Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ క్షిపణి, డ్రోన్‌ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.

    ఈ దాడుల్లో చారిత్రక డార్మిషన్‌ కేథడ్రల్‌ భారీగా దెబ్బతింది. డ్రోన్‌ నేరుగా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ కేథడ్రల్‌ ఉక్రెయిన్‌ ఆర్థడాక్స్‌ క్రైస్తవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన కేంద్రంగా భావిస్తారు.

    ఈ దాడులపై స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, ఉక్రెయిన్‌కు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని జీ-7 దేశాలను కోరారు.

    ఈ దాడుల అనంతరం జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్‌, రష్యా వర్గాలు వెల్లడించాయి.

     

     

  • పశ్చిమాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని వెల్లడించారు.

    సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్‌.. "ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌తో ఒప్పందం పూర్తయ్యింది. అందరికీ అభినందనలు. హర్మూజ్‌ జలసంధిని ఎలాంటి టోల్‌ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నాను. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నాను. ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి" అని పేర్కొన్నారు.

    అయితే ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని స్పష్టం చేసింది. అమెరికాపై తమకు ఇంకా అపనమ్మకం కొనసాగుతోందని మరోసారి పేర్కొంది.

    కాగా, ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 4న టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్‌, ఖోమ్‌ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్‌హద్‌లో నిర్వహించి, అదే రోజు ఇమామ్‌ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్‌ వర్గాలు వెల్లడించాయి.

  • అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్‌ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్‌) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్‌ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్‌పీ)ని,  అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ పాత్‌వే (సీఈపీ)ని  తక్షణమే రద్దు చేసింది.  

    చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్‌ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్‌ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు  జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద  ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్‌లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో  చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్‌ఆర్‌సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్‌ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు  80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో,  5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.

    మానిటోబా ప్రావిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ (MPNP)  ప్రకారం మానిటోబా ప్రావిన్స్‌లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్  సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో  భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

    ఇదీ చదవండి: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం

    భారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు.  ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. 

    ఇదీ చదవండి: ట్విన్స్‌ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్‌!

    రద్దయిన  సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు  మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్‌మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే  ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ ప్లాన్‌ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.

    ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

    కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్‌ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్‌ను స్వీకరించడానికి ముందు,  ‘స్కిల్డ్‌ వర్కర్‌ ఇన్‌ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్‌  ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్‌కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్‌మెంట్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు. 

    ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

Movies

  • బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. తాజాగా అమీర్ ఖాన్ సూపర్‌హిట్ మూవీ లగాన్ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే కరీనా కపూర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

    హీరోయిన్లు ధరించే దుస్తులు, యాక్ససిరీస్ ఎప్పుడూ ఆకర్షిస్తాయి. కేవలం చెప్పులు, వాచీల కోసం లక్షలు ఖర్చుచేసే నటీనటులున్నారు మన దగ్గర. తాజాగా కరీనా కపూర్ తన దుస్తులు, యాక్ససిరీస్‌తో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ సూపర్‌ హిట్‌ మూవీ 'లగాన్' వేడుకకు సల్మాన్ ఖాన్‌ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా కొంతమంది వచ్చారు.  అయితే ఈ ఈవెంట్‌లో కరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ఈ వేడుకలో బెబో తన గ్లామరస్ లుక్‌తో, గులాబీ రంగు సూట్‌లో మెరిసింది. ఈ అందమైన పింక్ సిల్క్ సూట్‌ను ‘ఏకాయ్ బనారస్’ అనే బ్రాండ్‌కు చెందినది. దీని ధర రూ. 40,975. ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షేర్-గిల్ కళాఖండాల స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ సాంప్రదాయ దుస్తులు కంఫర్ట్‌తో పాటు వింటేజ్ లుక్‌ను అందించాయి. అంతటితో ఆగితే అమెను బాలీవుడ్‌ బెబో అని ఎందుకంటారు? తన లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి కరీనా ‘అక్వాజురా’ అనే బ్రాండ్‌కు చెందిన ఖరీదైన హీల్స్ ధరించింది.

    అయితే ఆమె ధరించిన డ్రెస్ కంటే కూడా ఈ హీల్స్ చాలా కాస్ట్‌లీ అట. ఈ ఇంపోర్టెడ్ హీల్స్ అసలు ధర 835 యూరోలు. అంటే అది మన దేశ కరెన్సీలో దాదాపు 91,874 రూపాయలు. ఎందుకు అంత ధర అంటే.. ఇది 30 రకాల విడిభాగాలను జతచేసి తయారు చేసిన హ్యాండ్‌ మేడ్ షూ అట. అందుకే ఈ షూ అంత రేటు అని తెలుస్తోంది. కాగా ఇండియాలో ఈ బ్రాండ్‌కు చెందిన ఇలాంటి డిజైనర్ శాండల్స్ ధర రూ. 99,650 నుండి రూ. 1,54,500 వరకు ఉంటాయి. ఇలా కరీనా కపూర్ ఈ వేడుకలో ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది.
     

  • ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో సందీప్ అశ్వ హీరోగా  తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రిస్క్'. జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పుడీ చిత్రంలోని 'దేవుడు వరమందిస్తే' అంటూ సాగే మెలోడీ పాటని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

    ఈ పాటకు సంబంధించి హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.

    (ఇదీ చదవండి: సిమ్రాన్-విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు)

  • తమిళ‍నాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు తనతో పాటు కలిసి నటించిన సినిమా సెలబ్రిటీలని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కోలీవుడ్‌కి చెందిన చాలామంది విజయ్‌ని కలిశారు. అయితే వాళ్లతో పోలిస్తే తాజాగా జరిగిన రీయూనియన్ ఎవర్‌గ్రీన్ అని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    (ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

    టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సిమ్రాన్.. ప్రస్తుతం సహాయ పాత్రలతో అడపాదడపా మూవీస్ చేస్తోంది. అయితే 1997-2004 మధ్య కాలంలో దళపతి విజయ్‌తో కలిసి నెరుక్కు నెర్ (1997), వన్స్ మోర్ (1997), తుళ్లత్త మనముమ్ తుళ్లుమ్ (1999), ప్రియమనవలె(2000), యూత్ (2002), ఉదయ(2004) తదితర చిత్రాలు చేసింది. వీటిల్లో వీరిద్దరూ కెమిస్ట్రీకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. అలాంటిది మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్‌ని కలిశానని చెబుతూ సిమ్రాన్ పోస్ట్ పెట్టింది.

    తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్‌ని నా కుటుంబంతో కలిసి కలుసుకోవడం ఆనందంగా అనిపించింది. సీఎం విజయ్ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. ప్రజల ప్రేమని సంపాదించుకున్న ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. తమిళనాడు అభివృద్ధి కోసం విజయ్ దూరదృష్టి, సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఆయన నాయకత్వానికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని సిమ్రాన్ రాసుకొచ్చారు. సిమ్రాన్‌తో పాటు ఈమె ఇద్దరు కొడుకులు, భర్త ఉన్నారు.

    (ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఫేమస్ తెలుగు యూట్యూబర్ నాగదుర్గ.. టీజర్ రిలీజ్)

  • నవ్వుతూ మాయ చేస్తున్న పూజా హెగ్డే

    పట్టుచీరలో అందంగా హీరోయిన్ సమంత

    దేవకన్యలా మెరిసిపోతున్న దివ్యభారతి

    పింక్ డ్రస్‌లో గ్లామరస్‌గా శిల్పాశెట్టి

    పట్టుచీరలో మెప్పించేస్తున్న శివానీ

    చెన్నై షూటింగ్ జ్ఞాపకాలతో మాళవిక

  • తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అయితే తెలుగులో 'కలివనం' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది గానీ ఇదొకటి రిలీజైందనే సంగతి కూడా చాలామందికి తెలియదు! ఇప్పుడు తమిళంలో ఎంట్రీకి సిద్ధమైంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

    స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలోనే నాగదుర్గనే మెయిన్ హీరోయిన్. 'లవ్ ఓ లవ్' పేరుతో తీస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే హీరోయిన్ పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రియుడితో ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మోడ్రన్ అమ్మాయిగా నాగదుర్గ కనిపించనుంది. ఈ మూవీ హిట్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు రావొచ్చు.

    ఇప్పటికే తమిళంలో గౌరిప్రియ, శ్రీదివ్య లాంటి తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నాగదుర్గ, వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు కూడా తమిళంలోకి వెళ్లిపోతున్నారు. మరి తమిళంలో వీళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు మాత్రం వీళ్లని పెద్దగా పట్టించుకోవట్లేదా అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

  • విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

    నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.

    విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని అన్నారు.

    (ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

  • 'పెద్ది' సినిమాకు బోలెడంత హైప్ రావడానికి, అలానే చిన్నపాటి వివాదానికి 'చికిరి చికిరి' సాంగ్ ఎంతలా కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు నెలల క్రితం దీని లిరికల్ వీడియో రిలీజైనప్పుడు వెంటనే శ్రోతలకు నచ్చేసింది. అదే టైంలో 'సరకు సామాను' అనే లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. వాటిని సరిచేసి థియేటర్‌లో కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాని ఫుల్ వీడియోని రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్.. చిరు, రామ్ చరణ్ ఘనత)

    'సరకు సామాను' అని ఉన్న చోట 'సొగసు సింగారం' అని మార్చారు. ఇకపోతే మూవీలో జాన్వీ కపూర్ పాత్ర, అందచందాలని చూపించిన తీరుపైన చాలానే విమర్శలు వచ్చాయి. దీంతో దర్శకుడు బుచ్చిబాబు.. క్షమాపణ కూడా చెప్పాడు. అలానే సదరు సన్నివేశాల్ని కూడా తొలగిస్తామని పేర్కొన్నాడు. బుధవారం నుంచి ఇందుకు సంబంధించిన కొత్త వెర్షన్స్ థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇంతలోనే చికిరి చికిరి పూర్తి వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇకపోతే మూవీ విడుదలకు ముందు ప్రమోషన్లలో తెగ కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తర్వాత మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ కనిపించలేదు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

  • అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘లెనిన్‌’. ఈ మూవీని మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.

    అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్‌ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది.

     

  • రామ్ చరణ్ పెద్ది మూవీతో సూపర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ నాలుగు వందల కోట్ల రాబట్టేలా కనిపిస్తోంది. ఈ మూవీకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన దక్షిణాది చిత్రంగా ఘనత సాధించింది.

    తండ్రి, తనయుల అరుదైన రికార్డ్..

    అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి సైతం బాక్సాఫీస్ వద్ద నిలిచాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్ కొట్టేశారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓకే ఏడాది తండ్రి, తనయులు సినిమాలు రూ.300 కోట్లకు పైగా వసూళ్ల సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.  టాలీవుడ్ సినీ చరిత్రలోనే కొత్త రికార్డ్ సృష్టించారు.  దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
     

     

  • 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో మూవీస్, ఓటీటీ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కి ‍రెడీ అయింది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేసి కథేంటో చెప్పే  ప్రయత్నం చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)

    ఐశ్వర్యా రాజేశ్, సముద్రఖని, సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సిరీస్ 'ఇసకపట్నం'. 1990‍ల్లో ‍ఓ తీరప్రాంత గ్రామంలో జరిగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. వచ్చే నెల 02వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్యారీ బీహెచ్ ఈ సిరీస్‌కి దర్శకుడు.

    ట్రైలర్ బట్టి చూస్తే.. ఇసకపట్నం అనే ఊరిలో నాయుడు(సముద్రఖని) అనే పెద్దమనిషి పోర్ట్‌లో వ్యాపారాన్ని, ఊరిలో జనాల్ని తన అదుపులో ఉంచుకుని ఆజమాయిషీ చెలాయిస్తుంటాడు. ఊహించని విధంగా ఇతడి కూతురు (ఐశ్వర్యా రాజేశ్) ఇతడికి ఎదురు తిరుగుతుంది. ఈమెకు ఊరిలో కొందరు తోడవుతాడు. తర్వాత ఏం జరిగింది? కుర్చీ, అధికారం కోసం జరిగే ఈ కొట్లాట ఎక్కడకు దారితీసింది అనేది మిగతా స్టోరీ.

    ‍ట్రైలర్ చూస్తే రెగ్యులర్ రొటీన్ టెంప్లేట్ స్టోరీలానే అనిపించింది. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈ తరహా అంశాల్ని చూసేశారు. మరి వీళ్లు ఏం కొత్తగా చూపిస్తారనేది ఇక్కడ ప్రశ్న. కొత్తగా చూపిస్తే వర్కౌట్ అవుతుంది లేదంటే జస్ట్ ఒక సిరీస్ అవుతుంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి టెక్నో థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

  • ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టెక్నో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఓ స్టోరీతో వెబ్ సిరీస్ సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈయన కొడుకు వీర్ హిరానీ ఇందులో లీడ్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

    'ప్రీతమ్ అండ్ పెడ్రో' పేరుతో తీసిన ఈ సిరీస్ వచ్చే నెల 3వ తేదీ నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వీర్ హిరానీ లీడ్ రోల్ చేయగా.. అర్షద్ వార్షీ, విక్రాంత్ మస్సే, బొమన్ ఇరానీ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.

    ట్రైలర్ బట్టి చూస్తే.. టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని పెడ్రో(అర్షద్ వార్సీ) అనే పోలీస్ అధికారి.. ఓ కేసు కారణంగా మంత్రి దెబ్బకు సైబర్ డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. మరోవైపు ప్రీతమ్ అనే కుర్రాడు టెక్నాలజీలో జీనియస్. 15 నిమిషాల్లోనే సెల్‌టవర్‌ని హ్యాక్ చేయగలడు. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముతుంటాడు. అయితే పెడ్రో ట్రాన్స్‌ఫర్‌కి కారణమైన మంత్రి కొడుకు కిడ్నాప్ అవుతాడు. రూ.23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఇదంతా చేసింది పేరు మోసిన మరో హ్యాకర్ అని పెడ్రో, ప్రీతమ్ తెలుసుకుంటారు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు యాక్షన్ సినిమా.. అధికారిక ప్రకటన)

  • కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్‌ ధృవ నక్షత్రం. 2018లో మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఇటీవలే జూన్ 15 లోపు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు కూడా చెప్పింది. కానీ అలా జరగలేదు. ఈ సినిమా విడుదలకు మరింత సమయం కావాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సినిమా విడుదలకు అదనంగా 30 రోజులు కావాలని అభ్యర్థించారు.  

