Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్‌లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది.  

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్‌గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్‌ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

    ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్‌లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు.  

    ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్‌ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్‌లో ఉంది.  

    ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్‌ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్‌లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.  
     

  • టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష‍్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్‌కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్‌గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

    చెన్నైలోని ఈ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష‍్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్‌ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.

    గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష‍్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

  • బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ధురంధర్‌ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. ధురంధర్‌: ద రివేంజ్‌ మూవీ మార్చి 19న విడుదల కానుంది.

    మూడు కేరవాన్స్‌
    ఇదిలా ఉంటే ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. 

    అసలు నిజమిదే!
    ధురంధర్‌ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్‌ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు.

     

     

    చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్‌

  • ప్రముఖ నటి శరణ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నటి శరణ్య- దర్శకనటుడు పొన్వన్నన్‌ దంపతుల చిన్న కూతురు చాందిని పెళ్లి పీటలెక్కింది. ఫిబ్రవరి 2న వివాహం జరగ్గా శుక్రవారం చెన్నైలో ఎంతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్‌కు తమిళ స్టార్‌ హీరోలు ధనుష్‌, కార్తీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఇద్దరూ డాక్టర్సే..
    చాందిని డాక్టర్‌ కాగా, అతడి భర్త ఫిలిప్‌ కూడా డాక్టర్‌ అని తెలుస్తోంది. 2025 డిసెంబర్‌లోనే వీరి నిశ్చితార్థం జరగ్గా ఇప్పుడు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇకపోతే నటి శరణ్య.. తల్లి, అత్తమ్మ పాత్రలతో పేరు తెచ్చుకుంది. ఎంతోమంది స్టార్‌ హీరోలకు వెండితెరపై అమ్మగా కనిపించింది. గ్యాంగ్‌ లీడర్‌, రఘువరన్‌ బీటెక్‌, 24.. ఇలా అనేక సినిమాలు చేసింది. ఈవిడ దర్శకుడు పొన్వన్నన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ప్రియదర్శిని, చాందిని సంతానం. కూతుర్లిద్దరూ డాక్టర్స్‌గా స్థిరపడ్డారు.

     

     

    చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. క్షమించండి: ప్రభాకర్‌

  • బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ చేసిన ఓ పని వల్ల తీవ్ర విమర్శలపాలయ్యాడు. ప్రమోషన్స్‌ కోసం ఓ పాట పాడటం.. అందులో అసభ్య పదాలు ఉండటంతో హీరోను విమర్శించనివాళ్లు లేరు. ఓపక్క ట్రోలింగ్‌ జరుగుతుండగానే అతడి సినిమా బరాబర్‌ ప్రేమిస్తా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

    స్పందించిన ప్రభాకర్‌
    ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు ప్రభాకర్‌ స్పందించాడు. తన కొడుకు చేసింది తప్పేనని అంగీకరించాడు.  అందుకు క్షమాపణలు తెలియజేశాడు. ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత నాలుగురోజులుగా విపరీతంగా వైరలవుతున్న విషయం.. మా బాబు చంద్రహాస్‌ వాడిన బూతు పదాలు- దానిపై విశ్లేషణలు, అభిప్రాయాలు, వాళ్లు తిరిగి బూతులు అనడాలు.

    తప్పని చెప్పా..
    నేనైనా, నా కొడుకైనా, ఎవరైనా సరే పబ్లిక్‌గా బూతులు మాట్లాడటమనేది తప్పు. దాన్ని నేను ఎంకరేజ్‌ చేయను. ఆరోజు నేను ఫంక్షన్‌లో సగం పాటయ్యాక అక్కడికి వెళ్లాను. పాట అయిపోగానే బాబును పక్కకు పిలిచి నాన్నా, ఇలాంటి పదాలు పబ్లిక్‌గా వాడకూడదు అని చెప్పాను. వాడు కూడా సరేనని, ఇంకోసారి పునరావృతం చేయనన్నాడు. అయితే ఆ పాట వీడియో క్లిప్పింగ్స్‌ను ముక్కలుగా కట్‌ చేసి వైరల్‌ చేశారు. 

    అది పెద్ద తప్పు
    తప్పు చేసినవాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు, కానీ, వినకూడని మాటల్ని ఇంకా ఎక్కువమందికి వినిపించి తప్పు చేస్తున్నారు. ఆ వీడియోలో రెండు, మూడు బూతులుంటే నా కుటుంబం మొత్తాన్ని వందల బూతులు తిడుతున్నారు. అది చేయకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ ఈవెంట్‌లో నా భార్య, కూతురు లేరు. వాళ్లు చెన్నై షూటింగ్‌లో ఉన్నారు. ఆ విషయం తెలియకుండా చాలా మంది చాలామాటలన్నారు. అది చాలా పెద్ద తప్పు. 

    పెంపకంపై విమర్శలు
    ఏదైనా తెలుసుకుని మాట్లాడండి. నన్ను కూడా నానామాటలన్నారు. పెంచడం రాదా? పద్ధతి తెలీదా? అని విమర్శించారు. నా పెంపకం, నేర్పించిన సంస్కారం.. ఈ ఒక్క పాటతో డిసైడ్‌ చేయకూడదు. నా బిడ్డ టాలెంట్‌ చూడండి. బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూసినవాళ్లు చంద్రహాస్‌ అద్భుతంగా చేశాడంటున్నారు. ఎంతో మెచ్యురిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంటున్నారు.

    ఇబ్బందిపపడితే క్షమించండి
    తప్పుని నేను సమర్థించట్లేదు. తప్పుని ఎత్తిచూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో! సమాజానికి హాని చేస్తున్నామేమో! నేను ఒకటే చెప్పదల్చుకున్నా.. మా అబ్బాయి ప్రవర్తన, మాటల వల్ల ఎవరైనా ఇబ్బందిపపడితే క్షమించండి. ఆరోజు ఫంక్షన్‌కు నాపై ప్రేమతో వచ్చిన జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్‌, జయంత్‌ సి. పరంజి గారిని మన్నించమని కోరుతున్నా.. నా ఫంక్షన్‌కు వచ్చినందుకు మీరు మాట పడాల్సి వచ్చింది. చివరగా.. నా బిడ్డ తప్పుల్ని ఎంచారు, ఒకసారి వాడి టాలెంట్‌నూ చూడండి అంటూ బరాబర్‌ ప్రేమిస్తా సినిమా చూడమని ప్రభాకర్‌ కోరాడు.

     

     

    చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా: చంద్రహాస్‌

  • అవార్డు విన్నర్ దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలమైన సామాజిక థీమ్‌తో కూడిన చిత్రం ‘కాక్రోచ్’. తాజాగా ఈ మూవీ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్‌పై బి. బాపిరాజు, ముతుకి నాగ సత్యనారాయణలు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ (A) సర్టిఫికెట్ మంజూరు చేసింది.

    ‘సమాజంలోని చీకటి మూలలను, అవినీతి, భ్రష్టుత్వాన్ని కఠినంగా చిత్రీకరించిన ఈ చిత్రం... అడ్డురోడ్లపై జీవనం సాగించే వేశ్యకు, ఒక కిరాయి హంతకుడికి మధ్య ఏర్పడిన స్వచ్ఛమైన ప్రేమ, స్నేహాన్ని చూపిస్తుంది. సమాజం చీత్కరించే మురికి మనుషుల మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ద్వంద్వ విలువలు, విలువల ద్వంద్వత్వాన్ని ప్రశ్నిస్తూ... కాక్రోచ్‌ను చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే సమాజ మనస్తత్వాన్ని ఈ చిత్రం ఎండగట్టనుంది’ అని దర్శకుడు తెలిపారు. 

    సున్నిత మనస్కులు మరియు పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి. బాపిరాజు పత్రికా ప్రకటన ద్వారా  కోరారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ , మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్, మల్లిక, ఎఫ్‌ఎమ్ బాబాయ్, రాజు, బాలాజీ, ఎల్‌బీ రమణ, ఆర్‌కే సింగ్, పూజా, పొట్టి మూర్తి, ప్రసాద్, రేలారే రఘు బృందం, జానీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి మొదటి వారంలో విడుదల కానుంది.

  • గతేడాది 'లైలా' సినిమాతో బొక్కబోర్లా పడ్డాడు హీరో విశ్వక్‌సేన్‌. ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కామెడీ జానర్‌ ఎంచుకున్నాడు. జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేశాడు. డ్రాగన్‌ బ్యూటీ కయాదు లోహర్‌ కథానాయికగా నటించింది. శనివారం (ఫిబ్రవరి 7న) ఫంకీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

    ట్రైలర్‌ నిండా పంచులే
    ట్రైలర్‌ ప్రారంభం నుంచే పంచులతో, కామెడీతో అదిరిపోయింది. మీ అమ్మకు ఆపరేషన్‌ చేయాలంటే నాకు రాదు డాక్టర్‌ అన్న డైలాగ్‌తో వీడియో మొదలైంది. ఓనర్‌కు రెంట్‌ కట్టుడు వంటివన్నీ నాకు గలీజ్‌ అనిపిస్తయ్‌ అంటాడు హీరో. ట్రైలర్‌ ముగింపు వరకు పంచులకు లోటే లేకుండా కట్‌ చేశారు. మొత్తానికి ట్రైలర్‌తోనే మంచి హైప్‌ ఇచ్చారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.

     

  • సెట్‌లో ఒకసారి ఓ వ్యక్తిని చితకబాదానంటోంది హీరోయిన్‌ సాయి ధన్సిక. ఆవేశం పట్టలేక అతడిని కొడుతూ ఉంటే అది చూసి దర్శకుడు, హీరో తనను ఆపారంటోంది. సాయిధన్సిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా యోగి డా. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ తమిళ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

    ఫోటో అడిగితే..
    అందులో సాయి ధన్సిక మాట్లాడుతూ.. కేరళలో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఓ వ్యక్తి నాతో ఫోటో దిగాలని మా అంకుల్‌(నా పర్యవేక్షకుడు)ని అడిగాడు. అయితే అతడు తాగి ఉన్నాడని గమనించి ఫోటో ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వెంటనే ఆ తాగుబోతు మా అంకుల్‌ను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదంతా చూసి నాలో కోపం కట్టలు తెచ్చుకుంది.

    చితకబాదా..
    ఆత్మరక్షణ కోసం నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఆ టాలెంట్‌ అంతా అప్పుడు ఉపయోగించాను. వాడ్ని పరిగెత్తి వెళ్లి మరీ పట్టుకుని చితకబాదాను. పదినిమిషాలు కొడుతూనే ఉన్నాను. డైరెక్టర్‌, హీరో నా చేతులు పట్టుకుని నన్ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. నా మనుషుల్ని ఏదైనా అంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే విచక్షణారహితంగా కొట్టాను అని సాయి ధన్సిక చెప్పుకొచ్చింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో షికారు సినిమాలో నటించింది.

    పెళ్లి
    ఇకపోతే సాయిధన్సిక, హీరో విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే! గతేడాది ఆగస్టు 29న (విశాల్‌ పుట్టినరోజున) వీరి వివాహం జరగాల్సింది. కానీ నడిగర్‌ సంఘం భవనం ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుని ఎంగేజ్‌మెంట్‌తో సరిపెట్టుకున్నారు. మరి ఈ ఏడాది ఆగస్టు 29కైనా సాయి ధన్సిక మెడలో విశాల్‌ మూడు ముళ్లు వేస్తాడో, లేదో చూడాలి!

    చదవండి: నా సినిమా ఎఫెక్ట్‌ అవుతుందని భయపడ్డా: ఏడ్చేసిన చంద్రహాస్‌

  • తల్లికి మళ్లీ పెళ్లి చేస్తానంటోంది టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత. ఈమె 'చౌదరిగారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయం కావాల్సింది. కానీ దానికంటే ముందు అమరావతికి ఆహ్వానం సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఈ హారర్‌ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్‌ కానుంది.

    కుంకుమ పెట్టుకోవద్దా?
    తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సుప్రిత మాట్లాడుతూ.. అమ్మ కుంకుమ పెట్టుకున్నందుకు సురేఖావాణికి మళ్లీ పెళ్లంట అని ఏవేవో రాశారు. నా బలవంతం వల్లే అమ్మ కుంకుమ పెట్టుకుంది. నాన్న (టీవీ షోల డైరెక్టర్‌ సురేశ్‌ తేజ) చనిపోయే సమయానికి అమ్మకు 35 ఏళ్లుంటాయి. అప్పుడే అంత వైరాగ్యం చూడాల్సిన అవసరం లేదు. 

    ట్రోలింగ్‌
    అందుకే కుంకుమ పెట్టుకోమన్నాను. అందరూ ఏమనుకుంటారని మొదట ఒప్పుకోలేదు. నా బలవంతం వల్ల తనకు కుంకుమ ధరించడం అలవాటైపోయింది. అమ్మ, నేను కలిసి విహారయాత్రలకు వెళ్తుంటే కూడా ట్రోల్‌ చేస్తున్నారు. మా డబ్బుతో మేము బయటకు వెళ్లడం కూడా తప్పేనా? ఈ నెగెటివిటీ చూసి మొదట్లో ఏడ్చేసేదాన్ని.

    కాలు కింద పెట్టనివ్వకూడదు
    కానీ, వాళ్ల మాటలు పట్టించుకుని ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే జీవితం ముందుకు కదలదని అర్థమైంది. అలా వాటిని లైట్‌ తీసుకుంటున్నాను. అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. తనకంటూ ఓ తోడుండాలి. నేను పెళ్లి చేసుకునే సమయానికి అమ్మకు వివాహం చేయాలన్నది నా కోరిక. అమ్మకు తగిన వ్యక్తి దొరకాలి. అతడు నా తల్లిని చాలా బాగా చూసుకోవాలి. కాలు కింద పెట్టనివ్వకూడదు.

    బిగ్‌బాస్‌ షో ఇష్టం
    నాకు బిగ్‌బాస్‌ రియాలిటీ షో అంటే చాలా ఇష్టం. ఇంతవరకు ఒక్క ఎపిసోడ్‌ మిస్‌ అవకుండా అన్ని సీజన్లు చూశాను. ఏడో సీజన్‌లో ఫోన్‌ కాల్‌ వస్తే వెళ్లిపోదామనుకున్నాను. కానీ దగ్గరివాళ్లు వద్దనడంతో ఆగిపోయాను. ఓ సీజన్‌లో అమ్మను, నన్ను జంటగా రమ్మని పిలిచారు. కానీ, వెళ్లలేదు. ఇక మీదట కూడా వెళ్లనేమో! అని సుప్రిత చెప్పుకొచ్చింది.

    చదవండి: నా సినిమా చూడరేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన చంద్రహాస్‌

  • నేపాల్‌ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) కన్నుమూశారు. శనివారం(ఫిబ్రవరి 7) ఉదయం గుండెపోటుకి గురికావడంతో వెంటనే ఖాట్మండ్‌లోని థాపాతలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉదయం 7.44 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

    నేపాల్‌లోని డాంగ్‌లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. నేపాలీ, బాలీవుడ్‌, భోజ్‌పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. సునీల్ థాపా మరణం పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్‌’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించింది. 

  • బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు, యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం బరాబర్‌ ప్రేమిస్తా. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్‌. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నాకు మాటలు రావడం లేదు. రెండు, మూడు నెలల కిందట మ్యూజిక్‌ లేకుండా సినిమా చూశాను. 

    ఏడుపాగలేదు
    ఫైనల్‌ కాపీ చూడలేదు. ఇప్పుడిలా థియేటర్‌లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్‌లో సినిమా చూస్తున్న అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే (పాట) వివాదం వల్ల నా సినిమా చూసేందుకు జనం రారేమో అని భయపడ్డాను. నా మూవీపై ఎఫెక్ట్‌ పడుతుందేమోనని చాలా భయమేసింది' అంటూ చంద్రహాస్‌ ఏడ్చేశాడు. 

    ఏంటా వివాదం?
    బరాబర్‌ ప్రేమిస్తా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చంద్రహాస్‌ ఓ పాట పాడాడు. అందులో బూతు పదాలు దొర్లడంతో అతడిపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. హీరో అయుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా? ప్రమోషన్‌ కోసం ఇంత దిగజారాలా? అని విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌ వల్ల సినిమాపై నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుందని చిత్రయూనిట్‌ భయపడ్డారు. సినిమా విషయానికి వస్తే.. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. అర్జున్‌ మహి విలన్‌గా యాక్ట్‌ చేశాడు. సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించగా కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, ఏవీఆర్‌, గాయత్రి చిన్ని నిర్మించారు.

    చదవండి: ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన ముమైత్‌ ఖాన్‌

Sports

  • అభిషేక్‌ శర్మ డకౌట్‌... పవర్‌ప్లే ముగిసేసరికి 46/4... ఒకదశలో వరుసగా 26 బంతుల పాటు బౌండరీనే రాలేదు... 12.4 ఓవర్లు ముగిసేసరికి 77/6... పరిస్థితి చూస్తే అమెరికా సంచలన విజయానికి పునాది వేసుకున్నట్లు అనిపించింది. కానీ సూర్యకుమార్‌ అసలు సమయంలో తన స్థాయిని ప్రదర్శించాడు. ఒంటి చేత్తో కెప్టెన్  ఇన్నింగ్స్‌ ఆడి జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. మిగిలిన 44 బంతుల్లో భారత్‌ మరో 84 పరుగులు జోడిస్తే వీటిలో సూర్య ఒక్కడే 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సహా 63 పరుగులు సాధించాడు. 

    ఛేదనలో ఆరంభం నుంచే తడబడిన అమెరికా ఆతిథ్య జట్టు సవాల్‌ ముందు నిలవలేకపోయింది. భారత బౌలర్లు సిరాజ్, అర్ష్ దీప్, అక్షర్‌ పటేల్‌ సమష్టిగా రాణించడంతో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. బలహీన జట్టుతో మ్యాచ్‌లో చివరకు గట్టెక్కినా... ఈ మ్యాచ్‌ భారత బ్యాటింగ్‌కు చిన్న హెచ్చరికను జారీ చేసింది.  

    ముంబై: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శుభారంభం చేసింది. చిన్న జట్టు చేతిలో కాస్త పోటీ ఎదురైనా చివరకు పైచేయి సాధించింది. శనివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 29 పరుగుల తేడాతో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ)పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

    సహచరులంతా విఫలమైనా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ యాదవ్‌ (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరును అందించారు. అమెరికా బౌలర్లలో వాన్‌ షాక్‌విక్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. శుభమ్‌ రంజనే (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజయ్‌ కృష్ణమూర్తి (31 బంతుల్లో 37; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మిలింద్‌ కుమార్‌ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. 

    సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్, అక్షర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనారోగ్యం కారణంగా భారత టాప్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగలేదు. భారత్‌ తమ తర్వాతి పోరులో గురువారం న్యూఢిల్లీలో నమీబియాతో తలపడుతుంది.  

    సూర్యకుమార్‌కు లైఫ్‌... 
    హిట్టర్‌ అభిషేక్‌ శర్మ (0) తాను ఆడిన తొలి బంతికే అనూహ్యంగా ‘డకౌట్‌’ కాగా... ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. నేత్రావల్కర్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో తిలక్‌ ధాటిని ప్రదర్శించగా, అలీఖాన్‌ ఓవర్లో ఇషాన్‌ వరుసగా 4, 6 కొట్టాడు. అయితే షాల్‌విక్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ వెనుదిరగ్గా, ఓవర్లోని చివరి రెండు బంతుల్లో వరుసగా తిలక్, శివమ్‌ దూబే (0) అవుటయ్యారు. 

    పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49/4 వద్ద నిలిచింది. లెగ్‌స్పిన్నర్‌ మొహసిన్‌ బౌలింగ్‌లో వరుసగా ఏడు బంతుల పాటు సింగిల్‌ కూడా తీయలేకపోయిన రింకూ సింగ్‌ (6) అసహనంతో తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా, హార్దిక్‌ పాండ్యా (5) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇలాంటి స్థితిలో సూర్యకుమార్‌ బాధ్యత తీసుకున్నాడు. 15 పరుగుల వద్ద శుభమ్‌ తన బౌలింగ్‌లోనే సూర్య ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలం కావడంతో భారత కెప్టెన్ కు లైఫ్‌ లభించింది. 

    దీనిని అతను సమర్థంగా వాడుకుంటూ చకచకా పరుగులు రాబట్టాడు. నేత్రావల్కర్‌ ఓవర్లో సూర్య, అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) కలిసి 3 ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 21 పరుగులు రాబట్టారు. 36 బంతుల్లో సూర్య అర్ధసెంచరీ పూర్తయింది. నేత్రావల్కర్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాది ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.  

    సిరాజ్‌కు 3 వికెట్లు.. 
    ఛేదనలో అమెరికాకు సరైన ఆరంభం లభించలేదు. తొలి 20 బంతుల్లో 5 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వరుస ఓవర్లలో గూస్‌ (6), సాయితేజ ముక్కామల (2)లను వెనక్కి పంపగా, మోనాంక్‌ పటేల్‌ (0) వికెట్‌ అర్ష్ దీప్ ఖాతాలో చేరింది. ఈ దశలో మిలింద్, కృష్ణమూర్తి కలిసి కొన్ని చక్కటి షాట్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. 

    వీరిద్దరు నాలుగో వికెట్‌కు 52 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే మిలింద్‌ను అవుట్‌ చేసి వరుణ్‌ ఈ జోడీని విడగొట్టగా... 29 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్‌ వరుస బంతుల్లో కృష్ణమూర్తి, హర్మీత్‌ సింగ్‌ (0)లను అవుట్‌ చేశాడు. దాంతో అమెరికా గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో శుభమ్‌ కొంత పోరాడినా లాభం లేకపోయింది. 2024 జూలైలో భారత్‌ తరఫున చివరి టి20 ఆడి జట్టుకు దూరమైన సిరాజ్‌... అనూహ్యంగా వరల్డ్‌ కప్‌ అవకాశం దక్కించుకొని తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లతో సత్తా చాటాడు.

    సొంతగడ్డపై ముగ్గురు ముంబైకర్లు... 
    అమెరికా జట్టులో సభ్యులైన సౌరభ్‌ నేత్రావల్కర్, శుభమ్‌ రంజనే, హర్మీత్‌ సింగ్‌లకు ముంబైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ముగ్గురూ ముంబైలోనే ఓనమాలు నేర్చుకొని ఇక్కడే కెరీర్‌ను మలచుకున్నారు. ముగ్గురు కూడా జూనియర్, అండర్‌–19 క్రికెట్‌ను ముంబై తరఫునే ఆడటంతో పాటు రంజీ ట్రోఫీలో కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 

    రంజనే చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడినప్పుడు జట్టు కెప్టెన్ గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నాడు. తర్వాతి రోజుల్లో యూఎస్‌కు వలస వెళ్లి వీరు అక్కడి జాతీయ జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. అయితే వాంఖెడే మైదాలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ అయినా ఆడాలనేది వీరి చిరకాల కోరిక! అది ఈ మ్యాచ్‌తో నెరవేరింది. మ్యాచ్‌లో ముగ్గురూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వకపోయినా... సొంతగడ్డపై వరల్డ్‌ కప్‌ ఆడిన జ్ఞాపకం వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  

    స్కోరు వివరాలు  
    భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 20; అభిషేక్‌ (సి) కృష్ణమూర్తి (బి) అలీ ఖాన్‌ 0; తిలక్‌ వర్మ (సి) మోనాంక్‌ (బి) షాల్‌విక్‌ 25; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 84; దూబే (సి) నేత్రావల్కర్‌ (బి) షాల్‌విక్‌ 0; రింకూ (సి) మిలింద్‌ (బి) మొహసిన్‌ 6; పాండ్యా (సి) ముక్కామల (బి) హర్మీత్‌ 5; అక్షర్‌ (సి) మొహసిన్‌ (బి) హర్మీత్‌ 14; అర్ష్ దీప్ (సి) మిలింద్‌ (బి) షాల్‌విక్‌ 4; వరుణ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–46, 4–46, 5–72, 6–77, 7–118, 8–140, 9–161. బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4–0–65–0, అలీ ఖాన్‌ 2–0–13–1, షాల్‌విక్‌ 4–0–25–4, మొహసిన్‌ 4–0–16–1, శుభమ్‌ 2–0–16–0, హర్మీత్‌ 4–0–26–2.  

    అమెరికా ఇన్నింగ్స్‌: గూస్‌ (సి) తిలక్‌ (బి) సిరాజ్‌ 6; సాయితేజ ముక్కామల (సి) వరుణ్‌ (బి) సిరాజ్‌ 2; మోనాంక్‌ (సి) దూబే (బి) అర్ష్ దీప్ 0; మిలింద్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) వరుణ్‌ 34; కృష్ణమూర్తి (సి) రింకూ (బి) అక్షర్‌ 37; శుభమ్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 37; హర్మీత్‌ (సి) సిరాజ్‌ (బి) అక్షర్‌ 0; మొహసిన్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్ 8; షాల్‌విక్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–13, 4–71, 5–98, 6–98, 7–110, 8–132. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–18–2, సిరాజ్‌ 4–0–29–3, వరుణ్‌ 4–0–24–1, అక్షర్‌ 4–0–24–2, పాండ్యా 4–0–34–0.

    టి20 ప్రపంచకప్‌లో నేడు
    న్యూజిలాండ్‌ X అఫ్గానిస్తాన్‌
    వేదిక: చెన్నై; ఉదయం 11 గంటల నుంచి 
    ఇంగ్లండ్‌X నేపాల్‌ 
    వేదిక: ముంబై; మధ్యాహ్నం 3 గంటల నుంచి
    శ్రీలంక X ఐర్లాండ్‌
    వేదిక: కొలంబో; రాత్రి 7 గంటల నుంచి
    స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడి.. కేవలం భారత్‌తో మాత్రమే ఆడకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు ఈ మ్యాచ్‌కే ఎందుకనే విమర్శలూ వస్తున్నాయి.

    బంగ్లాదేశ్‌కు మద్దతుగా
    ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) సైతం పీసీబీకి ఇదే ప్రశ్నను సంధించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌ల కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిస్కరిస్తామంటూ పాక్‌ కొత్త రాగం ఎత్తుకుంది.

    కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాము కూడా లంకలోనే ఆడతామని బంగ్లా కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భద్రత పరంగా భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తమ బృందం తేల్చినందున పునరాలోచించుకోవాలని సమాధానం ఇచ్చింది.

    ఒకవేళ రద్దయితే
    కానీ బంగ్లాదేశ్‌ మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ.. పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని ప్రకటించింది. పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఈ ప్రకటన చేశాడు.

    కాగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. భారీ క్రేజ్‌ ఉన్న ఈ మ్యాచ్‌ ఒకవేళ రద్దయితే పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇతర బోర్డులు సైతం పాక్‌ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

    తెలివి ప్రదర్శించిన పీసీబీ
    అయితే, తమపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాక్‌ తెలివిగా.. ఫోర్స్‌ మజ్యూర్‌ క్లాజ్‌ (Force Majeure Clause)ను తెరపైకి తెచ్చింది. అనూహ్య, నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఈ నిబంధన ద్వారా లభిస్తుంది.

    సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి  అత్యవసర పరిస్థితులు ఏర్పడితే.. సంబంధిత పక్షం తన వాదనను సమర్థించుకునే అవకాశం ఉంటుంది. తమ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించనందున ఈ నిబంధన తమకు వర్తింపజేయాలని పీసీబీ ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం.

    గట్టిగానే బదులిచ్చిన ఐసీసీ
    అయితే, ఇందుకు ఐసీసీ గట్టిగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘ప్రభుత్వ అనుమతితో టోర్నీలో కొనసాగుతున్నారు.. కానీ.. ప్రభుత్వ ఆంక్షల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? ఇదెలా సాధ్యం? దీనిపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి’’ అని పీసీబీని ఆదేశించినట్లు వార్త సంస్థ PTI వెల్లడించింది. 

    కాగా బంగ్లాదేశ్‌కు మద్దతుగా తొలుత టోర్నీనే బహిష్కరిస్తామన్న పాక్‌.. ఆ తర్వాత మాట మార్చి భారత్‌తో మాత్రమే ఆడమంటూ డ్రామాకు తెరలేపింది.

    చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా బ్యాటర్లు కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు. ముంబై వేదికగా అమెరికా బౌలర్లు ఆది నుంచే చెలరేగుతూ భారత బ్యాటింగ్‌ విభాగంపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్‌ రెండో బంతికే అలీ ఖాన్‌ అభిషేక్‌ శర్మ (0) డకౌట్‌గా వెనక్కి పంపాడు.

    ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి..
    ఆ తర్వాత వాన్‌ షాల్‌విక్‌ ఆరో ఓవర్లో రెండో బంతికి ఇషాన్‌ కిషన్‌ (20),  ఐదో బంతికి తిలక్‌ వర్మ (25), ఆఖరి బంతికి శివం దూబే (0)ను అవుట్‌ చేసి.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఫలితంగా పవర్‌ ప్లేలో కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

    సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
    మిగిలిన వారిలో రింకూ సింగ్‌ (6), హార్దిక్‌ పాండ్యా (5) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ కాసేపు అలరించి (11 బంతుల్లో 14) పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

    మెరుపు అర్ధ శతకం
    ధనాధన్‌ దంచికొట్టిన సూర్య 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సూర్య మెరుపు అర్ధ శతకం కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

    అమెరికా బౌలర్లలో వాన్‌ షాల్‌విక్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హర్మీత్‌ సింగ్‌ రెండు, అలీ ఖాన్‌, మొహమ్మద్‌ మొహ్సిన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా గ్రూప్‌-‘ఎ’లో

    చదవండి:  అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను: వైభవ్‌ సూర్యవంశీ తండ్రి

  • టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో ఈ పంజాబీ బ్యాటర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఓ చెత్త రికార్డును అభిషేక్‌ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టీ20 జట్టు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్‌ శర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌తో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు.

    గత కొన్నాళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్‌.. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ టోర్నీకి సిద్ధమయ్యాడు. ముంబైలోని వాంఖడే వేదికగా వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో అమెరికాతో తలపడునుండటంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అదరగొడతాడని అంతా భావించారు.

    అయితే, ఊహించని రీతిలో అభిషేక్‌ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. అమెరికా పేసర్‌ అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చిన ఈ లెఫ్టాండర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగిన ఐదో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సైతం ఇలాగే అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.

    ఇక అభిషేక్‌ శర్మ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుట్‌కావడంతో.. “గంభీర్‌ బాటలో నడిచిన అభిషేక్‌ శర్మ.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.. ఇలా చేశావేంటి బ్రో’’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. పవర్‌ ప్లేలోనే 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

    టీ20 వరల్డ్‌కప్‌ అరంగేట్ర మ్యాచ్‌లో డకౌట్‌ అయిన భారత ఆటగాళ్లు వీరే
    👉గౌతం గంభీర్‌
    👉ఆశిష్‌ నెహ్రా (గోల్డెన్‌ డక్‌)
    👉శార్దూల్‌ ఠాకూర్‌
    👉దీపక్‌ హుడా
    👉అభిషేక్‌ శర్మ (గోల్డెన్‌ డక్‌).

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. పసికూన స్కాట్లాండ్‌ను చిత్తు చేసి శుభారంభం అందుకుంది. కోల్‌కతా వేదికగా గ్రూప్‌-‘సి’ నుంచి విండీస్‌- స్కాటిష్‌ జట్లు శనివారం తలపడ్డాయి.

    ఈడెన్‌ గార్డెన్స్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లలో బ్రాండన్‌ కింగ్‌ (35) రాణించగా.. కెప్టెన్‌ షాయీ హోప్‌ (19) ఫర్వాలేదనిపించాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    మొత్తంగా 36 బంతుల్లో రెండు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో హెట్‌మెయిర్‌ 64 పరుగులు సాధించాడు. రోవ్‌మన్‌ పావెల్‌ (14 బంతుల్లో 24), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (13 బంతుల్లో 26) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి విండీస్‌ 182 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

    స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ క్యూరీ రెండు వికెట్లు తీయగా.. సఫ్యాన్‌ షరీఫ్‌, ఒలీవర్‌ డేవిడ్‌సన్‌, మైకేల్‌ లీస్క్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జార్జ్‌ మూన్సే (19), బ్రాండన్‌ మెక్‌ముల్లన్‌ (14) నిరాశపరచగా.. మైకేల్‌ జోన్స్‌ (1) విఫలమయ్యాడు.

    ఇలాంటి తరుణంలో రిచీ బెరింగ్‌టన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (24 బంతుల్లో 42)తో అలరించగా.. టామ్‌ బ్రూస్‌ (28 బంతుల్లో 35) అతడికి తోడుగా నిలిచాడు. అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం అందలేదు. మాథ్యూ క్రాస్‌ (11), మార్క్‌ వాట్‌ (15) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. 18.5 ఓవర్లలోనే స్కాట్లాండ్‌ ఆలౌట్‌ అయింది. 147 పరుగులకే పరిమితమై 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

    విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లు తీయగా.. షెఫర్డ్‌ హ్యాట్రిక్‌తో కలిపి ఐదు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. షమర్‌ జోసెఫ్‌, గుడకేశ్‌ మోటీ తలా ఒక వికెట్‌ తీసి తమ వంతు సాయం అందించారు.

  • ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా ప్రయాణం మొదలైంది. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత యూఎస్‌ఏతో భారత్‌ తలపడుతోంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో టాస్‌ గెలిచిన యూఎస్‌ఏ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

    సూర్య మెరుపు అర్ధ శతకం (49 బంతులలో 84) కారణంగా టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.  అమెరికా లక్ష్య ఛేదనకు దిగింది.

    T20 World Cup 2026 India vs United States of America Updates
    టీమిండియా శుభారంభం.. అమెరికాపై గెలుపు
    ముంబై వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా.. 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ 84 పరుగులతో చేశాడు. ఛేదనలో అమెరికా జట్టు.. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. సంజయ్ కృష్ణమూర్తి, శుభం రంజనే తలో 37 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పాటు అందించారు.

    19 ఓవర్లకు స్కోరు 121-7
    19 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 121-7 స్కోరుతో నిలిచింది. క్రీజులో శుభం 27, స్కాల్క్ 2 ఉన్నారు.

    18 ఓవర్లకు స్కోరు 111-7
    18 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 111-7 స్కోరుతో ఉంది. క్రీజులో శుభం 18, స్కాల్క్ 1 ఉన్నారు.

    ఏడో వికెట్ కోల్పోయిన అమెరికా
    అమెరికా ఏడో వికెట్ కోల్పోయింది. మహమ్మద్ మోసిన్ 8 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 104-6
    17 ఓవర్లు పూర్తయ్యేసరికి అమెరికా.. 6 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. శుభం 17, మోసిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    16 ఓవర్లకు స్కోరు 100-6 
    16 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 6 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. శుభం 15, మోసిన్ 1 క్రీజులో ఉన్నారు

    ఆరో వికెట్ కోల్పోయిన అమెరికా
    15.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హర్మీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. సిరాజ్ క్యాచ్ పట్టాడు.

    ఐదో వికెట్ కోల్పోయిన యూఎస్ఏ
    15.2: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజయ్ 37 పరుగుల దగ్గర క్యాచ్ ఔట్ అయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన అమెరికా

    15 ఓవర్లకు స్కోరు 98-4
    సంజయ్ 37, శుభం 14 పరుగులతో క్రీజులో ఉన్నారు

    13 ఓవర్లలో అమెరికా స్కోరు: 78-4
    సంజయ్‌ 26, శుభం 5 పరుగులతో ఉన్నారు.
    నాలుగో వికెట్‌ డౌన్‌
    11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌ (34) స్టంపౌట్‌. నాలుగో వికెట్‌ కోల్పోయిన అమెరికా. స్కోరు: 71-4. విజయానికి 48 బంతులో​ 91 పరుగులు కావాలి.

    పది ఓవర్లలో అమెరికా స్కోరు: 49-3
    పవర్‌ ప్లేలో అమెరికా స్కోరు: 31-3(6).
    మిలింద్‌ 16, సంజయ్‌ 4 పరుగులతో ఉన్నారు.

    మూడో వికెట్‌ కోల్పోయిన అమెరికా
    3.2: సిరాజ్‌ బౌలింగ్‌లో సాయితేజ ముక్కామల (2) వరుణ్‌ చక్రవర్తికి క్యాచ్‌ ఇచ్చాడు. మిలింద్‌ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 13-3(3.2)

    రెండో వికెట్‌ కోల్పోయిన అమెరికా
    2.1: అర్ష్‌దీప్‌ బౌలింగ్లో అమెరికా కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ (0) శివం దూబేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 11-2(2.1). సాయితేజ ముక్కామల రెండు పరుగులతో ఉండగా.. మిలింద్ కుమార్‌ క్రీజులోకి వచ్చాడు.

    వికెట్‌ తీసిన సిరాజ్‌
    1.4: అనూహ్యంగా వరల్డ్‌కప్‌ జట్టులోకి.. తుదిజట్టులోకి వచ్చిన సిరాజ్‌ టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. తొలి ఓవర్‌ నాలుగో బంతికే వికెట్‌ పడగొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్లో తిలక్‌కు క్యాచ్‌ ఇచ్చి అమెరికా ఓపెనర్‌ ఆండ్రీ గౌస్‌ (6) వెనుదిరిగాడు.

