Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో మీజిల్స్(తట్టు) వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. గత నాలుగు రోజుల్లోనే 88 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 646కు చేరింది. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా క్లెమ్సన్,ఆండర్సన్ విశ్వవిద్యాలయాలకు కూడా ఈ వైరస్ పాకింది.

    ఈ యూనివర్సిటీల్లో చాలా మంది విద్యార్థులు ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా ఈ వ్యాధి తీవ్రత వాయువ్య ప్రాంతంలోని ఎక్కువగా స్పార్టన్‌బర్గ్ (Spartanburg) పట్టణంలో ఎక్కువగా ఉంది. వ్యాధి సోకిన వారిలో ఎక్కువమంది టీకా తీసుకోని వారే కావడం గమనార్హం. ఈ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరస్ వల్ల నిమోనియా, మెదడు వాపు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

    ప్రమాదంలో అమెరికా హోదా..
    కాగా 2000 సంవత్సరంలో అమెరికా మీజిల్స్ రహిత దేశంగా ప్రకటించబడింది. అయితే ఇప్పుడు కేసులు అధికంగా పెరుగుతుండడంతో అమెరికా తన "మీజిల్స్ రహిత" హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే యూటా, అరిజోనా, ఉత్తర కరోలినా వంటి రాష్ట్రాల్లో కూడా మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.

  • 2025  సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల అరెస్టులపై కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ (CPJ) నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2025 డిసెంబర్‌లో అరెస్టైన జర్నలిస్టుల సంఖ్య 300కు పైగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలో అత్యధికంగా చైనా 50 మంది పాత్రికేయులను బంధించినట్లు తెలిపింది.

    ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయుల అక్రమ నిర్భందాలు ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు అద్ధం పడుతున్నాయి. 300సంఖ్య దాటి అరెస్టులు జరగడం ఇది వరుసగా ఐదవ సారని CPJ నివేదిక పేర్కొంది. పాత్రికేయుల అరెస్టులలో చైనా అధికంగా 50, మయన్మార్ 30, ఇజ్రాయెల్ 29 అరెస్టులు  ఉన్నట్లు తెలిపింది. రష్యా 27, బెలారస్ 25, అజర్‌బైజాన్ 24 తరువాతి స్థానాలలో ఉన్నట్లు పేర్కొంది.

    ఇప్పటి వరకూ జర్నలిస్టులు అధికంగా 1992 సంవత్సరంలో 384 మంది అరెస్టు కాగా ప్రస్తుతం 2025 మూడవ అత్యధిక అరెస్టులు జరిగిన సంవత్సరమని CPJ తెలిపింది. అయితే అరైస్టైన జర్నలిస్టులలో దాదాపు సగంమందికి పైగా ఎటువంటి నేరం చేయకుండానే అక్రమంగా నిర్భందించినట్లు న్యూయార్క్‌కు చెందిన ఒక ఎన్జీవో సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. 

    అంతేకాకుండా జైలులో 20 శాతం తీవ్రమైన హింసను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. జర్నలిస్టులను హింసించే దేశాలలో ఇరాన్, ఇజ్రాయెల్, ఈజిప్టు ముందు వరుసలో ఉంటాయని కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్ నివేదిక తెలిపింది.

  • బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో అక్కడి రాడికల్ నేత ఉస్మాన్‌ హాదీ మృతితో  నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి.  ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలోని  భారత  అధికారులు, వారి కుటుంబాలు వెంటనే అక్కడినుంచి దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది.

    ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో హిందు దేవాలయాలు, వ్యక్తులే టార్గెట్‌గా ఇంతకాలం దాడులు జరిగాయి. అవి కొద్ది మేర సద్దుమణుగుతాయనే సమయంలోనే అక్కిడ రాడికల్ నేత ఉస్మాన్‌ హాదీని దుండగులు హతమార్చడంతో అక్కడి మతఛాందస వాదులు విరుచుకపడుతున్నారు. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిపి వారిని హతమారుస్తున్నారు. ఇటీవల బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ ప్రస్థావన వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. భారత అధికారులు వారి కుటుంబసభ్యులు వెంటనే మాతృ దేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది." ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా భారత అధికారులు వారి కుటుంబసభ్యులు స్వదేశానికి తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే బంగ్లాదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది". అని అధికారులు పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గేంత వరకూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశంలో వచ్చే నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హిందువులపై దాడులు పెరుగుతున్నట్లు పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • దాయాది పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలుదువ్వింది. నిన్న రాత్రి ( మంగళవారం) నార్త్ కశ్మీర్‌ ప్రాంతంలోని కేరన్ సెక్టార్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు పహారా చేస్తున్న సమయంలో కాల్పులు జరిపింది. అయితే భద్రతా బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని అధికారులు పేర్కొన్నారు.

    ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ నిఘావ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. పాకిస్థాన్‌తో సరిహాద్దు పంచుకుంటున్న సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలు ఆధునాతన సీసీ సర్వెలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాగా ఆసమయంలో పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది.

    కెమెరాలు ఏర్పాటును అడ్డుకునేలా రెండు రౌడ్ల కాల్పులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈకాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ప్రమాదంలో రెండువైపులా ఎవరికీ గాయాలుకానట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో చిల్లైకలానే అత్యంత కఠినమైన చలి ఉండే సమయం నడుస్తోంది. 

    ఈ సమయంలో పాక్‌ నుంచి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది. అందుకే సరిహద్దు వెంబడి భద్రతను మరింత కఠినతరం చేశారు. ఎటువంటి చిన్నబొరబాట్లు సైతం దేశంలోకి జరగకుండా ప్రత్యేక నిఘావ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.

  • సౌదీ అరేబియా.. అత్యంత ధనిక దేశం.. చమురు నిల్వలకు కొదవలేదు. బంగారపు కొండలూ ఉన్నాయి. మక్కాలాంటి పవిత్ర స్థలం ఉండటంతో ప్రపంచ దేశాలకు చెందిన కోట్లాది మంది ముస్లింలు పర్యటిస్తుంటారు. సాంప్రదాయాలకు అధిక విలువనిస్తూ.. మత పరమైన రాజ్యంగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాలో ఓ కొత్త నగరం సిద్ధమవుతోంది. నగరం సిద్ధం కావడమేంటా? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును.. నియోమ్‌ సిటీగా దీనికి నామకరణం చేశారు.

    నియోమ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం నాంది పలికింది. ప్రపంచంలోనే అత్యాధునిక, అధునాతన టెక్నాలజీతో ఆ పట్టణాన్ని తయారు చేస్తున్నారు. ఆ సిటీ తయారీ కోసం కొన్ని వేల కంపెనీలు రేయింబవళ్లు పని చేస్తున్నాయంటే సిద్ధమవుతున్న ఆ సిటీ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.. వాస్తవంగా ఆ నగరం చూడటానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో భాగంలా కనిపిస్తుంది. అసలు ఆ నగరానికి సంబంధించిన అద్భుతమైన ప్రపోజల్ పరిశీలిస్తే.. ఈ నగరం నిజంగా రెడీ అవుతుందా?. ఇది సాధ్యమేనా?. ఈ డిజైన్‌లో నిజంగా ఏ ప్రయోజనాలున్నాయి?. ఎలాంటి నష్టాలు ఉంటాయి?. ఇలాంటి మెగా ప్రాజెక్ట్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అనుమానాలు తలెత్తడం సహజమే.

    సౌదీ అరేబియా దేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంశాలు.. ఒకటి ఎడారి.. రెండోది చమురు నిల్వలు. ఎందుకంటే.. ఈ దేశం ఎక్కువగా ఎడారులతో చుట్టుముట్టి... సౌదీలో ఎటు చూసినా సాధారణ ఎడారి వాతావరణం కనిపిస్తుంది. ఎడారి దేశాన్ని.. ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక సిటీగా మార్చాలనే ఆలోచనతో ‘నియోమ్’ అనే స్మార్ట్ సిటీని నిర్మించాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణయించుకున్నారు. తన దేశంలోని ఒక పెద్ద ప్రాంతంలో ఆ సిటీని డెవలప్‌ చేయాలని దానికి ‘నియోమ్’ సిటీ అని నామకరణం చేశారు. నియోమ్‌ అనేది ఒక స్మార్ట్ సిటీ మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ పేరు.

    సౌదీ అరేబియాలో ఉత్తర–పశ్చిమ భాగంలో రెడ్ సీ ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని ఈ సిటీ నిర్మాణానికి ఎంచుకున్నారు. సిటీ పరిమాణం దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిమాణానికి సగానికి సమానం అని చెప్పవచ్చు. అసలు సౌదీలో అదే ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణమేంటంటే అక్కడి వాతావరణం సౌదీ దేశంలో ఉండే వేడి వాతావరణంగా కాకుండా నార్మల్‌గా ఉంటుంది. ఆ సిటీకి నియోమ్‌ పేరు పెట్టడానికి కారణాలేంటని విశ్లేషిస్తే... ప్రిన్స్‌ పేరు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పేరు నుంచి అరబిక్‌ భాష ఆధారంగా అక్షరాలు సేకరించినట్లు సమాచారం.

    నియోమ్‌ సిటీ సౌదీ అరేబియాలోని అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0°C కంటే తక్కువకు పడిపోతాయి. ఇక్కడి మంచును కూడా వినియోగంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. దీని డిజైన్. 170 కిలోమీటర్ల పొడవైన ఒక లైన్. ఈ నగరం 200–500 మీటర్ల ఎత్తైన స్కై స్క్రేపర్ల మధ్య నిర్మించనున్నారు. ఇవి లీనియర్ ఫార్మ్‌లో ఉంటాయి. ఈ నగరం బయట వాతావరణం నుండి పూర్తిగా సంబంధం లేకుండా లోపలే స్వయం సమృద్ధిగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. న్యూయార్క్ నగర పరిమాణం కంటే దాదాపు 20 రెట్లు పెద్ద నగరం ఇది. 26,500 చదరపు కిలోమీటర్లు.. 10,500 చదరపు మైళ్ల వైశాల్యంలో ఈ నగరం సిద్ధమవుతోంది. కాబట్టి ఫుట్‌ప్రింట్ చాలా పెద్దది. నగరంలో మల్టిపుల్ లేయర్లు ఉంటాయి. పార్కులు, గ్రీన్ స్పేస్‌లు ఉంటాయి. 170 కిలోమీటర్ల పొడవైన లైన్ కావడంతో హై-స్పీడ్ రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు.

    అయితే ఈ ప్రాజెక్ట్‌లో సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ప్రధాన సమస్య ఫైనాన్స్. కొన్ని నివేదికల పరిశీలనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ 2050 వరకు కూడా పూర్తికాకపోవచ్చు. సిటీ నిర్మాణానికి మొత్తం ఖర్చు 1 ట్రిలియన్ డాలర్ల దాకా.. అంటే ఇండియన్‌ కరెన్సీలో 85 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. దానికోసం సౌదీ వద్ద వనరులు సిద్ధంగా లేకపోవడంతో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ప్లానింగ్‌కు అనుగుణంగా వినియోగించాల్సిన టెక్నాలజీ కూడా ఓ సవాలుగా మారింది. నియోమ్‌ సిటీలో ఒక చివర నుండి మరో చివర వరకు 20 నిమిషాల్లో ప్రయాణం చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి గంటకు 500 కంటే ఎక్కువ వేగం ఉండాలి.. కానీ ఇంత వేగం ఇచ్చే టెక్నాలజీ ఇప్పటివరకు లేదు. 2015లో జపాన్‌లో మాగ్లేవ్‌ ట్రైన్ టెస్ట్ రన్‌లో గంటకు 603 కిలోమీటర్‌ ప్రయాణించినప్పటికీ.. రెగ్యులర్ ఆపరేషన్లలో గంటకు 430 కిలోమీటర్లు మాత్రమే వేగం ఉంటుంది.

    మరో విషయం ఏమిటంటే నియోమ్‌ సిటీలో 500 మీటర్ల ఎత్తైన గాజుతో కప్పే భవనాలను నిర్మించడం. దాని కోసం తక్కువ మోతాదులో కార్బన్‌ మెటీరియల్స్‌ వినియోగించడం దాదాపు అసాధ్యం. ఓవరాల్‌గా సిటీ నిర్మాణంతో స్థలం ఆదా అవుతున్నప్పటికీ.. సమస్యలు పెరిగే అవకాశముంది.  ఇక సౌదీ ప్రజలు ఇన్ని సవాళ్లను అధిగమించినా, ప్రజలు నిజంగా ఇక్కడ నివసించాలనుకుంటారా? అనేదీ ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది.

Movies

  • 2026 సంవత్సరానికి టాలీవుడ్ ఘనంగా శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఒక్క సినిమా తప్ప మిగతావన్నీ క్లిక్ అవ్వడం సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన శుభారంభం. ప్రేక్షకులు కూడా ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే సంక్రాంతి ఊపు కొనసాగించాల్సిన సమయంలో షెడ్యూల్‌లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా సైడ్ అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వారాల్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమా లేదు. చిన్న సినిమాలే వరుసగా రావడం వల్ల బాక్సాఫీస్‌లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది.  

    ఫిబ్రవరిలో పెద్ద సినిమా స్వయంభూ మాత్రమే కనిపిస్తోంది. కానీ ఈ సినిమా విడుదల తేదీపై కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. వాయిదా పడుతుందేమో అనే వార్తలు రోజురోజుకు బలపడుతున్నాయి. స్వయంభూ వాయిదా పడితే ఫిబ్రవరిలో మరో పెద్ద సినిమా లేదు. మార్చి నుంచి మళ్లీ పెద్ద సినిమాల హవా మొదలవుతుందని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మార్చి కూడా డ్రైగానే ముగిసేలా ఉంది. ది ప్యారడైజ్ సినిమా వాయిదా పడినట్టే. పెద్ది సినిమా కూడా బాలీవుడ్ పోటీ కారణంగా తటపటాయిస్తోంది. కొంతమంది మాత్రం పెద్ది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు.  కానీ చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలి.

    ఒకవేళ మార్చిలో పెద్ది కూడా వాయిదా పడితే డెకాయిట్ తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఖాయం. దీంతో మొత్తం పరిస్థితి టాక్సిక్ సినిమాకే దారిచ్చినట్టవుతుంది. రాబోయే రెండు నెలలు పెద్ద సినిమాల లేని డ్రై సీజన్‌గా మారే అవకాశం ఉంది. ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.కానీ విడుదలల అనిశ్చితి వల్ల ఆ ఉత్సాహం తగ్గిపోయే అవకాశం ఉంది.  

  • రణ్‌వీర్‌ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్‌ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్‌ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఓవరాల్‌గా చూస్తే దురంధర్‌ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. 
     

     

  • కోలీవుడ్ స్టార్ విశాల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తన ఫెవరేట్ డైరెక్టర్‌ సుందర్ సితో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి పురుషన్‌ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగులో మొగుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టైటిల్‌ రివీల్ చేస్తూ ఏకంగా ఐదు నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

    ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ వీడియో యోగిబాబుతో తమన్నా చేసే కామెడీ ఫుల్‌గా నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వంటగదిలో విశాల్ చేసే ఫైట్‌ వేరే లెవెల్లో ఉంది. ఇది చూసిన యోగిబాబు రియాక్షన్‌ చూస్తే సీరియస్‌ సీన్‌లో కామెడీ చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. 'మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా..' అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్‌లు  నవ్వులు తెప్పిస్తున్నాయి.

