Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (CCT)కు కేంద్ర హోంశాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది.  సుమారు 27 ఏళ్లుగా ఛారిటబుల్‌ ట్రస్టు కింద బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు ఐ బ్యాంకు కూడా చిరంజీవి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా  చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ (Chiranjeevi Charitable Trust)ను ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదుకు కేంద్ర హోంశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇకనుంచి విదేశీ విరాళాలు తీసుకునే వెసులుబాటును ట్రస్టుకు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

    కొద్దిరోజుల క్రితమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి తీసుకోవాలని నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో  చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి కోసం కేంద్రాన్ని  కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఆమోద ముద్రవేసినట్టు తెలుస్తోంది.

  • సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.

    ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు.

  • పైరసీ.. పైరసీ.. పైరసీ.. దీని గురించి చాలామందికి తెలుసు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెయిన్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం 'ఐ బొమ్మ' రవి అరెస్ట్. అతడు చేసింది తప్పా ఒప్పా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతకీ పైరసీ అంటే ఏంటి? ఏళ్లకు ఏళ్లుగా వైరస్‌లా పెరిగిపోతున్నా సరే దీన్ని పోలీసులు ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?

    పైరసీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం అంటే 1990-2000ల కాలంలో ఇది మొదలైంది. మొదట్లో ఫ్లాపీ డిస్క్‌ల్లో సమాచారాన్ని కాపీ చేసుకునేవారు. తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. వీటిల్లో వినేందుకు పాటలు కాపీ చేసేవారు. థియేటర్ ప్రింట్ రూపంలో సినిమాలని కూడా కాపీ చేసి ఇళ్లలో చూసుకునేవారు. 2000 తర్వాత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. 2010 వచ్చేసరికి మెమొరీ కార్డ్స్ వచ్చాయి. 2020 వచ్చేసరికి స్మార్ట్ ఫోన్, పెన్ డ్రైవ్ ఇలా చాలా సదుపాయాలు వచ్చేశాయి. ప్రస్తుతానికైతే పైన చెప్పిన వాటి కంటే ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి సినిమాని ఉచితంగా చూసేయొచ్చు. కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే.

    పైరసీ చూడటం కరెక్టేనా అంటే అస్సలు కాదు. మొబైల్‌లో ఉచితంగా చూపిస్తున్నాడు కదా అని వీటిని చాలామంది చూస్తున్నారు. కానీ తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు వాడికి అప్పగించేస్తున్నారు! ఎలా అంటే? మీ స్మార్ట్‌ఫోన్‌లో సదరు పైరసీ సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు, అప్పటికే మొబైల్‌లో మీ మొయిల్ ఐడీతో లాగిన్ అయ్యింటారు కదా. హ్యాకర్లు కావొచ్చు, సైట్ నిర్వహకులు కావొచ్చు.. మీ వివరాలని మీకు తెలియకుండానే స్టోర్ చేసుకుంటారు. మరి వాటితో ఏం చేస్తారు అంటే చాలా చేయొచ్చు. డార్క్ వెబ్‌లో మీ వివరాలని ఎవరికైనా అమ్మేస్తే.. దానితో వాళ్లు ఏమైనా చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ పేరు సహా కొన్ని వివరాలని వాళ్లు చెబుతుంటారు. వాళ్లకు మీ గురించి ఎలా తెలిసిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే మీకు ఇప్పుడు చెప్పిన విషయం కచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పైరసీ సైట్లని గానీ, అనుమతి లేని లింక్స్ గానీ ఓపెన్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త.

    పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అప్పట్లో థియేటర్‌కి వెళ్లి రహస్యంగా మొబైల్ ఫోన్‌తో లేదంటే కెమెరాతో రికార్డ్ చేసేవారు. తర్వాత దాన్ని డీవీడీలు లేదా మెమొరీ కార్డ్‌లో కాపీ చేసి పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఎంతలా అంటే సర్వర్లు హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్స్ డౌన్‌లోడ్ చేసేంతలా! 'ఐ బొమ్మ' రవి కేసునే తీసుకుందాం. సినిమా రిలీజ్‌కి ముందే వాటిని లోడ్ చేసి ఉంచిన సర్వర్లని హ్యాక్ చేసి మరీ సినిమాలని తస్కరించేవాడు. ముందే పైరసీ సైట్లలో పెడితే ఎక్కడ అనుమానం వస్తుందోనని.. సరిగ్గా సినిమా విడుదల రోజు.. సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు. మన దగ్గరే ఉంటే దొరికిపోతాడు కాబట్టి నైజీరియన్ దేశాల్లో ఉంటూ ఇదంతా చేసేవాడు.

    నైజీరియన్ దేశాలతో పాటు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ సైబర్‌ మాయగాళ్లు తిష్టవేసి.. పైరసీ సైట్లని నడుపుతున్నారు. పైరసీలో మనం సినిమా ఫ్రీగా చూస్తాం కదా వాడికి ఎలా డబ్బులొస్తాయి అని మీరు అనుకోవచ్చు. సినిమా ప్లే అవుతున్నప్పుడు పైనో దిగువనో ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి. వాటి నిర్వహకులు సదరు పైరసీ చేసిన వాడికి డబ్బులిస్తుంటారు. కొందరు సినిమా చూసి వదిలేస్తారు. మరికొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

    పైరసీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ 2023లో రూ.22,400 కోట్లు నష్టపోయింది. అందులో థియేటర్లు కోల్పోయింది రూ.13,700 కోట్లు కాగా ఓటీటీల వాటా రూ.8,700 కోట్లు. ఆ ఏడాది మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆదాయంతో పోలిస్తే పైరసీ వల్ల కలిగిన నష్టం అందులో నాలుగో వంతుగా తేలింది. పైరసీ వల్ల గతేడాది ఒక్క టాలీవుడ్‌ రూ.3,700 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. గత పదేళ్లలో తీసుకుంటే ఆ నష్టం రూ.20 వేల కోట్లకు పైమాటే!

    ఇంతా జరుగుతున్నా పోలీసులు ఎందుకు పైరసీ సైట్లని ఆపలేకపోతున్నారు అని అనుకోవచ్చు. ఒకదాన్ని బ్లాక్‌ చేస్తే, రావణాసురుడి తలలా చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా వెబ్‌సైట్లు తెలుగు సినిమాలని అక్రమంగా చూసేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో పోలీసులని.. సదరు పైరసీ చేస్తున్నవారిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం పైరసీ చేశారని తేలితే.. మూడేళ్ల జైలుశిక్ష, మూడు లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో అయిదు శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా సరే పైరసీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది.

  • వైట్ అండ్ వైట్ డ్రస్‌లో రకుల్ హొయలు

    చీరలో మరింత అందంగా అనసూయ

    నిహారిక గోవా ట్రిప్.. ఎర్రచీరలో గ్లామర్‌తో

    కెన్యా ట్రిప్‌లో హీరోయిన్ చాందినీ చౌదరి

    నెమలి పింఛంతో నిధి అగర్వాల్ క్యూట్‌నెస్

    కొడైకెనాల్‪‌లో చిల్ అవుతున్న మానస చౌదరి

  • 'జాతిరత్నాలు' సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో మరో హిట్ అందుకున్నాడు. దీని తర్వాత మరో మూవీ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే చిత్రం చేస్తున్నాడు. రాబోయే సంక్రాంతికి దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

    ఇ‍ప్పటికే దసరా, దీపావళికి ప్రమోషనల్ వీడియోలు వదిలిన నవీన్.. ఇప్పుడు తొలి పాటని రిలీజ్ చేశారు. 'భీమవరం బల్మా' అంటూ సాగే ఈ గీతాన్ని.. భీమవరంలోనే ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్‌లోనే గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. పాట కలర్‌ఫుల్‌గా ఉంది. నవీన్-మీనాక్షి కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి మారి దర్శకుడు.

    (ఇదీ చదవండి: 'చికిరి చికిరి' పాట లొకేషన్ ఎక్కడో తెలుసా?)

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి కొన్నిరోజుల క్రితం 'చికిరి చికిరి' అని సాగే తొలి పాట రిలీజైంది. వెంటనే సంగీత ప్రియులకు నచ్చేసింది. అప్పటినుంచి రీల్స్, షార్ట్స్.. ఇలా ప్రతిచోట ఈ పాట వీడియోలే కనిపించాయి. తాజాగా ఈ గీతం అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి చిన్న సర్‌ప్రైజ్ వచ్చింది. మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

    ఈ వీడియోలో టీమ్ అంతా దాదాపు 45 నిమిషాల పాటు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కొండపైన ఉన్న లొకేషన్‌కి చేరుకున్నారు. రామ్ చరణ్ కూడా కొండ ఎక్కుతూ అలసిపోయి ఆగుతూ ఎక్కడం ఇందులో మీరు చూడొచ్చు. చివరలో 'చిరుత' గురించి దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాట్లాడుకోవడం ఆసక్తికరంగా అనిపించింది.

    అసలు విషయానికొస్తే.. 'చికిరి' పాటని నిజమైన లొకేషన్‌లో తీశారు. మహారాష్ట్రలోని పుణెలో సవల్య ఘాట్ (Savlya Ghat) అనే ప్రాంతం ఉంది. ఎత్తయిన కొండలు, చుట్టూ పచ్చదనంతో కనువిందుగా ఉంటుంది. అక్కడే కొండపైన 'చికిరి చికిరి' పాట షూటింగ్ చేశారు. దీనిపై ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదు. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. మూవీ టీమ్ అలానే వెళ్లింది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబుతోపాటు టీమ్ అంతా వెళ్లడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.

    (ఇదీ చదవండి: నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు.. కుటుంబ వివాదంపై మంచు లక్ష‍్మీ)

  • మరో వీకెండ్ వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ కాగా.. మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు అనగా శుక్రవారం కూడా పలు డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వాటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం శుక్రవారం ఒక్కరోజే 20 వరకు మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటిలో చూడదగ్గవి చాలానే ఉన్నాయి కూడా.

    స్ట్రేంజర్ థింగ్స్, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి లాంటి సినిమాలు ఇప్పటికే గురువారం స్ట్రీమింగ్‌లోకి రాగా.. శుక్రవారం నాడు మాస్ జాతర, ఆర్యన్, ప్రేమిస్తున్నా, శశివదనే, ఆన్ పావమ్ పొల్లతత్తు తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?

    ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 28)

    ఆహా

    • ప్రేమిస్తున్నా - తెలుగు సినిమా

    • క్రిస్టినా కథిర్‌వేలన్ - తమిళ మూవీ

    సన్ నెక్స్ట్

    • శశివదనే- తెలుగు సినిమా

    నెట్‌ఫ్లిక్స్

    • మాస్ జాతర - తెలుగు సినిమా

    • ఆర్యన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

    • లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ - మాండరిన్ సినిమా

    • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 - తెలుగు డబ్బిగ్ సిరీస్ (ప్రస్తుతం స్ట్రీమింగ్)

    • సన్నీసంస్కారి కీ తులసి కుమారి - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

    హాట్‌స్టార్

    • ఆన్ పావమ్ పొల్లతత్తు - తెలుగు డబ్బింగ్ చిత్రం

    • బార్న్ హంగ్రీ - ఇంగ్లీష్ మూవీ

    జీ5

    • ద పెట్ డిటెక్టివ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

    • రేగాయ్ - తమిళ సిరీస్

    • రక్తబీజ్ - బెంగాలీ మూవీ

    లయన్స్ గేట్ ప్లే

    • ప్రీమిటివ్ వార్ - తెలుగు డబ్బింగ్ సినిమా

    • రష్ - ఇంగ్లీష్ మూవీ

    బుక్ మై షో

    • 40 ఏకర్స్ - ఇంగ్లీష్ సినిమా

    • ఎలివేషన్ - ఇంగ్లీష్ మూవీ

    • గ్యాబీ డాల్ హౌస్ - ఇంగ్లీష్ సినిమా

    • హాచీ: ఏ డాగ్స్ టేల్ - ఇంగ్లీష్ మూవీ

    • విన్నర్ - ఇంగ్లీష్ సినిమా

    అమెజాన్ ప్రైమ్

    • కాంతార 1 - హిందీ డబ్బింగ్ వెర్షన్

    • షీ రైడ్స్ షాట్ గన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • కొన్నాళ్ల ముందు వరకు మంచు కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు భౌతిక దాడులు చేసుకోవడంతో పాటు పోలీస్ కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ప్రస్తుతానికి అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష‍్మీ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణమేంటి? కుటుంబంలో గొడవలు కారణంగా తను ఎంత బాధపడ్డాననేది ఇప్పుడు లక్ష‍్మీనే స్వయంగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుటుంబ వివాదంపై స్పందించింది.

    (ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి)

    'దేవుడు కనిపించి వరం కోరుకోమంటే.. నా కుటుంబం అంతా మళ్లీ కలిసిపోవాలని అడుగుతాను. అన్ని ఫ్యామిలీస్‌లోనూ గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎన్ని జరిగినా సరే చివరకు అందరూ ఒక్కటైపోవాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే.. జీవితాంతం కలవకూడదు అని అనుకుంటారు. కానీ చివరకు మనకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. కుటుంబంతో కలిసి ఉండేందుకు ఎన్ని పోరాటాలైనా చేయాలి. అంతేకాని దూరాన్ని పెంచుకోకూడదు.'

    'ముంబైలో నేను ఉంటున్నాను. అయితే ఇక్కడి విషయాలు తెలిసినా బాధపడలేదని కొందరు వార్తలు రాశారు. నేను ఎంత బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. వివాదం గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి ఇష్టమొచ్చినట్లు నా గురించి రాసేశారు. వాటిపై స్పందించాలని అనుకోలేదు. ఇది నా పర్సనల్ మేటర్. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూసిన తర్వాత షాక్ అయ్యాను. మా ఫ్యామిలీ గురించి నేను ఏమనుకుంటున్నానో, ఎంత బాధపడ్డానో బయటకు చెప్పాల్సిన అవసరం లేదనిపించింది' అని మంచు లక్ష‍్మీ చెప్పుకొచ్చింది. 

    (ఇదీ చదవండి: ధర్మేంద్ర మరణం.. తొలిసారి స్పందించిన భార్య హేమమాలిని)

  • బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర.. మూడు రోజుల క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. కొన్నాళ్ల క్రితమే చనిపోయారనే రూమర్స్ వచ్చాయి. కానీ కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. ఈ సోమవారం ధర్మేంద్ర చనిపోయిన తర్వాత నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తొలిసారి భర్త మరణంపై హేమమాలిని స్పందించారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో తన బాధని పంచుకున్నారు.

    'ధరమ్ జీ. ప్రేమించే భర్త, నా కూతుళ్లకు ఆరాధ్యుడైన తండ్రి, స్నేహితుడు, గైడ్, కవి, ఎప్పుడైనా వెళ్లగలిగే చనువున్న వ్యక్తి. చెప్పాలంటే ఆయనే నా సర్వస్వం. నా మంచి చెడుల్లో తోడున్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులపై కూడా ఎంతో ప్రేమ చూపించారు. ఓ సెలబ్రిటీగా ప్రతిభ, మానవత్వం, పాపులారిటీ లాంటి వాటితో దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఘనతలు చిరస్థాయిగా నిలిచిపోతాయి'

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    'నా వ్యక్తిగత నష్టం వర్ణించలేనిది. ఏర్పడిన శూన్యత జీవితాంతం కొనసాగుతుంది. ఇన్నేళ్ల పాటు కలిసున్న తర్వాత ఆయనని గుర్తుపెట్టుకునేందుకు లెక్కలేనన్ని జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి' అని హేమమాలిని రాసుకొచ్చాడు. భర్తని మనసారా గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిపోయారు.

    ధర్మేంద్రకు హేమామాలిని రెండో భార్య. వీళ్లకు ఈషా డియోల్, అహనా డియోల్ అని కూతుళ్లు ఉన్నారు. అంతకు ముందు ధర్మేంద్రకు పెళ్లి కాగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్. వీళ్లిద్దరూ తండ్రిలానే హిందీలో నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

    (ఇదీ చదవండి: కొడుకు సమక్షంలో సీఎస్కే క్రికెటర్ తో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి)

  • యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది.  ఈ క్రమంలో ఓ మెలోడీ గీతాన్ని వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న వదిలారు. ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది.

    కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్‌ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచి తెహ్లాన్ ఎంతో అందంగా కనిపించారు. నిఖిల్‌ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌‌తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చినట్టు అయింది.

    ‘తేనెల వానలా’ పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ఆ సంస్థ యూట్యూబ్ ఛానెల్‌లోనే ఈ పాట ప్రసారం అవుతోంది. వీహ అద్భుతమైన గానం, హృదయాన్ని హత్తుకునేలా చరణ్ అర్జున్ ఇచ్చి బాణీ, సాహిత్యం ఈ పాటను అందరికీ మరింత చేరువ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

  • ప్రముఖ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్‌తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్‌గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్‪‌లోనూ చేసింది. తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.

    (ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌)

    అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్‌లానే క్రికెట్‌ని కెరీర్‌లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్‌లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.

    ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

  • టైటిల్‌: ఆంధ్రకింగ్‌ తాలుకా
    నటీనటులు: రామ్‌ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేశ్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య తదితరులు
    నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్
    నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవి  శంకర్‌ 
    దర్శకత్వం: మహేశ్‌బాబు పి.
    సంగీతం: వివేక్‌-మెర్విన్‌
    సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని
    ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌
    విడుదల తేది: నవంబర్‌ 27, 2025

    రామ్‌ పోతినేని ఖాతాలో హిట్‌ పడి చాలా ఏళ్లు అవుతుంది. ఆయన చివరగా `ఇస్మార్ట్ శంకర్‌`తో హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్‌, ది వారియర్స్‌, స్కంధతో పాటు భారీ అంచనాలతో వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌ కూడా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని ‘ఆంధ్రకింగ్‌ తాలుకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై రామ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. చాలా నమ్మకంతో ప్రమోషన్స్‌ గట్టిగా చేశాడు. మరి ఈ చిత్రంలో అయినా రామ్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? సినిమా ఎలా ఉంది? రివ్యూ(Andhra King Taluka Review)లో చూద్దాం.

    కథేంటంటే.. 
     ఈ సినిమా కథంతా 2000-2003 మధ్యకాలంలో సాగుతుంది. సూర్య(ఉపేంద్ర) ఓ స్టార్‌ హీరో. ప్లాప్‌ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్‌ తెప్పించే అభిమానులు ఉన్నారు. అయితే వరుసగా తొమ్మిది సినిమాలు డిజాస్టర్‌ కావడంతో.. తన కెరీర్‌లో 100వ మూవీతో ఎలాగైన భారీ హిట్‌ కొట్టాలనే కసితో ఉంటాడు. అయితే 100వ సినిమా షూటింగ్‌ మొదలైన కొన్నాళ్లకే ఆగిపోతుంది. ఇక సినిమా చేయలేనంటూ నిర్మాత చేతులెత్తేస్తాడు. ఆ సినిమా పూర్తి చేయాలంటే మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బు కోసం మరో నిర్మాతకు ఫోన్‌ చేస్తే.. తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో తండ్రి పాత్ర చేయమని అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా..తర్వాత ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటాడు. 

    ఈ విషయం నిర్మాతకు చెప్పేలోపే.. సూర్య అకౌంట్‌లో రూ. 3 కోట్లు వచ్చి చేరుతాయి. ఆ డబ్బు ఎవరేశారని ఆరా తీయగా..తన వీరాభిమాని సాగర్‌(రామ్‌ పోతినేని) గురించి తెలుస్తుంది. రాజమండ్రి సమీపంలోని గోడపల్లిలంక అనే ఒక చిన్న పల్లెటూరికి చెందిన సాగర్‌కు అంత డబ్బు ఎలా వచ్చింది? అసలు సాగర్‌కి హీరో సూర్య అంటే ఎందుకు అంత పిచ్చి?  ప్రియురాలు మహాలక్ష్మీ(భాగ్యశ్రీ బోర్సె)ని దక్కించుకోవడం సాగర్‌ చేసిన చాలెంజ్‌ ఏంటి?  ఆ చాలెంజ్‌లో సాగర్‌ గెలిచాలడా ఓడాడా? హీరోపై ఉన్న అభిమానం..సాగర్‌ని, తన ఊరిని ఎలా మార్చేసింది? అభిమానిని వెతుక్కుంటూ వచ్చిన హీరో సూర్యకి.. తెలిసొచ్చిన విషయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Andhra King Taluka Review). 

    ఎలా ఉందంటే.. 
    స్టార్‌ హీరోలకు వీరాభిమానులు ఉంటారు. జీవితంలో ఒక్కసారి కూడా ఆ హీరోని నేరుగా చూడకపోయినా.. ఆయన కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతారు. డబ్బులు ఖర్చు పెట్టి మరీ సినిమాను ఆడించే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఓ అభిమాని కథే ఈ సినిమా. ఇలా అభిమానిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌.  ఈ స్టోరీ పూర్తిగా హీరో-అభిమాని చుట్టూనే తిరుగుతుంది. అందులోనే గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథను చూపించారు. 

    దర్శకుడు మహేశ్‌ ఎంచుకున్న పాయింట్‌ డిఫరెంట్‌గా ఉన్నా.. దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథకు బలమైన ‘మూడు కోట్ల’ సీన్‌ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. ఓ అభిమాని.. హీరోకే మూడు కోట్ల రూపాయలు ఇచ్చాడంటే..అతని ప్రభావం ఫ్యాన్‌పై బలంగా ఉండాలి. ఇందులో ఆ బలమైన సన్నివేశాలు కూడా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. పైగా కథనం మొత్తం ఊహకందేలా సాగడం మరో మైనస్‌.  అయితే పతాక సన్నివేశాలు మాత్రం హృదయాలను ఆకట్టుకుంటాయి. 

    స్టార్‌ హీరో సూర్య 100వ సినిమా ఆగిపోయే సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది.  ఈ వార్త బటయకు రావడం..బయ్యర్లు ధర్నాకు దిగడం.. మూడు కోట్ల కోసం హీరో ప్రయత్నాలు చేయడం..ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచుతుంది. ఇక హీరో అకౌంట్‌లో రూ. 3 కోట్లు పడిన విషయం తెలిసిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది.  సూర్య వీరాభిమాని సాగర్‌ ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ ఆకట్టుకుంటుంది.  రామ్‌ ఎంట్రీ సీన్‌ అదిరిపోతుంది. ఇక హీరోయిన్‌ పరిచయ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. వారిద్దరి పరిచయం.. ప్రేమలో పడడం..కాలేజీలో గొడవ..ఇవన్నీ రొటీన్‌గా సాగిపోతాయి. 

