Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారంటూ ఆయన చేసిన కామెంట్లపై తెలంగాణ  నాయకులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర​్‌ ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్‌ అయ్యారు.

    పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్‌ ఇచ్చారు. 

    పవన్ కల్యాణ్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే... హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్‌లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు.  తెలంగాణ ప్రాంతమంటే  ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్‌ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.

  • రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఒక ప్రేమ జంట ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అబ్బాయి పేరు ధనుంజయ్ కాగా అమ్మాయి పేరు అనామిక అని తెలుస్తోంది. మృతులిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారు.  వీరిద్దరూ స్థానికంగా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారని సమాచారం. కాగా  ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ లో‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్‌ ప్రభుత్వానికి చేరడంతో దీనిపై కాసేపట్లో గెజిట్‌ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. 

    ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.  హైదరాబాద్‌ తెలంగాణ కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది.

    జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న పురపాలికలివే...
    మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా : బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట, కొంపల్లి, దుండిగల్‌  

    రంగారెడ్డి జిల్లా: బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, నార్సింగి, మణికొండ, ఆదిభట్ల,
    తుక్కుగూడ 
    సంగారెడ్డి జిల్లా: బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్‌  
     

  • తెలంగాణలో ఇటీవల జరిగిన ఐపీఏస్ పోస్టింగులపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పలు శాఖలలో ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉండగా వారికి బదులుగా ఐపీఎస్ ఆఫీసర్స్ ని నియమించారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ అంశంపై త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది.

     

     

     

  • దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను ఎమ్‌హెచ్‌ఏ పరిగణనలోకి తీసుకుంది. అలాగే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ సీసీటీఎన్‌ఎస్‌ పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.

    ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ఏడో ర్యాంకును సాధించడం విశేషం.

    ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, ఏసీపీ మేడ్చల్ బాలగంగిరెడ్డి, శామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌తో పాటు సిబ్బందిని అభినందించారు.

     

  • సాక్షి, వరంగల్: మండలంలోని ఆశాలపల్లి సర్పంచ్‌ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశమైంది. గ్రామంలో ఉన్న ఒకేఒక ఎస్సీ మహిళ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా కానుంది. వివరాలిలా ఉన్నాయి. ఆశాలపల్లిలో ఎస్సీ కుటుంబాలు లేవు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ, వెంకటయ్య దంపతులు 10 సంవత్సరాల కిత్రం బతుకుదెరువు కోసం పాలేరు పనికి ఆశాలపల్లికి వచ్చారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా పెళ్లి చేశారు. మల్లమ్మ, వెంకటయ్య ఇద్దరే ఎస్సీ ఓటర్లుగా నమోదయ్యారు. కాగా, మూడు నెలల క్రితం వెంకటయ్య గేదెలను మేపడానికి వెళ్లి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

    మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా గ్రామంలో నమోదై ఉంది. ఇప్పుడు ప్రకటించిన ఆశాలపల్లి సర్పంచ్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌ కానుంది. దీంతో సర్పంచ్‌ రిజర్వేషన్‌ మార్చాలని కోరుతూ మాజీ సర్పంచ్‌ కిశోర్‌యాదవ్‌తో పాటు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు రమేశ్‌, నాగరాజు, సంపత్‌, నరహరి తదితరులు డీపీఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాగా, ఒక్కసారి రిజర్వేషన్‌ ప్రకటించిన తర్వాత మార్చడానికి వీలు లేదని, మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌ కావడం ఖాయమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

    అధికారులు లెక్కలు సరిచేయకపోవడంతోనే..
    2011 జనాభా లెక్కల ప్రకారం 1,807 జనాభా ఉంది. 350 మంది ఎస్సీలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. కానీ, వాస్తవంగా ఆ గ్రామంలో ఎస్సీలు లేరు. అధికారులు ఆ లెక్కలను సరిచేయకపోవడంతోనే రిజర్వేషన్‌ ఎస్సీ మహిళకు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికై జాక్‌పాట్‌ కొట్టనుంది.

Movies

  • సినీ నటుడు నాగచైతన్య సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు. తను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ 'దూత' రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాయతీగా ఒక ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్‌ అవుతారని దూత నిరూపించిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు.  నటుడిగా సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని అందుకు తగ్గట్టుగా నిజాయతీతో పని చేసి ఆపై మంచి ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు.  ‘దూత’ రెండేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక పోస్ట్‌ చేశారు.

    దూత వెబ్‌సిరీస్‌ చాలా బాగా నచ్చిందంటూ అభిమానులు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సీజన్‌-2 ఎప్పుడు తీసుకోస్తారంటూ వారు కోరుతున్నారు. దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌ 2023 డిసెంబరు 1న  ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది. ఇందులో జర్నలిస్టు సాగర్‌ వర్మ పాత్రలో నాగచైతన్య మెప్పించారు. నాగచైతన్య దూత వెబ్‌ సిరీస్‌ గురించి ట్వీట్‌ చేయడంతో సమంత పెళ్లి గురించి కూడా కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.  

    • మాల్దీవుస్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..

    • ఫ్యామిలీ ట్రిప్లో నాసామిరంగ హీరోయిన్ ఆషిక రంగనాథ్..

    • మ్యాడ్ బ్యూటీ రెబా మోనిక జాన్ బ్యూటీఫుల్ లుక్స్..

    • కలర్ఫుల్ డ్రెస్లో అనుపమ పరమేశ్వరన్ హోయలు..

    • బ్లాక్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ కాజోల్..

     

     

     

     

     

     

     

     

  • బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్కు ఆడియన్స్నుంచిఅద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా మూవీ నుంచి హైందవం సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన సింగర్స్‌ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. సాంగ్కు తమన్‌ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చిత్రం డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుంది.

     

  • బేబీ మూవీతో కల్ట్ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరు మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఆనంద్, వైష్ణవి జంటగా వస్తోన్న తాజా చిత్రం ఎపిక్. తాజాగా మూవీ టైటిల్గ్లింప్స్రిలీజ్చేశారు మేకర్స్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ టైటిల్ ఆసక్తిని మరింత పెంచేసింది.

    మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాకు తెలుగు మాట్లాడే హీరోయిన్ కావాలని డైరెక్టర్ఆదిత్య హాసన్చెప్పగా.. నేనే కచ్చితంగా ఇద్దరే కావాలని పట్టుపట్టానని నాగవంశీ చెప్పారు. బేబీ- 2 చేయండి.. 20 చేయండి… నాకు అనవసరం.. ఈ సినిమాకు మీ ఇద్దరే కావాలని గట్టిగా అడిగినట్లు వెల్లడించారు. వైష్ణవినే తీసుకోవాలని నేను గోలగోల చేస్కే.. ఆనంద్‌ మేనేజర్‌ ఒప్పుకోకపోయినా.. సమస్యే లేదు అంటూ.. వైష్ణవి ఉంటేనే చేద్దాం, లేకపోతే వద్దని చెప్పానని నాగవంశీ తెలిపారు.

  • రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

    ఇటీవలే ద్రౌప‌ది పాత్ర‌లోని ర‌క్ష‌ణ చంద్ర‌చూడ‌న్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రీసెంట్‌గానే విడుద‌ల చేయ‌గా సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెల‌రాజె..’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మ‌న‌సులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. పాటక జిబ్రాన్ సంగీత అందించారు. ఈ సాంగ్‌ను సామ్రాట్ రాయ‌గా.. ప‌ద్మ‌ల‌త పాడారు. ఈ సాంగ్ హృదయానికి హ‌త్తుకునేలా ఆడియన్స్ను ‍‍అలరిస్తోంది. చిత్రంలో నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

     

  • బేబీ మూవీతో బ్లాక్బస్టర్హిట్కొట్టిన జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. ఒక్క మూవీతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది వైష్ణవి చైతన్య. తన మాస్ నటనతో ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోసార జంట తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అదే నిజం చేయబోతోంది బేబీ జంట ఆనంద్- వైష్ణవి.

    తాజాగా వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్. మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ అనే పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ అభిమానులను అలరిస్తోంది. ప్రేమకథా చిత్రాన్ని 90స్ వెబ్‌సిరీస్‌లోని పాత్రలతో రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్లో ది శేఖర్‌ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి.. సందీప్‌ రెడ్డి వంగా సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ అనే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. మూవీకి 90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

     

  • గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్కు నేటితో చెక్ పడింది. సామ్-రాజ్ ఎక్కడా కనిపించినా డేటింగ్ రూమర్స్వైరలయ్యాయి. అంతేకాకుండా వీరిద్దరు మరింత సన్నిహితంగా మెలగడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం దాదాపు ఫిక్సయిపోయారు. అందరూ అంచనాలను నిజం చేస్తూ రెండో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది సమంత. ఊహించిందే అయినప్పటికీ.. సామ్ స్టార్ హీరోయిన్ కావడంతో హాట్ టాపిక్గా మారింది. ఎట్టకేలకు ఆమె బాలీవుడ్ డైరెక్టర్రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

    ఇక పెళ్లి విషయం పక్కనపెడితే అందరి నోటా ఒకటే చర్చ నడుస్తోంది. రెండో పెళ్లి ఓకే.. కానీ వీరిద్దరు వయస్సు మధ్య తేడా ఎంత అనేది ప్రశ్న. ప్రేమ, పెళ్లికి వయసుతో పనేంటని అందరూ అంటూనే ఉంటారు. కానీ జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్య వయసు తేడా అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సామ్- రాజ్ఏజ్గ్యాప్ ఎంతనేది కూడా నెట్టింట చర్చ మొదలైంది. పెళ్లి చేసుకునే జంటకు పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ఉంటే మంచిదని అందరూ అనడ మనం వింటుంటాం. మరి వీరి మధ్య ఏంత తేడా ఉంది? అసలు సమంత- రాజ్మధ్య ఎంత గ్యాప్ ఉందో తెలుసుకుందాం.

    సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. లెక్కన సమంతకు ప్రస్తుతం 38 ఏళ్లు. అయితే రాజ్కు సంబంధించిన అఫీషియల్పుట్టినరోజు లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజ్ 1975 ఆగస్టు 4 తేదీన తిరుపతలో జన్మించారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఆయనకు ఇప్పుడు 50 ఏళ్లు. లెక్కన సామ్- రాజ్కు మధ్య ఏజ్ గ్యాప్దాదాపు 12 సంవత్సరాలు. వయస్సుల పరంగా చూస్తే ఇద్దరి మధ్య ఇంత అంతరం ఉండడం చర్చకు దారితీసింది. దీంతో సమంత నిర్ణయంపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రేమకు వయస్సుతో పనిలేదని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఇద్దరి మధ్య పదేళ్ల లోపు ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    కాగా.. సమంత రూత్ ప్రభు 2017లో టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. తర్వాత 2021లో వివాహాబంధానికి గుడ్బై చెప్పేసింది. తాజాగా మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. రాజ్ నిడిమోరును పెళ్లాడింది. రాజ్ సైతం గతంలో శ్యామలి దేను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సామ్- రాజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ల్లో కలిసి పనిచేశారు.

  • పెళ్లి అనేది జీవితంలో జరిగే అన్నిటికన్నా అతిపెద్ద శుభకార్యం. ఎవరి లైఫ్లోనైనా ఇదొక సువర్ణ అధ్యాయం. పెళ్లి అంటే మళ్లీ మళ్లీ చేసుకునేది కాదు. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. అలాంటిది మన జీవితంలో జరిగే అతిపెద్ద ముచ్చటే పెళ్లి. బంధువులు, మిత్రులు, సన్నిహితులు హాజరైన నూరేళ్ల పాటు కలిసుండాలని దీవించే అట్టహాసమైన వేడుకే పెళ్లి. ఒక్కసారి మూడు ముళ్లబంధంలోకి అడుగుపెడితే వందేళ్లు కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

    అలా అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే ఇంకేముంది. ఒక్క పెళ్లి బంధం కూడా విడిపోదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోతున్నాయి. కాలంతో పాటే వివాహ బంధాలు బీటలు వారిపోతున్నాయి. మనం ఒకటి తలిస్తే.. దేవుడు ఒకటి రాశాడని అంటారు. అలా చాలామంది పెళ్లిళ్లు వందేళ్లు సాగడం కాదు కదా.. పట్టుమని పదేళ్లు కలిసి ఉండడమే గగనమైపోయింది ఈ రోజుల్లో.

    ఇక సినీతారల పెళ్లి విషయానికొస్తే ఇదొక హాట్ టాపిక్. వారి రిలేషన్ మొదలుకుని.. పెళ్లి, పిల్లలు అయ్యే వరకు ఒక సెన్సేషన్. డేటింగ్ నుంచి మొదలు పెడితే.. పెళ్లి, విడాకుల వరకు రూమర్స్కు కొదవేలేదు. అలా అవీ చూసి చూసి విసుగెత్తి స్పందించే వారు కొందరైతే.. వాటిని లైట్ తీసుకుని జీవితంలో ముందుకెళ్లేవారు మరికొందరు. సామాన్యులతో పోలిస్తే సెలబ్రిటీల లైఫ్పూర్తిగా విభిన్నం. ఏదైనా చిన్న హింట్ దొరికినా చాలు అదొక పెద్ద సంచలనంఅవుతుంది. డేటింగ్, పెళ్లి, విడాకులు, పిల్లలు అంటూ హెడ్లైన్స్కనిపిస్తాయి.

    అయితే తాజాగా ఇవాళ స్టార్ హీరోయిన్సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఇది కాస్తా టాలీవుడ్మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. కారణం ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ కావడం.. అంతేకాకుండా టాలీవుడ్ హీరో నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులివ్వడం. రోజు మీడియా చూసినా సమంత పెళ్లి గురించే చర్చ. అంటే సినీతారల రెండో పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇది చూస్తే చాలు అర్థమైపోతుంది. సమంత రెండో పెళ్లి వేళ.. అలా ఇప్పటి వరకు విడాకులు తీసుకుని రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్స్ఎవరెవరు ఉన్నారో లుక్కేద్దాం.

    • సమంత..

      టాలీవుడ్లో స్టార్హీరోయిన్గా ఎదిగిన సమంత మొదటి అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. 2017లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు నాలుగేళ్లకే విడిపోయారు. తర్వాత నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్రాజ్నిడిమోరును సామ్ పెళ్లాడింది.

    • అమలా పాల్..

      కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ మొదట ఎల్ విజయ్ను వివాహమాడింది. కొన్నేళ్లకే అతనితో విడిపోయిన అమలాపాల్ సినిమాలతో బిజీ అయిపోయింది. మళ్లీ 2023లో జగత్ దేశాయ్ను రెండో పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం వీరికి కుమారుడు కూడా జన్మించారు.

    • సీనియర్ హీరోయిన్ రాధిక..

      దక్షిణాదిలో స్టార్హీరోయిన్గా ఎదిగిన రాధిక.. మొదట రిచర్డ్ హ్యాడీని పెళ్లాడింది. తర్వాత కొన్నేళ్ల విభేదాలు రావడంతో ప్రతాప్ బోథన్రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా మనస్పర్థలు రావడంతో 2001లో నటుడు శరత్‌కుమార్ను మూడో పెళ్లి చేసుకుంది.

    • ఆదితి రావు హైదరీ..

      హీరోయిన్ ఆదితి రావు హైదరీ.. మొదట సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. తర్వాత విభేదాలు రావడంతో హీరో సిద్ధార్థ్తో డేటింగ్చేసింది. కొన్నేళ్ల తర్వాత సిద్ధార్థ్ను రెండో పెళ్లి చేసుకుంది.

    • సీనియర్ నటి జయమాల..

      ప్రముఖ సీనియర్ నటి జయమాల మొదట టైగర్ ప్రభాకర్ను పెళ్లాడింది. తర్వాత మనస్పర్థలు రావడంతో కొన్నేళ్లకే విడిపోయారు. ‍అనంతరం హెచ్ఎం రామచంద్రను మరో పెళ్లి చేసుకుంది.

    • నటి లక్ష్మి..

      పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన సీనియర్ నటి లక్ష్మి.. మొదట భాస్కర్ను పెళ్లాడింది. తర్వాత అతనితో విడిపోయిన ఆమె మోహన్ శర్మను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత శివచంద్రన్ను మూడో పెళ్లి చేసుకుందామె.

    • మలయాళ నటి కావ్య మాధవన్..

      ప్రముఖ మలయాళ నటి కావ్య మాధవన్ మొదట నిషాల్ చంద్రను వివాహమాడింది. కొన్నేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నటుడు దిలీప్ను రెండో పెళ్లి చేసుకుంది.

    • వనితా విజయ్ కుమార్..

      కోలీవుడ్ హీరోయిన్, నటి వనితా విజయ్ కుమార్పేరు అందరికీ సుపరిచితమైన పేరు. ‍మొదట ఆకాశ్ను పెళ్లాడింది. తర్వాత కొన్నేళ్లకే విభేదాలు రావడంతో రాజన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఉండలేక విడిపోయి 2020లో పీటల్ పాల్ను మూడో పెళ్లి చేసుకుంది. చివరికీ పీటర్తో కూడా విడాకులు తీసుకుని సింగిల్గానే ఉంటోంది.

  • బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.

    స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.

    ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

  • రవితేజ కొత్త సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉన్న దృష్ట్యా ప్రమోషన్లు మొదలుపెట్టారు. 'బెల్లా బెల్లా' అంటూ సాగే తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. రవితేజ ఎప్పటిలానే డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, ఇతడి పక్కన ఆషికా రంగనాథ్ క్యూట్‌గా కనిపించింది. స్పెయిన్‌లో ఈ పాట చిత్రీకరించారు.