    గోపిచంద్‌ టైటిల్‌నే..

    అయితే ఈ మూవీ టైటిల్‌ మొగుడు కావడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్‌, తాప్సీ జంటగా వచ్చిన మూవీ టైటిల్ మొగుడు కావడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో విశాల్‌ ప్రయోగం చేయడం కలిసొస్తుందా? డిజాస్టర్‌ అవుతుందా?  వేచి చూడాల్సిందే. 
     

     

  • మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న హీరోయిన్‌ టీనా శ్రావ్య తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యాక తెలిసింది అది కరెక్ట్‌ కాదని! 

    కుక్కకి సర్జరీ
    నేను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ట్యూమర్‌ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్కను మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. 

    తప్పు తెలుసుకున్నా
    మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్‌ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వను. మన సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని కోరుతున్నాను అని చేతులెత్తి వేడుకుంది.

    మేడారం జాతర
    తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఎంతో విశిష్టమైనది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ వేడుకకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. చాలామంది వారి బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు. ఈ క్రమంలోనే 'ద ‍గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో' హీరోయిన్‌ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియో ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా పలువురూ ఆమె చేసిన పనిని విమర్శించారు. దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చుకుంది.

    చదవండి: తెలుగు, తమిళ హీరోయిన్స్‌పై రాజాసాబ్‌ బ్యూటీ సెటైర్లు

  • అభిషన్ జీవింత్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తోన్న లవ్ ఎంటర్‌టైనర్‌ 'విత్ లవ్'. ఈ ప్రేమకథ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని విత్ లవ్‌ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్‌ రివీల్ చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో  హరీష్ కుమార్, కావ్య అనిల్, సచ్చిన్ నాచియప్పన్, తేని మురుగన్, శరవణన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ సంగీతమందించారు. 

     


     

  • మలయాళ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌.. మలయాళంతోపాటు సమానంగా తమిళంలోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో తను నటించిన మాస్టర్‌, పేట, తంగలాన్‌ చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్‌ ది రాజాసాబ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్‌ 2 మూవీలో యాక్ట్‌ చేస్తోంది.

    డైలాగులు బేఖాతరు
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ.. చాలాకాలం కిందట సంగతి ఇది. తెలుగు, తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారే కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి ఒకటి, రెండు, మూడు, నాలుగు అని లెక్కపెట్టేవారు. అంతే..! ఆవేశం, కోపం కలగలిపిన సీన్లలో ఏబీసీడీ అనే అక్షరాలను చదువుతూ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేవారు. 

    మమ అనిపించేవారు
    ఏబీసీడీ అన్న అక్షరాలను పదేపదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. ఆ లిప్‌ సింక్‌ వల్ల డబ్బింగ్‌లో చెప్పే డైలాగ్స్‌కు సరిగ్గా సరిపోయేవి. కెరీర్‌ మొత్తం వాళ్లిలాగే నెట్టుకొచ్చారు. నేనైతే వారిలా అస్సలు చేయలేను అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌పై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర భాషా నటుల్ని తీసుకొచ్చి పెడితే ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే.. మాస్టర్‌ మూవీలో నిన్ను ట్రోల్‌ చేసిందెందుకో మర్చిపోయావా? అని మరికొందరు మాళవికపై సెటైర్లు వేస్తున్నారు.

     

     

    చదవండి: మమ్ముట్టి సినిమాలు రిజెక్ట్‌ చేశా..: హీరోయిన్‌ భావన

  • మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్‌గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

    కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే.
     

     

  • హీరోయిన్‌ భావన పెళ్లయిన కొత్తలో మలయాళ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. దాదాపు ఐదేళ్లపాటు (2018-2022) మాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎంతోమంది పెద్ద పెద్ద సినిమా ఛాన్సులు ఇచ్చినా వాటిని నిర్మహమాటంగా తిరస్కరించింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

    ఏదీ ప్లాన్‌ చేయలేదు
    భావన మాట్లాడుతూ..  నేను ఏదీ ముందుగా ప్లాన్‌ చేయలేదు. ఎందుకో సడన్‌గా మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలనిపించింది. పెళ్లి చేసుకున్నాక నేను బెంగళూరు షిఫ్ట్‌ అయ్యాను. కుటుంబంతో సరదాగా గడిపాను. ఆ సమయంలో అలా ఉండటమే నాకు నచ్చింది. మాలీవుడ్‌కు వెళ్లి అక్కడ బిజీ నటిగా ఉండాలనిపించలేదు.

    కథ వినకుండానే రిజెక్ట్‌ చేశా..
    నా ఇష్టప్రకారమే సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నాను. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సన్నిహితులు ఈ సినిమా చేయు, బాగుంటుంది.. ముందు కథ విను, నచ్చకపోతే నో చెప్పు అనేవారు. అయినా సరే కథ వినకుండానే చాలా సినిమాలు రిజెక్ట్‌ చేశాను. కథ నచ్చాక కూడా నో చెప్పడం బాగోదనే అలా చేశాను. ఆషిఖ్‌ అబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జయసూర్య, మమ్ముట్టి సినిమాలను సైతం తిరస్కరించాను. ఎందుకలా చేశావు? దీనివల్ల ఏం సాధిస్తావు? అని నన్నడిగితే నా దగ్గర సమాధానం లేదు. 

    సమాధానం లేదు
    అప్పుడు నాకు మలయాళ సినిమాలకు విరామం ఇవ్వాలనిపించిందంతే! హ్యాపీగా బెంగళూరులో కుటుంబంతో గడపాలనుకున్నాను. ఈ లైఫ్‌స్టైల్‌ను బ్రేక్‌ చేసి మళ్లీ కేరళ వెళ్లిపోయి హడావుడిగా సినిమాలు చేయాలనుకోలేదు అని చెప్పుకొచ్చింది.  భావన.. కన్నడ నిర్మాత నవీన్‌ను 2017లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోగా 2018లో పెళ్లాడింది. పెళ్లయిన ఐదేళ్లపాటు మాలీవుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేసింది. కేవలం కన్నడ భాషలో మాత్రమే వరుసగా సినిమాలు చేసింది. ఇకపోతే భావన.. ఒంటరి, హీరో, మహాత్మ సినిమాలతో తెలుగువారికి సైతం దగ్గరయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ అనోమి ఫిబ్రవరి 6న విడుదలవుతోంది. 

  • హెబ్బా పటేల్, అనిరుధ్ శ్రీవాత్సవ్‌ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మారియో. ఈ చిత్రాన్ని కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రం.. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. కాగా.. నాటకం, తీస్ మార్ ఖాన్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్ జీ ఆడియన్స్‌ను మెప్పించారు. 

    తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు హెబ్బా పటేల్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా.. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతమందించారు. 

     

  • నరేష్ అగస్త్య, సంజనా సార‌థి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ మరొక్కసారి. ఈ మూవీకి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్ర‌పంచంలో ఎత్తైన ప్రాంతంలో జరుగుతోంది. గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ఘనత సాధించింది. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.

    కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే స‌మ‌యంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తి చేశారు. ఈ మూవీని ద‌క్షిణాది అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు.  ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి కీలక పాత్రల్లో నటించారు.
     

  • చెన్నై: ప్రముఖ నటి ఊర్వశి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు, నటుడు కమల్‌ రాయ్‌ (54) చెన్నైలో కన్నుమూశారు. కమల్‌ రాయ్‌ మృతి పట్ల దర్శకుడు వినాయన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఊర్వశి, కల్పన, కలారంజినిల సోదరుడే కమల్‌ రాయ్‌. ఈయన కల్యాణసౌగంధికం సినిమాలో విలన్‌గా నటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దేవుడిని ప్రార్థించాడు.

    నటులు చావర వీపీ నాయర్‌- విజయలక్ష్మిల సంతానమే కమల్‌ రాయ్‌. అతడికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. వారే ఊర్వశి, కళారంజిని, కల్పన. ఈ ముగ్గురు కూడా యాక్టర్స్‌గా సుపరిచితులే. వీరితో పాటు ఓ సోదరుడు కూడా ఉండేవాడు. అతడి పేరు ప్రిన్స్‌. చిన్నవయసులోనే అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

    కమల్‌ రాయ్‌ విషయానికి వస్తే.. సాయుజయం, కొల్లైలక్కం, మంజు, కింగిని, కల్యాణ సౌగంధికం, వచలం, శోభనం, ద కింగ్‌ మేకర్‌, లీడర్‌ వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించారు. మోహన్‌లాల్‌, ఊర్వశి హీరోహీరోయిన్‌గా నటించిన యువజనోల్సవం మూవీలో విలన్‌గా యాక్ట్‌ చేశారు. తమిళ సినిమాల్లోనూ నటించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్‌లోనూ మెరిశారు.

    చదవండి: భారత్‌లో బిజినెస్‌ చేయలేక దుబాయ్‌కు చెక్కేసిన హీరోయిన్‌

  • షాహిద్‌ కపూర్‌ హీరోగా వస్తోన్న ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓ రోమియో. ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‍అయితే ఈ సినిమా ట్రైలర్‌ హిందీలో కాకుండా ఇంగ్లీష్‌ భాషలో రిలీజ్ చేయడం విశేషం. ఈ చిత్రంలో అవినాష్‌ తివారి, విక్రాంత్‌ మస్సే, నానా పటేకర్‌, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
      
     

  • ఒకప్పుడు హిట్‌ సినిమాల హీరోయిన్‌.. ఇప్పుడు మాత్రం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. భారత్‌ కన్నా విదేశాల్లో బతకడం, సంపాదించడమే ఈజీ అని దుబాయ్‌కు చెక్కేసింది. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూతో సడన్‌గా లైమ్‌ లైట్‌లోకి వచ్చింది. తనే హీరోయిన్‌ రిమీ సేన్‌.

    భారత్‌లో అలా లేదు
    హీరోయిన్‌ రిమీ సేన్‌ మాట్లాడుతూ.. దుబాయ్‌ నాకు సాదర స్వాగతం పలికింది. ఇక్కడి జనాభాలో 95% మంది ప్రవాసులే ఉన్నారు. ఇక్కడివారు అందరి గురించి ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ మసీదులతో పాటు గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. అది మన భారత్‌లో లేదు. భారత్‌లో ప్రభుత్వం రాత్రికి రాత్రే పాలసీలు మార్చేస్తుంది.

    అనుకూలంగా లేదు
    దీనివల్ల ప్రజల జీవితాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్యాక్సులు కూడా చాలా ఎక్కువ. నా దృష్టిలో ఇండియా ఇప్పుడు వ్యాపారం చేసేందుకు అనుకూలమైన దేశం కాదు. దుబాయ్‌లో వ్యాపార నిబంధనలు చాలా సులభతరంగా ఉంటాయి. అందుకే ఇక్కడ సెటిలయ్యా.. అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    రిమీ బెంగాలీ అమ్మాయి. ఆమె అసలు పేరు శుభమిత్రాసేన్‌. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్‌లో హంగామా, ధూమ్‌, గరం మసాలా, క్యోంకీ, దీవానే హుయే పాగల్‌, ఫిర్‌ హేరా ఫేరీ, గోల్‌మాల్‌ 2, ధూమ్‌ 2, థాంక్యూ.. ఇలా అనేక సినిమాలు చేసింది. చివరగా షాగిర్డ్‌ (2011) సినిమాలో కనిపించింది. 30 ఏళ్ల వయసులోనే నటనకు గుడ్‌బై చెప్పేసింది. హిందీ బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లోనూ పాల్గొంది. తెలుగులో కన్నా హిందీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. 

     

     

    చదవండి: ఇంకా నిద్రపోతున్నారా? హీరోకు అవమానకర ప్రశ్న

Sports

  • న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది

    ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్‌(24 బంతుల్లో 44 నాటౌట్‌), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్‌, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.

    అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్‌ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్‌ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. 

    అతడితో పాటు చాప్‌మన్‌(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.
    చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌
     

  • న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్‌.. పొట్టి క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

    ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (271 ఇన్నింగ్స్‌లు), శిఖర్‌ ధవన్‌ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ పేరిట ఉంది. బాబర్‌ కేవలం 245 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. అభిషేక్‌ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ అతి భారీ స్కోర్‌ (238/7) చేసింది.

    మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్‌.

    ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (10), ఇషాన్‌ కిషన్‌ (8), శివమ్‌ దూబే (9), అక్షర్‌ పటేల్‌ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్‌ డెవాన్‌ కాన్వేను (0) ఔట్‌ చేశాడు. రెండో ఓవర్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్యా రచిన్‌ రవీంద్రను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 39-2గా  ఉంది. రాబిన్సన్‌ (19), గ్లెన్‌ ఫిలిప్స్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి.

     

  • నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ (238/7) చేసింది. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. 

    ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.

    అభిషేక్‌కు జతగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు.  కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ భారీ స్కోర్‌ చేసింది.

    మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ 10, ఇషాన్‌ కిషన్‌ 8, శివమ్‌ దూబే 9, అక్షర్‌ పటేల్‌ 5, అర్షదీప్‌ (6 నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు. 

  • నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్‌ రాహుల్‌ పేరిట ఉండేది. రాహుల్‌ 2020లో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

    అభిషేక్‌కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్‌ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్‌ తర్వాతి స్థానాల్లో ఫిల్‌ సాల్ట్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు.

    ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్‌ సోధి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్‌ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో (33 ఇన్నింగ్స్‌లు) 2 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్‌రేట్‌తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్‌కే ఔటైనా అభిషేక్‌ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్‌ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్‌ ఔటయ్యాక శృతి మించాయి.

    కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్‌ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హార్దిక్‌ (14 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్‌ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 185/5గా ఉంది. 

  • భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ల వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.

    ఇవాళ  (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్‌ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.

    భరోసా ఇచ్చినా..!
    భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్‌ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఓవరాక్షన్‌ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్‌ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.

    ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు  
    భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది.  
     
    స్కాట్లాండ్‌కు అవకాశం  
    ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్‌ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.

    మరో 24 గంటల డెడ్‌లైన్‌
    ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్‌ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం​ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.

    షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్‌-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది.  
     

  • భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్‌, డఫీ ఉన్నారు.

    మరోవైపు భారత్‌ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

    తుది జట్లు..
    న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ

    భారత్‌: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
     

  • ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ బెన్‌ మేస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

    ఈ మ్యాచ్‌లో మేస్‌ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో  191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్‌ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. 

    ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్‌ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్‌.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్‌ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మేస్‌ భారీ శతకంతో పాటు ఓపెనర్‌ జోసఫ్‌ మూర్స్‌ (81) అర్ద సెంచరీతో రాణించాడు. 

    లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్‌ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్‌ థామస్‌ రూ 22, కాలెబ్‌ ఫాల్క్‌నర్‌ 32, రాల్ఫీ ఆల్బర్ట్‌ 13, ఫర్హాన్‌ అహ్మద్‌ 15 (నాటౌట్‌), సెబాస్టియన్‌ మోర్గాన్‌ 24 (నాటౌట్‌) పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ బెన్‌ డాకిన్స్‌ 5 పరుగులకే ఔటయ్యాడు.