    హీరో.. తన ఫేవర్‌ హీరో కోసం ఒకసారి.. హీరోయిన్‌ కోసం మరోసారి పరుగులు తీస్తూనే ఉంటాడు కానీ కథనం మాత్రం నెమ్మది, అక్కడక్కడే తిరుగుతుంది.  చాలా వరకు కథనం ఊహకందేలా సాగుతుంది.  ఇక సెకండాఫ్‌ ప్రారంభంలోనే మూడు కోట్ల ట్విస్ట్‌ ఊహించొచ్చు. అయితే ఆయా సన్నివేశాలు మాత్రం ఎమోషనల్‌గా సాగుతాయి. ‘మహాలక్ష్మీ థియేటర్‌’ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో హీరో-అభిమాని మధ్య వచ్చే సీన్లు హృదయాలను హత్తుకుంటాయి.  సినీ స్టార్స్‌ అభిమానులంతా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. 

    ఎవరెలా చేశారంటే.. 
    హీరో సూర్య వీరాభిమాని సాగర్‌ పాత్రలో రామ్‌ ఒదిగిపోయాడు. పేరుకు ఇది హీరో-ఫ్యాన్‌ స్టోరీనే కానీ ఇందులో ఎక్కువగా కనిపించేది ఫ్యానే.   హీరో రామ్‌ ఒక్కడే ఈ కథను తన భూజాన వేసుకొని ముందుకు తీసుకెళ్లాడు. ఎమోషనల్‌ సీన్లలోనూ అద్భుతంగా నటించాడు. ఇక మహాలక్ష్మీ పాత్రకి భాగ్యశ్రీ న్యాయం చేసింది.  ఇందులో ఆమెది కూడా కీలక పాత్రే. తెరపై చాలా అందంగా కనిపించింది. రామ్‌-భాగ్యశ్రీ ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. స్టార్‌ హీరో సూర్య పాత్రలో ఉపేంద్రని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఆయన నిడివి తక్కువే అయినా.. కథపై చాలా ప్రభావం చూపించింది. 

     హీరో తండ్రిగా నటించిన రావు రమేశ్‌కు ఒకటి, రెండు బలమైన సన్నివేశాడు పడ్డాయి. రాహుల్ రామ‌కృష్ణ‌, స‌త్య‌, ముర‌ళీశ‌ర్మ‌, తుల‌సి త‌దిత‌రులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ - మెర్విన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేసి నిడివి(166 నిమిషాలు) కాస్త తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
    -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

  • టాలీవుడ్‌ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ సైక్‌ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్‌ హీరోయిన్‌. ఇటీవల రిలీజైన టీజర్‌ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్‌ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.

    వదిలేసి వెళ్లిపోయింది
    సిగరెట్స్‌ లంగ్స్‌కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్‌లో కాలుస్తారు. ఆల్కహాల్‌.. లివర్‌కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్‌.. హార్ట్‌కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్‌ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.

    కలర్స్‌ సాంగ్‌
    'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్‌ ఒస్తాది.. రెడ్‌, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్‌ ఒస్తాది.. బ్లాక్‌.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్‌ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్‌ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

     

    చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్‌బాస్‌: అడుక్కున్న సోహైల్‌

  • టాలీవుడ్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) పెళ్లి పీటలెక్కాడు. ప్రియురాలు హరణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో గురువారం (నవంబర్‌ 27న) ఉదయం ఈ వివాహ వేడుక జరిగింది. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    రాహుల్‌ ప్రస్థానం
    హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో మధ్య తరగతి కుటుంంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ జన్మించాడు. అతడికి సంగీతంపై ఉన్న ఆసక్తి గమనించిన తండ్రి గజల్‌ మాస్టర్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఓవైపు సంగీతంలో శిక్షణ తీసుకుంటూ మరోవైపు తండ్రికి సాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేశాడు.

    ఫేమస్‌ సాంగ్స్‌
    కాలేజీ బుల్లోడ.. వాస్తు బాగుందే.. ఈగ టైటిల్‌ సాంగ్‌.. సింగరేణుంది బొగ్గే పండింది, రంగా రంగా రంగస్థలానా.. బోనాలు ఇలా అనేక సాంగ్స్‌ పాడాడు. మంగమ్మ, పూర్‌ బాయ్‌, గల్లీకా గణేశ్‌, దావత్‌ వంటి పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించాడు. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు పాట అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

    చదవండి: రూ.50 లక్షలు పెడ్తే  రూ.88 లక్షలు కలెక్షన్స్‌

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: పంచాయితీ ఎన్నికల వేల రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పదవుల ఆక్షన్, బలవంతపు విత్‌డ్రాల్స్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు  ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది.  అన్‌కాంటెస్టెడ్ ఫలితాలపై Rule–15 దుర్వినియోగం నివారించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. 

    ప్రతి విత్‌డ్రా సమయంలో అభ్యర్థుల నుంచి రెండు డిక్లరేషన్లు తప్పనిసరి. ఒక్క అభ్యర్థి మిగిలితే RO వెంటనే Form-X సిద్ధం చేయాలి. ఆర్వో పంపిన సమాచారం డీఈఏ అదేరోజు ధృవీకరించాలి. వేలం/బెదిరింపు ఆధారాలు ఉంటే ఫలితాన్ని ఆర్వో తాత్కాలికంగా నిలిపేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలి అని ఆదేశాల్లో స్పష్టం చేసింది. అన్‌కాంటెస్టెడ్ ఫలితాలు స్వచ్ఛమైనవి అని నిర్ధారించినప్పుడే ప్రకటించాలని.. మొత్తం ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ పేర్కొంది.

  • సాక్షి హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. సరోగసీ పేరుతో అక్రమాలు, పిల్లల విక్రయం వంటి పలు అభియోగాలు ఆమెపై నమోదైన సంగతి తెలిసిందే. 

    హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్‌ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్‌(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని  పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్‌ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని  విచారణలో తేలింది. 

    ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని సృష్టి యూనివర్సల్‌ ఫెర్టిలిటీ సెంటర్‌  యజమాని డాక్టర్‌ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్‌(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్‌ నమ్రతపై కేసులు నమోదు చేశారు. 

    అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను  పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు.

  • సాక్షి, హైదరాబాద్: నగరంలోని సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్(ఏఎస్ఎస్జీపీ) అనే నూతన వ్యవస్థకు హైదరాబాద్ సిటీ పోలీస్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎంపవరింగ్ యూవర్ ఎవరీడే సేప్టీ(ఐస్) బృందాలను ఏర్పాటు చేసింది. సీసీటీవీల వ్యవస్థను విస్తరించడంతో పాటు, అవి నిరంతరం సజావుగా పనిచేసేలా ఈ బృందాలు చర్యలు చేపడుతాయి.  

    హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో గురువారం అడ్వాన్స్‌డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ తో పాటు ఐస్ బృందాలను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో కలిసి లోగో ను ఆవిష్కరించారు. నూతనంగా ఏర్పాటైన ఐస్ బృందాలకు రిపేర్ కిట్ లను అందించి వారికి కేటాయించిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

    సిటీలో ప్రస్తుతం 16 వేలకు పైగా వీధి సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఉన్నాయి.  50 వేలకు పైగా కమ్యూనిటీ, ప్రైవేట్ ఫీడ్లు, ల‌క్ష‌కు పైగా నేనుసైతం సీసీటీవీ కెమెరాలున్నాయి. వాటితో పాటు అదనంగా బాడీ-వోర్న్ కెమెరాలు, పోలీస్ డ్రోన్లు వంటి ఆధునిక పరికరాలు కూడా త్వరలో ఈ నెట్‌వర్క్‌లో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విస్తృత వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ నిర్ణయించింది.

    ఈ నేపథ్యంలో ఐస్ అనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

    టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్ టీమ్:
    పరికరాలకు కనీస ప్రమాణాలు నిర్ధారించడం, ఇన్నోవేషన్ హబ్‌లు, ప్రధాన టెక్ సంస్థలతో కలిసి నూతన పరిష్కారాలను అన్వేషించడం వంటి పనులు చేపడుతుంది.
     

    కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్:
    ఫీల్డ్ ఆపరేషన్లకు మద్దతుగా లోపాలను సరిచేయడం, నష్ట నివారణ, సర్వీస్ టికెట్ జనరేషన్–క్లోజర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. దర్యాప్తు అధికారులకు కావాల్సిన వీడియో ఫుటేజ్ సంబంధిత ప్రశ్నలకు మొదటి స్పందన కేంద్రంగా పనిచేస్తుంది.

    ఐస్ ఫీల్డ్ టీమ్స్ – ప్రతి జోన్‌కు 2 బృందాలు
    దీనిలో లోపం గుర్తించిన వెంటనే కేసు ఫీల్డ్ టీమ్‌కి వెళ్తుంది. సాంకేతికంగా శిక్షణ పొందిన ఈ బృందాలు అత్యవసర బ్రేక్‌డౌన్‌లకు స్పందించి, సీసీటీవీ మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తాయి. అవసరమైతే సివిల్, స్ట్రక్చరల్ కాంట్రాక్టర్లతో సమన్వయం చేస్తాయి.

    స్టోర్స్ టీమ్

    రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారంగా ట్యాగింగ్, వ్యవస్థీకృత ఇన్వెంటరీ ప్లానింగ్, విలువైన స్పేర్ పార్ట్స్ నిర్వహణ ద్వారా ఫీల్డ్ బృందాలకు బలమైన లాజిస్టికల్ మద్దతు ఇస్తుంది.

    రిపేర్ సెంటర్
    ప్రధాన భాగాల సాంకేతిక తనిఖీలు, ఇన్-హౌస్ రిపేర్లు,  Original Equipment Manufacturer(OEM)లతో కలిసి వారంటీ ఆధారిత భర్తీలు నిర్వహిస్తుంది.

    సీఎస్ఆర్ డెస్క్
    Hyderabad City Security Council (HCSC) తో అనుసంధానమై “Adopt a Camera”, “Share a Live Feed” వంటి ప్రచారాలను నిర్వహిస్తూ కమ్యూనిటీ, కార్పొరేట్ భాగస్వామ్యాలను విస్తరించేందుకు పనిచేస్తుంది.

     డేటా అనలిటిక్స్ టీమ్
    రియల్-టైమ్ డాష్‌బోర్డులు రూపొందించడం, డేటా ఆధారిత నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం, కాల్ సెంటర్ టెలిఫోనీ–వర్క్‌ఫ్లోలను పర్యవేక్షించడం వంటి వాటిని నిర్వహిస్తుంది. పరిశీలన కార్యకలాపాలను రియాక్టివ్ నుండి ప్రోయాక్టివ్ స్థాయికి తీసుకెళ్లడంలో ఇది కీలకంగా నిలుస్తుంది.
     

    ఐస్ ఆవిష్కరణ నగర భద్రతలో మైలురాయిగా నిలుస్తుందని హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్,  అన్నారు. టెక్నాలజీ డ్యూ డిలిజెన్స్, వేగవంతమైన ఫీల్డ్ స్పందన, బలమైన లాజిస్టిక్స్, అనలిటికల్ ఇంటెలిజెన్స్, సహకార ఫండింగ్ మోడల్ ఇవన్నీ నగరంలోని సీసీటీవీ నిర్వహణ విధానాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తాయని ఆయన తెలిపారు.

    ప్రతి జోన్ లో రెండు ఐస్ టీములను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి సీసీటీవీ సమస్యను ఇవి పరిష్కరిస్తాయన్నారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలను దానం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా సీఎస్ఆర్ లో భాగంగా క్రిస్టియన్  లీడర్స్ ఫోరమ్ ఇచ్చిన రూ.4 లక్షల చెక్ ను సీపీ  వీసీ సజ్జనర్కి సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పావల్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • సాక్షి హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 17శాతం రిజర్వేషన్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లలో 25శాతం కోత విధించారని ఆరోపణలు గుప్పించారాయన. గురువారం కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

    తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని పరిశ్రమలకు చెందిన భూములను పప్పు, బెల్లం  మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు. బాలానగర్, జీడిమెట్లలోని పరిశ్రమల భూములను తక్కువ ధరకే బడాబాబులకు అప్పనంగా రాసిస్తున్నారు. తన అననూయులకు కూకట్ పల్లిలో  సీఎం రేవంత్ గజం రూ. 8,000లకే ఇచ్చేస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహారిస్తున్నారు. తెలంగాణలో రూ. ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం జరిగితే.. అందులో  రేవంత్ వాటా 50శాతం. 

    .. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే. రాష్ట్రం కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్‌తో అసలు యుద్ధం 2028లో. అందుకోసం జనవరినుంచి పార్టీని సంస్థగతంగా బలోపేతం చేస్తాం. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను సీఎం చేయాలని ఇదివరకే ఫిక్స్ అయిపోయారు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

    KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది
  • సాక్షి, హైదరాబాద్‌/ఢిల్లీ: తెలంగాణ ఈగల్ టీమ్ దేశ రాజధానిలో గురువారం భారీ ఆపరేషన్ చేపట్టి సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి.. 50 మందిని అదుపులోకి తీసుకుంది. వీళ్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న నైజీరియన్లని తేలింది. 

    ఢిల్లీ పోలీసుల(సీసీఎస్‌) సహకారంతో తెలంగాణ ఈగల్‌ టీం ఈ స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. వంద మంది స్థానిక పోలీసులు, 124 మంది ఈగల్‌ టీం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సుమారు 20 ప్రాంత్లాలో సోదాలు జరిపింది. తనిఖీల్లో డ్రగ్ కింగ్‌పిన్, డ్రగ్ సేల్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్,  మ్యూల్ అకౌంట్ హోల్డర్లు పట్టుబడ్డారు. వీళ్ల నుంచి భారీగా మత్తు పదార్థాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

    డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్‌ టీం వరుసగా మెరుపు దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు లింకుల నేపథ్యంలోనే తాజా ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పాటు గ్రేటర్‌ నోయిడా, గ్వాలియర్‌, విశాఖలోనూ స్థానిక పోలీసుల సహకారంతో అంతరాష్ట్ర ఆపరేషన్స్‌ చేపట్టినట్లు సమాచారం. 

    డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్
  • సాక్షి హైదరాబాద్: సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల  దర్యాప్తు తీరుపై  హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు సజీవ దహానమైన భారీ ప్రమాదమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే సింగ్‌ అన్నారు. ఇంత తీవ్రమైన ప్రమాద ఘటనలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు.

    సంగారెడ్డిలో సిగాచీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో దర్యాప్తు జరుగుతున్న తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. 54 మంది కార్మికులు మృతిచెందితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇంత పెద్దఘటనకు డీఎస్పీని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని అడిగారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సి ఉండవచ్చుగా అని ప్రశ్నించారు. 237మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదా అని అడిగారు.

    సిగాచీ ప్రమాద ఘటనపై బాబురావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పేలుడు సంబవించి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణుల కమిటీ సైతం పరిశ్రమ నిర్వహణలో లోపాలున్నాయని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వచేశారని కమిటీ గుర్తించిందని న్యాయవాది పేర్కొన్నారు. పేలుడు తీవ్రతతో ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని కోర్టుకు తెలిపారు.

    వాదనలు విన్న కోర్టు  పోలీసు దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ తొమ్మిదికి వాయిదా వేసింది. ఆ విచారణకు డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాశామైలారంలోని సిగాచీ ఫార్మా ప్లాంట్ లో ఈ ఏడాది జూన్ 30 న భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.

    పోలీసుల దర్యాప్తు తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం
  • హైదరాబాద్‌: అమీర్‌పేటలోని ఓ ఇంట్లో గురువారం పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఆ ఇంట్లోలోని వాషింగ్‌ మెషీన్‌ పేలిపోయింది. పేలుడు ధాటికి మెషిన్‌ తునాతునకలైంది. అయితే అదృష్టవశాత్తూ ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

    ఈ ఘటనతో ఆ ఇంట్లో వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఘటన నేపథయంలో జనం భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గుంపును క్లియర్‌ చేసే పనిలో ఉన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRAA) పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ గురువారం ఘాటు విమర్శలు చేసింది. 

    ‘‘రాజ్యాంగ హక్కులను హైడ్రా ఉల్లంఘించింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారు?. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(FTL) నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారు?. అసలు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణే జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారు?. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదు?..

    సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయి. సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చి వేయడం లాంటివి చేయొద్దు’’ అంటూ హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది.

    నల్లచెరువు వద్ద ఉద్రిక్తత
    కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా గురువారం కూల్చివేతలకు దిగింది. అయితే.. అధికారుల్ని అడ్డుకునేందుకు ప్రకాష్‌ నగర వాసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.. ఉద్రిక్తత నెలకొంది.

  • సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓఎస్డీ(Officer on Special Duty) రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.

    గురువారం జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో రాజశేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారణ జరిపి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు సిట్‌ అధికారులు. గత ఏడాది మార్చిలో ఈ కేసు నిందితుడు రాధా కిషన్(టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ) ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసీఆర్‌ ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. 

    రాధాకిషన్‌ తన స్టేట్‌మెంట్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పేరును ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పని చేశామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పదేళ్లపాటు కేసీఆర్‌కు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్‌ ప్రశ్నించింది.

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందుకు కేసీఆర్ OSD

National

  • కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎపిసోడ్‌ రసవత్తరంగా తయారైంది. డీకే, సిద్ధరామయ్య మధ్య నేరుగా ‘మాట’ల యుద్ధం మొదలైంది. డీకే శివకుమార్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చేలా సీఎం సిద్దరామయ్య చేసిన ట్వీట్‌ పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది. 

    సీఎం మార్పు ఊహాగానాల వేళ అగ్రనేతల పోరు తారస్థాయికి చేరింది. ఇంతకాలం గప్‌చుప్‌గా ఉంటూ తమ వర్గీయులను ముందుంచిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు నేరుగా రంగంలోకి దిగారు. ఒకవైపు మీడియా మైకుల ముందు మాటలు.. ఇంకోవైపు సోషల్‌ మీడియా పోస్ట్‌లతో కర్ణాటక పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. 

     ‘‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు.. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నాం. కన్నడ ప్రజలకు మేం ఇచ్చిన ‘మాట’ కేవలం ఒక నినాదం కాదు.. అదే మాకు ‘ప్రపంచం’ అంటూ.. సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. 

    మాట (Word) నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి లేదు అనే అర్థం వచ్చేలా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ గురువారం ఉదయం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. సిద్ధరామయ్య ట్వీట్‌ డీకే శివకుమార్‌కు కౌంటర్‌లా ఉండడం గమనార్హం. 

    కర్ణాటకలో నవంబర్‌ 20వ తేదీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్ల అధికారం పూర్తి చేసుకుంది. అయితే, అధికారం చేపట్టే సమయంలో రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మధ్యలో ఈ ప్రచారం తెరపైకి వచ్చినా.. అలాంటిదేం లేదంటూ ఇద్దరూ ఖండించారు కూడా. తీరా టైం రావడంతో ఇప్పుడు సీటును నిలబెట్టుకునేందుకు సిద్ధరామయ్య, తాను సీఎం పీఠం మీద కూర్చునేందుకు డీకే శివకుమార్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పరిణామం ప్రభుత్వం కుప్పకూల్చే అవకాశం ఉండడంతో హైకమాండ్‌ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 

  • దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమ్మకం ఆచారాలు ఉంటాయి. కానీ మారుతీ  కార్లను బ్యాన్‌ చేసిన గ్రామం గురించి తెలుసా?   మహారాష్ట్రలోనే ఈ  ప్రత్యేకమైన  గ్రామం ఉంది.  ఇక్కడ మారుతి కార్లపై నిషేధం ఎందుకు? ఆ కార్ల నాణ్యత నచ్చలేదా? లేక ధరలు ఎక్కువని భావించారా? పదండి తెలుసుకుందాం.  

    మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లాలో  ఆ గ్రామం సాధారణ భారతీయ గ్రామం కాదు. ఆధునిక జీవితం పురాతన  నమ్మకాలతో  మిళితమైన గ్రామం అని  చెప్పవచ్చు. ఈ నిషేధం వెనుక కారణం కారు నాణ్యత కారు, అధిక ధరలూ కాదు.  స్థానిక పురాణాల గాథ ప్రకారం సంరక్షక దేవత నింబ దైత్య పట్ల భక్తితో లోతుగా ముడిపడి ఉంది.

    ధైర్యాన్నిచ్చి, కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తులు బాగా విశ్వసించే  శ్రీరాముడికి  గొప్ప సేవకుడు భక్తుడు హనుమంతుడి దేవాలయాలు ఉండవు. మారుతిని ఇక్కడ పూజించరు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఇక్కడ  రాక్షస రాజైన నింబ దైత్యుడిని పూజిస్తారు. ఇక్కడి ప్రజలు దైత్య నింబ రాక్షసుడుని తమ మూలపురుషుడిగా భావిస్తారు. చిన్నా పెద్దా అందరికీ నింబ దైత్య అంటే బలమైన నమ్మకం. తరతరాలుగా  చెప్పుకుంటున్న స్థానిక పురాణం ప్రకారం, హనుమంతుడు , నింబ దైత్య మధ్య ఒకప్పుడు వివాదం జరిగింది. చివరికి  రాముడు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత, రాముడు నింబ దైత్యుడికి ఈ గ్రామానికి ఏకైక దైవ సంరక్షకుడిగా ఉండే హక్కును ఇచ్చాడని నమ్ముతారు, హనుమంతుడిని ఈ పాత్ర నుండి తప్పుకోవాలని కోరాడట  శ్రీరాముడు. దీని కారణంగా, హనుమంతుడి ఉనికి ఏ రూపంలోనైనా ఉండటం గ్రామానికి దురదృష్టాన్ని తెస్తుందనే  నమ్మకం పెరిగింది. ఈ నమ్మకం దేవాలయాలు, పేర్లకు కూడా విస్తరించింది. అలా "మారుతి" అనేది హనుమంతుడికి మరొక పేరు కాబట్టి, ఈ బ్రాండ్ కార్లను అపశకునంగా భావిస్తారట. ఇక్కడ మారుతి కారు  బిగ్గరగా హారన్ వినడం కూడా చెడ్డ శకునంగా భావిస్తారు. మూఢనమ్మకం అని అందరూ పిలుస్తున్నప్పటికీ, శతాబ్దాలుగా తమను రక్షిస్తున్న  పవిత్ర సంప్రదాయం  అంటారు ఈ గ్రామ ప్రజలు.

     ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

    గ్రామంలోని ప్రజలు తరచుగా పంచుకునే ఒక ప్రసిద్ధ కథ ఉంది. సంవత్సరాల క్రితం, ఒక స్థానిక వైద్యుడు మారుతి 800 కారును కొన్నాడట. ఆ తరువాత క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య అకస్మాత్తుగా  తగ్గిపోయింది. దీంతో ఆందోళన పడిన అతగాడు,మారుతి కారుని విక్రయించి, దానిని వేరే బ్రాండ్, టాటా సుమోతో భర్తీ చేశాడు. మారిన తర్వాత, అతని ప్రాక్టీస్ సాధారణ స్థితికి వచ్చిందట. 

    (రూ. 80 లక్షల తల్లి పెన్షన్‌ కోసం ఏ కొడుకూ చేయని పని!)

  • సాక్షి, హైదరాబాద్‌: అంతరిక్ష రంగంలో దేశం ఈ రోజు ఒక అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శంషాబాద్‌లో నిర్మించిన భారీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’ను గురువారం వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 

    ‘‘..విప్లవాత్మక విధానపరమైన మార్పుల ప్రభావంతో ప్రైవేట్‌ సంస్థలు ఈ రంగంలో దూసుకెళుతున్నాయి. హైదరాబాద్‌లో నేడు ఆవిష్కృతమైన స్కైరూట్‌ కంపెనీ కార్యాలయం ‘ఇన్ఫినిటీ క్యాంపస్‌’ దేశ యువశక్తికి, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. సృజనాత్మక ఆవిష్కరణలతో దూసుకెళుతున్న భారత దేశ యువత ఇతర దేశాల జెన్‌జీ తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తోంది..

    .. యువతరం రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని, సృజనాత్మకంగా ఆలోచిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. ఉపగ్రహ ప్రయోగాల విషయంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంటుంది’’ అనే ధీమా వ్యక్తం చేశారాయన. ఈ సందర్భంగా స్కైరూట్‌ సంస్థ వ్యవస్థాకులు పవన్‌ కుమార్‌ చందన, నాగభరత్‌ డాకాలు దేశ యువతకు స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు.

    యువత దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తోందని దేశ ప్రధాని కొనియాడారు. అంతరిక్ష రంగమూ దీనికి భిన్నమేమీ కాదని.. ఇద్దరు, ముగ్గురు జెన్‌-జీలతో మొదలైన స్టార్టప్‌లు చాలా తక్కువ వనరులతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని కలిసే అవకాశం తనకు దక్కిందని వివరించారు. జెన్‌-జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్ట్‌లు రాకెట్ల చోదక వ్యవస్థలు మొదలుకొని కాంపోజిట్‌ మెటీరియల్స్‌, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్లకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ఇలాంటివి కనీసం ఊహకు కూడా అందేవి కావని.. అందుకే 21వ శతాబ్ధం దేశ జెన్‌-జీదేనని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 

    ప్రైవేటీకరణ దిశగా భారత అణుశక్తి రంగం
    అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ కంపెనీలను అనుమతించడం ద్వారా సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో అణుశక్తి రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత అంతరిక్ష రంగ ప్రస్థానం చాలా చిన్న స్థాయిలో మొదలైందని, సైకిళ్లపై రాకెట్‌ విడిభాగాలను మోసుకెళ్లే స్థితినుంచి ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన లాంచ్‌ వెహికల్‌ను తయారు చేయగల స్థాయికి చేరగలిగామని ప్రధాని గుర్తు చేశారు. ఈ ప్రస్థానం పరిమితమైన వనరులతోనే మొదలైనప్పటికీ వృద్ధిమ ఆత్రం దేశ శాస్త్రవేత్తల సంకల్పబలానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. గడచిన దశాబ్ధ కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంతరిక్ష రంగంలోనే 300కుపైగా స్టార్టప్‌లు వెలిశాయి అని సమాచార, వాతావరణ అంచనాలు, వ్యవసాయం, అర్బన్‌ ప్లానింగ్‌లతోపాటు దేశ భద్రతకూ అంతరిక్ష రంగం విస్తృత వినియోగంలోకి వచ్చిందని వివరించారు. దేశీ అంతరిక్ష రంగంపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోందని చిన్న ఉపగ్రహాలకు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోందని వివరించారు.

    ప్రయోగం ఎప్పుడంటే.. 
    సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కార్యలయంలోనే స్కైరూట్‌ తన మొట్టమొదటి ఆర్బిటల్‌ వెహికల్‌ ‘విక్రమ్‌-1’ను తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా విక్రమ్‌-1ను ఆవిష్కరించారు. స్కైరూట్‌ సొంతంగా తయారు చేసిన ఆర్బిటల్‌ వెహికల్‌ ‘విక్రమ్‌-1’ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాయంతో రెండు నెలల్లో ప్రయోగించనున్నట్లు సంస్థ వ్యవస్థపకుల్లో ఒకరైన పవన్‌ కుమార్‌ చందన తెలిపారు. 

    2018లో దేశంలోనే మొట్టమొదటి సబ్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-ఎస్‌’ ప్రయోగాన్ని విజయవంతం కావడం గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యానికి ఓకే చెప్పడం వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు.  కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వికసిత్‌ భారత్‌ 2047 కంటే ఎంతో ముందుగానే ఆవిష్కృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌ డాకా మాట్లాడుతూ 2030 నాటికి దేశం ఏడాదికి యాభై అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించగల స్థితికి చేరుకుంటుందని, స్కైరూట్‌లో డిమాండ్‌కు తగ్గట్టుగా నెలకు ఒక విక్రమ్‌-1ను తయారు చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటామని అన్నారు. కేంద్ర బొగ్గు, పర్యావరణ శాఖల మంత్రి జి.కిషన్‌ రెడ్డితోపాటు, వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇన్‌స్పేస్‌ ఛైర్మన్‌ పవన్‌ గోయాంక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌  క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) కు సంబంధించి  మరో వార్త వైరల్‌గా మారింది.  బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌ చేస్తున్న పాపులర్‌ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ-17) ‍ స్పెషల్‌ ఎడిసోడ్‌కు రాకపోవడం వార్తల్లో నిలిచింది. ఇది  ఆమె అభిమానులను మరింత ఆందోళన పరుస్తోంది.

    భారత ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని  కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) ప్రత్యేక కార్యక్రమాన్ని, కొంతమంది మహిళా క్రికటర్లు, మరికొంతమంది అభిమానుల మధ్య చిత్రీకరించారు. కానీ స్మృతి రాకపోవడం  అభిమానులను నిరాశపర్చింది. అయితే సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఆమె గైర్హాజరీ సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

    నవంబర్ 26 బుధవారం సాయంత్రం షూట్ కోసం మంధాన తన సహచరులతో పాటు రావాల్సి ఉంది, కానీ వ్యక్తిగత కారణాలను చూపుతూ చివరి క్షణంలో వైదొలిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. మంధాన లేనప్పటికీ, ప్రపంచ కప్ విజేత జట్టు నుండి స్టార్-స్టడ్డ్ బృందం  కేబీసీ షూట్‌లో కనిపించింది.


    కేబీసీలో భారత మహిళా క్రికెట్ జట్టు
    ఈ ఎపిసోడ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బ్యాట్స్‌మన్ హర్లీన్ డియోల్, వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్, ఓపెనర్ షఫాలీ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ, ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. మహిళల క్రికెట్‌లో భారతదేశం సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటైన  ఈ విజయానికి గుర్తుగా దీన్ని రూపొందించారు. మంధాన వచ్చి ఉంటే అమితాబ్  హోస్ట్ చేస్తున్న రియాలిటీ షోలో మూడో సారి కనిపించినట్టు అయ్యేది.  భారత మహిళా క్రికెట్ జట్టు కౌన్ బనేగా కరోడ్‌పతి (కెబిసి) యొక్క 'ప్రత్యేక' ఎపిసోడ్‌లో కనిపించింది ప్రసార తేదీపై ఇంకా తెలియదు.

    ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్‌ : పలాష్‌ మాజీ ప్రేయసి ప్రపోజల్‌ వైరల్‌
    కాగా సంగీత్, మెహందీ, హల్దీ  వేడుకలు జోరుగా సాగుతున్న తరుణంలో  స్మృతి-పలాష్‌ వివాహ వేడుకలు అకస్మాత్తుగా నిలిచిపోవడం సంచలనం రేపింది.  తొలిత తండ్రి శ్రీనివాస్ మంధానకు అనారోగ్యం అని చెప్పినప్పటికి, తరువాత జరిగిన పరిణామాలు, పలాష్‌ ముచ్చల్‌ మోసం చేశాడన్న ఆరోపణలు,  స్మృతి తన వివాహానికి ముందు ఉన్న అన్ని చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించడం,  చాలామంది పలాష్‌ను సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేయడం లాంటి విషయాలు అనేక పుకార్లకు తెరలేపాయి.  

    ఇదీ చదవండి: స్మృతి పెళ్లికి బ్రేక్స్‌ : వైరల్‌ స్ర్కీన్‌ షాట్స్‌, ఎవరీ మేరీ డికోస్టా

  • సాక్షి, ముంబై: షేర్‌ మార్కెట్‌లో  ట్రేడింగ్‌ పేరుతో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త భారీగా మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.  దాదాపు రూ.35 కోట్లు మోసపోయిన దిగ్భ్రాంతికర వార్త కలకలం రేపుతోంది

    తన భార్య పేరుతో ఉన్న డీమ్యాట్‌ ఖాతాను ఒక బ్రోకరేజ్‌ సంస్థ అన్యాయంగా వాడి మోసం చేసిందని 72 ఏళ్ల వ్యాపారవేత్త వాపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ మోసానికి తెగబడిందని మతుంగా వెస్ట్ నివాసి భరత్ హరక్‌చంద్ షా అనే బ్రోకరేజ్ సంస్థ గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై ఆరోపణలు గుప్పించారు.

    అసలేమైంది అంటే.
    పరేల్‌లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతున్న షా, తన భార్యతో పాటు, 1984లో తన తండ్రి మరణించిన తర్వాత ఆయన షేర్ పోర్ట్‌ఫోలియోను వారసత్వంగా పొందారు. కానీ ఆ జంటకు స్టాక్ మార్కెట్‌పై  ఎలాంటి పరి జ్ఞానం లేదు. ఎపుడూ ట్రేడింగ్‌ చేసిన అనుభవమూ లేదు. దీంతో స్నేహితుడి    సలహా మేరకు షా తనకు , తన భార్యకు గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో డీమ్యాట్ , ట్రేడింగ్ ఖాతాను తెరిచి, వారి వారసత్వంగా వచ్చిన  షేర్లను  కంపెనీకి బదిలీ చేశాడు. అక్షయ్ బరియా ,కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులకు వీరి పోర్ట్‌ఫోలియోను "నిర్వహించే" బాధ్యతను అప్పగించారు. ఇక అక్కడినుంచి వీరి మోసానికి తెరలేచింది. వారి ఖాతాలకు పూర్తిగా నియంత్రణలోకి తీసుకొన్నారు. మొదట్లో కొద్దో గొప్పో సమాచారం ఇచ్చినప్పటికీ, ఆ తరువాత అసలు వీళ్లని సంప్రదించేవారు కాదు. అయితే మార్చి 2020 -జూన్ 2024 మధ్య, లాభాలు,  క్లీన్ స్టేట్‌మెంట్ రావడంతో ఎలాంటి అనుమానం రాలేదు. తన ఖాతాల ద్వారా విస్తృతమైన వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని షాకు తెలియదు. 

    ఇదీ చదవండి: డీకేకి చాన్స్‌ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్‌ ఏంటి?

    మోసం ఎలా బైట పడింది?
    జూలై 2024లో షాకు గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి అకస్మాత్తుగా కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటయ్యా అంటే.. మీ భార్యాభర్తలఖాతాల్లో రూ. 35 కోట్ల డెబిట్‌ ఉంది. వెంటనే దాన్ని చెల్లించాలి, లేకపోతే మీ షేర్లన్నీ అమ్మేస్తాం’’ అని చెప్పడంతో నిర్ఘాంత పోవడం షా వంతైంది.  కంపెనీని సందర్శించినప్పుడు, భారీ, అనధికార వ్యాపారం జరిగిందని అతనికి సమాచారం అందింది.జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. 

    ఇదీ చదవండి: వేధింపులపై మహిళలకు కీలక సందేశం : ఐశ్వర్యారాయ్‌ వీడియో వైరల్‌

  • మహిళలపై వేధింపులపై మాజీ విశ్వ బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ Aishwarya Rai Bachchan కీలక వ్యాఖ్యలు చేశారు.  వీధి వేధింపులు,  బాధితులను నిందించడంపై ఐశ్వర్య రాయ్ ఆమె స్పందిస్తే, ఇందులో మహిళలు, లేదా అమ్మాయిల తప్పు ఎప్పుడూ లేదన్నారు. లోరియల్ పారిస్ స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో ఆమె ఐశ్వర్య రాయ్ వీధి వేధింపుల (Street harassment )పై మాట్లాడారు. బాధితులనే  నిందించే వైఖరిని కూడా ఆమె తప్పు బట్టారు.

    గతరెండు దశాబ్దాలుగా  గ్లోబల్‌ బ్యూటీ  బ్రాండ్‌ లోరియల్ పారిస్‌కి  అంబాసిడర్‌గా ఉన్న ఐష్‌  వీధి వేధింపులకు వ్యతిరేకంగా బ్రాండ్ ప్రచారంలో పాల్గొన్నారు.  ధైర్యంగా తలపైకెత్తుకుని నిలబడండి..  గౌరవం విజయంలో రాజీపడకండి, వీధి వేధింపులకు వ్యతిరేకంగా పోరాటంలో చేరండి. స్టాండ్ అప్ శిక్షణా కార్యక్రమంలో చేరండి  అని లోరియల్‌ పిలుపునిచ్చింది.

     ఈ ప్రచారంలో భాగంగా ఐశ్వర్యారాయ్‌ వీధి వేధింపుల గురించి మహిళలకు ఇలా సందేశమిచ్చారు "మీ దుస్తులను లేదా లిప్‌స్టిక్‌ను నిందించవద్దు.. వీధి వేధింపులు, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు?" అంటే ఒక వీడియోలో సూచనలు చేశారు. అవేంటంటే.. వారి కళ్లలోకి చూడకుండా ఉండాలి..  కానే కాదు కాదు,  "సమస్యను నేరుగా కళ్ళలోకి చూడండి.తల ఎత్తి ధైర్యంగా ఉండాలి.  స్త్రీగా స్త్రీవాదిగా ఉండాలి.   నా శరీరం. నా విలువ," అనే  సందేశాన్నిచ్చారు. మిమ్మల్ని మీరు అనుమానించకోకండి.  మీకోసం మీ విలువ విషయంలో ఎప్పుడూ రాజీ పడకండి.  వాల్యూకోసం నిలబడండి.  అంతేకాదు  మీ  దుస్తులను లేదా మీ లిప్‌స్టిక్‌ను నిందించవద్దు. వీధి వేధింపులు ఎప్పుడూ మీ తప్పు కాదుఅంటూ ఆమె ముగించారు.

    చదవండి: డీకేకి చాన్స్‌ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్‌ ఏంటి?

    ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు  ప్రముఖ సెలబ్రిటీలు అమెరికన్ నటి అరియానా గ్రీన్‌బ్లాట్, ఇంగ్లీష్ నటుడు సిమోన్ ఆష్లే, ఇటాలియన్ హై జంపర్ జియాన్మార్కో టాంబేరి , ఫార్ములా 1 డ్రైవర్ కార్లోస్ సైన్జ్ ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం విశేషం.

    కాగా 2012 గాలప్ నివేదిక ప్రకారం, 143 దేశాలలో పురుషులతో పోలిసతే, మహిళలు రాత్రిపూట ఒంటరిగా నడవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.  2011లో నిర్వహించిన సర్వేల నుండి ఈ డేటాను తీసుకున్నారు. స్టాప్ స్ట్రీట్ హరాస్‌మెంట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న 79శాతం మంది మహిళలు బహిరంగంగా హింస లేదా వేధింపులకు గురవు తున్నారు. ఈ డేటా బ్రెజిల్‌లో 89శాతం, యూకేలోని  లండన్‌లో  75శాతం గా ఉంది.
     

  • సాక్షి బెంగళూరు: కర్ణాటక సీఎం వివాదంపై ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. త్వరలోనే ఈ ప్రతిష్ఠంభనకు ముగింపు పలకబోతున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలోనే పార్టీ అగ్రనేతలతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆ మీటింగ్‌లో ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఖర్గే పేర్కొన్నారు.

    కర్ణాటకలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి పదవి కాపాడడం కోసం సిద్దరామయ్య, ఎలాగైనా సీఎం పదవి చేపట్టాలని డీకే శివకూమార్ ఇద్దరు నేతలు భీష్మించుకు కూర్చొన్నారు.  అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటీవల వ్యాఖ్యానించడంతో కేంద్రం ఆయనను సీఎం చేస్తానని హామి ఇచ్చిందని దానికోసమే అలా మాట్లాడారని అంతా అనుకున్నారు. ఈ వరుస ఘటనలతో   ఆ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారాయి. 

    అయితే తాజాగా ఆ రాష్ట్ర వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఆయన మాట్లాడుతూ  "త్వరలోనే కర్ణాటకలో జరుగుతున్న వివాదానికి ముగింపు పలుకుతాం. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర నాయకులతో కలిసి సమావేశం నిర్వహిస్తాం. ఆ మీటింగ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌ను కూడా పిలిచి వారితో చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.

    ఇటీవల ఒక కార్యక్రమంలో శివకుమార్‌ మాట్లాడుతూ మాటకున్న శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని, వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అతిపెద్ద చర్య అని అన్నారు. దీంతో సీఎం పదవినుద్దేశించే తాను మాట్లాడారని చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా  ‘అంతిమంగా నిర్ణయం తీసుకునేది హైకమాండ్ఈ  గందరగోళానికి పూర్తి ముగింపు పలకడానికి, హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి అని  అన్నారు

    పవర్‌ షేరింగ్‌ ఏంటంటే..
    2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండనున్నట్లు అధిష్ఠానం నిర్ణయించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 తారీఖుతో రెండున్నరేళ్ల కాలం ముగిసింది. దీంతో సీఎం మార్పు వ్యవహారం మళ్లీ తెరమీదకొచ్చింది.

     

     

     

  • భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరు. ఆమె వంట గ్యాస్, టాయిలెట్ లేదా విద్యుత్  సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తుండటం ఆసక్తికరం.  పదండి మరి ఆమె ఎవరో? ఎక్కిడి వారో వివరాలు తెలుసుకుందాం.

    భారతదేశంలో  తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లి గ్రామ నివాసి. ఆధార్ కార్డు మహిళగా ప్రసిద్ధి చెందిన రంజనా సోనావానే.  2010న సెప్టెంబర్ 29,అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హాజరైన ఆధార్ కార్యక్రమం జాతీయ ప్రారంభోత్సవంలో ఈ కార్డు జారీ చేశారు. ఆధార్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.

    చదవండి: డీకేకి చాన్స్‌ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్‌ ఏంటి?

    ఎవరీ రంజన సోనావానే?
    మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో ఒక పూరిగుడిసెలో నివసించే మహిళ రంజనా. ఆమె భర్త సదాశివ్  దినసరి కూలీ.వీరికి ముగ్గురు పిల్లలు. ప్రత్యేక గుర్తింపు కార్డు పొందిన  తొలి వ్యక్తి అయినప్పటికీ, వంట గ్యాస్, టాయిలెట్‌, విద్యుత్తు లాంటి కనీస సౌకర్యాలేవీ లేవు.  అందుకే  తొలి ఆధార్‌ కార్డు  పొండదంలో గొప్ప  ఏముంది? ఇదో గొప్ప విజయమా. లాటరీ గెలిచనట్టుగా కాదు కదా అని అప్పట్లోనే తన నిర్లిప్తతతను ప్రకటించింది. తమలాంటి పేదవాళ్లు, గిరిజనుల కోసం ఏ మీ చేయాలేదు, ఓట్లు మాత్రం అడుగుతారు అంటూ అప్పటి మంత్రులపై నిరసనను  సోనావానే ఒక ఇంటర్వ్యూలో  ప్రకటించింది.  

    ఇదీ చదవండి: ఆధార్‌ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాప్యతకు అంత్యంత  కీలకమైన  ఈ కార్డు ద్వారా తనకు ఒరిగిందేమీ లేదని ఒక సందర్భంలో వాపోయింది. ఆధార్ కార్డు తనకు ఉద్యోగం పొందడానికి సహాయ పడుతుందని మొదట్లో భావించానని, కానీ తర్వాత తాను పొరబడ్డానని గ్రహించానని కూడా చెప్పింది. ఆధార్ కార్డు పొందిన తొలి భారతీయురాలిగా పదిహేను సంవత్సరాలు గడిచినా, 54 ఏళ్ల రంజనా సోనావానే తనకు ప్రభుత్వపరంగా ఉద్దేశించిన ప్రాథమిక సంక్షేమ ఫలాలేవీ  అందలేదని తెలిపింది.  

    ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

  • సాక్షి, ఢిల్లీ: ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. గురువారం దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. 

    సీబీఐ కేసు ఆధారంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఎన్‌ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్‌ నేపథ్యంతో ఈ రైడ్స్‌ జరుగుతున్నట్లు సమాచారం.  కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది కూడా. ఈ క్రమంలో ఇవాళ ఇటు ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం.

    తెలుగు రాష్ట్రాల్లో.. 
    ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాకుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు.. మెడికల్ సీట్ల కేటాయింపులు సహా పలు అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.  

  • కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.  అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడంతో  కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక వేళ కాంగ్రెస్‌ అధిష్టానం డీకేను ప్రమోట్ చేయాలనుకుంటే సిద్ధరామయ్య ‘ ప్లాన్‌’ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.

    సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని డీకే శివకుమార్‌,ఐదేళ్లు తానే సీఎంనని సిద్ధరామయ్య ప్రకటించినప్పటికీ ఇది అంత తేలిగ్గా పరిష్కారమవుతుందా అనేది రాజకీయ వర్గాల్లో  జరుగుతున్న చర్చ. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే జోక్యం తరువాత అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, సిద్ధరామయ్య కట్టుబడి ఉండాలని ప్రకటించి నప్పటికీ ఈ  పొలిటికల్ డ్రామాకు ఇంకా ఫుల్‌ స్టాప్‌ పడలేదు.

