తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం
1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Andhra Pradesh
సాక్షి,అమరావతి: ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది,
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.
వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు.

విశాఖ: దేవస్థానం భూములను పరిశ్రమలకు వాడటం దారుణమని విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. దేవస్థానం భూమునుల ధార్మిక కార్యక్రమాలకే వాడాలని, గూగుల్ సంస్థకు 106 ఎకరాల సింహాచలం భూమి ఇవ్వడం దారుణమన్నారు.
పంచగ్రమాల సమస్య పరిధిలో ఉన్న భూమిని ఏవిధంగా గూగుల్కు కేటాయిస్తారు. పంచ గ్రామాల సమస్యను పరిష్కరించాలని ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అప్పన్న స్వామి 106 ఎకరాలకు బదులు వేరే చోట గూగుల్కు భూములు ఇవ్వాలి. భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. చంద్రబాబు పెద్ద అపచారానికి పాల్పడుతున్నారు. అప్పన్న స్వామి భూములకు చంద్రబాబు శఠగోపురం పెడుతున్నారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు. అప్పన్న స్వామికి జరిగే అన్యాయం పవన్ కళ్యాణ్కు కనిపించలేదా?, నేడు చంద్రబాబు శంకుస్థాపన చేసిన రెన్యూ పవర్ ప్రాజెక్ట్ వైఎస్ జగన్ కృషి.
2023 సంవత్సరంలో రెన్యూ పవర్ ప్రాజెక్ట్ కు ఒప్పందం కుదిరింది. 4700 మెగావాట్ల ప్రాజెక్ట్ కు వైఎస్ జగన్ హయాంలో ఎంవోయూ కుదిరింది. చంద్రబాబు అబద్ధాలు చెపితే నమ్మడానికి పాతకాలం పేపర్ల యుగం కాదు. సోషల్ మీడియా యుగం’ అని స్పష్టం చేశారు.
ఏలూరు: మండే ఎండలో దాహార్తిని తీర్చే చలివేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఏలూరులోని 45వ డివిజన్ ఆదివారంపేటలో వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తొలగించారు అధికారులు.ఏలూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ జయప్రకాశ్ ఆదివారంపేటలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారులు ఆ చలివేంద్రాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం గురుభక్తి చాటుకున్నారు.
అధికారులను అడ్డుపెట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేయడంపై వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని కూడా తొలగించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ఎర్రటి ఎండల్లో ప్రజల దాహం తీర్చే చలివేంద్రం మూసివేయడం అమానుషమని వైఎస్సార్సీపీ విమర్శించింది.
కృష్ణా, సాక్షి: రాష్ట్రం నుంచి హాజ్ యాత్రకు వెళ్లిన హజ్ యాత్రికులు తమ లగేజ్లు అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18న గన్నవరం ఎయిర్పోర్టు నుంచి 335 మంది హజ్ యాత్రకు బయిలుదేరారు. అయితే ఆ సమయంలో విమానంలో అధిక లగేజ్ ఉందనే కారణంతో గన్నవరంలో ఎయిర్పోర్టులో 285 బ్యాగులను ఉంచారు. అయితే ఐదు రోజుల గడిచినా ప్రయాణికులకు లగేజ్ చేరకపోవడంతో అక్కడ వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా వెంటనే తమ లగేజ్లను అందజేయాలని ఆందోళన చేపడుతున్నారు.
ఈ సమస్యపై యాత్రికుల బంధువులు హజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవంతుని దర్శనం కోసం వెళ్లిన యాత్రికులపై ఇంత నిర్లక్షం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వేరే దేశంలో వారు వారి కనీస అవసరాలు లేకుండా వారు ఎలా ఉంటారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
Sports
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.
తొలుత బౌలింగ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్ షాట్ ఆడి తన వికెట్ను వికెట్ను కోల్పోయాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్ అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.
సీఎస్కే ఘన విజయం
ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు.అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు. ఈ ఏడాది సీజన్లో సంజూకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.
అకిల్ మ్యాజిక్
అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి శతక్కొట్టాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ముంబై బౌలర్లను తనదైన శైలిలో ఉతికారేశాడు.
కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
సూర్య సాధించిన రికార్డులు ఇవే
ముంబై ఇండియన్స్పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్కే బ్యాటర్గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై ముడెంకల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్గా సంజూ రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్ నిలిచాడు.
టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.
చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్లోకి విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే వైదొలిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్ధానాన్ని మరో ఇంగ్లీష్ ప్లేయర్ రెహాన్ అహ్మద్తో ఢిల్లీ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనెజ్మెంట్ గురువారం అధికారంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సరైన ఆల్రౌండర్లు లేరు. కెప్టెన్ అక్షర్ పటేల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆల్రౌండర్ అయిన రెహాన్తో ఢిల్లీ ఒప్పందం కుదర్చుకుంది. రెహాన్ అహ్మద్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అతడు లెగ్ స్పిన్తో పాటు లోయార్డర్లో దూకుడుగా బ్యాటింగ్ కూడా చేయగలడు.
కాగా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు తరపున ఆడనున్నాడు. సదర్ బ్రేవ్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమానార్హం. అతడికి వైట్బాల్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 5 టెస్టులు, 9 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.
మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.
చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.
అయితే ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా హర్మన్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3016) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. హర్మన్ ఇప్పటివరకు భారత కెప్టెన్గా 3017 పరుగులు చేసింది. ఈ జోహాన్స్బర్గ్ వన్డే హర్మన్ తన విశ్వరూపం ప్రదర్శించింది. హర్మన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్గా నిలిచింది.
మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీరే
హర్మన్ప్రీత్ కౌర్-3017
చమరి అటపట్టు-3016
మెగ్ లానింగ్- 2619
షార్లెట్ ఎడ్వర్డ్స్-2529
సూజీ బేట్స్-2236
చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
అఫ్గనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అత్యవసర విభాగంలో ఉంచి అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిరంతరం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం పెద్దగా మెరుగుపడటం లేదని తెలుస్తోంది.
‘ఆర్థిక సాయం వద్దు
ఈ నేపథ్యంలో షాపూర్ తమ్ముడు ఘామీ జద్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని.. తన సోదరుడి ఆరోగ్యం బాగుపడేలా ప్రార్థిస్తే చాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ దేవుడి దయ వల్ల ఆర్థికంగా మా కుటుంబం పటిష్టంగానే ఉంది. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదు.దయచేసి అందరూ ప్రార్థించండి
మా అన్నయ్య బతకాలని దయచేసి అందరూ ప్రార్థించండి. మీ ప్రార్థనల్లో తనకూ చోటు ఇవ్వండి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా షాపూర్ జద్రాన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. అతడి రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అఫ్గన్ నుంచి భారత్కు తీసుకువచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.ఇక్కడి వైద్యులు అద్భుతం
ఈ విషయం గురించి ఘామి జద్రాన్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్లో ఉన్న మా డాక్టర్.. మా అన్నయ్యను భారత్కు తీసుకువెళ్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఢిల్లీకి తీసుకువచ్చాము. భారత్లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మేము ఇక్కడికి వచ్చాము.
ఇక్కడి వైద్యులు మా అన్నయ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడిని హీరోగా అభివర్ణిస్తూ సానుకూల దృక్పథం నింపుతున్నారు. వాళ్లంతా అనుభవజ్ఞులైన వైద్యులు. ఇక్కడి ఆస్పత్రి గొప్పగా ఉంది. డాక్టర్లకు ధన్యవాదాలు’’ అని తెలిపాడు.
వాళ్లంతా అండగా ఉన్నారు
ఇక అఫ్గనిస్తాన్ క్రికెట్ బృందం తమకు అండగా ఉందన్న ఘామీ జద్రాన్.. ‘‘రాయీస్ అహ్మద్జాయ్, నవ్రోజ్ మంగళ్, మొహ్మద్ నబీ అందరూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అన్నయ్య గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రపంచకప్ సమయంలో రషీద్ ఖాన్, ఇతర జట్టు సభ్యులు ఆస్పత్రికి వచ్చి అన్నయ్యను చూసి వెళ్లారు.రషీద్ ఖాన్ ఇప్పటికీ టచ్లోనే ఉన్నాడు. ఢిల్లీ, ముంబైలలో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నపుడు అల్లా ఘజన్ఫర్ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లాడు. అతడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్కు ఆడుతున్నాడు. ఒకవేళ అవసరమైతే మా అన్నయ్యను అంబానీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిద్దాం అని చెప్పాడు. అఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు’’ అని తెలిపాడు.
చదవండి: లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే: ఆసీస్ దిగ్గజం
Chennai super kings vs Mumbai indians Live updates: ముంబై ఇండియన్స్పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై నడ్డివిరిచాడు.
అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.
ముంబై ఏడో వికెట్ డౌన్
సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది. ముంబై విజయానికి 41 బంతుల్లో 121 పరుగులు కావాలి.కష్టాల్లో ముంబై
13 ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్లో వరుస బంతుల్లో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి హార్దిక్ పాండ్యా(1), రెండో బంతికి షెర్ఫేన్ రూథర్ ఫర్డ్(0) పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 86/6ముంబై ఐదో వికెట్ డౌన్
తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన తిలక్.. అకీల్ హొసేన్ బౌలింగ్లో ఔటయ్యాడు.ముంబై మూడో వికెట్ డౌన్
ముంబై మూడో వికెట్ కోల్పోయింది. అకిల్ హుస్సేన్ బౌలింగ్లో నమన్ ధీర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.ముంబై రెండో వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన క్వింటన్ డికాక్.. ముఖేష్ చౌదరి బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 11/2ముంబై తొలి వికెట్ డౌన్
ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ ఓపెనర్ దానిష్ మలేవార్ మరోసారి డౌకటయ్యాడు. అకిల్ హోస్సేన్ బౌలింగ్లో మలేవార్ ఔటయ్యాడు.
సంజూ శాంసన్ సూపర్ సెంచరీ
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు.దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ తలా వికెట్ సాధించారు.
సీఎస్కే ఐదో వికెట్ డౌన్
కార్తీక్ శర్మ రూపంలో సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కార్తీక్ శర్మ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 166/5. క్రీజులో సంజూ శాంసన్(78) ఉన్నాడు.12 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 128/4
12 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్(57), కార్తీక్ శర్మ(2) ఉన్నారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్
సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. శాంట్నర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్కే స్కోర్: 73/2సీఎస్కే తొలి వికెట్ డౌన్
32 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. గజన్ఫర్ బౌలింగ్లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్
2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(17), సంజూ శాంసన్(5) ఉన్నారు.ఐపీఎల్-2026లో మరో కీలక పోరుకు తెరలేచింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్కు కూడా ముంబై, సీఎస్కే లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని దూరమయ్యారు. వీరిద్దరూ గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సీఎస్కే జట్టులోకి ఆయూశ్ మాత్రే స్ధానంలో యువ ఆటగాడు కార్తిక్ శర్మ వచ్చాడు.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా మహ్మద్ గజన్ఫర్, అశ్వనీ కుమార్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో సతమతవుతున్నప్పటికి.. ఆ జట్టు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ తను ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ముఖ్యంగా ఈ ఢిల్లీ పేసర్ రెడ్-సాయిల్ పిచ్లపై సరైన లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రిన్స్ పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో నిలకడగా వికెట్లు తీస్తూ లక్నో ప్రధాన బౌలర్గా మారాడు. ఈ ఏడాది సీజన్లో ప్రిన్స్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు.
