Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి, చిత్తూరు: జిల్లా సమాచారశాఖ  అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం రేపాయి. చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ వేలాయుధం జిల్లా సమాచారశాఖ అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌లో న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సమాచార శాఖ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్న వీడియోలు కనిపించాయి.

    చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ వేలాయుధం చేసిన నిర్వాకంతో ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో ఉన్న మీడియా ప్రతినిధులు, జిల్లా అధికారులు అవాక్కయ్యారు. తర్వాత మీడియా ప్రతినిధులు ఫిర్యాదుతో వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలను డిప్యూటి డైరెక్టర్ డిలీట్ చేశారు.
     

  • తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు.

    అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. 

    తదుపరి మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.  తర్వాత ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.

    టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెంలో రెండో రోజు జరిగిన కోడిపందాల్లో ఓ కోడి ఏకంగా కోటి 43 లక్షలు గెలిచింది. పైబోయిన వెంకటరామయ్య బరిలో 1 కోటి 53 లక్షల పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ (సేతువ), రాజమండ్రి రమేష్ (డేగ) మధ్య భారీ పందెం నిర్వహించగా.. రాజమండ్రి రమేష్‌ డేగ విజేతగా నిలిచింది. రేపు మరో భారీ పందానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పందాల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.

    కాగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులపై పందెంరాయుళ్లే పైచేయి సాధించారు  కోళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. కూటమి ప్రజా ప్రతినిధులు దగ్గరుండి బరులను ప్రారంభించారు. పందేల మాటున పెద్ద ఎత్తున గుండాట, పేకాట, కోతాట, జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా.

    కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారం హోరెత్తించిన పోలీసు యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. మైకులు మూగబోయాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరే కనిపిస్తోంది. కూటమి నేతల ఆధ్వర్యంలో వందకు పైనే బరులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటను మొదలుపెట్టేశారు. డేగాపురం, నరసాపురం, పెదఅమిరంలో క్యాసినోలు ఏర్పాటుచేసి భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

    ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే క్యాసినోలోకి వెళ్తున్నట్లు సమాచారం. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. పందెం కోసం పుంజులు తెచ్చినవారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాండ్లు ఇచ్చి గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం స్టాళ్లు ఏర్పాటచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్‌హౌస్‌లు, ప్లాట్లు పేకాట శిబిరాలతో జూద కేంద్రాలుగా మారిపోయాయి.

     

  • విజయవాడ:  సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలు, పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలనే సూచనలు జిల్లా స్థాయి అధికారులకు ఉన్నప్పటికీ.. కోడి పందాలు జోరు.. జూద శాలల నిర్వహణే కనబడుతోంది. తూర్పు గోదావరి, డా బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలతో పాటు పలు జిల్లాల వ్యాప్తంగా అటు పందెం బరులు.. ఇటు క్యాసినోన తలపించే జూద శాలలే కనబడుతున్నాయి.  దాంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.  మరొకవైపు అక్కడే మద్యం కూడా ఏరులై పారుతోంది.  కోడి పందాలు, జూదాలు జరిగే చోట మద్యం స్టాల్స్‌ను పెట్టి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. 

    చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
    తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూ లేనంతగా కోడి పందాలు, జూద క్రీడల నిర్వహణ సాగుతోంది. ఒక్క రాజానగరం నియోజవర్గ పరిధిలోనే 35 బరులు ఏర్పాటు చేశారు. దాంతో కోట్లాది రూపాయలు క్షణాల్లో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు అన్నట్లు చేతులు మారుతున్నాయి. తినకుండేపూడి రఘుదేవపురం కోటి మధురపూడి రాజవరం గ్రామాల్లో భారీ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారు. 

    ఒక్క బరిలోనే ఐదు కోట్ల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. పలుచోట్ల టిడిపి నేతల ఆధ్వర్యంలో కోడిపందాలు జూద శిబిరాలు నిర్వహిస్తన్నారు. జంబు పట్నంలో టిడిపి జనసేన నేతల మధ్య విభేదాలతో రెండు బరులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి నగరానికి   అతి సమీపంలో టిడిపి నేత ఆధ్వర్యంలో భారీ కోడిపందాలు బరి ఏర్పాటు చేయగా, కడియం వీరవరం రోడ్డులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూటమినేతల ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహిస్తున్నారు. విచ్చలవిడిగా బరితెగించి కోడిపందాలు పేకాటలు నిర్వహిస్తున్నా తమకేమి సంబంధం లేనట్టు మిన్నకుండిపోతున్నారు పోలీసులు. 

    ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు
    ఉమ్మడి కృష్ణాజిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. కూటమి నేతల అండతో కోడి పందాలు, జూద శాలలు ఏర్పాటు చేయగా, మంచి నీళ్ల మాదిరిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో టిడిపి నేతల ఆధ్వర్యంలో మినీ క్యాసినో నిర్వహిస్తున్నారు. రామవరప్పాడులో మినీ స్టేడియాన్ని తలపిస్తున్న కూటమి నేతలు ఏర్పాటు చేసిన బరి. కోడి పందాల బరుల్లో ప్రత్యేకంగా పేకాల కోసం బరులు ఏర్పాటు చేశారు. పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, తిరువూరు, మైలవరంలో భారీగా జూదం బరులు నిర్వహిస్తన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇదే పరిస్థితి కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

  • సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగొండపాలెం ఎస్‌ఐ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు వ్యక్తి బలయ్యాడు.  ఎస్‌ఐ చౌడయ్య నిద్రమత్తులో కారుతో రెండు బైక్‌లను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

    మరో ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయాలపాలైన ఘటన నిన్న(జనవరి 14, బుధవారం) మండలంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన అంచా వెంకట సువర్ణ అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి బుధవారం ప్రత్తిపాడు మండలం గనికపూడిలో దేవర కార్యక్రమానికి వచ్చారు. కార్యక్రమం పూర్తయిన తరువాత మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనంలో గుంటూరుకు తిరుగు పయనమయ్యారు.

    మార్గ మధ్యలో ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం సమీపంలో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట సువర్ణతో పాటు కారు నడుపుతున్న అంచా శ్రీనివాసరావులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో గుంటూరుకు తరలించారు. 

    కాగా అందులో ప్రయాణిస్తున్న అంచా భాను ప్రసాద్‌ (60) తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులది స్వగ్రామం గనికపూడి కాగా కొన్నేళ్లుగా గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎన్‌.నరహరి తెలిపారు.

  • పాలకొండ రూరల్‌: ఏటిరో.. పిల్లాజల్లా అంతా కలిసి బెజివాడలో ఉంటున్నారట.. పండగకు ఇదేనా రావడం అంటూ శ్రీనివాసరావును సంఘంశాల ఎదుట కూర్చున్న ఊరిపెద్దలు పలుకరించారు. కొండపై అమ్మవారి దయతో అక్కడ బతుకుతున్నాం. పండగ కోసం ఊరు వచ్చేందుకు నరకం చూశాం. శ్రీకాకుళం నుంచి పాలకొండ చేరడం అటుంచితే ఆటోలో నవగాం మీదుగా ఊరి వచ్చేసరికి సరదా తీరిపోయింది. రోడ్డు మధ్యలో గోతులు ఏంటిరా దద్ది.... పడితే పెద్దల్లో కలసిపోతాం. గత పండగకు వచ్చినప్పుడు రోడ్డు వేస్తామన్నారు.. నిజమే అనుకున్నాను. చూస్తే రోడ్డు వేయలేదు. మరీ దారుణంగా ఉన్నాయంటూ వాపోయాడు.  

    సురేష్‌: శ్రీనుతో కలిసి ఆటోలో వచ్చిన సురేష్‌ మాట అందుకున్నాడు... ఇక్కడే రేషన్‌ బండి నడిపేవాడిని. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రేషన్‌బండిని నిలిపివేసింది. ఉపాధికోసం తెలంగాణా వెళ్లాను. ఇప్పుడు జనమంతా రేషన్‌ కోసం కొండలు దిగి దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి.  

    భీమన్న: ప్రయాణికుడైన భీమన్న అంతలో కలుగచేసుకుని ఈ ఏడాది పంటలు సరిగ్గా పండించ లేకపోయాను. విత్తనాలు లేవు. అన్నదాత సుఖీభవ పథకం పూర్తిగా అందలేదు. పెట్టుబడికి అప్పుచేశాను. సాగు నీరు లేక పంట ఎండిపోయింది. వర్షాలకు ఒరిగిపోయింది. బస్తాడు యూరియా కోసం పాలకొండే కాదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాను. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఈ దుస్థితి ఏ రైతుకూ కలగలేదు. అందుబాటులోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు లభించేవి. ఇప్పుడు రైతుభరోసా కేంద్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు అంతా డాబుడూబులే..  

    చిన్నయ్య: మరో వృద్ధుడైన చిన్నయ్య మాటకలుపుతూ కరెంట్‌ బిల్లు ముట్టుకుంటే షాక్‌తగులుతోంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్‌ ఊరికి రావడంలేదు. వైద్యసేవలు గతంలో వలే అందడంలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేస్తున్నారని తెలిసింది. ఇది ఎంతఘోరం. ఇలాగైతే మనలాంటి పేదలు ఏమైపోవాలి. రైతులు పంటలు కోల్పోతే పరిహారం కూడా అందడంలేదు. ఏ పథకమూ సరిగా అందిన దాఖలా లేవు. ఏం చెప్పుకుంటామయ్యా.. ప్రభుత్వం మారింది.. పరపతి పోయింది అంటూ నిట్టూర్చారు.

    అమ్మకు ఉద్యోగం పోయింది..  
    నాన్న చనిపోయాక ఊరిలో పనులుకు చేసుకునేవాడిని. ఇప్పుడు విజయవాడలో కూలి పనులు చేస్తున్నా. అక్కడ వచ్చే సొమ్ము భార్యా, పిల్లలకు కడుపు నింపేందుకే చాలదు. అమ్మ ఊరి బడిలో ఆయాగా చేసేది. గత ప్రభుత్వంలో బడిలో స్వీపర్‌గా చేరింది. మేం ఎక్కడ ఉన్నా అమ్మకు ఎదో చిన్నపని ఉంది అని భరోసాతో ఉండేవాడిని. ఇటీవల స్వీపర్‌ ఉద్యోగం తొలగించారు. అమ్మను కూడా ఇకపై నేనే చూసుకోవాలి. ఇంటిళ్లపాది కష్టపడితేనే బతుకు. ఏం చేస్తాం... మధ్యతరగతి కుటుంబాలు మావి.            
      – టి.శ్రీను, ఎం.సింగుపురం, పాలకొండ మండలం 

Business

  • స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్‌సెట్ మోటరోలా సిగ్నేచర్‌ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

    ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌ను అప్‌డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

    ప్రధాన ఫీచర్లు
    డిస్‌ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్‌లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

    కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్‌తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.

    పవర్ కోసం ఇందులో  5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.

    ధర ఇదేనా?
    ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.

    మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.

  • ప్రభుత్వ రంగ దిగ్గజం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,073 కోట్లను తాకింది. ప్రొవిజన్లు భారీగా తగ్గడం ఇందుకు అనుకూలించింది. అయితే నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 9,328 కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ వ్యవస్థకంటే తక్కువగా రుణ వృద్ధి 7 శాతానికి పరిమితంకావడం, నికర వడ్డీ మార్జిన్లు 0.15 శాతం నీరసించి 2.76 శాతానికి చేరడం ప్రభావం చూపాయి.

    డిపాజిట్లు సైతం 3.4 శాతం మాత్రమే పుంజుకున్నాయి. వడ్డీయేతర ఆదాయం 3 శాతం పెరిగి రూ. 4,541 కోట్లకు చేరింది. కాగా.. తాజా స్లిప్పేజీలు రూ. 2,199 కోట్ల నుంచి రూ. 1,820 కోట్లకు నీరసించగా.. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.29 శాతం నుంచి 3.06 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 1,599 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 322 కోట్లకు పరిమితమయ్యాయి. వెరసి లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి.

    ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

  • ఆహార, ఆహారేతర పదార్థాల రేట్ల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. డిసెంబర్‌లో 0.83 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. క్రితం రెండు నెలల్లో నెగటివ్‌గా ఉన్న ధరల పెరుగుదల తాజాగా పాజిటివ్‌లోకి వచి్చంది.

    టోకు ధరల సూచీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని (Inflation) కొలిచే అత్యంత కీలకమైన సాధనం. వినియోగదారుల వద్దకు చేరకముందే, అంటే టోకు మార్కెట్ లేదా తయారీదారుల స్థాయిలో వస్తువుల ధరల్లో వచ్చే మార్పులను ఇది ప్రతిబింబిస్తుంది.

    టోకు ధరల సూచీ ప్రాముఖ్యత

    ఈ సూచీ ద్రవ్యోల్బణాన్ని ముందే పసిగట్టే ఒక సాధనం. తయారీదారులు లేదా టోకు వ్యాపారుల వద్ద వస్తువుల ధరలు పెరిగితే, కొద్ది రోజుల్లోనే ఆ ప్రభావం రిటైల్ (వినియోగదారుల) ధరల మీద పడుతుంది. దీనివల్ల ప్రభుత్వం, ప్రజలు భవిష్యత్తులో పెరగబోయే ధరలను అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.

    ప్రభుత్వ విధానాల రూపకల్పన

    దేశ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రభుత్వం తన ఆర్థిక (Fiscal), ద్రవ్య (Monetary) విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను సవరించడానికి డబ్ల్యూపీఐ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఏయే రంగాలలో ధరలు పెరుగుతున్నాయో గమనించి ఆయా ఉత్పత్తులపై సబ్సిడీలు ఇవ్వాలా లేదా దిగుమతి సుంకాలను తగ్గించాలా అనే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది.

    వ్యాపార, పెట్టుబడి నిర్ణయాలు

    వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేయడానికి ఈ డేటాను ఉపయోగిస్తారు. ముడి పదార్థాల ధరలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడం ద్వారా కంపెనీలు తమ వస్తువుల ధరలను నిర్ణయించుకుంటాయి. అలాగే, పెట్టుబడిదారులు మార్కెట్ ధోరణిని అర్థం చేసుకుని సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక గైడ్‌లా పనిచేస్తుంది.

    ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

  • ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్‌మెరిన్ కేబుల్ నెట్‌వర్క్‌ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్‌కు చేరుకుంది. అయితే, ఈ నెట్‌వర్క్‌లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.

    భారత డిజిటల్ మౌలిక వసతులు

    భారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్‌మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్‌ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్‌గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్‌వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్‌వర్క్‌లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.

    ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?

    ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్‌ను ల్యాండ్ చేసుకోవచ్చు.

    సింగపూర్‌కు ప్రత్యామ్నాయంగా భారత్?

    ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్‌ఎస్‌లతో సింగపూర్ తిరుగులేని హబ్‌గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్‌ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.

    రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్‌సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మద్యం సరఫరా చేసే కంపెనీలకు మధ్య బకాయిల వివాదం ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుమారు రూ.3,900 కోట్లకు పైగా ఉన్న దీర్ఘకాలిక బకాయిలను చెల్లించాలని ప్రముఖ ఆల్కహాలిక్ బేవరేజ్ (అల్కోబెవ్) పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ISWAI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

    ఏడాది కాలంగా నిధులు పెండింగ్‌

    తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ద్వారా మద్యం సరఫరాదారులకు చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుతం రూ.3,900 కోట్లు దాటిందని, ఇందులో రూ.900 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని సంఘాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం సరఫరా జరిగిన 45 రోజుల్లోపు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆ నిబంధన అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.

    రికార్డు స్థాయిలో ఆదాయం

    గడచిన పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కళ్లు చెదిరే రీతిలో పెరిగింది.

    • 2014 ఆదాయం: సుమారు రూ.9,000 కోట్లు.

    • 2023-24 ఆదాయం: దాదాపు రూ.38,000 కోట్లు (నాలుగు రెట్లు పెరుగుదల).

    • అక్టోబర్ 2025: కేవలం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారానే ప్రభుత్వం రూ.3,000 కోట్లు వసూలు చేసింది.

    • డిసెంబర్ 2025: మద్యం విక్రయాల టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందనే అంచనాలున్నాయి.

    రాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో మూడో వంతు వాటా ఈ రంగం నుంచే వస్తోంది. నెలకు సగటున రూ.2,300 నుంచి రూ.2,600 కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తుందని సంఘాలు హెచ్చరించాయి.

    తగ్గుతున్న పెట్టుబడులు

    రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని పరిశ్రమ వర్గాలు గణాంకాలతో సహా వివరించాయి. టీజీ ఐపాస్‌ కింద వచ్చిన అనుమతుల రూపేణా గత ఏడాది వచ్చిన పెట్టుబడులు రూ.28,100 కోట్లు ఉండగా, 2024-25లో అవి రూ.13,730 కోట్లకు (సుమారు 50% పైగా తగ్గుదల) పడిపోయాయి. త్వరలో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) దావోస్ సదస్సులో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పాత ఒప్పందాలను గౌరవించి బకాయిలు చెల్లిస్తేనే అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరుగుతుందని సంఘాలు సూచించాయి.

    ‘బకాయిల చెల్లింపులో ఆలస్యం కొనసాగితే సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన 70,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం..

National

  • ఢిల్లీ–న్యూయార్క్‌ ఎయిర్‌ ఇండియా AI101 విమానంలో లగేజ్‌ కంటైనర్‌.. ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో  పొగమంచు కారణంగా టాక్సీ(రన్‌ వే మధ్యలో భూమి మీద సడిచే సమయంలో) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరూ గాయపడలేదు కానీ విమానాన్ని  గ్రౌండ్‌ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది 

    విమానంలో 250 మంది ప్రయాణికులు ఉండగా, వారంతా ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నప్పుడు విమానం క్రాష్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూవిమానం సురక్షితంగా గ్రౌండ్‌ (ఎగరడానికి అనుమతి లేకుండా నిలిపివేయడం)చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

     

    ఇదీ చదవండి:

    ఇరాన్‌ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

  • బృహత్ ముంబై మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దేశ ఆర్థిక రాజధాని ఓటర్లంతా ఎవపరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకున్నారు. అయితే ఎన్నికల అనంతరం సంప్రదాయంగా ప్రకటించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ మూకుమ్మడిగా బీజేపీ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి.  

    ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్ర స్థానికులతో పాటు ముస్లిం ఓటర్లు శివసేన (యూబీటీ) వైపు నిలువగా, దక్షిణాది, ఉత్తరాది ప్రజలు యువత మహిళలు బీజేపీ వైపు నిలిచిట్లు ఎగ్జిట్ పోల్ట్ అంచనా వేశాయి. నాలుగు ప్రముఖ ఎగ్జిట్‌పోల్ సంస్థలు ఫలితాలు ప్రకటించాయి. వాటి వివరాలు.

    • జన్‌మత్ : బీజేపీ కూటమికి -138 సీట్లు, శివసేన ( యూబీటీ) 62, కాంగ్రెస్  20 ఇతరులు 7 అని అంచనా వేసింది.

    • యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 131-151, శివసేన ( యూబీటీ) 58-68, కాంగ్రెస్ 12-16 ఇతరులు 6-12 స్థానాలు గెలవనున్నట్లు తెలిపింది.

    • టైమ్స్ నౌ బీజేపీ కూటమి: 129-146, శివసేన యూబీటీ 54,64, కాంగ్రెస్ కూటమి ఇతరులు 6-9 స్థానాలు గెలవనున్నట్లు ప్రకటించింది.

    • న్యూస్-18- బీజేపీ కూటమి: 119,శివసేన యూబీటీ 75, కాంగ్రెస్ కూటమి 20 ఇతరులు 14 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించింది. 

    అయితే కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి.

