Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ఎంచుకున్న రంగంలో ఏ స్థాయికి ఎదిగామన్నది కాదు... ఎంత ఎదిగినా, దాన్ని తలకెక్కించుకోకుండా ఎంత హుందాగా, సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరితో ఎంత గౌరవంగా ప్రవర్తించామన్నది ముఖ్యం. అందరినీ ఆకట్టుకొనే ఆ తరహా ప్రవర్తనను అగ్ర నటుడు నాగార్జున మరోసారి ప్రదర్శించారు. 

    ఇటీవల చెన్నైలో జరిగిన ‘జియో – హాట్ స్టార్’ వారి ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఆయన తన సీనియర్ నటుడు – మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో, మరో అగ్ర తమిళ నటుడు విజయ్ సేతుపతితో కలసి వేదిక పంచుకున్నారు. 

    ఆ సందర్భంగా వేదిక మీదకు వస్తూనే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? పక్కనే ఉన్న విజయ్ సేతుపతి చేతి నుంచి చొరవగా ముందుగా మైకు తీసుకొని, మోహన్ లాల్‌ను అభినందించడం.

    క్లాప్స్ కొట్టడం తప్ప మరేమీ చేయలేం!
    మలయాళ చిత్రాల్లోనే కాక తెలుగు, హిందీ సహా వివిధ భాషల్లో నటించిన నటుడు మోహన్‌లాల్‌ను ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి, సత్కరించిన సంగతి తెలిసిందే. 

    ఆ తరువాత తొలిసారిగా వ్యక్తిగతంగా కలుస్తున్న మోహన్‌లాల్‌ను సభాముఖంగా నాగార్జున ఆత్మీయంగా అభినందించారు. “వెండితెర మీద ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల అరుదైన నటుడు మోహన్‌లాల్ గారు. 

    ఏ తరహా పాత్ర అయినా సరే, అందులోకి పరకాయ ప్రవేశం చేసి, అద్భుతంగా పండిస్తారు. ఆయన ఏదైనా చేయగలరు. అలాంటి అభినయాన్ని చూసినప్పుడు చప్పట్లు కొట్టి, హర్షం వ్యక్తం చేయడం తప్ప మరేమీ చేయలేము” అంటూ నాగ్ తన మనసులో మాట ఆత్మీయంగా పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువా, పుష్పగుచ్ఛంతో మోహన్‌లాల్‌ను సత్కరించారు.

    అడిగినా... అక్కినేని చెప్పలేదట!
    ఆ సందర్భంగా నాగార్జున తన తండ్రి – సీనియర్ అగ్ర నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుతో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. సినీ రంగంలో కృషి చేసినవారికి భారత ప్రభుత్వమిచ్చే అత్యున్నత పురస్కారమైన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్ గారు అన్ని విధాలా అర్హులైన నటుడు. ఈ అవార్డు ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో నాకు బాగా తెలుసు. 

    ఎందుకంటే, కొన్నేళ్ళ క్రితం స్వయంగా మా నాన్న గారికి వచ్చింది. ఆ తరువాత ఫాల్కే అవార్డు విజేత ఎంపిక కమిటీలో మా నాన్న గారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఒకసారి ఆ కమిటీ మీటింగ్ జరిగి, ఫాల్కే అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించారు. ఇంకా పేరు బయటకు ప్రకటించాల్సి ఉంది. 

    ఇంటికొచ్చాక నాన్న గారితో, ఈసారి ఫాల్కే అవార్డు ఎవరికిస్తున్నారని అడిగాను. ఎంత అడిగినా, ఆయన ఆ సంగతి చెప్పలేదు. గోప్యంగానే ఉంచారు. అంత నిజాయతీగా, నిఖార్సుగా ఇచ్చే అవార్డ్ గనకనే ఫాల్కే అవార్డ్ రావడమంటే అంత గొప్ప. అందుకే, మోహన్‌లాల్ గారికి ఈ అవార్డ్ రావడం ఎంతో ఆనందంగా ఉంది” అని నాగార్జున పాత సంగతులు ప్రస్తావించారు.

    ఆ ఆటోగ్రాఫ్‌కు ఫ్రేమ్ కట్టుకున్న విజయ్ సేతుపతి!
    వేదికపై ఉన్న తమిళ నటుడు విజయ్ సేతుపతి సైతం మోహన్ లాల్‌కు సత్కారం చేయడమే కాక, భావోద్వేగానికి గురవుతూ, “మోహన్‌లాల్‌ గారికీ, ఆయన నటనకూ నేను వీరాభిమానిని. ఏ పాత్ర ఇచ్చినా ఆయన అంత సునాయాసంగా ఎలా చేస్తారో అర్థం కాదు. 

    వీరాభిమానిగా నేను ఆయన దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను భద్రంగా ఫ్రేమ్ కట్టి, ఇంట్లో దాచుకున్నాను. అలాంటి గొప్ప నటుడికి ఫాల్కే అవార్డ్ దక్కడం ఎంతో ఆనందం. ఆయనతో కలసి ఇలా వేదిక పంచుకోవడం, ఆయన ఎదురుగా మాట్లాడడం ఓ చెప్పలేని అనుభూతి” అని వ్యాఖ్యానించారు.

    అనుకోని రీతిలో జరిగిన ఈ ఆత్మీయ అభినందనకు మోహన్‌లాల్ సైతం అంతే వినయంగా, ఆత్మీయంగా స్పందించారు. తనను అభినందించిన తోటి నటులకు కృతజ్ఞతలు చెబుతూనే, అక్కినేని నాగేశ్వరరావుతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 

    మహానటుడు ఏయన్నార్‌తో కలసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయంటూ, “బాలకృష్ణ హీరోగా దర్శకుడు ప్రియదర్శన్ తెలుగులో తీసిన ‘గాండీవం’ (1994) చిత్రంలో ఆయనతో కలసి నేను ఓ పాటలో (‘గోపబాలుడొచ్చెనమ్మ గోకులానికి...’ పాట) నటించాను. 

    డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో ఆ పాట చిత్రీకరణ జరిగింది. ఏయన్నార్ గారి నటన, ప్రవర్తన నేను మర్చిపోలేను. ఎందరికో స్ఫూర్తిదాత అయిన ఆయన నాకు మంచి ఆత్మీయులయ్యారు” అని మోహన్‌లాల్ వివరించారు. ఇలా పరస్పర గౌరవం, ఆత్మీయ అభినందనలు చూసి, ప్రేక్షకులు పెద్దయెత్తున హర్షధ్వానాలు చేశారు. - రెంటాల జయదేవ

     

    • బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర వింటేజ్ లుక్..

    • ఉప్పెన భామ కృతి శెట్టి శారీ అందాలు..

    • ఫ్యామిలీతో చిల్ అవుతోన్న మెహరీన్..

    • బ్లూ శారీలో అనసూయ అందాలు..

    • శాలీ మొహబ్బత్ప్రమోషన్స్తో బిజీగా రాధికా ఆప్టే..

    • బ్లాక్ డ్రెస్లో బొమ్మలా అందాల భామ మానుషి చిల్లర్..

    • వేకేషన్ ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..

     

     

     

     

     

     

     

     

     

  • పవన్ కళ్యాణ్‌ బత్తులను హీరోగా ఎంట్రీ ఇస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ పురుష. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. మూవీని కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు

    త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, క్యాప్షన్స్ చూస్తుంటే ఫుల్గా నవ్వించే కథతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా వదిలిన మరో పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతాం అంటూ పోస్టర్పై రాసిన క్యాప్షన్ ఫుల్ఇంట్రస్టింగ్గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో కసిరెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్ర్లలో నటించారు.

  • అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనే అన్ని భాషల, ప్రాంతాల సినిమాలు, సీరియళ్ళు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో... ప్రపంచం అక్షరాలా ఓ కుగ్రామమైంది. విభజనలు, సరిహద్దులు చెరిగిపోయి వినోద పరిశ్రమలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు, పార్లమెంటు సభ్యుడు, ‘పద్మభూషణ్’ కమల్ హాసన్ ఆ సంగతే మరోసారి స్పష్టం చేశారు.

    “ప్రాంతీయ సినిమా ఇవాళ ఎంతో మారిపోయింది. నిజం చెప్పాలంటే, ప్రాంతీయ సినిమా... ఇప్పుడు సరికొత్త జాతీయ స్థాయి సినిమాగా అవతరించింది. అలాగే, స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ ప్రాంతపు మట్టి నుంచి పుట్టి, స్థానిక మూలాలపై తీస్తున్న సినిమా... నూతన అంతర్జాతీయ సినిమాగా మారిపోయింది. ఇవాళ మచిలీపట్నం, మదురై, మళప్పురమ్, మాండ్య... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో పుట్టిన కథలు సైతం కేవలం ప్రాంతీయ సినిమాలుగా మిగిలిపోవడం లేదు. అవి జాతీయస్థాయి సాంస్కృతిక సంరంభాలుగా మారుతున్నాయి” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

    బడ్జెట్ కాదు... నిజాయతీ ముఖ్యం!

    కర్ణాటకలోని కోస్తా ప్రాంత్రంలోని స్థానిక సంస్కృతికి అద్దంపడుతూ, ‘భూతకోల’ సంప్రదాయం ఆధారంగా అల్లుకున్న ఓ జానపద కథ లాంటి సినిమా ‘కాంతార’ ఇవాళ దేశమంతటినీ ఊపేయడం అందుకు ఓ ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. అలాగే, కుటుంబాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో సాగిన మలయాళ చిత్రకథ ‘దృశ్యం’ భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటేసిన సంగతి కమలహాసన్ గుర్తు చేశారు.

    ‘‘తెలుగులో వచ్చిన ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటివి ఇవాళ ముంబయ్ నుంచి మలేసియా దాకా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత భాషలో భాగమైపోయాయి. తమిళం నుంచి వచ్చిన ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి చిత్రాలు సరిహద్దులు దాటి విజయం సాధించాయి. ఈ విజయాలకి కారణం సింపుల్... కథలు మన మట్టిలో నుండి పుట్టడమే. ఇవాళ బడ్జెట్‌ కాదు... స్థానికతను బలంగా చూపిస్తూనే సార్వత్రికంగా అందరినీ కదిలించే నిజాయతీతో కూడిన కథలు కీలకం. అవే భాషలు, ప్రాంతాల సరిహద్దుల్ని దాటేస్తాయి. ప్రామాణికత అనేది ఎప్పటికీ మురిగిపోని, ఎక్కడైనా చెల్లుబాటయ్యే కరెన్సీ లాంటిదని ఇది నిరూపిస్తోంది’’ అంటూ జాతీయ స్థాయిలో మన దక్షిణాది సినిమా కథలు సృష్టిస్తున్న సంచలనంపై ఆయన తన విశ్లేషణ అందించారు.

    ఆ తేడా పోయింది..! ఇప్పుడు తెర కాదు... కథ కీలకం!!

    దక్షిణాది వినోద మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తూ, ‘జియో – హాట్ స్టార్’ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త సొంత కంటెంట్‌తో ముందుకొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ‘సౌత్ అన్ బౌండ్’ వేడుకలో ఈ అగ్రేసర దక్షిణాది నటుడు మాట్లాడుతూ, “భారతీయ వినోద రంగం అభివృద్ధి చెందడమే కాదు... ఓటీటీ సహా అనేక వాటితో సమూలంగా మారిపోతోంది. ఇవాళ ఏ కథ, ఏ తెర మీద చూస్తున్నామనే తేడా పోయింది. వినోద రంగంలో తొలిసారిగా ప్రేక్షకులే ఫ్లాట్ ఫాంగా మారుతున్న రోజులివి. కథలనేవి ఇక తెరకు మాత్రమే పరిమితం కాదు. ప్రజలు, ప్రేక్షకులతో కథలు ప్రయాణం చేయాలి. మన మూలాలతో కూడిన కథలను అందరికీ అందించేందుకు కృషి చేయాలి’’ అని కమల్ పేర్కొన్నారు. “అలాగే, తెరపై కథలను అందంగా చెప్పడం ప్రతిభతో ఆగిపోకూడదు. ఈ కథలను అత్యధిక మందికి చేరువ చేయడానికి సరైన నాయకత్వం అవసరం. ఈ విషయంలో జియో -హాట్ స్టార్ కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నాను. వారు దక్షిణాదిని ఒక మార్కెట్ గా కాకుండా, క్రియేటివ్ గ్రావిటీగా చూడడం హర్షించదగ్గ విషయం’’ అని కమల్ అభినందించారు.

    “ప్రపంచ సినిమా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. మన భారతీయ మూలాలతో కూడిన కథలను ప్రపంచానికి అందించడానికి ఇది సరైన సమయం. యువతకు నేను చెప్పేది ఏమిటంటే, ప్రపంచ సినిమాలో మన కళాకారులు సత్తా చాటాలి. అదే నా కోరిక” అని ఆయన అన్నారు. 

  • చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా ఉంటుంది. రోజులను మళ్లీ వస్తే బాగుండని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. బాల్యం, స్కూల్ లైఫ్ మళ్లీ మళ్లీ రావాలని కోరుకోని వారు ఉండరేమో. అంతటి మధురమైన చిన్ననాటి చిలిపి పనులు తలచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. బాల్యం నాటి మన ఫోటోలు చూస్తే మనమేనా అన్న డౌట్వచ్చేస్తుంది. అలాంటి అరుదైన ఫోటోలు దొరికితే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది.

    అలాంటి మధురమైన జ్ఞాపకాలను టాలీవుడ్ స్టార్ సింగర్మంగ్లీ సిస్టర్ఇంద్రావతి చౌహాన్ పోస్ట్చేసింది. చిన్నప్పుడు అక్క మంగ్లీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. రోజులను గుర్తు చేసుకుని తెగ సంబరపడిపోయింది. ఇది చూసిన అభిమానులు వావ్బ్యూటీఫుల్.. నేచురల్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    కాగా.. ఫోక్ సింగర్ మంగ్లీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల్లో పాడుతూ.. అప్పుడప్పుడు ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యనే 'బాయిలోన బల్లిపలికే' అని ఓ ఆల్బమ్ పాట రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ఫుల్ ట్రెండింగ్ అయింది. మంగ్లీతో పాటే సిస్టర్ఇంద్రావతి చౌహన్జానపద గాయని కావడం విశేషం. ఇద్దరు సిస్టర్స్సింగర్స్గా తెలుగు వారిని తమఅలరిస్తూనే ఉన్నారు.

     

     

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం మొదలైందంటే చాలు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల సందడే సందడి. ఇక వారంలో బిగ్ స్క్రీన్పై అలరించేందుకు అఖండ-2, మౌగ్లీ చిత్రాలు వచ్చేస్తున్నాయి. గత వారమే రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్చేయడం లేదు. కేవలం మౌగ్లీ మాత్రమే అఖండతో పోటీ పడనుంది.

    ఇక ఓటీటీల విషయానికొస్తే పలు సూపర్ హిట్చిత్రాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ కాంత మాత్రమే ఫ్రైడే కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఇది మినహాయిస్తే తెలుగులో 3 రోజేస్ వెబ్ సిరీస్స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా లుక్కేయండి.

