Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • సయ్యద్ముస్తాక్అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్మహ్మద్సిరాజ్చెలరేగిపోయాడు. డిఫెండింగ్ఛాంపియన్ముంబైతో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

    సిరాజ్విజృంభించడంతో తొలుత బ్యాటింగ్చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్తో పాటు చామా మిలింద్‌ (4-0-36-2), త్యాగరాజన్‌ (4-0-27-2), నితిన్సాయి యాదవ్‌ (3-0-26-1), అర్ఫాజ్అహ్మద్‌ (1-0-7-1) సత్తా చాటారు.

    స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్‌ (29), హార్దిక్తామోర్‌ (29), సూర్యాంశ్షేడ్గే (28), సాయిరాజ్పాటిల్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్ఖాన్‌ (5), రఘువంశీ (4), అంకోలేకర్‌ (3), తనుశ్కోటియన్‌ (2), తుషార్దేశ్పాండే (1) సింగిల్డిజిట్స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్శార్దూల్ఠాకూర్డకౌటయ్యాడు.

    అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్ఓపెనర్లు అమన్రావ్‌ (29 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్అగర్వాల్‌ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్‌ 11.5 ఓవర్లలో వికెట్మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్సూపర్లీగ్పోటీల్లో భాగంగా జరిగింది.

     

     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.

    పదమూడు ఖాళీలు
    వేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్‌ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.

    మాక్‌ వేలం
    ఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈసారి కూడా మాక్‌ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్‌ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ అతడి కోసం పోటీపడ్డాయి.

    భారీగా తగ్గిన ధర!.. 
    ఇంతలో కేకేఆర్‌ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్‌ అయ్యర్‌ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్‌ వేలంలో కేకేఆర్‌ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్‌ మొత్తంలో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు.

    ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను కేకేఆర్‌ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్‌ వేలంలో కేకేఆర్‌ లివింగ్‌స్టోన్‌ను కొనుక్కోవడం గమనార్హం.

    చదవండి: ఆసియా కప్‌- 2025: భారత్‌ ఘన విజయం

  • అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్‌ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.

    హైదరాబాద్‌ పర్యటన ఇలా
    ‘ది గోట్‌ టూర్‌’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్‌ స్వయంగా వెల్లడించాడు.

    ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..

    ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..
    👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్‌ 24న మెస్సీ జన్మించాడు.
    👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్‌ గ్రాండోలిలో జాయిన్‌ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్‌ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్‌ మెస్సీ.

    👶ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్‌ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాడు.

    👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్లబ్‌లో చేరాడు.
    👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్‌ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.

    వారిద్దరు.. వారికి ముగ్గురు 
    👩‍❤️‍💋‍👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 
    👨‍👩‍👦‍👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.
    🫂అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడు

    ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
    🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.
    💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్‌ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!
    🎶అన్నట్లు లియోనల్‌ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్‌ సింగర్‌ లియోనల్‌ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.

    చిరస్మరణీయ విజయం
    🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్‌ డిఓర్‌ అవార్డులు గెలుచుకున్నాడు.
    🥇2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు.
    ⚽🏆మెస్సీ కెరీర్‌లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవడం.

     

     

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్‌పూర్‌ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.

    ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (0) గోల్డెన్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపించింది మేనేజ్‌మెంట్‌. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్‌ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.

    మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (17)తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ పాండ్యా (20), జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.

    ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్‌ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?

    నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్‌ బ్యాటింగ్‌ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్‌ కంటే ముందు అభిషేక్‌ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్‌- రైట్‌ కాంబినేషన్‌ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.

    కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్‌ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్‌ తప్పుబట్టాడు.

    కాగా సిరీస్‌ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్‌ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

    అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్‌ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు.

  • ఆసియా క్రికెట్‌ మండలి మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నీలో భారత్‌ శుభారంభం చేసింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

    దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్‌- యూఏఈ (IND vs UAE) మ్యాచ్‌తో ఈ వన్డే ఫార్మాట్‌ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

    దంచికొట్టిన భారత బ్యాటర్లు
    ఇందులో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్‌ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్‌ త్రివేది (38) కూడా రాణించాడు.

    ఆఖర్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్‌), కనిష్క్‌ చౌహాన్‌ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్‌, ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు.  ఇక యూఏఈ బౌలర్లలో యుగ్‌ శర్మ, ఉద్దిశ్‌ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్‌ డిసౌజా, కెప్టెన్‌ యాయిన్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

    కుదేలైన యూఏఈ బ్యాటింగ్‌  ఆర్డర్‌
    ఇక భారత్‌ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్‌ యాయిన్‌ రాయ్‌ (17), షాలోమ్‌ డిసౌజా (4).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అయాన్‌ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్‌ రేయాన్‌ ఖాన్‌ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్‌ హుదాదాద్‌ డకౌట్‌ అయ్యాడు.

    మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. ఐదో నంబర్‌ బ్యాటర్‌ పృథ్వీ మధు (50), ఉద్దిశ్‌ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్‌) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సలే అమీన్‌ (20 నాటౌట్‌) తన వంతు ప్రయత్నం చేశాడు.

    234 పరుగుల తేడాతో జయభేరి
    అయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్‌ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ రెండు వికెట్లు తీయగా.. కిషన్‌ కుమార్‌ సింగ్‌, హెనిల్‌ పటేల్‌, ఖిలాన్‌ పటేల్‌, విహాన్‌ మల్హోత్రా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్‌ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.

    చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య

International

  • రెండున్నరేళ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలు పెట్టిన రష్యా ఇప్పుడు ఆర్థిక ఛట్రంలో పూర్తిగా మునిగిపోతోందా? అయితే.. ఆర్థిక మాంద్యం.. లేదంటే ద్రవ్యోల్బణం అన్నట్లుగా రష్యాలో పరిస్థితులున్నాయా? ఇప్పుడు రష్యా ముందున్న ఒకేఒక్క ఆశాదీపం భారతదేశమేనా? అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల భారత్‌లో పర్యటించారా? ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? యుద్ధం ప్రారంభమైన రెండేళ్ల వరకు జీడీపీలో ఎలాంటి తరుగుదల లేకుండా.. పైపైకి దూసుకుపోయిన రష్యాకు ఇప్పుడేమైంది?

    అది 2022 ఫిబ్రవరి 24. రష్యా దళాలు బెలారస్ మీదుగా ఉక్రెయిన్‌పై దురాక్రమణను ప్రారంభించాయి. క్రమంగా ఉక్రెయిన్‌కు సముద్రమార్గంతో సంబంధాలు లేకుండా ఈ ఆక్రమణ కొనసాగింది. అంటే.. దక్షిణ ఉక్రెయిన్‌లో ఉండే ప్రధాన పోర్టులు ఒడెస్సా, మైకొలైవ్‌తోపాటు.. మారియుపూల్ వరకు రష్యా కబ్జా చేసేసింది. 

    అంతేకాదు.. నల్లసముద్రంతో సంబంధం లేకుండా.. అతిపెద్ద ప్రావిన్స్ అయిన జాపొరిజియా దక్షిణ భాగాన్ని ఆక్రమించి.. అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం ప్రారంభించింది. తూర్పున డోనెట్స్క్, లుహాన్స్క్‌పై పట్టుసాధించింది. అంటే.. 2014లో ఆక్రమించిన క్రిమియా నుంచి రష్యాలోని బెల్గోల్ట్ వరకు రోడ్డు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఈ పరిణామాలతో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు ఉక్రెయిన్ సముద్రంపై ఆధారపడకుండా చేసినట్లైంది.

    2020లో కొవిడ్ కల్లోలం తర్వాత అమెరికా సహా.. దాదాపుగా అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను తయారు చేసినా.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనా.. కారిమకుల జీతాలను పెంచిన పుతిన్ సర్కారు ద్రవ్యోల్బణ ప్రమాదం నుంచి గట్టెక్కింది. 2022లో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయింది. 2024లో ముదిరి పాకాన పడే పరిస్థితులు నెలకొన్నాయి.

    యుద్ధం మూడున్నరేళ్లుగా నడుస్తుండడంతో.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం రష్యాకు తలకు మించిన భారమవుతోంది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. దీంతో.. గత త్రైమాసికంలో జీడీపీ నేలముఖం చూడడం ప్రారంభించింది. 2023, 2024 సంవత్సరాల్లో 3-4% వృద్ధి నమోదైనా.. ఇప్పుడు మాత్రం పరిస్థితి చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో రష్యా ముందు ఆశాదీపంగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేశం భారత్..! అందుకే.. 2022 నుంచే రష్యా మన దేశానికి మరింత దగ్గరవ్వడం మొదలుపెట్టింది.

    నిజానికి రష్యా-భారత్‌ల మైత్రి చారిత్రకమైనది. ఓల్గా నుంచి గంగా వరకు స్నేహం ఫరిడవిల్లిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. అయితే.. చమురు కోసం ఇరాక్, సౌదీలపై ఆధారపడే భారత్‌కు కూడా ఇప్పుడు తక్కువ ధరకే చమురును అందించే రష్యా ఓ ఆశాజ్యోతిగా మారింది. రష్యా అత్యధికంగా చమురు ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిపోయింది. యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెళ్లలోపు చమురు మాత్రమే భారత్‌కు దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ దిగుమతి ఏకంగా రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెరిగిపోయింది. అందుకే ట్రంప్ కూడా పదేపదే రష్యాను ఆర్థికంగా ఆదుకుంటున్నది భారతదేశమేనని వ్యాఖ్యానాలు చేస్తుంటారు. 38% రష్యా చమురు భారత్‌కే వెళ్తోందని, ఉక్రెయిన్‌ యుద్ధానికి పరోక్షంగా భారత్ ఆజ్యం పోస్తోందంటూ కారాలుమిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే..!

    ఇప్పుడున్న పరిస్థితుల్లో.. భారత్ ఏమాత్రం చమురు దిగుమతులను తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. రష్యా చమురును భారత్ కొనడం ఆపేయనుందని ట్రంప్ ఒకట్రెండు సార్లు ప్రకటనలు చేసిందే దరిమిలా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ పర్యటనకు వచ్చారు. భారత్‌కు కావాల్సిన రక్షణపరమైన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధమంటూ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారత్‌ను కోరారు. అవును.. ఇప్పుడు రష్యాకు పెద్దదిక్కు భారతే..! ఉక్రెయిన్‌లోని కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా భారత్ గనక రష్యా చమురు కొనుగోళ్లను కనీసం 20% తగ్గించినా.. రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందంటూ నివేదిక ఇచ్చింది. 

    ఓ వైపు భారత్‌ను నమ్ముకుంటూనే.. రష్యా తమ ప్రజలపై పన్నుల భారం వేస్తోంది. రష్యాలో అధిక డిమాండ్ ఉండే వోడ్కాపై అదనంగా 5% పన్ను విధిస్తోంది. ఇక వ్యాట్‌ను 10శాతం నుంచి 11శాతానికి పెంచింది. అదనంగా పెరిగిన ఒక శాతం వ్యాట్ విలువ ఒక ట్రిలియన్ రూబిల్స్‌గా ఉంటుంది. అంటే.. 1,304 బిలియన్ డాలర్లన్నమాట. అంతేకాదు. ఇంతకాలం రష్యాలో చిరువ్యాపారులపై వ్యాట్ లేదు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే వంకతో.. వారిపైనా దశలవారీగా పన్ను విధించేందుకు సిద్ధమైంది. రష్యాలో రెపోరేటు బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ వడ్డీ రేట్లు 15శాతానికి పైగా ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా విదేశాల నుంచి అప్పు పుట్టే అవకాశాలు లేకుండా పోయాయి. అమెరికా, ఐరోపాలో ఉండే రష్యా ఆస్తులు, రష్యన్ల బ్యాంకు ఖాతాలు స్తంభించిపోయాయి.

    ఆర్థికపరంగా రష్యాకు ఇప్పుడు భారత్ అత్యంత కీలకమైన మిత్రదేశం. అదే సమయంలో భారత్‌కు కూడా రక్షణపరంగా రష్యా ఆప్తమిత్రుడు. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు మనకు రష్యా నుంచి వచ్చినవే. మిగ్ విమానాలు కూడా రష్యా సరఫరానే. నిజానికి భారత్ తన రక్షణ వ్యవస్థల అవసరాలను ‘మేకిన్ ఇండియా’లో భాగంగా తీర్చుకోవాలని నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడు రష్యా అధునాతన ఆయుధాలను విక్రయించేందుకు సిద్ధమవ్వడంతో.. దిగుమతుల వాటా 36శాతానికి పెరిగింది. నిజానికి దశాబ్దాలుగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతానికి సహకరిస్తూ వచ్చిన ప్రధాన దేశం రష్యానే..! ఈ నేపథ్యంలో చమురు కొనుగోళ్ల ద్వారా మిత్రదేశం రష్యాను ఆదుకుంటూనే.. భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశలో అడుగులు వేస్తోంది. భారత్ ఈ నిర్ణయం గనక తీసుకోకపోయి ఉంటే.. రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు..!

  • పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీప్‌కు ఘోర పరాభవం ఎదురైంది. తుర్కిస్థాన్‌ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడానికి ఆయన దాదాపు 40 నిమిషాలు ఎదురుచూశారు. అయినప్పటికీ పుతిన్ కలవకపోవడంతో షెహబాజ్‌ పుతిన్ ఉన్న ప్రదేశానికి నేరుగా వెళ్లాడు.  దీంతో పాకిస్థాన్‌ అధ్యక్షుడిపై నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.  

    ప్రస్తుతం పాకిస్థాన్- అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. యూఎస్ అధ్యక్షుడు ‍ట్రంప్ తరచుగా పాకిస్థాన్‌ని పొగుడుతూ వారిని బుట్టులో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం  ఆ దేశ ప్రధాని షెహబాజ్‌తో పాటు ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌తోనూ నేరుగా చర్చలు జరిపారు. అంతేకాకుండా పాకిస్థాన్‌ను దక్షిణాసియాలో అవసరమైన మిత్రుడు అని గతంలో అభివర్ణించాడు. 

    ఇదే సమయంలో భారత్‌తో ట్రంప్ డిస్టెన్స్ పెంచాడు. భారత్‌పై అధిక పన్నులు విధించడంతో పాటు ఆపరేషన్ సిందూర్‌ తానే ఆపానంటూ  ప్రేలాపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య కొంత గ్యాప్ పెరిగింది. అయితే భారత్‌కు ఎల్లవేళలా నమ్మదగిన మిత్రుడిగా ఉండే రష్యా ఇప్పుడు పాక్‌కు చిన్న ఝలక్‌ ఇచ్చింది.

    తుర్కిస్థాన్‌లో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సమ్మిట్‌లో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశానికి వెళ్లాడు. ఆ పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడితో పుతిన్‌ భేటీ జరగాల్సి ఉంది. కాగా ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్‌తో పుతిన్ సమావేశంలో ఉన్నారు. దీంతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రితో కలిసి పుతిన్‌ను కలవడానికి ఎదురుచూశారు.

    దాదాపు 40 నిమిషాలపాటు వేచి చూసినప్పటికీ భేటీ ముగియకపోవడంతో షెహబాజ్ అసహానానికి గురయ్యారు. దీంతో పుతిన్ చర్చలు జరుపుతున్న ప్రాంతానికి నేరుగా వెళ్లాడని  అక్కడ కొద్ది సేపు ఉన్న అనంతరం షెహబాజ్ తిరిగి వెళ్లినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలవుతోంది. పుతిన్ సమయాన్ని వృథా చేసుకోరు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ట్రంప్ కూడా అలానే చేశారని మరో యూజర్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే రష్యా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై కీలక ఒప్పందాలు జరిగాయి. పుతిన్‌కు స్వాగతం పలకడానికి ప్రధాని మోదీ స్వయంగా వెళ్లారు. అంతేకాకుండా పుతిన్‌ తనకు మిత్రుడని సంభోదించారు.

  • పాకిస్తాన్‌లో విభ‌జ‌న అన‌గానే 1971 నాటి జ్ఞాపకాలు గుర్తుకువ‌స్తాయి. ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు దాయాది దేశంలో విభ‌జన మాట బాగా విన‌బ‌డుతోంది. అయితే ఈ విభ‌జ‌న వేరే రకమైనది. పాకిస్తాన్ జాతీయ స‌మాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌నతో విభ‌జ‌న‌ చ‌ర్చ ఊపందుకుంది. దేశంలో చిన్న ప్రావిన్సుల ఏర్పాటు ఇప్పుడు ఖాయమని ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న పాక్‌లో సంచ‌ల‌నంగా మారింది. అయితే ప‌రిపాల‌నా సౌల‌భ్యం, ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకే చిన్న ప్రావిన్సులను ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పార‌ని జియో టీవీ నివేదించింది. అయితే ప్రావిన్సులను విభజించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

    పాకిస్తాన్‌లో ప్ర‌స్తుతం ఉన్న నాలుగు ప్రావిన్స్‌ల‌ను విడ‌గొట్టి 12 చేయడానికి రంగం సిద్ధమైంద‌ని స్థానికి మీడియా స‌మాచారం. ఈ మేర‌కు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్,  ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మ‌ధ్య తుది చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. కొద్ది రోజుల్లోనే ఈ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 1947 నాటికి పాకిస్తాన్‌లో ఐదు ప్రావిన్సులు ఉన్నాయి. అవి తూర్పు బెంగాల్, పశ్చిమ పంజాబ్, సింధ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (NWFP), బలూచిస్తాన్. 1971 విముక్తి యుద్ధం తర్వాత తూర్పు బెంగాల్ స్వాతంత్ర్యం ప్రకటించుకుని బంగ్లాదేశ్ ఏర్ప‌డింది. పశ్చిమ పంజాబ్.. పంజాబ్ అయింది. వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరును ఖైబర్ పఖ్తుంఖ్వాగా (Khyber Pakhtunkhwa) మార్చారు. సింధ్, బలూచిస్తాన్ పేర్లు అలాగే ఉన్నాయి.

    ఎందుకీ విభ‌జ‌న?
    ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసమ‌మే చిన్న ప్రావిన్సుల ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్టు పాకిస్తాన్ పాలకులు చెబుతున్నా అందుకు భిన్నమైన ప‌రిస్థితులు క‌న్పిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. త‌మ‌ను స్వతంత్ర దేశాలుగా ప్ర‌క‌టించాల‌ని ఈ రెండు ప్రాంతాల ప్ర‌జ‌లు పోరాడుతున్నారు. మ‌రోవైపు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ హైబ్రిడ్ పాలనపై వ్య‌తిరేక‌త రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో విభ‌జ‌న చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో పాకిస్తాన్‌లో సెమినార్లు, మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

    ఒక్కోదాన్ని మూడుగా విభ‌జిస్తాం
    షెహబాజ్ షరీఫ్ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ (IPP) నాయకుడు అబ్దుల్ అలీమ్ ఖాన్ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. త‌మ దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాల‌న్నింటిలోనూ అనేక చిన్న ప్రావిన్సులు ఉన్నాయని అన్నారు. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి అద‌నంగా మూడు ప్రావిన్సులు చొప్పున ఏర్పాటు అవుతాయ‌ని వెల్ల‌డించారు. పరిపాలనా నియంత్రణను బలోపేతం చేయడానికి, పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి ఇది సహాయపడుతుందని ఆయ‌న చెప్పిన‌ట్టు జియో టీవీ తెలిపింది.

    మేం ఒప్పుకోం
    షెహబాజ్ షరీఫ్ ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామిగా ఉన్న బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మాత్రం సింధ్ విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తోంది. త‌మ‌ ప్రావిన్స్‌ను విభజించడానికి లేదా మూడు ముక్కలు చేయడానికి త‌మ పార్టీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒప్పుకోద‌ని సింధ్ ముఖ్యమంత్రి, పీపీపీ నాయకుడు మురాద్ అలీ షా (Murad Ali Shah) గ‌త నెల‌లో కుండ‌బద్ద‌లు కొట్టారు.

    12కు పెర‌గ‌నున్న ప్రావిన్సులు
    దేశంలోని ఒక్కో ప్రావిన్స్‌ను మూడు భాగాలుగా చేయాల‌ని పాకిస్తాన్ యోచిస్తున్న‌ట్టు స్థానిక మీడియా స‌మాచారం. నాలుగు ప్రావిన్సులను విడ‌గొట్టి 12కు పెంచేలా పాక్ స‌ర్కారు అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీని ప్ర‌కారం.. పంజాబ్ ప్రావిన్స్ ఉత్తర పంజాబ్, మధ్య పంజాబ్, దక్షిణ పంజాబ్‌గా విభజించబడుతుంది. సింధ్ ప్రావిన్స్ కరాచీ సింధ్, మధ్య సింధ్, ఎగువ సింధ్‌లుగా విభజించబడుతుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా కూడా మూడు భాగాలవుతుంది. వీటిని ఉత్త‌ర‌, ద‌క్షిణ‌, గిరిజన ఖైబర్ పఖ్తుంఖ్వాగా ప‌రిగ‌ణిస్తారు. అదేవిధంగా, బలూచిస్తాన్ (Balochistan) కూడా తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రావిన్సులుగా మారుతుంది.

    కొత్త స‌మ‌స్య‌లు ఖాయం
    ప్ర‌స్తుతం ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండా ప్రావిన్సుల‌ను విభ‌జించ‌డం వ‌ల‌న ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని మేధావులు, సామాజికవేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. పాలనలోని అంతరాలను తొల‌గించ‌కుండా ఏం చేసినా నిష్ఫ‌ల‌మ‌న్నారు. బలహీనమైన సంస్థలు, అసమాన చట్ట అమలు, పేలవమైన స్థానిక పాలన అనేవి నిజ‌మైన స‌మ‌స్య‌ల‌న.. వీటిని నివారించ‌కుండా కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేయ‌డం వల్ల అసమానతలు మరింత తీవ్రమవుతాయని వెట‌ర‌న్‌ పోలీసు ఉన్నత అధికారి సయ్యద్ అక్తర్ అలీ షా అభిప్రాయ‌ప‌డ్డారు.