  • జైపూర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో 78వ సైనిక దినోత్సవ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి రాజనాథ్‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరయ్యారు. అత్యాధునిక ఆయుధాలు ఆర్మీ ప్రదర్శించింది. బ్రహ్మోస్‌ క్షిపణులు, అర్జున్‌ ట్యాంకులు, కే-9 వజ్ర ఆకట్టుకున్నాయి. ధనుష్‌ ఆర్జిలరీ గన్స్‌, డాగ్‌ రాబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెన్సార్లు, కెమెరాల సహాయంతో ఎత్తైన కొండలు, కఠినమైన భూభాగాల్లో ప్రయాణించగల ఒక రోబోటిక్ డాగ్ ఆకట్టుకుంది.

    మొట్టమొదటిసారిగా ఆర్మీ డే పరేడ్‌ను మిలిటరీ కంటోన్మెంట్ వెలుపల నిర్వహించారు. రాజస్థాన్‌లోని జైపూర్, మహల్ రోడ్డులో వేలాది మంది ప్రజల సమక్షంలో భారత సైన్యం తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించింది. పరేడ్‌లో కళ్ళద్దాలు ధరించిన K9 డాగ్స్ స్టైలిష్‌గా కవాతు చేశాయి. ముఖానికి కళ్ళద్దాలు, ఒంటిపై ఆర్మీ ప్రింట్ కోటులు ధరించి ఉన్న ఈ డాగ్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' (స్వయం సమృద్ధి భారత్)లో భాగంగా, భారత సైన్యం.. దేశీయ శునక జాతులను విధుల్లోకి చేర్చుకుంది. వీటిని నిఘా, పేలుడు పదార్థాల గుర్తింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ల సమయంలో గ్రెనేడ్ పేలుళ్లు సంభవించినప్పుడు ఎగిరిపడే ధూళి, శిథిలాల నుండి కళ్లను రక్షించుకోవడానికి ఈ కుక్కలకు కళ్ళద్దాలను ధరింపజేస్తారు.


     

     

  • సాక్షి చెన్నై: తమిళనాడు ఆవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో అపశ్రుతి చోటు చేసుకుంది. జల్లికట్టు సాగుతుండగా ఉన్నట్టుండి ఎద్దులన్నీ ఆటను వీక్షిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చాయి అక్కడున్న ప్రజలపై దాడి చేశాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 50 మందికి పైగా తీవ్రగాయాలు కాగా అందులో 10 మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పోటీలలో 600కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 1000కి పైగా ఎద్దులు ఈ పోటీలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

  • బీజాపూర్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌లో 52 మంది మావోయిస్టలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా చూస్తూ లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 1. 14 కోట్ల రివార్డు ఉంది.  కాగా, ఇటీవల కాలంలో మావోయిస్టుల భారీగా లొంగిపోతున్నారు. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 120కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 

    కేంద్ర ప్రభుత్వం మార్చి నెల చివర నాటికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఉంది. మావోయిస్టు దళాలు.. అడవులను వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది.  దీనిలో భాగంగానే మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.  ఈ క్రమంలోనే ఆపరేషన్‌ కగార్‌ వంటి చర్యలతో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 

  • సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకీ చుక్కెదురైంది. ఈడీ అధిాకారులపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లపై కోర్టు స్టే విధిస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.

    దానితోపాటు ఐప్యాక్ ఆపీసులో సీసీ కెమెరాల, పుటెజ్‌ను  భద్రపరచాలని , ఫైల్ చోరీ కేసులో సాక్షాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఐప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

    ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "అధికారుల ఫోన్లు, కీలక డాక్యమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారు. అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ పుటేజ్‌ను ధ్వంసం చేశారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి" అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

    దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇది చాలా తీవ్రమైన అంశమని రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు  పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  

  • ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్‌ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.

    ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్  దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు. 

    ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని  స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్‌ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

    ‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్‌ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.

  • ఢిల్లీ: 13 ఏళ్లుగా శాశ్వత అచేతనావస్థలో ఉన్న హరీష్ రాణాకు కారుణ్య మరణం ప్రసాదించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

    పిటిషనర్ తరఫున న్యాయవాది రష్మి నందకుమార్ వాదనలు వినిపించారు. ‘19 ఏళ్ల వయసులో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిన హరీష్ అప్పటి నుంచి కోలుకోలేదు. వందశాతం అచేతనావస్థలో ఉన్నందున కారుణ్య మరణం అనుమతించాలని కుటుంబం కోరుకుంటుంది’ అని తెలిపింది.  వాదనలు విన్న ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. 

    ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని ఉపయోగింలేదు. మేం నిత్యం ఎన్నో కేసులు విచారిస్తుంటాం. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం మేమూ మనుషలమే. .. ‘ఎవరు బతికి ఉండాలో, ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం?’ అని వ్యాఖ్యానించింది.

    వాదనలు,అనంతరం సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పును వెలువరించే ముందు పలు అంశాలను పరిశీలించనుంది. ఆ తర్వాతే తుది తీర్పు వెలవరించనుంది.  

     

     

International

  • పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా తమపై ఏదైనా చర్యకు ఉపక్రమిస్తే.. ఉన్నఫళంగా స్పందించేందుకు ఇరాన్ సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఓ ప్రకటనను విడుదల చేసినట్లు అరబిక్ మీడియా వెల్లడించింది. 

    ప్రధానంగా ఐఆర్‌జీసీ తన వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను అరబిక్ మీడియా ఉటంకించింది. ప్రధానంగా ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులను సిద్ధం చేసినట్లు చెబుతోంది. తన శక్తిమంతమైన ‘ఫతాహ్’ క్షిపణిని సైతం ఇజ్రాయెల్‌తో పాటు.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై గురిపెట్టినట్లు పేర్కొంటోంది.

    అమెరికా, లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే.. వెంటనే తమ ప్రతిస్పందనలో భాగంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తామని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఫతాహ్ క్షిపణులు హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యాలను ఛేదించడమే కాకుండా.. మార్గమధ్యంలో వాటి దిశను మార్చే అవకాశాలుంటాయి. అయితే అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు.

    ఇదీ చదవండి:
    నెతన్యాహూ క్రీట్‌కు పారిపోయాడు..!

  • భారత్‌లో చొరబడేందుకు పాకిస్తానీయులు యత్నించారు.  అరేబియా సముద్ర మార్గం ద్వారా తొమ్మిదిమంది పాకిస్తానీయులు.. భారత్‌లో చొరబాటుకు యత్నించారు. కానీ వారిని భారత సైనికులు పట్టుకున్నారు. భారత కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది వారిని బంధించి గుజరాత్‌కు తీసుకువస్తున్నారు. 

    ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధి చెప్పినా వారి కార్యకలాపాల్లో మార్పు రావడం లేదు.  మత్స్యకారుల వేషంలో ఓ పడవలొ పయనిస్తూ తొమ్మిదిమంది పాక్‌ దేశీయలు భారత్‌లో చొరబడేందుకు పన్నాగం వేశార.  

    నిన్న(బుధవారం, జనవరి 14వ తేదీ) రాత్రి, భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉంది. అయితే . అకస్మాత్తుగా, రాడార్ అనుమానాస్పద కదలికను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. ఇది సాధారణ ఫిషింగ్ నౌకలా కనిపించలేదు, ఎందుకంటే దాని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదే సైనికుల అనుమానాలను రేకెత్తించింది. దాంతో కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.  వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్‌లోని పోర్ట్‌కు తీసుకువస్తున్నారు. 

     

  • కెంట్: ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.

    సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్‌ భరతనాట్యం ప్రదర్శించారు.

  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం, దేశంలో శీతాకాల పరిస్థితులు తదితర కారణాల రీత్యా దేశంలో ఇందన రంగంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ‍ప్రకటించారు.

    2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఎనర్జీ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా జరిపిన దాడులలో ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్‌లు పెద్దమెుత్తంలో దెబ్బత్నిన్నాయి. అంతేకాకుండా అత్యధిక శాతం చమురు యుద్ధానికి అవసరం అవడంతో ఆదేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో శీతాకాలంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున కరెంట్ కోతలతో పాటు నీటి సరఫరాలకు అంతరాయం తదితరమైనవి ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    దేశంలో ఇందన ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితులను పరిష్కరించడానికి, సరఫరా అంతరాయాలను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను తిరిగి పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెలెన్‌స్కీ ఆదేశించారు.

  • ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు టెల్ అవీవ్‌లో లేరా? ఉన్నఫళంగా ఆయన క్రీట్ ద్వీపానికి పయనమయ్యారా? ఈ ప్రశ్నలకు అరబిక్ మీడియా ఔననే సమాధానం చెబుతోంది. albawaba.com అనే మీడియా సంస్థ ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. నెతన్యాహు పారిపోయాడంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకించింది.

    ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి బోయింగ్ 767 (4ఎక్స్-ఐఎస్ఆర్) విమానం గుర్తుతెలియని గమ్యస్థానానికి చేరుకుంది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గ్రీస్‌లోని క్రీట్ ద్వీపంలోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో అరబిక్ వార్తాసంస్థ ఈ విమానం ఏథెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు పేర్కొంది.

     ఈ విమానం బెంజమిన్ నెతన్యాహుకు చెందిన ‘వింగ్ ఆఫ్ జియాన్’ అని ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ మరికొన్ని అరబిక్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 11.22కు టేకాఫ్ అయిన విమానం.. మధ్యాహ్నం 1.06కు గ్రీస్‌లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలుండడంతో ఇజ్రాయెల్ చీఫ్ గ్రీస్‌కు వెళ్లిపోయాడంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ‘వింగ్ ఆఫ్ జియాన్’లో నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 


     

  • కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో ఇజ్రాయెల్ రాయబారులు గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ ‘యెదువోత్ అహ్రోనోత్’ స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం కీవ్‌లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రష్యా భారీ దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు.. మూడ్రోజులుగా ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. దీంతో.. ఇజ్రాయెల్ రాయబారులు చలికి గజగజ వణికిపోతున్నారు.

    ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ బ్రాడ్స్కీ ఈ సందర్భంగా వైనెట్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘కీవ్ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారిపోతోంది. విద్యుత్తు లేకపోవడంతో.. హీటర్లు పనిచేయక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో.. పరిసర నగరాలకు తరలిపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. 

    యుద్ధం కొనసాగుతున్నా.. తాము రాయబార కార్యాలయ విధులకు ఆటంకం కలిగించడం లేదని, అయితే.. మౌలిక సదుపాయాలు మృగ్యమవ్వడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. ‘మేము ఉంటున్న అపార్ట్‌ మెంట్లలో విద్యుత్తు లేదు. బయట మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దాంతో వెచ్చని కోట్లు ధరించి గడపాల్సి వస్తోంది. శీతాకాలం చలికి తోడు.. రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో ఉంటున్న ఇజ్రాయెలీలకు రక్షణ కల్పించేందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం’ అని ఆయన వివరించారు.

    దీనిపై కీవ్ మేయర్ మాట్లాడుతూ రష్యా దాడులతో వేల మంది పౌరులు చీకట్లో మగ్గిపోతున్నారని, చలికి వణుకుతున్నారని వాపోయారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా.. రష్యా ప్రయోగించిన హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓర్ష్నిక్’ కారణంగా కీవ్‌లోని విద్యుత్తు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే.. పౌరులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

  • ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. అక్కడ రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో  ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.

    ఇంగ్లాండ్‌.. లండన్‌లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. ‍పాపం అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుధవారం లండన్‌లో ఓ మహిళ పావురాలకు ఆహారం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు. 

    ఈ చిత్రాలను అక్కడే ఉ‍న్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. అయితే లండన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్‌బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు. 

  • ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్‌ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.

    గత కొద్దిరోజులుగా ఇరాన్‌లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్‌ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు.  అయితే సడెన్‌గా పరిస్థితి యూటర్న్‌ తీసుకుంది.

    అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్‌ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.

    అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ‍ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.

    అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్‌లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు.

Sports

  • భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగే  'ద హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. గత సీజన్‌కు వరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ ఒరిజినల్స్‌గా ఉండేది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా..మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70% వాటాను కొనుగొలు చేశారు. 

    దీంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరును లక్నో సూపర్ జెయింట్స్‌గా మార్చారు. మాంచెస్టర్ జట్టులో మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. స్మృతికి 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది

     2022 సీజన్‌లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇక మాంచెస్టర్‌ పురుషల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్‌ జూలై 21 నుంచి ఆరంభం కానుంది.
    చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

  • ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

    అతడితో పాటు దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ తలా వికెట్‌ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.

    ఈ టార్గెట్‌ను భార‌త్ 17.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభ‌వ్ సూర్య‌వంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి..  వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌల‌ర్ల‌లో రిత్విక్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భార‌త్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో జ‌న‌వ‌రి 17న బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
    చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అత‌డి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.

    వివాదానికి కారణం ఏంటంటే?
    ఐపీఎల్‌-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.

    అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై  ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.

    ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

    "ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.

    కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో  బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్‌పై  క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.
    చదవండి: IND vs USA: వైభ‌వ్ సూర్య‌వంశీ అట్ట‌ర్‌ ప్లాప్‌..

    నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు.
     

  • అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ టోర్నీలో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యవంశీ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

    దీంతో స్వల్ప లక్ష్య  చేధనలో వైభవ్ తనదైన శైలిలో విరుచుకుపడతాడని అంతా భావించారు. కానీ 14 ఏళ్ల వైభవ్ మాత్రం తుస్సుమన్పించాడు. 2 పరుగులు చేసిన సూర్యవంశీ.. రిత్విక్ అప్పిడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్‌లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.

    వర్షం అటంకి..
    కాగా భారత్ లక్ష్య చేధనకు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4 ఓవర్లలో భారత్ స్కోర్ 21/1 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. క్రీజులో అయూశ్ మాత్రే(15), త్రివేది(2) ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు  దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
    చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం

  • ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. డిసెంబర్ 2025 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా స్టార్క్‌ ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. యాషెస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో సొంతం చేసుకోవడంలో స్టార్క్‌ది కీలక పాత్ర.

    ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్క్ ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ పాట్‌ కమ్మిన్స్, హాజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరం కవడంతో.. పేస్ దళాన్ని స్టార్క్ ముందుండి నడిపించాడు.  కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ అతడు సత్తాచాటాడు.

    బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో అతడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ కారణంగానే అతడికి ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం వెస్టిండీస్‌కు ఆల్‌రౌండర్‌ జస్టిన్ గ్రీవ్స్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ పోటీపడ్డారు. కానీ వారిద్దరికంటే స్టార్క్ ప్రదర్శనలు మెరుగ్గా ఉండడంతో అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై స్టార్క్ స్పందించాడు.

    "ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది.  సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ విజయంలో భాగం కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా దృష్టి ఇప్పుడు 'ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్' ఫైనల్‌పై ఉంది" అని స్టార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ అవార్డును ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ గెలుచుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.  చివరిసారిగా డిసెంబర్ 2023లో పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు.
    చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం

  • అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జ‌ట్టు యువ భార‌త‌ బౌల‌ర్ల ధాటికి 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ముఖ్యంగా టీమిండియా పేస‌ర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో అమెరికా న‌డ్డి విరిచాడు.

    హెనిల్ 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మ‌హేష్ వంటి కీల‌క వికెట్ల‌ను హెనిల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ తలా వికెట్‌ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

    తుది జట్ల వివరాలు:
    భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్

    అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్‌, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి
     

  • టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే స‌మాధ‌నం ఎక్కువ‌గా వినిపిస్తోంది. జ‌డేజా టెస్టు క్రికెట్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికి.. వ‌న్డేల్లో మాత్రం త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు.

    ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లోనూ అత‌డి ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. తొలి వ‌న్డేలో కూడా ఘోరంగా విఫ‌ల‌మైన జడేజా బుధ‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

    బ్యాటింగ్‌లోనూ కేవ‌లం 27 ప‌రుగులు చేశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయం కార‌ణంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగ‌డంతో జ‌డేజా ఒక్క‌డే సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అక్ష‌ర్ పటేల్‌ను ఎందుకు వ‌న్డే జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేద‌ని సెలెక్ట‌ర్ల‌ను శ్రీకాంత్ ప్ర‌శ్నించాడు. జ‌డేజా పేల‌వ ఫామ్ గురుంచి కూడా అత‌డు మాట్లాడాడు.

    "నాకు ఇష్ట‌మైన ఆట‌గాళ్ల‌లో జ‌డేజా ఒకరు. కానీ అత‌డు ప్ర‌స్తుతం పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించ‌లేక‌పోతున్నాడు. బంతిని అటాకింగ్‌గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్‌ను ట్రాప్ చేయాలా అనే విష‌యంలో అత‌డు కాస్త గంద‌ర‌గోళంగా ఉన్నాడు.

    ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్‌రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్‌కోట్ వన్డేలో భారత్‌కు అద‌న‌పు స్పిన్న‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పించింది. అక్ష‌ర్ ప‌టేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్ష‌ర్‌ను ఎందుకు జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేదు? అతడొక అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్‌. చాలా మ్యాచ్‌ల‌లో జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. 

    హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబ‌ట్టి అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డం బెట‌ర్" అని శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జ‌ట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు.

    దీంతో మ‌రోసారి భార‌త జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ల కొర‌త క‌న్పిస్తోంది. ఇప్ప‌టికే టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన జ‌డేజా.. ఇదే ఫామ్ కొన‌సాగితే వ‌న్డేల నుంచి కూడా త‌ప్పుకొనే అవ‌కాశ‌ముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌ పేరును చాలా మంది మాజీలు సూచిస్తు‍న్నారు.
    చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌

    జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్‌కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు.
     

Politics

  • సాక్షి, పల్నాడు జిల్లా: పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని వైఎస్సార్‌సీపీ నేత కాసు మ‌హేష్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెల్లి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు భయంతో బయటికి వెళ్లిపోయాయని కాసు మహేష్‌రెడ్డి అన్నారు.

    ‘‘సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని వదిలి బయట జీవనం సాగిస్తున్నాడు. భార్య అనారోగ్యంతో ఉండటంతో ఆమెతో మాట్లాడేందుకు సాల్మన్ పిన్నెల్లి గ్రామానికి వెళ్లాడు. అతను గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బదులు, కోమాలో ఉన్న సాల్మన్‌పైనే కేసులు పెట్టడం ఎంత దారుణం? సాల్మన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినా సీఐ పనికిమాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారు.

    ..రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతాయి. చంద్రబాబు, లోకేష్ నీతులు చెప్పడం కాదు. పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన 1500 మంది పరిస్థితిపై సమాధానం చెప్పాలి. ఈ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్ చిట్‌ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్‌.. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్‌ తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తీర్పు స్పీకర్‌ ఇచ్చారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్‌లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్‌ తీర్పు చెప్పనున్నారు.

    పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్‌ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇచ్చారు. తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్‌ తీర్పు ఇచ్చారు.

    మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్‌(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.

    అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్‌ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్‌చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్‌), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్‌) పిటిషన్లను స్పీకర్‌ కొట్టిపారేశారు.

Movies

    • సంక్రాంతి వైబ్‌లో హీరోయిన్ సాక్షి అగర్వాల్..

    • సంక్రాంతి స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో ఆషిక రంగనాథ్..

    • లంగా ఓణిలో మన్మధుడు హీరోయిన్ అన్షు హోయలు..

    • పతంగులు ఎగరేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ..

    • హ్యాపీ పొంగల్ అంటోన్న అనిఖా సురేంద్రన్..

    • సంక్రాంతి ఫెస్టివ్‌ మూడ్‌లో భాగ్యశ్రీ బోర్సే 

     

     

     

     

     

     

     

     

     

  • గతంలో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచిన వార్‌ మూవీ బోర్డర్. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సన్నీ డియోల్ కీలక పాత్రలో వస్తోన్న బోర్డర్‌-2.. రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

    ఇవాళ సంక్రాంతి కానుకగా బోర్డర్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  వరుణ్‌ ధావన్‌, దిల్జీత్‌ దొసాంజ్‌ కీలక పాత్రల్లో నటించారు. 
     

  • ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ మూవీని జపాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నెల 16న జపాన్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

    ఈ సందర్భంగా ఒక రోజు ముందే జపాన్‌లో పుష్ప-2 ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ షోకు ‍అల్లు అర్జున్, రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు.  జపాన్ ‍అభిమానుల ముందు బన్నీ డైలాగ్స్ చెప్పి జోష్ పెంచారు. జపాన్‌ భాషలో అల్లు అర్జున్‌ డైలాగ్ చెప్పడంతో థియేటర్ ఒక్కసారిగా మార్మోగిపోయింది.  ఈ వీడియోను టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • వరుణ్‌ తేజ్‌ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ జనవరి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.

    తాజాగా కమెడియన్‌ సత్యతో ఓ ఫన్నీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఏంటి ఇన్నీ డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారుపడుతూ కనిపించారు. ఇందులో కొరియా భాషల్లో ఉన్న డైలాగ్‌ను చూసి కొరియన్స్‌కు వీడియో కాల్‌ చేసిన ఫన్నీ ఆడియన్స్‌కు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వరుణ్‌ సందేశ్‌ ఫోన్ చేసి ఆ డైలాగ్‌ గురించి ఆరా తీస్తాడు. ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతోంది.

     

  • కాంత్ తనయుడు  రోషన్‌ నటించిన పీరియాడికల్ యాక్షన్ మూవీ ఛాంపియన్. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజై సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణలోని బైరాన్‌ పల్లి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్‌ మంచి మార్కులు కొట్టేశారు.

    బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీలో ఓ సాంగ్ సినీ అభిమానులను ఊపేసింది. గిర గిర గింగిరాగిరే అంటూ కుర్రకారును ఊర్రూతలూగించింది. రామ్‌ మిరియాల ఆలపించిన ఈ పాట సోషల్‌ మీడియాలో ఊపేసింది.  తాజాగా ఈ సూపర్ హిట్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రోషన్‌- అనస్వర రాజన్‌ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.

    కాగా.. ఈ చిత్రానికి ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్‌, జీకే మోహన్‌, జెమిని కిరణ్‌ నిర్మించారు. ఇందులో సంతోష్‌ ప్రతాప్‌, అవంతిక, కృతి కంజ్‌ సింగ్‌ రాథోడ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజైన మూడురోజుల్లోనే రూ.9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
     

  • ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్‌కే శరవణ్‌ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.

    తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్‌-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్‌గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్‌ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • బలగం ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం ఎల్లమ్మ. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోగా సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. 

    తాజాగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో కొమ్ములు తిరిగిన పొట్టేలు మరింత ఆసక్తిని పెంచుతోంది. నది ఒడ్డున వర్షంలో దేవీశ్రీ ప్రసాద్‌  లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 

  • ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్‌ గా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్‌ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు. 

    సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. శివ వరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, రొమాన్స్, సస్పెన్స్‌, వినోదంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు తాటి బాలకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్‌.  

  • అల్లుడు కేఎల్ రాహుల్‌పై మామయ్య సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ కొట్టడంతో బాలీవుడ్ నటుడు కొనియాడారు. విభిన్నమైన స్థానం.. అదే ప్రశాంతత.. అదే వ్యక్తిత్వం అంటూ అల్లుడిని ఆకాశానికెత్తేశారు. ఆ స్కోర్ బోర్డ్‌లో ఈ సెంచరీ ప్రత్యేకంగా గుర్తుంటుందని అన్నారు. దీని వెనుక ఉన్న క్షణాలను సంయమనాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని సునీల్ శెట్టి పోస్ట్ చేశారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన కేఎల్ ఫ్యాన్స్ సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు.

    కాగా.. కేఎల్ రాహుల్.. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ కుతూరు కూడా జన్మించింది. వీరి పెళ్లి వేడుకను సునీల్ తన ఫామ్‌ హౌస్‌లోనే గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ పెళ్లి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు సందడి చేశారు. కాగా.. కేఎల్ సతీమణి అతియా శెట్టి కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది. 
     

     

  • ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది. చిరంజీవి 'మనశంకర వరప్రసాద్‌గారు', ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', రవితేజ 'భర్తమహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్‌ 'నారీనారీ నడుమ మురారి' సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 

    ఇందులో అన్ని సినిమాల కన్నా 'మన శంకర వరప్రసాద్‌గారు' మూవీ కలెక్షన్స్‌ వద్ద ఎక్కువ దూకుడు చూపిస్తోంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం మహేశ్‌బాబు సినిమా కూడా సంక్రాంతి రారాజుగా నిలిచింది. ఆ మూవీ ఏంటో తెలుసా? ఒక్కడు. 2003 జనవరి 15న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఆ సినిమా విశేషాలను ఓసారి చూసేద్దాం...

    పేపర్‌లో చూసి కథ
    చిరంజీవితో గుణశేఖర్‌ తీసిన 'మృగరాజు' బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. ఈ మూవీ తర్వాత గుణశేఖర్‌ కసితో తీసిన సినిమా 'ఒక్కడు'. ఒకరోజు పేపర్‌లో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ ఇంటర్వ్యూ చూశాడు. పుల్లెల గోపీచంద్‌ తండ్రికి క్రీడలంటే ఆసక్తి లేదు, అయినా ఎన్నో కష్టాలు పడి ఛాంపియన్‌గా ఎదుగుతాడు. 

    మొదట అనుకున్న టైటిల్‌
    దాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథ రాసుకున్నాడు. అది మహేశ్‌బాబుకు చెప్పగా వెంటనే ఒప్పుకున్నాడు. నిర్మాతగా రామోజీరావును అనుకున్నాడు. కానీ, ఆయన ఆసక్తి చూపకపోయేసరికి ఎమ్మెస్‌ రాజు చెంతకు చేరింది. టైటిల్‌ విషయంలోనే అంతా మల్లగుల్లాలు పడ్డారు. 'అతడే ఆమె సైన్యం' అన్న టైటిల్‌ పెట్టాలనుకున్నారు. కానీ అది ఆల్‌రెడీ ఎవరో రిజిస్టర్‌ చేయడంతో మరొకటి వెతుక్కున్నారు. 

    చార్మినార్‌ సెట్‌ కోసం
    'కబడ్డీ' అనుకున్నారు, మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గారు. చివరకు 'ఒక్కడు' టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అందరికీ నచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించగా ప్రకాశ్‌రాజ్‌ విలన్‌గా యాక్ట్‌ చేశారు. అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో చార్మినార్‌ సెట్‌ వేసి మూవీ తీశారు. ఈ సెట్‌ కోసం దాదాపు రూ.2 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పాతబస్తీని, ముఖ్యంగా కర్నూల్‌ కొండారెడ్డి బురుజును సినిమాలో హైలెట్‌ చేసి చూపించారు. 

    మాస్‌ & స్టార్‌ ఇమేజ్‌
    అలా ఒక్కడు రూ.9 కోట్లతో తీస్తే దాదాపు రూ.40 కోట్లు రాబట్టింది. మహేశ్‌బాబు కెరీర్‌లో తొలిసారి మాస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అతడికి స్టార్‌ హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయాయి. ఈ మూవీ 8 నంది అవార్డులు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక్కడు దాదాపు ఎనిమిది భాషల్లో రీమేక్‌ అయింది. ఇప్పటివరకు ఒక్కడు మూవీ ఐదుసార్లు రీరిలీజ్‌ అవడం విశేషం!

     

    చదవండి: బక్కచిక్కిపోయిన బుల్లిరాజు.. ఆ కారణం వల్లే

  • ఆది సాయి కుమార్ హీరోగా చేసిన మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ శంబాల. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాడు. ఇటీవలే జనవరి 9న ఈ మూవీ హిందీలో కూడా విడుదల చేశారు.

    తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. జనవరి 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్‌ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకుంది.

    శంబాల చిత్రాన్ని మహీధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్‌ హీరోయిన్‌గా కనిపించింది.ఈ చిత్రంలో స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది.
    కథేంటంటే... 

    ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్‌(ఆది సాయికుమార్‌) వస్తాడు. చావులోనూ సైన్స్‌ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్‌. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.

    ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్‌ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్‌) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల(Shambhala  Review) చూడాల్సిందే.

     

     

  • సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ ఎంట్రీతోనే సూపర్ హిట్‌ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా వస్తోన్న డకాయిట్ చిత్రంలో మెప్పించనుంది.  ఈ సినిమా సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇక సినీ కెరీర్ సంగతి పక్కన పెడితే.. మృణాల్ వ్యక్తిగత జీవితంపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె కోలీవుడ్ స్టార్ ధనుశ్‌తో డేటింగ్‌లో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఇ‍ద్దరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత  మృణాల్ ధనుష్  సిస్టర్స్‌ డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాకుండా వారిద్దరు కూడా మృణాల్‌ను  ఫాలో అయ్యారు. ఇక ఈ జంట డేటింగ్‌ కన్‌ఫామ్ అని చాలామంది ఫిక్సయిపోయారు.

    తాజాగా ఈ జంటపై మరో రూమర్ నెట్టింట వైరలవుతోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని లేటేస్ట్ టాక్. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం వచ్చేనెల 14న మృణాల్- ధనుశ్ ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా తమ పర్సనల్‌ లైఫ్‌లో ఎల్లప్పుడూ గోప్యతను పాటిస్తారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ కానీ, ధనుశ్  స్పందించలేదు. ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్‌కు చెక్‌ పడనుంది.

    కాగా.. గతేడాది ఆగష్టు 1న మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుశ్ పాల్గొన్నారు. పార్టీ వీడియోలో ధనుష్ ఆమె చేతిని పట్టుకుని ఆత్మీయంగా మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వైరలైంది. ఆపై మృణాల్ ఠాకూర్‌ నటించిన కొత్త సినిమా 'సన్ ఆఫ్ సర్దార్ 2' స్పెషల్ స్క్రీనింగ్‌కు ధనుష్ ప్రత్యేకంగా ముంబయికి వెళ్లారు. స్క్రీనింగ్ సమయంలో ధనుష్ చెవిలో మృణాల్ ఏదో గుసగుసలాడటం కనిపించింది. అంతకుముందు ధనుశ్‌ మూవీ 'తేరే ఇష్క్ మే' పార్టీకి మృణాల్ కూడా హాజరయ్యారు. అక్కడ కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.

     

  • ఒక్క సినిమాతో ఫుల్‌ ఫేమస్‌ అయిపోయాడు బుల్లిరాజు. వెంకటేశ్‌​ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బుల్లిరాజు నోరు తెరిస్తే బూతులు.. అయినా సరే కొలికేత్త.. కొలికేత్త అంటూ బుల్లిరాజు చేసిన కామెడీకి జనాలు పడీపడీ నవ్వారు. ఇతడి కామెడీ టైమింగ్‌కు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్‌ ఇచ్చాడు అనిల్‌ రావిపూడి.

    డబుల్‌ ధమాకా
    అలా 'మన శంకరవరప్రసాద్‌గారు' మూవీలోనూ మెప్పించాడు. గతేడాది బుల్లిరాజు నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఎలాగైతే బ్లాక్‌బస్టర్‌ కొట్టిందో ఈ 'మన శంకరవరప్రసాద్‌గారు' కూడా అంతే మెగా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. దీంతో బుల్లిరాజు అలియాస్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ రేవంత్‌ దశ తిరిగిపోయిందని ఫ్యాన్స్‌ అంటున్నారు. అంతేకాదు, నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీలోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కూడా విజయపథంలో నడుస్తుండటంతో ఈసారి సంక్రాంతికి డబుల్‌ ధమాకా అందుకున్నాడు.

    అందుకే సన్నబడ్డాడా?
    అయితే సినిమా ఈవెంట్స్‌లో మాత్రం కాస్త బక్కచిక్కి కనిపించాడు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. అతడికి వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. రెండు.. తెరపై కాస్త సన్నగా కనిపించాలని బుల్లిరాజే భావించాడట! ఓ ఈవెంట్‌లో రేవంత్‌ మాట్లాడుతూ.. నేను దాదాపుగా 10 సినిమాలు చేస్తున్నాను. అన్ని సినిమాల్లో ఒకలాగే కనిపిస్తే ఏం బాగుంటుంది? ఒక మూవీలో కాస్త డిఫరెంట్‌గా కనిపిద్దాం అని డైట్‌ చేశా.. అందుకే సన్నబడ్డా..

    రెండో సినిమాయే మెగాస్టార్‌తో..
    ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనుకుంటారు. నేను తీసిన మొదటి సినిమాకే ఆయనతో నటించే ఆఫర్‌ వచ్చింది. అది నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన విషయం..  సంక్రాంతికి వస్తున్నాంలో బూతులు తిట్టా.. కానీ, మన శంకర వరప్రసాద్‌లో బూతులు తిట్టలేదు. అదే తేడా.. అన్నాడు. మొత్తానికి ఒక్క సినిమాతోనే బిజీ స్టార్‌ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతి బ్లాక్‌బస్టర్లు ఖాతాలో వేసుకుంటూ సంక్రాంతి బుల్లోడుగా మారిపోయాడు.

    చదవండి: తొలి సినిమా హీరోతో అలనాటి హీరోయిన్‌.. 37 ఏళ్ల తర్వాత..

Telangana

  • హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా వైరాలో  సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి సాంబార్‌లో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర  విషాదం నింపింది.  ప్రమాదవశాత్తూ చిన్నారి రమ్మశ్రీ వేడి వేడి సాంబార్‌లో పడటంతో తీవ్ర గాయాలపాలైంది. దాంతో చిన్నారి రమ్మశ్రీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చికిత్స అందించారు. 

    నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో చిన్నారి తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను కోల్పోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది  సీనియర్ డాక్టర్ల ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీపై కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో రూ.38 కోట్లకు పైగా మోసం చేశారంటూ ఎండీపై ఆరోపణలు ఉన్నాయి. భారీ లాభాల ఆశ చూపి డాక్టర్లను నమ్మించారని.. మోసానికి మాజీ ఎండీతో పాటు అతని సోదరుడి పాత్ర ఉందంటూ ఫిర్యాదు చేశారు.

    ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2014–2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు పెట్టగా.. మొత్తం రూ.100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధుల సమీకరణ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి రూ.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. హామీ ఇచ్చిన లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్టు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఖాతాల్లో నష్టాలు చూపుతూ డాక్టర్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపినట్టు ఆరోపిస్తున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లుల వసూలు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్, బంగారానికి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొనగా.. ఆసుపత్రి నిధుల ఉద్దేశపూర్వక దారి మళ్లింపు ఆరోపణలు ఉన్నాయి. పీఏసీ 406, 409, 477-A, 120-B సెక్షన్ల కింద సీసీఎస్‌ పోలీసులు కేసు చేశారు. మాజీ ఎండీ, అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు చేపట్టారు. ఆధారాలపై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని సీసీఎస్‌ స్పష్టం చేసింది.

  • సాక్షి, హైదరాబాద్‌: విస్తరిత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్న నేపథ్యంలో సికింద్రాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిందేనని, అందుకోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడేది లేదని ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తన డిమాండ్‌ నెగ్గించుకుంటారా.. లేక వెనక్కు తగ్గుతారా? అన్నది నగరంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డీలిమిటేషన్‌ సైతం ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా అస్తవ్యస్తంగా చేశారని పేర్కొన్న ఆయన సికి ంద్రాబాద్‌ను ముక్కలుగా చేసి మల్కాజిగిరి కార్పొరేషన్‌లో కలిపితే చూస్తు ఊరుకోబోమనే డిమాండ్‌తో సికింద్రాబాద్‌కు చెందిన వివిధ వర్గాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే.

     ఈ నెల 17న భారీ ర్యాలీ.. 
    సికింద్రాబాద్‌ ఎప్పటినుంచో అటు జీహెచ్‌ఎంసీలో, ఇటు హైదరాబాద్‌ జిల్లాలో భాగంగానే ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగా తాను మారుస్తున్నదంటూ ఏమీ లేదని ఇటీవల సచివాలయంలో జరిగిన  ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో సికింద్రాబాద్‌ పేరిట కార్పొరేషన్‌ ఏర్పాటు ఉండబోదనే చాలామంది భావిస్తున్నారు. తన డిమాండ్‌ సాధనకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్న శ్రీనివాస్‌యాదవ్‌.. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఎంజీరోడ్‌ గాంధీ విగ్రహం వరకు పదివేల మందితో భారీ  ర్యాలీ సహా వివిధ కార్యక్రమాలు ప్రకటించారు.  

    ముందుకా.. వెనకకా? 
    ఉద్యమానికి శ్రీకారం చుడుతూ  బాలంరాయి లీ ప్యాలెస్‌లో వివిధ వర్గాల వారితో ఏర్పాటు చేసిన తొలి  సమావేశంలో సీఎంనుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలు  సికింద్రాబాద్‌ అస్తిత్వం కోసం ఆవేశంలో చేశానని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం అన్నా, మంత్రులన్నా తనకు గౌరవమేనన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని, పర్సనల్‌ అజెండా అంటూ లేదని స్పష్టం చేశారు.  తన వ్యాఖ్యలపై  అభ్యంతరాలుంటే తప్పకుండా ఉపసంహరించుకుంటానని వ్యాఖ్యానించారు. గట్టి గా మాట్లాడినంత మాత్రాన కొమ్ములొచ్చినట్లు కాదని, ఆత్మాభిమానం, అస్తిత్వం కోసమే తమ పోరాటమన్నారు. సికింద్రాబాద్‌ను కార్పొరేషన్‌గా కానీ, జిల్లాగా కానీ చేయాలని, లేని పక్షంలో ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలనేదే తమ అభిమతమన్నారు. దీంతో ఏం జరగనుందన్నది నగర ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ఏం జరగనుందో చూద్దామనే ధోరణిలో వేచి చూస్తున్నారు.  

     

Family

  • పొంగల్‌ వేళ ఓ పాఠశాలలోని టీచర్‌ మార్గదర్శకత్వంలోని సాంప్రదాయ పులి నృత్యం నెట్టింట వైరల్‌గా మారి అదరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆ చిన్నారులు ఆనృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించేలా చేసేందుకు అతడు పడ్డ తపన మాటలకందనిది. ఓ గురువు తన శిష్యుల కోసం ఎంతలా కష్టపడతాడు అనేందుకు ఈ ఘట్టం అద్భుతమైన ఉదాహరణ.

    న్యూజెర్సీ ఎడిసన్‌లోని తిరువల్లూవర్ తమిళ పాఠశాలలో జరిగిన ఉత్సాహభరితమైన పొంగల్ వేడుక నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో గులాబీ రంగు చీర ధరించిన ఓ మహిళా టీచర్‌ తన పిల్లల ముందు నిలబడి పులియట్టం (సాంప్రదాయ పులి నృత్యం) కోసం మార్గనిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తాడు. దాంతో ఆ విద్యార్థులు తమ టీచర్‌ని అనుసరిస్తూ..సులభంగా ఆ బీట్‌కు అనుగుణంగా కాళ్లు కదుపుతుంటాడు. 

    అయితే అక్కడ వాళ్లు ఆ సంగీత లయలకు అనుగుణంగా సరిగా స్టెప్పులు వేస్తున్నా..అక్కడ ఆ మహిళా టీచర్‌ మాత్రం అందరి దృష్టిని అకర్షించి, హైలెట్‌గా నిలిచింది. అక్కడున్న విద్యార్థులంతా ఆ సంప్రదాయ పులి నృత్యం అంతభాగా ప్రదర్శించగలిగారంటే..అందుకు ఆ టీచర్‌ పెట్టిన ఎఫెక్టే కారణం. వాళ్లు ఏ స్టెప్‌ని మిస్‌ చేయకుండా కేర్‌ తీసుకుంటూ..వారికి ఎదురుగా నిలబడి ఆ టీచర్‌ కూడా నృత్యం చేస్తూ..పడిన తపనకి అందరూ ఫిదా అవ్వడమే గాక..ఆమె పెట్టిన ఎఫెక్ట్‌కి మాటల్లేవ్‌ అంతే..!. అంటూ పోస్టలు పెట్టారు నెటిజన్లు

     

    (చదవండి: Makar Sankranti 2026: అరిసెలే కాదు ఉంధియు, తిల్ పిఠా కూడా!)
     