    (ఇదీ చదవండి: అయ్యర్‌తో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన మృణాల్)

    ఈ సినిమాలో రవితేజ సరసన ఆషిక, డింపుల్ హయతి నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. భీమ్స్ సంగీతమందించాడు. ఇదివరకే గ్లింప్స్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. రవితేజ ఈసారి హిట్ కొడతాడేమోనని అనుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని చిత్రాలతో దారుణమైన ఫలితాలని అందుకున్న ఈ హీరో మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. కాబట్టి ఈసారి సక్సెస్ చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?

    (ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)

  • 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకుర్.. తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు చేసింది. అనంతరం పూర్తిగా హిందీపై ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఏదోలా సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె.. టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్‌లో ఉందనే రూమర్స్ వచ్చాయి. ఇవి మృణాల్ వరకు చేరడంతో క్లారిటీ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)

    'ఇలాంటి రూమర్స్ వినడానికి చాలా కామెడీగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఉచితంగా చేసే పీఆర్ స్టంట్స్ ఇవి' అని మృణాల్ తనపై వస్తున్న డేటింగ్ వార్తల్ని కొట్టిపారేసింది. గతంలో తమిళ హీరో ధనుష్‌తోనూ ఈమె డేటింగ్ చేస్తుందనే వార్తలు రాగా.. అతడు తన స్నేహితుడు మాత్రమేనని చెప్పుకొచ్చింది. మరి నెక్స్ట్ ఏ సెలబ్రిటీతో మృణాల్ డేటింగ్ అని వార్తలొస్తాయో చూడాలి?

    ఈ ఏడాది హిందీలో పలు చిత్రాలతో వచ్చిన మృణాల్.. వచ్చే ఏడాది తెలుగు, హిందీ మూవీస్‌తో రాబోతుంది. అడివి శేష్ 'డకాయిట్'లో ఈమె హీరోయిన్‌గా చేస్తోంది. ఇది వచ్చే ఏడాది మార్చిలో రానుందని ఇదివరకే ప్రకటించారు. అలానే అల్లు అర్జున్-అట్లీ కాంబోలో తీస్తున్న సినిమాలోనూ ఈమె ఒక హీరోయిన్ అని అంటున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

    (ఇదీ చదవండి: డిసెంబరులో వచ్చే సినిమాలేంటి? క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?)

  • బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ఆసక్తికర కామెంట్స్ చేసింది. రోజుల్లో యువత, పెళ్లి అనే కాన్సెప్ట్పై మాట్లాడింది. ముంబయిలో జరిగిన 'వీ ది ఉమెన్' అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె నేటి యువతరం, పెళ్లి అనే విషయాలపై స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెళ్లి అనేది ముగిసిన అధ్యాయంలా కనిపిస్తోందని తెలిపింది. రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోమని తాను మాత్రం యువతకు సలహాలు ఇవ్వనని జయా బచ్చన్ వెల్లడించింది. తన మనవరాలు నవ్య నవేలి నందా వివాహం చేసుకోవాలని చెప్పనని పేర్కొంది.

    జయా బచ్చన్ మాట్లాడుతూ..'నా మనవరాలు నవ్య కూడా వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకోమని నేను సలహా కూడా ఇవ్వను. ఎందుకంటే రోజుల్లో పెళ్లి అనేది ముగిసిన అధ్యాయం. నవ్య మరికొన్ని రోజుల్లో 28 ఏళ్లు నిండుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలో యువతులకు సలహాలు ఇచ్చే పెద్దదాన్ని కాదు. ఎందుకంటే నేటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తరం చిన్న పిల్లలు చాలా తెలివైనవారు. వారు మిమ్మల్ని మించిపోతారు. రోజుల్లో వివాహం, చట్టబద్ధత అనే రిలేషన్ నిర్వచించాల్సిన అవసరం లేదు.

    ఇక జయా బచ్చన్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్‌ అనే చిత్రంలో కనిపించనుంది. మూవీలో వామికా గబ్బి, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రల్లో నటించారు.

     

  • హైదరాబాద్గ్రాండ్ ఈవెంట్కు వేదికగా నిలవనుంది. ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్భాగ్యనగరంలో జరగనుంది. ఏడాది 30 ఎడిషన్లో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్, సారథి స్టూడియోస్లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ డైరెక్టర్ జెల్లే డే జోంగ్ తెరకెక్కించిన మేమెరీ లేన్ అనే మూవీతో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.

    హైదరాబాద్వేదికగా నెల 5 నుంచి 14వరకు జరగనుంది. ఫిల్మ్ ఫెస్టివల్లో యూరప్ దేశాల్లో తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రదర్శించనున్నారు. బెల్జియం మూవీ జూలీ క్వీప్ క్వైట్.. ఆస్ట్రియా చిత్రం హ్యాపీలో లాంటి సినిమాలు తెరపై ఆవిష్కరించనున్నారు. అలాగే పలు దేశాలకు సంబంధించిన సూపర్ హిట్ చిత్రాలను ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారని యూరోపియన్ యూనియన్ రాయబారి హార్వే డెల్ఫిన్ వెల్లడించారు. ఈయూఎఫ్ఎఫ్‌-2025లో దాదాపు 23 దేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

     

     

  • 2025 క్లైమాక్స్‌కి వచ్చేసింది. కొత్త ఏడాదికి మరో నెల మాత్రమే ఉంది. ఈ ఏడాది టాలీవుడ్‍‌కి ఉన్నంతలో బాగానే కలిసొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, డాకు మహారాజ్, మిరాయ్, హిట్ 3, కుబేర, ఓజీ చిత్రాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కోట్లకు కోట్లు కలెక్షన్స్ కూడా సాధించాయి. మరి డిసెంబరులో రాబోతున్న సినిమాలేంటి? వీటిలో ఎవరు హిట్ అయ్యే అవకాశముంది?

    (ఇదీ చదవండి: 'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. ఏంటి ఆచారం?)

    తొలివారంలో బాలకృష్ణ-బోయపాటి 'అఖండ 2' రాబోతుంది. దీనికి పోటీగా వేరే ఏ సినిమాలు లేవు. గతంలో దీని తొలి భాగం.. 2021 డిసెంబరులో వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్‌తోనే సీక్వెల్‌ని కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తున్నారు. తొలి పార్ట్‌లో ఎక్కువగా యాక్షన్‌ని నమ్ముకోగా, ఈసారి యాక్షన్‌తో పాటు డివోషనల్ అంశాలు కూడా బాగానే ఉండబోతున్నాయని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. దీని ఫలితం ఏమొస్తుందో చూడాలి? దీనితో పాటు హిందీ చిత్రం 'ధురంధర్'.. 5వ తేదీనే రిలీజ్ కానుంది. కాకపోతే తెలుగు వరకు అయితే ఏ సమస్య ఉండదు.

    రెండో వారంలో యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'మోగ్లీ' రిలీజ్ కానుంది. రోషన్ తొలి మూవీ 'బబుల్ గమ్' ఫ్లాప్ అయినప్పటికీ.. ఈసారి దర్శకుడు సందీప్ రాజ్ కావడం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. గతంలో ఈ డైరెక్టర్.. 'కలర్ ఫోటో' మూవీ తీశాడు. కాకపోతే అది ఓటీటీ రిలీజ్. ఈసారి మాత్రం థియేటర్ రిలీజ్. ఏం చేస్తారో చూడాలి? దీంతో పాటు నందు 'సైక్ సిద్ధార్థ్', ఘంటసాల, సకుటుంబానాం అనే తెలుగు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. ఇదే తేదీన కార్తీ డబ్బింగ్ సినిమా 'అన్నగారు వస్తారు' రిలీజయ్యే అవకాశముంది. ప్రస్తుతానికి డేట్ అధికారికంగా ప్రకటించలేదు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

    మూడో వారం తెలుగు నుంచి 'దేవగుడి' అనే చిన్న సినిమా మాత్రమే రిలీజ్ కానుంది. అయితే ఆ వీకెండ్‌లో 'అవతార్' ఫ్రాంఛైజీలో మూడో భాగం 'ఫైర్ అండ్ యాష్' రిలీజ్ కానుంది. దీనికి ప్రపంచవ్యాప‍్తంగా క్రేజ్ ఉంది. అవతార్ తొలి పార్ట్ వేల కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో పార్ట్ మాత్రం ఓకే ఓకే అనిపించుకుంది. మరి మూడో పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదే వారంలో 'డ్యూడ్' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ రిలీజ్ కానుంది. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' పేరుతో దీన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళంలో ఇది విడుదల కానుంది.

    నాలుగో వారం బోలెడన్ని తెలుగు సినిమా లైన్‌లో ఉన్నాయి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన 'ఛాంపియన్', దండోరా, పతంగ్, శంబాల అనే చోటామోటా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలోనూ దేనిపై అస్సలు బజ్ లేదు. రిలీజ్ టైంకి వస్తుందోమో చూడాలి. వీటితో పాటు చివరి వారంలో అనకొండ  (తెలుగు డబ్బింగ్), ఇక్కీస్ (హిందీ సినిమా), వృషభ (మలయాళ డబ్బింగ్) అనే మూవీస్ కూడా రాబోతున్నాయి. వీటిలో అఖండ 2, అవతార్ 3కి మాత్రమే ప్రస్తుతం ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కనిపిస్తాయి. మిగిలిన వాటిలో కంటెంట్‌తో సర్‌ప్రైజ్ చేసి ఏమైనా హిట్ కొడితే క్లైమాక్స్ సుఖాంతం అయ్యే అవకాశముంది.

    (ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

  • సమంత మరో పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' అనే సంప్రదాయం ప్రకారం సమంత.. ఈ వివాహం చేసుకుంది. ఇంతకీ ఏంటిది? దీనికి అ‍ర్థం ఏంటి?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

    కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం సమంత పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఇది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు.. పంచభూతాలు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ 'భూత శుద్ధి వివాహం'.

    ఈశా యోగ కేంద్రలో ప్రాణ ప్రతిష్ట చేసిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్ట ఆచారాలకు ఈ ఆలయం నెలవు. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచే ఈ ఎనిమిది అడుగుల శక్తి స్వరూపం. భక్తుల మనశ్శరీరాలకు, శక్తులని స్థిరపరుస్తూ, పుట్టుక నుంచి మరణం వరకు జీవితంలోని ప్రతిదశలోనూ వారికి అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని ఈశా ఓ ప్రకటన రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సమంత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

  • హీరోయిన్ సమంత.. దర్శకుడు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. సోమవారం ఉదయం నుంచి తెగ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సమంత అధికారికంగా ప్రకటించింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లోని ఓ ఆశ్రమంలో ఈ శుభకార్యం జరిగింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? ఇతడు తెలుగోడే అని మీలో ఎంతమందికి తెలుసు?

    రాజ్ పూర్తి పేరు రాజ్ నిడిమోరు. పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన వెంటనే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే ఇతడికి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో (కృష్ణ దాసరి) పరిచయం ఏర్పడింది. అలా వీళ్లిద్దరూ స్నేహితులు అయ్యారు. కలిసి మొదటగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. అది సక్సెస్ కావడంతో 'ఫ్లేవర్స్' అనే ఇంగ్లీష్ మూవీ తీశారు. తర్వాత స్వదేశానికి తిరిగొచ్చేశారు.

    మొదటగా హిందీలో '99' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తర్వాత తెలుగులో 'ఇంకోసారి' అనే చిత్రానికి రైటర్స్‌గా పనిచేశారు. మళ్లీ హిందీలో 'షోర్ ఇన్ ద సిటీ', గో గోవా డాన్ అనే మూవీస్ తెరకెక్కించారు. అనంతరం తెలుగులో 'డీ ఫర్ దోపిడీ' అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నవీన్ పొలిశెట్టి ఓ హీరోగా నటించాడు. తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైపోయారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

    అయితే రాజ్‌-డీకేకి 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. రెండో సీజన్ కోసం విలన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేశారు. అలా సమంత-రాజ్ మధ్య తొలి పరిచయం ఏ‍ర్పడింది. వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న టైంలో వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏ‍ర్పడింది.

    కొన్నాళ్ల తర్వాత రాజ్-డీకే తీసిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో సమంత లీడ్ రోల్ చేసింది. అప్పటినుంచి పలు సందర్భాల్లో రాజ్‪‌తో ఉన్న ఫొటోలని సమంత పోస్ట్ చేస్తుండేది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకున్నారు. గత కొన్ని నెలల్లో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. దీంతో త్వరలో గుడ్ న్యూస్ చెబుతారేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు సడన్‌గా సమంతతో రాజ్ పెళ్లి అయిపోయింది. ఈ మేరకు సమంత ప్రకటన చేసింది.

    మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత

    సమంతకి ఇది రెండో పెళ్లి. అలానే రాజ్‌కి కూడా ఇది రెండో పెళ్లినే. 2015లో శ్యామోలిని పెళ్లి చేసుకున్న రాజ్.. 2022లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. రాజ్ ఆస్తుల విషయానికొస్తే.. దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.90 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. మిత్రుడు డీకేతో కలిసి డీ2ఆర్(D2R) అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఇందులో ఇప్పటికే పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు నిర్మించారు.

  • కొత్తబంగారు లోకం హీరో వరుణ్‌ సందేశ్‌ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ‘న‌య‌నం’. ఈ సిరీస్‌ జీ5లో డిసెంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్ల‌ర్‌ను స్వాతి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేశారు. మ‌నుషుల్లోని నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సున్నిత‌మైన అంశాల‌ను ఇందులో చూపించారు.

    ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌
    సోమవారంనాడు ఈ సిరీస్‌ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. డాక్ట‌ర్ న‌య‌న్ పాత్ర‌లో వ‌రుణ్ సందేశ్ కనిపించనున్నాడు. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో ఆవిష్క‌రించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.

    వెబ్‌సిరీస్‌లో వరుణ్‌
    ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వ‌రుణ్ సందేశ్ (Varun Sandesh) ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నటుడిగా నాకు ఇది స‌రికొత్త ప్ర‌యాణం. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి విభిన్న‌మైన పాత్ర‌లో డాక్ట‌ర్ న‌య‌న్‌గా క‌నిపించ‌బోతున్నాను. పోస్ట‌ర్‌ గ‌మ‌నిస్తే నా పాత్ర‌లో ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయ‌టం వ‌ల్ల‌ ఇలాంటి పాత్ర‌లో డెప్త్‌ను మ‌రింత‌గా ఎలివేట్ చేసిన‌ట్ల‌యింది అని పేర్కొన్నాడు.

     

     

    చదవండి: ఆ కారణాల వల్లే దివ్య ఎలిమినేట్‌

Family

  • దశాబ్దాలుగా భారతదేశంలో ఇంజనీరింగ్, వైద్యం వంటి సాంప్రదాయ కెరీర్‌లే ఆధిపత్యం చెలాయించాయి. ప్రస్తుతం భారత్‌ యువతలో మార్పు సంతరించుకుంది. డిజైన్‌, ష్యాషన్‌, యానిమేషన్‌, క్రియేటివ్‌ సాంకేతిక కెరీర్‌లను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ మార్పుని ప్రతిబింబింబించేలా  వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ (WUD) ఈ క్రియేటివ్‌ రంగం ప్రాముఖ్యతను హైలెట్‌ చేసేలా హైదరాబాద్‌లో కౌన్సలర్ల సమావేశాన్ని నిర్వహించింది. 

    ఆంధ్ర తెలంగాణ అంతటా దాదాపు వెయ్యి మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్‌లు, కౌన్సలర్‌లను అనుసంధానించిన ఈ డ్రైవ్‌లో సృజనాత్మక రంగాలపై పెరుగుతున్న క్రేజ్‌ని చర్చించడమే కాకుండా ఈ జెన్‌ జెడ్‌ తన ఆకాంక్షలను ఎలా రూపొందించుకోగలదు అనే దానిపై అంతర్దృష్టిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు రాష్ట్రం దాటి అవకాశాలను అన్వేషించడంలో తమ వంతు పాత్రను పోషిస్తామని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ డీన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ షలీన్ శర్మ అన్నారు. 

    అలాగే ఈ యూనివర్సిటికి చెందిన విద్యార్థుల్లో సుమారు  12-15% మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే కావడం విశేషం.  అంతేగాదు ఈ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవకాశాలను బలోపేతం చేసేలా WUD ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయం అండ్‌ రీడింగ్ UK విశ్వవిద్యాలయం, ఎమిలీ కార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్  అండ్‌ డిజైన్ అండ్‌ వాంకోవర్ ఫిల్మ్ స్కూల్, కెనడా; కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ USA; ENSAIT, ఫ్రాన్స్; ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్; వంటి ప్రముఖ సంస్థలతో కూడా అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.  

    చివరగా ఈ కౌన్సలర్ల సమావేశం ద్వారా తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి వచ్చిన విద్యార్థులను సాధికారపర్చడానికి  WUD తన నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా ఈ డిజైన్‌ ఎడ్యుకేషన్‌ని పూర్తి స్థాయి కెరీర్‌ మార్గంగా ఎంచుకునులా  ప్రోత్సహిస్తోంది కూడా. 

