Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ప్రస్తుతం ఇరాన్- అ‍మెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన  F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

    పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.

    ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన  F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది.  ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్‌ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.

    అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విదేశీ శక్తులు యువతను ప్రలోభ పెడుతున్నాయనేందుకు  నిదర్శనగా ఒక షాకింగ్‌ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇరాన్ ఏజెంట్లతో చేతులు కలిపి గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ 14 ఏళ్ల ఇజ్రాయెల్ మైనర్‌ బాలుడిపై అభియెగాలు నమోదు కావడం నెట్టింట చర్చకు దారి తీసింది. టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంబంధాలు పెట్టుకుని, వారిచ్చిన పనులను పూర్తి చేస్తూ డబ్బులు (క్రిప్టోకరెన్సీ) తీసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు.

    మధ్య ఇజ్రాయెల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిపై ఇరాన్ కోసం గూఢచర్యం చేసినందుకు, ఇరాన్ గూఢచారుల కోసం డబ్బు తీసుకుని పనులు చేసినందుకు అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు బుధవారం తెలిపారని ఇజ్రాయెల్ ఆధారిత ఐ24 న్యూస్ నివేదిక పేర్కొంది. టెల్ అవీవ్ జిల్లా బాలల న్యాయస్థానంలోని స్టేట్ అటార్నీ కార్యాలయం దాఖలు చేసిన పత్రాల ప్రకారం, ఆ బాలుడు ఉద్యోగానికి ఆశపడి, గత ఏడాది ఏప్రిల్‌లో  టెలిగ్రామ్ ద్వారా ఇరాన్ గూఢచారులతో సంప్రదింపులు జరిపాడు.

    ఇదీ చదవండి: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సంక్షోభం, కేంద్రం కీలక ప్రకటన

    ఎలా మొదలైందీ అంటే..
    గత ఏడాది టెలిగ్రామ్‌లో వచ్చిన 'ఉద్యోగ ప్రకటన'కు  మైనర్‌ బాలుడు స్పందించాడు. దీంతో  హ్యాండ్లర్లు బాలుడితో పరిచయం పెంచుకున్నారు. టెల్‌ అవీవ్ పరిసర ప్రాంతాల్లోపలు అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రతిఫలంగాజరిగే లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ రూపంలో జరిగేవని దర్యాప్తులో తేలింది. నిందితుడు తన హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో నాలుగు డిజిటల్ వాలెట్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనులన్నిటికీ కలిపి సుమారు లక్ష రూపాయలు అందుకున్నాడు.

    ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు
    ఎలాంటి పనులు చేసేవాడు
    ఇచిలోవ్ ఆసుపత్రి సమీప వీధులను చిత్రీకరించడం, రామత్ గాన్ ప్రాంతంలోని పరిసరాలను మ్యాపింగ్ చేయడం. 'కిర్యా' అనే కీలక మిలిటరీ కాంప్లెక్స్‌ను గుర్తించి, తెల అవీవ్ ఆకాశహర్మ్యాలను (skyline) వీడియోలు తీయడం.

    కిర్యా మిలిటరీ ప్రాంతం సమీపంలో ఒక అపార్ట్‌మెంట్‌ను వెతికి, దాని ఫోటోలను, యజమానుల వివరాలను తన హ్యాండ్లర్లకు పంపడం.మరో సందర్భంలో, విదేశాంగ మంత్రి గిడియన్ సార్ ఇంటి సమీపంలో గ్రాఫిటీ (గోడలపై రాతలు) వేసి, పరిసరాలను రికార్డ్ చేయమని అతడిని కోరారు, కానీ పాఠశాల పని కారణంగా ఆ పనిని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు అరెస్ట్‌ తర్వాత సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. తన వాలెట్‌లో ఉన్న డబ్బు తన క్లాస్‌మేట్ పంపాడని అబద్ధం చెప్పమని తన స్నేహితుడిని కోరడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడని అభియోగపత్రంలో పేర్కొన్నారు.

     

  • వాష్టింగన్‌: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.     

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్‌ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్‌ జలసంధి అంశంలో ఇరాన్‌ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా  బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటింది

    దీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.  ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారు

    బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్‌ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్‌లైన్‌  రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు  ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.  భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.  

    వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావం
    చమరు  ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.

    కేంద్ర బ్యాంకుల ధోరణి
    గత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

    ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. 

  • టెహ్రాన్‌: పాకిస్థాన్‌కు ఇరాన్‌ షాకిచ్చింది. హర్మూజ్‌ జలసంధిలో పాక్‌ నౌక్‌ను ఇరాన్‌ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్‌ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్‌ గొప్పలు చెబుతోంది. ఇరాన్‌ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్‌ జలసంధిలో పాక్‌ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్‌ వాటిని అడ్డుకుంది. 

    ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్‌ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.

    ఇరాన్‌లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్‌  అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం,  హర్మూజ్‌ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని  స్పష్టం చేసింది.  ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. 

    ఈ సంఘటనతో పాకిస్తాన్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్‌  జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.

    ఇరాన్‌ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్‌తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Movies

  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చరణ్‌ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి రాబోయే అప్‌డేట్ ఆలస్యమవుతుందేమోనని అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే యూనిట్ తాజాగా ఇచ్చిన స్పష్టతతో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి. చరణ్ ఎడమ కంటికి చిన్నపాటి గాయం మాత్రమే జరిగింది. దానికి వెంటనే ట్రీట్‌మెంట్ జరిగిందని 'పెద్ది' టీమ్ తెలిపింది. రేపట్నుంచే ఆయన తిరిగి సెట్స్‌లో పాల్గొనబోతున్నారని కూడా ప్రకటించింది.  

    ఇక అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. చరణ్ పుట్టినరోజు కానుకగా 'పెద్ది' నుంచి ప్రత్యేక గ్లింప్స్ రాబోతోంది. మార్చి 27 ఉదయం 11:07 గంటలకు దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే రెడీ చేసిన టీజర్ విడుదల కానుంది. ఇప్పటికే చరణ్ చేసిన బ్యాట్ విన్యాసం సోషల్ మీడియాలో సూపర్‌ హిట్ అయింది. అదే తరహాలో ఈ బర్త్‌డే టీజర్ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 

    అంటే రామ్ చరణ్ గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పెద్ది సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్, సంబరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పెద్ది టీమ్‌ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

  • కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్‌ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్‌ తేరీ సర్కే అనే సాంగ్‌ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాటను రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా హిందీ లిరిక్స్ వర్షన్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఆ తర్వాత వెంటనే హిందీ వర్షన్ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

    ఈ నేపథ్యంలో హిందీ లిరిక్స్ వివాదానికి దారి తీయడంపై డైరెక్టర్ ప్రేమ్ స్పందించారు. హిందీ భాషపై తనకు పట్టులేదని.. ఆ లిరిక్స్ అర్థం కూడా తనకు తెలియదన్నారు. నేను కన్నడలో మాత్రమే లిరిక్స్‌  రాశానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఒకవైపు యుద్ధం.. మరోవైపు గ్యాస్‌ కొరత ఉందని.. వాటిపై చర్చించాలని అన్నారు. అంతేకానీ ఈ పాటను వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ పాట కేవలం ఒక పార్టీలో భాగంగా సరదా కోసమే ఉంచామని వెల్లడించారు.  కాగా.. ఈ మూవీలో  నోరా ఫతేహి, సంజయ్‌దత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది.

     

  • రణ్‌వీర్‌ సింగ్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్‌  నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.

    అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్‌వీర్ సింగ్‌ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్‌-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్‌-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

    కాగా.. రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ ‍సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్‌ హీరోయిన్‌గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.

     

  • ఓ మ్యాగజైన్ కోసం శోభిత షాకింగ్ లుక్స్

    బ్లాక్ డ్రస్‌లో మనసు దోచేస్తున్న మృణాల్

    చీరలో అందాల ముద్దుగుమ్మలా నేహాశెట్టి

    'మేడిన్ కొరియా' జ్ఞాపకాలతో ప్రియాంక మోహన్

    చీరలో నాభి అందాలతో నభా నటేశ్

    మంచు దేశంలో నైట్‌ టైమ్ కృతి సనన్ చిల్

  • మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గాయంపై పెద్ది టీమ్ స్పందించింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. షూటింగ్‌లో చరణ్‌ ఎడమకన్నుకు చిన్న గాయమైందని వెల్లడించింది. అనంతరం రామ్ చరణ్‌కు చికిత్స అందించామని ప్రకటించింది. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్ ప్రారంభమవుతుందని పెద్ది టీమ్ నోట్ విడుదల చేసింది. దయచేసి ఎటువంటి ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులకు సూచించింది. పెద్ది షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

    కాగా.. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబోలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ఈ మూవీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

     

  • సినీరంగంలోకి  దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.

    ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్  ద్వారా తెరకు  పరిచయమయ్యారు.  ఈ చిత్రం  ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ  ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన  'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ప్రియదర్శి హీరోగా నటించిన ఈ చిత్రానికి వైఎస్‌ మాధవ రెడ్డి దర్శకత్వం వహించారు. బోసుబాబు నిడిమోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. 

    ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.

    ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం  ఉంది.  'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి  పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు. 

  • 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్‌టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)

    ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?)

  • టాలీవుడ్ జంట విజయ్-రష్మిక ఇటీవలే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లికి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. ఈ రిసెప్షన్‌ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

    తాజాగా పెళ్లి తర్వాత విరోష్ జంట వేకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం హనీమూన్‌ ట్రిప్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధంచిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరలవుతున్నాయి. అయితే పెళ్లి తర్వాత ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌లో తామిద్దరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేశామని రష్మిక తెలిపారు. ఈ మేరకు  ఎయిర్‌బిఎన్‌బి (Airbnb) భాగస్వామ్యంతో రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు.

     ‘ప్రశాంతమైన ఉదయం, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, పూల్ ఆటలతో ఇక్కడి కో సముయ్‌లోని ప్రాంతం  మా సొంత ఇల్లులా అనిపించిందని తెలిపింది.  ఆ రోజుల్లో మేము గడిపిన కొన్ని క్షణాలు’ అంటూ వీడియోను పోస్ట్ చేసింది. 

    అయితే వీరి పెళ్లి కోసం టాలీవుడ్‌ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎక్కడా తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదు. ఎన్నిసార్లు రూమర్స్ వినిపించినా వాటిపై ఎవరు కూడా స్పందించలేదు. అయితే కొన్ని సార్లు ఇన్‌ డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తూ వచ్చారు. చాలాసార్లు వీరిద్దరు ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి. కానీ చివరికీ పెళ్లి కొద్ది రోజుల ముందు మాత్రమే సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

     

     

     

  • కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తెలుగులోనూ అలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రతిసారి.. వీళ్లు తప్పితే మరెవరు నటించినా అస్సలు సూట్ కాదు కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. అలాంటి వాటిలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మూవీ ఒకటి. మరీ ముఖ్యంగా ఇందులో ప్రకాశ్ రాజ్, రేలంగి మామయ్యగా జీవించేశాడు. ఇప్పటికీ ఎవరైనా నవ్వుతూ ఉంటే సరదాగా రేలంగి మామయ్య అని ఆటపట్టిస్తుంటారు. అంతలా జనాల్లో వెళ్లిపోయింది. అయితే ఈ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్‌ని తొలుత అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)

    ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటే పాత్ర కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. నా నవ్వు బాగుంటుందనే విషయాన్ని గుర్తుచేస్తూ నేను చేస్తే బాగుంటుందని అడిగారు. కానీ చేయలేకపోయాను' అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చేయనుందుకు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని అడగ్గా.. అలాంటిదేం లేదని అన్నారు. ఒకవేళ రాజశేఖర్.. రేలంగి మామయ్య పాత్ర చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి!

    శర్వానంద్ హీరోగా చేసిన 'బైకర్' మూవీలో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. ఇది వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్ల సందర్భంగానే చాలా విషయాలని రాజశేఖర్ పంచుకుంటున్నారు. అప్పట్లో ఈయన్ని వెతుక్కుంటూ చాలానే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు వచ్చాయి. కానీ పలు కారణాలతో వాటిని వదులుకున్నారు. ఇప్పుడేమో ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి అని ఈయనే టాలీవుడ్ దర్శకనిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

    రాజశేఖర్ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో అల్లరి ప్రియుడు, సింహరాశి, మా అన్నయ్య, అంకుశం లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో రాజశేఖర్.. గత కొన్నేళ్లుగా తెరపై కనిపించట్లేదు. చెప్పాలంటే ఈయన్ని దర్శకులు పట్టించుకోవడం మానేశారు. కొన్నాళ్ల క్రితం నితిన్ 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్' మూవీలో క్యారెక్టర్ రోల్ చేసినప్పటికీ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 'బైకర్'పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇందులో హీరోకి తండ్రి, బైక్ రేసింగ్ కోచ్‌గా కనిపించనున్నారు.

