Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్‌కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్‌ఫెక్ట్‌' అని ప్రశంసించింది.  

    ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్‌స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్‌లో సమంత తన స్టంట్స్‌తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్‌లో బాగా పేలింది.

    ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. 

    • బ్లాక్‌ డ్రెస్‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ సావిత్రి హోయలు..
    • పర్పుల్ కలర్ డ్రెస్‌ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్‌ పోజులు..
    • లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..
    • సిస్టమ్‌ టీమ్‌తో జ్యోతిక చిల్..
    • డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..

     

     

     

     

     

     

  • టాలీవుడ్ పర్సెంటేజ్ వివాదం మరింత రసవత్తరంగా మారింది. ఈ సమస్య చివరికీ మెగాస్టార్ వరకు చేసింది. ఈ వివాదం మరింత ముదరడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతస సంఘం చిరంజీవిని కలిశారు. దాదాపు గంటసేపు వీరితో చిరంజీవి సమావేశంలో కానున్నారు. ఎగ్జిబిటర్స్‌తో,  గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి భేటీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

    ఈ రోజు తెలంగాణ ఎక్జిబిటర్స్, నిర్మాత కేఎల్ నారాయణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల నియమించిన కమిటీ నుంచి అన్ని వివరాలు చిరంజీవి తెలుసుకున్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు మూడు రోజుల్లో అఫిషియల్‌గా చెబుతామని తెలిపారు. 

    ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య..: ఎగ్జిబిటర్ శ్రీధర్..

    ఇది ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య అని.. పెద్ది మూవీ గురించి కాదని ఎగ్జిబిటర్ శ్రీధర్ వెల్లడించారు.  చిరంజీవి రెస్పాన్స్ బాగుందని అన్నారు. అన్ని వివరాలు మెగాస్టార్ అడిగి తెలుసుకున్నారని వివరించారు. సింగిల్ స్రీన్ థియేటర్స్ పడుతున్న సమస్యలు ఇన్ని ఉన్నాయా అని చిరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని శ్రీధర్ అన్నారు. 
     

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.

    ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.
     

     

  • 'కళామతల్లికి సేవ చేస్తున్నాం' లాంటి మాటలు ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ప్యూర్ వ్యాపారం. ఏ నిర్మాత అయినా పెట్టుబడి ఎంత? లాభం ఎంత? లాంటి విషయాలే అంతిమంగా ఆలోచిస్తాడు. కొందరు నిర్మాతలకు అప్పుడప్పుడు అలాంటి అదృష్టం దక్కుతుంది. ఇప్పుడు హాలీవుడ్ నిర్మాణ సంస్థకు అలాంటి జాక్‌పాట్ తగిలింది. అది కూడా ఓ హారర్ సినిమాతో. ఇంతకీ దీని సంగతేంటి? వసూళ్లు ఎలా ఉన్నాయి?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

    ఈ నెల 15న అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో 'అబ్సెషన్' అనే సైకో హారర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. దీనికి రూ.7 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్ అయింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఇది సృష్టిస్తున్న సెన్సేషన్ చూస్తే అమ్మ బాబోయ్ అనాల్సిందే. ఎందుకంటే తొలివారం 16 మిలియన్ డాలర్లు, రెండోవారం 22 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు అమెరికాలో దగ్గర దగ్గర 60 మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసింది. మరో వారం పదిరోజుల్లో 100 మిలియన్ డాలర్ల గీత దాటేయడం గ్యారంటీ. ఇదే గనక నిజమైతే పెట్టిన పెట్టుబడి 100 రెట్ల లాభం సంపాదించినట్లే.

    మరి ఇంతలా ఈ సినిమాలో ఏముందా అని చూస్తే.. బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమని బయటకు చెప్పడు. ఓసారి చిత్రమైన బొమ్మ ఎదుట నిలబడి నిక్కీ వేరే ఎవరిని ప్రేమించనంత గొప్పగా తనని ఇష్టపడాలని కోరుకుంటాడు. కట్ చేస్తే నిక్కీ లాంటి అమ్మాయి ఇతడి జీవితంలోకి వస్తుంది. ఆమె ఓ సైకో. చిత్రంగా ప్రవర్తిస్తూ ఘోరమైన హత్యలు చేయడం మొదలుపెడతుంది. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది ఈ మూవీ ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ చూడాలంటే మీకు కచ్చితంగా గుండె ధైర్యం కావాలి. మన దేశంలో ఈ వీకెండ్ రిలీజ్ కానుంది.

    (ఇదీ చదవండి: చరణ్ బాడీగార్డ్ ప్రొఫెషనల్ ఫైటరా? ఇతడెవరు జీతమెంత?)

  • టాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్‌.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

    ఈవెంట్‌కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. 
     

  • ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు బయట పెద్దగా తిరగరు. సెల్ఫీల పేరుతో అభిమానులు ఇబ్బంది పెడతారని భయం. అందుకు కొందరు బాడీగార్డ్స్‌ని పెట్టుకుంటారు. సల్మాన్ ఖాన్, యష్ లాంటి వాళ్ల లోకల్‌గా ఉండేవాళ్లని నియమించుకోగా మెగాహీరో రామ్ చరణ్ మాత్రం ఏకంగా ఓ ఆఫ్రికన్ ఫైటర్‌ని తనకు బాడీగార్డ్‌గా పెట్టుకున్నాడు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఇతడెవరు? జీతం ఎంతిస్తున్నారు?

    (ఇదీ చదవండి: డబ్బింగ్‌లకు డబ్బులు.. తెలుగు సినిమాలకు నిల్.. ఎందుకిలా?)

    'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్‌గా ముంబైలో జరిగింది. అప్పటినుంచి చరణ్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్న వ్యక్తి పేరు కెవిన్ కుంట. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన ఇతడు.. అంతర్జాతీయ స్థాయిలో ఎమ్ఎమ్ఏ(MMA) ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు.

    కేవలం బాక్సింగ్ రింగ్ లోపలే కాకుండా నిజ జీవితంలోనూ సెలబ్రిటీలు, అంతర్జాతీయ వీఐపీలకు VVIP సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా కూడా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే 'పెద్ది' ప్రమోషన్లు జరిగేంతవరకు రామ్ చరణ్ ఇతడిని మాట్లాడుకున్నట్లు ఉంది. అయితే భద్రత కల్పిస్తున్నందుకుగానూ రోజుకు రూ.2 లక్షలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్‌కి రూ.15 లక్షలు ఇస్తుండగా.. కన్నడ హీరో యష్ తన బాడీగార్డ్‌కి రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడని టాక్. ఇప్పుడు చరణ్ బాడీగార్డ్ గురించి వస్తున్న నిజమైతే మాత్రం ఇదో రికార్డ్ అవుతుందేమో!

    (ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)

  • ,

    స్వాతి అంటే గుర్తు పట్టరేమో కానీ.. కలర్స్ యాడ్ చేస్తే ఇట్టే పసిగడతారు. అంతలా ఆ పేరుతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. డేంజర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి.. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అష్టా చెమ్మా, త్రిపుర, కలవరమాయే మదిలో, మిరపకాయ్ చిత్రాల్లో నటించింది. కొన్నేళ్ల తర్వాత మంత్ ఆఫ్ మధు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.

    ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా ఈ ముద్దుగుమ్మ.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది. ముఖ్యంగా పెళ్లి టాపిక్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోవడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని తన మనసులోని మాటను బయటకు చెప్పేశారు. ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టంగా మారిపోయిందని తెలిపింది.

    ఈ రోజుల్లో ఎవరికీ కూడా కొంచే కూడా ఓపిక ఉండడం లేదని.. అందుకే ముక్కు, మొహం తెలియని వ్యక్తిని పెళ్లాడి ప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం నాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎలా చింతా లేకుండా హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్ అని  అన్నారు. ఎందుకంటే అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుందని.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుందని హీరోయిన్ స్వాతిరెడ్డి చెప్పుకొచ్చింది. 
     

  • సూర్య 'కరుప్పు'(తెలుగులో వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తమిళ, తెలుగులో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. మరోవైపు మోహన్ లాల్ 'దృశ్యం 3' ఎలాంటి ప్రచారం లేకుండానే మన థియేటర్లలోకి వచ్చి మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. అయితే ఈ రెండింటికి తెలుగులో ఏమంత గొప్ప టాక్ రాలేదు. కానీ ఆ ప్రభావం కలెక్షన్స్‌పై అస్సలు పడినట్లు కనిపించడం లేదు. అదే టైంలో వీటితో పాటు రిలీజైన తెలుగు మూవీస్‌ని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకీ పరిస్థితి?
    (ఇదీ చదవండి: హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)

    టాలీవుడ్ బాక్సాఫీస్‌కి సంక్రాంతి ఎంత ముఖ్యమో అంతకు మించి వేసవిలో సందడి ఉంటుంది. కానీ ఈ సమ్మర్‌ని తెలుగు దర్శకనిర్మాతలు హీరోలు వృథాగా వదిలేశారు. చెప్పుకోదగ్గ ఒక్క సినిమాని కూడా రిలీజ్ చేయలేదు. దీంతో థియేటర్లన్నీ బోసిపోయాయి. ఎండలు, ఐపీఎల్ వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు గానీ అసలు కారణం ఇది కాదు. ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసే కంటెంట్‌తో ఒక్కరూ మూవీస్ చేయట్లేదు. రొటీన్ రొట్టకొట్టుడు కంటెంట్ వల్ల చిన్న, మిడ్ రేంజ్ మూవీస్ వచ్చినవి వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి.

    అలా స్టార్స్ సినిమాల కోసం ముఖం వాచిపోయిన తెలుగు ప్రేక్షకులకు.. సూర్య, మోహన్ లాల్ మూవీస్ మండవేసవిలో కూలింగ్ వాటర్‌లా కనిపించాయి. అంత ఎండలో వాటర్ బాగోలేదని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. అలానే ఈ రెండు చిత్రాలు ఏమంత పెద్దగా గొప్పగా లేవు అని ఆడియెన్స్‌కి తెలిసినా సరే చూసేద్దాంలే అని వెళ్తున్నారు. సూర్య చిత్రానికి బీ,సీ సెంటర్లలో రెండో వారం కూడా ఆదరణ లభిస్తుండగా.. మోహన్ లాల్ చిత్రం మల్టీప్లెక్స్‌ల్లో జోరు చూపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోలేకపోయిన తెలుగు దర్శకనిర్మాతలు పదుల కోట్ల రూపాయల వసూళ్లని చేజేతులా వదిలేసుకున్నారు.

    ఉన్నంతలో తెలుగు ఆడియెన్స్ కోసం వేసవి చివరలో వస్తున్న పెద్ద సినిమా 'పెద్ది'నే. ప్రస్తుతానికైతే దీనిపై బజ్ బాగానే ఉంది కానీ ఇండస్ట్రీలో పరిస్థితులే బాగోలేవు. ఈ మూవీకి కచ్చితంగా పర్సంటేజీ ఇచ్చి తీరాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా తగ్గడం లేదు. దీనికి పరిష్కారం ఎప్పుడు దొరుకుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా టాలీవుడ్‌లోని అంతర్గత సమస్యలు కూడా డబ్బింగ్‌లకు ఓ రకంగా ప్లస్ అవుతున్నాయి. మరి ఈ విషయం తెలుగు హీరోలు దర్శకులు నిర్మాతలకు ఎప్పుడు అర్థమవుతుందో?

    (ఇదీ చదవండి: ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో విషాదం)

  • హీరోయిన్‌ త్రిషకు 43 ఏళ్ల వయసొచ్చినా అందం, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. తాజాగా కరుప్పుతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకుంది. అయితే కొంతకాలంగా త్రిష పేరు అటు రాజకీయాల్లో, ఇటు ఫిల్మీదునియాలో మారుమోగిపోతోంది. హీరో విజయ్‌- త్రిష ప్రేమలో ఉన్నారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది.

    లక్కీ చార్మ్‌
    ఇటీవల విజయ్‌ భార్యతో విడాకులకు సిద్ధపడటం.. సీఎంగా గెలిచాక త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ ప్రేమాయణం నిజమని అందరికీ అర్థమైపోయింది. పైగా తను కూడా రాజకీయాల్లో అడుగుపెడుతుందని మరో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తమిళ స్టార్‌ హీరోలకు త్రిష బాగా అచ్చొచ్చిందట. అందుకు కారణం.. విజయ్‌, అజిత్‌, సూర్యల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తనే హీరోయిన్‌. ఈ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమాని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాన్ని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తిరిగి పంచుకుంది.

    విజయ్‌: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష కథానాయిక. 2023లో దసరాకి ముందు విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.600 కోట్లకు పైగా రాబట్టి విజయ్‌ కెరీర్‌లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.

    అజిత్‌: హీరో అజిత్‌ 'గుడ్‌బ్యాడ్‌ అగ్లీ' ద్వారా తన కెరీర్‌లోనే హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ అందుకున్నాడు. 2025లో విడుదలైన ఈ సినిమాలోనూ త్రిషయే కథానాయిక. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది.

    సూర్య: కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కరుప్పు'. ఈ ఏడాది మే 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్ల మేర కలెక్షన్స్‌ సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులోనూ త్రిషయే కథానాయిక. 

    అలా త్రిష నటించిన పై మూడు సినిమాలు భారీ కలెక్షన్ల రికార్డులతో ఆయా హీరోల కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆమెను లక్కీ ఛార్మ్‌ అని కొనియాడుతున్నారు.

    చదవండి: 30 ఏళ్ల తర్వాత ఆపద్బాంధవుడు హీరోయిన్‌ రీఎంట్రీ

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.

    హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్‌ తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని  గంటల్లోనే ఊహించని రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ  కపూర్‌ హీరోయిన్‌గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

     
     

     

  • కోలీవుడ్ హీరో విజయ్ సీఎం అయ్యాక సినీ పరిశ్రమ ఆయనపై గంపెడాశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని స్టార్ హీరో విజయ్ సేతుపతి సీఎంకు విజ్ఞప్తి చేశారు. కమల్ హాసన్ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభించాలని విజయ్‌ను కోరారు. ఓటీటీ ప్లాట్‌ఫారాన్ని ప్రారంభిస్తే అది తమకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

    విజయ్ సీఎం అయ్యాక విశాల్ సైతం ఇండస్ట్రీ ఇబ్బందులను వివరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని నియమించడాన్ని తప్పుబట్టారు. సినిమా శాఖను సీఎం వద్దే ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితేనే న్యాయం చేయగలడని అన్నారు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి అ‍య్యాక కోలీవుడ్ సినీతారలు సంబురాలు చేసుకున్నారు.

     

  • ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రంభ.. తండ్రి తలుచుకుని చాలా భావోద్వేగానికి గురైంది. నా హృదయంలో నీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. ఎ‍న్నో ఇ‍బ్బందులు పెట్టినప్పటికీ నీ ముఖంపై చిరునవ్వు మాత్రం చెరిగిపోనివ్వలేదు. నువ్వు వెళ్లిపోవడంతో నా ప్రపంచం శూన్యమైపోయింది అని రాసుకొచ్చింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

    విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమెకు తొలుత మలయాళంలో అవకాశమొచ్చింది. 1992లో 'సర్గామ్' మూవీతో ఈమె హీరోయిన్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఈ హిట్ తర్వాత అదే ఏడాది 'ఆ ఒక్కటి అడక్కు'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. దీంట్లోనే ఆమె స్క్రీన్ నేమ్ రంభగా ఫిక్స్ అయింది. తర్వాత సూపర్‌ కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున ఇలా స్టార్‌ హీరోలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసింది. 90వ దశకంలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.

    తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలి భాషల్లోనూ రంభ సినిమాలు చేసింది. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ని పెళ్లిచేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. రంభకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీకి దూరమైనా రియాలిటీ టీవీ షోలకు ఈ మధ్య జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోంది. ఇంతలోనే తండ్రి చనిపోవడంతో దుఖంలో మునిగిపోయింది.

    (ఇదీ చదవండి: హైదరాబాద్‌లో డ్రీమ్ హౌస్ కడుతున్న ప్రభాస్)

  • ఒకప్పుడు తన అందంతో, హావభావాలతో, అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె తెలుగులో చిరంజీవి సరసన 'ఆపద్బాంధవుడు' చిత్రంలో నటించింది. అవురా అమ్మకు చెల్ల పాటలో ఆమె చేసిన డ్యాన్స్‌ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి అమెరికా వెళ్లిపోయింది. 

    30 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
    అక్కడ డ్యాన్స్‌ స్కూల్‌ ఓపెన్‌ చేసి ఎంతోమందికి నాట్యం నేర్పించింది. దాదాపు 30 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న ఈ నటి కొన్ని నెలల క్రితమే భారత్‌కు తిరిగి వచ్చేసింది. తనకు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుందన్న కోరికను మీనాక్షి శేషాద్రి ఆమె సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టింది. 'నన్ను అభిమానిస్తున్న అందరికీ నమస్కారం.. మీ ప్రేమానురాగాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. 30 ఏళ్ల తర్వాత నా కర్మభూమికి తిరిగొచ్చేశాను.

    అలాంటి పాత్రలు చేయాలనుంది
    ఇప్పుడు ముంబైలో ఉంటున్నాను. సానుకూల దృక్పథం, ఆశ, ప్యాషన్‌తో మరోసారి చలనచిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నాను. చిన్న, పెద్ద, ప్రధాన పాత్ర అని తేడా లేకుండా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. సినిమాలతో పాటు ఓటీటీ షోలు, వెబ్‌సిరీస్‌లైనా చేసేందుకు రెడీగా ఉన్నాను. చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలనుంది. నేను భారత్‌ తిరిగి వచ్చాక అనేక ఆఫర్లు వచ్చాయి. 

    ఏదో నిరూపించుకోవాలని కాదు
    కానీ అందులో కొన్ని ఏమంత ఎగ్జయిటింగ్‌గా లేవు. మరికొన్నేమో ముందుకు కదల్లేవు. అయినా సరే ఎటువంటి టీమ్‌, ఏజెన్సీ లేకుండా నేనే అంతా మేనేజ్‌ చేసుకుంటున్నాను. నేను ఏదో నిరూపించుకోవడానికి రీఎంట్రీ ఇవ్వడం లేదు. నా కుటుంబసభ్యుల ఎంకరేజ్‌మెంట్‌ వల్లే ఇక్కడున్నాను. నాకు సంతోషాన్నిచ్చేదే సినిమా.. అందుకే మళ్లీ ఇండస్ట్రీలో భాగం అవాలని కోరుకుంటున్నాను' అని నటి చెప్పుకొచ్చింది.

    కెరీర్‌
    మీనాక్షి శేషాద్రి హిందీలో.. హీరో, పైసా యే పైసా, దిల్‌వాలా, స్వాతి, జుర్మ్‌, దామిని, గంగా జమున సరస్వతి వంటి అనేక చిత్రాల్లో నటించింది. చివరగా స్వామి వివేకానంద (1998) బయోపిక్‌లో కనిపించింది. ఆ తర్వాత ఘాయల్‌: వన్స్‌ ఎగైన్‌ మూవీలో ఫ్లాష్‌బ్యాక్‌లో తళుక్కుమని మెరిసింది. మరి మీనాక్షి ఇప్పుడెలాంటి సినిమాలు ఎంపిక చేసుకుంటుందో చూడాలి!

    చదవండి: కదిలే రైలుపై నేను, విజయ్‌.. ఆరోజు చనిపోయేవాళ్లం: విలన్‌

  • పది పదిహేనేళ్ల ముందు వరకు తెలుగులో మాత్రమే సినిమాలు చేసే ప్రభాస్.. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ తదితర చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు హైదరాబాద్‌లో తన డ్రీమ్ హౌస్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో డిస్కషన్‌‌కి కారణమైంది. ఇంతకీ ఈ ఇంటి సంగతేంటి?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

    హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కి ఇల్లు ఉంది. రాయదుర్గ్‌లో ఓ గెస్ట్ హస్ ఉంది. అయితే ఈ ప్రాంతమంతా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది. అందుకే రెండేళ్ల క్రితం ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటలో రెండేళ్ల క్రితం ప్రభాస్ రెండు ఎకరాల స్థలం కొన్నాడు. ఇప్పుడు ఆ చోటులోనే నిర్మాణ పనులు మొదలైనట్లు తెలుస్తోంది.

    ఈ మధ్యే సదరు స్థలానికి మున్సిపల్ అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించడంతో.. డార్లింగ్ ప్రభాస్ తన లగ్జరీ మ్యాన్షన్ నిర్మించే పనిలో పడ్డాడు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కి ఈ స్థలం చాలా దగ్గరగా ఉంది. ఇక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు. ప్రయాణ సౌకర్యాల పరంగా సదుపాయం ఉండటంతోనే ఇక్కడ మ్యాన్షన్ కడుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం కోకాపేటలో ఎకరం విలువ రూ.80 కోట్లు పలుకుతున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రభాస్ మ్యాన్షన్ కట్టబోయే స్థలమే రూ.160 కోట్ల పైచిలుకు అన్నమాట. ఇప్పుడు కడుతున్న డ్రీమ్ హౌస్‌లో లగ్జరీ వసతులు చాలానే ఉండబోతున్నాయని మాట్లాడుకుంటున్నారు. హై ఎండ్ ఫిట్‌నెస్ సెంటర్, మోడరన్ సౌండ్ సిస్టమ్‌తో ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, లాన్ ఏరియా ఇందులో ఉండబోతున్నాయట. ఈ భారీ ప్యాలెస్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

    (ఇదీ చదవండి: చిరంజీవి దగ్గరకు ఎగ్జిబిటర్స్ .. 'పెద్ది' గురించి ఏం తేలుస్తారో?)

National

  • అమెరికా  విదేశాంగ శాంగ మంత్రి మార్కో రూబియో అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార చర్యలపై వివరణ ఇచ్చారు. తాజాగా ఆవీడియో క్లిప్‌ను ఆ దేశ అధికారులు  అధికారిక ఖాతా నుంచి తొలిగించారు. ప్రతి దేశంలోనూ మూర్ఖులుంటారు అన్న పదం పరోక్షంగా ట్రంప్‌కు చురకులంటించే విధంగా ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.  

    నిన్న(ఆదివారం) భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, మార్కో రూబియో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో భారతీయులపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, అలాగే భారతదేశాన్ని "నరకకూపం"గా పేర్కొంటూ చేసిన  ట్రంప్‌ చేసిన ఒక పోస్ట్‌ అంశమై మీడియా ప్రతినిధులు మార్కో రూబియోను ‍ప్రశ్నించారు.

    దీనికి మార్కో రూబియో వివరణ ఇస్తూ.. “ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలివితక్కువ మాటలు మాట్లాడే మూర్ఖులు ఉంటారు. వారి మాటలను మెుత్తం దేశానికి ఆపాదించకూడదన్నారు. ట్రంప్ భారతదేశానికి, ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని అన్నారు." అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆ దేశ అధికారులు వెంటనే తమ అధికారిక ఖాతా నుంచి తొలగించారు.