Rangareddy

  • 2 జోన్లు.. 10 ఠాణాలు

    సాక్షి, రంగారెడ్డిజిల్లా: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలల ప్రాజెక్ట్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు కొత్తగా ఫ్యూచర్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కమిషనరేట్‌కు పటిష్టమైన ట్రాఫిక్‌ విభాగం ఏర్పాటు కానుంది. ఫోర్త్‌ సిటీలో భవిష్యత్‌ ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ జోన్లు, డివిజన్లు, ఠాణాలను ఏర్పాటు చేయనున్నారు. మహేశ్వరం, శంషాబాద్‌ రెండు ట్రాఫిక్‌ జోన్లలో నాలుగు డివిజన్లు, మొత్తం 10 ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లతో ఫ్యూచర్‌ సిటీ ట్రాఫిక్‌ విభాగం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

    ట్రాఫిక్‌కు జాయింట్‌ సీపీ..

    ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, చలాన్ల జారీతో పాటు ఫ్యూ చర్‌ సిటీ ట్రాఫిక్‌ పోలీసు విభాగం సరికొత్తగా ఆవిష్కృతం కానుంది. ట్రాఫిక్‌ పోలింగ్‌ సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చడం, సమర్థ పర్యవేక్షణ నిమిత్తం హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల తరహాలోనే ఫ్యూచర్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ విభాగానికి జాయింట్‌ కమిషనర్‌ ఉండనున్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో కొలువుదీరనున్న బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారుల రాకపోకలు ఎలాంటి అంతరాయం కలగకుండా సాఫీగా ప్రయాణం సాగించేలా ఈ విభాగం పని చేస్తుంది.

    ఠాణాలివీ..

    శంషాబాద్‌ ట్రాఫిక్‌ జోన్‌లో శంషాబాద్‌ డివిజన్‌, షాద్‌నగర్‌ డివిజన్లుంటాయి. ఈ రెండు డివిజన్లలో ఆరు ట్రాఫిక్‌ ఠాణాలు, మహేశ్వరం ట్రాఫిక్‌ జోన్‌లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం డివిజన్లుంటాయి. వీటిలో నాలుగు ఠాణాలు ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌లో శాంతి భద్రతల విభాగంలో మూడు జోన్లు ఏర్పాటైన సంగతి తెలిసిందే.

    ఫ్యూచర్‌ సిటీ ట్రాఫిక్‌ విభాగంస్వరూపమిదీ

    కమిషనరేట్‌ నేపథ్యమిదీ..

    ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఫ్యూచర్‌ సిటీ పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఇక్కడి నుంచే కమిషనరేట్‌ కార్యకలాపాలు సాగించనుంది. త్వరలోనే రంగారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలో లేదా ప్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిలో గానీ కమిషనరేట్‌కు స్థలం కేటాయించనున్నారు. ఇప్పటికే అనువైన స్థలం కోసం రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణతో ప్రభుత్వం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తరహాలో నాలుగో నగరం అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్‌ రాష్ట్ర రహదారి మధ్యలో ముచ్చెర్ల ప్రాంతంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో కొత్తగా ఫ్యూచర్‌ సిటీ పరిధి వరకు పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలోనే సైబరాబాద్‌, రాచకొండలోని పలు ప్రాంతాలను వేరు చేసి కొత్తగా ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు.

  • సీపీఎ

    పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

    తుక్కుగూడ: సీపీఎం పోరాట ఫలితంగానే ఫ్యాబ్‌ సిటీ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు అందాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రావిర్యాల, జెన్నాయిగూడ రైతులు ఆయన్ను కలిసారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. 2004లో జెన్నాయిగూడలో ఫ్యాబ్‌సిటీ ఏర్పాటుకు 224 మంది రైతుల నుంచి 827 ఎకరాల భూమిని సేకరించారని.. తదనంతరం వారిని పట్టించుకోలేదన్నారు. దీంతో పార్టీ జిల్లా కమిటీ రైతుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించి నలుగురికి రిజిస్ట్రేషన్‌ చేసిందన్నారు. మిగిలిన నిర్వాసితులకు సైతం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రామ చందర్‌,ఆర్‌.స్వామి, రైతులు నర్సింహ, ప్రశాంత్‌, నాగేశ్‌, భిక్షపతి, రాజు, అశోక్‌ పాల్గొన్నారు.

    కూలీల పొట్టకొట్టేందుకు

    కేంద్రం కుట్ర

    వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా

    అధ్యక్షుడు అంజయ్య

    యాచారం: కూలీల పొట్ట కొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలుపన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం సంఘం ఆధ్వర్యంలో నందివనపర్తి, నస్దిక్‌సింగారం, కుర్మిద్ద గ్రామాల్లో భోగి మంటల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ జీ రామ్‌ జీ జీఓ ప్రతులను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడు తూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకో కుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంగయ్య, సురేశ్‌, బుగ్గ రాములు, గోపాల్‌, రాములు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

    బకాయిలు సకాలంలో

    చెల్లించండి

    డీసీసీబీ డీజీఎం శైలాజారెడ్డి

    యాచారం: పీఏసీఎస్‌లో పొందిన రుణాలకు సకాలంలో బకాయిలను చెల్లించాలని డీసీసీబీ డీజీఎం శైలజారెడ్డి రైతులకు సూచించారు. యాచారం పీఏసీఎస్‌ పరిధిలోని యాచారం, తమ్మలోనిగూడ, మాల్‌ గ్రామాల్లో బకాయిలున్న రైతులను ఆమె బుధవారం కలిశారు. పీఏసీఎస్‌లో పౌల్ట్రీఫాం, డెయిరీఫాం, గొర్రెలు, మేకల పెంపకం కోసం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. యాచారం పీఏసీఎస్‌ కింద రూ.48 కోట్ల బకాయిలున్నట్లు ప్రతీ రైతు సకాలంలో చెల్లించే విధంగా కృషి చేయాలని ఆమె కోరారు. కొందరు రైతులు అధికారులకు బకాయి చెల్లించారు. మిగిలిన రైతులకు నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాచారం పీఏసీఎస్‌ సీఈఓ నాగరాజు, యాచారం డీసీసీబీ బ్యాంకు మేనేజర్‌ నాగలక్ష్మి ఉన్నారు.

    మున్సిపాలిటీలకురిజర్వేషన్లు ఖరారు

    పరిగి: రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను బుధవారం ఖరారు చేసింది. ఆమనగల్లులో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 4, ఎస్సీ– 2, బీసీ– 1, జనరల్‌– 8, ఇబ్రహీంపట్నంలో 24 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 6, బీసీ– 5, జనరల్‌– 12, కొత్తూర్‌లో 12 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 3, జనరల్‌– 6, మొయినాబాద్‌లో 26 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 7, బీసీ– 5, జనరల్‌– 13, షాద్‌నగర్‌లో 28 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 2, బీసీ– 11, జనరల్‌– 14, శంకర్‌పల్లిలో 15 వార్డులు ఉండగా ఎస్టీ– 1, ఎస్సీ– 3, బీసీ– 3, జనరల్‌– 6 రిజర్వేషన్‌లను ప్రభుత్వం ప్రకటించింది. ఏ వార్డు ఏ రిజర్వేషన్‌లో ఉందనే విషయం త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది.

  • రిజర్వేషన్‌ టెన్షన్‌

    సమీపిస్తున్న పురుపోరు

    ఆమనగల్లు: పురపోరు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నుంచి ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో తమకు రిజర్వేషన్లు అను కూలంగా వస్తాయా లేదో అనే టెన్షన్‌లో ఉన్నారు. వార్డులు, చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్‌లు మారుతాయనే చర్చలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్‌ ఏమొచ్చినా అందుకు తగిన విధంగా ఆయా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎలాగైనా పోటీలో ఉండాల్సిందే అని నిర్ణయించుకున్నవారు అందుకు తగి న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వచ్చే అవకా శం ఉందంటూ ఆశావహులు లెక్కలు వేసుకుంటూ రిజర్వేషన్లపై ఓ అంచనాకు వస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

    తుది జాబితాల విడుదల

    ఆమనగల్లు మున్సిపాలిటీలో ఓటర్ల తుది జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి శంకర్‌ విడుదల చేశారు. ఓటర్ల జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం తుది ఓటరు జాబితాను, పోలింగ్‌ స్టేషన్‌ల తుది జాబితాను సైతం ప్రకటించారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో మొత్తం 16,984 మంది ఓటర్లు ఉన్నారు.

    మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలవగా రిజర్వేషన్లపై నేటికీ స్పష్టత రాలేదు. దీంతో ఆశావహులు తమనకు అనుకూలంగా వస్తాయా లేదా అని అయోమయోనికి గురవుతున్నారు.

  • సంప్ర

    శంకర్‌పల్లి: భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోకిలతండా పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ వర్త్య శాంతమ్మ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతగా విశ్రాంత ఐఏఎస్‌ పౌర్ణిమ వ్యవహరించి విజేతలను ప్రకటించారు. అనంతరం మొదటి విజేత సంధ్యకు రూ.50 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ఉమకు రూ.25 వేలు, తృతీయ స్థానం సోనాలికి రూ.15 వేలు, 4వ స్థానం శివయ్య మాతకి రూ.10 వేలు, 5వ స్థానంలో నిలిచిన పార్వతికి రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం సర్పంచ్‌ శాంతమ్మ పోటీల్లో పాల్గొన్న వారికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు నాయక్‌, బాబు నాయక్‌, ప్రభాకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రాములు, వాసుదేవ్‌ కన్నా తదితరులు పాల్గొన్నారు.

  • కేటుగాడు.. దొరికాడు

    కడ్తాల్‌: మండల కేంద్రంతో పాటు, పరిసరా గ్రామాల ప్రజలు కుదువ పెట్టిన సుమారు రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను తన సొంత అవసరాలకు వాడుకోవడంతో పాటు తప్పించుకు తిరుగుతున్న పాన్‌ బ్రోకర్‌ను పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బేవార్‌ జిల్లా జైతారం మండలం రామర్‌ గ్రామానికి చెందిన బర్ఫా నన్నారాం అలియాస్‌ నవీన్‌, అతని సోదరుడు ధర్మారామ్‌ కలిసి 2023లో ఉపాధి కోసం కడ్తాల్‌కు వచ్చారు. ఇక్కడ గణేశ్‌ పాన్‌ బ్రోకర్స్‌ పేరుతో లైసెన్స్‌ కలిగిన నగల తాకట్టు దుకాణాన్ని ప్రారంభించారు. పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది తమ బంగారు, వెండి ఆభరణాలు కుదవ పెట్టి డబ్బులు తీసుకునేవారు. ఈసమయంలో కస్టమర్లకు తక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చేవారు. అనంతరం అదే వస్తువులను మండల కేంద్రంలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌తో పాటు సిక్రిందాబాద్‌లోని ఉత్తమ్‌చంద్‌కు చెందిన వివేక్‌ పాన్‌ బ్రోకర్స్‌ వద్ద కుదువ పెట్టి, ఎక్కువ డబ్బులు తీసుకునేవారు. వచ్చిన సొమ్ముతో తమ అవసరాలు తీర్చుకునే వారు. ఇలా ప్రజలు కుదువ పెట్టిన సుమారు 500 గ్రాముల బంగారంతో గత ఏడాది సెప్టెంబర్‌లో షాపును మూసేసి, కుటుంబ సభ్యులతో సహా పారిపోయారు. ఈ విషయమై అప్పట్లోనే సుమారు 25 మంది బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నన్నారాం ఈనెల 13న కందుకూరు మండలం పెద్దమ్మతండాకు వచ్చాడని పోలీసులకు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సికింద్రాబాద్‌లో కుదువ పెట్టిన సుమారు 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కుతరలించారు. ఇతని సోదరుడు ధర్మారామ్‌ పరారీలోనే ఉన్నాడు. వీరి నుంచి మరో 200 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే స్థానిక పీఎస్‌లలో ఫిర్యాదు చేయాలన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గంగాధర్‌, ఎస్‌ఐ వరప్రసాద్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

  • వైభవం

    మొయినాబాద్‌రూరల్‌: గోదాదేవి అవతారమే భూమాత అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ అన్నారు. బుధవారం ఆలయంలోని అద్దాల మేడలో గోదాదేవి రంగనాయక స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణమహోత్సవంలో భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూ లు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో వికారాబాద్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ముంజులరవియాదవ్‌, మాజీ మంత్రి సబితారెడ్డి కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Adilabad

  • సంస్కృతికి జైకొట్టి.. భక్తి మార్గాన్ని నిలబెట్టి

    అన్నవరం: మన సంస్కృతికి అద్దం పడుతూ.. భక్తి మార్గానికి జై కొడుతూ ‘భోగి’భాగ్యాలు ప్రసాదించాలంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరిగాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొత్త ఏర్పడిన పోలవరం జిల్లాలోని పలు దేవస్థానాల్లో భోగి సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ప్రతీక అని, ఇవి మనుషుల అనుబంధాలను పెంచుతాయని తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అన్నారు. భోగి పండగ సందర్భంగా బుధవారం అన్నవరం రత్నగిరిపై రామాలయం ఆవరణలో సంక్రాంతి వేడుకలను స్వామీజీ ప్రారంభించారు. పాడి పంటలు, పశువులతో పెనవేసుకున్న మన సంస్కృతిని గుర్తుచేసే అపురూపమైన పండగ భోగి అని స్వామీజీ తెలిపారు. రామాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటను పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రజ్వలన చేశారు. అనంతరం రామాలయం ఆవరణలో తెలుగు సంస్కృతిని ప్రతిబంబిస్తూ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావుతో కలసి తిలకించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామీజీ ప్రసంగిస్తూ అచ్చ తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఏటా దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

    పల్లె వాతావరణం ప్రతిబింబించేలా..

    సత్యదేవుడు కొలువైన రత్నగిరిపై రామాలయం వద్ద భోగి వేడుకలను పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు. ఇక్కడ గ్రామీణ వాతావరణ అలంకరణ ఆకట్టుకుంది. ఒకవైపు పొంగలి వంట, ఇంకో వైపు భోగి మంట, పాడి ఆవులు, తెలుగు పౌరుషానికి ప్రతిరూపంగా నిలిచే కోడి పుంజులు, ఎడ్ల బండి, భోగిపళ్లు, బొమ్మల కొలువు, తాడిచెట్టు, కొబ్బరి చెట్టు, ఈతచెట్టు, కుమ్మరి సారి తదితరాలు అందరినీ అలరించాయి. అలాగే జానపద కళారూపాల ప్రదర్శన కనువిందు చేసింది. సంప్రదాయ జానపద కళారూపాలైన గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసు, హరిదాసులు, కళాకారుల కోలాట నృత్యాలు రంజింపజేశాయి. దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి, ఆసుపత్రి ఫార్మసీ సూపర్‌వైజర్‌ వల్లూరి మాధవి తదితరులు మట్టి కుండలపై పొంగలి, పాయసం వండి భక్తులకు పంచిపెట్టారు. వీటికి తోడు స్వామివారి వార్షిక కల్యాణ వేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించే అవకాశం కల్పించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉత్సవమూర్తుల విగ్రహాలు, ధాన్యపురాశి మీద గణపతి విగ్రహం అందరినీ అకట్టుకున్నాయి. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, ఉప ప్రధానార్చకులు ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, పవన్‌, సుధీర్‌, శర్మ తదితరులు పూజలు చేశారు.

    ‘భోగి’భాగ్యాలు నింపేలా వేడుకలు

    రత్నగిరిపై వేడుకలు ప్రారంభించిన

    సచ్చిదానంద సరస్వతి స్వామీజీ

    ఉమ్మడి జిల్లాలోని

    పలు దేవస్థానాల్లో సంబరాలు

  • రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుపై గరం గరం

    జగ్గన్నతోటలో ఎన్నడూ లేని సంస్కృతి

    ఫ్లెక్సీలు తొలగించకుంటే

    తీర్థానికి వచ్చేది లేదన్న గ్రామస్తులు

    అంబాజీపేట: కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం రగులుతోంది. బుధవారం గంగలకుర్రులో గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రులకు చెందిన గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగ్గన్నతోటను రాజకీయ తీర్థంగా మార్చారని సమావేశం ఆరోపించింది. మునుపెన్నడూ లేనివిధంగా జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నూతన సంస్కృతికి తెర తీశారని ప్రభల కమిటీ సభ్యులు ఆరోపించారు. ఫ్లెక్సీలు తొలగించకుంటే రెండు గ్రామాల నుంచి వచ్చే ప్రభలు కౌశిక గట్టుపై ఉండి, తీర్థంలోకి వచ్చేది లేదన్నారు. అనంతరం ప్రభలు జరిగే జగ్గన్నతోట ప్రాంతాన్ని గ్రామస్తులు, భక్తులు పరిశీలించారు. ఈ విషయమై పి.గన్నవరం సీఐ ఆర్‌.భీమరాజుకు ఫిర్యాదు చేశారు. 470 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గనతోట ప్రభల తీర్థంలో ఇప్పటి వరకూ ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని, జనసేన పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలకు భంగం కలిగించవద్దన్నారు. శివకేశవ యూత్‌ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభల తీర్థ విశిష్టతను తెలుపుతూ 2020లో ప్రధాని మోదీకి లేఖ రాశారని, దానికి బదులుగా ఏకాదశ రుద్రులపై సందేశం పంపారన్నారు. 2023లో 74వ గణతంత్ర వేడుకల్లో ఏకాదశ రుద్రుల ప్రభలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శకటంగా ప్రదర్శించినప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని గంగలకుర్రు అగ్రహారానికి చెందిన ఎంఎం శెట్టి వివరించారు. సీఐ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫ్లెక్సీని నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తీర్థంలో కాకుండా బయట ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని, పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అభ్యంతరకరమని తక్షణమే తొలగించాలని సీఐకు వారు వివరించారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తొలగించడం కుదరదని, చట్టవిరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇదిలా ఉండగా జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామాల్లో ఘర్షణలు, కవ్వింపు చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రభల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

  • ● జై.

    లక్షణంగా సందడి

    ఓడలరేవు బీచ్‌లో పతంగులను ఎగుర వేస్తున్న పర్యాటకులు

    పందేలకు సై అన్నారు.. బరుల వద్ద ఎక్కడ చూసినా క్యూ కట్టారు.. ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద కోడిపందేలు పెద్దఎత్తున జరిగాయి. రూ.కోట్లలో సాగుతున్న ఈ పందేలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భారీగా వచ్చారు. ఆ బరి వద్ద కార్ల పార్కింగ్‌కు స్థలం సరిపోలేదు మరి. – ఐ.పోలవరం

    మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేశారు. లక్షకు పైగా పిడకలతో తయారు చేసిన దండను గ్రామంలో ఊరేగించి అనంతరం ఆ దండను భోగి మంటలో వేసి సందడి చేశారు.

    – మామిడికుదురు

    అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం చైన్నెలోని మేరీనా బీచ్‌ను తలపించింది. తారాడి ధర్మారావు ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా కై ట్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి పిల్లాపాపలతో గాలి పటాలను ఎగురవేశారు. కై ట్‌ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులకు ఉచితంగా పతంగులను అందించారు.