    (చదవండి: ఈ పర్ఫెక్ట్‌ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్‌)
     

  • దోసెలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మెత్తగా నోట్లో కరిగిపోయే వాటికంటే..చక్కగా కరకరలాడే క్రిస్పి దోసెలంటే కొందరికి మహా ఇష్టం. అందులోనూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ దోసె. అలా రావడానికి పెద్ద సైన్సు సూత్రమే ఉందట. దాన్ని సాక్షాత్తు ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌  సోషల్‌మీడియా ఎక్స్‌ వేదికగా వివరించడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

    బంగారు రంగులో నోరూరించే ఈ దోసెలకు సైన్సుకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెబుతున్నారు పోస్ట్‌లో. సాధారణంగా దోసెలను వేసే ముందు పాన్‌ లేదా తవాపై ముందుగా నీళ్లు చిలకరిస్తారు గమనించారా..!. అది వేడెక్కిందా లేదా టెస్ట్‌ చేసుకుని మరి దోసెలు వేస్తుంటారు. దీన్ని లైడెన్‌ఫ్రాస్ట్ ఎఫెక్ట్‌ అంటారు. ఆ ప్రభావం వల్లే దోసె పైన క్రిస్పీగా లోపల మెత్తగా వస్తుందట. అది ఏవిధంగానో కూడా క్లియర్‌గా వివరించారు.

    లైడెన్‌ఫ్రాస్ట్ ప్రభావం అంటే ..
    మనం వేడివేడి పాన్‌ లేదా తవాపై నీళ్లు చిలకరించగానే నీరు ఉబ్బి ఆవిరైపోదు. నీటి బుడగలా వచ్చి.. పాన్‌ ఉష్ణోగ్రత నుంచి తనను కాపాడు కునేలా ఆవిరి పొరను ఏర్పరుచకుని అటు ఇటు జర్రు జర్రున జారుతూ ఉంటుంది. అదే పాన్‌ లేదా తవా వేడెక్కకపోతే నీటి బిందువులు పాన్‌కే అతుక్కుపోతుంది. పైగా పాన్‌ నెమ్మదిగా వెడేక్కగానే గాల్లో ఆ నీరు ఆవిరైపోతుంది. దీని గురించి 18వ శతాబ్దంలోనే జర్మన్‌ శాస్త్రవేత్తలు వివరించారు గానీ అంతకుమునుపే భారతీయుల వంట గృహాల్లో ఈ సిద్ధాంతంతో ఎంతో సంబంధం ఉంది. 

    ఇలా ఆదర్శ ఉష్ణోగ్రత వద్ద నీటి బిందువులు పాన్‌ ఉపరితలంపై జారేందుకు దోహదపడిన ఎఫెక్టే పిండి పాన్‌కి అతుక్కోకుండా చక్కగా వచ్చేందుకు కారణం అవుతుందట. అలాగే పాన్‌ చుట్టు పిండి స్పెండ్‌ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందట. అదే పాన్ గనుక వేడెక్కకపోతే..పాన్‌పై దోసె సరిగా స్ప్రెడ్‌ అవ్వదు, పైగా పాన్‌కి దోసె అతుక్కుపోయి అట్టులా కాకుండా విరిగిపోతుందని వివరించాడు. ఈ లైడెన్‌ఫ్రాస్ట్‌ ఎఫెక్ట్‌ వల్లే అంతలా క్రిస్పీ దోసెలను రుచిగా తినగలమని చెప్పుకొచ్చారు. మన వంటిళ్లు ఫిజిక్స్‌ సూత్రాల నిలయం కదూ..!.

     

    (చదవండి: సినిమా రేంజ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజల్‌..! నెటిజన్ల ప్రశంసల జల్లు)

     

  • పార్థ్‌ మానియార్‌ అనే భారతీయ వ్యక్తి న్యూయార్క్‌లోని టైమ్‌ స్కేర్‌లో తన భాగస్వామికి చేసిన ప్రపోజల్‌ సినిమాని తలపించే రోమాంటిక్‌ సన్నివేశం అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. బిజీ బిజీగా ఉండే టైమ్‌ స్కేర్‌కాస్తా మూవీ సెట్‌గా మారిపోయింది. అక్కడొక వ్యక్తి తన గర్లఫ్రెండ్‌కి ప్రపోజల్‌ చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. 

    ఒక్కసారిగా అక్కడ బాలీవుడ​మూవీ షూటింగ్‌ జరుగుతుందా అనే ఫీల్‌ కలుగుతంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ మూవీ కుచ్‌ కుచ్‌ హోతా హైలో కోయి మిల్‌ గయా అనే పాటకు పురుషుల, అమ్మాయిల బృందంతో హీరో రేంజ్‌లో డ్యాన్స్‌లు చేస్తూ తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్‌ చేశాడు. 

    మొదట దాన్ని చూసి అయోమయంగా చూస్తుండిపోతుంది అతడి స్నేహితురాలు, ఆ తర్వాత తన అక్కా చెల్లెళ్లను తీసుకొచ్చి డ్యాన్స్‌ చేస్తూ కనపించడంతో విస్తుపోతుంది. అతడి ప్రపోజ్‌ చేసిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాదు నెటిజన్లు మనసును కూడా దోచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

     

    (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ)

     

  • ప్రస్తుతం వివాహం అనే పదం ఎలా విలువలేని బంధంగా మారుతోందో చూస్తున్నాం. అదీగాక నేటి యువత వివాహం అనే బంధంలో చాలా చకచక నిర్ణయాలు తీసుకుని ఎలా విచ్ఛినన్న చేసుకుంటున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ జనరేషన్‌ తీరు భవిష్యత్తుకి భరోసా నిచ్చేలా వెల్‌ సెటిల్‌మెంట్‌ తర్వాతే పెళ్లి అని అంటున్నారే గానీ బంధాన్ని పదిలంగా కలకాలం నిలిచేలా మైండ్‌ని స్ట్రాంగ్‌ ప్రిపేర్‌ చేసుకోవడంలో ఫెయిలవ్వుతున్నారనేది నిపుణుల వాదన. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ నటి జయబచ్చన్‌ వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. పైగా ఆమె వివాహాన్ని కాలం చెల్లిందిగా పేర్కొనడం సర్వత్ర చర్చనీయాంశమైంది. అందులోనూ ఎంపీ, సీనియర్‌ నటి జయబచ్చన్‌ ఇలా మాట్లాడటంపై సంప్రదాయవాదులు వ్యతిరేకించగా, స్వేచ్ఛ కోరుకునే మహిళామణులు మాత్రం ఆమెకు మద్దతు పలకడం విశేషం. ఇంతకీ ఆమె ఏం అన్నారు. అది కరెక్టేనా అంటే..

    ప్రముఖ నటి జయా బచ్చన్‌ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వివాహాన్ని కాలం చెల్లినది(Outdated Institution)గా పేర్కొన్నారు. అందుకే తన మనవరాలు నవేలి నందా వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని అన్నారు. తన మనవరాలు జనరేషన్‌లో ఉన్న యువత నమ్ముతుందే చెబుతున్నానని అన్నారామె. ఎందుకంటే వివాహ వ్యవస్థ చాలా వేగంగా మారిపోతోందని అన్నారు. 

    ఇది అభ్యంతరంగా అనిపించినా..అదే నిజం!
    నవ్య గనుక తన కెరీర్‌లో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇంటి బాధ్యతలకు పరిమితమవ్వడం మీకు ఓకేనా అని అడిగినప్పుడూ జయ ఈ విధంగా వ్యాఖ్యానిచ్చారామె. ఏమాత్రం సంకోచం లేకుండా నవ్య వివాహం చేసుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు. ముందుగా యువత జీవితాన్ని ఆస్వాదించమని సలహా ఇచ్చారు. మాతరంలోని సంబంధాలతో ఈ తరం అనుభవిస్తున్నది చాల భిన్నంగా ఉంది. 

    ఇది అభ్యంతరంగా అనిపించినా..నిజానికి దీర్ఘాకాలిక సంబంధాలను నిలబెట్టుకోవాలంటే శారీర ఆకర్షణ, అనుకూలత చాలా ముఖ్యం కానీ ఈ తరం అది నిజమేనా కాదా అని ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే ప్రేమ కలకాలం కొనసాగాలంటే కొంత సర్ధుబాటు కూడా అవసరం. అది లేకపోతే బంధాన్ని నిలబెట్టుకోలేరని చెప్పుకొచ్చారు జయ. అలాగే ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు. వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు. 

    తరాల మధ్య ఆలోచనా విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు . గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను, సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

    పెళ్లిపై ఆలోచనలు నిజంగా మారుతున్నాయా? 
    నివేదికల ప్రకారం..భారతదేశంలో మహిళ సగటు వివాహ వయసు 2023లో 22.9 సంవత్సరాలకు పెరిగింది. ఇది మునుపటి కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్య, కెరీర్‌ లేదా వ్యక్తిగత వృద్ధి కోసం వివాహాన్ని ఆలస్యం చేస్తోంది యువత. అదే విధంగా ఒకప్పుడూ ఎక్కువమంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక స్వాతంత్ర్యంపై పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా వివాహంపై యువత ధోరణిలో పెనుమార్పులు వచ్చినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. 

    ఇక జయబచ్చన్‌ వ్యాఖ్యలు చాలా బోల్డ్‌గా ఉన్నా..ఇప్పటికే జరుగుతున్న మార్పునే ప్రతిబింబించారని చెప్పొచ్చు అని  అంటున్నారు నిపుణులు. ఇక జయ ఉద్దేశ్యం వివాహ తప్పనిసరి కాదు, కానీ శారీరక అనుకూలత, స్నేహం,సామాజిక బాధ్యత కంటే ముఖ్యమైనది. అలాగే పిల్లలను పెంచడానికి తప్పనిసరిగా సాంప్రదాయ నిర్మాణాలు అవసరం లేదనేది ఆమె అభిప్రాయం. దీన్ని చాలామంచి మహిళామణులు స్వాగతించగా, చాలామంది సంప్రదాయవాదులు ఇది సరైనది కాదని మండిపడుతున్నారు.

    (చదవండి: రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారికి స్క్రాబుల్ గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌! అసలేంటి గేమ్‌..)

     

  • హైదరాబాద్: ఎయిడ్స్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తున్న ప్రమాదకరమన వ్యాధి. అయితే, తగిన అవగాహన ఉంటే దాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని డా. అనురాధ జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సార్క్ (సైంటిఫిక్ అండ్ అప్లైడ్ రీసెర్చ్ సెంటర్) తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా నడక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పలువురు వైద్యులు, వైద్యవిద్యార్థులు,  నర్సింగ్ సిబ్బంది, సామాన్య ప్రజలు.. మొత్తం 300 మందితో అవగాహన నడక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అందరూ ప్లకార్డులు పట్టుకుని, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

    ఈ సందర్బంగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర మాట్లాడుతూ, ‘‘దేశంలో 24 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. తెలంగాణలో 1.4 లక్షల మందికి హెచ్ఐవీ ఉంది. వీరిలో సగం మంది పురుషులు, సగం మంది మహిళలు ఉన్నారు. చాలామంది పరీక్షలు చేయించుకోవడంతో పిల్లల్లో కూడా పాజిటివ్ కనపడుతోంది. ఇలాంటి కేసులు చాలావరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. 

    ఏమాత్రం లక్షణాలు కనిపించినా, తరచు జ్వరం వస్తున్నా, ఆహారం తీసుకున్నా సరే నీరసంగా ఉంటున్నా వైద్యుల వద్దకు వెళ్లి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. హెచ్ఐవీ సోకిందన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. గుర్తించిన కేసులను ముందుగా ఐసీటీసీ సెంటర్లో రిజిస్టర్ చేయించుకోవాలి. ఎల్బీనగర్ పరిసర ప్రాంత వాసులకు సమీపంలో వనస్థలిపురంలో ఒక ఐసీటీసీ సెంటర్ ఉంది. పీపీపీ పద్ధతిలో ఏఆర్టీ సెంటర్ కామినేనిలో ఉంది. ఇది 2022లో స్థాపించారు. ఇది ఫంక్షనల్ ఐసీటీసీ సెంటర్. ఇందులో యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ కాకుండా ఇంకా నగర పరిధిలో గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రిలో కూడా ఉన్నాయి. 

    కామినేని ఎఫ్ఐసీటీసీలో ఇప్పటివరకు 1200 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. దాదాపు రోజుకు 35-40 మంది వరకు వచ్చి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న మందులు తీసుకుంటారు. నిజానికి రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాలలో ఒక ఏఆర్టీ సెంటర్ ఉండాలి. అప్పుడు అందరికీ చికిత్స అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్లో పెద్దసంఖ్యలో రోగులను చూస్తూ, ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేస్తూ, ప్రతినెలా ఫాలో అప్ చేసుకుంటూ, వారికి మందులు ఇస్తున్నది కామినేని పీపీపీ ఏఆర్టీ సెంటర్ మాత్రమే. ఇక్కడ కేవలం మందులు ఇవ్వడమే కాక.. మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఇతరులకు అవగాహన తెప్పించి హెచ్ఐవీ రాకుండా జాగ్రత్తలు చెబుతున్నాం. నిపుణుల కన్సల్టేషన్ కావాలి’’ అని తెలిపారు.

    సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.స్వామి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రోగుల విషయంలో ఇప్పటికీ మన సమాజంలో వివక్ష కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే విస్తృత ప్రచారం అవసరం. ఇంకా చెప్పాలంటే అసలు హెచ్ఐవీ రోగులను తాము చూడబోమని, చికిత్స అందించేది లేదనే వైద్యులూ కొంతమంది ఉన్నారు. అలా కాకుండా అందరూ అందరినీ చూడాలనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. 

    మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసాలి మాట్లాడుతూ, ‘‘హెచ్ఐవీ రకరకాలుగా వ్యాపిస్తుంది. అరక్షిత శృంగారం ద్వారాను, రక్తమార్పిడి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా.. ఇలా ఎలాగైనా సోకే అవకాశం ఉంటుంది. మనకు తెలిసినంత మేర జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండచ్చు. ఒకవేళ హెచ్ఐవీ సోకినట్లు పరీక్షల్లో తేలినా భయపడాల్సిన అవసరం లేదు. యాంటీ రెట్రోవైరల్ మందులను ప్రభుత్వం అందిస్తోంది. మా ఏఆర్టీ సెంటర్లో నమోదుచేసుకుని, ఎప్పటికప్పుడు ఆ మందులు తీసుకుంటే సరిపోతుంది’’ అని వివరించారు.

    ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్గనైజింగ్ ఛైర్పర్సన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ డా. సుధీర్ బాబు పడుగుల్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ జె.హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్, ఏఆర్టీ సెంటర్ సీఎంఓ డాక్టర్ పెద్ది రామకృష్ణ, ప్రొఫెసర్ డాక్టర్ పి. రత్నాచారి, డాక్టర్ ఐ. సురేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దాక్షాయని తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh

  • తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ఈ-డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశితో పాటు డిసెంబర్‌ 31, జనవరి 1 దర్శనం టికెట్ల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగింది. ఈ  మూడు రోజులలో దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం  24 లక్షల మంది భక్తులు ఈ-డిప్‌లో పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. 9.6 లక్షల ఖాతాల నుంచి  24,05,237 లక్షల మంది భక్తులు తమ  పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 

    డిసెంబరు 2న మధ్యాహ్నం 2 తర్వాత నిర్వహించే ఈ-డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు మెసేజ్‌ అందుతుంది.  జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠ ‍ద్వారా దర్శనం ఉంటుంది. ఈ ఏడు రోజులకు సంబంధించి రోజుకు 15వేల చొప్పున రూ.300 దర్శనం టోకెన్లు డిసెంబరు 5వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 

  • విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుంది. జోగి రమేష్‌ తనయుడు జోగి రాజీవ్‌కు  ఎక్సైజ్‌ అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలంటూ భవానీపురం ఎక్సైజ్‌ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్‌ 3వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులిచ్చారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 1:30 లోపు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. 

     

     

     

  • శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలం పాలవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తుంది. డయేరియాతో చిన్నారావు అనే వ్యక్తి మృత్యువాత పడగా, మరో ఆరుగురు వ్యక్తులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిఇలో ఇద్దరు, శ్రీకాకుళం ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మిగతా నలుగురు చికిత్స పొందుతున్నారు.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పారిశుథ్య లోపం కారణంగానే డయేరియా వ్యాపించిందని స్థానిక ప్రజలు అంటున్నారు.

    గతంలో శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా జి. సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో డయేరియా వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. సుమారు 40 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. దీనికి వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితమయ్యారు.

    కలుషిత నీరు తాగడం వల్లే తరుచు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుందని జిల్లా వాసులు అంటున్నారు. సరైన తాగునీరు లేకపోవడం వల్ల ఈ వ్యాధి నియంత్రణలోకి రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    నివారణ చర్యలు
     వైద్యశాఖ తరుచు మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలి. 
     ప్రజలకు శుభ్రమైన నీరు తాగడం, ఆహార పరిశుభ్రత పాటించడంపై అవగాహన కల్పించాలి.
    -నీటి వనరుల శుద్ధి, సమగ్ర పరిశుభ్రత చర్యలు తీసుకోవడం జరగాలి

  • తాడేపల్లి: రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’అంటూ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి గళమెత్తారు వైఎస్‌ జగన్‌.  సేవ్‌ ఏపీ ఫార్మర్స్‌హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు.

    ఇదీ రైతుల దుస్థితి..
    కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి  రూ. 50 పైసలకే అమ్ముడవుతున్నాయని  రాష్ట్రంలోని రైతుల దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా అరటిపండు చౌకయ్యిందని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అని వైఎస్‌ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 

    అరటి పండ్లే కాదు ఉల్లినుంచి టమోట వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. మార్కెట్ లో మాత్రం అరటిపండ్లు రూ. 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నారని అన్నారు. ఈ డబ్బులంతా మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళుతున్నాయని రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదన్నారు. దీంతో ఆవేదనతో రైతులు తమ పంటను రోడ్లపై పడివేస్తున్నారన్నారు.

