Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికాలో వలసదారుల ఏరివేతకు ఇమ్మిగ్రేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మొన్నటికి మొన్న మిన్నెసోటాలోని ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో చిన్నారిని అరెస్ట్ చేశారు. మినియాపాలిస్‌లో  రెండేళ్ల క్లోయ్ రెనాటాను ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.

    క్లోయ్ రెనాటా తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం నుంచి తిరిగి వస్తుండగా వారిని ఒక గుర్తు తెలియని వాహనం వెంబడించింది. అధికారులు కారు అద్దాన్ని పగలగొట్టి, ఎటువంటి జుడిషియల్ వారెంట్ చూపకుండానే తండ్రీకూతుళ్లను తీసుకెళ్లారు. అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను"అని మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేసన్ చావెజ్ పేర్కొన్నారు.

    ఈ ఘటనపై కోర్టు స్పందిస్తూ చిన్నారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, ఆ ఆదేశాలను లెక్కచేయకుండా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం వారిని విమానంలో టెక్సాస్‌లోని ని డిటెన్షన్ సెంటర్‌కు తరలించింది. అయితే వారి ఫ్యామిలీ లాయర్  కిరా కెల్లీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పాపను డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

  • 10,574.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జైల్లలో శిక్ష అనుభవిస్తున్న భారతీయుల సంఖ్య. అందులో  43 మంది మరణశిక్ష ఎదుర్కొంటున్నారు. యెమెన్‌లో మలయాళీ నర్సు నిమిషా ప్రియ, గల్ఫ్ దేశాల్లో మరికొందరు ఈ జాబితాలో ఉన్నారు.

    అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం భారత్ నుంచి ఒకే ఒక్కరు మరణ శిక్ష ఎదుర్కొటున్నారు. అతడే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘునందన్ యందమూరి. ఈ నేపథ్యంలో అతడు శిక్ష అనుభవిస్తున్న కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    రఘునందన్ యందమూరి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. హెచ్‌1బీ వీసాతో అమెరికాకు వెళ్లాడు. అయితే పెన్సిల్వేనియాలో నివాసముండే రఘునందన్.. అక్టోబర్ 20, 2012న తన భార్యతో కలిసి ఒక బర్త్‌డే పార్టీకి వెళ్లాడు. అక్కడే 10 నెలల చిన్నారి సాన్వి వెన్న ధరించిన బంగారు ఆభరణాల గురుంచి ఆమె తల్లి ఇతరులతో చెబుతుండడం రఘునందన్ విన్నాడు.

    అప్పటికే క్యాసినోలో దాదాపు 15,000 డాలర్లు నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రఘునందన్ కన్ను ఆ బంగారు నగలపై పడింది. తన అప్పు తీర్చడానికి ఆ చిన్నారిని కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. రెండు రోజుల తర్వాత సాన్విని కిడ్నాప్ చేసే క్రమంలో  రఘునందన్ అడ్డువచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతి (61) ని అత్యంత దారుణంగా హత్య చేశాడు.

    అనంతరం సాన్విని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అయితే ఏడవకుండా నోటిలో గుడ్డలు కుక్కి, టేపు వేయడంతో ఊపిరాడక ఆ పసికందు కూడా ప్రాణాలు విడిచింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రఘునంద్‌ను దోషిగా తెలుస్తూ 2014లో పెన్సిల్వేనియా కోర్టు మరణశిక్ష విధించింది.

    అయితే తొలుత హత్య చేసింది తనే అంటూ ఒప్పుకున్న రఘునందన్‌ ఆ తర్వాత మాట మార్చాడు. జంట హత్యలతో తనకు ప్రమేయం లేదని, కేవలం  దొంగతనంలో మాత్రమే పాల్గొన్నానంటూ ఐదుగురు సభ్యుల కోర్టు బెంచ్‌ ముందు వాగ్మూలం ఇచ్చాడు. 

    దీంతో ఏడుగురు సభ్యుల బెంచ్‌కు కేసును బదిలీఅయ్యింది. ఈ కేసును విచారించిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం కూడా అతడిని దోషిగా తెలుస్తూ.. మరణ శిక్షణను సమర్ధించింది. అయితే పెన్సిల్వేనియా రాష్ట్రంలో 1999 నుండి మరణశిక్ష అమలుపై తాత్కాలిక నిషేధం ఉంది. దీంతో రఘునందన్ ప్రస్తుతం జైలులోనే మరణశిక్ష అమలు కోసం ఎదుచూస్తున్నాడు.
     

  • గ్వాంగ్‌జౌ: విపరీతమైన ఆఫీసు పని ఒత్తిడి ఒక యువకుడి ప్రాణాలను కబళించింది. చైనాలోని గ్వాంగ్‌జౌలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన టెక్ ఉద్యోగులపై పడే విపరీతమైన పని ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. 32 ఏళ్ల ప్రోగ్రామర్ గావో గ్వాంగ్ హూయ్ వారాంతపు సెలవు దినమైన శనివారం నాడు కూడా ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తూ కుప్పకూలిపోయాడు.

    విపరీతమైన పని ఒత్తిడి కారణంగానే గావో గ్వాంగ్ హూయ్ అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం పనిలో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన గావోను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఆయన ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన చైనా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచింది.

    గావోను ఉదయం 9:46 గంటల సమయంలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ హాస్పిటల్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌కు తరలించినట్లు  ఆస్పత్రి రికార్డులు వెల్లడిస్తున్నాయి. వైద్యులు ఆయనను కాపాడేందుకు  ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాధితుడు క్లినికల్‌గా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అతని మరణానికి ప్రధాన కారణం ‘సడన్ రెస్పిరేటరీ అండ్ కార్డియాక్ అరెస్ట్’ (శ్వాస మరియు గుండె ఆగిపోవడం) అని వైద్యులు ధృవీకరించారు. దీనికి ‘స్టోక్స్-ఆడమ్స్ సిండ్రోమ్’ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇది గుండె  కొట్టుకోవడంలో తీవ్రమైన అంతరాయాల వల్ల సంభవించే ప్రాణాంతక పరిస్థితి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    ఈ ఉదంతంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆస్పత్రిలో  గావో ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలోనే ఆఫీసు వర్గాలు ఆయనను 'వీ చాట్‌’ టెక్నికల్ వర్క్ గ్రూప్‌లో యాడ్ చేసి, వర్క్‌ అప్పగించాయి. గావో మరణించిన రోజున కూడా ఆయన ఐదు సార్లు కంపెనీ సిస్టమ్‌లోకి లాగిన్ అయినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. ఈ వ్యవహారం దరిమిలా సంస్థ పని తీరు, అమానవీయ వైఖరిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

    గావో మృతికి పనిభారమే కారణమని ఆయన భార్య  యాంగ్  ఆరోపించారు. డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత కారణంగా, ఆరుగురు చేసే పనిని గావో ఒక్కడే చేయాల్సి వచ్చేదని ఆమె వాపోయారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో పాటు సేల్స్, మేనేజ్‌మెంట్ బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవని, రాత్రి 11 గంటల వరకు పనిచేయడం సర్వసాధారణమైపోయిందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై ‘వర్క్-రిలేటెడ్ ఇంజ్యూరీ’ (పని సంబంధిత గాయం) కింద కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు

  • కెనడాలో 28 ఏళ్ల భారత మూలాలకు చెందిన వ్యక్తిని కొంతమంది కాల్చి హత్య చేయడంపై గ్యాంగ్‌ వార్‌గా అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్‌ సింగ్‌ గిల్‌ అనే వ్యక్తిని కొంతమంది దాడి చేశారు. గత గురువారం సాయంత్రం గం. 5.30 ని.లకు బర్నబీ నగరంలో గిల్‌ను పలువురు కాల్చి చంపారు. 

     బర్నబీ  ఆర్సీఎంపీ ఫ్రంట్‌లైన్ అధికారులు కెనడా వే 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడ ఓ వ్యక్తి రోడ్డపై పడి ఉన్నాడు. అయితే అతని ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 

    ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. తమక గిల్‌ బాగా తెలిసిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గ్యాంగ్‌ వార్‌ కారణంగానే గిల్‌ను కాల్చి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

    ఇలా పబ్లిక్‌ ప్లేస్‌లో కాల్పులు జరగగంపై పోలీసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇది పోలీసులకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని కూడా కలవరపెట్టే అంశం. సంఘటనా స్థలంలో ఉన్న సాక్షులు, అక్కడి ప్రజల నుండి లభించే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

Movies

  • టాలీవుడ్‌లో పెద్ద హీరోల్లో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ అంతే వేగంగా షూటింగ్‌లు పూర్తి చేసే హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేస్తారు. వాటికి బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రభాస్ బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అట్లీతో బన్నీ ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఇటీవలే లోకేశ్ కనగరాజ్‌తో మరో సినిమా ప్రకటించాడు. ఈ రెండు సినిమాలపై చర్చలు కొనసాగుతుండగానే తాజాగా మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్‌పై వంగా దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు.  

    నిజానికి ఈ కాంబినేషన్ కొత్తది కాదు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే వంగా-బన్నీ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. కానీ అనుకోని కారణాల వల్ల అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా వెంటనే మొదలయ్యే అవకాశం లేదు. అట్లీ, లోకేశ్ కనగరాజ్ సినిమాలు పూర్తి చేసిన తర్వాతనే బన్నీ వంగా ప్రాజెక్ట్ వైపు వస్తాడు. మరోవైపు సందీప్ రెడ్డి కూడా స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.  

    ప్రభాస్ ఒకేసారి 2-3 సినిమాలు ప్రకటించే ట్రెండ్‌ను మొదలుపెట్టాడు. సలార్, కల్కి, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రకటించారు. వీటికి అదనంగా సలార్-2, కల్కి-2 కూడా లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు బన్నీ కూడా అదే తరహాలో ముందు ప్రాజెక్టులు లాక్ చేసి ఆ తర్వాత డేట్స్ కేటాయించే స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ స్టార్ హీరోల అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • నాని హీరోగా నటిస్తున్న సినిమా 'ద ప్యారడైజ్'. లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మే తొలి వారం లేదంటే జూన్ నెలలో రిలీజ్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. సరే రిలీజ్ గురించి కాసేపు పక్కనబెడితే ఇదే మూవీ గురించిన ఓ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

    'ప్యారడైజ్' మూవీలో నాని.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు.. సికంజా మాలిక్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. 'కిల్' ఫేమ్ రాఘవ్ జూయెల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

    కెరీర్ ప్రారంభంలో తనికెళ్లి భరణి.. విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తర్వాత తండ్రి తరహా పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలామంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్‌ బిర్యానీగా సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్‌ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఏం ప్లాన్ చేశాడనేది మూవీ రిలీజైతే తెలుస్తుంది.

    (ఇదీ చదవండి: అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి)

  • రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

    గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.

    అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.

    (ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్‌ చేసిన హరీష్‌ శంకర్‌!)

  • అక్కతో కలిసి మృణాల్ థాయ్‌లాండ్ ట్రిప్

    ఎర్రని చుడీదార్‌లో అందంగా మాళవిక

    మస్త్ షేడ్స్ చూపించేస్తున్న సంయుక్త

    ఖతార్‌లోని ఎడారిలో దివి గ్లామరస్ పోజులు

    బ్లాక్ డ్రస్ లో మోడ్రన్ గర్ల్‌లా భాగ్యశ్రీ బోర్సే

    చీరలో ఓరచూపులు చూస్తున్న హీరోయిన్ త్రిష

  • మా తమ్ముళ్లు జెమ్స్‌ అని చిరంజీవి ఓ సినిమాలో డైలాగ్‌ చెప్తాడు. చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునను ఒకేచోట చూసినప్పుడు అభిమానుల నోట కూడా ఇదే డైలాగ్‌ వస్తుంది. మా ముగ్గురు హీరోలు జెమ్స్‌ అని గొప్పగా చెప్పుకుంటారు. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న స్నేహం వారిది.

    స్టార్‌ హీరోలు ఒకేచోట
    ఎప్పుడు తారసపడ్డా ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ వారికి తెలియకుండానే ఓ చిరునవ్వు కనిపిస్తుంది. తాజాగా ఈ స్టార్‌ హీరోలు మరోసారి కలిశారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఇంట్లో ఓ పార్టీ జరగ్గా దానికి ఈ ముగ్గురూ హాజరయ్యారు. వీరితో డాక్టర్‌ గురవారెడ్డి ఓ ఫోటో దిగారు. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. 

    అదిరిపోయిన సంక్రాంతి
    ఇది చూసిన అభిమానులు వీళ్లు అప్పటికీ.. ఇప్పటికీ.. యంగ్‌గానే కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఇటీవలే సంక్రాంతి పండక్కి 'మన శంకర వరప్రసాద్‌గారు' సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించాడు. నయనతార కథానాయికగా నటించింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు దాటేసింది.

    చదవండి: చిరంజీవి, వెంకటేశ్‌ల ఏంటీ బాసూ సంగతి.. పాట రిలీజ్‌

  • రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతిక, క్రీడలు తదితర రంగాల నుంచి మొత్తంగా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఇందులో 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలానే 13 మందికి పద్మభూషణ్ వరించాయి. ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారులు దక్కాయి.

    హిందీ చిత్రసీమకు విశేష సేవలందించిన దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టిని పద్మభూషణ్ వరించింది. ప్రముఖ నటుడు మాధవన్‌ని పద్మ శ్రీ దక్కించుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్.. పద్మశ్రీలుగా ఎంపికయ్యారు.
     

  • సౌత్‌ టు నార్త్‌.. అన్ని భాషా సినిమాల్లో నటించాడు ప్రకాశ్‌ రాజ్‌. దాదాపు 38 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీయే బలమైన సినిమాలు చేస్తోందని.. హిందీ సినిమా తన మూలాలు కోల్పోయిందంటున్నాడు. శనివారం నాడు కోజికోడ్‌లో కేరళ లిటరేటర్‌ ఫెస్టివల్‌కు ప్రకాశ్‌ రాజ్‌ హాజరయ్యాడు. 

    సహజత్వం లేదు
    ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తమిళం, మలయాళంలో బలమైన సినిమాలు తీస్తున్నారు. కానీ హిందీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అక్కడి సినిమాలు ఆత్మను, సహజత్వాన్ని కోల్పోయాయి. పైకి అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే అంతా ప్లాస్టిక్‌లా ఉంటుంది.. మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలోని విగ్రహాలలాగా! కానీ దక్షిణాదిలో ఇప్పటికీ చెప్పడానికి బోలెడన్ని కథలున్నాయి. 

    ఫోకస్‌ అంతా దానిపైనే
    దళితుల సమస్యలను తమిళ యంగ్‌ డైరెక్టర్స్‌ తెరపై చాలా చక్కగా చూపిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక బాలీవుడ్‌ కేవలం వాటికి అనుగుణంగా సినిమాలు తీయడంపైనే శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయతను కోల్పోయింది. కేవలం డబ్బు, లుక్స్‌, రీల్స్‌, ప్రమోషన్స్‌.. వీటిపైనే ఫోకస్‌ చేసింది. దానివల్లే హిందీ చిత్రపరిశ్రమ ప్రేక్షకులకు కాస్త దూరమైంది అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: కూతురి చిన్ననాటి కోరిక.. రూ.50 లక్షల గిఫ్ట్‌ ఇచ్చిన నటి

  • అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అదృష్టం నాకు శంబాల సినిమాతో దక్కింది అంటున్నాడు నటుడు శివకార్తిక్‌.  ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన చిత్రంలో శివకార్తిక్‌ కీలక పాత్ర పోషించాడు. సినిమా రిలీజ్‌ తర్వాత శివకార్తిక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి.  చిత్ర విజయోత్సవంలో భాగంగా శివ కార్తిక్ తన సినీ ప్రయాణం, అందులోని ఒడిదుడుకుల గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.

    నాకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు. ఒంటరిగానే ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘జోష్’ మూవీ కోసం వేల మంది ఆడిషన్స్ ఇస్తే అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తరువాత వరుసగా ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పిల్లా జమీందార్’ చిత్రాలు చేశాను.

    కారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగా ‘లజ్జా’ అనే సినిమాను చేశాను. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఈ మూవీ కోసం నేను రెండున్నరేళ్లు కష్టపడ్డాను. కానీ ఫలితం మాత్రం రాలేదు. దీంతో అటు హీరోగా, ఇటు కారెక్టర్ ఆర్టిస్ట్‌గా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. అలాంటి టైంలోనే బాబీ గారు ‘పంతం’ సినిమాలో నా పర్ఫామెన్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. నటుడిగా మంచి స్థాయికి వెళ్లాలని, ఇంకా గట్టిగా ప్రయత్నించాలన్న కసి అక్కడి నుంచి నాలో మరింత పెరిగింది.

    అలా ప్రయత్నిస్తున్న సమయంలోనే నేను ఆర్జీవీ గారి ‘భైరవగీత’ చిత్రంలో పవర్ ఫుల్ రోల్‌ చేశాను. అది చూసి బోయపాటి గారు చాలా మెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయనే నన్ను పిలిచి ‘అఖండ’లో అవకాశం ఇచ్చారు. అయితే ఈ క్రమంలో నేను చేసిన చాలా చిత్రాలకు మంచి పేరు వచ్చింది. ‘ఉగ్రం’ తరువాత మరింతగా నా పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకున్నారు. ‘తండేల్’లో మంచి పాత్ర దక్కింది.

    ఎప్పుడూ ఒకేలా సింపతీ పాత్రలు చేయకూడదు.. వెరైటీ పాత్రల్ని చేయాలని అనుకున్నాను. ఆ సమయంలో మనీష్ అని కో డైరెక్టర్ ద్వారా యుగంధర్ ముని వద్దకు నేను వెళ్లాను. ఆడిషన్స్ ఇచ్చాను. అలా ‘శంబాల’ మూవీలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే పాత్ర లభించడం అంటే ఓ నటుడికి అదృష్టం అనే చెప్పాలి. ‘శంబాల’లో అవకాశం ఇచ్చిన దర్శకుడు యుగంధర్ మునికి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను.

    ఆది గారు ‘శంబాల’ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన డెడికేషన్ చూసి మాలోనూ మరింతగా కసి పెరిగింది. ఆయనతో పాటుగా, పోటీగా నటించాలని అందరూ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టారు. ‘శంబాల’ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు రావడం ఆనందంగా ఉంది.

    ప్రస్తుతం నేను నటుడిగా సంతృప్తికరంగానే ఉన్నాను. అయితే విక్రమ్ చేసిన ‘శివ పుత్రుడు’ లాంటి డిఫరెంట్ రోల్స్ చేయాలన్నదే నా కోరిక, కల. అందులో శివ కార్తిక్ కాకుండా కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. అలా ఓ అద్భుతమైన పాత్ర చేయాలని అనుకుంటున్నాను. నేను కీలక పాత్రలు పోషించిన ‘హైందవ’, ‘వృషకర్మ’ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతోన్నాయి. అందులోనూ అద్భుతమైన పాత్రల్నే పోషించాను.
     

  • చాన్నాళ్లుగా టాలీవుడ్‌లో ఉంటూ సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నందు.. రీసెంట్ టైంలోనూ దండోరా, వనవీర తదితర చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. వీటితో పాటు హీరోగానూ ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అదే 'సైక్ సిద్ధార్థ'. థియేటర్లలో ఘోరమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)

    పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'సైక్ సిద్ధార్థ'.. ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. హీరో నందు.. ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఒకటి రెండు సందర్భాల్లో ఎమోషనల్ కూడా అయిపోయాడు. ఈ సినిమాతో హీరోగా నిలబడతానని చెప్పాడు కూడా. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇప్పుడు దీన్ని ఫిబ్రవరి 4 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేనున్నారు. గోల్డ్ యూజర్స్ ఒకరోజు ముందే చూడొచ్చు. ఇందులో నందు, యామినీ భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

    'సైక్ సిద్ధార్థ' విషయానికొస్తే.. సిద్ధార్థ (శ్రీ నందు) అనుకోకుండా ప‌రిచ‌య‌మైన త్రిష(ప్రియాంక‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. వీళ్లు మ‌న్సూర్ (సుఖేష్‌రెడ్డి)తో క‌లిసి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదలుపెడతారు. అందులో రూ.2 కోట్ల పెట్టుబ‌డి సిద్ధార్థ‌దే. కానీ మ‌న్సూర్‌, త్రిష కలిసిపోయి.. సిద్ధార్థ‌ని దారుణంగా మోసం చేస్తారు. దీంతో అన్నీ పోగొట్టుకున్న సిద్ధార్థ.. చివరకు హైదరాబాద్‌లోని ఓ బ‌స్తీలో చిన్న గ‌ది అద్దెకు తీసుకుని బతుకుతుంటాడు. సిద్ధార్థ ఉంటున్న బిల్డింగ్‌లోకి త‌న కొడుకుతో క‌లిసి శ్రావ్య (యామినీ భాస్క‌ర్‌) అద్దెకు వస్తుంది. భ‌ర్త వేధింపులు తట్టుకోలేక వేరేగా వచ్చి బతుకుతూ ఉంటుంది. తర్వాత సిద్ధార్థ-శ్రావ్య ఎలా కలిశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

  • టాలీవుడ్‌లో సాధారణంగా దర్శకులు, అభిమానుల మధ్య గొడవలు, విమర్శలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్‌ హీరో సినిమా ఫ్లాప్‌ అవయితే.. ఫ్యాన్స్‌ అంతా దర్శకుడిని ట్రోల్‌ చేస్తుంటారు. అతన్ని విమర్శిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ హరీష్‌ శంకర్‌, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.


    గతంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌పై కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించి, నెగటివిటీ ప్రచారం చేశారు. దీంతో తన పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో హరీష్‌ శంకర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.

    అయితే, తాజాగా విడుదలైన సినిమా అప్‌డేట్స్, టీజర్లు చూసిన అభిమానులు హరీష్ శంకర్ విజన్‌పై పూర్తి నమ్మకం పెంచుకున్నారు. దీంతో నిన్న ఒక అభిమాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. "గతంలో జరిగిన పొరపాట్లను మన్నించి, అందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి" అని వినమ్రంగా కోరారు.ఈ అభ్యర్థనకు హరీష్ శంకర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. 

    "గతాన్ని మర్చిపోదాం.. మనమంతా ఒకటే కుటుంబం. సినిమాను కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ తక్షణమే ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు.  సినిమా రీలీజ్‌ సమయం దగ్గర పడడంతో హరీశ్‌ అన్‌బ్లాక్‌ చేయడం మొదలు పెట్టాడు. మరి పవన్‌ ఫ్యాన్స్‌, హరీష్‌ల మధ్య ఈ సఖ్యత ఇలానే కొనసాగుతుందా లేదా రిలీజ్‌ వరకే పరిమితం అవుతుందా చూడాలి. 
     

  • బుల్లితెర నటి మహి విజ్‌ ఇటీవలే వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలుకుతూ భర్త జే భానుషాలితో విడిపోతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆమె కొత్త కారు కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మినీ కూపర్‌ ఇంటికి తీసుకొచ్చామంటూ మహి వీడియో షేర్‌ చేసింది. దానిపై జే స్పందిస్తూ కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పాడు.

    కూతురికి గిఫ్ట్‌
    ఇకపోతే తారకు నాలుగేళ్ల వయసున్నప్పుడు మినీ కూపర్‌ కావాలని అడిగింది. అప్పుడు అంత అవసరం, స్థోమత లేక కొనలేదు. కానీ ఇప్పుడు తన కోరిక నెరవేర్చే సమయం వచ్చిందంటోంది మహి. అందుకే తనకెంతో ఇష్టమైన కూపర్‌ కారును గిఫ్టుగా ఇచ్చానంటోంది. మహి.. తెలుగు సినిమా తపనలో హీరోయిన్‌గా నటించింది. సినిమాల్లో అదృష్టం కలిసిరాకపోవడంతో బుల్లితెరకు షిఫ్ట్‌ అయింది. 

    సీరియల్స్‌
    జే భానుషాలి.. మూవీస్‌ చేయడంతోపాటు సీరియల్స్‌ చేశాడు. హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. జే- మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ జంటగా నాచ్‌ బలియే డ్యాన్స్‌ షో 5వ సీజన్‌లో పాల్గొని ట్రోఫీ గెలిచారు. ఈ జంటకు కూతురు తార సంతానం. బాబు రాజ్‌వీర్‌,  పాప ఖుషిల బాధ్యతను కూడా ఈ దంపతులే చూసుకుంటున్నారు. గతేడాది చివర్లో ఇద్దరూ విడిపోయారు.

     

     

    చదవండి: బిగ్‌బాస్‌ సోనియా బారసాల ఫంక్షన్‌

  • యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతానికి టీమిండియా తరఫున పెద్దగా మ్యాచులేం ఆడట్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాజ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు.. వ్యక్తిగత మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అయిపోతూనే ఉన్నాడు. తాజాగా మూడోసారి ప్రేమలో పడినట్లు కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ బ్యూటీతో డిన్నర్ డేట్‌కి వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

    టీమిండియాకు ఆడుతున్న టైంలోనే చాహల్.. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మని పెళ్లి చేసుకున్నాడు. 2020-25 వరకు దాదాపు ఐదేళ్ల పాటు కలిసున్న వీళ్లిద్దరూ గతేడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్జే మహావశ్ అనే అమ్మాయితో చాహల్ కొన్నాళ్ల పాటు సన్నిహితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకు తగ్గట్లే పలుమార్లు వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. మరి కారణాలేంటో తెలీదు గానీ రెండు మూడు రోజుల క్రితం ఆర్జే మహ్‌వశ్, చాహల్.. ఇన్ స్టాలో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంటే బ్రేకప్ చెప్పేసుకున్నట్లే!

    ఇప్పుడు చాహల్.. బిగ్‌బాస్ 13 హిందీ ఫేమ్, యాంకర్ సెఫాలీ బగ్గాతో జంటగా కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారా అని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుకుంటోంది. ఏదేమైనా ఇలా పలువురు అమ్మాయిలతో చాహల్ కనిపిస్తుండటం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది.

    (ఇదీ చదవండి: పరోటా మాస్టర్‌కి గోల్డ్ చెయిన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్)

  • కొంతకాలంగా ట్రాక్‌ తప్పిన హీరో నితిన్‌ కొత్త సినిమా ప్రకటించాడు. దర్శకుడు విఐ ఆనంద్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది నితిన్‌ కెరీర్‌లో 36వ సినిమాగా రాబోతోంది. ఈ మేరకు ఓ ఫోటో షేర్‌ చేశాడు. నో బాడీ నో రూల్స్‌.. వాస్తవ నిబంధనలు ఇప్పుడే మారిపోయాయి. నా సోదరులు దర్శకుడు ఆనంద్‌, నిర్మాత శ్రీనివాస్‌గారితో ప్రయాణం చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు.

    ఎల్లమ్మ చేజారె..
    పోస్టర్‌లో నితిన్‌ సిగరెట్‌ తాగుతున్నట్లుగా చూపించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ నిర్మించనున్నాడు. నిజానికి నితిన్‌ బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా చేయాల్సింది. కానీ, ఆ ప్రాజెక్టు అతడి నుంచి చేజారి దేవిశ్రీప్రసాద్‌ను వరించింది. ఏదేమైనా ఆనంద్‌ డైరెక్షన్‌లో నితిన్‌ హిట్టు కొడతాడేమో చూడాలి! వీఐ ఆనంద్‌.. హృదయం ఎక్కడున్నాది, టైగర్‌, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, డిస్కోరాజా, ఊరు పేర భైరవకోన వంటి సినిమాలు తెరకెక్కించాడు.

     

     

    చదవండి: బిగ్‌బాస్‌ సోనియా కూతురి బారసాల ఫంక్షన్‌

  • సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎప్పటికప్పుడు గోల్డ్ చెయిన్స్ గిఫ్ట్ ఇస్తుంటారు. వీటిని అందుకున్న వాళ్లలో సెలబ్రిటీలే ఎక్కువగా ఉంటుంటారు. ఏదైనా సినిమా నచ్చితే.. హీరో లేదా దర్శకుడిని పిలిచి రజనీ.. బంగారు చెయిన్స్ ఇస్తుంటారు. ఈసారి మాత్రం పరోటాలు చేసే ఓ వ్యక్తికి ఇచ్చారు. అతడి కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఈ బహుమానం అందజేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

    తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. ఇతడి పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తలైవర్‌కి అంత వీరాభిమాని కాబట్టి. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. తాజాగా శేఖర్‌ని ఇంటికి పిలిపించుకున్న రజనీకాంత్.. అతడికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు. 

    (ఇదీ చదవండి: 'హుక్ స్టెప్' అలా పుట్టింది: కొరియోగ్రాఫర్ ఆట సందీప్)

  • ఈసారి సంక్రాంతి రిలీజైన సినిమాల్లో చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' సక్సెస్ అందుకుంది. కంటెంట్ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ.. కుటుంబ ప్రేక్షకులకు దీన్ని చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా చిరు వేసిన 'హుక్ స్టెప్' సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ స్టెప్ ఎలా పుట్టిందో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: ఆ రికార్డ్ ఇకపై చిరంజీవి సొంతం!)