    – అల్లవరం

  • శివమణ

    కోటనందూరు: ఢిల్లీలోని భారత్‌ మండపంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించిన వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ –2026లో కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలేనికి చెందిన కొరుప్రోలు శివమణికంఠ పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగిక విద్యను అందిస్తూ ప్రయోగశాల జ్ఞానాన్ని నేరుగా పొలాలకు తీసుకెళ్లే విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. శివమణికంఠ తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రత్యక్షంగా పంచుకున్నారు. టాప్‌– 5 ప్రతిపాదనల్లో శివమణికంఠ ప్రతిపాదన ఉండడంతో ఆయనకు జాతీయ గుర్తింపు లభించింది. విద్య, పరిశోధనకు వ్యవసాయాన్ని అనుసంధానించే తన తన వినూత్న ఆలోచనలు దేశ వ్యవసాయ అభివృద్ధికి దిశానిద్దేశం చేస్తాయని నిపుణులు అన్నారు. విజయనగరం ట్రైబుల్‌ వెల్ఫేర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న శివమణికంఠను స్థానిక పెద్దలు, అధ్యాపకులు అభినందించారు.

    ఉరేసుకుని

    యువకుడి ఆత్మహత్య

    చింతూరు: స్థానిక శబరినది ఒడ్డున చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేష్‌ కథనం ప్రకారం.. శబరినది ఒడ్డున ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండడాన్ని ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన చెందక వెంకటేష్‌(27)గా గుర్తించామని, సెల్‌ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

    ప్రపంచంలోనే శక్తివంతం

    ఏకాదశ రుద్రులు

    అంబాజీపేట: విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ఎన్నో ప్రాచీన దేవాలయాలు నేడు జీర్ణ దశకు చేరుకోవడంతో వాటి పునర్నిర్మాణం కోసం ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు హంపీలోని పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. కె.పెదపూడిలో ప్రముఖ సిద్ధాంతి రాపాక శేషాచలం స్వగృహంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కోనసీమలో ఎంతో శక్తివంతమైన ఏకాదశ రుద్రుల దేవాలయాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో అన్నవరం, అంతర్వేది లాంటి ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయన్నారు. విజయనగర సామ్రాజ్యంలో హంపిలో నిర్మించిన పలు దేవాలయాలు జీర్ణోద్ధారణ చేసే ముందు కోనసీమలో ఉన్న ఏకాదశ రుద్రుల దర్శించుకోవడం శ్రేయస్కరమని స్వామీజీ చెప్పారు. ఏకాదశ రుద్రుల పేర్లు వేరైనా వారి అంశ ఒక్కటేనని అన్నారు. ఏకాదశ రుద్రులు ఈ నాటివారు కారని వేదాలలోనే ఉందన్నారు. అయోధ్యలో రామ జన్మభూమి ఉన్నట్లు హంపిలో హనుమ జన్మభూమి నిర్మిస్తామన్నారు. రాబోయే 2027లో గోదావరి నదికి పుష్కరాలు వస్తున్నాయని, ప్రభుత్వం భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందు ఏకాదశ రుద్రుల దేవాలయాలను స్వామీజీ దర్శించుకున్నారు.

    కోట సత్తెమ్మ ట్రస్ట్‌కు

    రూ.లక్ష విరాళం

    నిడదవోలు రూరల్‌: తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోట సత్తెమ్మ ఆలయంలో నిత్యాన్నదాన ట్రస్ట్‌కు నిడదవోలుకు చెందిన డాక్టర్‌ తోపరాల కల్యాణ చక్రవర్తి బుధవారం రూ.లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతకు అమ్మవారి చిత్రపటం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హరిసూర్యప్రకాష్‌, ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ దేవులపల్లి రవిశంకర్‌, ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ పాల్గొన్నారు.

  • కల్యా

    స్వామి, అమ్మవార్లకు కల్యాణ వస్త్రాలు తీసుకు వస్తున్న చైర్మన్‌ రాజు, ఈఓ చక్రధరరావు దంపతులు

    వాడపల్లి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

    కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో గోదాదేవి కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో గోదారంగనాథ స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని క్షేత్రాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భోగి పండగ సందర్భంగా మంట వేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేద పండితులు గోదాదేవిని పెండ్లి కుమార్తెగా, రంగనాథ స్వామిని పెండ్లి కుమారుడిగా అలంకరించి భక్తజనం నడుమ ఆ క్షేత్రంలోని కల్యాణ వేదిక పైకి తోడ్కొని వచ్చారు. స్వామివారికి ఎమ్మెల్యే సత్యానందరావు, చైర్మన్‌ వెంకట్రాజు, డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు దంపతులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ క్రతువును వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతంలో భాగంగా అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావైని అనుసంధానించి, చివరిగా కల్యాణంతో ముగించి గోదారంగనాథుల కృపకు పాత్రులు కావడం అత్యంత అవశ్యమని పండితులు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకించారు. సుమారు రెండు వేల మంది అవివాహితులు యువతీ, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు.

  • వైఎస్సార్‌ సీపీ శ్రేణులను రెచ్చగొట్టొద్దు

    ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల

    నల్లజర్ల/జంగారెడ్డిగూడెం: ‘వైఎస్సార్‌ సీపీ శ్రేణులను రెచ్చగొట్టవద్దని ముందే చెప్పాం. అయినా కూటమి నాయకులు, కార్యకర్తలు వినడం లేదు. అధికారం ఉందని రెచ్చిపోతున్నారు. ప్రజలు మీకిచ్చిన పదవీకాలంలో మరో రెండు సంక్రాంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జరిగేది మీరే చూస్తారు...’ అని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి ఆర్‌.శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసుల వేధింపులకు గురైన యువకులను బుధవారం శ్యామల పరామర్శించారు. వైఎస్సార్‌ సీపీ కుటుంబంలో ఇక్కడ కొందరు తమ్ముళ్లకు అన్యాయం జరిగిందని, ఒక అక్కగా వారిని కలవాలని వచ్చానని శ్యామల చెప్పారు. అనంతరం పడమర చోడవరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని సాకుగా చూపి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు గొడ్డును బాదినట్లు బాదుకుంటూ రోడ్డుపై నడిపించడం దుర్మార్గమన్నారు. ఇప్పటి వరకూ తమ పార్టీ శ్రేణుల మంచితనమే చూశారని, ఇక నుంచి రెచ్చిపోయే ప్రతి కూటమి నాయకుడు, కార్యకర్తకు తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శ్యామల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కూడా వచ్చి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను కలిశారు.

Prakasam

  • నిరుప

    చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా గ్రామీణ ఆస్తులను నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామాల అభివృద్ధి కోసం సమకూర్చిన ఆస్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల చెంతకు పాలన వచ్చింది. నాడూ–నేడుతో ప్రభుత్వ స్కూళ్లల్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. మేము చదివిన పాఠశాలలను పట్టించుకోవడంలేదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మా తముళ్లు, ఊళ్లో పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు..అంటూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కొలువులు చేస్తున్న యువకులు నిట్టూరుస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సొంతూరు గంజివారి పల్లెకు వచ్చిన యువకులు బుధవారం భోగి మంటలు వేసుకున్న తర్వాత అంతా గ్రామంలోని రచ్చబండ వద్దకు చేరుకున్నారు. గ్రామ పరిస్థితి, కుటుంబ వ్యవహారాలు చర్చించుకోవడం కనిపించింది. పంచాయతీలకు గుర్తింపు తీసుకొచ్చి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ల కోసం రూ.కోట్లు ఖర్చుపెట్టి పక్కా భవనాలు నిర్మించి ఆ ఆస్తులు గ్రామానికి అప్పజెప్తే చంద్రబాబు ప్రభుత్వానికి కన్నుకుట్టినట్లుగా ఉందని, వాటిని నిరుపయోగంగా మార్చుతున్నారని వెన్నా వీరారెడ్డి చర్చ తీసుకొని వచ్చారు.

    ● రూ.45 లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన సచివాలయ భవనం ఈ నాటికి ప్రారంభోత్సవానికి నోచుకోదు. రైతు భరోసా కేంద్రంలోనే సచివాలయ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని మరో ఉద్యోగి పిచ్చిరెడ్డి అన్నారు.

    ● రూ.1.20 కోట్లతో నాడు–నేడు కింద జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపేశారని, 10 తరగతి గదుల్లో విద్యను అభ్యశించాల్సిన విద్యార్థులు కేవలం 5 గదుల్లో సర్దుకుంటున్నారని, ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంటోందని వెంకటేశ్వరరెడ్డి వాపోయారు. నియోజకవర్గ కేంద్రానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరైతే కేవలం టీడీపీ వర్గీయులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మాత్రమే అభివృద్ధి చేశారని, తమ గ్రామంలోని రోడ్డులో తట్టెడు ఇసుక వేయలేక పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    మెడికల్‌ కాలేజీలు ప్రవేటు పరంచేయడం ఏమిటి..

    పేదల ఆరోగ్యం కాపాడటంతోపాటు పేద పిల్లలు డాక్టర్లుగా ఎదిగేందుకు గత చరిత్రలో ఎక్కడా లేని విధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తీసుకొని వస్తే వాటిని ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెట్టడం సరికాదని, చంద్రబాబు, ఆయన బినామీలు జేబులు నింపుకోవటానికే అని ఐటీ ఉద్యోగి శివారెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయటానికి రూ 1700 కోట్లు ఖర్చుచేయవచ్చని, పేదల ఆరోగ్యం కాపాడేందుకు మాత్రం ప్రభుత్వం వద్ద నిధులు ఉండవని ఆయన ప్రశ్నించారు.

    ● రేషన్‌ ఇంటి వద్దకు చేర్చేలా జగనన్న వాహనాలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు వాటిని ఎత్తివేసి రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించుకునేలా చర్యలు తీసుకొని పేదల కడుపులు కాల్చుతున్నారని చెన్నకేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ తల్లిదండ్రులు కాయకష్టం చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    ఊరు : యర్రగొండపాలెం, గంజివారి పల్లె

  • సేవలు

    ఊరు: సింగరాయకొండ మండలం, చిన్న కనుమళ్ల గ్రామం..

    ిసింగరాయకొండ మండలం చిన్న కనుమళ్ల గ్రామం. ఈ గ్రామ వాసులు ఉద్యోగాల రీత్యా పొరుగు ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పండుగను తమవారితో జరుపుకునేందుకు సొంతూరికి వచ్చారు. గ్రామం అంతా కలియదిరిగారు. కనుమళ్ల గ్రామ సచివాలయానికి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయానికి వెళితే సిబ్బంది లేక ఖాళీగా ఉన్న కుర్చీలు దర్శనమిచ్చాయి. వ్యవసాయాధికారి పొలం పిలుస్తోంది కార్యక్రమానికి వెళ్లడంతో రైతు సేవా కేంద్రం మూతపడి ఉంది. ఈ దృశ్యాలు వారిని మరింతగా కలిచివేశాయని చెప్పుకొచ్చారు. వెనుకబడిన ప్రకాశంలో జిల్లాలో వైఎస్‌ రాజశేఖరెడ్డి ఒంగోలులో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా రిమ్స్‌ను ఏర్పాటు చేసి అత్యాధునిక వైద్యసేవలు అందేలా చేశారని, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు చేశారు. దాదాపు 70 శాతం పనులు పూర్తి చేశారు. మార్కాపురం జీజీహెచ్‌ను సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలగా మార్చేందుకు అన్నీ చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు వచ్చాక పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పు బట్టారు. మెడికల్‌ కాలేజీలు నిర్వహించలేని చంద్రబాబు రూ.1,700 కోట్లు పెట్టి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఎలా పెడతాడని, ఇదో డ్రామా అంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని, పేదలకు నరకం చూపిస్తున్న ప్రభుత్వమని ఆరోపించారు. వారి అభిప్రాయాలు..

    పింఛన్‌ కోసం అవస్థలు..

    నేను బేల్దారి పనిచేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాను. ప్రతి సంవత్సరం పండక్కి స్వగ్రామం వస్తాను. ఈ ఏడాది ఊళ్లో పండుగ సందడి లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉంది. గతంలో ఒకటో తేదీ ఇంటి తలుపు తట్టి గ్రామ వలంటీర్‌ పింఛన్‌ ఇచ్చేది. దీంతో గడప దాటే పనిలేదు. కానీ నేడు ఒకటో తేదీ రాగానే గ్రామంలోని ఆలయం వద్దకు వస్తే గానీ పింఛన్‌ ఇచ్చే పరిస్థితి లేదు. అనారోగ్యం గా ఉన్నా, నడవలేని వృద్ధులైనా పింఛన్‌ కోసం గుడి వద్దకు వెళ్లాల్సిందే.

    – చొప్పర సునీల్‌, బేల్దారి మేస్త్రి, చిన్న కనుమళ్ల గ్రామం

  • సూపర్

    యర్రగొండపాలెం: ‘రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. సీఎం చంద్రబాబు రైతులకు, ఉద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు చేసిందేమీ లేద’ని మాజీ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. చంద్రబాబు కూటమి ప్రజల ఓట్లతో గెలవలేదని, ఈవీఎంలను గోల్‌మాల్‌ చేశారని ప్రజలంతా బహిరంగంగా చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా అశేష సంఖ్యలో తరలివస్తున్న జనాలే అందుకు నిదర్శనమన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీల్లో నాలుగో రోజు బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందని ముని శాపం ఉందని, అందుకే నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతారని ఎద్దేవా చేశారు. భోగి రోజున కూడా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సూపర్‌ సిక్స్‌ హిట్‌ అయిందని, రైతుల ఆనందంలో అంతులేదని సిగ్గు లేకుండా, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారన్నారు.

    అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతులకు ఇప్పటి వరకు రూ 40వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి పంగనామం పెట్టారని విమర్శించారు. పంటలు పండించేందుకు యూరియా ఇవ్వకుండా, తంటాలు పడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కనీయకుండా చేస్తే రైతులు ఏ విధంగా సంతోషంగా ఉంటారని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ హయాంలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అడుగుపెడితే అక్కడే తాను పుట్టానని చెప్పుకొనే పవన్‌కల్యాణ్‌కు తన సినిమాలపై ఉన్న మోజు ప్రజా సంక్షేమంపై లేదన్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ముందుగా మాజీ మంత్రి సాకె శైలజనాథ్‌, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఐటీ వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.సునీల్‌ రెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి చింతలపూడి అశోక్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డ్‌ మాజీ సభ్యురాలు డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు హాజరై పోటీలు తిలకించారు.

  • విద్య, వైద్యం ప్రభుత్వమే కదా నిర్వహించాలి..

    ఊరు : మార్కాపురం పట్టణం

    సంక్రాంతి పండుగకు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి తమ సొంత పట్టణమైన మార్కాపురానికి వచ్చారు. ఇంట్లో వారితో సరదాగా గడిపి బుధవారం ఉదయం అందూ పట్టణంలోని తూర్పువీధిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎలా ఉన్నావ్‌.. మామా... ఎలా ఉన్నావ్‌ బాబాయ్‌.. తమ్ముడూ బాగున్నావా..! అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొంత సేపు పాత కబుర్లు మాట్లాడుకుని ఆ తర్వాత మార్కాపురం మెడికల్‌ కాలేజీ, వెలుగొండ ప్రాజెక్టుపై చర్చకు వచ్చింది. వారి మాటల్లో...

    బాలకృష్ణారెడ్డి : ఎరా...! అల్లుడూ ఎలా ఉన్నావ్‌.. హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఎలా ఉంది. ఇప్పుడంతా లేఆఫ్‌లు అంటున్నారు కదా.. నీకేమీ ప్రాబ్లం లేదు కదా అంటూ మాటల్లో ఈ మధ్య మార్కాపురం శివారులో కట్టిన మెడికల్‌ కాలేజీని ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వారికి అప్పజెప్పిందట నిజమేనా..?

    కొండారెడ్డి : అవును.. మావా..! నేను కూడా ఈ మధ్య మార్కాపురం వచ్చినప్పుడు మెడికల్‌ కాలేజీ వద్దకు ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఎంటా అని ఆరా తీస్తే ప్రభుత్వం మెడికల్‌ కాలేజీని ప్రైవేటు వారికి ఇచ్చిందట. ప్రభుత్వమే నిర్వహించాలని వారు కోరుతూ పెద్దఎత్తున మెడికల్‌ కాలేజీ వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారట. విద్య,వైద్యం ప్రభుత్వం ఉచితంగా అందించాలి కదా..!

    విష్ణువర్ధన్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి: అన్నా... నువ్‌ చెప్పింది నిజమే ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోకూడదు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్మించి ఉచితంగా పేదలకు వైద్యం అందించాలి. లేదంటే మళ్లీ ఉచిత వైద్యం కోసం మనవాళ్లు గుంటూరు, ఒంగోలు వెళ్లాలంటే చాలా కష్టపడాలి. ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీని నిర్వహించాలి.

    వెంకటేశ్వర రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి : కరెక్టే అన్నా.. ! ఇప్పటికే కాలేజీ నిర్మాణం చాలావరకూ జరిగింది. మిగిలిన నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది.

    గొలమారి శ్రీనివాసరెడ్డి : ఏరా..! అల్లుళ్లూ.. బాగున్నార్రా..! మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని మన ఏరియా వారందరూ పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. మీరు కూడా సోషల్‌ మీడియాలో, వాట్సప్‌ల్లో, మార్కాపురం గ్రూపుల్లో చూసే వుంటారు కదా.. ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలను నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాము. దీనితోపాటు వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కూడా త్వరగా వదలాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.

    హేమంత్‌ రెడ్డి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి: అవును.. బాబాయ్‌..! వెలుగొండ నీళ్లు వస్తేనే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోతుంది. ఇప్పుడు మనకు నాలుగు లేదా ఐదురోజులకొకసారి సాగర్‌ నీటిని ఇస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రతిరోజూ తాగునీరు వస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్లోరిన్‌ నీరు ఎక్కువగా ఉండటంతో చాలామంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాతంతో ఇబ్బంది పడుతున్నారు.

    బాలక్రిష్ణారెడ్డి : మేము కూడా ప్రభుత్వాన్నికోరేది అదే..! అటు మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే కట్టడం.. ఇటు వెలుగొండ ప్రాజెక్టు నీటిని అందించాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వమేమో అభివృద్ధి బాగా జరుగుతోందంటోంది. ఇక్కడేమో పరిస్దితి మరోలా ఉంది.

  • ప్రకాశం
    గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026

    నాడు సంక్రాంతి పండుగంటే ఎంత సంబరంగా ఉండేదో.. ఇప్పుడా కళ ఏమైందో అంటూ పండుగ కళతప్పిన దానిపై వారి చర్చ సాగింది. నాడు జగన్‌ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలు అందజేయడంతో ఊళ్లన్నీ కళకళలాడేవని గుర్తు చేసుకున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు ఏదో ఒక పథకం డబ్బులు బ్యాంకులో పడేవి. ఆ డబ్బులతో పేదలు దుస్తులు, ఇంటికి సరుకులు తెచ్చుకుని పండుగ సంబరాలు చేసుకునే వారు. ఇప్పుడు పల్లె వెలవెలపోతోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వలంటీర్లు ఇంటికే వచ్చి పింఛన్లు ఇచ్చే సందడి హడావుడి బాగుండేది. ప్రస్తుతం రైతులకు సేవా వారధిగా ఉండే రైతు భరోసా కేంద్రం సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జగన్‌ హయాంలో రైతులు పండించిన ధాన్యానికి ధరలు బాగుండేవి. లాభాలు పండాయి. చంద్రబాబు వచ్చాక పరిస్థితి తలకిందులైంది. ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చారు. పల్లెల్లో వచ్చిన మార్పును వారు గమనించారు. ‘‘నేడు ఒకటో తేదీ వస్తే ఉదయాన్నే పింఛన్‌ కోసం గుడి వద్ద కాపు కాయాల్సిన దుస్థితి. గతంలో రేషన్‌ బియ్యం ఇంటికి వస్తే నేడు రేషన్‌ దుకాణానికి వెళ్లి గంటల తరబడి నిరీక్షించి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో గ్రామ వలంటీర్‌ వచ్చి అప్లికేషన్‌ పూర్తి చేసి తీసుకుని వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయించేవారు. కానీ నేడు గ్రామ సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.’’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కాపురంలో మెడికల్‌ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడం, వెలుగొండ జలాలను జిల్లా వాసులకు అందించి స్వచ్ఛమైన జలాలు అందించాలన్న డిమాండ్‌ సైతం వారి నుంచి వినిపించింది.