    తిరుగుబాటు త‌ప్ప‌దు
    పరిపాలనా పునర్నిర్మాణంతో గతంలో చేసిన ప్రయోగాలు స‌మ‌స్య‌ల‌ను మ‌రింత పెంచాయ‌ని పాకిస్తాన్‌కు చెందిన మేధావి సంఘం పిల్దాట్ అధ్యక్షుడు అహ్మద్ బిలాల్ మెహబూబ్ పేర్కొన్నారు. కొత్త ప్రావిన్సులను సృష్టించడం అనేది ఖరీదైన, సంక్లిష్టమైన, రాజకీయంగా మోసపూరితమైనదిగా డాన్ ప‌త్రిక‌లో రాసిన‌ తన వ్యాసంలో వ‌ర్ణించారు. ఇప్పుడు చేయాల్సింది విభ‌జ‌న కాద‌ని, రాజ్యాంగానికి అనుగుణంగా స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాల‌ని సూచించారు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం.. బ్రిటిష్ త‌ర‌హాలో విభజించు- పాలించు విధానాన్ని అనుసరిస్తున్నాయని మ‌రికొంద‌రు విమ‌ర్శించారు. ఇలాంటి చ‌ర్య‌ల‌తో తిరుగుబాటు వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

    పాకిస్తాన్‌లో మరిన్ని ప్రావిన్సులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ముందుకు తీసుకురావడం ఇది మొదటిసారి కాదు, బహుశా చివరిది కూడా కాకపోవచ్చు. కానీ గ‌త ప్ర‌తిపాద‌న‌లేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈసారి ప్ర‌తిపాద‌న‌కు ప్రధానమంత్రి షరీఫ్ సంకీర్ణ ప్ర‌భుత్వంలోని ఇస్తేకామ్-ఎ-పాకిస్తాన్ పార్టీ, సింధ్ ఆధారిత ముత్తహిదా క్వామి మూవ్‌మెంట్-పాకిస్తాన్ (MQM-P) పార్టీలతో పాటు ప‌లువురు మేధావులు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. 

  • అది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్, టల్లీ ఎయిర్‌ పోర్ట్‌.. ఆకాశం నిర్మలంగా ఉంది.. సాధారణ స్కైడైవింగ్‌ విన్యాసం కోసం సిద్ధమైన ప్రత్యేక రోజది. 17 మంది పారాచూటిస్టులతో కూడిన ’సెస్నా కారవాన్‌’ విమానం 15,000 అడుగుల (సుమారు 4,500 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. 16 మంది స్కైడైవర్లు కలిసి ఒక అద్భుతమైన ఫార్మేషన్‌ జంప్‌ చేయబోతున్నారు. అంతా సిద్ధంగా ఉంది.. విమానం తలుపు వద్ద నిల్చున్న స్కైడైవర్‌ ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ గుండె వేగం పెరిగింది. 

    విమానం నుంచి బయటికి దూకడానికి సెకన్‌ మాత్రమే ఉంది.. కానీ, ఆ క్షణంలోనే ఊహించని విపత్తు సంభవించింది. ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ గాల్లోకి దూకే ప్రయత్నంలో ఉండగా, అతని రిజర్వ్‌ పారాచూట్‌ తాడు విమానం రెక్క ఫ్లాప్‌ను తాకింది. అంతే.. కళ్లు మూసి తెరిచేలోపే, పారాచూట్‌ ఒక్కసారిగా విచ్ఛిన్నమైపోయింది. ఆ ఉధృతి ఫెర్గూసన్‌ను వెనక్కి లాగేసింది. నియంత్రణ కోల్పోయిన అతను.. విమానం వద్దే వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న కెమెరా ఆపరేటర్‌ను ఢీకొట్టాడు. ఆ ఆపరేటర్‌ వెంటనే విమానం నుంచి బయటకు దూకి, అదుపులేని ఫ్రీ–ఫాల్‌లో పడిపోయాడు. 

    అసాధారణ ధైర్యశాలి
    కళ్లు మూసి తెరిచేలోపే, ఫెర్గూసన్‌ కాళ్లు విమానం తోక భాగంలోని ’హారిజాంటల్‌ స్టెబిలైజర్‌’కు బలంగా తగిలాయి. అంతలో, తెరుచుకున్న పారాచూట్‌ మొత్తం తోకకు చుట్టుకుపోయింది! ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించినట్టు అనిపించింది. 15,000 అడుగుల ఎత్తులో.. ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ విమానం తోకకు వేలాడుతూ, చావు అంచున చిక్కుకుపోయాడు. అతని ముఖంలో మృత్యు భయం స్పష్టంగా కనిపించింది. కింద అగాధం.. పైన మృత్యుపాశం.. పట్టు తప్పితే ప్రాణాలు దక్కవు. ఆ ప్రమాదకర స్థితిలో, ఆడ్రియన్‌ ఫెర్గూసన్‌ భయంతో వణికిపోకుండా, అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అతని వద్ద ఉన్న ఒకే ఒక్క ఆయుధం.. చేతిలో ఉన్న చిన్న హుక్‌ కత్తి. ఆ చిన్న కత్తితోనే ఆడ్రియన్‌ మృత్యువుతో పోరాడాలి. 

    ప్రాణం కాపాడిన కత్తి
    ఆడ్రియన్‌ తన వద్ద ఉన్న చిన్న ’హుక్‌ కత్తి’ తీశాడు. వేలాడుతూనే.. విమానం తోకకు గట్టిగా చిక్కుకుపోయిన తన రిజర్వ్‌ పారాచూట్‌ లైన్లను ఒక్కొక్కటిగా కోయడం మొదలుపెట్టాడు. ఇది సాహసం కాదు, ఆత్మరక్షణ! ఆఖరికి 11 లైన్లను తెగ్గొట్టగలిగాడు. చివరికి, చిరిగిన పారాచూట్‌లోని కొంత భాగంతో సహా విమానం నుంచి పూర్తిగా విడిపోయి కిందకు పడిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే, ఆడ్రియన్‌ తన ప్రధాన పారాచూట్‌ను తెరిచాడు. రిజర్వ్‌ పారాచూట్‌ అవశేషాలు అడ్డుప డినా, అది పూర్తిస్థాయిలో విచ్చుకుంది. చివరకు, ఫెర్గూసన్‌ కేవలం స్వల్ప కాలి గాయాలతో సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అయ్యాడు.

     

    మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది
     

    ప్రమాదంలో విమానం..
    ఇంతలో పైన విమానం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. పారాచూట్‌ లైన్లు తోకకు గట్టిగా చుట్టుకోవడంతో, పైలట్‌ కొంతవరకు విమానంపై నియంత్రణ కోల్పోయాడు. వెంటనే, ఆయన ’మేడే’ అత్యవసర సంకేతాన్ని పంపారు. తోకకు చిక్కుకున్న పారాచూట్‌తో విమానాన్ని నియంత్రించడం కష్టమని భావించినా, బ్రిస్బేన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సాయంతో, పైలట్‌ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని టల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేయగలిగాడు. కానీ తోక భాగానికి గణనీయమైన నష్టం వాటిల్లింది.

     

    శభాష్‌ ఫెర్గూసన్‌!
    ఈ ఏడాది సెప్టెంబర్‌ 20న జరిగిన ఈ అసాధారణ ఘటనపై ఆస్ట్రేలియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బ్యూరో (ఏటీసీబీ) దర్యాప్తు జరిపి, ఈ ఉత్కంఠభరితమైన వీడియోను విడుదల చేసింది. ఏటీసీబీ ముఖ్య కమిషనర్‌ ఆంగస్‌ మిచెల్‌ మాట్లాడుతూ, ‘హుక్‌ కత్తిని వెంట తెచ్చుకోవడం తప్పనిసరి నియమం కానప్పటికీ, రిజర్వ్‌ పారాచూట్‌ విచ్ఛిన్నమైనప్పుడు అదే ప్రాణాలు కాపాడింది’.. అని ఫెర్గూసన్‌ సమయస్ఫూర్తిని ప్రశంసించారు.  పదిహేను వేల అడుగుల ఎత్తులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఫెర్గూసన్‌ సాహసం, ఆత్మవిశ్వాసం ప్రపంచ స్కైడైవింగ్‌ చరిత్రలో ఒక పాఠ్యాంశంగా నిలిచిపోయింది.

    ఇదీ చదవండి: రూ.1,404 కోట్ల అవినీతి, మాజీ బ్యాంకు అధికారిని ఉరి తీసిన చైనా

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని.. కొన్నిసార్లు ప్రజలు ఆమోదిస్తారు.. తిరస్కరిస్తారు.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల్లోనే ఉండాలని ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ వచ్చిన ఆయన..  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

    నంది నగర్ నివాసానికి చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్.. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో కేసీఆర్‌ను కలుస్తానన్నారు.

    కేటీఆర్‌ మాట్లాడుతూ.. అఖిలేష్‌ యాదవ్‌ తమకు స్ఫూర్తి అన్నారు. అసెంబ్లీ ఎ‍న్నికల్లో ఓడిపోయినా 37 ఎంపీ స్థానాలు సాధించారు. దేశంలో మూడో స్థానంలో పార్టీని నిలిపారని కేటీఆర్‌ అన్నారు.

     

     

     


     

  • సాక్షి, తాడేపల్లి: మొలకలు చెరువు, ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ కల్తీ మద్యం కుంభకోణం ఈ దేశంలోనే పెద్దదని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అన్నారు. మొలకలచెరువు ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోనే కల్తీ మద్యం తయారీ చేశారని.. స్థానిక జనం కనిపెట్టి పోలీసులకు చెప్తే తప్ప పోలీసులు స్పందించలేదని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.

    ‘‘కూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్‌కు మద్యం దుకాణాలు కట్టబెట్టి.. ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ అధినాయకత్వంతో కుమ్మక్కై అక్రమ మద్యం కుటీరాలు ఏర్పాటు చేశారు. 3వ తేదీన కుంభకోణం బయటపడితే 10న అద్దేపల్లి జనార్ధన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూటమి నేతలకు భయం పుట్టింది. అందుకే ఇష్యూని డైవర్ట్‌ చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డికి తాము సన్నిహితులమని నేరస్తులు చెప్పారు. తంబళ్లపల్లిలో డంప్‌ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుష్ప్రచారం చేశారు.

    ..ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో విష ప్రచారం చేశారు. జయచంద్రారెడ్డి చెప్పినట్లు అంత చేశామని నిందితులే చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు అయ్యిందో? ఎవరెవరు ఉన్నారో? ఎక్కడెక్కడ సరఫరా చేశారో?  విచారణ జరపాలి. కానీ కేసు విచారణ అలా ఎందుకు జరగటం లేదు?. జయచంద్రారెడ్డిని రాష్ట్రానికి రప్పించి కేసును పక్కన పెట్టాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలు చెపుతూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది.

    ..ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ 1600 అని లెక్కలు చెపుతున్నారు. 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేయించి.. ఛార్జ్‌షీట్‌లు వేస్తే.. సిగ్గు లేకుండా విత్ డ్రా చేస్తున్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు విచారణను ఎందుకు ఎదుర్కోరు?. నిసిగ్గుగా కేసులు విత్ డ్రా చేయించునే చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రపంచంలో ఉండరు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడతారు.

    ..టీడీపీ వాళ్ళను ఎలా రక్షించుకోవాలనే మాత్రమే పని చూస్తున్నారు. వ్యవస్థలను దిగజార్చటంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు వ్యవస్థలపై నమ్మకం ఉంటే.. మద్యం కుంభకోణంపై స్వతంత్ర ఆడిట్ చేయించండి. ఏ బెల్ట్ షాప్‌కు ఏ స్పిరిట్ లిక్కర్ వెళ్లిందో తేల్చాలి. చంద్రబాబుకు దమ్ముంటే కేసును ఎదుర్కోని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. జయచంద్రారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దర్యాప్తును నిష్పక్షపాతంగా పూర్తి చేయాలి’’ అని మనోహర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

  • విశాఖపట్నం​:  నగర పరిధిలో పెద్ద ఎత్తున భూ పందేరం నడుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ ధ్వ.జమెత్తారు. ఏపీలో రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా? అని నిలదీశారు. కేవలం ఏపీలోనే రూపాయికి, అర్థ రూపాయికి భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు.  

    ఈ రోజ(శుక్రవారం, డిసెంబర్‌ 12వ తేదీ) విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్‌.. ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి రూపాయికి భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్‌ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్సార్‌సీపీ హయాంలోనే వచ్చిందన్నారు. 

    నాడు జగన్‌ ఏం చెప్పారో.. చంద్రబాబు అదే చెబుతున్నారు
    విశాఖ గురించి నాడు తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చెప్పారో.. నేడు చంద్రబాబు కూడా అదే చెబుతున్నారన్నారు. విశాఖ అనేది మన రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌ అని జగన్‌ ఏనాడో చెప్పారని, ఇప్పుడు అదే మాట చంద్రబాబు కూడా చెబుతున్నారన్నారు. 2014లో విశఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేకపోయారన్నారు. ‘ రాష్ట్రానికి పరిశ్రమల రావడం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్..ిశాఖకు ఇన్ఫోసిస్ లాంటి గొప్ప ఐటీ పరిశ్రమ తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. ఇన్ఫోసిస్ లాంటి సంస్థ విశాఖ వచ్చింది కాబట్టి మిగతా ఐటీ పరిశ్రమలు విశాఖ నగరానికి తరలివస్తున్నాయి.

    టిసిఎస్ విశాఖ రావడానికి జగన్ కృషి ఉంది. పెద్ద కంపెనీలకు భూమి ఇవ్వడంలో తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కట్ట బేడుతున్నారు. సత్వ, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల కోట్ల భూములను తక్కువ రేటుకు ఎందుకు ఇస్తున్నారు?, మీకు నచ్చిన సంస్థలకు రూపాయి అర్ధ రూపాయికి  ఇస్తామంటే ఎలా..?, సత్వకు ఇచ్చిన భూమిలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ప్లాట్స్ కట్టుకోమని ఎలా అనుమతులు ఇస్తారు?, 

    రియల్ ఎస్టేట్ సంస్థలకు భూమి తక్కువ రేటుకు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు ఇస్తారా?, లులు సంస్థ గుజరాత్ రాష్ట్రంలో ఎకరా భూమి కోట్లాది రూపాయలకు కొంటారు. మన రాష్ట్రంలో నామమాత్రపు ధరకు కట్టబెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు. లోకేష్‌ను ప్రమోట్ చేయడం కోసం ప్రభుత్వ ధనంతో ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల్లో కనీసం పరిశ్రమల శాఖ మంత్రి ఫోటో కూడా వేయడం లేదు. 

    వైఎస్ జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానంటే మునిగిపోతుందని వార్తలు రాశారు. చంద్రబాబు విశాఖను అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటూ వార్తలు రాస్తున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ తో పాటు మోదీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసేవారు.. నేడు ప్రకటనల్లో మోడీ పవన్ ఫోటోలు చుక్కలా మారిపోయాయి’ అని విమర్శించారు. 

Andhra Pradesh

  • విజయవాడ అమరావతి కోసం మళ్లీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. నాబార్డ్‌ ద్వారా రూ. 7,387 కోట్లు అప్పు చేసింది. APCRDAకి నాబార్డ్ రుణం రూ.7,387.70 కోట్లు పొందేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి కోసం ఇప్పటికే 40 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో అప్పుకు సిద్ధమైంది. తాజా రుణంతో కలిసి అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. 47 వేల కోట్లను దాటనుంది. 

  • నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరులో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆత్మకూరు పట్టణంలోని ఇస్లాం పేటకు చెందిన అర్షియా అనే 4 (సం) చిన్నారి ఇంటి ముందర ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. 

    ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. చెవిని కొరుక్కు తినడంతో పాటు దవడపై తీవ్ర గాయాలు చేసింది.  ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో  కర్నూలు హాస్పిటల్ తరలించారు.

     

     

Movies

  • ‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్‌ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శశివదనే’. అక్టోబరు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించారు. ఇప్పటికే  సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న  ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా తాజాగా విడుదలైంది.

    'శశివదనే' విషయానికొస్తే.. గోదావరి లంకల్లోని ఓ పల్లెటూరి కుర్రాడు రాఘవ(రక్షిత్‌ అట్లూరి). పీజీలో కెమిస్ట్రీ చేసేందుకు రెడీ అవుతుంటాడు. తల్లి లేకపోవడంతో తండ్రి (శ్రీమాన్‌) ఇతడిని పెంచి పెద్ద చేస్తాడు. తన తండ్రిలానే లవ్ మ్యారేజ్ చేసుకోవాలని రాఘవ అనుకుంటూ ఉంటాడు. ఓరోజు అనుకోకుండా శశి(కోమలి ప్రసాద్‌)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందేందుకు తెగ ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? ఈ ప్రేమకథలో తలెత్తిన సమస్యలేంటి? ప్రేమికుడైన రాఘవ జైలు పాలవ్వడానికి కారణమేంటి? అనేదే మిగతా స్టోరీ.

  • మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, తెలుగు యంగ్‌ హీరో రోషన్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్న చిత్రం 'వృషభ'.. తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఇందులో రాగిణి ద్వివేది, నేహా సక్సెనా తదితరులు నటించారు.   దర్శకుడు నంద కిశోర్‌  తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్‌. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్‌ మాథుర్, సౌరభ్‌ మిశ్రా   నిర్మించారు.  మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించిని ఈ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న తమిళ్‌, కన్నడ, హిందీలో విడుదల కానుంది.  కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్‌, ఏవీఎస్‌ స్టూడియోస్‌ పతాకంపై  రానున్న ఈ మూవీని మూన్‌లైట్‌, థ్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ వంటి హాలీవుడ్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నిక్‌ తుర్లో ఈ చిత్రం కోసం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం విశేషం. ఆయన చిత్రాలకు గతంలో ఆస్కార్‌ కూడా దక్కింది.
     

  • టాలీవుడ్‌ యంగ్‌ హీరో రోషన్‌ కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్‌ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్‌ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై కలర్‌ ఫోటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్‌ సీన్‌ మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బండి సరోజ్‌కుమార్‌, బండి సరోజ్‌, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు.
     

  • రెడ్ డ్రస్‌లో బోలెడంత గ్లామర్‌గా నిధి అగర్వాల్

    ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే అంతే

    'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ వేడుకలో రాశీ హొయలు

    నల్ల చీరలో నాజుగ్గా మెరిసిపోతున్న ఈషా రెబ్బా

    మాయ చేస్తున్న పొడుగు కాళ్ల సుందరి రకుల్

    చీరలో వయ్యారంగా అనుపమ పరమేశ్వరన్

  • వాయిదాలను దాటుకోని అఖండ2: తాండవం థియేటర్స్‌లోకి వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిని ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌కుమార్‌ తదితరులు నటించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, తాజాగా ఈ మూవీ రివ్యూలు, ఫలితంపై వారు రియాక్ట్‌ అయ్యారు.

    అఖండ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట పేర్కొన్నారు. బుక్‌మైషోలో కూడా గంటకు 25వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయన్నారు. హిందీ బెల్ట్‌లో సుమారు 800 థియేటర్స్‌లలో విడుదల చేశామన్నారు. అక్కడ కూడా మంచి టాక్‌ వచ్చిందన్నారు. అయితే, టాలీవుడ్‌లో వచ్చే రివ్యూలను తాము తప్పు పట్టడం లేదన్నారు. ఒక సినిమా రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్‌ వారికి ఉండటంలో తప్పులేదన్నారు. కానీ, గ్రౌండ్‌ రియాలిటీ వేరుగా ఉందన్నారు. 

    రివ్యూలతో సంబంధం లేకుండా సినిమాకు మంచి టాక్‌ వచ్చిందన్నారు. ఒక సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అంటూ ప్రేక్షకుల ద్వారా మంచి టాక్‌ దక్కిందని తెలిపారు. ‘అఖండ 2’ మూవీకి ప్రేక్షకాదరణ దక్కినప్పటికీ.. ఇండస్ట్రీలో కాస్త నెగెటివిటీతో పాటు మిక్స్‌డ్‌  రిపోర్ట్ ఉందని  రామ్‌ ఆచంట తెలిపారు.
     

  • సెలబ్రిటీలు పెళ్లి అంటే కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. సంగీత్, హల్దీ, పెళ్లి అంటూ సెలబ్రేషన్ ఉండనే ఉంటాయి. ఆ టైంలో సోషల్ మీడియాలోనూ ఫొటోలు బాగానే వైరల్ అవుతుంటాయి. కానీ రీసెంట్ టైంలో చూస్తే ఓ కొత్త ట్రెండ్ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటి సంగతి?

    (ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?)

    ఈ నెల ప్రారంభంలో నాగచైతన్య-శోభిత తమ తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో శోభిత షేర్ చేసింది. వివాహం జరిగినప్పుడు కేవలం ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వీడియోని పోస్ట్ చేసి అభిమానులకు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

    ఇప్పుడు హీరోయిన్ కీర్తి సురేశ్ వంతు వచ్చింది. ఈమె కూడా పెళ్లి టైంలో కేవలం ఫొటోలని మాత్రమే పంచుకుంది. తమ బంధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వివాహ వీడియోని షేర్ చేసింది. ఇందులో హల్దీ, సంగీత్, హిందూ-క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన పెళ్లికి సంబంధించిన విజువల్స్ అన్నీ చూడొచ్చు. కీర్తి, ఆమె భర్త ఆంటోనీతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా కనిపించారు.