    'రేపు పాట షూటింగ్. ఇంకా హుక్ స్టెప్ కంపోజ్ చేస్తున్నాను. స్టెప్ రావట్లేదు. ఒకపక్కన ఫోన్ కాల్స్. నిజంగా చెబుతున్న ఆ టైంలో చాలా గందరగోళానికి గురయ్యా. భయం ఏంటంటే చిరంజీవితో సాంగ్ చేస్తున్నా. మరోవైపు వాళ్లు వీళ్లు ఊరికే ఫోన్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే చిరంజీవి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందా? లేదంటే ఓ కాస్ట్యూమర్ చేస్తున్నాడా? డ్యాన్సర్స్ కోసం చేస్తున్నారా? లేదంటే ప్రాపర్టీస్ కోసం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి. ఇంకా ఆ టైంలో నా ఫోన్‌ని తీసి నేలకేసి కొడదామనుకున్నా. అప్పటిదాకా రాని స్టెప్.. ఫోన్ పట్టుకోగానే వచ్చింది. అప్పుడు వచ్చిన స్టెప్ ఏదైతే ఉందో.. అదే హుక్ స్టెప్. నేను కంపోజ్ చేయడం ఒకత్తెయితే.. కూరకు ఉ‍ప్పు, మసాలా, కారం జోడించినట్లు చిరంజీవి గ్రేస్ కలిపారు' అని సందీప్ మాస్టర్ చెప్పాడు.

    దాదాపు 15-20 ఏళ్ల క్రితం డ్యాన్స్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. తోటి డ్యాన్సర్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే డ్యాన్స్ స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత తనకు చిరంజీవితో పనిచేసే అవకాశమొచ్చిందని ఆట సందీప్ రీసెంట్ టైంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. చూడటానికి సింపుల్‌గా అనిపించే ఈ స్టెప్.. అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు కుర్రాళ్లకు బాగానే నచ్చేసిందని చెప్పొచ్చు.

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఉండేది ఇలానే)

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తాజాగా వాకింగ్‌ స్టిక్‌తో నడుస్తూ కెమెరాలకు చిక్కాడు. ముంబైలో నిర్వహించిన డైరెక్టర్‌ గోల్డీ బెహల్‌ పుట్టినరోజు వేడుకకు హృతిక్‌ చేతి కర్రతో హాజరయ్యాడు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు వెళ్లినప్పుడు హృతిక్‌ హుషారుగా ఫోటోగ్రాఫర్లను పలకరిస్తూ వెళ్లేవాడు. కానీ ఈ సారి మాత్రం వాకింగ్‌ స్టిక్‌ సాయంతో సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. 

     ఈ మ‌ధ్యే బ‌ర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోష‌న్ ఇలా చేతి క‌ర్ర‌ల‌తో న‌డుస్తూ క‌నిపించ‌డం ఫ్యాన్స్‌లో ఆందోళన చెందుతున్నారు.  ‘హృతిక్‌కు ఏమైంది?’ అంటూ  ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'వార్ 2' సినిమాలోని ఒక సాంగ్ రిహార్సల్ సమయంలోనే హృతిక్‌ కాలికి గాయం అయినట్లు సమాచారం. హృతిక్‌ ప్రస్తుతం ‘క్రిష్‌ 4’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. 
     

  • బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, నటి సోనియా ఆకుల 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది. యష్‌ వీరగోనిని ప్రేమించి పెళ్లాడింది. ఈ వేడుకకు బిగ్‌బాస్‌ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. కాగా సోనియా- యష్‌ దంపతులు పెళ్లయిన ఏడాదికే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. 2025 డిసెంబర్‌ 8న వీరి ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది. తనకు శిఖ వీరగోని అని నామకరణం చేశారు.

    నిద్రలేని రాత్రులు
    తాజాగా కూతురి బారసాల ఫంక్షన్‌ ఫోటోలను సోనియా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. '28 డిసెంబర్‌ 2025.. 21 రోజుల ఫంక్షన్‌ ఎంత అద్భుతంగా గడిచిందో.. నీ చిన్ని పాదాలు, నాకు నిద్రలేని రాత్రులు, వెల్లివిరిసిన ఆనందాలు.. మాటల్లో చెప్పలేంతన సంతోషాన్ని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారింది. ఇల్లు నిండుగా కనిపిస్తోంది' అంటూ పాపను ఎత్తుకున్న ఫోటోలను షేర్‌ చేసింది. 

    తొలిసారి ఊయలలో
    సోనియా దంపతులిద్దరూ కలిసి పాపను తొలిసారి ఊయలలో వేశారు. అయితే చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. పాపను చూపించొచ్చుగా అని ఓ అభిమాని అడగ్గా మూడునెలలవరకు చూపించకూడదనే ఆగాం.. వచ్చే నెలలో చూపిస్తాను అని సోనియా బదులిచ్చింది. నార్మల్‌ డెలివరీయా? సీ సెక్షనా? అని మరో నెటిజన్‌ అడగ్గా సీ సెక్షన్‌ జరిగిందని పేర్కొంది. సోనియా.. జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్‌, ఆశ ఎన్‌కౌంటర్‌ సినిమాల్లో నటించింది. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో పాల్గొంది.

     

     చదవండి:  విడాకులు తీసుకున్న బుల్లితెర జంట

  • జూనియర్‌ ఎన్టీఆర్‌ రాముడిగా నటించిన చిత్రం 'రామాయణం'.. ఎంఎస్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. బాల నటుడిగా తన నటనా సామర్థ్యం ఏంటో తెలుగు ప్రేక్షకులకు తారక్‌ చూపించాడు. 

    ఈ మూవీ షూటింగ్‌ సమయానికి అతని వయసు కేవలం 13ఏళ్లు మాత్రమే.. ‘రామాయణం’ కంటే ముందు... ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో శకుంతల తనయుడు భరతునిగా తారక్ నటించినా... ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ విధంగా చూసుకుంటే... తారక్ వెండితెరపై కనిపించిన తొలి సినిమా రామాయణమే (1997). అయితే, ఈ మూవీ గురించి తాజాగా గుణశేఖర్‌ పలు విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తారక్‌ పెంపకం గురించి ఆయన మాట్లాడటం విశేషం.

    'రామాయణం' సెట్స్‌లో తారక్‌ను తిడితే..: గుణశేఖర్‌
    సినిమా సెట్స్‌లో తారక్‌‌ ఎలా ఉండేవారో గుణశేఖర్‌ ఇలా చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను చాలా పద్ధతిగా వారి అమ్మగారు   పెంచారని ఆయన గుర్తు చేసుకున్నారు. 'రామాయణం సినిమా షూట్‌లో భాగంగా ఒక్కసారి తారక్‌ను బాగా తిట్టాను. దీంతో తను చాలా బాధతో వారి అమ్మ (షాలిని) వద్దకు వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో షాలిని గారు నన్ను ఒక్కమాట కూడా అనలేదు. పైగా తారక్‌నే మందలించారు. డైరెక్టర్‌ చెప్పినట్లు వినాల్సిందేనని గట్టిగా తారక్‌కు చెప్పారు. డైరెక్టర్‌ తిట్టినా, కొట్టినా సరే పడాల్సిందేనని చెప్పడంతో.. సరే అమ్మా అంటూ అలానే నిలబడిపోయాడు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ తన అమ్మ మాటకు చాలా విలువ ఇస్తాడు. అమ్మ పెంపకం షాలిని మాదిరి ఉండాలని నేను అనుకుంటాను. ఆమె పెంపకం గురించి తెలుస్తే ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే.' అని  గుణశేఖర్ అన్నారు.

    రామజననం నుంచి రావణ సంహారం వరకూ సాగే ఈ కథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరు అభినందనీయం. పిల్లలకు తగ్గట్టు ఆభరణాలను తయారు చేయించడమేకాదు, వారి హైట్‌ని బట్టి అంతఃపురం సెట్లను కూడా వేయించి, చూపరులను అబ్బురపరిచారు. పిల్లలతో రామకథను తీసి వెండితెరను పులకింపజేశారాయన.

  •  పేరున్న హీరో కానీ, పాపులర్‌ హీరోయిన్‌ కానీ ఎవరూ లేని ఓ చిన్న సినిమా అది. కానీ అప్పట్లో పెద్ద హీరోల భారీ చిత్రాలను సైతం తలదన్ని, ఆబాలగోపాలాన్నీ అలరించింది. అనూహ్య విజయం సాధించింది. బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్‌గా రతనాల రంగవల్లులు తీర్చిదిద్దింది. అది... తెలుగు సినిమా వాకిట చెరగని, చెదరని ‘ముత్యాల ముగ్గు’. అక్షరాలా బాపు – రమణల మార్కు సెల్యులాయిడ్‌ నిగ్గు. ఓ సినీప్రియుడు అన్నట్టు... ఓ చిన్న టుమ్రీ లాగా మొదలైనా, రిలీజైన కొద్దివారాలకే మంత్రముగ్ధం చేసే మహత్తర గజల్‌గా మారిన రసరమ్య సంగీత మాలిక. ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిరి వారి ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’లో... ఇషాన్‌ ఆర్య ఛాయాగ్రహణ దృశ్యజాలపు అల్లిక. తెరపై నేటికీ వసివాడని కుటుంబానురాగాల నవ మల్లిక. రమణ రాత – బాపు తీతల్లో ఓ మైలురాయి. రావుగోపాలరావు నటనలో కలికితురాయి. 

    అది 1975. ఆ ఏడాది ఆరంభమై అప్పటికి ఆరు నెలలు దాటిపోయింది. ఆ సంవత్సరం అప్పటికి తెలుగు చిత్రసీమలో వేళ్ళ మీద లెక్కపెట్టుకోగలిగినన్ని సినిమాలే విజయం సాధించాయి. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాదే కాదు... అప్పటికి కొంతకాలంగా ఇండస్ట్రీలో అదే పరిస్థితి. ఏటా దాదాపు 70 చలనచిత్రాల నిర్మాణం స్థాయికి తెలుగు సినీ పరిశ్రమ ఎదిగింది కానీ, వాటిలో అతి తక్కువే విజయం అందుకుంటున్న దుఃస్థితి. కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా 1976 కల్లా ‘స్మాష్‌’ అయిపోవడం ఖాయమని సాక్షాత్తూ అగ్రనటుడు అక్కినేని లాంటి వారు సైతం వ్యాఖ్యానించిన రోజులవి. అదిగో... సరిగ్గా అలాంటి సమయంలో 1975 జూలై 25న చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయం సాధించి, పరిశ్రమకు కొత్త ఊపిరి పోసిన ‘వి’చిత్రం... ‘ముత్యాల ముగ్గు’.  

    ‘లవకుశ’కు... ఆకట్టుకొనే సోషల్‌ వెర్షన్‌!

    ‘సాక్షి’తో మొదలైన బాపు దర్శకత్వ ప్రస్థానంలో అది తొమ్మిదో సినిమా. రచయితగా రమణకు రజతోత్సవ (25వ) సినిమా. కొత్త హీరో హీరోయిన్లతో, పాత్రధారులెవరికీ మేకప్‌ లేకుండా, అందులోనూ ఖరీదైన రంగుల్లో సినిమా నిర్మించడం ఆ రోజుల్లే ప్రయోగమే కాదు. పరమ మూర్ఖ సాహసం. అయినా, బాపు – రమణ చేశారు. అంతకు ముందు ఎనిమిదిన్నరేళ్ళ క్రితం తెలుగులో తొలిసారిగా పూర్తి ఔట్‌డోర్‌లో నెల రోజుల్లో ‘సాక్షి’ చిత్రం నిర్మించిన వారిద్దరూ...  ఈసారి మేకప్‌ లేకుండా, మొత్తం రంగుల్లో, 40 రోజుల్లో ఒకే షెడ్యూల్‌లో ‘ముత్యాల ముగ్గు’ తీసి మరోసారి చరిత్ర సృష్టించారు. ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అని మరొక్కసారి రుజువు చేశారు.

    అసలు ‘ముత్యాల ముగ్గు’ మరీ ప్రత్యేకమైన కథేమీ కాదు. సీతను అనుమానించిన శ్రీరామచంద్రుడు, రాజ్యం విడిచి అడవికి వెళ్ళాల్సి వచ్చిన సీత, అక్కడ ఆమెకు కలిగిన కవలపిల్లలు లవకుశులు, పిల్లల వల్ల చివరకు తల్లితండ్రులు తిరిగి చూసుకోవడం... ఇదే ఉత్తర రామాయణంలోని పురాణగాథ. దాన్నే కాస్తంత మార్చి, సోషలైజ్‌ చేసి, పిల్లలే క్రియాశీలంగా వ్యవహరించి తల్లితండ్రుల్ని కలిపితే? అదే ‘ముత్యాల ముగ్గు’ సినిమా స్క్రిప్టు. కాకపోతే, మొదట అనుకోని కాంట్రాక్టర్‌ (రావుగోపాలరావు) పాత్రను ఆ తర్వాత స్క్రిప్టులో చేర్చి, కథను మరింత రసవత్తరం చేశారు. పాత కథనే గొప్ప కథనంతో అద్భుతంగా పండించారు బాపు – రమణ.

    హనుమంతుడి పాత్రను ప్రవేశపెట్టి, దీన్ని ‘సోషియో – ఫ్యాంటసీ’గా చేయడం మంచి బాక్సాఫీస్‌ ఫార్ములా. అంతకు ముందు ఎన్టీఆర్‌ – యస్వీఆర్‌ ‘దేవాంతకుడు’ (1960 జూలై 7)లో సక్సెసైన ఆ ధోరణిని శోభన్‌బాబును శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి, ఏయన్నార్‌ ‘బుద్ధిమంతుడు’ (1969 సెప్టెంబర్‌ 20)లోనూ బాపు–రమణలు సమర్థంగా వాడారు. అయితే, ‘ముత్యాల ముగ్గు’లో అది సంపూర్ణతను సంతరించుకొని, పెద్ద పేయింగ్‌ ఎలిమెంట్‌ అయింది. ఆ సినిమా తర్వాత ‘దేవుడే దిగివస్తే’ (1975 సెప్టెంబర్‌ 19) లాంటి పలు చిత్రాలు ఇలా ‘సోషియో – ఫ్యాంటసీ’ సూత్రాన్ని అనుసరించాయి.

    అలాగే, రొటీన్‌కు భిన్నంగా తీస్తున్న ఈ సినిమాకు ‘కవల పిల్లల కథ’ లాంటి మూస ధోరణి పేర్లకు పోకుండా టైటిల్‌ కూడా భిన్నంగానే పెట్టారు. ‘తీరైన సంపద ఎవరింట నుండు... దిన దినము ముగ్గున్న లోగిళ్ళ నుండు...’ అనే ఈ చిత్ర కథావస్తువుకు తగ్గట్టు ‘ముత్యాల ముగ్గు’ అనే టైటిల్‌ను బాపు మొదట్లోనే నిర్ణయించారు.    

    ప్రొడ్యూసరైన తెలుగు లెక్చరర్‌... ఎమ్వీయల్‌!
    విజయవాడ దగ్గర నూజివీడులోని ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు లెక్చరరైన ఎమ్వీయల్‌ ‘ముత్యాల ముగ్గు’తో నిర్మాత అవతారమెత్తారు. మచిలీపట్నం దగ్గర గూడూరులో జన్మించిన ఆయన పూర్తి పేరు – మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు. సంక్షిప్తంగా ఎమ్వీయల్‌. ఆయన స్వతహాగా మంచి కవి, రచయిత, వక్త. అప్పట్లో ఆయన ‘ప్రభవ’ అనే మాసపత్రికకు సంపాదకుడిగానూ వ్యవహరించారు. ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘యువజ్యోతి’ శీర్షిక నడిపారు. ఆ శీర్షిక ఆ రోజుల్లో పాఠకులకు పెద్ద ఆకర్షణ. వెంకటగిరి సంస్థానం రాజా గారి తమ్ముడి కుమారుడైన ఎం. సుకుమార్‌ ఆయన శిష్యుడే! ఆ శిష్యుడి కోసం తమకు ఓ సినిమా చేసిపెట్టమని బాపు – రమణల్ని ఎమ్వీయల్‌ అభ్యర్థించడంతో ‘ముత్యాల ముగ్గు’ పట్టాలెక్కింది.

    తీరా మద్రాసు విజయా గార్డెన్స్‌లో పాటల రికార్డింగ్‌ జరుగుతున్న వేళ... తొంభై వేలిచ్చేసరికే వెంకటగిరి యువరాజా వారు చేతులెత్తేశారు. అయితే, బాపు – రమణల మాట మీద పంపిణీదారులైన ‘అన్నపూర్ణ ఫిలిమ్స్‌’ ఆదుకున్నారు. (అప్పట్లో సినీ పంపిణీ రంగంలో ఓ ప్రముఖ సంస్థ అన్నపూర్ణ ఫిలిమ్స్‌. ఆ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేరెవరో కాదు... ప్రముఖ నిర్మాత ‘జగపతి’ వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ తమ్ముడు కృష్ణప్రసాద్‌. నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, అగ్రనటుడు జగపతిబాబుకు సొంత బాబాయి. హీరో అక్కినేని సహా పలువురికి ఆ ‘అన్నపూర్ణ’ పంపిణీ సంస్థలో వాటాలుండేవి). అలా బాపు – రమణ పూనుకొని, ఆ ‘అన్నపూర్ణ ఫిలిమ్స్‌’ వారి సహాయ సహకారాలతో, ఇతర వనరులు కూడా కలుపుకొని పన్నెండున్నర లక్షల్లో ‘ముత్యాల ముగ్గు’ పూర్తి చేశారు. నిర్మాతగా ఎమ్వీయల్‌ పేరు, సమర్పకుడిగా సుకుమార్‌ పేరుతో రిలీజ్‌ చేశారు. చిన్న సినిమా కాస్తా విజయంలో పెద్ద సినిమా అయింది. మొత్తం కథే మారిపోయింది. అలా సినీరంగ ప్రవేశం చేసిన ఎమ్వీయల్‌ ఆ తర్వాత కాలంలో ‘గోరంత దీపం’, ‘స్నేహం’, ‘మనవూరి పాండవులు’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘ఓ ఇంటి భాగోతం’ సినిమాలకు సంభాషణలు రాశారు. అయితే... వేడుక అలవాట్లను వాడుక వ్యసనాలను చేసే రంగుల ప్రపంచం మాయలో పడి, 42 ఏళ్ళ పిన్న వయసులోనే 1986 జనవరి 23న కన్నుమూయడం ఎమ్వీయల్‌ కథకు యాంటీ క్లైమాక్స్‌.  

    కొత్తవాళ్ళతో కలర్‌ఫుల్‌ మ్యాజిక్‌
    ‘ముత్యాల ముగ్గు’లో ప్రధానమైన నాయకుడు, నాయిక... ఇద్దరూ కొత్తవాళ్ళే. మంచి రూపం, కంఠస్వరం ఉన్న నటుడు శ్రీధర్‌ అంతకు ముందు ‘తల్లా? పెళ్ళామా?’(1970 జనవరి 8)తో మొదలుపెట్టి, ‘రైతుబిడ్డ’ (1971 మే 19) తదితర చిత్రాల్లో సహాయక పాత్రల్లో తెరపై కనిపించినా, ఆయనకు హీరోగా ప్రమోషన్‌ వచ్చింది మాత్రం ఈ చిత్రంతోనే! పూర్వాశ్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసి, మంచి నాటకానుభవంతో సినిమాల్లోకి వచ్చారాయన. అందుకే, ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా ఈజ్‌తో, సాఫీగా ఈ నాయక పాత్ర పోషించగలిగారు. అలాగే, వరంగల్‌ నుంచి మద్రాసుకొచ్చి, సంగీతగా పేరు మార్చుకున్న లత (అదే ఆమె అసలు పేరు) హీరోయిన్‌గా అందరినీ ముగ్ధుల్ని చేశారు. తెరపై ప్రేక్షకుల ముందుకు రావడం ఆమెకు అదే తొలిసారి. నిజానికి, యు.విశ్వేశ్వరరావు దర్శకత్వంలోని ఎన్టీఆర్‌ ‘తీర్పు’ (1975 అక్టోబర్‌ 1) ఆమె నటించిన మొదటి సినిమా. కానీ, రిలీజైన తొలి సినిమా మాత్రం ‘ముత్యాల ముగ్గే’. చెంపకు చేరడేసి కళ్ళు, అందం, ముఖంలో పల్లెటూరి పిల్ల పాత్ర తాలూకు అమాయకత్వం, ఆత్మాభిమానాన్ని అలంకారంగా మలుచుకున్న ఆ పాత్ర వ్యక్తిత్వం... అన్నీ కలిసి తొలి సినిమాతోనే తార అయిపోయారు సంగీత. ఆపైన ‘ముత్యాల ముగ్గు’ బాపు బొమ్మగా ఇప్పటికి యాభై ఏళ్ళ పైగా కెరీర్‌ కొనసాగిస్తూనే ఉన్నారు.  

    విలన్‌ రావుగోపాలరావుతో పాటు ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో దుష్టపాత్ర... అల్లు రామలింగయ్య పోషించిన జోగినాథం పాత్ర. దేవుడి ఆభరణాల దొంగతనం, కోపగించిన కోతి పీకడంతో పిచ్చిపట్టి, అచ్చం కోతి లాగా ప్రవర్తించే సన్నివేశాల్లో అల్లు మార్కు అనుభవం, అపారమైన అభినయ నైపుణ్యం కనిపిస్తాయి. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో ఇతర పాత్రల్లో సైతం సందర్భోచితంగా ఈ ‘ముత్యాల ముగ్గు’ మార్కు అభినయ ఛాయల్ని ఆయన ప్రదర్శించారు. ప్రేక్షకుల్ని పదే పదే మెప్పించారు. అదీ ‘ముత్యాల ముగ్గు’ చూపిన నటనా మార్గం.  

    ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే అల్లు రామలింగయ్య రెండో కుమారుడు ఆకస్మికంగా మరణించారు. తన వల్ల దర్శక, నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని, ఊహించని ఆ పుత్రశోకాన్ని దిగమింగుకుని, వద్దంటున్నా సరే మూడోరోజు నుంచే తిరిగి షూటింగులో పాల్గొన్నారు అల్లు రామలింగయ్య. అలా ఓ చిన్న చిత్ర నిర్మాణానికి తోడ్పడడం, అంత కుటుంబ కష్టాన్ని సైతం పైకి కనపడనివ్వకుండా కెమెరా ముందు కామెడీ పండించడం ఆయనకే చెల్లింది. హీరో తండ్రిగా కాంతారావు, హీరో హీరోయిన్లను విడదీసే పాత్రలో ముక్కామల, నిత్యపెళ్ళికొడుకుగా నూతన్‌ప్రసాద్, ఇంకా ‘సాక్షి’ రంగారావు, సూర్యకాంతం, జయమాలిని, హలం తదితరులు ఈ చిత్రకథలోని ఇతర పాత్రలను సైతం చిరంజీవులుగా మార్చారు.  

    పిల్లలు మెచ్చిన పవన సుత హనుమాన్‌!
     ‘ముత్యాల ముగ్గు’లో పిల్లల్ని అమితంగా ఆకర్షించిన హనుమంతుడి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో నటుడు అర్జా జనార్దనరావు అద్భుతంగా నటించారు. అంతకు ముందే బాపు – రమణలు శోభన్‌బాబుతో తీసిన ‘సంపూర్ణ రామాయణం’ (1972 మార్చి 16)లోనూ, ఎన్టీఆర్‌తో చేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’(1975 జనవరి 10)లోనూ ఆయనది అదే పాత్ర. ఆ పౌరాణికాల్లోనే కాదు, ఈ సాంఘిక చిత్రం ‘ముత్యాల ముగ్గు’లోనూ సాక్షాత్తూ ఆంజనేయ స్వామినే తెరపై చూస్తున్నామా అనిపించేలా ఆయన వేషం, భాష, అభినయం అన్నీ అద్భుతంగా అమరాయి. పిల్లలకు అండగా నిలిచి, దూరమైన వారి తల్లితండ్రులను మళ్ళీ కలిపే బాధ్యతను మోసిన రామభక్త హనుమాన్‌గా ఆ పాత్ర తీరు కొత్తగా ఉంటుంది. కథలోని కీలక పాత్రచిత్రణ రీత్యా ‘ముత్యాల ముగ్గు’లోని ఆ ఇద్దరు పిల్లలు (బాలనటులు రాధ, మురళి), ఆంజనేయ స్వామి పాత్రలే సినిమా చూసిన చిన్నారులకు సహజంగా ఫేవరెట్‌. ఈ సినిమా తర్వాత కూడా అర్జా జనార్దనరావు పలుమార్లు ఆంజనేయ పాత్రలో కనిపించారు. తెలుగుతెర ఆంజనేయుడిగా నేటికీ చెరగని చిరకీర్తిని ఆర్జించుకున్నారు.

    సెల్యులాయిడ్‌పై శిల్పసౌందర్యం... ఇషాన్‌ ఆర్య పనితనం!
    కోనసీమ పల్లెపట్టుల్లో, ప్రధానంగా గోదావరి ఒడ్డున పులిదిండి గ్రామంలో తీర్చిదిద్దిన ఈ ‘ముత్యాల ముగ్గు’కు బాపు ఏరికోరి ఎంచుకొని, తెలుగు తెరకు పరిచయం చేసిన విలక్షణ ఛాయాగ్రాహకుడు ఇషాన్‌ ఆర్య. ఆయన అసలు పేరు ఇర్షాద్‌ ఎహ్‌సాన్‌. అంతకు ముందే కోకాకోలా వాణిజ్యప్రకటనతో, అలాగే ఎం.ఎస్‌. సత్యూ దర్శకత్వంలో బలరాజ్‌ సహానీ నటించగా దేశవిభజన నేపథ్యంలో తీసిన కళాత్మక చిత్రం ‘గరమ్‌ హవా’ (1973)తో ఇషాన్‌ అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘గరమ్‌ హవా’ అప్పటికే ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా భారత ప్రభుత్వ నేషనల్‌ అవార్డుతో పాటు ప్రసిద్ధ ఆస్కార్‌ అవార్డులు, కాన్స్‌ చలనచిత్రోత్సవానికి కూడా నామినేట్‌ అయింది. అక్కినేని ‘అందాల రాముడు’ (1973)కే ఆయనను తీసుకుందామని బాపు అనుకున్నారు. కానీ, స్టార్‌ సినిమా కావడంతో రమణ సలహా మేరకు ఆగారు. ఈసారి అంతా కొత్తవాళ్ళతో తీస్తున్న ‘ముత్యాల ముగ్గు’తో ఆ కోరిక తీరింది.

    మేకప్‌ లేకుండా నటీనటులను సహజంగా చూపిస్తూ... రిఫ్లెక్టర్ల లైటింగ్‌లో వేవేల వేడి ప్రకాశంతో వారిని మాడ్చేయకుండా, శాటిన్‌ గుడ్డ వాడి కాంతిని బౌన్సింగ్‌ చేసి, ప్రశాంతంగా... కంటికీ, మనసుకూ ఆహ్లాదం కలిగించేలా చిత్రీకరణ జరపడం ఇషాన్‌ ఆర్య స్టయిల్‌. అప్పటికే సుప్రసిద్ధులైన సినిమాటోగ్రాఫర్లు ఎందరికో ఇది పూర్తి భిన్నం. అయినా, ఈ తరహా చిత్రీకరణతోనే ఇషాన్‌ ఆర్య సెల్యులాయిడ్‌పై సన్నివేశాలను సౌందర్య శిల్పాలుగా మార్చారు. దానికి తోడు బాపు మార్కు పెయింటింగ్‌ తరహా కెమెరా ఫ్రేమింగ్, తెర నిండుగా టైట్‌ క్లోజప్పుల్లో ఆర్టిస్టుల హావభావాలు కలిసేసరికి... ‘ముత్యాల ముగ్గు’ చూసిన ప్రేక్షకులకు మతి పోయింది. సినిమా ఓ విజువల్‌ పొయిట్రీలా అనిపించింది. ఇషాన్‌ చూపిన ఆ పంచరంగుల కెమెరా పనితనానికి కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డు దక్కింది.

    ‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ ‘గోరంతదీపం’ (1978), ‘తూర్పు వెళ్ళే రైలు’ (1979) చిత్రాలకు కూడా బాపు కెమెరా కన్ను ఇషాన్‌ ఆర్యే! నిజానికి, ఇషాన్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే. ప్రసిద్ధ ఉర్దూ రచయిత కైఫీ ఆజ్మీ కుటుంబానికి అత్యంత సమీప బంధువు. కైఫీ ఆజ్మీ సంతానమైన నటి షబానా ఆజ్మీకి కజిన్‌. షబానా సోదరుడైన బాబా ఆజ్మీ మొదట్లో ఇషాన్‌ దగ్గరే సహాయకుడిగా పనిచేసి, ఆనక స్వతంత్రంగా సినిమాటోగ్రాఫరయ్యారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఇషాన్‌ కుమారుడైన సమీర్‌ ఆర్య సైతం సినిమాటోగ్రాఫరే! హృతిక్‌ రోషన్‌ పాపులర్‌ సినిమా ‘కోయీ... మిల్‌ గయా’ (2003) సహా పలు హిందీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు.

