Archive Page | Sakshi
Sakshi News home page

International

  • అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేపో మాపో యుద్ధం తప్పదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితులున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇరాన్‌ మిలిటరీ అధికారులు.. ఆ దేశ సుప్రీం లీడర్  అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లోని ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ కుమార్తె డాక్టర్ ఫాతిమా అర్దేషిర్‌ను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఎమోరీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలోని  మెడికల్ స్కూల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఫాతిమా పనిచేస్తోంది. 

    అయితే ఆమె తండ్రి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుడిగా ఉన్నారు. కాగా ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిసనలపై భద్రతా దళాలు కఠినంగా వ్యవహరించడంలో అలీ లారిజానీ కీలక పాత్ర పోషించారని అమెరికా ట్రెజరీ విభాగం అత‌డిపై ఆంక్షలు విధించింది.  ఈ క్ర‌మంలోనే ఫాతిమా అర్దేషిర్‌పై  ఎమోరీ యూనివర్సిటీ వేటు వేసింది.

  • తనను తాను విమాన పైలట్‌గా పరిచయం చేసుకుంటాడు... ఎయిర్‌ పోర్టు నుంచి  లోపలికి వెళ్లేదాకా ఐడీ కార్డులు చూపిస్తూ దర్జాగా విమానంలోకి ప్రవేశిస్తాడు. లోపల విమానం కాక్‌పిట్‌లో ప్రత్యేకంగా ఉండే జంప్‌సీట్‌ కావాలని పట్టుబట్టి ఆ సీట్‌ మీద కూర్చుని ప్రయాణం చేస్తాడు. ఇలా ఒకటి.. రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు అతను వేర్వేరు విమానాల్లో ప్రయాణించాడు. 

    కెనడా ఎయిర్‌ లైన్స్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి.. మానేసిన తర్వాత ఎయిర్‌ లైన్స్‌లో ఉండే లొసుగులను  బాగా వంట పట్టించుకున్న 33ఏళ్ల డల్లాస్ పోకోర్ని ఈ మోసపు దందాకు తెర లేపాడు. 

    2024 జనవరి నుంచి అదే ఏడాది అక్టోబర్‌ల మధ్య నకిలీ ఐడీలు చూపి.. ప్రయాణాలు చేశాడు. మూడు ప్రధాన విమానయాన సంస్థలను తన మోసానికి టార్గెట్‌ చేసుకుని అందులో ప్రయాణించాడు. 

    కేవలం ప్రయాణం మాత్రమే కాదు... విమానంలో సాధారణంగా... పైలట్లు... FAA ఇన్‌స్పెక్టర్‌లు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డ్‌ అధికారులకు మాత్రమే అనుమతి ఉన్న జంప్‌సీట్‌ను డిమాండ్‌ చేసి ఆ సీటుపై ప్రయాణించాడు. 

    ఎట్టకేలకు అనుమానం వచ్చిన అధికారులు అతని ప్రయాణాలపై ఆరా తీశారు. అతను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్టు చేయడంతో అతని పూర్తి బాగోతం బయట పడింది. వెంటనే పనామాలో అతన్ని అరెస్టు చేశారు. హవాయిలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపారు.
    దోషిగా తేలితే... అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.

     

     

  • డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినాటి నుంచి అక్రమ వలసదారులపై కఠినవైఖరి అవలంభించారు.  వారు దేశంలోకి రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అమెరికాలోకి అక్రమ వలసలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఆ దేశం విడుదల చేసిన సర్వేలో  కనీసం 20 నిమిషాలకు ఒక భారతీయుడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే యత్నం చేస్తున్నట్లు తేలింది. ఈ నివేదిక భారత్‌లో కొంత ఆందోళన కలిగిస్తుంది.

    డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై  రెచ్చిపోయారు. ఎట్టిపరిస్థితుల్లో వారు దేశంలో ఉండేది లేదంటూ హుకుం జారీ చేశారు. తమకు తాము స్వచ్ఛందంగా దేశాన్ని వదిలితే ప్రోత్సహాకాలు అందిస్తామని ప్రకటించారు. అయితే ట్రంప్ ఇంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారి సంఖ్య ఇప్పటికీ లక్షల్లోనే ఉంది. 2025లో USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉన్నట్లు యుఎస్ కస్టమ్స్.. బోర్డర్ ప్రోటెక్షన్ విడుదల చేసిన సర్వే తెలిపింది.

    అయితే వీరిలో భారతీయులు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం... 2025లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 23,830 భారతీయులు అరెస్టయ్యారు. అదే 2024 అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ అరెస్టైన వారి సంఖ్య 85,119గా ఉంది. మెుత్తంగా 2025లో  USAలోకి అక్రమంగా ప్రవేశించిన వారి సంఖ్య 3లక్షల 90వేలుగా ఉంది. అయితే బాధాకర విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు ఒంటరిగా సరిహద్దు దాటుతున్నారు. వారి వెంట ఎవరూ లేకుండా పోలీసులకు పట్టుబడుతున్నారు.

    భారతీయులు అధికంగా కెనడా సరిహాద్దునుండే అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. 6,968 మంది కెనడా, యుఎస్ బోర్డర్ గుండా ప్రవేశిస్తూ అరెస్టైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. 2022లో ఇటువంటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఓ భారతీయ కుటుంబం మృతిచెందిన ఘటన ఒకటి జరిగింది.గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన ఓ కుటుంబం కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిద్దామని ప్రయత్నించారు. కానీ ఆ తీవ్రమైన చలిగాలులకు తట్టుకోలేక మార్గమధ్యలోనే నలుగురు మరణించారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

  • ఇటీవల కాలంలో అన్ని దేశాలను విసిగించినట్లు కెనడాకు అత్యంత చిరాకు తెప్పిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. తాము లేకపోతే కెనడానే లేదని వ్యాఖ్యానించిన ట్రంప్‌.. ఆ దేశం తాను ఏర్పాటు చేసిన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌కు మద్దతు తెలపకపోవడంతో అత్యంత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమకు మద్దతు తెలపని దేశాలను గుర్తుపెట్టుకుంటామని కూడా ట్రంప్‌ హెచ్చరించారు. అదే సమయంలో కెనడా కృతజ్ఞత లేని దేశమని కూడా హాట్‌ కామెంట్స్‌ చేశారు.

    దీనికి ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్‌ కార్నే కౌంటర్‌ కూడా ఇచ్చారు. తాము  ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ఒక స్థానం ఉందని, తాము కెనడాకు చెందిన వారేమనని అమెరికాకు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. తాము ఎప్పటికీ అమెరికాకు 51వ రాష్ట్రంగా ఉండబోమని తెగేసి చెప్పారు కార్నే.

    అయితే కెనడా ప్రధాని కార్నే.. భారత్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  త్వరలో ఆయన భారత్‌లో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత్‌తో కెనడాకు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ట్రేడ్‌ డీల్స్‌ ఒప్పందం చేసుకునేందుకు కార్నే.. భారత్‌కు పర్యటన చేపట్టబోతున్నారు. 

    ఇదే విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు  భారత హైకమిషనర్‌ దినేష్‌ పట్నాయక్‌. కెనడా ప్రధాని కార్నే.. భారత పర్యటన పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఉండొచ్చన్నారు.        

    ఇదీ చదవండి:

    అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌’ అగ్గి..!

  • న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

    అదే సమయంలో భారత్‌-అమెరికాలది హిస్టారిక్‌ బాండ్‌ అంటూ కోడ్‌ చేశారు.  భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ ఫోటోను షేర్‌ చేశారు ట్రంప్‌. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా  ఉంది ట్రంప్‌ షేర్‌ చేసిన ఫోటో. 

    భారత ప్రభుత్వానికి,  భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.  దీనికి సంబంధించి యూఎస్‌ ఎంబసీ తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. 

    ఈరోజు అంతకముందే భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్‌తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్‌ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. 

     

    ఇదీ చదవండి: 

     మనది చారిత్రాత్మక బంధం: అమెరికా శుభాకాంక్షలు

  • సక్సెస్‌ అనుభూతి ఎపుడూ తీయగానే ఉంటుంది. కానీ ఆ సక్సెస్‌ వెనుక ఎన్నెన్నో  చేదు అనుభవాలు, మరెన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఒక్కోసారి వారి మార్గం కూడా అసహ్యించుకునే చూపులతోనే మొదలవు తుంది. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల వ్యవస్థాపకుడు ఊహించని సక్సెస్‌ గురించి తెలుసుకుంటే   ఔరా అనిపించకమానదు.

    కాలిఫోర్నియాపారిశ్రామికవేత్త డానియెల్ టామ్ పోర్టబుల్ టాయిలెట్ వ్యాపారంలో గణనీయమైన లాభాలతో సంచలనం సృష్టించారు. దాదాపు 2,000 పోర్టబుల్‌ టాయిలెట్లను నిర్వహిస్తూ, 2025లో రూ.39 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు నిర్మాణ స్థలాలు, ఈవెంట్‌ల వద్ద మానవుల కనీస అవసరమైన టాయిలెట్‌ సౌకర్యాన్ని అందిస్తూ  తీరుస్తూ విజయవంతమైన  తీరు స్ఫూర్తిదాయకం.

    అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించాడు  టామ్‌. పోర్టబుల్ పారిశుధ్య వ్యాపారంలో ఉన్నప్పుడు. తొలుత అందరూ అసహ్యించుకున్నారు. కానీ తన వ్యాపారంతోపాటు, అవసరమైన సేవను అందించడంలో సంతృప్తి చాలా ఉంటుంది అంటాడు టామ్‌. తన వ్యాపార తీరును ఆదాయాన్ని  చూసిన తరువాత చాలామందికి ఆసక్తి వచ్చిందంటారు  బే ఏరియా శానిటేషన్ యజమాని , నిర్వాహకుడైన డేనియల్ టామ్

    డేనియల్ టామ్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సమీపంలోని ఒక శివారు ప్రాంతంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచీ శ్రమను నమ్ముకున్న జీవి. అతని తల్లిదండ్రులు, వారి కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు కోసం విద్య ఒక్కటే మార్గమని గ్రహించాడు.అ లా శారీరక విద్య ఉపాధ్యాయుడిగా మారాలనే  ఆశయంతో శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో చేరాడు. మొదట్లో క్రీడలు, ఆరోగ్యం ద్వారా యువతకు స్ఫూర్తినివ్వాలనుకున్నాడు. ఇక్కడే అతని కరియర్‌ కీలకమైన మలుపు తిరగింది.  

     ఆ బిజినెస్‌ అంటే అందరూ అసహ్యించుకున్నారు 
    స్థానిక పోర్టా-పాటి (పోర్టబుల్ టాయిలెట్‌లను) అద్దెకిచ్చే కంపెనీలో పార్ట్-టైమ్ ఉద్యోగంలో చేరాడు. ఈ సమయంలో పారిశుద్ధ్య పరిశ్రమ, నిర్వహణ తెరవెనుక ఉండే విషయాల గురించి తెలుసుకున్నాడు. చాలా మంది నిర్లక్ష్యం చేసే ప్రజారోగ్యం, దాని విలువ గురించి అవగాహన పెంచుకున్నాడు. పెళ్లిళ్లలు, ఈవెంట్లలో ప్రతి ఒక్కరికీ రెస్ట్‌రూమ్‌ కావాలి, ప్రాథమిక అవసరమని గుర్తించాడు. దీన్నే అందుబాటులోకి తీసుకొచ్చి, వ్యాపారంగా దీన్ని అభివృద్ధి  చేయాలని భావించాడు.

    పోర్టబుల్ పారిశుద్ధ్య సంస్థ హాన్సన్ & ఫిచ్‌లో సేల్స్ మేనేజర్‌గా ఏడు సంవత్సరాలు గడిపిన అనుభవం, నైపుణ్యంతో గ్రాడ్యుయేషన్ తర్వాత, 2023లో ఒకే ఒక ట్రక్కు, 100 టాయిలెట్లతో టామ్ Bay Area Sanitation అనే సంస్థను స్థాపించాడు. ఇది స్థానికి నిర్మాణ స్థలాలు , ఈవెంట్లకు సేవలను అందిస్తుంది. ఒక నిర్దిష్టమైన ఆశయం, లక్ష్యంతో వ్యాపారాన్ని కొనసాగించాడు. మొదట్లో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ వ్యక్తిగత పొదుపు, చిన్న వ్యాపార రుణాలు, కుటుంబ మద్దతు,మంచి వ్యూహంతో మార్కెట్లో నిలదొక్కు కున్నాడు. అసాధారణమైన కస్టమర్ సేవలను అందించి, సంచలన విజయం సాధించాడు.  వాక్యూమ్ పంపర్ ట్రక్కులలో ఒకదానితో ప్రతి యూనిట్ నుండి 60 గ్యాలన్ల వరకు వ్యర్థాలను ఖాళీ చేయడంతో సహా, ఆ టాయిలెట్లను అద్దెకు ఇవ్వడం , నిర్వహించడం టామ్ కంపెనీ బాధ్యత.

    శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంతటా దాదాపు 2 వేల పోర్టబుల్ టాయిలెట్‌లతో కంపెనీ గత  ఏడాది అద్భుతమైన 4.3 మిలియన్ల  డాలర్లు అంటే సుమారు రూ. 39 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 లో కంపెనీ ఆదాయం సుమారు రూ. 28 కోట్లుగా ఉంది. రాబోయే ఐదేళ్లలో 5,000 పోర్టబుల్ టాయిలెట్లకు సామర్థ్యాన్ని పెంచి, 10 మిలియన్ల డాలర్ల వార్షిక ఆదాయాన్ని సాధించాలని డానియెల్ టామ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బే ఏరియా శానిటేషన్ ప్రామాణిక-పరిమాణ పోర్టబుల్ టాయిలెట్లు నెలకు దీర్ఘకాలిక అద్దె 160  డాలర్లు నుండి ప్రారంభమవుతాయి. ఇందులో వీకెండ్‌ క్లీనింగ్‌ కూడా ఉంది.  స్వల్పకాలిక ధరలు ఒక్కో ఈవెంట్‌కు 239 - 399 డాలర్ల దాకా ఉంటుంది. 

    నా పనే నాకు  గర్వ కారణం
    ఆదాయం గురించి వినే వరకు ప్రజలు అసహ్యించుకుంటారు,  కృత్రిమ మేధస్సు ద్వారా తమ ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన చెందుతున్న సమయంలో, తక్కువ-సాంకేతికత, AI-ప్రూఫ్ వ్యాపారాన్ని నిర్మించగ లిగాను అని గర్వంగా చెబుతారు డేనియల్‌. తాను చేసే పనిలో  తనకు గర్వ కారణం అంటారు. ప్రతి యూనిట్ 60 గ్యాలన్ల వరకు వ్యర్థాలను నిల్వ చేయగలదు. వారానికి శుభ్రపరచడం, రీస్టాకింగ్ , పంపింగ్ చేస్తారని చెప్పారు. ఇంధనం మరియు సరఫరాలతో సహా అదనపు ఖర్చులతో కంపెనీ ఆదాయంలో దాదాపు 30 శాతం లేబర్ వాటా మాత్రమే ఉందని టామ్ చెప్పారు.

    వాసన భరించడం కష్టం కాదా?
    ఉదయం 4 గంటలకే నిద్రలేవడంతో ప్రారంభించి, రాత్రి పడుకునేదాకా నిరంతరం శానిటైజేషన్‌ పని చేసే టామ్ వ్యాపారం బహుశా అందరికీ సరిపోకపోవచ్చు, అయినప్పటికీ తాను కొన్ని భరించలేని విషయాలకు అలవాటు పడ్డానని చెబుతున్నాడు. రోజూచేసే పనికాబట్టి ఆ వాసన పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ చెడి పోయిన పదార్థాలు తిన్నపుడు వారి విసర్జకాల నుంచి వాసన  భరించడం తనలాంటి వారికి  కూడా కష్టంగా ఉంటుంది అంటారు.

    ఐబిఐఎస్‌వరల్డ్ అనే పరిశోధన సంస్థ సెప్టెంబర్ 2025 విశ్లేషణ ప్రకారం, 2025లో  అమెరికాలో పోర్టబుల్ టాయిలెట్ల అద్దె పరిశ్రమ సుమారుగా 3.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది, ఇది 2024తో పోలిస్తే 1.7శాతం ఎక్కువ. బే ఏరియాలో అనేక స్థానిక బహిరంగ కార్యక్రమాలు, పెరుగుతున్న నిర్మాణ రంగం ఉన్నందున, మార్కెట్‌లో పట్టు సాధించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని టామ్ చెబుతున్నాడు.

     

  • జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగడానికి అమెరికా చెప్పిన కారణాలు అసత్యమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ స్పష్టం చేశారు. ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఆదేశానికి కాకుండే ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. 

    టెడ్రోస్ అధనోమ్‌ ఘెబ్రెయెసస్‌ మాట్లాడుతూ..అమెరికా డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగడానికి చూపిన కారణాల్లో ఎలాంటి వాస్తవం లేదు. డబ్ల్యూహెచ్‌ఓ అమెరికాతో పాటు అన్ని సభ్య దేశాలతో వారి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ పనిచేస్తుంది’ అని సూచించారు.

    అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో, ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగిందని ప్రకటించారు. కోవిడ్‌-19 సమయంలో డబ్ల్యూహెచ్‌వో పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. డబ్ల్యూహెచ్‌వో అమెరికాను తక్కువ చేసి, స్వతంత్రతను దెబ్బతీసింది. అలాగే,కోవిడ్ సమయంలో కీలక సమాచారం అందించకుండా కాలయాపన చేసింది. ఫలితంగా దేశంలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగిందన్నారు.

    అమెరికా చేస్తున్న ఈ ఆరోపణల్ని డబ్ల్యూహెచ్‌ఎవో ఖండించింది.అమెరికాతో నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించాము. కోవిడ్ సమయంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెంటనే ప్రపంచానికి తెలియజేశాం. మాస్క్‌లు, టీకాలు, భౌతిక దూరం పాటించమని సూచించాము. కానీ ఎప్పుడూ మాస్క్ మాండేట్లు, టీకా మాండేట్లు లేదా లాక్‌డౌన్‌లు విధించమని చెప్పలేదు. అవి ప్రతి దేశం స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాలు’ అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

Movies

  • టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది.  

    ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్‌ చరణ్‌ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ​ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది.  ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.  

    ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్‌లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు.  మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర.. ఇటీవల మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ప్రకటించారు. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు తొలి ప్రకటన చేశారు. ఏటీవీ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై  కొత్త నటీనటులతో రూపొందే సినిమాకు 'ఎయిర్‌ఫోర్స్‌ బెజవాడ బ్యాచ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు.

    విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం.. నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని సంఘటనలు ఆధారంగా తీస్తున్నారు. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనేది స్టోరీ. విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో సరదాగా, మట్టివాసనతో కూడిన సందేశంతో బ్యానర్ ఇప్పడు అందరిని ఆకట్టుకుంది.

    'అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు' అంటూ రూపొందించిన ఈ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

  • ఎర్రచీరలో అందంగా మెరిసిపోతున్న ఆషికా

    దుబాయిలో స్కై డైవింగ్ చేసిన హీరోయిన్ నిహారిక

    జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న నభా నటేశ్

    జీన్ నిక్కర్‌లో గ్లామర్ ఆరబోస్తున్న సోనాల్ చౌహాన్

    పచ్చ చీరలో గ్లామర్ హద్దులు దాటేస్తున్న డింపుల్

    నాలోని మరో కోణం.. సంయుక్త ఇంట్రెస్టింగ్ వీడియో

  • గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండకు దొరకట్లేదు. గతేడాది 'కింగ్డమ్'తో వచ్చాడు గానీ అదే సీన్ రిపీటైంది. ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'రౌడీ జనార్ధన' కాగా మరొకటి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పీరియాడిక్ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.

    విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 1876-78 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ కాలంలో భారతదేశానికి వచ్చిన బ్రిటీషర్లు.. హిట్లర్ చేసిన దానికంటే ఎంత పెద్ద మారణహోమం సృష్టించారు. ఏకంగా 45 ట్రిలియన్ డాలర్లు దోచుకోవడం, 40 ఏళ్లలో 100 మిలియన్ల మంది చావులకు కారణమవడం.. ఇలాంటి చాలా విషయాలు సినిమాలో ఉండబోతున్నాయని అనౌన్స్‌మెంట్ వీడియోతో చెప్పకనే చెప్పేశారు.

    ఇందులో విజయ్..  బ్రిటీషర్లపై పోరాడిన రణబాలి అనే వీరుడిగా కనిపించనున్నాడు. రష్మిక.. జయమ్మ అనే పాత్ర పోషించింది. 'మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో ... సర్ థియోడర్ హెక్టర్ పాత్ర చేశాడు. బాలీవుడ్ ఫేమ్ అజయ్ అతుల్ సంగీతమందిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 11న ఇది పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫిబ్రవరిలో విజయ్-రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వీళ్లిద్దరూ భార్యభర్తలుగా నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. గతంలో వీళ్లిద్దరూ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు జంటగా చేశారు.

  • ప్రెగ్నెన్సీ జర్నీలో భార్యకు భర్త తోడుండాలంటోంది హీరోయిన్‌ శ్రియా శరణ్‌. ఆ సమయంలో భర్త తోడు ఎక్కువ కావాలనిపిస్తుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ.. మహిళ గర్భం దాల్చినప్పుడు తన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటోందంటే అదొక అద్భుతమైన అనుభవం. 

    అతడిదే బాధ్యత
    కానీ ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా అనేక మార్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపులో ఉండవు. కడుపులో ఓ బిడ్డను మోస్తూ తిరగాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు నీలాగే కనబడవు. ఆ సమయంలో ఆడవారి శరీరం ఒక ఆవులా కనిపిస్తుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే! నేను గర్భం దాల్చినప్పుడు ఎక్కువ బాధగా అనిపించేది. నా భర్త నాతో ఎక్కువసేపు ఉంటే బాగుండనిపించేది. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా పనికి వెళ్లాలనిపించేది. ఇలా నా ఎమోషన్స్‌ అదుపులో ఉండేవి కాదు అని చెప్పుకొచ్చింది.

    సినిమా
    శ్రియా.. రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను 2018లో పెళ్లి చేసుకుంది. 2021లో వీరి దాంపత్యానికి గుర్తుగా కూతురు రాధా శరణ్‌ కొశ్చీవ్‌ జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్‌, నీకు నేను నాకు నువ్వు, నేనున్నాను, ఛత్రపతి, మనం వంటి పలు సినిమాల్లో నటించింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. కొన్ని ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. చివరగా మిరాయ్‌ మూవీలో కనిపించింది. ప్రస్తుతం హిందీ దృశ్యం 3లో నటిస్తోంది.

    చదవండి: తరుణ్‌ భాస్కర్‌తో డేటింగ్‌? తొలిసారి పెదవి విప్పిన హీరోయిన్‌

  • డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ 'జాతిరత్నాలు' సినిమానే గుర్తొస్తుంది. అంతకు ముందు ఓ మూవీ చేసినప్పటి.. దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట.. ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు 'ఫంకీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

    ఎవరినైనా ప్రేమించారా? అని యాంకర్ సుమ, అనుదీప్‌ని అడగ్గా..'స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం ఆమెకు చెప్పలేదు. అంటే వన్ సైడ్ లవ్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరినీ లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ, పెళ్లి మీద ఆసక్తి లేదు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు' అని క్లారిటీ ఇచ్చేశాడు.

    అయితే అనుదీప్.. ఇదంతా సీరియస్‌గానే చెప్పాడా? లేదా జోక్‌గా చెప్పాడా? అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాన్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని, అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండింటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికొస్తే 'జాతిరత్నాలు' తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్‌తో 'ప్రిన్స్' తీశాడు. కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'ఫంకీ'తో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?

    (ఇదీ చదవండి: మేం రొమాన్స్ చేస్తుంటే.. అనుదీప్ బిగుసుకుపోయేవాడు)

  • తెలుగు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, హీరోయిన్‌ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి పండగలు సెలబ్రేట్‌ చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్‌ సజీవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయజయజయహేకి రీమేక్‌గా తెరకెక్కింది.

    తర్వాత చెప్తా
    తాజాగా సినిమా ప్రమోషన్స్‌కు హాజరైన ఈషా రెబ్బాకు డేటింగ్‌పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్‌- ఈషా.. రియల్‌ లైఫ్‌లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. ఆమె రూమర్స్‌ను ఖండించనూ లేదు, ఒప్పుకోనూ లేదంటే సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉన్నట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

    గట్టిగా కొట్టాడు
    ఇక సినిమాలో తనను తరుణ్‌ నిజంగా కొట్టాడంది ఈషా. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్‌ నన్ను గట్టిగా కొట్టాడు. అది నేను ఊహించలేదు. ఆ దెబ్బకు నాకు తెలియకుండానే కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. సీన్‌ అయిపోగానే సారీ చెప్పాడు. కానీ చివర్లో నేను కూడా గట్టిగానే కొట్టాను అని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.

    చదవండి: ప్రభాకర్‌ కొడుకును కాకపోయుంటే ఎన్నో సినిమాలు చేసేవాడిని

  • తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    (ఇదీ చదవండి: డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)

    ''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.

    'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్‌గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. 

    (ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

  • బుల్లితెర నటుడు ప్రభాకర్‌ తనయుడు, యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రామ్‌నగర్‌ బన్నీ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ మూవీయే బరాబర్‌ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్‌ మహి విలన్‌గా యాక్ట్‌ చేశాడు. 

    నాన్న సపోర్ట్‌ చేయలేదు
    సంపత్‌ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చంద్రహాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రహాస్‌ మాట్లాడుతూ.. నాకు 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే యాక్టింగ్‌ వైపు రావాలనిపించింది. నాన్న సపోర్ట్‌ చేయలేదు. 25 ఏళ్లు వచ్చాకే సపోర్ట్‌ చేస్తానన్నాడు. అప్పటిదాకా ఖాళీగా ఎందుకుండాలి? అనుకున్నాను. ట్రిప్పులు తిరిగాను. అప్పటికి నేను 12th పాస్‌ అంతే! దాంతో మా అమ్మ బ్లాక్‌మెయిల్‌ చేసింది.

    అమ్మ ఏడుపు వల్లే..
    నా కొడుకు 12వ తరగతి వరకే చదివాడని ఎలా చెప్పుకోవాలి? తలెత్తుకుని ఎలా తిరగాలి? అని ఏడ్చేసింది. తనకోసం కాలేజీలో జాయిన్‌ అయ్యా.. ఓపక్క చదువుకుంటూనే సినిమాలు, షార్ట్‌ ఫిలింస్‌కి ట్రై చేద్దామనుకున్నాను. ఓ పెద్ద ఆఫీస్‌కు వెళ్తే చాలాసేపు వెయిట్‌ చేయించారు. చివరకు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్‌ కానని చెప్పారు. కనీసం ఆఫీస్‌ లోపలకు కూడా పిలవలేదు. నేను ప్రభాకర్‌ కొడుకునని ఆయనకు తెలుసు. నేను ఆయన కొడుకును కాకపోయుంటే వాళ్లు చేసినదాన్ని పట్టించుకునేవాడినే కాదు. 

    ఆయన కొడుకుని కాకపోయుంటే..
    అసలు ప్రభాకర్‌ కొడుకుని కాకపోయుంటే ఈపాటికి చాలా సినిమాలు చేసేవాడిని.. చిన్న క్యారెక్టర్‌ లేదా పెద్ద పాత్రలు ఏవైనా చేసుకుంటూ పోయేవాడిని. కానీ, ఇప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఆరోజు జరిగిన ఘటనతో గట్టిగా ఒకటి డిసైడయ్యా.. నన్ను  ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు పెట్టి విదేశాలకు పంపించొద్దు.. ఆ డబ్బు ఏదో నేను చేయబోయే పాటకు ఇవ్వు. రూ.10-15 లక్షలు ఇస్తే ఓ పాట చేసుకుంటా అన్నాను. అది చూసి ఎవరైనా సినిమా ఛాన్సులిస్తారన్నది నా ఆశ!అనుకున్నట్లే సినిమా ఆఫర్‌ వచ్చింది అని చెప్పుకొచ్చాడు.