    మార్కో రూబియో చేసినా వ్యాఖ్యలు పరోక్షంగా  అధ్యక్షుడు ట్రంప్‌ను "తెలివితక్కువ మాటలు మాట్లాడే" "మూర్ఖులలో" ఒకరిగా అభివర్ణిస్తున్నట్లు రాజకీయ  విమర్శకులు ప్రస్థావించిన తర్వాత  ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

  • కోల్‌కతా: ఆకాశ్‌ సింగ్‌.. పశ్చిమ బెంగాల్‌లో అతడో రౌడీ.. హౌరా 'డాన్'గా అతడికి పేరుంది. అదే హౌరా రోడ్లపై అతడిని ఇప్పుడు లోదుస్తులతో ఊరేగించారు పోలీసులు. 2021లో పోలీసులపై కాల్పులు జరపడంతో పాటు, 20కి పైగా బాంబులు విసిరినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతడిని ఈ నెల ఆరంభంలోనే అరెస్టు చేసినప్పటికీ, రౌడీలందరికీ ఒక గట్టి హెచ్చరిక పంపే ఉద్దేశంతో ఈ రోజు ఇలా ఊరేగించారు.

    పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్న సమయంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు అనేవారు. పోలీసులపై దాడులు జరుగుతున‍్నప్పటికీ మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోయేవారని బీజేపీ నేతలు ఆరోపించేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావడంతో పోలీసుల వైఖరిలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు రౌడీల భరతం పడుతున్నారు పోలీసులు. ఇక పాతరోజులు పోయాయని, సీఎంగా సువేందు వచ్చారని రౌడీలకు రౌడీలే చెప్పుకోవాలని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.

    హౌరా జిల్లా పోలీసులు చేపట్టిన క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ సమయంలో ఆకాశ్‌ సింగ్‌ను లోదుస్తులతో తీసుకెళ్లారు. మాలిపాంచ్‌ఘడా, గోలాబాడి పోలీస్ స్టేషన్ల జాయింట్‌ టీమ్‌ ఆకాశ్ సింగ్‌ను తీసుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టింది. ఆకాశ్‌పై తేలాబాజీ, సిండికేట్ నిర్వహణ, ఒక పోలీస్ అధికారిని నేరుగా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం లాంటి తీవ్ర కేసులు ఉన్నాయి. పాత కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, నేరానికి ప్లాన్‌ ఎలా రూపొందిందో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రక్రియ చేపట్టారు. ఆకాశ్ కేవలం బనియన్‌, షార్ట్స్‌లో కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

    అయితే, జనాల ముందు నిందితుడిని ఇలా అర్థనగ్నంగా తీసుకెళ్లడం తీవ్ర విమర్శలకు కూడా దారితీస్తోంది. మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాల వాదన ప్రకారం, చట్ట పరిధిలో కేసుల దర్యాప్తు చేయడం, క్రైమ్ సీన్ రీక్రియేషన్ నిర్వహించడం పోలీసుల హక్కే. కానీ నేరస్థుడైనప్పటికీ ఒక వ్యక్తిని ఇలా ప్రజల ముందు అర్ధనగ్నంగా తిప్పడం అభ్యంతరకరమని అంటున్నారు. 

    ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని వారు ఆరోపించారు. అయితే జిల్లా పోలీసులు స్పందిస్తూ.. ఎలాంటి చెడు ఉద్దేశంతోనూ ఈ పని చేయలేదని, పాత కేసుల ముడి విప్పడం, నేరానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సేకరించడం లక్ష్యంగానే ఈ చర్య చేపట్టామని తెలిపారు. ఈ నేర ముఠా వెనుక ఉన్న ఇతరుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

  • సాక్షి,చెన్నై: కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. బాలికను అపహరించి దారుణంగా హత్య చేసిన ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.

    ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి, ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

    అయితే కేసు పురోగతిని వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్‌ జోన్‌ ఐజీ ఆర్వీ రమ్యా భారతి, డీఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నేపథ్యంలో అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఐజీ రమ్యా భారతి నవ్వుతూ గోళ్లు గిల్లుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది.

     

     

    ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ‘ఒక కుటుంబం కన్నీటిలో మునిగిపోయి ఉంటే, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు నవ్వుతూ కనిపించడం మానవత్వానికి విరుద్ధం’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రాష్ట్ర మహిళా మంత్రులు ఎస్‌.కీర్తన, కే.జగదీశ్వరి కూడా నవ్వుతూ మాట్లాడినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు.బాధిత బాలిక తల్లి కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘నా బిడ్డను కడసారి చూడనీయలేదు, పోస్టుమార్టం తర్వాత కూడా చూపించలేదు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం,ఈ కేసు విచారణ కొనసాగుతుండగా ప్రెస్‌మీట్‌లో నవ్వుతూ కనిపించిన ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

    కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసులో ఇద్దరు నిందితులు కార్తిక్ (33), మోహన్ (30) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కార్తిక్ గాయాల కారణంగా కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు, మోహన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు.

    ప్రధాన నిందితుడు కార్తిక్ బాధిత కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి. బాలికను లాక్కెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అరెస్ట్ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించి భవనం నుంచి దూకడంతో చేతి, కాలి ఎముకలు విరిగాయి. ప్రస్తుతం కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మోహన్.. కార్తిక్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
     

     

  • న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరణానంతరం ప్రముఖ హిందీ నటుడు ధర్మేంద్రకి పద్మ విభూషణ్ పురస్కారం అందింది. ఆయన సతీమణి హేమామాలిని అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

    ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులకు ఆమోదం తెలిపింది. ఇందులో 5 పద్మ విభూషణ్‌, 13 పద్మ భూషణ్‌, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.

    అధికారిక వివరాల ప్రకారం తొలి విడతలో 66 మందికి  అవార్డులు అందజేస్తున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి దద్రౌపది ముర్ము 2 పద్మ విభూషణ్‌, 6 పద్మ భూషణ్‌, 58 పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. మిగిలిన పద్మ అవార్డు గ్రహీతలకు ఈ ఏడాది తర్వాత నిర్వహించే రెండో విడత పురస్కార ప్రదాన కార్యక్రమంలో అందిస్తారు.

    ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. కళలు, సామాజిక సేవ, సాహిత్యం, వైద్యం, విజ్ఞానం, ఇంజినీరింగ్‌, క్రీడలు, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, సివిల్ సేవలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ఇస్తారు.

    పద్మ విభూషణ్‌ అత్యున్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు. పద్మ భూషణ్‌ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ప్రదానం చేస్తారు. ఏ రంగంలోనైనా విశేష సేవలు అందించిన వారికి పద్మశ్రీ పురస్కారం అందజేస్తారు.

    తెలుగు రాష్ట్రాల వారు వీళ్లే  
    రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం పద్మ అవార్డులు అందుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మామిడాల జగదీశ్‌, దీపికా రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ గూడూరు వెంకటరావు, వెంపటి కుటుంబ శాస్త్రి, పాలకొండ విజయ్ ఆనంద రెడ్డి. 

    ఇంకా.. 
    ఎన్‌. రాజం‌కు పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రదానం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలిగా ఆమె గుర్తింపు పొందారు.

    పుదుచ్చేరికి చెందిన సిలంబం కళాకారుడు కె. పజనివేల్‌కు సంప్రదాయ యుద్ధ కళల రంగంలో చేసిన సేవలకు పద్మశ్రీ పురస్కారం అందించారు.

    పారా హైజంప్‌లో పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.

    ప్రకటనల రంగ ప్రముఖుడు దివంగత పీయూష్ పాండేకు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించారు. ఈ అవార్డును ఆయన భార్య నీతా జోషి స్వీకరించారు.

    భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్రీడల రంగంలో చేసిన సేవలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారం అందించారు. వీరితో పాటు మొత్తం 66 మంది సోమవారం పద్మ అవార్డులు అందుకున్నారు.
     

  • చెన్నై: నగరంలోని మనలీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్‌ పరిశ్రమలో మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడుతున్నాయి. ఎనిమిది ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. విచ్చూర్ లక్ష్మీ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆయిల్ గోదాం నుంచి భారీగా నల్లపొగ ఎగసిపడిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో ఆర్పడం కష్టతరమైంది.    

    మనలి పుదు నగర్, విచ్చూర్ రెండు ప్రాంతాల మధ్యలోనే శ్రీ సత్యసాయి లూబ్రికేషన్స్ అనే ఆయిల్ నిల్వ చేసే పరిశ్రమ ఉంది. అందులో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. 50కి మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పే పనిలో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ పరిశ్రమ పదేళ్లకు పైగా నడుస్తోందని చెబుతున్నారు. 

    ముఖ్యంగా పాత ఆయిల్‌ను బారెళ్లలో నిల్వ చేసే గోదాముగా ఈ పరిశ్రమ పనిచేస్తోందని తెలిసింది. ముందుగా చిన్నస్థాయి అగ్నిప్రమాదం జరిగి, ఆ తర్వాత పరిశ్రమలో ఉన్న ఆయిల్ బారెళ్లు పేలి చెల్లాచెదురవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. సుమారు 2000కు పైగా బ్యారెళ్లు అక్కడ నిల్వ ఉన్నాయి. అవి పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్లపొగ ఆ ప్రాంతమంతా కమ్మేసి భయాందోళన కలిగిస్తోంది.

    అంతా ఆయిల్ ఉండటంతో ఒకదాని తర్వాత ఒక బారెల్‌ పేలుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది కూడా దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పలేని పరిస్థితి ఎదురైంది. ఆ బారెళ్లు పూర్తిగా పేలి మంటలు తగ్గిన తర్వాతే పూర్తిగా అదుపులోకి తేవచ్చని చెబుతున్నారు. అంతవరకు దగ్గర్లో ఉన్న ఇతర భవనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ చర్యలు చేపడుతోంది. మంటలను పూర్తిగా ఆర్పే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

     

  • నాగ్‌పూర్‌కు చెందిన ఒక 72 ఏళ్ల పదవీ విరమణ పొందిన (రిటైర్డ్) నర్సును సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో కొన్ని వారాల పాటు భయ భ్రాంతులకు గురిచేసి, రూ. 90.65 లక్షలు దోచుకున్నారు.

    జిల్లాలోని జరిపట్కా నివాసి అయిన మహిళకు, గతేడాది నవంబర్‌లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ అధికారినంటూ ఓ వ్యక్తి కాల్‌ చేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులమంటూ  ఆమెను నమ్మించారు. మనీలాండరింగ్‌ కేసులో ఆమె పేరు బయటపడిందని, ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని బదిరించారు.

    అంతేకాదు వీడియో కాల్స్ చేసిన అచ్చం పోలీస్ట్‌ స్టేషన్‌లా, నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ కోర్టు విచారణలను సృష్టించి బాధితురాల్ని మరింత భయపెట్టారు.  మిమ్మల్ని 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని, ఎవరికీ చెప్పకూడదని బందీగా ఉంచారు. నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 9 మధ్య వివిధ ఖాతాలకు రూ.90.65 లక్షలు బదిలీ చేయించారు. తమ విచారణలో ఆమె నిర్దోషిగా తేలితే డబ్బు వాపసు ఇస్తామని చెప్పిన దుండగులు.. తరువాత అన్ని రకాల కమ్యూనికేషన్స్‌ కట్‌ చేశారు. వారి ఫోన్లు స్విచ్చాఫ్ అవ్వడంతో తా తాను మోసపోయానని గ్రహించిన ఆమె ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, పోలీసులు, కోర్టులు, ఏజెన్సీలు ‘డిజిటల్‌ అరెస్టులు’నిర్వహించవని, డబ్బు బదిలీ చేయమని అడగవని తెలిపారు. ఇలాంటి డిజిటల్‌ అరెస్ట్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్‌ వివరాలు, డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించారు.


    నోట్‌ :  సైబర్‌ నేరగాళ్లు సిబిఐ (CBI), ఈడీ (ED), పోలీస్ లేదా కస్టమ్స్ అధికారులలా నటిస్తూ బాధితులకు ఆడియో, వీడియో కాల్స్ చేస్తారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా భయపెట్టి, వారిని ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ల ముందే 'డిజిటల్ బందీలుగా' ఉంచుతారు. కేసు నుండి బయటపడాలంటే డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చి దోచుకుంటారు.ఏ ప్రభుత్వ సంస్థ, కోర్టు లేదా పోలీస్ శాఖ కూడా ఇలా ఫోన్లలో 'డిజిటల్ అరెస్టులు' చేయవు. అలాగే దర్యాప్తు లేదా వెరిఫికేషన్ పేరుతో ప్రజల నుండి డబ్బులను బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయమని ఎప్పటికీ అడగవు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

  • లక్కీ భాస్కర్‌.. ఈ సినిమా గురించి మనకు పరిచయమే. లక్కీ భాస్కర్ సినిమా థీమ్‌ ఒక సాధారణ బ్యాంక్‌ క్యాషియర్‌ ఆర్థిక కష్టాలు, అప్పులు, అవమానాలు ఎదుర్కొని అక్రమ డబ్బు సంపాదనలోకి అడుగుపెట్టే కథ. డబ్బు దొంగతనం, మోసం, నేరం వంటి విషయాలను సీరియస్‌గా కాకుండా వ్యంగ్యంగా, వినోదాత్మకంగా చూపించారు ఈ సినిమాలో. ఇది సినిమా కాబట్టి  ఆ హీరో చాకచక్యంగా తప్పించుకున్నట్లు మలిచారు. ప్రధానంగా లోభం, కుటుంబ బాధ్యతలు, నైతికతల మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా అని చెప్పొచ్చు.

    మరి నిజ జీవితంలో ఇలా చేస్తే దొరక్కుండా ఉంటారా?, కచ్చితంగా ఏదో ఒక రోజు దొరికి తీరుతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. అతనొక లక్కీ భాస్కర్‌ మాదిరే బ్యాంకుకు కన్నం వేశాడు,. ఒకటి, రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ. 8 కోట్లకు పైగా బ్యాంకు డబ్బును పట్టుకెళ్లిపోయాడు. గత 15 ఏళ్లుగా బ్యాంకులో జాయింట్ కస్టోడియన్‌గా పనిచేస్తున్న అతను.. భారీ మొత్తాన్ని బ్యాంకు నుంచి సర్దేశాడు. చివరకు దొరికేశాడు.

    అసలు విషయంలోకి వెళ్తే.. గుజరాత్‌ రాష్ట్రంలోని  గాంధీ రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేస్తున్న హర్షిద్ద్‌ కడియార్‌.. ఆర్‌బీఐ కరెన్సీ చెస్ట్‌(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక నగదు నిల్వ కేంద్రం) నుంఢి కోట్ల రూపాయలను దోచేశాడు. 

    2026 జనవరి 13వ తేదీ రాత్రి  కట్టుదిట్టమైన భద్రత ఉన్న కరెన్సీ చెస్ట్ నుంచి కడియార్ ఒక పెట్టెలో స్క్రాప్ మెటీరియల్‌ను పారవేయడానికి బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అయితే అప్పటికే కోట్ల రూపాయలను అందులో సర్దేశాడు.  బ్యాంకులో నమ్మకమైన  వ్యక్తిగా ఉండటంతో ఆ కట్టుదిట్టమైన భద్రత వలయాన్ని కూడా తప్పించుకున్నాడు. తర్వాత అసలు విషయం బయటపడింది.  ఆ కరెన్సీ చెస్ట్‌లో రూ. 8.7 కోట్ల తేడా వచ్చింది. దాంతో ఆరా తీస్తే  హర్షిద్ద్‌ కడియా ఆ పని చేసి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఆ  తర్వాత యథావిధిగా బ్యాంకు వస్తూనే తన పనులు చేసుకుంటూ ఉ‍న్నాడు హర్షిద్‌.  మరొకవైపు ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల దృష్టికి వచ్చినా సైలెంట్‌గా ఉన్నారు. 90 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుందని నమ్మి, నిందితుడు మూడు నెలల పాటు యధావిధిగా విధులకు హాజరయ్యాడు. 

    అయితే సీసీ ఫుటేజ్‌ను తిరిగి రికవరీ చేయడంతో అతగాడి విషయం బయటపడింది. ఇప్పుడు ఆ ఫుటేజ్ లభ్యం కావడంతో అది కేసులో కీలక సాక్ష్యంగా మారింది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీస్‌ అధికారులు.. కడియార్‌కు సహచరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు  దొంగిలించిన నగదును ఎక్కడకి తరలించి ఉండవచ్చు అనే దానిపై ఆరా తీస్తున్నారు.

  • సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్‌ను జూన్‌ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఉద్యోగులు రోడ్డెక్కారు. ముందస్తు సమాచారం లేకుండా వచ్చిన ఈ అకస్మాత్తు నోటీసుతో, క్లబ్‌లో పనిచేస్తున్న దాదాపు 500 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాల విషయంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

    ఆందోళనలో 500 మంది
    కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తమ పరిస్థితి ఏంటీ, ఎక్కడి పోవాలి, తమ భవిష్యత్తు ఏంటి? అని వాపోతున్నారు. ‘మమ్మల్ని జూన్ 5కల్లా క్లబ్ ఖాళీ చేయాలని చెప్పారు. మాకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఇక్కడ ముప్పై, నలభై ఏళ్లుగా పనిచేస్తున్నాం.. ఇప్పుడు మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ క్లబ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నప్పటి నుండి సిబ్బంది అంతా షాక్‌లో ఉన్నారని, తమ భవిష్యత్తు ఏంటో తెలియక నిరంతరం ఫోన్లు చేస్తున్నారని యూనియన్ చీఫ్ నందన్ నేగి తెలిపారు.

    క్లబ్ యాజమాన్యం స్పందన
    మరోవైపు నాలుగు ముఖ్యమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మే 25న ఢిల్లీ జింఖానా క్లబ్ యాజమాన్యం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌కు లేఖ రాసింది.  క్లబ్ నిర్వహణకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా తగిన స్థలాన్ని కేటాయిస్తారా?, క్లబ్‌ నమ్ముకుని ఉన్న 500 మంది ఉద్యోగులు, సిబ్బంది భవిష్యత్తుకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు? అని కోరింది. దీనితో పాటు, క్లబ్ గవర్నింగ్ బాడీ ఈ ఖాళీ ప్రక్రియపై ఉన్న ఆందోళనలను చర్చించడానికి ల్యాండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌తో సమావేశం కావాలని అభ్యర్థించింది.

    కాగా ప్రధానమంత్రి అధికారిక నివాసానికి సమీపంలో  ఉన్న చారిత్రాత్మక 'ఢిల్లీ జింఖానా క్లబ్' భూమిని తక్షణమే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న  ఈ స్థలం అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ప్రాంతం పరిధిలోకి వస్తుందని ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని, ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్' మే 22న ఈ నోటీసు జారీ చేసింది.

    ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం
    ఢిల్లీ జింఖానా.. దేశంలోని పురాతన, ప్రముఖ క్లబ్‌లలో ఒకటి. 1913 జులైలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ గా పిలిచేవారు. స్పెన్సర్ హార్కోర్ట్ బట్లర్ దీనికి మొదటి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1947లో స్వాతంత్య్రానంతరం ఇంపీరియల్ అనే పదాన్ని తొలగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఢిల్లీ జింఖానా క్లబ్‌గా మారింది. క్లబ్ ప్రారంభ రోజుల్లో పోలో క్లబ్ జింఖానాలో భాగంగా కొనసాగింది.  ప్రస్తుతం 5,600 మందికి పైగా సభ్యులు, సుమారు 500 మంది సిబ్బంది ఉన్నారు.
    ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
    22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్‌!


     

  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనను చర్చను రేకెత్తిస్తోంది. 22 ఏళ్ల ఒక యువతి ప్రస్తుతం తన 6వ బిడ్డకు జన్మనివ్వబోతుండటమే ఇందుకు కారణం. ఆ డాక్టర్ తెలిపిన వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.

    రాజస్థాన్‌కు చెందిన ఈ దంపతులకు 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. అయినప్పటికీ, మరొక మగపిల్లాడు కావాలనే ఆశతో వారు మళ్లీ గర్భం దాల్చారు. స్పందన్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రగ్యా తోమర్ పేషెంట్ , ఆమె భర్త అనుమతితోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ మహిళ డాక్టర్‌తో ఇలా  అంది.  "నాకు వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు.. మాకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు ఇంకొక అబ్బాయి కావాలి" అని చెప్పింది. ఆమె భర్త స్పందిస్తూ.. కుటుంబాన్ని పోషించడానికి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకే ఒక కొడుకు సరిపోడంటూ వ్యాఖ్యానించాడు.
     

    ఇప్పటికే ఆ మహిళ అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఇంత చిన్న వయసులోనే వరుసగా గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్రమైన ప్రాణాపాయాల గురించి డాక్టర్ ఆ దంపతులను హెచ్చరించారు.  కాన్పుకు,  కాన్పుకు మధ్య కనీస సమయం లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకదు. దీనివల్ల తీవ్రమైన రక్తహీనత (Anemia), పోషకాహార లోపం, శారీరక క్షీణత ఏర్పడతాయని  వైద్యురాలు వివరించారు. ఇన్నిసార్లు గర్భం దాల్చం, ప్రసవాలతోనే ప్రాణం మీదికి తెచ్చుకున్నారని, ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని  ఆమె హెచ్చరించారు.

    ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం
     

    నెటిజన్ల ఆగ్రహం
    ఈ వీడియో వైరల్ కావడంతో, సమాజంలో మహిళలపై ఉన్న ఒత్తిడిని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన "మగపిల్లాడిపై వ్యామోహం" లింగ వివక్షకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు."ఆమె ఒక వయస్కురాలిగా మారకముందే.. తల్లిగా మారిపోయింది" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు, "ఆ భర్త పరిస్థితి చూడండి. కనీసం కుటుంబానికి సరైన తిండి, బట్టలు, వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉండి కూడా.. వంశాన్ని ఉద్ధరించడానికి ఇంకో కొడుకు కావాలంటున్నాడు, ఎందుకు?" అని ప్రశ్నించారు. గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేకపోవడం, బాల్యవివాహాలు, ఫ్యామిలీ ప్లానింగ్ లోపించడం, కొడుకులు-కూతుళ్ల మధ్య చూపిస్తున్న వివక్షపై ప్రజలు గళమెత్తారు.

    ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
     

  • దేశ రాజధాని నగరానికి సంబంధించి మరో ఘోర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని, కిడ్నాప్‌ చేసి నాలుగు రోజులు పాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

    లక్నోలోని ఒక అద్దె గదికి తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన బాధితురాలు దౌలత్ రామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతోంది. సెలవుల్లో తన సొంత గ్రామాన్ని సందర్శించి ఢిల్లీకి తిరిగి వస్తుండగా మే 15న జాఫరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కింది. ఈ ప్రయాణంలో, 20 ఏళ్ల శివం యాదవ్ అనే పాత పరిచయస్తుడికి సందేశం పంపింది. అతను లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో 19 ఏళ్ల సన్నీ యాదవ్ అనే మరో వ్యక్తితో కలిసి ఆమెను కలిశాడు. ఆమెను తిరిగి స్టేషన్‌లో దింపే ముందు ఇక్కడ కొద్ది  సేపు ఉండొచ్చు కదా అని ఆమెన బలవంతంగా ఒప్పించారు. 

    ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను క్యాబ్‌లో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో ఉన్న అద్దె గదికి తీసుకెళ్లారు.  కోల్ట్‌ కాఫీలో  మత్తు మందు కలిపి ఇచ్చారు. మే 15, 16 తేదీల రాత్రి తనపై పలుమార్లు లైంగిక దాడి జరిగిందని ఆమె ఆరోపించింది. తరువాతి రెండు రోజుల పాటు ఇది కొనసాగింది.  మే 16న రెండవ వ్యక్తి ఆమెపై మళ్లీ దాడి చేశాడని, ఆ తర్వాత గుర్తుతెలియని మూడవ వ్యక్తిని గదిలోకి తీసుకువచ్చి అతను కూడా ఆమెపై  రేప్‌ చేయించాడు. ఎదురుతిరిగినా, ఎవరికైనా చెప్పినా జరిగిన విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించారు. 

    ఆ తరువాత మే 18న ఆమెను తిరిగి చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లి, ఒక జనరల్ టికెట్ కొని ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టాడు. ఆమె ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ప్రయాణంలో ఉండగానే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేసి, రైల్వే హెల్ప్‌లైన్ 139ని  ఫిర్యాదు చేసింది.  దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అప్రమత్తం చేశారు.

    మే 19న ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, వైద్య పరీక్షల కోసం హెడ్గేవార్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.  వైద్య నమూనాలను సేకరించి, సీల్ చేసి, సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. సఖి వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ ద్వారా కౌన్సెలింగ్ సహాయం ఏర్పాటు  చేశారు.

    దక్షిణ జోన్ అదనపు డీసీపీవసంత కుమార్, ప్రాథమికవిచారణలో శివమ్, సన్నీ ఇద్దరూ బాధితురాలు నివసించే జౌన్‌పూర్‌లోని అదే గ్రామానికి చెందినవారని తేలిందన్నారు.  నిందితుల్లో ఒకడైన శివమ్ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నారని, మరో నిందితుడు సన్నీఈ-కామర్స్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా ఉన్నాడు. నిందితులను అరెస్టు చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, వారు దాక్కునే అవకాశం ఉన్న ప్రదేశాలను తెలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు.

    ఆనంద్ విహార్‌లో రైల్వే పోలీసులు భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్లు 70(1) (సామూహిక అత్యాచారం), 123 (విషం ద్వారా గాయపరచడం), 127(3) (అక్రమ నిర్బంధం) మరియు 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని నివేదిక పేర్కొంది. ఈ కేసు మే 23న లక్నో పోలీసులకు బదిలీ చేయబడింది మరియు సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో అవే సెక్షన్ల కింద కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆరోపిత నేరస్థలం లక్నో పరిధిలోకి వస్తుందని, తదుపరి దర్యాప్తు కోసం పత్రాలను పంపినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  

    ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్‌పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ

  • కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని మహాదేవపుర నియోజకవర్గం హెచ్‌ఏఎల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేష్‌ ఆరాధ్య భార్య లక్ష్మీప్రియ (26) శుక్రవారం కృష్ణరాజపురలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాజేష్‌ ఆరాధ్య–లక్ష్మీప్రియల వివాహం 2023లో జరిగింది.

     రాజేష్‌ ఆరాధ్య, అతని తండ్రి పాలక్ష రాధ్య, తల్లి భాగ్యమ్మ తమ కుమార్తెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని లక్ష్మీప్రియ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీ ప్రియ వాట్సాప్‌ ద్వారా తన సోదరి జయశ్రీకి ఫోన్‌ చేయగా ఆమె కాల్‌ స్వీకరించలేదు. ఆ తర్వాత రాజేష్‌ ఆరాధ్య ఆమెకు ఫోన్‌ చేసి లక్ష్మీ ప్రియ మరణించినట్లు తెలియజేశాడు. లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • లక్నో: బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పది కీలక ఆదేశాలను జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, జంతు బలులపై స్పష్టమైన ఆంక్షలు విధిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

    బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు
    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జారీచేసిన ఆదేశాల ప్రకారం, ఈద్-ఉల్-అధా సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నమాజ్ నిర్వహించకూడదు. రోడ్లను దిగ్బంధించి ప్రార్థనలు చేయడం నిషిద్ధం. ఒకవేళ నమాజ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే, వారు మసీదుల లోపల లేదా ఈద్గాల వద్ద షిఫ్టుల వారీగా ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మతపరమైన ప్రక్రియలు చేయకూడదని  ప్రభుత్వం తేల్చిచెప్పింది.

    జంతు బలులపై కఠిన నిబంధనలు
    పండుగ సందర్భంగా జంతు బలుల విషయంలో ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి జంతు బలులు నిర్వహించకూడదని, కేవలం నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, నిషేధిత జంతువుల వధను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పండుగ తర్వాత బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా, తగిన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

    నిఘా, భద్రతా చర్యలు
    రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాల్లో శాంతిని కాపాడేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. డ్రోన్లు, సిసిటివి కెమెరాల ద్వారా ప్రతి కదలికను అధికారులు పర్యవేక్షిస్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాత ఘటనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేలా స్థానిక శాంతి కమిటీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.

Politics

  • న్యూఢిల్లీ:  అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అధికార పార్టీ టీవీకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 126 చోట్ల ప్రజలు విజయ్‌ టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. కొన్ని పార్టీల వద్దకు వెళ్లి మద్దతు కోరారని విమర్శించారు.

    “అదే కాకుండా, ‘పుష్ప’ సినిమా శైలిలో సోఫా చేతిలో పట్టుకుని వెళ్లినట్టు.. అన్నాడీఎంకే తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి వారి మద్దతు కూడా పొందేందుకు ప్రయత్నించారు. ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఇదేనా నిజాయితీగల రాజకీయ నాయకుడి ప్రవర్తన అని ప్రశ్నిస్తున్నారు” అని పేర్కొన్నారు. కాగా, పుష్ప సినిమాలో సోఫాల్లో హీరో డబ్బుల కట్టలు పంపుతాడు.

    తమిళనాడులో ఈ ఘటనను “ముందే పన్నిన కుట్ర”గా ఈపీఎస్‌ పేర్కొన్నారు. రాజీనామాలు, టీవీకేలో చేరికలు సచివాలయం లోపలే సమన్వయంతో జరిగాయని పళనిస్వామి ఆరోపించారు. “సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో రాజీనామా లేఖలు ఆమోదిస్తుండగా, ఫస్ట్ ఫ్లోర్‌లో మంత్రి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు ఇచ్చారు” అని చెప్పారు. దీంతో ఇది ముందే పన్నిన కుట్ర అని, బేరసారాల రాజకీయాలు బయటపడ్డాయని ఈపీఎస్ అన్నారు.

    ఇలాంటి మోసపూరిత చర్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్తవని, ఎన్నో ద్రోహాలు, వెన్నెపోట్లను ఏఐఏడీఎంకే ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. విజయ్‌పై ఈపీఎస్‌ పరోక్షంగా విమర్శలు చేస్తూ.. “సినిమా ప్రముఖుడి గుర్తును” ప్రజలు తిరస్కరించడంతోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారని అన్నారు. టీవీకే విజిల్ గుర్తును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఇతరుల భుజాలపై ఎక్కి ప్రయాణిస్తున్న వారికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు.

    అన్నాడీఎంకేలో విభేదాలు మరింత తీవ్రం
    ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ రాజీనామాలు మరో ఎదురుదెబ్బగా మారాయి. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం పళనిస్వామికి మద్దతు ఇస్తుండగా, మరో వర్గం సీనియర్ నేతలు షణ్ముగం, వేలుమణికి మద్దతు ఇస్తోంది.

    రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన షణ్ముగం-వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలలో ఉన్నారు. అయితే, మరో పరిణామంలో, తిరుగుబాటు వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం తిరిగి పళనిస్వామి వర్గంలో చేరారు. దీంతో ఈపీఎస్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 27కి పెరిగింది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు తర్వాత స్పీకర్‌ను కలిసి, పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని లేఖ ఇచ్చారు.

    నిబంధనల ప్రకారమే..: స్పీకర్  
    బేరసారాల జరిగాయన్న ఆరోపణలపై స్పందించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. తన బాధ్యత రాజీనామా లేఖలు అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడటమేనని చెప్పారు. “సమర్పించిన లేఖలు నిబంధనలకు సరిపోతున్నాయా లేదా మాత్రమే నేను పరిశీలించగలను. బయట ఏం జరుగుతుందో నేను మాట్లాడలేను” అని విలేకరులతో చెప్పారు.

    రాజీనామాలు ఆమోదం పొందడంతో, మదురాంతకం, ధారాపురం, పెరుందురై నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. రెండు స్థానాల్లో గెలిచి తర్వాత విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానంలో కూడా ఉపఎన్నిక జరగనుంది.

    తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, టీవీకేలో చేరడంతో దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఇప్పటికే ఆమోదించారు. దీంతో 234 సభ్యుల అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 47 నుంచి 44కి తగ్గింది. మే 13న విశ్వాస పరీక్షలో సి.జోసఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో పి.సత్యభామ, మరగతం కుమరవేల్, ఎస్ జయకుమార్ కూడా ఉన్నారు.

    శరవేగంగా బేరసారాలు: స్టాలిన్‌
    డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ దీనిపై మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆరోపించారు. శరవేగంగా బేరసారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మొదట మిత్రపక్షాల మద్దతు కోరిన టీవీకే తర్వాత ఫ్లోర్ టెస్ట్ సమయంలో అన్నాడీఎంకేలోని కొంతమందితో చర్చలు జరిపిందని, చివరకు కొంతమంది అన్నాడీడీఎంకే సభ్యుల రాజీనామాలు చేయించి, వారినే సచివాలయ ప్రాంగణంలో తమ పార్టీలో చేర్చుకుందని ఆరోపించారు. ఇలాంటి అవమానకర దృశ్యాలు చూడటానికే ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని స్టాలిన్ అన్నారు.

    టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌పై కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకతంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని కపటత్వంగా ఉందని పేర్కొన్నారు. డీఎంకే నేత ఆర్ఎస్ భారతి.. ఈ ఫిరాయింపులపై “ఆయా రామ్, గయా రామ్” అన్న వ్యాఖ్య చేశారు.

  • చండీగఢ్‌: తాను అసెంబ్లీకి తాగి వచ్చాననే విమర్శలు,  రాత్రి-పగలు తాగుతూ ఉంటారనే ఆరోపణల్ని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ స్పందించారు. తనపై విమర్శలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, అంతకుమించి వారికి పనీపాటా ఏమీ లేనట్లు ఉందన్నారు భగవంత్‌ మాన్‌. ఎన్డీటీవీ నిర్వహించిన నవ పంజాబ్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..  ఇక రాష్ట్రంలో ఏ అంశం లేనట్లు తాను నిరంతరం తాగుతూ ఉంటాననే ఆరోపణలు తప్పితే ఇంకా ఏమీ ప్రతిపక్షాలకు లేవా అని ప్రశ్నించారు. 

    తాను 2012లో యాక్టివ్‌ పాలిటిక్స్‌లో అడుగుపెట్టానని, ఇప్పటికి 14 ఏళ్లు అయ్యిందన్నారు భగవంత్‌ మాన్‌సింగ్‌. అప్పట్నుంచీ తాను పగలు-రాత్రి లేకుండా తాగుతూనే ఉంటానని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

    నిజంగా తాను 14 ఏళ్ల నుంచి పగలు-రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉంటే బ్రతికే ఉండేవాడినా? అని ఎదురు ప్రశ్నించారు. మనకు తెలిసిన మిత్రులు కానీ, బంధువులు కానీ, వేరే ఎవరైనా కానివ్వండి.. 14 ఏళ్ల నుంచి రాత్రి-పగలు అనే తేడా లేకుండా తాగితే బ్రతుకుతారా?, అలా బ్రతికి ఉన్నవాళ్లని చూశారా? అంటూ చమత్కరించారు.  ఒకవేళ తన లివర్‌ను ఏమైనా ఐరన్‌ రాడ్‌తో చేశారని వారు అనుకుంటున్నారా? వారే చెప్పాలన్నారు. 

    ఇది తనపై జరిగే వ్యక్తిత్వ హననం తప్పితే ఏమీ లేదన్నారు. తన ప్రత్యర్థులకు తనను సవాలు చేయడానికి గట్టి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.ఇతరులపై కూడా ఇలాంటి ఆరోపణలు చేసినట్లు ఆయన సూచించారు. ఉదాహరణకు, శిరోమణి అకాలి దళ్ నేత సుఖ్బీర్ బాదల్ అఫీమ్  వాడతారని, అందుకే ఆయనను "సుఖ్మాలి" అని పిలుస్తారని ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆ ఆరోపణపై బాదల్ స్పష్టత ఇవ్వాలని సూచించారు.

  • సాక్షి,చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.  అన్నాడీఎంకే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌కు రాజీనామా లేఖలు అందించారు. రాజీనామా అనంతరం,తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (హైవేలు, భవనాలు, మైనర్ పోర్టులు) మంత్రి అధవ్ అర్జున్‌తో భేటీ అయ్యారు.  

    ఇటీవల అధికారం చేపట్టిన  తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చేపట్టారు. ఈ విశ్వాస తీర్మానంలో  అన్నాడీఎంకేలోని వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చారు. ఆ 25 మందిలో ఇవాళ అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.    

    మే 13 టీవీకే ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో గెలవడానికి వేలుమణి శిబిరం 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే కన్వినర్‌ ఎడప్పాడి పళనిస్వామి టీవీకేకు మద్దతు ఇచ్చిన ఈ 25 మందిని పార్టీ పదవుల నుండి తొలగించాలని కోరుతూ స్పీకర్‌కు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెట్టారు. ఈ వరుస పరిణామాలతో వేలుమణి వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఈపీఎస్‌ శిబిరంలో చేరగా.. మరికొంత మంది అంతర్గతంగా టీవీకే వైపు మొగ్గు చూపారు. సత్యభామ, మరగాథం, జయ్‌ కుమార్‌తో పాటు మరికొంత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

  • ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇటు రాజకీయ యుద్ధంగా మారింది. ఎన్నికల ముందు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జగన్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయంటూ ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు?” అనే గొంతుక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

    తాజాగా పెంచిన ఇంధన ధరలతో..  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 వద్ద ఉండగా.. విజయవాడలో అది రూ.118కి చేరడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.69గా ఉంది. అంటే పొరుగు రాష్ట్రంతో పోల్చినా కూడా ఏపీలోనే ఇంధన భారం ఎక్కువగా పడుతోంది. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం హైదరాబాద్‌ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. ఏపీలో రేట్లను ఏ మూలన ప్రస్తావించడం లేదు.

    అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయన్నది తెలిసిందే. సామాన్యుల జేబుకు చిల్లుపడే విషయంలో.. ఆయిల్‌ కంపెనీలు, కేంద్రం చేతులెత్తాశాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్‌, అదనపు సెస్సులేనని విమర్శలు వస్తున్నాయి.

    ప్రస్తుతం ఏపీలో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్‌, మరో రూ.1 రోడ్ డెవలప్‌మెంట్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఇందులో అదనపు వ్యాట్‌, ఇతర భారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిందని మొన్నటి ప్రెస్‌మీట్‌లో వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.( 2015లో అప్పటి బాబు సర్కార్‌ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన జీవోలో.. పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ విధించారు. వ్యాట్‌కు అదనంగా ప్రతి లీటర్‌పై రూ.4 వడ్డించారు). అయితే.. కరోనా వంటి కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం కేవలం రోడ్ సెస్సు కింద ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని ఆయన వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగాయని ప్రచారం చేశారని.. అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాటిచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. 

    జగన్‌ చెప్పిన లెక్క ప్రకారం.. 
    దేశవ్యాప్తంగా.. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.8 పెరిగింది. ఈ ప్రభావంతోనే విజయవాడలో ధరలు మరింత ఎగబాకాయి. దీంతో “ఏపీలో సామాన్యుడికి భారం” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..

    జగన్ తాజా వ్యాఖ్యల్లో మరో కీలక ప్రశ్న కూడా లేవనెత్తారు. “ఎన్నికల ముందు పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. జగన్ హయాంలో పెరిగిందని విమర్శించారు. అప్పుడు అంత విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించాలి కదా? మరి ఎందుకు పెరుగుతున్నాయ్‌” అని చంద్రబాబు జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్‌ ప్రెస్‌మీట్‌ నాటికి పెట్రో ధరలు రూ.4 పెరిగాయి. ఈ మధ్యలోనే మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఈ లెక్కన జగన్‌ కోరినట్లు ఆ రూ. 8 చంద్రబాబు తగ్గింపు చేసి ఉంటే.. ఏపీలో వాహనదారులపై భారం చాలా వరకు తగ్గేదే అనే అభిప్రాయం వినిపిస్తోంది.  

    ఇక.. ఇంధన ధరల వ్యవహారంలో ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన విమర్శలు, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కనిపిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయం ఆరోపిస్తోంది. “జగన్ హయాంలో పెట్రోల్ భారం” అంటూ ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ అడిగిన దానికి సమాధానం ఏదని నిలదీస్తున్నారు. మరోవైపు హామీల్లో తగ్గింపు మాటలు చెప్పి.. చేతల్లో మాత్రం అదనపు భారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు “మాటల బాబు.. చేతల్లో ఎక్కడ?” అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

International

  • వాషింగ్టన్‌: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.

    2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

    ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

    ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు.  

     

  • ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది.  ఈద్-ఉల్-అదా(ఈద్‌) పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు, అదుపు తప్పి బోల్తా పడటంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఈద్ వేళ విషాదం
    ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఇనుప రాడ్లతో పాటు, ప్రయాణీకులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీలు తమ కుటుంబాలతో కలిసి ఈద్ వేడుకలు జరుపుకోవడానికి ఇంటికి బయలుదేరగా, విధి వారిని మార్గమధ్యలోనే బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలేనని అధికారులు తెలిపారు.

    అదుపు తప్పిన వాహనం
    స్థానిక పోలీస్ చీఫ్ ఫువాడ్ హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనాన్ని నియంత్రించలేక డ్రైవర్ చేసిన పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి, ట్రక్కు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    నిత్యం వెంటాడుతున్న మరణ మృదంగం
    బంగ్లాదేశ్‌లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం, రహదారుల దుస్థితి, నైపుణ్యం లేని డ్రైవర్ల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ప్రయాణ భద్రతపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదకర సంఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయి.

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్‌ సహా అరబ్‌ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్‌ ఎందుకు టెన్షన్‌ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..

    అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.

    అబ్రహాం ఒప్పందం లక్ష్యం

    • దౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్‌తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.

    • ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.

    • భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.


    ఒప్పందంలోని దేశాలు..

    • యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్‌: ఈ దేశాలు ఇజ్రాయెల్‌ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.

    • సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.

    • పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్‌ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.

    అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్‌కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్‌.. అరబ్‌ దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.

    ఇజ్రాయెల్‌కు లాభాలు

    • అరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్‌కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.

    • ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.

    • భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.

    • ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.


    ఇజ్రాయెల్‌కు నష్టాలు

    • పాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.

    • ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    • సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.

    అమెరికాకు లాభాలు

    • ప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.

    • భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్‌ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.

    • ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.

    • వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.


    పాలస్తీనా సమస్యలో మార్పులు

    • అరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.

    • పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.

    • ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.


    ఇరాన్ అంశం
    ఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్‌ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.

    పాకిస్తాన్‌ ఇలా..
    పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్‌తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్‌ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని షరీఫ్‌కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. 

Business

  • గత రెండు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో.. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మే 15 తర్వాత నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.2కు పెరిగింది. అదే సమయంలో సీఎన్‌జీ ధరలు కూడా కేజీపై సుమారు రూ.4 వరకు పెరిగింది.

    ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ముఖ్యంగా అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

    ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు, సాధారణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకుల రవాణాకు ఇంధనం కీలకం. రైతుల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

    ఇప్పటికే వంటింటి ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.11.2 పెరిగింది. సోయా ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోకు రూ.7కిపైగా పెరగగా, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వంటనూనెల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రభావం నేరుగా కనిపిస్తోంది.

    ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి రెండు రకాల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రయాణ ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు వంటింటి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే సాధారణ జీవనం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!

  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్‌లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.

    నాగ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్‌ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్‌ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్‌పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.

    భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.

    ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!

    ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.

    ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్‌పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు.

  • డిమాండ్‌ పెరుగుతుండటం, పాలసీల్లో మార్పులు మొదలైన అంశాల కారణంగా.. దేశీయంగా పసిడి, ఆభరణాల సెక్టార్‌ కీలక దశలోకి ప్రవేశిస్తోంది. పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ డిమాండ్‌ పటిష్టంగానే ఉంటోంది.

    స్వచ్ఛత, ధరల విషయంలో పారదర్శకత, విశ్వసనీయతకు కస్టమర్లు మరింత ప్రాధాన్యతనిస్తుండటంతో జ్యుయలరీ మార్కెట్‌ క్రమంగా కన్సాలిడేట్‌ అవుతోంది. గత ఐదేళ్లుగా సంఘటిత రిటైల్‌ విభాగం గణనీయంగా విస్తరించింది. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు అనువుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధి అవకాశాలకు పరిశీలించతగిన కంపెనీ.

    ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!

  • అమెరికా-ఇరాన్ యుద్ధం.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ, దేశంలో ఖర్చులను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు ఎఫ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మూడు ఎఫ్‌లు - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు).

    పెరిగిన ధరలు - ప్రజలపై భారం!
    ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎరువుల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతోంది. కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.7.38 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.

    ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. భారత్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.

    మోదీ పిలుపు
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. కాబట్టి, కొంతకాలం పాటు అవసరం లేని దిగుమతులను తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటి సూచనలు ప్రజలకు, పరిశ్రమలకు ప్రధాని ఇచ్చారని సీతారామన్ గుర్తుచేశారు.

    ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మాత్రమే సమస్య కాదు. ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను సృష్టిస్తున్నాయని ఆమె వివరించారు.

    అనేక సమస్యలు ఒకేసారి!
    అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైన అంశం కాదు, ఇది సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ హెచ్చరించారు. ఇంధన ధరలు పెరగడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు ఒకేసారి ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.

    పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వచ్చినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) చెల్లింపుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు బకాయిలను చెల్లించాలని ఆమె సూచించారు.

    ఇదీ చదవండి: ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం!

  • రాబోయే దశాబ్దం ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు అత్యంత సవాలుతో కూడుకున్నదని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన టెక్స్‌ప్రోసిల్ ఎక్స్‌పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటోందని, పెరుగుతున్న రక్షణవాదం, సుంకం రహిత అడ్డంకులు, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు.

    అయితే, ఇలాంటి సంక్షోభ సమయాలు భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, సుస్థిరత, క్రాఫ్ట్ ఆధారిత తయారీ వంటి పోకడలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ రిటైలర్లు తమ సోర్సింగ్ నిబంధనల్లో స్థిరత్వ ప్రమాణాలను తప్పనిసరి చేస్తున్నందున, ఎగుమతిదారులకు సుస్థిరత అనేది ఇకపై ఒక ఎంపిక కాదని, ఒక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.

    మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి సాంకేతికత ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తూ, కార్మిక ఖర్చులను తగ్గిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఈ మారుతున్న వాతావరణంలో భారతీయ వస్త్ర ఎగుమతిదారులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే... నైపుణ్యాల పెంపు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమలు ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీతారామన్ నొక్కి చెప్పారు.