    (ఇదీ చదవండి: శర్వా 'బైకర్' ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది)

  • 'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్‌ సింగ్‌ ఆరు వారాల్లోనే)

    ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్‌లో కావొచ్చు బాలీవుడ్‌లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్.  లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.

    టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.

    ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్‌ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

    టాలీవుడ్‌లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్‌కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.

    'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్‌కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా)

  • ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్‌ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ముఖ్యంగా ప్రియాంక మోహన్‌ నటనను కొనియాడుతున్నారు.

    ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్‌ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    వరుసగా రెండవ వారం కూడా  మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ  నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

     

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా  ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్‌-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.

    ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ విలన్‌గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్‌గా సంజయ్‌ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.

    కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్‌-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్‌ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.

    తాజాగా గతేడాది రిలీజైన దురంధర్‌ మూవీలోనూ సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్‌ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్‌-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్‌ దత్‌కు రికార్డ్‌ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్  'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్‌ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా  కీలక పాత్రలు పోషించారు. 
     

  • బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడా స్టార్‌డమ్‌ని ఓ హాలీవుడ్‌ సినిమా ప్రచారానికి వాడుకుంటుంది. హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ’ టీమ్‌.. ఇండియాలో తమ సినిమా ప్రమోషన్స్‌ కోసం హృతిక్‌ని సంప్రదించింది. ప్రమోసన్స్‌లో భాగంగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్‌, హృతిక్‌తో ఒక ఎక్స్‌క్లూజివ్ వర్చువల్ ఇంటర్వ్యూని నిర్వహించారు.స్పేస్, సైన్స్, సినిమాలపై తమకున్న ఆసక్తిని పంచుకుంటూ ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ చేసిన ఈ ముఖాముఖి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    ఈ సంభాషణ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ చుట్టూ తిరిగింది. హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి... మిల్ గయా’తో ఈ కొత్త చిత్రానికి ఉన్న పోలీకలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడంతోపాటు, భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశాలపై కూడా చర్చించారు.

    ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' చిత్రంలో ర్యాన్ గాస్లింగ్ మెమరీ లాస్ కి గురైన రైలాండ్ గ్రేస్ పాత్రను పోషించారు. శాండ్రా హుల్లెర్, లియోనెల్ బాయిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అమెజాన్  ఎంజీఎం(MGM) స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. ఈ సినిమా మార్చి 26న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది.

  • కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’. ఈ చిత్రం ఈ నెల 26న  రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్.

    ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియెన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • 'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్‌ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

    (ఇదీ చదవండి: ధురంధర్‌ 2 ఎఫెక్ట్‌.. స్టార్‌ హీరో సినిమా వాయిదా)

    జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.

    అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?

    'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‪కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్)

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్  నటించిన ‘భూత్‌ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్‌ కామెడీ సినిమా ‘భూత్‌ బంగ్లా’.  ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్‌ రావల్, రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్‌ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 2న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.

    రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌ 2’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుంది. దీంతో ఏప్రిల్‌ 10న భూత్‌ బంగ్లా విడుదల  కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.  'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్‌ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్‌ ఉంది.
     

National

  • న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరినీ కష్టాలకడలిలో ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ఇకనైనా ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ హితబోధ చేశారని అఖిలపక్ష సమావేశంలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. యుద్ధం మరింత విస్తరించకుండా భారత్‌ తన వంతుగా ఎలాంటి కృషిచేయట్లేదన్న విపక్షాల ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. 

    పాకిస్తాన్‌లా భారత్‌ దళారీగా వ్యవహరించబోదని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టంచేశారు. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టలు పెదవి విరిచాయి. ఈ అఖిలపక్ష భేటీకి బుధవారం పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ వేదికగా నిలిచింది. బుధవారం సాయంత్రం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలో మొదలైన ఈ అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్‌షా, పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు పాల్గొన్నారు. 

    విపక్షాల నుంచి తారిఖ్‌ అన్వర్, ముకుల్‌ వాస్నిక్‌(కాంగ్రెస్‌), ధరేంద్ర యాదవ్‌(ఎస్పీ), సస్మిత్‌ పాత్రా(బీజేడీ), సంజయ్‌ ఝా(జేడీయూ), శ్రీకాంత్‌ షిండే(శివసేన), సంజయ్‌సింగ్‌(ఆప్‌), జాన్‌ బ్రిటాస్‌            (సీపీఎం), సుప్రియా సూలే(ఎన్సీపీ–ఎస్పీ), అరవింద్‌ సావంత్‌(శివసేన–యూబీటీ), అసదుద్దీన్‌ ఒవైసీ(ఏఐఎంఐఎం) తదితర నేతలు పాల్గొని దాదాపు రెండు గంటలపాటు పశ్చిమాసియా అంశంపై చర్చించారు.

    యుద్ధం ముగింపు కోసం అమెరికా, ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వం నెరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మనకన్నా చిన్నదేశం పాకిస్తాన్‌ ముందుకొచ్చిందని, భారత్‌ కనీసం నోరుమెదపలేదని విపక్షాలు చేసిన ఆరోపణలపై మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పందించారు. ‘‘దళారిలాగా మధ్యవర్తిత్వం కోసం అర్రులుచాచడం పాకిస్తాన్‌కు అలవాటే. 1981 నుంచి అమెరికా పాకిస్తాన్‌ను ఇలాగే ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్‌లా భారత్‌ దళారీ దేశం కాదు. 

    అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్‌ ఎప్పుడూ జోక్యంచేసుకోదు. మధ్యవర్తిత్వం వహించబోదు. యుద్ధం ముగింపు కోసం భారత్‌ తన వంతు కృషిచేస్తోంది. మౌనంగా కూర్చోలేదు. సందర్భానుసారం మన వైఖరి తెలియజేస్తున్నాం. ఇరాన్‌ సుప్రీంనేత ఖమేనీ మరణవార్త తెలియగానే మోదీ సర్కార్‌ స్పందించలేదన్న విపక్షాల వాదనల్లో నిజం లేదు. ఇరాన్‌ ఎంబసీని తెరచిన వెంటనే విదేశాంగ కార్యదర్శి వెళ్లి సంతాపం తెలిపారు. అక్కడి సంతాపసూచిక పుస్తకంలో సంతకం కూడా చేసి వచ్చారు’’అని అన్నారు.  

    మన వాళ్ల భద్రత, ఇంధన భద్రత ముఖ్యం 
    ‘‘గల్ఫ్‌ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యం. దీంతోపాటే దేశీయ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చడం పైనా మేం దృష్టిసారించాం. ఈ విషయంలో దౌత్య విజయం సాధించాం. భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సీఎన్‌జీ నిల్వలపై ఆందోళన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ముడిచమురు, ఇంధన నౌకలు విదేశాల నుంచి వస్తూనే ఉన్నాయి. మరిన్ని నౌకలు మార్గమధ్యంలో ఉన్నాయి. హార్మూజ్‌ గుండా రావాల్సిన 18 నౌకలు అక్కడే చిక్కుకుపోయిన మాట వాస్తవమే. హార్మూజ్‌ గుండా సరఫరా తగ్గడంతో ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టిసారించాం. ముడి చమురు, గ్యాస్‌లను వేరే దేశాల నుంచి తెప్పిస్తున్నాం. 

    భారత్‌ కేవలం గల్ఫ్‌దేశాల నుంచేకాకుండా మొత్తంగా 41 దేశాల నుంచి ఆయిల్, గ్యాస్‌లను కొనుగోలుచేస్తోంది.  మనకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ఇజ్రాయెల్‌ అతిపెద్ద సాంకేతిక భాగస్వామిగా ఉన్నాయి. మనకు ఇరాన్‌తోనూ సత్సంబంధాలున్నాయి’’అని ప్రభుత్వం విపక్షాలకు తెలియజేసింది. ప్రభుత్వ వివరణపై విపక్షపారీ్టల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పశ్చిమాసియా పరిణామాలపై తక్షణం 193వ నిబంధన కింద లోక్‌సభలో, 176వ నిబంధన కింద రాజ్యసభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌చేశాయి. మరోవైపు విపక్షనేత రాహుల్‌గాంధీ అఖిలపక్ష భేటీకి రాకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు.  

  • న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. 

    దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్‌ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. 

    ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు.  విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.

    కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున సమావేశానికి  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు.

  • తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో..  ఊటీ, కున్నూరు, కూడలూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నికలు ఏవైనా కానీ.. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను అంచనా వేయడం తలలు పండిన విశ్లేషకులకు కూడా సాధ్యం కాదనే విషయం ఇక్కడి అభ్యర్థులను కల్లోలపరుస్తోంది. ఈ మూడు నియోజకవర్గాలపై విశ్లేషణను ఎక్కడా మిస్సవ్వకుండా చదివేయండి..

    అంత ఈజీ కాదు..
    ఊటీ, కున్నూరు, కూడలూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ కూటమి రెండు చోట్ల.. అన్నాడీఎంకే ఒకచోట బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే.. ఇక్కడ గెలుపోటములను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఊటీ నియోజకవర్గాన్ని ఇక్కడ అధికారికంగా ఉదగై అంటారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.గణేశ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పర్యాటకమే ప్రధాన ఆర్థిక వ్యవస్థ. టీ-కాఫీ తోటలకు నెలవు. అయితే.. కీలకమైన పరిశ్రమలు మూతపడడంతో ఇక్కడ నిరుద్యోగిత పెరుగుతోంది. స్థానిక సమస్యలు తోడవ్వడం యాంటీ-ఇన్‌కంబెన్సీకి దారితీసే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

    ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే..! 
    ఇక కున్నూరు నియోజకవర్గం డీఎంకేకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతం. టీ-కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులకు ఈ నియోజకవర్గం నిలయం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా డీఎంకేకు కలిసివచ్చే అంశమే..! అయితే.. తేయాకును సేకరణకు ఇచ్చే కూలీ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఇక్కడి కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని అన్నాడీఎంకే అడ్వాంటేజ్‌గా తీసుకుంటే.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఆ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే..
    ఇక కూడలూరు నియోజకవర్గంలో గిరిజన ఓటర్లదే ఆధిపత్యం. అనూహ్య ఫలితాలకు ఈ నియోజకవర్గం వేదిక. ఇక్కడ ఇరులర్, కురుంబర్ వర్గాలు గెలుపోటములను శాసిస్తాయి. వీరితోపాటు.. పడుగర్ వర్గానికి పెద్దమొత్తంలోనే ఓటుబ్యాంకు ఉంది. ఈ మూడు వర్గాలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ అభ్యర్థి విజయం కరతలామలకమే..! గిరిజనుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు ఇచ్చే అభ్యర్థికే ఇక్కడి ఓటర్లు పట్టంకడతారు.

    ఆ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే..
    మొత్తానికి నీలగిరిలోని మూడు నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే.. ఏ పార్టీ అయినా.. ఉపాధి, పరిశ్రమల కల్పన, తేయాకు సేకరణ కూలీ ధర, కార్మికుల సంక్షేమం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పడుగర్ వర్గం ఓటు బ్యాంకు అత్యంత కీలకం. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు వేర్వేరుగా ఓటు బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఈసారి పెరిగిన యువ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

    ఏది ఏమైనా.. ఊటీలో విజయానికి కాంగ్రెస్ ఈసారి చమటోడ్చాల్సిందే..! కున్నూరును తిరిగి నిలబెట్టుకోవాలంటే.. కార్మికుల కూలీ ధరలపై డీఎంకే స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక కూడలూరులో అన్నాడీఎంకే బలంగా కనిపిస్తున్నా.. నెక్-టు-నెక్ పోటీ తప్పదని తెలుస్తోంది.
     

  • సాక్షి, న్యూఢిల్లీ :  రైల్వే టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌  ఐఆర్‌సీటీసీ (IRCTC)లో ఆన్‌లైన్‌  టికెట్ల బుకింగ్‌కు భారీ ఆదరణ  లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు, ఆన్‌లైన్ రైలు టిక్కెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయని, మొత్తం రిజర్వ్డ్ బుకింగ్‌లలో 88 శాతం, అంటే 48.25 కోట్లకు పైగా టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అయ్యాయని ప్రభుత్వం బుధవారం తెలిపింది.

    లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర  రైల్వే, సమాచార & ప్రసార , ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మాట్లాడుతూ, ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌ల వైపు మొగ్గు పెరుగుతోందన్నారు. తద్వారా రిజర్వేషన్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడంతోపాటు,  ప్రయాణ సమయం, ఖర్చులను ఆదా చేయడం ద్వారా ప్రయాణికులకు టిక్కెటింగ్ సులభతరం  మైందన్నారు.

    ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సౌకర్యం భారతీయ రైల్వేల అత్యంత ప్రయాణీకుల స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ కోసం ఐఆర్‌సీటీసీ  గణనీయమైన ఖర్చు చేస్తోందనీ, టిక్కెటింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉన్నతీకరణ విస్తరణకు అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి, ఐఆర్‌సిటిసి చాలా నామ మాత్రపు  రుసుమును వసూలు చేస్తుందని మంత్రి తెలిపారు.

    ప్రస్తుతం అత్యధిక టిక్కెట్లు డిజిటల్‌గా బుక్ అవుతుండటంతో, ఆన్‌లైన్ వ్యవస్థ భారతీయ రైల్వే చేపట్టిన అత్యంత ప్రయాణీకుల-స్నేహపూర్వక కార్యక్రమాలలో ఒకటిగా మారిందని తెలిపారు.  అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి,దుర్వినియోగాన్ని నివారించడానికి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 

     > ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు
     

     

     

    మంత్రి వివరణలోని మరికొన్ని విశేషాలు

    • ఆధార్ ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలరు.గత ఏడాదిల జూలై 1నుంచి అమల్లోకి వచ్చింది. ఇది నకిలీ ఖాతాల వాడకాన్ని పరిమితం చేయడానికి,నిజమైన ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశాలను మెరుగుపరచడానికి సహాయపడింది.

    • 2025 సంవత్సరంలో, 3.04 కోట్ల వినియోగదారుల ఖాతాలులను రద్దు చేయగా, 2.94 కోట్ల వినియోగదారుల ఖాతాలు పునఃధృవీకరణ ఎంపికతో తాత్కాలికంగా నిలిపివేశారు. (టెలిగ్రామ్‌లో ఎర, క్రిప్టోలో చెల్లింపులు, కట్‌ చేస్తే!)

    • అయితే గత ఏడాది జనవరి నుంచి ఈ  ఫిబ్రవరి  28 మధ్య కాలంలో, 1,80,474 వినియోగదారుల ఖాతాలు తిరిగి  యాక్టివ్‌ చేశారు. 

    • సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి ఐఆర్‌సీటీసీ  తన సాంకేతిక వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. దీని యాంటీ-బాట్ టెక్నాలజీ సుమారు 64 శాతం హానికరమైన ట్రాఫిక్‌ను నిరోధించగలదు, తద్వారా నిజమైన వినియోగదారులకు బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

    2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఫిబ్రవరి 28, 2026 నాటికి 13,023 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లు  అరికట్టామని వైష్ణవ్ వివరించారు. సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా బుకింగ్ సరళిని ,వినియోగదారుల రిజిస్ట్రేషన్‌లను పరిశీలించి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి నిరంతర పర్యవేక్షణ భవిష్యత్తుల  కూడా కొనసాగుతుందన్నారు.
     

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌  యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌ డీజిల్‌, వంటగ్యాస​ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్,  డీజిల్  కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని   స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయనీ, వదంతులను నమ్మవద్దు అని బుధవారం (మార్చి 25, 2026)  పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. 

    పెట్రోల్‌, డీజిల్‌  కొరత లేదు, ధరలు పెంచం
    ఏటా సుమారు 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం మనకు ఉందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అన్నారు. గత రెండు రోజులుగా, అనేక ప్రాంతాల్లోని రిటైల్ అవుట్‌లెట్లు మరియు పెట్రోల్ పంపుల బయట క్యూలు కనిపించాయి. భయాందోళనలతో కొనుగోళ్లు కూడా జరిగాయి.   కానీ  మన వద్ద తగినంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఏ పెట్రోల్ పంపు వద్ద కూడా కొరత లేదు. పెట్రోల్ పంపులకు సరఫరా టెర్మినళ్లలో కూడా తగినంత పరిమాణంలో ఇంధన నిల్వలున్నాయి. అందువల్ల, వదంతులను నమ్మవద్దు , భయాందోళనలతో కొనుగోళ్లు మానుకోండి అని ఆమె చెప్పారు.  పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి పెరుగుదల ఉండదని కూడా  ఆమె స్పష్టం చేశారు. LPG విషయానికి వస్తే, ఏ పంపిణీ కేంద్రం వద్ద కూడా ఎలాంటి  కొరత లేదని ఆమె తెలిపారు. ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల వాణిజ్య ఎల్‌పిజిని కేటాయించారని, గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త పిఎన్‌జి కనెక్షన్లు మంజూరు చేశారని ఆమె తెలిపారు. సుమారు 30,005 కిలోల సిలిండర్లు పంపిణీ చేశామని ఆమె చెప్పారు. 

    ప్రత్యామ్నాయ ఇంధన కిరోసిన్‌ను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం  అదనపు కేటాయింపులు చేసిందన్నారు. సుమారు 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి కేటాయింపు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే నల్లబజారు, అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు.  ఈ క్రమంలోనే మంగళవారం వివిధ రాష్ట్రాల్లో సుమారు 2700 దాడులు నిర్వహించి, సుమారు 2000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్టు సుజాత శర్మ వెల్లడించారు.

    ఇదీ చదవండి: కోట్లాదిమందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు
     

  • మధ్యప్రాచ్య (Middle East) యుద్దంతో నెలకొన్న చమురు సరఫరా సంక్షోభం పెట్రోల్‌, డీజిల్‌పై  ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు  భారీ ఊరటనిచ్చే అంశమిది. భారత రిఫైనరీలు వచ్చే నెల డెలివరీ కోసం సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తద్వారా చమురు కొనుగోలులో అమెరికా ఇచ్చిన  వెసులు బాటు భారత్‌ సమర్ధవంతంగా వినియోగించుకున్నట్టు అవుతోంది.

    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో సౌదీ అరేబియా, ఇరాక్ నుండి రావాల్సిన చమురు నిలిచి పోవడంతో, భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్ళీ రష్యా వైపు మొగ్గు చూపింది. మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతీయ రిఫైనరీలు మే నెల డెలివరీ కోసం దాదాపు 6 కోట్ల (60 Million) బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నాయి. చమురు ధరలు బ్రెంట్ క్రూడ్ కంటే బ్యారెల్‌కు 5 డాలర్ల నుండి 15 డాలర్ల ప్రీమియం ధరలకు బుక్ అయ్యాయి. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం, ఈ పరిమాణం ఈ నెల కొనుగోళ్లకు సమానంగా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి నెల కొనుగోళ్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ.

    (ట్రంప్‌ యూటర్న్‌ : 20 నిమిషాల్లో రూ. 840 కోట్లు)

    గత డిసెంబర్ నుండి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ (MRPL), హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి సంస్థలు ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూతపడటంతో ఏర్పడిన చమురు కొరతను అధిగమించేందుకు, మార్చి 12 లోపు సముద్రంలో లోడ్ అయిన రష్యన్ చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

    2022 ప్రారంభంలో ఉక్రెయిన్‌పై దాడి జరిగిన తర్వాత,  భారత్‌కు తక్కువ ధరకు లభించే రష్యన్ ముడి చమురుకు ఇది ఒక ప్రధాన కొనుగోలుదారుగా మారింది. అయితే, అమెరికా ఒత్తిడితో గత ఏడాది చివరి నుంచి భారత్ కొనుగోళ్లను తీవ్రంగా తగ్గించుకుంది. దానికి బదులుగా సౌదీ అరేబియా, ఇరాక్‌ల నుంచి బ్యారెళ్ల వైపు మళ్లింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత, అందులో అధిక భాగం పర్షియన్ గల్ఫ్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా మినహాంపుతోపాటు, కేవలం రష్యా పైనే ఆధార పడకుండా, భారత్ తన చమురు వనరులను పెంచుకుంటోంది. అక్టోబర్ 2020 తర్వాత అత్యధికంగా వెనిజులా నుండి కూడా ఏప్రిల్ నెలలో 80 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోనుంది.

    ఇదీ చదవండి: కోటక్‌ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం

    రష్యాకు భారీ లాభాలు
    భారత్‌ , ఇతర దేశాలనుంచి  వస్తున్న భారీ డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరల వల్ల రష్యా భారీ లాభాలను ఆర్జిస్తోంది. మార్చి 2022 తర్వాత రష్యా చమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సమయం ఇదేనని నివేదికలు చెబుతున్నాయి.

  • ప్రముఖ సినీ దర్శకుడు, ఏక్ థా టైగర్ ఫేమ్ కబీర్ ఖాన్  తన భార్య ప్రముఖ యాంకర్ మినీ మాథుర్‌కు ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చారు.  పర్యావరణానికి మేలు చేసేలా (EV), స్టైలిష్‌గా , స్పోర్టీగా ఉండే ఈ కారు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ఫోటోలను మినీ ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు  తెలుసుకుందాం.

    బహుమతిగా యూజ్డ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు
    కబీర్ ఖాన్ తన భార్యకు మినీ కూపర్ SE (MINI Cooper SE)  ఆల్-ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను మినీ మాథుర్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఒక సెకండ్ హ్యాండ్ (యూజ్డ్) కారు అయినప్పటికీ, కేవలం 2,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన 2023 మోడల్ కావడం విశేషం.

    ఫీచర్లు
    ఇందులో 32.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 275 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే 50kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 36 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్స్‌తో ఇది లభ్యం. 

    8.8 అంగుళాల టచ్ స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే (Apple CarPlay) , స్టీరింగ్ వెనుక 5.5 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లతో  ఈ కారు ఇంటీరియర్‌ చాలా లగ్జరీగా ఉంటుంది. ప్రీమియం హర్మాన్ కార్డాన్ (Harman Kardon) సౌండ్ సిస్టమ్,  పనోరమిక్ గ్లాస్ రూఫ్ (సన్‌రూఫ్), నాప్పా లెదర్ స్టీరింగ్ వీల్ దీనికి మరింత అందాన్ని ఇస్తాయి.  మొత్తానికి పర్యావరణాన్ని కాపాడుతూనే,గో-కార్ట్  హ్యాండ్లింగ్‌తో  ఎలక్ట్రిక్ వెర్షన్‌లో  మినీ కూపర్ కార్‌  మజాతో స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇచ్చే కారు ఇది.

    ధర ఎంత?
    భారతదేశంలో ఈ కారు కొత్తది కొనాలంటే ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 47.20 లక్షలు. అయితే, కబీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ యూజ్డ్ కార్ ధర సుమారు రూ. 32 లక్షలు ఉంటుందని అంచనా. 

    కాగా కబీర్ ఖాన్ , మినీ మాథుర్ 1998, ఫిబ్రవరి 28న వివాహం చేసుకున్నారు.    డైరెక్టర్‌గా కబీర్ 'ఏక్ థా టైగర్' 'బజరంగీ భాయ్‌జాన్' పాపులర్‌ అవ్వగా, మినీ ఒక ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వీరికి వివాన్ ఖాన్ అనే కుమారుడు , సైరా అనే కుమార్తె ఉన్నారు.

  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో  కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో రూ. 160 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి

    హర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్‌డీల్లో జమ చేసిన  నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని  పోలీసులు అనుమానిస్తున్నారు.

    వెలుగులోకి ఎలా వచ్చింది?
    రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్‌మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

    తమ ఎఫ్‌డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్  తెలిపారు. ఇదే  విషయాన్ని స్టేట్ విజిలెన్స్‌కు నివేదించారు. బ్యాంక్‌పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్‌ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

    కాగా గత నెలలోనే చండీగఢ్‌లోని ఐడిఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది
     

Politics

  • పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో, కేరళ రాజకీయ నాయకులు కూడా తమదైన యుద్ధం చేస్తున్నారు. అదే ఓట్ల కోసం చేసే యుద్ధం.  క్షిపణులు, డ్రోన్లు వంటివి తమ వద్ద లేకపోయినా అభ్యర్థులు, కార్యకర్తలు తాము యుద్ధంలో ఉన్నట్లే భావిస్తున్నారు. కజక్కూట్టం నియోజకవర్గంలో ఈ యుద్ధం మరింత క్లిష్టంగా ఉంటుంది.

    రాజకీయ నేతలకు అక్కడి ఎత్తైన అపార్ట్‌మెంట్‌లు పెద్ద ఓటింగ్ యంత్రాల్లా కనిపిస్తాయి. కిటికీలు అభ్యర్థుల పార్టీ గుర్తుల్లా కనిపిస్తాయి. కానీ సమస్య ఏమిటంటే అభ్యర్థులు వస్తే కిటికీలు, తలుపులు రెండూ తెరుచుకోవు. ఆ ఫ్లాట్లలోని వారు తెరవరు. ఇళ్లలో ఇంటింటి ప్రచారం చేసే అలవాటు ఉన్న పార్టీలకు ఐటీ ఉద్యోగులు ఉండే ఫ్లాట్లలో ప్రచారం చేయడానికి మాత్రం ప్రత్యేక వ్యూహాలు అవసరం.