    దీంతో ధృవ నక్షత్రం ఇప్పుడే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లే కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి మరింత టైమ్ కావాలని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ హైకర్ట్‌ను కోరారు. ఈ మూవీ రిలీజ్‌కు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జూన్ 15, 2026 లోపు థియేటర్లలోకి తీసుకురావడం తన వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. 

    కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని లావాదేవీలు 'కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో నిర్వహించే ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే జరగాలని.. అలాగే కోర్టు నియమించిన పరిశీలకులు ప్రతి ఆర్థిక లావాదేవీని పర్యవేక్షించాలని గత ఉత్తర్వుల్లో ఆదేశించింది. నిర్ణీత గడువులోగా సినిమాను విడుదల చేయలేకపోతే, అదనపు సమయం కోరే స్వేచ్ఛను కూడా కోర్టు మీనన్‌కు కల్పించింది.

    కాగా.. ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు రితూ వర్మ, వినాయకన్, ఆర్. పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 2017లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన అడ్డంకులతో 2023లో షూటింగ్ పూర్తయింది. నవంబర్ 2023లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరింత అదనపు సమయం కోరడంతో రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.
     

  • తెలుగులో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు గుర్తుండే ఉంటాడు. చాన్నాళ్లుగా తెరపై పెద్దగా కనిపించని ఇతడు.. ట్రెండ్‌కి తగ్గట్లే ఓ యాక్షన్ మూవీ చేశాడు. దర్శకత్వంతో పాటు హీరోగానూ ఇతడే నటించాడు. కాకపోతే థియేటర్లలో రిలీజైన తొలి ఆట నుంచి దారుణమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

    (ఇదీ చదవండి: పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్)

    సహాయ నటుడిగా అద్భుతమైన పాత్రలు చేసిన రవిబాబు.. 'అల్లరి' మూవీతో దర్శకుడిగా మారాడు. అవును, అనసూయ, అమరావతి లాంటి డిఫరెంట్ ప్రయోగాలు చేశాడు. అప్పట్లో ఇవి ఉన్నంతలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ట్రెండ్‌కి తగ్గట్లు కంటెంట్ మార్చుకోలేక మూవీస్ చేయడం తగ్గించుకుంటూ వచ్చేశాడు. 'రేజర్' పేరుతో తీసిన యాక్షన్ చిత్రాన్ని గత నెల 8న థియేటర్లలో రిలీజ్ చేశాడు. దీని ప్రమోషన్లలో సినిమాల గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వాటిని అందరూ బాగానే చూశారు గానీ మూవీని ఒక్కడూ పట్టించుకోలేదు.

    ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆడియెన్స్ దీన్ని థియేటర్లలో పట్టించుకోలేదు. మరి ఓటీటీలోనైనా పట్టించుకుంటారేమో చూడాలి? ఇకపోతే ఈ వారం దీనితోపాటు దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3, కెనాతా కానమ్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

    'రేజర్' విషయానికొస్తే.. రాష్ట్ర హోంమంత్రి (కనకరాజు) తన కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. దీనికి సంబంధించిన  సీసీటీవీ ఫుటేజీ విష్ణు (తనీష్‌) చేతికి చిక్కుతుంది. దీంతో హోంమంత్రి ముఠా విష్ణును, అతని భార్యని చంపేస్తారు. ప్రాణాలతో బయటపడిన విష్ణు కూతురు తేజును.. పెట్‌ గ్రూమింగ్ చేసే రుద్ర ప్రతాప్‌ (రవిబాబు) కాపాడతాడు. తర్వాత హోంమంత్రి గ్యాంగ్‌ నుంచి ఆ చిన్నారిని రవిబాబు ఎలా కాపాడాడనేది మిగిలిన కథ.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

  • ప్రముఖ బుల్లితెర నటి సంచితా ఉగలే(22) బలవన్మరణానికి పాల్పడింది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన ఆమె ముంబయిలోని తన నివాసంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది. ఆమె చివరిసారిగా ఓ రీల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    సంచితా హిందీలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు.  'కుంకుమ్ భాగ్య', 'సాజన్ ఘర్', 'దిల్వాలీ దుల్హా లే జాయేగీ' లో కనిపించారు. టీవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'కుంకుమ్ భాగ్య' సీరియల్‌లో దియా టాండన్ పాత్రకు ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా 'వాగ్లే కి దునియా' సీరియల్‌లో రుచితా.. జైట్లీ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత  'దిల్వాలీ దుల్హా లే జాయేగీ'లో సోరబ్ బేడీ సరసన సుకూన్ అనే ప్రధాన పాత్రను పోషించింది. విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' మూవీలో ఆమె తారాబాయి పాత్రలో మెరిసింది.

     

     

National

  • దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల్లో ఒకటైన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (UPSC) సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 13,343 అభ్యర్థుల రోల్‌ నంబర్ల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

    ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా 83 నగరాల్లోని 2,072 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,016 సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 8,19,372 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

    ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు  తదుపరి దశ అయిన మెయిన్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో సాధించిన మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది.

     

  • న్యూఢిల్లీ: నీట్ (NEET-UG) పరీక్ష నిర్వహణలో ఇప్పటికే ప్రశ్నపత్రం లీకేజీ వివాదంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో మరోసారి కలకలం రేగింది. నీట్ అధికారిక పోర్టల్‌లోకి అక్రమంగా చొరబడిన 19 ఏళ్ల యువకుడు నవీన్ యాదవ్‌ 150 మంది అభ్యర్థులకు చెల్లించాల్సిన రీఫండ్ మొత్తాలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. అహ్మదాబాద్ పోలీసులు నిందితుణ్ని బిహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

    గత నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయకుండా, ఇప్పటికే చెల్లించిన ఫీజులో భాగంగా రీఫండ్ అందించేందుకు ఎన్‌టీఏ ప్రత్యేక రీఫండ్ మాడ్యూల్‌ను ప్రారంభించింది.

    ఈ ప్రక్రియలో అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇదే ప్రక్రియను లక్ష్యంగా చేసుకున్న నవీన్ యాదవ్, పోర్టల్‌లోని భద్రతా లోపాలు,బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి విద్యార్థుల ఖాతాల్లోకి చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు.

    పోలీసుల దర్యాప్తులో బిహార్‌ గయా జిల్లాకు చెందిన నవీన్ యాదవ్ సుమారు 350 మంది అభ్యర్థుల ఖాతాలను లక్ష్యంగా చేసుకుని, వారిలో 150 మందికిపైగా ఖాతాల్లోకి విజయవంతంగా ప్రవేశించాడు. ఇందుకోసం బ్రూట్ ఫోర్స్ అటాక్ పద్ధతిని ఉపయోగించాడు. అంటే పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఊహిస్తూ అన్ని సాధ్యమైన కాంబినేషన్లను వరుసగా ప్రయత్నించడం. అలా పాస్‌వర్డ్‌లను గుర్తించిన అనంతరం నిందితుడు విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాల స్థానంలో తన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీంతో ఒక్కో అభ్యర్థికి చెల్లించాల్సిన రూ.1,700 రీఫండ్ మొత్తం అతని ఖాతాలో జమైంది.

    ఎన్‌టీఏ పోర్టల్‌లో నగదు లావాదేవీల్లో అవకతవకలు జరగడంతో అధికారులు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు రీఫండ్ లావాదేవీల్లో అసాధారణ మార్పులు గుర్తించారు. అనంతరం ఎన్‌టీఏ నుంచి బ్యాంకు లావాదేవీల వివరాలు సేకరించి డబ్బు బదిలీలను ట్రాక్ చేసి నిందితుడిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘల్ మాట్లాడుతూ.. పోర్టల్‌లోని భద్రతా లోపాలను నిందితుడు సద్వినియోగం చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం అతను ఇతర సైబర్ నేరాల్లో కూడా పాల్గొన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు.

    నీట్‌ అభ్యర్థులకు చుక్కలు  
    ఇదిలా ఉండగా, జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్ సరిగా పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా అనేక మంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, అడ్మిట్ కార్డుల విడుదల ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం నాటికి కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే వాటిని డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. సాంకేతిక సమస్యలు, సర్వర్‌పై అధిక భారం కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లు పేర్కొంది.

    ఈ సమస్యల పరిష్కారానికి తమ సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తోందని, అతి త్వరలో అన్ని అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌టీఏ తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది. అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది

  • సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ  ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు నిషేధం విధించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అంటించడం నిషేధమని స్పష్టం చేసింది. 

    ఇటీవల రాష్ట్రంలో భారీ కటౌట్లు, పోస్టర్లు పాదచారుల రాకపోకలకు అడ్డంకిగా మారాయి. పాదచారులు రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు పెరిగాయి.
    వర్షాకాలం ప్రారంభం కావడంతో బ్యానర్లు, కటౌట్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో విజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అదే సమయంలో టీవీకే తన పార్టీ కార్యకర్తలకు సైతం విజ్ఞప్తి చేసింది. పార్టీ కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లు, ప్లకార్డులు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించొద్దని కోరింది. జన్మదిన వేడుకలు, కుటుంబ వేడుకలు, రాజకీయ సమావేశాలు వంటి సందర్భాల్లో బహిరంగ ప్రదేశాల్లో డెకరేషన్లు చేయద్దని సూచించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఏ వేడుకలు జరపరాదని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

    గత నెలలో పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్ స్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను విజయ్‌ మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం, ఆయన తన తమిళగ వెట్రి కజగం కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజులు,  కుటుంబ కార్యక్రమాల వంటి సందర్భాలలో ప్రజలకు లేదా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా... బహిరంగ ప్రదేశాలలో బ్యానర్లు, పోస్టర్లు అంటించొద్దని కోరారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు,కటౌట్లు,పోస్టర్లు అంటించడంపై ఆంక్షలు విధించడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

  • జైపూర్‌ : కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని.. కాక్రోచ్‌ కార్యకర్తలు చితక బాదారు. 

    సీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు (సోమవారం) జైపూర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

    నీట్‌ పరీక్ష పత్రికా లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు జైపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్‌ దీప్కే హాజరయ్యారు. దీంతో పార్టీ మద్దతుదారులు ఆయనను భూజాలపై ఎత్తుకొని ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని పరిణామం జరిగింది.  

    కాగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో జైపూర్‌లో నిర్వహించిన నిరసనల్లో ఆయనపై దాడి జరిగింది.

    కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం 

    ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. 

     

  • లక్నో: వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కావాల్సిన బ్యాగ్స్‌,బుక్స్‌, పెన్నులు కొనుగోలు చేసేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేషనరీ షాపులకు క్యూకట్టారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌శాఖ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసింది. స్టేషనరీ షాపుల్లో కొనుగోలు చేసే పెన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

    పెన్నుల్లా కనిపించేవన్నీ పెన్నులు కాదని.. సంఘ విద్రోహ శక్తులు పెన్నులకు బదులు..వాటి ఆకారంలో ఉండే బాంబుల్ని తయారు చేశారని తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని విడుదల చేసింది.

    ఉత్తరప్రదేశ్‌లో పెన్ ఆకారంలో ఉన్న అనుమానాస్పద వస్తువులపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బులంద్‌షహర్ జిల్లా పోలీసులు (ఖుర్జా పోలీస్‌ స్టేషన్ పరిధి) ఈ అడ్వైజరీని విడుదల చేశారు. పెన్‌లా కనిపించే అనుమానాస్పద వస్తువులను తాకరాదని ప్రత్యేక సూచనలు చేశారు. ఇవి విస్ఫోటక పరికరాలుగా మార్పిడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

    ప్రజలు రోడ్లపై, పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎడారిలాంటి ప్రాంతాల్లో కనిపించే వస్తువులను తాకకుండా 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల సహకారం అత్యంత కీలకమని, శిక్షణ పొందిన భద్రతా సిబ్బందే ఇలాంటి వస్తువులను పరిశీలించాని తెలిపారు. ప్రజలు సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. 

     

  • దక్షిణ, మధ్య ప్రాంతాల్లోకి ఇటీవల రుతుపవనాలు విస్తరించినప్పటికీ, దేశంలోని చాలా ప్రాంతాలలో అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు. మురిపించినట్టే మురిపించిన మేఘాలు తగినతంగానే వర్షించకుండానేమాయమైపోతున్నాయి. ఇదే విషయాన్ని ఉపగ్రహ చిత్రాలుకూడా వెల్లడిస్తున్నాయి. దీంతో నైరుతి రుతుపవనాలు ఎందుకు దోబూచులాడుతున్నాయనే ఆందోళన నెలకొంది. 

    ఐఎండి (IMD) గణాంకాల ప్రకారం, జూన్ 4 నుండి జూన్ 15 మధ్య సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ.  వర్షపాతానికి బదులుగా కేవలం 19.2 మి.మీ. మాత్రమే నమోదైంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షపాతంలో 64 శాతం  లోటు ఏర్పడింది.  అంటే భారతదేశ నైరుతి రుతుపవనాలు  దాదాపుగా అదృశ్యమైనట్లు కనిపిస్తోంది. శాటిలైట్‌ అండ్‌  ఐఎండి (IMD) డేటా ప్రకారం, భారతదేశంలోని చాలా ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. ఈ వారం చివర్లో వర్షపాతం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఎగువ వాతావరణంలోని గాలుల కారణంగా రుతుపవనాల కార్యకలాపాలు గణనీయంగా నిలిచిపోయాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 14 , 15 తేదీలలో తీసిన INSAT-3DS ఉపగ్రహ చిత్రాలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. నైరుతి రుతుపవనాలు కరుణించకపోవడంతో అటు  రైతులు, ఇటు సామాన్యులు  ఆకాశం వైపు చూస్తూన్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, వర్షం ఎందుకు కురవడం లేదు? అనే మీమాంసలో పడిపోయారు.  