  • హైదరాబాద్‌: ఫార్మాస్యూటికల్స్‌ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం భారీగా జంప్‌చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1.6 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు ఎగసింది.

    నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 6 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు మెరుగుపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 45 శాతం వృద్ధితో రూ. 14 కోట్లను అధిగమించింది. 2024–25లో రూ. 10 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 159 కోట్ల నుంచి రూ. 381 కోట్లకు జంప్‌ చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి.

  • కృత్రిమ మేధస్సు (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో.. విద్యార్థుల్లో ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందేమో అనే భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

    ఇటీవల 'హార్డ్ ఫోర్క్' అనే పాడ్‌కాస్ట్‌లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. ఏఐ వల్ల మార్పులు వచ్చినా, కొత్త తరం ఆ సవాళ్లను స్వీకరించి మంచి భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

    స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే పట్టభద్రుల సభలో పిచాయ్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా.. పాడ్‌కాస్ట్ హోస్ట్ ఏఐ గురించి మాట్లాడితే.. విద్యార్థులు విమర్శిస్తే, ఏమని జవాబిస్తారు? అని సరదాగా ప్రశ్నించారు. 'ప్రతి తరం సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఈ తరం కూడా అలాగే సవాళ్లను అధిగమించి మంచి ప్రపంచాన్ని నిర్మిస్తుంది' అని పిచాయ్ సమాధానం ఇచ్చారు.

    యువత, విద్యార్థులు ఏఐ ప్రభావాన్ని మాత్రమే అనుభవించరు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కూడా మారతారు. వీళ్ళే AI పురోగతికి కారణమవుతారు, దాని ప్రభావాలను కూడా ఎదుర్కొంటారని పిచాయ్ వెల్లడించారు. యువత కొత్త అవకాశాలను సృష్టించే శక్తి కలిగిన వారని ఆయన స్పష్టం చేశారు.

    ఇటీవల చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఏఐ అని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతలో నిరుద్యోగం కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు AI గురించి భయపడటం సహజమని పిచాయ్ అంగీకరించారు.

    టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎప్పుడూ సమాజంలో భయాన్ని కలిగిస్తాయి. గతంలో వచ్చిన సాధారణ సాంకేతిక మార్పులకు కూడా ప్రజలు భయపడ్డారు. కానీ.. తరువాత అవే అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. AIను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మానవ సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.

    ఏఐ వల్ల జరిగే నష్టాలను మాత్రమే కాకుండా.. ప్రయోజనాలను కూడా ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత టెక్నాలజీ రంగంపై ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి బాధ్యతాయుతంగా AIని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు.

  • రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

    కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?
    కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్‌ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.

    టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..
    తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా డిజిటల్‌గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

    రైల్వే చార్ట్ తయారీలో మార్పులు
    ప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.

    రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

  • సోమవారం ఉదయం లాభల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,073.61 పాయింట్లు లేదా 1.42 శాతం లాభంతో 76,488.96 వద్ద, నిఫ్టీ 312.40 పాయింట్లు లేదా 1.32 శాతం లాభంతో 24,031.70 వద్ద నిలిచాయి.

    సుందరం బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రేవతి ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ వంటివి లాభాలను పొందాయి. సూర్య రోష్ని లిమిటెడ్, సాన్‌స్టార్ లిమిటెడ్, ఎక్సెల్‌సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులందరికీ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. టోల్‌గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, వేగంగా ముందుకు వెళ్లడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రవేశపెట్టింది. అయితే.. చాలామంది వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్‌లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్‌గేట్ల వద్ద ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

    ఫాస్ట్‌ట్యాగ్‌లో ఉండే.. ఆర్ఎఫ్ఐడీ చిప్ టోల్ ప్లాజా స్కానర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ చిప్ సరిగా పనిచేయకపోతే స్కానర్ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీడ్ చేయలేవు. ఫలితంగా వాహనం టోల్‌గేట్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ పెరిగి పొడవైన క్యూలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

    ఎన్‌హెచ్‌ఏఐ ప్రకారం ఫాస్ట్‌ట్యాగ్‌ దెబ్బతినడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

    • ఒకటి.. వెహికల్ విండ్ షీల్డ్ తరచుగా శుభ్రం చేయడం. కొంతమంది గట్టిగా రుద్దడం లేదా కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఫాస్ట్‌ట్యాగ్‌లోని ఆర్ఎఫ్ఐడీ చిప్ దెబ్బతింటుంది.

    • రెండవది.. ఎండ, దుమ్ము, వర్షం వంటి వాతావరణ ప్రభావాలు. ఎక్కువకాలం ఫాస్ట్‌ట్యాగ్‌ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కూడా టోల్ ప్లాజా స్కానర్లు రీడ్ చేయలేవు.

    • మూడవది.. పాతబడిన ఫాస్ట్‌ట్యాగ్‌లు.  చాలా రోజుల పాటు ఉపయోగించిన ట్యాగ్‌లు సహజంగానే పనితీరును కోల్పోతాయి.

    ఫాస్ట్‌ట్యాగ్‌ ఐదేళ్లకు పైబడితే లేదా తరచూ స్కాన్ సమస్యలు ఎదురైతే వెంటనే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే టోల్ గేట్ల వద్ద అనవసర ఆలస్యం, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు డబుల్ డిడక్షన్ లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా వస్తాయి.

    ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!

    వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. విండ్‌షీల్డ్ మీద ట్యాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దకూడదు. ఫాస్ట్‌ట్యాగ్‌ను వంచడం, తీసి మళ్లీ అతికించడం చేయకూడదు. ట్యాగ్‌పై ఇతర స్టిక్కర్లు లేదా సన్ ఫిల్మ్‌లు ఉండకూడదు. సమస్యలు కనిపించిన వెంటనే ఫాస్ట్‌ట్యాగ్‌ జారీ చేసిన బ్యాంకును సంప్రదించి కొత్త ట్యాగ్ తీసుకోవాలి.

  • భారత ఎగుమతుల పర్ఫార్మన్స్‌ 2026 ఏప్రిల్‌లో ఆశాజనకంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న సమయంలో కూడా భారత్ తన ఎగుమతి మార్కెట్లను విస్తరించడంలో ముందడుగు వేసినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.

    ప్రభుత్వం, పరిశ్రమల వర్గాలు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ వాణిజ్య అవరోధాల మధ్య కూడా 2026 ఏప్రిల్‌లో భారత సరుకు ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగి 43.66 బిలియన్ డాలర్లకు చేరాయి.

    ఈ పెరుగుదలలో కొంత భాగం అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వచ్చినప్పటికీ, మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారత ఎగుమతిదారులు చేరుకుంటున్న మార్కెట్ల సంఖ్య గణనీయంగా పెరగడం.

    ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఏడాదిలో కనీసం 20 ఎగుమతి విభాగాలకు చెందిన ఉత్పత్తులు 17 లేదా అంతకంటే ఎక్కువ కొత్త దేశాలకు చేరాయి. ఉదాహరణకు, భారత హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

    ఈ కొత్త మార్కెట్లలో ఎగుమతుల పరిమాణం ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త మార్గాలను తెరవడం ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమికల్స్ వంటి భారత ప్రధాన ఎగుమతి రంగాలు గత ఏడాదితో పోలిస్తే 2026 ఏప్రిల్‌లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.

    మరో కోణంలోనూ మెరుగైన ప్రదర్శన 
    ఇది ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, కొత్త సరఫరా గొలుసులు కూడా ఏర్పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. భారత ఎగుమతుల బలాన్ని అంచనా వేయడానికి మరో ప్రమాణం.. పెట్రోలియం ఉత్పత్తులు వాటి ధరల ప్రభావాన్ని పక్కనపెట్టి చూసే గణాంకాలు.

    ఈ కోణంలో కూడా భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2026 ఏప్రిల్‌లో చమురుేతర ఎగుమతులు 9 శాతం పెరిగి దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా భారత సరుకు ఎగుమతుల వృద్ధి, దిగుమతుల వృద్ధిని మించి ఉండటం గమనార్హం.

    అయితే పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో వచ్చిన భారీ పడిపోయిన ధోరణి కొనసాగుతూ ఏప్రిల్‌లో పశ్చిమాసియాకు భారత ఎగుమతులు 28 శాతం తగ్గాయి. ఆ ప్రాంతం నుంచి దిగుమతులు కూడా సుమారు 32 శాతం పడిపోయాయి.

    ఇది భారత్‌కు అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామ్య ప్రాంతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లో వచ్చిన లాభాలు ఈ నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. ఇదే సమయంలో ‘సేఫ్ అసెట్’గా భావించే బంగారం దిగుమతులు ఏప్రిల్‌లో 82 శాతం ఎగసిపడ్డాయి.

    భారతీయులు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడం, ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

    గ్లోబల్ ట్రేడ్ పవర్‌గా భారత్‌! 
    మరో ముఖ్యమైన అంశం సేవారంగ ప్రాధాన్యం పెరుగుతుండటం. 2014లో భారత మొత్తం ఎగుమతుల్లో సేవారంగం వాటా 39 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 49 శాతానికి చేరుకుంది. అయితే, ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీ సేవల రంగంలో భారత పోటీ సామర్థ్యం తగ్గితే అది పెద్ద దెబ్బ కావచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ, వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎగుమతి గమ్యస్థానాలను విస్తరించడం వంటి ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

    ఇకపై వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగితే.. భారత్ నిజమైన గ్లోబల్ ట్రేడ్ పవర్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.    -  వెబ్‌ డెస్క్‌

  • ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్‌కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.

    ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.

    'పెట్రో డాలర్'కు మరణ శాసనం?

    రాబర్ట్ కియోసాకి తన ట్వీట్‌లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్‌తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.

    ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని  పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.

    ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్‌డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్‌లో స్పష్టం చేశారు.

    అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?

    గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.

  • బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.

    నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారు

    భవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్‌ వరల్డ్‌ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్‌లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.

    ‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

    ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..

    23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.

    కెమెరాలు ఎందుకోసమంటే..

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.

    అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..

    కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్‌కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి

  • అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్‌ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.

    సవరించిన కొత్త ధరల పట్టిక

    ప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్‌లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

    ఇంధనం రకంపాత ధర (లీటరుకు)తగ్గిన ధరప్రస్తుత ధర (లీటరుకు)
    పెట్రోల్రూ. 409.78రూ. 6.00రూ. 403.78
    హై-స్పీడ్ డీజిల్రూ. 409.58రూ. 6.80రూ. 402.78

    గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్‌ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్‌ రూపాయి)

    అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలు

    ఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్‌ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..

    మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.

    ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.

    ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.

    భారత్‌లో పరిస్థితి ఏంటి?

    అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి

  • భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా ఇండియా' (Kia India) ఈ మే నెలలో సరికొత్త సేల్స్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. మారుతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు, స్టాక్‌ను క్లియర్ చేసేందుకు వీలుగా తన పూర్తి లైనప్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ రూ. 2.70 లక్షల వరకు భారీ ప్రయోజనాలను, డిస్కౌంట్లను ప్రకటించింది.

    కొత్తగా ఎస్‌యూవీ (SUV) లేదా ఎంపీవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఈ నెల అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలలో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ సపోర్ట్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. మోడల్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

    కియా కార్నివాల్
    ఈ నెలలో కియా లైనప్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్ లగ్జరీ ఎంపీవీ 'కియా కార్నివాల్' (Kia Carnival). ఈ మోడల్‌పై రూ. 2 లక్షల వరకు భారీ ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తోంది. దీనికి అదనంగా స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు ఆఫర్ ఉంది. ప్రీమియం ఫ్యామిలీ కార్, విశాలమైన క్యాబిన్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

    కియా కారెన్స్ క్లావిస్ 
    ఇటీవల మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. టర్బో వేరియంట్లకు అదనంగా 5 సంవత్సరాల కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా కియా అందిస్తోంది. ఇదే మోడల్‌లోని డీజిల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85,000 వరకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.

    కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 
    పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ MPV కొనుగోలు చేయాలనుకునే వారికి కారెన్స్ క్లావిస్ ఈవీ  (Kia Carens Clavis EV)పై రూ. 2.15 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.

    కియా సెల్టోస్ 
    భారతదేశంలో కియా బ్రాండ్‌కు అత్యంత బలమైన సేల్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ'సెల్టోస్' (Kia Seltos)పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. గతేడాదికి చెందిన (Model Year 2025) ఇన్వెంటరీపై రూ. 95,000 వరకు గరిష్టంగా ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడళ్లపై డిస్కౌంట్ కొంత తక్కువగా (సుమారు రూ. 40,000 వరకు) ఉండే అవకాశం ఉంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా, మారుతి సుజుకి గ్రాండ్ విటారాలకు గట్టి పోటీనిస్తోంది.

    కియా సిరోస్
    సరికొత్తగా వచ్చిన సిరోస్ (Kia Syros) 2025 మోడల్‌ ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు, అలాగే కొత్త 2026 మోడల్‌ యూనిట్లపై రూ. 50,000 వరకు తగ్గింపులను సొంతం చేసుకోవచ్చు.

    కియా సోనెట్ 
    కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో దూసుకుపోతున్న సోనెట్ (Kia Sonet) మోడల్‌పై ఆఫర్లు కాస్త పరిమితంగా ఉన్నాయి. 2026 మోడల్‌ స్టాక్‌పై రూ. 35,000 వరకు, 2025 మోడల్‌  యూనిట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

    స్టాండర్డ్ కియా కారెన్స్ 
    రెగ్యులర్ కియా కారెన్స్ (Kia Carens) ఎంపీవీ మోడల్‌పై ఈ నెలలో రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.

    అయితే ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు అనేవి డీలర్‌షిప్ వద్ద ఉన్న స్టాక్ లభ్యత, నగరం (ప్రాంతం), కొనుగోలుదారు అర్హత ఆధారంగా మారుతుంటాయి. కాబట్టి ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరలు, ఫైనల్ ఆఫర్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని అధీకృత కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

Sports

  • తమిళనాడు చెందిన మరో క్రికెటర్‌ ఐపీఎల్‌ సహా దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ దేశవాలీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకగా.. తాజాగా మురుగన్‌ అశ్విన్‌ కూడా రెండు విభాగాలకు బై బై చెప్పాడు.

    35 ఏళ్ల అశ్విన్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌గా సుపరిచితుడు. 2016లో రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన మురుగన్‌.. 2018లో ఆర్సీబీకి, 2019-21 వరకు పంజాబ్‌ కింగ్స్‌కు, 2022లో ముంబై ఇండియన్స్‌కు, 2023లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. 

    అప్పటి నుంచి అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. మురుగన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 44 మ్యాచ్‌లు ఆడి 35 వికెట్లు తీశాడు.

    2012లో తమిళనాడు తరఫున దేశవాలీ అరంగేట్రం చేసిన మురుగన్‌.. 2023, 24లో చండీఘడ్‌కు, 2025లో జమ్మూ కశ్మీర్‌కు ఆడాడు. దేశవాలీ కెరీర్‌లో 7 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 29 లిస్ట్‌-ఏ, 105 టీ20లు ఆడిన మురుగన్‌.. మొత్తంగా 130 వికెట్లు తీశాడు. 

  • రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఏ జట్టు ఘన విజయం సాధించింది. అరండల్‌ (ఇంగ్లండ్‌) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పెద్దగా అనుభవం లేని లయన్స్‌ను ప్రొటీస్‌-ఏ టీమ్‌ 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 157, రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లోనే (331 ఆలౌట్‌) భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకొని, రెండు ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని (214) కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.  

    ఛేదనలో సెనోక్వానే (55), జోర్డన్‌ హెర్మన్‌ (70 నాటౌట్‌), జుబేర్‌ హంజా (54 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికాను గెలిపించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తరఫున కెప్టెన్‌ మార్కస్‌ అకెర్‌మన్‌ (173) భారీ సెంచరీతో కదంతొక్కాడు.

    ఇంగ్లండ్‌ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. కనీసం ఒక్క బ్యాటర్‌ కూడా హాఫ్‌ సెంచరీ మార్కును తాకలేకపోయాడు. 25 పరుగులు చేసిన ఏకాన్ష్‌ సింగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జేసన్‌ స్మిత్‌ 4, మొకోయెనా 3, డేన్‌ పీటర్సన్‌ 2, బార్ట్‌మన్‌ ఓ వికెట్‌తో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

    తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైన లయన్స్‌ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నారు. ఓపెనర్‌ ఆసా ట్రైబ్‌ (135), బెన్‌ మేస్‌ (105) సెంచరీలతో సత్తా చాటారు. అయినా వారు సౌతాఫ్రికా ముందు సరిపడా లక్ష్యాన్ని ఉంచలేకపోయారు. దీంతో స్వదేశంలో లయన్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌  మే 29న మొదలవుతుంది.

  • భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన "పద్మశ్రీ" అవార్డును ఇవాళ (మే 25) అందుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    భారత క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన హర్మన్‌, గత 17 ఏళ్లుగా జాతీయ జట్టుకు సేవలందిస్తూ అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌కు కొత్త గుర్తింపు వచ్చింది.

    కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హర్మన్‌తో పాటు భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మకు కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ప్రపంచకప్ విజయాలు సాధించిన ఇద్దరు కెప్టెన్లు ఒకే ఏడాది ఈ గౌరవాన్ని పొందడం భారత క్రికెట్‌కు అరుదైన ఘట్టంగా భావించబడుతోంది. క్రికెట్‌కు సంబంధించి గతంలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

  • ఐపీఎల్‌ 2026లో దారుణమైన ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ సీజన్‌కు ముందు భారీ కొనుగోళ్లు చేసి ఈసారైనా టైటిల్‌ సాధించాలని పట్టుదలగా ఉండిన ఆ జట్టుకు మరోసారి చుక్కెదురైంది. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు, జంబో కోచింగ్‌ బృందం ఉన్నా ఆ జట్టు ఏమీ సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచింది కేవలం నాలుగు మాత్రమే.

    ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (రూ. 27 కోట్లు) సహా విధ్వంసకర వీరుడిగా పేరున్న నికోలస్‌ పూరన్‌ (రూ. 21 కోట్లు), ఇంకా చాలా మంది ఖరీదైన ఆటగాళ్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆటగాళ్లలాగే కోచింగ్‌ బృందం కూడా అత్యంత ఖరీదైన స్టార్లతో నిండి ఉన్నా సాధించింది సున్నా.    కోట్లు కుమ్మరించి స్టార్లను అక్కున చేర్చుకున్నా, అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిన లక్నోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

    22 మంది ఖరీదైన స్టార్‌ ఆటగాళ్లు, 29 మంది ఖరీదైన స్టార్‌ కోచ్‌లు ఉన్నా,  పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది అనే వ్యంగ్యాస్త్రంతో నెటిజన్లు ఎల్‌ఎస్‌జీని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ జట్టు ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా ఇలాంటి జట్టుపై కోట్టు కుమ్మరించి నిలువునా మునిగిపోయాడంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు పొగరుబోతైన గొయెంకాకు ఇలా జరగాల్సిందేనంటూ చరకలంటిస్తున్నారు.

    వాస్తవానికి గొయెంకా సీజన్‌ ప్రారంభానికి ముందు భారీ ప్రక్షాళన చేశాడు. ఆటగాళ్ల రిటెన్షన్, కొత్త కొనుగోళ్లు, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు జట్టును బలంగా మారుస్తాయని  భావించాడు. ముఖ్యంగా మిడిలార్డర్‌ను బలోపేతం చేయడం, డెత్ ఓవర్ బౌలింగ్ మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో జట్టు నిర్మాణం జరిగింది. అయితే ఈ మార్పులు సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి.

    సీజన్ మొత్తం చూస్తే ఈ జట్టు ప్రధాన సమస్య స్థిరత్వం లేకపోవడం. ఓ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బ్యాటింగ్ యూనిట్, తదుపరి మ్యాచ్‌లోనే పూర్తిగా విఫలమవడం తరచూ కనిపించింది. బౌలింగ్ విభాగం కీలక సందర్భాల్లో నియంత్రణ కోల్పోయింది. పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం జట్టును ఒత్తిడిలోకి నెట్టింది.

    కెప్టెన్సీ నిర్ణయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కీలక సమయాల్లో బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్ వంటి వ్యూహాత్మక నిర్ణయాలు ఫలితాన్ని మార్చలేకపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తరచుగా ప్లేయింగ్ XIలో మార్పులు చేయడం కూడా జట్టు సమతుల్యతను దెబ్బతీసిందని విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఈ సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ దారుణ వైఫల్యాలకు అందరూ కారణమయ్యారు. 
     

  • ప్ర‌తిష్టాత్మ‌క ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచ‌ల‌నం న‌మోద‌య్యింది. తెలుగు మూలాలున్న భార‌త సంత‌తి కుర్రాడు నిశేష్ బ‌స‌వ‌రెడ్డి తొలి రౌండ్‌లో ప్ర‌పంచ తొమ్మిదో ర్యాంక‌ర్ టేల‌ర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. భార‌త కాల‌మాన ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన‌ 148వ ర్యాంక‌ర్‌ బ‌స‌వ‌రెడ్డి 7-6, 7-6, 6-7, 6-1తో త‌న దేశానికే చెందిన‌ టేల‌ర్ ఫ్రిట్జ్‌ను మ‌ట్టిక‌రిపించాడు. దీంతో నిశేష్ బసవరెడ్డి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.

    ఎవరీ నిశేష్ బసవరెడ్డి?
    నిశేష్ రెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. సాయి ప్రసన్న, మురళీకృష్ణ అతడి తల్లిదండ్రులు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వారి స్వస్థలం. కాగా 1999లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నిశేష్ చిన్న వయసులోనే తన తండ్రి టెన్నిస్ పరిచయం చేశాడు. కోచ్ బ్రయాన్ స్మిత్ వద్ద శిక్షణ పొందాడు. 

    మాజీ ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయర్ రాజీవ్ రామ్ మార్గదర్శకత్వం కూడా నిశేష్‌కు లభించింది. 2022లో జరిగిన యూఎస్ ఓపెన్‌లో నిశేష్.. ఓజాన్ బారిస్‌తో కలిసి.. బాయ్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇలా.. జూనియర్ సర్క్యూట్‌లో తొలిసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2023లో ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-3 స్థానానికి చేరుకున్నాడు. 

    అలాగే ఏటీపీ ఛాలెంజర్ టూర్‌ 2024 సీజన్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు ఏటీపీ ఛాలెంజర్ టైటిళ్లు గెలిచి టెన్నిస్ ప్రపంచంలో తన ముద్ర వేశాడు. 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా గ్రాండ్‌ స్లామ్ అరంగేట్రం చేసిన నిషేశ్.. తొలి మ్యాచ్‌లోనే దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించడం ద్వారా మరోసారి తన సత్తా చాటాడు.

    చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్‌ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!    

  • ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ సాధించలేకపోయింది. లీగ్‌ దశ చివరి వరకు రేసులో ఉన్నా, పంజాబ్‌ కింగ్స్‌ ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. అక్షర్‌ పటేల్‌ నేతృత్వంలో ఢిల్లీ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు, 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

    ఢిల్లీని ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయినా, కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ వ్యక్తిగతంగా ఓ భారీ మైలురాయిని తాకాడు. ఐపీఎల్‌లో అత్యంత అరుదైన 2000+ పరుగులు, 100+ వికెట్లు, 100+ సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. అక్షర్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (3469 పరుగులు, 178 వికెట్లు, 121 సిక్సర్లు), కేకేఆర్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (2653, 123, 223) మాత్రమే ఈ అరుదైన ట్రిపుల్‌ ఫీట్‌ను సాధించారు.

