Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులకు ఇవి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయితే ప్రపంచంలో బంగారం కంటే కొన్ని లక్షల రెట్లు ఖరీదైన లోహం ఒకటి ఉందని మీకు తెలుసా? ఒకే ఒక్క గ్రాముతో వందల కిలోల బంగారం కొనొచ్చు అంటే నమ్మగలరా? బంగారం కంటే లక్షల రెట్లు ఖరీదైన ఒక లోహం ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరు కాలిఫోర్నియం. దీని ధర వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక గ్రాము కాలిఫోర్నియం ధర సుమారు 27 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.239 కోట్లు. అంటే ఒక్క గ్రాము కొనాలంటే దాదాపు 200 కిలోల బంగారం విలువ అనమాట.

    కాలిఫోర్నియం భూమిలో సహజంగా దొరికే లోహం కాదు. ఇది పూర్తిగా ప్రయోగశాలలో సృష్టించిన సింథటిక్ మూలకం. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ శాస్త్రవేత్తలు దీన్ని తొలిసారి తయారు చేశారు. అందుకే ఆ రాష్ట్రం పేరుతో దీనికి కాలిఫోర్నియం అనే పేరు పెట్టారు. దీనిని తయారు చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అణు రియాక్టర్లలో ఇతర మూలకాలను దీర్ఘకాలం న్యూట్రాన్లతో ఢీకొట్టించడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు, కొన్ని ప్రత్యేక ల్యాబ్‌లు మాత్రమే దీనిని తయారు చేయగలవు. పైగా ఇది అత్యంత శక్తివంతమైన రేడియోధార్మిక మూలకం కావడంతో దీన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా చాలా ఖరీదైన, ప్రమాదకరమైన ప్రక్రియ.

    ఇంత ఖరీదైన మూలకం అయినప్పటికీ దీన్ని ఆభరణాల కోసం ఉపయోగించరు. కానీ దీని ప్రయోజనాలు మాత్రం అసాధారణం. కాలిఫోర్నియం-252ను క్యాన్సర్ చికిత్సలో న్యూట్రాన్ థెరపీ కోసం ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఇతర చికిత్సలు పనిచేయని సందర్భాల్లో ఇది కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అణు పరిశ్రమలో రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది స్టార్టర్‌గా పనిచేస్తుంది. అంతరిక్ష పరిశోధనలో పరికరాల పరీక్షల్లో దీని ఉపయోగం ఉంది. అలాగే గనుల్లో బంగారం, వెండి నిల్వలను గుర్తించడంలో, చమురు బావుల అన్వేషణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

    అంటే కాలిఫోర్నియం కేవలం ఖరీదైన లోహం మాత్రమే కాదు.. అణుశక్తి, వైద్యం, అంతరిక్ష రంగాల్లో చాలా సైలెంట్‌గా విప్లవం సృష్టిస్తున్న శాస్త్రీయ అద్భుతం. బంగారం విలువైనదే కానీ విజ్ఞానానికి విలువ కట్టలేమని ఇది మరోసారి నిరూపిస్తుంది.

  • బంగారం ఖరీదైనదే కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని మించిపోయింది. కిలోకు కోటి రూపాయలు పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి చెట్టులా ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసనలేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు, అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంలో సువాసనగల నల్ల అగర్వుడ్‌గా మారుతుంది.

    అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్‌ని ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7 శాతం చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు.. 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన, సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని 'క్యారా' అంటారు. దీని ధర గ్రాముకు రూ.8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్యారా కలప ఏకంగా రూ.154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న ముక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే..

    అగర్వుడ్‌ని ప్రపంచంలో చాలా ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, పారిస్ లాంటి నగరాల్లో లగ్జరీ సెంట్స్ కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతత ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి తదితర సమస్యలకు దీనిని ఉపయోగిస్తారు.

    భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్‌కి ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అక్విలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది. కానీ అగర్వుడ్ తయారవ్వడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది.

  • పాహోన్ పెన్ : కంబోడియాలో సైబర్‌ నేరగాళ్లపై భారీ ఆపరేషన్‌ జరిగింది. ఈ ఆపరేషన్‌లో అక్కడి అధికారులు 200 మంది సైబర్‌  గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. ఫ్నామ్‌పెన్‌లోని నకిలీ సైబర్‌ సెంటర్లపై పోలీసులు దాడి చేసి, నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ ప్రత్యక్ష ఆదేశాలు ఇచ్చారు.

    16 దేశాలకు సంబంధించిన 11వేల మందిని పట్టుకున్నారు. మొత్తం 172మంది కలిసి సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల్ని ఉద్యోగాల పేరుతో కంబోడియాకు రప్పించిన మాఫియా వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించినట్లు తేలింది. నేరగాళ్లు కేజీఎఫ్‌ సినిమా తరహాలో ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇండియాకు సంబంధించిన నకిలీ పోలీస్‌ స్టేషన్లు,సీబీఐ,ఈడీ ఆఫీసులు ఏర్పాటు చేసి డిజిటల్‌ అరెస్టులు అంటూ వసూళ్లకు పాల్పడ్డారు.

    ఈ కేంద్రాల్లో పనిచేసిన వారు సోషల్‌ మీడియా ద్వారా ప్రేమ, వ్యాపార సంబంధాలు వంటి మాయాజాలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మోసం చేశారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దక్షిణాసియా ప్రాంతం ఈ తరహా మోసాలకు ప్రతి సంవత్సరం సుమారు 40 బిలియన్ అమెరికన్‌ డాలర్ల మేర మోసాలు జరుగుతున్నాయని అంచనా. సైబర్‌ నేరాలు చేసేందుకు కొన్ని వేల సంఖ్యలో పోలీస్‌ స్టేషన్ల సెట్టింగులు ఏర్పాటు చేశారు. తాజాగా, సైబర్‌ ఆపరేషన్‌తో సైబర్‌ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. 11వేల మందిని పట్టుకుని కంబోడియా ప్రభుత్వం వారి దేశాలకు పంపించి వేసింది. 

  • థాయ్‌లాండ్‌లోని శోంక్లా పట్టణంలో దారుణం జరిగింది. పాఠశాలలో అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. మాజీ పోలీస్‌ అధికారి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పాఠశాల ముగిసే సమయంలో ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయులు, చిన్నారులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడి థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

    థాయ్‌లాండ్‌లో కాల్పుల కలకలం
     

  • వన్యప్రాణులకు సంబంధించి కొత్త అన్వేషణలు ఔత్సాహికులకు చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తాయి.  ఇటీవల తొమ్మిది రంగుల హిమాలయ మోనాల్ అనే అరుదైన మోనాల్ జంతువు భూటాన్ పర్వత లోయల్లో దర్శనమిచ్చింది. అద్భుతమైన ఇంద్రధనస్సు లాంటి ఈకలు , సహజమైన ప్రకాశవంతమైన మెరుపుతో  ఆకాశాన విహరిస్తున్న ఈ పక్షి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈఫోటో తీసింది ఎవరో తెలుసా? 

    మగ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించింది. ఈ దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై ఆవిష్కృతమైంది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద ఈ పక్షి మెరిసింది. చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. 

    సహజ ఇంద్రధనస్సు రంగులతో హిమాలయ మోనాల్ అని పిలిచే నెమలి జాతి మగ పక్షి ఎగురుతూ  ఫోటోలకు చిక్కింది. రంగులతో మెరిసిపోయే దేహం దీని ప్రత్యేకత. హిమాలయాల ఆభరణం అని పిలిచే ఈ  పక్షి జాతి తేజస్సుకు ప్రసిద్ధి చెందింది. ఈ మేల్‌ హిమాలయ మోనాల్ విమానం మధ్యలో కనిపించిన దృశ్యం భూటాన్ ఎత్తైన పర్వతాలపై  దర్శనమిచ్చింది. వీక్షకులు ఈ దృశ్యాన్ని ఉత్కంఠభరితంగా అభివర్ణించారు. ప్రకాశవంతమైన పర్వత సూర్యకాంతి కింద  ఇది అద్భుతంగా మెరిసింది. దాని ఈకలు నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులను, అటు బంగారం , నారింజ రంగులు ప్రకాశవంతంగా మెరుసి పోవడంతో  చాలామంది దీనిని ఎగిరే ఆభరణంతో పోల్చారు. మెటాలిక్‌  కలర్స్‌ను మార్చుకుంటూ పచ్చ, రాగి షేడ్స్ తక్షణమే కనిపిస్తాయి. వెంటనే వైలెట్, ముదురు నీలంలోకి మారతాయి. ఒక విధంగా చెప్పాలంటే దీని ప్రతి కదలికతో దృశ్యం మారిపోయి, పూర్తిగా సహజమైన రంగులతో నిండుగా కనిపిస్తుంది.  

    ఇదీ చదవండి: 
     

    ఈ హిమాలయ మోనాల్ సాధారణంగా భూటాన్, నేపాల్ అంతటా, ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో నివసిస్తుంది.  ఉత్తర భారతదేశంలో కూడా  అక్కడడక్కడా కనిపిస్తుంది. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ జాతులకు ఆతిథ్యం ఇస్తాయి. ఈ పక్షి 4,500 మీటర్ల ఎత్తులో వృద్ధి చెందుతుంది. ఇది ఆల్పైన్ పచ్చిక భూములు, అడవులను ఇష్టపడుతుంది. దీనికి ప్రాంతీయంగా సాంస్కృతికంగా ముఖ్యమైనది. 

    ఇది నేపాల్ జాతీయ పక్షి.. ప్రధానంగా నేలపై నివసించినప్పటికీ, ఇది ఎగరగలదు.  బిగ్గరగా అరిచే దాని  అరుపులు లోయలలో ప్రతిధ్వనిస్తాయి. ఈ దృశ్యం హిమాలయ జీవవైవిధ్య గొప్పతనాన్ని హైలైట్ చేస్తుందనీ,  ఇది ఆవాస రక్షణ ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుందని వన్యప్రాణులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో

    ఈ చిత్రాన్ని తీసింది ఎవరు?
    వన్యప్రాణుల ఫోటోలకు ప్రసిద్ధి చెందిన భారత్‌ ఫోటో గ్రాఫర్‌ ది డా. సుధీర్‌ ఈ ఫోటోను తీశారు.  దీన్ని  ఎడిట్‌ చేయలేదు. ఇది ఏఐ  అంతకన్నా కాదు..అంటూ భూటాన్‌ ఆకాశంలో ఎగురుతున్న ఈ  తొమ్మిది రంగుల పక్షి తన కెమెరా కంటికి చిక్కిన వైనాన్ని పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ విషయంలోఆయన మరో రికార్డ్‌ కూడా నెలకొల్పారు. గత 10 ఏళ్లుగా ఫేస్‌బుక్‌లో వన్యప్రాణుల చిత్రాలను నిరంతరం పోస్ట్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.  ఈ క్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకిది  4వ రికార్డు. ఈ అవార్డు కిట్‌లో డిజైనర్ పెన్, పుస్తకం, బ్యాడ్జ్‌లు, ఐడి కార్డ్ , ముఖ్యంగా పతకం ఉన్నాయి! ఐ లవ్ ‌దిస్‌ కిట్‌ అంటూ డా. సుధీర్‌ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.  ఇది  కఠినమైందే అయినప్పటికీ ప్రతిఫలదాయకమైన ప్రయాణంలో తనకు మద్దతు ఇచ్చినందుకు  అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

  • ఇటీవల ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆదేశంలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో ఖమేనీ సర్కార్ వారి నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసింది. పెద్ద సంఖ్యలో అక్కడి పౌరులపై కాల్పులు జరిపింది. మిగతా వారిని జైళ్లలో బంధించింది. ఇదంతా తెలిసిన విషయమే.. అయితే జైళ్లలో బంధించిన నిరసనకారులను ఇరాన్ చిత్రవధకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని అక్కడి సైనికులు కాల్చివేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

    ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు అణు ఒప్పందంపై చర్చలకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే గనుక తీవ్ర యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ప్రపంచాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.  ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపిన వారిని అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తున్నట్లు తెలుస్తోంది.

    న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. "ఇరాన్‌ నిరసనల్లో గాయపడిన వారిని అక్కడి భద్రతా బలగాలు ఆసుపత్రుల్లోనే  కాల్చి చంపుతున్నాయి. అందుకోసం ఆసుపత్రుల్లో ఇటీవల చేరిన వివరాలను ఇరాన్ భద్రతా బలగాలు సేకరిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు సాధారణంగా మారిపోయాయి. భద్రతా బలగాల భయానికి నిరసనల్లో గాయపడిన వారు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా అక్కడ జైళ్లలో మగ్గుతున్న మహిళలపై తీవ్రమైన లైంగిక దాడులు జరుగతున్నాయి. అక్కడ నిరసనలల్లో అరెస్టై జైళ్లలో ఉన్న మహిళలు తమ కుటుంబసభ్యులను గర్భనిరోధక మాత్రలు పంపించాల్సిందిగా కోరుతున్నారు" అని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

    వీటితో  పాటు గడిచిన మూడు వారాల్లో 207 మంది రాజకీయ ఖైదీలు ఉరితీయబడ్డారని తెలిపింది. వారందరిని దేశవ్యాప్తంగా ఉన్న 57 జైళ్లలో బంధించారు. అయితే అమెరికా కథనాల ప్రకారం ఇరాన్ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది ఖైదీలు మరణించగా, ఇరాన్ లెక్కల ప్రకారం 3,117 మంది ప్రాణాలు వదిలారు. నిరసనల్లో  ఇప్పటివరకూ 42,000 మందిని అరెస్టు చేశారు. 

  • దేశం కాని దేశంలో మనకు సంబంధించిన వస్తువులను చాలా ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా వీసా, పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌ కార్డు అత్యంత ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం తీవ్ర ఒత్తిడికి కారణమవుతుంది. కానీ మన దేశంలో అలా కాదు. క్రెడిట్ కార్డును కోల్పోయిన మహిళను స్నేహితులు సేవ్ చేసారు. దీనికి సంబంధించి ఆమె షేర్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అదేంటో చూద్దామా.

