సాక్షి,హైదరాబాద్: కేంద్ర సర్వీసుల చరిత్రలోనే తొలిసారి గ్రూప్-1 డీఎస్పీగా పోలీసు శాఖలో కెరియర్ ప్రారంభించిన ఓ అధికారి అదనపు డీజీపీ స్థాయికి ఎదిగారు. సాదారణంగా కన్ఫర్డ్ ఐపీఎస్ ఇన్సెక్టర్ జనరల్(ఐజీ)ర్యాంక్కే పరిమితం అవుతారు. కానీ ప్రస్తుత రాచకొండ పోలీసుల కమిషనర్ జీ.సుధీర్బాబు చరిత్ర సృష్టించారు. 1989 బ్యాచ్ డీఎస్పీగా సర్వీసులోకి అడుగపెట్టిన సుధీర్ బాబు 2002లో ఐపీఎస్గా (పదోన్నత పొందడం) కన్ఫర్డ్ అయ్యారు. .
హైదరాబాద్ నగరంలోని అత్యంతక్లిష్టమైన ఈస్ట్జోన్,నార్త్ జోన్లకు ఆయన ఎస్పీ ర్యాంకులో డీసీపీగా సేవలందించారు. ఆ తర్వాత డీజీఐ,ఐజీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎక్కడ పని చేసినా తన దైన ముద్రవేసుకుంటూ,సౌమ్యుడిగా, వివాద రహితుడిగా విధులు నిర్వహించే సుధీర్బాబు ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనర్గా ఉన్నారు.
తాజాగా,సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం 2001 బ్యాచ్కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు డాక్టర్. అకున్ సబర్వాల్ ఐపీఎస్, జి. సుధీర్బాబు ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జి. సుధీర్బాబు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి లేదా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పదోన్నతి అమల్లోకి వస్తుంది.
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ కమ్లిబాయ్ పెంటయ్య విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ప్రమాదంలో సౌజన్య (7) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే… ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్లిబాయ్ పెంటయ్య గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమయంలో చిన్నారి సౌజన్య కారు కిందపడి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలికను వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీలో కారే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపించగా, సర్పంచ్ కమ్లిబాయ్ భర్త పెంటయ్య మాత్రం బాలిక కారు కింద పడలేదని వాదిస్తున్నారు. ఈ అంశంపై గ్రామస్థులకు, పెంటయ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో ప్రస్తుతం ఉద్రిక్తత కొంతమేరకు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 3 గంటలపాటు మంత్రులతో సీఎం సమావేశం సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం చూపాలని రేవంత్ అన్నారు. అన్ని జడ్పీ పీఠాలను క్లీన్స్వీప్ చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేశారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ పై సమావేశంలో చర్చ జరిగింది.
మంత్రుల సమావేశంలో జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరిగింది. డివిజన్ల ఏర్పాటుపై మంత్రులకు సీఎం రేవంత్ వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యతన్న రేవంత్.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు లభించిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు కొన్ని పొరపాట్లు చేశారని.. వాటిని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృత్తం కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరించారు.
ఈ నెల 29న అసెంబ్లీ సమావేశం కానుంది. జనవరి 2 నుంచి సమావేశాలను ప్రభుత్వం కొనసాగించనుంది. సమావేశాల్లో ఎంపీటీపీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరగనుంది. సభలోకి ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రధానంగా గోదావరి కృష్ణా జలాల ఎజెండాగా ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
సాక్షి హైదరాబాద్: నగర వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహానగర పురపాలక సంస్థ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్కు వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల పెండింగ్ బకాయిలపై 90శాతం మినహాయింపు ప్రకటించింది. వినియోగదారుడు కేవలం ప్రాపర్టీ ట్యాక్స్తో కలిపి కేవలం 10శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.
కాగా ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిష్కృతమైంది. ఔటర్ రింగ్ రోడ్డు అనుకోని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలకు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ ఆపర్ వీటికి వర్తించనుంది. ఈ లెక్కలతో జీహెచ్ఎంసీకి భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం ఆఘ మేఘాలపై పూర్తి చేసింది. మహానగర విస్తరణకు నవంబర్ 25న మంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందించగా గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేశారు. డిసెంబర్ 2న మెుత్తం 27 పట్టణ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో గతంలో 150 కార్పొరేటర్ స్థానాల సంఖ్య 300కు పెంచుతూ ప్రభుత్వం డీలిమిటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజనలో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. వార్డుల విభజన అభ్యంతరాలపై హైకోర్టులో 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యంతరాల గడువు పూర్తైనందున పిటిషన్ల విచారణను హైకోర్టు ముగించింది.
కాగా, శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను పరిపాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించారు. విలీనానికి ముందు 750 చదరపు కిలోమీటర్ల పరిధిలో 150 వార్డులుగా ఉన్నప్పుడు కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, కొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. ఒక వార్డు రెండు నియోజకవర్గాల పరిధిలో ఉండేది. ఇలాంటి వాటికి తావులేకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని 300 వార్డులుగా విభజించినట్లు జీహెచ్ఎంసీ చెబుతోంది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు.
అందులో భాగంగా ఈ సంవత్సరం 1-7-2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది.
జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి 71,387 మందికి లబ్ధి చేకూరనుంది.
సాక్షి, హైదరాబాద్: వరుస చెక్ డ్యామ్ కూలిన ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిద్దమా? అనే అంశం పై రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు. పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యామ్లో కూలిన ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూలిపోయిన చెక్ డ్యామ్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. నాసి రక నిర్మాణం లేదా నాణ్యతలేమి తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావాలనే ధ్వంసం చేసినట్లు నిర్ధారణ అయితే కఠిన శిక్షలు తప్పవన్నారు. ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
విచారణను వేగవంతం చేయాలని విజిలెన్స్ శాఖను ఆదేశించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యామ్లను ధ్వంసం చేస్తే ఊరుకోమన్న మంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు.
సాక్షి నిర్మల్: ఆ గ్రామంలో ప్రజల కష్టాలను తీరుస్తానని ఆ యువ సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. దీంతో అతని మాట నమ్మిన ప్రజలు తమ కష్టాలను తీరుస్తాడనే ఉద్దేశంతో అతనని సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఇచ్చిన మాటను ఏలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సర్పంచ్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రహించి దానిని అరికట్టడం కోసం ఏకంగా తానే ఎలుగుబంటి రూపం ధరించి కోతులను తరిమాడు.
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వారు గెలవగానే మర్చిపోతుంటారు. మళ్లీ ఐదు సంవత్సరాలకు గానీ వారికి ఆవాగ్దానాలు గుర్తుకురావు. కానీ నిర్మల్లో మాత్రం ఇటీవల ఎన్నికైన యువ సర్పంచ్ గ్రామ బాగోగుల చూస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకోవడం కోసం ఏకంగా ఎలుగుబంటి రూపమే ధరించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. గత రెండు, మూడు ఏళ్లుగా గ్రామ్ంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలంతా కలిసి చందాలు వేసుకొని వాటిని తరిమికొట్టేందుకు బోన్ల ఏర్పాటు చేశారు. వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్దగా ప్రభావం లేకుండా పోయింది.
దీంతో ఏలాగైనా కోతులను గ్రామం నుంచి తరిమికొట్టాలని భావించిన గ్రామ సర్పంచ్ రంజిత్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కోతుల బెడదను నివారించడానికి ఎలుగుబంటి వేశం వేసి గ్రామంలో కలియతిరిగారు. వానరాలను బెదిరిస్తూ వాటిని అక్కడి నుంచి తరిమికొట్టారు. కోతులు సైతం ఆయనను చూసి నిజమైన బల్లూకమోనని భావించి ఆ గ్రామం నుంచి పరారవుతున్నాయి.
Innovative solution to #monkey problem – young #sarpanch dressed as a bear.The new sarpanch dressed as a bear to drive away the monkey menace in the village. When he approached monkeys in bear getup,the monkeys ran away.#Nirmal District, Kadem Mandal – #Telanganapic.twitter.com/ICCs0i6z5P
దీంతో ప్రస్తుతం ఆ గ్రామంలో కోతుల బెడద కొంతమేర తగ్గిందని ప్రజలు అంటున్నారు. యువ సర్పంచ్ ఆలోచనతో పాటు ప్రజలకు మంచి చేయాలనే తన ఆలోచనను గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు.
ఖమ్మం: సమాజంలో ఒకప్పుడు చిన్నచూపునకు గురై, ఉపాధి మార్గాలు లేక యాచనకే పరిమితమైన ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మెప్మా అధికారుల చొరవ, ప్రభుత్వ ప్రోత్సాహంతో వారు ఇప్పుడు వ్యాపారులుగా ఎదుగుతున్నారు. మొదటి విడతలో ట్రాన్స్జెండర్లతో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడు సంఘాలకు రుణాలు ఇప్పించడం ద్వారా స్వయం శక్తితో ఎదిగేందుకు అవకాశం కల్పించారు.
గౌరవంగా బతికేలా.. ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రోత్సాహం, మెప్మా అధికారుల చొరవతో వారందరితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించారు. మెప్మా అధికారులు వారికి పొదుపుపై అవగాహన కల్పించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు సామాజిక రక్షణతోపాటు ఆర్థిక భరోసా లభించింది.
బ్యాంక్ లింకేజీ రుణాలు.. నగరంలోని ట్రాన్స్జెండర్లతో మెప్మా ఆధ్వర్యంలో ఐదు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేయించారు. మూడు సంఘాలకు రూ.3 లక్షల చొప్పున రుణం ఇవ్వగా.. సంఘంలోని పది మంది సభ్యులకు రూ.30 వేల చొప్పున అందాయి. దీంతో వారు తమకు నచ్చిన రంగాల్లో స్వయం ఉపాధిని ప్రారంభించారు. రుణం తీసుకున్న సంఘాల్లో విశ్వం స్వయం సహాయక సంఘ సభ్యులు రూ.3లక్షలు సకాలంలో చెల్లించడంతో మరో రూ.10 లక్షల బ్యాంక్ లింకేజీ రుణం అందించారు. ఇక మిగిలిన రెండు సంఘాలు కూడా రుణాలను సక్రమంగానే చెల్లిస్తున్నాయి.
అదర్శ జీవితం గడుపుతూ.. గౌరవప్రద జీవనానికి ఖమ్మంలోని ట్రాన్స్జెండర్లు మార్గదర్శకులుగా మారారు. ఒకప్పుడు యాచనే ప్రధాన వృత్తిగా ఉన్న వీరు ప్రస్తుతం తమ కాళ్లపై తాము నిలబడగలమనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నారు. ‘మాకు గౌరవం కావాలి, మేమూ సమాజంలో భాగమే’ అని చాటిచెబుతూ, ఇతర ప్రాంతాల్లోని ట్రాన్స్జెండర్లకు ఖమ్మం బిడ్డలు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి వచ్చిన రుణంతో చిన్న తరహా వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. అలాగే కేటరింగ్, ఇతర రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని బ్యాంకర్లతో మాట్లాడి రుణం ఇప్పించారు. అధికారులు తీసుకున్న చొరవతో ట్రాన్స్జెండర్లలో ఆర్ధిక స్థిరత్వం ఏర్పడింది.
మరికొందరికి ఉపాధి కల్పించేలా.. విశ్వం స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన బోడ శివాని తనకు వచ్చిన రూ.30వేల రుణంతో టీస్టాల్ ఏర్పా టు చేసుకుంది. తద్వారా వచ్చే ఆదాయంలో కొంత రుణం కింద చెల్లిస్తోంది. టీ స్టాల్ బాగానే నడుస్తుండటంతో మరింత అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ స్వ యం సహాయక సంఘం సభ్యులు తమ రుణమొత్తం రూ.3 లక్షలు చెల్లించడంతో మరో రూ.10లక్షల రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చారు. ఈ రుణంతో మరో ఆరుగురు సభ్యులతో వేర్వేరు వ్యాపారాలు ఏర్పాటు చేయించనున్నట్లు శివాని తెలిపింది. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తమకు మంచి అవకాశం కల్పించారని చెప్పింది.
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయంలోకి సింగపూర్కు చెందిన ఓ వ్యక్తి ఏఐ సాంకేతికత కలిగిన గ్లాసులు ధరించి వచ్చారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతనిని అరెస్టు చేశారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతికత కలిగిన కలిగిన వస్తువులతో ఆలయంలోకి వచ్చినందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పడుకున్నరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి అధికారులు ఐదెంచెల భద్రత కల్పిస్తారు. డ్రోన్, స్మార్ట్ సెన్సార్లు వంటి ఆధునాతన పరికారలతో నిరంతంరం నిఘా నేత్రాలలో ఉంచుతారు. అయితే ఆలయంలోకి మెుబైల్స్, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.
ఈ నేపథ్యంలోనే ఏఐ మెటా సాంకేతికత కలిగిన గ్లాసులను ధరించి వచ్చిన విదేశీ భక్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయ నిబంధనలు తెలియక తాను గ్లాసులు ధరించానని ఆ భక్తుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అనంతరం అతనిని కోర్టులో హాజరు కావాల్సిందిగా చెప్పి వదిలి వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అరస్టైన వ్యక్తి పేరు తిరుపనీన్ అని ప్రస్తుతం ఆయన శ్రీలంక సంతతికి చెందిన వ్యక్తి కాగా ప్రస్తుతం సింగపూర్లో నివాసం ఉంటున్నారని తెలిపారు.
కేరళ శబరిమల సన్నిధానం పర్యవేక్షణకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. సన్నిధానం పరిసరాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, ఫుడ్ కాంప్లెక్స్లు ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకపోవడంతో పాటు సరైన నిబంధనలు పాటించిన వ్యాపార సముదాయాలకు జరిమానా విధించారు.
అయ్యప్ప సన్నిధాన పవిత్రతను కాపాడడానికి దేవస్థానం బోర్టు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది వరకే శబరిమలలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తిగా నిషేదం విధించారు. ఈ నేపథ్యంలో శబరిమలలోని హోటళ్లు, ఫుడ్కోర్టులు, ఇతర వ్యాపార సముదాయాలలో అధికారులు సేప్టీ డ్రైవ్ చేపట్టారు. పరిశుభ్రత లేకుండా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిపై దాదాపు రూ. 98 వేల జరిమానా విధించారు.
భక్తులు రద్దీని దృష్టిని ఉంచుకొని అధిక ధరలకు వస్తువుల అమ్మడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం తదితర అంశాలను ఆరా తీశారు. ఆహార పదార్థల ధరలను పట్టికలో పొందుపర్చాలని వాటిని ఎట్టి పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తులకు కచ్చితంగా వేడినీటినే సరఫరా చేయాలని కూల్ వాటర్ ఇవ్వకూడదని తెలిపారు. అదే విధంగా దేవస్థానం ఉద్యోగస్థుల పేరుతో మోసం చేసే వారిపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు.
పంజాబ్ మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ఐజీ అమర్ సింగ్ చాహల్ తన నివాసంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అమర్ సింగ్ చాహల్ సోమవారం సెక్యూరిటీ గార్డు రివాల్వర్ ఉపయోగించి తనను తాను కడుపులో కాల్చుకున్నారు. సంఘటనా స్థలం నుండి 12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ శర్మ తెలియజేశారు. పంజాబ్లోని పాటియాలాలో చాహల్ ఆత్మహత్యాయత్నం విషయం తమ దృష్టికి రాగానే పోలీసు బృందాలు అతని నివాసానికి చేరుకుని, ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాహెల్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.
Breaking : Punjab ex-IPS officer Amar Singh Chahal, accused in 2015 Faridkot firing case, critical after alleged 'suicide' attempt pic.twitter.com/7NRdu1hEuh
సూసైడ్ నోట్ లో ఏముంది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు, అందులో చాహల్ ఆర్థిక మోసానికి గురయ్యాడని రాసి ఉంది. ఈ మేరకు చాహల్ పంజాబ్ పోలీస్ డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్లో రూ.8.10 కోట్ల విలువైన ఆన్లైన్ మోసం కేసు గురించి ప్రస్తావించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మోసం, తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఒత్తిడికి గురైనట్టు సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాహల్ ఐజీ పదవి నుండి పదవీ విరమణ చేసినప్పటి నుండి పాటియాలాలో నివసిస్తున్నారు.
కోట్కాపుర కాల్పుల కేసులో నిందితుడు కాగా 2015లో ఫరీద్కోట్లో జరిగిన బెహ్బాల్ కలాన్ ,కోట్కాపుర కాల్పుల కేసు నిందితుల్లో అమర్ సింగ్ చాహల్ కూడా ఒకరు. 2023, ఫిబ్రవరిలో, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్.కె. యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అమర్ సింగ్ చాహల్తో సహా పలువురు సీనియర్ పంజాబ్ అధికారులపై ఫరీద్కోట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా గతంలో కూడా సీనియర్ పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని సీనియర్ పోలీసు అధికారి వై. పురాన్ కుమార్ చండీగఢ్లోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకు డీజీపీ, ఏడీజీసీ ఎస్పీతో సహా 10 మంది అధికారులను నిందిస్తూ ఆయన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాసిన సంగతి తెలిసిందే.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మరాఠా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. కలిసికట్టుగా ముంబై ఎన్నికల బరిలోనే నిలిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముందడుగు పడిందని, ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మున్ముందు ముంబై రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉంటాయి.