    స్కాట్లాండ్‌ బౌలర్లలో జేక్‌ వుడ్‌హౌస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్‌ 2, మ్యాక్స్‌ ఛాప్లిన్‌ ఓ వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్‌ (6), మ్యాక్స్‌ ఛాప్లిన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అలెక్స్‌ గ్రీన్‌, లూక్‌ హ్యాండ్స్‌, ఫర్హాన్‌ అహ్మద్‌కు తలో వికెట్‌ దక్కింది.

    కాగా, ప్రస్తుత ఎడిషన్‌ ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్‌.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. 

     

  • భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన స్కై.. న్యూజిలాండ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌తో మ్యాచ్‌ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.

    భారత క్రికెట్‌లో ఇప్పటివరకు రోహిత్‌ శర్మ (159), విరాట్‌ కోహ్లి (125), హార్దిక్‌ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు.

    మరో చారిత్రక మైలురాయి దిశగా..
    మ్యాచ్‌ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 346 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం రోహిత్‌ శర్మ (547), విరాట్‌ కోహ్లి (435) మాత్రమే సాధించారు.

    పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్య
    నేటి మ్యాచ్‌లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్‌ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. 

    టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్‌గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్‌ను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే అతని కెరీర్‌ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.

    ఇదిలా ఉంటే, భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్‌ జరుగనుండటం సూర్యకుమార్‌ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ పాల్గొననుంది.

    ఇదిలా ఉంటే.. కివీస్‌తో పాటు ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్‌మన్‌ గిల్‌ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.

    అద్భుతమైన ఆటగాడు
    ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌ టోర్నీ తర్వాత గిల్‌ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్‌ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్‌ ప్రశంసలు కురిపించాడు.

    ఫామ్‌లేమి కారణంగానే
    బియాండ్‌23క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్‌ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆప్షన్లు ఉన్నాయి.

    ప్రస్తుతం అతడు కెప్టెన్‌ కూడా కాదు. అందుకే వరల్డ్‌కప్‌ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్‌ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్‌లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

    కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు
    అయితే, ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత గిల్‌ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్‌. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్‌ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్‌కప్‌ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్‌మెంట్‌ అతడిని తప్పించింది’’ అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.

    రోహిత్‌ స్థానంలో సూర్య, గిల్‌ 
    కాగా రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్‌ రిటైర్మెంట్‌ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. 

    అయితే, క్లార్క్‌ అభిప్రాయపడినట్లు వరల్డ్‌కప్‌ తర్వాత గిల్‌ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్‌-2026 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

    చదవండి: T20 WC: సూర్యకుమార్‌ యాదవ్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

  • జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ విల్ మలాజ్‌చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్‌-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

    గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు ఖాసిం అక్రమ్‌ పేరిట ఉండేది. ఖాసిమ్‌ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్‌ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్‌ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

    మలాజ్‌చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్‌ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.

    ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హ్యూగో కెల్లీ (79 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్‌ పర్మార్‌ (33), చార్లెస్‌ హి​ంజ్‌ (24), హర హింజ్‌ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్‌ బౌలర్లలో కూరే 3, విల్‌ బైరోమ్‌ 2, ఆర్యన్‌ శర్మ, కేసీ బార్టన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. మలాజ్‌చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ (60 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్‌ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

  • ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్‌-2గా ఉన్న న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ సరికొత్త వన్డే నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు.

    తాజాగా భారత్‌పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్‌, 137) చేయడంతో డారిల్‌ రేటింగ్‌ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్‌ ప్లేస్‌లో ఉండిన విరాట్‌పై డారిల్‌ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. 

    ప్రస్తుతం డారిల్‌ ఖాతాలో 845 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో డారిల్‌ టాప్‌ ర్యాంక్‌ను కైవసం​ చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌తో సిరీస్‌లో డారిల్‌ ​చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్ని (2-1) అందించాడు.

    మరోవైపు రెండు వారాల కిందట టాప్‌ ర్యాంక్‌లో ఉండిన మరో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం​ నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

    న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన మరో​ టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ టాప్‌-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌, ఐర్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ టెక్టార్‌, విండీస్‌ ప్లేయర్‌ షాయ్‌ హోప్‌, శ్రీలంక ఆటగాడు చరిత్‌ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.

    తాజాగా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌తో మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో అలరించిన ఫిలిప్స్‌ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.

    బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్‌ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్‌-5లో ఉన్నారు.  

    న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్‌తో సిరీస్‌లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్‌ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. 

    న్యూజిలాండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్‌ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.

    ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, జింబాబ్వే సికందర్‌ రజా, ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ మహ్మద్‌ నబీ టాప్‌-3లో కొనసాగుతున్నారు. 

Business

  • నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) ఇండియా 75వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంధులకు అండగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తరపున రాబోయే ఐదేళ్లలో రూ.5 కోట్ల విరాళాన్ని అందజేస్తామని నీతా అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్, నాబ్‌ సంయుక్త కృషితో ఇప్పటివరకు 22,000 మందికి పైగా అంధులకు చూపు తెప్పించారు.
     

  • బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో పసిడి ధరలు ఎగుస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికే మరింత పెరిగాయి.

    హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.4600 పెరిగి రూ. 1,41,900 లకు చేరుకోగా సాయంత్రానికి మొత్తంగా రూ.6250 ఎగిసి రూ.1,43,550లకు చేరింది.

    ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.5020 ఎగిసి రూ. 1,54,800 లను తాకగా సాయంత్రానికి మొత్తంగా రూ.6820 పెరిగి రూ.1,56,600లకు చేరుకుంది.

    అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూరోపియన్ మిత్రదేశాల నుంచి కొంత వ్యతిరేక స్పందన (pushback) వ్యక్తమవుతుండగా, ఆయన ఈ రోజు దావోస్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) కాంగ్రెస్ హాల్‌లోని ‘జోన్ సిలో’ వద్ద వందలాది మంది ప్రతినిధులు క్యూకట్టారు. ట్రంప్ ప్రసంగంపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.

    అధ్యక్ష పదవికి ఏడాది.. ట్రంప్ ప్రశంసలు

    అధ్యక్ష పదవిలో ఏడాది పూర్తి అయిన సందర్భంగా దావోస్‌లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వేదికపై ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాలనలో సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు.

    “నిన్న నా ప్రమాణ స్వీకారానికి ఏడాది పూర్తైంది. ఈ రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వృద్ధి ఉధృతంగా ఉంది, ఆదాయాలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. గతంలో తెరిచి ఉన్న ప్రమాదకరమైన సరిహద్దులు ఇప్పుడు మూసివేయబడ్డాయి. అమెరికా తన చరిత్రలోనే అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది” అని ట్రంప్ అన్నారు.

    యూరప్ సరైన దిశలో లేదు
    డబ్ల్యూఈఎఫ్ వేదికపై మాట్లాడిన ట్రంప్, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు “గుర్తించలేనంతగా మారిపోయాయి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో “వాదనకు తావు లేదని” పేర్కొన్నారు.

    “నేను ఐరోపాను ప్రేమిస్తున్నాను. ఐరోపా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కానీ ప్రస్తుతం అది సరైన దిశలో ముందుకు సాగడం లేదు” అని ట్రంప్ స్పష్టం చేశారు.

    అలాగే, ప్రపంచంలోని సుమారు 40 శాతం దేశాలతో అమెరికా చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. వివిధ దేశాలపై విధించిన సుంకాల వల్ల అమెరికాలో భారీ వాణిజ్య లోటులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు.

    గ్రీన్‌లాండ్‌ కావాల్సిందే..
    అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక ప్రదేశంలో గ్రీన్‌లాండ్ ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాకు ఈ ద్వీప భూభాగం దాని ఖనిజాల కోసం కాదని, "వ్యూహాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రత" కోసం అవసరమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. 

    డెన్మార్క్‌కు కృతజ్ఞత లేదని ట్రంప్‌ ఆక్షేపించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత "గ్రీన్‌లాండ్ ను తిరిగి ఇవ్వడం" అమెరికా "మూర్ఖత్వం" అని అన్నారు. "మేము డెన్మార్క్ కోసం గ్రీన్‌లాండ్‌లో స్థావరాలను ఏర్పాటు చేశాం. డెన్మార్క్ కోసం పోరాడాము. గ్రీన్‌లాండ్‌ను రక్షించాం. శత్రువులు అడుగు పెట్టకుండా నిరోధించాము. యుద్ధం తర్వాత మేము గ్రీన్లాండ్ ను తిరిగి డెన్మార్క్ కు ఇచ్చాము. అలా చేయడం మా తెలివి తక్కువతనం' అన్నారు. 

    మరోవైపు గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయండం వల్ల  నాటోకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. నాటోనే అమెరికాను "చాలా అన్యాయంగా" చూస్తోందని ట్రంప్ విమర్శించారు.

  • భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. నిరంతర విదేశీ నిధుల నిష్క్రమణ, లోహ దిగుమతిదారుల నుంచి బలమైన డాలర్ డిమాండ్ నేపథ్యంలో బుధవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 77 పైసలు క్షీణించి 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది.

    గ్రీన్‌లాండ్ సమస్యతో పాటు సంభావ్య సుంకాలపై ఐరోపాలో ఉద్రిక్తతలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణి పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.

    ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో రూపాయి 91.05 వద్ద ప్రారంభమై, ట్రేడింగ్‌లో క్రమంగా క్షీణిస్తూ డాలర్‌తో పోలిస్తే 91.74 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ఇది మునుపటి ముగింపు స్థాయితో పోలిస్తే 77 పైసల పతనం.

    మంగళవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 7 పైసలు తగ్గి 90.97 వద్ద ముగిసింది. అంతకుముందు 2025 డిసెంబర్ 16న ఇంట్రా-డే కనిష్ట స్థాయి  నమోదై, ఆ రోజు రూపాయి 91.14 వరకు పడిపోయింది.

    ఇదిలా ఉండగా, ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 98.61 వద్ద ట్రేడ్ అవుతోంది.

    అంతర్జాతీయ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.88 శాతం తగ్గి 63.70 డాలర్లకు చేరుకుంది.

    దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కూడా నెగెటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 289.85 పాయింట్లు పడిపోయి 81,890.62 వద్ద, నిఫ్టీ 77.40 పాయింట్లు తగ్గి 25,155.10 వద్ద ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) మంగళవారం రూ.2,938.33 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  • ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వేదికగా తెలంగాణ ప్రభుత్వం తన నెక్ట్స్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ను ఆవిష్కరించింది. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే టాప్ ఐదు లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తీర్చిదిద్దడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.

    ఈ విధానం ద్వారా  25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడుల ఆకర్షణ, 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి, అలాగే అధునాతన థెరప్యూటిక్స్, సస్టెయినబుల్ బయో-మాన్యుఫాక్చరింగ్, ఫ్రంటియర్ ఆర్‌ అండ్‌ డీ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

    దావోస్‌లో పాలసీని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ “ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన, మార్పు తీసుకువచ్చే బయోసైన్సెస్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది” అని పేర్కొన్నారు. గ్లోబల్ భాగస్వామ్యాలు, వినూత్న ఆవిష్కరణలు, సస్టెయినబిలిటీ ద్వారా ప్రపంచ ఆరోగ్య రంగంపై ప్రభావం చూపడమే రాష్ట్ర సంకల్పమని తెలిపారు.

    రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లోనే తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని, రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.

    పాలసీ ముఖ్యాంశాలు

    • ప్రపంచ స్థాయి లక్ష్యం: 2030 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు

    • గ్రీన్ ఫార్మా సిటీ: జీరో లిక్విడ్ డిశ్చార్జ్, నెట్-జీరో ప్రమాణాలతో పర్యావరణహిత పారిశ్రామిక క్లస్టర్

    • ఫార్మా విలేజ్‌లు: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి 1,000–3,000 ఎకరాల విస్తీర్ణంలో 10 ప్రత్యేక హబ్‌లు

    • జీనోమ్ వ్యాలీ విస్తరణ: షేర్డ్ ల్యాబ్స్‌తో కూడిన కొత్త బయో-ఇన్నోవేషన్, బయోమాన్యుఫాక్చరింగ్ క్లస్టర్

    • వన్‌బయో: దేశంలోనే తొలి గ్రోత్-ఫేజ్ బయోఫార్మా స్కేల్-అప్ కేంద్రం

    • లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్: రూ.1,000 కోట్ల (111 మిలియన్ డాలర్లు) వరకు విస్తరించగల ప్రత్యేక నిధి

    • టాలెంట్ అభివృద్ధి: గ్లోబల్ ప్రమాణాల విద్య కోసం తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్
       

  • జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ ఎటర్నల్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. ఇది ఫిబ్రవరి 1న అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. “ఇటీవల నేను అధిక రిస్క్‌, ప్రయోగాత్మకత కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడనయ్యాను. ఇవి పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్ పరిధి వెలుపల మరింత సమర్థంగా అమలయ్యే ఆలోచనలు” అని వాటాదారులకు రాసిన లేఖలో గోయిల్  పేర్కొన్నారు.

    అలాగే, “ఎటర్నల్ తన ప్రస్తుత వ్యాపార నమూనాకు అనుబంధంగా కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలంటే పూర్తి దృష్టి, క్రమశిక్షణ అవసరం. అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం లేదని నేను భావిస్తున్నాను. భారతదేశంలోని పబ్లిక్ కంపెనీ సీఈవో బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయి” అని తెలిపారు.

    బోర్డులో కొనసాగనున్న గోయిల్
    సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దీపిందర్ గోయిల్ ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్‌గా కొనసాగుతారు. “నా జీవితంలో దాదాపు 18 సంవత్సరాలు ఈ సంస్థ నిర్మాణానికి అంకితం చేశాను. ఇకపై కూడా అదే నిబద్ధతతో పనిచేస్తాను. మా భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం యథాతథంగా కొనసాగుతుంది. అన్ని వ్యాపార విభాగాల సీఈవోలు ఇప్పటివరకు ఉన్న స్వతంత్రతతోనే పని చేస్తారు” అని గోయిల్ స్పష్టం చేశారు.

    కొత్త సీఈవోగా అల్బిందర్ ధిండ్సా
    ఎటర్నల్ గ్రూప్ నూతన సీఈవోగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు, సీఈవో అల్బిందర్ ధిండ్సా బాధ్యతలు స్వీకరించనున్నారు. రోజువారీ కార్యకలాపాలు, ఆపరేటింగ్ ప్రాధాన్యతలు మరియు కీలక వ్యాపార నిర్ణయాల అమలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.

    బ్లింకిట్‌ను స్థాపించడానికి ముందు, ధిండ్సా జొమాటోలో అంతర్జాతీయ విస్తరణ విభాగం అధిపతిగా పనిచేశారు. సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఆయన కీలక పాత్ర పోషించారు.

    2013లో బ్లింకిట్‌ను సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన ధిండ్సా, ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పొందారు.
     

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం వరుసగా మూడవ సెషన్‌లోనూ క్షీణించాయి. 

    బీఎస్ఈ సెన్సెక్స్ 270.84 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 81,909.63 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 75 పాయింట్లు లేదా 0.30 శాతం నష్టపోయి 25,157.5 వద్ద స్థిరపడింది. 

    విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.9 శాతం క్షీణించాయి.

  • ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.

    పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్‌కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి  కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్‌ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.

    ఈ మార్పు భారతీయ సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్‌తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

    ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.

    గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.

    ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు 

Telangana

  • సాక్షి, ములుగు: తెలంగాణలో మేడారం జాతరకు భక్తులకు శుభవార్త. రేపటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో రానున్నాయి. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.

    వివరాల మేరకు.. తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాడ్వాయి మండలం ఎలుబాక నుండి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్‌ నడపనున్న టూరిజం శాఖ తాజాగా తెలిపింది. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క రేపు ప్రారంభించనున్నారు. కాగా, ఒక్కరికి 5000 వేల రూపాయలు చార్జీతో ఏడు నిమిషాలు హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ వీక్షించే అవకాశం కల్పించారు. 

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఐడీ రూపొందించిన నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

    హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తాజాగా మాట్లాడుతూ..‘తెలంగాణ పోలీసుల చారిత్రాత్మక నిర్ణయం, ఘటనా స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోలీసులే బాధితుల ఇంటి వద్దకు వెళ్తారు. హైదరాబాద్‌లో పకడ్బందీగా అమలులోకి విక్టిమ్ సిటిజన్ సెంట్రిక్ విధానం. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నూతన విధానం ఉంటుంది. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ కేసులకు వర్తింపు ఉంటుంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తారు.

    నూతన విధానంలో బాధితుడు ఆసుపత్రిలో ఉన్నా అక్కడికే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. బాధితుల గౌరవం, గోప్యతకు భంగం కలగకుండా సేవలు ఉంటాయి. విధానం అమలులో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులను అకారణంగా స్టేషన్‌కు పిలిస్తే సంబంధిత అధికారులదే బాధ్యత. ప్రతీ కేసును డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు జరగకపోతే హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు ఇప్పటికే ప్రారంభమైన సీ-మిత్రతో పాటు ఈ విధానం ప్రజలకు మరింత మేలు చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 

  • సాక్షి హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్‌లో పెద్ద పీట వేస్తే వారి పక్కన ఎలా కూర్చుంటామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.10 ఏళ్లు బీఆర్ఎస్ పై తాము పోరాటం చేసిన నాయకులకు కాంగ్రెస్‌లో పెద్దపీట వేస్తే  కేత్రస్థాయిలో ఉన్న నాయకులకు ఏమని సమాధానం చెప్తామని ప్రశ్నించారు.  అందుకే అది  జీర్ణించుకోలేకపోయానని, పీసీసీకి క్షమాపణలు చెప్పి   గాంధీ భవన్‌ నుంచి బయిటకి వెళ్లిపోయానని జీవన్ రెడ్డి తెలిపారు.

    స్పీకర్‌తో తానే స్వయంగా పార్టీ మారలేదని చెప్పారని అలాంటి వారిని సమావేశానికి పిలవాల్సిన అవసరమేముందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నాయకులను చులకన చేస్తున్నారని పార్టీలో ఇటువంటి పరిస్థితి వస్తుందని తాను ఉహించలేదన్నారు. నిన్నటి వరకూ సైతం  బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాల పై పోరాటం చేశాను. ఇప్పుడేమో మీటింగ్ లో అలాంటి వ్యక్తి ని పక్కను కూర్చోబెట్టారు. రాజ్యాంగాన్ని  ఉల్లంగించిన వ్యక్తి ని పార్టీ అంతర్గత సమావేశంలో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.

    ప్రస్తుతం జరుగుతున్న సమావేశం పార్టీ విధానానికి రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియాగాంధీ విధానానికి వ్యతిరేకంగా జరుగుతుందన్నారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తెచ్చేలా ఈ సమావేశం జరిగిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో విలువ ఇచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు.

    తాను ఎన్నో కష్టాలు భరించి పార్టీలో ఉన్నానని ఇప్పుడు దాని నుండి ఎందుకు వెళ్లిపోతానన్నారు. కాంగ్రెస్ తనపార్టీ అని కేవలం ఈ రోజు జరిగిన మీటింగ్‌కు మాత్రమే నిరసనగా బయిటకి వెళుతున్నానని తెలిపారు. 
     

  • సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో మద్యం ప్రియులకు ఊహించని షాక్‌ తగలనుంది. ముఖ్యంగా వేసవిలో చల్లటి బీరు తాగి రిలాక్స్‌ అవుదామనే వారికి మాత్రం ఇది చేదు వార్తే. ఎందుకంటే.. వచ్చే వేసవి నాటికి రాష్ట్రంలో బీర్ల సరఫరా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయడమే. ప్రాజెక్ట్‌కు, బీర్లకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. అయితే.. ఇది తెలుసుకోండి.

    సింగూరు డ్యామ్‌ సెఫ్టీ రివ్యూ ప్యానెల్‌ సూచనలు మేరకు ఈ వేసవిలో ప్రాజెక్ట్‌లోని నీటిని ఖాళీ చేసి అధికారులు మరమ్మతులు చేయనున్నారు. దీంతో, సంగారెడ్డిలోని నాలుగు ప్రధాన బెవరేజెస్‌ కంపెనీలకు సింగూరు నుంచే వెళ్లే నీటి సరఫరా ఆగిపోతుంది. నీటి వనరులు లేని కారణంగా బీర్ల కంపెనీలలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగూరు జల మండలి నుంచి బీర్ల ఫ్యాక్టరీలకు రోజుకు 44 లక్ష లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి సరఫరా లేకపోతే ఉత్పత్తి నిలిచిపోనుంది. అలాగే, సిటీలో మంచి నీటి సరఫరాకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

    మరోవైపు.. సంగారెడ్డి జిల్లాలోని ఫ్యాక్టరీల నుంచి 11 రాష్ట్రాలకు బీర్ల సరఫరా జరుగుతోంది. నామమాత్రపు ధరకే బీర్ల ఫ్యాక్టరీలకు నీటి సరఫరా అందిస్తున్నారు. ఇప్పుడు అధిక ఛార్జీలు వసూలు చేసి నీటి సరఫరా చేస్తే బీర్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో సింగూరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేస్తున్నా దృష్ట్యా ఫ్యాక్టరీలకు భారీ నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో, బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వేసవి దృష్ట్యా బీర్ల ఉత్పత్తి తగ్గరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 

    TS: మద్యం ప్రియులకు బిగ్ షాక్

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే కాంగ్రెస్‌ ప్రభుత్వ బదిలీలు చేపట్టింది. తెలంగాణవ్యాప్తంగా 40 మంది మున్సిపల్‌ కమిషనర్లు బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సర్కార్‌ కీలక మార్పులు చేపట్టింది.

    జీహెచ్‌ఎంసీలో పలువురు కమిషనర్లు, మేనేజర్లకు కొత్త బాధ్యతలను అప్పగించింది. రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీల్లో బదిలీలు చోటుచేసుకున్నాయి. కాగా, వెంటనే కొత్త పోస్టింగ్‌లకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

    బదిలీలు ఇలా.. 

    • రాజేష్ కుమార్ ప్రమోషన్‌తో GHMC కి బదిలీ

    • టీ.ఎస్.వి.ఎన్. త్రిలేశ్వర రావు  C&DMA హెడ్ ఆఫీస్ కు బదిలీ

    • బి. సత్యనారాయణ రెడ్డి ప్రమోషన్‌పై GHMC కి బదిలీ

    • ఆర్. వెంకట గోపాల్.. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్

    • ఉమా మహేశ్వర రావు - ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

    • పి. రామాంజుల రెడ్డి - మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్

    • బి. తిరుపతి - కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ (ప్రమోషన్)

    • చ. నాగరాజు - నేరెడ్‌చర్ల మున్సిపల్ కమిషనర్

    • వై. సుదర్శన్ - ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్

    • C.V.N. రాజు - రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ

    • కె. సమ్మయ్య - సచివాలయానికి రిపాట్రియేషన్

    • కీర్తి నాగరాజు - రాయకల్ మున్సిపల్ కమిషనర్

    • ఏ. శ్రీనివాస రెడ్డి - హాలియా మున్సిపల్ కమిషనర్

    • ఎం. నూరుల్ నజీబ్ - అమర్‌చింత మున్సిపల్ కమిషనర్

    • కె. సంపత్ కుమార్ - వెనులవాడ మున్సిపల్ కమిషనర్

    • టి. రమేష్ - ములుగు మున్సిపల్ కమిషనర్

    • ఎం. రామచంద్ర రావు - తిరుమలగిరి (OD)

    • జి. రాజు - ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్

    • మునావర్ అలీ - ఎదులాపురం మున్సిపల్ కమిషనర్

    • జె. సంపత్ - బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్

    • పి. చంద్రశేఖర్ రావు - భూత్‌పూర్ మున్సిపల్ కమిషనర్

    • డి. మురళి - నందికొండ మున్సిపల్ కమిషనర్

    • చి. వేణు - ఆచంపేట్ మున్సిపల్ కమిషనర్

    • ఎం. రామదుర్గ రెడ్డి - కల్లూరు మున్సిపల్ కమిషనర్
       

  • హైదరాబాద్‌:  తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై దురుద్దేశ పూర్వకంగానే ఏబీఎన్‌ కథనాలు రాసిందని దళిత సంఘాలు మండిపడ్డాయి. డిప్యూటీ సీఎంపై ఏబీఎన్‌ రాసిన తప్పుడు కథనాలను ఖండించాయి దళిత సంఘాలు. 

    ఈ మేరకు దళిత సంఘాల నేతలు  ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ..‘‘ఏబీఎన్‌ రాధాకృష్ణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. భట్టిపై దురద్దేశపూర్వకంగాకథనాలు రాశారు. నైనీ బ్లాక్‌పై ఆంధ్రజ్యోతిది ఊహాజనిత వార్త. 

    ఇంధన శాఖకు భట్టి అర్హలు కారని ఎలా రాస్తారు?, భట్టి ఎదుగుదలను అడ్డుకునేందుకు తప్పుడు కథనాలు. పెద్ద వాళ్ల మెప్పు కోసమే తప్పుడు వార్తలు రాశారు’ అని దళిత సంఘాలు  ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

  • సాక్షి,హైదరాబాద్:  ఆధ్యాత్మిక, విద్యా, సామాజిక సేవా రంగాలలో 75 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ “అమృత మహోత్సవం”ను జనవరి 24, 25 తేదీలలో హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిన్మయ మిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా 50వేల మందితో గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.. 

    స్వామి చిన్మయానంద (1916–1993) చిన్మయ మిషన్ స్థాపకులు, భగవద్గీత, ఉపనిషత్తుల బోధలను సామాన్య ప్రజలకు చేరేలా చేయడానికి తన జీవితం మొత్తాన్ని అర్పించారు. 1951లో పూణేలో తన మొదటి గీతా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకూ చిన్మయ మిషన్ 32 దేశాల్లో 330కి పైగా కేంద్రాలతో విస్తరించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నట్లు చిన్మయ మిషన్ తెలిపింది.

National

  • మ‌హారాష్ట్ర పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగించిన కాషాయ పార్టీ ఇప్పుడు క‌ర్ణాట‌క‌పై గురి పెట్టింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబై మ‌హాన‌గ‌రంలో 28 ఏళ్ల శివ‌సేన ఆధిప‌త్యానికి ముగింపు ప‌లికిన క‌మ‌లం పార్టీ బెంగ‌ళూరులోనూ పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తోంది. మ‌రో నాలుగైదు నెల‌ల్లో జ‌రగ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌కు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు కీల‌క నేత‌ల‌కు బెంగ‌ళూరు ఎన్నికల బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

    బీజేపీ జాతీయ‌ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్‌ను గ్రేట‌ర్ బెంగ‌ళూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఇంచార్జిగా నియ‌మించింది. రాజ‌స్థాన్ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు స‌తీశ్ పూనియా, (Satish Poonia) మ‌హారాష్ట్ర ఎమ్మెల్యే సంజ‌య్ ఉపాధ్యాయ్‌ల‌ను స‌హ‌-ఇంచార్జిలుగా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నూతన జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్ర‌క‌ట‌న‌ను జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ ప్ర‌ధాన కార్యాలయం ఇంచార్జి అర్జున్ సింగ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

    అసెంబ్లీ సమరం లాంటిదే.. 
    గ్రేట‌ర్‌ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇంచార్జిగా త‌న‌ను నియమించినందుకు నితిన్ న‌బీన్‌కు 'ఎక్స్'లో రాంమాధ‌వ్ ధన్యవాదాలు తెలిపారు. మే నెల‌లో జరగనున్న బృహద్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) ఎన్నికల్లో త‌మ పార్టీని గెలిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామ‌ని పేర్కొన్నారు. 90 లక్షల ఓటర్లు, 369 వార్డులు ఉన్న బీబీఎంపీ ఎన్నిక‌లు.. అసెంబ్లీ సమరం కంటే త‌క్కువేమీ కాద‌న్నారు. క‌ర్ణాట‌క బీజేపీ నాయ‌కులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, బెంగళూరు న‌గ‌ర నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్ల‌డించారు.

    ఎన్నిక‌లకు సిద్ధం: సీఎం
    బెంగ‌ళూరు కార్పొరేష‌న్‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఇంత‌కుముందే ప్ర‌క‌టించారు. జూన్ 30లోపు బీబీఎంపీ ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో ఆయ‌నీ ప్ర‌క‌ట‌న చేశారు. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల ప్ర‌కారం నిర్ణీత గడువులోగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని డిప్యూటీ సీఎం, బెంగ‌ళూరు నగ‌రాభివృద్ధి మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) తెలిపారు. బెంగ‌ళూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌య‌మ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. బీజేపీ-జేడీఎస్ పొత్తు గురించి త‌మ‌కు బెంగ‌లేద‌ని సిద్ధ‌రామ‌య్య, శివ‌కుమార్ అన్నారు. 

    చ‌ద‌వండి: నితిన్ న‌బీన్‌కు తొలి అడుగే అగ్నిప‌రీక్ష‌!

  • సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న అం ర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ప్రపంచం కోనే మొట్టమొదటి త్రీవే హైబ్రీడ్ సజ్జ రకం. రాచీ 273ని అభివృద్ధి చేసింది. ఈ చిరు కాన్యం కరువు పీడిత ప్రాంతాల్లో 400 ఏ.మీ.ల లోటు వర్షపాతాన్ని సైతం తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. అత్యంత కరువు పరిస్థి టలుండే ఉష్ణ మండలాల్లో పంటలు సాగు చేసే తులకు ఇలాంటి హైబ్రీడ్ రకం ఎంతో ప్రయో నకరంగా ఉంటుందని ఇక్రిసాట్ మంగళ కారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిం ). ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక రల్ రీసెర్చ్). ఆర్ఎఏఆర్ ఐ (రాజస్థాన్‌ వ్యవసాయ పరిశోధన సంస్థ)ల సహకారంతో ఈ సజ్జ విత్తనాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సాధారణంగా ద్విముఖ సంకర జాతితో రూపొందే సజ్జల కంటే భిన్నంగా, త్రిముఖ జాతి లక్షణాలను కలబోసిన సంకర జాతి కావ డం దీని ప్రత్యేకత. అధిక దిగుబడి, ఎండ సహనశక్తి, మంచి మేత నాణ్యత వంటి లక్ష ణాలు ఒకేసారి లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

    కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విడుదల చేసినట్లు ప్రక టించిన వాటిల్లో ఆరోచీ 273 ఒకటి. రాజ స్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోని అత్యంత లోటు వర్షపాతాలు ఉండే 30 ప్రదే శాల్లో 3 సంవత్సరాలుగా ఈ రకాన్ని పరీక్షలు చేసింది. ఇది హెక్టారుకు 2,230 కిలోల దిగు బడిని ఇచ్చినట్లు తెలిపింది. ప్రాంతీయ రకాల కంటే సుమారు 13 నుంచి 27% అధిక దిగుబడి ఇచ్చినట్లు గుర్తించింది. డౌనీ బూజు, బ్లాస్ట్, స్మట్ వంటి కీలక వ్యాధి నిరోధకత కూడా ఈ రకం అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. పశు గ్రాసం కొరతకు కూడా ఈ రకం పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రి కాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు చిరుధా న్యాలు ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా సజ్జలు అధిక ఉష్ణోగ్రతలను, తక్కువ నీటి లభ్య తను తట్టుకోగల సామర్ధ్యానికి ప్రసిద్ధి చెం దాయని ఐక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి త్రీ వే సజ్జ రకం ఇక్రిసాట్ పరిశోధనల్లో మరో మెలురాయిగా నిలుస్తుందని అన్నారు.


  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోఒక విచిత్రం చోటు చేసుకుంది. జీవ శాస్త్రంలో కనీవినీ ఎరుగని రీతిలో  47 ఏళ్ల పురుషుడికి గర్భసంచి ఉన్నట్టు రిపోర్ట్‌ వచ్చింది. దీంతో ఆ వ్యక్తితోపాటు, వైద్యులూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంతకీ అసలు ఏమిటంటే...

    ఉంచెహరా నగర పంచాయతీ ఛైర్మన్ నిరంజన్ ప్రజాపతి, కడుపు నొప్పి ,  ఉబ్బరంతో  బాధపడుతూ జనవరి 13న సోనోగ్రఫీ చేయించుకున్నారు. దీంతో అతనికి కుడివైపున గర్భసంచి ఉందనీ అదీ తలకిందులగా ఉందని ఒక డయాగ్నస్టిక్ రిపోర్ట్ వచ్చింది. అయితే, అతనికి ఆసుపత్రి ఫైల్‌కు బదులుగా, ఒక వైద్య వ్యంగ్య కథకు సరిపోయే రిపోర్ట్ అందింది. దీంతో నాకు యూట్రస్‌ ఏంటి అని విస్తుపోయిన ప్రజాపతి  వైద్యులను సంప్రదించి అసలు విషయాన్ని నిర్ధారించుకున్నారు.  ఆ  తరువాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య శాఖ కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.

    ఏం జరిగిందీ అంటే..
    డయాగ్నస్టిక్ సెంటర్లోని గుమస్తా పొరపాటు కారణంగా ఈగందరగోళం నెలకింది. అతను ఒక రిపోర్ట్‌ బదులుగా, మరొకరి రిపోర్ట్‌ను అందించాడు. ఆరోగ్య సంరక్షణ  కేంద్రాల్లో ఉద్యోగుల నిర్లక్ష్యానికి అజాగ్రత్తకు సంబంధించిన ఇదొక భయంకరమైన ఉదాహరణ  అని చెప్పవచ్చు.  

    ఇదీ చదవండి: అరుదైన కానుక : రాహుల్‌ గాంధీ భావోద్వేగం, వైరల్‌ వీడియో

    ఆ రిపోర్ట్ అస్సలు నాది కాదు అంటూ తన అనుభవాన్ని  ప్రజాపతి  పంచుకున్నారు.  కొన్ని రోజులుగా కడుపులో నొప్పి వచ్చేది.. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. త రువాత మందులు తీసుకున్నా ఉపశమనం లభించలేదు. దీంతో మొదట ఉంచెహరాలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత సత్నాలో సోనోగ్రఫీ చేయించుకున్నాను. ఆ తరువాత జబల్‌పూర్‌కు వెళ్ళాను. అక్కడి డాక్టర్ ఈ రిపోర్ట్ నాది కాదని స్పష్టంగా చెప్పారని తెలిపారు.  ఈ విషయంపై సత్నాలోని ఆ కేంద్రానికి చెందిన డాక్టర్ అరవింద్ సరఫ్‌ను సంప్రదించగా, ఆయన స్పందించడానికి నిరాకరించారు. ఆయన మౌనం తీవ్రమైన నిర్లక్ష్యం ,రోగనిర్ధారణ ప్రక్రియలలో లోపాలు జరిగాయనే అనుమానాకు బలాన్నిచ్చింది.  దీనిపై  సత్నా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ శుక్లా  స్పందించారు.  సంబంధిత రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    మరోవైపు ఇలాంటి పొరపాట్లు కేవలం గుమస్తా తప్పులు మాత్రమే కావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. "తప్పుగా వచ్చిన సోనోగ్రఫీ రిపోర్ట్ చికిత్సను తప్పుదోవ పట్టిస్తుందనీ, ఇది రోగిపై మానసికంగా ప్రభావం మాత్రమే కాదు, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటే ప్రాణాంతకం కూడా కావచ్చు అంటున్నారు  సీనియర్‌ వైద్య నిపుణులు.

    ఇదీ చదవండి: మిస్‌ అయిన ఫోన్‌ దొరికితే...ఆ ఆనందం వేరే లెవల్‌!

  • రాయ్‌బరేలి: కాంగ్రెస్‌  ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరుదైన అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోని తన పార్లమెంటరీ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ఒక అభిమాని కుటుంబం రాహుల్‌ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.  ఈ అపురూప జ్ఞాపకాన్ని తిరిగి పొందడంపై రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించిన రాహుల్‌  వెంటనే దాని ఫోటోను తన తల్లి, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీతో వాట్సాప్‌లో షేర్‌ చేశారు. దీనికి సంబంధించి, అంకిత్‌ మయాంక్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

    రాహుల్‌ గాంధీ తాత, దశాబ్దాల క్రితం రాయ్‌బరేలీ మాజీ ఎంపీ ఫిరోజ్ గాంధీ పోగొట్టుకున్న పర్సును అక్కడి ఒక కుటుంబం ఇన్నాళ్లూ ఆయన జ్ఞాపకార్థం భద్రంగా దాచిందట. తాజాగా రాయ్‌బరేలీ పర్యటనలో ఉన్న ఆయన మనవడు, ఎంపీ రాహుల్ గాంధీని కలిసి ఆ పర్సును అందజేయడం విశేషంగా నిలిచింది. 

    స్థానిక కుటుంబం దశాబ్దాలుగా భద్రపరిచిన ఈ లైసెన్స్‌ను, రాయ్ బరేలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యుడు వికాస్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు తన నియోజకవర్గంలో పర్యటన రెండో రోజున గాంధీకి అందజేశారు. 

    వారు ఏమన్నారంటే.. "చాలా ఏళ్ల క్రితం, రాయ్‌బరేలిలో జరిగిన ఒక కార్యక్రమంలో, నా మామగారు ఈ డ్రైవింగ్ లైసెన్స్‌ దొరికింది.  అప్పటినుంచీ ఆయన దానిని భద్రంగా ఉంచుకున్నారు.  ఆయన మరణం తర్వాత, నా అత్తగారు దానిని భద్రపరిచారు" అని సింగ్ అన్నారు. "రాహుల్ గాంధీ రాయ్‌బరేలిని సందర్శిస్తు న్నారని తెలిసి దానిని అతనికి అందజేయడం మా బాధ్యతగా భావించాము." దీన్ని తమ కుటుంబం ఒక "అమానత్" (విలువైన ట్రస్ట్)గా దీన్ని గాంధీ కుటుంబానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించామని సింగ్ అన్నారు.

    కాగా భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇందిరా ప్రియదర్శిని గాంధీ, ఇందిరా గాంధీగా సుపరిచితులు. ఆమె ఈ దేశానికి మూడవ ప్రధానమంత్రి మరియు భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి కూడా. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ,కమలా నెహ్రూల కుమార్తె  ఇందిరా గాంధీ,ఫిరోజ్ గాంధీ 1942 మార్చి 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కొడుకులే దివంగతులు రాజీవ్‌ గాంధీ, సంజీవ్‌ గాంధీ. డిసెంబర్ 1912లో జన్మించిన ఫిరోజ్ గాంధీ 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాయ్ బరేలి సీటును గెలుచుకున్నారు. 1960  సెప్టెంబర్ 7న గుండెపోటుతో ఫిరోజ్‌ గాంధీ మరణించారు.


     

  • ఢిల్లీ: దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్లాన్‌ చేస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.  దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో, ఢిల్లీ, కశ్మీర్‌, బోర్డర్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.

    నిఘా వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్‌ చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్‌ నేమ్‌ను పెట్టుకున్నారు. పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు తెలిసింది. గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు ప్లాన్‌ చేసుకున్నారు అని తెలిపాయి. దీంతో, అలర్ట్‌ అయిన భద్రతా బలగాలు..  జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

    ఇదే సమయంలో పలువురు అనుమానితుల ఫొటోలతో ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. నిందితులు సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌, దిల్లీ, హరియాణాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు  గుర్తించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

    పోలీసుల మాక్ డ్రిల్స్
    ఉగ్ర ముప్పు నేపథ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత రద్దీగా ఉండే, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సంసిద్ధతను అంచనా వేయడానికి నాలుగు ప్రధాన మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎర్రకోట, ISBT కాశ్మీరీ గేట్, చాందినీ చౌక్, ఖారీ బావోలీ, సదర్ బజార్, మెట్రో స్టేషన్లు వంటి ప్రదేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను బలోపేతం చేయడం, అత్యవసర సమయంలో ప్రజలు, ఏజెన్సీలు ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.

  • కొద్దిరోజుల క్రితం కేరళలో బస్సులో లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి వీడియో పోస్ట్ చేసి సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారడంతో అవమాన భారంతో ఆయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేరళ పోలీసులు ఆ వీడియో పోస్ట్ చేసిన యువతిని అరెస్టు చేశారు.

    గత శుక్రవారం దీపక్(42) అనే వ్యక్తి కన్నూర్‌ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులోనే ఉన్న శింజితా ముస్తాఫా (35) అనే మహిళ తనను దీపక్ తనను అసభ్యంగా తాకాడంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్త అక్కడ వైరల్‌గా మారడంతో అవమానభారంతో ఆ దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయువకుడి తప్పేమి లేదని యువతి ఫేమస్ కావాలనే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని యువకుడు తరపు బంధువులు కేసు పెట్టారు.

    దీంతో ముస్తాఫా పరారైంది. తాజాగా ఆమెను తన బంధువుల ఇంటివద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన వీడియో ఎడిటడ్‌దని ఆ పూర్తి వీడియోని సైబర్ విభాగం రివవరీ చేసి చూస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

    ఈ ఘటనపై  గతంలో శింజితా ముస్తాఫా  స్పందిస్తూ " నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అతడు నన్ను అదేపనిగా తాకాడు. అది అపార్థంగా అనుకోకుండా జరిగింది కాదు. కావాలనే అలా చేశాడు ఇది ఖచ్చితంగా తప్పే నాకు అతను తాకడం ఇబ్బందిగా అనిపించిన తర్వాత రికార్డింగ్ చేయడం ప్రారంభించాను అయినప్పటికీ అతను తాకాడు" అని  తెలిపింది.

    అయితే ఈ వివాదం రెండురోజుల తర్వాత దీపక్ తన ఇంటివద్ద ఉరివేసుకొని చనిపోయాడు. దీంతో అతను చాలా అమాయకుడని అన్యాయంగా తన కొడుకుపై అపనింద వేశారని అతని తల్లిదండ్రులు రోదించారు. దీనిపై కేరళ మానవహక్కుల సంఘం సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్రవిచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.

     

  • కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్‌ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్‌ అనిపించు కుంటోంది. ఒకపుడు  డ్రైవింగ్‌ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్‌ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు.  స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్‌ వచ్చిందంటే.. రయ్‌ రయ్‌మని దూసుకుపోవాల్సిందే. 

    ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ,  లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉండటం విశేషం.  విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్‌ అభివర్ణిస్తున్నారు.  


    ‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మ


    కేరళలో డ్రైవింగ్‌ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు  శిక్షణ
    1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన  సమయంలోనే A2Z ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్‌మెంట్స్‌కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్‌ కరియర్‌ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది.  రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్‌లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్‌ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్‌ను పొందింది.  డ్రైవింగ్‌ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ  లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.

    ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 
    70 ఏళ్ల  వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్‌స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్‌ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని  కూడా అంటారు.

  • ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్దవ్‌ థాక్రేకు తన సోదరుడు రాజ్‌థాక్రే ఊహించని షాకిచ్చారు. పదవుల కోసం మరోసారి శివసేనను రెండుగా చీల్చిన ఏక్‌నాథ్ షిండేతో రాజ్‌థాక్రే చేతులు కలిపారు. శివసేన (యూబీటీ) బద్ద శత్రువైన షిండేతో రాజ్ థాక్రే చేతులు కలపడం మహారాష్ట్ర పాలిటిక్స్‎లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. ఈ క్రమంలో కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) మద్దతు ఇచ్చింది. అయితే.. స్థానిక ఎంఎన్ఎస్ నాయకుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కళ్యాణ్-డోంబివిలి ప్రాంతంలో అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా షిండే నేతృత్వంలోని శివసేనకు మద్దతు ఇవ్వాలనే నిర్ణయం స్థానిక నాయకత్వం తీసుకుందని ఆ పార్టీ తెలిపింది. 122 మంది సభ్యులు ఉన్న కళ్యాణ్‌-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50, షిండే సేనకు 53, ఎంఎన్ఎస్‌కు 05, ఉద్ధవ్ థాక్రే శివసేన యూబీటీ 11 స్థానాలను గెలుచుకుంది. కేడీఎంసీని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 62 కావాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయి.

    బీజేపీకి నో చాన్స్‌..
    అయితే, శివసేన-బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేయర్ పదవుల్ని దక్కించుకోవడానికి పొరాడుతున్నాయి. బుధవారం కొంకణ్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, శివసేన ఎంపీ మరియు ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, రాజ్‌థాక్రే పార్టీతో పొత్తును ధృవీకరించారు. ఇది వారి బలాన్ని 58కి పెంచుతుంది. ఉద్ధవ్ వర్గం నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు ఈ కూటమిలో చేరవచ్చని శ్రీకాంత్ చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా చేసింది. మరోవైపు.. ఎంఎన్ఎస్ నిర్ణయంపై ఉద్ధవ్ థాక్రే ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.  

    ఉద్దవ్‌ వర్గానికి ఎదురుదెబ్బ!
    ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో రాజకీయం ఎప్పుడు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మున్సిపల్‌ ఎన్నికలకు ముందు 20 ఏళ్ల ఈగోను పక్కన బెట్టి థాక్రే సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. థాక్రే బ్రదర్స్ రీయూనియన్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. వీరి కలయిక మాత్రం రెండు పార్టీల కేడర్‎లో నూతనోత్తేజాన్ని నింపింది. కానీ, ఎన్నికలు ముగిసి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రాజ్‎థాక్రే ఇలా ట్విస్ట్‌ ఇవ్వడం ఉద్దవ్‌ వర్గానికి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు.