    (ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)

Business

  • ఫ్లిప్‌కార్ట్‌లో చీఫ్‌ ప్రొడక్ట్, టెక్నాలజీ ఆఫీసర్‌గా లోగడ పనిచేసిన జేయంద్రన్‌ వేణుగోపాల్‌ను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ప్రెసిడెంట్, సీఈవోగా నియమించుకుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇషా అంబానీ, రిలయన్స్‌ రిటైల్‌ నాయకత్వ బృందంతో కలసి.. ముకేశ్‌ అంబానీ, మనోజ్‌ మోదీ మార్గదర్శకం కింద వేణుగోపాల్‌ పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

    రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ, బిజినెన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో 25 ఏళ్ల అనుభవం ఉన్న వేణుగోపాల్‌.. రిటైల్‌ పోర్ట్‌ఫోలియోని బలోపేతం చేస్తారని, ఓమ్ని ఛానల్‌ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌) వృద్ధిని వేగవంతం చేస్తారని, రిలయన్స్‌ రిటైల్‌ వ్యాల్యూ చైన్‌ వ్యాప్తంగా సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొంది. మింత్రాను దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్‌ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దడంలో వేణుగోపాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. అంతకుముందు యాహూ, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌లోనూ పనిచేశారు.

  • బంగారం ధరలు ఈ రోజు (డిసెంబర్ 12) ఉదయం గరిష్టంగా రూ. 2180 పెరిగింది. అయితే.. సాయంత్రానికి రేటు మళ్లీ పెరిగింది. దీంతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందనే.. విషయం తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,21,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,22,100 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 500 పెరిగిందన్న మాట. (ఉదయం 1750 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 500 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 2250 పెరిగింది).

    24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,33,200 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1910 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 540 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 2450 పెరిగింది).

    ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ. 2450 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,33,350 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2250 పెరిగి.. 1,22,250 రూపాయల వద్దకు చేరింది.

    ఇక చెన్నైలో విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 3490 పెరగడంతో రూ. 1,34,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 3200 పెరిగి.. 123700 రూపాయల వద్దకు చేరింది.

  • విహారయాత్రలంటే ఎవరికి మాత్రమే ఇష్టం ఉండదు చెప్పండి, ఏడాదిలో ఏదో ఒకసారైనా.. ఒంటరిగా లేదా కుటుంబంతో అయినా.. అలా కొత్త ప్రదేశాలను సందర్శించి సంతోషపడుతుంటారు. టూర్ వెళ్లడానికి కొందరు వేసవి కాలం ఎంచుకుంటే, మరికొందరు శీతాకాలం ఎంచుకుంటారు. అయితే.. చాలామంది శీతాకాల ప్రయాణమే ఎంచుకుంటారని ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) ఒక సర్వేలో వెల్లడించింది.

    భారతదేశంలో చాలామంది ప్రయాణికులు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి శీతాకాలాన్ని ఎంచుకుంటున్నారని ఎయిర్‌బీఎన్‌బీ 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ సర్వే ద్వారా స్పష్టం చేసింది. చల్లని వాతావరణం.. అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుందని.. ఈ కారణంగానే ఈ కాలంలో ప్రయాణాలకు షెడ్యూల్‌ చేసుకుంటున్నారని వెల్లడించింది.

    భారతీయులలో 30 శాతం మంది శీతాకాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి ఎంచుకుంటుంటే.. మరో 30 శాతం మంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నారు. 20 శాతం మంది కాలానుగుణ లేదా సాంస్కృతిక అనుభవాలను కనుగొనడానికి ప్రయాణం చేస్తున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ చెప్పుకొచ్చింది.

    50 శాతం మంది ప్రజలు జీవిత భాగస్వామితో ప్రయాణించడానికి ఇష్టపడతారు. మూడవ వంతు స్నేహితులతో, 30 శాతం మంది ఉమ్మడి కుటుంబాలతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇందులో కూడా చాలామంది ముందుగా గోవా, కేరళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరువాత జాబితాలో తిరువనంతపురం, కొచ్చి వంటి ప్రదేశాలలోని బీచ్‌లు, కేఫ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయి. 2025 అక్టోబర్ 13-20 మధ్య దేశవ్యాప్తంగా 2,155 మందితో సర్వే నిర్వహించి 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది.

  • ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ వద్ద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం అధికంగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లపై అధికంగా వచి్చనట్టు ఆర్‌బీఐ తాజా డేటా తెలియజేస్తోంది.

    ➤2024–25లో మొత్తం 13,34,244 ఫిర్యాదులు ఆర్‌బీఐ ఇంటెగ్రేటెడ్‌ అంబుబ్స్‌మన్‌ వద్ద దాఖలయ్యాయి. 2023–24లో 11,75,075 ఫిర్యాదులు వచ్చాయి. కాకపోతే 2023–24లో 33 శాతం అధిక ఫిర్యాదులతో పోలి్చతే తర్వాతి సంవత్సరంలో తగ్గాయి.

    ➤సెంట్రలైజ్డ్‌ రిసీప్ట్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీఆర్‌పీసీ) 9,11,384 ఫిర్యాదులను అందుకుంది. ఇందులో 1,08,331 ఫిర్యాదులను దేశవ్యాప్తంగా ఉన్న 24 అంబుడ్స్‌మన్‌ ఆఫీసులకు బదిలీ చేసింది. 10,589 ఫిర్యాదులను కన్జ్యూమర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ సెల్స్‌ (సీఈపీసీ)కు బదిలీ చేసింది. మిగిలిన 7,76,336 ఫిర్యాదులు నిబంధల ప్రకారం లేనివిగా పరిగణిస్తూ కొట్టివేసింది.

    ➤2025 మార్చి 31 నాటికి 16,128 ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి.
        
    ➤రుణాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత క్రెడిట్‌కార్డులపై ఎక్కువగా ఉన్నాయి.
        
    ➤మొబైల్‌/ఎల్రక్టానిక్‌ బ్యాంకింగ్‌పై ఫిర్యాదులు 12.74 శాతం తగ్గాయి.
        
    ➤అత్యధికంగా 2,41,601 ఫిర్యాదులు (81.53 శాతం) బ్యాంకులకు సంబంధించి రాగా, 43,864 ఫిర్యాదులు ఎన్‌బీఎఫ్‌సీలకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి.
        
    ➤ప్రవేటు బ్యాంకులకు వ్యతిరేకంగా వచి్చన ఫిర్యాదుల్లో 37.53 శాతం పెరుగుదల ఉంది.

    ➤ప్రభుత్వరంగ బ్యాంకులపై 8.45 శాతం మేర ఫిర్యాదులు తగ్గాయి.

  • భారతదేశ చేనేత వారసత్వాలను కాపాడటానికి అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూపుకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్‌వోవెన్, నేడు ప్రఖ్యాత నటి శోభితా ధూళిపాళను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది.

    ఈ భాగస్వామ్యం గురించి ఆద్యం హ్యాండ్‌వోవెన్‌ - బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ.. “ఆద్యం ఎల్లప్పుడూ మగ్గం వెనుక ఉన్న వ్యక్తులకు, మన చేతి వృత్తులను రూపొందించే సంస్కృతులకు & అభివృద్ధి చెందుతున్న సంప్రదాయాలకు అండగా నిలుస్తుంది. శోభిత నేటి కాలపు మహిళ, చేనేత వస్త్రాలతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతమైనది.. సహజమైనది. ఆమె మా ప్రచారకర్తగా నిలవటం కొత్త తరం కోసం భారతీయ పనితనంను ప్రతి ఒక్కరూ అభిమానించేలా చేయాలనే మా ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.

    శోభితా ధూళిపాల తన సంతోషాన్ని వెల్లడిస్తూ “కళ,  భావోద్వేగాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా చేతితో తయారు చేసినప్పుడు, అది దానిని సృష్టించిన వ్యక్తి యొక్క ముద్రను కలిగి ఉంటుంది. నేత సంఘాలతో ఆద్యం చేస్తోన్న కృషి, అన్ని రూపాల్లో సంస్కృతిని వేడుక జరుపుకునే సిద్దాంతంతో కలిపి, ఈ అనుబంధాన్ని నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది..” అని అన్నారు.

  • ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

    ఆన్లైన్లీగల్సమాచార పోర్టల్బార్ & బెంచ్కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.

    ఇండిగో వాదన ఇదీ..

    మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఎయిరలైన్స్కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.

    ఇండిగో ఇప్పటికే పునర్‌-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్‌-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.

    మరమ్మతు తర్వాత పునర్‌-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.

    అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది.

Telangana

  • ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌జెండర్లను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌  వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని వారికి ఆయన హితవు పలికారు.  

    హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా  సమావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారు పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్బంగా నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతిభద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

    "ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించం. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు.

    ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని చెప్పారు. 

    'ప్రైడ్ ప్లేస్‌'తో సమస్యల పరిష్కారం: ఏడీజీ చారు సిన్హా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను పరిష్కరించడానికే మహిళా భద్రత విభాగంలో 'ప్రైడ్ ప్లేస్' అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ గారు తెలిపారు.

    ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా వేధించినా నిరభ్యంతరంగా ఈ వింగ్‌ను ఆశ్రయించవచ్చని ఆమె అన్నారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ, సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.

    హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే, ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పక తీసుకోవాలని సూచించారు . ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

    ఈ సమావేశంలో  జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్  .తఫ్సీర్ ఇకుబాల్ ఐపిఎస్ , నార్త్ జోన్ డీసీపీ  రష్మి పెరుమాళ్,  వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళ భద్రతా విభాగ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ  సృజనతో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ చందానాయక్‌ తండా హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థులకు కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో నానక్‌రామ్‌గూడ రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 38 మంది విద్యార్థులు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

     

National

  • కనీవినీ ఎరుగని రీతిలో ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల కష్టాలకు సంబంధించిన ఇప్పటికే  పలు హృదయవిదారక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. హ‌రియాణాలోని రోహ్‌తక్ నుండి పంఘల్ కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కుమారుడి పరీక్ష కోసం తండ్రి చేసిన సాహసం వైరల్‌గా మారింది.

    హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరిపంఘాల్, ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రీ-బోర్డ్​ పరీక్ష (XII ) రాసేందుకు ఇండోర్‌కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుండి విమానాశ్రయానికి వెళ్లాలని ‍ ప్లాన్‌. కానీ అనూహ్యంగా ఇండిగో విమాం రద్దు అయింది. 

    రైలులో సీటు అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని తండ్రి రాజ్‌నారాయణ్  పంఘాల్‌  సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు పరీక్షకు హాజరుకావాలంటే రాత్రంతా కారులో ప్రయాణించాలని ఎంచుకున్నాడు. దాదాపు 800కిలోమీట‌ర్లు కారులో ప్రయాణించి కాలేజీకి చేరుకున్నాడు. సరిగ్గాపరీక్ష సమయానికి ఇండోర్‌కు చేరడం విశేషంగా నిలిచింది. 

    ఇదీ చదవండి: మధుమేహులకు గుడ్‌ న్యూస్‌ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది

    దీనిపై తండ్రి రాజ్ నారాయణ్ స్పందిస్తూ డిసెంబర్ 8న పరీక్షలు రాయాల్సి ఉంది. అంతకుముందు, డిసెంబర్ 6 సాయంత్రం ఇండోర్‌లోని కళాశాలలో అబ్బాయికి సత్కారం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుండి ఇండోర్‌కు అతని విమానం ఇప్పటికే బుక్ చేశాం. అతణ్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపడానికి వెళ్ళాను, విమానం రద్దు కావడంతో సత్కారం మిస్‌ అయింది. కానీ పరీక్ష మిస్‌ కాకూడదనే ఉద్దేశంతోనే  తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సమయానికి తీసుకెళ్ల గలిగాను అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గ్రేట్‌ ఫాదర్‌, నాన్న ప్రేమ అలా ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.   

  • ఛత్తీస్‌గఢ్‌: మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్‌ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.

    లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47 తుపాకీ, రెండు సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్(SLRs), ఒక స్టెన్‌గన్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL)ను అప్పగించారు. గత 11 నెలల్లో కనీసం 1,514 మంది మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో ఆయుధాలను వదిలేశారని బస్తర్‌ ఐజీ సుందరరాజ్ పట్టీలింగం తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 2,400 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

    కాగా, ఈ నెల (డిసెంబర్‌ 8)న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్‌ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో  లొంగిపోయాడు.

     


     

  • అస్సాంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హిమాంత్ బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలోని ముస్లిం సామాజిక వర్గం తనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయరన్నారు. వారికి ఓటుకు రూ.లక్ష ఇచ్చినా తనను ఎన్నుకోవడానికి మెుగ్గుచూపరన్నారు. ఈ మేరకు జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు ఇటీవల బిహార్‌లో ఓటర్లను ఆకర్షించడానికి అక్కడి సీఎం నితీశ్ కుమార్ ప్రవేశ్ పెట్టిన విధంగా మీరెమైనా అస్సాంలో పథకాలు తీసుకొస్తారా అని సీఎంను ‍ప్రశ్ని్ంచారు. దానికి సీఎం బదులిస్తూ "నేను రూ.10 వేలు కాదు రూ.లక్ష ఇచ్చినా ఆ రాష్ట్ర ముస్లింలు నాకు ఓటెయ్యరు. వారు కావాలంటే నా కిడ్నీని దానంగా ఇస్తా కానీ వారు నాకు ఓటెయ్యరు" అని అన్నారు. ప్రస్తుతం ఓట్లనేవి పథకాలు, అభివృద్ధి బట్టి కాకుండా ఐడీయాలజీ ప్రకారం వేస్తున్నారని హిమంత్ అన్నారు.

    అస్సాంలోకి చాలా మంది అక్రమంగా ప్రవేశిస్తున్నారని హిమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో 38 శాతం ఉన్న ముస్లింల జనాభా 2027 వరకూ 40 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 1961 నుంచి ఆ కమ్యూనిటీ దశాబ్ధ జనాభా వృద్ధిరేటు 4-5శాతం నిరంతరాయంగా పెరుగుతూ ఉందని అన్నారు. ఒకవేళ ముస్లింల జనాభా రాష్ట్రంలో 50శాతం దాటితే వేరే మతాల ప్రజలు రాష్ట్రంలో నివసించలేరని హిమంత్ బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అయితే ముస్లిం ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. వారు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం అక్కడ విజయం సాధించిందన్నారు. 

Family

  • తమిళ సినిమా ఐకాన్‌ రజనీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కుర్రహారోల మాదిరిగా అంతే ఫిట్‌గా ఉండటమే కాదు, స్టైలిష్‌గా డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు. ఏడు పదుల వయసులోనూ అంతే స్ట్రాంగ్‌ పర్సనాలిటి మెయింటైన్‌ చేస్తున్న​ సూపర్‌స్టార్‌ డైట్‌ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు ఒక చెన్నై డాక్టర్‌ రజనీ డైట్ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా ఇషేర్‌ చేశారు. మరి ఇవాళ (డిసెంబర్‌ 12) రజనీకాంత్‌ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఆరోగ్య రహాస్యాలు, డైట్‌ ఎలా ఉంటుంది వంటి వాటి గురించి ఆ డాక్టర్‌ మాటల్లోనే తెలుసుకుందామా.

    చెన్నై బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రీతి మృణాళిని రజనీ ఆరోగ్య రహస్యం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆయన ఐదు తెల్లటి ఆహారాలను నివారించడం వల్ల ఇంతలా ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఉన్నారని అన్నారామె. ఉప్పు, చక్కెర, మైదా, పాలు, పెరుగు అతిగా తీసుకుంటే  వాపు, ఇన్సులిన్ స్పైక్‌లు, ఆమ్లత్వం, గట్‌ సమస్యలకు దోహదం చేస్తాయి. అలాగే ఆయన మంచి పోషకవంతమైన ఆహారం తోపాటు రోజువారీ వ్యాయామాలు, ధ్యానం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయని అన్నారు. 

    అలాగే డాక్టర్‌ మృణాళిని రజనీ డ్యాన్సులు చేస్తున్న వీడియోలు పంచుకుంటూ..మన సూపర్ స్టార్ రజనీకాంత్ 74 సంవత్సరాల వయస్సులో కూడా చాలా అందంగా నృత్యం చేస్తున్నారు కదా..!. దానికి కారణం ఏంటో తెలుసా..అంటూ ఆయనే స్వయంగా తాను ఎలాంటి ఆహారం తీసుకుంటాననేది చెబుతున్న వీడియోని కూడా ఆమె జోడించారు. ఆ వీడియోలో రజనీకాంత్‌ స్వయంగా తాను తెల్లటి ఆహారాలకు దూరంగా ఉంటానని అన్నారు. అవేంటో కూడా ఆయనే చెప్పారు కూడా.

    ఆ ఐదు ఎందుకు నివారించాలంటే.

    1. ప్రాసెస్ చేసిన తెల్లటి చక్కెర
    డాక్టర్ మృణాళిని మాట్లాడుతూ.. "ఇది బొడ్డు కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, ఆకలి కోరికలను పెంచుతుంది. కాబట్టి,  దీన్ని ఎంత త్వరగా నివారిస్తే అంత మంచిది." అని సూచించారు.

    2. తెల్ల ఉప్పు
    పరిమితంగా తీసుకోకపోతే పొట్ట ఉబ్బరం, అధిక బిపి (రక్తపోటు) కూడా రావొచ్చు

    3. తెల్ల బియ్యం
    దీన్ని (తెల్ల బియ్యం) కూరగాయలతో కలిపి మితమైన పరిమాణంలో తీసుకుంటే పర్లేదు లేదంటే బరువు వేగంగా పెరిగిపోయేందుకు దారితీస్తుందని హెచ్చరించారు డాక్టర్‌ మృణాళిని. 

    4. మైదా
    బియ్యంలో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కానీ మైదాలో పూర్తిగా జీరో కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు

    5. పాలు, పెరుగు  వెన్న వంటి పాల ఉత్పత్తులు
    ఇవి కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కానీ, 40 ఏళ్ల తర్వాత, జీవక్రియ మందగించడం ప్రారంభమవుతుందట. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. అప్పుడే పొట్ట  ఉబ్బరం, అధిక బరువు సమస్య దరిచేరవని అంటున్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

     

    (చదవండి: Success Story: డెలివరీ బాయ్ నుంచి జొమాటో డిజైనర్‌ రేంజ్‌కు! మనసును కదిలించే సక్సెస్‌ స్టోరీ..)

     

Dr B R Ambedkar Konaseema

  • వాడపల్లి క్షేత్రంలో టెండర్లు

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గృహ సంకల్పం కింద ఇటుకల పాటను దొడ్డ లక్ష్మణరావు రూ.59,09,999కు దక్కించుకున్నారు. గతంలో ఈ టెండరు ద్వారా రూ.35,66,999 రాగా ఈ సారి రూ. 23,43,000 ఆదాయం పెరిగింది. దేవస్థానం పచ్చి గో గ్రాసం అమ్ముకునే హక్కును అడపా వరప్రసాద్‌ రూ.10,09,999కు దక్కించుకున్నారు. గత ఏడాది దీనికి రూ.1.25 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.8,84,999 అదనంగా ఆదాయం వచ్చింది. గుమ్మటాలుకు సంబంధించి గత శిస్తు రూ.2,14,999 ఆదాయం రాగా ప్రస్తుతం రూ.75,333 వచ్చింది. ఆ విధంగా ఈసారి రూ 1,39,666 ఆదాయం తగ్గింది. 26 షాపులకు పాట పెట్టగా అందులో ఐదు మాత్రమే వేలానికి వెళ్లాయి. వాటిని రూ.50,709కు పొందారు. గత ఏడాది కంటే ఈసారి రూ.5,300 ఆదాయం పెరిగింది. ఆలయంలో సెక్యూరిటీ సేవలు శ్రీస్కంధ బౌన్సర్లు రూ.వెయ్యికి, శ్రీకృష్ణప్రసాద్‌ రూ.369కి టెండరు పొందారు. కార్యక్రమంలో గ్రేడ్‌ – 3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం సిబ్బంది తధితరులు పాల్గొన్నారు.

  • ఓవరాల్‌ చాంపియన్స్‌ జీఎస్‌ఎల్‌

    రాజానగరం: స్థానిక జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల క్రీడా మైదానంలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్‌, డెంటల్‌ కాలేజీలకు నిర్వహించిన అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు (పురుషులు) 2025లో ‘ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌’ను స్థానిక జీఎస్‌ఎల్‌ క్రీడాకారులు కై వసం చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పోటీలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. ఫుట్‌బాల్‌, చెస్‌, బ్యాడ్మింటన్‌ పోటీలలో జీఎస్‌ఎల్‌ విద్యార్థులు విజేతలుగా నిలువగా, కబడ్డీ, లాన్‌ టెన్నిస్‌లలో విజయవాడకు చెందిన ఎస్‌ఎమ్‌సి జట్లు ఆధిపత్యం చూపాయి. అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ద్వారా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్న విజతలకు జీఎస్‌ఎల్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు షీల్డ్‌ అందజేశారు.

  • పిచ్చి కుక్క దాడిలో  21 మందికి గాయాలు

    పి.గన్నవరం: మండలంలోని ఏనుగుపల్లి, వై.కొత్తపల్లి, పి.గన్నవరం పరిసర గ్రామాల్లో రెండు రోజలుగా ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తోంది. కనిపించిన వారిని కరుస్తూ పారిపోతుండటంతో ప్రజలు భయాందోన చెందుతున్నారు. బుధవారం 14 మందిని, గురువారం ఏడుగురిని గాయ పరచింది. దీంతో వారంతా పి.గన్నవరం సీహెచ్‌సీకి వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆస్పత్రిలో నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, సిబ్బంది హెచ్చరించారు.