    కేకేఆర్‌తో జరిగిన చివరి లీగ్‌ దశలో మ్యాచ్‌లో అక్షర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 100కు చేరింది. దీంతో అతడు జడేజా, రసెల్‌ సరసన చేరాడు.

    ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (బ్యాటంగ్‌లో 39 పరుగులు, బౌలింగ్‌లో ఓ వికెట్‌, ఫీల్డింగ్‌లో 2 క్యాచ్‌లు) సత్తా చాటిన అక్షర్‌ తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌ గెలిచినా ఢిల్లీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే నిన్ననే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది (లక్నోపై పంజాబ్‌ గెలుపుతో).

    ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రేపు (మే 26) జరుగబోయే తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్‌ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.

     

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 583 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ, మూడు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌పై గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

    మే 27న (బుధ‌వారం) ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడ‌నుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సోష‌ల్ మీడియాలో వైభ‌వ్ సూర్య‌వంశీకి సంబంధించిన ఫ్యామిలీ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి వైభ‌వ్ కుటుంబం మొత్తం త‌ర‌లివ‌చ్చింది.

    మ్యాచ్‌లో వైభ‌వ్ తుస్సుమ‌న్న‌ప్ప‌టికీ రాజ‌స్తాన్ గెల‌వ‌డం, ప్లేఆఫ్ చేర‌డంతో అత‌డి కుటుంబం సంతోషంతో ఇంటిబాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో స్టేడియం నుంచి బ‌య‌టికి వ‌స్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ కుటుంబం స‌హా అత‌డి సోద‌రులు కెమెరా కంటికి చిక్కారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'ఫ్యామిలీ అంతా ఒకేలా ఉంది' అంటూ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తి క‌లిగించింది.

    కాగా, వైభవ్‌కు ముగ్గురు సోదరులు ఉన్నారు. ఉజ్వల్, విశాల్ అతడి కంటే పెద్దవాళ్లు కాగా, ఆశీర్వాద్ అందరికంటే చిన్నవాడు. ఈ న‌లుగురు అన్న‌దమ్ములు కూడా హైట్‌లో తేడా ఉన్న‌ప్ప‌టికీ ముఖ క‌వ‌లిక‌ల్లో మాత్రం అచ్చు గుద్దిన‌ట్లు ఒకేలా ఉండ‌డం విశేషం. ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. జురెల్ (38), జోఫ్రా ఆర్చ‌ర్ (32) స‌హా మిగ‌తా బ్యాట‌ర్లు త‌లా కొన్ని ప‌రుగులు చేయ‌డంతో రాజ‌స్తాన్ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. అనంత‌రం లక్ష్య‌ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.

    చదవండి: మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్‌ నిర్ణయం!

  • ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్‌ రిటైర్మెంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్‌కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.

    దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్‌కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్‌గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 

    మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మేగన్ స్కట్‌ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్‌ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మొదటి బౌలర్‌గానూ మేగన్‌ రికార్డులకెక్కింది.

    ఇక తన రిటైర్మెంట్ ప్లాన్‌పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. 

    మేగన్ స్కట్‌.. రెండు వన్డే ప్రపంచకప్‌(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్‌లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.

    లెస్బియన్‌తో వివాహం

    అడిలైడ్‌కు చెందిన మేఘ‌న్ స్క‌ట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్‌ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఆ బిడ్డ‌కు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. 

    అయితే 2025లో జెస్‌తో తన పదేళ్ల రిలేషిన్‌షిప్‌ ముగిసిందంటూ మేగన్‌ స్కట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్‌లు క‌లిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్‌కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. 

    చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌!

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ ఆదివారం వాంఖడే స్టేడియానికి వచ్చాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా లీగ్‌ దశలో ముంబై ఇండియన్స్‌ ఆఖరి మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

    నడవలేని స్థితిలోనూ..
    ఇదిలా ఉంటే.. నడవలేని స్థితిలోనూ ముంబైకర్‌ వినోద్‌ కాంబ్లీ తనకెంతో ఇష్టమైన వాంఖడే స్టేడియానికి రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది వినోద్‌ కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిన విషయం విదితమే.

    మాజీ క్రికెటర్ల ఆర్థిక సాయం
    మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో పుణె ఆస్పత్రిలో చేరగా.. మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలబడ్డారు. వన్డే వరల్డ్‌కప్‌-1983 గెలిచిన భారత జట్టులోని సభ్యులు, మరో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఆర్థికంగా సాయం అందించారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స పొందిన వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం కాస్త కోలుకున్నాడు.

    యూరిన్‌ సమస్య
    ఇదిలా ఉంటే.. తన దుస్థితికి తన చెడు అలవాట్లే కారణమని వినోద్‌ కాంబ్లీ గతంలో వెల్లడించాడు. మద్యం పూర్తిగా మానివేశానని తెలిపాడు. ఇటీవల విక్కీ లల్వాణీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను బాగున్నాను. నా భార్య ఆండ్రియా నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది. మూడు వేర్వేరు ఆస్పత్రులకు తీసుకువెళ్లి నాకు చికిత్స చేయించింది. నేను మళ్లీ ఫిట్‌గా మారాలని చెప్పింది.

    మూత్రం అస్సలు ఆగదు
    భారత మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా నన్ను చూసేందుకు రావడం ఎంతో సంతోషంగా అనిపించింది. నాకు యూరిన్‌ సమస్య ఉంది. మూత్రం అస్సలు ఆగదు. నా ప్రమేయం లేకుండానే పాస్‌ అయిపోయేది. అప్పుడు నా కుమారుడు జీసస్‌ క్రిస్టియానో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. పదేళ్ల నా కూతురు కూడా నాకు సాయం చేసేది.

    నెల రోజుల క్రితమే ఇది జరిగింది. నా తల తిరిగినట్లు అనిపించేది. అకస్మాత్తుగా కిందపడిపోయాను. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే వెంటనే ఆస్పత్రిలో చేరమన్నారు’’ అని 52 ఏళ్ల వినోద్‌ కాంబ్లీ గుర్తు చేసుకున్నాడు.

    చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం!

  • భారత స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా యావత్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 49 ఓవర్లు వేసిన అతడు.. 102.5 సగటున కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఓ టీ20 టోర్నీలో కనీసం 40 ఓవర్లు వేసిన బౌలర్లలో ఇదే అత్యంత చెత్త సగటు. ఇప్పటివరకు ఏ బౌలర్‌ 100 మార్కు (సగటు) కూడా తాకలేదు. ఈ స్థాయి చెత్త ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.

    బుమ్రా తర్వాత యావత్‌ టీ20 ఫార్మాట్‌లో (ఓ టోర్నీ సింగిల్‌ ఎడిషన్‌లో) అత్యంత చెత్త సగటు (కనీసం​ 40 ఓవర్లు) కలిగిన బౌలర్లుగా ప్రగ్యాన్‌ ఓఝా (ముంబై ఇండియన్స్‌ తరఫున 95 సగటు), ప్రసిద్ద్‌ కృష్ణ (కేకేఆర్‌, 94.25), బెన్నీ హోవెల్‌ (చట్టోగ్రామ్‌ ఛాలెంజర్స్‌, 86.25), మొహమ్మద్‌ ఆమిర్‌ (కరాచీ కింగ్స్‌, 69.8) ఉన్నారు.

    ఇదిలా ఉంటే, బుమ్రా పేలవ ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రేపు జరుగబోయే తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్‌ తలపడనుండగా.. 27న జరుగబోయే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. 

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా ట్రెండింగ్‌లో నిలిచిన పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ఆడుతున్న ఈ 15 ఏళ్ల చిన్నోడు బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ నిర్వ‌హించిన యూట్యూబ్‌ షోలో పాల్గొన్న వైభ‌వ్ సూర్య‌వంశీ 25 బంతుల్లోనే సెంచ‌రీ సాధించి స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. 

    విష‌యంలోకి వెళితే పీట‌ర్స‌న్ త‌న యూట్యూబ్ చానెల్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీతో ఒక ప్ర‌త్యేక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్‌లోనే పీట‌ర్స‌న్ వైభ‌వ్‌కు 50 బంతుల్లో 100 ప‌రుగులు చేయాలంటూ స‌వాల్ విసిరాడు. కానీ వైభ‌వ్ మాత్రం పీట‌ర్స‌న్ విసిరిన స‌వాల్‌ను 25 బంతుల్లోనే అందుకోవ‌డం విశేషం.  బౌలింగ్‌ మెషిన్ నుంచి వచ్చిన బంతుల‌ను వైభ‌వ్ భారీ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. 

    అయితే 25 బంతుల్లోనే శ‌త‌కం సాధించిన‌ప్ప‌టికీ ఇదే పీట‌ర్స‌న్ షోలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 22 బంతుల్లో సాధించిన వంద ప‌రుగుల రికార్డును మాత్రం బ‌ద్ద‌లుకొట్ట‌లేక‌పోయాడు. మూడు బంతుల తేడాతో అయ్య‌ర్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశాన్ని వైభ‌వ్ కోల్పోయాడు. ఇక పీట‌ర్స‌న్ షోలో అత్యంత వేగంగా సెంచ‌రీలు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో వైభ‌వ్ సూర్య‌వంశీ రెండో స్థానంలో ఉన్నాడు. 

    శ్రేయ‌స్ అయ్య‌ర్‌, వైభ‌వ్ త‌ర్వాత నికోల‌స్ పూరన్ (28 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. అంత‌క‌ముందు ఏబీ డివిలియ‌ర్స్ 30 బంతుల్లో వంద ప‌రుగులు సాధించాడు. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ 47 బంతుల్లో వంద ప‌రుగులు సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదే ఎపిసోడ్‌లో సూర్య‌వంశీ త‌న కోరిక‌ను వెల్ల‌డించాడు. టీ20ల్లో డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నాడు. 

    అయితే టీ20 క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు విండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ (175 ప‌రుగులు) పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజ‌న్‌లో గేల్ ఆర్సీబీ త‌ర‌ఫున 175 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. గేల్ రికార్డును బ‌ద్దలుకొట్ట‌డంతో పాటు టీ20ల్లో డ‌బుల్ సెంచ‌రీ బాద‌డ‌మే త‌న టార్గెట్ అని మ‌రోసారి స్ప‌ష్టం చేశాడు.

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌పై 30 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన రాజ‌స్తాన్ 16 పాయింట్ల‌తో నాకౌట్ ద‌శ‌కు చేరుకుంది. బుధ‌వారం (మే 27న‌) జ‌ర‌గ‌నున్న ఎలిమినేట‌ర్ పోరులో ఎస్ఆర్‌హెచ్‌ను ఎదుర్కోనుంది. ఇక రాజ‌స్తాన్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లాడి 583 ప‌రుగులు సాధించాడు.

    చదవండి: మెస్సీకి గాయం.. ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు దూరం!

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన జట్లుగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ నిలిచాయి. గతంలో ప్లే ఆఫ్స్‌ చేరిన అనుభవం ఉన్న లక్నో.. ఈసారి లీగ్‌ దశలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది.

    ఇక ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై పరిస్థితి కూడా ఇలాగే ఉంది. లక్నో (-0.740) మాదిరే నాలుగు మ్యాచ్‌లే గెలిచినా.. నెట్‌రన్‌రేటు పరంగా కాస్త మెరుగ్గా ఉండి.. ముంబై (-0.584) తొమ్మిదోస్థానంలో నిలవగలిగింది. లక్నో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈసారి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా లక్నో నిలవగా.. తర్వాతి స్థానాన్ని ముంబై ఆక్రమించింది.

    నవ్వుతూ మాట్లాడుతూ
    అయితే.. అటు ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. ఇటు లక్నో సారథి రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ అనంతరం తమ జట్లను వెనకేసుకువచ్చారు. నవ్వుతూ మాట్లాడుతూ పరిస్థితిని తేలికపరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ హార్దిక్‌, పంత్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

    లోలోపల ఆగ్రహంతో ఉడికిపోతున్నారు
    మరో ప్రొటిస్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని చిరునవ్వుతో దాచేసే ప్రయత్నం చేసిన ఇద్దరు ఐపీఎల్‌ కెప్టెన్ల గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. వారిద్దరు మరెవరో కాదు.. పంత్‌, హార్దిక్‌. ఒత్తిడి తమను ఏమీ చేయలేదన్నట్లుగా నవ్వుతో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

    కానీ మ్యాచ్‌ ఎలా సాగిందో పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. మేము పుంజుకుంటాము. మా జట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఒక్కసారైనా తాము నిరాశ చెందామని వాళ్లు చెప్పారా?.. నిజానికి వాళ్లు లోలోపల ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. కానీ బయటకు కనబడనివ్వలేదు.

    మంచి కెప్టెన్లు ఇలా చేయరు
    వాళ్లిద్దరు ప్రొఫెషనల్‌ క్రికెటర్లు. గెలవాలనే కోరుకున్నారు. తమ జట్ల బాగా ఆడాలని భావించారు. నిజానికి మంచి కెప్టెన్లు జట్టు నిరాశపరిచినపుడు.. ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు. ‘నేను కోపంగా ఉన్నాను. మనం ఇంకా మెరుగ్గా ఆడాలి’ అనే సందేశాన్ని ఇస్తాడు.

    అయితే, ఫేక్‌ నవ్వులతో ఒత్తిడిని కప్పిపుచ్చే వాళ్లు మాత్రం చెత్త కెప్టెన్లు. సీజన్‌ ముగిసిన తర్వాత కూడా.. ‘బాధ పడాల్సిందేమీ లేదు. మేము మళ్లీ గొప్పగా తిరిగివస్తాం’ అని కబుర్లు చెప్తారు. కానీ ప్రతిసారీ అదే మాట చెప్పడం అంత బాగుండదు కదా!’’ అని డేల్‌ స్టెయిన్‌ హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ తీరును ఎండగట్టాడు.  

    చదవండి: వైభవ్‌ వల్లే జైస్వాల్‌ ఫెయిల్‌.. అతడి స్థానాన్ని ఆక్రమించాడు!

  • ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్తాన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మే 30న రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న తొలి వన్డే కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.

    ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఆస్ట్రేలియా జట్టుకే కాదు, భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి సైతం రక్షణ కల్పించేందుకు ప్రత్యేక "సెక్యూరిటీ అండ్‌ డిసిప్లిన్‌ యూనిట్‌"ను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు.

    కాగా, రావల్పిండి, లాహోర్‌ వేదికలుగా మే 30, జూన్‌ 2, 4 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. ఐపీఎల్‌ కారణంగా చాలామంది ఆసీస్‌ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు.

    జట్ల వివరాలు..
    పాకిస్తాన్‌: అబ్దుల్‌ సమద్‌, బాబర్‌ ఆజం, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షమిల్‌ హుసేన్‌, సల్మాన్‌ అఘా, మాజ్‌ సదాకత్‌, షాదాబ్‌ ఖాన్‌, ఘాజీ ఘోరీ, రోహైల్‌ నజీర్‌, షాహీన్‌ అఫ్రిది (కెప్టెన్‌), అబ్రార్‌ అహ్మద్‌, అహ్మద్‌ దనియాల్‌, అరాఫత్‌ మిన్హాస్‌, హరీస్‌ రౌఫ్‌, నసీం షా, సూఫియాన్‌ ముఖీమ్‌

    ఆస్ట్రేలియా: మార్నస్‌ లబూషేన్‌, మాథ్యూ షార్ట్‌, మ్యాట్‌ రెన్షా, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), కెమరూన్‌ గ్రీన్‌, లియామ్‌ స్కాట్‌, ఒలివర్‌ పీక్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, రిలే మెరిడిత్‌, తన్వీర్‌ సంఘా, నాథన్‌ ఇల్లిస్‌, మాథ్యూ కుహ్నేమన్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, ఆడమ్‌ జంపా

     

  • భారత క్రికెట్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మాజీ సహచరుడు (కర్ణాటక) ఎస్‌ఎల్‌ అక్షయ్‌ గుండెపోటుతో కన్నుమూశాడు. 39 ఏళ్ల అక్షయ్‌ బెంగళూరులో స్థానిక డివిజన్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఛాతినొప్పితో కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

    ఈ విషాద ఘటన మే 24న బెంగళూరులోని కేఆర్‌పురం ప్రాంతంలో జరిగింది. మూడో డివిజన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొంటున్న అక్షయ్‌కు మధ్యాహ్నం సమయంలో తీవ్ర అస్వస్థత కలిగింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యులు అక్షయ్‌ మరణించినట్లు నిర్ధారించారు.

    అక్షయ్‌ మృతిపై కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (KSCA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అక్షయ్‌ కర్ణాటక తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించాడు. ఆటగాడిగా మాత్రమే కాదు.. యువ క్రికెటర్లకు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అతడి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని KSCA తమ ప్రకటనలో పేర్కొంది.

    1987 ఏప్రిల్‌ 30న జన్మించిన అక్షయ్‌ 2011-12 సీజన్‌లో రంజీ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలోనే కేఎల్‌ రాహుల్‌, రాబిన్‌ ఉతప్ప, వినయ్‌ కుమార్‌ వంటి ప్రముఖులతో కలిసి కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందిన అక్షయ్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు తీశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 6 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు సాధించాడు.

    దీర్ఘకాలం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కొనసాగలేకపోయిన అక్షయ్‌.. రెండు, మూడు డివిజన్‌ లీగ్‌ల్లో ఆడుతూ కెరీర్‌ను కొనసాగించాడు. చివరివరకు ఆటను వదలకుండా స్థానిక క్రికెట్‌లో కొనసాగుతుండగానే ఈ విషాదం చోటు చేసుకుంది.

    ఇటీవలికాలంలో యువ క్రీడాకారులు గుండెపోటులతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన 40 ఏళ్ల క్రికెటర్‌ ప్రవీణ్‌ బాబన్‌ పవార్‌ కూడా మ్యాచ్‌ ఆడుతుండగానే గుండెపోటుతో మరణించాడు. 

    అలాగే బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ కూడా 2025లో ఢాకా ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

    అక్షయ్‌ మృతి వార్తతో కర్ణాటక క్రికెట్‌ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ సహచరులు, అభిమానులు సోషల్‌మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

  • మ‌రో ప‌దిహేను రోజుల్లో సాక‌ర్ సంగ్రామం (ఫిఫా వ‌రల్డ్‌క‌ప్-2026) మొద‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో అర్జెంటీనాకు షాక్ త‌గిలేలా ఉంది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు లియోన‌ల్ మెస్సీ గాయం బారీన ప‌డ్డాడు. ప్రస్తుతం ఇంట‌ర్ మియామి క్ల‌బ్ త‌ర‌ఫున ఆడుతున్న మెస్సీ మేజ‌ర్ సాక‌ర్ లీగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం రాత్రి ఫిల‌డెల్ఫియా యూనియ‌న్‌తో ఇంట‌ర్ మియామి త‌ల‌ప‌డింది. 

    మ్యాచ్‌లో 73వ నిమిషంలో స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చిన మెస్సీ బంతిని కొట్టే క్ర‌మంలో ఎడ‌మ కాలికి గాయ‌మైంది. అయితే మైదానం వీడే స‌మ‌యంలో నార్మ‌ల్‌గానే క‌నిపించిన‌ప్ప‌టికీ, డ‌గౌట్‌లో కూర్చున్న స‌మ‌యంలో తీవ్ర ఇబ్బందిగా మెస్సీ క‌నిపించాడు. మెస్సీ గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, గాయం తీవ్ర‌త కాస్త ఎక్కువ‌గానే ఉంద‌ని ఇంట‌ర్ మియామి కోచ్ గులెరెమో హొయెస్ పేర్కొన్నాడు. 

    మ‌రో 15 రోజుల్లో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మొద‌లుకానున్న నేప‌థ్యంలో మెస్సీ సాక‌ర్ సంగ్రామంలో ఆడుతాడా లేదా అనేది అనుమానంగా మారింది. మెస్సీ గాయంపై అర్జెంటీనా ఫుట్‌బాల్ జ‌ట్టు స్పందించ‌న‌ప్ప‌టికీ, అత‌డి గాయంపై ఆందోళ‌నతోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. జూన్ 11న మొద‌లుకానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి.

    గ్రూప్ జెలో ఉన్న‌ అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌ను జూన్ 17న అల్జీరియాతో ఆడ‌నుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్‌లు గ్రూప్‌-జెలో ఉన్నాయి. ఇక ఫిలడెల్ఫియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంట‌ర్ మియామి 0-6తో విజ‌యాన్ని అందుకుంది.

    చదవండి: కెప్టెన్సీ విమర్శలపై రహానే ఘాటు వ్యాఖ్యలు

  • పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంచలనం సృష్టించాడు వైభవ్‌ సూర్యవంశీ. దేశీ క్రికెట్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీలతో సత్తా చాటి ఐపీఎల్‌ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను కొనుగోలు చేసింది.

    వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు
    అయితే, నాడు పద్నాలుగేళ్ల పిల్లాడికి అంతమొత్తం చెల్లించి రాజస్తాన్‌ తొందరపడిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వైభవ్‌ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ తన అద్భుత ప్రదర్శనలతో వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు.

    అత్యధిక పరుగుల వీరుల జాబితాలో
    అరంగేట్ర సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో రాణించిన వైభవ్‌ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి విధ్వంసకర సెంచరీ (36 బంతుల్లో) సాయంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. 583 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-5లో నిలిచాడు.

    ఒకప్పుడు రాజస్తాన్‌ పోస్టర్‌ బాయ్‌
    అదే సమయంలో మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 397 పరుగులు చేశాడు. కాగా ఒకప్పుడు రాజస్తాన్‌ పోస్టర్‌ బాయ్‌గా యశస్వి ముందు వరుసలో ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని వైభవ్‌ ఆక్రమించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

    భారత స్పిన్‌ దిగ్గజం, రాయల్స్‌ మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి.. వైభవ్‌ ఆట తీరు వల్ల జైసూ ప్రభావితం అయ్యాడని.. అందుకే ఈ సీజన్లో సరిగ్గా ఆడలేకపోయాడని పేర్కొన్నాడు.

    జైసూ విఫలం.. వైభవ్‌ను నిందించిన అశూ!
    తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఈసారి యశస్వి జైస్వాల్‌ ప్రదర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అంచనాలు అందుకోలేకపోయాడు. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండటమే ఇందుకు కారణం కావొచ్చు.

    అయితే, నాకు మరో సందేహం కూడా ఉంది. మరో ఎండ్‌లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం జైస్వాల్‌ను భయపెట్టిందని నాకు గట్టిగా అనిపిస్తోంది. నాకు తెలిసి వైభవ్‌ ఆట తీరు జైసూను కుదేలు చేసి.. గందరగోళంలోకి నెట్టేసి ఉంటుంది.

