Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు  రోడ్కెక్కారు. మంగళవారం రాత్రి వడ్డించిన భోజనం చాలా నాసికరంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తమకు పాడైపోయిన భోజనం పెడుతున్నారని ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో విద్యార్ధులు  బైఠాయించారు. ఆహారం విషయంలో ఎలాంటి నాణ్యత లేదని ఆపై హాస్టల్‌ కూడా కనీస మౌలిక వసతులు లేవని తెలిపారు. యూనివర్సిటీలోని సమస్యల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవడం లేదని స్టూడెంట్స్‌ తెలిపారు.


    హాస్టల్‌లో పాడైపోయిన ఆహారాన్నే తరుచుగా వడ్డించడం వల్లే తాము అనారోగ్యానికి గురవవుతున్నామని విద్యార్థులు వాపోయారు. రాత్రి సమయంలో బోజనం కోసం విద్యార్థులు రోడెక్కడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • సాక్షి, కరీంనగర్ జిల్లా: కరీంనగర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను తమ్ముడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీపీ గౌస్‌ ఆలం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. అన్నను టిప్పర్‌తో ఢీకొట్టి.. ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.

    రూ.కోటి 50 లక్షల అప్పుల్లో చిక్కుకున్న ప్రధాన నిందితుడు మామిడి నరేష్.. తన అప్పులు తీర్చుకోవడానిక అన్న వెంకటేశ్ పేరుపై భారీ ఇన్స్యూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. మొత్తం ఇన్స్యూరెన్స్ విలువ రూ. 4 కోట్ల 14 లక్షలు. అదనంగా యాక్సిస్‌ బ్యాంకులో మరో 20 లక్షల రూపాయల గోల్డ్ లోన్ అన్న పేరిట  తీసుకున్న ప్రధాన నిందితుడు.. పెద్దన్నను చంపి ప్రమాదంగా చూపే పకడ్బందీ ప్లాన్‌ చేశాడు. స్నేహితుడు నముండ్ల రాకేశ్, డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో కలిసి కుట్ర పన్నాడు. ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేశ్.. మొబైల్‌లో రికార్డ్ చేసి భద్రపరిచాడు.

    గత నెల (నవంబర్‌ 29, శనివారం) రాత్రి టిప్పర్‌తో పెద్దన్న వెంకటేష్‌ను ఢీకొట్టాడు. టిప్పర్  బ్రేక్‌డౌన్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య తర్వాత ప్రమాదంలా చూపేందుకు కుటుంబాన్ని నరేష్‌ తప్పుదారి పట్టించాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన రామడుగు పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర వీడియో ఉన్న మొబైల్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • నిశిరాత్రి.. రోడ్డు పక్కన నిలిపి ఉంచే  వాహనాలు  ప్రాణాలు తీస్తున్నాయి. ఒకవైపు చీకటి, మరోవైపు పొగమంచు కారణంగా ఇలాంటి వాహనాలను స్పష్టంగా గుర్తించలేకపోవడంతో  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌ హైవేపై  నిలిపి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

    ఔటర్‌రింగ్‌రోడ్డుపై తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి వాహనాలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ప్రధాన రహదారులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వంటి ప్రాంతాల్లో వాహనాలను పార్క్‌ చేసినప్పుడు వాటి ఉనికి స్పష్టంగా కనిపించే విధంగా రిట్రో రిఫ్లెక్టివ్‌ టేప్‌లను (retro reflective tape) అతికించాలి. సరుకు రవాణా వాహనాలు మొదలుకొని వ్యక్తిగత వాహనాల వరకు ఈ రిట్రో రిఫ్లెక్టివ్‌ టేప్‌లు, ప్లేట్‌ల నిబంధన కచ్చితంగా పాటించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఏటా 25 శాతానికిపైగా రోడ్డు ప్రమాదాలు రిఫ్లెక్టర్‌లు లేక, వాహనాలను గుర్తించలేకపోవడం వల్లే జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.   
     – సాక్షి, సిటీబ్యూరో

    యథేచ్చగా ఉల్లంఘన..  
    రిట్రో రిఫ్లెక్టర్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహన చట్టంలో స్పష్టమైన నిబంధనలు విధించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సైతం రిఫ్లెక్టర్‌ల ఉల్లంఘనలోని తీవ్రతను గుర్తించింది. కేవలం సరుకు రవాణా, వాణిజ్య వాహనాలే కాకుండా ద్విచక్ర వాహనం నుంచి భారీ వాహనాల వరకు తప్పనిసరిగా రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మోటారు వాహన చట్టంలోని నిబంధనలను సైతం కమిటీ ప్రధానంగా  ప్రస్తావించింది. కానీ వీటి అమలులోనే వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.  

    గ్రేటర్‌ హైద‌రాబాద్‌ పరిధిలోని కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో కొంతమంది మోటారు వాహన తనిఖీ అధికారులు రిఫ్లెక్టర్‌లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలను (Fitness Certificate) అందజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొన్ని చోట్ల నాసిరకం రిఫ్లెక్టర్‌ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కేంద్రం నిర్ధారించిన ప్రమాణాలకు భిన్నమైన రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో నిలిపి ఉన్న, నెమ్మదిగా వెళ్తున్న వాహనాలను  స్పష్టంగా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు  నాసిరకం రిఫ్లెక్టర్‌లు కూడా ఒక కారణమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    అక్రమ దందా..  
    మరోవైపు కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోని ఫిట్‌నెస్‌ సెంటర్‌లలో రిట్రో రిఫ్లెక్టివ్‌ టేపుల అక్రమ దందా కొనసాగుతోంది. కేవలం రూ.150 నుంచి రూ.500 వరకు లభించే రిఫ్లెక్టర్‌లను దళారులు, ఏజెంట్‌లు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎంవీఐల ప్రోత్సాహంతోనే  ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు రావడం  గమనార్హం.

    ఇండియన్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ ప్రమాణాల మేరకు ఏఐఎస్‌ 090, ఏఐఎస్‌ 089, ఏఐఎస్‌057 గుర్తింపు కలిగిన రిట్రో రిఫ్లెక్టర్‌లు,ప్లేట్‌లను మాత్రమే వినియోగించాలి. కానీ.. ఇందుకు విరుద్ధంగా నాసిరకం రిఫ్లెక్టర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన రిఫ్లెక్టర్‌లు కనీసం ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్న వాహనాల ఉనికిని తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. నాసిరకం వాటితో ఆ అవకాశం ఉండదు.

    చ‌ద‌వండి: ఒక్క సిగ‌రెట్‌.. 146 ప్రాణాలు బ‌లి!

    ఈ నిబంధనలు తప్పనిసరి..  
    అన్ని రకాల వాహనాలకు  ముందు, వెనుక ఎరువు, తెలుపు  రంగు రిఫ్లెక్టర్‌లను ఏర్పాటు చేయాలి. 
    భారీ వాహనాలకు  ఎరువు,తెలుపు రిఫ్లెక్టర్‌లతో పాటు పసుపు రంగు రిఫ్లెక్టర్‌లను రెండు వైపులా అతికించాలి 
    రిఫ్లెక్టర్‌లను కనీసం  ఒక కిలోమీటర్‌ దూరం నుంచి స్పష్టంగా గుర్తించేలా  ఏర్పాటు చేయాలి. 
    మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌లోని  104వ నిబంధన మేరకు ఏఐఎస్‌ గుర్తింపు కలిగిన వాటిని మాత్రమే వినియోగించాలి.   

  • సాక్షి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని  ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం తెలిపారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటింకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని, కోటి చీరలను  ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదే అని తెలిపారు. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మార్చిలో  పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలన్నారు.

    2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెట్టి యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని వర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈనెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నామని ఆకార్యక్రమంలోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించుకోబోతున్నాం.

    తెలంగాణలో నూతనంగా  నాలుగు విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్టు ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగుళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అనేది గొప్ప బాధ్యత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో కాళ్లలో కట్టెలు పెట్టడం సహజమని దానిని పెద్ద సమస్యగా భావించొద్దనిల  అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని  పార్టీ నాయకులకు  సూచించారు.

    రాహుల్ గాంధీ చేపట్టిన  ఓట్ చోరీ కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నేషనల్ హెరాల్డ్ కేసుల పేరుతో కేంద్రం హడావుడి చేస్తుందన్నారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని  రేవంత్ రెడ్డి తెలిపారు. 

  • సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన మహిళ కల్పనకు ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కల్పన పేరును ఓటర్ లిస్టు నుంచి అధికారులు తొలగించారు. దాంతో కల్పన హైకోర్టును ఆశ్రయించింది. 

    ఈ విషయంపై విచారణ అనంతరం హైకోర్టు ఓటర్ లిస్టులో కల్పన పేరును తక్షణమే నమోదు చేయాలని తేల్చి చెప్పింది. ఇందుగుల గ్రామ సర్పంచ్ సీటు ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే ఈ పంచాయితీ పరిధిలో ఇద్దరే ఎస్టీ మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ పదవి మహిళకు కేటాయించడంతో పాటు నాలుగు వార్డులను సైతం ఎస్టీకి కేటాయించడం జరిగింది.

  • సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పుష్ప సినిమా రేంజ్‌లో జరిగిన అక్రమ గోవుల రవాణా ప్రయత్నాన్ని పంతంగి టోల్ ఫ్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ పైభాగంలో ఉల్లిగడ్డల లోడు, కిందభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూహల వంటి ఖాళీలో గోవులను దాచిపెట్టి తరలించేందుకు ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు.  

    సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి పరిశీలించగా వైజాగ్ నుంచి హైదరాబాదులోని ఒక కబేళాకు గోవులను తరలిస్తున్నట్టు బయటపడింది. లారీ క్రింద భాగాన్ని పాలిష్ బోర్డులతో కప్పి చిన్న గాలి రంధ్రాలు ఉంచి పైన ఉల్లిగడ్డల సంచులతో పూర్తిగా మూసివేసి ఎవరికీ అనుమానం రాకుండా ముఠా చాకచక్యంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.

    గోవుల రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Andhra Pradesh

  • శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం  దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. భక్తుల రద్దీ పెరగడంతో తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ రైళ్లు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్‌ల మీదుగా శబరిమలకు చేరుకుంటాయి. డిసెంబర్‌ 13 నుంచి 31 వరకు  ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి వెళ్తాయో వాటి వివరాలను  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.   శబరిమలకు ఇప్పటికే  సుమారు 60 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.

    చర్లపల్లి -కొల్లం జంక్షన్‌ (07119),  సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ -కొల్లం జంక్షన్‌ (రైలు నం. 07117),  చర్లపల్లి -కొల్లం జంక్షన్‌ (07121),   నాందేడ్‌ - కొల్లం (07123) రైళ్లకు డిసెంబర్‌ 3 నుంచే టికెట్ల బుకింగ్‌ ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు రైళ్లకు బుధవారం ఉదయం 8గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

  • సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సెక్యూరిటీ గార్డు డాక్టర్‌ అవతారం ఎత్తాడు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్‌గా వైద్యం చేయడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు విస్తుపోతున్నారు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయడంతో పాటు గాయాలతో వచ్చిన రోగులకు సెక్యూరిటీ గార్డ్  చికిత్స చేస్తున్నాడు.  గేటు బయట కాపలాగా ఉండాల్సిన గార్డ్ వైద్యం చేయడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

    వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్‌సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సరెండర్‌ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు. 

    అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

    ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు.
     

  • సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గుంటూరు కేఎల్‌ వర్శిటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థి సురేష్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిచెందిన విద్యార్థి బాపట్ల కొత్తపాలెం వాసిగా గుర్తించారు.

    కాగా, నిన్న(డిసెంబర్‌ 1, సోమవారం) తెలంగాణలోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలోనే చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. నిజాంపేటలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యహహారమే కారణమని తెలుస్తోంది.

    గుంటూరు KL వర్సిటీలో విషాదం ఉరేసుకొని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
  • సాక్షి, నంద్యాల జిల్లా: రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. రైతులకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు.

    హుసేనాపురం నుంచి డి.రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలీ మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తుండగా.. గిట్టుబాటు ధరలేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు.

    ‘‘మొక్క జొన్నకు మద్దతు ధర 2400 ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల దగ్గర నుంచి ఇంత వరకు కొన్న పాపాన పోలేదు. నాడు జగన్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో మద్దతు ధర, ఎరువులను అందించేవారు నేడు కూటమి ప్రభుత్వంలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రైతుల బీమా కోసం ఏడాదికి దాదాపు  రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. ప్యాపిలిలో రూ.50 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక కూడా  వేయకుండా ఆపేశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసింటే నేడు దళారులు వచ్చి కొనుగోళ్లు జరిపేవారు.

    రైతులను పట్టించుకోకుండా ఐటీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అంటూ రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో అన్నీ సౌకర్యాలు, ఏర్పాట్లు కల్పించడంతో అరటి పంట రైతులు విదేశాలకు ఎగుమతులు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం దిగొచ్చి రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

    Nandyala: రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర

     

     

     

  • సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్‌డీఏ(CRDA) కమిషనర్‌కు అప్పగించింది.  అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో,  తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో  భూ సమీకరణ చేయనుంది.

    రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో  భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్‌ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ జూలై 1న ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.

    మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్‌), వాణిజ్య (కమర్షియల్‌) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     

Politics

  • సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్‌ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్‌సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:

    అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:
    కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్‌ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.

    రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్‌ మాఫియా:
    రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్‌ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్‌ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

    ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:
    పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్‌ఆర్‌సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.

    చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.

    టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:
    బంద్‌కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్‌ 2న నెల్లూరు బంద్‌కు టీడీపీ, వైయస్‌ఆర్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్‌ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే  పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.

    పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:
    టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియాపై కఠిన చర్యలు లేవు.

    ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:
    పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి  (మంగళవారం) బంద్‌ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్‌ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.

    కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:

    సంక్షోభంలో వ్యవసాయ రంగం:
    గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్‌ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్‌ మార్కెట్‌లో కొనకా తప్పడం లేదు.

    చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క  పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.

    కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:
    రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.

    మొంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్‌ తర్వాత కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.

    దారుణంగా పడిపోయిన ధరలు:
    మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.

    ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్‌కుమార్‌ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.

  • సాక్షి, విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.

    ‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.

    ‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.

    ‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.

    ‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?

    ..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి

    ..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?

    Perni Nani: చంద్రబాబు అనైతిక రాజకీయాల్లో భాగంగానే ఎమ్మెల్సీల రాజీనామాలు

    చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన‌ సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు.

  • సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్‌ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే  స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది‌. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు.

    ..నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్‌ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి.

    ..చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు  తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్‌లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో  కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు.

    చంద్రబాబు డబల్ యాక్షన్ ఆయనే సీఎం, ఆయనే నిందితుడు
  • సాక్షి, సిద్ధిపేట: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్‌ చేసిన కామెంట్లపై తెలంగాణ  నాయకులు భగ్గుమంటున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు.

    మంత్రి పొన్నం​ ప్రభాకర్‌ సిద్దిపేటలోని హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల భావంతో ఉండే రాష్ట్రాలు. తెలంగాణ తుపానులో మునుగుతుంటే మేము ప్రకృతి అనుకున్నాం తప్ప ఏపీని తప్పుపట్టడం లేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్‌.. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆయన వివేకవంతుడా? లేక అవివేకా? అని ప్రశ్నించారు. 

    ..మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నాను. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడటం దురదృష్టకరం. ఏపీలో తుఫాను వస్తే మా హుస్నాబాద్ మునిగింది.. మేము ఏపీ ప్రజలను తప్పు పట్టడం లేదు. అది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తున్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం. వెంటనే పవన్ తన మాటలు ఉప సంహరించుకోవాలి.. క్షమాపణలు కోరాలి. భవిష్యత్తులో ఇలాంటి వివక్ష పూరిత మాటలు మాట్లాడవద్దు.. విజ్ఞతగా వ్యవహరించాలి. ఉప ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలి. ఏపీ, తెలంగాణ కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగాలి.. ఇలాంటి వ్యాఖ్యలు మాకు రావు.. మీరు మాట్లాడకూడదు అని హితవు పలికారు. 

    నీకు సిగ్గుంటే తెలంగాణ వదిలి వెళ్ళిపో పవన్ పై కాంగ్రెస్ నేతలు సీరియస్

Movies

  • టాలీవుడ్ నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రెండు సినిమాలలో వేలు పెట్టిన ఆ టాలీవుడ్ హీరో సంగతి తర్వాత చూస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్దాకా వెళ్లిందని.. కానీ నేను మాత్రం వెళ్లలేదని తెలిపారు. నా సినిమాకు రూ.1.6 కోట్ల బడ్జెట్ అని చెప్పి.. రూ.4.8 అయ్యేలా చేశారని వెల్లడించారు.

    మాకు విషయం చెప్పకుండానే హీరోయిన్ సీన్స్ తీసేయించారని నిర్మాత అన్నారు. హీరోను డామినేట్ చేసేలా ఉన్నాయంటూ దాదాపు 15 నిమిషాల సన్నివేశాలను తీసేశారని ఆయన మండిపడ్డారు. చిత్రంలో జీవిత రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్గా నటించారని తెలిపారు. దీంతో తర్వాత సినిమా నుంచి డైరెక్టర్తప్పుకున్నారని నిర్మాత పేర్కొన్నారు. ‍అయితే ఆలా చేసిన ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. 

    కాగా.. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఇవాళ టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మాత సమాధానాలిచ్చారు. 

     

     

  • బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో యాక్షన్మూవీ అఖండ-2. సినిమా రిలీజ్కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. మూవీ డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుంది. అఖండకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.

    భారీగా ధరల పెంపు.. 

    అఖండ-2 మూవీకి భారీగా టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో ఏకంగా రూ.75 పెంచుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొంది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టకెట్‌పై అదనంగా రూ.100 పెంపునకు అనుమతులు జారీ చేసింది. అంతే కాకుండా టికెట్ ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వులిచ్చింది. దీంతో పాటు ఎన్నడూ లేనివిధంగా ప్రీమియర్ షోలకు కూడా అనుమతిలిచ్చింది. ఈ నెల 4న ప్రీమియర్‌ షో టికెట్‌ ధర ఏకంగా రూ.600లుగా నిర్ణయించింది. 

    ఇంత భారీ స్థాయిలో టికెట్స్ పెంచడంపై సినీ ప్రియులు మండిపడుతున్నారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడంతో భారీగా ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించకునేందుకు ఉత్తర్వులిచ్చారు. భారీగా టికెట్ ధరల పెంపుతో సినీ ప్రేక్షకుల జేబులు గుల్ల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

     

     

  • జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం గోట్(GOAT). కామెడీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూవీలో దివ్య భారతి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

    ఇవాళ గోట్ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి.. తనను ఎత్తుకొస్తే పది లక్షలు ఇస్తానంది.. ఐదు నీకు.. ఐదు నాకు అంటూ బ్రహ్మజీ చెప్పిన డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. సినిమాను జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు

     

     

  • అఖండ 2 సినిమాలో ఓ మాస్‌ సాంగ్‌ ఉంటుంది. అది విన్న తర్వాత నాకు నెర్వస్‌గా అనిపించింది. ఇంతవరకు అలాంటి మాస్‌ సాంగ్‌ నేనెప్పుడు చేయలేదు. డ్యాన్స్‌ విషయంలో తగ్గొద్దు అనుకున్నాను. రెండు రోజుల ప్రాక్టీస్‌ చేసిన తర్వాత మోకాలు సహకరించలేదు. దీంతో ఫిజియోథెరపీ తీసుకొని మరీ ఆ పాట పూర్తి చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా స్టైలిష్ ఉంటుంది’ అన్నారు హీరోయిన్‌ సంయుక్త. నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సంయుక్త మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    విరూపాక్ష తర్వాత తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను మాత్రం సెలెక్టెడ్‌గా చేస్తున్నాను.  బింబిసారా, విరూపాక్ష, సార్, భీమ్లా నాయక్ ఒకేసారి సైన్ చేశాను. అయితే రిలీజ్ టైమ్స్ డిఫరెంట్ గా అయ్యాయి. తర్వాత స్వయంభు, నారీ నారీ, ఆ తర్వాత అఖండ 2 సైన్ చేశాను. ఆ తర్వాత పూరి గారి సినిమా చేశాను.

    → బోయపాటి అఖండ 2 కథ చెప్పగానే చాలా నచ్చింది. డేట్స్ ఉన్నాయో లేదో మా టీం ని అడిగాను. లేవని చెప్పారు. ఎలాగైనా ఈ సినిమా చేయాలని చెప్పడంతో డేస్ట్‌ అడ్జస్ట్‌ చేశారు. బోయపాటి  చాలా గ్రేట్ విజన్ తో ఈ సినిమా తీశారు. మన ఊహకి మించి ఉంటుంది.

    → బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్. ఆయన్ని తొలిసారి ఒక యాడ్ షూట్ లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్ల యాక్టర్. డైరెక్టర్  ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది. ఆయనతో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.

    → ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్ శివ కి ట్రిబ్యూట్ లాగా ఉండబోతున్నాయి. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్ లో తీసుకెల్తాయి

    →  కొత్త సినిమాల విషయాలకొస్తే.. స్వయంభులో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వానంద్‌ ‘ నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి పాత్ర లభించింది. దీంతో పాటు పూరీ జగన్నాథ్‌ సినిమాలో నటిస్తున్నాను. 

  • టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.

    అయితే మరోవైపు మూవీ టైటిల్పై కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మూవీ షూటింగ్ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేపథ్యంలో మూవీ టైటిల్పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.

    త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్‌ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్‌లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

  • కంటెంట్‌ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్‌ని కంటె కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు.  

    ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

    ట్రైలర్‌ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్‌ అయింది. ఆ తర్వాత ఫోన్‌, పర్సు మిస​్‌ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే  అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి  నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్‌ 12న విడుదల కానుంది. 

  • సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన చేస్తున్న కామెంట్స్. ఏదైనా ఈవెంట్జరిగినప్పుడు ఆయన చేస్తున్న కామెంట్స్ కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారుతున్నాయి. డేవిడ్ వార్నర్ నుంచి బ్రహ్మనందం వరకు రాజేంద్ర ప్రసాద్చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దీంతో ఆయనపై పలువురు నెటిజన్స్మండిపడ్డారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని ఫైరయ్యారు.

    టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్నటుడిగా పేరున్న రాజేంద్ర ప్రసాద్ప్రతిసారి అలా మాట్లాడడం చూస్తుంటే అభిమానులే షాకవుతున్నారు. ఒక్కోసారి అసలు ఆయనకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్స్లో తప్పుగా మాట్లాడడం.. తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ఏకైక నటుడిగా ఘనత..

    అయితే ఇటీవల కొద్ది కాలంగా తన మాటలతో ట్రోల్స్కు గురవుతున్న రాజేంద్ర ప్రసాద్ మంచిపని కూడా చేశాడు. పవిత్రమైన తిరుమల సన్నిధిలో భక్తుల వసతి కోసం కాటేజీ నిర్మించినట్లు తెలిసింది. టి. సుబ్బరామిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ కాటేజీ నిర్మించానని తెలిపారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా తిరుమల కొండపై కాటేజీ నిర్మించిన ఏకైక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఘనతను సొంతం చేసుకున్నారు.

  • ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు.. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది.

    అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది. కొందరేమో వీరి వయస్సుల గురించి చర్చిస్తే.. మరికొందరు డేటింగ్, పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్లో స్టార్ హీరోయిన్కావడం.. రాజ్ నిడిమోరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్గ్రౌండ్గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో సామ్-రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి?.. ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్చర్చించుకుంటున్నారు. వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.

    మాయ చేశావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. కొద్ది కాలంలోనే స్టార్హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్రహీరోల సరసన వరుసపెట్టి సినిమాలు చేసింది. క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది సామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.

    సమంత ఆస్తులే ఎక్కువ.. 

    ఇక రాజ్ నిడిమోరు ఆస్తుల విషయానికొస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ దాదాపు రూ.85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. లెక్కన రాజ్ కంటే సమంతనే 29 శాతం అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా రూ.200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్అంచనా వేస్తున్నారు.

    కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. సమయంలోనే ఇద్దరి మధ్యప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న జంట డిసెంబర్ 1 వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

  • 71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్‌ హాసన్‌. యంగ్‌ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్‌ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు. 

    తాజాగా ఆయన నటి మంజు వారియర్‌తో కలిసి కేరళలో అర్ట్‌ అండ్‌ లిటరేచర్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.

    ‘నన్ను రిటైర్‌ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్‌(Kamal Haasan) చెప్పుకొచ్చాడు. 

    మొత్తానికి ఓ బ్లాక్‌ బస్టర​ సినిమా తీసి సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని కమల్‌ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్‌లైఫ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్‌ కనగరాజ్‌తో విక్రమ్‌ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు.

  • రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్కు ఆడియన్స్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

    చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. మూవీ జనవరి 9 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే.

  • బాలీవుడ్‌లో స్టార్‌ హీరో అని గుర్తించాలంటే కచ్చితంగా లగ్జరీ కారు ఉండాల్సిందే అంటున్నాడు మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌. మలయాళ, తెలుగుతో పాటు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న దుల్కర్‌..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్‌ ఎంట్రీ అనుభవాన్ని పంచుకున్నాడు. హిందీలో స్టార్‌ హీరో అని చూపించుకోకపోతే.. కనీస మర్యాదలు కూడా చేయరని దుల్కర్‌(Dulquer Salmaan) అన్నారు.

    బాలీవుడ్‌లో నటించేటప్పుడు నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్లు. నేను సెట్‌లోకి వచ్చినప్పుడు వాళ్లు నన్ను రౌండప్‌ చేసి ఎవరూ దగ్గరకు రాకుండా చూసుకునేవాళ్లు. నేను స్టార్‌ హీరో అని నమ్మించడానికి అలా చేయాల్సి వచ్చింది. అక్కడ స్టార్‌ హీరో అని నిరూపించుకోకపోతే.. కనీసం కూర్చొవడానికి కుర్చీ కూడా వేయరు. మోనిటర్‌ చూడడానికి స్థలం కూడా ఇవ్వరు. చుట్టూ జనాలు..లగ్జరీ కారు ఉంటేనే మనల్ని స్టార్‌ అనుకుంటారు. 

    మలయాళంలో అలాంటి పరిస్థితి ఉండదు. సెట్‌కి ఎలా వచ్చినా సరే.. గౌరవిస్తారు. లగ్జరీకి ప్రాధాన్యత ఉండదు. ఇంటి నుంచే అన్నీ తెచ్చుకుంటాం. ఎక్కువ వరకు సొంత ఖర్చులే పెట్టుకుంటాం’ అని దుల్కర్‌ చెప్పుకొచ్చాడు. 2018లో కార్వాన్‌ చిత్రంలో దుల్కర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ  ఇచ్చాడు. ఇటీవల ఆయన ‘కాంత’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

  • గత కొన్నాళ్లగా రవితేజ వరస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా సరైన హిట్ కావట్లేదు. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ కామెడీ మూవీలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లే గ్లింప్స్, ఓ పాట రిలీజ్ చేశారు. రవితేజ మార్క్‌లోనే ఈ మూవీ కూడా ఉండనుందనిపిస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఓ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత?