    రైలు నుంచి జారిపడి

    వ్యక్తి మృతి

    తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. అన్నవరం రైల్వేస్టేషన్‌, యార్డ్‌ రైల్వేగేటు మధ్య సుమారు 40 ఏళ్ల వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94906 19020 నంబరుకు ఫోన్‌ చేయాలని కోరారు.

  • ఏమి స

    సాక్షి, అమలాపురం: గోదావరి నదీపాయల మధ్య దీవులుగా ఉన్న కోనసీమకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కల్పించినదీ.. ఈ ప్రాంత వాసుల రాకపోకలకు అనువుగా మార్చినదీ.. ఇక్కడ పండే వ్యవసాయ.. ఉద్యాన.. ఆక్వా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ ఎగుమతులకు అనువుగా చేసినదీ ఇక్కడి వారధులే. కోనసీమ అభివృద్ధిలో ఇవెంతో కీలకంగా నిలిచాయి. ఇక్కడ నిర్మించిన పాత కాలం నాటి వారధులు కొన్ని దెబ్బతింటున్నాయి. బరువు తట్టుకునే సామర్థ్యం తగ్గడంతో వీటికి మరమ్మతులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇటీవల దిండి– చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు చేపట్టగా, తాజాగా పి.గన్నవరం అక్విడెక్టు మరమ్మతులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రావులపాలెం– జొన్నాడ మధ్య ఉన్న పాత వంతెనకు మరమ్మతులు చేయగా, ఐలెండ్‌ (ఐ.పోలవరం)–ముమ్మిడివరం మధ్య ఉన్న రాఘవేంద్ర వారధికి సైతం మరమ్మతులు చేసి నెట్టుకువస్తున్నారు.

    కోనసీమ దీవిలో కీలకమైన వంతెనల పరిస్థితి ఇలా దిగజారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉలుకూ పలుకూ లేకుండా ఉండడంపై ఈ ప్రాంత వాసులు మండిపడుతున్నారు. జిల్లాలోని దిండి–చించినాడ పి.గన్నవరం అక్విడెక్టులకు ఏకకాలంలో మరమ్మతులు నిర్వహిస్తే భారీ వాహనాలకు, ప్రజా రవాణాకు బ్రేక్‌ పడుతుంది. రాజోలు నుంచి పశ్చిమ గోదావరికి చేరాల్సిన భారీ వాహనాలు బోడసకుర్రు వంతెన మీద నుంచి అమలాపురం, రావులపాలెం మీదుగా సిద్ధాంతం వంతెన దాటాల్సి ఉంది. ఇది తమకు వ్యయప్రయాసలుగా మారుతోందని స్థానికులు, రైతులు వాపోతున్నారు.

    దిండి–చించినాడ.. మూడు నెలలుగా నత్తనడకనే..

    జాతీయ రహదారి 216లో కీలకమైన దిండి–చించినాడ వంతెన సూపర్‌ స్ట్రక్చర్‌ బలహీన పడినట్లు నేషనల్‌ హైవే ఇంజినీర్లు గుర్తించారు. ప్రధాన పిల్లర్లలో లూజ్‌ పాకెట్‌లు ఏర్పడ్డాయి. భారీ వాహనాలు వెళ్లే సమయంలో వంతెన బాగా స్వింగ్‌ అవుతోందని గుర్తించారు. ఏకంగా 56 బేరింగ్‌లకు గాను 40 దెబ్బతిన్నాయి. 1995 సంవత్సరంలో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి అనేక అవాంతరాల అనంతరం వంతెనను 2001 సంవత్సరంలో పూర్తి చేశారు. 216 జాతీయ రహదారిగా మారిన తరువాత గడచిన పదేళ్లుగా నిమిషానికి అరవై నుంచి డబ్బై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చైన్నె నుంచి విశాఖపట్నం, కోల్‌కతాకు రాకపోకలు సాగించే వాహనాలు కూడా ఒంగోలులో ఎన్‌హెచ్‌ 16ను వీడి 216 జాతీయ రహదారి ద్వారా కోనసీమ జిల్లా మీదుగా కాకినాడ జిల్లా కత్తిపూడికి చేరుకుంటున్నాయి. దీనితో రద్దీ విపరీతంగా పెరగడంతో వంతెన మరింత దెబ్బతింది. వంతెన మరమ్మతులలో భాగంగా బేరింగ్‌ల స్థానంలో కొత్తవాటిని అమర్చాల్సి ఉంది. తరువాత వంతెనపై రహదారి నిర్మాణం, లైటింగ్‌ ఏర్పాటు చేయాలి. గత జూలై 23వ తేదీ నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేసి అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తయితే గొప్ప విషయమే మరి.

    మరమ్మతుల్లో ఉన్న

    దిండి–చించినాడ వంతెన

    మొన్న దిండి–చించినాడ..

    నేడు గన్నవరం అక్విడెక్ట్‌..

    గతంలో రావులపాలెం జొన్నాడ..

    ప్రమాదంలో పాత వంతెనలు

    వాహనాల రాకపోకలకు బ్రేకులు

    ప్రమాదంలో కోనసీమ వారధులు

    దిండి బాటలోనే పి.గన్నవరం అక్విడెక్టు

    పి.గన్నవరం అక్విడెక్టుపై కూడా రాకపోకలు నిలిచిపోనున్నాయి. 2000 సంవత్సరం జూలై 22 నుంచి ఇది వినియోగంలో ఉంది. అక్విడెక్టు జాయింట్లు దెబ్బతినడంతో రూ.49.30 లక్షలతో విస్తరించనున్నారు. ఇందుకు 42 రోజులు సమయం పడుతుందని చెబుతున్న అధికారులు అప్పటి వరకు రాకపోకలు నిలిపివేయనున్నారు. మరో పది రోజులలో ఇక్కడ పనులు మొదలు కానున్నాయి. కొత్త అక్విడెక్టుపై పనులు ప్రారంభించేందుకు పాత అక్విడెక్టుకు మరమ్మతులు మొదలు పెట్టారు. సుమారు 166 ఏళ్ల నాటి పాత అక్విడెక్టు సామర్థ్యాన్ని పరిశీలించిన తరువాత వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక్కడ కూడా భారీ వాహనాల రాకపోకలు దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

    రాఘవేంద్ర వారధి.. మరమ్మతులతో సరి..

    ఐ.లెండ్‌కు, మిగిలిన కోనసీమ ప్రాంతానికి మధ్య రాకపోకల కోసం మరమళ్ల రాఘవేంద్ర వారధిని 1980లో నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 లక్షల రూపాయలు విరాళాలు అందించారు. దీనిని నిర్మించి 45 ఏళ్లు అవుతోంది. తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇది 216 జాతీయ రహదారిలో భాగంగా ఉంది. కాని వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించలేదు. మరమ్మతులు చేసిన వంతెన మీదనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. తొలుత యానాం–ఎదుర్లంక మీద వంతెన నిర్మాణం పూర్తి కావడం, తరువాత జాతీయ రహదారిగా మారడంతో వాహనాల రాకపోకలు పది రెట్లు పెరగడంతో ఇది తరచూ మరమ్మతులకు గురవుతోంది.

  • కోనసీ

    కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నమోదు

    గజగజలాడుతున్న జిల్లా ప్రజలు

    ఉదయం 8 దాటినా వీడని మంచు తెరలు

    ఐ.పోలవరం: చలి పులి పంజాకు కోనసీమ ప్రజలు గజగజలాడుతున్నారు. జిల్లాలో గురువారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజుల క్రితం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉంది. అయితే రెండు రోజుల నుంచి అటు గరిష్ట, ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం విశేషం. గరిష్టం 27 డిగ్రీలకు, కనిష్ఠం 18 డిగ్రీలకు తగ్గిపోయింది. మరో రెండు రోజులలో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 గంటలకే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. మరోవైపు ఈ వాతావరణం శీతల రోగాలకు, వ్యాధులకు కారణమవుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న మంచులో తిరుగుతున్న వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధ్యమైనంత వరకూ మంచులో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పొద్దు పొడవక ముందే పనులకు వెళ్లాల్సిన వారు ముందున్న దారి కనపడక తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ వాతావరణం వల్ల ఖరీఫ్‌ కోతలు, రబీ సాగు నారుమడులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 9 గంటలైతే తప్ప వరి చేలల్లో పనులకు కూలీలు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితి రైతులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఉదయం పూట దట్టంగా కమ్ముకుంటున్న మంచులో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాకింగ్‌ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉదయం నడిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారు జామున వాకింగ్‌ మంచిదే అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా మంచులో తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి వాతావరణంతో గుండె సమస్యలు పెరుగుతాయని, గుండైపె ఒత్తిడి పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. పలువురికి ఆస్తమా లేదా బ్రాంకైటిస్‌ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచులో నడకకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాలని, వీలైతే, సూర్యరశ్మి భూమికి తాకే సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

  • టెట్‌కు 45 మంది గైర్హాజరు

    రాయవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు 45 మంది గైర్హాజరయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బుధవారం నుంచి టెట్‌ ప్రారంభమైంది. ముమ్మిడివరం మండలం చెయ్యేరు పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 300 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 278 మంది హాజరై, 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే అమలాపురం భట్లపాలెంలోని బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో 205 మంది హాజరు కావాల్సి ఉండగా 182 మంది హాజరై 23 మంది గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన టెట్‌ పరీక్షకు రెండు సెంటర్లలో కలిపి 250 మంది హాజరు కావాల్సి ఉండగా 221 మంది హాజరై 29 మంది గైర్హాజరయ్యారు. రామచంద్రపురం డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

    నేటి నుంచి ఢిల్లీ విమానం

    కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌కే శ్రీకాంత్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్‌ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్‌ తెలిపారు.

    ఉద్యోగాల భర్తీకి

    నోటిఫికేషన్‌

    కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 3, ఆడియో మెట్రీషియన్‌ 4, టీబీ హెల్త్‌ విజిటర్‌ 5, ఫార్మసిస్ట్‌ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 3, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ 2, పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో ఆర్డినేటర్‌ ఫర్‌ టీబీ 1, అకౌంటెంట్‌ 2, డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ కౌన్సిలర్‌ 1, ఎల్‌జీఎస్‌ 8 పోస్టులను నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు.

    రూ.3.73 లక్షల హుండీ ఆదాయం

    బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,72,809 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వడ్డి ఫణీంద్రకుమార్‌, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

  • పురపాలక సంఘాలలో సౌర విద్యుత్‌ పెట్టాలి

    కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

    అమలాపురం రూరల్‌: పురపాలక సంఘాల్లో సౌర విద్యుత్‌ ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ హిత విద్యుత్‌ ఉత్పత్తి అయ్యి విద్యుత్‌ వ్యయం గణనీయంగా తగ్గుతుందని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నెడ్‌క్యాప్‌, మున్సిపల్‌, ఏపీ ఈపీ డీసీఎల్‌ అధికారులతో అమలాపురం పురపాలక సంఘ పరిధిలో నడిపూడిలో ఏర్పాటు చేయనున్న సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలపై సమీక్షించారు. సోలార్‌ విద్యుత్‌ వల్ల నగర, స్థానిక సంస్థలకు ఆర్థిక, పర్యావరణ, సేవల నాణ్యత పరంగా దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయన్నారు. గ్రిడ్‌ విద్యుత్‌ కొనుగోలు తగ్గడం వల్ల నెలవారీ బిల్లులు తగ్గించుకోవచ్చునన్నారు. ఒక మెగా యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన అంచనాలపై అధికారులతో సమీక్షించి ప్రతిపాదిత ఏడు కోట్ల పెట్టుబడిని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. భవనాలపై సోలార్‌ పెట్టడం ద్వారా గ్రీన్‌ మున్సిపాలిటీ, సోలార్‌ స్మార్ట్‌ టౌన్‌ వంటి బ్రాండింగ్‌ సాధ్య మవుతుందని, దాని వల్ల అదనపు కేంద్ర, రాష్ట్ర ప్రోత్సాహకాలు, అవార్డులు అందుకోవచ్చునని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో కె. మాధవి, ఏపీ ఈపీ డీసీఎల్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ బి.రాజేశ్వరి పాల్గొన్నారు.

    వాడబోది పూడిక తీతకు ప్రతిపాదనలు

    మామిడికుదురు మండలం పాసర్లపూడి వాడబోది మేజర్‌ డ్రైయిన్‌ పూడిక తీత పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ లో ఈ మేరకు డ్రైనేజీ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ అధికారులు, ఓఎన్‌జీసీ ఇంజినీర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 40 ఏళ్లుగా ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల నీరు పారకపోవడంపై ఇంజినీర్లు కలెక్టర్‌కు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. దీని వల్ల ఏర్పడే దుష్ప్రభావాలను ఆయన అడిగి తెలుసు కుని ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.

    రహదారి నిర్మాణంలో క్వాయర్‌ మ్యాట్లు

    అల్లవరం: బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంలో క్వాయర్‌ మ్యాట్‌ల వినియోగం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అన్నారు. మండలం ఎంట్రుకోనలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రహదారి నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. రహదారికి అడుగు భాగంలో ఏర్పాటు చేసిన క్వాయర్‌ మ్యాట్‌ను పరిశీలించి దాని పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • మాదిగలకు మరిన్ని సీట్లు కేటాయించాలి

    ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌

    ఉత్సాహంగా మాదిగల ఆత్మీయ కలయిక

    అమలాపురం రూరల్‌: 70 ఏళ్ల చరిత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ పార్టీలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు మాలలకే ఇచ్చి మాదిగలకు ద్రోహం చేశాయని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేస్తురన్నారని ఆయన అందోళన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్‌లో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం పెరుగుతున్నాయని, వాటిని రాజకీయ పార్టీలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పేరూరులోని కొంకాపల్లి సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గురువారం జరిగిన మాదిగల ఆత్మీయ కలయికలో ఆయన పాల్గొని సహపంక్తి భోజనాలు చేశారు. తొలుత యువత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ 70 ఏళ్ల చరిత్రలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే జిల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చి తమ ప్రాధాన్యాన్ని పెంచుకున్నారన్నారు. ఇతర పార్టీలు మాదిగల పట్ల తమ వైఖరి చెప్పాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నిలబెట్టుకోవాలన్నారు. 2009–19 ఎన్నికల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే సీటు మాదిగలకు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. వచ్చే పంచాయతీ, మున్సిపల్‌ మండల పరిషత్‌ జెడ్పీటీసీ ఎన్నికల్లో 6 శాతం వాటా మేరకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డి మాండ్‌ చేశారు. దండోరా ఉద్యమంలో పోరాటం చేసి న మాదిగ నాయకులను ఇజ్రాయిల్‌ సత్కరించారు. ఆత్మీయ కలయికను విజయవంతం చేసిన ఎమ్మెల్సీని సంఘం నాయకులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు మడికి శ్రీరా ములు, యార్లగడ్డ రవీంద్ర, చెయ్యెటి శ్రీనుబాబు, బడుగు శ్రీను, నేదునూరి నథానిల్‌, పలివెల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఏపీ ఎన్‌జీవో జిల్లా కార్యవర్గం

    అమలాపురం టౌన్‌: ఏపీ ఎన్‌జీవో సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక ఏవీఆర్‌ నగర్‌లోని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్‌ భవనంలో గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. కార్యవర్గంలోని 17 పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా బి.సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వర్లు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఎన్‌.రామారావు, కార్యదర్శిగా కోలా పీవీఎన్‌బీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జె.మల్లికార్జునుడు, సీహెచ్‌ చిట్టిబాబు, సీహెచ్‌ సూర్యారావు, టి.ఏసుబాబు, ఆర్‌వీ నరసింహరాజు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.లోవలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవీ సీతారామరాజు, బి.రామకృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎస్‌వీ రామారావు, డి.పృథ్వీరాజ్‌, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎస్‌. కృష్ణవేణి, కోశాధికారిగా జి.సురేష్‌సింగ్‌ ఎన్నికయ్యారు. ఎన్నికలకు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారిగా పి.రమేష్‌, అబ్జర్వర్‌గా టి.జానకి వ్యవహరించారు. కార్యవర్గాన్ని ఉమ్మడి జిల్లా సంఘం పూర్వ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, ఆచంట రామారాయుడు తదితరులు అభినందించారు. జిల్లాలోని ఎన్‌జీవోల సమస్యల పరిష్కారానికి తమ నూతన కార్యవర్గం కృషి చేస్తుందని నూతన సభ్యులు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లాలోని ఆరు యూనిట్ల అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

  • తొలి

    కోనసీమ జిల్లాకు బాహ్య ప్రపంచంతో రాకపోకలు మొదలైంది రావులపాలెం–జొన్నాడ పాత వంతెనతోనే. గౌతమీ నదిపై తొలి వంతెనను నాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పీడబ్ల్యూడీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించగా ఏప్రిల్‌ 20, 1967లో వినియోగంలోకి తీసుకువచ్చారు. 58 ఏళ్లు పూర్తయిన ఈ వంతెన తొలుత ఎన్‌హెచ్‌–16, తరువాత ఎన్‌హెచ్‌–216 పరిధిలో ఉంది. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా వాజ్‌పాయి ప్రభుత్వ హయాంలో రెండో వంతెన నిర్మించారు. తరచూ ఎక్కడో అక్కడ దెబ్బ తింటుండడంతో రూ.కోట్లతో మరమ్మతులు చేశారు. ఈ నేపథ్యంలో 2022 మే నెలలో వాహనాల రాకపోకలు నిలిపివేసి తిరిగి 2023 ఏప్రిల్‌ నెలలో ప్రారంభించారు. ఐరెన్‌ రోప్‌లు, పిల్లర్లకు బేరింగ్‌లు మార్చారు. ఇది మరో 30 ఏళ్లు పనిచేస్తుందని అధికారులు చెప్పినా, వాహనాల సంఖ్య పెరగడంతో పదిహేనేళ్లు తరువాత మరోసారి మరమ్మతులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌

    కొబ్బరి రకం ధర (రూ.ల్లో)

    కొత్త కొబ్బరి (క్వింటాల్‌) 20,000 – 22,500

    కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000

    కురిడీ కొబ్బరి (పాతవి)

    గండేరా (వెయ్యి) 27,000

    గటగట (వెయ్యి) 25,000

    కురిడీ కొబ్బరి (కొత్తవి)

    గండేరా (వెయ్యి) 25,000

    గటగట (వెయ్యి) 23,000

    నీటికాయ

    పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000

    కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000

    కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000

    కిలో 400

  • నమ్మక

    కపిలేశ్వరపురం: స్థానిక ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు గురువారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి పర్యవేక్షణలో ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీకి మారిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరంకు సరిపడ 10 మందికి మించి సభ్యులు ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ స్థానానికి వెంకటలక్ష్మిని కేదారిలంక ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు ప్రతిపాదించగా నేలటూరు ఎంపీటీసీ సభ్యురాలు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి బలపరిచారు. దీంతో వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జేసీ నిషాంతి, ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ధ్రువీకరణ పత్రం అందజేశారు. నూతన ఎంపీపీ వెంకటలక్ష్మికి ఎంపీడీఓ హెచ్‌.భానోజీరావు, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జి.రాజేంద్రప్రసాద్‌, సిబ్బంది, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు.

    ప్రలోభాలకు లొంగక..

    రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత ఇష్టాలు, ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అంటూ జీవించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా గెలుపు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బాటలో నడచి, చేయిపట్టి నడిపించిన నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. మండల పరిషత్‌ ఎన్నికల్లో అదే జరిగింది. వైఎస్సార్‌ సీపీకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నమ్మకానికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు కట్టుబడి నిలబడ్డారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి మళ్లిన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అంతిమంగా నిజాయతీ మరోసారి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. మండలంలో 19 మంది ఎంపీటీసీ స్థానాలుండగా గత పరిషత్‌ ఎన్నికల్లో 15 వైఎస్సార్‌ సీపీ, రెండు టీడీపీ, మరో రెండు జనసేన గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగినప్పటికీ మిగిలిన 12 మంది నిజాయతీగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఓటింగ్‌లో ఎంపీపీ జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, పెందుర్తి శిరీష, పలివెల మధు, గుణ్ణం భాను ప్రసాద్‌, అడ్డాల శ్రీనివాస్‌, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, ఉమ్మిడిశెట్టి వీరవేణి, గొల్లపల్లి సోనియా, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

    గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

    తనతో సహా వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మండల పరిషత్‌లో ఉన్న సుమారు 70 లక్షల నిధులను మండలంలోని 19 గ్రామాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాలు చేశాం. వివిధ దశల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలంతో అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ తామంతా పరిషత్‌ నిధులను పార్టీలకు అతీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

    – జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీపీ

    సభ్యులకు కృతజ్ఞతలు

    ఎమ్మెల్సీ తోట

    కపిలేశ్వరపురం ఎంపీపీ ఎన్నికలో నిజాయతీగా నిలబడిన వైఎస్సార్‌ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సభ్యులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం తదితర కారణాలతో వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలు ఆలస్యమైందన్నారు. ఒప్పందానికి కట్టుబడి మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడం, జిత్తుక వెంకటలక్ష్మి ఎన్నికకు 12 మంది సభ్యులు ఏకతాటిపై నిలవడం వైఎస్సార్‌ సీపీ పట్ల, తన పట్ల ఎంపీటీసీ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులు తర్వాత మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోబోమని, ఎవరైనా రాదలిస్తే తమ పదవులకు రాజీనామా చేసి చేరవచ్చని ప్రగల్బాలు పలికారన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీకి చెందిన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్నారని, వారంతా వారి వారి పదవులకు రాజీనామా చేయించి చేర్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేని నేత అని ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల తీరు సైతం అలానే ఉందన్నారు. నియోజకవర్గంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రలోభాలకు గురి చేస్తూ నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, నిజాయతీ, అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల తెలుసుకోవాలని ఎమ్మెల్సీ తోట అన్నారు.