    సెహ్వాగ్‌- ఆకాశ్‌ మాదిరి
    టెస్టుల్లో టీమిండియా స్టార్లు వీరేందర్‌ సెహ్వాగ్‌- ఆకాశ్‌ చోప్రా ఓపెనింగ్‌ జోడీ మీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆకాశ్‌ చోప్రా బాగానే ఆడతాడు. 30- 40 రన్స్‌తో శుభారంభమే ఇస్తాడు. అయితే, సెహ్వాగ్‌ విధ్వంసకర ఆట తీరు కారణంగా ఆకాశ్‌ చోప్రా కనుమరుగైపోయేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ బాగా ఆడిన అనుభవం ఆకాశ్‌ చోప్రాకు ఉంది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.

    ఇప్పుడు కూడా వైభవ్‌ సూర్యవంశీ ఊచకోత చూసి జైస్వాల్‌ కొద్దిగా షేక్‌ అయినట్లు కనిపిస్తోంది. ఓవైపు.. వైభవ్‌ చితక్కొడుతుంటే.. జైసూ బంతిని బాదేందుకు కష్టపడిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని అశూ పేర్కొన్నాడు.

    అశూ అభిప్రాయం సరైందేనా?
    అశ్విన్‌ అన్నట్లు వైభవ్‌ నిజంగానే జైసూను భయపెట్టాడా? అంటే.. నిజం కాకపోవచ్చనే అనిపిస్తోంది. 24 ఏళ్ల జైస్వాల్‌ 2020 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. టీమిండియా టెస్టు ఓపెనర్‌గానూ కావాల్సినంత అనుభవం ఉంది.

    నిజానికి వైభవ్‌ను చూస్తూ జైసూ భయపడుతున్నాడు అనడం కంటే.. 15 ఏళ్ల పిల్లాడిని స్ఫూర్తిగా తీసుకుని మరో ఎండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. 

    సీనియర్‌ ఓపెనర్‌గా మైదానంలో వైభవ్‌కు పెద్దన్నలా సలహాలు ఇస్తూ.. అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ ఝులిపించడంలోనూ జైసూ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఏదేమైనా వైభవ్‌ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం త్వరలోనే టీమిండియా ఓపెనర్‌గా సీనియర్లకు పోటీగా మారడం ఖాయం.

    చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓట‌మితో ముగించింది. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 40 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌య్యింది. అయితే అంత‌క‌ముందే రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ముంబైపై గెలిచి ప్లేఆఫ్స్‌కు చేర‌డంతో ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ నామామాత్రంగా మారిపోయింది. అయితే విజ‌యంతో సీజ‌న్‌ను ముగిద్దామ‌నుకున్న కేకేఆర్‌కు భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో భంగ‌పాటు ఎదురైంది. 

    ఈ సీజ‌న్‌లో కేకేఆర్ ఆట‌తీరుపై, ర‌హానే నాయ‌క‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌, త‌న కెప్టెన్సీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ర‌హానే ఘాటుగా స‌మాధాన‌మిచ్చాడు. ర‌హానే మాట్లాడుతూ.. ‘జ‌ట్టు వ‌రుస ఓట‌ములతో కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా వెనక్కి తగ్గడం నా డిక్షనరీలోనే లేదు. నేను ఎప్పుడూ సవాళ్లను చూసి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. 

    ఈ కఠిన పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఆలోచన నా మనసులోకి ఒక్కసారి కూడా రాలేదు. ఒక నాయకుడిగా జట్టును ముందుకు నడపడమే తన బాధ్యత అని, గెలుపోటములు ఆటలో సహజం. నేనైతే కేకేఆర్‌తోనే కొనసాగాలనుకుంటున్నా. నాకు ఆడాలనిపించినకాలం క్రికెట్ ఆడుతాను. రిటైర్మెంట్ ఆలోచన ఇప్పుడేం లేదు. 

    ఐపీఎల్ ముగియడంతో కొంతకాలం కుటుంబంతో గడుపుతాను. ఆ తర్వాత ముంబైలో లోకల్ లీగ్‌లో పాల్గొంటాను. క్రికెట్ ఆడడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని రహానే చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ ప్రదర్శనపై కూడా రహానే స్పందించాడు. 

    ‘సీజన్‌ ఆరంభంలో వరుస పరాజయాలు మా జట్టును కుంగదీశాయి. కానీ రెండో అంచె పోటీల్లో గోడకు కొట్టిన బంతిలా మేం తిరిగి ఫుంజుకున్నాం. వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి కూడా వచ్చాం. కొన్ని మ్యాచ్‌ల్లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయాం. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచి ఉండుంటే ఇవాళ ప్లేఆఫ్స్‌లో ఉండేవాళ్లం.  రాబోయే సీజన్‌లో తప్పులను సరిదిద్దుకుని బలంగా పునరాగమనం చేస్తాం.’ అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు.

    ఈ సీజ‌న్‌లో కేకేఆర్ ప్ర‌యాణం అంచ‌నాల‌కు భిన్నంగా సాగింది. ఒక మ్యాచ్ రద్దు సహా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన కేకేఆర్ తొలి హాఫ్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. అయితే రెండో సగంలో మాత్రం వరుసగా నాలుగు విజయాలు సాధించి ఔరా అనిపించింది. మధ్యలో ఆర్సీబీ చేతిలో ఓడినా మళ్లీ రెండు విజయాలు సాధించిన కేకేఆర్ ఒక్కసారిగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.

    కానీ పంజాబ్‌, రాజస్తాన్‌లతో పోలిస్తే నెట్ రన్‌రేట్ చాలా తక్కువగా ఉండడంతో పోటీలో ఉన్నప్పటికీ ఇతర జట్ల విజయాలపై ఆధారపడాల్సి వచ్చింది. రహానే కెప్టెన్సీపై విమర్శలు వచ్చినప్పటికీ, అతడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా జట్టును సమర్థంగా నడిపించాడు. ఐపీఎల్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ వచ్చే సీజన్‌లో తప్పులను సరిదిద్దుకొని సత్తా చాటుతుందని ఆశిద్దాం.

    చదవండి: హెడ్ భార్య‌కు అవమానం.. వికృత చేష్ట‌లు ఆపండి!

Andhra Pradesh

  • అనకాపల్లి: జిల్లాలో మత్య్సకారులు నిరసన చేపట్టారు. ఎస్‌ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో చేపట్టారు మత్య్సకారులు. తమకు భరోసా కింద ఇస్తానన్న రూ. 20 వేలు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. బోటులపై  లైసెన్స్‌లు, పాస్‌బుక్‌లతో బొట్లపైనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. 

    సముద్రoలో చేపల వేట నిషేధం సమయంలో 20వేల రూపాయలు మత్స్యకారుల భరోసా ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అయితే పాయకరావుపేట నియోజకవర్గంలో  1380 మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పడలేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారుల భరోసా 20వేల రూపాయలు వెయ్యాలంటూ డిమాండ్ చేశారు. కాని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

  • సాక్షి,విజయవాడ: ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత మరో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. నేడు అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 46.3, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 46.1, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిలో 45.7, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు 45.4, కోనసీమ జిల్లా శివల, కాకినాడ జిల్లా కాజులూరులో 45.2,గుంటూరు జిల్లా మంగళగిరిలో 44.9, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7, విశాఖ జిల్లా ములగాడ 44.4, తూర్పుగోదావరి జిల్లా పోతవరం 44.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    మంగళవారం వాతావరణ సూచన
    ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.  

    శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

  • భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తన ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌. ఈ మేరకు భీమవరం కలెక్టర్  కార్యాలయంలో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. 

    స్థలం వివాదం కోర్టులో ఉన్నప్పటికీ పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారని అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అనంత్ శ్రీరామ్ వినతి పత్రం అందజేశామన్నారు.

  • విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అ​న్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.

    ‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?

    సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది. 

    చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు  P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.

    ఎక్కువ మందిని కనాలా? 
    పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు  కీర్తిస్తున్నాడు. 

    ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్‌కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు.

  • సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌ను  పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.

    చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం..  దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?.  

    పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు?.కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?

    రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేర‌సారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్‌ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్‌ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్‌ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్‌ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు?

    దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్‌ చేశారు. 
     

     

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసలు బుద్దుందా?.. ఎవరిది గొడ్డలి పార్టీ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?. దస్తగిరిని నెత్తిన పెట్టుకుంది టీడీపీ కాదా?. బీటెక్‌ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నువ్వెంత.. నీ బతుకెంత.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

    పులివెందులలో వైఎస్సార్‌సీపీ బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఇతర కీలక నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమరావతిలో చంద్రబాబు కట్టే బిల్డింగుల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలన్నిటినీ పూర్తి చేయవచ్చు. ఇలాంటి దోపిడీని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు.. ఎదురుదాడికి దిగుతారు. గతంలో పన్నులు తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ పని మాత్రం చేయడం లేదు. వీటన్నిటిపై వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే జవాబు లేదు.

    మీరు చేస్తున్న తప్పులను సరిచేసుకోండి అంటే వాళ్లు.. స్వర్గీయ రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు. లేదంటే వైఎస్సార్‌ గురించి మాట్లాడతారు. గొడ్డలి పార్టీ అంటారు. అసలు చంద్రబాబుకు బుద్ధుందా?. తానే గొడ్డలితో కిరాతకంగా చంపానని దస్తగిరి చెప్తే.. అతన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నది మీ పార్టీ కాదా?. ఏరకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. గొడ్డలి పార్టీ మీది. గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరు. మా ప్రశ్నలకి సమాధానం లేక.. చేతిలో అధికారం ఉందని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పులివెందులలో ఉన్న టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పులివెందులకు కన్నం వేసి దోచేసుకుంటున్నారు.

    నోరు జాగ్రత్తగా పెట్టుకో..
    ఇక్కడి బైరెటిస్, ఇసుక మొత్తాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నారు. పులివెందులలో వీళ్లు ఏ ఒక్క సమస్యనైనా పట్టించుకుంటున్నారా?. పులివెందుల ప్రజలు పట్టరు కానీ.. కేవలం జగన్నను తిడితే మీకు రాజకీయంగా మనుగడ అని భ్రమల్లో బతుకుతున్నారు. మీ ప్రతి ఒక్క మాటకూ జవాబు తప్పకుండా చెప్తాం. నిన్న బీటెక్‌ రవి.. వాడు వీడు అనే లెవల్‌లో మాట్లాడాడు. నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు?. నువ్వెంత.. నీ బతుకెంత? ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు. అలాంటి నువ్వు వైఎస్‌ జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా? నోరు జాగ్రత్తగా పెట్టుకో.

    బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?
    మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చావ్‌.. ఎందుకొచ్చావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి 12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చాడు. ఆనాడు జగన్‌ అలాంటి పనులు చేయన‌ని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా.. మీరు ఒప్పుకుంటే వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా?. మా పార్టీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్‌ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా?. ఇదీ బీటెక్‌ రవి బతుకు. ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది. అలాంటి వ్యక్తి ఈరోజు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారందరికీ మనం అధికారంలోకి రాగానే మంచి సమాధానం చెబుదాం. కక్షలు, కార్పణ్యాలు కాకుండా.. మనం ప్రజలకు మంచి చేసి ఇలాంటి వారికి బుద్ధి చెబుదాం.

  • కర్నూలు:  బక్రీద్‌ పండుగ సమీపిస్తుండటంతో ముస్లింలు ఖుర్బానీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొట్టేళ్ల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎమ్మిగనూరు పొట్టేళ్ల సంత కిటకిటలాడింది. ఎమ్మిగనూరుతో పాటు కర్నూలు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కొనుగోలు దారులు తరలివచ్చారు. వ్యాపారులు, పొట్టేళ్ల పోషకులు పొట్టేళ్ల ధరను పెంచి విక్రయించారు. ఒక్కొక్కటి రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పైగా ధర నిర్ణయించి విక్రయానికి ఉంచారు. పండుగకు ముందు వచ్చే చివరి ఆదివారం సంతలో పొటేళ్ల క్రయ,విక్రయాలు జోరందుకున్నాయి.  
     

Telangana

  • హైదరాబాద్‌: హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది.   ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కోఠి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, చింతల్‌, బాలానగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెంట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.   కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా,  అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. 

    ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్‌లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. 

    మెదక్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్‌ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. 

    కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. 

  • సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నార‌ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర‌సింహ‌ సోమ‌వారం మీడియా స‌మావేశంలో తెలిపారు. పాత‌క‌క్ష‌ల నేప‌థ్యంలోనే మధును మ‌ట్టుబెట్టార‌ని చెప్పారు. త‌న తండ్రి హ‌త్య‌కు ప్ర‌తీకారంగా ప్ర‌ధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హ‌త్య‌కు పాల్ప‌డినట్టు ఎస్పీ వెల్ల‌డించారు. అత‌డికి మరో ఐదుగురు స‌హ‌క‌రించార‌ని చెప్పారు.

    కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గుర‌య్యాడు. త‌న తండ్రిని హ‌త్య చేసిన మ‌ధుపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ర‌వీంద‌ర్‌ కొడుకు జీవన్ గ‌తంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్‌తో మధును హత్య చేశాడు. కొంత‌కాలంగా సూర్యాపేట బాలాజీన‌గ‌ర్‌లో కుటుంబంతో పాటు నివ‌సిస్తున్న మ‌ధును ప‌థ‌కం ప్ర‌కారం బ‌య‌ట‌కు తీసుకొచ్చి క‌త్తుల‌తో న‌రికి చంపారు.

    చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మ‌ధును చింత సైదులు శుక్ర‌వారం త‌న ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్‌తో కలిసి మ‌ధు మ‌ద్యం సేవించాడు. అత‌డు మ‌త్తులోకి జారుకోగానే జీవన్‌కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్‌తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వ‌చ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూట‌గ‌ట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్‌లో పడేశారు.

    మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉంద‌ని ఎస్పీ నర‌సింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్‌ల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఎస్పీ అన్నారు. 

    చ‌ద‌వండి: వ్య‌వ‌స్థ చ‌చ్చింది.. శవ‌మై న‌డిచింది!

  • హైదరాబాద్‌:  నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కోఠి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, చింతల్‌, బాలానగర్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెంట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.   కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా,  అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. 

    దీంతో హైదరాబాద్‌ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్‌వేవ్‌ను చూడాల్సి ఉంటుంది.

Family

  • అవి పర్వత శ్రేణులు మాత్రమే కాదు, ఒక జీవన వేదం. మంచు పర్వతాలతో మొదలయ్యి, ప్రశాంతమైన బుద్ధిస్ట్‌ ఆలయం వరకు నేపాల్‌లోని ప్రతీ ఒక్కటి మనకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ ఉన్న వాతావరణం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఖాట్మాండులో చారిత్రాత్మక కట్టడాల నుంచి పోఖరాలోని సరస్సు వరకు ప్రతీ అడుగు ఒక కొత్త కథలోకి ఎంటరైన ఫీలింగ్‌ను అందిస్తుంది.

    ప్రకృతి పరవశంలో...
    నేపాల్‌ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హిమాలయాలు. ఎండాకాలంలో మిగితా చోట్ల ఎండ ఎక్కువ ఉన్నా, ఇక్కడ అనేక చోట్ల వాతావరణం మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఖాట్మాండులోని ప్రాచీన కట్టడాలు, కొత్తగా అనిపించే వీధులు మన ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా మార్చుతాయి. ఇక్కడ ఉండే మనుషులు, వారి ఆత్మీయత మనం దూర ప్రాంతంలో ఉన్నాం అనే ఫీలింగ్‌ని దరిచేరనివ్వవు. ప్రతీ చిన్న గుడిలో ఉండే శాంతి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం కొత్త జ్ఞాపకంలా అనిపిస్తుంది.

    సందర్శనీయ ప్రదేశాలు
    ఖాట్మాండు సిటీలో ఉండే పశుపతినాథ్‌ ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అక్కడ జరిగే హారతి, వాతావరణం మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇక్కడ ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది. ఇంకా బౌద్ధనాథ్‌ స్తూపం వద్ద ఉండే ఆ శాంతి, అక్కడికి వచ్చిన భక్తుల మౌనం మనల్ని క్షణం పాటు స్థంభింపచేస్తాయి. 

    పోఖరకి వెళ్తే అక్కడ ఫేవా లేక్‌లో బోట్‌ రైడింగ్‌ చేస్తున్నప్పుడు కనిపించే మచ్ఛపుచ్చ్రే పర్వతం రిఫ్లెక్షన్‌ చూసేందుకు రెండు కళ్లు సరి΄ోవు. సరస్సు నుంచి వచ్చే చల్లని గాలి మన శరీరాన్నే కాదు మనసును కూడా హత్తుకుంటుంది. సారంగ్‌కోట్‌ నుంచి సూర్యోదయం చూడటం ఒక మరువలేని అనుభవంగా మిగిలి΄ోతుంది.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి ఖాట్మాండుకి డైరెక్ట్‌ ఫ్లైట్స్‌ లాంటి ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి. ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు మబ్బుల మధ్య కనిపించే హిమాలయ శిఖరాలు చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది. హైదరాబాద్‌ నుంచి ట్రైన్‌లో గోరఖ్‌పుర్‌ వరకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్‌ మార్గం ద్వారా నేపాల్‌ బార్డర్స్‌ దాటాల్సి ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక కొత్త ఫీలింగ్‌ ఇస్తుంది. విజయవాడ నుంచి వచ్చే వారు ముందుగా హైదరాబాద్‌ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్స్‌ తీసుకోవడం ఉత్తమం.

    ఎక్కడ ఉండాలి?
    నేపాల్‌లో స్టే చేయడం అంటే ఒక ప్రకృతి ఒడిలో నిద్ర΄ోవడం లానే ఉంటుంది. ఖాట్మాండులోని థామెల్‌ ఏరియాలో ఉన్న హాస్టల్స్‌లో ఉంటే అక్కడుండే వైబ్రెంట్‌ లైఫ్‌ని దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ స్ట్రీట్స్‌ అన్ని కొత్త పరిమళాలతో నిండి ఉంటాయి. పోఖరాలో సరస్సు పక్కనే ఉండే రిసార్ట్స్‌లో స్టే చేస్తే, పొద్దున్నే లేచే సరికి కనిపించే మౌంటెన్‌ వ్యూస్‌ మనసును ఉల్లాసపరుస్తాయి. ఇక్కడ రిసార్ట్స్‌లో ఉండే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అక్కడుండే చెట్ల మధ్య, చల్లని గాలి మధ్య స్పెండ్‌ చేయడం చాలా బాగుంటుంది.

    ఏం చూడాలి?
    నేపాల్‌లో ప్రతీ మూమెంట్‌ స్పెషల్‌. భక్తుపూర్‌లోని ప్రాచీన వీధులు, అక్కడుండే ఆర్కిటెక్చర్‌ చూస్తే మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్లామా అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. నాగర్‌కోట్‌ నుంచి కనిపించే ఎవరెస్ట్‌ రేంజ్‌ వ్యూస్‌ ట్రిప్‌కి ఒక హైపాయింట్‌లా ఉంటుంది. సమ్మర్‌లో అక్కడుండే గ్రీనరీ, మబ్బుల దోబూచులాట చూడటానికి చాలా బాగుంటాయి. పశుపతినాథ్‌ దగ్గర ఈవినింగ్‌ హారతి చూడటం, అక్కడి ఆట్మాస్ఫియర్‌ని ఫీల్‌ అవ్వడం ఒక గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌.

    ఏం తినాలి?
    నేపాల్‌లో ప్రతీ ముద్ద ఒక జ్ఞాపకంలా మిగిలి΄ోతుంది.ఇక్కడ మోమోస్‌ తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఒక యూనిక్‌ ఇమోషన్‌. మోమోస్‌ మాత్రమే కాదు, లోకల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆ రుచి మనసుకు హత్తుకుంటుంది. ట్రెడిషనల్‌ దాల్‌ భాట్‌ మనం తినే థాలిని పోలి ఉంటుంది. హిమాలయన్‌ స్పైసెస్‌ వల్ల కొత్త రుచి వస్తుంది. ఎండాకాలం బేవరేజెస్‌ అండ్‌ టీ వెరైటీలు రిఫ్రెషింగ్‌లా ఉంటాయి. వీటితో పాటు క్రిస్పీ సెల్‌ రోటీ, యోమారి లాంటి స్వీట్‌ డెలికసీస్‌ నేపాల్‌ ఆథెంటిక్‌ టేస్టును చూపిస్తాయి. స్ట్రీట్‌ ఫుడ్‌లో దొరికే చోయిలా, చాటామరి అనే నేపాల్‌ పిజ్జాను పర్యాటకులు బాగా ఇష్టపడతారు.

    నేపాల్‌ యాత్ర బడ్జెట్‌ వివరాలు
    నేపాల్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసేటప్పుడు 5 డేస్‌ ప్లాన్‌ చాలా బాగుంటుంది. టోటల్‌ ట్రిప్‌ బడ్జెట్‌ పర్‌ పర్సన్‌ వచ్చేసి మినిమం రూ.20 వేల అనుకుంటే, మ్యాక్సిమమ్‌ అనేది మీ ట్రావెల్‌ స్టైల్, రూమ్‌ అండ్‌ ఫుడ్, ఇతర ఖర్చులను బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా చెప్పాలంటే ఒక వ్యక్తికి వారం రోజుల నేపాల్‌ యాత్రకు యావరేజ్‌ రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.

    హైదరాబాద్‌ నుంచి ఖాట్మాండుకు ఫ్లైట్‌ చార్జీలు సీజన్, ప్రయాణించే క్లాసును బట్టి రూ.35 వేల నుంచి రూ.51 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రూమ్స్‌ విషయానికి వస్తే రూ.500కు కూడా రూమ్స్‌ లభిస్తాయి. కానీ అందులో సేఫ్టీ ఇష్యూస్‌ అండ్‌ సదు΄ాయాల కొరత ఉండే అవకాశం ఉంది. బడ్జెట్‌ సమస్యే కాదు అనుకుంటే రూ.10 వేలకు కూడా రూమ్స్‌ లభిస్తాయి.ఇక ఫుడ్‌ కాస్ట్‌ విషయానికి వస్తే యావరేజ్‌గా రోజుకు రూ.600 నుంచి రూ.1500 వరకు మీ టేస్ట్‌ అండ్‌ ప్రిఫరెన్స్‌ను బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్‌ ట్రావెలర్స్‌ కోసం గెస్ట్‌ హౌజెస్‌ కూడా ఆప్షన్స్‌ ఉంటాయి.

    ఎవరెస్ట్, కైలాస శిఖర దర్శనం
    నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ అండ్‌ పవిత్ర కైలాస పర్వత శిఖరాన్ని చూడటం ఒక తీయని అనుభూతిగా మిగిలి΄ోతుంది. ఖాట్మాండు నుంచి ఎర్లీగా మౌంటెన్‌ ఫ్లైట్‌ ఎక్కితే ఎవరెస్ట్‌ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఎవరెస్ట్‌ని చూసేందుకు ఫ్లైట్స్‌ ఉన్నా, కైలాస పర్వత దర్శనం కోసం హుమ్లాలోని లిమి ప్లాచా వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి చైనా వీసా లేకుండా దూరంగా ఉన్న కైలాస మానస సరోవర్‌ని కళ్లారా చూడవచ్చు.