    టీమిండియా స్కోరు: 161-9(20)
    తొమ్మిదో వికెట్‌ డౌన్‌
    19.6: వరుణ్‌ చక్రవర్తి (0) రనౌట్‌.. తొమ్మిదో వికెట్‌ డౌన్‌

    అర్ష్‌దీప్‌ అవుట్‌
    18.6: షాల్‌విక్‌ బౌలింగ్‌లో... ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన అర్ష్‌దీప్‌ సింగ్‌ (4) 
    సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ
    36 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్యకుమార్‌

    ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    16.4: హర్మీత్‌ బౌలింగ్‌లో మొహ్సిన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (14). క్రీజులోకి  అర్ష్‌దీప్‌ సింగ్‌.  సూర్య 47 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 118-7(16.4)

    అక్షర్‌, సూర్య ధనాధన్‌
    15: నేత్రావల్కర్‌ బౌలింగ్లో అక్షర్‌ 4,4 బాదగా.. సూర్య 4, 6 బాదాడు. ఒకే ఓవరల్లో 21 పరుగులు. స్కోరు: 115-6 (16).

    ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    12.4: హర్మీత్‌ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన హార్దిక్‌ పాండ్యా (5). క్రీజులోకి అక్షర్‌ పటేల్‌. స్కోరు: 85-6(13.5).
    ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    11.4: మొహ్సిన్‌ బౌలింగ్‌లో మిలింద్‌కు క్యాచ్‌ ఇచ్చి రింకూ సింగ్‌ అవుట్‌ (6). సూర్య 21 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 72-5(11.4) 
    పది ఓవర్లలో టీమిండియా స్కోరు:  63-4 

    శివం దూబే డకౌట్‌
    5.6: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో నేత్రావల్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయిన శివం దూబే. పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 46-4(6)
    తిలక్‌ వర్మ అవుట్‌
    5.5: మూడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్‌ వర్మ (16 బంతుల్లో 25; మూడు ఫోర్లు, ఒక సిక్స్‌). వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌ మోనాంక్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన తిలక్‌. శివం దూబే క్రీజులోకి రాగా.. సూర్య 1 పరుగుతో ఉన్నాడు. స్కోరు: 46-3(5.5)
    రెండో వికెట్‌ డౌన్‌
    5.2: వాన్‌ షాల్‌విక్‌ బౌలింగ్‌లో మిలింద్‌ కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన ఇషాన్‌ కిషన్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్‌, రెండు సిక్స్‌లు). క్రీజులోకి సూర్యకుమార్‌ యాదవ్‌. తిలక్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 45-2(5.2).

    నాలుగు ఓవర్లలో టీమిండియా స్కోరు: 33-1
    తిలక్‌ 13 బంతుల్లో 23, ఇషాన్‌ 10 బంతుల్లో 10 పరుగులతో ఉన్నారు.

    తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
    1.2: అలీ ఖాన్‌ బౌలింగ్‌లో సంజయ్‌ కృష్ణమూర్తికి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ

     

    తొలి ఓవర్లో ఏడు పరుగులు
    కట్టుదిట్టంగా నేత్రావల్కర్‌ బౌలింగ్‌... ఇషాన్‌ 7, అభిషేక్‌ 0 పరుగులతో ఉన్నారు.

     

    సంజూపై వేటు
    ఇక ఊహించినట్లుగానే తుదిజట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌ (Sanju Samson)పై వేటు పడింది. ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు. కాగా గత కొంతకాలంగా సంజూ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే.

    సిరాజ్‌కు లక్కీ ఛాన్స్‌
    అదే విధంగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. ఇక పేస్‌ దళ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి స్థానంలో మొహమ్మద్‌ సిరాజ్‌ను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు.

    కాగా హర్షిత్‌ రాణా గాయపడటంతో సిరాజ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. రాణా స్థానంలో ఈ హైదరాబాదీ పేసర్‌ను తీసుకున్నట్లు శుక్రవారం బీసీసీఐ ప్రకటించగా.. బుమ్రా అనారోగ్యం వల్ల ఏకంగా తుదిజట్టులోనూ సిరాజ్‌కు స్థానం దక్కడం విశేషం.

    మరోవైపు.. యూఎస్‌ఏ కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ మాట్లాడుతూ.. పిచ్‌ బాగుందని.. ఇక్కడ భారీ స్కోరు నమోదుకు ఆస్కారం ఉందని పేర్కొన్నాడు. తమ తుదిజట్టులో ఆరుగురు బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ముగ్గురు బౌలర్లు ఉన్నట్లు తెలిపాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026: భారత్‌ వర్సెస్‌ యూఎస్‌ఏ తుదిజట్లు
    భారత్‌
    ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్‌ సిరాజ్, వరుణ్ చక్రవర్తి

    యూఎస్‌ఏ
    ఆండ్రీస్ గౌస్(వికెట్‌ కీపర్‌), సాయితేజ ముక్కామల, మోనాంక్ పటేల్(కెప్టెన్‌), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్‌విక్‌, అలీ ఖాన్, సౌరభ్ నేత్రావల్కర్

  • వైభవ్‌ సూర్యవంశీ.. క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే హాట్‌టాపిక్‌. ఫార్మాట్‌ ఏదైనా ఈ పాలబుగ్గల పిల్లాడికి బంతిని బౌండరీకి తరలించడమే తెలుసు.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పీడకలను మిగల్చడం ఈ యువ బ్యాటర్‌కు అలవాటుగా మారింది..

    ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో వైభవ్‌ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. పద్నాలుగేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఈ ఈవెంట్లో ఏడు మ్యాచ్‌లలో కలిపి మూడు అర్ధ శతకాలు.. ఓ సెంచరీ సాధించాడు. ఆ శతకం కూడా ఫైనల్లో.. అదీ ఇంగ్లండ్‌ జట్టుపై ఏకంగా 175 పరుగులు సాధించడం విశేషం.

     

    55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌
    వరల్డ్‌కప్‌ ఫైనల్లో 55 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. పలు చిరస్మరణీయ రికార్డులు నెలకొల్పాడు. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ బిహారీ కుర్రాడు.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడంతో పాటు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు కూడా అందుకున్నాడు.

    పుత్రోత్సాహం
    ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా సాగిన అతడి విధ్వంసం గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఇక వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పుత్రోత్సాహంతో ఆయన ఉప్పొంగిపోతున్నారు.

    అప్పటిదాకా బిగ్‌ క్రికెటర్‌ అని ఒప్పుకోను
    ఈ క్రమంలో సంజీవ్‌ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సింది ఇంకెంతో ఉంది. వైభవ్‌ టెస్టు మ్యాచ్‌ ఆడేదాకా తననొక స్టార్‌ క్రికెటర్‌గా నేను పరిగణించను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు.

    అదే విధంగా.. ‘‘నువ్వెంత గొప్పగా ఆడితే అంత హుందాగా, ఒద్దికగా ఉండాలని తనకు చెబుతూ ఉంటాను. సీనియర్లు, కోచ్‌లతో చర్చిస్తూ లోపాలు సరిచేసుకోవాలని చెప్తాను. ‘అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో సెంచరీ చేశావు.. భేష్‌.. అయితే, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం.

    టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యం
    టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని తనకు చెప్పాను. సచిన్‌ టెండుల్కర్‌ను చూసి ఓ క్రికెటర్‌ ఎలా ఉండాలో నేర్చుకోవాలని తనకి బోధించాను. టన్నుల కొద్దీ పరుగులు సాధించినా.. ఆయన ఎప్పుడూ ఒక్క వివాదంలోనూ చిక్కుకోలేదు. ‍

    క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆయనను ఆరాధిస్తున్న తీరు గురించి తరచూ చెబుతూ ఉంటాను’’ అని సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నారు. తద్వారా తన కుమారుడు కెరీర్‌లోనే కాదు వ్యక్తిత్వంలోనూ మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పకనే చెప్పారు సంజీవ్‌.

    చదవండి: IND vs PAK: శ్రీలంక లేఖ.. దిగొచ్చిన పాక్‌ బోర్డు? యూటర్న్‌?

  • టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ మొదలైంది. పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో శనివారం ఈ పొట్టి క్రికెట్‌ సంగ్రామానికి తెరలేచింది. తొలిరోజు ఈ మ్యాచ్‌తో పాటు.. వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. టీమిండియా- యూఎస్‌ఏ మ్యాచ్‌లకు షెడ్యూల్‌ ఖరారైంది.

    ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు
    ఇక గ్రూప్‌-సిలో ఉన్న ఇంగ్లండ్‌ తొలత నేపాల్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్‌ శనివారమే తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఈ జట్టులో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, లియామ్‌ డాసన్‌లకు చోటు దక్కింది.

    హార్డ్‌ హిట్టర్‌ వచ్చేశాడు!
    అంతేకాదు.. పూర్తి ఫిట్‌నెస్‌తో హార్డ్‌ హిట్టర్‌ ఫిల్‌ సాల్ట్‌ కూడా తుదిజట్టులోకి వచ్చేశాడు. సాల్ట్‌కు తోడు మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు కెప్టెన్‌ బ్రూక్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను మరింత పటిష్టం చేశారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, జేకబ్‌ బెతెల్‌ ఉన్నారు. 

    పేస్‌ దళంలో జోఫ్రా ఆర్చర్‌, ల్యూక్‌ వుడ్‌ పేర్లు ఖరారయ్యాయి. కాగా ఇంగ్లండ్‌- నేపాల్‌ మధ్య ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది.

    టీ20 ప్రపంచకప్‌-2026: నేపాల్‌తో మ్యాచ్‌కు ఇంగ్లండ్‌ తుదిజట్టు
    ఫిల్‌ సాల్ట్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), జేకబ్‌ బెతెల్‌, టామ్‌ బాంటన్‌, హ్యారీ బ్రూక్‌ (కెప్టెన్‌), సామ్‌ కర్రాన్‌, విల్‌ జాక్స్‌, లియామ్‌ డాసన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, ల్యూక్‌ వుడ్‌.
    బెంచ్‌: రెహాన్‌ అహ్మద్‌, జోష్‌ టంగ్‌, బెన్‌ డకెట్‌, జేమీ ఓవర్టన్‌.

    వరల్డ్‌కప్‌ టోర్నీకి నేపాల్‌ జట్టు
    రోహిత్ పౌడెల్ (కెప్టెన్‌), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్.

    చదవండి: T20 WC: పాక్‌కు చుక్కలు చూపించిన పసికూన.. ఆఖరికి..

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటు వేసి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్ణయాన్ని వ్యతిరేకించిన పీసీబీ.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ నాటకానికి తెరతీసింది. ఈ విషయం గురించి పాక్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ప్రకటించడం గమనార్హం.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ముందుగా ఐసీసీ కుదిర్చిన ఒప్పందం ప్రకారం.. పాక్‌ కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేశారు. పాక్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా షెడ్యూల్‌ ఖరారైంది.

    భారత్‌- బంగ్లా.. మధ్యలో పాక్‌
    అయితే, భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో రక్షణ ఉండదని.. అందుకే తమ వేదికను కూడా లంకకు మార్చాలంటూ బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. బంగ్లా వాదనలో నిజం లేదని తేల్చిన ఐసీసీ ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ.

    భారత్‌తో మాత్రమే ఆడమంటూ
    ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు తమకు భద్రత ఉండదంటూ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. లీగ్‌ దశలో మిగతా మ్యాచ్‌లకు లేని ఇబ్బంది భారత్‌తో మాత్రమే ఉందని చెప్పడం పాక్‌ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. అంతేకాదు.. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిజంగానే ఆగిపోతే ఐసీసీతో పాటు సభ్య బోర్డులన్నింటికీ పెద్ద ఎత్తున నష్టం వస్తుంది.

    ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీలంక క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌కు లేఖ రాసింది. గతంలో పాక్‌లో తమ జట్టుపై ఉగ్రదాడి జరిగినా.. తిరిగి ఆ దేశంలో పర్యటించిన తొలి జట్టుగా నిలిచామని గుర్తు చేసింది. ఇటీవల కూడా బాంబుల మోతతో దద్దరిల్లిన వేళ పాక్‌లో పర్యటించి పరిమిత ఓవర్ల సిరీస్‌ పూర్తి చేశామని సుతిమెత్తగానే చురకలు అంటించింది.

    ఉగ్రదాడిని గుర్తుచేస్తూ
    అలాంటిది.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక.. అకస్మాత్తుగా మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. ఆర్థికంగా భారీ నష్టం వస్తుందని.. ఈ అంశంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా పాత విషయాలు ముఖ్యంగా ఉగ్రదాడిని గుర్తుచేస్తూ లంక బోర్డు రాసిన లేఖ పాక్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ బోర్డు చైర్మన్‌, పాక్‌ మంత్రి మొహ్సిన్‌ నక్వీ భారత్‌తో మ్యాచ్‌ ఆడే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ సన్నిహిత వర్గాలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ..

    గతంలో సాయం చేశాము కదా!
    ‘‘శ్రీలంక ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డుతో పాకిస్తాన్‌ ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. అందుకు తగిన ఫలాలు పొందింది. కాబట్టి లంక బోర్డు నుంచి వచ్చిన లేఖను పాక్‌ నిర్లక్ష్యం చేయలేదు.

    లంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా.. మొహ్సిన్‌ నక్వీని నేరుగా సంప్రదించి.. పాక్‌ తమకు సాయపడాల్సిందిగా కోరారు. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల వల్ల వచ్చే అదనపు ఆదాయానికి గండికొట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తాము పాక్‌ బోర్డుకు సహాయపడిన విషయాన్ని గుర్తు చేశారు.

    నక్వీ ఈ విషయం గురించి తప్పక ప్రధాని దృష్టికి తీసుకువెళ్తారు. శ్రీలంక బోర్డు మాత్రమే కాదు.. శ్రీలంక ప్రభుత్వం కూడా గతేడాది నవంబరులో  ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోకుండా ఒప్పించి.. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ పూర్తి చేసేలా ఒప్పించారు’’ అని పేర్కొన్నాయి.

    కఠిన చర్యలు తప్పవు
    ఇదిలా ఉంటే.. పాక్‌ అన్నంత పనిచేస్తే ఐసీసీ కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఐసీసీతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, ఇతర సభ్య దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే క్రమంలో పీసీబీని ఆ పరిహారం చెల్లించాలని కోరే అవకాశాలు లేకపోలేదు. పరిస్థితి చేయిదాటితే ఇంకాస్త కఠినంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా ఫిబ్రవరి 15న భారత్‌- పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

    చదవండి: పసికూనను ఓడించేందుకు కష్టపడ్డ పాకిస్తాన్‌

Andhra Pradesh

  • సాక్షి, విజయవాడ: చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ బండారం బట్టబయలైంది. హెరిటేజ్‌ ‘టోటల్‌ కర్డ్‌’ అత్యంత నాణ్యతలేనిదిగా నిర్థారణ అయ్యింది. సబ్‌-స్టాండర్డ్‌ ఉత్పతి అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించి నాణ్యత లేని పెరుగు విక్రయిస్తోంది. నాణ్యత లేని  పెరుగు విక్రయిస్తున్న హెరిటేజ్‌కు జరిమానా విధించిన అధికారులు.. పెరుగులో కనీస పాలకొవ్వు లేదని తేల్చారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ యాక్ట్‌ కింద రూ.లక్ష పెనాల్టీ వేశారు. తప్పు ఒప్పుకున్న హెరిటేజ్‌ యాజమాన్యం.. పెనాల్టీ కడతామంటూ సెబీకి నివేదిక ఇచ్చింది. 

    ప్రజల ఆరోగ్యంతో బాబు సంస్థ చెలగాటమాడుతోంది. నాణ్యతలేని పెరుగును మార్కెట్‌లోకి వదిలిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రాండ్‌ పేరుతో హెరిటేజ్‌ మోసానికి పాల్పడుతోంది.  హెరిటేజ్‌ ఉత్పత్తుల్లో నాణ్యత లోపంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

     

  • సాక్షి, అనకాపల్లి: ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్‌పై భూకబ్జా ఆరోపణలు బయటకు వచ్చాయి. దాదాపు 200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమిని కబ్జా చేయాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ చూస్తున్నారని దళితులు ఆరోపించారు. ఆ భూములే తమకు జీవనాధారం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    వివరాల మేరకు.. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్‌పై  రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు భూ కబ్జా ఆరోపణలు చేశారు. 50 ఏళ్ల క్రితం తమకు ఇచ్చిన 42 ఎకరాల భూములను విజయ్‌ కుమార్‌ కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆ భూములే తమకు జీవనాధారం.. సదరు 42 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. మా భూముల్లోకి వెళ్లొద్దంటూ అధికారులు పోలీసులు బెదిరిస్తున్నారు. నిరసన తెలియజేసేందుకు వేసిన టెంట్‌ను కూడా పోలీసులు అర్ధరాత్రి తొలగించారని అన్నారు.

    తమ భూములు బలవంతంగా తీసుకుంటే చావడానికి అయిన సిద్ధమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలు పెరిగిపోయాయి. గడిచిన 50 ఏళ్ల సమయంలో మా భూములను ఎవరు తీసుకునే సాహసం చేయలేదు. కానీ, ఇప్పుడు కూటమి నేతల కన్ను మా భూములపై పడింది అంటూ మండిపడ్డారు. 

  • సాక్షి, తిరుపతి జిల్లా: పుత్తూరులోని కృష్ణా నగర్‌లో విషాదం జరిగింది.  ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు.. మృతురాలిని పద్మజగా గుర్తించారు పోలిసులు. 8 ఏళ్ల క్రితం శివ అనే వ్యక్తిని పద్మజ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • చెన్నై: చెన్నైలోనూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రేజ్‌ మాములుగా లేదు. తన బంధువు కుమారుడి  వివాహ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ చెన్నై వెళ్లారు. వైఎస్‌ అనిల్‌రెడ్డి (వైఎస్‌ జగన్‌ పెదనాన్న వైఎస్‌ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడు సాహిల్ వివాహం సందర్భంగా జరుగుతున్న వేడుకలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ చెన్నై వచ్చారు.

    రేపు ( ఫిబ్రవరి 8, ఆదివారం) ఉదయం సాహిల్‌, వేదికల వివాహం జరగనుంది. ఇంజంబాక్కం విజిపీ లేఅవుట్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వారికి వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు.

    రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

Business

  • ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    దేశ్ కా నెట్‌వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ తీసుకొచ్చింది. 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.

    సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

    రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.

  • బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.

    చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.

    ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్‌లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్‌ ఇదే!

    ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.

    వెండి ధరలు
    బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట.

  • హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.

    ➤2024లో గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.

    ➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్‌మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్‌ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.

    ➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.

    ➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి.

  • 2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

    అగ్రస్థానంలో చండీగఢ్
    రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్‌వర్క్‌లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.

    టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్‌సీఆర్) & జిన్‌ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్‌ను ఉపయోగిస్తున్నాయి.

    1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్‌
    నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌ను అమలు చేసింది.

    వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్‌ రీచార్జ్‌ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్‌ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్‌ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్‌ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

    ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

International

  • వాషింగ్టన్‌: భారత్‌ సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో చైనా రహస్యంగా జరిపిన అణు పరీక్షలపై అమెరికా సంచలన విషయాలను వెల్లడించింది. 2020లో భారత్, చైనాల మధ్య గాల్వాన్‌లో ఘర్షణలు చోటుచేసుకున్న అనంతరం.. చైనా రహస్యంగా అణు పరీక్షలను నిర్వహించినట్లు అమెరికా చెప్పింది. దీంతో, అమెరికా వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

    అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ థామస్ డినాన్నో శుక్రవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా థామస్‌.. అణు పరీక్షల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత వారం రోజుల వ్యవధిలో జిన్ఙియాంగ్ ప్రావిన్సుల్లోని లోప్ నూర్ సైట్‌లో చైనా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా భూమి కంపనాలను గుర్తించడం కష్టంగా ఉండేందుకు ‘‘డీకప్లింగ్’’ అనే టెక్నాలజీని చైనా ఉపయోగించినట్లు అమెరికన్ అధికారులు చెబుతున్నారు.

    కాగా, డీ కప్లింగ్ అంటే భూగర్భంలో అతిపెద్ద గుహలో పరీక్షలు నిర్వహించడం. దీని వల్ల ఏర్పడే భూకంప తరంగాలు గుహలోనే అబ్సార్వ్ అవుతాయి. అయితే, ప్రపంచం కళ్ల నుంచి తప్పించుకోవడానికి చైనా రహస్య అణు పరీక్షలు నిర్వహిస్తోందనే సమాచారం తమ వద్ద ఉందన్నారు. జూన్ 22, 2020న చైనా అలాంటి ఒక అణు పరీక్షను నిర్వహించిందని అమెరికా నిపుణులు చెబుతున్నారు.  

    ఇదిలా ఉండగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ క్రమంలో చైనాపై భారత్‌ జరిపిన దాడిలో 35-40 మంది చనిపోయినట్లు యూఎస్ నివేదికలు చెబుతున్నాయి. చైనా తన సైనికుల మరణాలను ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గాల్వాన్‌ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత 2024లో ఈ ప్రతిష్టంభన ముగిసింది.

    చైనాపై ఎందుకు అనుమానం?
    చైనా తన అణ్వాయుధాలను పెంచుకోవడంపై అమెరికా ఆందోళన చెందుతోంది. బీజింగ్ వద్ద సుమారు 600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని నమ్ముతున్నారు. గత సంవత్సరం, నవంబర్‌లో చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేసిన సమయంలో అమెరికా సైన్యాన్ని అణు ఆయుధాల పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. మరోవైపు రష్యా కూడా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు రష్యాతో భవిష్యత్తులో కుదిరే ఏ అణు ఒప్పందంలోనైనా చైనా కూడా భాగం కావాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మరోవైపు.. అమెరికా, రష్యా మధ్య చివరి అణు ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసిన తర్వాత ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారాయి.

  • బంగ్లాదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది.ఆ దేశ మాజీ మంత్రి, హిందూనేత రమేశ్ చంద్రసేన్ ఈ రోజు ఉదయం  అనుమానాస్పదంగా మృతిచెందారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ పార్టీలో ఆయన కీలక నేతగా ఉన్నారు.

    అసలే హిందువులపై దాడులతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో బంగ్లాదేశ్‌లో మరో వివాదం చోటు చేసుకుంది. ఆవామీ లీగ్ నేతలను విచారించే క్రమంలో నిన్న రమేశ్ చంద్ర సేన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే దింజాపూర్ మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లగా కొద్దిసేపటికే ఆయన మృతిచెందినట్లు ఆసుప్రతి వర్గాలు ప్రకటించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

    అయితే రమేశ్ చంద్రసేన్‌ని కస్టడీలో మాజీ మంత్రితో ప్రవర్తించే విధంగా చూసుకోలేదని అక్కడి కథనాలు పేర్కొన్నాయి. వయస్సు రీత్యా (85) అనారోగ్య సమస్యలు ఉండగా వాటికి ఏటువంటి ప్రత్యేక చికిత్స అందించలేదని తెలిపాయి. బంగ్లాదేశ్ సామాజిక మాధ్యమాలలో రమేశ్ చంద్రసేన్‌ది కచ్చితంగా కస్టోడియల్ డెత్‌ అని  పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఐదుగురు అవామీ లీడర్లు కస్టడీడెత్‌ లో మరణించినట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.

    అయితే షేక్ హాసీనాపై వ్యతిరేకతతో ఆ దేశంలో ఉన్న అవామీ నేతలపై యూనస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్లు అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. 2024 నుంచి ఇప్పటి వరకూ వందల మంది అవాలీ లీగ్ నేతల్ని చంపినట్లు  తెలిపారు. 

    1940లో జన్మించిన రమేశ్ చంద్రసేన్ 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2009 నుంచి 2014వరకూ మంత్రిగా పనిచేశారు. ప్రజలలో ఆయనకు మంచి పేరుంది. నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపినట్లు అక్కడి కథనాలు పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి.

  • ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్‌కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్‌కు ఫార్మా రూపంలో మరో షాక్‌ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్‌లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి 400 మిలియన్‌ డాలర్లు అవుతోందని పాక్ ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం, భారత్‌పై ఆగ్రహంతో పాక్‌ ఆంక్షలు విధించడంతో ఇటు ఇండియా కూడా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఫార్మా ఉత్పత్తులు(మెడిసిన్‌) కేంద్రం నిలిపివేసింది. దీంతో, పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. మందుల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

    ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి ముస్తాఫా కమాల్‌ స్పందిస్తూ.. భారత వ్యాక్సిన్లు లేకపోవడంతో మా దేశంపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం ఏటా దాదాపు 400 మిలియన్‌ డాలర్లతో వ్యాక్సిన్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో 49 శాతం ఖర్చులను గావీ(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (GAVI)) ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51శాతం వాటా ప్రభుత్వం భరిస్తోంది. స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే.. 2031 నాటికి దిగుమతి కోసం దాదాపు రూ.10వేల కోట్లు (1.2 బిలియన్‌) ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో మా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నారు. 

    ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు 2031 నాటికి ముగుస్తుందని కూడా ఆయన చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది కొవిడ్‌ టీకాలను భారత్‌ నుంచి సేకరించడంలో గావీ సహాయం చేసిందన్నారు. దాతల మద్దతుపై ఆధారపడకుండా స్థానికంగా టీకాల తయారీకి సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    అయితే, పాక్‌ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్‌లను ఉచితంగా అందిస్తుంది. అయినప్పటికీ ఏదీ స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. వ్యాక్సిన్లు అన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పాకిస్తాన్‌లో దాదాపు 24కోట్ల జనాభా ఉండగా.. ఏటా 62 లక్షల జననాలు నమోదువుతున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ల డిమాండ్‌ భారీగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు, ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యూనైజేషన్‌ (GAVI).. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు టీకాలు అందించేందుకు పనిచేస్తుంది. 

  • కౌలాలంపూర్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం.. ప్రధాని నరేంద్ర మోదీ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల జెండాలతో చిన్నారులు ప్రధాని మోదీకి అభివాదం చేశారు. అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి మోదీ, అన్వర్ ఇబ్రహీం కలిసి ఒకే కారులో ప్రయాణించారు. కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ నృత్యంతో మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు

    కాగా, భారత్-మలేషియా మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' మరింత పటిష్టం చేయడమే ప్రధాని పర్యటన సాగుతోంది. రక్షణ, భద్రత, ఆర్థిక బంధాల బలోపేతంపై ఇరు దేశాల దృష్టి  పెట్టారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ, భద్రత, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

    2024లో ఇరు దేశాల మధ్య కుదిరిన 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయి పెంపు తర్వాత ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. భారతీయ సంతతి ప్రజలు ఇరు దేశాల మధ్య 'సజీవ వారధి'గా నిలుస్తున్నారని, వారి చారిత్రక స్నేహానికి వారే బలమైన స్తంభాలని ప్రధాని మోదీ కొనియాడారు.

     

     

     

National

  • ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ డివిజన్‌ పరిధిలోని బీజాపూర్‌లో 30, సుక్మా జిల్లాలో 21 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్‌ అయిన మావోయిస్టులపై రూ.1.59 కోట్ల రివార్డు ఉంది.. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ ఎదుట వీరంతా లొంగిపోయారు.

    వీరు తమ వద్ద ఉన్న ఏకే-47 (AK-47) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ (SLR)లు, మరియు బారెల్ గ్రెనేడ్ లాంచర్ల వంటి అత్యాధునిక ఆయుధాలను అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 20  మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద.. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ ఆర్థిక సాయంగా రూ. 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు.
     

     

  • జీవిత చరమాంకంలో చాలా మంది తాము అప్పటి వరకూ చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాటి గురించే ఇతరులకు చెప్పుతు లేదా తమలో తామే ఆలోచిస్తూ బాధ పడడమే లేక సంబరపడడమే చేస్తుంటారు. అయితే ఇక్కడ  రైల్వేశాఖ మాజీ ఉద్యోగి మాత్రం  విభిన్నంగా ఆలోచించారు. తను ఇంతకాలం పనిచేసిన జ్ఞాపకాలకు మనసులో కాకుండా కళ్లెదుట చూడాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ నిర్మాణం చేపట్టారు.

    తమ జ్ఞాపకాలను వదలకుండా ఉండడానికి.. చాలా పనులు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక రైల్వే ఉద్యోగి ఇంతకాలం తను పని చేసిన సంస్థను వీడలేకపోయాడు. అవే జ్ఞాపకాలతో అను నిత్యం తనతో ఉండాలనుకున్నాడు ఇంకేంటి అనుకున్నదే తడువుగా తన ఇంటినే రైల్వే కోచ్‌గా మార్చాడు. దీని నిర్మాణం కోసం తన స్వహస్తాలతో  రైలు నమూనాను చెక్కాడు.

    కేరళ, కాసరగోడ్ రవనీశ్వరం-చల్లింగల్ రహదారిపై వెళుతుంటే ఎవరి కన్నైనా సరే ఒకసారి ఆ ఇంటిపై పడాల్సిందే. ఎంటబ్బా ఈ నిర్మాణం అని అనాల్సిందే? ఎందుకంటే అది సాధారణ ఇళ్లు కాదుగా మరి.. పురాతన రైల్వే కోచ్‌ మోడల్‌కు చెందిన నమూనా.. అందుకే దాని నిర్మాణం చూసి ఎవరైనా ఔరా అనాల్సిందే..

    టీ. దామోదరన్ అనే వ్యక్తి రైల్వేలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. 20 ఏళ్ల క్రితమే ఆయన తన వృత్తికి స్వచ్ఛంగ విరమణ ప్రకటించారు. అయితే అంతకాలం రైల్వేలో పనిచేయడం ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన మదిలో ఎప్పుడూ రైలు జ్ఞాపకాలే మెదిలాడేయి. దీంతో ఆయన తన ఇంటినే రైలుగా మార్చాలని నిశ్చయించుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా ఆ నిర్మాణం చేపట్టారు.

    రెండేళ్ల క్రితం ఇండియన్ రైల్వే బ్యాన్ చేసిన ALCO లోకోమోటివ్ మోడల్‌లో దాని నిర్మాణం చేపట్టారు. దీని నిర్మాణంలో సహాజాకృతి రావాలని స్వయంగా ఆయనే 'రేక్‌వాల్' స్ప్రింగ్స్, వీల్స్ తదితరవన్ని కర్రతో తానే చెక్కినట్లు తెలిపారు. తాపీవారికి ఆ పని అప్పగిస్తే అంత సులభంగా చేయలేరని తానే ఆ పని చేసినట్లు దామోదరన్ అన్నారు.

    ఇక్కడితో కథ ముగియలేదు. తను ఎంతో కష్టపడి నిర్మించిన తన జ్ఞాపకాల గుర్తుకు తనను పెంచి పెద్దచేసిన తన మాతృమూర్తి పేరు మీద "ఆచా కోచ్"  అని పెట్టాడు.  తన మాతృమూర్తి తనను ఎంతో గొప్పవాడు కావాలని కలలు కందని దానికోసం ఎంతో తపించిందని అందుకోసమే తన పేరు పెట్టినట్లు తెలిపారు.

    తన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తనకు ఏ జాబు రాలేదని అందుకే సేల్స్‌మాన్‌గా చేరానని ఆ సమయంలోనే తనకు రైల్వేస్‌ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చిందని దామోదరన్ తెలిపారు. అయితే తాను వెళ్లడానికి నిరాకరించడంతో తన యజమాని వెళ్లాల్సిందని పట్టుబట్టినట్లు తెలిపారు. 1977లో రైల్వేలో ఉద్యోగంలో చేరగా 1996లో పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. ఫిబ్రవరి 21న రైలు ఇళ్లును ప్రారంభించే ఫంక్షన్ ఘనంగా చేయనున్నట్లు దామోదరన్ తెలిపారు.

Telangana

  • సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓఆర్‌ఆర్‌పై జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డిలోని గడ్డ పోతారం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓఆర్‌ఆర్‌పై అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డుపై కారు ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు, దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారులో​ చిన్నారి సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. నెహ్రు జూపార్‌ నుంచి బాచుపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

  • సాక్షి వికారాబాద్: కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా  అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆయన వికారాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతుందని అడిగారు.సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదా అనే దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. 

    నాంపల్లి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఓటుకు నోటు లాంటి కీలక కేసులు విచారణలో ఉండగా అగ్నిప్రమాదం జరగడం ఏంటన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

    గత రెండున్నర ఏళ్లుగా BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు డూప్ డైలాగ్ లు కొడుతూ  కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్యాంట్ లో తొండలు వేస్తా, గుడ్లు పీకుతా, నాలుక కోస్తా, జైల్లో చిప్ప కూడు తినిపిస్తా అంటూ రేవంత్ డమ్మీ డైలాగ్ లతో టైంపాస్ చేస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. ఇక ఇది చాలక తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆ దమ్ము రేవంత్‌ కెక్కడిదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

    బీజేపీ భూజాల మీద బంధూకు పెట్టి ఎక్కువ రోజులు నాటకాలు ఆడలేరని సీఎం పదవికి విలువ ఉంటుందని అనవసరంగా  సీఎం బాధ్యతను ఇంకొకరిపై నెట్టకుడదని ఈసందర్భంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతి పై విచారణ చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

     

  • సాక్షి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం జూకల్ ప్రధాన రహదారిపై షార్ట్ సర్క్యూట్‌ కారణంగా స్కూల్ బస్సు దగ్ధమైంది. రైసింగ్ సన్ స్కూల్‌కు చెందిన బస్సులో పొగలు రావడం గమనించిన డ్రైవర్‌.. అప్రమత్తమై విద్యార్థులను దింపడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో స్కూల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది.

    ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్కూల్ బస్సు ఫిట్నెస్ వివరాలతో పాటు మంటలు వ్యాప్తికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

     

     

  • అమృతా ప్రణయ్‌లాంటి సంచలనాత్మక కేసును డీల్‌ చేసిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ రంగనాథ్‌.. ఆ తర్వాతి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైడ్రా అనే ఓ వ్యవస్థను కమిషనర్‌ హోదాలో ముందుకు నడిపిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా సరే.. హైడ్రా ‘రైట్‌ రూట్‌’లోనే ముందుకు వెళ్తోందని అంటున్నారాయన. అలాంటి వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా?.. సాక్షి డిజిటల్‌కు ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. 

    ప్రభుత్వం మారితే హైడ్రా పరిస్థితి?

    రంగనాథ్‌: హైడ్రాకు ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. పది.. పదిహేనేళ్లు.. ఇలా నిరంతరాయంగా పని చేసినా సరిపోవు. ఉదాహరణకు.. మన చుట్టురా వేల చెరువులు ఉన్నాయి. వాటి పునరుద్దరణకు మొదటి అడుగు వేశాం. అదసలు అలా కొనసాగుతుంది. హైడ్రా అనేది రేవంత్‌ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువైంది. వాటర్‌ బాడీస్‌ ప్రొటెక్షన్‌ అనేది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి(ఆర్టికల్‌ 51-A(g) ప్రకారం). పొరుగున ఉన్న కర్ణాటకలో చూసుకుంటే చెరువుల సంరక్షణ 2008 నుంచే కొనసాగుతుంది. అక్కడ ఇన్నేళ్లలో ప్రభుత్వాలు మారాయి కదా. కాబట్టి.. ఆ అవకాశాలను కొట్టిపారేయలేం.

    ప్రభుత్వాన్ని, బ్యూరోక్రట్లు వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయా? 
    రంగనాథ్‌: నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం సామాన్యులను కాలుస్తోంది అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదు. పావుగా వాడుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఛాయిస్‌. అలాగే ఆ అధికారులపై విమర్శలు వచ్చినప్పుడు.. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదు. వాటికి హైడ్రా అనే వ్యవస్థ దూరం కూడా.

    ఒత్తిళ్లతో పెద్దవాళ్లను టచ్‌ చేయట్లేదన్న విమర్శలపై ఏమంటారు?
    రంగనాథ్‌: 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టాం. పేదవాళ్ల ఇళ్లనే కాదు.. ప్రముఖుల నిర్మాణాలనూ వదిలిపెట్టలేదు. ఎన్‌ కన్వెషన్‌ కూల్చివేత అందుకు ఉదాహరణ.   సినీ, రాజకీయ, వ్యాపార.. ఇతర రంగాల ప్రముఖుల కట్టడాలను కూల్చేశాం. కొన్నిసార్లు సామాజిక కోణంలో చూశాం. అందుకే ఎన్నో బస్తీలను వదిలేశాం. కొన్ని కేసుల్లో న్యాయం కూడా అందించాం. కొన్నింటికి ఎ‌ఫ్‌టీఎల్(ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌‌) ఇంకా డిసైడ్‌ కాలేదు. ఒక్కసారిగా ఫిక్స్‌ అయితే వాటిని వదిలిపెట్టం. సోషల్‌ మీడియాలో ప్రచారాన్ని పట్టుకుని హైడ్రా పని తీరును శంకించాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోం కూడా. పనిలో 100 పర్సంట్‌ స్ట్రయిక్‌ రేట్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం ఉంది కాబట్టే హైడ్రా ప్రజావాణికి జనం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి కదా.