    ఒక వేళ ఉప ముఖ్యమంత్రి డీకేను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే,  సిద్ధరామయ్య శిబిరం ఆయన్ను పదవిలో కొనసాగించాలని ఒత్తిడి తీసుకురావడానికి సకల అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.  మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బహిరంగంగా డీకే వైపే మొగ్గుచూపుతున్నారని సిద్ధరామయ్య మద్దతుదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరసనకు సిద్ధంగా ఉన్నారు.

    పార్టీ ఇంకా కొత్త ముఖ్యమంత్రి కోసం పట్టుబడుతుంటే, వారికి ప్రత్యామ్నాయ జాబితాను అందజేయ నున్నారట. అందులో ఒకటి సిద్ధరామయ్య మద్దతుదారుడు, దళిత నాయకుడు హోంమంత్రి జి. పరమేశ్వర కావచ్చని అంచనా. ఈ సందర్భంగా తానెప్పుడూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానన్న వ్యాఖ్యలు గమనించ దగ్గవి. దీనిపై సిద్ధరామయ్య విధేయుడు, పిడబ్ల్యుడి మంత్రి సతీష్ జార్కిహోలి నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో  చర్చకు వచ్చినట్టు సమాచారం. మరోవైపు ఖర్గే, గాంధీలో డిసెంబరు 1 నాటికి దీనిపై ఒక నిర్ణయం ప్రకటించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

    ఎవరి పంతం నెగ్గుతుంది?
    మరోవైపు సిద్ధరామయ్య తన అధికారాన్ని  మరింత బలపర్చుకునేందుంకు తన మంత్రివ ర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కూడా యోచిస్తున్నారట. ఆయన  ఎమ్మెల్యేల మద్దతు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉంది. ఈ  నేపథ్యంలోసిద్ధరామయ్య గెలుస్తారా లేదా డికె శివకుమార్ తను కోరుకున్నది సాధిస్తారా? 2028లో తదుపరి ఎన్నికల వరకూ దీన్ని సర్దు బాటు చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

    కాగా 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుండి అత్యున్నత పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య  కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత  చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది. ప్రస్తుతం, ఈ సమయం అయిపోవడంతో డీకే వర్గం నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ అధిష్టానంపై పట్టు పెంచుతోంది.  ఈ నేపథ్యంలో అధిష్టానం  ఈ ఉత్కంఠకు ఎలా తెరదించుతుందో వేచి చూడాలి. 
     

  • పథనంతిట్ట: సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసే అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం అప్పట్లో కలకలం రేగింది. సరిగ్గా అలాంటి లోపాలే ఇప్పుడు అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో లోపాలున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తేల్చింది.

    ఫోమిక్ యాసిడ్ కంటైనర్లలో తేనె..
    చీమలు, తేనెటీగలు మనల్ని కుట్టినప్పుడు విపరీతమైన మంట కలగడానికి కారణం అవి విడుదల చేసే ఫోమిక్ యాసిడ్. అయితే.. కృత్రిమంగా తయారు చేసే ఫోమిక్ యాసిడ్‌ను రబ్బరు ప్రాసెసింగ్, శానిటైజర్ల తయారీ, పురుగుమందుల్లో వినియోగిస్తారు. ఇలాంటి ఫోమిక్ యాసిడ్‌ను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కంటైనర్లు, డబ్బాలను ఆహార పదార్థాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఫోమిక్ యాసిడ్ అవశేషాలతో ఆహారపదార్థాలు విషపూరితమవుతాయి. ఫోమిక్ యాసిడ్ కంటైనర్లను ఎంతగా శుభ్రపరిచినా.. వాటిల్లో రసాయన అవశేషాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆహార భద్రత ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమంటున్నారు.

     విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది?
    పంపాలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లో పనిచేసే రిసెర్చ్ అధికారి తన పరిశీలనలో తప్పుడు నివేదిక ఇచ్చినట్లు విజిలెన్స్ నిగ్గుతేల్చింది. అయ్యప్ప ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల విషయంలో తనిఖీ డొల్లగా ఉందని పేర్కొంది. ఫోమిక్ యాసిడ్ కంటైనర్ల హిస్టరీని తనిఖీ చేయకపోవడం.. సరఫరా సంస్థ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. దీంతో కాంట్రాక్టర్‌కి షోకాజ్ నోటీసును జారీ చేసింది. కాంట్రాక్టర్ నుంచి సమాధానం వచ్చిన తర్వాత తగిన చర్యలు ప్రారంభిస్తామని శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు విలేకరులకు తెలిపారు. ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. శబరిమల స్వర్ణ తాపడం వివాదం మరువక ముందే ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. 

    ఇది కూడా చదవండి: శబరిమల గోల్డ్ కేసు: ఏపీకి లింకు..! నటుడు జయరాంను ప్రశ్నించే చాన్స్

Business

  • ‘ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి’ అంటూ ఒక రెస్టారెంట్ పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మారుతున్న సామాజిక పోకడలు, ఏకాంతంగా జీవించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక నూడిల్ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే కస్టమర్లకు సర్వీసు చేయబోమని బోర్డు పెట్టడం వివాదానికి కారణమైంది.

    దక్షిణకొరియా జియోలా ప్రావిన్స్‌లో ఉన్న యోసు నగరంలోని ఒక నూడిల్ రెస్టారెంట్ వెలుపల ఉంచిన నోటీసు బోర్డు చర్చకు దారితీసింది. కొరియా టైమ్స్‌లోని వివరాల ప్రకారం.. ఒక సందర్శకుడు ఈ నోటీసును ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అది త్వరగా వైరల్ అయింది. ఈ నోటీసులో సోలో డైనర్ల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి.

    • రెండు ఐటమ్స్‌ ఆర్డర్‌ చేయండి.

    • రెండు ఐటమ్స్‌ తినండి.

    • మీరు ఒంటరిగా ఉంటే మీ స్నేహితుడిని పిలవండి.

    • తదుపరి మీ భార్యతో రెస్టారెంట్‌కు రండి.

    • ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి.. అని ఉన్నాయి.

    ఈ పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది రెస్టారెంట్ వైఖరిని విమర్శించారు. ఒంటరిగా తినడం అనేది ఒంటరితనంతో ఎందుకు సమానం అవుతుందని ప్రశ్నించారు. కస్టమర్లకు విలువ ఇవ్వడం లేదని వాదించారు. అయితే, మరికొంతమంది ఈ విధానాన్ని సమర్థించారు. తమ వ్యాపారంలో అలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు యజమానికి ఉంటుందని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

  • ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2026 వేలం సందర్భంగా ముంబయి ఇండియన్స్‌ అధినేత, రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ న్యూఢిల్లీకి చేరుకున్నారు. డబ్ల్యూపీఎల్‌ ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఆమె వేలంపాటలో పాల్గొనేందుకు వచ్చారు. తొలి రెండు సీజన్లలో విజయం సాధించి డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ (MI) టీమ్‌లోకి వచ్చే ఆటగాళ్లు ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

    ఫ్రాంచైజీకి ఆదాయం ఎలాగంటే..

    • సెంట్రల్ రెవెన్యూ పూల్ అన్ని ఫ్రాంచైజీలకు ప్రధాన ఆదాయ వనరు. ఇందులో టోర్నమెంట్‌ను ప్రసారం చేసే హక్కుల (టీవీ, డిజిటల్) ద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగాన్ని అన్ని ఫ్రాంచైజీలకు పంచుతారు. Viacom18/JioStar వంటి సంస్థలు భారీ మొత్తంలో మీడియా హక్కుల కోసం డబ్బు చెల్లిస్తాయి. ఇందులో ముంబై ఇండియన్స్ కూడా వాటాను పొందుతుంది.

    • లీగ్‌కు సంబంధించిన టైటిల్ స్పాన్సర్, ప్రీమియర్ భాగస్వాముల నుంచి వచ్చే ఆదాయం ఫ్రాంచైజీల మధ్య పంపిణీ చేస్తారు. ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్ విజయాలు ఈ రెవెన్యూ పూల్ విలువను పెంచడానికి దోహదపడతాయి.

    • ఫ్రాంచైజీ స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు జట్టుకు నేరుగా వచ్చే ఆదాయ వనరులు. ఇప్పటికే రెండు టైటిల్స్‌ను గెలుచుకున్న ముంబయి ఇండియన్స్‌ బ్రాండ్‌లను ఆకర్షించడంలో ముందుంటుంది.

    • జెర్సీపై (ముందు, వెనుక, భుజాలు) ప్రధాన స్పాన్సర్‌ల లోగోలను ఉంచడం ద్వారా ఆదాయం వస్తుంది.

    • ఎక్విప్‌మెంట్, కిట్ పార్టనర్షిప్‌ల ద్వారా (బ్యాట్లు, ప్యాడ్లు) ఒప్పందాలుంటాయి. ఇది కూడా జట్టు ఆదాయానికి దోహదం చేస్తుంది.

    • అసోసియేట్ స్పాన్సర్‌లు డిజిటల్ రైట్స్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాల కోసం స్పాన్సర్‌ చేస్తారు.

    • జట్టు జెర్సీలు, టోపీలు, టీ-షర్టులు, ఇతర వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం.

    • డబ్ల్యూపీఎల్‌ ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ టికెట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇందులోనూ జట్లకు ఆదాయం ఉంటుంది.

    ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

  • డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.

    నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్‌లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్‌ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్‌లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్‌ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్‌టెల్‌ సేఫ్ సెకండ్ అకౌంట్‌ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.

    ఈ ఖాతా ప్రత్యేకతలు..

    ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్‌ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

    ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

  • కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం నాలుగు లేబర్ కోడ్స్‌ను ఇటీవల నోటిఫై చేసింది. దశాబ్దాలుగా ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చారు.

    లేబర్‌ కోడ్స్‌లో చేసిన ముఖ్యమైన మార్పులు

    • తొలిసారిగా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం.

    • దేశవ్యాప్తంగా కార్మికులందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు.

    • ఉద్యోగులందరికీ తప్పనిసరి నియామక పత్రాలు.

    • అన్ని రంగాల్లో ఏకరీతి వేతన చెల్లింపు నియమాలు తీసుకురావడం.

    కేరళ వైఖరి

    కేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్ కుట్టి కేంద్ర కార్మిక కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళ ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న సీపీఐ(ఎం) ఈ కోడ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కోడ్స్‌ కార్మికుల దీర్ఘకాలిక హక్కులు, రక్షణలను పలుచన చేసేలా ఉన్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కోడ్స్‌ కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు చెబుతోంది.

    • ఈ కోడ్‌లు ఉపాధిని పెంచుతాయనే కేంద్ర ప్రభుత్వ వాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కోడ్స్‌ లక్ష్యం కార్మిక హక్కులను రద్దు చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం అని పేర్కొంది.

    • ఈ కోడ్స్‌ కార్మికులు సమ్మె చేసే హక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.

    ఈ సందర్భంగా మంత్రి శివన్ కుట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని తీసుకోదని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ మూడో వారంలో తిరువనంతపురంలో కార్మిక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.

    లేబర్ కోడ్స్‌పై నిపుణులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మిక సంఘాలు, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

    తొలగింపు నియమాలు సడలింపు

    300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే లే-ఆఫ్‌లు లేదా తొలగింపు చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. గతంలో ఈ పరిమితి 100 మంది కార్మికులుగా ఉండేది. దీనివల్ల సంస్థలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.

    సమ్మె హక్కుపై పరిమితులు

    సమ్మెకు వెళ్లే ముందు 14 రోజుల నోటీసు తప్పనిసరి. ఈ నియమాలు సమ్మె హక్కును పరిమితం చేస్తాయని కార్మిక సంఘాల సామూహిక బేరసారాల శక్తిని బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.

    సామాజిక భద్రతపై అస్పష్టత

    గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నప్పటికీ ఈ నిధుల్లో కంపెనీల విరాళం చాలా తక్కువ (ఆదాయంలో 1-2%) ఉంది. ఇది వారి అవసరాలకు సరిపోదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

    పని గంటలు

    ఈ కోడ్ పని గంటలను రోజుకు 8 నుంచి 12 గంటలకు పెంచడానికి అనుమతిస్తుంది (వారానికి మొత్తం పని గంటల్లో మార్పు లేకపోయినా). ఇది కార్మికుల ఆరోగ్యం, శ్రేయస్సుకు హానికరం.

    స్థిర కాల ఉపాధి

    ఉద్యోగులను ఏ రకమైన పనికైనా నిర్దిష్ట కాలానికి నియమించడానికి ఈ కోడ్‌లు అనుమతిస్తాయి. దీనివల్ల సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు (గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి) ఎగవేసి, ఎక్కువ మంది కార్మికులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: రిచ్‌గా కనిపిస్తున్నారా? రిచ్‌గా మారుతున్నారా?

  • స్పోర్ట్స్ కారు, ఖరీదైన వాచ్, చేతి నిండా షాపింగ్ బ్యాగ్‌లు.. బయటికి చూస్తే అతడు కోటీశ్వరుడు! కానీ తన క్రెడిట్ కార్డు బిల్లులు, బ్యాంకు రుణాల చిట్టా చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రిచ్‌గా కనిపించడానికి భారీగా అప్పు చేశాడు. మరోవ్యక్తి అనవసర ఆండంబరాలకు పోకుండా మంచి పెట్టుబడి సాధనాల్లో పొదుపు చేస్తూ దీర్ఘకాలంలో భారీ సొమ్ము పోగు చేశాడు. తర్వాత తన అవసరాలకు ఖర్చు చేస్తున్నాడు. నేటి సమాజంలో నిజంగా ధనవంతులుగా మారడానికి ప్రయత్నించే వారి కంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ధనవంతులుగా నటించే వారే ఎక్కువైపోతున్నారు. పొరుగువారిని మెప్పించాలనే ఉద్దేశంతో లేనిపోని ఖర్చులు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

    రిచ్‌గా కనిపించడానికి చేసే ఖర్చులు కొన్ని..

    • చాలామంది వ్యక్తులు ఇతరుల దృష్టిలో ధనవంతులుగా, విజయవంతమైనవారిగా కనిపించడానికి తమ సంపాదనలో సింహభాగాన్ని ఖర్చు చేస్తారు. ఈ ఖర్చులు సాధారణంగా అప్పులు లేదా అధిక వడ్డీకి దారితీయవచ్చు.

    • అవసరం లేకపోయినా కేవలం స్టేటస్ సింబల్ కోసం ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు, బట్టలు, యాక్సెసరీలు కొంటారు. ఇవి ఆస్తులు కావు, విలువ కోల్పోయే వస్తువులని గుర్తుంచుకోవాలి.

    • స్తోమతకు మించిన లగ్జరీ కార్లు కొనడం, వాటి ఈఎంఐలు, నిర్వహణ ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతుంటారు. కారు విలువ తగ్గుతూ ఉంటుంది, కానీ అప్పు భారం మాత్రం పెరుగుతూనే ఉంటుంది.

    • నిత్యం ఖరీదైన రెస్టారెంట్లు, పబ్‌లు, విదేశీ పర్యటనలకు వెళ్లడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరుల నుంచి ప్రశంసలు పొందాలని ఆశిస్తారు.

    • అవసరం కంటే పెద్ద ఇల్లు కొనడం లేదా అద్దెకు తీసుకుంటారు. కేవలం రిచ్ ఏరియాలో నివసించాలనే ఉద్దేశంతో అధిక అద్దె చెల్లిస్తారు.

    నిజంగా రిచ్‌గా మారాలంటే అనుసరించాల్సిన మార్గాలు

    • నిజమైన సంపద అంటే బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు, నిరంతరాయంగా వచ్చే ఆదాయ వనరులు కలిగి ఉండటం. నిజమైన ధనవంతులు ఖర్చు చేయడంలో కాకుండా సంపద సమకూర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.

    • ఇతరులను మెప్పించడం అనే ఆలోచనను వదిలి తమ వ్యక్తిగత ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి.

    • ఎంత సంపాదించినా దానికి తగినట్టుగా ఖర్చును పెంచకుండా, ఒక కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.

    • వెంటనే వచ్చే సంతృప్తి (Instant Gratification) కంటే దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.

    • ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేసి ప్రతి నెలా కచ్చితమైన బడ్జెట్‌ను అనుసరించాలి.

    • అధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పులు, వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేయాలి.

    • జీతం రాగానే ఖర్చు చేయడానికి ముందే, కొంత మొత్తాన్ని నేరుగా పొదుపు ఖాతాలోకి లేదా పెట్టుబడిలోకి మళ్లించాలి.

    ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

  • మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరమైన ఖజురహోలో ప్రతిష్టాత్మకమైన ‘ది ఒబెరాయ్ రాజ్‌గఢ్‌ ప్యాలెస్’ను ప్రారంభిస్తున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఇది 76 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్. ఈ చారిత్రక వారసత్వ కట్టడాన్ని ఇటీవల ఒబెరాయ్‌ గ్రూప్‌ పునరుద్ధరించింది. సహజ సరస్సు, మనియాఘర్ కొండల వాలుపై సాల్, పలాష్ అడవుల మధ్య వింధ్యాచల్ పర్యాత శ్రేణుల్లో ఈ ప్యాలెస్ ఉంది.

    యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఖజురహో దేవాలయాలు, పన్నా నేషనల్ పార్క్‌కు సమీపంలో ఈ హోటల్ ఉండటం వల్ల చాలా మంది ఇందులో బస చేసేందుకు అవకాశం ఉందని ఒబెరాయ్‌ గ్రూప్‌ తెలిపింది. ది ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్ ఒబెరాయ్ ఈ పునరుద్ధరణపై స్పందిస్తూ చరిత్రకు తిరిగి జీవం పోసే ప్రయాణంగా దీన్ని అభివర్ణించారు. ఖజురహోలో బుండేలా స్మారక చిహ్నం సమగ్రతను కాపాడుతూనే, ఆధునిక సౌకర్యాలను జోడించినట్లు తెలిపారు.

    ఈ ఎస్టేట్‌లో మొత్తం 65 గదులు, సూట్‌ రూమ్‌లున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ప్యాలెస్ సూట్లు, ప్రైవేట్ పూల్ విల్లాలు, తోటలు/ టెర్రస్‌లతో కూడిన రూమ్స్‌ ఉన్నాయి. వీటిలో కోహినూర్ సూట్ అత్యంత ప్రత్యేకమైనదని కంపెనీ చెప్పింది. ప్యాలెస్ గదుల నుంచి చుట్టూ ‍ప్రదేశాల 360 డిగ్రీల వ్యూను ఆస్వాదించవచ్చని పేర్కొంది.

    ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

  • యాపిల్ ఇంక్ తన ప్రపంచవ్యాప్త టర్నోవర్ జరిమానాలను లింక్ చేసే భారతీయ యాంటీ-ట్రస్ట్ చట్టం నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాల్ చేసింది. ఈ నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాదిస్తుంది. ఈ రిట్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 3న విచారణ చేపట్టనుంది.

    ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్. భారతీయ పోటీ చట్టం (Competition Act)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలపై విధించే జరిమానాలను వారి ప్రపంచ టర్నోవర్‌తో అనుసంధానించే నిబంధనల రాజ్యాంగబద్ధతను కంపెనీ ప్రశ్నించింది.

    అసలు సమస్య ఏమిటి?

    యాపిల్ తన రిట్ పిటిషన్‌లో కాంపిటీషన్ చట్టంలోని సవరించిన సెక్షన్ 27(బి), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) 2024 నాటి టర్నోవర్ నిబంధనలను ప్రధానంగా సవాల్ చేసింది. పోటీ చట్టంలో సవరించిన నిబంధనల ప్రకారం.. పెనాల్టీల సమయంలో కంపెనీ ఉత్పత్తులు, సేవల నుంచి పొందిన గ్లోబల్ టర్నోవర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. తద్వారా జరిమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆదాయాన్ని లెక్కిస్తారు. దాంతో కంపెనీపై ఏదైనా జరిమానా విధించాల్సి వస్తే గ్లోబల్‌ టర్నోవర్‌ను లెక్కించి నిర్ణయం తీసుకుంటారు. ఇది కంపెనీకి నష్టం. యాపిల్ ఈ నిబంధనలను కొట్టివేయాలని కోరుతోంది.

    యాపిల్ న్యాయపరమైన సవాల్‌ 2022లో ప్రారంభమైన యాంటీట్రస్ట్ దర్యాప్తుతో ముడిపడి ఉంది. టిండర్ యజమాని మ్యాచ్ గ్రూప్, కొన్ని భారతీయ స్టార్టప్‌ల ఫిర్యాదుల మేరకు సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. థర్డ్‌ పార్టీ చెల్లింపులను పరిమితం చేస్తున్నట్లు సీసీఐ ప్రాథమికంగా కనుగొంది. ఇన్-యాప్ లావాదేవీలపై 30 శాతం వరకు అధిక కమీషన్లు తీసుకుంటున్నట్లు గమనించింది. దీని ద్వారా ఐఓఎస్ యాప్ స్టోర్‌లో యాపిల్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీసీఐకి ఆధారాలు లభించాయి.

    అయితే, యాపిల్ ఎలాంటి తప్పు చేయలేదని ఖండించింది. తాము న్యాయమైన, సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఒకవేళ ఈ కేసులో సీసీఐ మరిన్ని ఆధారాలు సేకరిస్తే యాపిల్‌ జరిమానా విధించాల్సి వస్తుంది. సీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఆర్థిక సంవత్సరాల్లో దాని సగటు ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం జరిమానా విధించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 38 బిలియన్ డాలర్లగా ఉంటుందని చెబుతున్నారు.

    యాపిల్ సంస్థ వైఖరి

    యాపిల్ తన పిటిషన్‌లో కొన్ని కీలక వాదనలను ముందుకు తెచ్చింది. జరిమానాలను గ్లోబల్ టర్నోవర్‌తో లింక్ చేయడం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నట్టేనని యాపిల్ వాదిస్తోంది. ఇది ఏకపక్షం, అసమానమైనది అని పేర్కొంది. సంస్థ మొత్తం గ్లోబల్ ఆదాయాన్ని పరిగణిస్తూ కేవలం ఒక నిర్దిష్ట మార్కెట్‌లో లేదా కొన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఉల్లంఘనకు జరిమానా విధించడం న్యాయం కాదని వివరించింది. యూకే, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ యాంటీ ట్రస్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘన జరిగిన నిర్దిష్ట భౌగోళిక మార్కెట్లో సంబంధిత టర్నోవర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయని కంపెనీ తెలిపింది.