    చదవండి: బిస్కెట్స్‌ తిని కడుపు నింపుకున్నా: హీరో

  • తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. అల్లు అర్జున్‌తో రెండు వారాల క్రితం కొత్త సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ దర్శకుడిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసరికి 'ఖైదీ 2' వదిలేశాడు, LCU(లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్) ఆగిపోయింది అని రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై లోకేశ్ స్వయంగా స్పందించాడు. చెన్నైలో సోమవారం ఉదయం జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో తనపై వస్తున్న అన్ని పుకార్లకు సమాధానమిచ్చాడు.

    'గత వారం నుంచి ఎల్‌సీయూ క్లోజ్ అయిపోయిందని అన్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ఖైదీ 2 కూడా ఆగిపోయిందంటున్నారు. ఇది కూడా నిజం కాదు. అల్లు అర్జున్‌తో చేస్తున్న మూవీ పూర్తవగానే 'ఖైదీ 2' చేస్తా. తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ చిత్రాలు వరసగా వస్తాయి. లారెన్స్‌తో చేస్తున్న 'బెంజ్' కూడా ఎల్‌సీయూలో భాగమే. దయచేసి రూమర్స్ నమ్మకండి'

    (ఇదీ చదవండి: తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)

    'ఖైదీ 2 ఆలస్యం కావడానికి పారితోషికం కారణం కాదు. వేరే నిర్మాతలు డబ్బులు ఎక్కువ ఇచ్చారని దీన్ని వదిలేయలేదు. ఇతర ప్రాజెక్టుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. 'కూలీ' తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం చేయమన్నారు. దీంతో ఒకటిన్నర నెలలు స్క్రిప్ట్‌ వర్క్ చేశాను. వరసగా యాక్షన్ మూవీస్ చేస్తుండటంతో ఒక సింపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేద్దామన్నారు. దాన్ని ఎలా డీల్ చేయాలో తెలీక ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశాను'

    'అల్లు అర్జున్‌తో సినిమా కోసం మైత్రీ మూవీస్ సంస్థతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నాయి. అది ఇప్పటికి కుదిరింది. అందుకే బన్నీ మూవీ ఇప్పుడు చేస్తున్నాను తప్పితే 'ఖైదీ 2' వదిలేసి చేయట్లేదు. అలానే దళపతి విజయ్ 'జన నాయగణ్'లో అతిథి పాత్ర చేశా' అని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

  • కోకాపేట్‌లో అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంతో హైదరాబాద్‌ తన మొదటి డాల్బీ సినిమా అనుభవాన్ని అందుకుంది. నగరంలో పెరుగుతున్న థియేటర్ల వ్యవస్థలో మల్టీప్లెక్స్‌ మరో ముందడుగు. 2025లో నటుడు రవితేజ భాగస్వామ్యంతో ఏషియన్‌ సినిమాస్‌ వనస్థలిపురంలో ఏఆర్‌టీ సినిమాస్‌ ను ప్రారంభించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. అంతకుముందు శరత్‌ సిటీ మాల్‌లో నటుడు మహేష్‌ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్, అమీర్‌పేట్‌లో నటుడు అల్లు అర్జున్‌తో కలిసి ఏఏఏ సినిమాస్‌ వెంచర్లు నెలకొల్పారు. పీవీఆర్‌ ఐనాక్స్‌ గ్రూప్‌  తేడాదిడిసెంబర్‌లో ఇనార్బిట్‌ మాల్‌లోని తమ 6 ్రస్కీన్ల మల్టీప్లెక్స్‌ ను 11 స్క్రీన్స్‌ సూపర్‌ప్లెక్స్‌గా పునరుద్ధరించింది. ఇది తెలంగాణలో పీవీఆర్‌కు మొదటిది. అలాగే, రెక్లయినర్లతో కూడిన మూడు లక్స్‌ స్క్రీన్లు అంతర్గత చెఫ్‌ అందించే మెనూ కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీలో నగరంలోని మూడవ 4డీఎక్స్‌ స్క్రీన్‌ కూడా ఉంటుంది. ఇందులో మోషన్‌ సీట్లు వీక్షణ అనుభవాన్ని పెంచే గాలి, పొగ, సువాసన, నీరు స్నో వంటి ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి.                 

    ఈ ఏడాది 2026 మధ్యలో ఆర్‌టీసీ ఎక్స్‌ రోడ్స్‌లో ఏఎంబీ క్లాసిక్‌ అనే కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభానికి సిద్ధమైంది. ఇందులో ప్రీమియం ఎక్స్‌ట్రా లార్జ్‌ ఫార్మాట్‌ 55 అడుగుల వెడల్పు స్క్రీన్‌ ఉంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ సీఈఓ గ్రోత్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోద్‌ అరోరా, తమ విస్తరణ ఇంకా మధ్యలోనే ఉందని ధ్రువీకరించారు. ‘అనేక కొత్త ప్రాపర్టీలు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. హెచ్‌ఎస్‌ఆర్‌ ఆర్క్, ఆర్‌టీసీ ఎక్స్‌ రోడ్స్‌లోని ఓడియన్‌ మాల్, కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని లేక్‌ షోర్‌ మాల్‌(ఇందులో ప్లేహౌస్‌ పీఎక్స్‌ఎల్‌ ఫార్మాట్‌ స్క్రీన్లు ఉన్నాయి). ఎల్బీనగర్‌లోని హెచ్‌ఎస్‌ఆర్‌ మాల్, బండ్లగూడలోని లీగ్‌ మాల్‌ త్వరలో ప్రారంభం కానున్నాయి. మల్టీప్లెక్స్‌ల పరంగా తగినంత సేవలు లేని నగరంలోని ఇతర ప్రాంతాలను మేం అన్వేషిస్తున్నాం.’ అని వారు చెబుతున్నారు.  

    నగరంతో పాటూ పెరుగుతూ.. 
    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2,053 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సుమారు 1.3 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, బహుళజాతి ఐటీ కంపెనీలు దానికి అనుగుణంగా గృహ నిర్మాణ ప్రాజెక్టుల పెరుగుదల కారణంగా నగరం, ముఖ్యంగా పశ్చిమ జోన్‌లో భారీ విస్తరణను చూసింది. హైటెక్‌ సిటీ గచ్చిబౌలికి ఆవల నల్లగండ్ల, కోకాపేట్‌ వరకు విస్తరించిన ప్రాంతాల్లో కొత్త మల్టీప్లెక్స్‌ లకు పెరిగిన అవకాశాలను ఏషియన్‌ సినిమాస్‌ నిర్మాత సునీల్‌ నారంగ్‌ వంటివారు పరిశీలిస్తున్నారు. ‘కొత్తగృహ ప్రాజెక్టులతో, సిటీకి చెందిన అత్యంత ప్రధాన జనాభా ఈ ప్రాంతాలలో స్థిరపడుతోంది’ అంటారాయన. ఏషియన్‌ సినిమాస్‌ దాని మల్టీప్లెక్స్‌ల ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలలోకి కూడా ప్రవేశిస్తోంది. ఈ గ్రూప్‌నకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రాపరీ్టలలో 40 మల్టీప్లెక్స్‌ స్క్రీన్లు ఉన్నాయి.

    సంతరించుకుంటున్న సాంకేతికత 
    ‘ఉత్తమ ఆడియో విజువల్‌ నాణ్యతను అందించడానికి సాంకేతిక అంశాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం’ అని నారంగ్‌ తెలిపారు. అలాగే మా ఫుడ్‌ మొత్తం మా చెఫ్‌లతోనే తయారవుతుంది. శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, పిజ్జాల కోసం ఉపయోగించే బ్రెడ్స్, బర్గర్లు, పిజ్జా బేస్‌లను స్వయంగా మా ప్రాంగణంలోనే తయారు చేస్తారని అన్నారాయన. సింగిల్‌ స్క్రీన్లు అధికంగా కలిగిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోకి ప్రవేశించడం గురించి మాట్లాడుతూ, సంప్రదాయ సింగిల్‌ స్క్రీన్లు ఎక్కువగా మల్టీప్లెక్స్‌లకు మారుతున్నాయి. పైగా ఆ ప్రాంతంలో మల్టీప్లెక్స్‌ కూడా అవసరమని మేం భావించాం’ అని చెప్పారు.  

    థియేటర్ల మనుగడకు ఢోకా లేదు 
    డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లు, మొబైల్‌ ఫోన్లలో షార్ట్‌–ఫామ్‌ కంటెంట్‌ నుంచి ప్రేక్షకులను దూరం చేయడానికి చిత్ర నిర్మాతలు కష్టపడు తున్న సమయంలో కొత్త థియేటర్ల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ఇంట్లో సినిమా చూడటం సౌకర్యవంతంగా ఉండవచ్చు.. కానీ అది సినిమా హాళ్లలో సామూహిక వీక్షణ ఆనందాన్ని భర్తీ చేయదు. అంతకుముందు కూడా థియేటర్లు టెలివిజన్‌ డిజిటల్‌ వెల్లువను తట్టుకుంటాయా అనే సందేహాలు ఉండేవి. ఆ పరిస్థితి నుంచి థియేటర్లు మరింత బలంగా ఉద్భవించాయి. ప్రేక్షకులు నాణ్యమైన చిత్రాలను కోరుకుంటున్నారని, నిర్మాతలుగా దాన్ని అందించడం బాధ్యత, వారికి సౌకర్యాలతో కూడిన వీక్షణ అనుభవాన్ని అందించడం థియేటర్‌ యజమానుల బాధ్యత అన్నారు’ నారంగ్‌. 