    రాజ ప్రాసాదంలో... రంగుల సినిమా
    ‘ముత్యాల ముగ్గు’ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ సినిమాలో కీలక భాగం షూటింగ్‌ జరిగిన ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’. తొమ్మిది పదులు దాటిన వయసులో ఇటీవలే మరణించిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ తాత తండ్రులు కట్టించిన ప్రాసాదం ఇది. 1890 ప్రాంతంలో మొత్తం మూడు దశల్లో... రాజా జ్ఞాన్‌ గిర్‌జీ బహదూర్, నరసింగ్‌ గిర్‌జీ బహదూర్, రాజా ధన్‌రాజ్‌గిర్‌జీ బహదూర్‌లు ముగ్గురి హయాంలో ఆ కోట లాంటి ఇంటిని కట్టారు. ఒకప్పుడు యావత్‌ దక్షిణ భారతదేశంలో నిజామ్‌ ప్రభువు తర్వాత అత్యంత సంపన్న కుటుంబం వారిదే! మహారాజ్‌ నర్సింగ్‌గిర్‌ ధన్‌రాజ్‌గిర్‌ జ్ఞాన్‌ బహదూర్‌ అప్పట్లో నిజామ్‌ ఆస్థానంలో ప్రముఖ వర్తకుడు, బ్యాంకర్‌. అంతేకాక, తొలి భారతీయ టాకీ ‘ఆలమ్‌ ఆరా’ (1931) హీరోయిన్‌ అయిన జుబేదాను వివాహమాడిన వ్యక్తి. హైదరాబాద్‌లో తొలినాళ్ళలో సినీ పరిశ్రమను ప్రోత్సహించినవారిలో ఈ ధన్‌రాజ్‌గిర్‌ కుటుంబం కూడా ఒకటి. రాజా నరసింగ్‌గిర్‌ ఒకానొక సమయంలో రైల్వే సంస్థ ఏర్పాటు కోసం సాక్షాత్తూ ఆరో నిజామ్‌ నవాబుకు ఋణం ఇచ్చారు. ఆయన మనుమరాలే రాజకుమారి ఇందిర.

    చివరి దాకా ఆమె నివాసమైన ఆ ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’కే ‘ధన్‌రాజ్‌ గిర్‌ ప్యాలెస్‌’ అని కూడా పేరు. మొత్తం యూరోపియన్, ఇండో– శారసెనిక్‌ సమ్మిళిత శైలిలో సున్నపురాయి, చలువరాయి వాడి నిర్మించిన ప్రాసాదం అది. దాదాపు 8 ఎకరాల స్థలంలో, సుమారు 30 వేల చదరపు అడుగుల మేర 19 సూట్లతో ఉంటుంది. స్వతహాగా కవయిత్రి – కళాభిమాని అయిన రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్‌గిర్‌ తన భావాలకు సరితూగే కవి గుంటూరు శేషేంద్రశర్మతో ఆ ప్యాలెస్‌లో జీవనం గడిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున గోషామహల్‌ ప్రాంతంలో పాన్‌ మండీ వద్ద శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ప్యాలెస్‌ అది. తరచూ కవులు – కళాకారుల భేటీలతో సాంస్కృతిక కేంద్రంగా వెలిగిన ఆ ప్యాలెస్‌లోనే ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్‌ జరిగింది. ఆ సినిమా చిత్రీకరణకు ప్యాలెస్‌ను ఉపయోగించుకునేందుకు రాజకుమారి ఇందిర ఉదారంగా అనుమతించారు.

    హీరో నివాసానికి సంబంధించిన కీలక ఘట్టాల షూటింగ్‌ అక్కడే జరిగింది. ఆ ప్యాలెస్‌ వాకిటనే ఉదయం వేళ ముగ్గు వేస్తూ హీరోయిన్‌ సంగీత పాడే ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ...’ పాటను చిత్రీకరించారు. నిండుగా నగలు ధరింపజేసి హీరోయిన్‌ను పుట్టింటికి పంపేసే కీలకమైన నగల సీన్‌ తీస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇందిర, ‘గిల్టు నగలెందుకు?’ అంటూ రత్నాలు, వజ్రాలు పొదిగిన అచ్చమైన తమ ఇంటి బంగారు నగలనే షూటింగ్‌కు ఇవ్వడం మరో విశేషం. బాపు ‘ముత్యాల ముగ్గు’ తర్వాత బాలకృష్ణ – విజయశాంతితో రాఘవేంద్రరావు తీసిన ‘పట్టాభిషేకం’ (1985 డిసెంబర్‌ 21) సహా మరికొద్ది చిత్రాల్లో మాత్రమే వెండితెరపై ‘జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌’ కనువిందు చేసింది. అటుపైన పెద్ద పెద్ద సినిమా షూటింగ్‌లకు సైతం ఆ రాజప్రాసాదం తలుపులు తెరుచుకోనే లేదు.

    కలిసొచ్చిన అనుకోని ఇబ్బంది!
    కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు సైతం కలిసొచ్చిన అదృష్టాలుగా మారతాయి. ‘ముత్యాల ముగ్గు’ షూటింగ్‌లో అలాంటిదే జరిగింది. జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌లో షెడ్యూల్‌ పూర్తి చేశాక, విలనైన కాంట్రాక్టర్‌ రావు గోపాలరావు ఇంటి సీన్లు తీయాలి. అందు కోసం హైదరాబాద్‌ సారథీ స్టూడియోలో సెట్టు బుక్‌ చేసున్నారు. ఎల్లుండి షూటింగ్‌ అనగా ఇవాళ స్టూడియో వారు పిలిచి, ఆ సెట్‌ ఎవరో పెద్దవాళ్ళు తీసుకున్నారనీ, వీళ్ళకివ్వడం కుదరదనీ చెప్పారు. పోనీ భోజనాలకు వాడే షెడ్డు ఇవ్వమన్నా ససేమిరా అన్నారు. డైనింగ్‌ హాలులో షూటింగ్‌ చేసినా, స్టూడియోలోకి ఆ సౌండ్‌ చొరబడుతుందనీ, సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టేశారు. ‘‘ఎలాగరా అని బాధపడుతూ రాక్‌ క్యాజిల్‌ హోటల్‌లో ‘ఉపద్రవాలు’ తాగుతూ ఆలోచిస్తున్నాం. ఆ కొండ మీది బండలూ, వాటి చాటున గదులూ, దారులూ, ఆ వెనక చక్కటి లాన్‌ ఆకర్షించాయి. అంతే... సినిమాలోని కాంట్రాక్టర్‌ ఇల్లూ, హలం డ్యాన్సూ – మొత్తం అంతా అక్కడ కుదిరిపోయాయి. సినిమా తరహాయే మారిపోయింది’’ అని బాపు పేర్కొన్నారు.

    ఆ హోటల్‌లోనే కొన్ని రూములు అద్దెకు తీసుకొని బస చేస్తూ అక్కడే షూటింగ్‌ చేశారు. షూటింగ్‌కు అద్దె ఇస్తామన్నా, కనీసం గిఫ్టు ఇస్తామన్నా ఆ ప్రొప్రయిటర్‌ వద్దు అన్నారట. ‘రోజూ ఉదయం మీరు వెలిగించే అగరొత్తుల ప్యాకెట్‌ (ఆ రోజుల్లోనే ప్యాకెట్‌ అయిదు రూపాయలున్న ‘సాయి ఫ్లోరా’) ఒకటి ఇవ్వండి చాలు’ అన్నారట. అలా దేవుడిచ్చిన ఆ నేచురల్‌ స్టూడియోలోనే... ఆకాశంలో సూర్యుణ్ణి చూస్తూ రావుగోపాలరావు తన సెక్రటరీతో, ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిగినెస్సేనా? ఆ... పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ...’ లాంటి డైలాగులు  సీన్లన్నీ అక్కడ తీసినవే!

    సాహితీ భావాల త్రివేణి! సంగీత బాణీల అలివేణి!!
    మామ కె.వి. మహదేవన్‌ సంగీతంలో ‘ముత్యాల ముగ్గు’ పాటలన్నీ అప్పట్లో మహా పాపులర్‌. అభ్యుదయ కవి ఆరుద్ర, అనుభూతివాద కవి శేషేంద్ర, ఆధునిక గేయకవి సినారె... ఈ అపురూప త్రయం రాసిన ఈ సినిమాకు రాసిన సాహిత్యం నేటికీ నిత్యనూతనమే! శ్రీరామనవమి సహా ఏ పండగ వచ్చినా ప్రతి భక్తిగాన సందర్భంలోనూ కర్ణాటక సంగీత విద్వన్మణి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళంలో ‘శ్రీరామ జయరామ సీతారామ...’ అన్న ఆరుద్ర రచన వినపడాల్సిందే! పలు సంప్రదాయ స్త్రీల పాటల ప్రభావంతో ఆరుద్ర రాయగా, పి. సుశీల ప్రాణం పోసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ... ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ... ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన... మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ....’ ఆల్‌టైమ్‌ హిట్‌.

    రామకృష్ణ గొంతులో వినిపించే ఆరుద్ర మరో రచన – ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు... గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు...’. ఆ సాహిత్యం, ఆ బాణీ, ఇషాన్‌ ఆర్య కెమెరా కంటితో కోనసీమ అందాల నడుమ గోదావరిపై ఆ పడవ ప్రయాణం చిత్రీకరణల... అన్నీ కలసి అదో మరపురాని లలిత లావణ్య ప్రణయ గీతం. ఇక, తెలంగాణలో సుప్రసిద్ధమైన మరో జానపద గేయఫణితిని ఎత్తుగడగా చేసుకొని, దాన్ని అందమైన ప్రేమగీతంగా సినారె మలిచిన  ‘గోగులు పూచె గోగులు పూచె ఓ లచ్చగుమ్మడీ...’ మరో మరపురాని పాట. సినారె రాసిన ‘ఎంతటి రసికుడవో తెలిసెరా’ అన్న జావళీ... సాహిత్యపు సొంపులు, తెరపై నటి హలం ఒంపులతో గుమ్మెత్తిస్తుంది. నిజానికి, సెకండాఫ్‌లోని ‘నిదురించే తోటలోకి...’ మినహా మిగతా పాటలన్నీ ఈ సినిమాలో ఫస్టాఫ్‌లోనే వస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఆ ఒక్కటి కూడా నేపథ్యగీతం. కమర్షియల్‌గా అది దుస్సాహసమే! అయినా, జనం మాత్రం అదేమీ ఆలోచించకుండా హాయిగా సినిమా చూసేశారు.

    సినీతోటలోకి... శేషేన్‌ పాట ఒకటి వచ్చింది!
     ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది... సుప్రసిద్ధ కవి – విమర్శకుడు – పండితుడు గుంటూరు శేషేంద్రశర్మ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రాసిన పాట. ‘నా దేశం – నా ప్రజలు’, ‘ఆధునిక మహాభారతం’, ‘కవిసేన మేనిఫెస్టో’ లాంటి రచనలతో సుకవితా వేద్య సుప్రసిద్ధుడైన శేషేంద్ర సినిమాకు పాట రాయడం అదే తొలిసారి. అదే చివరిసారి కూడా! బాపు – రమణల బలవంతం మేరకు ఆయన ఆ పాట రాశారు. అక్షరాక్షరంలో అనుభూతి నింపే శేషేన్‌... ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న ఆ పాటను కూడా అంతే కవితాత్మకంగా రాశారు. సినీగీతాన్ని సైతం నిక్కమైన కవిత్వానికి అచ్చమైన చిరునామాగా మలిచారు. ‘‘శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది... ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది’’, ‘‘నది దోచుకుపోతున్న నావను ఆపండి... రేవు బావురుమంటోందని నావకు చెప్పండి’’ లాంటి ఆ పాటలోని అనేక పంక్తులే అందుకు ఉదాహరణ. సర్వసాధారణంగా సినిమా పాటకు ఒదగని కవితా మేలిబంతులవి. అయినా ఆ పాట, దానికి మామ కట్టిన వరుస, చిత్రీకరణ, కూర్పు... సగటు సినీ ప్రేక్షకుడి స్థాయినీ, అభిరుచినీ పెంచాయి. అదీ ఆ పాట ఘనత, చెదిరిపోని ‘ముత్యాల ముగ్గు’ చరిత.

    ఆల్‌టైమ్‌ హిట్‌ డైలాగ్స్‌తో... ‘స్టార్‌’ గోపాలరావు!
    ‘ముత్యాల ముగ్గు’ సినిమాతో పాటు అందులోని డైలాగులూ అంతే ఫేమస్‌. నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, ఆగి ఆలోచింపజేసే మాటలు... ఒకటా, రెండా... సినిమా అంతా ముళ్ళపూడి వెంకట రమణ రచనా విశ్వరూపం చూడవచ్చు. కథానాయిక పాత్ర నోట వినిపించే ‘‘కన్నెపిల్ల మనసు అద్దంలా ఉంటుంది. అందులో తాళి కట్టేవాడి బొమ్మ పడగానే అది పటంగా మారిపోతుంది’’, ‘‘సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు’’, ‘‘సుఖమూ సంతోషమూ... డబ్బున్న మేడల్లో కాదు, మనసున్న మనుషుల పక్కన ఉంటాయని తెలుసుకున్నాను’’ లాంటి అర్థవంతమైన డైలాగులు అప్పటికీ ఇప్పటికీ ఆలోచింపజేసేవే. అలాగే, అతిగా పొగిడేవాళ్ళను గమనించి జాగ్రత్తపడాలన్న అంశాన్ని రావు గోపాలరావు పక్కనే ప్రత్యక్షమయ్యే మృదంగ బృందం రూపంలో నవ్విస్తూనే, నషాళానికి అంటేలా చెప్పారు దర్శక, రచయితలు.

    అంతకు ముందు అనేక పాత్రలు చేసినా... రావుగోపాలరావును రాత్రికి రాత్రికి సూపర్‌స్టార్‌ను చేసేసిన సినిమా ఇదే. కథలో చెడ్డపనులు చేసే కాంట్రాక్టర్‌ పాత్రలో రావుగోపాలరావు నటనకూ, తూర్పు గోదావరి జిల్లా మాండలికంలో, చిత్రమైన మాడ్యులేషన్‌తో కూడిన డైలాగులకూ ముచ్చటపడని ప్రేక్షకులు ఆ రోజుల్లో లేరంటే అతిశయోక్తి కాదు.  ‘వార్‌ దాన్సిగ తరగ’ అనే ఊతపదంతో సహా ‘అలోవలోవ్, పబ్లిక్‌ సిటీ, డిక్కీలో తొంగోబెట్టేస్తా, కరుసయిపోగలవు, కలాపోసన, ఆ ముక్క నే లెక్కెట్టక ముందు సెప్పాల, ఆఫీసర్ల పెళ్ళాలు డాన్సు చెయ్యరేటండీ, నిచ్చె పెళ్ళికొడుకు, సీరలు సీరలు (ఇంగ్లీష్‌ ‘ఛీర్స్‌’కు బదులుగా), సినేమా కతలు సెప్పద్దన్నానా...’ లాంటి ప్రయోగాలు రావు గోపాలరావు నోట లక్ష్మీ బాంబుల్లా భలే పేలాయి.

    ముఖ్యంగా, సూర్యోదయాన్ని చూస్తూ ‘పైనేదో మర్డర్‌ జరిగినట్టు లేదూ... ఆకాశంలో? సూరీడు నెత్తురుగడ్డలా లేడూ? ...మడిసన్నాక కాసింత కలాపోస నుండాలయ్యా? ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది?’ అంటూ సెక్రటరీ (నటుడు కాకరాల)తో రావుగోపాలరావు జరిపే సంభాషణ తెలుగు సినీ చరిత్రలో నేటికీ చిరంజీవి. అలాగే, కనిపించేది కొద్ది క్షణాలే అయినా... కాంట్రాక్టర్‌ దగ్గరకు వచ్చి ‘కాలు కెంతవుద్ది? కాలేజీ సీటు కెంతవుద్ది? పెసిడెంటు సీటు కెంతవుద్ది? మడ్డరు కెంతవుద్ది? ...ఓలు మొత్తం ఓల్‌సేల్న ఎంతవుద్ది? కన్సెసన్‌ ఏవన్నావుందా?’ అంటూ నోటిలో సిగరెట్‌తో, చేతితో చిటికెలు వేస్తూ నటుడు మాడా వెంకటేశ్వరరావు మాట్లాడే సీనూ, ఆ డైలాగులూ అంతే!
        
    పబ్లిసిటీ బాగా జరిగి, కలెక్షన్లు పెరగడానికి సాఫ్ట్‌ విలనీ చూపిస్తూ రావు గోపాలరావు పోషించిన ఆ కాంట్రాక్టర్‌ పాత్ర, ఆ పాత్ర∙డైలాగులు తోడ్పడ్డాయి. అంతే, ఆయన సంభాషణలున్న సన్నివేశాల్లోని ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల ట్రాక్‌ను గ్రామ్‌ఫోన్‌ కంపెనీ వారు అప్పట్లోనే రెండు ‘ఇ.పి.’ మోడ్‌ రికార్డులుగా తీసుకొచ్చారు. తర్వాత కాలంలో అదే ఆడియో క్యాసెట్లుగానూ వచ్చింది. అంతకు ముందు అక్కినేని ‘సుడిగుండాలు’ సినిమా డైలాగులు 78 ఆర్‌.పి.ఎం. రికార్డులుగా వచ్చినా, ఒక తెలుగు సినిమా డైలాగులు మోస్ట్‌ పాపులరై, జనం ఎగబడి ఆ డైలాగ్‌ రికార్డుల్ని కొనడం మాత్రం ‘ముత్యాల ముగ్గు’తోనే మొదలు. ఆ డైలాగులు ఎంత పాపులరంటే... అప్పట్లోనే అవి పది వేల జతల రికార్డులు అమ్ముడవడం మరో పెద్ద రికార్డ్‌. కేవలం రికార్డుల అమ్మకంపై ఇచ్చే 10 శాతం రాయల్టీతో ఆ రోజుల్లోనే రచయిత రమణకు ఏకంగా రూ. 40 వేలు వచ్చింది. 

    సినిమా చూడడం మీదే కాక కేవలం డైలాగులే అలా పదే పదే వేసుకొని వినడం మీద జనానికి అంత క్రేజు నెలకొందంటే, ‘ముత్యాల ముగ్గు’ ఏ రేంజ్‌ హిట్టో చెప్పనక్కర లేదు. అందుకు ముళ్ళపూడి రాత, బాపు తీత, రావుగోపాలరావు చేత కారణమని చెప్పక తప్పదు. ‘ముత్యాల ముగ్గు’ డైలాగ్స్‌ గ్రామ్‌ఫోన్‌ రికార్డుల తర్వాత ఎన్టీఆర్‌ ‘దానవీరశూర కర్ణ’, ‘యమగోల’ (1977), నూతన్‌ప్రసాద్‌ ‘చలిచీమలు’ (1978) నుంచి ఎన్టీఆర్‌ ‘బొబ్బిలిపులి’ (1982) దాకా వరుసగా అనేక హిట్‌ చిత్రాల డైలాగ్‌ ట్రాక్‌లు అప్పటికి వచ్చిన ఎల్‌.పి. రికార్డుల పద్ధతిలో మార్కెట్‌లో రిలీజై,  జనాన్ని ఆకర్షించాయి. అలా సినిమాల డైలాగ్స్‌ ట్రాక్‌ గ్రామ్‌ఫోన్‌ రికార్డులకూ ‘ముత్యాల ముగ్గు’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయింది.

    జనాకర్షక మార్కెటింగ్‌ వ్యూహాలు!
    బెజవాడకు చెందిన ప్రసిద్ధ అన్నపూర్ణ ఫిలిమ్స్‌ పంపిణీ చేసిన ‘ముత్యాల ముగ్గు’ ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది. రిలీజ్‌ సమయంలో ఆబాలగోపాలాన్నీ థియేటర్లకు ఆకర్షించేందుకు సినిమా పంపిణీదారులు, ప్రదర్శకులు వివిధ రకాల మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ వాడారు. రిలీజ్‌ రోజున విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మార్నింగ్‌ షో, మ్యాట్నీలకు ప్రేక్షకులందరికీ ‘ముత్యాల ముగ్గు’ లాకెట్లు ఉచితంగా ఇచ్చారు. హైదరాబాద్‌ లాంటి చోట్ల ఈ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పలువురు టికెట్‌తో పాటు హనుమంతుడి టోకెన్‌ ఒకటి చిన్నది ఉచితంగా తీసుకున్న సంగతి ఇప్పటికీ అపురూపంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మార్కెటింగ్‌ ఎత్తుగడ సైతం సినిమాకు బాగా లాభించింది. అదో రకం మంచి మౌత్‌ పబ్లిసిటీ తెచ్చింది.

    అంతటితో ఆగలేదు. విజయవాడ లాంటి పట్నాల్లో అప్పట్లో ప్రత్యేకంగా అరచేతి సైజులో ‘ముత్యాల ముగ్గు’ పాటల పుస్తకం ప్రచురించి, మహిళా ప్రేక్షకులకు థియేటర్ల వద్ద ఉచితంగా ఇచ్చేవారు. అది కేవలం సినిమా పాటల పుస్తకమే కాదు. ముగ్గుల పుస్తకం కూడా! ఎందుకంటే, అందులో సినిమాలోని పాటలతో పాటు... రకరకాల మెలికల ముగ్గులు, ఎన్ని చుక్కలతో ఎలా ముగ్గు వేయాలన్న వివరంతో సహా అన్నీ ఉండేవి. దాంతో, ఆ చిన్న సైజు ‘ముత్యాల ముగ్గు’ పుస్తకానికి మహిళల్లో భలే క్రేజుండేది. అందులోని ఆ ముగ్గులను ఇళ్ళ ముందు రంగవల్లులుగా తీర్చిదిద్దడంలో ఆడపిల్లలు పోటీలు పడేవారు. అలా ముగ్గులతో పాటు సినిమా కూడా జనం నోళ్ళలో నానడం... అతి పెద్ద మార్కెటింగ్‌ వ్యూహమైంది. అలా ఆ రోజుల్లోనే ‘ముత్యాల ముగ్గు’ అనేక కొత్త తరహా ప్రచార ధోరణులకు నాంది పలికింది.

    పబ్లిసిటీ యాడ్స్‌లోనూ ప్రత్యేకత
    బాపు – రమణలకు సన్నిహితుడైన ప్రముఖ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ జి.ఎన్‌. భూషణ్‌ ప్రెస్‌ రిలేషన్స్‌కు పనిచేసిన ఈ చిత్రం పబ్లిసిటీలోనూ కొత్త పోకడలు పోయింది. టైటిల్‌కు తగ్గట్టే ముగ్గుల్ని పబ్లిసిటీ డిజైన్‌లో భాగం చేశారు. అలాగే, నటీనటుల టైట్‌ క్లోజప్‌ ఫోటోలను డిజైన్లలో ఎక్కువగా వాడి, చూపరులకు కొత్త ఫీల్‌ తీసుకొచ్చారు. పూర్వాశ్రమంలో ప్రఖ్యాత యాడ్‌ ఏజెన్సీల్లో పనిచేసిన అనుభవం ఉన్న బాపు... సర్వసాధారణంగా వాణిజ్య ఉత్పత్తుల పబ్లిసిటీ డిజైనింగ్‌లో కనిపించే పద్ధతిని ఈ సినిమా పబ్లిసిటీ యాడ్స్‌కు వాడారు. పేజీలో చాలా భాగం ఖాళీ ఉంచి, కంటికి కావాల్సినంత రిలీఫ్‌ ఇస్తూ, ఓ మూలన 200వ రోజు అంటూ సినిమా టైటిల్, ప్రధాన వ్యక్తుల పేర్లు వేయడం లాంటి యాడ్‌ పబ్లిసిటీ టెక్నిక్‌లతో అబ్బురపరిచారు. బాపు ఏనాడో చూపిన ఆ బాట ఆ తర్వాత చాలామందికి అనుసరణీయమైంది. చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు మణిరత్నం సైతం నాగార్జున ‘గీతాంజలి’ (1989 మే 12) లాంటి తన సినిమాల పబ్లిసిటీకి ఈ తరహా యాడ్స్‌ను డిజైన్‌ చేయించడం మరపురాని విషయం.∙

    సినిమా నవలా సూపర్‌హిట్టే!
    ‘ముత్యాల ముగ్గు’ తొలి రిలీజు నాడే ఆ సినిమాకు సంబంధించిన వెండితెర నవల కూడా మార్కెట్‌లోకి వచ్చింది. ఆ సినిమాకు నిర్మాతగా క్రెడిట్‌ అందుకున్న తెలుగు లెక్చరర్, స్వయంగా రచయిత అయిన ఎమ్వీయలే ఆ వెండితెర నవలీకరణ చేయడం విశేషం. బాపు – రమణల ‘సాక్షి బుక్స్‌’ పేరిట విజయవాడలోని నవోదయ పబ్లిషర్స్‌ అధినేత ఎ. రామ్మోహనరావు ఆ నవలను ముద్రించి, సోల్‌ డిస్ట్రిబ్యూషర్‌గా వ్యవహరించారు. సినిమాతో పాటు ఈ వెండితెర నవల కూడా సూపర్‌హిట్‌. సినిమా రిలీజైన కొద్ది రోజులకే అన్ని కాపీలూ హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి. ‘ముత్యాల ముగ్గు’ 50వ రోజుకు చేరుకొనే సమయానికి నవల రెండో ముద్రణకు వచ్చేసింది. నూటయాభై రోజుల నాటికి ఆ ముద్రణ కూడా అయిపోయింది. 1976 మార్చికి ముచ్చటగా మూడో ముద్రణ వచ్చేసింది. అలా ఒక సినిమా తాలూకు వెండితెర నవల అంతగా ప్రాచుర్యం పొందడం, అన్ని కాపీలు అమ్ముడుపోవడం కూడా అప్పట్లో ‘ముత్యాల ముగ్గు’ చేసిన మ్యాజిక్‌. ఎన్నో ముద్రణలు పొందిన ఆ వెండితెర నవల ఇటీవల ‘అక్షజ్ఞ పబ్లికేషన్స్‌’ ద్వారా మళ్ళీ కొత్తగా ప్రచురితమైంది. యాభై ఏళ్ళ నాటి ఆ సినిమా నవల ఇలా నేటికీ పాఠకాదరణకు నోచుకోవడం నిజంగానే విశేషం.

    పోటాపోటీలో... 300 రోజుల బాక్సాఫీస్‌ బంపర్‌హిట్‌
    1975 జూలై చివరలో ‘ముత్యాల ముగ్గు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకపక్కన హిందీ హిట్‌ ‘యాదోంకీ బారాత్‌’కు రీమేకైన అగ్ర హీరో ఎన్టీఆర్‌ ‘అన్నదమ్ముల అనుబంధం’ అప్పటికే రిలీజై, జోరు మీదుంది. మంచి వసూళ్ళతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. మరోపక్కన రంగనాయకమ్మ పాపులర్‌ నవల ఆధారంగా, వరుస విజయాల హీరో శోభన్‌బాబుతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ వచ్చి వారమే అయింది. వేరొకపక్క కృష్ణ – వాణిశ్రీ జంటగా కాశ్మీర్‌ లాంటి సుందర ప్రదేశాల్లో కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వంలో ‘చీకటి వెలుగులు’ వచ్చి రెండే వారాలైంది. ఇక, ‘ముత్యాల ముగ్గు’ వచ్చిన సరిగ్గా వారం రోజులకల్లా కృష్ణంరాజు – జయప్రద తదితరులు నటించిన ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ రిలీజైంది. ‘ముత్యాల ముగ్గు’ వచ్చి ఇరవై రోజులైందో లేదో, శోభన్‌బాబు ‘జేబుదొంగ’ (1975 ఆగస్ట్‌ 15న రిలీజ్‌) సైతం థియేటర్లలో వచ్చి చేరి, హిట్టయింది.  

    అదిగో... అలాంటి గట్టి పోటాపోటీ సమయంలో, అందరు స్టార్‌ హీరోల సినిమాల మధ్య, ఎలాంటి స్టార్లూ లేకుండా రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ ఆ పెద్ద చిత్రాలను తట్టుకొని, బలంగా నిలబడింది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ అధిగమించి మరీ, అఖండ విజయం సాధించింది. బ్లాక్‌బస్టర్‌ సూపర్‌హిట్టయింది. అదీ అసాధారణ విషయం. మొదటి వారం కాస్త అటూ ఇటూగా ఉన్నా, రెండోవారం అందుకున్న సినిమా కలెక్షన్లు, మూడోవారానికల్లా బాగా పుంజుకొన్నాయి. ఆపైన సినిమా ఆగకుండా దూసుకుపోయింది.  

    మొత్తం 28 కేంద్రాల్లో 29 థియేటర్లలో రిలీజైన ‘ముత్యాల ముగ్గు’ 12 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. చిత్రంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లు రెంటిలోనూ వేర్వేరుగా వంద రోజులు ఆడడం విశేషం. ఆ రోజుల్లోనే ఫస్ట్‌ సెట్‌లో విడుదలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, తిరుపతి... 5 కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకొంది. సెకండ్‌ సెట్‌లో రిలీజైన మరో కేంద్రం బెంగుళూరులోనూ ‘మినర్వా’ థియేటర్‌లో ఆ పైన సిల్వర్‌ జూబ్లీ చేసుకొంది. అక్కడ ఏకంగా 200 రోజులు దిగ్విజయంగా నడిచింది. ఇక, తిరుపతి ‘మినీ ప్రతాప్‌’లో అయితే ఈ సినిమా 260 రోజులు ఆడడం మరో విశేషం. తెలుగు రాజధాని హైదరాబాద్‌లో షిఫ్టులతో ఏకంగా 300 రోజులు నడిచిందీ సినిమా. 
        