    బొప్పాయి ధర కూడా మార్కెట్‌ను బట్టి మారిపోతుందని రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదన్నారు. ఉల్లి టమాట ధరలు కూడా మార్కెట్లో రూ1. నుంచి రూ.3 వరకూ పలుకుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని వైఎస్‌ జగన్ ప్రశ్నించారు. అంతే కాకుండా విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

    YS Jagan: హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్

    అదే  వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరటి పండ్ల ధర టన్ను రూ. 25 వేలు పలికేదాని అంతేకాకుండా రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లు నడిపామన్నారు. తమ ప్రభుత్వంలో కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు.  కానీ నేడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు వైఎస్‌ జగన్‌.

     

  • తాడేపల్లి :  ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే అందించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి రాష్ట్ర అథ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్‌ చేశారు.  లేకపోతే ఎమ్మెల్యేల ఇళ్లు, మంత్రుల ఇళ్లను త్వరలోనే ముట్టడిస్తామని హెచ్చరించారు. అపపటికీ రెస్పాండ్‌ కాకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. 

    ఈ రోజు(సోమవారం, డిసెంబర్‌ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పానుగంటి చైతన్య.. ‘ కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లేసినందుకు విద్యార్థి లోకాన్ని రీడ్డున పడేశారు. జగన్ హయాంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. చంద్రబాబు వచ్చాక బకాయిలు పెరిగి పోయాయి. ఎంతోమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కూలి పనులకు వెళ్తున్నారు. అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనపడటం లేదు.

    తన ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఎవరినీ పట్టించుకోవటం లేదు. నారా లోకేష్ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు. 

    వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా ప్రచారపిచ్చిలో మునిగి తేలుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. జగన్ హయాంలో త్రైమాసికం ప్రకారం రిలీజ్ చేశారు. కూటమి వచ్చాక కాలేజీలకి చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. జగన్ ఇవ్వగా లేనిది చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?, 2014-19 మధ్య చంద్రబాబు  పెట్టిన బకాయి కూడా కలిపి ఒకేసారి రూ.4 వేల కోట్లు జగన్ ఇచ్చారు. 

    Chaitanya: సోమరిపోతు చంద్రన్న... అదిరిపోయే పిట్టకథ..

    చంద్రబాబు మాత్రం త్రైమాసికం ప్రకారం కూడా ఇవ్వటం లేదు. ఇప్పటికే రూ.7,800 కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టారు. నారా లోకేష్ విద్యార్థి సంఘాల నేతలతో పచ్చి అబద్దాలు చెప్తున్నారు. జగన్‌, చంద్రబాబు హయాంలలో ఎవరు ఎంత ఇచ్చారో చర్చకు సిద్దమా?, మా పార్టీ తరఫున చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం తరపున ఎవరైనా చర్చకు రావాలి. రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు పరీక్షలు కూడా రాయనీయటం లేదు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న లోకేష్ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు’ అని మండిపడ్డారు.

    ఇదీ చదవండి:
    గో బ్యాక్‌.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు

  • సాక్షి శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు సరుబుజ్జులి మండలం వెన్నెల వలసలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. కూన రవికుమార్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

    అయితే  కొద్ది రోజుల క్రితం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి వరకూ ర్యాలీ నిర్వహించాలని తలపించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే గిరిజనులు నిరసనలు చేపట్టారు. సురుబుజ్జి, బూర్జ మండలాలలో పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పవర్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. 

    థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారు. స్థానికుల జీవనోపాధి అయిన అడవులు, నీటి వనరులు, వ్యవసాయం ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.. ఈ మేరకు నిరసనల చేపట్టారు.  ఇది గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వానికి  ఎదురవుతున్న నిరసన సెగ. ఇప్పటికే -థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళంలో ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్థానికులు తమ భూములు, వనరులు కాపాడుకోవడానికి సంఘటిత పోరాటం చేస్తున్నారు.

    ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైన నిరసన సెగ.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనతో థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉంది. గిరిజనుల నిరసనను విస్మరిస్తే మాత్రం వారి నిరసనలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు  ఉన్నాయి.  ఎందుకంటే ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి, వారి నిరసనకు ప్రజాబలం పెరుగుతుంది. మొత్తంగా, శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం గిరిజనుల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.

    ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై  గిరిజనుల తిరుగుబాటు  

  • తిరుపతి: తిరుపతి నగరంలోని హోటల్ రాజ్ పార్క్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. ఆర్డిఎక్స్‌తో పేల్చేస్తాం అని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. డాగ్‌ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై అజిత ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. హోటల్ సిబ్బంది, అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు.

  • సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సాక్షిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో సాక్షి విజయనగరం ఆఫీసుకు వచ్చిన పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు. అయితే, టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు.

    సాక్షి కథనంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి, పీఏ సతీష్‌కు గౌరవ భంగం కలిగింది అని మక్కువ మండలం టీడీపీ అధ్యక్షుడు గుళ్ల వేణుగోపాల నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు సాక్షికి నోటీసులు ఇచ్చారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం​ గమనార్హం.‍ కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. దీంతో విషయం జనాల్లోకి పోవడంతో ఆమెను గప్‌చుప్‌గా వదిలేశారు.

    ఈ క్రమంలో బాధితురాలి గురించి కథనాలు ఇచ్చిన సాక్షికి నోటీసులు జారీ చేసింది. బీఎన్‌ఎస్‌ 94 ప్రకారం.. ప్రసారం చేసిన కథనాలకు ఆధారాలు సమర్పించాలని పోలీసులు కోరారు. అలాగే.. సతీష్ అకృత్యాలకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ చాటింగ్‌(ఇందులో మంత్రి కుమారుడి చాటింగ్ కూడా) ఉన్న ఫోన్‌ను ఇప్పటికే ఆమె పోలీసులకు అప్పగించారు. పోలీసులు అవేవీ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆమె వెనక ఎవరైనా ఉన్నారా? అని ఆరాలు తీస్తున్నారు. తద్వారా విషయాన్ని రాజకీయ ప్రత్యర్థులపైకి నెట్టేసేలా కనిపిస్తోంది.  

    Vizianagaram: సాక్షి మీడియాకు సాలూరు పోలీసుల నోటీసులు

     

Politics

  • న్యూఢిల్లీ:  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల ‘సీఎం’ పంచాయతీ బ్రేక్‌ఫాస్ట్‌లపై నడుస్తుంది.  అధిష్టానం ఆదేశాలనుకుణంగా మొన్న ఇద్దరు నేతలు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య ఇంటికి హాజరైన డీకే.. బ్రేక్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరు ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలిశారు. వారిద్దరూ బ్రేక్‌ఫాస్ట్‌ కలిసి చేసినా ఏమీ స్పష్టత లేకపోవడంతో మళ్లీ బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలని హైకమాండ్‌ ఆదేశించింది. ఈసారి ఆ బ్రేక్‌ఫాస్ట్‌ను డీకే నివాసంలో ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ రెండో తేదీన అంటే రేపు(మంగళవారం) వారిద్దరు మరోసారి బ్రేక్‌ఫాస్ట్‌ విందులో పాల్గొననున్నారు. 

    ఢిల్లీకి వెళ్లిని వీరిద్దరి హైకమాండ్‌ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం.. వీరిద్దరి ఎపిసోడ్‌పై సీరియస్‌గా ఉన్నారు. ఐదేళ్ల సీఎం పదవిలో బాగంగా మార్పు అంశానికి ముగింపు పెట్టాలని వారిని హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే సిద్ధరామయ్య, డీకేలు మరోసారి భేటీ కావండం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారైనా సీఎం మార్పు అంశానికి వీరిద్దరూ ముగింపు పెడతారా లేదా అనే దానిని హైకమాండ్‌ నిశితంగా గమనిస్తోంది. 

    కాగా  నవంబర్ 20న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడవడంతో  సీఎం మార్పు జరగనుందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం మార్పు జరిగేలా అగ్రిమెంట్ జరిగిందని దానికనుంగానే నిర్ణయం తీసుకోనున్నారని ఊహాగానాలు  చెలరేగాయి. దానికి ఆజ్యం పోస్తూన్నట్లుగానే ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌లు చేయడం కూడా ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.  వాట్‌ నెక్ట్స్‌ అనేది రేపటికి  ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సీఎం పదవి తనకు కావాలని డీకే పట్టుబడతారా.. లేక సిద్ధరామయ్యకు పూర్తిగా ఐదేళ్లు వదిలేస్తారా? అనేది చూడాలి. 

  • నారాయణపేట:  మక్తల్‌ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ హయాంలో మక్తల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు రేవంత్‌. మక్తల్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ కొడంగల్‌ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తాం. భూములిచ్చిన రైతులకు రూ 20 లక్షల పరిహారం ఇస్తున్నాం. మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలి. దండు కట్టండి.. దగ్గరుండి పనిచేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి.

    ఇరిగేషన్‌తో పాటు విద్యకూ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతీ పేదబిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రారంభించాం. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాం. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పక్కనే ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని సోయి 70 ఏళ్లుగా పాలకులు లేకుండా పోయింది. 

    ఆ పని నేను చేస్తున్నందుకు ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. రెండేళ్లలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. సన్నబియ్యం ఇస్తున్నాం. బీసీల జనాభా 56 శాతం ఉన్న లెక్క తేల్చిన ఘనత మాది. గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. అభివృద్ధి ఆకాంక్షించే వారిని సర్పంచ్‌గా గెలిపించాలి’ అని సీఎం రేవంత్‌ సూచించారు.

Sports

  • సంగారెడ్డి వేదికగా జరిగిన 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో మేడ్చ‌ల్ మల్కాజిగిరి సీనియ‌ర్స్‌ బాలికల జట్టు విజేతగా నిలిచింది. అద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా జరిగిన ఫైన‌ల్‌లో హైద‌రాబాద్ గ‌ర్ల్స్ టీంపై 61-59 స్కోరుతో గెలిచింది. మూడో స్థానంలో రంగారెడ్డి జ‌ట్టు నిలిచింది. 

    మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జట్టు చివరి వరకూ అద్భుతంగా ఆడింది. ఒక ద‌శ‌లో రెండు జ‌ట్ల స్కోర్లు స‌మాన‌మ‌య్యాయి. అయితే ఫైన‌ల్ మ్యాచ్ మ‌రికొద్ది క్ష‌ణాల్లో ముగుస్తుంద‌న్న స‌మ‌యంలో మేడ్చ‌ల్ జ‌ట్టు బాస్కెట్‌ చేసి విజయాన్ని తమ వైపు తిప్పుకుంది. 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్‌లో  మొత్తం 14 జిల్లాల టీంలు హోరాహోరీగా పోటీప‌డ్డాయి. బాలుర పోటీలో హైద‌రాబాద్ టోర్నీ గెలుచుకోగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి నిలిచాయి.

    మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి త‌ర‌పున ఆడిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు వివ్హా రెడ్డి మరియు నేత్ర బిరుదవోలు భార‌త టీంకు కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం విశేషం. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జ‌ట్టు భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ఛాంపియన్‌షిప్‌లు సాధించాలని అసొసియేష‌న్ అధ్య‌క్షులు సుధీర్‌, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ర‌విశంక‌ర్ ఆకాంక్షించారు.
     

  • ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్, పాడెల్ పెడరేషన్ ధ్రువీకరించింది.

    కాగా పీట్రాంగెలి ఇటలీ టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఇటాలియన్ ప్లేయర్ నికోలానే కావడం విశేషం​. డేవిస్ కప్ మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా కూడా పొందారు. ఆయన తన కెరీర్‌లో 44 సింగిల్స్‌ టైటిళ్లను గెలుచుకున్నారు. 

    కాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన మొట్టమొదటి ఇటాలియన్ ఆటగాడు కూడా నికోలానే. 1959, 1960లో రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన వార‌స‌త్వాన్ని జానిక్ సిన్నర్, మాటియో బెరెట్టినిల వంటి యువ సంచ‌ల‌నాలు ముందుకు తీసువెళ్తున్నారు. నికోలా పీట్రాంగెలి మృతి పట్ల  ఇటలీ ప్రధాన మంత్రి జియోర్జియా మెలోనీ, స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజం రాఫెల్ నాదల్  సంతాపం వ్యక్తం చేశారు.
     

  • భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండో వ‌న్డే బుధ‌వారం(డిసెంబ‌ర్ 3) రాయ్‌పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా మాత్రం తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికాకు ఓ గుడ్ న్యూస్ అందింది.

    వ‌ర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా తొలి వ‌న్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ టెంబా బవుమా, స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మహారాజ్ తిరిగి తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు స‌మాచారం.  వీరిద్దరి రాక‌తో క్వింట‌న్ డికాక్‌, ప్రేనేలన్ సుబ్రాయెన్ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ ఇద్ద‌రు ప్రోటీస్ ఆట‌గాళ్లు తొలి వ‌న్డేలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

    ఇక రాంచీ వ‌న్డేలో బవుమా గైర్హ‌జరీలో ప్రోటీస్ కెప్టెన్‌గా ఐడైన్ మార్‌క్ర‌మ్ వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు రెండో వ‌న్డేలో బ‌వుమా తిరిగి జ‌ట్టు ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌డం దాదాపు ఖాయం. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బ‌వుమా ఎడ‌మ కాలి గాయం బారిన ప‌డ్డాడు. దీంతో అత‌డు పాక్ ప‌ర్య‌ట‌న మొత్తానికి దూర‌మ‌య్యాడు.

    ఆ త‌ర్వాత అత‌డు భార‌త్‌తో టెస్టు సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అత‌డి నాయ‌క‌త్వంలోనే ప్రోటీస్ జ‌ట్టును భార‌త్‌తో టెస్టు సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. బ‌వుమా ప్ర‌స్తుతం ఫిట్‌గా ఉన్నాడు. కానీ త‌ర్వాత వ‌రుస సిరీస్‌ల నేప‌థ్యంలో అత‌డికి తొలి వ‌న్డేకు విశ్రాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 వెన‌కంజ‌లో ఉండ‌డంతో అత‌డి పున‌రాగ‌మ‌నం అనివార్య‌మైంది.

    రెండో వన్డేకు సౌతాఫ్రికా తుది జట్టు:  ర్యాన్ రికెల్టన్, ఐడైన్ మార్‌క్రమ్‌, టెంబా బవుమా, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్‌, నాంద్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్
    చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అత‌డిపై వేటు.. డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌కు ఛాన్స్‌?
     

  • టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్‌, సౌరాష్ట్ర దిగ్గ‌జం జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. దేశ‌వాళీ టీ20 టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా ఉన‌ద్క‌ట్ అవ‌త‌రించాడు.  ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ కుమార్‌ను ఔట్ చేసిన జయదేవ్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 83 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సిద్ధార్థ్ కౌల్(120) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కౌల్‌ను ఉనద్కట్ అధిగమించాడు.

    పోరాడి ఓడిన సౌరాష్ట్ర
    ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌరాష్ట్రపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. రుచిత్ అహిర్(39), వగేలా(7 బంతుల్లో 23) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు.  ఢిల్లీ స్పిన్నర్‌ సుయష్ శర్మ 3 వికెట్లతో సత్తాచాటాడు.

    సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
    జయదేవ్ ఉనద్కత్ 121
    సిద్ధార్థ్ కౌల్ 120
    పీయూష్ చావ్లా 113
    లుక్మాన్ మేరివాలా 108
    చామ మిలింద్ 107

    ప్రస్తుతం టాప్‌-5 బౌలర్లలో జయదేవ్‌, చామ మిలింద్ మాత్రమే ఇంకా ఆడుతున్నారు. ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు ఉనద్కట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకుంది.
    చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్‌కే అత‌డిపై వేటు.. డేంజ‌ర‌స్ బ్యాట‌ర్‌కు ఛాన్స్‌?

  • వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. 2026 మినీ వేలానికి ముందు లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ సహ యజమాని, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. రసెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు.

    నీ ఒంటిపై కేకేఆర్‌ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా..
    ‘‘మాకెన్నో మధురమైన, అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆండ్రీ. నీ అద్భుత ఆట తీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. కేకేఆర్‌ (KKR)కు నువ్వు అందించిన సేవలు మరువలేనివి.

    ఇక క్రీడాకారుడిగా నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్‌ కోచ్‌గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ తెలివి, శక్తిని మన ఆటగాళ్లకు బదిలీ చేసెయ్‌. వారిని చాంపియన్లుగా నిలిపే ఉత్ప్రేరకంగా మారు.

    ఏదేమైనా నీ ఒంటిపై కేకేఆర్‌ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు ఆండ్రీ. లవ్‌ యూ రసెల్‌. ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫున నేను ఈ మాట చెబుతున్నా’’ అంటూ షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan).. రసెల్‌తో తమ జట్టుకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. కాగా... కేకేఆర్‌ యాజమాన్యం రసెల్‌ (Andre Russell)ను తమ జట్టు ‘పవర్‌ కోచ్‌’గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

    నాలో సిక్స్‌లు కొట్టే సత్తా ఉంది
    ఇదిలా ఉంటే.. 2012 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న 37 ఏళ్ల రసెల్‌ 2014 నుంచి ఇప్పటి వరకు కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా.. ‘కేకేఆర్‌తో బంధం విడదీయలేనిది. ఇప్పటికీ నాలో సిక్స్‌లు కొట్టే సత్తా... మ్యాచ్‌లు గెలిపించగల పట్టుదల ఉన్నాయి. కానీ వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని భావించా.