    బెర్లిన్‌కు చెందిన జెన్నిఫర్ అనే 29 ఏళ్ల యువతి  భారత పర్యటనకు వచ్చింది.  అయితే ఊహించని క్రమంలో క్రెడిట్ కార్డులు. కార్పొరేట్ ఐడి క్రెడిట్‌ కార్డు ఉన్న పర్స్‌ ఎక్కడో పారేసుకుంది. దీంతో ఆమె పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. కానీ ఈ సమయంలో ఒక్క సెకను కూడా చింతించిలేదనీ, దీనికి కారణంగా భారత్‌లో ఉన్న తన స్నేహితులేనని చెప్పుకొచ్చింది. వారంతా కష్టకాలంలో అండగా నిలిచి గట్టెక్కించారనీ, ట్రూ స్టోరీ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌ చేసింది. అలాగే జెన్నిఫర్ తన స్నేహితులతో తన వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లను  షేర్‌ చేసింది.

    తన టూర్‌ పూర్తయ్యేవరకు తన ఫ్రెండ్స్‌ తనకు కావాల్సిన డబ్బును ఏర్పాటు చేసి తాను ఎలాంటి ఆందోళన పడకుండా చూసుకున్నారని, ఇలాంటి మద్దతు లభిస్తుందని తాను అస్సలు ఊహించలేదని పేర్కొంది. అంతేకాదు ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేస్తాను. భారతీయుల స్నేహాన్ని, ఆతిథ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదని వెల్లడించించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనులు కూడా ఆనందాన్ని ప్రకటించారు.

     

    నెటిజ‌న్ల స్పంద‌న‌
    బెంగళూరులోని బస్సులో పర్సును (క్రెడిట్ కార్డులు , కార్పొరేట్ ఐడీ కార్డ్‌ ఉన్న) పోగొట్టుకున్నా.. ఆ మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఇవ్వడానికి తన కార్యాలయానికి వచ్చాడంటూ తన అనుభవాన్ని ఒకరు పంచుకున్నారు. స్నేహం,స్నేహితులు అంటే అదే కదా.. జాతి, జాతీయత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదుకుంటారు అని మరొకరు వ్యాఖ్యానించారు. 

Movies

  • గతంలో ఒకసారి నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ , బంగారు బుల్లోడు చిత్రాలకు.. మరోసారి హీరో నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జండాపై కపిరాజు చిత్రాలకు ఇలాంటి సమస్యనే ఎదురైంది. తమ సినిమాల విడుదల విషయం తమ చేతిలో లేకపోవడం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయాల్సిన పరిస్థితి రావడం. ఇప్పుడు శ్రీవిష్ణుకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ నెల చివర్లో ఓ ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. తను నటించిన రెండు సినిమాలు ఒకేసారి  విడుదల కానున్నాయి. బాలయ్య రెండు చిత్రాలు ఒకేరోజు (1993 సెప్టెంబర్ 3)  విడులైయ్యాయి. అలాగే నాని నటించిన రెండు చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి.

    అయితే ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. కానీ స్లాట్ ఈ నెలలోనే ఇచ్చింది. అయితే అదే శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాను మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. ఆ సంస్థ కూడా ఇదే నెలకు డేట్ ఇచ్చింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి కానీ నో యూజ్‌. ఇద్దరూ ఒకే తేదీపై పట్టుబడటంతో నిర్మాతలు, హీరో శ్రీవిష్ణు కూడా ఏం చేయలేని పరిస్థితి. రెండు సినిమాలు తనవే కావడంతో, రెండింటినీ సమానంగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత శ్రీవిష్ణుపై పడింది.  

    ఇప్పటికే మృత్యుంజయ్ టీజర్ విడుదలైంది. మరో రెండు రోజుల్లో విష్ణు విన్యాసం టీజర్ కూడా రానుంది. ఆ వారం ఈ రెండు సినిమాలు తప్ప మరే పెద్ద రిలీజ్ లేకపోవడం శ్రీవిష్ణు అదృష్టమే. రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్‌మెంట్ లభించనుంది. అయితే ఏదో ఒకటి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం రెండూ హిట్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి శ్రీవిష్ణుకు ఒకవైపు ఎంబ్రాసింగ్, మరోవైపు ఎక్సైటింగ్ కూడా. ఎందుకంటే ఒకేసారి రెండు సినిమాలు తనవే అని చెప్పుకోవడం అరుదైన విషయం.  

  • టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్  తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్‌ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

    కాగా.. ఈ సినిమాను గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన  పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్‌ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. 

     

    • శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్..
    • ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..
    • టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..
    • పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..
    • బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్‌ పోజులు..

     

     

     

     

     

     

     

     

     

  • టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 

    టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ఓ మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్‌లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.
     

  • ప్రముఖ  బాలీవుడ్ బుల్లితెర భామ సురభి జ్యోతి నాగిన్ సీరియల్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అంతే కాకుండా ఖుబూల్ హై, ఇష్క్ బాజ్, కోయి లౌట్ కే ఆయా హై సీరియల్స్‌తో మెప్పించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు నటుడు సుమిత్ సూరితో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2024లో పెళ్లి పీటలెక్కి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు వివాహ బంధంలోకి ‍అడుగుపెట్టారు. 

    తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో మా ఇంటికి కొత్త మెంబర్ రానున్నారని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మా గొప్ప సాహసయాత్ర ప్రారంభమవుతుంది.. ఈ జూన్‌లో లిటిల్ లవ్ మా ఇంటికి వస్తోందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.

    కాగా.. సురభి- సుమిత్ హాంజి-ద మ్యారేజ్ మంత్ర అనే మ్యూజిక్ వీడియోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆమె భర్త సుమిత్ సూరి 2013లో నటుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వాట్ ద ఫిష్, బబ్లూ హ్యాపీ హై సినిమాలు.. ద టెస్ట్ కేసు, హోమ్ వెబ్ సిరీసుల్లోనూ నటించాడు.

     

  • బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సుబేదార్. ఈ యాక్షన్‌ సినిమాకు సురేశ్‌ త్రివేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుబేదార్ అర్జున్ మౌర్య జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు దేశం కోసం పోరాడిన సైనికుడు.. తన ఇంటిని, కుటుంబాన్ని రక్షించుకోవడానికి శత్రువులతో పోరాటం చేశారనే కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    తాజాగా సుబేదార్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విక్రమ్ మల్హోత్రా, అనిల్ కపూర్, సురేష్ త్రివేణి నిర్మిస్తోన్న ఈ సినిమా అమెజాన్ ‍ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. వచ్చేనెల మార్చి 5 నుంచి ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీవుతోంది. ఈ చిత్రంలో రాధిక మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్ , ఫైసల్ మాలిక్ కీలక పాత్రల్లో నటించారు.

     

  • నటి షామ్నా ఖాసిం అలియాస్‌ పూర్ణ రెండోసారి తల్లి కాబోతోంది. గతేడాది ఆగస్టులో తను రెండోసారి గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించింది. తాజాగా ఆమె తన బేబీ షవర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. అందులో భర్త, కుమారుడితో కలిసి దిగిన పిక్స్‌ జత చేసింది. వీటిలో పూర్ణ లైట్‌ పింక్‌ కలర్‌ గౌన్‌లో అందంగా ముస్తాబైంది.

    గర్వంగా ఉంది
    అయితే ఈ డ్రెస్‌ వెనక ఓ స్టోరీ ఉందని చెప్పింది.  అతడు (పూర్ణ భర్త) నాకు తొలిసారి ఐ లవ్యూ చెప్పినరోజు ఈ గౌన్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. ఏళ్ల తరబడి ఈ డ్రెస్‌ కప్‌బోర్డులో అలాగే నలిగిపోతూ ఉంది. ఒక మంచిరోజుకోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తోంది. ఇంతకాలానికి ఆ మంచి రోజు రానే వచ్చింది. మాతృత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకునేరోజు దాన్ని ధరించాను. నా భర్త ఈ సెలబ్రేషన్స్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా మలిచాడు. నా మనసు సంతోషం, ప్రేమతో ఉప్పొంగిపోతోంది. అలాగే నా డ్యాన్స్‌ స్కూల్‌లో పిల్లలు ఒక్కో స్టెప్పు వేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది.

    సినిమా
    మలయాళ నటి పూర్ణ తెలుగులో.. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్‌, అవును, నువ్వలా నేనిలా, రాజుగారి గది, మామ మంచు అల్లుడు కంచు, సుందరి, అఖండ 2 వంటి పలు సినిమాలు చేసింది. గుంటూరు కారం మూవీలో కుర్చీ మడతపెట్టి పాటలో కనిపిస్తుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. 2022లో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లాడింది. ఆ మరుసటి ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

     

     

    చదవండి: ఆ సంతోషం, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను: చిరంజీవి

  • ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే ’నిలవే‘.  అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా ఇది. క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే  తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా’ అన్నారు సింగర్‌ సునీత. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సింగర్‌ సునీత మాట్లాడుతూ..  ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.

    హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ..  చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక ఉండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా  తొలి సినిమా విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు.  రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా ఉందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ - నిలవే’ అన్నారు.

    హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి  సంగీతమే ప్రధాన  కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ  జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

     ‘నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి కృషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు సా కే వెన్నం అన్నారు. 

  • ఎంతటి దూర ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు పడిందంటే ఎంతో కొంత విజయం లభించినట్లే! అలా తన సినీ ప్రస్థానానికి పునాది వేసిన తొలి సినిమాను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 1979లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. తొలి మెట్టుకే విజయాన్ని అందుకుని గుండె నిండా ధైర్యంతో ముందడుగు వేశారు. తనను తాను చెక్కుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 

    చందమామ కథలాంటి అనుభూతి
    తాజాగా ఆయన పునాదిరాళ్లు సెట్‌లో అడుగుపెట్టిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేను. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. 

    నట జీవితానికి పునాది రాళ్లు
    ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు" అని ట్వీట్‌ చేశారు. తన ఫస్ట్‌ మూవీ చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోలను ఈ పోస్ట్‌కు జత చేశారు.

     

     

    చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేశా: హీరో నిఖిల్‌

  • హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్‌ సర్జానే దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కెమియో రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

    ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు బ్రహ్మనందం సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చారు. ఫిబ్రవరి 10న ఐశ్వర్య బర్త్ డే కావడంతో తానే స్వయంగా గీసిన శ్రీరాముడు, హనుమాన్‌ పెయింటింగ్‌ కానుకగా అందజేశారు. ఐశ్వర్య తన కూతురు లాంటిదని బ్రహ్మనందం ‍అన్నారు.

    కాగా.. సీతా పయనం మూవీని శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందించారు. కాగా.. ఈ చిత్రంలో  సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
     

     

  • యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శివజ్యోతి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టినా, మంచి జరిగినా, చెడు జరిగినా అన్ని అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

    థాంక్యూ
    నా చిన్న పాప లేదా బాబుకు ఈ పోస్ట్‌ అంకితం.. ఈ తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఆనందంగా, అందంగా, అద్భుతంగా సాగనిచ్చినందుకు థాంక్యూ.. ఒక్కరోజు లేదా ఒక్కసారి కూడా నువ్వెప్పుడూ నన్ను టెన్షన్‌ పెట్టలేదు. కొన్నిసార్లు అసౌకర్యానికి లోనయినప్పటికీ అది ఈ జర్నీలో భాగమే.. దాన్ని కూడా నేను ఆస్వాదించాను. మమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు నేను, నాన్నా నీకెప్పుడూ రుణపడి ఉంటాం. 

    సేఫ్‌ డెలివరీ
    నువ్వు మంచి బిడ్డగా ఉంటావని తెలుసు. నువ్వు మా జీవితాల్లోకి వస్తుండటమే అతి పెద్ద ఆశీర్వాదం, అలాగే అద్భుతం కూడా! నిన్ను ఎప్పుడెప్పుడు పొత్తిళ్లలోకి తీసుకోవాలా? అని ఎదురుచూస్తున్నాను. ఈ 9 నెలల జర్నీలాగే డెలివరీ కూడా సేఫ్‌గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు నీ అమ్మా, నాన్నా అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు తప్పకుండా అంతా మంచే జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

     

     

    చదవండి: నాకు జరిగినట్లుగా నా కూతురికి జరగనివ్వను: రణ్‌బీర్‌ కపూర్‌

  • హీరో అర్జున్‌ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్‌ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్‌ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్‌, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్‌లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్‌ శివను ఘనంగా సత్కరించారు.

    ఈవెంట్‌కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్‌ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్‌ను అర్జున్‌కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ ‍సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్‌ బండ్‌ శివకు లక్ష రూపాయల చెక్‌ను అర్జున్ సర్జా అందజేశారు.

     

  • బత్తుల సతీష్ దర్శకత్వంలో సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌’. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

    అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో.. ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ .. ‘సినిమాలోని నటీనటులు, టెక్నికల్ టీంను బట్టి ఆ మూవీ మీద ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మూవీకి కాస్ట్ అండ్ క్రూ బాగా సెట్ అయింది. సాయి ఈ మూవీ కోసం హీరో అయి నిర్మాత అయ్యాడా?.. నిర్మాత అయ్యాక హీరోగా మారాడా? తెలీదు. కానీ ఈ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ప్రతీ శుక్రవారం పదుల సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలు హిట్ అయితే ఇంకా చాలా మంది కొత్త వాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వస్తారు. ‘సన్ ఆఫ్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    హీరో, నిర్మాత సాయి సింహాద్రి మాట్లాడుతూ .. ‘నేను ఎన్నో కథల్ని విన్నాను. సతీష్ బత్తుల చెప్పిన ‘సన్ ఆఫ్’ కథ నాకు చాలా నచ్చింది. యాక్టింగ్ పట్ల శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాకి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతీ ఒక్కరూ నాకు సపోర్ట్ చేశారు. ‘సన్ ఆఫ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతోంది. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఈ మూవీని చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కన్నీరు కార్చకుండా మాత్రం థియేటర్ నుంచి బయటకు వెళ్లలేరు’ అని అన్నారు.

  • కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ పార్తీబన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత లైఫ్ గురించి తాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నటి సీతను పెళ్లాడిన ఆయన.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. ఈ సందర్భంగా తమ వైవాహిక బంధం, విడాకుల గురించి చెప్పుకొచ్చారు. 

    సీతతో విడిపోయినందుకు తానెప్పుడు బాధపడలేదని అన్నారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకుల తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే తనతో ఉన్న 12 సంవత్సరాల నా జీవితం అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని వెల్లడించారు. ఎందుకంటే ఈ రోజుల్లో పురుషులు, మహిళలు వివాహం కంటే స్వతంత్రంగా ఉండటాన్నే ఇష్టపడతారని పార్థీబన్‌ అన్నారు. ఏ స్త్రీ కూడా వివాహం పేరుతో పరిమితులు ఉండే జీవితాన్ని కోరుకోదని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారని ఆర్ పార్థీబన్‌ పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌

    ఆర్ పార్తీబన్‌ కెరీర్‌..