    భారీ వర్షపాత లోటు
    జూన్ 4 నుండి జూన్ 15 మధ్య కాలంలో సాధారణంగా కురవాల్సిన 53.7 మి.మీ. వర్షపాతానికి గానూ దేశంలో కేవలం 19.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఏకంగా 64శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఐఎండీ (IMD) మ్యాప్ ప్రకారం మధ్య, దక్షిణ , తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. దీనికి సంబంధించి శాటిలైట్ చిత్రాలలో స్పష్టమైన మార్పు  కనిపిస్తోందంటున్నారు.

    ఇదీ చదవండి: ట్విన్స్‌ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్‌!

    సాధారణంగా రుతుపవనాలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు దేశమంతటా దట్టమైన మేఘాలు వ్యాపించి ఉంటాయి. కానీ జూన్ 15 నాటి INSAT-3DS ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ద్వీపకల్ప (పెనిన్సులర్), మధ్య భారతదేశ ఆకాశం అసాధారణంగా నిర్మలంగా కనిపిస్తోంది. మేఘాల కదలికలు కేవలం హిమాలయాలు, ఈశాన్య భారత్‌, ఇండో-గంగా మైదానాల ఉత్తర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అరేబియా సముద్రం వైపు రుతుపవన శాఖ బలహీనపడింది.  ఇటీవలి రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగినప్పటికీ ఈ మందగమనం చోటుచేసుకుంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సమస్య చుట్టుపక్కల సముద్రాలపై తేమ కొరత వల్ల కాదు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల పైన జరుగుతున్న ఒక పెద్ద వాతావరణ సంఘర్షణ వల్ల ఏర్పడింది.

    ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

    రుతుపవనాలు మందగమనానికి కారణాలు
    సముద్రాలలో తగినంత తేమ ఉన్నప్పటికీ, వాతావరణంలో ఎగువ పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రుతుపవనాల సమయంలో ఇది ఉత్తరానికి వెళ్లాల్సి ఉండగా, ఈసారి అసాధారణంగా దక్షిణం వైపునకు మరలిపోతున్నాయి.  ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ పై ప్రభావమే కారణమా?  ఈ బలమైన పశ్చిమ గాలులు (Westerlies), రుతుపవనాలకు ఇంజిన్‌లా పనిచేసే తూర్పు గాలుల (Easterlies) మెకానిజంను అణచివేస్తున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ, మేఘాలు ఏర్పడటానికి మరియు వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు లభించడం లేదు. అయితే వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే. ఈ వారం చివర్లో జెట్ స్ట్రీమ్ సరళి బలహీనపడి, రుతుపవన వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అప్పటి వరకు, నైరుతి రుతుపవనాలిచ్చే విస్తృత వర్షాల కోసం భారతదేశంలోని చాలా ప్రాంతాలు వేచి ఉండవలసిందే.

    ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

  • సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ జరుపుతుంది. ఈ అంశంలో  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని ఈ రోజు (సోమవారం) అధికారులు విచారించారు. కోల్‌కతాలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా నిన్న ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో అధికారులు  అభిషేక్ బెనర్జీని దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు.

    మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలు ,నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాల్లో ఆయన పాత్రపై ఈడీ అభిషేక్ బెనర్జీని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది. ఈనెట్‌వర్క్ ద్వారా, అర్హులైన అభ్యర్థుల కంటే లంచాలు చెల్లించిన వ్యక్తులకే ప్రాధాన్యత లభించిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.   

    స్కామ్ నేపథ్యం

    పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా మండలి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రూప్-సి, గ్రూప్-డి సిబ్బందితో పాటు ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ ఉపాధ్యాయుల నియామకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, అర్హత గల అభ్యర్థులను పక్కన పెట్టి, పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అర్హత లేని వారికి, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ.
      
    అక్రమాల కోసం  OMR షీట్ల తారుమారు చేశారని కొందరు ఖాళీ పేపర్లు వదిలినా వారికి ఉద్యోగాలు వచ్చాయని,  అధికారిక అర్హత లేకపోయినా, అక్రమ మార్గాల్లో వందలాది మందికి నకిలీ సిఫార్సు లేఖల ద్వారా నియామక పత్రాలు అందజేశారు. అర్హులైన అభ్యర్థుల పేర్లను వెనుకకు నెట్టి, లంచాలు ఇచ్చిన వారి పేర్లను మెరిట్ లిస్ట్‌లో పైకి చేర్చారని ఆరోపణలున్నాయి. 

    దీంతో ఈ స్కామ్‌పై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ED అరెస్ట్ చేసింది. అర్పితా ముఖర్జీ నివాసాల నుంచి సుమారు రూ. 50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం, ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

     

     

  • ఐవీఎఫ్‌  పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్‌ఏ మ్యాచ్‌ కాకపోవడంతో గురుగ్రామ్‌కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.

    గురుగ్రామ్‌కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్‌ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్‌ రిపోర్ట్స్‌లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా  పీడకలగా మారిపోయింది. 

    మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.

    ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

    ఏం జరిగింది?
    ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను  ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో ఉన్న ఒక ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్‌కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్‌దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న  మీనూ  గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే  ట్విన్స్‌ పోలీకలపై అనుమానంతో టెస్ట్‌ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్‌గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో క్లినిక్‌ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

    ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్‌ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

  • కట్టుకున్న భర్త వేధింపులకు గురిచేసి, అత్యంత  దారుణంగా హింసించిన  కేసు ఒకటి కలకలం రేపుతోంది. ఎర్రగా కాలిన ఇనుప రాడ్‌తో వాతలు పెట్టి  హింసించాడు. మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చేతనైతే పోలీసుల దగ్గరకు వెళ్లమని సవాలు విసిరాడు. కట్‌ చేస్తే...  క్రైమ్‌ థిల్లర్‌లా సాగిన ఈ కథలో  చివరికి ఆమె పోలీసుల వద్దకు చేరింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి రావడంతో ఈ హింస మొదలైంది. రాత్రి భోజనం తర్వాత  తిట్టడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకించడంతో ఆమెపై క్రూరంగా దాడి చేశాడు.కర్రతో బాదాడు, చెంపదెబ్బలు కొట్టాడు, బెదిరించాడు. ఆ హింసను భరించలేక, మాంగీబాయి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.  ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి బయటకు వచ్చింది.


    మొదటిసారి దొరికిపోయింది
    గంటల తరబడి నడుచుకుంటూ ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు  వెడుతుండగానే,  ఒక గుడి సమీపంలో ఆమె భర్త ఆమెను అడ్డుకుని, మళ్లీ దాడి చేసి, బలవంతంగా గ్రామానికి తీసుకువెళ్లాడు. మరింత క్రూరంగా మారిపోయాడు. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసులేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి,తాళం వేశాశాడు.  ఇప్పుడు చూస్తాను నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నాపై ఎలా ఫిర్యాదు చేస్తావో, ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో  అంటూ  బెదిరిస్తూ పదే పదే కొట్టాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్‌ను వేడి చేసి, ఆమె శరీరంపై కాల్చాడని ఆమె తెలిపింది. ఆమె నడుము, నడుము కింది భాగం, కుడి తొడపై ఈ వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా, ఎవరూ   సాయం చేసేవారే లేకపోయారు. 24 గంటలు బయటకు వెళ్లనివ్వలేదు, ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టాలని  తాళం   బయటకు వెళ్లాడు. అతగాడి క్రూరత్వం,జరగబోయే  హింసను ఊహించి భయంతో, రాజీకి అంగీకరించినట్లు నటించింది. కానీ మనసులో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూసింది.

    తీవ్ర అలసటతో, ఒళ్లంతా గాయాలతో, ముళ్ళు గుచ్చుకుని తెగిపోయిన పాదాలతో, తనను బంధించడానికి వాడిన ఇనుప గొలుసు ఇంకా మెడలోనే వేలాడుతుండగా చివరికి పోలీసు స్టేషన్‌ గడప తొక్కింది. సాహసోపేతమైన తప్పించుకునే ప్రయత్నం, చివరకు ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ అరెస్టుకు దారితీసింది.

     ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్‌ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌

    దారి చూపిన రాయి
    పంచాయతీ కోసం భర్త బయటికి వెళ్లగానే చుట్టూ సాయంకోసం వెదికింది. మాంగీబాయి కళ్ళు అక్కడ ఉన్న ఒక రాయిపై పడ్డాయి. అంతే దాన్నితీసుకుని తాళంపై  ఒకటి, రెండుసార్లు పదే పదే  తాళం పగిలే దాకా కొడుతూనే ఉంది.  చివరకు తాళం విరిగింది. గొలుసు తెగిపోయింది, బందీఖానానుంచి విముక్తి లభించింది. క్షణం కూడా వృధా చేయకుండా, ఆమె ఇంటి నుండి పరుగులు తీసి ఖిల్చిపూర్ వైపు నడవడం ప్రారంభించింది.

    చీకట్లో ఆరు కిలోమీటర్ల ప్రయాణం
    చుట్టూ చీకటి.. మెడలోఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా.. మాంగీబాయి నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాలు, గరుకు మార్గాల గుండా నడక మొదలు పెట్టింది. ఒక పక్కన ముళ్ళు గుచ్చుపోయి, కాళ్ళు రక్కుకుపోయి రక్తం కారిపోతున్నా ఆమె పయనం ఆగలేదు. ముందుకు సాగుతూనే ఉంది. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని అనుకున్నారు.  కానీ ఎవరూ కనీసం  ఆగి ప్రశ్నించలేదు. అయితే, ఒక బాటసారి ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఏదైనా ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు తన ప్రయాణాన్ని కొనసాగించింది.

    ఇదీ చదవండి: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం
    షాక్‌కు గురైన పోలీసులు
    రాత్రి 10 గంటల ప్రాంతంలో మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించగానే అక్కడున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. మెడలో తాళం వేసిన గొలుసు, శరీరంపై వాతలు , తీవ్ర భయాందోళలో గజ గజ వణికిపోతూ స్టేషన్‌కు చేరుకున్న  ఆమె కన్నీరుమున్నీరై, జరిగినదంతా వివరించింది. పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో ఆమె శరీరంపై గాయాలు, వాతలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే ఒక పోలీసు బృందం గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్తను అరెస్టు చేశారు.

  • సాక్షి, చైన్నె: తమిళనాడులో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీ వైదొల‌గింది. ఈ విష‌యాన్ని టీఎంసీ (ఎం) అధ్య‌క్షుడు జీకే వాసన్ ప్ర‌క‌టించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్య బాధ్యులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. 12 ఏళ్ల క్రితం స్థాపిత‌మైన త‌మ పార్టీ గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిందని ఆయ‌న‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని ఆయన చెప్పారు.

    ఎన్డీఏలో ప్రాధాన్యత లేదు: నేతల ఆగ్రహం
    చైన్నె ఎగ్మోర్‌లో ఆదివారం జీకే వాసన్‌ అధ్యక్షతన టీఎంసీ (ఎం) అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం జ‌రిగింది. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన రాష్ట్ర, జిల్లా స్థాయి నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మెజారిటీ నాయకులు ఎన్డీఏ కూటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో తమ పార్టీకి దక్కాల్సిన కనీస ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని, కాబట్టి కూటమి నుండి తక్షణమే వైదొలగాలని జీకే వాసన్‌ను కోరారు. మరికొందరు నేతలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ప్రత్యామ్నాయాల వైపు చూడటం మంచిదని అభిప్రాయపడ్డారు.

    అవకాశవాద రాజకీయాలు పెరిగాయి
    నాయకుల అభిప్రాయాలను విన్న అనంతరం జీకే వాసన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అవకాశవాద రాజకీయాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్న వారు, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఏదో ఒక పార్టీ గుడ్డిగా సాహసం చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన.. వారే ఎల్లకాలం విజయం సాధిస్తారని తాను భావించడం లేదన్నారు.

    చ‌దవండి: విజ‌య్ ప్ర‌భుత్వంపై రజినీకాంత్ స‌తీమ‌ణి నో కామెంట్‌

    ఒక పార్టీ స్థిరంగా రాణించాలంటే బలమైన సంస్థాగత నిర్మాణంతో పాటు సరైన సంకీర్ణం అవసరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగతంగా ఎప్పుడో బలహీనపడిందని, టీఎంసీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నా అంతర్గతంగా కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే ఒక్క ఎన్నికలలోనూ గెలవలేక పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నామ‌ని, అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే వరకు స్వతంత్రంగా వ్యవహరిస్తామని, బలోపేతం దిశగా వెళ్తామన్నారు.

Politics

  • హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తన గురువు చంద్రబాబు ఎపిలో 2018లో సేవా మిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించినట్లే,బిఆర్ఎస్ పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గ, బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఏల ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బిజేపి పార్టీ,కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయని,ఆ రెండు పార్టీలు ఒక్కటై,తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రతో,ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.  ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ నిర్వహించి సుమారు 90 లక్షల ఓట్లు తొలగించి,మమత బెనర్జీ పార్టీని ఓడించారని తెలిపారు. బిజేపి అధికారంలోకి వచ్చాక అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.

    మాజీ మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు గల్లంతయ్యిందని, బెంగళూరులో రాహుల్ ద్రావిడ్ కూడా ఓటు వినియోగించలేకపోయారన్నారు.  ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏమరుపాటుగా ఉంటే మన ఓటు కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్యుమరేషన్ ఫారం నింపిన తర్వాత, వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఓటు తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు,ఓటు తొలగించాలంటే ఖచ్చితంగా నోటీసు ఇవ్వాల్సిందేనన్నారు. 