    ఎన్నికల్లో ఒక్కోసారి గెలుపు చాలా చిన్న మెజారిటీపై ఆధారపడుతుంది. సరిగ్గా ప్రచారం చేయకపోయినా, అభ్యర్థులు, కార్యకర్తలను ప్రచారంలో ప్రజలు ఆదరించకపోయినా తీవ్ర నిరాశకు గురవుతారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో కజక్కూట్టం నియోజకవర్గంలో పార్టీలకు ఇటువంటి సమస్యే ఎదురవుతుంది. 
     
    అక్కడ అన్నీ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు ఉంటాయి. అభ్యర్థులు వెళ్లినా ఆ ఫ్లాట్ల యజమానులు తలుపులు తెరవడం లేదు. రాజకీయ పార్టీల ప్రచారానికి వారు సహకారించడం లేదు. ఐటీ ఉద్యోగులు ఉండే ఈ ఫ్లాట్ల వద్దకు వెళ్లి ప్రచారాలు చేసుకోవాలంటే పార్టీల అభ్యర్థులకు ప్రత్యేక వ్యూహాలు అవసరం. అంతేగాక, ఈ ఫ్లాట్లలో బయటి వాళ్లు ఎక్కువగా ఉంటారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్న ఉద్యోగులు అధికం. 

    ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం 
    ఇక్కడ ఓటరు కార్డు ఉన్నవారిలో ఓటింగ్ ఆసక్తి తక్కువ. యువ ఐటీ ఉద్యోగులు పోలింగ్‌ కేంద్రానికి రారు. ఆ ఫ్లాట్లలో అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉంటుంది. వారి అనుమతి లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ ప్రచారం చేసుకోవడం అసాధ్యం. ఇక్కడ ఇంటింటి ప్రచారం చాలా తక్కువ. అయితే, ఇక్కడి ప్రతి ఓటు అభ్యర్థికి చాలా ముఖ్యం. తక్కువ మెజార్టీతో ఇక‍్కడ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. 

    కజక్కూట్టం నియోజకవర్గంలో ఎత్తైన అపార్ట్‌మెం‍ట్లు రాజకీయ పార్టీలకు పెద్ద సవాలుగా మారాయి. అతి తక్కువ మెజార్టీతో ఇక్కడి అభ్యర్థులు గెలుస్తుండడంతో ఆయా ఫ్లాట్ల ఓటర్లను వదులుకునే ప్రసక్తే లేదు. కజక్కూట్టం స్థానిక ఎన్నికల్లో గతంలో ఎల్డీఎఫ్ 1,909 ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ ప్రతి ఓటు కీలకంగా మారింది.

    పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు వస్తే ఆయా ఫ్లాట్లలో నివసించే వారు తలుపులు తెరవకపోవడం, ప్రచారానికి సహకరించకపోవడం పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే ఈ ఫ్లాట్లలోని చాలా మంది తమకు సహకరించరని పార్టీల కార్యకర్తలు చెబుతున్నారు.

    తక్కువ మెజార్టీతో గెలుపు
    కజక్కూట్టం టెక్నోపార్క్ కు నిలయం. ఇక్కడ 1990 దశకంలో వ్యవసాయ భూమిని ఐటీ కేంద్రంగా మార్చారు. ఇప్పుడు వరుసగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు  ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు కనపడుతున్నాయి. మూసివేసిన గేట్లు, తలుపులు తీయాలని కోరుతూ వాటిల్లోకి వెళ్లడం రాజకీయ పార్టీల నేతలకు పెద్ద సవాలు.

    కజక్కూట్టంలో గతంలో పలు పార్టీల నేతలు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎంఏ వాహిద్ 2001లో రెండు ప్రధాన కూటములను ఓడించి గెలిచారు. 2016 వరకు స్థానాన్ని నిలుపుకున్నారు. 2021లో సీపీఎంకు చెందిన కడకంపల్లి సురేంద్రన్ 7,374 ఓట్ల తేడాతో తిరిగి గెలిచారు.

    ఈ నియోజకవర్గంలో 28 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. బీజేపీ 14, ఎల్డీఎఫ్ 10, యూడీఎఫ్ 3, ఒకటి స్వతంత్ర అభ్యర్థి. ఈ సారి సీపీఎం తరఫున సురేంద్రన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వి. మురళీధరన్, కాంగ్రెస్ తరఫున టి. శరత్‌చంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -వెబ్‌డెస్క్‌

     

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పపువ్వు సారా మంచిదే గానీ.. ఇందిరమ్మ పేరు పెట్టకండంటూ రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రులు  శ్రీధర్‌బాబు, పొన్నం, వాకిటి శ్రీహరి మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్‌  చేశారు. రాకేష్‌రెడ్డివ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. రూల్స్‌ ప్రకారమే సభ నడవాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

    కాంగ్రెస్‌, బీజేపీ  ఎమ్మెల్యేల తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌,బీజేపీ ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. చర్చను పక్కదారి పట్టించడం సరైన పద్దతి కాదన్నారు. ఒక్క విషయాన్ని పట్టుకుని గంట సమయం వృథా చేయడం సరికాదన్నారు. రాకేష్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్న స్పీకర్‌.. కొత్త సభ్యులు పొరపాటు చేస్తే ఫ్లోర్‌ లీడర్‌ సరిచేయాలని సూచించారు.

    తానేం తప్పు మాట్లాడలేదన్న రాకేష్‌రెడ్డి.. ప్రతి స్కీమ్‌కు ఇందిరమ్మ పేరు పెడుతున్నారు.. ఈ స్కీమ్‌కు ఆమె పేరు పెట్టొద్దని చెప్పానంటూ రాకేష్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలంటే హౌస్‌ కమిటీ వేయండి.. ఇందిరమ్మపై తప్పుగా ప్రచారం చేస్తుంటే తానూ మాత్రమే ఖండించానని రాకేష్‌రెడ్డి అన్నారు. ఇప్పపువ్వు సారా ఫ్యాక్టరీకి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని చెప్పడం తప్పేమీ కాదంటూ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని.. ఇందిరమ్మ పేరు ఎందుకు తెచ్చారో రాకేష్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేని మంత్రి సీతక్క అన్నారు.

    BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

     

     

  • కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.

    ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయించాయి.

    1952 నుంచి 2021 వరకు 
    తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

    తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?
    1952–1962

    1952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.

    1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్‌కు పోటీగా మారింది.

    1967 కాంగ్రెస్‌పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. 

    1971లోనూ డీఎంకే గెలిచింది.

    1977  డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అ‍న్నాడీఎంకే భారీ విజయం సాధించింది.


    1980–1990 దశకం 
    ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది. 

    1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.

    1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.

    1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.

    2001–2011 మధ్య
    కూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి.  

    2016–2021 
    2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్‌, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.

    2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.


    ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు

    1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.

    2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.

    3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.

    4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.

    5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి.

     

  • సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు.

    రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

    బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..
    వైఎస్‌ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు.  మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది.

    జరగని మీటింగ్‌పై బాబు ఉలికిపాటు..
    రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు?

    అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెళ్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పీఎస్ ఆర్ ఆంజనేయలు, పీవీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి?

    గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం?  

    వైఎస్‌ జగన్ హయాంలో హుందాతనం..
    వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్థం అవుతోంది.

    కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

    గతంలో తన పాలనలో అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ  చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి.

    అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే.

    బాబు పాలనలో కక్ష సాధింపులు..
    ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే.

    పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే...  నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Business

  • మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

    ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలు
    యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.

    ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలు
    గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..

    దేశంపెరుగుదల శాతం
    మయన్మార్55.4%
    ఫిలిప్పీన్స్54.2%
    కంబోడియా52.8%
    లెబనాన్28.6%
    కెనడా25.0%
    పాకిస్తాన్24.4%
    చైనా23.2%
    జపాన్19.6%

    పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.98 డాలర్లుగా నమోదైంది.

    ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?
    ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..

    పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.

    పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

    ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది.

  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం జీతం కాదు.. అతను పనిచేసే విధానం!

    రోహన్ ధావన్ అనే ఎంట్రాప్రెన్యూర్‌ తన మేనల్లుడి గురించి లింక్డ్‌ఇన్ (LinkedIn)లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువ డెవలపర్ రోజుకు కేవలం 2 నుండి 3 గంటలు మాత్రమే లాప్‌టాప్ తెరిచి పనిచేస్తాడట. పని ముగియగానే దర్జాగా లాగ్-ఆఫ్ అవుతాడు. మిగిలిన రోజంతా ఖాళీగా ఉండటం చూసి అతని తల్లిదండ్రులు సంతోషపడాల్సింది పోయి, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

    "వీడు అసలు పనేం చేయడం లేదు.. ఇంత జీతం ఇస్తున్నారంటే ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నాడా?" అని ఆ తండ్రి తన ఆందోళనను ధావన్‌తో పంచుకున్నారు.

    కష్టపడటం అంటే గంటలు గడపడమేనా?
    సాధారణంగా భారతీయ మధ్యతరగతి ఇళ్లలో ఒక వ్యక్తి రోజుకు 10-12 గంటలు ఆఫీసులో కష్టపడితేనే అదే 'నిజమైన పని' అని నమ్ముతారు. "అలసటను ఒక గౌరవ చిహ్నంగా, పని సులభంగా అవ్వడాన్ని అనుమానంగా చూసే మనస్తత్వం మన సమాజంలో ఉంది" అని ధావన్ తన పోస్ట్‌లో విశ్లేషించారు. ఒకవేళ అదే అబ్బాయి తక్కువ జీతానికి టీసీఎస్‌ (TCS) లేదా ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పగలూరాత్రి కష్టపడితే, ఆ తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేవారని ఆయన పేర్కొన్నారు.

    పని తీరును మార్చిన ఏఐ
    2026 నాటి ఆధునిక పని వాతావరణంలో కృత్రిమ మేధ (AI) విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో 8 గంటలు పట్టే పనిని, సరైన ఏఐ టూల్స్ వాడి 3 గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రిమోట్ ఉద్యోగాల్లో మీరు ఎన్ని గంటలు లాగిన్ అయ్యారనే దానికంటే, ఎంత నాణ్యమైన పనిని డెలివరీ చేశారన్నదే ముఖ్యం. టెక్నాలజీపై పట్టున్న యువత ఇప్పుడు 'హార్డ్ వర్క్' కంటే 'స్మార్ట్ వర్క్' వైపు మొగ్గు చూపుతున్నారు.

    బిజీగా ఉన్నట్లు నటన!
    చాలా మంది యువ నిపుణులు తమ పనిని త్వరగా ముగించినప్పటికీ, సమాజం లేదా బాస్‌ల నుండి వచ్చే విమర్శల భయంతో "బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారని" ధావన్ ఎత్తి చూపారు. ఉత్పాదకతను గంటలతో కొలిచే పద్ధతి ఇంకా పోలేదని ఇది నిరూపిస్తోంది.

  • దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

    ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర
    రత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.

    50 వేల టన్నుల బంగారం నిల్వలు
    నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్‌ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

    అడ్డంకిగా 3% జీఎస్టీ
    భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్‌ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్‌ఎస్‌ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.

    పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్
    గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

    తప్పనిసరి హాల్‌మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు.

  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన అనుబంధ సంస్థ ‘ఎన్‌పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్’ (NBSL) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఇకపై భీమ్ యాప్ ద్వారా చేసే యూపీఐ (UPI) లావాదేవీలకు పిన్ అవసరం లేకుండా, కేవలం వేలిముద్ర లేదా ఫేస్‌ రికగ్నిషన్‌తో నగదు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    ఫీచర్‌ ముఖ్యాంశాలు

    రూ. 5,000 వరకు పరిమితి: వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని బయోమెట్రిక్ ఫీచర్‌ను ఉపయోగించి గరిష్టంగా రూ. 5,000 వరకు లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.

    పిన్ ఎంట్రీతో పనిలేదు: తరచూ పిన్ మర్చిపోవడం లేదా తప్పుగా నమోదు చేయడం వల్ల పేమెంట్స్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుంది.

    అధిక భద్రత: పిన్ షేరింగ్ వంటి రిస్క్‌లను తగ్గించి, వ్యక్తిగత గుర్తింపు ఆధారంగా లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇది మరింత సురక్షితం.

    రూ. 5,000 దాటితే: అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిపే లావాదేవీలకు భద్రతా కారణాల దృష్ట్యా యధావిధిగా యూపీఐ పిన్ తప్పనిసరి.

    యాక్టివేట్ చేసుకునే విధానం
    భీమ్ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను యాక్టివేట్‌ కోవడానికి ఈ కింది దశలను అనుసరించండి..

    • భీమ్ (BHIM) యాప్ ఓపెన్ చేయండి.

    • ప్రొఫైల్ (Profile) విభాగానికి వెళ్లండి.

    • మీ బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి.

