Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్‌ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్‌ సెమీఫైనల్‌కు చేరేది. కానీ తారిఖ్‌ వేసిన 16వ ఓవర్‌ ఐదో బంతికి షనక సింగిల్‌ తీయడంతో లంక స్కోరు 148 పరుగులకు చేరింది. దాంతో పాక్‌ ఆశలు గల్లంతయ్యాయి. ‘గ్రూప్‌ 2’లో పాక్‌కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లంకపై మ్యాచ్‌లో చివరకు 5 పరుగుల తేడాతో గెలిచినా పాక్‌ టోర్నీనుంచి నిష్క్రమించింది.  

    శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, ఫఖర్‌ జమన్‌ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి పోరాడి ఓడింది. కెప్టెన్‌ షనక (31 బంతుల్లో 76 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విరుచుకుపడగా, పవన్‌ రత్నాయకే (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు.  

    ఫర్హాన్, ఫఖర్‌ ధనాధన్‌ 
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్‌లు ధనాధన్‌ ఆరంభమిచ్చారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ పాక్‌ స్కోరును వాయువేగంతో పెంచారు. పవర్‌ప్లేలో 64/0 స్కోరు చేసిన పాకిస్తాన్‌... పదో ఓవర్‌ ముగియక ముందే 100కు చేరుకుంది. ఫర్హాన్‌ 32 బంతుల్లో, ఫఖర్‌ 27 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. 

    ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌ నమోదు చేసిన పాక్‌ 14వ ఓవర్లలోనే 150 పరుగుల మార్క్‌ దాటింది. 16వ ఓవర్‌ వేసిన చమీర ఎట్టకేలకు ఫఖర్‌ను బౌల్డ్‌ చేసి 176 పరుగుల ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. తర్వాత పాక్‌ వికెట్లు పేకమేడలా కూలాయి. నాఫే (2), షాదాబ్‌ (7), నవాజ్‌ (0), కెప్టెన్ సల్మాన్‌ (0) ఇలా వరుసగా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో వైపు 59 బంతుల్లో ఫర్హాన్‌ సెంచరీ పూర్తయింది.  

    ఆశలు రేపిన షనక 
    భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య లంక తడబడింది. నిసాంక (3), మిశార (26), అసలంక (25) వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. దీంతో విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. అయితే రత్నాయకే రాణించగా, కెప్టెన్ షనక అనూహ్యంగా ఆఖరి ఓవర్లో చెలరేగి గెలుపు ఆశలు పెంచాడు. 

    6 బంతుల్లో 28 పరుగుల అసాధ్యమైన సమీకరణం ఉండగా... షాహిన్‌ అఫ్రిది చివరి  ఓవర్లో షనక వరుసగా 4, 6, 6, 6లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టేడియమంతా మునివేళ్లపై నిలబడింది. కానీ ఒత్తిడికి గురైన షనక ఆ రెండు బంతులకు పరుగు తీయలేకపోవడంతో పాక్‌ గెలుపు ఖాయమైంది.  

    స్కోరు వివరాలు 
    పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) లియనాగే (బి) మదుషంక 100; ఫఖర్‌ (బి) చమిర 84; ఖాజా నాఫే (సి) అసలంక (బి) మదుషంక 2; షాదాబ్‌ రనౌట్‌ 7; నవాజ్‌  (సి) తీక్షణ (బి) షనక 0; సల్మాన్‌ (సి) తీక్షణ (బి) షనక 0; ఉస్మాన్‌ నాటౌట్‌ 8; షాహిన్‌ అఫ్రిది (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 4; నసీమ్‌ షా రనౌట్‌ 1; అబ్రార్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–176, 2–179, 3–198, 4–199, 5–199, 6–203, 7–207, 8–210. బౌలింగ్‌: మదుషంక 4–0–33–3, చమిర 4–0–48–1, తీక్షణ 4–0–35–0, షనక 4–0–42–2, వెల్లలాగే 3–0–37–0, లియనాగే 1–0–14–0. 

    శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) నవాజ్‌ (బి) నసీమ్‌ షా 3; మిశార (బి) అబ్రార్‌ 26; అసలంక (బి) అబ్రార్‌ 25; రత్నాయకె (సి) అయూబ్‌ (బి) అఫ్రిది 58; మెండిస్‌ (బి) అబ్రార్‌ 3; లియనాగే (బి) నవాజ్‌ 5; షనక నాటౌట్‌ 76; వెలలాగే నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–8, 2–33, 3–75, 4–94, 5–101, 6–162. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–48–1, నసీమ్‌ షా 4–0–36–1, అబ్రార్‌ 4–0–23–3, ఉస్మాన్‌ 4–0–43–0, నవాజ్‌ 2–0–21–1, షాదాబ్‌ 2–0–33–0.   

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాకిస్తాన్ యువ ఓపెన‌ర్  సాహిబ్జాదా ఫర్హాన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ప‌ల్లెక‌లే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ నుంచే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.

    కేవ‌లం 60 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్‌తో ప‌ర్హాన్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

    ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే
    👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫ‌ర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ  ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫర్హాన్ 383 ప‌రుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.

    👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా షిమ్రాన్ హెట్‌మైర్‌(17)ను ఫ‌ర్హాన్(18) అధిగ‌మించాడు.

    👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శ‌త‌కాలు బాద‌లేదు.

    👉అదేవిధంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓవ‌రాల్‌గా రెండు సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ స‌మం చేశాడు.
     

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పల్లెకలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెన‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

    ఓపెన‌ర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫ‌ఖార్ జ‌మాన్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 176 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు.

    ఫర్హాన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జ‌మాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఓ ద‌శ‌లో పాక్ 250 ప‌రుగుల మార్క్ సునాయ‌సంగా దాటేలా క‌న్పించింది.

    అయితే ఆఖ‌రిలో వికెట్లు కోల్పోవ‌డంతో పాక్ 250 ప్ల‌స్ ప‌రుగులు సాధించ‌లేక‌పోయింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మ‌ధుశంక మూడు, ష‌న‌క రెండు, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు. పాకిస్తాన్ సెమీస్‌కు అర్హ‌త సాధించాలంటే శ్రీలంక‌ను 147 ప‌రుగుల లోపు క‌ట్ట‌డి చేయాలి.
     

  • భారత దేశవాళీ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర  ఆవిష్కృతమైంది. జ‌మ్మూ కాశ్మీర్‌ 67 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ మొట్ట‌మొద‌టి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ను జ‌మ్మూ కాశ్మీర్ కైవ‌సం చేసుకుంది.

    ఫైన‌ల్లో క‌ర్ణాటక‌పై జ‌మ్మూ విజ‌యం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసిన‌ప్ప‌టికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యప‌రంగా జే అండ్ కేను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో జ‌మ్మూ కాశ్మీర్ అంతటా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ నేప‌థ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. 

    అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆట‌గాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివ‌రి రోజు ఆట చూసేందుకు స్టేడియం వ‌చ్చి త‌మ జ‌ట్టును  ఉత్స‌హ‌ప‌రిచారు. ఈ క్ర‌మంలో విజ‌యం సాధించిన అనంత‌రం త‌మ ఆట‌గాళ్ల‌ను అబ్దుల్లా అభినందించారు.

    ఈ ఏడాది సీజ‌న్‌లో జ‌మ్మూ కాశ్మీర్ ప్లేయ‌ర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్ల‌తో ఈ సీజ‌న్ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఫైన‌ల్లో కూడా 5 వికెట్లతో స‌త్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 ప‌రుగుల‌తో జ‌ట్టును ముందుండి న‌డిపించాడు.

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2026 సూప‌ర్‌-8 లో భాగంగా కొలంబో వేదిక‌గా శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్ప‌టికే సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. పాక్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీల‌కం.

    పాక్ తొలుత బ్యాటింగ్ చేయ‌నున్నందున 65 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్‌ను వెన‌క్కినెట్టి పాక్ సెమీస్‌కు అర్హ‌త సాధిస్తోంది. ఈ కీల‌క మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.

    తుది జ‌ట్లు
    పాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

    శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీప‌ర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

  • ఫిబ్ర‌వ‌రి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జ‌మ్మూ అండ్ కాశ్మీర్ త‌మ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదిక‌గా జ‌రిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్‌లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో ఆ జ‌ట్టు పేస‌ర్ ఆకిబ్‌ న‌బీ ధార్‌ది కీల‌క పాత్ర‌. ఈ సీజ‌న్ అసాంతం ఆకిబ్ న‌బీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

    ఈ సీజన్‌లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల న‌బీ త‌న‌ స్వింగ్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి  బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు.

    మొత్తంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి క‌ర్ణాట‌క ఓట‌మిని శాసించాడు.  కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాట‌ర్ల‌ను సైతం న‌బీ బోల్తా కొట్టించాడు. న‌బీ త‌న సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీని సైతం ఆక‌ర్షించాడు.

    రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాల‌ని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

    "ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్‌లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.

    నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్‌లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్‌లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
     

  • ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్‌ చేరేందుకు మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది.

     159 పరుగులు
    కొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (35), ఫిన్‌ అలెన్‌ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్‌ 159 పరుగులు చేయగలిగింది.

    ఆదిలోనే ఎదురుదెబ్బలు
    ఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్‌ డాసన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కివీస్‌ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (2), జోస్‌ బట్లర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (26)ను ఫిలిప్స్‌ తొందరగానే పెవిలియన్‌కు పంపాడు.

    ఆఖర్లో అంతా తలకిందులు
    ఇక జేకబ్‌ బెతెల్‌ (21), సామ్‌ కర్రాన్‌ (24) నిరాశపరచగా.. టామ్‌ బాంటన్‌ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్‌ జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. 

    ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్‌ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్‌లో రెండు సింగిల్‌, ఫోర్‌ బాది పని పూర్తి చేశారు.

    మొత్తంగా జాక్స్‌ 18 బంతుల్లో 32, రెహాన్‌ అహ్మద్‌ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. 

    కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర మూడు, మ్యాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్‌కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోతేనే న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరగలదు.

    వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?
    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్‌ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్‌ స్పిన్నర్‌లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్‌ ఉంటుందా?’’ అంటూ కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు గ్రేమ్‌ స్మిత్‌ చురకలు అంటించాడు.

    చదవండి: T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

  • న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. జ‌న‌వ‌రి 2026 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా మిచెల్ ఎంపికయ్యాడు. గ‌త నెలలో భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో మిచెల్ దుమ్ములేపాడు.

    కివీస్ జట్టు 2-1తో సిరీస్ గెలవడంలో డారిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో అత‌డు ఏకంగా 352 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సెంచ‌రీలు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఫ‌లితంగానే అత‌డికి ఈ ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ద‌క్కింది. 

    భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ అవార్డును మిచెల్ సొంతం చేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన శోభన మోస్తరీ మ‌హిళ‌ల విభాగంలో ఈ అవార్డును ద‌క్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో శోభన అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026కు బంగ్లా క్వాలిఫై కావ‌డంలో ఆమెది కీల‌క పాత్ర‌.

  • టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందా?.. ఫలితంతో సంబంధం లేకుండా అతడిని తొలగించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైందా?.. అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    ఏమాత్రం సంతోషంగా లేరు
    ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ (Mohsin Naqvi)జట్టు ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేరు. ఈసారి పాకిస్తాన్‌ మెరుగ్గా ఆడుతుందని సెలక్టర్లు, యాజమాన్యం ఆయనకు హామీ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా లేవు.

    కెప్టెన్‌ సహా వారిపై వేటు
    ముఖ్యంగా సల్మాన్‌ ఆఘా, బాబర్‌ ఆజం, ఉస్మాన్‌ ఖాన్‌ (Usman Khan)లతో పాటు మరికొంత మంది సీనియర్‌ ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్‌కప్‌ కానుంది. అంతేకాదు వాళ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ఇంతటితో ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ తర్వాత పాకిస్తాన్‌ టీ20 జట్టులో భారీ మార్పులు చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాయి.

    పసికూనలపై గెలిచి
    కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండగా.. తటస్థ వేదికైన లంకలో పాక్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌లతో కలిసి లీగ్‌ దశలో తలపడ్డ పాక్‌.. టీమిండియా చేతిలో మాత్రమే ఓడింది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి గ్రూప్‌-ఎలో టీమిండియా తర్వాతి స్థానాన్ని ఆక్రమించి.. సూపర్‌-8కు చేరుకుంది.

    లంకపై భారీ తేడాతో గెలిస్తేనే
    అయితే, కీలక సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షార్ఫణం కాగా.. ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. దీంతో శనివారం నాటి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పక భారీ విజయం సాధిస్తేనే పాకిస్తాన్‌ సెమీస్‌ చేరుకుంటుంది. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆసాంతం పాక్‌ సీనియర్‌ ఆటగాళ్లు పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. దీంతో వారి కెరీర్‌ ముగించేలా పీసీబీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

    చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?

  • జమ్మూ కశ్మీర్‌ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

    అసాధారణ విజయాలతో
    దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో జమ్మూ కశ్మీర్‌ అసాధారణ విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్‌ రేసులో నిలిచింది.

    ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్‌ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్‌ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగులు సాధించింది.

    సమిష్టిగా రాణించిన బ్యాటర్లు
    యావర్‌ హసన్‌ (88), కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (70), అబ్దుల్‌ సమద్‌ (61), కన్హయ్య వాధవాన్‌ (70), సాహిల్‌ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్‌ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.

    చెలరేగిన ఆకిబ్‌ నబీ
    స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (13) విఫలం కాగా.. మరో సీనియర్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్కాల్‌ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్‌ గోపాల్‌ (27), కృతిక్‌ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్‌ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

    అజేయ సెంచరీల సాక్షిగా 
    ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్‌.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్‌గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్‌ కమ్రాన్‌ అక్మల్‌ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్‌ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్‌గా నిలిచాడు.