    అంతేకాకుండా 326 ప్రకారం ఎవరైనా వ్యక్తులు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉంటే, రిప్రజెంటేషన్ ఈఫ్ పీపుల్ యాక్ట్ 1950 లోని సెక్షన్ 17,18 ప్రకారం ఏడాది పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.2028లో  కేసీఆర్ గారిని తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే బిఎల్ఏలే ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి,నూతన ఓటు నమోదు చేయడానికి ఫారం 6 నింపి ఇవ్వాలని, బిజేపి,కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బిఎల్ఓ లను ప్రభావితం చేసి,దొంగ ఓట్లు వేయిస్తే,వెంటనే అధికారులకు ఫిర్యాది చేసి, ఫారం 7 ద్వారా ఓట్లు తొలగించాలని సూచించారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు, మ్యాపింగ్ టెక్నాలజీ ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.  ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్నా, వెంటనే అభ్యంతరాలు తెలుపుతూ,ఫారం 8 ద్వారా సరిచేసుకోవాలన్నారు.

    తెలంగాణలో అభివృద్ధి పథంలో నడవాలంటే,తిరిగి కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని,అందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితంగా మన బూత్ లో ఉండే అన్ని కుటుంబాలను కలిసి అందరి ఓట్లు నమోదయ్యేలా చూడాలని,నిరంతరం బిఎల్ఓలను వెంట ఉండి ఓట్లు పోకుండా చూడాలన్నారు. తుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి,మాజీ రాజ్యసభ ఎంపి మల్లయ్య యాదవ్, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్‌ ఎంపీలు సోమవారం పార్టీ ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు పోరాడతామని ప్రకటించారు. తాము టీఎంసీని వీడలేదని, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనమవుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం మాత్రం మాట మార్చారు.

    అరూప్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. “మేము టీఎంసీని వీడలేదు. టీఎంసీలోనే ఉన్నాం. పార్టీని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అది ఎందుకు దెబ్బతిన్నదన్న చర్చ జరగడం లేదు. పార్టీ గుర్తు కోసం మేము పోరాడతాం. మా వద్ద 20 మంది సభ్యులు ఉన్నారు. గుర్తు కోసం ఎందుకు పోరాడకూడదు?” అని తెలిపారు.

    రాజకీయ, న్యాయ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతాయన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తిరుగుబాటు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త దశకు నాంది పలికిందని చక్రవర్తి అన్నారు. “కొత్త ఆట మొదలైంది. ఖేలా హోబే” అని ఆయన అన్నారు. ఈ పరిణామం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. 20 మంది రెబల్‌ టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తాము ఎన్‌సీపీఐలో విలీనమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ అరూప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ సమావేశంలో ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు కోరారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ నుంచి శాసనసభ్యుల స్థాయిలో తమ విభజనను అధికారికంగా ప్రకటించినట్టైంది.

    కోర్టును ఆశ్రయిస్తాం 
    ఆరు సార్లు ఎంపీగా ఎన్నికైన సుదీప్ బంద్యోపాధ్యాయ్ తిరుగుబాటు వర్గంలో చేరారు. తమదే నిజమైన టీఎంసీ అని నిరూపించేందుకు, పార్టీ జంట పువ్వుల ఎన్నికల గుర్తుపై హక్కు సాధించేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఈ తిరుగుబాటుపై టీఎంసీ నాయకత్వం తీవ్రంగా స్పందించింది. పార్టీ వాదన ప్రకారం, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఈ చర్య చెల్లదు. రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీ ముందుగా విలీనం కావాలి లేదా విడిపోవాలి. ఆ తర్వాతే శాసనసభ్యులు అనర్హత నిబంధనల నుంచి మినహాయింపు కోరగలరని చెప్పారు.

    ఎక్స్‌లో చేసిన పోస్టులో ఘోష్ స్పందిస్తూ.. “2/3 వంతుల మెజారిటీ, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంపై భారీ స్థాయిలో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉంది. పదో షెడ్యూల్, సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాయి. పార్లమెంట్ వెలుపల ఉన్న రాజకీయ పార్టీనే ముందుగా విడిపోవాలి లేదా విలీనం కావాలి. పార్లమెంట్‌లో కూర్చున్న పార్టీ ప్రతినిధులు కాదు. ఈ షరతు నెరవేరిన తర్వాతే 2/3 మంది విడిపోయినా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు” అని తెలిపారు.

    సీనియర్ టీఎంసీ నేత సౌగత రాయ్ కూడా తిరుగుబాటు నేతలపై విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారు ద్రోహం చేశారని ఆరోపించారు. “ఇప్పుడు మమతా బెనర్జీ అధ్యక్షురాలిగా ఉన్న అఖిల భారత తృణమూల్ కాంగ్రెసే అసలైన పార్టీ అని స్పష్టమైంది. ఎన్నికల గుర్తు రెండు పువ్వులు. భారతీయ జనతా పార్టీని ఓడించడమే దాని లక్ష్యం” అని ఆయన చెప్పారు.

    “టీఎంసీ గుర్తుపై ఎన్నికైన 20 మంది ఎంపీలు తమ ఓటర్లకు ద్రోహం చేస్తూ, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరారు. చట్టవిరుద్ధంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10(4) నిబంధనల నుంచి తప్పించుకోవడానికే వారు ఇలా చేశారు. ప్రజలు ఈ వార్తను గమనిస్తున్నారు” అని రాయ్ అన్నారు.

    మమతా బెనర్జీపైన కూడా చక్రవర్తి నేరుగా విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆమె ఒత్తిడిలో ఉన్నారని అన్నారు. “మమతా బెనర్జీ భయపడుతున్నారు. పార్టీ సమావేశం కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు సొంత నియోజకవర్గంలో కూడా సమావేశం నిర్వహించలేకపోయారు” అని ఆయన చెప్పారు.

  • హైదరాబాద్‌:  తమ పార్టీ అంటే సీఎం రేవంత్‌రెడ్డి  భయపడిపోతున్నారన్నారని  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. అందుకే కిషన్‌రెడ్డిని, బీజేపీని టార్గెట్‌ చేస్తున్నారన్నారు.  రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన రాంచందర్‌రావు.. హైదరాబాద్‌ వ్యక్తిగా కిషన్‌రెడ్డితో పాటు తాసు కూడా ఇక్కడ అభివృద్ధి కోరుకుంటామని, రేవంత్‌కు హైదరాబాద్‌ అభివృద్ధి జరగాలని లేదని విమర్శించారు. 

    బీజేపీ బలం పుంజుకుంటోందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు.  కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదు. మీరు టెక్నికల్ గా తప్పులు ఇస్తే తప్ప. మీ చేతగాని తనాన్ని మా మీద తోయాలని చూస్తున్నావు. మోదీ గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌ది కాదు. మోదీ ముందు రేవంత్‌ చిన్నపిల్లాడు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది. సీఎం మాట ఎవరు వినట్లేదు’ అని ఆరోపించారు. 

  • కోల్‌క‌తా: పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే నేత‌ల‌ను కాద‌ని సినిమా తార‌ల‌ను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ఆ పార్టీకి చెందిన నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని, పార్టీ కోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే వారిని గుర్తించాల‌ని కోరుతున్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మ‌మ‌తా బెన‌ర్జీపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసి ఎన్డీఏ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అధినేత్రి తీరుపై పార్టీలో గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా స‌యోనీ ఘోష్ (Saayoni Ghosh).. రెబల్ ఎంపీల వర్గంలో చేరడం టీఎంసీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

    గుణ‌పాఠం నేర్పారు
    మ‌మ‌తా బెన‌ర్జీకి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెన‌ర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న స‌యోనీ ఘోష్.. టీఎంసీని వీడ‌తార‌ని ఊహించ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. స్థాయికి మించి అవ‌కాశాలు క‌ల్పించినా ఆమె పార్టీని వీడ‌డం జీర్ణించుకోలేపోతున్నామ‌ని చెబుతున్నారు. “స‌యోనీ ఘోష్‌ రెబల్ వర్గంలో చేరుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఆమెను అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాయకురాలిగా ఎదిగే అవకాశం కల్పించారు. ఇది మమతా, అభిషేక్‌లకు కూడా ఒక పాఠం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతల కంటే సినీ రంగం నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచారు” అని టీఎంసీ సీనియ‌ర్ నాయ‌కుడొక‌రు వ్యాఖ్యానించారు.

    మ‌హువా మెయిత్రా భావోద్వేగం
    పార్టీని వీడి, రెబ‌ల్ గ్రూపు ఎంపీల‌తో స‌యోనీ ఘోష్ చేతులు క‌ల‌ప‌డం త‌న‌ను బాధించింద‌ని టీఎంసీ ఎంపీ మ‌హువా మెయిత్రా వ్యాఖ్యానించారు. “స‌యోనీ నాకు చెల్లెలిలాంటిది, కూతురితో స‌మానం. ఆమె పార్టీని విడిచిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఎంతో కష్టపడి ఎదిగింది. డబ్బు కోసం లేదా వ్యక్తిగత లాభం కోసం పనిచేసే వ్యక్తి కాదు. గత ఐదేళ్లలో పార్టీ ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి వ్యక్తి పార్టీని వీడాలని ఆలోచించడం చాలా బాధాకరం. భయాన్ని జయించి ముందుకు సాగాలని నేను ఆమెకు చెప్పాలనుకుంటున్నాను” అని మహువా మొయిత్రా పేర్కొన్నారు.

    స‌యోనీ స్థానంలో అర్నాబ్
    టీఎంసీలో సంక్షోభం నేప‌థ్యంలో రెబ‌ల్ ఎంపీల వ‌ర్గంలో స‌యోనీ ఘోష్ చేరిన‌ట్టు గత వారం వార్త‌లు వ‌చ్చాయి. ఎన్డీఏకు మ‌ద్ద‌తుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు రెబ‌ల్ ఎంపీలు స‌మ‌ర్పించిన లేఖ‌లో ఆమె కూడా సంత‌కం చేసిన‌ట్టు తెలియ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీనిపై గత వారాంతంలో ఢిల్లీలో ఆమె స్పందిస్తూ..  “సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను” అని పేర్కొన్నారు. తాజాగా ఆమెతో పాటు పలువురు రెబల్ ఎంపీలతో పాటు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను కలిసి.. నేష‌న‌లిస్ట్ సిటిజ‌న్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తామంతా విలీనమైనట్లు ప్రకటిస్తూ పార్లమెంట్‌లో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి స‌యోనీ ఘోష్‌ను తొల‌గించి, ఆమె స్థానంలో అర్నాబ్ బెన‌ర్జీ (Arnab Banerjee)ని మ‌మ‌త నియ‌మించారు.

    చ‌దవండి: తాను రాఘ‌వ్ చ‌ద్దాను కాదంటూనే.. ఝ‌ల‌క్‌!

    స‌యోనీ రాజకీయ ప్రస్థానం
    2021 అసెంబ్లీ ఎన్నికల ముందు సయోనీ ఘోష్ అధికారికంగా టీఎంసీలో చేరారు. అంతకుముందు ఆమె బీజేపీపై విమర్శలు చేస్తూ వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే ఏడాది ఆసన్సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్‌పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆమె ఎన్నికల ప్రచారంలో చూపిన చురుకుదనం టీఎంసీ అధిష్ఠానాన్ని ఆకట్టుకుంది. ఎన్నికల అనంతరం అభిషేక్ బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగిస్తూ జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ యువ నాయకురాలిగా స‌యోనీ వేగంగా ఎదిగారు. ప్ర‌స్తుతం జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజ‌వ‌ర్గానికి ప్రాతినిథ్య‌వం వ‌హిస్తున్నారు. 

  • కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తీసుకున్న ఓ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి తాను అందుకున్న అన్ని కానుకలను తిరిగి ఇస్తానని బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో తెలిపారు. 

    రెండేళ్ల క్రితం తన పెళ్లి సందర్భంగా తన భార్యకు మమతా బెనర్జీ ఇచ్చిన బంగారు హారం, దుర్గాపూజ సమయంలో తనకు ఇచ్చిన పంజాబీ-పైజామా దుస్తులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.

    ఇది తన మనస్సాక్షికి సంబంధించిన విషయం అని బైద్యనాథ్ ఘోష్ చెప్పారు. "ఆ ఆప్యాయతకు నేను కృతజ్ఞుడిని. అయితే ఇటీవలి పరిణామాల దృష్ట్యా, నా మనస్సాక్షి చెప్పింది విని ఈ కానుకలను తిరిగి ఇవ్వడం సముచితమని భావిస్తున్నాను" అని పోస్టులో బైద్యనాథ్ ఘోష్ పేర్కొన్నారు.

    "ఆ హారం బ్యాంకు లాకర్‌లో ఉంది. గత రెండేళ్లలో ఆ బంగారు హారం విలువపై వచ్చిన వడ్డీకి సమానమైన మొత్తాన్ని జత చేసి ఈ కానుకలన్నీ తిరిగి ఇస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆమె కాళీఘాట్ నివాసానికి పంపిస్తాను" అని తర్వాత మీడియాతోనూ చెప్పారు.

    మమతతో పాటు సౌగత రాయ్, కల్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, సోనాలి గుహ సహా కొందరు టీఎంసీ నేతలు తనపై, తన కుటుంబంపై పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని బైద్యనాథ్ ఆరోపించారు. తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల విషయంలో మమత, టీఎంసీకి చెందిన పలువురు సీనియర్ నేతలను బహిరంగ క్షమాపణ కోరుతూ న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

    ఈ వివాదంపై స్పందించిన సౌగత మాట్లాడుతూ.. "కాకోలి కుమారుడు చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపిల్లల తరహాలో ఉన్నాయి, ఆధారరహితమైనవి. మమతా బెనర్జీకి కానుకలు తిరిగి ఇవ్వాలన్న అతని నిర్ణయం హాస్యాస్పదం. నాకు ఏదైనా న్యాయపరంగా నోటీసు వస్తే, తగిన విధంగా స్పందిస్తాను" అని అన్నారు.

    బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. కానుకలు తిరిగి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టైమింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు ఈ చర్యను హాస్యాస్పదంమని పేర్కొనగా, మరికొందరు ఇది రాజకీయ ప్రేరణతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. బైద్యనాథ్‌పై చాలామంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

  • తాడేపల్లి : రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.  చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ధ్వజమెత్తారు. దీనిపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు శైలజానాథ్‌. 