    కపిలేశ్వరపురం ఎంపీపీగా

    విజయలక్ష్మి ఏకగ్రీవం

    అండగా నిలచిన 12 మంది

    వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు

    ప్రలోభాలకు లొంగని వైనం

    ఎన్నికను పర్యవేక్షించిన జేసీ నిశాంతి

  • మొసళ్

    అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని తెలుసుకున్న అమలాపురం అటవీ రెంజ్‌ అధికారి ఈశ్వరరావు బృందం గురువారం ఆ పరిసరాలను గాలించారు. పరిసరాల్లోని నీటి గుంటల వద్ద మొసళ్ల పాదముద్రలు సేకరించారు. అయితే ఒకటే మొసలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు, వ్యవసాయ కార్మికులకు వారి ఫోన్‌ నంబర్లు ఇచ్చి మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మొసలి రాత్రి వేళల్లో వేగంగా సంచరిస్తుందని, ఒక చోట నుంచి మరో చోటుకు వేగంగా కదులుతోందన్నారు.

    ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్ష

    కడియం: బాలుడి మృతి కేసులో కడియం మండలం జేగురుపాడుకు చెందిన రాయి వెంకన్న, నల్లి శేఖర్‌లకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్టు కడియం ఇన్‌స్పెక్టర్‌ ఎ.వేంకటేశ్వరరావు తెలిపారు. 2018 సెప్టెంబర్‌ ఏడో తేదీన మోటారు సైకిల్‌లో పెట్రోల్‌ తీసి దొంగతనం చేస్తున్నాడని సంతోష్‌కుమార్‌ అనే బాలుడిని వీరు కొట్టారు. దీంతో బాలుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి సీఐ ఎం.సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి గంధం సునీత 14 మంది సాక్షులను విచారించి, నిందితులకు కేసు ఖరారు చేసినట్టు వెంకటేశ్వరరావు వివరించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అడిషనల్‌ పీపీలు కె.రాధాకృష్ణ, రాజులు, రాచపల్లి ప్రసాద్‌ వ్యవహరించారన్నారు. కోర్టు కానిస్టేబుల్‌ కె.శ్రీనివాస్‌ సాక్షులను కోర్టు ముందు హాజరు పరిచారని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

    మహిళపై కత్తులతో దాడి

    పిఠాపురం: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ మహిళపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పిఠాపురం–సామర్లకోట రోడ్డులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సునీత రాత్రి విధులు ముగించుకుని హైవే మీదుగా స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఆమె సీతయ్య గారి తోట శివారు నరసింగపురం రోడ్డు మీదుగా వస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెంబడించి కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. దాడిలో సునీత శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. గాయపడ్డ సునీత గట్టిగా అరవడంతో దుండగులు పరారయ్యారు. రక్తపు గాయాలతో ఉన్న సునీతను స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. సదరు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

    17 నుంచి

    అభిషేక వేళల మార్పు

    సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసం సందర్భంగా 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ స్వామివారి ఆర్జిత అభిషేకం వేకువ జామున 4.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ గురువారం పేర్కొన్నారు. ఇంత వరకూ ఈ అభిషేకాన్ని 5.30 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా 16వ తేదీన ఆర్జిత సేవగా స్వామివారి శాంతికల్యాణం జరుగునున్నట్టు ఏసీ ప్రసాద్‌ అన్నారు. ఈ సేవలకు ఆలయ వెబ్‌సైటు నుంచి గాని, ఆలయం వద్ద కౌంటర్‌ నుంచి కానీ టిక్కెట్లు పొందవచ్చునని ఆయన అన్నారు.

    16 నుంచి ధనుర్మాస వ్రతం

    మామిడికుదురు: అప్పనపల్లిలో బాల బాలాజీ స్వామి వారి సన్నిధిలో ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు గురువారం తెలిపారు. ఆ రోజు నుంచి జనవరి 14వ తేదీ బుధవారం వరకు ఈ వ్రతం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా నిత్యం ప్రాతఃకాలంలో ఐదు గంటలకు దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా స్వామి వారి సన్నిధిలోని ఆండాళ్‌తాయారు (గోదాదేవి)కి ప్రతి రోజు మేళ తాళాలతో అర్చక స్వాములు తీర్థపు బిందెతో గ్రామోత్సవం, ‘తిరుప్పావై’ నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా నిత్యం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నివేదన, నిత్య హోమం, బలిహరణ, మంగళా శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు.

  • కొండల

    గోపాలపురం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు దళారులు మండలంలోని పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు కొల్లగొట్టి మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, గోపాలపురం, చిట్యాల, చెరుకుమిల్లి, రాజంపాలెం, గంగోలు, యర్రవరం గ్రామాలలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి సుమారు 70 శాతం మట్టిని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. వారికి స్థానిక నాయకుల అండదండలు ఉండడంతో జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు ఇప్పటికే మాయమైపోయాయి. కాలువ తవ్వకాల సమయంలో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పొందిన రైతులు మిగులు భూములపై కన్నేసి ఆ భూమిలోని మట్టిని విక్రయించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్లీ సాగులోకి తెస్తున్నారు. కొవ్వూరుపాడు, గోపాలపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కొండలను సైతం అక్రమార్కులు తవ్వేసి ఇళ్లకు, ఎత్తు పల్లాల నేలల చదునుకు మట్టిని విక్రయిస్తున్నారు.

    కొండలు పిండి చేస్తున్నారు

    రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్‌ ఇంటి వద్ద వేయాలంటే దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ. 1500కు విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మట్టి దొకడం కష్టంగా ఉంటుంది. కొండలు పిండి చేస్తున్నా సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు కానీ, రెవెన్యూ అఽధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి.

    – సరంగి మోసియ్య, చిట్యాల

    ఆగని మట్టి అక్రమ తవ్వకాలు

    చోద్యం చూస్తున్న అధికారులు

    స్థానిక నాయకుల అండతో

    రేయింబవళ్లు మట్టి తరలింపు

    గోపాలపురం మండలంలో విడ్డూరం

  • భారీగా గంజాయి పట్టివేత

    24,690 కిలోల సరకు స్వాధీనం

    విలువ రూ.13,29,500

    ఏడుగురి అరెస్టు

    కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి ఎస్సై జి.సతీష్‌ తన సిబ్బందితో బూరుగుపూడి గ్రామ శివారున మాటు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వైపు మూడు మోటార్‌ సైకిళ్లపై వెళ్తున్న ఏడుగురు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి 17 ప్యాకెట్లలో ఉంచి తరలిస్తున్న రూ.13,29,500 విలువ చేసే 24,690 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అల్లూరి జిల్లా హకుంపేటకు చెందిన జోగ్‌ నకుల్‌సింగ్‌, పంజా దుర్గాప్రసాద్‌, పెద్దాపురానికి చెందిన పంచదార స్వామి, వనపర్తి రాజేష్‌, సప్పా అశోక్‌, లంక శ్రీకల్యాణ్‌, గొంపు అప్పారావులుగా గుర్తించారు. గంజాయి తరలింపులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నకుల్‌సింగ్‌ను ఏ1గా, జంపా దుర్గాప్రసాద్‌ ఏ2, పంచదార స్వామి ఏ3, వనపర్తి రాజేష్‌ ఏ4గా పేర్కొన్నారు. గతంతో వీరిపై ఎన్‌డీపీఎస్‌ కేసులు ఉన్నాయి. ఏ5 సప్పా అశోక్‌పై హత్య కేసు ఉంది. నిందితులపై కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మూడు మోటార్‌ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టించిన ఈగల్‌ టీమ్‌ను, ఎస్సైని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకర్ల సమావేశంలో సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్సై సతీష్‌ కూడా పాల్గొన్నారు.

  • రోడ్డ

    మోటారు సైకిల్‌ను ఢీకొన్న కారు

    మరొకరికి తీవ్రగాయాలు

    జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్‌ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్‌ఎల్‌ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వేమూరి మురళీకృష్ణ (60), తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్‌ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి (35)కి, మురళికృష్ణకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Karimnagar

  • హస్తం

    కరీంనగర్‌: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్‌ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. కమాన్‌పూర్‌ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్‌ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది.

  • తొలి

    సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

    తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో మొత్తం 92 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. మూడు గ్రామాల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. చొప్పదండి మండలంలోని దేశాయిపేట గ్రామంలో సర్పంచ్‌తోపాటు ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 91 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,52,408 మంది ఓటర్లకు గాను, 1,24,088 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 59,504 మంది పురుషులు కాగా, 64,540 మంది సీ్త్రలు ఉన్నారు. మహిళలు 82.51శాతం ఓటుహక్కు వినియోగించుకుని ముందంజలో ఉండగా, 80.26శాతం పురుషులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.

    పరిశీలించిన అధికారులు

    మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్‌ జరిగిన గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. సీపీ గౌస్‌ఆలం ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఓటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు.

    మండలం మొత్తం గ్రామాలు ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు శాతం మహిళలు శాతం మొత్తంశాతం

    చొప్పదండి 15 27,677 23,154 11,145 83.02 12,008 84.26 83.66

    గంగాధర 33 44,163 34,758 16,293 76.15 18,464 81.10 78.70

    కరీంనగర్‌రూరల్‌ 14 22,053 18,672 9,233 84.94 9,438 84.40 84.67

    కొత్తపల్లి 06 17,767 14,069 6,810 77.98 7,259 80.35 79.19

    రామడుగు 23 40,748 33,435 16,023 81.29 17,411 82.78 82.05

    మొత్తం 91 1,52,408 1,24,088 59,504 80.26 64,580 82.51 81.42

  • ఆరోగ్

    కరీంనగర్‌స్పోర్ట్స్‌: ఆరోగ్యానికి వ్యాయామ క్రీడలు దోహదం చేస్తాయని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఉమేశ్‌ కుమార్‌ అన్నారు. గురువారం వర్సిటీ క్రీడా మైదానంలో సౌత్‌ జోన్‌ అంతర విశ్వవిద్యాలయ అథ్లెటిక్‌ పోటీలను ప్రారంభించారు. వ్యాయామంతో శారీ రక ధృఢత్వం పెరుగుతుందని, ఆత్మధైర్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులకు రన్స్‌, జంప్స్‌, త్రోస్‌ విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ నజీముద్దీన్‌ మునవర్‌, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మనోజ్‌ కుమార్‌, పీడీ విజయకుమార్‌, దినేశ్‌, పర్వీన్‌, అరవింద్‌, జిలాని పాల్గొన్నారు.

    సీపీఐ మద్దతుదారులను గెలిపించండి

    చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఆయా గ్రామాల్లో సీపీఐ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్‌, వార్డు సభ్యులుగా గెలిపించాలని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓటర్లను కోరారు. చిగురుమామిడి, సుందరగిరి, రేకొండ గ్రామాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులతో కలిసి గురువారం ఇంటింటా ప్ర చారం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు బూడిద సదాశివ, బోయిని పటేల్‌, చాడ శ్రీధర్‌రెడ్డి, మావురపు రాజు పాల్గొన్నారు.

    కరీంనగర్‌కల్చరల్‌: యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని హైదరాబాద్‌ ది లైఫ్‌ చర్చ్‌కు చెందిన అంతర్జాతీయ ప్రవచకుడు డాక్టర్‌ ఆషేర్‌ ఆండ్రూ అన్నారు. నగరంలోని కోర్డురోడ్డులోని సెయింట్‌ మార్క్‌చర్చ్‌ గ్రౌండ్‌లో గురువారం కరీంనగర్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్‌ వేడుకలకు ప్రధాన ప్రసంగీకుడిగా హాజరై సందేశమిచ్చారు. అంతకు ముందు డాక్టర్‌ ఆషేర్‌ ఆండ్రూకు కేసీఏ బాధ్యులు ఘనస్వాగతం పలికారు. కేసీఏ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎం.క్రిస్టోఫర్‌, ఎంపాలా నాయక్‌, కార్యదర్శి సురేశ్‌, సహకార్యదర్శి కెయేల్‌, కోశాధికారులు ప్రేమసాగర్‌, బాలరాజు, శ్యాం, అభిలాష్‌, కృపాకర్‌ పాల్గొన్నారు.

    సిటీలో పవర్‌కట్‌ ప్రాంతాలు

    కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్‌ లైన్‌ నిర్మాణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ., ఎల్‌టీ లైన్‌ వావిలాలపల్లి ఫీడర్‌ పరిధిలోని బూత్‌బంగ్లా, అల్ఫోర్స్‌ కళాశాల, పోచమ్మ ఆలయం, గుండు హనుమాన్‌ఆలయం, తేజస్‌స్కూల్‌, రెడ్డి ఫంక్షన్‌ హాల్‌, సుభాష్‌నగర్‌ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైతన్యపురి ప్రాంతాలతో పాటు విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాసుదేవకాలనీ, కట్టరాంపూర్‌, అయోధ్యకాలనీ, రెడ్‌హిల్స్‌కాలనీ, వాసుదేవకాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు.

    ‘సర్పంచ్‌ల విజయంతో కాంగ్రె్‌స్‌కు మహర్దశ’

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: సర్పంచ్‌ ఎన్నికలతో కరీంనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మహర్దశ వచ్చిందని పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. గురువారం జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు దారులు అధికంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నల్లగుంటపల్లి సర్పంచ్‌గా వడ్లూరి అంజయ్య, తహేర్‌ కొండాపూర్‌ సర్పంచ్‌గా ఆకుల గిరి, దుబ్బపెల్లి సర్పంచ్‌గా మోతె ప్రశాంత్‌రెడ్డి, ఫకీర్‌పేట్‌ సర్పంచ్‌గా బొద్దుల విజయలక్ష్మి, బహదూర్‌ ఖాన్‌పేట్‌ సర్పంచ్‌గా తిరుపతిరెడ్డిని అభినందించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేదని పేర్కొన్నారు.

  • కరీంన
    శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

    9

    ఓటుపై మమకారం

    ఓటు వేసేందుకే వెనకాముందు ఆలోచించే ఈ రోజుల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కొందరు.

    క్వింటాల్‌ పత్తి రూ. 7,400

    జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో గురువారం క్వింటాల్‌ పత్తి రూ. 7,400 పలికింది. క్రయ, విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

  • రంగు పడింది!

    కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని డివైడర్లకు కొత్తగా రంగులు పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ కింద బ్యూటిఫికేషన్‌లో భాగంగా ఈ రంగులు వేస్తున్నట్లు చెబుతున్నా, టెండర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రూ.30 లక్షలు గోల్‌మాల్‌ అయినట్లు జరుగుతున్న ప్రచార క్రమంలో హఠాత్తుగా డివైడర్లకు రంగులు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుండడం తెలిసిందే. ఆయా మున్సిపాలిటీలు, నగరపాలకసంస్థలు స్వచ్ఛతలో ర్యాంక్‌లు సాధించేందుకు ఈ నిధులు వెచ్చిస్తుంటారు. తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంచడం, పారిశుధ్యాన్ని పాటింపచేసేలా ప్రజలను చైతన్యపరిచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగరంలో అలాంటి ప్రచారాలు లేనప్పటికి, రూ.30 లక్షలు బిల్లు చెల్లిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల ‘సాక్షి’లో ‘రంగులేశారట’ పేరిట వెలుగులోకి తేవడం తెలిసిందే. ఎలాంటి రంగులు లేకుండానే రూ.30 లక్షలు స్వాహా చేసేందుకు సిద్దమయ్యారనే కథనం బాధ్యుల్లో కలవరాన్ని పుట్టించింది. ఈ క్రమంలో నగరంలోని బస్‌స్టేషన్‌కు సమీపంలోని మెయిన్‌రోడ్‌ డివైడర్లకు హఠాత్తుగా రంగులు వేస్తుండడం కలకలం రేపింది. ఈ రంగులకు సంబంధించి అసలు టెండర్‌ పిలిచారా, టెండర్‌లేకుండానే పనులు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రంగులు ఎవరేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో, టెండర్‌ పిలిచారో లేదో కూడా తమకు తెలియదని నగరపాలకసంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. హఠాత్తుగా డివైడర్లపై ప్రత్యక్షమైన రంగులకు, స్వచ్చ సర్వేక్షన్‌లో రూ.30 లక్షల గోల్‌మాల్‌ వ్యవహారానికి ఏదైనా లింకు ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో చేపట్టిన కార్యక్రమాలు, పిలిచిన టెండర్లు, చెల్లించిన బిల్లులు.. ఈ మొత్తంపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్తలు, పలువురు మాజీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

  • ఐదు మండలాలు.. ఆరుగురు ఏసీపీలు

    కరీంనగర్‌క్రైం: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఐదు మండలాలకు ఒక ఏసీపీస్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమించి, అన్నింటిని సమన్వయం చేసుకునేందుకు మరో ఏసీపీకి విధులు అప్పగించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలానికి శ్రీనివాస్‌ జీ, కొత్తపల్లి మండలానికి వెంకటస్వామి, చొప్పదండి మండలానికి సతీశ్‌కుమార్‌, గంగాధర మండలానికి వేణుగోపాల్‌, రామడుగు మండలానికి యా దగిరిస్వామిని ఇన్‌చార్జీగా కేటాయించారు. ఐదు మండలాలను సమన్వయం చేసుకునేందకు ఏసీపీ విజయ్‌కుమార్‌కు బాధ్యతలు ఇచ్చారు. మొత్తం 782 మంది సిబ్బంది ఉండగా 19మంది సీఐలు 40 మంది ఎస్సైలు, 34 మందిహెడ్‌కానిస్టేబుళ్లు, 392 మంది కానిస్టేబుళ్లు, 47 స్పెషల్‌ యాక్షన్‌ టీం పోలీ సులు, 144 మంది హోంగార్డులు, 100 మంది బెటాలియన్‌తో బందోబస్తు నిర్వహించారు. సీపీ గౌస్‌ఆలం ఐదు మండలాల్లోని వివిధ పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు అందించారు. ఏసీపీల అనుమతి ఉంటేనే విజయోత్సవ సంబరాల ర్యాలీ నిర్వహించాలని, లేకుంటే కోడ్‌ ఉల్లంఘన అవుతుందని సీపీ సూచించారు.

  • సమాన ఓట్లతో డ్రాలో గెలుపు
    ● బహుదూర్‌ఖాన్‌పేట 1వ వార్డులో ముగ్గురు పోటీ

    కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామపంచా యతీలో 1వ వార్డులో పో టీ చేసిన ముగ్గురు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధి కారులు గురువారం డ్రా విధానంలో ఒకరిని ఎంపికచేశారు.1వ వార్డులో మొత్తం 86 ఓట్లుండగా 83 ఓట్లు పోల్‌ కాగా రెండు చెల్లలేదు. మిగితా 81 ఓట్లలో పోటీ చేసిన బుర్ర మారుతీ, బుర్ర సంపత్‌కుమార్‌, బుర్ర తిరుపతి లకు 27 ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో ముగ్గురు అభ్యర్థుల అంగీకారంతో డ్రా తీయగా బుర్ర మారుతి గెలుపొందారు.

    కరీంనగర్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ సత్తా చాటింది. గత పంచాయతీ ఎన్నికల్లో 800లకు పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఎన్ని కలు నిర్వహిస్తే కేవలం 22 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఈసారి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కమార్‌ ఆధ్వర్యంలో తొలి దశ ఎన్నికల్లోనే 40కిపైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో తొలిదశ ఎన్నికల్లో 160 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు పోటీ చేశారు. అందులో నాలుగో వంతుకుపైగా గెలుపొందడం విశేషం. తొలిదశ ఎన్నికల్లో గెలిచిన మరో 10 మందికి ఇండిపెండింట్‌ అభ్యర్థులు బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. బండి సంజయ్‌ ఎంపీగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతన్నందున ఎంపీ లాడ్స్‌, సీఎస్సార్‌ ఫండ్స్‌ తోపాటు కేంద్రంతో మాట్లాడిన అత్యధిక నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకొచ్చే అవకాశముందని వారు భావిస్తున్నారు.

  • కౌన్సెలింగ్‌.. స్వచ్ఛంద సేవ

    పున్నం చందర్‌ కొన్నేళ్లుగా జిల్లా కేంద్రంలో సైకాలజిస్టుగా సేవలందిస్తున్నారు. జీవితంపై నిరాసక్తితో ఆత్మహత్యే శరణ్యమనుకునే వాళ్లను గుర్తించి కౌన్సెలింగ్‌ ప్రక్రియతో వారిలో విశ్వాసం నింపుతున్నా రు. ఈమేరకు కార్మికులు ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నా రు. కుటుంబ తగాదాలు, దంపతుల భావోద్వేగపరమైన సమస్యల విషయంలో అదే రీతిలో స్పందిస్తున్నారు. కౌమారదశలో బాలికలకు స్వీయ ఆత్మరక్షణ విద్య, గృహహింస బాధితులకు సాయం, బాలల వికాసంపై సెమినార్లు నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సెల్‌ మానవహక్కుల దినో త్సవం రోజున హైదరాబాద్‌లో గ్లోబల్‌ఐకాన్‌ అవార్డునిచ్చి సత్కరించింది.