    సాహిల్‌ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్‌ కెప్టెన్‌ పారస్‌ డోగ్రా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్‌ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.

    సీఎం అభినందనలు
    పారస్‌ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్‌, సాహిల్‌ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్‌కు అందించాడు.  కాగా సాహిల్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. 

    చదవండి: IND vs WI: విండీస్‌ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?

     

    ఇక జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్‌ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ సైతం ఈ చారిత్రాత్మక​ ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్‌తో పాటు కశ్మీర్‌ జట్టును అభినందించారు.
     

  • న్యూఢిల్లీ: పురుష సామర్థ్యమున్న స్త్రీలు మహిళల విభాగంలో పోటీపడకుండా ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్షతో అడ్డుకట్ట వేయాలని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్ణయించింది. ఇందులో జీవసంబంధమైన లింగనిర్ధారణలో అమ్మాయి అని తేలితేనే పోటీకి అనుమతిస్తారు. ఇందులో పురుషులకు వుండే వై క్రొమోజోముల ప్రభావం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల విభాగంలో అనుమతించరు.

    ఇటీవల ఏఎఫ్‌ఐ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ (EC) సమావేశంలో ఎస్‌ఆర్‌వై జన్యు పరీక్ష తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో జరిగే అన్ని పోటీల్లో ఈ పరీక్ష చేయాలని ఏఎఫ్‌ఐ నిర్ణయించింది. ముందుగా ఈ జూలై 24 నుంచి 28 వరకు జరిగే జాతీయ ఇంటర్‌–స్టేట్‌ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎస్‌ఆర్‌వై జన్యుపరీక్షను అమలు చేయనున్నట్లు ఏఎఫ్‌ఐ తెలిపింది.  

    ఎందుకీ పరీక్ష... ఏమిటీ ‘ఎస్‌ఆర్‌వై’ ?
    జన్మతః అమ్మాయిగా పుట్టినప్పటికీ చాలా అరుదుగా కొందరు స్త్రీలలో పురుష సామర్థ్యం అసహజంగా ఉంటుంది. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఇలా జరుగుతుంది. దీనివల్ల సదరు స్త్రీ సాటి స్త్రీలకంటే పురుషుడి సామర్థ్యం కలిగి ఉంటుంది. 

    దీంతో పోటీల్లో పైచేయి సాధిస్తుంది. ఎస్‌ఆర్‌వై అంటే పురుషుల్లో ఉండే వై క్రొమోజోముల్ని బట్టి నిర్ధారించే లింగ పరీక్ష (SRY gene test). ఈ టెస్టు మహిళలకు చేస్తే జన్మతః కాకుండా జీవసంబంధమైన లింగ నిర్ధారణ బయటపడుతుంది. 

Movies

  • ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా హనీ, అక్యూజ్జ్, హాట్ స్పాట్ 2 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు, రోస్లిన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలానే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్'.. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి మరో తెలుగు సినిమా కూడా వచ్చి చేరింది.

    (ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

    'స్కూల్ లైఫ్' పేరుతో తీసిన తెలుగు మూవీ.. గతేడాది నవంబరు 28న అంటే మూడు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చింది. సుమన్, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం.. కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉండేసరికి ఇదొకటి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.

    'స్కూల్ లైఫ్' విషయానికొస్తే.. 1990ల్లో రాయలసీమలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. స్కూల్ లవ్ స్టోరీతో మొదలై.. అక్కడి ప్రాంత ప్రజల మధ్య కులం, కుటుంబ గౌరవం, పగ తదితర అంశాలు ఎలాంటి పాత్ర పోషించాయి. ప్రేమతో మొదలై పగతో ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా స్టోరీ. పులివెందుల మహేశ్ అనే కుర్రాడు.. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.

    (ఇదీ చదవండి: రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్)

  • ప్రీ వెడ్డింగ్ పార్టీ కోసం అందంగా అల్లు స్నేహ

    ఫిబ్రవరి జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్న సమంత

    మెరుపుల చీరలో రచ్చ లేపుతున్న ధనశ్రీ వర్మ

    కాటన్ చీరలో మరింత అందంగా హెబ్బా పటేల్

    వెబ్ సిరీస్ జ్ఞాపకాలతో 'రాజాసాబ్' బ్యూటీ రిద్ధి

    హాలీవుడ్ బొమ్మలా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్

  • కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్‌ చేస్తున్నారని వాపోయింది నటి రేణూ దేశాయ్‌. తనపై ఇంత ద్వేషం ఎందుకని మండిపడింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. 2012లో నాకు విడాకులైనప్పటినుంచి నా గురించి రకరకాలుగా కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. భరణం తీసుకున్నానని, నా వ్యక్తిగత జీవితం గురించి, ఏ రాజకీయ పార్టీకి బానిస అని.. ఇలా రకరకాలుగా తిడుతూనే వచ్చారు. 

    నేను రానన్నాను
    ఇక నాపై కామెంట్స్‌ చేసేందుకు ఏం మిగల్లేదు అనుకున్నాను. అది తప్పని అర్థమైంది. జనవరిలో కుక్కల కోసం ఓ ప్రెస్‌మీట్‌లో కూర్చున్నాను. నిజానికి అప్పుడు కూడా నేను ప్రెస్‌మీట్‌కు రాననే చెప్పాను. నేను ఏం మాట్లాడినా తిడతారే తప్ప ఎటువంటి సమాధానం దొరకదు అని చెప్పాను. కానీ, కొన్ని ఎన్జీవోలు నన్ను రమ్మని మరీమరీ అడిగారు. వందలాది కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. మీరు కచ్చితంగా మాట్లాడాలన్నారు. అంత పెద్ద సంఖ్యలో కుక్కల్ని చంపేస్తుంటే నాకూ బాధేసింది.

    నానా బూతులు తిట్టారు
    అందుకే ప్రెస్‌మీట్‌కు వచ్చాను. వంద కుక్కల్లో పది పిచ్చి కుక్కలుంటాయి. ఆ పదింటికోసం 90 మంచి కుక్కల్ని చంపొద్దన్నాను. అందులో ఏం తప్పు మాట్లాడాను? నేను చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా దాన్ని వక్రీకరిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. నన్ను నానా బూతులు తిట్టారు. నేనేదైనా సినిమా చేస్తే మీ యాక్టింగ్‌ బాలేదు అని చెప్పండి.. తప్పుపట్టను. కానీ, నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం దేనికి? 

    అందుకే అంత కోపం
    ఇష్టమొచ్చిన బూతులు తిట్టడం ఏం సంస్కారం? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మీ ఇంట్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు మీరు ఎటువంటి కామెంట్స్‌ పెడుతున్నారో చూపించండి. ప్రెస్‌మీట్‌లో ఎవరో తెలియని వ్యక్తి లోపలకు వచ్చి దున్నపోతు అని తిట్టాడు. అందుకే కోప్పడ్డాను. అది అర్థం చేసుకోకుండా నాకు రేబిస్‌ వచ్చింది అంటూ దారుణమైన పదజాలంతో దూషించారు. ఒక ఘోరమైన కామెంట్‌ చూసి నేను చాలా షాకయ్యాను. 

    కుక్కల వల్ల హాని
    ఈ పిచ్చికుక్కలు రేణూదేశాయ్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ను కరిస్తే తనకు ఆ బాధేంటో తెలుస్తుంది అన్నారు. ఇదేం భాష? ఆ ఆలోచనలు ఏంటి? మీ అమ్మానాన్న మిమ్మల్ని ఏం సంస్కారంతో పెంచారో నాకర్థం కావడం లేదు. ఆడమగ తేడా లేకుండా అందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుక్కల వల్ల ఎవరికైనా హాని కలుగుతుంటే వాటి బెడద ఎక్కువగా ఉందని మీ కార్పొరేటర్‌తో, మీ ఎమ్మెల్యేతో పోరాడండి. అంతే తప్ప మీకు నన్ను తిట్టే హక్కు లేదు.

    నేనేం చేశా?
    ఏదో ఒక రోజు ఈ తిట్ల దండకం ఆపేస్తారులే అని అంతా భరించాను. కానీ, మొన్న కులాల మధ్య గొడవలో ఒక బిడ్డ ప్రాణం పోతే నన్నే తిడుతున్నారు. ఇందులో నా ప్రమేయం ఎక్కడుంది? ఇక భరించడం నా వల్ల కాదు. ఎక్కడైనా బూతు కామెంట్స్‌ కనిపించాయంటే మీ ఇంటివరకు వస్తాను. మీ అమ్మానాన్న, అక్కచెల్లెళ్లకు మీరు పెట్టిన బూతుల కామెంట్‌ చూపించి ఇదేనా మీరు నేర్పిన సంస్కారం అని అడుగుతాను.

    బండబూతులు తిట్టండి
    నేను కాశీకి వెళ్లినందుకు కూడా విమర్శించారు. నిండుగా ధరించిన దుస్తులు వేసుకున్న ఫోటో షేర్‌ చేస్తే కూడా రాత్రికి రేటెంత? అని అడిగారు. బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారు? నన్ను తిడితే మీకొచ్చే ప్రయోజనం ఏంటి? ఒక పని చేద్దాం.. నేను పబ్లిక్‌ ముందు వచ్చి కూర్చుంటాను. నన్ను, నా పేరెంట్స్‌ను, పిల్లల్ని అందర్నీ బండబూతులు తిట్టండి. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏదైనా ఒక ప్రాణం నిలబడుతుందా? చెప్పండి. మీకు దమ్ముంటే మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేని బూతులు తిట్టండి అని రేణూ దేశాయ్‌ ఆగ్రహించింది.

     

     

    చదవండి: కాస్ట్‌లీ హీల్స్‌ ధరించిన నిక్కీ..  ఆ చెప్పుల ధర వేలల్లో కాదు!

  • హిట్, లక్కీ భాస్కర్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా చేసిన శ్రీనాథ్ మాగంటి.. 'యానిమల్' మూవీలో రష్మికకు సోదరుడిగానూ యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఇతడు హీరోగా నటించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే 'మెన్షన్ హౌస్ మల్లేష్'. మార్చి 06న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా తాజాగా సందీప్ రెడ్డి వంగా చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది అలరించేలా ఉంది.

    (ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

    తెలంగాణలోని ఓ ఊరిలో మల్లేష్ అనే కుర్రాడు. మందు తాగుతూ అవారాగా తిరుగుతుంటాడు. మారుతాడనుకుని ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. మల్లేష్‌కి అతడి భార్యతో ఎలాంటి బంధం ఏర్పడింది అనేదే స్టోరీలా అనిపించింది. ట్రైలర్‌లోనే మూవీ ప్లాట్ ఏంటనేది దాదాపుగా బయటపెట్టేశారు. చూడాలి మరి థియేటర్లలో ఎలాంటి టాక్ అందుకుంటుందో?

    (ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

  • 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్‌పై ఫోకస్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. లేటెస్ట్‌ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్‌ చేసి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

    గోవా ట్రిప్‌
    తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్‌కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్‌ పొట్టి డ్రెస్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్‌పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్‌ డాల్స్‌ అండ్‌ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన చెప్పులు.

    చెప్పుల ధర ఎంతంటే?
    ఆ హీల్స్‌ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్‌ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్‌ పటేల్‌ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్‌ ధర రూ.75 వేలు, సీరమ్‌ రూ.50 వేలు అని తెలిపాడు.

     

     

    చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్‌ శెట్టి

  • ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో మూకీ చిత్రం తీశారంటే సాహసమనే చెప్పొచ్చు. తాజాగా అది జరిగింది కూడా. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో 'గాంధీ టాక్స్' అనే మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి కూడా తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్ర తెలుగు స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

    (ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

    శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి మార్చి 06 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇది మూకీ సినిమానే కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. భావాన్ని అర్థం చేసుకోవచ్చు.

    'గాంధీ టాక్స్' విషయానికొస్తే.. ముంబైలోని ధారావిలో ఉండే పేదకుర్రాడు మహాదేవ్ విష్ణు(విజయ్ సేతుపతి). మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా, ప్రేమించిన అమ్మాయి(అదితీ రావు హైదరీ) దక్కాలన్నా ఈ జాబ్ కీలకం. దీంతో ఆ డబ్బు కోసం ఓ తప్పుడు పనికి సిద్ధపడతాడు. ఇదే ముంబైలో బోస్‌మన్ (అరవింద స్వామి)ది మరో కథ. బిజినెస్‌మ్యాన్ అయినప్పటికీ ఘోరమైన నష్టాలొచ్చి రోడ్డున పడతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ ఆలోచన చేస్తాడు. ఇంతకీ అదేంటి? విష్ణు, బోస్‌మన్ జీవితాలని డబ్బు ఎలా కలిపింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి గుజరాతీ హిట్ సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

  • ఈ ఏడాది సంక్రాంతికి 'అనగనగ ఒక రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్న సితార నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాదిలో పలు చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటి 'వింటారా సరదాగా'. మహేశ్ మేనల్లుడు అశోక్ హీరో కాగా శ్రీ గౌరీప్రియ హీరోయిన్. పూర్తిగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి 'అనగాఅనగా అమెరికా' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది వినసొంపుగా ఆకట్టుకుంటోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

    ఉద్భవ్ అనే నటుడు.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమెరికాలో ఉంటున్న తెలుగు యువతీయువకుడు ప్రేమలో పడటం, తర్వాత జరిగే పరిస్థితులు నేపథ్యంగా మూవీ తీసినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.

    (ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

  • మంచు మనోజ్‌ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా హుషారుగా ఉంటాడు. చాలా ఓపెన్‌గా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతాడు. తన చేష్టలు, మాటలతో చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తుంటాడు. కానీ తాజాగా అయన అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చాడు. మెప్పు కోసం అప్పులు చేయొద్దదంటూ యువతకు విలువైన సలహా ఇచ్చాడు. తాజాగా ఆయన ఓ యూనవివర్సీటీలో జరిగిన ఈవెంట్‌కు అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుందని.. వాడే వస్తువుల వల్ల రాదని చెప్పారు.  