  • బరితె

    సాక్షి టాస్క్‌ఫోర్స్‌:

    జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. కోడి పందేల నిర్వహణ చట్టవిరుద్ధమైనప్పటికీ.. అధికార పార్టీ అనే అహంకారంతో ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేశారు. పైగా, ఆ బరుల చుట్టూ టీడీపీ జెండాలు, ఆయా నియోజకవర్గాల టీడీపీ ముఖ్య నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలను అలంకరించారు. జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల్లో కోడి పందేలు వేస్తున్నారు. అక్కడే మద్యం, మాంసం విక్రయిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దర్శి, కొండపి, కందుకూరు, కనిగిరి ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పాటు భారీగా లంచాలు తీసుకుని పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం కోడి పందేలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు, ప్రకటనలు చేస్తూ క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులతో చేతులు కలిపి డ్రామాలాడుతున్నట్లు తెలుస్తోంది.

    దర్శి నియోజకవర్గంలో పచ్చనేతల విచ్చలవిడి...

    దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి అండదండలతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాళ్లూరు సమీపంలోని వెంకట్రామయ్యస్వామి ఆలయ సమీపంలో కొందరు తెలుగు తమ్ముళ్లు గొట్టిపాటి లక్ష్మి ఫొటోలతో ఫ్లెక్సీలు వేసి మరీ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై మల్లికార్జునరావు కోడి పందేల బరిని ట్రాక్టర్‌ సహాయంతో దున్నేసినట్లు పైకి షో చేసినప్పటికీ.. బుధవారం గుట్టుచప్పుడు కాకుండా అదే ప్రాంతంలో బరి ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. కొందరు తెలుగు తమ్ముళ్లు గొట్టిపాటి లక్ష్మి, సీఐ, ఎస్సైలకు భారీగా ముడుపులు ముట్టజెప్పి బరిని ఏర్పాటు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీసుల ప్రవర్తన చూసి ముక్కునవేలేసుకుంటున్నారు. కోట్లాది రూపాయల్లో పందేలు వేస్తుండగా, కమీషన్లు పెట్టి తెలుగు తమ్ముళ్లు మధ్యవర్తిత్వం నడుపుతూ లక్షలాది రూపాయలు కాజేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు బరి వద్దే మద్యం యథేచ్ఛగా విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారు. ఇదంతా విచ్చలవిడిగా జరుగుతున్నా కనీసం పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. బుధవారం జరిగిన పందేలలో లక్షలాది రూపాయలు వెచ్చించినట్లు సమాచారం కాగా, సంక్రాంతి, కనుమ రెండు రోజుల్లో ఇంకా భారీ మొత్తాల్లో పందేలు వేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పారన్న చర్చ నడుస్తోంది.

    మంత్రి స్వామి ఇలాకాలోనూ జోరుగా

    కోడి పందేలు...

    మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి చెందిన కొండపి నియోజకవర్గంలో ఏకంగా మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బరులు సిద్ధం చేశారు. కొణిజేడు – యరజర్ల గ్రామాల మధ్య టీడీపీ నాయకులు జోరుగా కోడి పందులు నిర్వహిస్తున్నారు. పెద్ద, చిన్న బరులు, కాయ్‌ రాజా కాయ్‌ ఏర్పాటు చేశారు. కోడి పందేలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 100 పందెపు కోళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ పందేల్లో లక్షల రూపాయల్లో డబ్బు చేతులు మారుతోంది. దాదాపు 500 కార్లు, 1000కి పైగా ద్విచక్ర వాహనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. కారుకు రూ.100, ద్విచక్ర వాహనానికి రూ.50 చొప్పున నిర్వాహకులు పార్కింగ్‌ ఫీజు కూడా వసూలు చేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు.

    మంచికలపాడు పంచాయతీ పరిధిలో

    లక్షల్లో కోడి పందేలు...

    చీమకుర్తి రూరల్‌: మండలంలోని మంచికలపాడు పంచాయతీ పరిధిలో ఎర్రగుడిపాడు వెళ్లే చినరాస్తా రోడ్డుకి ఇరువైపులా స్థానిక టీడీపీ నాయకులు మూడు బరులు ఏర్పాటు చేసి లక్షల రూపాయల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బరులు ఏర్పాటు చేసినట్లు సాక్షి దినపత్రికలో ఈ నెల 11వ తేదీ కథనం ప్రచురితమైనప్పటికీ పోలీసులు, అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుని అండతో ఆ పార్టీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద బరిలో ఒక్కో పందెం లక్ష రూపాయల వరకు నడవగా, చిన్న బరిలో 50 వేల రూపాయల వరకు నడిచినట్లు సమాచారం.

    కొత్తపట్నం మండలంలో

    కోడి పందెం కూత...

    కొత్తపట్నం: మండలంలో టీడీపీ నాయకులు బరుల చుట్టూ పసుపు జెండాలు ఏర్పాటు చేసి జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకుడి ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పోలీసులను సైతం లెక్క చేయకుండా కోడి పందేలు వేస్తున్నారు. లక్షల రూపాయల్లో నగదు చేతులు మారుతుండగా, పోలీసులకు సమాచారం తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జూదరులు కోళ్లతో చేరుకోవడంతో బరులు కిక్కిరిసిపోయాయి. అక్కడే మద్యం, మాంసం వంటివి కూడా ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా టీడీపీ నాయకులు కోడి పందేలు నిర్వహిస్తుండటంతో పాలకులు, పోలీసుల తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

    కనిగిరి నియోజకవర్గంలో భారీగా

    కోడి పందేలు...

    కనిగిరి రూరల్‌/హనుమంతునిపాడు/పీసీ పల్లి: సంక్రాంతి సంబరాల మాటున కనిగిరి నియోజకవర్గంలో జోరుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో కనిగిరి, పీసీ పల్లి, హెచ్‌ఎం పాడు, వెలిగండ్ల, పామూరు, సీఎస్‌ పురం మండలాల్లో బుధవారం విచ్చలవిడిగా కోడి పందేలు జరిగాయి. కనిగిరి మండలంలోని శివారు ప్రాంతమైన బల్లిపల్లి పంచాయతీ పాలకొండ వద్ద అధికార పార్టీకి చెందిన రూరల్‌ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు. సంక్రాంతి, కనుమ రెండ్రోజులు కూడా భారీగా నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటగాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించి మరీ పందేలు వేస్తున్నారు. వేములపాడు గ్రామ సమీపాన పొలాల్లో కోడి పందేలు భారీగా సాగాయి. వేములపాడు కేంద్రంగా ఘాట్‌ రోడ్డు సమీపాన పొలాల్లో కోడి పందేల బరులు ఏర్పాటు చేసి పందేలు జరిపారు. అక్కడికి కంభం, బేస్తవారిపేట, కొనకనమిట్ల, కనిగిరి హనుమంతునిపాడు, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు మండలాల నుంచి కోడి పందెం ఆటగాళ్లు వచ్చి పాల్గొన్నట్లు సమాచారం. సుమారు 400 నుంచి 500 కోళ్లు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. పై పందేలు కూడా భారీగా సాగినట్లు తెలిసింది. పీసీ పల్లి మండల పరిధిలోని పెదఎర్లపాడు, పీసీ పల్లి పంచాయతీ రామగోవిందాపురం, వేపగుంపల్లి, దేశిరెడ్డిపల్లి, కోదండరామపురం, గుంటుపల్లి, లక్ష్మక్కపల్లి, చౌటు గోగులపల్లి గ్రామాల్లోనూ అధికార పార్టీ అండదండలతో దర్జాగా ఆ పార్టీ నాయకులు టెంట్లు, కుర్చీలు వేసి మరీ కోడి పందేలు ఆడించారు.

    జిల్లాలో బరుల చుట్టూ టీడీపీ జెండాలు ఏర్పాటు చేసి మరీ విచ్చలవిడిగా

    కోడి పందేలు

    దర్శి, కొండపి, కందుకూరు, కనిగిరి

    ఒంగోలు, సంతనూతలపాడు

    నియోజకవర్గాల్లో యథేచ్ఛగా నిర్వహణ

    ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయకుల అండదండలతో చెలరేగిపోయిన వైనం

    జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల్లో పందేలు

    అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ముడుపులకు తలొగ్గిన పోలీసులు

    పైకి మాత్రం చట్టప్రకారం చర్యలు

    తీసుకుంటామంటూ డ్రామాలు

  • భోగి
    మద్దిపాడులో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలులో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో దహనం

    మద్దిపాడు:

    ంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత ప్రతులను వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటల్లో దహనం చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించి పేదలకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. మద్దిపాడు మండలంలోని వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఆయా ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వారి స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలోని మెడికల్‌ కళాశాలలను పీపీపీ విధానం పేరుతో కార్పొరేట్‌ వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం దారుణన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసూ విధానాలు లేవన్నారు. పీపీపీ విధానంతో పేద ప్రజలకు వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్యను చంద్రబాబు దూరం చేస్తున్నారని మేరుగు నాగార్జున విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, ఎన్‌జీ పాడు మండల అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, నాయకులు కె.వెంకటేష్‌, ఎన్‌.మహేష్‌, పి.వెంకటరావు, పి.యశ్వంత్‌, తదితరులు పాల్గొన్నారు.

    చంద్రబాబు ప్రభుత్వ మోసాలు,

    అరాచకాలు భోగి మంటల్లో తగలబడాలి...

    ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు, మోసాలు, వారి ఆలోచనలు భోగి మంటల్లో తగలబడాలని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం వేసిన భోగి మంటల్లో పీపీపీ విధానం పేరుతో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోను దహనం చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలకు తెచ్చిన పీపీపీ విధానం చీకటి జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దహనం చేశామని తెలిపారు. కూటమి పాలకులు ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ఆ దేవుడు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, స్డూడెంట్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, ఒంగోలు నియోజకవర్గ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, ఒంగోలు సిటీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ కాకుటూరి సంపత్‌కుమార్‌, నాయకులు మలిశెట్టి దేవా, వైవీ గౌతమ్‌అశోక్‌, పిగిలి శ్రీనివాసరావు, పార్టీ కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, నాయకులు మట్టే రాఘవరావు, 15వ డివిజన్‌ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకులు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.

  • రెడ్‌బుక్‌ పాలనతో జీవితాలు చిన్నాభిన్నం

    యర్రగొండపాలెం: రాష్ట్రంలో రెడ్‌బుక్‌ వెర్రి పాలనతో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణంగా పంట చేతికొచ్చి అమ్ముకుని సంక్రాంతి పండుగను రైతులంతా వైభవంగా జరుపుకుంటారన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని, పండుగకు అన్నదాతలంతా దూరమయ్యారని ఆవేదన చెందారు. అందుకు ప్రధాన కారణం ఎర్రబుక్కు అనే వెర్రి పాలన అని అన్నారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం వై.పాలెంలో భోగి మంటలను ఎమ్మెల్యే వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతిలో భాగంగా భోగి పండుగకు చెడు కార్యక్రమాలను తగలబెట్టి మంచి కార్యక్రమాలకు నాంది పలకాలన్న ఉద్దేశంతో తమ ఇళ్లలోని పనికిరాని చెత్తను తీసుకొచ్చి తగులబెడతామని, ఆ విధంగానే రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను కూడా తగలబెట్టుకోవాలని, అందుకే ఎర్రబుక్కును మంటల్లో వేసి తగలపెట్టామని అన్నారు. సంక్రాంతి అంటే ఎడ్ల పోటీలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అనేక మంది కోడి పందేలు వేస్తుంటారని, వాటి కాళ్లకు కత్తులు కట్టి బరిలో దింపుతారని, అవి కత్తుల దెబ్బకు బరిలోనే విలవిల్లాడి కళ్ల ఎదుటే ప్రాణాలు వదలుతాయని, టీడీపీ నాయకులు కూడా అలాంటి నరమేధానికి పాల్పడుతున్నారని అన్నారు. బరిలో కోళ్లు ఏ విధంగా కొట్టుకునిచస్తున్నాయే రాష్ట్రం నలుమూలలా రాజకీయం అనే బరిలో అనేక మంది రక్తం చిందిస్తున్నారని అన్నారు. చిన్న పిల్లలు మానభంగానికి గురవుతున్నారని, అనేకమంది హత్యలకు గురవుతున్నారని, మానసిక వేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నారని, ఇప్పటికై నా కూటమి నాయకులు కళ్లుతెరిచి సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే తాటిపర్తి హితవుపలికారు. లేకుంటే ప్రజలంతా చంద్రబాబు ప్రభుత్వాన్ని భోగి మంటల్లో కాల్చివేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ ఏకుల ముసలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్‌ జబీవుల్లా, టి.సత్యనారాయణరెడ్డి, బిజ్జం రమణారెడ్డి, ఆవుల రమణారెడ్డి, ఆర్‌.అరుణాబాయి, పల్లె సరళ, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌ కుమార్‌, గోళ్ల కృష్ణారావు పాల్గొన్నారు.

    భోగి మంటల్లో రెడ్‌బుక్‌ దహనం చేసిన వై.పాలెం ఎమ్మెల్యే

    తాటిపర్తి చంద్రశేఖర్‌

  • ఆసక్త

    కొత్తపట్నం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామం పెద్దపట్టపుపాలెంలో బుధవారం నిర్వహించిన పడవల పోటీలు ఆసక్తికరంగా నిలిచాయి. ప్రకాశం జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పడవల పోటీలతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సముద్రంలో తెడ్ల సహాయంతో నడిచే పడవలతో నిర్వహించిన పోటీల్లో ఒక్కో పడవలో ఇద్దరు చొప్పున పాల్గొన్నారు. తెడ్ల సహాయంతో పడవను వేగంగా నడిపి పోటీపడ్డారు. అలలు కొంచెం ఇబ్బందిపెట్టినప్పటికీ ఎటువంటి అవాంతరాలు లేకుండా పోటీలు సాగాయి. ఒంగోలుకు చెందిన శ్రీరామ్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ డాక్టర్‌ వంశీకృష్ణ, శ్రీనిధి ఫిషరీస్‌ ప్రతినిధి వాయల విజయరత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రథమ స్థానంలో వజ్జిరెడ్డిపాలేనికి చెందిన బ్రహ్మయ్య, శ్రీను నిలిచి రూ.15 వేలు బహుమతి అందుకున్నారు. ద్వితీయ స్థానంలో అదే గ్రామానికి చెందిన శోభన్‌బాబు, రాము రూ.10 వేలు గెలుచుకున్నారు. మూడో బహుమతిగా హరిబాబు, సున్నపు కొండలరావు రూ.5 వేలు, నాలుగో బహుమతిగా చిన్నంగారిపాలేనికి చెందిన ఏడుకొండలు, తాతారావు రూ.3 వేలు గెలుపొందారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు. వర్మ గ్రాండ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ రంగారావు, ఎంఎస్‌ఎస్‌ రాష్ట్ర సెక్రటరీ సున్నపు తిరుపతిరావు, రాష్ట్ర కార్యదర్శి రేవు చలపతివర్మ, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పొన్నపూడి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొక్కిలగడ్డ శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడు కొండూరు శ్రీనివాసులు, జిల్లా విద్యా కమిటీ అధ్యక్షుడు అక్కంగారి లక్ష్మణ్‌, పామంచి రమేష్‌, గ్రామ కాపులు, ప్రజలు పాల్గొన్నారు.

Orissa

  • నమ్మినందుకు మళ్లీ నగుబాటు!

    పోలాకి:

    పోలాకి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాం గ్రామం. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారంతా పెద్దపండగ సంక్రాంతికి సొంతూరు రావటంతో గ్రామంలో చిన్న సందడి.. గ్రామంలోని కణితోళ్ల ఇంటి వద్ద ఉన్న రచ్చబండపై కూర్చున్నారు గ్రామానికి చెందిన రైతు చింతాడ నూకయ్య, రైతు కూలీ సంపతిరావు వేణు. వీరిద్దరూ వ్యవసాయం గురించి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన ఎల్‌ఐసీ ఏజెంట్‌ కణితి కృష్ణ పలకరించాడు. డబ్బుల కోసం అడగ్గా.. ఇంకా ధాన్యం డబ్బులు అందలేదు పండగ వెళ్లాక కిస్తీ కడతాను అన్నాడు నూకయ్య.

    కృష్ణ: అదేంట్రా తమ్ముడు.. లేటైతే ఫినాల్టీ కట్టాలి. ఇంటిదగ్గర డబ్బులుంటే చూసి కట్టేయకూడదు.

    నూకయ్య: ఇంకెక్కడ డబ్బులురా అన్నా.. ఖర్చులు పెరిగిపోయాయి. పంటకు ధరలేదు, ఎరువులు దొరకటం లేదు. మిల్లులు చుట్టూ తిరగలేక, సచివాలయం దగ్గర నిలబడ లేక ధాన్యం దళారీలకి ఇచ్చాను. ఇంకా డబ్బులు అందలేదు. ఈలోగా పండగ వచ్చేసింది. చుట్టాలు, బంధువులు, పిల్లలు వస్తారు కదా..

    (ఇంతలోనే అటుగా వచ్చిన యువకులను చూసి వీరు ముగ్గురూ ఆప్యాయంగా పిలిచారు. నాయనా బాగున్నార్రా అందరూ.. పండక్కి వచ్చారా..? మీరుంటే ఊరు కళకళలాడుతాదిరా అన్నారు. వెంటనే వారి దగ్గరకు వచ్చిన కుర్రాళ్లు కణితి సంతోష్‌, కిల్లి లచ్చుమునాయడు(హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు), సంపతిరావు గోవిందరాజు (టెక్నికల్‌ మెంబర్‌, జిందాల్‌ స్టీల్స్‌, ఛత్తీస్‌గఢ్‌), కిల్లి తిరుపతి(వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయ్‌) ఏంటి దద్దా డిమ్ముగా వున్నారు అనడిగారు.

    నూకయ్య: ముసిలోళ్లం.. డిమ్ముగా కాకపోతే మీలా ఉండగలమా..?

    లచ్చుమునాయుడు: మీ పనే బాగుంది పింఛన్‌ అందుతుంది కదా?

    నూకయ్య: ఏం పింఛన్‌రా.. నిలువునా మునిగిపోయాం. యాభై సంవత్సరాలకు పింఛన్‌ ఇస్తానన్నారు. నాకు అరవయ్యొక్కటి..ఇదిగో వేణుకి యాభైనాలుగు వచ్చినాయి. మా ఇద్దరికే కాదు మా వయసున్నోళ్లు చాలామంది ఉన్నా

    ఊళ్ల నుంచి జనాలైతే వచ్చారు. కానీ ఏం కొందామన్నా డబ్బుల్లేవు. ధాన్యం ధర గిట్టుబాటు కాలేదు. తీసుకున్న ధాన్యానికి ఇచ్చే కొద్దిపాటి సొమ్మైనా ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదు. 50 ఏళ్లు దాటితే పింఛన్‌ ఇత్తామన్నారు. ఆ ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా విగ్రహాలకు, ఆడంబరాలకు వందల కోట్లు తగలేస్తున్నారు. ఈ ప్రభుత్వం సంగతి తెలిసినా మళ్లీ ఓట్లేసి గెలిపించి మోసపోనాం.. ఇంకేం పండుగ చేసుకుంటాం.

  • పారిశ

    శ్రీకాకుళం అర్బన్‌: సంక్రాంతి సండగ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనిచేసే 14 మంది పారిశుద్ధ్య కార్మికులకు జీఎన్‌ జ్యుయలరీస్‌ సౌజన్యంతో నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ హనుమంతు అమరసింహుడు కార్మికులకు వస్త్రాలు వితరణ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎస్‌ఎం ఎంపీ రావు, ప్రసాద్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

    రణస్థలం: కొండములగాంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ రెడ్డి వాసు 5100 పిడకలతో భారీ భోగి పిడకల దండ తయారు చేయించారు. 20 మంది చిన్నారులతో ఊరేగింపుగా దండను తీసుకొచ్చి భోగి మంట వద్ద సందడి చేశారు.

    గడ్డికుప్పలు దగ్ధం

    టెక్కలి రూరల్‌: పరశురాంపురంలో బుధవా రం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్‌ కోరాడ కామేష్‌తో పాటు మరికొందరు సుమారు 5ఎకరాల గడ్డిని కుప్పలుగా పెట్టి ఉంచారు. బుధవారం మధ్యాహ్నం సమీప పొలంలోని వరి దుబ్బులు కాల్చేందు కు పెట్టిన మంట చెలరేగి పక్కనే ఉన్న గడ్డికుప్పలపై పడటంతో ఈ ప్రమాదం సంభవించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటల ను అదుపు చేశారు. అప్పటికే చాలావరకు కుప్పలు కాలిపోయాయి.

    నందిగాం: గొల్లూరు గ్రామంలో పింఛన్‌దారుల సొమ్ములో కొంత మొత్తాన్ని పంచాయతీ కార్యదర్శి తన వద్దే ఉంచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జనవరి నెలకు సంబంధించి గొల్లూరు పంచాయతీలో సుమారు 120 పింఛన్లకు గాను రూ.5,32,500ను గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శి హేమసుందర్‌కు అప్పగించారు. అందులో రూ.4,68,000 మేరకు పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. మరి కొంత మంది పింఛన్‌దారులు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించిన రూ.64,500ను కార్యదర్శి తన వద్దే దాచుకున్నాడు. 3వ తేదీతో పింఛన్‌ పంపిణీ ప్రక్రియ పూర్తయినప్పటికీ, మిగిలిన పింఛన్‌ డబ్బుల సంగతి మండల స్థాయి అధికారులకు తెలియజేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కుమార్‌ పట్నాయక్‌ వద్ద ప్రస్తావించగా.. గొల్లూరు కార్యదర్శి హేమసుందర్‌ పింఛన్‌ డబ్బులు ఉంచేశారనే విషయం తనకు తెలియదన్నారు.

    శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని తిలక్‌ నగర్‌లో ఉపాధి కొత్త చట్టం జీఓ కాపీలను భోగిమంటలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ల ఒత్తిడితోనే కొత్త చట్టం తెచ్చారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బి.కృష్ణమూర్తి, కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, పి.ప్రసాదరావు, కె.శ్రీనివాస్‌, ఎం.గోపి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

    నరసన్నపేట : కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎన్నికల హామీలు తుంగలోనికి తొక్కడం దారుణమని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోజ్జాడ యుగంధర్‌ అన్నా రు. ఈ మేరకు బుధవారం నరసన్నపేటలోని ఉమామహేశ్వరాలయం వద్ద భోగి మంటల్లో మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు రూ.20 లక్షలు, నిరుద్యోగ భతి నెలకు రూ. 3000 ఇస్తామని ఇంతవరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు.

  • సర్వం
    సంగమేశ్వర జాతరకు..

    సర్వమత సమ్మేళనం ఇక్కడి ప్రత్యేకత

    నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు

    ఆమదాలవలస రూరల్‌: గాజులు కొల్లివలస సంగమేశ్వర జాతరకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 12వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మితమైందని పురావస్తుశాఖ కూడా గుర్తించటంతో రాష్టంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమదాలవలస పట్టణ సమీపంలోనే ఈ ఆలయం ఉంది.

    ఎన్నో ప్రత్యేకతలు..

    చరిత్రాత్మక నిలయంగా చెప్పుకుంటున్న సంగమేశ్వర ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. కొండపై రాతితో చెక్కిన శివ లింగంతో పాటు శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

    మూడు మతాల సమ్మేళనం

    ఆమదాలవలస సంగమేశ్వర ఆలయం సర్వమత

    సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి కొండపై బౌద్ధ, జైన, శైవ అనే మూడు మతాలు ఒక్కో చోట చేరటం ఇక్కడి ప్రత్యేకత. మూడు మతాలు ఇక్కడ ఉండటం వల్ల సంగమేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారని ప్రతీతి. మత సంగమం సాధారణంగా నదీ సంగమంలో ఉంటాయని చరిత్ర చెబుతోంది. అయితే ఇక్కడ ఎటువంటి నదులు లేనప్పటికీ కొండపై మూడు మతాలు సమ్మేళనంగా ఉండటం విశేషం. శివుడితో పాటు బుద్ధుడు, జైన తీర్ధంకుల విగ్రహాలను భక్తులు దర్శించుకుంటారు.

  • ఘనంగా ఆదిత్యుని కల్యాణం

    అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం ఉదయం అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి ప్రక్రియ పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించి భక్తదంపతులకు తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌, వేదపండితులు పాల్గొన్నారు.

    నేడు ఆదిత్యుని క్షీరాభిషేకం

    మకర సంక్రాంతి సందర్భంగా సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేక సేవ జరగనుందని ఈవో ప్రసాద్‌ తెలిపారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి అభిషేక సేవ జరుగుతుందని, నిజరూపదర్శనం కూడా ఉంటుందని, రూ.500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తదంపతులకు మాత్రమే ఈ సేవలో పాల్గొనే అవకాశముందని చెప్పారు.

    ఆదిత్యుని సన్నిధిలో భక్తుల రద్దీ

    అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం భోగి సందర్భంగా ఆదిత్యుని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేసి ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. విశాఖకు చెందిన న్యూరోసర్జన్‌ డాక్టర్‌ వై.ప్రభాకరరావు కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం సూర్యనమస్కారాల పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే రథసప్తమి మహోత్సవాల సందర్భంగా ఆలయ మండపాల్లో వివిధ రకాల పనులు జరుగుతున్న క్రమంలో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌ తగు జాగ్రత్తలతో కూడిన చర్యలు చేపట్టారు.

  • శబర శ

    జయపురం: జయపురానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు, ఆదివాసీ జీవనం, సంస్కృతి, సంప్రదాయాల పరిశోధకుడు, అవిభక్త కొరాపుట్‌ చరిత్ర పలు పుస్తకాలు రచించిన డాక్టర్‌ పరేష్‌ రథ్‌ కొరాపుట్‌ శబరి శ్రీక్షేత్రపై రచించిన శబరి శ్రీక్షేత్ర, కొరాపుట్‌ పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు.శబర శ్రీక్షేత్ర విద్యాపీఠం, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాయం, పూరీ పండితులు సంయుక్తంగా కొరాపుట్‌ ఆదివాసీ సంగ్రాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి శబరశ్రీక్షేత్ర దివ్య పీఠ అధ్యక్షులు, జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహిణీపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు రోజులు జరిగిన శ్రీజగన్నాథ సంస్కృతి, ఆదివాసీ సంస్కృతిలపై జరిగిన చర్చావేదికపై ‘శబర శ్రీక్షేత్ర కొరాపుట్‌ ’పుస్తకాన్ని జయపురం ఎమ్మెల్యే బాహిణీపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచయిత డాక్టర్‌ పరేష్‌ రథ్‌ 2016లో శబరి శ్రీక్షేత్రం కొరాపుట్‌పై ఒడియాలో రచించారన్నారు. రాష్ట్ర వాసులే కాకుండా దేశ, విదేశీయులు కొరాపుట్‌ శబరి శ్రీక్షేత్రం ప్రాధాన్యత తెలుసు కొనేందుకు వీలుగా ఆంగ్లంలో రచించటం ప్రశంసనీయమన్నారు. డాక్టర్‌ రథ్‌ అవిభక్త కొరాపుట్‌ ఆదివాసీ సంస్కృతిపై పలు పండుగలపై అనేక రచనలు చేశారని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పరేష్‌ రథ్‌ను ఎమ్మెల్యే బాహిణి పతి ఘనంగా సన్మానించారు.

Nizamabad

  • మద్యం

    మాచారెడ్డి: మద్యం మత్తులో ఓ యువకుడు దుస్తుల దుకాణంలో వీరంగం సృష్టించిన ఘటన మండలంలోని గజ్యానాయక్‌ తండాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రునాయక్‌ తండాకు చెందిన మధు బుధవారం గజ్యనాయక్‌ తండా చౌరస్తాలో ఉన్న బట్టల దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన దుస్తులకు భారీ డిస్కౌంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీనికి షాపులో పనిచేస్తున్న గుమాస్తా కుదరదని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇరువురి మధ్య మాటామాట పెరుగడంతో మీ అంతు చూస్తానని బెదిరించి, తన సొంత లారీతో బట్టల దుకాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మధును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు.

    ఐదు ఇళ్లలో చోరీ

    పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించి ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వెంకట్రావ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందరెడ్డి కాలనీలోని అల్లాపూర్‌ గ్రామానికి చెందిన కాసాల జనార్దన్‌ రెడ్డి ఇంట్లో కొంత నగదు, ఒక బంగారు చైన్‌, వెండి పూజ సామగ్రి అపహరణకు గురైందని, మిగతా ఇళ్లలో వస్తువులు చోరీకి గురికాలేదని తెలిపారు. బుధవారం చోరీ జరిగిన ప్రదేశాలను బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రల నమూనాలను సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ తిరుపయ్య మాట్లాడుతూ పండుగకు వేరే ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ, ఎవరూ సమాచారం ఇవ్వలేదని, సమాచారం ఇస్తే ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచేవారమని పేర్కొన్నారు.

    పేకాడుతున్న ఏడుగురి అరెస్టు

    రుద్రూర్‌: కోటగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోతంగల్‌ మండలం కల్లూర్‌ గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సునీల్‌ తెలిపారు. వారి నుంచి రూ.7,920 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    మొరం టిప్పర్ల పట్టివేత

    బాన్సువాడ : అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు. సింగీతం శివారు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న నాలుగు టిప్పర్లను ప ట్టుకుని సీజ్‌ చేశామని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నార. అను మతి లేకుండా మొరం తలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    చోరీ కేసులో నిందితురాలి అరెస్ట్‌

    నిజాంసాగర్‌ (జుక్కల్‌): మండలంలోని మల్లూరు గ్రామంలో ఈ నెల 9న జరిగిన చోరీ కేసులో నిందితురాలు సాయవ్వను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. మల్లూరు గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి విజయరావు ఇంట్లో బీరువా నుంచి వెండి ఆభరణాలతోపాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. కేసు నమోదు చేసుకొని సాయవ్వపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

  • బీరులో మత్తు కలిపి..మాయం చేశారు

    బంగారం, నగదు చోరీ

    నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

    నిజామాబాద్‌ అర్బన్‌: మత్తు పదార్థాలు ఇచ్చి చోరీకి పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నాలుగో టౌన్‌ ఎస్‌హెచ్‌వో సతీశ్‌ తెలిపారు. గత డిసెంబర్‌ 17న వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తి తాగుతున్న బీరులో మత్తు గో లీలు కలిపి అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్‌ చైన్‌, కొంత నగదు దొంగిలించుకుపోయారు. ఈ మేరకు నాలుగో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా నిందితులైన భారత ప్రసాదం, నర్సింగ్‌రావు, రుద్ర యాదవ్‌లను పోలీసులు పట్టుకొని విచారించారు. వీరు దొంగిలించిన సొమ్మును హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గుప్త అనే వ్యాపారి వద్ద తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ కలిసి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. బియ్యం వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి మాట్లాడదామని బీర్లలో మత్తు పదార్థాలు కలిపి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. సమావేశంలో ఎస్సై సందీప్‌, ఉదయ్‌ కుమార్‌, ఏఎస్‌ఐ రవీందర్‌, కానిస్టేబుల్‌ శేఖర్‌, రమేశ్‌, నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • వరద క

    మోర్తాడ్‌(బాల్కొండ): వరద కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీరందించేందుకు ప్రభు త్వం చొరవ చూపింది. రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నీటిని వరద కాలువలో నింపడంతో యాసంగి పంటలకు నీటి కొరత తీరనుంది. వరద కాలువ ద్వారా నీటి విడుదల లేకపోయినప్పటికీ నీటిని నిలువ ఉంచడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందడం, కాలువను ఆనుకుని ఉన్న భూములకు సాగునీటి సౌకర్యం లభించేది. వర్షాకాలంలో గాండ్లపేట్‌ వద్ద వరద కాలువకు గండిపడటంతో నీరు లీకై కాలువ ఖాళీ అయ్యింది. వర్షాకాలం పంటలకు ఎలాంటి సమస్య లేకపోయినా యాసంగి పంటలకు మాత్రం వరద కాలువలో నీరు నిలువ లే కపోతే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన చెందారు. మోర్తాడ్‌, తిమ్మాపూర్‌, పాలెం, గాండ్లపేట్‌, కమ్మర్‌పల్లి, ఉప్లూర్‌, నాగాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు సుమారు 2,600 ఎకరాలు వరద కాలువపైనే ఆధారపడి ఉన్నాయి. గండికి మరమ్మతులు పూర్తి చేసేందుకు మరింత సమయం ఉండటంతో గండి ఏర్పడిన ప్రాంతానికి దూరంలో నీటిని నిలువ ఉంచితే తమకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావించారు. ఈ మేర కు ఏడు గ్రామాల రైతులు ఇటీవల బాల్కొండ ని యోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడా రు. నీటి విడుదలకు ఆమోదం తెలుపడంతో రైతులకు నీటి చింత తీరింది. ఈనెల 8వ తేదీన నీటిని రివర్స్‌ పంప్‌ చేయగా మరుసటి రోజు వరకు వరద కాలువలో నీరు నిండింది. రెండు మీటర్ల లోతులో నీరు నిలువ ఉండటంతో యాసంగి పంటలకు ఎ లాంటి ఇబ్బంది ఉండదని రైతులు పేర్కొంటున్నా రు. కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్‌ నుంచి మోర్తా డ్‌ మండలం గాండ్లపేట్‌ వరకు నీరు నిల్వ ఉంది.

    రాంపూర్‌ పంప్‌హౌజ్‌ వద్ద సాంకేతిక సమస్య

    కాళేశ్వరం నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా మోర్తాడ్‌ వరకు పంపించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి, అధికార యంత్రాంగం అంగీకరించినా వరద కాలువ 70వ కిలోమీటర్‌ వద్ద ఉన్న రాంపూర్‌ పంప్‌హౌజ్‌లో సాంకేతిక సమస్య నెలకొంది. అక్కడి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి దొంగలు విద్యుత్‌ తీగలను ఎత్తుకెళ్లారు. దీంతో నీటి విడుదలకు ప్రభుత్వం అంగీకరించినా సాంకేతికంగా సాధ్యపడలేదు. ఎన్‌పీడీసీఎల్‌ ఉన్నతాధికారులతో మరోసారి సంప్రదింపులు జరపడంతో సబ్‌స్టేషన్‌ నుంచి పంప్‌హౌజ్‌కు విద్యుత్‌ సరఫరా ప్రారంభమైంది. దీంతో నీరు గాండ్లపేట్‌ వరకు చేరింది.

    ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

    వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని రైతులు కోరడం, ప్రభుత్వం స్పందించడంతో పెద్ద సమస్య తీరిపోయింది. గండిపడిన చోట మరమ్మతులకు కొంత సమయం ఉండటంతో కట్టలు కట్టిన వరకై నా నీటిని నిలువ ఉంచాలని కోరాం. ప్రభుత్వం స్పందించినందుకు రైతులు రుణపడి ఉంటారు.

    – రొక్కం మురళి, సీడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, తిమ్మాపూర్‌

    రివర్స్‌ పంపింగ్‌తో కాలువలోకి చేరిన కాళేశ్వరం నీరు

    గాండ్లపేట్‌ శివారులోని కాలువలో

    గండి వద్ద మట్టికట్ట ఏర్పాటు

    నీటిని నిలువ ఉంచి యాసంగి

    పంటలను గట్టెక్కించేందుకు చొరవ

  • భూపతి రెడ్డికి కార్పొరేషన్‌ పదవి ?

    పదవులు దక్కని సీనియర్ల

    ఎదురుచూపులు

    మున్సిపల్‌ ఎన్నికల తర్వాత నియామకాలు చేయనున్నట్లు చర్చ

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేయ లేదు. దీంతో సీనియర్‌ నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలకు సైతం కీలకమైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవు లు కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డికి కీలకమైన రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. కాగా ఇప్ప టి వరకు ప్రభుత్వ విప్‌ పదవిని ఆశిస్తూ వచ్చిన భూపతిరెడ్డికి తాజాగా కార్పొరేషన్‌ పదవి కేటాయించనున్నట్లు తెలియడంతో పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కీలక పదవి కేటాయించారు. భూపతిరెడ్డికి సైతం ప దవి దక్కితే పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    ● జుక్కల్‌ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడిన గడుగు గంగాధర్‌ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. తనకు వ్యవసాయ కమిషన్‌ సభ్యుడిగా పదవి ఇవ్వడంపై గడుగు అసంతృప్తిగా ఉన్నారు. 1983 నుంచి ఆయన పార్టీకి సేవలందిస్తున్నారు.

    ● ఎనిమిది నెలల కిందట రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పదవులు దక్కని సీనియర్ల వివరాలు సేకరించారు. నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు, డీసీసీ అధ్యక్ష పీఠం కోసం, బ్లాక్‌, మండల అధ్యక్ష పదవుల కోసం పోటీ పడుతున్న నాయకుల పేర్లను మీనాక్షి తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు గాను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కసరత్తు చేశారు. మీనాక్షి నటరాజన్‌ క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేసే లక్ష్యంతో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ తమకు నామినేటెడ్‌ పదవులు, పార్టీ పదవులు కేటాయించడంలో ఆలస్యం చేస్తుండడంపై పార్టీలో నిరాశ వ్యక్తమవుతోంది.

    కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోగా నామినేటెడ్‌, పార్టీ పదవుల కోసం సీనియర్‌ నాయకులు ఎదురు చూస్తున్నారు. తమకంటే జూనియర్లకు కీలకమైన పదవులు దక్కాయంటూ గుర్రుగా ఉన్నారు. మనస్తాపం చెందుతున్నారు. 1988 నుంచి పార్టీకి సేవలందిస్తున్న మార చంద్రమోహన్‌రెడ్డి తాజాగా డీసీసీ పీఠం ఆశించి విఫలమయ్యారు. చంద్రమోహన్‌రెడ్డి నామినేటెడ్‌ రేసులో ఉన్నారు. మరో సీనియర్‌ నాయకుడు బాడ్సి శేఖర్‌గౌడ్‌ రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి రేసులో ఉన్నారు. 1983 నుంచి శేఖర్‌గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీకి సేవలందిస్తున్నారు. శేఖర్‌గౌడ్‌కు రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి వచ్చినట్లేనని అంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు పెండింగ్‌ పడుతోంది. డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేసిన బాస వేణుగోపాల్‌ యాదవ్‌ సైతం కీలకమైన పదవిని ఆశిస్తున్నారు.

  • ‘సాగర

    ప్రధాన కాలువకు

    కొనసాగుతున్న నీటి విడుదల

    నిజాంసాగర్‌: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ఈనెల 10 నుంచి విడుదలవుతున్న నీరు బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టును చేరింది. ప్రాజెక్టులోకి 4,380 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఆయకట్టు అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 700 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402 అడుగుల (14.830 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

    కార్పొరేషన్‌లో

    అఖిలపక్ష సమావేశం

    ఓటరు జాబితాలో

    తప్పులున్నాయని అభ్యంతరాలు

    నిజామాబాద్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల కసరత్తులో భాగంగా నగరంలోని మున్సిప ల్‌ కార్యాలయంలో కమిషనర్‌ఽ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయ పార్టీ ల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓటరు జాబితాలో తప్పులున్నా యని తాము కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి సాధ్యమైనంత వరకు సరి చే స్తామని కమిషనర్‌ అన్నారని నాయకులు తె లిపారు. తాము పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఓటరు జాబితాను సరిచేయాలని కోరామన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల సంఖ్య దాదాపు 50 వరకు పెరిగిందని తెలిపారు.

