Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తిరిగి పుంజుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. 205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

    ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(62) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అక్ష‌ర్ ప‌టేల్‌(43) ఫ‌ర్వాలేద‌న్పించాడు.  వీరితో విప్ర‌జ్ నిగ‌మ్(19 బంతుల్లో 38) ఆఖ‌రిలో మెరుపులు మెరిపించ‌న‌ప్పటికి జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు, అనుకుల్ రాయ్‌,ర‌స్సెల్‌, ఆరోరా త‌లా వికెట్ సాధించారు. 

    అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.
    చ‌దవండి: IPL 2025: వావ్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైర‌ల్‌

     

  • ఐపీఎల్‌-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ దుష్మంత చమీర అద్బుత‌మైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. చ‌మీరా సంచ‌ల‌న క్యాచ్‌తో అనుకుల్ రాయ్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు.

    చ‌మీరా క్యాచ్ అంతా షాక్ అయిపోయారు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్ వేసిన స్టార్క్ బౌలింగ్‌లో మూడో బంతికి రావ్‌మ‌న్ పావెల్ వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన అనుకుల్ రాయ్‌కు స్టార్క్ నాలుగో బంతిని మిడిల్ అండ్ లెగ్ దిశ‌గా సంధించాడు.

    ఆ డెలివ‌రీని అనుకుల్ రాయ్ డీప్ స్వ్కెర్ లెగ్ దిశ‌గా ఫ్లిక్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కావ‌డంతో అంతా బౌండ‌రీ వెళ్తుంద‌ని భావించారు. కానీ స్వ్కెర్ లెగ్‌లో ఉన్న చ‌మీరా అద్బుత విన్యాసం చేశాడు. స్వ్కెర్ లెగ్ నుంచి ప‌రిగెత్తుకుంటూ గాల్లోకి జంప్ చేస్తూ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. 

    దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కులు మొత్తం ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యుత్త‌మ క్యాచ్‌ల‌లో ఒక‌టిగా నెటిజ‌న్లు కొనియాడుతున్నారు.

    ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.

  • ఐపీఎల్‌-2025లో యువ ఆట‌గాళ్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే దుమ్ములేపుతున్నారు. 14 ఏళ్ల సూర్య‌వంశీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున సంచ‌ల‌నాలు సృష్టిస్తుండగా.. ఆయుష్ మాత్రే సీఎస్‌కే తరపున అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ రికార్డు సెంచరీతో చెలరేగాడు. 

    కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ స్దానంలో జట్టులోకి వచ్చిన మాత్రే తన మెరుపు ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకుంటున్నాడు. 

    అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఈ ఇద్దరు యువ క్రికెటర్లు తిరిగి భారత అండర్‌-19 జట్టు తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జూన్‌లో భారత జూనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 

    ఈ టూర్‌లో  భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనున్నట్లు సమాచారం. ఈ ఇంగ్లండ్ టూర్‌కు  సూర్యవంశీ, మాత్రే వెళ్లనున్నారు. సూర్యవంశీ గత ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. 

    ఈ బిహారీ క్రికెటర్ జూనియర్ జాతీయ జట్టు తరపున రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. గతేడాది అండర్‌-19 ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత యువ జట్టుకు తొలి టూర్ కావడం గమనార్హం. అండర్ 19 ప్రపంచకప్‌-2026 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. కాగా ఇదే జూన్‌లో భార‌త సీనియ‌ర్ జ‌ట్టు కూడా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌పడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్ల‌నుంది.
     

  • శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో భారత మహిళా ​‍క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్  దుమ్ములేపుతోంది. మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ప్రతీక హాఫ్ సెంచ‌రీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.

    ఈ క్ర‌మంలో రావ‌ల్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది. మ‌హిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాట‌ర్‌గా ప్ర‌తీక రికార్డుల‌కెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) త‌న వ‌న్డే అరంగేట్రం నుంచి అద‌ర‌గొడుతోంది.

    ఈ క్ర‌మంలో కేవ‌లం 8 మ్యాచ్‌లలోనే ప్ర‌తీక 500 ప‌రుగుల మార్క్‌ను అందుకుంది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్‌ల‌లో ఆమె ఈ ఫీట్‌ను సాధించింది. తాజా మ్యాచ్‌తో ఎడ్వ‌ర్డ్స్ ఆల్‌టైమ్ రికార్డును రావ‌ల్ బ్రేక్ చేసింది.

    మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయ‌ర్స్ వీరే..
    ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్‌లు
    షార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్‌లు
    నికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్‌లు
    బెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్‌లు
    వెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్‌లు

    ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవ‌ర్ల‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓ ద‌శ‌లో సునాయాసంగా గెలిచే క‌న్పించిన సౌతాఫ్రికాను భార‌త స్పిన్న‌ర్ స్నేహ్ రాణా దెబ్బ‌తీసింది. రాణా త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 43 ప‌రుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.
    చ‌ద‌వండి: సూర్యవంశీకి భారీ న‌జ‌రానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
     

  • ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ ఘ‌న విజ‌యం
    అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. 205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 9 వికెట్లు కోల్పోయి 190 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది.

    ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫాఫ్ డుప్లెసిస్‌(62) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అక్ష‌ర్ ప‌టేల్‌(43) ఫ‌ర్వాలేద‌న్పించాడు.  వీరితో విప్ర‌జ్ నిగ‌మ్(19 బంతుల్లో 38) ఆఖ‌రిలో మెరుపులు మెరిపించ‌న‌ప్పటికి జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి రెండు, అనుకుల్ రాయ్‌,ర‌స్సెల్‌, ఆరోరా త‌లా వికెట్ సాధించారు.

     అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

    ఢిల్లీకి షాక్‌.. ఓకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
    14 ఓవ‌ర్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి అక్ష‌ర్ ప‌టేల్‌(43) ఔట్ కాగా.. ఆరో బంతికి స్ట‌బ్స్ ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ 5 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్‌(62), విప్ర‌జ్ నిగ‌మ్‌(5) ఉన్నారు.

    ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్ డౌన్‌..
    కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన రాహుల్‌.. ర‌నౌట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేరాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ మూడు వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫాఫ్ డుప్లెసిస్‌(32), అక్ష‌ర్ ప‌టేల్‌(8) ఉన్నారు.

    ఢిల్లీ రెండో వికెట్ డౌన్‌..
    క‌రుణ్ నాయ‌ర్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన నాయ‌ర్‌.. వైభ‌వ్ ఆరోరా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ రెండు వికెట్ల న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది.

    ఢిల్లీ తొలి వికెట్ డౌన్‌..
    205 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన అభిషేక్ పోరెల్‌.. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ వికెట్ న‌ష్టానికి 178) ప‌రుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్‌(8), క‌రుణ్ నాయ‌ర్‌(4) ఉన్నారు.

    చెలరేగిన కేకేఆర్‌ బ్యాటర్లు.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌
    అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ(44) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(36), గుర్భాజ్‌(26), నరైన్‌(27), రహానే(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్,విప్రజ్ నిగమ్ తలా రెండు వికెట్లు సాధించారు.
    కేకేఆర్ ఐదో వికెట్ డౌన్‌
    రఘువంశీ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 44 ప‌రుగులు చేసిన రఘువంశీ.. చ‌మీరా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 5 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. 
    14 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 142/4
    14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌ఘువంశీ(35), రింకూ సింగ్‌(14) ఉన్నారు.

    ర‌హానే ఔట్‌..
    కేకేఆర్ వ‌రుస క్ర‌మంలో రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవ‌ర్ వేసిన విప్ర‌జ్‌నిగ‌మ్ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్‌(27) ఔట్ కాగా.. 8 ఓవ‌ర్‌లో అక్ష‌ర్ పటేల్ బౌలింగ్ ర‌హానే(26) పెవిలియ‌న్‌కు చేరాడు. 8 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌

    6 ఓవ‌ర్ల‌కు కేకేఆర్ స్కోర్‌: 79/0
    6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ వికెట్ న‌ష్టానికి 79 ప‌రుగులు చేసింది. క్రీజులో సునీల్ న‌రైన్‌(26), ర‌హానే(21) ఉన్నారు.

    కేకేఆర్‌ తొలి వికెట్ డౌన్‌
    రహ్మానుల్లా గుర్బాజ్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 26 ప‌రుగులు చేసిన గుర్భాజ్‌..స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ వికెట్ న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. క్రీజులో సునీల్ న‌రైన్‌(20), ర‌హానే(0) ఉన్నారు.

    ఐపీఎల్‌-2025లో అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. కేకేఆర్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. ర‌మ‌ణ్‌దీప్ సింగ్ స్ధానంలో అనుకుల్ రాయ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.

    తుది జ‌ట్లు
    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి

    ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీప‌ర్ ), కరుణ్ నాయర్, కేఎల్‌ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

  • శ్రీలంక వేదిక‌గా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌-2025లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ ట్రై సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవ‌ర్ల‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

    ఓ ద‌శ‌లో సునాయాసంగా గెలిచే క‌న్పించిన సౌతాఫ్రికాను భార‌త స్పిన్న‌ర్ స్నేహ్ రాణా దెబ్బ‌తీసింది. 48వ ఓవ‌ర్‌లో మూడు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి మ్యాచ్ స్వరూపాన్నే రాణా మార్చేసింది. రాణా ఓవ‌రాల్‌గా త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 43 ప‌రుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ద‌క్షిణాఫ్రికా 11 ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వ‌రించింది. 

    దక్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో టాజ్మిన్ బ్రిట్స్( 107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 109) విరోచిత శ‌త‌కంతో చెల‌రేగింది. ఆమెతో లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించిన‌ప్ప‌టికి.. వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోవ‌డంతో ప్రోటీస్‌ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.

    ప్రతీక సూప‌ర్ ఇన్నింగ్స్‌..
    ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల న‌ష్టానికి 276 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ ప్ర‌తీక రావ‌ల్‌(78) టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఆమెతో కెప్టెన్ హ‌ర్మాన్ ప్రీత్ కౌర్‌(41), జెమీమా రోడ్రిగ్స్‌(41), మంధాన‌(36) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో మ్లాబా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా..ఖాకా, క్లాస్ త‌లా వికెట్ సాధించారు.
    చ‌ద‌వండి: సూర్యవంశీకి భారీ న‌జ‌రానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
     

  • ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. హీథ‌ర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భ‌ర్తీ చేయ‌నుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్సీ హీథ‌ర్ నైట్ రాజీనామా చేసింది.

    మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో నైట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అదేవిధంగా ప్ర‌ధాన కోచ్ జాన్ లూయిస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అత‌డి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియ‌మించింది.

    ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపిక అయిన త‌ర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం నాకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచ‌న మెర‌కు నా ఈ కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నున్నాను.

    2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు నా వంతు స‌హ‌కారం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. స్కైవర్-బ్రంట్‌కు కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది.  హీథ‌ర్ నైట్ గైర్హ‌జ‌రీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించింది.
    చ‌దవండి: సూర్యవంశీకి భారీ న‌జ‌రానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం


  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్యవంశీ ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. సోమ‌వారం జైపూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అద్బుత సెంచ‌రీతో క్రికెట్ ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకున్నాడు. అత్యంత చిన్న వయస్సులో ఐపీఎల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా సూర్య‌వంశీ చ‌రిత్ర సృష్టించాడు. 

    ఈ మ్యాచ్‌లో 38 బంతులు ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏడు ఫోర్లు, పదకొండు సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. బిహార్‌కు చెందిన సూర్యవంశీపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో వైభవ్‌కు బిహార్ సీఎం నితీష్ కుమార్ రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు.

    "ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 సంవత్సరాలు) నిలిచిన వైభవ్ సూర్యవంశీకి అభినందనలు. సూర్యవంశీ తన అద్బుత టాలెంట్‌తో భారత క్రికెట్‌కు భవిష్యత్తు ఆశాకిరణంగా నిలిచాడు. అతడి అంకితభావాన్ని, పట్టుదలను చూసి మేము గర్విస్తున్నాము.

    నేను 2024లో సూర్యవంశీ, అతడి తండ్రిని కలిశాను. ఐపీఎల్‌లో అతడి అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఫోన్‌లో సూర్యవంశీతో మాట్లాడాను. వైభవ్ సూర్యవంశీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేయనున్నాము. వైభవ్ భవిష్యత్తులో భారత జట్టుకు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తాడని ఆశిస్తున్నాను" అని నితీష్ కుమార్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
    చ‌ద‌వండి: IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు: వైభవ్‌ కోచ్‌ ఓఝా

  • 14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్‌ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

    ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్‌ చిన్ననాటి కోచ్‌ మనీశ్‌ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్‌ లారాకు వీరాభిమాని అయిన వైభవ్‌లో నమ్మశక్యంకాని సిక్స్‌ హిట్టింగ్‌ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్‌ టాలెంట్‌ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్‌ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్‌లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.

    వైభవ్‌ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా  తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్‌కు ఏ షాట్‌ నేర్పించినా,  ఏ టెక్నిక్‌ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్‌ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.

    ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్‌లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో  అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్‌ 90 మీటర్లపైనే ఉం​డింది. ఆ సమయంలోనే వైభవ్‌ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్‌ అద్భుతాలు చేయగలడని నమ్మాను.

    14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్‌లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్‌లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్‌తో అతను భారీ షాట్లు ఆడుతాడు. 

    వైభవ్‌కు ఈ స్థాయి సిక్స్‌ హిట్టింగ్‌ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్‌ కూడా ఓ కారణం. వైభవ్‌ టైమింగ్‌, టెక్నిక్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్‌లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్‌ ఎక్కువగా ఫుల్‌ టాస్‌ బంతులకు షాట్లు ప్రాక్టీస్‌ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్‌తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.

    కాగా, ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.

    ఈ మ్యాచ్‌లో వైభవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా..  రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి.

     

     

  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఈ నలుగురిలో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటంటే.. నలుగురు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే. పైగా నలుగురు 27 ఏళ్ల లోపు వారే. ఈ నలుగురు 45 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు కాగా.. ఒకరు పంజాబ్‌, ఒకరు రాజస్థాన్‌ ఆటగాడు.

    ఈ సీజన్‌లో తొలి సెంచరీని సన్‌రైజర్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ చేశాడు. సీజన్‌ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఇషాన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన ఇషాన్‌, మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో ఇషాన్‌ చేసిన ఈ సెంచరీ 15వ వేగవంతమైన సెంచరీ.

    ఈ సీజన్‌లో రెండో సెంచరీని పంజాబ్‌ ఆటగాడు ప్రియాంశ్‌ ఆర్య చేశాడు. సీజన్‌ 22వ మ్యాచ్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్‌ మూడంకెల స్కోర్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్‌ 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.

    ప్రియాంశ్‌ ఈ సెంచరీని కేవలం​ 39 బంతుల్లో పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రియాంశ్‌ ఈ రికార్డును సన్‌రైజర్స్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌తో షేర్‌ చేసుకున్నాడు. ట్రవిస్‌ కూడా గత సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో శతక్కొట్టాడు.

    ఈ సీజన్‌లో మూడో సెంచరీని సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ చేశాడు. సీజన్‌ 27వ మ్యాచ్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ 14 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 141 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అభిషేక్‌ది ఏడో వేగవంతమైన సెంచరీ.

    ఈ సీజన్‌లో నాలుగో సెంచరీని రాజస్థాన్‌ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ చేశాడు. సీజన్‌ 47వ మ్యాచ్‌లో వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం​ 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వైభవ్‌.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్‌లో ఫాస్టెస్‌ సెంచరీ రికార్డు క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) పేరిట ఉంది.

    వైభవ్‌ ఈ సెంచరీ చేసే సమయానికి అతని వయసు కేవలం​ 14 ఏళ్ల 32 రోజులు. ఈ సెంచరీతో వైభవ్‌ చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీలు చేసిన నలుగురిలో వైభవ్‌ అత్యంత పిన్న వయస్కుడు.

     

     

  • ఐపీఎల్‌లో రికార్డు సెంచరీతో చెల‌రేగిన‌ 'సిక్స‌ర పిడుగు' వైభవ్‌ సూర్యవంశీపై శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జడేజా అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. అత‌డు అలా మాట్లాడి ఉండాల్సి కాద‌ని పరోక్షంగా కౌంట‌ర్ ఇచ్చాడు. జైపూర్‌లోని స‌వాయ్‌ మాన్‌సింగ్ స్టేడియంలో సోమ‌వారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీనేజీ సంచ‌ల‌నం సూర్యవంశీ (14) సూప‌ర్ సెంచ‌రీతో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఘ‌న విజ‌యం అందించాడు. దీంతో క్రికెట్ ప్ర‌పంచంలో అత‌డి పేరు మార్మోగిపోతోంది. ఈ రోజు ఆ 14 ఏళ్ల ఈ కుర్రాడి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

    మ్యాచ్ ముగిసిన త‌ర్వాత శుబ్‌మన్ గిల్ (Shubman Gill) మాట్లాడుతూ.. సూర్యవంశీకి అదృష్టం క‌లిసి వ‌చ్చింద‌న్న‌ట్టుగా వ్యాఖ్యానించాడు. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్నాడ‌ని కామెంట్ చేశాడు. "ఇది అతడి (అదృష్ట) రోజు. అద్భుతంగా హిట్టింగ్ చేశాడు. అతడు తన రోజును పూర్తిగా ఉపయోగించుకున్నాడ"ని గిల్ అన్నాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై అజ‌య్ జ‌డేజా త‌న‌దైన శైలిలో స్పందించాడు. "14 ఏళ్ల పిల్లవాడు తనపై తాను పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎంత‌గా అంటే తాను న‌మ్మిన‌దాన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చాల‌నుకున్నాడు. చేసి చూపించాడు. ఎవరో ఆటగాడు చెప్పినట్లుగా ఇది అతడి అదృష్ట దినం" అని కౌంట‌ర్ ఇచ్చాడు.