    కాగా.. ఆర్ పార్తీ బన్‌ 1990లో నటి సీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. సీత మరొకరిని పెళ్లి చేసుకోగా తర్వాతి కాలంలో ఆయనకు సైతం విడాకులు తీసుకుంది. ఇక ఆర్ పార్తీబన్ సినిమాల విషయానికి వస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 వంటి పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాకుండా సుడల్‌ 1 వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశాడు.
     

     

  • నాలాంటి పరిస్థితి నా కూతురికి రానివ్వనంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. నా తండ్రి (నటుడు రణ్‌బీర్‌ కపూర్‌)కి, నాకు మధ్య కొంచెం గ్యాప్‌ ఉండేది. మేమిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం కాదు. ఎందుకంటే ఆ జనరేషన్‌లో తండ్రీకొడుకుల మధ్య అలాంటి సీరియస్‌నెస్సే ఉండేది. ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేది. నా కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను నేను కూల్చాలనుకుంటున్నాను. తనతో ఒక ఫ్రెండ్‌లా ఉండాలనుకుంటున్నాను. తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్‌గా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

    సినిమా
    కాగా రణ్‌బీర్‌ కపూర్‌- ఆలియా భట్‌.. 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఈ దంపతులకు కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం రణ్‌బీర్‌- ఆలియా.. లవ్‌ అండ్‌ వార్‌ సినిమా చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్‌.. రామాయణ మూవీలో రాముడిగా కనిపించనున్నాడు. నితేశ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి సీతగా కనిపించనుంది. యష్‌ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది.

    చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా: నిఖిల్‌

  • ప్రముఖ తెలుగు నటి శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంబీబీఎస్‌ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా డాక్టర్‌గా అర్హత సాధించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తల్లి గైనకాలజిస్ట్‌గా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగిన శ్రీలీల, సినిమా షూటింగ్‌ల మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌ను పూర్తి చేసుకొని..  తాజాగా కాన్వోకేష‌న్ వేడుక‌లో డిగ్రీ ప‌ట్టాను అందుకుంది.  దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.  అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

    ‘డాక్టర్‌’ శ్రీలీల వెనుక పెద్ద కథే ఉంది
    శ్రీలీల వైద్య విద్యను అభ్యసించడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకుంది. అమ్మమ్మ విషయంలో జరిగిన ఓ సంఘటననే తనను మెడిసిన్‌ చదివేలా చేసిందని చెప్పారు. ‘నేను డాక్టర్‌ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్‌ చేశాడు.

    దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్‌ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్‌ అవ్వాలని. అందుకే మెడిసిన్‌ కోర్సు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

  • టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ మనసంతా నువ్వే. ఈ ‍ప్రేమకథా చిత్రం మరోసారి ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.  ఈ ఏడాది వాలైంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రీమా సేన్, తనూ రాయ్‌ హీరోయిన్లుగా నటించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకు వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి,  చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

    ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మేనకోడలు మహతి ఓ వీడియోను రిలీజ్ చేసింది. నేను ఉదయ్ కిరణ్ మేనకోడలు అని.. ఈ సినిమా రిలీజైనప్పుడు నాకు రెండు నెలల వయస్సు ఉంటుందని తెలిపింది. ఈ ఫిబ్రవరి 14 మీకు చాలా స్పెషల్‌గా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. మనసంతా నువ్వే మిమ్మల్ని మరోసారి థియేటర్లలో ‍అలరించనుందని పేర్కొంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాను మీ అందరితో కలిసి చూడడానికి చాలా ఆసక్తిగా ఉందంటూ మహతి వీడియోలో మాట్లాడింది. 

     ఉదయ్‌కిరణ్‌ మేనల్లుడు తేజ కూడా..

    ‘అంతకుముందే ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ కూడా మాట్లాడారు. 'మా మామయ్య నటించిన ఈ చిత్రం 25ఏళ్ల తర్వాత రీ-రిలీజ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మామయ్య పట్ల ఇంత ప్రేమ, ఆదరణ ఉటుందని నేను ఊహించలేదు. మనసంతా నువ్వే మ్యాజిక్‌ను మళ్లీ చూసేందుకు ఫిబ్రవరి 14న థియేటర్స్‌కు వెళ్లండి. ఈ మూవీ విడుదల సమయంలో నా వయసు 7ఏళ్లు మాత్రమే.. నేను కూడా థియేటర్‌కు వెళ్లి మూవీ చూస్తాను. కుటుంబం మొత్తం కలిసిచూడాల్సిన సినిమా అని చెబుతాను.' అంటూ తేజ ఒక వీడియో విడుదల చేశారు.

Sports

  • టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు.. బుధవారం రాత్రి వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‪‌ని మట్టికరిపించింది. 76 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రూథర్‌ఫర్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూథర్‌ఫర్డ్ 76 పరుగులు చేయగా.. ఛేజ్ 34, హోల్టర్ 33 తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో  ఓవర్టన్, రషీద్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభమే దక్కినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్ 43 పరుగులతో కాస్త పోరాడినప్పటికీ ఇతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఫలితంగా ఈ టోర్నీలో విండీస్ రెండో విజయం నమోదు చేసింది.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్‌లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు​ చెలరేగడంతో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

    8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (1), షాయ్‌ హోప్‌ (0) వికెట్లు కోల్పోయిన విండీస్‌ను షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (23), రోస్టన్‌ ఛేజ్‌ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్‌ఫోర్డ్‌ (76 నాటౌట్‌), హోల్డర్‌ (33) చెలరేగి ఆడి విండీస్‌కు భారీ స్కోర్‌ అందించారు. 

    వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం​ సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్‌ను 200 దరికి చేర్చారు. రూథర్‌ఫోర్డ్‌ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్‌ 17 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ 14, రొమారియో షెపర్డ్‌ ఒక్క పరుగు (నాటౌట్‌) చేశారు.

    ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (4-0-16-2) అత్యంత​ పొదుపుగా బౌలింగ్‌ చేసి విండీస్‌ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్‌ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్‌ వికెట్‌ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 

    గత మ్యాచ్‌లో సత్తా చాటిన సామ్‌ కర్రన్‌ (3-0-36-1) ఈ మ్యాచ్‌లో  పెద్దగా ‍ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్‌ 2 ఓవర్లలో 32, డాసన్‌ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్‌ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్‌ బేతెల్‌ (20) వేగంగా ఆడుతున్నాడు. 

    6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి.

     

  • రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్‌ శర్మ డిశ్చార్జ్‌ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్‌ సహ టీమిండియా సభ్యుడు తిలక్‌ వర్మ ఇవాళ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు. అయితే అభిషేక్‌ రేపటి మ్యాచ్‌ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్‌ క్లారిటీ ఇవ్వలేదు.

    అభిషేక్‌ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్‌ నమీబియా మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్‌మెంట్‌ సంజూ శాంసన్‌ను రేపటి మ్యాచ్‌కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇవాళ కూడా నెట్స్‌లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్‌ సమయానికి అభిషేక్‌ ఫిట్‌ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్‌ తప్పకపోవచ్చు.

    ఒకవేళ కీలకమైన పాకిస్తాన్‌ మ్యాచ్‌ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్‌కు రెస్ట్‌ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్‌లో ఇషాన్‌, సంజూ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్‌లో రాణిస్తే.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అభిషేక్‌తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్‌మెంట్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్‌కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. 

    ఈ ప్రపంచకప్‌లో అభిషేక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్‌ గతినే మార్చేస్తాయి. అభిషేక్‌ ప్రతి మ్యాచ్‌లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. 

    భారత బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్‌తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్‌లో సత్తా చాటినా భారత్‌ మరోసారి ప్రపంచకప్‌ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

     

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

    ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్‌ స్టోయినిస్‌ టాప్‌​ స్కోరర్‌గా నిలిచాడు. జోష్‌ ఇంగ్లిస్‌, మ్యాట్‌ రెన్‌షా తలో 37 పరుగులు.. కూపర్‌ కన్నోలీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్‌ ట్రవిస్‌ హెడ్‌ , గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 9 పరుగులు చేశారు. 

    ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 2, మాథ్యూ హంఫ్రేస్‌, జార్జ్‌ డాక్రెల్‌, హ్యారీ టెక్టార్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

    అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్‌ జంపా (4-0-23-4), నాథన్‌ ఎల్లిస్‌ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్‌ బౌలర్లలో కుహ్నేమన్‌ (4-0-29-1) కూడా రాణించాడు. 

    ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జార్జ్‌ డాక్రెల్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. డాక్రెల్‌ ఈ స్కోర్‌ చేయకపోయుంటే ఐర్లాండ్‌ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్‌ బ్యాటర్లలో లోర్కన్‌ టక్కర్‌ (24), రాస్‌ అదైర్‌ (12), గెరాత్‌ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. 

  • టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు వంత పాడిన పాకిస్తాన్‌, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్‌ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్‌ ఇచ్చిన పాక్‌, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించింది. 

    ఈ మొత్తం ఎపిసోడ్‌ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్‌ బంగ్లాదేశ్‌ను ఫూల్‌ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్‌ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్‌తో గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్‌ మాత్రం ప్రపంచకప్‌ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.

    ఈ ఎడిసోడ్‌ నడుస్తుండగానే బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు పాక్‌లో జరిగే పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్‌ ప్రైజ్‌ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. 

    బంగ్లాదేశ్‌ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్‌.. పీఎస్‌ఎల్‌ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. 

    ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్‌ ఆటగాళ్లవైపు పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.

    బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్‌ను కనీసం​ బేస్‌ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం​ ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్‌ పాక్‌ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. 

    లిట్టన్‌ దాస్‌కు గతంలో పీఎస్‌ఎల్‌లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్‌ హొసేన్‌. ఈ బంగ్లా ఆల్‌రౌండర్‌ను రావల్పిండి బేస్‌ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్‌ కరెన్సీకి సొంతం చేసుకుంది. 

    అలాగే ఐపీఎల్‌ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్‌ సైనింగ్‌ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది.  మొత్తంగా చూస్తే పీఎస్ఎల్‌ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది.

  • టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్‌ డబుల్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ కొదమ సింహాల్లా పోరాడాయి. 

    రెగ్యులర్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి. 

    అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్‌ ఓవర్‌) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్‌ ఓవర్‌లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్‌ మూడో సూపర్‌కు కూడా వెళ్లేది.

    అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూపర్‌ ఓవర్‌ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్‌ ఔట్‌ పద్దతి అమల్లో ఉండేది. సూపర్‌ ఓవర్‌ రాకతో బౌల్‌ ఔట్‌ పద్దతికి చరమగీతం పాడారు.

    అప్పటి నుంచి రెగ్యులర్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్‌ ఓవర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్‌ ఓవర్‌లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్‌ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్‌ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది. 

    ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్‌ ఆలౌట్‌గా పరిగణించబడుతుంది. సూపర్‌ ఓవర్‌లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది.  

    సూపర్‌ ఓవర్‌లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్‌ ఓవర్‌ జరుగుతుంది. రెండో సూపర్‌ ఓవర్‌లోనూ సేమ్‌ రూల్స్‌తో ఇరు జట్లకు ఓ ఓవర్‌ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్‌ ఓవర్‌కు కూడా ఆస్కారముంటుంది.  

    ఒకవేళ మూడో సూపర్‌ ఓవర్‌లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్‌ పరిస్థితులు, షెడ్యూల్‌ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.

    అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్‌ ట్రిపుల్‌ సూపర్‌ ఓవర్‌ వరకు కూడా వెళ్లింది. 

    2025 జూన్‌ 16న నేపాల్‌, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ట్రిపుల్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు మూడో సూపర్‌ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్‌ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌ యావత్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలో తొలి ట్రిపుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌గా చరిత్రకెక్కింది.

    అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది. 

    అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండో సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఈ మ్యాచ్‌ జరిగింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే తొలి డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది.

    అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్‌ కూడా డబుల్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. అది ఐపీఎల్‌ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్‌ 18న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ గెలుపు కోసం రెండో సూపర్‌ ఓవర్‌ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి డబుల్‌ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌గా నిలిచింది.  

    ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్‌లో చాలా సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్‌ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లు జరిగాయి. 2012 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌-వెస్టిండీస్‌.. అదే ఎడిషన్‌లో న్యూజిలాండ్‌-శ్రీలంక.. 2024 ఎడిషన్‌లో నమీబియా-ఒమన్‌.. అదే ఎడిషన్‌లో పాకిస్తాన్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లాయి. 

  • టీ20 ప్రపంచకప్‌-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్‌వెల్‌ ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్‌ సమయానికంతా ఫిట్‌నెస్‌ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. 

    వార్మప్‌ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్‌వెల్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. 

    గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్‌కాంచీని బ్రేస్‌వెల్‌కు రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. మెక్‌కాంచీ న్యూజిలాండ్‌ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్‌తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్‌కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.

    ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్‌ (డి) మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. 

  • భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఇంగ్లండ్‌ మాజీ బ్యాటర్‌ మార్క్‌ బుచర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు. కాగా ఫార్మాట్‌లకు అతీతంగా ధనాధన్‌ దంచికొడుతూ క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్‌.

    ధనాధన్‌
    హర్యానాకు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్‌లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్‌-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్‌ వన్డేలు, యూత్‌ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.

    ఫైనల్లోనూ భారీ శతకం
    ఇక ఇటీవల ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్‌పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్‌ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మార్క్‌ బుచర్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్‌ లెజెండ్‌ గ్యారీ సోబర్స్‌ను గుర్తుకు తెస్తోందన్నాడు.

    గ్యారీ సోబర్స్‌కి కార్బన్‌ కాపీ
    విజ్డన్‌ క్రికెట్‌ వీక్లీ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. “వైభవ్‌ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్‌ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్‌ను స్వింగ్‌ చేయడం.. ఆ టైమింగ్‌, పరిపూర్ణత సూపర్‌. అతడి హ్యాండ్‌ స్పీడ్‌, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.

    అచ్చం సోబర్స్‌ లాగే అతడు బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్‌ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్‌ మాత్రం తన బ్యాటింగ్‌ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్‌ స్వింగ్‌ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్‌’’ అని మార్క్‌ బుచర్‌ వైభవ్‌ సూర్యవంశీని కొనియాడాడు. 