బుధవారం ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల వేయడంలో ప్రిన్స్ దిట్ట. దీంతో అతడిని వీలైనంత త్వరగా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, సిరాజ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు లేరు. సిరాజ్ ఎక్కువగా టెస్టులకే మాత్రమే పరిమితమవుతున్నాడు. దీంతో బుమ్రాపై వర్క్లోడ్ పడుతోంది. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ వంటి యువ సంచలనం జాతీయ జట్టులోకి వస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
आयरलैंड दौरे के लिए Prince Yadav का नाम फाइनल समझिए।
Prince Yadav का चयन नहीं हुआ तो घोर जातिवाद समझिए। pic.twitter.com/xvqmzz0S5e— Comrade Yadav (@Comrade6989) April 15, 2026
ప్రిన్స్ యాదవ్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 14 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన ప్రిన్స్.. 5.15 ఏకానమితో 29 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 35 టీ20 వికెట్లు కూడా అతడి పేరిట ఉన్నాయి. ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్తో టీ20 జరిగే టీ20 సిరీస్లో భారత తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశముంది.
చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో అతడు అంతలా బంతిని బాదడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. ఇంత వరకు తాను ఇలాంటి ఆటగాడిని చూడలేదంటూ కొనియాడాడు. అయితే, అదే సమయంలో వైభవ్ చేస్తున్న తప్పును కూడా బోర్డర్ ఎత్తి చూపాడు.
పరుగుల వరద
పద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్కు చెందిన ఈ పిల్లాడు దేశీ క్రికెట్లో పరుగుల వరద పారించి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ గతేడాది రూ. 1.10 కోట్లకు వైభవ్ను కొని అరంగేట్రం చేయించింది.విధ్వంసకర భారీ సెంచరీ
యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటూ పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై విధ్వంసకర భారీ సెంచరీ (175)తో రాణించి జట్టుకు ట్రోఫీ అందించాడు.ఇక ఐపీఎల్-2026లో రాజస్తాన్ తరఫున ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విధ్వంస కొనసాగుతోంది. జస్ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను కూడా చితక్కొడుతూ... ఇప్పటికి ఏడు మ్యాచ్లలో 254 పరుగులతో టాప్ రన్ స్కోరర్లలో టాప్-5లో కొనసాగుతున్నాడు.
అత్యద్భుతమైన ఆటగాడు
ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ దిగ్గజం అలెన్ బోర్డర్ వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ను చూస్తే తనకు వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా గుర్తుకువస్తున్నాడని తెలిపాడు.‘‘అతడు అత్యద్భుతమైన ఆటగాడు. గొప్ప ప్రతిభ. 14-15 ఏళ్ల వయసులోనే బంతిని ఇంత గొప్పగా బాదిన ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. అతడొక పవర్ హిట్టర్. అయితే, ఇప్పుడే అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయలేము.
లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ
టెస్టు క్రికెటర్గా విజయవంతం అవుతాడా? లేడా? అనేది చెప్పలేను. అయితే, అతడిని చూస్తే మాత్రం నాకు బ్రియన్ లారా గుర్తుకువస్తున్నాడు. వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మైదానంలో నలువైపులా అతడు బంతిని బాదగలగాలి. అంతేకాదు.. డిఫెన్స్ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అలెన్ బోర్డర్ మిడ్-డేతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ వదిలి ఇక్కడికి వచ్చెయ్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత్ వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ (SAFF) మహిళల ఛాంపియన్షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్య ధ్రువీకరించింది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పాక్ వైదొలగడంతో ఈ టోర్నమెంట్ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.
ఈ ఫుట్బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదికగా జరగనుంది. మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్, శ్రీలంక, భూటాన్.. గ్రూపు-బిలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. అయితే సాఎఫ్ఫ్ టోర్నీలో భారత్కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్పటివరకు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.
కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాక్ దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది తమిళనాడులో జరిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంతకుముందు రాజ్గిర్లో ఆసియా కప్-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్ పంపలేదు.
భారత్ కూడా పాక్ వేదికగా క్రీడా ఈవెంట్లను బాయ్కాట్ చేస్తూ వస్తుంది. ఆసియా టీ20 కప్తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాక్కు వెళ్లలేదు. తమ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక, దుబాయ్ వేదికలగా ఆడింది.
చదవండి: IPL 2026: సీఎస్కే జట్టులోకి యార్కర్ల కింగ్
ఐపీఎల్-2026 సీజన్ మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మధ్యలోనే వైదొలిగిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే స్ధానాన్ని సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్తో సీఎస్కే భర్తీ చేసింది. ఈ విషయాన్ని సీఎస్కే ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించింది. రూ.30 లక్షల బేస్ప్రైస్కు మధ్వాల్ను చెన్నై జట్టులోకి తీసుకుంది.
మధ్వాల్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. గతంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్కు దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కూడా ఉంది.
ఇక సీఎస్కే విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్లో కూడా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన సీఎస్కే కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్ జట్టుకు భారంగా మారింది. అంతకుతోడు అద్భుతమైన ఫామ్లో ఉన్న మాత్రే కూడా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది.
రూ.28 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో గత రెండు మ్యాచ్లకు వారిని సీఎస్కే బెంచ్కే పరిమితం చేసింది. గురువారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో ప్రశాంత్ వీర్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
చదవండి: SRH: కమిన్స్కు షాక్.. కెప్టెన్గా ఇషాన్ కొనసాగింపు!
టీ20 ప్రపంచకప్-2026లో ఇంగ్లండ్ తరఫున సత్తా చాటాడు యువ క్రికెటర్ జేకబ్ బెతెల్. టీమిండియాతో సెమీ ఫైనల్లో 105 పరుగులతో దుమ్ములేపాడు. ఓ దశలో సూర్యకుమార్ సేన నుంచి మ్యాచ్ లాగేసుకున్నట్లు అనిపించినా.. ఆఖరికి భారత్ పైచేయి సాధించింది.
బెంచ్కే పరిమితం
ఇక ఈ టోర్నీ తర్వాత బెతెల్ ఐపీఎల్-2026 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో చేరాడు. ఇప్పటికి ఆర్సీబీ ఈ సీజన్లో ఆరు మ్యాచ్లకు నాలుగు గెలిచింది. అయితే, ఇంత వరకు బెతెల్కు మాత్రం ఆడే అవకాశం రాలేదు. తుదిజట్టులో అతడికి ఒక్కసారి కూడా చోటు దక్కనేలేదు.కాగా బెతెల్ సాధారణంగా టాపార్డర్లో ఆడతాడు. ఆర్సీబీలో ఇప్పటికే ఓపెనర్లుగా దిగ్గజ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ పాతుకుపోయారు. ఇతర స్లాట్లు కూడా ఖాళీగా లేవు. ఇక విదేశీ ఆటగాళ్ల జాబితాలో సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్వుడ్లకే ఆర్సీబీ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బెతెల్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు.
ఓపెనర్గా బెస్ట్
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ బెతెల్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ను వీడి ఇంగ్లండ్ దేశీ క్రికెట్ ఆడేందుకు తిరిగి రావాలని సూచించాడు. ‘‘సిడ్నీలో బౌలర్ల అటాక్ను ఎదుర్కొని టాపార్డర్లో అతడు అదరగొట్టాడు.ఓపెనర్గా లేదంటే వన్డౌన్ బ్యాటర్గా రాణించగల సత్తా అతడికి ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతోంది? బెతెల్కు ఓపెనింగ్ చేసే అవకాశం రావడం లేదు. అతడు బెంచ్ మీదే ఉండాల్సిన పరిస్థితి. పూర్తిగా ఖాళీగా ఉంటున్నాడు.
తిరిగి వచ్చెయ్
స్వదేశానికి తిరిగి వచ్చి కౌంటీ చాంపియన్షిప్లో వర్విక్షైర్ తరపున ఆడితే బాగుంటుంది’’ అని అలిస్టర్ కుక్ ఓ పాడ్కాస్ట్లో భాగంగా తన అభిప్రాయం పంచుకున్నాడు. టెస్టులకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేందుకు ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుందన్నాడు.కాగా బెతెల్ ఇంగ్లండ్ దేశీ టోర్నీలో వర్విక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో వర్విక్షైర్ మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుని డివిజన్ వన్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: SRH: కమిన్స్కు షాక్.. కెప్టెన్గా ఇషాన్ కొనసాగింపు!
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరపున తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు రవీంద్ర జడేజా. లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం నాటి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రతిభతో అదరగొట్టాడు జడ్డూ.
కఠినమైన లక్నో పిచ్పై 29 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 43 పరుగులతో అజేయంగా నిలిచిన జడ్డూ.. రాయల్స్ తరఫున టాప్ రన్ స్కోరర్. ఇక బౌలింగ్ పరంగానూ ఈ స్పిన్ ఆల్రౌండర్ రాణించాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి.. నికోలస్ పూరన్ రూపంలో కీలక వికెట్ పడగొట్టాడు.
రెండేళ్లలో తొలిసారి
ఇక ఈ మ్యాచ్లో రాజస్తాన్ 159 పరుగులే స్కోరు చేసినప్పటికీ.. బౌలర్ల విజృంభణ కారణంగా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఇందులో జడ్డూ కీలక పాత్ర పోషించి.. గత రెండేళ్లలో తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.రివాబాకు అంకితం
ఈ సందర్భంగా రవీంద్ర జడేజా తన భార్య రివాబాపై ప్రేమ కురిపించాడు. అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. ‘‘జట్టు విజయం కోసం కృషి చేసి అవార్డు అందుకున్న అనుభూతి చాలా బాగుంది. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖా మంత్రికి అంటే నా భార్య రివాబాకు అంకితం చేస్తున్నా.మ్యాచ్ ఆరంభానికి ముందే.. నేను ఈరోజు అద్భుతం చేయగలగనని ఆమె చెప్పింది. ఆ మాటలే నిజమయ్యాయి. ఇందుకు ఆమెకు కృతజ్ఞతలు. నిజానికి ఈ వికెట్ చాలా కఠినంగా ఉంది.
చివరి ఓవర్లోనూ..
బంతి బాగా స్వింగ్ అయింది. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని భావించాను. అందుకు తగ్గట్లే ఆడాను. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. చివరి ఓవర్లోనూ మేము పరుగులు రాబట్టగలిగాము’’ అని జడేజా పేర్కొన్నాడు. కాగా లక్నోతో చివరి ఓవర్లో రాజస్తాన్ 20 పరుగులు రాబట్టింది.Rockstar player, rockstar performance 🎸🔥@imjadeja delivers an all-round masterclass to win his 1st player of the match award for Rajasthan Royals in #TATAIPL. 🩷#TATAIPL #LSGvRR pic.twitter.com/EeQtxbuTl3
— Star Sports (@StarSportsIndia) April 22, 2026
మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన రాజస్తాన్.. లక్నోను 119 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 40 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది. కాగా ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాజస్తాన్కు ఇది ఐదో గెలుపు.
చదవండి: సీఎస్కే శిబిరంలో తీవ్ర విషాదం
సన్రైజర్స్ హైదరాబాద్కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు దక్కుతుంది. మూడు సీజన్లుగా చతికిల పడిన ఎస్ఆర్హెచ్కు కమిన్స్ తన అద్భుతమైన కెప్టెన్సీతో జీవం పోశాడు. అతడి సారథ్యంలో 2024లో సన్రైజర్స్ ఫైనల్కు చేరింది.
వెన్నునొప్పితో..
ఇక గతేడాది పద్నాలుగింట ఆరు విజయాలతో.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది ఎస్ఆర్హెచ్. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వెన్నునొప్పి కారణంగా కమిన్స్ సన్రైజర్స్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత ఇషాన్ కిషన్ (Ishan Kishan) కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టాడు.ఐపీఎల్-2026లో ఇషాన్ సారథ్యంలో ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ నాలుగు గెలిచింది. ముఖ్యంగా సొంతమైదానం ఉప్పల్లో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. ఈ మ్యాచ్లలో ఇషాన్ కెప్టెన్సీకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఫిట్నెస్ సమస్యలను అధిగమించి కమిన్స్ (Pat Cummins) ఇటీవలే జట్టుతో చేరాడు.