    చిన్న వ‌య‌సులోనే రికార్డు సెంచ‌రీతో చెల‌రేగిన సూర్యవంశీపై అజ‌య్ జ‌డేజా (Ajay Jadeja) ప్ర‌శంసలు కురిపించాడు. "క్రికెట్ ఆడే మనమందరం.. డ్రాయింగ్ రూమ్‌లలో లేదా  స్నేహితులతో ఆడుతున్నప్పుడో ఒక నిర్దిష్ట మార్గంలో మ‌న ఆట‌ గురించి కలలు కన్నాం. మ‌నం ఇష్ట‌ప‌డేది సాధించాల‌ని 14 మరియు 15 సంవత్సరాల వయస్సులో మ‌నమంతా స్వ‌ప్నించాం. కానీ సూర్యవంశీ తన క‌ల‌ను నిజం చేసుకోవాల‌ని జీవించాడు. అదే అత‌డి శ‌క్తి. ఇక అత‌డి ఆట‌ను వంద సార్లు విశ్లేషిస్తార"ని జ‌డేజా పేర్కొన్నాడు.

    వైభవ్‌ సూర్యవంశీ స‌క్సెస్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ హెచ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ (Vikram Rathour) కీలంగా వ్యహ‌రించార‌ని జ‌డేజా వెల్ల‌డించాడు. సూర్యవంశీని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్స‌హించార‌ని ప్ర‌శంసించాడు. కాగా, రాజ‌స్తాన్ త‌న త‌ర్వాతి మ్యాచ్ మే 1న జైపూర్‌లో ముంబై ఇండియ‌న్స్‌తో ఆడుతుంది. మే 12న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో ఆర్‌ఆర్  త‌ల‌ప‌డ‌నుంది. 

    చ‌ద‌వండి: తండ్రి త్యాగం, ప‌ట్టుద‌ల‌తో ఎదిగిన వైభవ్‌ సూర్యవంశీ

  • శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌-2025లో భారత్‌ ఇవాళ (ఏప్రిల్‌ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ప్రతిక రావల్‌ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41), జెమీమా రోడ్రిగెజ్‌ (41), స్మృతి మంధన (36), హర్లీన్‌ డియోల్‌ (29), రిచా ఘోష్‌ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. 

    భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔట్‌ కాగా.. కశ్వీ గౌతమ్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్‌, డి క్లెర్క్‌, డెర్క్‌సెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

    కాగా, ఈ ట్రై నేషన్‌ సిరీస్‌లో భారత్‌, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్‌ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్‌ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. 29.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్‌ 48 (నాటౌట్‌) పరుగులతో సత్తా చాటారు. 

    ఈ టోర్నీలో భారత్‌ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

  • పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్‌ ఆర్మీపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్‌ చేస్తూ తన ఎక్స్‌ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. 

    కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధ‌ర‌హిత వ్యాఖ్య‌లు చేసే బ‌దులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్‌ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్‌ మాతా కి జై. జై హింద్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. 

    అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్‌ చేసిన ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్‌ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.

    కాగా, పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భార‌త సైన్యం వైఫ‌ల్యం కారణంగానే పహల్గామ్‌ ఉగ్రదాడి జ‌రిగింద‌ని అన్నాడు. కశ్మీర్‌లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ‍ప్రశ్నించాడు.  దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.

    తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించ‌డం ప‌రిపాటిగా మారింద‌ని విమ‌ర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్‌ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్‌ విసిరాడు.

    అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భార‌త సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్‌లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోక‌ర్, ప‌నికిరాని వాడంటూ విమ‌ర్శించారు. ప‌నికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

    కాగా, ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్‌ లోయలో పాక్‌ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉ‍గ్రదాడిని యావత్‌ ప్రపంచం ఖండించింది.  

    ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్‌, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్‌ చేసింది. 

National

  • జమ్మూ: ఎన్‌ఐఏ విచారణలో  జిప్లైన్ ఆపరేటర్ ముజమ్మిల్‌ తీరుపై పలు అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.  

    పహల్గాం ఉగ్రదాడి సమయంలో  జిప్లైన్‌పై ప్రయాణిస్తున్న ఓ టూరిస్ట్  తీసిన వీడియోలో ఉగ్రదాడి ఘటన రికార్డైంది. అయితే అప్పటికే కాల్పులు ప్రారంభమైనా తనను హెచ్చరించకుండా  ఆపరేటర్ అల్లహో అక్బర్  అని అరుస్తూ తనను ముందుకు తోశాడని గుజరాత్‌కు చెందిన టూరిస్ట్ రిషి భట్ చెప్పాడు. రిషి వీడియో బయటకు రావడంతో జిప్ లైన్ ఆపరేటర్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

    ఎన్‌ఐఏ విచారణలో ముజమ్మిల్‌ అల్లాహు అక్బర్‌ అని అనడంలో ఎలాంటి అనుమానం లేదని ఎన్‌ఐఏ వర్గాల సమాచారం. ఆపత్కాలంలో హిందువులు రామా అని ఎలా స్మరిస్తారో.. ముజమ్మిల్‌ సైతం తాను కూడా అల్లాహో అక్బర్‌ అని పలికినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. ఎన్‌ఐఏ ప్రాథమిక విచారణలో ముజమ్మిల్‌కి ఈ ఉగ్రదాడిలో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, అతని తీరుపై పలు అనుమానాలు ప్రస్పుటమవుతున్నాయి.  

    ఘటనా స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపినప్పుడు జిప్‌లైన్‌ ఆపరేటర్‌ ముజ‍మ్మిల్‌.. టూరిస్ట్‌ రిషి భట్‌ని అల్లహో అక్బర్ అని అరుస్తూ  ముందుకు తోశాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్‌ఐఏ అధికారులు జిప్ లైన్ ఆపరేటర్ ముజమ్మిల్‌ ప్రశ్నిస్తే.. ఆయన వ్యవహార శైలీ అనుమానాస్పదంగా మారింది. దీంతో ఎన్‌ఐఏ అధికారుల తమ దర్యాప్తును మరింత లోతుగా ముమ్మరం చేశారు.

  • జమ్మూ: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం పాక్‌ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.

    జమ్మూకశ్మీర్‌ అనంత్‌ నాగ్‌ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్‌ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్‌ చేశారు. వాటి ఆధారంగా  

    ఎగ్జిట్‌, ఎంట్రన్స్‌ గేటులో ఉగ్రవాదులు కాపలా
    ప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్‌ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్‌ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్‌ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్‌ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్‌ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు.  

     

    ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే
    ఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.

    ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్‌ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. 

  • ఢిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయి నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్‌ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు.

    కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్‌ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 1992లో నాగ్‌పూర్‌ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు.

    2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్‌ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. జస్టిస్ గవాయ్‌ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్‌.

  • ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి.  మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 

    ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్‌ అనీల్‌ చౌహాన్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రలో పాక్‌ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్‌ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. 


     

  • ఢిల్లీ : ప్రైవేట్‌ స్కూళ్లల్లో అడ్డగోలు ఫీజుల దందాపై చరిత్రలో తొలిసారి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ స్కూళ్లలో ఫీజులు ఎంత మేరకు ఉండాలనే అంశంపై ప్రభుత్వం విధివిధానాల్ని ఖరారు చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనుంది.

    ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025పై ఢిల్లీ కేబినెట్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో పలు స్కూల్స్‌ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్‌ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి చట్టాన్ని ఆమోదించింది.  

    అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడారు. నా ఆనందానికి అవధుల్లేవు.ఢిల్లీ ప్రభుత్వం ధైర్యమైన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పలు స్కూల్స్‌ ఏకపక్షంగా ఫీజుల పెంచుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ కేబినెట్‌ మంగళవారం పాఠశాల ఫీజులను నియంత్రించడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.

     ఢిల్లీ ప్రభుత్వం చారిత్రాత్మక,సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఫీజుల స్థిరీకరణ,నియంత్రణ బిల్లు- 2025 ముసాయిదా బిల్లును ఈరోజు కేబినెట్‌  ఆమోదించిందని మీకు చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను’అని అన్నారు.

    ఢిల్లీలోని 1,677 పాఠశాలలు ఎయిడెడ్, నాన్-ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అయినా, ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకం, విధానాన్ని నిర్ణయిస్తారు. చరిత్రలో మొదటిసారిగా, అటువంటి బిల్లును ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు.  

    విద్యా మంత్రి ఆశిష్ సూద్ మాట్లాడుతూ, కొత్త నిబంధనలను అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తామని, పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ప్యానెల్లు నిర్ణయిస్తాయని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొంటారని  చెప్పారు.  

    ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని పలు స్కూళ్లు ఏకపక్షంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లి దండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.ఫిర్యాదులతో పలు పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తన ప్రభుత్వం పారదర్శకత, పిల్లల విద్యా హక్కు రక్షణకు కట్టుబడి ఉందని ఆ సమయంలో సీఎం రేఖా గుప్తా స్పష్టం చేశారు. 

  • న్యూఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

    దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. 

    పిటిషన్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. 

    జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. 

    ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

    ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

    పెగాసస్‌ వ్యవహారం ఏంటంటే.. 
    ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్‌ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్‌ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది. 

  • న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో రేపు కేబినెట్‌ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యం కారణంగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో భద్రతా క్యాబినెట్ కమిటీ(CCS) పాకిస్తాన్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం వ్యవధిలోనే సీసీఎస్‌ భేటీ జరుగుతుండడం గమనార్హం.

    సింధు జలాల ఒప్పందాన్ని  నిలిపివేత , దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాకిస్తాన్ జాతీయుల వీసా రద్దు తదితర  నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతా బలగల సన్నద్ధత, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న ఆపరేషన్, పాకిస్తాన్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కేబినెట్‌ చర్చించనుంది. ఆ వెంటనే ఆర్థిక భద్రతా కమిటీ జరుగుతుండడంతో పాక్‌ నడ్డి విరిగేలా ఈ నిర్ణయాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

    ఇదిలాఉంటే.. పహల్గాం దాడి జరిగిన మరుసటిరోజు ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా కేబినెట్‌ కమిటీ (CCS) సమావేశమైంది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌, రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ సహా ప్రధానమంత్రి ఇద్దరు ప్రిన్సిపల్‌ కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంతదాస్‌లు పాల్గొన్నారు. ఈ కమిటీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఉన్నప్పటికీ.. అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరుకాలేకపోయారు. 

Movies

  • సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని  శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

    సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల  తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని  వైద్యులు సూచించారు.

    గతేడాది డిసెంబర్‌లో ఘటన

    కాగా.. గతేడాది డిసెంబర్‌ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్‌ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
     

  • పెళ్లి అయినా పేరంటమైనా అయినా నగలు అలంకరించుకోవాల్సిందే అంటారు ఆభరణాల ప్రియులు.. అభినయమైనా, ఆభరణమైనా నటులు ఉండాల్సిందే అంటున్నారు ప్రచార వ్యూహాల రూపకర్తలు. తారలు ఆభరణాల లేబుల్‌ల మధ్య అనుబంధం నిత్య కళ్యాణం పచ్చతోరణం అని చెప్పాలి. కళ్యాణం అనగానే పెళ్లి మాత్రమే కాదు కళ్యాణ్‌ జ్యుయలర్స్‌ ప్రకటన కూడా గుర్తొస్తుందంటే కారణం... నాగార్జున అని చెప్పొచ్చు, అమితాబ్‌ బచ్చన్‌ అని కూడా చెప్పొచ్చు. దేశంలోని బంగారు ఆభరణాల వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాలు దాదాపు 37% వాటాను కలిగి ఉన్న నేపధ్యంలో ఈ బ్రాండ్‌ తమిళనాడులో ప్రభు గణేషన్, తెలుగు రాష్ట్రాల కోసం అక్కినేని నాగార్జున, కన్నడిగుల్ని మెప్పించడానికి...శివరాజ్‌కుమార్, మంజు వారియర్‌... ఇలా  నలుగురు ప్రధాన తారలతో ఒప్పందం కుదుర్చుకుంది .

    నమూనాలు, శైలులు, సున్నితత్వాలు ప్రాధాన్యతలు మన దేశంలో ఉన్న భాషలు  మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా బ్రాండ్‌ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌ని ఎంపిక చేసిందని కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ మార్కెటింగ్, హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కళ్యాణరామన్‌ అంటున్నారు. భారతీయ బంగారు ఆభరణాల మార్కెట్‌లో పశ్చిమ భారత రాష్ట్రాలు 32% వాటా కలిగి ఉన్నందున ఇదే బ్రాండ్‌  బాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా అమితాబ్‌ బచ్చన్, జయా బచ్చన్‌ కత్రినా కైఫ్‌లను ఎంపిక చేసింది. గతంలో ఈ బ్రాండ్‌ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌  సోనమ్‌ కపూర్‌ వంటి వారితో కూడా జట్టు కట్టింది.


    బంగారం వెలిగిపోతోంది.. ఆభరణాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే తారలతో ఆభరణాల బ్రాండ్స్‌ అనుబంధం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. టాలీవుడ్‌ హీరో యంగ్‌టైగర్‌ ఎన్టీయార్‌ మలబార్‌ గోల్డ్‌లో మెరిశారు. ఇక రామ్‌ చరణ్‌   భీమా జ్యుయలర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపిస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార సైతం ప్రముఖ ఆభరణ బ్రాండ్‌ పిఎంజె జ్యుయల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. గతంలో గానీ ప్రస్తుతం గానీ... చూసుకుంటే బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా కావచ్చు కలెక్షన్లను ఆవిష్కరించిన సెలబ్రిటీలుగా కావచ్చు... ర్యాంప్‌ మీద ఆభరణాలను ప్రదర్శించి కావచ్చు..విభిన్న రకాలుగా అనేక మంది నటీనటులు నగధగలకు తమ స్టార్‌ డమ్‌ మెరుపులను జత చేశారు.

    ఒక్కసారి పరిశీలిస్తే...

    నటి తమన్నా భాటియా వైట్‌ అండ్‌ గోల్డ్‌ బ్రాండ్‌ను స్వయంగా లాంచ్‌ చేసింది. అంతేకాదు ఆమె హెడ్‌ డిజైనర్‌గానూ పనిచేస్తోంది. గతంలో ఓ ఆభరణాలను తాకట్టుపెట్టుకునే మరో బ్రాండ్‌కు ఆమె ప్రచారం చేసింది. బాలీవుడ్‌ నటి దిశా పటానీ  రిలయన్స్ జ్యువెల్స్‌ రూపొందించిన మధ్యప్రదేశ్‌ సాంస్కృతిక  వారసత్వాన్ని ప్రతిబింబింబించే ’వింధ్య కలెక్షన్‌’ను ఆవిష్కరించారు. త్రిభువన్‌ దాస్‌ భీమ్‌జీ జువేరీ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్‌ను నియమించుకుంది. భీమా జ్యువెలర్స్‌కు మొదటి బ్రాండ్‌ అంబాసిడర్‌గా టాలీవుడ్,  బాలీవుడ్‌ నటి పూజా హెగ్డే పనిచేస్తే, బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. అంతగా పాప్యులర్‌ కాని ఓ మోస్తరు నటీమణులను సైతం బ్రాండ్స్‌ ఎంపిక చేసుకోవడం విశేషం. వెడ్డింగ్‌ పులావ్, గులాబీ లెన్స్‌ వంటి సినిమాల్లో పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన అనుష్కా రంజన్‌ వరుణ డి జానీ అనే ఆభరణ బ్రాండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెరిసింది.  ఖన్నా జ్యువెలర్స్‌ నగల ప్రచారంలో నటి చిత్రాంగద సింగ్‌ పనిచేసింది.

    కలెక్షన్స్‌ విడుదల్లోనూ...

    బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయడంతో పాటు కేవలం ఒక కలెక్షన్స్‌ను మాత్రమే ప్రదర్శించడం, విడుదల చేయడం వంటివి కూడా తారలు చేస్తున్నారు.తాప్సీ పన్ను  రిలయన్స్ జ్యువెల్స్‌ ’తంజావూర్‌ కలెక్షన్‌’ను లాక్మీ  ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించారు. జాన్వీ కపూర్‌ సైతం అంతకు ముందే ఈ తంజావూర్‌ కలెక్షన్‌ను పరిచయం చేశారు. బెంగాలీ నటి రితాభారి చక్రబర్తి గత ఏడాది కల్యాణ్‌ జ్యువెలర్స్‌  అక్షయ తృతీయ ప్రత్యేక కలెక్షన్స్‌ను ప్రారంభించింది.  

    బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తన భార్య ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి పిసి జ్యువెలర్స్‌ బంగారు ఆభరణాలు సతీసమేతంగా ప్రదర్శించాడు. బంగారు ఆభరణాలను మాత్రమే కాదు బంగారంతో అనుబంధం ఉన్న ప్రతీ దాంట్లో తారలు తళుక్కుమంటున్నారు. డిజిటల్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ అయిన ప్లస్‌ గోల్డ్‌ కు  సోనాక్షి సిన్హా ప్లస్‌ గోల్డ్‌  బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది. అలాగే బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకునే ముత్తూట్‌ ఫైనాన్స్‌కు టాలీవుడ్‌ సీనియర్‌ హీరో వెంకటేష్‌ జట్టు కట్టారు.