    ఇక మీద కొత్త అవతారంలో దర్శనమిస్తా. 2026 సీజన్‌లో అదే ఉత్సాహంతో కేకేఆర్‌ ‘పవర్‌ కోచ్‌’గా పనిచేయనున్నాను. 12 సీజన్‌లుగా కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇతర లీగ్‌ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నా... ఐపీఎల్‌లో మాత్రం ప్లేయర్‌గా కాకుండా వేరే బాధ్యతలు నిర్వర్తించనున్నా. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే 
    తప్పుకోవాలనేది నా అభిమతం.

    ఎంతో నమ్మకముంచారు
    అందుకే ఇంకొన్నాళ్లు ఆడే దమ్ము ఉన్నప్పటికీ ముందే వీడ్కోలు పలుకుతున్నా. ఆటగాడిగా రిటైర్‌ అయినా... కేకేఆర్‌ కుటుంబంలో నేనెప్పుడూ భాగమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించా. 

    వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇన్నాళ్లు మైదానంలో ప్లేయర్‌గా నిర్వర్తించిన బాధ్యతలను ఇకపై ‘పవర్‌ కోచ్‌’గా డగౌట్‌లో ఉండి చక్కబెట్టమని సూచించారు. అందుకు అంగీకరించా’ అని రసెల్‌ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.

    కాగా తొలి రెండు సీజన్‌ల పాటు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రసెల్‌... ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లాడి 174.18 స్ట్రయిక్‌రేట్‌తో 2,651 పరుగులు చేశాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించిన రసెల్‌ 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • సౌతాఫ్రికాతో మూడు వ‌న్డేల సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజ‌యంతో ప్రారంభించింది. రాంచీ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో ప‌ర్యాట‌క ప్రోటీస్ జ‌ట్టును 17 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిచిన‌ప్ప‌టికి స‌రిదిద్దుకోవాల్సిన త‌ప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సింది.

    జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పించింది. 350 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కాపాడుకునేందుకు భార‌త బౌల‌ర్లు తీవ్రంగా శ్ర‌మించారు. ఓ ద‌శ‌లో జాన్సెన్, బాష్ జోరు చూస్తే స‌ఫారీలదే మ్యాచ్ అన్న‌ట్లు అన్పించింది. కానీ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ మ‌యాజాలంతో ఓట‌మి నుంచి మెన్ బ్లూ గ‌ట్టెక్కింది.

    అదేవిధంగా రాంచీ వ‌న్డేలో భార‌త మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు కూడా విఫ‌ల‌మ‌య్యారు. ఛాన్నాళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్(13) కూడా నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మ‌య్యాడు.

    వారిద్ద‌రిపై వేటు.. 
    ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాయ్‌పూర్ వేదిక‌గా స‌ఫారీల‌తో జ‌రిగే రెండో వ‌న్డేలో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది.తొలి వన్డేలో విఫ‌ల‌మైన రుతురాజ్ గైక్వాడ్‌, సుంద‌ర్‌ల‌పై వేటు వేసేందుకు మెనెజ్‌మెంట్ సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం.

    రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌, సుంద‌ర్ స్ధానంలో ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ నితీష్ కుమార్ జ‌ట్టులోకి రానున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పంత్ గ‌తేడాది చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున వ‌న్డే మ్యాచ్ ఆడాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఏడాది త‌ర్వాత ఈ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్  బ్లూ జెర్సీలో క‌న్పించ‌నున్నాడు. 

    గ‌త మ్యాచ్‌లో సుంద‌ర్ కేవ‌లం మూడు ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. జ‌ట్టులో స్పిన్న‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌తో పాటు రవీంద్ర జ‌డేజా ఉండ‌డంతో సుంద‌ర్‌ను బెంచ్‌కు ప‌రిమితం చేయాల‌ని గంభీర్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. నితీష్ బ్యాట్‌తో పాటు మీడియం పేస్ బౌల‌ర్‌గా కూడా త‌న సేవ‌ల‌ను అందించనున్నాడు. అయితే స‌ఫారీల‌తో జ‌రిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచాడు.

    రెండో వ‌న్డేకు భార‌త తుది జ‌ట్టు(అంచనా)
    రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, నితీశ్ కుమార్ రెడ్డి, ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్షిత్ రాణా, కుల్దీప్ యాద‌వ్‌, అర్ష్‌దీప్ సింగ్‌
    చదవండి: రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్‌!
     

  • ఇంగ్లండ్‌తో పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గాయాల బెడద వల్ల వీరిద్దరు ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు కూడా దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (Cricket Australia) ఇటీవలే వెల్లడించింది.

    యాషెస్‌ సిరీస్‌తో బిజీ
    అయితే, తాజా సమాచారం ప్రకారం ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (Usman Khawaja) కూడా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌తో బిజీగా ఉంది ఆస్ట్రేలియా.

    ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్‌. రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) జట్టును ముందుకు నడిపించగా.. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4-8 మధ్య బ్రిస్బేన్‌లోని గాబా వేదికగా రెండో టెస్టు జరుగనుంది.

    ఖవాజా సైతం..
    పింక్‌బాల్‌తో జరిగే ఈ డై- నైట్‌ టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. కమిన్స్‌తో పాటు హాజిల్‌వుడ్‌ గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. అయితే, ఇప్పుడు ఖవాజా ఫిట్‌నెస్‌ సమస్య ఆసీస్‌కు తలనొప్పిగా మారింది. పెర్త్‌ టెస్టు సందర్భంగా ఖవాజాకు వెన్ను నొప్పి తిరగబెట్టింది.

    గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు అతడే
    ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనింగ్‌ చేయలేదు. ఇక పింక్‌బాల్‌ టెస్టుకు సన్నద్ధమయ్యే క్రమంలోనూ అతడు వెన్నునొప్పితో బాధపడినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ముప్పై నిమిషాల పాటు జరిగిన సెషన్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు అతడు ఇబ్బందిపడినట్లు పేర్కొంది.

    దీంతో రెండో టెస్టుకు ఖవాజా అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతడు ఈ మ్యాచ్‌కు దూరమైతే జట్టుకు కష్టమే. గాబాలో గత మూడు పింక్‌ బాల్‌ టెస్టుల్లోనూ ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో అతడికి మాత్రమే ఉంది. కాగా ఖవాజా గనుక ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమైతే బ్యూ వెబ్‌స్టర్‌, జోష్‌ ఇంగ్లిస్‌ల రూపంలో బ్యాకప్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

    ఇంగ్లండ్‌తో పింక్‌బాల్‌ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు
    స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్‌రాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.

    చదవండి: రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్‌!

  • భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల భవితవ్యం గురించి క్రికెట్‌ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నమెంట్‌ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.

    వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..
    ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్‌గా రోహిత్‌ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.

    ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్‌ తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

     ఆద్యంతం అద్భుత ఆట తీరుతో
    అయితే, ఆసీస్‌ టూర్‌లో అందుకు భిన్నంగా రోహిత్‌- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్‌ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.

    రాంచి వేదికగా రోహిత్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 83వ శతకం బాది తన బ్యాటింగ్‌లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.

    అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్‌
    ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్‌గా సెలబ్రేట్‌ చేసుకోగా.. రోహిత్‌ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌కాగా..రో- కో ఫ్యాన్స్‌ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌ను టార్గెట్‌ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

     

    బీసీసీఐ సీరియస్‌!
    ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌- అగార్కర్‌లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్‌తో సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్‌- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.

    వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్‌పూర్‌ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్‌- అగార్కర్‌కు అస్సలు మాటల్లేవు.

    ఇక కోహ్లి- గంభీర్‌ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్‌- కోహ్లి అభిమానులు గంభీర్‌- అగార్కర్‌లను ట్రోల్‌ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్‌గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

    రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!
    ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో గంభీర్‌ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్‌లాబీలో గంభీర్‌తో రోహిత్‌ సీరియస్‌గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్‌తో హోటల్‌ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసింది.

    తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కేక్‌ కట్‌ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్‌ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. 

    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేలో కూడా ప్రోటీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది.

    అయితే ఈ మ్యాచ్‌కు ​ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్క‌ర్‌తో  పాటు మరికొంత మంది ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి గ‌ల కార‌ణాల‌ను, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను గంభీర్‌, అగార్క‌ర్‌తో బీసీసీఐ చ‌ర్చించే అవ‌కాశ‌ముంది.

    బీసీసీఐ సీరియస్‌?
    "హోమ్ టెస్టు సీజ‌న్‌లో మాకు కొన్ని ఫ‌లితాలు తీవ్ర నిరాశ‌ క‌లిగించాయి. ఈ సీజన్‌లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి.  వాటిపై మాకు స్పష్టత కావాలి. మా తదుప‌రి టెస్టు సిరీస్‌కు ఇంకా ఎనిమిది నెల‌ల స‌మ‌యం మిగిలి ఉంది. అందుకోసం ముందుస్తు ప్ర‌ణాళిక‌ల‌ను కోచ్‌, చీఫ్ సెల‌క్ట‌ర్ నుంచి అడిగి తెలుసుకోవాల‌నుకుంటున్నాము. 

    అంతేకాకుండా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ డిఫెం‍డింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో కూడా టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా ఉంది. కాబట్టి ఈ రెండు మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

    కాగా టీమ్‌మెనెజ్‌మెంట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య  కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్‌కు బీసీసీఐ కొత్త బాస్ మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. 

    అయితే ఈ సమావేశం మ్యాచ్ రోజే  జరగనుండడంతో సీనియర్ ప్లేయర్లు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఇక టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌ కావడంతో గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడిని కోచ్‌ పదవి నుంచి తప్పించాలని చాలా డిమాండ్‌ చేశారు.

    గంభీర్‌ మాత్రం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటిలో గంభీర్‌ హెడ్‌కోచ్‌ పదవికి ఎటువంటి ముప్పులేదు. ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్‌-2027 వరకు భారత హెడ్‌ కోచ్‌గా కొనసాగే అవకాశముంది.
    చదవండి: వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌

  • సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం అర్జున్  తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గత సీజన్‌లో లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్‌కు ఈసారి గోవా టీమ్ మెనెజ్‌మెంట్ ఏకంగా ఓపెనర్‌గా ప్రమోషన్ ఇచ్చింది.

    కెరీర్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన జూనియర్ టెండూల్కర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన అర్జున్‌.. ఆ తర్వాత చండీగఢ్‌పై కేవలం 18 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

    తాజాగా ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతులు ఆడి 7 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో కూడా అర్జున్ సత్తాచాటలేకపోయాడు. యూపీపై కూడా అర్జున్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. కానీ చండీగఢ్‌పై మాత్రం  4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 

    దీంతో గోవా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగితా రెండు మ్యాచ్‌లలో మాత్రం గోవా చిత్తు అయింది. ముంబై నుంచి తన మకాంను గోవాకు మర్చిన అర్జున్ ఇక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. మొన్నటివరకు కేవలం రెడ్ బాల్ క్రికెట్‌కు పరిమితమైన అర్జున్‌కు ఈసారి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కింది. 

    కానీ తనకు దక్కిన అవకాశాన్ని అర్జున్ సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. కాగా ఐపీఎల్‌-2026లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. మినీ వేలానికి ముందు అర్జున్‌ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో ట్రేడ్ చేసుకుంది.
    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.

    యాన్సెన్‌ మెరుపు ఇన్నింగ్స్‌
    టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్‌ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్‌ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్‌కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్‌ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.

    ఓ దశలో యాన్సెన్‌ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్‌ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కార్బిన్‌  బాష్‌ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. 

    బాష్‌ ఒంటరి పోరాటం
    ఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్‌ వరకు బాష్‌ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్‌ జోరు టీమిండియాను భయపెట్టింది. 

     

    అయితే, ప్రసిద్‌ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్‌.. రెండో బంతికి రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. 

    ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..

    వాళ్ల పోరాటం అద్భుతం
    ‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్‌ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.

    పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. 

    జాగ్రత్త అంటూ వార్నింగ్‌
    తదుపరి రెండు మ్యాచ్‌లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. 

    కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్‌ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (60) రాణించగా.. విరాట్‌ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.

    లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్‌ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు, ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్‌- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్‌ ఖరారైంది. 

    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్  (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 

    ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్‌ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్‌కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా  ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 

    దీంతో వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఈ వెట‌ర‌న్ క్రికెట‌ర్లు ఆడుతారా? అప్ప‌టివ‌రకు ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెట‌ర్లు వ్య‌క్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్‌ జోడీ అద్భుత ఇన్నింగ్స్‌లతో సమాధానమిచ్చింది.

    ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ  సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడం అసాధ్యమని అత‌డు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు వేరే లెవల్‌లో ఆడుతున్నారు. వీరిద్ద‌రూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మ‌నం వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెల‌వ‌లేం. 

    కాబ‌ట్టి ఇకపై ప్ర‌పంచ‌క‌ప్‌లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్‌-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్‌ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. 

    వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు.  కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతూ తమ రిథమ్‌ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్‌కప్‌లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. 

    ఇక తొలి వ‌న్డేలో సౌతాఫ్రికాపై 17 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. 350 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.
    చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

  • టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.

    182 పరుగులు
    ఈ టోర్నీలో ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్‌... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్‌ వేదికగా టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

    విజయ్‌ శంకర్‌ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం చేయగా... బ్రికమ్‌ కుమార్‌ దాస్‌ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ మణిశంకర్‌ (21 బంతుల్లో 42; 5 సిక్స్‌లు) రాణించారు.

    సెంచరీతో కదం తొక్కిన ఇషాన్‌ కిషన్‌
    జార్ఖండ్‌ బౌలర్లలో వికాస్‌ సింగ్, అనుకూల్‌ రాయ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్‌ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. 

    కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (50 బంతుల్లో 113 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్‌ సింగ్‌ (40 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. 

    ఫలితంగా జార్ఖండ్‌ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్‌ కిషన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

    చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
    టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్‌ కిషన్‌ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా  క్రికెట్‌ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్‌ నిలిచాడు.

    గతంలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్‌లో జార్ఖండ్‌ సారథిగా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్‌. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (పంజాబ్‌ కింగ్స్‌) కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.

    టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
    🏏ఇషాన్‌ కిషన్‌ (ఇండియా)- జార్ఖండ్‌ తరఫున 3 శతకాలు
    🏏ఆడం గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ తరఫున కలిని 2 శతకాలు
    🏏మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌)- ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరఫున 2 శతకాలు.  

    చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి

  • సౌతాఫ్రికాతో నిన్న (నవంబర్‌ 30) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌..  వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా (352) పాకిస్తాన్‌ మాజీ షాహిద్‌ అఫ్రిది (351) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు విభాగంలో రోహిత్‌, అఫ్రిది తర్వాత 300 సిక్సర్ల మార్కు తాకిన ఏకైక ఆటగాడు విండీస్‌ వీరుడు క్రిస్‌ గేల్‌ (331) మాత్రమే.

    తాజా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ సిక్సర్ల సంఖ్య 645కి చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న అతను.. రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్‌ కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. 

    రోహిత్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల కొట్టిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (553) కొనసాగుతున్నాడు. ఆతర్వాతి స్థానాల్లో అఫ్రిది (476), బ్రెండన్‌ మెల్‌కల్లమ్‌ (398), జోస్‌ బట్లర్‌ (387) టాప్‌-5లో ఉన్నారు.

    ఇక్కడ గమనించదగ్గ ఓ విషయం ఏంటంటే.. ప్రస్తుతం కెరీర్‌ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో రోహిత్‌ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఈ విభాగంలో ఐదో స్థానంలో ఉన్న జోస్‌ బట్లర్‌ హిట్‌మ్యాన్‌కు ఆమడదూరంలో ఉన్నాడు. రోహిత్‌కు బట్లర్‌కు మధ్య ఉన్న సిక్సర్ల వ్యత్యాసం ఏకంగా 258. కెరీర్‌ చరమాంకంలో ఉన్న బట్లర్‌ మహా అయితే ఇంకో 100 సిక్సర్లు కొట్టగలడు.

    ఈ లెక్కన అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్‌ శర్మ పేరిట చిరకాలం ఉండిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈతరం క్రికెటర్లలో ఎవరికీ మూడు ఫార్మాట్లలో కొనసాగేంత సీన్‌ లేదు. ఒకటి, రెండు ఫార్మాట్లతో హిట్‌మ్యాన్‌ రికార్డును బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి రోహిత్‌ శర్మ సిక్సర్ల శర్మగా క్రికెట్‌ అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాడు. 

Business

  • కొన్ని సందర్భాల్లో.. అనేక కారణాల వల్ల రైలు ప్రయాణాలకు అంతరాయం కలగవచ్చు లేదా రైలు రావడం ఆలస్యం కావొచ్చు. AC యూనిట్లు పనిచేయకపోవచ్చు, కోచ్ కాన్ఫిగరేషన్‌లు మారవచ్చు, రైలును పూర్తిగా దారి మళ్లించనూవచ్చు. ఇలాంటి సమయంలో ప్రయాణికులు టీడీఆర్ లేదా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ ఉపయోగించుకోవడం ద్వారా.. మొత్తం డబ్బు రీఫండ్ అవుతుంది. ఈ విషయం తెలియక చాలామంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు.