    చదవండి: పాక్‌ స్పిన్నర్‌కు అశ్విన్‌ మద్దతు.. నెటిజన్స్‌ ఫైర్‌

  • అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్‌ తమ వీరోచిత పోరాటంతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మనసులు గెలుచుకుంది.

    తొలుత రెగ్యులర్‌ మ్యాచ్‌లో స్కోర్లు సమం కాగా.. సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్‌గా సౌతాఫ్రికా రెండో సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి విజయం సాధించింది.

    రెగ్యులర్‌ మ్యాచ్‌
    సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)
    ఆఫ్ఘనిస్తాన్‌ 187-10 (19.4 ఓవర్లు)

    ఫ్రీ హిట్‌కు రనౌట్‌
    రెగ్యులర్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్‌ రూపంలో వికెట్‌ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్‌. ఆఫ్ఘన్‌ కోల్పోయి వికెట్‌ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.

    తొలి సూపర్‌ ఓవర్‌
    ఆఫ్ఘనిస్తాన్‌- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)
    సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)

    రెండో సూపర్‌ ఓవర్‌
    సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)
    ఆఫ్ఘనిస్తాన్‌- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్‌ హక్‌ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు. 

    ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (3-0-30-0), మొహమ్మద్‌ నబీ (2-0-20-0), నూర్‌ అహ్మద్‌ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్‌ డికాక్‌ (59), ర్యాన్‌ రికెల్టన్‌ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (23), డేవిడ్‌ మిల్లర్‌ (20 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ మార్క్రమ్‌ (5), స్టబ్స్‌ (1) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. ఆఖర్లో జన్సెన్‌ (16) బ్యాట్‌ ఝులిపించాడు.

    188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్‌ను లక్ష్య​ం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (22), రషీద్‌ ఖాన్‌ (20), నూర్‌ అహ్మద్‌ (15 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆఫ్ఘన్‌ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 

    మిగతా ఆఫ్ఘన్‌ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్‌ 12, దర్విష్‌ రసూల్‌ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్‌ నైబ్‌, సెదిఖుల్లా అటల్‌, ముజీబ్‌, ఫజల్‌ హక్‌ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్‌కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్‌, రబాడ, లిండే, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ తీశారు.

  • ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్‌కు ముందు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడటంతో స్టీవ్‌ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్‌కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.

    బిగ్‌బాష్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నా, స్టీవ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్‌కు అవకాశం లభించింది. స్టీవ్‌ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్‌ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.

    కాగా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్‌ హెడ్‌ ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్‌కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.

    క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్‌కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

    ఆసీస్‌ వేధిస్తున్న గాయాలు
    ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్‌ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

    ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆసీస్‌ షెడ్యూల్  
    - ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11  
    - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13  
    - శ్రీలంకతో – ఫిబ్రవరి 16  
    - ఒమాన్‌తో – ఫిబ్రవరి 20  

    ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

    తుది జట్లు.. 
    ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్

    ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా 
     

  • పాకిస్తాన్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌కు టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్‌ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.

    పాకిస్తాన్‌ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్‌ తారిఖ్‌ రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆడే పాక్‌ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

    అయితే, ఉస్మాన్‌ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్‌ యాక్షన్‌ తీరే నెట్టింట వైరల్‌గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్‌ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్‌ శ్రీవత్స్‌ గోస్వామి ఘాటుగా స్పందించాడు.

    ఇది కొనసాగకూడదు
    ‘‘పెనాల్టీ రన్‌ అప్‌ సమయంలో ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్‌ చేశాడనుకుందాం. మరి పాజ్‌ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్‌ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్‌.. ఉస్మాన్‌ బౌలింగ్‌ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు.

     బౌలర్‌ మీదే ఆంక్షలు ఎందుకు?
    ఇందుకు అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్‌ స్విట్‌ హిట్‌ లేదంటే రివర్స్‌ షాట్‌ ఆడుతున్నపుడు అంపైర్‌ లేదంటే బౌలర్‌కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.

    అలాంటపుడు బ్యాటర్‌ మీద లేని ఆంక్షలు బౌలర్‌ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్‌ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.

    ఏదేమైనా ఉస్మాన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్‌ యాక్షన్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.

    అతడి సహజశైలి కాబట్టి లీగలే
    నిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్‌ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్‌ చేస్తున్నాడా అన్నది ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ధారించడం అసాధ్యం.

    ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్‌ జరుగుతున్నపుడు రియల్‌టైమ్‌ టెస్టింగ్‌ టూల్‌ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్‌ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్‌ బదులిచ్చాడు.

    ఈ నేపథ్యంలో శ్రీవత్స్‌కు మద్దతుగా.. అశ్విన్‌ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్‌ బౌలింగ్‌ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

    చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బంగ్లాదేశ్

Politics

  • సాక్షి, సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్‌ఈసీ ఆదేశించింది. స్టేట్ ఎలక్షన్‌ కమిషన్ నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడే తానూ మీడియాలో చూశానని సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించిందన్నారు.

    ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారు.. దీంతో నేను అక్కడికి వెళ్ళాను.. గొడవ జరిగింది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

    మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమై.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

     

  • సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరులో  మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.

    సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..

    సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.

    1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా  అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.

    మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్‌లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.

    అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరుణంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

    ఆ ట్వీట్‌లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్‌ కొండంత  బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.  

    రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

    అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా  పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎస్‌ఈసీ మండిపడింది. 

    ఈసీ ఆదేశాలు.. జగ్గారెడ్డి రియాక్షన్‌.. 
    ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్‌ చెప్పడం కరెక్టా? అంటూ ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని.. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్త గల్లాను సీఐ శివకుమార్‌ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను.. గొడవ జరిగింది’’ అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఎలక్షన్‌ కమిషన్‌ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు?. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్‌,  జిల్లా అధికారులు బాధ్యులు కారా?. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్‌, అధికారుల విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.

    సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఇవాళ జగ్గారెడ్డి హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. సీఐ.. కాంగ్రెస్‌ కార్యకర్త చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్‌ ఆపేస్తానంటూ బూత్‌లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలంటూ పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే  సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కొత్త నారికేళ్ళపల్లి (కేఎన్‌ పల్లి) వైఎస్సార్‌సీపీ స్ధానిక నాయకులు కలిశారు. టీడీపీ మూకలు బరితెగించి అర్ధరాత్రి తమ ఇళ్ళపై దాడి చేశారని, తలుపులు బద్దలు కొట్టి ధ్వంసం చేసి బంగారం, నగదు దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

    చుండూరు మండలం కొత్తనారికేళ్ళపల్లిలో వైఎస్సార్‌సీపీ బీసీ నేత, సర్పంచ్‌ అంగిరేకుల నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీకి చెందిన రౌడీషీటర్‌ బాలకోటిరెడ్డి పచ్చమూకలతో కలిసి దాడిచేశాడని.. వైఎస్‌ జగన్‌కు వేమూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌ బాబు వివరించారు. కేఎన్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టార్గెట్‌గా చేసుకుని బాలకోటిరెడ్డి తరుచూ మారణాయుధాలతో మూకుమ్మడి దాడులు చేస్తున్నాడని, గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ ఉన్నా తమను కాపాడడం లేదంటూ వైఎస్‌ జగన్‌ వద్ద కేఎన్ పల్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ విషయంపై బాపట్ల కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళినా తమ కుటుంబాలకు, ప్రాణాలకు రక్షణ కరువైందని, ప్రాణభయంతో కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నామన్న బాధిత కుటుంబాలు. టీడీపీ ప్రభుత్వంపై నమ్మకం లేక, ఆత్మహత్యకు అనుమతివ్వాలని కలెక్టర్‌ కార్యాలయంలో కోరిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ దృష్టికి నాయకులు తీసుకొచ్చారు. 

    వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ ఎవరూ భయపడొద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చిన వైఎస్‌ జగన్‌.. టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందామని, పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని వెల్లడించారు. వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

    వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో గాదె శివరామిరెడ్డి (మాజీ జెడ్పీటీసీ), రఘురామిరెడ్డి (చుండూరు మండల పార్టీ అధ్యక్షుడు), అంగిరేకుల నాగేశ్వరరావు, శివమ్మ, విష్ణు, ఊరుబండి కోటేశ్వరరావు, బాలాజీ నాయక్‌, స్వప్న, అంగిరేకుల తిరుపతమ్మ, శ్రీను, ఉయ్యూరు రవిశంకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్ సభ్యుడు) ఉన్నారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: ఎల్లో మీడియా క‌థ‌నాలు కూర్పుగా గ‌వ‌ర్న‌ర్‌ ప్ర‌సంగం ఉంద‌ని.. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5ల‌లో వ‌చ్చే క‌థ‌నాల‌నే పుస్తకంగా అచ్చేసి ఆయ‌న‌తో చ‌దివించారేమోన‌న్న అనుమానం క‌లుగుతోంద‌ని వైఎస్సార్‌సీపీ య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ప్ర‌సంగమంతా చూస్తుంటే భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, కాకి లెక్క‌లు, నిరాధార ఆరోప‌ణ‌లే క‌నిపిస్తాయ‌ని వివ‌రించారు.

    ఒక్క మాట‌లో చెప్పాలంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన‌ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్‌మీట్ పెట్టి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింద‌ని చెప్పిన‌ట్టుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు పాల‌నలో అడుగడుగునా వింత పోక‌డ‌లే త‌ప్ప విష‌యం లేదని మండిప‌డ్డారు. ప్ర‌జా సమ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని వైఎస్సార్‌సీపీ నిల‌దీస్తుంద‌ని ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని, స‌భ‌లో ప్ర‌భుత్వ వైఫల్యాలు చ‌ర్చ‌కు రాకూడ‌ద‌నే భ‌యంతోనే వైఎస్సార్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు.

    ప్ర‌తిప‌క్ష హోదా విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ చొర‌వచూపాల‌ని ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి చేశారు. 164 మంది స‌భ్యులున్న కూటమికి 11 మంది వైఎస్సార్‌సీపీ స‌భ్యుల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ము లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే స‌భ‌కు రావ‌డానికి వైయ‌స్సార్సీపీ సిద్ధంగా ఉంద‌ని తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

    అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాకి క‌లెక్ష‌న్ల వ‌ర్షం అన్న‌ట్టుంది
    కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోనైనా వాస్త‌వాలు ఉంటాయ‌నుకుంటే ఆయ‌న‌తో కూడా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పించారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తే నిత్యం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి టీవీ5, ఏబీయ‌న్‌ల‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌ను వింటున్న‌ట్టు, చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌నే పుస్త‌కంగా అచ్చేసి గ‌వ‌ర్న‌ర్‌తో చ‌దివించారేమోన‌ని ఎవ‌రికైనా అనుమానం క‌లుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల గురించి ఊసే లేదు. అవే అబ‌ద్ధాలు, కాకి లెక్క‌లు, నిరాధార ఆరోప‌ణ‌లు, ఏదో జ‌రిగిపోతుంద‌న్న భ్ర‌మ‌లు.. ఇవి మాత్ర‌మే కాకుండా నిత్యం ఎల్లో మీడియాలో క‌నిపించే వైఎస్సార్‌సీపీ మీద ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు.. స్థూలంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన సినిమాకి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింద‌ని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకున్న‌ట్టుగా ఉంది.

    20 నెల‌ల్లో రూ. 3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి ప‌త‌నం వైపున రాష్ట్రాన్ని న‌డిపిస్తూ అభివృద్ధి వైపు ప‌రుగులు పెడుతున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తో చెప్పించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. నిన్నటి వ‌రకు చేసేందేమీ లేదు. ఈరోజు ఏం చేస్తాడో తెలియ‌దు.. కానీ ఏరో స్పేస్ సిటీ, ఎల‌క్ర్టానిక్ సిటీ, క్వాంటం సిటీల పేరుతో ప్ర‌జ‌ల‌కు భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నారు. ఎవ‌రో చేసిన‌ హైద‌రాబాద్ సిటీ, సైబ‌రాబాద్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌ను ఇప్ప‌టికీ త‌న గొప్ప‌గానే చెప్పుకుంటున్నాడు.

    ఇళ్లు లేవు, పింఛ‌న్లు లేవు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు
    పున‌ర్నిర్మాణం, అభ్యుద‌యం, అభివృద్ధి అని పెద్ద పెద్ద మాట‌లు చెబుతున్న ప్ర‌భుత్వం.. రెండేళ్ల‌వుతున్నా విధ్వంస పాల‌న అంటూ వైయ‌స్సార్సీపీ మీద నెపం నెట్ట‌డం దౌర్భాగ్యం. గ‌త చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు పెట్టి దిగిపోతే ఐదేళ్లు సంక్షేమ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో విజ‌య‌వంతంగా నడిపించారు. రూపాయి అవినీతి లేకుండా ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చారు. సంప‌ద సృష్టిస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌బ‌లికి 2024లో వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం.. సంప‌ద సృష్టించ‌డం ప‌క్క‌న‌పెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బ‌తీసి శ్రీలంక హీనంగా మార్చేశాడు. వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వ హయాంలో ఐదేళ్ల‌లో రూ. 3.36 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేస్తే.. సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం 20 నెల‌ల‌కే రూ. 3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింది. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీల ఏర్పాటు పేరుతో విశాఖ‌లో భూముల పంప‌కం త‌ప్పించి చంద్ర‌బాబు చేసింది శూన్యం.

    చేసిన త‌ప్పులు, హామీలు అమ‌లు చేయ‌లేని చేత‌కానిత‌నాన్ని, జ‌రుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకోవ‌డానికి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆఖ‌రుకి క‌లియుగదైవం శ్రీవేంక‌టేశ్వ‌రుడిని వివాదాల్లోకి ప‌బ్బం గ‌డుపుకోవ‌డం సిగ్గుచేటు. కూట‌మి నాయ‌కుల దారుణాల‌ను ప్ర‌శ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్ల‌పై పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌త‌నం జ‌రుగుతుంటే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో దాని ఊసే లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్ర పోలీసు వ్య‌వ‌స్థ దేశంలోని అత్యున్న‌త స్థానం నుంచి అట్ట‌డుగు స్థాయికి ప‌డిపోతే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తావించ‌లేదు. ఒక్క పింఛ‌న్ కొత్త‌గా ఇవ్వ‌క‌పోగా 5 ల‌క్ష‌ల పింఛ‌న్లు తొల‌గించారు. ఒక్క ఇంటి స్థ‌లం మంజూరు చేయ‌క‌పోయినా ఇంటి నిర్మాణాలు ఆపేశారు.