    • యాక్టివేట్ బయోమెట్రిక్ ట్రాన్సాక్షన్స్ (Activate Biometric Transactions)పై క్లిక్ చేయండి.

    ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌లలో బయోమెట్రిక్ సదుపాయం ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో ఉంది.

  • ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

    కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

    • ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం

    • జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

    • ఐవీఎఫ్‌ఆర్‌టీ  ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతి

    • ఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదం

    • పదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

    • ఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి

    • 200 హెలిపాడ్ ల ఆధునీకరణ

    • ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం  

    • ఎయిర్ లైన్స్  ఆపరేటర్స్ కు వయబులిటీ  గ్యాప్ ఫండ్ కింద 10,043  కోట్ల రూపాయల సహాయం  

    • ఈ పథకం కింద కొత్తగా 120  ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీ

    • పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం  

    • సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి 

  • దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన తరువాత చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రెండవ సెషన్ లో ఎగిశాయి.

    నిఫ్టీ 1.72 శాతం లేదా 392.70 పాయింట్ల లాభంతో 23,306.45 వద్ద, సెన్సెక్స్ 1.63 శాతం లేదా 1,205 పాయింట్లు పెరిగి 75,273.45 వద్ద ట్రేడవుతున్నాయి.

    సెన్సెక్స్‌లో ప్రధానంగా శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance), అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), ట్రెంట్ (Trent), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి ఇన్వెస్టర్లకు మంచి లాభాలను పంచాయి. మరోవైపు, ఐటీ రంగ షేర్లు ఒత్తిడికి లోనవ్వడంతో టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రధానంగా నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీనితో పాటు పవర్ గ్రిడ్ (Power Grid), టీసీఎస్ (TCS) వంటి షేర్లు కూడా స్వల్పంగా నష్టపోయాయి.

    విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.30 శాతం, 2.59 శాతం పెరిగాయి

    రంగాల వారీగా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ టాప్ గెయినర్ గా నిలిచాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ కూడా తమ సహచరులను అధిగమించాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది.

  • సోషల్ మీడియాలో ఎల్‌పీజీ (LPG) రీఫిల్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.

    వైరల్ వార్తల్లో ఏముంది?
    గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్‌ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్‌కు అయితే 35 రోజులు గ్యాప్‌ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.

    కేంద్రం, ఐవోసీఎల్‌ వివరణ
    ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్‌లతో ‍సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.

    పార్లమెంటులో చర్చ

    సాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

    • ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.

    • ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.

    • రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్‌కమింగ్ సదుపాయం ఉండాలి.

    • మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).

    మంత్రి స్పందన

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్‌ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్‌ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

    ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

    త్వరలో కీలక నిర్ణయం?

    పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్,  ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Sports

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీకి ఊహించని అవకాశం దొరికింది. వేలంలో అమ్ముడుపోని సైనీని, కేకేఆర్‌ లీగ్‌ ప్రారంభానికి మూడు రోజుల ముందు అక్కున చేర్చుకుంది. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన హర్షిత్‌ రాణా స్థానాన్ని సైనీ భర్తీ చేయనున్నాడు.

    రోజుల వ్యవధిలో కేకేఆర్‌లో జరిగిన రెండో కీలక మార్పు ఇది. కొద్ది రోజుల కిందట ఆకాశ్‌దీప్‌ గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరం కాగా.. అతని స్థానాన్ని సౌరభ్‌ దూబే భర్తీ చేశాడు. ఇద్దరు కీలక పేసర్లు సీజన్‌ మొత్తానికి దూరం కావడం అసలే అంతంతమాత్రంగా ఉన్న కేకేఆర్‌ పరిస్థితిని మరింత దిగజార్చింది. 

    ప్రస్తుత కేకేఆర్‌ జట్టులో మతీష పతిరణ మినహా ఒక్క స్టార్‌ పేసర్‌ కూడా లేడు. ఉమ్రాన్‌ మాలిక్‌, బ్లెస్సింగ్‌ ముజరబానీ ఓ మోస్తరు గుర్తింపు కలిగిన పేసర్లుగా ఉన్నారు. వైభవ్‌ అరోరా, కార్తీక్‌ త్యాగి, సౌరభ్‌ త్యాగి రూపంలో దేశీయ పేసర్లు ఉన్నారు. 

    ఈ సీజన్‌ కేకేఆర్‌ అజింక్య రహానే నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మార్చి 29న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో కేకేఆర్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ సీజన్‌లో రహానేకి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) రింకూ సింగ్‌ను ప్రకటించారు. గత సీజన్‌తో పోలీస్తే ఈ సీజన్‌లో కేకేఆర్‌లో చాలా మార్పులు జరిగాయి. రసెల్‌ ఐపీఎల్‌కు బైబై చెప్పగా.. ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌, రోవ్‌మన్‌ పావెల్‌, కెమరూన్‌ గ్రీన్‌, రచిన్‌ రవీంద్ర వంటి విధ్వంసకర బ్యాటర్లు జట్టులోకి వచ్చారు.

    గుజరాత్‌ టైటాన్స్‌లో ఓ మార్పు
    తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌లోనూ ఓ మార్పు చోటు చేసుకుంది. గాయం బారిన పడిన పృథ్వీ రాజ్‌ యర్రా స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చాడు. ఖేజ్రోలియా 2018లో RCB తరఫున IPLలో అరంగేట్రం చేశాడు. తర్వాత 2019లో RCB, 2023లో KKR తరఫున ఆడాడు. గత సంవత్సరంలో అతను గుజరాత్‌ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌ ప్రయాణం మార్చి 31న ముల్లాన్పూర్‌లో పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌తో మొదలవుతుంది. 

  • ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్‌ జేసన్‌ గిల్లెస్పీ పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను.. ఫ్రాంచైజీ తరఫున రూపొందించే వెల్కమ్ వీడియోలో పాల్గొనడానికి నిరాకరించారు. 

    ఈ సంప్రదాయాన్ని ఆయన స్టుపిడ్‌ అని పిలుస్తూ పాక్‌ అభిమానులు, ఫ్రాంచైజీ యాజమాన్యం మనోభావాలను దెబ్బ తీశాడు. గిల్లెస్పీ నుంచి ఈ ఊహించని చర్యకు పాక్‌ క్రికెట్‌ అభిమానులు తొలుత షాక్‌ అయ్యారు. ఆతర్వాత ఫైరవవుతన్నారు.

    వాస్తవానికి గిల్లెస్పీ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అతను పాక్‌ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసినప్పుడు పీసీబీ వల్ల చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి మనసులో పెట్టుకునే అతను ఇలా ప్రవర్తించి ఉంటాడని క్రికెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

    కాగా, కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ నిన్న తమ ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గిల్లెస్పీ కూడా కనిపించినప్పటికీ, హోటల్ లాబీకి రావడానికి ఆయన నిరాకరించారు. నాకు చాలా పని ఉంది. మీరు ఆ మూర్ఖమైన వీడియోలు తీయమని అంటున్నారు. నేను చేయను అని స్పష్టంగా చెప్పారు.  

    ఇదిలా ఉంటే, హైదరాబాద్‌ కింగ్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ నాయకత్వంలో మార్చి 26న లాహోర్ ఖలందర్స్‌తో తమ తొట్ట తొలి పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంధన సంక్షోభం కారణంగా PCB ఈ టోర్నీని పరిమిత వేదికలలో, ప్రేక్షకులు లేకుండా నిర్వహించనుంది.  

  • మాజీ భారత డాషింగ్‌ బ్యాటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొడుకు సహచరులపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యోగ్‌రాజ్‌ ఈసారి దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత స్పిన్‌ కింగ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేశాడు. యోగ్‌రాజ్‌ అశ్విన్‌పై ఫైరవ్వడానికి సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ కారణం.

    అర్జున్‌ 2022లో యోగ్‌రాజ్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచే అర్జున్‌ దశ మారింది. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌తో పాటు రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో అర్జున్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.

    ఈ సీజన్‌లో అర్జున్‌కు లక్నో తుది జట్టులో చోటు లభించడంపై ఇటీవల అశ్విన్‌ కాస్త ఓపెన్‌గా మాట్లాడాడు. అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమని అన్నాడు. ఈ మాటలే యోగ్‌రాజ్‌ను చిర్రెత్తిపోయేలా చేశాయి. టీవీల్లో కూర్చొని ఒకరి ఫేట్‌ను డిసైడ్‌ చేయడానికి నువ్వ ఎవరు.. నీ అర్హత ఏంటి అంటూ ఘాటుగా స్పందించాడు. 

    ఓ ఆటగాడిని నువ్వు చేయలేవు.. ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు చురకలంటించాడు. ఇలా మాట్లాడటం ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతుందని అన్నాడు. సచిన్‌ కొడుకు కావడం అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉంది.. ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయని తెలిపాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అర్జున్‌కు తప్పక అవకాశాలు వస్తాయి.. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటాడని యోగ్‌రాజ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

    కాగా, యోగ్‌రాజ్‌ కొంతకాలం కిందట, అర్జున్‌ తన వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకుంటే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌ అవుతాడని జోస్యం చెప్పాడు. అలా జరగకపోతే తాను గడ్డం కత్తరించుకుంటానని ఛాలెంజ్‌ కూడా చేశాడు. యోగ్‌రాజ్‌ చెప్పనట్లుగానే.. అతని వద్ద 12 రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత అర్జున్ ఫేట్‌ మారిపోయింది. రంజీ ట్రోఫీలో కొత్తగా గోవా తరఫున, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కాంట్రాక్ట్‌ లభించాయి. ఈ అవకాశాలను అర్జున్‌ పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయినా,  అభిమానుల చూపును తనవైపు మళ్లించుకోగలిగాడు.

    అశ్విన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి వీల్లేదు..!
    ఈ సీజన్‌లో లక్నో బౌలింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. మొహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ వంటి నాణ్యమైన పేసర్లు జట్టులో ఉన్నారు. వీరిని కాదని అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం ప్రాక్టికల్‌ సాధ్యం కాకపోవచ్చు. అయినా, యోగ్‌రాజ్‌ అర్జున్‌పై నమ్మకం వ్యక్తం చేయడం ఆసక్తికరం.

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను తెగ కంగారు పెట్టింది. ఇటీవల బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లగా.. అతనికి గాయమైందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. 

    తాజాగా అలాంటిదేమీ లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా కేవలం ఫిట్‌నెస్ చెక్ కోసమే CoE​కి వెళ్లాడని కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది.

    కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఆ మరుసటి రోజు (మార్చి 29) ఆడనుంది. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో ఎంఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

    ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌​ ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, ఆఖరి మ్యాచ్‌ల్లో అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది (నాలుగో స్థానం). అయితే క్వాలిఫయర్-2లో పంజాబ్‌ కింగ్స్‌ చేతుల్లో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. 

    బుమ్రా రాకతో మారిన ఫేట్‌
    గత ఎడిషన్‌లో బుమ్రా తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌ను చాలా ప్రభావితం చేసింది. బుమ్రా రాకతో ఎంఐ తిరిగి గాడిలో పడి క్వాలిఫయర్‌-2 వరకు చేరింది. ఆ సీజన్‌లో బుమ్రా 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌కు జీవం పోశాడు. 

    ఊరిస్తున్న ఆరో టైటిల్‌
    తాజాగా బుమ్రా భారత్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి జోరుమీదున్నాడు. బుమ్రా ఫామ్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఆరో ఐపీఎల్‌ ట్రోఫీని ఊరిస్తుంది. బుమ్రా తన సామర్థ్యం మేరకు రాణించగలిగితే ఈ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు తప్పక చేరుతుంది. 

    ఉరకలేస్తుంది..!
    ఈ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. తాజాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఆ జట్టులో సభ్యులైన తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా ఇదే జట్టులో ఉన్నారు. వీరికి వెటరన్‌ డాషింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కూడా తోడున్నాడు. 

    వారి ప్రదర్శనల కోసం ఎదురుచూపు..!
    వీరు కాకుండా ఈ సీజన్‌తోనే ముంబై ఇండియన్స్‌ పంచన చేరిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, విల్‌ జాక్స్‌ లాంటి భారీ హిట్టర్ల ప్రదర్శనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

  • ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో (CSK) కీలక మార్పు చోటు చేసుకుంది. నాథన్‌ ఇల్లిస్‌ గాయంతో సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో, అతని స్థానంలో మరో ఆస్ట్రేలియా పేసర్‌ స్పెన్సర్ జాన్సన్‌ జట్టులో చేరాడు. ఎడమ చేతి వాటం పేసర్‌ అయిన జాన్సన్‌ను సీఎస్‌కే రూ. 1.5 కోట్లకు సొంతం​ చేసుకుంది.