  • కష్టాలు దాటుకుని సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్‌ హీరో విక్రాంత్‌ మాస్సే ఒకరు. చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఈయన తాజాగా వాటిని ఓ సారి గుర్తు చేసుకున్నాడు. విక్రాంత్‌ మాస్సే మాట్లాడుతూ.. 16 ఏళ్ల వయసులో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను. అప్పటివరకు కాఫీ షాప్‌లో పని చేశాను. 

    రోజులో 16 గంటలు పని
    నా చదువు ముందుకు సాగాలంటే ఆ ఉద్యోగం చేయడం తప్పనిసరి. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కూడా పని చేశాను. అదే సమయంలో ఓ డ్యాన్స్‌ గ్రూప్‌కు అసిస్టెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్‌ చేశాను. ప్రతిరోజు నాలుగు లోకల్‌ ట్రైన్స్‌ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని. పార్లీజీ బిస్కెట్‌, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. తర్వాత నేనొక షో చేశాను. దానికోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. 

    డబ్బు కూడా సగమే..
    తీరా ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయిందని చాలా బాధపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. ఇలాంటి సమస్యలు యాక్టర్స్‌కు చివరి నిమిషం వరకు తెలియవు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్‌లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను అని గుర్తు చేసుకున్నాడు.

    సీరియల్‌, సినిమా
    విక్రాంత్‌ మాస్సే.. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్‌ హై వంటి సీరియల్స్‌లో యాక్ట్‌ చేశాడు. సినిమాల్లో రాణించాలన్న ఆశతో బుల్లితెరకు గుడ్‌బై చెప్పాడు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్‌ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో సినిమా చేస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.

    చదవండి: ఫ్లాప్‌ వస్తే ఎవర్నీ తిట్టను.. బాధ్యత నాదే: చిరంజీవి కౌంటర్‌?

  • ఇప్పుడంతా ఓటీటీ జమానా. వివిధ భాషల సినిమాలని డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నారు. గత కొన్నేళ్లలో అలా దక్షిణాది భాషల మూవీస్‌కి తెలుగు ప్రేక్షకులు బాగా అలవాటు అయిపోయారు. ఇకపోతే గత వీకెండ్ రిలీజైన ఓ తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఇప్పుడు కాస్త ఆలస్యంగా తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఏ సినిమా? ఎందులో ఉంది?

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)

    విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'సిరై'. తమిళంలో ఈ టైటిల్‌కి జైలు అని అర్థం. డిసెంబరులో థియేటర్లలోకి రిలీజైనప్పుడు అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. మూడు రోజుల క్రితం జీ5 ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ మాత్రమే తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంటెన్స్ పోలీస్ డ్రామా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయొద్దు.

    'సిరై' విషయానికొస్తే.. శీను(విక్రమ్ ప్రభు) అనే పోలీస్, ఎక్కువగా ఎస్కార్ట్ డ్యూటీ చేస్తుంటాడు. ఎస్కార్ట్ అంటే ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడం అనమాట. వృత్తిలో సిన్సియర్ అయిన ఇతడు ఓ రోజు అబ్దుల్ రౌఫ్(అక్షయ్ కుమార్) అనే ఖైదీని గుంటూరు జైలు నుంచి కడప కోర్టు వరకు తీసుకెళ్లాల్సిన ఎస్కార్ట్ పనిపడుతుంది. మరి ఈ ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. అబ్దుల్ గతమేంటి? ఇతడు ప్రేమించిన కళ (అనిష్మా) చివరకు ఏమైంది? అనేది మిగతా స్టోరీ.

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

  • మరోవారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీకెండ్.. ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తదితర తెలుగు మూవీస్ బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్', 'తుంబాడ్' డైరెక్టర్ కొత్త చిత్రం 'మయసభ' కూడా ఈ వారాంతలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవనున్నాయి.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

    ఈ వారం ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' కూడా ఇదే వీకెండ్‌లో స్ట్రీమింగ్‪‌లోకి రానుందనే టాక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవే. సడన్ సర్‌ప్రైజులు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27

    • టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27

    • బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29

    • ఛాంపియన్ (తెలుగు సినిమా) - జనవరి 29

    • ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 (రూమర్ డేట్)

    • మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30

    అమెజాన్ ప్రైమ్

    • ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28

    • దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30

    హాట్‌స్టార్

    • గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27

    • సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30

    సన్ నెక్స్ట్

    • పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30

    ఆపిల్ టీవీ ప్లస్

    • స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 28

    • యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30

    బుక్ మై షో

    • ద ఇంటర్న్‌షిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 28

    జీ5

    • దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30

    (ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు)

  • 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మూవీ విజయోత్సవ వేడుకల్లో చిరు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఖైదీ నెంబర్‌ 150, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాల షూటింగ్‌కు ఉత్సాహంగా వెళ్లాను. మళ్లీ మన శంకరవరప్రసాద్‌గారు షూటింగ్‌ కూడా అంతే ఎంజాయ్‌ చేశాను. 

    నేనే బాధ్యత తీసుకుంటా..
    ఈ సినిమాలన్నీ సక్సెస్‌ఫుల్‌ అయ్యాయి. మధ్యలో కొన్ని సినిమాలు ఏదో డౌట్‌గా అనిపించాయి. వాటిని నేను తప్పుపట్టను. తప్పు నా మీద వేసుకుంటాను కానీ ఒకరిపై నెట్టను అన్నాడు. దీంతో ఆచార్య సినిమా విషయంలో వచ్చిన విమర్శలకు చిరు కౌంటరిచ్చాడంటూ నెట్టింట చర్చ మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూవీ ఆచార్య (2022). 

    ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్‌
    ఆ సినిమా డిజాస్టర్‌ కాగా దానికి కొరటాలే కారణమని చిరంజీవి అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అనంతరం ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే ఈ ప్రపంచమంతా హ్యాపీగా ఉంటుంది అని కామెంట్స్‌ చేశాడు. ఆచార్య స్క్రిప్ట్‌ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్‌ అయిందన్న ఆరోపణలు వస్తున్న సమయంలో కొరటాల ఇలాంటి కామెంట్స్‌ చేశాడు. దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురూ భావించారు.

    డైరెక్టర్‌కు కౌంటర్‌?
    అయితే కొరటాల మాత్రం.. సాధారణంగా పని గురించి మాట్లాడాను తప్ప ఆ వ్యాఖ్యల వెనక మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగలేదు. ఇప్పుడు చిరంజీవి తన కామెంట్స్‌తో.. తాజాగా కొరటాల శివకు పరోక్షంగా కౌంటరిచ్చారని పలువురు భావిస్తున్నారు.

    చదవండి: 3 సబ్జెక్టులు ఫెయిల్‌.. చిరంజీవి పరువు తీయొద్దన్నా.. అనిల్‌ రావిపూడి తండ్రి

  • మమ్మట్టి తనను తాను ఎప్పుడూ హీరో అని చెప్పుకోరు. తానొక నటుడిని మాత్రమేనని ఓపెన్‌గా చెబుతారు. ఆయనకు కథ నచ్చితే చాలు తన ఇమేజ్‌ను పక్కన పెట్టేసి ఓకే చెప్తారు.. భారీ ఫైట్స్‌, విదేశాల్లో షూటింగ్స్‌, హీరోయిన్లతో రొమాన్స్‌లు అక్కర్లేదు. కేవలం కథ బలంగా ఉంటే చాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు.  ప్రయోగాలకు చిరునామాగా వైవిధ్యభరితమైన పాత్రలతో  400కి పైగా సినిమాల్లో నటించారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా అయిదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. మలయాళం, తెలుగుతో సహా పలు భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి ఎనలేని కీర్తిని పొందారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను తాజాగా పద్మ భూషణ్‌ అవార్డ్‌ వరించింది.

    ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ. ఆయన తనను తాను ఎప్పుడూ కూడా హీరో అని చెప్పుకోరు. కేవలం తానొక నటుడిని మాత్రమేనని చెప్తారు. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అనేకమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. మమ్ముట్టి పూర్తి పేరు ముహమ్మద్‌ కుట్టి ఇస్మాయిల్‌ పెనిపరంబిల్‌. ఇస్మాయిల్, ఫాతిమా దంపతులకు 1951 సెప్టెంబర్‌ 7న కేరళలోని అలప్పుళ జిల్లా చండీరూర్‌లో ఆయన జన్మించారు. పెరిగింది మాత్రం కేరళలోని కొట్టాయం జిల్లాలో. మమ్ముట్టిది మధ్యతరగతి ముస్లిం కుటుంబం. ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా పొందారు మమ్ముట్టి. ఆ తర్వాత రెండేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేశారు.

    1971లో అనుభవంగళ్‌  పాలిచకల్‌ అనే మూవీతో తన కెరీర్‌ ప్రారంభమైంది. కొన్నేళ్ల పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మమ్ముట్టి వచ్చారు. అయితే, 1980లో విడుదలైన ‘విల్కనుండు స్వప్నంగల్‌’ సినిమాతో  తొలిసారి మమ్ముట్టి పేరు   మారుమోగింది. ఈ చిత్రంతో మమ్ముట్టికి మంచి గుర్తింపు లభించింది. ఇక అక్కడి నుంచి  మలయాళ చిత్రసీమలో తనకు ఎదురులేదు. 