  • అనాథ వృద్ధులకు పెద్ద దిక్కు

    గంభీరావుపేట(సిరిసిల్ల): రెండు దశాబ్దాలుగా అనాథ వృద్ధుల సేవలో తరిస్తున్న మల్లుగారి నర్సాగౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. గంభీరావుపేట మండల కేంద్రంలో ‘మా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నర్సాగౌడ్‌ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మలిసంధ్యలో అన్నీ తానై వారి బాగోగులు చూసుకుంటున్నారు. తనువు చాలించిన వారికి కన్నకొడుకులా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం 31 మంది అనాథ వృద్ధులు ఉన్నారు. తన సొంతింటిలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి 9వ తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ఫార్మేషన్‌ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా గురువారం ‘సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. నర్సాగౌడ్‌కు అవార్డు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • దివ్య

    కరీంనగర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులకు సహాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన సహాయకుడిని ఎంపిక చేసుకోవచ్చని ఎన్నికల నిబంధనల్లో ఉంది. ఇదే విషయాన్ని పోలింగ్‌ కేంద్రంలోని రిటర్నింగ్‌ అధికారికి తెలిపితే ఆయన అనుమతి ఇస్తారు. దివ్యాంగులు సహాయకుడితో లోపలికి వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని సహాయకుడు గోప్యంగా ఉంచడంతోపాటు మరోమారు ఇతరులకు సహాయకుడిగా రానంటూ అతను డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఓటువేసే వ్యక్తి ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తికి మాత్రం కుడిచేతి చూపుడు వేలికి గుర్తువేస్తారు.

    స్మార్ట్‌ ఫోన్‌కు అనుమతి లేదు

    పోలింగ్‌ కేంద్రంలోకి స్మార్ట్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ను పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లడం నిషేధమన్నారు. ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌ తీసుకొస్తే స్విచ్‌ ఆఫ్‌ చేసి భద్రత సిబ్బంది లేదా పోలింగ్‌ సిబ్బంది లేదా బీఎల్‌వో వద్ద ఉంచాలని స్పష్టం చేశారు.

    రామగుండం: గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు గురువా రం మృతిచెందినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి తెలిపిన వివరాలు.. అక్టోబర్‌ 24న సుమారు 70 ఏళ్ల వృద్ధురాలు రైల్వేవంతెన కింద పట్టాల పక్కన తీవ్రగాయాలతో ఉండడంతో స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరైనా బంధువులు గుర్తిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

    లారీ బోల్తాపడి ముగ్గురికి గాయాలు

    ధర్మపురి: లారీ బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. మండలంలోని ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన ఐరన్‌లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

    డబ్బులు పంచుతూ పట్టుబడిన వ్యక్తి

    ఇబ్రహీంపట్నం: మండలంలోని తిమ్మాపూర్‌లో గురువారం ఉడయం ఏడు గంటల సమయంలో దాసరి రాజేశ్‌ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి రేవంత్‌ పట్టుకున్నారు. రాజేశ్‌ నుంచి రూ.40వేలు స్వాధీనం చేసుకుని పోలిసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

  • ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి

    కరీంనగర్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ రోజున ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి ఓటరు స్లిప్‌తోపాటు గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

    గుర్తింపు కార్డులివే..

    ● ఆధార్‌ కార్డు, పీహెచ్‌సీ ఫొటో గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌.

    ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు.

    ● బ్యాంకులు, కోఆపరేటివ్‌ సంస్థలు ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డులు.

    ● ప్రభుత్వమిచ్చే హెల్త్‌ కార్డు, జాతీయ జనాభా నమోదు(ఎన్పీఆర్‌) కార్డు.

    ● ఉపాధిహామీ పథకం జాబ్‌ కార్డు.

    ● కార్మిక శాఖ జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం కార్డు.

    ● మాజీ సైనికులు, వితంతువుల పింఛన్‌ పుస్తకం, వృద్ధుల పింఛన్‌ పత్రం.

    ● ఫొటోతో కూడిన రేషను కార్డు, ఫొటోతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం.

    ● స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు.

    ● ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్సు.

    ● దివ్యాంగుల ధ్రువపత్రం.

    ● ఫొటోతో కూడిన పట్టాదారు పాసు పుస్తకం.

  • వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు

    జమ్మికుంట: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో డబ్బులు, మద్యం తమకు వద్దని గ్రామ అభివృద్ధి చేసే సర్పంచ్‌, వార్డు మెంబర్లకు ఓట్లు వేస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రంగమ్మపల్లి భూలక్ష్మి దేవతల వద్ద సీసీ రోడ్డు ,డ్రైనేజీ నిర్మించే నాయకులు కవాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

    ధర్మపురిలో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

    ధర్మపురి: ధర్మపురిలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. దీంతో వివిధ దుకాణదారులు వారివారి షాపులను మూసివేశారు. ఫుడ్‌సేఫ్టీ జిల్లా అధికారి అనూష ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా విషయం తెలిసిన వెంటనే షాపులకు తాళం వేసి వెళ్లిపోయారు. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఓ బేకరిలో తనిఖీలు చేసి యజమానికి రూ. పది వేల జరిమానా విధించారు.

  • అద్దె చెల్లించడం లేదని వాటర్‌ ప్లాంట్‌ మూత

    ధర్మపురి: మున్సిపాలిటీకి డాక్టర్‌ వాటర్‌ ప్లాంట్‌ యజమానికి అద్దె చెల్లించకపోవడంతో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్లాంట్‌ను మూసివేశారు. ధర్మపురి మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2011లో డాక్టర్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్‌ను సుకుమార్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నప్పటికీ అద్దె మాత్రం చెల్లించడంలేదు. దీంతో కమిషనర్‌ అద్దె చెల్లించాల్సిందేనంటూ ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న కర్నె గంగాధర్‌కు సూచించారు. సుకుమార్‌కు సమాచారం చేరవేయాలని కోరినా.. నిర్లక్ష్యం చేస్తున్నారు. అద్దె బకాయిలు రూ.5లక్షలకుపైగా చేరడంతో వారం క్రితం మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ప్లాంట్‌కు తాళం వేశారు. ప్లాంట్‌ మూసివేయడంతో చుట్టుపక్కల ఇళ్లవారు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.

  • వృద్ధులకు బాసటగా..

    కనిపెంచిన వారసుల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న వయోవృద్ధులు, ఆస్తులు లాక్కుని అన్నానికి దూరం చేసిన అయిన వాళ్ల నుంచి బాధలు పడుతూ నిస్సహాయ స్థితికి చేరిన వృద్ధులకు బాసటగా నిలుస్తున్నారు ఆర్డీవో వెంకటేశ్వర్లు. ఏడు నెలల క్రితం సిరిసిల్లకు ఆర్డీవోగా బాధ్యతలు తీసుకునే నాటికి జిల్లా కేంద్రంలో బాధలు పడుతున్న వృద్ధుల కేసులు సుమారు 60 వరకు పెండింగ్‌లో ఉండేవి. ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కేసులపై దృష్టి సారించారు. స్వల్పకాలంలోనే 40 కేసులను పరిష్కరించి వారసుల చేత ఇబ్బందిపడుతున్న వయోవృద్ధులకు ఊరట కలిగించారు. ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సమస్యలపై మానవత దృక్పథంతో స్పందిస్తూ త్వరితగతిన కేసుల పరిష్కారానికి చొరవ చూపుతున్న సేవలను గుర్తించిన ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ గురువారం తమ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించింది. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌శర్మ చేతుల మీదుగా బెస్ట్‌ ప్రిసైడింగ్‌ అఽధికారిగా గుర్తించారు. అలాగే సేవారత్న బిరుదునిచ్చి సత్కరించారు.

  • ఆరోగ్య సేవలు

    జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన అలువాల ఈశ్వర్‌ ఆర్‌ఎంపీగా కార్మిక ప్రాంతంలోని నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. హెల్పింగ్‌హార్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేతకార్మికుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శిబిరాలు, మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామగ్రిని సేకరించి సమకూర్చడం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, దివ్యాంగులకు సహాయం తదితర సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి గ్లోబల్‌ఐకాన్‌ అవార్డునిచ్చి సత్కరించింది.

Hyderabad

  • మెట్లబావిలో తాబేళ్ల మృత్యువాత

    కాలుష్యమయంగా మారిన పురాతన బావి

    పట్టించుకోని ఉద్యాన శాఖ అధికారులు

    నాంపల్లి: పబ్లిక్‌ గార్డెన్‌లోని అతి పురాతన మెట్లబావి కాలుష్యమయంగా మారింది. తాబేళ్లకు ప్రాణ సంకటమైంది. అయినా ఉద్యాన శాఖ అధికారుల్లో చలనం లేకుండాపోయింది. సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఈ శాఖ విఫలమైంది. తెలంగాణ శాసన మండలి ప్రవేశ ద్వారం సమీపంలోని మెట్ల బావి ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో నిండి ఉండేది. ప్రస్తుతం ఈ బావిలో మురుగునీరు వచ్చి చేరింది. మంచినీటి ఊట బావిలో లక్డీకాపూల్‌ నుంచి వచ్చే మురుగునీటి కాల్వ నీరు మెట్లబావిలోకి వచ్చి చేరుతోంది. ఈ కాలుష్యంతో గత ఏడాది పబ్లిక్‌ గార్డెన్‌ చెరువులో సుమారు 70 చేపలు, 22 తాబేళ్లు చనిపోయాయి. ప్రస్తుతం పదుల సంఖ్యలో తాబేళ్లు చనిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తాబేళ్లు చనిపోవడాన్ని చూసిన వాకర్లు, సందర్శకులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్యాన శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం పక్కనే ఉన్న మెట్ల బావిని కూడా పరిరక్షించలేని స్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. వీటికి తోడు పార్కులో ప్రవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది బస్సులు పార్కింగ్‌ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేశారు. ఈ విషయములో ఉద్యాన శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాబేళ్ల మృత్యువాత ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

  • 12 జో

    డీలిమిటేషన్‌పై ఆందోళనలు.. కొనసాగుతున్న అభ్యంతరాలు

    సాక్షి, సిటీబ్యూరో

    టీవల విలీనమైన స్థానిక సంస్థలు సహా హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)ను 300 వార్డులు (కార్పొరేటర్‌ డివిజన్‌)గా డీలిమిటేషన్‌కు ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికార యంత్రాంగం, తదుపరి దశలో చేయాల్సిన సర్కిళ్లు, జోన్లపై దృష్టి సారించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 వార్డులుండగా, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉండటం తెలిసిందే. వార్డులు 150 నుంచి 300కు పెరిగి రెట్టింపు కాగా, సర్కిళ్లు, జోన్లు సైతం రెట్టింపు కానున్నాయి. మొత్తం 60 సర్కిళ్లు, 12 జోన్లుగా జీహెచ్‌ఎంసీ పరిపాలన సాగనుంది. ఈమేరకు కసరత్తు జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.

    ఆందోళనలు.. అభ్యంతరాలు

    విస్తరించిన జీహెచ్‌ఎంసీని 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన వార్డుల్లో కొన్నింట్లో వార్డు పేరు తప్ప ఆ ప్రాంతం లేదంటూ బాకారం వార్డును ప్రస్తావించారు. కొందరు కాచిగూడ బదులు వార్డు పేరు బర్కత్‌పురా కావాలని కోరినట్లు తెలిసింది. ఇంకొందరు సరిహద్దులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న వార్డులకు సంబంధించిన మ్యాపులు లేకపోవడం. వార్డుల వివరాలు కూడా ఆంగ్లంలో తప్ప తెలుగులో లేకపోవడంతో అందరికీ అర్థం కావడం లేదని నిరసనలు వ్యక్తం చేశారు.

    కమిషనర్‌ కర్ణన్‌ను కలిసిన కమలం నేతలు

    వార్డుల విభజనపై బీజేపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర బీజేపీ ఎలక్షన్‌ కమిషన్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి డా.ఎన్‌.గౌతమ్‌రావు, ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, పార్టీ నేతలు సి.కృష్ణయాదవ్‌, చింతల రామచంద్రారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. విలీనం, డీలిమిటేషన్‌ అత్యంత తొందరపాటుతో పారదర్శకత లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లోని 300 వార్డుల మ్యాపులను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌కు ఏ విధానం అనుసరించారో పబ్లిక్‌ డొమైన్‌లో లేకపోవడం తగదని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ప్రక్రియ అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. అధికార పార్టీ అండదండలతో ఒకపార్టీ నేతలు ప్రభావం చూపారని ఆరోపించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీకి ముందు కమిషనర్‌ పాలకమండలి అభ్యంతరాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా నిబంధనలున్నప్పటికీ, పాటించలేదని, వార్డులవారీగా జనాభా, ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు ఇవ్వాలని కోరారు.

    16న పాలకమండలి ప్రత్యేక సమావేశం

    శివారు స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్‌ఎంసీ విస్తరణ, కలిసిన పరిధి మేరకు వార్డుల పునర్విభజన అంశాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునేందుకు ఈ నెల 16న పాలకమండలి ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈమేరకు సభ్యులకు సమాచారం పంపారు.

    వార్డుల మ్యాపులు, తెలుగులో వివరాలు లేకపోవడంపై నిరసనలు

    వార్డు పేరు మార్పు కోసం వినతులు

    జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు

  • పొల్యూషన్‌ కంట్రోల్‌ తప్పుతోంది

    నగరంలో మూడేళ్ల గరిష్టానికి వాయు కాలుష్యం

    సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాయు కాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా దిగజారుతోంది. ఈ ఏడాది 12 శాతం వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 ధూళి కణాల సంఖ్య నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా కనీసం 150 నుంచి 265 మధ్య కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ గాలి పీల్చడం వల్ల రోజుకు 4.4 సిగరెట్లు కాల్చినంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు సంతాన సమస్యలకు కారణమవుతోందని పేర్కొంటున్నారు.

    విమర్శల పాలవుతున్న పీసీబీ..

    నగరంలో వాయు కాలుష్య నివారణకు నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం (ఎన్‌సీఏపీ)లో భాగంగా 2019 జనవరిలో రూ.614 కోట్లు మంజూరయ్యాయి. 2017తో పోల్చితే 2026 నాటికి గాలిలో పీఎం 10 ధూళి కణాలు కనీసం 40 శాతం తగ్గించాలన్నది ఈ పథకం లక్ష్యం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) రూ.561 కోట్ల నిధులు ఖర్చు చేసినా సాధించిన పురోగతి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. 2020లో నగర వాయు నాణ్యత సూచీ 100 (ఏక్యూఐ) ఉండగా 2025లో ఏక్యూఐ 100గానే నమోదు కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డిసెంబర్‌ నెల ఏక్యూఐ 178గా నమోదైంది. గతంలో 2021 డిసెంబరులో 155గా నమోదు కావడమే గరిష్టంగా ఉండేది. ఆ రికార్డులను చెరిపేస్తూ వాయు వేగంతో గాలి కాలుష్యం దూసుకెళుతోంది. దీంతో రూ.వందల కోట్ల నిధులు వృథాగా గాలిలో కలిపేసినట్లైందన్న విమర్శలను పీసీబీ మూటగట్టుకుంటోంది.

    ● కాలుష్య నియంత్రణ మండలి గాలి నాణ్యత లెక్కలకు రహదారిపై వెళ్లే మోటారు సైకిల్‌, ఆటో, బస్సు ప్రయాణికులు, నడిచి వెళ్లే వ్యక్తులు పీల్చిన గాలిలో ఉన్న ధూళి కణాల (పీఎం 2.5, పీఎం10) లెక్కలకు పొంతన లేకుండా పోతోంది. అధికారులు రహదారికి కొంత దూరంలో యంత్ర పరికరాలు అమర్చుతున్నారు. దీంతో రహదారిపై ప్రయాణించే సగటు ప్రయాణికుడు పీల్చే గాలి నాణ్యతకు కొలమానం లేకుండా పోయింది. రహదారిపై వాహనాలు రాకపోకలు సాగించే క్రమంలో గాలిలో ఎగిరిన ధూళి కణాలు పీసీబీ అమర్చిన సీఏఏక్యూఎంఎస్‌ వరకు వెళ్లేసరికి వాటి సాంద్రత గణనీయంగా తగ్గిపోతోంది. రహదారి పక్కనే వాయు నాణ్యత కొలిచే పరికరాలు అమర్చినట్లైతే భయంకరమైన గణాంకాలు వెలుగు చూస్తాయని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. పీసీబీ అధికారులు మాత్రం పరిసర ప్రాంతాల వాయు నాణ్యతను కొలవడానికి ఇలా ప్రశాంతమైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని సమర్థిచుకుంటున్నారు. అయితే.. కొన్ని కేంద్రాల్లో పీఎం 10, మరికొన్ని కేంద్రాల్లో పీఎం 2.5 గణాంకాలు నమోదు కావడం లేదు.

    కొన్ని ప్రాంతాలకే పరిమితం..

    నగరంలో పీసీబీకి 14 ప్రాంతాల్లోనే వాయు నాణ్యత కొలిచే వ్యవస్థ ఉంది. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా అది లెక్కలోకి రావడంలేదు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య, నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. సికింద్రాబాద్‌– మెహిదీపట్నం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఎల్‌బీ నగర్‌ –విజయవాడ, ఉప్పల్‌– వరంగల్‌, హైదరాబాద్‌– బీజాపూర్‌, ఇతర జాతీయ రహదారులపై గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు. మణికొండ, బండ్లగూడ జాగీర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌ ఇతర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరుగా ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యత కొలిచే పరిస్థితి కనిపించడం లేదు.

    రూ.వందల కోట్లు కరుగుతున్నా ఫలితం శూన్యం

    ప్రమాదకర స్థితిలో గాలి నాణ్యత సూచీ

    ఈ ఏడాది 12 శాతం పెరుగుదల నమోదు

    రూ.561 కోట్లు ఖర్చు చేసినా లక్ష్యసాధనలో వెనకబాటే..

    సంవత్సరాల వారీగా వాయు నాణ్యత సూచీ ఇలా..

    సంవత్సరం ఏక్యూఐ

    2020 100

    2021 105

    2022 104

    2023 95

    2024 89

    2025 100

    నగరంలో ప్రాంతాలవారీగా ఇటీవల నమోదైన కాలుష్య వివరాలు

    ప్రాంతం పీఎం 2.5 పీఎం 10

    మలక్‌పేట్‌ 264 135

    బొల్లారం 190 154

    పటాన్‌చెరు 187 155

    సనత్‌నగర్‌ 185 –––

    నాచారం 185 –––

    సోమాజిగూడ 170 150

    జూపార్క్‌ 157 153

  • సబ్సిడీ.. ‘గ్యాసేనా’

    అర్హత సాధించినా రాయితీ వర్తించని వైనం

    సాక్షి, సిటీబ్యూరో: సాక్షాత్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే రూ.500కు ఎల్పీజీ సిలిండర్‌ వర్తింపు ఉత్తుత్తి ‘గ్యాస్‌’గా తయారైంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హత సాధించినా.. సబ్సిడీ సిలిండర్‌ మాత్రం వర్తించడం లేదన్న ఆవేదన పేద కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. దీంతో బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ రీఫిల్‌ కొనుగొలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజా పాలనకు రెండేళ్లు కావస్తున్నా.. కొందరికే సబ్సిడీ భాగ్యం కలుగుతోంది. మరోవైపు కొన్ని కుటుంబాలకు సబ్సిడీ వర్తించినా సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్‌ ఖాతాలో జమ మూణ్నాళ్ల ముచ్చటగా తయారవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం స్లాబ్‌కు పరిమితమై కేవలం రూ.40.71 మాత్రమే నగదు బదిలీగా బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతోంది.

    మహాలక్ష్మి పథకం వర్తిస్తే..

    ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హత సాధించిన కుటుంబాలకు మాత్రం సిలిండర్‌ ధరలో రూ.500, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తూ అవుతోంది. తాజాగా సిలిండర్లపై కొద్ది మందికి మాత్రమే సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగతా వారికి జమ కావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    స్పష్టత కరువు..

    వంట గ్యాస్‌ సబ్సిడీ నగదు జమ కొన్ని లబ్ధి కుటుంబాలకు నిలిచిపోవడంపై పౌరసరఫరాల అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. సిలిండర్ల వినియోగం దాటడమే సబ్సిడీ నగదు జమ కాకపోవడానికి కారణమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తింపజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడేళ్ల పాటు వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గరిష్టంగా ఏటా ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. లబ్ధిదారుల సిలిండర్‌ల సంఖ్య ఎనిమిది పరిమితి దాటనప్పటికి.. గతంలో వినియోగించిన సంఖ్యను తక్కువగా ఉంటే దాటి ప్రకారమే సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు సమాచారం.

    ఆరు లక్షలు మించలే..

    మహా హైదరాబాద్‌ పరిధిలో సుమారు 40 లక్షలపైగా గృహోపయోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా అందులో ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం కనెక్షన్‌దారుల్లో సుమారు 24 లక్షల కుటుంబాలు ప్రజాపాలనలో రూ. 500కు వంట గ్యాస్‌ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 12 లక్షల వరకు దరఖాస్తులు అర్హత సాధించినా.. వర్తింపు మాత్రం 50 శాతం మించలేదు. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్‌ వర్తిస్తునప్పటికీ.. వంటగ్యాస్‌ సబ్సిడీ మాత్రం అందని ద్రాక్షగా మారింది.

    కొంత మందికే వంటగ్యాస్‌ సిలిండర్‌

    మిగతా వారికి మూణ్నాళ్ల ముచ్చటగానే..

    సంబంధిత అధికారులకూ స్పష్టత కరువు

    ఇదీ ఆరు గ్యారంటీల లబ్ధిదారుల పరిస్థితి

    త్రిశంకు స్వర్గం చూపిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

  • హెచ్‌ఎండీఏ డీలా..