    డిసెంబర్‌ 3న విచారణ

    ఇంటర్‌లిక్డ్‌ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను సమర్పించాలని ఆదేశించిన సీసీఐ ‘కాన్ఫిడెన్షియాలిటీ రింగ్’ ఉత్తర్వులోని కొన్ని అంశాలను కూడా యాపిల్ రద్దు చేయాలని కోరింది. యాపిల్ తన రిట్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో సీసీఐలో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోర్టును కోరింది. మరిన్ని వివరాల కోసం డిసెంబర్ 3న ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టనుంది.

    ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

  • అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్‌ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

    గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్‌ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్‌ చమురు దిగుమతి చేసుకున్నాయి.

    గణనీయ పెరుగుదల

    నవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్‌ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్‌ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్‌నెఫ్ట్‌(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.

    తగ్గుముఖం పట్టే అవకాశం

    నవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

  • దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్స్టేట్రీసెర్చ్సంస్థ అనరాక్రీసెర్చ్విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.

    ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 20222025 మధ్య లగ్జరీ సెగ్మెంట్‌లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.

    హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఇలా..

    ప్రస్తుతం హైదరాబాద్లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.

    ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్రియల్ఎస్టేట్మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.

Sports

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.

    మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్‌ అందుకుంది.

    మరి డబ్ల్యూపీఎల్‌ 2026 మెగా వేలంలో వీరితో పాటు టాప్‌-10లో ఉన్న ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!
    దీప్తి శర్మ (భారత్‌)
    👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

    అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌)
    👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌

    సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)
    👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్‌ జెయింట్స్‌

    మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)
    👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌

    శ్రీచరణి (భారత్‌)
    👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 ​కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

    చినెలె హెన్రి (వెస్టిండీస్‌)
    👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

    ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)
    👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

    లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)
    👉బ్యాటర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

    ఆశా శోభన (భారత్‌)
    👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌

    లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)
    👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.

    చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర?

  • రాంచీ: ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి గురువారం జార్ఖండ్‌లో ల్యాండ్ అయ్యాడు. రాంచీలోని బిర్సా ముండా విమానాశ్ర‌యంలో అత‌డికి స్పెష‌ల్ వెల్‌కం ల‌భించింది. ఒక‌ప్పుడు కోహ్లితో క‌లిసి క్రికెట్ ఆడిన‌ మాజీ క్రికెట‌ర్ సౌర‌భ్ తివారీ అత‌డికి ద‌గ్గ‌రుండి మ‌రీ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత కోహ్లితో క‌లిసి సౌర‌భ్ తివారీ కెమెరాకు చిక్క‌డంతో వారిద్ద‌రి జ్ఞాపకాలను క్రికెట్ ల‌వ‌ర్స్ గుర్తు చేసుకుంటున్నారు. తొలి నాళ్ల నాటి అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకుంటున్నారు.

    జూనియ‌ర్ ధోనిగా ముద్ర ప‌డిన 35 ఏళ్ల‌ సౌర‌భ్ తివారీ (Saurabh Tiwary).. చాలా సంవత్సరాలు జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో కోహ్లి నాయ‌క‌త్వంలో అండ‌ర్-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులోనూ అత‌డు స‌భ్యుడిగా ఉన్నాడు. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన తివారీ జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. టీమిండియా త‌ర‌పున కేవ‌లం మూడు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 2010, అక్టోబ‌ర్ 20న‌ విశాఖ‌ప‌ట్నంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌తో వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు.

    ఆర్సీబీలోనూ కోహ్లితో క‌లిసి..
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోనూ నాలుగు జ‌ట్లకు ప్రాతినిథ్యం వ‌హించిన తివారీ 93 మ్యాచ్‌లు ఆడాడు. 2008 నుంచి 2010 ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. 2011 నుండి 2013 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జ‌ట్టులో మ‌ళ్లీ విరాట్ కోహ్లితో క‌లిసి ఆడాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన శక్తివంతమైన స్ట్రోక్ ఆటతో జూనియ‌ర్‌ ధోనిగా గుర్తింపు పొందాడు.

    ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత అడ్మినిస్ట్రేష‌న్‌లోకి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JKCA) కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ హోదాలోనే ఇప్పుడు విరాట్ కోహ్లికి హృదయపూర్వ స్వాగ‌తం ప‌లికాడు. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌ల‌వ‌డం క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి రేపింది. మాజీ సహచరులు తిరిగి కలిసిన వీడియో నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌నులు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. "నీలం రంగు సూట్‌లో ఉన్న వ్యక్తి కోహ్లి అండ‌ర్‌-19 సహచరుడు అని ఎవరికీ తెలియదు" అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు. "విమానాశ్రయంలో సౌరభ్ తివారీ!" అని మ‌రొక‌రు పేర్కొన్నారు.  "సౌరభ్ తివారీ.. కరణ్ ఔజ్లా లాగా కనిపిస్తున్నాడు!" అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

    చ‌ద‌వండి: ప‌లాష్ ముచ్చ‌ల్‌ చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..

    కాగా, న‌వంబ‌ర్ 30 నుంచి భార‌త్- ద‌క్షిణాఫ్రికా వ‌న్డే సిరీస్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇరు జ‌ట్లు మూడు వ‌న్డేలు ఆడ‌నున్నాయి. రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన నేప‌థ్యంలో వ‌న్డే సిరీస్ అయినా గెల‌వాల‌ని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. 

     

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు భారీ ధర దక్కింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి వేలంపాటలో యూపీ వారియర్స్‌ ఆమెను ఏకంగా రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆదిలో దీప్తి కోసం ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

    కాగా డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌ (2023) నుంచి దీప్తి శర్మ యూపీ వారియర్స్‌కే ప్రాతినిథ్యం వహిస్తోంది. అలిసా హేలీ గాయం వల్ల దూరం కావడంతో 2025లో యూపీ కెప్టెన్‌గానూ దీప్తి వ్యవహరించింది. అయితే, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆమె సారథ్యంలో యూపీ కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరలేదు.

    ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌
    ఇదిలా ఉంటే.. ఇటీవల ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ విజేతగా నిలవడంలో దీప్తి శర్మదే ముఖ్య పాత్ర. ఈ ఆల్‌రౌండర్‌ మూడు అర్ధ శతకాల సాయంతో 215 పరుగులు చేయడంతో పాటు.. మొత్తంగా 22 వికెట్లు కూల్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకుంది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో హాఫ్‌ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూల్చడం హైలైట్‌గా నిలిచింది.

    ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్ప
    ఈ నేపథ్యంలో యూపీ దీప్తిని రిటైన్‌ చేసుకుంటుందని భావించగా.. అనూహ్యంగా ఆమెను వేలంలోకి వదిలింది. వేలంలో దీప్తి కోసం ఫ్రాంఛైజీలు ఎగబడతాయని భావించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్ప ఎవరూ కనీసం ఆమె వైపు చూడలేదు.

    ఈ క్రమంలో కనీస ధర రూ. 50 లక్షలకు దీప్తి వేలంలోకి రాగా ఢిల్లీ అదే ధరకు దీప్తిని కొనుగోలు చేయాలనుకుంది. ఇంతలో రంగంలోకి దిగిన యూపీ.. రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కార్డు ద్వారా అదే ధర చెల్లించి దీప్తిని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే, ఢిల్లీ ఒక్కసారిగా దీప్తి ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది.

    ఢిల్లీ వదిలేలా లేదని భావించిన యూపీ రూ. 3.2 కోట్ల వద్ద తమ RTM కార్డును ఉపయోగించి దీప్తిని తిరిగి సొంతం చేసుకుంది. ఫలితంగా డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా.. ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌- 2023- రూ. 3.2 కోట్లు) రికార్డు సమం చేసింది. కాగా ఆర్సీబీ 2023లో స్మృతి మంధానను రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆమె లీగ్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కొనసాగుతోంది. 

    చదవండి: WPL 2026: వేలంలో శ్రీచరణికి భారీ ధర

  • టీమిండియా మహిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ఓ యువ‌తి అంగీక‌రించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశాన‌ని, త‌న‌కు మ‌రో ఉద్దేశం ఏదీ లేద‌ని వెల్ల‌డించింది. ప‌లాష్ ముచ్చ‌ల్‌తో జ‌రిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను బ‌య‌ట‌పెట్టింది తానేన‌ని తెలిపింది. ప‌లాష్ ఎలాంటి వాడో తెలియాల‌న్న భావ‌న‌తోనే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. అయితే ప‌లాష్‌తో 4 నెల‌ల క్రితం చాటింగ్ చేశాన‌ని, అత‌డి పెళ్లి ఆగిపోవ‌డానికి వీటికి సంబంధం లేద‌ని తెలిపింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా తాను కొరియోగ్రాఫ‌ర్ కాద‌ని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అంది. ఈ మేర‌కు తాజాగా సోష‌ల్  మీడియాలో పోస్ట్ పెట్టింది.

    ''స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మైన చాట్‌లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. ప‌లాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మ‌ధ్య చాట్‌లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేష‌న్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (ప‌లాష్ ముచ్చ‌ల్‌) గురించి బహిర్గతం చేశాను.

    నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. ప‌లాష్‌తో చేసిన చాట్‌ను బ‌య‌ట‌పెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్య‌తిరేక‌త రావ‌డంతో నా సోష‌ల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివ‌చ్చింది. ప‌లాష్‌తో జ‌రిపిన చాట్‌లను గ‌మ‌నిస్తే.. నేను తప్పు చేయలేదన్న విష‌యం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మ‌హిళ‌కు అన్యాయం నేను చేయ‌లేదు. దయచేసి నన్ను టార్గెట్  చేయ‌వ‌ద్ద‌ని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.

    చ‌ద‌వండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం

    కాగా, స్మృతి, ప‌లాష్ పెళ్లి ఆగిపోయిన నేప‌థ్యంలో మేరీ డికోస్టా అనే యువ‌తి పేరుతో అన‌ధికారిక‌ చాటింగ్ స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ (Palash Muchhal) కుటుంబాలు ఇప్ప‌టివ‌రకు అధికారికంగా స్పందించ‌లేదు. 

     

  • భారత క్రికెటర్‌, కడప ముద్దుబిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి (Shree Charani)కి జాక్‌పాట్‌ తగిలింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఆమె కోసం పోటీపడ్డాయి. ఈ క్రమంలో శ్రీచరణికి భారీ ధర దక్కింది.

    ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2025 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో శ్రీచరణిది ముఖ్య భూమిక. ఈ మెగా ఈవెంట్లో శ్రీచరణి ఏకంగా పద్నాలుగు వికెట్లు పడగొట్టింది. తద్వారా భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నిలిచింది.    

    రూ. 30 లక్షల కనీస ధర
    ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణికి భారీ ధర దక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె అదరగొట్టింది. రూ. 30 లక్షల కనీస ధరతో శ్రీచరణి వేలంలోకి రాగా.. యూపీ వారియర్స్‌ తొలి బిడ్‌ వేసింది. ఆ వెంటనే ఢిల్లీ క్యాపిటల్స్‌ రంగంలోకి దిగి.. ధరను ఏకంగా రూ. 75 లక్షలకు పెంచింది.

    దీంతో యూవీ వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఆ వెంటనే మళ్లీ రూ. 90 లక్షలకు ధరను పెంచింది. ఈ క్రమంలో శ్రీచరణిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ధరను ఏకంగా రూ. 1.3 కోట్లకు పెంచగా.. యూపీ వెనక్కి తగ్గింది. ఫలితంగా శ్రీచరణి రూ. 1.3 కోట్లకు మళ్లీ సొంతగూటి (ఢిల్లీ)కి చేరుకుంది.

    ఎదురులేని చరణి
    కాగా గతంలో శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడింది. 2024 సీజన్‌లో రూ. 55 లక్షలకు ఆమెను ఢిల్లీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దీంతో అత్యధిక ధర దక్కించుకున్న నాటి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల లిస్టులో శ్రీచరణి చేరింది. అరంగేట్రంలోనే ఎలిస్‌ పెర్రీని అవుట్‌ చేసి ఆగమనాన్ని ఘనంగా చాటింది ఈ స్పిన్‌ బౌలర్‌.

    ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీచరణి 2025 ఏప్రిల్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. శ్రీలంకతో ముక్కోణపు వన్డే సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీ20లలోనూ అడుగుపెట్టింది. 4/12 గణాంకాలతో సత్తా చాటి తొలి అంతర్జాతీయ టీ20లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

    ఇక ఇప్పటి వరకు భారత్‌ తరఫున 18 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన 21 ఏళ్ల శ్రీచరణి.. వరల్డ్‌కప్‌లో ఏకంగా పదకొండు వికెట్లు కూల్చి సత్తా చాటింది. ప్రపంచకప్‌ విజేతగా డబ్ల్యూపీఎల్‌ వేలంలోకి వచ్చిన ఆమె కనీస ధర.. దాదాపుగా 333 శాతం పెరగడం విశేషం.

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. తాజా ఎడిషన్‌లో నవీ ముంబై, వడోదరలను ఈ మెగా ఈవెంట్‌ వేదికలుగా ఖరారు చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య డబ్ల్యూపీఎల్‌ నాలుగో ఎడిషన్‌ నిర్వహిస్తామని వెల్లడించింది.

    డబ్ల్యూపీఎల్‌-2026 మెగా వేలం సందర్భంగా లీగ్‌ చైర్మన్‌ జయేశ్‌ జార్జ్‌ గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా మెగా వేలం మొదలుకాగా.. ఐదు ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ప్లేయర్ల కోసం పోటీపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రెండుసార్లు టైటిల్‌ అందించిన భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా వేలంలో కూర్చోవడం విశేషం.

    ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్‌ 2023లో మొదలై ఇప్పటికి మూడు సీజన్లు పూర్తిగా డబ్ల్యూపీఎల్‌ తొలి చాంపియన్‌గా ముంబై నిలిచింది. ఆ మరుసటి ఏడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌ స్మృతి మంధాన ట్రోఫీ అందించింది. ఈ ఫ్రాంఛైజీకి ఇదే తొలి టైటిల్‌. ఇక ఈ ఏడాది హర్మన్‌ మరోసారి తన సారథ్యంతో ముంబైని విజేతగా నిలిపింది.

    కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పాల్గొంటున్నాయి. 
     

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 సీజన్‌ మెగా వేలం ముగిసింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం నాటి ఈ వేలంపాటకు మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా వ్యవహరించారు. 

    డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 73 స్థానాలు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం ఏకంగా 277 మంది వేలంలో పోటీ పడుతున్నారు. ఇందులో 194 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

    చదవండి: WPL 2026: రిటైన్‌ చేసుకున్న, రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా

    WPL 2026 Auction Updates:

    👉వేలంలో చివరి ప్లేయర్‌.. ఆయూషీ సోనిని రూ.30 లక్షలకు కొన్న గుజరాత్‌

    👉డాన్నీ వ్యాట్‌ హాడ్జ్‌ను రూ.50 లక్షలకు కొన్న గుజరాత్‌ 

    👉ప్రతీక్‌ రావల్‌ను రూ.50 లక్షలకు కొన్న యూపీ
    👉మిన్ను మణిని రూ.40 లక్షలకు కొన్న ఢిల్లీ

    👉దయాలన్‌ హేమలతను రూ.30లక్షలకు కొన్న ఆర్సీబీ
    👉రాజేశ్వరి గైక్వాడ్‌ను రూ.40 లక్షలకు కొన్న గుజరాత్‌

     👉ఆసీస్‌ సూపర్‌ బౌలర్‌ మిల్లిసెంట్ హాల్ ఇల్లింగ్‌వర్త్‌ను రూ.10 లక్షలకు కొన్న ముంబై

    👉సైకా ఇషాక్‌ను రూ.30 లక్షలకు కొన్న ముంబై
    👉జి. త్రిషను రూ.10 లక్షలకు తీసుకున్న యూపీ
    👉ప్రత్యుష కుమార్‌ను రూ.10 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ

    👉పూనమ్‌ ఖేమార్‌ను రూ. 10 లక్షలకు కొన్న ముంబై
    👉శివాంగి సింగ్‌ను రూ. 10 లక్షలకు కొన్న గుజరాత్‌

    👉గౌతమీ నాయక్‌ను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
    👉సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొన్న ముంబై
    👉అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్లు త్రివేణి వశిష్టను రూ. 20 లక్షలకు, నల్లరెడ్డిని రూ. 10 లక్షలకు కొన్న ముంబై
    👉సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్లోయీ ట్రియాన్‌ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌
    👉భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ సుమన్‌ మీనాను రూ. 10 లక్షలకు కొనుగోలు చేసిన యూపీ

    👉అమెరికా ప్లేయర్‌ తారా నోరిస్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ వారియర్స్‌.
    👉ఆస్ట్రేలియాకు చెందిన లూసీ హామిల్టన్‌ను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ
    👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌ను రూ. 50 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌
    👉యస్తికా భాటియాను రూ. 50 లక్షలకు కొన్న గుజరాత్‌
    👉సిమ్రాన్‌ షేక్‌ను రూ. 10 లక్షలకు కొన్న యూపీ

    👉షిప్రా గిరిని రూ. 10 లక్షలకు కొనుక్కున్న యూపీ
    👉మమత మడివాలాను రూ. 10 లక్షలకు కొన్న ఢిల్లీ
    👉హ్యాపీ కుమారిని రూ. 10 లక్షలకు సొంతం చేసుకున్న గుజరాత్‌
    👉నందాని శర్మను రూ. 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ
    👉ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ

    👉ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నికోలా క్యారీని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై
    👉ఆల్‌రౌండర్‌ అనుష్క శర్మను రూ. 45 లక్షలకు దక్కించుకున్న గుజరాత్‌
    👉ఆస్ట్రేలియా లెగ్‌ స్పిన్నర్‌ జార్జియా వారేహామ్‌ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన గుజరాత్‌
    👉ఆల్‌రౌండర్లు తనూజ కణ్వార్‌ను రూ. 45, కనిక్‌ అహుజాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌
    👉రహీలా ఫిర్దోజ్‌ను రూ. 10 లక్షలకు కొనుక్కున్న ముంబై

    ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలు
    కొనుగోలు చేసిన ఆర్సీబీ

    వికెట్‌ కీపర్‌ తాన్యా భాటియాను రూ. 30 లక్షలకు కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌

    అరుంధతి రెడ్డి ఆర్సీబీకి
    భారత పేసర్‌, హైదరాబాదీ స్టార్‌ అరుంధతి రెడ్డిని ఆర్సీబీ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది.

    ఎస్‌ సజనను కొనుగోలు చేసిన ముంబై
    సుజన కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి రాగా.. ముంబై రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది.

    ప్రతికా రావల్‌కు భారీ షాక్‌
    భారత స్టార్‌ ఓపెనర​ ప్రతికా రావల్‌ వేలంలో అమ్ముడుపోలేదు. వరల్డ్‌కప్‌ -2025లో సత్తా చాటిన ఆమెపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ఈ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయం అయింది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు ఆమెను కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.

    కశ్వీ గౌతమ్‌కు రూ. 65 లక్షలు
    తొలుత కశ్వీని కొనుగోలు చేసిన యూపీ.. RTM ద్వారా తిరిగి దక్కించుకున్న గుజరాత్‌

    శిఖా పాండేకు రూ. 2.4 కోట్లు
    శిఖా పాండేను కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌

    డియెండ్రా డాటిన్‌ యూపీకి
    యూపీ రూ. 80 లక్షలకు విండీస్‌ ఆల్‌రౌండర్‌ డియెండ్రా డాటిన్‌ను సొంతం చేసుకుంది.

    అమ్ముడుపోని అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు (కనీస ధర రూ. 10 లక్షలు)
    డవీనా పారిన్‌, వ్రింద దినేశ్‌, దిశా కసత్‌, ఆరుషి గోయెల్‌, సనికా చల్కే, హుమైరా కాజీ, అమన్‌దీప్‌ కౌర్‌, గొంగడి త్రిష, జింతిమణి కలిత. యశశ్రీ, షిప్రా గిరి, మమత మడివాలా, ఖుషి భాటియా, ప్రత్యూష కుమార్‌, నందిని కశ్యప్‌, హ్యాపీ కుమారి, నందిని శర్మ, కోమల్‌ప్రీత్‌ కౌర్‌, మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌, షబ్నమ్‌ షకీల్‌, ప్రకాశిక నాయక్‌, భారతి​ రావల్‌, ప్రియాంక్‌ కౌశల్‌, పరుణిక సిసోడియా, జాగ్రవి పవార్‌.

    అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల వేలం
    ముంబైకి సంస్కృతి గుప్త
    రూ. 20 లక్షలకు సంస్కృతిని కొనుగోలు చేసిన ముంబై

    ఆర్సీబీకి అన్‌​క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌
    భారత అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ. 20 లక్షలకు తిరిగి దక్కించుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌ ప్రేమ కోసం బిడ్‌ వేయగా.. RTM కార్డు ద్వారా అదే ధర చెల్లించి సొంతం చేసుకుంది. 

    దీయా యాదవ్‌
    భారత క్రికెటర్‌ దీయా యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 10 లక్షల కనీస ధరకు కొనుక్కుంది.

    ముగిసిన వికెట్‌ కీపర్లు, స్పిన్నర్లు, పేసర్ల వేలం
    ఆశా శోభనకు జాక్‌పాట్‌
    కనీస ధర రూ. 30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్‌ ఆశా శోభనకు జాక్‌పాట్‌ తగిలింది. ఆర్సీబీతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్‌ రూ. 1.1 కోట్లకు ఆమెను దక్కించుకుంది.

    ఆర్సీబీకి లిన్సే స్మిత్‌
    ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లిన్సే స్మిత్‌ను ఆర్సీబీ రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

    షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను కొనుక్కున్న గుజరాత్‌
    సౌతాఫ్రికా స్టార్‌ షబ్నమ్‌ ఇస్మాయిల్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది.

    టైటస్‌ సాధు ధర ఎంతంటే?
    భారత స్పిన్నర్‌ టైటస్‌ సాధును గుజరాత్‌ రూ. 30 లక్షలకు కొనుక్కుంది.

    క్రాంతి గౌడ్‌ ధర ఎంతంటే?
    యూపీ వారియర్స్‌ కనీస ధర రూ. 50 లక్షలకే వరల్డ్‌కప్‌ విన్నర్‌, భారత పేసర్‌ క్రాంతి గౌడ్‌ను సొంతం చేసుకుంది.