    ఆరోగ్య ఉపకేంద్రం తనిఖీ

    వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం జాన్కంపేట్‌ ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరును పరిశీలించారు. ప్రతి బుధవారం జరిగే వ్యాధి నిరోధ టీకాల కార్యక్రమం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలిచ్చే తల్లులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణుల మొదటి కాన్పు సాధారణ డెలివరీ అయ్యేలా చూడాలని చెప్పారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆరోగ్య కార్యకర్త కమల, ఆశావర్కర్‌ కళావతి ఉన్నారు.  

  • బల్దియా పోరుకు మరో అడుగు

    సామాజికవర్గాల వారీగా రిజర్వ్‌ అయ్యే స్థానాల సంఖ్యపై స్పష్టత

    మోర్తాడ్‌(బాల్కొండ): మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందు పడింది. జిల్లాలో ని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపా టు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు రిజర్వ్‌ అవుతాయనేదానిపై స్పష్టత వచ్చింది. ఈ మేర కు బుధవారం రాత్రి ప్రభుత్వం రిజర్వేషన్‌లు ఖరారు చేసింది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్‌లు ఉండగా ఎస్టీ వర్గానికి ఒకే ఒక్క స్థానం.. 16 డివిజన్‌లు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. బోధన్‌ మున్సిపాలిటీలో 38 వార్డులు, ఆర్మూర్‌లో 36, భీమ్‌గల్‌లో 12 వార్డు స్థానాలున్నాయి.

  • దేశ సమైక్యత కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్విరామ కృషి

    సమాజ పరివర్తన కోసం పాటుపడాలి

    విభాగ్‌ కార్యవాహ రాజుల్వర్‌ దిగంబర్‌

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వందేళ్లలో అనేక సామాజిక కార్యక్రమా లు నిర్వహించడంతోపాటు దేశ సమైక్యత కోసం నిర్విరామంగా కృషి చేసిందని విభాగ్‌ కార్యవహ రాజుల్వర్‌ దింగబర్‌ పేర్కొన్నారు. బుధవారం ఇందూరు నగరంలోని శ్రీరామ్‌ ఉపనగరంలో సంఘ శతాబ్ది సంక్రాంతి ఉత్సవం జనార్దన్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ ఉత్సవంలో ప్రధాన వక్తగా హాజరైన రాజుల్వర్‌ దిగంబర్‌ మాట్లాడారు. శతాబ్ది వేడుకల ద్వారా సంక్రాంతి పండుగ సమరసత సందేశాన్ని ప్రతి హిందువు కుటుంబానికి అందజేయాలని కోరారు. హిందూ సమాజంలో అంటరానితనం లేదన్నారు. శ్రీరాముడు గుహుడితో స్నేహం చేయడం, శబరి ఇచ్చిన ఎంగిలి పళ్లను తినడం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం లాంటి అంశాలు సనాతన జీవన విధానంలోని సమరసతకు నిదర్శనాలన్నారు.

    ప్రతి పౌరుడు పంచ పరివర్తన ద్వారా సమాజ పరివర్తన కోసం పాటు పడాలన్నా రు. కార్యక్రమంలో నగర కార్యవహ అరుగుల సత్యం, సహ కార్యవహ సుమిత్‌, అనిల్‌, అభిరామ్‌, శ్రవణ్‌, మృత్యుంజయ, నరేశ్‌ తదితరులు పాల్గొ న్నారు.

  • చైనా మాంజా విక్రయించిన ముగ్గురిపై కేసు

    ఆర్మూర్‌టౌన్‌: నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకొని క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. పట్టణంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న నారాయణ, రవిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 18,500 విలువ గల చైనా మాంజాను స్వా ధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌లో హోల్‌సేల్‌గా అమ్ముతున్న జహీర్‌ఖాన్‌ను సైతం అదుపులో తీసుకొని ముగ్గురిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

    నిజామాబాద్‌లో ఒకరు...

    నిజామాబాద్‌ అర్బన్‌: చైనా మాంజా విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు రెండో టౌన్‌ ఎస్సై సయ్యద్‌ ముజాహిద్‌ తెలిపారు. నగరంలోని పోస్టు ఆఫీస్‌ వెనుక సుల్తాన్‌ కై ట్‌ షాపులో సయ్యద్‌ అస్లాం అనే వ్యక్తి 18 మాంజా చుట్లు విక్రయిస్తున్నారని తెలుసుకొని, అతనిని అరెస్టు చేశామన్నారు. సయ్యద్‌ అస్లాంతోపాటు దుకాణం యజమాని ఫహీం అన్సారీపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

SPSR Nellore

  • గృహ నిర్మాణాలకు మోక్షం
    పేదల గూడును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పొదలకూరు జగనన్న కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను తిరిగి నిర్మించేందుకు విజిలెన్స్‌, థర్డ్‌ పార్టీ నివేదికలు అందాయి. దాని ప్రకారం ఇళ్లను పూర్తి చేయాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

    పొదలకూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్ద ఊర్లనే నిర్మించి పేదలకు ఇళ్లు అందజేయాలని మూడు ఆప్షన్లను పెట్టి నిర్మాణం చేపట్టింది. జిల్లాలో కావలి తర్వాత పొదలకూరు ప్రభుత్వ లేఅవుట్‌ అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్ప వద్ద లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణం సొంతంగా నిర్మించుకోలేమని లబ్ధిదారులు సమ్మతిపత్రం అందజేశారు. గృహ నిర్మాణ శాఖ తొలివిడతగా 750 ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇక్కడ మొత్తం 1,400 ప్లాట్లు, ఒక్కొక్కరికి 9 అంకణాల వంతున అందజేయడం జరిగింది. లేఅవుట్లో కాంట్రాక్టర్లు 750 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 572 ఇళ్లకు శ్లాబులు, 268 ఇళ్లకు బేస్‌మట్టాలను పూర్తి చేశారు. పెద్ద లేఅవుట్‌ కావడంతోపాటు ప్లాట్ల నంబర్లు మారిపోవడంతో లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు సుమారు రూ.3 కోట్లు నిధులు కూడా మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. లేఅవుట్లో విద్యుత్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి నిర్మాణాలను చేపట్టారు.

    విచారణ చేసి..

    లేఅవుట్లో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాల్సిందిగా విజిలెన్స్‌కు అప్పగించింది. ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు లేఅవుట్‌కు వచ్చి విచారణ చేశారు. ప్లాట్ల నిర్మాణం, ఇళ్ల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, అర్హులైన వారికి ప్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై విచారణ నిర్వహించారు. దీంతో పేదల గూడుకు కష్టం వచ్చింది. విచారణ సాగదీత ధోరణలో ఉండటంతో నిర్మాణంలో మరింత జాప్యం జరిగింది. అయితే ఎట్టకేలకు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల ద్వారానే రిపేర్లతోపాటు, పూర్తి చేయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

    నాలుగు పద్ధతుల్లో..

    ఇప్పటి వరకు నిర్మించిన 572 ఇళ్లలో 385 ఇళ్లకు రిపేర్లు చేపడితే వినియోగానికి పనికొస్తాయని థర్డ్‌ పార్టీ నివేదిక సమర్పించింది. ఇందులో భాగంగా క్యూరింగ్‌, క్రాక్స్‌, సాయిల్‌ ఫిల్లింగ్‌, కాంక్రీట్‌ బెడ్‌ పద్ధతుల్లో రిపేర్లు చేయాల్సి ఉంటుంది. నిర్మించిన వాటిలో 187 ఇళ్లు బాగున్నాయని వాటికి ఎలాంటి రిపేర్లు అవసరం లేదని నివేదికలో చెప్పారు. ఇక్కడి ప్రభుత్వ లేఅవుట్లో ఏడు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు ముందుకొచ్చి ఇళ్లను నిర్మించడం జరిగింది. మండలంలోని నేదురుమల్లి, వెలికంటిపాళెం, మహ్మదాపురం గ్రామాల్లో లేఅవుట్లకు సంబంధించి థర్ట్‌ పార్టీ నివేదికలు అధికారులకు అందాల్సి ఉంది.

    ఇళ్లను నిర్మిస్తాం

    విజిలెన్స్‌, థర్డ్‌ పార్టీ నివేదికలు సమన్వయం చేసుకుని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. పొదలకూరు లేఅవుట్లో ఇళ్ల రిపేర్లతోపాటు, గతంలో నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టు కంపెనీల చేత పనులు పూర్తి చేయించడం జరుగుతుంది. కాంట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు, మిగిలిన ఇళ్లను నిర్మించేందుకు ముందుకొచ్చారు.

    – మహేష్‌, హౌసింగ్‌ ఏఈ,

    పొదలకూరు

    విచారణ పేరుతో ఆగిన

    పేదల ఇళ్ల నిర్మాణం

    కట్టిన వాటికి రిపేర్లు చేస్తే

    సరిపోతుందని నివేదిక

    187 ఇళ్లకు మరమ్మతులు

    అవసరం లేదు

    గతంలో నిర్మించినవి

    కాంట్రాక్టర్లే పూర్తి చేయాలి

    త్వరలో అతిపెద్ద లేఅవుట్లో

    పనుల ప్రారంభం

  • అగ్ని

    పేలిన గ్యాస్‌ సిలిండర్‌

    మంటల్లో ఎనిమిది ఇళ్లు

    వీధిన పడిన నిరుపేద కుటుంబాలు

    సైదాపురం: అక్కడ నిరుపేద కుటుంబాలు ఉంటున్నాయి. వారికి రోజూ కూలీ పనులకు వెళ్తేనే పూట గడుస్తుంది. భోగి పండగ సందడిలో ఉండగా అగ్నిప్రమాదం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన సైదాపురం మండలంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఊటుకూరు గ్రామ సమీపంలో మిక్స్‌డ్‌ కాలనీ ఉంది. అక్కడున్న వారంతా కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. కొందరు రేకులు, మరికొందరు పూరిళ్లలో నివాసముంటున్నారు. భోగి పండగను చేసుకుంటున్న సమయంలో ఆ కాలనీకి చెందిన నక్కా ఏడుకొండలు రేకుల ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలింది. మంటలు చెలరేగి చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయి. నక్కా నాగరాజు, నక్కా రమేష్‌, శైలజ, పొలుగోటి అంకయ్య, కె.వసంత, కుడుముల పోలయ్య, తిరిమలశెట్టి శీనయ్యకు చెందిన ఐదు రేకులు, మూడు పూరిళ్లకు మంటలు వ్యాపించాయి. కాలనీవాసులు ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. గూడూరు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఇన్‌చార్జి విజయకుమార్‌ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. రూ.లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెప్పారు. తహసీల్దార్‌ సుభద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులకు తక్షణ సహాయంగా 10 కేజీల బియ్యంతోపాటు, చాపలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వారిని ఆదుకుంటామని తెలిపారు.

  • మోటార

    మహిళ మృతి

    ఉదయగిరి: మండలంలోని దాసరిపల్లి వద్ద బుధవారం రాత్రి మోటార్‌బైక్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెంంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దాసరిపల్లికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి సయ్యద్‌ మహబూబ్‌బాషా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబాన్ని స్వగ్రామం దాసరిపల్లి నుంచి ఉదయగిరికి మార్చాడు. మహబూబ్‌బాషా బుధవారం డ్యూటీకి వెళ్లాడు. భార్య సాహెరా (43) కుమారుడు మజహర్‌తో కలిసి బైక్‌పై పుట్టిల్లు దాసరిపల్లికి వచ్చింది. అక్కడ కుటుంబ సభ్యులతో కొంతసేపు గడిపింది. అందరూ కలిసి భోజనం చేశా రు. అనంతరం తల్లీకుమారుడు ఉదయగిరికి బయలుదేరారు. జాతీయ రహదారిపైకి వచ్చిన వెంటనే ఉదయగిరి వైపు నుంచి దుత్తలూరుకు వెళ్తున్న కారు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సాహెరా అక్కడికక్కడే మృతిచెందింది. మజహర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారయ్యాడు. కారు వింజమూరు మండలం గుండెమడగలకు చెందిన వారిదిగా చెబుతున్నారు.

  • ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

    నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ , ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య డిమాండ్‌ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధీ పేరును తట్టుకోలేని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయన పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. దాని స్థానంలో వీబీ–జీ–రామ్‌జీ చట్టాన్ని తీసుకురావడం దారుణమన్నారు. జిల్లాలోని 200 గ్రామాల్లో ప్రజలు భోగి మంటల్లో కొత్త చట్టం ప్రతులను వేశారన్నారు. ఈ పథకం ద్వారా 200 రోజుల పనిరోజులు కల్పించాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. కొత్త చట్టం ద్వారా వచ్చే ఇబ్బందులపై ఈనెల 18వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ ఉపాధి’ క్యాంపెయిన్‌ చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. సమావేశంలో సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నాయకులు గోగుల శ్రీనివాసులు, దయాకర్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Narayanpet

  • సంక్ర

    రంగుల్లులతో శోభిల్లిన లోగిళ్లు

    ఇంటింటా కలకూరగాయ.. సద్ద, నువ్వుల రొట్టెలు

    నారాయణపేట: సరదాల సంక్రాంతి సంబరాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి పండగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటి ముంగిళ్లలో కల్లాపి చల్లి రంగవల్లులతో సుందరంగా అలంకరించారు. వాటిలో కొత్తగా పండించిన ధాన్యం, గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేశారు. భోగభాగ్యాలు కలగాలని భోగి మంటలు వేయగా.. యువత, చిన్నారులు సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. అక్కడక్కడా బొమ్మల కొలువులను ఏర్పాటుచేశారు. మహిళలు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు. ఇంటింటా సద్ద, నువ్వుల రొట్టెలు, కలకూరగాయలతో ప్రత్యేక వంటకాలను తయారుచేసి ఇంటిల్లిపాది ఆనందంగా ఆరగించారు. చిన్నారులు పతంగులను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఏ పల్లెలో చూసినా యువకుల ఆటపాటలు, బంధుమిత్రుల రాకలతో సందడిగా కనిపించాయి. ఇక గురువారం సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. మూడోరోజు శుక్రవారం కనుమ సందర్భంగా పశువులకు పూజలు చేసి.. విందు, వినోదాలతో సంబరాలు జరుపుకోనున్నారు. పండగ సందర్భంగా పలు గ్రామాల్లో యువతులు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

    వాయినం ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు

  • డూడూ.
    అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు

    గంగిరెద్దులతో సంక్రాంతికి కళ

    పండగకు ముందు నుంచే సందడి

    ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు

    జడ్చర్ల టౌన్‌: డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు.

    గంగిరెద్దు అలంకరణ

    ద్దుకు వారు చెప్పినట్లుగా ఆడేలా శిక్షణ ఇచ్చి అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకు ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతలు, పాత పట్టు చీరలను అలంకరిస్తారు. కొమ్ములను రింగులతో అందంగా తీర్చిదిద్ది వాటికి గొట్టాలను ధరింపజేసి రంగురంగుల ఊలు ధారాలను కడతారు. వీటిని కుప్పెలుగా పిలుచుకుంటారు. నొసటిభాగంలో తోలుతో అలంకరించి పైన గవ్వలు వేలాడదీస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిస్తుంటారు.

    సన్నాయి, బూర

    గంగిరెద్దును ఆడించే వారి వేషాధారణ సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి చేతిలో సన్నాయి, బూర, చిన్న గంట పట్టుకుంటారు. ఎవరైనా పాతకోటు ఇస్తే అది వేసుకుని తిరుగుతుంటారు. ఏకాలనీలోకి అడుగుపెట్టినా సరే సన్నాయి బూర శబ్దం వచ్చిందంటే గంగిరెద్దులోళ్లు వచ్చారని అట్టే అర్థం అవుతుంది.

    ఆదరణ తగ్గింది

    మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్‌లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది.

    – రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి

    ఎద్దులే సాకుతాయి..

    ద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట

  • అభివృద్ధి దిశగా పాలమూరు

    దేవరకద్ర/ భూత్పూర్‌: వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ ప్రాంత బిడ్డ, సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిగా నడిపిస్తున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రం పాలమూరు ప్రాజెక్టు పనులు 10 శాతమే మిగిలి ఉన్నాయని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి చేయడం లేదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం దేవరకద్ర, భూత్పూర్‌ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాను దత్తత తీసుకుని వివక్ష చూపించారని విమర్శించారు. దేవరకద్ర నియోజవవర్గ అభివృద్ధి కోసం ఇక్కడి ఎమ్మెల్యే కురుమూర్తి ఘాట్‌ రోడ్డుకు రూ.110 కోట్లు మంజూరు చేయించుకున్నారని, అలాగే కోయిల్‌సాగర్‌ రోడ్డుకు, డ్యాం డెవలప్‌మెంట్‌ పనులకు నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సర్పంచ్‌ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్‌, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలే నాయకులుగా పనిచేసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ విజయేందిర, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ స్వర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

    ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు

    మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి

    రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • ‘పుర’

    నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కోస్గి, మద్దూరు, మక్తల్‌, నారాయణపేట మున్సిపాలిటీల్లో 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ స్థానాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏ వార్డుకు ఏ రిజర్వేషన్‌ కేటాయిస్తారనేది స్పష్టత రానుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ స్థానాల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అయితే మూడు మున్సిపాలిటీల్లో ఒక్కొక్క స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. మద్దూర్‌ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్‌, ఎస్టీ మహిళకు రెండు వార్డులను రిజర్వు చేశారు. నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను ఎస్టీ జనరల్‌ 4, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్‌ 6, ఎస్సీ మహిళకు 4, బీసీ జనరల్‌కు 12, బీసీ మహిళకు 9, జనరల్‌కు 14, జనరల్‌ మహిళకు 22 స్థానాలు కేటాయించారు. 72 స్థానాల్లో మహిళలకు 36 స్థానాలు దక్కనున్నాయి. అత్యధికంగా జనరల్‌ మహిళ స్థానాల్లోనే 22 మందికి అవకాశం కల్పించనున్నారు.

  • వైభవంగా క్షీరలింగేశ్వరుడి రథోత్సవం

    క్షీరలింగేశ్వరస్వామి

    రథోత్సవంలో

    పాల్గొన్న భక్తజనం

    కృష్ణా: మండల కేంద్రంలో బుధవారం శ్రీక్షీరలింగేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ కు క్షీరాభిషేకం, మహా మంగళహారతి, బిల్వార్చన నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆల యం నుంచి ఆలయ ధర్మకర్త ఎంకణ్ణగౌడ్‌ మంగళవాయిద్యాల మధ్య కలశంతో ఊరేగింపుగా రథం వద్ద చేరుకొని ప్రత్యేక పూజలు చేసి.. ఉత్సవమూర్తిని రథపై కొలువుదీర్చగా.. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ని ర్వహించారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి బంతనల్‌ శ్రీవృశభలింగేశ్వర మహాస్వామి, నేరడగం పీఠాధిపతి శ్రీసిద్దలింగ మహాస్వామి, శ్రీక్షీరాలింగ మహాస్వామి పాల్గొన్నారు.

Nalgonda

  • వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

    తిరుమలగిరి(సాగర్‌) : తిరుమలగిరి మండల పరిధిలోని జువ్విచెట్టుతండా గ్రామ పంచాయతీకి చెందిన సపావత్‌ శ్రీను(36) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ వీరశేఖర్‌ బుధవారం తెలిపారు. శ్రీను ఈ నెల 13వ తేదీన ఉదయం వేళ గ్రామ శివారులోని పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. బుధవారం శ్రీను తండ్రి సీర ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శ్రీను గురించిన ఆచూకీ తెలిసిన వారు 87126 70199 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.