ఈ క్రమంలో శనివారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్తో సన్రైజర్స్ తరఫున కమిన్స్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారగా.. టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇషాన్నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
ఇషాన్ కిషన్నే కొనసాగించాలి
ఇక టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా తాజాగా ఇషాన్కే మద్దతుగా నిలిచాడు. జియోహాట్స్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ తిరిగి వచ్చినా ఇషాన్ కిషన్నే సన్రైజర్స్ కెప్టెన్గా కొనసాగించాలి. యువ నాయకుడికి మద్దతుగా నిలబడాలని యాజమాన్యం భావిస్తే ఇలా చేయడమే సరైంది.కారణం ఇదే
కమిన్స్ను ఎస్ఆర్హెచ్ను 2024లో ఫైనల్కు చేర్చిన మాట నిజమే. అయితే, ప్రస్తుతం ఇషాన్ నాయకత్వంలోనూ జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. బౌలర్లు, ఇతర ఆటగాళ్లకు అతడితో మంచి సమన్వయం కుదిరింది. కాబట్టి ఇషాన్ను కెప్టెన్గా కొనసాగిస్తే సన్రైజర్స్కు ప్రయోజనం చేకూరుతుంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.కాగా చాన్నాళ్లుగా గాయం వల్ల ఆటకు దూరమైన కమిన్స్ పునరాగమనం చేయనున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ రూపంలో అదనపు భారం పడకుండా మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
చదవండి: BCCI: డబ్బు కక్కుర్తి.. టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’?
90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ
సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్
భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...
బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..
ఓటు వేసిన సూర్య, జ్యోతిక
చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు
ఏపీలో మండిపోతున్న ఎండలు
సమ్మె దెబ్బ ఆటో రేట్లు పెంచిన డ్రైవర్లు
బీజేపీ అభ్యర్థిపై దాడి కారు ధ్వంసం
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
ఎలాగైనా దీన్ని ఆపేయాలి అని చంద్రబాబు కక్ష కట్టుకుని ఉన్నాడు
తరిమి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు పారిపోయిన బీజేపీ అభ్యర్థి
నిత్యానంద రెడ్డి తో విభేదాలు లేవు నిజం బయటపెట్టిన పెద్ద దస్తగిరి భార్య
ముంబై నడిరోడ్డుపై మంత్రికి చెమటలు పట్టించిన మహిళ
ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి యువతి తల్లిదండ్రుల దాడి
హింసాత్మక ఘటనల మద్యం బెంగాల్ లో భారీగా పోలింగ్
ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు
ప్రజలపై చిల్లర రాజకీయం... బుద్ధి ఉండే చేస్తున్నావా చంద్రబాబు?
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
తొలి గంటలోనే ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
20 మంది నుంచి కోటి వసూలు, సంచలన విషయాలు బయటపెట్టిన అనంతపురం DSP
అల్లర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సువేందు హెచ్చరిక
Business
గత కొన్నేళ్లుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో 'ఇనాకీ ఎరెనో' తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇనాకీ ఎరెనో ప్రకారం.. జెన్ జీ తరానికి చెందిన యువత ఎక్కువగా పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమయం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్ద వ్యాపార నాయకులు ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు.
ఒక ఉద్యోగి తరచుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అని ఆలోచిస్తే.. అది ఆ ఉద్యోగం తనకు సరిపడటం లేదని అర్థం. ఒక వ్యక్తి తన పనిని నిజంగా ఇష్టపడితే, పని - జీవితం మధ్య కఠినమైన సరిహద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఎరెనో పేర్కొన్నారు.
ఎరెనో తన అనుభవాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. ఆయన ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నప్పటికీ.. వీకెండ్స్లో నా కుమారుడితో కలిసి జిమ్కు వెళ్తున్నప్పుడు కూడా వ్యాపార ఆలోచనలు చేయడం, ఈమెయిల్స్ చూడడం వంటివి తనకు ఒత్తిడిగా అనిపించదని చెప్పారు. తన పనిని ఆనందంగా చేసుకుంటే, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన భారంగా చూడాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. తమకు నచ్చిన పని ఎంచుకుంటేనే పని–జీవిత సమతుల్యత అనే సమస్యే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక స్కేల్ ఏఐ కో-ఫౌండర్ లూసీ గువో (Lucy Guo) కూడా ఇదే తరహా అభిప్రాయం చెప్పారు. పని–జీవిత సమతుల్యత అవసరం అనిపిస్తే, ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు అని అన్నారు. తాను తన పనిని ఎంతో ఇష్టపడతానని, అందుకే అలాంటి సమస్య ఎదురుకాదని చెప్పారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ హోమ్ స్క్రీన్పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి.
సాక్షి, ముంబై : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్య 8,440 మేర తగ్గినట్లు తెలిపింది. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న తర్వాత ఈ భారీ తగ్గుదల చోటుచేసుకుంది.అయితే ఈ ఏడాది మరో 20వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకోనున్నట్టు వెల్లడించింది.
ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా మాట్లాడుతూ, వరుసగా తమ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఇది 5,000 మంది పెరిగిందన్నారు. త్రైమాసికంలో ఎప్పుడూ కొంత కాలానుగుణత ఉంటుంది. ఈ త్రైమాసికంలో వాల్యూమ్లు తక్కువగా ఉన్నాయి, దానికి తోడు సిస్టమ్లోకి వచ్చిన కొత్తవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.జనవరి-మార్చి కాలం ముగిసే నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,28,594గా ఉంది, గత పన్నెండు నెలల ప్రాతిపదికన చూస్తే, ఈ త్రైమాసికంలో ఉద్యోగుల వలస రేటు (అట్రిషన్) మునుపటి త్రైమాసికంలోని 12.3 శాతం నుండి 12.6 శాతానికి పెరిగిందని తెలిపారు.
భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు ఇప్పటికే 18,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. కాగా, గత త్రైమాసికంలో (Q3FY26) దాని నికర ఉద్యోగుల సంఖ్య 5,000 మందికి పైగా పెరిగింది. అలాగే 2026 చివరి నాటికి, 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని ఇది అంచనా వేస్తోంది.WEF దావోస్ సదస్సు సందర్భంగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, జనవరి 2026లో FY27లో తమ కంపెనీ 20 వేల మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్ విషయాలు
అంచనాలను ఇన్ఫోసిస్ ఫలితాలు
28 శాతం లాభాలతో ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలను అధిగమించింది. క్యూ4లో ఇన్ఫోసిస్ నికర లాభం 27.8 శాతం పెరిగి రూ. 8,501 కోట్లకు చేరిం. ఆదాయం త్రైమాసికం ప్రాతిపదికన (QoQ) 2 శాతం పెరిగి రూ. 46,402 కోట్లకు చేరింది 2026-27ఆర్థిక సంవత్సరాకి గాను తన ఆదాయ వృద్ధి అంచనా (guidance) 1.5 శాతం నుండి 3.5 శాతం పరిధిలో ఉంటుందని తెలిపింది. కాగా 2026కి ఈ అంచనా 3 నుండి 3.5 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ.. కుటుంబంతో కలిసి అత్యంత ఖరీదైన యాంటిలియాలో నివాసం ఉంటున్నారు. రాజప్రాసాదంలా ఉండే ఈ భవనం లోపల జరిగే ప్రతి పని ఒక పెద్ద సంస్థలో జరిగేలా క్రమబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కిచెన్ పని విధానం చూస్తే.. అదొక 7-స్టార్ హోటల్ స్థాయి నిర్వహణలా ఉంటుంది.
యాంటిలియాలో పనిచేసే సుమారు 600 మంది సిబ్బందికి ప్రతిరోజూ భోజనం అందించాలి. దీనికోసం రోజుకు సుమారు 4000 రోటీలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే చెఫ్ బాధ్యత చాలా కీలకమైనది. ఎందుకంటే.. అతను కేవలం వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఒక మేనేజర్, ఒక ప్లానర్ కూడా.
అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్ జీతం ఏడాదికి సుమారు 24 లక్షల రూపాయలు (నెలకు రూ.2 లక్షలు) అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే ఎక్కువ జీతం వస్తుందనే మాట ఒక అపోహ మాత్రమే అవుతుంది. ఒక రంగంలో ప్రతిభ, నైపుణ్యం ఉంటే.. ఎక్కడైనా మంచి జీతం లభిస్తుంది.
యాంటిలియాలోని చెఫ్ పని ఎంతో ఒత్తిడితో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు ఒకే రుచి, ఒకే నాణ్యతతో ఆహారం తయారు చేయాల్సి ఉంటుంది. పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి. తన టీమ్ను సమర్థవంతంగా నడిపించాలి. ముఖ్యంగా.. సమయానికి అన్నీ సిద్ధం చేయాలి. ఇంత పెద్ద స్థాయిలో ఒక చిన్న పొరపాటు జరిగినా, అది వెంటనే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.
వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.
తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.
జాతీయ స్థాయిలో ఆధిపత్యం
ప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
ముంబై, సాక్షి బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఇండస్ట్రీస్ వచ్చే ఐదేళ్లకు భారీ ప్రణాళికను ప్రకటించింది. 2031 నాటికి రూ. 5 లక్షల కోట్ల మేర దాదాపు రెండింతల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో రెండు కంపెనీలను లిస్ట్ చేయడం, అన్ని వ్యాపారాల్లో డబుల్ డిజిట్ వృద్ధి సాధించడం ద్వారా ఈ టార్గెట్ చేరుకోవాలని భావిస్తోంది.
సంవత్సరానికి 15 శాతానికి మించి అమ్మకాల వృద్ధి, 20 శాతం కంటే ఎక్కువ ఈపీఎస్ వృద్ధి, ప్రతి వ్యాపారంలో 18 శాతం కంటే ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం గ్రూప్ కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగో ఆవిష్కరణ సందర్భంగా త్వరలో కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న పిరోజ్ షా గోద్రెజ్ ఈ విషయాలు తెలిపారు. లిస్ట్ చేయబోయే సంస్థల్లో గోద్రెజ్ క్యాపిటల్ ఉంటుందని చెప్పారు.సస్టైనబిలిటీ, ఉద్యోగుల ప్రాతినిధ్యం అంశాలపై కూడా సంస్థ దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.

2031 నాటికి మహిళలు, ఎల్జీబీక్యూటీ వర్గాలు, దివ్యాంగుల ప్రాతినిధ్యాన్ని 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వ్యాపార వృద్ధి వ్యూహంలో భాగంగా, లిస్టెడ్ సంస్థలు తమకు అవసరమయ్యే నిధులను తామే సమకూర్చుకుంటాయి. లిస్ట్ కాని వ్యాపారాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 5,000 నుంచి రూ. 7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గోద్రెజ్ తెలిపారు.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) తీసుకుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో ఒకటి రెండు ఈఎంఐలు (EMI) చెల్లించలేకపోతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. ఆ పరిస్థితి అలాగే కొనసాగితే మాత్రం మీ కలల సౌధం వేలం దాకా వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి? 'సర్ఫేసీ' చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు మీకోసం..
ఎన్పీఏ అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రకటిస్తారు?
మీరు మొదటి నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్ల ద్వారా గుర్తు చేస్తాయి. రెండో నెలలో కూడా అదే పరిస్థితి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వరుసగా మూడు నెలల పాటు మీరు ఈఎంఐ చెల్లించనట్లయితే, బ్యాంక్ మీ రుణ ఖాతాను ఎన్పీఏ (NPA- నిరర్థక ఆస్తి)గా మారుస్తుంది. ఇక్కడి నుంచే అసలు చట్టపరమైన ప్రక్రియ మొదలవుతుంది.సర్ఫేసీ చట్టం.. బ్యాంకుల అస్త్రం
రుణగ్రహీత మొండి బకాయిదారుగా మారినప్పుడు బ్యాంకులు సర్ఫేసీ చట్టం, 2002 (SARFAESI act)ని ప్రయోగిస్తాయి. లోన్ ఖాతా ఎన్పీఏ మారిన తర్వాత, బ్యాంక్ రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో డిమాండ్ నోటీసు ఇస్తుంది. బకాయి ఉన్న మొత్తాన్ని ఈ గడువులోగా చెల్లించాలని కోరుతుంది. ఈ 60 రోజుల వ్యవధిలో మీరు బ్యాంకును సంప్రదించి, మీ ఇబ్బందులను వివరించి చెల్లింపు గడువును పొడిగించుకునే లేదా రీ-స్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇంటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?