ముంబై రాజకీయాలు అనగానే ముందుగానే ఠాక్రే కుటుంబం గుర్తుకు వస్తుంది. మరాఠా పులిగా పేరొందిన బాల్ ఠాక్రే (Bal Thackeray) మహారాష్ట్రలో రాజకీయాలను శాసించారు. ఆయన తర్వాత శివసేన పార్టీ చాలా అటుపోట్లు ఎదుర్కొంది. ప్రస్తుతం రెండు పార్టీలుగా కొనసాగుతోంది. శివసేన పార్టీని ఏక్నాథ్ షిండే దక్కించుకోవడంతో బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) పేరుతో పార్టీని నడుపుతున్నారు. శివసేను చీల్చి బీజేపీతో ఏక్నాథ్ షిండే చేతులు కలపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపు తిరిగాయి. ఈ క్రమంతో ఉద్ధవ్ ఠాక్రేపై సానుభూతి పెరిగింది. రెండు దశాబ్దాల వైరాన్ని వీడి రాజ్ఠాక్రే తన సోదరుడి చెంతకు వచ్చారు. కష్టకాలంలో సోదరుడికి అండగా నిలిచారు.
ముంబై సహా 29 కార్పొరేషన్లకు జనవరి 15న జరగనున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి దిగాలని ఠాక్రే సోదరులు నిర్ణయించారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిపాయి. చర్చలు ఫలించాయని, సీట్ల పంపిణీపై స్పష్టత వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో.. శరద్పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్తో సంబంధం లేకుండా తమ రెండు పార్టీల అభ్యర్థులనే పోటీకి దించాలని ఉద్ధవ్, రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తియిందని, అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
బీఎంసీలో మొత్తం 227 వార్డులుండగా.. శివసేన (యూబీటీ) 157, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 70 స్థానాల్లో పోటీకి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీకి ఇవ్వాల్సివస్తే ఉద్ధవ్ పార్టీ నుంచి 15 సీట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన (యూబీటీ), ఎమ్మెన్నెస్ కలిసి పోటీ చేస్తే.. రెండు దశాబ్దాలలో ఠాక్రే వారసులు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.
కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మహా వికాస్ అఘాడీలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే బీఎంసీ ఎన్నికల్లో ఠాక్రే సోదరులు చేతులు కలపడంతో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హస్తం పార్టీని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనట్టుగా శివసేన నాయకులు మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి ఆనంద్ దూబే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ వరుసగా ఓడిపోతూనే ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు, ఇతర పార్టీలకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఈమేరకు ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ వెల్లడించారు.
ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ‘సిక్కిం సుందరి’ పై మనసు పారేసుకున్నారు. ప్రకృతి అసాధారణ సృష్టి, అద్భుతం అంటూ దీని గురించి ట్వీట్ చేశారు. ఇంతకీ ఏవరీ సిక్కిం సుందరి తెలుసుకుందాం.
అరుదైన హిమాలయ పుష్పం అసాధారణ జీవిత చక్రాన్ని హైలైట్ చేస్తూ, ఆశ్చర్యాన్ని ప్రకటించారు. సహజ అద్భుతం అంటూ ప్రశంసించారు. దానిపేరే సిక్కిం సుందరి. ఇది హిమాలయ పర్వతశ్రేణుల్లో కనిపించే అరుదైన మొక్క. దీన్ని రూమ్ నొబైల్ (Rheum nobile) అని పిలుస్తారు. దీని ప్రత్యేక రూపం కారణంగా "గ్లాస్హౌస్ ప్లాంట్" అని. ఇది చాలా ఎత్తులో పెరుగుతుంది ఒకేసారి పెద్దగా పూసి చనిపోతుంది. 30 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న ఈ మొక్కను సిక్కిం సుందరి అంటారు.
ఆనంద్ మహీంద్రా ఆదివారం అరుదైన మొక్కపై తన అభిమానాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ప్రకృతి లోని అపూర్వ అసాధారణ సృష్టిలలో ఒకటిగా ఉన్న దీని గరించి తన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో దీని ప్రస్తావన లేదన్నారు. కఠినమైన పరిస్థితులలో ఓర్పుతో వికసించే ఈ మొక్క సహనానికి ఒక మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు.
ఇది దాదాపు 3 నుండి 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఎత్తైన, కోన్ ఆకారంల వికసిస్తుంది ఇది ఒకేసారి పుష్పిస్తుంది, దాని విత్తనాలను వెదజల్లడంతో దాని జీవిత చక్రాన్ని పూర్తి అవుతుందని మహీంద్రా చెప్పారు. ఇలాంటి వాటికి ఎందుకు గుర్తింపు లభించడం లేదని ప్రశ్నించారు. సిక్కిం వంటి ప్రాంతాలను అన్వేషించడానికి స్థానిక జీవవైవిధ్యంతో తిరిగి కనెక్ట్ అవాలని మహీంద్రా కోరారు.
I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’
Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains.
సిక్కిం, తూర్పు నేపాల్ ,ఆగ్నేయ టిబెట్లో సముద్ర మట్టానికి 4,000 నుండి 4,800 మీటర్ల ఎత్తులో ఈ మొక్క కనిపిస్తుంది. ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం అపారదర్శక, గడ్డి-రంగు బ్రాక్ట్లలతో కోన్-ఆకారపు టవర్లా ఎదుగుతాయి. ఈ బ్రాక్ట్లు సహజ గ్రీన్హౌస్ లాగా పనిచేస్తాయి. సూర్యరశ్మి గుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తూ, ఎండ, చల్లగాలులనుంచి సున్నితమైన పువ్వులను కాపాడుతుంది. ఇది లోపల వెచ్చని మైక్రోక్లైమేట్ను సృష్టిస్తుంది. అధిక ఎత్తులో మొక్క మనుగడకు సహాయపడుతుంది. అలాగే దాని ఎత్తు, లేత రంగు కారణంగా, మొక్క పర్వత లోయల మీదుగా అందంగా స్పష్టంగా కనిపిస్తుంది.
సాంస్కృతిక, ఔషధ ప్రాముఖ్యత అయితే దీని రూపం, ఆకర్షణతో పాటు సిక్కిం సుందరికి సాంస్కృతిక, ఔషధ పరంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్థానికంగా చుకా అని పిలుచుకునే దీని కాండాన్ని సాంప్రదాయ వంటలలో వండుకుని తింటారు. దీని ప్రకాశవంతమైన పసుపు వేర్లు సాంప్రదాయ టిబెటన్ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా జూన్ , జూలై మధ్య పుష్పిస్తుంది, ఇది ఎత్తైన హిమాలయాలలో సీజనల్ హైలైట్గా నిలుస్తుంది.సింగిల్ బ్లూమ్ మొక్క చనిపోయి, దశాబ్దాల వరకు ఆ విత్తనం అలాగే పదిలంగా ఉంటూ, మళ్లీ మొలకెత్తడమే దీని ప్రత్యేకత.
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో ఈడీ అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అప్పీలుపై స్పందన కోరుతూ సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజెఎల్కు కాంగ్రెస్ పార్టీ రూ. 90కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈవ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, అస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దుబే తదితరులు మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది.
ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్కు చెందిన సూమారు. రూ. రెండువేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమర యోధులు ప్రారంభించారు. దీని నిర్వహణ బాధ్యతలు AJL అనే సంస్థ చూసుకునేది. ఈ పత్రికకు ఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తుంది.
సాక్షి, ఢిల్లీ: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే ఏపీ, తెలంగాణలో ఎస్సీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ఉదంతాలను ప్రస్తావిస్తూ సోమవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..
తెలుగు రాష్ట్రాల్లో దళితులపై అధిక దాడులు జరుగుతున్నాయి. దళితులను పోలీసు వ్యవస్థ చిన్న చూపు చూస్తూ అమానుషంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఓ దళితుడిని పోలీసుల రౌడీల్లాగా పాశవికంగా కొట్టారు. ఈ ఘటనపై డీజీపీ ఇప్పటికైనా విచారణ జరిపి పూర్తి నివేదిక పంపాలి. అమరావతిలో దళితుల డీకే పట్టా భూముల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. భూముల రేట్లు పెరిగిన తర్వాత.. వ్యవసాయం చేయడం లేదనే సాకుతో భూమి లాక్కుంటున్నారు. దీనిపై 85 ఫిర్యాదులు వచ్చాయి వాటిపై విచారణ చేస్తున్నాం. ఇప్పటిదాకా 35 ఎకరాలు భూమి బలవంతంగా తీసుకున్నారు. దానికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి..
తెలంగాణ కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలి. ఈ ఘటనలో రీపోస్ట్మార్టం జరిగింది. సీఐ సస్పెన్షన్ తో సరిపోదు. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అని అన్నారాయన.
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందుగానే కర్చీఫ్ వేయాల్సిందే. పొంగల్ బాక్సాఫీస్కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే స్టార్స్ అంతా సంక్రాంతి రిలీజ్కు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల డేట్స్ ఖరారయ్యాయి. వీటిలో ది రాజాసాబ్ జనవరి 9న, మనశంకరవరప్రసాద్ గారు జనవరి 12న, భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు జనవరి 14న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
వీటికి తోడు కోలీవుడ్ సినిమాలు సైతం సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన పరాశక్తి కూడా పొంగల్కే రానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. జనవరి 14న విడుదల చేస్తామని ఫిక్సయ్యారు. అయితే తాజాగా రిలీజ్ తేదీ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. జనవరి 10న టాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్ లేకపోవడంతో ఆ రోజే పరాశక్తి విడుదల కానుందని ప్రకటించారు.
దీంతో ది రాజాసాబ్ రిలీజైన మరుసటి రోజే పరాశక్తి థియేటర్లకు రానుంది. విపరీతమైన పోటీ ఉన్న పొంగల్ బాక్సాఫీస్ వద్ద పరాశక్తికి థియేటర్లు ఎంతవరకు దొరుకుతాయో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న దళపతి విజయ్ జన నాయగన్ జనవరి 9న విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు.
Coming to you, earlier than expected 🔥#Parasakthi - in theatres worldwide from January 10th, 2026 ✊
చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఠక్కున క్లిక్ క్లిక్మనిపించడమే. అదొక గ్రేట్ అచీవ్మెంట్లా ఫీలవ్వడమే. సమయం సందర్భంతో అవసరం లేదు మనకు. అంతలా అడిక్ట్ అయిపోయారు జనాలిప్పుడు. ఎలాంటి సందర్భమైనా సరే అదే ముఖ్యమంటున్నారు. అదేనండి సెల్ఫీ మోజు. ఈ చరవాణి ప్రపంచంలో దానికున్న క్రేజ్ ఇంకా దేనికైనా ఉందా? సందర్భంతో పనిలేకుండా ఎగబడి మరీ సెల్ఫీలు తీసుకుంటారు.
ఇక ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే చాలు.. ఒక్క క్షణం కూడా ఆగలేం కదా. మరి ఈ పిచ్చి ముదిరితే ఎలా ఉంటుంది. అదే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో పీక్స్కు చేరింది. వచ్చిన సందర్భం కూడా ఆలోచించకుండా సెల్ఫీలకు ఎగబడ్డారు. ఇదే ఆ స్టార్ హీరో భార్యకు చిరాకు తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రముఖ మలయాళ నటుడు శ్రీనివాసన్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మలయాళ సినీతారలు పాల్గొన్నారు. అదే సమయంలో కొందరు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీనివాసన్ ఫ్యామిలీకి బాధలో ఉంటే మీలాంటి వారి పైత్యం ఏంటని నిలదీసింది. శ్రీనివాసన్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషాదంలో ఉన్న కుటుంబం బాధ మీకు అర్థం కాదా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించింది.
సుప్రియా మీనన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఇది వారి కుటుంబానికి భావోద్వేగ క్షణం. ఇలాంటి సమయంలో బాధలో ఉన్నవారిని పరామర్శించడానికి కూడా అక్కడ చోటు లేకపోవడం చాలా విషాదకరం. ప్రతిచోటా మొబైల్ ఫోన్ల కెమెరాలతో లోపలికి వస్తున్న నటులతో సెల్ఫీలకు ఎగబడ్డారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధను ఆ సమయంలో మనం ఊహించలేం. అసలు అంత్యక్రియల జరిగే చోట సెల్ఫీల కోసం గుమిగూడాల్సిన అవసరం ఉందా? బాధలో ఉన్న వారి కుటుంబం ఆ వ్యక్తికి వీడ్కోలు పలికే సందర్భంలో ఇలా చేస్తారా? ఆ ఫ్యామిలీ గోప్యతను గౌరవించరా?..' అంటూ ఆమె నిలదీసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. మలయాళ నటుడు శ్రీనివాసన్(69) కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు.
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్లింప్స్లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారని టాక్.
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.
కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.
టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.
సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
కుమారు సాను విలక్షణమైన సింగర్.. ఈయన తెలుగులో దేవుడు వరమందిస్తే.., మెరిసేటి జాబిలి నువ్వే.. వంటి పలు హిట్ సాంగ్స్ ఆలపించాడు. దాదాపు 16 భాషల్లో అనేక పాటలు పాడారు. అయితే ఆయన కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ లైఫ్లో ఒడిదుడుకుల కారణంగానూ తరచూ వార్తల్లో ఉంటాడు.
రెండు పెళ్లిళ్లు ఈయన రీటా భట్టాచార్యను 1986లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. అయితే భార్య ఉండగానే పలువురితో డేటింగ్ చేశాడు. వారిలో నటి కునికా సదానంద్ ఒకరు. ఈ విషయంలో గొడవలు రావడంతో కొన్నేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆరేళ్లపాటు కునికాతో రిలేషన్లో ఉన్న కుమార్ తర్వాత సలోని భట్టాచార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు సంతానం.
మాజీ భర్తపై ఆరోపణలు ఇటీవల రీటా భట్టాచార్య మాజీ భర్త కుమార్ సానుపై సంచలన ఆరోపణలు చేసింది. అతడూ ఎప్పుడూ అబద్ధాలు ఆడేవాడని ఆరోపించింది. కొడుకు పెళ్లి సమయంలో కుమార్ ప్రేమకథల గురించి పుకార్లు వస్తే వాటికి ఫుల్స్టాప్ పెట్టమని కోరినందుకు తన నెంబర్ బ్లాక్ చేశాడంది. మూడోసారి గర్భవతిగా ఉన్నప్పుడు తిండిపెట్టకుండా టార్చర్ చేశారంది. ఆయన కుటుంం కిచెన్ స్టోరేజ్కు తాళం వేసుకునేవారంది. గర్భంతో ఉన్నానన్న కనికరం చూపకుండా తనను కోర్టులచుట్టూ తిప్పాడంది.
రూ.50 కోట్ల పరువు నష్టం దావా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్ సాను కోర్టును ఆశ్రయించాడు. ఆమె వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించాయంటూ రీటాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. విడాకుల సమయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకూడదన్న అగ్రిమెంట్ను ఉల్లంఘించిందని పేర్కొన్నాడు. ఈ మేరకు మాజీ భార్యకు నోటీసులు పంపాడు.
దయచేసి హింసించొద్దు దానిపై రీటా భట్టాచార్య స్పందిస్తూ.. నేను షాక్లో ఉన్నాను. అతడు.. తన ముగ్గురు కొడుకుల తల్లిపై కేసు వేస్తున్నానన్న విషయం మర్చిపోయాడా? పైగా రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. నా దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుందనుకుంటున్నాడు? ఇది నిజంగా బాధాకరం. నా ముగ్గురు పిల్లల తండ్రిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా అయినా మెదులుకోమని ఆయన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. మమ్మల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు.. కానీ దయచేసి ఇబ్బందిపెట్టకు అని కోరింది.
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్గా మారిందా? అనేది తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.
సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
హృతిక్ రోషన్ విమర్శలు..
బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్కు మరింత ప్లస్గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది.
ఈ ఏడాది చివరి వారం టాలీవుడ్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల జాతరే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవులు దొరకడంతో పాటు పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో భారీ ఎత్తున చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 25న ఛాంపియన్, శంబాల, ఈషా, దండోరా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నాలుగు సినిమాల జోనర్స్ వేరు వేరుగా ఉండడం గమనార్హం. ఇయర్ ఎండ్లో యాక్షన్, హారర్, మిస్టరీ,సోషియయో ఫాంటసీ.. ఇల రకరకాల సినిమాలను ఆడియన్స్ని పలకరించబోతున్నాయి. ఇప్పటికే అన్నింటిపైన మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
శ్రీకాంత్ తనయుడు రోషన్ చాలా గ్యాప్ తర్వాత ‘ఛాంపియన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం తెలంగాణలోని బైరాన్ పల్లిలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
గతకొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్.. ఈ సారి మిస్టీరియస్ థ్రిల్లర్ శంబాలతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆది హిట్ ట్రాక్ ఎక్కుతాడని దర్శకనిర్మాతలు బలంగా చెబుతున్నారు.
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్హిట్ కొట్టిన అఖిల్రాజ్తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు బాగానే భయపెట్టాయి. ఇదే భయంలో థియేటర్స్లో పుట్టిస్తే.. సినిమా హిట్ అవ్వడం ఖాయం.
మరో చిన్న చిత్రం ‘దండోరా’ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. శివాజీ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
వీటితో పాటు మలయాళం డబ్బింగ్ సినిమా వృషభ కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. మోహల్ లాల్ కీలక పాత్ర వహించిన ఈ చిత్రంపై కూడా టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం విజయం అవుతుందో? ఇయర్ ఎండ్లో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాయో చూడాలి.
తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈయన నిర్మించిన కొత్త సినిమా 'వా వాతియర్'.. సరిగ్గా రిలీజ్కి మరికొన్ని గంటలు ఉందనగా కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోయింది. దీనికి చేసిన అప్పులు తీర్చకపోవడమే కారణం. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తికి ఈయన రూ.20 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్య ఓవైపు ఉండగానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా జ్ఞానవేల్పై చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు.
శివకార్తికేయన్ హీరోగా జ్ఞానవేల్ నిర్మాతగా 2019లో 'మిస్టర్ లోకల్' అనే సినిమా వచ్చింది. దీనికిగానూ హీరోకి రూ.15 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కానీ తనకు రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చి మిగతా రూ.4 కోట్లు బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని శివకార్తికేయన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నిర్మాత.. తనకిచ్చిన పారితోషికంపై టీడీఎస్ చెల్లించకపోవడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.90 లక్షల మొత్తాన్ని ఐటీ శాఖ కట్ చేసుకుందని పేర్కొన్నాడు.
తనకు బాకీ ఉన్న మిగతా రెమ్యునరేషన్ చెల్లించేవరకు జ్ఞానవేల్ నిర్మిస్తున్న సినిమాలు.. విడుదల కాకుండా నిలుపుదల చేయాలని శివకార్తికేయన్, చెన్నై కోర్టుని కోరారు. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే జ్ఞానవేల్ రాజా.. హీరోల సూర్య, కార్తీలకు దగ్గర బంధువే. అయితే గతేడాది ఈయన నిర్మించిన తంగలాన్, కంగువ, బడ్డీ, రెబల్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫ్లాప్స్ అయ్యాయి. సరే కార్తీ హీరోగా తీసిన సినిమా రిలీజ్ చేద్దామంటే తిరిగివ్వాల్సిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి. మరి ఈ విషయంలో జ్ఞానవేల్ ఏం చేస్తాడో చూడాలి?
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది.
'మహానటి' సహా తెలుగులో చాలా సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. హిందీ, మలయాళ, తమిళంలోనూ హీరోయిన్గా బిజీగా ఉంది. గతేడాది ప్రియుడు ఆంటోనిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. కెరీర్ పరంగా ఖాళీగా ఏం లేదు. అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఓ పెళ్లిలో డ్యాన్సులేస్తూ ఫుల్ సందడి చేసింది. ఆ వీడియోని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన ఫ్రెండ్ పెళ్లికి భర్త ఆంటోనితో పాటు వచ్చిన కీర్తి సురేశ్.. ఈ వేడుకలోనే తన బ్లాక్బస్టర్ సాంగ్ 'చమ్కీలా అంగిలేసి'కి స్టెప్పులేసింది. నాని భార్య అంజన కూడా కీర్తితో కలిసి డ్యాన్స్ చేసింది. వీరిద్దరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
నాని-కీర్తి సురేశ్.. నేను లోకల్, దసరా సినిమాల్లో జంటగా నటించారు. ఈ మూవీస్ చేస్తున్న టైంలోనే నాని కుటుంబంతో కీర్తికి స్నేహం కుదిరింది. తర్వాత కూడా ఒకటి రెండు సందర్భాల్లో నాని ఫ్యామిలీని కలిసింది. ఇప్పుడు ఏకంగా నాని భార్యతో కలిసి స్టెప్పులేసింది.
ఒక సామాస్యుడు బిగ్బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.
21 మందిని వెనక్కు నెట్టి.. హౌస్లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.
కేక్ కటింగ్ బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నా ఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు.
సౌతిండియా నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్. ఆమె తాజాగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్' (Son Of )ఇప్పటికే మంచి బజ్ను క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు భారీ రెస్పాన్ వస్తోంది. ఈ మూవీలో మీరా చేసిన తన పాత్రకు.. ఆమె స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఉత్తర భారతీయురాలైనా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. పాన్ ఇండియా చిత్రం కాంచన 4లో కీలక పాత్రలో నటించబోతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి లాంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్కు బిగ్ ఛాన్స్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్పై మీరా రాజ్కు అపారమైన గౌరవం ఉంది.“నా మీద నమ్మకం ఉంచి ఈ పాత్ర ఇచ్చినందుకు లారెన్స్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను” అని మీరా భావోద్వేగంగా చెప్పింది.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ స్క్రీన్పై మీరా రాజ్ స్టార్ హీరోయిన్గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.
జేమ్స్ కామెరూన్ అవతార్కు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉంది. 2009లో వచ్చిన మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత అవతార్-2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చివరికీ 2022లో అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో రిలీజై ఆడియన్స్ను అలరించింది. ఈ రెండు చిత్రాలకు ఆదరణ దక్కడంతో జేమ్స్ కామెరూన్ మరో అడుగు ముందుకేసి అవతార్-3ని(అవతార్ ఫైర్ అండ్ యాష్ ) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకుంది.
అయితే మరికొందరు మాత్రం అవతార్-3 అస్సలు బాగోలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు. పార్ట్-3 రోటీన్గా అనిపించిందని.. కొత్తదనం ఏం కనిపించలేదని పోస్టులు పెట్టారు. ఈ మూవీలో కొత్తగా రెండు రకాల జీవాలను పరిచయం చేసినప్పటికీ జేమ్స్కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త ట్రైబ్ను తీసుకొచ్చినా.. విజువల్స్ అదిరిపోయే రేంజ్లో ఉన్నా.. కథ మొత్తం తిరిగి జాక్, కల్నల్ మధ్యే వార్ సాగడం ఆడియన్స్కు బోరు కొట్టించింది. సినిమాలో మెయిన్ విలన్ అంటూ వరాంగ్ గురించి ఆసక్తిగా అనిపించినా మెప్పించలేకపోయింది. దీంతో అవతార్ ఫ్యాన్స్ను మరోసారి మెప్పించడంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.
అవతార్ పార్ట్ 2 అండ్ పార్ట్- 3 తేడా కేవలం అదొక్కటే కావడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇందులో వరాంగ్ ట్రైబ్ ఒక్కటి అదనంగా చేర్చాడు జేమ్స్ కెమెరూన్. అంతా పాత కథే కావడంతో జేమ్స్ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాకుండా నిడివి కూడా మూడు గంటలకు ( 3 గంటల 17 నిమిషాలు) పైగా ఉండడం.. రోటీన్ కథ కావడం ఆడియన్స్కు చిరాకు తెప్పించింది. సినిమా రిలీజ్కు ముందు రాజమౌళి- మహేశ్ బాబు సెట్స్కు రావాలని ఉందని చెప్పడం జేమ్స్ కామెరూన్ సినిమాపై కాస్తా బజ్ క్రియేట్ అయినా.. ఆ ప్రచారం కూడా పెద్దగా కలిసి రాలేదు.
ఇక్కడ జేమ్స్ కామెరూన్ కేవలం విజువల్స్ ఎఫెక్ట్స్పైనే ఆధారపడడం అవతార్-3ని దెబ్బతీసినట్లు తెలుస్తోంది. కథలో కొత్తదనం కూడా లేకపోవడం మరింత మైనస్గా మారింది. పార్ట్-1, పార్ట్-2 హిట్ అయ్యాయన్న ధీమాతో వచ్చిన జేమ్స్ కామెరూన్కు ఆడియన్స్ నాడీని పట్టుకోవడంలో ఫెయిల్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రోటీన్ కథను కేవలం విజువల్ ఎఫెక్ట్స్తోనే నడిపిస్తానంటే ఇప్పుడు కుదరదు. ఆడియన్స్ కూడా ఫుల్ అప్డేట్ అయి ఉన్నారు. కథలో కొత్తదనం లేకపోతే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యాడన్నదే అందరికీ అంతుచిక్కని ప్రశ్న. ఇకనైనా జేమ్స్ కామెరూన్ రియలైజ్ అయి.. అవతార్ సిరీస్కు స్వస్తి చెబితే బాగుంటుందని సగటు ప్రేక్షకుడి భావన. అవతార్-4 అంటూ మరో ప్రయోగం ఇక అదొ పెద్ద సాహసమనే చెప్పాలి.
తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్తో తనూజ ఓడిపోయి రన్నరప్గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.
అందులో ఏం రాసిందంటే.. బిగ్బాస్ సీజన్కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది.
అదే అతిపెద్దక్సెస్ మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్బాస్ హౌస్ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను.
గుణపాఠం నేర్చుకున్నా.. మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.
నిజమైన ఫైటర్ మీలో ఒకరిగా హౌస్లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయిన సినిమా 'ధురంధర్'. పాకిస్థాన్లోని గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ స్పై డ్రామాలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మూవీలో తమన్నా కూడా నటించాల్సింది కానీ దర్శకుడు ఈమెని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ బయటపెట్టాడు.
'ధురంధర్' చిత్రం పూర్తిస్తాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ.. 'షరారత్' అంటూ సాగే ఓ స్పెషల్ (ఐటమ్) సాంగ్ కూడా ఉంది. హీరో పాత్రకు పెళ్లి జరిగే టైంలో ఇది వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పులేశారు. ఈ పాట కోసం తొలుత తమన్నానే అనుకున్నామని కొరియోగ్రాఫర్ చెప్పాడు. 'నా మైండ్లో తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే పాటకు నిండుదనం తీసుకొస్తుంది. సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు చెప్పాను. కానీ ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ ఐటమ్ సాంగ్లా ఉండకూడదని చెప్పేశారు' అని విజయ్ గంగూలీ తెలిపాడు.
'సినిమా కథని డిస్టర్బ్ చేసేలా ఒక్క అంశం కూడా ఉండకూడదనేది ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప స్టోరీపై ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టే అవకాశముంది. అలా ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లని పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించాడు. అలా ఆయేషా, క్రిస్టల్ వచ్చారు' అని విజయ్ చెప్పుకొచ్చాడు.
గతంలో జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా.. మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఎంతల అంటే ఐటమ్ సాంగ్స్ అంటేనే ఈమె గుర్తొంచేంతలా. ఒకవేళ 'ధురంధర్'లో గనక ఐటమ్ సాంగ్ కోసం ఈమెని తీసుకుని ఉంటే.. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు ప్రేక్షకుడి దృష్టి మారిపోయి ఉండేదేమో!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ మరింత పెరిగింది. రిలీజ్కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదు. ఇప్పటికే రోషన్ మరో సినిమాకు రెడీ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.
చాలామంది సెలబ్రిటీలు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్లో అడుగుపెట్టామన్నది వారి వాదన. అలా తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్, విజయకాంత్, శరత్కుమార్, కమల్ హాసన్, విజయ్.. ఇలా అందరూ రాజకీయాలను ఎంచుకున్నావే.. కానీ కర్ణాటకలో సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదు. ఇదే ప్రశ్న ఓ విలేఖరి స్టార్ నటుడు శివన్నను అడిగాడు.
కారణాలేంటి? కన్నడ నటులు శివరాజ్కుమార్, ఉపేంద్ర, రాజ్ బి.శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 45: ది మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ జనవరి 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్లో శివన్నకు.. కన్నడ నటులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? దానివెనక గల కారణాలేంటి? అన్న ప్రశ్న ఎదురైంది.
నా డబ్బుతో సేవ చేస్తా.. అందుకాయన స్పందిస్తూ.. నాకు రాజకీయాలు తెలియవు. అధికారం, పదవి లేకపోయినా జనాలకు సేవ చేయడమే నాకు తెలుసు. రాజకీయాలు కొన్నిసార్లు జనాల మధ్య బేధాన్ని సృష్టిస్తాయి. కానీ నేను నా డబ్బుతో ఎటువంటి పక్షపాతం చూపించకుండా జనాలకు సేవ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది.
ఎన్నికల్లో శివన్న భార్య కాగా శివరాజ్కుమార్ రాజకీయాల్లోకి రాకపోయినా ఆయన భార్య గీత గతేడాది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ అభ్యర్థిగా ఎలక్షన్స్లో నిలబడింది. భార్య కోసం శివన్న ప్రచారం కూడా చేసినప్పటికీ ఆమె ఓడిపోయింది. కాగా గీత మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప కుమార్తె!
దృశ్యం-3 సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు పలు భాషలలో సూపర్ హిట్ అయ్యాయి. అయితే, తాజాగా దృశ్యం-3 హిందీ వర్షన్ అప్డేట్ ఇచ్చారు. అజయ్ దేవగణ్ హీరోగా డైరెక్టర్ అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 అక్టోబర్ 2న విడుదల కానుందని చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇకపోతే ఈ సిరీస్లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. మూడో భాగంలోనూ మోహన్లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయింది. తెలుగులో వెంకటేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం గరిష్టంగా రూ. 1100 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,24,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,800 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 800 పెరిగిందన్న మాట. (ఉదయం 1000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 800 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1800 పెరిగింది).
24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,36,150 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1100 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 870 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1970 పెరిగింది).
ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల ధర రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,36,300 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1800 పెరిగి.. 1 24,950 రూపాయల వద్దకు చేరింది.
ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1850 పెరగడంతో రూ. 1,37,130 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1700 పెరిగి.. 1,25,700 రూపాయల వద్దకు చేరింది.
జెండాల్ గ్రూప్లో భాగమైన గ్లోబల్ హ్యూమన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ.. బయోఫ్యాబ్రి వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించాయి.
రెండు సంస్థల భాగస్వామ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాధాన్యతలకు అనుగుణంగా.. క్షయవ్యాధి వ్యాక్సిన్లకు అందించడానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
2020లో లైసెన్సింగ్ అగ్రిమెంట్ తరువాత జరిగిన ఈ కొత్త టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం రెండు కంపెనీలను మరింత బలపరుస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. ఆఫ్రికా, ఆగ్నేయాసియా అంతటా 70 కంటే ఎక్కువ దేశాలలో MTBVAC వ్యాక్సిన్ తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండేలా చూడడం.
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.
👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.
👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.
👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.
👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.
👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.
👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.
👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.
👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.
భారత్కు వచ్చి హెచ్-1బీ వీసా స్టాంపింగ్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది భారతీయ హెచ్ -1బి వీసా హోల్డర్లు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడి యూఎస్ కాన్సులర్ కార్యాలయాలు హఠాత్తుగా వారి వీసా స్టాంపింగ్ అపాయింట్లను రీషెడ్యూల్ చేసింది. దీంతో వాళ్లు తిరిగి తమ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ వీసా రీషెడ్యూళ్లు ప్రధానంగా డిసెంబర్ 15 నుంచి 26వ తేదీల మధ్య స్లాట్ లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్రిస్మస్ సెలవు సీజన్ ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియా స్క్రీనింగ్ను కఠినంగా అమలు చేయడం వల్లే ఈ మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలు వీసా హోల్డర్లలో ఆందోళనను పెంచుతున్నాయి.
ఇక ఈ పరిణామం వల్ల ప్రభావితులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ, హెల్త్కేర్, ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తున్న హెచ్-1బి ఉద్యోగులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉద్యోగులు పనిచేసే అమెరికాలోని కంపెనీలు కూడా ఉద్యోగుల గైర్హాజరీతో ప్రాజెక్ట్ డెడ్లైన్లు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO), తెలంగాణ సభ్యులు తమ 30 సంవత్సరాల వార్షికోత్సవాన్ని నిర్వహించకునేందుకు సిద్ధమయ్యారు. మొదటగా 1995లో స్థాపించబడిన నరెడ్కో సంస్థ రాష్ట్ర శాఖ దాని ప్రత్యక్ష వాటాదారుల భాగస్వామ్యం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించింది.
ప్రభుత్వం, పరిశ్రమ,కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా, నరెడ్కోతెలంగాణ పారదర్శక, విధాన-అనుగుణ్య, వృద్ధి-ఆధారిత రియల్ ఎస్టేట్ వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధాన వార్షిక ప్రాపర్టీ షోలు, ఇతర పరిశ్రమ వేదికల ద్వారా, అసోసియేషన్ అర్థవంతమైన సంభాషణను ప్రారంభించింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన విధాన సంస్కరణలకు మద్దతు ఇచ్చింది. నగర రియల్ ఎస్టేట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. విశ్వసనీయ డెవలపర్లు, ధృవీకరించబడిన ప్రాజెక్ట్లకు ప్రాప్యతను అందిస్తూ, పారదర్శకత, నైతిక పద్ధతులు, నియంత్రణ అవగాహనను ప్రోత్సహించడం ద్వారా ఇది గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు తగిన సమాచారంతో, నమ్మకంగా నిర్ణయాలు తీసుకునేలా సాధికారికతను అందిస్తుంది.
నేడు, నరెడ్కోలో తెలంగాణలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లతో సహా 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు – ఇది నరెడ్కో ఒక పటిష్టమైన స్వీయ-నియంత్రణ సంస్థగా పరిణామం చెందింది అనడానికి నిదర్శనం. హైదరాబాద్ నివాస, వాణిజ్య ఆస్తులకు ఒక ప్రీమియం కేంద్రంగా ఎదుగుతున్న సందర్భంలోనరెడ్కో తెలంగాణ రాష్ట్రానికి తన సేవలను అందిస్తూనే ఉంటుంది.దీనితో కలసి పని చేసే వారు కూడా ఈ మహానగరంతో పాటు అభివృద్ధి చెందేలా చూస్తుంది. రాబోయే మరో 30 ఏళ్లు కూడా ఈ ప్రస్థానం కొనసాగాలని ఆశిస్తోంది.
భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.
మీథేన్ హైడ్రేట్ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు? సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.
డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలు సముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.
పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం! సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.
మొదటిది. టీడీఎస్..
ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.
రెండోది. టీసీఎస్..
ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.
మూడోది.. ఎస్టీటీ..
ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..
పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.
క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.
1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్
సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.
ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే.
ఒకేఒక్కరూల్.. ప్రపంచమార్కెట్లనుఎన్నోఏళ్లుగాఏలుతోంది. సగటుఇన్వెస్టర్లుధనవంతులుఅయ్యేందుకురామబాణంలాపనిచేస్తూవస్తోంది. అదేవారెన్ బఫెట్ ప్రతిపాదించిన 90/10 పెట్టుబడి వ్యూహం. వ్యక్తిగత మదుపరులకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన, ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగాఇదినిలిచింది. అధిక రుసుములు, అనవసరమైన సంక్లిష్టతను నివారిస్తూ, దీర్ఘకాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి లాభపడేందుకు సగటు మదుపరులకుసహాయపడాలనే ఉద్దేశంతో బఫెట్ ఈ నియమాన్ని సూచించారు.
మార్కెట్నుఅంచనావేయడంలోచాలా మంది యాక్టివ్ ఫండ్ మేనేజర్లు విఫలమవుతున్నారనిచాలాకాలంగావిమర్శిస్తూవచ్చినబఫెట్.. చారిత్రక మార్కెట్ డేటా, సహనం, కాంపౌండింగ్ శక్తిపై ఆధారపడేలాపెట్టుబడిప్యూహాన్నిప్రతిపాదించారు. 90/10 వ్యూహం పెట్టుబడిదారులకు వృద్ధిని గరిష్టంగా పొందే అవకాశం ఇస్తూనే, చిన్న భద్రతా వలయాన్ని కూడా కల్పిస్తుంది. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలికంగా నిలకడైన, అమలు సాధ్యమైనవ్యూహంగాదీన్నిరూపొందించారు.
ఏమిటీ 90/10 రూల్?
మదుపరులుపెట్టేపెట్టుబడుల్లో 90 శాతంతక్కువ ఖర్చుతో కూడిన ఎస్& పి 500 ఇండెక్స్ ఫండ్లోమిగిలిన 10 శాతంస్వల్పకాలిక అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లోఇన్వెస్ట్ చేయాలనేదిఈనియమంసారాంశం.
బఫెట్ 2013లోతన బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకురాసిన లేఖలోఈ నియమాన్ని మొదటిసారిగాబహిరంగంగా వివరించారు. బెంజమిన్ గ్రాహం బోధనలను ఆధారంగా తీసుకుని, చాలా మంది వ్యక్తిగత మదుపరులకు స్టాక్స్ను లోతుగా విశ్లేషించే సమయం లేదా నైపుణ్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.గెలుపుగుర్రాల్లాంటిస్టాక్స్ను ఎంచుకోవడానికి ప్రయత్నించడంకన్నా, విస్తృత మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన మార్గంఅనేదిబఫెట్ అభిప్రాయం.
తన భార్య కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్కుసంబంధించినపెట్టుబడులకుకూడాఇదేసూత్రాన్నిపాటించారుబఫెట్. దీంతోఈ వ్యూహంపైఇన్వెస్టర్లకునమ్మకం మరింత బలపడింది.
బఫెట్ లాజిక్ ఇదే..
కాలక్రమేణా అమెరికన్ వ్యాపార రంగం పెరుగుతుందనేదిబఫెట్ నమ్మకం. ఆ వృద్ధిని సంపూర్ణంగా పొందాలంటే విస్తృత మార్కెట్ బహిర్గతం అవసరం.అధిక ఫీజులు, భావోద్వేగ నిర్ణయాలు, తప్పుడు టైమింగ్ వంటి అంశాలు మదుపరుల రాబడులను తగ్గిస్తాయి. ఇండెక్స్ ఫండ్లుఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.
బఫెట్ తరచూ చెప్పే మాట ఒక్కటే ‘చిన్నపాటిఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారి తీస్తాయి.’
ప్రయోజనాలు.. పరిమితులు
90/10 వ్యూహం అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఎస్&పీ 500 దాదాపు ఒక శతాబ్దంలో స్థిరమైన వృద్ధిని అందించిందని దీర్ఘకాలిక డేటా చూపిస్తోంది. దాని విస్తృత వైవిధ్యం.. అధిక ఈక్విటీ కేటాయింపుతో వచ్చేరిస్క్నుకూడాపరిమితం చేస్తుంది. తక్కువ నిర్వహణ రుసుములు కాంపౌండింగ్ను మరింత పెంచుతాయి. కాలక్రమేణా పోర్ట్ ఫోలియోకు వేలాది డాలర్లను జోడిస్తాయి.
అయితేఈక్విటీలకు 90శాతం కేటాయింపు అందరికీ తగినది కాదని విమర్శకులు గమనించారు. ఇదిపదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ సహనం తక్కువఉన్నవారికి దూకుడుగా ఉండవచ్చు.
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 85,567.48 వద్ద, నిఫ్టీ 195.20 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 26,161.60 వద్ద నిలిచాయి.
క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఆర్వీ లాబొరేటరీస్, మీషో లిమిటెడ్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.
మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.
మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.
కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్లైట్స్ కనిపిస్తాయి.
కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్గా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ముందంజలో జియో
ఈ విప్లవంలో రిలయన్స్ జియో (Reliance Jio) కేవలం భారతీయ లీడర్గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్హౌస్గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 26 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్వర్క్కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్ఫైబర్ (Jio Fiber) సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.
100 కోట్ల దిశగా ప్రయాణం
భారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.
వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలన
దేశం
సగటు వారపు పనిగంటలు
సగటు నెలవారీ వేతనం
గంటకు ఆదాయం
అమెరికా
34 - 36 గంటలు
రూ.5,60,000
రూ.4,100
జర్మనీ
34 - 35 గంటలు
రూ.4,50,000
రూ.3,100
జపాన్
38 - 40 గంటలు
రూ.3,10,000
రూ.1,900
చైనా
46 - 48 గంటలు
రూ.1,40,000
రూ.750
భారతదేశం
46 - 48 గంటలు
రూ.32,000
రూ.170
గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.
అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి
అమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.
ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.
చైనాలో కూడా పనిగంటలు భారత్తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
భారత్లో ఎందుకీ పరిస్థితి?
భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.
శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.
భారత్లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.
భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
చమురు సంస్థలకు కీలక ఆదేశాలు
ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.
అవగాహన కార్యక్రమాలు
ఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.
చట్టపరమైన నిబంధనలు ఇవే..
మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ బాటలోనే ఒడిశా
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.
గత ఐపీఎల్ సీజన్లో డీసీ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్లోనే కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్మెంట్ రాహుల్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్ పటేల్ నేతృత్వంలో డీసీ గత సీజన్లో 14 మ్యాచ్ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్లో ఎలాగైనా ప్లే ఆఫ్స్కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్ మార్పు జరిగినట్లు సమాచారం.
డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. గత సీజన్లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్లో కెప్టెన్ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్ కెప్టెన్గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్మెంట్ జెమీమా రోడ్రిగ్స్కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ మెగ్ లాన్నింగ్ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్తో జరిగిన సెమీస్లో జెమీమా చేసిన సూపర్ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది.
ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఇవాళ (డిసెంబర్ 22) రిటైర్మెంట్ ప్రకటించాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ అయిన 37 ఏళ్ల గౌతమ్ 2021లో టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. అప్పటి నుంచి మరో అవకాశం రాని గౌతమ్.. దేశవాలీ క్రికెట్కు, ఐపీఎల్కు మాత్రమే పరిమితమయ్యాడు.
గౌతమ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. కర్ణాటక తరఫున అతను 32 మ్యాచ్లు ఆడి 116 వికెట్లు తీశాడు. అలాగే ఓ సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ గౌతమ్ ఓ మోస్తరు రికార్డు కలిగి ఉన్నాడు. 32 మ్యాచ్ల్లో 51 వికెట్లు తీసి, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 400 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో 49 మ్యాచ్లు ఆడిన గౌతమ్ 32 వికెట్లు తీయడంతో పాటు 2 హాఫ్ సెంచరీల సాయంతో 454 పరుగులు సాధించాడు.
గౌతమ్కు ఐపీఎల్లో అత్యంత ఖరీదైన అవకాశం దక్కింది. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన గౌతమ్ను 2021 సీజన్లో సీఎస్కే ఏకంగా రూ. 9.25 కోట్ల ధర వెచ్చించి సొంతం చేసుకుంది. అప్పట్లో ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్కు దక్కిన అతి భారీ మొత్తం ఇదే. ఐపీఎల్ కెరీర్లో ముంబై ఇండియన్స్, సీఎస్కేతో పాటు రాజస్థాన్ రాయల్స్ (2018), లక్నో సూపర్ జెయింట్స్కు (2022-24) ఆడిన గౌతమ్.. మొత్తంగా 36 మ్యాచ్లు ఆడి 21 వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 2025 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ ఏడాది చాలా ప్రపంచ రికార్డులు చేతులు మారాయి. దిగ్గజాలు తమ వారసత్వాన్ని మరింత బలపరుచుకోగా, కొత్త తరం ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పారు.
పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లి, జో రూట్.. మహిళల క్రికెట్లో స్మృతి మంధన లాంటి వారు వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. జట్ల పరంగా పురుషుల క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు.. మహిళల క్రికెట్లో టీమిండియా సరికొత్త వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాయి.
తిలక్ వర్మ 318 నాటౌట్ ఈ ఏడాది టీమిండియా ఆటగాడే ప్రపంచ రికార్డుల బోణీ కొట్టాడు. జనవరిలో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తిలక్ టీ20ల్లో ఔట్ కాకుండా 318 పరుగులు (19*, 120*, 107*, 72*) చేసి విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును తన పేరిట బదిలీ చేసుకున్నాడు.
విరాట్ కోహ్లి @ ఫాస్టెస్ట్ 14000 రన్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో (ఛాంపియన్స్ ట్రోఫీ) విరాట్ కోహ్లి ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పురుషుల వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ ఈ మైలురాయిని 350 ఇన్నింగ్స్ల్లో చేరుకుంటే, కోహ్లి కేవలం 287 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.
సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు ఇదే ఏడాది విరాట్ మరో భారీ ప్రపంచ రికార్డును కూడా సాధించాడు. ఓ సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెస్ట్ల్లో 51 సెంచరీలు చేయగా.. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 53 వన్డే శతకాలు ఉన్నాయి.
అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక స్కోర్ సౌతాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా డెస్మండ్ హేన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. హేన్స్ 1978లో తన వన్డే అరంగేట్రంలో 148 పరుగులు చేయగా.. బ్రీట్జ్కే 150 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్స్కు చేర్చడంతో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును ఫైనల్స్కు చేర్చిన తొలి కెప్టెన్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే, టీ20 వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్కు చేర్చాడు. వీటిలో డబ్ల్యూటీసీ మినహా అన్ని టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.
అనామక బ్యాటర్ ఖాతాలో ప్రపంచ రికార్డు ఆస్ట్రియాకు చెందిన అనామక బ్యాటర్ కరణ్బీర్ సింగ్ ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1488) చేసిన బ్యాటర్గా కరణ్బీర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఓ ఓవర్లో ఏకంగా 39 పరుగులు సమోవా జట్టు ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (39) సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సమోవాకు చెందిన డారియస్ విస్సర్ ఓ ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు పిండుకోగా.. 3 పరుగులు నో బాల్స్ రూపంలో వచ్చాయి.
రూట్ @ 213 టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్కు సంబంధించి వరుసగా రికార్డును బద్దలు కొడుతున్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్.. ఈ ఏడాది ఫీల్డింగ్లో ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. రూట్ టెస్ట్ అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా (213) రాహుల్ ద్రవిడ్ (210) రికార్డును బ్రేక్ చేశాడు.
చరిత్ర సృష్టించిన స్టార్క్ ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో స్టార్క్ (420) పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (414) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
వన్డేల్లో అతి భారీ విజయం ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు వన్డేల్లో అతి భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ జట్టు సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2023 జనవరిలో భారత్ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది.
మంధన ఖాతాలో భారీ రికార్డు భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ రికార్డును బద్దలు కొట్టింది. టేలర్ 5000 పరుగులు పూర్తి చేసేందుకు 129 ఇన్నింగ్స్లు తీసుకోగా.. మంధన కేవలం 112 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని తాకింది.
టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు మహిళల వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆసీస్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఆసీస్పై ఈ భారీ రికార్డు సాధించింది.
ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరిన భారత్.. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.
డేవిడ్ బెక్హామ్.. ఈ పేరకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంగ్లండ్ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకడైన ఈ మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పారిస్ సెయింట్- జెర్మేన్.. ఇలాంటి ప్రతిష్టాత్మక జట్టకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్.. మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.
పాతికేళ్ల కాపురం ఇక వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్ బెక్హామ్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీమేన్గా కొనసాగుతున్నాడు. మాజీ పాప్ స్టార్ విక్టోరియా ఆడమ్స్తో ప్రేమలో పడ్డ డేవిడ్ బెక్హామ్.. 1999లో ఆమెను పెళ్లాడాడు. ఐర్లాండ్లోని డబ్లిన్లో గల లట్రెల్స్టౌన్లో అత్యంత వైభవోపేతంగా వీరి వివాహం జరిగింది.
ఇప్పటికి పాతికేళ్లకు పైగా వైవాహిక బంధంలో కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్న డేవిడ్- విక్టోరియా జంటకు.. నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు బ్రూక్లిన్ బెక్హామ్, రోమియో బెక్హామ్, క్రూజ్ బెక్హామ్.. కుమార్తె హార్పర్ సెవెన్ బెక్హామ్. 26 ఏళ్ల బ్రూక్లిన్ ఫొటోగ్రాఫర్, మోడల్, చెఫ్.
ఇక 2002లో జన్మించిన రోమియో ఫుట్బాలర్గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. ఇరవై ఏళ్ల క్రూజ్ తల్లి మాదిరి సంగీత రంగంలో ఉన్నాడు. పద్నాలుగేళ్ల హార్పర్ పాఠశాల విద్య ఇంకా పూర్తి కాలేదు. కాగా పెళ్లైన తర్వాత విక్టోరియా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ కొనసాగిస్తోంది.
పెద్ద కుమారుడి వివాహం.. కోడలి రాకతో అమెరికా బిలియనీర్ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్ను 2022లో పెళ్లి చేసుకున్నాడు బ్రూక్లిన్. అప్పటి నుంచే తల్లిదండ్రులతో అతడికి విభేదాలు తలెత్తినట్లు సమాచారం.
పెళ్లిలో వేసుకునేందుకు విక్టోరియా.. కోడలు నికోలా కోసం గౌన్ డిజైన్ చేయగా.. ఆమె దానిని ధరించేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి నికోలా స్పందిస్తూ.. విక్టోరియా డిజైన్ చేసిన డ్రెస్ తనకు సరిపడలేదని అందుకే వేరే గౌను వేసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చింది.
అన్ఫాలో చేశాడు అయినప్పటికీ అత్తా-కోడలి మధ్య గొడవ అన్న వదంతికి చెక్పడలేదు. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం బ్రూక్లిన్ తన తల్లిదండ్రులతో విడిపోయేదాకా చేరిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా.. తన తల్లిదండ్రులను బ్రూక్లిన్ సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడన్న వార్తలు ఇందుకు కారణం.
తండ్రి పుట్టినరోజున రాలేదు.. మామకు విషెస్ అంతేకాదు గత కొంతకాలంగా బ్రూక్లిన్.. డేవిడ్- విక్టోరియాలతో పాటు తన తమ్ముళ్లు, చెల్లెలికి కూడా దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి చేసుకునే వేడుకలక అతడు గైర్హాజరు అవుతున్నాడు. డేవిడ్ బెక్హామ్ ఇటీవలే 50వ పుట్టినరోజు జరుపుకోగా.. బ్రూక్లిన్- నికోలాలకు ఆహ్వానం ఇచ్చినా వారు రాలేదు.
అంతేకాదు.. ఇటీవల న్యూయార్క్లో బ్రూక్లిన్- నికోలా మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేయగా.. ఈ వేడుకలో బెక్హామ్ ఫ్యామిలీ కనిపించనే లేదు. ఇక క్రీడారంగంలో సేవలు అందించినందుకు గానూ.. కింగ్ చార్లెస్ III ఈ ఏడాది నవంబరులో డేవిడ్ బెక్హామ్కు ‘సర్’ బిరుదును ప్రదానం చేశారు. ఈ నైట్హుడ్ సెర్మనీకి కూడా బ్రూక్లిన్ రాలేదు.
ఈ ఏడాది క్రిస్మస్ సెలవులను కూడా బ్రూక్లిన్.. నికోలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు(మే 2)న బ్రూక్లిన్ను మిస్ అయినట్లు తండ్రి డేవిడ్ పోస్ట్ పెట్టాడు. అయితే, ఫాదర్స్ డే సందర్భంగా బ్రూక్లిన్ తన తండ్రికి కనీసం విషెస్ కూడా చెప్పలేదు. అయితే, తన మామగారి (భార్య) తండ్రి ఫొటో పంచుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ అతడి పట్ల అభిమానం చాటుకున్నాడు.
భార్యనే సర్వస్వం అదే విధంగా.. తన భార్యనే తనకు సర్వస్వం అని.. ప్రపంచంలో ఆమె కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బ్రూక్లిన్ తల్లిదండ్రులను అన్ఫాలో చేయడం గమనార్హం.