    నెట్‌ఫ్లిక్స్

    • గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    • సింగిల్ పాపా (హిందీ సిరీస్) - డిసెంబరు 12

    • ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) - డిసెంబరు 12

    • వేక్ అప్ డెడ్ మ్యాన్- నైస్ అవుట్ మిస్టరీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    • కాంత (తెలుగు సినిమా) - డిసెంబరు 12

    • సిటీ ఆఫ్ షాడోస్(స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- డిసెంబర్ 12

    జియో హాట్‌స్టార్

    • అరోమలే (తమిళ మూవీ) - డిసెంబరు 12 (రూమర్ డేట్)

    • ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ(కామెడీ సిరీస్)- డిసెంబర్ 12

    • టేలర్ స్విఫ్ట్- ది ఎరాస్ టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12

    అమెజాన్ ప్రైమ్

    • టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 12

    ఆహా

    • 3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - డిసెంబరు 12

     

    జీ5

    • సాలీ మొహబ్బత్ (హిందీ మూవీ) - డిసెంబరు 12

    సన్ నెక్స్ట్

    • అంధకార (మలయాళ సినిమా) - డిసెంబరు 12

    ఆపిల్ టీవీ ప్లస్

    • ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 12

    మనోరమ మ్యాక్స్

    • ఫెమించి ఫాతిమా (మలయాళ మూవీ) - డిసెంబరు 12

     

     

  • టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్‌. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్‌ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ, విజయ్‌, శివకార్తికేయన్‌ లాంటి స్టార్‌ హీరోలతో నవీన్‌ పోలిశెట్టి, శర్వానంద్‌ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. 

    అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్‌(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్‌ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్‌ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్‌ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?

    శర్వా నమ్మకం అదే.. 
    ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్‌. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్‌ ‘ది రాజాసాబ్‌’ జనవరి 9న రిలీజ్‌ కానుంది. అదే రోజు విజయ్‌ చివరి చిత్రం జననాయక్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్‌ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్‌ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్‌ కానుంది. మరోవైపు శివకార్తికేయన్‌ పరాశక్తి, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్‌ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. 

    సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు.  సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్‌పుట్‌ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్‌ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. 

    గత చరిత్ర ఏం చెబుతోంది?
    గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.

    ఈసారి అంత ఈజీకాదు.. !
    అయితే గతంలో శర్వానంద్‌ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ, విజయ్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు.  సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్‌ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్‌ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి. 

  • ఓటీటీలు వచ్చాక సినిమాలు,వెబ్ సిరీస్లకు కొదవే లేదు. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. భాషలో వచ్చినా సరే డబ్బింగ్చేసి డిజిటల్గా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ప్రతి ఏటా వందలకొద్ది చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రిలీజైన ఆదరణ దక్కించుకున్నవి చాలానే ఉన్నాయి.

    కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనూ ప్రతి ఏటా సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లాంటి వాటికి మాత్రమే ఆడియన్స్కనెక్ట్ అవుతున్నారు. మర్డర్ మిస్టరీ లాంటి సిరీస్లకు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. సినీ ప్రియుల అభిరుచితి తగ్గట్టుగానే చాలా వెబ్ సిరీస్లు డిజిటల్ఫ్లాట్ఫామ్లో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. చాలా వరకు మన దేశ ఆడియన్స్ఆదరిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన కంటెంట్సత్తా చాటలేకపోయింది.

    ఓవరాల్రేటింగ్పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా టాప్‌-10లో మన ఇండియన్వెబ్ సిరీస్ఒక్కటీ కూడా లేకపోవడం గమనార్హం. ఐఎండీబీ ప్రకటించిన టాప్-25 వెబ్ సిరీస్లో ఇండియా నుంచి కేవలం నాలుగు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో టాప్-15లో హర్షద్ మెహతా స్కామ్-1992 కాస్తా ఫర్వాలేదనిపించింది. లిస్ట్లో తొలిస్థానంలో బ్రేకింగ్ బ్యాడ్‌(9.5) అనే వెబ్ సిరీస్ నిలవగా.. బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్(9.4), ప్లానెట్ ఎర్చ్-2(9.4) రెండు, మూడు స్థానాల్లో రేటింగ్ దక్కించుకున్నాయి.

    టాప్-10 విషాయానికొస్తే నాలుగు నుంచి వరుసగా.. ప్లానెట్ ఎర్త్, ది వైర్, చెర్నోబిల్, ‍అవతార్- ది లాస్ట్ ఎయిర్బెండర్, బ్లూ, కాస్మోస్, బ్లూ ప్లానెట్‌-2 నిలిచాయి. ఇక 11 ప్లేస్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిలవగా.. 12లో ది సోప్రానోస్ వెబ్ సిరీస్నిలిచింది. ఇక ఇండియా నుంచి హర్షద్ మోహతా వెబ్ సిరీస్స్కామ్-1992(9.2) లిస్ట్లో 13 స్థానం దక్కంచుకుంది. తర్వాత ఆస్పిరెంట్స్, గుల్లక్, టీవీఎఫ్ పిచర్స్ వరుసగా 23, 24, 25 స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్గా చూస్తే మనదేశం నుంచి ఒక్క వెబ్ సిరీస్కూడా టాప్-10లో రేటింగ్ సాధించలేకపోయింది.

     

  • టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్షమాపణలు కోరింది. నటుడు బండి సరోజ్ కుమార్చేసిన వ్యాఖ్యలపై సారీ చెబుతూ నోట్రిలీజ్ చేసింది. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని.. దీనికి బాధ్యత వహిస్తూ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు నోట్లో పేర్కొంది.

    మా నటుడు బండి సరోజ్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివరణ ఇచ్చింది.  సెన్సార్ ప్రక్రియ పట్ల మాకు అత్యున్నత గౌరవం ఉందని తెలిపింది. బాధ్యత, సమగ్రతతో కంటెంట్‌ను నిర్వహించడంలో బోర్డు పాత్రను మేము గౌరవిస్తామని స్పష్టం చేసింది. సెన్సార్ బోర్డ్లో అత్యంత సమర్థులైన నిర్వాహకులు, సీనియర్ పరిశ్రమ నిపుణులు ఉన్నారు.. వారి మార్గదర్శకత్వాన్ని మేము ఎంతో విలువైందిగా భావిస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేర్కొంది. బండి సరోజ్ వ్యాఖ్యలను తాము వెంటనే ఉపసంహకరించుకుంటున్నామని తెలిపింది. సెన్సార్ బోర్డు వారి నిరంతర సహకారం, మద్దతు కోసం మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేసింది.

    బండి సరోజ్ ఏమన్నారంటే..

    బండి సరోజ్ మాట్లాడుతూ..' మోగ్లీ సినిమాను ఫ్యామిలీతో చూడొచ్చు. సెన్సార్ బోర్డ్వాళ్లు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అసభ్యత ఉండదు. సినిమా సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ భయపడి పోయారంటా. ఎవడ్రా వీడు.. వీడి ఫర్మామెన్స్ ఏంటి? రూత్లెస్కాప్లా నటించలేదని భయపడి సర్టిఫికేట్ ఇచ్చారంటా అని అన్నారు. కామెంట్స్ కాస్తా వివాదానికి దారి తీయడంతో మౌగ్లీ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెబుతూ ట్విటర్లో పోస్ట్ చేసింది.

  • ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులను నవ్వించిన టాలీవుడ్ నటి ప్రగతి(Pragathi) క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. సినిమాలను పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ క్రీడాకారిణిగా మారిపోయింది. ఇటీవల పవర్ లిఫ్టింగ్ఛాంపియన్షిప్లో ఏకంగా నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. దీంతో టాలీవుడ్ మొత్తం ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఆమె టాలెంట్ను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

    తాజాగా ప్రగతి తెలుగు వెబ్ సిరీస్‌ 3 రోజెస్‌ ట్రైలర్లాంఛ్ ఈవెంట్కు హాజరయ్యారు. సందర్భంగా పలు విషయాలను ఆమె పంచుకున్నారు. ఎక్కడ ట్రోల్‌ చేస్తారోననే భయంతో తాను మీడియాకు దూరంగా ఉంటున్నానని ప్రగతి తెలిపారు. పవర్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చాలామంది తనను ట్రోల్చేశారని గుర్తు చేసుకున్నారు. జిమ్‌లో నా దుస్తులపై కూడా విమర్శలు వచ్చాయని అన్నారు. జిమ్కి చీరలు కట్టుకుని వెళ్లలేం కదా.. అందరూ అలా తిడుతుంటే చాలా బాధపడ్డానని తెలిపింది. నీకు ఈ వయసులో అవసరమా? అని చాలామంది అన్నారని ప్రగతి ఆవేదన వ్యక్తం చేసింది. 

    (ఇది చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్‌.. చాలా బాధపడ్డా!)

    నాపై ఆ ట్రోల్స్‌ చూసి తప్పు చేస్తున్నానేమోనని భయపడ్డానని.. నా ఎదిగిన కూతురికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని బాధపడ్డానని ప్రగతి తెలిపింది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగేశానని.. ట్రోల్స్‌ చేసిన వారికి పతకాలతోనే సమాధానం ఇచ్చానని ప్రగతి కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు నా పతకాలను అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశానికి ఇంత మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని అన్నారు. తన నెక్ట్స్ మూవీ తమిళంలో చేస్తున్నానని ప్రగతి వెల్లడించారు.

    ప్రగతి మాట్లాడుతూ..'నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్‌ చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ నేను సినిమాలు ఎప్పటికీ మానేయను. ఎందుకంటే నటించకపోతే నేను బతకలేను. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీనే. నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీని ఎప్పటికీ వదిలుకోను. తుదిశ్వాస వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా. అలా సెట్‌లోనే కన్నుమూయాలని కోరుకుంటా' అని అన్నారు.

     

  • అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్‌ తగిలింది. సినిమా ప్రీయయర్షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణహైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్ధరల పెంపు జీవోను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

    కాగా.. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్‌ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్‌ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్‌ రేటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. తాజాగా హైకోర్ట్ ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును సస్పెండ్‌ చేసింది. దీంతో అఖండ-2 నిర్మాతలు ప్రీమియర్ షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆడియన్స్‌లో సస్పెన్స్ నెలకొంది. 

    అఖండ-2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు

     

  • మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సిన అఖండ-2 కు ఊహించని షాక్‌ తగిలింది. సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. లంచ్ మోషన్‌కి అనుమతించిన న్యాయస్థానం.. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది.

    కాగా, ఇప్పటికే అఖండ 2(Akhanda 2 ) రిలీజ్‌ ఒకసారి వాయిదా పడింది. ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఈ వివాదాన్ని సెటిల్‌ చేసుకొని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్‌ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్ల్సుల్లో టికె ట్‌ ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే ఈనెల 11న రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్‌ రేటుకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

    ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై సతీష్‌ కమల్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశాడు. ప్రీమియర్స్‌ని రద్దు చేయడంతో పాటు టికెట్ల రేట్ల పెంపుకు ఇచ్చిన మోమోని సస్పెండ్‌ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు.  మరికాసేపట్లో  హైకోర్టు(Telangana High Court) దీనిపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    అఖండ 2 విషయానికొస్తే..  నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి  బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.  సంయుక్త హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.

    బాలకృష్ణకు భారీ షాక్.. అఖండ 2పై హైకోర్టులో పిటిషన్
  • సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీల సమాచారానికి సంబంధించి అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రామాణికమైన వేదిక Imdb..2025 సంవత్సరానికి గాను ఇండియాలోని టాప్‌ 10 వెబ్‌ సిరీస్‌, సినిమాలను ప్రకటించింది.

    1) టైటిల్‌: ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్
    నటీనటులు: బాబీ డియోల్, లక్ష్య లల్వానీ, సాహెర్ బాంబా, మోనా సింగ్, అన్యా సింగ్, గౌతమీ కపూర్
    దర్శకత్వం: ఆర్యన్ ఖాన్ (షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు)
    ఓటీటీ: ‘నెట్‌ఫ్లిక్స్‌’

    2) టైటిల్‌: బ్లాక్ వారెంట్
    నటీనటులు: జహాన్ కపూర్, అనురాగ్ ఠాకూర్, పరం వీర్ సింగ్, రాహుల్ భట్
    దర్శకత్వం: విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ 
    ఓటీటీ : 'నెట్ ఫ్లిక్స్'(7 ఎపిసోడ్స్‌)

    3) టైటిల్‌: పాతాళ్‌లోక్‌ సీజన్‌-2
    నటీనటులు: జైదీప్‌ అహ్లవత్‌, గుల్‌పనాగ్‌, ఇష్వాక్‌ సింగ్‌, విపిన్‌ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్‌ తమాంగ్‌
    దర్శకత్వం: అవినాష్ అరుణ్‌, ప్రోసిత్‌ రాయ్‌
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    4) టైటిల్‌:పంచాయత్ సీజన్ 4
    నటీనటులు: జితేంద్ర కుమార్, నేనా గుప్తా,రఘుబీర్ యాదవ్బి,శ్వపతి సర్కార్, సునీత రాజ్వార్, శాన్విక 
    దర్శకుడు: దీపక్ కుమార్ మిశ్రా - అక్షత్
    ఓటీటీ:'అమెజాన్ ప్రైమ్ వీడియో

    5) టైటిల్‌: మండల మర్డర్స్‌
    నటీనటులు: వాణీ కపూర్‌, వైభవ్‌ రాజ్‌, సుర్విన్‌ చావ్లా, శ్రియా పిల్గాంకర్‌, జమీల్‌ఖాన్‌, అదితి సుధీర్‌
    దర్శకత్వం: గోపి పుత్రన్‌, మనన్‌ రావత్
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

    6) టైటిల్‌: ఖాఫ్‌
    నటీనటులు: మోనిక పన్వర్‌, రజత్‌ కపూర్‌, గీతాంజలి కులకర్ణి 
    దర్శకత్వం: పంకజ్‌ కుమార్‌, సూర్య బాలకృష్ణన్‌ 
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    7) టైటిల్‌: స్పెషల్‌ ఓపీఎస్‌2
    నటీనటులు: కేకే మేనన్‌, తాహిర్‌ రాజ్‌ బాసిన్‌, కరణ్‌ థాకర్‌, వినయ్‌ పాఠక్‌, విపుల్‌ గుప్త, సయామీ ఖేర్‌,  ప్రకాశ్‌రాజ్‌
    దర్శకత్వం: నీరజ్‌ పాండే
    ఓటీటీ:జియో హాట్‌స్టార్‌

    8) టైటిల్‌: ‘ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌’ (ఖాకీ 2)
    నటీనటులు: జీత్, ప్రొసెన్ జిత్ ఛటర్జీ, రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఖాన్, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగ్ధ సింగ్ 
    దర్శకత్వం: డెబాత్మ మండల్, తుషార్ కాంతి 
    ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

    9) టైటిల్‌: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3
    నటీనటులు: మనోజ్‌ బాజ్‌పాయి, ప్రియమణి, షరీబ్‌ హష్మి, జైదీప్‌ అహ్లావత్‌, నిమ్రత్‌ కౌర్‌, శ్రేయా ధన్వంతరి, గుల్‌ పనాగ్‌, సందీప్‌ కిషన్‌
    దర్శకత్వం: రాజ్‌ అండ్‌ డీకే, సుమన్‌ కుమార్‌, తుషార్‌
    ఓటీటీ: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

    10) క్రిమినల్ జస్టీస్ 4
    నటీనటులు: పంకజ్ త్రిపాఠి, మహ్మద్ జీషన్, సుర్వీన్ చావ్లా, ఆషా నేగి, మీతా వశిష్ట్, శ్వేతా బసు ప్రసాద్, ఖుషీ భరద్వాజ్
    దర్శకత్వం : రోహన్ సిప్పి
    ఓటీటీ: హాట్‌స్టార్‌

    టాప్‌ 10 సినిమాలివే

    1. సయారా
    2. మహావతార్ నరసింహ
    3. ఛావా
    4. కాంతారా: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1
    5. కూలీ
    6. డ్రాగన్
    7. సితారే జమీన్ పర్
    8. దేవా
    9. రెయిడ్ 2
    10. లోక ఛాప్టర్ 1: చంద్ర
       

Sports

  • ముల్లాన్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.

    రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో డొనోవన్‌ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

    సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ 8, కెప్టెన్‌ మార్క్రమ్‌ 29, బ్రెవిస్‌ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ 4, ఎంగిడి, జన్సెన్‌, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. 

    భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్‌ శర్మ 27, అక్షర్‌ పటేల్‌ 21, హార్దిక్‌ 20, అభిషేక్‌ శర్మ 17, సూర్యకుమార్‌ 5, అర్షదీప్‌ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌, వరుణ్‌ చక్రవర్తి డకౌటయ్యారు.

    ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్‌ (90), బౌలింగ్‌లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్‌ 14న జరుగనుంది.

    చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. తొందరపాటు చర్యతో..

     

     

  • భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి
    ఆసియా కప్‌-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్‌ (Shubman Gill). దీంతో అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ను మేనేజ్‌మెంట్‌ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్‌ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్‌ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.

    ఈసారి గోల్డెన్‌ డక్‌
    తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్‌ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.

    వరుసగా వైఫల్యాలు
    సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్‌ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్‌ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).

    ఈ స్థాయిలో గిల్‌ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. 

    సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?
    టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్‌ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.

    ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌ మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్‌ శర్మ (17), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపింది.

    చదవండి: విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం!

  • టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. 

    ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్‌ (8) అవుటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి తన తొలి ఓవర్‌ తొలి బంతికే అతడిని బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

    అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ కావడంతో డికాక్‌ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ వేగంగా స్పందించి డికాక్‌ను రనౌట్‌ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.

    ఇక డికాక్‌కు తోడుగా కెప్టెన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్‌ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్‌ మిల్లర్‌ (12 బంతుల్లో 20) ధనాధన్‌ దంచికొట్టి అజేయంగా నిలిచారు.

    ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్‌కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. డికాక్‌ను వికెట్‌ కీపర్‌ జితేశ్‌​ శర్మ రనౌట్‌ చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్‌ 22 పరుగులు సమర్పించుకుంది.

    ఇక భారత పేసర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్‌ పూర్తి కోటాలో 29 రన్స్‌ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్‌ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టారు.

  • సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌​ సందర్భంగా డికాక్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

    ముల్లన్‌పూర్‌ వేదికగా
    రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్‌ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్‌పూర్‌ ఆతిథ్యమిస్తోంది.

    పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్‌ కాగా.. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

    క్వింటన్‌ డికాక్‌  జోరు
    ఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.

    12 ఇన్నింగ్స్‌లోనే
    ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్‌ కంటే ముందు వెస్టిండీస్‌ స్టార్‌ నికోలస్‌ పూరన్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్‌.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్‌ అవసరం కాగా.. డికాక్‌ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ అందుకున్నాడు. 

    తొందరపాటు చర్యతో
    కానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్‌ రనౌట్‌ అయ్యాడు. పదహారో ఓవర్‌ తొలి బంతికి వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్‌ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్‌ జితేశ్‌ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు. 

    దీంతో డికాక్‌ రనౌట్‌ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ రీఎంట్రీలో డికాక్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్‌.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

    చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్‌ భారతి!

  • భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్‌మెషీన్‌ మరోసారి బ్యాట్‌ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా..  దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.

    ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరు
    ఈ విషయాన్ని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్‌ ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరును చేర్చింది. 

    దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్‌ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్‌ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్‌లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. 

    రిషభ్‌ పంత్‌ కూడా
    ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.

    ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ పేరు కూడా ప్రాబబుల్స్‌ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

    గంభీర్‌- అగార్కర్‌ ఒత్తిడి వల్లేనా?
    కోహ్లి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

    సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్‌ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ దేశీ క్రికెట్‌ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

    ముఖ్యంగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్‌ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్‌కప్‌ ప్లాన్‌లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్‌ చెప్పడం ఇందుకు నిదర్శనం.

    అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్‌ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌: ఢిల్లీ ప్రాబబుల్స్‌ జట్టు
    విరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, దేవ్‌ లక్రా, యుగళ్‌ సైనీ, దివిజ్‌ మెహ్రా, సుజల్‌ సింగ్‌, రజ్‌నీశ్‌ దాదర్‌, అమన్‌ భార్తి, గోవింద్‌ మిట్టల్‌, సుమిత్‌ బెనీవాల్‌, శుభమ్‌ దూబే, కేశవ్‌ దబాస్‌, రాహుల్‌ చౌదరి, సమర్థ్‌ సేత్‌, శివమ్‌ త్రిపాఠి, అన్మోల్‌ శర్మ, శివమ్‌ గుప్తా, లక్షయ్‌ తరేజా, మనన్‌ భరద్వాజ్‌, రౌనక్‌ వాఘేలా, మయాంక్‌ గుసైన్‌, కేశవ్‌ ఆర్‌సింగ్‌,, లక్ష్మణ్‌, దివాన్ష్‌ రావత్‌, ప్రణవ్‌ రాజ్‌వన్షీ, ప్రన్షు విజయరణ్‌.

    చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు

  • దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి
    ముల్లాన్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్‌ (90), బౌలింగ్‌లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు.  ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 

    ఓటమి అంచుల్లో టీమిండియా
    19వ ఓవర్‌లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్‌ దూబే (1), ఆతర్వాత అర్షదీప్‌ సింగ్‌ను (4), వరుణ్‌ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. 

    ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
    14.2వ ఓవర్‌- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి హార్దిక్‌ పాండ్యా (20) ఔటయ్యాడు. 

    లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 
    👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4
    తిలక్‌ వర్మ 18 బంతులలో 32, హార్దిక్‌ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం
    👉7.3: బార్ట్‌మాన్‌ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (21). స్కోరు: 67-4 (7.4)
    👉పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)
    👉 3.5: మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).
    👉1.6: మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు:  19-2 (2).
    👉మరో ప్రయోగం.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌
    👉0.5: మరోసారి శుబ్‌మన్‌ గిల్‌ విఫలం.. ఎంగిడి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌. గత మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసిన గిల్‌... భారత్‌ స్కోరు: 9-1 (1)

    సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?
    👉డికాక్‌ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్‌ (16 బంతుల్లో 30 నాటౌట్‌), మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌)
    👉భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తికి రెండు, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌
    👉సౌతాఫ్రికా స్కోరు: 213-4..  టీమిండియా లక్ష్యం 214 

    టాస్‌ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్‌
    👉ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌..  సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4
    👉16.1: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ (14)
    👉15.1: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్‌ రనౌట్‌. మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
    👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 
    👉11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన మార్క్రమ్‌ (29) 
    👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా
    👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 
    👉8.3: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్‌ డికాక్‌.
    👉పవర్‌ ప్లేలో సౌతాఫ్రి​కా స్కోరు: 53-1
    👉4.1: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో సఫారీ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (8) అవుట్‌
    👉ముల్లన్‌పూర్‌ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్టాండ్‌ ఆవిష్కరణ

    ఎలాంటి మార్పులూ లేవు
    టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడాము. పురుషుల క్రికెట్‌లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.

    ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్‌ చేస్తాం. వికెట్‌ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.

    సంజూకు మరోసారి మొండిచేయి
    కాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్‌గా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్‌ రాకతో ఓపెనింగ్‌ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్‌ (Sanju Samson).. వికెట్‌ కీపర్‌గానూ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్‌ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్‌మెంట్‌ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.

    మూడు మార్పులతో బరిలోకి
    మరోవైపు.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ తెలిపాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌, కేశవ్‌ మహరాజ్‌, అన్రిచ్‌ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్‌, జార్జ్‌ లిండే, బార్ట్‌మన్‌లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్‌ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. 

    ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లు
    కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో సఫారీలు దుమ్ములేపారు. 

    అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్‌ చేశారు. అయితే, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి భారత్‌ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్‌ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లు
    భారత్‌
    అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

    సౌతాఫ్రికా
    రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.

    చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు

  • పొట్టి క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయం గురువారం మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు టికెట్లు లైవ్‌లోకి రానున్నాయి.

    ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్‌ టికెట్‌ ధరను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) వంద రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి అధికారిక భాగస్వామి బుక్‌మైషోలో టికెట్ల విక్రయం జరుగనుంది.

    కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవనుంది. అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా భారత్‌- అమెరికాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెడుతుంది.

    భారత్‌లో వాంఖడేతో పాటు.. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం.. శ్రీలంకలోని ఎస్‌ఎస్‌సీ కొలంబో, ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదికలుగా ఉన్నాయి.

    ఈడెన్‌ గార్డెన్స్‌లో అతి తక్కువగా రూ. 100 నుంచే టికెట్‌ లభించనుండగా.. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రూ. 150తో ధర మొదలుకానుంది. అహ్మదాబాద్‌లోనూ రూ. 100 టికెట్‌ అందుబాటులో ఉంది. చెపాక్‌లో అత్యధికంగా రూ. 2 వేల ధరతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.  
     

  • ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌-2026 ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్‌ పీక్‌ సారథ్యం వహించనున్నాడు.

    ఇక వరల్డ్‌కప్‌ ఆడే ఆసీస్‌ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.

    పాల్గొనే జట్లు ఇవే
    కాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్‌-19 మెన్స్‌ వరల్డ్‌కప్‌ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, జపాన్‌, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్‌-బి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా పోటీపడతాయి.

    కెప్టెన్‌ ఎవరంటే?
    ఇక గ్రూప్‌-సి నుంచి ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్‌-డి నుంచి అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఒలీవర్‌ పీక్‌ సారథిగా వ్యవహరించబోతున్నాడు.

    భారత్‌తో ఫైనల్లో సత్తా చాటి
    సౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒలీవర్‌ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

    అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌ కొట్టేశాడు.

    అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు
    ఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్‌ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.

    చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్‌ కొడుకులు

  • భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్‌ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్‌ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.

    అనూహ్య రీతిలో
    ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్‌ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.

    భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌ హక్కుల కోసం రెండేళ్ల క్రితం..  నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్‌స్టార్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్‌ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

    రేసులోకి ప్రసార్‌ భారతి!
    ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్‌ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్‌ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది. 

    పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చు
    ఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్‌ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్‌ విధానంలో కొన్ని మ్యాచ్‌లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.

    ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్‌ల వారీగా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.

    దూర్‌దర్శన్‌, డీడీ ఫ్రీడిష్‌.. ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్‌ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ వెల్లడించింది.

    చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

  • భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్‌ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్‌ ఇచ్చిన మాట ఏంటి?!

    ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా
    టీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున సచిన్‌ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.

    అతడి త్యాగంతో సెంచరీ
    ఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్‌ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు. 

    ఫలితంగా సచిన్‌ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్‌ సింగ్‌ త్యాగానికి ప్రతిగా.. సచిన్‌ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. 

    ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు
    ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్‌ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.

    ‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు. అలా నువ్వు రిటైర్‌ అయ్యి బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ ఆడాను.

    పదిహేనేళ్ల తర్వాత
    ‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. 

    చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

  • అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్‌ మెస్సీ భార‌త్ ప‌ర్య‌ట‌న‌పై క్రీడాభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మూడు రోజుల 'ద గోట్ టూర్'లో భాగంగా డిసెంబ‌ర్ 13న భార‌త గ‌డ్డ‌పై ఆయ‌న అడుగుపెడ‌తారు. కోల్‌క‌తా, హైద‌రాబాద్‌, ముంబై, న్యూఢిల్లీ మ‌హా న‌గ‌రాల్లో మెస్సీ ప‌ర్య‌టిస్తారు. ప‌లు ర‌కాల కార్య‌క్ర‌మాల్లో పాల్గొని, ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఆడ‌తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సెల‌బ్రిటీల‌ను ఆయ‌న క‌లుస్తారు. కోల్‌క‌తాలో మొదలు పెట్టి ఢిల్లీలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగుస్తుంది. మెస్సీతో పాటు రొడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), ఉరుగ్వే లెజండ‌రీ స్టైక‌ర్ లూయిస్ సువాలెజ్ కూడా ఇండియాకు వ‌స్తున్నారు.

    త‌మ అభిమాన ఫుట్‌బాల్ క్రీడాకారుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడ‌డమే త‌ప్పా ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫొటో తీసుకునే అవ‌కాశం సామాన్యుల‌కు ఉండ‌దు. ఎందుకంటే మెస్సీతో ప్ర‌త్యేకంగా ఫొటో దిగాలంటే దాదాపు 10 ల‌క్ష‌ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా 100 మందికి మాత్ర‌మే. మెస్సీ రాక‌ కోసం తెలుగు అభిమానులు అమితాస‌క్తితో వేచివున్నారు. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో అత‌డు ఆడే మ్యాచ్ ప్ర‌త్య‌క్షంగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించాలంటే టిక్కెట్ త‌ప్ప‌నిస‌రి. వీటి ధ‌ర‌లు రూ.1750 నుంచి రూ.13500 వ‌ర‌కు ఉన్నాయి.

    మ‌రోవైపు లియోన‌ల్‌ మెస్సీ (Lionel Messi) షెడ్యూల్‌పై ఫ్యాన్స్ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అత‌డు ఎప్పుడు ఎక్క‌డికి వెళ‌తాడ‌నే స‌మాచారం కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. వారి కోసం మెస్సీ ఫుల్ షెడ్యూల్‌ను ఇక్క‌డ ఇస్తున్నాం.  

    మెస్సీ షెడ్యూల్ ఇలా...

    డిసెంబర్ 13, కోల్‌కతా
    ఉదయం 1:30: కోల్‌కతాకు రాక
    ఉదయం 9:30 నుండి 10:30 వరకు: అభిమానులతో ముఖాముఖి
    ఉదయం 10:30 నుండి 11:15 వరకు: మెస్సీ విగ్రహం వర్చువల్‌గా ప్రారంభోత్సవం
    ఉదయం 11:15 నుండి 11:25 వరకు: యువ భారతికి రాక‌
    ఉదయం 11:30: షారుఖ్ ఖాన్ యువ భారతికి రాక‌
    మధ్యాహ్నం 12:00: సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ స్టేడియానికి రాక‌
    మధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, సంభాషణ
    మధ్యాహ్నం 2:00: హైదరాబాద్‌కు బయలుదేరడం

    డిసెంబర్ 13, హైద‌రాబాద్‌
    సాయంత్రం 4: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాక‌, తాజ్ ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌కు ప‌య‌నం, మెస్సీతో మీట్ అండ్ గ్రీట్‌
    రాత్రి 7: ఉప్ప‌ల్ స్టేడియానికి రాక‌, అభిమానుల‌కు ప‌ల‌క‌రింపు, ఫ్రెండ్లీ మ్యాచ్,  చిన్నారుల‌కు మెస్సీ ఫుట్‌బాల్ చిట్నాలు, స‌న్మానం, రాత్రికి ఫ‌ల‌క‌నుమా ప్యాలెస్‌లో బ‌స‌, మ‌ర్నాడు ఉద‌యం ముంబైకు ప‌య‌నం.