    పాతఫోన్‌కు కొత్త కవర్‌
    ఈ సందర్భంగా మంచు మనోజ్‌ ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నాడు.  అదేంటంటే.. మనోజ్‌ ఇప్పటికీ పాత ఐఫోన్‌నే వాడుతున్నాడు.కానీ దానికి  iPhone 17 Pro Max కవర్ వేసి మ్యానేజ్‌ చేస్తున్నాడు.  ఆ ఫోన్‌ను చూపిస్తూ.. ఇతరుల మెప్పు కోసం అప్పులు చేసి విలాసాలకు వెళ్లవద్దని యువతకు సూచించారు. డబ్బు వృథా చేయకుండా ఉన్నదానితో తృప్తిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

    మనోజ్‌ సినిమాల విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘డేవిడ్‌ రెడ్డి’అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో మనోజ్‌ బ్రిటిష్‌ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరా డిన యోధుడు డేవిడ్‌ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా పీరియాడిక్‌ మూవీని నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి నిర్మిస్తున్నారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. మారియా ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తున్నారు.

  • సామజవరగమన, సింగిల్ లాంటి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న హీరో శ్రీ విష్ణు నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'విష్ణు విన్యాసం'. పెద్దగా బజ్ లేకుండానే శుక్రవారం(ఫిబ్రవరి 27) థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచి దీనికి గొప్ప టాక్ అయితే రాలేదు. చూసినవాళ్లు కూడా పెదవి విరుస్తున్నారు. అయితేనేం తొలిరోజు కళ్లుచెదిరే కలెక్షన్స్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. మొదటిరోజు వసూళ్ల పోస్టర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

    శ్రీ విష్ణు, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని కామెడీ కథతో తీశారు గానీ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు. కానీ తొలిరోజు రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ వదిలారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ టా‌క్‌తో పాటు కలెక్షన్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికైతే థియేటర్లలో వేరే మూవీస్ ఏం లేకపోవడం దీనికి కలిసి రావొచ్చు.

    'విష్ణు విన్యాసం' విషయానికొస్తే.. విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాల పిచ్చి ఎక్కువే. వాస్తు బాలేదని పక్కింటి ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటేసినా పెళ్లి చేసుకోడు. ఇతడిని చూసిన తొలిచూపులోనే మరో లెక్చరర్‌ మనీషా(నయన్ సారిక) ప్రేమలో పడుతుంది. ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యే ముందు మనీషా.. ఓ నిజం చెబుతుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషా పెళ్లి చేసుకున్నారా? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

  • బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమారుడు అహాన్‌ శెట్టి నటించిన తాజా చిత్రం "బోర్డర్‌ 2". అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇంతటి ఘన విజయం అందుకున్న ఈ సినిమాను ఇంతవరకు చూడలేదంటున్నాడు సునీల్‌ శెట్టి.

    మాట మీదే ఉన్నా..
    రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాతే బోర్డర్‌ 2 చూస్తానంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్‌ శెట్టి మాట్లాడుతూ.. ఇది దేశభక్తి సినిమా.. కచ్చితంగా ఇది రూ.500 కోట్లు దాటాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేవరకు నేను వేచి చూస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇప్పుడీ సినిమా రూ.489 కోట్ల కలెక్షన్స్‌ వరకు చేరుకుంది. మరో రూ.11 కోట్లు వస్తే నేను అనుకున్న నెంబర్‌ దాటేస్తుంది. 

    సినిమా
    అప్పుడే ఈ మూవీ చూస్తాను. చాలాసార్లు సినిమా చూడాలనుకున్నాను, థియేటర్‌ వరకు వెళ్లాను. అహాన్‌ ఇంట్లో ప్రాక్టీస్‌ చేసిన డైలాగులను థియేటర్‌లో చెవులారా వినాలనుకున్నాను. కానీ నన్ను నేను తమాయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 1997లో వచ్చిన బోర్డర్‌ సినిమాకు సీక్వెల్‌గా బోర్డర్‌ 2 తెరకెక్కింది. ఇందులో సన్నీడియోల్‌, వరుణ్‌ ధావన్‌, దిల్జిత్‌ దోసాంజ్‌, మోనా సింగ్‌, సోనమ్‌ బజ్వా, అన్య సింగ్‌, ప్రణవ్‌ వశిష్ట్‌, మేధ రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    చదవండి: ప్రేయసికి బ్రేకప్‌ చెప్పలేదని హీరోని మార్చేశారా?

  • తిరుమల కొండపై కొందరు యూట్యూబర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. రీల్స్ పిచ్చిలో పడి డ్యాన్సులు వేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ వీళ్ల పద్ధతి మాత్రం అస్సలు మారడం లేదు. తాజాగా 'బిగ్‌బాస్' ఫేమ్ గీతూ రాయల్ అయితే గుడి ముందే సినిమా పాటలకు స్టెప్పులేసింది. వాటిని రీల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం కాస్త ఇప్పుడు వివాదాస్పదమైంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

    రీసెంట్‌గా తన నలుగురు స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన యూట్యూబర్ గీతూ.. ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్స్ దగ్గర డ్యాన్సులు చేసింది. వాటిని వీడియోగా చేసి ఇన్ స్టాలో రీల్ అప్‌లోడ్ చేసింది. దీంతో ఈమెపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు రీల్‌ని డిలీట్ చేసింది. తాజాగా ఈమెపై టీటీడీ చర్యలకు కూడా సిద్ధమైంది. అదే విషయాన్ని చెబుతూ మరో వీడియో పోస్ట్ చేసింది. అయితే ఈమె.. ఏకంగా గుడి ముందే డ్యాన్సులు చేస్తుంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    'అందరికీ ఒక గుడ్ న్యూస్. నా మీద చర్యలు తీసుకుంటారట. ఇక హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను. పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా మీరు తీసేసి సంతోషంగా ఉండండి' అని గీతూ తన లేటెస్ట్ వీడియోలో చెప్పుకొచ్చింది.

    తిరుమల కొండపై రూల్స్ పాటించాలని టీటీడీ పదేపదే చెబుతోంది. శ్రీవారి ఆలయం దగ్గర కూడా మైక్‌లో ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు పట్టించుకోవట్లేదు. టీటీడీ నిబంధనల ప్రకారం.. కొండపై రాజకీయ ప్రసంగాలతో పాటు రీల్స్ చేయడం, ఫొటోషూట్స్ చేయడం లాంటివి నిషిద్ధం. అయినా సరే గీతూ రాయల్ లాంటి యూట్యూబర్లు.. సరదా కోసమో వ్యూస్ కోసమో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తీరా చర్యలకు సిద్ధమైతే గానీ తాము రూల్స్ అతిక్రమించామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి ఈమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: తిరుమల దర్శన వివాదం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ శివానీ నాగరం)

  • ఎవర్ గ్రీన్ జానర్ అయిన లవ్ డ్రామాకు వినోదాన్ని జోడిస్తూ, హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఒక ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సరికొత్త కథాంశంతో, యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శనివారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు. ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ చిత్రంలో యువ జంట జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్ తో పాటు సీనియర్ నటులు దేవీ  ప్రసాద్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లక్ష్మణ్ మీసాల,  పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

    ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ..సినిమా అంటే నాకు ఒక కల, ఒక బాధ్యత. అందుకే నా మొదటి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. యువత మనసు దోచుకునే ప్రేమ కథతో పాటు, ప్రతి కుటుంబం ఆస్వాదించే వినోదం మా చిత్రంలో ఉంటుంది. నాణ్యమైన నిర్మాణ విలువలతో, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. భవిష్యత్తులో మా బ్యానర్ నుండి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఇది పునాది లాంటిది’ అని పేర్కొన్నారు.

    దర్శకుడు రఘువర్ధన్ కోట్ల మాట్లాడుతూ, త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, టైటిల్‌ను అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

  • బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ కెరీర్‌ పరంపర (1993) సినిమాతో మొదలైంది. అయితే దీనికంటే ముందు సైఫ్‌ బేకుడి చిత్రంతో పరిచయం కావాల్సి ఉంది. కానీ గర్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్తేనే సినిమా ఛాన్స్‌ అని డైరెక్టర్‌ కండీషన్‌ పెట్టాడని, దానికి సైఫ్‌ నిరాకరించాడని, దాంతో ఈ సినిమా అతడి చేజారిందని ప్రచారం జరిగింది.

    అసలేం జరిగిందంటే?
    దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ విషయంపై బేకుడి దర్శకుడు రాహుల్‌ రవాలి స్పందించాడు. ఆనాడు అసలేం జరిగిందనే విషయాలను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. గర్ల్‌ ఫ్రెండ్‌ ఉందన్న కారణంతో సైఫ్‌ అలీఖాన్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. 

    అప్పుడలా...
    షూటింగ్‌కు సరిగా వచ్చేవాడే కాదు. దానివల్ల నేను ఒత్తిడికి లోనయ్యాను. యాక్టింగ్‌ బాగా చేస్తాడు, కానీ షూటింగ్‌కు రాకుండా చిరాకు తెప్పించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ తనలో చాలా మార్పు వచ్చింది అని చెప్పుకొచ్చాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ విషయానికి వస్తే.. ఆషిక్‌ ఆవారా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 

    సినిమా
    మై ఖిలాడీ తు అనారి, ఏక్‌తా రాజా, హమేశా, కీమత్‌: దే ఆర్‌ బ్యాక్‌, కచ్చే ఢాగే, దిల్‌ చహతా హై, డర్నా మానా హై, హమ్‌ తుమ్‌, ఓంకార, లవ్‌ ఆజ్‌ కల్‌, తానాజీ ఇలా అనేక సినిమాలు చేశాడు. దేవర: పార్ట్‌ 1 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం హైవాన్‌, హమ్‌ హిందుస్తానీ సినిమాలు చేస్తున్నాడు.

    చదవండి: ఎవరెంత రెచ్చగొట్టినా అలాగే ఉంటా: దీపికా పదుకొణె

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా. ఓ భాషలో అద్భుతమైన సక్సెస్ చేసుకున్న ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అలా గతేడాది గుజరాతీలో తీసిన ఓ డివోషనల్ మూవీ.. బంపర్ బ్లాక్‌బస్టర్ అయింది. రూ.50 లక్షల బడ్జెట్‪‌తో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూకీ సినిమా)

    గుజరాతీ సినీ ఇండస్ట్రీలో తొలి రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమా 'లాలో-కృష్ణ సదా సహాయతే'. గతేడాది అక్టోబరు 10న రిలీజ్ కాగా.. నవంబరు 28న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. లాంగ్ రన్‌లో కళ్లు చెదిరే కలెక్షన్ అందుకుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం సృష్టించింది. దీనికి కారణం కథలోని బలం.

    2019లో గుజరాతీలో రిలీజైన 'చాల్ జీవీ లాయియే' చిత్రం రూ.50 కోట్ల వసూళ్లు సాధించగా.. 'లాలో' సినిమా దాన్ని అధిగమించేసింది. రూ.100 కోట్ల ఘనత సాధించిన తొలి గుజరాతీ మూవీగా నిలిచింది. కృష్ణుడి లీలలు చూపించే బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అంకిత్ సఖియా దర్శకుడు. రీవా రచ్, శ్రుహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ, గుజరాతీ భాషల్లోనే చూడొచ్చు.

    'లాలో-కృష్ణ సదా సహాయతే' విషయానికొస్తే.. లాలో పాత్రధారి ఓ ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. ఆ ఆధ్యాత్మిక చింతనలో ముక్తి మార్గంవైపు నడుస్తాడు. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ)

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె వరుసగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంటూనే ఉంది. స్పిరిట్‌, కల్కి 2 నుంచి దీపికా సైడ్‌ అయిన విషయం తెలిసిందే! తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ది వైట్‌ లోటస్‌లో యాక్ట్‌ చేసే అవకాశాన్ని కూడా వదిలేసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది.

    హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి అవుట్‌
    ది వైట్‌ లోటస్‌ నాలుగో సీజన్‌ కోసం మేకర్స్‌ దీపికను సంప్రదించారట! అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించాలంటే ఆడిషన్‌ తప్పనిసరి అని టీమ్‌ చెప్పిందట. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న తనకు ఆడిషన్‌ ఏంటన్న భావనతో దీపికా ఈ ఛాన్స్‌ను వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ పెట్టింది. 

    అరవడం పెద్ద విషయం కాదు
    ప్రశాంతంగా ఉండటమే అన్నింటికంటే గొప్ప వరం. సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడటం పెద్ద విషయం కాదు. దానికి ఎటువంటి శక్తి, బలం అవసరం లేదు. కానీ ఎన్ని గందరగోళ పరిస్థితులు తలెత్తినా ఏమాత్రం చలించకుండా ఉండటంలోనే అసలైన బలం దాగి ఉంది. మన చుట్టూ ఎంత డ్రామా జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని మనల్ని రెచ్చగొడుతున్నా స్థబ్ధుగా, ప్రశాంతంగా ఉండాలి, భావోద్వేగాలను బయటకు కనిపించనివ్వకూడదు. 

    ఎప్పుడూ ఏదో ఒక గొడవ
    ఎంతో కృషి చేస్తే తప్ప ఇదంతా సాధ్యం కాదు. ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. అదొక శక్తి. మనమేంటనేది ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి స్పందించాల్సిన పని అంతకన్నా లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలు, వివాదాలు, అర్థంపర్థం లేని విషయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో మనం వాటికి చలించకుండా కూల్‌గా ఉండటమే అన్నింటికంటే పెద్ద సూపర్‌ పవర్‌ అని దీపికా పదుకొణె రాసుకొచ్చింది.

    చదవండి: హీరోలు రిజెక్ట్‌ చేశారు.. వాళ్ల వల్లే: తాప్సీ

  •  సినిమా పరిశ్రమలో పైరసీ అనేది దశాబ్దాలుగా పరిష్కారం కాని కీలక సమస్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రకంగా సినిమా బయటకు వచ్చేస్తుంది. ఇలా థియేటర్‌లో బొమ్మ పడుతుందో లేదో అలా పైరసీ కాపీ నెట్టింట్లోకి వచ్చేస్తూ.. నిర్మాతలకు కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పుడిప్పుడే పైరసీ కాస్త తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో టాలీవుడ్‌ హీరో శ్రీవిష్ణు షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టాడు. నిన్న రిలీజ్‌ అయిన తన కొత్త సినిమా డిసెంబర్‌లోనే లీక్‌ అయిందని చెప్పి పెద్ద బాంబు పేల్చాడు. షూటింగ్‌ పూర్తి కాకముందే సినిమా లీక్‌ అయిందట. అందుకే హడావుడిగా షూటింగ్‌ పూర్తి చేసి..త్వరగా రిలీజ్‌ చేయాల్సిన వచ్చిందని శ్రీవిష్ణు చెప్పాడు.

    ఆయన హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(ఫిబ్రవరి 27) రిలీజ్‌ అయింది. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడు పైరసీ విషయాన్ని వెల్లడించాడు.

    ఎలా జరిగిందో తెలియదు
    ‘మా సినిమాను సడెన్‌గా రిలీజ్‌ చేయడానికి గల కారణం ఏంటంటే.. డిసెంబర్‌లో ఈ సినిమాను లీక్‌ చేశారు. ఎలా జరిగిందో తెలియదు. ఓ రోజు ఉదయం నిర్మాత ఫోన్‌ చేసి చెప్పడంతో షాక్‌ అయ్యాడు. దానిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా టీమ్‌ అంతా షాక్‌లో ఉండిపోయాం. షూటింగ్‌ ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది బయటకు చెబితే వేరే విధంగా వెళ్తుంది. రీల్ రీల్ కోసం కూడా మా నిర్మాతని బ్లాక్ మెయిల్ చేశారు. రిలీజ్‌కి ముందు రోజు వరకు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. అయినా కూడా నిర్మాత ధైర్యంగా నిలబడి ఈ సినిమాను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్‌కి మాకు కేవలం 10 రోజులు మాత్రమే దొరికింది. మొత్తానికి పైరసీ బయటకు రాకుండా చేసి ఈ సినిమాను రిలీజ్‌ చేశాం’ అని శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.

    వాట్సాప్‌ చూసి షాకయ్యా : నిర్మాత 
    నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఓ రోజు నాకు తెలిసిన పర్సన్‌ నాన్‌ స్టాఫ్‌గా కాల్‌ చేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 9 గంటలకు నేను ఫోన్‌ లిఫ్ట్‌ చేశా. వాట్సాప్‌ చూస్కో అని చెప్పాడు. చూస్తే.. సినిమా పస్టాఫ్‌ అంతా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు.చాలా టెన్షన్‌ పడ్డా. నా కూతురు పెళ్లి చేయాలి. కొడుకుని సెట్‌ చేయాలి. ఇదంతా నా కళ్లముందు గిర్రున తిరిగింది. కాసేపటికి గుండె నిబ్బరం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న నా కొడుకుకి ఫోన్‌ చేసి చెప్పా. ఎలా జరిగిందో ఆరా తీస్తే.. మా యూనిట్‌ నుంచే వెళ్లినట్లు తెలిసింది. లాక్‌ వేసుకోకపోవడంతో ఈ లీకేజీ జరిగింది. ఎవరు పంపారో తెలియదు కానీ.. పెద్ద డ్యామేజ్‌ జరిగింది. ఫోన్‌ నెంబర్ల ద్వారా ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో తెలుసుకొని.. డిలీట్‌ చేయించాం. ఈలోపు ఛాంబర్‌లో కూడా ఫిర్యాదు చేశాం. చెన్నై నుంచి లీక్‌ అయిన విషయం తెలిసి.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ జరుగుతుంది. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని అన్నారు. 

     

  • చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా కీలకపాత్రలో వెంకటేశ్‌ నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు... మీ జీ తెలుగులో, జీ5లోనూ అందుబాటులో ఉండనుంది. శనివారం సాయంత్రం మీ ఇంట్లోనే బుల్లితెరపై చిరంజీవి హిట్‌ సినిమాను కుటుంబ సమేతంగా చూసేయండి.

    చిరంజీవి హీరోగా నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్‌ మేకర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ హై–యాక్షన్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ థియేట్రికల్‌ రన్‌లో భారీ వసూళ్లు సాధించి, ప్రశంసలు అందుకుంది. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ గ్రాండ్‌ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 శనివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి.

    ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఫిబ్రవరి 11 నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫాం జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. షైన్‌ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. శంకర వరప్రసాద్‌ పాత్రలో చిరంజీవి కనిపించగా, నయనతార, వెంకటేశ్‌ దగ్గుబాటి, కేథరిన్‌ ట్రెసా, సచిన్‌ ఖేడేకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం, సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది.

    హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు, నవ్వులు పూయించే కామెడీ, థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో అన్ని వయసుల ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాకేజీగా ఈ చిత్రం నిలిచింది. డిజిటల్‌ వేదికపై కూడా సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రం జీ5లో సంచలనాత్మకంగా 500 మిలియన్‌ స్ట్రీమింగ్‌ నిమిషాలను సాధించి ప్రేక్షకాదరణను మరింతగా చాటుకుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని జీ5, జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూసేయండి!  మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకర వరప్రసాద్‌ గారు’... జీ5లో ఫిబ్రవరి 11 నుంచి, వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో మిస్‌ కాకుండా చూసేయండి!  

Business

  • సూపర్‌ మార్కెట్‌ చైన్‌ కంపెనీ విశాల్‌ మెగా మార్ట్‌లో సమయత్‌ సర్వీసెస్‌ తాజాగా 14 శాతం వాటా విక్రయించింది. పీఈ దిగ్గజం కేదార క్యాపిటల్, స్విట్జర్లాండ్‌ కంపెనీ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసిన ఎస్‌పీవీ ఇది. షేరుకి రూ. 117 సగటు ధరలో 13.96 శాతం వాటాకు సమానమైన 65.25 కోట్ల షేర్లను అమ్మివేసింది.

    వీటి విలువ దాదాపు రూ. 7,636 కోట్లుకాగా.. విశాల్‌లో సమయత్‌ వాటా 54.09 శాతం నుంచి 40.13 శాతానికి దిగివచి్చంది. ఈ నేపథ్యంలో విశాల్‌ మెగా మార్ట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమై రూ. 118 వద్ద ముగిసింది.

  • రేమండ్ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మరో ఫెరారీ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కుడి చేతి డ్రైవ్ 'ఫెరారీ 296 స్పెషలే'. భారతదేశంలో కూడా ఇది మొదటి మోడల్ కావడం గమనార్హం. దీని ధర రూ.6.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).

    కారు డ్రైవ్ చేస్తున్న వీడియోను గౌతమ్ సింఘానియా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఫెరారీ 296 స్పెషలే (Ferrari 296 Speciale) అద్భుతమైన డిజైన్, గొప్ప పనితీరును అందిస్తుందని అభివర్ణించారు.

    ఫెరారీ 296 స్పెషలే
    ఫెరారీ 296 స్పెషల్ అనేది 296 GTB ట్రాక్ ఫోకస్డ్ వెర్షన్. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 3.0 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. దాదాపు 880 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రియర్ వీల్ డ్రైవ్ ఫెరారీలలో ఒకటిగా నిలిచింది.

    ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ విద్యుత్ శక్తితో మాత్రమే తక్కువ దూరాలను కూడా అనుమతిస్తుంది. ఈ కారు 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని స్పీడ్ గంటకు 330 కి.మీ కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

  • దాదాపు అందరూ భారతదేశంలోని హైవేలపై ప్రయాణించి ఉంటారు. ఆ సమయంలో మీకు అక్కడక్కగా తెల్ల రంగు అక్షరాలతో.. ఆకుపచ్చ రంగు సైన్ బోర్డులను చూసి ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా?, జాతీయ రహదారులపై ఇలాంటి రంగులోనే సైన్ బోర్డులు ఎందుకు అమర్చారో!. బహుశా దీనిగురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.

    డైరెక్షన్ & గైడెన్స్
    భారతదేశంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు & ప్రధాన జిల్లా రహదారులపై డైరెక్షన్ & గైడెన్స్ సైన్‌లు ఆకుపచ్చ రంగుపై తెల్ల రంగు అక్షరాలతో ఉంటాయి. ఇవి నగరాలు, ఎగ్జిత్, జంక్షన్లు & రూట్ నెంబర్‌లను చూపుతాయి. వేగంగా వెళ్లేవారు కూడా వీటిని వెంటనే గమనించగలరు. పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ఈ రంగు సైన్‌లను సులభంగా చదవాలనే ఉద్దేశ్యంతో ఐఆర్సీ ఈ రంగు సైన్‌లను నిర్దేశించింది.

    సేఫ్టీ & విజిబిలిటీ
    ఆకుపచ్చ బోర్డుపై తెల్లని అక్షరాలు ఉండటం వల్ల దూరం నుంచి కూడా సులభంగా కనిపిస్తుంది. పగలు మాత్రమే కాకుండా.. రాత్రి సమయంలో కూడా బోర్డులు స్పష్టంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ/తెలుపు కలయిక అనేది డ్రైవర్లు ముఖ్యమైన దిశాత్మక వివరాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆకస్మిక లేన్ మార్పులు లేదా చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి తగ్గిస్తుంది.

    రోడ్డు రకాల గుర్తింపు
    డ్రైవర్లు తాము ఎలాంటి రోడ్డుపై ఉన్నామనే విషయం తెలుసుకోవడంలో కలర్ కోడింగ్ పనికొస్తుంది. ఇవి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను మార్గాలను సూచిస్తాయి. అయితే పట్టణ లేదా నగర రోడ్లపై సంకేతాలు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి డ్రైవర్లు తాము ఏ వేగంతో ప్రయాణించాలో ముందుగానే అంచనా వేసుకోవచ్చు. దీనిద్వారా భద్రత & అవగాహన పెరుగుతుంది.

    ప్రశాంతత
    ఇతర రంగులతో పోలిస్తే గ్రీన్ కలర్ ప్రశాంతతను ఇస్తుంది. అయితే హైవేపై ఉన్న కలర్ గురించి ట్రాఫిక్ కోడ్‌లలో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ ట్రాఫిక్ డిజైన్ రీసెర్చ్ ప్రకారం.. గ్రీన్ కలర్ తటస్థమైనది. కాబట్టి హైవేపై పసుపు, ఎరుపు రంగు కాకుండా గ్రీన్ కలర్ ఎంచుకున్నారు. డైవర్లు లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు.. గ్రీన్ కలర్ చూస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.

    భారతీయ ప్రమాణాలు
    ఆకుపచ్చ రంగు హైవే సంకేతాలు భారతీయ ప్రమాణాలను (IRC:67-2022) అనుసరిస్తాయి. రాష్ట్రాలు & ఎక్స్‌ప్రెస్‌వేలలో రూట్, దూర సమాచారం కోసం ఆకుపచ్చను స్థిరంగా ఉపయోగించడం ద్వారా, వివిధ ప్రాంతాలు లేదా నేపథ్యాల నుంచి వచ్చిన డ్రైవర్లు సహా, త్వరగా డీకోడ్ చేయగలరని & గందరగోళం లేకుండా సంకేతాలకు ప్రతిస్పందించగలరని ట్రాఫిక్ అధికారులు నిర్ధారిస్తారు.

    ఇదీ చదవండి: ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

  • ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం మొదలుపెట్టేశాయి. దీంతో పెట్టుబడిదారుల్లో భయం పెరిగిపోయింది. ఈ తరుణంలో అందరూ సురక్షితంగా భావించే బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు.. దేశంలోని ఏ నగరంలో ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి రూ. 1,68,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 6550 పెరిగి రూ. 1,54,650 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఉన్నాయి.

    చెన్నైలో కూడా ధరలు పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,69,640 (రూ. 7090 పెరిగింది). 22 క్యారెట్ల రేటు రూ. 1,55,500 (రూ. 6500 పెరిగింది) వద్ద ఉంది.

    ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 7140 పెరిగి, రూ. 1,68,860 వద్ద నిలిచింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 6550 పెరిగి రూ. 1,54,800 వద్ద నిలిచింది.

    వెండి ధరలు
    బంగారం బాటలోనే వెండి అన్నట్లు.. వెండి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 3.20 లక్షలు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 2.95 లక్షల వద్ద నిలిచింది.

    ఇదీ చదవండి: అమెరికాను విడిచిపెడుతున్న లక్షలాది మంది ప్రజలు!

  • నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారు హరిత భవనాలపై ఆసక్తి చూపుతున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యకరంగా ఉంచే ఈ భవనాలకు ప్రస్తుతం ఆదరణ పెరిగింది. కాస్త ఖరీదైనా వీటివైపే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో

    స్వచ్ఛమైన గాలి, వెలుతురుతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌర శక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)కి అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్‌ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు.

    నిత్యావసరాలకు వినియోగించే నీటిని బయటకు పంపకుండా వాటిని రీసైకిల్‌ చేసి మొక్కలు, బాత్‌రూమ్‌ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది.

    అదనపు వ్యయం రెండేళ్లలో వాపస్‌..
    ఈ భవనాల్లో నిత్యం నీరు, విద్యుత్‌ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్‌ మెటీ రియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్‌ బిల్డింగ్స్‌ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్‌ వరకు గ్రీన్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు.

  • ఏడాది క్రితం ఒక డాలర్‌కు రూ.85 వచ్చేవి.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.92 వచ్చే పరిస్థితి.. అంటే ఏడాదిలో 4.29 శాతం పెరిగింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి ప్రవాసులు ఇక్కడ పెట్టుబడి కోసం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాకపోతే అనుకున్న వెంటనే పెట్టుబడి పెట్టగలిగేది, దీర్ఘకాలంలో లాభాలిచ్చేది స్థిరాస్తి రంగమే కావటంతో ఇటువైపు చూస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఎన్‌సీఆర్‌(ఢిల్లీ), బెంగళూరు, హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

    ప్రవాసులకు టైమొచ్చింది.. పెట్టుబడి అనగానే ఎన్‌ఆర్‌ఐ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌)లకు ముందుగా గుర్తొచ్చేది మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లే.. ఆ తర్వాతే స్థిరాస్తి, బంగారం వంటివి. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయన్నది కాదనలేని వాస్తవం. దీంతో రియల్టీ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. డాలర్‌ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణంగా ఎన్‌ఆర్‌ఐలు భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు.

    రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
    భారత స్థిరాస్తి రంగం బూమ్‌లో ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ) వ్యక్తులు భాగస్వాములే.. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, కెనడా, ఆ్రస్టేలియా, పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ప్రవాసుల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎన్‌ఆర్‌ఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

    ఎన్‌ఆర్‌ఐలు కొనాలంటే..
    ఎన్‌ఆర్‌ఐల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్‌ఈఎంఏ) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి(పీఐఓ) దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే కొనుగోళ్లలో పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్‌ ప్రాపర్టీలను మాత్రం కొనుగోలు చేసే వీలు లేదు. వీటి కొనుగోళ్లకు ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. బహుమతి లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ప్రాపర్టీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల ద్వారా కొనుగోళ్లు భారత రూపాయిలలో జరుగుతాయి. ప్రవాసులు కొనుగోలు చేసే ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను మినహాయింపు(టీడీఎస్‌) 12.5 శాతం, స్వల్పకాలిక మూధన లాభాలు 30 శాతం మినహాయింపు ఉంటుంది.

    విక్రయించాలనుకుంటే..
    ఫెమా నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ సొంత ఆస్తి, వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని దేనినైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్‌ఆర్‌ఐకి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్‌ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకుంటే మాత్రం కేవలం స్థానికులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతర ఎన్‌ఆర్‌ఐ లేదా భారత సంతతికి గానీ గిఫ్ట్‌గా అందించవచ్చు. అలాగే ప్రవాసులకు అద్దె ఆదాయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.

    హైదరాబాద్‌లో ప్రవాసుల పెట్టుబడులు..
    అమెరికా, ఆ్రస్టేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్‌లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. 

    విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకే ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.

    కొనేముందే పరిశీలించాలి

    • యాజమాన్య హక్కులు, పత్రాలు, టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి.

    • స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాలి. నీరు, విద్యుత్‌ వంటి బిల్లులు చెల్లించారో లేదో పూర్తిగా పరిశీలించాలి.

    • కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్‌ టైటిల్స్‌ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీలను తీసుకున్నారా లేదా గమనించాలి.

    నిర్మాణంలో ఉంటే.. 
    నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీఓఏ)ను ఇవ్వాల్సిందిగా డెవలపర్‌ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్‌ చేసుకోవడం మంచిది. సులభతరం కూడా.. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్‌కు గానీ మార్ట్‌గేజ్‌కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని డిస్పోజల్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాదీనం, అగ్రిమెంట్‌ వంటి విషయంలో పీఓపీ ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.

    శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.

    నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతున్న షాడో వార్‌ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధశత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో చూద్దాం.

    శత్రుత్వానికి పునాదులు

    రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. ఇరాన్‌లో రాజు మహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాధినేత పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. షా తన రహస్య పోలీసు దళంతో తనపై వ్యతిరేక స్వరాలను అణచివేసేవారు. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరిగింది. దేశంలో చమురు సంపద పెరిగినప్పటికీ, అది సామాన్య ప్రజలకు చేరడం లేదని, కేవలం సంపన్నులకే లాభం చేకూరుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్‌ను అమెరికా తొలగించి షాను గద్దెనెక్కించడంపై ఇరానియన్లలో తీవ్ర వ్యతిరేకత ఉండేది.

    అప్పటి విప్లవం ఎలా జరిగింది?

    ఈ విప్లవంలో ప్రధాన నాయకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ.. షా విధానాలను విమర్శించినందుకు ఆయనను 1964లో దేశం నుంచి బహిష్కరించారు. తాను ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పంపేవారు. 1978లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. సైన్యం ప్రజలపై కాల్పులు జరిపినా ఉద్యమం ఆగలేదు. పరిస్థితి చేజారిపోవడంతో 1979 జనవరిలో షా పహ్లవీ దేశం విడిచి పారిపోయారు. 1979 ఫిబ్రవరిలో ఖొమేనీ ఇరాన్ చేరుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన రెఫరెండం ద్వారా ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది.

    విప్లవం తర్వాత ఏం జరిగింది?

    దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ (మత పెద్ద) చేతిలోనే తుది నిర్ణయ అధికారం ఉండేలా రాజ్యాంగం మారింది. 1979 నవంబర్‌లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖొమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.

    ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్‌ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్ (గాజా), హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్) వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలున్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది.

    అణు బాంబు భయం

    ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.

    అమెరికా ఎందుకు మధ్యలోకి వచ్చింది?

    పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే, అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి.

    చమురు సంక్షోభం

    ఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం.

    ప్రాంతీయ ఆధిపత్యం

    ఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది.

    అణ్వాయుధ నియంత్రణ

    ఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.

    తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని కొందరు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు

  • కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్‌ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్‌ అవసరం. ముఖ్యంగా ఫోన్‌ పనిచేయాలంటే ఛార్జింగ్‌ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్‌ ఎప్పుడు పుట్టిందో తెలుసా?

    ప్రారంభ కాలంలో ఫోన్‌ ఛార్జ్‌ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్‌సంగ్‌ ఫోన్‌ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్‌కు వాడే ఛార్జర్‌ మరొక ఫోన్‌కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.

    ఆ తర్వాత యూఎస్‌బి (యూనివర్సల్‌ సీరియల్‌ బస్‌) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్‌ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్‌ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్‌ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్‌కు వైర్‌లెస్‌గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.  2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్‌లెస్‌ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.

    చాలామంది ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్‌ షాక్‌ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్‌ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్‌ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్‌లో 100 శాతం ఛార్జింగ్‌ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు. 

  • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారం ఇరాన్ పై దాడి చేపట్టినట్లు సమాచారం వెలువడిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా విలువైన లోహాల మార్కెట్లు ఉత్కంఠకు గురయ్యాయి. సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండి వంటి లోహాలపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

    టెహ్రాన్‌పై పగటి వేళ జరిగిన అరుదైన దాడి నేపథ్యంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయనే ఆందోళనతో పెట్టుబడిదారులు రక్షణాత్మక ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు.

    ఎంసీఎక్స్‌లో రికార్డు స్థాయిలు
    మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు గణనీయంగా ఎగశాయి. ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు సుమారు రూ.1,60,399 వద్ద ట్రేడ్ అయ్యాయి. మార్చి డెలివరీ సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు సుమారు రూ.2,67,600కు చేరాయి.

    దేశీయ స్పాట్ మార్కెట్లో కూడా బంగారం రూ.1.60 లక్షల మార్క్‌కు, వెండి రూ.2.68 లక్షల మార్క్‌కు చేరువ కావడం మార్కెట్ ఒత్తిడిని ప్రతిబింబిస్తోంది.

    ధరల పెరుగుదల వెనుక కారణాలు
    విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ర్యాలీకి పలు కారణాలు ఉన్నాయి.  మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత స్వర్గధామ ఆస్తుల వైపు నెట్టాయి. యుఎస్ డాలర్ బలహీనత ఇతర కరెన్సీల హోల్డర్లకు బులియన్‌ను చౌకగా చేస్తూ డిమాండ్ పెంచుతుంది. ద్రవ్యోల్బణం, అస్థిరతకు రక్షణగా ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మద్దతిస్తోంది.

    వెండి విషయానికి వస్తే, ఇది సురక్షిత ఆస్తిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగపడుతోంది. టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వినియోగం పెరగడం వెండికి నిర్మాణాత్మక మద్దతు ఇస్తోంది.

    ఇకపై ఏం జరగనుంది?
    మార్కెట్ వ్యూహకర్తల దృష్టి ఇప్పుడు రెండు అంశాలపై నిలిచింది. అవి ఒకటి  ఉద్రిక్తతలు మరింత విస్తరించి ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతాయా? రెండోది దౌత్య ప్రయత్నాలు ఉద్రిక్తతలను చల్లార్చుతాయా?

    యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారీ బంగారం ధరలు పెరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఉద్రిక్తతలు తగ్గినా లేదా డాలర్ బలపడినా బులియన్ ధరల్లో తాత్కాలిక వెనకడుగు సంభవించే అవకాశముంది. అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

International

  • అమెరికా​-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా​-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ రైట్‌ హ్యాండ్‌ జనరల్‌ అలీ ఖంబాని హతం కాగా,  ఇరాన్‌కు చెందిన పలువురు సినియర్‌ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.

    ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని టార్గెట్‌ చేశామని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. మరోవైపు, దాడుల్లో సుప్రీం లీడర్‌  ఆయతొల్లా ఆలీ ఖమేని చనిపోయాడంటూ ఇజ్రాయెల్‌ మీడియాలో వార్తలు వస్తుండగా.. తమ సుప్రీం లీడర్‌ సురక్షితంగా ఉన్నారని ఇరాన్‌ ఆర్థిక మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా వెనిజెవెలా అధ్యక్షుడు మదురో మాదిరిగా పట్టుకునేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా జల్లెడ పడుతోంది. 1979లో రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి ఇరాన్‌లో ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం.. దాన్ని అణచివేసేందుకు ఖమేనీ నేతృత్వంలోని ఐఆర్‌జీసీ బలగాల దమనకాండ.. వేల మంది మరణాల నేపథ్యంలో.. ట్రంప్ టెహ్రాన్‌పై దాడికి దిగారు. ప్రస్తుత పరిణామాలు, జియోపాలిటిక్స్ ఈక్వేషన్లు అంచనా వేసినట్లుగానే జరుగుతున్నాయి.

    మదురోను అరెస్టు చేసిన సమయంలో అమెరికా తన నౌకదళాన్ని ఎక్కువగా వాడుకుంది. అదే సమయంలో సైబర్ ఎటాక్‌లు చేసింది. ఇప్పుడు కూడా అమెరికాకు చెందిన యుద్ధ విమానాల వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ జలాల సమీపంలోకి రావడంతో.. ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది.

    ఇరాన్ పౌరులు కూడా ఖమేనీ శకాన్ని ఖతం చేయాలంటూ భీష్మించుకోవడం.. లక్షల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు కలిసివచ్చింది. నిజానికి 2012లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తాము యురేనియం కడ్డీని తయారు చేశామని ప్రకటించినప్పటి నుంచే అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పుడు టెహ్రాన్‌లో ప్రజాందోళనలు అమెరికాకు కలిసివచ్చాయి. ఇదే అదనుగా ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వాదనలు ఉన్నాయి.

    వాస్తవానికి ఇరాన్-అమెరికా వివాదాలు, దాడులు-ప్రతిదాడులు గత ఏడాది నుంచి మొదలయ్యాయి. గత ఏడాది జూన్ 21 అర్ధరాత్రి దాటాక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఆ మర్నాడే ఇరాన్ ప్రతీకార దాడి చేసింది. ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే.. ఆ దాడి గురించి ఇరాన్ తమకు ముందుగానే సమాచారం అందించిందని అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాహాటంగా చెప్పారు. ఫలితంగా తాము ఇరాన్ క్షిపణులను సమర్థంగా ఎదుర్కొన్నట్లు వివరించారు. 2020లో ట్రంప్ ఇదే తరహా దాడులు చేయించారు.

    ఆ ఏడాది జనవరి 3న ఇరాక్‌లోని బగ్దాద్ విమానాశ్రయం సమీపంలో.. కుద్స్‌ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ లక్ష్యంగా దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇరాక్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న అల్-అసద్ వైమానిక స్థావరంపై విరుచుకుపడింది. అప్పట్లో కూడా ఇరాన్ ముందస్తుగా సమాచారం ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఈ దాడులతో అమెరికా సైనికులకు ప్రాణనష్టం జరగకున్నా.. అప్పట్లో అక్కడ పనిచేసిన సైనికులు ఇప్పుడు అదే ట్రామాలో కొనసాగుతూ మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారనే నివేదికలు వచ్చాయి.

    గతంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పుడు దాడులు-ప్రతిదాడుల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టమవుతోంది. అమెరికా సైనిక శక్తి విషయంలో బలంగా ఉంది. ఇరాన్ ఆ విషయంలో చాలా వెనుకబాటులో ఉంది. అయితే.. బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలో ఇరాన్ గడిచిన మూడేళ్లలో చాలా పురోగతి సాధించింది. అయితే.. సొంత ప్రజలే వ్యతిరేకంగా ఉండడంతో.. ఇరాన్ సర్కారు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని, కొన్ని ప్రాంతాలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందంటూ ఇటీవల నివేదికలు వచ్చాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులు నేపథ్యంలో ఖమేనీ ఇప్పటికీ టెహ్రాన్‌లోనే ఉన్నాడా? లేక వేరే దేశంలో తలదాచుకుంటున్నాడా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

  • మేం ఇప్పటికి వరకు పాత ఆయుధాలే వాడాం.. కొత్త ఆయుధాలు ప్రయోగిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తట్టుకోలేరంటూ ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్‌.. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ హెచ్చరించింది. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేము ముగిస్తామన్న ఇరాన్.. ప్రతీకారం దారుణంగా ఉంటుందని తెలిపింది. వేలాది మంది సైనికులు మరణించారని ఇరాన్‌ ప్రకటించింది.