    జాన్సన్‌కు ఇదివరకే ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. 2024లో గుజరాత్ టైటాన్స్ అతన్ని రూ. 10 కోట్ల భారీ బిడ్‌తో దక్కించుకుంది. ఆ తర్వాత 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జాన్సన్‌.. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ రేట్ (10.39) చాలా దారుణంగా ఉంది. అయినా, సీఎస్‌కే అతన్ని తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

    జాన్సన్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు లేకపోయినా, ఆస్ట్రేలియా తరఫున ఓ మోస్తరు రికార్డు ఉంది. ఆసీస్‌ తరఫున అతను 8 టీ20ల్లో 14 వికెట్లు, 5 వన్డేల్లో 4 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్‌ ఆఫర్‌కు ముందు జాన్సన్‌కు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ నుంచి భారీ ఆఫర్‌ వచ్చింది. 

    గ్లాడియేటర్స్‌ ఇతన్ని నేరుగా సంతకం చేసుకున్నా, వ్యక్తిగత కారణాలతో అతను ఆ లీగ్‌ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఐపీఎల్‌ నుంచి బంపర్‌ ఆఫర్‌ రావడంతో అన్నీ పక్కకు పెట్టి ఓకే చెప్పేశాడు. ఆజానుబాహుడైన జాన్సన్‌ బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు.

    కాగా, ఐపీఎల్‌ 2026లో సీఎస్‌కే ప్రయాణం మార్చి 30 నుంచి మొదలవుతుంది. గౌహతిలొ జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 28న ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో మొదలవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. 

    ఐపీఎల్‌-2026లో సీఎస్‌కే జట్టు
    ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్‌ ద్వారా, వికెట్‌ కీపర్‌), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, స్పెన్సర్‌ జాన్సన్‌ , శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్‌ (వికెట్‌ కీపర్‌), ఖలీల్‌ అహ్మద్‌, అకీల్‌ హొసేన్‌, ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మ, మాథ్యూ షార్ట్‌, అమన్‌ ఖాన్‌, జాక్‌ ఫౌల్క్స్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ చహర్‌, మ్యాట్‌ హెన్రీ.

  • ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ జేసన్‌ గిల్లెస్పి మరోసారి పాకిస్తాన్‌ క్రికెట్‌లో భాగమయ్యాడు. గతేడాది పాక్‌ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌ పదవి నుంచి ఈ మాజీ పేసర్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తనకు చెప్పకుండానే సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌పై వేటు వేశారని.. అవమానాన్ని భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.

    హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌ కోచ్‌గా
    అయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో గిల్లెస్పి భాగం కావడం విశేషం. మార్చి 26న తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్న తరుణంలో కొత్త ఫ్రాంఛైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మెన్‌ కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జట్టుతో చేరిన అతడు హోటల్‌లో కెమెరామెన్‌తో సంభాషించిన తీరు వైరల్‌గా మారింది.

    ఫ్రాంఛైజీ క్రికెట్‌లో స్వాగత వీడియోలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు, కోచ్‌ల ఆగమనం నేపథ్యంలో వీడియోలు తీసి వాటికి ఎలివేషన్లు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ వెల్‌కమ్‌ వీడియో తీస్తున్న క్రమంలో గిల్లెస్పి కీలక వ్యాఖ్యలు చేశాడు.

    స్టుపిడ్‌ వెల్‌కమ్‌ వీడియోలు వద్దు
    ‘‘నేనేమీ కిందకు రావడం లేదు. నాకు చాలా పని ఉంది. ఇలాంటి స్టుపిడ్‌ వెల్‌కమ్‌ వీడియోలు నేను చేయను’’ అంటూ పై అంతస్తులో ఉన్న గిల్లెస్పి వ్యాఖ్యానించాడు. తనకు పని ఎక్కువగా ఉందని.. కాబట్టి ఇలాంటి వాటిలో తాను భాగం కాలేనని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గిల్లెస్పి పేర్కొన్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఏమాత్రం సమయం వృథా చేయకుండా శిక్షణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

    చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

  • న్యూజిలాండ్‌కు సొంతగడ్డపై పరాభవం ఎదురైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పర్యాటక సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. క్రైస్ట్‌ చర్చ్‌ వేదికగా ఇవాళ (మార్చి 25) జరిగిన నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో సఫారీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నాలుగో నంబర్‌ ఆటగాడు, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కానర్‌ ఎస్టర్‌హ్యూజన్‌ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

    మిగతా ఆటగాళ్లలో వియాన్‌ ముల్దర్‌ (31), రూబిన్‌ హెర్మన్‌ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో డియాన్‌ ఫార్రెస్టర్‌ (21 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. టోని డి జోర్జి (12) నిరాశపర్చగా.. జేసన్‌ స్మిత్‌ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బెన్‌ సియర్స్‌ 2, జకరీ ఫౌల్క్స్‌, జోష్‌ క్లార్క్‌సన్‌ తలో వికెట్‌ తీశారు.

    అనంతరం 188 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌.. సఫారీ బౌలర్ల ధాటికి తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసి పరాజయంపాలైంది. గెరాల్డ్‌ కొయెట్జీ, వియాన్‌ ముల్దర్‌, ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ తలో 2, కెప్టెన్‌ కేశవ్‌ మహారాజ్‌ ఓ వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. వికెట్లు తీయకపోయినా ప్రెనెలన్‌ సుబ్రాయెన్‌ (4-0-22-0) అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. 

    కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 36 పరుగులతో బెవాన్‌ జాకబ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్‌ రాబిన్సన్‌ 25, డేన్‌ క్లీవర్‌ 22, నిక్‌ కెల్లీ 14, కేటీన్‌ క్లార్క్‌ 2, కెప్టెన్‌ జిమ్మీ నీషమ్‌ 24, జోష్‌ క్లార్క్‌సన్‌ 13, కోల్‌ మెక్‌కోంచి 1, జకరీ ఫౌల్క్స్‌, కైల్‌ జేమీసన్‌ తలో 4 పరుగులతో అజేయంగా నిలిచారు.

    మరో క్లాసెస్‌ దొరికాడు..!
    ఈ సిరీస్‌తో సౌతాఫ్రికాకు మరో క్లాసెన్‌ దొరికాడు. క్లాసెన్‌ లాగే వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన కానర్‌ ఎస్టర్‌హ్యూజన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ శైలితో క్లాసెన్‌కు తలపించాడు. కానర్‌ వికెట్ల వెనకాల కూడా పర్వాలేదనిపించాడు. నేటి మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో తన జట్టుకు సిరీస్‌ విజయాన్ని అందించిన కానర్‌.. దీనికి ముందు మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. 

    ఆ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ఇదే సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కానర్‌.. 5 మ్యాచ్‌ల్లో 145కు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 200 పరుగులు చేశాడు. తద్వారా ఐదో టీ20లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. క్లాసెన్‌ రిటైరయ్యాక సౌతాఫ్రికాకు ఆ స్థాయి బ్యాటర్‌గా కానర్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. 

  • గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌. మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్‌ నిలిచాడు.

    కెప్టెన్‌గానూ ఫెయిల్‌
    అయితే, ఐపీఎల్‌-2025లో పంత్‌ (Rishabh Pant) దారుణంగా విఫలమయ్యాడు. పదమూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కెప్టెన్‌గానూ పంత్‌ ఫెయిలయ్యాడు. అతడి సారథ్యంలో లక్నో గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

    టీమిండియా రీఎంట్రీ కష్టమే
    ముఖ్యంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా పంత్‌ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా పంత్‌ ఆట తీరు మారకపోతే.. భారత టీ20 జట్టులో అతడు తిరిగి స్థానం దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

    ‘‘రిషభ్‌ పంత్‌ విషయంలో విమర్శలు రావడం సరైందే. సంప్రదాయ విరుద్ధ, రిస్కీ షాట్లు ఆడటం అనే చట్రంలో అతడు ఇరుక్కుపోయాడు. ఫామ్‌ను తిరిగి పొందే ప్రయత్నమే చేయడం లేదు. గతేడాది మొత్తం రిస్కీ షాట్లతో విమర్శలు మూటగట్టుకున్నాడు.

    సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు
    టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీ20 జట్టుకు అతడు దూరమయ్యాడు. మిడిలార్డర్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సేవలు అందించే పంత్‌ గురించి ఇప్పుడు సెలక్టర్లు అసలు పట్టించుకోవడం లేదు.

    ఓపెనర్‌-వికెట్‌ కీపర్‌గా ఓ ఆటగాడు రాణిస్తుంటే (సంజూ), ఓపెనర్‌- వికెట్‌ కీపర్‌ లేదంటే వన్‌డౌన్‌లో ఆడే వికెట్‌ కీపర్‌గా మరొకరు (ఇషాన్‌) దుమ్ములేపుతున్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటితేనైనా తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం చేసే అవకాశం అయినా పంత్‌కు దక్కుతుంది. 

    ఏదేమైనా జాతీయ జట్టుకు ఆడటమే ప్లేయర్‌ అంతిమ లక్ష్యం కదా! యువరాజ్‌ సింగ్‌ మార్గదర్శనంలో పంత్‌ ప్రాక్టీస్‌ చేయడం శుభసూచకం. ఈసారైనా పంత్‌ ఉత్తమంగా రాణించాలి. లేదంటే భవిష్యత్‌ కష్టమే’’ అని ఆకాశ్‌ చోప్రా జియోహాట్‌స్టార్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2026 షురూ కానుంది.

    చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. పొట్టి క్రికెట్‌ గతినే మార్చి వేసిన లీగ్‌.. భారత్‌లో 2008లో మొదలైన ఈ టీ20 టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నది. గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందింది.

    ఐపీఎల్‌లో ఒక్కసారి ఆడితే చాలు తమ దశ తిరిగిపోతుందని ఆటగాళ్ల నమ్మకం. ఈ టీ20 లీగ్‌లో సత్తా చాటి జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కోకొల్లలు. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఐపీఎల్‌ ద్వారానే వెలుగులోకి వచ్చారు.

    ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు, లీగ్‌ తొలి చైర్మన్‌
    ఐపీఎల్‌ ఈ స్థాయికి చేరడంలో లలిత్‌ మోదీకి కీలక పాత్ర. ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు, లీగ్‌ తొలి చైర్మన్‌ అతడే. 2010 వరకు లీగ్‌ కమిషనర్‌గానూ లలిత్‌ మోదీ కొనసాగాడు. ఆ తర్వాత మనీ లాండరింగ్‌ ఆరోపణలతో అభాసుపాలై.. దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుగా ముద్రపడ్డాడు. ఏదేమైనా ఐపీఎల్‌కు అంకురార్పణ చేసింది అతడే. అందుకే అతడి పేరు భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడం ఖాయం.

    1997-98 మధ్యకాలంలోనే ఆ ఐడియాతో..
    కాగా 2008 కంటే దశాబ్దకాలం ముందే లలిత్‌ మోదీ ఐపీఎల్‌ గురించి బీసీసీఐ (BCCI)కి చెప్పాడట. టీమిండియా మాజీ సెలక్టర్‌, భారత మాజీ క్రికెటర్‌ సబా కరీం (Saba Karim) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దూరదర్శన్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘1997-98 మధ్యకాలంలోనే లలిత్‌ మోదీ టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆలోచనతో బీసీసీఐ దగ్గరికి వచ్చాడని చాలా మందికి తెలియదు.

    ఐపీఎల్‌ ఆరంభానికి దాదాపు పదేళ్ల ముందు నుంచే ఇలాంటి లీగ్‌ గురించి లలిత్‌ మోదీ బీసీసీఐ వద్ద ప్రతిపాదన తెచ్చాడు. అప్పట్లో అసలు టీ20 క్రికెట్‌ గురించి ఆలోచనే లేదు. అంతా వన్డేల మయం. అయితే, అప్పట్లోనే టీ20 క్రికెట్‌ కోసం బెంగాల్‌ నుంచి ఓ జట్టు తయారు చేయాలని మేము అనుకున్నాము.

    కాంట్రాక్టు కూడా..
    వాళ్లతో కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నాము. అయితే, వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ లీగ్‌ గురించిన ఆలోచన మాత్రం మా మెదళ్లలో ఉండిపోయింది’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2008లో మొదలైన ఐపీఎల్‌ విలువ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. 

    ఆరంభ సీజన్‌ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ తాజాగా రూ. 15 వేల కోట్లకు పైగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీ రూ. 16 వేల కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు చిన్నపాటి నిదర్శనాలు. ఇక ఈ ఏడాది మార్చి 28న ఐపీఎల్‌కు తెరలేవనుంది.

    చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

  • ఫుట్‌బాల్‌లో ఈతరం మేటి ఆటగాళ్లుగా ముద్రపడ్డవారు లియోనల్‌ మెస్సీ,  క్రిస్టియానో రొనాల్డో. వీరిద్దరిలా అంత పాపులారిటీ సంపాదించనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈజిప్ట్ ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు మహ్మద్ సాలా. ఫార్వర్డ్ ప్లేయర్‌గా స్టార్ హోదా పొందిన సాలా తొమ్మిదేళ్లుగా లివర్‌పూల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

    అయితే లివర్‌పూల్‌తో ఉన్న తొమ్మిదేళ్ల బంధానికి ముగింపు పడనున్నట్లు సాలా ప్రకటించాడు. త్వరలోనే లివర్‌పూల్ క్లబ్‌తో ఒప్పందం ముగియనున్న వేళ దానితో ఉన్న బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వీడియో రూపంలో భావోద్వేగంతో పంచుకున్నాడు. ‘అందరికీ నమస్కారం. ఈ సీజన్‌తో లివర్‌పూల్‌తో బంధం ముగియనుంది. ఏదో ఒకరోజు లివర్‌పూల్ క్లబ్ నుంచి వైదొలగాల్సిందే. కానీ ఆ దురదృష్టకరమైన రోజు రానే వచ్చింది. 

    ఇది నా వీడ్కోలులో మొదటి భాగం. లివర్‌పూల్ క్లబ్‌తో తొమ్మిదేళ్లుగా సాగిన బంధంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లివర్‌పూల్ అనేది కేవలం నాకు ఫుట్‌బాల్ క్లబ్ మాత్రమే కాదు అంతకుమించి. ఇంతకాలం నన్ను భరించడంతో పాటు నాకు సహకరించిన క్లబ్ యాజమాన్యానికి, నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 

    2017లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరిన 33 ఏళ్ల మహ్మద్ సాలా ఆ క్లబ్ తరఫున 435 మ్యాచ్‌లాడి 255 గోల్స్ సాధించాడు. తద్వారా లివర్‌పూల్ క్లబ్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన జాబితాలో ఇయాన్ రష్‌, రోజర్ హంట్‌ల తర్వాత సాలా మూడో స్థానంలో ఉన్నాడు. 2019, 2024 సీజన్లలో టైటిల్ గెలిచిన లివర్‌పూల్‌లో సాలా సభ్యుడిగా ఉన్నాడు. ఇక అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌లో ఈజిప్ట్‌ తరఫున మహ్మద్‌ సాలా 115 మ్యాచ్‌ల్లో 67 గోల్స్‌ సాధించాడు.

    చదవండి: డకెట్‌ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పందన!

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని రాజకీయ పరిశీలకుడు జోతిర్మయరెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉత్తర –దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా వైరుద్యం నెలకొన్న నేపథ్యంలో దామాషా పద్దతిన పెంచటమే మేలని ఆయన చెప్పారు.

    బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో 182 శాసనసభ స్థానాలు, 26లోక్‌సభ స్థానాల ఏర్పాటు జరుగుతుందని పేర్కొన్నారు. మహిళలకు సైతం 60 స్థానాలు రిజర్వు అవుతాయని, అయితే వాటిని లాటరీ పద్దతిన ఎంపకి చేసే అవకాశం ఉంటుందని జ్యోతిర్మయరెడ్డి వెల్లడించారు.

  • సాక్షి, సంగారెడ్డి: మద్యం మత్తులో సినీ హీరో రాజ్‌ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్‌చల్‌ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు  చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మల్కాపూర్‌ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును మల్లెపల్లి పోలీసులు అడ్డుకున్నారు.

    సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో వారితో లావణ్య వాగ్వాదానికి దిగింది. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి  చేరుకున్నారు. పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలను తయారీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాటెదాన్‌లోని ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. ఇంద్ర సొసైటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ పిల్లలు తినే డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.

    నిందితులు అఫ్రిది అన్సారీ, యాసిన్, ఖత్రేషన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. బయట మార్కెట్ నుండి కుళ్లిపోయిన, పగిలిపోయిన కోడిగుడ్లను సేకరించి, వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

    కుళ్లిపోయిన కోడిగుడ్లు(330) రసాయనాలు సోడియం బెంజోయేట్ (15 కిలోలు), సోర్బిక్ యాసిడ్ (15 కిలోలు), పొటాషియం సోర్బేట్ (20 కిలోలు), పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్, తయారైన డోనట్స్, కేకులు (150 కిలోలు), డాల్డా (120 కిలోలు), మిల్క్ పౌడర్ (25 కిలోలు), మిక్సింగ్ మెషీన్లు, స్పైరల్ మెషీన్, ఓవెన్లు, వెయింగ్ మెషీన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • హైదరాబాద్‌: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్‌ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని అన్నారు.

    ‘పార్టీలో ఉండి అడగాలి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చాలా మందికి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారు. 

    రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, గొప్ప వ్యూహకర్త. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ఈ దేశం ఎన్నడూ మరిచిపోదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ఆచరిస్తూ హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. 

    కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన బాగా పని చేశారు. జీవన్ రెడ్డిలాంటి క్రమశిక్షణతో ఉన్న నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. ప్రభుత్వం పటిష్ఠమైన పాలన చేయాలంటే కొంత సర్దుకుపోవాలి. నాకు కూడా అవకాశాలు చాలా మిస్సయ్యాయి. 

    నేను పార్టీలోనే ఉండి పోరాటం చేశాను. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలి. పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయి. వేచి చూడాలి.. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. ఆయన లాంటి వారు ఓపికగా రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అండగా ప్రజాపాలనకు సహకారాన్ని అందిస్తే బాగుండేది’ అని చెప్పారు. 

  • సాక్షి, జగిత్యాల: తాను కాంగ్రెస్‌ పార్టీ వీడటానికి  ప్రధాన కారణం రేవంత్ రెడ్డేన‌ని మాజీ మంత్రి తాటిపర్తి జీవ‌న్‌రెడ్డి అన్నారు. హ‌స్తం నుంచి తాను బ‌య‌ట‌కు రావ‌డానికి పార్టీ ఫిరాయింపులు మరో కారణమ‌ని వెల్ల‌డించారు. సీనియ‌ర్ నాయ‌కుడినైన త‌న‌ను ఎంతో అవ‌మానించార‌ని వాపోయారు. అధిష్టానం కూడా త‌న‌ను విస్మరించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడుగడుగునా అవమానాలు, అన్యాయాలతో విసిగిపోయి పార్టీని వీడిన‌ట్టు వివ‌రించారు. బుధ‌వారం ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా సాక్షి టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

    ''ఫిరాయింపుదారులతో పార్టీ నిండిపోయి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రశ్నించా.. తప్పా..? నలభై ఏళ్ల ప్రస్థానాన్ని తెంపుకోవడం బాధాకరమే. కేసీ వేణుగోపాల్‌కు అంతా తెలుసు. అయినా అధిష్ఠానం ఇగ్నోర్ చేసి, హ్యుమిలేట్ చేస్తే పార్టీలో ఎలా కొనసాగాలి? పట్టపగలే మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం ప్రతిపాదించిన నాయకుడు, నా అనుచరుడు గంగారెడ్డి దారుణహత్యకు గురికావ‌డం నన్ను తీవ్రంగా కలిచివేసింది. గంగారెడ్డికి ప‌ద‌వి కోసం నేను సీఎం రేవంత్‌ను (Revanth Reddy) కలిశాను. ఆయన ఓకే అన్నారు. అంతలోనే మనసు మార్చుకున్నారు. గంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే ఆయన హత్య జరుగకపోవునేమో?

    ఒక గంగారెడ్డి ఇష్యూనే కాదు.. బీఆర్ఎస్ హయాంలో ఆధిపత్యం చెలాయించిన పోలీసుల‌ బదిలీలు, మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ ఇలా ఎన్నో మనసును కలిచివేశాయి. ఇగ్నోరెన్స్, హ్యుమిలేషన్‌తో విసిగిపోయాను. ఎమ్మెల్యేగా ఐదేళ్లు, ఎమ్మెల్సీగా ఐదేళ్లపాటు అధికార బీఆర్ఎస్ తో ఒంటరి పోరాటం చేస్తే నేను కనీసం మంత్రి పదవికి అర్హుణ్ని కానా..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నా ఎమ్మెల్సీ పదవి 20 నెలల కాలముంటే నాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండేగా? అడుగడుగునా అవమానాలు, అన్యాయాలతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఏఐసీసీ సభ్యత్వానికి నేను రాజీనామా చేశాను.

    కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి, సాక్షి వార్తలు

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నాకు మొదటి నుంచి మంచి దోస్త్. అటు అరవింద్‌తోనూ, ఇటు బండి సంజయ్ తోనూ నాకు రాజకీయాలకతీతంగా సంబంధాలున్నాయి. ఇంకా నా భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోలేదు. మీకు చెప్పే పార్టీ మారుతా. కచ్చితంగా నా తడాఖా, నా పోరాటం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి చూస్తార''ని జీవ‌న్‌రెడ్డి అన్నారు. 

    చ‌ద‌వండి: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • సాక్షి, హైదరాబాద్‌: కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యాన్ని పాడుచేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కల్తీకి కాదేది అనర్హం' అన్న చందంగా మార్కెట్‌లో ప్రతి వస్తువును కల్తీచేస్తున్నారు. నగరంలో ఇటీవల కళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కల్తీ పన్నీర్, పచ్చళ్ల కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులు కూడా బయటపడ్డాయి. తాజాగా.. కల్తీ  కొబ్బరిపొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు.

    హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ, ఖైరతాబాద్ జోన్‌లు) మరియు గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. బేగంబజార్‌లోని కల్తీ కొబ్బరి పొడి తయారీ కేంద్రంపై దాడి చేశారు. అనారోగ్యకరమైన పద్ధతుల్లో కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేస్తున్న నిందితుడు నకుల్ మరోటియాను అరెస్ట్ చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో రూ.21 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

    నిల్వ ఉంచిన కొబ్బరి పొడి (8,300 కిలోలు), సీలింగ్ ప్యాకింగ్ యంత్రాలు(3), బరువు తూచే యంత్రాలు(3), ప్యాకింగ్ కవర్లను సీజ్‌ చేశారు. నిందితుడు నకుల్ మరోటియా బేగంబజార్‌లోని బాలాజీ పురుషోత్తం కోకోనట్ బిజినెస్ షాప్ పేరుతో అక్రమంగా కొబ్బరి పొడిని తయారు చేస్తున్నాడు.

    నిందితుడు కర్ణాటక నుండి తక్కువ ధరకే నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేసి, దానిని 'చేతక్' (Chetak) బ్రాండ్ ప్యాకెట్లలో నింపి, అసలైన కొబ్బరి పొడిగా విక్రయిస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. ఈ ప్యాకెట్లపై ఎలాంటి బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ), ఆహార భద్రతా ప్రమాణాల (FSSAI) లైసెన్స్ వివరాలు లేవని విచారణలో తేలింది.

    నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు..
    నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా పట్టుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, ఫుడ్ అడల్టరేషన్ (ఆహార కల్తీ నియంత్రణ) విభాగం అధికారులతో కలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్, ఎం.ఎం. పహాడీలో గల "డెక్కన్ ట్రేడర్స్" గోడౌన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించింది. 

    సుమారు మూడున్నర లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ (70 క్వింటాళ్లు), సింథటిక్ ఫుడ్ కలర్ ప్యాకెట్లు(1 బాక్స్), శాంటిక్ యాసిడ్ టిన్:1 (40 లీటర్లు), ఆదిత్య బిర్లా కెమికల్స్(1 బాక్స్)లను సీజ్‌ చేశారు. నిందితులు ముగ్గురు కలిసి ఎం.ఎం. పహాడీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గోడౌన్లను నడుపుతున్నారు. వీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడం కోసం శాంటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్, వెల్లుల్లి పొట్టును కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన ప్రమాదకరమైన పేస్ట్‌ను ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి, హైదరాబాద్ నగరంలోని హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

     

     

     

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురిసింది. నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఇవాళ వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌లో వడగళ్ల వాన పడింది. ఘట్‌కేసర్‌, పోచారం, అన్నోజిగూడ, నారపల్లిలో భారీ వర్షం కురిసింది.

    రంగారెడ్డి జిల్లా, నారాయణపేట్‌, వికారాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌, మేడ‍్చల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే 2-3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. 

  • హైదరాబాద్‌: పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరి కనపడుతుండడంతో దీనిపై తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప‍్పారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదని అన్నారు.

    ‘మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం. అవసరం మేరకు సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి డ్రమ్‌లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం.. చర్యలు తప్పవు. ప్రజలు ప‍్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది. రూమర్స్, ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు’ అని సూచించారు.

    కాగా, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ... ‘డిమాండ్ 25 శాతం పెరిగింది. 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి. పెట్రోల్ బంక్ లు క్లోజ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అహ్మదాబాద్, సూరత్, నాగపూర్, చెన్నైలో  ఇలాంటి పరిస్థితి ఉంది. బంక్ లకు క్రెడిట్ సమస్య లేదు. గ్యాస్ అక్రమ రవాణా పై 175 కేసులు నమోదు చేస్తాం. 2,954 వాణిజ్య సిలిండర్ లు సీజ్ చేశాం.