    చ‌ద‌వండి: ర్యాంప్‌పై మెస్సీ న‌డ‌క‌

    డిసెంబర్ 14, ముంబై
    మధ్యాహ్నం 3:30: క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్‌లో పాల్గొనడం
    సాయంత్రం 4:00: సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్
    సాయంత్రం 5:00: వాంఖడే స్టేడియంలో కార్యక్రమం, సెల‌బ్రిటీల‌తో ఛారిటీ ఫ్యాషన్ షో

    డిసెంబర్ 15, న్యూఢిల్లీ
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
    మధ్యాహ్నం 1:30 గంటలకు: అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానం

International

  • మయన్మార్ మరోసారి నెత్తురోడింది.  గురువారం పశ్చిమ రఖైన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ నెలలో ఆదేశంలో మిలటరీ దాడి చేయడం ఇది రెండోసారి.

    మయన్మార్‌లో హింసతో అట్టుడుకిపోతుంది. 2021లో నోబెల్ గ్రహిత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టి ఆదేశ ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకున్ననాటి నుంచి ఆ దేశం అంతర్గత సంఘర్షణలతో అట్టుడుకుతుంది. ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడి రెబల్ గ్రూపులు వారి హక్కులు, సంస్కృతి కాపాడుకోవడానికి ఆర్మీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఈనెల 5వ తేదీన సగాయింగ్ ప్రాంతంలో ఓ టీషాపులో పుట్‌బాల్ మ్యాచ్ తిలకిస్తున్న ప్రజలపై ఆర్మీ బాంబులతో విరుచుకపడింది. ఈ ఘటనలో 18మంది మృతిచెందారు. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ఆసుపత్రిపై దాడి చేసింది. 

    రఖైన్‌ రాష్ట్రంలోని మ్రౌక్ యు టౌన్‌షిప్‌లోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 34 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఆర్కాన్ అనే రెబల్ గ్రూపు ఆధీనంలో ఉంది.

     మయన్మార్‌ ఆర్మీ ప్రధానంగా ఆ దేశ ఆర్మీ రెబల్ గ్రూపు ప్రాంతాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. 2025 ప్రారంభం నుంచి నవంబర్ చివరి వరకూ సైనిక దళాలు 2,165 సార్లు వైమానిక దాడులు నిర్వహించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. డిసెంబర్‌ 28నుంచి మయన్మార్‌లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.  అయితే అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్త్నున్నట్లు సమాచారం.

  • కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి, అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్‌ త్వరలో ప్రజస్వామ్య వేడుకకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు  ప్రకటించారు. ఆ దేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హసినా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

    2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 

    ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుపుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్‌ నసిరుద్దీన్‌ ప్రకటించారు. ఈమేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ‍అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దయచేసి ‍ప్రజలెవరూ ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాలలో ఉన్న దేశీయులు ఓటుకోసం డిసెంబర్‌12 నుంచి 25వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

    అయితే వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్‌ ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలుశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల్లో హాసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ‍ప్రభుత్వం భారత్‌ను అభ్యర్థిస్తుంది. అయితే బంగ్లాదేశ్ వెళ్లే  నిర్ణయం స్వయంగా షేక్‌ హసీనానే తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అ‍న్నారు.

    షేక్ హసీనా తొలిసారిగా  1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకూ వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హాసీనాకు చెందిన పార్టీ ఆవామీ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనానే కాకుండా ఆమె పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు. 
     

  • పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్  జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష  విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు  వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు,  సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది  తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.

    ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్  దుర్వినియోగం చేశారని సైనిక  కోర్టు విశ్వసించింది.  కోర్టు ప్రతి అభియోగంపై హమీద్‌ను దోషిగా నిర్ధారించింది.  దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్‌ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం  భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

    చదవండి: ఫస్ట్‌ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు 

    పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణ
    FGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే  హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు  తెలిపారు. 

    ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
     

  • ఆ మధ్య మలయాళంలో సూక్షదర్శిని అనే సినిమా వచ్చింది. అందులో అమాయకంగా కనిపించే తల్లీకొడుకులు.. తమ ఇంటి బిడ్డనే దారుణంగా హతమార్చి.. యాసిడ్‌లో పోసేసి కరిగించేస్తారు. ఆపై ఏం ఎరగనట్లు నాటకాలాడతారు. పరువు హత్య(ఓ సున్నితమైన అంశం) నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ హిట్‌ అయ్యి.. ఇక్కడ తెలుగు డబ్‌తో ఓటీటీలోనూ అలరించింది. అయితే దాదాపు ఇలాంటి తరహా ఘటనే ఒకటి తెరపైకి వచ్చింది.

    వింటేనే వెన్నులో వణుకుపుట్టే ఘటన ఇది. తన భార్యను.. ఇద్దరు పిల్లల తల్లిని.. క్షణికావేశంలోనో లేదంటో ఉద్దేశపూర్వకంగానో హత్య చేశాడో భర్త. ఆపై నేరం నుంచి తప్పించుకునేందుకు అతను చేసిన ప్రయత్నమే కిరాతకంగా ఉంది. ఆమెను ముక్కలుగా.. చెక్కలుగా చేసి.. ముద్దగా మార్చేసి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయి దోషిగా తేలాడు.

    స్విట్జర్లాండ్‌లో హైప్రొఫెషనల్‌ కేసుగా ఉన్న క్రిస్టియానా జోక్సిమోవిక్‌(38) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్తే ఆమెను కిరాతకంగా హత్య చేశాడని స్థానిక అధికారులు బుధవారం నిర్ధారించారు. క్రిస్టియానా జోక్సిమోవిక్‌ మిస్‌ స్విట్జర్లాండ్‌ ఫైనలిస్ట్‌ కావడమే ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.

    2024 ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని తన నివాసంలో క్రిస్టియానా జోక్సిమోవిక్‌ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వేళ్లన్నీ భర్త థామస్‌ వైపే చూపించాయి. అయితే తన భార్య తనపై దాడికి ప్రయత్నించిందని.. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించిందని.. తాను భయంతో ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం మాత్రమే చేశానని మొదటి నుంచి అతను వాదించాడు. కానీ, ఆధారాలు అన్నీ అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి.

    ఆమెను గొంతు నులిమి హత్య చేసిన థామస్‌.. గర్భాశయాన్ని తొలగించి ఆ తర్వాత పెరట్లోని రంపంతో ముక్కలుగా కత్తిరించాడని.. ఆపై మిక్సర్‌లో వేసి ముద్దగా మార్చేశాడని.. అందులో కొంత భాగాన్ని రసాయనాల్లో వేసి కరిగించేశాడని తెలిపారు. నేరానికి ఉయోగించిన రంపాన్ని, తోలు భాగాన్ని, ఎముకల అవశేషాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఘోరాన్ని అతను యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ చేశాడని వెల్లడించారు.

    శరీరం నుంచి నడుమ జాయింట్లను విరిచేసి.. మెడ, వెన్నెముకను కోసేసి.. చివరకు ఆమె తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. శవపరీక్షలో అత్యంత భయానకమైన ఈ వివరాలు వెల్లడయ్యాయి అని కోర్టుకు దర్యాప్తు అధికారులు సమర్పించిన వివరాల్లో ఉంది.

    క్రిస్టియానా మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి తీవ్రంగా ప్రయత్నించారు. నెలలు గడిచినా ఆమె ఆచూకీ కానరలేదు. అయితే.. క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్‌లో ఆమె తండ్రి గుర్తించడం ఈ కేసును అసలు మలుపు తిప్పింది. ఆ ఘటన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా ఉన్నాడని.. అది అతనిలోని క్రూరత్వానికి ప్రతీకగా నిలిచిందని పోలీసులు తమ నివేదికలో వివరించారు. భర్తే హంతకుడిగా తేలడంతో ఈ కేసు ట్రయల్‌ జరగాల్సి ఉంది.

    మిస్‌ నార్త్‌వెస్ట్‌ స్విట్జర్లాండ్‌ క్రిస్టియానా జోక్సిమోవిక్‌.. 2007లో మిస్‌ స్విట్జర్లాండ్‌ పోటీల్లో ఫైనలిస్ట్‌తో సరిపెట్టుకుంది.  ఆ తర్వత క్యాట్‌వాక్‌ కోచ్‌గా మారి.. అనేక మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చింది. 

    పై కేసు చదువుతుంటే.. భార్యను కుక్కర్‌లో ఉడికించిన కేసు గుర్తొచ్చిందా?.. ఆ కథనమూ చదివేయండి 👉 హైదరాబాద్‌ మీర్‌పేటలో కిరాతకం

  • న్యూఢిల్లీ: న్యూ ఇయర్‌లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? లేదంటే ఇతర వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. త్వరలో ఆటోమొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు భారత్‌పై మెక్సికో విధించే 50 శాతం సుంకమే కారణమని జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

    న్యూఇయర్‌ జనవరి1,2026 నుంచి మెక్సికో నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం వసూలు చేయనుంది. ఇప్పటికే భారత్‌ దిగుమతులపై అమెరికా 50శాతం అంతకంటే ఎక్కువగా సుంకాలు విధించింది. తాజాగా,మెక్సికో సైతం భారత్‌ దిగుమతులపై భారీ ఎత్తున టారిఫ్‌ వసూలు చేసేందుకు సిద్ధం కాగా.. అందుకు ఆదేశ సెనేట్‌ సైతం ఆమోదం తెలిపింది. మెక్సికో భారత్‌, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి సుంకాలను వసూలు చేయనుంది.

    ఫలితంగా మెక్సికో నుంచి భారత్‌ భారీ స్థాయిలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50శాతం సుంకాల్ని చెల్లించాల్సి వస్తుంది. వాటిలో ప్రధాన ఉత్పత్తులు వాహనాలు, వాహనాల విడిభాగాలు, టెక్స్‌టైల్స్‌, ప్లాస్టిక్‌, స్టీల్‌ ఉంది. అలా చెల్లించే పరిస్థితి వస్తే దేశీయంగా సంబంధిత వస్తువుల ఉత్పత్తుల అమాంతం పెరిగే అవకాశం ఉందని వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

    మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ దేశీయంగా తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాజాగా, భారత్‌ దిగుమతులపై సుంకం విధించే దిశగా చర్యలు తీసుకున్నారు. 

    భారత్‌పై ప్రతికూల ప్రభావం
    భారత్‌పై 50శాతం వరకు సుంకాలను విధించాలన్న మెక్సికో చర్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. మెక్సికన్ ఎగుమతులకు భారత్‌ తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం, భారత్‌.. మెక్సికోతో అధిక మొత్తంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2024లో భారత్‌ నుంచి మెక్సికోకు ఎగుమతులు దాదాపు 8.9 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు  2.8 బిలియన్లుగా ఉంది.

    గతేడాది భారత్‌.. మెక్సికో నుంచి వాహనాలు, వాటి తయారీలో వినియోగించే ఆటో విడిభాగాలు,ఇతర ప్రయాణీకుల వాహనాలు. ఇప్పుడు, మెక్సికో ఈ వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో..  వచ్చే ఏడాది దిగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశ ఉందని ఆర్థిక నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు జరిమానా విధించింది. రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థకు రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. వారం లోపు చెల్లించాలని స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

    చివరి అవకాశం ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ 30వ తేదీకి వాయిదా వేసింది.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్‌ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.  

    ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో ఎంపీ ఈటల రాజేందర్‌ బిగ్‌షాక్‌ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్‌ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్‌ వర్గానికి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్‌ గెలుపుపొందారు. ఈటల రాజేందర్‌ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్‌ ఓటమి పాలయ్యారు.

    ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్‌టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ నేపథ్యంలో కరీంనగర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్‌ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.

    మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్‌ఎస్‌ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

    తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

    కాగా, ఇవాళ జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు. 

  • సాక్షి, కొమరం భీమ్‌: తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. తర్వాతి స్థానంలో బీఆర్‌ఎస్‌, ఇతరులు, ఆ తర్వాతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఈ తరుణంలో.. 

    కొమరం భీమ్‌ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆసక్తికర ఎన్నిక జరిగింది. ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిందక్కడ. కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్‌ పుష్పలత.. కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలిచారు. దీంతో ఆమె కుటుంబ సభ్యల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రంగులు చల్లుకుంటూ.. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారక్కడ.

  • సాక్షి, హైదరాబాద్‌: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్‌ షాక్‌ తగిలింది. బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్‌ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్‌ కస్టడీ కారణంగా రవి బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. 

    మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్‌ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

    ఆంధ్రప్రదేశ్‌ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్‌ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్‌ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. 

    సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే..  స్క్రీన్‌ రికార్డింగ్‌ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్‌ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్‌ పోలీసుల కస్టడీ అప్పీల్‌ గనుక రిజెక్ట్‌ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది.

  • సాక్షి, హైద‌రాబాద్‌: ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేసిన పౌర సరఫరాల శాఖ తాజాగా కొత్త సభ్యులపై దృష్టి సారించింది. కొత్త రేషన్‌కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్తసభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతున్నందున కొత్త సభ్యులు సైతం ఈ కేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. రేషన్‌కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈ–పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు అప్‌డేట్‌ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు సైతం రేషన్‌ కోటా డ్రా కోసం వస్తున్న లబ్ధిదారులకు ఈ కేవైసీ(e-KYC) గురించి గుర్తు చేస్తున్నారు.

    వాస్తవంగా గత రెండేళ్లగా ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికీ పలు మార్లు గడువు పెంచుకుంటూ వస్తోంది. గ్రేటర్‌ హైద‌రాబాద్‌ పరిధిలో ఇప్పటికే డుబ్లికేట్, చనిపోయిన యూనిట్లు ఎరివేతకు గురికాగా, మిగిలిన వాటిలో దాదాపు 85 శాతం ఈ–కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకుంటే సదరు యూనిట్ల రేషన్‌ కోటా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

    ఆధార్‌కు ఈ–పాస్‌ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం (Rice) తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం అవుతుంది. దీనితో చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ మరింత సమర్ధవంతంగా అమలు చేయవచ్చనే ఉద్దేశంతో ఈ–కేవైసీ నిబంధన తప్పనిసరి చేసినట్లు కనిపిస్తోంది.



    అప్‌డేట్‌ లేక తిప్పలు 
    ఆధార్‌ నవీకరణ(అప్‌డేట్‌) లేక బయోమెట్రిక్‌ వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తి చేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆధార్‌ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆధార్‌ (Aadhaar) నవీకరణ పూర్తి కాకపోవడంతో చిన్నారులు ఈ–కేవైసీ ప్రక్రియకు దూరమవుతున్నారు. 

    చ‌ద‌వండి: బంజారాహిల్స్‌లో రూ. 350కు గ‌జ‌మా?

  • సాక్షి, హైదరాబాద్‌: తనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్‌ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్‌ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. 

    ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. 

    ‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. 

    ‘‘కోర్టు నాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె.  
    కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. 