  • ఢిల్లీ వాయుకాలష్యంపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాయుకాలుష్యం తీవ్రముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కాలుష్య సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని, నాలుగు వారాల్లో ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    రాజధాని నగరంలో గాలి కాలుష్య నివారణకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ బోర్డు కీలక ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించింది. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాలే ప్రధాన కారణమని తెలిపింది. కనుక అధిక కాలుష్యాన్ని కలిగింపజేసే వాహనాలను దశలవారిగా తొలిగించాలని AQMB కోర్టుకు తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు విధానాలను సవరించాలని పేర్కొంది. పాత వాహనాలను మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహాకాలు అందించాలని తెలిపింది.

    అంతేకాకుండా ప్రస్తుతమున్న మెట్రో నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాలని AQMB కోర్టుకు నివేదించింది. అయితే ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ బోర్డు ప్రతిపాదనలు విన్న కోర్టు వాటిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.

     

     

  • స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేనిదే రోజుగడవని పరిస్థితి. అంత అలవాటైపోయిన మొబైల్‌ పోగొట్టుకుంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దాని మీద ఆశలు వదిలేసు కుంటాం. కానీ పోయిందనుకున్న ఫోన్‌  అనూహ్యంగా మళ్లీ మన చేతికి వస్తే భలే ఆనందంగా ఉంటుంది కదా. సరిగ్గా ఒక మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ  ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియో  ఒకటి నెట్టింట తెగ సందడి  చేస్తోంది.

    టీవల చెత్తలో దొరికిన 45 లక్షల బంగారం, కార్మికురాలు నిజాయితీగా తిరిగి వచ్చిన వైరల్‌ అయింది. ఇది కూడా అలాంటి హృదయానికి హత్తుకునే ఘటన లాంటిదే. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ రఘు అహిర్వర్ ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. దీని ప్రకారం తాను, తన సోదరితో కలిసి గ్రామం నుండి ఇండోర్‌కు ప్రయాణిస్తున్నప్పుడు, సోదరి ఒక మొబైల్‌ను గుర్తించింది. అదృష్టవశాత్తూ అన్‌లాక్‌లోనే ఉంది. దీంతో వారు  కాల్‌లిస్ట్‌లోకి వెళ్లి లాస్ట్‌ కాల్‌ చేసిన నంబరుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అహిర్వర్ ఫోన్‌ పోగొట్టుకున్నమహిళను కలుసుకుని, ఆమెకు ఫోన్‌ను తిరిగి ఇచ్చాడు. దీంతో ఆమె తెగ సంతోష పడిపోయింది. పదే పదే అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అహిర్వర్‌కు బదులుగా, వేరే ఎవరికికైనా దొరికితే తన ఫోన్‌ తన చేతికి తిరిగి వచ్చేది కాదంటూ భావోద్వేగానికి లోనైంది.

     ఫోన్‌ అన్‌లాక్‌లో ఉండటం చూస్తే పాపం.. వారికి ఫోన్‌ టె​క్నాలజీ గురించి తెలియదని అర్థం అయిపోయిందని, వెంటనే వారికి ఫోర్‌ చేశామని అహిర్వర్‌ పేర్కొన్నారు. ‘‘దేవుడు మనకు ఈ మొబైల్ ఇవ్వడం మంచిది" అనే క్యాప్షన్‌తో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలను దక్కించుకుంది. అతని నిజాయితీ  పలువురి హృదయాలను గెలుచుకుంది."ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే, ప్రపంచం మెరుగుపడుతుంది" అని ఒకరు, విలువైన వస్తువులను తిరిగి ఇవ్వడం గ్రేట్‌ బ్రో అని ఒకరు, "నిజ జీవిత హీరో" అని మరికొందరు వ్యాఖ్యానించడం విశేషం.

     

  • ప్రస్తుత ఏఐ కాలంలో  నిజమైన సమాచారం ఏదో.. అసత్యమో ఏదో.. తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. డీప్‌ఫేక్ పుణ్యమా అని సెలబ్రేటీల మార్ఫింగ్ వీడియోలు చాలా వస్తున్నాయి. అయితే రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సైతం డీప్‌ ఫేక్ బాధితురాలిగా మారింది. వివిధ ఈ కామర్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా తాను చెబుతున్నట్లు వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయని అవి నమ్మద్దని తెలిపింది.

    సుధామూర్తి మాట్లాడుతూ "నేను మిమ్మల్ని అలర్ట్ చేద్దామనుకుంటున్నాను ఆన్‌లైన్‌లో నా ముఖచిత్రంతో  ఫేక్‌ వీడియోస్ సర్యూలేట్ అవుతున్నాయి. వివిధ ఆర్థిక సంబంధమైన వ్యవహరాల్లో నేను పెట్టుబడి పెట్టమన్నట్లు ప్రచారం జరుగుతుంది. 200 డాలర్లు లేదా 20 వేల రుపాయలు పెట్టుబడి పెడితే 10 రెట్లు డబ్బు తిరిగి వస్తుందని అందులో ఉంది. అది నేను ప్రచారం చేసిన వీడియో కాదు పూర్తిగా అబద్ధం" అని సుధామూర్తి అన్నారు.

    తన పేరుతో ప్రచారం జరగడంతో చాలా మంది పెట్టుబడి పెట్డి నష్టపోయినట్లు తెలిపారు. తానేప్పుడు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లడలేదని కేవలం పని గురించి మాత్రమే మాట్లాడానని సుధామూర్తి అన్నారు. కనుక దయచేసి ఆ ప్రకటనను నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితమే. ఆమె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రముఖ సాప్టేవేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా ఆమె పనిచేశారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు. 

    కాగా, ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ)  ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్‌, కారుమూరి సునీల్‌, కార్యకర్తలు హాజరయ్యారు. 

    ఇదీ చదవండి:

    ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్‌ జగన్‌

  • తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మంద సాల్మన్‌ హత్యపై న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్‌రెడ్డి. సాల్మన్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్న కాసు మహేష్‌రెడ్డి,..ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం సాగుతుందన్నారు. ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ) సాల్మన్‌ కుటుంబ సభ్యులతో కలిసి మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డిని కాసు మహేష్‌రెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కాసు మహేష్‌రెడ్డి. 

    ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

    న్యాయ పోరాటం చేస్తాం
     మంద సాల్మన్‌ కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. వచ్చే ఆదివారం పిన్నెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో సాల్మన్‌ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు హాజరై నివాళులు అర్పిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించాల్సింది పోయి టీడీపీ నాయకుల అరాచకాలకు వంత పాడుతున్నారు. సాల్మన్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ పోరాడుతుంది. అందుకోసం న్యాయస్థానాలతో పాటు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), జాతీయ ఎస్సీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తాం. 

    సాల్మన్‌పై దాడి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చూపిన పోలీసులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపు మా ప్రభుత్వం వచ్చాక, వారిని కచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తాం.

    పిన్నెల్లిలో టీడీపీ అరాచకం
    రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతోనే, ఆ పార్టీ నాయకుల అరాచకాలకు భయపడి పిన్నెల్లిలో దాదాపు 300 కుటుంబాలకు చెందిన వెయ్యి మందికి పైగా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 9 వేల మంది జనాభాతో ప్రశాంతంగా ఉన్న పిన్నెల్లి గ్రామాన్ని శ్మశానంగా మార్చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి వచ్చిన మంద సాల్మన్‌ మీద ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. దారుణంగా చంíపడమే కాకుండా స్వగ్రామంలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకోవాలని చూశారు. 

    టీడీపీ చేస్తున్న అరాచకాల కారణంగా గ్రామాల్లో పనులు లేక వలసలు పెరిగిపోతున్నా, దీన్ని అడ్డుకుని శాంతి నెలకొల్పాలన్న ఆలోచన సీఎం చంద్రబాబు చేయడం లేదు. వ్యాపారులు కూడా గ్రామంలో ఉండటానికి భయపడిపోతున్న భయంకరమైన పరిస్థితులు పిన్నెల్లిలో నెలకొన్నాయని కాసు మహేష్‌రెడ్డి వివరించారు.

    	Kasu Mahesh: త్వరలో పిన్నెల్లికి జగన్

    గ్రామంలో శాంతి నెలకొనాలి
    కక్షలు, దాడులతో గ్రామం అభివృద్ధి చెందదు. మంద సాల్మన్‌ హత్య మా గ్రామంలో చివరి హత్యగా మిగిలిపోవాలి. పగలు ప్రతీకారాలతో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునే సంస్కృతికి ఇక్కడితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. ఇకనైనా హత్యా రాజకీయాలు విడనాడాలని అధికార పార్టీని వేడుకుంటున్నా. శాంతి చర్చల ద్వారా గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం రావాలనేది మా ఆకాంక్ష. అందుకే ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు కలగ జేసుకుని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలి. మా అన్న సాల్మన్‌ హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలి.
    -మంద అన్నోజిరావు. మంద సాల్మన్‌ తమ్ముడు

    ఇదీ చదవండి:

    వైఎస్‌ జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు

     

     

     

     

Politics

  • ఢిల్లీ: తాను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఖండించారు. తాము సోదరులుగా ఉంటామని, ఇద్దరం కూడా సంక్షేమం పనులు చేయడానికి ఉన్నామన్నారు.  ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేసినట్లు ఎవరో కావాలని క్రియేట్‌ చేశారన్నారు. అల్లాపూర్‌లో కొన్ని శంకుస్థాపనలు జరిగే సమయంలో ఎమ్మెల్యే విజయుడు, తాను కలిసి కొన్నికార్యక్రమాలు నిర్వహించామన్నారు.  ‘నేను, ఎమ్మెల్యే,ప్రోటోకాల్ పాటిస్తూనే కార్యక్రమాలు నిర్వహించాం. 

    నేను ఎమ్మెల్యే విజయుడుపై దాడి చేయలేదు, అలాంటి ఉద్దేశ్యం నాకు లేదు. మేము ఇద్దరం దళితులం. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారు. ఎల్లుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం ఉంది మళ్ళీ అక్కడ కలుస్తున్నాం. ఎమ్మెల్యే విజయుడు నాకు ఇంతకు ముందు ఫోన్ చేసి టీవీలో ఏమో వస్తుంది నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కొందరు దిన్ని రాజకీయం చేస్తున్నారు. ఎమ్మెల్యే, నేను అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము. ప్రజలు నన్ను గెలిపించారు నేను ఎంపీని అయ్యాను. అప్రజాస్వామ్యంగా నేను ఎప్పుడూ వ్యవహరించలేదు’అని స్పష్టం చేశారు. 

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటరిచ్చారు.

    కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ స్పందిస్తూ..‘కిషన్ రెడ్డి పలుకులు బీఆర్ఎస్ నేతలవి. కేటీఆర్, హరీష్ దారిలో కిషన్ రెడ్డి ఉన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కదా విచారణ జరపమనండి.. ఎవరు వద్దన్నారు. టెండర్ల అవకతవకలపై  చర్చకు రండి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే  నిజాలపై చర్చకు రండి. గత బీఆర్ఎస్ హయంలో అవకతవకలపై దర్యాప్తు అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పారదర్శకత వచ్చింది’ అని వ్యాఖ్యలు చేశారు.

    ఇదిలా ఉండగా.. అంతకుముందు కిషన్‌ రెడ్డి టెండర్ల విషయమై సంచలన ఆరోపణలు చేశారు. కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్‌ చూస్తోంది. సింగరేణి బొగ్గు ​క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారని అన్నారు. 

  • తాడేపల్లి : దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు బేతాళ కథలు వినిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ విమర్శించారు. వారు తెచ్చే పరిశ్రమల సంగతి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉందని మండిపడ్డారు. పనిలో పనిగా ట్రంప్‌ స్వయంగా వచ్చి చంద్రబాబును కలిశారని కూడా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు శైలజానాథ్‌. అసలు ఇప్పటివరకూ చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి ఎ‍న్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు.  ఈరోజు( బుధవారం, జనవరి 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. ఎంవోయూల కోసం వచ్చేదంతా టీడీపీ ఏర్పాటు చేసిన మనుషులేనని స్పష్టం చేశారు. 

    ‘ వాళ్ళ కోటు రంగులు మారతాయే కానీ కంపెనీలు మాత్రం రావు. చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. ఏమైనా అడిగితే పెట్టుబడుల కోసం కాదు.. బ్రాండ్ వాల్యూ పెంచటం కోసం వెళ్తున్నామని లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.  ఆర్ఎంజెడ్ సంస్థతో లక్ష ఒప్పందం కుదుర్చుకున్నామని.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అసలు లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తుంది?, లక్ష ఉద్యోగాలు ఆ సంస్థ ఇవ్వకుంటే ఏం చేయాలి?, అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ ఏర్పాటు చేస్తాం అన్నారు. 

    దొనకొండలో డ్రోన్స్ యూనిట్ అన్నారు. వారు చెప్పిన ఏ ఒక్క కంపెనీ కనిపించటం లేదు. వీటి ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదు. చంద్రబాబు, వారి మంత్రులు తిరిగే ప్రత్యేక హెలికాఫ్టర్ల ఖర్చుతో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. దేనికి ఖర్చు పెట్టారో కూడా లెక్కలు లేవు. గత ప్రభుత్వ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో 90 శాతం గ్రౌండ్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో దక్షిణ భారత దేశంలో సేవారంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం సాధించాం. చంద్రబాబు పరిశ్రమల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములు మొత్తం ప్రజలవే. దావోస్ వెళ్ళినా కూడా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు.

    బాబు, లోకేష్ దావోస్ టూర్‌పై శైలజానాథ్ అదిరిపోయే సెటైర్లు
  • సాక్షి, ఢిల్లీ: సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ తరహాలోనే పనిచేస్తోందన్నారు. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. ఎక్కడా లేని సైట్ విజిట్ అనే కొత్త నిబంధన పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ అనేక సమస్యల్లో కూరుకుపోయింది. కేంద్రానికి సింగరేణిలో 49 శాతం వాటా ఉన్నా నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక పనులు ఎందుకు ఆలస్యం చేశారు?. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు కోసం కేంద్రం నైనీ కోల్ బ్లాక్‌ను సింగరేణికి అప్పగించింది. టెండర్లను ఆహ్వానించి వాటిని రద్దు చేశారు. దేశంలో ఎన్నో టెండర్లు నిర్వహిస్తుంటాం.. కానీ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒడిషాలో బీజేపీ వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించాను.

