Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఈరోజు ఫ్యూచర్ సిటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్, ఐజీ రమేష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.

    అనంతరం మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బందోబస్తులో ఎలాంటి లోపం ఉండకూడదని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు 600 మంది దేశీ–విదేశీ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్‌తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

    సమ్మిట్‌ ప్రాంతంలో వెయ్యికిపైగా సీసీటీవీలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యి మంది సిబ్బందిని మోహరించడంతో పాటు రోడ్ల మార్పులు, బారికేడ్లు, పార్కింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక మార్షల్స్‌ను నియమించనున్నారు. రెండు రోజుల పాటు కొన్ని మార్గాల్లో రహదారి మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

  • సాక్షి,  హైదరాబాద్‌: టీసీయూఆర్‌ విస్తరణపై అధికారిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) విస్తరణను ప్రభుత్వం పూర్తి చేసింది. 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. విలీన ప్రక్రియ మార్పులు ఇవ్వాల్టి నుంచి అమల్లోకి వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగం కానుంది. ప్రాంత విస్తరణపై ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

    జీహెచ్‌ఎంసీలో కలిసిన 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు ఇలా..
    చార్మినార్ జోన్: 
    1. ఆదిభట్ల 
    2. బడంగ్ పేట్ 
    3. జల్ పల్లి 
    4. శంషాబాద్ 
    5. తుర్కయాంజాల్.

    శేరిలింగంపల్లి జోన్:
    1. బండ్లగూడ జాగీర్ 
    2. మణికొండ 
    3. నార్సింగి 
    4. అమీన్ పూర్ 
    5. తెల్లాపూర్

    ఎల్ బీ నగర్ జోన్:
    1. మీర్ పేట్ 
    2. పెద్ద అంబర్ పేట 
    3. తుక్కుగూడ 
    4. దమ్మాయిగూడ 
    5. ఘట్ కేసర్ 
    6. పీర్జాదిగూడ 
    7. పోచారం

    సికింద్రాబాద్ జోన్
    1. బోడుప్పల్ 
    2. జవహర్ నగర్ 
    3. నాగారం 
    4. తూంకుంట

    కూకట్ పల్లి జోన్:
    1. దుండిగల్ 
    2. గుండ్లపోచంపల్లి 
    3. కొంపల్లి 
    4. మేడ్చల్ 
    5. నిజాంపేట్ 
    6. బొల్లారం.

     

     

  • సాక్షి, సిటీబ్యూరో: శివారు మునిసిపాలిటీలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో విలీనమయ్యాయి.. అధికారులు డ్రాఫ్ట్‌ తయారీలో లీనమయ్యారు.. ఈ మేరకు వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీలో 20 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్‌ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ వెలువడిన అనంతరం మూడు రోజుల్లోగా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది.. వార్డుల పునర్విభజనపై ప్రజల అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం అధికారులు తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

    విలీనమవుతున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(టీ క్యూర్‌)గా (Telangana core urban region) పిలుస్తున్నారు. అయితే దానికి చట్టబద్ధత కల్పించేందుకూ కసరత్తు చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై టీక్యూర్‌గానే వ్యవహరించనున్నారు. ఈ పరిధిలో జనాభా దాదాపు 1.30 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

    విలీనమైన మునిసిపాలిటీలు సహా జీహెచ్‌ఎంసీలోని అన్ని వార్డుల్ని డీలిమిటేషన్‌ చేసే పేపర్‌ వర్క్‌ దాదాపుగా పూర్తయింది. విలీనం, వార్డుల పునర్విభజనకు సంబంధించి చట్టపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విలీనమయ్యాక సైతం పరిపాలన వ్యవస్థ వార్డులు, సర్కిళ్లు, జోన్లుగానే ఉంటుంది.  

    ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ వరకే బడ్జెట్‌ 
    ప్రతియేటా రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాదాపు నాలుగైదు నెలల ముందుగానే జీహెచ్‌ఎంసీ (GHMC) బడ్జెట్‌ను రూపొందించడం ఆనవాయితీ. ప్రస్తుతం కొత్తగా 27 స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతున్నందున వాటిల్లోనూ పనులు చేయాల్సింది జీహెచ్‌ఎంసీయే. కొత్త బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తారు.

    జీహెచ్‌ఎంసీ పాలకమండలిని ఎన్నుకున్నది జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డుల వరకే. ఇప్పుడు కొత్తగా కలిసే స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే అధికారం పాలకమండలికి సాంకేతికంగా లేదు. ఈనేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరకే కొత్త బడ్జెట్‌కు అధికారులు రూపకల్పన చేశారు.  

    విలీనమైనవాటికి మరో రకంగా.. 
    కొత్తగా విలీనమయ్యే వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి పొందడమో, మరో రకంగానో చట్టబద్ధమైన ఇబ్బందుల్లేకుండా కేటాయింపులు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిపోతుంది. ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

    చ‌ద‌వండి: అస‌లే నిశిరాత్రులు.. ఆపై పొగ‌మంచు

    కొత్త బడ్జెట్‌కు సంబంధించిన కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావడం తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కానందున, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 27 స్థానిక సంస్థలు కలిసినా జీహెచ్‌ఎంసీ ఒకటిగానే ఉంటుంది. జీహెచ్‌ఎంసీని విభజించాలనుకుంటే కొంతకాలం తర్వాతే ఆ పని జరగనుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట నియోపోలీస్‌ భూముల వేలంతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాసులపంట పడింది. ఆ భూములకు ఇవాళ మూడో విడత వేలం ముగిసింది. ప్లాట్ నంబర్స్ 19,20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్లు ధర పలికింది.

    8.04 ఎకరాలకు గాను హెచ్‌ఎండీఏ వెయ్యి కోట్లు పొందింది. మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు 3,708 కోట్ల రూపాయలను హెచ్‌డీఏ దక్కించుకుంది. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హెచ్‌డీఏ ఈ వేలం వేస్తోంది. కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాల భూమికి వేలం వేయనుంది. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5న ఈ వేలం వేయనున్నారు.

    కాగా, కోకాపేట్‌ నియోపొలిస్‌లో నిర్వహించిన రెండో విడత ఆన్‌లైన్‌ వేలంలో ఎకరం గరిష్టంగా రూ.151.25 కోట్ల ధర పలికింది. నియోపొలిస్‌లోని 15వ ప్లాట్‌లో ఉన్న 4.03 ఎకరాలకు, 16వ ప్లాట్‌లో ఉన్న 5.03 ఎకరాలకు బిడ్డింగ్‌ నిర్వహించారు. అయితే 15వ ప్లాట్‌లో ఎక్కువ ధర పలికింది. 16వ ప్లాట్‌లో ఎకరాకు గరిష్టంగా రూ.147.75 కోట్లు లభించింది. సగటున ఒక ఎకరా రూ.142.83 కోట్లు చొప్పున అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.

    9.06 ఎకరాల బిడ్డింగ్‌ ద్వారా మొత్తం రూ.1,352 కోట్లు లభించగా, ఈ నెల 24వ తేదీన విక్రయించిన భూములతో కలిపి ప్రభుత్వానికి రూ.2,708 కోట్లు ఆదాయం లభించింది. రెండేళ్ల క్రితం కోకాపేట్‌ నియోపొలిస్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు లభించగా ఈసారి రెండు విడతల్లో రూ.137 కోట్ల నుంచి రూ.151 కోట్ల వరకు ధర పలకడం విశేషం.

     

  • సాక్షి, సిద్ధిపేట జిల్లా: రూ.262.78 కోట్లతో హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌ ప్రజల అభిమానం మరవలేనన్నారు. ‘‘మీ ఓటుతో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రజాపాలనను తీసుకొచ్చిన రోజు డిసెంబర్ 3. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోంది’’ అని రేవంత్‌ చెప్పారు. 

    ‘‘బీఆర్ఎస్ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరమైపోయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ ఎలా ఉంది. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో మీరే ఆలోచించండి. దేశంలో భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకూ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణా వరి దిగుబడుల్లో నంబర్‌ వన్ స్టేట్‌గా నిల్చింది. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు కావాలంటే దొర గడీ ముందు చేతులు కట్టి నిల్చోవాల్సిన పరిస్థితి. ఆనాడు దొడ్డుబియ్యం ఇస్తే, మనం ఈరోజు 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.

    ..మీ పక్కన్నే గజ్వేల్, మరోవైపు సిద్ధిపేట, ఇంకోవైపు సిరిసిల్ల ఉన్నాయి. వాటిని దేవుళ్లేమైనా పాలిస్తున్నారా..?. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయిగానీ, ఇక్కడి గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదో మీరు ఆలోచించాలి. ఇక్కడ ఓ ఆదర్శ గ్రామం అని చెప్పి చిన్నముల్కనూరును నాడు కేసీఆర్ ఏం చేశాడో మీకు తెలుసు. మేం వాళ్లలా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకే మంత్రి పొన్నం నా ముందు పెట్టిన అన్ని విజ్ఞప్తులకూ నిధులందిస్తామని హామీ. ఆ సర్కార్ లో ఎవ్వరికీ పదేళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ, మేం ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తాం.

    ఇవాళ మంచి ప్రభుత్వముంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా ముందుకెళ్తాయో, గ్రామాల్లో కూడా మంచి సర్పంచ్‌ను ఎన్నుకుంటేనే మీ గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మంచివాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. వీలైనంతగా ఏకగ్రీవం చేసుకునే యత్నం చేయాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్.. సర్పంచులు కిరికిరిగాళ్లు వస్తే గ్రామాలు  తిరోగమనం పడతాయంటూ వ్యాఖ్యానించారు.

     

     

Andhra Pradesh

  • సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాయచోటి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు శనివారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడి చేశారు. ఇంటిపైకి దూసుకొచ్చిన 20–30 మంది దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో విజయభాస్కర్ తలకు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

    మాజీ సీఎం జగన్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలపై విజయభాస్కర్ విడుదల చేసిన మీడియా నోట్‌తో ఆగ్రహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు విజయభాస్కర్ ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయనను మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, రామపూరం జడ్పిటిసి వెంకటరమణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు ఇతర నాయకులు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడప పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. లైంగికదాడి కేసులో నిందితుడికి యావజీవ కారాగారా శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధించింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు రాంప్రసాద్ రెడ్డికి యావజ్జీవ జైలు శిక్ష విధిసూ.. పోక్సోకోర్టు మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తీర్పు చెప్పారు.

    నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీసీ, రైల్వే సిబ్బందిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి రూ.10 లక్షల 50 వేలు పరిహారం అందించాలని గుంతకల్ ఆర్ఎంకు ఆదేశాలు జారీ చేసింది. 2019 జనవరి 19న తిరుపతి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా.. రాజంపేట-నందలూరు మధ్య ఈ ఘటన  చోటు చేసుకుంది. బాలిక వాష్ రూమ్ వెళ్ళినప్పుడు రాం ప్రసాద్‌రెడ్డి ఆమెపై లైంగికదాడి చేశాడు.

    హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుంతకల్ ఆర్ఎం కార్యాలయం నుంచి కడపకు రిఫర్‌ చేశారు. కడప రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే టీసీల నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా భావించిన కోర్టు.. నిర్లక్ష్యానికి కారణమైన టీసీ, పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్‌ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • విశాఖ‌ప‌ట్నం: మ‌న శ‌రీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీల‌కం. అదే స‌మ‌యంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియ‌స్‌లో క‌ణితి ఏర్ప‌డితే చాలా ప్ర‌మాద‌క‌రం. కేవ‌లం ఎనిమిదేళ్ల వ‌య‌సులో అలాంటి ఇబ్బంది వ‌చ్చిన ఒక పాప‌కు.. సీత‌మ్మ‌ధార‌లోని కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు అత్యంత అధునాత‌న ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేసి, ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన చీఫ్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్, హెప‌టో-బైలియ‌రీ, పాంక్రియాటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ నంబాడ తెలిపారు.

    “విశాఖ న‌గ‌రానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్ర‌మైన క‌డుపునొప్పితో ఆస్ప‌త్రికి వ‌చ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ చీఫ్ డా. ఆచంట చలపతి రావు గారు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ప‌రీక్షించ‌ చేసి, ఇది అత్యంత అరుదైన సాలిడ్ సూడోపాపిల‌రీ ఎపితెలియ‌ల్ నియోప్లాజ‌మ్ (స్పెన్‌) అనే పాంక్రియాటిక్ క‌ణితి ఉన్న‌ట్లు తేలింది. భారత దేశంలో ఈ త‌ర‌హా స‌మ‌స్య‌కు శ‌స్త్రచికిత్స జ‌రిగిన అత్యంత చిన్న‌వ‌య‌సు రోగిగా ఈ పాప చ‌రిత్ర సృష్టించింది. పాప‌కు పాంక్రియాస్‌లో క‌ణితి ఉండ‌డం, అది అత్యంత అరుదైన‌ది కావ‌డంతో దాంట్లో క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా, త‌ర్వాత ఎలాంటి సంక్లిష్ట స‌మ‌స్య‌లు రాకూడ‌దంటే శ‌స్త్రచికిత్స చేసి దాన్ని తొల‌గించాల‌ని నిర్ణ‌యించాం.

    మూడు గంట‌ల పాటు అత్యంత క‌చ్చిత‌త్వంతో కీహోల్ స‌ర్జ‌రీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొద‌లుపెట్టాం వీలైనంత వ‌ర‌కు ర‌క్త‌స్రావం లేకుండా చూడ‌డంతో పాటు, పాంక్రియ‌స్ క‌ణ‌జాలాన్ని కూడా వీలైనంత వ‌ర‌కు కాపాడుకుంటూ క‌ణితి మొత్తాన్ని తొల‌గించ‌గ‌లిగాం. ఈ శ‌స్త్రచికిత్స త‌ర్వాత బాలిక చాలా త్వ‌ర‌గా కోలుకుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో ఐదు రోజుల్లోనే పాప‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చ‌క్క‌గా రాణిస్తోంది.

    ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ క‌ణితుల‌ను తొల‌గించ‌డంలో ఉన్న నైపుణ్యాల‌కు ఈ శ‌స్త్రచికిత్సే నిద‌ర్శ‌నం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. ఇలాంటివి త్వ‌ర‌గా గుర్తించ‌డం, అసాధార‌ణ స‌ర్జిక‌ల్ నైపుణ్యాలు ఇలాంటి అరుదైన ప‌రిస్థితుల్లో చాలా కీల‌కం.

    ఇలాంటి కేసుల్లో కూడా అత్యంత సుర‌క్షిత‌మైన ఫ‌లితాల‌ను తీసుకురావడంలో కిమ్స్ ఆస్ప‌త్రికి పేరుంది. ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌వారు ఇక పెద్ద న‌గ‌రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. పిల్ల‌లు, పెద్ద‌ల‌కు ఇలాంటి కీహోల్ శ‌స్త్రచికిత్స‌ల విష‌యంలో కిమ్స్ ఆస్ప‌త్రి పేరు ప్ర‌ఖ్యాతులను ఈ శ‌స్త్రచికిత్స‌ మ‌రింత పెంచింది” అని డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ నంబాడ తెలిపారు. ఈ శాస్త్ర చికిత్స లో సర్జికల్ టీమ్ డా. రవి చంద్రారెడ్డి, డా. గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

  • సాక్షి, విజయవాడ: భవానీపురంలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేసిన ప్రాంతం చుట్టూ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గోడ కడుతుంది.