    (ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)

    రవితేజ తర్వాత సినిమా ఏది అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. శివ నిర్వాణతో పాటు పలువురి దర్శకులు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు ఉండనున్నారనే.. ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఫేక్ అని స్పష్టత వచ్చేసింది. ఈ రూమర్‌ని ఎవరు ఎందుకు వైరల్ చేశారో మరి?

    గత నెలలో 'మాస్ జాతర' సినిమాతో రవితేజ.. ప్రేక్షకుల ముందుకొచ్చాడు. థియేటర్లలో రిలీజైనప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రెస్పాన్స్ వచ్చింది. అలానే రవితేజతో చేసి హీరోయిన్ల విషయంలోనూ అప్పుడప్పుడు కొన్ని ట్రోల్స్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా కావాలనే ఎవరో ఈ రూమర్ స్ప్రెడ్ చేశారనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఎందుకు ఇలాంటి పరిస్థితి?)

  • టాలీవుడ్‌లో అప్పుడప్పుడు చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటిదే ఒకటి జరిగింది. రామ్ హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'.. గత వీకెండ్‌లో థియేటర్లలోకి వచ్చింది. సోషల్ మీడియాలో టాక్, మీడియాలో రివ్యూలు పాజిటివ్‌గానే వచ్చాయి. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు. కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. మరి ఈ మూవీ విషయంలో లెక్క ఎక్కడ తప్పింది? ఇలా జరగడానికి కారణాలేంటి?

    (ఇదీ చదవండి: 'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో)

    'ఆంధ్రకింగ్ తాలూకా' విషయంలో ఇలా జరగడానికి ఒకటి రెండు కాదు చాలానే కారణాలే ఉన్నాయనిపిస్తోంది. మొదటగా రిలీజ్ డేట్. సాధారణంగా నవంబరుని అన్-సీజన్ అని అంటుంటారు. చెప్పుకోదగ్గ మూవీస్ ఏం ఈ నెలలో విడుదల కావు. అయినా సరే నిర్మాతలు సాహసం చేశారు కానీ కలిసి రాలేదు. 'అఖండ 2' లాంటి పెద్ద హీరో సినిమా పెట్టుకుని వారం ముందు రిలీజ్ చేయడం కూడా ఓ రకంగా మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్‌కి రెడీ ఉంటే అంతకు ముందు వారం పదిరోజుల్లో వేరే చిత్రాల గురించి ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితి ఉండదు.

    మరో కారణం చెప్పుకొంటే ఈ సినిమాలో చూపించింది యూనివర్సల్ కంటెంట్ కాదు. ఓ అభిమాని-హీరో మధ్య సాగే ఎమోషనల్ స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. కాబట్టి హీరోలని పిచ్చిగా అభిమానించే కొందరికి మాత్రమే నచ్చుతుంది. సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఏ హీరోని పిచ్చిగా అభిమానించడు, ఆరాధించడు. కాబట్టి ఈ విషయం ఏమైనా మైనస్ అయిందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్!

    (ఇదీ చదవండి: సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్‌)

    ఈ సినిమాలో హీరో రామ్ మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీతో కెమిస్ట్రీ సూపర్‌గా ఉండొచ్చు. అంతమాత్రాన ప్రేక్షకులు తమ సినిమాకు వచ్చేస్తారు అనుకోకూడదు. ఎందుకంటే ఓ హీరో నుంచి సినిమా వస్తుందంటే.. అతడి గత చిత్రాలేంటి? వాటి ఫలితాలేంటి అనేది కూడా ప్రేక్షకుడు ఆలోచిస్తాడు! రామ్ గత మూడు నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో రామ్ మార్కెట్ కాస్త డౌన్ అయింది. అలానే ఈ హీరో మాస్ ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తీసింది క్లాస్ చిత్రం కావడంతో ఏమైనా తేడా కొట్టిందా అనిపిస్తుంది.

    ప్రస్తుతం ఓటీటీ జమానా నడుస్తోంది. అంటే ట్రైలర్ రిలీజైనప్పుడే ఏ సినిమాని థియేటర్‌లో చూడాలి? ఏ మూవీని ఓటీటీలో చూడాలి అనేది ప్రేక్షకుడు ముందే ఫిక్స్ అయిపోతున్నాడు. బహుశా ఈ ట్రెండ్ ఎఫెక్ట్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై పడి కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయా అనిపిస్తుంది. ఒకవేళ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాని ఎక్కువమంది చూస్తే మాత్రం ఇది నిజమని ఫిక్స్ అయిపోవచ్చు. భాగ్యశ్రీ కూడా యాక్టింగ్ బాగానే చేస్తున్నప్పటికీ ఈమె మూవీస్ అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. లిస్టులోకి ఇప్పుడు ఇది కూడా చేరినట్లే!

    ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం కూడా మరో కారణం అనుకోవచ్చు. ప్రస్తుతం రొటీన్ ప్రమోషన్స్ చేస్తుంటే జనాలకు పెద్దగా పట్టించుకోవట్లేదు. సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండాలి, కంటెంట్‌ ఏంటో విడుదలకు ముందే ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా చేయాలి. సినిమా కోసం ఎంత కష్టపడినా మొక్కుబడి ఇంటర్వ్యూలు ఇచ్చేశాం, ఈవెంట్స్ చేసేశాం అంటే కుదరదు. కంటెంట్ ఎలా బాగున్నా సరే ప్రమోషన్స్ కూడా అంతే పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. బహుశా ఈ విషయంలోనూ 'ఆంధ్రకింగ్' వెనకబడ్డాడేమో?

    ఈ సినిమా విషయంలో ప్రేక్షకుడినో ఇంకెవరినో తప్పుబట్టడానికి ఏం లేదు. ఎందుకంటే సినిమా ఫలితం అనేది చాలా వాటిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు బాగున్న చిత్రాలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయంలోనూ అదే జరిగినట్లుంది.

    (ఇదీ చదవండి: ‘ఆంధ్ర కింగ్‌ తాలుకా’ మూవీ రివ్యూ)

Sports

  • స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ త‌న‌యుడు, గోవా ఆల్‌రౌండ‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత బౌలింగ్‌లో 3 వికెట్ల‌తో సత్తాచాటిన అర్జున్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లో 16 ప‌రుగులు చేశాడు. 

    అర్జున్‌ పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. మధ్యప్రదేశ్‌ ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్‌ కుమార్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ను అద్భుతమైన బంతితో జూనియర్‌ టెండూల్కర్‌ బోల్తా కొట్టించాడు. 

    బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అర్జున్‌ దూకుడుగా ఆడి గోవాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడిని గోవా టీమ్‌ మెనెజ్‌మెంట్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసింది. కానీ బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

    ల‌క్నోలోకి అర్జున్‌
    కాగా అర్జున్  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. రాబోయో ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియ‌న్స్ నుంచి అర్జున్‌ను ల‌క్నో ట్రేడ్ చేసుకుంది. 

    అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో వున్నప్పటికి.. 2023 సీజ‌న్‌లో అరంగేట్రం చేశాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జ‌ట్టులో బుమ్రా, బౌల్ట్ వంటి బౌల‌ర్లు ఉండ‌డంతో అర్జున్‌కు పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. ఇప్పుడు ల‌క్నో త‌ర‌పున అర్జున్‌కు ఎక్కువ‌గా ఛాన్స్ ల‌భించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

    గోవా ఘ‌న విజ‌యం..
    ఇక  మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌పై గోవా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఎంపీ నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గోవా కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(50 బంతుల్లో 75) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు అభినవ్‌ 55 పరుగులతో రాణించాడు.
    చదవండి: సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

  • ఐపీఎల్‌-2025 మినీ వేలానికి ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్‌.. మంగళవారం లక్నో వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.

    దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టిం‍చాడు. కేవలం  47 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ముంబైక‌ర్‌ స‌రిగ్గా వంద ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

    సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అతడితో వెటరన్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించాడు. కాగా గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో వేలం అన్‌సోల్డ్‌గా మిగిలిన స‌ర్ఫరాజ్ ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

    ఐదేసిన శార్థూల్‌..
    ఇక 221 పరుగుల భారీ లక్ష్య చేధనలో అస్సాం జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ముంబై కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో అస్సాం పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ తలా రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం
     

  • యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టుని ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ కోసం ఒకే ఒక్క మార్పు చేసింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.

    జాక్స్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లడ్ తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు అతడు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. 

    అతడిని జ‌ట్టులోకి తీసుకురావ‌డం వెనుక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ మాస్ట‌ర్ మైండ్ ఉంది. జాక్స్‌ను కేవలం స్పిన్ ఎంపికగా కాకుండా, అతని బ్యాటింగ్‌ సామర్థ్యం కారణంగానే తుది జ‌ట్టులో చోటు ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవ‌డం కోస‌మే రెగ్యూల‌ర్ స్పిన్న‌ర్ బ‌షీర్ కాకుండా జాక్స్ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. గురువారం(డిసెంబ‌ర్ 4) నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా ఈ యాషెస్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.

    ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదే
    జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
    చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం
     

  • ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని రాబిన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచారని వారు చెప్పుకొచ్చారు.

    కానీ ఆయన మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ దర్యాప్తులో మరణ కారణం నిర్ధారించబడుతుందని తెలిపారు. 2004లో రిటైర్మెంట్ తర్వాత ఆయన మద్యానికి బానిసై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ స్మిత్ మరణానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.

    'ది జడ్జ్'గా పేరొందిన స్మిత్‌.. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ , కోర్ట్నీ వాల్ష్ వంటి పేస్ దళంతో కూడిన వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 43.67 సగటుతో 4236 టెస్టు పరుగులు చేశారు. ఆయన కెరీర్‌లో తొమ్మిది టెస్టు సెంచరీలు ఉన్నాయి.

    అదేవిధంగా ఆయన 71 వన్డేలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఆయన దిట్ట. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్‌(167 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

    ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదుర్స్‌..
    రాబిన్ స్మిత్ డర్బన్‌లో జన్మించినప్పటికీ  1983లో ఇంగ్లండ్‌కు వచ్చి హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో చేరారు. మొత్తంగా  17 సీజన్లలో ఆయన 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించారు. స్మిత్ మృతిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
     

  • మొన్న ఐపీఎల్‌.. నిన్న ఆసియాక‌ప్.. నేడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఆ 14 ఏళ్ల యువ సంచల‌నం దూకుడును ఎవ‌రూ ఆప‌లేక‌పోతున్నారు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో చిన్న‌నాటి స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లిల‌ను గుర్తు చేస్తున్నాడు. అవ‌తలి ఎండ్‌లో బౌల‌ర్ ఎవ‌రైన డోంట్ కేర్‌. అత‌డికి తెలిసిందల్లా బంతి బౌండ‌రీకి త‌ర‌లించ‌డ‌మే.

    అత‌డు క్రీజులో ఉన్నాడంటే సీనియ‌ర్ బౌల‌ర్ల‌కు సైతం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా సీనియ‌ర్ బౌల‌ర్ల‌ను అత‌డు ఎదుర్కొంటున్న తీరు అత్య‌ద్భుతం. 15 ఏళ్ల నిండ‌క‌ముందే  రికార్డుల‌కు కేరాఫ్ అడ్రాస్‌గా మారిన ఆ చిచ్చ‌రపిడుగు ఎవ‌రో ఈపాటికే మీకు ఆర్ధ‌మైపోయింటుంది. అత‌డే భార‌త అండ‌ర్‌-19 స్టార్ ఓపెన‌ర్‌, బిహార్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ.

    స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మంగ‌ళ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా మ‌హారాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. మందకొడి పిచ్‌పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది ప‌డిన చోట.. వైభ‌వ్ మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

    31 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన బిహార్ జ‌ట్టును వైభ‌వ్ త‌న అద్బుత బ్యాటింగ్‌తో ఓ యోధుడిలా పోరాడాడు. ఆకాష్ రాజ్‌, అయూష్‌తో విలువైన భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో సూర్య‌వంశీ కేవ‌లం 58 బంతుల్లో సెంచ‌రీని పూర్తి చేశాడు. అయితే ఇది అత‌డి స్టాండ‌ర్డ్స్ ప్ర‌కారం "స్లో నాక్" అనే చెప్పాలి. 

    ఎందుకంటే టీ20లలో అతని సగటు స్ట్రైక్ రేట్ 217.88. అంతకుముందు వైభ‌వ్ టీ20ల్లో 32, 35 బంతుల్లో రెండు శతకాలు బాదాడు. ఓవ‌రాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆ ల‌క్ష్యాన్ని మ‌హారాష్ట్ర  7 వికెట్లు కోల్పోయి చేధించింది.

    తొలి ప్లేయ‌ర్‌గా..
    ఈ సెంచ‌రీతో వైభ‌వ్ సూర్య‌వంశీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. . సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్‌ జోల్‌ పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో జోల్ ఆల్‌టైమ్ రికార్డును ఈ బిహారీ బ్రేక్ చేశాడు.

    సీనియర్ జట్టు ఎంట్రీ ఎప్పుడు?
    వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బిహార్ సీనియర్ ఆటగాళ్లు తడబడినప్పటికీ వైభవ్ మాత్రం మేఘాలయపై 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఏడాదిలో వైభవ్  కేవలం 15 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి మూడు సెంచరీలు సాధించాడు. 

    దీంతో అతడు త్వరలోనే భారత సీనియర్ టీ20 జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంత చిన్న వయస్సులో అతడి నిలకడైన ఆట తీరు, సీనియర్ బౌలర్లపై  అతను చూపిస్తున్న ఆధిపత్యం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ను ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది.  అతడు వయస్సు తక్కువ కావడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టులోకి రాకపోయినా.. 15 ఏళ్ల నిండ‌గానే జాతీయ జ‌ట్టు త‌ర‌పున డెబ్యూ చేయ‌డం ఖాయం.