    నేను సింగరేణికి 683 ఎకరాల అటవీ భూమిని అప్పగించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒప్పించాను. టెండర్ల విషయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదికలు వస్తున్నాయి. రాష్ట్ర పెద్దల ఆదేశంతోనే ఇది జరిగింది. దేశంలో అనేక గనులను కేంద్రం పారదర్శకంగా వేలం నిర్వహిస్తోంది. తెలంగాణ చేతిలో ఒక్క నైనీ కోల్ బ్లాక్ పెడితే అక్రమాలకు తెర లేపారు. ఈ వివాదంలోకి నన్ను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 32వేల కోట్ల బకాయి పడింది. గతంలో బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ సింగరేణిని వాడుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ లాగే కాంగ్రెస్‌ పనిచేస్తోంది. సింగరేణిని బంగారు బాతుగా కాంగ్రెస్‌ చూస్తోంది. 12 ఏళ్లుగా నైనీ బ్లాక్‌ విషయంలో సమస్యలు సృష్టిస్తున్నారు. సీబీఐ అనుమతి కోరుతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. బీఆర్‌ఎస్‌ హయాంలోనూ అనేక అక్రమాలు జరిగాయి. సింగరేణి బొగ్గు ​క్వాలిటీ పడిపోయింది. దీనిపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సింగరేణిని కలుషితం చేశాయి. సింగరేణి భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఉంది. అనేక జిల్లాలో సింగరేణి భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి నచ్చిన విధంగా వారికి భూములు ఇస్తున్నారు. 

    అవినీతి, అక్రమాలతో సింగరేణిని నాశనం చేయవద్దు. సింగరేణిలో ఒక్క అధికారిని కూడా బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదు. సింగరేణి సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సింగరేణి అన్ని వ్యవహారాలపై దర్యాప్తు జరగాలి. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తే పరిశీలిస్తాం. మంత్రుల మధ్య వాటాల తేడా వల్లే నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు జరిగింది. సైట్ విజిట్ నిబంధన పెట్టాలనే విషయం కేంద్రానికి తెలియదు. దేశవ్యాప్తంగా సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన ఉంటే.. ఇక్కడ మాత్రం వేరుగా పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే లాభాల్లోకి తీసుకువస్తాం అని అన్నారు. 

Family

  • కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వ‌చ్చినప్పుల్లా యూపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతుండ‌డం ఇటీవ‌ల కాలంలో చూస్తున్నాం. ఐఫోన్‌ను ముందుగా ద‌క్కించుకోవ‌డానికి దుకాణాల ముందు యాపిల్ అభిమానులు గంట‌ల త‌ర‌బ‌డి వేచివుంటారు. ఇంకా కొంత‌మంది అయితే ఏకంగా తెల్ల‌వారుజాము నుంచే స్టోర్ల ముందు ప‌డిగాపులు కాస్తుంటారు. తాజాగా ఇలాంటి దృశ్యాలు ఇండియ‌న్ సిలికాన్‌వ్యాలీలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. అదేంటి.. కొత్త ఐఫోన్ ఏదీ మార్కెట్‌లోకి రాలేదు క‌దా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?. ఈ క్యూ ఐఫోన్ల కోసం కాదు.. మ‌రి దేనికోసం?

    బెంగ‌ళూరులోని ఓ దుకాణం ముందు మ‌హిళ‌లు పెద్ద ఎత్తున క్యూ క‌ట్టిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వారంతా తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే షాపు ముందు వేచివున్న‌ట్టు తెలుస్తోంది. చీరల కోసం వీరు ఇలా లైన్లో నిల‌బ‌డ్డార‌ని తెలిసి జ‌నం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే అవేమి ఉచితంగా ఇచ్చేవో, స‌గం ధ‌ర‌కు అమ్మేవో కాదు.. చాలా ఖ‌రీదైన ప‌ట్టు చీర‌లు. ఏంటీ.. అంతేసి డ‌బ్బులు పెట్టి కొనే కాస్ట్లీ సారీలను ద‌క్కించుకునేందుకు ఇంత క‌ష్ట‌ప‌డాలా అని జనం నోరెళ్ల‌బెడుతున్నారు. విష‌యం పూర్తిగా తెలిస్తే మీరు కూడా క్యూ క‌డ‌తారు!

    మైసూరు ప‌ట్టు చీర‌ల‌ను ద‌క్కించుకునేందుకు మ‌హిళలంతా క‌ర్ణాట‌క సిల్క్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ (కేఎస్ఐసీ) షోరూం ముందు మంగ‌ళ‌వారం ఇలా క్యూ క‌ట్టారు. లైన్లో వేచివున్న మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా స్టూల్స్ కూడా వేశారు. ఒక్క చీర‌నైనా ద‌క్కించుకోవాల‌న్న‌ట్టుగా మ‌హిళ‌లు ఎదురుచూస్తున్నారు. ఈ దృశ్యాలున్న వీడియోను రాకేశ్ కృష్ణన్ సింహ అనే వ్య‌క్తి 'ఎక్స్‌'లో షేర్ చేశారు. రూ.23 వేల నుంచి రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌రీదు చేసే మైసూరు ప‌ట్టుచీర‌ల కోసం మ‌హిళ‌లు తెల్ల‌వారుజాము నుంచే కేఎస్ఐసీ షోరూం ముందు వేచివున్నార‌ని తెలిపారు. క్యూలో ఉన్న‌వారికి టోకెన్లు కూడా ఇస్తున్నారని, టోకెన్ ఉన్న‌వారిని మాత్ర‌మే దుకాణం లోప‌లికి అనుమ‌తిస్తార‌ని 'క‌న్న‌డ‌ప్ర‌భ' తెలిపింది. అంద‌రికీ చీర‌లు ద‌క్కాల‌న్న ఉద్దేశంలో ఒక్కొక్క‌రికి ఒకటి మాత్ర‌మే విక్ర‌యిస్తార‌ని వెల్ల‌డించింది.

    కేఎస్ఐసీ (KSIC) మాత్ర‌మే అస‌లు సిస‌లైన మైసూరు సిల్క్ సారీల‌ను త‌యారు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధీకృత త‌యారీ హ‌క్కులు, జీఐ ట్యాగ్ రైట్స్.. ఇది క‌లిగివుంది. దీంతో కేఎస్ఐసీ శిక్ష‌ణ ఇచ్చిన వారు మాత్ర‌మే మైసూరు ప‌ట్టు చీర‌ల‌ను నేస్తుండ‌డంతో డిమాండ్‌కు త‌గిన‌ట్టుగా స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోతోంది. అందుకే త‌మ దుకాణానికి వ‌చ్చిన వారికి ఒక్కొక్క‌రికి ఒక చీర మాత్ర‌మే విక్ర‌యిస్తోంది. నాణ్య‌త‌లో ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఒరిజిన‌ల్ ప‌ట్టుచీర‌ల‌ను త‌యారు చేస్తోంది కాబ‌ట్టే మ‌హిళ‌లు కేఎస్ఐసీ దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఒరిజిన‌ల్‌ బ్రాండ్ వ్యాల్యూకు ఉండే క్రేజ్ అలాంటిది మ‌రి!

    నెటిజ‌న్ల స్పంద‌న‌..
    ''కొత్త ఐఫోన్ల కోసం ఆపిల్ స్టోర్ల ముందు మ‌గాళ్లు 12 గంట‌లు ముందుగానే క్యూ క‌ట్ట‌డం మామూలు విష‌యం. కానీ చీరల కోసం మ‌హిళ‌లు క్యూలో వేచివుండ‌డం ఆస‌క్తిక‌రం.''

    ''కొత్త ఐఫోన్ లాంచ్ అయినప్పుడు ఆపిల్ షోరూమ్‌ల వెలుపల కూడా ఇలాంటి దృశ్యాలే క‌న్పిస్తుంటాయి. అంటే ఆ ఫోన్‌ల కొరత ఉందని కాదు. ఐఫోన్ కోరుకునే ప్రతి ఒక్కరూ చివ‌ర‌కు దాన్ని ద‌క్కించుకుంటారు. చీర కోసం 23 వేల రూపాయ‌లు ఖర్చు చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్నారంటే.. వారంతా బాగా డ‌బ్బున్న‌ ఉన్నవారే అయుంటారు.''

    ''ప్రైవేటు దుకాణాల కంటే కేఎస్ఐసీ నాణ్య‌త‌పై న‌మ్మ‌కంతోనే మ‌హిళ‌లు ఇక్క‌డ ప‌ట్టు చీర‌లు కొనేందుకు వ‌స్తున్నారు.''

    చ‌ద‌వండి: కారును లాగే కొండ‌.. ఎక్క‌డుందో తెలుసా?

  • సూపర్‌మార్కెట్‌ షెల్ఫ్‌ నుంచి ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పాకెట్‌ తీసుకొని న్యూట్రీషన్‌ ఫ్యాక్ట్స్, రెగ్యులేటరీ సింబల్స్, చిన్న చిన్న డిస్కైమర్‌లు చూడడం అనేది సాధారణ విషయం. అయితే ఈ సాధారణ దృశ్యం వెనుక పెద్ద కష్టమే ఉంది. బ్రాండ్‌ల ‘లేబులింగ్‌’ వెనక కనిపించని కష్టం ఎంతో ఉంది. మన దేశంలో ప్యాకేజ్డ్‌–ఫుడ్‌ మార్కెట్‌ విస్తృతమవుతున్న రోజుల్లో ‘లేబులింగ్‌’ ప్రక్రియ మాత్రం నత్తకు క్లోజ్‌ఫ్రెండ్‌లా స్లోగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ‘లేబులింగ్‌’ ప్రక్రియను స్పీడెత్తించడానికి ‘లేబుల్‌బ్లైండ్‌’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించింది న్యూట్రీషన్‌ ఎక్స్‌పర్ట్‌ రషీద వాపీవాలా...

    మన దేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మార్కెట్‌ వృద్ధి చెందినప్పటికీ, లేబులింగ్‌ విషయంలో మాత్రం పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. తప్పులు లేకుండా ‘లేబులింగ్‌’ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయడం సమస్యగా ఉండేది. 

    ఈ నేపథ్యంలోనే పోషకాహార నిపుణురాలు రషీదా వాపివాలా ‘లేబుల్‌బ్లైండ్‌’ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రీషన్‌లో మాస్టర్స్, ఆ తరువాత పీహెచ్‌డీ చేసిన రషీద హెల్త్‌ టోటల్, డైట్‌ ఫర్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలలో పనిచేసింది.

    ఫుడ్‌ రేటింగ్‌తో మొదలై...
    స్థిరమైన కార్పొరేట్‌ కెరీర్‌ను వదులుకొని కొత్తదారి ఎంచుకోవాలనుకోవడం కొందరికి రిస్క్‌. అయితే రషీద మాత్రం రిస్క్‌ అనుకోలేదు. ‘ఆహారం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూశాను. అదే సమయంలో లేబుల్స్‌తో వినియోగదారులు ఎలా గందరగోళానికి గురవుతున్నారో చూశాను. 

    సమాచారానికి సంబంధించి కంపెనీలు, వినియోగదారులు స్పష్టతతో ఉండాలని నమ్ముతాను’ అంటున్న రషీద ముంబై కేంద్రంగా ‘లేబుల్‌బ్లైండ్‌’ను ఫుడ్‌ రేటింగ్‌ వెబ్‌సైట్‌గా ప్రారంభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ‘లేబుల్‌ బ్లైండ్‌’ పనితీరును గుర్తించి ప్యాక్‌ లేబులింగ్‌ నియమాలను తెలియజేసే ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ హోదా ఇచ్చింది.

    ఫోల్‌సోల్‌
    ‘ప్రిన్సిపల్‌ ఇవ్వెస్టిగేటర్‌’ అవకాశంతో రషీదకు మన దేశంలోని పెద్ద ఫుడ్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పెద్ద కంపెనీలలో కూడా డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఊపందుకోక΄ోవడాన్ని గమనించిన రషీద ‘ఫోల్‌సోల్‌’కు శ్రీకారం చుట్టింది. ఇది ‘లేబుల్‌బ్లైండ్‌’కు సంబంధించిన క్లౌడ్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌. ఫుడ్‌ లేబులింగ్‌ ప్రక్రియను సులభతరం చేసింది. ఒకప్పుడు ఈ ప్రక్రియకు వారాలు, నెలల సమయం తీసుకునేది. 

    ‘60 నుంచి 100 సెకన్‌లలో మా ఏఐ సాధనాలు నివేదికను రూపొందిస్తాయి’ అంటుంది రషీద. డైరీ, బేకరి, స్నాక్స్‌...మొదలైన విభాగాలలో ‘లేబుల్‌బ్లైండ్‌’ పనిచేస్తోంది. 2021 నుంచి 2023 మధ్య మెనూలేబులింగ్‌కు సంబంధించి రెస్టారెంట్లు, హోటల్స్, క్విక్‌–సర్వీస్‌ రెస్టారెంట్‌(క్యూస్‌ఆర్‌)లతో కలిసి పనిచేసింది. 2023 నుంచి 2024 మధ్య కాలంలో కంపెనీ అంతర్జాతీయంగా విస్తరించింది. వేగవంతమైన, కచ్చితమైన, ప్రపంచవ్యాప్త నిబంధనలకు అనుగుణంగా ఉండే లేబులింగ్‌ కోసం చూస్తున్న కంపెనీలకు ‘ఫోల్‌సోల్‌’ ఒక కీలక సాధనంగా మారింది.

    డైనమిక్‌ లేబుల్స్‌
    మొదట్లో సవాళ్లు ఎదురైనా నైపుణ్యం ఉన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవడంలో, కంపెనీని విజయపథంలో నడిపించడంలో విజయం సాధించింది రషీద. స్టాటిక్‌ ప్యాకేజింగ్‌కు మాత్రమే కంపెనీ పరిమితమైపోలేదు. ఎన్నో కొత్త ఫీచర్‌లను ఆవిష్కరించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూఆర్‌–బేస్డ్‌ డైనమిక్‌ లేబుల్స్‌ను ఆవిష్కరించింది. ఎగుమతికి సంబంధించిన వివరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాల సమాచారం, మాన్యుఫ్యాక్చర్‌ డేటా అప్‌డేట్‌ చేయడానికి బ్రాండ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.  

    పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకొని...
    ప్రారంభదశలోనే టాటా స్టార్‌బక్స్, ఐటీసీ హోటల్స్, టిమ్‌ హోర్టన్స్‌ ఇండియాలాంటి పెద్ద కంపెనీల నమ్మకాన్ని గెల్చుకుంది లేబుల్‌బ్లైండ్‌. మెనూ–లేబులింగ్‌ సోల్యూషన్స్‌కి సంబంధించి ఈ కంపెనీలు ఇప్పటికీ ‘లేబుల్‌బ్లైండ్‌’ యాక్టివ్‌ యూజర్‌లుగా ఉన్నాయి. ప్యాకేజ్డ్‌–ఫుడ్‌ క్లయింట్‌లలో బికానో, బికనేర్‌వాలా, ఎవరెస్ట్‌ స్పైసెస్, మదర్‌ రెసీపీ(దేశాయ్‌ బ్రదర్స్‌), గోల్టి మసాలా, థియోబ్రొమా...మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ‘లేబుల్‌బ్లైండ్‌’ నలభైకి పైగా భారతీయ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. వీటిలో ఎక్కువ కంపెనీలు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా...మొదలైన దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తాయి.

    తొలి రోజుల్లో సవాళ్లు
    తొలి అడుగులు వేస్తున్న కాలంలో కంపెనీకి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఫుడ్‌ రెగ్యులేషన్స్‌కు సంబంధించి సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడం, సరిౖయెన టీమ్‌ను తయారుచేసుకోవడం కాస్త కష్టం అయింది. మన దేశ నియమాలకు, ఇతర దేశ నియమాలకు తేడా ఉంటుంది. ‘సాంకేతికత, ఆహారనియంత్రణ అనే రెండింటిలోనూ నైపుణ్యం కలిగిన వ్యక్తులను కనుగొనడం కష్టంగా అనిపించింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది రషీద. 

  • నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కి వెళ్ళగా నాకు ఒక అరుదైన జబ్బు ఉందనీ, దానికి చికిత్సగా నామీద ప్రయోగాత్మకంగా కొన్ని మందులు వాడితే పనిచేయవచ్చునని చెప్పారు. అంతేకాదు, ఆ మందులు నామీద ప్రయోగించడానికి ఉచిత వైద్యం చేస్తాం అని చెప్పారు. నేను పెద్దగా చదువుకోలేదు. దాంతో వారి మాటలను గుడ్డిగా నమ్మాను. వారు నాతో తియ్యగా మాట్లాడుతూ ప్రతివారం నాకు కొన్ని కొత్త మందులు ఇచ్చేవారు. అంతేకాదు, హాస్పిటల్‌కి వెళ్లడానికయ్యే ఖర్చులు కూడా ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నాకు నొప్పి ఎక్కువ అవడంతో వేరే డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. 

    కిడ్నీలలో సమస్య మొదలైంది అని చెప్పి నేను వాడుతున్న మందులు మొత్తం పరిశీలించి వాటిని వెంటనే ఆపేయమని చెప్పారు. కొన్ని నెలల తర్వాత నాకు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. అందుకు ఆ హాస్పిటల్‌ వాళ్లు నా మీద ప్రయోగించిన మందులే కారణమని తేలింది. ఇదేమిటని సదరు ఆస్పత్రి వారిని ప్రశ్నిస్తే– ‘నువ్వు మాకు అంగీకార పత్రం ఇచ్చావు కదా.. మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని’ నన్నే బెదిరించారు. అది నేను అంగీకరించే చేశాను కాబట్టి నాకు ఎటువంటి పరిష్కారం లేదంటారా? 
    – రవి, హైద్రాబాద్‌ 

    మీ మీద ప్రయోగించిన మందులు ఒకవేళ ఆ ప్రైవేట్‌ హాస్పిటల్‌ వాళ్ళు నిర్దేశించిన ప్రమాణాలు, ఎథిక్స్‌ కమిటీ (నైతిక కమిటీ) ఆమోదం పొంది, తగిన జాగ్రత్తలు తీసుకొని – మీ పూర్తి అంగీకారం, అలాగే మీతో పాటుగా ఎవరైనా కుటుంబ సభ్యులు గానీ – సన్నిహితుల వద్ద కానీ పొంది తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయోగించవచ్చు. అది కూడా ఒకవేళ మీకు ప్రాణాపాయం ఉంది అనుకుంటే వెంటనే ఆపేయవలసి ఉంటుంది. మీరు పెద్దగా చదువుకోలేదని చెప్తున్నారు కాబట్టి మీ హాస్పిటల్‌ రికార్డులు మొత్తం తీసుకుని ఎవరైనా చట్టం తెలిసిన వారితో కలిసి రాష్ట్ర వైద్యమండలి (మెడికల్‌ కౌన్సిల్‌) లో ఫిర్యాదు చేయవచ్చు. 

    అలాగే మీకు జరిగిన నష్టానికి గాను పూర్తి పరిహారం చెల్లించవలసిందిగా కోరుతూ మీరు సివిల్‌ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అందుకు తగిన పత్రాలు ఏం కావాలో దగ్గర్లోని న్యాయనిపుణులను కలిస్తే వారు మీకు సూచిస్తారు. అంతేకాకుండా ఇందులో ఏదైనా నేర దృక్పథం ఉంటే కూడా తగిన క్రిమినల్‌ చట్టాల కింద కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. పూర్తి వివరాలతో న్యాయ నిపుణుల – వైద్య నిపుణుల సలహా తీసుకుంటే పరిష్కారం లేకపోలేదు.
    – శ్రీకాంత్‌ చింతల,హైకోర్టు న్యాయవాది
    (మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

    (చదవండి: కొంపముంచిన వెయిట్‌లాస్‌ టిప్‌..! పాపం ఆ విద్యార్థిని..)


     

  • గత ఆర్థిక సంవత్సరం ఊపిరితిత్తుల కేన్సర్‌కి సంబంధించి ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు రెట్టింపయ్యాయి, చికిత్స వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా గుర్తించడం, నివారించడం, ఆర్థికంగా సన్నద్ధంగా ఉండటానికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

    భారతదేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్ ప్రజలపై చూపుతున్న ప్రభావం గురించి టాటా ఏఐజీకి వచ్చిన క్లెయిమ్స్ గణాంకాల్లో కీలకాంశాలు వెల్లడయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఊపిరితిత్తుల కేన్సర్‌ సంబంధిత బీమా క్లెయిమ్‌ల సంఖ్య, అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే రెట్టింపయ్యింది. దీనితో పాటు ఆసుపత్రిలో చికిత్స వ్యయాలు 27 శాతం మేర పెరిగాయి. చికిత్స మరింత ఖరీదైనదిగా మారడాన్ని, కేన్సర్ బాధితుల కుటుంబాలకు ఆర్థికంగా పెనుభారం అవుతున్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.

    “ఊపిరితిత్తుల కేన్సర్ అనేది ప్రస్తుతం అరుదైన ముప్పుగా ఉండటం లేదు. వైద్యంపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండివిడ్యువల్ క్లెయిమ్‌లు లక్షల స్థాయిలో, కొన్ని సందర్భాల్లో రూ. 50 లక్షలకు పైగా కూడా వస్తుండటాన్ని మేము చూస్తున్నాం. స్టాండర్డ్‌గా ఉండే రూ. 5 లక్షలో లేదా రూ. 10 లక్షల పాలసీల్లాంటివి, కుటుంబాలకు ఎంతో అవసరమైన సందర్భాల్లో సరిపోని పరిస్థితి నెలకొనవచ్చు. 

    బీమా ఉంటే సరిపోదు. వైద్యానికి సంబంధించి నేటి వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా సరైన కవరేజీ ఉండాలి. ఎలాంటి ముందస్తు హెచ్చరికా లేకుండా దాడి చేసే ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కొనేలా ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండే క్రమంలో బీమాను పునఃమదింపు చేసుకునేందుకు, అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇది సరైన సమయం” అని టాటా ఏఐజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & నేషనల్ హెడ్ – కన్జూమర్ క్లెయిమ్స్ రుద్రరాజు రాజగోపాల్ తెలిపారు.

    వచ్చిన వాటిలో 64 శాతం క్లెయిమ్‌లు 50 ఏళ్ల పైబడిన వారికి చెందినవని డేటాలో వెల్లడైంది. ఈ వ్యాధి, పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటోందనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది. మరింత సంక్లిష్టమైన కేసుల్లో సగటు క్లెయిమ్ పే అవుట్ రూ. 3 లక్షలు పైగా ఉండగా, అత్యధిక ఇండివిడ్యువల్ క్లెయిమ్ ఏకంగా రూ. 58 లక్షలుగా నమోదైంది. గత మూడేళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలకు చెల్లించిన మొత్తం రెట్టింపు స్థాయికి మించింది. మహారాష్ట్ర (23.9%), గుజరాత్ (17%), ఢిల్లీ (12.3%) నుంచి క్లెయిమ్‌లు అత్యధికంగా వచ్చాయి. బహుశా ఆయా రాష్ట్రాల్లో వాయు కాలుష్యం అత్యధికంగా ఉండటం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, డయాగ్నోస్టిక్స్ ఉండటం ఇందుకు కారణం అయి ఉండొచ్చు.

    ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కారకాలకు సంబంధించి అత్యధికంగా దాదాపు 85 శాతం కేసుల్లో స్మోకింగ్ ప్రధానమైనదిగా ఉంటున్నప్పటికీ, అదొక్కటే కారణం కాదు. వాయు కాలుష్యానికి, సెకండ్-హ్యాండ్ స్మోక్‌కి, నిర్దిష్ట పనిప్రదేశాల్లో రసాయనాలకి ఎక్స్‌పోజ్ కావడం వల్ల కూడా రిస్కులు పెరుగుతాయి. నగరాల్లో జీవించే వారు, దుమ్మూ ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో పని చేసేవారు లేదా స్మోక్ చేసే కుటుంబ సభ్యులు ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ చరిత్ర, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండే జీవన విధానాలు కూడా ఇందుకు దారి తీయొచ్చు.

    అందుకే హెచ్చరిక సంకేతాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మీ వయస్సు 40 పైగా ఉండి, స్మోకింగ్ అలవాటు ఉన్నా లేదా గతంలో స్మోక్ చేసినా, లేదా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నా, ఈ కింది లక్షణాలు కనిపిస్తే డాక్టరును సంప్రదించడం శ్రేయస్కరం:

    దగ్గు ఆగకుండా రావడం, తీవ్రత పెరగడం
    చాతీలో నొప్పి లేదా అసౌకర్యం
    దగ్గినప్పుడు రక్తం రావడం
    చిన్న పని చేసినా ఊపిరి తీసుకోవడం కష్టం కావడం
    కారణం లేకుండా అలసిపోవడం లేదా బరువు తగ్గిపోవడం
    తరచుగా లేదా పదే పదే ఛాతీ సంబంధ అంటువ్యాధులు వస్తుండటం

    రిస్కు ఎక్కువగా ఉండే వారికి ఏటా తక్కువ డోస్‌లో సీటీ స్కాన్‌ల్లాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, మెరుగైన చికిత్స ఫలితాలు సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అన్ని రకాల కేసులను నివారించలేకపోయినప్పటికీ, ఆరోగ్యకరమైన అలవాట్లు, రిస్కులను కొంత తగ్గించగలవు. స్మోకింగ్ మానివేయడం, కాలుష్యం ఉండే ప్రాంతాలకు ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకోవడం, సమతుల్యమైన డైట్ తీసుకోవడం, శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, తరచుగా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంలాంటి పనులు చిన్నవే అయిననప్పటికీ సమర్ధవంతంగా ఉపయోగపడతాయి.

    (చదవండి: లంగ్‌ కేన్సర్‌ని ముందుగా గుర్తించగలమా..?)

     

  • అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి అమెరికా సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ దంపతులు తాము నాలుగో బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కూడా. అంతేగాక అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఇలా భర్త పదవిలో ఉండగా 40 ఏళ్ల వయసులో గర్భవతి అయిన తొలి అమెరికా సెకండ్‌ లేడిగా నిలిచారామె. ఇదంతా ఎలా ఉన్నా..ఒక్కసారిగా ఇంత లేటు వయసులో గర్భధారణ మంచిదేనా అంటూ చర్చలు మొదలయ్యాయి. 

    మొన్నటికి మొన్న 42 ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కత్రినా కైవ్‌. అదిమరువకమునుపే మళ్లీ భారత సంతతి మహిళ, అమెరికా ఉపాధ్యాక్షుడి సతీమణి ఉష సైతం ఆ జాబితాలో చేరిపోవడంతో..ఇక రాను ఆధునిక అమ్మల వయసు ఇలానే ఉంటుందా అంటూ ఊహగానాలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆ ఏజ్‌లో తల్లి అవ్వడం హెల్త్‌ పరంగా ప్రమాదామా కాదా? మరి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు..

    2014లో వివాహం చేసుకున్న ఉషా-జేడీ వాన్స్‌ దంపతులకు ఇప్పటికే ఇవాన్, వివేక్ , మిరాబెల్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు ఈ ఏడాది జూలైకి నాల్గోబిడ్డకు స్వాగతం పలకనున్నారు. అలాగే గతేడాది సెప్టెంబర్‌ 25న నటి కత్రినాకైఫ్‌ ఇలానే 42వ ఏటనే తల్లి కాబోతున్నానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సరసన హాస్యనటి భారతి సింగ్‌ కూడా చేరిపోయారు. ఆమె 41వ ఏటా రెండో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు షేర​ చేసుకున్నారు. 

    మొన్నమొన్నటి వరకు 30లలో గర్భధారణ ప్రమాదం అంటూ పలు వార్తలు విన్నాం. ఇప్పుడు ఏకంగా అది కూడా కాదని ఏకంగా నాలుగు పదుల వయసులో మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ ఆధునిక అమ్మలు. ఇంతకీ ఈ ఆధునిక తల్లులకు వయసు రీత్యా ఆరోగ్యప్రమాదా లేమి ఎదురుకావా? ఇకపై ఆ భయాలకు కాలం చెల్లిపోయిందా అంటే..

    లేటు వయసులో ప్రెగ్నెన్సీ అనేది సురక్షితం కాదని, పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే సమయంలో ఇకపై ఇంత లేటు వయసులో గర్భందాల్చడం అనేది ప్రమాదకరం కూడా కాకపోవచ్చని, పైగా ఇది అసాధారణమైనదిగా ఉండదని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు తగిన జాగ్రత్తలతో సానుకూల ఫలితాలను పొందుతున్నట్లు వెల్లడించారు. 

    నిజానికి ఇంత లేటు వయసులో పిల్లలను కనడం కష్టం. పైగా అండాల నాణ్యత తగ్గి..సంతానోత్పత్తి సహజంగానే తగ్గుతుందన్నారు. అందువల్ల ఆ వయసులో ఐవీఎఫ్‌ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతలను ఆశ్రయించాల్సి ఉంటుందని కూడా అన్నారు.

    తల్లి, బిడ్డకు ఎదురయ్యే ప్రమాదాలు..
    వైద్య పురోగతి కారణంగా ఆలస్య గర్భధారణ సురక్షితంగా మారినప్పటికీ..35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. సాధారణంగా 35 దాటిన తర్వాత గర్భధారణ అనేది మధుమేహం, రక్తపోటు, ప్రీకాంప్సియా వంటి అనారోగ్య ప్రమాదాలను పెంచుతుందట. పైగా ప్రసవ సమయంలో ఆ సమస్యల కారణంగా సీజేరియన్‌ డెలివరీ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట.

    అందువల్ల ఆ ఏజ్‌లో ప్రెగ్నెంట్‌ అయ్యే మహిళలు ముందుగానే వైద్యులను సంప్రదిస్తే..రాను రాను తలెత్తే ప్రమాదాలను నివారించడంలో హెల్ప​ అవుతుందని అన్నారు. అలాగే వృద్ధ తల్లులకు జన్మించిన  శిశువులు డౌన్‌ శిండ్రోమ్‌ వంటి క్రోమోజోమ్‌ అసాధారణతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే అకాల జననం లేదా నెలలు నిండక ముందు జన్మనివ్వడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని అన్నారు.

    లేటు వయసులో ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం..

    • ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందుగానే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

    • గర్భధారణ నిర్ధారించిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, సలహాలు, సూచనలు పాటించడం

    • సమతుల్య ఆహారం, మితకరమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం

    • ఒత్తిడి నిర్వహణ, కుటుంబ మద్దతు తదితరాలు అత్యంత అవసరం. అప్పుడే తల్లిబిడ్డ సురక్షితంగా ఉంటారు.