    ఈ క్రమంలోనే  1992లో కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘స్వాతి కిరణం’ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల్ని మమ్ముట్టి మెప్పించారు. అలా టాలీవుడ్‌లో కూడా ఆయనకు అభిమానులు పెరిగారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ (2019) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించారు .అలాగే ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రంలోనూ మమ్ముట్టి నటించారు.

    మమ్ముట్టిని తన అభిమానులు మమ్ముక్కగా ముద్దుగా పిలుచుకుంటారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ పురస్కారాల్ని (ఒరు వడక్కన్‌ వీరగాథ, పొంతన్‌ మదా అండ్‌ విధేయన్, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రాలకుగాను) అందుకున్నారు. ఆపనై పది కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులతో పాటు 11 కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు కూడా ఉన్నాయి. 1998లో ఆయన్ను పద్మశ్రీ అవార్డు వరించగా.. ఇప్పుడు పద్మ భూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు.

Sports

  • మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియ‌న్స్ గెలుపు బాట ప‌ట్టింది. సోమ‌వారం వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో ముంబై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో హ‌ర్మ‌న్ సేన త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

    ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది. 

    57 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది.  వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్‌డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.

    రిచా విధ్వంసం..
    అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.

    కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్‌, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు.

  • భారత్‌, శ్రీలంక వేదికగా త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్‌ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్‌ హోప్‌ కొనసాగనుండగా.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌, 25 ఏళ్ల గయానీస్‌ బ్యాటర్‌ క్వెంటిన్‌ సాంప్సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

    మాజీ కెప్టెన్లు జేసన్‌ హోల్డర్‌, రోవ్‌మన్‌ పావెల్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కడం విశేషం​. పేసర్లుగా ఫోర్డ్‌, సీల్స్‌ తమ స్థానాలను నిలబెట్టుకోగా.. స్పిన్‌ విభాగంలో ఆకీల్‌ హొసేన్, రోస్టన్‌ చేజ్, గుడకేశ్‌ మోటీ, ఆల్‌రౌండర్‌ విభాగంలో విధ్వంసకర బ్యాటర్‌ రొమారియో షెపర్డ్‌ అవకాశాలు దక్కించుకున్నారు. గాయాల కారణంగా ఎవిన్‌ లూయిస్‌, అల్జరీ జోసఫ్‌ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. మొత్తంగా గత ఎడిషన్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

    కాగా, ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌  గ్రూప్‌-సిలో ఉంది. ఈ గ్రూప్‌లో మిగతా జట్లుగా ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, నేపాల్‌, ఇటలీ ఉన్నాయి. విండీస్‌ ఫిబ్రవరి 7న స్కాట్లాండ్‌పై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనుంది. ఇదే వేదికపై వారు చివరిసారి వరల్డ్‌కప్‌ గెలిచారు.  

    టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం విండీస్‌ జట్టు..
    షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసిన్, గుడకేష్ మోటీ, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్

     

  • భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌-2026లో దాయాది పాకిస్తాన్‌ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌ బాటలోనే పాక్‌ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ స్పష్టం చేశాడు.

    ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్‌లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్‌లో ప్రస్తుత ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.

    ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్‌ మహ్మద్‌ నవాజ్‌ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.

    దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్‌ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్‌ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్‌ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్‌ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.

    వివాదం ఎలా మొదలైందంటే..?  
    బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.

    బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్‌ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్‌ బంగ్లాదేశ్‌ స్థానాన్ని భర్తీ చేసింది. 

    ఈ మొత్తం ఎపిసోడ్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్‌ను మధ్యలోనే వదిలేసి యూటర్న్‌ తీసుకుంది. 
     

  • బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ పెర్త్‌ స్కార్చర్స్‌ ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ల చరిత్రలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025-26 ఎడిషన్‌ విజేతగా నిలవడం ద్వారా ఆరోసారి బీబీఎల్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ఈ ఫ్రాంచైజీ.. ఓ టీ20 లీగ్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. 

    తాజా టైటిల్‌కు ముందు స్కార్చర్స్‌ ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌తో సమంగా ఉండింది. సీఎస్‌కే 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్ల ఐపీఎల్‌ టైటిళ్లు సాధించగా.. ముంబై ఇండియన్స్‌ 2013, 2015, 2017, 2019, 2020 ఎడిషన్లలో ఐపీఎల్‌ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.

    స్కార్చర్స్‌ విషయానికొస్తే.. తాజా బీబీఎల్‌ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజీ గుర్తింపు పొందిన టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో బీబీఎల్‌ టైటిళ్లు సాధించింది. జనవరి 25 జరిగిన ఫైనల్లో స్కార్చర్స్‌ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకుంది.

    టీ20 లీగ్‌ల చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు 
    పెర్త్‌ స్కార్చర్స్‌ (బిగ్‌బాష్‌ లీగ్‌)- 6
    ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఐపీఎల్‌)- 5
    కొమిలా విక్టోరియన్స్‌ (బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌)- 4
    జాఫ్నా కింగ్స్‌ (లంక ప్రీమియర్‌ లీగ్‌)- 4
    ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌)- 3
    ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ (హండ్రెడ్‌ లీగ్‌)- 3
    సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)- 3
    ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే (ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20)- 2
    ఎంఐ న్యూయార్క్‌ (మేజర్‌ లీగ్‌ క్రికెట్‌)- 2

    బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 ఫైనల్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

     


     

  • టీమిండియా డాషింగ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ జోరు కొన‌సాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో గువాహ‌టిలో ఆదివారం జ‌రిగిన మూడో టి20 మ్యాచ్‌లోనూ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. కివీస్ బౌల‌ర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డి ప‌రుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్‌కు తోడుగా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా దంచుకొట్టుడు కొట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్‌ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెర‌గ‌డంతో 8 వికెట్ల తేడాతో కివీస్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫ‌లితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవ‌సం చేసుకుంది.

    ఈ సిరీస్‌లో రెండో అర్ధ‌సెంచ‌రీ న‌మోదు చేసిన అభిషేక్ శ‌ర్మ.. మ‌రో ఘ‌న‌త సాధించాడు. గువాహ‌టి మ్యాచ్‌లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ బాదేశాడు. దీంతో ఇంట‌ర్నేష‌న‌ల్ టి20ల్లో త‌క్కువ బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేసిన రెండో భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఓవ‌రాల్‌గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసి స‌త్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. 340 స్ట్రైక్‌రేట్‌తో న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఫ‌స్ట్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచ‌రీ (35 బంతుల్లో 84 ప‌రుగులు; 5 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) కొట్టాడు. 

    ఎప్పుడు బ్రేక్ చేస్తావ్‌?
    అభిషేక్ శ‌ర్మ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌పై మాజీ ఆట‌గాళ్లు, సీనియ‌ర్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అత‌డి గురువు యువ‌రాజ్ సింగ్ త‌న శిష్యుడికి స‌వాల్ విసిరాడు. త‌న పేరిట రికార్డ్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట ప‌ట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్‌లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొన‌సాగించాల‌''ని ఎంక‌రేజ్ చేశాడు. కాగా, టీమిండియా త‌ర‌పున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లోనే అత‌డు అర్ధ‌శ‌త‌కం సాధించి రికార్డు నెల‌కొల్పాడు.

    నెటిజ‌న్ల స్పంద‌న‌
    కాగా, అభిషేక్ శ‌ర్మ‌ను మోడ్ర‌న్ యువ‌రాజ్ సింగ్‌గా వ‌ర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగ‌మించే స‌త్తా శిష్యుడికే ఉందని నెటిజ‌నులు అంటున్నారు. అభిషేక్ శ‌ర్మ ఇదే హై కొన‌సాగిస్తే త్వ‌ర‌లోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని కొంత‌మంది నెటిజ‌నులు అంటే.. శిష్యుడిని ఉత్సాహ‌ప‌రిచేందుకే యువీ స‌వాల్ విసిరాడ‌ని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ అభిషేక్ శ‌ర్మ ఇదే జోరు కొన‌సాగించాల‌ని ఏకాభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

    చ‌ద‌వండి: రోహిత్‌శ‌ర్మ‌పై అభిషేక్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు

    భార‌త్‌- న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతుంది. చివ‌రి మ్యాచ్ ఈ నెల 31న తిరువ‌నంత‌పురంలో జ‌ర‌గ‌నుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్ శ‌ర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!

     

  • కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌కు ప్రమోషన్‌ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ తమ రంజీ కెప్టెన్‌గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 

    గ్రూప్‌ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్‌. కీలకమైన ఈ మ్యాచ్‌కు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ కేవలం రెండు మ్యాచ్‌ల అనుభవమున్న పడిక్కల్‌కు కెప్టెన్‌గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో పడిక్కల్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్‌లో లేని మయాంక్‌ అగర్వాల్‌ను తప్పించి పడిక్కల్‌కు రంజీ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చారు.

    పంజాబ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్‌ రాహుల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.

    మరో స్టార్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ కరుణ్‌ స్థానాన్ని నికిన్‌ జోస్‌ భర్తీ చేశాడు. మరో స్టార్‌ ఆటగాడు అభినవ్‌ మనోహర్‌పై వేటు పడింది. మనోహర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లో లేడు. మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.

    కీలక పోరాటం  
    గ్రూప్‌ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్‌ ఫైనల్‌ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది.  