    గిల్ చోటుకు ఎస‌రు?
    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూల్స్ ప్ర‌కారం.. ఓ ఆట‌గాడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరేంగ్ర‌టం చేయ‌డానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి.  వైభవ్‌ మార్చి 27, 2011 న జన్మించాడు.  కాబట్టి అతడు మార్చి 27, 2026 తర్వాతే సీనియర్ జాతీయ జట్టు త‌ర‌పున‌ ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అంటే వ‌చ్చే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సైకిల్‌లో భార‌త జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించాడు. 

    ఒక‌వేళ అత‌డు రాబోయో రోజుల్లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తే వైస్ కెప్టెన్ గిల్ స్ధానం డెంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం టీ20ల్లో భార‌త జట్టు ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ‌, గిల్ ప్రారంభిస్తున్నారు. అభిషేక్ దుమ్ములేపుతున్న‌ప్ప‌టికి గిల్ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోతున్నాడు. త‌దుప‌రి మ్యాచ్‌లో కూడా గిల్ ఇదే పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తే అత‌డి స్ధానాన్ని శాంస‌న్ లేదా వైభ‌వ్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశ‌ముంది.

    స్పీడ్ గ‌న్స్‌ను ఎదుర్కోగ‌ల‌డా?
    అయితే సూర్య‌వంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఇది సరైన వయస్సు కాదు అని, జోష్ హాజిల్‌వుడ్, కగిసో రబాడ లేదా మార్క్ వుడ్ వంటి ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం అతనికి చాలా కష్టమని కొంత‌మంది మాజీలు వాదిస్తున్నారు. కానీ సూర్య‌వంశీ ఇప్ప‌టికే ఐపీఎల్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, వెటరన్ ఇషాంత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ వంటి స్పీడ్‌స్టార్ల‌ను ఉతికారేశాడు. కాబ‌ట్టి అత‌డికి ప్రీమియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొవ‌డం పెద్ద టాస్క్ ఏమి కాదు.
    చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?
     

  • టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మం‍గళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.

    ఆసియాకప్‌-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్‌తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.

    తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్‌ శర్మ(47) మెరుపులు మెరిపించారు.

    225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్‌కు ముం‍దు హార్దిక్‌ మరో రెండు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నాడు.
    చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?



     

     

  • రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో భారత్‌ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్  అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    రాంచీ వన్డేలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. 

    అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్‌ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు.

    "జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్‌లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. 

    అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశూ పేర్కొన్నాడు.
    చదవండి: Ashes 2025-26: అనుకున్న‌దే జ‌రిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్‌

  • ఇంగ్లండ్‌తో రెండో యాషెస్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ త‌గిలింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖవాజా దూర‌మ‌య్యాడు. ఖవాజా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

    ఈ కారణం చేతనే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అయితే రెండో టెస్టుకు దాదాపు పది రోజుల విశ్రాంతి లభించడంతో అతడు కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కానీ ఉస్మాన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు.

    మంగళవారం 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ సెషన్‌లో ఖవాజా పాల్గోన్నాడు. కానీ అతడు అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఖవాజాను రెండో టెస్టు జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడి స్ధానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం సీఎ వెల్లడించలేదు. 

    తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. సెకెండ్ టెస్టులో కూడా ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. అదే విధంగా ఖవాజా స్ధానంలో తుది జట్టులోకి ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్ రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ టెస్టుకు కూడా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో మ్యాచ్‌లను కంగారుల జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

    రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
    చదవండి: మరోసారి పేట్రేగిపోయిన వైభవ్‌ సూర్యవంశీ

  • ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్‌.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.

    ఈ టోర్నీలో పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్‌ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం​ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. 

    అనంతరం రాజ్‌ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నమన్‌ ధిర్‌ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్‌ రావత్‌ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్‌లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ.

     

     

National

  • ఢిల్లీ: రోహింగ్యాల అంశంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. అక్రమంగా  దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతించాలా అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇటీవల కస్టడీలో ఉన్న ఐదుగురు రోహింగ్యాల ఆచూకీ లేదని వారి సమాచారం ఇవ్వాలని పిటిషన్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది.

    భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు."మీరు అక్రమంగా దేశంలోకి చొరబడతారు. దాని కోసం ఫెన్సింగ్ ను తెంపుతారు, సొరంగం తవ్వుతారు. ఆ తర్వాత మేము మీ దేశంలోకి వచ్చాము. మీ చట్టాలు మాకు వర్తించాలి అంటారు. ఆ తర్వాత మాకు ఆహారం కావాలి, మాకు నివాసం కావాలి, మా పిల్లలకు చదువు కావాలి అంటారు. మేము ఇలా చట్టాలని సాగదీసుకుంటూ పోవాలా "అని రోహింగ్యాలను ఉద్దేశించి పిటిషనర్ ని ప్రశ్నించారు.

    మన దేశంలోనూ పేదవారు ఉన్నారు. వారు ఈ దేశ ప్రజలు వారికి కొన్ని సౌకర్యాలు, ప్రయోజనాలు లభించడం లేదు? మీరు వాటిపైన ఎందుకు దృష్టి పెట్టరు. అని అడిగారు. కస్టడీలోకి తీసుకున్న వ్యక్తిని హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఖచ్చితంగా  కోర్టు ముందు ప్రవేశపెట్టాలి.  కస్టడీ న్యాయబద్ధమైనదా కాదా అనే విషయం న్యాయమూర్తి అప్పుడు నిర్ణయిస్తారు అని తెలిపారు. అయితే అక్రమంగా ప్రవేశించిన వారిపై సైతం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిషేధమన్నారు.

    అయితే భారత్ రోహింగ్యాలను శరణార్థులుగా ఇంకా ప్రకటించలేదని వారికి  శరణార్థులకుండే చట్టబద్ధత హోదా లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఎవరైనా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన అవసరం మనకు ఉందా అని అని అడిగారు. భారత్ కు ఉత్తర భారతంలో చాలా సున్నితమైన సరిహద్దు ఉందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

    మయన్మార్ దేశానికి చెందిన  రోహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో వారు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.అయితే భారత్ వీరిని శరణార్థులుగా గుర్తించలేదు. అయినప్పటికీ దేశంలో అక్రమంగా చొరబడి నివసిస్తున్నారు. ఇండియాలో దాదాపు 40 వేలకు పైగా రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం.

     

  • భారతదేశంలోని అత్యంత విశిష్ట గైనకాలజిస్టులలో ఒకరైన డాక్టర్ కె లక్ష్మీ బాయి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన జీవితకాల పొదుపు నుంచి రూ. 3.4 కోట్లను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) భువనేశ్వర్‌కు విరాళంగా ఇచ్చారు.  మహిళలకు క్యాన్సర్ సంరక్షణ సేవలకు గాను  ఈ విరాళాన్ని అందించారు. డిసెంబర్ 5న ఆమె 100వ పుట్టినరోజు జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందు   ఆమె దానం  చేయడం విశేషం.

    100వ పుట్టిన రోజు  జరుపుకోబోతున్న  డాక్టర్ కె లక్ష్మీ బాయి తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 3.4 కోట్లను ఒడిశా, క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళల కోసం గైనకాలజికల్ ఆంకాలజీ యూనిట్‌ను నిర్మించడానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, ఇది గైనకాలజికల్ ఆంకాలజీ కార్యక్రమాన్ని స్థాపించడంలో సహాయ పడుతుందని, భవిష్యత్ వైద్యులను రూపొందిస్తుందని, ఎంతోమంది మహిళల  ఆశలను రెక్కలివ్వాలనేది  తన కోరిక అని చెప్పారు. దీంతో పాటు  యువతులలో క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడే కౌమార టీకా డ్రైవ్‌లకు మద్దతుగా డాక్టర్ బాయి బెర్హంపూర్ ప్రసూతి మరియు గైనకాలజీ సొసైటీకి రూ. 3 లక్షలు విరాళంగా ఇచ్చారు. భావ్‌నగర్‌లోని డాక్టర్ బాయి నివాసంలో ఆమె పూర్వ విద్యార్థులు కొందరు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు హాజరవుతారని భావిస్తున్నారు.

    యాభై సంవత్సరాలకు పైగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ లక్ష్మీ బాయి తన క్లినికల్ ప్రావీణ్యం కోసం మాత్రమే కాకుండా, మహిళలకు గౌరవప్రదమైన, అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడంలో ఆమె అచంచలమైన నిబద్ధతకు కూడా విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

    1926లో డిసెంబర్ 5, జన్మించిన డాక్టర్ లక్ష్మీ బాయి, కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో మొదటి MBBS బ్యాచ్‌లో ఉన్నారు.  అక్కడినుంచే ఆమె అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి DGO, MD (ప్రసూతి & గైనకాలజీ)  పట్టాలు పుచ్చుకున్నారు. USAలోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్‌లో MPHని అభ్యసించారు. 1950లో సుందర్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో  వృత్తిని ప్రారంభించారు. 1986లో బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీలో O&G ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.

  •  వారణాసి,  సాక్షి :  మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖీ (Devavrat Mahesh Rekhe) అరుదైన ఘనతను సాధించారు. శుక్ల యజుర్వేదం (మధ్యందిన శాఖ) నుండి దాదాపు 2,000 మంత్రాల అత్యంత సంక్లిష్టమైన పారాయణం ‘దండక్రమ పారాయణాన్ని’ పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. అద్భుతమైన ఆ వారణాసి అసాధారణమైన ఆధ్యాత్మిక క్షణాలకు వారణాసి వేదికగా నిలిచింది.  వేద సంప్రదాయంలో అత్యంత క్లిష్టమైన వాటిల్లో ఒకటిగా ఈ పారాయణాన్ని  భావించారు. దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా శాస్త్రీయంగా ఈ కార్యక్రమం జరిగింది.

     ఈ పవిత్ర కార్యానికి గౌరవసూచకంగా, దేవవ్రతకు రూ.5 లక్షల విలువైన బంగారు కంకణం, రూ.1,11,116 విలువైన బంగారు కంకణాన్ని బహుకరించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం , జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఈ గుర్తింపు లభించింది. 500 మందికి పైగా వేద విద్యార్థులు, సాంప్రదాయ సంగీతకారులు , శంఖ రావాల ప్రతిధ్వనుల మధ్య   వారణాసి పులకించిపోయింది.   భక్తులు వీధుల్లో బారులు తీరి, జల్లులు కురిపించారు ఈ వేడుకలో, శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతి తీర్థ మహాసన్నిధానం నుండి ఆస్థాన విద్వాన్ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ ప్రత్యేక ఆశీర్వాద సందేశాన్ని అందించారు. సంక్లిష్టమైన స్వర-నమూనాలు మరియు శబ్ద ఖచ్చితత్వానికి వేద పారాయణ కిరీటంగా గౌరవించబడే దండక్రమ  పారాయణం చరిత్రలో మూడు సార్లు మాత్రమే నిర్వహించబడిందని, దేవవ్రత పారాయణం దోషరహితంగా అతి తక్కువ సమయంలో పూర్తయిందని శృంగేరి మఠం అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు 
    19 ఏళ్ల దేవవ్రత మహేష్ రేఖే అద్భుతమైన విజయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసించారు. దేవవ్రతుడి విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్‌  చేశారు. భారతీయ సంస్కృతిని అనుసరించే ప్రతి ఒక్కరూ ఆ యువ పండితుడు శుక్ల యజుర్వేదంలోని 2,000 మంత్రాలతో కూడిన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల పాటు నిరంతరాయంగా పూర్తి చేశాడని తెలుసుకుని సంతోషిస్తారని ఆయన అన్నారు. ఇంతటి అసాధారణ ఆధ్యాత్మిక క్రమశిక్షణను కాశీ పవిత్ర నేలపై  జరగడం గర్వంగా ఉందన్నారు.  ఈ సందర్బంగా దేవవ్రతుడి కుటుంబం, సాధువులు, పండితులు, అతని కఠినమైన వేద అభ్యాసానికి దేశవ్యాప్తంగా  అతనికి మద్దతు ఇచ్చిన సంస్థల పట్ల గౌరవాన్ని ప్రకటించారు. వల్లభరం శాలిగ్రామ్ సంగ్వేద్ విద్యాలయంలో అక్టోబర్ 2 నుండి నవంబర్ 30 వరకు పారాయణం నిర్వహించారు. శృంగేరి పీఠం వేదపోషక సభ ఆధ్వర్యంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ పరీక్షల ప్రధాన పరిశీలకుడు వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే యువ పండితుడు మరియు అతని తండ్రి-గురువు  వేదబ్రహ్మశ్రీ మహేష్ చంద్రకాంత్ రేఖే ఇద్దరినీ సాధువులు , వేద పండితులు ప్రశంసించారు.

  • కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9 - 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి.  ఈ క్రమంలో మున్నార్‌ నుంచి పోటీ  చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ (అవును మీరు చదవింది నిజమే) కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో  చర్చనీయాంశంగా మారింది.

    ఎవరీ సోనియా గాంధీ
    కేరళలోని నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ విధేయుడు, సీనియర్‌ నాయకుడు  దివంగత దురే రాజ్  కుమార్తె సోనియా గాంధీ. సోనియా గాంధీ పట్ల అభిమానంతో, ఆమెకు ఆ పేరు పెట్టుకున్నారట.అయితే బీజేపీలో చురుకైన కార్యకర్తగా ఉన్న సుభాష్‌ను సోనియా వివాహం చేసుకున్నారు . ప్రస్తుతం పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు పాత మున్నార్ మూలక్కడ వార్డులో జరిగిన ఉప ఎన్నికలో ఆమె బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. తన భర్త రాజకీయ మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడు మళ్లీ  బీజేపీ తరపున బరిలోకి దిగారు. 

    చదవండి: జస్ట్‌ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్‌ సక్సెస్‌ స్టోరీ

    మరోవైపు మున్నార్‌లో సోనియా గాంధీ పోటీ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్‌కు ఇక్కడ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే  కాంగ్రెస్‌ అధినేతగా సోనియా గాంధీ పేరు అందరికీ సుపరిచితమే. ఆ పేరున్న వ్యక్తం  పోటీ చేయడంతో  సోనియా పేరు తక్షణమే ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో  రమేష్‌ ఆందోళన పడుతున్నారు.  డిసెంబర్ 13న లెక్కింపు జరుగుతుంది.

    ఇదీ చదవండి: అపూర్వ ఘట్టం, అరుదైన ఘనత : ప్రధాని మోదీ ప్రశంసలు

  • చండీగఢ్ లోని టింబర్ మార్కెట్ సమీపంలో ఇంద్రపీత్ సింగ్  (ప్యారీ) అనే  గ్యాంగ్ స్టార్ ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ప్యారీ తన వాహనంలో ప్రయాణిస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారని తెలిపారు.

    ఇంద్రపీత్ సింగ్ పై కాల్పులు జరిపిన అనంతరం వెంటనే అతడిని దగ్గర్లోని పీజీ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు పేర్కొన్నారు. ఏదైనా గొడవ కారణంగానే  బాధితుడిపై కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. కాగా కాల్పులు జరిగిన కొద్దిసేపటికి హరీ బాక్సర్ ఆర్జో బిష్ణోయ్ పేరుతో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. 

    ప్యారీ ( ఇంద్రప్రీత్ సింగ్) ను తామే చంపామని అతను లోకల్ క్లబ్స్ నుండి డబ్బులు వసూలు చేసి తమను చంపాడానికి ప్లాన్ చేస్తున్నాడని అందులో ఉంది. అయితే ఆ పోస్టును ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ స్టర్ ప్యారీ చంఢీగఢ్ లోని సెక్టార్ 36లో నివసిస్తారని అతనిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు.

    ఇంద్రపీత్ సింగ్, గ్యాంగ్ స్టార్ బిష్ణోయ్ డీఏవీ కాలేజీలో పూర్వ విద్యార్థులు. వీరిద్దరూ 2010లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలలో ప్రవేశించారు. ఒక సందర్భంలో వీరిద్దరూ కలిసి చండీగఢ్ సెక్టార్ 40లో ఒకరిపై దాడి చేశారు. ఆ కేసులో  బిష్ణోయ్, ఇంద్రప్రీత్ సింగ్ ఇద్దరూ ఒకేసారి అరెస్టయ్యారు.

    పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్ ఇతని గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం బిష్ణోయ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధీఖీ హత్య తరువాత ఇతని పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలోనూ ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 

    ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కు ఈయన నుంచి బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ శిక్ష ఎదుర్కొంటున్నారు. అయితే కృష్ణ జింక బిష్ణోయ్ కమ్యూనిటికి చాలా పవిత్ర జంతువు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం బాలీవుడ్ స్టార్ కు భద్రత పెంచింది.
     

  • నూనూగు మీసాల విద్యార్థి  దశలోనే ఉండగానే 18 ఏళ్ల  వయసులో ఒక సంస్థకు సీఈఓ కాగలనని ఎవరైనా కలగంటారా? కానీ ఒకబ్బాయి కన్నాడు. పెద్ద సాహసమే చేశాడు. అభిరుచి, అభ్యాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించి తీరవచ్చని నిరూపించాడొక యువకుడు. కలలు కంటూ కూర్చోవడం కాదు, వాటిని సాకారం చేసుకోవడంలోనే  ఉంటుంది కిక్కు. సూర్య వర్షన్‌ను చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తుంది. పదండి ఆయన సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

    తమిళనాడులోని తూత్తుకుడిలో ఒక చిన్న వంటింటి నుంచి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఆవిస్కృతమైన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. సూర్య వర్షన్ అద్భుతమైన నేకెడ్ నేచర్‌ (Naked Nature)ను స్థాపించాడు.  కంపెనీ సీఈవోగా స్కిన్‌కేర్ అండ్‌ హెయిర్‌కేర్ బ్రాండ్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలిచాడు.

     ఉప్పు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి పట్టణంలో సూర్యకు చిన్నప్పటి నుంచి ఉప్పును ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. మరీ ముఖ్యంగా గాయాలకు ఉప్పు కాపడం  పెట్టడం చూసి ఆశ్చర్యపోయేవాడు.   అసలు ఉప్పులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. దానిగురించి స్టడీ చేశాడు.  తద్వారా మెగ్నీషియం, కాల్షియం ఉప్పులో ఎక్కువగా ఉంటాయని, అవి కండరాల నొప్పులను తగ్గిస్తాయని లుసుకున్నాడు. అయితే ఉప్పుతో పాటు ఏదైనా పదార్థాన్నికలిపి మెడిసిన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయనాలు కలపకుండా సహజ ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.  ఈ క్రమంలో  గతల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ రూ.200 తో,600 చదరపు అడుగుల ఇంటిలో మందారం పువ్వు, బార్లీ, వేపాకుతో కలిపి బాత్ సాల్ట్ ను తయారు చేశాడు. దానికి హైబిస్కస్ బాత్ సాల్ట్ అని పేరుపెట్టాడు. దీని  ధర  రూ. 320. 12వ తరగతిలో సూర్య వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమై 2019లో  ఒక చిన్న   ఫ్యాక్టరీ సెటప్‌కు మారింది. దాదాపు అన్ని పనులూ సింగిల్‌ హ్యాండ్‌తోనే నడిపించాడు. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ అవే  ఈరోజు సూర్యను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. 

    చదవండి: సమంత-రాజ్‌ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!

    సేంద్రీయ, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, పైగా దేశీ-ఆవు నెయ్యిని ఉపయోగించడంతో ముగ్ధుడైన ఆయుర్వేద వైద్యుడు బల్క్ ఆర్డర్ ఇవ్వడంతో సూర్య వ్యాపారం కీలక మలుపు మలుపు తిరిగింది. ఈ విజయంతో సూర్య తన చదువులను మధురైకి మార్చుకుని పూర్తిగా తన వ్యాపారంపై దృష్టి పెట్టాడు.  యూట్యూబ్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. వాటిని ఆన్‌లైన్‌లో బోధించి  రూ. 2.2 లక్షలు సంపాదించాడు. దీన్ని తిరిగి నేకెడ్ నేచర్‌లో స్కేల్ ఆపరేషన్‌లకు పెట్టుబడి పెట్టాడు.

    ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

    ప్రస్తుతం నేకెడ్ నేచర్ చర్మ ,జుట్టు సంరక్షణ, బాత్‌ బేబీ కేర్ వర్గాలలో,  70 ఉత్పత్తులనుపైగా సహజ ఉత్పత్తులను అందిస్తుంది. 2021-22 నాటికి రూ. 10 కోట్ల విలువను చేరుకుంది.  కంపెనీ ఆఫీసు 4ఏవేల చదరపు అడుగులకు మారింది. ఈ బ్రాండ్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, అంతర్జాతీయంగా కూడా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 2023లో గ్లోబల్‌ స్టూడెంట్‌  ఆంట్రపెన్యూర్‌  అవార్డు దక్కించుకున్నాడు. 
     

  • ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును  సేవాతీర్థ్ గా  మార్చుతూ  కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల పేరును కేంద్రం లోక్ భవన్ లుగా మార్చింది. ఈ నేపథ్యంలో మిగతా వాటి పేర్లను మార్చుతూ  నోటిఫికేషన్ జారీ చేసింది.

    దీనితో పాటు రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. రాజ్ భవన్ పేరు మార్చినట్లు నోటిఫికేషన్ రావడంతో  హైదరాబాద్ లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ లోక్ భవన్ పేరును ప్రచురించబోతున్నట్లు పేర్కొన్నారు. 

    సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో  ఆ భవనాలలోకి పీఏంఓతో పాటు ఇతర కీలకమైన శాఖల కార్యాలయాలను మార్చారు. పీఎంఓకు  ప్రక్కనే క్యాబినెట్ సెక్రటేరియేట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియేట్, ఇండియా హౌస్ ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2016లో ప్రధాని నివాసం పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్ గా, రాజ్ పథ్ ని కర్తవ్యపథ్ గా నామకరణం చేశారు.

     

     

  • సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్​లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్‌ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. 

    గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. 

    ఇక మండల-మకరవిలక్కు సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. 

    సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్‌, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.

    (చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!)

     

  • హర్యానాకు చెందిన  ఐఐటీ బాంబే  విద్యార్థిని షేర్‌ చేసిన వీడియో ఒకటి  నెట్టింట తెగ సందడి చేస్తోంది. క్యాంపస్ మెస్ ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలతో తన అనుభవాన్ని పంచుకుంది.


    భారతదేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో  ఒకటైన ఐఐటీ బాంబే మెస్‌  గురించి అక్కడ  చదువుకుంటున్న  గరిమా  తన యూ ట్యూబ్‌లో ఒక  చిన్న వీడియో పోస్ట్‌ చేసింది.  ఇక్కడ మెస్‌ చాలా హైజీనిక్‌గా ఉంటుందని,ఫుడ్‌ కూడా చాలా బావుంటుందని వివరించింది.  అంతే ఈ చిన్న యూట్యూబ్ వీడియో వైరల్ అయింది.  


    "నేను హర్యానా నుండి వచ్చాను, నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇతర రాష్ట్రాల ఆహార సంస్కృతిని ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఐఐటీ బాంబే నాకు ప్రతిదీ పరిచయం చేస్తోంది."అని పేర్కొంది.  ఇది 12 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించింది. 4 లక్షలకు పైగా కామెంట్లువెల్లువెత్తాయి. 2024లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో మళ్లీ ఇపుడు వైరలవుతోంది.  1300 కమెంట్స్‌ రావడంతో   నెట్టింట ఇంట్రస్టింగ్‌గా మారింది.

    కాగా గరిమా @garimabagar పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది.  IIT బాంబే మెస్‌ టూర్‌లో  ప్రతి పండుగ మెస్‌లో మా ప్లేట్‌లో కనిపిస్తుంది." అంటూ అక్కడ వడ్డించే ఆహారం గురించి మాట్లాడుతుంది.పొంగల్ సమయంలో, అరటి ఆకుల్లో  భోజనాన్ని వడ్డించడం,విద్యార్థులు నేలపై కూర్చుని తినడం గురించి గర్వంగా చెప్పుకొచ్చింది. పొంగల్ రోజున, క్యాంటీన్ లోపల రంగోలి సాంప్రదాయ లేఅవుట్‌లో భోజనం వడ్డించారు. బియ్యం, సాంబార్, చట్నీ . స్వీట్లు వంటి వంటకాలను అరటి ఆకులపై వడ్డించాన్ని ఈ వీడియో చూడవచ్చు.

    అంతేకాదు ఈ సంప్రదాయంలో భాగంగా విద్యార్థులు నేలపై కూర్చుని తినడానికి ,,చెప్పులు తీసేసారని,  తొలిసారి, సాంప్రదాయ దక్షిణ భారత పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తున్నామని నిజంగా ఇది భిన్నమైన అనుభవం అని   ఈ వీడియోలో వివరించింది.  మరికొన్ని రోజుల్లో  పొంగల్‌ సందడి రానున్న సందర్భంగా మళ్లీ ఇపుడు ఈ వీడియో నెటిజన్లును ఆకట్టుకుంటోంది. 

     

  • విధి వెక్కిరించినా, సమాజం వెక్కిరించినా, తన కలను వదులకోలేదు. పట్టుదలగా తను అనుకున్నదిసాధించాడు. తనలాంటి ఎందరికో  స్ఫూర్తిగా నిలిచాడు.   ఆయనే భారతదేశానికి చెందిన 3 అడుగుల డాక్టర్ గణేష్ బరయ్య. తన కల  సాకారం కోసం ఆయన చేసిన పోరాటం అంతా ఇంతాకాదు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు  చెందిన మూడు అడుగుల  గణేష్ ( 25)‌ తాను పోరాడి సాధించిన   MBBS కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య అధికారిగా నియమితుడయ్యారు. వికలాంగులకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి సివిల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన  పేరు దేశ మంతా మారిమోగిపోతోంది.  

    గ్రోత్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్  కారణంగా పుట్టుకనుంచి గణేష్‌ ఎదుగుదల సమస్య వచ్చింది. అందుకే ఆయన ఎత్తు మూడు అడుగులకే  పరిమితం అయింది.    మరుగుజ్జుత్వం కారణంగా 72శాతం  లోకోమోటర్ వైకల్యంతో జన్మించిన గణేష్ బరయ్య కేవలం మూడు అడుగుల పొడవు , 20 కిలోల బరువు  మాత్రమే. శారీరకంగా ఉన్న సమస్య కారణంగా చిన్నతనంనుంచే ఎన్నో అవమానాలు, అవహేళలను తప్పలేదు. 

    2018లో నీట్ యుజి పరీక్ష  రాసిన సందర్భంగా  అతనిలోని  వైకల్యం కారణంగా భారత వైద్య మండలి  ఆయన్ను  తిరస్కరించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MBBS కోర్సుకు అడ్మిషన్ తిరస్కరించడంతో   గుజరాత్ హైకోర్టులో కేసు  వేశారు. అక్కడా ఫలితం దక్కలేదు. అక్కడితో ఆగిపోలేదు.  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి  2019లో మీకు సీటు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వైకల్యం కారణంగా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని గణేష్ బరయ్యకు హామీ ఇచ్చింది.  చట్టపరమైన ఖర్చులను భరించడంలో సహాయపడిన  గణేష్‌ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దల్పత్‌భాయ్ కటారియా మద్దతుతో, బరయ్య సంకల్పం ఫలించింది.

    ఇదీ చదవండి: సమంత-రాజ్‌ పెళ్లి వేడుక : అరటి ఆకులో విందు ఏం వడ్డించారో!