డిమాండ్ నోటీసు ఇచ్చిన 60 రోజుల తర్వాత కూడా రుణగ్రహీత స్పందించకపోతే, బ్యాంక్ సదరు ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించి, ఇంటిని సీల్ చేసే అధికారం కలిగి ఉంటారు.వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది?
ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ దానికి మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది. ఆపై బకాయిలను వసూలు చేసుకోవడానికి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. సాధారణంగా ఈఎంఐ నిలిచిపోయిన నాటి నుండి వేలం దాకా వెళ్లడానికి 5 నెలల నుండి 12 నెలల సమయం పడుతుంది. వేలానికి ముందు కూడా రుణగ్రహీతకు తన బకాయిలను పూర్తిగా చెల్లించి ఇంటిని కాపాడుకోవడానికి చివరి అవకాశం ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకు నుండి వచ్చే కాల్స్ లేదా నోటీసులను విస్మరించవద్దు. నేరుగా బ్యాంకు అధికారులను కలిసి మీ పరిస్థితిని వివరిస్తే, వారు ఏదైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించకపోతే మీ సిబిల్ (CIBIL) స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మరెక్కడా రుణాలు లభించవు. బ్యాంకు వేలం వేసే ముందు ఆస్తి విలువను సరిగ్గా లెక్కించిందో లేదో తనిఖీ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.ఇది చదివారా? ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు?
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 852.49 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టంతో 77,664.00 వద్ద, నిఫ్టీ 219.60 పాయింట్లు లేదా 0.90 శాతం నష్టంతో 24,158.50 వద్ద నిలిచాయి.
డెల్టా కార్ప్ లిమిటెడ్, డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్, మాస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, డంగీ డమ్స్ లిమిటెడ్, సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో వంటగ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో, దేశీయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇండక్షన్ స్టవ్ల తయారీ పెంపుతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. ఓడల రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరా తగ్గడం తెలిసిందే. దీంతో ప్రజలు తాత్కాలికంగా ఇండక్షన్ స్టవ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
కీలక మార్పులు..
ఇండక్షన్ స్టవ్ల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఫారసు చేసింది.
మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 మధ్య 467 సీఎన్జీ, బయో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా, వెంటనే పరిష్కరించారు. ఇందులో 157 స్టేషన్లకు తుది లైసెన్సులు సైతం మంజూరయ్యాయి.
ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా ఏప్రిల్ 2న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
హైవేలపై రద్దీని, వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'ఫాస్ట్ట్యాగ్'ను పరిచయం చేసింది. ఆ తరువాత యాన్యువల్ పాస్ తీసుకొచ్చారు. మోసగాళ్లు కూడా.. ఈ సేవలను అందిస్తున్న మోసపూరిత వెబ్సైట్లను సృష్టించారు. ఈ విషయాన్ని NHAI వెల్లడిస్తూ.. ప్రయాణికులను హెచ్చరించింది.
ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్సైట్లు, అనధికారిక లింక్ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఈ పాస్లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్ఫామ్లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్ఫామ్లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్లను నమ్మకూడదని ఎన్హెచ్ఏఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
Attention National Highway Users!
NHAI cautions commuters against fake websites and unauthorised links claiming to sell FASTag Annual Passes. The #FASTagAnnualPass is available only through the official Rajmargyatra App. Any other platform offering the pass is not authorised and… pic.twitter.com/uAaHMCUAR1— NHAI (@NHAI_Official) April 22, 2026
ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు అసలైన FASTag పోర్టల్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. అంతే కాకుండా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటివి ఉపయోగించే వాటిని ముందు వరసలో కనిపించేలా చేస్తున్నారు. ఇలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేస్తే.. మొబైల్ నంబర్లు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమాచారం, చెల్లింపు వివరాలు వంటి సున్నితమైన వివరాలను నమోదు చేయమని కోరతారు. ఇంటర్ఫేస్ నిజమైనదిగా కనిపించినప్పటికీ.. ఆ చెల్లింపు మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఖాతాలకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని NHAI హెచ్చరించింది.
ఇదీ చదవండి: యాపిల్ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?
భారతీయ ఐటీ రంగంలో ‘మూన్లైటింగ్’ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం) అనేది ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే. కంపెనీలు దీన్ని అనైతికం అని కొట్టిపారేస్తున్నా కొందరు టెక్కీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కాసులు సంపాదిస్తున్నారు. అయితే, ఈ సంపాదన వెనుక ఎంతటి మానసిక సంఘర్షణ, సామాజిక దూరం ఉందో వివరిస్తూ ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ఏడాదికి రూ.70 లక్షలకు పైగా సంపాదన.. రూ.1.3 కోట్ల ఇల్లు.. కానీ నా సామాజిక జీవితం శూన్యం’ అంటూ సదరు టెక్కీ వెళ్లగక్కిన ఆవేదన ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అప్పు చేయకుండా రూ.1.3 కోట్ల ఇల్లు!
టైర్-3 సిటీలో 2022 బ్యాచ్ నాన్-ట్రెడిషనల్ ఇంజినీరింగ్ విభాగంలో చదివిన ఈ యువకుడు కేవలం నాలుగేళ్లలోనే కళ్లు చెదిరే స్థాయికి ఎదిగాడు. పైథాన్, బ్యాకెండ్ సిస్టమ్స్, ప్లాట్ఫాం ఇంజినీరింగ్లో నైపుణ్యం సాధించి ఒకేసారి రెండు రిమోట్ (వర్క్ ఫ్రం హోం) ఉద్యోగాలను సంపాదించాడు. అందులో ఒకటి భారతీయ స్టార్టప్దికాగా, మరొకటి అమెరికాకు చెందిన ఎంఎన్సీ. తన సంపాదన ఏడాదికి రూ.74.5 లక్షలు. ఏ విధమైన హోమ్ లోన్ లేకుండా రూ.1.3 కోట్లతో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు.
తీవ్ర పని ఒత్తిడి!
తన జీవితం పైకి అంతా కలర్ ఫుల్గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ టెక్కీ నరకం చూస్తున్నాడు. ఒక ఉద్యోగానికి రోజుకు నాలుగు గంటలు, రెండో ఉద్యోగానికి 10 గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వచ్చేది. ‘రెండు రిమోట్ ఉద్యోగాలే కాబట్టి మేనేజ్ చేయగలిగాను కానీ, నా సామాజిక జీవితం కనుమరుగైపోయింది. ఫ్యామిలీకి, స్నేహితులకు సమయం ఇవ్వలేకపోయాను. నేను కొనుక్కున్న జిమ్ సామాగ్రిని వాడే తీరిక కూడా లేదు’ అని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. చివరికి ఆరోగ్యం దెబ్బతినడం, ఒంటరితనం వేధించడంతో ఒక ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. పని ఒత్తిడితోపాటు ఆదాయ పన్ను లెక్కలు కూడా తన నిర్ణయానికి కారణమయ్యాయి.
నెటిజన్ల మిశ్రమ స్పందన
ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని కష్టాన్ని చూసి లెజెండ్ అని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ‘ఇంత డబ్బు ఉండి ఏం లాభం? యవ్వనాన్ని గదిలోనే గడిపేస్తే జీవితానికి అర్థం ఏముంది?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతం భారతీయ టెక్ ప్రపంచంలో పెరుగుతున్న హస్టిల్ కల్చర్ (విశ్రాంతి లేకుండా పని చేయడం)కు నిదర్శనం. ఆస్తులు కూడబెట్టడం ముఖ్యం కాదని ఎవరూ అనరు, కానీ అది మానసిక ఆరోగ్యానికి సమాధి కట్టేలా ఉండకూడదు. డబ్బు కంటే లైఫ్ ముఖ్యమని గుర్తించిన ఈ టెక్కీ నిర్ణయం అతిగా కష్టపడే యువతకు ఒక హెచ్చరిక లాంటిదే!
ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
Crime
రాజానగరం: ప్రేమ పేరుతో వెంటబడి విద్యార్థినిని తీవ్ర వేధింపులకు గురి చేసిన యువకుడు.. చివరకు ఆ యువతిని హత్య చేసేందుకు యత్నించిన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో చోటు చేసుకుంది. రాజానగరం గైట్ కళాశాలలో ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై ఓ యువకుడు పెట్రోలక్ష పోశాడు.
ఆపై నిప్పంటించేందుకు యత్నించే క్రమంలో తోటి విద్యార్థినులు అడ్డుకుని కేకలు వేయడంతో అక్కడ నుంచి యువకుడు పరార్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ప్రేమను నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు సదరు యువకుడు. ఆ యువకుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Movies
- మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..
- శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..
- బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..
- ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..
పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ..
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. వాళా-2 తెలుగు డబ్బింగ్ వర్షన్తో పాటు గేదేల రాజు లాంటి సినిమాలపై అంతగా బజ్ లేదు. వాళా-2 మలయాళ హిట్ మూవీ కావడంతో కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఫ్రైడే సినిమాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. వీటిలో తెలుగు మూవీ బ్యాండ్మేళంపై ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు జీవీ ప్రకాశ్ హ్యాపీ రాజ్ డబ్బింగ్ సినిమా, మలయాళ మూవీ ప్రతిఛాయ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. ఈ శుక్రవారం ఒక్క రోజే అన్ని కలిపి దాదాపు 20 చిత్రాలు ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్ఫ్లిక్స్- అపెక్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 24
- నుక్కడ్ నాటక్(హిందీ సినిమా)- ఏప్రిల్ 24
- ఇఫ్ విషెస్ కుడ్ కిల్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24
- నీ ఫరెవర్(హిందీ మూవీ)- ఏప్రిల్ 24
- సోనిక్3 ది హెడ్జ్హాగ్(హాలీవుడ్)- ఏప్రిల్ 24
- అన్కామన్ వాలర్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24
- మై డ్రెస్అప్ డార్లింగ్(జపనీస్ మూవీ)- ఏప్రిల్ 25
- 28యర్స్ లేటర్- ది బోన్ టెంపుల్(హాలీవుడ్)- ఏప్రిల్ 26
జియో హాట్స్టార్- ప్రతి ఛాయ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 24
- 24 (హిందీ సిరీస్) - ఏప్రిల్ 24
సన్ నెక్స్ట్
- జేసీ ది యూనివర్సిటీ(కన్నడ మూవీ)- ఏప్రిల్ 24
జీ5
- బ్యాండు మేళం (తెలుగు మూవీ) - ఏప్రిల్ 24
- జిరాక్స్ (కన్నడ సిరీస్) - ఏప్రిల్ 24
అమెజాన్ ప్రైమ్
- హ్యాపీరాజ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 24
- నాటీ బిజినెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
- మార్టీ సుప్రీమ్(హాలీవుడ్ మూవీ)- ఏప్రిల్ 24
- న్యూ బండిట్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 24
- ఇమ్మార్షల్ కాంబాట్(హాలీవుడ్)- ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
- గ్రీన్ ల్యాండ్ 2: మైగ్రేషన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 24
ఆపిల్ టీవీ ప్లస్
- మై బ్రదర్ ద మినోటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 24
హులు..
- నో అదర్ ఛాయిస్ (హాలీవుడ్)- ఏప్రిల్ 24
ముబీ..
- సౌండ్ ఆఫ్ ఫాలింగ్(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 24
తమిళనాడు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ రావడం.. అవి నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్కి హాజరకావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్గా వచ్చి ఓటు వేసి వెళ్లింది. విజయ్కి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ.. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని పరోక్షంగా చెప్పేసింది.
ఇన్స్టాలో తొలి పోస్ట్..
చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కలిసి ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగి వెళ్లిపోయారు. కాసేపటికే ఆ ఫోటోని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు అసలైన రచ్చకు కారణమైంది.పాటతో ఇలా చెప్పేసింది
త్రిష షేర్ చేసిన పోటోకి బ్యాగ్రౌండ్లో ఓ పాటను జోడించింది. అది విజయ్తో కలిసి త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాట. కేవలం పాటను ఎంచుకోవడమే కాదు, అందులో కేవలం 'విజిల్స్'వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్కి జత చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. విజయ్ పార్టీ గుర్తు విజిల్. అందుకే త్రిష ఆ పాటతో షేర్ చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక విజయ్ అభిమానులు అయితే త్రిషను ఏకంగా ‘వదినమ్మ’అని సంభోదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ -త్రిషలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు.
#Aadu3 (Malayalam)
Streaming from May 1 on Zee5 in Malayalam, Tamil, Telugu, Kannada & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/eJURte08qN— OTT Trackers (@OTT_Trackers) April 23, 2026
ప్రముఖ నటి అక్షయ హరిహరన్కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్కు గురైంది. అడయార్లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని కోరినట్లు అక్షయ హరిహరన్ తెలిపింది. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరింది. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. తన ఓటు వేసేందుకు వచ్చిన సెలబ్రిటీకి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. కాగా.. అక్షయ హరిహరన్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. సబా నాయగన్, రంగోలి, బ్లడీ బగ్గర్, హే సినామికా లాంటి సినిమాల్లో మెప్పించింది.
నా ఓటు వేరే వాళ్లు వేశారని తెలిసి షాక్ అయ్యాను: నటి అక్షయ హరిహరన్
ఓటు వేసేందుకు అడయార్ లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లాను
కానీ అప్పటికే నా పేరుతో వేరే వ్యక్తి ఓటు వేసినట్లు తెలిసి షాక్ అయ్యాను
నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలింగ్ సిబ్బందిని… pic.twitter.com/SJtyWZkQ8L— ChotaNews App (@ChotaNewsApp) April 23, 2026
సినీ తారలకు ప్రేమ, పెళ్లిళ్లు ఎంత కామనో.. బ్రేకప్, విడాకులు కూడా అంతే కామన్. ఎప్పుడు ఎందుకు ప్రేమలో పడతారో..ఎందుకు విడిపోతారో తెలియదు. ఇలా ప్రేమ విషయాన్ని బయటపెట్టి..అలా బ్రేకప్ చెప్పుకుంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పి.. కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందటారు. అలా విడిపోయి సడెన్ షాక్ ఇచ్చిన వారిలో విజయ్ వర్మ-తమన్నా జంట ఒకటి. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట.. కొన్నాళ్ల క్రితం విడిపోయి అందరికి షాకిచ్చింది.
తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ పలువురు హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనాతో ప్రేమలో పడ్డాడనే వార్తకు కూడా వినిపించాయి. కానీ ఫాతిమా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాత విజయ్ మరో యంగ్ బ్యూటీతో రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వాలెంటైన్స్ డే రోజు ఓ అమ్మాయి చేతిలో చేయి వేస్తున్న ఫోటోని షేర్ చేసి..దానికి లవ్ ఎమోజీనీ జోడించాడు. ఈ పోస్ట్ని ఖుషి అహుజా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కు ట్యాగ్ చేశాడు. దీంతో విజయ్ వర్మ మరోసారి ప్రేమలో పడ్డాడని అనుకున్నారు.
తాజాగా ఆ బ్యూటీ పేరు బయటకు వచ్చింది. విజయ్ వర్మ ప్రస్తుతం నటి అలియా ఖురేషితో రిలేషనల్లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. అలియా ఖురేషితో కలిసి విజయ్ వర్మ ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు రావడం, ఒకే కారులో కలిసి వెళ్లడంతో ఇద్దరూ రిలేషన్లో ఉన్నరానే పుకార్లు బయటకు వచ్చాయి.
ఎవరీ ఖురేషీ?
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్లో ‘జాన్వి’పాత్రలో మెరిసిన బ్యూటీనే అలియా ఖురేషి. నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. ప్రముఖ మ్యూజికల్ సిరీస్ 'బందిష్ బాండిట్స్' రెండవ సీజన్లో అనన్య పాత్రలో కనిపించింది. తాజాగా ఇభ్రహీం అలీఖాన్, ఖుషీ కపూర్ల ‘ నదానియన్’ మూవీలో కీలక పాత్ర పోషించింది. మరి నిజంగానే విజయ్ - అలియాలు ప్రేమలో ఉన్నారా? లేక జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.Vijay Varma was spotted with rumoured girlfriend Alia Qureshi at Mizu Restaurant in Bandra, sparking fresh dating buzz.#VijayVarma #AliaQureshi #CelebSpotted #Bollywood #DatingRumours #Mumbai pic.twitter.com/aMnpXoolNq
— The Daily Jagran (@TheDailyJagran) April 21, 2026
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ వాయిదా వేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకా ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండడంతో ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్కు షిఫ్టయ్యాడు. అయితే ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. రోజుకొక హీరోయిన్ పేరు వినిపిస్తున్న వీటిపై అధికారిక ప్రకటనైతే రాలేదు.
ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.
తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్లో పేర్కొన్నారు.దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
Thank you for all the LOVE ❤️🔥❤️🔥❤️🔥
Appudu #MAJOR ki Lowest Ticket Price
Ippudu #DACOIT ki.
We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices
❤️🔥❤️🔥❤️🔥
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:
👉 ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70
👉 తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026
ది కేరళ స్టోరీ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ ఆదా శర్మ. ఈ మూవీపై ఎన్ని వివాదాలొచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్ల చెదిరే కలెక్షన్స్ రాబ్టటింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ది కేరళ స్టోరీ-2 రిలీజై హిట్గా నిలిచింది.
తాజాగా ఆదా శర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది ముద్దుగుమ్మ. గవర్నర్ ది సైలెంట్ సేవియర్ పేరుతో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా షేర్ చేసింది ఆదా శర్మ. 'ఈనాడు మనం ఒక ప్రపంచ శక్తిగా నిలిచామంటే.. దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన ఒక అప్రకటిత యుద్ధమే' అంటూ గవర్నర్ పోస్టర్ పంచుకుంది. ఈ చిత్రం జూన్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుందని పోస్ట్ చేసింది. ఈ చిత్రానికి చిన్మయి దీపక్ మండ్లేకర్ దర్శకత్వం వహించగా.. విపుల్ అమృత్లాల్ షా నిర్మించారు.
ఈ పోస్టర్ చూస్తుంటే ఆర్బీఐ బ్యాంక్, మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో జరిగే అవతవకలు, మోసాలే లక్ష్యంగా ఈ మూవీని రూపొందించినట్లు పోస్టర్లో చూస్తే అర్థమవుతోంది. గవర్నర్ టైటిల్తోనే ఈ మూవీ థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది.
My next ❤️
GOVERNOR releasing in cinemas on 12th June, 2026.
We are a world power today
because an unsung hero fought an untold war.
GOVERNOR releasing in cinemas on 12th June, 2026.@BajpayeeManoj @adah_sharma #NoushadMohamedKunju @madhoo69 #ParitoshSand @KurupKrisha… pic.twitter.com/QdlMFeeM0v— Adah Sharma (@adah_sharma) April 23, 2026
తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. రజనీకాంత్, ధనుష్, త్రిష, మణిరత్నం, అజిత్, శృతీహాజన్తో పాటు పలువురు తమిళ స్టార్స్ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.
‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్గ్రేడ్ చేయడానికి విజయ్ పర్ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.
టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
#WATCH | Tamil Nadu Elections 2026 | Actor VTV Ganesh says, "I cast my vote to TVK. Vijay is a perfect fit to upgrade the society, people and the system... I want him to become the CM..."
He also says, "Young voters should exercise their voting rights..." pic.twitter.com/RWJ5mc5ydS— ANI (@ANI) April 23, 2026
సింగర్ మంగ్లీ వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగిందని తెలిపింది. వాళ్లకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని వెల్లడించింది. బాధితుల తరఫున అండగా ఉంటానని గతంలో చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉన్నానని పేర్కొంది. ఈ ఆర్థిక మోసాలతో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నానని మంగ్లీ తెలిపింది.
కానీ కొందరు వ్యక్తులు, దుష్ట శక్తులు అదే పనిగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజం ఏంటనేది నిలకడపై తెలుస్తుందని.. న్యాయ వ్యవస్థ, చట్టాలపై తనకు పూర్తిగా నమ్మకముందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
International
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊసరవెల్లి కంటే వేగంగా ట్రంప్ తన మాటలను మార్వగలరు. ఈ రోజు ఉదయమే భారత్పై విషం వెల్లగక్కుతూ అవమానించేలా మాట్లాడిన ట్రంప్.. అంతలోనే ఇండియాను ప్రశంసిస్తూ మాట్లాడారని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ వలసల విషయంలో భారత్పై మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. భారత్ను నరకంతో పోల్చుతూ అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఓ లేఖను ట్రంప్ తన ట్రుత్ సోషల్ పోస్టులో షేర్ చేశారు.
ఇండియా, చైనా దేశాలను నరకకూపాలు అభివర్ణిస్తూ.. ఆ రెండు ఆసియా దేశాల నుంచి వచ్చే ప్రజలు.. అమెరికాలో 9 నెలల్లో ఓ బిడ్డను కనేస్తారు. ఇక చట్టం ప్రకారం వాళ్లు తక్షణమే అమెరికా పౌరులు అవుతారంటూ సావేజ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు.
కొన్ని గంటల్లోనే ట్రంప్ తన బుద్ధిని బయటపెట్టాడు. భారత్ గొప్ప దేశం. అక్కడ నాకు మంచి స్నేహితుడు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఉన్నాడు. ఆయనతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది’ అంటూ ట్రంప్ అన్నారని భారత్లోని అమెరికా కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
మైఖేల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆసియా దేశాల నుండి ప్రజలు తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి బిడ్డను ప్రసవిస్తారని, తద్వారా ఆ బిడ్డకు తక్షణమే అమెరికా పౌరసత్వం లభిస్తుందని ఆయన ఆరోపించారు.భారతీయ మరియు చైనీస్ వలసదారులను "ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు" అని సావేజ్ అభివర్ణించారు. కాలిఫోర్నియాలోని హైటెక్ కంపెనీలలో తెల్ల జాతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిసినప్పటి నుండి తాను భారతీయులకు మద్దతు ఇవ్వడం మానేశానని సావేజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ట్రంప్ రీపోస్ట్ చేశారు.భారత్ స్పందన
అటు ట్రంప్ ఇటు సావేజ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ..‘మేము కొన్ని నివేదికలను చూశాము. వాటిని అక్కడే వదిలేశాం’ అని అన్నారు.
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.
పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే ఏ బోట్లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్, చైనా నరకాలు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇరాన్లోని నాగరికతను నాశనం చేస్తామంటూ ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్న ట్రంప్ ఉంటున్న అమెరికానే నరకం అంటూ ఇరాన్ రిప్లై ఇచ్చింది. భారత్, చైనాలు మానవాళికి మహోన్నత దేశాలు అంటూ ఇరాన్ పేర్కొంది. భారత్, చైనాలను నాగరికతకు పుట్టినిల్లు అని పేర్కొంటూ ట్రంప్పై విరుచుకుపడింది.
చైనా, భారత్ నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి అమెరికా దేశ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు ఇరాన్లో నాగరికతను నాశనం చేస్తానని బెదిరించిన చోటే ఆ నరకమనేది ఉంది’ అంటూ ఇరాన్ బదులిచ్చింది.
డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారత్, చైనాలను నరక కూపాలు అని అభివర్ణిస్తూ వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా స్పందించింది. ట్రంప్ ప్రకటనలకు సంబంధించి కొన్ని నివేదికలను చూశామని పేర్కొంది. తాము కొన్ని నివేదిలైతే చూశామని, ఈ వ్యాఖ్యల వివాదాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.
కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.
కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ వద్ద టోల్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.
ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
భారత్కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB
— IRGC (@IRGC_Press) April 22, 2026
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని రాబోయే 36 నుంచి 72 గంటల్లోపూ మరో దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ బలప్రదర్శన చేసింది. తన బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఉరేగింపు జరిపింది. ఈ ఊరేగింపులో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధంలో సీజ్ఫైర్ నడుస్తున్నందున ఇరాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు సాధారణ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ తమ దేశ ఆయుధ సంపత్తిని తెలియజేస్తూ టెహ్రాన్ వీధుల్లో ఓ ర్యాలీ నిర్వహించింది. ఒక భారీ వాహనంపై తన దేశానికి చెందిన ఆధునాతన బాలిస్టిక్ క్షిపణి ఖదర్ను ప్రదర్శనకు ఉంచి ఊరేగింపు జరిపింది.ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయిలు దేరారు. ఖదర్ అనే క్షిపణి పాత షహాబ్-3A క్షిపణికి ఆధునాతన వెర్షన్ ఇది. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ ప్రధానంగా వీటినే వినియోగించింది.
అయితే ఇటీవల ట్రంప్ తరచుగా ఇరాన్ ఆయుధ సామాగ్రిపై ట్రంప్ తరచుగా కామెంట్స్ చేశారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సామాగ్రి లేదని తరచుగా మాట్లాడారు. కాగా ఇటీవల యుఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు.
మరోవైపు గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది డ్రోన్లు ఆయుధాగారంలోనే దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ర్యాలీ సైతం తమ వద్ద ఇంకా బలమైన ఆయుధాలు ఉన్నాయని పరోక్షంగా హెచ్చరించడానికే అన్న కోణంలో ఉంది.
Iran publicly displays 2000 km range ballistic missile in Tehran pic.twitter.com/HnKXAyPis9
— Iran Headlines (@Iran_Headlines) April 23, 2026
Telangana
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది.
ముందుగా శంకర్ గౌడ్కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ.. రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట మౌన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే..
రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ మౌనదీక్షలు
ఈ నెల 25 నుంచి అన్ని డిపోల్లో వంటా వార్పు
26వ అన్ని జిల్లాలో ఆర్టీసీ కార్మికుల కవాతు
ఈనెల 27వ తేదీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు
28వ తేదీన మహిళా ఉద్యోగులతో డిపోల వద్ద బతుకుమ్మలతో నిరసన
29వ తేదీన అన్ని డిపోల ఎదుట కార్మికుల అర్ధనగ్న నిరసనలు
హైదరాబాద్: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు చేసింది హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్. నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడిని తయారుచేస్తూ, విక్రయిస్తున్న తయారీ కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధిక లాభాల కోసం నిందితులు తక్కువ నాణ్యత గల టీ పొడికి కృత్రిమ రంగులు గడువు ముగిసిన ముడి పదార్థాలను కలిపి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కల్తీ పొడిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు కొన్ని ప్రముఖ విక్రయశాలలకు కూడా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లాబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్కు చెందిన సతీష్, బౌయిన్ పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్ కు చెందిన నరసింహ (250 గ్రాముల ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్ కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లాబుర్జుకు చెందిన రాజేష్, బీదర్కు చెందిన రవీందర్ మరియు మల్లేపల్లికి చెందిన వసీం ఉన్నారు. వీరంతా రంగులు కలపడం, ప్యాకేజింగ్ మరియు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించారు.
విచారణ వివరాల ప్రకారం, నిందితులు కోల్కతా, కేరళ మరియు అస్సాం వంటి రాష్ట్రాల నుండి తక్కువ నాణ్యత గల టీ పొడిని సేకరించి, దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి హానికరమైన రంగులతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడి మరియు ఎక్స్పైరీ అయిన టీ పొడిని కలుపుతున్నారు. ఈ హానికరమైన మిశ్రమాలను ప్రసిద్ధ బ్రాండ్ల పేరుతో రీ-ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటువంటి కల్తీ టీ పొడి సేవించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ దాడుల్లో సుమారు 3,000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం మరియు భారీగా కృత్రిమ రంగులను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్య గమనిక జారీ చేస్తూ, టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఆహార కల్తీకి సంబంధించి ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తయారీదారులు ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో, H-FAST ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించింది.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ఎవరూ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని పొన్నం విజ్ఞప్తి చేశారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగాలని కొంత ఆలస్యమైందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి పొన్నం.
దీనిలో భాగంగా రేపు(శుక్రవారం, ఏప్రిల్ 24వ తేదీ) ఆర్మీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్,. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు.
మరో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించి... సమ్మె విరమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్చలు జరుపుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే అనాలోచిత చర్యలకు పాల్పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
క్షణికావేశంతో కొత్త సమస్యలు వస్తాయని, ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావొద్దని కోరారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెంటనే చర్చలకు ముందుకు రావాలని కార్మిక సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మనిబ్బరంతో ఉండాలని... ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.
కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. కేబినేట్ భేటీ కొనసాగుతుంది ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ సమ్మోతో అదేవిధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామాకం జరిపే అంశం, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైన మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు.
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అధికారులు కేవలం ఖాతాల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో ఆయన సమన్వయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులుతో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు 'సేఫ్ కస్టమర్ చాలెంజ్'ను బ్యాంకులు స్వీకరించాలని కోరారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు.
బ్యాంకు మేనేజ్మెంట్లు ఖాతాల సంఖ్యను కాకుండా, కస్టమర్ల భద్రతనే ఉద్యోగుల కీలక పనితీరు సూచికగా (KPIs) పరిగణించాలని హితవు పలికారు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాన్ని గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.
కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి దేశాల నుంచి సాగుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు.. స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో 'మ్యూల్ ఖాతాలు' ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఒత్తిడితోనే వారు డబ్బు విత్డ్రా చేస్తున్నారా? అన్నది గమనించి వారిని కాపాడాలని కోరారు.
మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు 'మ్యూల్ హంటర్' వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వాడాలని, 1930 హెల్ప్లైన్ నంబర్పై కస్టమర్లకు విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుందని, బ్యాంకులు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. స్నేహితుడు కలిసినా.. బంధువు వచ్చినా.. శుభవార్త విన్నా.. చెడు కబురు అందినా.. ముచ్చట ఏదైనా.. మందు తాగుడు కామన్ అయింది. ఇక వీకెండ్ వచ్చిందంటే ఎంజాయ్ అంటూ పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మందు తాగడానికి కారణాలు వెతుక్కునే పరిస్థితి.. ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామాలకూ విస్తరించింది. యువకుల నుంచి ముసలి వాళ్ల వరకు కారణం దొరికితే ముక్క, సుక్కతో దావత్ చేసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో తానూరు మండలంలోని మూడు గ్రామాలు.. మద్యానికి దూరంగా ఉంటున్నాయి. ఆయా గ్రామాల్లో జరిగిన సంఘటనలు అందరినీ ఆవైపు నడిపించాయి. ఆధ్యాత్మికబాట పట్టించాయి. మద్యనిషేధం తర్వాత గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయి.
తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండలం మూడు గ్రామాల వాసులు మద్యపాన నిషేధంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయిన ఝరి(బి), హిప్నెల్లితండా, మొగ్లి, మొగ్లి అనుబంధ మసల్గాతండా గ్రామస్తులు ఐక్యంగా మద్యనిషేధం అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాలను మూసివేశారు. కట్టుబాటు పెట్టుకుని కఠినంగా నిషేధం అమలు చేస్తున్నారు. యువకులు, మహిళలే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కట్టుబాటు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తూ మద్య రహితంగా మార్చారు.
గురువు ఉపదేశంతో..
ఝరి(బి)లో 12 ఏళ్లుగా మద్యనిషేధం అమలవుతోంది. మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్ మహరాజ్ గ్రామానికి వచ్చి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఉపదేశంతో మద్యపాన నిషేధం ప్రారంభమైంది. ఇక మొగ్లి, మసల్గాతండల్లో రెండేళ్లుగా, హిప్నెల్లితండాలో ఆరు నెలలుగా మద్యనిషేధం కొనసాగుతోంది. మండల కేంద్రం నుంచి 14 కి.మీ. దూరంలోని ఈ గ్రామాల్లో మద్యం తాగి వచ్చినవారికి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. మద్యం అమ్మకుండా చూడాలని పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చారు. పోలీసులు కూడా వీరికి మద్దతుగా ఉన్నారు.ఆత్మహత్యల కారణంగా..
గ్రామాల్లో మద్య నిషేధం అమలుకు ప్రధాన కారణం.. మద్యానికి బానిసైన వారు ఆత్మహత్యలు చేసుకోవడం. మద్యం మత్తులో ఏ పని చేయకుండా ఉండేవారు. దీంతో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులతోపాటు గొడవలు జరిగేవి. ఈ కారణంగా పంచాయితీలు నిర్వహించారు. కుటుంబ కలహాల కారణంగా యజమానులు ఆత్మహత్య చేసుకునేవారు. కుటుంబాలు రోడ్డున పడి, పిల్లల చదువులు ఆగిపోయాయి. ఒక్క హిప్నెల్లి తండాలో ఏడేళ్లలో 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మొగ్లిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి చేశాడు. ఈ దుర్ఘటన కలకలం రేపి మద్య నిషేధానికి దారితీసింది.ప్రశాంతంగా పల్లెలు..
మద్యనిషేధం అమలులో మహిళా సంఘాల సభ్యులు, యువకులే కీలక పాత్ర పోషించారు. గ్రామ పెద్దలను ఒప్పించి ఊరందరితో మద్యం తాగమని ప్రతిజ్ఞ చేయించారు. మద్యం అమ్మకాలు నిలిపివేయించారు. హిప్నెల్లితండాలో అయితే మద్య నిషేధం తర్వాత గ్రామస్తులంతా కలిసి జగదాంబదేవి ఆలయం నిర్మించుకున్నారు. మద్యనిషేధం తర్వాత పల్లెల్లో క్రమంగా పరిస్థితులు మెరుగయ్యాయి. గొడవలు తగ్గాయి. ఆత్మహత్యలు ఆగిపోయాయి. యువకులు కూడా చదువుపై శ్రద్ధ పెట్టారు. చదువు పూర్తయినవారు పనులు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. యువకులు గ్రామ శుభ్రత, అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఝరి(బి)లో శ్రమదానాలు జరిపి చెత్తను తొలగించారు. డ్వాక్రా సమూహాలు పర్యవేక్షణలో గ్రామాలు ప్రశాంతంగా ముందుకు సాగుతున్నాయి.మద్య నిషేధ మాలలు..
మహారాష్ట్ర పర్భణి జిల్లాకు చెందిన శేషేరావ్ మహరాజ్ గ్రామాలకు వచ్చినప్పుడు మద్యం అలవాటు ఉన్నవారికి మద్య నిషేధ మాలలు వేస్తున్నారు. ఈ మాల వేసుకున్నవారు మద్యంతోపాటు మాంసం కూడా ముట్టరు. ఝరి(బి) గ్రామంలో చాలా మంది యువకులు మాల ధరించారు. దీంతో మద్యం, మాంసానికి దూరంగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు.భోజాబాయి ఝరి(బి) గ్రామానికి చెందిన ఈమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. 14 ఏళ్ల క్రితం మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం రోడ్డున పడింది. భోజాబాయి కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. ఇలాగే ఈ గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో 12 ఏళ్ల క్రితం మద్య నిషేధం విధించారు.
ఉత్తం...హిప్నెల్లి తండాకు చెందిన ఇతను గ్రామంలో మద్యనిషేధం అమలులో కీలకపాత్ర పోషించాడు. యువకులు మద్యానికి బానిపై పనీపాట లేకుండా పెడదారి పడుతున్నట్లు గుర్తించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి తలెత్తడంతో గ్రామంలో మద్య నిషేధం అమలుకు ఊరంతటినీ ఏకతాటిపైకి తెచ్చాడు. అందరూ మద్యనిషేధానికి అంగీకరించారు. దీంతో ఆరు నెలలుగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపేశారు.
తానూరు మండలం మొగ్లి గ్రామంలో రెండేళ్ల క్రితం మద్యం మత్తులో గ్రామస్తుడు ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది. మద్యం కారణంగా యువత చెడుమార్గంలో పయనిస్తోందని గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. మొగ్లి స్ఫూర్తితో సమీపంలోని మసల్గ తండావాసులు కూడా మద్య నిషేధం అమలు చేస్తున్నారు.
National
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సినిమా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. గురువారం ఉదయం పోలింగ్ మొదలు కాగానే సెలబ్రిటీలు ఓట్లు వేసేందుకు బారులు తీరారు. సామాన్యుల్లా క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులు తమతో పాటే క్యూలో నిలబడి ఓటు వేయడాన్ని జనం ఆసక్తిగా గమనించారు. కెమెరాల ముందు పెద్దగా కనబడని ప్రముఖ రాజకీయ నేతల కుటుంబ సభ్యులను చూసేందుకు కూడా జనం ఉత్సుకత కనబరిచారు.
చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథమరై స్టాలిన్ (Senthamarai Stalin), అల్లుడు శబరీసన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమించారు. పోలింగ్ కేంద్రంలోని ఉన్నవారంతా సీఎం స్టాలిన్ కుమార్తె, అల్లుడిని ఆసక్తిగా గమనించారు. వ్యాపారవేత్త అయిన సెంథమరై రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. దీంతో ఆమెకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా అందుబాటులో లేదు.
#WATCH | Tamil Nadu Elections 2026 | Chief Minister MK Stalin's daughter Senthamarai Stalin and son-in-law Sabarisan cast their votes at a polling station in Chennai. pic.twitter.com/UAsFX7VGs4
— ANI (@ANI) April 23, 2026
కాగా, సూపర్స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ బూత్లో తన ఓటు వేశారు. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, తన భార్య కావేరి, కుమార్తె కావ్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. హీరో విశాల్.. అన్నా నగర్లోని పోలింగ్ కేంద్రంలో తన హక్కు వినియోగించుకున్నారు. నటుడు ఆది పినిశెట్టి తన భార్య నిక్కీ గల్రాని, తండ్రి రవిరాజా పినిశెట్టితో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. శింబు సింగిల్గా వచ్చి ఓటు వేశారు.
Actor couple Aadhi and Nikki Galrani cast votes in Chennai, urges public to vote. pic.twitter.com/XIQkMZjfzf
— News Arena India (@NewsArenaIndia) April 23, 2026
చదవండి: ఫస్ట్ టైమ్ ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్ కొడుకుశివగంగలో ఓటు వేసిన కార్తీ చిదంబరం
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన భార్య శ్రీనిధి, కుమార్తె అదితితో కలిసి శివగంగలో ఓటు వేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నా ఓటు వేశాను. ఎన్నికల రోజులన్నీ పండుగ రోజులే అని భావిస్తాను. ఇది ప్రజాస్వామ్య విజయమని నేను అనుకుంటున్నాను. ప్రజలు వచ్చి ఓటు వేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంద''ని అన్నారు.
ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తె, 22 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్పై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాహుల్ మీనా ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొన్ని గంటల ముందే రాజస్థాన్లో మరో మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల నివేదిక ప్రకారం దక్షిణ ఢిల్లీలో కైలాష్ హిల్స్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన 23 ఏళ్ల రాహుల్ మీనా, రెండు రాష్ట్రాల్లో ఇలాంటి భయంకర నేరాల పరంపర వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు రాజస్థాన్లోని అల్వార్లో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
మొదట రాజస్థాన్లో, తర్వాత ఢిల్లీలో ఘాతుకం
మంగళవారం రాత్రి రాజస్థాన్లోని అల్వార్లో తన పరిచయస్తుడి భార్యపై రాహుల్ మీనా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన భర్త ఒక పెళ్లికి వెళ్లినప్పుడు, నిందితుడు ఆ రాత్రి తనపై లైంగిక దాడి చేశాడని రాజస్థాన్ మహిళ అల్వార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ చౌదరికి ఫిర్యాదు చేసింది. మరోవైపు నిందితుడు, బాధిత మహిళ భర్తకు మధ్య జూదం కార్యకలాపాల ద్వారా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.ఆ తర్వాత రాత్రికి రాత్రే క్యాబ్ మాట్లాడుకుని ఢిల్లీకి పారిపోయాడు. బుధవారం ఉదయం సుమారు 6:30 గంటలకు ఢిల్లీలోని కైలాష్ హిల్స్కు చేరుకున్నాడు. అక్కడ నివసిస్తున్న ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపి, ఇంట్లో దోపిడీకి పాల్పడ్డాడు.
ఆనూ పానూ చూసి, పథకం ప్రకారం
బాధితురాలి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి దంత వైద్యురాలు. వీరి ఇంట్లో పది నెలల పాటు పనిచేశాడు. కుటుంబ సభ్యుల అలవాట్లు, ఇంటి భద్రతా వ్యవస్థపై అతనికి పూర్తి అవగాహన ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు ఉదయాన్నే జిమ్కు వెళ్లేవారు. పనిమనుషుల కోసం మెయిన్ డోర్ దగ్గర ఒక 'స్మార్ట్ కార్డ్' (తాళం) దాచి ఉంచేవారు. ఈ విషయం తెలిసిన రాహుల్, వారు జిమ్కు వెళ్లగానే ఆ కార్డుతో లోపలికి ప్రవేశించాడు.తన ఫోన్లలో ఒకదాన్ని రూ. 10వేలకు అమ్మేశాడు. ఆ తరువాత ఆ డబ్బుతో ఒక వ్యాన్ను అద్దెకు తీసుకుని, డ్రైవర్కు రూ. 6,000 ఇస్తానని నమ్మ బలికాడు. కానీ అతనికి డబ్బులివ్వకుండానే ఢిల్లీ చేరుకుని, ఉదయం 6:39 గంటలకు ఇంట్లోకి వెళ్లిన నిందితుడు, కేవలం 40 నిమిషాల్లోనే (7:15 గంటలకు) ఈ ఘాతుకానికి పాల్పడి బయటకు వచ్చేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసింది.
నిందితుడికి ఆన్లైన్ జూదానికి (Gambling) బాగా అలవాటు పడ్డాడు. ఇరుగుపొరుగు వారి దగ్గర అప్పులు చేస్తున్నాడనే కారణంతో రెండు నెలల క్రితమే ఆ కుటుంబం అతడిని పనిలో నుంచి తీసేసింది. ఈ పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు అతడి కోసం వెతుకుతుండగానే, నిందితుడు ఢిల్లీలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అది తప్పు...కానీ
విచారణ సందర్భంగా, "మీరు ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు?" అని కోర్టు నిందితుడిని ప్రశ్నించినపుడు డబ్బు దొంగిలించడానికే తాను ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పాడు.మరి మరి ఇతర నేరాలు ఎందుకు చేశావు?" అని అడగ్గా. అది తప్పే.. కానీ ఇప్పుడు తానేమీ చెప్పలేనని’’ బదులిచ్చాడు.రాహుల్ మీనాను, ఢిల్లీ న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ద్వారకాలోని ఒక హోటల్ నుండి అరెస్టు చేసిన అనంతరం, మీనాను న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితుడిని నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించ డానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసు విజ్ఞప్తిని ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దీపికా ఠాకరన్ ఆమోదించారు. మరోవైపు దొంగిలించిన డబ్బు, నగలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. అయితే, కేసులో మరెవరైనా ప్రమేయం ఉన్నారేమోనని పరిశీలించడానికి, అతడిని విచారించడానికి తమకు మరింత సమయం అవసరమని తెలిపారు.
ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..
ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక బాలుడు అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్ ద్వారా ఆ పాత్రను కట్ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం.
దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే ఫన్నీగా స్పందించారు. ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్గా మారింది.
A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.
Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో టీవీకే పార్టీ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. టీవీకే గుర్తుపై ఓటు వేస్తూ వీడియో చిత్రీకరణ చేసిన ఆ కార్యకర్త.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద టీవీకే కార్యకర్త శక్తివేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలింగ్ కేంద్రంలోకి తన మొబైల్ ఫోన్ను తీసుకెళ్లిన శక్తివేల్.. పార్టీ గుర్తు ‘ఈల’కు ఓటు వేస్తున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో 'రీల్'గా షేర్ చేయడంతో.. సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చింది. ఓటు రహస్యాన్ని భంగపరిచే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం ఎన్నికల నిబంధనల ప్రకారం నేరమని భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అధికారులు పోలీసులను అప్రమత్తం చేయడంతో.. వారు బూత్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శక్తివేల్పై ఎన్నికల చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కఠిన నిఘా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును 5.73 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివచ్చారు
బీకాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఈరోజు (ఏప్రిల్ 23, గురువారం) కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను కంపెనీ వెల్లడించ లేదు.
బికాజీ ఫుడ్స్, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, సాంప్రదాయ స్నాక్స్, స్వీట్స్ విభాగంలో కంపెనీని ఒక గుర్తింపు పొందిన బ్రాండ్గా తీర్చిదిద్దడంలో అగర్వాల్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. భుజియా, నమ్కీన్, ప్యాకేజ్డ్ స్వీట్స్ మరియు 'రెడీ-టు-ఈట్' విభాగాల్లో బీకాజీని అగ్రగామిగా నిలబెట్టారంటూ ఆయనకు నివాళులర్పించింది. వ్యవస్థాపకుని ఆశయాలకు అనుగుణంగా సంస్థను నడుపుతామని, వ్యాపార స్థిరత్వాన్ని కొనసాగిస్తామని కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు ప్రకటించారు. సెబీ నిబంధనల ప్రకారం, ఆయన మరణం తర్వాత ప్రమోటర్ గ్రూపులో ఆయన సభ్యత్వం ముగుస్తుందని కంపెనీ తెలిపింది.
బీకాజీ ఫుడ్స్ నేపథ్యం:
భారతదేశంలోని ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో బీకాజీ ఫుడ్స్ ఒక ప్రముఖ సంస్థ. పట్టణీకరణ, బ్రాండెడ్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఈ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశీయ మార్కెట్తో పాటు, విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా కూడా తన ఉనికిని చాటుకుంది.
సాక్షి,కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 మొదటి దశలో భాగంగా ఈరోజు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటa వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పశ్చిమ మేదినిపూర్ 65.77 శాతం పోలింగ్తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పోలింగ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓటు వేసే ప్రయత్నంలో తీవ్రమైన వేడి, శారీరక శ్రమ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ఓటర్లు మరణించారు. తూర్పు, పశ్చిమ మేదినీపూర్, మాల్దా, బీర్భూమ్ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఏప్రిల్ మాసంలో తీవ్రమైన వేడి కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఈ నలుగురూ గుండెపోటుకు గురయ్యారు.
పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతున్నప్పటికీ, జరిగిన మరణాలు ఆనాటి కార్యకలాపాలపై నీడను పడేశాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నడుమ ఓటర్ల భద్రతపై ఆందోళనలు రేకెత్తాయి.మృతులను తూర్పుమేదినీపూర్ జిల్లాలోని పటాష్పూర్కు చెందిన నృపేంద్ర దాస్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్పూర్కు చెందిన ఇస్రతన్ బీబీ, మాల్దా జిల్లాలోని మాలతీపూర్కు చెందిన ప్రమీలా బాగ్డి, బీర్భూమ్ జిల్లాలోని సూరికి చెందిన అసిమ్ రాయ్గా గుర్తించారు.
మాలతీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కందరన్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద మహిళా ఓటరు స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. తన తల్లి, తన సోదరుడితో కలిసి ఓటు వేయడానికి వెళ్లిందనీ, ఆమె ఓటు వేయబోతుండగా స్పృహ కోల్పోందని మృతురాలి కుమారుడు సన్నీ తెలిపాడు. ఆమె పోలింగ్ బూత్లోనే మరణించిందని కంట తడి పెట్టాడు. ఈ జిల్లాల్లో ఏప్రిల్ మధ్య నుంచి వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకుండా ఉండాలని వైద్య నిపుణులు కూడా సూచించారు.
#WATCH | Malda, West Bengal | Woman voter falls unconscious and passes away at a polling booth in Kandaran area of Malatipur assembly constituency
The deceased woman's son, Sunny, says, "My mother, along with my brother, had gone to cast her vote. Just as she was about to cast… pic.twitter.com/v7xhWKh4R1— ANI (@ANI) April 23, 2026
> కాగా ఉత్తర బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని పలు జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 294 నియోజకవర్గాలలో 152 నియోజకవర్గాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయనున్నారు. కనీసం 80 స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా సవరణపై చెలరేగిన రాజకీయ దుమారం , బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న ప్రతిపక్ష బీజేపీ వ్యూహాలు,తిరిగి అధికారం తమదే అని చెబుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉత్కంఠగామారుతోంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాలకు NHRC నోటీసులు జారీ చేసింది. జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్ స్కూళ్లపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే తమ తమ వద్దే పాఠ్య పుస్తకాలు కోనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని విద్యార్థులు NHRCకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Family
వైశ్యుల కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితంగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అందచందాలతో, విద్యావినయాలు, గుణ గణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవించాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లితండ్రులను కూడా విస్మితులను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరుడు, విరూపాక్షుని వివాహం రత్నావతితో అతి వైభవంగా జరిపించారు తల్లిదండ్రులు.
ఇలా ఉండగా... వేంగిరాజ్య పాలకుడు,పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరాజు విష్ణువర్ధనుడు తన సామంతరాజ్యమైన పెనుగొండకు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు ఆ చక్రవర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలాదిత్యు డనే మరొక పేరూ కలిగిన విష్ణువర్ధనుడు పెనుగొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహితుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించవలసిందిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురంపాడు.
వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించనూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కులగురువైన భాస్కరాచార్యుని అధ్వర్యంలో 714 గోత్రాలుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశమయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమేననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్రమాదం, అందువలన కలిగే కులక్షయం అనే ముప్పూ తప్పుతాయని భావించగా; 102 గోత్రాల వారు మాత్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించబడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్రవర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయ పడ్డారు. ఇంతలో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించింది. ‘అన్నలారా, తండ్రులారా! ఒక వినూత్న ప్రణాళికతో చక్రవర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచ కోత కోస్తాడు. అహింస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మార్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించ గలవారు మాత్రమే ఈ నా పోరాటంలోపాల్గొనగలరు’ అని ఆమె పలికిన పలుకులకు ఆమె తల్లిదండ్రులతోబాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.
గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనేపావన ప్రదేశంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నె పిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగడాలకు చరమ గీతం పాడడానికి; ఆడపిల్లల అభిప్రాయాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి; ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ్ర΄ాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ‘ మార్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతోబాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాలని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్యశ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అంటూ తమ జన్మవృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.
దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబలం, సమాజసేవల గురించి ప్రబోధించింది. ‘రాజా! చేతనైనే నన్ను ఇప్పుడు చెరబట్టు’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యం చూసి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించక పోగా అపకీర్తి, ఆకస్మిక మరణం రాజును వరించాయి.
గురజాడ వారు అన్నట్లు ‘పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్‘. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచి పోయాయి. విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలిరాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శించి, ‘గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించుకొందాం‘ అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజ నరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వామి దేవస్థానం లోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవతగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయాలు వెలిశాయి.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
మానవ సంబంధాలన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ’సహోదరత్వం’. అయితే నేటి సమాజంలో స్వార్థం, అహంకారం పెరిగిపోయి ఇతరుల హక్కులను కాలరాయడం, బలహీనులపై దౌర్జన్యం చేయడం సర్వసాధారణమైపోయింది. కానీ, ఇస్లామీయ బోధనల ప్రకారం దౌర్జన్యం (జులుమ్) అనేది అల్లాహ్ దృష్టిలో క్షమించరాని మహాపరాధం.
దౌర్జన్యం అంటే ఏమిటి?
అరబీలో ’మజాలిమ్’ అంటే అకారణంగా ప్రజలను వేధించడం, ఒకరి ఆస్తిని అక్రమంగా కబళించడం మరియు ఒకరి హక్కులను బలవంతంగా లాక్కోవడం. వివేకవంతులైన విశ్వాసులు అల్లాహ్ హెచ్చరికను గుర్తుంచుకోవాలి: ‘దుర్మార్గులు చేస్తున్న దానిని అల్లాహ్ పట్టించుకోవడం లేదని భావించకండి. ఆయన వారిని శిక్షించే రోజును వాయిదా వేస్తున్నాడు మాత్రమే.‘ ఆనాడు ఏ అధికార బలగం, ఏ సంఖ్యా బలం వారిని రక్షించలేదు.పరలోకంలో శిక్షా రూపం
ప్రవక్త ముహమ్మద్ (సఅసం) హెచ్చరించినట్లుగా, ఈ లోకంలో ఇతరులపై చేసే దౌర్జన్యం ప్రళయదినాన దట్టమైన చీకటిగా మారుతుంది. పీడితుని ఆక్రందనకూ, అల్లాహ్ కీ మధ్య ఎలాంటి అడ్డుతెర ఉండదు. ఒక వ్యక్తి వేరొకరి జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే, ప్రళయదినాన ఏడు భూభాగాల గుదిబండను అతని మెడలో వేయడం జరుగుతుంది. ఇది కేవలం భూమికే కాదు, ఇతరుల మాన మర్యాదలను మంటగలిపేవారికి కూడా వర్తిస్తుంది.అసలైన సహాయం: బాధితునికీ, దౌర్జన్యపరునికీ!
మత సామరస్యం, సామాజిక న్యాయం వెల్లివిరియాలంటే ముస్లింలు తమ తోటి సోదరులకు అండగా ఉండాలి. ప్రవక్త (సఅసం) ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు: ‘మీ సోదరునికి అతను దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తోడ్పడండి. బాధితునికి సహాయం చేయడం అంటే అతనికి న్యాయం జరిగేలా చూడటం. మరి దౌర్జన్యపరునికి సహాయం చేయడం అంటే ఏమిటి? అతను అన్యాయం చేయకుండా అతని చేతిని పట్టుకోవడం, అతన్ని తప్పు నుండి మళ్ళించడం.క్షమ – ప్రాయశ్చిత్తం
ఒక వ్యక్తి చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడేమో కానీ, తోటి మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించే వరకు అల్లాహ్ కూడా క్షమించడు. అందుకే పారలౌకిక విచారణ రాకముందే, ఈ లోకంలోనే బాధితుని వద్ద క్షమాపణ పొంది, వారి హక్కులను తిరిగి చెల్లించాలి. లేదంటే, పుణ్యాలన్నీ బాధితుని ఖాతాలోకి వెళ్లిపోయి పాపాలే మిగిలే ప్రమాదం ఉంది.ఆక్రందనలు అరణ్య రోదనలు కావు
లోకంలో పీడితుల ఆక్రందనలు అరణ్య రోదనలు కావు. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ తప్పక జరుగుతుంది. ఒక విశ్వాసి మరో విశ్వాసికి భవనంలోని ఇటుకల వలె ఒకరికొకరు బలం చేకూర్చుకోవాలి. అప్పుడే సమాజంలో శాంతి, అల్లాహ్ కారుణ్యం లభిస్తాయి. క్షమించడం, సర్దుకుపోవడం అనేది కేవలం బలహీనత కాదు, అది ఒక గొప్ప సాహసం, దృఢ సంకల్పం.
– ముహమ్మద్ ముజాహిద్
భారతదేశం ఎందరో గురుదేవుళ్ల పుణ్యధామం. వారు సమాజంలో జ్ఞాన దీప్తులు వెలిగించారు. అలాంటి వారిలో సుప్రసిద్ధులు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బ్రహ్మంగారి మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో స్వామి చరిత్ర, ఉత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం.
శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి గొప్ప కాలజ్ఞానిగా భూ మండలంపై కీర్తి గడించారు. అంతేకాక ఆయన రాజయోగి, హేతువాది, తత్త్వవేత్తగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. రాబోయే కాలంలో జరిగే విపత్తులపై కాలజ్ఞానం ద్వారా వివరించి.. మానవాళికి ఎన్నో సూచనలు, హెచ్చరికలు చేశారు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కావున మిగతావి కూడా జరుగుతాయని భక్తులు నమ్ముతున్నారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే.. సన్మార్గంలో నడవాలని బోధించారు. ఎన్నో మహిమలు చూపి మహిమాన్వితుడిగా విరాజిల్లారు. కులమతాలను రూపుమాపేందుకు కృషి చేసి సంఘ సంస్కర్తగా పేరు పొందారు. కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్త్వబోధ చేసి జగద్గురువుగా ప్రఖ్యాతి గాంచారు. చివరికి దైవ స్వరూపులుగా వినుతి కెక్కారు. సజీవసమాధి నిష్ట పొంది భక్తులను అనుగ్రహిస్తు న్నారు.
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో నేటి నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
సన్మార్గంలో నడిపించడం కోసం...
మానవులకు జ్ఞాన బోధ చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. తెలుగు నేల నలుచెరగులా సంచరించి బోధనలు చేసి 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. (ఆ ్ర΄ాంతంలోనే ప్రస్తుతం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి క్షేత్రం ఉంది.) నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.ఏటా వేడుకలు
స్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సాతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. ఆరాధనోత్సవానికి ఇంకా పెద్ద ఎత్తున రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు.. మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.ఉత్సవాలు ఇలా..
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రçకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి.అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాదం నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయి.– వడ్ల మల్లికార్జున ఆచార్య, సాక్షి, వైఎస్ఆర్ కడప జిల్లా

ఘనంగా ఏర్పాట్లు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల ఆరాధనోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. వసతి, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.
– శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వాముల వారు, మఠాధిపతులు, బ్రహ్మంగారిమఠం
Politics
తాడేపల్లి : చంద్రబాబు యదేచ్చగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. తమ నాయకుడు వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలను కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈరోజు(గురువారం, ఏప్రిల్ 23వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పుత్తా శివశంకర్.. జగన్ కష్టాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
రెన్యూ సంస్థ జగన్ హయాంలోనే ఏపీలో పెట్టుబడులకు సిద్దమైంది. 2023లో వైజాగ్లో జరిగిన జీఐఎస్ సదస్సులో జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ. జగన్ ప్రభుత్వమే ఆ రెన్యూ సంస్థకు భూములను కూడా కేటాయించింది. అయితే చంద్రబాబు అప్పటి జీవోలను రద్దు చేసి మళ్లీ అదే పేరుతో కొత్తగా ఇచ్చారు. అంటే తానే రెన్యూ సంస్థను తెచ్చినట్లు బిల్టప్ ఇస్తున్నారు.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమన్ సిన్హా సైతం జీఐఎస్ సదస్సులో జగన్ పాలనను మెచ్చుకున్నారు. జగన్ కల్పించిన అవకాశాల వలనే తాము ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్టు కూడా ప్రకటించారు. మీడియా ముందు ప్రకటించటంతో పాటు ట్వీట్ కూడా చేశారు. కానీ జనానికి ఇవేమీ తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. జగన్ కష్టాన్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. రాష్ట్రంలో క్రెడిట్ చోరీ, జగన్ని దూషించటం తప్ప మరేమీ జరగటం లేదు’ అని మండిపడ్డారు.
సాక్షి, విజయనగరం జిల్లా: కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి సర్కార్.. జిత్తులమారి ప్రభుత్వం.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రజలను మోసం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన గజపతినగరంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి కొంతమంది మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు.
సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అమ్మ ఒడి జాడ లేదు. వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదు. ‘‘నేడు గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా?. నేడు పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా?. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే పేదవాడి ఆరోగ్యం ఏమవ్వాలి? నాడు వైఎస్ జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చారు’’ అని బొత్స గుర్తు చేశారు.