    42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధితులు రోడ్డునపడ్డారు. బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

    పోలీసులతో బాధితుల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్‌ బందోబస్త్‌ మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. కూల్చివేతలను బాధితులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

    విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేత

     

  • సాక్షి, తాడేపల్లి: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ విశ్వాసానికి, దృఢ సంక‌ల్పానికి ఏ వైక‌ల్యం అడ్డుకాదు. ప‌ట్టుద‌ల‌తో స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తూ.. ప్ర‌తి రంగంలోనూ నూత‌న శిఖ‌రాల‌ను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ  ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

    దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా YS జగన్ శుభాకాంక్షలు

Sports

  • రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 1-1తో ద‌క్షిణాఫ్రికా స‌మం చేసింది. 359 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో చేధించింది.

    ప్రోటీస్‌ ఓపెనర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌(98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110) సూపర్‌ సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ బ్రీట్జ్కే(64 బంతుల్లో 68), బ్రెవిస్‌(34 బంతుల్లో 54) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖరిలో కార్బిన్‌ బాష్‌(14 బంతుల్లో 25) మరోసారి కీలక నాక్‌ ఆడాడు.

    ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఒక్క అర్ష్‌దీప్‌ మినహా మిగితా బౌలర్లందరూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు తోడు చెత్త ఫీల్డింగ్‌ కూడా భారత్‌ కొంపముంచింది. మిస్‌ ఫీల్డ్‌ల రూపంలో టీమిండియా దాదాపు 30 పరుగులు సమర్పించుకుంది. అర్ష్‌దీప్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించారు.

    కోహ్లి, రుతు సెంచ‌రీలు వృథా..
    అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి((93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102), రుతురాజ్‌ గైక్వాడ్‌(83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. రాహుల్‌(66) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 

    సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. అయితే భారత్‌ ఓటమి పాలవ్వడంతో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు వృథా అయిపోయాయి. ఇ​క సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే శనివారం వైజాగ్‌ వేదికగా జరగనుంది.

     

  • టీమిండియా స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు పక్కన పెట్టనున్నారా? అంటే అవునానే స‌మాధానం ఎక్కువ‌గా వినిపిస్తుంది. స్వ‌దేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ భార‌త జ‌ట్టును అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.

    రింకూ ఔట్‌.. హార్దిక్ ఇన్‌
    అతడి స్ధానంలో జట్టులోకి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగొచ్చాడు. ఈ జట్టు సెలక్షన్‌ను బట్టి రింకూ పొట్టి ప్రపంచకప్ ప్రణాళికలలో లేనిట్లు తెలుస్తోంది. రింకూ చివరగా భారత్ తరపన ఆసియాకప్‌-2025లో ఆడాడు.
    పాక్‌తో జరిగిన ఫైనల్లో విన్నింగ్ రన్స్ అతడే కొట్టాడు.

    అయితే వాస్తవానికి హార్దిక్ పాండ్యాకు గాయం కాకపోయి ఉంటే రింకూకు తుది జట్టులో దక్కకపోయేది. ఇప్పుడు పాండ్యా గాయం నుంచి కోలుకోని తిరిగి రావడంతో రింకూను పూర్తిగా ప్రధాన జట్టు నుంచే తప్పించారు. బహుశా రింకూ తరుచుగా చెప్పే విధంగా దేవుని ప్లాన్ అయి వుంటుంంది.

    గంభీర్ కారణమా?
    రింకూ గ‌త కొన్ని టీ20 సిరీస్‌ల‌గా జ‌ట్టుతో పాటు ఉన్న‌ప్ప‌టికి తుది జ‌ట్టులో మాత్రం పెద్ద‌గా చోటు ద‌క్క‌లేదు. టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్ ఎక్కువ‌గా ఆల్‌రౌండర్ల మొగ్గు చూప‌డంతో రింకూ చాలా మ్యాచ్‌ల‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. అత‌డికి బ‌దులుగా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, శివ‌మ్ దూబేలకు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో టీమ్ మెనెజ్‌మెంట్ చోటు క‌ల్పిస్తోంది.

    అత‌డు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో జట్టులో ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయలేదు. మొన్న‌టివ‌ర‌కు ముఖ్యమైన 'ఫినిషర్'గా పరిగణించబడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇప్పుడు ఏకంగా జ‌ట్టులోనే లేకుండా పోయాడు. అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 భార‌త్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఉప‌ఖండంలో మంచి స్పిన్న‌ర్లు, స్పిన్‌ను ధీటుగా ఎదుర్కొనే బ్యాట‌ర్లు కావాలి. 

    వాషింగ్టన్, దూబేలు స్పిన‌ర్ల‌కు బాగా ఆడ‌గ‌ల‌రు. అంతేకాకుండా వాషింగ్ట‌న్ బంతితో కూడా మ్యాజిక్ చేయ‌గ‌ల‌డు. సుంద‌ర్‌, దూబే ప్ర‌ధాన జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో మాత్రం ఇద్ద‌రిలో ఒక‌రికి చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. 

    ఎందుకంటే అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ రూపంలో ఇద్ద‌రూ స్పిన్న‌ర్లు ఎలాగానూ తుది జ‌ట్టులో ఉంటారు. బ‌హుశా అందుకే రింకూను టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెటాప్ నుంచి త‌ప్పించండొచ్చు. అంతే త‌ప్ప రింకూపై వేటు వెన‌క మ‌రే ఏ ఇతర కార‌ణం లేక‌పోవ‌చ్చ‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

    సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా
    🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌
    🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌
    🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌
    🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.
    చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

  • టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. మోహిత్‌ త‌న నిర్ణ‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా బుధ‌వారం వెల్ల‌డించాడు. భారత్ త‌రపున 34 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌.. ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వహించాడు.

    "హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం మొదలు భారత్ జట్టు, ఆపై ఐపీఎల్‌లో ఆడటం వరకు నా ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. 

    అలాగే నన్ను సరైన మార్గంలో నడిపించిన అనిరుధ్ సర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. బీసీసీఐ,  కోచ్‌లు, సహచరులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సపోర్ట్ సిబ్బంది, అభిమానులందరికి ధన్యవాదాలు ఉంటూ తన రిటైర్మెంట్ నోట్‌లో మోహిత్ రాసుకొచ్చాడు. 

    ఈ హ‌ర్యానా పేస‌ర్ చివ‌ర‌గా భార‌త త‌ర‌పున 2015లో ఆడాడు. అప్ప‌టి నుంచి జాతీయ దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో మాత్రం రెగ్యూల‌ర్‌గా ఆడుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ఆడాడు. అయితే మినీ వేలానికి ముందు అత‌డిని గుజ‌రాత్ విడిచిపెట్టింది. అంత‌లోనే అత‌డు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

    భార‌త్ త‌రుపున అతడు 26 వ‌న్డేలు, 8 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు. అతడు 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 120 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్ 134 వికెట్లు పడగొట్టాడు.


     

     

  • దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.

    సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్‌..
    సఫారీ పేసర్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టుకుని.. రుతురాజ్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.

    ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్‌మెంట్‌ రుతుకు మరో అవకాశం ఇ‍చ్చింది. రాయ్‌పూర్‌ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్‌ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.

    77 బంతుల్లోనే సెంచరీ
    ఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్‌ గైక్వాడ్‌ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్‌... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.

    మరికొన్నాళ్లపాటు..
    సఫారీ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్‌ ఇవ్వడంతో రుతురాజ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రుతురాజ్‌ను మేనేజ్‌మెంట్‌.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. 

    తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.

    చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
    ఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్‌ గైక్వాడ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.

    ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరుగగా.. కివీస్‌తో వన్డేలో నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్‌ శతకం సాధించి.. రోహిత్‌ పేరును చెరిపేశాడు.

    మరో రెండు రికార్డులు
    ఇక ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్‌.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 

    అంతకు ముందు యూసఫ్‌ పఠాన్‌ 2011లో ప్రొటిస్‌ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్‌ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 కోసం టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రిలీజ్ చేసింది. రాయ్‌పూర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డే సంద‌ర్భంగా ఈ కొత్త‌ జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.

    వీరితో పాటు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మలు కూడా పాల్గోన్నారు. వీరిద్ద‌రూ భార‌త కొత్త జెర్సీ కిట్‌ల‌తో ఫోటోల‌కు పోజులిచ్చారు. అదేవిధంగా భార‌త్, శ్రీలంక వేదిక‌ల‌గా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శ‌ర్మ ఎంపిక‌య్యాడు.

    అనంత‌రం రోహిత్ మాట్లాడుతూ.. భార‌త జ‌ట్టుకు నా ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ఉంటాయి చెప్పుకొచ్చాడు. ఈ జెర్సీలో భారత జెండాలోని మొత్తం మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువ‌గా ముదురు నీలం రంగు ఉండ‌గా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగు ఉంది. కాలర్‌ దగ్గరలో తెలుపు రంగు ఉంది జెర్సీ మధ్యలో స్పాన్సర్‌ అపోలో టైర్స్‌, ఇండియా అని పేరు రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

    గ్రూపు-ఎలో భారత్‌
    ఇక ఈ పొట్టి ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భారత్ ఉంది. భారత్‌తో పాటు పాక్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, అమెరికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న అమెరికాతో వాంఖడే వేదికగా తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్‌-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.



     

     

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    హార్దిక్‌ రీఎంట్రీ.. రింకూపై వేటు
    ఇక వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఫిట్‌నెస్‌ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్‌ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్‌ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.

    టెస్టులలో వైట్‌వాష్‌.. వన్డేలలో జోరు
    కాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.

    ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్‌ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్‌ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్‌.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్‌.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే
    సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

    భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
    🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా
    🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌
    🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌
    🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌
    🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.

    చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

  • రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. 

    ఆ ఓవర్‌లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్‌.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్‌ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. 

    వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేం‍దుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.

    అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9  నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

    భారత్ భారీ స్కోర్‌..
    ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్‌(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్‌(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.
    చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

  • సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) విఫలం కాగా.. విరాట్‌ కోహ్లి (102), రుతురాజ్‌ (105) సెంచరీలతో చెలరేగారు.

     

    రాహుల్‌ మెరుపు అర్ధ శతకం
    తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) రనౌట్‌ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌ రెండు, నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్‌.. ప్రొటిస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్‌ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.

    వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్‌-5 జాబితా
    🏏గ్వాలియర్‌ వేదికగా 2010లో 401/3
    🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 358/5
    🏏రాంచి వేదికగా 2025లో 349/8
    🏏కార్డిఫ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ 2013లో 331/7
    🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 326/5.

    చదవండి:  చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

  • టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్‌పూర్‌లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్‌టేజ్‌’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.

    ఈ క్రమంలో న్యూజిలాండ్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్‌ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్‌ అయ్యాడు.

    అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.

    మొత్తంగా రాయ్‌పూర్‌లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో.. ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

    అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్‌ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.

    సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు
    🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 101 నాటౌట్‌
    🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు
    🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 102 పరుగులు

    చదవండి: IND vs SA: గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌
     

  • టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్‌ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.

    ఆరంభంలోనే రోహిత్‌ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి ఓ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

    సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..
    వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంలో పాలుపంచుకున్న‌ ఆట‌గాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 32 సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మ‌రొక ఆట‌గాడితో క‌లిసి నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ వ‌ర‌ల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

    టీమిండియా భారీ స్కోరు
    ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్‌) సాధించాడు.


     

     

  • సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

    జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్‌.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

    గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడు
    రుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త వ‌న్డే జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వ‌న్డేలో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

    దీంతో అత‌డిని రెండో వ‌న్డేకు ప‌క్క‌న పెట్టాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.

    భారీ స్కోర్‌ దిశగా భారత్‌..
    రాయ్‌పూర్‌ వన్డేలో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(43), జడేజా(9) ఉన్నారు.
    చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి
     

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్‌లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్‌) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.

    సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.

    రెండో వన్డేలోనూ దూకుడు
    ఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్‌పూర్‌ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.

    చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి
    యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. 

    గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్‌ నమోదు చేయగా.. సచిన్‌ టెండుల్కర్‌ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.

    కోహ్లి- రుతు ధనాధన్‌
    మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, నాలుగో నంబర్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 
    UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ

    చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

Movies

    • బర్త్డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్..

    • వైట్ డ్రెస్లో దియా మీర్జా బ్యూటీఫుల్ లుక్స్..

    • బహమాస్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లయ..

    • వేకేషన్లో చిల్ అవుతోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే..

    • శ్రీలంకలో చిల్ అవుతోన్న సాహితి దాసరి

     

     

     

     

     

     

  • రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం ద్రౌపది -2. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజి ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మూవీ నుంచి నెలరాజెఅంటూ సాగే పాటను విడుదల చేశారు.

    అయితే పాటను తమిళంలో ఏం కోనే అంటూ సాగే పాటను చిన్మయి ఆలపించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఈ పాటను పాడినందుకు క్షమాపణలు చెబుతూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు. పాట రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేప‌థ్యం గురించి తనకు తెలియకపోవ‌టం వ‌ల్ల పాడానని తెలిపింది. ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుంచే నేను ఇందులో భాగం అయ్యేదాన్ని కాద‌ని వెల్లడించారు. దీనికి కారణం డైరెక్టర్ మోహన్ అంటూ పోస్ట్ చేసింది.

    డైరెక్టర్ రియాక్షన్..

    చిన్మ‌యి క్ష‌మాప‌ణ చెబుతూ ట్వీట్ చేయడంపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌ జి స్పందించారు. ఈ పాట‌ను పాడ‌టానికి తాను ప‌ర్స‌న‌ల్‌గా చిన్మ‌యి అయితేనే బాగుంటుందని పాడించాన‌ని పేర్నొన్నారు. రికార్డింగ్ స‌మ‌యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌ అందుబాటులో లేక‌పోవ‌టంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విష‌యాల‌ను మాత్ర‌మే వివ‌రించాన‌ని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. త‌న‌తో కానీ, సంగీత ద‌ర్శ‌కుడితో కానీ మాట్లాడ‌కుండా, ఎలాంటి వివ‌ర‌ణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిద‌న్నారు. దీనిపై చిన్న‌యి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదంటే ట్వీట్‌ను తొల‌గించాల‌ని కోరారు.

    ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను కాకుండా త‌న‌ను విమ‌ర్శించాల‌ని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా మేకింగ్‌లో భాగ‌మైన ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌టం పిరికిత‌నమ‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ పేర్కొన్నారు. చిన్మ‌యి త‌న మెసేజ్‌లో పేర్కొన్న వ్య‌తిరేక భావ‌జాలం గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ చిన్మ‌యి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియ‌జేస్తోందన్నారు. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయ‌న వెల్లడించారు.

     

     

     

  • బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్పాయ్ కీలక పాత్రలో వచ్చిన సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో తాజాగా మూడో సీజన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

    తాజాగా సిరీస్క్రేజీ రికార్డ్ను సొంతం చేసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అత్యధికమంది వీక్షించిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. క్రమంలో గత రెండు సీజన్ల వ్యూస్‌ను అధిగమించింది. అంతే కాకుండా భారత్‌ సహా 35 దేశాల్లో టాప్‌-5లో ట్రెండింగ్‌లో ఉంది. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్‌, మలేషియా దేశాల్లోనూ ఆదరణ దక్కించుకుంది.

    రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందించిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్ 21 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెబ్ సిరీస్లో జైదీప్‌ అహ్లావత్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

  • ఏడాది కాంతార చాప్టర్-1తో బ్లాక్బస్టర్హిట్కొట్టిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిత్రాన్ని గతంలో రిలీజై సూపర్ హిట్గా కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా హోంబలే ఫిల్మ్స్బ్యానర్లో నిర్మించారు.