    రోగులు మొదట్లో చికిత్సను నిరాకరించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అయినా తను అలాంటి వాటి  గురించి  పట్టించుకోనని, దానికి బదులుగా తనతో సానుకూలంగా  ఉన్న  చాలా మంది రోగులపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు. వైద్య అధికారిగా  తనతదుపరి లక్ష్యం  తన కుటుంబంకోసం ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వాలనేది.  భావ్‌నగర్ జిల్లాలోని గోర్ఖి గ్రామంలోని కచ్చా ఇంట్లోనే నివసిస్తోంది.  వారికి అన్ని సౌకర్యాలతో కూడిన ఇటుక ఇల్లు నిర్మించడం అనేది  తన డ్రీమ్‌ అని  చెప్పారు.

     

     

  • తమిళనాడు: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని కట్టుకుడలూర్‌ ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్‌ భార్య తమిళరసి (35). వీరికి ఇద్దరు కుమారులు హరికృష్ణన్‌ (13), హరిశక్తి (10) ఉన్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల కారణంగా గత 10 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నారు. గోపాలకృష్ణన్‌ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తమిళరసి తన ఇద్దరు కుమారులతో కలిసి తన భర్త తమ్ముళ్లయిన బాలకృష్ణన్, మురుగనాథం ఇంట్లో నివసిస్తోంది. 

    ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం, బాలకృష్ణన్, మురుగానందం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ తమిళరసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు మురుగానందాన్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలకృష్ణన్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బాలకృష్ణన్‌ తాగి ఇంటికి వచ్చాడు. తర్వాత తమిళరసితో గొడవ పడ్డాడు. తర్వాత తన వద్ద దాచిన కత్తితో తమిళరసి తలను నరికి హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న బాలకృష్ణన్‌ను అరెస్టు చేశారు.

  • ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్​ కేసులో కొత్త ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడంపై ఖర్గే పలు విమర్శలు చేశారు. ఇది బీజేపీ, మోదీ రాజకీయ ప్రతీకారం అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, ఈడీ కలిసి కొత్త ఆరోపణలు లేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాయని అన్నారు.

    నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విషయమై మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘12 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా గాంధీ కుటుంబంపై కొత్త ఎఫ్​ఐఆర్ నమోదైంది. ఎందుకంటే మోదీ ప్రభుత్వం, ఈడీ వద్ద కొత్త ఆరోపణలు లేవు. వాస్తవాలు తక్కువగా ఉన్నప్పుడు నాటకీయ అంశాలు రంగంలోకి దిగాయి. రాజకీయ ప్రతీకార చర్య, పాత ఆరోపణలు తీసుకురావడం అన్నీ ప్రత్యర్థులను వేధించే ప్రయత్నం. ఇది రాజకీయ ప్రతీకార చర్య. దీనిని న్యాయవ్యవస్థ కచ్చితంగా గుర్తిస్తుందని మేం విశ్వసిస్తున్నాం’ అని పోస్టులో పేర్కొన్నారు.

    కేసు వివరాలు ఇలా.. 
    దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1938లో వార్తాపత్రిక నేషనల్ హెరాల్డ్‌ స్థాపించారు. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్​ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వాటిలో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది.

    ఇదిలా ఉండగా.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును పరిగణనలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్​ 16కు వాయిదా వేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్‌ జర్నలిస్ట్స్‌ లిమిటెడ్‌(AJL)కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడాలతోపాటు యంగ్‌ ఇండియన్‌ అనే ఒక ప్రైవేటు కంపెనీ కుట్రకు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది.

  • హీరోయిన్‌ సమంత రూతు ప్రభు, రాజ్‌ నిడుమోరు (Samantha and Raj Nidimoru Wedding) తమ పెళ్లివార్తను ప్రకటించి ఎన్నో ఊహాగానాలకు చెక్‌ పెట్టారు. రాజ్ నిడిమోరుతో తన వివాహ చిత్రాలను అప్‌లోడ్ చేయడంతో అటు ఫ్యాన్స్‌,  ఇటు నెటిజన్లు సంబరాల్లో మునిగితేలారు.  

    తమిళనాడులోని కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సాంప్రదాయ వేడుకలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వివాహం చేసుకున్నారు. సమంత అందమైన ఎర్రచీర, చోకర్‌ నెక్లెస్‌, భారీ చెవిపోగులు సంప్రదాయ నగలతో ఆకట్టు కున్నారు.  రాజ్‌ కూడా తనదైన శైలిలో ప్రత్యేకంగా కనిపించారు. ముఖ్యంగా సమంత ధరించిన మొగల్‌ శైలి పోట్రెయిట్‌కట్‌ డైమండ్‌ రింగ్ విశేష ప్రాధాన్యంగా నిలిచింది. పోట్రెయిట్‌ కట్‌ను బలం, తేజస్సు, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు.  

    ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్యాషన్ డిజైనర్, సమంత సన్నిహితురాలు శిల్పా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాహం నుండి మరిన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో  అరటి ఆకులో వడ్డించిన థాలీ ఏంటి అనేది హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

    అరటి ఆకులో కమ్మటి భోజనం
    సమంత & రాజ్ వివాహానికి సాత్విక విందు మరో ప్రత్యేక  ఆకర్షణ. అరటి ఆకుపై అన్నం,  పప్పు,కూరలతో కలర్‌పుల్‌గా కనిపించిన  సాంప్రదాయ దక్షిణ భారత విందు ఇది. ఇషా ఫౌండేషన్ విలువలు, నమ్మకాలకు  ప్రతిబింబిస్తూ సాత్విక నియమాలను ఖచ్చితంగా పాటించారు. తమిళనాడు రుచులు మరియు సంస్కృతికి అనుగుణంగా అన్నం,  పప్పు క్యారెట్ , బీన్స్ పల్యా, రాగి బాల్స్, దోసకాయ సలాడ్, ఊదా రంగు స్వీట్ రైస్ ఉన్నాయి. ఇషా యోగా సెంటర్‌లోని ది పెప్పర్ వైన్ ఈటరీ అనే కేఫ్ అందించిన ఎలాంటి మసాలా దినుసులు లేకుండా  ఈ ఫుడ్‌ను వడ్డించారు.

    ఇదీ చదవండి : పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

Business

  • బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 2) మరోమారు తగ్గాయి. దీంతో పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఉదయం రూ. 250 తగ్గిన 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 550 రూపాయలకు చేరింది. అంటే గంటల వ్యవధిలో 300 రూపాయలు తగ్గింది. దీంతో రేటు రూ. 1,19,050 (22 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 610 తగ్గింది (ఉదయం రూ. 280 మాత్రమే తగ్గింది). దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,29,870 వద్ద నిలిచింది.

    ఢిల్లీలో కూడా బంగారం ధరలు మరింత తగ్గాయి. సాయంత్రానికి 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 610 రూపాయలు తగ్గి రూ. 1,30,020 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 550 రూపాయలు తగ్గి రూ. 1,19,200 వద్ద నిలిచింది.

    చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి అలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర 320 రూపాయలు తగ్గి రూ. 1,31,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 300 రూపాయలు తగ్గి రూ. 1,20,400 వద్ద నిలిచింది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • అగ్రరాజ్యం అమెరికా విధించిన భారీ టారిఫ్‌ల దెబ్బతో ఆ దేశానికి భారత్‌ ఎగుమతులు గత 5 నెలల్లో గణనీయంగా క్షీణించాయి. అతి పెద్ద మార్కెట్‌కి ఎక్స్‌పోర్ట్స్‌ 28.5 శాతం తగ్గిపోయాయి. జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం గతేడాది మే–అక్టోబర్‌ మధ్య కాలంతో పోలిస్తే ఈసారి ఎగుమతులు 8.83 బిలియన్‌ డాలర్ల నుంచి 6.31 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

    భారత్‌ ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లు ఏప్రిల్‌ 2న 10 శాతంతో మొదలుపెట్టి ఆగస్టు నాటికి 50 శాతానికి చేరాయి. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో అత్యధిక టారిఫ్‌లు వర్తిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచింది. మరోవైపు పొరుగు దేశం చైనాపై టారిఫ్‌లు 30 శాతంగానే ఉండగా జపాన్‌పై కేవలం 15 శాతంగా ఉన్నాయి.

    తాజా గణాంకాలు పరిశీలిస్తే టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ఫార్మా, పెట్రోలియం ఉత్పత్తుల వాటా అక్టోబర్‌ ఎగుమతుల్లో 40.3 శాతం స్థాయిలో ఉన్నప్పటికి విలువపరంగా మే నెల నాటి 3.42 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 2.54 బిలియన్‌ డాలర్లకు (25.8 శాతం) పడిపోయింది.

  • పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ &  క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.

    నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.

    టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్‌లో మరొకటి ప్లాన్ చేసింది.

    టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.

  • కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయనే మాట చాలామంది వినే ఉంటారు. కానీ అంబానీ సంపదను రోజుకు రూ. 5కోట్లు చొప్పున ఖర్చు చేస్తే.. కరిగిపోవడానికి ఏకంగా వందల సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం.. వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

    రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం ప్రపంచంలోనే 16వ ధనవంతుడు. ఆయన నికర విలువ దాదాపు USD 113.5 బిలియన్లు, అంటే దాదాపు రూ. 1,01,40,00,00,00,000 కోట్లు. ఈ సంపదను రోజుకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తే.. మొత్తం కరిగిపోవడానికి 2,02,800 రోజులు అవుతుంది. సంవత్సరాల రూపంలో చెప్పాలంటే 555 ఏళ్లు (2,02,800 ÷ 365) పడుతుందన్నమాట.

    రిలయన్స్ ఆదాయం ఇలా..
    1966లో ధీరూభాయ్ సారథ్యంలో ఒక చిన్న వస్త్ర తయారీదారుగా ప్రారంభమైన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇప్పుడు దాదాపు 125 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. రిలయన్స్.. పెట్రోకెమికల్స్, చమురు, గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఆర్థిక సేవలతో సహా అనేక రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, ముఖేష్ అంబానీ & అతని తమ్ముడు అనిల్ అంబానీ కుటుంబ వ్యాపారాన్ని పంచుకున్నారు.

  • హైపర్‌సర్వీస్ ప్లాట్‌ఫాం కింద ఓలా ఎలక్ట్రిక్‌ కొత్తగా ఇన్‌–యాప్‌ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ ఫీచరును ప్రవేశపెట్టింది. దీనితో కంపెనీ యాప్‌ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన సర్వీస్‌ స్లాట్లను బుక్‌ చేసుకోవచ్చు. సర్వీస్‌ పరిస్థితిని ట్రాక్‌ చేసుకోవచ్చు. అలాగే సర్వీస్‌కి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట సమగ్రంగా చూసుకోవచ్చు.

    సంప్రదాయ సర్వీస్‌ బుకింగ్‌ విధానంలో ఎదురయ్యే సవాళ్లను తొలగించే విధంగా ఇది ఉంటుందని కంపెనీ తెలిపింది. సిసలైన, అత్యంత నాణ్యమైన విడిభాగాలు, ప్రామాణిక సర్వీస్‌ ప్రక్రియలు యూజర్లకు లభిస్తాయని పేర్కొంది. కస్టమర్లు, స్వతంత్ర గ్యారేజ్‌లు, ఫ్లీట్‌ ఆపరేటర్లకు కూడా తమ స్పేర్‌ పార్టులు, డయాగ్నోస్టిక్‌ సాధనాలు, శిక్షణ మొదలైనవి అందుబాటులో ఉండేలా ఓలా ఇటీవలే హైపర్‌సర్వీస్‌ ప్లాట్‌ఫాంని ఆవిష్కరించింది.

  • ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.

    లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

    పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.

    అత్యధికంగా విజయ్ మాల్యా
    విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్‌బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.

  • మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 503.62 పాయింట్లు లేదా 0.59 శాతం నష్టంతో.. 85,138.27 వద్ద, నిఫ్టీ 143.55 పాయింట్లు లేదా 0.55 శాతం నష్టంతో 26,032.20 వద్ద నిలిచాయి.

    సన్ ఫార్మా అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కంపెనీ, టిప్స్ ఫిల్మ్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, శ్యామ్ సెంచరీ ఫెర్రస్ లిమిటెడ్, ఆల్పా లాబొరేటరీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, జేహెచ్ఎస్ స్వెండ్‌గార్డ్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, విజి ఫైనాన్స్ లిమిటెడ్, ష్రెనిక్, అనిక్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్‌ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

    పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.

    ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్‌ పట్టు

    డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్‌, శామ్‌సంగ్‌, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.

    ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..

    • డూప్లికేట్‌ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.

    • జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్‌లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.

    ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్‌ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్‌ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

    యాపిల్ గోప్యతా ప్రమాణాలు

    ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్‌ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్‌ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్‌ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్‌సంగ్‌, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    ఇదీ చదవండి: గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..

  • యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.

    ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్‌ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేష‌న్ మోడ‌ల్స్‌, ఎంఎల్ రీస‌ర్చ్‌, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేష‌న్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.

    ఎవరీ అమర్ సుబ్రమణ్య?
    ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ పనిచేశారు.

    పీహెచ్‌డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్‌లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా మైక్రోసాఫ్ట్‌కు మారాడు. గూగుల్‌లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్‌లో సీపీవీగా చేరారు.

  • భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం అంటే గుర్తుకొచ్చే పేరు అంబానీ ఫ్యామిలీ. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం, ప్రపంచ స్థాయి విలాసవంతమైన జీవనం.. ఇవన్నీ ఉన్నా మనుషులతో మమైకమయ్యే గొప్ప మనసు ఆ కుటుంబానిదని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మరోసారి చాటారు. ఒక సాధారణ సిబ్బంది పుట్టినరోజు వేడుకలో ఆమె పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇదికాస్తా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. దీని ఫలితంగా గూగుల్ ట్రెండ్స్‌లో నీతాఅంబానీ టాప్ స్థానంలో నిలిచారు.