    ప్రతి పండుగ సీజన్‌లో మాదిరిగానే అక్షయ తృతీయ రోజున ప్రింట్‌ మీడియా  సిటీ హోర్డింగ్‌లలో గోల్డ్‌ ఫీవర్‌ కనిపిస్తుంది. విలాసవంతమైన, మెరిసే ఆభరణాలను ధరించిన బాలీవుడ్‌, దక్షిణ భారత సినిమాలకు చెందిన  తారల ప్రకటనలతో నిండిపోతాయిు. అయితే ఒక  సెలబ్రిటీ పని బ్రాండ్‌ తాజా కలెక్షన్స్‌ను ప్రదర్శించేందుకు పోజులివ్వడమే కాదు – ఇది సీజన్‌ ట్రెండ్‌లు  సమయాలు సందర్భాలను దృష్టిలో ఉంచుకుని  వీరు తప్పనిసరిగా సోషల్‌ మీడియాలో బ్రాండ్‌ గురించి మాట్లాడాలి  బ్రాండ్‌  ఆభరణాలను ధరించి ఈవెంట్స్‌లో కనిపించాలి.  ఒప్పందాల గోప్యత కారణంగా సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌ల కోసం కేటాయించిన ఖర్చుల గురించి చాలా బ్రాండ్‌లు పెదవి విప్పడం లేదు. అయితే ప్రతి ప్రచారానికి సెలబ్రిటీని బట్టి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 1 కోటి అంతకంటే ఎక్కువ ముట్టచెబుతారని పరిశ్రమలోని సీనియర్లు చెబుతున్నారు.

     

  • తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో ‍అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.

    అయితే ఇటీవల తన బర్త్‌ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.
     

     

  • బాలీవుడ్ నటుడు  సూరజ్ పంచోలీ ప్రధాన పాత్రలో వస్తోన్న పీరియాడికల్ చిత్రం 'కేసరి వీర్..లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్‌'. ఈ సినిమాలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమనాథ్ ఆలయాన్ని విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడిన   రాజ్‌పుత్ యోధుడు హమీర్జి గోహిల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. ఈ ట్రైలర్‌ ఈవెంట్‌కు హాజరైన సునీల్ శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.

    కశ్మీర్‌లో అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఉగ్రవాదులని సునీల్ శెట్టి ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అభివృద్ధికి భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  కానీ కొందరు ఈ పురోగతిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే  మనమంతా కలిసి నిలబడాలి.. భారత్ మాతా కీ జై అని అన్నారు. అంతకుముందే తాను త్వరలోనే వేకేషన్‌ కోసం కశ్మీర్‌లో పర్యటిస్తానని సునీల్ శెట్టి చెప్పారు. అక్కడి ప్రజలు భయంతో జీవించకూడదని ఆయన ఆకాంక్షించారు.

    కాగా.. ఈ చిత్రంలో సునీల్ శెట్టి యోధుడు వేగదా జీ పాత్రను పోషిస్తుండగా.. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో జాఫర్ ఖాన్‌గా కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ రాజల్ అనే మహిళా యోధురాలిగా తొలిసారిగా నటించింది. ఈ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన సూరజ్ పంచోలి ఎమోషనలయ్యారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశామని వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసరి వీర్ మే 16న 2025న థియేటర్లలోకి రానుంది.

  • బీచ్ ఒడ్డున అందాలన్నీ ఆరబోస్తున్న మలైకా అరోరా

    కళ్లజోడుతో స్టైలిష్ పోజులిస్తున్న దుషారా విజయన్

    డ్యాన్స్ డే వీడియోలతో మౌనీ రాయ్, ఆదితీ రావు

    వయ్యారాలు ఒలకబోస్తున్న రెజీనా కసాండ్రా

    చీరలో అలా నడిచొస్తూ మాయ చేసేస్తున్న అనసూయ

    పాలరాతి శిల్పంలా తెల్లగా మెరిసిపోతున్న ప్రణీత

    కొండల్లో విహార యాత్రకు వెళ్లిన యాంకర్ విష్ణుప్రియ

  • పహాల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.

    నభా నటేష్ స్పందిస్తూ - పహాల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన డార్లింగ్ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహాల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 

    ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహాల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి. అని చెప్పింది.

  • 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.

    (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్ 

    1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.

    కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా  ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా 

    దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.

    (ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు

  • పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ చేసిన పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆయన చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది భారతీయులు ఉన్నారన్న ఆయన వాదనపై నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో తన పోస్ట్‌పై విజయ్ ఆంటోని క్లారిటీ ఇచ్చారు.  తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని మరో పోస్ట్ చేశారు.

    కాగా.. అంతకుముందు పహల్గామ్ దాడిని ఖండిస్తూ..కశ్మీర్‌లో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. భారతీయులుగా మనందరికీ  బాధాకరమైన క్షణమిది. పాకిస్తాన్‌లో 50 లక్షల మంది ఇండియన్స్‌ ఉన్నారని.. పాకిస్తానీలు మనలాగే శాంతి, ఆనందాన్ని కోరుకుంటారు. ఇలాంటి సమయంలో ద్వేషం కంటే మానవత్వాన్ని చూపిద్దాం' అంటూ విజయ్ ఆంటోని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో ఆయనపై పలువురు విమర్శల దాడి చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న ఈ 50 లక్షల మంది భారతీయులు ఎవరు? మీరు హిందువులను భారతీయులుగా పోలుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పాకిస్థాన్‌లో భారతీయులు అంటూ ఆయన చేసిన వాదనను పలువురు తప్పుపట్టారు.

    తాజాగా తన పోస్ట్‌పై వివరణ ఇచ్చేందుకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్‌లో దారుణమైన మారణకాండ పాల్పడ్డారు.. వారి లక్ష్యం మన ఐక్యతను, బలమైన బంధాన్ని దెబ్బతీయడమే. భారతీయులుగా మన ప్రభుత్వంతో కలిసి మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామనేదే నా ఉద్దేశమని మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. బిచ్చగాడు మూవీతో ఫేమస్ అయిన విజయ్ ఆంటోనీ సినిమాల విషయానికొస్తే  చివరిసారిగా 'హిట్లర్‌లో కనిపించారు. ప్రస్తుతం 'గగన మార్గం', 'వల్లి మయిల్', 'అగ్ని సిరగుగల్', 'ఖాఖీ', 'శక్తి తిరుమగన్' లాంటి ఐదు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
     

     

     

  • తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్లలో ఒకడు బెల్లంకొండ శ్రీనివాస్. పదేళ్లకు పైనే ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ చెప్పుకోదగ్గ సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. చివరగా 2023లో ఛత్రపతి చిత్రాని హిందీలో రీమేక్ చేసి ఘోరంగా ఫెయిలయ్యాడు.

    (ఇదీ చదవండి: మహేశ్ బాబు నయా లుక్.. ఎ‍ప్పుడు లేనంతగా)   

    దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఒకేసారి నాలుగు సినిమాల్ని రెడీ చేస్తున్నాడు. అందులో 'భైరవం' త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 'కిష్కిందపురి' అని మరో మూవీ ప్రకటించాడు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

    పాడుబడ్డ పెద్ద భవంతి, అందులో హీరో అండ్ గ్యాంగ్ వెళ్తారు. తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనే అంశాలతో ఈ 'కిష్కిందపురి' తీసినట్లు అనిపిస్తుంది. గతంలో బెల్లంకొండ హీరోతో 'రాక్షసుడు' సినిమాలో నటించిన అనుపమ.. ఇందులో హీరోయిన్.

    (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)   

    తొలిసారి హారర్ జానర్ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ రాబోతున్నాడు. ఈ వర్షాకాలంలోనే మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. మరి ఈసారైనా బెల్లంకొండ హిట్ కొడతాడా?

    ఈ గ్లింప్స్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివర్లో హీరో... అహం మృత్యు అని చెప్పిన డైలాగ్, ఆ టైంలో కళ్లు దెయ్యం కళ్లలా ఉండటం చూస్తుంటే ఈసారి ప్రేక్షకుల్ని భయపెడతారనిపిస్తోంది. గతంలో అనుపమతో థ్రిల్లర్ మూవీ చేయగా.. ఇప్పుడు హారర్ చేశాడు శ్రీనివాస్.

    (ఇదీ చదవండి: ‍అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్)   

  • ‘బలగం’ తర్వాత దర్శకుడు వేణు(venu yeldandi) చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ (Yellamma Movie)  అని ప్రకటించి చాలా రోజులైంది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తొలుత నాని హీరోగా నటిస్తారనే ప్రచారం జరిగింది. నాని కూడా వేణుతో సినిమా చేస్తానని చెప్పారు. ఏం జరిగిందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పకున్నాడు. చివరకు ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి నితిన్‌ (Nithiin) దగ్గర వెళ్లింది. 

    కథ బాగా నచ్చడంతో నితిన్‌ ఈ చిత్రాన్ని వెంటనే ఓకే చేశాడు. డేట్స్‌ కూడా అరేంజ్‌ చేసుకున్నాడు. నిర్మాత దిల్‌ రాజు కూడా సినిమా షూటింగ్‌ స్టార్స్‌ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈ సినిమాకు కీలకమైన హీరోయిన్‌ మాత్రం దొరకడం లేదట. ‘ఎల్లమ్మ’ కోసం అటు దిల్‌ రాజు, నితిన్‌.. ఇటు వేణు తెగ వెతుకుతున్నారట.

    బలగం మాదిరే ఈ కథ కూడా రూరల్‌ నేపథ్యంలోనే సాగుతుదంట. దర్శకుడు వేణు చాలా పకడ్బంధీగా ఈ సినిమా స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడట. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది. అందుకే ఓ స్టార్‌ హీరోయిన్‌ని ఆ పాత్రకు తీసుకోవాలనుకున్నారట. 

    తొలుత సాయి పల్లవి అయితే బాగుంటందని ఆమెను సంప్రదించారు. అయితే సాయి పల్లవి ఈ సినిమా చేయలేనని చెప్పేసిందట. దీంతో మరో స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ అయితే ‘ఎల్లమ్మ’కు న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించారట. అయితే కథ, పాత్ర బాగా నచ్చినప్పటికీ.. డేట్స్‌ ఖాలీగా లేకపోవడం నో చెప్పేసిందట. శ్రీలీలను తీసుకుందామంటే.. అల్రెడీ నితిన్‌తో రెండు సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాప్‌ అవ్వడంతో దిల్‌ రాజు వెనకడుకు వేస్తున్నాడట. ఇక రష్మిక, సమంత లాంటి హీరోయిన్లు కూడా ఖాలీగా లేరు. నితిన్‌ ఎప్పుడైన తన సినిమాలకు ట్రెండింగ్‌ హీరోయిన్‌ని తీసుకుంటాడు. కానీ ఈ సారి మాత్రం అది వర్కౌట్‌ అయ్యేలా లేదు. స్టార్‌ హీరోహీరోయిన్లు అంతా బిజీగా ఉన్నారు. మరి ‘ఎల్లమ్మ’గా ఎవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి. 

  • మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇదివరకే హైదరాబాద్, ఒడిశాలో షూటింగ్ చేశారు. త్వరలో మరో షెడ్యూల్ కూడా మొదలుపెట్టబోతున్నారు. కానీ SSMB 29 గురించి అధికారికంగా మాత్రం ప్రకటించలేద. మహేశ్ అయితే పూర్తిగా బయట కనిపించడమే మానేశాడు.

    కొన్నిరోజుల క్రితం షూటింగ్ లో బ్రేక్ దొరకగానే కుటుంబంతో కలిసి మహేశ్.. ఇటలీ వెళ్లాడు. కానీ తన ఫొటో గానీ, లుక్ గానీ బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్ పోర్ట్ లోనూ తలపై క్యాప్, కళ్లజోడు ఉండటం వల్ల మహేశ్ లుక్ సరిగా రివీల్ కాలేదు.

    (ఇదీ చదవండి: ‍అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్)  

    మరి తాజాగా ఎవరితోనూ ఏదో డిస్కషన్ చేస్తున్న టైంలో మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ బయటపడింది. గుబురు గడ్డంతో, పొడవైన జుత్తుతో మహేశ్ కనిపించాడు. గతంలో మహేశ్ హెయిర్ పెంచాడు గానీ రాజమౌళితో మూవీ కోసం మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.

    గతంలో ఒడిశాలో షూటింగ్ చేస్తున్న టైంలో మహేశ్ క్లిప్ ఒకటి లీకైంది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. మరోవైపు ఇదే సినిమాలో ప్రియాంక చోప్రా కూడా కీలక పాత్ర చేస్తోంది. వీళ్ల లుక్స్ కూడా బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మూవీ 2027లో థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి?

    (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)  

  • శ్రీవిష్ణు హీరోగా, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ ‍ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓం‌ భీమ్‌ బుష్‌'. గతేడాది మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. 

    అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్‌ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది.  అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.  ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
     

     

  • బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.

    అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.

    ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్‌ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్‌ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. 
     

     

  • నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.

    'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'

    (ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం)  

    'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.

    మౌనీ రాయ్ ‍వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.

    (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)  

  • కెరీర్‌ను అందుకునే క్రమంలో బహుశా అతను సాధించినన్న రికార్డ్స్‌ మరే హీరో సాధించి ఉండడు. అత్యంత పిన్న వయసులో నటుడు, అత్యంత పిన్న వయసు హీరో, అత్యంత పిన్న వయసు స్టార్, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తొలి సినిమా హీరో... హిందీ, తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ..అన్ని భాషల్లోనూ స్వల్ప వ్యవధిలోనే 280 చిత్రాలు చేసిన హీరో...పాతికేళ్ల వయసులోనే ఇన్ని సాధించాడంటే ఇప్పుడెలా ఉండాలి? ఏభై ఏళ్ల వయసులో ఎంత గొప్ప స్థాయిలో ఉండాలి? ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి? కానీ అడ్రెస్‌ కూడా లేకుండా పోవడం ఏమిటి?

    అది 90వ దశకం.. భారతీయ సినీ పరిశ్రమకు ఒక మార్పు కాలం. ప్రధాన సినిమాలల్లో స్థిరపడిన తారల వయసు ముదిరిపోతుండగా, వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ నటీనటులను పెద్ద సంఖ్యలో పరిచయం చేసిన కాలం. అలా తెరపైకి వచ్చిన యువతలో, అప్పుడే 15ఏళ్ల వయసులో హీరోగా అడుగుపెట్టిన ఒక యువ నటుడు ప్రత్యేకంగా నిలిచాడు అతడే హరీష్‌ కుమార్‌ (Harish Kumar), తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన హరీష్‌.  

    బాలనటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన హరీష్, కొన్ని హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత 1988లో, కేవలం 13ఏళ్ల వయసులోనే  హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు.  దివంగత నిర్మాత రామానాయుడు 1990లో తీసిన ‘ప్రేమ ఖైదీ‘ తెలుగు సినిమాతో అప్పటి యూత్‌ని ఒక ఊపు ఊపాడు. తరువాతి ఏడాది, ఈ సినిమా హిందీ రీమేక్‌ లో కూడా నటించాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరిష్మా కపూర్‌ తొలి సినిమా విజయం సాధించింది. హరీష్‌–కరిష్మా కపూర్‌ (అప్పుడు ఇద్దరికీ 16ఏళ్లు) జోడీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.

    తర్వాతి కాలంలో, ‘తిరంగా‘, ‘కాలేజ్‌ బుల్లోడు‘ వంటి విజయవంతమైన చిత్రాల్లో హరీష్‌ నటించాడు. ఆ సమయానికి, హరీష్‌ను హిందీ తెలుగు సినిమాల్లో ఉన్న అత్యుత్తమ యువ నటుల్లో ఒకరిగా గుర్తించారు. కొందరు ఆయనను షారుఖ్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్‌  తదనంతర స్టార్‌గా కూడా భావించారు. కానీ తర్వాత తర్వాత  హరీష్‌కు పూర్తిస్థాయి హీరోగా అవకాశాలు రాకున్నా మంచి పాత్రలే వచ్చాయి.  టాప్‌ స్టార్స్‌ అయిన రజనీకాంత్, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నానా పాటేకర్, గోవిందా ల చిత్రాల్లో హరీష్‌  రెండవ హీరో, చిన్న పాత్రలకే పరిమితం అయ్యాడు.

    ‘ద జెంటిల్మన్‌‘, ‘కూలీ నం.1‘, ‘హీరో నం.1‘ వంటి హిట్‌ చిత్రాల్లో నటించాక, 2001 ప్రాంతంలో అకస్మాత్తుగా  తెరమరుగైన హరీష్‌... తిరిగి పదేళ్ల తర్వాత తెరపై కనిపించాడు. ఓ పుష్కర కాలం క్రితం ‘నాటీ ః 40‘, ‘చార్‌ దిన్‌ కి చాంద్ని‘ వంటి ఫ్లాప్‌ చిత్రాలతో తిరిగి సినిమాల్లో ప్రయత్నించాడు.ఆ తర్వాత ఏడేళ్ల క్రితం‘ఆ గయా హీరో‘ అనే చిత్రంలో గోవిందాతో కలిసి చివరిసారి తెరపై కనిపించాడు. ఏమైందో తెలీదు గానీ  హరీష్‌ సినిమా జర్నీ ఎంత ఉధృతంగా మొదలైందో అంతే అకస్మాత్తుగా ముగిసింది.

    అందగాడని, ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అని, డ్యాన్సులు, ఫైట్స్‌ బాగా చేస్తాడని మంచి పేరు తెచ్చుకున్న హరీష్‌..సినిమా కెరీర్‌ను వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులే నాశనం చేశాయని అంటారు. ఆయన ప్రేమ, పెళ్లి కూడా ఆయన సమస్యలకు కారణం అని కూడా కొందరు చెబుతారు.

    అయితే కొంత కాలం క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రంగం విడిచిపెట్టడానికి గల అసలు కారణం గురించి మాట్లాడాడు. చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో గాయపడిన తాను సంవత్సరాల తరబడి చికిత్స చేయించుకోకపోవడం వల్ల, సీరియస్‌ బ్యాక్‌ ప్రాబ్లెమ్‌కి గురయ్యాడని చెప్పారు. ‘ లంబార్‌ వెరిబ్రా ఎల్‌3  ఎల్‌5 ప్రాంతాల్లో స్లిప్డ్‌ డిస్క్‌ ఏర్పడింది. దీనివల్ల నడక కూడా కష్టమైంది. ఆ సమయంలో నేను చాలా నిర్లక్ష్యంగా ఉండి, గాయాన్ని గుర్తించలేకపోయాను. ఆపరేషన్‌ కూడా చేయించుకోవాలనుకోలేదు,‘ అని హరీష్‌ చెప్పాడు.