    టీడీఆర్ సేవను ఉపయోగించడం వల్ల.. తన డబ్బు మొత్తం రీఫండ్ అయిందని.. ఒక ఎక్స్ యూజర్ తన అనుభవాన్ని పేర్కొన్నారు.

    ఎక్స్ యూజర్, తన భార్య రైలులో సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నారని, అయితే ట్రైన్ ఏడు గంటలు ఆలస్యమైందని IRCTC నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. ట్రైన్ ఆలస్యం కావడంతో బస్సులో ప్రయాణించాలనుకున్నాము. అయితే ట్రైన్ టికెట్ కోసం పెట్టిన డబ్బును రీఫండ్ పొందడానికి.. TDR దాఖలు చేసి, రైలు 3 గంటలకు పైగా ఆలస్యం అయిందని.. నేను రైలులో ప్రయాణం చేయలేదనే రీజన్ ఎంచుకున్నాను. రీఫండ్ కూడా త్వరగానే ప్రారంభమైంది, డిసెంబర్ 1న వచేశాయని వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తోటి ప్రయాణీకులను కూడా కోరారు.

    ఇదీ చదవండి: పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలా?: నాలుగు మార్గాలున్నాయ్‌గా..

    టీడీఆర్ గురించి
    నిజానికి TDR అనేది కొత్త సర్వీస్ కాదు. అయితే చాలామందికి తెలిసి ఉండదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రైల్వే శాఖ రైలును రద్దు చేసినప్పుడు, ట్రైన్ మూడు గంటలు ఆలస్యమైనప్పుడు, సరైన టికెట్ ఉన్నప్పటికీ.. ప్రయాణం చేయలేనప్పుడు, ప్రయాణం సమయంలో ఏసీ సరిగ్గా పనిచేయనప్పుడు మాత్రమే టీడీఆర్ ఫైల్ చేసి రీఫండ్ పొందవచ్చు. టీడీఆర్‌ను తప్పనిసరిగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫైల్ చేయాలి. రైలు బయలుదేరిన నాలుగు గంటల్లోగా టీడీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

  • ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్‌లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.

    భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్‌లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.

    ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్‌గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

    ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 3K వీడియో రిజల్యూషన్‌లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్‌లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది.

  • ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ కథనంలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?, దానికున్న మార్గాలు ఏమిటనేది వివరంగా తెలుసుకుందాం.

    మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్
    యూఏఎన్ పోర్టల్‌లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు.

    • మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలనుకునే సభ్యులు ముందుగా.. మొబైల్ నెంబర్‌ను యూనిఫైడ్ పోర్టల్‌లో UANతో యాక్టివేట్ చేయాలి. దీనికోసం కావలసిన డాక్యుమెంట్లతో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి.

    • 9966044425 కు కాల్ చేసినప్పుడు రెండు రింగ్‌ల తర్వాత స్వయంచాలకంగా డిస్‌కనెక్ట్ అవుతుంది. తరువాత ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది. అందులోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడవచ్చు.

    ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌
    యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.

    • EPFOHO UAN టెక్స్ట్‌లో మీ UAN నంబర్‌ను యాడ్ చేసి.. మీ ప్రాంతీయ భాషలో ప్రతిస్పందనను స్వీకరించాలనుకుంటే, టెక్స్ట్‌లో మీ UAN తర్వాత మీకు నచ్చిన భాష కోసం కోడ్‌ను వెల్లడించాలి. ఇది ఇంగ్లీష్, హిందీ (HIN), పంజాబీ (PUN), గుజరాతీ (GUJ), మరాఠీ (MAR), కన్నడ (KAN), తెలుగు (TEL), తమిళం (TAM), మలయాళం (MAL), బెంగాలీ (BEN) వంటి పది భాషల్లో అందుబాటులో ఉంటుంది.

    UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్

    • UMANG యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోలంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    • డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. లాగిన్ అయి EPFO ​​సేవలను యాక్సెస్ చేయడానికి మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని లింక్ చేయాలి.

    • లింక్ చేసిన తర్వాత, మీరు UMANG యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్‌ను సులభంగా చూడవచ్చు.

    EPFO వెబ్‌సైట్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌

    • ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్‌పై క్లిక్ చేసి, దీని కింద ఉన్న మెంబర్ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి.

    • EPFO ​​పోర్టల్‌లో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) & పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

    • ఇలా లాగిన్ అయిన తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుసుకోవచ్చు.

    ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?

  • ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్ఫోన్వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్ను తగ్గించుకుందామని టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.

    రెండేళ్ల క్రితం, ఆన్‌లైన్‌లో క్యాట్జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్‌ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్‌లైన్ ఫోన్వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్వాడాలంటే కొత్త నంబర్‌, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్‌షెల్ హ్యాండ్‌సెట్‌ను తీసుకుని, దాన్ని బ్లూటూత్తో స్మార్ట్ఫోన్లకు కనెక్ట్చేసుకుని కాల్స్మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్‌మెంట్‌లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.

    తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్లైన్‌లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికిఫిజికల్ ఫోన్అని పేరు పెట్టి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఏదో 1520 ప్రీఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.

    ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..

    ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్బ్రాండ్ కింద 90110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్‌సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్‌ ఉత్పత్తుల షిప్పింగ్ని ప్రారంభించనుంది.

    ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌టైమ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్‌ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్‌ను డయల్ చేయడం ద్వారా లేదా స్టార్‌’(*) కీని నొక్కి ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్‌గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు.

  • రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల రూ. 199 ప్లాన్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు మరోమారు రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ అందించనుంది.

    బీఎస్ఎన్ఎల్ ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీనిని దీపావళి సమయంలో కూడా కొనసాగించింది. ఇప్పుడు మరోమారు ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

    దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్కువమంది ప్రజలు ఈ ప్లాన్ కోరుకోవడం వల్లనే దీనిని మళ్లీ తీసుకురావడం జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    రూ.199 ప్లాన్ వివరాలు
    బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

  • 2026 ప్రారంభంలో సీలియన్ 7 ధరలు పెరుగుతాయని బీవైడీ ఇండియా ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు.. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎల్డబ్ల్యుబీ, టెస్లా మోడల్ వై, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5, వోల్వో ఈసీ40 వంటివాటికి ప్రత్యర్థిగా ఉంది.

    బీవైడీ సీలియన్ 7 ధరలు రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షల (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి. డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్న వారికి ఈ ధరలే వర్తిస్తాయి. 2026 జనవరి 1 నుంచి ధరల్లో మార్పులు జరగనున్నాయి. కాబట్టి అప్పుడు బుక్ చేసుకున్న వారికి కొత్త ధరలు వర్తిస్తాయి. అయితే కంపెనీ ధరలను ఎంత పెంచుతుందనే విషయాన్ని వెల్లడించలేదు.

    భారతదేశంలో ఇప్పటివరకు 2,000 యూనిట్లకు పైగా సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 82.56kWh బ్యాటరీ ఎంపికలో అందుబాటులో ఉంది. ప్రీమియం వేరియంట్‌లో 313hp & 380Nmలను అభివృద్ధి చేసే రియర్ మౌంటెడ్ మోటారుకు శక్తినిస్తుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ ముందు ఇరుసులో మోటారు ఉంటుంది. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్‌లు వరుసగా 482 కిమీ, 456 కిమీ రేంజ్ అందిస్తాయి.

  • రోబోటిక్స్టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.

    ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్‌డీఆర్‌సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ కూడా ఇప్పటికే హెచ్చరించారు.

    చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?

    హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.

    ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది.

  • ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని సమకూర్చుకోవాలని భావించే వారు.. తమ పోర్ట్‌ఫోలియో కోసం స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను తప్పకుండా పరిశీలించాలి. ఈక్విటీల్లో అత్యధిక రిస్క్‌ ఉండేది ఈ విభాగంలోనే. అదే సమయంలో అధిక రాబడులు కూడా ఇక్కడే సాధ్యం. కనుక దీర్ఘకాల లక్ష్యాల కోసం తమ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం వరకు స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి రాబడులను అందిస్తున్న పథకాల్లో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ కూడా ఒకటి.

    రాబడులు: గత ఐదేళ్ల కాలంలో ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ పెట్టుబడిపై 285 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడి 164%. అంటే వార్షిక కాంపౌండెడ్‌ రాబడి 28.44 శాతం.  గత ఏడాది కాలంలో రాబడి ఒక శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా మార్కెట్లు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 15 శాతం వరకు ఉండడాన్ని గమనించొచ్చు.

    ఈ పథకం ఆరంభం నుంచి ఇప్పటి వరకు పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 19.35 శాతం చొప్పున ఉంది. రాబడుల్లో స్థిరత్వాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక ఈ పథకంలో సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే ఏడాది కాలంలో సిప్‌ పెట్టుబడులపై 6.88 శాతం నష్టాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే వార్షిక రాబడి 18.49 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో అయితే వార్షిక రాబడి ఏకంగా 55.78 శాతంగా ఉండడం గమనించొచ్చు. ఇక 10 ఏళ్లలో సిప్‌ రాబడి 164% ఉంది. కనుక సిప్‌ ప్లాన్‌ రూపంలో పెట్టుబడులతో రిస్‌్కను అధిగమించడంతోపాటు.. మెరుగైన రాబడుల ను సమకూర్చుకోవచ్చని డేటా తెలియజేస్తోంది.

    పెట్టుబడుల విధానం: దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు సంపద సమకూర్చడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. చిన్న కంపెనీలు ఆర్థిక సంక్షోభ సమయాల్లో పెద్ద కంపెనీలతో పోల్చి చూస్తే కుదేలవుతుంటాయి. కనుక ఆ సమయంలో స్మాల్‌క్యాప్‌ పెట్టుబడుల విలువ పడిపోతుంటుంది. ఆందోళన చెందకుండా, స్థిరంగా ఆ పెట్టుబడిని తిరిగి గణనీయంగా వృద్ధి చెందే వరకు వేచి చూడగలిగే వారికే స్మాల్‌క్యాప్‌ పెట్టుబడులు అనుకూలం.

    పోర్ట్‌ఫోలియో: ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 36,945 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, 2.57 శాతం పెట్టుబడులు డెట్‌ సాధనాల్లో ఉన్నాయి. 4.16 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా, 36.34 శాతం మేర స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన మొత్తం మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

    పేరుకు స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అయినప్పటికీ.. మిడ్‌క్యాప్‌లో ఎక్స్‌పోజర్‌ ఎక్కువగా ఉంది. దీనికి కారణం స్వల్పకాలంలో రాబడుల అవకాశాలతోపాటు.. ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేసిన తర్వాతి కాలంలో కొన్ని కంపెనీలు వృద్ధితో మధ్యస్థ కంపెనీలుగా అవతరించినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో అత్యధికంగా 26.55 శాతం ఇండ్రస్టియల్స్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. కన్జ్యూమర్‌ కంపెనీలకు 20.56 శాతం, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 15.9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.

  • దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం రికార్డు గరిష్టాలను తాకిన స్టాక్సూచీలు తర్వాత స్వల్ప నష్టాలతో ఫ్లాట్గా స్థిరపడ్డాయి. ఫారిన్ఇన్ఫ్లోలు మందగించడం, కీలక వాణిజ్య చర్చలపై దీర్ఘకాల అనిశ్చితి మధ్య రూపాయి కొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తగ్గించింది.

    ముగింపు సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 64.77 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 85,641.9 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.2 పాయింట్లు లేదా 0.1 శాతం నష్టపోయి 26,175.75 వద్ద ఉన్నాయి. ప్రారంభ డీల్స్లో సెన్సెక్స్ 86,159 వద్ద రికార్డు స్థాయిని తాకగా, నిఫ్టీ 26,325.8 వద్ద రికార్డు స్థాయిని తాకింది.

    విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ముగియగా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం పెరిగింది. రంగాల సూచీలలో నిఫ్టీ రియల్టీ 1 శాతానికి పైగా పడిపోగా హెల్త్కేర్, ఫార్మా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు అనుసరించాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఆటో, మెటల్, ఐటీ సూచీలు గ్రీన్లో స్థిరపడ్డాయి.

    సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ట్రెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్ పీవీ, మారుతి సుజుకి, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

  • పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చాయంటే.. బంగారం కోనేస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. దీంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది, ధరలు కూడా పెరుగుదల దిశగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను చేరుకుని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉండనున్నాయో ఇక్కడ పరిశీలిద్దాం.

    2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.

    2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆగష్టు నుంచి నవంబర్ వరకు బంగారం ధరలు పెరుగుదల దిశగా పరుగులు పెడుతున్నాయి. ఈ నెలలో (డిసెంబర్) పెడ్ వడ్డీ రేట్లు తగ్గి.. బంగారం ధరలు పెరిగితే, 1979 తరువాత గోల్డ్ రేటు పెరుగుదల విషయంలో రికార్డ్ బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఇదే జరిగితే 46ఏళ్ల తరువాత సరికొత్త రికార్డ్ క్రియేట్ అవుతుంది.

    1979లో బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
    1979లో అంతర్జాతీయ అనిశ్చితులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ సంక్షోభాలు, ద్రవ్యోల్బణ భయం వంటి కారణాల  రేటు 120 శాతం కంటే ఎక్కువ పెరిగింది.

    1979 తరువాత 2022, 2023లలో 14 శాతం, 2024లో 21 శాతం మేర బంగారం ధరలు పెరిగాయి. 2025లో గోల్డ్ రేటు 60 శాతం పెరుగుదలను అందుకుంది. దీన్నిబట్టి చూస్తే.. 46 సంవత్సరాల తరువాత బంగారం ధరలు పెరిగాయని స్పష్టంగా అర్థమవుతోంది.

    నేటి ధరలు ఇలా..
    గోల్డ్ రేటు ఈ రోజు (డిసెంబర్ 01) గరిష్టంగా రూ. 980 పెరిగింది(చెన్నైలో). దీంతో బంగారం ధర రూ. 1,30,630 వద్దకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలలో 24 గ్యారేట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 660 పెరిగి రూ. 1,30,480 వద్ద నిలిచింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 600 పరైగింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల పసిడి ధర రూ. 1,19,600 వద్దకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇదీ చదవండి: చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?

  • సైబర్ దాడి జరగకుండా, ఒకవేళ జరిగినా అందుకు అవసరమయ్యే పరిష్కారాలు అందించడం చాలా కీలకం. ఈ విభాగంలో సర్వీసులు అందిస్తూ ఏకంగా 132 బిలియన్‌ డాలర్ల విలువ సంపాదించుకున్న టెక్ దిగ్గజ కంపెనీకి ఓ ఇండియన్‌ సారథ్యం వహిస్తున్నారు. 2025 నవంబర్‌ నాటికి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ (PANW) మార్కెట్ క్యాప్ రికార్డును చేరింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ ప్లాట్‌ఫామ్‌ల్లో ప్రపంచ లీడర్‌గా ఈ కంపెనీ నిలవడానికి కారణం నికేష్ అరోరా వ్యూహాత్మక నాయకత్వమేనని కంపెనీలోని ప్రముఖులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టి పాలోఆల్టో నెట్‌వర్క్స్ ఛైర్మన్, సీఈఓగా ఎదిగిన నికేష్ అరోరా గురించి తెలుసుకుందాం.

    నికేష్‌ అరోరా తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసేవారు. నికేష్‌ క్రమశిక్షణతో కూడిన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో పెరిగారు. 1968లో జన్మించిన ఆయన 1990లో వారణాసిలోని ఐఐటీ బీహెచ్‌యూ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. తర్వాత అమెరికాకు వెళ్లి బోస్టన్ కాలేజీ నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్, నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. కెరియర్‌ ప్రారంభంలో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, పుట్నమ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పనిచేసి ప్రపంచ మార్కెట్లు, పెట్టుబడి వ్యూహాలపై అనుభవాన్ని సంపాదించారు. ఆరంభంలో దాదాపు 400 సార్లు తన జాబ్‌ అప్లికేషన్‌ను కంపెనీలు తిరస్కరించాయి. అయినా ఆయన పట్టుదలతో కృషి చేశారు.

    గూగుల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌లో..

    నికేష్ అరోరా 2004లో గూగుల్‌లో చేరడం తనకు టర్నింగ్‌ పాయింటని చెప్పారు. పదేళ్లలో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా ఎదిగారు. కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని 2 బిలియన్‌ డాలర్ల నుంచి 60 బిలియన్‌ డాలర్లకు పెంచడంలో కీలకపాత్ర పోషించారు. యూరప్ కార్యకలాపాల నుంచి ప్రపంచ వ్యాపార వ్యూహం వరకు అన్నీ ఆయన చేతుల్లోనే ఉండేవి.

    2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెంట్, సీఓఓగా వెళ్లి 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్‌కు బీజం వేశారు. ఈ సమయంలోనే ఓలా, ఒయో, స్నాప్‌డీల్ వంటి భారతీయ స్టార్టప్‌లతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో భారీ పెట్టుబడులు పెట్టడంలో కీలకంగా మారారు.

    2018 నుంచి పాలో ఆల్టోలో..

    జూన్ 2018లో నికేష్‌ పాలో ఆల్టో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ సెక్యూరిటీ, ఏఐ, ఎంఎల్‌ ఆధారిత సైబర్ సర్వీసులను బలోపేతం చేయడానికి 15కి పైగా కంపెనీలను విజయవంతంగా కొనుగోలు చేశారు. Prisma Cloud, Cortex XDR, Cortex XSIAM వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించారు. సైబర్ థ్రెట్‌లను రియల్ టైమ్‌లోనే ఆపే సామర్థ్యాన్ని ప్రపంచానికి అందించారు.