    వైరల్ వీడియోలో..

    ‘అంబానీ ఫ్యామిలీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్‌ అయిన వీడియోలని వివరాల ప్రకారం.. నీతా అంబానీ తన ఇంటి సిబ్బంది పక్కన నిలబడి తన పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా ఆమె చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా హ్యాపీ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమె ఎలాంటి హడావుడి లేకుండా ఒక స్పూన్‌తో చాక్లెట్ కేక్ ముక్కను తీసి ఆ సిబ్బందికి ప్రేమగా తినిపించారు. ఈ ఊహించని చర్యతో సంతోషం పట్టలేకపోయిన సిబ్బంది చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ‘సో డౌన్ టు ఎర్త్’ క్యాప్షన్‌ ఉన్న ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

    ఇదీ చదవండి: వెండి మెరుపులు.. కారణాలు ఏమై ఉండొచ్చు?

  • బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో పేదవాడి బంగారంగా పిలిచే వెండి ధరలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్దికాలంగా వెండి ధరలు ఎగబాకుతున్నాయి. ఈ అసాధారణ పెరుగుదలకు కారణం ఏమిటనే ప్రశ్నలొస్తున్నాయి. డిమాండ్‌కు సరిపడా వెండి సరఫరా కావడంలేదనే కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు వెండిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుందాం.

    ధరల పెరుగుదలకు కారణం

    వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడమేనని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో వెండి సరఫరా కంటే డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ సిల్వర్ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొరత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

    డిమాండ్ ఎందుకు పెరిగింది?

    బంగారం, వెండి రెండూ విద్యుత్ వాహకత, తుప్పు నిరోధకత, సులభంగా సాగే, రేకులుగా మలిచే గుణం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా వీటి వినియోగం కేవలం పెట్టుబడులు లేదా ఆభరణాల తయారీకే పరిమితం కాకుండా అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తోంది.

    ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తయారీ

    బంగారం అత్యుత్తమ విద్యుత్ వాహకాల్లో ఒకటి. తుప్పు పట్టదు కాబట్టి దీన్ని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, జీపీఎస్ యూనిట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో వాడుతున్నారు. ముఖ్యంగా కనెక్టర్లు, స్విచ్‌లు, రిలేలు, సర్క్యూట్ బోర్డులలోని కీలకమైన భాగాలలో దీర్ఘకాలిక విద్యుత్ కనెక్షన్ల కోసం బంగారాన్ని ఉపయోగిస్తున్నారు.

    ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధన

    ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్‌ల్లోని కీలకమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను రక్షించడానికి, విద్యుత్ ప్రసారం కోసం బంగారాన్ని వాడుతున్నారు. అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణంలో కూడా ఇది అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి బంగారాన్ని పూతగా కూడా ఉపయోగిస్తారు.

    వైద్య పరికరాలు

    బంగారం జీవసంబంధితంగా స్థిరంగా ఉంటుంది (శరీరంలో సులభంగా చర్యలకు గురికాదు). తుప్పు పట్టదు. నాన్-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా దంతవైద్యంలో క్రౌన్స్, బ్రిడ్జెస్ వంటి వాటికి ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సా పరికరాలు, అతిపెద్ద వైద్య ఇమేజింగ్ పరికరాల్లో బంగారాన్ని వాడుతున్నారు.

    నానోటెక్నాలజీ

    బంగారు నానోపార్టికల్స్‌కు వైద్య రంగంలో మెరుగైన సామర్థ్యం ఉంది. వీటిని క్యాన్సర్ చికిత్స, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ (మందులను లక్షిత ప్రాంతానికి చేర్చడం), జీవసంబంధిత సెన్సార్ల (Biosensors) తయారీలో పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు.

    గ్లాస్, కిటికీలు

    కొన్ని భవనాల అద్దాలు, కిటికీలపై సన్నని బంగారు పూతను ఉపయోగిస్తున్నారు. ఈ పూత వేడిని నిరోధించి, లోపల ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. తద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గిస్తుంది.

    సోలార్ ప్యానెల్స్, విద్యుత్ బ్యాటరీలు

    ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తి (Solar Energy) రంగంలో వెండి వినియోగం కీలక పాత్ర పోషిస్తోంది. ఫోటోవోల్టాయిక్ సెల్స్‌లో విద్యుత్తును సేకరించి సరఫరా చేయడానికి వెండి పేస్ట్‌లను (Silver Paste) వాడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే కొన్ని రకాల బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు.

    ఎలక్ట్రానిక్స్, కండక్టర్లు

    వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకతను కలిగి ఉండటం వల్ల అధిక పనితీరు గల ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో సర్క్యూట్ బోర్డులు, స్విచ్‌లు, ఫ్యూజులు, కనెక్టర్‌లలో దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా అధిక విశ్వసనీయత అవసరమయ్యే పరికరాలలో దీని వినియోగం తప్పనిసరి అవుతోంది.

    పారిశ్రామిక రసాయనాలు, ఉత్ప్రేరకాలు

    వెండిని రసాయన పరిశ్రమల్లో ఉత్ప్రేరకాలుగా (Catalysts) వాడుతున్నారు. ఉదాహరణకు, ఫార్మాల్డిహైడ్ ఉత్పత్తిలో (ఇది అనేక ప్లాస్టిక్‌ల తయారీలో ముఖ్యమైనది) ఇది ప్రముఖంగా ఉపయోగపడుతుంది.

    నీటి శుద్ధి, వైద్య రంగం

    వెండికి బలమైన యాంటీమైక్రోబియల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే) లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా దీన్ని నీటి శుద్ధి పద్ధతుల్లో, కొన్ని వైద్య ఉపకరణాలు, కట్టులు (Bandages) తయారీలో వాడుతున్నారు. ఆసుపత్రి పరికరాలపై క్రిమిసంహారక పూతగా కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.

    ఫొటోగ్రఫీ

    సాంప్రదాయ ఫిల్మ్ ఫొటోగ్రఫీలో ఫిల్మ్, పేపర్‌పై కాంతిని గుర్తించడానికి వెండి హాలైడ్లను విస్తృతంగా వాడుతున్నారు. డిజిటల్ ఫొటోగ్రఫీ రాకతో ఈ వినియోగం తగ్గినప్పటికీ ప్రత్యేక ఫొటోగ్రఫీ రంగాలలో ఇంకా ఉపయోగిస్తున్నారు.

    సరఫరా ఎందుకు లేదు?

    • వెండి అనేది ఒక ఉప ఉత్పత్తి (By-product) లోహం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వెండిలో సుమారు 70% కంటే ఎక్కువ భాగం ప్రధానంగా రాగి, సీసం, జింక్, బంగారం వంటి ఇతర లోహాల మైనింగ్ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.

    • ప్రధాన లోహాల మైనింగ్‌పై పెట్టుబడులు తగ్గడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉప ఉత్పత్తిగా లభించే వెండి పరిమాణం కూడా తగ్గిపోతుంది.

    • వెండిని ప్రధానంగా ఉత్పత్తి చేసే గనుల్లో కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ భూమిలో ఉన్న వెండి శాతం (గ్రేడ్) తగ్గిపోతోంది. అంటే ఒకే పరిమాణంలో వెండిని పొందడానికి ఎక్కువ ఖర్చుతో అధిక మట్టిని తవ్వాల్సి వస్తుంది.

    • ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెండిని తిరిగి తీయడం (రీసైక్లింగ్) ఖర్చుతో కూడుకుంది. దీని వల్ల మొత్తం సరఫరాపై ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు.

    వెండి కేవలం సంప్రదాయ ఆభరణాల లోహం కాకుండా ఆధునిక సాంకేతికతకు, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్‌కు కీలకమైన పారిశ్రామిక ముడిసరుకుగా మారింది. సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి భవిష్యత్తు సాంకేతికతలపై పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దీనికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో మైనింగ్ నుంచి లభించే సరఫరా పరిమితంగా ఉండటం వల్ల డిమాండ్ - సరఫరా మధ్య అంతరం మరింత అధికమవుతోంది. ఈ అసమతుల్యతే వెండి ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది.

    ఇదీ చదవండి: దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రభుత్వ పథకాలు

International

  • పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రస్తుతం  ఈ మాజీ క్రికెటర్ అంశం  పాకిస్థాన్ లోనే కాకుండా ఇతర దేశాలలోనూ చర్చనీయాంశం అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధానిని జైలులోనే చంపేశారని పుకార్లు రావడంతో ఆ దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో  మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను ఆమె సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిసింది.

    మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నాడా లేదా అనే అంశం ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న  ఆయనను  కలవడానికి కొంతకాలంగా అక్కడి అధికారులు నిరాకరించడం, దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని పుకార్లు రేగడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలని, ఆయనను కలవడానికి అనుమతించాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

    మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ ని ఆమె సోదరి డాక్టర్ ఖానుమ్  జైలులో కలిసింది. అతనితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" దేవుడి దయ వల్ల ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు. కానీ మానసికంగా ఆయనను చాలా వేధిస్తున్నారు. ప్రతిరోజు సెల్ లో నిర్భంధిస్తున్నారు. ఆయనను ఎవరితోనూ కలవనివ్వడం లేదు. కేవలం కొద్దినిమిషాలు మాత్రమే ఆయనను బయిటకి వదులుతున్నారు". అని  తెలిపింది.

    తాను జైలులో ఉండడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని  ఆయన ఇమ్రాన్ అన్నారని ఆమె తెలిపింది. మెుత్తానికి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలియడంతో  ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని 2023లో అరెస్టు చేశారు. దేశద్రోహం, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఇలా ఆయనపై 121 కేసులు మోపారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ లో హింస చేలరేగింది. ఆయన మద్ధతు దారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో  500మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
     

  • బెలూచిస్తాన్‌ రీజియన్‌లో గత 10 రోజులుగా నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెబల్‌ గ్రూప్స్‌ వరుస దాడులతో పాక్‌ సైన్యం వణికిపోతోంది. తాజాగా బెలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ మునుపెన్నడూ లేని రీతిలో కొత్త తరహా దాడికి దిగింది. ఈ దాడిలో భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

    జరీనా రఫీయా అలియాస్‌ ట్రాంగ్‌ మహూ.. బెలూచ్‌ వేర్పాటువాద సంస్థల దృష్టిలో ఆమె వీర మహిళ.  చగయ్‌ సమీపంలో చైనా మైనింగ్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాంబుతో ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్‌ సైనికుల మరణించారు. అందుకే.. ఆమె త్యాగాన్ని అంతగా కీర్తిస్తున్నారు.

    బీఎల్‌ఎఫ్‌ ఈ తరహా మానవ బాంబు దాడులకు(fidayeen strike) దిగడం ఇదే తొలిసారి. అందునా ఒక మహిళతో దాడి చేయించడంతో ప్రముఖంగా నిలిచింది. ఈ మేరకు మహూ ఫొటోను టెలిగ్రామ్‌ ద్వారా రిలీజ్‌ చేసింది.

    చగయ్‌ జిల్లాలో చైనా అతిపెద్ద రాగి, బంగారపు మైన్‌ కార్యాకలాపాల సంబంధిత కార్యాలయాన్ని నెలకొల్పింది. ఇందుకోసం అక్కడ పాక్‌ భారీగా సైన్యాన్ని మోహరించింది. మహూ తొలుత ఆత్మాహుతి దాడి జరిపి కాపలాగా ఉన్నవాళ్లను హతమార్చింది. ఆపై రెబల్స్‌లోకి ప్రవేశించి తమ దాడిని సులువుగా కొనసాగించారు. అయితే ఈ దాడిలో తమ సైనికులు మరణించిన విషయాన్ని పాక్‌ సైన్యం ధృవీకరించలేదు.

    మరో వైపు.. ఈ మధ్యకాలంలో జరిగిన వరుస దాడులు తమ పనేనని బెలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) ప్రకటించుకుంది. ఈ దాడుల్లో పాక్‌ ఇంటెలిజెన్స్‌.. ఆర్మీ అధికారులు పలువురు మరణించారు.

    ఎందుకీ దాడులంటే..

    బెలూచిస్తాన్‌లో తిరుగుబాట్లు (Baloch Insurgency) దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా జాతి స్వతంత్రత, వనరుల దోపిడీ, రాజకీయ నిర్లక్ష్యం, మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి కారణాలతో ఇవి మొదలయ్యాయి. నెమ్మదిగా.. చైనా పెట్టుబడులు (CPEC ప్రాజెక్టులు), పాకిస్తాన్ భద్రతా దళాలపై దాడుల రూపంలో మరింత తీవ్రమవుతున్నాయి.  BLA (Baloch Liberation Army), BLF (Baloch Liberation Front) వంటి గ్రూపులు చైనా ప్రాజెక్టులు, పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇందుకోసం చైనా ప్రాజెక్టులపై దాడులు, తాత్కాలిక భూభాగం ఆక్రమణలు.. ఇప్పుడు ఏకంగా సూసైడ్‌ దాడుల్లాంటి వ్యూహాలు అవలంబిస్తున్నాయి.

    ప్రధాన కారణాలు ఏంటంటే..
    బలూచిస్తాన్‌లో గ్యాస్, ఖనిజాలు, పోర్టులు ఉన్నప్పటికీ స్థానికులకు లాభం తక్కువ(ఆర్థిక దోపిడీ). వీటికి తోడు.. స్థానిక నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం(రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం). పాకిస్తాన్ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దాడులు, అపహరణలు, జాతి స్వతంత్రత(మానవ హక్కుల ఉల్లంఘనలు).. బలూచ్ జాతి వేర్పాటువాద పోరాటం.. చైనా పెట్టుబడులు (CPEC) పెడుతుండడాన్ని అక్కడి వాళ్లు భరించలేకపోతున్నారు. అందుకే తిరుగుబాటు గ్రూపుల ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు మారాయి. ఇది సాధారణంగానే పాక్‌ సైన్యంతో పాటు చైనాకు గుబులు పుట్టిస్తోంది.