    జీహెచ్‌ఎంసీ విస్తరణతో ప్రతిష్టంభన

    సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ విస్తరణతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు ఐదంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించే భవనాలు, హైరైజ్‌ బిల్డింగ్‌లు, అపార్ట్‌మెంట్‌లు, భారీ వెంచర్‌లు తదితర నిర్మాణరంగ అనుమతులన్నీ హెచ్‌ఎండీఏ నుంచే అందజేస్తున్నారు. త్వరలో ఈ అధికారాలన్నీ జీహెచ్‌ఎంసీకి బదిలీ కానున్నాయి. దీంతో హెచ్‌ఎండీఏ ఆదాయం భారీగా పడిపోనుంది. అధికారులు, ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు సహా హెచ్‌ఎండీఏ చేపట్టే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి ఇచ్చే అనుమతులపైనే హెచ్‌ఎండీఏకు ప్రతి ఏటా దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. కొన్ని సందర్భాల్లో రూ.1500 కోట్లకు పైగా కూడా లభించింది. ఇలా ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంతోనే ఉద్యోగుల జీతభత్యాలతో పాటు పార్కులు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫ్లైఓవర్‌ల నిర్మాణం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి రీజినల్‌రింగ్‌ రోడ్డు వరకు చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లతో పాటు, ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌లను సైతం హెచ్‌ఎండీఏ సొంతంగానే చేపట్టింది. ఈ ప్రాజెక్టులకన్నింటికీ నిధుల కొరత తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

    రియల్‌ భూమ్‌ అంతా అక్కడే..

    విస్తరణ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధి 650 చ.కి.మీ. నుంచి సుమారు 2000 చ.కి.మీ.లకు పైగా పెరగనుంది. దీంతో ఇప్పటి వరకు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న శంకర్‌పల్లి, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్కేసర్‌ తదితర జోన్‌లలోని కీలకమైన ప్రాంతాలన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు, నిర్మాణరంగ సంస్థలు మొదలుకొని సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు జీహెచ్‌ఎంసీ నుంచే అన్ని రకాల అనుమతులు పొందవచ్చు, మరోవైపు ఉప్పల్‌ భగాయత్‌, మేడిపల్లి, బాచుపల్లి, హయత్‌నగర్‌, తొర్రూరు తదితర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ సొంత భూముల్లో వేసిన లేఅవుట్‌లకు సైతం భారీ స్పందన లభించింది. ఇలా అన్ని విధాలుగా వచ్చిన ఆదాయ మార్గాలన్నీ హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీకి మారనున్నాయి.

    జీత భత్యాలు కష్టమే..

    ‘హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రతి నెలా సుమారు రూ.70 కోట్లకు పైగా జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపులకే వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు 90 శాతానికి పైగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లడంతో జీతభత్యాల చెల్లింపు ఒక సవాల్‌గా మారనుంది’అని ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధికి వెలుపల అంటే సుమారు 2000 చ.కి.మీ దాటిన తర్వాత చేపట్టే నిర్మాణాలు మాత్రమే హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఆ దిశగా నిర్మాణరంగం విస్తరించేందుకు మరో 5 నుంచి 10 ఏళ్లు పట్టవచ్చు’ అని ఆయన వివరించారు.

    హెచ్‌ఎండీఏ వద్దనే డెలిగేషన్‌ పవర్స్‌..

    జీహెచ్‌ఎంసీ విస్తరణ, డివిజన్‌ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఒక వైపు వేగంగా కొనసాగుతున్నాయి. కానీ నిర్మాణ అనుమతులు, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించిన డెలిగేషన్‌ పవర్స్‌ మాత్రం ఇంకా హెచ్‌ఎండీఏ నుంచి జీహెచ్‌ఎంసీకి బదిలీ కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హెచ్‌ఎండీఏ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగిన తర్వాతనే అధికారాల బదిలీ జరగనుందని అధికారులు తెలిపారు.

    వార్డుల సంఖ్య పెరగడంతో భారీగా పడిపోనున్న ఆదాయం

    నిర్మాణ అనుమతులపై ఏటా రూ.1200 కోట్లు

    ఈ రాబడికి సైతం గండిపడే అవకాశం

    ఉద్యోగుల జీతభత్యాలకూ గడ్డు కాలమే

  • ఇద్దరు కాదు ఐదుగురు!

    సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ పి.వినయ్‌కుమార్‌ తదితరులను రూ.23.1 కోట్ల మేర మోసం చేసి, టాస్క్‌ఫోర్స్‌ కస్టడీ నుంచి ఎస్కేప్‌ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పలపాటి సతీష్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొలుత సతీష్‌తో పాటు ఆయన భార్య శిల్ప బొండ మాత్రమే నిందితులుగా ఉన్నారు. అయితే వీరి అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలతో మరో ముగ్గురినీ ఆ జాబితాలో చేరుస్తూ సీసీఎస్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సతీష్‌ సోదరిలతో పాటు బావను నిందితులుగా చేరుస్తున్నట్లు సీసీఎస్‌ అధికారులు నాంపల్లి కోర్టుకు సమాచారం ఇచ్చారు. వీరిలో సతీష్‌, శిల్పలతో పాటు హిమబిందులను ఇప్పటికే అరెస్టు చేసిన సీసీఎస్‌ అధికారులు త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు.

    పథకం ప్రకారం

    షెల్‌ కంపెనీలు ఏర్పాటు...

    సతీష్‌ 2018లో పృథ్వీ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, ఆ తర్వాత మూసేశాడు. సతీష్‌ తన సోదరి హిమబిందు, భార్య శిల్ప, స్నేహితుడు పువ్వల ప్రసేన్‌ కుమార్‌తో కలిసి భారీ స్కామ్‌కు కుట్ర పన్నారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అనేక షెల్‌ కంపెనీలను తెరిచారు. 2019లో సతీష్‌, శిల్ప, ప్రసేన్‌కుమార్‌ పథకం ప్రకారం డాక్టర్‌ వినయ్‌కుమార్‌ను కలిసి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని, కచ్చితంగా భారీ లాభాలు పంచుతామని చెప్పారు.

    నమ్మడంతో నట్టేట ముంచేసి...

    ఈ విషయం నమ్మిన వైద్యుడితో పాటు మరో ముగ్గురు ఆయన కుటుంబీకులకూ కలిపి విజయ్‌ శ్రావ్య ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు.వారు రూ.15.21 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలో వీరితో పాటు మరో ఇద్దరూ రూ.6.5 కోట్లు, రూ.1.39 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. ఇలా ఈ బాధితుల నుంచి ప్రసేన్‌, శిల్పలు రూ.23.1 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. బాధితుడితో పాటు ఆయన కుటుంబీకులకు ప్రసేన్‌, శిల్పలు 2023 జనవరి వరకు లాభాలు పంచారు. ఆపై ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడంతో వీరికి సందేహం వచ్చింది. ప్రసేన్‌ కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం బాధితుడికి అందింది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్‌లో ఆయన్ను చూడటానికి బాధితుడు వెళ్లారు. ఆ సమయంలో ప్రసేన్‌ కుమార్‌ బాధితుడితో మాట్లాడుతూ శిల్ప బండతో పాటు సతీష్‌ ఉప్పలపాటి కొన్ని షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారని, పథకం ప్రకారం తమ పెట్టుబడులను వాటిలోకి మళ్లించారని చెప్పాడు.

    సహకరించిన సోదరిలు, బావ...

    ఎట్టకేలను తాను మోసపోయానని గుర్తించిన వినయ్‌ కుమార్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్‌, శిల్పలపై కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన శిల్ప, సతీష్‌ను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు స్కామ్‌లో హిమబిందు పాత్రను గుర్తించారు. గత నెల 8న ఆమెను అరెస్టు చేశారు. సతీష్‌, శిల్ప తప్పించుకోవడానికి, న్యాయపోరాటానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలూ మాధవితో పాటు బిందు భర్త భాగవతుల వెంకటరమణ అందించారు. కారు డ్రైవర్‌ శివానందంను బెదిరిస్తూ, అతడి ఫోన్‌ తమ ఆధీనంలో ఉంచుకుని సతీష్‌, శిల్పలు అనేక రాష్ట్రాల్లో తిరిగారు. చివరకు గత నెల 20న వీరి కదలికల్ని కర్ణాటకలో ఉన్న ధార్వాడలో గుర్తించిన సీసీఎస్‌ అధికారులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే వీరి ఎస్కేప్‌తో పాటు మోసాల్లోనూ మాధవి, వెంకట రమణ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

    అంతు చిక్కని ‘విషం’ మిస్టరీ..

    ప్రసేన్‌ కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలిసిన డాక్టర్‌ వినయ్‌కుమార్‌ 2023 ఏప్రిల్‌లో వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంలోనే ప్రసేన్‌... సతీ ష్‌, శిల్పలు ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడ్డారని, అంతేకాకుండా వాళ్లిద్దరే తనకు విషం పెట్టారని వివరించాడు. అదే నెల 24న ప్రసేన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అదే ఏడాది జూన్‌లో సతీష్‌ను కలిసిన వినయ్‌ కుమార్‌ తన డబ్బు విషయం ఆరా తీశారు. అప్పుడు నిధులను వివిధ షెల్‌ కంపెనీల్లోకి మళ్లించి, సొంతానికి వాడుకున్న విషయాన్ని సతీష్‌ అంగీకరించాడు. తన డబ్బు కోసం బాధితుడు ఒత్తిడి తీసుకురాగా.... చట్టపరంగా ముందుకు వెళ్లాలని చూస్తే ప్రసేన్‌కు పట్టిన గతే పడుతుంది బెదిరించాడు. ఈ అంశాలను సీసీఎస్‌ పోలీసులు తమ కేసులో ప్రస్తావించారు. సతీష్‌, శిల్పల వాంగ్మూలాల్లోనూ ప్రసేన్‌ విష ప్రయోగంతో చనిపోయారనే విషయం పొందుపరిచారు. ఆ విషం అతడికి ఇచ్చింది ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనే అంశాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.

    శిల్ప, సతీష్‌ ( ఫైల్‌)

    ఉప్పలపాటి సతీష్‌ కేసులో పెరిగిన నిందితులు

    ఇప్పటికే సూత్రధారులు సహా ముగ్గురు అరెస్టు

    వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిటీ సీసీఎస్‌

    త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు

  • చలి వ

    సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జంతువులకు వెచ్చదనం కలిగించేలా నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలి నుంచి జంతువులను రక్షించడానికి హీటర్లు, షేడ్‌ నెట్‌లు, చెక్క పలకలు, ఇన్సులేటెడ్‌ షెల్టర్‌లు, అత్యధిక వెలుగునిచ్చే బల్బులు ఏర్పాటు చేశారు. బయటి ఉష్ణోగ్రతల కంటే జూలో 3–5 డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. ఇటీవల జూలో 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గది హీటర్లు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పనిచేసేలా ఏర్పాటు చేశారు. కొన్ని ఎన్‌క్లోజర్ల చుట్టూ మందపాటి గోనెసంచులను చుట్టి వుంచారు. కొన్నింట్లో చెక్క పలకలపై జంతువులు విశ్రాంతి తీసుకునేలా చూస్తున్నారు.

    నిత్యం వైద్యపరీక్షలు

    చలి ప్రభావం నుంచి తట్టుకునేలా జంతువులు ఉండే ఎన్‌క్లోజర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్‌ వెటర్నరీ మహ్మద్‌ అబ్దుల్‌ హకీం బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. వ్యప్రాణులకు అందించే ఆహారం, పానీయాలలోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. నిమోనియా వంటి వ్యాధులు సోకకుండా బీ కాంప్లెక్స్‌, కాల్షియం మందులు ఇస్తున్నట్లు తెలపారు.

  • అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ

    రూ. 70 లక్షల నగదు, నగలు మాయం

    మలక్‌పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ప్రొఫెసర్స్‌ కాలనీలోని మానస అపార్ట్‌మెంట్‌లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్‌ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.

    వాచ్‌మెన్‌పై అనుమానం..

    నేపాల్‌కు చెందిన అర్జున్‌ ఐదు నెలలు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్‌ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తుంది. నేపాల్‌కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్‌మెన్‌గా కూడా పెట్టాడని అపార్ట్‌మెంట్‌ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

Rangareddy

  • తొలి
    తొలి విడత ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం ఇలా..

    సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాద్‌నగర్‌: చెదురు ముదురు ఘటనలు మినహా తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటల కే ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. తెల్లవారుజామున చలితీవ్రత దృష్ట్యా.. ఓటింగ్‌ ప్రక్రియ ఉద యం కొంత మందకొండిగా సాగినా.. 11 తర్వాత ఊపందుకుంది. పోలింగ్‌ కేంద్రాల ఎదుట ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరడం కన్పించింది. అభ్యర్థు లు, వారి మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రాల ముందు గుంపులుగా నిలబడి ఓటర్లను అభ్యర్థించడం, వృద్ధులు, దివ్యాంగులను వీల్‌ చైర్లపై తీసుకొచ్చి ఓటేయించిన దృశ్యాలు కన్పించాయి. మధ్నాహం ఒంటి గంట లోపు వరకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటింగ్‌ అవకాశం కల్పించారు. భోజన విరామం తర్వాత పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. తొలుత వార్డుల ఓట్లను, ఆ తర్వాత సర్పంచ్‌ అభ్యర్థుల ఓట్లను లెక్కించారు. అనంతరం ఫలితాలు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన మద్దతుదారులు తమ అభ్యర్థుల విజయంతో పెద్దఎత్తున బాణసంచా కాల్చి, రంగులను చల్లుకుంటూ డీజే హోరులో సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత జులూస్‌ నిర్వహించారు.

    168 స్థానాల్లో పోటీ

    జిల్లాలో 168 సర్పంచ్‌, 1340 వార్డులకు ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 2,11,544 మంది ఓటర్లకుగాను 1,87,573 మంది (88.67 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వికారాబాద్‌ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 225 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,66,252 మంది ఓటర్లకు గాను.. 2,16,212 మంది (81.21శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురు ముదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు.

    ఓటేసిన ప్రముఖులు

    షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ తన స్వగ్రామమైన నందిగామ మండలం వీర్లపల్లిలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట్‌లో ఓటేశారు. ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి నందిగామ మండలం మొదళ్లగూడలో ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి ఫరూఖ్‌ నగర్‌ మండలం దూస్కల్‌లో, మరో మాజీ ఎమ్మెల్యే బొక్కని నరసింహులు లింగారెడ్డిగూడలో ఓటేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్వగ్రామమైన వీర్లపల్లిలో తన మద్దతుదారు ఓడిపోయారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాత్రం తన గ్రామంలో మళ్లీ తన పట్టు నిలుపుకోవడం విశేషం.

    ప్రశాంతంగా పోలింగ్‌

    మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గురువారం పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరి చూసుకొని ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్‌ అధికారులకు సూచించారు. ఓటింగ్‌ శాతం నమోదును ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని స్టేజ్‌–2 రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు.

    కేశంపేట: సిరా చుక్కను చూపుతున్న

    మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

    ఎలికట్టలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడికి సహాయం చేస్తున్న కానిస్టేబుల్‌

    నందిగామ వీర్లపల్లిలో ఓటేయడానికి వచ్చిన

    శతాధిక వృద్ధురాలు పుల్లమ్మ

    రంగారెడ్డిలో 88.67 శాతం

    మండలం మొత్తం ఓటర్లు 9 గంటల వరకు 11వరకు ఒంటిగంట వరకు పోలింగ్‌శాతం

    ఫరూఖ్‌నగర్‌ 50,557 13,359 28,539 44,820 88.65

    చౌదరిగూడ 25,869 7,077 15,602 22,632 87.49

    కేశంపేట్‌ 36,250 6,933 17,666 32,588 89.09

    కొందుర్గ్‌ 22,243 5,114 12,137 19,711 88.62

    కొత్తూరు 16,813 4,102 10,448 15,346 91.27

    నందిగామ 26,499 5,828 14,715 23,549 88.87

    శంషాబాద్‌ 33,313 5,850 15,898 28,934 86.85

  • తొలిపోరులో హస్తం హవా!

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు.. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. మెజార్టీ స్థానాల్లో వారికి ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కేశంపేట్‌, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌, కేశంపేట్‌, నందిగామ, కొత్తూరు మండలాలు, రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధిలోని శంషాబాద్‌ మండల పరిధిలోని మొత్తం 168 సర్పంచ్‌ స్థానాలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. ఇక వికారాబాద్‌ జిల్లాలో 262 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 35 పంచాయతీల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగినప్పటికీ మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ మద్దతుదారులే గెలుచుకున్నారు. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో ప్రత్యక్ష సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

    రెండు సార్లు రీకౌంటింగ్‌

    ఫరూఖ్‌నగర్‌ మండలం శేరిగూడ పంచాయతీ ఎన్నికల్లో రెండుసార్లు రీ కౌంటింగ్‌ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ శారద, బీఆర్‌ఎస్‌ బలపరిచిన సమీప ప్రత్యర్థి విజయమ్మపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు

  • ఎత్తుకు పైఎత్తు!

    షాద్‌నగర్‌: ఎన్నికలు అంటేనే అంచనాలకు అందవు.. ఎన్ని వ్యూహాలు రచించినా చివరికి తలకిందులు కాక తప్పదు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అచ్చంగా అదే జరిగింది. కాంగ్రెస్‌ అంచనాలను తారుమారు చేస్తూ కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ సత్తా చాటగా.. బీఆర్‌ఎస్‌ కోటగా భావించే గ్రామాల్లో కాంగ్రెస్‌ పాగా వేసింది. ఇలా ఒక్కో చోట ఒక్కో ఆట.. పల్లెల్లో సర్పంచ్‌ స్థానాల వేట.. అత్యంత రసవత్తరంగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో జరిగిన పోరును ఓ సారి పరిశీలిస్తే అవగతం అవుతోంది.

    బీఆర్‌ఎస్‌దే ఎక్లాస్‌ఖాన్‌పేట

    బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ స్వగ్రామమైన ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి హరిశేఖర్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ రెడ్డి మద్దతులో బరిలో దిగిన ప్రవీణ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌యాదవ్‌లు ఓటమి పాలయ్యారు.

    దూసకల్‌ హస్తగతం

    మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామమైన ఫరూఖ్‌నగర్‌ మండలం దూసకల్‌ గ్రా మంలో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి జ్యో తి విజయం సాధించారు. ఆ గ్రామం మొ దటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది.

    స్వగ్రామంలో ఎమ్మెల్సీ హవా

    మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన నందిగామ మండలం మొదళ్లగూడలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి అభ్యర్థి పెండ్యాల అరుణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై 407 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

    షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్వగ్రామమైన వీర్లపల్లిలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అయితే బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థితో పాటుగా, కాంగ్రెస్‌ మద్దతు తెలిపిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ రెబల్‌గా ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి బలపర్చిన అభ్యర్థి పాండు సర్పంచ్‌గా విజయం సాధించారు. మొదటి నుంచి ఎమ్మెల్యే శంకర్‌కు పట్టున్న స్వగ్రామంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అనుచరుడు విజయం సాధించడం విశేషం.

    ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్‌, టీడీపీ బలపర్చిన అభ్యర్థి ఎంసీ రాజు సమీప బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి భీష్వ రామకృష్ణపై విజయం సాధించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే భీష్వ కిష్టయ్యలు ఉన్న ఈ గ్రామంలో రెండు పార్టీలు బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు.

    ఎమ్మెల్యే ఊరిలో

    ఎదురుదెబ్బ

    కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థి విజయం

  • గ్లోబల్‌ కిటకిట

    కందుకూరు: గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణం గురువారం విద్యార్థులు, సందర్శకులతో కిటకిటలాడింది. నగరంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి, ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేసిన స్టాళ్లను వీక్షించారు. వీరికి రోబోలు స్వాగతం పలికాయి. విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేసిన నెట్‌ జీరో స్టాల్‌, పోలీస్‌, డీఆర్‌డీఓ, హ్యాండ్లూమ్స్‌, స్కిల్స్‌ యూనివర్సిటీ, అగ్రికల్చర్‌, ఎయిరోస్పేస్‌, విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను, వాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రధాన వేదికపై నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

    విజన్‌ సాధిద్దాం..

    సెర్ప్‌ సీఈఓ దివ్యదేవరాజన్‌ ఆధ్వర్యంలో జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యునిసెఫ్‌ సలహాదారు డేవిడ్‌రాజ్‌, ప్రజ్వల సహ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ సునీతకృష్ణన్‌, సైకాలజిస్టు డాక్టర్‌ గీత చల్లా తదితరులు మహిళా సాధికాతరపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. యువత క్రీడలను ఓ వృత్తిగా ఎంచుకోవాలని గుత్తా జ్వాల సూచించారు. పోరాట పటిమతో ముందుకు సాగాలని సునీతాకృష్ణన్‌ సూచించారు. సోషల్‌ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రీల్‌ లైఫ్‌కు, రియల్‌ లైఫ్‌కు తేడాను గుర్తించాలని డేవిడ్‌రాజ్‌ వివరించారు. తెలంగాణ చరిత్రకారుడు, సాంస్కతిక శాఖ మాజీ డైరెక్టర్‌ డా.మామిడి హరికృష్ణ, పి.పద్మావతి, బిరాద్‌ రాజారాం యాజ్ఞిక్‌, గోపి బైలుప్పల తదితరులతో చర్చాగోష్టి నిర్వహించారు.

Vikarabad

  • జనం మ

    వికారాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. మొదటి విడతలో నిర్వహించిన ఎనిమిది మండలాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు ఉండగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తాండూరు, పెద్దేముల్‌, బషీరాబాద్‌, యాలాల, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌, దుద్యాల్‌ మండలాల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. ఈ మండలాల్లో 262 జీపీలు ఉండగా 37ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి పోలింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల పోలింగ్‌ సాగింది. 2 గంటలకు కౌటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటల నుంచే ఫలితాలు వెలువడ్డాయి.