    అయితే మూవీ తర్వాత రిషబ్ శెట్టి నెక్ట్స్ప్లాన్ ఏంటనే దానిపై అప్పుడే చర్చ మొదలైంది. కాంతార-3 ప్లాన్లో ఉన్నారా? లేదంటే మరో కొత్త మూవీ తెరకెక్కిస్తున్నారా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటివరకు కొత్త మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ రిషబ్ శెట్టి తన నెక్స్ట్సినిమా టాలీవుడ్లో చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

    టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్తో రిషబ్ శెట్టి జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఓ యోధుడి క‌థ‌ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో మరుగున పడిపోయిన వీరుడి గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. బంకించంద్ర‌ ఛట‌ర్జీ ర‌చించిన 'ఆనంద్ మ‌ఠ్‌' అనే పుస్త‌కం స్ఫూర్తిగా తీసుకొని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు అశ్విన్ అశ్విన్ గంగ‌రాజు తెరకెక్కించనున్నట్లు స‌మాచారం. వచ్చే ఏడాది 2026 వేస‌విలో షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

  • యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా మైథలాజికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి  కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి  నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్‌ పుట్టించే క్లైమాక్స్‌ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. 

    కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.

    అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్‌ ఉండబోతుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్  హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

     

  • టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఏడాది సంక్రాంతికి బ్లాక్బస్టర్హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్టాలీవుడ్ఆడియన్స్ను అలరించింది. అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు.

    మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లోనూ వెంకీ మామ సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్చిత్రంలో కనిపించనున్నారు. మూవీలో కీలక పాత్రలో వెంకీమామ నటిస్తున్నారు. తాజాగా సినిమాకు షూటింగ్కు సంబంధించిన అప్డేట్ఇచ్చారు హీరో వెంకటేశ్. మనశంకర వరప్రసాద్ చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.

    వెంకటేశ్ తన ట్వీట్లో రాస్తూ..'మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనే కోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసం అనిల్ రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.

     

  • టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టాడని, అక్కడ వరుసగా ఆరు సినిమాలు నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దిల్‌ రాజు క్లారిటీ ఇచ్చారు.  ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెడుతూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని దిల్‌ రాజు(Dil Raju) కోరారు.

    ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. 

    త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్‌ను నమ్మొద్దు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను’ అని దిల్‌ రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, అక్షయ్‌ కుమార్‌తో దిల్‌ రాజు నిర్మించే సినిమా..  ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్‌ అని ప్రచారం జరుగుతుంది. 

  • త్వరలోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసిపోనుంది. చూస్తుండగానే రోజులు అలా గడిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే అందరూ కొత్త ఏడాది స్వాగతం పలకడానికి సమయం ఆసన్నమైంది. మరి సినీ ఇండస్ట్రీలో 2025లో కలిసొచ్చిందా? ఎంతమందికి స్టార్స్హోదాను దక్కించుకున్నారు. ఇండియా సినీ చరిత్రలో ఏడాది అత్యంత ఆదరణ సొంతం చేసుకున్న నటీమణులు, హీరోలు ఎవరు? 2025లో ఎంట్రీ స్టార్డమ్ను దక్కించుకున్న యంగ్ హీరోయిన్స్, హీరోలు ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే స్టోరీ చదివేయండి.

    2025లో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న స్టార్స్ లిస్ట్ను ప్రముఖ సినీ రేటింగ్సంస్థ ఐఎండీబీ రిలీజ్ చేసింది. ఏడాది టాప్-10లో నిలిచిన హీరోయిన్స్, హీరోల జాబితాను వెల్లడించింది. సారిఅత్యధికంగా బాలీవుడ్తో పాటు దక్షిణాది తారలు సైతం సత్తా చాటారు. ఐఎండీబీ మోస్ట్ పాపులర్ యాక్టర్‌-2025 లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. లిస్ట్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రుక్మిణి వసంత్‌, కల్యాణి ప్రియదర్శన్‌ నిలిచారు. కాగా.. 2025లో ఆమె ఛావా, సికందర్‌, థామా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్‌ లాంటి చిత్రాలతో మెప్పించింది. రుక్మిణి వసంత్.. కాంతార చాప్టర్‌-1తో ఆడియన్స్లో క్రేజ్ను సొంతం చేసుకుంది. కల్యాణి ప్రియదర్శన్‌ కొత్తలోక: చాప్టర్‌- 1 మూవీతో సూపర్ హిట్కొట్టేసింది.

    బాలీవుడ్ మూవీ సయారాతో సూపర్ హిట్ కొట్టిన అహాన్ పాండే, అనీత్ పడ్డా తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. కేవలం ఒక్క సినిమాతోనే వీరిద్దరు టాప్లో నిలవడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మోహిత్‌ సూరి డైరెక్టర్ల లిస్ట్లో టాప్ప్లేస్ దక్కించుకున్నారు. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన సయారా బాక్సాఫీస్‌ వద్ద రూ.570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

    ఐఎండీబీ- 2025 లిస్ట్..

    టాప్-10 సినీ స్టార్స్ వీళ్లే...

    • అహాన్ పాండే (సయారా)

    • అనీత్ పడ్డా (సయారా)

    • ఆమిర్ ఖాన్ (సితారే జమీన్‌ పర్‌)

    • ఇషాన్ ఖట్టర్ (హోమ్ బౌండ్‌)

    • లక్ష్య (ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌)

    • రష్మిక మందన్నా (ఛావా, సికిందర్‌, థామా, కుబేర)

    • కల్యాణి ప్రియదర్శన్ ( కొత్త లోకా చాప్టర్‌1)

    • త్రిప్తి డిమ్రి (ధడక్‌2)

    • రుక్మిణి వసంత్ (కాంతార: చాప్టర్‌1)

    • రిషబ్ శెట్టి (కాంతార: చాప్టర్‌1)

     

    టాప్-10 ఇండియన్ డైరెక్టర్స్ వీళ్లే..

    • మోహిత్ సూరి (సయారా)

    • ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌)

    • లోకేశ్ కనగరాజ్ (కూలీ)

    • అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్‌)

    • పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్‌2: ఎంపురాన్‌)

    • ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్‌ పర్‌)

    • అనురాగ్ బసు (మోట్రో ఇన్‌ దినో)

    • డోమినిక్ అరుణ్ (కొత్త లోకా చాప్టర్‌1)

    • లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)

    • నీరజ్ ఘేవాన్ (హోమ్ బౌండ్‌)

       

  • షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్‌ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన  జై–వీరు (అమితాబ్‌–ధర్మేంద్ర) మోటార్‌ సైకిల్‌ బాలీవుడ్‌లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్‌ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది.  ఈ పురాతన మోటార్‌ సైకిల్‌ 1942 బిఎస్‌ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్‌ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్‌ సైకిల్‌ తిరిగి వెలుగులోకి వచ్చింది.

    ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఎఫ్‌ఎఫ్‌ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది.  షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ’డిఐపిఆర్‌) కమిషనర్‌ ఎడిజిపి హేమంత్‌ నింబాల్కర్‌ అంటున్నారు.

    ఈ చిత్రంలో వినియోగించిన బైక్‌ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి  బెంగళూరు బిజినెస్‌ కారిడార్‌ చైర్‌పర్సన్‌ ఎల్‌కె అతిక్‌ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్‌ నింబాల్కర్‌ వివరించారు. ఈ  బిఎస్‌ఎ మోటార్‌సైకిల్‌ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.

    ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్‌సైకిల్‌ను బ్రిటిష్‌ సంస్థ బర్మింగ్‌హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ తయారు చేసింది. ఈ బైక్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు.  సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్‌ సైన్యం ఈ మోడల్‌ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.

    ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంవైబి  3047 కాగా ఇది ఛాసిస్‌ నంబర్‌ ఎం 20 116283 , ఇంజిన్‌ నంబర్‌ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్‌పవర్‌ను అందించే 500  సిసి సింగిల్‌–సిలిండర్‌ సైడ్‌–వాల్వ్‌ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్‌ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్‌ ఇంధన ట్యాంక్‌తో వచ్చింది. 

    దీనిలో ముందు భాగంలో గిర్డర్‌ ఫోర్కులు  వెనుక పెద్ద క్యారియర్‌ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్‌ బ్రేక్‌లు ఉన్నాయి  యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్‌బార్లు  ఫుట్‌రెస్ట్‌లను కాన్వాస్‌లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు.
     

  • హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

    దర్శకుడు రాజ్‌తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్

    ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్‌ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.

    ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్‌కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్‌.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ)

  • టెక్నాలజీ వచ్చాక ప్రతి పని మరింత సులభతరమైపోయింది. ఇప్పుడు మనం పూర్తిస్థాయి డిజిటల్ ఇండియాగా మారిపోయాం. దీంతో సాంకేతికత పెరిగే కొద్ది సవాళ్లు కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాలపై ప్రభావం మాత్రమే కాదు.. వ్యక్తిగత గోప్యతకు కూడా సవాల్గా మారింది.

    సినీతారలు ఫోటోలను ఇష్టమొచ్చినట్లుగా ఏఐతో ఏడిట్ చేసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వీటిలో మంచికంటే ఎక్కువగా అసభ్యకరమైన కంటెంట్ఉంటోంది. వీటి బారిన ఇప్పటికే పలువురు అగ్ర సినీతారలు పడ్డారు. ఏఐని మంచి పనుల కోసం ఉపయోగించాలి కానీ.. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ‍అలా చాలామంది సినీతారల ఫోటోలను మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

    ఇలా దుర్వినియోగానికి ఏఐని వాడుకోవడంపై రష్మిక మందన్నా రియాక్ట్ అయింది. ఏఐ అనే మన అభివృద్ధికి కోసమని.. అంతేకానీ అసభ్యతను సృష్టించడానికి కాదని ట్వీట్ చేసింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్న కొంతమందికి నైతికత లేదని మండిపడింది. మనం నిజాన్ని సృష్టించినప్పుడు.. వివేచన అనేది గొప్ప రక్షణగా మారుతుందని పోస్ట్లో రాసుకొచ్చింది.

    రష్మిక తన ట్వీట్లో రాస్తూ..' ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి.. ఇంటర్నెట్ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు.. అది ఏదైనా సృష్టించగలిగే కాన్వాస్‌. ఇకపై ఏఐ టెక్నాలజీని దుర్వినియోగానికి కాకుండా..  గౌరవప్రదమైన, ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతగా వ్యవహరిద్దాం.. ప్రజలు మనుషుల్లా వ్యవహరించకపోతే.. అలాంటి వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి' అంటూ పోస్ట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో కొందరు నెటిజన్స్ రష్మికకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

     

     

National

  • శబరిమలకు భక్తుల రద్దీ పెరిగింది. పెద్దఎత్తున స్వాములు ఇరుముడితో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర అటవీ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం నిషేదమని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ పారవేయడం తీవ్ర నేరమని కనుక స్వాములెవ్వరూ ప్లాస్టిక్ వస్తువులతో సన్నిధానానికి రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

    అటవీ శాఖ ఆదేశాల నేపథ్యంలో అక్కడి అలువా నది వద్ద స్వాముల వద్ద నున్న ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వాటి స్థానంలో పేపర్ బ్యాగులు స్వాములకు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడకంతో  అటవీ ప్రాంతంతో పాటు పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని కనుక స్వాములెవరూ ప్లాస్టిక్ వస్తువులు స్వామివారి సన్నిధానానికి తీసుకురాకూడదని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

     

  • ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో  40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

    సుర్గుజా జిల్లా ఘటనపై  జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

    మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా  ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?"  అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.

    అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

    అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.

  • బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ.  ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.

    హర్యానాలోని పానిపట్‌లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.  జర్మన్ అద్భుత కథ స్నో వైట్‌లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన  హత్యాకాండను  ఛేదించారు.

    తన కంటే అందంగా ఉందని
    పానిపట్‌లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్‌ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది.  బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి  ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు.
     
    హత్య ఎలా జరిగింది
    సోనిపట్‌కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్‌లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు.  పెళ్లిలో  సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్‌ కన్నుపడింది.  రాక్షసిలా మారిపోయింది.

    అకస్మా‍త్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత,  విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్‌రూమ్‌కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత  కేసు నమోదు చేశారు.  పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్‌ చేశారు.

    పిల్లలను చంపే విధానం
    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన  అమ్మాయిలే ఆమెటార్గెట్‌  అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే  చంపినట్లు అంగీకరించింది.

    2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే   వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో  పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు. 

    ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో

  • చెన్నై,సాక్షి : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఎదురు దెబ్బ తగిలింది.  ఆర్డర్‌ చేసిన వస్తువు కాకుండా మరో తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకుగాను కోర్టు జరిమానా విధించింది. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది.

    తమిళనాడులోకి తిరుచ్చకి చెందిన  ఐజాక్‌ న్యూటన్‌  జులై 9న ఒక  మినీ ప్రొజెక్టర్‌ ఆమెజాన్‌ ద్వారా ఆర్డర్‌ చేశారు. కానీ  జూలై 14న వచ్చిన పార్సిల్‌ చూసి ఐజాక్‌ నివ్వెరపోయాడు.  రూ.2,707 ధర గల మినీ ప్రొజెక్టర్‌కి బదులుగా టీ-షర్టులు కనిపించాయి. అయితే, న్యూటన్ ఉత్పత్తిని మార్చాడని ఆరోపిస్తూ అమెజాన్ డబ్బును తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. అమెజాన్ చర్యతో నిరాశ చెందిన ఐజాక్‌ కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. అసలు మొత్తాన్ని తిరిగి ఇచ్చింది. అయినా చెప్పిన సమయానికిఈ-కామర్స్ సంస్థ డబ్బులు చెల్లించక పోవడంతో న్యాయపోరాటానికి దిగాడు. 

    ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో

    తనకు జరిగిన మోసం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఐజాక్ న్యూటన్ త్రిరుచ్చి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. రూ. 5 లక్షల పరిహారం కోరుతూ కేసు దాఖలు చేశాడు. కేసును విచారించిన కోర్టు అమెజాన్ ,డెలివరీ ఏజెంట్ తప్పు చేసినట్లు గుర్తించింది.  నవంబర్ 28న కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది, అమెజాన్ ఐజాక్ న్యూటన్‌కు రూ.25,000 పరిహారంగా  రూ.10 వేల కోర్టు ఖర్చులకు చెల్లించాలని ఆదేశించింది.  ఐజాక్‌కు  మొత్తంగా రూ.35,000  చెల్లించాలని తీర్పు  చెప్పింది.

    చదవండి: మాస్క్‌తో పలాష్‌ : ప్రేమానంద్‌ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు భారత్ రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్- రష్యా 23వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ  ఎంపీ శశి థరూర్ భారత్ - రష్యా మధ్య మైత్రి ఎంతో ముఖ్యమైనదంటూ  కీలక వ్యాఖ్యలు చేశారు.

    రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్న సమయం నుంచే రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆకాలం నుంచే రెండు దేశాలు పరస్పర సహకారాలు అందించుకుంటూ వస్తున్నాయి. కాగా రేపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  ఈ పర్యటనపై మాట్లాడారు.

    "రష్యా అధ్యక్షుడి పర్యటన చాలా ముఖ్యమైనది. ఈ స్నేహం చాలా పాతది, బలమైనది, అదే విధంగా అమెరికా, చైనాలతోనూ ద్వైపాక్షిక బంధాల్ని కొనసాగించాలి. భారత ఆర్థిక వ్యవస్థను వేరే ఏ దేశం కోసం తనఖా పెట్టకూడదు" అని శశి థరూర్ అన్నారు. ఈ మూడు దేశాలతో భారత్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.

    రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఈయూతో పాటు అమెరికా పలు ఆంక్షలు విధించి ఏకాకిని చేసే యత్నం చేశాయి. భారత్ సైతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.  అయితే వీటిని భారత్ లెక్కచేయకుండా మాస్కోతో మైత్రిని కొనసాగించింది. తన చిరకాల మిత్రునికి అండగా నిలిచింది.  