    ఆర్సీబీకి లారెన్‌ బెల్‌ 
    24 ఏళ్ల ఇంగ్లండ్‌ పేసర్‌ లారెన్‌ బెల్‌ను ఆర్సీబీ రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది.

    ఉమా ఛెత్రి అన్‌సోల్డ్‌
    వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన ఉమా ఛెత్రికి భారీ షాక్‌. రూ. 50 లక్షల కనీస ధరకు కూడా ఎవరూ ఆమెను కొనలేదుజ

    లిజెల్లె లీ ధర ఎంతంటే?
    సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ లిజెల్లె లీని రూ. 30 లక్షల కనీస ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది.

    హర్లిన్‌ డియోల్‌కు కనీస ధర
    యూపీ వారియర్స్‌ రూ. 50 లక్షలకు భారత ఆల్‌రౌండర్‌ హర్లిన్‌ డియోల్‌ను కొనుగోలు చేసింది.

    రాధా యాదవ్‌ ఆర్సీబీకి
    గుజరాత్‌తో పోటీపడి భారత స్పిన్నర్‌ రాధా యాదవ్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

    స్నేహ్‌ రాణాకు రూ. 50 లక్షలు
    ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 50 లక్షలకు భారత స్పిన్నర్‌ స్నేహ్‌ రాణాను కొనుక్కుంది.

    నదినె డిక్లెర్క్‌ ఏ జట్టుకంటే?
    సౌతాఫ్రికా పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ నదినె డిక్లెర్క్‌ను ఆర్సీబీ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది.

    శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్‌కు
    వరల్డ్‌కప్‌-2025 విజేత, ఆంధ్ర క్రికెటర్‌ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 1.3 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

    చినెల్‌ హెన్రికి రూ. 1.3 కోట్లు
    వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ చినెల్‌ హెన్రీని రూ. 1.3 కోట్లకు కొనుకున్న ఢిల్లీ.

    జార్జియా వోల్‌ ఆర్సీబీకి
    ఆసీస్‌ ప్లేయర్‌ జార్జియా వోల్‌ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.
    కిరణ్‌ నవ్‌గిరేకు రూ. 60 లక్షలు
    భారత బ్యాటర్‌ కిరణ్‌ నవ్‌గిరేను రూ. 60 లక్షలకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు సాధించిన ఏకైక​ భారత క్రికెటర్‌ కిరణ్‌.

    ఫోబే లిచ్‌ఫీల్డ్‌ను కొనుక్కున్న యూపీ
    ఆసీస్‌ యువ బ్యాటర్‌ ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.2 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌

    అమ్ముడుపోని సౌతాఫ్రికా ఓపెనర్‌ తజ్మిన్‌ బ్రిట్స్‌

    సబ్బినేని మేఘనకు షాక్‌
    ఆంధ్ర క్రికెటర్‌ సబ్బినేని మేఘన అమ్ముడుపోలేదు. రూ. 30 లక్షల కనీస ధరకు కూడా ఆమెను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.

    లారా వొల్వర్ట్‌ ఢిల్లీకి
    ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ లారా వొల్వర్ట్‌ను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ ముందుగా బిడ్‌ వేసినా ఢిల్లీ వెనక్కి తగ్గలేదు. లారా కొనుగోలుతో ముగిసిన మార్క్యూ సెట్‌.

    మెగ్‌ లానింగ్‌కు రూ. 1.9 కోట్లు
    ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ మెగ్‌ లానింగ్‌ను రూ. 1.9 కోట్లకు కొనుక్కున్న యూపీ వారియర్స్‌. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా పనిచేసిన లానింగ్‌.

    రేణుకా ఠాకూర్‌కు తక్కువ ధరే!
    భారత స్టార్‌ పేసర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌ను రూ. 60 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్‌ జెయింట్స్‌

    అమేలీ కెర్‌కు ఎంత ధరంటే?
    న్యూజిలాండ్‌ క్రికెటర్‌ అమేలీ కెర్‌ను రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌
    వేలానికి ముందు వదిలేసి మళ్లీ కొనుగోలు చేసిన ముంబై

    సోఫీ ఎక్లిస్టోన్‌ ఆడేది ఆ జట్టుకే
    ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎక్లిస్టోన్‌ను యూపీ వారియర్స్‌ రూ. 85 లక్షలతో తిరిగి సొంతం చేసుకుంది. RTM కార్డు వాడి ఆమెను దక్కించుకుంది.

     దీప్తి శర్మకు డిమాండ్‌ లేదా?
    👉వరల్డ్‌కప్‌ విన్నర్‌ దీప్తి శర్మను పట్టించుకోని ఫ్రాంఛైజీలు
    👉కనీస ధర రూ. 50 లక్షలకు దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ యత్నం
    👉ఇంతలో రంగంలోకి యూపీ వారియర్స్‌
    👉RTM (రైట్‌ టు మ్యాచ్‌) కార్డును ప్రయోగించిన యూపీ
    👉ఈ క్రమంలో యూపీతో పోటీపడిన ఢిల్లీ
    👉రూ. 3.2 కోట్లకు ధర పెంచిన ఢిల్లీ
    👉అనూహ్య రీతిలో RTM కార్డు ద్వారా దీప్తిని రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ
    👉వేలానికి ముందు దీప్తిని వదిలేసిన యూపీ

    రూ. 50 లక్షలతో వేలంలోకి
    👉న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్‌ రూ. 50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

    అమ్ముడుపోని అలిసా హేలీ
    👉ఆస్ట్రేలియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌, ఓపెనర్‌ అలిసా హేలీకి మొండిచేయి
    👉కనీస ధర రూ. 50 లక్షలతో వేలంలోకి వచ్చిన అలిసాను ఎవరూ కొనలేదు.
     

     

  • ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues)ది కీలక పాత్ర. లీగ్‌ దశలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ ముంబైకర్‌ సెమీస్‌లో మాత్రం అదరగొట్టింది. పటిష్ట ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.

    చాంపియన్‌ జట్టు ఆసీస్‌ విధించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే తడబడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా జట్టును ఆదుకుంది. అజేయ శతకం (134 బంతుల్లో 127)తో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఇలా ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పిన జెమీమా.. వ్యక్తిగత జీవితంలోనూ తనకు తానే సాటి అని చాటుకుంది.

    అక్కాచెల్లెళ్ల మాదిరి
    భారత జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) జెమీమాకు ప్రాణ స్నేహితురాలన్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల మాదిరి వీళ్లిద్దరు కలిసి ఉంటారు. తనకు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి కుదిరిన వెంటనే.. ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని జెమీమా సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారానే స్మృతి వెల్లడించింది.

    ఆ తర్వాత స్మృతి- పలాష్‌ హల్దీ, సంగీత్‌ వేడుకల్లో జెమీమా తోటి క్రికెటర్లు అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఆడిపాడింది. కానీ అనూహ్య రీతిలో స్మృతి పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. తొలుత స్మృతి తండ్రి ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరడం.. ఆ తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రిపాలు కావడం.. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చేసినట్లుగా ఉన్న చాట్స్‌ లీక్‌ కావడం సందేహాలకు తావిచ్చాయి.

    ఆగిన వివాహం
    మరోవైపు.. స్మృతి తండ్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి మంధాన కుటుంబం స్పందించలేదు. ఈ నేపథ్యంలో జెమీమా రోడ్రిగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. కష్టకాలంలో స్మృతికి తోడుగా ఉండేందుకు మహిళల బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమైంది.

    స్మృతి కోసం సంచలన నిర్ణయం
    డబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్‌ హీట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి.. ‘‘దురదృష్టవశాత్తూ జెమీ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉండనుంది. తను భారత్‌లోనే ఉండిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం.

    హోబర్ట్‌ జట్టు జెమీ, స్మృతి మంధాన కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి తాను తిరిగి రావాలనుకున్నా.. పరిస్థితుల దృష్ట్యా రాలేకపోతున్నానని జెమీ మాకు చెప్పింది. మా ప్లేయర్లతో ఆమె టచ్‌లోనే ఉంది. జట్టు గెలవాలని ఆమె కోరుకుంటోంది’’ అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.

    కాగా ఈ సీజన్‌లో హీట్‌ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన జెమీమా 37 పరుగులు చేసింది. హోబర్ట్‌ హ్యారికేన్స్‌తో మ్యాచ్‌ తర్వాత స్మృతి పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే, స్నేహానికి ప్రాణమిచ్చే తనకు కెరీర్‌ కంటే.. క్లిష్ట పరిస్థితుల్లో స్మృతి వెంట ఉండటమే సరైందనే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్‌లో భారత్‌ తరఫున డబ్ల్యూబీబీఎల్‌ ఆడిన ఏకైక ప్లేయర్‌ జెమీమా కావడం విశేషం.

    చదవండి: ఇలాగైతే స్మృతిని ఎవరూ పెళ్లి చేసుకోరు!.. తండ్రికి వేధింపులు.. ఇప్పుడిలా!

  • సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. ముఖ్యంగా గువాహటి వేదికగా రెండో టెస్టులో కనీవినీ ఎరుగని రీతిలో 408 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

    ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టు క్రికెట్‌ కోచ్‌గా అతడు పనికిరాడని.. వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.

    కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా..
    టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నమెంట్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) హెడ్‌కోచ్‌గా తప్పుకోగా.. గంభీర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అంతకుముందు కోచ్‌గా గంభీర్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడిపై నమ్మకం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించింది.

    అయితే, గౌతీ వచ్చిన తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గానే రాణిస్తోంది. ఆదిలో శ్రీలంక పర్యటనలో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోయింది భారత్‌. ఆ తర్వాతి ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025, ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్లలో చాంపియన్‌గా నిలిచి సత్తా చాటింది.

    ద్రవిడ్‌కే ఆ క్రెడిట్‌
    కానీ చాంపియన్స్‌ ట్రోఫీలో దక్కిన విజయాన్ని గంభీర్‌ ఖాతాలో వేసేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంగీకరించలేదు. ద్రవిడ్‌ భాయ్‌ తయారు చేసిన జట్టుతోనే ఇది సాధ్యమైందంటూ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌కు టైటిల్‌కు అందించిన హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు.

    పొమ్మనలేక పొగబెట్టి.. ప్రయోగాలతో కొంపముంచి..
    ఇదిలా ఉంటే.. టెస్టుల నుంచి దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. అంతకుముందే స్పిన్‌ లెజెండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తప్పుకోవడానికి కారణం గంభీర్‌ అనే ఆరోపణలు ఉన్నాయి. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా సీనియర్లను వెళ్లగొట్టాడని.. రోహిత్‌ నుంచి టెస్టు, వన్డే కెప్టెన్సీ శుబ్‌మన్‌ గిల్‌కు దక్కడంలో గంభీర్‌ కీలకమనే విమర్శలు వచ్చాయి.

    ఇవన్నీ పక్కనపెడితే.. గంభీర్‌ మార్గదర్శనంలోనే గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియాకు టెస్టుల్లో పరాభవం ఎదురుకావడం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తుగా ఓడటం అతడి రాజీనామా డిమాండ్లకు ప్రధాన కారణం అయ్యాయి. 

    ముఖ్యంగా టెస్టుల్లో కీలకమైన మూడు, నాలుగు స్థానాల్లో తరచూ మార్పులు, ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం ఇస్తూ.. స్పెషలిస్టులను పక్కనపెట్టడం, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు కొంపముంచాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడ్డారు.

    సంధి కాలం
    ఈ నేపథ్యంలో గంభీర్‌ తన భవితవ్యంపై స్పందిస్తూ.. ‘‘టెస్టు జట్టుకు కోచ్‌గా నేను సరైనవాడినా కాదా అనేది చెప్పడం తన చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది నేను గతంలోనే చెప్పినట్లు భారత జట్టు ముఖ్యం తప్ప వ్యక్తులు కాదు.

    చాలా మంది న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి గురించి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇదే యువ జట్టుతోనే నేను ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో మంచి ఫలితాలు రాబట్టిన విషయం మరచిపోవద్దు. నా కోచింగ్‌లోనే జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ కూడా గెలిచింది.

    కివీస్‌తో సిరీస్‌తో దీనిని పోల్చవద్దు. ప్రస్తుతం జట్టులో అనుభవం తక్కువగా ఉంది. ఓటమికి సాకులు చెప్పే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. నిజానికి ‘సంధి కాలం’ అనే మాటను నేను వాడను కానీ మా పరిస్థితి ఇప్పుడు సరిగ్గా అలాగే ఉంది.

    ఈ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో ఉన్న జట్టు ఒక 30 నిమిషాల స్పెల్‌లో కుప్పకూలింది. మన ఆటగాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారు. వారికి తగినంత సమయం ఇవ్వాలి’’ అని గంభీర్‌ విజ్ఞప్తి చేశాడు.

    బీసీసీఐ నిర్ణయం ఇదే!
    ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆసక్తి భారత క్రికెట్‌ వర్గాల్లో నెలకొంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు తాజాగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో గంభీర్‌ స్థానాన్ని వేరే వాళ్లతో భర్తీ చేయాలనే ఆలోచన మాకు లేదు.

    అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. 2027 వరల్డ్‌కప్‌ వరకు అతడి కాంటాక్టు ఉంది. సౌతాఫ్రికాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత జట్టు యాజమాన్యం, సెలక్టర్లతో గంభీర్‌ సమావేశం అవుతాడు. సంధి దశలో టెస్టు జట్టు ప్రదర్శన గురించి అతడి అభిప్రాయం ఏమిటన్నది చెబుతాడు. 

    లోపాలు ఎలా అధిగమించాలో తన ప్రణాళికలు వివరిస్తాడు’’ అని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఇప్పట్లో గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా తప్పించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.

    చదవండి: దంచికొట్టిన సంజూ.. ఇరగదీసిన రోహన్‌.. సరికొత్త చరిత్ర

International

  • వైట్‌హౌజ్‌ వద్ద కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన అగ్రరాజ్యం.. నేరుగా అఫ్గనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలకు దిగింది. అఫ్గన్‌ను ప్రమాదకరమైన నేలగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ దేశ ఇమిగ్రేషన్‌ దరఖాస్తుల సస్పెండ్‌కు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS)ను పురమాయించారు కూడా.  ఈ క్రమంలో.. తాలిబాన్‌ ప్రభుత్వం తాజా పరిణామాలపై స్పందించింది.

    వైట్‌హౌజ్‌ సమీపంలో జరిగిన దాడిలో పాకిస్తాన్‌ ప్రమేయం ఉందా?. కాల్పులకు పాల్పడిన దుండగుడు రెహ్మనుల్లా లఖన్‌వాల్‌ను ఆ దేశమే బ్రెయిన్‌వాష్‌ చేసి పంపిందా?.. అయ్యి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తోంది అఫ్గనిస్తాన్‌. కాబూల్‌ ప్రపంచ దేశాలతో.. ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరస్తోందని చెబుతోంది. ఈ దాడి తమ దేశాన్ని బద్నాం చేసే కుట్ర అయ్యి ఉండొచ్చని.. అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిగితే అసలు విషయం బయటపడుతుందని అంటోంది. 

    తాలిబాన్‌ ప్రభుత్వ ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ భారత్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రమేయం ఉందనిపిస్తోంది. మా దేశగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నంలో భాగమే ఈ దాడి అయ్యి ఉండొచ్చు కూడా. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే నిజం బయటపడుతుంది..

    .. ఇది బయటి దేశాల గూఢచారి సంస్థలు(పాక్‌ ఐఎస్‌ఐను ఉద్దేశిస్తూ..) పని అయ్యి ఉండొచ్చు. అఫ్గాన్లను ఇతర దేశాల భద్రతా ముప్పుగా చూపించే ప్రయత్నమూ కావొచ్చు. ఇందులో ఏ కోణాన్ని మేం వదలిపెట్టబోం. ఎందుకంటే.. అయితే మా విధానం స్పష్టంగా ఉంది. మా పౌరులు ఎప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడరు. ఆఫ్గన్‌ నేలను, ఇక్కడి ప్రజల్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించేందుకు మేం అంగీకరించబోం’’ అని అన్నారాయన. అఫ్గాన్‌ వలస ప్రక్రియను అమెరికా కఠినతరం చేయడంపై స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వం అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. ఆ తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.

    గురువారం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనానికి అతి సమీపంలో జరిగిన ఈ కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. కాల్పుల సమయంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి అఫ్గాన్‌ జాతీయుడని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధ్రువీకరించారు. అతడి పేరు రెహ్మనుల్లా లఖన్‌వాల్‌ (Rahmanullah Lakanwal)గా పేర్కొన్నారు. 2021లో అఫ్గాన్‌లకు అందించిన స్పెషల్‌ వీసాపై అగ్రరాజ్యానికి వచ్చినట్లు తెలిపారు. నేషనల్‌ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని ఎఫ్‌ఐబీ చీఫ్‌ కాష్‌ పటేల్‌ ప్రకటించారు. కాల్పుల్లో నిందితుడికి కూడా గాయాలవడంతో.. అతడిని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

    వైట్‌హౌజ్‌ దాడి ఘటనపై ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఇది ఒక దారుణమైన దాడి. విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య. ఇది మొత్తం దేశంపై జరిగిన దాడి. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దీన్ని మేం ఖండిస్తున్నాం. కాల్పుల అనంతరం అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ భూమి పైనే ప్రమాదకర ప్రాంతమైన అఫ్గానిస్థాన్‌ (Afghanistan)కు చెందినవాడని పేర్కొన్నారు. అతడు జో బైడెన్‌ (Joe Biden) పరిపాలన సమయంలో యూఎస్‌లోకి ప్రవేశించాడు. బైడెన్‌ పాలనలో అలా వచ్చినవాళ్లందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. అలాంటి శరణార్థులు అమెరికన్ల మనుగడకే ప్రమాదకరం’’ అని అన్నారు. ఈ ఘటన తర్వాత వాషింగ్టన్‌లో మరో 500 మంది నేషనల్‌ గార్డ్‌ సిబ్బంది మోహరింపునకు ఆదేశించారు. అంతేకాదు.. ట్రంప్‌ ఆదేశాలతో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) అఫ్గాన్ల ఇమిగ్రేషన్‌ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

  • తల్లి పెన్షన్‌ కోసం ఒక కొడుకు ఎవరూ చేయని, చేయకూడని  పనికి పూనుకున్నాడు. అలా నాలుగేళ్లు మోసం చేశాడు. చివరికి  పోలీసులకు  చిక్కాడు.  కొడుకు ఘనకార్యం  ఏంటి అంటే..


    ఉత్తర ఇటలీలోని బోర్గో వర్జిలియో పట్టణానికి చెందిన  నర్సు  గ్రాజియెల్లా డల్ ఓగ్లియో (85) చనిపోయింది. అయితే ఆమె చనిపోయిందని చెబితే  పెన్షన్‌ రాదేమో ననే భయంతో  ఆమె 56ఏళ్లు కొడుకు  ఎవరూ ఊహించని పనిచేశాడు చట్టబద్ధంగా తన తల్లి పెన్షన్ రావాలంటే.. తల్లి చనిపోయినట్టు ఎవరికీ తెలియకూడదని ప్లాన్‌ వేశాడు. అచ్చం ఆమెలాగే వేషం వేసుకుని అందర్నీ నమ్మించడం మొదలు పెట్టాడు. అలా వేషం మార్చుకుని గత మూడేళ్లుగా ఆమె పెన్షన్‌ పొందుతూ సుమారు రూ.  80 లక్షలు దండుకున్నాడు.  అయితే   మోసం ఎంతో కాలం దాగదు కదా.

    2022లో తన తల్లి మరణించిన  తరువాత, ఆమెలానే బ్లౌజ్ ,స్కర్ట్, లిప్‌స్టిక్, విగ్‌ ధరించేవాడు.  అయితే నవంబర్ 16న, ఐడీ కార్డు రెన్యూవల్ కోసం రిజిస్ట్రీ కార్యాలయానికి  వెళ్లినపుడు అధికారులకు అనుమానం వచ్చింది.   వేషధారణలో ఏదో తేడా ఉందని గమనించారు. ఐడిలోని ఫోటోలో ఉన్న మహిళలాగే కనిపించినప్పటికీ,  మెడపై జుట్టు, భారీ మేకప్  నకిలీది అని అర్థం అయింది. దీంతో అతని పెన్షన్ స్కామ్‌ వెలుగులో వచ్చింది .అలాగే కుటుంబం  రియల్ ఎస్టేట్ , భూమి నుండి వచ్చే ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తూనే ఉన్నాడు.

    ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

    మరి తల్లి శవాన్ని ఏం చేశాడు.
    పోలీసులు కూపీ లాగడంతో తన మారువేషాన్ని అంగీకరించాడు. తన తల్లి  సహజంగానే చనిపోయిందని, అది దాచిపెట్టడానికి ఆమె శవాన్ని మమ్మీఫై చేసినట్టు ఒప్పుకున్నాడు.  దీని ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారుల ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.  నిరుద్యోగి అయిన  ఈ ఇటాలియన్ వ్యక్తిపై కేసు నమోదు చేసి,  దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ సహజ కారణాల వల్ల మరణించి ఉండవచ్చు, కానీ శవపరీక్షలో అసలు విషయం తెలుస్తుందని  విచారణ అధికారి అపోర్టి  చెప్పారు.  ఆ కుటుంబానికి ఎలాంటి  ఆర్థిక సమస్యలు లేవు .ఇది చాలా, చాలా విచారకరమైన కథ అని తెలిపారు. 

    ఇదీ చదవండి: స్మృతి పెళ్లి వివాదంలో కొత్త ట్విస్ట్‌ : పలాష్‌ మాజీ ప్రేయసి ప్రపోజల్‌ వైరల్‌
     

  • చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 11మంది రైల్వే సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి గాయాలయినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం చైనాలోని యున్నాన్ ప్రావిన్స్ కున్మింగ్ నగరంలో ఘోరరైలు ప్రమాదం జరిగింది.  భూకంపాల గుర్తింపును పరీక్షిస్తున్న ఒక టెస్ట్ ట్రైన్, రైలు ట్రాక్ పై విధులు నిర్వహిస్తున్న రైల్వే సిబ్బందిపై పట్టాలు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారని, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ మీడియా సంస్థలు తెలిపాయి. దీంతో ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

    ఈ రైలు ప్రమాదం దశాబ్ద కాలంగా చైనాలో జరిగిన రైలు ప్రమాదాలలో అతి పెద్దదని  ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2011లో చివరిసారిగా ఒక భారీ ట్రైన్ ప్రమాదం జరిగిందని ఆ ఘటనలో 40 మంది మృతిచెందగా 200 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.