    2018లో 180 డాలర్లు ఉన్న కంపెనీ స్టాక్ ధర 2025 నాటికి 400 డాలర్లు పైనే ట్రేడవుతోంది. నికేష్ అరోరా నాయకత్వంలో కంపెనీ కేవలం ఐదేళ్లలోనే దాదాపు 120%కు పైగా రిటర్న్‌లను అందించింది.

    రికార్డు పరిహారం

    నికేష్ అరోరా సంపాదన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2023లో ఆయన అందుకున్న పరిహారం 151.43 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,260 కోట్లు). ఇది అమెరికాలో ఆ సంవత్సరానికి రెండవ అత్యధిక వేతనం పొందిన సీఈఓగా నిలిపింది. 2025 జులై నాటికి ఆయన వ్యక్తిగత నికర విలువ 1.5 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.12,500 కోట్లకు) చేరింది. ఇందులో ఎక్కువ భాగం పాలో ఆల్టో నెట్‌వర్క్స్ స్టాక్స్ రూపంలోనే ఉంది.

    ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం

  • తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్‌బస్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్‌గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.

    అప్‌గ్రేడ్ వివరాలు

    ఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్‌గ్రేడ్ పూర్తి చేసింది.

    ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్‌గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్‌లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.

    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 25 విమానాల్లో 23 అప్‌గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్‌ చేయనున్నారు.

    సమస్య ఏమిటి?

    ఎయిర్‌బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్‌ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్‌లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తక్షణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.

    ఇదీ చదవండి: యాప్స్‌.. మార్కెటింగ్ యంత్రాలా?

  • ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్‌టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్‌గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్‌ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్‌టెక్ ఎకోసిస్టమ్‌ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్‌గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్‌లకు పుట్టినిల్లు అయింది.

    స్టార్టప్‌ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్‌ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్‌కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్‌కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.

    ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్‌ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్‌టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.

    ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వివరాలు..

    • ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.

    • 105 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్‌ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.

    • దాదాపు 40 శాతం స్టార్టప్‌లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.

    • ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్‌ను అందించింది.

    • రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.

    కీలక రంగాలపై దృష్టి

    ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్‌టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్‌ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్‌లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.

    ఇదీ చదవండి: యాప్స్‌.. మార్కెటింగ్ యంత్రాలా?

International

  • దక్షిణకొరియాలో  భారీ సైబర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. 1,20,000 సీసీ కెమెరాలు హ్యాక్ చేసి వాటి ద్వారా రహస్య సమాచారం సేకరిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్యారా ప్రజలు వ్యక్తిగత వీడియోలను నిందితులు సేకరించేవారని వాటిని అమ్మి పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించేవారని తెలిపారు.

    దక్షిణ కొరియాలో భారీ స్కామ్ బయిటపడింది. నివాస ప్రాంతాలతో పాటు పలు వ్యక్తిగత ప్రదేశాలలో భద్రత కోసం ఏర్పరుచుకున్న సీసీ కెమెరాలను సైబర్ ముఠా హ్యాక్ చేశారు. అనంతరం ఆ కెమెరాల ద్వారా బాధితుల వ్యక్తిగత వీడియోలను సేకరించి  ప్రైవేట్  వెబ్‌సైట్ లకు అమ్మేవారు. దీనికోసం నిందితులు, నివాస గృహాలు, ఆసుపత్రులు, లాడ్జ్ లు ఇతర ప్రాంతాలలో అమర్చిన సీసీ కెమెరాలనే టార్గెట్ చేసినట్లు  పోలీసులు తెలిపారు.

    కాగా ఈ ఘటనపై సౌత్ కొరియా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నిందితులని అదుపులోకి  తీసుకున్నామని వారిలో ఒకరు  63 వేల కెమెరాలను హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు. దాని ద్వారా 545 వ్యక్తిగత వీడియోలను సేకరించి వివిధ వెబ్‌సైట్  లకు అమ్మాడన్నారు. దాని ద్వారా 35 మిలియన్లు సంపాదించారని తెలిపారు. మరోక వ్యక్తి 70 వేల కెమెరాలను హ్యాక్ చేసి 648 ప్రైవేట్ వీడియోలను అమ్మినట్లు తెలిపారు. ఇలా చేయడం ద్వారా నిందితులిద్దరూ పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అరెస్టైన నలుగురికి ఎటువంటి పరిచయం లేదన్నారు.

    ప్రజల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసిన వెబ్‌సైట్ లపై నిఘా ఉంచామని త్వరలోనే దానిలోని కంటెంట్ తొలగిస్తామని పోలీసులు తెలిపారు. వాటిని గుర్తించడానికి  ఫారెన్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నామన్నారు. నిందితులు సీసీ కెమెరాలు హ్యాక్ చేసిన ప్రదేశాలలో వారి కెమెరాలు హ్యాక్ అయినట్లు సమాచారమిచ్చామని పోలీసులు  పేర్కొన్నారు. బాధితులకు కెమెరా హ్యాక్ కాకుండా ఏలా జాగ్రత్త పడాలి, పాస్ వర్డ్ ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై అవగాహాన కల్పించినట్లు పేర్కొన్నారు.

     

  • నిప్పుతో చెల‌గాటం ఆడొద్ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఏమరుపాటుగా ఉంటే క్షణంలో నిప్పు జీవితాల‌ను త‌ల‌క్రిందులు చేస్తుంది. అగ్గిరాజుకుంటే క‌లిగే న‌ష్టాన్ని ఊహించం చాలా క‌ష్టం. ఆస్తి న‌ష్ట‌మే కాదు ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. చివ‌ర‌కు బూడిద మాత్ర‌మే మిగులుతుంది. అందుకే పెద్దోళ్లు హెచ్చ‌రిస్తూ ఉంటారు.. అగ్నితో ఆట‌లు వ‌ద్ద‌ని. తాజా విష‌యానికి వ‌స్తే హాంగ్‌కాంగ్‌లో నిప్పు సృష్టించిన విల‌యం పెను విషాదాన్ని మిగిల్చింది. టై పొ టౌన్‌లోని వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ స‌ముదాయంలో న‌వంబ‌ర్ 26న‌ చెల‌రేగిన అగ్ని కీలలు ఇప్ప‌టివ‌ర‌కు 146 మందిని బ‌లితీసుకున్నాయి. 40 మంది ఆచూకీ ఇంకా తెలియ‌లేదు. మ‌రో 18 మంది ఆస్ప‌త్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

    1948 త‌ర్వాత హాంగ్‌కాంగ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్ర‌మాద‌మ‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ ప్ర‌మాదానికి గ‌ల‌ కారణాలు తెలుసుకునేందుకు హాంగ్‌కాంగ్ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మంట‌లు ఎలా అంటుకున్నాయ‌నే దాని గురించి అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ఇంటర్ డిపార్ట్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. నగర అవినీతి నిరోధక నిఘా సంస్థ అగ్నిప్రమాదానికి సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ముగ్గురిని పోలీసులు హ‌త్యా నేరం పోలీసులు అరెస్ట్ చేశారు.

    వెలుగులోకి వీడియో
    హాంగ్‌కాంగ్ అగ్నిప్ర‌మాదానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. కాల్చి పారేసిన సిగ‌రెట్ వ‌ల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. 'ఆర్టీ ఇండియా' షేర్ చేసిన ఈ వీడియోలో.. వాంగ్ ఫుక్ కోర్టు అపార్టుమెంట్ స‌ముదాయంలో మంటలు చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు భవనం బయటి గోడ దగ్గర ఒక కార్మికుడు పొగ తాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే అధికారికంగా హాంగ్‌కాంగ్ పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధార‌ణ‌కు రాలేదు. కాగా, అపార్ట్‌మెంట్‌ కిటికీలకు రక్షణగా బిగించిన స్టీరోఫోమ్‌ ఫ్రేమ్‌లు కూడా మంట‌ల తీవ్ర‌త పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌న్న వాద‌న‌లు కూడా విన్పిస్తున్నాయి.

    కొన‌సాగుతున్న గాలింపు
    వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఎనిమిది ట‌వ‌ర్ల‌లో ఏడు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. మూడు రోజుల త‌ర్వాత మంట‌లు అదుపులోకి వ‌చ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడికల్ స్టాప్‌, వలంటీర్లు అన్వేషణ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ద‌గ్ధ‌మైన ప్ర‌తి అపార్ట్‌మెంట్‌లోకి అగ్నిమాపక సిబ్బంది టార్చ్‌లైట్లు పట్టుకుని వెళ్లి మృతదేహాల కోసం వెతుకుతున్నారు. మంట‌ల ధాటికి అపార్ట్‌మెంట్ భ‌వ‌నాలు పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో వెతుకులాట‌కు ఎక్కువ స‌మ‌యంలో ప‌డుతోంద‌ని పోలీసులు తెలిపారు.

    కాలిపోయిన అపార్ట్‌మెంట్‌ల‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు సంబంధించిన ఫొటోలను పోలీసులు మీడియాకు విడుద‌ల చేశారు. మంట‌ల ధాటికి బూడిదగా మారిన వ‌స్తువులు, ధ్వంస‌మైన గోడ‌లు ఈ ఫొటోల్లో క‌నిపించాయి. విపత్తు బాధితుల గుర్తింపు యూనిట్ (DVIU)కు చెందిన వంద‌లాది మంది సిబ్బంది ఈ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. మ‌రోవైపు అగ్నిప్రమాదంతో చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి ఆదివారం హాంకాంగ్ అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. పుష్పగుచ్ఛాలు ఉంచి క‌న్నీటి నివాళి అర్పించారు.

    వాటికి ప్ర‌మాదం లేదు
    వాంగ్‌ ఫుక్‌ కోర్ట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌ను 1,984 ఫ్లాట్‌లతో 1983 సంవత్సరంలో నిర్మించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం వీటిల్లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని తెలుస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గురైన 8 అపార్ట్‌మెంట్ బ్లాక్‌లలో ఆరింటిని సర్వే చేశామని, వాటి మొత్తం నిర్మాణానికి "తక్షణ ప్రమాదం లేదు" అని హౌసింగ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

  • వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోతో ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడాడని.. అది హాట్‌హాట్‌గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. 

    వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్‌ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్‌ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే.. 

    గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్‌ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్‌స్పేస్‌ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

    ట్రంప్‌ ఎందుకు ప్రకటించారు
    ట్రంప్‌ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్‌ గ్రూపులు డ్రగ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్‌ ట్రాఫికింగ్‌తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్‌, పైలట్స్‌, డ్రగ్‌ డీలర్స్‌, హ్యూమన్‌ ట్రాఫికర్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు.  అమెరికా కరేబియన్‌ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ సహా) మోహరింపజేశారు.

    రూల్స్‌ ఇవిగో.. 
    ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా.. 

    • ఆర్టికల్‌ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.

    • ఆర్టికల్‌ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.

    • ఆర్టికల్‌ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.

    గతంలో.. 
    తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో యూరప్‌ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌-పాక్‌ నడుమ కూడా ఎయిరోస్పేస్‌ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.

    ప్రభావం.. 
    తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్‌ షెడ్యూల్స్‌ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్‌లైన్స్‌ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు. 

    గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు  చికాగో కన్వెన్షన్‌ రూల్స్‌ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్‌ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది. 

National

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోడీ  63వ  పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.  లండన్‌లో హై-ఎనర్జీ పార్టీతో తన 63వ పుట్టినరోజును జరుపుకున్నారు.  ప్రధానంగా వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన  వ్యాపారవేత్త విజయ్ మాల్యా  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మేఫెయిర్‌లోని మాడాక్స్ క్లబ్‌లో పుట్టినరోజు కేక్ కట్ చేయడం, డ్యాన్స్ చేయడం మరియు అతిథులతో  కలిసి ఆడిపాడిన వీడియోలను మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.ఇక్కడ ఒక్కో టేబుల్‌కు కనీసం 1,000 పౌండ్లు (సుమారు రూ. 1.18 లక్షలు) ఖర్చు  అవుతుందని అంచనా.

     అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన పుట్టినరోజు పాట నేపథ్యంలో "హ్యాపీ బర్త్‌డే, లలిత్. కింగ్ ఆఫ్ స్మైల్స్" అనేది మరో హైలైట్‌గా నిలిచింది.  అలాగే తన భాగస్వామి రీమా బౌరీకి ధన్యవాదాలు తెలుపుతూ, "ఈ పుట్టినరోజు కుటుంబం, స్నేహితులతో ఎంతో అందంగా గడిచింది. రీమా, నువ్వు అద్భుతమైన పార్టీ ఇచ్చావు" అని లలిత్ మోదీ పోస్ట్ చేయడం విశేషం. 

    ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

    310 మందికి పైగా దేశ, విదేశీ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో క్రికెటర్ క్రిస్ గేల్  కూడా ఒకరు. మోడీ ,మాల్యా ఇద్దరితో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.   మోడీ తన పోస్ట్‌లో, బ్యూటిఫుల్‌  ఈవినింగ్‌... ఈ వీడియో "ఇంటర్నెట్‌ను బద్దలు కొట్టవచ్చు" అని చమత్కరించాడు. కరోకే సెటప్ కోసం సంగీతకారుడు కార్ల్టన్ బ్రాగాంజాకు ధన్యవాదాలు తెలిపాడు.

     

    ఇదీ చదవండి: జడ్జి‘మెంటల్స్‌’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట

    కాగా మనీలాండరింగ్ మరియు FEMA ఉల్లంఘనలకు సంబంధించిన అనేక ED కేసుల్లో నిందితుడిగా ఉన్న మోడీ 2010లో లండన్‌కు పారిపోయాడు.  అలాగే భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి, లండన్‌కు చెక్కేశాడు మాల్యా.  

  • సోషల్‌ మీడియా వచ్చిన తరువాత  మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్‌’ అయిపోతాడు.  పెచ్చుమీరుతున్న ఆన్‌లైన్‌ ట్రోల్స్‌ గురించి  తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్‌ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్‌ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే..  కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన జంట  మాత్రం  తమను అవమానించిన ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.

    11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్‌కు చెందిన  ప్రేమ జంట రిషబ్,   సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే  నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి,  ఆన్‌లైన్‌లో   పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు.  

    రిషబ్‌ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో  సోనాలీ చాలా అందంగా కనిపించారు.  అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు.

    "బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని  ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు,  బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్‌ ఎగతాళి చేశారు. ఈ  ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్  30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్‌ను  కలర్-షేమింగ్‌ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన  ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.

    ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

    ట్రోలర్స్‌కు కొత్త జంట సమాధానం
    మామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది.  వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్‌ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు.  సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది.  కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే  నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్‌ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. 
     

  • ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని నొక్కిచెప్పింది. గాలి నాణ్యత కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండాలా అని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ని ప్రశ్నించింది.

    ఢిల్లీలో గాలి కాలుష్యంపై  సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత ఎంత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతుంటే  ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ను ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సుప్రీం కోర్టు చూస్తూ ఉండాలా అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఒక్కటే ఈ సమస్యకు కారణం కాదని అది కేవలం  ఇందులో  ఒక భాగమేనని తెలిపింది.

    జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు ఈ సమస్యపై చూస్తూ ఉండలేదు. "పంటవ్యర్థాల కాల్చివేత ఈ సమస్యకు కారణమైతే కోవిడ్-19 సమయంలో మనం ఆకాశంలోని నక్షత్రాలను చూడగలిగేవారిమా?  ఈ సమస్యను రాజకీయంగా చూడకూడదు. ఢిల్లీ వాతావరణ కాలుష్యం కేవలం పంట వ్యర్థాల వల్ల ఏర్పడింది కాదు. దీనిని నిర్మూలించడానికి మీరు తీసుకున్న చర్యలేంటో చూపండి". అని చీఫ్ జస్టిస్  ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ని ప్రశ్నించారు.

    ఈ సమస్యను పరిష్కరించే అంశం కోర్టుల పరిధిలోనిది కాదని నిపుణులతో కూడిన కమిటీ  వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపారు. కోర్టులు ఈ సమస్యలను రూపుమాపవు కాని దానికి కావాల్సిన వేదికను ఏర్పాటు చేయగలవు. అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గాలి కాలుష్యాన్ని పరిష్కరించడానికి స్పష్టమైన సమయాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా  పేర్కొంది.

     

  • ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి తెలియంది కాదు.. మనం కొనుగోలు చేసిన వాహనం ధరను కూడా మించిపోయి మరీ ఫ్యాన్సీ నంబర్లు వేలంలో మెరుస్తూ ఉంటాయి.  ఒక ఫ్యాన్సీ నెంబర్‌ కోసం వేలు, లక్షలు దాటి కోట్లు పెట్టారంటే ఆ నంబర్లకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.  ఇదే జరిగింది హర్యానా రాష్ట్రంలో. అయితే ఇది జరిగి వారం రోజులు అవుతుంది. కానీ నంబర్‌ను వేలంలో పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆ నంబర్‌ మళ్లీ ఆక్షన్‌కు వచ్చింది. ఇంతకీ ఆ నంబర్‌ ఏంటి.. ఆ కధేంటి అనేది తెలుసుకుందాం

    భారత్‌లోనే అత్యంత ఖరీదైన నంబర్‌ ప్లేట్‌,..
    HR88B8888- ఇదీ నెంబర్‌. ఇది కచ్చితంగా ఫ్యాన్సీ నంబరే. హెచ్‌ఆర్‌ 88 దగ్గర్నుంచీ ఆపై వచ్చే నంబర్‌ కూడా మొత్తం 8888గా ఉంది. దీని కోసం సుధీర్‌ కుమార్‌ అనే వ్యక్తి పోటీ పడ్డాడు. ఆ నంబర్‌ వేలంలో రూ ఒక కోటి 17 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ నంబర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సుధీర్‌ చెల్లించలేకపోయాడు. 

    ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న సుధీర్‌.. రెండు రోజుల బిడ్డింగ్‌ తర్వాత ఆ నంబర్‌ను భారీ ధరకు పాడేశాడు.  ఇది భారత్‌లోనే అత్యంత ఖరీదైన నంబర్‌ ప్లేట్‌గా రికార్డు కూడా సృష్టించింది.  కానీ ఆ మొత్తాన్ని చెల్లించే క్రమంలో తాను సాంకేతిక సమస్య తలెత్తిందని, శని, ఆదివారాల్లో రెండుసార్లు చేసిన యత్నం విఫలమైందన్నాడు.  ఆ కారణం చేత ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయానన్నాడు. మరొకవైపు అంత పెద్ద మొత్తాన్ని నంబర్‌ ప్లేట్‌కు పెట్టడంపై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారన్నాడు. సోమవారం సాయంత్రానికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని సుధీర్‌ తెలిపాడు. 

    హర్యానా నంబర్‌ ప్లేట్ల వేలం ఇలా..
     ఫ్యాన్సీ నంబర్లు, వీఐపీ నంబర్ల వేలాన్ని వారానికి ఒకసారి నిర్వహిస్తుంది హర్యానా ఆర్టీవో. ప్రతీ బుధవారం ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం ఐదుగంటల వరకూ ఈ వేలాన్ని ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహిస్తారు. fancy.parivahan.gov.in పోర్టల్‌ ద్వారా అధికారికంగా ఈ వేలాన్ని  ఏర్పాటు చేస్తారు. 

    ఈ క్రమంలోనే HR88B8888 నంబర్‌కు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయని ఆర్టీవో అధికారులు తెలిపారు. మొత్తం 45 దరఖాస్తుల ఈ నంబర్‌ కోసం  వచ్చాయన్నారు. అయితే ఒకసారి వేలంలో పాడి ఆ నంబర్‌కు నిర్ణీత సమయంలో నగదు సమర్పించకపోతే ప్రతీ నిమిషానికి రూ. 50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందట. ఈ క్రమంలో సుధీర్‌కు ఇచ్చిన సమయం దాదాపు అయిపోవడంతో ఆ నంబర్‌ తిరిగి వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. నేటి( సోమవారం) సాయంత్రం ఐదు గంటల లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే ఆ నంబర్‌ను సుధీర్‌ చేజిక్కించుకుంటారు. లేకపోతే మళ్లీ ఆ నంబర్‌ తిరిగి వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. 

  • నాగరిక ప్రపంచంలో ప్రేమకు చోటు లేకుండా పోతోంది. కుల దురహంకారం మట్టికాళ్ల మహారాక్షసిలావిజృంభిస్తోంది. మనసుకు నచ్చినవాడిని ప్రేమించడమే తరతరాలుగా ‘ఆమె’ పాలిట శాపమైపోతోంది.మనసిచ్చినవాడిని మను వాడాలనుకున్న అమ్మాయి కలల్ని సొంత కుటుంబ సభ్యులే కాల రాస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురి కంట తడి పెట్టిస్తోంది.  

    ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చినపుడు, అబ్బాయి తల్లిదండ్రులు స్వీకరించిన సులువుగా అమ్మాయి తల్లిదండ్రులు ఒక జంట ప్రేమను ఎందుకు అంగీకరించకలేక పోతున్నారు. అమ్మాయి ప్రేమిస్తే.. అది ధిక్కారమే అన్నట్టు ఆగ్రహావేశాలతో ఎందుకు రగిలిపోతున్నారు.. ఎందుకంటే అనాదికాలంగా పాతుకుపోయిన ఆమె మన సొత్తు..మనం చెప్పినట్టే వినాలి అనే భావన. అమ్మాయి మన స్వాధీనంలోనే ఉండాలనే ఆధిపత్య ధోరణి. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకొని, వాడితో పిల్లల్ని కంటుందా? అనే అత్యంత అమానవీయమైన  భావజాలం వారిలో తీరని అసంతృప్తిని రగిలిస్తోంది.

    అమ్మాయి ప్రేమే సమస్య
    తమ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తే ఎందుకంత అగ్గిమీద గుగ్గిలం అవుతారు. కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకోవాల్సిన సమస్యని హత్యల దాకా ఎందుకు తీసుకెళతారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆధిపత్య, అహంకార పూరిత ధోరణి. ఆడవారి స్వేచ్ఛను, ప్రేమను అంగీకరించలేని అసహనం. వివక్ష. బాల్యంలో తండ్రి ఇంట​, యవ్వనంలో భర్త ఇంట, ముసలి తనంలో  కొడుకు ఇంట ఆడది బతకాలి. మారు మాట్లాడినా, ఎదురు తిరిగినా అంతే సంగతులు, పరువు ప్రతిష్ట పేరుతో ఇంట్లోని మగవాళ్ల ఆగ్రహానికి బలికావాల్సిందే. ఇదే తరతరాలుగా సాగుతున్న తంతు. 

    మహిళల్ని, లేదా యువతులను పితృస్వామ్య అణచివేత, లైంగిక,శారీరక, మానసిక వేధింపులతోనే కాదు వారికి నచ్చినవారిని హతమార్చి, ఇలా కూడా అతి దారుణంగా చంపేయొచ్చు. వారిని మానసికంగా దెబ్బతీయచ్చు. తండ్రి , సోదరులు ఇలా ఎవరైనా సరే పరువు హత్యల ద్వారా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ‘ఆమెను’ హత్య చేయవచ్చు. అపుడే వారి అహం చల్లారుతుంది. ఈ అహంభావమే, దౌర్జన్యమే ఇప్పటికీ రాజ్య మేలుతోంది. ఆయా కుంటుంబాలలోని మహిళలు ఇలాంటి హత్యలను సమర్థించడం సాయపడుతూ ఉండటం దురదృష్టకరం

    ఇటీవల జరిగిన సంచలన హత్యలు
    2016 మార్చి 13న లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగిన శంకర్ పరువు హత్య సంచలనం రేపింది. తమ కుమార్తె కౌసల్యం  శంకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుందన అక్కసుతో, కౌసల్య తండ్రి చిన్నస్వామితన బంధువులతో కలిసి పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు.ఈ కేసులో ఏమైంది... నేరస్తులకు దక్కిన పరువు ఉంటి? నలుగురిలోనూ హంతకులనే పేర్లు, జైలు జీవితం అంతేగా. 

    ప్రణయ్‌ హత్యతో పరువు నిలబడిందా?  
    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  2018, సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్‌ది మరో దారుణ హత్య. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న  కారణంగా, పగపెంచుకుని, కిరాయిహంతకుల సాయంతో స్వయంగా అమృత తండ్రి మారుతీ రావు చంపించాడు.

    ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు దూరం, మరోవైపు అల్లుడి హత్యతో ఆమె జీవితంలో నిప్పులు పోసానన్న పశ్చాత్తాపం ఊపిరి సలప నీయలేదు. దీనికి తోడు పోలీసు కేసులు విచారణ,  చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు. 

    నానమ్మ కోసం హత్య 
    2025 జనవరిలో  సూర్యాపేటలో భార్గవి, కృష్ణల ప్రేమను పరువు హత్య చేశారు. తమ కుమార్తెను భార్గవిని తన స్నేహితుడు కృష్ణ కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు దీంతో స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా మరి కొంత మందితో కలిసి కృష్ణను నమ్మించి హత్య చేశారు.  ఈ కేసులో నానమ్మ  పాత్ర పెద్ద చర్చు దారితీసింది. మొదటినుంచి భార్గవి ప్రేమను వ్యతిరేకించి నాన్నమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొట్టి మరీ ఈ హత్యకు వుసి గొల్పిందని పోలీసులు  నిర్ధారించారు.

    ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని భావించి   ప్రేమికుడిని హత్య చేశారు.  అదేవిధంగా  యాదాద్రి జిల్లాలో లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, నరేష్‌ ప్రేమించు కున్నారు. కేవలం కుల అహంకారంతోనే స్వాతి తల్లిదండ్రులు నరేష్‌ను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  తాజాగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన యువకుడి హత్య. ఆంచల్ మామిద్వార్‌కు స్వయంగా తల్లిదండ్రులే పుట్టెడుదుఃఖాన్ని మిగిల్చారు. అంచల్ ప్రేమికుడు సాక్షమ్ టేట్ (25)ని దారుణంగా కాల్చి చంపారు.  ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. వెలుగులోకి రాని కౄరహత్యలు ఎన్నో...మరెన్నో..! 

    పగ కాదు, ప్రేమను పంచుదాం
    కన్నబిడ్డల కంటే వారి సంక్షేమం కంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. జీవితాంతా కష్టపడి  ప్రాణానికి ‍ప్రాణంగా పెంచుతారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మూర్ఖంగా మారిపోతున్నారు. అమ్మాయి ప్రేమను అస్సలు ప్రేమను జీర్ణించుకోలేక పగతో రగిలి పోతున్నారు. కుటుంబ పరువు గంగలో కలిసిపోయిందంటూ గగ్గోలు పెడతారు. ఫలితంగా దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరికి కన్నబిడ్డ గొంతుకు ఉరి బిగించేందుకు కూడా వెనుకాడటం లేదు.

    ఏమిటీ పరిష్కారం
    ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ఉండాల్సింది ప్రేమ, అభిమానం, పరస్పరం నమ్మకం. ప్రేమకు, ప్రేమ వివాహాలకు కులాలు, మతాలు అడ్డుగోడలు కాకూడదు. ఆర్థిక స్థోమత అస్సలు సమస్యే కాదు. కానీ తక్కువ, ఎక్కువ  అనే లేని పోని విద్వేషాలతో ప్రేమ వివాహాలను పెద్దలు అడ్డుకుంటున్నారు. కుటుంబ పరువు, సమాజంలో నలుగురూ ఏమనుకుంటారో అనే లేని పోని ఆందోళన వారిని భయపెడుతోంది. ఇదే ప్రేమికులనూ భయపెడుతోంది. అందుకే తమ ప్రేమ బతకని చోట తామూ బతకలేమని ప్రేమికులు ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతోంటూ, మరోవైపు ప్రేమకోసం ప్రేమగా, ధైర్యంగా కలిసి బతుకుదామను కున్న వారిని స్వయంగా కుటుంబ సభ్యులే హత్య చేస్తుండటం బాధాకరం.

    రాజ్యాంగం ప్రకారం  మేజర్‌ అయిన ప్రతీ  యువతీ యవకుడికీ తమకు నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు  పాల్పడిని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం, చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. చట్టాలు, ప్రేమ వివాహాలు, పరువుహత్యలు, పర్యవసానాలపై పౌరుల్లో అవగాహన కల్పించాలి. "మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును." అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు కుల, మత బేధం లేని సమాజం ఇపుడు మనకు కావాలి.  ఇకనైనా పరువు పేరుతో జరుగుతున్న మారణకాండ ఆగాలని కోరుకుందాం. పరువు, ప్రతీకారంకోసం నిండు నూరేళ్ల ప్రేమను కోల్పోయిన బాధితురాళ్ల  వేదన సాక్షిగా నిజమైన ప్రేమలను గెలిపించుకుందాం.

  • ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బాధితురాలి తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. ఆశారాం బాపుకు అనారోగ్య కారణాలతో  అక్డోబర్ లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    వివాదాస్పద మత గురువు ఆశారం బాపు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు వయసు రీత్యా  తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని కనుక మెరుగైన చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆశారం బాపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన వయస్సు 86 సంవత్సరాలని వయస్సు రీత్యా వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వీటిని విచారించిన కోర్టు ఆయనకు అక్డోబర్ లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

    అయితే బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం ఆశారాం బాపు ఆరోగ్యంగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆశారం బాపు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన అహ్మదాబాద్, ఇండోర్, జోధ్‌పూర్ నగరాలు ప్రయాణం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అలా దేశవ్యాప్త పర్యటనలు చేయలేరని పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆశారం బాపుకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు.

    ఆశారం బాపుపై కేసు ఏమిటి

    2013 ఆగస్టు 15న ఆశారం బాపు  దగ్గర్లోని తన ఆశ్రమంలో తనపై ఆత్యాచారం చేశారని 16 ఏళ్ల బాలిక దీంతో ఆశారం బాపుని అరెస్టు చేసి జోద్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. రెండు నెలల తరువాత గుజరాత్ లోని సూరత్ ఆశ్రమంలో  ఆశారాం బాపు తన కుమారుడు తమపై అత్యాచారం చేసారని  ఇద్దరు అక్కాచెల్లెల్లు కేసు నమోదు చేశారు. వీటిపై విచారణ జరిపిన జోద్ పూర్ కోర్టు 2018 ఏప్రిల్ 25న ఆశారాం బాపుకు జీవిత ఖైధు విధించింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత తొలిసారిగా గత అక్టోబర్ లో ఆశారాం బాపుకు తొలిసారిగా  ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్ వచ్చింది. 

  • న్యూఢిల్లీ:  డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మోసాల వల్ల ఇప్పటివరకు భారీ నష్టం జరిగినట్లు గుర్తించిన సుప్రీంకోర్టు.. సీబీఐ విచారణకు రాష్ట్రాలు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. డిజిటల్‌ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ భాగంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బగ్చి నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును స్వయంగా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్‌గా(సుమోటో పీల్‌) తీసుకుని విచారించింది. 

    డిజిటల్‌ అరెస్టులో భాగంగా కొంతమంది పోలీసు, కోర్టు అధికారులుగా నటిస్తూ, నకిలీ సుప్రీం కోర్టు ఆదేశాలు చూపించి, ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. దాంతో పలువురు డిజిటల్‌ అరెస్టు బారిన పడి కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూస్తున్నారు. 

    2025 చివరి త్రైమాసికంలో డిజిటల్ అరెస్టు మోసాలు విపరీతంగా పెరగడంతో, కోర్టు జోక్యం చేసుకుంది. ఈ మోసాలు రాష్ట్రాలవారీగా కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నందున, సీబీఐకి కేంద్రీకృత విచారణ బాధ్యత అప్పగించాలని సుప్రీం నిర్ణయించింది. దీనిలో భాగంగా డిజిటల్‌ అరెస్టు మోసాలపై రాష్ట్రాలు సీబీఐ విచారణకు సహకరించాలని పేర్కొంది. 

    అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వద్ద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలను సీబీఐకి అందించాలని,  ఫలితంగా సదర సంస్థ పూర్తి  స్వేచ్ఛతో విచారణ చేయడానికి ఆస్కారం దొరుకుతుందని తెలిపింది. -ఇతర సైబర్ మోసాలు (ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లు తరహా లాంటి కేసులు ఉన్నా మొదట ప్రాధాన్యం డిజిటల్ అరెస్టు కేసులకు ఇవ్వాలని ఆదేశించింది. 

    ఇంటర్‌పోల్, సోషల్ మీడియా కంపెనీలు, ఆర్బీఐ వంటి సంస్థల సహకారంతో విచారణ జరగాలని కోర్టు సూచించింది. ప్రజల నమ్మకాన్ని కాపాడటానికి, డిజిటల్‌ అరెస్టుల ద్వారా డబ్బు వసూలు చేసే మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

    డిజిటల్ అరెస్టుల కేసుల్లో సీబీఐ దర్యాప్తు

    ఇదీ చదవండి: ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు.. పతంజలికి షాక్‌

  • న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ సభలో 'డ్రామా'కు కాకుండా, 'డెలివరీ' (పని)కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎదురుదాడి చేశారు.

    పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ తన ప్రసంగంలో.. ప్రతిపక్షాలు తమ పాత వ్యూహాలను మార్చుకోవాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ‘డ్రామా కాదు, డెలివరీ ఉండాలి.. నినాదాలు కాదు, విధానాలకు ప్రాధాన్యత నివ్వాలి’ అని అన్నారు. తొలిసారిగా ఎన్నికైన ఎంపీలకు మాట్లాడే అవకాశం రావడం లేదని, డ్రామా చేయడానికి పార్లమెంట్ సరైన వేదిక కాదని ఆయన ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ.. ఢిల్లీలో వాయు కాలుష్యం, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) తదితర క్లిష్టమైన సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తడం నాటకం కాదని స్పష్టం చేశారు.

    ఎన్నికల పరిస్థితులు, ఎస్‌ఐఆర్‌, కాలుష్యం మొదలైనవి చాలా పెద్ద సమస్యలని, వాటిపై చర్చిద్దామని ప్రియాంకా గాంధీ అన్నారు. పార్లమెంటు ఉన్నది దేనికి?.. నాటకాలకు కాదు. సమస్యలపై మాట్లాడటం, లేవనెత్తడం నాటకం కాదని ఆమె అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చలకు అనుమతించడం లేదంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాగా ఈ శీతాకాల సమావేశాలు కేవలం 15 రోజులు మాత్రమే జరగడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కావాలనే సమావేశాలను తగ్గించి, శాసనసభ చర్చలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్‌ సమస్యలు, బీఎల్‌ఓ ఆత్మహత్యలు, ఢిల్లీ ఉగ్ర దాడి, జాతీయ భద్రతా అంశాలపై చర్చలకు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

    ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్‌ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు
     

Cartoon