    రష్యా నుంచి  భారత్ రక్షణ రంగ సామాగ్రి , పెట్రోలియం, ఎరువులు పెద్దఎత్తున  దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా జౌషదాలు, ఇతర రసాయనాలు, యంత్రాలు మాస్కోకు ఎగుమతి చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చివరిసారిగా 2021లో ఇండియాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.

  • హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమాన సేవల్లో అవరోధం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో 70కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. సాంకేతిక సమస్యలతో ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన 13 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

    సాంకేతిక లోపాలు, రద్దీ, ఆపరేషనల్ సమస్యలు, సిబ్బంది కొరత కారణమని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం పరిస్థితి నెలకొంది. చెక్ ఇన్ సిస్టమ్ లో సాంకేతిక లోపంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టుల్లో ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ సిస్టమ్స్‌ పనిచేయకపోవడంతో చెక్‌ఇన్, బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ  ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ ఫలితం  కోసం ఎనిమిదేళ్లు  నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించింది. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకు ఏమిటా కల, ఆమె సాధించిన విజయం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ  స్ఫూర్తిదాయక కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.

    ప్రియాంక దల్వి పేదింటి బిడ్డ. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన గుండె ఉప్పొంగేలా చేసిన ఆడబిడ్డ ప్రియాంక. నాన్నకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఎనిమిదేళ్లు కష్టపడింది.  ఆ కల నిజమైన రోజు భావోద్వేగంతో కన్నీటి  ప్రవాహమైంది. మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల  గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం!

     

    నవేఖేడ్ గ్రామంలో గుడ్డిదీపాల మధ్య మసక వెలుగులో చదువుకున్న  ప్రియాంక మహారాష్ట్రను అగ్రస్థానంలో నిలిచింది. మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారి పదవిని సంపాదించింది. ఫలితాల రోజున, ప్రియాంక తల్లిదండ్రులు తమ కుమార్తె విజయానికి చూడటానికి వారి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఫలితాలు రాగానే తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నేళ్ల పోరాటం నిశ్శబ్ద ప్రార్థనలు ఆమె కంట కన్నీరుగా ప్రవహించాయి.  

    ఇదీ చదవండి: మాస్క్‌తో పలాష్‌ : ప్రేమానంద్‌ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?

  • 2028 సంవత్సరం నాటికి స్పేస్ లో  "భారతీయ అంతరిక్ష స్టేషన్" ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది.  పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనే  దీని నిర్మాణం చేపడుతున్నామని పార్లమెంటులో బుధవారం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్ ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.

    భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలమైన డిజైన్ మైల్ స్టోన్ ను ఇస్రో పూర్తిచేసిందన్నారు. దీని నిర్మాణం పూర్తయితే  భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం, సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చాలా సులభతరమైతాయని వారు పేర్కొన్నారు. 

    2024 సెప్టెంబర్ 1న భారతీయ అంతరిక్ష స్టేషన్ మెుదటి మాడ్యుల్ నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.20,193 కోట్ల నిధులు కేటాయించగా 2028 వరకూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2035 నాటికి ఇది పూర్తిస్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంది. 

    భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు పూర్తయితే  అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత స్పేస్ లో స్వంత అంతరిక్ష స్టేషన్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ రికార్టు సృష్టిస్తుంది.

  • ఢిల్లీ: సంచార్‌  సాథీ యాప్‌ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. మెబైల్స్‌లో  ప్రీ​-ఇన్‌స్టాలేషన్‌ నిబంధనను కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరికాదని కేంద్రం తెలిపింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఇవాళ(డిసెంబర్‌ 3, బుధవారం) ప్రకటించింది.

    సంచార్‌ సాథీ యాప్‌ ప్రీ ఇనస్టాలేషన్‌ను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరితో సంప్రదించకుండా నియంతృత్వంతో ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కాగా, కొత్త మొబైల్‌ ఫోన్లలో తప్పనిసరిగా సంచార్‌ సాథీ యాప్‌ని ప్రీ–ఇన్‌స్టాల్‌ చేయాలంటూ హ్యాండ్‌సెట్‌ కంపెనీలకిచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడంతో కేంద్రం స్పష్టతనిచ్చింది కూడా.. యూజర్లు కావాలంటే దీన్ని అట్టే పెట్టుకోవచ్చని, వద్దనుకుంటే డిలీట్‌ కూడా చేయొచ్చని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

    సైబర్‌ మోసాల నుంచి రక్షణ కల్పించే ఈ యాప్‌ గురించి చాలా మందికి ఇంకా తెలియదని, వారందరికీ దీన్ని చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టే ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ‘ఈ యాప్‌ని అందరికీ చేరువ చేయడం మా బాధ్యత. మీరు డిలీట్‌ చేయదల్చుకుంటే చేయొచ్చు. వాడకూడదనుకుంటే రిజిస్టర్‌ చేసుకోవద్దు. రిజిస్టర్‌ చేసుకుంటే యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే ఇనాక్టివ్‌గా ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.

    మోసాలపై సత్వరం ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్‌ సాథీ యాప్‌ను కొత్తగా తయారు చేసే అన్ని మొబైల్‌ ఫోన్లలో తప్పనిసరిగా ప్రీ–ఇన్‌స్టాల్‌ చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా ఇన్‌స్టాల్‌ చేయాలని హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థలను టెలికం శాఖ (డాట్‌) ఆదేశించిన సంగతి తెలిసిందే.  సంచార్‌  సాథీ యాప్‌కి సంబంధించి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.

  • స్టార్‌ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న  వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల  మధ్య  పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత  పలాష్‌ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.

    ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్  ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ మహారాజ్‌ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని  ఫోటోల వైరల్‌గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్‌ ఇక్కడ ముఖానికి మాస్క్‌తో,   భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.

    చదవండి: జస్ట్‌ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్‌ సక్సెస్‌ స్టోరీ

    కాగా  మెహిందీ, సంగీత్‌ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్‌ పెళ్లి  స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్‌ ప్రైవేట్‌ చాట్స్‌, స్క్రీన్‌షాట్‌లు అంటూ  మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో  సస్పెన్స్‌ కొనసాగుతోంది.

    ఇదీ చదవండి: రిటైర్డ్‌ డాక్టర్‌ లక్ష్మీ బాయ్‌ రూ. 3.4 కోట్ల భారీ విరాళం

Politics

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

    పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, జీసీసీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ గా బద్వేల్ హజీ ఇలియాస్, కో- కన్వీనర్లుగా గోవిందు నాగరాజు (కువైట్), దొండపాటి శశి కిరణ్ (ఖతర్), మహమ్మద్ జిలాని భాష (దుబాయ్) నియమితులయ్యారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం, డిసెంబర్‌ 4వ తేదీ) ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు.

Business

  • బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన సినీ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే, తెర వెనుక ఒక శక్తివంతమైన వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. తాజా అంచనాల ప్రకారం, క్రీడా ఫ్రాంఛైజీల యాజమాన్యం నుంచి గ్లోబల్ బ్రాండ్‌ల్లో వ్యూహాత్మక పెట్టుబడుల వరకు విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం నికర విలువ సుమారు రూ.280 కోట్లుగా ఉంది. హరూన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం అమితాబ్ బచ్చన్ నేతృత్వంలోని బచ్చన్ కుటుంబం మొత్తం విలువ రూ.1,630 కోట్లుగా ఉంది.

    జైపూర్ పింక్ పాంథర్స్ (JPP)

    అభిషేక్ బచ్చన్ 2014లో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో జైపూర్ పింక్ పాంథర్స్ (జేపీపీ) జట్టును కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ పెట్టుబడి విలువ 100 రెట్లు పెరిగిందని తానే స్వయంగా వెల్లడించారు. పీకేఎల్ ప్రారంభ సంవత్సరం (2014)లోనే ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఈ జట్టు రెండో సీజన్ నుంచి ఆర్థికంగా లాభదాయకంగా మారింది. పీకేఎల్ సీజన్-12 ఆక్షన్‌లో జేపీపీ రైడర్ నితిన్ కుమార్ ధంఖర్‌ను రూ.1 కోటికి కొనుగోలు చేసింది.

    ఫుట్‌బాల్.. చెన్నైయిన్ ఎఫ్‌సీ (CFC)

    కబడ్డీతో పాటు అభిషేక్‌కు ఫుట్‌బాల్ పట్ల ఉన్న ఆసక్తితో 2014లో ఎంఎస్ ధోనీతో కలిసి చెన్నైయిన్ ఎఫ్‌సీ (ఐఎస్‌ఎల్) సహ-యాజమానిగా మారారు. 2025-26 సీజన్‌లో కూడా జట్టు పోటీ పడుతోంది. ఇటీవల అక్టోబరు 2025లో జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్‌ సూపర్ కప్‌లో క్లిఫర్డ్ మిరాండా నేతృత్వంలో పాల్గొంది.

    రియల్ ఎస్టేట్, స్టార్టప్ పెట్టుబడులు

    అభిషేక్ బచ్చన్ తన పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆహార బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు. 2020 నుంచి 2024 మధ్య బచ్చన్ కుటుంబం భారతదేశవ్యాప్తంగా రూ.220 కోట్ల విలువైన ఆస్తులు కొనుగోలు చేసింది. 2024లో ముంబైలోని ఒబెరాయ్ రియల్టీస్ ఎటర్నియాలో రూ.24.95 కోట్లకు 10 అపార్ట్‌మెంట్లను (అభిషేక్ 6, అమితాబ్ 4), బోరివలిలోని ఒబెరాయ్ స్కై సిటీలో రూ.15.42 కోట్లకు 6 అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు.

    2015లో సింగపూర్ క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫామ్ ‘జిడ్డు’లో చేసిన రూ.2 కోట్ల పెట్టుబడి 2017లో లాంగ్ ఫిన్ కార్ప్ కొనుగోలు సమయంలో బిట్‌కాయిన్ పెరుగుదల వల్ల రూ.112 కోట్ల భారీ లాభాన్ని ఇచ్చింది. ఓప్రా విన్ఫ్రే వంటి ప్రముఖులు ఆమోదించిన వహ్దామ్‌ టీ లేబుల్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. జెప్టో, జీక్యూ‌ఐ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడి పెట్టారు.

    నిర్మాతగా..

    అమితాబ్ బచ్చన్ యాజమాన్యంలోని ఏబీ కార్ప్ (AB Corp)లో అభిషేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పా (2009), షమితాబ్ (2015), ఘూమర్ (2023) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. పా చిత్రం జాతీయ అవార్డులను గెలుచుకుంది.

  • టెక్ దిగ్గజం యాపిల్‌ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్‌డేట్‌ చేసింది. ఐదు యాపిల్‌ ఉత్పత్తులకు అధికారిక హార్డ్‌వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్‌డేట్‌ చేసిన జాబితాలో కింది ఉ‍త్పత్తులు ఉన్నాయి.

    • ఐఫోన్ SE (మొదటి తరం)

    • 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)

    • యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్

    • యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్

    • బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్

    ఏడేళ్ల గడువు పూర్తి

    యాపిల్‌ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్‌, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్‌వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్‌ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.

    వినియోగదారులకు సవాలు

    యాపిల్‌ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్‌గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్‌వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్‌ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.

    ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అ‍మ్మాడు.. కానీ..

  • నేటి యువతరం కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, సంపాదన కోసం తమదైన మార్గాన్ని సృష్టించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక చిన్న ఆలోచన, కొంచెం సృజనాత్మకత ఉంటే.. సాధారణ వస్తువులను కూడా అద్భుతమైన బిజినెస్ అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో కొందరు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన ఓ వీడియా వైరల్‌గా మారింది.

    రోడ్డు పక్కన రాయి.. రూ.5,000 గడియారంగా!

    సాధారణంగా రోడ్డు పక్కన పడి ఉండే రాళ్లను ఎవరు పట్టించుకుంటారు? కానీ, ఢిల్లీకి చెందిన ఒక యువకుడు అదే రాయిని అత్యంత ఆకర్షణీయమైన ఫంక్షనల్ గడియారంగా మార్చి రూ.5,000కు అమ్మి అందరి దృష్టిని ఆకర్షించాడు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ప్రకారం.. ఈ యువకుడు రోడ్డు పక్కనుంచి తీసుకున్న ఒక సాధారణ రాయిని ప్రత్యేకమైన షోపీస్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట రాయిని కావలసిన ఆకారంలో కత్తిరించి, ఆపై పాలిషింగ్, పెయింటింగ్ చేశాడు. దీంతో రాయికి నిగనిగలాడే ఫినిషింగ్ వచ్చింది. తర్వాత లోపల ఒక చిన్న గడియారాన్ని జాగ్రత్తగా అమర్చి దాన్ని అలంకార వస్తువుగా మార్చేశాడు.

    మొదట ఆకర్షణీయంగా లేకపోవడంతో..

    వీడియోలోని వివరాల ప్రకారం.. మొదటి ప్రయత్నంలో గడియారం వెనుక భాగం అంతగా ఆకర్షణీయంగా లేకపోవడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, ఈ యువకుడు నిరాశ చెందకుండా వెంటనే దాన్ని సరిదిద్ది వెనుక భాగాన్ని చక్కటి కవర్‌తో కప్పి ఆకర్షణీయంగా చేశాడు. దాంతో ఒక కస్టమర్ వెంటనే రూ.5,000 చెల్లించి దాన్ని కొనుగోలు చేశాడు.

    ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

  • కృత్రిమ మేధ(ఏఐ) చాలా సాంకేతిక పనులను నిర్వహిస్తున్నందున ఉద్యోగ ప్రపంచంలో భావోద్వేగ మేధ(EQ), ట్రేడిషనల్‌ ఇంటెలిజెన్స్‌(సాంప్రదాయ మేధ IQ) కీలకమవుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అదే సమయంలో భావోద్వేగ మేధ లేకుండా సాంప్రదాయ మేధపై మాత్రమే ఆధారపడలేమని అభిప్రాయపడ్డారు. ఇటీవల యాక్సెల్ స్ప్రింగర్ సీఈఓ మాథియాస్ డాఫ్నర్‌తో జరిగిన ‘ఎండీ మీట్స్’ పోడ్‌కాస్ట్‌లో నాదెళ్ల ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ‘నాయకులకు కేవలం ఈక్యూ లేకుండా ఐక్యూ ఉంటే సరిపోదు. సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ కావాల్సిందే.  ఏఐ సాంకేతిక పనులను ఎక్కువగా నిర్వహిస్తున్న తరుణంలో సాఫ్ట్‌ స్కిల్స్‌ కీలకంగా మారాయి. ఇది వ్యాపారంలో ముఖ్యమైన నైపుణ్యంగా, ఒక సూపర్‌ పవర్‌గా మారుతోంది. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి’ అని చెప్పారు.

    ఏఐ రేసులో మెరుగైన పోటీ కోసం నాదెళ్ల మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో ఇటీవల అనేక కీలక మార్పులు చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో విజయం సాధించడానికి ఇటీవల క్లౌడ్‌ ఎక్స్‌పర్ట్‌ రోల్ఫ్ హార్మ్స్‌ను ఏఐ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా నియమించారు. అక్టోబర్ 2025లో మైక్రోసాఫ్ట్ కమర్షియల్ బిజినెస్ సీఈఓని నియమించి తాను పూర్తిగా ఏఐ టెక్నికల్ అంశాలపై దృష్టి పెడుతున్నారు. కంపెనీ తమ కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ టీమ్‌తో ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(AGI) వైపు పయనిస్తోంది.

    ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

  • రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) ఛైర్మన్ అనిల్ అంబానీ బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వ్యక్తిగత ఖాతాలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’ వర్గీకరించిన నిర్ణయాన్ని సమర్థించిన బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అప్పీల్ గత వారం చివరిలో దాఖలు చేయబడినప్పటికీ కేసు ఇంకా అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంబానీ గ్రూప్‌పై బ్యాంకులు, దర్యాప్తు సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ తాజా న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది.

    కేసు వివరాలు

    ఎస్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో ఆర్‌కామ్‌ లోన్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’ గుర్తించింది. రుణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. దీనివల్ల బ్యాంకుకు రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అయితే దీనిపై అనిల్‌ అంబానీ స్పందిస్తూ, ఎస్‌బీఐ సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, విచారణ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషన్‌లో తెలిపారు.

    బాంబే హైకోర్టు తీర్పు

    అక్టోబర్ 3, 2025న బాంబే హైకోర్టులోని జస్టిస్‌ రేవతీ మోహిటే డేరే, నీలా గోఖలేల డివిజన్ బెంచ్ అంబానీ పిటిషన్‌ను తిరస్కరించింది. ఎస్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాస్టర్ డైరెక్షన్స్‌ను పాటించిందని, అంబానీ కంపెనీ ప్రమోటర్‌గా, కంట్రోలింగ్ పర్సన్‌గా ఫలితాలను ఎదుర్కోవాల్సిందేనని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అంబానీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    ఇతర బ్యాంకులు

    ఎస్‌బీఐతో పాటు ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ఇతర బ్యాంకులు కూడా ఆర్‌కామ్ ఖాతాలను ‘ఫ్రాడ్‌’గా వర్గీకరించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025లో రూ.400 కోట్లకు సంబంధించిన ఆరోపణలపై షోకాజ్ నోటీసు జారీ చేసింది.

    దర్యాప్తు సంస్థల దూకుడు

    ఎస్‌బీఐ ఫిర్యాదు ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆగస్టు 21, 2025న కేసు నమోదు చేసి రూ.2,929 కోట్ల మోసానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆర్‌కామ్, అంబానీ నివాసం సహా పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెప్టెంబర్ 2025లో ప్రివెన్షన్‌ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. నవంబర్ 2025లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) కూడా నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాలపై విచారణ ప్రారంభించింది.

    ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

  • టాప్‌ టెక్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో పని చేస్తున్న వ్యక్తి నిత్యం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ, మరెన్నో సమావేశాల్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంటారు. చాలా మంది ఇలాంటి బాధ్యతల్లో ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితానికి చాలా తక్కువ సమయం గడుపుతూ, కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కానీ టెక్ దిగ్గజం సిస్కో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జీతూ పటేల్ జీవితం మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు.

    పనిలో విశ్రాంతి లేకపోయినా తన కుమార్తెకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పారు. తన సమావేశంలో ఎప్పుడైనా, ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. అందరూ కుటుంబ బంధానికి అత్యంత విలువ ఇవ్వాలని పేర్కొన్నారు.

    ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం, పటేల్ రోజువారీ కార్యకలాపాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు ఉంటాయి. ఈ కఠినమైన పని విధానంలో ఆయన ఒక స్మార్ట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు ముందు సీఈఓ లేదా బోర్డు సమావేశాలు తప్పా మరే ఇతర మీటింగ్‌లకు అనుమతి ఉండదు. ఈ సమయంలో ఆయన పనిలో విభిన్నంగా ఎదిగేందుకు ఎలాంటి నిర్ణయాలు అవసరమో ఆలోచిస్తానని, ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఉపయోగిస్తానని చెప్పారు. తర్వాత క్షణం తీరిక లేకుండా రోజువారీ కార్యకలాపాలుంటాయని చెప్పారు.

    ఈ బిజీ షెడ్యూల్‌లో మొదటి నియమం.. తన కూతురికి సంబంధించింది. అత్యంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా సరే ‘నా కుమార్తె ఏ సమావేశానికైనా వచ్చి నన్ను ఏదైనా అడగవచ్చు. తలుపు తట్టాల్సిన అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. ఇది ఒక వ్యక్తిగత అనుభవం నుంచి పుట్టింది. 2023లో తన తల్లి చివరి రోజుల్లో పటేల్ కార్పొరేట్‌ బాధ్యతల నుంచి ఎనిమిది వారాల పాటు దాదాపు పూర్తిగా దూరంగా ఉండి ఆసుపత్రిలో ఆమెతో గడిపారు. ఈ క్షణాలు ఆయనకు ఒక చేదు సత్యాన్ని నేర్పాయని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ సమతుల్యంగా ఉండదు. చాలాసార్లు కుటుంబం మాత్రమే మొదటి స్థానంలో ఉంటుంది. మీ కోసం పనిచేసే వ్యవస్థను మీరే రూపొందించుకోవాలి, మరెవరూ ఈ పని చేయరు’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!

Nizamabad

  • పల్లె పాలనకు 61 ఏళ్లు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో

    1964లో తొలిసారి పంచాయతీ ఎలక్షన్లు

    మొదట్లో పరోక్ష పద్ధతిలో సర్పంచ్‌ ఎన్నిక

    డిచ్‌పల్లి: పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏర్పడి 61 ఏళ్లు పూర్తవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఏర్పాటులో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1957లో భారత ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ సంస్థల ఏర్పాటు కోసం బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం మూడంచెల (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చేసిన సూచించగా, జాతీయాభివృద్ధి సంస్థ 1958లో ఆమోదించింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సంస్థల చట్టం ఏర్పాటు చేసింది. దీన్ని మొట్టమొదటగా రాజస్థాన్‌ రాష్ట్రం అమలు చేయగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 1959 అక్టోబర్‌ 2న అమలు చేసింది.

    వార్డు సభ్యులే సర్పంచ్‌ను ఎన్నుకునేలా..

    ఆంధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 500 పైగా జనాభా ఉన్న గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభా ఆధారంగా 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులుండవచ్చని పేర్కొన్నారు. 1964లో సర్పంచ్‌ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటే, ఈ వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. ఎన్నికై న సర్పంచ్‌లు కలిసి సమితి ప్రెసిడెంట్‌ ను ఎన్నుకునేవారు. సమితి ప్రెసిడెంట్‌లు జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండేది.

    1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి..

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్‌ ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. 1992లో అమల్లోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

    మండల వ్యవస్థతో మార్పులు..

    తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్‌ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్‌లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌లను ఎన్నుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ అనే మూడంచెల వ్యవస్థ రూపొందుకుంది. మండల పరిషత్‌లో సర్పంచ్‌లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు అదే ప్రక్రియ కొనసాగుతోంది.

  • ఒకేచోట.. పరిశోధన, విస్తరణ, బోధన

    వ్యవసాయాభివృద్ధిలో

    ప్రత్యేకతను చాటుతున్న ‘రుద్రూర్‌’

    నేడు జాతీయ వ్యవసాయ

    విద్య దినోత్సవం

    రుద్రూర్‌: వ్యవసాయాభివృద్ధిలో రుద్రూర్‌ ప్రాంతం ప్రత్యేకతను చాటుతోంది. ఈప్రాంతంలో ఏర్పాటు చేసిన చెరుకు, వరి పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాలతో ఒకేచోట వ్యవసాయంలో పరిశోధనలు, కొత్తవంగడాల విస్తరణ, బోధన తరగతులు కొనసాగుతూ వ్యవసాయానికి సాయం చేస్తున్నాయి. నేడు జాతీయ వ్యవసాయ విద్య దినోత్సవం సందర్భంగా రుద్రూర్‌లోని కేంద్రాలపై ప్రత్యేక కథనం.

    నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూరు ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధన, పరిశోధన, విస్తరణ సంస్థలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రానికి సమీపంలో 1932లో ప్రాంతీయ చెరకు, వరి పరిశోధనా స్థానం ఏర్పాటు చేశారు. నాటి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించి వరి, చెరకులో దిగుబడి పెంచే నూతన వండాలను రూపొందించి రైతులకు పరిచయం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన వంగడాల గూర్చి విస్తరించడంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీన్ని 2004లో ఇక్కడనే ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా రైతాంగానికి అందించడం, క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ విస్తీర్ణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పరుస్తోంది. అలాగే రైతులకు స్వయం ఉపాధి పెంపొందించుకొనే దీర్ఘకాలిక శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది.

    వ్యవసాయ కళాశాలలు..

    విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌ కళాశాలను 2005లో స్థాపించబడినప్పటికీ, దీన్ని 2022లో వ్య వసాయ పాలిటెక్నిక్‌ కళాశాలగా మార్చారు. ఈ క ళాశాలలో విద్యార్థులకు తరగతుల్లో పాఠాలు చెప్పడమే కాకుండా వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పంట విత్తుట నుంచి కోత వరకు అనుభ వం వచ్చేలా బోధన చేస్తారు. అలాగే 2015లో ఆహా ర రంగంలో డిమాండ్‌ ఆధారిత, విలువ ఆధారిత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో 2015లో ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌ లిక సదుపాయాలు విద్యార్థులకు మంచి సైద్ధాంతి క, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ కళాశాల 2021లో న్యూఢిల్లీలోని ఐసీఎఆర్‌ ద్వారా ’ఎ’ గ్రేడ్‌ గుర్తింపు పొందింది.

    రుద్రూర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిశోధన, విస్తరణ, బోధన కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. చెరుకు, వరి వంటి పంటలకు సంబంధించిన కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో రైతులకు పరిచయం చేస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకాలను రూపొందిస్తారు. శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, రైతులతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తుంది.

    – పవన్‌ చంద్రారెడ్డి, అధిపతి,

    వ్యవసాయ పరిశోధన కేంద్రం,

    ప్రిన్సిపాల్‌, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల

  • పలు గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒకే నామినేషన్

    పోటీ లేని సుమారు 9 సర్పంచ్‌ స్థానాలు

    ఏకగ్రీవమైనట్లు అధికారులు

    ప్రకటించడమే తరువాయి

    మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని పాల్దా, లింగి తండా, ధర్మారం తండా సర్పంచ్‌ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. పాల్దా జనరల్‌ రిజర్వ్‌ కావడంతో మున్నూరు ప్రభాకర్‌, లింగి తండా ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో మాలావత్‌ రమేష్‌, ధర్మారం తండా ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో బాదావత్‌ కల్పన మాత్రమే నామినేషన్‌ వేశారు. దీంతో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమైనట్లేనని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పేర్కొంటున్నారు. ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉందంటున్నారు. కానీ ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్‌ స్థానం కోసం వార్డు స్థానాలకు ఒకటికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి.

    డిచ్‌పల్లి మండలంలో..

    డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు గానూ నాలుగు గ్రామాల్లో సర్పంచ్‌, 306 వార్డు స్థానాలకు గానూ 90 స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సింగ్‌పూర్‌ (కొత్తపేట) గ్రామ సర్పంచ్‌గా ఎంకాయల శోభ, కొరట్‌పల్లి తండా సర్పంచ్‌గా బానోత్‌ సంగీత, నక్కలగుట్ట తండా సర్పంచ్‌గా లకావత్‌ దేవీసింగ్‌, మిట్టపల్లి తండా సర్పంచ్‌గా బుక్య సెవంత నవుసీరాం ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లేనని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల విత్‌డ్రా అనంతరం మరో రెండు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.

    మోపాల్‌: మండలంలోని నర్సింగ్‌పల్లి సర్పంచ్‌ స్థానానికి ఒక్కరే నామినేషన్‌ దాఖలుచేశారు. ఎస్సీ (మహిళ)కు రిజర్వ్‌ కావడంతో గ్రామపెద్దలు కలిసి చారుగొండ లిఖితతో నామినేషన్‌ దాఖలు చేయించారు. 10 వార్డు స్థానాలకుసైతం ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో గ్రామంలో సర్పంచ్‌, వార్డుస్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లే. కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    మాక్లూర్‌: మండలంలోని సింగంపల్లి తండా గ్రా మ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌ అభ్యర్థి గా జాదవ్‌ శాంత, వార్డు సభ్యులకు కూడ ఒక్కోక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. తండాలో నామినేషన్ల పక్రియ ప్రారంభమైనప్ప టి నుండి చివరి రోజైన మంగళవారం వరకు మ రెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో తండా పాలకవర్గం ఏకగ్రీవం లాంఛనమే అయింది. దీంతో తండావాసులు పెద్ద ఎత్తున టపాకాయ లు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఇక తండా సర్పంచ్‌గా జాదేవ్‌ శాంత, ఉప సర్పంచ్‌గా బానోత్‌ సంజీవ్‌, 8 వార్డు సభ్యు లు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించమే మిగిలింది.

  • ప్రత్యేక పిల్లలకు భరోసా.. భవిత!

    జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో

    కొనసాగుతున్న సేవలు

    సత్ఫలితాలనిస్తున్న విలీన విద్య

    నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

    ఆర్మూర్‌: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రాలు వారి భవిష్యత్‌కు భరోసాను ఇస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆయా కేంద్రాల్లో విలీన విద్యను అందిస్తున్నారు. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత కేంద్రాలపై ప్రత్యేక కథనం.

    ఎన్నో సౌకర్యాలు..

    జిల్లాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సుమారు 4,860 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి 35 మంది రిసోర్స్‌ పర్సన్‌లతో పాటు ఇటీవల నియమించబడ్డ 39 మంది స్పెషల్‌ టీచర్లచే సేవలందిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసిన భవిత కార్యాలయాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు, ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిర్వహణ, స్పీచ్‌ థెరపీ, ఎర్లీ ఇంట్రవెన్షన్‌ తదితర సేవలను అందిస్తున్నారు. అలాగే పలు మండలాల్లో కొత్తగా భవిత కేంద్రాల నిర్మాణాలతోపాటు పలు మండలాల్లో మరమ్మతులు చేపడుతున్నారు. టీచింగ్‌ లర్నింగ్‌ మెటీరియల్‌ (టీఎల్‌ఎం) కొనుగోలుకు మంజూరు నిధులు సైతం చేసారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, రవాణా భత్యం పుస్తకాలు, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ వైకల్యాలతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (అలిమ్‌కో) ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్‌, వీల్‌ చెయిర్స్‌, చంక కర్రలు, వినికిడి యంత్రాలు, సీపీ వాకర్‌లు, కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. చిన్నచిన్న వైకల్యాలు కలిగి ఉన్నవారిని గుర్తించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు.

    నేడు ప్రత్యేక కార్యకమ్రాలు..

    జిల్లాల్లోని భవిత కేంద్రాల్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి జిల్లా స్థాయి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోను ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు క్రీడలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

    సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు కార్యక్రమాలలో విలీన విద్యకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రతీ విద్యార్థి సాధారణ విద్యార్థుల తో సమానంగా పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకొని స మాజంలో గౌరవంగా నిలబడే విధంగా శిక్షణనిస్తున్నాము.

    – అశోక్‌, డీఈవో,

    సర్వశిక్షా అభియాన్‌ పీవో, నిజామాబాద్‌

    భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను తీర్చి దిద్దడానికి ఐఈఆర్పీల సహకారంతో అన్ని రంగాల్లో శిక్షణనిస్తున్నాము. సాధారణ విద్యార్థులతో పాటు సాధారణ తరగతి గదిలో చదువుకొనేలా శిక్షణనిస్తున్నాము.