    కర్ణాటక జట్టు (పంజాబ్‌ మ్యాచ్‌ కోసం)  
    - మయాంక్‌ అగర్వాల్  
    - కేఎల్‌ రాహుల్  
    - అనీష్ KV  
    - దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌)  
    - స్మరణ్ R  
    - శ్రేయస్‌ గోపాల్  
    - కృతిక్‌ కృష్ణ (wk)  
    - వెంకటేష్ M  
    - విద్యాధర్‌ పటిల్  
    - విద్యవత్‌ కావేరప్ప  
    - ప్రసిద్ధ్‌ కృష్ణ  
    - మొహ్సిన్‌ ఖాన్  
    - శిఖర్‌ శెట్టి  
    - శ్రీజిత్‌ (wk)  
    - ధ్రువ్‌ ప్రభాకర్  

     

  • గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌటైన (తొలి బంతికే ఔట్‌) శాంసన్‌.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక గోల్డెన్‌ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. 

    ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సరసన చేరాడు. విరాట్‌, శాంసన్‌ భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్లు అయ్యారు. విరాట్‌ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్‌ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్‌ తన 151 మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.

    అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక గోల్డెన్‌ డకౌట్స్‌
    - 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్‌లు)  
    - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్‌లు)*  
    - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్‌లు)  
    - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్‌లు)  
    - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్‌లు)  

    మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. 

    ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. న్యూజిలాండ్‌ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్‌ (4-0-18-2), హార్దిక్‌ (3-0-23-2), హర్షిత్‌ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్‌ చేశారు. న్యూజిలాండ్‌ తరఫున గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

    అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. 

    వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్‌గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్‌ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అభిషేక్‌, ఇషాన్‌ విధ్వంసాన్ని కొనసాగించాడు. 

    వీరిద్దరి ధాటికి భారత్‌ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్‌ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.

    శాంసన్‌ ఫామ్‌పై ఆందోళనలు  
    ఈ సిరీస్‌లో శాంసన్‌ ఫామ్‌ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా సిరీస్‌లోనూ శాంసన్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది. 

    వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్‌ కిషన్‌ దూసుకొస్తున్నాడు. ఇషాన్‌ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్‌ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్‌ కాకపోయినా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

  • జింబాబ్వే వేదికగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌-2026లో భారత యువ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ఆయుశ్‌ మాత్రే సేన.. తదుపరి బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలిచింది.

    చివరగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడ్డ యువ భారత్‌.. డీఎల్‌ఎస్‌ పద్ధతిలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. కివీస్‌ యవ జట్టుతో మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ (RS Ambrish) కీలక పాత్ర పోషించాడు.

    నాలుగు వికెట్లతో సత్తా చాటి
    ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటి న్యూజిలాండ్‌ అండర్‌-19 జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అంబరీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పద్దెమినిదేళ్ల ఈ కుర్రాడు ఇలాగే అద్భుత ప్రదర్శనలతో ముందుకు సాగితే టీమిండియాకు మరో హార్దిక్‌ పాండ్యా దొరికినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    మరో హార్దిక్‌ పాండ్యా అవుతాడా?
    హార్దిక్‌ మాదిరి ఆరో స్థానంలో చక్కగా ‍బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. కొత్త బంతితో బౌలింగ్‌ చేయగల సత్తా కలిగి ఉండటం ఇందుకు కారణం. తమిళనాడుకు చెందిన ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన అతడు.. రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌.

    తండ్రి కల నెరవేరుస్తున్న తనయుడు
    కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబరీశ్‌.. 33 ఏళ్ల నిరీక్షణ తర్వాత జూనియర్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో జట్టుకు ట్రోఫీని అందించాడు. అతడి తండ్రి ఆర్‌. సుకుమార్‌ కూడా క్రికెటరే. జూనియర్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఆ తర్వాత రైల్వేస్‌ జట్టుకు మారిన సుకుమార్‌ సీనియర్‌ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.

    రైల్వేస్‌లో సెక్యూరిటీగా 
    ఆ తర్వాత రైల్వేస్‌లో సెక్యూరిటీ జాబ్‌ పొందిన సుకుమార్‌.. తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలని భావించాడు. అందుకు తగ్గట్లే చిన్ననాటి నుంచే అంబరీశ్‌ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తండ్రి ఆశయాన్ని తాను నెరవేరుస్తున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన అంబరీశ్‌.. భారత అండర్‌-19 జట్టులోనూ ఎంట్రీ ఇచ్చాడు.

    గతేడాది జూన్‌లో ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేల ద్వారా యాభై ఓవర్ల ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చిన అంబరీశ్‌.. అప్పటి నుంచి భారత అండర్‌-19 తుది జట్టులో కీలక సభ్యునిగా మారాడు. 

    ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ టోర్నీలో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఆల్‌రౌండర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యాలు ఉన్న అంబరీశ్‌ మెరుగ్గా రాణిస్తే.. టీమిండియాలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తాడనటం అతిశయోక్తి కాదు. 

    చదవండి: యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!

  • భారత క్రికెట్‌ పరిపాలనలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరైన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్‌ సింగ్‌ బింద్రా (ఐఎస్ బింద్రా) వయోభారంతో (84 ఏళ్లు) ఆదివారం కన్నుమూశారు. బింద్రా 1993 నుండి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 1978 నుండి 2014 వరకు 36 సంవత్సరాల పాటు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

    బింద్రా మరణం భారత క్రికెట్‌ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. పరిపాలకుడిగా తన దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలతో బింద్రా భారత క్రికెట్‌ను ప్రపంచ వేదికపై తిరుగులేని శక్తిగా నిలిపారు.  

    1987 వరల్డ్‌కప్‌ను భారత ఉపఖండానికి తీసుకురావడంలో బింద్రా కీలక పాత్ర పోషించారు. ఇది మొదటిసారి ఇంగ్లండ్‌ వెలుపల జరిగిన వరల్డ్‌కప్. ఈ వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించిన బింద్రా.. భారత క్రికెట్‌ ఆర్థికస్థితిగతుల రూపురేఖల్ని మార్చారు. 

    అనంతరం బింద్రా ప్రోద్భలంతోనే 1996 వరల్డ్‌కప్‌ కూడా భారత ఉపఖండంలో జరిగింది. ఈ ప్రపంచకప్‌ నిర్వహణ ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ కేంద్రస్థానంగా మారడానికి దోహదపడింది.  

    ప్రపంచకప్‌ లాంటి ఐసీసీ మెగా టోర్నీలను భారత్‌కు తీసుకురావడంలో సఫలీకృతుడైన బింద్రా.. ప్రసార హక్కుల విషయంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు. 1994లో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించి, దూరదర్శన్‌ ఏకాధికారాన్ని సవాలు చేశారు. ఆ తీర్పుతో ప్రైవేట్‌ మరియు అంతర్జాతీయ ప్రసార సంస్థలు భారత క్రికెట్‌లోకి ప్రవేశించాయి. 

    ESPN, TWI వంటి సంస్థలు మార్కెట్లోకి రావడంతో టెలివిజన్‌ ద్వారా క్రికెట్‌ భారత దేశ నలుమూలకు చేరింది. దీంతో ఆదాయాలు పెరిగి, భారత క్రికెట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మార్కెట్‌గా మారింది. ఈ ఆర్థిక బలమే బీసీసీఐని స్వతంత్రంగా, శక్తివంతంగా నిలబెట్టింది.  

     

  • న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌కు మరో లక్కీ ఛాన్స్‌ దక్కింది. తిలక్‌ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్‌ను చివరి రెండు టీ20లకు కూడా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ప్రపంచకప్‌కు ముందు శ్రేయస్‌ తనను తాను నిరూపించుకునేందుకు ఇది సువర్ణావకాశం. శ్రేయస్‌ భారత్‌ తరఫున టీ20లు ఆడక చాలా కాలమైంది.

    న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు అతను ఎంపికైనా, తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 3-0తో చేజిక్కించుకోవడంతో శ్రేయస్‌కు చివరి రెండు టీ20ల్లో అవకాశం​ దక్కవచ్చు. ఈ అవకాశాన్ని శ్రేయస్‌ సద్వినియోగం చేసుకోగలిగితే, ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.

    ప్రపంచకప్‌కు ఎంపికైన వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఒకవేళ సుందర్‌ ప్రపంచకప్‌కు దూరమైతే అతని​ స్థానాన్ని శ్రేయస్‌తో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది అంత సులువుగా జరిగే విషయం అయితే కాదు. ఎందుకంటే, సుందర్‌ స్థానానికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది.

    సుందర్‌కు ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైన రవి బిష్ణోయ్‌ ప్రధాన పోటీదారుగా మారాడు. బిష్ణోయ్‌ చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడో టీ20లో సత్తా చాటాడు. ప్రపంచకప్‌ భారత ఉపఖండంలో జరుగుతుంది కాబట్టి, సెలెక్టర్లు సుందర్‌ లాంటి ఆల్‌రౌండర్‌ కాకపోయినా, బిష్ణోయ్‌ లాంటి నాణ్యమైన స్పిన్నర్‌తో అడ్జస్ట్‌ కావచ్చు.

    సుందర్‌ స్థానానికి మరో ప్రధాన పోటీదారుడు రియాన్‌ పరాగ్‌. పరాగ్‌ సుందర్‌ లాగే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాబట్టి, సెలెక్టర్లు అతనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరాగ్‌ సైతం చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నా, ఐపీఎల్‌ 2025 సత్తా చాటడం అతనికి కలిసొచ్చే అంశం.