    ఫీజు రీయింబ‌ర్స్ బ‌కాయిలు క్లియ‌ర్ చేయ‌క‌పోయినా, ఆరోగ్య‌శ్రీతో వైద్యం అంద‌క‌పోయినా, రైతులు పండించే పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌పోయినా.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ పాల‌న అందిస్తున్న‌ బ‌డాయి మాట‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి.. ట్రూఅప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు రెండింత‌లు పెంచేసి దోచుకుంటున్నారు. శ్రీశైలం చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా భ‌క్తుల మీద లాఠీ చార్జీ చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని వివాదాల్లోకి లాగారు. ఆస్తుల కోసం ఆల‌యాల నేల‌మ‌ట్టం జ‌రుగుతోంది.

    స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన నాయ‌కుల పాల‌న‌లో ఇన్ని అరాచ‌కాలు జ‌రుగుతున్నా గ‌వర్న‌ర్ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా లేదు. వక్ఫ్ భూములు, ఆల‌యాల‌కు చెందిన ఎండోమెంట్ భూములు కాజేస్తున్నారు. మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటీక‌రించి పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యాన్ని దూరం చేస్తుంటే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో దాని ప్ర‌స్తావ‌నే క‌నిపించ‌లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తూ ప్ర‌జ‌ల త‌ర‌ఫున గొంతు వినిపిస్తున్న ప్ర‌తిప‌క్షం మీద అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధిస్తున్నారు.

    ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటే స‌భ‌లో స‌మ‌యం ఇవ్వాలి క‌దా
    ఎక్క‌డ చూసినా అన్యాయాలు, అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు, దోపిడీ, అత్యాచారాలు రాజ్య‌మేలుతున్నాయి. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన‌ పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. స‌భ‌లో ఉన్న ఒకే ఒక్క ప్ర‌తిప‌క్ష పార్టీ.. ఆరు కోట్ల ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున 175 నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను స‌భ‌లో బ‌లంగా వినిపించాలంటే అసెంబ్లీలో స‌మ‌యం కావాలి క‌దా. స‌మ‌యాన్ని కేటాయించ‌కుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా?  దీనిపై గ‌వ‌ర్న‌ర్‌కి ఫిర్యాదు చేసినా స్పంద‌న లేదు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షం బ‌లంగా గొంతు వినిపించక‌పోతే అమాయ‌కుల‌కు న్యాయం జ‌రిగేది ఎలా?

    వైఎస్సార్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కూడ‌ద‌నే నిబంధ‌న ఎక్క‌డైనా ఉందా? గ‌వ‌ర్న‌ర్ దీనిపై స్పందిస్తార‌ని ఆశించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. ప‌క్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మ‌న‌కు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకుంటుంటే చంద్ర‌బాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి సంజీవ‌ని లాంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌యోజ‌నాల కోసం సీఎం చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టేశాడు. వీట‌న్నింటిపై అసెంబ్లీలో చ‌ర్చ‌కు రాకూడ‌ద‌ని, చ‌ర్చ‌కు వ‌స్తే ప్ర‌జ‌ల‌కు స‌మాధానం  చెప్పే ద‌మ్ములేక వైయ‌స్సార్సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జ‌గ‌న్‌ ప్ర‌శ్నిస్తార‌నే భ‌యంతోనే ప్ర‌తిప‌క్ష నాయకుడిగా గుర్తించ‌డానికి వెనక‌డుగు వేస్తున్నారు. వైఎస్‌ జ‌గ‌న్ హెచ్చ‌రించిన‌ట్టుగానే దోచుకో పంచుకో తినుకో లాంటి పాల‌న న‌డుస్తోంది.

    జ‌ర్న‌లిస్టుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు
    అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని బ‌లంగా నిల‌దీయాల‌ని ఉంది. కానీ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి భ‌య‌ప‌డిపోతోంది. దీనిపై గ‌వ‌ర్న‌ర్ గారు కూడా చొర‌వ చూపించాలి. రాష్ట్రంలో జ‌రుగుతున్న అల్ల‌ర్ల‌పై ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌కి  విన‌తిప‌త్రం ఇచ్చినా చ‌ర్య‌లు క‌నిపించ‌లేదు. అమ‌రావ‌తి పేరు చెప్పి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డం త‌ప్ప‌, నిర్మాణం జ‌ర‌గ‌డం లేదు. పెట్టుబ‌డుల పేరుతో చంద్ర‌బాబు విలువైన భూములు బినామీల‌కు రాసిచ్చేస్తున్నాడు. పొలిటిక‌ల్ గ‌వర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని కుక్క‌లు చింపిన విస్త‌రిలా మార్చేశారని తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ విమ‌ర్శించారు.

  • హైదరాబాద్‌: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కొనసాగిందని పీపుల్స్ పల్స్ పేర్కొంది.

    కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవు’’ అని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

    ‘‘రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది

    మహబుబ్‌నగర్‌లో  కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్‌లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కరీంనగర్‌లో  కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.

    68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది’’ అని  పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

  • సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఉ‍ద్రిక్తత చోటుచేసుకుంది. సీఐ కాంగ్రెస్‌ అభ్యర్థి చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్‌ ఆపేస్తానంటూ బూత్‌లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. తన కాలర్‌ పట్టుకున్నారంటూ సీఐపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్‌ నాయకులు భారీగా చేరుకుంటున్నారు.

    సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలని పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే  సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పూర్తిగా సపోర్ట్ చేశాడని మండిపడ్డారు. వార్డులో ఎన్నికలు రద్దు చేయాలంటూ  జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

    అరేయ్ ఎవడ్రా అంటూ పోలీసులపైకి దూసుకెళ్లిన జగ్గారెడ్డి

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పలు మున్సిపాలిటీల్లో ఉద్రికత్త చోటుచేసుకున్నాయి. పలుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. భౌతిక దాడులకు కూడా దిగారు. మహబూబాబాద్ 14వ వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేయి చేసుకున్నారు. భూపాలపల్లి మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులు డబ్బుల పంపిణీ  చేస్తున్నారంటూ..  స్థానికుల సమాచారంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు పోలీసులు చేసుకున్నారు.  దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు వదిలేసి పరారీ అయ్యారు. లక్షకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

     

Business

  • బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) ఇటీవల గణనీయ మార్పులను చూపిస్తోంది. ఇది విలువైన లోహాల మార్కెట్‌లో ఉన్న అధిక అస్థిరతను సూచిస్తుంది. 2026 జనవరి చివరలో వెండి ధరలు ఘోరంగా పెరగడంతో ఈ నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 44–46కు పడిపోయింది. వెండి ధరలు ఔన్స్‌కు 100 డాలర్లను మించిపోయాయి.

    అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో వెండి ధరల్లో తీవ్ర దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, బంగారం-వెండి నిష్పత్తి వేగంగా 60కు పుంజుకుంది. 2026 ఫిబ్రవరి 11 నాటికి ఈ నిష్పత్తి  61 పైన ట్రేడ్ అవుతోంది.

    నెల ప్రారంభంలో బంగారం-వెండి నిష్పత్తిలో కనిపించిన తీవ్ర అమ్మకాలు, బులియన్ ధరలలో కొత్త ర్యాలీకి దారితీశాయి. బుధవారం (ఫిబ్రవరి 11) స్పాట్ గోల్డ్ ధరలు 0.7% పెరిగి ఔన్స్‌కు 5,057.23 డాలర్లకు చేరాయి. ఏప్రిల్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి ఔన్స్‌కు 5,081.40 డాలర్లను తాకాయి.  స్పాట్ సిల్వర్ 2.3% పెరిగి ఔన్స్‌కు 82.56 డాలర్లు చేరింది.

    ఇక ఫిబ్రవరి 2 నుండి, బంగారం ధరలు 15% పైగా పెరిగాయి, వెండి ధరలు 16% పెరిగాయి. జనవరి 30 న వెండి ఒక్క సెషన్‌లోనే  26% క్షీణతను ఎదుర్కొంది. ఇది లోహ మార్కెట్‌లో తీవ్ర అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది.

    బంగారం-వెండి నిష్పత్తి అంటే..
    బంగారం-వెండి నిష్పత్తి అనేది బంగారం, వెండి సాపేక్ష విలువను కొలుస్తుంది. ఇది ఒక ఔన్సు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన వెండి ఔన్సుల సంఖ్యను సూచిస్తుంది. బంగారం ధరను వెండి ధరతో భాగించడం ద్వారా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి రెండు విలువైన లోహాల సాపేక్ష పనితీరు, మార్కెట్ విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

    నిష్పత్తి 60 దాటడం దేనికి సూచన?
    బంగారం-వెండి నిష్పత్తి 43.80 వద్ద కనిష్టంగా గుర్తించడం సాంకేతికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంఘటన అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి 60ని దాటడం మార్కెట్ సాధారణీకరణ దశకి సూచన. అంటే సమీప కాలంలో బంగారం ధరలు వెండి ధరలను అధిగమించే అవకాశం ఉంది.

  • న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్‌గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన  23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్‌ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.

    ‘‘ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్‌యూవీ/కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్‌ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు  కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్‌ సీ ఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు.

    వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్‌లుక్‌ 
    రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్‌ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్‌ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.

    జీఎస్‌టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్‌ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాల విభాగాల్లో డిమాండ్‌ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్‌ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది.

  • ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) తన పేరును  మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్‌టీఎం లిమిటెడ్‌ (LTM Limited)గా  ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది.

    "వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్‌టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

    "మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్‌తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.

    ఎల్‌టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్‌.. లార్సెన్ & టుబ్రో గ్రూప్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్‌ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్‌అండ్‌టీఐ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం  సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.

    ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే..

  • న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్‌ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం మూడో రౌండ్‌ను కేంద్ర స్టీల్‌ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్‌గ్రేడెడ్‌ అలాయ్‌ స్టీల్‌ తయారీలో 8.7 మిలియన్‌ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్‌కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.

    వీటిలో పీఎస్‌యూ దిగ్గజం సెయిల్‌ సేలం స్టీల్‌ ప్లాంట్‌తో స్టీల్‌ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్‌ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో పీఎల్‌ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.

    మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌.. లక్ష్యాలు రెండింటికీ  తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్‌ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్‌ టన్నుల స్పెషాలిటీ స్టీల్‌ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు.

  • న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్‌) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. అయితే డీల్‌ విలువను తెలియజేయలేదు.

    తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్‌) ఆధారిత ఫుడ్‌ విభాగంలో రిలయన్స్‌ కన్జూమర్‌ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్‌తో సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్‌సీపీఎల్‌ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్‌ ఫర్‌ యు బ్రాండ్‌ పానీయాల బిజినెస్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే.

  • భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం మ్యూట్ నోట్‌తో సెషన్‌ను ముగించాయి. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నడిచిన ర్యాలీకి బ్రేక్‌ పడింది. 

    ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 40.28 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టపోయి 84,233.64 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18.7 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 25,953.85 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.03 శాతం, 0.02 శాతం లాభపడ్డాయి.

    సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 3 శాతానికి పైగా ర్యాలీ చేసి, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టీసీఎస్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మారుతి సుజుకి, ట్రెంట్ ఇతర టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. 

    మరోవైపు ఐటీ షేర్లు పడిపోయాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా క్షీణించింది. హెల్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఐటీసీ ఇతర టాప్‌ లూజర్స్‌లో జాబితాలో  చేరాయి. రంగాలవారీగా నిఫ్టీ హెల్త్ కేర్ 1.62 శాతం లాభపడగా, నిఫ్టీ ఆటో 1.3 శాతం లాభపడ్డాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఐటీ సెషన్ లో అతిపెద్ద లూజర్‌గా ఉద్భవించింది.

  • గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

    “కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్‌కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.

    ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులు
    గూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.

    ఎవరిపై ప్రభావం?
    ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్‌మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.

    ఏడాదిలో మూడోసారి.. 
    ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్‌లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్‌లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.

    వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..
    గూగుల్‌ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్‌ పీరియడ్‌, దా ఆధారంగా లంప్‌సమ్‌ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్‌లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.

  • దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

    ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?

    సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.

    ఒక కస్టమర్ కాల్‌లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్‌వర్క్ స్థాయిలో ఎయిర్‌టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్‌కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.

    ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌టెల్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్‌వర్క్‌గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్‌వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

    అందుబాటులోకి ఎప్పుడు?

    గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్‌ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్‌వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్‌వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.

    ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

  • భారతీయులకు కారు లగ్జరీ కంటే కూడా అది ఇచ్చే మైలేజీనే ముఖ్యమని చెప్పడానికి ఓ ఆటోమొబైల్‌ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొత్త కారు కొనాలనుకునే వారు నేటికీ మైలేజీకే పెద్ద పీట వేస్తున్నారు. వివిధ కంపెనీలు అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజీనిచ్చే టాప్-5 కార్లు కింద చూద్దాం.

    టాప్ 5: మారుతీ సుజుకీ స్విఫ్ట్ (కొత్త మోడల్‌)

    కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ తన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని పెట్రోల్‌ మాన్యువల్ మోడల్ లీటర్‌కు 24.8 కి.మీ., ఆటో గేర్ వెర్షన్ 25.75 కి.మీ మైలేజీ అందిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 3 కిలోమీటర్ల మైలేజీని అదనంగా ఇస్తుంది. అయితే మైలేజీ కోసం ఇంజన్ పవర్‌లో స్వల్పంగా 8 బీహెచ్‌పీ శక్తిని తగ్గించడం గమనార్హం.

    టాప్ 4: మారుతీ సుజుకీ సెలెరియో

    అధిక ఇంధన సామర్థ్యం కలిగిన నాన్-హైబ్రిడ్ పెట్రోల్ కారుగా సెలెరియో గుర్తింపు పొందింది. ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం మాన్యువల్ వెర్షన్ 25.24 కి.మీ, ఆటో గేర్ వెర్షన్ ఏకంగా 26.68 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది.

    టాప్ 3: హోండా సిటీ (హైబ్రిడ్)

    సెడాన్ కార్ల విభాగంలో మైలేజీకి రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఏఆర్‌ఏఐ ధ్రువీకరించింది. ఇది 100 బీహెచ్‌పీ శక్తిని, 131 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    టాప్ 2: టయోటా హైరైడర్ / మారుతి గ్రాండ్ విటారా

    మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఈ రెండు కార్లు మైలేజీ విషయంలో రాణిస్తున్నాయి. కంపెనీల లెక్కల ప్రకారం ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. వాస్తవానికి హైవేలపై అద్భుతమైన మైలేజీ ఇచ్చినప్పటికీ, సిటీ డ్రైవింగ్‌లో మాత్రం సుమారు 20 కి.మీ మైలేజీ వస్తోందని వినియోగదారులు చెబుతుంటారు.

    టాప్ 1: మారుతీ సుజుకీ విక్టోరిస్ (హైబ్రిడ్)

    అత్యధిక మైలేజీనిచ్చే ప్రీమియం ఎంపీవీ/ఎస్‌యూవీగా మారుతీ సుజుకీ విక్టోరిస్ నిలుస్తోంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది భారీ సైజు ఉన్నప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది.

    ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

National

  • భారతదేశ సరిహద్దుల గురించి మనం ఆలోచించినప్పుడు, సాధారణంగా గుర్తుకు వచ్చేది ముళ్ల తీగల కంచె. సినిమాలు, టీవీలలో ఈ దృశ్యాలనే చూస్తాం. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే కంచె వెంట వేలాడుతున్న గాజు సీసాలుకూడా కనిపిస్తాయి. ఇవి ఎందుకు పెడతారు? వాటి వలన ప్రయోజనం ఏమిటి? తెలుసు కుందాం.

    నిజానికి ఇవి చూడటానికి సాధారణంగా కనిపించవచ్చు. కానీ అవి దేశాన్ని రక్షించడంలో కీలకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. సరిహద్దు గార్డులకు 'స్థానిక హెచ్చరిక'గా పనిచేస్తుంది, తరచుగా వారి ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) అనుసరించే అత్యంత ప్రభావవంతమైన 'లో-టెక్' భద్రతా పద్ధతుల్లో ఇది ఒకటి.

    దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే:
    శత్రువుల చొరబాటును గుర్తించడానికి (Intrusion Detection)
    సరిహద్దులో దట్టమైన పొగమంచు కురిసినప్పుడు లేదా పిచ్ చీకటిగా ఉన్నప్పుడు, అత్యాధునిక కెమెరాలు కూడా కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. అటువంటి సమయంలో, ఎవరైనా సరిహద్దు కంచెను కత్తిరించడానికి లేదా దాటడానికి ప్రయత్నిస్తే, ఆ కంచెకు ఉన్న గాజు సీసాలు ఒకదానికొకటి తగిలి శబ్దాన్ని చేస్తాయి. ఈ శబ్దం ద్వారా అలర్ట్ అయిన సైనికులు చొరబాటుదారులను వెంటనే పట్టుకుంటారు.

    పొగమంచు సమయాల్లో రక్షణ
    ముఖ్యంగా పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో చలికాలంలో పొగమంచు (Fog) చాలా ఎక్కువగా ఉంటుంది. కంటికి ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించని ఆ సమయంలో, ఈ సీసాలు 'అలారం'లా పనిచేస్తాయి. శత్రువు కంచెను తాకిన వెంటనే వచ్చే "కిణ కిణ" శబ్దమే సైనికులకు సిగ్నల్.

    ఖర్చు తక్కువ - ఫలితంఎక్కువ
    థర్మల్ ఇమేజర్లు, సెన్సార్లు వంటి ఖరీదైన పరికరాలు లేని చోట లేదా అవి మొరాయించినప్పుడు, ఈ ఖాళీ సీసాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరం లేదు, విద్యుత్ అవసరం లేదు. కేవలం గాలికి ఊగకుండా, ఎవరైనా తాకితేనే శబ్దం వచ్చేలా వీటిని అమర్చుతారు.

     మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు:
    ఈ సీసాలను సాధారణంగా శీతల పానీయాల (Soft Drinks) ఖాళీ బాటిల్స్‌ను సేకరించి ఉపయోగిస్తారు. కేవలం శబ్దమే కాదు, రాత్రిపూట టార్చ్ లైట్ వేసినప్పుడు ఈ గాజు సీసాలు కాంతిని పరావర్తనం (Reflection) చెందిస్తాయి, ఇది కూడా భద్రతకు అదనపు బలాన్నిస్తుంది. చాలా దేశాల సరిహద్దుల్లో అత్యాధునిక సెన్సార్లు ఉన్నప్పటికీ, మన జవాన్లు ఇప్పటికీ ఈ సంప్రదాయ పద్ధతిని నమ్ముతారు ఎందుకంటే ఇది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు.

  • ప్రపంచంలోనే అతి పెద్ద ఇల్లు ఎక్కడుందో తెలుసా? అది ఎక్కడో విదేశాల్లో కాదు… మన భారతదేశంలోనే ఉంది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రెసిడెన్స్‌గా గుర్తింపు పొందింది. ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు, మ్యూజియం కూడా కాదు – రాజ గైక్వాడ్ కుటుంబం ఇప్పటికీ ఇక్కడే నివసిస్తోంది.

    లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దదిగా ఉన్న ఈ మహల్ దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం దీని వైభవాన్ని చూపిస్తుంది. 1890లో బరోడా మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు. ఆ కాలంలో ఇల్లు అనేది కేవలం నివాస స్థలం కాదు, శక్తి, సంపద, సంస్కృతికి ప్రతీక. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే దాదాపు 2.7 లక్షల పౌండ్లు ఖర్చు చేయబడ్డాయి.

    ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిషోల్మ్ దీనిని రూపకల్పన చేశారు. భారతీయ, ఇస్లామిక్, యూరోపియన్ శైలుల అద్భుత సమ్మేళనం ఈ నిర్మాణంలో కనిపిస్తుంది. ప్రతి మూలలో రాజ వైభవం ప్రతిబింబిస్తుంది. ప్యాలెస్ లోపలికి వెళ్లినప్పుడు దాని వైశాల్యం మనసును ఆశ్చర్యపరుస్తుంది. విశాలమైన దర్బార్ హాల్ బెల్జియం గాజుతో చేసిన ఫ్లోర్, ఇటలీ నుండి తెచ్చిన వెనీషియన్ మొజాయిక్ డిజైన్లతో అలరారుతుంది. ప్యాలెస్ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్టు, క్రికెట్ మైదానం, అందమైన తోటలు మాత్రమే కాదు, ఈ ప్యాలెస్ లో చిన్న జూ కూడా ఉంది. ఇది ఒక ఇల్లు కాదు, ఒక స్వంత ప్రపంచం లాంటిది. అప్పట్లోనే ఆధునిక సౌకర్యాలు కూడా ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి.1890లలోనే లిఫ్ట్ సౌకర్యం ఉండటం విశేషం.

    అత్యాధునిక ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలు కూడా అమర్చబడ్డాయి. అంతేకాదు, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ కళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశపు ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మను ఆహ్వానించి అనేక అద్భుత తైలవర్ణ చిత్రాలను వేయించారు. నేటికీ ఆ అరుదైన కళాఖండాలు ఈ ప్యాలెస్ కే గర్వకారణంగా నిలుస్తున్నాయి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వైభవానికి నిలువెత్తు సాక్ష్యం.

     

  • హరియాణాలోని  గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణం  ప్రకంపనలు రేపుతోంది. ప్రముఖ లగ్జరీ హబ్‌ ‘32 అవెన్యూ’ CEO ధ్రువ్ శర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రూ.500 కోట్ల  రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణం చేశాడనే  ఆరోపణలు   వెల్లువెత్తాయి

     

    పోలీసుల ప్రకారం, శర్మ ఒక వాణిజ్య భవనంలోని ఒకే అంతస్తును దాదాపు 25 మంది  విక్రయించాడు. భారీ మోసపూరిత ఆపరేషన్‌కు సంబంధించి గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం శర్మను అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదుల విలువ మొత్తం రూ. 500 కోట్ల దాకా ఉంటుందని దర్యాప్తు అధికారుల అంచనా. నకిలీ ఒప్పందాలు, తప్పుదారి పట్టించే హామీలు, లాభాల ఆశ జూపి విక్రయించాడనేది ఆరోపణ.

    అయితే  కొనుగోలుదారులకు  సంబంధిత ఆస్తిని స్వాధీనం చేయకుండా ఏవేవో సాకులు చెబుతూ జాప్యం చేయడం, యాజమాన్య పత్రాలు  ఇవ్వలేదని ఫిర్యాదు చేయడంతో  ఈ మెగా స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రతి లావాదేవీని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి అనేక నకిలీ పత్రాలను సృష్టించి కొనుగోలు దారులను మోసం చేశాడు. ఈ విధంగా 2022 - 2023 మధ్యకాలంలో ఈ కాంప్లెక్స్‌లోని 3,000 చదరపు అడుగుల మొదటి అంతస్తు యూనిట్‌ను విక్రయించి, శర్మ వివిధ వ్యక్తుల నుండి సుమారు రూ. 500 కోట్ల మేర మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని  పోలీసులు  తెలిపారు. జనవరిలో ట్రామ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఒకరు అప్రా మోటెల్స్,  32 మైల్‌స్టోన్ విస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీసుల ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు ఇతర ఫిర్యాదుల మేరకు పలు కేసులు  నమోదయ్యాయి. అధికారులు బ్యాంకు రికార్డులు, ఆర్థిక లావాదేవీలు మరియు ప్రాజెక్టుకు సంబంధించిన షెల్ ఎంటిటీలను పరిశీలిస్తున్నారు. 

    ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు తర్వాత, ధ్రువ్ దత్ శర్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు చేసేఅవకాశంఉందని పేర్కొన్నారు. నిందితుడిని నగర కోర్టులో హాజరుపరిచి ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్నారు. 

    మరోవైపు  రూ.64 లక్షలు మోసం చేశారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక జంట ఆరోపించారు. వారి ఫిర్యాదుమేరకు డిసెంబర్‌లో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సీఈఓ ధ్రువ్ శర్మ, అతని సోదరి, తల్లిదండ్రులు, ఇతరులపై నేరపూరిత కుట్ర, నేరపూరిత నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ లాంటి అభియోగాలు మోపడం గమనార్హం. అంతేకాదు 32వ అవెన్యూ ఉద్యోగి కార్మికులకు  గత కొన్ని నెలలుగా జీతం చెల్లించలేదట.

    గతంలో ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్న  ధ్రువ్ శర్మ  అవినీతి వ్యవహారం, భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, పెట్టుబడిదారుల రక్షణ గురించి ఆందోళనలను మరింత పెంచింది.
     

  •  
    రైలు ప్రయాణాల్లో కొంతమంది వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు.  రైల్లో  ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటివి ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా సుదూర  ప్రాంతాలకు రైలు ప్రయాణమంటే 24-28 గంటలకు మించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేవారు సరిపడా  భోజనాలు చేసుకుని వెంట తీసుకెళతారు. తాజాగా ఓ ఫ్యామిలీ రైలులో శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    దివ్య జైన్ అనే ఇన్‌స్ట గ్రామ్ యూజర్ ‘రైల్వేలు ఇలాంటి వారిని నిషేధించాలి,  బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి ప్రమాదకరం’  అంటూ చేసిన పోస్ట్‌ ప్రకారం కుటుంబ సభ్యులు వరుసగా తమ బెర్తుల్లో కూర్చుని ఉన్నారు. వీరంతా ఎంతో సంతోషంగా బ్రెడ్‌, టమోటా, కీర లాంటి కూరగాయలతో శాండ్‌విచ్‌లు తయారు చేసుకున్నారు. ఒకరు కూరగాయలను కట్ చేయడం, మరొకరు బ్రెడ్‌పై చాకుతోసాస్‌, చట్నీ పూస్తూ ఎంతో జాయ్‌ఫుల్‌గా బ్రెడ్‌ శాండ్‌విచ్‌లు తయారు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.

     

     fy"> 

    నెటిజన్ల స్పందన 
    ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా కామెంట్స్‌ చేశారు. కొంతమంది వీరి వ్యవహారాన్ని ఖండించగా, రైలంటే సొంత కిచెన్ కాదని మరికొంతమంది  ఒకింత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు.  రైల్వేస్‌లోకి చాకుతో ఎలా అనుమతించారు ఒకరు ప్రశ్నించారు. 

    ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో

    ఫ్యామిలీతో ట్రైన్ జర్నీలో ఎంచక్కా  శాండ్‌విచ్‌లు బావుంది.. ఎందుకంటే రైల్వే స్టేషన్లలో  దొరికే ఆహారంగా అంత శుభ్రంగా ఉండదు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిదేగా అన్నట్టు వారిని సమర్ధించారు.   ఏముందబ్బా, హ్యాపీగా చేసుకుని తింటారు. ఆ తరువాత ఆప్రాంతాన్నిశుభ్రం చేస్తారు..ఇందులో తప్పేముంది అని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన ఎక్కడ,  ఏ రైలులో జరిగింది అనేదానిపై ‍స్పష్టత లేదు.

    ఇదీ చదవండి:  ఇండియన్‌ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం

  • 'మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్' గుర్తున్నాడా? జ‌న‌వ‌రి 26న జ‌రిగిన సంఘ‌ట‌న‌తో అత‌డు పేరు దేశం మొత్తం మారుమోగింది. 70 ఏళ్ల ముస్లిం వ్యక్తికి అండగా నిల‌బ‌డి వార్త‌ల్లో నిలిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ (video viral) కావ‌డంతో అత‌డి గురించి అంద‌రికీ తెలిసింది. అత‌డి ధైర్యాన్ని ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా మెచ్చుకున్నారు.

    38 ఏళ్ల దీప‌క్ కుమార్ ఉత్త‌రాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో హ‌ల్క్ పేరుతో జిమ్ న‌డుపుతున్నాడు. రిప‌బ్లిక్ డే నాడు బజరంగ్ దళ్‌కు చెందిన కొంత‌మంది.. దుకాణం పేరు మార్చాలంటూ ముస్లిం వృద్ధుడిపై ఒత్తిడి తెచ్చారు. పార్కిన్స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ముస‌లాయన కొంచెం స‌మ‌యం కావాల‌ని వారిని అభ్య‌ర్థించాడు. అయినా వారు వినిపించుకోకుండా వాద‌న‌కు దిగ‌డంతో అక్క‌డే ఉన్న దీపక్ కుమార్ క‌ల‌గ‌జేసుకున్నాడు. బజరంగ్ దళ్ కార్య‌క‌ర్తలు త‌న‌ పేరేంట‌ని అడ‌గ‌డంతో మొహ‌మ్మ‌ద్‌ దీప‌క్ (Mohammad Deepak) అని స‌మాధానం ఇచ్చాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. బీబీసీ స‌హా ప‌లు వార్తా సంస్థ‌లు అత‌డిని ఇంట‌ర్వ్యూ చేశాయి. మాన‌వ‌త్వంతోనే ముస్లిం వృద్ధుడికి అండ‌గా నిల‌బ‌డ్డాన‌ని దీప‌క్ చెప్పాడు. మ‌నుషులంతా స‌మాన‌మేన‌ని, మ‌న‌మంతా సోద‌ర భావంతో మెల‌గాల‌ని ఆకాంక్షించాడు.