    చివరికి చికిత్స తీసుకున్న తరువాత, నెలల తరబడి మంచం మీద ఉండాల్సి వచ్చిందని, ఆ లోపు పరిశ్రమ తనను దాటి వెళ్లిపోయిందని హరీష్‌ తెలిపారు. ‘డాక్టర్‌ మొదట రెండేళ్ల పాటు పని చేయకూడదని చెప్పాడు. ఆ తర్వాత అలా అలా తెలియకుండానే  పరిశ్రమ నుంచి మాయం అయ్యాను,‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హరీష్‌ ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ‘నేను ఇంకా భారత్‌లోనే ఉన్నాను – చెన్నై, హైదరాబాద్, ముంబైలలో ఎక్కువగా ఉంటాను. సినిమా రంగం విడిచిన విషయం చాలా వ్యక్తిగతమైనది. దీనిపై ఎక్కువగా మాట్లాడాలని ఇష్టం లేదు,‘ అని హరీష్‌ స్పష్టం చేశాడు.

  • ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.

    (ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!)  

    ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. 

    ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.

    (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)  

    దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.

    నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎ‍ప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.

    (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా 

  • ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా   (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఎన్టీఆర్‌ ప్రకటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న  ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)  మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో  పీరియాడికల్‌ స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్  నిర్మిస్తుంది . ఇందులో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్‌ 22 నుంచి  షూటింగ్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన  సంగతి తెలిసిందే. ‘దేవర’ తర్వాత  ఎన్టీఆర్‌.. ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    అభిమానులకు ఎన్టీఆర్‌ శుభవార్త చెప్పారు.    (#NTRNEEL) చిత్రాన్ని 2026 జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డైనమిక్‌ వ్యక్తుల కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విధ్వంసమే జరగనుంది. ఆ అనుభూతి పొందేందుకు సిద్ధకండి అంటూ  మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది. వచ్చే సమ్మర్‌లో బాక్సాఫీస్‌ వద్ద ఫుల్‌ సందడి వాతావరణం కనిపించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

    మొదట వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే, కథ వల్ల వీఎఫ్‌ఎక్స్‌ పనులతో పాటు చిత్రీకరణ విషయంలోనూ మరింత స్ట్రాంగ్‌గా ప్లాన్‌ చేయడం వల్లే కాస్త ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు కూడా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే.. తారక్‌ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్‌ చిత్రీకరించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించారు.  శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎన్టీఆర్‌తో షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఉన్నాయి. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్‌ చేశారని తెలిసింది.  

  • కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 

    'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.

    (ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి? 

    తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 

    'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?

    (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా 

  • ‘దక్షిణాది అభిమానులు మాపై(బాలీవుడ్‌ హీరోలు) చూపిస్తున్న ప్రేమను థియేటర్‌ వరకు తీసుకెళ్లరు’ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో నాని(Nani) స్పందిస్తూ..బాలీవుడ్‌ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు తరతరాలుగా ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ వారంతా నిజంగానే ఆదరించరనేదే నిజమైతే వాళ్లు(బాలీవుడ్‌ హీరోలు) సూపర్‌ స్టార్స్‌ ఎలా అయ్యారని ప్రశ్నించారు. 

    ‘దక్షిణాది చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. కానీ అంతకంటే ముందు హిందీ చిత్రాలను అందరూ ఆదరించారు. ఎన్నో దశాబ్దాలుగా సౌత్‌ ఆడియన్స్‌ బాలీవుడ్‌ సినిమాలపై ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ హీరోలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ ఉన్నారు. అమితాబ్‌ నటించిన ఎన్నో చిత్రాలు సౌత్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. సల్మాన్‌ ఖాన్‌కు ఇక్కడ(సౌత్‌) చాలా మంది అభిమానులు ఉన్నారు.

    ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘దీదీ తేరా దీవానా’ పాట ఇక్కడి పెళ్లిళ్లలో ఎన్నోసార్లు విన్నాం. ఆయన నటించిన చిత్రాలెన్నో ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.  అందరూ ఆదరించారు కాబట్టే వాళ్లు సూపర్‌ స్టార్స్‌ అయ్యారు. బహుశా సల్మాన్‌ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. బాలీవుడ్‌ సినిమాలకు సౌత్‌లో మంచి ఆదరణ ఉంటుంది’ అని నాని చెప్పుకొచ్చారు. 

    కాగా, సికిందర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘సౌత్‌ హీరోల సినిమాలు బాలీవుడ్‌లో మంచి విజయం సాధిస్తున్నాయి. రజనీకాంత్‌, చిరంజీవి, సూర్య, రామ్‌ చరణ్‌ లాంటి హీరోల సినిమాలు అక్కడ(బాలీవుడ్‌) మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఎందుకంటే వారి సినిమాను మేమంతా థియేటర్స్‌కి వెళ్లి చూస్తాం. కానీ వారి అభిమానులు మాత్రం మా(హిందీ )సినిమాలు చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు. నేను రోడ్లపై కనిపిస్తే..‘భాయ్‌..భాయ్‌’ అంటూ ప్రేమను చూపిస్తారు కానీ..అదే ప్రేమతో థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడరు’ అని అన్నారు.  

    ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘హిట్‌ 3’(HIT 3) మే 1న విడుదల కాబోతుంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా ఇది. శైలేష్‌ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. 

  • తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రెయిట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగా రావట‍్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూయర్లదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.

    (ఇదీ చదవండి: 'ది ఫ్యామిలీ మ్యాన్‌-3' నటుడు అనుమానాస్పద మృతి

    ఎందుకంటే కంటెంట్ సరిగా ఉండి ఎంటర్ టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గతవారం 'సారంగపాణి' ‍సినిమాతో పాటు జింఖానా, తుడురమ్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు.

    అదే టైంలో 'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన 'జింఖానా'కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ..  కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి రూ.2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్.

    (ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?

    చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే 'జింఖానా'పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువ పెట్టి ఉండరుగా!

    జింఖానా విషయానికొస్తే.. అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్లు.. ఇంటర్ ఫెయిలవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీటు సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగోలా గెలిచేస్తారు. దీంతో రాష్ట‍్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.

    (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

    వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు వీరే
    1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)
    2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ
    3.అరకు- బొడ్డేటి ప్రసాద్‌
    4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)
    5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)
    6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)
    7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి
    8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్‌ (ఎమ్మెల్సీ)
    9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి
    10.మచిలీపట్నం -జెట్టి గురునాథం
    11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు
    12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)
    13.గుంటూరు-పోతిన మహేష్‌
    14.నరసరావుపేట​-డా.పూనూరు గౌతంరెడ్డి
    15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)
    16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి
    17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
    18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)
    19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి
    20.రాజంపేట​- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్‌)
    21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి
    22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)
    23.హిందూపురం-ఆర్‌.రమేష్‌రెడ్డి
    24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)
    25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

     

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్‌ ఆఫ్‌ వాయిస్‌లెస్‌’గా వైఎస్సార్‌సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని  ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు

    ఆ బాధ్యత పార్టీపై ఉంది:
    రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు  అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్‌ గుర్తు చేశారు.

    వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:
    రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్‌ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.

    హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:
    రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్‌ఆర్‌సీపీ ఉండాలని వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్‌ సిక్స్‌ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.

    ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్‌సీపీ వారికి అండగా నిలబడుతుంది.

    రైతుల్లో భరోసా కల్పించాలి:
    రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా  ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్‌ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

    ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్‌ఆర్‌సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్‌ జగన్‌ నిర్ధేశించారు.

    పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:
    పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్‌ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.

    అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్‌లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్‌లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌ ట్వీట్లు పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రమంలో ఆమె మరో సంచలన ట్వీట్‌ చేశారు. తనపై వేటు తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ ట్వీట్‌ చేశారు. కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన. 4 నెలలు టూరిజం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశాను. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30లో రాష్ట్రానికి పరిచయం చేశాను’’ అని ట్వీట్‌ చేశారు.

    ‘‘నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్‌లలో దిశ, పెట్టుబడి కోసం పటిష్టమైన ఫ్రేమ్‌ని సృష్టించాను. డిపార్ట్‌మెంట్ పని శైలిని పునరుద్ధరించాను. జవాబుదారీతనం నింపడానికి ప్రయత్నించాను. లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాది వేసి- గ్లోబల్ ఈవెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టాను.. అది నాకు ఆనందం.. గౌరవంగా ఉంది’’అంటూ స్మితా ట్వీట్‌ చేశారు.

     

    కాగా, కంచ గచ్చిబౌలి భూవివాదంలో స్మితా సబర్మాల్‌.. ఏఐ ఫోటో రిట్వీట్ చేసిందని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె.. రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. స్మితాపై బదిలీ వేటు వేసింది. ఆమెను ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.



     

  • భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సభ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు, నేతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ పాలనపై ఇప్పటికే అసంతృప్తి ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీవైపు కాకుండా బీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఏర్పడేందుకు కూడా వరంగల్‌ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఉపయోగపడుతుంది.

    2023లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం అనూహ్యమే. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు, శాసన మండలి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురు కావడంతో పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండటం సహజం. రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదుర్కొన్నాయి. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1991లో 13 సీట్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడల ఆరోపణలు, వ్యతిరేకత ఉందని తెలిసి సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం వంటి అనేకానేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదానైతే దక్కిం‍చుకుంది కానీ.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంత నష్టం చేసింది.

    రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం, తదితర అంశాలపై విచారణ కమిషన్లు వేయడం కూడా పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగేందుకు అవకాశమిచ్చింది. దీన్ని అధిగమించడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్‌ ఈ రజతోత్సవ సభను వాడుకున్నారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించి, ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందని, అది చూసి తనకు దుఃఖం వేస్తోందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమం నాటి సంగతులు, 1956 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి సెంటిమెంట్‌ను ప్రయోగించే యత్నం చేసినట్లు స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రమంలో 1956లో ప్రజలంతా తెలంగాణ, ఏపీలో కలపడానికి వ్యతిరేకించారని ఆయన చెప్పడం కొంత వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్రలు కలవడానికి అంగీకరించని వారు కొంతమంది ఉండవచ్చు కానీ, హైదరాబాద్ శాసనసభలో ఉమ్మడి ఏపీకి అనుకూలంగా మెజార్టీ సభ్యులు మాట్లాడారు.

    అంతేకాదు.. అంతకుముందు ప్రముఖుల సారథ్యంలో తెలంగాణలో సైతం ఆంధ్ర మహాసభలు జరిగేవి. చరిత్రను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. 2009లో సోనియాగాంధీ తెలంగాణ  ప్రకటన చేయడం కీలకమైన  మలుపు. టీఆర్‌ఎస్‌కు అప్పట్లో ఇద్దరు ఎంపీలే ఉండేవారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాలలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉండటం, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.

    తెలంగాణ వాదంతో కాంగ్రెస్, టీడీపీలను కేసీఆర్‌ భయపెట్టగలిగారు. ఆ పార్టీలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. అంతవరకు ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితులు ఏర్పడడం కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి, తదితరులకు భిన్నంగా కేసీఆర్‌ పనిచేసిన మాట నిజం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికే  కట్టుబడి రాజకీయం చేశారు. నిజానికి ఇదంతా గతం. ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలనే అని చెప్పడంలో హేతుబద్దత ఎంత ఉందన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని మంత్రులు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం, సీతక్కలు ప్రశ్నించారు.

    అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తారు. అదే పని కేసీఆర్‌ చేశారు. బీజేపీపై మాత్రం నామమాత్రపు విమర్శలు చేశారనే చెప్పాలి. అంత భారీ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడటం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి సభలలో నాయకుడు వచ్చేలోగా పలువురు  నేతలు మాట్లాడుతుంటారు. ఈసారి అలా చేయలేదు. కాకపోతే పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు అయిన కేటీఆర్‌ ప్రాముఖ్యతను మరింత పెరిగేలా ఈ సభలలో జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. సభా వేదికపై కూడా కేసీఆర్‌తోపాటు ఆయన ఫోటో కూడా ఉంచారు. కేసీఆర్‌ తన స్పీచ్‌ను మరీ ఎక్కువ సేపు చేయలేదు. అంతేగాక.. పరుష పదాలతో కాంగ్రెస్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే యత్నం కూడా చేసినట్లు అనిపించదు. కాంగ్రెస్ పాలనపై గట్టి విమర్శలే చేస్తూ, ప్రధానంగా తెలంగాణ ఆగమైందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులు పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రస్తావించకుండా ప్రసంగించడం కూడా చెప్పుకోదగిన అంశమే.

    కాంగ్రెస్ పార్టీ హామీలపై బాండ్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొన్ని వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చారు. తన పాలన గురించి చెబుతూ ప్రత్యేకించి రాష్ట్రంలో నీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని, భూముల విలువలు పెరగడానికి దోహదపడ్డామని, రైతుబంధును అమలు చేయడం ద్వారా రైతులకు మేలు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, పోలీసులకు రాజకీయాలు వద్దని ఆయన సూచించారు. ఆయా సందర్భాలలో సభలోని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న ఆరోపణలు, అధిక అప్పుల భారం, ఫోన్‌ ట్యాపింగ్ తదితర అంశాల జోలికి వెళ్లలేదు.

    కేసీఆర్‌ స్పీచ్ ముగిసిన వెంటనే మంత్రులు గట్టిగానే జవాబు ఇచ్చారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని, ఆయన చేసిన విమర్శలపై చర్చకు సిద్దమని అన్నారు. పొన్నం ప్రభాకర్ అయితే గ్రీన్‌మ్యాట్ వేసి ప్రజలు అధికంగా వచ్చినట్లు చూపే యత్నం జరిగిందని ఆరోపించారు. కాకపోతే గతంలో మాదిరి కాకుండా, ఇప్పుడు కనుచూపు మేర కుర్చీలు వేశారు. రాజకీయ సభల నిర్వహణలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ పార్టీ సభ జరిగినా, గతంలో ఒకటి, రెండు బ్లాక్‌లు తప్ప, అంతా కిందే కూర్చునేవారు. ఇప్పుడు  అలా చేయడం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌పై విమర్శలు చేసిన మంత్రులలో పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రముఖులు. గత ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు.

    ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడు  కావడం, కొందరు మంత్రులు గతంలో తన వద్ద పని చేసినవారు కావడం తదితర కారణాల వల్ల బహుశా ఆయన ఈగో సమస్య ఎదుర్కొంటున్నారని అది కేసీఆర్‌ స్పీచ్‌లో కనిపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ఓవరాల్‌గా పరిశీలిస్తే రజతోత్సవ సభకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగానే ఉంది. 

    కానీ, ఇదే వరంగల్‌లో ఉద్యమ సమయంలో ఇంతకన్నా భారీ బహిరంగ సభలే జరిగాయి. అయినా భారీ సభలే అన్నిటికి కొలమానం కావు. కాకపోతే జనంలో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచడానికి రజతోత్సవ సభ కొంతమేర అవకాశం కలిగిస్తుంది. కేసీఆర్‌ ఒక్కరే మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కేసీఆర్‌ పూర్వపు స్పీచ్‌ల మాదిరి మరీ ఘాటుగా మాట్లాడలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదేమీ తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉన్నప్పటికీ, ఈ సభ ద్వారా తాను మళ్లీ బయటకు వచ్చి జనంలో తిరుగుతానని కేసీఆర్‌ చెబుతున్నారు. ఇప్పటికీ కేసీఆర్‌ గ్లామర్ పైనే బీఆర్ఎస్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.

    -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

  • గుంటూరు, సాక్షి:  సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు.  ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది.  విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. 



    జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీది
    ప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్‌సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే.  

    మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలి
    జూన్‌-జులైల్లో  గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి.  జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. 
    బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.

    జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు
    జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది.  మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.

    ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది
    ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.

    LIVE: YSRCP జిల్లా అధ్యక్షులతో YS జగన్‌మోహన్‌రెడ్డి భేటీ

    మనమంతా రాజకీయ నాయకులం
    మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు.  ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.

    రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి.  గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది  ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.

    మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు
    వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. 

     

     

Business

  • 2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్‌లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.

    ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.

    ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.

    తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.

    రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.

    తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్‌లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.

    పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది.

  • హైదరాబాద్: గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్‌ఫోలియోలో మూడు రెట్లు వృద్ధి సాధించినట్లు భారత్‌లో అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 'టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్‌కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో కంపెనీ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసింది. టాటా ఏఐజీ నెట్‌వర్క్‌, 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.

    వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్‌ పేరిట, మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ పెను సవాలును అధిగమించేందుకు, కస్టమర్లకు కీలక పరిష్కారాన్ని అందించేందుకు ఈ సాధనం తోడ్పడగలదు.

    నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అనువైనదిగా, అందుబాటు ప్రీమియంలతో ఉండేలా మెడికేర్ సెలెక్ట్ రూపొందించబడింది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోతగిన విధంగా ఇది ఉంటుంది. జీవితకాల యంగ్ ఫ్యామిలీ డిస్కౌంట్, 7.5% శాలరీ డిస్కౌంట్‌లాంటి ఉపయుక్తమైన ఫీచర్ల కారణంగా అన్ని రకాల ఆదాయవర్గాల వారు, జీవితంలో వివిధ దశల్లో ఉన్న వారికి ఇది అనువైనదిగా ఉంటుంది.