    ‘ముత్యాల ముగ్గు’ చిత్ర శతదినోత్సవం 1975 నవంబర్‌ 1 ఉదయం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరగగా, త్రిశత దినోత్సవాన్ని 1976 మే 21న మద్రాస్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో నిర్వహించారు. హైదరాబాద్‌ సహా తెలుగు ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో తీసుకువచ్చిన ‘బాలానంద సంఘం’ బాలబాలికల ముందు ఆ 300 రోజుల వేడుక జరిగింది. సరిగ్గా ఆ వేడుక జరిగిన వారం రోజులకు మే 29న బాపు – రమణల మరో బంపర్‌హిట్‌ పౌరాణిక గాథ కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ రిలీజవడం విశేషం.

    ఎన్టీఆర్‌ మెచ్చిన త్రీ మచ్‌ సినిమా!
    ‘ముత్యాల ముగ్గు’లో వెన్నెల్లో మల్లెపందిరి కింద హీరో హీరోయిన్ల శోభనం రాత్రి çసన్నివేశాలు, వాటిని అశ్లీలంగా కాక అందమైన అనుభవంగా చిత్రీకరించిన విధానం, ఆ నేపథ్య సంగీతం... వగైరాలను అగ్ర హీరో ఎన్టీఆర్‌ సైతం ఎంతో మెచ్చుకున్నారు. ‘మా పాతరోజులు గుర్తొచ్చాయి బ్రదర్‌’ అని బాపు – రమణలతో అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ మాతో, ‘అసలు మీ సినిమాలో కుర్రాడు... విలన్‌ దగ్గర సర్వెంటుగా రావడం హైలైట్‌! ఏముంది? ‘బాలనాగమ్మ’లో బాలవర్ధిరాజు... మాయల ఫకీరు కోటలో చేరినట్టే! మీరు ఇంకాస్త డోసు పెంచితే సినిమా టూ హండ్రెడ్‌ డేస్‌ పోయేది’ అని, ఓ క్షణం ఆగి – ‘ఓహో! మొన్న త్రీ హండ్రెడ్‌ డేస్‌ అయింది కదూ. ఇది టూ మచ్‌... కాదు కాదు త్రీమచ్‌’ అని అట్టహాసంగా నవ్వేశారాయన’’ అని బాపు స్వయంగా పేర్కొన్నారు.  

    స్టార్లకు సైతం దక్కని సిల్వర్‌జూబ్లీ హిస్టరీ!
    ఆ రోజుల్లో ‘ముత్యాల ముగ్గు’ ఎంత పెద్ద హిట్టంటే, 1975లో తెలుగు సినిమా టాప్‌ గ్రాసర్లలో అదొకటి. హైదరాబాద్‌లో అంతకు ముందున్న ‘దసరా బుల్లోడు’, ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి స్టార్‌ హీరోల ‘‘25 వారాల సూపర్‌హిట్‌ చిత్రాల రికార్డుల్ని 50 రోజుల్లోనే అవలీలగా’’ దాటేసింది. ఆ సంగతి పంపిణీదారులే ఘనంగా పత్రికల్లో ప్రకటించారు. 1975 వరకు తెలుగు సినీచరిత్రను తరచి చూస్తే – ‘జీవితం’ (1950) సినిమా అనంతరం, 1950వ దశకం ప్రారంభంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు స్టార్‌ హీరోలైన తర్వాత... ఆ పాతికేళ్ళ కాలంలో ఆ ఇద్దరు హీరోలూ లేకుండా, లేదా ఒక చిన్న సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్టయింది రెండే రెండుసార్లు. ఆ చిత్రాలు ఏవంటే,  ఒకటి – ‘లేత మనసులు’ (1966). రెండు – ‘ముత్యాల ముగ్గు’ (1975). 
        
    అలాగే, 1970ల ప్రారంభంలో కృష్ణ, శోభన్‌బాబు స్టార్‌ హీరోలైన తర్వాత కూడా కృష్ణ ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, అలాగే శోభన్‌బాబు ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘జీవనజ్యోతి’ లాంటివి మాత్రమే బ్లాక్‌బస్టర్‌ సూపర్‌హిట్లయ్యాయి. ఆ స్టార్‌ హీరోలందరితో సమంగా నిలిచింది ఒక్క ‘ముత్యాల ముగ్గే’. ఆ తర్వాత మళ్ళీ కె. విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’ (1980 రిలీజ్‌)కి ఆ ఘనత దక్కింది. అటుపైన అనేక చిత్రాలు ఆ దోవలో పయనించాయి.

     ఇక, సిల్వర్‌ జూబ్లీల్లోనూ ‘ముత్యాల ముగ్గు’ది మరో ఘనమైన రికార్డ్‌. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్ల సినిమాల తర్వాత ఫస్ట్‌ బ్యాచ్‌ రిలీజ్‌లో 5 సెంటర్లలో రెగ్యులర్‌ షోలతో రజతోత్సవం చేసుకున్న సినిమా కూడా ఇదొక్కటే! తెలుగు సినిమా బాక్సాఫీస్‌ చరిత్ర గమనిస్తే... స్టార్లయిన కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులకు సైతం వాళ్ళ మొత్తం కెరీర్‌లోనే రెగ్యులర్‌ షోలతో, ఇన్ని కేంద్రాల్లో పాతికవారాలాడిన సినిమా ఏదీ లేదు. అది గమనార్హం. ‘ముత్యాల ముగ్గు’ తర్వాత మళ్ళీ 5 సెంటర్లలో రెగ్యులర్‌ షోలతో, మరో 4 కేంద్రాల్లో నూన్‌షోలతో సిల్వర్‌ జూబ్లీ ఆడిన సినిమా ఆ తరంలో ‘శంకరాభరణం’ ఒక్కటే! 
        
    అలాగే, 1975 నవంబర్‌ 1 నాటికి వంద రోజులు పూర్తి చేసుకున్న ‘ముత్యాల ముగ్గు’ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు సంబంధించినంత వరకు అత్యంత అన్‌ సీజన్‌గా భావించే నవంబర్, డిసెంబర్, అలాగే జనవరి ఆరంభం... ఇలా మొత్తం పదివారాలనూ బలంగా తట్టుకొని నిలబడి, నిలకడగా కలెక్షన్లు రాబడుతూ, రెగ్యులర్‌ షోలతో రజతోత్సవం వైపు స్థిరంగా అడుగులు వేసింది. అది ఆ సినిమా బాక్సాఫీస్‌ సత్తాకు నిదర్శనం. గమనించాల్సిన మరో విశేషం. ‘ముత్యాల ముగ్గు’ డైలాగుల్లోనే చెప్పాలంటే, ఈ ‘‘ఇస్టరీని సింపేస్తే సిరిగిపోదు... సెరిపేస్తే సెరిగిపోదు!!’’

    తెగనమ్మిన నిర్మాత... లాభపడ్డ బయ్యర్‌...
    అనూహ్య విజయం అనంతరం కొన్నేళ్ళకు... సదరు ‘ముత్యాల ముగ్గు’ నిర్మాత చుట్టూ చాలామంది చేరారు. వాళ్ళమాట విన్న నిర్మాత ఎమ్వీయల్‌ కాస్తా... బాపు–రమణలకు మాట మాత్రంగానైనా చెప్పకుండానే బోలెడంత రిపీట్‌ రన్‌ వ్యాల్యూ ఉన్న కామధేనువు లాంటి ‘ముత్యాల ముగ్గు’ హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఎమ్మెస్‌ రెడ్డికి రెండున్నర లక్షలకు తెగనమ్మేశారు. చిత్రమేమంటే, నెల తిరిగే లోపల కేవలం దూరదర్శన్‌లో ప్రసారానికి గాను ఆ సినిమా టెలీ రైట్స్‌ ఒక్కటే ఎమ్మెస్‌ రెడ్డికి రూ. 5 లక్షలు తెచ్చిపెట్టాయి. మద్రాసు దూరదర్శన్‌ నుంచి (నేషనల్‌ టెలికాస్ట్‌లో భాగంగా) ప్రసారమైన మొట్టమొదటి తెలుగు సినిమా ‘ముత్యాల ముగ్గే’. ఆ ప్రసారానికి గాను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలు పలకడం మరో విశేషం.

    అవార్డుల్లోనూ... ఆగని సూపర్‌ హిట్‌!
    ఆ ఏడాది అనేక సినిమాలు వచ్చి ఉండవచ్చు. కానీ, ‘ముత్యాల ముగ్గు’ సృష్టించిన సంచలనం మాత్రం సాధారణం కాదు. జనం రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేట్‌ అవార్డులు... అన్నీ ఆ సినిమాకే! ఆ ఏటి ఉత్తమ తెలుగు చిత్రంగా కేంద్ర ప్రభుత్వం వారి రజత కమలం, అదే నేషనల్‌ అవార్డుల్లో అఖిల భారత స్థాయిలో ఉత్తమ వర్ణఛాయాగ్రహణానికి (ఇషాన్‌ ఆర్య) అవార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వ రజత నంది దాకా ‘ముత్యాల ముగ్గు’కే వచ్చాయి. ఇక, మద్రాస్‌ ఫిలిమ్‌ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ ఫ్యాన్స్, ఆంధ్రా సినీ గోయర్స్, ‘ఆంధ్రపత్రిక’, తెనాలి ‘ఫిలిమ్‌ క్లాసిక్‌’... ఇలా అనేక ప్రతిష్ఠాత్మక ప్రైవేట్‌ సంస్థల అవార్డులు కూడా లెక్కేస్తే... సుమారు నాలుగు పదుల దాకా అవార్డులు ఈ సెల్యులాయిడ్‌ క్లాసిక్‌కు దక్కాయి. ఇలా ‘ముత్యాల ముగ్గు’కు జనం రివార్డుతో పాటు విమర్శకుల అవార్డుల పరంపర లభించడం నేటికీ అబ్బురపరుస్తుంది.

    తారాచంద్‌ బర్జాత్యా సహా తెరకెక్కని ఆలోచనలెన్నో!
     ‘ముత్యాల ముగ్గు’ చూసి, ప్రముఖ హిందీ సినీ పంపిణీ సంస్థ ‘రాజశ్రీ పిక్చర్స్‌’ అధినేత – చిత్ర నిర్మాత అయిన తారాచంద్‌ బర్జాత్యా సైతం బాపు – రమణలతో సినిమా తీయాలని ముచ్చటపడ్డారు. బాపును తన మద్రాసు ఆఫీసుకు పిలిపించారు. మనసుకు హత్తుకున్న ‘ముత్యాల ముగ్గే’ హిందీలో చేద్దామని పెద్దాయన ప్రతిపాదించారు. కానీ, అప్పటికే ఏ.వి.ఎం. వారు ఆ సినిమా హక్కులు కొనేసుకున్నారు. పోనీ... వెండితెరపై హిట్‌ ఫార్ములా అయిన ‘సిండ్రెల్లా’ తరహా కథ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనా చేశారు. ఒక దశలో ‘శ్రీకృష్ణ – సుదామ’ (మన తెలుగు భక్త కుచేలుడి కథ) చిత్రం తీయించాలని కూడా తారాచంద్‌ అనుకున్నారు. కానీ, దర్శక – రచయితల జీతభత్యాల మొదలు సినిమా ఖర్చుల దాకా అన్నింటిలో అపరిమితమైన పొదుపు పాటించే తారాచంద్‌ బార్జాత్యా దెబ్బకు ఆ ప్రతిపాదనలేవీ పట్టాలెక్కనే లేదు. 
        
    అలాగే, ‘శ్రీరామచిత్ర’ బ్యానర్‌పై తొలిచిత్రంగా ‘ముత్యాల ముగ్గు’ నిర్మాణమై, హిట్టయిన తర్వాత... అదే బ్యానర్‌పై రెండో చిత్రాన్ని బాపు – రమణల సారథ్యంలో ఏయన్నార్‌తో ప్రకటించారు. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. అలాగే, బాపు – రమణల ‘త్యాగయ్య’లో ప్రధాన పాత్ర చేసేందుకు ఏయన్నార్‌ సరే అన్నా... 1980ల మొదటి దాకా అదీ కార్యరూపం దాల్చలేదు. చివరకు ‘శంకరాభరణం’ ఫేమ్‌ జె.వి. సోమయాజులుతో నవతా కృష్ణంరాజు నిర్మాతగా, బాపు – రమణల ‘త్యాగయ్య’ (1981 ఏప్రిల్‌ 17) తయారవడం వేరే కథ.

    హిందీలో ఏ.వి.ఎం! కాపీకొట్టి మరీ... మరికొందరు!!

        సూపర్‌హిట్టయిన ‘ముత్యాల ముగ్గు’ కథ ఆ తర్వాత హిందీలోనూ రీమేక్‌ అయింది. హక్కులు తీసుకున్న ప్రసిద్ధ సంస్థ ఏ.వి.ఎం. వారు హిందీలో ‘జీవన్‌ జ్యోతి’గా నిర్మించారు (1976 మే 7న రిలీజ్‌). సలిల్‌ చౌధరీ సంగీతం అందించిన ఆ సినిమా ప్రముఖ నటి బిందియా గోస్వామికి తొలి సినిమా. చిన్నపిల్లలు, కుటుంబ సెంటిమెంట్‌ నిండిన ఆ కథను అక్కడి ప్రేక్షకులూ ఆదరించారు. ఆ హిందీ రీమేక్‌ సైతం వంద రోజులు ఆడింది. ఆపైన షిఫ్టులతో రజతోత్సవమూ జరుపుకొంది.

        ‘ముత్యాల ముగ్గు’ కథ హిందీ తర్వాత తమిళంలోకీ వెళ్ళింది. తెలుగులో ‘పుట్టినిల్లు – మెట్టినిల్లు’ దర్శకత్వం వహించిన పట్టు (పూర్తిపేరు ఆర్‌. పట్టాభిరామన్‌) దర్శకత్వంలో ఆర్ముగం ఆర్ట్స్‌ వారు తమిళంలో ‘మహాలక్ష్మి’ పేరిట ఈ రీమేక్‌ను తెరకెక్కించారు. తెలుగులో నటించిన సంగీతే తమిళంలోనూ హీరోయిన్‌. జైశంకర్‌ హీరో. 1976 మే 27న ఈ తమిళ ‘మహాలక్ష్మి’ ఆరంభమైంది. తెలుగులోని రావుగోపాలరావు పాత్రను అశోకన్, కాంతారావు పాత్రను యస్‌.వి. సుబ్బయ్య తమిళ వెర్షన్‌లో పోషిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఏమైందో ఏమో కానీ తీరా ఈ తమిళ రీమేక్‌ జనం ముందుకొచ్చేటప్పటికి 1979 అక్టోబర్‌ 20 అయింది.

    ఇవన్నీ అధికారిక రీమేక్‌లైతే, హీరో కృష్ణతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన సూపర్‌హిట్‌ ‘నంబర్‌ వన్‌’ (1994 జనవరి 14) సహా అనధికారిక కాపీలకు హద్దే లేదు. అలాంటి ఓ హిట్‌ సినిమా చూసి ఆశ్చర్యపోయిన రచయిత రమణ అది తమ ‘ముత్యాల ముగ్గు’కు కాపీ అంటూ ఫిర్యాదు చేశారు. సినీ రచయితల సంఘం వాళ్ళు పదమూడు మంది సభ్యులతో ఏకంగా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ వారు రెండు సినిమాలూ చూసి, చర్చించి, సదరు సినిమా అక్షరాలా ‘ముత్యాల ముగ్గు’కు కాపీయే అని ఏకగ్రీవంగా తీర్మానం కూడా రికార్డ్‌ చేశారు. ఇంతలో సదరు కాపీచిత్ర దర్శక, నిర్మాతలు ఏం మతలబు చేశారో ఏమో కానీ, సదరు తీర్మానం బయటకు రాకుండానే భూస్థాపితమై పోయింది. ‘కాపీ రైట్‌’ కాస్తా ‘కాపీ కొట్టడమే రైటు’ అన్నట్టుగా తయారైంది.

     ఏమైనా, మాటలు, పాటలు, సంగీత స్వరాలు, నేపథ్య గళాలు, కళ్ళను కట్టేసే ఛాయాగ్రహణ సౌందర్యం, నాలుగు నిమిషాల పాటు మాటా పలుకూ లేకుండా చిత్రీకరించిన హీరో హీరోయిన్ల తొలి రేయి సన్నివేశంలో చెవులకు పట్టేసే సజ్జాద్‌ హుస్సేన్‌ మాండొలిన్‌ వాద్య నేపథ్య మాధుర్యం, ప్రతి పాత్రకూ ప్రాణం పోసిన పాత్రధారుల అభినయం, నిర్మాణ విలువలు మొదలుకొని నిర్దేశకత్వ సామర్థ్యం దాకా... ఇలా అన్నింటి సమపాళ్ళ మేళవింపు ‘ముత్యాల ముగ్గు’. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ‘ఆంధ్రప్రభ’లో ఈ సినిమాను సమీక్షిస్తూ, ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ పేర్కొన్నట్టు ‘‘రమణీయమైన దృశ్యకావ్యంగా రూపొందిన రంగుల చిత్రం ఇది.’’ అందుకే, ఇది మామూలు చిత్రాల్లో కనిపించని గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. భావుకత, కళాత్మకత కోరుకునే సినీ ప్రేమికులకు పూర్తి సంతృప్తిని కలిగిస్తుంది. వెరసి నాటికీ నేటికీ ఇది... తెలుగు సినిమాతల్లి ముంగిట వెల్లివిరిసిన ‘ముత్యాల ముగ్గు’. మున్నూరు రోజుల పైగా మహాజనం మెచ్చిన బ్లాక్‌బస్టర్‌ రతనాల రగ్గు. తరాలు మారినా తెలుగు తెరకు ఎప్పటికీ తరగని నిగ్గు. 
    – రెంటాల జయదేవ

  • బుల్లితెర నటి అనూష హెగ్డే భర్త, నటుడు ప్రతాప్‌ సింగ్‌తో చాలాకాలం దూరంగా ఉంటోంది. వీరిద్దరికీ విడాకులయ్యాయా? అన్న అనుమానాలకు ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది అనూష. నా వైవాహిక జీవితంలో 2023 తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో మీ అందరికీ తెలుసు. మేమిద్దరం చట్టపరంగా 2025లోనే విడిపోయాం అని తెలియజేయడానికే ఈ పోస్ట్‌..

    అధ్యాయం ముగిసింది
    దీనిపై ఎటువంటి చర్చ పెట్టొద్దని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు, అందిస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞతలు అని పేర్కొంది. పరస్పర అంగీకారంతోనే తన జీవితంలో ఈ అధ్యాయం ముగిసిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబం, కెరీర్‌, మానసిక ప్రశాంతతపైనే దృష్టిపెట్టినట్లు రాసుకొచ్చింది.

    సీరియల్‌లో జంటగా..
    అనూష హెగ్డే, ప్రతాప్‌ సింగ్‌ 'నిన్నే పెళ్లాడతా' సీరియల్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అదే నెలలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొంతకాలంగా విభేదాలు మొదలయ్యాయి. చివరకు దంపతులిద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు.

    సీరియల్‌, సినిమా
    తెలుగు నటుడు ప్రతాప్‌ సింగ్‌.. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు ఇలా పలు సీరియల్స్‌ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ వెబ్‌ సిరీస్‌లో నిహారికకు జోడీగా యాక్ట్‌ చేశాడు. బేవర్స్‌ సినిమాలోనూ నటించాడు. అనూష హెగ్డే విషయానికి వస్తే సూర్యకాంతం సీరియల్‌లో యాక్ట్‌ చేసిన ఈ నటికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ బుల్లితెరపై సెటిలైంది.

     

     

    చదవండి: ఓటీటీలో ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే మూవీ.. సిరై రివ్యూ

  • ఆట సందీప్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగిపోతుంది. మనశంకర్‌ వరప్రసాద్‌ గారు సినిమాలో చిరంజీవితో ఆయన వేయించిన ‘హుక్‌’ స్టెప్పులు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ఆయన కొరియోగ్రఫీ అందించిన ‘గిర గిర గింగిరానివే..(చాంపియన్‌)’ సాంగ్‌ కూడా సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఇలా సందీప్‌ కొరియోగ్రఫీ చేసిన రెండు పాటలు వరుసగా సూపర్‌ హిట్‌ అవ్వడంతో..ఇప్పుడు ఆయన గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. సోషల్‌ మీడియాలో కూడా సందీప్‌ గురించి చర్చిస్తున్నారు. గతంలో సందీప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను షేర్‌ చేస్తూ..ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ఇదిలా ఉంటే..తాజాగా సందీప్‌కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. డబ్బులు ఇస్తాం.. తమతో గడపమని పలువురు మహిళలు తనను అడిగినట్లు చెప్పాడు. ఆ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చర్చకు వచ్చినప్పుడు సందీప్‌ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు. 

    ‘నాకు కూడా డబ్బులు ఇస్తాం.. వస్తావా అని కొంతమంది మహిళలు ఆఫర్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ.. ఒక వారం ఎంజాయ్ చేయాలి, డబ్బు ఇస్తా.. తనతో గడపమని ఆఫర్ చేసింది. ఈ మెసేజ్ చాలా పద్ధతిగా, కార్పొరేట్ స్టైల్‌లో మీకు ఇష్టం ఉందా? అన్నట్లుగా పెట్టారు. ఆమె ఎవరో ఏంటో నాకు తెలియదు. వెంటనే నాకు ఆసక్తి లేదని రిప్లై ఇచ్చాను. రెండు రోజుల తర్వాత మళ్లీ అదే పర్సన్‌ నుంచి ‘డబ్బులు ఎక్కువ కావాలంటే ఇచ్చేస్తా’ అని మెసేజ్‌ వచ్చింది. దీంతో నేను వెంటనే నా నెంబర్‌ని బ్లాక్‌ చేశా. పబ్లిక్‌లో ఉన్నప్పుడు గుడ్‌ వేలో ఉండాలని అనుకున్నాను. 

    అందుకే అలాంటి పనులు చేయదల్చుకోలేదు. అలా 4-5 సార్లు వేరు వేరు అమ్మాయిలు మేసేజ్‌ చేశారు. ఒకసారి ఓ ట్రాన్స్‌ జెండర్‌ కూడా అలా అడిగారు. ఒక బ్యూటిఫుల్‌ మెసేజ్‌ పెట్టి.. చివరల్లో నీతో గడపాలని ఉంది’ అని చెప్పారు. నేను సున్నితంగా తిరస్కరించా. వీళ్లంతా నా అందం చూసి కాదు కానీ.. నా డ్యాన్స్‌ నచ్చి అలా మెసేజ్‌ చేశారని భావిస్తున్నా’ అని సందీప్‌ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సందీప్‌ పక్కన అతని భార్య జ్యోతి కూడా ఉంది.  మన శంకరవరప్రసాద్‌గారు రిలీజ్‌ తర్వాత ఇప్పుడు మరోసారి ఆ ఇంటర్వ్యూలో సందీప్‌ చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. 

  • ప్రేమ గుడ్డిది. రంగు, ఆస్తి, కులమతాలు దానికి కనిపించవు. ఎప్పుడు ఏ రెండు మనసుల్ని కలుపుతుందో దానికే తెలీదు. కానీ, ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ ప్రేమ సుఖాంతం అవడం చాలా కష్టం. ఈ క్రమంలో అది పెట్టే పరీక్షలు, కష్టాలు అనుభవించినవారికే ఎరుక. సిరై సినిమాలో అదే చూపించారు. ఆ మూవీ రివ్యూ ఓసారి చూసేద్దాం...

    కథ
    విక్రమ్‌ ప్రభు పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటించాడు. ఓరోజు ఖైదీ అబ్దుల్‌ (అక్షయ్‌ కుమార్‌)ను కోర్టు విచారణకు తీసుకెళ్లే డ్యూటీకి వెళ్తాడు. ఆ సమయంలో ఖైదీ తప్పించుకుంటాడు. దీంతో దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్తే అక్కడ ఖైదీ ఉంటాడు. కానీ అతడిని అప్పగించేందుకు ఆ స్టేషన్‌ హెడ్‌ ఒప్పుకోడు. పైగా విక్రమ్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ తాగి ఉన్నాడని గుర్తిస్తాడు. మరి ఖైదీని వీళ్లు విచారణకు తీసుకెళ్లారా? డ్యూటీ సరిగా చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు. తప్పించుకున్న నేరస్తుడు మళ్లీ ఎందుకు లొంగిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

    ఎలా ఉందంటే?
    పోలీస్‌ డ్యూటీ అంటే ఆషామాషీ ఏం కాదు. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. దుండగులు కత్తులతో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినా ఖైదీలా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. అది చూసి మనకే జాలేస్తుంది. ఇక ఖైదీ అబ్దుల్‌.. చిన్నప్పటినుంచే అతడికో లవ్‌స్టోరీ ఉంది. స్కూల్‌డేస్‌ నుంచే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మతాలు వేరు. 

    మనసును కదిలిస్తుంది
    అందులోనూ అతడికి తల్లి తప్ప తండ్రి లేడు. ఈ ప్రేమ వర్కవుట్‌ కాదని అర్థమై ప్రియురాలిని దూరంగా ఉండమని చెప్తాడు. కానీ, ఆమె మాత్రం అతడి చేయి వదలదు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతడి కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక్కడ వారి స్వచ్ఛమైన ప్రేమ మనసుల్ని కదిలిస్తుంది. అతడు జైలు నుంచి విడుదలవుతాడునుకున్న సమయంలో ఓ ట్విస్ట్‌ వస్తుంది. 

    ఓటీటీలో
    అప్పుడు ప్రేక్షకులు కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. దర్శకుడు సురేశ్‌ రాజకుమారి సిరై సినిమాలో సమాజంలో పెరుగుతోన్న మతవివక్షను, న్యాయస్థానంలో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో మనసును హత్తుకున్నారు. యాక్టర్స్‌ అందరూ బాగా నటించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి. మిస్‌ అవకుండా చూసేయండి..

  • చిరంజీవి- వెంకటేశ్‌ ఇద్దరూ కలిసి అదిరిపోయే రేంజ్‌లో తొలిసారి స్టెప్పులు వేశారు.​ సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకరవరప్రసాద్‌ గారు మూవీలో వారు నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి  తాజాగా 'అదిపోద్ది సంక్రాంతి' వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో చిరు, వెంకీ పోటీపడి స్టెప్పులు వేశారు. భీమ్స్‌ సంగీతం అందించగా.. కాసర్ల శ్యామ్‌ పాటను రాశారు. నకాశ్‌ అజీజ్‌, విశాల్‌ దడ్లానీ ఆలపించారు. ఫుల్‌ జోష్‌ తెప్పించే సాంగ్‌ను మీరూ చూసేయండి. 
     

Telangana

  • పోలీసు కొలువు.. నిత్యం సవాళ్లతో సహవాసం.. పోలీస్‌ శాఖలో మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తూ.. సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌, సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అభిలాష బిస్త్‌ ఆ శాఖలో దూసుకుపోతున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన అభిలాష బిస్త్‌.. 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణిగా సర్వీసులో చేరారు. రాష్ట్ర పోలీస్‌ శాఖకు ఎంపికవుతున్న కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 1986లో ఏర్పాటైన పోలీసు అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్‌ కావడం విశేషం.

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షి డిజిటల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీస్‌ శాఖలో ఆమె జర్నీతో పాటు తెలంగాణ పోలీసింగ్‌ గురించి వివరించారు. పోలీసుశాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం సాధించగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పోలీస్‌ శాఖ చేపట్టిన చర్యలు, వివిధ అంశాలపై మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు సాక్షితో పంచుకున్నారు.

    పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో క్లిక్‌ చేయండి:

  • సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో నిన్న అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు( ఆదివారం) ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచానిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

    కాగా నిన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అఖిల్ (7), ప్రణిత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) చనిపోయినట్లు  ఫైర్ డిజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. సెల్లార్‌లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బాధితులు బయిటకి రావడం కష్టమైందని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

  • సాక్షి హైదరాబాద్‌: నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలోని అగ్నిప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. నాంపల్లి ఫర్నిచర్‌ షాపులో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు ఒక రోజంతా రెస్క్యూ ఆపరేషన్‌ సాగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు.

    ప్రమాదంలో చిక్కుకున్న ఐదుగురు మృతి చెందారని ఫైర్‌ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ తెలిపారు. సెల్లార్‌లో ఫర్నిచర్‌, కెమికల్స్‌ నిల్వ ఉంచారని, బాధితుల మెట్ల మార్గంలోకి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్‌ షట్టర్‌కు తాళం వేయడంతో బయటకు రాలేకపోయారన్నారు. ఫైర్‌ సెఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
     

  • సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానెల్  డిబేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వైఖరిని బీఆర్ఎస్ ఖండించింది. ప్రత్యేక చర్చ సందర్భంగా MLC రవీందర్‌ రావుపై ఏబీఎన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్యా స్పూర్తికి ఇది విరుద్ధం అని పేర్కొంది. కనుక తక్షణమే ఎమ్‌ఎల్‌సీకి, ఏబీఎన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఇక నుంచి ఏబీఎన్ ప్రతినిధులను బీఆర్ఎస్ సమావేశాలకు అనుమతించేది లేదని కీలక నిర్ణయం తీసుకుంది. 

