Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ ‍టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

    కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్‌ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్‌ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.
     

  • డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్‌ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

    ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్‌ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.

    తుది జట్లు
    ఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్‌కీపర్‌), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్‌), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ

    ముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్‌), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి 
     

  • భారత్‌-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయ‌ప‌డ్డాడు. మొద‌టి వ‌న్డే కోసం భార‌త జ‌ట్టు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో శ‌నివారం త‌మ చివ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోంది.

    అయితే త్రోడౌన్ స్పెషలిస్టుల ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అత‌డు నొప్పితో విలవిలాడాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించాడు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిషబ్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.

    ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్ గాయపడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్ శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అంతలోనే పంత్ గాయప‌డ‌డం టీమ్ మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

    అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. పంత్ ప్ర‌స్తుతం జ‌ట్టులో కేఎల్ రాహుల్‌కు బ్యాక‌ప్‌గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ మొత్తానికి అత‌డు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి స్ధానంలో ఇషాన్‌ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్‌ వైపే మొగ్గు చూపారు.

    కివీస్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.
    చదవండి: WPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శ‌ర్మ‌
     

  • మహిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం క్రికెట్ ప్రపంచానికి ప‌రిచ‌య‌మైంది. డ‌బ్ల్యూపీఎల్‌-2026 సీజ‌న్‌లో శ‌నివారం యూపీ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన అనుష్క శ‌ర్మ‌.. త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టింది.

    బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు. 

    కెప్టెన్ యాష్లీ గార్డరన్‌తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

    ఎవరీ అనుష్క శర్మ..?
    ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. ఆమెకు చిన్న‌త‌నం నుంచి క్రికెట్‌పై మ‌క్కువ ఎక్కువ‌. అనుష్క త‌న అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆయుష్ కూడా  ప్రొఫెషనల్ క్రికెటర్ కావ‌డం గ‌మ‌నార్హం.

    అత‌డు త‌న బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం త‌న సోద‌రితో బౌలింగ్ చేయించేవాడంట‌. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్‌లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క‌ మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వ‌హించింది. అనుష్క‌ సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి స‌త్తాచాటింది.

    వేలంలో రికార్డు ధ‌ర‌..
    ఈ క్ర‌మంలోనే గ‌తేడాది నవంబ‌ర్‌లో జ‌రిగిన మెగా వేలంలో అనుష్క‌పై కాసుల వ‌ర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 ల‌క్ష‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. త‌ద్వారా ఈ ఏడాది సీజ‌న్ వేలంలో అత్యధిక ప‌లికిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ఆమె నిలిచింది. ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌లు చేస్తే అనుష్క త్వ‌ర‌లోనే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి  వ‌చ్చే అవ‌కాశ‌ముంది.
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

  • మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్‌-2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యాష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమెతో పాటు అరంగేట్ర ప్లేయర్ అనుష్క శర్మ (44), సీనియర్ సోఫీ డివైన్(38) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.

    దుమ్ములేపిన ఫీబీ..
    అనంతరం భారీ లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ ఆఖరి వరకు పోరాడింది. ఓ దశలో గెలిచేలా కన్పించిన యూపీ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. యూపీ యువ ‍బ్యాటర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.

    లిచ్‌ఫీల్డ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లిఛ్‌ఫీల్డ్‌.. సోఫీ డివైన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌(30), ఆశా శోభన(27) పర్వాలేదన్పించారు. భారత స్టార్‌ ప్లేయర్లు హర్లీన్‌ డియోల్‌(0), దీప్తీ శర్మ(1) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో  రేణుకా సింగ్‌, సోఫీ డివైన్‌, జార్జియా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్‌, గార్డనర్‌ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

  • మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు ఓట‌మి పాలైంది. గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. కానీ సెమీస్‌లో మాత్రం చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 క్రీడాకారిణి వాంగ్ జియి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.

    ఆమె చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓట‌మి చ‌విచూసింది. రెండో గేమ్‌లో సింధు 11-6తో ఆధిక్యంలో ఉన్న‌ప్ప‌టికి, వ‌రుస త‌ప్పిదాల వ‌ల్ల విజయాన్ని చేజార్చుకుంది. అంత‌కుముందు  సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఓట‌మిపాలైంది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ - ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీ చేతిలో 10-21, 21-23తో ఈ భార‌త అగ్రశ్రేణి ద్వయం ఓట‌మి పాలైంది.
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో
     

  • భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆదివారం(జ‌న‌వ‌రి 11) నుంచి ప్రారంభం కానుంది.  ఈ సిరీస్‌లో మొద‌టి వ‌న్డేకు వ‌డోద‌ర‌లోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన కివీస్‌.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పున‌రావృతం చేయాలని పట్టుదలతో ఉంది.

    ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్‌ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.

    మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్‌ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇ‍ప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.

    "ఈసారి భిన్నమైన ఫార్మాట్‌లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్‌కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డేల్లో విజయం సాధించాము.

    గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్‌లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో చివ‌రి మెట్టుపై బోల్తా ప‌డ్డాము. కానీ ఆ ఓట‌మిని మేము ఎప్పుడో మ‌ర్చిపోయాము.

    ఇప్పుడు  మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా  గ‌తేడాది మార్చిలో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో భార‌త్ చేతిలో కివీస్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భార‌త ప‌ర్య‌ట‌కు కేన్ విలియ‌మ్స‌న్, టామ్ లాథ‌మ్‌,ర‌చిన్ ర‌వీంద్ర వంటి స్టార్ ప్లేయ‌ర్లు దూర‌మ‌య్యారు. వ‌న్డే సిరీస్‌కు కివీస్ కెప్టెన్‌గా మైఖ‌ల్ బ్రెస్‌వెల్ వ్య‌వ‌హ‌రించనున్నాడు.
    చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

     

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది శుభారంభం అందుకుంది.

    ఆర్సీబీ తరఫున అరంగేట్రం
    నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు లారెన్‌ బెల్‌, లిన్సీ స్మిత్‌ అరంగేట్రం చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ బెల్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.

    మరోవైపు.. లెఫ్టార్మ్‌ పేసర్‌ లిన్సీ స్మిత్‌ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.

    ఎన్ని వికెట్లు తీశారంటే
    బెల్‌ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్‌లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్‌ 100లో బెల్‌ ఖాతాలో 60 (41 మ్యాచ్‌లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్‌లలో) వికెట్లు ఉన్నాయి

    ఇక బెల్‌, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్‌.

    లిజెలి లీ
    సౌతాఫ్రికా ఓపెనింగ్‌ బ్యాటర్‌ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్‌లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.

    ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటికి 104 మ్యాచ్‌లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్‌నూ వాచౌట్‌ ప్లేయర్‌.

    గొంగడి త్రిష
    తెలంగాణ ఆల్‌రౌండర్‌, టీమిండియా అండర్‌-19 స్టార్‌ గొంగడి త్రిష. అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్రకెక్కింది.

    టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. పార్ట్‌టైమ్‌ లెగ్‌ స్పిన్నర్‌గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.

    ఈసారి యూపీ వారియర్స్‌ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్‌లలో ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.

    దీయా యాదవ్‌
    పదహారేళ్ల దీయా యాదవ్‌ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌ కాంట్రాక్టు పొందిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్‌ 15 వన్డే కప్‌లో డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్‌లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

    చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్‌మన్‌ గిల్‌

  • భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న సూపర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా  స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

    ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడు సాధించిన స్కోర్‌లో 78 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. 

    అతడితో పాటు ఆరోన్‌ జార్జ్‌ 61 పరుగులతో రాణించారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం అభిజ్ఞాన్ కుండు(10), విహాన్ మల్హోత్రా(46) ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.

    కాగా  వార్మాప్ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసిన వైభవ్‌.. మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్‌కప్‌ ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌, అమెరికా జట్లు తలపడనున్నాయి.
    చదవండి: WPL 2026: ఈ ఐదుగురు ప్లేయర్లపైనే కళ్లన్నీ.. గొంగడి త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?

     

  • డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా జ‌ర‌గుతున్న రెండో మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌, యూపీ వారియ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ త‌ర‌పున ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కుముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు లానింగ్ సార‌థ్యం వ‌హించింది.

    కానీ డ‌బ్ల్యూపీఎల్‌-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన లానింగ్‌ను యూపీ వారియ‌ర్స్ సొంతం చేసుకుని త‌మ జ‌ట్టు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయ‌ర్లు  సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్ గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున అరంగేట్రం చేశారు. వీరిద్ద‌రూ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్‌ తరపున డెబ్యూ చేసింది.

    తుది జట్లు
    గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీప‌ర్‌), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్‌), జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్

    యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే

  • టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గొనే భారత జట్టు నుంచి తనను తప్పించడంపై.. టీమిండియా వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ స్పందించాడు. తనపై వేటు వేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. కాగా ఆసియా టీ20 కప్‌-2025 ద్వారా గిల్‌ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో అభిషేక్‌ శర్మకు విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా ఉన్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ను తప్పించి.. అతడి స్థానంలో గిల్‌ను ఓపెనర్‌గా పంపారు. అయితే, వరుస మ్యాచ్‌లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ విఫలమయ్యాడు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడి ఖాతాలో ఒక్క టీ20 హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనం.

    అయినప్పటికీ సౌతాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లోనూ గిల్‌ (Shubman Gill).. తొలి మూడు మ్యాచ్‌లలో కొనసాగించారు. ఇక్కడా అతడు విఫలమయ్యాడు. అనంతరం పాదం నొప్పి కారణంగా సఫారీ జట్టుతో నాలుగు (వర్షం వల్ల రద్దు), ఐదో టీ20కి గిల్‌ దూరమయ్యాడు. ఈ క్రమంలో ప్రొటిస్‌తో ఐదో టీ20లో ఓపెనర్‌గా తిరిగి వచ్చి సంజూ మరోసారి సత్తా చాటాడు.

    అనూహ్య రీతిలో వేటు
    ఫలితంగా.. గిల్‌కు పెద్ద పీట వేస్తూ.. సంజూకు అన్యాయం చేశారన్న విమర్శలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో  అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌.. టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ అయిన గిల్‌ను ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించింది. ఊహించని రీతిలో భవిష్య కెప్టెన్‌పై వేటు వేసి.. అక్షర్‌ పటేల్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ డిప్యూటీగా నియమించింది.

    ఇక భారత జట్టు ప్రస్తుతం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో బిజీ కానుంది. జనవరి 11 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌ మొదలుకానుండగా.. టీమిండియా వన్డే కెప్టెన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీ20 జట్టులో చోటు కోల్పోవడంపై ప్రశ్న ఎదురైంది.

    అలా అయితే నన్నెవరూ ఆపలేరు కదా!
    ఇందుకు స్పందిస్తూ.. ‘‘సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌. నా తలరాతలో రాసి ఉన్నదాన్ని బట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.

    నాకు దక్కాల్సిన వాటి గురించి నుదిటిరాతలో రాసి ఉంటే.. నా నుంచి దానిని ఎవరూ దూరం చేయలేరు. నన్నెవరూ ఆపలేరు. ప్రతి ఒక్క ఆటగాడు ఎల్లప్పుడూ దేశం కోసం ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే కోరుకుంటాడు. నేను కూడా అంతే. అయితే, సెలక్టర్లే అంతిమ నిర్ణయం తీసుకుంటారు’’ అని శుబ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు.

    చదవండి: T20 WC 2026: ‘ఈసారి ఫైనల్లో టీమిండియాపై గెలుస్తాం’

  • టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌గా యువరాజ్‌ సింగ్‌కు పేరుంది. టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011 టోర్నీల్లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో అతడిది కీలక పాత్ర. పదిహేడేళ్లకుపైగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన యువీ.. తన కెరీర్‌లో 40 టెస్టులు, 58 టీ20 మ్యాచ్‌లు.. అత్యధికంగా 304 వన్డేలు ఆడాడు.

    టెస్టుల్లో 1900, టీ20లలో 1177 పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. వన్డేల్లో 14 శతకాల సాయంతో 8701 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఖాతాలో 9 టెస్టు, 111 వన్డే, 28 టీ20 వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లోనూ 132 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 2750 పరుగులు చేయడంతో పాటు.. 36 వికెట్లు కూడా తీశాడు.

    ఇంతటి అనుభవం గల యువీ దగ్గర పంజాబీ బ్యాటర్లు, టీమిండియా స్టార్లు శుబ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ శిక్షణ తీసుకున్నారు. అతడి మార్గదర్శనంలో వీరిద్దరు రాటుదేలారు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా, ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా ఎదగడంలో యువీది కీలక పాత్ర.

    మరోవైపు.. గిల్‌ ఏకంగా టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు. ఇక యువీ శిష్యుల జాబితాలోకి తాజాగా సంజూ శాంసన్‌ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సన్నద్ధమవుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సన్నాహకంగా సాగే ఈ సిరీస్‌లో సత్తా చాటి.. మెగా ఈవెంట్లోనూ మెరవాలని సంజూ పట్టుదలగా ఉన్నాడు.

    ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ మార్గదర్శనంలో నెట్స్‌లో సంజూ శ్రమిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో యువీ.. సంజూకు బ్యాటింగ్‌ పొజిషన్‌, టెక్నిక్స్‌ గురించి సలహాలు ఇస్తుండగా.. అతడు శ్రద్ధగా వింటున్నట్లు కనిపించిది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘క్రేజీ కాంబినేషన్‌.. సూపర్‌ భయ్యా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్‌ ఫ్యాన్స్‌ పేజీ నుంచి వచ్చిన ఈ వీడియోపై మరికొందరు మాత్రం.. ‘‘AI’’ కాదు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

    కాగా న్యూజిలాండ్‌తో తొలుత మూడు వన్డేలు ఆడిన తర్వాత.. టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. జనవరి 11- 31 వరకు ఈ సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌-2026తో భారత జట్టు బిజీ అవుతుంది.

     

Movies

  • కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్‌ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒ‍క్క సీన్‌తో టీజర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్‌ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్‌ ఫైరయ్యారు.

    తన మూవీ టీజర్‌లోని ఇంటిమేట్‌ సీన్‌పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్‌ ఇలాంటి సీన్స్‌ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్‌ గ్లింప్స్‌లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్‌ సీన్స్ చూపించారు. ఆ సీన్స్‌లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు.  ఈ హాలీవుడ్‌ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్‌ నటించారు. 

    కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌ని మార్చి 19న రిలీజ్‌ చేస్తున్నారు. 

  • తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌లు సృష్టించుకోవడం కొత్తేమీ కాదు. ఒక సినిమాలో పాత హిట్ సినిమాల రిఫరెన్సులు, క్యారెక్టర్లు వాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే.  

    అలాంటి మరో యూనివర్స్ క్రియేట్ చేసే అవకాశం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి సినిమా తీసిన ఆయన, ఈ కాంబినేషన్‌తో యూనివర్స్ సృష్టించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

    సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో కనిపించారు. కానీ చిరంజీవి సినిమాలో మాత్రం ఆయనను మైనింగ్ డాన్ వెంకీ గౌడగా చూపిస్తున్నట్టు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అంటే ఈ రెండు సినిమాలు ఒకే యూనివర్స్‌లో లేవని ఆయన క్లారిటీ ఇచ్చారు.  

    అయితే భవిష్యత్తులో వెంకటేశ్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అందులో తప్పకుండా చిరంజీవి క్యామియో పెట్టే ప్రయత్నం చేస్తాను. అప్పుడు తనకంటూ ప్రత్యేకమైన వరప్రసాద్ యూనివర్స్‌ను సృష్టిస్తానని ఆయన చెప్పారు.  

    అంటే రాబోయే రోజుల్లో వెంకీ హీరోగా నటించే సినిమాలో చిరంజీవి శంకర వరప్రసాద్‌గా కనిపించే అవకాశం ఉందన్నమాట. ఈ ఆలోచన నిజంగా ప్రేక్షకులకు పెద్ద కిక్ ఇచ్చేలా ఉంది. అభిమానులు కూడా ఆ రోజు త్వరగా రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.  

  • సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుతూ జీఓ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ది రాజాసాబ్‌. మన శంకరవర ప్రసాద్‌ గారు చిత్రాలకు ప్రీమియర్‌ షోలతో పాటు అదనపు ధరలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.. అయతే, తాజాగా రవితేజ నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' రెండు చిత్రాలకు కూడా టికెట్‌ ధరలు పెంచుతూ ఏపీ అనుమతి ఇచ్చింది.

    'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ జనవరి 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా సింగిల్‌ స్క్రీన్స్‌లలో రూ. 50, మల్టీఫ్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు ఛాన్స్‌ దక్కింది. జీఎస్టీతో కలిపి ఈ ధరలు ఉంటాయి. అయితే, జనవరి 14న విడుదల కానున్న అనగనగా ఒక రాజు సినిమాకు కూడా ఇవే ధరలు వర్తిస్తాయి.  అదనంగా పెంచిన ధరలు 10రోజుల పాటు అమలులో ఉంటాయి. అయితే, తెలంగాణలో ఈ రెండు సినిమాలకు టికెట్‌ ధరలను పెంచలేదు. సాధారణ ధరలతోనే ప్రేక్షకులు సినిమా చూడొచ్చు.
     

  • సినిమాలకు ఫేక్‌ రివ్యూలు ఇవ్వడం వల్ల తాము నష్టపోతున్నట్లు నిర్మాతలు తరచూ అంటుంటారు. ముఖ్యంగా పెద్ద సినిమాలో ఒకే సమయంలో విడుదలైనప్పుడు వారి అభిమానులు ఇలాంటి ఫేక్‌ రివ్యూలతో రంగంలోకి దిగుతారు. దీంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందని  విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఇప్పుడు అలాంటి ఫేక్‌ రివ్యూలకు కోర్టు ఆర్డర్‌తో చెక్‌ పడింది. ఈ ట్రెండ్‌ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతోనే ప్రారంభం అవుతుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

    మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు సంబంధించి ఆన్‌లైన్‌  టికెటింగ్ పోర్టల్‌లలో రేటింగ్‌లు , రివ్యూలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 'బుక్‌ మై షో' తమ పోర్టల్‌లో పేర్కొంది.   సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు కొందరు బాట్‌లను ఉపయోగించి  నకిలీ రేటింగ్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు. దీనిని కట్టడి చేసేందుకు 'BlockBIGG' & 'Aiplex' సంస్థలు రంగంలోకి దిగాయి. ఇక నుంచి బాట్స్‌ ఉపయోగించి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఎవరూ ఫేక్‌ రివ్యూలు ఇవ్వడం కుదరదు. అలా ఎవరైన ప్రయత్నం చేసినా నేరం అవుతుందని పేర్కొంది.

    తెలుగు సినీ పరిశ్రమలో ఇది సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.  సినిమాలపై కుట్రపూరితంగా జరిగే నెగెటివ్ రేటింగ్స్, ఫేక్ రివ్యూలకు ఇక నుంచి చెక్ పడనుంది. కోర్టు ఆదేశాల ప్రకారం  'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి ఆన్‌లైన్‌ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూలు, రేటింగ్స్ చట్టబద్ధంగా నిలిపివేయబడ్డాయి.

  • దురదృష్టవశాత్తు, ఈ ప్రపంచంలోని ప్రతి మహిళ తన జీవితంలో కనీసం ఒక్కసారైనా లైంగిక వేధింపులకు గురవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి మహిళకు ఈ వేధింపుల తప్పడం లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటి పార్వతి తిరువోత్‌ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి పలు ఘటనలు ఆమెను మానసికంగా కలచివేశాయని చెప్పుకొచ్చారు.

    ఛాతీపై కొట్టాడు.. 
    నా చిన్నప్పుడు ఒకసారి అమ్మా నాన్నలతో కలిసి రైల్వే స్టేషల్‌కు వెళ్లాను. ట్రైన్‌ కోసం పెరెంట్స్‌తో కలిసి నిలబడితే.. ఒకడు వచ్చి నా ఛాతీపై కొట్టి పారిపోయాడు. అతను కావాలనే అక్కడ టచ్‌ చేశాడు. ఆ సంఘటన నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది. ఆ తర్వాత నేను బయటకు వెళ్తే.. ఎలా ఉండాలో అమ్మ చెప్పేది. మగాళ్ల చేతులను చూస్తూ నడవాలని చెప్పాలి. ఒక తల్లి తన కూతురికి ఇలా నేర్పించాల్సిన పరిస్థితి రావడం దారుణం. ఆ ఒక్క సంఘటననే కాదు. చిన్నప్పుడు నాకు ఇలాంటివి చాలానే ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు ప్రైవేట్‌ పార్ట్‌ని చూపిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించా. అతను నన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చమని వేధించాడు. ప్రేమిస్తే.. అనుమతి లేకపోయినా సరే ఆ పనికి ఒప్పుకోవాల్సిందేనా?

    లిఫ్ట్‌లో అలా.. కొట్టేశా
    19-20 ఏళ్ల వయసులో కూడా ఓ ఘటన జరిగింది. సినిమా కోసం స్నేహితులతో కలిసి మాల్‌కి వెళ్లాను. అనంతరం లిఫ్ట్‌లో కిందికి వస్తుంటే..ఒక వ్యక్తి నా దగ్గరికి రావడానికి ప్రయత్నించాడు. అతని ప్రైవేట్‌ పార్ట్‌ నాకు తగిలినట్లుగా అనిపించింది. లిఫ్ట్‌ దిగగానే అతన్ని చెంపపై కొట్టాను. సెక్యూరిటీ వచ్చి ఆపారు. పోలీసులకు ఫోన్‌ చేసి రప్పించాను. చివరికి అతను నా కాళ్ళ మీద పడి, 'నాకు ఇప్పుడే గల్ఫ్‌లో ఉద్యోగం వచ్చింది, నేను పెళ్లి చేసుకుంటున్నాను' అనడంతో వదిలేశా.  నేను అతన్ని కొట్టినప్పుడు, అందరూ నన్ను అభినందించారు. కానీ అది పెద్ద విజయం అని నేను అనుకోలేదు. నన్ను నేను రక్షించుకోవడం పెద్ద విషయం కాదు’ అని పార్వతి చెప్పుకొచ్చింది. 

    సినిమాలో విష‌యానికి వ‌స్తే.. 2024లో వచ్చిన ‘ఉల్లోజుక్కు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతీ, ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య నటించిన ‘దూత’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 

  • రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "మర్దానీ 3". దేశంలోనే అతిపెద్ద మహిళా పోలీస్‌ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన రెండు భాగాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. తాజాగా మూడో పార్ట్‌ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ వదిలారు. నిజానికి ఈ సినిమాను హోలి పండగ సందర్భంగా ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్‌ను ఓ నెల ముందుకు జరిపారు.

    సినిమా
    మర్దానీ 3 విషయానికి వస్తే.. అన్యాయం, అక్రమాలను ఎదురించే డేర్‌ డెవిల్‌ పోలీస్‌ శివానీ శివాజీరాయ్‌గా రాణీ ముఖర్జీ మరోసారి కనిపించనున్నారు. 'ద రైల్వేమెన్‌' ఫేమ్‌ ఆయుష్‌ గుప్తా కథ అందించాడు. అభిరాజ్‌ మినావాలా దర్శకత్వం వహించగా, యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాల్ని సినిమాలో చూపించనున్నారు.

     

     

    చదవండి: ఇలా జరుగుతుందనుకోలేదు.. సారీ: రాజాసాబ్‌ డైరెక్టర్‌

  • తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో తనూజ, కల్యాణ్‌ పడాల జోడీకి అభిమానులు భారీగానే ఉన్నారు. అందుకే వారిద్దరూ మరోసారి ఏదైనా ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.  ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా స్టార్‌మా ఒక ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. 'మా సంక్రాంతి వేడుక' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సందడి చేశారు. జనవరి 14న మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. తాజాగా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

    తనూజకు ఫోటో గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌
    'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్‌. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదని, అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడరని ఆమె బాధ పడింది. బిగ్‌బాస్‌ ఫైనల్‌ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది. కానీ, ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా రివీల్‌ చేయలేదు. కానీ, ఆమె ఫ్యాన్స్‌ AI ఫోటోతో సర్‌ప్రైజ్‌ చేశారు. తనూజ తన తండ్రి పుట్టస్వామితో ఉన్న ఫోటోను చక్కగా ఫ్రేమ్‌ చేసి గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

  • కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్‌, ఒక బ్యాడ్‌న్యూస్‌. ముందుగా బ్యాడ్‌న్యూస్‌ ఏంటంటే.. జన నాయగణ్‌ ఈ నెలలో రిలీజ్‌ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్‌ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్‌ లేకపోయినా విజయ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్‌ అవుతోంది.

    పదేళ్ల సందర్భంగా..
    ఈ విషయాన్ని నిర్మాత ఎస్‌.కలైపులి థాను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్‌ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్‌ సినిమాను రీరిలీజ్‌ చేయాలని ఎప్పుడో ప్లాన్‌ చేశారు. కానీ విజయ్‌ చివరి మూవీ 'జననాయగణ్‌' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

    తేరి రీరిలీజ్‌
    వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్‌ అయింది. ఈ సూపర్‌ హిట్‌ సినిమా పలు భాషల్లో రీమేక్‌ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్‌ అవగా బాలీవుడ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

     

     

    చదవండి: బాలీవుడ్‌ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్‌

  • కోలీవుడ్‌లో సడెన్‌గా హీరో కార్తీ సినిమా రేసులోకి వచ్చేసింది. విజయ్‌ మూవీ జన నాయగన్‌ వాయిదా పడటంతో పొంగల్‌ రేసులో పెద్దగా సినిమాలు లేవు. తమిళనాట ప్రస్తుతం శివ కార్తికేయన్‌ ‘పరాశక్తి’ మాత్రమే ఉంది. దీంతో ఇదే సరైన సమయం అని భావించిన మేకర్స్‌ సడెన్‌గా 'అన్నగారు వస్తారు' విడుదల తేదీని ప్రకటించారు.  వాస్తవంగా ఈ మూవీ కూడా   డిసెంబరు 12న విడుదల కావాల్సి ఉంది. పలు ఆర్థిక కారణాలతో వాయిదా పడింది. 

    తాజాగా ఆ సమస్యలన్నీ పూర్తి కావడం వల్ల విడుదలకు లైన్‌ క్లియర్‌ అయింది. దీంతో జనవరి 14న ‘వా వాతియార్‌’(అన్నగారు వస్తారు)ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. అయితే, తెలుగు వర్షన్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలదే. ఇక్కడ థియేటర్స్‌ దొరకడం కష్టం కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగులో విడుదల కావచ్చు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై  కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఇందులో కృతీ శెట్టి కథానాయికగా నటించారు. కామెడీతో పాటు యాక్షన్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.

    ఎందుకు వాయిదా పడింది..?
    అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ, ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా ఈ సమస్య లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది.
     