    బలూచిస్తాన్ తిరుగుబాట్ల చరిత్ర👇

    • మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్‌లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది.

    • రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు.

    • మూడో దశ తిరుగుబాటు (1962–63): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు..

    • నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు..

    • ఐదో దశ తిరుగుబాటు (2004–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

Family

  • నిద్రలో కాళ్లు చేతుల ఆడవు.. మెడను నొక్కస్తున్నట్లు ఉంటుంది అది దెయ్యం పనేనా..??? అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది..! మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం.

    కానీ, చేతులు కదలవు..! కాళ్లను కదపలేం..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి నిద్రలో ఇదో నిత్యకృత్యం..! ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. మరికొందరైతే.. గిట్టనివారు చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందంటారు..! అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని ఉందా..!

    ఏ సమయంలో ఇలా జరుగుతుంది??
    అర్ధరాత్రి సరిగ్గా 12.30 గంటలు దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్‌ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెలమీద కూర్చుని, పీక నొక్కుతున్నట్లు.. గుండెలపై బరువు అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతులను కదిలించలేని స్థితిలో.. ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు.. గట్టిగా అరవాలనిపించినా.. అరవలేరు. కళ్లు కూడా తెరవలేరు. దాంతో.. గుండెలో దడ మొదలవుతుంది. మదినిండా ఆందోళనలతోకూడిన ఆలోచనలు వస్తుంటాయి. కళ్లు మూసుకుని ఉన్నా.. బెడ్‌రూంలో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింతవింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.

    అంతా ట్రాష్ అంటున్న సైంటిస్టులు
    ఈ పరిస్థితి కలలాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చేముందు.. భయంతో దేవుడి నామస్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత నిద్ర లేస్తారు. దాంతో.. దేవుడి పేరు చెప్పగానే దెయ్యం పారిపోయిందనుకుంటారు. కానీ.. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే.. ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతందా? అంటే.. చెప్పలేం..! స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది.

    స్లీప్ పెరాలసిస్ అంటే..
    అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్.. అదే పక్షవాతం వస్తే.. పూర్తిగానో.. పాక్షికంగానో కాలు, చేయి చచ్చుబడిపోయి.. నోరు ఓవైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే.. పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే.. స్లీప్ పెరాలసిస్‌కు కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అంతకు ముందు విన్న విషయాలో.. హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్, స్వప్న, సుశుప్త దశలుంటాయి. వీటినే.. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు.

    స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుని, నిద్రపోయేవారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నెపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే.. నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం.

    ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్‌కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు.. ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో.. గుండె దడ పెరగడం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి.. భయం పెరుగుతుంది. అంతే.. కొన్ని సెకన్లపాటు స్లీప్ పెరాలసిస్‌ వస్తుంది. ఇది కనీసం 30 సెకన్లు ఉంటుంది. గరిష్ఠంగా ఇంత సమయం అని చెప్పలేం.

    కంటినిండా నిద్ర లేకపోవడమే కారణం..
    స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా? నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్‌కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్‌కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు.

  • కొన్ని వైరల్వీడియోలు గొప్ప సందేశాన్ని, ద్భుతమైన ప్రేమను వ్యక్తం చేస్తాయి. అలాంటి అద్భుతమైన క్షణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. భారతీయ ట్రావెల్వ్లాగర్కైలాష్మీనా భారతీయ సందర్శకులు పట్ల సంస్కృతిని ప్రతిబింబించే సంభాషణను రికార్డు చేశాడు. వీడియోలో అఫ్గనిస్తాన్లోని జ్యైస్కార్ట్‌ ​వద్ద కైలాష్ఒక గ్లాసు దానిమ్మ రసం ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.

    తర్వాత డబ్బు చెల్లించబోతుంటే..విక్రేత మర్యాదగా నవ్వి డబ్బు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. పైగా "మెహ్మాన్" అనే పదాన్ని పునరావృతం చేస్తాడు. అంటే మీరు మా అతిథి అని అర్థం. అంతేగాదు సమీపంలో నిలబడి ఉన్న ఒక స్థానిక వ్యక్తి  "ఇండియా మెహ్మాన్ హై" అని గట్టిగా చెబుతూ భావోద్వేగం వ్యక్తం చేస్తాడు. ముఖ్యంగా భారతీయ ప్రయాణికుల పట్ల చూపిన ఆప్యాయతను గురించి వీడియోలో నొక్కి చెప్పడం స్పష్టంగా చూడొచ్చు

    అందుకు ముగ్దుడై ట్రావెల్వ్లాగర్ దేశం ఆతిథ్యాన్ని గుర్తిస్తూ  "యే హై ఆఫ్ఘనిస్తాన్ కి మెహ్మన్నవాజీ" అని అంటాడు. అంతేగాదు తాను అఫ్గాన్అంతటా చాలా ప్రదేశాల్లో స్థాయి ఆతిథ్యాన్నే చూశానని, మళ్లీ దేశాన్ని సందర్శించాలనుకుంటున్నా అంటూ వీడియోని ముగించాడు. వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాదు అఫ్గాన్దేశం ఆతిథ్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: జేఈఈ ప్రిపరేషన్‌ నుంచి రాష్ట్రపతి మెడల్‌ వరకు..! ఎన్డీఏ చరిత్రలో సరికొత్త మైలు రాయి..)

     

     

  • ఎన్డీఏ ప్రతిష్టాత్మకమైన పోర్టల్స్‌ 149 కోర్సు నుంచి సుమారు 329 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వారంతా ట్రై సర్వీసెస్అకాడమీలోని రెండో బ్యాచ్మహిళలు. మొత్తం 15 మంది మహిళా క్యాడెట్లకు ఈసారి చోటు కల్పించింది డిఫెన్స్అకాడమీ. వారిలో మొత్తం మెరిట్ఆర్డర్పరంగా రాష్ట్రపతి మెడల్‌ని‌ గెలుపొందిన తొలి మహిళా క్యాడెట్‌గా ఘనత సాధించిందామె. ఇంతకీ ఎవరామె..? ఆమె ఈ ఘనతను ఎలా సాధించగలిగిందంటే..

    ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్యాడెట్లు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకరు 148 కోర్సులో కాగా, మరొకరు 149 కోర్సులో. ఏడాది డిపెన్స్అకాడమీ 149 కోర్సులో మెరిట్క్రమంలో గెలుపొందిన తొలి మహిళ సిద్ధి జైన్‌. దీన్ని మొత్తం మెరిట్జాబితా, విద్యారంగం, బహిరంగ శిక్షణ, సామూహిక శిక్షణ, అధికారిలాంటి లక్షణాలు, ప్రత్యేక సేవా అంశాలతో కూడిన పనితీరు తదితరాల ఆధారంగా రూపొందించారు

    ఏడాది రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆల్ఫా స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ దీపక్ కంద్‌పాల్కి, రాష్ట్రపతి వెండి పతకాన్ని ఆస్కార్ స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్రపతి కాంస్య పతకాన్ని కిలో స్క్వాడ్రన్‌కు చెందిన డివిజనల్ క్యాడెట్ కెప్టెన్ సిద్ధి జైన్లు అందుకున్నారు. మేరకు పాసింగ్అవుట్క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ..ఈరోజు  పట్టభద్రులవుతున్న రెండవ బ్యాచ్ మహిళా క్యాడెట్లను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది

    వారిలో సుమారు 15 మంది తమ పురుష సహచరులతో సమానంగా భుజం భుజం కలిపి నిలబడ్డారు. సేవ ఒకే ప్రమాణాన్ని గౌరవిస్తుందనేది ఘటన పునరుద్ఘాస్తోందని అన్నారు. ఇక వైమానిక దళంలో చేరనున్న సిద్ధి మాట్లాడుతూ.."మేము శిక్షణలో అనేక ఒడిదడుకులను చవిచూశాం. ప్రతి దశలోనూ మాకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల నుంచి, కుటుబం నుంచి పుష్కలంగా మద్దతు, ప్రేమ లభించింది.  అందువల్లే అకాడమీలో సవాలుతో కూడిన శిక్షణ సాధ్యమైందని పేర్కొంది."

    అలాగే ఎన్డీఏ మహిళా క్యాడెట్లను చేర్చుకోవడాని కంటే ముందు తాను ఇంజనీరింగ్కోర్సులో చేరి ఆపై సాయుధ దళాలలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ లక్ష్యంతో నేఐఐటీ జేఈఈ కోసం సన్నద్ధమైనట్లు వెల్లడించింది. అయితే ఇంతలో ఎన్డీలో మహిళా క్యాడెట్ల చేరేలా మార్గం సుగమం కావడం..అందులో తాను చేరడం చకచక జరిగిపోయిందని, పైగా అందుకు తన కుటుంబం పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకొచ్చింది

    కాగా, యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, ఇండియన్నావల్ అకాడమీ పరీక్షలకు అర్హత ఉన్న మహిళలు హాజరు కావడానికి ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించగా, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత NDAలోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది. నేపథ్యంలోనే 148వ కోర్సులో భాగంగా 2022 జూలై-ఆగస్టులో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ NDAలో చేరింది.

    (చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)

     

  • సాధారణంగా బరువు తగ్గడం అంటే సరైన డైట్‌ ప్లాన్‌, ఖరీదైన సప్లిమెంట్లు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం అని అనుకుంటుంటారు. సత్వరమే మంచి ఫలితం రావాలంటే మొత్తం లైఫ్‌స్టైల్‌నే మార్చితే చాలని కొందరు అనుకుంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే..రోజువారి అలవాట్ల నుంచి వస్తుందనేది విస్మరిస్తారని చెబుతోంది కంటెంట్‌ క్రియేటర్‌, వెయిట్‌ లాస్‌ కోచ్‌ అయిన నేహా పరిహార్‌. మనం అంతగా పట్టించుకోని చాలా చిన్న చిన్న బేసిక్‌ విషయాలతోనే అద్భుతం చేయొచ్చని అంటోందామె. మరి అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!

    వెయిట్‌లాస్‌ కోచ్‌ నవంబ్‌కి సుమారు 22 కిలోలు బరువు తగ్గినట్లు నెట్టింట షేర్‌ చేశారు. అంతేగాదు తన వెయిట్‌ లాస్‌ జర్నీని కూడా షేర్‌ చేసుకుంది. తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి కొలెస్ట్రాల్‌ బర్నర్‌లు, డీటాక్స్‌ పానీయాలను ఉపయోగించలేదని, అలాగే కఠినమైన కేలరీల లెక్కింపు వంటివి ఏమిలేవని స్పష్టం చేసింది. జస్ట్‌ కామెన్‌సెన్స్‌తో స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గే ప్రయంత్నం చేశానని పేర్కొంది. అదెలాగంటే..

    ఎక్కువ లాగిస్తూనే..
    నేహా తనను తాను ఆకలితో అలమటించే ప్రయత్నం చేయలేదని వెల్లడించింది. తాను అక్షరాల రోజుకు 3 ఫుల్ మీల్స్ + 1 స్నాక్ తినడం ప్రారంభించానని తెలిపింది. భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకు బదులుగా ఆమె తన ప్లేట్‌లో ప్రోటీన్‌, ఫైబర్‌ ఉండేలా కేర్‌ తీసుకుంది.

    ప్రతిరోజూ వాకింగ్‌
    పదివేల అడుగులు నవడవ లేదు, అలాగే ట్రెడ్‌మిల్‌ సెషన్‌లు కూడా చేయలేదు. జస్ట్‌ రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల వాక్‌ మాత్రమే. దీంతోనే నేహ జీర్ణక్రియను, బొడ్డుకొవ్వుని మెరుగుపరిచింది. ఇది ఒకరకంగా వ్యాయామ ఒత్తిడిని దూరం చేసింది.

    నూటికి నూరు శాతం హెల్దీగా తినడం మానేసింది..
    ఎల్లప్పుడూ హెల్దీకి ప్రాధాన్యత ఇస్తే వారాంతంలో నచ్చిన ఐటెమ్స్‌ లాగించాలనే కోరిక కలుగుతుందట. అందుకు నేహా 80:20 రూల్‌ని పాటించిందట. అంటే 80% నిజమైన ఆహారం, 20% స్మార్ట్‌గా తినటం. అంటే అప్పడప్పుడు నచ్చిన రిలాక్స్డ్‌ భోజనం అది కూడా పరిమితంగా తీసుకునేదాన్ని అంటోంది

    తేలికపాటి విందులు
    రాత్రి 7:30 గంటలకు చీలా, క్వినోవా దోస, పప్పు-సబ్జీ వంటివి తీసుకునేది. ఇలా తేలికగా తినడం వల్ల ఆమె జీర్ణక్రియ, నిద్ర, మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా బొడ్డు కొవ్వు కూడా తగ్గింది.

    బరువు తగ్గే ఖరీదైన సప్లిమెంట్లు, సంక్లిష్ట ఆహారాలను తీసుకోవాల్సిన పనిలేదని నేహా వెయిట్‌ లాస్‌ స్టోరీ చెబుతోంది. చాలా చిన్న చిన్న విషయాల్లో కేర్‌ తీసుకుంటే చాలు. ముఖ్యంగా వేళకు భోజనం, నిద్ర, కాస్త కదలిక ఉంటే చాలు. దీంతో పాటు టెన్షన్‌ లేని ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకుంటే బరువు తగ్గడం సులభమని చాలా సింపుల్‌గా చేసి చూపించారామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

    (చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)

     

     

     

NRI

  • బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .

    ఈ ఈవెంట్‌లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు  తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు.

Cartoon