    81.21 శాతం పోలింగ్‌

    తొలి విడత ఎన్నికల్లో 81.21 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బొంరాస్‌పేట మండలంలో అత్యధికంగా 84.50 శాతం, బషీరాబాద్‌లో అత్యల్పంగా 77.45 శాతం ఓటింగ్‌ నమోదైంది. చలి తీవ్రత కారణంగా ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ 9 గంటలకు పుంజుకుంది. ఒంటి గంట వరకు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటలకు 20.19 శాతం, 11 గంటలకు 52.19 శాతం, మధాహ్నం ఒంటి గంట 73.82 శాతం నమోదైంది. నడవలేని వృద్ధులను, దివ్యాంగులను కుర్చీలు, వీల్‌ చైర్లలో పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల పరిధిలో 2,16,212 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,28,943 మంది పురుషులు,1,37,301 మంది మహిళలు ఉన్నారు. వీరి లో 1,06,110 మంది పురుషులు(82.29 శాతం), 1,10,098 మంది మహిళలు(80.19 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరలు ఎనిమిది మంది ఉండగా నలుగురు ఓటు వేశారు.

    పోలింగ్‌ సరళిని పర్యవేక్షించిన ఉన్నతాధికారులు

    తొలి విడత పోలింగ్‌ సరళిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు యాస్మిన్‌ బాషా పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ తీరు, వసతు లపై ఆరా తీశారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ కలెక్టరేట్‌ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ఎస్పీ స్నేహమెహ్ర కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయిన వాళ్లు ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి మౌనంగా అక్కడి నుంచి తప్పుకోగా, గెలుపొందిన అభ్యర్థులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విజయోత్సవాల్లో ముగిని తేలారు.

    మండలాల వారీగా పోలింగ్‌ వివరాలు

    మండలం పురుషులు మహిళలు మొత్తం ఓటు పోలైనవి శాతం

    తాండూరు 17,828 19,071 36,901 28,672 77.70

    బషీరాబాద్‌ 18,299 20,193 38,492 29,811 77.45

    యాలాల 16,093 17,807 33,901 27,287 80.49

    పెద్దేముల్‌ 18,449 19,499 37,948 31,362 82.64

    కొడంగల్‌ 15,066 15,666 30,732 25,583 83.25

    దౌల్తాబాద్‌ 19,416 20,339 39,760 32,530 81.82

    బొంరాస్‌పేట్‌ 14,055 14,418 28,473 24,061 84.50

    దుద్యాల్‌ 9,737 10,308 20,045 16,906 84.34

    మొత్తం 1,28,943 1,37,301 2,66,252 2,16,212 81.21

    తాండూరు మండలంలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బషీరాబాద్‌లో 5, యాలాలలో 10, పెద్దేముల్‌లో 5, కొడంగల్‌లో 01, దౌల్తాబాద్‌లో 03, బొంరాస్‌పేట్‌లో 7, దుద్యాల్‌ మండలంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

    మొదటి విడత పోలింగ్‌ ప్రశాంతం

    యునానిమస్‌ పంచాయతీలు

  • తొలి పోరులో హస్తం హవా

    వికారాబాద్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ దుందుబి మోగించింది. గురువారం కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల్లోని 225 జీపీలకు ఎన్నికలు జరిగాయి. బషీరాబాద్‌ మినహా మిగిలిన ఏడు మండలాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్‌ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే సొంత మండలం బషీరాబాద్‌లో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కనిపించింది. ఈ మండలంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు చెరో సగం జీపీలు దక్కించుకున్నాయి.

    కొడంగల్‌లో కాంగ్రెస్‌కు పట్టం

    సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఫలితాలు దాదాపుగా ఏకపక్షంగా వచ్చాయి. మెజార్టీ జీపీలను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఐదారు జీపీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏకగ్రీవ జీపీల్లో సైతం కాంగ్రెస్‌ మద్దతుదారులే ఉన్నారు. ఓవరాల్‌గా కమలం పార్టీ ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు ఖాతా తెరవలేదు.

    ‘చే’జిక్కిన పంచాయతీలు 173

    పార్టీల వారీగా వివరాలు

    మండలం మొత్తంజీపీలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ స్వతంత్ర

    తాండూరు 33 22 11 – –

    బషీరాబాద్‌ 39 21 17 01 ––

    యాలాల 39 23 12 01 03

    పెద్దేముల్‌ 38 26 12 –– ––

    కొడంగల్‌ 25 22 – 02

    దౌల్తాబాద్‌ 33 21 11 – 01

    బొంరాస్‌పేట్‌ 35 29 05 – 01

    దుద్యాల 20 15 04 – 01

    మొత్తం 262 179 72 02 08

  • మూడో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి
    ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు

    అనంతగిరి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. గురువారం కలెక్టరేట్‌ సమావేశంలో కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సమక్షంలో ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండో విడతలో 7 మండలాలు 175 గ్రామ పంచాయతీలు ఉండగా 16 జీపీలు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన 159 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మండలాల్లో 1,520 వార్డులు ఉండగా 122 యునానిమస్‌ అయినట్లు తెలిపారు. 1,398 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 1,701 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 2,127 మందితో కూడిన ఇద్దరు సభ్యుల టీంలను, 298 మందితో కూడిన ముగ్గురు సభ్యులు గల 28 టీంలును, 1,398 మందితో కూడిన నలుగురు సభ్యుల టీంలకు ర్యాండమైజేషన్‌ ద్వారా ఎన్నికల విధులు కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సుధీర్‌, డీపీఓ జయసుధ, నోడల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

  • అంజన్

    జాతరకు తరలివచ్చిన భక్తజనం

    ప్రత్యేక అలంకరణలో స్వామివారు

    దుద్యాల్‌: అంజన్నా.. కరుణించన్నా అంటూ భక్తులు అడవిలో వెలసిన ఆంజనేయస్వామిని వేడుకున్నారు. దుద్యాల్‌ మండలం చిలుముల మైల్వార్‌ గ్రామ శివారులో కొలువుదీరిన మామిడికుంట ఆంజనేయస్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం పల్లకీ సేవ, సాయంత్రం పెరుగు బసంతం వేడక నిర్వహించారు. దుద్యాల్‌, బొంరాస్‌పేట్‌, కొడంగల్‌, కోస్గి, దౌల్తాబాద్‌ మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొక్కులు చెల్లించుకున్నారు. మహిళల భజన ఆకట్టుకుంది. ఏటా రెండు సార్లు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Siddipet

  • ఓటెత్
    88.05 శాతం పోలింగ్‌ నమోదు..
    తొలి విడత 147 సర్పంచ్‌, 1,208 వార్డుల్లో ఎన్నికలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు

    సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్‌ జరిగింది. గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్‌, మర్కూక్‌, జగదేవ్‌పూర్‌, ములుగు, వర్గల్‌, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌, రాయపోలు మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి 147 సర్పంచ్‌, 1,208వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

    చలి తీవ్రత కారణంగా...

    ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్‌ నెమ్మదిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. పోలింగ్‌కు ఆరు గంటల సమయం ఉండటంతో పోలింగ్‌ కేంద్రాలకు త్వరగా వచ్చారు. హైదరాబాద్‌కు ఉపాధికి, ఉద్యోగ కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. చివరి అరగంట పోలింగ్‌ కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హైమావతి, సీపీ విజయ్‌ కుమార్‌ పర్యవేక్షించారు.

    భారీగా పోలింగ్‌..

    తొలివిడత పోలింగ్‌ భారీగానే నమోదైంది. ఏకంగా 88.05 శాతం నమోదైంది. రాయపోలు మండలంలో అత్యధికంగా 89.59 శాతం పోలింగ్‌ నమో దైంది. అత్యల్పంగా జగదేవ్‌పూర్‌లో 84.27 శాతం ఓట్లు పోలయ్యాయి. మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    ఓటింగ్‌ సరళి ఇలా..

    ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 44,995 (24.46 శాతం)

    11 గంటల వరకు ఇలా: 1,10,488 (60.06 శాతం)

    మధ్యాహ్నం 1 గంట వరకు : 1,47,348 (80.10 శాతం)

    పోలింగ్‌ ముగిసే సమయం వరకు : 1,61,971 (88.05 శాతం)

  • బీఆర్‌ఎస్‌ 73కాంగ్రెస్‌ 64

    మొదటి విడత పల్లె పోరులో పోటాపోటీగా ఫలితాలు

    సాక్షి, సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ జరిగింది. హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా సర్పంచ్‌లను దక్కించుకున్నారు. మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

    బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న చోట..

    తొలి విడతలో గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, మర్కూక్‌, వర్గల్‌, ములుగు, దౌల్తాబాద్‌, రాయపోలు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా బీఆర్‌ఎస్‌ పార్టీ 73 సర్పంచ్‌ స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 64 సర్పంచ్‌లు, బీజేపీ 10 సర్పంచ్‌ స్థానాలు, ఇండిపెండెంట్లు 16 సర్పంచ్‌లు దక్కించుకున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీల బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ సర్పంచ్‌లు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

    వికసించని కమలం

    కమలం పార్టీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటలేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. మరోవైపు స్వతంత్రుల కంటే బీజేపీ సర్పంచ్‌లు తక్కువ మంది గెలుపొందారు.. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్య్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం.

    తూంకుంట ఇలాకాలో బీఆర్‌ఎస్‌..

    మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డిది వర్గల్‌ మండల కేంద్రం.. అక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయభారతి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియమితులైన తర్వాత తొలి ఎన్నికల్లోనే పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు.

    డ్రాతో సర్పంచ్‌గా గెలిచి..

    మర్కూక్‌ మండలం గంగాపూర్‌–యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే.. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మికి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో పూర్తిగా చూపించ కుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు.

  • పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!

    సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు

    ఆయా నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన

    మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం

    జహీరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.

    కేంద్ర ప్రభుత్వ నిధులు

    ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి..

    రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

    గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్‌, ఖర్చుల వివరాలు, ఆడిట్‌ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది.

  • ‘బొమ్మ’ ఆశయాలను కొనసాగిస్తాం
    ● మంత్రి పొన్నం ప్రభాకర్‌ ● ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్‌ భూక్య రాజేశ్వరికి సన్మానం

    హుస్నాబాద్‌: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. బొమ్మ వెంకటేశ్వర్లు జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బలహీన వర్గాల ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి వెంకటేశ్వర్లు అని కొనియాడారు. ఈ ప్రాంతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్బంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం పని చేశారన్నారు. మార్గదర్శిగా ఉన్న బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్‌, ఎండీ హస్సెన్‌ తదితరులు ఉన్నారు.

    సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు సన్మానం

    హుస్నాబాద్‌ మండలం వంగ రామయ్య పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న భూక్య రాజేశ్వరి తిరుపతిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సత్కరించి అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికై న ఉప సర్పంచ్‌ దండుగుల రాజుతో పాటుగా వార్డు సభ్యులను సన్మానించారు.

  • కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దు

    కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో ఈనెల 14న జరిగే మల్లన్న కల్యాణ ఏర్పాట్లను దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణారావు గురువారం ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. స్వామి వారి కల్యాణం జరిగే తోటబావి ప్రాంగణం, క్యూకాంప్లెక్స్‌, ఆలయ పరిసరాలను సందర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలలో శానిటేషన్‌ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీ సుధాకర్‌ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఓం ప్రకాశ్‌, ఆలయ ఈఓ వెంకటేశ్‌, ఏఈఓ బుద్ది శ్రీనివాస్‌, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌లు ఉన్నారు.

    వెండి వస్తువుల బహూకరణ

    మల్లన్న స్వామికి అమీన్‌పూర్‌కు చెందిన భక్తులు తుమ్మల చంద్రశేఖర్‌ రెడ్డి 500 గ్రాములు వెండి వస్తువులను విరాళంగా గురువారం ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్‌కు అందిచారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు ఉపయోగించే వెండి బాక్స్‌లను బహూకరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌, ముఖ్య అర్చకులు చిన్న మల్లికార్జున్‌, మనోహర్‌, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  • గౌరవెల్లి ప్రాజెక్టుకు ‘బొమ్మ’ పేరు పెట్టాలి

    హుస్నాబాద్‌: గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు పేరు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు బీజం పడింది వెంకటేశ్వర్లు కృషి వల్లేనని కొనియాడారు. ఈ ప్రాంతంలో బస్‌ డిపో, కోర్టు, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పాటును అందించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్‌ ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

  • జాలిగామలో ఉద్రిక్తత

    గజ్వేల్‌రూరల్‌: గజ్వేల్‌ మండలం జాలిగామలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రచా రం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి తాళ్ల లావణ్య భర్త నవీన్‌గౌడ్‌ను, 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కరుణాకర్‌ భార్య అనసూయలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పోలింగ్‌ కేంద్రం సమీపంలో గుంపులుగుంపులుగా వస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    బహిలంపూర్‌లో..

    ములుగు(గజ్వేల్‌): మండల పరిధి బహిలంపూర్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రం సమీపంలో అధికారులు నిర్దేశించిన ప్రదేశంలో వేచిఉన్న వారిని పోలీసులు అక్కడినుంచి పంపించే క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

Sangareddy

  • ఓటెత్తిన పల్లె

    సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పల్లె ఓటరు ఓటెత్తారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వచ్చిన యువత ఉత్సాహంగా ఓటేశారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లో పోలింగ్‌ జరిగింది. ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాలు ఏడు మినహాయిస్తే 129 సర్పంచ్‌ పదవులకు పోలింగ్‌ జరిగింది. అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 113 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,133 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

    ప్రారంభంలో మందకొడిగా..

    ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్‌ మందకొడిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. హైదరాబాద్‌, కర్నాటక, మహరాష్ట్ర వంటి చోట్లకు ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచు అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.ప్రావీణ్య ఎన్నికల సరళిని పరిశీలించారు.

    పలుచోట్ల ఆలస్యంగా కౌంటింగ్‌

    పోలింగ్‌ ముగిసిన తర్వాత భోజన విరామం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్‌ ఏజెంట్లు సకాలంలో రాకపోవడంతో కొన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేసి 25 బ్యాలెట్‌ పేపర్లకు ఒక కట్ట కట్టారు. ఆ తర్వాత ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించారు. ముందుగా వార్డు సభ్యుల ఫలితాలను ప్రకటించారు. ఆ తర్వాత సర్పంచు పదవుల ఫలితాలను ప్రకటించారు. ఓట్లు తక్కువగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వచ్చాయి. మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు ఫలితాలు వచ్చాయి.

    భారీగానే పోలింగ్‌

    తొలివిడత పోలింగ్‌ భారీగానే నమోదైంది. ఏకంగా 87.96 శాతం నమోదైంది. హత్నూర మండలంలో అత్యధికంగా 90.06 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా పటాన్‌చెరులో 84.21 శాతం ఓట్లు పోలయ్యాయి.

  • నువ్వ
    కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ ఫలితాలు

    సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ జిల్లాలో తన పట్టును నిలుపుకొంది. హస్తం పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్‌ఎస్‌ కాస్త తక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది. పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

    సుమారు 65 సర్పంచ్‌ స్థానాల్లో

    కాంగ్రెస్‌ విజయం

    తొలి విడతలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, సదాశివపేట మండలాలు, పటాన్‌చెరు నియోజకవర్గంలో పటాన్‌చెరు, గుమ్మడిదల మండలాలు, నర్సాపూర్‌ నియోజకవర్గం హత్నూర మండలంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 136 గ్రామ పంచాయతీలకు గాను ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 129 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్‌ జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ పార్టీ సుమారు 65కు పైగా సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది.

    బీఆర్‌ఎస్‌కు సుమారు 46 సర్పంచ్‌ స్థానాలు

    ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ తన పట్టు నిలుపుకొంది. అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చింది. సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలవడం సాధారణం. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు 46 గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెస్‌తో పోల్చితే బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలిచిన స్థానాలు కాస్త తక్కువే అయినప్పటికీ.. గట్టి పోటీని ఇచ్చింది. దీంతో గ్రామాల్లో పార్టీకి మంచి పట్టుందని నిరూపితమైంది.

    స్వతంత్రులు, కమలం పార్టీ సర్పంచులు

    బీజేపీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకున్నారు. నాలుగు గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతు దారులు విజయం సాధించారు. హత్నూర మండలం చందాపూర్‌లో అన్ని వార్డు సభ్యులతో పాటు, సర్పంచ్‌ స్థానాలను గెలుచుకున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ.. పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఈ ఎన్నికల్లో స్వతంత్రులు కూడా విజయం సాధించారు. ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన ఈ స్వతంత్రులు సుమారు ఏడు చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం.

    మాజీలు, తాజామాజీలే అధికం

    చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా మాజీలు, తాజా మాజీలే బరిలో నిలిచారు. రిజర్వేషన్లు కలిసి రాని అతికొన్ని పంచాయతీల్లోనే కొత్తవారు పోటీ చేశారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగింది.

    హస్తం పార్టీ మద్దతుదారులదే పైచేయి

    పట్టునిలుపుకొన్న గులాబీ పార్టీ మద్దతుదారులు

    పలు చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు

    ఉనికిని చాటుకున్న బీజేపీ మద్దతుదారులు

    కౌంటింగ్‌ ప్రక్రియ పరిశీలన

    సంగారెడ్డి జోన్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య పరిశీలించారు. గురువారం కొండాపూర్‌ మండల పరిధిలోని మల్లేపల్లిలో కౌంటింగ్‌ కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజేందర్‌ పాల్గొన్నారు.

  • పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
    ప్రతిష్టాత్మకం

    పల్లెల్లో సర్పంచ్‌ అభ్యర్థుల ఆపసోపాలు

    గెలుపుకోసం విశ్వ ప్రయత్నాలు

    జోరుగా మలి, చివరి విడత ప్రచారం

    నారాయణఖేడ్‌: తొలి విడత ఎన్నికల పర్వం ముగియడంతో మలి, చివరి దశ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, పార్టీల నాయకులు ప్రచార పర్వంలో దూసుకు పోతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను చూపుతూ ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం ప్రచారం.. రాత్రిళ్లు మంతనాలు సాగిస్తున్నారు. ఎలాగైనా తాము గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అవకాశాలను వాడుకుంటున్నారు. రెబల్స్‌ బెడద ఉన్న చోట ప్రత్యర్థి వర్గం నుంచి తమకు ఓట్లు వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో ఉంటూ రెబల్స్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్న వారిని ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎవరు చెబితే వింటారో అంటూ ఆలోచిస్తూ ఆయా వ్యక్తులు, పార్టీల నాయకులతో మాట్లాడించి మద్దతు కూడగడుతున్నారు. ఈ ఒక్కసారి తమకు మద్దతు ఇవ్వాలని.. అందుకు ప్రతిఫలంగా ఏం కావాలో చెప్పాలంటూ అడుగుతున్నారు. చాలా చోట్ల ఆర్థిక హామీలతోనే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. దీంతో చాలా పంచాయతీల్లో ఉదయం ఒక పార్టీలో ఉన్న నాయకులు, ఓటర్లు సాయంత్రానికి పార్టీ మారుతున్నారు. కొందరు కుటుంబాలను, కులాలను కూడా చూపుతూ తమ మద్దతు తెలపాలని వేడుకుంటున్నారు.

    జోరుగా దావత్‌లు

    గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ క్షేత్రాలు, కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి వస్తుండడంతో ఉదయం, సాయంత్రం ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. తమ వెంట తిరిగే కార్యకర్తలు, అభిమానులకు మధ్యాహ్నం సమయంలో చికెన్‌ రైస్‌, లేదా చికెన్‌ బిర్యానీలు తినిపిస్తున్నారు. రాత్రి సమయాల్లో దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చీప్‌లిక్కర్‌ తాగేవారు కూడా బ్రాండెడ్‌ మందు అడుగుతున్నారని కొందరు అభ్యర్థులు గుసగుసలాడుతున్నారు.

    పంచాయతీ పోరును వివిధ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత పంచాయతీ పాలకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతోనే ఎక్కువ మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పెద్ద నాయకులు పంచాయతీ పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెల్లో ప్రజాప్రతినిధులు ఉంటే పార్టీకి పట్టు ఉంటుందని, మరోసారి ఎన్నికల్లో విజయం సులువు అవుతుందని తెలుపుతూ ప్రతీ చోట కాంగ్రెస్‌ విజయం సాధించాలని సూచిస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మొత్తమ్మీద అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెపోరు వేడెక్కుతోంది.

  • పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!

    సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు

    ఆయా నిధులతోనే మౌలిక వసతుల కల్పన

    మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం

    జహీరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్‌ఆర్‌ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి.

    కేంద్ర ప్రభుత్వ నిధులు

    ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి..

    రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

    గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్‌, ఖర్చుల వివరాలు, ఆడిట్‌ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది.

  • ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
    సీఐటీయూ అధ్యక్షుడు చుక్కా రాములు

    పటాన్‌చెరు టౌన్‌: రాబోయే రోజుల్లో లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికవర్గమంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని శాండ్విక్‌ యూనియన్‌ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాము లు అన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కాలంలో నాన్‌ పర్మినెంట్‌ ఉద్యోగులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే డిసెంబర్‌ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ 18వ అఖిల భారత జాతీయ మహాసభల సందర్భంగా డిసెంబర్‌ 15న అన్ని పారిశ్రామిక ప్రాంతాలలో, గ్రామాల్లో, నివాస ప్రాంతాలలో సీఐటీయూ జెండాలను ఎగురవేసి ఫ్లాగ్‌ డే నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో శాండ్విక్‌ యూనియన్‌ నాయకులు పాండు రంగారెడ్డి, ఎం.మనోహర్‌, వీరారావు, సదాశివరెడ్డి, సత్తిబాబు, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.