    ఒవైసీ కాలేజ్‌ను టచ్‌ చేయలేదన్న రాజకీయ విమర్శల నేపథ్యంలో తీసుకోబోయే యాక్షన్‌ ఎలా ఉందనుంది?
    రంగనాథ్‌: ఒవైసీ కాలేజీలాగే చాలా భవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క ఆ కాలేజ్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి?. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఉండవచ్చు, పుల్లారెడ్డి లేదంటే వెంకట్ రెడ్డి కాలేజీ ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిష్కారం కనిపించదు. నిజంగా మనం ఒక్క లింక్‌పై మాత్రమే దృష్టి సారిస్తున్నాం. ఒక్క కేసును మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ హైడ్రా సైలెంట్‌గా ప్రభుత్వ భూముల్ని, చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొట్టి ఎంతో మేలు చేస్తున్నాం.

    వేల, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాపాడుతున్నాం. హైడ్రా అనేది దేశంలోనే వినూత్నమైన ప్రభుత్వం. జాతీయ మీడియా సంస్థలే కాదు.. ఐఎస్‌బీ కూడా హైడ్రాను ప్రస్తావించింది. ముంబైలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కోరుకుంటున్నారు. అలాగే హైడ్రా పని తీరు కూడా మారింది. కూలగొట్టడమే కాదు.. చెరువుల పునర్మిరాణాలు చేపడుతోంది. కొందరు హైడ్రా పరిధి పెంచమని కోరుతున్నారు. దేవదాయ భూముల్ని ఎందుకు పరిరకక్షించకూడదని అనుకుంటున్నాం కూడా.  కానీ, పాలసీ, ఎఫ్‌టీఎల్‌ ఫైనల్‌ నోటిఫికేషన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టులు కూడా ఈ విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు మేం చేస్తున్నాం.

    హైడ్రా కార్యాచరణలో లోపాల గురించి..
    రంగనాథ్‌:చూసే వాళ్లను బట్టి ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాలు చికెన్‌, మటన్, చేపల వేస్టేజ్‌లు పడేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెళ్లి సమస్య పరిష్కరించాం. నష్టంగా భావించేవాళ్లు.. వేళ్లమీద లెక్కపెట్టుకునేవాళ్లు. వాళ్లు హైడ్రా ఉద్దేశాలను తప్పుబడతారు. కానీ, వందల, వేల, లక్షల మందికి మంచి  జరుగుతోంది. వాళ్లు మౌనంగా ఉంటారు.  జరిగే మంచి గురించి వాళ్లు మాట్లాడుకోరు. మాట్లాడే ఆ ఒకరిద్దరి గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా!. కాబట్టి ఉద్దేశం మంచిదే.. అలాగే కార్యాచరలోనూ సవ్యంగానే ఉంది.

    మీ ఇల్లు కూడా ఎఫ్‌టీఎల్‌ జోన్‌లో ఉందంట కదా?
    రంగనాథ్‌: నేను ఉండేది మధురానగర్‌లో. నా ఇంటికి కిలోమీటర్‌ దూరంలో కృష్ణకాంత్‌ పార్క్‌ ఉంది. అది ఒకప్పుడు చెరువు. ఆ చెరువు దిగువన ప్రాంతంలో నేను ఉంటా. అది ఎఫ్‌టీఎల్‌ పరిధికి ఎంతో దూరం. ఎవరో సెన్స్‌ లేకుండా‌ కాంట్రవర్సిటీ కోసం క్రియేట్‌ చేసింది. హైడ్రా మీద వీలైనంత మంది అన్ని విధాల దాడులు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచారం కూడా.(నవ్వుతూ..)

    రంగనాథ్‌ కూల్చివేతలకు వెళ్లడం అవసరమా?
    రంగనాథ్‌: కచ్చితంగా అలా అనేం లేదు. ఆఫీస్‌ నుంచి కూడా పర్యవేక్షించొచ్చు. కానీ, ఒక్కోసారి హైడ్రా కమిషనర్‌గా అది నా బాధ్యత. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి.. విమర్శలు వస్తుంటాయి. ఆ బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది.  కొన్ని ఆపరేషన్‌లప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. బ్యూరోక్రట్‌గా, సివిల్‌ సర్వెంట్‌గా, పొలిటికల్‌ ఎగ్జిక్యూటివ్‌గా.. తక్కువ మందికి డ్యామేజ్‌ కలిగేలా ఎక్కువ మందికి లాభం కలిగేలా చూడాల్సిందే. అప్పుడే కదా.. తర్వాతి తరాలు హైడ్రా గురించి మాట్లాడుకునేది.

  • సాక్షి హైదరాబాద్ : డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో అకస్మిక దాడులు నిర్వహించింది. నిషేదిత మందులు అమ్ముతున్న రెండు మెడికల్ షాపులను గుర్తించి వాటిని సీజ్ చేసింది.

    మహబూబాబాద్ జిల్లా, మారిపెడ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మెడికల్ షాప్‌లో డ్రగ్‌ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన దాడులలో నిషేదిత మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసి మందుల దుకాణం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమంగా వినియోగిస్తున్న మందులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

    నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా మెడికల్ షాపు నిర్వహించడం లేదని అదే విధంగా గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పాల్వంచలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెడికల్ షాపులో  డ్రగ్‌ లేబుల్‌  ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో స్టాక్‌లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు.  

    అధికారులు దాడులలో ట్రామాడోల్ ఇంజెక్షన్లు, మాత్రలు మరియు అల్ప్రజోలం మాత్రలను అధికారులు సీజ్ చేశారు. నిషేదిత మందులు అమ్మడం, లేబుల్ ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని దీనికి రెండేళ్ల దాక జైలుశిక్ష పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. 
     

     

Family

  • ''నా కొడుకు బారి నుంచి నన్ను కాపాడండి'' అని వ‌న దేవ‌త‌లు సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భ‌క్తుడు. త‌న వేద‌నను వంద‌ రూపాయ‌ల నోటుపై రాసి హుండీలో వేశాడు. మ‌రికొంత మంది భ‌క్తుల నుంచి కూడా ఇలాంటి వేడుకోళ్లు వ‌చ్చాయి. ముదిమి వ‌య‌సులో ముస‌లి త‌ల్లిదండ్రుల‌ను వేద‌న‌కు గురిచేస్తున్న విదారక‌ ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో బాగా పెరిగిపోయాయి. క‌డుపున పుట్టిన పిల్ల‌ల‌ను పెంచి, ప్ర‌యోజ‌కుల‌ను చేసిన అమ్మ‌నాన్న‌ల‌కు చివ‌రి రోజుల్లో చీద‌రింపులే ఎదుర‌వుతున్నాయి. జీవిత చ‌ర‌మాంకంలో త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన పిల్ల‌లు వ‌దిలించుకోవాల‌ని చూస్తున్నారు. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

    మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సౌర్ ప‌ట్ట‌ణంలోని బ‌స్టాండ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలు దిక్కుతోచ‌ని స్థితిలో ఒంట‌రిగా ఏడుస్తూ క‌నిపించింది. దీంతో ప్ర‌యాణికుడొక‌రు ఏమైంద‌ని ఆరా తీశాడు. త‌నను కొడుకు, కోడ‌లు వ‌దిలేసి వెళ్లిపోయార‌ని పెద్దావిడ వాపోయింది. త‌న కుమారుడు ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడ‌ని, అత‌డి పేరు సురేష్ శర్మ అని తెలిపింది. త‌నను కొడుకు- కోడ‌లు స‌రిగ్గా చూడ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ మారింది. అమ్మ‌ను వ‌దిలేసి వెళ్లిన కొడుకుపై నెటిజ‌నులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు.

    నెటిజ‌న్ల స్పంద‌న‌
    పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం త‌ల్లిదండ్రులు త‌మ జీవితాల‌ను ధారపోస్తార‌ని, అలాంటి వారిని చివ‌రి రోజుల్లో చూసుకోవ‌డం వార‌సుల బాధ్య‌త‌ మాత్ర‌మే కాదు.. గౌర‌వం కూడా అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశారు. తన కొడుకు పుట్టినప్పటి నుంచి అతడికి వాళ్ల‌మ్మ‌ పెట్టిన డబ్బు, ఆహారం, భద్రత, ఆశ్రయం, సంరక్షణకు మూల్యం వ‌సూలు చేయ‌డానికి కేసు పెట్టాల‌ని మ‌రొక‌రు సూచించారు. ఓరి దేవుడా! వృద్ధురాలు అలా ఏడుస్తుండటం తాను చూడలేకపోతున్నానని, ఇది చాలా హృదయ విదారకంగా ఉందని ఇంకొక‌రు ఆవేద‌న చెందారు. మ‌న స‌మాజంలో మానవత్వం ఇంత దిగజారిపోతుందని ఊహించలేకపోతున్నానని మరొకరు అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు చూసిన‌ప్పుడు ఎక్కువ కాలం బ‌త‌కం కూడా శాపంగా కింద భావించాల్సి వ‌స్తోంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

    చ‌ద‌వండి: 100 రూపాయ‌ల నోటుపై రాసి.. కాపాడాల‌ని వేడుకోలు

    వీడియోలోని వృద్ధురాలికి ఎవ‌రైనా స‌హాయం చేశారా? ఆమె ఇప్పుడు ఎక్క‌డ ఉంద‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు. త‌ల్లిని వ‌దిలేసి వెళ్లిన కొడుకును క‌చ్చితంగా శిక్షించాల‌ని నెటిజ‌నులు డిమాండ్ చేస్తున్నారు. స‌మాజంలో క‌నుమ‌రుగవుతున్న మాన‌వీయ‌ విలువ‌ల‌కు ఈ ఉదంతం అద్దం ప‌డుతోంద‌ని ఆలోచ‌నాప‌రులు నిట్టూరుస్తున్నారు. 

     

Politics

  • సాక్షి, బాన్సువాడ: మున్సిపల్‌ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. అధికార కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ మనిషి కాదు.. బీజేపీ మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జుక్కల్ నియోజకవర్గం బాన్సువాడ(బిచ్కుంద మున్సిపాలిటీ) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ఉచిత బస్సు పేరిట మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు రేవంత్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అయినా నేరవేరిందా?. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.

    ఒక ఆంబోతు రెండు దున్నపోతులంటూ పోచారం బండ కట్టుకొని బాయిలో  దూకలే అంటూ ఎద్దవా చేశారు. పోచారానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్ నేతలందరూ స్టువర్టుపురం దొంగలే. కేసీఆర్‌ ఉన్నప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ప్రజలకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు.


     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్‌ఎస్‌ నేతలను గెలిపిస్తే ఏం ప్రయోజనమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పెన్షన్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

    మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిల్లో అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతుంది. కరోనా వచ్చినప్పుడు పేదలకు ఉపాధి లేకపోతే 80 కోట్ల మందికి అన్నం పెట్టింది నరేంద్ర మోదీ. కరోనా కాలంలో వాక్సిన్ తయారు చేయించి ప్రజల ప్రాణాలు కాపాడింది మోదీ. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు మంజూరైతే కేసీఆర్ కనీసం లక్షా70 వేల ఇళ్లు కట్టలేకపోయాడు. మోదీని తిట్టిన కేసీఆర్‌ ప్రభుత్వం ఖతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే అంటున్నారు. వాళ్ల పరిస్థితి కూడా అదే అవుతుంది.

    నాకు తక్కువ టైంలో ఎక్కువ ఓట్లతో ఆశీర్వదించింది గజ్వేల్ ప్రజలే. నామినేషన్‌ వేసిన సమయంలో 5000 మంది వస్తారనుకుంటే 25వేల మంది వచ్చారు. ఎన్నికల్లో గెలిచింది కేసీఆర్‌ అయితే నైతికంగా గెలిచింది గజ్వేల్‌ ప్రజలు. గజ్వేల్‌కు కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉన్నా.. అభివృద్ధి మాత్రం జరగలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోలేని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది?. తనను కోసినా 5 పైసల బిళ్ళ లేదు. నేను రైతు బంధు ఇవ్వను అని రేవంత్  అంటున్నాడు. ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటూ వ్యాఖ్యలు చేశారు.

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్‌ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    నాంపల్లి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్‌లను, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.

    మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

    ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబ్‌ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్‌ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.

    అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్‌ జోన్‌ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్‌ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

  • సాక్షి, గుంటూరు: కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపు సరికాదని కాపు నేతలు అన్నారు. శనివారం.. మాజీ మంత్రి అమర్నాథ్‌, కరణం ధర్మశ్రీ ఆధ్వరంలో 100 కార్లతో అంబటి ఇంటికి తరలివచ్చిన ఉమ్మడి జిల్లా కాపు నేతలు.. అంబటి కుటుంబానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులంతా అండగా ఉంటారన్నారు. ‘‘అంబటి రాంబాబును వాళ్లే రెచ్చగొట్టి  వాళ్లే దాడికి పాల్పడ్డారు. అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?’’ అంటూ కాపు నేతలు మండిపడ్డారు.

    ‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిర్థారించింది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టడం దారుణం. అంబటి రాంబాబుపై  ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 32 కేసులు నమోదు చేశారు. పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయించారు.

    ‘‘టీడీపీకి కాపులు అంటే గిట్టదు. టీడీపీని  కాపులు ప్రశ్నిస్తే సహించరు. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రజలు  ఎక్కువ కాలం అంగీకరించరు. చంద్రబాబు, లోకేష్‌ను చూసి ఎవరూ భయపడరు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  వడ్డీతో  సహా  చెల్లిస్తాం’’ అని కాపు నేతలు హెచ్చరించారు.

Warangal

  • బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

    కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

    నర్సంపేట: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో ప్రతీ అధికారి బాధ్యతతో, నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ సత్యశారద సూచించారు. నర్సంపేట జెడ్పీ సెకండరీ స్కూల్‌లో పీఓ, ఏపీఓలకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోలింగ్‌ నిర్వహణలో పారదర్శకత, సమర్థత ఎంతో కీలకమని, చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. శిక్షణ అనంతరం నర్సంపేట మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పీఎంశ్రీ జెడ్పీ సెకండరీ స్కూల్‌ పరిసరాలను కలెక్టర్‌ పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే శుభ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

    ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

    వర్ధన్నపేట: మున్సిపల్‌ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద ఆదేశించారు. పట్టణంలోని రైతువేదికలో పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ప్రిసైడింగ్‌ అధికారుల పాత్ర కీలకమని గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఇచ్చే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్స్‌ల సీలింగ్‌, ప్రిసైడింగ్‌ అధికారుల డైరీ, బ్యాలెట్‌ పేపర్‌, అకౌంట్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్స్‌లు తెరవడం, పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం వంటి పలు అంశాలను వివరించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి వాటర్‌ బాటిళ్లు, బ్యాగ్‌లు, మొబైల్‌ఫోన్లు, ఇంక్‌ప్యాడ్‌ వంటివి అనుమతించవద్దని పేర్కొన్నారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, నర్సంపేట, వర్ధ న్నపేట మున్సిపల్‌ కమిషనర్లు భాస్కర్‌, సుధీర్‌కుమార్‌, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, విజయసాగర్‌, ఎన్నికల అధికారులు, మున్సిపల్‌ అధికారులు, మాస్టర్‌ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘పెద్ది’ వల్ల రూ.15కోట్లు నష్టపోయాం

    బోరు బండి కుటుంబ సభ్యుల నిరసన

    నర్సంపేట: 2016 –17వ సంవత్సరంలో అప్పటి సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌గా ఉన్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. నర్సంపేట నియోజకవర్గంలో తమ బోరు బండితో విచ్చలవిడిగా బోర్లు వేయించి మోటార్లు బిగించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తీరని అన్యాయం చేశారని నర్సంపేట పట్టణంలోని శ్రీలక్ష్మి బోర్‌వెల్స్‌ యజమానులు వీరమల్ల మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోర్‌వెల్‌ షాపు ఎదుట టెంట్‌ వేసుకొని.. పెద్ది సుదర్శన్‌రెడ్డి, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు మోసం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుటుంబాలతో సహా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బోర్‌వెల్‌ యజమానులు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్‌రెడ్డి వల్ల తమ కుటుంబాలు వీధిన పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బోరు వేసే క్రమంలో తాము చేసిన అప్పులు రూ.15కోట్లు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పిచ్చిన వారికి సమాధానం చెప్పలేక ఎనిమిది నెలలుగా ఇళ్లకు తాళాలు వేసి రహస్యంగా జీవనం గడుపుతున్నామని వాపోయారు. కాగా, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న వేళ నర్సంపేటలో వీరి ఆందోళన వైరల్‌గా మారింది.

  • ఉపాధ్యాయుల కృషి అభినందనీయం

    ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం నోడల్‌ ఆఫీసర్‌ గాయపు లింగారెడ్డి

    దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలలో వసతులు, పరిశుభ్రత, బోధన విధానం అద్భుతంగా ఉందని, అందుకు ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ గాయపు లింగారెడ్డి కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. మాథ్స్‌, సోషల్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, హిందీ సబ్జెక్టులను టీమ్‌ సభ్యులు ఆనంద్‌మోహన్‌, నాగార్జున్‌ రావు, ఎం.రాజు, సంతోష్‌కుమార్‌, రమేష్‌ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని సైన్స్‌ ల్యాబ్‌, హాజరు రిజిస్టర్‌, మధ్యాహ్న భోజన నిర్వహణ, పారిశుద్ధ్యాన్ని పరిశీలించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయులు ఎస్‌కే.అహ్మద్‌, సునీత, సంధ్యారాణి, జుమ్మిలాల్‌, రజినీ, కిరణ్‌, కరుణ, తదితరులు పాల్గొన్నారు.

  • శనివా

    మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే

    గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు..

    పకడ్బందీగా గెలుపు కోసం పావులు

    రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం

    ఓట్ల కోసం పార్టీల నేతలు, ఇన్‌చార్జ్‌ల పాట్లు.. రోజువారీ పరిస్థితిపై అధిష్టానాల ఆరా..

    సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

    మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్‌చార్జ్‌లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

    10 నియోజకవర్గాలు..

    12 మున్సిపాలిటీలు..

    ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ తర్వాత ఎక్కువ పంచాయతీల్లో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

    హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళీప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు.

    వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సవాల్‌గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్‌ రెడ్డి చైర్మన్‌ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు.

    జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీ అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

    స్టేషన్‌ ఘన్‌పూర్‌ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు.

    జనగామ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వార్డు కౌన్సిలర్ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.

    భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్‌), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్‌ఎస్‌) వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు.

    ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిఽథ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

    మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్‌(బీఆర్‌ఎస్‌)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ విప్‌ దాస్యం వినయభాస్కర్‌, కాంగ్రెస్‌ నుంచి సీహెచ్‌ వెంకటేశ్‌లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్‌నాయక్‌.. అభ్యర్థులను బరిలోకి దింపారు.

    డోర్నకల్‌ నియోజకవర్గంలో డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ (బీఆర్‌ఎస్‌)కు సవాల్‌గా మారాయి.

  • పులి.

    రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివారులోని పరిశె రాజుకుచెందిన లేగదూడపై శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పులి దాడి చేసి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై దూదిమెట్ల నరేశ్‌ అటవీశాఖ డీఎఫ్‌ఓ కొండల్‌రెడ్డి, సిబ్బందితో వెళ్లి పులి పాదముద్రలుగా నిర్ధారించారు.

    జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సరిహద్దులోని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్‌పూర్‌లో పులి సంచరించినట్లు శుక్రవారం మద్దూరు సీఐ రమేశ్‌, ఎస్సై ఆసీఫ్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాముడు గుర్తించారు. సమీప గ్రామాలైన కట్కూర్‌, వీఎస్‌ఆర్‌ నగర్‌, బండనాగారం, బంజేరు, మార్మాముల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సమాచారం ఇచ్చారు.

    జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్లు పలు గ్రామాల్లో వార్తలు, ఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

    ఆడనా.. మగనా?

    ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండడం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్‌ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.

    పులికోసం బోన్లు.. ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు

    పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో వ్యాఘ్రం జాడలు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

    పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు.

    పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది.

    పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్ధాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది.

    మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు.

    రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు.

    వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి.

    పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్‌ఎస్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓ, ఎస్‌హెచ్‌ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి.

  • రుద్రేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

    హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ వరంగల్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ రామల సునీత తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి వేయిస్తంభాల ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను డీసీ రామల సునీత ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది దేవాలయానికి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నగరపాలక సంస్థ, విద్యుత్‌శాఖ, పోలీస్‌శాఖ, రెవెన్యూ శాఖ, దేవాదాయశాఖ, పురావస్తుశాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈఓ అనిల్‌కుమార్‌, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ శివరాత్రి ఉత్సవాల్లో ఐదురోజులు జరిగే పూజా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు అ యినవోలు వెంకటసత్యమోహన్‌, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు, పద్మశాలి సంఘం నాయకులు గణపతి, వెలమ సంఘం నాయకులు సంపత్‌రావు, సిబ్బంది మ ధుకర్‌, రామకృష్ణ, సందీప్‌శర్మ పాల్గొన్నారు.

    వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పత్రంతో పా టు, సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంఈఓ ధ్రువీ కరించిన ప్రవేశ ఫామ్‌తో ఉదయం 8గంటలకు జేఎన్‌ఎస్‌ వద్ద హజరు కావాలని కోరారు.

    కేయూ క్యాంపస్‌: విద్యార్థులు భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా ఎదగాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. కేయూ, హైదరాబాద్‌లోని టి హబ్‌ సంయుక్తంగా క్యాంపస్‌లోని ఆడిటోరియంలో విద్యార్థులకు ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేయూ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, స్టార్టప్స్‌ స్థాపనకు టి హబ్‌, కె హబ్‌ సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన వంద మంది విద్యార్థులకు పూర్తి స్థాయి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులతోపాటు అధ్యాపకులు, పరిశోధకులు సైతం నూతన ఆలోచనలు పంచుకోవచ్చన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం హెదరాబాద్‌ ఏఐసీ టి హబ్‌ ప్రధాన అధికారి రాజేశ్‌కుమార్‌, కేయూ హబ్‌ డైరెక్టర్‌ సవితా జ్యోత్స్న, వివిధ సంస్థల ప్రతినిధులు డాక్టర్‌ వినోద్‌, సయ్యద్‌ రాష్యన్‌, స్వాతి, రిషిత, అరుణ్‌రెడ్డి, టి హబ్‌ ప్రతినిధులు చైతన్య శ్రవణ, మహ్మద్‌హఫీజుద్దీన్‌, ఏర్ల శ్రవణ, సిద్ధార్థ, బొల్లం కిరణ్‌ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.

    న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఓఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఇంటర్‌ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి డాక్టర్‌ జంగా సతీశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బాలికలకు (హనుమకొండ కేయూ క్రాస్‌ రోడ్డులోని టెమ్రిస్‌ వరంగల్‌–1 బాలికలు), బాలురకు హనుమకొండ హంటర్‌ రోడ్డులోని కాజీపేట బాలుర కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, జేఈఈ, నీట్‌, ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు ఆయా కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు.

  • నత్తనడకన విచారణ

    కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ కామన్‌ మెస్‌లో అవకతవకలు జరిగాయని, అధికంగా మెస్‌ బిల్లులు వస్తున్నాయని కొందరు విద్యార్థులు గతంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కామన్‌ మెస్‌లో మెస్‌ బిల్లులు అధికంగా వచ్చాయని విద్యార్థులు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. విచారణ కమిటీ చైర్మన్‌గా కేయూ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తుండగా పలువురు ప్రొఫెసర్లు సభ్యులుగా ఉండి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కమిటీ పలుమార్లు హాస్టళ్ల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజ్‌కుమార్‌ నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా ఆయా జాయింట్‌ డైరెక్టర్లను కూడా కొద్దిరోజుల క్రితమే విచారించారు. ఈవిచారణ కమిటీవేసి నెలరోజులు గడిచిపోయింది అయినా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.

    ఇష్టారీతిన అడ్వాన్స్‌లు..

    వివిధ హాస్టళ్లు, మెస్‌ల నిర్వహణకు హాస్టళ్ల డైరెక్టర్‌ ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్ని హాస్టళ్లు, మెస్‌లలోని 23 మంది జాయింట్‌ డైరెక్టర్లకు కూడా అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు విడుదల చేస్తూ వస్తున్నట్లు డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ చెబుతున్నారు. కొందరికి ఎక్కువ మొత్తంలో అడ్వాన్స్‌లు ఇవ్వడంతో వారుసక్రమంగా వెచ్చించా రా లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామన్‌మెస్‌తోపాటు హాస్టళ్ల డైరెక్టర్‌పరిధి అన్ని మెస్‌ల, హాస్టళ్ల జాయింట్‌ డైరెక్టర్లకు విడుదల చేసి న అడ్వాన్స్‌ల బిల్లులను విచారణ కమిటీ క్షణ్ణంగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

  • ముల్క

    ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార శాఖకు చెందిన 52మంది నూతనంగా నియమితులైన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు శుక్రవారం సందర్శించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీఎం) 36 వారాల హయ్యర్‌ డిప్లొమా ఇన్‌ కో–ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణ పొందుతున్న అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు సహకార రంగంలో ఉత్తమంగా పనిచేస్తున్న సంస్థల పని తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ముల్కనూరు సహకార సంఘం అందిస్తున్న వివిధ సేవలు, నిర్వహణ విధానం తదితర అంశాలు తెలుసుకున్నారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నూతనంగా నియమితులైన ప్రభుత్వ అధికారులతో చర్చించారు. సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై వివరించారు. నూతన అధికారులు అభినందిస్తూ, ఈ శిక్షణ కార్యక్రమం అధికారుల భవిష్యత్‌ సహకార సేవలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    హన్మకొండ అర్బన్‌: పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న బుధవారం స్థానిక సెలవుగా దినంగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులతో పాటు ఎన్నికల పరిధి దుకాణాలు, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ, విద్యా సంస్థల భవనాలకు ఈనెల 10న, 11 పోలింగ్‌ రోజున, 13న ఓట్ల లెక్కింపు రోజుల్లో సెలవు దినాలుగా పరిగణించాలని సూచించారు. ఓటర్లు విధిగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

  • టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

    టీపీయూఎస్‌ జిల్లా అధ్యక్షుడు

    ఉప్పుల సతీశ్‌

    విద్యారణ్యపురి: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పుల సతీశ్‌ డిమాండ్‌ చేశారు. టీపీయూస్‌ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్‌ను వరంగల్‌ జిల్లా డీఈఓ రంగయ్యనాయుడుతో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సతీశ్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలన్నారు. అర్హులైన టీచర్లకు పదోన్నతులివ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ సుజన్‌తేజ, సైన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఉల్లాస్‌ కో–ఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావు, టీపీయూఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బత్తిని వెంకటరమణ, జిల్లా జనరల్‌ సెక్రటరీ ఎ.శేఖర్‌, బాధ్యులు రవికుమార్‌, సదానందం, రాములు, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, తిరుపతిరావు, రాజు పాల్గొన్నారు.

  • నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

    మంత్రి కొండా సురేఖ

    ఖిలా వరంగల్‌: ప్రజాపాలన దిశగా పేదల సక్షేమం, తూర్పు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు శుక్రవారం వరంగల్‌ 35వ డివిజన్‌ శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌లో జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.కోటి వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, మున్నూరుకాపు కమ్యూనిటీహాల్‌ అభివృద్ధి పనులను మేయర్‌ గుండు సుధారాణి, కార్పొరేటర్‌ సోమిశెట్టి ప్రవీణ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, కొత్తపెల్లి శ్రీనివాస్‌, శ్రీరాం రాజేశ్‌, పగడాల సతీశ్‌, శ్రీధర్‌, కేడల పద్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే

    ఐసీసీ అండర్‌–19 గెలుపుపై సంబురాలు

    వరంగల్‌ స్పోర్ట్స్‌: జింబాబ్వే దేశంలోని హరారే పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అండర్‌–19 ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా విజేతగా నిలిచి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. భారత కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే నేతృత్వంలో వైభవ్‌ సూర్యవంశీ 175 పరుగులు చేసి విజయఢంకా మోగించడంలో కీలకపాత్ర పోషించారు. యువ ప్రపంచకప్‌ను సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సంబురాల్లో మార్నేని ఉదయభానురావు, బండారి ప్రభాకర్‌, మట్టెడ కుమార్‌, అనిల్‌, నాగేశ్‌, నరేశ్‌, అవినాశ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బిల్లులు రాకుండా ఆపింది ఎమ్మెల్యేనే

    బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ రవీందర్‌రావు

    నర్సంపేట: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆరోపణలు సరికాదని, బోర్‌వెల్‌ నిర్వాహకులకు బిల్లులు ఆపింది ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డి బోర్లు వేయించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను సుదర్శన్‌రెడ్డి చెల్లించాలని అనడం సిగ్గు చేటన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న నర్సంపేటను తగాదాలకు నిలయంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. బోర్‌వెల్‌ నిర్వాహకుల నిరసన వెనుక కాంగ్రెస్‌ పార్టీ ఉందని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్‌ మాజీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు, సంగాని సూరయ్య, బాల్నె వెంకన్న, యువరాజు, రాజ్‌కుమార్‌, చంద్రమౌళి, మౌలానా, ఇర్ఫాన్‌, నాయిని వేణుచంద్‌, తదితరులు పాల్గొన్నారు.

  • దూకుడ
    వరంగల్‌
    శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
    గెలుపే లక్ష ్యంగా

    ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు

    స్వతంత్రులు కూడా వెరవని వైనం

    ఎన్నికల ప్రచార ఆర్భాటాలకు రూ.లక్షల్లో ఖర్చు

    విజయమే ధ్యేయంగా ప్రధాన పార్టీల ప్రణాళికలు

    ప్రచార మోజులోపడి ఈసీ నిబంధనలకు తూట్లు

    సాక్షి, వరంగల్‌: ఎంతైనా సరే అంతిమంగా గెలుపే లక్ష్యమనే ధోరణిలో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. నామినేషన్‌ నుంచి ప్రచారం ముగిసే వరకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నా ఎక్కడా ఏమాత్రం ఎవరూ తగ్గడం లేదు. ఎంత ఖర్చైనా సరే.. ఏమాత్రం తగ్గేదేలే అన్న ధోరణిలో విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఆయా పార్టీల టికెట్ల కోసం ముఖ్యనేతల వద్ద రూ.లక్షల్లో డిపాజిట్లు పెట్టి కొంతమంది బీఫారాలు పొందారు. ప్రచారం ఇప్పుడు తారాస్థాయికి చేరుతుండడంతో పైసలు వెదజల్లేందుకు వెనుకాడడం లేదు.

    భారీగా పెరుగుతున్న ప్రచార ఖర్చు

    ఉదయం, సాయంత్రం వార్డుల్లో ప్రచారం, ప్రముఖులు వచ్చినప్పుడు రోడ్‌ షోలు, జన సమీకరణకు పంపకాలు, భోజనాలు, ఇతరత్రా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార ఖర్చు భారీగా పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి అభ్యర్థులు మూడింతలు ఖర్చుచేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో పోటీ చేసే కౌన్సిలర్‌ అభ్యర్థి వ్యయపరిమితి లక్ష రూపాయలు కాగా, అంతకు ముప్పయింతలు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల నిఘా వ్యవస్థకు చిక్కకుండా అభ్యర్థులు పైసల మంత్రంతో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఈ ఎన్నికల ఖర్చు కోసం కొంతమంది అభ్యర్థులు తమ భూములు, ప్లాట్లు అమ్ముకొని జనవరిలోనే డబ్బులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఖర్చు చేస్తున్నారు.

  • అగ్రనేతలకు సవాలే!

    సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

    మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా.. రెండు రోజుల ముందే ప్రచారానికి తెరపడనుంది. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి ఇంకా మూడు రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అభ్యర్థుల గెలుపు కోసం దూకుడు పెంచారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు నియమించిన ఎన్నికల ఇన్‌చార్జ్‌లు రెండు రోజులుగా మున్సిపాలిటీలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారం, కులసంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఈ ఎన్నికలు మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

    10నియోజకవర్గాలు.. 12 మున్సిపాలిటీలు..

    ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలలో 260 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిసి 1,073 మంది పోటీలో ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌.. 12 మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ తర్వాత ఎక్కువ పంచాయతీలలో తమ మద్దతుదారులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్‌.. గత వైభవాన్ని చాటుతామంటోంది. బీజేపీ 12 మున్సిపాలిటీల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాలు మినహా 10 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

    ఆయా నేతలకు ఈ ఎన్నికలు సవాలే..

    ● హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరఫున కాళిప్రసాదరావు ప్రచారం చేస్తున్నారు.

    ● వరంగల్‌ జిల్లాలో నర్సంపేట, వర్దన్నపేట మున్సిపాలిటీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు సవాల్‌గా మారాయి. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేల పెద్ది సుదర్శన్‌ రెడ్డిలు చైర్మన్‌ పీఠం కోసం కుస్తీ పడుతున్నారు. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం వార్డుల్లో తిరుగుతున్నారు.

    ● జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీ పీఠం కోసం బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థుల గెలుపు కోసం పావులు కదుపుతున్నారు. ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ నేత హనుమాండ్ల ఝాన్సీలు అభ్యర్థులను బరిలోకి దింపారు. వరంగల్‌ ఎంపీ డా.కడియం కావ్య ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

    ● జనగామ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వార్డు కౌన్సిలర్‌ల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఉండగా, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లులు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.

    ● స్టేషన్‌ ఘన్‌పూర్‌ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కాగా.. ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తున్న కడియం శ్రీహరి ఆ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత డా.తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారు.

    ● భూపాలపల్లి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (కాంగ్రెస్‌), గండ్ర వెంకట రమణారెడ్డి (బీఆర్‌ఎస్‌)లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ స్థానాలను దక్కించుకుని చైర్మన్‌ పీఠంను కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి అభ్యర్థులను బరిలోకి దింపారు.

    ● ములుగు నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధనసరి సీతక్క కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. ముఖ్యనేతలు, పార్టీ ఇన్‌చార్జ్‌లతో కలిసి అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న బడే నాగజ్యోతి.. ఆమెకు తోడుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

    ● మహబూబాబాద్‌ జిల్లా మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్‌, కేసముద్రం మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్‌(బీఆర్‌ఎస్‌)లకు ప్రతిష్టాత్మకం కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ విప్‌ దాస్యం వినయభాస్కర్‌, కాంగ్రెస్‌ నుంచి సీహెచ్‌ వెంకటేశ్‌లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. బీజేపీ నుంచి హుస్సేన్‌నాయక్‌.. అభ్యర్థులను బరిలోకి దింపారు.

    ● డోర్నకల్‌ నియోజకవర్గంలో డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల ఎన్నికలు ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్‌ (కాంగ్రెస్‌), మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ (బీఆర్‌ఎస్‌)లకు సవాల్‌గా మారాయి.

    మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పుర పోరు ప్రతిష్టాత్మకం

    మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకూ కత్తి మీద సామే

    గ్రామ పంచాయతీ ఫలితాల బేరీజు..

    పకడ్బందీగా గెలుపు కోసం పావులు

    రెండు రోజులుగా మున్సిపాలిటీల్లోనే నేతల మకాం

  • పులి.

    జనగామ జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట

    పులికోసం బోన్లు.. ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు

    పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్‌ జాడలు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

    జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

    ఆడనా.. మగనా...?

    ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండటం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్‌ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.

    ప్రజలకు అధికారుల సూచనలు

    ● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చెబుతున్నారు.

    ● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం చాలా మంచిది.

    ● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్దాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది.

    ● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు.

    ● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు.

    ● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి.

    ● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్‌ఎస్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓ, ఎస్‌హెచ్‌ఓ, తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలి.