    – పడకంటి శ్రీనివాస్‌రావు, జిల్లా ఇన్‌చార్జి కోఆర్డినేటర్‌, సహిత విద్యావిభాగం, సమగ్ర శిక్ష

  • రైతుల వెన్ను విరిచేలా విత్తన చట్టం ముసాయిదా

    విత్తన ధరల నిర్ణయం

    కంపెనీల చేతుల్లో

    రైతు సంక్షేమ కమిషన్‌ మెంబర్‌

    గడుగు గంగాధర్‌

    డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన విత్తన చట్టం ముసాయిదా రైతుల విత్తన హక్కును కార్పొరేట్‌ పరం చేయబోందని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ మెంబర్‌ గడుగు గంగాధర్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్రం విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచిందని, ఈ నెల 11 వరకు అభిప్రాయాలు చెప్పాలని కోరిందన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకవస్తున్నామని కేంద్రం ప్రకటించిందని, నిజానికి ఇది రైతుల నడ్డి విరిచి విత్తన కంపెనీలకు మేలు చేసేవిధంగా ఉందన్నారు. నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల వలన రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే నిబంధనలు ఈ బిల్లులో లేవన్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప విత్తనాల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై చట్టం చేయాలని కమిషన్‌ సూచిస్తుందన్నారు. విత్తనాలను సాగు చేసే రైతులను ఆదుకోవడానికి ఈ బిల్లులో నిబంధనలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది రైతులు విత్తన సాగు చేస్తున్నారని ఇటీవల కాలంలో వీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈనేపథ్యంలో ములుగు ప్రాంత గిరిజన రైతులకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ చొరవతో రూ. నాలుగు కోట్ల నష్ట పరిహారం ఇప్పించామన్నారు.

  • ఆలూరులో భారీ చోరీ

    14 తులాల బంగారం, అర కిలో వెండి, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన దుండగులు

    ఆర్మూర్‌ టౌన్‌: ఆలూర్‌ మండల కేంద్రంలోని తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్‌లో నివాసం ఉండే కట్టే మిషన్‌ పుల్లెల రాము తన భార్య, పిల్లలతో కలిసి నవంబర్‌ 27న వారి మామ దినకర్మ కోసం వేరే ఊరికి వెళ్లారు. డిసెంబర్‌ 2 మంగళవారం సాయంత్రం వారు తిరిగి ఇంటికి రాగా తలుపులకు వేసిఉన్న తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా, డ్రెస్సింగ్‌టేబుల్‌లో ఉన్న 14 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.లక్ష నగదును చోరీ చేశారు. ఈమేరకు బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

  • మోసమే అతని వృత్తి

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నకిలీ కంపెనీలు సృష్టించి ఉపాధికోసం గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారిని దో చుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్‌. పోలీసు కేసులు నమోదై నా అతడి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్‌ కుటుంబం పన్నెండేళ్లుగా నిజామాబాద్‌లో నివసిస్తుండగా, అతడు ఎనిమిదేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. 2022 మార్చి నుంచి ఆగస్టు మధ్యలో డొంకేశ్వర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన అర్గుల భోజారాం అనే మధ్యవర్తి ద్వారా గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యా ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన 80 మంది వద్ద రూ.5 కోట్లు (ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు) తీసుకున్నాడు. ఇందులో 40 మందిని అసలు తీసుకెళ్లలేదు. మరో 40 మందిని మాత్రం విజిట్‌ వీసా ద్వారా దుబాయికి తీసుకెళ్లి.. మీరెవరో తెలియదంటూ బుకాయించడంతోపాటు బెదిరింపు ధోరణితో వ్యవహరించా డు. చివరకు ఉద్యోగం ఇచ్చే కంపెనీపై కేసు అ యిందని చెప్పి కొరియర్‌ ద్వారా 40 మందికి టిక్కెట్లు, పాస్‌పోర్టులు పంపాడు. 30 మంది పేర్ల తో దుబాయిలో క్రెడిట్‌ కార్డులు తీసుకుని రూ.6 కో ట్ల రుణాలు తీసుకున్నాడు. డబ్బులు కట్టాలంటూ దుబాయి బ్యాంకుల నుంచి భారత్‌లో ఉన్న సదరు బాధితులకు ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. రుణాలు తీసుకున్న కార్మికులు భారత్‌కు పారిపోయారని చె ప్పి దుబాయిలో సదరు క్రెడిట్‌ కార్డుల మీద ఇన్సురెన్స్‌ సైతం క్లెయిమ్‌ చేశాడు ఈ మహాముదురు. 2014లోనూ వేల్పూర్‌కు చెందిన 60 మందిని ఇదే తరహాలో భూమేశ్‌ మోసం చేశాడు. 15 ఏళ్లుగా భూమేశ్‌ దగా చేస్తూనే ఉన్నాడు.

    ‘సాక్షి’ కథనాలతో కేసులు

    భూమేశ్‌ చేసిన మోసాలపై 2024 జనవరి 24, 25 తేదీల్లో కథనాలు రావడంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కామారెడ్డి జిల్లా బీర్కూర్‌, నిజామాబాద్‌ జిల్లా నందిపేట, నవీపేట, మోర్తాడ్‌, వేల్పూర్‌, ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. కాగా 2018 నుంచి భూమేశ్‌ దుబాయిలో ఉంటుండగా, పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పీడీ యాక్ట్‌ పెట్టడంతోపాటు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్‌ ద్వారా భూమేశ్‌ను భారత్‌కు రప్పించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌లో ఉంటు న్న భూమేశ్‌ భార్య స్వప్న మాత్రం తమపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు కొందరు రాజకీయ నేప థ్యం ఉన్న వ్యక్తులు, మరో రిటైర్డ్‌ పోలీసు అధికారి ద్వారా ప్రయత్నాలు చేసిందని బాధితులు చెబుతున్నారు. ఇందల్‌వాయికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని దుబాయిలో భూమేశ్‌ వేధించడంతో గుండెపోటు తో మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

    పేరు మార్చుకొని..

    మోసాల నేపథ్యంలో 2014లో దొండిగల భూమేశ్‌ పాస్‌పోర్టును (కామారెడ్డి జిల్లా అడ్రస్‌తో ఉంది) బీర్కూర్‌ పోలీసులు సీజ్‌ చేసి నందిపేట పోలీసు స్టేషన్‌కు పంపారు. దీంతో 2015లో భార్య స్వప్న తల్లిదండ్రుల ఇంటిపేరును వాడుకుని పబ్బ భూమేశ్‌రెడ్డి పేరుతో హైదరాబాద్‌ అడ్రస్‌తో అక్రమంగా మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద ఉన్న పాస్‌పోర్టు సైతం 2025 నవంబర్‌ 18వ తేదీకి ఎక్స్‌పైరీ అయ్యింది. అయినప్పటికీ భూమేశ్‌ దుబాయిలోనే ఉన్నాడు.

    బంగారం పేరిట మరో మోసం

    దుబాయి పర్యటనకు వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన కొన్ని కుటుంబాల వారిని రూ.60 వేలకే తులం బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ.60 లక్షలు తీసుకొని మోసం చేయగా, బాధితులు దుబాయ్‌లో కేసు పెట్టారు. భూమేశ్‌ను అక్కడి పోలీసులు నెల రోజుల క్రితం జైల్లో పెట్టారు. అయితే డబ్బులు ఇచ్చేస్తానని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని నిజామాబాద్‌లో ఉన్న భూమేశ్‌ భార్య స్వప్న ఉత్తరాది రాష్ట్రాల వారితో బేరం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.

    గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగాల పేరుతో దగా

    దుబాయిలో తిష్ట వేసి

    దోచుకుంటున్న ఘనుడు

    నకిలీ కంపెనీలు సృష్టించి ఆగడాలు

    పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేసినా మరో

    పాస్‌పోర్ట్‌ పొందిన వైనం

    ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్‌

    స్టేషన్‌లలో పబ్బ భూమేశ్‌పై కేసులు

  • రెండో విడత నామినేషన్‌లు 4942

    జిల్లాలో ‘పల్లెపోరు’ ఊపందుకుంది. మొదటి విడత, రెండో విడత ఎన్నికలు జరగను న్న జీపీలకు సంబంధించి నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొదటి విడత నామినేష న్‌ల ఉపసంహరణకు నేడు మూడు గంటల వరకు అవకాశం ఉంది. మూడో విడతకు సంబంధించి నామి నేషన్‌ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.

    సుభాష్‌నగర్‌: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో విడత నామినేషన్‌ల స్వీకరణ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చి వరిరోజు కావడంతో నామపత్రాల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోగా కేంద్రంలోకి వచ్చిన వారికి అధికారులు టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌తోపాటు ఆర్మూర్‌ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలంలోని 196 జీపీలు, 1,760 వా ర్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

    తరలివచ్చిన అభ్యర్థులు

    నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడం.. బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నామినేషన్ల దాఖలు కోసం అభ్యర్థులు పోటాపోటీగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చివరి రోజు సర్పంచ్‌ స్థానాలకు 596, వార్డు స్థానాలకు 2,400 నామినేషన్‌లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ స్థానాలకు మొత్తం 1,178, వార్డు స్థానాలకు 3,764 మంది నామినేషన్‌లు వేశారు.

    పరిశీలన..

    బుధవారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్‌ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.

    తొలి విడత ఉపసంహరణ నేడు..

    బోధన్‌: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే నామినేషన్‌ల స్క్రూటినీ పూర్తికాగా బుధవారం ఉప సంహరణ ప్రక్రియను చేపట్టనున్నారు. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లోని పది మండలాలతోపాటు నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని నవీపేట మండలంలోని 184 సర్పంచ్‌ స్థానాలకు 1156 నామినేషన్‌లు, 1642 వార్డు సభ్య స్థానాలకు 3,526 నామినేషన్‌లు దాఖలైనట్లు స్క్రూటినీ తరువాత అధికారులు తేల్చారు. బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఎడపల్లి, బోధన్‌, వర్ని, కోటగిరి మండలాల్లోని ఏడు గ్రామాల సర్పంచ్‌ స్థానాలు సింగిల్‌ నామినేషన్లు దాఖలయ్యాయి.

    చివరి రోజు సర్పంచ్‌ స్థానాలకు 596..

    వార్డు స్థానాలకు 2400

    5 గంటల తర్వాత గేట్లు మూసివేత

    అభ్యర్థులకు టోకెన్లు అందజేసి

    దరఖాస్తులు తీసుకున్న అధికారులు

    రాత్రి వరకూ కొనసాగిన

    నామపత్రాల స్వీకరణ

  • 90 రోజుల ప్రణాళిక

    ఇంటర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని

    పెంచేందుకు..

    పెరిగిన హాజరు శాతం

    75 శాతానికి పైగా సిలబస్‌ పూర్తి

    ఖలీల్‌వాడి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యా ర్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టిసారించింది. ప్రతి సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అంతగా పెరగటం లేదు. ఈసారి మంచి ఫలితాలు రా బట్టేందుకు 90 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా రోజూ సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులను చదివించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు లెక్చరర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే సిలబస్‌ 75 శాతం కంటే ఎక్కువగా పూర్తికాగా, మిగితా సిలబస్‌ను త్వరగా పూర్తిచేసి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా చర్యలు చేపట్టారు.

    ఎఫ్‌ఆర్‌ఎస్‌తో మెరుగైన హాజరు...

    ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ముఖగుర్తింపు విధానం(ఎఫ్‌ఆర్‌ఎస్‌) హాజరు తీసుకుంటున్నారు. 70 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆడ్మిషన్ల సమయంలోనే ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు. గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు లెక్చరర్లు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీంతో కాలేజీకి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. నెలకోసారి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చదివించేలా అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు ఏకాగ్రత పెరిగేందుకు వారానికి మూడు రోజులపాటు యోగా నేర్పిస్తున్నారు.

    ప్రణాళిక అమలు చేశాం

    ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 90 రోజుల ప్రణాళిక అమలు చేశాం. రోజుకో సబ్జెక్టు చొప్పున మూడు నెలలపాటు అన్ని సబ్జెక్టులను చదివిస్తాం. నవంబర్‌ నుంచి పకడ్బందీగా అమలుచేయాలని లెక్చరర్లకు ఆదేశాలు ఇచ్చాం.

    – రవికుమార్‌, డీఐఈవో, నిజామాబాద్‌

    జిల్లాలో ఇంటర్‌ కాలేజీలు

  • అడవిని వీడిన మావోయిస్టు నేత

    సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీపీఐ మావోయిస్టు పా ర్టీలో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ చైతన్య నాట్య మంచ్‌ (సీఎన్‌ఎం)లో డివిజన్‌ కమిటీ సెక్రెటరీగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన మా వోయిస్ట్‌ పార్టీ నేత లోకేటి రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ జనజీవన స్రవంతిలో కలిశాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జనగామ డీసీపీ సమక్షంలో మంగళవారం ఆయన పోలీసులకు లొంగిపోయాడు.

    కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా కా ర్యదర్శిగా పనిచేసిన స్వామి అలియాస్‌ చందర్‌ను పార్టీ దండకారణ్యానికి బదిలీ చేసింది. ఆయన వెళ్లి న కొద్దికాలానికే భార్య సులోచన కూడా అడవిబాట పట్టింది. ఎనిమిదేళ్ల క్రితం సులోచన అనారోగ్యంతో మృతిచెందింది. వారి పిల్లలు లోకేటి రమేశ్‌, లోకే టి లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నా రు. 2005లో రమేశ్‌, లావణ్యలు కూడా తల్లిదండ్రులు నడిచిన బాటలోనే నడిచా రు. నలుగురు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. కాగా స్వామి కొడుకు రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత ఏడాది కాలం పాటు సీసీఎం పోతుల కల్పన దగ్గర పనిచేసి చైతన్య నాట్య మంచ్‌కు బదిలీ అయ్యాడు. 2008లో ఏరియా కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొంది 2011 వరకు చైతన్య నాట్య మంచ్‌లో పనిచేశాడు. 2012లో ఊసూర్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా బదిలీ అయ్యాడు. 2013లో డీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడ్‌ ఏరియా కమిటీకి సెక్రె టరీగా వెళ్లాడు. 2019 లో జేగురుగొండ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా పనిచేశాడు. 2021లో చైతన్య నాట్య మంచ్‌ డీవీసీఎస్‌ సెక్రెటరీగా పదోన్నతి పొంది మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ పరిధిలో ఇప్పటి దాకా కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 2016లో పామేడ్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌ కమలను వివాహం చేసుకో గా ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రమేశ్‌పై రూ.8 లక్షల రివార్డు ఉంది.

    జనగామ జిల్లాలో లొంగిపోయిన

    జిల్లాకు చెందిన లోకేటి రమేశ్‌

    కుటుంబమంతా మావోయిస్టు

    పార్టీలోనే..

    జైలులో భార్య కమల

    దండకారణ్యంలో వెస్ట్‌ జోనల్‌ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్న తండ్రి స్వామి

  • ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

    నిజామాబాద్‌ అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని అన్నారు. ఎన్ని కల నిర్వహణపై మంగళవారం ఆమె హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మొద టి, రెండో విడత నామినేషన్‌ల స్వీకరణ, దాఖలైన నామినేషన్ల వివరాలను కమిషనర్‌ తెలుసుకున్నా రు. రెండో విడత నామినేషన్‌ల పరిశీలన, మూడో విడతకు సంబంధించిన స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎన్నికల సిబ్బంది కేటా యింపు, పోస్టల్‌ బ్యాలెట్‌, బ్యాలెట్‌ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులతో కమిటీలు ఏ ర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎన్నిక ల సాధారణ పరిశీలకుడు జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రి య సజావుగా జరుగుతోందన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నోడల్‌ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • నేటి నుంచి మూడో విడత నామినేషన్‌లు

    57 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి

    సుభాష్‌నగర్‌: మూడో విడత జీపీ ఎన్నికల కోసం నామినేషన్‌ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ టి వినయ్‌ కృష్ణా రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సర్పంచ్‌, వార్డు స్థానాలకు బుధవా రం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నా రు. ఇందు కోసం 59 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 5వ తేదీన సాయంత్రం 5గంట లకు నామినేషన్‌ల ప్రక్రియ ముగియ నుండగా, 6న పరిశీలన, 9న ఉపసంహరణకు గడువు ఉంటుంది. 17న పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన ఉంటుంది.