     

  • హాంకాంగ్ వాంగ్ హాక్ కోర్ట్ టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 65కు చేరుకుంది. 70 మంది తీవ్రగాయాలపాలవగా , 237 మంది ఆచూకీ లభించడంలేదు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంత తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

     బుధవారం  హాంకాంగ్ లోని వాంగ్ పుక్ కోర్ట్  టవర్స్ లో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 65 మంది దుర్మరణం చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాద ఘటనపై ఆదేశ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఇంత పెద్దఎత్తున మంటలు చెలరేగడానికి ఆ భవన మరమ్మత్తులో ఉపయోగిస్తున్న సామాగ్రి కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

    భవన నిర్మాణం ప్రతి కిటికీలలో స్టైరోఫామ్ తో తయారు చేయబడిన వస్తువులను ఉపయోగించారని దాని కారణంగానే మంటలు ఇంత పెద్దఎత్తున వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టైరోఫామ్ అనేది పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్. దీనిని నిర్మాణరంగంలో, ఫుడ్ ప్యాకేజింగ్ లలో అధికంగా ఉపయోగిస్తారు. అయితే స్టైరోఫామ్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. దీనికి మంటలు అంటుకుంటే అంత తేలికగా ఆర్పలేము. 

    ఉష్ణోగ్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో కూడా ఇది అధికంగా మండుతుంది. అంతేకాకుండా ఇది మండుతున్నప్పుడు అధిక మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ విడుదల చేస్తుంది.  ఈ నేపథ్యంలో భవన మరమ్మత్తులో ఇంత హానీకర వస్తువులను ఎందుకు ఉపయోగించారు అని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

    హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

    కాగా హాంకాంగ్ లోని అసోసియేయేట్ ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం మరమ్మత్తులు చేపడుతున్న ఇంజినీరింగ్ కంపెనీ ఎటువంటి భద్రత ప్రమాణాలు పాటించలేదని  నివేదించింది. హాంకాంగ్ లో నిన్న ప్రమాదం జరిగిన భవంతి 1980లో నిర్మించారు. ఆ టవర్స్ లో 2వేలకు పైగా అపార్ట్ మెంట్స్ ఉండగా 4వేలకు మందికి పైగా నివసిస్తున్నారు. ఇటీవల ఆ భవనాలకు మరమ్మత్తులు చేస్తుండగా ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

  • ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్‌ ఖాన్  ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ, పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్  ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపధ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు.

    తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్‌ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతనిని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

    ఇదేవిధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కుటుంబ సభ్యులపై జైలు అధికారుల ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: కర్ణాటక: డిసెంబర్‌ ఒకటి లోగా కొత్త సీఎం?
     

Family

  • విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్‌. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. 

    అతడే అభిజయ్ అరోరా. భారత్‌కి చెందిన అభిజయ్‌ చక్కగా స్విట్జర్లాండ్‌లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్‌తో చదవాలనే డ్రీమ్‌తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్‌ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్‌ చేసేశాడు. 

    ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్‌ లేకుండా హార్వర్డ్‌లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్‌ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్‌ కూడా రాలేదు. తనకున్న జాబ్‌ నెట్‌వర్కింగ్‌ కూడా హెల్ప్‌ అవ్వలేదు. 

    ఏ జాబ్‌ స్ట్రాటజీ వర్కౌట్‌ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్‌ (యూట్యూబ్)లో ప్రొడక్ట్‌ మేనేజర్‌ జాబ్‌ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. 

    పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్‌ చేసుకున్నాడు అరోరా. 

    ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్‌ జాబ్‌ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు  భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్‌ అని పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: ఇంజనీర్‌ కమ్‌ డాక్టర్‌..! విజయవంతమైన స్టార్టప్‌ ఇంజనీర్‌ కానీ..)

     

  • జంక్‌ఫుడ్‌ ప్రమాదకరమని నిపుణులు హెచ్చిరిస్తుంటే..పెడచెవిన పెట్టిన వాళ్లెందరో. అంతెందుకు చీట్‌మీల్‌ పేరుతో బర్గర్లు, పీజాలు లాగించేసేవాళ్లు కోకొల్లలు. అలాంటి వాళ్లందరికీ ఈ ఘటన ఓ కనువిప్పు. మారథాన్‌ ఛాలెంజ్‌లో భాగంగా తిన్న జంకఫుడ్‌ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రాణాలనే హరించేసింది. ఎవ్వరూ ఇలాంటి ఛాలెంజ్స్‌లో పాల్గొనేందుకు జంకేలా చేసింది కూడా.

    అసలేం జరిగిందంటే..రష్యన్‌ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ 30 ఏళ్ల డిమిత్రి నుయాన్జిన్, బరువు తగ్గించే కార్యక్రమాన్ని ప్రోత్సహించే నిమిత్తం ఈటింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఆయన సదుద్దేశ్యంతో చేస్తే..ఆ ప్రయోగం అతడి ప్రాణమే పోయింది. అదికూడా నిద్దురలోనే ప్రాణం పోవడం బాధకరం. అధిక బరువు ఎంత పెద్ద సమస్య అని అవగాహన కల్పించే నిమిత్తం డిమిత్రి 25 కిలోలు బరువు పెరగాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు. 

    ఈ మేరకు మారథాన్‌లొ భాగంగా అతిగా తినే ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. తన క్లయింట్లు తనలా బరువు తగ్గేలా ప్రేరణనివ్వాలని ఈ ఛాలెంజ్‌ పాల్గొన్నాడు. ఆ నేఫథ్యంలోనే రోజుకు దాదాపు 10 వేల కేలరీలకు పైగా జంక్‌ఫుడ్‌ తిన్నాడు. అనుకున్నట్లుగా బరువు పెరిగాడు..తన ఫాలోవర్స్‌కి కూడా తనలోని ఆ ఛేంజ్‌ని బహిర్గతం చేయడమే కాకుండా ఆ అధిక బరువుని తగ్గించుకునేలా కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు కూడా. 

    అయితే అనూహ్యంగా చనిపోవడానికి ఒక రోజు ముందు తను చేసే వర్కౌట్ల సెషన్‌ను రద్దు చేసుకున్నాడు కూడా. తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైద్యుడుని సంప్రదించాలను చూస్తున్నట్లు నెటిజన్లతో షేర్‌ చేసుకున్నాడు కూడా. అయితే అదే చివరి మాట అవుతుందని అనుకోలేదు  అతడి అభిమానులు, ఫాలోవర్లు. అతడి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అతడి గుండె నిద్దురలోనే ఆగిపోయిందని, అవే అతడి చివరి మాటలయ్యాయనని బాధగా చెబుతున్నారు. 

    అంతేగాదు డిమిత్రి గత నవంబర్‌ 18న చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో లేస్‌ ప్యాక్‌ తినడం తోపాటు తాను 105 కిలోలు బరువు పెరిగినట్లు కూడా వెల్లడించాడు. అంతేగాదు నెలలో కనీసం 13 కిలోలు పెరిగినట్లు తెలిపాడు. నెటిజన్లు డిమిత్రి మృతికి స్పందిస్తూ..అతడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అలాగే ఇలాంటి ఈటింగ్‌ ఛాలెంజ్‌ల్లో పాల్గొనేవాళ్లకు ఈ సంఘటన ఓ గొప్ప పాఠం అంటూ పోస్టులు పెట్టారు. కాగా, డిమిత్రీ ఈ ఈటింగ్‌ ఛాలెంజ్‌లో భాగంగా రోజు వారీ ఆహారంలో పేస్ట్రీలు, కేక్‌లు, మయోన్నెస్‌లో ఉడికించిన డంపింగ్స్‌, రాత్రి భోజనంలో రెండు పిజ్జాలు తప్పనిసరిగా తిన్నట్లు తెలిపాడు. 

    అధిక బరువుని తగ్గించడం ఎలా అనేదానిపై ప్రేరణ కలిగించేలా బరువు పెరగాలనుకుంటే..అది అతడి ఉసురే తీసేసింది. డిమిత్రీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఓరెన్‌బర్గ్ ఒలింపిక్ రిజర్వ్ స్కూల్ అండ్‌ నేషనల్ ఫిట్‌నెస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌, పైగా ఒక దశాబ్దం పాటు ఉన్నత రష్యన్లకు వ్యక్తిగత కోచ్‌ కూడా ఆయన. అలాంటి వ్యక్తి జంక్‌ ఫుడ్‌ ఎంత ప్రమాదకరం అనేది చూపిద్దామనుకుంటే అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. 

    నిజంగానే ఇంత ప్రమాదమా అంటే..
    జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు.ఎందుకంటే ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకు అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తరచుగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

    (చదవండి: ఇంజనీర్‌ కమ్‌ డాక్టర్‌..! విజయవంతమైన స్టార్టప్‌ ఇంజనీర్‌ కానీ..)

     

  • జేఎన్‌టీయుహెచ్‌ వజ్రోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన  ఎస్‌ఎస్‌ఆర్‌. కృష్ణ త్రీడీ ఇల్యూషన్‌ ఆర్టిస్ట్‌. ఈయన నేలపై వేసే చిత్రాలు మనిషికి భ్రమ కల్పిస్తాయి. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు.. భ్రమ కల్పించటమే ఈ 3డీ ఆర్ట్‌ ప్రత్యేకత. ఇలాంటి 3డీ ఆర్టిస్ట్‌లు దేశం మొత్తంలో తక్కువ మంది ఉన్నారు. 

    అమ్మ ప్రోత్సాహంతో.. 
    చిన్నప్పటి నుంచి కృష్ణ బొమ్మలు గీస్తూ ఉండటంతో ఆసక్తిని గమనించి బొమ్మలు గీయడం నేరి్పంచారు ఆయన తల్లి. అక్కడి నుంచి బొమ్మలు వేయడం సాధన చేయడంతో 3డీ చిత్రాలు వేయడం అలవాటైంది. మిగతా ఆర్టిస్టులకు భిన్నంగా 

    బొమ్మలు గీయడంలో ప్రత్యేకత 
    ఉండాలనే కోరిక సింగారపు శివరామకృష్ణను 3డీ ఆర్టిస్టుగా నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రం కొండగట్టులో బీటెక్‌ అభ్యసించే సమయంలో మెకానికల్‌ విభాగం హెచ్‌ఓడీ ఎన్‌వీఎస్‌ రాజు మెకానికల్‌ విద్యకు సంబంధించి పాఠ్యపుస్తకం రాశారు. ఇందులో బొమ్మలు వేయడానికి అతడికి అవకాశం ఇచ్చారు. మంథని నుంచి అమెరికా వరకూ అతడి ప్రతిభకు ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. 

    రాహుల్‌ గాంధీ జోడో యాత్రలో 3డీ ఆర్ట్స్‌ గీశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా ఆర్ట్‌ ఫెస్టివల్‌కు ఆయనను ఆహా్వనిస్తారు. ప్రస్తుతం జేఎన్‌టీయులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకల్లో ఆయనకు యంగ్‌ అచీవర్‌ అవార్డును ప్రదానం చేశారు. 

    (చదవండి: ఇంజనీర్‌ కమ్‌ డాక్టర్‌..! విజయవంతమై స్టార్టప్‌ ఇంజనీర్‌ కానీ..)

  • ఇంజీనీరింగ్, వైద్య విద్య రెండు చాలా భిన్నమైన కోర్సులు. రెండింటిని చదవాలనుకోవడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లుగా.. దేనిలోనూ మంచి స్కిల్‌ని సాధించలేం, రాణించలేం. కానీ అమ్మాయి రెండింటిలోనూ సత్తా చాటి అందర్నీ విస్మయపర్చింది. ఇక్కడ ఈ మహిళ ఇంజనీరింగ్‌ కెరీర్‌ని ఎంచుకుని..మంచిగా జాబ్‌లో సెటిల్‌ అయ్యాక స్టెతస్కోప్ పట్టుకునెందుకు రెడీ అవ్వడం విశేషం. అలాంటి నిర్ణయం వినడానికి కాస్త హాస్యాస్పదంగా అనిపించినా..ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని చూపించి ప్రేరణగా నిలిచింది.

    ఆ అమ్మాయే ఆకృతి గోయెల్‌. 2015లో ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్‌గా బయటకు అడుగుపెట్టి మంచి కెరీర్‌ని నిర్మించుకుంది. వేగవంతమైన స్టార్టప్‌ల ప్రపంచంలో విజయవంతమైన ఇంజనీర్ అనిపించుకుంది. కార్పోరేట్‌ ప్రపంచంలోకి దూసుకుపోయి..అందివచ్చిన నిచ్చెనలన్నీ ఎక్కేసింది. టీమ్‌ లీడర్‌గా అందరూ అసూయపడే రేంజ్‌లో వేతనం అందుకుంది. తనకు ఎదురేలేదు అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతున్న ఆమెకు సడెన్‌గా ఇక చాలు ఇందులో ఈదింది అనిపించింది. 

    ఎంతో అలసిపోతున్నట్లుగా, అసంతృప్తిగా సాగుతోంది లైఫ్‌ అనిపించిందామెకు. రోజురోజుకి ఇది వద్దు అనిపిస్తోందామెకు. ఏదో తెలియని ఒత్తిడితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా లాక్‌డౌన్‌ టైంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం ధైర్యంగా తీసుకుంది. ఆ తర్వాత తగిన విరామం తీసుకుని, ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చేవరకు వేచి ఉంది. తదుపరి యోగా టీచర్‌గా, న్యాయవాదిగా లేదా హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌గా మారాలని  అని ఆలోచిస్తూ ఉండేది. 

    సరిగ్గా అప్పుడే తన చిన్ననాటి కల గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు డాక్టర్‌గా వైద్య విద్యను అభ్యసించడమే ఫన్నీనా అనుకుంది. వయోపరిమితి లేదు కదా అని సరదాగా నవ్వుకుంది. ఇంతలో సుప్రీంకోర్టు వైద్య ప్రవేశ పరీక్షలకు ఉన్నత వయో పరిమితిని తొలగించింది. అంటే ఈ రంగంలోకి పయనించు అనేందుకు ఇది గ్రీన్‌ సిగ్నల్‌ కాబోలు అనుకుని..ఎలాంటి ఆలోచన లేకుండా మళ్లీ కెరీర్‌ని మొదటి నుంచి ప్రారంభించింది. అలా క్లాస్‌రూమ్‌లో బయాలజీ పాఠాలపై మనసులగ్నం చేసింది. బహుళ మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను నిర్వహించిన ఆ మహిళ పెన్నుతో తడబడింది. 

    ఉపాధ్యాయులను అడగడానికి ఇబ్బంది పడే ప్రశ్నలను సైతం అడిగేందుకు భయపడలేదు. పదేళ్ల తర్వాత తరగతికి రావడం అంత సులభం కాలేదామెకు. అయినా అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ చదవుకోసాగింది. మరోవైపు స్నేహితులు, బంధువులు టైం వేస్ట్‌ చేసుకుంటుందంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ ఆకృతి ఇంజీరింగ్ కెరీర్‌లో సక్సెస్‌ అందుకున్నా.. ఇందులో కూడా గెలుపు నా సొంతం అవ్వాలన్న కసి మరింత పెంచుకుంది. అవిశ్రాంతంగా చదివింది. 

    దాదాపు వంద మాక్‌టెస్ట్‌లకు పైగా రాసింది. ఆందోళనకు గురైనప్పుడల్లా..కుటుంబ మద్దతు తీసుకుని మళ్లీ రీఛార్జ్‌ అవుతుండేది. అలా నీట్ యూజీ పరీక్షలో  676 ​​స్కోరు తెచ్చుకుని డాక్టర్‌ కోర్సు అభ్యసించింది. 2026లో డాక్టర్‌గా బయటకు అడగుపెట్టనుంది. కార్పొరేట్ లీడర్ నుంచి  వైద్య విద్యార్థిగా సాగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా..దానిపై స్ట్రాంగ్‌గా నిలబడాలి, నిలదొక్కుకునేలా విజయ ఢంకా మోగించాలని ఆకృతి స్టోరీ చెబుతోంది కదూ..!.

    (చదవండి: పర్యావరణ స్ఫూర్తి: క్లీన్‌ ఎనర్జీ స్టార్స్‌..!)

     

Andhra Pradesh

  • సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డలో ఓ హోంగార్డు సెల్ఫీ వీడియో వైరల్‌ కావడం కలకలం రేపుతోంది. ఇసుక, రేషన్‌ బియ్యం, పేకాట వ్యవహారం విచ్చలవిడిగా నడుస్తోందని.. నిజాయితీగా డ్యూటీ చేస్తుంటే ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ హోంగార్డు వాపోయాడు. ఈ క్రమంలో తన తోటి హోంగార్డులపైనా సంచలన ఆరోపణలు చేశాడు. 

    హోంగార్డు నరేష్‌ విడుదల జిల్లా ఎస్పీకి పంపిన ఆ ఫిర్యాదు వీడియోలో..  నా తోటి హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీనుతో పాటు టీవీ5కి చెందిన ఓ ప్రతినిధి నన్ను వేధిస్తున్నారు. అవనిగడ్డలో ఇసుక , రేషన్ బియ్యం , పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. నా డ్యూటీ నేను చేసినా నన్ను టార్గెట్ చేశారు. నా డ్యూటీ నేను చేయడం తప్పా. నేను దళితుడిగా పుట్టడమే తప్పా. అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడిగానే పుట్టాలా?.. 

    పేకాట ఆడేవారిని పట్టుకున్నా ఎమ్మెల్యే మనుషులంటూ హోంగార్డు దుర్గారావు విడిచిపెట్టేస్తున్నారు. నన్ను మోపిదేవి నుంచి హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయించారు. నన్ను వేధిస్తున్నారు. మీరే న్యాయం చేయండి. మీరు న్యాయం చేయకపోతే చనిపోమన్నా చనిపోతాను. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వడం లేదు..  మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలిసి మీకు నా ఆవేదన పంపిస్తున్నా. దయచేసి అవనిగడ్డ డివిజన్ లో పోలీసు వ్యవస్థను చక్కదిద్దండి ఆ వీడియోలో నరేష్‌ కోరాడు. 

    స్పందించిన ఎస్పీ.. 
    హోంగార్డ్ సెల్ఫీ వీడియోపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారణకు ఆదేశించారు. పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించామని.. విచారణ నివేదిక అందిన వెంటనే తగిన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారాయన.

  • విశాఖపట్నం: సెన్యార్‌ ముప్పు తొలగిందని అనుకునేలోపే మరో తుపాను దూసుకొస్తోంది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం.. శ్రీలంక వైపు కదులుతూ  రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలను భారత వాతావరణ శాఖ(IMD) అప్రమత్తం చేసింది. 

    దిత్వా ప్రస్తుతం ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి  610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదిలింది.  ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి,  దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. 

    ఈ ప్రభావంతో.. ఏపీలో రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తుపాను నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దిత్వా తుపాను నేపథ్యంలో అన్ని పోర్టులలో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.

    మరోవైపు దిత్వా ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలపై కూడా ఉండనుంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఈ తుపానుకు దిత్వాగా యెమెన్‌ నామకరణం చేసింది. దీనర్థం పువ్వు అని.

    Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం

Politics

  • సాక్షి, తాడేపల్లి: ఆదాయం వచ్చే అన్ని శాఖల్లో వేలుపెడుతూ.. తనకు ఇచ్చిన శాఖను మాత్రం మంత్రి నారా లోకేష్‌ గాలికి వదిలేశారని వైఎస్సార్‌సీపీ గుంటూరు అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు..

     నారా లోకేష్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ హస్టళ్లలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కలుషిత ఆహారం తిని విద్యార్థులు రోగాల పాలవుతున్నా పట్టించుకోవటం లేదు.  కామెర్లతో పిల్లలు చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.  నారా లోకేష్‌ విద్యా, ఐటీ శాఖలను గాలికి వదిలేశారు. సీఎంగా ట్రైనింగ్‌ అవుతున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో వేలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో ఆయన ఉన్నారు. చిన్నవయసులోనే ప్రవచనాలు చెబుతూ కొత్త అవతారం ఎత్తారు. 

    సోషల్ మీడియాలో జగన్ పై ఏఐ వీడియోలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకవైపు దారుణమైన పోస్టులు పెట్టిస్తూ మరోవైపు ట్వీట్ లో ప్రవచనాలు చెప్తున్నారు. రాజకీయాల్లో దుష్ట సంప్రదాయాలు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు. మీడియాను అడ్డు పెట్టుకుని ప్రచారం పొందటమే పనిగా పెట్టుకున్నారు. పిల్లల ముందు చంద్రబాబు దారుణమైన అబద్దాలు చెప్పారు. తన వెన్నుపోటు రాజకీయాల గురించి వాస్తవాలు చెబితే బాగుండేది. 

    చంద్రబాబు, లోకేష్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ యాంటీ హీరోలుగా తయారయ్యారు. హీరోలుగా నటిస్తూ విలన్ పనులు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అటు చంద్రబాబు కోసమూ పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

    జగన్ ప్రభుత్వం వచ్చాకే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని పవన్ కళ్యాణ్ అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారు. కానీ నిజాలేంటో అక్కడి రైతులే చెప్పారు(ఈ సందర్భంగా రైతులు పవన్‌ ఎదుట మాట్లాడిన వీడియోను అంబటి ప్రదర్శించారు. ప్రశ్నించటానికే పుట్టిన పార్టీ అని చెప్పుకున్న పవన్ ఎదుటివారు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోతున్నారు. కూటమికి సపోర్టు చేసిన విషయమ్మీద తన మనిషే ప్రశ్నించినా సమాధానం చెప్పలేక పోయిన పిరికి వ్యక్తి పవన్. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగానే కాదు.. మంత్రిగా కూడా పనికి రాడు. అసలు రాజకీయాలకే పనికి రాని వ్యక్తి పవన్‌​‍’’ అని అంబటి మండిపడ్డారు.

    ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి

    బూతులు మాట్లాడటంలో పవన్ కళ్యాణ్ ని మించినవారు లేరు. సోషల్ మీడియాలో లోకేష్ ఆర్గనైజ్డ్‌గా  బూతులు మాట్లాడిస్తున్నారు. పవర్ లేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన జస్ట్‌ ఫోటోల ఉప ముఖ్యమంత్రి. అసలైన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది మాత్రం లోకేష్. అమరావతి నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోంది. లోకేష్, పవన్ కళ్యాణ్ దోచుకుని దాచుకుంటున్నారు. ప్రజలే సరైన సమయంలో సమాధానం చెప్తారు. అధికారం కోసం ఇతరుల కాళ్లు పట్టుకోవడం కాదు. మేము కూటమితో పోరాడి అధికారంలోకి వస్తాం అని అంబటి ఉద్ఘాటించారు.