    కాగా, అమెరికాను కొట్టగల మిసైళ్లను ఇరాన్‌ సిద్ధం చేస్తోందన్న ట్రంప్‌.. అందుకే అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందన్నారు. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులు అంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్ మద్ధతుతోనే హామాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇరాన్‌లో ఉన్న నరహంతక నాయకత్వాన్ని అంతం చేస్తాం. ఇరాన్ నావికా దళాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ట్రంప్‌ హెచ్చరించారు.

    అమెరికా బేస్‌ క్యాంప్‌లే లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తోంది. బహ్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్‌ దాడి చేసింది. ఒకేసారి 10 దేశాలపై మిస్సైళ్లను ఇరాన్‌ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, కువైట్‌, సౌదీ, అబుదాబి, ఖతార్‌, జోర్డాన్‌, యూఏఇ, ఇరాక్‌, దుబాయ్‌పై ఇరాన్‌ దాడులకు దిగింది. దాబాయ్‌ టార్గెట్‌గా దాడులు చేస్తోన్న ఇరాన్‌..  ఆ దేశంపై వరుసగా మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో బుర్జ్‌ ఖలిఫాను అధికారులు ఖాళీ చేయించారు.

    అమెరికా​-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇరాన్‌లో నాయకత్వ మార్పుదిశగా అమెరికా​-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించాయి. సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్నాయి. ఖమేనీ పరిస్థితిపై స్పష్టత లేదు. ఆయన రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ రైట్‌ హ్యాండ్‌ జనరల్‌ అలీ ఖంబాని హతం కాగా, ఇరాన్‌కు చెందిన పలువురు సినియర్‌ కమాండర్లు మృతిచెందినట్లు సమాచారం.

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. మినాబ్‌లోని స్కూల్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది.  ఈ దాడిలో 50 మందికిపైగా విద్యార్థులు మృతి చెందారు. ఇవాళ ఉదయం(శనివారం) ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌, అమెరికా తీరుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. వరల్డ్‌ ఆర్డర్‌ను మార్చేలా అమెరికా నాయకత్వం వ్యవహరిస్తోందంటూ మాస్కో మండిపడింది. ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో సుప్రీం లీడర్‌ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.

    బాంబు దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు చేపట్టిందన్న ట్రంప్.. అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అరికట్డడానికే దాడులంటూ ఆయన తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు మళ్లీ తయారు చేస్తోందన్న ట్రంప్‌.. అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండడం వల్లే ఈ దాడులంటూ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి ‍ప్రారంభించింది. బాలిస్టిక్‌ మిసైళ్లతో ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఒకేసారి ఇరాన్‌ 10 దేశాలపై మిస్సైళ్లు ప్రయోగించింది.

    కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు నేపథ్యంలో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్‌ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేశారు. ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పశ్చిమాసియాకు వెళ్తే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. పశ్చిమాసియా ఘర్షణలతో  ఎయిరిండియా విమానం వెనక్కి తిరగొచ్చింది.
     

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్  భీకర దాడులు  పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు  రాజేశాయి.  ఈ దాడుల్లో భాగంగా టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో అమీర్ హతామి మరణించారని ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామి మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియ నివేదించింది, అయితే టెహ్రాన్‌లోని అధికారులు మరణాన్ని ధృవీకరించ లేదు.

    ఇరాన్ రాజధానిలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా ఫిబ్రవరి 28న దాడులు చేసింది. దీంతో టెహ్రాన్ అంతటా పేలుళ్లతో అట్టుడికింది దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయి. మరోవైపు ఈ దాడులపై బాలిస్టిక్‌ మిస్సైళ్ల దాడులతో ఇరాన్‌ ఎదురు దాడికి దిగింది.  ఈ దాడుల పరిమాణం చాలా తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌ హెచ్చిరించింది. ఇందులో భాగంగానే అమెరికా నేవీ స్థావరాలను టార్గెట్‌ చేసింది. గల్ఫ్‌లోని బహ్రెయిన్‌ తదితర అమెరికా స్థావరాలను లక్ష్యంగా  దాడులను ముమ్మరం చేసింది. దీంతో పాటు యుఎఇలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్‌లలో పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇరాన్ ఆర్మీ కమాండర్-ఇన్-చీఫ్ అమీర్ హతామి చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ లేదు. 

    మేజర్ జనరల్ హోదాలో ఉన్న హతామి, మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి పదోన్నతి పొందిన తర్వాత గత ఏడాది జూన్ 14 నుండి ఈ పదవిలో పనిచేస్తున్నారు. జూన్ 2025లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో మొహమ్మద్ బాఘేరి హత్య తర్వాత కమాండర్-ఇన్-చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు.  

    ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం

  • ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడులు ప్రారంభించిన తర్వాత  ఇరాన్‌  కూడా కౌంటర్‌ దాడులను మొదలు పెట్టింది. నార్త్‌ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌  ఎదురుదాడులకు దిగింది.  35కు పైగా దాకా బాలిస్టిక్‌ మిస్సైళ్ల దాడులును ప్రారంభించింది. 

    అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా టెహ్రాన్ సిద్ధమవుతోందని, ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. యుద్ధం మీరు ప్రారంభించారు, ఊహించని రీతిలో ముగింపు  తాము  పలుకు తామంటూ ఇరాన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. టెహ్రాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.

     

  • Israel Attack Iran ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై  అనేక నగరాల్లో “ముందస్తు” వైమానిక దాడులను ప్రారంభించింది.రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఈ  అమెరికా దాడులను ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధృవీకరించారు. 

    ఇరాన్ అణు కార్యక్రమంపై తాజా చర్చలతో తాను "సంతోషంగా లేను" అని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్‌ బెదిరింపులను నిలువరించేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హోమ్ ఫ్రంట్ కమాండ్ పౌరులను రక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉండాలని, బైటికి రావద్దని ఆదేశాలు జారీ చేశాయి.ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షాలలో పేలుళ్లు సంభవించాయని, టెహ్రాన్‌లోని రెండు ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయని దీంతో నగర కేంద్రంలో  దట్టమైన  పొగ కమ్ముకుందని పలు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. 

    అప్రమత్తంగా ఉండండి
    ఈ దాడుల నేపథ్యంలో ఇండియా అక్కడి భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక  జారీ చేసింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ అధికారులు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు ,సూచనలను భారతీయ పౌరులు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. 
     

National

  • టీవీకే పార్టీ అధ్యక్షుడు, అగ్రహీరో దళపతి విజయ్‌కు మరో బ్యాడ్‌ న్యూస్‌ తప్పదా. భార్య సంగీతసోర్నలింగంతో విడాకుల వార్తల మధ్య, మరో ఎదురు దెబ్బ తగలనుందా? తమిళనాట సీఎం కావాలని కలలు కంటున్న విజయ్‌ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్కుడి సంచలన అంచనాలు వైరల్‌గా మారాయి. ఏమిటా అంచనాలు? ఈ కథనంలో తెలుసుకుందాం. 

    తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ, అందులోనూ   విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను  విజయ్‌ ఇమేజ్‌కు కళంకంగా మారింది.

    ఇదీ చదవండి : ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

    27 నంబరు గండం
    నటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసింది  మొదలు  వరుస కష్టాలు  తప్పడం లేదు.   మరీ ఆయన జీవితంలో27 నంబరు కలిసి రావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా

    తమిళనాడులోని కరూర్ జిల్లాలో విజయ్ పార్టీ (TVK) సభ సందర్బంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది.  ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్  27న జరిగింది.

    భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసిన ఫిబ్రవరి 27న వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బందం సంక్షోభంలో పడింది.

    ఇటీవలి చిత్రం జన నాయగన్ ఆలస్యం , కోర్టు పోరాటం తర్వాత, విజయ్ భార్య  విడాకుల కోసం దాఖలు చేయడంతో,  విజయ్  కష్టాలు అంతులేనివిగా కనిపిస్తున్నాయి. 

    ఇది చాలదన్నట్టు దళపతి విజయ్ భవిష్యత్తుపై  జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురుదెబ్బ తగులుతుందని అంచనా వేశారు. 

    ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం


     

    జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్‌గా మారింది. “2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు. కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన  ఉనికి   చాటుకుంటాడు అంతే….!! ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు….!! (sic).”

    మరొక పోస్ట్‌లో,  “దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు….!!  అని పేర్కొన్నాడు. ఎం. జి.రామచంద్రన్,  జయలలిత మాదిరిగానే చరిత్ర పునరావృతం కావచ్చని వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.

  • రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా  ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.

    అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది  14  ఏళ్ల  సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్‌’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.

    ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

    భారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్,  (ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్‌ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తోపాటు టైప్‌ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని  కేంద్రం తెలిపింది. 

    ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం


     

  • న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాన సానుభూతి తెలిపారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

    కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుని 23 మంది వరకూ మరణించారు. ఆ ప్రమాద సమయంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

    ఇవీ చదవండి

    వేట్లపాలెంలో భారీ పేలుడు.. భారీ ప్రాణనష్టం

    వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

  • భువనేశ్వర్‌ : ఒడిశాలో 23 ఏళ్ల మహిళ హత్యాచార ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన  ప్రియుడు  ఆమెపై అత్యాచారం చేసి వదిలేశాడు. ఆ తరువాత  సాయం చేస్తానని చెప్పి నమ్మించిన మరో అగంతకుడు ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  స్థానికంగా తీవ్ర ఆందోళన రేపిన హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    పోలీసుల సమాచారం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకుందామని బాధితురాల్ని ప్రియుడు నమ్మించాడు. దీంతో  ఫిబ్రవరి 22న ఆ మహిళ తన ఇంటి నుండి పారిపోయింది. అయితే ప్రియుడు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి రహమా బస్ స్టాండ్‌లో వదిలేశాడు.  ఒంటరిగా ఉన్న ఆమెను చూసి జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకొని సాయం చేస్తానని నమ్మించి ‍ ఆమెను పారదీప్ పట్టణంలోని అద్దెకు తీసుకున్న వసతి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. చివరికి బాధిత మహిళను నాలుగు అంతస్తుల భవనం పైకప్పు నుండి తోసేశాడు. ఆ మహిళ మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం గుర్తించామని  జగత్సింగ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ కుమార్ వర్మ తెలిపారు. బాధితురాలి సోదరుడు ఫిబ్రవరి 25న పారదీప్ మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరు నిందితులను  అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు.   

    ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

    బిజు జనతాదళ్ (BJD) అధినేత మాజీ ముఖ్యమంత్రి  నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్రంగా స్పందించారు. మైనర్లు, వికలాంగుల సహా ఎవరికీ రాష్ట్రంలో రక్షణ లేదంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయని ప్రశ్నించారు. పట్టపగలు కూడా భయానక వాతావరణం నెలకొంది. ఇటువంటి దారుణాలు పదేపదే జరుగుతున్నా కనీస చర్యలు లేవనీ, అసలు రాష్ట్రంలో పాలన ఉందా అని ఆయన మండిపడ్డారు. అంగుల్‌లోని కనిహాన్, సంబల్‌పూర్‌లోని కుచిండా , పారాదీప్ ప్రాంతాల నుండి వస్తున్న దుశ్చర్యల వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

    ఇదీ చదవండి: కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..18 మంది సజీవ దహనం

Telangana

  • హైదరాబాద్‌: తెలంగాణలోని శారదాఫీఠం భూముల అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో జలమండలికి భూ కేటాయింపులు రద్దు చేశారు. 

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సీఎం రేవంత్‌ సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిర్మాణాల తాజా స్థితిని తెలియజేయనందుకు అధికారులపై రేవంత్‌ ఫైర్‌ అయినట్లు సమాచారం. 

    కాగా, 2019లో తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి  అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని, ఇది ఆ పీఠం విజ్ఞప్తి మేరకే జరిగినట్లు తెలుస్తోంది.

    బీఆర్‌ఎస్‌ ధ్వజం
    శారదా పీఠం భూములు అంశానికి సంబంధించి రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇక దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారంటూ హరీష్‌ రావు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్లం లేదా అంటూ ప్రశ్నించారు. 

Family

  • దిండు లేకుండా నిద్ర పోవడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గి గ్లాకోమా తీవ్రత తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా శాశ్వత అంధత్వానికి దారితీసే కారణాలలో గ్లాకోమా ఒకటి. దీనికి ప్రధాన కారణం కంటిలో ఉండే అధిక ఒత్తిడి దృష్టి నరాన్ని దెబ్బతీయడం. 