    గడిచిన మూడేళ్లుగా.. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే ఉదంతాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్‌మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయి. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) చికిత్స వ్యయాలు 40% పెరిగాయి. సగటు ఖర్చులు కూడా రూ. 1.6 లక్షలకు చేరాయి. 2025లో టాటా ఏఐజీ ఒక కార్డియోవాస్కులర్ కండీషన్‌ (CAD with STEMI) కేసుకి సంబంధించి హైదరాబాద్‌లో అత్యధికంగా రూ. 1 కోటి హెల్త్ క్లెయిమ్ చెల్లించింది. తీవ్రమైన కిడ్నీ డిసీజ్ (సీకేడీ) చికిత్స ఖర్చులు 38% పెరిగాయి. ఇవన్నీ కూడా అత్యవసరంగా అందుబాటు ప్రీమియంలతో హెల్త్‌కేర్ లభ్యత ఆవశ్యకతను సూచిస్తున్నాయి.

  • అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది.

    ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అక్షయ తృతీయను పురస్కరించుకుని 72 గంటల ఎలక్ట్రిక్ రష్ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అదే రోజు స్కూటర్ డెలివరీలు కూడా ఉంటాయి.

    ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. జెన్ 2, జెన్ 3 మోడళ్లతో సహా S1 పోర్ట్‌ఫోలియో అంతటా రూ.40,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపులు తరువాత Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుంచి.. Gen 3 లైన్అప్ ధర రూ. 73,999 నుంచి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

    ఓలా #హైపర్‌డ్రైవ్ సర్వీస్ కింద.. అదే రోజు డెలివరీ, రిజిస్ట్రేషన్ వంటివి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్‌లను ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.

    అక్షయ తృతీయ ఆఫర్స్ ఇస్తున్న ఇతర కంపెనీలు
    అక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్ వంటివి కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే విషయం తెలుసుకోవడానికి మీ సమీపంలోని బ్రాండ్ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

  • భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.

    ▸1925: రూ. 18.75
    ▸1935: రూ. 30.81
    ▸1945: రూ. 62.00
    ▸1955: రూ. 79.00
    ▸1965: రూ. 72.00
    ▸1975: రూ. 540.00
    ▸1985: రూ. 2130.00
    ▸1995: రూ. 4680.00
    ▸2005: రూ. 7000.00
    ▸2015: రూ. 26845.00
    ▸2016: రూ. 29560.00
    ▸2017: రూ. 29920.00
    ▸2018: రూ. 31730.00
    ▸2019: రూ. 36080.00
    ▸2020: రూ. 48480.00
    ▸2021: రూ. 50000.00
    ▸2022: రూ. 53000.00
    ▸2023: రూ. 60000.00
    ▸2024: రూ. 80000.00
    ▸2025: రూ. 97970.00

    1925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.

    బంగారం ధరలు పెరగడానికి కారణాలు
    బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.

    ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?

  • న్యూఢిల్లీ: ప్రతిపాదిత జాతీయ తయారీ కార్యక్రమం రూపురేఖలను ఖరారు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఓ అంతర్‌ మంత్రిత్వ కమిటీని నియమించింది. నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.

    భారత్‌లో తయారీని మరింత ప్రోత్సహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దీన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం, భవిష్యత్‌కు అనుగుణమైన ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్‌ఎంఈని బలోపేతం చేయడం, టెక్నాలజీ లభ్యత, నాణ్యమైన ఉత్పత్తులు.. అనే ఐదు అంశాలపై ఈ కమిటీని కీలక సిఫారసులు చేయనుంది.

  • ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్‌మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.

    జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.

    ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..

    కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ.

  • 2007లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 'హ్యుందాయ్ ఐ10' ఏకంగా 33 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఒక్క భారతదేశంలోనే ఈ కారును 20 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కాగా కంపెనీ 140 కంటే ఎక్కువ దేశాలలో మరో 13 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.

    హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10ను ఎక్కువగా దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ దేశాలకు ఎగుమతి చేశారు. 2007లో మొదటి సారి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు.. ఆ తరువాత అనేక అప్డేట్స్ పొందుతూ.. ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ అనే మూడు వేరియంట్లలో.. 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమాటిక్, CNGతో 1.2 లీటర్ పెట్రోల్‌ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

    ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ

    హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రతి ఏటా సగటున లక్ష యూనిట్ల కంటే ఎక్కువ ఐ10 కార్లను విక్రయించింది. ఇది మంచి డిజైన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక కొత్త ఫీచర్స్ పొందింది. గ్రాండ్ i10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్జ్, ఆస్టా అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది.

  • మంగళవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 28.11 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో.. 80,246.48 వద్ద, నిఫ్టీ 7.45 పాయింట్లు లేదా 0.031 శాతం లాభంతో 24,335.95 వద్ద నిలిచాయి.

    టాప్ గెయినర్స్ జాబితాలో మాలు పేపర్ మిల్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా), గార్డెన్ రీచ్ షిప్‌ బిల్డర్స్ & ఇంజనీర్స్, టీబీఓ టెక్ వంటి కంపెనీలు చేరగా.. మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, మనక్సియా, శివ మిల్స్ లిమిటెడ్, లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

  • హెచ్‌పీ తన తదుపరి తరం ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్‌పీ ఎలైట్ బుక్‌, ప్రోబుక్‌, ఓమ్నీబుక్‌లను విభిన్న వ్యాపారాలు, వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో సెకనుకు 40 నుంచి 55 ట్రిలియన్ కార్యకలాపాలను అందించగల డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు (ఎన్‌పీయూ) ఉన్నాయని పేర్కొంది. ఏఐ కంప్యూటింగ్‌లో ఈ డివైజ్‌లు ముందంజలో ఉన్నాయని తెలిపింది.

    ఇంటెల్ కోర్ అల్ట్రా 200 వి సిరీస్, ఏఎండీ రైజెన్ ఏఐ 300 సిరీస్, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్ సిరీస్ చిప్‌లతో ఈ ల్యాప్‌టాప్‌లను తయారు చేసినట్లు సంస్థ చెప్పింది. తాజా ప్రాసెసర్లతో నడిచే ఈ ల్యాప్‌టాప్‌లు అడాప్టివ్ వర్క్‌లోడ్‌ను సర్దుబాటు చేసుకుంటూ రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్, వీడియో కాల్స్ సమయంలో ఆటో ఫ్రేమింగ్ వంటి ఆప్టిమైజేషన్లను అందిస్తాయని తెలిపింది.

    ఏఐ ఫీచర్లు

    హెచ్‌పీ ఏఐ కంపానియన్: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు, సురక్షితమైన ఫైల్ విశ్లేషణను అందించే రీసెర్చ్ అసిస్టెంట్.

    పాలీ కెమెరా ప్రో: ఆటో ఫ్రేమింగ్, మల్టీ కెమెరా సపోర్ట్, స్ట్రీమింగ్ ఇంటిగ్రేషన్‌తో వర్చువల్ సమావేశాలను మెరుగుపరచడం.

    మైహెచ్‌పీ ప్లాట్ ఫామ్: వినియోగదారు భద్రతను ప్రోత్సహిస్తూ డివైజ్‌ పనితీరు, బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను మెరుగుపరుచడం.

    డివైజ్‌ తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, లోహాన్ని ఉపయోగించారు. ఇది పర్యావరణ సుస్థిరత పట్ల కంపనీ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఎనర్జీ స్టార్  సర్టిఫికేషన్, ఈపీఈఏటీ గోల్డ్ రిజిస్ట్రేషన్‌ను సొంతం చేసుకుంది. ఇది గ్రీన్ టెక్నాలజీ పట్ల కంపెనీ అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. హెచ్‌పీ వోల్ఫ్ ప్రో సెక్యూరిటీ వంటి భద్రతా ఫీచర్లు పెరుగుతున్న ఆన్‌లైన్‌ బెదిరింపుల నుంచి రక్షణ ఇస్తాయని సంస్థ పేర్కొంది.

    ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..

    హెచ్‌పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఇప్సితా దాస్ గుప్తా మాట్లాడుతూ..‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాం. హెచ్‌పీ డివైజ్‌ల్లో పరిశ్రమలు, స్టార్టప్‌లు, వ్యక్తుల సాధికారతలో అర్థవంతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ ఆధారిత పీసీలు పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి. భారతీయ వినియోగదారులు, వ్యాపారాల విభిన్న అవసరాలను ఇవి తీరుస్తాయి’ అని చెప్పారు.

  • 2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.

    ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా 195 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీరందరికీ కంపెనీ ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంస్థ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది.

    భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఏప్రిల్ 18న దాదాపు 240 మందిని తొలగించగా, అంతకు ముందు ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను, మార్చిలో 30 నుంచి 35 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్‌ లెటర్‌ను కూడా సంస్థ అందిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ తొలంగించిన ట్రైనీలందరినీ.. 2022లో నియమించుకుంది.

    ఇదీ చదవండి: అద్దె అపార్ట్‌మెంట్‌లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా..

  • భానుడి ప్రకోపం మరింత ముదురుతోంది. ఈ ఏడాది భారీగానే వేసవి తాపం ఉంటుందని కొన్ని సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సంస్థల నుంచి, రిటైల్‌ స్టోర​్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    ఐసెర్‌ రేటింగ్‌

    సరైన అవగాహన లేక కొందరు  పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్‌ (ఐఎస్‌ఈఈఆర్‌) రేటింగ్‌ చూడాలి. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్‌ రేటింగ్‌ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్‌ రేట్‌ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్‌ స్టార్‌ ఉంటుంది. రేటింగ్‌ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుందని గమనించాలి.

    ఇన్వర్టర్‌తో మేలు

    చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్‌, ఆఫ్‌ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్‌లో చాలా వరకు కన్వర్ట్‌బుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల ఫ్యాన్‌ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.

    ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?

    ధరల మధ్య వ్యత్యాసం

    ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్‌ కొనాలి. వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్‌ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్‌ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్‌ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్‌ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్‌ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి.

Andhra Pradesh

  • విజయవాడ: విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్‌ మధ్య మరో 36 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07031) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది.

    తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది. 

    చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు..
    చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07233) మే 2 నుంచి జూన్‌ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మే 4 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌లలో ఆగుతుంది.  

  • అనంతపురం: సార్‌ .. నా కూతురిని నేను పోషించలేను. మీరే నా కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని కోరుతున్నా. మీ దగ్గరే వదిలి వెళ్లిపోతున్నాను. తన జీవితం బాగుండాలని వేడుకుంటున్నాను. నేను చనిపోతున్నా. నా కూతురిని బాగా చూసుకోండి ప్లీజ్‌. ఒక తల్లిగా ఇది నా ఆవేదన’ అంటూ లెటర్‌ రాసిన ఓ తల్లి వారం వయస్సు కలిగిన ఆడ శిశువును అనాథగా వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన అనంతపురంలోని విజయనగర్‌ కాలనీలో సోమవారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి వచ్చింది. 

    నవజాత శిశువుకు గౌను వేసి చూడముచ్చటగా తీర్చిదిద్దిన తల్లి బిడ్డను అనాథగా వదిలివెళ్లడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. శిశువు ఏడుపు విని అటువైపు వెళ్తున్న వారు గమనించి ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. ఐసీపీఎస్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ చంద్రకళ, చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ కృష్ణమాచారి, సూపర్‌వైజర్‌ నవీన్‌, ఆశా వర్కర్‌ గౌరి ఘటనా స్థలానికి వెళ్లారు. శిశువును అక్కున చేర్చుకొని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడి నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ పసికందు తల్లి తన ఆవేదనను లేఖలో రాసి అక్కడ ఉంచడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

  • ఆయన నవ్వాడంటే అక్కడ శత్రుత్వపు బీజాలు పడినట్టే.. ఆయన కరచాలనం చేశాడంటే.. అక్కడ కేడర్‌ మధ్య అడ్డుగోడలు కట్టినట్టే.. ఆయన ఆలింగనం చేశాడంటే అక్కడ గ్రూపులు ప్రారంభమైనట్టే.. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ పార్టీలో లుకలుకలు మొదలైనట్టే.. ఇదీ నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తీరుపై ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్న అభిప్రాయం. పల్నాడులో శ్రీకృష్ణ‘తలభారం’తో తెలుగుదేశం పార్టీకి బొప్పి కడుతోంది. అమ్మో ఈ ఎంపీ మాకొద్దు బాబోయ్‌ అంటూ తలలు పట్టుకుంటోంది.

    సాక్షి, గుంటూరు: పల్నాడు రాజకీయాల్లో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సరికొత్త భాష్యానికి తెర తీశారు. మామూలుగా పల్నాడు రాజకీయాలంటే ప్రతీకారాలు, ప్రత్యక్ష యుద్ధాలు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అడుగుపెట్టాక కొత్తకోణాన్ని పల్నాడు రాజకీయాలకు పరిచయం చేశాడు. ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోశాడు. తాను అనుకున్నదే జరగాలనే ఒంటెత్తు పోకడలతో కేడర్‌ మధ్య చిచ్చు పెట్టారు. ఇలా తన రాజకీయ ప్రస్తానంలో పైకి సౌమ్యుడిలా.. లోన కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు.  

    వర్గపోరుకు కేరాఫ్‌.. 
    గతంలో వైఎస్సార్‌ సీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణ దేవరాయలు 
    పారీ్టలో వర్గ పోరు కొనసాగించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజిని, అప్పటి వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో విభేదాలు ఉండేవి. గురజాలలో కాసు మహేష్‌రెడ్డికి పక్కలో బల్లెంలా మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రూప్‌ రాజకీయాలను పెంచి పోషించాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు.  మిగిలిన నియోజకవర్గ ఎమ్మెల్యేలతోనూ పైకి స్నేహపూర్వకంగా ఉన్నట్టు నటిస్తూ అంటీముట్టనట్లు వ్యవహరించే వారు. తనకంటూ అన్ని నియోజకవర్గాలలో ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించేవారు. 

    అందుకే జగన్‌ పక్కన పెట్టేశారు..
    వైఎస్సార్‌ సీపీలో చేరిన శ్రీకృష్ణదేవరాయలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయాల్లో యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఇచ్చారు. అక్కడ గెలుపొందిన శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని, ఎమ్మెల్యేలంతా తన తర్వాతే అనే ధోరణిలో వ్యవహరించే వారు. ఇది అప్పటి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలకు  తలనొప్పిగా మారింది.

    ఈ విషయాలపై శ్రీకృష్ణదేవరాయలును వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సున్నితంగా మందలించారని కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి రజిని బహిరంగంగా చెప్పారు.  తాము అధికారంలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని మీడియా ముఖంగా మాజీ మంత్రి విడదల రజిని కుండబద్దలు కొట్టారు. దీనిపై స్పందించిన ఎంపీ.. నాలుగు ముక్కలు చెప్పి వేరే విషయాలు మాట్లాడి చేతులు దులుపుకొన్నారని, దీటైన జవాబు ఇవ్వలేకపోయాడని తెలుగుదేశం పార్టీ వర్గాలే పెదవి విరిచాయి. తనను ఎంపీగా గెలిపించిన పార్టీ, ఎమ్మెల్యేలకు మోసం చేయడంతోనే వైఎస్సార్‌ సీపీ నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన పెట్టేశారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ తలనొప్పి మాకు తగులుకుందని వాపోతున్నారు.

    టీడీపీలోనూ అదే పంథా.. 
    కూటమి తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీగా రెండోసారి గెలిచారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో గ్రూపు రాజకీయాలు నడిపారు. టీడీపీలోకి చేరే సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కొన్ని కండీషన్లు పెట్టిమరి కండువా కప్పుకున్నారని సమాచారం. అందులో భాగంగా గురజాలలో జంగా కృష్ణమూర్తిని ప్రోత్సహించి యరపతినేనికి టికెట్‌ రానీయకుండా పావులు కదిపారనే ప్రచారం నడిచింది.   

    = నరసరావుపేటలో బీసీ అభ్యర్థి అరవింద్‌ బాబుకు చివర వరకు బీఫారం రాకుండా అడ్డుకున్నారు. జనసేన నేత జిలాని, కొంతమంది టీడీపీ నేతలతో జట్టు కట్టి అక్కడ కుట్రలకు తెర తీశారు. ఆ సమయంలోనే అరవింద్‌ బాబు, శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు పొడచూపి బహిరంగంగా తిట్టుకొనే వరకు వెళ్లాయి. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావొస్తున్నా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు.  

    ⇒ ఇక చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావును కాదని మర్రి రాజశేఖర్‌ వర్గాన్ని ఆదరిస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌కే పేట ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారన్న ప్రచారంతో పత్తిపాటి వర్గం గుర్రుగా ఉంది.   

    ⇒ వినుకొండలో తనతోపాటు వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే  మక్కెనను ఎంపీ ప్రాధాన్యత ఇవ్వడంతో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వర్గం జీరి్ణంచుకోలేకపోతోంది. గతంలో బొల్లాకు ఇలానే తలనొప్పి తెప్పించారని గుర్తుచేసుకుంటున్నారు.   

    ⇒ మాచర్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా సొంతపారీ్టలోనే మరో గ్రూపు కడుతున్నారు. ఈ వర్గం ద్వారా బ్రహ్మారెడ్డికి ఇక్కట్లు తీసుకొస్తున్నారు. వైఎస్సార్‌ సీపీలో వర్గ రాజకీయాలు చేసిన లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరిన తర్వాత అదే పంథా కొనసాగిస్తున్నారు. నచ్చిన వారు ఎన్ని తప్పులు చేసినా అందలమెక్కిస్తారని, నచ్చకపోతే వారిని అధఃపాతాళానికి తొక్కుతారనే విమర్శలు ఉన్నాయి.  

     

     

  • ,

    గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారు

    డీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్‌ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

    పవన్‌ కాన్వాయ్‌ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్‌ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు.

  • సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా అదే పారీ్టకి చెందిన నేతలు, సానుభూతిపరుల పేర్లు వినిపిస్తుండటం అధికార టీడీపీని కలవరపెడుతోంది. హత్యలో పాల్గొన్నది, మొదలు వ్యూహరచన చేసింది అందరూ ఆ పార్టీ వారేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది తమ పార్టీకి ఎక్కడ చెడ్డపేరు తెస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. హత్యకు గురైన వీరయ్య చౌదరి, పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన అనుమానితుడికి తెలుగుదేశం పార్టీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

     ఈ నెల 22వ తేదీ రాత్రి 7.30 గంటలకు నగరంలోని ఎస్పీ కార్యాలయానికి, తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జాతీయ రహదారి పక్కనున్న భవనంలో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. ముసుగులు ధరించిన నలుగురు యువకులు కేవలం మూడు నిముషాల్లోనే ఆయన శరీరంలోకి 53 కత్తి పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమ్మనబ్రోలు చేరుకుని వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఇంత దారుణానికి పాల్పడిన హంతకులు భూమి మీద ఉండడానికి అనర్హులని ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టేదిలేదని హెచ్చరించారు. 

    దీంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం చీమకుర్తి బైపాస్‌ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక దాబా సమీపంలో హంతకులు వినియోగించిన స్కూటీ లభించింది. దీంతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించినట్లయింది. కేసు కీలక మలుపు తిరిగింది. స్కూటీ ఆధారంగా చేసిన విచారణలో వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ యువనేత ప్రధాన నిందితుడిగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కూటీ స్వా«దీనంతో లభించిన ఆధారాలతో నగరానికి చెందిన కొప్పోలు వాసి ప్రధాన పాత్రధారిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే రెండో వాహనాన్ని కూడా స్వా«దీనం చేసుకోవడంతో హత్యలో పాల్గొన్న మిగిలిన ముగ్గురూ జిల్లా వాసులుగానే గుర్తించారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.   

    జిల్లా టీడీపీ నేతల్లో కలకలం... 
    వీరయ్య హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు అదుపులో ఉన్న టీడీపీ యువనేతకు ఆ పారీ్టలోని ముఖ్య  నాయకులందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తోంది. స్థానిక నాయకులతో పాటు జిల్లాకు చెందిన కీలక ఎమ్మెల్యేలు, మంత్రులతో సదరు వ్యక్తి అత్యంత సన్నిహితుడిగా మెలిగేవాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడా నాయకులు తేలుకుట్టిన దొంగల్లా మౌనం పాటిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు ఎటుపోయి ఎటు వస్తుందో, చివరికి ఎవరి తలకు చుట్టుకుంటుందోనని కలత చెందుతున్నారు. అలాగే ప్రచారంలో ఉన్న హవాలా వ్యాపారికి, రేషన్‌ బియ్యం డాన్‌కు సైతం టీడీపీ నేతలతో మంచి  సంబంధాలున్నాయని ప్రచారం.   అలాగే హత్యలో పాల్గొన్న ప్రధాన అనుమానితుడికి సైతం ఆ పారీ్టతో లింకులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను ఇరుకున పెడుతోంది.

    వీరయ్య కేసును ఏం చేస్తారు... 
    వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితులు భూమి మీద ఉండేందుకు అర్హులు కారని చెప్పడం, నిందితులు ఎంతటి వారైనా ఒదిలిపెట్టేది లేదనడంతో ఈ కేసు గురించి ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. హత్యకు గురైన వీరయ్య చౌదరి టీడీపీకి చెందిన నాయకుడు కావడం, హత్యలో ప్రధాన అనుమానితుడిగా పోలీస్‌ కస్టడీలో ఉన్న యువనేత కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో ఇప్పుడీ కేసును ఏం చేస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిజంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు నిందితులను కఠినంగా శిక్షిస్తారా? లేక క్రమంగా నీరుగార్చేందుకు ప్రయత్నిస్తారా? అనే అంశాలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మిగతా వారు కూడా అధికార పారీ్టకి చెందిన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అధికార పార్టీ స్థానిక నాయకులతో, రాష్ట్రంలోని కీలక నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు కావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది.

    డైలమాలో పోలీసులు...
    వీరయ్య కేసులో పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. హత్య జరిగి దాదాపు ఎనిమిది రోజులు కావస్తున్నా ఇంతవరకూ ఒక కొలిక్కి రాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి హతుడు వీరయ్య చౌదరి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. మద్యం సిండికేట్, బియ్యం మాఫియా, భూ, ఆర్థిక వివాదాలున్నాయి. అయినా ఆయన టీడీపీ నాయకుడు కావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో సంబంధాలు కలిగి ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ కేసు పోలీసులకు పలు సవాళ్లు విసురుతోంది.

     విచారణలో అనుమానితులంతా టీడీపీ నాయకులే కావడంతో పాటు వారికి జిల్లా టీడీపీ నాయకులతో, మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు సమాచారం. స్కూటీ లభించిన రోజు టీడీపీ మీడియా చానళ్లలో అధికార పార్టీ నేతల ప్రమేయాన్ని పేర్లతో సహా ప్రసారం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు రోజుకో పేరు తెరపైకి వస్తున్నాయి. 

    ఈ కేసు మరకలను ఇతర పారీ్టలకు అంటగట్టేలా ఆ పత్రికల్లో కథనాలు వస్తుండటంతో కేసు పక్కదోవ పడుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల వద్ద నుంచి కూడా పోలీసులకు ఒత్తిడి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా ఇతర పారీ్టలకు చెందిన వారి పేర్లను ప్రచారంలోకి తెస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

Telangana

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.

    ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు అమ్మకాలు జరిగాయని.. నిన్న ఐదు చోట్ల సోదాలు చేపట్టామని ఈడీ ప్రకటించింది. మునావర్ ఖాన్ ఫామ్ హౌస్‌లో పార్కు చేసిన 25 కార్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మునావర్ ఖాన్, లతీఫ్, అక్తర్ సుకుర్ ఇళ్లలో జరిపిన సోదాల్లో 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. విదేశీ కరెన్సీతో పాటు 23 లక్షల నగదు సీజ్ చేశాం’’  అని అధికారులు తెలిపారు

    కుదురున్నీసా, మునావర్‌ఖాన్‌ ఇళ్లలో సోదాలు చేశాం. మునావర్‌ఖాన్‌ ఫామ్‌ హౌస్‌లోని పత్రాలను సీజ్‌ చేశాం. ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు సాగించారు. తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారు. ప్రముఖులు, రియల్టర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించాం. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి విక్రయాలు జరిపారు’’అని ఈడీ అధికారులు వెల్లడించారు.

  • భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.

    కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే  ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

    దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

  • హైదరాబాద్‌, సాక్షి: మేడిగడ్డ ప్రాజెక్టు కట్టింది.. కూలిపోయింది.. ఈ విషయాన్ని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికగా ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదికపై తెలంగాణ సచివాలయంలో మంగళవారం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించారాయన. 

    తెలంగాణ ఆర్టిక వ్యవస్థకు సంబంధించింది బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిరంతరం బీఆర్‌ఎస్‌వాళ్లు తప్పుడు ప్రచారాలు చేశారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం.. 38వేల కోట్లతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అనాడు వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్‌, రీ డిజైనింగ్‌ చేసింది. కమిషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచింది. కమీషన్లకక్కుర్తి కోసం ప్రాణహిత డిజైన్‌ మార్చింది. చివరకు తుమ్మిడిహెట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజి...మేడిగడ్డ వద్ద వంద మీటర్ల హైట్ తో కట్టారు. దీని వల్ల ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు తీవ్ర నష్టం జరిగింది. 

    తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. బ్యారేజీల నిర్మాణ సమయంలోనే లోపాలు తెలిసినప్పటికీ సరిదిద్దుకోలేదు. సుందిళ్ల, అన్నారం దగ్గర సాయిల్‌ టెస్ట్‌ చేయలేదు. ప్రారంభానికి ముందే లోపాలు బయటపడ్డాయి.. కానీ, బీఆర్‌ఎస్‌ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర నష్టం జరిగింది. కాళేశ్వరం డిజైన్లు ఒకలా ఉంటే.. మరోలా నిర్మాణం చేశారు. ప్రాజెక్టు కోసం 85 వేల కోట్లు అంచనా వేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం లోన్లు ఇవ్వలేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కూలింది. 

    NDSA మేడిగడ్డ పరిశీలనకు వచ్చింది గత ప్రభుత్వం పాలనలోనే. మేడిగడ్డ లో డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని NDSA రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలోనే ఇచ్చారు. NDSA అథారిటీ బిల్లుకు పార్లమెంట్‌లో BRS మద్దతు పలికింది. దేశంలో 5600 బ్యారేజీలు, డ్యామ్‌లను ఎన్‌డీఎస్‌ఏ పర్యవేక్షిస్తోంది. దేశంలో ఏ బ్యారేజీకి ఎలాంటి సమస్య వచ్చినా NDSA నుంచే అభిప్రాయం చెప్తుంది. NDSA లో జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అలాంటిది NDSA నిపుణులను సైతం BRS నాయకులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. 

    కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై లక్షన్నర కోట్ల భారం పడుతోంది. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులకు మిత్తి ఏడాదికి 16వేలు కట్టాల్సి వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌కు లేఖ చేశాం. 14 నెలలు పరిశీలించి నివేదిక రూపొందించింది. గత ప్రభుత్వ కక్కుర్తి వల్ల చాలా నష్టం జరిగింది తుమ్మెడిహట్టి దగ్గర రెండు ప్రాజెక్టులు కడతామన్నారు. తట్టెడు మట్టి కూడా పోయలేదు. పైగా అక్కడ నీటి లభ్యత లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

    మేడిగడ్డ ప్రాజెక్టు.. లొకేషన్‌ పెద్ద మిస్టేక్‌. అది కూలినప్పుడు కేసీఆర్‌ సీఎంగా ఉన్నారు. వాల్స్‌, భీమ్స్‌లో రంధ్రాలు వచ్చాయని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొంది. ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా?. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు. 

    కాళేశ్వరాన్ని ఉపయోగించుకునే స్థితి లేదని ఎన్‌డీఎస్‌ఏ చెప్పింది. రీడిజైన్‌ చేసి నిర్మాణం చేయాలని చెప్పింది. రిపోర్ట్‌ ఆధారంగానే ముందుకు వెళ్తాం ప్రాజెక్టు తప్పిదాలకు కారణమైన అధికారుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయి. అధికారులు తప్పిదాలు చేయడానికి కారణమైన వ్యక్తి గత ప్రభుత్వ పెద్ద కేసీఆర్ . చట్టప్రకారం గత ప్రభుత్వ పాలకులు, అధికారులపై చర్యలు ఉంటాయి. రాబోయే కేబినెట్‌ భేటీలో NDSA రిపోర్ట్ పై చర్చ జరుపుతాం. క్యాబినేట్ లో చర్చించిన తర్వాత ప్రాజెక్టు పై తదుపరి కార్యాచరణ ప్రకటన చేస్తాం.

  • సాక్షి, హైదరాబాద్‌: పలువురు ఐపీఎస్‌లు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంలో (Bhoodan Land Issue) కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 26 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ నెల 24న సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్‌రెడ్డి తీర్పు వెల్లడించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్‌లు అప్పీల్ చేశారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా అప్పీల్ పిటిషన్‌ దాఖలు చేశారు.

    కాగా, రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

    తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్‌ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది.

    తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్‌ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్‌ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు.

    ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గత గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్‌ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్‌ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు.

    కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్‌ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్‌ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు.

    అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్‌ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్‌ నోటీసులు పంపారు.

    క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 12కు వాయిదా వేశారు.

  • హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. రేపు.. అంటే ఏప్రిల్‌ 30వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నాం 1గం.కు రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని సమాచారం. 

    మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం పూర్తి కావడంతో రిజల్ట్స్‌ రిలీజ్‌ కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం విద్యా శాఖ ఎదురు చూసింది. ఈలోపు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో పలితాలు విడుదల చేస్తోంది.

     ఈసారి మెమోలో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడులు ఇవ్వనున్నారు. త్వరగతిన.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్‌ చేసుకునేందుకు https://education.sakshi.com/ క్లిక్‌ చేయండి.

  • సాక్షి, హైదరాబాద్: గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్‌ బానోతు సుజాత నాయక్‌ పోలీసులలతో పాటు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

    కార్పొరేటర్‌ బానోత్‌ సుజాత నాయక్‌ ఫిర్యాదుతో Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై వివరణ, విచారణకు హాజరవ్వాలంటూ మహిళా కమిషన్‌ సైతం  ఆయనకు నోటీసులు జారీ చేసింది.  

    ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం, ఎమ్మెల్యే సుధీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాను. కావాలని నాపై రాజకీయ కక్షతో పిర్యాదు చేశారు. ఈ అంశంపై లీగల్‌గా ఫైట్ చేస్తాను’అని వ్యాఖ్యానించారు.

    వివాదం నేపథ్యం ఇదే 
    గత నెలలో ఎల్బీ నగర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్‌ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..

    కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనకు దిగారు.దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేసి అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి..పీఎస్‌కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్‌ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు.వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్‌కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.

    ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్‌ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్‌ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. 

  • సాక్షి, మేడ్చల్‌: సోషల్‌ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. జవహర్‌నగర్‌లో రీల్స్ చేస్తూ తరుణ్‌(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్‌ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. 

    స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

    కాగా, కొంత‌మందిలో సోష‌ల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.  త్వ‌ర‌గా ఫేమ‌స్ అయిపోవాల‌ని, త‌మ వీడియోలు వైర‌ల్ అవ్వాల‌ని కొన్నిసార్లు ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్ట‌లు చేయ‌కూడ‌ద‌ని ఎంత‌మంది చెప్పినా త‌మ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తెచ్చుకోవ‌డం లేదు.

     

     

     

     

  • సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ట్యూషన్ టీచర్ నిర్వాకం వెలుగులోకి రావడంతో బాలుడు తండ్రి ఖంగుతిన్నాడు. సదరు టీచర్‌.. బాలుడి వద్ద నుంచి దాదాపు రెండు లక్షలు తీసుకున్నట్టు తండ్రి గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పట్టించుకోకపోవడంతో హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.

    వివరాల ప్రకారం.. జీడిమెట్ల పరిధిలో కమల్ నివాసం ఉంటున్నారు. కమల్‌ కుమారుడు.. స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్‌ టీచర్‌ వద్దకు ట్యూషన్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్‌ వస్తున్న బాలుడిని సదరు టీచర్‌ డబ్బులు అడగంతో అతడు తన ఇంట్లో మనీ దొంగతనం చేసి టీచర్‌కు ఇస్తున్నాడు. ఇలా పలుమార్లు డబ్బులు దొంగలించి.. రెండు లక్షలకుపైగా టీచర్‌కు ఇచ్చాడు. ఇక, ఇటీవలే.. ఐఫోన్‌ కూడా టీచర్‌కు ఇచ్చాడు.  

    ..తనకు ఫోన్‌ వద్దని.. డబ్బులే కావాలని సదరు టీచర్‌ అడగటంతో సదరు బాలుడు ఫోన్‌ అమ్మకానికి పెట్టాడు. అనంతరం, ఆ డబ్బులను మళ్లీ టీచర్‌కు అందజేశాడు. ఈ నేపథ్యంలో మొబైల్‌ షాప్‌ ఓనర్‌.. బాలుడి తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు విషయంలో కమల్‌కు తెలియడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, వెంటనే కమల్‌.. జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు. అయితే, అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో కమల్‌.. తాజాగా హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Family

  • శ్రీశైలం టెంపుల్‌: శ్రీగిరిలో వెలసిన మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు క్షేత్ర పరిధిలో సందర్శించే స్థలాల్లో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. దక్షిణ భారత దేశంపై దండయాత్రకు వచ్చిన మొఘలు చక్రవర్తులను మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ తరిమికొట్టారు. ఆయనకు శ్రీశైల క్షేత్రానికి ఎంతో అనుబంధం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 1630లో జన్మించగా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన 16వ ఏటా నుంచి యుద్ధాలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా 1677లో దక్షిణ భారతదేశం నుంచి దండయాత్ర మొదలు పెట్టి ముందుగా శ్రీశైలం చేరుకున్నారు. స్వతహాగా అమ్మవారి భక్తుడైన ఆయన అమ్మవారి దర్శనార్థం శ్రీశైలంలోనే 10 రోజుల పాటు బస చేశారు.

    శ్రీశైలంలో ప్రస్తుతం నిర్మించిన ధ్యాన కేంద్రం ప్రదేశంలో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ధ్యానం చేశారు. ఆయన సాధనకు మెచ్చిన భ్రమరాంబాదేవి సాక్షాత్కరించి దివ్య ఖడ్గాన్ని శివాజీకి ప్రసాదించారని, అందుకు సాక్షంగా ఇప్పటికీ శ్రీశైల ఆలయ ప్రాంగణంలో విగ్రహం కూడా ఉంది. శ్రీశైల ఆలయ ఉత్తర గోపురాన్ని శివాజీ 1677లో శ్రీశైలయానికి వచ్చినప్పుడు తన సైన్యంతో నిర్మించారని తెలుస్తోంది. రామచంద్ర పంత్‌ అనే తన మంత్రిని సుమారు 2 ఏళ్ల పాటు శ్రీశైలంలోనే ఉంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివాజీ ధ్యానం చేసిన ప్రాచీన కట్టడం శిథిలం కావడం అక్కడే శివాజీ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఛత్రపతి శివాజీ బస చేసిన ప్రదేశంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు.  

    శివాజీ స్ఫూర్తి కేంద్రం విశేషాలు ఇవి..  
    1975లో శ్రీ శివాజీ మెమోరియల్‌ కమిటీ ఏర్పాటయ్యిది. 1983లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత దాదా పాటిల్‌ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అంచలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. 1994లో పట్టాభిషక్తుడైన శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2004లో నిర్మాణాలు అన్ని పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.  