  • సాక్షి, తాడేపల్లి: ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్‌ జగన్ ఎంతో తపించి మెడికల్‌ కాలేజీల తీసుకొస్తే.. వాటిని చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బొత్స నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ బృందం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

    అనంతరం తాడేపల్లి పార్టీ కేంద్రకార్యాలయంలో బొత్స ఈ అంశంపై మాట్లాడారు. కోవిడ్‌ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాం. పేదలకు మేలు జరగాలనే వైఎస్‌ జగన్‌ మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారు. వైద్య రంగాన్ని వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం వైద్య రంగానికి నిధులు కేటాయించారు. 

    ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. చంద్రబాబు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో కాలేజీలను పెట్టాలని చూస్తున్నారు. ఐదు కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి. మిగతావి క్రమబద్దంగా పనులు జరుగుతున్నాయి. జగన్‌కు మంచి పేరు రాకూడదనే ప్రైవేటీకరణకు వెళ్తున్నారు. అవి పూర్తయితే జగన్ కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. 

    ..మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం. అన్ని‌ ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌ వాళ్ల చేతుల్లో ఉండకూడదు. అన్ని విషయాలు గవర్నర్‌కు వివరించాం. దీనిపై ఒక కమిటీని‌ పంపించి ర్యాండమ్ చెకింగ్ చేయమని కోరాం. ప్రైవేట్‌ వాళ్లు ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు?. లాభాపేక్షతో వ్యాపారం చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి?. పేద పిల్లలు వైద్య విద్యని ఎలా చదవగలరు?. పీపీపీని వెనక్కు తీసుకునే వరకు మా‌ పోరాటం ఆగదు’’ అని బొత్స స్పష్టం చేశారు. 

    ఇంకా బొత్స ఏమన్నారంటే.. 👉జగన్ హయాంలో రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేలా చేశారు. చంద్రబాబుకు కోపం ఉంటే మాపై తీర్చుకోవాలి. అంతేగానీ పేదల మీద అంత కోపం ఎందుకు?. ఓటు వేసి గెలిపించిన పాపానికి అదే పేదల మీద కక్ష తీర్చుకోవటం న్యాయమేనా?. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్వ నాశనం చేశారు. 

    👉జగన్ హయాంలో ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. ట్యాబులు ఇస్తే విద్యార్థులు గేమ్ లు ఆడుకున్నారని మాక్ అసెంబ్లీలో చెప్పించారు. ఇలా పిల్లలతో చెప్పించటానికి కాస్తన్నా సిగ్గు ఉండాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇంగిత జ్ఞానం లేదు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవచ్చు. అంతేగానీ బాధ్యతలేని వ్యక్తి లాగా మాట్లాడటం సరికాదు

    Botsa : జగన్ కు మంచి పేరు వస్తుందనే బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు

    👉రాష్ట్రంలో అసలు ప్రభుత్వమే లేదు. ఏ వ్యవస్థ మీదా పర్యవేక్షణ లేదు. ఎల్లోమీడియాలో ఆహాఓహో అనిపించుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రైతులు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతుంటే అసలే మాత్రం పట్టించుకోవటం లేదు. హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వానికి పట్టటంలేదు. ఆస్పత్రులలో సరైన వైద్యం అందటం లేదు. ఇలాంటి వాటి గురించి కూడా చంద్రబాబు పట్టించుకోవటం లేదు

    👉రాజ్యాంగ ఆమోద దినోత్సవానికి ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదు?. రాజ్యాంగంలో ప్రతిపక్షాన్ని పిలవవద్దని ఉందా?. ప్రతిపక్షం గురించి పట్టించుకోని ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు

    👉పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?. ఇంకొకరు మాట్లాడితే తప్పా?. పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు?. ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? అని బొత్స నిలదీశారు.

  • ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనసందోహాన్ని చూసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ పార్టీల నాయకులు జగన్‌పై, ఆయన పర్యటనలపై విమర్శలు చేయడం సహజం. కానీ స్వతంత్ర మీడియా పేరు చెప్పుకునే ఎల్లోమీడియా కూడా గుక్కపెట్టి రోదిస్తున్న తీరు మాత్రం జనంలో నగుబాటుకు గురవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి సంస్థలు బరితెగించి చేస్తున్న చిల్లర విమర్శలు కాస్తా.. వారి దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు అనంతపురం సమీపంలోని రాప్తాడుకు వెళ్లారు. 

    ఆ సందర్భంగా ఏభైవేల మందికి పైగా జనం  ఆయనకు స్వాగతం చెప్పారు. ఆయన కాన్వాయి వెంట పరుగెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఎన్నికలై ఏడాదిన్నర కాలం కాకముందే ప్రజలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని స్పష్టమైనట్లు ఈ జనసందోహం చెబుతోంది. అదే సమయంలో ఇంత ప్రజాభిమానం కలిగిన నేత ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజంగానే ఓడిందా అన్న సంశయం చాలామందికి కలిగింది. ఏదో మతలబు జరిగిందని ఈవీఎంల ప్రభావమో, పోలింగ్‌ సమయం తరువాత పోలైనట్టుగా చెబుతున్న సుమారు ఏభై లక్షల అదనపు ఓట్ల మహత్యమో కావచ్చు కానీ ప్రజలు మాత్రం అప్పుడు, ఇప్పుడు జగన్‌వైపే ఉన్నారన్న మాటలూ వినిపిస్తున్నాయి. 

    ఒక రాప్తాడు మాత్రమే కాదు.. తుపాను బాధితుల పరామార్శకు మచలీపట్నం వెళ్లినా అదే జన కెరటం. సత్తెనపల్లిలో ఒక పార్టీ నేత కుటుంబాన్ని పలకరించడానికి వెళ్లినా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  

    కొన్ని నెలల క్రితం  జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా నెల్లూరు నగరం అంతా కదిలివచ్చినంత జన తరంగం  కనిపించింది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వచ్చినప్పుడు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏమాటకామాట. తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసుల మాదిరి కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరో ఒకరు రఫ్పా,రప్ఫా అని సినిమా డైలాగును పోస్టరు రూపంలో ప్రదర్శించినా తప్పుడు కేసు పెట్టే ఆలోచన చేయలేదు. ఏపీలో అయితే జగన్ అభిమానులు కదిలితే కేసు. మాట్లాడితే కేసుగా ఉంది పరిస్థితి. జగన్ మచిలీపట్నం టూర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే  కైలే అనిల్ కుమార్‌పై కేసులు పెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టారు. 

    హైదరాబాద్‌లోనూ తరగని జగన్‌ అభిమానాన్ని చూసి తెలుగుదేశం పార్టీతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లు జీర్ణించుకోలేకపోయాయి. అసహ్యం పుట్టించేలా పిచ్చి రాతలు రాశాయి. టీవీ చానళ్లలో పిచ్చి వాగుడు వాగారు. ఇవి ఎంతవరకు వెళ్లాయంటే అర్జంట్‌గా జగన్‌పై కేసులను  తేల్చేయాలట. వారు కోరుకున్న రీతిలో శిక్షించాలట. ఈ సందర్భంలో కొంతమంది టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు వెగటు పుట్టించాయి. వర్ల రామయ్య వంటివారు ఏకంగా న్యాయమూర్తులకే విజ్ఞప్తి చేసినట్లు మాట్లాడారు. మరో చోటా నేత జగన్‌ను ఎన్ కౌంటర్ చేయాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం యాంకర్లుగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలు జగన్‌ కోసం ఆ రకంగా రావడం ఏమిటని ప్రశ్నించారు. చాలాచాల అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ఏపీ నుంచి తరలించారని ఏడుపుగొట్టు కూతలు కూశారు. 

    జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు లోపల సన్నివేశాలు వీడియో తీయరాదు.అయినా కొందరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. జగన్ కోర్టు హాలులో నిలబడితే అదేదో తప్పు అన్నట్లుగా ప్రచారం చేశారు. కోర్టులో జగన్ సాక్ష్యుల స్థానాలలో కూర్చుని కనిపించారని మరొకరి ఆక్షేపణ. న్యాయమూర్తి రావడానికి ముందు ఎవరైనా కోర్టులో కూర్చోవచ్చు. దీనిపై వైసిపి నేత, మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. కోర్టులో వీడియోలు తీయడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయినప్పుడు ఆయనను హెలికాఫ్టర్లో విజయవాడకు తీసుకు రావాలని పోలీసు అధికారులు  భావించారు.కాని చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. బస్సులోనే ప్రయాణిస్తానని పట్టుబట్టారు.  

    పోలీసులు ఒప్పుకుని  నంద్యాల నుంచి విజయవాడకు  తరలించారు. అది అప్పట్లో పోలీసులు వ్యవహరించిన పద్దతి. కాని ఇప్పుడేమో  ఎలా ప్రవర్తిస్తున్నారో  వేరే చెప్పనవసరం లేదు. చిలకలూరిపేట మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బస్సు వద్ద హడావుడి చేశారు. నినాదాలు చేశారు. చంద్రబాబు విజయవాడ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన కూడా తన లాయర్ పక్కన  కూర్చున్న సంగతిని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తదుపరి ఆయన కూడా లేచి నిలడ్డారు.ఆ సన్నివేశాలను ఎవరూ రికార్డు చేయలేదు. ఆరోగ్య సమస్యల పేరు చప్పి చంద్రబాబు  హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నప్పుడు కూడా వైసీపీ ఎక్కడా అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని, అది తమ సంస్కృతి అని పొన్నవోలు అన్నారు. కాని ప్రస్తుతం టీడీసీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

    చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య సమస్యలు ఏమయ్యాయో కాని రాత్రంతా గంటల తరబడి ర్యాలీ చేసి రాజమండ్రి నుంచి ఉండవల్లి కరకట్ట నివాసానికి చేరుకున్నారు. అప్పుడు ఈనాడు  ‘‘జైలు నుంచి జనం గుండెల్లోకి’’ అని శీర్షిక పెట్టింది. దారి పొడవునా నీరా'జనాలు"అని రంకెలేసింది. చంద్రబాబుకు నిజంగా అన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే తెల్లవార్లూ ర్యాలీ చేయవచ్చా అని ప్రశ్నించలేదు. జగన్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రం ఇదే పత్రిక ‘‘జగన్ మార్కు బలప్రదర్శన’’ అని ఏడుపుగొట్టు వార్త ఇచ్చింది. ఆయన అనుచరులు హల్ చల్ చేశారట. అంతకు ముందు బందరు ప్రాంతానికి వెళ్లినప్పుడైతే ‘‘అడుగడుగునా అరాచకమే’’ అంటూ నీచమైన శీర్షిక పెట్టింది. హైవేపై గుమికూడదని పోలీసులు షరతు పెట్టడాన్ని కూడా సమర్థించి తన లేకి బుద్ది ప్రదర్శించుకుంది. 

    చంద్రబాబు హైవేలపై ర్యాలీ తీసినప్పుడు, పుంగనూరు వంటి చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్‌ను దగ్ధం చేసినప్పుడు మాత్రం ఈ మీడియాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. చంద్రబాబు కందుకూరులో రోడ్డు మధ్యలో మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా అది పోలీసుల వైఫల్యం అని ప్రచారం చేసింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ  తన వికృతత్వాన్ని అంతా ప్రదర్శించి జగన్‌కు హైదరాబాద్‌లో ప్రజాస్పందనపై  ఒక  వ్యాసం రాసి అక్కసు వెళ్లగక్కారు. చంద్రబాబుపై అసలు కేసులే లేనట్లు, బెయిల్‌పై లేనట్లు ఆ విషయాలేవి ప్రస్తావించకుండా, జగన్ కేసులపైనే  నీచాతినీచంగా రాసుకుని స్వామి భక్తి ప్రదర్శిస్తే, సోషల్ మీడియాలో పలువురు ఆయనను ఉతికి ఆరేశారు.అయినా వారేమి సిగ్గుపడే పరిస్థితి లేదనుకోండి. ఏది ఏమైనా టీడీపీ ఎంత ఘోరంగా మాట్లాడినా, వారికి బానిసత్వం చేసే ఎల్లో మీడియా ఎంతగా ఏడ్చి పెడబొబ్బలుపెట్టినా, జగన్‌కు దిష్టి తీసిన చందమేనని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.


    - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Komaram Bheem

  • నవోదయలో యూత్‌ గ్రామ సభ

    కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో బుధవారం కేంద్ర విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల సంయుక్త ఆదేశాల మేరకు మోడల్‌ యూత్‌ గ్రామసభ నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులు, గ్రామస్తుల పాత్రలు పోషించారు. ఆరోగ్యం, కూరగాయల పెంపకం, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంపు, హెల్త్‌ క్యాంప్‌, మహిళల స్వయం ఉపాధి, వ్యవసాయ పంటలకు మద్దతు ధర తదితర అంశాలపై 45 నిమిషాలపాటు చర్చించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రామయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కోసిని మాజీ సర్పంచ్‌ నగునూరి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు హరీబాబు, శ్రీఅంకిత్‌ పాల్గొన్నారు.

  • నేటి

    కెరమెరి/లింగాపూర్‌/వాంకిడి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి జిల్లాలోని ఐదు మండలాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలు స్వీకరించనున్నారు. తొలి విడతలో జైనూర్‌ మండలంలోని 26 పంచాయతీలు, 222 వార్డులు, కెరమెరి మండలంలోని 31 పంచాయతీలు, 250 వార్డులు, లింగాపూర్‌ మండలంలోని 14 పంచాయతీలు, 112 వార్డులు, సిర్పూర్‌(యూ) మండలం 15 పంచాయతీలు, 124 వార్డులు, వాంకిడి మండలం 28 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఐదు మండలాల్లోని 114 సర్పంచ్‌ స్థానాలతోపాటు 944 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు 27 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. స్టేజ్‌ 1, 2 రిటర్నింగ్‌ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలతోపాటు మీడియా సెల్‌, ఎంపీఎంసీ కమిటీ, గ్రీవెన్స్‌ సెల్‌, కంట్రోల్‌ రూంల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేపట్టనున్నారు.

  • సృజనా

    ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థి దశలోనే శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించే దిశగా విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలోనే విజ్ఞాన మేళాలు నిర్వహిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం పలికేందుకు జిల్లా కేంద్రంలోని సెయింట్‌ మేరీ ఉన్నత పాఠశాలలో 53వ రాజ్యస్తరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ మనాక్‌ జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలల నుంచి 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. నిత్య జీవితంలో సవాళ్లు– వైజ్ఞానిక పరిష్కారాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, హరిత శక్తి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి వనరుల వినియోగం, వినోదాత్మక గణిత నమూనాలు అనే అంశాల్లో జిల్లాస్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి 400 మంది విద్యార్థులు 300 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఇందులో 280 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, 120 ఇన్‌స్పైర్‌ మనాక్‌ ప్రాజెక్టులు ఉన్నాయి.

    ముగిసిన ప్రదర్శనలు

    మూడు రోజులుగా జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనలు బుధవారం ముగిశాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన 35 మంది విద్యార్థులకు ప్రొఫెసర్‌ శంకర్‌, కోకన్వీనర్‌ దేవాజీ, జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌, ఎస్‌వో శ్రీనివాస్‌ బహుమతులు ప్రదానం చేశారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 21 మంది, ఇన్‌స్పైర్‌ మనాక్‌ ప్రాజెక్టులో 12, సైన్స్‌ సెమినార్‌లో ఒక్కరు. టీఎల్‌ఎంలో ఒక్కరు రాష్ట్రస్థాయిలో ప్రదర్శన ఇవ్వనున్నారు.

    ఘాట్‌ రోడ్లపై ప్రమాదాల నివారణ

    ఘాట్‌ రోడ్లపై ప్రమాదాల నివారణకు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అజయ్‌కుమార్‌ ప్రాజెక్టు రూపొందించాడు. గైడ్‌ టీచర్‌గా తిరుపతయ్య వ్యవహరించారు. తిరుపతి, శ్రీశైలంతోపాటు జిల్లాలో కెరమెరి ఘాట్‌ రోడ్లు ఉన్నాయి. మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేందుకు స్తంభాలపై సెన్సార్‌ లైట్లు ఏర్పాటు చేశాయి. మూల తిరుగుతున్న సమయంలో రెడ్‌లైట్‌ వెలుగుతుంది. అటువైపు నుంచి వచ్చే వాహనం డ్రైవర్‌ అప్రమత్తమై నెమ్మదిగా వస్తారు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.

    ఎరువులు, విత్తనాలు వేసే యంత్రం

    చాలా మంది రైతులు భుజంపై మోస్తూ విత్తనాలు, ఎరువులు వేస్తారు. వారి కష్టాలు తీర్చేందుకు సిర్పూర్‌(టి) ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శివశంకర్‌, వరుణ్‌తేజ ప్రాజెక్టు రూపొందించారు. స్మార్ట్‌ సాలిడ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రే మిషన్‌తో రోజుకు ఐదెకరాల వరకు విత్తనాలు, డీఏపీ మందులు వేసుకోవచ్చు. రూ.5వేల ఖర్చుతోనే మిషన్‌ తయారు చేసుకోవచ్చు. లక్ష్మణ్‌ గైడ్‌ టీచర్‌గా వ్యవహరించారు.

    ప్రమాదాల నివారణకు స్మార్ట్‌ బస్సు

    కర్నూల్‌ బస్సు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రమాదాల నివారణకు స్మార్ట్‌ బస్సు ప్రాజెక్టును కాగజ్‌నగర్‌ ఆశ్రమ పాఠశాలకు చెందిన సునీల్‌ రూపొందించాడు. బస్సుకు నాలుగు వైపులా ఏదైన వాహనం తగిలితే ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నప్పుడు అలారం మోగుతుంది. రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. గైడ్‌ టీచర్‌గా ప్రీతి వ్యవహరించారు.

    భూకంపాన్ని ముందే గుర్తించేలా..

    ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి రాకేశ్‌, గైడ్‌ టీచర్‌ రమేశ్‌ సాయంతో భూకంపాన్ని 30 నిమిషాల ముందే గుర్తించే పరికరం రూపొందించాడు. ఎర్త్‌ క్విక్‌ అలారం ఏర్పాటు చేసుకుంటే ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించవచ్చు. భూమిలో సెన్సార్‌ ఏర్పాటు చేసుకుని సోలార్‌ బ్యాటరీతో స్తంభానికి లైట్‌ ఏర్పాటు చేసుకుంటే భూకంపం వచ్చే ముందు అలారం మోగుతుంది. దీనికి రూ.2వేల లోపే ఖర్చవుతుంది.

  • వంద ప

    కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సీహెచ్‌సీ) 30 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.26 కోట్ల నిధులను మంజూరు చేసింది. సివిల్‌ పనుల కోసం రూ.18కోట్లు కేటాయించారు. మిగిలిన నిధులను పరికరాల కొనుగోలుకు వెచ్చించనున్నారు. నూతన భవన నిర్మాణం కోసం పురాతన పీహెచ్‌సీ భవనాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలోనే 100 పడకల ఆస్పత్రిని కట్టేందుకు అధికారులు స్థలాన్ని చదును చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

    పాత భవనాలు నేలమట్టం

    వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని పట్టణంలోని ప్రధాన రహదారి సమీపంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ సమీపంలో, ఇతర ప్రభుత్వ స్థలాల కోసం ఎమ్మెల్యే, ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రయత్నాలు చేశారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీహెచ్‌సీ బిల్డింగ్‌తోపాటు సుమారు 40ఏళ్ల క్రితం నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేశారు. ప్రస్తుతం చదును చేసిన ఆ స్థలంలోనే జీ+2 పద్ధతిలో భవనం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సీహెచ్‌సీ జీ+1తో కొనసాగుతున్న భవనంపై మరో అంతస్తు నిర్మించనున్నారు. 30 పడకల ఆస్పత్రిగా కొనసాగుతుండగా, భవన నిర్మాణం పూర్తయితే వంద పడకలు అందుబాటులోకి వచ్చి రోగులకు మెరుగైన సేవలు అందనున్నాయి. తెలంగాణ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

    మెరుగైన వైద్యసేవలకు ఆస్కారం

    సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు కాగజ్‌నగర్‌ సామాజిక ఆస్పత్రికి కీలక సేవలు అందిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. గర్భిణులు స్కానింగ్‌, ప్రసవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కొత్త ఆస్పత్రి పూర్తయితే కీలకమైన వైద్యులు, పరికరాలు సమకూరనున్నాయి.

    శంకుస్థాపనకు ఏర్పాట్లు

    30 పడకల నుంచి వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి నిర్మాణానికి పాత భవనం కూల్చివేసి చదును చేశాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో

    శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు

    చేస్తున్నాం.

    – అవినాష్‌, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌

    మెరుగైన వైద్యం అందించాలని..

    మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్షతో రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించాం. ఎల్లగౌడ్‌తోటలో ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తాం. గైనకాలజిస్ట్‌, జనరల్‌ ఫిజిషీయన్‌, ఎనస్థషీయా, ఈఎన్‌టీ సర్జన్‌తో సహా ఎంబీబీఎస్‌ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. – పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే

  • పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి

    ఆసిఫాబాద్‌అర్బన్‌: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలతో ఏర్పాట్లపై సమీక్షించారు. గురువారం ఉద యం 10.30 గంటల నుంచి మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్టాటిస్టిక్‌ సర్వేయలెన్స్‌, ప్లయింగ్‌ సర్వేయలెన్స్‌ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే మాట్లాడారు. మొదటి విడతలో లింగాపూర్‌, సిర్పూర్‌– యూ, జైనూర్‌, కెరమెరి, వాంకిడి మండలాల్లో ఫారం– 1 నోటీసు ప్రకటించి 27 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. బ్యా లెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సింగిల్‌ నామినేషన్లు వచ్చే స్థానాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతిగౌడ్‌, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

    రాజ్యాంగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

    ఆసిఫాబాద్‌అర్బన్‌: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే రాజ్యాంగం అవసరమని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భారత పౌరులు ప్రాథమిక హక్కులతో ప్రశాంతంగా జీవించేందుకు రాజ్యాంగం మా ర్గదర్శకమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి పనిచేయాలని సూచించారు. అ నంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.