     

     

  • సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ క్రైం: చూసేందుకు అందంగా ఉంటారు. చక్కగా రెడీ అయ్యి ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో రీల్స్‌ అప్‌లోడ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవుతారు. లైక్‌ కొట్టి.. కామెంట్‌ పెట్టినవారిలో ప్రొఫైల్స్‌ ఆధారంగా ప్రముఖులు, వ్యాపారులను ఎంచుకుంటారు. తియ్యగా మాట్లాడి స్నేహం చేస్తారు. తెలివిగా తామున్న చోటికి రప్పించుకుంటారు. సన్నిహితంగా మెదిలి, రహస్యంగా కెమెరాల్లో చిత్రీకరిస్తారు. తరువాత స్నేహం ముసుగు తీసి, డబ్బులివ్వాలని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. డిమాండ్‌ చేసినంత ఇవ్వకపోతే వీడియోలు బహిర్గతం చేసి పరువు తీస్తామని బెదిరిస్తారు. కొందరు పరువు పోతుందన్న భయంతో అడిగినంత ఇచ్చుకుని సైలెంట్‌గా తప్పుకుంటుండగా.. మరికొందరు మళ్లీమళ్లీ వారి వలలో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొంతకాలంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వెలుగుచూస్తున్న హనీట్రాప్‌ కేసులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

    సోషల్‌ మీడియా వేదికగా
    కష్టపడకుండా తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కొందరు ముఠాగా ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందమైన మహిళలతో సోషల్‌ మీడియాలో ప్రత్యేక పేజీలు క్రియేట్‌ చేసి ఆకర్షిస్తారు. వీరి వీడియోలకు కామెంట్లు పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంటారు. ఒరిజినల్‌ ఖాతాల నుంచి కామెంట్లు పెట్టిన వారి నేపథ్యాన్ని వెరిఫై చేసుకుంటారు. డబ్బున్న వారైతే డైరెక్ట్‌ మెసేజ్‌ చేసి స్నేహం పేరిట ఎరవేస్తారు. కలుద్దామంటూ ఇంటికి ఆహ్వానిస్తారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బెదిరింపులకు దిగి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు.



    డేటింగ్‌యాప్స్‌తో జాగ్రత్త
    సోషల్‌ మీడియాతోపాటు డేటింగ్‌ యాప్స్‌తో చాలా దారుణాలు జరుగుతున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలే లక్ష్యంగా ఈ యాప్స్‌లోకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని త్వరగా బ్లాక్‌మెయిల్‌ చేయవచ్చు. స్నేహం చేయడం, కలవడం సులువు. యాప్‌లో చిక్కిన వారిని వీడియోలు తీసి బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఇవ్వకపోతే ఏకంగా రేప్‌ కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడి కొందరు, పరువుకు భయపడి మరికొందరు అడిగినంత చెల్లించుకుని అక్కడ నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కడమే బాధితుల చేతిలో ఉంటుంది. వారిని వదలాలా? వద్దా? అన్నది మాత్రం ముఠా చేతిలోనే ఉంటుంది.

     

    నాడు మిల్కీ.. నేడు డింపుల్‌
    తాజాగా కరీంనగర్‌ పరిధిలోని ఆరెపల్లి కేంద్రంగా వెలుగుచూసిన హనీట్రాప్‌పై లోతుగా విచారణ చేసేందుకు సదరు దంపతులను రూరల్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారి ఉచ్చులో ఎంతమంది ఉన్నారు? అందులో ప్రముఖులు ఎంతమంది? అన్న విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఆర్థిక ఇబ్బందులతోనే నిందితులు ఈజీమనీ కోసం డింపుల్‌ పేరుతో సోషల్‌ మీడియా ఖాతా తెరిచి దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది డిసెంబరులో జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో కొందరు నిందితులు మహిళను ఎరవేసి, వీడియోలు తీసి ఓ రియల్టర్‌ నుంచి రూ.7 లక్షలు గుంజారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టురట్టయ్యింది. కరోనా సమయంలో కరీంనగర్‌లో మిల్కీ అనే మహిళ విడుదల చేసిన వీడియోలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. ఆమె బాధితుల జాబితాలో నేతలతోపాటు పలువురు పుర ప్రముఖులు ఉన్నట్లు చర్చజరగడంతో అప్పటి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

    స్నేహం చేసి.. ఆరా తీసి..
    ఇటీవల ట్రేడింగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో కొత్తపంథా మొదలైంది. మొదట హై ప్రొఫైల్‌ ఉన్నవారిని గుర్తించి, పరిచయం చేసుకొని, వారికి అందమైన ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. కొన్ని రోజులు స్నేహం చేస్తారు. ఏం చేస్తారు.. ఎంత సంపాదిస్తారు అని ఆరా తీస్తారు. డబ్బున్న వారిని గుర్తించి ట్రేడింగ్‌ చేస్తే రూ.లక్షలు వచ్చాయని నమ్మిస్తారు. పలువురు బాధితులు నమ్మి మోసపోతున్నారు. వారు పంపించిన లింక్‌ల ద్వారా ట్రైడింగ్‌ కోసం డబ్బులు పంపించి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిఘా పెట్టారు. సోషల్‌ మీడియాలో కొత్త పరిచయాలు వద్దని, ట్రేడింగ్‌ పేరుతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.

Sports

  • గౌహతి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలూండ‌గానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేసింది.

    ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    అతడితో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌  (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్‌) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్‌(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, ఇష్‌ సోధీ తలా వికెట్‌ సాధించారు.

    బుమ్రా మ్యాజిక్‌..
    అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్‌(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్  తలా రెండు వికెట్లు సాధించారు.
    చదవండి: ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్‌ 'ఢీ'
     

  • గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీని, ఓవరాల్‌గా ఏడో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.

    భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ కేవలం 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్‌ గేమ్స్‌లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్‌ విధ్వంసం ధాటికి భారత్‌ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (28) ఔట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ (67), సూర్యకుమార్‌ యాదవ్‌ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.

    అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్‌ (4-0-17-3), హార్దిక్‌ పాండ్యా (3-0-23-2), హర్షిత్‌ రాణా (4-0-35-1) ధాటి​కి న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

    న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

     

  • గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. 

    ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో ​కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్‌ సీఫర్ట్‌, కైల్‌ జేమీసన్‌ వికెట్లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

    క్లీన్‌ బౌల్డ్‌ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్‌ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్‌ రవి బిష్ణోయ్‌ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్‌.. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.

    న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్‌ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్‌ కాన్వే వికెట్‌ తీయగా.. హార్దిక్‌ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 

    మిగతా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (3-0-32-0), శివమ్‌ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

     

     

     

  • గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

    టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్‌ (12), రచిన్‌ రవీంద్ర (4), చాప్‌మన్‌ (32), డారిల్‌ మిచెల్‌ (14) ఔట్‌ కాగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (48), సాంట్నర్‌ క్రీజ్‌లో ఉన్నారు.

    భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, బిష్ణోయ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు. వీరిలో బిష్ణోయ్‌, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన దాంట్లో కుల్దీప్‌ యాదవ్‌ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్‌ వేసి 13 పరుగులిచ్చాడు.

    గాల్లో నాట్యం
    ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ తొలి బంతి​కి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్‌ లెంగ్త్‌ బంతిని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో సీఫర్ట్‌ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్‌ బ్యాట్‌ను ఆఫ్‌ స్టంప్‌ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్‌ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

    రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
    ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

    మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్‌ స్థానంలో కైల్‌ జేమీసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

    భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
     

  • టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా గతేడాది రన్నరప్‌ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్‌ మ్యాచ్‌లా కాకుండా వార్మప్‌ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్‌ మ్యాచ్‌ అని సమాచారం.

    వాస్తవానికి ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్‌ కిరికిరి ఉండటంతో ఫైనల్‌ షెడ్యూల్‌ ఆలస్యమైంది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్‌ మార్చాల్సి వచ్చింది.

    భారత్‌-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్‌ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.

    ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.

    ప్రపంచకప్‌ మెయిన్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్‌ఏతో ఆడనుంది.

    భారత్‌.. యూఎస్‌ఏ, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియాతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది. మిగతా గ్రూప్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18  (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.

    దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌, యూఏఈలతో కలిసి గ్రూప్‌-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది.  

     

  • గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి వచ్చారు. 

    మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్‌ స్థానంలో కైల్‌ జేమీసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

    కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

    భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

  • 2026 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా.. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మంది పద్మభూషణ్‌, ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు లభించాయి. 

    ఇందులో క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌కు పద్మవిభూషణ్‌, 

    భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌, భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్‌ సింగ్‌, భగవాన్‌దాస్‌ రైక్వార్‌, కే పజనివేల్‌) పద్మశ్రీ అవార్డులు లభించాయి. 

  • 2025-26 ఎడిషన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ అవతరించింది. ఇవాళ (జనవరి 25) జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ కైవసం చేసుకుంది. స్కార్చర్స్‌ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో టైటిళ్లు సాధించింది. 

    ప్రస్తుత ఎడిషన్‌లో స్కార్చర్స్‌కు టైటిల్‌ అందించిన ఆష్టన్‌ టర్నర్‌ గతంలో మరో రెండు టైటిళ్లు (కెప్టెన్‌) అందించాడు. తద్వారా లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. బీబీఎల్‌ నిర్వహకులు ఈ ఎడిషన్‌లో కొత్త ఆనవాయితీకి తెరలేపారు. 

    విజేతలను అందించే మెడల్స్‌ను చిన్నారుల చేత ఇప్పించారు. స్కార్చర్స్‌ కెప్టెన్‌ టర్నర్‌ తన విన్నింగ్‌ మెడల్‌ను తన ముగ్గురు సంతానం చేతుల మీదుగా అందుకున్నాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. 

    సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

    మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

     

  • క్రికెట్‌కు సంబంధించి ఏ జట్టుకైనా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడమనేది చాలా ముఖ్యం. కేవలం మైదానంలో లభించే గుర్తింపు కోసమే కాకుండా, ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలోనూ ఇది చాలా కీలకం. అందుకే ప్రతి జట్టు ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

    అయితే, క్రికెట్‌ చరిత్రలో కొన్ని జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ చేరింది. ఈ జట్టు త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఈవెంట్లను బహిష్కరించిన జట్లపై ఓ లుక్కేద్దాం.

    చరిత్ర చూస్తే.. రాజకీయ కారణాలు, భద్రతా సమస్యలు లేదా అంతర్జాతీయ సంబంధాల కారణంగా కొన్ని జట్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరించాయి. ఇందులో ముందుగా జింబాబ్వే పేరు వస్తుంది.

    జింబాబ్వే రాజకీయ ఉద్రిక్తతలు, ఆటగాళ్లకు వీసా సమస్యల కారణంగా ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ20ని (అప్పట్లో టీ20 ప్రపంచకప్‌ను అలా పిలిచేవారు) బహిష్కరించింది. 

    జింబాబ్వే ఇలా చేయడానికి బీజం 2003లో పడింది. ఆయేడు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ జింబాబ్వేలో ఆడటానికి నిరాకరించింది. ఇందుకు కారణం నాటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేతో యూకేకు ఉండిన రాజకీయ విభేదాలు.

    అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు మెరుగుపడకపోవడంతో జింబాబ్వే 2009 ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ20 నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. జింబాబ్వేకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.

    ఇలాంటి ఉదంతమే 2016 అండర్‌ 19 వరల్డ్‌కప్‌లోనూ జరిగింది. ఆయేడు బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యువ ఆసీస్‌ జట్టు మెగా టోర్నీని బహిష్కరించింది. అప్పుడు ఆసీస్‌కు ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్‌కు అవకాశం లభించింది. 

    పై రెండు ఉదంతాల తర్వాత ఓ జట్టు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే బహిష్కరించడం ఇదే ఏడాది జరిగింది. రాజకీయ ఉద్రిక్తతలు, ఐపీఎల్‌ 2026లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలగింపు, భద్రతా కారణాల చేత భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి బంగ్లాదేశ్‌ వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.

    పైన పేర్కొన్న ఉదంతాల్లో ఆయా జట్లు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే రద్దు చేసుకోగా.. కొన్ని జట్లు పలు మ్యాచ్‌లను బాయ్‌కాట్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

    • 1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్లు బాయ్‌కాట్‌ చేశాయి. లంకలో అంతర్యుద్దం, భద్రతా కారణాల చేత ఆ జట్లు తమ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్‌ లభించింది. ఆ టోర్నీలో శ్రీలంకనే ఛాంపియన్‌గా నిలవడం​ కొసమెరుపు.

    • 2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు కూడా ఓ మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించింది. ఆయేడు ప్రపంచకప్‌ టోర్నీకి జింబాబ్వేతో పాటు కెన్యా కూడా ఆతిథ్యమిచ్చింది. మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌ నైరోబీలో ఓ మ్యాచ్‌ ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల చేత న్యూజిలాండ్‌ బాయ్‌కాట్‌ చేయాలనుకుంది.

     

  • ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ కెరీర్‌లో మరో ఘనతను సొంతం​ చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్‌, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు.. 

    ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్‌ పీటర్సన్‌ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్‌, కేపీ తర్వాత జోస్‌ బట్లర్‌ (24), ఇయాన్‌ మోర్గాన్‌ (23) ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. 

    నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్‌ మొదలవుతుంది.

    ఎనిమిది మందితో ప్రయోగం
    టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, రూట్‌ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్‌, జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

    రాణించిన రూట్‌
    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్‌ (75), బ్రూక్‌ (42), డకెట్‌ (39), బట్లర్‌ (33 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు.

     

  • టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.  

    కెప్టెన్‌గా సల్మాన్‌ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్‌ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్‌ రౌఫ్‌, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్‌ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్‌ షా, మొహమ్మద్‌ హరీస్‌, సుఫియాన్‌ ముఖీమ్‌ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్‌ తారిక్‌ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

    టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్‌ జట్టు..
    సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్

    మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!
    ప్రపంచకప్‌ కోసం జట్టును ప్రకటించినా, పాక్‌ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్‌లో పాల్గొనబోమని పాక్‌ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్‌ జట్టు హెడ్‌ కోచ్‌ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.

    నెదర్లాండ్స్‌తో ఢీ
    అన్నీ కుదిరితే పాక్‌ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.

    ఇదిలా ఉంటే,  భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.

    అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్‌ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. 

    అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది.

    "బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.

    పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్‌ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్‌ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

    తదనంతర పరిణామాల్లో.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విష‌యాన్ని ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్ర‌కారం స్కాట్లాండ్‌కు అవ‌కాశం ల‌భించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాట‌లోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.

    నేపథ్యం
    భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకొని ఓవరాక్షన్‌ చేస్తుంది.

     

     

Politics

  • సాక్షి, ఏలూరు జిల్లా: చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారని.. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘‘తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిపారని దుష్ప్రచారం చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్‌ దుర్గగుడికి మెట్లు కడిగారు. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారు. పాపపు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాలుకపై వాతలు పెట్టాలి’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    లడ్డూలో ఎలాంటి పంది, జంతువు, చేప కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చెప్పిందని పేర్ని నాని గుర్తు చేశారు. ‘‘కలియుగదైవం వెంకటేశ్వరస్వామి వేసే శిక్షను చంద్రబాబు,పవన్ తప్పించుకోగలరా?. వెంకటేశ్వరస్వామి పవిత్రతో ఆటలాడిన చంద్రబాబు, పవన్‌ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

  • నిజామాబాద్ :  నిజామాబాద్‌ కార్పోరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌. మన నిజామాబాద్ మన అభివృద్ధి... పేరుతో  ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు(ఆదివారం, జనవరి 25వ తేదీ) నిజామాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ముఖ్య కార్తకర్తల సమావేశంలో పాల్గొన్న మహేష్‌కుమార్‌ గౌడ్‌.. ప్రసంగించారు. 

    మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే ఉత్తమ్‌కు ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.  కాంగ్రెస్‌.. బీజేపీకి ఎంత దూరమో మజ్లిస్‌కు అంతే దూరం. బీజేపీ నేతల అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం చిమ్ముతన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర వద్దు, ప్రలోభాలతో  టికెట్స్ రావు ,డబ్బులు ఎవరికి ఇవ్వొద్దు. కులం , మతం పేరిట ప్రజల జీవితాలు విచ్చిన్నం చేస్తానంటే చూస్తూ ఊరుకోం’ అని స్పష్టం చేశారు.

     

  • హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యుత్తమ హోదా పొందటానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అంతటి అనుభవం ఉన్న భట్టి.. రేవంత్‌రెడ్డి కళ్లలో ఆనందం కోసం పనిచేయడం బాధాకరమన్నారు. సింగరేణి స్కాంలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు(ఆదివారం, జనవరం 25వ తేదీ) మీడియాతో మాట్లాడిన హరీష్‌ రావు.. సింగరేణి స్కాంలో లబ్ధిదారుడు రేవంత్‌రెడ్డేనన్నారు. అయితే భట్టి లబ్ధిదారుడా లేదా అనేది విచారణలో తేలుతుం‍దన్నారు. 

    ‘అవినీతి ఆరోపణలు వచ్చినప్పడు గతంలో మంత్రులు రాజీనామా చేసేవారు. సింగరేణి ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తెచ్చిందే కాంగ్రెస్. తనకు లేఖ రాస్తే.. భట్టి ముఖ్యమంత్రితో  మాట్లాడుతాననటం హాస్యాస్పదం. రేపో మాపో నాకు మరో లేఖ(సిట్ నోటీసులు) వస్తుంది. 
    మే 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీ వర్క్స్ కోసం సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తీసుకొచ్చింది. 

    ఓబీ వర్క్స్ లో‌ మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి. నైమీ బ్లాక్ టెండర్లు కాదు.. సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద జరిగిన అన్ని టెండర్లను రద్దు చేయాలి. 2025 మే నుంచి ఎంత మందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రిని బొగ్గు స్కాం నుంచి బయట పడేయటానికి ప్రయత్నం చేసి భట్టి విఫలమయ్యారు. భట్టి మాటల గారడితో మసిపూడి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. సింగరేణి స్కాంలో లబ్ధిదారులు ఎరరు? నష్టం ఎంత? ఎవరు బాధ్యడు.. భట్టి సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లి ఫర్నిచర్‌ షాప్‌ అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతి విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ  ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

  • సాక్షి, తాడేపల్లి: పద్మ పురస్కార విజేతలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 2026గానూ కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా.. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

     

  • ఢిల్లీ: 2026గానూ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ( జనవరి 25, ఆదివారం) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

    సినీ నటులు రాజేంద్రప్రసాద్(ఏపీ), మాగంటి మురళీమోహన్(ఏపీ) పద్మశ్రీ అవార్డులు లభించాయి. కళల విభాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(ఏపీ), దీపికారెడ్డి(తెలంగాణ) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వైద్య విభాగంలో గూడూరు వెంకటరావు(తెలంగాణ) పద్మశ్రీ, పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి(తెలంగాణ)లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

    సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ విభాగంలో చంద్రమౌళి గడ్డమానుగు (తెలంగాణ), కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం(తెలంగాణ), కుమారస్వామి తంగరాజు (తెలంగాణ), విద్య విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి(ఏపీ), పశుసంవర్ధక విభాగంలో రామారెడ్డి మామిడి (తెలంగాణ)కి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

     

     


     

  • పిన్నెల్లి: చంద్ర‌బాబు దృష్టిలో ద‌ళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాల‌కు లేదని, అందుకే అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీకి అండ‌గా ఉన్న ద‌ళితుల మీద దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్ర‌లు చేస్తున్నార‌ని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్ట‌డం సిగ్గుచేటన్నారు. పిన్నెలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మందా సాల్మన్ సంస్మరణ సభ కార్యక్రమానికి రాష్ట్ర నాయ‌కులు హాజ‌రై నివాళులు అర్పించారు.

    టీడీపీ గూండాల దాడిలో మందా సాల్మ‌న్ దారుణ హ‌త్య‌కు గురై ప‌ది రోజులైన సంద‌ర్భంగావైఎస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సాల్మ‌న్ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వంపై నాయ‌కులు తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అనంత‌రం నాయ‌కులంతా భారీ ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మ‌న్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. 

    ముఖ్యంగా  కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప‌ల్నాడు జిల్లాలో ప‌థ‌కం ప్ర‌కారం వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేసి దాడులు చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, చేత‌నైతే  వైఎస్‌ జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ అభివృద్ధి చేసి పల్నాడు ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాల‌ని స‌వాల్ విసిరారు. అభివృద్ధి చేత‌కాక ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తే వారే ఎప్ప‌టికీ అధికారంలో ఉండొచ్చ‌న ప‌గ‌టి క‌ల‌లు మానుకోవాల‌ని, వారి వేధింపుల‌ను లెక్క‌చేయ‌కుండా పార్టీ కోసం పోరాడుతున్న కార్య‌కర్త‌ల‌ను ఈ సంద‌ర్భంగా అభినందించారు. 

    మందా సాల్మ‌న్ హ‌త్య పిన్నెల్లిలో చివ‌రి హ‌త్య కావాల‌ని, గ్రామంలో శాంతి నెల‌కొనాల‌ని ఆకాంక్షిస్తున్న సాల్మ‌న్ బిడ్డ‌ల పెద్ద మ‌న‌సుకి పార్టీ నాయ‌కులు హాట్సాప్ చెప్పారు. వారి కుటుంబానికి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, నిందితుల‌కు శిక్ష‌ప‌డేదాకావైఎస్సార్‌సీపీ పోరాడుతుంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనేవైఎస్సార్‌సీపీ ఆధ్వ‌రంలో ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి పార్ల‌మెంట్ లో టీడీపీపై ఒత్తిడి తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.  

    మందా సాల్మ‌న్ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రులు మేక‌తోటి సుచ‌రిత, మేరుగ నాగార్జున‌, విడ‌ద‌ల ర‌జ‌ని, సాకె శైల‌జానాథ్‌,వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు,వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌,వైఎస్సార్‌సీపీ ప‌ల్నాడు జిల్లా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, కాసు మహేష్ రెడ్డి, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ పార్టీ ఇన్‌చార్జి పూనూరు గౌత‌మ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

    మందా సాల్మ‌న్ హ‌త్య‌పై త్వ‌ర‌లోనే ఛ‌లో ఢిల్లీ:   ఎంపీ గురుమూర్తి
    కూటమి అధికారంలోకి రావ‌డంతోనే రాజ్యాంగాన్ని ర‌చించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం మీద దాడులు మొద‌లుపెట్టి ఎస్సీల‌ను నిత్యం వేధిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు హ‌త్య‌లు చేసి గ్రామాల‌నే ఖాళీ చేయించే దారుణాలకు పాల్ప‌డుతున్నారు. కూట‌మి నాయ‌కుల దాడుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు పార్ల‌మెంట్‌లోవైఎస్సార్‌సీపీ త‌ర‌ఫున గళం వినిపిస్తూనే ఉన్నాం. దేశంలో ఎక్క‌డా లేనివిధంగా ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. 

    ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే మందా సాల్మ‌న్ దారుణ హ‌త్య జ‌రిగింది. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల‌తో చేతులు క‌లుపుతున్న దుర్మార్గ వాతావ‌ర‌ణం రాష్ట్రంలో క‌నిపిస్తోంది. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై జాతీయ మాన‌వ‌హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ), జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తాం. నిందితుల‌కు శిక్ష పడేదాకా కోర్టుల్లోవైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై ఢిల్లీ స్థాయిలోవైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. త్వ‌ర‌లోనే ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తాం.

    వైఎస్సార్‌సీపీని లేకుండా చేయ‌డం ప‌గ‌టి క‌ల‌: నందిగం సురేష్‌
    కూట‌మి నాయ‌కుల అరాచ‌క పాల‌న‌తో బీహార్ కూడా చిన్న‌బోయింది. వైఎస్సార్‌సీపీ హ‌యాంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్షణ‌లో పోలీసులు దేశంలో అత్యున్న‌త స్థాయి అవార్డులు గెలుచుకుంటే, చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఏడాదిన్న‌రలోనే దేశంలోనే చిట్ట‌చివ‌రి 31వ స్థానానికి ప‌డిపోయింది. అంతలా వ్య‌వ‌స్థ‌ల‌ను దిగ‌జార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. అధికారం చేతిలో ఉంది క‌దా అని చ‌ట్టాల‌ను ఉల్లంఘించి పాల‌న సాగిస్తున్న కూట‌మి నాయ‌కులు ప్ర‌జ‌ల్లో దారుణ‌మైన వ్య‌తిరేక‌త తెచ్చుకున్నారు. అందుకేవైఎస్సార్‌సీపీని లేకుండా చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రావొచ్చ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. ఓటేసిన ప్ర‌జ‌ల‌కే వెన్నుపోటు పొడిచి వేధిస్తున్న ప్ర‌భుత్వానికి పోయేకాలం ద‌గ్గ‌ర‌ప‌డింది. మందా సాల్మ‌న్ హ‌త్య‌కు కార‌ణ‌మైన కూట‌మి ప్ర‌భుత్వానికి ఖ‌చ్చితంగా బుద్ధి చెబుతాం.

    గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని గూండారాజ్యం: కాసు మ‌హేష్‌రెడ్డి
    అంబేడ్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జ‌రుగుతుందో మందా సాల్మ‌న్ హత్య‌తో వచ్చిన ప్ర‌జావ్య‌తిరేక‌త ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, తెలుగుదేశం పార్టీకి ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది. ఈ హ‌త్యలో ప్రత్య‌క్షంగా ప‌రోక్షంగా పాల్గొన్న వారిని స‌హ‌క‌రించిన వారిని ఎవ‌రినీ వైఎస్సార్‌సీపీ వ‌దిలిపెట్ట‌దు. నిందితుల‌ను చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేదాకా న్యాయ‌స్థానాల్లో పోరాడ‌తాం. జాతీయ‌స్థాయిలో మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. 

    పేద‌వాడికి బ‌తికే స్వేచ్చ‌ను హ‌రిస్తున్న ఈ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధిచెబుతాం. గుర‌జాల‌లో గూండా రాజ్యం న‌డుపుతున్న ఎమ్మెల్యే య‌రప‌తినేని శ్రీనివాస్ కి ప్ర‌జాస్వామ్యం బ‌లం చూపిస్తాం. దాడి చేసి చంపార‌ని ఫోన్ చేసిన బాధితుల‌తో గ్రామంలోకి ఎందుకొచ్చార‌ని ప్రశ్నించిన సీఐ భాస్క‌ర్‌రావుని న్యాయ‌స్థానాల ద్వారా శిక్ష ప‌డేలా చేస్తాం. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో చూపించిన నిర్ల‌క్ష్యానికి మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌దు. అంత్య‌క్రియ‌లు చేసుకుంటామ‌ని వేడుకునే దుస్థితికి, శ్మ‌శానానికి ఆధార్ కార్డులు చూపించాల్సిన దౌర్భాగ్యానికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. మందా సాల్మ‌న్‌ని దారుణంగా హత్య చేసినా ప్ర‌తీకారం చేయాల‌నో, ప‌రిహారం కావాల‌నో కోరుకోకుండా గ్రామంలో శాంతి నెల‌కొనాల‌ని ఆశిస్తున్న వారి కుటుంబ స‌భ్యుల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా. గ్రామంలో ఇదే చివ‌రి హ‌త్య కావాల‌ని వేడుకుంటున్న వారి పెద్ద మ‌న‌సుని ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాలి.  

    రాష్ట్రాన్ని రాతియుగంవైపు తీసుకెళ్తున్నారు: మేక‌తోటి సుచ‌రిత‌
    నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో ప‌ల్నాడులో శాంతిభ‌ద్ర‌త‌లు నెల‌కొనేలా కృషి చేశాం. గ్రామాల నుంచి వెళ్లి బ‌య‌ట నివ‌సిస్తున్న వారిని పోలీసుల సాయంతో వెన‌క్కి రప్పించి కుటుంబంతో ప్ర‌శాంతంగా బ‌తికే వాతావ‌ర‌ణం తీసుకొచ్చాం. కానీ సీఎం చంద్ర‌బాబు మాత్రం విజ‌నరీన‌ని చెప్పుకుంటూనే రాష్ట్రాన్ని మ‌ళ్లీ రాతి యుగంవైపుకి న‌డిపిస్తున్నాడు. రెడ్ బుక్ పాల‌న‌తో క‌క్షా రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు. గ్రామానికి ఎందుకొచ్చావ్ అని ప్ర‌శ్నిస్తున్న పోలీసులు ప‌నిచేయ‌డం చేత‌కాని అస‌మ‌ర్థుల కిందే లెక్క‌. అలాంటి వారు ఉద్యోగాల‌కు ప‌నికిరారు. త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి. బాధితుల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోవ‌డం ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌తే అవుతుంది.

    సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి: మేరుగ నాగార్జున‌
    ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేవిధంగా మందా సాల్మ‌న్‌ని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేశారు. అమాయ‌క ద‌ళిత కుటుంబంపై దాడి చేసి చంపితే ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌రకు స్పందించ‌లేదు. ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చినా డీజీపీ క‌నీసం క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ద‌ళితుల ప్రాణాలంటే ఈ ప్ర‌భుత్వానికి అంత లెక్క‌లేనిత‌నం. డిప్యూటీసీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో ద‌ళితుల‌ను గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేసినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితుల మీద దాడులు, దౌర్జ‌న్యాలు, ద‌ళిత మ‌హిళ‌ల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి.వైఎస్సార్‌సీపీ హ‌యాంలో ఒక మ‌హిళ‌ను దారుణంగా చంపితే ద‌ళిత చ‌ట్టాల ప్ర‌కారం వారిని ప్ర‌భుత్వం ఆదుకుంది. కానీ ఇప్పుడు మందా సాల్మ‌న్ హ‌త్య‌ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌క‌పోవ‌డం దుర్మార్గం. 

    న్యాయం జ‌రిగేదాకా ఉద్య‌మిస్తాం: విడ‌ద‌ల ర‌జ‌ని
    కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా ప‌ల్నాడు జిల్లాలో దాడులు, వేధింపులు మ‌రీ ఎక్కువ‌గా ఉంటున్నాయి. అయినా అవ‌న్నీ లెక్క‌చేయ‌కుండా పార్టీ కోసం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్ర‌భుత్వం, పోలీసుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే మందా సాల్మ‌న్ హ‌త్య జ‌రిగింది. ఇది ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వ హ‌త్యే.వైఎస్సార్‌సీపీకి అండ‌గా నిలిచిన వ్య‌క్తుల మీద దాడులు ప‌రిపాటిగా మారాయి. సామాన్యుడు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లే ప‌రిస్థితి కనిపించ‌డంలేదు. బాధితుల‌నే నిందితులుగా మార్చి చూపిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం నుంచి  300 కుటుంబాలు బయ‌ట‌కు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వ‌చ్చిందంటే ఇది పోలీసుల చేత‌కానిత‌న‌మే. మందా సాల్మ‌న్ కుటుంబానికి న్యాయం చేసేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.

    దాచేప‌ల్లి పోలీస్‌ స్టేష‌న్‌ని ముట్ట‌డిస్తాం: శైల‌జానాథ్‌
    ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను దోపిడీ, దుర్మార్గాల వైపు న‌డిపిస్తున్నాడు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టం చేత‌కాని పోలీసులు ఉద్యోగాల‌కు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ అమాయ‌కులైన ద‌ళితుల‌ను టీడీపీ క‌క్ష‌ల‌కు బ‌లిపెట్ట‌డం మంచిదికాదు. త్వ‌ర‌లోనే ఎస్సీలంతా క‌లిసి దాచేప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌ని ముట్ట‌డిస్తాం. కూట‌మి ప్ర‌భుత్వానికి ఎస్సీల బ‌లం చూపిస్తాం. భ‌య‌ప‌డ‌టానికివైఎస్సార్‌సీపీ కార్యక‌ర్త‌లు సిద్ధంగా లేరు. వైఎస్‌ జ‌గ‌న్ గారి నాయ‌క‌త్వ‌లో అక్ర‌మాల‌పై తిరుగుబాటు చేస్తాం. ఊరు బాగుంటే చాలు, ఇదే చివ‌రి హ‌త్య కావాల‌ని చెప్పిన మందా సాల్మ‌న్ బిడ్డ‌ల పెద్ద మ‌న‌సుని అభినందిస్తున్నా.

    పిన్నెల్లి గ్రామంలో శాంతి నెల‌కొనాలి: గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి
    చంద్ర‌బాబు దృష్టిలో ద‌ళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాల‌కు లేదు. కూట‌మి వ‌చ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు, బ‌హిష్క‌ర‌ణ‌లు, వేధింపులే దీనికి నిద‌ర్శ‌నం. మందా సాల్మ‌న్ ని దారుణంగా హత్య చేసి ప‌ది రోజుల‌వుతున్నా ఇంత‌వ‌ర‌కు ఏమాత్రం స్పందించ‌ని చంద్ర‌బాబు,వైఎస్సార్‌సీపీ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంద‌ని తెలుసుకుని గ్రామంలోకి టీడీపీ నాయ‌కుల‌ను పంపించి కుటిల రాజ‌కీయాలు చేస్తున్నాడు. మందా సాల్మ‌న్ హ‌త్య ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే. ద‌ళితుల గ్రామ బ‌హిష్క‌ర‌ణ జ‌రిగి రెండేళ్ల‌వుతుంటే ఒక్క‌సారి కూడా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు కార‌ణంగానే ఈ హ‌త్య జ‌రిగింది. మందా సాల్మ‌న్ కుటుంబానికి ప్ర‌భుత్వం న్యాయం చేయాలి. గ్రామంలో శాంతి వాతావ‌ర‌ణం తీసుకురావాలి. గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాల‌ను గ్రామానికి రప్పించాలి. మందా సాల్మ‌న్ కుటుంబానికివైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

    ప‌ల్నాడు వ్యాప్తంగా ఆట‌విక రాజ్యం: టీజేఆర్ సుధాక‌ర్ బాబు
    ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సీఐ భాస్క‌ర్‌రావు సార‌థ్యంలో మందా సాల్మ‌న్ ని దారుణంగా హ‌త‌మార్చారు. దాదాపు రెండేళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటూ భార్య‌ను చూడ‌టానికి వ‌చ్చిన సాల్మ‌న్ ని చంప‌డం సిగ్గుచేటు.వైఎస్సార్‌సీపీకి అండ‌గా ఉన్న కుటుంబాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి పార్టీకి దూరం చేయ‌డానికి జ‌రుగుతున్న చ‌ర్య‌ల్లో భాగంగానే పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ప‌ల్నాడు వ్యాప్తంగా ఆట‌విక రాజ్యం న‌డుస్తోంది. గూండాలు, దోపిడీదారుల‌కు అండగా పోలీసులు ప‌నిచేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేయ‌డం చేత‌కాక దాడుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేత‌నైతే అభివృద్ధిలో పోటీప‌డాలి. మెడిక‌ల్ కాలేజీ పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాలి. మందా సాల్మ‌న్ కుటుంబానికి న్యాయం జ‌రిగేదాకావైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.

    ప‌లుకూరులో 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపోయాయి: బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు
    కూటమి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వెనుబ‌డిన ఎస్సీఎస్టీబీసీ మైనారిటీ వ‌ర్గాల మీద దాడులు నిత్య‌కృత్యమైపోయాయి. ఏడాది పాల‌న పూర్తికాకుండానే ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. 20 నెల‌ల్లో చంద్ర‌బాబు పాల‌న మీద‌ ప్ర‌జా వ్య‌తిరేక‌త ప‌తాక‌స్థాయికి చేరింది. పిన్నెల్లి మాదిరిగానే బొల్లాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌లుకూరులో కూడా కూటమి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. గ్రామంల భూముల‌న్నీ బీడుబారిపోయాయి. ఇలాంటి దారుణ వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన ప్ర‌భుత్వానికి రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లే మంచి గుణ‌పాఠం చెబుతారు. కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

     

     

     

     

  • సాక్షి,తాడేపల్లి: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వేదికపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హాయంలో తెచ్చిన భూ సంస్కరణలపై ప్రశంసలు దక్కాయి. ఏపీ క్లీన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కోసం వైఎస్‌ జగన్‌ కృషి చేశారని ఐఎంఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌) ఎండీ గీతా గోపీనాథ్‌ కుండబద్దలు కొట్టారు. భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో గీతా గోపీనాథ్‌ చేసిన వ్యాఖ్యలతో ఇదే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేసింది విషప్రచారమేనని తేటతెల్లమైంది.   

    ఎన్నికల ముందు ఈ చట్టం గురించి చంద్రబాబు విష ప్రచారం చేశారు. ఇప్పుడు అదే చట్టాన్ని దావోస్‌ వేదికగా ఇది ఇండియాకు రోల్‌ మోడల్‌ అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అధికారం కోసమే చంద్రబాబు అదే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ మీద విష ప్రచారం చేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌. సాక్షి న్యూస్‌ ఎక్స్‌ వేదికగా నిర్వహించిన ఎక్స్‌ స్పేస్‌లో ఆయన మాట్లాడారు. 

    దావోస్‌ వేదికగా ప్రపంచదేశాది నేతల సమక్షంలో  వైఎస్‌ జగన్‌ తన హయాంలో తలపెట్టిన ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌  దేశానికే ఆదర్శమని ప్రకటించింది. కేంద్రం ఏపీ ల్యాండ్‌ టైటిల్లింగ్‌ యాక్ట్‌ దేశానికి రోల్‌మోడల్‌ అని చెబుతుంటే.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇదే టైటిల్లింగ్‌ యాక్ట్‌ కాదని.. భూములాగేసే చట్టమని విష ప్రచారం చేశారని అన్నారు. 

    దేశాదినేతల సమక్షంలో కేంద్రం ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రశంసలు కురిపించడం నిజంగా హర్షించదగిన విషయం. ఎందుకంటే విషప్రచారానికి ప్రయోగ వేదికలైన ఎల్లోమీడియా కర్కాణాల నుంచి వెలువడిన ఈ విష ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. ఇది వైఎస్సార్‌సీపీకి మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలకు శుభపరిణామం. 

    అంతేకాదు. ల్యాండ్‌ రీ సర్వే తన విజన్‌ అని చంద్రబాబు చెప్పుకుంటున్నా..  వైఎస్‌ జగన్‌ హయాంలో ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పురుడుపోసుకుందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో టైటిల్‌ డీడ్‌ సరిగా లేదనో, పాస్‌ పుస్తకాలు లేవనో, పాస్‌ పుస్తకాల్లో లోపాలు ఉన్నాయనో  ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపెట్టేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ తెచ్చారని ఆధారాలతో సహా స్పష్టం చేశారు. 
     

     

National

  • దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ప్రస్తుతం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నారని ముర్ము అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ముర్ము పేర్కొన్నారు.

    మన రైతులు దేశానికి అవసరమైన పోషకాహారాన్ని సమృద్దిగా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు ఘన విజయం అందించిన త్రివిధ దళాలను ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ నిర్మాతలు నిబంధనలు ద్వారా జాతీయవాద స్ఫూర్తికి దేశ ఐక్యతకు బలమైన పునాదిని అందించారని, ప్రస్తుతం భారత ప్రజలమైన మనము గణతంత్ర దినోత్సవాన్ని దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత గణతంత్ర ఉత్సవాలు దేశ భూత, వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులకు అద్దం పడుతాయన్నారు.

    1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం దేశ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్చి వేసిందని ఈ  ముర్ము పేర్కొన్నారు. ఈ సందర్భంగా  తమిళ భాషలో వందేమాతరం యోన్బోమ్‌ అనే గీతాన్ని స్వరపరిచిన జాతీయవాద కవి సుబ్రమణ్య భారతిని ద్రౌపది ముర్ము ప్రశంసించారు. 

  • భువనేశ్వర్: ఒడిశాలో ఓ హృదయ విదారకర ఘటన జరిగింది. తమ జీవిత చరమాంకంలో ఉన్న ఇద్దరు వృద్ధ దంపతుల అన్యోన్యత పలువురిని కంటతడి పెట్టించింది.పేరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న తన భార్యను రక్షించుకోవడం కోసం 75 ఏళ్ల వృద్ధ భర్త ఏకంగా 600 కిలోమీటర్ల రిక్షా లాగాడు. తనను వెనుక కూర్చెబెట్టి కంటికి రెక్కలా కాపాడుకుంటూ తొమ్మిది రోజులు ప్రయాణించాడు. ఎట్టకేలకు తనను ఆసుపత్రిలో చేర్చి తన ప్రాణాలను కాపాడాడు.

    ప్రస్తుతం దాంపత్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చడి పంచాయితీ కోసం కూడా విడాకులు తీసుకునే రోజులివి. అహంకారంతో చిన్నచిన్న విభేదాలకే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా దంపతులు విడిపోతుంటారు. పెళ్లి వెనుక పరమార్థం కానీ తాళి బొట్టుకున్న గొప్పతనం గురించి కాని వారు పట్టించుకోరు. వారికి నచ్చిందే చేస్తారు. అయితే ప్రస్తుత సమాజానికి కనుపిప్పు కలిగిస్తూ ఆలుమెుగల బంధానికి అర్థం చెప్పేలా ఒడిశాలో ఓ ఘటన జరిగింది. “ధర్మ, అర్థ, కామములు ఏనాడు నీతోడు; ఎన్నడూ నే విడిచిపోనూ” అనే ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం  ఓ వృద్ధ భర్త తన వయసును సైతం లెక్కచేయకుండా ఏకంగా 600  కిలోమీటర్లు  రిక్షా లాగాడు.  తన భార్య ప్రాణాన్ని రక్షించుకున్నాడు.

    శంబలాపూర్, మెుదైపాడలో బాబులోహార్‌ (75),జ్యోతి (70) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. అయితే ఇటీవల జ్యోతి స్టోక్ రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. అక్కడి స్థానిక డాక్టర్లు తనకు మెరుగైన వైద్యం అందించాలని అందుకోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌కి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కడు పేదరికంతో పూట గడవడమే కష్టంగా ఉన్న ఆ దంపతులకు అంతదూరం వెళ్లి ఆసుపత్రిలో వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టం. అయితే అంత పేదరికంలోనూ బాబులోహార్ తన భార్యను రక్షించాలని సంకల్పించాడు.

    రవాణా ఖర్చులకు సైతం డబ్బులు లేకపోవడంతో రిక్షాపైన తన భార్యను ఎక్కించి కటక్‌కు బయిలుదేరాడు. 300 కిలోమీటర్ల పాటు ఉదయం పూట రిక్షా లాగేవాడు.  రాత్రిళ్లు ఏదైనా స్థలం వద్ద విశ్రాంతి తీసుకునే వారు. ఇలా తొమ్మిది రోజు పాటు ప్రయాణించి ఎట్టకేలకు ఆసుపత్రికి తన భార్యను చేర్చాడు. అనంతరం ఆసుపత్రి వారు తనని అడ్మిట్ చేసుకొని రెండు నెలల పాటు అత్యవసర చికిత్స అందించారు. దీంతో దంపతులిద్దరూ జనవరి 19న తిరుగు ప్రయాణమయ్యారు.

    ఇంకేంటి కథ సుఖాంతం అయ్యిందనుకున్నారా? అక్కడితో విధి ఆట ఆగలేదు. తిరుగు ప్రయాణంలో వీరికి యాక్సిడెంట్ అయ్యింది. మరోసారి ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆ దంపతుల పరిస్థితి చూసి చలించిపోయిన వికాస్ అనే డాక్టర్ వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. 75 ఏళ్ల వయస్సు లోనూ తన భార్య కోసం 600 కిలోమీటర్లు రిక్షా లాగడం చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆ వృద్ధుని గొప్పతనానికి సెల్యూట్ చెబుతున్నారు

  • పెళ్లంటే... అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ... ఈ స్పీడు యుగంలో అంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే.. జాతకాల కంటే జన్యుపత్రికలు కలిస్తే మేలంటున్నారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌! జన్యుశాస్త్ర పరిశోధనల్లో దశాబ్ధాల అనుభవమున్న, సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ శాస్త్రవేత్త చెప్పేది సింపుల్‌!

    జన్యుక్రమాల ఆధారంగా పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో జన్యు వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి అని! అంతే కాదు.. జన్యువ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద కార్యక్రమం గురించి.. జన్యువులకు.. జబ్బులకు వేసుకునే మందులకూ మధ్య ఉన్న సంబంధం గురించి.. మరెన్నో అంశాలపై పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన ‘సాక్షి.కాం’తో సవివరంగా మాట్లాడారు. హైదరాబాద్‌లో సీసీఎంబీలో పనిచేస్తున్న ఆయనకు జన్యు సంబంధ పరిశోధనలకు గాను 2026-పద్మశ్రీ అవార్డు లభించింది

    ప్రశ్న: జాతకాలు కలవడం కంటే జన్యుక్రమాల మేళవింపు ముఖ్యమన్న శాస్త్రవేత్త మీరు. ఎందుకో వివరిస్తారా? 
    జవాబు: భారత దేశంలో ఇప్పటికీ మేనరికాలు ఎక్కువ. అంతేకాకుండా.. శతాబ్దాలుగా ఒకే సమూహంలో (కులం, దగ్గరి బంధువుల్లో) పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనివల్ల మన జన్యువుల్లోని వ్యాధికారక మార్పులు ఆయా సమూహాల్లో బలపడుతూ వస్తాయి. తల్లిదండ్రుల నుంచి అందుకునే క్రోమోజోముల్లో (ఎక్స్‌, వై, లు మినహాయించి) ఒకే ఒక్క మార్పు ఉన్నా సంతానానికి వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. దీన్ని ఆటోసోమల్‌ రిసెసివ్‌ మ్యూటేషన్‌ అంటారు.

    తరాలు మారుతున్న కొద్దీ ఈ మార్పులతో ఉండే వారి సంఖ్య పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆటోసోమల్‌ మ్యూటేషన్స్‌ ఉంటే పుట్టే బిడ్డకు జన్యుపరమైన వ్యాధి వచ్చే అవకాశం 25 శాతమవుతుంది. అందుకే మీడియా సహాయంతో ఈ సమాచారాన్ని సమాజానికి సులభమైన భాషలో, చేరవేయడం, కుటుంబం/కులంలోనే పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే రిస్క్‌ల గురించి చెప్పడం అవసరం, కానీ బలవంతంగా ఏమీ రుద్దకుండా, సమాచారం ఇచ్చి ప్రజలే నిర్ణయం తీసుకునేలా చేయాలి.​

    ప్రశ్న: సరే.. పెళ్లికి ముందు ఎలాంటి జన్యు పరీక్షలు చేయించుకుంటే మేలంటారు?
    జవాబు: దీనిని రెండు భాగాలుగా చూడాలి. కుటుంబంలో లేదా సమూహంలో జన్యువ్యాధులు ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? దానికి కారణమయ్యే జన్యుమార్పులు ఏవన్నది గుర్తించారా? చూసుకోవాలి. ఆ మార్పు పెళ్లి చేసుకోబోయే వారు ఇద్దరిలోనూ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. రెండవది – కుటుంబ చరిత్రలేమీ లేకపోయినా... స్థూలంగా కొన్ని కొన్ని వ్యాధికారక జన్యుమార్పుల కోసం పరీక్షించడం. కొన్ని వ్యాధులకు కారణమైన జన్యుమార్పులను ఇప్పటికే గుర్తించారు.

    అయితే ఇది చాలా జాగ్రత్తగా జరగాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సహజంగానే కొన్ని జన్యుమార్పులు ఉంటాయి, అలాంటి వారికి నీలో జన్యుమార్పు ఉంది అంటే ఆందోళనకు గురికావచ్చు. రక్తసంబంధం లేకుండా... ఒకేరకమైన ఆటోసోమల్‌ రిసెసివ్‌ మ్యూటేషన్‌ లేకపోతే సమస్య ఏమీ ఉండదు కానీ.. ఏ జన్యువులు, ఏ రకమైన మార్పులను పరిశీలించాలన్న విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది.

    ప్రశ్న: జన్యుమార్పులు మనం తీసుకునే మందులపై కూడా ప్రభావం చూపుతాయా? 
    జవాబు: అవును. శస్త్రచికిత్సలకు ముందు ఇచ్చే మత్తుమందులే (అనస్తీషియా) ఒక ఉదాహరణ. నిర్దిష్ట జన్యుమార్పులున్న ఒక సామాజిక వర్గంపై వీటి ప్రభావం భిన్నంగా ఉంటుంది. జన్యుమార్పులుంటే ఈ మందులు శరీరంలో ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీంతో అనుకున్నదానికంటే చాలా ఎక్కువసేపు అనస్తీషియా ప్రభావం కొనసాగి, కొన్ని సందర్భాల్లో పక్షవాతం లేదా ప్రాణాపాయం జరగవచ్చు.

    కేన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులకు తీసుకునే మందులు కూడా కొన్ని జన్యుమార్పులున్న వారిపై భిన్నమైన ప్రభావం చూపుతాయి. అంటే... వ్యాధికారక, మందులకు స్పందించే జన్యుమార్పులను వేర్వేరుగా గుర్తించేందుకు పరీక్షలు అవసరమన్నమాట.  భవిష్యత్తులో రాగల వ్యాధులకు సంబంధించిన పరీక్షలూ జోడించి తగిన మార్గదర్శకాలు రూపొందిస్తే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది.

    ప్రశ్న: జన్యు పరీక్షలతో గుండెజబ్బులను ముందే గుర్తించవచ్చా?
    జవాబు: జన్యు పరీక్షల ద్వారా రెండు రకాల లాభాలున్నాయి. ముందుగా గుర్తించడం ఒకటైతే... వ్యాధి వేగంగా ముదిరిపోకుండా చూసుకోవడం రెండోది. ఉదాహరణకు కార్డియోమయోపతిని తీసుకుందాం. జన్యుక్రమంలో నిర్దిష్ట మార్పు ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    తల్లిదండ్రులు ఇద్దరి నుంచి ఈ మార్పు సంక్రమించి ఉంటే ప్రమాదం ఎక్కువ. ఒకరి నుంచి మాత్రమే అందితే తక్కువగా ఉంటుంది. పదేళ్ల కుర్రవాడు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయినప్పుడు.. అతడి గుండె కండరాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు జన్యుమార్పు ప్రభావాన్ని గుర్తించారు. అలాంటి మ్యూటేషన్లను ముందుగానే గుర్తిస్తే, గుండెజబ్బు రావడాన్ని ఆలస్యం చేయవచ్చు.  

    ప్రశ్న: కోవిడ్‌ టీకా తీసుకున్న తరువాత యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారన్న అంచనా ఉంది. రెండింటికీ సంబంధం ఉందా? 
    జవాబు: కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత గుండెపోట్లు పెరిగాయన్న అంశంపై కొన్ని నివేదికలు ఉన్నాయి. చర్చలూ జరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై “కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండె రోగాలు పెరిగాయి” అని నిర్దిష్టంగా నిరూపించిన అధ్యయనం ఏదీ లేదు. 

    ప్రశ్న: భారతదేశంలో స్థూలంగా 4635 జన సమూహాలు ఉన్నాయి. వీరందరికీ జన్యు పరీక్షలు చేయించడం మేలా?
    జవాబు: దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతూండటం వల్ల దేశంలో కొన్ని సమూహాలకు కొన్ని రకాల జన్యువ్యాధులు వస్తున్నాయి. వీటి తీవ్రత కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒకానొక సముదాయంలో పుట్టిన రెండు నెలలకే పిల్లలు మరణిస్తూంటారు. ప్రజలు అనారోగ్యంగా ఏమీ కనిపించారు కానీ వ్యాధికారక జన్యుమార్పులు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా సమూహాలకు జన్యుపరీక్షలు చేయించడం అవసరం. జినోమ్‌ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకూ 83 సమూహాలకు పరీక్షలు పూర్తయ్యాయి కూడా.

    త్వరలో మరింత ఎక్కువ సమూహాలకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం పది లక్షల మంది జన్యుక్రమాలను నమోదు చేసి వ్యాధికారక మార్పులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తద్వారా ఆయా సముదాయాల్లో పెళ్లిళ్ల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. premarital, prenatal counseling ద్వారా ముందుగానే సూచనలనిచ్చే అవకాశం ఉంటుంది.​

    ప్రశ్న: దేశంలో premarital లేదా prenatal counseling నిర్వహించడానికి తగినంత మంది జన్యు శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్నారంటారా? 
    జవాబు: ఇటీవలి కాలంలో జన్యువ్యాధులపై వైద్యుల్లోనూ అవగాహన బాగా పెరిగింది. చాలా సందర్భాల్లో వారు రోగులను జన్యుపరీక్షలు చేయించుకోమంటున్నారు. వైద్యులు, జన్యు శాస్త్రవేత్తలతోపాటు ఈ రెండు అంశాలను అర్థం చేసుకుని సామాన్యులకు వివరించగల జెనెటిక్‌ కౌన్సిలర్లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తారు. జన్యుశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే.. వాటి ఫలితాలను ఆధారంగా genetic counselors సలహాలు ఇస్తారు. వైద్యులు చికిత్స అందిస్తారన్నమాట.

    ప్రశ్న: జన్యుపరంగా చూస్తే భారత్‌.. దక్షిణాసియా ప్రజల ప్రత్యేకత ఏమిటి? 
    జవాబు: ఆఫ్రికా తర్వాత, అత్యంత పురాతన జనాభా నివసిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. జన్యు ఆధారాల ప్రకారం ఆధునిక మానవుడు (హోమో సేపియన్‌ సేపియన్‌) ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన మొదటి సమూహపు వారసులు.  కొంతమంది దక్షిణ భారత దేశంలోనే స్థిరపడ్డారు. మరికొందు అండమాన్‌ మీదుగా ఆస్ట్రేలియాకి వెళ్లారు. దక్షిణాసియా దేశాల జనాభాల్లో కూడా కనీసం 50% వరకు భారతీయ వారసత్వం కలిగి ఉన్నాయి,  రోగాలు ముఖ్యంగా కార్డియో మయోపతికి సంబంధించిన జన్యుమార్పులు భారతదేశంతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మొదలైన దేశాల్లోనూ కనిపిస్తాయి.

    ప్రశ్న: మీకు అపరిమిత వనరులు ఉన్నాయనుకోండి; జన్యుశాస్త్రంలో మీరు మొదట పరిష్కరించాలనుకునే ఒక పెద్ద సమస్య ఏది?​
    జవాబు: ఆరోగ్యం; దాన్ని ఒక్క రోగానికిపరిమితం చేయకుండా, స్థూల దృష్టితో చూడాలి. ఇందులో రోగాల కారణం, pharmacogenomics, సంక్రమణ రోగాలు – ఇవన్నీ వస్తాయి, వీటిలో ప్రతి దాంట్లోనూ genetics ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి అనేక అవకాశాలు అందిస్తుంది.​

    ప్రశ్న: నేటి యువ శాస్త్రవేత్తలు genetics రంగంలోకి రావాలనుకుంటే, ప్రత్యేకంగా science, society రెండింటిపై ప్రభావం చూపాలని భావిస్తే మీరు ఏ సలహా ఇస్తారు?​
    జవాబు: హ్యూమన్ genomics రంగంలో ప్రస్తుతం గొప్ప అవకాశాలు ఉన్నాయి; అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలు, నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. జన్యుక్రమ రంగంలో చేసే పనులు సమాజ ఆరోగ్యానికి, దేశానికి ఉపయోగపడతాయి. అందుకే యువత జన్యుశాస్త్రాన్ని కెరియర్‌గా తీసుకుని, తమ సామర్థ్యానికి తగ్గట్లు సమాజానికి, దేశానికి సేవ చేసేలా ప్రోత్సహించాలి.

  • ఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (జనవరి 26, సోమవారం) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీని నిఘా నీడలోకి తెచ్చారు. ఉగ్రముప్పు హెరేపు (జనవరి 26, సోమవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలుచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. కర్తవ్య పథ్‌లో ఏఐ (AI) పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

    ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో సిట్టింగ్ ఎన్‌క్లోజర్‌లకు గంగా, గోదావరి, యమున తదితర నదుల పేర్లను పెట్టారు. భద్రతను పటిష్టం చేసిన ఢిల్లీ పోలీసులు.. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)ను ఉపయోగించనున్నారు. అనుమానితులను గుర్తించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.

    చరిత్రలో తొలిసారిగా..
    అన్ని సీసీటీవీ కెమెరాలను వీడియో అనలిటిక్స్, ముఖ గుర్తింపు వ్యవస్థలతో అనుసంధానించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ చరిత్రలో తొలిసారిగా పోలీసులు స్మార్ట్‌ గ్లాసెస్‌ ధరించి విధుల్లో పాల్గొంటారు. రద్దీని పర్యవేక్షించడంతో పాటు అనుమానితులను గుర్తిస్తారు. గడ్డం, జుట్టు పెంచినా, ముఖంపై గాయాలు ఉన్నా.. పాత, కొత్త ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. స్మార్ట్‌ గ్లాసెస్‌లో ఉండే కెమెరా మొబైల్‌ యాప్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో దాదాపు 65,000 మంది నేరస్తుల డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా నేరస్తుడు కనిపిస్తే ఈ పరికరం వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.

    థర్మల్ స్కానింగ్:
    ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా వ్యక్తులు దాచుకున్న ఆయుధాలను, అనుమానాస్పద వస్తువులను కూడా గుర్తించవచ్చు. కేవలం ఢిల్లీ జిల్లాలోనే 10 వేల పోలీసులు, 3 వేల పైగా సీసీటీవీ కెమెరాలు, 30కి పైగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మూడు అంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.

    కాగా, జనవరి 26న జరగనున్న వేడుకలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు మరింత అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు అల్ ఖైదా ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్’ (ఏక్యూఐఎస్‌)కు చెందిన మహమ్మద్ రేహాన్ అనే ఉగ్రవాది ఫోటోను తొలిసారిగా చేర్చడం గమనార్హం. రేహాన్ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులకు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఈ ఆరుగురు ఉగ్రవాదులు ఎక్కడైనా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచించారు.