    ఈ కేంద్రంలో పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ (Chatrapati Shivaji) క్యాంస విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే 10 మందితో కూడిన శివాజీ మంత్రి మండలి సాక్షాత్కరించేలా దర్బార్‌ నెలకొల్పారు. శివాజీ జీవిత చరిత్రను పర్యాటకులు తెలుసుకునేలా ఫైబర్‌ మెటీరియల్‌తో 23 బ్లాక్‌లలో త్రీడీ చిత్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, కనడ భాషలలో జీవిత చరిత్ర విశేషాలను వివరించారు.  

    దర్బార్‌ హాల్‌పక్కనే శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశంగా ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ధ్యాన కేంద్రాన్ని పూర్తి రాజస్థాన్‌ మెటీరియల్‌తో నిర్మించారు. ఈ మందిరం పెద్ద కోటను తలపిస్తుండడంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ధ్యాన కేంద్రంలో శివాజీ ధాన్య ముద్రలో ఉన్న విగ్రహంతో పాటు శివాజీ వినియోగించిన ఖడ్గాన్ని చూడవచ్చు. 

     

    శివాజీ కాంస్య విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించారు. జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (శిల్పాలు తయారు చేసే) కళాశాలలో ఈ విగ్రహాన్ని ఖాన్‌ విల్‌ ఖర్‌ అనే శిల్పి తయారు చేశారు. ఛత్రంతో కలిపి 12 అడుగుల ఎత్తుతో, 4.5 టన్నుల బరువుతో ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు.  

    శివాజీని ఎప్పుడు గుర్రం పైనే చూస్తాం. కానీ శ్రీశైలంలో మాత్రం సింహాసనంపై కూర్చుని, శివాజీ ధరహాసంతో కనిపిస్తారు. శివాజీపైన (ఛత్రం) గొడుగు ఉండడం విశేషం.

    చ‌ద‌వండి: స‌జీవ క‌ళ‌.. ఆద‌ర‌ణ లేక‌!  

    2021లో పుణేకు చెందిన చిత్ర కల్పక్‌ శిల్ప కళాశాలలో దర్బార్‌హాల్‌లో శివాజీ జీవిత విశేషాలతో ఫైబర్‌ మెటీరియల్‌తో త్రీడీ పిక్చర్స్‌ను తయారు చేయించి ఏర్పాటు చేశారు.  

  • చార్టర్డ్ అకౌంటెంట్ అవ‌డం అంటే మామూలు విష‌యం కాదు. దేశంలోనే అత్యంత క్లిష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో ఒక‌టైన సీఏ ఎగ్జామ్‌లో పాస‌వ‌డం కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప్రిపేర్ అవుతుంటారు. సీఏ ప‌రీక్ష‌ల్లో నెగ్గేందుకు ఏళ్ల‌బ‌డి పుస్త‌కాల‌తో కుస్తీ ప‌ట్టేవారెంద‌రినో మ‌నం చూసుంటాం. అయితే నందిని అగ‌ర్వాల్ అలా  కాదు. అత్యంత చిన్న‌వ‌య‌సులోనే సీఏ ఫైనల్స్‌ క్లియ‌ర్ చేయ‌డ‌మే కాదు, ఏకంగా ఆలిండియా టాప‌ర్‌గా నిలిచి ప్ర‌పంచ రికార్డు సాధించింది. ఇది జ‌రిగి నాలుగేళ్ల‌యింది. తాను ఎంచుకున్న రంగంలోనే కెరీర్ కొనసాగిస్తూ డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్‌గానూ రాణిస్తోంది నందిని.

    అన్న‌య్యకు క్లాస్‌మేట్‌!
    మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మొరెనా ప‌ట్ట‌ణానికి చెందిన నందిని అగ‌ర్వాల్ (Nandini Agrawal) యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా 2021లో గిన్నీస్ రికార్డు సృష్టించింది. ఆ ఏడాది జూలై జ‌రిగిన సీఏ (న్యూ) ప‌రీక్ష‌ల్లో ఫ‌స్ట్ ర్యాంక్‌తో ఆలిండియా టాప‌ర్‌గా నిలిచింది. 19 ఏళ్ల 8 నెల‌ల 18 రోజుల వ‌య‌సులో ఆమె ఈ ఘ‌న‌త సాధించిన‌ట్టు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వెబ్‌సైట్‌ వెల్ల‌డించింది. 2001, అక్టోబ‌ర్ 18న నందిని జ‌న్మించింది. చ‌దువులో ఎంతో  చురుగ్గా ఉండే నందిని.. రెండు క్లాసులు జంప్ చేసి త‌న అన్న‌య్య స‌చిన్‌కు క్లాస్‌మేట్‌గా మారింది. చెల్లెలితో పాటు సీఏ ఫైనల్స్‌ రాసిన స‌చిన్‌కు 18వ ర్యాంక్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇక సీఏ ఇంట‌ర్‌ను 16 ఏళ్ల వ‌య‌సులో పూర్తి చేసింది నందిని. ఆలిండియా 31వ ర్యాంక్ సాధించి స‌త్తా చాటింది.

    వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ కంపెనీల్లో జాబ్‌
    నందిని ప్ర‌స్తుతం ప్రైవేటు ఈక్విటీ ఎన‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. అంత‌కుముందు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ కార్పొరేట్ కంపెనీల్లో ప‌నిచేశారు. పీడ‌బ్ల్యూసీ కంపెనీలో ఆర్టిక‌ల్ ట్రైయినీగా కెరీర్ మొదలు పెట్టిన ఈ యంగ్ టాలెంట్ గాళ్ అంచెలంచెలుగా ఎదిగారు. స్టాట్యూటరీ ఆడిట్‌, గ్రూప్ రిపోర్టింగ్, రెఫర్డ్ రిపోర్టింగ్, IFRS అసైన్‌మెంట్‌లు, టాక్స్ ఆడిట్‌, ఫోరెన్సిక్ ఆడిట్‌లలో త‌న‌కు మూడేళ్ల‌ అనుభవం ఉందని త‌న లింక్డ్‌ఇన్ బయోలో రాసుకున్నారు నందిని. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో ఒకటిన్నర సంవత్సరాలు అసోసియేట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసిన‌ట్టు వెల్ల‌డించారు. BCGలో కీల‌క‌మైన‌ G20 టీమ్‌లోనూ ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: క‌ళ్ల త‌ప్పిన బైండ్ల బ‌తుకులు

    సోష‌ల్ మీడియాలోనూ సంచ‌ల‌నం
    డిజిట‌ల్ కంటెంట్ క్రియేట‌ర్‌గా త‌న‌దైన స్ట‌యిల్‌లో దూసుకెళుతోంది నందిని అగ‌ర్వాల్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 74 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లోనూ ఆమెకు 2 ల‌క్ష‌ల‌కు పైగా స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. సీఏ ఎగ్జామ్స్ ప‌రీక్ష‌ల సంబంధించిన స్ట‌డీ టిప్స్ వీడియోల‌ను యూట్యూబ్‌లో ఆమె షేర్ చేస్తుంటుంది. 

  • హైద‌రాబాద్ తెలంగాణ‌లో వేస‌వి ముదురుతోంది. ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. అదే స‌మ‌యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజ‌న్‌ల కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) త‌న నివేదిక‌లో తెలిపింది. డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు స‌రిగా లేక‌పోవ‌డం, విప‌రీతంగా ఎండ‌ల్లో తిర‌గ‌డం వ‌ల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌తో రావ‌డంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్స‌లు చేస్తున్నారు. వేస‌వి అంటేనే “స్టోన్ సీజ‌న్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీల‌కు చాలా ప్ర‌మాదం ఉంటుంది. ప్ర‌ధానంగా శ‌రీరంలో నీరు ఆవిరి అయిపోవ‌డం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం, త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వేస‌విలో కిడ్నీల‌లో రాళ్లు ఎక్కువ‌గా ఏర్ప‌డ‌తాయి.

    ప్ర‌ధానాంశాలు: 

    • రోజుకు స‌గ‌టున 300 నుంచి 400 వరకు కిడ్నీలో రాళ్ల కేసులు వ‌స్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇది బాగా ఎక్కువ‌. 

    • రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. 

    • జంక్ ఫుడ్ తిన‌డం, ఎక్కువ‌గా క‌ద‌ల‌క‌పోవ‌డం, త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డంతో పిల్ల‌లు, యువ‌త‌లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌వుతోంది. 

    • 10-17 సంవ‌త్స‌రాల మ‌ధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాఠ‌శాల‌లో ఉన్న‌ప్పుడు నీళ్లు తాగ‌క‌పోవ‌డం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తిన‌డం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కార‌ణం. 

    • పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల‌కు ఈ స‌మ‌స్య కొంత త‌క్కువే (సుమారు 40% త‌క్కువ‌). కానీ, గ‌ర్బ‌వ‌తులుగా ఉన్న‌ప్పుడు ఈ స‌మ‌స్య వ‌చ్చి, గుర్తించ‌క‌పోతే ముప్పు ఎక్కువ‌. 

    • పిల్ల‌ల్లో ఈ స‌మ‌స్య వ‌ల్ల దీర్ఘ‌కాలంలో వారి కిడ్నీల ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది.

    ఈ సంద‌ర్భంగా ఏఐఎన్‌యూకు చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ తైఫ్ బెండెగెరి మాట్లాడుతూ, “కిడ్నీలో రాళ్ల కేసులు ఈసారి అసాధార‌ణంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్ల‌లు, యువ‌త‌లో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.  వేడి పెరిగిపోవ‌డం, త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు. పాఠ‌శాల‌కు వెళ్లే పిల్ల‌లు జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వారికి ఈ కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య ఎక్కువ అవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ రాళ్ల స‌మ‌స్య కేవ‌లం పెద్ద‌వాళ్ల‌ది అనుకోకూడ‌దు. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌తో పాటు పాఠ‌శాల‌లు కూడా దీనిపై అవ‌గాహ‌న పొందాలి. త‌గినంత నీళ్లు తాగ‌డం, స‌రైన ఆహారం తీసుకోవ‌డం, స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా గుర్తించ‌డం వ‌ల్ల చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా.. వేస‌వి నెల‌ల్ల ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క తీసుకోవాలి” అని సూచించారు.

    జాగ్ర‌త్త‌గా ఉండండిలా...

    • త‌గిన‌న్ని నీళ్లు తాగాలి. మూత్రం స్ప‌ష్టంగా, లేత‌రంగులో ఉండేలా చూసుకోవాలి.

    • ఉప్పు, ప్రాసెస్డ్ ఆహారం, జంతువుల కొవ్వు ప‌దార్థాల వాడ‌కం త‌గ్గించాలి. 

    • ముఖ్యంగా పిల్ల‌ల్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ చిరుతిళ్లు, కూల్ డ్రింకుల వాడ‌కం మానేయాలి.

    • స్కూల్లో ఉన్న‌ప్పుడు, ఇళ్ల ద‌గ్గ‌ర కూడా త‌గిన‌న్ని నీళ్లు తాగేలా చూడాలి

    • కుటుంబంలో ఎవ‌రికైనా గ‌తంలో కిడ్నీ రాళ్లు ఏర్పడితే మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి.

    ఎప్ప‌టిక‌ప్పుడు కిడ్నీ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా పిల్ల‌ల‌కు కార‌ణం లేకుండా క‌డుపునొప్పి రావ‌డం, త‌ర‌చు మూత్ర విస‌ర్జ‌న‌కు ఇబ్బంది ప‌డ‌డం లాంటి ల‌క్ష‌ణాలుంటే వెంట‌నే వైద్యుల‌కు చూపించాలి. త‌గిన‌న్ని నీళ్లు తాగ‌డం చాలావ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ను దూరం పెడుతుంది.

  • ఒకటి రెండు కప్పలు సింక్ కింద ఉంటే చాలు, ఇంట్లో బొద్దింకల బెడద తీరిపోతుందని రోమ్ వాళ్ల అమ్మ ఎప్పుడూ అంటుండే వారు. ఆలోచించి చూస్తే, మా అస్తవ్యస్థమైన తోటలాగే, కప్పలు మా ఇంటిలో గుమిగూడి, గంపలు తెంపలుగా చేరాయి, అచ్చం ఆ చెట్టుకప్పల దాడి లాగ. అడవి దారిలో నడిచినట్టు, ప్రతి రాత్రి నేను నా చెప్పులు తొడగని కాలిని ఎక్కడ పెడుతున్నానో చూసుకోవలసి వచ్చేది. నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఆ అద్భుత-పరిమాణం గల జిగురోడే కప్ప మలం ఎగిరోచ్చి నా పాదాలకు అంటుకునేది. నేను ఏమి చేస్తున్నా మరచిపోయి, ఆ నల్ల ‘కప్ప జిగురుని’ కడుక్కోవడానికి వెంటనే కుంటూ కుంటూ వెళ్ళాల్సొచ్చేది. అలా కొన్ని రాత్రి సంఘటనల తరువాత నేను ఆ కప్పల్ని ఇంటి నుంచి అవతల విసిరేశాను కానీ అవి నా కోపాగ్నిని ఎదురుకోవడానికి భయం లేకుండా తిరిగి వచ్చాయి.

    వాటిని నేనొక ప్లాస్టిక్ డబ్బాలోకి పోగు చేసి, ఒక 250 మీటర్లు అవతల, ఇంటి ముందుపెరటి చివర్న వదిలాను. అవి ఒక మొండి ధైర్యంతో తిరిగి వచ్చాయి. నేను 500 మీటర్ల దూరంలో వాటిని వదిలేముందు వాటికి ముద్ర వేసి (గుర్తించడం కోసం), డబ్బాని గిరగిరా గుండ్రంగా తిప్పి  తోటలో వాటిని చాలా గజిబిజిగా త్రోవ మార్చి తిప్పాను (అయోమయం సృష్టింద్దామని అనుకున్నా).  కానీ అవి 25 గంటల్లో తిరిగి వచ్చాయి.

    ఆడ-రాక్షసి వాటికోసం వస్తే వాటి భాగ్యంలో ఏముందో ఈ పాటికి ఆ వేధించే జీవులకి అర్ధమయ్యింది. అవి బాధలో కీచుమన్నాయి, వణుకుతూ ఎక్కడ పడితే మూత్రం చేసాయి, ఇంకా పట్టుబడకుండా వుండే ప్రయత్నం చేసాయి. నేను ఇంచుమించు క్షమించేశా, కానీ నా కుతూహలం నన్ను ఎగదోసింది. 750 మీటర్లు. 30 గంటల్లో తిరిగి వచ్చాయి. ఆ చిన్న ప్రాణులకి నడవటానికి అది చాలా పెద్ద దూరమే. సీసాని గిరగిరా తిప్పి,  ఒక కిలోమీటర్ దూరంలో  రోడ్డవతల బురదనిండిన పొడవాటి దారిలో తీసుకెళ్లి, అడవిలో నీటి మడుగు దెగ్గర వదిలేశా. వాటిని ఇంటి నుండి తరిమెయ్యడంలో నేను విజయం సాధించాను కానీ, పెరటి బయట కుండీలో ఒక కప్ప జంటని నేను కనుగొన్నాను. అవన్నీ తిరిగివచ్చాయా లేదా కొన్నే తిరిగివచ్చాయా అన్నది నేనిప్పుడు చెప్పలేను. వేరే జంతువులు వాటిని ఇంటి నుండి దూరంగా తీసుకుపోతే ఏం చేస్తాయి?

    నేను వెలికి తీసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో...

    నమీబియాలో ముద్ర వేసి 800 కిలోమీటర్ల దూరంలో వదిలివేసిన ఎనిమిది చిరుతల్లో, 5 నుండి 28 నెలల వ్యవధిలో ఆరు చిరుతలు ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక ఉదాహరణ ఇస్తాను ఉండండి: ఈ చిరుతల్ని చెన్నై నుంచి తీసుకుపోయి గోవాకి కొద్దిగా ఉత్తరాన వదిలినట్టయితే, అవి తిన్నగా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాయాన్నమాట! అమెరికాలో, వాటి ఇంటికి 200 కిలోమీటర్ల అవతల వదిలేసిన 34 నల్ల ఎలుగుబంట్లలో చాలామటుకు విజయవంతంగా వాటి భూభాగానికి తిరిగి వచ్చేశాయి. భారతదేశంలో, టెరాయి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో బక్స పులుల సంరక్షణ కేంద్రంకి మార్చాబడిన ఒక ఏనుగు రెండు నెలల కంటే తక్కువ కాలంలో తిరిగి వచ్చేసింది. ఆస్ట్రేలియాలోని, ఇంటి నుండి 400 కిలోమీటర్ల అవతల వదల బడ్డ ఉప్పునీటి మొసళ్లు తిరిగి వచ్చేసాయ్‌..అదే నన్ను బెంగుళూరులో వదలండి, నేను మరుక్షణం తప్పిపోతాను.

    ఏదేమైనా, దూరాల నుండి ఇంటికి చేరుకోవడంలో ఆరితేరినవి మాత్రం ఆల్బట్రాస్, షీర్వాటర్ వంటి సముద్ర పక్షులదే. మధ్య పసిఫిక్ నుంచి 6,500 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పిన్స్ లో ఉన్న ఒక దీవిలో విడిచి పెడితే, అది ఒక ఆల్బట్రాస్ నెలలో తిరిగి వచ్చింది, మరో రెండు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ (అమెరికా) నుంచి తిరిగి వచ్చాయి.

    ఈ అద్భుత నేర్పు కేవలం పెద్ద జంతువులకు మాత్రమే ఉండదు. U. K లో, వాటి తేనె తుట్ట నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ప్రణాళిక లేకుండా విడిచెయ్యబడ్డ బంబల్ బీ తేనెటీగలు వాటి ఇంటికి తిరిగి వచ్చేసాయి. కాబట్టి, కప్పకు ఒక కిలోమీటర్ ఎంత, ఊఁ?

    ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇంటికి తిరిగి చేరుకుంటాయన్న వాస్తవం బాగా డాక్యుమెంట్ చేయబడింది. కానీ, దూరతీరాలలోని తెలియని భూభాగం నుంచి అవి ఇంటి దారి ఎలా కనుగొంటాయి? 

    ఈ జంతువులను వాటి ఇంటి నుంచి బయట చోటికి మార్చేప్పుడు, అన్ని వైపులా మూసి ఉన్న వాహనాలలో (లేదా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో) తీసుకు వెళతారు కనుక, అవి దారిలో దాటి పోయే దృశ్యాలను, చెట్లను చూసి,  జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం లేదు. చాలా కేసులలో, ఆ జ్వంతువులు తీసుకువెళ్లే దారిలో కాకుండా, దానికి బదులుగా, ఇంటికి రావటానికి డైరెక్ట్ తోవ ఎంచుకున్నాయి. అయితే, అవి అది ఎలా చేస్తాయి?

    -ఇంకా ఉంది

    Author : Janaki Lenin -- జానకి లెనిన్
    Photo credit -  జానకి లెనిన్

  • ఇటీవల అల్లుడితో అత్త పారిపోయిన సంఘటన మరిచిపోకముందే మరో విచిత్రకరమైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ బామ్మ, వరుసకు మనవడయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.   ప్రస్తుతం ఈ స్టోరీ  నెట్టింట వైరల్‌గా  మారింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.  అతడిని పెళ్లి చేసుకోవడం వెనుక  ఉద్దేశం మరేదైనా ఉందా?  అసలేం జరిగింది  తెలుసుకుందాం.

    ఉత్తర్‌ప్రదేశ్‌ అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.  బందుత్వాలు, మానవ విలువలకు తిలోదకాలిచ్చి మనవడి వరసయ్యే వ్యక్తిని ఓ బామ్మ పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల మహిళ ఇంద్రావతి  తన 30 ఏళ్ల మనవడు ఆజాద్‌తో పారిపోయి గోవింద్ సాహిబ్   ఆలయంలో వివాహం చేసుకుంది. సింధూరం పూసుకుని , పవిత్ర అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి, గ్రామం నుండి పారిపోయారు. ఇందుకోసం నలుగురు పిల్లలు, భర్త ( ఇద్దరు కుమారులు ,ఇద్దరు కూతుళ్లు) కుటుంబాన్ని వదిలేసింది.  ఇంతవరకూ ఓకే గానీ. ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే...?

    ట్విస్ట్‌ ఏంటంటే..?
    వారిద్దరూ అంబేద్కర్‌నగర్‌లో  నివసించేవారు.   ఈక్రమంలోనే ఇంద్రావతి, ఆజాద్ ప్రేమలో పడ్డారు.  ఇరు కుటుంబాల మధ్య సాన్నిహత్యం  కారణంగా వీరిని పెద్దగా అనుమానించలేదు. అయితే ఇంద్రావతి భర్త చంద్రశేఖర్, వారు పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వీరిద్దరూ  ఏకాంతంగా మాట్లాడుకోవడం చూశాడు. వద్దని వారించాడు.  నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. వారి వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ ఇద్దరూ దానికి సుతరామూ అంగీకరించలేదు. ఇక అంతే తమకు అడ్డురాకుండా ఎలాగైనా భర్తను తప్పించాలని ప్లాన్‌ వేసింది. ఇందుకోసం  ఇద్దరూ కలిసి కుట్రపన్నారు. ఇంద్రావతి ఆజాద్‌తో కలిసి వారికి విషం ఇవ్వడానికి కుట్ర పన్నిందని ఇంద్రావతి భర్త చంద్రశేఖర్‌ ఆరోపణ.

    చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్‌!

    ఇదే చంద్రశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్రమంగా  ఆజాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాటు, తనతోపాటు తన నలుగురు పిల్లల్ని హత మార్చేందుకు వారిద్దరూ కుట్ర చేశారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితుడు వాపోయాడు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో  తన భార్యకు పెద్ద కర్మ నిర్వహించి "చనిపోయినట్లు" ప్రకటించాలని నిర్ణయించు కున్నాడు.  కాగా ఇంద్రావతి చంద్రశేఖర్‌కు రెండో భార్య.  ఉద్యోగరీత్యా అతను ఎక్కువ క్యాంప్‌లకు వెళ్లేవాడట. ఈ సమయంలో ఇంద్రావతి, అజాద్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని భావిస్తున్నారు. 

    ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?
     

  • ఎన్నో రకాల కేక్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి కేక్‌ని మాత్రం చూసుండరు. అదికూడా సాంకేతికతను, సైన్సుని మిళితం చేసేలా కేక్‌ని రూపొందించారు. అయితే దీనిని భవిష్యత్తులో ఒక పర్పస్‌ కోసమే తయారు చేశారట. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పేస్ట్రీ చెఫ్‌లు కలిసి ఎంతో శ్రమించి తయారు చేశారు. మరిదాన్ని వేటితో తయారు చేశారో సవివరంగా చూద్దామా..!.  

    వినూత్నంగా తయారు చేసిన కేకులు ఇటర్‌నెట్‌లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. అయితే ఈ 'రోబోటిక్‌ కేక్‌' మాత్రం అందుకోసం చేసింది మాత్రం కాదు. దీన్ని తినదగిన సాంకేతికతలో పురోగతికి చిహ్నంగా తయారుచేశారు. ఈయూ నిధులతో కూడిన రోబోఫుడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. దీన్ని ఓ వెడ్డింగ్‌ కేక్‌ మాదిరిగా తయారు చేశారు. స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లౌసాన్ (EPFL), ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) శాస్త్రవేత్తలు, అలాగే లౌసాన్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (EHL) పాక నిపుణులు కలిసి తయరు చేశారు. 

    ఈ నెల ఏప్రిల్ మధ్యలో ఒసాకాలో జరిగిన ఎక్స్‌పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఈ "రోబోకేక్" అత్యంత వినూత్న భాగాలలో ఒకటి తినదగిన రీఛార్జబుల్ బ్యాటరీలు. వీటిని B2, క్వెర్సెటిన్, యాక్టివేటెడ్ కార్బన్, చాక్లెట్‌తో తయారు చేశారు. కేక్‌పై LED కొవ్వొత్తులను వెలిగించడానికి వాటిని ఉపయోగించారు. 

    ప్రముఖ డిజైనర్‌ మారియో కైరోని సమన్వయంతో IIT పరిశోధకులు ఈ బ్యాటరీలను రూపొందించారు. అలాగే ఈ కేక్‌పై రెండు పూర్తిగా తినదగిన రోబోటిక్ టెడ్డీ బేర్‌లు ఉంచారు. వాటిని తయారు చేసేందుకు జెలటిన్, సిరప్, ఫుడ్‌ కలర్స్‌ని ఉపయోగించారు. అంతర్గత వాయు వ్యవస్థ ద్వారా యానిమేట్ చేయబడతాయి. ఇవి ప్రత్యేక మార్గాల ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినప్పుడు, వాటి తలలు, చేతులు కదులుతాయి కూడా. అలాగే రుచికి ఇవి దానిమ్మ గమ్మీల టేస్ట్‌ని కలిగి ఉంటాయి. 

    ఎందుకోసం ఇలా..
    రోబోటిక్స్ ,ఆహారం రెండూ వేర్వేరు ప్రపంచాలు. అయితే, వాటిని ఇలా విలీనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ తినదగిన రోబోట్‌లను అంతరించిపోతున్న ప్రాంతాలకు ఆహారాన్ని అందించడానికి, మింగడంలో ఇబ్బంది ఉన్న వ్యక్తులకు లేదా జంతువులకు వినూత్న మార్గాల్లో మందులను అందింవచ్చట. 

    పైగా తినగలిగే సెన్సార్‌లను ఉపయోగించి ఆహారాన్ని దాని తాజాదనాన్ని కూడా పర్యవేక్షించొచ్చట. చివరగా ఈ రోబోటిక్స్ భాగాలు తినడానికి సురక్షితంగా ఉన్నాయని, మంచి రుచిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. రానున్న కాలంలో ఇక కేకులు ఇలానే ఉంటాయేమో కాబోలు.

    (చదవండి: Free AI healthcare revolution: మైక్రోసాఫ్ట్‌ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..!)

     

  • వైశాఖమాసం,  శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే  నాడు జరుపుకునే అక్షయ తృతీయ అంటే ఆ సందడే  వేరు.  ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున చేసే ఏ పని అయినా అక్షయం అవుతుందని, ఇంట్లో సిరిసంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అందుకే  గోరంతైనా బంగారమో, వెండో కొనుగోలు చేయాలని ఆశపతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు  అక్షయ తృతీయను అనేది ప్రగాఢ విశ్వాసం.

    భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి.  ఇక అక్షయ తృతీయ అనగానే బంగారు  నగల్ని  సొంతం చేసుకోవాలని ఆశపడతారు.  బంగారం కొనుగోళ్లు  భారతీయులకు అక్షయ తృతీయ వేడుకలలో అంతర్భాగం. కానీ  ఇటీవలికాలంలో బంగారం ధరలు  ఆకాశన్నంటేంతగా ఎగిసి అందనంటున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల నస్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు సమీపంలో ఉంది.  ఈ క్రమంలో గత పదేళ్లలో బంగారం ధరల్లో మార్పు గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో 11 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో పుంజుకోవడం గమనార్హం.2014లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర  పది గ్రాములకురూ. 30,182 వద్ద ఉండగా అదే 2025  నాటి ధరలను గమనిస్తే  ఏకంగా  218 శాతం పెరిగి రూ. 95,900 కు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2025లోనే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 30 శాతానికి పైగా  పుంజుకుంది.

    ఇదీ చదవండి : Akshaya Tritiya 2025 : శుభ సమయం, మంగళవారం గోల్డ్‌ కొనొచ్చా?
     

    కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది.  ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు  చేరింది. స్వాతంత్ర్యం తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది.   స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది.  ఆ సమయంలో  10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.

    పదేళ్లలో పసిడి పరుగు
    బంగారం ధర 10 సంవత్సరాలలో  రూ. 68,500 పెరిగింది. 2015లో అక్షయ తృతీయకు నాటి ధరలతో పోలిస్తే నేటికి  HDFC సెక్యూరిటీస్ డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 68,500 కంటే ఎక్కువ పెరిగాయి.

    2019లో  అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు ధరలు 10 గ్రాములకు  రూ.31,729గా ఉంది.  అంటే అప్పటి పెట్టుబడిపై 200 శాతం  పుంజుకున్నట్టే.  గత ఏడాది అక్షయ తృతీయ నుండి పుత్తడి 30 శాతానికి పైగా  ర్యాలీ అయింది.  2024లో 10 గ్రాముల రూ. 73,240 వద్ద  ఉంది. 2024 మధ్యకాలం నుండి బంగారం ధరలు విపరీతంగా పుంజుకున్నాయి. దాదాపు 22 శాతం పెరిగి రూ. 73,240 వద్దకు చేరాయి.

    చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్‌!

     హై నుంచి కాస్త తగ్గే అవకాశం,  కానీ 
    మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ  “చాలావరకు డిమాండ్ ,సరఫరా కారకాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా మార్కెట్లో అధిక అనిశ్చితులు ఉన్న సందర్భంలో. గత రెండు నెలలుగా బంగారం ధరలు  బాగా  పెరిగాయి. అందువల్ల  ధరల్లో కొత్త తగ్గుదల కనిపించవచ్చు. అయితే బంగారం ధరలకు సానుకూలతలు , ప్రతికూలతలు రెండూ ఉన్నాయి, మిశ్రమ ఆర్థిక డేటా పాయింట్లు, సుంకాల యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ అంచనాలు, నెమ్మదించిన వృద్ధి ఆందోళనలు, రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణాలు లాంటి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. 


     

  • మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్‌ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్‌ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్‌ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్‌కేర్‌ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.

    మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు. 

    ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు. 

    సరిగ్గా ఆ సమయంలోనే  అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్‌లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్‌గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్‌కేర్ బృందాలతో  కనెక్ట్‌ అయ్యారు. 

    అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్‌లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..

    DxGPT అంటే ..
    ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్‌ చేయదు. 

    జస్ట్‌ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్‌పుట్‌ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.

    (చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..)

     

  • అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025)  పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం.  నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి( Lakshmi Devi )కి సంబంధించిన వేడుకగా భావిస్తారు.   అక్ష‌య తృతీయ రోజున‌ కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను  తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. తద్వారా ఏడాదంతా  తమ ఇల్లు శుభప్రదంగా ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం. 

     ఇదీ చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్‌!

     వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం.అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే నాశనం లేకుండా  ఉంటాయ‌ని న‌మ్మ‌కం. . నిజానికి ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో  అక్షయ తృతీత సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల  ఆఫర్లతో ఆకర్షింటారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను  కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే  మంచిదని పండితులు చెబుతున్నమాట.

    ఈ ఏడాది అక్షయ తృతీయ ముహూర్తం వివరాలు 
    పంచాంగం ప్రకారం   ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది.  సాధారణంగా ఉదయ తిథినే ప్రామాణికంగా భావిస్తాం కాబట్టి , ఈ సమయంలో ఏ వ్రతమైనా, పూజ అయినా ఆచరించవచ్చు. అలాగే  అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారాన్ని ఇంటికి  తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం పసిడి ధర కొండెక్కి కూచున్న నేపథ్యంలో  ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే దానధర్మాలు   చేయాలని కూడా పెద్దలు చెబుతారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.

    అక్షయ తృతీయ- బంగారం కొనడానికి శుభ సమయాలు
    ఏప్రిల్ 29 మంగళవారం  బంగారం కొనుగోలు సమయాలు - 05:31 PM నుండి 04:38 AM వరకు
    ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.

     

  • ఆదర్శం అంటే దర్శనం చేయించేది: ‘చూపించేది’ అని అర్థం. మహనీయుల జీవితం మనకు సరైన నడవడిక ఎలా ఉండాలో చూపుతుంది కనుక అది మనకు ‘ఆదర్శం’. దస్తూరీ మెరుగు పరుచుకునేందుకు రాసే ‘కాపీ’ పుస్తకంలో, పేజీలో పైన ముద్రితమై ఉండే నమూనా పంక్తి– ‘మేలు బంతి’–ని చూసుకుంటూ, దాన్ని అనుకరిస్తూ కింద పదిసార్లు రాస్తే చేతి రాత బాగవుతుంది. ఆ నమూనా పంక్తిని కూడా ఆదర్శం అంటారు.
    ఏదయినా జటిలమైన శాస్త్ర విషయానికి, ఆ శాస్త్రం బాగా నేర్చిన పండితుడు విపులంగా, సరళంగా వ్యాఖ్య రాసి పెడితే; అది ఆ శాస్త్రం తాలూకూ కిటుకులకూ, మర్మాలకూ అద్దం పట్టి మనకు చూపుతుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా ఆదర్శాలే. ఉదాహరణకు కావ్య లక్షణాల గురించి దండి రంన గ్రంథం పేరు ‘కావ్యాదర్శం’.

    వేదాంతవేత్తలు వివిధ సందర్భాలలో మనసునూ, బుద్ధినీ, చైతన్యాన్నీ అద్దంతో పోలుస్తారు. రజోగుణ సముద్భవమైన కామ– క్రోధాలు అనే లక్షణాలు... శుద్ధమైన మనిషి బుద్ధిని, స్వచ్ఛమైన అద్దాన్ని; మాలిన్యమూ, మసీ కప్పివేసినట్టు ఒక్కొక్కప్పుడు కప్పి వేస్తాయి. అప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. అలాంటప్పుడే మనిషి పాపకర్మల ఫలాలు దారుణంగా ఉంటాయని తెలిసి కూడా పాత కాలు చేస్తాడు. నవ్వుతూ చేసిన పాపాల కర్మలను తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడని భగవద్గీత బోధిస్తుంది.

    మనం చూసే విశ్వమంతా ‘దర్పణ దృశ్యమాన నగరి’ (అద్దంలో కనిపించే నగరపు ప్రతిబింబం) లాంటిది అన్నారు ఆదిశంకరులు. బాహ్య ప్రపంచంలో విశేషాలన్నీ మన అంతఃకరణలో ప్రతిబింబించడం వల్లనే మనకు గోచరిస్తున్నాయి. మన చేతోదర్ప ణంలో బాహ్య ప్రపంచపు విశేషాలు ప్రతిబింబించకపోతే వాటి రపురేఖల, లక్షణాలూ మనం గ్రహించలేం. ఈ అద్దం లేకపోతే ఆ విశ్వం మనకు గోచరించదు. 

    అద్దం మీద మోహమూ, భ్రాంతీ, అజ్ఞానమూ అనే మురికి పేరుకుపోతే కూడా మనకు మన కట్టెదుట ఉన్న సత్యం యథాతథంగా కనిపించదు. ఉన్నది కప్పబడి, లేనట్టుతోస్తుంది. అద్దం మీది మాలిన్యం వల్ల లేనిదేదో ఉన్నట్టు కనిపిస్తుంది. బుద్ధి అద్దానికి మకిలి పడితే మనం భ్రాంతిలో జీవిస్తూ ఉంటాం.  ‘చేతో దర్పణ మార్జనమ్‌’ (బుద్ధిని శుద్ధి చేసే సాధనం) శ్రీకృష్ణ నామ సంకీర్తనం’ అని చైతన్య మహాప్రభువుల ‘శిక్షాష్టకం’ అంటుంది. దానివల్లనే ‘సమ్యక్‌ దృష్టి’ కలుగుతుంది.
    – ఎం. మారుతి శాస్త్రి 

International

  • చైనాలోని లియావోయాంగ్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.

    ఏప్రిల్‌ 9న ఓ నర్సింగ్‌ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.

     

     

  • ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ  కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల  ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్‌ జర్నలిస్టుల ఎక్స్‌ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్‌ఐ, పాకిస్థాన్‌ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.

    భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడ
    మరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్‌ ఐఎస్‌ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్‌ స్కూల్‌ ఉద్యోగులమంటూ ఐఎస్‌ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని  సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.

    కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్‌ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్‌ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Cartoon