    ఈరోజు(సోమవారం, జూన్‌ 15వ తేదీ) రాయలసీమ లిఫ్టు నిలిపివేతపై తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ ప్రాంతానికి సంబంధించిన పార్టీ నేతలు సమావేశమయ్యారు.  దీనికి సాకే శైలజానాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కాకాని గోవర్ధన రెడ్డి తదితరులు హాజరయ్యారు. త్వరలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 

    దీనిపై శైలజానాథ్‌ మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది. రాయలసీమ ప్రాజెక్టులను నిలిపేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపునకు దిగారు. దీనిపై రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తాం. తొలుత అనంతపురం, నెల్లూరు జిల్లాలో తొలుత పర్యటిస్తాం. ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం.  మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. కృష్ణా, తుంగభద్ర మీద ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా రాయలసీమ ఎడారిగా మారుతోంది. చంద్రబాబు తక్షణం స్పందించాలి.

    వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్టును ఏర్పాటు చేస్తే చంద్రబాబు దాన్ని ఆపేశారు. రేవంత్ రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను పనంగా పెట్టారు. ఏపీ హక్కులను కాలరాశారు. అదేమంటే బనకచర్ల ప్రాజెక్టు పేరు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యే రాయలసీమ లిఫ్టును పూర్తి చేయకుండా బనకచర్ల అంటారెందుకు?, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుక పడిన ప్రాంతాల కన్నీటితో రాజధానిని కడతారా?, రాజధానిలో జరుగుతున్న అవినీతికి అడ్డూ అదుపు లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాలకంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేయటం వెనుక భారీ అవినీతి ఉంది. అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం పెట్టినా మావిగన్, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అనేదే లేదు’ అని ధ్వజమెత్తారు.

Sports

  • టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. జడ్డూ అద్భుత ఆటగాడని.. అతడిని వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే, అందుకోసం ముందుగా జడేజా సెలక్టర్లను ఒప్పించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

    ఈ ఏడాది మూడు వన్డేలు ఆడిన స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జడేజా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఓవర్‌కు ఆరు చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు జడ్డూ ఎంపిక కాలేదు. యువ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు.

    మరోవైపు.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ 37 ఏళ్ల జడ్డూ భవిష్యత్తు గురించి మాట్లాడాడు.  

    హార్దిక్‌ పాండ్యా తిరిగి వస్తే.. 
    ‘‘జడేజాను ఇప్పుడే లెక్కలోంచి తీసేయొద్దు. అతడు ఇప్పటికీ అద్భుతమైన క్రికెటరే. నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆల్‌రౌండర్‌. హార్దిక్‌ పాండ్యా తిరిగి వస్తే.. నితీశ్‌కు బదులు అతడే జట్టులో ఉంటాడు.

    ఇక హార్దిక్‌తో పాటు జట్టులో ఉన్న మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజానే. అతడు ప్రపంచకప్‌ వరకు కొనసాగితే బాగుంటుంది. అయితే, అందుకు జడ్డూ తన ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించాల్సి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ జట్టు నుంచి పూర్తిగా తప్పిస్తామంటే మాత్రం అది మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిక్కా పేర్కొన్నాడు.

    ఫామ్‌లోకి వస్తేనే
    కాగా 2027లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో దిగ్గజ బ్యాటింగ్‌ ద్వయం విరాట్‌ కోహ్లి- రోహిత్‌ శర్మ ఆడతారా లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక అరుదుగా జట్టుకు దూరమయ్యే కోహ్లి.. తొడకండరాల గాయంతో అఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. 

    మరోవైపు.. ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి వచ్చిన రోహిత్‌ అఫ్గనిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో చిక్కా మాట్లాడుతూ.. రోహిత్‌ ఫామ్‌లోకి వస్తేనే ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. లేదంటే అతడికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.

    చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌ సూర్యవంశీ

  • న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం అందుకుంది. లార్డ్స్ వేదికగా తొలి టెస్టులో పర్యాటక కివీస్‌ను 115 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం (జూన్‌ 17) నుంచి లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగారెండో టెస్టు మొదలుకానుంది.

    ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. నైట్‌క్లబ్‌ వివాదం నేపథ్యంలో రెగ్యులర్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌పై వేటు వేసిన బోర్డు.. అతడి స్థానంలో రెండో టెస్టుకు వెటరన్‌ ప్లేయర్‌ జో రూట్‌ సారథిగా వ్యవహరిస్తాడని తెలిపింది.

    ఇద్దరి అరంగేట్రం
    ఇక కివీస్‌తో రెండో టెస్టు సందర్భంగా తమ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నట్లు ఈసీబీ వెల్లడించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోర్డాన్‌ కాక్స్‌, హాంప్‌షైర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సోనీ బేకర్‌ టెస్టుల్లో అడుగుపెట్టనున్నట్లు తెలిపింది.

    కాగా జోర్డాన్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు.. బేకర్‌ ఇప్పటికి రెండు వైట్‌బాల్‌ మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, చివరగా అతడు 2025లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. ఇక జోర్డాన్‌ ఎనిమిది నెలల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు.

    ఇదిలా ఉంటే.. స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా రెండో టస్టు సందర్భంగా జట్టుతో చేరుతున్నాడు. కాగా నైట్‌క్లబ్‌ వివాదంలో స్టోక్స్‌తో పాటు ఆల్‌రౌండర్‌ గస్‌ అట్కిన్సన్‌ మీద కూడా వేటు పడింది. ఇక ఓలీ రాబిన్సన్‌ను విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో జోర్డాన్‌, బేకర్‌, ఆర్చర్‌ తుదిజట్టులోకి వచ్చారు.

    న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు
    జో రూట్‌ (కెప్టెన్‌), జోఫ్రా ఆర్చర్‌, సోనీ బేకర్‌, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్‌, జోర్డాన్‌ కాక్స్‌, బెన్‌ డకెట్‌, మ్యాట్‌ ఫిషర్‌, ఎమీలియో గే, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), జోష్‌ టంగ్‌.

    చదవండి: శ్రీలంకప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌ సూర్యవంశీ.. 

  • భారత్‌- ‘ఎ’ జట్టు కెప్టెన్‌ తిలక్‌ వర్మ, యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.

    దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్‌- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్‌.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై’ అయింది.

    అయితే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్‌ చేయకుండానే.. సింగిల్‌ తీసి రనౌట్‌ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.

    ఈ నేపథ్యంలో కెప్టెన్‌ తిలక్‌ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్‌ సూర్యవంశీ కూడా తిలక్‌కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.

    అయితే, కాసేటికే తిలక్‌ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్‌ ఓవర్లో తిలక్‌ బంతిని అర్షద్‌ ఖాన్‌కు ఇవ్వగా.. లంక కెప్టెన్‌ సహన్‌ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్‌కాగా.. తదుపరి మరో సింగిల్‌ వచ్చింది.

    మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్‌ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్‌గా మలచగా.. ఆరో బంతి నోబాల్‌ అయింది. దీంతో ఫ్రీ హిట్‌ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్‌ విషయంలో కూడా తిలక్‌ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ, సూర్యాంశ్‌ షెడ్గే బ్యాటింగ్‌కు దిగగా.. భారత్‌కు ఓటమే ఎదురైంది. 

    చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌.. వీడియో వైరల్‌

  • ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్‌ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్‌ ఆద్యంతం ఉ‍త్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    మ్యాచ్‌ ‘టై’
    ఆల్‌రౌండర్లు సూర్యాంశ్‌ షెడ్గే (72), విప్రాజ్‌ నిగమ్‌ (51) అర్ధ శతకాల వల్ల భారత్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్‌ నిగమ్‌ పిచ్‌ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్‌కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.

    ఫలితంగా మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ తరఫున బ్యాటింగ్‌కు దిగిన వైభవ్‌ సూర్యవంశీ, సూర్యాంశ్‌ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్‌ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.

    భారత్‌ ఓటమి
    ఆ తర్వాత వైభవ్‌ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్‌ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్‌ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్‌ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్‌ను ఏదో అన్నట్లుగా కనిపించింది.

    శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్‌
    దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్‌ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్‌, సూర్యాంశ్‌ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్‌ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్‌ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా

  • ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్‌ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.

    ముక్కోణపు వన్డే సిరీస్‌
    కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్‌, అఫ్గనిస్తాన్‌ ‘ఎ’ జట్ల మధ్య జూన్‌ 9న ముక్కోణపు వన్డే సిరీస్‌ మొదలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ భారత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.

    ఇక మూడో మ్యాచ్‌లో శ్రీలంక అఫ్గనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా సోమవారం భారత్‌- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్‌ వర్మ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    265 పరుగులు చేసి ఆలౌట్‌
    గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11), వైభవ్‌ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్‌ బదోని 15, నిశాంత్‌ సింధు 6, అనుకుల్‌ రాయ్‌ 8, అర్షద్‌ ఖాన్‌ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.

    అయితే, ఆల్‌రౌండర్లు సూర్యాంశ్‌ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్‌ నిగమ్‌ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    పది పరుగుల పెనాల్టీ
    శ్రీలంక బౌలర్లలో విజయకాంత్‌ వియస్కాంత్‌, మొహ్మద్‌ షిరాజ్‌ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్‌ సహన్‌ అరాచిగే, వనుజా సహన్‌, కుగాతస్‌ మతూలన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్‌ నిగమ్‌ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్‌ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.

    ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్‌ సమయంలో బంతి వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.

    ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్‌ డిక్‌విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విశేన్‌ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్‌ సహన్‌ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్‌ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.

    ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్‌ (25) రాణించగా.. విజయకాంత్‌ వియస్కాంత్‌ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.

    నరాలు తెగే ఉత్కంఠ
    ఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.

    ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్‌ ఠాకూర్‌ నోబాల్‌తో 48వ ఓవర్‌ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్‌ రాగా.. గుణశేఖర ఫోర్‌ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌ ఖాన్‌ బంతితో రంగంలోకి దిగాడు.

    తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్‌ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్‌ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్‌ మూడో బంతికి సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్‌ పూర్తి చేశాడు.

    దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్‌ సింగ్‌ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్‌ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.

    సూపర్‌ ఓవర్‌ ముగిసిందిలా..
    అయితే, గుణశేఖర షాట్‌ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్‌ అయి కీపర్‌ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్‌గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్‌ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్‌లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    భారత కెప్టెన్‌ తిలక్‌ వర్మ అర్షద్‌ ఖాన్‌ చేతికి బంతినివ్వగా.. వైడ్‌, నోబాల్‌ రూపంలో భారత్‌ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్‌ విషయంలో తిలక్‌ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్‌ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. 

  • టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

    ఆకిబ్‌ నబీకి మొండిచేయి 
    అంతకుముందు అఫ్గన్‌తో ఏకైక టెస్టు ఆడింది శుబ్‌మన్‌ గిల్‌ సేన. ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్‌ బ్రార్‌కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.

    ఈ నేపథ్యంలో ఆకిబ్‌ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్‌ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్‌లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.

    వన్డేతో అరంగేట్రం
    ఇక అఫ్గన్‌తో టెస్టు మ్యాచ్‌లో గుర్నూర్‌ బ్రార్‌కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్‌ బౌలర్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

    ఇద్దరూ రాణించారు
    ఇక తన తొలి ఓవర్లోనే వికెట్‌ తీసిన గుర్నూర్‌ బ్రార్‌.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్‌ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్‌ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

    సెలక్టర్ల నిర్ణయం సరైందే
    ఈ నేపథ్యంలో అశ్విన్‌ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్‌ నబీని కాదని గుర్నూర్‌ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్‌ బ్రార్‌ తొలి మ్యాచ్‌లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.

    ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్‌ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్‌ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్‌ చేయగలడు.

    సెలక్టర్లు ఆకిబ్‌ నబీని కాదని గుర్నూర్‌ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్‌ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్‌లను తప్పక అభినందించాల్సిందే.

    భవిష్యత్తులో టీమిండియా స్టార్‌ బౌలర్‌గా
    ఒకవేళ అతడు ఫిట్‌గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్‌ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్‌ బౌలర్‌గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్‌.. 26 ఏళ్ల గుర్నూర్‌ బ్రార్‌తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. 

    అదే విధంగా.. హర్ష్‌ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్‌ అఫ్గన్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    చదవండి: 29 బంతుల్లోనే చహల్‌ సెంచరీ

  • టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న ‘రికార్డు’ను బద్దలుకొట్టాడు.

    ఇంతటి పవర్‌ హిట్టరా? 
    చహల్‌ ఇంతటి పవర్‌ హిట్టరా? ఎప్పుడూ అతడి బ్యాటింగ్‌ చూడలేదే! అంటూ ఆశ్చర్యపోతున్నారా?!.. ఆగండాగండి.. చహల్‌ శతక్కొట్టింది.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ నిర్వహించే ఓ యూట్యూబ్‌ చాలెంజ్‌ షోలో!..

    శ్రేయస్‌ అయ్యర్‌ 22 బంతుల్లోనే..
    అవును.. పీటర్సన్‌ నిర్వహించే ఈ యూట్యూబ్‌ షోలో ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు పాల్గొన్నారు. డివిలియర్స్‌ 30 బంతుల్లో శతకం చేయగా.. టీమిండియా స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 22 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇక భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల 25 బంతుల్లో శతక చాలెంజ్‌ను పూర్తి చేశాడు.

    తాజాగా చహల్‌ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించాడు. యాభై బంతుల్లో సెంచరీ కొట్టాలని పీటర్సన్‌ సవాలు చేశాడు. ఇక తొలి బంతి గంటకు 51 మీటర్ల వేగంతో వస్తుందని.. అయితే, ఆ తర్వాత ప్రతీ బంతికి 1 మీటర్‌ వేగం మేర పెరుగుతుందని పీటర్సన్‌ షరతు విధించాడు. అంతేకాదు.. చహల్‌ కోసం బౌండరీని 40 మీటర్లకు కుదించాడు.

    14 బంతుల్లోనే 50 పరుగులు
    ఈ క్రమంలో మొదటి బంతికే సిక్సర్‌ బాదిన చహల్‌.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మధ్యలో చాలాసార్లు ఫీల్డర్లు అతడి క్యాచ్‌ జారవిడవడంతో లైఫ్‌ పొందిన చహల్‌.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో 14 బంతుల్లోనే 50 పరుగులు మార్కు అందుకున్నాడు చహల్‌.

    29వ బంతికి సిక్సర్‌ బాది శతకం
    ఆ తర్వాత కవర్స్‌ మీదుగా సిక్సర్‌ బాదే క్రమంలో చహల్‌ ఫీల్డర్‌కు దొరికిపోయాడు. అయితే, ఇందుకు ప్రతిగా అతడి స్కోరులో ఐదు పరుగుల కోత విధించిన పీటర్సన్‌.. తర్వాత ఆటను కొనసాగించాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో 90 పరుగులు పూర్తి చేసుకున్న చహల్‌.. 29వ బంతికి సిక్సర్‌ శతక మార్కు అందుకున్నాడు.

    చహల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక పీటర్సన్‌ 50 బంతుల్లో సెంచరీ చేయాలనే షరతు విధించగా.. ఈ స్పిన్‌ బౌలర్‌ మరో 21 బంతులు మిగిలి ఉండగానే.. అంటే 29 బంతుల్లో శతక్కొట్టడం మరో విశేషం. 

    చదవండి: IND vs SL: కొంప ముంచేశాడు!

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్‌లో దిగిన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోతాడు. ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే వారికి సమాధానం చెబుతాడు. స్లెడ్జింగ్‌కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇస్తాడు.

    ఇక అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లికే చెల్లింది. అయితే, కొంతమంది మాత్రం విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని అహంకారి అని.. దూకుడు ఎక్కువని.. అతి చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లిని విమర్శిస్తూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది.

    అది నిజమే.. విరాట్‌ కోహ్లి అహంకారి
    ఇందుకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌, కోహ్లితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. వన్‌8 చానెల్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘అహంకారి.. అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు. దూకుడు.. కోహ్లి గురించి వాళ్లు అన్న ప్రతీ మాట నిజమే. 

    అయితే, ఇదంతా క్రికెట్‌ మైదానంలో ఉన్నంత వరకే. మైదానం వెలుపల కోహ్లి ఇందుకు పూర్తి విభిన్నం. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు.

    ప్రత్యేక అనుబంధం
    కాగా రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో నంబర్‌ వన్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ ఇద్దరు తర్వాతి కాలంలో తమ తమ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ.. వారి మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం నిరూపితమైంది.

    ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఫైనల్‌ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. ఇక రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతూ.. తనదైన శైలి వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు.

    చదవండి: IND vs SL: కొంపముంచేశాడు!

  • శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్‌ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.

    అఫ్గన్‌ చేతిలో ఓటమి
    అనంతరం అఫ్గన్‌-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్‌ జట్టు డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

    ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్‌ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్‌, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలిచి లంక టాప్‌కు దూసుకెళ్లగా.. భారత్‌ రెండు, అఫ్గన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.

    మరోసారి శ్రీలంకతో
    ఈ ట్రై సిరీస్‌లో భాగంగా భారత్‌ సోమవారం నాటి మ్యాచ్‌లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

    ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11), వైభవ్‌ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ 37, కెప్టెన్‌ తిలక్‌ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్‌రౌండర్లు సూర్యాంశ్‌ షెడ్గే (72), విప్రాజ్‌ నిగమ్‌ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.

    రెండుసార్లు అదే తప్పు
    అయితే, విప్రాజ్‌ చేసిన పొరపాటు వల్ల భారత్‌ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్‌-‘ఎ’ ఇన్నింగ్స్‌లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్‌.. సింగిల్‌ తీసే క్రమంలో పిచ్‌ మధ్యలో పరిగెత్తాడు.  ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్‌ మధ్యలో (ప్రొటెక్టెడ్‌ ఏరియా)కి వచ్చి డ్యామేజ్‌కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్‌ సదరు స్ట్రైకర్‌ను హెచ్చరిస్తాడు.

    ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్‌ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్‌ రాయ్‌ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్‌ వార్నింగ్‌తో వదిలేశాడు. అయితే, విప్రాజ్‌ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్‌ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్‌కు పది పరుగుల మేర నష్టం కలిగింది.

    పది పరుగుల నష్టం
    ఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్‌ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్‌ రేసులో ఉండాలంటే భారత్‌ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్‌ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!

    చదవండి: హోల్డర్‌ సిక్సర్ల వర్షం.. సిరీస్‌ విండీస్‌ కైవసం

Business

  • బంగారం ధరలు పెరుగుతాయని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' మరోసారి హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    మొత్తానికి బంగారం తన కదలికను ప్రారంభించింది. ఒక్క రోజులోనే 100 డాలర్లు దాటింది. మీరు దీనిని గమనించారా?. ఒకవేళా గమనించకపోతే, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసిడి ధర పెరుగుదల ఇప్పుడే మొదలైంది. ఈ రోజు బంగారం ఔన్సుకు 4300 డాలర్ల వద్ద ఉంది. అయితే 2025 నాటికి ఇది 35,000 డాలర్లకు చేరుకోవచ్చని కియోసాకి పేర్కొన్నారు.

    కియోసాకి అభిప్రాయం ప్రకారం డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుంది. అందుకే "క్యాష్ ఈజ్ ట్రాష్'' అని వ్యాఖ్యానిస్తూ, కేవలం డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. నగదు రూపంలో డబ్బును నిల్వ ఉంచడం కంటే.. విలువను నిలబెట్టుకునే ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మంచిదని అంటున్నారు.

    బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథీరియం, చమురు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం మంచిదని కియోసాకి సలహా ఇస్తున్నారు. తాను కూడా గత కొన్ని సంవత్సరాలుగా నగదును ఈ ఆస్తులుగా మార్చుకుంటూ వచ్చానని, వాటినే 'నిజమైన డబ్బు'గా భావిస్తున్నానని చెప్పారు.

    అయితే ఇది కియోసాకి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పెట్టుబడుల విషయంలో మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రిస్క్‌లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు పూర్తి పరిశీలన చేయడం, ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఈ విషయంలో పెట్టుబడిదారులు తప్పకుండా జాగ్రత్త వహించాలి.

  • కార్లలో ఉండే స్టెప్నీ (Spare Tyre) సాధారణంగా.. మిగతా టైర్ల కంటే కొద్దిగా చిన్నగా ఉండటం చాలా మంది గమనించి ఉంటారు. కొందరు దీనిని తయారీ లోపంగా భావించినప్పటికీ, వాస్తవానికి ఇది ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో భాగంగా తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయం. ఈ చిన్న స్టెప్నీని సాధారణంగా 'స్పేస్ సేవర్' లేదా 'డోనట్ టైర్' అని పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా ఉపయోగించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందిస్తారు.

    బరువును తగ్గించడం
    స్టెప్నీ టైర్ చిన్నగా ఉండటానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాహనం బరువును తగ్గించడం. కారు ఎంత తక్కువ బరువు ఉంటే అంత తక్కువ ఇంధనం వినియోగిస్తుంది. దీంతో మైలేజ్ మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి హానికరమైన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ప్రతి కారులో పూర్తి పరిమాణం గల అదనపు టైర్‌ను ఉంచితే వాహనం బరువు పెరిగి ఇంధన వినియోగం కూడా పెరుగుతుంది.

    స్థలాన్ని ఆదా చేయడం
    మరో ముఖ్యమైన కారణం స్థలాన్ని ఆదా చేయడం. చిన్న పరిమాణంలోని స్టెప్నీ కారు డిక్కీలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ప్రయాణికులు తమ లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కార్లలో డిక్కీ స్థలం పరిమితంగా ఉండటం వల్ల ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    ఖర్చు తగ్గించడం
    ఖర్చును తగ్గించడం కూడా మరో కారణం. చిన్న టైర్, రిమ్ తయారీకి తక్కువ ముడిసరుకు అవసరం అవుతుంది. ఫలితంగా తయారీ ఖర్చు తగ్గుతుంది. స్టెప్నీని రోజువారీ వినియోగం కోసం కాకుండా కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి ఖరీదైన పూర్తి పరిమాణం గల టైర్‌ను అందించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వాహన ధర కూడా కొంత వరకు నియంత్రణలో ఉంటుంది.

    తాత్కాలిక ఉపయోగం కోసం
    అయితే ఈ చిన్న స్టెప్నీని ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగించకూడదు. సాధారణంగా 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తారు. అలాగే గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడపకూడదు. దీని ప్రధాన ఉద్దేశం సమీపంలోని టైర్ రిపేర్ సెంటర్ లేదా సర్వీస్ స్టేషన్ వరకు సురక్షితంగా చేరుకోవడమే.

    సులభ వినియోగం
    చిన్న స్టెప్నీ తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల దానిని మార్చడం కూడా సులభం. రోడ్డుపై టైర్ పంక్చర్ అయినప్పుడు డ్రైవర్లు లేదా ప్రయాణికులు పెద్దగా శ్రమ లేకుండా స్టెప్నీని అమర్చగలుగుతారు. పూర్తి పరిమాణం గల టైర్‌తో పోలిస్తే దీనిని ఎత్తడం, అమర్చడం చాలా సులభంగా ఉంటుంది.

    అయితే.. చిన్న స్టెప్నీ వాడుతున్నప్పుడు వాహనం గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండ్లింగ్‌లో స్వల్ప మార్పులు రావచ్చు. అందువల్ల జాగ్రత్తగా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది. స్టెప్నీ అనేది స్వల్ప దూరం ప్రయాణించడానికి మాత్రమే అనే విషయం మర్చిపోకూడదు.

  • బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి అక్షరాలా కాసుల వర్షం కురిసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2020-21 సిరీస్-3 ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో భారీ లాభాలను అందుకోబోతున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ ధరను ప్రకటించింది. జూన్ 16, 2026 నుంచి ఈ బాండ్లను ముందస్తుగా రీడీమ్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది. గడచిన మూడు ట్రేడింగ్ రోజుల్లోని బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా.. ఈ విడత ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ ధరను గ్రాముకు రూ.14,774 గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయిన తర్వాత, వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌కు అవకాశం ఉంటుంది.

    ధర ఎలా లెక్కిస్తారంటే..

    ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన రేట్ల ప్రకారం... రిడంప్షన్ తేదీకి ముందు ఉన్న మూడు వ్యాపార రోజుల్లో 999 స్వచ్ఛత (24 క్యారెట్ల) బంగారం ముగింపు ధరల సాధారణ సగటును పరిగణనలోకి తీసుకొని ఈ ధరను ఖరారు చేశారు.

    పెట్టుబడిదారులకు ఎంత రాబడి వస్తుంది?

    ఈ సిరీస్ జారీ చేసిన సమయంలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు గ్రాముకు రూ.50 తగ్గింపుతో రూ.4,627 లభించగా, ఆఫ్-లైన్ ఇన్వెస్టర్లకు రూ.4,677 గా ఉంది. ప్రస్తుత రిడంప్షన్‌ ధర రూ.14,774గా ఉంది. దాంతో నికరంగా 215.88% శాతం లాభం చేకూరినట్లయింది.

    గమనిక: ఈ లాభం బాండ్లపై లభించిన 2.5% వార్షిక వడ్డీ భాగం కాకుండా కేవలం బంగారం ధరల పెరుగుదల ద్వారా వచ్చిన నికర లాభం మాత్రమే.

    రూ.లక్ష పెట్టుబడి.. రూ.3.19 లక్షలు!

    ఈ లెక్కన 2020 జూన్‌లో ఈ బాండ్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన ఆన్‌లైన్ ఇన్వెస్టర్ ప్రస్తుత పెట్టుబడి విలువ ఏకంగా రూ.3.19 లక్షలకు పైగా పెరిగింది. దీనికి అదనంగా గడచిన ఐదేళ్లలో ఏటా లభించిన 2.5 శాతం వడ్డీ ఆదాయం అదనం.

    పన్ను నిబంధనల్లో మార్పులు

    ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను నిబంధనలను సవరించినందున ఇన్వెస్టర్లు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి.

    • ప్రైమరీ ఇష్యూ (మొదటగా ఆర్‌బీఐ వద్ద కొనుగోలు చేసిన) చందాదారులు కూడా ఐదేళ్ల తర్వాత ‍ప్రిమెచ్యూర్‌ రిడంప్షన్‌ చేసుకుంటే వచ్చే లాభాలపై మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

    • ఎస్‌జీబీ నిబంధనల ప్రకారం లభించే పూర్తి పన్ను మినహాయింపు ప్రయోజనం.. కేవలం 8 ఏళ్ల కాలపరిమితి ముగిసే వరకు బాండ్లను ఉంచుకునే అసలు చందాదారులకు మాత్రమే పరిమితం చేశారు.

    • స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసిన వారు ఆ బాండ్లను మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు హోల్డ్ చేసినప్పటికీ.. సవరించిన నిబంధనల ప్రకారం వారికి ఇకపై పన్ను రహిత విముక్తి (Tax-free Redemption) లభించదు. వారు కూడా పన్ను చెల్లించాల్సిందే.

    ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

  • భారతదేశంలో ఎల్‌పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్‌పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.

    ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

    ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్‌ఆయిల్ వన్ యాప్‌ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు హెచ్‌పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్‌ వంటి దశలు ఉంటాయి.

    ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

    ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.

  • ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.

    12 మందితో బోర్డు ఏర్పాటు

    దీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.

    శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.

    అప్‌సైడ్ అగ్రిమెంట్ వివరాలు

    ఈ విలీన పథకంలో భాగమైన ‘అప్‌సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.

    వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..

    అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.

    ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

  • టెస్లా భారతదేశంలో లాంచ్ చేసిన మోడల్ వైఎల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV రూపంలో లాంచ్ అయిన ఈ కారు ప్రారంభ ధర రూ.61.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ మోడల్ కంటే కూడా విశాలమైన క్యాబిన్‌ పొందుతుంది. ఇది 2+2+2 సీట్ల అమరికలో ఉంటుంది.

    మోడల్ YLలో 16-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండవ వరుసలోని ప్రయాణీకుల కోసం 8-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్, 2వ వరుస సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 19-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

    మోడల్ YL డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5.0 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని. ఇది ఒక ఫుల్ ఛార్జితో 681 కి.మీ రేంజ్ అందిస్తుందని టెస్లా పేర్కొంది. ఇది 250 kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 288 కి.మీ వరకు ప్రయాణించగల ఛార్జింగ్ పొందగలరు.

  • ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    కట్టుదిట్టమైన భద్రత

    ఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్‌కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.

    కమిటీతో భేటీ - విరాళం

    పూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్‌నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్‌నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

    జై శ్రీరామ్ నినాదాలతో..

    కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.

    ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం

  • ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.

    ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.

    బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలు

    పడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.

    ఇతర దేశాలు ఇలా..

    ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.

    డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?

    ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్‌లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.

    నిజమైన ఖర్చులు ఇవే..

    పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.

    పెరుగుతున్న గృహాల ధరలు

    కుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్‌ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.

    ఆలస్యమవుతున్న వివాహాలు

    ఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!

    ఆధునిక మహిళ - పని వాతావరణం

    నేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్‌ అన్నారు.

    ఇంటెన్సివ్ పేరెంటింగ్

    నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్‌హుడ్‌ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.

    గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)

    యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.

    అడ్డంకులు/కారణాలుశాతం (%)
    ఆర్థిక పరిమితులు39%
    ఉద్యోగ అభద్రత21%
    గృహ సమస్యలు19%
    సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు12%

    మనం నేర్చుకోవాల్సిన పాఠాలు

    భారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్‌ఆర్‌) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్‌ఆర్‌ 1.9 కు పడిపోయింది.

    1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

    భారత్ ఏం చేయాలి?

    సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్‌ కేర్‌, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.

    ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం

  • డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే, దీని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్‌మర్ (Keir Starmer) నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్‌లను నిషేధిస్తానని, గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు విధిస్తానని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడటానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.

    బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సంవత్సరాలలో టెక్నాలజీ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సు నిర్ధారణ వ్యవస్థలు, అల్గారిథమ్‌లలో మార్పులు, అనుచిత చిత్రాలను పంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కంపెనీలను ఆదేశించింది. అయితే.. ఇప్పుడు కేవలం నియంత్రణలతో సరిపోదని భావించిన ప్రభుత్వం, పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తోంది.

    బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రేలియాను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్) వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచింది.

    పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు.. రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్‌లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షలు వంటి అంశాలను పరిశీలించింది.

    ఈ సంప్రదింపుల్లో లక్షకు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు.. ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90 శాతం మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు.

    అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

    ఇదీ చదవండి: క్యాష్ ఈజ్ ట్రాష్.. పెట్టుబడిదారులకు కియోసాకి హెచ్చరిక!

  • గ్లోబల్ మార్కెట్‌లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

    ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.

    ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణ

    ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్‌ఏఆర్‌) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.

    ‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.

    బ్యాంకులకు ఊరట

    విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్‌ను తగ్గించడానికి ఆర్‌బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ) డిపాజిట్ల కోసం ఆర్‌బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్‌బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

    ఇదీ చదవండి: మల్టీప్లెక్స్‌ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!

  • సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 76,264.33 వద్దఎం నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి.

    మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఎక్సీకామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్, హెచ్‌బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, రవీందర్ హైట్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

  • భారతదేశంలో పర్యావరణ హిత ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఇది ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    కంపెనీ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేసిన సమయంలో ధరలను ప్రకటించలేదు. అయితే తాజాగా సంస్థ ఈ వాహనం ధరను రూ.7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించింది.

    వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు.. స్టాండర్డ్ వ్యాగన్ ఆర్ ZXi+ వేరియంట్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇందులో 1.2 లీటర్ K12N పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. అయితే ధర మాత్రం జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌ కంటే రూ. 86,000 ఎక్కువ.

    వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ E20 నుంచి E85 వరకు ఉన్న ఇథనాల్ - పెట్రోల్ మిశ్రమాలతో నడుస్తుంది. అంటే ఇంధనంలో 20 శాతం నుంచి 85 శాతం వరకు ఇథనాల్ ఉన్నప్పటికీ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్‌పై ఆధారపడటం తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది. అంతేకాకుండా.. చెరకు వంటి పంటల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.

    ఇదీ చదవండి: హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్‌లు

    అయితే.. ఈ వాహనం ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కాకుండా కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. కమర్షియల్ విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యాగన్ ఆర్ టూర్ H3తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇందులో ఉన్న 1.2 లీటర్ ఇంజిన్ మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. టూర్ H3లో 1.0 లీటర్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది.

    పనితీరు విషయానికి వస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌లో పవర్ లేదా టార్క్ పరంగా ఎటువంటి పెరుగుదల లేదు. ఈ 1.2 లీటర్ ఇంజిన్ గరిష్టంగా 90.9 హార్స్‌పవర్, 113.7 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

  • ప్రపంచ ‍ప్రసిద్ధ పర్సనల్‌ పైనాన్స్‌ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్‌ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.

    ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్‌ కార్డులపై 1.28 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని  అభిప్రాయపడ్డారు.

    అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్‌ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్‌గ్రేడ్‌లు, వివిధ సబ్‌స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.

    తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’లో ఉపయోగించిన “డూడాడ్స్‌ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు.

     

    ప్రస్తుతం సగటు అమెరికన్‌ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్‌ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్‌ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

    అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు.

Telangana

  • హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్టడీ చైర్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించడం, మెరుగైన అధ్యయన వాతావరణాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

    ఈ కార్యక్రమాన్ని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్‌టీఎఫ్) మరియు బీసీ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సంయుక్తంగా నిర్వహించాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా పోటీ పరీక్షలు మరియు ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన సౌకర్యాలను అందించారు.

    ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భట్టి విక్రమార్క సామాజిక న్యాయం, విద్యా అభివృద్ధి, వెనుకబడిన మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. సమాన అవకాశాల సమాజ నిర్మాణానికి విద్యలో పెట్టుబడి అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.

  • హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్‌కు తరలించారు.

    కేసు ఏంటి? 
    ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్‌లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద‍్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప. 

    రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డి అసమర్థత వల్లే మెట్లో ఫేజ్‌-2కు అనుమతులు లభించడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మెట్రో ఫేజ్‌-2 అనుమతులు దక్కకపోవడం ఆయన అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు (సోమవారం) కేటీఆర్ కౌంటరిచ్చారు. అధికారం పొందిన నాటి నుంచి 71 సార్లు సీఎం ఢిల్లీకి వెళ్లినా బజెపి రేవంత్‌ను పట్టించుకోవడం లేదన్నారు.

    ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని సీఎం రేవంత్ ప్రశ్నించలేక పోతున్నారని, ప్రధానిని ప్రశ్నించే ధైర్యం లేక  ప్రతిపక్షంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి  మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందని... 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును కాంగ్రెస్ చిక్కుల్లో వదిలేస్తే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని గుర్తుచేశారు. 

    కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించ‍ారు కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతుందని ఆరోపించారు.

    అంతకు ముందు మెట్రో ఫేజ్‌-2 అనుమతుల విషయంలో సీఎం రేవంత్ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేటీఆర్‌లపై మండిపడ్డారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేటీఆర్‌ కుట్రలు చేస్తున్నారని  ఆరోపించారు. తాజాగా కేటీఆర్ దానికి కౌంటరిచ్చారు.

  • ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఏపీ విభజనలో కాంగ్రెస్‌ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు  ఇంకా అలానే ఉ‍న్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇ‍వ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.

    ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్‌ 15వ తేదీ) పవన్‌ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్‌ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్‌ కల్యాణ్‌ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. 


     

  • హైదరాబాద్‌: బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రి సీతక్క సమక్షంలో ప్రభుత్వం, తరుణి సంస్థ మధ్య ఎంఓయూ కుదిరింది. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ‘‘బాల్య వివాహం-బతుకు ఆగం’’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది ప్రభుత్వం.

    సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... ‘‘బాల్య వివాహం కుటుంబ సమస్య మాత్రమే కాదు.. సామాజిక సమస్య. బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. బాల్య వివాహాల వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతుంది. బాల్య వివాహాలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. 

    బాలికల ఆర్థిక స్వావలంబనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ‘బాల్య వివాహం–బతుకు ఆగం’ నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత విస్తరిస్తాం. బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. 

    బాలికలకు హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందిస్తాం. బాల్య వివాహాల దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునే వాతావరణం కల్పించాలి. బాల్య వివాహాలకు ముగింపు పలకడానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం సమష్టిగా ముందుకు రావాలి’’ అని పిలుపునిచ్చారు. 

  • హైదరాబాద్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.

    ‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్‌ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్‌ కల్యాణ్‌ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Andhra Pradesh

  • తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

    ‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.

    అతని మీద 94 కేసులు 
    మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట‍్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. 

    ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? 

    మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

    లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు.

  • సాక్షి,కృష్ణ: విజయవాడలో కాల్‌మనీ ఆగడాలు కొనసాగుతున్నాయి.రూ.5 కోట్లు ఇచ్చి రూ.21 కోట్లు వడ్డీ కట్టించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. మరో రూ.5 కోట్లు కట్టాలంటూ వ్యాపారికి కాల్‌మనీ ముఠా బెదిరింపులకు దిగింది. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.

    దీంతో తన న్యాయం చేయాలని బాధితురాలు హోంమంత్రి అనితను కలిశారు. తనపై కాల్‌మనీ ముఠా దాడి చేసిందని ఆరోపించారు. ప్రామిసరీ నోట్‌పై సంతకాలు చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    కాల్‌మనీ వ్యాపారులు వెనిగళ్ల హర్షవర్ధన్‌, హరినాథ్‌లకు..టీడీపీ పెద్దల అండదండలున్నాయని చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందు అండతో కాల్‌మనీ ముఠా రెచ్చిపోతుందని బాధితురాలు పోయారు.  

  • సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (సోమవారం) పలు జిల్లాల్లో మరికాసేపట్లో పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ నేపథ్యంలో పలు జిల్లాలలకు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్డ్ , అనకాపల్లి,  అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. 

    భారీ వర్షాలతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతా గాలులు వీచే అవకాశం ఉందని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెట్లకింద, పలు హోర్డింగుల దగ్గర నిల్చోకూడదని తెలిపింది.

    ఏపీలో 4 జిల్లాల్లో భారీ వర్షం

     

  • సాక్షి,విజయవాడ: నెల రోజుల క్రితం ఆచూకీ గల్లంతయిన గాదె సాయి కృష్ణ కేసుపై ఏపీ హైకోర్టులో ఈవాళ విచారణ జరిగింది. విచారణలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29లోగా బాధితుణ్ని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేదంటే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

    కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. నెల రోజుల క్రితం ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడలో మీడియా ఎదుట కన్నీటి పర్యంతరమయ్యారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.

    తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆ సమయంలో  ఆమె  న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల (మే)9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.

    ఏపీ హైకోర్టులో సాయికృష్ణ తల్లి.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

    తన సెల్‌ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్‌ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు.  

    ఈ నేపథ్యంలో తన కుమారుడు గురించి సమాచారం ఇవ్వాలని కోరుతూ గాదె సాయికృష్ణ తల్లి ఏపీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయికృష్ణను కోర్టులో హాజరుపరచాలని సీఐ నాగరాజును ఆదేశించింది. 

  • సాక్షి,విజయవాడ: ఏపీ సచివాలయంలో వింత ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సచివాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలు విధించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సోమవారం (జూన్‌ 15) ఎస్‌ఐఆర్‌లో పలు సమస్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్సీ లు అప్పిరెడ్డి, రాహుల్లాలు, లీగల్ సెల్ మనోహర్ సహా పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ సీఈవోకి వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చారు. ఎన్నికల కమిషన్‌ సీఈవోకి లేఖ ఇచ్చారు.

    అనంతరం లేఖపై మీడియాతో మాట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నం చేశారు. అయితే, సెక్రటరియేట్‌లో మీడియాతో మాట్లాడడంపై ఆంక్షలు అమలులో ఉన్నాయంటూ వారిని పోలీసులు అధికారులు అడ్డుకున్నారు. ఆ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

    YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు  

Family

  • సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎ‍వ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్‌వ్లాగ్‌లో షేర్‌ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే కాదు..అక్కా మొట్టమొదటి వ్లాగ్‌ సూపర్‌ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆమె ఏ దేశం వెళ్లింది..అక్కడ ఎలా తనను తాను పరిచయం చేసుకుందంటే..

    ఆ వీడియోలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అనీష్ భగత్ వద్ద పనిచేసే రేష్మా అతనితో కలిసి థాయ్‌లాండ్‌కు ప్రయాణించడం కనిపిస్తుంది. తన తొలి అనుభవాలను చిత్రీకరించి ట్రావెల్‌ వ్లాగ్‌లో షేర్‌ చేసిది. ఇదే తొలి ట్రావెల్‌ వ్లాగ్‌ వీడియో అని తెలిపింది. తాను ఒక పనిమనిషిగా మగతోడు లేకుండా భారతదేశం దాటి బయటకు రావడం ఇదే మొదటసారి అని వీడియోలో పేర్కొంది. 

    తాను అనీష్‌ సోదరుడుతో కలిసి థాయ్‌లాండ్‌ చేరుకున్న తర్వాత ఒంటరిగా ఒకరోజంతా గడపమని చెప్పినట్లు తెలిపింది. అలాగే తన తొలి వాగ్‌లో, అనీష్ తనకు ఆసక్తి ఉన్న పనులు చేయమని అడిగాడని రేష్మా పంచుకుంది. అయితే తనకు దేనిపై ఆసక్తి ఉందో ఎప్పుడు ఆలోచించలేదు, పైగా అంత తీరిక కూడా దొరకలేదని చెప్పింది. 

    అయితే తాను కేవలం పనమ్మాయినని, తనకు ఇక్కడ భాష రాదు, అలాగే చదవడం రాదని చెప్పింది. కానీ వంట చేయడం వచ్చు. అందుకే స్నేహితులను చేసుకునేందుకు బొబ్బట్లు చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. 

    అక్కడ ఎలా స్పెండ్‌ చేసిందంటే..
    రేష్మా తనకు ఇష్టమైన చీర కట్టుకుని ఒంటరిగా థాయ్‌లాండ్‌ను అన్వేషించడానికి బయలుదేరడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశంలో కొత్త స్నేహితులను చేసుకోవడానికి ఆమె బొబ్బట్లతో నిండిన టిఫిన్ బాక్స్‌ను తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అందమైన ఆలయానికి చేరుకుని ఒక జర్మన్‌ వ్యక్తిని కలిసి బొబ్బట్లు ఇచ్చి స్నేహితుడిని చేసుకుంటుంది. 

    ఆ తర్వాత రేష్మా ఒక 7-ఎలెవెన్‌ను సందర్శించింది, అక్కడ ఆమెకు పోపో అనే మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ పరిచయమైంది. ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇద్దరూ వెళ్లే దారిలో కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం ఆస్వాదించారు. ఆ తదనంతరం ఆమె ఇలా పేర్కొంది. బాధ్యతల కారణంగా మన ఆడవాళ్ళం తరచుగా మన గురించి మనం ఎందుకు మరచిపోతామో నాకు తెలియదు.

    సినిమాల్లో లాగా ఒక పుస్తకం చదువుతూ, ఒక గిన్నెడు మామిడి స్టిక్కీ రైస్ తింటూ ఆమె ఆ రోజును ముగించింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె తనలో తాను, “రేష్మా, నీ గురించి నాకు గర్వంగా ఉంది,” అని అనుకోవడం చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ, స్పందన రావడమే గాక, ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత హృద్యమైన ట్రావెల్ వ్లాగ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం.

     

    (చదవండి: నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడితే..నేడు అందరూ మెచ్చే చెఫ్‌గా..!)

     

  • జీవితం ఎప్పుడు  అందరికీ ఒకేలాంటి కష్టాలు, సవాళ్లను ఇవ్వదు. ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కొందరికి పెద్దయ్యాక కష్టాలు వెంటాడితే మరికొందరికి పుట్టుకతో కష్టాలు వెంటాడతాయి. అంతేగాదు ఆ దుర్భరమైన జీవితం సాగించలేక కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయ్‌. అయినా తట్టుకుని నిలబడిన వాడికే మంచిజీవితం లభిస్తుంది, గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు ఈ ఢిల్లీ మహిళ కథే ఉదాహరణ. ఈమె కథ వింటే 'బిచ్చగాడు' మూవీలోని 
    ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
    జానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడం
    కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్న
    మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా అన్న పాట గుర్తొస్తుంది. మరి ఆమె పడ్డ కష్టాలు..ఎలా వాటిని అధిగమించి ఉన్నతస్థాయి చేరుకుందో సవివరంగా చూద్దామా.!.

    ఆ మహిళే లిలీమా ఖాన్‌. ఢిల్లీలోని తైమూర్‌ నగర్‌కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఒక సోదరుడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవారు. అయినప్పటికీ..మూడేళ్ల వయసున్న లిలీమా తన తండ్రి ఇరుగుపొరుగు వారి కోసం ప్రేమగా వండే కిచిడీ, రోటీ వంటి సాదాసీదా భోజనం వండటం చూసేది. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితం ఆకస్మికంగా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. 

    మొదట 2001లో, లిలీమాకు కేవలం ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత, ఆమె తల్లి క్షయ వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన కళ్లముందే అక్క వైవాహిక సమస్యలతో మరణించడం చూసింది. ఈ వరుస కష్టాలు ఆమెను కుంగదీస్తుంటే..మరోవైపు సోదరుడు డ్రగ్స్‌కి బానిసై దొంగతనాలకు అలవాటుపడటంతో జైలుపాలయ్యాడు. 

    దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిపోయింది లిలీమా. అయితే ఆమె అత్త తన తమ్ముడిని చేరదీసింది గానీ ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోలేదు. దాంతో అనాధగా మిగిలిన లిలీమాను తైమూర్ నగర్ మురికివాడలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇచ్చినా..ఒక పూట భోజనం కోసంతెల్లవారుజామున  ఫ్రెండ్స్ కాలనీ వీధుల్లో చెత్త ఏరడానికి ఇతర పిల్లల తోపాటు పంపేది. 

    అక్కడ మాల్స్‌, మెక్‌డొనాల్డ్స్‌ వంటి ప్రాంతాల్లో  చెత్తబుట్టల్లో వెతుకుతూ, మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ ఎముకలు, సగం తిన్న బర్గర్‌లను తింటూ గడిపేది. అలా కష్టాలు పడుతున్న లిలీమాను 11 ఏళ్ల వయసులో ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సహాయం అందించి, చదువు చెప్పించడంతో ఆమె పరిస్థితి మెరుగవ్వడం ప్రారంభమైంది. అయితే కొద్దికాలానికే తిరిగి వచ్చి..తన అత్త, తమ్ముడి వద్దకు వచ్చి..అక్కడే ఉండేందుకు ఇష్టపడింది. అయితే లిలీమా అత్త ఆమెను అక్కడ షుఫ్యాక్టరీలో పనికి పెట్టింది. 

    ఆ వ్యక్తి రాకతో చిగురించిన జీవితం..
    సరిగా పనిచేయకపోతే అత్త చేతిలో దెబ్బలు తింటూ మళ్లీ కష్టాల కడలిలో చిక్కుకుంది. ఆ తర్వాత ఎన్జీవో కార్యకర్త హర్ష్ మందర్‌ను సంప్రదించింది. ఆయన కాశ్మీరీ గేట్‌లోని బాలికల అనాథాశ్రమమైన కిల్కారి రెయిన్‌బో హోమ్‌లో  చేరడానికి సహాయం చేశారు. అక్కడే ఉన్న సమయంలో లిలీమాకు వంటపై ఆసక్తి కలిగింది. అయితే 2015లో, అనాథాశ్రమానికి తరచుగా వచ్చే ఒక సందర్శకుడు లిలీమా వంట నైపుణ్యాలను గమనించి, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌లో ఆమెకు ఉద్యోగం ఇప్పించారు. 

    అక్కడ సిబ్బందికి భోజనం తయారుచేయడమే లిలీమా ఉద్యోగం. అందుకు రూ. 7000లు జీతం ఇచ్చేవారు. అలా తన వంట నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో అక్కడుండే హెడ్ చెఫ్ వద్ద మ్యాష్డ్ పొటాటోస్ తయారుచేయడం, బర్గర్లు, సలాడ్‌లను చేయడం వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంది. 2019లో, లిలీమా 'డియర్ డోనా'లో చెఫ్ డి పార్టీగా చేరి, ఒక్క ఏడాదిలోనే సూస్ చెఫ్‌గా పదోన్నతి పొందింది. 

    ఇవాళ ఆమె 35 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె తయారు చేసే ప్రత్యేక వంటకాల్లో రిసోటో, రావియోలీ, సాల్మన్ గ్రావ్‌లాక్స్, రౌలేడ్, బీఫ్ వెల్లింగ్టన్ తదితరాలు ఉన్నాయి. తన అభిరుచినే బలంగా మార్చుకుని ముందుకు సాగి జీవితాన్ని అందంగా మలుచుకుంది. మన నైపుణ్యం, ఆసక్తులే మనల్ని మందుకు నడిపించే ఆస్తులనే లిలీమా కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.

    (చదవండి: పాతికేళ్ల 'లగాన్‌' వేడుకలో..స్పెషల్‌ అట్రాక్షన్‌గా కరీనా కపూర్‌! ఏకంగా రూ. 1.3 లక్షల..)

     

     

     

Education

  • ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం దాదాపు ఖాయం అన్న భావన ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక విప్లవ వేగం పెరగటంతో నిన్నటి నైపుణ్యాలు ఈ రోజు పనికిరాని స్థితికి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే సామర్థ్యాలు ఏమిటన్న దానిపై దేశాలు మళ్లీ ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. 

    కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో ప్రపంచ ఉద్యోగ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ.. చైనా ఉన్నత విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా... కాలం చెల్లినట్లు భావిస్తున్న వేలాది డిగ్రీ కోర్సులను విశ్వవిద్యాలయాలు తొలగిస్తున్నాయి. చైనా ఉన్నత విద్యా సంస్థలు తమ విద్యా కోర్సుల్లో పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపడుతున్నాయి. దేశాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా వేల సంఖ్యలో కాలం చెల్లినట్లు భావిస్తున్న డిగ్రీలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సాంకేతికత ఆధారిత కోర్సులను ప్రవేశపెడుతున్నాయి.

    10,200 కొత్త కోర్సులు 
    పరిశ్రమల్లో ప్రపంచ నాయకత్వం సాధించాలనే లక్ష్యాన్ని  చైనా పెట్టుకుంది. అలాగే, చైనాలో లక్షలాది యువతకు ఉపాధి దొరకడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో చైనా ఈ చర్యలు చేపడుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా ఉన్నత విద్యా సంస్థలు 12,200 అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను రద్దు చేశాయి. అదే సమయంలో 10,200 కొత్త కోర్సులను ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయ కోర్సుల్లో 30%కి పైగా మార్పులు చోటుచేసుకున్నాయి.

    ఈ విభాగాల్లో కోర్సులు ఔట్‌  
    ఈ తొలగింపులు ప్రధానంగా కళలు, మానవీయ శాస్త్రాలు, విదేశీ భాషలు, నిర్వహణ విద్య విభాగాల్లో జరిగాయి. చైనాలో యువత విషయంలో నిరుద్యోగం 16% కి పైగా ఉండటం, ఉద్యోగ రంగం కృత్రిమ మేధ ప్రభావంతో వేగంగా మారిపోవటం వల్ల ఈ విభాగాలను కాలం చెల్లినవిగా భావిస్తున్నారు.

    ఇక కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు చైనా ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు, 9 విశ్వవిద్యాలయాలు "ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్"ని ప్రారంభించాయి. ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక యంత్రాలు లేదా రోబోట్లు పరిసరాలను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధ విధానం.

    పనికిరాని కోర్సులు ఎందుకు? 
    తదుపరి తరం కృత్రిమ మేధను వాస్తవ ఆర్థిక వ్యవస్థలో వేగంగా కలపాలనే జాతీయ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా మారిపోతుండటంతో విశ్వవిద్యాలయాలపై మార్పులు చేపట్టాలనే ఒత్తిడి పెరిగింది. పట్టభద్రుల సంఖ్య రికార్డు స్థాయికి చేరినా, చాలామందికి వారి డిగ్రీలు ఉద్యోగాలు సంపాదించటంలో పెద్దగా ఉపయోగపడటం లేదు.

    ఉదాహరణకు, షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఈ ఏడాది తన ఉత్పత్తి రూపకల్పన కోర్సులో ప్రవేశాలను నిలిపివేసింది. ఆ కోర్సు వల్ల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే ఈ నిర్ణయానికి ఒక కారణం. మోడలింగ్, రెండరింగ్ వంటి అనేక ప్రధాన పనులను ఇప్పుడు కృత్రిమ మేధే నిర్వహిస్తోంది.

    మాధ్యమ విద్యపై దృష్టి సారించిన బీజింగ్‌లోని ప్రతిష్ఠాత్మక కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా కూడా పలు కోర్సులను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును ఫిల్మ్ అండ్ టెలివిజన్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ కోర్సుతో విలీనం చేసింది.

    పూర్వ విద్యార్థులు ఏమంటున్నారు? 
    ఈ మార్పు సాంకేతిక, మార్కెట్ పరిణామాలకు సహజ ప్రతిస్పందన అని విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. 2012లో సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసిన వీడియోగ్రాఫర్ సాంగ్ సాంగ్ మాట్లాడుతూ.. తాను చదివిన కాలంలో ఫిల్మ్ నుంచి డిజిటల్ సాంకేతికత వైపు మార్పు జరిగిందని చెప్పాడు.

    “ప్రత్యక్ష ప్రసారాలు, చిన్న వీడియోలు పెరగటంతో కెమెరామెన్ నైపుణ్య అవసరాలు సంప్రదాయ టెలివిజన్ వార్తల చిత్రీకరణతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి” అని సాంగ్ అన్నాడు. విద్యలో మార్పులు తప్పనిసరి అని తెలిపాడు.

    అయితే ఒక కోర్సు స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టటం తాత్కాలిక పరిష్కారమే అవుతుందని, వేగంగా మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యలో మరిన్ని మార్పులు అవసరమని జాతీయ విద్యా శాస్త్రాల సంస్థ సీనియర్ పరిశోధకుడు చు జావోహుయ్ హెచ్చరించారు.

    విశ్వవిద్యాలయాలు తొలగించిన అనేక కోర్సులు కొన్నేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని చు పేర్కొన్నారు. అందువల్ల అభివృద్ధి చెందటానికి తగిన సమయం కూడా వాటికి దొరకలేదని తెలిపారు.

    ఒక ప్రధానాంశం స్థానంలో మరొకటి మార్చటం కన్నా, విద్యార్థులకు తమ కోర్సులను తామే ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇచ్చే సౌకర్యవంతమైన విధానాన్ని విశ్వవిద్యాలయాలు అవలంబించాలని చు సూచించారు.

    “దీంతో విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు, భిన్న వృత్తి మార్గాల అవసరాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకుని, తమకంటూ ప్రత్యేక మేధో స్వరూపాన్ని నిర్మించుకుంటారు” అని చు అన్నారు. ఉద్యోగ విపణి మరింత అనిశ్చితంగా మారుతున్న వేళ చైనాలో చాలామంది అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీని అంతిమ గమ్యంగా కాకుండా తొలి మెట్టుగా చూడటం ప్రారంభించారు.