  • తమిళగ వెట్రి కజగం అధినేత  విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జరిగే పోరాటం కేవలం అధికారం కోసం  కాదని ప్రజాస్వామ్యం కోసం జరిగే పోరని అన్నారు. ఆదివారం తమిళనాడు మహాబలిపురంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

    తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. ఫిల్మ్‌ స్టార్ విజయ్‌కు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో బీజేపీ టీవీకేతో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ  తమ పార్టీ అధినేతకు మంచి ఫ్రెండ్ అని  టీవీకే, కాంగ్రెస్ పార్టీలు సిద్ధాంత పరంగా ఒకటేనని టీవీకే పార్టీనేత ప్రకటించడంతో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని ప్రచారం సైతం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత పార్టీ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు.

    బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ  "రాష్ట్రాన్ని పాలించే దుష్టశక్తిని (DMK) అవినీతిశక్తి( AIDMK) ఎదుర్కొనే సత్తా కేవలం టీవీకేకు మాత్రమే ఉంది.  దుష్టశక్తి, అవినీతి శక్తి రెండు కూడా రాష్ట్రాన్ని పాలించకూడదు. టీవీకే పార్టీకి ఒంటరిగా నిలబడి గెలిచే సత్తా ఉంది". అని విజయ్ అన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధానమైన ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం టీవీకే పార్టీ మాత్రమేనని తెలిపారు. అనంతరం ఆ సమావేశంలో పార్టీకార్యకర్తలకు టీవీకే గుర్తు విజిల్‌ను చూపించారు. దీంతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

    రాష్ట్రంలోని AIADMK కేంద్రంలోని అధికార బీజేపీకి నేరుగా మద్దతిస్తుంటే డీఎంకే పరోక్షంగా సపోర్ట్ చేస్తుందని తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకమే తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించిందని విజయ్ అన్నారు. తమిళ ప్రజలను రక్షించడానికే ఈ మట్టిని కాపాడడానికే తాము ఉన్నామని పేర్కొన్నారు..  అయితే ఇటీవల తమిళ స్టార్  విజయ్‌ ఇటీవల కరూర్‌ తొక్కిసలాట ఘటనలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. అంతే కాకుండా అయినా నటించిన జననాయగన్ సినిమా విడుదలకు పలు అవాంతరాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • ముంబై: ఒక చిన్న తగాదా ప్రాణం తీసింది. మలాడ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ కళాశాల ప్రొఫెసర్‌ను ప్రయాణికుడు.. దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించిన ప్రొఫెసర్‌, ఒక ప్రయాణికుడి మధ్య చిన్న వివాదం విషాదాన్ని మిగిల్చింది. ఆ రైలు స్టేషన్‌ చేరుకోగా దిగేటప్పుడు కూడా వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు ప్రొఫెసర్‌ను కత్తితో పొడిచి.. పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    ప్రొఫెసర్‌గా అలోక్ సింగ్.. విలే పార్లేలోని ప్రముఖ కాలేజీలో పని చేస్తున్నారు. శనివారం ఆయన లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. రైలులో సీటు విషయంలో ఓ ప్రయాణికుడు, ప్రొఫెసర్‌ అలోక్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ట్రైన్‌ మలాడ్ స్టేషన్‌ చేరగానే దిగే సమయంలో గేటు వద్ద రద్దీ కారణంగా తోపులాట జరిగింది. దీంతో వారి మధ్య గొడవ మరింత ముదిరింది. ఆ  వ్యక్తి.. ప్రొఫెసర్‌ అలోక్ సింగ్‌ కడుపులో పలుమార్లు పొడిచి చంపేశాడు. అనంతరం స్టేషన్‌లోని జనం రద్దీలో కలిసిపోయి పరారయ్యాడు. దీంతో కత్తి పోట్లుతో అలోక్‌ సింగ్‌ కుప్పకూలి మరణించాడు.

    ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు..  హత్య చేసిన వ్యక్తిని ఓంకార్ షిండే(27)గా పోలీసులు గుర్తించారు. దాడి చేసిన కొద్దిసేపటికే వైట్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఓ వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పారిపోతుండటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.

    గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. షిండేను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైలులో సీటు కోసం జరిగిన చిన్న గొడవకే ప్రొఫెసర్‌ను షిండే దారుణంగా కత్తితో పొడిచి చంపడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వారి మధ్య గతంలో శత్రుత్వం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

     

  • 2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రభుత్వం పద్మ  పురస్కారాలను ‍ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మభూషణ్, 113 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు, కుటుంబశాస్త్రి, రాజేంద్ర ప్రసాద్( కళావిభాగం) మరళీమెహన్( కళావిభాగం), రాజేంద్రప్రసాద్ (కళావిభాగం).... తెలంగాణ విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి (కళావిభాగం), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ లకు  పురస్కారం దక్కింది. తెలంగాణలో మెుత్తంగా ఏడుగురికి, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి ఈ ఏడాది అవార్డులు దక్కాయి.

    దివంగత మాజీ సీఎం అచ్యుతానందకు పద్మ విభూషన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. కళా విభాగంలో ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముటికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి.  ఈ సందర్భంగాప్రధాని నరేంద్ర మోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రంగాలలో వారి అంకిత భావం, సేవ, భారత సమాజ నిర్మాణాన్ని సుసంపన్నం చేశాయన్నారు. వారి నిబద్ధత, శ్రేష్ఠత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    భారతరత్న తర్వాత పద్మ అవార్డులను  కేంద్ర ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాలుగా భావిస్తారు. కళలు, విద్య, సాహిత్యం, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, పరిశ్రమలు, వైద్యం, ప్రజాసేవలు ఇలా విభిన్న రంగాలలో ఉత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తుంది. పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
     

    పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 

    1. కుమారసామి తంగరాజ్
    2 మామిడి రామారెడ్డి ( తెలంగాణ)
    3. భగవందాస్ రైక్వార్
    4. భిక్ల్య లడక్య ధిండా
    5. బ్రిజ్ లాల్ భట్
    6. బుధ్రి తాటి
    7. చరణ్ హెంబ్రామ్
    8. చిరంజీ లాల్ యాదవ్
    9. ధర్మైక్ లాల్ చునీలాల్ పాండ్యా
    10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి
    11. హాలీ వార్
    12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
    13. కె. పజనివేల్
    14. కైలాష్ చంద్ర పంత్
    15. కేమ్ రాజ్ సుంద్రియాల్ 
    16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి
    17.అంకె గౌడ
    18. మహేంద్ర కుమార్ మిశ్రా
    19. మీర్ హాజీభాయ్ కసంభాయ్
    20. మోహన్ నగర్
    21. నరేష్ చంద్ర దేవ్ వర్మ
    22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
    23. నూరుద్దీన్ అహ్మద్
    24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్
    25. పద్మ గుర్మెట్
    26. పోఖిల లెక్తేపి
    27. పున్నిమూర్తి నటేశన్
    28. ఆర్ కృష్ణన్
    29. రఘుపత్ సింగ్
    30. రఘువీర్ తుకారాం ఖేద్కర్
    31. రాజస్తపతి కాలియప్ప గౌండర్
    32. ఆర్మిడా ఫెర్నాండెజ్2
    33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే
    34. SG. సుశీలమ్మ
    35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్
    36. షఫీ షౌక్
    37. శ్రీరంగ్ దేవబ లాడ్
    38. శ్యామ్ సుందర్
    39. సిమాంచల్ పాత్రో
    40. సురేష్ హనగవాడి
    41. తగా రామ్ భీల్
    42. టెకీ గుబిన్
    43. తిరువారూర్ భక్తవత్సలం
    44. విశ్వ బంధు
    45. యుమ్నం జత్రా సింగ్

     

  • న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం) తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 130వ ఎపిసోడ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరించారు. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ రోజు రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను స్మరించుకునేందుకు ఒక గొప్ప అవకాశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    జనవరి 25న జరుపుకునే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ, భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలక పాత్ర పోషిస్తారని, ఓటరే ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివారని మోదీ అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా యువతీయువకులు మొదటిసారి ఓటు వేస్తున్నప్పుడు, వారు ఇరుగుపొరుగు వారితో కలసి స్వీట్లు పంచుకోవాలని పిలుపునిచ్చారు. 2016 జనవరిలో యువత కోసం ‘స్టార్టప్ ఇండియా’ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.

    నాడు చిన్నదిగా మొదలైన ఆ ప్రయత్నం, నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దిందని ప్రధాని పేర్కొన్నారు. 
    ఏఐ (ఏఐ), అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ తదితర అత్యాధునిక రంగాల్లో భారతీయ స్టార్టప్‌లు సత్తా చాటుతున్నాయని  అన్నారు. ఈ ప్రగతిలో యువత ఎంపికలు, ఆవిష్కరణలే కీలకమని పేర్కొన్నారు. భారతీయ ఉత్పత్తులంటేనే ‘అత్యుత్తమ నాణ్యత’ అనే గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. దేశంలోని యువ పారిశ్రామికవేత్తలు,  ఆవిష్కర్తలకు సెల్యూట్ చేస్తూ, నవకల్పనలతో పాటు బలమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం వైపు అడుగులు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

    ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పని ఒత్తిడి.. టెక్కీ దుస్థితి వైరల్‌

Business

  • భారత ప్రభుత్వం పద్మ పురస్కాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  2026 సంవత్సరానికి అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించింది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, వైద్యం, విద్య, ప్రజాసేవ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో విశిష్ట, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఈ అవార్డులతో సత్కరిస్తారు.

    గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు అవార్డులు పొందినవారి పేర్లను ప్రకటించారు. పద్మ అవార్డులు భారత రత్న తర్వాత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. వీటిని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ఇస్తారు. 2026 సంవత్సరానికి 131 పద్మ అవార్డులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.

    ఉదయ్ కోటక్‌కు పద్మభూషణ్
    పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్‌ ఉదయ్ కోటక్‌కు దేశ మూడో అత్యున్నత పురస్కారమైన  పద్మభూషణ్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ దాస్ ఆఫ్‌షోర్ లిమిటెడ్ ఫౌండర్‌, ఎండీ అశోక్ ఖాడే, టీటీకే  గ్రూప్ చైర్మన్ (ఎమెరిటస్) టీటీ జగన్నాథన్‌లకు పద్మశ్రీ పురస్కారాల జాబితాలో చోటు దక్కింది. దేశీయ ప్రఖ్యాత వంటసామాను బ్రాండ్లలో ఒకటిగా ప్రెస్టీజ్‌ను తీర్చిదిద్దిన టీటీ జగన్నాథన్ గతేడాది అక్టోబర్‌లో మరణించారు.
     

  • మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ ప్రయోజనాలున్న మంచి నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రిలయన్స్ జియో ఇటీవల ‘హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్’ పేరుతో రూ.500 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

    ఈ ప్లాన్‌తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

    జియో రూ.500 ప్లాన్
    ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.

    ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు ఇవే..
    యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్‌, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్‌స్క్రిప్షన్‌లన్నీ ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి.

    ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్‌లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.

  • ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.

    నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ  ఇవ్వవు.  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.

    లాకర్‌లోని వస్తువులకు బీమా ఉంటుందా?
    లాకర్‌లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్‌కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.

    భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.

    వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్‌కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.

    ప్రత్యేక ఆభరణాల బీమా అవసరం
    విలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్‌లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.

    క్లెయిమ్ సులభంగా రావాలంటే..
    ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్‌లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్‌లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.

    బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.

  • హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ప్రయత్నాల్లో భాగంగా, ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులను వారి ఇంటి విద్యుత్ వినియోగ వివరాలను పంచుకోవాలని కోరుతోంది. ఈ మేరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘరాజ్కా నుంచి ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్ వెళ్లింది.

    అందులో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విద్యుత్ వినియోగ సర్వేను పరిచయం చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ సర్వే హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే పరికరాల వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ ప్రయత్నమని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

    “హైబ్రిడ్ పని విధానం మన కార్యకలాపాల్లో భాగమవడంతో, మన పర్యావరణ ప్రభావం ఇక కేవలం క్యాంపస్‌లకే పరిమితం కాదు. అది ఉద్యోగుల ఇళ్ల వరకూ విస్తరించింది. ఇంటి నుంచి పని చేసే సమయంలో వినియోగించే విద్యుత్తు కూడా ఇన్ఫోసిస్ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతుంది. మన నివేదికలను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు, ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ విద్యుత్ వినియోగంపై సరైన డేటా అవసరం” అని సంఘరాజ్కా వివరించారు.

    ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది ఉద్యోగులున్న ఇన్ఫోసిస్‌లో, ఎక్కువ మంది హైబ్రిడ్ మోడల్‌లో పనిచేస్తున్నారు. ఈ విధానం ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయానికి హాజరుకావాలి. గత 15 సంవత్సరాలుగా సంస్థ తన స్థిరత్వ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించుకుంటూ వస్తూ, పర్యావరణ లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తోంది.

    పరికరాల వివరాలూ ఇవ్వాలి
    ఈ సర్వేలో ఉద్యోగులను కేవలం విద్యుత్ వినియోగ వివరాలే కాకుండా, ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఉపయోగించే కంప్యూటర్లు, లైటింగ్, ఎయిర్ కండిషనర్లు వంటి పరికరాల వివరాలు కూడా ఇవ్వాలని కోరుతోంది. అలాగే లైట్ల వాటేజీ, ఇంట్లో సౌర విద్యుత్ వినియోగం ఉందా లేదా వంటి అంశాలపై కూడా సమాచారం అందించాలని సూచించింది. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులు ఇళ్లలో శక్తి సమర్థవంతమైన చర్యలను అనుసరించాలని ప్రోత్సహిస్తోంది.

  • అమెరికా హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తుదారులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే దాదాపు ఏడాది పాటు వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలకు విరామం కొనసాగుతుండగా, తాజా పరిణామాలతో అపాయింట్‌మెంట్లు నేరుగా 2027 సంవత్సరానికి మారాయి. దీని ప్రభావం ముఖ్యంగా భారతీయ ఐటీ వృత్తి నిపుణులపై తీవ్రంగా పడనుంది.

    భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో భారీ బ్యాక్‌లాగ్‌లు పేరుకుపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా లభ్యం కాకపోవడంతో, ఇప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలలు వెనక్కి నెట్టి 2027 మధ్యకాలానికి మార్చినట్లు సమాచారం.

    వాస్తవానికి 2025 డిసెంబర్‌లో మొదలైన జాప్యం కారణంగా అప్పట్లో అపాయింట్‌మెంట్లను 2026కి మార్చారు. అనంతరం అవి 2026 అక్టోబర్‌కి, ఇప్పుడు నేరుగా 2027కి వాయిదా పడడం వృత్తి నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారులు స్టాంపింగ్ కోసం భారత్‌కు వెళ్లొద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు. 2027 వరకు రెగ్యులర్ అపాయింట్‌మెంట్లు లేవని ‘అమెరికన్ బజార్’ కూడా వెల్లడించింది. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్‌కు వచ్చిన కొందరి ఇంటర్వ్యూలు కూడా రద్దయ్యాయని సమాచారం. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్లు ఉన్నవారికి సైతం తేదీలు మార్చి ఏడాది తర్వాతకు కేటాయిస్తూ ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది.

    ఉద్యోగాలు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం
    ఈ జాప్యం వల్ల వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే చిక్కుకుపోయారు. కొందరి భార్యా పిల్లలు అమెరికాలో ఉండగా, వారు మాత్రం భారత్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ ఒప్పందాలు, హౌసింగ్ అగ్రిమెంట్లు, వీసా గడువు పొడిగింపుల విషయంలో పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన ఉద్యోగులకు కొన్ని సంస్థలు పొడిగింపులు కూడా ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
     

  • దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజాగా సింగపూర్‌కి చెందిన ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్‌ సంస్థ ఫినర్జిక్‌ సొల్యూషన్స్‌ని  కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 19 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లను (సుమారు రూ. 136 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సేవల విభాగంలో, ముఖ్యంగా కోర్‌ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది.

    ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఒప్పందం పూర్తి కాగలదని వివరించింది. 2019లో ప్రారంభమైన ఫినర్జిక్‌కి భారత్, సింగపూర్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో కంపెనీ 12.6 మిలియన్‌ సింగపూర్‌ డాలర్ల ఆదాయం ఆర్జించింది.

    హెచ్‌సీఎల్‌ టెక్‌ ఫినర్జిక్‌ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. కోర్‌ బ్యాంకింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగాల్లో డిజిటల్‌ పరిష్కారాలపై డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, ఫినర్జిక్‌ వద్ద ఉన్న డొమైన్‌ నైపుణ్యం, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం హెచ్‌సీఎల్‌ టెక్‌కు ఉపయోగపడనుంది. ముఖ్యంగా యూరప్‌, సింగపూర్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని మరింత బలపర్చుకునే అవకాశం ఈ డీల్‌ ద్వారా లభించనుంది.

    ఈ కొనుగోలుతో హెచ్‌సీఎల్‌ టెక్‌ తన బ్యాంకింగ్‌ క్లయింట్లకు మరింత సమగ్ర సేవలను అందించగలదు. ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు కొత్త సేవలను అందించే క్రాస్‌-సెల్లింగ్‌ అవకాశాలు పెరగడంతో పాటు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో ఆదాయ వృద్ధికి ఇది దోహదపడనుంది. ఐటీ సేవల కంపెనీలు డొమైన్‌ ఆధారిత సంస్థలను కొనుగోలు చేసి విలువ పెంచుకునే ధోరణిలో భాగంగానే ఈ డీల్‌ను మార్కెట్‌ వర్గాలు చూస్తున్నాయి.

Family

  • ఒక వయసు వచ్చాక మహిళల్లో గర్భధారణలు పూర్తిగా ఆగిపోవడానికి చిహ్నంగా  రుతుక్రమం ఆగడమన్నది చాలా సాధారణం.  ఇలా పీరియడ్స్‌ రావడం ఆగిపోవడాన్ని డాక్టర్లు ‘మెనోపాజ్‌’గా చెబుతుంటారు. హార్మోన్ల మార్పులతో ఇలా మెనోపాజ్‌ ఆగడానికి ముందుగా మహిళల్లో చాలా రకాల ప్రతికూల లక్షణాలు కనిపిస్తుంటాయి. అందులో ఒంటి నుంచి వేడి ఆవిర్లు వస్తుండే హాల్‌ ఫ్లషెస్, మూడ్స్‌ త్వరగా మారిపోతూ ఉండటం (మూడ్‌ స్వింగ్స్‌), పీరియడ్స్‌ పూర్తిగా ఆగిపోయే ముందు క్రమబద్ధంగా రాకపోవడం (ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌)... ఇవన్నీ సాధారణం. అయితే వీటితోపాటు ‘బ్రెయిన్‌ ఫాగ్‌’ అనే లక్షణం కూడా చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు... ఈ లక్షణాన్ని మెనోపాజ్‌కు సంబంధించినది కాకపోవచ్చంటూ కొందరు అయోమయానికి గురికావడం కూడా సహజమంటున్నారు. మెనోపాజ్‌కు ముందర నిశ్శబ్దంగా వచ్చే ఈ ‘బ్రెయిన్‌ఫాగ్‌’ వివరాలేమిటో సవివరంగా చూద్దాం.!.

    నిజానికి బ్రెయిన్‌ ఫాగ్‌ అనేది గతంలో కరోనా వైరస్‌ విజృంభించాక... కోవిడ్‌–19 తాలూకు అనంతర దీర్ఘకాలిక దుష్ప్రభావాలలో ఒకటిగా చెబుతూ వెలుగులోకి వచ్చింది. ఈ ‘బ్రెయిన్‌ ఫాగ్‌’ దశలో మెదడు అయోమయానికి గురికావడం, మనసుకు మబ్బులు పట్టినట్లుగా మందకొడిగా ఉండి΄ోవడం, ఆలోచనల్లో స్పష్టత లేకుండా ఉండటం, ఏదీ స్పష్టంగా అనిపించక΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాతావరణంలో మంచు బాగా కమ్మినప్పుడు చూడటానికి ఎదుటి దృశ్యం గోచరించడంలో ఉండే అస్పష్టతలాగానే... మనసుకు లేదా మెదడుకు అదే మంచు  ఆవరిస్తే ఆలోచనల్లో, భావాల్లో ఎలాంటి అయోమయంగా / అస్పష్టతతో ఉంటాయో తెలియజెప్పేందుకే ఈ బ్రెయిన్‌ ఫాగ్‌ అనే పదం ఉపకరిస్తుంది. 

    ఎందుకిలా జరుగుతుందంటే... 
    రుతుస్రావం ఆగి΄ోయే ముందుగా మహిళల్లో స్రవించే చాలా రకాల హార్మోన్లు... వీటిల్లోనూ మరీ ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ్ర΄ోజెస్టరాన్‌ వంటివి బాగా తగ్గడంతో హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడుతుంది. ఇవి కేవలం ప్రత్యుత్పత్తి కోసమే కాకుండా మెదడు సరిగా పనిచేయడంలో కూడా బాగా ఉపకరిస్తుంటాయి. ఉదాహరణకు ఈస్ట్రోజెన్‌ అన్న హార్మోన్‌ మెదడులోని నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్‌ నెరపుతుంటుంది. అలాగే మెదడులో స్రవించే రసాయనాలైన సెరటోనిన్, డోపమైన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మిట్టర్లు తమ బాధ్యతలను నెరవేర్చడంలోనూ ఈస్ట్రోజెన్‌ తగిన భూమికను పోషిస్తుంది. 

    ఈ హార్మోన్‌ తగ్గడంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరు ఆగడం ఎలాగూ జరిగేదే అయినా దాంతోపాటు మెదడులోని కార్యకలా΄ాలూ ప్రభావితమవుతాయి. దాంతో మెదడు ఆకృతిలో కూడా కొంతలో కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంటుందని ఆధునిక శాస్త్రపరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు ఫ్రంటల్‌ కార్టెక్స్, హిపోక్యాంపస్‌ వంటివి ఉన్న చోటు నుంచి కాస్తంత పక్కకు జరగడం వంటివి. ఈ కారణంగా కొందరు మహిళల్లో వారి జ్ఞాపకశక్తిపైనా అలాగే మూడ్స్‌లో మార్పుల పైనా ప్రభావం పడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

    నిద్రపైనా దుష్ప్రభావాలు... 
    ఈ బ్రెయిన్‌ఫాగ్‌ తాలూకు దుష్ప్రభావాలు మెనోపాజ్‌ వచ్చిన మహిళల నిద్రపైనా పడతాయి. దాంతో వాళ్లు తరచూ నిద్రాభంగానికి గురవుతుండటం జరుగుతుంది (ఒంట్లోంచి ఆవిరులు వస్తుండే హాట్‌ ఫ్లషెస్, రాత్రిళ్లు తీవ్రంగా చెమటలు పట్టే నైట్‌ స్వెట్టింగ్‌ వంటి లక్షణాలు కూడా మహిళల్లో నిద్రలేమి కారణమవుతుంటాయి). ఈ నిద్రలేమి తిరిగి మళ్లీ మెదడును మందకొడిగా చేయడానికి కారణమవుతుంటుంది. 

    చికిత్స...
    బ్రెయిన్‌ఫాగ్‌ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న మహిళలకు వాళ్లలో తగ్గిన  హార్మోన్లను భర్తీ చేసే ‘హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ’తో లక్షణాలు అదుపులోకి వస్తాయి. అయితే వాళ్ల సమస్యలకు ఇతరత్రా వేరే కారణాలేవీ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఈ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) ఇస్తారు. 

    బ్రెయిన్‌ఫాగ్‌లో కనిపించే లక్షణాలు...
    ∙దేనిపైనా ఏకాగ్రత నిలవకపోవడం లేదా ఏదైనా విషయంపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది కలగడం. 

    మనుషుల, ప్రదేశాల పేర్లూ, కొన్ని పదాలు ఠక్కుమని స్ఫురించక΄ోవడం లేదా మరచిపోవడం. మనం చేయాల్సిన పనులు, తదుపరి షెడ్యూల్స్‌ మరచిపోతూ ఉండటం. 

    తీవ్రమైన నిస్సత్తువ లేదా బాగా మందకొడిగా అనిపించడం. 

    సాఫీగా ఆలోచింకలేకపోవడం, మునపటిలా కాకుండా ఏదైనా ఆలోచనల్లో స్పష్టత వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడాల్సి రావడం. 

    అధిగమించడం ఎలా...
    మెనోపాజ్‌లో కనిపించే ఈ బ్రెయిన్‌ఫాగ్‌ను అధిగమించడానికి మంచి జీవనశైలి బాగా ఉపయోగపడుతుంది. కంటినిండా నిద్ర΄ోవడం, మంచి గాఢమైన, నాణ్యమైన నిద్రతోనూ, అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి సమతులాహారంతోనూ, క్రమంతప్పకుండా చేసే వ్యాయామాలతో పాటు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా కాలం గడుపుతూ, తమను తాము బిజీగా పెట్టుకుంటూ నిత్యం మంచి పుస్తకాలు చదవడం, గళ్లనుడికట్టు లేదా క్లిష్టమైన పజిల్స్‌ సాధించడం లాంటి  ‘మెంటల్‌ ఎంగేజ్‌మెంట్‌’ కార్యకలాపాలతో గడపడం వల్ల ఈ తరహా బ్రెయిన్‌ఫాగ్‌ లక్షణాలు చాలావరకు తగ్గుతాయి.

    మతిమరపు వస్తుందా అన్నంత ఆందోళన... 
    బ్రెయిన్‌ఫాగ్‌ తాలూకు ఈ లక్షణాలతో మెనోపాజ్‌ దశలో మహిళలకు తమకు మతిమరపు గానీ లేదా అలై్జమర్స్‌గానీ వస్తున్నాయా అంటూ తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు. అయితే అదృష్టవశాత్తూ ఇవేవీ అలై్జమర్స్‌లాంటి తీవ్రమైన మతిమరపులాంటి సమస్యలను తెచ్చిపెట్టవన్నది వైద్య నిపుణుల మాట. అంతేకాదు... బ్రెయిన్‌ఫాగ్‌తో కనిపించే ఈ లక్షణాన్నీ చాలావరకు తాత్కాలికమేనంటున్నారు.  

    (చదవండి: అమ్మ పాలతో అదనంగా...కాంప్లిమెంటరీ ఫుడ్‌గా..!)

     

  • చిన్నారులకు ఆర్నెల్లు నిండేవరకు తల్లిపాలు మినహా ఇతర ఆహారాలేవీ ఇవ్వాల్సిన  అవసరం లేదు. ఆర్నెల్ల వయసు దాటాకే చిన్నపిల్లలకు ఘనాహారం ఇవ్వడం మంచిదని అనేక అధ్యయనాలూ, నిపుణులూ సిఫార్సు చేస్తున్నారు. ఆర్నెల్లు దాటాక పిల్లలకు క్రమంగా ఘనాహారానికి మార్చే ప్రక్రియలో తల్లిపాలతోపాటు కొద్దికొద్దిగా ఆహారాన్ని ఇచ్చే క్రమంలో వారికి పెట్టే మెత్తటి గుజ్జులాంటి ఫుడ్‌ను ‘కాంప్లిమెంటరీ ఫుడ్‌’గా చెప్పవచ్చు. అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. 

    కాంప్లిమెంటరీ ఆహారం గురించి ఇటీవల మార్కెట్‌లో యాడ్స్‌ ద్వారా ప్రచారాలూ, వాణిజ్యపరమైన 
    హడావుడి ఎక్కువగా ఉంటున్నాయి. తమ కంపెనీ ఆహారం వల్ల ఎదిగే పిల్లలకు మంచి పౌష్టికత లభిస్తుందంటూ ఈ తరహా అడ్వరై్టజ్‌మెంట్స్‌లో చెబుతుంటారు. నిజానికి కాంప్లిమెంటరీ ఆహారం అంటే... తల్లిపాలతోపాటు ఆర్నెల్ల వయసు నుంచి పిల్లలకు అదనంగా ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం అని చెప్పవచ్చు. కాబట్టి కాంప్లిమెంటరీ ఆహారమనగానే అదేదో తప్పనిసరిగా మార్కెట్‌లో కొని చిన్నారులకు తినిపించాల్సిన ఆహారమంటూ పొరబడాల్సిన / అపోహపడాల్సిన అవసరం లేదు. 

    ఘనాహారంలో ఇవ్వాల్సిన న్యూట్రిషన్‌ ఇలా... 
    ఘనాహారంలో భాగంగా పిల్లలకు మెత్తగా ఉడికించిన అన్నం (రైస్‌), పప్పులు (దాల్‌), అరటిపండు గుజ్జుగా చిదిమి ఇవ్వాలి. ఆలూ వంటి ఉడకబెట్టిన కూరగాయలూ మెత్తగా చిదిమి పెట్టవచ్చు. ఘనాహారం మొదలుపెట్టిన నాటి నుంచి చిన్నారులకు కాచి చల్లార్చిన నీళ్లు పడుతూ ఉండాలి. అంతేతప్ప వాణిజ్య ప్రయోజనాలతో మార్కెట్‌లో లభ్యమయ్యే ఆహారాన్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. 