    జ‌నం చప్పట్లు కొట్టరు
    జ‌న‌వ‌రి 26 ఘ‌ట‌న త‌ర్వాత దీప‌క్‌కు ప్ర‌శంస‌ల‌తో పాటు చిక్కులు ఎదుర‌య్యాయి. కోట్‌ద్వార్‌లో (Kotdwar) సంఘీభావంతో పాటు నిర‌స‌నను ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. కొంత మంది అత‌డిని స‌మ‌ర్థించ‌గా, మ‌రికొంత మంది వ్య‌తిరేకించారు. జనవరి 31న, బజరంగ్ దళ్ సభ్యులు దీపక్‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు వారిని చెద‌ర‌గొట్టారు. ''కోట్‌ద్వార్‌ పట్టణంలో సగం మంది నన్ను సమర్థిస్తారు, కానీ మీరు మంచి పనులు చేసినప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టరు. నిజాయితీకి మూల్యం చెల్లించాల్సి రావచ్చు" అని ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన్నారు.

    150 నుంచి 15కు డౌన్‌
    మ‌రోవైపు దీప‌క్ జిమ్‌ను వ‌చ్చే వారి సంఖ్య బాగా త‌గ్గిపోయింది. ఒక‌ప్పుడు రోజుకు 150 మంది వ‌చ్చేవార‌ని, ఇప్పుడు క‌నీసం 15 మంది కూడా రావ‌డం లేద‌ని దీప‌క్‌ వాపోయాడు. ''ఆ ఘ‌ట‌న త‌ర్వాత నా జిమ్‌కు రావ‌డానికి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. వాళ్ల భ‌యం నాకు అర్థ‌మైంది. నెలకు రూ. 40,000 అద్దెతో జిమ్ (Gym) నిర్వ‌హిస్తున్నాను. అదీగాక ఈ మ‌ధ్య‌నే ఇల్లు కూడా క‌ట్టుకున్నాను. దీనికి నెలవారీ రూ. 16,000 రుణాన్ని చెల్లిస్తున్నాను. నాకున్న ఆదాయ‌మార్గం జిమ్ ఒక‌టే. స‌భ్యుల సంఖ్య బాగా త‌గ్గ‌డంతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌''ని దీప‌క్ వాపోయాడు.

    జాన్ బ్రిట్టాస్ సంఘీభావం 
    దీప‌క్ కుమార్‌కు రాజ్యసభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నాయకుడు జాన్ బ్రిట్టాస్ (John Brittas) సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ నెల 8న కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వ‌చ్చి దీపక్‌తో పాటు మొహ‌మ్మ‌ద్‌  బాబా డ్రెస్ షాప్‌ యజమాని వకీల్ అహ్మద్‌ను క‌లిశారు. మతతత్వ శక్తుల బెదిరింపుల కారణంగా దీప‌క్ జిమ్‌కు వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గడంతో తాను స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్టు ఎక్స్‌లో వెల్ల‌డించారు జాన్ బ్రిట్టాస్.

    చ‌ద‌వండి: మ‌నం ఎవ‌రికి కృతజ్ఞతగా ఉండాలి?

    ''మత సామరస్యాన్ని గౌరవించే రాష్ట్రమైన కేరళ త‌ర‌పున‌ శుభాకాంక్షలు తెలియజేయడానికి నేను కోట్‌ద్వార్ ప‌ట్ట‌ణానికి వెళ్లాను. దీపక్‌ను మాత్రమే కాకుండా అతడి తల్లి, భార్య, బిడ్డను కూడా కలిశాను. జీవనోపాధి కోసం టీ అమ్ముకునే అతని తల్లి అందించే వేడి అల్లం టీ తాగాను. మతపరమైన అంశాల బెదిరింపుల కారణంగా ఇప్పుడు నిర్జనమై ఉన్న అతని జిమ్‌ను సందర్శించి సభ్యత్వం తీసుకున్నాను. ముహమ్మద్ బాబా వస్త్ర దుకాణాన్ని కూడా సందర్శించి కొన్ని కొనుగోళ్లు చేశాను. దీపక్‌పై కేసు నమోదు చేసిన కోట్‌ద్వార్ పోలీస్ స్టేషన్‌లో బలమైన నిరసన తెలియ‌జేశాను. 'ముహమ్మద్' దీపక్‌గా రూపాంతరం చెందిన దీపక్ కుమార్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతడు భ‌విష్య‌త్ విశ్వాసానికి వజ్ర-ప్రకాశవంతమైన కాంతి'' అంటూ జాన్ బ్రిట్టాస్ ఎక్స్‌లో పేర్కొన్నారు. 

     

  • ఢిల్లీ: దేశంలో పనితీరు లేని ఎంపీలు,ఎమ్మెల్యేలను తొలగించే అధికారం ఓటర్లకు కల్పించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మాట్లాడారు.  

    రాజ్యసభ జీరో అవర్‌లో రాఘవ్‌ చద్దా ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన ప్రజలకు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనితీరు బాగలేకపోతే వారిని తొలగించుకునే హక్కు కల్పించాలని కోరారు.

    ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రజలకు ఎన్నిక చేసే హక్కు ఇస్తుంది కానీ, ఎన్నికైన ప్రతినిధులను పనితీరు లేకపోవడం లేదా అవినీతి వంటి కారణాలతో పదవీ కాలం పూర్తికాకముందే తొలగించే ప్రత్యక్ష విధానం లేదు అని ఆయన అన్నారు. ‘రైట్ టు రీకాల్’ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలు తమ ప్రతినిధులను పనితీరు లేకపోతే లేదా అవినీతిలో చిక్కుకుంటే తొలగించే అవకాశం కలుగుతుంది  అని పేర్కొన్నారు.

    ఈ హక్కు ఇప్పటికే ప్రపంచంలోని 24 దేశాల్లో అమలులో ఉందన్నారు. అదే సమయంలో పంచాయతీ స్థాయిలో మనదేశంలో ‍కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహరాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ ప్రతిపాదనపై సభలో కొంతమంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చద్దా మాత్రం ఈ హక్కు సాధారణ రాజకీయ విభేదాల కోసం కాకుండా, నిరూపితమైన అవినీతి, మోసం, లేదా విధులను నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడాలని స్పష్టం చేశారు.

    ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికైన ప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే, ప్రజలకు వారిని తిరస్కరించే శక్తి ఉండాలి అని ఆయన వాదించారు.

    మొత్తం మీద, రాఘవ్ చద్దా చేసిన ఈ ‘రైట్ టు రీకాల్’ ప్రతిపాదన భారత రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇది అమలులోకి వస్తే ప్రజాస్వామ్యానికి మరింత పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనను తీసుకురావచ్చని భావిస్తున్నారు. 

  • లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పై రాహుల్ అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. దీంతో ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సిద్ధమైంది.  దీనిపై రాహుల్ సాయంత్రం 5గం లోపు స్పీకర్ కార్యాలయంలోకి హజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.

    దీనిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ స్పందించారు. రాహుల్‌ గాంధీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్నారు. ఆయన చేసినవన్ని నిరాధార ఆరోపణలని తెలిపారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశంలో రాహుల్ గాంధీ చెప్పిన అంశాల్లో అసలు వాస్తవం లేదని దానికి సంబంధించిన చాలా నిజాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఓటుచోరి అంటూ అంటూ రాహుల్ ఎలక్షన్ కమిషన్‌పై ఆయన చేసిన డ్రామా విఫలమయ్యిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు.

    కాగా అంతకు ముందు రాహుల్ గాందీ పార్లమెంటులో మాట్లాడారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) చేసిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం యుద్ధాల యుగంలోకే ప్రవేశిస్తున్నామని దానికి ఉక్రెయిన్, గాజా, ఇరాన్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ మేఘాలను ఆయన ఉదాహరణగా చూపారు. శాంతి స్థాపన జరుగుతుందన్న అంచనాలు ఇక చెల్లవని, నిరంతర సంఘర్షణలే నేటి ప్రపంచ వాస్తవమని  రాహుల్‌ అన్నారు.

    లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలు దుమారం

    అయితే రాహుల్ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశం ప్రస్థావించాలని ప్రయత్నించగా స్పీకర్ స్థానంలో ఉ‍న్న జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ అదానీ, అంబానీ, హర్ధీప్ సింగ్ పేర్లను ప్రస్థావించారు. దీనిపై రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆప్ ఆర్డర్ లేవనెత్తారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు.

     

     

  • సాక్షి, చెన్నై : ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుచ్చేరిలో ప్రత్యేక ఆఫర్‌గా వైన్‌ కొంటే బీర్‌ ఫ్రీ అన్న ప్రచారం హోరెత్తింది. దీంతో ఎక్సైజ్‌ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువ. ఇక్కడ వివిధ రకాల బ్రాండ్లు లభిస్తుంటాయి. 

    తమిళనాడుతో పోలిస్తే తక్కువ ధరలకు ఇక్కడ విస్తృత శ్రేణి మద్యం బ్రాండ్లు లభించడం జరుగుతుంది. అందమైన సాగర  తీరప్రాంత నగరం కావడంతో పుదుచ్చేరికి నిత్యం పర్యాటకులు హోరెత్తుతుంటారు. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి మద్యపాన ప్రియులు తరచుగా పుదుచ్చేరికి వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో మద్యం వ్యాపారం ఇక్కడ జోరుగానే ఉంటుంది.  ఇటీవలి కాలంలో  పుదుచ్చేరిలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. 

    గత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,100 కోట్ల ఆదాయం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పుదుచ్చేరి నిలవడంతో, మద్యం దుకాణాలు ఇప్పుడు పండుగ సీజన్‌కే పరిమితం కాకుండా ప్రత్యేక రోజుల సందర్భంగా కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో, వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘‘వైన్‌ కొనుగోలు చేస్తే బీరు ఉచితం’’ అంటూ కొన్ని మద్యం దుకాణాలు ప్రకటించిన ఆఫర్‌ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 

    ఈ ఆఫర్‌ ద్వారా వినియోగదారులను ఆకర్షించి, తర్వాత విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పలువురు వినియోగదారులు తాము మోసపోయినట్లు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.దీంతో ఎక్సైజ్‌ అధికారులు కన్నెర్ర చేసే పనిలో పడ్డారు. అలాగే ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్‌లు సైతం ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు అంటూ సోమవారం నుంచి ప్రత్యేక ప్రకటనలను ఇచ్చుకునే పనిలో పడ్డాయి. ఫిబ్రవరి 14వ తేదీకి మరో మూడు రోజులే సమయం ఉండటంతో ఇక్కడి ఆఫర్లపై దృష్టి పెట్టే వాళ్లు పెరిగారు. అదే సమయంలో మద్యం దుకాణాలలో ఆఫర్ల ఘటనపై సంబంధిత శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆఫర్లు ప్రకటించినట్లు తేలితే, సంబంధిత మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.   

NRI

  • అమెరికాలోని జార్జియాలో ఉండే  భారతీయ అమెరికన్‌కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ  విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    జార్జియాలోని అక్వర్త్‌లోని వాల్‌మార్ట్‌లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్‌మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్‌ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్‌కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. 

    అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్‌. 2025 మార్చి 18న, తాను వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్‌ (టాబ్లెట్స్‌) ఎక్కడ ఉన్నాయోమిల్లర్‌ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.

     

    తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ  చెప్పింది.

    నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్
    అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని  సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు.  

    ఇదీ చదవండి: రైల్లో శాండ్‌విచ్‌...నెటిజన్ల రియాక్షన్స్‌ వైరల్‌ వీడియో
     

    మానసిక వేదన, వ్యాపార నష్టం 
    ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్‌మార్ట్ వీడియో లేకపోయి ఉంటే.  ఆమె మాట వర్సెస్ నా మాటగా  మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు.  ఆ ఫుటేజ్‌అక్షరాలా తన  ప్రాణాన్ని కాపాడిందన్నారు.

    సుమారు రూ. 210 కోట్లు
    తాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్‌పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.

    ఇదీ చదవండి:  ఇండియన్‌ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతం

    సీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్‌మన్ అన్నారు. 

    ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్‌ వీడియో

Family

  • అప్పట్లో భారతీయ టెలివిజన్‌ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్‌ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్‌ కోచింగ్‌ సర్వీసెస్‌. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్‌.. 

    90వ దశకంలో భారతీయ టెలివిజన్‌ రంగంలో ఛానల్‌వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్‌ ఐకాన్‌ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్‌ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్‌ ఇండియా కెనడా అయిన రూబీ భారత్‌ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు. 

    మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్‌ వంటి విషయాలపై లైఫ్‌ కోచింగ్‌ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. 

    ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్‌ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. 

     

    (చదవండి: ఆ హోటల్‌ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్‌!)

  • డెబై ఏళ్ల వయసులో ఆ బామ్మ పడుతున్న​ కష్టం చూస్తే మనసు కరిగిపోతుంది. ఇంతటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవంగా బతికేందుకు పడుతున్న తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్‌. ఎందుకమ్మా.. ఈ వయసులో నీకంత కష్టం అనిపిస్తుంది. కానీ ఆ బామ్మ తన కాళ్లపై తనునిలబడాలని పోరాడుతున్న తీరు యువతకు ఆదర్శం, స్ఫూర్తి కూడా. అందుకు సంబంధించిన వీడియోని ఆరాధన ఛటర్జీ షేర్‌ చేయడంతో నెటింట వైరల్‌గా మారింది. 

    ఆ బామ్మ పేరు దీపాలీ ఘోష్‌. తన భర్త మరణించిన తర్వాత దాదాపు మూడు దశాబ్దాలు ఓ చిన్న భోజనశాల నడుపుతోంది. ఆ భోజనశాలలో ప్రతీదీ ఆమెనే స్వయంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఆ హోటల్‌ సరిగా నడవడం లేదు. కనీసం ఐదు కస్టమర్లు కూడా లేరని భోరుమంటోంది. అది ఓ చిన్న ఇరుకైన స్థలంలో ఉన్న చిన్నపాటి భోజనశాల. అక్కడ ఓ విరిగిన ఫ్లైవుడ్‌పై నిద్రపోతుంది. 

    చెప్పాలంటే ఆ దుకాణం నిండా ఉన్న పాత సామాన్లు, మసితో నిండిన గోడలు, ఓ పక్క లీకయ్యే పైపుతో చిందరవందరగా ఉంది. బామ్మకు లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైందట. పైగా వినికిడి శక్తి తగ్గిపోయింది ఆ బామ్మకు. ఆమె తన ఆహారం, మందులు కోసం ఈ పని చేస్తూనే ఉండాలి. ఆమె వృద్ధాశ్రమానికి వెళ్లాలనుకోవడం లేదట. తాను గౌరవంగా జీవనోపాధిని పొందాలనేదే ఆమె ఆశ. 

    ఆ బామ్మ అక్కడే ఉండి తన వ్యాపారాన్ని ఇదివరకిటిలా రన్‌ చేయాలని తపన పడుతోంది. కాబట్టి మనమందరం కలిసి దీన్ని సాధ్యమయ్యేలా చేద్దామా అని పిలుపునిస్తూ..అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంది సోషల్‌ మీడియా యూజర్‌ ఆరాధన. ఆ వీడియో మిలియన్లమంది నెటిజన్ల మనసుని కదిలించింది. ఎలా ఆ బామ్మని కలిసేది, సాయం చేసేది అంటూ పోస్టలు పెట్టారు. మాలాంటి సోమరిపోతులకు నిజంగా ఆ బామ్మ కథ ఓ కనువిప్పు, ప్రేరణ అని భావోద్వేగంగా పోస్టులు పెట్టారు కూడా.

     

    (చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్‌ కపూర్‌)

     

  • ఇప్పుడంటే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు చాలా తేలికగా వెళ్లగలుగుతున్నాం. సరైన రవాణా సౌకర్యం లేనందున కొన్ని దశాబ్దాల క్రితం శ్రీవారి దర్శనభాగ్యం నగర వాసులకు చాలా  కష్టంగా ఉండేది. ఇలాంటి సమయంలో ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన బిర్లా మందిర్‌ ఆ కొరత తీర్చింది.  సిటీ జనులే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వారికి ఫేవరెట్‌గా మారింది. వివాహం తర్వాత, శుభకార్యాలు, పుట్టిన రోజుల సందర్భంగా అందరూ బిర్లా మందిర్‌కే రావడం... ఇక్కడి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. 

    కొత్తగా పెళ్లయినవారికైతే బిర్లామందిర్‌కు వెళ్లాల్సిందే అన్న రీతిలో ఖ్యాతికెక్కింది. అలాంటి బిర్లా మందిర్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకుంది. స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు తొలిసారిగా 1976 ఫిబ్రవరి 13న తొలిసారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

    చారిత్రక కట్టడాల సరసన ఆధ్యాత్మిక వైభవం 
    భాగ్య నగరం అంటే చారిత్రక కట్టడాలే కాదు. ఆధ్యాతి్మక వైభవం అని చాటుతోంది బిర్లా మందిర్‌. నౌబత్‌ పహాడ్‌ కొండపై పాలరాయితో కొలువుదీరిన ఈ ఆలయం కేవలం ఆధ్యాతి్మక ప్రదేశమే కాదు.. అద్భుత శిల్పకళా వేదిక కూడా. సిటీ నడిబొడ్డున జన కోలాహలం మధ్య ఉన్న ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కలిగే ప్రశాంతత అటు భక్తులు, ఇటు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తోంది.

    పాలరాతి సొగసుల మందిరం... 
    పూర్తిగా రాజస్థాన్‌ నుంచి తెప్పించిన 2000 టన్నుల పాలరాయితో బిర్లా మందిర్‌ను నిర్మించారు. పదేళ్లపాటు నిపుణులైన శిల్పుల చేత తీర్చిదిద్దారు. ఉత్తర, దక్షిణ భారత వాస్తు శిల్పి రీతుల (గోపుర, రాజస్థానీ) కలయికతో  విలక్షణంగా కనిపిస్తుంది. 

    బిర్లా మందిర్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం 11 అడుగుల ఎత్తులో తిరుమల శ్రీవారిని తలపిస్తూ భక్తిపారవశ్యం కలిగిస్తుంది. శివుడు, గణపతి, హనుమంతుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ, మహాభారత ఘట్టాలు భారతీయ సంస్కృతికి అద్దంపడతాయి. సాయంత్రం తర్వాత విద్యుత్‌ కాంతులతో మెరిసిపోయే బిర్లా టెంపుల్‌ పర్యాటకులనూ కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి హుస్సేన్‌ సాగర్, బుద్ధుడి విగ్రహం, నగర అందాలు కనువిందు చేస్తుంటాయి. ప్రశాంతత కోరుకునేవారికి, ఫొటోగ్రఫీ ప్రేమికులకు (ఆలయం వెలుపల) బిర్లా మందిర్‌ మంచి స్పాట్‌.

    హైదరాబాద్‌ ఎక్స్‌కర్షన్‌...! 
    అందులో బిర్లా మందిర్‌ విజిటింగ్‌..! ఇదీ స్కూల్‌ పిల్లలకు కొన్నేళ్లపాటు తప్పనిసరిగా కొనసాగిన సంప్రదాయం. అంతేకాదు, టెక్ట్స్‌ బుక్స్‌లోనూ బిర్లా మందిర్‌ విశిష్టత గురించి చెప్పేవారు. దీంతో ఆ టెంపుల్‌ను చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తహతహలాడేవారు. 

    కొత్త జంటలకు ఫేవరెట్‌ 
    కొత్తగా పెళ్లయినవారికి సిటీలో ఫేవరెట్‌ స్పాట్‌ బిర్లా మందిర్‌. భక్తి, ప్రశాంతత రెండూ లభించే ప్రదేశం కావడంతో యువ జంటలు ఇక్కడికి రావడాన్ని ఓ కార్యక్రమంగా పెట్టుకునేవారు. వీకెండ్‌లో హార్ట్‌ బీట్‌ అసలే వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఆపై శనివారం..! 
    ఇంకేం వీకెండ్‌ వస్తే చాలు సిటీ జనులు బిర్లా మందిర్‌కు పొలోమంటూ పోటెత్తుతుంటారు. వైకుంఠ ఏకాదశి వంటి రోజుల్లో కిక్కిరిసినట్లే. శని, ఆదివారాల్లో అత్యధిక శాతం నగరవాసుల ఆధ్యాత్మిక కేంద్రం ఇదే.

    ప్రత్యేకతలు ఇవి 
    1966లో ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్‌ బిర్లా కలలోకి ఈ కొండ, శ్రీ వేంకటేశ్వరస్వామి కనిపించారని చెబుతారు. సమీపంలోని హోటల్‌ గది నుంచి చూస్తున్న ఆయనకు కొండపై వేంకటేశ్వరస్వామి ఆహా్వనిస్తున్నట్లు అనిపించిందని.. దీంతో బిర్లా మందిర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే రూ.2 కోట్లతో ఏడెకరాలలో హిందూస్థాన్‌ చారిటీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నౌబత్‌ పహాడ్‌పై బిర్లామందిర్‌ నిర్మించారు. 50 ఏళ్లలో 15 కోట్ల మందిపైగా భక్తులు, పర్యాటకులు సందర్శించారు. సోమ–శుక్రవారం వరకు రోజుకు 5–6 వేలమంది భక్తులు, సందర్శకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 9–11 వేలకు చేరుతుంది.  

    24 నుంచి స్వర్ణోత్సవాలు 
    శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24 నుంచి 27 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నాం. హోమాలు, అభిషేకాలు, పల్లకీ సేవ, కలశపూజ, పూర్ణాహుతి, శోభాయాత్ర చేపడతాం.
    – సీఏ శ్యాం కొఠారి, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌

  • బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌  త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడి అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్‌ ..కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగానే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. ఈ జంట 2022లో మొదటి బిడ్డ వాయును స్వాగతించారు. ఇక గతేడాది నవంబర్‌లోనే సోనమ్‌ రెండోసారి అమ్మను కాబోతున్నట్లు ప్రకటించింది. 

    ఈ నెల ఫిబ్రవరి 8నబాలీవుడ్‌ అతిరథుల నడుమ సోనమ్‌ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుక తాలుకా వీడియోని షేర్‌ సుకుంటూ..సీమంతం తంతు గురించి చాలా భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేగాదు ఆ ఈవెంట్‌ ఎంతలా భారతీయ సంప్రదాయపద్ధతిలో జరిగిందో కూడా వివరించింది.

    కాబోయే తల్లి సోనమ్‌ తన సీమంతం వేడుక వీడియోని షేర్‌ చేస్తూ..పురాతన వేద సాంప్రదాయంలో పాతుకుపోయిన ఈ ఆచారం గురించి చాలా గొప్పగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. ఆ రోజు తనకెంతో ముఖ్యమైనదే గాక స్రీ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా పేర్కొంది. 40 ఏళ్ల సోనమ్‌ సీమంతం అనేది సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాలలో మూడవదిగా వెల్లడించింది. దీన్ని 'జుట్టు విప్పే ఆచారం'గా పిలుస్తారని, నవమాసాలు బిడ్డను మోసే తల్లి గౌరవార్థం జరిపే వేడుకగా పేర్కొంది. దీన్ని మన భారతదేశంలో  పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తారంటూ సవివరంగా వెల్లడించింది. 

    ఈ సీమంతం వేడుకను ఉత్తరాన గోధ్ భారాయ్ అని,  దక్షిణాన వాలైకప్పు, మహారాష్ట్రలో దోహలే జెవాన్ వంటి పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఎన్ని విభిన్న పేర్లతో పిలిచినా..ఈ అందమైన భావం స్త్రీ జీవితలోని అత్యంత అపురూపమైన క్షణంగా పేర్కొంది. ఇది ప్రేమ, రక్షణ, కొత్త జీవితంల వేడుకగా అభివర్ణించింది. సోనమ్‌ షేర్‌ చేసిన వీడియోలో వేదమంత్రాల నడుమ స్వీట్లను తినిపించడం, కుటుంబం, స్నేహితులతో గడిపే మధురమైన క్షణం అని చెబుతోంది. 

    కాగా, ఈ సీమంతం వేడుక అనిల్‌ కపూర్‌ విలాసవంతమైన బంగ్లాలో జరిగింది. అక్కడ ఈ వేడుక కోసం బంగ్లాని అధునాత డిజైన్‌తో పవిత్ర భారతీయ చిహ్నలను మిళితం చేస్తూ..పూల అభయారణ్యంగా, ఆధ్యాత్మికతకు నెలవుగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ వేడుకలో ముఖ్యంగా నాటి కాలాన్ని గుర్తుచేసేలా దీప స్థంభం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ఇంతలా అంగరంగ వైభవంగా ఈ సీమంతం వేడుకను జరిపినందుకు తన తల్లి, అత్తగారు, సోదరి రియా కపూర్‌లకు పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

     

    (చదవండి: అంతర్జాతీయ మోడల్‌గా సివిల్‌ ఇంజనీర్‌..! ఒక్క రోజుకే..)

     

Andhra Pradesh

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. అంబటి విడుదల కాకుండా విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత కేసులను తిరగతోడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అంబటిని మరో కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు.

    గతేడాది నవంబర్‌లో పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో అంబటికి షరతులతో కూడిన బెయిల్‌ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నారు.  ​ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. అంబటి విడుదల కాకుండా పాత కేసులు తిరగతోడాలని ఆదేశాలు జారీ చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

    2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును
    2023లో పెండింగ్‌లో ఉన్న పాత కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. సత్తెనపల్లిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో అప్పట్లో సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

    పట్టాభిపురం కేసులో అంబటికి బెయిల్ వస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం నుంచి పాత కేసులను తిరగ తోడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఆ ఆదేశాల మేరకు.. సత్తెనపల్లి కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు కోర్టులో పిటి వారెంట్ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటి వారెంటుకు కోర్టు అనుమతించింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి పట్టాభిపురం కేసులో విడుదల కానున్న అంబటిని ఈ కేసులో కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. 
     

    విడుదల కాకుండా ...  అంబటిపై మరో కేసులో ఇరికించాలని చూస్తోన్న పోలీసులు
     

  • సాక్షి, అన్నమయ్య జిల్లా: మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ఇలాకా రాయచోటిలో ‘104’ వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు అదృశ్యమయ్యాయి. రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు మాయం కాగా.. ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్‌ యార్డుకు కొంతమంది సిబ్బంది తరలించినట్లు సమాచారం.

    104లను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డంపింగ్‌ యార్డులో 104లను ధ్వంసం చేస్తున్న వీడియో.. సాక్షి చేతికి చిక్కింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్‌ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, 104లను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు జిల్లా వైద్యాధికారి ఫిర్యాదు చేశారు.

    AP: వీడియో వైరల్!! 104 వాహనాలను ధ్వంసం

     

  • సాక్షి, విజయవాడ: గ్రూప్‌-1పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 మూల్యాంకనం అక్రమాలపై సిట్‌ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీ స్థాయి అధికారితో సిట్‌ విచారణ జరపాలన్న  హైకోర్టు.. మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

     

  • సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ లభించింది. అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేగడాది నవంబర్‌ 12న నమోదైన కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తీర్పును వెలువరించింది. 

    నవంబర్‌ 12న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టింది. ఆ ర్యాలీ నిర్వహించే సమయంలో అంబటి  తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. తాజా, కోర్టు తీర్పుతో ఈరోజే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

    అంబటి రాంబాబు బెయిల్‌కు సంబంధించి పూచికత్తుల వ్యవహారం ఇప్పటికే పూర్తయ్యింది. అంబటి తరఫు న్యాయవాదులు పదివేల రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించారు. రిలీజింగ్ ఆర్డర్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బయల్దేరారు. 

    రాజమండ్రి జైల్ నుంచి రేపే అంబటి విడుదల

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2243  ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, ఈనెల 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.

    ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

    హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్‌ టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14నుంచి 16తేది వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15 వతేది నుంచి 17 తేది వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది.

    శివరాత్రి ఆపరేషన్స్‌పై ఉన్నతాధికారులతో సంస్థ విసి అండ్‌ ఎండీ ఐపీఎస్ వై.నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

    ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోంది. 43 శైవ క్షేత్రాలకు 2243  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని  క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

    మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని,టికెట్ల బుకింగ్ మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000,040-234500332లలో సంప్రదించవచ్చని తెలిపారు.