    గృహ అవసరాలకు గ్యాస్ ఇబ్బంది లేదు. ఎల్పీజీ బుకింగ్ 15 శాతం నుంచి 8.9 శాతానికి తగ్గింది’ అని అన్నారు. కాగా, పెట్రోల్ , డీజల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని ఇతర అధికారులు కూడా సూచిస్తు న్నారు. పెట్రోల్ బంక్‌లలో కావాల్సినంత సప్లై జరుగుతుందని అంటున్నారు.  

  • సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ తెలిపారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

    ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో ఇవాళ (బుధవారం) టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు.

    ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి.. కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు.

    ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్‌ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని.. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

    భయం వద్దు.. పెట్రోల్, డీజిల్ ఉంది

    హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Family

  • మనసు పెట్టాలే గానీ ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. అందుకు నిదర్శనం చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఆ వంతెన. మన సాయుధ బలగాలు ఆ వంతెనకు ప్రాణంపోసి కొత్తరూపం ఇచ్చారు. చెప్పాలంటే..అద్భుతమైన పర్యాటక గమ్యస్థానంగా మార్చేశారు. అదంతా ఎక్కడ అంటే..

    సాధారణంగా మంచి కేఫ్‌కి వెళ్లి ఓ కప్పు కాఫీ లేదా టీ సిప్‌ చేసి ఎంజాయ్‌ చేస్తాం. అలా కాకుండా ప్రకృతి మధ్య కొలువుదీరి..కింద జలజల పారే నది నడుమ కాఫీ/టీ తాగుతుంటే ఆ ఫీల్‌ వేరేలెవెల్‌. అలాంటి అనుభూతి కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రివర్‌ కేఫ్‌కి రావాల్సిందే. న్గ్యామ్‌జాంగ్ చూ నదిపై కొలువుదీరిన కేఫ్ ఇది. ఎన్నాళ్లుగానో వాడుకలో లేని వంతెనని భారత సైన్యం కేవలం 31 రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దారు. 

    ఆ వంతెనను కేఫ్‌గా మార్చి అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశారు. వచ్చే పర్యాటకులు గల గల పారే నదిని తమ పాదాల కింద నుంచి చూస్తూ..చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను వీక్షిస్తూ..భోజనం చెయ్యొచ్చు. ఆ కేఫ్‌ని గాజు భవంతిలా తీర్చిదిద్దడం విశేషం. సందర్శకులు వంతెనపైనే లేదా నదీ తీరంలోని కేఫ్ విభాగంలో కూర్చోవడానికి ఎంచుకోవచ్చు. 

    ప్రతి ఒక్కటి విభిన్నమైన అద్భుత దృశ్యాలను అందిస్తుంది. ఆపరేషన్ సద్భావనలో భాగంగా, భారత సైన్యం కేవలం 31 రోజుల్లో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఉపయోగంలో లేని సైనిక నిర్మాణాన్ని ప్రయాణికులు, బాటసారులు స్వాగతించే ప్రదేశంగా మార్చారు. ఈ కేఫ్‌ స్థానిక మోన్పా మహిళలచే నిర్వహించబడుతోంది. పర్యాటక ప్రదేశంగా మారుతున్న ఈ మారుమూల ప్రాంతానికి కొత్త జీవనోపాధి అవకాశాలను అందిస్తుంది ఈ రివర్‌కేఫ్‌. సందర్శకులకు ఈ కేఫ్‌ పర్వతాలు, నదులు, మేఘావృత లోయల మధ్య మరుపురాని అనుభూతుల్ని అందిస్తుంది. 

     

    (చదవండి:  రెంట్‌ ఏ ట్రీ..!)
     

  • కేరళకు చెందిన ఒక స్టార్టప్‌ అందరి మనసుల్నీ గెలుచుకుంటోంది. రెంట్‌ ఏ ట్రీ అనే పేరుతో ఉన్న ఈ సంస్థ.. ఆసక్తిగలవారు ఎవరైనా ఒక మామిడి చెట్టును అద్దెకు తీసుకుని, సాగుతో సంబంధం లేకుండానే ఆ చెట్టుకు కాసే దిగుబడిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కొచ్చికి చెందిన ఉమేష్‌ దామోదరన్‌ ఈ వినూత్న బిజినెస్‌ని ప్రారంభించారు. 

    బెంగళూరులో ఒక ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ను నడిపే దామోదరన్‌ ఒకసారి కొచ్చి–బెంగళూరు మధ్య ప్రయాణిస్తున్నపుడు అల్ఫోన్సో మామిడి పండ్లను చూశారు. కొన్నింటిని తన స్నేహితుల కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా వారికి ఆ పండ్ల రుచి బాగా నచ్చి, మరోసారి కావాలని కోరారు. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి ఒక పూర్తి చెట్టు పండ్లన్నీ తమకే కావాలని అడిగారు. అపుడే దామోదరన్‌లో ఈ ‘రెంట్‌ ఏ ట్రీ’ ఆలోచనకు పునాది పడింది. 

    ఈ కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చెట్టును, మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి లీజుకు తీసుకోవచ్చు. చెట్టు సంరక్షణ, సాగు బాధ్యతలన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్థ ఇప్పుడు మహారాష్ట్రలోని రత్నగిరి, తమిళనాడులోని దిండిగల్, కేరళలోని పాలక్కాడ్‌ ప్రాంతాల్లో సుమారు 250 ఎకరాల అల్ఫోన్సో మామిడి తోటలను నిర్వహిస్తోంది. ఈ స్టార్టప్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగానే నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 

    ‘బ్రిలియంట్‌ ఐడియా’ అని కొంతమంది కొనియాడగా, మరికొంతమంది దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాపు సరిగా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి అనుకోని వర్షాలు పంటను దెబ్బతీస్తాయని.. నష్టం రావొచ్చు అంటూ రాసుకొచ్చారు.  

     

    (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!)

  • రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై  హంజా అలీ మజారిగా నటించిన రణవీర్‌ సింగ్‌ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్‌ ఫిజిక్‌ పరంగా చాలా కేర్‌ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్‌లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్‌నెస్‌ కోచ్‌. అంత తక్కువ వ్యవధిలో రణవీర్‌ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.

    గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్‌ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్‌ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు.  ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్‌ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్‌నెస్‌ కోచ్‌ ముస్తఫా రణవీర్‌ సింగ్‌ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. 

    నిజానికి షూటింగ్‌ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్‌సింగ్‌ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్‌ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్‌ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్‌ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్‌కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్‌ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్‌వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం  600-700 కేలరీలు ప్రోటీన్ షేక్‌ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్‌ షేక్‌లు, 240 గ్రాముల ప్రోటీన్‌ కోసం చికెన్‌, మటన్‌ ఎక్కువుగా తీసుకునేవాడట. 

     

    తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్‌ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్‌ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్‌ షెడ్యూల్‌ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్‌ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం  ప్రయత్నిస్తాడని అన్నారు. 

    తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్‌నెస్‌ కోచ్‌కి ట్రైనింగ్‌ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్‌ ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్‌ సింగ్‌, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.

    గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

     

    (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!)

     

     

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్‌సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

    ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

     

       

  • సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం డ్యామ్ దగ్గర తీవ్ర విషాదం జరిగింది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి(52) డ్యామ్‌పై కిందపడి మృతి చెందారు. శ్రీశైలం డ్యామ్‌పై లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా  తేనెటీగలు దాడి చేశాయి.

    తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో  ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరస్వామి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. తేనెటీగల దాడిలో మరో ఇద్దరు ఉద్యోగస్తులు కూడా గాయపడ్డారు. వారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ వీరాస్వామి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

NRI

  • కొలంబస్, ఓహియోలోని హయాట్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో శంకర నేత్రాలయ USA  “మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది తొలి కార్యక్రమంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌కు దాదాపు 400 మంది కమ్యూనిటీ సభ్యులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని పేద ప్రజలకు కంటి శస్త్రచికిత్సలు అందించే “అడాప్ట్-ఎ-విలేజ్” ప్రోగ్రామ్‌కు మద్దతు లభించింది.

    మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సేవ, కళ, సామాజిక బాధ్యతల సమ్మేళనం స్పష్టంగా కనిపించింది. ప్రారంభ ప్రసంగంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు అమర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ, “కొలంబస్ నగరం సేవా భావంలో ముందుంటుంది. ఈ రోజు మనం కలిసి అనేక మందికి కంటి వెలుగు అందించే లక్ష్యంతో ఒకటయ్యాం” అని అన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి మాట్లాడుతూ, “సంస్థ వాలంటీర్లకు శక్తినిస్తుంది. కొలంబస్ చాప్టర్ అందిస్తున్న మద్దతు మా సేవా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అని తెలిపారు.

    నృత్య ప్రదర్శనల కళా వేదిక ప్రారంభ ప్రసంగాల అనంతరం ట్రినయనీ ఆర్ట్స్, సాయి నృత్య సంగం, మయాజ్ మస్తి డ్యాన్స్ అకాడమీ, శ్రీ వెంకటేశ్వర డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, నాట్యాలయం డ్యాన్స్ స్కూల్, సాయి ఆర్ట్ గ్రూప్, స్టైల్ ఎన్ గ్రేస్ వంటి సంస్థల నుంచివచ్చిన కళాకారులు అద్భుత నృత్య ప్రదర్శనలు అందించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, సినీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 

    కార్యక్రమం చివరలో కంటి చూపు ప్రాముఖ్యతను తెలియజేసే నాటిక, రజనీకాంత్ అనంతోజి నేతృత్వంలో జరిగిన గ్రాండ్ ఫినాలే అందరినీ ఆకట్టుకుంది. చెన్నైకు చెందిన ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ గాయకుడు రాము, గాయని అంజనా సౌమ్య తమ మధుర గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. భక్తి గీతాలు, ప్రముఖ సినిమాల ఫ్యూజన్ పాటలను సమన్వయంతో ఆలపిస్తూ, నలుపు-తెలుపు యుగం నుంచి రంగుల యుగం వరకు విస్తరించిన సంగీతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

    శంకర నేత్రాలయ USA బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, “కంటి చూపును తిరిగి ఇవ్వడం అనేది గౌరవం, ఆశను పునరుద్ధరించే మహత్తర సేవ” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కళాకారులు, వాలంటీర్లు, నిర్వాహకులు అందరూ నెలల తరబడి కృషి చేశారు. వేదిక వెనుక పనిచేసిన SNUSA కొలంబస్ టీమ్ ప్రతీ అంశాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. 

    ముఖ్యంగా అమర్ ఏమిరెడ్డి, ఆర్‌కే రెడ్డి, రాజా బొమ్మన నాయకత్వంలోని కొలంబస్ కోర్ టీమ్‌తో పాటు సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల, రామకృష్ణ కసర్ల, గంగరాజు బేతిన, విజయ్ సుంకాడ్, యెల్లా రెడ్డి చిట్టి, శ్రీని పడాల, వెంకట్ దురిపాల, భూపేష్ మద్దు, శంకర్ రావుల, రంగనాథ్, స్వాతి మద్దు, మహిత మద్దు, నికిత పడాల, శ్రికా దురిపాల, మహేష్ వెలిడండి, రాజ్ ముద్దాన, వినయ్, శరందీప్, వంశీ నిమ్మ, విష్ణు తూముల, శ్యామ్ దుద్దెల, లోహిత్ సాయి బురుగుపల్లి, రిషిత్ బేతిన, కీర్తన్ ముద్దాన తదితర వాలంటీర్లు విశేషంగా సేవలందించారు.

    స్థానిక కమ్యూనిటీ నాయకులు, సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు అందించారు. అలాగే ట్రెజరర్ మూర్తి రేకపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డా. రెడ్డి ఉరిమిండి, ఆది మొర్రెడ్డి, మహిళా కమిటీ చైర్ రేఖా రెడ్డి ప్రత్యేక సహకారం అందించారు. అలాగేఎస్‌వీ ఆచార్య, డా. సురేంద్రన్, డా. గిరీష్ రావు, సురేష్ కుమార్, త్యాగరాజన్, దీన్ దయాళన్ మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇవిపి శ్యామ్ అప్పాలి, సెక్రటరీ వంశీ కృష్ణ ఎరువారం, పబ్లిసిటీ కమిటీ చైర్ రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, నీలిమ గడ్డమనుగు కలిసి సంయుక్తంగా ఆడియో, వీడియో,  మీడియా ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించారు. చివరగా ఈ కార్యక్రమం శంకర నేత్రాలయ యూఎస్‌ఏ సేవా లక్ష్యాన్ని మరింత బలపరచింది.

    చదవండి: న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం