో స్వీకర్త శరీరం దాన్ని స్వీకరించక΄ోవడం అన్న రిస్క్‌ చాలా తక్కువ. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదం ఉండవచ్చు. అదెప్పుడంటే...

    అంటించిన గ్రాఫ్ట్‌ ఊడిపోవడం లేదా కదిలిపోవడం 

    గ్రాఫ్ట్‌ తర్వాత కంటికి ఇన్ఫెక్షన్‌ రావడం 

    కంటిలోని గుడ్డులో ఒత్తిడి పెరగడం వల్ల (గ్లకోమా) 

    కుట్లు వేయడంలో కొన్ని సమస్యల కారణంగా 

    కార్నియా వాపు వచ్చినప్పుడు.

    కార్నియా నిరుపయోగమని తేలితే...? 
    కొందరు పెద్దమనసుతో నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ వాళ్ల కార్నియా నిరుపయోగం అని తేలితే... అప్పుడూ దాతల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఎయిడ్స్‌ రోగులు, హెపటైటిస్‌ బీ లేదా సీ ఉన్నవారి కార్నియాలు దానంగా స్వీకరించడానికి ఉపయోగపడవు. అయితే కొన్ని సందర్భాల్లో వారి నుంచి స్ల్కెరా వంటి కొన్ని కంటి భాగాలను గ్రాఫ్టింగ్‌ కోసం వాడుకోవచ్చు. 

    మరికొన్ని సందర్భాల్లో మానవాళికి ఉపయోగపడే కొన్ని పరిశోధనల కోసం కూడా ఆ కార్నియాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే మరో బాధితుడికి అమర్చడానికి వీల్లేనంత మాత్రాన కార్నియా నిరుపయోగం అవుతుందనే అభి్ర΄ాయానికి రావద్దు. 

    చివరగా... మరణానంతరం వృథాగా మట్టిలో కలసిపోవడం వల్లగానీ లేదా కట్టెపై కాలిపోవడం ద్వారాగానీ వృథాగా పోయే కార్నియాలను వీలైనంత ఎక్కవ మంది దానం చేస్తే... ఎంతోమంది చిన్నారులూ, పెద్దవారూ చూపు పొందేలా చేయవచ్చు. అందుకే కార్నియా దానాల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహనను పెంచుకోవడం ఎంతైనా అవసరమని గుర్తించాలి.        
    ఎవరు నేత్రదానం చేయడానికి అర్హులు కారంటే... 
    కొందరి నుంచి మరణానంతరం కార్నియా స్వీకరించడం కుదరకపోవచ్చు. వారు ఎవరంటే... నిర్దిష్టంగా ఏ కారణం వల్ల చనిపోయారో చెప్పలేని వారు 

    రేబిస్, సిఫిలిస్, హెపటైటిస్, సెప్టిసీమియా, ఎయిడ్స్‌ వంటి జబ్బులతో చనిపోయిన వారి నుంచి 

    కంటికి వచ్చే ఆక్యులార్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉన్నవారు... 

    ఈ అందరి నుంచి కార్నియా స్వీకరించడం కుదరదు. అంటే వీళ్లు నేత్రదానానికి అర్హులు కాదు. 
    డాక్టర్‌ 
    కె. రవికుమార్‌ రెడ్డి
    సీనియర్‌ 
    కంటి వైద్య నిపుణులు 
    నిర్వహణ: యాసీన్‌ 

    (చదవండి:

  • ఆహార విక్రేతలు వాళ్ల ఫుడ్‌ స్టాల్‌ అ‍మ్మకాల కోసం ఎన్నో రకాల వ్యూహాలతో సాగుతారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ ఈ పానీపూరీ విక్రేత అంతకుమించి క్రియేటివిటీతో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. మొత్తం సెటప్‌ చూస్తే..అది పానీ పూరీ అమ్ముతున్నట్లుగా ఉండదు..ఏదో వార్‌లా కనిపిస్తుంది. ఈ వ్యక్తి క్రియేటివిటీకి, ఐడియాకు మెచ్చుకోకుండా ఉండలేం. అంతలా ఫుడ్‌స్టాల్‌ని సెటప్‌ చేశాడు మరి..!. ఎక్కడంటే..

    ముంబైకి చెందిన పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్‌ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి ఆహార్యం సైతం పూర్తి విభిన్నంగా ఉంది. అతడు పానీపూరీని పోరాట అడిషన్‌గా మార్చేశాడు. యుద్ధం చేసే సైనికుల మాదిరిగా పవర్‌ఫుల్‌ వార్‌మ్యాన్‌లా దుస్తులు ధరించి చేతిలో సూపర్‌సోకర్‌ వాటర్‌గన్‌తో ప్రజలకు పానీపూరీని సర్వ్‌ చేస్తున్నాడు. 

    ఆలుకర్రీ స్టఫ్‌తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్‌గన్‌తో సర్వ్‌ చేస్తున్నాడు. కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటుండం విశేషం. అంతేగాదు ఒకరకంగా ఆవిచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తున్నారు. 

    ఇది మార్కెటింగ్‌ ట్రిక్‌ అయినా..పొట్టకూటి కోసం మనిషి ఎంత దూరమైన వెళ్తాడు..పైగా తనలోని టాలెంట్‌ మొత్తం బయటకు తీసి ఏదోరకంగా బతుకుబండిని నడిపించేందుకు ఆరాటపడతాడు. అందుకు నిదర్శం ఈ పానీపూరీ వ్యాపారి క్రియేటివిటీనే కదూ..!.

    (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్‌ పేరెంటింగ్‌ స్టైల్‌)

     

     

Crime

  • రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. 

    వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు.  అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.