    వీసా అవసరం లేదు
    భారతీయులకు నేపాల్‌ వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఓటర్‌ ఐడీ లేదా పాస్‌పోర్టు ఉంటే సరి΄ోతుంది. డిజిటల్‌ కాపీలను కాకుండా ఒరిజినల్‌ తీసుకెళ్లండి. ఎందుకంటే డిజిటల్‌ కాపీలు, ప్రింటౌట్లు, డిజిలాకర్‌ వర్షన్లను బార్డర్స్‌ అండ్‌ ఎయిర్‌΄ోర్టుల్లో యాక్సెప్ట్‌ చేయరు. మరో విషయం ఏంటంటే ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సులను అధికారిక ట్రావెల్‌ డాక్యుమెంట్స్‌గా అంగీకరించరు.

    తెలుసుకోవాల్సిన విషయాలు 
    1.    ప్రపంచంలోని టాప్‌ 14 అత్యంత ఎతైన పర్వతాల్లో 8 నేపాల్లోనే ఉన్నాయి.
    2.    గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన లుంబిని నేపాల్లోనే ఉంది.
    3.    నేపాల్‌ ఫ్లాగ్‌ ప్రపంచంలోనే యూనిక్‌ షేప్‌లో ఉంటుంది.
    4.    ఇక్కడ నేలీ భాషతోపాటు చాలామంది హిందీ, ఇంగ్లిష్‌ మాట్లాడుతారు.
    5.    ఇండియన్‌ కరెన్సీని కూడా ఇక్కడ యాక్సెప్ట్‌ 
        చేస్తారు.

    ఎండాకాలంలోవెళ్తే మాత్రం
    నే;ల్‌ సమ్మర్‌ ట్రిప్‌ వెళ్తే మాత్రం బ్రెతబుల్‌ కాటన్‌ క్లోత్స్, ఒక లైట్‌ జాకెట్‌ తీసుకెళ్లండి. వెళ్లే ముందు వాతావరణం అప్డేట్స్‌ తెలుసుకోవడం మరవకండి.
    ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు 

    నోట్‌: ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్‌ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్‌ అప్టేట్స్‌ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్‌ చేసుకోగలరు.  

    (చదవండి: ఇవాళ నుంచే రోహిణి కార్తె ప్రారంభం..! రోళ్లు పగిలే ఎండలకు కారణం ఇదే..)

  • సమ్మర్‌ హాలిడేస్‌ అంటే రోడ్‌ ట్రిప్స్‌ గుర్తొస్తాయి. హైవేస్, ప్లే లిస్టులు, టీ స్టాప్స్, సన్‌సెట్‌ డ్రైవ్స్‌ ఇవన్నీ ప్రయాణంలో భాగం అవుతాయి. కానీ ఎండాకాలంలో కార్‌ కేర్‌ చేయకపోతే జర్నీ మధ్యలో టైర్‌ పేలిపోవడం లేదా ఇంజిన్‌ వేడెక్కడం లాంటి సమస్యలు కూడా రెడీగా ఉంటాయి. రోడ్‌ ట్రిప్‌ అనే ఒక ఎగ్జైట్మెంట్‌ను బోనెట్‌ నుంచి వచ్చే పొగ తగ్గించే అవకాశం ఉంది.

    ఇంజిన్‌ హీట్‌తో జాగ్రత్త
    ఎండాకాలంలో లాంగ్‌ డ్రైవ్స్‌ చేస్తున్నప్పుడు ఇంజిన్‌ ఎక్కువ హీట్‌ అవ్వడం సాధారణం. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రత మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ట్రిప్‌ ముందు కూలెంట్‌ లెవల్స్‌ చెక్‌ చేయడం చాలా ఇంపార్టెంట్‌. రేడియేటర్‌ వాటర్‌ సరిగ్గా ఉందా లేదా అని ఒక్కసారి కన్ఫర్మ్‌ చేసుకోవాలి. 

    ఇంజిన్‌ ఆయిల్‌ పాతది అయితే వేడి ఎక్కువగా జనరేట్‌ అవుతుంది. అందుకే సర్వీసింగ్‌ను టైమ్‌కు చేయించడం మరవకండి. ట్రాఫిక్‌లో కంటిన్యూగా ఏసీ ఫుల్‌ బ్లాస్ట్‌లో వినియోగిస్తే చేస్తే కూడా ఇంజిన్‌ ప్రెషర్‌ పెరిగి΄ోతుంది. కొంచెం బ్రేక్స్‌ ఇస్తూ లాంగ్‌ డ్రైవ్‌ చేస్తే కార్‌కి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది.

    టైర్‌ పేలిపోకుండా ఉండాలి అంటే ..
    ఎండాకాలంలో స్పీడుగా వెళ్లడం అనేది కారుకు బల పెట్టడం పరీక్షలాంటిదే. ఎందుకంటే ఈ సమయంలో టైర్‌ ప్రెషర్‌ ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా.. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణానికి ముందు పీఎస్‌ఐ లెవల్స్‌ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్‌ చేయాలి. చాలా మంది అదనపు భద్రత కోసం టైర్లలో గాలిని ఎక్కువగా నింపుతారు. కానీ ఎండ వేడి కారణంగా ఆ గాలి విస్తరించి టైర్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

    అలాగే పాత టైర్లతో దూర ప్రయాణాలు ప్లాన్‌ చేయడం కూడా ప్రమాదకరం. టైర్‌ ఉపరితలంపై పగుళ్లు లేదా ఎక్కువగా అరిగిపోయిన గుర్తులు కనిపిస్తే వెంటనే మార్చించడం మంచిది. స్టెప్‌నీ పరిస్థితిని కూడా తప్పకుండా పరిశీలించాలి. సరైన కండిషన్‌లో ఉన్న టైర్‌ను మాత్రమే అదనపు టైర్‌గా వెంట తీసుకెళ్లడం సురక్షితం.

    స్మార్ట్‌ డ్రైవర్స్‌ బ్రేక్స్‌ తీసుకుంటారు
    లాంగ్‌ జర్నీలో ఆగకుండా డ్రైవ్‌ చేయడం కన్నా ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి చిన్న చిన్నబ్రేక్స్‌ తీసుకోవడం బెటర్‌. కార్‌ ఇంజిన్‌ కూల్‌ అవుతుంది. టైర్స్‌కి కూడా రెస్ట్‌ దొరుకుతుంది. మీకు కూడా కాస్త బాడీని స్ట్రెచ్‌ చేసుకుని టీ బ్రేక్‌ ఎంజాయ్‌ చేసే అవకాశం ఉంటుంది.

    రోడ్‌ ట్రిప్‌ మెమోరీస్‌ బ్యూటిఫుల్‌గా ఉండాలి అంటే డెస్టినేషన్‌ కన్నా ముందు బండి కండిషన్‌ చాలా ఇం΄ార్టెంట్‌. బండి భద్రం.. ప్రయాణం సురక్షితం. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం.  

  • ఎండాకాలం అంటే మన మైండ్‌లో ముందుగా ఫ్లాష్‌ అయ్యే ఇమేజ్‌ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్‌క్రీమ్‌. అయితే ప్రపంచంలో ఐస్‌క్రీమ్‌కు కూడా ఒక రాజధాని ఉంది అని దానిని ఐస్‌ క్రీమ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అని పిలుస్తారని తెలుసా?

    అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ‘లే మార్స్‌’ అనే స్మాల్‌ టౌన్‌ ఈ స్పెషల్‌ టైటిల్‌తో వరల్డ్‌ వైడ్‌ ఫేమస్‌ అయింది. ఈ పట్టణం చిన్నది అయినా అక్కడి ఐస్‌క్రీమ్‌ క్రేజ్‌ మాత్రం మామూలుగా ఉండదు. అక్కడ వీధుల్లో నడుస్తుంటే కూడా స్వీట్‌ వెనీల్లా సువాసన వస్తుంది అని టూరిస్టులు చెబుతారు.

    బ్లూ బన్నీ స్టోరీతో ఫేమస్‌ అయిన స్టోర్‌
    లే మార్స్‌ ΄పాపులారిటీ వెనక అతిపెద్ద కారణం వచ్చేసి వెల్స్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అనే కంపెనీ. ఈ సంస్థ నడిపించే బ్లూ బన్నీ అనే ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ చాలా పాపులర్‌ అయింది. కొన్ని దశాబ్దాల నుంచి ఐస్‌క్రీమ్‌ ప్రొడ్యూస్‌ చేస్తూ ఈ చిన్న పట్టణాన్ని అంతర్జాతీయ డెసెర్ట్‌ మ్యాపులో పెట్టింది ఈ సంస్థే.

    ప్రతీ రోజు ఇక్కడ భారీ పరిమాణంలో ఐస్‌క్రీమ్‌ ప్రిపేర్‌ చేస్తారు. వెనీల్లా, స్ట్రాబెర్రీ, చాకొలేట్, కేరామెల్‌ం సింపుల్‌ ఫ్లేవర్స్‌ నుంచి కలర్‌ఫుల్‌ క్రేజీ కాంబినేషన్స్‌ వరకు ఇక్కడ ఎన్నో ఆప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఐస్‌క్రీమ్‌ అనేది జస్ట్‌ ఫుడ్‌ మాత్రమే కాదుం లోకల్‌ కల్చర్‌లో ఒక పార్ట్‌లా ఫీల్‌ అవుతుంది.

    ఫ్రోజెన్‌ కార్నివాల్‌ వైబ్‌
    లే మార్స్‌ వీధుల్లో ఐస్‌క్రీమ్‌ థీమ్‌ అనేది ప్రతీ చోట కనిపిస్తుంది. క్యూట్‌ ΄ార్లర్స్, డెజర్ట్‌ కేఫ్స్, జయంట్‌ స్కూప్‌ స్టాట్యూలు, కలర్‌ఫుల్‌ బోర్డులుం సిటీ మొత్తం ఒక ఫ్రోజెన్‌ కార్నివాల్‌లా ఉంటుంది. విజిటర్స్‌ కోసం స్పెషల్‌గా ఐస్‌ క్రీమ్‌ మ్యూజియం, ఫ్యాక్టరీ టూర్స్, టేస్టింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కూడా అరేంజ్‌ చేస్తారు. 

    ట్రావెల్‌ లవర్స్‌కి లే మార్స్‌ అనేది నార్మల్‌ ఫుడ్‌ డెస్టినేషన్‌ కాదు. చైల్డ్‌హుడ్‌ సమ్మర్‌ మెమోరీస్‌ని ఫ్రీజర్‌లో ప్రిజర్వ్‌ చేసినట్టు అనిపించే స్వీట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. మన దగ్గర మ్యాంగో సీజన్‌ కోసం వెయిట్‌ చేస్తాము. కానీ అక్కడ ప్రతీ రోజు ఒక ఐస్‌క్రీమ్‌ సీజన్‌లాగే ఉంటుంది.  

  • పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్‌  చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.

    మహారాణి రాధికరాజే గైక్వాడ్‌ తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో సికింద్రాబాద్‌కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్‌ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్‌, కంబైన్డ్‌ ఇక్కత్‌ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. 

    ఆమె ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్‌లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్‌లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. 

    అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్‌గా పిలిచే ఈ చీరలో మోటీఫ్‌ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్‌ మోటిఫ్‌లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్‌ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్‌కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.

    తెలియా రుమాల్ చరిత్ర
    తెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే  జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్‌ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. 

    దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్‌కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్‌లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్‌బుల్‌ కానీ విధంగా ధరించేవారట.

    ఇక డబుల్ ఇక్కత్‌ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్‌) కూడా  లభించింది.

     

    (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్‌ ట్రెండ్‌..! ఇది పెద్దలకు మంచిదా?)

  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం మారింది. ప్రజల ఆలోచన, ఆచరణ కూడా మారింది. విలువలూ మారిపోతున్నాయి. అయితే, ఏ విషయంపైనా ఆసక్తి, శ్రద్ధ నిమిషమైనా నిలపలేని స్పీడు యుగంలోకి వచ్చిపడ్డప్పటికీ... నేటికీ నాణ్యమైన, నిఖార్సయిన మనుషులు, రచనలకే అసలు సిసలు విలువ. జీవితంలోనూ, పత్రికారచన వృత్తిలోనూ అలాంటి విలువలకు కట్టుబడి, ప్రమాణాలు పాటించినందుకే... ఆనాటి పాత్రికేయ శిఖరం గోరాశాస్త్రి లాంటి వారిని ఇవాళ్టికీ గుర్తు చేసుకుంటున్నామని గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్టు పురస్కార ప్రదానోత్సవం మరోసారి నిరూపించింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మే 23 సాయంత్రం దాదాపు నాలుగు గంటల పైగా సుదీర్ఘంగా సాగిన ఈ కార్యక్రమంలో అతిథులందరూ సృజనాత్మక రచయితగా, పత్రికా రచయితగా గోరా శాస్త్రి విశిష్టతను పునఃస్మరణ చేశారు. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ఉద్రిక్తతలు నెలకొన్న నేటి పరిస్థితుల్లో పత్రికా రచన మరింత బృహత్తరమైన బాధ్యత అన్న సంగతి గుర్తు చేశారు.

    దాదాపు అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ పత్రికా రచనానుభవమున్నఏడున్నర పదులు పైబడిన అవిశ్రాంత పాత్రికేయుడు గుండు వల్లీశ్వర్‌కు (Gundu Valliswar) భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును అందించారు. వల్లీశ్వర్, లలితకుమారి దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి, సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ‘ఎమెస్కో’ ప్రచురణల అధినేత విజయకుమార్, ‘సాక్షి’ జర్నలిజం స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ గోవిందరాజు చక్రధర్, వరంగల్ దగ్గరి చండీపరమేశ్వరీ పీఠాధిపతి అవసరాల ప్రసాదశర్మ సిద్ధాంతి తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

    సత్యానికి దగ్గరగా... సంచలనానికి దూరంగా... 
    “శాసన, న్యాయ, పరిపాలక వ్యవస్థలు మూడింటిలో ఏది దారి తప్పినా... వాటిని సరైన మార్గంలో పెట్టాల్సింది మీడియా. అందుకే, ‘ఫోర్త్ ఎస్టేట్‌’గా పేరుతెచ్చుకొని ప్రజాస్వామ్యానికి అది నాలుగో స్తంభమైంది. ప్రమాణాలు, విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, శివలెంక శంభుప్రసాద్, నీలంరాజు వెంకట శేషయ్య, గోరాశాస్త్రి లాంటి ఆ తరం పాత్రికేయ దిగ్గజాల గురించి అందరూ తప్పనిసరిగా చదవాలి. నిక్కచ్చిగా, నిర్భయంగా వ్యవహరించిన వారిని మార్గదర్శకంగా తీసుకోవాలి. హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ మేళవించిన గోరాశాస్త్రి (Gora Sastry) రచనలు చాలా ప్రసిద్ధి. ఆ రోజుల్లో ఆయన సంపాదకీయాలంటే జనం చెవికోసుకొనేవారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ అధినేత రామనాథ్ గోయెంకా, ‘స్టేట్స్‌మన్’ పత్రిక ఎడిటర్ -ఇన్-ఛీఫ్ సి.ఆర్. ఇరానీ పాలకుల దౌర్జన్య విధానాలకు వ్యతిరేకంగా దృఢంగా ఎదురు నిలిచారు. మన దగ్గర గోరాశాస్త్రి సంపాదకీయాలు ఓ సంచలనం. అప్పటికి యువ రాజకీయనేతలమైన ఎస్. జైపాల్ రెడ్డి గారు, నేను, ఇతరులం గోరాశాస్త్రి సంపాదకీయాలను చదివి, మార్గదర్శనం పొందేవాళ్ళం” అని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు.

    “ప్రమాణాలు (వాగ్దానాలు) చేయడం కాదు... ప్రమాణాలను (స్టాండర్డ్స్‌ను) పాటించడం ప్రస్తుత అవసరం అన్న మాజీ ఉపరాష్ట్రపతి, “జర్నలిస్టులు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తూ, ఇవాళ అందుకు పూర్తి వ్యతిరేకంగా... సత్యానికి దూరంగా, సంచలనానికి దగ్గరగా మీడియా ఉంటోంది. ఈ పరిస్థితులు మారాలి. అందుకు పాత తరం గొప్ప జర్నలిస్టుల జీవితం, ఆచరణలే మార్గదర్శి” అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ‘ఎమెస్కో’ ప్రచురణలకు కంటెంట్ హెడ్‌గా వ్యవహరిస్తున్న వల్లీశ్వర్‌తో తన చిరకాల పరిచయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, “ఇవాళ అరుదైపోతున్న నిబద్ధత, నాణ్యత, ప్రతిభ, విలువలు... అన్నీ ఉన్న జర్నలిస్టు వల్లీశ్వర్. అనువాదంలో అందె వేసిన చేయి. జాతీయవాద భావాలున్న వ్యక్తి. మానవ సంబంధాల విలువ తెలిసిన మనిషి. ఆయనకు గోరాశాస్త్రి అవార్డు ఇవ్వడం సముచితం” అని ప్రశంసించారు.

    వై.ఎస్.కి ఛీఫ్ పీఆర్వోగా... ఆయన మెప్పు పొంది...
    సాంస్కృతిక సంస్థ ‘నవసాహితీ ఇంటర్నేషనల్’, ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా’ (తెలంగాణ) వారితో కలసి ఈ గోరాశాస్త్రి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిపింది. గోరాశాస్త్రి కుమార్తె – అల్లుడి కుటుంబం ప్రాయోజకత్వంలో దాదాపు ఏటా ఓ ఉత్తమ జర్నలిస్టును ఎంచుకొని, ఈ పురస్కార ప్రదానం చేస్తున్నారు. తాజాగా జరిగిన ప్రదానోత్సవం ఆ వరుసలో మూడోది. ముందుగా ఔత్సాహిక గాయనుల పాటకచ్చేరీ, ఆ తర్వాత పురస్కార ప్రదాన సభ జరిగాయి.

    రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమాలకు ఆత్మబంధువైన డాక్టర్ కె.వి. రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ, “నిస్వార్థంగా, నిరాడంబరంగా జీవితం గడిపే వ్యక్తుల్ని, జర్నలిస్టుల్ని సమాజం గుర్తుంచుకోవాలి. గౌరవించుకోవాలి. అందులో భాగమే ఈ సన్మానం. ‘ఉంటే ఇలా ఉండాలి’ అనేలా అర్థవంతంగా, నిరాడంబరమైన జీవితం గడిపిన వ్యక్తి గోరాశాస్త్రి. ఆయన మార్గంలోనే జిజ్ఞాస, జ్ఞానసముపార్జనతో నియమబద్ధంగా జీవితం సాగిస్తూ వచ్చారు వల్లీశ్వర్” అని పేర్కొన్నారు.

    “ఒక జర్నలిస్టుగా రిపోర్టింగ్‌లోని గ్లామర్, గ్రామర్... రెండూ సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్‌కు తెలుసు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసినవాడు. 2004లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి ఛీఫ్ పీఆర్వోగా ఆయన పనిచేసినప్పుడు, నేను సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ని. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హైదరాబాద్‌లో పర్యటించేలా చూడడంలో, అలాగే మొదట వీలుకాదన్న ‘బిట్స్ – పిలానీ’ సంస్థ సైతం చివరకు మనసు మార్చుకొని ‘బిట్స్ – హైదరాబాద్’ శాఖను భాగ్యనగరంలో ఏర్పాటు చేసేలా చూడడంలో వై.ఎస్. వెంటే నిలిచి, వల్లీశ్వర్ ముఖ్యపాత్ర పోషించారు. అలాగే, “సర్కార్ పత్రిక” అయిన రాష్ట్రప్రభుత్వ మాసపత్రిక ‘ఆంధ్రప్రదేశ్‌’ను అందరూ చూసేలా, చదివేలా ఓ “సాహిత్య పత్రిక”గా తీర్చిదిద్ది, దాదాపు 40 వేల కాపీల సర్క్యులేషన్‌కు తీసుకువెళ్ళారు. ఆ పత్రికలో ఆయన ప్రచురించిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితకథ ఓ సంచలన ప్రయోగం. ఆ జీవితకథను స్వయంగా వై.ఎస్. చదివి, అభినందిన సందర్భానికి నేను ప్రత్యక్ష సాక్షిని” అని రమణాచారి వివరించారు.  

    భవిష్యత్తులో దొరకడం కష్టమే!: ‘ఎమెస్కో’ విజయకుమార్
    ‘ఎమెస్కో బుక్స్’ అధినేత దూపాటి విజయకుమార్ మాట్లాడుతూ, “ఈ వేదికపై ఉన్న అందరూ మా ఎమెస్కో ప్రచురణ సంస్థ రచయితలే! వారి పుస్తకాలను మేము ప్రచురించడం మాకు సంతోషం కలిగించిన విషయం. కీర్తిశేషులైన ఐ.ఏ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్ వల్ల వల్లీశ్వర్‌తో నాకు పరిచయం. ఎప్పుడో ‘న్యూస్ టైమ్’ ఆంగ్ల పత్రికలో ఉండగానే వల్లీశ్వర్ గారిని మా సంస్థ సంపాదక మండలిలో భాగం కావాల్సిందిగా కోరాను. అంతలో ఆయన ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డికి సీపీఆర్వో అయ్యారు. ఆ బృహత్తర బాధ్యతలు నిర్వహించిన చాలా కాలం తర్వాత ఆయన అప్పటి ఆ మాట నిలబెట్టుకొని, మా సంస్థలో భాగమయ్యారు” అని గుర్తు చేసుకున్నారు. “అద్భుత రసాన్ని అపూర్వంగా ఆవిష్కరించడంలో వల్లీశ్వర్ ప్రముఖుడు. గోరాశాస్త్రి పేరిట ఇస్తున్న ఈ అవార్డుకు, వారి మార్గంలోనే తెలుగు, ఇంగ్లీషుల్లో ద్విభాషా జర్నలిస్టుగా రాణించిన వల్లీశ్వర్ అన్ని విధాలా అర్హుడు” అని పేర్కొన్నారు.

    అదే సమయంలో, “గోరాశాస్త్రి తరం నెలకొల్పిన విలువలకు ప్రతీకగా నిలిచే జర్నలిస్టులను ఈ అవార్డులకు ఎంచుకోవాలంటే రానురానూ క్లిష్టతరం కావచ్చు. ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకోదగ్గ నిఖార్సైన జర్నలిస్టులు మున్ముందు దొరక్కపోవచ్చు. అలాంటి జర్నలిస్టులు మరో ఇద్దరు, ముగ్గురికి మించి లేరేమో అనిపిస్తోంది. సమాజంలో, పత్రికా రచనలో పెద్దమనుషుల తరం అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితులపై జర్నలిస్టులు ఆలోచించాలి” అని ‘ఎమెస్కో’ విజయకుమార్ సమకాలీన పరిస్థితులను కుండబద్దలు కొట్టడం గమనార్హం.  

    మీరు ఆశుకవులు... మేము ఆలస్య కవులం!: సుద్దాల
    ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ విశిష్ట అతిథిగా పాల్గొంటూ, “సంభాషణాత్మక సంపాదకీయాలు రాసిన విశిష్టులు గోరాశాస్త్రి. ఆయనలోని ప్రత్యేకత... ఎవరికీ, దేనికీ లొంగని స్వతంత్రత. ఒకసారి సంప్రదాయవాదిగా, మరోసారి సంప్రదాయ విరోధిగా కనిపించే ఆయన ఏ ఒరలోనూ ఇమడని ఖడ్గం. ఒక్క ముక్కలో ‘హీ ఈజ్ యాంటీ ఫర్ యాంటీ’. అందుకే, ఆయనను “తెలుగు ‘స్వతంత్రు’డు గోరాశాస్త్రి” అన్నారు అని గుర్తు చేశారు. ‘ప్రాస ప్రవాహోపన్యాస విన్యాసం వెంకయ్య నాయుడు’ గారు అయితే, ‘పాత్రికేయ అక్షర కల్పవల్లీశ్వరుడు... మన వల్లీశ్వరుడు’ అంటూ పదప్రయోగంతో సభికుల హర్షధ్వానాలు అందుకున్నారు. “పత్రికా రచయితలు ఆశుకవులు, మేము (సినీ కవులం) ఆలస్య కవులం” అని సినీ గేయరచనలో జాతీయ అవార్డు అందుకున్న సుద్దాల చమత్కరించారు.  

    సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా... గోరాశాస్త్రి!
    ‘సాక్షి’ జర్నలిజమ్ స్కూల్, ‘రచన’ జర్నలిజమ్ కాలేజీల మాజీ ప్రిన్సిపాల్ - సీనియర్ జర్నలిస్టు – గోరాశాస్త్రిపై కేంద్ర సాహిత్య అకాడెమీకి మోనోగ్రాఫ్ రాసిన రచయిత అయిన గోవిందరాజు చక్రధర్ మరో విశిష్ట అతిథిగా ఉపన్యసించారు. “జర్నలిస్టుగా ఉంటూనే సృజనాత్మక రచయిత కావడం చాలా కొద్దిమందిలోనే చూస్తాం. స్థిరమైన రైల్వే ఉద్యోగం వదిలి, ఇంగ్లీషు ‘స్వతంత్ర’ పత్రిక సంపాదకులైన ఖాసా సుబ్బారావు ప్రేరణతో కాకతాళీయంగా జర్నలిజంలోకి వచ్చారు గోరాశాస్త్రి. అయితేనేం, ఇటు సంపాదకుడిగా, అటు ‘వినాయకుడి వీణ’ కాలమిస్టుగా, శ్రవ్యనాటికల రచయితగా వైభవోజ్జ్వలమైన జీవితాన్నీ, వృత్తి జీవితాన్నీ గడిపారు. రచనా మార్గంలో తాను నడుస్తూ, తోటి వారిని సైతం ప్రోత్సహిస్తూ, కె. రామలక్ష్మి (ఆరుద్ర), ఎస్. రమాదేవి లాంటి పలువురిని కాలమిస్టులుగా, రచయితలుగా తీర్చిదిద్దిన అరుదైన వ్యక్తి ఆయన. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి సినిమా రచనలో సహకారం అందించిన గోరాశాస్త్రి, మరో నాలుగైదు సినిమాలకు తెర వెనుక అజ్ఞాత రచయితగా కూడా పనిచేశారు” అని చక్రధర్ వివరించారు.

    “అప్పట్లో సికింద్రాబాద్ నుంచి ఆరంభమై, ఇక్కడ నుంచే వెలువడుతూ వచ్చిన ‘ఆంధ్రభూమి’ డైలీకి తెలుగులో, దాని మాతృసంస్థ ‘దక్కన్ క్రానికల్’ డైలీకి ఇంగ్లీషులో... ఇలా రెండు వేర్వేరు భాషల్లో, రెండు విభిన్నమైన అంశాలపై... ఒకే రోజున ఒకే మనిషి సంపాదకీయాలు రాయడం గోరాశాస్త్రికే చెల్లింది” అన్నారు. ఆయన సంపాదకీయాలు, కాలమ్స్‌లోని వైవిధ్యమైన ఇతివృత్తాలు, వ్యంగ్య శైలీ విన్యాసం సహా పలు అంశాలను సోదాహరణంగా వివరించారు. “ద్విభాషా జర్నలిస్టుగా, సృజనాత్మక రచయితగా గోరాశాస్త్రికీ, వల్లీశ్వర్‌కూ కొన్ని సారూప్యాలు ఉన్నాయి. గోరాశాస్త్రి ‘భాణాలు’ అనే సాహిత్య రూపక ప్రక్రియలో రచనలు చేస్తే, వల్లీశ్వర్ ‘99 సెకన్ల కథలు’ అంటూ వినూత్నంగా చిట్టిపొట్టి కథలు అందించారు. నిజానికి, వల్లీశ్వర్‌లో ‘గుడ్ స్టోరీ టెల్లర్’ ఉన్నాడు. అందుకే, ఆయనను ‘కథల కన్నయ్య’ అనాలంటాను” అని చక్రధర్ వ్యాఖ్యానించారు.  

    మాటల దౌత్యం... “యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!”
    ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగించి, ఇటీవలి వరకు ఇరాన్‌లో దౌత్యవేత్తగా పనిచేసిన యువకుడు జి. రాజా కార్తికేయ మాట్లాడుతూ, తనపై తన తండ్రి వల్లీశ్వర్ ప్రభావాన్ని ఆసక్తిగా చెబుతూ, సభికుల ప్రశంసలు అందుకున్నారు. “జీవితంలోనైనా, వృత్తి జీవితంలోనైనా పైకి రావాలంటే ఓర్పు, నేర్పు... అనే రెండు ప్రధాన లక్షణాలు కీలకం. ఆ సంగతి మా నాన్న గారిని చూసి నేర్చుకున్నా. ఇరుపక్షాలకు వారధిగా వ్యవహరిస్తూ, ‘యూ ఆర్ రైట్! బట్ హి ఈజ్ నాట్ రాంగ్!!’ అంటూ తరచూ ఆయన ఉటంకించే మాట నాకు దౌత్యరంగంలో ఎంతో ఉపకరించింది. అలాగే, ‘హెచ్.ఆర్.’ అంటే కేవలం ‘హ్యూమన్ రిసోర్సెస్’ (మానవ వనరులు) కాదు... ‘హ్యూమన్ రిలేషన్స్’ (మానవ సంబంధాలు) అనేదీ ఆయన నేర్పిన పాఠమే! అలాగే, ఆఫ్ఘనిస్తాన్‌లో లొంగిపోయిన తీవ్రవాదుల పునరావాస ఉపాధి నిధులు స్వాహా అయినప్పుడు, దానిపై నేను పోరాడేందుకు స్వాతంత్ర్య సమరంలో మా తాత గారు, 1971-72లో ‘జై ఆంధ్రా’ ఉద్యమ సమయంలో ఏలూరులో పోలీసు కాల్పుల వేళ జర్నలిస్టుగా మా నాన్న గారు ప్రవర్తించిన తీరే మార్గదర్శకమయ్యాయి. వృత్తి ధర్మం, వ్యక్తి ధర్మం... రెండూ వేర్వేరు కాదు అన్నది వారు చెప్పకనే చెప్పిన పాఠం” అని రాజా కార్తికేయ ఆ అనుభవాలు పంచుకున్నారు.

    సభారంభంలో... సాంస్కృతిక సంస్థ ‘నవసాహితీ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపక అధ్యక్షుడు – సీనియర్ జర్నలిస్టు ఎస్.వి. సూర్యప్రకాశరావు అతిథులను ప్రశంసలతో ముంచెత్తుతూ, సాదర స్వాగతోపన్యాసం చేశారు. “పత్రికా రచన వృత్తిలో విలువలను నిలబెట్టిన గోరాశాస్త్రిని స్మరించుకొని, ఆ మహోన్నత వ్యక్తి పేరిట అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా ఇది జర్నలిస్టులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజు” అని పేర్కొన్నారు. ‘ప్రస్తుత పత్రికారంగంలోని పరిణామాలు, విలువలపై ఒకసారి ఎవరికి వారం పరిశీలన చేసుకోవాల’ని అభ్యర్థించారు.

    గోరాశాస్త్రి అల్లుడు – బెంగుళూరులో ఇంగ్లీష్ ఉపన్యాసకులుగా పనిచేసి, ఈ మధ్యే హైదరాబాద్‌కు మకాం మార్చిన శ్రీనివాస్ వాసుదేవ్ సభలో గోరాశాస్త్రి రచనా జీవిత విశేషాలు, అవార్డు గ్రహీత వల్లీశ్వర్ వృత్తి విశేషాలను చదివి వినిపించారు. ఇదే వేదికపై శ్రీనివాస్ వాసుదేవ్ రాసిన కవితా సంపుటి ‘జాతర’ను భారత మాజీ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. సభలో రాజకీయ – సామాజిక విశ్లేషకుడు చలసాని శ్రీనివాసరావు, వ్యవసాయ కూలీ నుంచి ఐటీ పరిశ్రమ స్థాపకురాలిగా ఎదిగిన భారతీయ – అమెరికన్ పారిశ్రామికవేత్త డి. జ్యోతిరెడ్డి, అవిశ్రాంత పాత్రికేయులు టి. ఉడయవర్లు, ‘విశాలాంధ్ర’ లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ, ‘జాగృతి’ వారపత్రిక మాజీ ఎడిటర్ వడ్డి విజయసారథి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సి. కేశవులు, సీనియర్ జర్నలిస్టులు ‘మా’ శర్మ, దోర్బల బాలశేఖరశర్మ, మహమ్మద్ రఫీ, కోవెల సంతోష్ కుమార్, వడ్డి ఓం ప్రకాశ్, ‘వ్యూస్’ ఛానల్ సుబ్రహ్మణ్యం - పురాణపండ వైజయంతి దంపతులు సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    2017లో ఏర్పాటై, 16 రాష్ట్రాల్లో విస్తరించి, మూడేళ్ళుగా తెలంగాణలోని 12 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జాతీయవాద భావ జర్నలిస్టుల సమూహం ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా’ (తెలంగాణ) కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ సారథ్యంలో ఈ అవార్డు ప్రదానోత్సవంలో కీలక భూమిక పోషించారు. ‘నవసాహితి’ పక్షాన జాతీయ కన్వీనర్ ఝాన్సీ రాపర్తి, శిరీషా శ్రీనివాస్, రజని, పాత తరం ప్రముఖ రాజకీయవాది తెన్నేటి విశ్వనాథం గారి మనుమడు తెన్నేటి మూర్తి, తదితరులు సభా నిర్వహణకు సహకరించారు.

    తొలి గురువు మాటలే... తారకమంత్రంగా!
    “ఈ సత్కారం నా పూర్వజన్మ సుకృతం, తల్లితండ్రులు – గురువుల ఆశీఃఫలం” అంటూ పురస్కార గ్రహీత వల్లీశ్వర్ తన స్పందన తెలియజేశారు. “సాక్షాత్తూ గాంధీ మహాత్ముడు 1930లలో ఏలూరులో పర్యటించినప్పుడు విలేఖరిగా వార్తలు సేకరించిన మంగళంపల్లి చంద్రశేఖరం గారు నాకు జర్నలిజంలో తొలి గురువు. రాష్ట్ర జర్నలిస్టుల సంఘం స్థాపకాధ్యక్షులాయన. ఇక, కోస్తా జిల్లాలన్నిటికీ ‘ది హిందూ’ ఇంగ్లీష్ డైలీ సంచార ప్రతినిధిగా (రోవింగ్ కరస్పాండెంట్‌)గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు సిహెచ్.ఎస్. మాధవరావు గారికీ, వారి వార్తాకథన శైలికీ నేను ఏకలవ్య శిష్యుణ్ణి. విద్యార్థి నాయకుడి కాలం నుంచి వెంకయ్య ప్రసంగశైలికి అభిమానిని. ఈ ముగ్గురూ నాకు మార్గదర్శకులు” అని చెప్పుకొచ్చారు.

    “పీటీఐతో పాటు ‘ది మెయిల్’, ‘ఆంధ్రపత్రిక’ దినపత్రికలకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు విలేఖరిగా పనిచేసిన చంద్రశేఖరం గారు... ‘ఒక జడ్జి, ఒక టీచర్, ఒక అర్చకుడు... ఇలాంటి వాళ్ళు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిజాయతీగా, నిష్పక్షపాతంగా ఉండాలని ఆశిస్తామో... జర్నలిస్టు కూడా అలాగే ఉండాలి’ అని తొలిరోజుల్లో నాకు చెప్పారు. అలాగే, నాటి నుంచి నేటి దాకా పక్షపాతాలు లేకుండా, ప్రలోభాలు, పరువు నష్టం కేసులకు లొంగకుండా నియమబద్ధమైన పత్రికా రచనే సాగించాను” అంటూ వల్లీశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు.

    చ‌ద‌వండి: క‌ళ్లు మూసుకున్న స‌మాజానికి క‌న్న‌ల్లి మేలుకొలుపు!

    సమయాతీతమై, రాత్రి పొద్దుపోతున్నా... వల్లీశ్వర్ ఆప్తులు, మిత్రులు, బంధువులతో సభాంగణం కళకళలాడింది. వృత్తికే అంకితమై, భార్యాబిడ్డల బాగోగులు పట్టకుండా తిరుగుతూ, జీవితంలో చల్లని సాయంత్రాలకు నోచుకోని శాపోపహతులైన జర్నలిస్టుల కష్టాల గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు వల్లీశ్వర్ సతీమణి లలిత కుమారి 1980లలో తమ తిరుపతి కొత్త కాపురం నాటి సంగతులను ఆత్మీయంగా పంచుకున్నారు. అమాయకంగా, అదే సమయంలో అంతే నిజాయతీగా, నిష్కల్మషంగా ఆమె ప్రస్తావించిన అప్పటి జ్ఞాపకాలు సభా ప్రాంగణంలో నవ్వులు విరబూయించాయి. గోరాశాస్త్రి విలువలు, ఒకప్పటి జర్నలిస్టుల జీవితంలోని కష్టనష్టాల పురాస్మృతుల స్మరణతో ఆ సాయంత్రం ఆహ్లాదంగా గడిచింది.

    - రెంటాల జయదేవ

  • కొద్దిగా పని చేసినా నిస్సత్తువ ఆవహించడం, చిన్న విషయాలకే కోపం రావడం, ముఖం ఉబ్బుగా కనిపించడం, చర్మం పొడిబారడటం, కీళ్ల నొప్పులు వేధించడం, ఊబకాయం రావడం, అకస్మాత్తుగా సన్నబడటం వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే ఓసారి పరీక్షించుకోండంటూ వైద్యులు సూచిస్తున్నారు. 

    ఎందుకంటే ఇటీవల ప్రతి పది మందిలో ఒకరికి థైరాయిడ్‌ వ్యాధి వేధిస్తోంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారి శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. ఈ గ్రంథి పనిచేయకపోతే దేహంలోని ఇతర అవయవాల పనితీరు మందగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై అవగాహన లేక చికిత్సలో జాప్యంతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. నేడు వరల్డ్‌ థైరాయిడ్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. 

    ఈ లక్షణాలు కనిపిస్తే..   
    థైరాయిడ్‌లో హైపోథైరాయిడిజం (థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండటం), హైపర్‌ థైరాయిడిజం (హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం) ప్రధానమైనవి. థైరాయిడ్‌ నోడ్యూల్స్, గాయిటర్‌ (థైరాయిడ్‌ గ్రంథి వాపు), థైరాయిడ్‌ క్యాన్సర్‌ కూడా ఉన్నాయి. అలసట, బరువు పెరడగం, చలి అనుభూతి, జుట్టు రాలడం, నీరసం, డిప్రెషన్, మలబద్ధకం వంటివి హైపోౖథెరాయిడిజం లక్షణాలు, బరువు తగ్గడం, ఆందోళన, వేగంగా గుండె చప్పుడు, చెమటలు, వణుకు, నిద్రలేమి హైపర్‌ థైరాయిడిజం లక్షణాలు. గాయిటర్‌ లేదా నోడ్యూల్స్‌ ఉన్నవారిలో మెడ వాపు, గొంతులో అసౌకర్యం వంటివి కనిపిస్తాయి. 

    ఇలా కణితి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆపరేషన్‌ అవసరం లేదు. క్యాన్సర్‌గా మారితేనే ఆపరేషన్‌ చేయించుకోవాలి. గడ్డలు ఏర్పడ్డ వారిలో 5 శాతం మందిలో మాత్రమే క్యాన్సర్‌ కణితులు ఉంటాయి. వీరికి మాత్రమే ఆపరేషన్‌ చేసి కణితి తొలగించాల్సి ఉంటుంది.  

    కారణాలు..      
    థైరాయిడ్‌ సమస్యకు కారణాలు అనేకం. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల హార్మోన్లు అసమతుల్యం అవుతాయి. తద్వారా థైరాయిడ్‌ వ్యాధి వస్తుంది. హైపోౖథెరాయిడిజం సాధారణంగా ఆటోఇమ్యూన్‌ రుగ్మతలు, అయోడిన్‌ లోపం, థైరాయిడ్‌ శస్త్రచికిత్స, రేడియేషన్‌ థెరపీతో గానీ, కొన్ని రకాల మందులతో వస్తుంది. హైపర్‌ థైరాయిడిజం గ్రేవ్స్‌ డిసీజ్, థైరాయిడ్‌ గ్రంథి వాపు వస్తుంది. జన్యు కారణాలు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, గర్భం/ ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్‌ సమస్యలకు కారణం. అయోడిన్‌ లోపం గానీ, అధికంగా ఉన్నా దీని బారినపడతారు.  

    నివారణ ఇలా..    
    థైరాయిడ్‌ సమస్య వస్తే సమతుల ఆహారం, అయోడిన్‌ సమృద్ధిగా ఉండే ఆహారాలు (సీఫుడ్, పాల ఉత్పత్తులు, అయోడైజ్డ్‌ ఉప్పు) తీసుకోవాలి. వైద్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా సహాయపడతాయి. చికిత్సలో హైపోౖథెరాయిడిజం కోసం లెవోథైరాక్సిన్‌ వంటి హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ, హైపర్‌ థైరాయిడిజం కోసం యాంటీథైరాయిడ్‌ మందులు, రేడియో అయోడిన్‌ థెరపీ, శస్త్రచికిత్స ఉన్నాయి. థైరాయిడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారి శస్త్ర చికిత్స, కిమోథెరపీ గానీ రేడియేషన్‌ గానీ అవసరం కావచ్చు  

    మహిళల్లోనే అధికం..     
    మహిళల్లో థైరాయిడ్‌ సమస్యలు పురుషుల కంటే 58 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భం, ప్రసవం తర్వాత, రుతుక్రమం ఆగిన తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయిలు థైరాయిడ్‌ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో హైపోౖథెరాయిడిజం, హైపర్‌ౖథెరాయిడిజం మాతా,శిశు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. జిల్లాలో థైరాయిడ్‌ బాధితులు అధికంగా ఉండటంతో ప్రతీ పీహెచ్‌సీలో థైరాయిడ్‌ పరీక్షలు అందుబాటులో ఉంచాలని రోగులు కోరుతున్నారు.

    త్వరగా గుర్తిస్తే మేలు 
    సమాజంలో 11 శాతం మందిలో హైపోౖథెరాయిడ్, రెండు శాతం మందిలో హైపర్‌ థైరాయిడ్‌ సమస్య ఉంది. ఈ సమస్యను త్వరగా గుర్తిస్తే ఇబ్బందులు రాకుండా చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. 
    – డాక్టర్‌ దల్లి సురేష్‌రెడ్డి, ఎండీ, క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్, ఇచ్ఛాపురం

    గర్భిణులు జాగ్రత్త.. 
    థైరాయిడ్‌ సమస్య ఉన్న గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటిస్తూ మందులు వాడాలి. పుట్టబోయే బిడ్డకు కూడా పరీక్ష చేయించాలి. థైరాయిడ్‌ ఉందంటే మందులు వాడాలి. లేకపోతే బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలు అధికం. 
    – డాక్టర్‌ ఎ.రమ్యారెడ్డి, వైద్యాధికారి, ఈదుపురం  

    మరిన్ని వివరాలకు ఈ కింది వీడియోపై క్లిక్‌ చేయండి

     

Guest Columns

  • భారత ప్రధాన న్యాయమూర్తి మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. మొత్తం యువత గురించి తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశాననీ రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే మాటను జెన్‌–జీ వైరల్‌గా మార్చేసింది. ‘అవును. మేము బొద్దింకలమే’ అని ప్రకటించుకుంది. ఇది కేవలం మీమ్‌ రాజకీయమా? వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?

    ఉద్యోగాలులేని యువతరం సోషల్‌ మీడియా, ఆర్టీఐ యాక్టివి జంలోకి వచ్చి కొందర్ని టార్గెట్‌ చేస్తున్నారని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ‘బొద్దింకలు’ అనే పోలిక సోషల్‌ మీడియాలో విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చిందనీ, ప్రజాస్వామ్యంలో అసమ్మతి శత్రుత్వం కాదనీ అనేకమంది స్పందించారు. మనకు నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా స్వేచ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్థంలో అమెరికా సామాజిక కార్యకర్త నోమ్‌ చామ్‌స్కీ మాటలు మళ్లీ వైరలయ్యాయి.

    ఉద్యమకాలంలో అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా మారిపోతుంది. నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సీపీఐ–మార్క్సిస్టు–లెనినిస్టులు. గిట్టనివాళ్లు వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. ‘అవును మేము నక్సలైట్లమే’ అంటూ వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొద లెట్టారు. ‘మేము మాల’, ‘మేము మాదిగ’ వంటి ఆత్మగౌరవ ప్రకట నల్ని కూడా చూశాం. ఇది సోషల్‌ మీడియా యుగం కనుక వేగం మరింత ఎక్కువ.‘బొద్దింక’ కొత్త రాజకీయ మీమ్‌గా మారింది.

    బోస్టన్‌ యూనివర్సిటీ విద్యార్థి అభిజీత్‌ దీప్కే సరదాగా ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్‌ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఆ పార్టీలో వేలమంది చేరి పోయారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాకపోవచ్చు కానీ, ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టు కోవడం లేదు. అందుకే మీమ్స్, వ్యంగ్యం, డిజిటల్‌ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.

    బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ‘న్యూక్లియర్‌ యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే’ అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు. కోట్ల సంవత్స రాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం కూడా వీటికి ఉందన డానికి సైంటిఫిక్‌ ఆధారాలున్నాయి. అందుకే ఇప్పుడు యువత ‘మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం’ అని ధీమాగా అంటోంది.
     
    సరికొత్త పోరాట వేదికలు
    ఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్‌ పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్‌ హ్యాష్‌ ట్యాగ్‌లు, ఇన్‌ స్టాగ్రామ్‌ రీల్స్, యూట్యూబ్‌ షార్టులు– ఇవే ఇప్పుడు కొత్త పోరాట వేదికలు. అమెరికాలో ‘వాల్‌ స్ట్రీట్‌ను ఆక్రమించండి’, హాంగ్‌కాంగ్‌ ఉద్యమాలు, అరబ్‌ స్ప్రింగ్‌ – అన్నీ డిజిటల్‌ మీడియా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్‌–జెడ్‌ అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.

    సోషల్‌ మీడియాలో యువత అంటున్నదేమిటీ?– ‘ప్రశ్నించడం దేశద్రోహం కాదు.’ అది నిజమేకదా? కాక్రోచ్‌ జనతా పార్టీ నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. వ్యవస్థల పట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతోంది. ఈసారి అది ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం ముఖ్యం.

    - డానీ 
    వ్యాసకర్త సమాజ, రాజకీయ విశ్లేషకులు

Cartoon