  • సాక్షి, ఢిల్లీ: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు భారీ షాక్‌ తగిలింది. ఆయన్ని వెంటనే లొంగిపోవాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. వారంపాటు ఆయన్ని విచారణ జరపొచ్చని సిట్‌కు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

    ‘‘ప్రభాకర్‌రావు రేపు సరెండర్‌ కావాలి. అలాగే ఆయన్ని ఫిజికల్‌గా టార్చర్‌ చేయొద్దు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్‌ చేయండి. వారంపాటు కస్టోడియల్‌ విచారణ జరిపాక ఆ వివరాలను మాకు తెలియజేయండి’’ అని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇంతకాలం సుప్రీం కోర్టు తాత్కాలిక రక్షణతో ప్రభాకర్‌రావు అరెస్ట్‌ నుంచి ఊరట పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి విచారణలో.. 

    ‘‘డేటా ఎక్కడుంది?. 36 హార్డ్ డిస్క్ లను ఎలా ధ్వంసం చేస్తారు?. హార్డ్ డిస్క్ లలో డేటా తొలగించాలని మీకు లిఖిత పూర్వక ఆదేశాలు ఎవరైనా ఇచ్చారా?. ఆ ఆదేశాల ప్రతులు చూపండి’’ అని ద్విసభ్య ధర్మాసనం ప్రభాకర్‌రావు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఆ ఆదేశాలు తమ వద్ద లేవని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే కస్టడీ కోరుతున్నారని జస్టిస్‌ మహదేవన్‌ అన్నారు. 

    శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు లొంగిపోవాలి. ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయండి. మందులు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు ఆయన్ని అనుమతి ఇవ్వండి అని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది  సుప్రీం కోర్టు. ఈ క్రమంలో.. విచారణ రోజునే కస్టడీ పొడగింపు కోరుతామని  తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా అన్నారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

    బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, ఆఖరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురయ్యాయని అభియోగాలున్నాయి. అంతేకాదు.. ఆ ఆధారాలను మాయం చేసే ప్రయత్నమూ జరిగిందనే ఆరోపణలూ ఉన్నాయి.  ఈ క్రమంలో ప్రభాకర్‌ రావు బంధువు, ఇంటెలిజెన్స్‌లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు అరెస్ట్‌తో ట్యాపింగ్‌ తేనెతుట్టె కదిలింది. ఈ కేసులో ఏ1గా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు పేరును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) చేర్చింది. 

    ప్రణీత్‌రావు అరెస్ట్‌ అప్పటి నుంచి  ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉంటూ వచ్చారు. చివరకు.. సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలతో అరెస్ట్‌ నుంచి ఊరట పొందిన ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఆయన్ని సిట్‌ విచారణ జరిపింది. అయితే.. అరెస్టు నుంచి ఊరట కావాలంటే దర్యాప్తునకు అన్నివిధాలా సహకరించాలని ప్రభాకర్‌రావుకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయినా కూడా ఆయన ఐక్లౌడ్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వకుండా డేటాను డిలీట్‌ చేశారని.. దర్యాప్తులో ఏరకంగానూ సహకరించడం లేదని సిట్‌ తరఫున తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో.. తాత్కాలిక రక్షణను పక్కన పెట్టి లొంగిపోయి విచారణకు సహకరించాలని ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

    ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్‌, తిరుపతి రావులు అరెస్ట్‌ అయ్యారు. రాధాకిషన్‌ తన కన్‌ఫెషన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్‌ రెడ్డిని ఇటీవలె SIT ప్రశ్నించింది కూడా. ఇప్పుడు ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తాయా? అనే ఆసక్తి నెలకొంది.

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురి నియామకం జరిగింది.

    షేక్‌ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు), కె.కృష్ణమూర్తిరెడ్డి (పలమనేరు), పోలు సుబ్బారెడ్డి (రాయచోటి), ఉపేంద్ర రెడ్డి (రాయచోటి), డి. ఉదయ్ కుమార్ (మదనపల్లె), వి.చలపతి (కోవూరు), గువ్వల శ్రీకాంత్ రెడ్డి (సింగనమల), డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి (తాడిపత్రి),  సుభాష్ చంద్రబోస్ (కర్నూలు), రఘునాథరెడ్డి (జమ్మలమడుగు), ఎస్. ప్రసాద్ రెడ్డి (కమలాపురం), పార్టీ ఎస్‌ఈసీ సభ్యునిగా ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి (రాయచోటి) నియమితులయ్యారు.

     

  • సాక్షి, నెల్లూరు‌: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్‌ కిడ్నాప్‌ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే..   

    నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. 

    మేయర్‌పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్‌ కార్పొరేటర్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్‌ కార్పొరేటర్), షేక్‌ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్‌ కార్పొరేటర్‌)లను  మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్‌ జగన్‌ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్‌ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది.

  • సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్‌), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్‌), కాయల సాహితి (51వ డివిజన్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్‌), షేక్‌ ఫమిదా (34వ డివిజన్‌) ఉన్నారు.

    వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్‌ జగన్‌ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ షాక్ ఇచ్చింది.

  • త‌మిళ‌నాడులో అధికారం హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డానికి పుదుచ్చేరిని గేట్‌వేగా వాడుకోవాల‌ని భావిస్తున్న స్టార్‌ హీరో విజ‌య్‌కు బ్రేక్ ప‌డే సూచ‌న‌లు కన్పిస్తున్నాయి. ఆయ‌న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన మ‌రుస‌టి రోజే మ‌రో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పెట్టిన‌ వ్య‌క్తి కూడా త‌న పార్టీకి చెందిన‌ కీల‌క నేత‌ బంధువువే కావ‌డం గ‌మ‌నార్హం. కొత్త పార్టీతో కేంద్ర పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో రాజ‌కీయాలు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

    లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్‌ చార్లెస్ మార్టిన్.. తాను సొంత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తాను న‌డుపుతున్న స్వ‌చ్ఛంద సంస్థ‌ 'జేసీఎం మక్కల్ మాండ్రం'ను (JCM Makkal Mandram) రాజ‌కీయ పార్టీగా మారుస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆ పార్టీకి 'లక్ష్య జననాయక కచ్చి' (Latchiya Jananayaka Katchi) అని పేరు పెడతామని, డిసెంబర్ 14న లాంఛనంగా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్ర‌సంగిస్తూ ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున్ బావమరిదే చార్లెస్ మార్టిన్. చార్లెస్ సోద‌రి డైసీ మార్టిన్‌ను అర్జున్ వివాహం చేసుకున్నారు.

    మార్పు తెస్తా
    పుదుచ్చేరికి 1954లోనే స్వాతంత్ర్యం వ‌చ్చినా, దాని ప్రయోజనాలను పూర్తిగా పొందలేదని చార్లెస్ మార్టిన్ (Charles Martin) అన్నారు. పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో డిసెంబర్ 14 ఒక 'చారిత్రాత్మక ఘట్టం' కానుందని పేర్కొన్నారు. త‌న‌కు అండ‌గా నిల‌బ‌డి ముందుకు న‌డిపించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. గ‌త ప్ర‌భుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయ‌ని, వ్య‌వ‌స్థ‌లో మార్పు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

    సింగ‌పూర్ చేస్తా
    2026 ఎన్నికల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని చార్లెస్ మార్టిన్ పేర్కొన్నారు. పుదుచ్చేరిలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు నిజాయితీగా లేవని, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయ‌లేక‌పోయాయ‌ని చార్లెస్ విమ‌ర్శించారు. పాల‌నలో మార్పు తీసుకురావాల‌నే లక్ష్యంతోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు చెప్పారు. సింగపూర్ తరహాలో పుదుచ్చేరిని అభివృద్ధి చేయ‌డ‌మే త‌మ దీర్ఘకాలిక లక్ష్యమని 'ఇండియా టుడే'తో అన్నారు.

    జ‌ట్టు క‌డ‌తారా?
    కాగా, మంగ‌ళ‌వారం పుదుచ్చేరిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన విజ‌య్‌.. ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి నాయ‌క‌త్వంలోని ఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. పుదుచ్చేరి ప్ర‌భుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ త‌మిళ‌నాడులోని డీఎంకే స‌ర్కారుకు చుర‌క‌లు అంటించారు. రంగ‌స్వామి ప్ర‌భుత్వంపై విజ‌య్ సానుకూలంగా మాట్లాడ‌టంతో.. పుదుచ్చేరి ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ జ‌ట్టు క‌డ‌తార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

    చ‌ద‌వండి: విజ‌య్‌, రంగ‌స్వామి మెగా ప్లాన్‌

  • సాక్షి, తిరుపతి: కూటమి వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్‌ జగన్‌పై కూటమి దాడి చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని.. కూటమి నేతలు తప్పు చేసి వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘వైఎస్‌ జగన్‌ను దెబ్బతీయడానికి తిరుమలను చంద్రబాబు వాడుకుంటున్నారు. ఎన్నికల ముందు‌, తరువాత తిరుమల చూట్టు రాజకీయాలు చేస్తున్నారు. లడ్డూ, పరకామణి, పట్టు వస్త్రాలు అవినీతి అంటూ జగన్‌ను టార్గెట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయంగా దెబ్బ తీయడానికి స్వామివారి కూటమి నేతలు వాడుకుంటున్నారు.

    ..పదిరోజుల వైకుంఠ ఏకాదశి వద్దని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు మళ్లీ అదే కొనసాగిస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు దీనికి కారణం వైఎస్సార్‌సీపీనే‌.. పదిరోజుల దర్శనం తప్పు అంటూ ప్రచారం చేశారు. లడ్డూ కేసులో ఇప్పటి వరకు రాజకీయపరమైన అరెస్టు ఒక్కటి జరగలేదు. కాని సుబ్బారెడ్డి చేశాడని అసత్య ప్రచారం చేశారు.

    ..సింహాచలం ఆలయంలో దొంగతనం చేస్తే స్టేషను బెయిల్ ఇచ్చి వదిలేశారు. 2015 నుంచి 2025 వరకు పట్టు వస్త్రాల స్కాం జరిగితే‌‌‌.. వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నాడు. రోజుకో మాట మాట్లాడటంలో పవన్ దిట్టా. బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడూ జరగని అపచారాలు తిరుమలలో జరిగాయి’’ అని  భూమన ధ్వజమెత్తారు.

     

     

Business

  • ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా సంస్థలు స్టార్టప్‌ గుర్తింపు పొందాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. 2,01,335 స్టార్టప్‌లను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం డీపీఐఐటీ గుర్తించినట్లు తెలిపింది. ఇవి దేశవ్యాప్తంగా 21 లక్షల పైచిలుకు ఉద్యోగాలను కల్పాయని పేర్కొంది. 2025 జూన్‌ వరకు 14 రంగాలవ్యాప్తంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ. 1.88 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని శాఖ వివరించింది. దీనితో అదనంగా రూ. 17 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తి/అమ్మకాలు జరిగాయని, 12.3 లక్షల మేర ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని పేర్కొంది.

    పీఎల్‌ఐ స్కీముతో ఎల్రక్టానిక్స్, ఫార్మా, టెలికం, నెట్‌వర్కింగ్‌ ప్రోడక్ట్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల నుంచి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం కింద స్టార్టప్‌గా గుర్తింపు పొందిన సంస్థలకు ఆదాయ పన్ను రాయితీ తదితర ప్రోత్సాహకాలు లభిస్తాయి. మరోవైపు, వ్యాకారాల నిర్వహణను సరళతరం చేసే క్రమంలో నిబంధనల భారాన్ని కూడా గణనీయంగా తగ్గించినట్లు కేంద్రం తెలిపింది. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో (2014–25) భారత్‌లోకి 748.38 బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని వివరించింది. అంతక్రితం 11 ఏళ్లలో (2003–14) వచ్చిన 308.38 బిలియన్‌ డాలర్లకు ఇది 143 శాతం అధికమని పేర్కొంది.

  • చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..

    చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.

    దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్‌బుక్‌లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.

    వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్‌గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.

    ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

  • రిటైల్‌ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్‌ అండ్‌ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్‌ ఈక్విటీ హోల్డింగ్స్‌ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.

    డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్‌ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్‌ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్‌ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్‌ మార్కెట్లో స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్‌ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు జెన్‌ జెడ్, మిలీనియల్స్‌ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్‌ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.

    దీర్ఘకాల దృక్పథం..
    ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్‌లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్‌ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్‌ 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్‌ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్‌ ఎకోసిస్టమ్‌ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.  

    ఫండ్స్‌-ఈక్విటీలకు ప్రాధాన్యం..
    సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్‌ పార్ట్‌నర్‌ సౌరభ్‌ ట్రెహాన్‌ తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్‌ తెలిపారు.

  • టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్‌'ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది. భారతదేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇదెలా పనిచేస్తుందనే విషయాన్ని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

    ప్రపంచంలోని మోస్ట్ అడ్వాన్స్డ్ జీరో ఎమిషన్ వాహనాల్లో టయోటా మిరాయ్ ఒకటి. ఈ కారు హైడ్రోజన్ & ఆక్సిజన్ మధ్య జరిగిన రసాయన చర్య ద్వారా ఏర్పడిన విద్యుత్తు ద్వారా పనిచేస్తుంది. నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది సుమారు 650 కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఇదే నిజమైతే.. సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ఇది ప్రత్యామ్నాయమనే చెప్పాలి.

    కంపెనీ కూడా ఈ లేటెస్ట్ మిరాయ్ కారును.. ఇంధన సామర్థ్యం, ​​పరిధి, డ్రైవింగ్ సామర్థ్యం, భారతదేశ విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా తయారు చేసింది. ఈ కారు టెస్టింగ్ పూర్తయిన తరువాత.. అన్నింటా సక్సెస్ సాధిస్తే.. త్వరలోనే రోడ్డుపైకి వస్తుంది.

    ఇదీ చదవండి: నవంబర్‌లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు

    భారతదేశ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ & కార్బన్-న్యూట్రాలిటీ లక్ష్యాలను బలోపేతం చేస్తూ.. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని TKM & NISE మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత.. కారును టెస్టింగ్ కోసం అప్పగించడం జరిగింది.

  • బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా.. పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.

    ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

    35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.

    బంగారం ధరలు ఎందుకిలా..
    ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.

    భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి.

    కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌ను పెంచేసింది.

    డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్‌కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్‌గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.

    డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.

    ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.  పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.

    భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?
    2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది.

  • భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్‌గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.

    ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్‌వర్క్‌లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.

    యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్‌పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్‌పీయూ రూ.167. ఇది ఎయిర్‌టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్‌టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.

    సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్‌టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది.

  • ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామక పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రిక్రూట్‌మెంట్ పరీక్షల కాలక్రమాన్ని క్రమబద్ధీకరించడం, వాటి ఫలితాల ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులను సూచించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) నియామకాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

    తాము సూచించిన మార్పులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే పరీక్షలలో పారదర్శకతను పెంచడానికి దోహదపడతాయని పేర్కొంది. ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నియామకాలకు తానే సొంతంగా రిక్రూట్‌మెంట్‌ చేపడుతుండగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆర్ఆర్‌బీలలో రిక్రూట్‌మెంట్‌ను ఆయా బ్యాంకుల ఆదేశాలకు అనుగుణంగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.

    సాధారణంగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఎస్‌బీఐలలో ఉద్యోగాల పరీక్షల కంటే ముందే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్‌ఆర్‌బీలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను కూడా ఇదే క్రమంలో ప్రకటిస్తున్నారు. "అయితే, కొత్తగా నియమితులైన అభ్యర్థులు తరచుగా ఆర్ఆర్‌బీల నుండి ఇతర ప్రభుత్వ బ్యాంకులకు, తరువాత ఎస్‌బీఐకి మారే ఒక ముఖ్యమైన ధోరణి ఉద్భవించింది. ఈ వలస బ్యాంకులలో గణనీయమైన అట్రిషన్ కు దారితీస్తూ కార్యాచరణ సవాళ్లను విసురుతోంది" అని ఆర్థిక సేవల విభాగం తెలిపింది.

    పై సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఆర్థిక సేవల విభాగం బ్యాంకుల రిక్రూట్‌మెం​ట్ పరీక్షల సమగ్ర ప్రక్రియ, ఫలితాల ప్రకటనల నమూనాను సమీక్షించింది. మూడు రకాల బ్యాంకులలో నియామక ఫలితాలను ప్రకటించడానికి ప్రామాణిక, తార్కిక క్రమాన్ని అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు సూచించింది.

    పర్యవసానంగా, సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ప్రకారం.. మొదట ఎస్‌బీఐ, అనంతరం ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆ తరువాత చివరగా ఆర్‌ఆర్‌బీలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలి. ఈ కేటగిరీలలోని అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ప్రారంభంలో ప్రకటిస్తామని, క్లరికల్ స్థాయి పరీక్ష ఫలితాలను అదే క్రమంలో ప్రకటిస్తామని తెలిపింది.

  • ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ-20 పెట్రోల్) వినియోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల పెట్రోల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ చర్య కారణంగా.. రూ. 1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు.

    ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకంపై కొందరు ఆందోళనల చెందుతున్నారు. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉపయోగించే కార్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని, ఇప్పటికే.. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

    ఈ-20 పెట్రోల్ తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ కంటే కూడా ఉత్తమంగా ఉందని గడ్కరీ అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్‌లో ఉపయోగించే ముడి పదార్థాలైన చెరకు, మొక్కజొన్న మొదలైన వాటి వినియోగం పెరుగుతుంది. ఇది రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేస్తుందని ఆయన అన్నారు.

    ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం అమలు తర్వాత.. గతంలో ముడి చమురు దిగుమతులకు ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు రైతులకు చేరుతోందని, దీంతో అన్నదాతలు.. ఊర్జాదాతలు(Energy Givers)గా మారారని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. గత 11 సంవత్సరాలలో.. ఇథనాల్ వినియోగం, సరఫరా కారణంగా 2014-15 నుంచి 2025 జూలై 2025 వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.1,40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశాయని ఆయన అన్నారు.

    ఇదీ చదవండి: నవంబర్‌లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు

  • ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్‌మెంట్‌ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్‌’లో పంచుకున్నారు.

    చరిత్ర చూడండి..
    ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.

    ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.

    కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం  వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.

    ఫెడ్‌ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలం
    ప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్‌నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్‌కాయిన్, ఈథీరియంను  “ప్రజల డబ్బు”గా  కియోసాకి అభివర్ణించారు.

    ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.

    స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.

    కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది.

     

  • భారతదేశంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకి విస్తరిస్తూనే ఉంది. కొత్త కంపెనీలు వస్తున్నాయ్. కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతున్నాయి. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ కొనుగోలు చేయడానికి అమితమైన ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల ప్రతి నెలా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో గత నెలలో ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.

    ➤టాటా నెక్సాన్: 22,434 యూనిట్లు
    ➤మారుతి సుజుకి డిజైర్: 21,082 యూనిట్లు
    ➤మారుతి సుజుకి స్విఫ్ట్: 19,733 యూనిట్లు
    ➤టాటా పంచ్: 18,753 యూనిట్లు
    ➤హ్యుందాయ్ క్రెటా: 17,344 యూనిట్లు
    ➤మారుతి సుజుకి ఎర్టిగా: 16,197 యూనిట్లు
    ➤మహీంద్రా స్కార్పియో: 15,616 యూనిట్లు
    ➤మారుతి సుజుకి ఫ్రాంక్స్: 15,058 యూనిట్లు
    ➤మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 14,619 యూనిట్లు
    ➤మారుతి సుజుకి బ్రెజా: 13,947 యూనిట్లు

    నవంబర్ 2025లో ఎక్కువమంది కొనుగోలు చేసిన కార్ల జాబితాలో.. 22434 యూనిట్ల అమ్మకాలతో టాటా నెక్సాన్ నిలిచింది. తరువాత జాబితాలో డిజైర్, స్విఫ్ట్ నిలిచాయి. వ్యాగన్ఆర్, బ్రెజా కార్లు చివరి వరుసలో నిలిచాయి. ఎక్కువమంది కొన్న టాప్ 10 కార్ల జాబితాలో ఆరు మారుతి సుజుకి కార్లు, రెండు టాటా కార్లు, ఒక హ్యుందాయ్ కారు ఉన్నాయి.

    నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన టాటా నెక్సాన్.. పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుండటం కారణంగా ప్రారంభం నుంచి మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నెక్సాన్ ప్రారంభ ధర రూ. 7.32 లక్షలు (ఎక్స్ షోరూమ్).

    ఇదీ చదవండి: కస్టమర్లకు అలర్ట్: హెచ్‌డీఎఫ్‌సీ సేవలు రెండు రోజులు బంద్!

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత భారత ఈక్విటీలు పుంజుకున్నాయి. మూడు రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికాయి.

    మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 426.86 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 84,818.13 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.55 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 25,898.55 వద్ద ముగిసింది.

    ఎటర్నల్, టాటా స్టీల్, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ ఈరోజు సెన్సెక్స్ లో 1.7 శాతం వరకు లాభపడ్డాయి. టైటాన్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

    విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.87 శాతం, 0.74 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.9 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.08 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు వరుసగా 0.6 శాతం, 0.4 శాతం పెరిగాయి.

  • స్పెయిన్‌లో ఒక విచిత్రమైన ఉద్యోగ వివాదం వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా 40 నిమిషాల ముందుగానే ఆఫీస్‌కు వస్తోన్న ఒక ఉద్యోగినిని ఆ కంపెనీ తొలగించింది. ఆఫీస్‌కు అర్లీగా వస్తే తొలగిస్తారా? అంటూ కంపెనీని కోర్టుకు లాగింది ఆ 22 ఏళ్ల ఉద్యోగిని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...

    అసలేం జరిగిందంటే.. 
    మెట్రో వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఆ ఉద్యోగిని షిఫ్ట్‌ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఆమె ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్యే ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లిపోయేది. ఉద్యోగిని ముందుగా రావడం ప్రారంభంలో మంచి అలవాటుగా కనిపించినా, ఆ సమయంలో ఆమె చేయడానికి ఎలాంటి పని లేకపోవడం, అలాగే ముందుగా రాకూడదన్న సంస్థ ఆదేశాలను ఆమె పదేపదే లెక్కచేయకపోవడం కంపెనీ యాజమాన్యాన్ని  అసహనానికి గురి చేసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

    కంపెనీ ఏం చెబుతోందంటే.. 
    సంస్థ మాటల్లో.. ఉద్యోగి ముందుగానే రావడం వల్ల ఎటువంటి ఉత్పాదకతా అందించకపోగా, నిర్ణయించిన సమయాలకు కట్టుబడే నిబంధనలను సదరు ఉద్యోగిని నిర్లక్ష్యం చేసింది. పలుమార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ ఆమె తన అలవాటు మార్చుకోలేదు. ఇక, ఆమె 19 సందర్భాల్లో ఆఫీస్‌ ప్రాంగణంలోకి రాక ముందే కంపెనీ యాప్‌లో లాగిన్‌ కావడానికి ప్రయత్నించినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇది మోసపూరిత చర్యగా కంపెనీ యాజమాన్యం పరిగణించింది.

    తొలగింపు అన్యాయమంటూ కోర్టుకు..
    తన తొలగిపింపును సవాలు చేస్తూ ఆ మహిళ అలికాంటే సోషల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదన ఏమిటంటే ముందుగా రావడం తప్పు కాదు. కంపెనీ యాజమాన్యం తనపట్ల అన్యాయం చేసింది.

    భిన్నంగా కోర్టు తీర్పు
    అయితే, కోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. గైర్హాజరు లేదా ఆలస్యంగా రావడం కాకుండా  అత్యధిక సమయపాలన కూడా నియమావళిని ఉల్లంఘించే పరిస్థితుల్లో సమస్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. సంస్థ నిబంధనలను పాటించడానికి ఉద్యోగి నిరాకరించిందని, ఇది స్పానిష్ వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54ను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొంది.

    అంతేకాకుండా ముందుగానే రావడం కారణంగా జట్టు సమన్వయానికి అంతరాయం ఏర్పడిందని మరో ఉద్యోగి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఉద్యోగిని తొలగించడం సముచితమేనని నిర్ణయిస్తూ కోర్టు యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

  • అప్పుడప్పుడు నిర్వహణ పనుల వల్ల బ్యాంకుల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో బ్యాంకింగ్ సేవలు (నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ సేవలు) తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఈ విషయాన్ని బ్యాంకులు ముందుగానే తమ కస్టమర్లకు తెలియజేస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఇలాంటి ప్రకటనే వెల్లడించింది.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పంపిన సందేశం ప్రకారం.. 2025 డిసెంబర్ 13 తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 6:30గంటల (నాలుగు గంటలు) వరకు, అలాగే 21వ తేదీన తెల్లవారు జాము 2.30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన యూపీఐ సేవలు కూడా ఆ సమయంలో పనిచేయవని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు పనిచేయని సమయంలో PayZapp ఉపయోగించుకోవచ్చని సిఫార్సు చేసింది. కేవలం రెండు రోజులు, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే బ్యాంకింగ్ సేవలు పనిచేయవు. మిగిలిన సమయంలో అన్ని సేవలు యధావిధిగా పనిచేస్తాయి.

    ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..

National

  • ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పుతిన్‌ భారత్‌ పర్యటన తర్వాత ట్రంప్‌కు మోదీ ఫోన్‌ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్‌ చర్చించారు. ఉమ్మడి, లాభదాయక అంశాలపై కలిసి పనిచేయడానికి అంగీకారం తెలిపారు. వ్యాపారం, సాంకేతిక సహకారంపై కూడా చర్చించారు.

    కాగా, భారత్, పాక్‌ దాదాపుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగాయని కల్పించుకుని దాన్ని నివారించానంటూ తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ అదే పాట పాడారు. మంగళవారం(డిసెంబర్‌ 9) పెన్సిల్వేనియాలోని మౌంట్‌ పొకోనో వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ పాలు గొప్పలకు పోయారు. ‘గత 10నెలల్లోనే నేను ఏకంగా 8 యుద్ధాలను ఆపాను. ఆయన ఇలా చెప్పుకోవడం ఇది దాదాపు 70వ సారి కావడం విశేషం! 

    కొసావో, సెర్బియా, ఇండో–పాక్, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపి యా, ఆర్మేనియా, అజర్‌ బైజాన్‌‘ అంటూ ఏకంగా జాబితానే ఏకరువు పెట్టారు. ‘ఇప్పుడు కంబోడి యా, థాయ్‌ లాండ్‌ తలపడుతున్నాయి. రేపు ఆ దేశాధినేతలకు కాల్‌ చేయబోతున్నా. ఇలాంటి ప్రకటనలు నేనుగాక ఇంకెవరు చేయగలరు?‘ అంటూ గొప్పలకు పోయారు. సోమాలియా, అఫ్ఘానిస్థాన్‌ వంటి మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలకు శాశ్వతం ఫుల్‌ స్టాప్‌ పెట్టానని చెప్పుకొచ్చారు. 

    మరోవైపు, భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో సంభాషించిన సంగతి తెలిసిందే. నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఇరువురు అగ్రనేతలు త్వరలో సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. మోదీ, నెతన్యాహు మధ్య స్నేహపూర్వక, ఆత్మీయ సంభాషణ సాగినట్లు ఇజ్రాయెల్ పీఎంవో పేర్కొంది.

     

     

     

  • న్యూఢిల్లీ/జెరూసలేం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణలో నెతన్యాహూ, ప్రాంతీయ పరిస్థితులపై మోదీకి వివరాలు అందించారు. 

    ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్‌ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్–ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.

    నేతన్యాహూ, గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా సవాళ్లపై మోదీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత కీలకమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.  మోదీ-నేతన్యాహూ సంభాషణ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుంది. రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతుందని అంచనా. 
     
    ఫోన్ సంభాషణలోనే ఇద్దరు నాయకులు త్వరలో ముఖాముఖి సమావేశం జరపాలని అంగీకరించారు. ఈ సమావేశం ద్వారా పశ్చిమ ఆసియా శాంతి, స్థిరత్వం కోసం కొత్త వ్యూహాలు రూపొందే అవకాశం ఉంది. 

    ఇదిలా ఉంటే.. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డిసెంబర్‌ 4,5 తేదీల్లో భారత్‌ పర్యటన చేశారు.  ఈ సందర్భంగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాయి. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు,ప్రధాని మోదీల మధ్య ఫోన్‌ సంభాషణ జరగడం చర్చాంశనీయంగా మారింది. 

  • సాక్షి శబరిమల: శబరిమలలో మండల పూజల సీజన్ ఈ నెల 27తో ముగియనుంది. ఆ వెంటనే మకరవిళక్కు సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ‘సందట్లో సడేమియా’లా భక్తుల రద్దీని అవకాశంగా మలచుకుంటున్న దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో శబరిమల పరిసరాల్లో నకిలీ పత్రాలతో.. గుర్తింపు కార్డులతో సేవకు వచ్చే వారి కోసం తనిఖీలను ముమ్మరం చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పంపాబేస్ నుంచి సన్నిధానం వరకు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచినట్లు వెల్లడించారు.

    అలాగే భద్రత దృష్టా అధికారులు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుతో సహా తాత్కాలిక ఉద్యోగుల పత్రాలను తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులను చూపిస్తూ వివిధ ప్రదేశాలలో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయా వ్యక్తుల కోసం పోలీసులు,  బోర్డు సమాచారాన్ని  పరస్పరం సమాచారాన్ని పంచుకుంటాని చెప్పారు. 

    అయితే ఒక్కోసారి నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, వారి పరిస్థితి దృష్ట్యా సాధారణంగా ప్రశ్నించి విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, శబరిమల అటవీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా వైమానిక నిఘా కూడా నిర్వహిస్తున్నాయి. "రద్దీ పెరిగినప్పుడు దొంగలు, సంఘ వ్యతిరేక శక్తులు , యాచకులు తరచుగా శబరిమలకు వస్తారు. వారు పోలీసులను, అటవీ శాఖను పట్టించుకోకుండా శబరిమల మార్గంలోని అడవుల్లోనే ఉంటారు. అలాంటివారు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు వంటి పత్రాలతో వస్తారు. వారి రాక భద్రతా ముప్పుని సృష్టిస్తోంది"  అని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు. అయ్యప్ప భక్తులను మోసగించి రద్దీ సమయాల్లో అడవిలోకి ప్రవేశించడం వారి నేరశైలి అని తెలిపారు. ఈ నేపథ్యంలో నీలిమల, అప్పచిమేడు, శరణ్‌గుత్తి తదితర ప్రాంతాల పరిసర అడవులలో డ్రోన్ నిఘాను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 

    అలాగే పోలీసుల రిజిస్టర్లలో నమోదుకాని కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పంపా, సన్నిధానంలో రెవెన్యూ శాఖ స్క్వాడ్, పోలీసు షాడో బృందం 24 గంటలు మోహరించి ఉంటాయని వెల్లడించారు.

    (చదవండి: శబరిమలలో 50% మంది తెలుగు భక్తులే)

     

  • బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా  నటిస్తూ వైట్‌ఫీల్డ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.

    టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం  ప్రకారం   21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్‌పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురు కింగ్‌పిన్‌లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.  అమెరికా, యూకేలలో  2022 నుండి  ఈ  దందా కొనసాగిస్తున్నారని  దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

    ఆగస్టు నుండి ఈ ముఠా  అమెరికా,  యూకేలలో  కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్‌కాయిన్ ATMలలో దాదాపు  పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో  ఉన్నామని  ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను'  ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు.  ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు ,  సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు. 

    ఇదీ చదవండి: ఫస్ట్‌ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు

    మస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్‌బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్‌లాగానే ఉంటాయి. కనిపించకుండా  ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు   మెసేజ్‌ పాప్‌ అప్‌  అవుతుంది. నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌కూడా డిస్‌ప్లే అవుతుందని  దర్యాప్తు అధికారులు వివరించారు.

    బాధితులు ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, వారి  కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్‌కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.

    ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు

    మస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్‌కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది.

  • నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్‌ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. లోక్‌సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..

    ఎమ్ఎమ్‌పీ (మిక్స్‌డ్‌ మెంబర్‌ ప్రపొర్షనల్‌) మోడల్‌.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్‌కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.

    దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్‌లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!

    ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.

    జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.

    భారత్‌లో.. 
    భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్‌పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.

    మిక్స్‌డ్‌ విధానం వల్ల ఒరిగేదేంటి?..

    • ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్‌లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్‌ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.

    • ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.

    • ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు.  

    ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్‌ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్‌లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్‌పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది.

  • న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.

    తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, అండమాన్ అండ్‌ నికోబార్‌, ఉత్తరప్రదేశ్‌,కేరళలో ఓటర్ల జాబితా సవరణ గడువు వారం రోజులకు పొడిగించింది. తమిళనాడు,గుజరాత్ (డిసెంబర్ 14), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ అండమాన్‌ నికోబార్ దీవులు (డిసెంబర్ 18), ఉత్తర ప్రదేశ్ (డిసెంబర్ 26)కు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాగా, గోవా, లక్షద్వీప్, రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈరోజు ముగిసింది.
     

  • కోల్‌కతా, సాక్షి:  ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) పై  తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా సమీక్ష సమయంలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మహిళలను కోరారు. ఓటర్ల జాబితా లక్ష్యంగా ఎస్‌ఐఆర్‌  సమీక్ష, రానున్న ఎన్నికల నేపథ్యంలో  మమతా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    మొదటినుంచీ ఎస్‌ఐఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తాజా వ్యాఖ్యలు ఇక బీజేపీపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైపోయినట్టు  కనిపిస్తోంది.  కృష్ణానగర్‌లో జరిగిన ఒక ర్యాలీలో బీజేపీ తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై నిప్పులు చెరిగారు. ఎస్‌ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటున్నారని ఆమె మండి పడ్డారు. ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి మహిళల్ని బెదిరిస్తున్నారని  విమర్శించారు. ‘‘తల్లులారా, సోదరీ మణులారా, మీ పేర్లు తొలగిస్తే, మీ దగ్గర పనిముట్లు ఉన్నాయి కదా? మీరు వంట చేయడానికి ఉపయోగించే పనిముట్లు. మీకు బలం ఉంది కదా? మీ పేర్లు తొలగిస్తే మీరు ఊరుకోరు కదా? మహిళలు ముందుండి పోరాడతారు’’ అన్నారు.

    ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్‌ ఏంటంటే..

    మహిళలా? బీజేపీ? తేల్చుకుందాం
    అంతేకాదు మహిళలు బలవంతులా లేక బీజేపీ బలమైనదా? తేల్చి చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తాను లౌకికవాదిననీ, ఏ మతతత్వాన్ని నమ్మనని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా, డబ్బుతో ప్రజలను విభజించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలను తీసుకువస్తుందని ఆరోపించారు.

    ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని బెనర్జీ ప్రస్తావించారు. అవసరమైనప్పుడల్లా మనమందరం ఇంట్లోనే గీత పఠిస్తాం. దానికి బహిరంగ ప్రదర్శన ఎందుకు అని ప్రశ్నించారు. దేవుడనేవాడు మన హృదయాల్లో ఉంటాడు.  అల్లాను ప్రార్థించేవారు హృదయాల్లోనే ప్రార్థిస్తారు. రంజాన్ సమయంలో, దుర్గా పూజ సమయంలో,  ఇక్కడంతా కలిసి ప్రార్థనలు నిర్వహించుకుంటాం అని గుర్తు చేశారు.  అలాగే ధర్మం అంటే పవిత్రత, మానవత్వం, శాంతి, హింస, వివక్ష, విభజన కాదు ఇదే కదా గీతారం, శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే గదా అని ఆమె బీజీపీనుద్దేశించి ప్రవ్నించారు. 

    రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులెవరూ ప్రజలను విభజించే రాజకీయాలు చేయలేదని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారతదేశ పౌరులమని నిరూపించుకోవాలా అని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ మిమ్మల్ని  ఏదీ  తిననివ్వదు. చేపలు, మాంసం తినాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎవరు శాకాహారం, ఎవరు మాంసాహారం తినాలనేది వ్యక్తిగత ఎంపిక, అంతేకానీ బీజేపీది కాదని స్పష్టం చేశారు. తన ప్రభుత్వం బెంగాల్ నుండి ఎవరినీ వెళ్లగొట్టడానికి అనుమతించదన్నారు.  సరిహద్దు ప్రాంతాల్లోని బీఎస్ఎఫ్ పోస్టుల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దు ఇదొక్కటే తన విన్నపం అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

    గాయపడిన పులి చాలా డేంజర్‌
    గాయపడిన పులి ఆరోగ్యంగా ఉన్న పులి కంటే ఎక్కువ భయంకరంగా ఉంటుందని బెనర్జీ  హెచ్చరించారు "మీరు మాపై దాడి చేస్తే, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు తెలుసు. అన్యాయాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు," అని ఆమె అన్నారు. బీజేపీ తన ఐటీ సెల్ తయారుచేసిన జాబితాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. బిహార్ చేయలేక పోవచ్చు, కానీ బెంగాల్ చేసి చూపిస్తుంది, మీరు ఏమి చేసినా సరే గుర్తుంచుకోండి అంటూ బీజేపీకి సవాల్‌ విసిరారు.

    చదవండి: ఫస్ట్‌ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు

  • గోవా అగ్నిప్రమాద ఘటనలో ప్రధాన నేరారోపణలు ఎదుర్కొంటున్న లుథ్రా బ్రదర్స్‌ను ఎట్టకేలకు  థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి సంకెళ్లు వేశారు. ఈ రోజు ఊదయం భారత విదేశాంగ శాఖ సౌరవ్‌ లూథ్రా, గౌరవ్ లూథ్రాలిద్దరి పాస్‌ పోర్టులను సస్పెండ్ చేసిన కొద్దిసేపటికే వారి అరెస్టు జరిగింది.

    గత శనివారం గోవాలోని బిర్చ్ బై రోమియో నైట్‌క్లబ్‌లో అగ్రి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే  ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే  ఈ క్లబ్‌ యజమానులైన లూథ్రా బ్రదర్స్‌ థాయిలాండ్‌ పరారయ్యారు. దీంతో ప్రమాదంపై తీవ్రంగా స్పందించిన గోవా ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో నిందితులను వదలబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారి ఇద్దరిపై పోలీసులు లూకౌట్‌ జారీ చేశారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీ వారిద్దరిపై బ్లూకార్నర్ ఇష్యూ చేసింది. 

    దీంతో థాయిలాండ్ పోలీసులు ఫుకెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి బేడీలు వేశారు. కాగా వీరిద్దరిని పట్టుకోవడానికి ఇదివరకే గోవా పోలీసులు థాయిలాండ్‌కు బయిలు దేరినట్లు తెలుస్తోంది.అధికారిక ప్రక్రియ పూర్తయిన అనంతరం వారిద్దరిని గోవా పోలీసులకు అప్పగిస్తున్నట్లు సమాచారం. 

    భారత్‌- థాయిలాండ్‌ దేశాల మధ్య 2013లో ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ జరిగింది. దీనిప్రకారం ఒక దేశంలో నేరం చేసి మరో దేశంలో తలదాచుకుంటే ఆ నేరస్థులను సంబంధిత దేశానికి అప్పగించాలి. ఈ ఒప్పందానికి అనుగుణంగా ‍ప్రస్తుతం థాయిలాండ్‌ లూథ్రా బ్రదర్స్‌ను భారత్‌కు అప్పగిస్తుంది. ఈ ఒప్పందం 2015 జున్ 9నుంచి అమలులోకి వచ్చింది. 

    కాగా ఈ శనివారం అర్థరాత్రి గోవాలోని నైట్‌ రోమియో నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టాగా క్లబ్‌లో సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడంతోనే ‍ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో క్లబ్‌ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇది వరకే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  • ఢిల్లీ: తెలంగాణ బీజేపీ ఎంపీలు మరింత యాక్టివ్‌గా ఉండాలంటూ వారికి ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్‌ పీకారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం మిస్సయింది. అది నాకు చాలా ఆవేదన కలిగించిందంటూ ఎంపీలతో మోదీ అన్నారు.

    తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడింది. 8 మంది ఎంపీలు ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నలు గుప్పించారు. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పని చేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడేలా దూకుడుగా పని చేయాలని సూచించారు.

    ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండండి. నిత్యం ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండాలంటూ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ఎంపీలకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.

    కాగా, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసంలో విందు కార్యక్రమం జరగనుంది. విందు ఏర్పాట్లను కేంద్ర మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలను సమన్వయం చేసే బాధ్యతలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకి అప్పగించారు.

    విందు కార్యక్రమంలో 54 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కేంద్రమంత్రి కూర్చునే ఏర్పాట్లు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రధాని.. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై మోదీ మాట్లాడనున్నారు.
     

  • అరుణాచల్‌ ప్రదేశ్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు.

    అరుణాచల్‌ ప్రదేశ్‌ అన్జా జిల్లా చాగ్లాగాం వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. హయులియాంగ్‌-చాక్లా మధ్య 40 నెంబర్‌ మైలురాయి వద్ద ట్రక్కు లోయలో పడిపోయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న ఇండియన్‌ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది.  ప్రత్యేక వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

    అతికష్టం మీద గాయపడిన నలుగురిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. మృతులంతా అస్సాంకు చెందిన కూలీలుగా తెలుస్తోంది. టిన్సుకియా నుంచి వాళ్లంతా పనుల కోసం వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

  • పెళ్లయిన మూడు రోజులకే  నవ వధువు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఘటన  ఆశ్చర్యానికి గురి చేసింది.  ఉత్తర ప్రదేశ్‌లో గోరఖపూర్‌లో ఈ ఘటన జరిగింది. శారీరకంగా అసమర్థుడైన వ్యక్తితో తాను జీవితాన్ని గడపలేను అంటూ కొత్త పెళ్లికూతురు లీగల్‌ నోటీసు పంపించింది.

    వరుడు సహజన్వాలోని రైతు కుటుంబానికి చెందిన ఏకైక కుమారుడు. వయస్సు 25. జిఐడిఎలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బేలియాపర్‌లోని బంధువుల ద్వారా ఈ వివాహం నిశ్చయమైంది. బంధు మిత్రులు సమక్షంలో  నవంబర్ 28న వీరి వివాహం జరగింది. సాంప్రదాయం ప్రకారం మరుసటి రోజు అత్తవారింటికి  సాగనంపారు.  సాధారణంగా పెళ్ళిళ్లలో జరిగే తంతు ప్రకారం డిసెంబర్ 1న మూడో రోజు ఫస్ట్‌ నైట్‌ కార్యక్రమానికి ముహర్తం పెట్టారు.  కానీ ఆ రాత్రే ఆమెకు చేదు అనుభవాన్ని మిగిలుస్తుందని ఆమె ఊహించి ఉండదు. పెళ్లయిన మొదటి రాత్రి  కోటి ఆశలతో గదిలోకి అడుగుపెట్టిన ఆమెకు  స్వయంగా భర్తే బాంబు పేల్చాడు. తాను వైవాహిక సంబంధాలకు శారీరకంగా అసమర్థుడిని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె హతాశురాలైంది. తరువాత ఇంట్లోని పెద్దలకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను తిరిగి పుట్టింటికి తీసుకువచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా లీగల్‌ నోటీసు పంపింది.

    డిసెంబర్ 3న బేలియాపర్‌లో ఇరుపక్షాలు కలుసుకున్నాయి.  వరుడి పరిస్థితిని దాచిపెట్టారని వధువు కుటుంబం  ఆరోపించింది. అంతే కాదు ఇది అతని రెండవ విఫల వివాహమని, రెండేళ్ల క్రితం మొదటి వధువు నెల రోజుల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయిందని కూడా వారు పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు

    ఇరుపక్షాల సమ్మతితో, వరుడికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అతడు శారీరంగా అసమర్థుడని,  "తండ్రి కాలేడు" అనివైద్యపరీక్షలు కూడా  నిర్ధారించాయి. దీంతో పెళ్లి బహుమతులు ఖర్చులన్నింటినీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీన్ని వారు తిరస్కరిండంతో వధువు కుటుంబం సహజన్వా పోలీసులను ఆశ్రయించి, అన్ని బహుమతులు మరియు నగదును తిరిగి ఇవ్వాలని కోరింది. పోలీసుల జోక్యంతో,  ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరింది. వరుడి కుటుంబం రూ. 7 లక్షలు, అన్ని పెళ్లి బహుమతులను ఒక నెలలోగా తిరిగి ఇవ్వడానికి అంగీకరించింది. బంధువుల సమక్షంలో  ఒప్పందంపై సంతకాలు చేశారని సహజన్వా ఎస్హెచ్‌ఓ మహేష్ చౌబే వెల్లడించారు.

    ఇదీ చదవండి: ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్‌ ఏంటంటే..

  • సాక్షి,ముంబై: తీవ్ర సంక్షోభం, గందరగోళం మధ్య విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరట నిచ్చింది.  వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనుంది. ఈ మేరకు డిసెంబర్ 11 గురువారం ఇండిగో  ఒక  ప్రకటన విడుదల  చేసింది.

    డిసెంబర్ 3, 4 మరియు 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.  విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్‌ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్‌లను రీడీమ్ చేసుకోవచ్చని  తెలిపింది.

    రద్దు చేయబడిన అన్ని విమానాలకు రీఫండ్‌ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో తెలిపింది. రీఫండ్‌లు ఇప్పుడు కస్టమర్ ఖాతాలో క్రెడిట్‌అయ్యాయనీ, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపింది.  ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భాగస్వాముల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల రీఫండ్‌లు కూడా ప్రారంభమైనట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ల చార్జీల రీఫండ్‌తోపాటు, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు, విమానం బ్లాక్ సమయం ఆధారంగా ఇండిగో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు పరిహారాన్ని అందిస్తుంది. 