  • నిబంధనలు పాటించాలి

    నిజామాబాద్‌ అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్‌ల స్క్రూటినీలో నిబంధనలను పాటించా లని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. రూరల్‌ మండలంలోని ఆకుల కొండూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నామపత్రాల స్వీకరణ, దాఖలైన నామినేషన్‌లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సిబ్బందికి సూచించారు.

Kamareddy

  • ఇక మూడో విడత!

    పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించిన నామపత్రాల దాఖలు ప్రక్రియ ముగియగా.. బుధవారంనుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ మొదలవడంతోపాటు తొలి విడతలో బరిలో మిగిలే అభ్యర్థుల లెక్క కూడా తేలనుంది.

    సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో విడతకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం వాటిని పరిశీలిస్తారు. ఇక మూడో విడత నామినేషన్ల ఘట్టం సైతం బుధవారమే మొదలుకానుంది.

    వేడెక్కిన ‘పంచాయతీ’..

    జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. బుధవారంనుంచి మూడో విడత ప్రక్రియ మొదలు కానుంది. దీంతో జిల్లా అంతటా ఎన్నికల వేడి పెరిగింది. ఏ ఊరుకువెళ్లినా పంచాయతీ ఎన్నికల గురించిన చర్చే జరుగుతోంది. చిన్నచిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి విడతలో పది మండలాల పరిధిలోని 167 గ్రామాల సర్పంచ్‌ పదవులకు నామినేషన్ల పరిశీలన తరువాత 951 మంది అభ్యర్థులు మిగిలారు. అలాగే 1,520 వార్డులకు 3,709 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, ఎంత మంది బరిలో మిగిలారనే లెక్క తేలనుంది. ఇక రెండో విడతకు సంబంధించి ఏడు మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతో పాటు 1,654 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 6వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇక మూడో విడతలో ఎనిమిది మండలాల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్‌, మద్నూర్‌, నస్రుల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌ మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌ పదవులతో పాటు 1,482 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 5 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రెండు విడతలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ఓట్ల వేటపై దృష్టి సారించారు. బుధవారం తొలి విడతకు సంబంధించిన ఉపసంహరణ గడువు ముగియనుంది. బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్‌ చేయనున్నారు.

    నాగిరెడ్డిపేటలో నామినేషన్‌ వేసేందుకు క్యూలో ఉన్న సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థులు

    జిల్లాలోని పలు పంచాయతీల పాలకవర్గాలను ఏకగ్రీవం చేయడానికి ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలి విడ తలో 167 పంచాయతీల్లో ఇప్పటికే ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ ఏకగ్రీవాలతో పంచాయతీలను తమ ఖా తాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే రెండో విడతలో 197 పంచాయతీల పరిధిలో నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో వాటిపైనా ఆయా ప్రాంతాల నేతలు దృష్టి సా రించారు. ఏకగ్రీవాలకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    రెండో విడతలో దాఖలైన నామినేషన్లు..

    పంచాయతీ ఎన్నికలలో ముగిసిన

    రెండో విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ

    నేటి నుంచి మూడో విడత

    నామినేషన్లు షురూ...

    తొలి విడతలో బరిలో

    మిగిలిన వారి లెక్క తేలేదీ నేడే

  • మోసమే అతని వృత్తి

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నకిలీ కంపెనీలు సృష్టించి ఉపాధికోసం గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారిని దో చుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్‌. పోలీసు కేసులు నమోదై నా అతడి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కామారెడ్డి జిల్లా ఉత్తునూరుకు చెందిన దొండిగల భూమేశ్‌ కుటుంబం పన్నెండేళ్లుగా నిజామాబాద్‌లో నివసిస్తుండగా, అతడు ఎనిమిదేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. 2022 మార్చి నుంచి ఆగస్టు మధ్యలో డొంకేశ్వర్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన అర్గుల భోజారాం అనే మధ్యవర్తి ద్వారా గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని జగిత్యా ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన 80 మంది వద్ద రూ.5 కోట్లు (ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు) తీసుకున్నాడు. ఇందులో 40 మందిని అసలు తీసుకెళ్లలేదు. మరో 40 మందిని మాత్రం విజిట్‌ వీసా ద్వారా దుబాయికి తీసుకెళ్లి.. మీరెవరో తెలియదంటూ బుకాయించడంతోపాటు బెదిరింపు ధోరణితో వ్యవహరించా డు. చివరకు ఉద్యోగం ఇచ్చే కంపెనీపై కేసు అ యిందని చెప్పి కొరియర్‌ ద్వారా 40 మందికి టిక్కెట్లు, పాస్‌పోర్టులు పంపాడు. 30 మంది పేర్ల తో దుబాయిలో క్రెడిట్‌ కార్డులు తీసుకుని రూ.6 కో ట్ల రుణాలు తీసుకున్నాడు. డబ్బులు కట్టాలంటూ దుబాయి బ్యాంకుల నుంచి భారత్‌లో ఉన్న సదరు బాధితులకు ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. రుణాలు తీసుకున్న కార్మికులు భారత్‌కు పారిపోయారని చె ప్పి దుబాయిలో సదరు క్రెడిట్‌ కార్డుల మీద ఇన్సురెన్స్‌ సైతం క్లెయిమ్‌ చేశాడు ఈ మహాముదురు. 2014లోనూ వేల్పూర్‌కు చెందిన 60 మందిని ఇదే తరహాలో భూమేశ్‌ మోసం చేశాడు. 15 ఏళ్లుగా భూమేశ్‌ దగా చేస్తూనే ఉన్నాడు.

    ‘సాక్షి’ కథనాలతో కేసులు

    భూమేశ్‌ చేసిన మోసాలపై 2024 జనవరి 24, 25 తేదీల్లో కథనాలు రావడంతో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, కామారెడ్డి జిల్లా బీర్కూర్‌, నిజామాబాద్‌ జిల్లా నందిపేట, నవీపేట, మోర్తాడ్‌, వేల్పూర్‌, ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. కాగా 2018 నుంచి భూమేశ్‌ దుబాయిలో ఉంటుండగా, పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పీడీ యాక్ట్‌ పెట్టడంతోపాటు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసి ఇంటర్‌పోల్‌ ద్వారా భూమేశ్‌ను భారత్‌కు రప్పించాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్‌లో ఉంటు న్న భూమేశ్‌ భార్య స్వప్న మాత్రం తమపైనే అక్రమ కేసులు పెట్టించేందుకు కొందరు రాజకీయ నేప థ్యం ఉన్న వ్యక్తులు, మరో రిటైర్డ్‌ పోలీసు అధికారి ద్వారా ప్రయత్నాలు చేసిందని బాధితులు చెబుతున్నారు. ఇందల్‌వాయికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని దుబాయిలో భూమేశ్‌ వేధించడంతో గుండెపోటు తో మృతి చెందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

    బంగారం పేరిట మరో మోసం

    దుబాయి పర్యటనకు వెళ్లిన ఉత్తర భారతదేశానికి చెందిన కొన్ని కుటుంబాల వారిని రూ.60 వేలకే తులం బంగారం ఇప్పిస్తానని చెప్పి రూ.60 లక్షలు తీసుకొని మోసం చేయగా, బాధితులు దుబాయ్‌లో కేసు పెట్టారు. భూమేశ్‌ను అక్కడి పోలీసులు నెల రోజుల క్రితం జైల్లో పెట్టారు. అయితే డబ్బులు ఇచ్చేస్తానని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని నిజామాబాద్‌లో ఉన్న భూమేశ్‌ భార్య స్వప్న ఉత్తరాది రాష్ట్రాల వారితో బేరం కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది.

    పేరు మార్చుకొని..

    మోసాల నేపథ్యంలో 2014లో దొండిగల భూమేశ్‌ పాస్‌పోర్టును (కామారెడ్డి జిల్లా అడ్రస్‌తో ఉంది) బీర్కూర్‌ పోలీసులు సీజ్‌ చేసి నందిపేట పోలీసు స్టేషన్‌కు పంపారు. దీంతో 2015లో భార్య స్వప్న తల్లిదండ్రుల ఇంటిపేరును వాడుకుని పబ్బ భూమేశ్‌రెడ్డి పేరుతో హైదరాబాద్‌ అడ్రస్‌తో అక్రమంగా మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు. ప్రస్తుతం అతడి వద్ద ఉన్న పాస్‌పోర్టు సైతం 2025 నవంబర్‌ 18వ తేదీకి ఎక్స్‌పైరీ అయ్యింది. అయినప్పటికీ భూమేశ్‌ దుబాయిలోనే ఉన్నాడు.

    గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగాల పేరుతో దగా

    దుబాయిలో తిష్ట వేసి

    దోచుకుంటున్న ఘనుడు

    నకిలీ కంపెనీలు సృష్టించి ఆగడాలు

    పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేసినా మరో

    పాస్‌పోర్ట్‌ పొందిన వైనం

    ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్‌

    స్టేషన్‌లలో పబ్బ భూమేశ్‌పై కేసులు

  • అడవిని వీడిన మావోయిస్టు నేత

    సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సీపీఐ మావోయిస్టు పార్టీలో దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ చైతన్య నాట్య మంచ్‌ (సీఎన్‌ఎం) లో డివిజన్‌ కమిటీ సెక్రెటరీగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన మావోయిస్ట్‌ పార్టీ నేత లోకేటి రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ జనజీవన స్రవంతిలో కలిశాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జనగామ డీసీపీ సమక్షంలో మంగళవారం ఆయన పోలీసులకు లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.

    కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. జిల్లా కార్యదర్శిగా పనిచేసిన స్వామి అలియాస్‌ చందర్‌ను పార్టీ దండకారణ్యానికి బదిలీ చేసింది. ఆయన వెళ్లిన కొద్దికాలానికే భార్య సులోచన కూడా అడవిబాట పట్టింది. ఎనిమిదేళ్ల క్రితం సులోచన అనారోగ్యంతో మృతిచెందింది. వారి పిల్లలు లోకేటి రమేశ్‌, లోకేటి లావణ్యలు బంధువుల ఇంట్లో ఉండి చదువుకున్నారు. 2005లో రమేశ్‌, లావణ్యలు కూడా తల్లిదండ్రులు నడిచిన బాటలోనే నడిచారు. నలుగురు కూడా దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. కాగా స్వామి కొడుకు రమేశ్‌ అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రాజేశ్వర్‌ అలియాస్‌ నరేందర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత ఏడాది కాలం పాటు సీసీఎం పోతుల కల్పన దగ్గర పనిచేసి చైతన్య నాట్య మంచ్‌కు బదిలీ అయ్యాడు. 2008 లో ఏరియా కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొంది 2011 వరకు చైతన్య నాట్య మంచ్‌లో పనిచేశాడు. 2012లో ఊసూర్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా బదిలీ అయ్యాడు. 2013లో డీవీసీఎంగా పదోన్నతి పొంది పామేడ్‌ ఏరియా కమిటీకి సెక్రెటరీగా వెళ్లాడు. 2019 లో జేగురుగొండ ఎల్‌వోఎస్‌ కమాండర్‌గా పనిచేశాడు. 2021లో చైతన్య నాట్య మంచ్‌ డీవీసీఎస్‌ సెక్రెటరీగా పదోన్నతి పొంది మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సౌత్‌ బస్తర్‌ డివిజనల్‌ కమిటీ పరిధిలో ఇప్పటి దాకా కొనసాగినట్టు పోలీసులు తెలిపారు.

    రూ.8 లక్షల రివార్డు..

    పోలీసులకు లొంగిపోయిన లోకేటి రమేశ్‌పై రూ.8 లక్షల రివార్డు ఉంది. లొంగుబాటు సందర్భంగా రూ.25 వేలు పోలీసులు రమేశ్‌కు అందజేశారు. ఆయనపై ఉన్న రివార్డును త్వరలోనే అందజేయనున్నారు. రమేశ్‌ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న క్రమంలో 2016లో పామేడ్‌ ఎల్‌వోఎస్‌ కమాండర్‌ గొట్టా బొజ్జి అలియాస్‌ కమలను వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కమల 2023లో అరెస్టు అయి జైలులో ఉందని వెల్లడించారు. జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రమేశ్‌ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

    జనగామ జిల్లాలో లొంగిపోయిన జిల్లాకు చెందిన లోకేటి రమేశ్‌

    రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో..

    కుటుంబమంతా మావోయిస్టు

    పార్టీలోనే..

    జైలులో భార్య కమల

    దండకారణ్యంలో వెస్ట్‌ జోనల్‌ బ్యూరో సెక్రెటరీగా పనిచేస్తున్న

    తండ్రి స్వామి

  • సకాలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ అందించాలి

    కామారెడ్డి క్రైం : సర్వీస్‌ ఓటర్లకు సకాలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ అందించాలని అధికారులను ఆదేశించిన ట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని మంగవారం నిజామాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. కామారెడ్డి నుంచి ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అదనపు కలెక్ట ర్లు విక్టర్‌, మధుమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నిక ల కమిషనర్‌ సూచనలు ఇచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై చేపడుతున్న వివరాలను తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జిల్లా అధికారులతో సమావేశం ని ర్వహించారు. సర్వీస్‌ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉ న్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులన్నారు. వారి కి సకాలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు జారీ చేయాలన్నారు. సర్వీస్‌ ఓటర్ల ఓటు హక్కును పరిరక్షించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.

  • అప్పుల ఊబిలో వ్యాపారి

    లేఖ రాసి, కుటుంబంతో సహా అదృశ్యం

    కామారెడ్డి టౌన్‌ : అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఓ ప్రముఖ కిరాణా వ్యాపారి.. లేఖ రాసి కుటుంబంతో సహా అదృశ్యమైన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. వేధింపులు, అప్పులు తదితర అంశాలపై లేఖ రాసి దుకాణం గోడకు అతికించి అదృశ్యమైన ఘటన వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. కిరాణం, కట్‌మిట్‌ వ్యాపారి జిల్లా కేంద్రంలోని రాంమందిర్‌ రోడ్‌లో చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. గతంలో పలుమార్లు కిరాణా అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాంమందిర్‌ రోడ్‌లో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుల పాలైన ఆయన.. రెండు పేజీలతో కూడిన లేఖను రాసి తన దుకాణం గోడకు అతికించి భార్య, ఇద్దరు కుమారులతో సహా అదృశ్యమయ్యారు. మంగళవారం దీనిని గమనించినవారు అవాక్కయ్యారు. కొన్ని ఏజెన్సీలు, వ్యాపారులకు, బ్యాంకులకు కలిపి రూ. 1.85 కోట్ల మేర బాకీ ఉన్నానని, తనకు ఇతర వ్యక్తులనుంచి రూ. 35 లక్షలు రావాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఓ వ్యాపారి తనను, కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురి చేస్తున్నాడని, అతని వల్ల ప్రాణహాని ఉందని, అందుకే కుటుంబంతో సహా కామారెడ్డి పట్టణం విడిచి వెళ్లిపోతున్నానని రాశాడు. కొన్ని నెలల తర్వాత కామారెడ్డికి వచ్చి తన అస్తులను అమ్మి అందరి అప్పులు తీరుస్తానని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ లేఖ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

  • ‘గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి’

    బిచ్కుంద: బీజేపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా శ్రేణులు ముందుకు వెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు సూచించారు. మంగళవారం బిచ్కుందలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు బీజేపీ వైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారన్నారు. బీజేపీ మద్దతు ఇచ్చినవారినే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యే అరుణతార, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తమ్మేవార్‌ అజయ్‌ పాల్గొన్నారు.

  • ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’  ప్రారంభం

    కామారెడ్డి క్రైం : రాష్ట్ర పోలీసుశాఖ సైబర్‌ సె క్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం వర్చువల్‌ విధానంలో ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అదనపు ఎస్పీ న రసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, సైబర్‌ సెల్‌ అధికారులు, సిబ్బంది, కళాశాల ల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు సైబర్‌ నేరా ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నా రు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, ఆన్‌లైన్‌ లింక్‌లు, వ్యక్తిగత సమాచార భద్రత తదితర అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. డీపీవోలో 6వారాల పాటు ప్రతి వారం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చే స్తామని తెలిపారు. అనంతరం ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌ పోస్టర్‌లను ఆవిష్కరించారు.

  • ‘చెక్‌పోస్టుల వద్ద  అప్రమత్తంగా ఉండాలి’

    మాచారెడ్డి : ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించా రు. గన్‌పూర్‌(ఎం) గ్రామ స్టేజీ వద్ద ఏర్పా టు చేసిన చెక్‌పోస్టును మంగళవారం ఆయ న పరిశీలించారు. వాహనాల తనిఖీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అక్రమంగా డబ్బు, మద్యం, నిషేధిత వస్తువుల రవాణాకు అవకాశాలు ఎక్కువగా ఉంటా యని గుర్తు చేశారు. బారికేడ్లను సక్రమంగా వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలు ముగిసేవరకు 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఆయన వెంట ఎస్సై అనిల్‌, చెక్‌పోస్టు సిబ్బంది ఉన్నారు

  • బొందల మీదే చితి పేర్చాలా?

    రామారెడ్డిలో స్థల కొరతతో

    అంత్యక్రియలకు అవస్థలు

    మరో వైకుంఠధామం

    నిర్మించాలని వినతి

    రామారెడ్డి: మనిషి జీవితం ముగిసినా తర్వాత ఆ మృతదేహాన్ని కాల్చేందుకు మండలకేంద్రంలో కష్టాలు ఎ దుర్కోవాల్సి వస్తోంది. ఎవరైనా చనిపోతే పటేల్‌ చె రువు వైపు, చింతలకుంట వైపు ప్రజలు అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. చింతకుంటలో మాత్రమే వై కుంఠధామం ఉంది. కాగా, పటేల్‌ చెరువు వైపు అంత్యక్రియలు నిర్వహించడానికి ఆరు గజాల స్థలం అందుబాటులో ఉంది.ఈస్థలంలోనే ఇంతకాలంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ వచ్చారు. హిందూ సాంప్రదా య ప్రకారం కనీసం కాడు చుట్టూ తిరగడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈఆరు గజాల స్థలంలోనే ఇటీవల ఇద్దరు వ్యక్తులను ఖననం(బొందలు) పెట్టారు.ఇప్పుడు ఎవరైనా చనిపోతే అక్కడే పెట్టిన బొందల మీద చితిని పేర్చి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. పటేల్‌ చెరువు ప్రాంతం రామారెడ్డి నుంచి సదాశివనగర్‌ ఎన్‌హెచ్‌–44ను కలుపుతోంది. సమస్యను పరిష్కరించకుంటే ఈరోడ్డుపై అంత్యక్రియలు నిర్వహిస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మండలకేంద్రంలో మరో వైకుంఠధామం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

  • బీర్కూర్‌లో లయన్స్‌ క్లబ్‌  సేవ కార్యక్రమాలు

    బాన్సువాడ : బీర్కూర్‌లో మంగళవారం లయన్స్‌ క్లబ్‌ బీర్కూర్‌లో ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో రూ.2500 విలువ గల విద్యుత్‌ సర్వీసు వైర్లు, మ్యాట్స్‌ అందజేశారు. అనంతరం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్‌ అవసరమున్న వారికి లయన్స్‌ కంటి ఆస్పత్రి బోధన్‌కు తరలించారు. ఉచిత డయాబెటిక్‌ శిబిరం నిర్వహించారు. ఈ నెలలో చేయవల్సిన సేవ కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు రమేష్‌, సంతోష్‌, రషీద్‌, ప్రవీణ్‌, మేకల గాలయ్య తదితరులున్నారు.

  • మహిళా సంఘాలు  ఆర్థికంగా ఎదగాలి

    దోమకొండ: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ కోరారు. మంగళవారం మండల చాముండేశ్వరి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌తో పాటు కాలమణి సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ను ఐకేపీ తరపున సందర్శించి అనంతరం సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామ సంఘాల పనితీరుతో పాటు వారి సంఘాల్లో వారి పరిశీలన సర్వీస్‌ ప్రొవైడర్స్‌ సపోర్ట్‌ ఎంతవరకు ఉంది అని సెర్ప్‌ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. సంఘాల సభ్యులకు ఎంపీడీవో పలు సూచనలు సలహాలు చేశారు. మండల వ్యవసాయాధికారి మణిదీపిక, ఈజీఎస్‌ ఏపీవో రజిని, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  •  ఆ స్థానాలు ఏకగ్రీవమే..!

    ఇబ్రహీంపేట్‌ తండా సర్పంచ్‌ ఏకగ్రీవం

    బాన్సువాడ రూరల్‌: మండలంలోని ఇబ్రహీంపేట్‌ తండా సర్పంచ్‌గా పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్‌ తండాకు చెందిన నేనావత్‌ స్వరూప వసంత్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం తండా పరిధిలోని గిరిజన నాయకులు, గ్రామస్తులు సమావేశమై సర్పంచ్‌ ఎన్నికల విషయమై చర్చించారు. సర్పంచ్‌ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో స్వరూపను ఎంపిక చేశారు. కార్యక్రమంలో మాలెపు నారాయణరెడ్డి, దేవారం ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, సాయిలు యాదవ్‌, తండా పెద్దలు బాబుసింగ్‌ , ప్రేమ్‌సింగ్‌, మోహన్‌, కిషన్‌నాయక్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

    తెల్గాపూర్‌ సర్పంచ్‌..

    నిజాంసాగర్‌(జుక్కల్‌): గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు స్థానాలను గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకున్నారు. రెండవ సారి పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ పాలనకు గ్రామస్తులు జై కోట్టారు. మంగళవారం నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సదరు గ్రామ పంచాయతీకి సర్పంచ్‌ అభ్యర్థిగా వెల్లుట్ల మేఘన ఒకే ఒక నామినేషన్‌ దాఖలు చేసింది. అలాగే ఆరు వార్డు స్థానాలకు ఒక అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియడంతో సదరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వెల్లుట్ల మేఘన ఏకగ్రీవమయ్యారు. వార్డు స్థానాలకు వెల్లుట్ల సాయిలు, నేనావత్‌ లక్ష్మి, మంజుల, రాములు, అనిత, పోచయ్య ఒక్కొరుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వెల్లుట్ల సాయిలును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

    మాలోత్‌ సంగ్యానాయక్‌ తండా సర్పంచ్‌..

    లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాలోత్‌ సంగ్యానాయక్‌ తండాకు చెందిన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా మాలోత్‌ సకృనాయక్‌, ఉపసర్పంచ్‌గా ఽకాట్రోత్‌ స్వరూప, వార్డు సభ్యులుగా నేనావత్‌ శాంతి, మాలోత్‌ రాజు, మాలోత్‌ జగ్‌రాం, గుగులోత్‌ మంజూల, కేతావత్‌ సంతోష్‌, కొర్ర సవాయి, కోర్ర లాలీబాయిలను ఏకగ్రీవంగా తండా వాసులు ఎన్నుకున్నారు. అనంతరం తండా వాసులు వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తండా పెద్దలు పాల్గొన్నారు.

    జిల్లాలో రెండో విడత సర్పంచ్‌ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. ఒక నామినేషన్‌ రావడంతో పలు సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

  • బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు

    భిక్కనూరు: సర్పంచ్‌ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో కొందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిని బెదిరించి నామినేషన్లను ఉపసహరించుకోవాలని ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్రామంలో ప్రజలతో ఎస్సై మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో అందరికి పోటీ చేసే హక్కు ఉంటుందని ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. అఖిల పక్షం నేతలు ప్రజలు పాల్గొన్నారు.

    రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదు

    ఎల్లారెడ్డిరూరల్‌: ప్రయాణికులు వారి వెంట రూ. 50 వేలకు మించి నగదును తీసుకెళ్లరాదని తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులో వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్న దృష్ట్యా నగదును తీసుకెళ్లే వారు సంబంధిత రసీదులు వెంట ఉంచుకోవాలన్నారు. డీటీ శ్రీనివాస్‌, గిర్దావార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

  • ఉత్సవాలకు శబరిమాత ఆశ్రమం ముస్తాబు

    4, 5 తేదీల్లో జాతర

    తాడ్వాయికి భారీ సంఖ్యలో

    రానున్న భక్తులు

    తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఈనెల 4, 5 తేదీల్లో 55వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం సుప్రభాత ధ్యానంతో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 12గంటలకు వేంకటేశ్వర కల్యాణం, దత్త జయంతి కార్యక్రమాలను వైభవంగా జరిపిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో ప్రవచనములు, భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. శుక్రవారం హంస వాహనంలో శబరిమాత చిత్రపటాన్ని ఉంచి డప్పు వాయిద్యాలు, నృత్యాలు, భజన కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈసారి ఉత్సవాలకు ఐదులక్షల మంది భక్తులు హాజరు అవుతారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.కామారెడ్డి బస్టాండ్‌ నుంచి తాడ్వాయి శబరిమాత ఆశ్రమం వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.

  • రెండు బైక్‌లు ఢీ: ఒకరి మృతి

    మరొకరికి తీవ్రగాయాలు

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్‌పేట–లొంకలపల్లి రోడ్డుపై రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నీరుడి పొశెట్టి మంగళవారం తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన మున్రూరు మహేందర్‌(30) తన బైక్‌పై గోపాల్‌పేటకు బయల్దేరాడు. కాగా మండలంలోని గోపాల్‌పేట–లొంకలపల్లి రోడ్డుపై ఇరువురి బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటలో ఇరువురు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మహేందర్‌ మృతిచెందాడు. పోశెట్టిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

  • లైసెన్స్‌లు లేకుండా దుకాణాలు నడిపితే కేసులు

    నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో లైసెన్స్‌లు లే కుండా కల్లుదుకాణాలను నిర్వహిస్తే కేసులు త ప్పవని ఎల్లారెడ్డి ఎకై ్సజ్‌ సీఐ షాకీర్‌అహ్మాద్‌ పేర్కొన్నారు. మండలంలోని మేజర్‌వాడి గ్రామంలో అ నుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్లుదుకాణంపై మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మండలంలోని చీనూర్‌, గోలిలింగాల గ్రామాల్లో నిర్వహిస్తున్న కల్లుదుకాణాలను తనిఖీ చేసి శాంపిళ్లను సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేజర్‌వాడిలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లుదుకాణాన్ని సీజ్‌ చేశామని, దుకాణాదారు మల్లాగౌడ్‌పై కేసునమోదు చేశామన్నారు. గోపాల్‌పేటలోని వైన్‌షాపు నుంచి వందమీటర్లలోపు ఎలాంటి గుళ్లు, మసీదులు, చర్చిలతోపాటు బడులు లేనందున ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే షాపు కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించారు. హెడ్‌కానిస్టేబుల్‌ పెంటయ్య, కానిస్టేబుళ్లు రవీందర్‌రెడ్డి, రజిత, స్రవంతి తదితరులున్నారు.

  • ఆలూరులో భారీ చోరీ

    14 తులాల బంగారం, అర కిలో

    వెండి, రూ.లక్ష నగదు అపహరణ

    ఆర్మూర్‌ టౌన్‌: ఆలూర్‌ మండల కేంద్రంలోని తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్‌లో నివాసం ఉండే కట్టే మిషన్‌ పుల్లెల రాము తన భార్య, పిల్లలతో కలిసి నవంబర్‌ 27న వారి మామ దినకర్మ కోసం వేరే ఊరికి వెళ్లారు. డిసెంబర్‌ 2 మంగళవారం సాయంత్రం వారు తిరిగి ఇంటికి రాగా తలుపులకు వేసిఉన్న తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించా రు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సే కరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తా ళాలు పగులగొట్టి, బీరువా, డ్రెస్సింగ్‌టేబుల్‌లో ఉన్న 14 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.లక్ష నగదును చోరీ చేశారు. ఈమేరకు బా ధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయ గా, కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

Family

  • మ‌న శ‌రీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీల‌కం, అదే స‌మ‌యంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియ‌స్‌లో క‌ణితి ఏర్ప‌డితే చాలా ప్ర‌మాద‌క‌రం. కేవ‌లం ఎనిమిదేళ్ల వ‌య‌సులో అలాంటి ఇబ్బంది వ‌చ్చిన ఒక పాప‌కు.. సీత‌మ్మ‌ధార‌లోని కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు అత్యంత అధునాత‌న ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేసి, ఊర‌ట క‌ల్పించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన చీఫ్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టిన‌ల్, హెప‌టో-బైలియ‌రీ, పాంక్రియాటిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్ నంబాడ తెలిపారు.

    "విశాఖ న‌గ‌రానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్ర‌మైన క‌డుపునొప్పితో ఆస్ప‌త్రికి వ‌చ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్‌ ఆచంట చలపతి రావు  ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా అరుదైన సాలిడ్ సూడోపాపిల‌రీ ఎపితెలియ‌ల్ నియోప్లాజ‌మ్ (స్పెన్‌) అనే పాంక్రియాటిక్ క‌ణితి ఉన్న‌ట్లు గుర్తించారు. భారత దేశంలో ఈ త‌ర‌హా స‌మ‌స్య‌కు శ‌స్త్రచికిత్స జ‌రిగిన అత్యంత చిన్న‌వ‌య‌సు రోగిగా ఈ పాప చ‌రిత్ర సృష్టించింది. పాప‌కు పాంక్రియాస్‌లో క‌ణితి ఉండ‌డం, అది అత్యంత అరుదైన‌ది కావ‌డంతో దాంట్లో క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా, త‌ర్వాత ఎలాంటి సంక్లిష్ట స‌మ‌స్య‌లు రాకూడ‌దంటే శ‌స్త్రచికిత్స చేసి దాన్ని తొల‌గించాల‌ని నిర్ణ‌యించాం.

    మూడు గంట‌ల పాటు అత్యంత క‌చ్చిత‌త్వంతో కీహోల్ స‌ర్జ‌రీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొద‌లుపెట్టాం వీలైనంత వ‌ర‌కు ర‌క్త‌స్రావం లేకుండా చూడ‌డంతో పాటు, పాంక్రియ‌స్ క‌ణ‌జాలాన్ని కూడా వీలైనంత వ‌ర‌కు కాపాడుకుంటూ క‌ణితి మొత్తాన్ని తొల‌గించ‌గ‌లిగాం. ఈ శ‌స్త్రచికిత్స త‌ర్వాత బాలిక చాలా త్వ‌ర‌గా కోలుకుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు లేక‌పోవ‌డంతో ఐదు రోజుల్లోనే పాప‌ను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చ‌క్క‌గా రాణిస్తోంది. 

    ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ క‌ణితుల‌ను తొల‌గించ‌డంలో ఉన్న నైపుణ్యాల‌కు ఈ శ‌స్త్రచికిత్సే నిద‌ర్శ‌నం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం".  అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. 

    (చదవండి: అక్కడ కాన్పు కోసం గర్భిణిని అంగడికి తీసుకువెళ్తారట..?)