    ఎత్తైన దిండ్లు లేదా ఒకటి కంటే ఎక్కువ దిండ్లను వాడటం వల్ల మెడలోని జుగులార్‌ వెయిన్‌పై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి ద్రవం సరిగ్గా బయటకు వెళ్లలేక, కంటి లోపల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి దృష్టి నరాన్ని (ఆప్టిక్‌ నెర్వ్‌)ప్రభావితం చేస్తుంది. ఇది గ్లాకోమా రావడానికి కారణం అవుతుంది. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆప్తమాలజీలో ప్రచురించిన ప్రకారం, ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 144 మంది గ్లాకోమా రోగులను పరీక్షించారు. కూర్చున్నప్పుడు, రెండు దిండ్లతో పడుకున్నప్పుడు, దిండు లేకుండా పడుకున్నప్పుడు వారి కంటి లోపల ఉండే ఒత్తిడిని ప్రతి రెండు గంటలకు ఒకసారి 24 గంటల΄ాటు పరిశీలించారు. దిండ్లతో తల ఎత్తుగా పెట్టి పడుకున్నప్పుడు, దాదాపు మూడింట రెండు వంతుల మంది రోగులలో కంటిలో ఒత్తిడి పెరిగినట్లు వారు గమనించారు. యువకులు, ప్రైమరీ ఓపెన్‌–యాంగిల్‌ గ్లాకోమా ఉన్నవారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు.  

    ఈ ఫలితాలు  ప్రాథమికమైనవే అయినప్పటికీ, గ్లాకోమా ఉన్నవారు తాము నిద్రించే విధానంలో జాగ్రత్త వహించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 

     

  • కోపం వలన గుండె సంబంధిత జబ్బులు రావచ్చని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. చిన్నపాటి కోపమైనా సరే అది రక్తనాళాలను ప్రభావితం చేయడం వల్ల రక్తప్రసరణపై ప్రభావం పడి గుండెపోటు లేదా స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.

    నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆధునిక జీవన శైలి వలన ఇప్పటికే పలు రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. సీటులో నుంచి కదలకుండా ఒకేచోట స్థిరంగా కూర్చోవడం, నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి కారణాల వలన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అనుకోకుండా వచ్చే కోపం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

    కేవలం ఎనిమిది నిమిషాల పాటు ఉండే కోపం అనే భావోద్వేగం వల్ల రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోతుంది. అంతే కాదు కేవలం 8 నిమిషాల పాటు వచ్చే కోపం వలన దాని ప్రభావం 40 నిమిషాల వరకు ఉంటుందని గుర్తించారు. దీనితో పాటు ఎక్కువ కోపంగా ఉండటం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.

    పరిశోధనలో అసలేం తెలుసుకున్నారు?
    అమెరికాలోని వివిధ సంస్థల నిపుణులు చేసిన పరిశోధనలో దాదాపు 300 మంది ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్దవయస్సు వారిని ఎనిమిది నిమిషాల పాటు కోపంగా ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతూ అధ్యయనం చేశారు. దీని ద్వారా వారు పొందిన ఫలితాలను బట్టి ఈ అధ్యయనం చేశారు. అయితే, విచారం లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు గుండె ఆరోగ్యంపై ఇలాంటి ప్రభావాన్ని చూపలేదు.

    కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే...
    బాగా కోపం వచ్చినప్పుడు లోతుగా డీప్‌ బ్రీత్‌ తీసుకోవడం లేదా 10 వరకు అంకెలు లెక్కపెట్టడం బెటర్‌. 
    కోపం కలిగించే వ్యక్తులకు, పరిస్థితులకు దూరంగా ఉండాలి.
    రెగ్యులర్‌గా వాకింగ్, ఎక్సర్‌సైజ్‌ చేయండి.
    రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు మంచి నిద్ర, విశ్రాంతి అవసరం.  
    స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
    ధ్యానం లేదా యోగా రెగ్యులర్‌గా చేయడం అలవాటు చేసుకోవాలి. 
    మీ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ మేనేజ్‌ చేసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి. 

    చ‌ద‌వండి: ముప్పై ఏళ్ల‌కే ఎముక‌లు గుల్ల‌బారుతున్నాయి 

Politics

  • సాక్షి, తాడేపల్లి: కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా వంటి వరుస ఘటనల సాక్షిగా చంద్రబాబు కుట్రలు, అధికారుల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిపోవడంతో వాటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు మరోసారి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

    అందుకే ఎవరో పెట్టిన పోస్టును తీసుకొచ్చి వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబును మార్ఫింగ్‌ ఫొటోలతో కించపర్చారంటూ వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు సీఐడీకి ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. నిజానికి మార్ఫింగ్‌ల సంస్కృతి, తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు చంద్రబాబే ఆద్యుడని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో వేల మంది సైకోలకు జీతాలిచ్చి  ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు.

    తిరుమలలో కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం ఆయన మెడకే చుట్టుకుందని, ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు చంద్రబాబు టీటీడీ నిధులు దోచిపెట్టిన వైనం ఆధారాలతో సహా బయటకొచ్చిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి, కల్తీ పాలు, కలుషిత నీటి సరఫరా.. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాను నిలువరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి వాటికి ఏ మాత్రం భయపడే ప్రసక్తి లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరు వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగంగానే..:
    కూటమి పాలనలో పంపిణీ అవుతున్న కల్తీ పాలు, కలుషిత నీరు తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వరుస ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం, అధికారుల అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి పేరుతో చంద్రబాబు ఆడిన రాజకీయ డ్రామాలు హెరిటేజ్‌ ముంగిట్లోకి వచ్చి ఆగింది. ఈ వరుస ఘటనలతో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. తమ తప్పులకు సమాధానం చెప్పుకోలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసే డైవర్షన్‌ పాలిటిక్స్‌కి కూటమి ప్రభుత్వం తెర లేపింది.

    ఆ దిశలోనే వర్ల రామయ్య నేతృత్వంలో కొందరు టీడీపీ నాయకులు సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు గురించి అసభ్యకర పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఎవరో పెట్టిన పోస్టులను తీసుకొచ్చి వైఎస్సార్‌సీపీకి ఆపాదించి సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్‌ చేయించారంటూ కట్టుకథలు అల్లుతున్నారు.

    వ్యక్తిత్వ హనన కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు:
    ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కూటమి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. అలాంటిది వాళ్ల గురించి మార్ఫింగ్‌లు, డీప్‌ ఫేక్‌ ఫొటోలతో పోస్టులు పెట్టాల్సిన అవసరం మాకులేదు. అసెంబ్లీలో, బయటా మహిళలతో కూటమి ఎమ్మెల్యేలు అసభ్యంగా, అశ్లీలంగా వ్యవహరిస్తున్నారు. మహిళలకు అర్థరాత్రి వీడియో కాల్స్‌ చేసి వేధిస్తూ దొరికిపోయారు.

    శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూటమి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. అలాంటిది వీరి గురించి ప్రత్యేకంగా మేం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుడు ప్రచారంతో వ్యక్తిత్వ హననం చేసే కుట్రలకు ఆద్యుడు చంద్రబాబు. రెండు పత్రికలు, నాలుగు టీవీలు, వందలాది యూట్యూబ్‌ ఛానళ్లు, లక్షల్లో మీమ్‌ పేజీలతో నిత్యం తమకు గిట్టని వారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని హైదరాబాద్‌ నుంచి నడిపిస్తున్నది చంద్రబాబే. ప్రజల నుంచి దోచుకున్న సంపదను ఐటీడీపీ పేరుతో ఆఫీస్‌ ఏర్పాటు చేసి వేల మంది సైకోలకు జీతాలిచ్చి ప్రోత్సహిస్తున్నదీ చంద్రబాబే.

    మా వరకు ఎందుకు మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి

    లడ్డూపై చేసిన ఏఐ వీడియోకి కేసు పెట్టాలి:
    ఆఖరుకి దేవదేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగి పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు, చేపల నూనె కలిసిందని చంద్రబాబు ప్రచారం చేశాడు. అదంతా అబద్ధమని సీబీఐ సిట్‌ తేల్చినప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పి అంతటితో వివాదానికి ముగింపు పలకాల్సింది పోయి, బాత్రూమ్‌లు కడిగే రసాయనాలు కలిశాయని ఇంకా ఉన్నాదిలా మారి ప్రచారం చేశాడు. వైయస్సార్సీపీ మీద దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పవిత్రమైన తిరుమల లడ్డూకి కళ్లు, నోరు, నామాలు పెట్టి ఏఐ వీడియోలు చేసి తెలుగుదేశం అధికార సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. అలా తిరుమల పవిత్రతను, కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఇంతకన్నా అపచారం, మార్ఫింగ్‌ ఇంకోటి ఉంటుందా?.

    హెరిటేజ్‌ అవినీతిపై సమాధానం చెప్పే దమ్ము లేదు:
    చంద్రబాబు, లోకేష్‌ అవినీతి బాగోతం గురించి రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ డెయిరీకి టీటీడీ నిధులు దోచిపెట్టడం, ఆ దోపిడీనికి అమలు చేయడంలో భాగంగా కల్తీ నెయ్యి పేరుతో సాగించిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చివరకు చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయాడు. హెరిటేజ్‌ అవినీతిని జగన్‌గారు ఆధారాలతో సహా, బయటపెడితే దానికి సమాధానం చెప్పే దమ్ము కూటమి నాయకులకు లేదు. అందుకే నైతికంగా ఇంకా దిగజారి ఇలాంటి డైవర్షన్‌ డ్రామాలు మొదలు పెట్టారని కారుమూరు వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు.

  • తాడేపల్లి : వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేట్లపాలెం ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రశేఖర్‌.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన కోరారు.  ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్‌.. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఇంకా లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. 

    లడ్డూ, ఇందాపూర్ విషయాలపై చర్చకు రమ్మంటే ఎందుకు రావటం లేదు?, ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?, ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వటం వెనుక స్కాం ఉంది. 900 కిమి దూరంలో ఉన్న ఇందాపూర్ కు కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు?, వైష్ణవి డెయిరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంబంధం ఉంది. ఆయనకు చెందిన సంగం డెయిరీతో వైష్ణవి డెయిరీకి‌ సంబంధం ఉంది. టీటీడీ నిధులను కొల్లగొట్టటానికే అక్రమంగా కాంట్రాక్టు పొందారు. మూడుసార్లు టెండర్ పిలిచి ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. తర్వాత సంగం డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చారు. అసలు సంగం డెయిరీకి ఆవు నెయ్యి సరఫరా చేసే అవకాశం లేదు. కానీ నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?, లోకేష్ రెడ్ బుక్ కు మా పార్టీలోని కుక్కలు కూడా భయపడవు. రెడ్ బుక్ వలనే కూటమి ప్రభుత్వం అభాసుపాలయింది’ అని ధ్వజమెత్తారు.

    ఇక ఏపీలో సంక్షేమం పేరుతో వృద్ధులు, దివ్యాంగులు కడుపు కొడుతున్నారని విమర్శించారు. వారికి నెలకు రూ. 25  వేల చొప్పన పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రతీనెలా మీటింగ్‌ పెట్టి చేస్తున్నది ఇదే. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారు. మండలి చైర్మన్‌ని ఒక మంత్రి డిక్టేట్‌ చేయడం బాధాకరం’ అని మండిపడ్డారు.

  • సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.

    చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు

    ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమా
    గుంటూరు నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.

    రెడ్‌బుక్‌ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
    రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్‌బుక్‌ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది.

    రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
  • సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.

    బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.

    భూదాన్‌ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.

    నీకు దమ్ముంటే.. రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్

    పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Andhra Pradesh

  • తాడేపల్లి :  కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్‌ జగన్‌.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్‌ జగన్‌.

    ‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు  అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్‌ జగన్‌ సూచించారు. 

     

    వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

    కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

  • సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం  సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని  23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన  వ్యక్తమవుతోంది.  పేలుడుధాటికి మృత దేహాలు స్థానిక  పంట పొలాల్లోకి  ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు.

    అందిన సమాచారం మేరకు మృతుల వివరాలు : అడబాల శ్రీను, కడిపల్లి కృపమ్మ, ధనరాజు, సాధనాల సత్యవతి, వల్లూరి రవి, రాము, గంపల మంగ, గోడత మహేష్‌, మందపల్లి చిన్ని, నిమ్మడ కరుణ, గొట్ట మహేష్‌, రమణ, నానిలు ఉన్నారు.

    డీఎన్‌ఏ  టెస్టుల ఆధారంగా మృతదేహాల అప్పగింత
    డీఎన్‌ఏ  టెస్టుల ఆధారంగా మృతదేహాలను అప్పగించే పనిలో పడ్డారు అధికారులు. డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చిన  తర్వాత మృతదేహాలను అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.

    కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. మంటల్లో 50 మంది..!

    ప్రమాదం  సమయంలో 70 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం.  పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి.  సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. 

    గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు 
    బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి.  బాణా సంచా తయారీకి  ప్రసిద్ధి చెందిన  వేట్లపాలెం, పరిసర గ్రామాల్లో ఇలాంటి భారీ ప్రమాదాలు జరగడం,  పలువురు కార్మికులు  ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్‌ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్‌ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్‌ తయారీ కేంద్రాలు ఉన్నాయి.

    జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామం, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్‌ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. 

    కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో  కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అలాగే గత ఏడాది రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు  అక్కడిక్కడే మరణించారు.

NRI

  • నిజమాబాద్ జిల్లా: లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు తెలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న దక్షిణ లండన్‌లోని క్రోయ్డన్ప్రాంతంలో ఉన్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం అంతా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.

    ఈ ఘటనలో పెద్దాపురం (కాకినాడ జిల్లా)కు చెందిన గంటి అభిషేక్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. నిజమాబాద్  జిల్లాకు చెందిన సాయి శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీకర్‌ను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ శుక్రవారం మృతి చెందాడు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

    ముగ్గురు యువకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌కు వెళ్లి, చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినట్లు తెలిసింది. క్రోయ్డన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకర్ మృతితో నిజామాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Eluru

  • చల్లన

    నేడు కలువ బోనాల సమర్పణ

    లక్ష మంది విచ్చేస్తారని అంచనా

    ప్రధాన ఆకర్షణగా ప్రభల ఊరేగింపు

    కొల్లేరు దిబ్బపై పెద్దింట్లమ్మ జాతరను తిలకించడం ఓ మధురానుభూతి. కై కలూరు నుంచి భీమవరం వెళ్ళే రహదారిలో ఆలపాడు వద్ద బస్సు దిగి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దింట్లమ్మ దేవస్థానానికి చేరుకోవచ్చు. పెద్దింట్లమ్మ విగ్రహం చెంత జలదుర్గాదేవితో గోకర్ణేశ్వరస్వామికి జరిగే కల్యాణం అనంతరం ఆ తలంబ్రాలు చల్లుకుంటే ఎంతో పుణ్యం.