Krishna

  • కృష్ణ
    శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
    u8లో

    అధికారుల అవినీతిపై చర్యలకు జీవో

    బహుళ అంతస్తుల భవనాలను

    రేకుల షెడ్లుగా చూపి పన్నుల విధింపు

    ఏసీబీ విచారణలో నిర్ధారణ

    జన కెరటం.. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం, (ఇన్‌సెట్‌లో)అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

    లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థిని డాక్టర్‌ బత్తుల దీపిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైద్య విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సిద్ధా ర్థ వైద్య కళాశాల నుంచి జీజీహెచ్‌ వరకూ నిర్వహించిన ర్యాలీలో వైద్య విద్యార్థులు, టీ చింగ్‌ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్‌ దీపికకు ఘన నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ దీపిక పీజీ విద్యార్థినిగా వైద్య రంగానికి అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్‌ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి, బోధనా పద్ధతులను పరిశీలించారు. వలంటీర్లు అందిస్తున్న శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిరక్షరాస్యులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించామని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

    లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్‌ రూఫ్‌ టాప్స్‌ ఏర్పాటు, పీఎం సూర్యఘర్‌పై ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యారావుపేటలోని ఆ సంస్థ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొని, ఫీడర్‌ లెవల్‌ సోలరైజేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సర్వీసు ఇవ్వాలని, రెవెన్యూ కలెక్షన్స్‌ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్‌ అన్నీ బ్రేక్‌డౌన్‌ కాకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణ యాదవ్‌, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టీవిఎస్‌ఎన్‌ మూర్తి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

    జి.కొండూరు: సర్కారు ఆంక్షలు.. అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు వచ్చిన వేలాది మంది జనంతో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌, నల్లకుంట జంక్షన్‌ కిక్కిరిసిపోయింది. ఇటీవల టీడీపీ గూండాలు పెట్రోలు బాంబులు, యాసిడ్‌ బాటిళ్లతో దాడి చేసి తగలబెట్టిన జోగి రమేష్‌ నివాసాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించి, కుటుంబాన్ని పరామర్శించారు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ నల్ల కుంట జంక్షన్‌కు మధ్యాహ్నం 1.40గంటలకు చేరిన వైఎస్‌ జగన్‌ అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్‌ నివాసానికి చేరుకోవడానికి 3.25 గంటలు సమయం పట్టిందంటే అభిమానులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారో అర్థమవుతుంది.

    గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ నల్లకుంట జంక్షన్‌ వద్దకు మధ్యాహ్నం 1.40కి చేరుకున్నారు. అక్కడికి ఉదయం 9గంటలకే వేలాదిగా చేరుకున్న అభిమానులు వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో మహిళా నాయకులు వైఎస్‌ జగన్‌కు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. వెస్ట్‌ బైపాస్‌ ఫ్లై ఓవర్‌పై నుంచి ఆయనపై పూల వర్షం కురిపించారు.

    వైఎస్‌ జగన్‌ ఇబ్రహీంపట్నం పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి కృష్ణానది వారధి మీదుగా విజయవాడ చేరుకొని కనకదుర్గ ఫ్లై ఓవర్‌ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని ముందుగానే తెలియజేసినా పోలీసులు అనుమతించలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను సాకుగా చూపుతూ రూట్‌ మ్యాప్‌ మార్చుకోవాలని నోటీసు ఇచ్చారు. దీనితో గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ మంగళగిరి బైపాస్‌, కాజా నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా నల్లకుంట చేరి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అదేవిధంగా ర్యాలీగా వెళ్లొద్దంటూ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలకు గురువారం రాత్రే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ నియోజకవర్గాల వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జులు నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్‌మోహన్‌రావు, దేవినేని అవినాష్‌, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకు పోలీసులు నోటీసులు అందించారు. నల్లగట్ల స్వామిదాసును తిరువూరులోని ఆయన నివాసంలో అడ్డుకోవడంతో పాటు మైలవరం మండలంలోని బాడవ టోల్‌ప్లాజా, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల వద్ద అడ్డుకున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా, బాడవ టోల్‌ ప్లాజా, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి.కొండూరు వై జంక్షన్‌, కట్టుబడిపాలెం జంక్షన్‌ల వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలి వచ్చిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, వైఎస్‌ జగన్‌ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

    జోగి రమేష్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే చులకన కాబట్టే బీసీ నాయకుడిగా ఎదుగుతున్న జోగి రమేష్‌ను అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్‌ కంపెనీని స్థాపించిన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకుండా జోగి రమేష్‌పై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు దారుణ పాలనలో జోగి రమేష్‌ నకిలీ మద్యం ఎలా తయారు చేయగలుగుతాడో చెప్పాలన్నారు. జోగి రమేష్‌పై 12 అక్ర మ కేసులు పెట్టి 83రోజులు జైలులో ఉంచింది కాక రాజకీయంగా ఎదుగుతున్నాడని ఆయన కుమారుడు జోగి రాజీవ్‌పై 7కేసులు పెట్టారని మండిపడ్డారు. చివరకు భర్తను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన ఆయన భార్య శకుంతలమ్మ, చిన్న కుమారుడిపై కూడా కేసులు నమోదు చేయడం చూస్తే బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అర్థమవుతుందన్నారు. ఇన్ని కేసులు పెట్టి ఇంత వేధించినా తట్టుకొని నిలబడడమేంటని గూండాలతో పెట్రోలు బాంబులు, కర్రలు, రాళ్లతో జోగి రమేష్‌ ఇంటిపై దాడి చేయించి ఇంటిని తగలబెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు.

    జోగి రమేష్‌ ఇంట్లో నిప్పు అంటుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు

    వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ వద్ద బారులు తీరిన జనాలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

    మామయ్య ఆశీర్వాదం.. ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థినిని దీవిస్తున్న వైఎస్‌ జగన్‌

    మా బిడ్డొచ్చాడు.. జననేతను చూసి అభివాదం చేస్తున్న వృద్ధ మహిళలు

    దాడి వివరాలను జగన్‌కు చెబుతున్న జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు, చిత్రంలో దేవినేని అవినాష్‌, మల్లాది, మొండితోక, వెలంపల్లి తదితరులు

    బందరు కార్పొరేషన్‌లో కలవరం

    మచిలీపట్నంటౌన్‌: మచిలీపట్నం నగరపాలక సంస్థలో గతంలో కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌. శివరామకృష్ణతో పాటు మరో 35 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ విభాగం అధికారులు ఇటీవల జీవో 87ను జారీ చేశారు. గతంలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌. శివరామకృష్ణతో పాటు రెవెన్యూ, ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేసిన 35 మంది ఉద్యోగులు చేసిన అవినీతిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ శాఖ అధికారులు ఈనెల 6వ తేదీన ఈ జీవోను జారీ చేశారు.

    పూర్తి వివరాలు ఇవి..

    నగరపాలక సంస్థ పరిధిలో 2021 మే, జూన్‌ నెలల ప్రాంతంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో కార్పొరేషన్‌ పరిధిలో తీవ్రమైన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు జరిగినట్టు నిర్ధారించారు. లంచాలు తీసుకుని బహుళ అంతస్తుల భవనాలను రేకుల షెడ్లుగా చూపి తక్కువ పన్నులు వేయటం, తాగునీటి కనెక్షన్ల కోసం, నీటి బిల్లుల జారీ కోసం పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయటం వంటి చర్యలను నిర్ధారించిన ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ 2024 డిసెంబర్‌ 31న ఎంఏ అండ్‌ యూడీ శాఖకి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం నాడు కమిషనర్‌గా పనిచేసిన ఎస్‌. శివరామకృష్ణ తోపాటు 35 మంది ఉద్యోగులు ఈ అవినీతిలో పాలుపంచుకున్నట్లు తేలింది. కమిషనర్‌ శివరామకృష్ణతో పాటు నాడు టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌లుగా పని చేసిన గుగులోతు కృష్ణ, కుమ్మరి శ్రీహరి ప్రసాద్‌, అనుమకొండ శ్రీధర్‌, కోన ఆశ, కె. వీరబ్రహ్మం, ఆర్‌ఐలు బొర్రా వెంకట కల్యాణ్‌, చీలి మోహన్‌ గోపాల్‌, వేదకొప్పుల వినయ్‌ రాజేంద్రప్రసాద్‌లతో పాటు టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ విభాగాల్లోని ఉద్యోగులతో పాటు సచివాలయ కార్యదర్శులు ఈ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిపై మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ అధికారులు త్వరలో శాఖా పరమైన విచారణ చేపట్టి బాధ్యులైన నాటి కమిషనర్‌ శివరామకృష్ణతో పాటు మరో 35 మంది ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ జీవో విడుదలతో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

    7

    వెస్ట్‌ బైపాస్‌ ఫ్లై ఓవర్‌ వద్ద 15 నిముషాల పాటు అభిమానులకు అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌ 2.09గంటలకు నల్లకుంట గ్రామం సెంటర్‌కు చేరారు. అక్కడి నుంచి సూరాయిపాలెం జంక్షన్‌, గుంటుపల్లి జంక్షన్‌, ఖాజీపేట, తుమ్మలపాలెం జంక్షన్‌, వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌ వంతెన, బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ వంతెన మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌కు 4.17కి చేరుకున్నారు. రింగ్‌సెంటర్‌లో భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతూ 5.05 గంటలకు జోగి రమేష్‌ నివాసానికి చేరుకున్నారు.

    అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 36.2750 టీఎంసీలు.

    పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్తు ఉందని వారు పేర్కొంటున్నారు.

    దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.

  • మోగను
    పెళ్లి బాజాలు మోగే సమయం సమీపిస్తోంది. యువతీ యువకులు మూడుముళ్లతో ఒక్కటై పెద్దల ఆశీర్వచనాలు అందుకోవాలని భావిస్తున్నారు. మూడు నెలల మూఢం ముగియనుంది. ఈ నెల 19 నుంచి సుముహూర్తాలు ఉండటంతో సందడి మొదలుకానుంది. పెళ్లి ముహూర్తాలు సమీపిస్తుండటంతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.

    శుభకార్యాల సీజన్‌..

    ఎందరికో ఉపాధి..

    సుముహూర్తాలు ఇవే

    ఫిబ్రవరి నెలలో: 19,20,21,24,25,26

    మార్చిలో: ,5,6,7,8,11,12,13,14,20,21,25,29

    ఏప్రిల్‌లో: 1,2,3,4,5,6,7,8,10,11,12,21,25,26,

    28,29,30

    జగ్గయ్యపేటలో పచ్చిపూల అలంకరణలో పెళ్లి మండపం

  • సీనియార్టీ జాబితాను విడుదల చేయండి
    డీఈఓ దృష్టికి సమస్యలు తీసుకెళ్లిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

    మచిలీపట్నంఅర్బన్‌: అన్ని క్యాడర్ల సీనియార్టీ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరారు. ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యారంగ సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. వారు మాట్లాడుతూ స్టెప్‌అప్‌ సందర్భాల్లో జాబితాల లేమి కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పదో తరగతి ఇన్విజిలేషన్‌, స్పాట్‌ వాల్యూయేషన్‌ విధుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నవారు, వికలాంగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ‘మధ్యాహ్న’ బియ్యాన్ని పాఠశాల పాయింట్‌ వద్ద కాకుండా ఇతర హైస్కూల్స్‌ వద్ద దించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టెన్త్‌ విద్యార్థుల 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా సెలవు దినాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కాంపెన్సేటరీ లీవ్‌ మంజూరు చేయాలని కోరారు. అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులకు రిటైర్మెంట్‌ నోటీసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ సుబ్బారావు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో వైఎస్‌ఆర్సీపీ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహంకాళి రావు, చంద్రశేఖరరెడ్డి, ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి. షౌకత్‌ హుస్సేన్‌, బి. కనకారావు సహా పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

  • కళాత్మకమైన కలంకారి
    కలంకారి పరిశ్రమలను పరిశీలించిన ఒడిశా కళాకారులు, తిరుపతి విద్యార్థులు

    పెడన: పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. మార్కెట్‌లో ప్రస్తుతం కళాత్మకమై కలంకారి ట్రెండ్‌ నడుస్తోందని, అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్‌ ఉందని వారు పేర్కొంటున్నారు. ఒడిశాలోని జబస్తాన్‌పురి శ్రీపార్వతీ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి చెందిన 20 మంది చేనేత కళాకారులు పెడనలోని పలు కలంకారి పరిశ్రమలను, చేనేత కళలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ సౌజన్యంతో వీరు పెడనలోని స్థానిక బ్రహ్మపురం సదాశివ లింగేశ్వర సొసైటీలో చేనేత వస్త్రాలను పరిశీలించారు. సూపర్‌వైజర్‌ విజయసింగ్‌, సంశలిత తదితరులు వీరికి మార్గదర్శకం చేశారు.

    తిరుపతి విద్యార్థులు సైతం..

    తిరుపతి అలిపిరిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల విద్యార్థులు కూడా శుక్రవారం కలంకారి కళపై అధ్యయనం చేయడానికి పెడనలో పర్యటించారు. వీరు జాతీయ హస్తకళల అవార్డు గ్రహీతలు కొండ్రు గంగాధర్‌, నరసయ్య బ్రదర్స్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బ్లాక్స్‌ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

West Godavari

  • క్యాన

    శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

    సాక్షి, భీమవరం: మారిన జీవనశైలి, ఆహార అలవాట్లతో క్యాన్సర్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సర్వైకల్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి వంద మందిలో ఐదుగురికి పైనే ఆయా క్యాన్సర్ల లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజస్‌ (ఎన్‌సీడీ) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిన్న పరీక్షతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే గుర్తించి తగిన చికిత్స అందించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

    ఎన్‌సీడీ సర్వే : క్యాన్సర్‌ రోగులను గుర్తించి వైద్య సాయం అందించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తోంది. సర్వైకల్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌ పరీక్షలతో పాటు బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ పరీక్షలు ఉచితంగా చేస్తోంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి 18 ఏళ్లు నిండిన వారికి అవసరమైన ఆయా పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 5,09,807 మందికి చేశారు. 8,761 మంది బీపీ, 22,995 మంది షుగర్‌, 27,076 మందిలో క్యాన్సర్‌ లక్షణాలను గుర్తించారు. వీరిలో నోటి క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారు 11,496 మంది, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 6,953, సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానితులు 8,627 మంది ఉన్నారు. క్యాన్సర్‌ అనుమానితుల్ని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని అంకాలజీ విభాగానికి సిఫార్సు చేస్తున్నారు. పాజిటివ్‌ లక్షణాలు వస్తే వారికి ప్రత్యేకంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    ప్రజలు సహకరించాలి

    ఎన్‌సీడీ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాన్సర్‌ దశలను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించే వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. సర్వే సిబ్బందికి మహిళలు తమలో తలెత్తుతున్న లక్షణాలు చెప్పుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు వీలుంటుందని సూచిస్తున్నారు.

    మహిళల్లో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లలో వచ్చే మార్పులు రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

    కొవ్వు అధికంగా కలిగిన ఆహారం తీసుకోవడం, జంక్‌ ఫుడ్‌, పోషకాహార లోపం, అబార్షన్‌ కిట్లు, స్టెరాయిడ్ల వాడకం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, తల్లి పాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందంటున్నారు.

    30 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంది.

    ఈ వైరస్‌ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే లక్షణాలు బయటపడతాయి.

    30 ఏళ్ల తర్వాత మహిళలు స్క్రీనింగ్‌ చేయించుకోవడం ద్వారా దీని బారి నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

    పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు, గుట్కా నమలడం, నోటి పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాలతో నోటి క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి.

    ముందస్తు జాగ్రత్తలే రక్ష

    బాధితులను గుర్తించేందుకు కేంద్రం ఎన్‌సీడీ సర్వే

    జిల్లాలో 15,12,258 మందికి వైద్య పరీక్షల నిర్వహణ లక్ష్యం

    ఇప్పటివరకు 5,09,807 మందికి పరీక్షలు

    వారిలో 5.3 శాతం మంది ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ రోగులుగా అనుమానం

    తదుపరి పరీక్షల కోసం ఏలూరు జనరల్‌ ఆస్పత్రికి సిఫార్సు

    చిన్న పరీక్ష.. పెద్ద రక్ష అంటున్న వైద్యులు

    ప్రజావైద్యానికి పెద్దపీట వేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష అమలుచేసిన విషయం విదితమే. బీపీ, షుగర్‌, హెపటైటీస్‌–బి, హిమోగ్లోబిన్‌, మలేరియా, హెచ్‌ఐవీ, డెంగ్యూ, విజువల్‌ ఇన్ఫెక్షన్‌, తదితర అనారోగ్య సమస్యలున్న వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వేలో 14 రకాల వైద్య పరీక్షలు చేసేవారు. హెల్త్‌ డైరీ రూపొందించి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్‌ వైద్యులతో వైద్యసేవలు, మందులు అందజేసేవారు. 172 రకాల మందులను అందుబాటులో ఉంచి నడవలేని వారు, దీర్ఘ్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెలా ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు, ఆరోగ్య సిబ్బంది మందులు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇలా జిల్లాలో కేవలం రెండు విడతల్లో ఐదు లక్షల మందికి పైగా రోగులకు సేవలు అందించారు.

  • తెలంగ

    ముగిసిన పెద్దపులి ప్రయాణం

    17 రోజులపాటు పంజా విసిరిన వైనం

    పట్టిసీమ మీదుగా గోదావరి దాటి..

    కూర్మాపురంలో బంధించిన అధికారులు

    బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో మొదలైన పెద్దపులి ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో ముగిసింది. దాదాపు 17 రోజులపాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను హడలెత్తించిన పులిని ఎట్టకేలకు రెస్క్యూ టీమ్‌ సురక్షితంగా బంధించింది. గతనెల 21న తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కావిడిగుండ్లలో రెండు ఆవులపై దాడి చేసి చంపిన పులి 22న ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం, గుబ్బల మంగమ్మ గుడి మార్గం వైపు తిరుగుతూ హడలెత్తించింది. అదేరోజు అంతర్వేదిగూడెం సమీపంలో ఆవు, లేగ దూడలపై పంజా విసిరి హతమార్చింది. 23న నాగులగూడెం సమీపంలో మూడు ఆవులపై దాడి చేసి చంపేసింది. అటవీ అధికారులు ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిక్కిన పెద్దపులిని చూసి అందరూ వణికిపోయారు. సుమారు 4 అడుగుల ఎత్తు, మీటన్నర పొడవు ఉండటంతో బెంబేలెత్తారు. అదే రోజు మధ్యాహ్నం అంతర్వేదిగూడెం సమీపంలో, రాత్రి కొండ ప్రాంతంలోని గాడిదబోరు సమీపంలో సంచరించింది. 24న బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంలో గేదైపె, కోట నాగవరంలో లేగ దూడలపై దాడి చేసింది. అక్కడి నుంచి కంసాలికుంట, అల్లికాల్వ మీదగా రాయిగూడెం వెళ్లి అక్కడ మరో గేదె దూడను హతమార్చింది.

    13 పశువులను హతమార్చి..

    రాయిగూడెం నుంచి కొయ్యలగూడెం మండలం బిల్లుమిల్లి చేరుకుని ఆవులను హతమార్చింది. రెండు రోజులపాటు అక్కడే మకాం వేసిన పెద్దపులి 26న మళ్లీ రావిగూడెం చేరుకుని గేదె దూడను చంపింది. అక్కడి నుంచి కండ్రికగూడెం, అమ్మపాలెం వెళ్లి రెండు గేదెలను చంపి తినేసింది. 27న బుట్టాయగూడెం మండలం లంకపల్లి రామ నర్సాపురం మీదుగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే 30న అటవీ ప్రాంతంలో మాటేసిన పెద్దపులి అక్కడికి వచ్చిన ఆవుపై దాడి చేసి చంపేసింది. 31న పోలవరం మండలం ఇటుకులకోటలో లేగ దూడలను హతమార్చి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఈదుకుంటూ అటుగా వెళ్లింది. మొత్తంగా ఏలూరు జిల్లాలో 13 పశువులను పులి హతమార్చింది. పోలవరం జిల్లా చిన్నకొండేపూడి, పెద్ద కొండేపూడి పంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను అక్కడి అధికారులు గు ర్తించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన పెద్దపులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఫారెస్ట్‌ అధికారులు, పూనే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్‌ రాయవరం మండలం కూర్మాపురంలో గన్‌ ద్వారా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శుక్రవారం సాయంత్రం పెద్దపులిని బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

  • గురువులపై ఆటోమేషన్‌ కత్తి

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలకు సంబంధించి కొత్తగా ఆటోమేషన్‌ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇన్విజిలేషన్‌ విధులు భారం కానున్నాయని ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ విధానం వల్ల పరీక్షల నిర్వహణే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేషన్‌ ద్వారా ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించడం అనే ప్రక్రియ పూర్తిగా అసంబద్ధమని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    గతంలో వెసులుబాటు

    సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు టెన్త్‌ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేషన్‌ విధులకు అర్హులైన ఉపాధ్యా యులను ఎంపిక చేసి కేటాయిస్తారు. ఇందులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చేవారు. అలాగే పిల్లల పరీక్షల నిమిత్తం లేదా తల్లిదండ్రులను ఆస్పత్రులకు తీసుకువెళ్లాల్సి వచ్చే వారికి కూడా అభ్యర్థన మేరకు వెసులుబాటు ఉండేది. అలాగే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న వారికి కూడా మినహాయింపు లభించేది. అయితే ఆటోమేషన్‌ ప్రక్రియ ద్వారా ఆయా వర్గాలకు మినహాయింపు లభించే పరిస్థితి లేదు.

    సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి..

    ఆటోమేషన్‌ ప్రక్రియ వల్ల ఇన్విజిలేషన్‌ విధులన్నీ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి వెళతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల జాబితా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తే సబ్జెక్టు, కేంద్రాలను బట్టి ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ విధులను కేటాయిస్తుంది. దీని వల్ల ఉపాధ్యాయులు దూరంగా ఉన్న కేంద్రానికి వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రత్యేక మినహాయింపులు, వెసులుబాటులు ఉండవని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు అని ఉపాధ్యాయ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. గతంలో బలవంతపు శిక్షణల పేరుతో కొందరు ఉపాధ్యాయులను బలి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ నిర్దేశిత ఇన్విజిలేషన్‌ విధుల రూపంలో మరికొందరిని బలి కోరుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

    టెన్త్‌ పరీక్షలకు ఆటోమేషన్‌లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలు

    ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు

    దూర ప్రాంతాలను కేటాయించే అవకాశం

    ఉపాధ్యాయుల్లో ఆగ్రహ జ్వాలలు

    విధులను బహిష్కరించే ఆలోచన

  • ఫైరింగ్‌లో నైపుణ్యం సాధించాలి

    కామవరపుకోట: పోలీస్‌ సిబ్బంది ఫైరింగ్‌లో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ సూచించారు. వార్షిక ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని పురస్కరించుకుని తడికలపూడిలో గురువారం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ వల్ల పోలీసు సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నైపుణ్యం, అప్రమత్తత పెరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల వినియోగంపై పూర్తి అవగాహన కలుగుతుందని అన్నారు. ఎస్పీ శివకిషోర్‌ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని, దీని కోసం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ను వినియోగించుకుని వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. జిల్లాలో అన్ని సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు శిక్షణకు హాజరయ్యారు. ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్‌ జయశర్మ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ జి.మునిరాజా పాల్గొన్నారు.

    నేర సమీక్షా సమావేశం

    ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి హాజరయ్యారు.

  • గ్రామాల్లో అనధికార లే అవుట్లు

    పంచాయతీ అనుమతి లేకుండానే ఏర్పాటు

    ప్రభుత్వ ఆదాయానికి గండి

    కాళ్ల: గ్రామాల్లో రియల్‌ వ్యాపారుల ఆగడాలు రో జురోజుకూ పెరిగిపోతున్నాయి. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా లోపాయికారి ఒప్పందాలతో లే అవుట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసా యేతర భూమిగా మార్చాలంటే అనుమతులు తప్పనిసరి. అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కన్వర్షన్‌ కూడా కట్టకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తున్నారు. అనంతరం భూమిని పూడ్చి లేఅవుట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలానే మండలంలోని దొడ్డనపూడిలో ఓ లే అవుట్‌ను ఏర్పాటుచేశారు. సెంటు రూ.లక్షల్లో ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయినా పంచాయతీ అధికారులు ఇటుగా కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. లే అవుట్‌కు అనుమతులు లేకపోతే కనీసం బోర్డు కూడా పెట్టకపోతే తమకు ఎలా తెలుస్తుందని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎ.పోలయ్యని వివరణ కోరగా గ్రామంలో ఎలాంటి లే అవుట్లకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అనధికార లేఅవుట్లలో స్థ లాలు కొని మోసపోవద్దన్నారు. ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి
    కలెక్టర్‌ నాగరాణి

    భీమవరం: వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. భీమవరం టౌన్‌హాల్‌లో శుక్రవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన హార్టికల్చర్‌ కాన్‌క్లేవ్‌–2026 సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆధునిక పద్ధతుల్లో అధిక విలువ గల కూరగాయలు, పూల రక్షిత సాగు, కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీ, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ ప్రధాన కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ఉద్యాన పంటల మార్పిడిపై దృష్టి సారిస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుకు అనుకూల వాతావరణం జిల్లాలో ఉందన్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన ఫల, పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. ఉద్యాన శాఖ డీడీ జి.ప్రభా కర్‌ రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.హరిప్ర సాద్‌, ఉద్యాన శాఖ అధికారి పి.శ్రీలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ ఎ.నాగేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

  • విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ని విడిచి ప్రైవేట్‌ విద్యాసంస్థల వైపు చూడాలని, ఫీజుల దందాను అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్‌లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మోహన్‌బాబు విద్యాసంస్థల్లో జరుగుతున్న దోపిడీని ప్రశ్ని స్తే కిడ్నాప్‌ చేయటం, చిత్రహింసలు పెట్టడం సరికాదన్నారు. మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు విద్యావ్యవస్థలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.శివ మాట్లాడుతూ మోహన్‌బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకున్నారని, యూజీసీ విచారణకు వెళ్లినప్పుడు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు సీహెచ్‌ శివాజీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి పి.రవికుమార్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

  • కేంద్

    ఆటోమేషన్‌ విధానంతో పరిపాలన పూర్తిగా కేంద్రీకరణకు దారి తీస్తుంది. సాధారణంగా వికేంద్రీకరణ మార్గంలో పాలన సాగిస్తుంటారు. ఆటోమేషన్‌ ద్వారా పాలన కేంద్రీకరించబడితే ఎటువంటి సమస్య వచ్చినా పై స్థాయిలోనే పరిష్కరించుకోవాలి. అదే జరిగితే సమస్య పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టి అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది.

    – గుగులోతు కృష్ణ, ఏపీటీఎఫ్‌ 1938 రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌

    విధానపరమైన సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు ఉద్యోగులకు ఆమోదయోగ్యమా, ఆచరణాత్మకమా అని ఆలోచించాలి. ఆటోమేషన్‌ వంటి సంస్కరణలు అమలు చేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే లోటుపాట్లు తెలుస్తాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఆటోమేషన్‌పై పునః సమీక్షించి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

    – వి.రామ్మోహనరావు, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

  • రొయ్య

    100 కౌంట్‌ రూ.270 నుంచి రూ.250కు పడిపోయిన వైనం

    అమెరికా సుంకాలు తగ్గినా రైతులకు దక్కని ఫలితం

    అమెరికా టారిఫ్‌ 25 నుంచి 18 శాతానికి తగ్గించడంతో రొయ్యల ధరలు పెరుగుతాయని రైతులు ఆశించారు. దీనికి భిన్నంగా కౌంట్‌ ధరలు రూ.20 నుంచి రూ.40 వరకూ తగడం దారుణం. రొయ్యల ట్రేడర్స్‌, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ప్రభుత్వం పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలి

    – కొరుపోలు అప్పారావు, ఆక్వా రైతు

    ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు, వైరస్‌ ప్రభావం తగ్గలేదు. ప్రతికూల వాతావరణంతో తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో నిరంతరం ఏరియేటర్లు తిరగాల్సిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చితే రైతులకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. 100 కౌంటు ధర రూ.280 వద్ద నిలకడగా ఉంటే రైతుకు మేలు జరుగుతుంది.

    – జె.రవీంద్ర, సీనియర్‌ ఆక్వా టెక్నీషియన్‌

    నిడమర్రు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రొయ్య ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ సాగు గత కొంత కాలంగా వాతావరణ మార్పులతో వైరస్‌, నాణ్యమైన సీడ్‌ అందకపోవడం, మేతల ధరలు, పెట్టుబడులు పెరగడం, టారిఫ్‌ల పెరుగుదలతో ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోవడం వంటి కారణాలతో ఆక్వా సాగు రైతులు నేల చూపులు చూస్తున్నారు. గత రెండు రోజులుగా రొయ్య ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఓ పక్క వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పడిపోవడం, మరోవైపు తగ్గని వైరస్‌తో పోరాటం చేస్తున్న రైతులను ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నెల 3 వరకు 100 కౌంట్‌ ధర రూ.270 ఉండగా బుధవారం నుంచి రూ.250కి పడిపోయింది. మిగిలిన కౌంట్‌ ధర రూ.20 నుంచి రూ.40 వరకూ తగ్గడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలకడలేని ధరలతో ఆక్వా సాగు చేయడంతో కనీసం పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని రొయ్య రైతులు చెబుతున్నారు. మరోవైపు అమెరికా సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించినా రొయ్య ధరలు పతనం అవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రొయ్య ధరలు, మేతల ధరలు నియంత్రించాల్సిన కూటమి సర్కారే సిండికేట్‌లకు కొమ్ము కాస్తోందని ఆక్వా రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నారు. వీటిలో 90 శాతం పైగా వనామినే.

    అమెరికా ప్రకటించిన రోజే రొయ్య ఽకౌంట్‌ ధరలు తగ్గడంపై ఆక్వా రైతులు నేల చూపులు చూస్తున్నారు. మేత, ఇతర ఖర్చులు పెరుగుతుంటే రొయ్యల ధరలు మాత్రం తగ్గతుండటం ఆక్వా సాగు రంగాన్ని కుదిపేస్తోంది. సాగు సమస్యలు ఎదుర్కొని పంట చేతికొచ్చే సమయంలో పట్టుబడులకు దిగిన రోజే ధరలు పడిపోవడంతో టన్ను రొయ్యకు రూ.20 నుంచి రూ.50 వేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో నికర ఆదాయం తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో ఆక్వా సాగు ప్రశ్నార్థకమే అని చెబుతున్నారు.

    ఽకూటమి ప్రభుత్వంలో గడ్డు పరిస్థితి

    రొయ్య ధరల నియంత్రణలో కూటమి సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆక్వా రైతులు విమర్శిస్తున్నారు. రొయ్య ధరలు నియంత్రించలేక పోవడం, మేతల ధరలు కంపెనీలు పెంచుతున్నా వారిని అదుపు చేయలేక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారిత కమిటీని ఏర్పాటు చేసి ప్రతి వారం సీడ్‌, ఫీడ్‌ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించే పద్ధతిని కూటమి సర్కారు పక్కన పెట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. అమెరికా పెంచిన సుంకాల పేరుతో వ్యాపారులు రొయ్య ధరలు అప్పట్లో అమాంతం తగ్గించేశారు. పెరిగిన టారిఫ్‌ ప్రకటనతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో టారిఫ్‌లను చూపి మధ్య దళారీలు ఇష్టారాజ్యంగా రొయ్య రేట్లు తగ్గించుకుంటూ పోతుండటంతో 100 కౌంట్‌ రొయ్యకు కనీస ధర కూడా లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

    వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాఽఽధికారత కమిటీ, ప్రతివారం సీడ్‌, ఫీడ్‌ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల ధరలపై మంత్రుల కమిటీ సమీక్షించి స్థిరీకరణ కోసం చర్యలు తీసుకునేది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ సాధికారత కమిటీకి మంగళం పాడింది. తమ పార్టీలకు చెందిన ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, హేచరీ, ఫీడు కంపెనీల నుంచి ప్రతినిధులతో ఆక్వా కమిటీ ఏర్పాటు చేస్తే, ఈ కమిటీ రైతుల సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తుంది?

    – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే

  • నకిలీ లెటర్లతో మోసం.. ఇద్దరి అరెస్టు

    నూజివీడు : ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో లోను క్లియర్‌ కాకుండానే క్లియర్‌ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్‌ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ తాడేపల్లిగూడెం బ్రాంచ్‌లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్‌ అయిపోయిందని చెప్పి బ్రాంచ్‌కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్‌ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్‌ రిలీజ్‌కు ప్రయత్నించారు. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఎన్‌.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్‌ ఫైనాన్స్‌ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్‌ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు.

    ద్వారకాతిరుమల: రైతులకు తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో శుక్రవారం పాడి, మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, ట్రంప్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకుందని, ఇది అమలైతే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్‌, పండ్లు, కూరగాయలు తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని వివరించారు. దీంతో మన పంటలు అమ్ముకునే దారి లేక రైతులు దివాలా తీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50 శాతం సబ్సిడీ ఇస్తుంటే, ఇక్కడి ప్రభుత్వం 3 శాతం మాత్రమే ఇస్తోందని అన్నారు. రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, పాల రైతులు, మొక్కజొన్న రైతులు గారపాటి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటేశ్వరరావు, భీమడోలు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

  • నిమ్మ

    ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిమ్మ, పౌల్ట్రీ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. నిమ్మకాయ ధరలు పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మకాయలకు కనీస ధరలు రాకపోవడంతో జిల్లాలో చాలా చోట్ల రైతులు నిమ్మ తోటలు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నిమ్మ తోటలు కౌలుకు తీసుకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డు ధర తగ్గి నష్టపోతున్న పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

    దెందులూరు: ప్రతిభ ప్రతి ఒక్కరికి గుర్తింపు తీసుకొస్తుందని ఏలూరు జిల్లా డీఎస్‌డీఓ అజీజ్‌ అన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్‌ మండలం మల్కాపురం ఆశ్రం వైద్యశాల ఆడిటోరియంలో దివ్యాంగుల క్రికెట్‌ పోటీలు జరిగాయి. దివ్యాంగుల క్రికెట్‌ పోటీల్లో విజేతగా ఏపీ జట్టు నిలిచింది. విజేతను రూ.50 వేల నగదు ట్రోఫీతో సత్కరించారు. మూడు రోజుల దివ్యాంగుల క్రికెట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఏలూరు జిల్లా డీఎస్‌డీఓ అజీజ్‌ మాట్లాడుతూ దివ్యాంగుల క్రికెట్‌ క్రీడను ప్రోత్సహించేలా అన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆశ్రం కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రాజు, గుప్తా ఫౌండేషన్‌ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎన్‌ ఫౌండేషన్‌ అధినేత నారా శేషు, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత మెన్‌ అండ్‌ ఉమెన్‌ బ్లైండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి అజయ్‌ కుమార్‌ రెడ్డి, క్రికెట్‌ అకాడమీ సెక్రటరీ మదన్‌ పాల్గొన్నారు.

  • పట్టి

    పోలవరం రూరల్‌: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పట్టిసం రేవులో క్షేత్రానికి వెళ్ళేందుకు వీలుగా క్యూలైన్‌లు, టిక్కెట్‌ కౌంటర్‌లు, ర్యాంపు పనులు సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు ఇసుక తిన్నెలపై జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. కొంత దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి పంట్ల మీద, తడికల బాదులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ఇసుక తిన్నెలపై చేరేలా పనులు చేపట్టారు. ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ మరో వైపు నదిలో ఏర్పాటుచేసిన ప్లాట్‌ఫాం దాటాల్సి ఉంది. అక్కడి నుంచి క్షేత్రానికి నడచుకుంటూ వెళ్ళేందుకు వీలుగా గోనె సంచుల్లో ఇసుక నింపి బస్తాలతో ప్లాట్‌ఫాం పనులు చేపట్టాల్సి ఉంది. క్షేత్రానికి దిగువ నుంచి క్యూలైన్‌లో నడుచుకుని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చేలా పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టిసం పంచాయతీ దేవస్థానం అధికారులు ఇరువైపులా పనులు చేపట్టారు.

    టిక్కెట్‌ కౌంటర్‌లు, క్యూలైన్‌ల కోసం చలువ పందిళ్ళు

    గోదావరి వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు

  • శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

    జంగారెడ్డిగూడెం: శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్‌ అన్నారు. మండలంలోని తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం, బుట్టాయగూడెం, మార్కండేయపురం, సూరపువారిగూడెంలో వ్యవసాయక్షేత్రాలను ఆయన శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి, మంచి దిగుబడికి రైతులు సకాలంలో తొలి మొగ్గ దశలో తల తుంచి పిలక నివారణ మందు వాడాలన్నారు. మందులు వాడిన 17 రోజుల తర్వాత మాత్రమే ఆకు కొట్టు చేయాలని, లేదంటే పురుగు మందు అవశేషాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెగ్నీషియం లోపం ఎక్కువగా ఇసుక నేలల్లో ఉంటుందని, ఎకరాకు 15 కిలోల మెగ్నీషియం ఆకై ్సడ్‌ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా భూమిలో వేయాలన్నారు. ఇనుము లోపం గుర్తిస్తే 0.5శాతం ఫెర్రస్‌ సల్ఫేట్‌ లీటరు నీటికి 5 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటేశన్‌, వేలం అధికారులు జె.సురేంద్రకుమార్‌, బి.శ్రీహరి, గ్రేడింగ్‌ అధికారి వై.ప్రశాంత్‌, ఐటీసీ లీఫ్‌ మేనేజర్‌ కొట్రేష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • బలివే ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన

    బలివే( ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయనున్నట్లు ఉత్సవాల ప్రత్యేక అధికారి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న అన్నారు. బలివేలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవదాయ శాఖ జిల్లా అధికారి కే.శ్రీనివాస్‌ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని, పోలీస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల సహాయంతో భక్తుల పుణ్యస్నానాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాట్లు, జల్లుస్నానాల ఏర్పాట్లు పరిశీలించారు.