    ఇదీ చదవండి: రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్‌ గోల్డ్‌ కార్డ్‌ మీదే! ఎలా అప్లయ్‌ చేయాలి?

  • బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కొనసాగుతున్న సీఎం మార్పు సంక్షోభానికి తెరపడినట్లే కనబడుతోంది.  సిద్ధరామయ్యనే మిగతా రెండున్నరేళ్లు కొనసాగాలని హైకమాండ్‌ చెప్పిందని ఆయన తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  ఈరోజు(గురువారం, డిసెంబర్‌ 11వ తేదీ) యతీంద్ర మాట్లాడుతూ.. ‘ ఇది క్లియర్‌. మిగతా రెండున్నరేళ్లు మా నాన్నే సీఎంగా కొనసాగుతార.  కాంగ్రెస్‌ అధిష్టానం ఇదే విషయాన్ని చెప్పింది. 

    ఇక నాయకత్వ మార్పు ప్రశ్నే ఉండదు. ఫలితంగా సీఎం మార్పు వివాదానికి తెరపడింది’ అని పేర్కొన్నారు. ఇక గత సోమవారం సీఎం సిద్ధరామయ్య ఇదే అంశంపై మాట్లాడుతూ.. హైకమాండ్‌ ఎలా చెబితే అలా అని వ్యాఖ్యానించారు.  అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే విషయంపై తనతో పాటు డీకే శివకుమార్‌ కూడా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారన్నారు. 

    కర్ణాటక సీఎం మార్పు అంశానికి సంబంధించి ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోట చేసుకున్నాయి.  సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య  మాటల వివాదం మొదలుకొని రెండు బ్రేక్‌ ఫాస్ట్‌ల ఎపిసోడ్‌ల వరకూ వెళ్లింది. కర్ణాటక సీఎం పదవిని సిద్ధరామయ్య గతంలో చేపట్టే క్రమంలో ఒప్పందం జరిగిన నేపథ్యంలో డీకే శివకుమార్‌ తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు., అయితే సిద్ధరామయ్య ఈ రెండున్నరేళ్లు తనకే ఉంచాలని డీకేతో పాటు అధిష్టానాన్ని కూడా కోరారు. ఇలా వారి మధ్య పంచాయతీ నడుస్తూ వచ్చింది.   ఆ సమయంలో కూడా ఇరువురి అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పారు. అయితే యతీం‍ద్ర వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చినట్లుంది కానీ, సిద్ధరామయ్య, డీకేలే దీనిపై సృష్టత ఇస్తే దీనికి తెరపడినట్లు అవుతుంది. 

Andhra Pradesh

  • సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ లిక్కర్‌ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, లిక్కర్‌ సిండికేట్‌ బాగోతాలను మరో టీడీపీ నేత బర్ల బాబురావు బట్టబయలు చేశారు. గతంలో వరుసగా టీడీపీ నేతలు మద్యం సిండికేట్ల ముడుపుల గురించి మాట్లాడిన ఆడియోలను బాబురావు విడుదల చేశారు. ఎక్సైజ్ సీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బర్ల బాబురావు బయటపెట్టారు. తాను విడుదల చేసిన ఆడియోలు ఏఐ క్రియేషన్ కాదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాబురావు సవాల్ చేశారు. బర్ల బాబురావుతో బహిరంగ చర్చకి వచ్చేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు.

    కాగా, గతంలో కూడా రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్‌ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్‌ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది.

    రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్‌చార్జ్‌ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్‌లో ఉన్న లిక్కర్‌ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

     

  • ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్‌లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.

    ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్‌లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

    ‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్‌ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత  పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

  • సాక్షి,అనంతపురం: చంద్రబాబు పరిపాలనపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా (దొరైసామి రాజా) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అంబేద్కర్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోంది. రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నా చంద్రబాబు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. 

  • సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్‌ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి. 

    ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే.. 

    తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్‌ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. 

    భవానిపురం 42 ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

    ‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు  వైఎస్‌ జగన్‌ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్‌ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Family

  • చాలామందిని వేధించే సమస్య డయాబెటిస్‌. గణాంకాలు సైతం రానున్న రోజుల్లో భారత​ డయాబెటిస్ కేరాఫ్‌గా మారనుందంటూ హెచ్చరిస్తున్నాయి కూడా. కొందరికి అధిక బరువుతో మొదలై డయాబెటిస్‌ బారినపడి ఇబ్బందులు పడుతున్నవారెందరో. కానీ కొందరూ ఆ వ్యాధి రావడంతోనే మేల్కొని ఆరోగ్య స్పృహ తెచ్చుకుని మరి బరువు తగ్గడమే కాదు డయాబెటిస్‌ని ితిప్పుకొడుతున్నారు. ఆ కోవలో ఈ కామెడీ హీరో కూడా చేరిపోయి ప్రేరణ కలిగిస్తున్నారు. ఏకంగా 78 ికిలోలు వరకు బరువు ఉండే ఆయన అంతలా ఎలా బరువు తగ్గారో సవివరంగా తెలుసకుందామా...!.

    అమెరికా హాస్య నటడు 'మైక్ అండ్ మోలీ' స్టార్ బిల్లీ గార్డెల్ టైప్ 2  అధికబరువుతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. డయాబెటిస్ నిర్ధారణ అయ్యేటప్పటికీ సుమారు 172 కిలోలు పైనే బరువు పెరిగిపోయాడు. సరిగ్గా 2020లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికమయ్యేంత వరకు మేల్కొలేదు. అదీగాక ఆ టైంలో మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లీ గార్డెల్ అధిక బరువు, స్లీప్ అప్నియా, ధూమపానం చేసేవాడు, టైప్ 2 డయాబెటిస్, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండేవాడు. 

    ఓపక్క కరోనా మహమ్మారి,మరోవైపు అనారోగ్యా జాబితాతో భయాందోళనలకు లోనై ఆరోగ్య స్పృహపై ఫోకస్‌ పెట్టాడు. కానీ తగ్గుదామని ఉపక్రమించిన ప్రతిసారి పెరిగిపోవడంతో లాభం లేదనుకుని..తన వ్యక్తిగత వైద్యులతో చర్చించి మరి బరువు తగ్గించే సర్జరీలకు ప్లాన్ చేశాడు.

    మార్పు వచ్చిందా అంటే..
    ఈ 53 ఏళ్ల గార్డెల్ జూలై 2021లో బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇది అతడి పరివర్తనలో తొలి అడుగు. ఆహారం విషయంలో తీసుకున్న జాగురకత..మంచి మార్పుకి శ్రీకారం చుట్టింది. కడుపు ఫుల్‌గా ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారాలతో ఓదార్పునిచ్చే ఆహారం తీసుకుంటూ..ఆకలిని నియంత్రించగలిగాడు. అలా 78 కిలోల వరకు అధిక బరువుని తగ్గించుకుని స్లిమ్‌గా హీరోలా మారిపోయాడు. అంతేగాదు డయాబెటిస్‌ కూడా నయం అయిపోయింది.

    ఇది మంచిదేనా అంటే..
    నిపుణుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు గణనీయమైన బరువు తగ్గడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను తిప్పికొట్టగలరని చెబుతున్నారు. ఇక్కడ హాస్య నటుడు కాలేయం , క్లోమంలో కొవ్వును తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తిరిగి సాధారణ  స్థితికి తీసుకురావడానికి వీలు కల్పించి డయాబెటిస్‌ నుంచి ఉపశమనం అందిస్తుంది. 

    అయితే బరువు పెరిగితే మాత్రం మళ్లీ డయాబెటిస్‌ తిరగబెట్టొచ్చు. అందువల్ల ఇలా సర్జరీ చేయించుకున్నవాళ్లు ఆ బరువుని మెయింటైన్‌ చేసేలా..జీవనశైలిలో మార్పులు, వ్యాయామం తదితరాల విషయాల్లో కేర్ తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఇక్కడ బరువు తగ్గించే సర్జరీతో కేవలం ఐదు నుంచి పది శాతమే బరువు తగ్గుతారని, ఆ తర్వాత అంతా ఫిజికల్‌గా మనం కష్టపడి స్లిమ్‌గా మారాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం . పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: భారత్‌ గుర్తింపును "మధురంగా" మార్చిన మహిళ..!ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు..)

     

  • మన భారతదేశ గుర్తింపు, అభివృద్ధిలో తోడ్పడిన కొందరిని మర్చిపోతుంటాం. ఎవరో గుర్తు చేస్తేగానీ మనం గ్రహించం. అలాంటి మహనీయుల్లో ఒకరు డాక్టర్‌ జానకి అమ్మళ్‌. తియ్యదనంతో చెరగని ముద్రవేసి భారత్‌ని ప్రపంచవేదికపై తలెత్తుకునేలా చేశారామె. అలాంటి ప్రముఖ మహిళ చేసిన అచంచలమైన కృషి గురించి పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా నెట్టింట షేర్‌ చేశారు. ఈ తరం తప్పక తెలుసుకోవాల్సిన గొప్ప మహిళ ..అలాగే ఆమె  సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తి అంటూ జానకి అమ్మల్‌పై ప్రశంసలజల్లు కురిపించారు. 

    ఆనంద్ మహీంద్రా ఎక్స్ పోస్ట్‌లో జానకి అమ్మల్ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ..ఆమెను  ధైర్యం, ఆశయం, అసాధారణ సేవకు నిలువెత్తు నిదర్శనం. భారత్‌ ప్రస్తుతం  ప్రపంచంలో రెండవ అతిపెద్ద చెరకు ఉత్పత్తిదారు అయినప్పటికీ...ఈ విజయానికి కారణమైన మహిళ గురించి విన్నారా అని ప్రశ్నించారు. ఈ అమ్మళ్‌ కథ భారతీయ మహిళలకు ప్రేరణ అని చెప్పారు. 

    వృక్షశాస్త్రంలో పిహెచ్‌డి చేసిన తొలి భారత మహిళ అమ్మల్.  భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తియ్యగా ఉండే.. అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను అభివృద్ధి చేసి, ప్రధాన ఆర్థిక లాభాలను అంచిందని తెలిపారు. ఆమె అద్భుతమైన రచనలు కూడా చేశారని తెలిపారు. కానీ పాఠ్య పుస్తకాల్లో ఆమె గురించి చాలా తక్కువగానే ప్రస్తావించారన్నారు. చెప్పాలంటే ఆమె కథ యువతరానికి అస్సలు తెలియదనే చెప్పొచ్చు.

    పెళ్లి కూడా చేసుకోలేదు..
    మహీంద్రా అమ్మళ్‌ జీవితాన్ని హైలైట్ చేస్తూ ఒక వీడియోను కూడా పంచుకున్నారు. 1932లో, వృక్షశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీని సంపాదించిన తొలి భారతీయ మహిళ, అలాగే శాస్త్రీయ పరిశోధనకు పూర్తిగా అంకితమై వివాహాన్ని కూడా తిరస్కరించారని చెప్పారు. జన్యు శాస్త్రవేత్తగా కోయంబత్తూరులోని చెరకు పెంపకం సంస్థలో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చింది. అయితే ఆ టైంలో భారత్‌ చెరకుకి తీపి తక్కువగా ఉండేదట. 

    అందుకే భారత్‌ ఆగ్నేయాసియా దేశమైన పాపువా న్యూ గినియా నుంచి చెరుకుని దిగుమతి చేసుకునేదట. కానీ అమ్మల్‌ హైబ్రిడ్ క్రాస్-బ్రీడింగ్‌లో చేసిన కృషికి భారత్‌ నేలే స్వయంగా తియ్యటి చెరకును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందుకుంది. దాంతో దిగుమతిదారుగా ఉన్న భారత్‌ కాస్తా ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారులలో ఒకటిగా మారేందుకు దారితీసిందట. ఆమె ఆవిష్కరణలు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తెచ్చిపెట్టి.. దేశానికి గణనీయమైన ఆదాయాన్ని అందించాయన్నారు మహీంద్రా

     

    వివక్షను ఎదుర్కొంటూనే సక్సెస్‌..
    అమ్మళ్‌ ఒంటరి మహిళ, కులం కారణంగా తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారట. భారతదేశంలోని సవాళ్లు ఆమెను లండన్‌కు తరలివెళ్లిపోయేలా చేసిందట. అక్కడ ఆమె రెండొవ ప్రపంచ యుద్ధం టైంలో కూడా తన పరిశోధనను కొనసాగించింది. అలా ఆమె అంతర్జాతీయ కృషి ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన వృక్షశాస్త్రజ్ఞురాలిగా ఆమె ఖ్యాతిని సుస్థిరం చేసింది.

    నెహ్రూ చొరవతో మళ్లీ భారత్‌కి..
    1951లో, జవహర్‌లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు, జానకి అమ్మళ్‌ సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీకి నాయకత్వం వహించడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అంతేగాదు జీవవైవిధ్య పరిరక్షణలో మార్గదర్శకురాలిగా మారింది. ఇంత ఘనత సాధించిన ఆమె పేరు పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం బాధకరం అని పోస్ట్‌ ముగించారు..

    (చదవండి: ఓర్నీ ఇదేంటిది..! అత్తారింటికి నవవధువే డ్రైవ్‌ చేసుకుంటూ..)

     

  • పెళ్లిలో జరిగే ప్రతి తంతు అపురూపమైన క్షణం. ఆ వివాహ ఘట్టం అంత తేలిగ్గా మర్చిపోలేని మధురానుభూతులు. బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఆ వధువు ఇలా చేసిందో ఏమో గానీ వరుడుకి నోట మాట లేకుండా చేసింది. అప్పుడే తనకు నచ్చినట్లుగానే అంతా చేయాల్సిందేనా అన్నట్లుగా నవ్వుతూ కళ్లప్పగించి చూశాడు. 

    అసలేం జరిగిందంటే..ఈ వింత ఘటన లూధియానాలోని థార్‌లో చోటుచేసుకుంది. పెళ్లి తంతు అయిపోయింది. ఆ తర్వాత అప్పగింతలు వేళ వధువుని తీసుకొచ్చి తల్లిదండ్రులు కారు వెనకాల కూర్చొబెట్టి సాగనంపుతారు కామన్‌. పైగా వరుడు పెళ్లికొడుకు కాబట్టి అతన కూడా కారు డ్రైవ్‌ చేయడు. ఇది వివాహంలో సర్వసాధారణం. 

    కానీ ఈమె మాత్రం తన అత్తారింటికి భర్తతో కలిసి తనే స్వయంగా కారు నడిపుతూ వెళ్లాలనకుందట. ఆ విషయం ముందే కాబోయే వరుడుకి చెప్పడంతో అతను కూడా సమ్మతించాడు. అంతేకాదు అక్కడ పెళ్లి మండపం వద్ద ఉన్న బంధువులు, సన్నిహితులు విస్తుపోయేలా నవవధువుని పెళ్లికొడుకే ఎత్తుకుని ఎస్‌యూవీ కారు వద్దకు తీసుకురాగ, ఆమె డ్రైవర్‌ సీటులో దర్జాగా కూర్చొంది. 

    ప్యాసింజర్‌ సీటులో వరుడు కూర్చొని మనం ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి అని ఆమెకు నవ్వుతూ చెబుతున్నాడు. అంతేగాదు వరుడు దేవుడా మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లు అని ప్రార్థించాడు కూడా. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా అవుతోంది. 

     

    (చదవండి: 50 ఏళ్ల సహోద్యోగి అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి..!)