    – కూచిపూడి శ్రీనివాసు, ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట

    కై కలూరు : తెలంగాణ బోనాల సంప్రదాయాన్ని ఏలూరు జిల్లా కొల్లేరు ప్రజలు కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర (తీర్థం) ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరుగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం శనివారం (28వ తేదీ) రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి వేలాదిగా కొల్లేరులంక గ్రామాల మహిళలు కలువ బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తితో అమ్మకు సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి అమ్మకు పట్టువస్త్రాలు అందిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ఏలూరు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    నీటి మధ్యలో ద్వీప కల్పం

    పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి ఆలయం వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

    ప్రత్యేక ఆకర్షణగా బోనాలు

    భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. ప్రస్తుతం వేల సంఖ్యలో బోనాలతో మహిళలు మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో తాటి కల్లు, పానకం, పిండి వంట, వడ పప్పు, చలివిడి నింపి చివరి కుండపై నెయ్యితో నిండిన 365 ఒత్తుల దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరుసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టెలు, నిమ్మ కాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు. కొల్లేరు సరస్సులో ఫిబ్రవరి, మార్చిలో సహజసిద్ధంగా కలువ పువ్వులు లభిస్తాయి. కొల్లేరు ప్రజలు తమ ఇలవేల్పుగా భావించే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కలువ పువ్వులను బోనాలకు కట్టుకుని సమర్పిస్తారు. బోనాల కోసం ప్రత్యేక కుండలకు రంగులు అద్ది అందంగా అలంకరిస్తారు. బోనాలలో పానకం, ఇతర పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెట్టిన తర్వాత చేపలు, రొయ్యల చెరువుల్లో కలపడం ఇక్కడి సంప్రదాయం.

    కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లి

    గోకర్ణేశ్వరస్వామి

  • కలుషి

    పాలకొల్లు సెంట్రల్‌: వాటర్‌ వల్ల వచ్చిన దద్దుర్లే తప్ప ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధులేమీ కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యశాఖాధికారి డా.గీతాబాయి అన్నారు. పాలకొల్లు మండలం రూరల్‌ పంచాయతీకి సంబంధించిన అచ్చుగట్లపాలెం చిత్రావిచెరువుగట్టు ప్రాంతానికి చెందిన ప్రజలకు అక్కడ పంచాయతీ వాటర్‌ వల్ల దద్దురు రావడంతో ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం రాత్రి అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మెడికల్‌ క్యాంపు ఏర్పాటుచేశారు. మెడికల్‌ క్యాంపులో పలువురికి పరీక్షలు చేసిన డా.గీతాబాయి మాట్లాడుతూ వాటర్‌ కలుషితం వల్ల దద్దురు వచ్చాయని నీళ్లలను పరీక్షలకు పంపామన్నారు. ఆయింట్‌మెంట్‌, ట్యాబ్లెట్లు అందించామన్నారు. ప్రతి నెలా ఈ ప్రాంతంలో సంచార వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని వైద్యాధికారులకు సూచించారు. వాటర్‌ ట్యాంకు ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్‌ టెస్టింగ్‌ చేయాలని తెలిపారు.

    కొయ్యలగూడెం: మట్టి అక్రమ తవ్వకాలకు అదుపు లేకుండా పోతోంది. శుక్రవారం మండలంలోని యర్రంపేట పులపాకుల చెరువు నుంచి జేసీబీలను ఏర్పాటుచేసి ట్రక్కులలో మట్టిని తరలించారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా.. వాళ్ళు వచ్చేసరికి మట్టి ట్రక్కులు ఎక్కడికక్కడ సర్దుకున్నాయి. గత కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో కొనసాగిన మట్టి తోలకాలు ఇప్పుడు పట్టపగలే కొనసాగుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులకు సమాచారం వెళ్లిన అనంతరం వాళ్లు రావడంతో వాహనాలతో అక్రమార్కులు పలాయనం చిత్తగించారు. యర్రంపేట, రాజవరం, పొంగుటూరు, దిప్పకాయలపాడు, కన్నాపురం, సరిపల్లి గ్రామాలలోని సాగునీటి చెరువుల వెంట మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని సాగునీటి చెరువుల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.

    భీమవరం (ప్రకాశంచౌక్‌): బస్‌లో బ్యాగ్‌ పోగొట్టుకున్న మహిళకు తిరిగి బ్యాగ్‌ భద్రంగా అప్పగించామని జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్‌.గిరిధర్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 25న ఆత్రేయపురానికి చెందిన ఎం.సూర్యకుమారి భీమవరం డిపోకు చెందిన విశాఖపట్నం బస్‌ సర్వీస్‌లో ప్రయాణించారన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ మర్చిపోవడంతో బ్యాగ్‌ను గుర్తించిన సర్వీసు డ్రైవర్‌ తీసుకువచ్చి డిపో ఎర్నింగ్‌ సెక్షన్‌కు అప్పగించారని తెలిపారు. ప్రయాణికురాలు ఆధార్‌ కార్డు ఆధారంగా సమాచారం అందించామన్నారు.

    ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు.

    ఉండి: ఈ నెల 25న ఉండి చిక్కాల వీరన్న నగర్‌లో జరిగిన గ్యాస్‌ లీకేజీ అగ్ని ప్రమాదంలో గాయపడిన నలుగురు వ్యక్తుల్లో ఒగ్గు సుబ్బాయమ్మ మృతి చెందగా.. మాసాబత్తుల లక్ష్మీ( 58) విజయవాడలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు బాధితులు తీవ్ర గాయాలతో విజయవాడలో చికిత్స పొందుతున్నారు.

  • హలీం.

    రంజాన్‌ మాసంలో ప్రత్యేక వంటకంగా హలీం ప్రసిద్ధి

    పుష్కలమైన పోషకాలతో తయారయ్యే ఆహారం

    కొయ్యలగూడెం : రంజాన్‌ అంటే ముస్లింలకు పవిత్ర మాసం. ఈ మాసంలో వారు దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. ఉపవాస దీక్షలు తీసుకున్న సమయంలో వారు నీరసించపోకుండా బలవర్థమైన ఆహారంగా హలీం ఎంతగానో దోహదపడుతుంది. మతాలకు అతీతంగా ఆహారప్రియులకు సైతం హలీం అత్యంత ఇష్టమైన వంటకంగా నిలుస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ పౌష్టికాహారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరిస్తోంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే అత్యంత పౌష్టికాహారాన్ని పదార్థాలలో హలీం ఒకటి. కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్లు ఉండటం వలన పిల్లలకు సైతం మెరుగైనదిగా వైద్యులు ధ్రువీకరిరిస్తున్నారు.

    హలీం తయారీ ఇలా..

    మాంసం, గోధుమలు, పప్పు దినుసులు, మసాలాలు కలిపి దాదాపు గంటసేపు ఉడికించి నీటిని అందులోనే ఇంకెలా మరిగించి.. అనంతరం దానిని గట్టి పాయసం మాదిరిగా కలిపి తయారుచేస్తారు. ఆ సమయంలోనే సరిపడా నెయ్యి, వేయించినటువంటి ఉల్లి, వెల్లుల్లి, కొత్తిమీర, లవంగాలు, యాలకులు మిశ్రమాలను సమపాళ్లలో కలిపి తయారు చేస్తారు. స్థోమత కలిగిన వారైతే జీడిపప్పు, బాదంపప్పు, ఇతర ఖరీదైనటువంటి డ్రైఫ్రూట్స్‌ మిశ్రమాన్ని లేదా పౌడర్‌లను హలీం వంటలలో కలుపుకోవచ్చు.

  • కోకోల

    కొలాటోట్రీకమ్‌ తెగులు సోకడంతో గోధుమ రంగులోకి మారిన కోకో కాయ , అల్లిపల్లి గ్రామంలో తెగులు సోకిన కోకో తోటలను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారులు

    చింతలపూడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దష్ట్యా కోకో తోటల్లో శ్రీకొలాటోట్రీకమ్‌శ్రీ తెగులు ఆశించే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండి నివారణ చర్యలు చేపట్టాలని చింతలపూడి మండల ఉద్యాన అధికారి ఎండీ షాఫియ సూచించారు. ఈ తెగులు వల్ల పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు క్షేత్రస్థాయిలో తోటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోరారు.

    తెగులు లక్షణాలు

    కోకో ఆకులు, కాయలు లేదా పిందెలపై పసుపు రంగు వలయాలతో కూడిన చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమంగా పెరుగుతూ కాయ లేదా ఆకు అంతటా వ్యాపిస్తాయి. దీనివల్ల కాయలు నాణ్యత కోల్పోవడమే కాకుండా, చెట్టు ఎదుగుదల కూడా దెబ్బతింటుంది.

    నివారణ, యాజమాన్య పద్ధతులు

    తోటల్లో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా సరైన సమయంలో కత్తిరింపులు చేపట్టాలని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల తేమ శాతం తగ్గి తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుందని, అదే విధంగా తెగులు సోకిన ఆకులు లేదా కాయలను వెంటనే గుర్తించి, వాటిని తోట నుంచి తొలగించి దూరంగా వేసి నాశనం చేయాలని చెబుతున్నారు.

    మందుల పిచికారీ

    తెగులు నివారణకు ప్రతి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో హెక్సాకొనజోల్‌ 5 శాతం 2 మి.లీ. (లేదా) ప్రోపికొనజోల్‌ 0.1 శాతం 1 మి.లీ. (లేదా) కార్బండిజం + మాంకోజెబ్‌ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. తెగులు లక్షణాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా రైతులు నిర్లక్ష్యం చేయకూడదని అధికారులు తెలిపారు. నెలకోసారి కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ (3 గ్రాములు లీటరు నీటిలో) కలిపి డ్రెంచింగ్‌ చేయడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కోకో సాగులో ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఉద్యాన అధికారిణి షాఫియ కోరారు.

    ఎండీ షాఫియ, ఉద్యాన అధికారి, చింతలపూడి

  • లక్ష్

    తాడేపల్లిగూడెం: విద్యార్థి దశలో ఉండగానే లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటి సాధన దిశగా సాగాలని శశి ఇంజనీరింగ్‌ కళాశాల అన్వేషణలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు. అన్వేషణ టెక్నో కల్చరల్‌ ఫెస్ట్‌ కార్యక్రమం శనివారం తాడేపల్లిగూడెంలో జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న జేఎన్‌టీయు కాకినాడ వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలు చేరుకోవాలంటే క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. సంస్థల వైస్‌ చైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత గుర్తించడానికి ఏటా తమ కళాశాలలో అన్వేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. లలిత జ్యూయలర్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎక్కడ విజయం సాధించాలన్నా కష్టపడితేనే సాధ్యమవుతుందన్నారు. సినీ నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ తాను కళాశాలలో చదువుతున్నప్పుడు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించానన్నారు. సినిమాను లక్ష్యంగా ఎన్నుకొని కష్టపడి నటుడిగా నిలబడ్డానన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్‌ బూరుగుపల్లి రాధారాణి, సెక్రటరీ, కరస్పాండెంట్‌ మేకా క్రాంతి సుధ, ప్రిన్సిపాల్‌ మొహ్మద్‌ ఇస్మాయిల్‌, కన్వీనర్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

    తాడేపల్లిగూడెం అర్బన్‌: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ బోణం ఆది ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం మాట్లాడుతూ పిఅండ్‌టి కాలనీ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై నాగరాజు, సిబ్బందితో కలిసి దెందుకూరి చిదంబర్‌ వెంకట రాజు అలియాస్‌ వంశిశీ షేక్‌ అక్బర్‌ను అదుపులోనికి తీసుకొని వారి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు అరకు నుంచి కొనుగోలు చేసి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • డ్రెయినేజీలో వ్యక్తి మృతదేహం లభ్యం

    తణుకు అర్బన్‌ : తణుకు బ్యాంకు కాలనీ డ్రెయినేజీలో శుక్రవారం ఉదయం వ్యక్తి మృతదేహం బయటపడ్డ ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పట్టణ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత బ్యాంక్‌ కాలనీ శివారు ప్రాంతమైన నాగేంద్రనగర్‌కు చెందిన గుడ్డాల నాగరాజు (40)గా గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్రంగి మేస్త్రిగా ఉన్న నాగరాజు మొదటి భార్య లక్ష్మి మృతి చెందడంతో రెండో భార్య సూర్యకళతో భీమవరంలో ఉంటున్నారు. తల్లి, పిల్లలను చూసేందుకు తరచూ నాగరాజు తణుకు వస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తణుకు వచ్చిన నాగరాజు మద్యం తాగేందుకు ఇంటి నుంచి రైల్వేస్టేషనన్‌ రోడ్డుకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఉదయం నుంచి కుటుంబ సభ్యులు గాలించారు. డ్రెయినేజీలో మృతదేహం ఉందన్న వార్త విని కుటుంబసభ్యులు వచ్చి చూసి నాగరాజుగా నిర్ధారించారు. పట్టణ ఇన్‌చార్జ్‌ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఎస్‌సైలు శ్రీనివాస్‌, జానా సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. నాగరాజు తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుంటారని, మద్యం మత్తులోనే డ్రెయినేజీలో పడి ఊపిరి ఆడక మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు కుమారుడు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.