ఏదేమైనా కోడలి గౌన్ గొడవతో మొదలైన వివాదం.. బెక్హామ్ కుటుంబం నుంచి పెద్ద కొడుకు విడిపోయేదాకా చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డేవిడ్- విక్టోరియా- కోడలు నికోలా మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా దిగ్గజ ఆటగాడి కుటుంబం ఇలా చీలిపోతుండటం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా డేవిడ్- విక్టోరియా బెక్హామ్ల నికర ఆస్తుల విలువ రూ. 8 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
నిన్న (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో యంగ్ ఇండియా పాకిస్తాన్ చేతిలో 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలై, భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఈ టోర్నీ ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడటాన్ని, అందులోనూ పాక్ చేతిలో ఓడిపోవడాన్ని సగటు భారతీయుడు జీర్ణించుకోలేకపోతున్నాడు.
అంతవరకు తిరుగులేని శక్తిగా కనిపించిన భారత్.. అమీతుమీ పోరులో ఎందుకలా చతికిలబడిందని అంతా లెక్కలేసుకుంటున్నారు. కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. ఒత్తిడే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయినా యువ భారత జట్టుకు ఆసియా కప్ ఫైనల్లో ఒత్తిడికి చిత్తవడం ఇది కొత్తేమీ కాదు. గత ఎడిషన్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఇలానే చిత్తైంది.
స్టార్ ప్లేయర్లకు ఏమాత్రం తీసిపోని టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నా.. ఎందుకో యంగ్ ఇండియాకు ఫైనల్ ఫోబియా పట్టుకుంది. ఒత్తిడి మినహా కారణాలేమీ కనబడటం లేదు. ఎందుకంత ఒత్తిడా అన్ని పరిశీలిస్తే.. తాజా ఉదంతంలో (2025 ఎడిషన్ ఫైనల్లో) భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని భారీ స్కోర్ సమర్పించుకోవడం కారణంగా తెలుస్తుంది.
అలాగని బౌలింగ్ విభాగం బాగా లేదా అని చూస్తే అదీ లేదు. హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్ లాంటి సీనియర్ స్థాయి మీడియం పేసర్లు.. కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోవడం భారత్ భారీ స్కోర్ సమర్పించుకోవడానికి కారణమని తెలుస్తుంది.
భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే టాస్ గెలిచినా పిచ్ను అంచనా వేయడంలో విఫలమయ్యాడని టాక్ వినిపిస్తుంది. ఇదే భారత్ కొంపముంచిదని అనిపిస్తుంది. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా భారత బౌలర్లు చివరి ఓవర్లలో పుంజుకున్నారు. ఓ దశలో పాక్ 400 స్కోర్ దాటేలా కనిపించినా 347 పరుగులకే పరిమితం చేయగలిగారు.
భారీ లక్ష్య ఛేదనను సైతం భారత్ ఆత్యవిశ్వాసంతోనే ప్రారంభించింది. తొలి బంతినే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సిక్సర్గా మలిచి పాక్ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఇక్కడే పాక్ బౌలర్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. భారత బ్యాటర్లను, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీని బంతితో కట్టడి చేయలేమని తెలిసి నోటికి పని చెప్పారు.
పదేపదే కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీని మాటలతో, దురుసు ప్రవర్తనతో రెచ్చగొట్టారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన యంగ్ ఇండియా బ్యాటర్లు వరుస పెట్టి వికెట్లు పారేసుకొని పెవిలియన్కు క్యూ కట్టారు. భారత ఓటమి తొలి 10 ఓవర్లలోనే ఖరారైపోయింది. టాప్-5 ప్లేయర్లు 9.4 ఓవర్లలో 68 పరుగులకే ఔటైపోయారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఏదో ఆడాలని ఆడటంతో భారత్ 150 పరుగుల మార్కునైనా దాటగలిగింది.
మొత్తంగా చూస్తే.. నిన్నటి రోజున భారత్కు ఏదీ కలిసి రాలేదు. పిచ్ను అంచనా వేయడం నుంచి పాక్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ వలలో పడటం, అలాగే ఒత్తిడి లోనవడం వంటివి జరిగిపోయాయి. ఈ టోర్నీలో అరివీర భయంకరమైన ఫామ్లో ఉండిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు అంతిమ పోరులో సత్తా చాటలేకపోవడం భారత ఓటమికి మరో కారణం.
గ్రూప్ దశలో పాకిస్తాన్ను చిత్తు చేసిన యంగ్ ఇండియా అదే విశ్వాసాన్ని తుది సమరంలో కొనసాగించలేకపోవడం ఇంకో కారణం. అంతిమంగా భారత్ అన్ని విధాల అర్హమైన ఆసియా కప్ టైటిల్ను కోల్పోవాల్సి వచ్చింది.
వరుసగా రెండు ఎడిషన్లలో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోవడం భారత క్రికెట్ అభిమానులకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ టోర్నీ చరిత్ర చూస్తే.. భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఇప్పటివరకు 12 ఎడిషన్లు జరగ్గా భారత్ 8 సార్లు ఛాంపియన్గా నిలిచింది. చివరిగా 2021 ఎడిషన్లో టైటిల్ సాధించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.
మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి కిక్ అందనుంది. దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు. ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు వీరంతా సిద్దంగా ఉన్నారు.
టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. రోహిత్ ముంబై జట్టులో, కోహ్లి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్మన్ గిల్ (పంజాబ్), సూర్యకుమార్ యాదవ్ (ముంబై) కూడా వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
ముంబై జట్టుకు రోహిత్తో పాటు శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిథ్యం వహించనుండగా.. ఢిల్లీ జట్టులో కోహ్లితో పాటు రిషబ్ పంత్ (కెప్టెన్), హర్షిత్ రాణా, ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ లాంటి టీమిండియా ప్లేయర్లు, ప్రియాంశ్ ఆర్మ లాంటి ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.
ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారివారి జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ జార్ఖండ్కు, రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్రకు, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారధులుగా వ్యవహరించనున్నారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు.
వీరే కాక సంజూ శాంసన్ (కేరళ), మహ్మద్ షమీ (బెంగాల్), కేఎల్ రాహుల్ (కర్ణాటక), తిలక్ వర్మ (హైదరాబాద్) లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు. అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమతమ దేశవాలీ జట్లకు అందుబాటులో ఉంటారు.
టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశించిన విషయం తెలిసిందే. కుదిరితే అన్ని మ్యాచ్లు.. లేకపోతే కనీసం రెండు మ్యాచ్లైనా ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే.. వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికెట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది.
ఇంగ్లండ్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు కోల్పోయింది. సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కంగారూలు... మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను చేజిక్కించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.
సంపూర్ణ ఆధిపత్యం ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్పై సంపూర్ణ ఆధిపత్యంతో గెలిచిన ఆసీస్.. మూడో టెస్టులోనూ దుమ్ములేపింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తుచేసింది.
ఆసీస్ విధించిన 435 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్నైట్ స్కోరు 207/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 102.5 ఓవర్లలో 352 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఇక 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ సిరీస్ కోల్పోని కంగారూలు... ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబర్చగా... అప్పటి నుంచి కనీసం ఒక్క మ్యాచ్లో అయినా విజయం సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు.
జేమీ స్మిత్తో కలిసి ఏడో వికెట్కు 91 పరుగులు జోడించిన జాక్స్... ఎనిమిదో వికెట్కు కార్స్తో 52 పరుగులు జతచేశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్కు ఆశలు చిగురించగా... స్టార్ పేసర్ స్టార్క్... స్మిత్, జాక్స్, ఆర్చర్ (3)లను ఆవుట్ చేసి ఇంగ్లండ్కు పరాజయం ఖాయం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 349 పరుగులు చేసి ప్రత్యర్థికి రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లండ్ పని పూర్తి చేయలేక సిరీస్ ఓటమి రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొంది.
అత్యంత చెత్త జట్టు ఇది ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. సిరీస్ విజేత ఆసీస్ జట్టును ఉద్దేశించి.. ‘చెత్త’ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. కాగా యాషెస్ సిరీస్కు ముందు బ్రాడ్ మాట్లాడుతూ.. ‘‘2010-11 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇది. ఇదొక ఆప్షన్ కాదు. ఇదే నిజం’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.
ఇప్పటికీ ఇదే మాట అంటాను ఈ క్రమంలో మరోసారి సిరీస్ గెలుచుకున్న అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. బ్రాడ్కు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించిన బ్రాడ్.. ‘‘నేను పశ్చాత్తాపపడుతున్నానా? అస్సలు కాదు.
ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ అతి గొప్పగా ఆడాల్సింది. అయితే, ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఏమీ ఆడలేదు’’ అని ‘ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్లో పేర్కొన్నాడు.
కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే, మిచెల్ స్టార్క్ అద్భుత రీతిలో చెలరేగి వారు లేని లోటు కనబడకుండా చేశాడు. ఇక మూడో టెస్టుతో కమిన్స్ తిరిగి రాగా.. హాజిల్వుడ్ మాత్రం గాయం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.
ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
డఫీకి పేస్తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
విండీస్తో టెస్ట్ సిరీస్లో డఫీ ప్రదర్శనలు.. తొలి టెస్ట్: 5-34 & 3-122 రెండో టెస్ట్: 1-33 & 5-38 మూడో టెస్ట్: 4-86 & 5-42
టెస్ట్ల్లో విశ్వరూపం 2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.
లీడింగ్ వికెట్టేకర్ టెస్ట్ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు.
డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.
ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు.. టీ20లు- 35 వికెట్లు టెస్ట్లు- 25 వికెట్లు వన్డేలు- 21 వికెట్లు
ఓ క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు.. జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు) రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79) డేనియల్ వెటోరి (2008లో 76) ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)
ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్ల్లో సూపర్ ఫామ్లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సెలక్టర్ల నిర్ణయంతో తాను ఏకీభవించడం లేదన్నాడు. వరల్డ్కప్ జట్టులో వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.
గిల్, జితేశ్లపై వేటు కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం బీసీసీఐ శనివారం తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో ఆడే 15 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ నుంచి అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill), వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (Jitesh Sharma)లను తప్పించింది.
వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వీరిద్దరి స్థానంలో రింకూ సింగ్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. లోయర్ ఆర్డర్లో రింకూను.. బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్గా ఇషాన్కు స్థానం ఇచ్చింది. రింకూ చాన్నాళ్లుగా టీ20 జట్టులో భాగం కాగా.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి ఇషాన్ పునరాగమనం చేశాడు. అదే విధంగా.. వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.
వాళ్లిద్దరు దండగ! ఈ నేపథ్యంలో వసీం జాఫర్ స్పందిస్తూ.. ‘‘ఈ జట్టులో యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ ఎందుకు లేరు?.. ఇషాన్, వాషీ స్థానాల్లో నేనైతే వారినే ఎంపిక చేస్తా. అక్షర్ వైస్ కెప్టెన్ కాబట్టి అతడు కచ్చితంగా తుదిజట్టులో ఉంటాడు.
కాబట్టి వరుణ్ చక్రవర్తి లేదంటే కుల్దీప్ యాదవ్ను కాదని మీరు వాషీని ఆడించలేరు కదా!.. ఇక జితేశ్ శర్మ.. జట్టు నుంచి తప్పించేంతంగా అతడు ఏమంత పెద్ద తప్పు చేశాడు? యశస్వి ఓపెనర్గా జట్టులో ఎందుకు ఉండకూడదో ఒక్క కారణమైనా చెప్పండి’’ అంటూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
మిశ్రమ స్పందన ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘‘ఇషాన్ ఇటీవల దేశీ టీ20 టోర్నీలో 500కు పైగా పరుగులు చేసి.. సూపర్ ఫామ్లో ఉన్నాడు. జార్ఖండ్కు కెప్టెన్గా తొలి టీ20 టైటిల్ అందించాడు. జైస్వాల్ చాన్నాళ్లుగా భారత టీ20 జట్టులో ప్రధాన సభ్యుడిగా లేడు. ఇక సంజూకు బ్యాకప్గా ఇషాన్ ఉంటాడు కాబట్టే జితేశ్ను తప్పించారు.
శ్రీలంకలోని స్లో పిచ్లపై వాషీ వంటి ఆల్రౌండర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు’’ అంటూ చాలా మంది టీమిండియా అభిమానులు వసీం జాఫర్కు బదులిస్తున్నారు.
టీమిండియా యువ కెరటాలు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ మరోసారి కలిసి బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి వారు ప్రాతినిథ్యం వహించనున్నది టీమిండియాకు కాదు. ఈ ముగ్గురు యువ తారలు విజయ్ హజారే వన్డే ట్రోఫీ (VHT) కోసం పంజాబ్ తరఫున బరిలోకి దిగనున్నారు.
డిసెంబర్ 24 నుంచి ప్రారంభంకాబోయే విజయ్ హజారే ట్రోఫీ కోసం 18 మంది సభ్యుల పంజాబ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 22) ప్రకటించారు. ఈ జట్టులో శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్తో పాటు రమన్దీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, ప్రభ్సిమ్రన్ సింగ్, నమన్ ధిర్ లాంటి ఐపీఎల్ స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.
ఈ జట్టుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) కెప్టెన్ను ప్రకటించకపోవడం విశేషం. గత సీజన్లో అభిషేక్ శర్మ కెప్టెన్గా వ్యవహరించగా.. ఈ సీజన్లో టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ జట్టులో ఉండటంతో PCA ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. బహుశా చివరి నిమిషంలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, VHTలో భాగంగా పంజాబ్ డిసెంబర్ 24నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జైపూర్ వేదికగా జరిగే ఆ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని మహారాష్ట్ర జట్టును ఢీకొట్టనుంది. భారత్-న్యూజిలాండ్ సిరీస్ కారణంగా గిల్, అభిషేక్ VHT మొత్తానికి అందుబాటులో ఉండరు. గిల్ వన్డే సిరీస్ సమయానికి.. అభిషేక్ టీ20 సిరీస్ సమయంలో పంజాబ్ జట్టుకు అందుబాటులో ఉండడు.
యాషెస్ సిరీస్ 2025-26ను సొంతం చేసుకుని గెలుపు జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే మ్యాచ్ ముగిసిన లియోన్ క్రచెస్ (ఊత కర్రల) సహాయంతో నడుస్తూ కనిపించడం అందరిని షాక్కు గురిచేసింది. దీని బట్టి అతడి గాయం తీవ్రమైనదిగా పరిగణించవచ్చు.
ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడు తిరిగి వస్తే జాక్ వెదరాల్డ్పై వేటు పడే అవకాశముంది.
ఇక లియోన్ గాయంపై ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. "నాథన్ లియోన్కి ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడిది కీలక పాత్ర. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నాథన్ తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లనున్నాడు.
గతంలో కూడా అతడి పిక్క గాయం కారణంగా రిహాబిలిటేషన్లో ఉన్నాడు. కాబట్టి ఎలా కోలుకోవాలన్నదానిపై అతడికి అవగాహన ఉంది. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు తన సేవలను అతడు అందించాలనుకుంటున్నాడు. నాథర్ వేగంగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాను" అని స్టార్క్ పేర్కొన్నాడు.
మూడో టెస్టులో లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. కాగా తొలి మూడు టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్ను 3-0 తేడాతో రిటైన్ చేసుకుంది. చదవండి:పాకిస్తాన్ ఓవరాక్షన్!.. అసలు కప్పు గెలిస్తే ఇంకేమైనా ఉందా?
మొట్టమొదటిసారిగా 2012లో అండర్-19 ఆసియాకప్ టైటిల్ గెలిచింది పాకిస్తాన్. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి తాజాగా ట్రోఫీని ముద్దాడింది. కాగా ఆసియా కప్-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, యూఏఈ, మలేషియా జట్లతో తలపడ్డ పాక్.. భారత్ మినహా మిగతా రెండు జట్లపై గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్కు అర్హత సాధించింది.
ఈ క్రమంలో సెమీస్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసి ఫైనల్ చేరిన పాకిస్తాన్.. టైటిల్ పోరులో దాయాది భారత్ (IND vs PAK)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది.
ఓపెనర్ సమీర్ మిన్హాస్ భారీ శతకం (113 బంతుల్లో 172)తో చెలరేగగా.. అహ్మద్ హుసేన్ హాఫ్ సెంచరీ (56)తో రాణించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా... హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
కీలక మ్యాచ్లో దారుణ వైఫల్యం అయితే, ఈ టోర్నీ ఆసాంతం దంచికొట్టిన భారత యువ తారలు... కీలక మ్యాచ్లో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా భారీ లక్ష్యఛేదనలో భారత జట్టు 26.2 ఓవర్లలో కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో 191 పరుగుల తేడాతో గెలిచిన పాక్ చాంపియన్గా నిలిచింది.
భారత ఓపెనర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 10 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (Ayush Mhatre- 2) దారుణంగా విఫలమయ్యాడు. ఆరోన్ జార్జ్ (16), విహాన్ మల్హోత్రా (7), వేదాంత్ త్రివేది (9), అభిజ్ఞాన్ కుందు (13) తేలిపోయారు. పదోస్థానంలో వచ్చిన దీపేశ్ 16 బంతుల్లో 36 పరుగులతో కాసేపు పోరాడాడు. అయితే, అప్పటికి పరిస్థితి చేజారి ఓటమి ఖరారైంది.
పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీయగా... మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ సమీర్ మన్హాస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
ఘన స్వాగతం ఇదిలా ఉంటే.. అండర-19 ఆసియా కప్ గెలిచిన పాక్ యువ జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఇస్లామాబాద్ విమానాశ్రయంలో దిగగానే జట్టును అభిమానులు చుట్టుముట్టారు. అనంతరం ఇస్లామాబాద్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ప్రపంచకప్ గెలిచినంతగా సంబరాలు చేసుకున్నారు.
దీనికే ఇంత చేశారంటే.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘మీ ఓవరాక్షన్ ఆపండి.. అండర్-19 స్థాయిలో ఆసియా కప్ గెలిస్తేనే ఈ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకుంటారా?..
ఒకవేళ మీ ప్రధాన జట్టు ప్రపంచకప్ గెలిస్తే అసలు తట్టుకుంటారా?.. దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పేదరికం.. ఇలాంటి వాటిపై కాస్త దృష్టి పెట్టండి.. ఇలాంటి అతి ఎప్పుడూ పనికిరాదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అమెరికా.. సగటు ఇండియన్ డాలర్ డ్రీమ్కు కేరాఫ్ అడ్రస్. గత కొన్ని దశాబ్దాలుగా ఆ కలను నిజం చేసుకునేందుకు లక్షలాది మంది భారతీయులు శ్వేతసౌధం ముందు వాలిపోయారు.. తమ కలను సాకారం చేసుకున్నారు కూడా. కాని.. ఇప్పుడా భారతీయుల ఆ కలలసౌధం ట్రంప్ రూపంలో కుప్పకూలుతోంది. నిమిషానికో నిబంధన, రోజుకో చట్టం తీసుకొస్తూ సగటు భారతీయుని ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దీంతో అమెరికా అంటేనే అమెరికానా..? అనేలా చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన డిపోర్టేషన్ల సంఖ్యే.
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టాక అమెరికాలో సగటు భారతీయుడి జీవితం బిక్కుబిక్కుమంటూ గడుస్తోంది. ఇండియన్ల పరిస్థితే కాదు.. అక్కడుంటున్న అన్ని దేశాల వారి పరిస్థితీ ఇదే. అయితే మనది కొంచెం ఎక్కువ. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్ణులా.. ఎప్పుడు ఏ చట్టంతో కొడతాడో.. ఏ రూలును ఝులిపిస్తాడో.. ఏ వైపు నుంచి వేటు వేస్తాడోనన్న చందంలా మారింది అమెరికాలో నివశిస్తున్న విదేశీయుల పరిస్థితి. ఓ రోజు H1b అంటాడు.. మరో రోజు విద్యార్థులపై పడతాడు.. ఇంకో రోజు పన్నులంటాడు. ఇలా బతుకుదెరువు కోసం వెళ్లిన విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంపన్న. ఇలా ఏదో ఒక కారణ చెప్పి అక్కడ్నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడు.
ఈ సందర్భంగా డిపోర్టేషన్కు సంబంధించి ఓ భయంకరమైన న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య. ఈ ఒక్క సంవత్సరమే అక్రమంగా ఉన్నారంటూ 3,258 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్న వార్త కలకలం రేపుతోంది. 2025 జనవరి 1 నుండి నవంబర్ 28 వరకూ జరిగిన డిపోర్టేషన్ల సంఖ్య ఇది.
2024తో పోలిస్తే ఈ ఏడాది బహిష్కరణల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశం. 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక సంఖ్య కూడా ఇదే. దీనిపై అమెరికన్లే తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో అగ్రరాజ్యం అతి చేస్తోందని సగానికి పైగా అమెరికన్లు అభిప్రాయపడినట్లు Pew Research Centre సర్వేలో వెల్లడైంది.
రాజ్యసభలో మంత్రి రామ్జీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ గణాంకాలను వెల్లడించారు. ట్రంప్ ప్రభుత్వం ప్రకారం బహిష్కరణకు గురైన వాళ్లంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవాళ్లు, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయినవాళ్లు. అలాగే ఏ డాక్యుమెంట్లూ లేకుండా అమెరికాలో నివాశముంటున్న వారు, లేదా నేర నిర్ధారణ జరిగిన వాళ్లు.
దీనిపై ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది అక్టోబర్లో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో సగానికి పైగా అమెరికన్ పెద్దలు ట్రంప్ ప్రభుత్వం బహిష్కరణల విషయంలో పరిధి దాటి ప్రవర్తిస్తోందని నమ్ముతున్నారట. అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలా అని అడిగినప్పుడు, కేవలం 31% మంది మాత్రమే అవును అని చెప్పారు. సగానికి పైగా ప్రజలు కేవలం కొందరిని మాత్రమే బహిష్కరించాలని నిర్భంయగా చెప్పారు. ఈ డిపోర్టేషన్లపై వ్యతిరేకత మార్చి నుండి అక్టోబర్ మధ్య 9 శాతం పెరిగడం గమనార్హం. మరింత ఆశ్చర్యకరంగా ఈ మార్పు అటు రిపబ్లికన్లలో, ఇటు డెమొక్రాట్లలో కూడా కనిపించడం. అంటే ప్రతపక్షంలోనే కాదు.. అధికార పక్షంలోనూ ఈ అభిప్రాయం ఉందన్నమాట.
ఈ సర్వేను మరింత డీటెయిల్డ్గా చూస్తే.. మార్చిలో కేవలం 13% మంది రిపబ్లికన్లు ప్రభుత్వం అతి చేస్తోందని భావించగా, అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 20 శాతానికి చేరింది. డెమొక్రాట్లలో ఈ అభిప్రాయం 86 శాతానికి పెరిగింది. రిపబ్లికన్లలో ఎక్కువ శాతం మంది ఇప్పటికీ అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు.
వీరిలో వైట్ రిపబ్లికన్లు అత్యధికంగా ఉండగా, సుమారు 40 శాతం మంది ఆసియా రిపబ్లికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. డెమొక్రాట్లలో కేవలం 8 శాతం మంది మాత్రమే అందరినీ పంపించేయాలని కోరుకోగా, 16 శాతం మంది బ్లాక్ డెమొక్రాట్లు అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరారు. హిస్పానిక్ వర్గానికి చెందిన వారు అంటే రెండు పార్టీలలోనూ ఎవరినీ బహిష్కరించకూడదని కోరుకుంటున్న వారిలో అధికంగా ఉన్నారు.
మార్చి నుంచి అక్టోబర్ వరకు బహిష్కరణల విషయంలో ట్రంప్ అతి చేస్తున్నాడనే సాధారణ ఆందోళన రెండు పార్టీల్లోనూ పెరిగినప్పటికీ, వ్యక్తిగత ప్రభావం పట్ల ఆందోళన అంతగా పెరగలేదు. మార్చిలో 27 శాతం డెమొక్రాట్లు తమ ఇమ్మిగ్రేషన్ లేదా సిటిజన్షిప్ స్టేటస్తో సంబంధం లేకుండా తమకు, తమ కుటుంబ సభ్యుడికి లేదా స్నేహితుడికి బహిష్కరణ ముప్పు ఉందని ఆందోళన చెందారు.
అక్టోబర్కు వచ్చేసరికి ఇది 40 శాతం కంటే ఎక్కువ పెరగడం గమనార్హం. రిపబ్లికన్ రెస్పాండెంట్లు మాత్రం ఏడాది పాటు తమ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నారు. మార్చి, అక్టోబర్ రెండింటిలోనూ కేవలం 10శాతం మంది మాత్రమే ఈ విషయాన్ని చెప్పారు. హిస్పానిక్ వ్యక్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమ ఫ్రెండ్స్ డిపోర్టేషన్కు గురవుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే.. తమ ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు లేదా అరెస్టులు చేస్తున్నారని 60 శాతం మంది హిస్పానిక్ ప్రజలు తెలిపారు. ఆసియన్లలో ఈ సంఖ్య 47%, బ్లాక్ పీపుల్లో 39%, వైట్ పీపుల్లో 38% గా ఉంది.
మా దేశంలోకి అడుగు పెట్టొద్దు..: ప్రపంచంలోని 20% దేశాలపై అమెరికా ఆంక్షలు అమెరికాకు ఏమైంది.. ఆంక్షల పేరుతో నిత్యం ఏదోఒక దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ఈ అగ్రరాజ్యం ప్రపంచ దేశాలపై మరో బాంబు వేసింది. గత కొన్ని రోజులుగా ట్రావెల్ బ్యాన్ పేరుతో కొత్త పేచీని తెరపైకి తీసుకొచ్చిన అమెరికా దాన్నిప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాల ప్రజలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా నిషేధించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చింది.
ప్రధానంగా ఆఫ్రికా నుంచి వచ్చే దేశాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేస్తూ యూఎస్లో ప్రవేశానికి పూర్తి లేదా పాక్షిక నిషేధం విధించింది. ఇది వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటికే ఉన్న ట్రావెల్ నిషేధాలు, పరిమితుల లిస్ట్లో మరిన్ని ఆఫ్రికన్, వెస్ట్ ఏషియన్తోపాటు మరికొన్ని ఇతర దేశాలను చేర్చినట్లైంది. మొత్తం నిషేధం, పరిమితులు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య 39కి చేరింది. టోటల్గా ఈ సంఖ్య ప్రపంచ దేశాల్లో దాదాపు సుమారు 20%. అంటే.. ప్రపంచంలోని దాదాపు 20శాతం దేశాల ప్రజలు అమెరికావైపు కన్నెత్తి కూడా చూడకూడదన్నమాట.
తాజా ట్రావెల్ బ్యాన్ విస్తరణలో అమెరికా ఐదు దేశాలపై పూర్తి ట్రావెల్ బ్యాన్ విధించింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం విధించారు. దీంతోపాటు పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారిపై కూడా కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇవి కాకుండా మరో 15 దేశాలు పాక్షిక ట్రావెల్ పరిమితులు ఎదుర్కోనున్నాయి. అంగోలా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవోర్, డొమినికా, గాబన్, గాంబియా, మలావీ, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే పాక్షిక ఆంక్షల ఈ జాబితాలో ఉన్నాయి.
ఇది ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ప్రభావం చూపుతుంది. ఇక్కడి భారతీయులపైనా ప్రభావం పడనుంది. టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో సంపన్నులైన భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్నారు.. ఈ నిర్ణయం వీరిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటితోపాటు యాంటిగ్వా, బార్బుడా వంటి కొన్ని కరీబియన్ దేశాలపై నిషేధం విధించడం జరిగింది. వీరు విదేశీయులకు ఇచ్చే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ద్వారా పౌరసత్వం ఇచ్చే పథకం అని తెలుస్తోంది.
తొలుత ఈ ట్రావెల్ బ్యాన్ను ఈ ఏడాది జూన్లో ప్రకటించారు. అమెరికా జాతీయ, ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని 19 దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధించింది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇరాన్, సోమాలియా, యెమెన్ వంటి దేశాలపై పూర్తి ప్రవేశ నిషేధం విధించగా.. లావోస్, వెనిజులా వంటి దేశాలపై పాక్షిక నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. అవినీతి పరులు, క్రిమినల్స్, మోసగాళ్ల విషయంలో అమెరికా అధికారులకు ఇమ్మిగ్రేషన్ తనిఖీలప్పుడు కష్టమవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది.
వీసా పరిమితి ముగిసినా ఉంటున్న వారు, తాము బహిష్కరించినా తమ పౌరుల్ని వెనక్కి తీసుకోడానికి కొన్ని ప్రభుత్వాలు నిరాకరించడం, బలహీనమైన భద్రతా సహకారం వంటి కారణాలను అమెరికా చూపుతోంది. వాషింగ్టన్ డీసీలో ఓ ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు అమెరికన్ నేషనల్ గార్డ్ సైనికులపై జరిపిన కాల్పుల ఘటనను ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా వైట్ హౌస్ పేర్కొంది.
సదరు వ్యక్తికి అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు జరిగినప్పటికీ, భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. అమెరికా శరణార్థుల దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసే కేంద్రంలో అక్రమంగా పనిచేస్తున్న ఏడుగురు కెన్యా జాతీయుల్ని దక్షిణాఫ్రికా అధికారులు అరెస్టు చేసి బహిష్కరించారు. వారంతా టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్కడ పనిచేస్తున్నట్లు గుర్తించారు.
ఈ ట్రావెల్ బ్యాన్ ఎక్స్పాన్షన్ను కొందరు రిపబ్లికన్ శాసనసభ్యులు, ఇమ్మిగ్రేషన్ హార్డ్లైనర్లు గట్టిగా సమర్థించారు. ఇది దేశ భద్రతకు, అక్రమ వలసల్ని అరికట్టడానికి అవసరమైన సరైన చర్య అని వాదిస్తున్నారు. భద్రతా సహకారం, డాక్యుమెంటేషన్ స్టాండర్డ్లకు విదేశీ ప్రభుత్వాలను జవాబుదారీగా చేయడం సరిహద్దు సమగ్రతను బలోపేతం చేస్తుందని వారు వెనకేసుకొచ్చారు.
అయితే కేవలం జాతీయతను బట్టి ఒక దేశం మొత్తాన్ని ప్రమాదకరంగా చూడటం సరికాదని, నేర చరిత్ర లేని సాధారణ పౌరుల్ని ఇది ఇబ్బంది పెడుతుందని మానవ హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ట్రంప్ గతంలో నార్వే, స్వీడన్ వంటి దేశాల నుండి వలసలను ఇష్టపడతానని, అభివృద్ధి చెందని దేశాలను కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత 17 ఏళ్లుగా విదేశాల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు తరీఖ్ రహమాన్ బంగ్లాదేశ్ రానున్నట్లు ప్రకటించారు. ఆయన రాకకోసం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆదేశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రహమాన్ రాక పొలిటికల్ హీట్ను పెంచింది.
బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత తీవ్రంగా ఉంది. ఇటీవలే రాడికల్ నేత ఉస్మాన్ హాదీ ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చారు. ఆయన చికిత్సపొందుతూ మృతిచెందాడు. దీంతో అక్కడ హింస చేలరేగింది. అంతేకాకుండా వరుసగా నాలుగు సార్లు అధికారం చేపట్టిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై ఈ సారి అక్కడ పోటీ చేయకుండా బ్యాన్ విధించారు. దీంతో అక్కడ అసలు పోటీ ఎవరి మధ్య జరుగుతుందనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆదేశ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు బంగ్లా రానున్నారు.
తరీఖ్ రహమాన్ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. అక్కడే ఉంటూనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ ఛైర్పర్సన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన 2008లో అవినీతి కారణాలతో ఆయన జైలు శిక్ష అనుభవించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితుల రీత్యా మెరుగైన చికిత్స కోసం లండన్ కెళ్లారు. అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పడడంతో లండన్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని రాజకీయ పరిస్థితుల రీత్యా ఆయన తిరిగి వస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని జియారౌ రహమాన్ స్థాపించారు. బంగ్లాదేశ్లో ఇప్పటివరకూ ఆపార్టీ మూడుసార్లు అధికారం సాధించింది. చివరిసారిగా 2001-2006లో ఖలేదా జియా ఆపార్టీ తరపున ప్రధానిగా సేవలంధించారు. ప్రస్తుతం అవామీలీగ్ పోటీలో లేకపోవడంతో బీఎన్పీకి సరైన పోటీ ఇచ్చే పార్టీలు అక్కడ లేవు.
కార్లూన్లతో పాపులర్ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది. తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, మత్తుమందులు, మానసిక ఆరోగ్యం సవాళ్లపై చర్చకు దారి తీసింది.
2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్. లాస్ ఏంజిల్స్లోని రివర్సైడ్లో సెప్టెంబర్లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.
మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాలనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. వీటితోపాటు గుడ్ టైమ్ మాక్స్ (2007), ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.
తోటి వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సాజిద్ను తాను క్షమించనని.. ఆ డెడ్బాడీని తాను చూడనని.. అంత్యక్రియలు చేయనని... పోలీసులకు స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ముష్కరదాడి కింగ్పిన్ సాజిద్ భార్య వెర్నా. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండీ ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.
ఆ కాల్పులు జరిపి 16మందిని పొట్టన పెట్టుకున్న సాజిద్ అక్రమ్ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్ కుటుంబీకులను, భార్య వెర్నాను పోలీసులు కోరినా.. ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేయడానికి నిరాకరించింది. దీంతో సాజిద్ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు.
ఏం జరిగింది ఆరోజు డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండిలోని చనుకా బై ది సీ ఈవెంట్ పై ఒక్క సారిగా విరుచుకు పడ్డ సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ ఉగ్రదాడి కారణంగా ఒక్కసారిగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈవెంట్ ఒక్కసారిగా మారణహోమంగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో 16మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.
సుమారు 100 మంది గాయాల బారిన పడ్డారు. ధైర్యం చేసిన మరో స్థానికుడు అహ్మద్ ధైర్య సాహసాలు ప్రదర్శించి... తూటాలకు భయపడకుండా సాజిద్ను ఎదుర్కొని ప్రాణనష్టాన్ని నివారించగలిగాడు. అప్పట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సాజిద్ను కాల్చి చంపేయడం.. అతని కుమారుడు నవీద్ను అదుపులోకి తీసుకోవడంతో డెత్గేమ్కు ఫుల్స్టాప్ పడింది. మారణకాండ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు తీవ్రవాద ఘటనను ఖండించాయి.
నవీద్పై 59 కేసులు ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మారణహోమాన్ని సృష్టించిన సాజిద్ అదే రోజు చనిపోవడంతో అతని డెడ్బాడీని కరోనర్ కార్యాలయంలోని మార్చురీకి తరలించి తదుపరి దర్యాప్తుపై పోలీసులు ఫోకస్ చేశారు. అక్కడి చట్ట ప్రకారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ భార్య వెర్నా మాత్రం ఆ డెడ్బాడీని తాను తీసుకెళ్లనని స్పష్టం చేసింది. ఈ తీవ్రవాద ఘటనలో ప్రధాన పాత్ర పోషించి పోలీసుల కాల్పుల్లో మరణించిన సాజిద్ కుమారుడు 24ఏళ్ల నవీద్ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.
అతన్ని విచారించిన ఆస్ట్రేలియా పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. వీటిలో 16 హత్య కేసులు, ఉగ్రవాద చర్యకు పాల్పడిన కేసుతో పాటు తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర కేసులున్నాయి. విచారించగా... తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్లోని మిండనావోలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు, ఐసిస్ నుంచి ప్రేరణ పొందినట్లు నవీద్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో అనే ద్వీపంలో 1990 నుంచి ఐఎస్ తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం.
దూరమైన బంధువులు అంతటి ఘోరానికి పాల్పడ్డ సాజిద్ గురించి హైదరాబాద్లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్ ఇప్పుడు కాదు... 1998లోనే దూరమయ్యాడని... తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని... అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని టోలీచౌకీలో నివాసముంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు.
ఆస్తులు కూడ బెట్టిన సాజిద్ తీవ్రవాదం జీర్ణించుకున్న సాజిద్ గతంలోనే భార్యతో కూడా దూరమయ్యాడట. అయితే ఘటనకు ఆరు నెలల ముందు నుంచి భార్యతో తిరిగి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భార్య వెర్నా పోలీసులకు వివరించింది. అయినా భార్యతో కాకుండా కుమారుడితో కలిసి కాంప్సీ ప్రాంతంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందే భారీగా ఆస్తులు కూడబెట్టిన సాజిద్ తొలుత 7లక్షల డాలర్లకు మూడు పడకగదుల ఆస్తిని 2016లో కొనుగోలు చేసి భార్య వెర్నా పేరిట రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత 5 లక్షల డాలర్లతో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. అతను మరణించిన నాటికి అతని ఆస్తుల విలువ సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
మారణకాండకు పక్కా స్కెచ్ మారణకాండ సృష్టించడానికి తండ్రీ కొడుకులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 14న సాయంత్రం7గంటల సమయంలో కాంప్సీ ప్రాపర్టీ నుండి బోండి బీచ్ కు వెళ్లారు. క్యాంప్ బెల్ పరేడ్ లో హ్యుండాయ్ ఎలాంట్రా కారును పార్క్ చేసి, వాహనం కిటికీపై ఐసిస్ జెండాను ఎగరవేశారు. బోండి బీచ్ నుండి మీటర్ల దూరంలో ఉన్న పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్నప్పుడు యూదు కుటుంబాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు చిక్కిన కొడుకు నవీద్ ఇచ్చిన ఆధారాలతో ఆ సాయంత్రం, సిడ్నీ నైరుతి ప్రాంతంలోని బోనీరిగ్ లోని ఒక ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు ఆ ఇంటిని వెర్నా, సాజిద్ లు కలిసి 2016లో కొనుగోలు చేశారని గుర్తించారు.
ఇండియాలో నేర చరిత్ర లేదు హైదరాబాద్కు చెందిన సాజిద్ ఆస్ట్రేలియాకు వలస వచ్చిన తర్వాత ఆరుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లినట్లు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఆస్తి సంబంధిత అంశాలు, అతని వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించడం లాంటి కారణాలతోనే వచ్చి వెళ్లాడు. అయినప్పటికీ, అతని తండ్రి మరణించినప్పుడు అతను భారతదేశానికి రాలేదు. ఉపాధి నిమిత్తం 1998లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సాజిద్ 1999లోనే యూరప్కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
భారతీయ పాస్ పోర్ట్ కలిగి ఉన్న 50 ఏళ్ల సాజిద్కు ఇండియా నుంచి నేర చరిత్ర లేదు. అతను భారతదేశంలో రాడికలైజ్ అయ్యే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని అతని కుటుంబం కూడా అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని చెబుతున్నారు. ఇప్పటికీ మధ్యతరగతి అధికంగా ఉన్న టోలిచౌకిలోని ఓ ఇంట్లో సాజిద్ తల్లి, సోదరుడు నివాసముంటున్నారు. సాజిద్ గురించి.. అతని రాకపోకల గురించి తమకేమీ తెలియదని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడం గమనార్హం.
ఫిలిప్పీన్స్లో నెల రోజులు తీవ్రవాద శిక్షణ అయితే తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్ లో తీవ్రవాద శిక్షణ పొందినట్లు సంకేతాలు స్పష్టం అయ్యాయి. గత నవంబర్లో నెల రోజల పాటు దక్షిణ ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లిన సాజిద్, నవీద్లో అక్కడే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మిండనోవా అనే ద్వీపంలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. ఫిలిప్పీన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఆస్ట్రేలియన్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో ద్వీపం.. 1990 దశకం నుంచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు షెల్టర్జోన్గా మారిందని... తీవ్రవాదులు తరచూ సందర్శించే మిండనోవా ద్వీపం వారికోసం ఓ హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.
తండ్రీ కొడుకులిద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్ చేరుకున్నట్లు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. మిండనావోలోని దావావో నగరానికి వెళ్లే ముందు వారు మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఇద్దరూ దావావోను తమ తుది గమ్యస్థానంగా మార్క్ చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్లో ఏ విధమైన ఉగ్రవాద శిక్షణను పొందారనే అంశాలను రాబట్టేందుకు ఫిలిప్పీన్స్ అధికారులతో ఆస్ట్రేలియా పోలీసులు చర్చలు సాగిస్తున్నారు.
అయితే ఐసిస్తో సంబంధాలున్నాయన్న వాదనను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ తిరస్కరించారు. అయితే ఐసిస్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉందని ఫిలిప్పీన్స్ సైన్యాధికారి తెలిపారు. తిరిగి తండ్రీ కొడుకులు నవంబర్ 28న దావావో నుండి మనీలాకు కనెక్టింగ్ విమానంలో అక్కడి నుంచి బయలుదేరి సిడ్నీ చేరుకున్నారు. ఉగ్రవాదుల వాహనం నుండి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన రెండు జెండాలను స్వాధీనం చేసుకున్నారు, ఐసిస్తో సంబంధం కలిగి ఉన్నాయనడానికి కొన్ని ఆధారాలను ఆస్ట్రేలియా పోలీసులు సేకరించారు.
తీవ్ర నిరసనలు, అ శాంతితో భగ్గుమంటున్న బంగ్లాదేశ్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయనను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశానికి చెందిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ మరణం ఆ దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఉస్మాన్ మృతితో ఆయన మద్దతుదారులు చెలరేగిపోయారు. ఢాకాలో మీడియా హౌజ్లపై దాడి చేస్తూ విధ్వంసం సృష్టించారు. అంతే కాకుండా దైవదూషణ చేశారనే నెపంతో ఓ హిందూ యువకుడిని అత్యంత దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం ఆదేశంలో నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ అనే నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
దీంతో ఆయనను హుటాహుటీన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అక్కడి పోలీస్ అధికారి మాట్లాడుతూ " మహమ్మద్ మోతేలాబ్ సికిదార్పై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు" అని తెలిపారు.
మహమ్మద్ మోతేలాబ్ సికిదార్ నేషనల్ సిటిజన్ పార్టీకి చెందిన నాయకుడు. శ్రామిక్ శక్తి విభాగంలో ఈయన సెంట్రల్ ఆర్గనైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఖులానా మెట్రోపాలిటన్ యూనిట్లో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులపై కాల్పులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.
స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.
మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
వారికి మినహాయింపు 2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
భారతీయులపై ప్రభావం ఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు.
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో సీనియర్ సైనిక అధికారి, లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్ మృతిచెందారు. రష్యన్ జనరల్ స్టాఫ్ పరిధిలోని ‘ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డైరెక్టరేట్’ అధిపతిగా పనిచేస్తున్న సర్వరోవ్, తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. వాహనం కింద అమర్చిన పదార్థం కారణంగానే పేలుడు సంభవించి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా దర్యాప్తు కమిటీ ధృవీకరించింది.
ఈ హత్య వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక నిగూఢ సేవల (Special Services) ప్రమేయం ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణను ప్రారంభించారు. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగిన నేపథ్యంలో, ఇది ఉక్రెయిన్ గూఢచారి సంస్థల పథకమేనని రష్యా అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ నుంచి అధికారికంగా ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు.
కాగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఫ్లోరిడాలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు నిర్మాణాత్మక రీతిలో సాగుతున్నాయని క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఒడేసాలోని ఓడరేవు లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతిచెందగా, 27 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. ఓడరేవు మౌలిక సదుపాయాలు, సమీపంలోని వాహనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ పరిణామాలు శాంతి ప్రయత్నాలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
Kim Woo-bin, Shin Min-ah Wedding దక్షిణ కొరియాకు చెందిన నటి ,మోడల్ 41 ఏళ్ల షిన్ మిన్-ఆహ్ తన చిరకాల ప్రియుడు కిమ్ వూ-బిన్ను పెళ్లాడింది. డిసెంబర్ 20న సియోల్లోని జంగ్-గులోని ది షిల్లా హోటల్లోని రాయల్ హాల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
గత పదేళ్లుగా సెలబ్రిటీ కపుల్గా పేరుతెచ్చుకున్న వీరిద్దరి వెడ్డింగ్కు దక్షిణ కొరియాలోని ఎంటర్టైన్మెంట్ రంగానికి పలువురు అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరిలో BTS V , PD నాహ్ యుంగ్-సుక్, దర్శకుడు చోయ్ డాంగ్-హూన్, రచయిత కిమ్ యున్-సూక్, కో డూ-సిమ్, లీ బైయుంగ్-హున్, పార్క్ క్యుంగ్-లిమ్, ఉహ్మ్ జంగ్-హ్వా, గాంగ్ హ్యో-జిన్, కిమ్ యుయి-సుంగ్, యూన్ క్యుంగ్-హో, బే సియోంగ్-వూ, ఇమ్ జూ-హ్వాన్, కిమ్ టే-రి, ర్యు జున్-యెయోల్, అన్ బో-హ్యూన్, నామ్ జూ-హ్యూక్, బే జంగ్-నామ్ తదితరులు ఉన్నారు.
షిన్ మిన్-ఆహ్ బ్రైడల్ గౌను మిన్-ఆహ్ ఐకానిక్ లెబనీస్ ఫ్యాషన్ హౌస్ ఎల్లీ సాబ్ బ్రైడల్ గౌనును ఎంచుకుంది. స్ప్రింగ్ 2026 బ్రైడల్ కలెక్షన్లోని అందమైన తెల్లని గౌనులో అందంగా మెరిసింది. సొగసైన నెట్టెడ్ వీల్ భారీ గౌను ధర రూ. 25.6 లక్షలు. కిమ్ వూ-బిన్ రాల్ఫ్ లారెన్ పర్పుల్ లేబుల్ సూట్ను ధరించాడు.
ప్రియుడికి కేన్సర్ వచ్చినపుడు మరింత ప్రేమతో
షిన్ మిన్-ఆహ్, కిమ్ వూ-బిన్ మొదటిసారి 2015లో ఒక ప్రకటన వాణిజ్య ప్రకటనలో కలుసుకున్నారు. 2015 నుంచి డేటింగ్ ప్రారంభించారు. 2017లో కిమ్ వూ-బిన్కు నాసోఫారింజియల్ క్యాన్సర్ సోకినపుడు షిన్ అతనికి సపోర్ట్గా నిలిచింది.పరస్పరం గౌరవించుకుంటూ, కరియర్లో ఎంతో కీర్తిని, ప్రజాదరణ పొందారు. దాదాపు దశాబ్దం తర్వాత,వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరికి కోట్లాది మంది అభిమానులు శుభాకాంక్షలు అందించారు.
సాక్షి, గుంటూరు: ఏపీలో మరో ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు పంపించింది. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో లోకేష్ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ నోటీసులు ఇచ్చింది. రేపు(డిసెంబర్ 23, మంగళవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అమ్మిరెడ్డికి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ నోటీసులు పంపింది.
13 మందిపై అక్రమ కేసులు శ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలొ వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసులు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. 8 మంది వైఎస్సార్సీపీ నేతలకు ధర్మవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.
ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.
23.12.2025(మంగళవారం) షెడ్యూల్: సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.
24.12.2025(బుధవారం) షెడ్యూల్: ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు
25.12.2025(గురువారం) షెడ్యూల్: ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు.
సినిమాలలో కొన్ని లొకేషన్స్ చూసి... ‘ఆహా’ అనిపిస్తుంది. ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు... ‘ఫలానా సినిమాలో ఈ సీన్ చూశాం కదా!’ అని గుర్తు తెచ్చుకుంటాం. ప్రయాణాలకు, చిత్రాలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రయాణ.. చిత్రం, చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!
తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఈ అద్భుత ప్రకృతి దృశ్యం బాలీవుడ్ సినిమా ‘3 ఇడియెట్స్’లో కనువిందు చేస్తుంది. కాలేజీ స్నేహాలు ముగిసి కలలు కనే ప్రదేశంగా ఈ ప్రదేశం దర్శనమిస్తుంది. పాంగాంగ్ లేక్ క్లైమాక్స్’గా ఈ ఎపిసోడ్కు పేరు వచ్చింది. యశ్ చోప్రా ‘జబ్ తక్ హై జాన్’ ఫర్హాన్ అక్తర్ ‘లక్ష్యా’ మణిరత్నం ‘దిల్ సే’లాంటి చిత్రాలలో లద్దాఖ్ కనిపిస్తుంది. ‘భాగ్ మిల్కా భాగ్’ సినిమాలో మిల్కాసింగ్ ట్రైనింగ్ దృశ్యాలను లద్దాఖ్లో చిత్రీకరించారు. ‘ట్యూబ్లైట్’ సినిమాను మూన్ల్యాండ్ ఏరియాలో చిత్రీకరించారు. ‘సనమ్ రే’ ‘రేస్ 3’ ‘హైదర్’ ‘తషాన్’ ‘ఎల్వోసీ: కార్గిల్’ సినిమాలలోనూ లద్దాఖ్ కనిపిస్తుంది. ‘రోడ్డ్ టు లద్దాఖ్’ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్ వచ్చింది.
సరస్సుల నగరం మెరిసింది! రాజస్థాన్లోని ఉదయ్పూర్కి ‘సరస్సుల నగరం’ అని పేరు. ఆడంబర వివాహాలకు కేరాఫ్ అడ్రస్.. ఉదయ్పూర్. ధర్మప్రొడక్షన్ ‘యే జవానీ హై దివానీ’ సినిమాలోని రాజసం ఉట్టిపడే సన్నివేశాలను ఈ అందాల నగరంలో చిత్రీకరించారు. చిత్రాలకు సంబంధించి భావోద్వేగ దృశ్యాలు పండాలంటే, పండగ సంతోషాలు వెల్లివిరియాలంటే ‘ఉదయ్పూర్’ సరిౖయెన నగరం అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. పీచోల సరస్సులో పడవలు వయ్యారంగా పరుగెడుతున్న దృశ్యాలు, సూర్యాస్తమయం తరువాత ప్యాలెస్ లైట్ల వెలుగులు నీటి అలలలో తేలియాడుతున్నప్పుడు.. ఉదయపూర్లో కనిపించిన క్షణాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. ‘యే జవానీ హై దివానీ’ ‘దడఖ్’ ‘జోదా అక్బర్’ ‘ఏక్లవ్య: ది రాయల్ గార్డ్’ ‘బాజీరావు మస్తానీ’లాంటి ఎన్నో సినిమాలలో ఉదయ్పూర్ కనిపిస్తుంది.
గతంలోకి వెళితే... గైడ్(1965), మేరా సాయ(1966) చిత్రాలలోని సన్నివేశాలను ఉదయ్పూర్లో చిత్రీకరించారు. సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్, లేక్ పిచోలా, జగమందిర్, లేక్ ప్యాలెస్, ఫతే ఘర్, అంబ్రాయ్ ఘాట్.. మొదలైనవి సినిమాల చిత్రీకరణకు కీలకమైన లొకేషన్స్గా (Cinema Locations) మారాయి.
ఆత్మశోధన అద్దం ‘గోవా అనేది ఆత్మశోధనకు అద్దంలాంటిది’ అంటారు భావుకులు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ‘దిల్ చాహ్తా హై’లో గోవా కనువిందు చేస్తుంది. పోర్ట్ అగ్వాడా ఎంతోమందికి సినిమాటిక్ ల్యాండ్ మార్క్గా మారింది. గోవా బీచ్ల (Goa Beach) వెంట నడుస్తూ ఆలోచిస్తుంటే...అలలు ఎగిసి పడే శబ్దాలు వింటుంటే, నవ్వులు గాలిలో తేలుతుంటే, ఉరుకు పరుగుల జీవితం కాస్తా ఆ అలల ముందు ప్రశాంత చిత్తంతో చూస్తుంటే.. ఇలా ఎన్నో ఎన్నో భావాలకు గోవా కేరాఫ్ అడ్రస్ అవుతుంది. అందుకే సినీ దర్శకులకు గోవా బాగా నచ్చుతుంది. ‘డియర్ జిందగీ’ ‘గోల్మాల్ సిరీస్ (2006–2010), ‘దృశ్యం’ ‘చెన్నై ఎక్స్ప్రెస్’ ‘దిల్వాలే’ ‘ధమ్ మారో ధమ్’ ‘గో గోవా గాన్’లాంటి ఎన్నో చిత్రాలను గోవాలో చిత్రీకరించారు. గోవా ప్రత్యేకత ఏమిటంటే భారీ బడ్జెట్ సినిమాల దర్శకులకు నచ్చుతుంది. చిన్న నిర్మాతలకు సైతం అందుబాటులో ఉంటుంది.
పొగమంచు కొండలలో... పొగమంచు కొండలతో స్నేహం చేసే డార్జిలింగ్ ఎన్నో సినిమాలలో కనిపించింది. నేత్రపర్వం చేసే హిమాలయ దృశ్యాలకు, విశాలమైన టీ తోటలకు డార్జిలింగ్ ప్రసిద్ధి పొందింది. డార్జిలింగ్ను బాగా అర్థం చేసుకోవాలంటే, ఆ అందాలను ఆస్వాదించాలంటే బాలీవుడ్ (Bollywood) సినిమా ‘బర్ఫీ’ చూడాల్సిందే. ‘మై హూ నా’ ‘యారియాన్’ ‘పరిణిత’ ‘రాజు బన్ గయా జెంటిల్మెన్’ ‘మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్’లాంటి ఎన్నో చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్లో చిత్రీకరించారు. వెనక్కి వెళితే... బర్సాత్ కి ఏక్ రాత్(1982), ప్రొఫెసర్(1962), జబ్ ప్యార్ కైసీ సే హోతా హై(1961), ఆరాధన (1969) చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్లో చిత్రీకరించారు.
అద్భుత కట్టడాలతో అలరించే.. శతాబ్దాల సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకున్న అండలూసియా ప్రాంత చారిత్రక రాజధాని సెవిల్లె. సూర్యకాంతితో అద్భుతంగా వెలిగే కట్టడాలు, అద్భుతమైన మూరిష్ వాస్తు శిల్పానికి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది సెవిల్లె. జోయా అక్తర్ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ ఇక్కడే చిత్రీకరించారు.
వెనిస్ ఆఫ్ నార్త్ వాయువ్య బెల్జియంలోని అందమైన చారిత్రక నగరం బ్రూజెస్. వంకర కాలువలు, మెట్ల–గేబుల్ ఇళ్ళు, రకరకాల శిల్పాలు, రాతి వంతెనలకు బ్రూజెస్ పెట్టింది పేరు. బ్రూజెస్ను ‘వెనిస్ ఆఫ్ నార్త్’గా పిలుచుకుంటారు. అమీర్ఖాన్ ‘పీకే’లో బ్రూజెస్ అందాలు కనువిందుచేస్తాయి. లవర్స్ బ్రిడ్జి, మిన్నె వాటర్ కాజిల్, మార్కెట్ స్క్వైర్, బ్రెల్ఫీ టవర్, వంకలు తిరిగే కాలువలు కనిపిస్తాయి. ‘పీకే’లోని ‘చార్ కదమ్’ పాటను ఇక్కడే చిత్రీకరించారు.
వంద స్తంభాల నగరం ఎత్తైన గోతిక్ స్తంభాలు, టెర్రకోట–ఎరుపు పైకప్పులు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి పొందింది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్. ‘వంద స్తంభాల నగరం’ అని పిలవబడే ప్రాగ్లో మధ్యయుగాలనాటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వల్తావా నది ప్రవాహాన్ని చూడడం అద్భుత అనుభవం. రాతి వీధుల్లో ఈల పాట పాడుతూ వేగంగా నడుస్తుంటే, ప్రాగ్ అందాలు ఇంతియాజ్ అలీ ‘రాక్స్టార్’ సినిమాలో కనిపిస్తాయి. సినిమాలోని రకరకాల భావోద్వేగాలకు ప్రాగ్ (Prague) సరిగ్గా సరిపోయింది. చార్లెస్ వంతెన కింద నది వయ్యరాలను చూడడం మరో అద్భుత అనుభూతి. – పాషా
సాధారణంగా మాల్స్లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.
ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్లోని H&M స్టోర్లోని హైటెక్ ట్రయల్ రూమ్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్దేవా. చక్కటి మ్యూజిక్ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది.
వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.
అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
డెస్టినేషన్ వివాహాలు గురించి తెలిసిందే. సంపన్నులు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఇలాంటి విలాసవంతమైన వివాహాలు చేసుకుంటుంటారు. విలాసవంతమైన ప్యాలెస్లు, రాజుల కాలంనాటి ఫేమస్ భవనాల్లో అలనాటి చారిత్రక దర్పానికి తగ్గట్టు అంగరంగ వైభవవంగా వివాహాలు చేసుకుంటుంటారు. అలాంటి ప్రఖ్యాతిగాంచిన డెస్టినేషన్ వెడ్డింగ్ భవంతులలో ఒకటి ఈ రాజస్థాన్ ఉదయ్పూర్లోని ప్యాలెస్. ఇక్కడ ఒక్క రాత్రికి బస ఎంత అవుతుందో తెలిస్తే కంగుతింటారు.
ఈ ప్రముఖ రాజస్థాన్ ప్యాలెస్లో లగ్జరీ రిసార్ట్లు, వాటి హంగుఆర్భాటాలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఇలాంటి ప్యాలెస్లలో పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నుంచి వెంకట దత్త సాయి పివీ సింధు -నేత్ర మంతెన-వంశీ గదిరాజు వంటి ఎందరో జంటలు పెళ్లి బంధంతో ఇక్కడే ఒక్కటయ్యారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చారిత్రకనేపథ్యం ఉన్న ఇలాంటి ప్యాలెస్లను ఎంచుకుంటారు చాలామంది జంటలు. ఈ డిసెంబర్22తో వెంకట దత్త సాయి పీవీ సింధుల దంపతులకు పెళ్లై ఏడాది అవుతున్న నేపథ్యంలో వారి వివాహానికి వేదిక అయిన ఉదయ్పూర్ ప్యాలెస్ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.
పీవీ సింధు రాఫెల్స్ ఉదయ్పూర్ సూట్లో వివాహం చేసుకున్నారు. యూరోపియన్ వాస్తుశిల్పాల మిశ్రమాన్ని కలిగి ఉన్న ఈ రిసార్ట్ తన కస్టమర్లకు మంచి ఆధునిక సౌకర్యాలను అందిస్తోంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్యాలెస్. ఇక్కడ ఉదయ్ సాగర్ సరస్సు మీదుగా పడవ ప్రయాణం అత్యంత ఆహ్లాదభరితంగా ఉంటుంది.
దాని చుట్టూ ఉన్న పచ్చదనం చూపు మరల్చనివ్వని విధంగా కట్టిపడేస్తుంది. అలాగే భోజన ప్రియుల కోసం చక్కటి వంటకాల నిధిని, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసం మంచి వెల్నెస్ చికిత్సలు, ఆయుర్వేద సెషన్ వంటి సకల సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా మౌంటైన్ బైకింగ్, వాల్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ తదితర ఎన్నో వినోదాలను నిలయం. దాదాపు 21 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ప్యాలస్ మర్చిపోలేని మధురానుభూతిని పంచి ఇస్తుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదండోయ్ పురాతనమైన మహాదేవ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ట్రెక్కింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుందట.
'స్టే' చేయడానికి అయ్యే ఖర్చు.. పీవీ సింధు-వెంకటసాయి దత్త రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్ని బుక్ చేసుకున్నారు. అది ఏకంగా దగ్గర దగ్గర ఒక్క రాత్రికి బస రూ. 7 లక్షలు పైనే అవుతుందట. ఇంత లగ్జరీలోనే కాదు ఓ మోస్తారు ధరలో లభించే రిసార్టుల కూడా ఉన్నాయట.
లేక్షోర్ సిగ్నేచర్ - ద్వీపంలో లేని గది, రాత్రికి రూ. 57,000 ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, తోటతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 77,000 ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, బాల్కనీతో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 81,000 ఫ్లెమింగో సిగ్నేచర్ రూమ్, ప్లంజ్ పూల్తో పాటు, ట్విన్ లేదా కింగ్ బెడ్తో, రాత్రికి రూ. 87,000 రాఫెల్స్ లేక్షోర్ మనోర్ - ద్వీపంలో లేని రిసార్ట్, రాత్రికి రూ. 97,000 రాఫెల్స్ మనోర్ సూట్, రాత్రికి రూ. 1,17,000 రాఫెల్స్ ఒయాసిస్ సూట్, రాత్రికి రూ. 1,37,000 రాఫెల్స్ ప్రెసిడెన్షియల్ సూట్, రాత్రికి రూ. 7,57,000 అయితే, బుకింగ్ తేదీని అనుసరించి గదులు, సూట్ల లభ్యతలో ధరలు మార్పు ఉంటుందట.
ధ్యానం ఇవాళ ఉరుకులు పరుగుల జీవితానికి అత్యంత అవసరం. పురాతన కాలంలో రుషులు ధ్యానాన్ని జ్ఞానోదయం కోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు జీవితంలో ఎదురవ్వుతున్న ఒత్తిడి, ఆందోళన వంటి సవాళ్లను అధిగమించి మనశ్శాంతిని పొందే మార్గంగా మారింది. సమయం తక్కువగా ఉండి, చేయవలిసిన పని చాలా ఎక్కువగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంది.
అటువంటి సమయంలో మన శరీరంలో శక్తి అంతా హరించుకుపోతుంది. ఒత్తిడిని ప్రేరేపించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు అమాంతం పెరగకుండా తగ్గించడానికి ధ్యానం సమర్ధవంతంగా ఉంటుంది. పైగా శక్తివంతంగా చేస్తుంది. ఇది మన మానసిస్థితిని మెరుగుపరిచి, జీవితాన్ని ఆనందమయంగా చేస్తుంది. జీవితంలో ఎంత ఎక్కువ బాధ్యతలు ఉంటే అంత ఎక్కువ ధ్యానం అవసరం ఉంటుందని ధ్యాన నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు, ఆశయాలు ఎంత ఎక్కువ ఉంటే ధ్యానం చేయాల్సిన అవసరం అంత ఎక్కువగా ఉంటుందట.
ఒత్తిడికి చక్కటి ఉపశమనం ధ్యానం. ధ్యానం అనేది శరీరానికి జీవననాడి, అలాగే మనసుకు మంచి శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా అప్రమత్తత, అవగాహన అంతగా మెరుగవ్వుతాయట. అంతేగాదు మనలో సృజనాత్మక శక్తి పెంచుతుందట. అందరిలోనూ నిస్తేజంగా ఉన్న ఈ క్రియేటివిటీ మేల్కోంటుందట. సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశం అందిస్తుందట.
అంతరంగంలో శాంతి లేకపోతే బాహ్య ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. ధ్యానం అంతర్గత శక్తిని సుస్థిరం చేస్తుంది. తత్ఫలితంగా మనం స్ట్రాంగ్గా తయావ్వడమే కాకుండా ప్రతి పనిలో విజయాన్ని సునాయాసంగా అందుకోగలుగుతామని నమ్మకంగా చెబుతున్నారుని నిపుణులు. ఇది మానవ సంబంధాలను కూడా మెరుగుపరస్తుందట.
సమాయానుసారంగా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందట. గందరగోళంతో సతమతమవుతున్న మనసుకు ఊరట, అలాగే దుఃఖాన్ని అధిమించగలిగే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసే శక్తి ఒక్క ధ్యానంతోనే సాధ్యమని నొక్కి చెబుతున్నారు యోగా గురుశ్రీశ్రీ రవిశంకర్, పలువురు యోగా నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరంమని వక్కాణిస్తున్నారు.
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్వర్క్గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షి టీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా పాల్గొని... టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంఛ్ అవటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు ఇదని కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు.
సాక్షి టీవీ కెనడా లాంచ్ ఈవెంట్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కేకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ నీల, రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదెల, మురళీధర్ పగిదెల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొత్తూరి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, గౌతమ్ కొల్లూరి, శ్రీనివాసులు, నూర్ అహ్మద్, విజయ్ చేగిరెడ్డి, కౌశిక్ నరల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కాసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్,
..షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, వేణుగోపాల శ్రీనివాసులు, రెడ్డి మరిక్కగారి, నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి, అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల, సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వివిఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర, భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతిల్ మిరియాల, పావని పులివర్తి, రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్, కస్తూరి వలియుద్దీన్, లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, వెంకట్, రీనా పాల్గొన్నారు.
భారతదేశం, శ్రీలంక, అండోరా, మెక్సికో, నేపాల్ దేశాల శాశ్వత ప్రతినిధులతో పాటు ఇతర సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒకచోట చేరి ప్రాచీన ధ్యాన సాధనను జరుపుకున్నాయి. ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు దీని ప్రాధాన్యతను పంచుకున్నాయి.
ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక రాజనీతితో సమ్మిళితం చేసిన ఒక విశేష క్షణంలో, రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గుర్తుచేసేందుకు సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యాయి. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు మరియు నాయకత్వానికి ధ్యానం ఎంతగా ప్రాసంగికమవుతోందో ఈ సమావేశం మరొకసారి స్పష్టం చేసింది.
“ప్రపంచ శాంతి సమరసత కోసం ధ్యానం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేయడంతో పాటు మార్గనిర్దేశిత ధ్యానాన్ని కూడా నిర్వహించారు. భారతీయ నాగరిక వారసత్వంలో పుట్టిన ఈ సాధనను ప్రపంచంలోని అత్యంత కీలకమైన దౌత్య వేదిక కేంద్రానికి తీసుకువచ్చిన ఘట్టమిది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వక్తలు ఇదే భావనలను ప్రతిధ్వనించారు. అండోరా రాయబారి జోన్ ఫోర్నర్ రోవిరా, తన దేశ విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని సమీకరించడం వల్ల విద్యార్థుల దృష్టి సామర్థ్యం భావోద్వేగ నియంత్రణ మెరుగుపడిందని తెలిపారు. మెక్సికో ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి అలీసియా గ్వాడలూపే బుయెన్రోస్త్రో మాసియూ, దీర్ఘకాలిక ప్రపంచ సమరసతకు అంతర్గత శాంతే పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.
నేపాల్ రాయబారి లోక్ బహాదూర్ థాపా, హిమాలయ ప్రాంతంలో ధ్యానానికి ఉన్న లోతైన నాగరిక మూలాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పు నుంచి తప్పుడు సమాచారం వరకు పరస్పరంగా ముడిపడిన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనేందులో ధ్యానం పోషించే పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో హాజరైన ఇతర ప్రముఖులు: మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్; యోగమాత ఫౌండేషన్కు చెందిన యోగమాత కేకో ఐకావా;బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ పరిపాలనా ఆధ్యాత్మిక అధిపతి బీకే మోహిని పంజాబీ; జీవన్ విజ్ఞాన్ ఫౌండేషన్ నేపాల్కు చెందిన ఎల్. పి. భాను శర్మ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన డా. లసంత చంద్రన గూనెతిల్లేకె; భౌతిక శాస్త్రవేత్త, శాంతి కోసం శాస్త్రవేత్తల గ్లోబల్ యూనియన్ అధ్యక్షుడు మరియు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉద్యమ నాయకుడు డా. జాన్ హాగెలిన్.
ఈ కార్యక్రమం ముగింపులో, గురుదేవ్ రాయబారులు, ప్రతినిధులను 20 నిమిషాల మార్గనిర్దేశిత ధ్యానంలో నడిపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అరుదైన నిశ్శబ్ద క్షణాన్ని సృష్టిస్తూ, ప్రాచీన సంప్రదాయాల్లో పుట్టిన సాధనలు నేటి ప్రపంచ వేదికపై కూడా ఎలా కొత్త ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయో గుర్తు చేశారు.
డిసెంబర్ 21న జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం వైపు ప్రపంచం ముందుకు సాగుతున్న వేళ, ఈ ఉద్యమం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పరిధిని దాటి శీర్షికల్లో నిలుస్తోంది. న్యూయార్క్లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ “World Meditates with Gurudev” అని ప్రకటించే బిల్లుబోర్డులతో వెలిగిపోతోంది ప్రపంచ వేదికపై ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడి నేతృత్వంలో జరుగుతున్న అరుదైన గ్లోబల్ ఘట్టానికి ఇది సంకేతం. న్యూయార్క్ నుంచే గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు.
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.
హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.
ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.
ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు
నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.
హెర్బలైఫ్ లిమిటెడ్ గురించి హెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘2014-19లో కాల్ మనీ రాకెట్తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.
‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు.
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ డెన్గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.
‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. రేవంత్పై ఆయన మండిపడ్డారు.
‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తూ పదవుల్ని గడ్డిపోచలా వదిలేశా. రేవంత్రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ వచ్చిన చరిత్ర ఆయనది. ఫోర్ట్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ నుంచి సమాధానమే లేదు. ఆయనవన్నీ సొల్లు మాటలు’’ అని హరీష్రావు అన్నారు.
రేవంత్ ఏమన్నారంటే.. ఆదివారం మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ ఉన్నంతకాలం హరీశ్రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, బీఆర్ఎస్ను కేటీఆర్ చేతిలో పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది అని విమర్శించారు.
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన.
చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన.
అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది.
కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు.