Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

International

  • ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భారత విద్యార్థులు గాయపడ్డారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, వీరిలో ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడి కాలేదు.  

    కాగా, డిసెంబర్‌ 14న (ఆదివార​ం) సిడ్నీలోని బోండీ బీచ్‌కు సమీపంలో గల ఓ చిన్న పార్కులో యూదులు "హనుక్కా బైదసీ" అనే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు సాయుధులు వేడుకల్లో మునిగిపోయిన యూదులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. 

    ఈ దుర్ఘటనలో 10 ఏళ్ల బాలుడు సహా 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.  

    కాల్పులు జరిపిన ఆగంతకుల్లో ఒకరిని నవీద్‌ అక్రమ్‌గా గుర్తించగా.. మరో ఆగంతకుడు నవీద్‌ తండ్రి, 50 ఏళ్ల పండ్ల వ్యాపారి సాజిద్‌ అక్రమ్‌ అని న్యూ సౌత్‌వేల్స్‌ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు పాకిస్తాన్‌ జాతీయులు. నవీద్‌కు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 
     

  • ప్రధాని మోదీ జోర్దాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం ఇథియోపియా చేరుకున్నారు. ఆ దేశ ‍ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మూడుదేశాల పర్యటన నిమిత్తం సోమవారం జోర్దాన్ బయిలుదేరారు.

    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా చేరుకున్నారు. ఆదేశ ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన అనంతరం ఇరు దేశాధినేతలు కాఫీ తాగారు. అనంతరం ఇథియోఫియా ప్రధాని అబియ్ అహ్మద్ మోదీ కారును స్వయంగా నడిపి నేషనల్‌ ప్యాలెస్‌కి వెళ్లారు. మార్గ మధ్యలో సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్‌షిప్‌ పార్క్ మోదీకి చూపించారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశంలోని భారతీయులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి పుష్పాలు అందించారు. మోదీ రాక సందర్భంగా ఓ చిన్నారి భారత సాంస్కృతిక నృత్యంతో  స్వాగతం పలికింది. 

    మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇథియోపియా వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ  జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన నిమిత్తం సోమవారం బయిలుదేరారు. జోర్దాన్ పర్యటన ముగించుకొని అనంతరం ఇథియోపియా చేరుకున్నారు.
     

  • చైనా.. మనకు పొరగునున్న దేశం. ఈ దేశం తీరు ఎవ్వరికీ అర్థం కాదు. ఒకవైపు మిత్రత్వం చేస్తూనే తమ సరిహద్దుల్లో ఉన్న భూభాగాల్ని తమదే అంటుంది.  ఆ విషయం ఇటీవల రష్యా భూభాగాన్ని తన మ్యాప్‌లో చూపించడంతో చైనా వైఖరి మరోసారి బయటపడింది. అంతకుముందు భారత్‌ భూభాగాల్ని అనేకసార్ల తన మ్యాప్‌ల్లో చూపించింది చైనా.

    సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నా..
    చైనాతో ప్రస్తుతం భారత్‌ సత్సంబంధాలు దిశగా పయనిస్తున్నప్పటికీ,  అవకాశం వస్తే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనుకాడదు అనేది గతంలో చాలాసార్లు నిరూపణ అయ్యింది. గాల్వాన్‌ ఎపిసోడ్‌లో ఎంతటి రాద్దాంతం జరిగిందో అందరికి తెలిసిందే.  2020, జూన్‌ 15వ తేదీన భారత–చైనా గాల్వాన్‌ జరిగిన ఘటన హింసాత్మకమనే చెప్పాలి.

    ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా, అనేకమంది చైనా సైనికులు కూడా మరణించారు. ఇది 45 సంవత్సరాల తర్వాత లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (LAC) వద్ద జరిగిన అత్యంత హింసాత్మక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యంతో  చైనా దూకుడు తగ్గించింది. అదే సమయంలో భారత్‌తో స్నేహ సంబంధాలకోసం చేతులు చాచింది.  ఆ క్రమంలోనే ఇటీవల ఇరదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి.  ఐదేళ్ల తర్వాత భారత విమానాలు.. చైనా గగనతలంలోకి వెళుతున్నాయి.

    చైనా మారిందా.. నటిస్తుందా..?
    కానీ తన వైఖరిని పూర్తిగా మార్చుకుందా అనేది ప్రశ్నార్థకమే.  ఎప్పుడు ఏదో వివాదంతో అగ్నికి ఆజ్యం పోయాలనే చూస్తూ,  అవకాశం కోసం ఎదురుచూస్తూ తన పొరుగు దేశాలను ఏదో రకంగా గిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే జరిగింది. రష్యాతో స్నేహం నటిస్తూనే  ఆ దేశ భూభాగాన్ని చైనా తన మ్యాప్‌లో చూపించింది. దీన్ని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రత్యర్థి దేశం ఏమాత్రం బలహీనంగా ఉన్నా వారిపైకి మెల్లగా తన అస్త్రాలను వదులుతుంది. రష్యా విషయంలో కూడా అదే జరిగింది.  

    ప్రస్తుతం రష్యా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్‌తో సుదీర్గకాలంగా చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా సైతం ఆర్థికంగా గాడిన పడటానికి అపసోపాలు పడుతోంది.  ఇటువంటి తరుణంలో రష్యా భూభాగాన్ని తన మ్యాప్‌లో చూపించే యత్నం చేసింది డ్రాగన​ కంట్రీ.  ఒక రాయి వేసి చూద్దాం అసలు ఏం జరుగుతుందా అనే వైఖరిని బాగా వంట బట్టించుకున్న చైనా.. అవకాశం వచ్చినప్పుడు ఈ జిత్తులు మారిన చేష్టలు చేస్తూనే ఉంటుంది.

    అమెరికాతో తీవ్రపోటీ..
    అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు  ఆశాజనకంగా లేవనే సంగతిని పక్కన పెడితే. ఆ దేశంతో ఇటీవల కాలంలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది చైనా.  పూర్తిగా ఇరు దేశాల మధ్య శత్వుత్వం లేకపోయినా తీవ్ర పోటీ ఉంది. ఆ క్రమంలోనే వారి మధ్య టారిఫ్‌ వార్‌ గట్టిగానే జరిగింది. ఇది కేవలం టారిఫ్‌ వార్‌గా అభివర్ణించినా, విషయం మాత్రం సీరియస్‌గానే ఉండటంతో మిత్రత్వం కోసం భారత్‌తో మిత్రత్వం కోసం పాకులాడింది.

    అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి అనే భావన చైనాలో ఉండటమే కాదు.. అత్యంత నమ్మదగిన దేశాలలో భారత్‌ ఒకటి అనే విషయాన్ని కూడా చైనా బాగానే గ్రహించింది. దాంతోనే భారత్‌తో స్నేహం కోసం నిరీక్షించి మరీ ఆ దిశగా సక్సెస్‌ అయ్యింది.  ఆ క్రమంలోనే ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గాడిలో పడ్డాయి.

    అరుణాచల్‌ ప్రదేశ్‌ మాదేనంటూ..
    ఇటీవల చోటు చేసుకున్న ఘటనను చూసుకుంటే.. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను చైనా ఎయిర్‌పోర్ట్‌లో ముప్పుతిప్పలు పెట్టారు చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.  తన పాస్‌పోర్ట్‌ను పరిశీలించే క్రమంలో అరుణాచల్‌ ప్రదేశే్‌-భారత్‌ అని ఉందేంటని ఆ అధికారులు ఆ మహిళను వేధింపులకు గురి చేశారు. యూకేలో ఉంటున్నభారత​ సంతతికి చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తీవ్ర ఇబ్బందులు పెట్టారు.  ఆమె పాస్‌పోర్ట్‌పై అరుణాచల్‌ప్రదేశ్‌-భారతదేశం అని ఉండటంతో చైనా అధికారుల కోపం కట్టలు తెంచుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అనేది చైనాలో బాగమని ఆమెతో వాదించారు.  ఆ పాస్‌పోర్ట్‌ చెల్లదు అంటూ తీవ్ర అసహనానికి గురిచేశారామెను.

    పెమా వాంఘజామ్‌ థోంగ్‌డాక్‌ అనే లండన్‌ నుంచి జపాన్‌కు వెళ్తున్న సమయంలో ఇది చోటు చేసుకుంది. మధ్యంతర విరామంలో భాగంగా చైనాలోని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మూడు గంటలు పాటు వేచి ఉన్న ఆమెకు.. చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ అక్కడ భారత ఎంబాసీ అధికారులు జోక్యం చేసుకోవడంతో చివరకు ఆ మహిళ ఎలాగోలా బయటపడింది.  మరి ఈ విషయం ప్రపంచానికి తెలిసినప్పుడు చైనా ప్రభుత్వానికి తెలియదా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి ఏమైనా మాట్లాడిందా అంటే అదీ లేదు.  ఇది చిన్న విషయంగా కనిపించినా, ఇటువంటి వాటిని ఆదిలోనే తుంచేయాలి. అలాగే డ్రాగన్‌ కంట్రీపై సీరియస్‌గా భారత్‌ దృష్టిసారించి ఉండాల్సిందే.

    ఇదీ చదవండి: 

    రష్యా భూభాగంపై జిత్తులమారి చైనా కన్ను!

  • బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్‌ హసంత్ అబ్దుల్లా భారత్‌పై కారు కూతలు కూశారు. భారత్‌ను చీల్చే ప్రయత్నాలు చేసే వ్యక్తులకు, సంస్థలకు తమ దేశం ఆశ్రయం ఇస్తుందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఆశ్రయంతో  భారత్‌లోని ఈశాన్యప్రాంతం ప్రాంతం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని తీవ్రంగా మాట్లాడారు. కాగా ఆ వ్యాఖ్యలను అస్సాం ముఖ్యమంత్రి  హిమంత బిశ్వ శర్మ ఖండించారు.

    బంగ్లాదేశ్ ఎన్సీపీ లీడర్ అబ్దుల్లా భారత్‌ను బెదిరిస్తూ పిచ్చిగా మాట్లాడారు.  అబ్దుల్లా మాట్లాడుతూ "నేను ఒక విషయం భారత్‌కు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తాం. దానివల్ల భారత్‌ నుంచి ఈశాన్య ప్రాంతం వేరయ్యే అవకాశముంది". అని హెచ్చరించారు. బంగ్లాదేశ్ సౌర్వభౌమాధికారాన్ని, మానవహక్కులని గౌరవించని వారికి భారత్ ఆశ్రయం కల్పిస్తే బంగ్లాదేశ్ సమాధానమిస్తుందని తెలిపారు. 

    అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. "ఈ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవి, గతేడాది నుంచి తరచుగా ఈశాన్య రాష్ట్రాలని భారత్‌ నుంచి విడగొడతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్‌ ఈ విషయంలో మౌనంగా ఉండకూడదు" అని హిమంత అన్నారు. భారత్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్. త్రిపుర రాష్ట్రాలను కలిపి సెవెన్‌సిస్టర్స్ అని అంటారు.

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటుంది. గతేడాది ఆ దేశంలో జరిగిన ఘర్షణల తర్వాత హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందింది. అయితే కొద్దిరోజుల క్రితం హసీనాకు  బంగ్లాదేశ్‌లోని కోర్టులు 21 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మరణశిక్ష విధించాయి. దీంతో షేక్ హసీనాను బంగ్లాకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది. అయితే దీనిపై భారత్ ఇంకా ఎటువంటి అధికారిక నిర్ణయం వెల్లడించలేదు.

  • అమెరికాలో  గ్రీన్‌ కార్డ్‌ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60  ఏళ్ల  మహిళకు  భారీ ఎదురు దెబ్బ తగిలింది.  అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్‌లో అరెస్ట్‌  చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

    గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు  తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని  ఆమె కుమార్తె జోతి  మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్‌లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.  డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం  డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి  చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్‌ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్‌కు తన న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే,  రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ తన  కథనంలో వివరించింది.


    ఎవరీ బబ్లీ కౌర్ 
    కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత,  మొదట లగున బీచ్‌లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్‌కు వెళ్లారు.  తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి  మారారు. కౌర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ  అమెరికా పౌరులుగా  ఉన్నారు.

    రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్‌లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్‌లెట్‌ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి  ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది  ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్‌లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్‌లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.

    బబ్లీ కౌర్‌ను విడుదల చేయాలని పిలుపు
    లాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్‌ను బాండ్‌పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు  ఆయన సిబ్బంది తెలిపారు.

  • అమ్మాన్‌: ప్రధాని నరేంద్ర మోదీ.. కింగ్ అబ్దుల్లా- II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు, మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా- II ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్‌ కలర్‌ బీఎండబ్ల్యూ కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్‌లోని జోర్డాన్ మ్యూజియంనకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను  చాటి చెప్పింది.

    అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్‌లో ఉన్న జోర్డాన్ మ్యూజియం  పురావస్తు, చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇక్కడ 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు ఉన్నాయి. అత్యంత పురాతన విగ్రహాలలో ఒకటైన తొమ్మిదివేల ఏళ్లనాటి  ఐన్ ఘజల్ సున్నపు ప్లాస్టర్ విగ్రహాలు  ఉన్నాయి.ఈ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు.
     

    ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. ఈ సందర్భంగా భారతదేశం, జోర్డాన్‌లు పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి ఇండియా-జోర్డాన్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రసంగించారు. ఇరు దేశాలు వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి సంబంధాలను పెంచగల రంగాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా,  ఒమన్) పర్యటనలో జోర్డాన్ మొదటి మజిలీ.

    ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..

  • గుడికెళ్లినా, ఆసుపత్రికెళ్లినా అవే దృశ్యాలు మనల్ని వెక్కిరిస్తుంటాయి. ఆఖరికి రోడ్డుమీద నడిచివెడుతున్నా కూడా చిక్కాకు పుట్టించే పరిస్థితి. ఏ మూల నుంచి ఎవడు పుసుక్కున  ఉమ్ముతాడో తెలియదు. ఏ సిగ్నల్‌ దగ్గర ఆగినా ఇవే దృశ్యాలు.. కొండొకచో  పోలీస్‌  స్టేషన్ల దగ్గర్ల కూడా ఇదే పరిస్థితి. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. పాన్ పరాగ్, గుట్కా, ఖైనీ తిని అసహ్యంగా ఉమ్ముతూ పరిసర ప్రాంతాలను, రోడ్లను  అత్యంత  చెత్తగా  తయారు చేస్తున్న వైనం గురించే. వీటిని ఇబ్బడి ముబ్బడిగా సేవిస్తున్న వారి సంఖ్య రోజూ రోజుకు పెరుగుతోంది. ఇవి  తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు మితిమీరితే  వివిధ రకాల కేన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడటం ఖాయం. దీనికి  సంబంధించిన అనేక హెచ్చరికలు చేస్తున్నా.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వీటిని వాడేవారి నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏ సినిమా హాలుకెళ్లినా  దీనికి సంబంధించిన యాడ్‌ ప్లే అవుతుంది.  అయినా ఉత్తరభారతంలోని అనేక నగరాలతో పాటు, హైదరాబాద్‌ నగరంలో గుట్కా తిని ఉమ్మేసేవాళ్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలిస్తే షాకవ్వక మానరు. 

    తాజాగా ఇంగ్లాండ్ లోని లింకన్ షైర్ లో  జరిగిన ఘటన గురించి తెలుసుకుంటే.. మన దేశంలో  చట్టాల అమలు తీరుపై ఆశ్చర్యం కలగమానదు. లింకన్ షైర్ కు చెందిన, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న రాయ్ మార్ష్ (86) వైద్యుడి సలహా మేరకు వాకింగ్‌కు వెళ్లాడు. పార్క్‌లో నడుస్తుండగా ఎండిన ఆకు ఒకటి గాలికి ఎగిరొచ్చి వృద్ధుడి నోట్లో పడింది. చాలా యధాలాపంగా వెంటనే ఆయన  దాని ఉమ్మేశారు. అదే ఆయనకు భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు  షైర్‌కు ఏకంగా రూ.30 వేల ( 250 పౌండ్ల ) జరిమానా విధించారు.

    చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడం నేరమని, జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. మార్ష్ వివరణ ఇచ్చినా ససేమిరా అన్నారు.  ఉద్దేశపూర్వకంగాఅలా చేయలేదని పొరబాటు జరిగిందని, అంతమొత్తం కట్టలేనని  లబోదిబో మనడంతో కనికరించిన అధికారులు  జరిమానాను 150 పౌండ్ల (సుమారు రూ.18 వేలు) తగ్గించారు. ఈ విషయాన్ని మార్ష్ కుమార్తె సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.అధికారుల తీరుపై  నెటిజన్లు విమర్శలు  గుప్పించారు. 

    అయినప్పటికీ ఇలాంటి కఠినచట్టాలు, అమలు మన దేశంలో అమలైతే  ఎంతమంది ఎన్ని వేల రూపాయలు  జరిమానా కట్టాల్సి ఉంటుందో ఒక్కసారి ఆలోచించింది.  చట్టాలు, అమలు కంటే సమాజ హితంకోసం  ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం.  లేదంటే ఇంగ్లాండ్‌లొ వృద్ధుడికి ఎదురైన పరిస్థితే మనకు వస్తే? ఆలోచించండి.

    కాగా భారతదేశంలో పొగాకు ఉత్పత్తులపై కఠిన నియమ నిబంధలు, కొన్ని రాష్ట్రాల్లో వీటి విక్రయాలపై షేధం ఉన్నప్పటికీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు పొగాకు, సున్నం, వక్క, తామలపాకు, మసాలా దినుసులు, చక్కెరతోపాటు సుగంధ రసాయనాలతో గుట్కాలు, ఖైనీలు తయారవుతాయి. వాణిజ్య ఉత్పత్తులైన రజనీగందా, పాన్‌పరాగ్‌లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి సోడియం బెంజోయేట్  లాంటివాటినీ ఉపయోగిస్తారు. ఇవి రుచి, మత్తును కలిగిస్తాయి. అంతిమంగా  వారిని మరణం అంచుకునెట్టేస్తాయి. మోటారు ఫీల్డ్‌లో ఉన్నవారు ప్రధానంగా వీటికి బానిసలవుతున్నారు. ప్యాన్‌లు  సహా  దీర్ఘకాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలోదాదాపు 20-25శాతం జనాభా తినే పొగాకు ఉత్పత్తులకు బానిసలేనని అంచనా. నికోటిన్‌తోపాటు ఆరెకోలిన్ వంటి రసాయనాలు ఈ ఉత్పత్తులను అత్యంత వ్యసనకరంగా మారుస్తాయి.  ఎక్కడ బడితే అక్కడ ఉమ్మకుండా కఠిన  చర్యలు తీసుకోవాలి.  వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ ఉత్పత్తుల గురించి అవగాహన  కలిగి ఉండటం ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం.  ఏమంటారు?

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి (డిసెంబర్‌ 18) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నారు. ఈ భేటీలో వైఎస్‌ జగన్‌ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉంటారు.  

    దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను వైఎస్‌ జగన్‌ జెండా ఊపి లోక్‌ భవన్‌కు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు పాల్గొంటారు.

    ఈ కార్యక్రమం తర్వాత వీరితో వైఎస్‌ జగన్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్‌ నివాసం లోక్‌ భవన్‌కు బయల్దేరి వెళ్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కోటి మందికిపైగా చేసిన సంతకాల పత్రాలతో నిండిన వాహనాలు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి.

  • తాడేపల్లి:  పితృ వియోగం కల్గిన టీవీ-9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్‌, ఎన్టీవీ సీనియర్‌ జర్నలిస్టు సురేష్‌లను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరిమర్శించారు. 

    రజనీకాంత్‌ తండ్రి వెల్లల చెరువు సాంబశివరావు మృతిపై, ఎన్టీవీ సీనియర్‌ జర్నలిస్టు సురేష్‌ తండ్రి వెంకటామిరెడ్డి మృతిపట్ల  వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. వీరికి ఫోన్‌ చేసిన వైఎస్‌ జగన్‌.. ఇలాంటి కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

  • జగనన్న అంటే ప్రజల గళం.. జగనన్న అంటే ప్రజల బలం.. జగనన్న అంటే ప్రతి ఇంటి వెలుగు.. జగనన్న అంటే ప్రతి మనసు నమ్మకం.. జగనన్న అంటే ప్రజల ఆశ.. జగనన్న అంటే ప్రజల విజయం.. జగనన్న అంటే మన అందరి భవిష్యత్తు.. ఓవరాల్‌గా చెప్పాలంటే జగనన్న అంటే ప్రజల ధైర్యం.

    విజయవాడ జోజినగర్‌ ఇళ్ల కూల్చివేత బాధితులు సైతం ఇదే ఆనందాన్ని వ్యక్తం చేశారు.  తమ వద్దకు జగనన్న రావడంతో ధైర్యమొచ్చిందన్నారు. వైఎస్‌ జగన్‌ మాట ఇస్తే చేస్తారనే నమ్మకం ఆయన కల్పించారని  ఆ బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందనే బాధను దిగమింగుతూనే జగనన్న రాక ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. 

    ఇచ్చిన మాట ప్రకారమే జగనన్న తమ వద్దకు వచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.  విజయవాడ జోజినగర్‌  ఇళ్ల కూల్చివేత బాధితుల్ని నేడు(మంగళవారం, డిసెంబర్‌ 16వ తేదీ) వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో 42 మందిని అన్యాయంగా రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. 

    విజయవాడ జోజినగర్ బాధితులకు అండగా YS జగన్‌మోహన్‌రెడ్డి

     కాగా, విజయవాడలోని జోజినగర్‌లో 42 ప్లాట్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహా­యం అందిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కూల్చివేతకు గురైన 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు గురువారం(డిసెంబర్‌ 11వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టార్జితాన్ని నేలపాలు చేశారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

    పక్కా  రిజిస్ట్రేషన్‌  డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి, బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 25 ఏళ్ల క్రితం భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్‌  రిజిస్ట్రేషన్‌ , ఇంటి పన్ను, కరెంట్‌ బిల్లుల రశీదులను చూపించారు. డిసెంబర్‌ 31 వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్‌ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్‌ 3వ తేదీ వేకువజామున వందల సంఖ్యలో పోలీసులొచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.

    అధికార టీడీపీ, జనసేన నాయకులను కలిసినా తమ గోడు వినిపించుకోలేదని, ఇళ్లు కూల్చివేస్తే ఎంపీ, ఎమ్మెల్యే కనీసం పరామర్శకు కూడా రాలేదని కన్నీరుమున్నీరయ్యారు. మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని, న్యాయ సహాయం అందిస్తుందని ధైర్యంచెప్పారు.  ఇచ్చిన మాట ప్రకారం వారిని ఈరోజు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారిలో ధైర్యం నింపారు. 

    ఇవీ చదవండి:

    బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేశారు: వైఎస్‌ జగన్‌

    జోజిగనర్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘పొర్లు దండాలు పెడుతున్నా.. రోడ్లు వేయండి. డ్రైనేజీలు కట్టండి. వెనుకబడిన కిసాన్‌నగర్‌ను అభివృద్ధి చేయండి’అంటూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్‌ వినూత్న తరహాలో నిరసన తెలిపాడు. సోమవారం కరీంనగర్‌ 3వ డివిజన్‌ కిసాన్‌నగర్‌లోని బీడీ కంపెనీ నుంచి మీ సేవ వరకు బురద రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ సమస్యలు పరిష్కరించాలన్నాడు. 

    ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కిసాన్‌నగర్‌ అభివృద్ధి విషయంలో గత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించాడు. జిల్లా అధికారులకు, నగరపాలక సంస్థ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతిపత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నా డు. పాతికేళ్ల నుంచి ఇక్కడ రోడ్డు వేయలేదని, డ్రైనేజీ నిర్మించలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. బీజేపీ నాయకులు మెంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్, గాలి సురేశ్, కల్యాణ్, సుమన్, చాడ ఆనంద్, మేకల సాయి పాల్గొన్నారు.  

  • గుంటూరు: మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని టాయిలెట్‌కు వెళ్లేందుకు బాత్రూం డోర్‌ కొట్టిందని మోకాళ్లపై కూర్చోబెట్టిన సంఘటనపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత నెల 17న జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు దిక్కు లేకుండా పోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా పేర్కొంటూ క్లోజ్‌ చేయడంతో తిరిగి విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. 

    గుంటూరు నగరం పట్టాభిపురంలోని జీకేఆర్‌ హైస్కూల్ ల్లో 3వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అర్జంటుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడంతో పాఠశాలలోని బాత్రూంకు వెళ్లింది. అయితే బాత్రూం ఖాళీ లేకపోవడంతో లోపల ఉన్న వారిని త్వరగా బయటకు రావాలని పిలిచేందుకు తలుపు తట్టింది. ఈ సంఘటన గమనించిన పాఠశాలలోని ఒక టీచర్‌ విద్యారి్థని పెద్ద తప్పిదం చేసినట్లుగా భావించి, చెంపపై దెబ్బ కొట్టడంతోపాటు మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఈ విధంగా గంటన్నర సేపు విద్యారి్థని మోకాళ్లపై కూర్చునట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతరం జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. బాలిక తల్లి సంకు త్రిలోచనకు ముగ్గురు పిల్లలు కాగా, ఇదే పాఠశాలలో చదువుతున్నారు. 

    ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి వారిని పాఠశాలకు రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరపాల్సిన విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పాఠశాలకు వెళ్లి విచారణ జరపాల్సిన అధికారులు ఇవేమీ చేయకుండానే ఫిర్యాదు పరిష్కరించామని చెప్పి ఫిర్యాదును మూసివేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చారు. గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీం బాషా పేరుతో సంబంధిత విద్యార్థిని తల్లికి పోస్టులో లేఖ పంపారు. విద్యారి్థని తల్లిదండ్రులు ఇచ్చిన సెల్‌ఫోన్‌కు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు.  

Movies

  • 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్‌ మున్నా ధులిపూడి దర్శకత్వం వహిస్తోన్న తాజా చిత్రం బ్యాడ్‌ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌ లైన్‌. అంచల్‌ గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్‌టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్‌ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్‌ నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. లేలో అంటూ సాంగే ఫుల్ రొమాంటిక్ పాట విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. మంగ్లీ సిస్టర్ ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ రొమాంటిక్ ‍సాంగ్‌ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రేణూ దేశాయ్, రోహన్‌ సూర్య, మొయిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    కాగా.. ఈ చిత్రం క్రిస్మస్‌ పండగ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదల కానుంది.  జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్  అని  దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి అన్నారు. 
     

  • బాలీవుడ్‌ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది జాట్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని తెరకెక్కించారు. గతంలో 1997లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ మేకర్స్ రిలీజ్‌ చేశారు.

    ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సన్నీ డియోల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ధర్మేంద్ర మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ టీజర్‌లోని డైలాగ్ చెబుతూ అభిమానులను అలరించారు. ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఆవాజ్ ఎక్కడి వరకు వెళ్లాలి? అని సన్నీ డియోలా అనడంతో.. ప్రేక్షకులు లాహోర్ వరకు అంటూ గట్టిగా అరిచారు. ప్రేక్షకుల స్పందనతో సన్నీ డియోల్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఈ మూవీ వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్‌ సింగ్‌ తెరకెక్కించారు.  ఈ చిత్రంలో దిల్‌జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. వీరంతా దేశాన్ని రక్షించడానికి పోరాడే సైనికుల పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోనా సింగ్, సోనమ్ బాజ్వా, అన్య సింగ్, మేధా రాణా హీరోయిన్లుగా కనిపించనున్నారు.

  • మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రి, తనయులుగా నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ ఫుల్ యాక్షన్‌ మూవీ క్రిస్‌మస్‌కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

    ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని మైథలాజికల్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలం నాటి విజువల్స్, యాక్షన్ సీన్స్‌ బాహుబలి తరహాలో మోహన్ లాల్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా ట్రైలర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో అభిమానులను అలరించనున్నారు. 

    కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నేహా సక్సెనా  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్‌, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా నిర్మించారు.  ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళం, కన్నడ, హిందీలో విడుదల కానుంది.   
     

  • రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

    తాజాగా ఈ మూవీని  టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్‌ మాల్‌లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్‌ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్‌లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్‌ దురంధర్‌ను వీక్షించింది.

    ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో  విడుదల కానుంది.

  • గ్లామర్‪‌తో రచ్చ లేపుతున్న నివేదా థామస్

    నీల రంగు చీరలో చాలా అందంగా శ్రీదేవి

    ఎత్తయిన కొండపైన కూర్చుని నిహారిక పోజులు

    షూటింగ్ జ్ఞాపకాలని పంచుకున్న సంయుక్త

    'మసూద' బ్యూటీ బాంధవి మాయ చేసేలా

    హీరోయిన్ మీనాక్షి చౌదరి క్లోజప్ స్టిల్స్

  • గత కొన్నేళ్లలో టాలీవుడ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మార్కెట్‌లో మనోళ్లు పోటీపడుతున్నారు. పోటీపడితే పర్లేదు కానీ దీని మోజులో పడి అయిన కాడికి బడ్జెట్, రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఇది తప్పితే ప్రేక్షకుడి గురించి ఒక్కరూ ఆలోచించట్లేదు. చూస్తుంటే ఇది భవిష్యత్తులో టాలీవుడ్‌కి సంకటంలా మారనుందా అనే సందేహం కలుగుతోంది.

    టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏడాది మొత్తంలో సరాసరిగా 250-300 సినిమాలు రిలీజైతే వీటిలో 10-20 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఎవరు ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. కానీ అటు హీరోలకు గానీ ఇటు దర్శకనిర్మాతలకు గానీ ఈ విషయం అర్థం కావట్లేదా అనిపిస్తుంది.

    ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్ గానీ టికెట్ రేట్లు గానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో.. మూవీస్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. హీరోలకు పదుల కోట్లు లేదంటే వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. నిర్మాణానికీ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. ఇంతా చేసి హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పదిలో ఒకటో రెండు మాత్రమే హిట్ అవుతున్నాయి. వీటికి కూడా పెట్టిన డబ్బులు తిరిగి వస్తున్నాయి గానీ పెద్దగా లాభాలు మాత్రం రావట్లేదు. అటు సినిమాలు హిట్ కాక, ఇటు అప్పులు పెరిగిపోతుండటం కలవరపరిచే విషయం.

    టికెట్ రేట్లు అయితే ఎప్పటికప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు టికెట్ రేట్లు రూ.50, రూ.100, రూ.150.. ఇలా అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు అంటూ ట్రెండ్ మొదలైందో వీటికోసం రేట్లలో పెంపు అడుగుతున్నారు. ప్రీమియర్లకు అయితే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుని మరీ వందలు, వేల రూపాయలు రేట్లు పెట్టుకుంటున్నారు. అభిమానులు.. తమ హీరో మూవీ కలెక్షన్స్ ఎక్కడ తగ్గిపోతాయోనని నామోషీ వల్లనో ఏమో గానీ ఇంతింత రేట్లు పెట్టి థియేటర్లకు వెళ్తారు. మరి సామాన్య ప్రేక్షకుడు కొనుగోలు చేస్తాడా అంటే సందేహమే.

    ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. థియేటర్లలో టికెట్ రేట్లు, తినుబండారాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. దీనికి బదులు ఇందులో కొత్త మొత్తం పెట్టి ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు అది కూడా బాగుందనే టాక్ వస్తే వెళ్తున్నారు. చిన్న చిత్రాలకైతే బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే తప్ప ఆడియెన్స్.. థియేటర్ ముఖం చూడట్లేదు. ఒకప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకేలా టికెట్ రేటు ఉండేది. ఇప్పుడు అంతరం కనిపిస్తోంది. ప్రేక్షకుడు కూడా చూడాలా వద్దా అనే విషయంలో అంతరం చూపిస్తున్నాడు.

  • టాలీవుడ్ బుల్లితెర నటి అన్షు రెడ్డి తన కోరికను నెరవేర్చుకుంది. ఖరీదైన కారును కొనుగోలు చేసిన సీరియల్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న బుల్లితెర నటి ఆ తర్వాత పలు సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది.

    అన్షు రెడ్డి దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మదగా టాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. అన్షు తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ కనిపించింది. సీరియల్స్‌తో పాటు డీ జోడీ-20లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అంతే కాకుండా అన్షు రెడ్డికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ కూడా ఉంది.  అయితే ప్రస్తుతం ఎలాంటి వీడియోలు చేయడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది బుల్లితెర భామ.  

     

     

  • టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. వెంకీమామ, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్‌2, ఎఫ్‌3 సినిమాలతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా రాజా ది గ్రేట్‌ చిత్రంలో రవితేజ సరసన కనిపించింది.

    అయితే సినీతారలపై రూమర్స్ రావడం సహజం. డేటింగ్, పెళ్లి అంటూ ఎప్పుడో ఒకసారి రూమర్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మెహరీన్‌పై కూడా అలాగే వదంతులు వచ్చాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో మెహరీన్‌ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలిపోయింది. ‍అప్పటి నుంచి మెహరీన్‌ సినిమాలతో బిజీ అయిపోయింది.

    అయితే తాజాగా మరోసారి మెహరీన్‌ పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. దీంతో మెహరీన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకపోయినా ఇలాంటి వార్తలు రాయడం చూస్తుంటే వింతగా అనిపిస్తోందని ట్వీట్ చేశారు. కేవలం డబ్బుల కోసం పనికిమాలిన వార్తలతో జర్నలిజం పూర్తిగా దెబ్బతినిందని మెహరీన్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ విషయంపై రెండు ఏళ్లుగా మౌనంగా ఉన్నానని..  నిరంతరం ఇలాంటి వేధింపుల కారణంగా ఈ రోజు మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

    తాను ఎవరో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు రాశారని మెహరీన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎప్పుడు కలవని వ్యక్తితో  పెళ్లయిందని రాయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. నాకు ఇప్పటి వరకు ఎవరితోనూ పెళ్లి కాలేదు.. నన్ను నమ్మండి అంటూ పోస్ట్‌ చేసింది. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఈ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసుకుంటానని మెహరీన్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్‌తో మెహరీన్‌ పెళ్లి రూమర్స్‌కు ఇక చెక్ పడినట్లే.

  • సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన రవి అలియాస్ ఐబొమ్మ రవి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్‌గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజులు పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకుగాను 12 రోజులు పాటు విచారించనున్నారు. ఈనెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతుంది.

    మరోవైపు ఇవ్వాళ కొనసాగిన విచారణలోనే రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం.. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్వర్క్ బయటపడుతుందని చెప్పారు.

    ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీని ద్వారానే బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇందుకోసం కరేబియన్‌ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్‌ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు.

  • గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఈ ఏడాది రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో ఐశ్వర్యా రాజేశ్ మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లీడ్ రోల్ చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం గత నెలలో తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    అర్జున్ సర్జా, ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ 'తీయవర్ కులై నడుంగ'. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరైన ప్రమోషన్స్ చేయకుండా విడుదల చేయకపోయేసరికి ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. గతవారం తమిళ వెర్షన్, సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు వెర్షన్‌ ఈ శుక్రవారం(డిసెంబరు 19) నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

    'మఫ్టీ పోలీస్' విషయానికొస్తే.. ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కేసు విచారణని ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా కనిపిస్తారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నాడా లేదా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటి? ఇందులో ఐశ్వర్యా రాజేశ్ పాత్రేంటి అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)

  • బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్  'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్‌ సైతం మేకర్స్‌ను కొనియాడారు.

    సైయారాను దాటేసిన దురంధర్..

    డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్‌ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్‌ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.

    కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..

    ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ‍అలా దురంధర్‌ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్‌-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.

    అందుకే బజ్‌..

    పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌వీర్ సింగ్‌ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.

    ఇప్పటివరకు  11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్‌ల రికార్డులను తుడిచిపెట్టేసింది.

    ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు.  ఈ చిత్రంలో  ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్‌, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది.

  • సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్‌తో పాటు గ్లామర్‌ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్‌ టెన్‌ అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్‌లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.

    మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ  షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్‌రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. టాప్‌-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్‌ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్‌ నిలిచారు.

     

  • గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    కథేంటి?
    1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్‌లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్‌వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.

    ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్‌వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.

    సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్‌వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.

    ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.

    క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్‌వీర్).. సీక్వెల్‌లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.

    ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ)

  • జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక 'లక్ష్మీ రావే మా ఇంటికి'. భావోద్వేగాలు, బంధాలు, బాధ్యతలు, కుటుంబ సవాళ్లతో అల్లుకున్న కథతో దీన్ని రూపొందించారు. డిసెంబర్ 22 నుంచి ఇది ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10గంటలకు ప్రసారం కానుంది. ఈ సీరియల్లో హర్ష్ నాగ్పాల్, దర్శిని గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మీర్ సయ్యద్, ఐశ్వర్య, ఇందు ఆనంద్, వెంకట్ గౌడ్, శ్రీవాణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    అనుకోకుండా ముడిపడిన రెండు జీవితాలే ఈ సీరియల్ స్టోరీ. అనాథగా పెరిగిన తెలివిగల అమ్మాయి శ్రీలక్ష్మి(దర్శిని గౌడ), ఊహించని విధంగా ధనవంతుడైన మధుసూదన్(హర్ష్ నాగ్పాల్) జీవితంలో అడుగుపెడుతుంది. అనేక సమస్యలతో సతమతమయ్యే లక్ష్మి ఆత్మవిశ్వాసంతో మధుసూదన్ ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంలో లక్ష్మి ఎదుర్కొనే ఇబ్బందులేంటి? లక్ష్మి ఎలా మధుసూదన్ మనసు గెలుచుకుంది అనేదే స్టోరీ.
     

  • భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యం కథతో తీసిన సినిమా 'బోర్డర్'. 1997లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో సంచనలమైంది. ప్రేక్షక్షుల నుంచి విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీశారు. 'బోర్డర్ 2' పేరుతో తెరకెక్కించారు. సన్నీ డియోల్, వరుణ్‌ ధావన్‌, దిల్జీత్‌ దొసాంజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా విజయ్ దివస్ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. తొలి పార్ట్‌కి జెపి దత్తా దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని అనురాగ్‌ సింగ్‌ తీశారు. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్య కథతోనే ఈ సినిమాని కూడా తెరకెక్కించారు. ఇందులో వరుణ్ ఆర్మీ, దిల్జీత్ ఎయిర్‌ఫోర్స్, అహన్ శెట్టి నేవీ సైనికులుగా కనిపించనున్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • అమ్మిత్‌ రావ్, పర్వేజ్‌ సింబా, ప్రకాశ్‌ తుమినాడ్, రవి భట్, సంగీత లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జిన్‌’. చిన్మయ్‌ రామ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ ఎం. గౌడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్‌ కానుంది. ‘జిన్‌ అనేది ఉండుంటే ఒకసారి వచ్చి నా చేతిని టచ్‌ చేయాలి, నన్ను మీరే కాదు... ఎవ్వరూ పట్టుకోలేరు’ అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘థియేటర్స్‌లో కరెక్ట్‌గా భయపెడితే ఆడియన్స్‌ హారర్‌ చిత్రాలను ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘జిన్‌’ ట్రైలర్‌ నచ్చింది’’ అన్నారు

    సోహెల్ మాట్లాడుతూ .. ‘తెలుగు ఆడియెన్స్ అన్ని భాషల చిత్రాల్ని, అన్ని భాషల టెక్నీషియన్లను ఆదరిస్తుంటారు. ‘జిన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. స్పూకీ వరల్డ్ అనే ట్యాగ్ లైన్ బాగుంది. జిన్‌లో గుడ్ జిన్ ఉంటుంది.. బ్యాడ్ జిన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తే ఇది బ్యాడ్ జిన్ గురించి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలి. డిసెంబర్ 19న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.

    దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ .. ‘‘మా ‘జిన్’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అందరినీ సపోర్ట్ చేసేందుకు డబ్బులు పెట్టి నిర్మించిన నిఖిల్ గారికి థాంక్స్. మా చిత్రం డిసెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఆడియెన్స్ అందరూ మా మూవీని చూడండి. మీరు పెట్టే డబ్బులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇస్తామ’ని అన్నారు.

  • రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన తాజా చిత్రం ‘ఎర్రచీర’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికికి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది.  అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు.  హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. 

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్. వి. వి. సుబ్బారెడ్డి ( సుభాష్) మాట్లాడుతూ.."సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న  ఈ సినిమాని ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.  ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తాయి" అన్నారు.

    చిత్ర దర్శకులు సుమన్ బాబు మాట్లాడుతూ "కొన్ని సినిమాల్లోని సోల్ మనకు అనుభూతి చెందాలంటే, ఖచ్చితంగా వాటిని థియేటర్‌లోనే చూడాలి. మా 'ఎర్ర చీర' సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో ఉన్న సౌండింగ్ మరియు విజువలైజేషన్ అనుభూతి మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి అన్నారు. 

  • ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసింది. గత నెలలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్. ఇంతకీ ఏంటీ సినిమా? ప్రస్తుతం ఎందులో చూడొచ్చు?

    2022లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై యాక్షన్ మూవీ లవర్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా 'శిశు'. కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉండే ఈ మాస్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీనికి కొనసాగింపుగా గత నెల 21న 'శిశు: రోడ్ టు రివెంజ్' చిత్రం రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి విదేశాల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ మన దేశంలోనూ ఓటీటీలో రిలీజయ్యే అవకాశముంది. ఈ సినిమా కూడా గంటన్నర నిడివితోనే తెరకెక్కించారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఓన్లీ యాక్షనే ఉంటుంది.

    'శిశు: రోడ్ టు రివెంజ్' విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న అటామి కోర్పి(జోర్మా).. తన ఫ్యామిలీ కోసం గుర్తుగా నిర్మించిన ఇంటి చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇది తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ (స్టీఫెన్ లాంగ్) అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు. ఈ భీకర పోరాటంలో అటామి ఎలా గెలిచి, ఇల్లు కట్టుకోవాలనే తన కల నెరవేర్చుకున్నాడనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ)

  • టాలీవుడ్‌ హీరో రామ్‌ పోతినేని సరైన విజయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ (2019) విజయం తర్వాత తనకు సరైన హిట్‌ దక్కలేదు. రెడ్‌, రొమాంటిక్‌, ది వారియర్‌, స్కంద వంటి సినిమాలు వచ్చినప్పటికీ ఏదీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. రీసెంట్‌గా విడుదలైన ఆంధ్రా కింగ్‌ తాలుకా మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ, పట్టుమని రెండు వారాలైన గట్టిగా థియేటర్స్‌లో రన్ కాలేకపోయింది. ప్రస్తుతం రామ్‌ 40ఏళ్లకు దగ్గర్లో ఉన్నాడు. కొద్దిరోజులుగా తన పెళ్లి వార్తలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన సినీ  కెరీర్‌ కూడా పెద్దగా చెప్పుకునే విధంగా లేదు. ఇలాంటి సమయంలో ఆయన నిర్ణయం ఎటూ అనేది తేల్చుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి.  

    స్కంద వంటి మాస్ సినిమాను కూడా జనం చూడలేదు. డబుల్‌ ఇస్మార్ట్‌ అని చెప్పినా సరే థియేటర్‌ వైపు ప్రేక్షకులు చూడలేదు. సరే అని  ఆంధ్రా కింగ్‌ తాలుకా అంటూ కొత్త ప్రయత్నం చేస్తే పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. కానీ, ప్రేక్షకులు లేరు. దీనికి కారణం తనకంటూ ఒక ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ మూవీ కోసం మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ పెట్టుబడి పెట్టింది. చివరకు నష్టాలను చూసింది.  ఇప్పుడు రామ్‌ ఎలాంటి సినిమా తీస్తే జనాలు చూస్తారనే క్లారిటీ కూడా లేదు. 

    కథ పరంగా ఎలాంటి జోనర్ టచ్ చేసినా సరే.. ఫెయిల్యూర్ వెంటాడుతూనే ఉంది. ఆంధ్రా కింగ్‌ తాలుకా మూవీకి మంచి టాక్ వచ్చింది. కానీ, అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్‌ లేవు. వరుస పరాజయాల కారణంగా తన సినిమాలకు థియేటర్ మార్కెట్ చాలా వరకు పడిపోయింది.  20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఒక హీరోకు కనీసం రూ. 20 కోట్లు కలెక్షన్స్‌ కూడా రాకుంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఇలాంటి సమయంలో ఓటీటీ మార్కెట్ సంగతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. 

    వార్‌2తో ఎన్టీఆర్‌, గేమ్‌ ఛేంజర్‌ చిత్రంతో రామ్‌ చరణ్‌ కూడా దారుణమైన ట్రోలింగ్‌  ఎదుర్కొన్నారు. కానీ, వారికి బలమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దీంతో త్వరగానే బౌన్స్‌బ్యాక్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. అయితే, రామ్‌ పోతినేనికి బలమైన కథతో పాటు సరైన దర్శకుడు దొరికితేనే నిలిదొక్కుకునే అవకాశం ఉంది.
     

  • ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సిరీస్‌ల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటి. 2016 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. గత నెలలోనే ఐదో సీజన్ తొలి వాల్యూమ్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో భాగంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అద్భుతమైన రెస్పాన్‌ అందుకుంది. ఇప్పుడు రెండో వాల్యూమ్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: హిందీ మార్కెట్‌లో ఊహించని దెబ్బ.. 'అఖండ 2' టోటల్ ఫ్లాప్)

    అమెరికాలోని హాకిన్స్ అనే ఓ పల్లెటూరిలో నలుగురు ఫ్రెండ్స్(అబ్బాయిలు) ఉంటారు. ఓ రోజు రాత్రి వీళ్లకు ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఇంతకీ ఈమె ఎవరు? వీళ్ల ఐదుగురితో పాటు మరికొందరు కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తి నుంచి తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. అయితే ఎలెవన్ అనే అమ్మాయికి ఇప్పటివరకు పవర్స్ ఉండగా.. నలుగురు పిల్లల్లోని విల్ అనే అబ్బాయికి కూడా పవర్స్ వచ్చినట్లు చూపించి ఐదో సీజన్ తొలి వాల్యూమ్‌ని ముగించారు. రెండో వాల్యూమ్‌లో ఎలెవన్, విల్, నం.8 కలిసి వెక్నా అనే అతీంద్రయ శక్తులున్న విలన్‌ని ఎలా ఎదిరిస్తాయనేది చూపించబోతున్నారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • పాన్‌ ఇండియా సినిమాకే కేరాఫ్‌గా మారింది టాలీవుడ్‌. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోలతో పాటు తేజ సజ్జ, నిఖిల్‌ లాంటి కుర్ర హీరోలు కూడా వరుసగా పాన్‌ ఇండియా సినిమాలను రిలీజ్‌ చేస్తూ తమ పాపులారిటినీ పెంచుకుంటున్నారు. అదే జోష్‌లో మన సీనియర్‌ హీరోలు కూడా పాన్‌ ఇండియా మార్కెట్‌లో నిలబడాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవి వర్కౌట్‌ అవ్వడం లేదు.

    మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలతో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కొన్నేళ్ల పాటు సినిమాలను ఆపేసినా కూడా ఆయన మార్కెట్‌ చెక్కుచెదరలేదు. కానీ పాన్‌ ఇండియా మార్కెట్‌లో మాత్రం చిరంజీవి ఫ్లాప్‌ అవ్వాలి. గాడ్‌ ఫాదర్‌ చిత్రంతో పాన్‌ ఇండియాలో మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ లాంటి బాలీవుడ్‌ హీరో నటించినా.. పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద దరుణంగా బోల్తా పడింది. 

    దీంతో చిరు పాన్‌ ఇండియా ప్రయత్నాలు వదిలేసి.. మళ్లీ లోకల్‌ చిత్రాలపైనే ఫోకస్‌ పెట్టాడు. సంక్రాంతికి రాబోతున్న ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’ పక్కా తెలుగు సినిమా. ఇక్కడ హిట్‌ అయితే చాలు..పాన్‌ ఇండియా అవసరం లేదనుకొని, అదే రేంజ్‌లో ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

    ఇక బాలయ్య కూడా పాన్‌ ఇండియాపై ఫోకస్‌ చేశాడు. అఖండ 2తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోవాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ చిరంజీవి కంటే దారుణమే ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 కోసం ముంబై, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ చేశాడు. హిందీతో డైలాగులు చెప్పి అలరించాడు. కానీ అవేవి థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. బాలీవుడ్‌లో అఖండ 2 అట్టర్‌ ఫ్లాప్‌ అయింది.

    ఇక వెంకటేశ్‌ కూడా పాన్‌ ఇండియా మార్కెట్‌లో రాణించాలని  ‘సైంధవ్‌’తో ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్‌ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చే  కథలపైనే ఫోకస్‌ పెట్టాడు.

    మనో సీనియర్‌ హీరో నాగార్జున కూడా అంతే. పాన్‌ ఇండియా పై ఆయనకు మోజే లేదు. సోలోగా రాణించాలనే ఆశే లేదు. కుబేర, కూలి, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలతో పాన్‌ ఇండియా ప్రేక్షకులను పలకరించాడు కానీ.. హీరోగా మాత్రం అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇలా టాలీవుడ్‌ సీనియర్లంతా పాన్‌ ఇండియా మార్కెట్‌ వద్ద ఫ్లాప్‌ అవుతూనే ఉన్నారు. మరి భవిష్యత్తులో అయినా హిట్‌ కొడతారో చూడాలి. 

Business

  • గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్.. లియోనెల్ మెస్సీ 'అనంత్ అంబానీ' స్థాపించిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం & పరిరక్షణ కేంద్రం వంతారాను సందర్శించారు. వంతారాలో కార్యక్రమాలు సాధారణంగా సనాతన ధర్మ సంప్రదాయాల ప్రకారం, ప్రకృతి & సమస్త జీవుల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ప్రారంభమవుతాయి. ఈ సంప్రదాయాలను గౌరవిస్తూ మెస్సీ కూడా హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.

    మెస్సీతో పాటు ఆయన సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్‌కు సంప్రదాయ జానపద సంగీతం, పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. ఆ తరువాత అంబే పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివాభిషేకంతో కూడిన మహా ఆరతిలో పాల్గొని, ప్రపంచ శాంతి & ఐక్యత కోసం ప్రార్థించారు.

    వంతారాలో మెస్సీ .. సింహాలు, పులులు, ఏనుగులు, శాకాహార జంతువులు, సరీసృపాలు, జంతు పిల్లలను చూశారు. జంతువులకు అందిస్తున్న ఆధునిక వైద్య సదుపాయాలు, పోషణ, సంరక్షణ పద్ధతులు చూసి ఆయన ఎంతో సంతోషించారు. ప్రత్యేక వన్యప్రాణి ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సలు, శస్త్రచికిత్సలను ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే జిరాఫీలు, ఖడ్గమృగాలు, ఒకాపీలు, ఏనుగులకు ఆహారం కూడా పెట్టారు.

    అనాథ & బలహీన జంతు పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఫోస్టర్ కేర్ సెంటర్‌లో, వాటి జీవన ప్రయాణాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ & రాధిక అంబానీ కలిసి ఒక సింహపు పిల్లకు మెస్సీ గౌరవార్థంగా “లియోనెల్” అని పేరు పెట్టారు. ఈ పర్యటనలో అత్యంత గుర్తుండిపోయే సంఘటన ఏనుగుల సంరక్షణ కేంద్రంలో జరిగింది. అక్కడ ఏనుగు పిల్ల 'మణిక్లాల్'తో మెస్సీ సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ఆట ద్వారా జంతువులతో అనుబంధాన్ని చూపిస్తూ, ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే భాష అని నిరూపించారు. ఆ దృశ్యం అక్కడున్న అందరి మనసులను ఆకట్టుకుంది.

  • నవంబర్ 2016లో మన దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా.. మార్చుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ తరువాత వీటి వాడకం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉన్నట్లు అప్పుడప్పుడు సంబంధిత అధికారులు గుర్తిస్తూ ఉంటారు.

    పాత రూ. 500, రూ. 1000 నోట్లు ఉపయోగించడం నేరమా?, ఒక వ్యక్తి దగ్గర ఎన్ని నోట్లు ఉండొచ్చు?, చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    చట్టం ఏం చెబుతోందంటే?
    స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017 ప్రకారం.. రద్దు అయిన రూ. 500, రూ. 1000 నోట్లు తక్కువ సంఖ్యలో ఉండటం నేరమేమీ కాదు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే నేరమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 10 నోట్ల వరకు ఉండవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య రాదు.

    10 కంటే ఎక్కువ రూ. 500 లేదా రూ. 1000 నోట్లు ఉంటే.. మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అభిరుచి కలిగిన నాణేలను సేకరించేవారు గరిష్టంగా 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఆర్ధిక లావాదేవీల కోసం ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు.

    ఐదు రెట్లు జరిమానా!
    ఒక వ్యక్తి పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో రద్దు చేసిన నోట్లను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే.. కనీసం రూ. 10వేలు జరిమానా లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీదగ్గర రూ. 20వేలు విలువైన రద్దు చేసిన నోట్లు ఉన్నాయనుకుంటే.. రూ. లక్ష (ఐదు రెట్లు) జరిగిమానా చెల్లించాలన్నమాట. అయితే జైలు శిక్ష ఉండదు.

    రద్దు చేసిన నోట్లను ఎక్కువగా ఉంచుకున్నప్పటికీ.. దానిని ఆర్ధిక నేరంగా పరిగణించరు. అయితే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రద్దు చేసిన నోట్లు చట్టబద్దమైనవి కాదు. కాబట్టి వీటిని ఎక్కడా ఉపయోగించలేరు. ఉపయోగించకూడదు కూడా.

    ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..

  • హైదరాబాద్‌లోని బోవెన్‌పల్లిలోని ఆటోమోటివ్ ఎంజీ షోరూమ్‌లో సరికొత్త ఎంజీ హెక్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్ కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ డిజైన్ కలిగి.. కొత్త గ్రిల్ డిజైన్ పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది సెలాడాన్ బ్లూ అండ్ పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

    5-సీటర్ ట్రిమ్‌లో డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్ ఇంటీరియర్‌.. 6, 7-సీటర్ ట్రిమ్‌ల కోసం డ్యూయల్ టోన్ అర్బన్ టాన్‌ ఇంటీరియర్‌ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

    కొత్త ఎంజీ హెక్టర్ లాంచ్ సందర్భంగా.. ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, భారతదేశంలోనే అతిపెద్ద 14 అంగుళాల పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ & అడ్వాన్స్డ్ i-SWIPE టచ్ నియంత్రణలతో కూడిన కొత్త హెక్టర్‌ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇది కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది అన్నారు.

  • కొత్త కారు కొనడానికి కావలసినంత డబ్బు లేనప్పుడు, చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొంటుంటారు. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.

    డాక్యుమెంట్లు చెక్ చేయాలి
    మీరు కొంటున్న కారుకు సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా?, లేదా?.. అని చెక్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ చెల్లుబాటు అవుతోందా?, క్లెయిమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవాలి. పొల్యూషన్ సర్టిఫికెట్ తనిఖీ చేయాలి. ఒకవేల లోన్ ఉంటే.. బ్యాంక్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగ్గా లేకుంటే.. అనుకోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.

    మీరు కొంటున్న కారు సెకండ్ హ్యాండ్ కారా? లేక ఎంతమంది చేతులు మారిందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఒక ఓనర్ మాత్రమే కారును ఉపయోగించి ఉంటే.. అది మంచి కండిషన్లో ఉంటుంది. ఎక్కువమంది చేతులు మారి ఉంటే.. కారులో లెక్కలేనన్ని సమస్యలు తలెత్తుతాయి. దీనికోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

    కారు కండీషన్
    మీరు కొంటున్న కారు ఎలాంటి స్థితిలో ఉందనే విషయం గమనించాలి. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా?, పెయింట్ ఒకేలా ఉందా? అనేది పరిగణలోకి తీసుకోవాలి. టైర్లు ఎలాంటి కండిషన్లో ఉన్నాయనేది చూడాలి. ప్రమాదాలకు గురైన కార్లకు చిన్న చిన్న మరమ్మత్తులు చేసి.. మార్కెట్లో అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని తప్పకుండా గమనించాలి.

    ఇంజిన్ స్థితి
    కారుకు గుండె వంటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉందనేది చూడాల్సి ఉంటుంది. ఇంజిన్ శబ్దం స్మూత్‌గా ఉందా?, స్టార్ట్ చేయగానే ఎక్కువ శబ్దం లేదా పొగ వస్తుందా?, గేర్ షిఫ్టింగ్ సరిగ్గా ఉందా? అని పరిశీలించాలి. మీకు ఈ విషయాలను చెక్ చేయడంలో అనుభవం లేకపోతే.. నమ్మకమైన మెకానిక్‌తో చెక్ చేయించడం మంచిది.

    టెస్ట్ డ్రైవ్ & ఓడోమీటర్ రీడింగ్
    కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో.. బ్రేకులు బాగా పని చేస్తున్నాయా?, స్టీరింగ్ వీల్ షేక్ అవుతోందా?, సస్పెన్షన్ శబ్దం ఉందా? అనేవి గమనించాలి. పరిశీలించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఓడోమీటర్ చెక్ చేసుకోవాలి. తక్కువ కిలోమీటర్లు ప్రయాణించినట్లు చూపిస్తుంటే.. తప్పకుండా అనుమానించాల్సిందే. అలాంటప్పుడు సర్వీస్ రికార్డ్స్‌తో పోల్చుకోవాలి.

    ధర & ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ
    సెకండ్ హ్యాండ్ కారు ధర మార్కెట్లో ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేల చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటే.. కారణం కనుక్కోవాల్సిందే. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పకుండా మీ పేరు మీదకు చేయించుకోవాలి. ఫారమ్ 29, 30 సరిగ్గా సబ్మిట్ చేయాలి.

    ఛలాన్స్
    మీరు కొంటున్న కారుపై ఏమైనా పెండింగ్ ఛలాన్స్ ఉన్నాయా?, దొంగతనం కేసులు వంటివి ఉన్నాయా? కూడా చెక్ చేసుకోవాలి. ఇలాంటి చెక్ చేసుకోకపోతే.. ఆ భారం మీ మీద పడుతుంది. అనుకోని సమస్యలను ఎదుర్కోవాలి ఉంటుంది.

    డీలర్ vs డైరెక్ట్ ఓనర్
    కొత్త కారును డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. అయితే యూస్డ్ కారును నేరుగా ఓనర్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం మంచిది. మధ్యవర్తులను ఆశ్రయించకపోవడం మంచిది. ఒకవేల డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే.. నమ్మకమైన డీలర్ నుంచి కొనుగోలోను చేయడం మంచిది.

  • దేశీయంగా బంగారం దిగుమతులు గత నెలలో వార్షికంగా 60 శాతం క్షీణించాయి. వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం నవంబర్‌లో 4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2024) నవంబర్‌లో 9.8 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి.

    2025 అక్టోబర్‌లో మూడు రెట్లు ఎగసి 14.72 బిలియన్‌ డాలర్లను తాకిన పసిడి దిగుమతులు ఈ ఏడాది(2025) ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో 3.3 శాతం పెరిగి 45.26 బిలియన్‌ డాలర్లను తాకాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 43.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా.. పసిడి దిగుమతులు క్షీణించడంతో గత నెలలో దేశ వాణిజ్య లోటు తగ్గి 24.53 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది ఐదు నెలల కనిష్టంకాగా.. దిగుమతులు నీరసించడంతో దిగుమతుల బిల్లు సైతం తగ్గిందని వాణిజ్య కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

  • ఈ-కామర్స్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న మీషో లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదిత్ ఆత్రే(34) నికర విలువ మంగళవారం ఒక బిలియన్ డాలర్‌ మార్కును అధిగమించి.. బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. మీషో షేర్లు ఒక్కసారిగా 13% పెరగడంతో అతని నికర విలువ రూ.9,142.87 కోట్లకు చేరుకుంది. ఐఐటీ ఢిల్లీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఐటీసీ, ఇన్‌మోబీ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన విదిత్ ఆత్రే.. మీషోకు సారథ్యం వహిస్తూ భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు స్ఫూర్తినిస్తున్నారు.

    1991లో జన్మించిన విదిత్ ఆత్రే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 2012లో బీటెక్‌ పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ఢిల్లీలో చదవడం ఆయనకు బలమైన సాంకేతిక పునాదిని అందించింది. గ్రాడ్యుయేషన్ తరువాత ఆత్రే తన కెరీర్‌ను ఐటీసీ లిమిటెడ్‌లో ప్రారంభించారు. ఆయన జూన్ 2012 నుంచి మే 2014 వరకు చెన్నైలో ఫ్యాక్టరీ కార్యకలాపాల్లో పనిచేశారు. ఆ తరువాత మొబైల్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌మోబీ(InMobi) సంస్థలో జూన్ 2014 నుంచి జూన్ 2015 మధ్య బెంగుళూరులో పనిచేశారు.

    మీషో స్థాపన
    వృత్తిపరమైన అనుభవాన్ని మూటగట్టుకున్న తర్వాత ఆత్రే పారిశ్రామికవేత్తగా మారాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2015 నుంచి ఆయన మీషో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) నాయకత్వం వహిస్తున్నారు. మీషోను స్థాపించడంలో, దానిని విజయవంతమైన ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన దూరదృష్టితో భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా జీరో-కమీషన్ మోడల్‌తో విక్రేతలకు, చిరు వ్యాపారులకు ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తెచ్చారు. తన నాయకత్వంలో మీషో వేగంగా ఎదిగింది. దీని ఫలితంగా ఆత్రే ఫోర్బ్స్ 30 అండర్ 30 (ఆసియా & ఇండియా, 2018), ఫార్చ్యూన్ 40 అండర్ 40 (2021) వంటి ప్రతిష్టాత్మక యువ నాయకత్వ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

    మీషో డిసెంబర్ 10న స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసి తన ఇష్యూ ధరకు ప్రీమియం వద్ద లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజున రూ.111 ఐపీఓ ధర కంటే 53% ఎక్కువగా ముగించింది. మంగళవారం, స్టాక్ అసాధారణ ర్యాలీని కొనసాగించి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.193.50 కి చేరుకుంది.

    విదిత్ ఆత్రే నికర విలువ
    మీషోలో విదిత్ ఆత్రేకు 11.1 శాతం వాటా ఉంది. షేరు ధర రూ.193.50 ఇంట్రాడే గరిష్టానికి చేరుకోవడంతో ఆయన వాటా విలువ రూ.9,142.87 కోట్లుగా ఉంది. అంటే సుమారు 1.005 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు సంజీవ్ బర్న్వాల్ 31.6 కోట్ల షేర్లతో రూ.6,114.6 కోట్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు. మీషో మార్కెట్ క్యాపిటలైజేషన్ పూర్తి ప్రాతిపదికన రూ.85,207.91 కోట్లుగా ఉంది.

  • మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 533.50 పాయింట్లు లేదా 0.63 శాతం నష్టంతో 84,679.86 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు లేదా 0.64 శాతం నష్టంతో 25,860.10 వద్ద నిలిచాయి.

    అసహి సాంగ్వాన్ కలర్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్, అగ్రి టెక్ ఇండియా, ఈప్యాక్ డ్యూరబుల్స్, న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సలోనా కాట్స్పిన్, ఆర్వీ లాబొరేటరీస్, విపుల్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్జీ రబ్బరు వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

     

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా స్పందించారు.

    2026 మార్చిలోపు ఏటీఎం ద్వారా, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందని మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. మీరు ఇప్పటికే 75 శాతం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనిని మరింత సరళతరం చేయడంలో భాగంగానే ఏటీఎం విత్‌డ్రా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

    ప్రస్తుత ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని కూడా మాండవియా హైలైట్ చేశారు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి అనేక ఫామ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సభ్యులకు ఇబ్బందిగా మారుతుందని, ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేస్తోందని మంత్రి అన్నారు.

    ఇదీ చదవండి: బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!

    అక్టోబర్ 2025లో, ప్రావిడెంట్ ఫండ్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ​​ప్రధాన సంస్కరణలను ఆమోదించింది. ఈపీఎఫ్ ఉపసంహరణ నియమాలు గందరగోళంగా ఉన్నాయని, దీని వల్లనే కొన్నిసార్లు పీఎఫ్ ఉపసంహరణ ఆలస్యం, తిరస్కరణ జరుగుతోందని కార్మిక మంత్రి వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఉపసంహరణ చట్రాన్ని సరళీకృతం చేయడానికి మంత్రిత్వ శాఖ 13 వర్గాలను విలీనం చేసి 3 విభాగాలుగా వర్గీకరించారు. ఇది పీఎఫ్ ఉపసంహరణను మరింత సులభతరం చేసింది.

  • టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 600 బిలియన్ డాలర్ల (రూ. 54.56 లక్షల కోట్లు) నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో పబ్లిక్‌గా (ఐపీఓ) వచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడిన వెంటనే.. మస్క్ నికర విలువ ఒక రోజులో 168 బిలియన్ డాలర్లు పెరిగింది.

    స్పేస్‌ఎక్స్ సీఈఓ ఇప్పటికే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటారు. కాగా ఇప్పుడు ఈయన సంపద 600 బిలియన్ డాలర్లకు చేరింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్ 42 శాతం వాటాను కలిగి ఉండటం వల్ల.. సంపద ఒక రోజులోనే భారీగా పెరిగిపోయింది. ఇది అనేక దేశాల GDP కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా.. మస్క్ తన స్థానాన్ని మరోమారు సుస్థిరం చేసుకున్నారు.

    స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాలో దాదాపు 12% వాటాను కలిగి ఉన్నారు. ఇది కూడా ఈయన సంపదను పెంచడంలో దోహదపడింది. టెస్లాలో మస్క్ వాటా ఇప్పుడు దాదాపు 197 బిలియన్ డాలర్లుగా ఉంది.

    మార్చి 2020లో, టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తరువాత జనవరి 2021లో దాదాపు 190 బిలియన్ డాలర్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అయితే.. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఆయన నికర విలువ డిసెంబర్ 2024లో 400 బిలియన్ డాలర్లకు, అక్టోబర్‌లో 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు తాజాగా 600 బిలియన్ డాలర్ల మార్క్ దాటింది.

  • భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అందరికీ గర్వకారణం. కేవలం 15 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని తొమ్మిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. సేవల రంగంలో గణనీయమైన వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం పెరగడం, జీఎస్టీ, డిజిటలైజేషన్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం.. వంటి కీలకమైన సంస్కరణలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. దాంతోపాటు బలమైన స్థూల ఆర్థిక స్థిరత్వం, అధిక మూలధన వ్యయం ఇందుకు ఎంతో తోడ్పడ్డాయి. అయితే భారత్‌ దశాబ్ద కాలంలో ఏమేరకు వృద్ధి చెందిందో అదే రీతిలో ప్రజల ఆదాయాలు పెరిగాయా అంటే లేదనే చెప్పాలి. ఏయే విభాగాల్లో పెట్టుబడి పెట్టినవారి ఆదాయాలు ఎంతమేరకు వృద్ధి చెందాయో కింద చూద్దాం.

    ఉద్యోగాలు పెరిగినా..

    భారతదేశ వృద్ధి పథంలో భాగంగా ఉద్యోగ కల్పన దశాబ్ద కాలంలో మెరుగ్గానే ఉంది. గడిచిన పదేళ్లలో దాదాపు 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2004-2014 కాలంతో పోలిస్తే ఉద్యోగ కల్పనలో తయారీ రంగం వాటా మెరుగుపడగా సర్వీసులు, నిర్మాణ రంగాల్లో అధిక కొలువులొచ్చాయి. అయినప్పటికీ జీవన నాణ్యత సంక్లిష్టంగా ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాల్లో(ఫ్రొఫెషనల్‌ ఉద్యోగాలు) వేతన పెరుగుదల జీడీపీ విస్తరణ కంటే తక్కువగా ఉంది. కొత్తగా ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించిన వారిలో ఎక్కువ భాగం అనధికారిక లేదా గిగ్ (Gig) వర్క్‌లో చేరుతున్నారు. భారతదేశం ఏటా వృద్ధి నమోదు చేస్తున్నట్లుగా ఉద్యోగులు వేతనాలు, వారి ఆదాయాలు వృద్ధి చెందడం లేదు.

    పెట్టుబడిదారులకు లాభాలు

    భారతదేశ వృద్ధి దశలో ఇటీవలి కాలంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు లబ్ధిదారులుగా ఉన్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్‌) ఇన్వెస్టర్ల పొదుపును అమాంతం పెంచేశాయి. సెప్టెంబర్ 2025 నాటికి వివిధ ఈక్విటీల్లో సిప్‌ల కింద ఉన్న ఆస్తులు సుమారు రూ.15.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 10 కోట్లకు పైగా సిప్‌ ఖాతాల ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు రూ.20,000 కోట్లకు పైగా నిధులను ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు.

    గత ఐదేళ్లలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సుమారు 170-200 శాతం రాబడిని అందించాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 300-380 శాతం వరకు పెరిగాయి. 2010 ప్రారంభంలో సిప్‌లను ప్రారంభించిన పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు రెట్టింపు అయ్యాయి. ఇది ఆర్థికంగా చాలా కుటుంబాలకు సాధికారత కల్పించింది.

    రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు

    నగరాల్లోని చాలా మంది పొదుపుదారులకు స్టాక్ మార్కెట్‌లోని రాబడులు తమ జీతం పెరుగుదలను అధిగమించాయి. ‍ప్రధానంగా ఎస్ఐపీ ద్వారా సృష్టించిన సంపద వార్షిక వేతన పెంపు కంటే ఎక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా సాంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టినవారికి ఎక్కువగా రాబడులు లేవు. పెద్దగా ఆదరణలేని ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటిలో ఆశించిన రాబడి రాలేదు. ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసరాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది.

    మీరు నిజంగా ధనవంతులా?

    భారతదేశం ఆర్థికంగా వేగంగా దూసుకుపోతోంది. అధిక జీడీపీ ర్యాంక్, మెరుగైన మూలధన మార్కెట్లు, బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు దీనికి నిదర్శనం. అయితే, ‘మీరు ధనవంతులా?’ అనే ప్రశ్నకు సమాధానం అసమానంగా ఉంటుంది. స్థిరమైన సిప్‌ పెట్టుబడిదారులు, ఐటీ, ఫైనాన్స్, న్యూఏజ్‌(కొత్తగా, వేగంగా విస్తరిస్తున్న రంగాలు) సర్వీసులు వంటి అధిక వృద్ధి రంగాల్లో నిపుణుల నికర విలువలో అభివృద్ధి కనిపిస్తోంది. అయితే స్థిరమైన వేతనం లేనివారు, ఈక్విటీలో పెట్టుబడులు లేని సాధారణ జీతం పొందే సిబ్బంది ఈ సంపద సృష్టి నుంచి దూరంగా ఉన్నారు.

    భారతదేశం ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక దేశాల్లో ఐదో స్థానానికి ఎగబాకడం సంతోషకరమైన అంశమే. అయితే ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. దేశ వృద్ధికి అనుగుణంగా అన్ని రంగాల్లోని ప్రజల ఆదాయాలు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాలు అందరికీ అందేలా ప్రభుత్వం, వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ విజయాన్ని ‘ఇండియా గ్రోత్ స్టోరీ’గా మార్చాలంటే, వేతన వృద్ధి, ఉద్యోగ నాణ్యతను మెరుగుపరచడం తదుపరి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యం కావాలి.

    ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే..

  • ఉద్యోగం చేసేవారికి కోటీశ్వరులు కావాలనే కల నెరవేర్చుకోవడానికి క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ప్రణాళిక చాలా ముఖ్యం. కేవలం పొదుపు చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. అందుకే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు మీ కోసం పనిచేసేలా చేయాలి. దీనికి తోడు చక్రవడ్డీ (Compounding) శక్తిని అర్థం చేసుకోవడం, వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం, రిస్క్‌ను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి వివిధ మార్గాల్లో పెట్టుబడులను విభజించడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగులకు అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు ఏమిటో చూద్దాం.

    మ్యూచువల్ ఫండ్స్

    ఉద్యోగులకు కోటీశ్వరులయ్యే లక్ష్యాన్ని చేరేందుకు మ్యూచువల్ ఫండ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలలో ఒకటి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి సిప్‌ విధానం అనుకూలంగా ఉంటుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి జీతం పెరిగే కొద్దీ సిప్‌ మొత్తాన్ని పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.

    ఈక్విటీ ఫండ్స్

    దీర్ఘకాలంలో (10-15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) అధిక రాబడిని ఆశించేవారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్) అనుకూలం. ఇవి అధిక రిస్క్‌తో కూడినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించే శక్తిని కలిగి ఉంటాయి.

    డెట్ ఫండ్స్

    ఇవి బాండ్‌లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. తక్కువ రిస్క్, స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.

    ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్

    ఇవి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్. పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. అయితే వీటికి కనీసం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.

    ఈక్విటీ, స్టాక్ మార్కెట్

    పెట్టుబడిపై అధిక నియంత్రణ, అధిక రాబడిని కోరుకునే వారికి స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్‌పై, కంపెనీల ఫండమెంటల్స్‌పై మంచి అవగాహన ఉండాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్‌ కంటే అధిక రిస్క్‌తో కూడుకున్నది. దీర్ఘకాలికంగా బలంగా ఉన్న మంచి వృద్ధి సామర్థ్యం కలిగిన నాణ్యమైన కంపెనీల షేర్లను ఎంచుకోవడం వల్ల అద్భుతమైన రాబడిని పొందే అవకాశం ఉంది. మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని మాత్రమే డైరెక్ట్ ఈక్విటీకి కేటాయించడం, ఒకే రంగంలో లేదా ఒకే షేరులో ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా వైవిధ్యపరచడం చాలా ముఖ్యం.

    రియల్ ఎస్టేట్

    భౌతిక ఆస్తులు

    ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు లేదా వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అద్దెల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం, ఆస్తి విలువ పెరగడం ద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధి లభిస్తుంది. అయితే నిర్వహణ ఖర్చులు, లిక్విడిటీ లేకపోవడం (అంటే అవసరమైనప్పుడు త్వరగా నగదుగా మార్చలేకపోవడం) వంటి సవాళ్లు ఉంటాయి.

    రీట్స్‌(Real Estate Investment Trusts)

    రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదొక సులభమైన మార్గం. రీట్స్‌ అనేవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. వీటి ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, భారీ వాణిజ్య ఆస్తుల యజమాన్యంలో భాగస్వామి కావచ్చు. అద్దెల ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఇది తక్కువ రిస్క్‌తో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను అందిస్తుంది.

    చిన్న వ్యాపారాలు

    పెట్టుబడి పెట్టడం ద్వారా కాకుండా మీ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉద్యోగానికి భంగం కలగకుండా మీ నైపుణ్యాలు లేదా అభిరుచులకు అనుగుణంగా ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ సేవలు, కన్సల్టింగ్, లేదా చిన్న ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు.

    ఈ సైడ్ బిజినెస్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని పైన పేర్కొన్న పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకోవచ్చు. కొంతమంది విజయవంతమైన చిరు వ్యాపారాల్లో చిన్న మొత్తంలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. కానీ దీనికి ఆ వ్యాపారంపై పూర్తి అవగాహన ఉండాలి. ఇది కొంత రిస్క్‌తో కూడుకుంది.

    ఇతర ముఖ్యమైన పెట్టుబడి మార్గాలు

    పీపీఎఫ్: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రభుత్వం మద్దతుతో నడిచే సురక్షితమైన, దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనికి 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. రాబడి స్థిరంగా, పన్ను రహితంగా ఉంటుంది. ఇది తక్కువ రిస్క్ కోరుకునే వారికి అనుకూలం.

    ఎన్‌పీఎస్‌: జాతీయ పింఛను పథకం అనేది ఉద్యోగులకు దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు కోసం ఉద్దేశించింది. ఇది ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. సెక్షన్ 80సీ, 80సీసీడీ(1బీ) కింద అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది.

    బంగారం: భౌతిక బంగారం లేదా సావరీన్ గోల్డ్ బాండ్‌లు (SGBs), గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం తరచుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హెడ్జింగ్‌గా(ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మార్కెట్‌ పడుతున్నప్పడు బంగారం పెరుగుతుంది. ఈక్రమంలో మార్కెట్‌ పడినప్పుడు బంగారంలోని పెట్టుబడి తీసి ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు) పనిచేస్తుంది. పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణకు సహాయపడుతుంది.

    ఇదీ చదవండి: బంగారం ధరలపై భారీ ఊరట.. తులం ఎంతంటే..

Sports

  • ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లైమ్ లివింగ్‌స్టోన్‌కు క‌ళ్లు చెదిరే ధ‌ర ద‌క్కింది. ఈ డేంజ‌రస్ ప్లేయ‌ర్ల‌ను రూ. 13 కోట్ల భారీ ధ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌తో వేలం తొలి రౌండ్‌లోకి వ‌చ్చిన అత‌డిని ద‌క్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.

    కానీ యాక్సలరేటెడ్ రౌండ్‌లో మాత్రం లివింగ్‌స్టోన్ కోసం ఫ్రాంచైజీలు ప్ర‌య‌త్నించాయి. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ తమ పర్స్‌లో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది. కానీ ఎస్ఆర్‌హెచ్ మాత్రం ఎక్క‌డ కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

     దీంతో ల‌క్నో పోటీ నుంచి త‌ప్పుకోంది. చివ‌రికి అత‌డు హైద‌రాబాద్ సొంత‌మ‌య్యాడు. లివింగ్‌స్టోన్ గ‌త సీజ‌న్‌లో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిథ్యం వ‌హించాడు. కానీ వేలానికి ముందు అత‌డిని ఆర్సీబీ త‌మ జ‌ట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన అత‌డికి జాక్ పాట్ త‌గిలింది.

    కానీ ఈ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. లియామ్ లివింగ్‌స్టోన్ మినహా మిగతా అందర్నీ అన్‌క్యాప్డ్ భార‌త ప్లేయర్ల‌నే కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వీళ్లే.. లియామ్ లివింగ్‌స్టోన్, సలీల్ అరోరా, క్రైన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, షాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్.
     

  • అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మకు జాక్ పాట్ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ కొనుగోలు చేసింది. త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ వీర్ రికార్డును కార్తీక్ స‌మం చేశాడు. 

    రూ.30 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన కార్తీక్ శ‌ర్మ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య బిడ్డింగ్ వార్ నెల‌కొంది. కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ పోటీ నుంచి త‌ప్పుకోవ‌డంతో అత‌డు సీఎస్‌కే సొంత‌మ‌య్యాడు. ఈ క్రమంలో కార్తీక్ శర్మ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపుతున్నారు.

    ఎవరీ కార్తీక్ శర్మ?
    రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ.. పవర్ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్‌కు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. 

    స్ట్రీట్ క్రికెట్‌తో త‌న ప్రయాణాన్ని ప్రారంభించిన కార్తీక్‌.. ఇప్పుడు ప్ర‌పంచంలోనే టాప్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. కార్తీక్ శర్మ ఆఖరిలో వచ్చి తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (SMAT) ఐదు మ్యాచ్‌ల్లో 160.24 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 133 పరుగులు చేశాడు.

     సీఎస్‌కే అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వేలానికి ముందే అతడిని సీఎస్‌కే ట్రయల్స్‌కు పిలిచింది.  కార్తీక్ ఇప్పటివరకు రాజస్తాన్ తరపున 12 టీ20లు ఆడి 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8 మ్యాచ్‌లు ఆడి 479 పరుగులు సాధించాడు.

     రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే ఉత్తరాఖండ్‌పై సెంచరీతో సత్తాచాటాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడి 445 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకునే అతడిపై భారీ మొత్తాన్ని సీఎస్‌కే వెచ్చించింది. అదేవిధంగా మరో యువ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ను సైతం రూ.14.20 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల కోసమే సీస్‌కే రూ.28 కోట్లపైన ఖర్చు చేసింది.
    చదవండి: IPL 2026: రూ.30 ల‌క్ష‌ల‌తో ఎంట్రీ.. క‌ట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు

  • అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. మంగళవారం దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 409 పరుగుల లక్ష్య చేధనలో మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. 

    దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో ప్రత్యర్ది జట్టు పతనాన్ని శాసించగా.. ఉద్దవ్‌ మోహన్‌ రెండు, ఖిలాన్‌ పటేల్‌, కనిష్క్‌ చౌహన్‌ తలా వికెట్‌ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంజా పంగి 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

    అభిజ్ఞాన్ డబుల్‌ సెంచరీ..
    ఇక టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 125 బంతులు ఆడిన అభిజ్ఞాన్ 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

    అతడితో పాటు వేదాంత్ త్రివేది (106 బంతుల్లో 90 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు)  హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వేదాంత్, అభిజ్ఞాన్ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  మలేషియా బౌలర్ మొహమ్మద్ అక్రమ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
    చదవండి: IPL 2026: రూ.30 ల‌క్ష‌ల‌తో ఎంట్రీ.. క‌ట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు

  • ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. రూ. 30ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్‌రౌండర్‌.. నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు.

    రికార్డు ధర దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ వీర్.  దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీ పడి మరి అతడిని సీఎస్‌కే సొంతం చేసుకుంది. 

    తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సీఎస్‌కే ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్‌స్టోన్ వం‍టి విధ్వంసకర ఆల్‌రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సీఎస్‌కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్‌(రూ. 10 కోట్లు) పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రి​కార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరీ ప్రశాంత్ వీర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

    ఎవరీ ప్రశాంత్ వీర్‌..?
    యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్‌.. అద్భుత‌మైన బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్‌. 20 ఏళ్ల ప్రశాంత్‌కు బ్యాట్‌తో పాటు  బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలార్డర్‌లో కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడడం అత‌డి స్పెషాలిటీ. అత‌డు లెఫ్మ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. యూపీ టీ20 లీగ్‌-2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్ర‌శాంత్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు. 

    ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన వీర్‌.. 320 ప‌రుగుల‌తో పాటు  ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 లీగ్‌లో అత‌డి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69 ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సీఎస్‌కే స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్‌కు పిలిచింది. 

    ట్రయల్స్‌లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సీఎస్‌కే అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సీఎస్‌కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరూ ఊహించలేదు. 

    ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో 112 పరుగుల (స్ట్రైక్ రేట్ 170)తో పాటు  9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అన్పించాడు. కాగా ప్రశాంత్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

    చదవండి: IPL 2026 Auction: సీఎస్‌కే వదిలేసింది.. క‌ట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
     

     

  • ఐపీఎల్‌-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేస‌ర్ మ‌తీషా ప‌తిరానాకు జాక్ పాట్ తగిలింది. అత‌డిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పోటీప‌డ్డాయి. 

    ఆ త‌ర్వాత ఢిల్లీ పోటీనుంచి త‌ప్పుకోవ‌డంతో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఈ జూనియ‌ర్ మ‌లింగ కోసం కేకేఆర్‌, ల‌క్నో మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ల‌క్నో అత‌డిని ద‌క్కించుకునేందుకు ఆఖ‌రివ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్‌ను పెంచుకుంటూ పోతుండడంతో ల‌క్నో వెన‌క్కి త‌గ్గింది. దీంతో ఈ యార్క‌ర్ల కింగ్ కేకేఆర్ సొంతమ‌య్యాడు.

    ప‌తిరానా త‌న ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అయితే నాలుగు సీజ‌న్‌ల పాటు త‌మ జ‌ట్టుకు ఆడిన ప‌తిరానాను సీఎస్‌కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వ‌చ్చిన ప‌తిరానాపై కాసుల వ‌ర్షం కురిసింది. గ‌త సీజ‌న్‌లో సీఎస్‌కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న ప‌తిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. 

    కాగా పతిరానా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పటికి.. సీఎస్‌కే లెజెండ్‌ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్‌ ఓవర్లలో కూడా తన పేస్‌ బౌలింగ్‌ ‍బ్యాటర్లను కట్టడి చేయగలడు. 

    అంతేకాకుండా ఈ జూనియర్‌ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు.  ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్‌ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.
    చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఐపీఎల్‌ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే?

     

  • అంతా ఊహించిందే జరిగింది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసింది.  ఈ విధ్వంసకర ఆటగాడిని రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన ముంబై ఇండియన్స్‌, కేకేఆర్ పోటీ ప‌డ్డాయి. 

    రూ. 2.75 కోట్ల‌తో ముంబై బిడ్‌ను ప్రారంభించింది. కానీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ముంబై పోటీ నుంచి త‌ప్పుకోంది. ఆ త‌ర్వాత కేకేఆర్, రాజస్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య పోటీ నెలకొంది. అనంతరం రాజస్తాన్‌ కూడా రేసు నుంచి వైదొలగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్‌ కోసం సీఎస్‌కే కూడా తీవ్రంగా శ్రమించింది. కానీ కేకేఆర్‌తో పోటీ పడలేక సీఎస్‌కే వెనక్కి తగ్గింది. దీంతో గ్రీన్‌ కేకేఆర్‌ సొంతమయ్యాడు.

    గ్రీన్‌ రికార్డు..
    ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డులలెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (రూ.24.75) పేరిట ఉండేది. తాజా వేలంతో స్టార్క్‌ను గ్రీన్‌ వెనక్కి నెట్టాడు. అదేవిధంగా ఓవరాల్‌గా ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పొందిన మూడో ప్లేయర్‌గా గ్రీన్‌ నిలిచాడు. ఈ జాబితాలో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌(రూ.27 కోట్లు) అగ్రస్ధానంలో ఉండగా.. శ్రేయస్‌ అయ్యర్‌(రూ. 26.75 కోట్లు) ఉన్నాడు.

    గ్రీన్‌కు వచ్చేది ఎన్ని కోట్లంటే?
    అయితే గ్రీన్ దక్కించుకున్న రూ. 25.20 కోట్లలో బీసీసీఐ కోత విధించనుంది. , ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. విదేశీ ప్లేయర్ 18 కోట్ల కంటే ఎక్కువ పలికితే, ఆపై మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ  ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు బీసీసీఐకి వెళ్లనున్నాయి.
    చదవండి: దంచికొట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. కానీ..
     

  • ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌. గాయం కారణంగా మరికొన్ని వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. 34 ఏళ్ల ఈ ఆసీస్‌ ఫాస్ట్‌బౌలర్‌.. స్వదేశంలో జరిగిన గత 25 మ్యాచ్‌లలో 15 గాయాల వల్ల మిస్సయ్యాడు.

    ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్‌ టెస్టులకూ హాజిల్‌వుడ్‌ అందుబాటులో లేకుండా పోయాడు. తన కెరీర్‌లో ఇప్పటికి 76 టెస్టులు ఆడిన హాజిల్‌వుడ్‌.. 295 వికెట్లు కూల్చాడు. అయితే, మూడు వందల వికెట్ల అరుదైన క్లబ్‌లో ఇప్పట్లో చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.

    వేధిస్తున్న గాయాలు
    కెరీర్‌ ఆరంభం నుంచి అద్భుతంగా ఆకట్టుకున్న హాజిల్‌వుడ్‌.. స్వదేశంలో, విదేశాల్లో తనదైన శైలిలో రాణించాడు. అయితే, ముందుగా చెప్పినట్లు గత కొన్నాళ్లుగా అతడి టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్‌ చేసేందుకు సహకరించడం లేదు. 

    పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు తరచూ అతడిని వేధిస్తున్నాయి. తాజాగా చీలమండ వెనుక భాగం నొప్పి తీవ్రం కావడంతో హాజిల్‌వుడ్‌ యాషెస్‌ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు.

    రేసులో వారంతా
    గత ఐదు వేసవి సీజన్లలో ఆసీస్‌ ఆడిన ఇరవై టెస్టుల్లో హాజిల్‌వుడ్‌ పది మాత్రమే ఆడాడు. నైపుణ్యాల పరంగా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నప్పటికీ గాయాల బెడద వల్ల అతడి టెస్టు కెరీర్‌ ముందుగానే ముగింపు దశకు చేరుకునేలా ఉంది. హాజిల్‌వుడ్‌ స్థాయిలో కాకపోయినా.. స్కాట్‌ బోలాండ్‌, మైఖేల్‌ నెసర్‌, బ్రెండన్‌ డాగట్‌, జేవియర్‌ బార్ట్‌లెల్‌, సీన్‌ అబాట్‌ వంటి పేసర్లు సత్తా చాటుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు.

    టెస్టులకు రిటైర్మెంట్‌ ఇస్తాడా?
    ఇలాంటి తరుణంలో గాయాల వల్ల హాజిల్‌వుడ్‌ తరచూ జట్టుకు దూరం కావడం.. అతడి కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టెస్టుల సంగతి పక్కనపెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హాజిల్‌వుడ్‌కు తిరుగులేదన్నది వాస్తవం. ప్రపంచస్థాయి టీ20 అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు కొనసాగుతున్నాడు.

    ఆసీస్‌ 2021లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో హాజిల్‌వుడ్‌దీ కీలక పాత్ర. వన్డేల్లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2027లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగే ఆస్ట్రేలియాకు అతడి సేవలు అత్యంత ముఖ్యం.

    తెలివైన నిర్ణయం తీసుకుంటేనే
    ఈ పరిణామాలను బట్టి ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్ట్యా హాజిల్‌వుడ్‌ టెస్టులకు వీడ్కోలు పలికి.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ ఫార్మాట్‌కు స్వస్తి పలికి టీ20, వన్డేలలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తేనే కెరీర్‌కు మరికొన్నాళ్లపాటు ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

    అయితే, పూర్తిగా టెస్టులకు వీడ్కోలు పలకపోయినా.. కొన్నాళ్ల పాటు ఆ ఫార్మాట్‌కు దూరంగా ఉంటే పరిస్థితి చక్కబడవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న హాజిల్‌వుడ్‌.. కెరీర్‌ కొనసాగింపులో భాగంగా ఈ దశలో తెలివైన నిర్ణయం తీసుకుంటేనే అంతా సజావుగా సాగిపోతుందని మెజారిటీ మంది అభిప్రాయం. అయితే, హాజిల్‌వుడ్‌ మాత్రం తనలో ఇంకా మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పేర్కొనడం కొసమెరుపు.

    చదవండి: Ashes: మూడో టెస్టుకు ఆసీస్‌ తుదిజట్టు ప్రకటన.. వాళ్లిద్దరిపై వేటు

  • IPL 2026 Auction LIVE Updates And Highlights: అబుదాబి వేదికగా ఐపీఎల్‌-2026 మినీ వేలం ముగిసింది. మొత్తం పది ఫ్రాంచైజీలు 77 స్ధానాలను భర్తీ చేశాయి. ఈ వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన ఆట‌గాడిగా ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ నిలిచాడు. రూ.25.20 కోట్ల భారీ ధ‌ర‌కు అత‌డిని కేకేఆర్‌ సొంతం చేసుకుంది. అన్‌ క్యాప్డ్‌ ఆటగాళ్లు ప్రశాంత్‌ వీర్‌, కార్తీక్‌ శర్మలను రూ.14.20 కోట్ల రికార్డు ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసుకుంది. వారిద్దరి కోసమే చెన్నై రూ.28 కోట్ల పైగా ఖర్చు చేసింది.

    👉ఆంధ్ర పేసర్‌ పృథ్వీ రాజ్‌ యర్రాను రూ.30 లక్షల కనీస ధరకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది.

    👉పృథ్వీ షాను రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

    👉హైద‌రాబాద్ ఆట‌గాడు అమన్ రావు పేరాలను రూ.30 లక్షలకు తీసుకున్న రాజస్తాన్ రాయ‌ల్స్‌

    👉ఆసీస్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ ఇంగ్లిష్‌ను రూ.8.60 కోట్ల భారీ ధ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

    👉లుంగీ ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ ద‌క్కించుకుంది.

    👉రాహుల్ చాహర్‌ను రూ.5.20 కోట్ల​కు సీఎస్‌కే సొంతం చేసుకుంది.

    👉ఆసీస్ బౌలర్ బెన్ దుర్హనియస్‌ను రూ.4.40 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.

    👉ఆకాష్ దీప్‌ను, మాట్ హెన్రిలను కేకేఆర్‌, సీఎస్‌కే కొనుగోలు చేశాయి. రూ.2 కోట్ల కనీస ధరకే దక్కించుకున్నాయి.

    👉కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను రూ.2 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది.

    👉ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్ల​కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

    👉పృథ్వీషా, దీపక్‌ హుడా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

    👉టీమిండియా బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ను రూ.75 ల‌క్ష‌ల‌కు సీఎస్‌కే సొంతం చేసుకుంది. తొలి రౌండ్‌లో అమ్ముడుపోని స‌ర్ఫరాజ్‌ను.. ఆఖరి రౌండ్‌లో చెన్నై ద‌క్కించుకుంది.

    👉అమిత్‌ కుమార్‌ను రూ. 30 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది.

    👉భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ మంగేష్‌ యాదవ్‌ను రూ.5.20 కోట్ల భారీ ధర​కు ఆర్సీబీ దక్కించుకుంది.

    👉సైల్‌ ఆరోరాను రూ. 1.50 కోట్ల​కు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది.

    👉రవిసింగ్‌ను రూ.30 లక్షలకు రాజస్తాన్‌ కైవసం చేసుకుంది.

    👉డానిష్‌ మలేవార్‌ రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

    👉 భారత అన్‌క్యాప్డ్‌ అక్షత్‌ రఘువంశీని రూ.2.20 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

    👉బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను రూ.9.20 కోట్ల​కు కేకేఆర్ కొనుగోలు చేసింది.

    👉వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ను రూ.7 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఆసీస్‌ ప్లేయర్‌ మాథ్యూ షార్ట్‌ను సీఎస్‌కే రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.

    👉రాహుల్‌ త్రిపాఠీని రూ.75 లక్షల కనీస ధరకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

    👉శ్రీలంక స్టార్‌ ఓపెనర్‌ ఫాథుమ్‌ నిస్సాంకను రూ.4 కోట్ల​కు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

    👉నమన్‌ తివారీని కోటిరూపయాలకు లక్నో సొంతం చేసుకుంది.

    👉అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లకు లక్నో, తేజస్వీ సింగ్‌ను రూ.3 కోట్ల​కు కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

    కార్తీక్‌ శర్మకు రూ. 14. 25 కోట్లు
    ఐపీఎల్‌-2026 వేలంలో మరో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ పంట పండింది. రాజస్తాన్‌కు చెందిన కార్తీక్‌ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

    యూపీ ఆటగాడికి జాక్‌ పాట్‌.. 
    ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్‌ ఆటగాడు ప్రశాంత్‌ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. రూ.14.20 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్‌ కోసం సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు సీఎస్‌కే సొంతమయ్యాడు.

    భారత వెటరన్‌ ప్లేయర్‌ విజయ్‌ శంకర్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

    అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు భారీ ధర..
    జమ్ముకాశ్మీర్‌ పేసర్‌ అకిబ్‌ నబీకి ఊహించని ధర దక్కింది. రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని రూ.8.4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

    👉విండీస్‌ స్పిన్నర్‌ అకిల్‌ హోస్సేన్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు సీఎస్‌కే సొంతం చేసుకుంది.

    బిష్ణోయ్‌కు భారీ ధర..
    భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను రూ. 7.20 కోట్ల భారీ ధరకు  రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

    👉సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జేను రూ. 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.

    పతిరానాకు జాక్‌పాట్‌..
    శ్రీలంక యువ పేస‌ర్ మ‌తీషా ప‌తిరానాను రూ. 18 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది.

     

    ఆర్సీబీలోకి కివీ స్టార్‌ పేసర్‌
    న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ జాకబ్‌ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

    ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి డకెట్‌..
    బెన్‌ డకెట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకోగా.. అలెన్‌ను కేకేఆర్‌ దక్కించుకుంది. వీరిద్దరూ రూ. 2 కోట్ల బెస్‌ ప్రైస్‌కు అమ్ముడుపోయారు.

    ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?

    ముంబైలోకి డికాక్‌..
    సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌  క్వింటన్‌ డికాక్‌ను రూ. కోటి రూపాయల కనీస ధర​‍కు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.

    👉దీపక్‌ హుడా, కేఎస్‌ భరత్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.


    ఆర్సీబీలోకి వెంకటేశ్‌ అయ్యర్‌..
    భారత ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను రూ.7 కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్‌ కోసం కేకేఆర్‌, ఆర్సీబీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌ పోటీ పడ్డాయి. కేకేఆర్‌, ల​క్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు.

    లక్నోలోకి హసరంగ
    శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాను రూ. 2 కోట్ల బెస్‌ప్రెస్‌కు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది.

    👉ఇంగ్లండ్ క్రికెటర్‌ గస్‌ అట్కిన్సన్‌, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్‌, అమ్ముడుపోలేదు.

    సర్ఫరాజ్‌ ఖాన్‌ అన్‌సోల్డ్‌
    భార‌త ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. క‌నీస ధర రూ.75లక్షల‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయ‌లేదు.

    గ్రీన్‌కు కళ్లు చెదిరే ధర.. రూ. 25.20 కోట్లకు కేకేఆర్‌ సొంతం
    ఊహించినట్లుగానే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌పై కాసులు వర్షం కురిసింది. గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతానైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకుంది. అతడిని దక్కించుకునేందుకు మొదటిలో కేకేఆర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాయల్స్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో సీఎస్‌కే ఎంట్రీ ఇచ్చింది. సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య తీవ్రమైన బిడ్డింగ్‌ వార్‌ జరిగింది. ఆఖరిలో సీఎస్‌కే రేసు నుంచి తప్పుకోవడంతో గ్రీన్‌ కేకేఆర్‌ సొంతమయ్యాడు.

    పృథ్వీ షా అన్‌సోల్డ్‌..
    టీమిండియా ప్లేయర్‌ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతడితో పాటు కివీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే సైతం అమ్ముడు పోలేదు.

    ఢిల్లీకి డేవిడ్‌ మిల్లర్‌
    ఐపీఎల్‌-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్‌గా డేవిడ్‌ మిల్లర్‌ నిలిచాడు. మిల్లర్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

    మెక్‌గర్క్‌కు షాక్‌..
    ఐపీఎల్‌-2026 మినీ వేలం  ప్రారంభమైంది. ఈ వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్‌గా ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌గర్క్‌ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

    మరి కాసేపట్లో ఐపీఎల్‌ వేలం..
    ఐపీఎల్‌-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయ‌ర్లు త‌మ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. 

    కేకేఆర్‌ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్‌తో ముంబై ఇండియన్స్‌ చివరిస్థానంలో ఉంది. 

    గ్రీన్‌పై అందరి కళ్లు?
    ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌  కామెరాన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్‌ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ఆట‌గాళ్ల‌కు భారీ ధ‌ర దక్కనున్నట్లు క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Telangana

  • నిజామాబాద్‌:  జిల్లాలోని ఇందల్వాయిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాతకక్షల కారణమా.. లేక వేరే ఏ కారణాలో కానీ లారీడ్రైవర్‌ సల్మాన్‌పై కొంతమంది దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ సల్మాన్‌ మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కాల్పుల కలకలం అనేది తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

     

  • హైదరాబాద్‌: ఆస్ట్రేలియా ఉగ్రదాడి కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ ఉగ్రదాడికి పాల్పడిన సాజిద్‌ అక్రమ్‌ అనే వ్యక్తికి హైదరాబాద్‌ నగరంతో లింక్స్‌ ఉన్నట్లు వెల్లడైంది. సాజిద్‌ హైదరాబాద్‌లో వీసా పొందినట్లు గుర్తించారు. స్టూడెంట్‌ వీసాపై 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్‌.. 2001లో పార్టనర్‌ వీసాగా మార్చుకున్నాడు. 

    ఆపై 2002లో రెసిడెంట్‌ రిటర్న్స్‌ వీసా పొందాడు సాజిద్‌. 2022లో టోలీచౌక్‌లోని ఆస్తులను అమ్ముకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోనే బీకామ్‌ డిగ్రీ పూర్తి చేసిన్‌ సాజిద్‌.. అక్కడ యూరోపియన్‌ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

    దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. సాజిద్‌ అనే వ్యక్తి 27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని, తిరిగి భారత్‌కు ఆరుసార్లు మాత్రమే వచ్చాడన్నారు. సాజిద్‌తో తెలంగాణకు కానీ, భారత్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ వెల్లడించారు. 

    సాజిద్ చివరిసారిగా 2022లో భారత్‌కు..
    భారతదేశంలోని సాజిద్ బంధువుల ప్రకారం, గత 27 సంవత్సరాలుగా సాజిద్ కు తన కుటుంబంతో చాలా తక్కువ సంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత అతను ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించాడు. దీనికి కారణం ఆస్తికి సంబంధించిన కుటుంబ సమస్యలు. 

    ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, సాజిద్ చివరిసారిగా 2022లో భారతదేశాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతను భారతదేశాన్ని సందర్శించలేదని సమాచారం. సాజిద్ లేదా నవీద్ యొక్క తీవ్రమైన అభిప్రాయాలు లేదా కార్యకలాపాల గురించి తమకు తెలియదని కుటుంబం వాదిస్తోంది.

    అంతకుముందు, సాజిద్ అక్రమ్ గత నెల నవంబర్ 1న తన కుమారుడు నవీద్‌తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్లాడని ఫిలిప్పీన్స్ అధికారులను ఉటంకిస్తూ  సీఎన్‌ఎన్‌ ప్రచురించింది.

    సాజిద్ భారతీయ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించగా, అతని కుమారుడు ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించాడు. వారు ఒక నెల నుండి దాడికి ప్రణాళిక వేశారు

    కాగా, ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం(డిసెంబర్‌ 14వ తేదీ) ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ జరుపుకుంటున్న యూదులపై సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ అనే తండ్రికొడుకులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 16మంది మరణించగా 40 మందికి గాయాలయ్యాయి. దాడి చేసిన వారు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని అధికారులు తెలిపారు. ‍

    ఇదీ చదవండి:

    బీచ్‌ అటాక్‌.. ఉగ్రవాది తల్లి సంచలన విషయాలు..

    బాండీ బీచ్‌ హీరోకు సర్వత్రా ప్రశంసలు.. భారీ విరాళాలు

  • హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ డిజిటల్‌ సేవల వేదిక మీ సేవా (MeeSeva) కింద ప్రారంభించిన వాట్సాప్‌/చాట్‌బాట్‌ సేవను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు 22 రోజుల్లోనే 2.7 లక్షల సార్లు ఉపయోగించారని రాష్ట్ర ఐటీ మంత్రి డి. శ్రీధర్‌బాబు తెలిపారు.

    నవంబర్‌ 18న మీ సేవా కింద అదనపు డిజిటల్‌ ఛానల్‌గా ఈ సేవను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ప్రజలు ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండానే ప్రభుత్వ సేవలు పొందగలుగుతున్నారు. ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయవచ్చు. బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తుల స్థితిని పరిశీలించవచ్చు. ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు.

    ఈ సేవ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని మంత్రి తెలిపారు. ప్రజల కేంద్రిత డిజిటల్‌ పరిపాలనను మరింత విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

    ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ESD) విభాగం వెల్లడించిన గణాంకాల ప్రకారం, నవంబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 9 వరకు మీ సేవా వాట్సాప్‌ సేవను ప్రజలు మొత్తం 2,78,267 సార్లు వినియోగించారు. ఈ కాలంలో 2,09,084 వేర్వేరు మొబైల్‌ నంబర్ల నుంచి ప్రజలు ఈ సేవను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

    అదే సమయంలో 75,655 దరఖాస్తు ఫారాలు సమర్పించబడ్డాయి. వీటిలో 1,403 మాత్రమే నిజమైన దరఖాస్తులు కాగా, మిగిలినవి సేవల గురించి తెలుసుకునేందుకు లేదా విధానాన్ని అర్థం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలుగా అధికారులు పేర్కొన్నారు. అలాగే 45,829 సార్లు దరఖాస్తుల స్థితి పరిశీలించబడింది. మొత్తం విజయ శాతం 81.3 శాతంగా నమోదైంది.

    ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న సేవల్లో జనన ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పోలీస్‌ చలాన్లు, విద్యుత్‌ బిల్లుల సేవలు ఉన్నాయి. రోజువారీ పరిపాలనా అవసరాలకు వాట్సాప్‌ ఒక సులభమైన, నమ్మదగిన వేదికగా మారుతోందని మంత్రి తెలిపారు.

    భవిష్యత్తులోనూ మీ సేవా ద్వారా మరిన్ని డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని, ప్రజలకు సులభంగా, నిరంతరాయంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

  • ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్‌లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

    పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి. 

    అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

    పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత

Politics

  • తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్‌ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు. 

    ఈరోజు(మంగళవారం, డిసెంబర్‌ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. 

    ‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్‌  సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 

    కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు  ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది.  అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు  సిద్దమా?’ అని సవాల్‌ చేశారు.

  • సాక్షి, విజయవాడ: న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్‌లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

    ‘‘25 ఏళ్లుగా 42 కుటుంబాలు ఇక్కడే ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అనుమతి కూడా ఉంది. అయినా కూడా వీళ్ల ఇళ్లను ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 31వ తేదీ వరకు సుప్రీం కోర్టు వీళ్లకు ఊరట ఇచ్చింది. పోలీసులు ప్రైవేట్‌ పార్టీకి మద్దతుగా ఈ కూల్చివేతలు జరిపారు. 200 మంది పోలీసులు ఈ కూల్చివేతలు జరిపారు. ప్రైవేట్‌ వ్యక్తులకు లబ్ధి చేసేందుకు ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి. అధికార దుర్వినియోగం చేస్తూ ఇక్కడి వాళ్లను రోడ్డుపాలు చేశారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. 

    సుప్రీంకోర్టులో కేసు ఉండగానే JCBలతో కూల్చేశారు జగన్ ఫైర్

    .. 2.17 ఎకరాల ఈ భూమి విలువ రూ.150 కోట్ల దాకా ఉంటుంది. 2016లో ఫేక్‌ సొసైటీ క్రియేట్‌ చేశారు. అప్పటి నంచే ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్‌ వేశారు. కూల్చివేతల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పేటర్‌ సోదరుడి ప్రమేయం కూడా ఉంది. బాధితులు చంద్రబాబును మూడుసార్లు కలిశారు. లోకేష్‌ను రెండు సార్లు కలిశారు. ఆ ఇద్దరికీ వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కూడా కుట్రపూరితంగా.. చంద్రబాబు, లోకేష్‌, చిన్నిలు బాధితులకు అన్యాయం చేశారు. బుల్డోజర్లతో మధ్యతరగతి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు’’ అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

    ప్లాట్లకు అన్నిరకాల అనుమతులు కూడా ఉన్నాయి. బ్యాంకుల నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. అయినా కూడా కుట్ర పన్ని కూల్చివేతలు జరిపారు. స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు?. ఇళ్లకు ఎలా అనుమతులు ఇచ్చారు?.. బ్యాంకు లోన్లు ఎలా వచ్చాయి?.. క్రయవిక్రయాలపై పేపర్లలలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? అని ప్రశ్నించారాయన. 

     

    ఈ క్రమంలో ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించాలని.. వాళ్ల బ్యాంకు లోన్లు కూడా ప్రభుత్వమే కట్టాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. అవసరమైన న్యాయ సహకారం కూడా అందిస్తాం. ఒకవేళ  మీరు ఎంక్వైరీ వేయకపోతే.. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పని చేస్తుంది. దోషులుగా మిమ్మల్ని కోర్టు ముందు నిలబెడుతుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

  • సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్‌ భారత్‌ - జీ- రామ్‌- జీ (గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (గ్రామీణ్‌)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో కొత్త బిల్లును తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు చట్టాన్ని బలహీనపరుస్తుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

    ఎవరైనా వ్యక్తిగత అభిలాష, పక్షపాతం, స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు చేయకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ ఇచ్చే MGNREGS పథకాన్ని రద్దు చేసి కొత్త బిల్లుతో భర్తీ చేయడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు రైతులు, కార్మికులు, గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా బలమైన నిరసన వ్యక్తం చేస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశంలోని కోట్లాది కుటుంబాలకు రక్షణ కవచం. దానిని బలహీనపరచడం ప్రజల హక్కులను హరించడం అవుతుందని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా ఈ బిల్లుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

    గాంధీ పేరు తొలగించడం అనైతికం: థరూర్ వ్యాఖ్యలు 
    కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిరసనకు మద్దతు తెలిపారు. రాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయొద్దు అంటూ కేంద్రాన్ని కోరారు. ప్రజల జీవనోపాధి కోసం రూపొందించిన పథకానికి పేరు మార్చడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడే పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని స్పష్టం చేశారు.

    ఈ మేరకు పార్లమెంటులో మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరును తొలగించి "జిరాంజీ"గా మార్చడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తన్నాయేగానీ.. కాంగ్రెస్‌ పార్టీ  నుంచి కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ నేత బిట్ల బాలరాజు, ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం కేటీఆర్‌ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారాయన. అనంతరం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

    రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉంది. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదు.. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

    "ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని హెచ్చరించారాయన. 

    గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు. నల్గొండలో మల్లయ్య యాదవ్ హత్య, సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన ఘటనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. గాయపడిన భారతి గారి కుటుంబానికి, ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామని.. న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. 

    ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. "ఖబడ్దార్ కాంగ్రెస్ గుండాలారా" అంటూ నినాదాలు చేశారు. 

    ప్రభుత్వానికి కేటీఆర్‌ డిమాండ్లు.. 
    భారతి పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెతో పాటు బాలరాజులపై దాడి చేసిన వారిని, ఆ దాడికి ప్రేరేపించిన వారిపై కూడా వెంటనే 'అటెంప్ట్ టు మర్డర్' (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలి. వెంటనే దోషులను అరెస్ట్‌ చేసి బాధితుల పక్షాన నిలబడాలి. ఆసుపత్రి పాలైన ఆ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరామర్శలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, స్థానిక కార్యకర్తలు కేటీఆర్‌ వెంట ఉన్నారు.

National

  • భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇప్పటివరకూ 1,104 అక్రమ చొరబాట్ల సంఘటనలు జరిగాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆయన మాట్లాడారు. భారత్‌తో సరిహాద్దు చొరబాట్లపై లోక్‌సభలో ఆయన వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

    2025 సంవత్సరం నవంబర్‌ నాటికి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు, ఇతర అంశాలపై కేంద్రమంత్రి లోక్‌సభలో వివరాలు అందించారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న వారిలో అధికంగా 1,104 చొరబాట్లు బంగ్లాదేశ్ నుండే జరిగాయన్నారు. వారిలో 2,556 మందిని అరెస్టు చేశామన్నారు. వీటితో పాటు చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, మయన్మార్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ‍ప్రయత్నాలు జరిగాయని వారందరినీ అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

    ఇండియా- బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుందని తెలిపారు.  ఆ ప్రదేశంలో దాదాపు 79 శాతం ప్రాంతానికి కంచె ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో 2,289 కిలోమీటర్ల మేర బార్డర్‌ ఉండగా దానిలో 93 శాతంగా పైగా ఫెన్సింగ్‌ పూర్తయినట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 8,500 చొరబాటు ఘటనలు జరగగా 20,800మందిని అరెస్టు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

    కేంద్రమంత్రిత్వ శాఖ నివేదిక 2014-2024

    బంగ్లానుంచి 7,500 చొరబాటు ఘటనలు జరుగగా 18,800 మంది అరెస్టు.

    పాకిస్థాన్ నుంచి 420 చొరబాటు ఘటనలు 560 మంది అరెస్టు. 

    మయన్మార్‌ నుంచి 290 ఘటనసలు జరుగగా 1,150 మంది అరెస్టు.

    నేపాల్, భూటాన్‌ నుంచి 160 ఘటనలు జరుగగా 260 మంది అరెస్టు జరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి పార్లమెంటులో నివేదిక సమర్పించారు.

  • ఢిల్లీ: సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణరాజుకు భారీ షాక్‌ తగిలింది. ఇండ్‌ భారత్‌ కేసులో స్టేను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తివేసింది. దాంతో సీబీఐ దర్యాప్తునకు అడ్డంగి తొలగింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని సీజేఐ ధర్మాసనం తేల్చిచెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్‌ఐఆర్‌న క్వాష్‌ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. 

    రఘురామ కృష్ణం రాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీల కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఎత్తివేసింది. ఖాతాల ఫ్రాడ్ తదితర అంశాలపై ఇతర న్యాయస్థానాల్లో  సవాల్ చేసే స్వేచ్ఛ  ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. 

    ఫలితంగా ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఇక సీబీఐ  దర్యాప్తు వేగవంతం కానుంది. బ్యాంకుల కన్సర్షియం నుంచి వేలకోట్ల రూపాయలు అప్పులు తీసుకొని నిధులు దారి మళ్లించిన రఘురామ కృష్ణంరాజు కంపెనీ.. గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్‌డీలు చేసి.. వాటిపై మళ్లీ రుణాలు తీసుకుంది. 

  • ఇటీవల ఇండిగో విమానాల రద్దు ఎపిసోడ్‌ పెద్ద హాట్‌ టాపిక్‌. ఇండిగో ప్రయాణికుల తిప్పలు ఇక్కడ వర్ణనాతీతం.   కొత్త పైలట్ విశ్రాంతి నియమాలు, షెడ్యూల్ ప్లానింగ్ లోపాలు,  శీతాకాల రోస్టర్ ఒత్తిడి వల్లే ఈ భారీ రద్దులు జరిగాయి  ఫలితంగా ప్రయాణికులకు అవస‍్థల తప్పలేదు. అయితే వీటితో ఇప్పడు ఒక సంఘటన వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న వరుడు.. ఇండిగో విమానం రద్దుతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. 

    అది కూడా పెళ్లి చివరి నిమిషంలో ఫ్లైట్‌ రద్దైన విషయం తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని వధువుకి కూడా చేరవేశాడు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు.  వరుడు ఎక్కడో ఉన్నాడు.. వధువు కూడా వేరే చోట అంటే ఫ్లైట్‌ .జర్నీ చేసి వస్తే కానీ ముహూర్తానికి అందనంత దూరంలో ఉంది. ఒకవైపు పెళ్లి కొడుకులో టెన్షన్‌..మరొకవైపు పెళ్లి కూతురిలో అంతకుమించి ఆందోళన. 

    ముహూర్తం సమయానికి పెళ్లి అవుద్దా.. లేదా అనే సందిగ్థంలో పడింది. అయితే వరుడ మాత్రం తన ప్రేమకు ఎల్లలు లేవని భావించాడు. అందుకే చార్టర్‌ ఫ్లైట్‌(ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం)లో వాలిపోయాడు. ఇంకేముంది కథ సుఖాంతమైంది.. వధువు అనందానికి హద్దుల్లేకుండా పోయింది. వరుడుకి ఘనస్వాగతం లభించింది.. వధువు తన డ్యాన్స్‌తో అలరించి కాబోయే భర్తకు ఘనంగా ఆహ్వానం పలికింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ  ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

     

     

  • ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మావోయిస్టులకు పునారావాసం కల్పించడానికి సరైన ఏర్పాట్లు చేసిందని బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. "పునారావాసం - పునరుజ్జీవనం" కార్యక్రమం ద్యారా మావోయిస్టులకు నూతన జీవితం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజాపూర్‌లో మంగళవారం 34మంది నక్సల్స్ లొంగిపోయారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

    ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మంగళవారం 34 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు బీజాపూర్‌ పోలీసులు ప్రకటించారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారిపై రివార్డు రూ. 84 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికి పునరావాసం పునరుజ్జీవనం కార్యక్రమం ద్వారా నూతన జీవితం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.  

    బీజాపూర్ జిల్లాలో జనవరి1, 2024 నుంచి మెుత్తం 824 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోగా 1079 మంది అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు.  220 మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్లలో మరణించినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి కొత్తజీవితం కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగిలిన వారు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు పిలుపునిచ్చారు. 

    అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. కేంద్ర బలగాల ఎన్‌కౌంటర్లలో ఆ పార్టీ సభ్యులు పెద్దసంఖ్యలో మృతిచెందారు. దానితో పాటు అధిక సంఖ్యలో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

  • సాక్షి శబరిమల:  "అందరికి ఫిర్యాదు లేని సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్‌ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్‌ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గతేడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్‌గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్‌ 24న  కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.

    ఇదంతా అయ్యప్ప మహిమే..
    దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే  అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..

    అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..
    కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్‌లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు. 

    చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్‌లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు. 

    స్పాట్‌ బుకింగ్‌ పెంపు ఎప్పుడంటే..
    సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్‌లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.

    ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్‌ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్‌.

    (చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..)

     

  • భారతదేశంలో ధూమపానం మరింత ఖరీదైనదిగా మారబోతోంది. భారత పార్లమెంటు సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025ను ఆమోదించింది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నును విధించేలా 1944 సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది.  దీన్ని ఈ నేపథ్యంలో  పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు గణనీయంగా పెరగనున్నాయి.  అధిక సుంకాలు వినియోగదారుల ఖర్చులను తప్పనిసరిగా పెంచుతాయని, కాలక్రమేణా వినియోగాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

    పొగాకు వినియోగాన్ని అరికట్టడం , ప్రజారోగ్యాన్ని కాపాడటం అనే ఒకే స్పష్టమైన లక్ష్యంతో సిగరెట్లు, సిగార్లు, హుక్కా పొగాకు, నమిలే పొగాడు, సువాసనగల పొగాకుపై పన్నులను పెంచేందుకు ఈ చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. కొత్త  ప్రతిపాదన ప్రకారం సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం ఇప్పుడు పరిమాణం మరియు రకాన్ని బట్టి 1,000 రూ. 11,000 వరకు పెరగవచ్చు. చిన్న , ఫిల్టర్ సిగరెట్లు  ధరలు బాగా పెరుగుతాయి.  అటు ప్రీమియం వేరియంట్లపై కూడా ధరల పెంపు వాయింపు భారీగానే ఉండబోతోంది. పొగాకు సెస్సు రద్దు అయిన తర్వాత  కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెంచడానికి ఇది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటును కూడా కల్పిస్తుంది. 

    చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?

    ఇటీవలి సవరణ ప్రకారం ఉత్పత్తి చేయని , తయారు చేయబడిన పొగాకు, పొగాకు ఉత్పత్తులు , ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా పెంచింది. ప్రధాన రేటు పెరుగుదలలు బాగా కనిపిస్తున్నప్పటికీ, GST పరిహార సెస్ నిలిపివేయడం వల్ల  ఈ సవరణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  ఉదాహరణకు, గతంలో  రూ.200 నుండి  రూ. 735 వరకు  పలికిన 1,000  సిగరెట్ల ధర ఎక్సైజ్ సుంకం పెంపు తరువాత రకాన్ని బట్టి రూ.2,700 నుంచి  రూ.11,000గా ఉండనునున్నాయి.  ఈ రేట్లు  ఎప్పటినుంచి అమల్లో ఉంటాయి అనేది ప్రభుత్వం  ఇంకా స్పష్టం చేయలేదు.

    ఇతర పొగాకు ఉత్పత్తులు కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నాయి
    • నమిలే పొగాకు సుంకం 100శాతాకి పెంపు
    • హుక్కా పొగాకుపై సుంకం 40శాతానికి పెంపు
    • ముడి పొగాకుపై సుంకాలు 70శాతాని పెంపు
    • సువాసనగల పొగాకుపై పన్ను 100శాతంగా కొనసాగుతుంది.

    ఇదీ చదవండి: ఆధార్‌, పార్సిల్‌ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం

  • ఢిల్లీ కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి స్పందించారు. కేవలం తొమ్మిది, పది నెలల్లో  ఢిల్లీలోని కాలుష్య తీవ్రతను తగ్గించడం ఎన్నికైన ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రజలు తమ ప్రభుత్వాన్ని క్షమించాల్సిందిగా మంత్రి మంజీందర్ సింగ్‌ సిస్రా ప్రజలను కోరారు.

    ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత రోజురోజూకి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రాజధానిలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ‍ప్రభుత్వాలని ఆదేశించింది. అయితే గత మూడురోజులుగా ఢిల్లీలోని వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు.

    మంత్రి మంజీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ  "పర్యావరణ కాలుష్యం విషయంలో ఢిల్లీ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. తొమ్మిది లేదా పది నెలల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడం ఎన్నికైన ఏప్రభుత్వానికి సాధ్యం కాదు. అయితే వాయు కాలుష్యాన్ని నివారించడానికి గత ప్రభుత్వంతో పోల్చితే మెరుగైన చర్యలు మేము తీసుకుంటున్నాం" అని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిందని దానిని నివారించడానికి మేము సరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

    అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో  తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్‌ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది.   

  • ప్రతీకాత్మక చిత్రం

    డిజిటల్‌ అరెస్ట్‌ మోసానికి బలవుతున్న బాధితులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  నకిలీ అధికారుల వలలో పడి బాధితులు కోట్ల రూపాయలను  నష్టపోతున్నారు. బాధితుల్లో విద్యాధికులే ఎ క్కువగా ఉండటం మరింత విచారకరం. తాజగా  బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి 2 కోట్ల విలువైన ఆస్తులను  అమ్ముకున్న వైనం ఆందోళన  రేపుతోంది.  

    బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ నిపుణురాలు  బబితా దాస్ డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో  రూ. 2 కోట్లు నష్టపోయింది. నకిలీ పోలీసుల డిమాండ్లను  నెరవేర్చేందుకు  తను ఉంటున్న ఇంటినీ, మరో రెండు ప్లాట్లను తెగనమ్ముకుంది. బాధితురాలు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ, తన 10 ఏళ్ల కొడుకుతో కలిసి విజ్ఞాన్ నగర్‌లోని  ఫ్లాట్‌లో నివసిస్తోంది బబితా. జూన్‌లో, కొరియర్ అధికారిగా నటిస్తున్న ఒక వ్యక్తి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక అనుమానాస్పద లగేజీని తాము స్వాధీనం చేసుకున్నట్లు  నమ్మించాడు.

    ఆ కాల్‌ను తక్షణమే ముంబై పోలీసు అధికారులుగా చెప్పుకుంటున్న మరో కేటుగాళ్లకు బదిలీ చేశాడు. అరెస్టు చేస్తామని బెదిరించి, ధృవీకరణ పూర్తయ్యేవరకు బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మోసగాళ్లు ఒక నిర్దిష్ట మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలని బెదిరించారు. తమకు సహకరించి అలా చేయకపోతే,  కొడుకువిషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. తాము చెప్పినట్టుగా చెల్లింపులు చేసి, ఆ తరువాత పోలీసుల  ద్వారా తిరిగి పొందవచ్చని నమ్మబలికారు.

    చదవండి: గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్నభారత సంతతి మహిళ అరెస్ట్

    దీంతో బిడ్డ భవిష్యత్తు గురించి భయపడిపోయిన ఆమె వాళ్లు చెప్పినట్టే  చేసింది.  తక్కువ ధరకే మలూరు లోని రెండు ప్లాట్లను , ఇటు తాను ఉంటున్న విజ్ఞాన్ నగర్ ఫ్లాట్‌ను కూడా అమ్మేసింది. తద్వారా వచ్చిన సొమ్మును ను మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. దీంతో పాటు ఆమె బ్యాంకు నుండి రుణం కూడా తీసుకుని  సుమారు రూ. 2 కోట్లు  మోసగాళ్లకు చెల్లించింది. ఆ తరువాత మోసగాళ్లు తరువాత డబ్బును తిరిగి పొందడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పి, అకస్మాత్తుగా కాల్ కట్ చేశారు. ఆ తర్వాత యథావిధిగానే వారి ఫోన్లు స్విచ్ ఆఫ్  అయ్యాయి. దీంతో  మోసపోయానని గ్రహించిన ఆమె వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

    ఇదీ చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?

  • ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ  క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్‌ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు. 

    ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్‌ బెంగాల్‌ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్‌ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.

    లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం.

     


     

  • డిసెంబరు నెలలో తొలి పున్నమి వచ్చిందంటే చాలు.. గూడచి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలగపండ్లు రాశులు పోసి కనిపిస్తాయి. దైవ దర్శనం పూర్తి చేస్తున్న భక్తులందరూ ఈ రాశుల వద్దకు చేరి డజన్లకు డజన్లు కొనుగోలు చేస్తూ కనిపిస్తారు. ఎందుకంటే కర్ణాటకలోని బెళగావి జిల్లా, రామదుర్గ తాలూలోని గూడచి వీరభద్రేశ్వర స్వామి జాతరకు హాజరైన వారందరూ స్వామివారి ప్రసాదంలా వెలగపండ్లు ఇళ్లకు తీసుకెళ్లడం వాడుక. అనాది కాలపు సంప్రదాయం. పౌర్ణమితో మొదలై ఐదు రోజులపాటు వైభవంగా జరిగే ఈ జాతరలో బెళగావితోపాటు పొరుగునే ఉన్న బాగల్‌కోట, విజయపుర, హావేరి జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూంటారు. జాతర ఐదవ రోజున ఆలయంలో జరిగే లక్ష దీపోత్సవం ఒక హైలైట్‌. 

    సాంప్రదాయికంగా ఈ జాతర జరిగేది ఐదు రోజులే అయినప్పటికీ పౌర్ణమి నుంచి తరువాతి అమావాస్య వరకూ భక్తుల రాకపోకలు జోరుగానే సాగుతూంటాయి. వచ్చిన వారిలో అత్యధికులు వెలగపండ్లను ప్రసాదంగా తీసుకెళ్లడమూ కద్దు. మనమంటే వెలగపండ్లు అని పిలుస్తున్నాం కూడా కర్ణాటకలో దీనికి బోలెడన్ని పేర్లు. బేల, బలవత్తే, దంతశఠ, కపిత్థ అన్న పేర్లు వాడుకలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. ఇంగ్లీషులో ‘వుడ్‌ ఆపిల్‌’. వీరభద్రేశ్వర ఆలయమున్న రామదుర్గ ప్రాంతంలో బళువల అని పిలుస్తారు. ఈ పండ్లను తీసుకెళ్లడంతోనే జాతర పూర్తయినట్లు వీరి నమ్మకం. అందుకే ఈ జాతరకు వెలగపండ్ల జాతరని కూడా స్థానికులు పిలుస్తూంటారని ఈరణ్ణ కామన్నవర తెలిపారు. 

    లారీల కొద్దీ పంట..
    వీరభద్రేశ్వర స్వామి ఆలయ జాతరకు లారీల కొద్దీ వెలగపండ్లు వస్తూంటాయి. ఈ ఏడాది సుమారు 15 లారీల వరకూ పండ్లు వచ్చినట్లు సమాచారం. ఏటా సుమారు యాభై మంది వరకూ వ్యాపారులు ఇక్కడ వెలగపండ్ల విక్రయాలు సాగిస్తూంటారు. వీటిని రాశులుగా పోసుకుని అమ్ముకునేందుకు, భక్తుల అవసరాల కోసం గ్రామపంచాయతీ, జాతర కమిటీలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. జాతరకు వచ్చిన ఒక్కో కుటుంబం కనీసం ఐదారు డజన్ల వెలగపండ్లను ఖరీదు చేస్తాయని వ్యాపారి ద్యామణ్ణ నాగప్ప అమరగోళ తెలిపారు. మరి అన్ని పండ్లు ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తే.. ఊళ్లో బంధు మిత్రులకు జాతర ప్రసాదంగా పంచుతారని సమాధానమిచ్చారు ఆయన. వెలగపండ్ల గుజ్జుకు బెల్లం కలిపి ఒక్కరోజు వదిలి తింటే ఆ రుచి అద్భుతం అని మనలో చాలామందికి తెలుసుకదా? ప్రసాదంగా పొందిన వారందరూ అంత మధురానుభూతి పొందాలన్నది ఈ సంప్రదాయం ఉద్దేశమేమో?

    ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రామదుర్గం తాలూకాలో వెలగపండ్లు అందుబాటులో ఉండటం తక్కువ కావడం. హావేరీ, శిగ్గావి, హానగల్‌, గోందీ, అనవట్టి వంటి ప్రాంతాల్లో దొరికే పండ్లను వ్యాపారలు ఇక్కడకు తీసుకొస్తూంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధంలో మడివాళ మాచప్ప శరణరు సందర్శించిన సందర్భంలో ఇక్కడి ప్రజలు ఎక్కువ మంది రోగాలపాలై ఉన్నారట. పోషకాలతో నిండిన వెలగపండ్లు తింటే మేలు జరుగుతుందని చెబితే ప్రజలు పట్టించుకోరని.. వీరభద్రేశ్వర ఆలయం.. జాతర వంటి ఏర్పాట్లు చేశారని ప్రతీతి. ప్రసాదంగా ఈ వెలగపండ్లు పంచడం కూడా అప్పుడే మొదలైందని చెబుతారు. అయితే ఈ కథకు సంబంధించి ఎక్కడ రాతపూర్వక ఆనవాళ్లయితే లేవు. 

    పోషకాల పుట్ట...
    వాస్తవానికి వెలగపండ్లు పోషకాల పుట్ట. తీపి, పులుపు రుచులతో ఉండే ఈ పండులో విటమిన్‌-సీ, పొటాషియం, ఫాస్పరస్‌ తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు మందుగా పనిచేస్తుందని అంచనా. అంటే.. దైవ ప్రసాదం మంచి రుచిని మాత్రమే కాదు. ఆరోగ్యాన్నీ ఇస్తోందన్నమాట.
    - గానధళు శ్రీకంఠ, ప్రజావాణి సౌజన్యంతో

  • అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి 15 ఏళ్లుగా తన భార్య హిమానీతో సంసారం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతను తన భార్యను ఒక హోటల్‌లో మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆమె భర్తను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు.

    భర్త తెలిపిన వివరాల ప్రకారం 2018లో కూడా ఆమె ఒక హోటల్‌లో వేరే వ్యక్తితో పట్టుబడింది. అప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవి సంసారం కొనసాగించాడు.  అలాగే  ఆ సమయంలో భార్య తన తల్లిదండ్రుల సమక్షంలో క్షమాపణ చెప్పడంతో, పరిస్థితి చక్కబడుతుందని రవి ఆశించాడు. కానీ భార్య తీరుతెన్నులో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని రవితన భార్యకు చెందిన యాక్టివా వాహనానికి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

    ఇంతలో రవి పదేపదే ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో అనుమానం పెరిగింది. జీపీఎస్‌ లొకేషన్‌ను అనుసరించి రవి ఒక హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ రవి తన భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన దరిమిలా రవి తండ్రి పర్వేజ్ గులాటి ఆమె ఇక తన కుమారునితో ఉండనక్కరలేదని, వారి పుట్టింటికి వెళ్లిపోవాలని తెగేసి చెప్పాడు. కాగా ఆమెతో పాటు పట్టిబడిన వ్యక్తిని ఆమె గతంలో తన సోదరునిగా భర్తకు పరిచయం చేసిందని పర్వేజ్ గులాటి తెలిపారు. రవి తండ్రి పర్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తితో హిమానీ ఏడేళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తోంది. గతంలో క్షమాపణతో ఈ సమస్య శాంతియుతంగా ముగిసిందని భావించామని, అయితే అదే తప్పు మళ్లీ జరగడంతో  ఆమెపై గౌరవం పూర్తిగా పోయిదని పర్వేజ్‌ తెలిపారు. ఈ కథనం ‘న్యూస్‌ 18’లోని వివరాల ఆధారంగా రాయడం జరగింది.

Family

  • ధనుర్మాసం మొదలవ్వగానే అందరూ నెలగంట కడతారు అని అంటుంటారు. పైగా అప్పటి నుంచి ముంగిళ్ల అన్ని రంగవల్లులతో శోభాయమానంగా ఉంటాయి. అసలేంటి ఈ నెలగంట..అందులోని ఆంతర్యం గురించి సవివరంగా తెలుసుకుందామా..!

    నెలగంట కట్టడం అంటే, సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాసం (Dhanurmasam) ప్రారంభాన్ని సూచించే ఒక సంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి, గుడిలో గంటలు మోగిస్తూ, పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు.  సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడుఆలయంలో మోగే గంటల శబ్దమే "నెలగంట". 

    ఇవాళ (డిసెంబర్‌ 16 వ తేదీన) మధ్యాహ్నం (1. 23)ప్రాంతంలో ధనుస్సులో ప్రవేశిస్తాడు. దానినే మనం ధనుస్సంక్రమణం అంటాం! అలా ధనూరాశిలో ప్రవేశించిన సూర్యుడు - నెలంతా ఆ రాశిలోనే ఉంటాడు.  ఇలా సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించగానే  నెలగంట కట్టడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ తరువాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది మకర సంక్రమణం!.

    ఈ నెలగంట కట్టినది మొదలుకొని పెద్ద పండుగ అయ్యేంతవరకు ఊళ్ళో ఎవరూ ఏ శుభకార్యం చేయరు. అంటే ఈ నెలంతా ఈ దీక్షలోనే ఉంటారు. ఈ నెలగంట కట్టడంతో ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి..తిరుప్పావై పాశురాలు - వేకువజాము పూజలు నిర్వహిస్తారు. అంతేగాదు అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అలా భోగి పండుగ నాడు ఈ మార్గళి వ్రతం లేదా తిరుప్పావై పూర్తవుతుంది. ఒకరకంగా ఈ నెలగంట మన సంక్రాంతి పండుగ రాకను సూచిస్తుందని చెప్పొచ్చు.

    ఈ సమయంలో ఏం చేస్తారంటే..
    పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.

    (చదవండి: ఈశ్వరీ..జగదీశ్వరీ..)
     

     

     

  • ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా స్వతహాగా ఆహారప్రియుడు. తరచుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో ఆహారం పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. అలానే ఈసారి కూడా గజగజ వణికించే ఈ చలిలో తనెంతో ఇష్టంగా తినే ఆహారాన్ని షేర్‌ చేశారు. దీన్ని శీతకాలపు చిరుతిండిగా అభివర్ణిస్తూ..ఆ రెసీపి తయరీతో సహా వివరించారు. నిపుణుల సైతం ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేర్కొనడం విశేషం.

    గుజరాత్‌, మహారాష్ట్ర ప్రాంతాల కాలానుగుణ వంటకాన్ని నెట్టింట షేర్‌ చేశారు హర్ష్‌ గోయెంకా. ఇది శీతకాలపు చిరుతిండి అని, తనకెంతో ఇష్టమని అన్నారు. పోంక్‌ రెసిపీ వ్యవహరిస్తారని చెప్పారు. ఇది ఆకుపచ్చని జొన్నలు,నిమ్మకాయ, మఖానా, కొద్దిగా సేవ్‌ జోడించి తయార చేసి స్మోకీ వంటకమట. ఇది తింటుంటే స్వర్గానికి వెళ్లిపోవాల్సిందేనట. దీనికి వెల్లుల్లి చట్నీ జోడిస్తేనే మంచి రుచి వస్తుందని చెప్పారు గోయెంకా. 

    ఎలా చేస్తారంటే..తాజా పోంక్‌(ఆకుపచ్చని జొన్నలని) పచ్చి వాసన పోయేదాక వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం జల్లుకోవాలి. క్రంచిగా ఉండేలా మఖానా చక్కెర బంతులను జోడిస్తూ..స్సైసీ పంచ్‌ ఇచ్చేలా వెల్లుల్లి చట్నీ జోడిస్తే చాలట. కాస్త ఆకర్షణీయంగా కనిపించేలా క్రిస్పిసేవ్‌ చలులుకుంటే..ఎంతో రుచికరమైన పోంక్‌ రెడీ..!.

    ఆరోగ్య లాభాలు..
    ఇది కేవలం చిరుతిండి కాదు. లేత దశలో ఉండే ఈ జొన్నలు ప్రత్యేకమైన వగరు రుచి కలిగి నోటిలే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఫైబర్‌ మూలం. ఇందులో ఉపయోగించే జొన్నలు గ్లూటెన్‌ రహితంగా ఉంటాయి. 

    అందువల గ్లూటెన్‌ అంటే పడినివాళ్లకి లేదా సెలియాక్‌ వ్యాధితో బాధపడేవారికి ఇది ఎంతో మంచిది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది మంచి ఎనర్జీని అందివ్వడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలుగజేస్తుంది. అలాగే ఇందులో ఐరన్‌, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు ఇది మొత్తం ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

     

    (చదవండి: అలాంటి శోకం ఎవ్వరికి వద్దని..30 ఏళ్లుగా ట్రాఫిక్‌ పోలీసుగా సేవ!)


     

  • "నిస్వార్థమెంత గొప్పదో…
    నీ పదము రుజువు కట్టదా..
    సిరాలు లక్ష ఓంపదా
    చిరాక్షరాలు రాయదా".. అనే పాట గుర్తుకొస్తుంది ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే..ఈ  వ్యక్తి ని ప్రమాదంలో కోల్పోయి తీరని దుఃఖంలో కోరుకుపోయాడు. చివరికి విధి భార్యను తీసుకుపోయి ఒంటిరిగా చేసింది. కానీ అతడు ఆ బాధలో మగ్గిపోకుండా తనలా విధి వంచితులవ్వకూడదని..ట్రాఫిక్‌ పోలీసులా ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాలక్రమేణ అందరూ అతడని ట్రాఫిక్‌ పోలీసనే అనుకునేవారు, అతడిని పలకరిస్తే గానీ అసలు విషయం తెలిసేది కాదు. కానీ అతడి నిస్వార్థ సేవకు తగిన గుర్తింపు రావడమే కాదు..చుట్టుపక్కల స్థానికులు సైతం అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. ఎవరా ఆ వ్యక్తి..ఏమా కథ తెలుసుకుందామా..!

    ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 79 ఏళ్ల వృద్ధుడు లాఠీతో నిలబడి ఉంటాడు. ఈ ఏజ్‌లో కూడా అక్కడ వాహనాలను నియంత్రిస్తూ డ్యూటీ చేస్తున్న ఆ వ్యక్తిని చూస్తే ఎవ్వరికైనా కుతూహలం కలుగుతుంది. ఇంకా రిటైర్‌ కాలేదా..ఉచితంగా సర్వీస్‌ అందిస్తున్నాడా..అన్న అనుమానాలతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. అతడి పేరు గంగారాం. ఓ విషాదం తన జీవితాన్ని ఇలా మార్చేసిందంటాడు. 

    తన కొడుకు తాను కలిసి టివీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ రిపైర్‌ షాపు నడిపేవారు. ఒకరోజు అనుకోకుండా కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ దఃఖం అతడ్ని తీవ్రంగా కుంగదీసేసింది. చివరికి అతడి భార్య సైతం ఆ బాధను జీర్ణించుకోలేక అతడిని ఒంటిరి చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక్క దుర్ఘటన తన కుటంబాన్ని ఇంతలా చిన్నాభిన్నం చేయడంతో గంగారాం..ఇలాంటి భాధ పగవాడికి కూడా వద్దు అని స్ట్రాంగ్‌ ఫిక్స్‌ అవ్వుతాడు. 

    ఆ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసు మాదిరిగా డ్రెస్‌ వేసుకుని ఢిల్లీలోని రద్దీగా ఉండే సీలంపూర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలను నియంత్రిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా  ఆ జంక్షన్‌ వద్దకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి జీతంభత్యం లేకుండా పనిచేశాడు. అలా రోజుకి సుమారు పది గంటలకు పైగా డ్యూటీ చేస్తుండేవాడు. మొదట్లో అతడిని కొందరు మోసగాడని తప్పుగా భావించేవారు, కాలక్రమేణ అతడి "నిస్వార్థ సేవ"ను గుర్తించడం ప్రారంభించారు. ఎవ్వరైనా అతడికి ఉచితంగా ఆహారం, డబ్బులు ఇచ్చినా నిరాకరించేవాడు. 

    అలా ఏళ్ల తరబడి నిస్వార్థంగా ఎలాంటి జీతం తీసుకోకుండా ట్రాఫిక్‌ పోలీసులా సేవలందించాడు. అంతేగాదు రోడ్డుపై క్రమశిక్షణతో మెలిగితేనే ప్రాణాలను సురక్షితమనేది గంగారాం ప్రగాఢ నమ్మకం. దాన్నే ప్రజలకు పదే పదే చెబుతుండే వాడు కూడా. వయసు సహకరించకపోయినా, అనారోగ్యంగా ఉన్నా.. తన డ్యూటీకి మాత్రం విరామం ఇచ్చేవాడు కాదు. కనీసం కరోనా మహమ్మారి, సమయంలో ప్రభుత్వం సీనియర్‌ సిటీజన్లను పదే పదే ఇంట్లో ఉండమని విజ్ఞప్తి చేసినా..తన దినచర్యకు కట్టుబడి ఉండేవాడు గంగారామ్‌. ఆఖరికి వర్షం, భగభగ మండే వేసవిలో సైతం అతడి డ్యూటీకి బ్రేక్‌ వేయలేకపోయాయి.

    ఆ సేవ వృధాగా పోలేదు..
    ఏళ్ల తరబడిచేస్తున్న అతడి సేవలు పోలీసులు, సామాజికి సంస్థలు గుర్తించి అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించింది. తరుచుగా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవాలలో అతడిని పిలిచి మరి తన సేవకు తగిన సత్కారం చేసి అభినందించేవారు. చివరగా 2018లో ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని అధికారికంగా ట్రాపిక్‌ సెంటినల్‌గా నియమించి, దశాబ్దాలులగా ఉచితంగా అందిస్తున్న సేవకు తగిన గుర్తింపు అందించారు. 

    అంతేగాదు అతనికి మొబైల్‌ ఫోన్‌ కూడా అందించి,తగిన వేతనం అందేలా చేసిందిఢిల్లీ ప్రభుత్వం. ఇప్పుడు గంగారామ్‌ సగర్వంగా యూనిఫాం ధరించి తన విధులను ఈ ఏజ్‌లో కూడా నిర్వర్తిస్తూ..తరతరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. 

    (చదవండి: ఆ కారు కొన్నప్పుడు బాధపడ్డా..కానీ అదే నా బిడ్డ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!)
     

Advt

  • నేటి కాలంలో ఆరోగ్యం, పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల వల్ల పెరుగుతున్న ముప్పు.. ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్‌నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం-వెల్‌నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

    నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు. కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.

    హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా.. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.

    ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా, హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.

    ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య; దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్‌నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.

    ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.

    హెర్బలైఫ్ లిమిటెడ్ గురించి 
    హెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్‌నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ.. వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి: www.herbalife.com/en-in

NRI

  • అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి,  మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని  రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.

    అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.

    అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    (చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి)

  • వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు  డా. తెన్నేటి సుధాదేవి  సంస్మరణ సభ నిర్వహించారు


    నవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు‌.

    సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ,  సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి,  అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Cartoon