    ఏ మోతాదులోనంటే... 
    పైన చెప్పిన ఆహారాన్ని ఆర్నెల్ల వయసు నుంచి రోజూ 150 ఎమ్‌ఎల్‌ పరిమాణంలో రెండు నుంచి మూడు సార్లు తినిపించవచ్చు. పాలు ఎక్కువగా పట్టని పిల్లలకు రోజూ 3 నుంచి 5 సార్లు కూడా తినిపించవచ్చు. ఇక ఎనిమిది/తొమ్మిది  నెలలు నిండిన పిల్లలకు పైన పేర్కొన్న ఆహారమేగాక... 

    మెత్తగా చిదిమిన ఇడ్లీ లేదా రోటీ కాస్తంత గట్టిగా వండిన పప్పుతో ఇవ్వవచ్చు. ఇక  రవ్వతో కాస్తంత జావలా వండిన ఆహారం (పారిడ్జ్‌), సపోటా, బొప్పాయి వంటి పండ్లను చిదిమి ఆహారంగా ఇవ్వవచ్చు. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ ఆహారం కిందికే వస్తాయి. 

    కాంప్లిమెంటరీ ఆహారం ఎలా ఉండాలంటే...
    పిల్లల కడుపుకు నప్పేదీ, సరైనది, మృదువుగా ఉండేది, తేలిగ్గా జీర్ణమయ్యేది, స్థానిక  సంస్కృతి ఆమోదించేది, తేలిగ్గా వండగలిగేది, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను బట్టి వారు భరించగలిగేంత (అఫర్డ్‌ చేయగలిగేంత) చవకగా దొరికేదని అధ్యయనాల నిర్వచనం. ఇప్పుడంటే దీన్ని ‘కాంప్లిమెంటరీ ఆహారం’గా చెబుతున్నారు గానీ... గతంలో ఘనాహారాన్ని మొదలుపెట్టే ప్రక్రియను ఇంగ్లిష్‌లో ‘వీనింగ్‌’ అనేవారు. అయితే ఈ ప్రక్రియను వీనింగ్‌ అనడం అంత సమంజసం కాదని నిపుణులు అభిప్రాయం.  

    నిజానికి వీనింగ్‌ అంటే పాలు పట్టడాన్ని క్రమంగా ఆపేస్తూ్త ఘనాహారానికి మళ్లడం అని అర్థం. కానీ పిల్లలకు రెండేళ్లు నిండేవరకు తల్లిపాలు పట్టడాన్ని కొనసాగిస్తూనే ఈ ఘనాహారాన్ని అనుబంధంగా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఇప్పుడు అనుబంధ ఆహారం (కాంప్లిమెంటరీ ఫుడ్‌) అంటున్నారు. ఇక కొద్దిమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కాస్తంత త్వరగా అంటే... మూడు లేదా నాలుగు నెలల వయసప్పటి నుంచే ఘనాహారాన్ని మొదలుపెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. 

    ఇలా మొదలుపెట్టిన పిల్లల్లో కొందరికి ఆహారం గొంతులో ఇరుక్కోవడం (చోకింగ్‌), నీళ్లవిరేచనాలు (డయేరియా), అలర్జీల వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనుబంధ ఆహారాన్ని ఆలస్యం ఇవ్వడం మొదలుపెడితే అది వాళ్ల పెరుగుదలపై దుష్ప్రభావం చూవచ్చు. అందుకే సరైన సమయంలో పిల్లలకు ఘనాహారం / అనుబంధ ఆహారం మొదలుపెట్టడం అన్నది ముఖ్యం. అయితే... ఘనాహారం ఇస్తున్నప్పటికీ పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. అది భవిష్యత్తులో వాళ్లను ఎన్నో జబ్బుల నుంచి దూరం చేస్తూ... ఆ పిల్లలకు పెద్దవయసు వచ్చాక కూడా రక్షణ ఇస్తూనే ఉంటుంది.  
    హరిత శ్యామ్‌ .బి సీనియర్‌ డైటీషియన్‌
    (చదవండి: 'ఒంటరి పెంగ్విన్'..ఇంత స్ఫూర్తిని రగలించిందా..!)
     

  • ఓ డాక్యుమెంటరీ నుంచి వచ్చిన ఒంటరి నిహిలిస్ట్ పెంగ్విన్ క్లిప్ ఇప్పటికీ వైరల్‌ అవ్వుతూ స్ఫూర్తిని రగిలిస్తూ..యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అంతేగాదు అసలేంటీ ఒంటరి పెంగ్విన్‌ కథ అని నెట్టింట చర్చలు లేవెనెత్తాయి. ఇది తిరుగుబాటుకు, ధైర్యానికి, పట్టుదలకు కేరాఫ్‌గా నిలిచింది. అందరు జీవిస్తారు కానీ ఈ ఎగరలేని పక్షి బతకాలని కోరుకుంటుందంటూ..ప్రేరణను అందించే కథలన్నీ గుట్టుగట్టలుగా ుపుట్టుకొచ్చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ ఒంటరి పెంగ్విన్‌ వెనుకున్న కథేంటంటే..!.

    నిజానికి పెంగ్విన్‌లు గుంపులు గుంపులు సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడ వీడియోలోనిపెంగ్విన్‌ మాత్రం నా దారి రహదారి అంటూ..విభిన్నంగా వెళ్తోంది. అది కూడా అది వెళ్లే రూటు ఆహారం దొరికే ప్రదేశం కానేకాదు. సముద్రం వైపుకి వెళ్తున్న గుంపుని వదిలేసి మరి ఒంటరిగా వెళ్తుండటం అందర్నీ ఆకర్షించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సైతం గ్రీన్‌ల్యాండ్‌ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులకు ఆద్యం పోసేలా ఈ ఒంటరి పెంగ్విన్‌ను కలిగి ఉన్న AI- రూపొందించిన చిత్రాన్ని కూడా పంచుకున్నారు. 

    అంతేకాదు చాట్‌జీపీటీ సైతం పెంగ్విన్‌ ఒంటరిగా అలా ఎందుకు వెళ్తుందో సర్చ్‌ చేయగా..ఈ క్లిప్‌ వన్యప్రాణులను చూడలేదని పేర్కొనడం గమనార్హం. 2007లో చిత్రీకరించిన డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు, మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి.

    కానీ, ఒక్క 'అడిలీ పెంగ్విన్' (Adelie Penguin) మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కి.మీ దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తుండటాన్ని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్‌ని ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్‌ హెర్జోగ్‌ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్‌ వాక్‌ని డెత్‌మార్చ్‌ అని పిలిచాడు. ఎందుకంటే ఆ పెంగ్విన్‌ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి, పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. వెర్నర్ హెర్జోగ్, ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిలబడ్డారు. దానిని పట్టుకుని మళ్ళీ పెంగ్విన్‌ల గుంపులో కలిపారు. 

     

    కానీ, ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్ళీ గుంపు నుండి బయటకు వచ్చి అదే పర్వతం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ ెపెంగ్విన్‌ గుండెధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. పైగా దాన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటుండుంటం విశేషం.

    గుంపులో గోవింద అన్నట్లుగా కాకుండా స్పెషల్‌గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు ఈ పెంగ్విన్‌ ఒక రోల్‌మోడల్‌ అని కొందరు చెబుతున్నారు. మరి ొకొందరు ఈ పెంగ్విన్‌ డిప్రెషన్‌లో ఉందంటూ భావోద్వేగంగా పోస్టులు పెట్టారు. ాకానీ ఎక్కువమంది మాత్రం ఎగరలేని పక్షి అయినప్పటికీ..కాలినడకన పర్వత శిఖరాన్ని అందుకోవాలనే పట్టుదలకు సలాం అంటూ కితాబులు ఇచ్చేస్తూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి: కొండల నుంచి సభకు..!)

  • గిరిపుత్రులుగా పిలిచే గిరిజనులు..కొన్నితెగలు ఇప్పటకీ చాలా వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ నాటి ఆచార సంప్రదాయాలు, కట్లుబాట్లు వారిలో భాగం అన్నట్లుగా ఉంటుంది వారి సంస్కృతి. కొందరు ఇప్పటికీ సిటీ ముఖమే చూడని వాళ్లున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి గిరిజనుల్లో ఒక తెగ అసలు బయటకే అడుగుపెట్టరు. వాళ్లకస్సలు..పట్టణాలు, నగరాలు గురించి బొత్తిగా తెలియనే తెలియదు. ముఖ్యంగా అక్కడ మహిళలు తమ ఇల్లు, గ్రామం తప్ప బయట ముఖమే తెలియని వాళ్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాళ్లంతా ఏదో పార్టీలో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారనుకుంటే పొరపాటే

    తమిళనాడు నీలగిరిలోని దేవర్చోలై పంచాయతీలోని కౌండన్‌కొల్లై కుగ్రామానికి చెందిన ఓ గిరిజన తెగ చాలా అరుదుగా బయటకు వస్తారు. అలాంటి నేపథ్యం ఉన్న గిరిజన మహిళలు అసెంబ్లీనికి చూసేందుకు రావడం విశేషం. ఎవరి వల్ల వాళ్లు ఇంత ధైర్యంగా అసెంబ్లీ సందర్శనకు రాగలిగారంటే..గూడలూరు ఎమ్మెల్యే పొన్ జయశీలన్ మద్దతుతో అసెంబ్లీకి వచ్చారు. ఆ తెగకు చెందిన ఎక్కువమందిని అసెంబ్లీకి తీసుకురావాలనుకుంటే..కేవలం ఐదుగురు మాత్రమే ఇక్కడకు రావడానికి అంగీకరించారట. 

    అంతేగాదు వాళ్లంతా తమకు ఈ అవకాశం ఇచ్చిన సదరు ఎమ్మెల్యే, స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాము అసెంబ్లీ ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతుహలంతో వచ్చామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే పొన్ జయశీలన్ ఆ తెగకు చెందిన చాలామంది ఇక్కడకు రావాలని ఆశించా, కానీ ఐదురుగు మాత్రమే వచ్చారని ఆయన అన్నారు. 

    అంతేగాదు ఆయన మారుమూల గిరిజన ప్రాంతాలలో గృహాలను నిర్మించడంలో ఎదుర్కొంటున్న లాజిస్టికల్ సవాళ్లను పేర్కొంటూ, గిరిజన గృహాలకు ఆర్థిక సహాయాన్ని 5.25 లక్షల నుంచి 7.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు కూడా. 

    (చదవండి: వణికించే చలిలో పెళ్లి..అక్షింతలుగా హిమపాతం..!)
     

  • వణికించే చలిలో పెళ్లి తంతు గురించి సినిమాల్లోనే చూసుంటాం. అందులో హీరో హీరోయిన్‌లు గడ్డకట్టిన మంచుని ఆస్వాదిస్తూ..గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నట్లు చూపిస్తుంటారు. కానీ రియల్‌గా మాత్రం అంత ఎంజాయ్‌ఫుల్‌గా ఉండదు. ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై లుక్కేయండి మరి..

    ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ హిమపాతం నడుమ ఓ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ జంట వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. అదే రోజున ఆ ప్రాంతంలో తొలి భారీ హిమపాతం కురిసింది. ఈ వివహ వేడుక ప్రసిద్ధిగాంచిన త్రియుగినారాయణ్ ఆలయంలో వైభవోపతంగా జరిగింది. ఈ త్రియుగినారాయణ్ ఆలయంలోనే సాక్షాత్తు ఆ పరమశివుడు, పార్వతిదేవి పెళ్లి చేసుకున్నారని భక్తులు విశ్వసిస్తుంటారు. 

    అందువల్ల చాలామంది భక్తులు తమ దాంపత్యం బాగుండాలని, తాము కలకాలం కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలయంలోనే పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. అయితే పెళ్లి తర్వాత ఆ నూతన దంపతులు దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం అత్యద్భుతంగా ఉంది. వారి పెళ్లిని ఆశ్వీరదిస్తూ..ప్రకృతి ఈవిధంగా పూల వర్షంలా హిమపాతాన్ని ఆ దంపతులపై కురిపిస్తుందా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. 

    ఇక ఈ వేడుకలో వధువు ప్రకాశవంతమైన ఎర్రటి లెహంగాలో మెరిసిపోతుండగా, వరుడు షేర్వేనీ విత్‌ జాకెట్‌ ధరించాడు. గజగజలాడిస్తున్న కఠిన వాతావరణాన్ని చూసి ఆ జంట ఆనందం వ్యక్తం చేస్తూ..ఇది ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం ఆనందంగా చెబుతుండటం విశేషం. ఇదిలా ఉండగా, శుక్రవారం, ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాదిలో తొలి హిమపాతం కురిసింది. 

    ఉత్తరాఖండ్‌లోని గర్వాల్, కుమావోన్ డివిజన్‌లలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఔలి, ముస్సోరీ, చక్రతా, ధనౌల్టి, మున్సియారి వంటి వివిధ ప్రదేశాలలో భారీ హిమపాతం సంభవించింది. నైనిటాల్‌లోని చైనా పీక్, కిల్బరీ, అల్మోరాలోని దునగిరి, పౌరీలోని తర్కేశ్వర్ వంటి ఎత్తైన ప్రాంతాలు పూర్తిగా దట్టమైన మంచుదుప్పటితో కప్పబడ్డాయి.

     

    (చదవండి: గౌరవానికి అసలైన అర్థం..! ఆ బైకర్‌ చేసిన పనికి..)

     

     

  • నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మళ్లీ మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. డాక్టర్‌ మందులు ఇస్తే తగ్గుతుంది. కాని, కొంతకాలానికి మళ్లీ వస్తుంది. ఈ మధ్య దగ్గు వచ్చినప్పుడు లేదా బలంగా నవ్వినప్పుడు మూత్రం లీక్‌ అవుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? సరైన పరీక్షలు, చికిత్స ఏమిటో చెప్పండి.
    – రాధ, అనంతపురం. 

    మీకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ప్రతిసారి ఒకే రకమైన మందులు వాడితే శరీరానికి అవి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మందులు తక్కువగా పనిచేయడం, ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఇన్ఫెక్షన్‌  ఎందుకు వస్తోంది అనే కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగడం, మలబద్ధకం, దగ్గు ఎక్కువగా ఉండడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం ఇవన్నీ సమస్యను పెంచుతాయి. రోజూ సరిపడా నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, చల్లని పానీయాలు, టీ, కాఫీ తగ్గించాలి. మలబద్ధకం, దగ్గు ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.

    దగ్గు లేదా నవ్వినప్పుడు మూత్రం లీక్‌ అవడం అనేది మూత్రాశయ కండరాల బలహీనత వల్ల కావచ్చు. దీనివల్ల మూత్రాశయం, మూత్రనాళం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి ఎలా ఉంది, కండరాల పని తీరు ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షను సాధారణంగా బయట చికిత్స విభాగంలోనే చేస్తారు. పెద్ద నొప్పి ఉండదు, అవసరమైతే మత్తు మందుతో చేస్తారు. అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. అయితే, ఈ పరీక్ష చేయడానికి ముందు ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌  లేదని నిర్ధారించాలి. 

    ఒకవేళ ఇన్ఫెక్షన్‌  ఉంటే ముందుగా దానికి మందులు ఇవ్వాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా కండరాల వ్యాయామాలు, మందులు లేదా ఇతర చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మూత్రం లీక్‌ అవుతోంది అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేస్తే సమస్యకు సరైన చికిత్స తీసుకుని, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.

    నా వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు. గర్భసంచి గడ్డల కారణంగా గర్భసంచి తీసివేయాలని డాక్టరు చెప్పారు. కాని, అండాశయాలను మాత్రం తీసివేయొద్దు అని అంటున్నారు. అండాశయాలు తీసివేస్తే బరువు పెరుగుతుందని కూడా చెప్పారు. ఇందులో సరైన నిర్ణయం ఏంటి?
    – లలిత, శ్రీకాకుళం. 

    గర్భసంచి గడ్డల వల్ల శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అండాశయాలను తీసివేయాలా లేక ఉంచాలా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. మీ వయస్సు, సమస్య స్వభావం, కుటుంబంలో క్యాన్సర్‌ చరిత్ర, స్కాన్‌  నివేదికలు ఇవన్నీ చూసి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సర్‌ అనుమానం ఉన్నప్పుడు, లేదా భవిష్యత్తులో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా అండాశయాలను కూడా తీసివేయాలని సూచిస్తారు. అలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్‌  అవసరం లేకుండా ఉంటుంది. కానీ క్యాన్సర్‌ ప్రమాదం లేని పరిస్థితుల్లో, అండాశయాలను ఉంచితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండాశయాలు ఉంచితే శరీరంలో సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.

     దీని వల్ల ఒక్కసారిగా వేడి దడలు, ఎక్కువ చెమటలు, మూడ్‌ మార్పులు, డిప్రెషన్‌ , జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా కొంతవరకు తగ్గుతుంది. అండాశయాలు తీసివేస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే లక్షణాలు ముందుగానే వస్తాయి. వేడి దడలు, నిద్రలేమి, తలనొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో బరువు పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరుగుతుందనే కాదు. కొన్ని ఎంపిక చేసిన పరిస్థితుల్లో హార్మోన్‌  ప్రత్యామ్నాయ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు. 

    మాత్రలు లేదా ప్యాచ్‌ల రూపంలో ఈ చికిత్స ఇస్తారు. అయితే ఇది అందరికీ సరిపోదు. వైద్యుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సూచిస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో అండాశయాలు ఉంచినా, తరువాత పొత్తికడుపు నొప్పి లేదా ఇతర సమస్యల వల్ల మళ్లీ శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అండాశయాలు ఉంచడం వల్ల నొప్పి కొనసాగవచ్చు. కాబట్టి గర్భసంచి శస్త్రచికిత్స సమయంలో అండాశయాలు తీసివేయాలా వద్దా అన్న నిర్ణయం మీ వైద్యునితో పూర్తిగా చర్చించి తీసుకోవాలి. మీకు ఉన్న సమస్య, భవిష్యత్తు ప్రమాదాలు, లాభనష్టాలు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.  

  • కుంభకర్ణుడి కొడుకులు సకుంభ నికుంభులు. రామ రావణ యుద్ధ కాలంలో వారు శాపవశాన మదగజాల రూపంలో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు. ఆ తర్వాత పులస్త్యుడి అనుగ్రహంతో శాపవిమోచన పొందారు. పూర్వరూపాలు పొందిన తర్వాత సకుంభ నికుంభులు యథావిధిగా ఇష్టానుసారం సంచరిస్తూ, లోకాలను పీడించడం ప్రారంభించారు. ‘రామ రావణ యుద్ధంలో రావణ కుంభకర్ణాదులు హతమయ్యారు. వీరు కూడా హతమైపోయి ఉండే బాగుండేది, వీరి పీడ విగడయ్యేది’ అని ఇంద్రాది దేవతలు అనుకోసాగారు.

    ఇదిలా ఉండగా, ఒకనాడు నారద మహర్షి లోకసంచారం చేస్తూ సకుంభ నికుంభుల నిలయానికి వచ్చాడు. ఇద్దరు సోదరులూ ఆయనకు ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించి, సగౌరవంగా స్వాగతించారు. ‘నారద మహర్షీ! విశేషాలేమిటి?’ అని అడిగారు.‘మహావీరులారా! దానవ వీరుల్లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సైతం నేను ఎరుగుదును. వారెవరూ బాహు పరాక్రమంలో మీకు సాటిరారు. మీరు కత్తి ఎత్తారంటే సహస్రాక్షుడు సైతం భయంతో తోక ముడిచి పరుగులు తీస్తాడు. మీ బలపరాక్రమాలకు భయపడి ఇంద్రుడు గజగజలాడుతున్నాడు. ముల్లోకాలలోని జనాలు మీ ధాటికి జడిసి నిద్రలో కూడా ఉలికిపడుతున్నారు’ అన్నాడు.‘ఔను నారద మహర్షీ! నువ్వు పలికినది సత్యం. ముల్లోకాలలోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడు?’ అని గర్వంగా మీసాలు దువ్వుకున్నారు. 

    ‘మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరూ లేకున్నా, జ్ఞాతిద్రోహం చేసి, లంకకు పట్టాభిషిక్తుడైన విభీషణుడు ఉన్నాడు కదా, అతడే మీ శత్రువు. అతడిని జయించి, లంకను స్వాధీనం చేసుకున్నారంటే, మీ లంక మీకు దక్కినట్లవుతుంది’ అని అగ్గి రాజేసి చక్కా వెళ్లిపోయాడు నారదుడు.నారదుడి మాటలు విని సకుంభ నికుంభులు రగిలిపోయారు. వెంటనే ఒక దూతను విభీషణుడి వద్దకు పంపి, యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరిక సందేశం పంపారు.విభీషణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు. సకుంభ నికుంభులకు, విభీషణుడి సేనలకు మధ్య భీకర యుద్ధం మొదలైంది. సకుంభ నికుంభుల చేతిలో విభీషణుడి సైనికులు పెద్దసంఖ్యలో నేలకొరిగారు. పోరులో వారి ముందు నిలువలేక విభీషణుడు కూడా రథాన్ని వెనక్కు మరలించాడు.

    యుద్ధంలో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటంతో విభీషణుడు చింతాక్రాంతుడయ్యాడు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితిలో నాకు రాముడే దిక్కు. ముందుగా ఈ సంగతిని హనుమకు తెలుపుతాను’ అనుకుని, వెంటనే ఆకాశమార్గాన గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ హనుమంతుడిని కలుసుకుని, సకుంభ నికుంభుల దురాగతాన్ని వివరించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు.
    ‘భయపడకు విభీషణా! వెంటనే మనం రామచంద్రుడిని కలుసుకుందాం. ఆయన అండ మనకు ఉన్నంత వరకు సకుంభ నికుంభుల వంటివారు ఎందరు వచ్చినా, నిన్నేమీ చేయలేరు’ అని అభయమిచ్చాడు. విభీషణుడిని వెంటబెట్టుకుని వెంటనే అయోధ్యకు చేరుకున్నాడు. 

    విభీషణాంజనేయులు రాత్రివేళ అకస్మాత్తుగా రావడంతో రాముడు ‘ఇంత రాత్రివేళ మీరిద్దరూ ఇలా రావడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించాడు.హనుమంతుడు రాముడికి విభీషణుడి పరిస్థితిని వివరించాడు. విభీషణుడికి రాముడు ధైర్యం చెప్పి, ‘హనుమా! రేపు సూర్యోదయానికల్లా సేనలను సిద్ధం చేయి. మనం యుద్ధానికి బయలుదేరుతున్నాం’ అని ఆజ్ఞాపించాడు. మర్నాడు ఉదయమే లక్ష్మణుడికి అయోధ్యానగర బాధ్యతలను అప్పగించి, భరత శత్రుఘ్నులతో కలసి విభీషణాంజనేయులు, సేనలు వెంటరాగా రాముడు లంకకు బయలుదేరాడు.

    రాముడి రాకను వేగుల వల్ల తెలుసుకున్న సకుంభ నికుంభులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హోరాహోరీ యుద్ధం మొదలైంది. భరత శత్రుఘ్నులు ముందుకు వెళ్లి సకుంభ నికుంభులను ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు ఎంతకూ వెనక్కు తగ్గకుండా పోరాడుతుండటంతో దానవ సోదరులిద్దరూ తమ తండ్రి కుంభకర్ణుడికి యముడు ఇచ్చిన యమదండాన్ని వారి మీదకు ప్రయోగించారు. యమదండం తాకగానే భరతశత్రుఘ్నులు కుప్పకూలిపోయారు.తన సోదరులు రణరంగంలో కూలిపోవడంతో రాముడు క్రోధావేశంతో కోదండాన్ని అందుకున్నాడు. సకుంభ నికుంభలపైకి వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. వాయువేగంతో దూసుకెళ్లిన ఆ దివ్యాస్త్రం సకుంభ నికుంభులిద్దరినీ యమపురికి పంపింది. 

    అప్పటికీ భరతశత్రుఘ్నులు స్పృహలేకుండా ఉండటంతో రాముడు శోకతప్తుడై దుఃఖించాడు. ‘రామచంద్రా! నువ్విలా శోకించ తగునా! ఇలాంటి ఆపదలను గట్టెక్కించడంలో దిట్ట అయిన హనుమ మన చెంతనే ఉన్నాడు కదా! అతడిని పంపితే, ఇట్టే సంజీవనని సాధించుకు వచ్చి నీ తమ్ములను బతికించగలడు’ అని విభీషణుడు ఊరడించాడు.‘హనుమా! నువ్వే నా సోదరులను బతికించాలి’ వేడుకోలుగా అన్నాడు రాముడు.‘ప్రభూ! నీ ఆజ్ఞ అయితే, సంజీవనినే కాదు, ఇంద్రుడితో పోరాడి సాక్షాత్తు అమృతాన్నయినా తీసుకొస్తా’ అని పలికి హనుమంతుడు ఆకాశానికెగశాడు.

    హనుమంతుడు నేరుగా అమరావతికేగి, అక్కడి నుంచి అమృతకలశంతో తిరిగి వచ్చాడు. అమృతాన్ని తాగించడంతో భరత శత్రుఘ్నులు పునర్జీవితులయ్యారు. విభీషణుడికి వీడ్కోలు పలికి రాముడు సోదరులతో కలసి అయోధ్యకు చేరుకున్నాడు.
    ∙సాంఖ్యాయన 

  • ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మాంద్యం కన్నా ‘లే-ఆఫ్’ గండం అందరినీ భయపెడుతోంది. కేవలం ఒక ఈ-మెయిల్ లేదా ఒక ఫోన్ కాల్‌తో ఉద్యోగుల దశాబ్దాల కెరీర్ పేకమేడలా కూలిపోతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు ఉండే పదవీ విరమణ వయసు, ఇప్పుడు అకస్మాత్తుగా 40 ఏళ్లకే వచ్చి పడుతోందా? అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

    బాధ్యతలు మోసే వయసులో..
    40 ఏళ్ల వయసులో ఉద్యోగం పోవడమంటే కేవలం ఉపాధి కోల్పోవడం మాత్రమే కాదు, పెండింగ్‌లో ఉన్న ఇంటి రుణాల (ఈఎంఐ) నుండి పిల్లల స్కూల్ ఫీజులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వైద్య ఖర్చుల వరకు కుటుంబ ఆర్థిక వ్యవస్థ మొత్తం  అస్తవ్యస్తమైపోతుంది. తదుపరి 20 ఏళ్ల పాటు ‘సర్వైవల్ మోడ్’లో బతకాల్సిన దుస్థితిని ఈ కొత్త లే-ఆఫ్ సంస్కృతి సృష్టిస్తోంది.

    ఆశలు చిదిమేస్తూ..
    ‘ఇండియా టుడే’లోని ఒక కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల రాజీవ్ (పేరు మార్చాం) లాంటి మిడ్-లెవల్ మేనేజర్ల పరిస్థితి ఇందుకు నిదర్శనం.  మల్టీ నేషనల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్.. తాను భవిష్యత్‌లో ఇదే ఉద్యోగంలో కొనసాగుతానని నమ్మాడు. అయితే అతను కంపెనీ దృష్టిలో ‘కోర్’ మెంబర్ కాదని, కేవలం ‘అదనపు ఖర్చు’ అని తేలింది.దీంతో ఒక్క వారం రోజుల వ్యవధిలోనే అతన్ని ఇంటికి పంపించేశారు.

    20 ఏళ్ల అనుభవం ఉన్నా..
    40 ఏళ్లు దాటాక జీవితం స్థిరపడుతుందని, ఇంటి రుణాలు తీరుస్తూ, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకోవచ్చని అనుకునే సమయంలో కంపెనీలు  ఇలాంటి వారిని పాతబడిపోయిన వారిగా చూస్తున్నాయి. హెచ్‌ఆర్ (హెచ్‌ఆర్‌) పరిభాషలో దీనిని 'రోల్ రేషనలైజేషన్' అని పిలుస్తున్నారు. 18-20 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతానికి వచ్చే యువతను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తూ, ఇలాంటి సాకులు చెబుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    మరో ఉద్యోగం పొందలేక..
    భారతదేశంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి మద్దతుగా నిలిచే సామాజిక భద్రతా వ్యవస్థలు లేకపోవడం విచారకరం. టాలెంట్ సెర్చ్ నిపుణుడు అంకుర్ అగర్వాల్ చెప్పినట్లుగా.. 40 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి మరో ఉద్యోగం పొందలేకపోతున్నారు. వారికి మద్దతు ఇచ్చే వ్యవస్థ మన దేశంలో లేదు. గృహ రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు 58 ఏళ్ల వరకు ఉన్న తరుణంలో, మధ్యలోనే ఆదాయం ఆగిపోతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

    జీవితం అగమ్యగోచరం
    వీరు జూనియర్ రోల్స్ చేయడానికి ఓవర్ క్వాలిఫైడ్‌గానూ, సీనియర్ లీడర్ల పాత్రలకు సరిపోని వారిగానూ ముద్రిపొందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పలు కంపెనీలు ఎక్కువ అనుభవం ఉన్నవారిని భరించేందుకు సిద్ధంగా లేవనే మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితి మున్ముందు ఇలానే కొనసాగితే, పింఛను లేని, గౌరవం లేని, భవిష్యత్తు లేని ఒక కొత్త రిటైర్మెంట్ వయసును (40 ఏళ్లు) మనం సృష్టించుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

    ఇది కూడా చదవండి: చాట్‌జీపీటీతో ఫ్రెండ్‌షిప్‌ యమడేంజర్‌?

Cartoon