  • తెలంగాణలో మన 'శంకర వర ప్రసాద్‌గారు' చిత్రానికి  టికెట్‌ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, తాజాగా దానిని తప్పుబడుతూ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. సినిమా టికెట్‌ ధరల పెంపు అంశాన్ని సవాల్‌ చేస్తూ   న్యాయవాది విజయ్‌ గోపాల్‌ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం టికెట్‌ ధరలను పెంచుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  కానీ, తను వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు పక్కనపెట్టింది. న్యాయస్థానం పనివేళల్లో మాత్రమే పిటిషన్ దాఖలు చయాలని కోరింది. దీంతో సంక్రాంతి తర్వాత జనవరి 19న మరోసారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

    చిరంజీవి  నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్‌ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
     

  • మలయాళ హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ 'లోక చాప్టర్‌ 1: చంద్ర' మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ ఉమెన్‌ సెంట్రిక్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్‌ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

    ధురంధర్‌ హీరో సరసన..
    ధురంధర్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన రణ్‌వీర్‌ సింగ్‌ నెక్స్ట్‌ మూవీ 'ప్రళయ్‌' (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో కల్యాణి యాక్ట్‌ చేయనుందంటూ బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.

    అన్నీ నాకే కావాలి!
    మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.

    ప్రళయ్‌ సినిమా!
    ప్రళయ్‌ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్‌ హిందీ సినిమా ప్రళయ్‌ అవుతుంది.

    చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్‌ నిర్మాత భావోద్వేగం

  • సంక్రాంతి పండగ సందర్భంగా  'మన శంకర వరప్రసాద్‌గారు, ది రాజా సాబ్‌' చిత్రాలు రేసులో ఉన్నాయి. అయితే, ప్రభాస్‌ రాజాసాబ్ సినిమాకు ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రీమియర్స్ లేకుండానే సినిమా విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో సినిమా కలెక్షన్స్‌పై భారీ దెబ్బ పడింది. బయ్యర్లకు చుక్కలు కనిపించాయి. అయితే, కొన్ని గంటల్లోనే చిరంజీవి సినిమాకు ప్రీమియర్స్‌ షోలతో పాటు టికెట్‌ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేశారు. ఈ అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రభాస్‌ సినిమాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

    నాకు సంబంధం లేదు: మంత్రి
    తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశానని చెప్పారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతికి సంబంధించిన ఫైల్ తన దగ్గరకి రాలేదని పేర్కొన్నారు. నాకు తెలియకుండానే  జీవోలు ఇచ్చారని సంచలన కామెంట్‌ చేశారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవసరం లేని నిందలు తనపై వేయకండి అంటూ ఆవేదన చెందారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒకవేళ వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు 2 రోజుల ముందే తెలంగాణ నుంచి ప్రత్యేక జీవో వచ్చేసింది. 11వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్స్ వేసుకునేందుకు తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టికెట్‌ ధర రూ. 600 రూపాయలుగా నిర్ణయించింది. ఆపై నైజాంలో ఎన్ని ప్రీమియర్స్‌ షోలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా సానుకూలంగా అవకాశం కల్పించింది. అయితే,రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్‌కు రాత్రి 10.30 దాటినా ప్రత్యేక జీవో రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు.

    ప్రభాస్‌ ఫోన్‌ కాల్‌ చేయకపోవడంతో..
    ప్రభాస్‌, చిరంజీవి సినిమాలకు సంబంధించి తెలంగాణ ప్రభత్వం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి.

    • టికెట్‌ ధరల పెంపు, ప్రీమియర్‌ GO జారీ వెనుకున్న కీలక అధికారి రాజా సాబ్‌ గురించి కలత చెందాడట. ప్రభాస్ తనను నేరుగా సంప్రదించకపోవడంతో ఆయన బాధపడ్డారని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ మొదటి నుంచి రాజకీయ విషయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే.., కానీ ఆ అధికారి అతని నుండి నేరుగా కాల్ వస్తుందని ఆశించారని.. దీని కారణంగానే జీఓ విషయంలో ఆలస్యం అయిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది.

    • రాజా సాబ్‌ నష్టం వెనుక నిర్మాత దిల్ రాజు ఉండవచ్చని కూడా కొందరు పేర్కొంటున్నారు. అతని వ్యాపార ప్రత్యర్థి నైజాం ఏరియాలో రాజా సాబ్‌ సినిమా పంపిణీదారుడిగా ఉన్నారట. అతన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు, అతను ప్రభుత్వంలోని తనకు తెలిసిన సన్నిహితులతో గేమ్‌ ప్లాన్‌ చేశారని మరికొందరు ఆరోపించారు.

    • ఈ విషయంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కూడా విమర్శలు ఉన్నాయి. పలు రాజకీయ కారణాలతో జీఓను విడుదలను ఆలస్యం చేస్తూ వచ్చారని, పదేపదే మరో ఐదు నిమిషాలు అంటూ కాలక్షేపం చేశారని అంటున్నారు. అయితే, రాత్రి 10 తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్‌ థియేటర్స్‌ వద్ద రచ్చ చేయడంతో వారిని కంట్రోల్‌ చేయడంలో పోలీసులకు సవాలుగా మారింది. దీంతో చివరి నిమిషంలో జీఓ విడుదల చేశారని వార్తలు వచ్చాయి. ఇందులో ఏది నిజమో, అబద్ధమో తేలాల్సి ఉంది.

    చిరంజీవి సినిమాకు బెనిఫిట్స్‌.. కారణం ఇదేనా..?
    టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు విడుదలౌతుందటే.. వారిని వేర్వేరుగా చూడటం ఏంటి అంటూ ఇతర హీరోల అభిమానులు కూడా మండి పడుతున్నారు. అయితే, మన శంకర వర ప్రసాద్‌గారికి బెనిఫిట్స్‌ దొరకడం వెనుక నిర్మాత సాహు గారపాటి పాత్ర చాలా కీలకంగా పనిచేసిందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో​  ఆయనకు స్నేహం ఉందట. చాలా కాలంగా ఇరు కుటుంబాలు స్నేహంగా ఉండటం వల్లనే సకాలంలో జీఓను ఆయన తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు రకాలుగా రాజా సాబ్‌ అంశంలో వైరల్‌ అవుతుంది.

    మంత్రికి చెప్పకుండా జీఓ ఎవరిచ్చారు..?
    రాజా సాబ్‌, చిరంజీవి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరల పెంపు విషయంలో జీఓ ఎవరిచ్చారో తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా  ఆయన ఇవ్వాల్సిన అనుమతులు ఎవరిచ్చారనేది రాజకీయ వర్గల్లో చర్చ నడుస్తోంది. అయితే, ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాత్ర ఉందని అంటున్నారు. ఆయన సన్నిహితుడు రోహిన్ రెడ్డి  అనఫీషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారంటూ ప్రచారం ఉంది. ఆయన నేతృత్వంలో ఇదంతా జరిగిందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

  • తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్‌. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్‌తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్‌లో చూసుకుని సెలబ్రేట్‌ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. 

    చివరి నిమిషంలో వాయిదా
    కానీ సెన్సార్‌ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్‌ నిర్మాత వెంకట్‌ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్‌ సినిమాను 2025 డిసెంబర్‌ 18న సీబీఎఫ్‌సీకి పంపించాం. డిసెంబర్‌ 22న యూఏ 16+ సర్టిఫికెట్‌ ఇస్తామంటూ మాకు మెయిల్‌ చేశారు. 

    సడన్‌గా ఓ ఫిర్యాదు
    అలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్‌ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్‌కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్‌ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్‌ బోర్డు మెయిల్‌ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. 

    పరిస్థితి చేయిదాటింది
    పైగా రివైజింగ్‌ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్‌కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.

    అసలేంటి సమస్య?
    భగవంత్‌ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్‌. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్‌సీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్‌కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

    కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్‌, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంన్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.

     

    చదవండి: రాజాసాబ్‌.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి

     

  • అనిల్‌ రావిపూడి వర్కింగ్‌ స్టైల్‌ గురించి అందరికి తెలిసిందే. సినిమాను తెరకెక్కించడమే కాదు..ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్స్‌ చేస్తాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంలో అనిల్‌ ప్రమోషన్స్‌ కూడా పాత్ర కూడా బాగానే ఉంది. స్టార్‌ హీరో వెంకటేశ్‌తో  ఇన్‌స్టా రీల్స్‌ కూడా చేయించి.. సినిమాను అందరికి రీచ్‌ అయ్యేలా చేశాడు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ‘మనశంకరవరప్రసాద్‌ గారు’ చిత్రానికి కూడా అప్లై చేశాడు. సినిమా అనౌన్స్‌ మెంట్‌ నుంచే ప్రమోషన్స్‌ చేయడం మొదలు పెట్టాడు. షూటింగ్‌ మొదలైన రోజే.. మెగాస్టార్‌ చిరంజీవిపై ఓ స్పెషల్‌ వీడియో వదిలాడు. ఒక​పక్క షూటింగ్‌ చేస్తూనే..మరోపక్క ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. చివరకు నయనతారతో కూడా సినిమా ప్రమోషన్స్‌ చేయించిన ఘనత అనిల్‌కే దక్కింది.

    సాధారణంగా నయనతార మూవీ ప్రమోషన్స్‌కి చాలా దూరంగా ఉంటారు.తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలతో ముందుగానే ప్రమోషన్స్‌కి రానని  అగ్రిమెంట్ చేసుకుంటారు. దానికి ఒప్పుకుంటేనే సినిమాకు నయన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎంత పెద్ద స్టార్ సినిమాలో నటించినా, దిగ్గజ దర్శకులు డైరెక్ట్ చేసినా ఆమె మాత్రం ప్రమోషన్స్‌కి వెళ్లరు.

    అయితే మనశంకరవరప్రసాద్‌ గారు సినిమాకు వచ్చేసరికి ఆమె తీరే మారిపోయింది. చాలా హుషారుగా ప్రమోషన్స్‌ చేసున్నారు. ఆమెతో చేయించిన స్పెషల్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అదే సమయంలో నయనతారపై కొంతమేర ట్రోలింగ్‌ కూడా నడిచింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆమె తీరును తప్పుబట్టారు. 

    కోలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించినా, చివరికి తను స్వయంగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ప్రమోషన్స్‌కు రాని నయనతార... తెలుగు సినిమాల కోసం ఇలా ముందుకు రావడం ఏంటీ? అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేశారు. తెలుగు సినిమా మీకు అంత ఎక్కువైపోయిందా? అంటూ ఆమెపై  విమర్శలు చేశారు.తాజాగా ఈ ట్రోలింగ్‌పై ‘మనశంకర్‌ వరప్రాసద్‌ గారు’ మూవీ దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్‌ని ఆమె పట్టించుకోదని.. తనకు నచ్చిన పని చేస్తుందని చెప్పారు. 

    ‘ఒక్కో సినిమాకు ఒక్కో వైబ్‌ ఉంటుంది. ప్రతి మూవీకి దర్శకుడు వెళ్లి హీరో, హీరోయిన్లకు కథ చెబుతాడు. అయితే వాళ్లను ఎలా ట్రీట్‌ చేస్తున్నామనేది ముఖ్యం. మన ప్రవర్తనను బట్టి.. వాళ్లు కూడా మారుతుంటారు. నేను అందరితో కలిసిపోతుంటాను. ప్రతి ఆర్టిస్ట్‌ని కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకుంటాను. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా వచ్చి నా భుజంపై చేయి వేసి మాట్లాడతారు.  అంతలా వాళ్లతో కలిసిపోతాను. మనం జన్యూన్‌గా అడిగినప్పుడు.. మనకున్న బాండ్‌ని బట్టి చేయను అనే వాళ్లు కూడా ప్రమోషన్స్‌ చేస్తారు. నయనతార చాలా నిజాయితీగా పని చేస్తారు. తను నటించే సినిమాలకు 100 శాతం న్యాయం చేస్తారు. ‘సినిమాకు ఇది అవసరం..దర్శకుడు పని తీరు ఇలా ఉంటుంది’ అని అమె బలంగా నమ్మినప్పుడు కచ్చితంగా ప్రమోషన్స్‌ చేస్తారు’ అని అనిల్‌ చెప్పుకొచ్చారు.

    ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ విషయానికొస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌  నటించిన ‘జన నాయగన్’ విడుదలకు పలు ఇబ్బందులు రావడంతో  ఆయన ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సైతం తప్పుబడుతున్నారు. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ హీరోలతో పాటు రాజకీయ నేతలు కూడా విజయ్‌కు మద్ధతుగా నిలిచారు. అయితే, తాజాగా విజయ్‌ కోసం ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు కమల్‌హాసన్‌ ఒక ట్వీట్‌ చేశారు.

    కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతుగా అంటూ అధికారిక ప్రకటనను కమల్‌హాసన్‌ విడుదల చేశారు. కమల్ హాసన్ ప్రకటనలో పలు అంశాలను లేవనెత్తారు.  'భారతదేశ రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ, దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు.., కళాకారులకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ప్రతిబింబిస్తుంది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు.. ఇందులో రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, చిన్న వ్యాపారాలు కూడా భాగస్వామ్యంగా కలిసి నిర్మించే సమిష్టి శ్రమ. వీరి జీవనాధారం ఇందులో భాగమై ఉంటుంది.

    సమాజంలో ఇలాంటి అంశాల్లో  స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటు పడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారతదేశం సినీ ప్రేమికులు కళల పట్ల  ఎంతో ప్రేమను, పరిపక్వతను చూపుతారు. వారికి పారదర్శకతతో పాటు గౌరవం  ఇవ్వండి.  సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను మరోసారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్‌కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులను వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలతో చర్చించాల్సిన సమయం ఇదే. ' అని విజయ్‌కు మద్ధతుగా కమల్‌ ట్వీట్‌ చేశారు.

  • ‘‘నేను లిరిసిస్ట్‌గా 2012లో కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే, అప్పట్నుంచి నంది అవార్డులు లేవు. మన ప్రతిభకు అవార్డులు కొలమానం కాదని భావిస్తాను. ఒకవేళ అవార్డ్స్‌ వస్తే అవి బోనస్‌’’ అని చెప్పారు ప్రముఖ గీత రచయిత కేకే (కృష్ణకాంత్‌). నేడు (శనివారం) కేకే పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘2025లో నేను పాటలు రాసిన 22 చిత్రాల నుంచి 45 పాటలు విడుదలయ్యాయి. 

    2025లో నాకు చాలెంజింగ్‌గా అనిపించిన పాట ‘ది రాజాసాబ్‌’ సినిమాలోని ‘సహనా సహనా’. ఇక ఎన్టీఆర్‌–హృతిక్‌ రోషన్‌గార్లు కలిసి డ్యాన్స్‌ చేసిన ‘సలామ్‌ అనాలి’ (‘వార్‌ 2’ సినిమా) పాట రాయడం సంతోషంగా అనిపించింది. రజనీకాంత్‌గారి ‘కూలీ’ సినిమాలోని ‘మౌనిక’ పాట తెలుగు వెర్షన్‌ రాశాను. విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ సినిమాలోని అన్ని పాటలు రాశాను. ‘మిరాయ్‌’ చిత్రంలోని ‘వైబ్‌ ఉంది’ సాంగ్‌ యూట్యూబ్‌లో 130 మిలియన్‌ వ్యూస్‌ వరకు వెళ్లింది. ప్రభాస్, నాని, శ్రీవిష్ణుగార్లు నన్ను నమ్మి అవకాశం కల్పిస్తున్నారు. 

    నేను ప్రభాస్‌గారి అభిమానిని. కెరీర్‌ ఆరంభంలో ఆయన సినిమాలకు పాటలు రాస్తే బాగుండు అనుకునేవాడిని. ఇప్పుడు ప్రభాస్‌గారి వరుస చిత్రాలకు (సాహో, రాధేశ్యామ్, సలార్, ఫౌజి) పాటలు రాయడం హ్యాపీ. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’, ఎన్టీఆర్‌గారి ‘ఎన్టీఆర్‌ నీల్‌’, విజయ్‌ సేతుపతి ‘పూరీ సేతుపతి’ సినిమాలతో పాటు చాలా సినిమాలకు పాటలు రాస్తున్నాను’’ అని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా పాటల్లో ఇంగ్లిష్‌ పదాలు తక్కువగానే ఉంటాయి. ‘ది రాజాసాబ్‌’లో ‘శరచ్చంద్రికా తేజయామిని..’ పాట రాశాను. చాలామందికి ఈ పదాలు అర్థం కాలేదు. అర్థం కాలేదని తెలుగు రాయకుండాపోతే మన భాషను మర్చిపోతాం. అయితే ట్రెండ్‌నూ ఫాలో అవుతాను’’ అని చెప్పారు. 

  • ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటిరోజే డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్‌ గత సినిమాల కంటే కాస్త తక్కువగానే కలెక్షన్స్‌ వచ్చాయి. రాజా సాబ​్‌‌ సినిమా విషయంలో దర్శకుడు మారుతిపై విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ సినిమాలో చూపించలేదంటూనే.. అవసరం లేకున్నా సరే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    రాజా సాబ్‌ సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్‌ మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధికుమార్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ రాజా సాబ్‌ మొదటిరోజు కలెక్షన్స్‌ రూ. 112 కోట్లు వచ్చినట్లు ప్రకటించారు. సినిమాపై డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ టికెట్ల బుకింగ్‌ భారీగా జరుగుతుందన్నారు. చాలామంది తమ కుటుంబంతో పాటుగా థియేటర్‌కు వెళ్తున్నారని గుర్తుచేశారు. హరర్‌, ఫాంటసీ చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ రావడం ఇదే తొలిసారి అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.
     

  • 'రాజాసాబ్‌ సినిమా చూసి ప్రభాస్‌ అభిమానులు డిసప్పాయింట్‌ అవలేదు, అలా అని సంతృప్తి చెందలేదు. ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్‌ గెటప్‌లో చూపించాం. థియేర్‌లో ఆ సీన్స్‌ ఎక్కడ? అని వెతికే క్రమంలో కథ ఎవరికీ ఎక్కలేదు' అన్నాడు దర్శకుడు మారుతి. ప్రభాస్‌ తొలిసారి హారర్‌ జానర్‌లో నటించిన చిత్రం ది రాజాసాబ్‌. ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వింటేజ్‌ ప్రభాస్‌ను చూసి కొందరు ఖుషీ అవుతుంటే మరికొంతమంది మాత్రం కథ అంతా గందరగోళంగా ఉందని నిరాశకు లోనవుతున్నారు. 

    బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌
    థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంటున్న ఈ సినిమా.. బ్లాక్‌బస్టర్‌ అంటూ సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టింది చిత్రయూనిట్‌. 'రాజాసాబ్‌.. కింగ్‌ సైజ్‌ బ్లాక్‌బస్టర్‌' అంటూ శనివారం (జనవరి 10న) సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారుతి.. విమల్‌ థియేటర్‌లో ప్రీమియర్స్‌ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించాడు. 

    సారీ
    మారుతి మాట్లాడుతూ.. విమల్‌ థియేటర్‌ వద్ద మీడియా మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 1.30 వరకు కూడా ప్రెస్‌ షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారు. మిమ్మల్ని ఇబ్బందిపెట్టినందుకు చాలా చాలా సారీ.. అసలు ఇలా జరుగుతుందని నాకు తెలియదు. హాయిగా నిద్రపోయే సమయానికి సినిమా చూపించాం. అయినా అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకు రివ్యూ ఇచ్చారు. థాంక్యూ సోమచ్‌.

    మూడేళ్ల కష్టం
    నెక్స్ట్‌.. నాకు అవకాశాన్నిచ్చిన ప్రభాస్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. తొమ్మిది నెలలకే సినిమా పూర్తి చేసే నేను రాజాసాబ్‌ను మూడేళ్లపాటు కష్టపడి, ఇష్టపడి తీశాను. ప్రభాస్‌కు నచ్చేవిధంగా, అభిమానులు మెచ్చేవిధంగా తెరకెక్కించాను. క్లైమాక్స్‌ కొత్తగా ఉందని ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

    ఒక్కరోజులో డిసైడ్‌ చేయొద్దు
    ఇకపోతే సినిమా రిజల్ట్‌ అనేది ఒక్కరోజునే తేల్చలేం.. పది రోజులు ఆగితే దాని ఫలితమేంటో తెలుస్తుంది. ఎందుకంటే కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా వెంటనే ఎక్కదు. కాస్త సమయం పడుతుంది. సినిమాలో కొన్ని సీన్స్‌ అర్థమైనవాళ్లు పొగుడుతున్నారు, అర్థం కానివాళ్లు తిడుతున్నారు. పండగ సమయంలో అందరూ సినిమాలు చూస్తారు. కాబట్టి.. అప్పుడే సినిమా ఫలితాన్ని నిర్ణయించకండి.

    రియల్‌ రాజాసాబ్‌
    ట్రైలర్‌లో ప్రభాస్‌ ఓల్డ్‌ గెటప్‌ చూపించాం. సినిమాలో ఆ సీన్స్‌ లేకపోయేసరికి చాలామంది నిరాశపడ్డారు. అందుకనే సెకండాఫ్‌లో ఆ సీన్స్‌ జత చేస్తున్నాం. ఎక్కడైతే కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయన్నారో వాటిని షార్ప్‌ చేశాం. ఈ రోజు సాయంత్రం నుంచి రియల్‌ రాజాసాబ్‌ను చూపించబోతున్నాం అని మారుతి అన్నాడు.

    చదవండి: మాట మీద నిలబడ్డ  మెగాస్టార్‌ చిరంజీవి

  • చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ అనే సింగింగ్‌ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తుంటారు. ఎలిమినేషన్‌ అనేది లేకుండా గ్రాండ్‌ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.

    మాటిచ్చిన మెగాస్టార్‌
    ఈ షోకి సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, సింగర్‌ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్‌ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్‌. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.

    మాట నిలబెట్టుకున్న చిరంజీవి
    ఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ గ్రాండ్‌ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్‌ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయబోతున్నట్లు తెలిపింది.

    చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్‌కు ఏకంగా చెప్పు చూపించాడా?

  • టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిన్నా పెద్దా సంబంధం లేదు. దాదాపు ప్రతి సినిమాకు ప్రీమియర్ షోలు వేస్తున్నారు. వీటి వల్ల చిన్న సినిమాలకు కాస్త ప్లస్ అవుతోంది గానీ పెద్ద చిత్రాలకు మాత్రం మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు అయితే ఊహించని దానికంటే మైనస్ అవుతుంది. ఏ చిత్రమైనా సరే ప్రీమియర్ షోలు వేయడం నిజంగా అవసరమా?

    పది పదిహేనేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊరిలోనూ ఒకటో రెండో థియేటర్లు ఉండేవి. ప్రతివారం చిన్నా పెద్దా సినిమాలు అందులో రిలీజయ్యేవి. టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉండేది కాదు. స్టార్ హీరోల మూవీస్‌ అయినా చిన్న హీరోల చిత్రాలైనా ఒకటే రూల్. కాకపోతే పేరున్న హీరోల సినిమాలకు కాస్త ఎక్కువగా వసూళ్లు వచ్చేవి. అప్పట్లో టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు లాంటి హంగామా ఉండేది కాదు. అంతా ప్రశాంతం. అప్పట్లో కథలు కూడా ప్రేక్షకులు తమని తాము సినిమాల్లోని ఆయా పాత్రలతో పోల్చి చూసుకునేలా ఉండేవి.

    కానీ ఇప్పుడు నగరాల్లో తప్ప ఊళ్లలో థియేటర్లు రోజురోజుకీ తగ్గుతూ వస్తున్నాయి. సిటీల్లో అయినా గ్రామాల్లో అయినా వీకెండ్ వస్తేనే చాలా తక్కువ మంది ప్రేక్షకులు.. థియేటర్ వైపు చూస్తున్నారు. మరీ బాగుంది అనిపిస్తే తప్పితే సినిమాకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. టికెట్ ధరల్లోనూ చిన్న పెద్ద సినిమాలకు బోలెడంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి లేదంటే వేకువజామున షోలు వేస్తున్నారు. వీటి వల్ల బోలెడంత నెగిటివిటీ ఏర్పడుతోంది.

    (ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')

    మనసు ప్రశాంతంగా ఉంటేనే సినిమాని ఆస్వాదించగలం. రాత్రివేళల్లో దాదాపు అందరూ నిద్రపోయే సమయాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకుల్లోనూ చాలామందికి అది నిద్రపోయే టైమ్ అయ్యిండొచ్చు. వాళ్లు మూవీని నిద్ర మబ్బుతో చూడటం, సినిమాలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రివ్యూలు చెప్పడం వల్ల మరింత చేటు జరుగుతోంది. అదే రిలీజ్ రోజు ఉదయాన్నే సినిమా చూస్తే బాగలేకపోయినా మూవీ కూడా పర్లేదు ఒక్కసారి చూడొచ్చు అని అనిపించే అవకాశముంది.

    కానీ గత కొన్నాళ్ల నుంచి తొలి వీకెండ్ అయ్యేసరికి పెట్టిన బడ్జెట్ ఎలాగైనా రాబట్టేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్నారు. వందల వందల రూపాయల టికెట్ ధరలకు అదనంగా పెంచేస్తున్నారు. దీనివల్ల సినిమాలు రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుడు.. థియేటర్‌కి వెళ్తాడేమో గానీ సగటు మధ్య తరగతి ప్రేక్షకుడు.. ఇంతింత ఖర్చు చేసి ఇప్పుడు వెళ్లడం అవసరమా? ఓటీటీలోకి వచ్చాక చూసుకుందాంలే అని తనలో తానే అనుకుంటున్నాడు. 

    ఇదేదో ఒకటి రెండుసార్లు జరిగితే పర్లేదు. అలవాటు అయిపోతే మాత్రం అలాంటి ప్రేక్షకుడిని తిరిగి థియేటర్‌కి తిరిగి రప్పించడం కష్టం. ప్రస్తుతం అలానే చాలామంది థియేటర్లకు దూరమైపోయారు. ప్రీమియర్ షోలే ఇలాంటి వాటికి ప్రధాన కారణమవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రీమియర్ షోలు వేయాలి, టికెట్ ధరలు పెంచేయాలని అనుకుంటున్నారు తప్పితే సరైన కంటెంట్‌తో వద్దాం. సాధారణ ధరలకే టికెట్స్ అమ్ముదాం అని మాత్రం ఆలోచించట్లేదు. 

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'దండోరా' సినిమా.. మూడు వారాల్లోపే స్ట్రీమింగ్)

Andhra Pradesh

  • ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన కారు నేరుగా వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన పెనుగంచిప్రోలు మండలం కొనకంచి సమీపంలో జరిగింది. ఈ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇది చూసిన స్థానిక యువకులు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని రక్షించారు.

    ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న చిల్లకల్లు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఎస్సై లు సూర్య శ్రీనివాస్ ,సాయి మణికంఠ సిబ్బందితో ప్రమాదస్థలిని కలిసి పరిశీలించారు. ప్రమాదంలో   గాయపడ్డ వారికి సిపీఆర్ చేసి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులను హైదరాబాదుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 
     

  • రైల్వేస్టేషన్‌(విజయవాడ): తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్‌ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్‌ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  

    ప్లాట్‌ఫాంలు కిటకిట.. 
    సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కశాశాలలకు సెలవులు రావటంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద  సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుండటంతో అన్ని ప్లాట్‌ఫాంలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి, ఆరు, ఏడు ప్లాట్‌ఫాంలలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ, పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తుండటంతో ప్లాట్‌ఫాంలు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులలో చార్జీలు రెట్టింపు వసూలు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్‌ రైళ్లు నెలరోజుల కిత్రమే నిండిపోయి భారీగా వెయిటింగ్‌ లిస్ట్‌  పెరిగిపోయింది. దీంతో రైల్వేఅధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్‌ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

    విజయవాడ మీదుగా 150 ప్రత్యేక రైళ్లు.. 
    హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్‌ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు.  

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.

    కాగా, ఇటీవల తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి, సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.

  • శబరిమల ఆలయ బంగారు చోరీ కేసు మళ్లీ రాజకీయ వేడిని రాజేసింది. తంత్రి(ప్రధాన అర్చకుడు) కందరారు రాజీవరు అరెస్టును బీజేపీ ఖండిస్తోంది. అంతేకాదు.. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలకు దిగింది. కేసుతో సంబంధం ఉన్న మాజీ దేవాదాయ శాఖ(దేవస్వం) మంత్రి కడకంపల్లి సురేంద్రను వదిలేసి.. తంత్రిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యంగా చేసుకున్నారని అంటోంది. 

    తంత్రిని అరెస్టు చేశారు, కానీ మంత్రిని విడుదల చేశారు. ఎందుకో చెప్పాలి? అంటూ కేరళ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రధాన అర్చకుడి అరెస్ట్‌ త్వరగతిన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు కే సురేంద్రన్, బీడీజేఎస్‌ నేత తుషార్ వెల్లప్పల్లి తదితరులు రాజీవరు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ కేసులో నిజం నిగ్గుతేలాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ చేస్తోంది. 

    సిట్‌ తన రిమాండ్ రిపోర్టులో కుట్ర ఆరోపణలకు ఆధారం లేదని కే సురేంద్రన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వ్యవహారంలో తంత్రికి ఆర్థిక లాభం ఏమీ లేదని.. అయినప్పటికీ అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. ఆలయ వ్యవహారాలతో సంబంధం ఉన్న దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్, సభ్యుడు కేపీ శంకర్‌దాస్‌, మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది కేవలం మంత్రిని రక్షించే కుట్రేనని ఆరోపించారు. తంత్రి అరెస్టునకు నిరసనగా.. జనవరి 14న మకరవిళక్కు సందర్భంగా ఇళ్లలో ‘‘అయ్యప్ప జ్యోతి’’ వెలిగించి నిరసనలు తెలియజేస్తామన్నారు. 

    శబరిమలలో (Sabarimala) గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని దాత అయిన బెంగళూరుకు చెందిన వ్యాపారి ఉన్ని కృష్ణన్‌ తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.100 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఎలక్ట్రోప్లేటింగ్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. ఉన్నట్టుండి తాపడాల బరువు దాదాపు 4.524 కేజీలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా ఉన్ని కృష్ణన్‌ సహా పలువురు ప్రధాన అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టింది. అయితే తదనంతర పరిణామాలతో హైకోర్టు సైతం ఈ దర్యాప్తున పర్యవేక్షిస్తోంది.

    చోరీ జరిగిన సమయంలో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ దేవస్వం మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో నిందితుల వాంగ్మూలంతో డిసెంబర్‌ చివర్లో ఆయన్ని సిట్‌ విచారణ జరిపింది. అయితే.. ఆయన పాత్ర లేదని నిర్ధారణ రావడంతో ప్రశ్నించి వదిలేసింది.

    సిట్‌ ప్రకారం నిందితుల వాంగ్మూలంలో ఇలా ఉంది.. ప్రధాన అర్చకుడు రాజీవరుకు బంగారు పూత పనులు జరిగిన విషయం తెలుసు. ఇది ఆచార నియమాలకు విరుద్ధం. ఇది కూడా ఆయనకు తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌ పొట్టితో రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పొట్టిని శబరిమలకు తీసుకొచ్చింది కూడా రాజీవరేన. తాపడాల చోరీ కేసులో రాజీవరు పాత్ర కూడా ఉంది. 

    శబరిమల గోల్డ్‌ చోరీ కేసులో రాజీవరుతో కలిపి 11 మందిని అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఆయన్ని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఆయన నివాసాల్లో సిట్‌ సోదాలు జరిపింది. అయితే జైలులో అస్వస్థతతో బాధపడటంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ప్రస్తుత సీజన్‌లో శబరిమల ఆలయానికి రాజీవరు ప్రధాన పూజారి కాదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు కె. జయకుమార్‌ నాయర్‌ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో ప్రసారమైన కథనం పట్ల కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క ఖండించారు. ఇక, తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా మండిపడ్డారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

    టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘వ్యక్తులకు సంబంధించి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం కరెక్ట్‌ కాదు. వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి మంత్రులు, అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలి అని హితవు పలికారు.

    ఇదే సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నిస్తూ.. రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిది? అని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు సాధించామని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని’ చెప్పుకొచ్చారు. 

  • సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఇసుక దందాపై మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక దందా చేస్తున్నది తెలుగు దేశం పార్టీ వారే అంటూ నారాయణ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    వివరాల ప్రకారం.. నెల్లూరు సిటీ టీడీపీ కోఆర్డినేషన్ టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరులో అక్రమ ఇసుక దందాపై ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారు. మామిడాల మధు, మస్తాన్ అయ్యా, మల్లీ జేసీబీలు పెట్టి టిపర్లతో ఇసుక తరలిస్తున్నారు.  ట్రాక్టర్లతో అయితే ఓకే.. టిపర్లతో ఇసుక తరలిస్తే సమస్య వస్తుంది. రాత్రి, పగలు టాక్టర్లతో కావాలంటే తరలించుకోండి.. టిపర్స్‌ వద్దు. టిప్పర్లను పోలీసులతో చెప్పి సీజ్ చేయిస్తున్నా అని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

    ఇసుక దందా చేస్తుంది మన టీడీపీ వాళ్లే..! మంత్రి నారాయణ

     

  • సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్‌ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్‌సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:

    ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావు
    ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్‌గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్‌ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్‌ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్‌ చేశాయి.

    జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్‌కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్‌ జర్నలిజమ్‌ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.

    వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తి
    రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్‌గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిని నిందించాయి. జగన్‌ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.

    రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్‌గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు.

  • సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌ మీద విష ప్రచారం చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. రాష్ట్రంలో గత 19 నెలలుగా జరుగుతున్న అపచారాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

    వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘పరమ పవిత్రంగా భావించే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు టీడీపీ వాళ్లకు పందేరం చేసే కుట్రలకు తెర తీశారు. రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాలు ఉన్న దేవాదాయ శాఖ భూములను అప్పనంగా దోచి పెట్టేందుకు కేబినెబ్‌లో తీర్మానం చేశారు. మూడు వేల కోట్ల మార్కెట్ విలువ ఉన్న టీటీడీ స్థలాన్ని కారుచౌకగా 25 కోట్లకు కట్టబెట్టారు. తిరుమల ఆలయ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు.

    దేవాలయాల పవిత్రను దెబ్బతీస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయని చూపిస్తే.. అలా చూపించిన వారిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం ఆలయాల్లో జరుగుతున్న ఘటనలకు ఏమని సమాధానం చెబుతుంది?. చంద్రబాబుకు ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీపై విషప్రచారం చేయడం అలవాటుగా మారిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

    Karumuri Venkat: దుర్గమ్మ గుడిలో కరెంటు కట్... పాలల్లో పురుగులు సనాతన డ్రామా ఆర్టిస్ట్ ఎక్కడ...?
     

  • సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్‌ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి అన్నారు.

    సుధాకర్ బాబు మాట్లాడుతూ.. నేడు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదలు కొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ పని చేస్తోందని.. ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైఎస్‌ జగన్‌ ఒక్కరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారింది’’ అని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.

    టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటం చేస్తాం’’ అని సుధాకర్‌బాబు చెప్పారు.

  • సాక్షి, నంద్యాల: ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ప్రాజెక్ట్‌ విషయంలో నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత ఇవ్వాలని బుగ్గన డిమాండ్‌ చేశారు.

    మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కి రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు. సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి’ అని వ్యాఖ్యలు చేశారు.

    వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమకు ద్రోహం చేస్తూ మీడియా సమావేశాల్లో తప్పుడు వ్యాఖ్యలు చేయడమేంటి?. నిజాయితీగా నీటిని అందించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు కృషి చేయాలి. కూటమి నేతలు సవాల్ విసరడం బాగానే ఉంది కానీ పాలకులుగా మీకు బాధ్యత లేదా?. చర్చకు సిద్ధమా అని టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన సవాల్‌కు మేము సిద్ధమే. రాయలసీమ ప్రాంతవాసులకు నీరు అందించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. 

    Buggana: ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగింది?
     

  • సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా, ఛానెల్స్‌లో మహిళా అధికారులపై పనికట్టుకుని వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని ఖండిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వార్తలు వస్తే ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడతారు. బాధ పడుతారని ఆలోచన చేయాలంటూ హితవు పలికారు. ఇదే సమయంలో తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను అంటూ వ్యాఖ్యలు చేశారు. 

    మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదు. అధికారుల బదిలీలు సీఎం, సీఎస్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరు. ఐఏఎస్, IPS కావాలంటే ఎంతో కష్టపడాలి. ఐఏఎస్ అధికారులకు సెలవులు ఉండవు. ఐఏఎస్, IPS అధికారుల బదిలీలు సర్వసాధారణం. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్న.. మీకు కుటుంబాలు ఉంటాయి. రాసే వారికి భార్య పిల్లలు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయి.. మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్‌ కాదు. సోషల్ మీడియాలో సీఎం పై విమర్శలు వచ్చాయి.. లిమిట్ లేకుండా పోయింది.

    ఆ ఐఏఎస్ అధికారి స్థానంలో ఉండి మీరు ఆలోచన చేసుకోండి. మహిళలు ఉద్యోగాలు చేయడమే తప్పా!. మంత్రుల ఇళ్లలో ఇబ్బందులు పెట్టి.. మహిళా అధికారులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు. మమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనుకుంటే వేసుకోంది. ఫోన్ మాట్లాడకపోతే.. ఫోన్ ఎత్తకపోతే అసత్య వార్తలు రాస్తారా?. ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే అధికారులతో రివ్యూ ఎప్పుడు చేయాలి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా... ఇలాంటి వార్తల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎదుటివాడు బాధపడితే స్పందించే గుణం నాది. నాలాంటి వాడిని ఏడుపిస్తా అనుకుంటే ఏడిపించండి. ఇప్పటికే కొడుకును కోల్పోయి ఏడుస్తున్నాను.

    సినిమాపై క్లారిటీ.. 
    నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేశాను. పుష్పా సినిమా వివాదం తర్వాత ప్రీమియం షోలకు అనుమతి ఇవ్వడం బంద్ చేసాను. రాజాసాబ్, చిరంజీవి సినిమా టికెట్ల రేట్లు, ప్రీమియం షో అనుమతి ఫైల్ నా దగ్గరకి రాలేదు. నాకు తెలియకుండానే రెండు సినిమాల జీవోలు వచ్చాయి. నేను సినిమా ఇండస్ట్రీపై దృష్టి పెట్టలేదు.. పెట్ట దల్చుకోలేదు. నిప్పులాగా బతికిన వాడిని ఇలా మానసికంగా బాధ పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్లను దేవుడే శిక్షిస్తాడు. జిల్లా మంత్రిగా రివ్యూ పెడితే అధికారులు పక్కన కూర్చోవడం తప్పా?. ఎన్నో విమర్శలు వచ్చినా ఆరుసార్లు గెలిచాను. వెంకట్ రెడ్డి ఉండొద్దు అంటే ఇంత విషం ఇచ్చి చంపండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

    Komatireddy: వాళ్లను దేవుడే శిక్షిస్తాడు.. నాకు తెలియకుండానే టికెట్ రేట్లు పెంచారు
  • తాడేపల్లి : అమరావతిలో అన్యాయం, అవినీతి జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముందన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. తన తందాన కంపెనీలకే బాబు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, ఆ కంపెనీల నుంచి 4 శాతం కమీషన్లు బాబు  తీసుకుంటున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం, జనవరి 10వ తేదీ) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల..  మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లతో బాబు అండ్‌ కో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

    ‘చంద్రబాబు అమరావతి మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కామ్స్‌. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  వైఎస్‌ జగన్‌ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటైనా.. అమరావతిలో నీళ్లు తోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమ నివాసంలో ఉన్నారు.. ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. 

    మేం అమరావతిని తక్కువ చేయలేదు
    తాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న స్కామ్‌లను ప్రశ్నిస్తున్నామన్నారు సజ్జల. ‘విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి అని చెప్పాం. అమరావతిని వైఎస్సార్‌సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. చంద్రబాబు బెదిరింపులు అరుపులు కాకుండా సూటిగా సమాధానం చెప్పాలి. గొంతెత్తి, కళ్లు పెద్దవి ేసి బెదిరిస్తే సమాధానం దొరకదు. రూ. లక్ష కోట్ల అప్పుకు ఏడాదికి రూ. 8 వేల కోట్ల వడ్డీ కట్టాలి

    రాయలసీమ ప్రయోజనాలు ఎలా.?
    శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ రోజుకు 8 టీఎంసీలు వాడుకుంటుంది. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటుందే రాయలసీమ ప్రయోజనాలు ఎలా?, రాయలసీమ హక్కుల పరిరక్షణలో చంద్రబాబ విఫలమయ్యారు. ఆర్గనైజ్జ్‌ మీడియా టెర్రరిజంతో నిజాలను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారు. చంద్రబాబు సైలెంట్‌ ఉండటం అంటే రేవంత్‌ చెప్పింది నిజమే అని అర్థం చేసుకోవాలి

    విష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ
    విష, అబద్ధపు ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని సజ్జల విమర్శించారు. పాస్‌ పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ అనేది వైఎస్‌ జగన్‌ ఉన్నప్పుడే ఉందని, ఇప్పుడు దాన్ని చంద్రబాబు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే అందులో దాపరికం ఎందుకని ప్రశ్నించారు. 

    ‘లక్షా 80 కేజీల గోమాంసం విశాఖలో  పట్టుబడితే ఏం చేశారు. క్వశ్చన్‌ చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు బాబు సమాధానం ఇవ్వకుండా.. మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. అధికారం వచ్చాక కూడా వారంలో మూడు, నాలుగు రోజులే బాబు ఇక్కడ ఉంటున్నారు. ప్రతివారం హైదరాబాద్‌లో చంద్రబాబు, లోకేష్‌లకు ఏం పని? అని నిలదీశార సజ్జల. 

    Sajjala: కోర్టు మొట్టికాయలు వేసిన బుద్ధి రావడం లేదు.. కోడి కొస్తే కేసు పెడతారా..

    చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందాం
    చంద్రబాబు అరాచక పాలన నుంచి ఏపీని కాపాడుకుందామన్నారు సజ్జల  ‘ వైఎస్‌ జగన్‌ హయాంలో రూ. 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. రూ. 3.30 లక్షల కోట్లలో రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ఇచ్చాం. చంద్రబాబు రెండేళ్లు తిరగకుండానే రూ. 3 లక్షల  కోట్లపైగా అప్పు చేశారు. చంద్రబాబ పాలనను ప్రజలు, విజ్ఞులు మేధావులు ప్రశ్నించాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

National

  • గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని.. మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన ఓంకార మంత్ర జపంలో మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో భక్తులు సోమనాథ్‌ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ తీరంలో ఏర్పాటు చేసిన అద్భుతమైన డ్రోన్ షోను ఆయన వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    కాగా, ప్రధాని మోదీ రేపు(ఆదివారం) ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‘ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనున్న ‘వైబ్రెంట్ గుజరాత్’ ప్రాంతీయ సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సు స్థానిక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

    అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అహ్మదాబాద్ మెట్రో రెండో దశను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక, జనవరి 12న జర్మన్ ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అంతర్జాతీయ దౌత్య సంబంధాలను పటిష్టం చేయడంలో భాగంగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చివరగా, అహ్మదాబాద్‌లో అత్యంత వేడుకగా జరిగే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ప్రధాని పాల్గొంటారు. 

  • బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

    ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్‌లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్‌ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌పై నుంచి సినిమా రేంజ్‌లో జంప్‌ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.

    ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్‌.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

    ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్‌ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

  • తిరువనంతపురం: శబరిమల బంగారు అభరణాల కేసులో అరెస్టైన ఆలయ ప్రధాన పూజారి కందావారు రాజీవరు ఇంట్లో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఎనిమిది మంది సభ్యులున్నా సిట్ బృందం ఈరోజు( శనివారం) మద్యాహ్నం ప్రాంతంలో పూజారి నివాసానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలు ఏమైనా లభిస్తాయా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.  మరోవైపు.. అనారోగ్యం కారణంగా అరెస్టయిన కందరరు రాజీవరు వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరారు. 

    తిరువనంతపురం స్పెషల్ సబ్-జైలులో కస్టడీలో ఉన్నప్పుడు తంత్రి ఆరోగ్య సమస్యలను నివేదించిన తర్వాత మొదట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల తరువాత, అతను ప్రత్యేక సంరక్షణ కోసం మెడికల్ కాలేజీకి బదిలీ చేయబడ్డారు. వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తీసుకురాగానే.. మెడిసిన్, కార్డియాలజీ విభాగాల అధిపతులు ఆయనను పరీక్షించారు. నిపుణుల సూచన మేరకు అతడిని ఐసీయూకి తరలించారు. అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

    అయితే, జైలులో అల్పాహారం తీసుకుంటుండగా తంత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జైలు అధికారులను వైద్య సహాయం కోరారు. అనంతరం, అతన్ని పరీక్షించేందుకు ఒక వైద్యుడు జైలుకు వెళ్లాడు. సదరు వైద్యుడి సూచనలు మేరకు రాజీవరును ఆసుపత్రికి తరలించారు.

    కాగా శబరిమల బంగారు తాపడాల చోరి కేసులో శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు కందావారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో నిన్న ఉదయం ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా సిట్ విచారణ చేపడుతుంది. కాగా ఈ కేసులో ఆయన అరెస్టు 11వది.

    ఏమిటి ఈ కేసు?
    2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్‌మాల్‌ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది.

  • లక్నో: అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్‌ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

    అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా వర్గాలు అతన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా.. భద్రతా నిర్వహణపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    అయోధ్య పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌ సోఫియాన్‌ జిల్లాకు చెందిన అహ్మద్‌ షేక్‌(55) అజ్మీర్‌ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయల్దేరాడు. అయితే అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అయోధ్య రామ మందిర కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాడు. ఆపై సీతమ్మ మండపం దగ్గర నమాజ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కాంప్లెక్స్‌ దగ్గర కాపలాగా ఉండే సిబ్బంది అది గమనించి అతన్ని నిలువరించారు. ఆ సమయంలో అతను నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆపై పోలీసులకు అప్పగించగా.. విచారణ జరుపుతున్నారు.  

    సున్నితమైన అంశం కావడంతో.. అతన్ని నిఘా ఏజెన్సీలకు అప్పగించారు. లోపలికి వెళ్లే టైంలో అతని బ్యాగులో కిస్మిస్‌, జీడిపప్పు మాత్రమే కనిపించాయని తనిఖీ సిబ్బంది చెబుతున్నారు. అయితే అతను అజ్మీర్‌ అని చెప్పి అయోధ్యకు ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? తదితర అంశాలపై దృష్టిసారించాయి. రామ మందిర ట్రస్ట్‌ నిర్వాహకులు ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. 

    అయోధ్య రామాలయం దేశంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఆలయాల్లో ఒకటి. అలాంటి చోట ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం అయోధ్య రామమందిర ప్రాంగణంలో జరగబోయే మకర సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. 

  • కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్‌లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్‌లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్‌, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.

    ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్‌ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

  • భువనేశ్వర్‌: ఒడిషాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్డ్‌ ఫ్లైట్‌ ఒకటి కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో పైలట్‌ సహా అందులోని ఆరుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

    శనివారం మధ్యాహ్నా సమయంలో రూర్కెలా సమీపంలోని రఘనాథ్‌పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా.. టేకాఫ్‌ అయిన 10 కి.మీ. దూరంలో విమానం ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. పైలట్‌ సహా ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 

    ఘటనలో చార్టర్డ్‌ ఫ్లైట్‌ ముందు భాగం నుజ్జు అయ్యింది. ప్రమాద గురించి తెలిసి చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. తమ ఫోన్లలో ప్రమాదం ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

    ఇంజిన్‌ ఫెయిల్‌ కావడంతోనే విమాన ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్‌ జెనా స్పందించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 

     

  • న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో 2025 నవంబర్ 23న జరిగిన  విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తాజాగా ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కాబూల్ నుండి ఢిల్లీకి వస్తున్న అరియానా ఆఫ్గన్ ఎయిర్‌లైన్స్ విమానం (ఏఎప్‌జీ311), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచించిన రన్‌వే 29ఎల్‌ కు బదులుగా పొరపాటున రన్‌వే 29ఆర్‌పై ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మరొక విమానం అదే రన్‌వేపై టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

    ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఏఏఐబీ.. విమానంలోని పైలట్-ఇన్-కమాండ్, ఫస్ట్ ఆఫీసర్ ఇద్దరికీ చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే విధుల్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా అర్హతలు కలిగి ఉన్నారని పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోని నావిగేషన్ వ్యవస్థలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని నివేదిక పేర్కొంది. అయితే ల్యాండింగ్‌కు కేవలం నాలుగు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 'ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్' (ఐఎల్‌ఎస్‌)సిగ్నల్ కోల్పోయామని, వాతావరణం సరిగా లేకపోవడంతో రెండు సమాంతర రన్‌వేల మధ్య తేడాను గుర్తించలేక పొరపాటు పడ్డామని విమాన సిబ్బంది విచారణలో వెల్లడించారు.

    ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలోని రన్‌వే 29ఎల్‌, 29ఆర్‌ మధ్య కేవలం 360 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. డీజీసీఏ (డీజీఏసీ) నిబంధనల ప్రకారం వీటిని ఒకేసారి ల్యాండింగ్ కోసం వాడకూడదు. ఘటన సమయంలో రన్‌వే 29ఆర్‌ పై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతుండగా, అఫ్గాన్ విమానం  అదేచోట ల్యాండ్ అయింది. ఆ సమయంలో ఆ రన్‌వేకు సంబంధించిన అప్రోచ్ లైట్లు, ఐఎల్ఎస్ వ్యవస్థలు కూడా ఆపివేసి ఉన్నాయి. విచారణలో భాగంగా డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్‌)ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, విమానం తదుపరి ప్రయాణం సాగించడంతో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్‌)లోని పాత డేటా పోయిందని అధికారులు గుర్తించారు.

    ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏఏఐబీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కీలక భద్రతా సిఫార్సులను చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని ఏటీసీ టవర్లలో వీడియో, ఆడియో రికార్డింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. కంట్రోలర్లు విధుల్లో ఉన్నప్పుడు వారి సంభాషణలు, కదలికలను రికార్డ్ చేయడం వల్ల ప్రమాదాల విచారణలో ఖచ్చితత్వం పెరుగుతుందని ఏఏఐబీ అభిప్రాయపడింది. అయితే ఈ రికార్డింగులను కేవలం విచారణ అవసరాల కోసమే తప్ప, సిబ్బందిని  ఇబ్బందిపెట్టడానికి వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతున్నది.

    ఇది కూడా చదవండి: పూణే: రోబో శునకాలతో ఓట్ల వేట.. భారీ కానుకల వెల్లువ
     

Telangana

  • సాక్షి, సిద్ధిపేట: చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం జరిగింది. చెక్‌ డ్యామ్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. మృతుల్లో తల్లీ కొడుకులు ఉన్నారు. కుమారులను కాపాడే ప్రయత్నంలో తల్లి మృతి చెందింది. బతుకు దెరువు కోసం బీహార్‌ నుంచి ఐదు రోజుల కిందటే కస్తూరిపల్లికి రెండు కుటుంబాలు వచ్చాయి. మృతి చెందిన వారంతా వలస కూలీలు. కూలీల మృతిపై  సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: తాను డాక్టర్‌ను కాదు.. కానీ సోషల్ డాక్టర్‌నని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హెచ్‌ఐసీసీలో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషమన్నారు.

    ‘‘భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు వచ్చారు. మీరంతా సక్సెస్ ఫుల్ కార్డియాలజిస్టులు. అయినా మీ నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కాన్ఫరెన్స్ కు వచ్చారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

    ..కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే మీ కెరీర్‌కు ముగింపు పలికినట్లే. ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లో జరగడం ఎంతో గర్వకారణం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది డాక్టర్లు అవ్వాలనుకున్నా అందుకు అర్హత సాధించలేరు. మీరంతా సమాజంలో ఒక ప్రత్యేక గ్రూప్. డాక్టర్లు ప్రాణాలు కాపాడతారని మేం బలంగా నమ్ముతాం. మనుషులపట్ల, సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు.

    ..ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆ దిశగా మీ సలహాలు, సూచనలు ఇచ్చి మాకు సహకరించండి. విజ్ఞానం, సాంకేతికత ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తున్నాయి. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉంది. అందుకే లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి.. కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దు.

    ..ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని మీకు తెలుసు. గుండె జబ్బులను నివారించే మిషన్‌లో మనమందరం భాగస్వాములం అవుదాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనమందరం కలిసి పనిచేద్దాం. విద్యార్థులకు సీపీఆర్‌ నేర్పించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే.. మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలం. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ గురించి అంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణలో మనం వరల్డ్ బెస్ట్ అవ్వాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ వైద్యుడిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి’’ అని రేవంత్‌ అన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులపై అసభ్య, అనుచిత ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

    మంత్రి సీతక్క తాజాగా మాట్లాడుతూ..‘మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహిళా ఐఏఎస్‌లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరం. మహిళలు ఉన్నత స్థాయికి చేరితే తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక స్థితే.. దుష్ప్రచారాలకు కారణం. మహిళా అధికారుల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రచారాన్ని సహించబోము. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

    మహిళా ఐఏఎస్ అధికారులు ధైర్యంగా, నిబద్ధతతో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహిళా అధికారుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుంది. అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. మహిళలపై ద్వేషపూరిత ప్రచారానికి సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలవాలి. మహిళల గౌరవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్‌ విలేజ్‌ మక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది.

    కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

    ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..
    ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.

    హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్జామ్..
    హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్జామ్‌ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్‌, బేగంబజార్‌, హైకోర్టు, ఆఫ్జల్గంజ్‌, నయాపూల్భారీగా ట్రాఫిక్‌ ఏర్పడింది. వీకెండ్సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్‌ కారణంగా రద్దీ నెలకొంది.

    విజయవాడలో..
    పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి.

     

  • సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగ నేపథ్యంలో రైళ్లన్నీ ఫుల్‌ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్‌ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిసిన దక్షిణ మధ్య రైల్వే.. పండగకు ముందు, తర్వాత రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

    ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు.. ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.  ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రైళ్లలో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.

    కాగా, తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్‌ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ మీదుగా  ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. 

    హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్‌ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్‌లలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. 

     

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మీర్‌పేటలో బిడ్డకు విషమించి.. తాను బలవన్మరణానికి పాల్పడిన వివాహిత సుష్మిత కేసుపై వివాదం నెలకొంది. ఉస్మానియా మార్చురీ వద్ద సుష్మిత, ఆమె భర్త యశ్వంత్‌ తరఫు బంధువులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. తమ మధ్య గొడవలేం లేవని యశ్వంత్‌ చెబుతుండగా..  ఆత్మహత్య కాదంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సుష్మ తరఫు బంధువులు.  

    మా మధ్య విబేధాలు లేవు. ఆత్మహత్య చేసుకునేంత గొడవలేం కూడా జరగలేదు. సుష్మ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చు. నా బాబుకి మా అత్తే విషమిచ్చి ఉండొచ్చు అని యశ్వంత్‌ అంటున్నాడు. అయితే.. తమ కూతురు చనిపోయాక పక్కనే ఉండి తమకు వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు, ఆమె తరఫు బంధువులు నిలదీశారు.  

    పోలీసులు వచ్చిన తర్వాతే సుష్మ చనిపోయిందని మాకు చెప్పారు. చనిపోయే ముందు అరగంట ఏదో జరిగిందనేది మా అనుమానం. ఆ అరగంట ఏం జరిగిందో పోలీసులే తేల్చాలి. ఫ్యాన్‌ ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంటారు. రెక్క సుష్మ బరువు ఆపుతుందా?.  ఆస్తి కోసమే ఇదంతా చేశారనిపిస్తోంది. యశ్వంత్‌, అతని బంధువులే సుష్మను మానసికంగా వేధించారు. అందుకే ఆధారాలు మార్చేసి ఉంటారు అని సుష్మ బంధువులు అంటున్నారు. అయితే మీడియా ఎదుటే జరిగిన ఆ వాగ్వాదంలో జోక్యం చేసుకున్న పోలీసులు వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.   

    పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన యశ్వంత్‌రెడ్డి చార్టెడ్‌ అకౌంటెంట్‌. అదే ప్రాంతానికి చెందిన సుస్మిత(27)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులు నగరంలోని హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్‌ నందన్‌రెడ్డి (11 నెలలు) కుమారుడు ఉన్నాడు. 

    అయితే.. గురువారం ఉదయం భర్త ఆఫీస్‌కు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించడంతో పాటు, కుమారుడు మృతిచెంది ఉన్నాడు. వారితో పాటే ఉండే సుస్మిత తల్లి లలిత(50) సైతం అపరస్మారక స్థితిలో ఉండగా ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

    సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మొదట బాబుకు విషమిచ్చిన సుస్మిత, తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావించారు. అయితే.. సుస్మితను భర్త వేధించేవాడని, బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళనల నడుమే.. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.

Business

  • జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం 'శ్రీధర్ వెంబు'.. ఆయన భార్య 'ప్రమీలా శ్రీనివాసన్' విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ వ్యాపారవేత్త వ్యక్తిగత జీవితం, కంపెనీ ఆస్తుల మధ్య జరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం.. కార్పొరేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

    శ్రీధర్ వెంబు తన వద్ద ఉండే.. జోహో కంపెనీ షేర్స్ భార్యకు (ప్రమీలా శ్రీనివాసన్) తెలియకుండా.. బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ. కంపెనీలో ఆమెకు రావాల్సిన వాటా.. రాకుండా చేయడానికే ఈ విధమైన బదిలీలు జరిగాయని అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ అంశం తెరపైకి వచ్చింది.

    ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా అనోన్య జీవితం సాగించిన శ్రీధర్ వెంబు, ప్రమీలా శ్రీనివాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఈ తరువాత శ్రీధర్ వెంబు ఇండియా వచ్చేసారు. ఇప్పుడు వీరిమధ్య ఆస్తుల పంపకం, నమ్మకద్రోహం అనే అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

    ప్రమీలా శ్రీనివాసన్ చేస్తున్న ఆరోపణలను శ్రీధర్ వెంబు ఖండించారు. నేను ఎప్పుడూ భార్య, బిడ్డకు (కుమారుడు) అన్యాయం చేయలేదు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి, కేవలం డబ్బు కోసం జరుగుతున్న డ్రామా అని అన్నారు. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.

    ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుని భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను అని.. మరోవైపు ప్రమీలా శ్రీనివాసన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒక కంపెనీ అధినేత జీవితం.. సంస్థ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!

  • 2025లో భారీగా పెరిగిన బంగారం ధరలు.. 2026లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది ప్రారంభమై 10 రోజులు కావొస్తుంది. ఈ సమయంలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 5400 పెరిగింది. దీంతో పసిడి ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి.

    జనవరి 1న హైదరాబాద్, విజయవాడలలో 1,35,060 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. నేటికి (జనవరి 10) రూ. 1,40,460 వద్దకు చేరింది. అంటే 10 రోజుల్లో గోల్డ్ రేటు 5,400 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,800 నుంచి రూ. 1,28,750 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.

    చెన్నైలో జనవరి మొదటి రోజు రూ. 1,36,140 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకు (జనవరి 10) 1,39,560 రూపాయల వద్దకు చేరింది. ఈ లెక్కన 10 రోజుల్లో రూ. 3420 పెరిగిందని స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,400 నుంచి రూ. 1,29,000 వద్దకు (రూ.4600 పెరిగింది) కదిలింది.

    ఢిల్లీలో 135210 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు పది రోజుల్లో రూ. 5400 పెరిగి.. 1,40,610 రూపాయలకు ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,950 నుంచి రూ. 1,28,900 వద్దకు (రూ.4950 పెరిగింది) కదిలింది.

    సిల్వర్ రేటు
    వెండి ధరల విషయానికి వస్తే.. జనవరి 1న కేజీ సిల్వర్ రేటు రూ. 2.56 లక్షల దగ్గర ఉంది. జనవరి 10 నాటికి రూ. 2.75 లక్షల వద్దకు చేరింది. అంటే కేజీ సిల్వర్ రేటు జనవరి ప్రారంభం నుంచి రూ.19,000 పెరిగిందన్నమాట. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?

  • జనవరి ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగానే.. టయోటా కంపెనీ తన ఇన్నోవా క్రిస్టా ధరలను సవరించింది. ధరల పెరుగుదల రూ.21,000 నుంచి రూ.33,000 మధ్య ఉంది.

    భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీలలో ఒకటైన టయోటా ఇన్నోవా క్రిస్టా లోయర్ స్పెక్ GX వేరియంట్ ధరలు రూ.33,000 వరకు పెరిగాయి. డీజిల్ పవర్డ్ లాడర్ ఫ్రేమ్ MPV మిడ్ స్పెక్ GX+ వేరియంట్‌ల ధరలు రూ.21,000 వరకు పెరిగాయి. మరోవైపు VX & ZX వేరియంట్‌లు ధరలు వరుసగా రూ. 25,000 & రూ. 26,000 వరకు పెరిగాయి.

    ధరల పెరుగుదల తరువాత.. టయోటా ఇన్నోవా క్రిస్టా బేస్ వేరియంట్‌లైన GX సెవెన్ & ఎనిమిది సీటర్ వేరియంట్‌ల ధర ఇప్పుడు రూ. 18.66 లక్షల నుంచి రూ. 18.99 లక్షలకు(ఎక్స్-షోరూమ్) చేరింది. GX+ సెవెన్ & ఎనిమిది సీటర్ మోడళ్ల ధర వరుసగా రూ. 20.47 లక్షలు & రూ. 20.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా వస్తుంది.

    ఏడు, ఎనిమిది సీట్ల VX మోడళ్ల ధరలు వరుసగా రూ. 23.95 లక్షలు & రూ. 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్-ఎండ్ ZX ఏడు సీట్ల మోడల్ ధర ఇప్పుడు రూ. 25.27 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 25.53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' గురించి అందరికి తెలుసు. చమురు, పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ మొదలైన వ్యాపారాలను నడుపుతున్న.. ఈ పారిశ్రామిక దిగ్గజం రోజుకు ఎంత సంపాదిస్తారనేది.. బహుశా చాలామందికి తెలుసుకుండక పోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    1957 ఏప్రిల్ 19న ధీరూభాయ్ & కోకిలాబెన్ అంబానీ దంపతులకు జన్మించిన ముఖేష్ అంబానీ.. ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాల దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈయన సుమారు 113 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 16వ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

    కొన్ని నివేదికలు ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రతిరోజూ దాదాపు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం ఆయన జీతం నుంచి రాదు. కంపెనీ లాభాలు, వాటా, పెట్టుబడి మొదలైన వాటి నుంచి వస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను బట్టి సంపదలో చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది.

    ముఖేష్ అంబానీ ఐదేళ్ల నుంచి కంపెనీలో జీతం తీసుకోలేదు. అయితే షేర్ నుంచి, వాటాల నుంచి మాత్రం ప్రతి సంవత్సరం గణనీయమైన లాభాలు వస్తున్నాయి. సంస్థ లాభాలు, షేర్ విలువ పెరిగినప్పుడు ఈయన సంపద మరింత పెరుగుతూ ఉంటుంది.

    ఇదీ చదవండి: H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!

  • ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఉచితంగా సిమ్ కార్డు అందించనున్నట్లు వెల్లడించింది.

    ''సెలబ్రేషన్స్ ముగిశాయి, కానీ ఆనందం మాత్రం అలాగే ఉంది!. కేవలం ఒక రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందండి. దీని ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు.. 30 రోజుల చెల్లుబాటుతో ఆనందించండి. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే. మీకు సమీపంలోని BSNL CSC లేదా రిటైలర్‌ని ఈరోజే సందర్శించండి!'' అని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

  • అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్).. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీజులు 2026 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నమోదైన ద్రవ్యోల్బణంను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది.

    ఈ కొత్త మార్పులు ముఖ్యంగా ఉద్యోగ ఆధారిత, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులకు వర్తిస్తాయి. అమెరికాలో పని చేస్తున్న లేదా చదువుతున్న భారతీయులపై ఇవి గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

    పెరిగిన ఫీజుల వివరాలు
    ➤ఫారమ్ I-129 (H-2B, R-1 వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.

    ➤ఫారమ్ I-129 (H-1B, L-1, O-1, P-1, TN వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.

    ➤ఫారమ్ I-140 (ఉపాధి ఆధారిత వర్గాలలోని విదేశీ కార్మికులు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.

    ➤ఫారమ్ I-539 (వలసేతర స్థితిని పొడిగించడానికి లేదా మార్చడానికి), F-1, F-2 విద్యార్థులు.. J-1, J-2 ఎక్స్ఛేంజ్ విజిటర్లు.. M-1, M-2 వృత్తిపర విద్యార్థులకు ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది.

    ➤ఫారమ్ I-765 (ఉద్యోగ అనుమతి - OPT, STEM-OPT) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.

    పెరిగిన ఫీజుల ఆధారంగా వచ్చిన ఆదాయాన్ని.. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల మెరుగుదలకు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయడానికి, పెండింగ్ కేసుల తగ్గింపుకు, మొత్తం USCIS సేవల నాణ్యత పెంపుకు వినియోగిస్తామని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది.

    భారతీయులపై ఎక్కువ ప్రభావం!
    H-1B, L-1 వీసాల్లో భారతీయులు అత్యధికంగా ఉంటారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ పెండింగ్‌లలో కూడా ఇండియన్స్ వాటా ఎక్కువ. OPT, STEM-OPTలను ఉపయోగించే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఉద్యోగ మార్పులు, వీసా పొడిగింపులు, ప్రయాణ ప్రణాళికల కోసం ప్రీమియం ప్రాసెసింగ్‌పై ఆధారపడేవారు ఎక్కువ. కాబట్టి ఫీజులు పెరిగితే.. ఈ ప్రభావం భారతీయుల మీద ఎక్కువగా ఉంటుంది.

    ఇదీ చదవండి: రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!

  • భారతదేశపు రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్, తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త, చవక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 390 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ సంస్థ, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో, సిమ్‌ను పూర్తిగా ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉంచే తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

    ఈ ప్లాన్ ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేని, కాలింగ్, ప్రాథమిక కనెక్టివిటీ అవసరమయ్యే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రులు, లేదా సెకండరీ/బ్యాకప్ సిమ్ ఉపయోగించే వారికి ఇది ఖర్చు తక్కువ పరిష్కారం. తక్కువ వ్యయంతో మీ మొబైల్ నంబర్‌ను ఏడాది పొడవునా యాక్టివ్‌గా ఉంచడమే ఈ రీఛార్జ్ ఉద్దేశం.

    ఎయిర్‌టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

    ఎయిర్‌టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రీఛార్జ్ చేసిన రోజు నుండి పూర్తి సంవత్సరం వరకు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఫోన్ వినియోగం ప్రధానంగా కాల్స్, చాటింగ్, పరిమిత ఇంటర్నెట్ అవసరాలకు మాత్రమే ఉంటే, ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

    డేటా, ఎస్ఎంఎస్‌ ప్రయోజనాలు

    ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా ఉండదు. బదులుగా, మొత్తం 30జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. దీన్ని 365 రోజుల కాలవ్యవధిలో అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ చాటింగ్, ముఖ్యమైన ఇంటర్నెట్అవసరాల కోసం ఈ డేటా సరిపోతుంది. అదనంగా 3,600 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇవి బ్యాంక్ అలర్టులు, OTPలు, ఇతర ముఖ్యమైన సందేశాల కోసం పూర్తిగా సరిపోతాయి.

    అదనపు బెనిఫిట్

    ఈ రీఛార్జ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ఒక ప్రత్యేక అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులకు 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ (Perplexity Pro AI) సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని విలువ సుమారు రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఈ ఏఐ టూల్ అధునాతన సెర్చ్‌, ఉత్పాదకత పనుల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఈ రీఛార్జ్ ప్లాన్ విలువ మరింత పెరుగుతుంది.

Family

  • ఆదివారం రాగానే.. నాన్‌ వెజ్‌ కోసం ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వంక ఒక చూపు చూసి.. కావాల్సిన క్వాంటిటీని ఆర్డర్‌ చేస్తుంటారు. ఇందులో చికెన్‌లో స్కిన్‌ కోడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు లేకపోలేదు. తోలుతో కూడిన కోడిని.. అందునా కరెంట్‌.. గ్యాస్‌ స్టౌలపై కాల్పించుకుని మరీ ముక్కలు కొట్టిస్తుంటారు. అయితే ఏరికోరి పట్టుకెళ్లే ఇలాంటి చికెన్‌ నిజంగానే ఒంటికి మంచిదేనా?..

    స్కిన్‌ చికెన్‌ తినడం మంచిదా? కాదా? అని చాలామందికి అనుమానాలు, అనేక అపోహలు ఉన్నాయి. రుచి కోసం తహతహలాడే వాళ్లు కొందరైతే.. తింటే ఏదైనా జరగొచ్చని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు మరికొందరు. అయితే కోడి చర్మం చెడ్డదేం కాదు. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదు. ఈ విషయంలో నిపుణులు చెబుతోంది కూడా ఇదే..

    చికెన్‌ స్కిన్‌లో ఎక్కువగా (unsaturated fatty acids-UFAs) ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. పైగా  ఇవి ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఏక అసంతృప్త కొవ్వులు(monounsaturated fats) లాంటివే. కాబట్టి గుండెకు చాలా మంచిది. అలాగే.. కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కొంత కాలజెన్ కూడా ఉంటుంది. ఇవి చర్మం, కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి.  ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది  ఉత్త రుచి కోసమే స్కిన్‌ కోడి వైపు మొగ్గు చూపుతుంటారు.

    అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, కొవ్వు కలిగిన భాగం కూడా. ఒక ఔన్స్‌ చికెన్‌ స్కిన్‌లో సుమారు 90–128 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తిన్నా.. హృదయ సంబంధ సమస్యలు, బరువు పెరగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్కిన్‌ చికెన్‌ మితంగా.. వారానికి ఒకసారి లేదంటే నెలలో నాలుగైదుసార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. అప్పుడే గుండెకు..ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

    కాల్చే పద్ధతులపైనా..
    కాల్చిన కోడికి ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అందునా కట్టెల పొయ్యి అయితే బాగుంటుందని ఫీలవుతుంటారు. కానీ.. టౌన్లు, సిటీల్లో గ్యాస్‌ పొయ్యిలు, ఎలక్ట్రిక్‌ స్టౌలే కనిపిస్తుంటాయి. అయితే..

    రుచి బాగుంటుందని కట్టెల పొయ్యి ప్రిపర్‌ చేసేవాళ్లకు అలర్ట్‌. అలాంటి పొగలో హానికారక రసాయనాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కట్టెల పొయ్యి నుంచి వెలువడే పాలీసైక్లిక్‌ ఆరోమెటిక్‌ హైడ్రోకార్బన్స్‌(PAHs), హెటిరోసైక్లిక్‌ అమెన్స్‌ (HCAs) వంటి రసాయనాలు క్యాన్సర్‌కు దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. కాబట్టి.. గాలి సరైన విధంగా బయటకు వెళ్లే రీతిలో ఉన్న గ్యాస్ స్టౌ, అసలు పొగ వెలువడని ఎలక్ట్రిక్ స్టౌలతోనే మంచిదని గుర్తించాలి.

    స్కిన్‌లెస్‌లో బ్రెస్టే బెస్ట్‌
    స్కిన్‌ లెస్‌ చికెన్‌లో బ్రెస్ట్‌ పీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లెగ్‌ పీస్‌లతో పోలిస్తే.. పై భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెకు మంచిది. సంతృప్త కొవ్వు(Saturated fat) తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతుకు సాయపడే అధిక ప్రొటీన్ లభిస్తుంది‌. అలాగే స్కిన్ లేకుండా వాడితే కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వీటికి తోడు.. బ్రెస్ట్‌ పీస్‌లోని లీన్‌ మీట్(తక్కువ కొవ్వు (fat) కలిగిన మాంసం).. సులభంగా జీర్ణం అవుతుంది.

    సరిగ్గా ఉడకకపోయినా..
    స్కిన్‌ లేదంటే స్కిన్‌లెస్..ఏదైనా సరే‌ చికెన్‌ తినడం శరీరానికి లాభాలు ఉన్నాయి. చికెన్‌లో అదనంగా విటమిన్లు B6, B12, నియాసిన్‌, సెలనియం, పాస్పరస్‌.. పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంతో పాటు రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపు కోసం అవసరంపడేవే.  అయితే వండే విధానం, తీసుకునే పరిమాణం ఆధారంగానే ఫలితం డిసైడ్‌ అవుతుంది. తాజా చికెన్‌కే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్‌ను ఉడికించడం, గ్రిల్‌, బేక్‌ చేయడం మంచిది. సరైన వేడిలో.. సరిగ్గా ఉడకకపోతే బాక్టీరియాల వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే డీప్‌ఫ్రైలు, స్కిన్‌ చికెన్‌ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు తప్పవు.  

International

  • గత ఏడాది(2025)లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ట్రంప్‌కు ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనం రేపింది.

    మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్‌కు ఇచ్చేస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని పంచుకోవడం, రద్దు చేయడం, బదిలీ చేయడం సాధ్యం కాదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్‌ ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం శాశ్వతంగా ఉంటుందంటూ కమిటీ పేర్కొంది. కాగా, నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కిందంటూ వ్యాఖ్యానించారు.

    వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్‌ గురించి శనివారం ట్రంప్‌ మరోసారి ప్రస్తావిస్తూ.. మాచాడో తన నోబెల్ బహుమతిని ఇవ్వాలనే ఆఫర్‌పై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో పట్టుబడి అమెరికాకు తరలించబడిన తర్వాత, అమెరికావెనిజులా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆమె రావాలని అనుకోవడం మంచిదేనంటూ ట్రంప్‌ చెప్పుకొచ్చారు. నా దృష్టి అంతా ప్రజల ప్రాణాలు కాపాడటం పైనే ఉందన్న ట్రంప్‌ యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మందిని రక్షించానంటూ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు.

     

     

     

     

     

     

     

  • వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. 

    వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్‌లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్‌తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.

    నెలల తరబడి నిఘా!
    అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. 

    నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్‌ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.

    అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..
    సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్‌ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్‌లో భాగంగా.. కారకస్‌లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది.  సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్‌కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్‌ చేశారు. 

    రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్‌లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్‌గ్రిడ్ (గురి డ్యామ్ నెట్‌వర్క్)ను అమెరికా టార్గెట్‌గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.

    సైబర్‌ ఎటాక్‌ ఎలా చేశారంటే.. 
    అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్‌వేర్‌ను చొప్పించారు. ఈ మాల్‌వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్‌కు అమెరికా తన సొంత మాల్‌వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్‌వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.

    అత్యంత చాకచక్యంగా..
    నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్‌కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్‌ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!

    కలిసొచ్చిన సూటర్
    సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్‌కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్‌వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.

    భారత్ ఎంత వరకు సురక్షితం?
    వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్‌ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్‌ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ విషయంలోనూ ట్రంప్‌ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్‌పై జరిగితే ఎలా ఉంటుంది?.. 

    ఐదేళ్ల క్రితం చైనా మాల్‌వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్‌ వేర్, సాఫ్ట్ వేర్‌ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్‌వేర్‌ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్‌లలో మాల్‌వేర్‌పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

    ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్‌ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    :: హెచ్.కమలాపతిరావు

  • బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవలే ఇస్లాం వ్యతిరేఖ ఆరోపణలతో పలువురు హిందు మతానికి చెందిన వ్యక్తులుపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా సునాంఘంజ్ అనే జిల్లాలో  జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై దాడి చేసి అనంతరం విషం ఇచ్చి చంపినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

    బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతుంది ఇటీవల  అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్‌ హాదీ మృతితో హిందువులపై తిరిగి మెుదలైన దాడులు ఏమాత్రం శాంతించడం లేదు. గడిచిన 40 రోజుల్లోనే 12 మంది హిందువులు హత్యకు గురయ్యారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులకు స్పష్టమైన కారణం ఏమి లేకపోయినప్పటికే.. అక్కడి మత ఛాందసవాదులు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నారనేది కాదనలేని సత్యం

    ఈ నేఫథ్యంలో హత్యలను భారత్ పలుమార్లు ఖండించింది మైనార్టీలపై దాడులు అరికట్టాలని కోరింది. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయి సంతాపం ప్రకటించారు.పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి మతఛాందస వాదులు విద్వేశాన్ని చిమ్మడం ఆపడం లేదు. 

    తాజాగా సునాంఘంజ్ జిల్లాలో జోయ్ మాహాపాత్ర అనే హిందూ యువకునిపై  అక్కడి అల్లరిమూకలు దాడి చేశాయి. అతనిని తీవ్రంగా కొట్టి అనంతరం విషం ఇచ్చాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాపాత్రను ఉస్మానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 2026 ప్రారంభమై పదిరోజుల కూడా కాకముందే బంగ్లాదేశ్‌లో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు. 

    నూతన సంవత్సర వేడుకల వేళ షరియత్ పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిపై దాడిచేసి చంపారు. జనవరి 5న హిందూ వార్త సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చిచంపారు. అనంతరం నర్సింగి జిల్లాలో వ్యాపారి మణి చక్రవర్తి ప్రాణాలు తీశారు. తాజాగా మహాపాత్ర అనే యువకుడిని విషం ఇచ్చి చంపారు. బంగ్లాదేశ్‌లో ఇంత పెద్దఎత్తున హిందువులపై దాడులు జరగడం భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

  • ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. వెనెజువెలాపై సైనిక చర్యను చేపట్టిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్బంధించి తమ దేశానికి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఘటనను పలు దేశాలు ఖండించగా.. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వెనెజువెలా మంచి కోసం కూడా చేశామంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ తన చర్యను సమర్థించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విషయంలోనూ ఇలా చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.    

    ఉక్రెయిన్‌ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి ప్రణాళిక ఒప్పందం కోసం ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తు‍న్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ మీద మండిపడ్డ అగ్రరాజ్యం అధ్యక్షుడు.. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ మీద సాఫ్ట్‌ టోన్‌ ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి మారింది. పైగా వెనెజువెలా చమురు విషయంలో రష్యాకు సంబంధించిన షాడో ఫ్లీట్‌ సీజ్‌ నేపథ్యంలో.. అమెరికా-రష్యాల మధ్య వార్నింగ్‌ ఇచ్చుకునే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. ఈ తరుణంలో.. 

    వెనెజువెలా రాజధాని కారకస్‌పై జనవరి 3వ తేదీన అమెరికా వైమానిక దళాలతో మెరుపు దాడులు చేసి మదురోను బంధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ నేరాల అభియోగాలతో ఆయన్ని అమెరికా ఫెడరల్‌ కోర్టులు విచారణ చేస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొలంబియా అధ్యక్షుడా?, ఇరాన్‌ సుప్రీం లీడరా?అమెరికా అధ్యక్షుడి నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరై ఉంటారా? అనే చర్చా జోరందుకుంది. అమెరికా చమురు–గ్యాస్ కంపెనీల అధిపతులతో సమావేశంలో.. పుతిన్‌ను అలా బంధిస్తారా? అని మీడియా వేసిన ప్రశ్నకుగానూ ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. పుతిన్‌ను పట్టుకోవడం అవసరం లేదు, కానీ నేను ఆయన విషయంలో చాలా నిరాశలో ఉన్నాను అని అన్నారు. ఇప్పటిదాకా తాను ఎనిమిది యుద్ధాలను ముగించానని, కానీ ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మాత్రం త్వరగా ఆపలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు... ఇదే అంశంపై పరోక్షంగా జెలెన్‌స్కీ కూడా స్పందించారు. 

    మదురో అరెస్టు తర్వాత పుతిన్‌పై కూడా అమెరికా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక నియంతను(పుతిన్‌ను ఉద్దేశిస్తూ..) ఇలా ఎదుర్కోవాలంటే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.

    ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అయితే యుద్ధ నేరాల ఆరోపణలతో  ది హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.  అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా పుతిన్‌కంటూ ఓ పేరుంది. అలాంటిది ఆయన్ని అంత తేలికగా నిర్బంధించడం అమెరికాకు కలలో కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది. 

  • టెహ్రాన్‌: ఇరాన్‌లో నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం​ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

    ఇరాన్‌లో సుప్రీం లీడర్‌ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.

    మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్‌ బంద్‌ చేయడం, అంతర్జాతీయ కాల్స్‌ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

    అయితే, ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ‍ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.

    ఇక, డిక్టేటర్‌ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్‌ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్‌ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్‌ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్‌  ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్‌ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్‌ ఈస్ట్‌ పారిస్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.