    ఈ లెక్కన వాషింగ్టన్‌ సుందర్‌ ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్‌ అయ్యర్‌, రియాన్‌ పరాగ్‌, రవి బిష్ణోయ్‌ రేసులో ఉంటారు. వీరిలో బిష్ణోయ్‌ ఇదివరకే (మూడో టీ20) తనను నిరూపించుకున్నాడు. శ్రేయస్‌కు ఒకవేళ చివరి రెండు టీ20ల్లో అవకాశం వచ్చి, అతను కూడా సత్తా చాటితే, సుందర్‌ స్థానానికి ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే, శ్రేయస్‌ చివరి రెండు టీ20లకు కొనసాగనుండటంతో, న్యూజిలాండ్‌ సిరీస్‌కు తిలక్‌ వర్మ అందుబాటులో ఉండడనే విషయం స్పష్టమవుతుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్‌ను న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపిక చేయలేదు. అతను చివరి రెండు టీ20లకు అందుబాటులో వస్తాడని సెలెక్టర్లు ఆశించారు. 

    అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రేయస్‌ చివరి రెండు మ్యాచ్‌లకు కూడా కొనసాగనున్నాడు. తిలక్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమైనా ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడని కన్ఫర్మ్‌ అయ్యింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. న్యూజిలాండ్‌తో చివరి రెండు టీ20లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జనవరి 28, 31 తేదీల్లో జరుగనున్నాయి.

     

  • టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడి పట్ల ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) గుర్రుగా ఉంది. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేని సమయంలో దేశీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.

    ఇందుకు అనుగుణంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) సైతం ఈసారి వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ బరిలో దిగారు. కోహ్లి ఢిల్లీ తరఫున.. రోహిత్‌ ముంబైకి ఆడి సత్తా చాటారు. ఇక యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సైతం సొంతజట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు ఆడాడు.

    రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు
    ప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ (Ranji Trophy 2025-26) మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. తదుపరి సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో ముంబై తలపడనుంది.

    కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సహా వెటరన్‌ స్టార్‌ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంసీఏ సెలక్టర్లు.. ఢిల్లీతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్‌ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది. దీంతో జైసూను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.

    స్పందన కరువు.. 
    ఈ విషయం గురించి MCA అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. “హైదరాబాద్‌తో మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాము. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. తనకు నచ్చినపుడు నచ్చిన మ్యాచ్‌లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

    యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయము!
    తదుపరి మ్యాచ్‌ కోసం అందుబాటులో ఉంటాడా? లేదా? అని అడిగినపుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్‌కు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీతో మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. సిద్దేశ్‌ లాడ్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌ వంటి స్టార్లు ఉన్నారు.

    చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌.. ఆ పని చేయబోము

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హ్యాట్రిక్‌ విజయాలతో 3-0తో సత్తా చాటింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సన్నాహకంగా సాగుతున్న ఈ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని సూర్యుకుమార్‌ సేన పట్టుదలగా ఉంది.

    అయితే, మెగా టోర్నీకి ముందు గాయాల బెడద టీమిండియాకు ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కాగా.. వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel) సైతం వేలునొప్పితో బాధపడుతున్నాడు.

    రేసులోకి ఊహించని ఆటగాడు
    ఇక వాషీ కోలుకునేందుకు ఇంకా రెండు వారాలకు పైగానే పట్టవచ్చని బీసీసీఐ (BCCI) వర్గాలు ఇప్పటికే జాతీయ మీడియాకు వెల్లడించాయి. దీనిని బట్టి అతడు వరల్డ్‌కప్‌ టోర్నీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)ను రేసులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

    భుజం నొప్పి
    అసోం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. భుజం నొప్పితో బాధపడుతున్న అతడు గత మూడు వారాలుగా బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు. గతేడాది డిసెంబరు 6న చివరగా అసోం తరఫున దేశీ క్రికెట్‌ ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు.

    రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లకు కూడా రియాన్‌ పరాగ్‌ అందుబాటులో లేడు. అయితే, ప్రస్తుతం అతడు వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. నెట్స్‌లో పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ నొప్పి లేకపోవడం సానుకూలాంశంగా పరిణమించింది. జనవరి 28, 30 తేదీల్లో అతడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.

    ఈ క్రమంలో జనవరి 31న రియాన్‌ పరాగ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయ్యే అవకాశం ఉందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ పరిస్థితి గురించి ఆరా తీసిన బీసీసీఐ.. ఫిబ్రవరి 2న టీమిండియాతో పాటు స్టాండ్‌బై ప్లేయర్‌గా అతడిని ముంబైకి పిలిచినట్లు సమాచారం.

    వాషీ దూరమైతే
    ఒకవేళ వాషింగ్టన్‌ సుందర్ కోలుకోకపోతే.. అతడి స్థానంలో రియాన్‌ పరాగ్‌ను వరల్డ్‌కప్‌ టోర్నీకి ఎంపిక చేసే అవకాశం ఉంది. కాగా గువాహటికి చెందిన 24 ఏళ్ల రియాన్‌ పరాగ్‌.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం గల బ్యాటర్‌ అయిన ఈ యువ ఆటగాడు.. రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!

    జింబాబ్వేతో 2024 నాటి టీ20 సిరీస్‌ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రియాన్‌ పరాగ్‌.. చివరగా శ్రీలంక పర్యటనలో వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 9 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 106 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు వికెట్లు తీశాడు. ఒకే ఒక్క వన్డేలో 15 రన్స్‌ చేసిన పరాగ్‌.. మూడు వికెట్లు పడగొట్టాడు.

    చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్‌.. ఆ పని చేయబోము

Business

  • భారత్‌-ఈయూ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. భారత్‌–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సాగిన చర్చలు విజయవంతంగా ముగిశాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ సోమవారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని జనవరి 27న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇది “సమతుల్యమైనదీ, ముందుచూపుతో కూడినదీ” అని పేర్కొన్న ఆయన, ఈయూతో భారతదేశ ఆర్థిక ఏకీకరణను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

    ఈ ఒప్పందం వచ్చే ఏడాది ఏదో ఒక సమయంలో అమల్లోకి వచ్చే అవకాశముందని అగర్వాల్ తెలిపారు. ఒప్పంద పాఠ్యానికి సంబంధించిన చట్టపరమైన పరిశీలన (లీగల్ స్క్రబ్బింగ్)కు సుమారు 5–6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అధికారికంగా సంతకాలు జరుగుతాయని చెప్పారు. “చర్చలు పూర్తయ్యాయి. ఒప్పందం ఖరారైంది. ఇది రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు.

    కాగా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సోమవారం జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  • దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వినిపించే పదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని పదాలు.. వాటి అర్థాల గురించి తెలుసుకుంటే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం–వ్యయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది.

    • యూనియన్‌ బడ్జెట్: ప్రభుత్వ ఆర్థిక స్థితిని సమగ్రంగా వివరించే నివేదిక. ఆదాయ వనరులు, వ్యయాలు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలు ఇందులో ఉంటాయి.

    • ఫిస్కల్‌ పాలసీ (విత్త విధానం): వ్యయం, పన్నుల ద్వారా ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం అనుసరించే విధానం. ఇది బడ్జెట్ ద్వారా అమలవుతుంది.

    • ఇన్‌ఫ్లేషన్‌ (ద్రవ్యోల్బణం): వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. దీని వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుంది.

    • మానిటరీ పాలసీ (Monetary Policy): డబ్బు సరఫరా, వడ్డీ రేట్లు, రుణ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకు (ఆర్‌బీఐ) తీసుకునే చర్యలు.

    • బడ్జెట్ ఎస్టిమేట్స్‌ (Budget Estimates): రాబోయే ఆర్థిక సంవత్సరానికి మంత్రిత్వ శాఖలు, పథకాలకు కేటాయించిన నిధుల అంచనాలు.

    • రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ (Revised Estimates): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో వాస్తవ పరిస్థితులను బట్టి సవరించిన ఆదాయం–వ్యయాల అంచనాలు.

    • రెవెన్యూ బడ్జెట్: ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు (పన్ను, పన్నుయేతర ఆదాయం), రెవెన్యూ వ్యయాలను చూపుతుంది.

    • క్యాపిటల్ బడ్జెట్: మూలధన వసూళ్లు, మూలధన వ్యయాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి.

    • ఫినాన్స్‌ బిల్‌ (ఆర్థిక బిల్లు): బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల మార్పులను అమలు చేయడానికి రూపొందించే చట్టప్రతిపాదన.

    • క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ (మూలధన వ్యయం): ఆస్తుల కొనుగోలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చేసే ఖర్చు.

    • రెవెన్యూ ఎక్స్‌పెండీచర్‌ (రెవెన్యూ వ్యయం): జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి తక్షణ వినియోగ ఖర్చులు.

    • ఫిస్కల్‌ డెఫిసిట్‌ (ద్రవ్యలోటు): ప్రభుత్వ మొత్తం వ్యయం, రుణం కాని వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే లోటు.

    • ప్రైమరీ డెఫిసిట్‌ (ప్రాథమిక లోటు): ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను మినహాయించిన మొత్తం.

    • రెవెన్యూ డెఫిసిట్‌ (రెవెన్యూ లోటు): రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడుతుంది.

    • గ్రాస్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (స్థూల ద్రవ్యలోటు): ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమైన మొత్తం రుణ పరిమాణం.

    • నెట్‌ ఫిస్కల్‌ డెఫిసిట్‌ (నికర ద్రవ్యలోటు): ప్రభుత్వం ఇచ్చే నికర రుణాలను మినహాయించిన ద్రవ్యలోటు.

    • క్యాపిటల్‌ రిసీట్స్‌ (మూలధన వసూళ్లు): రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ, రుణ రికవరీలు మొదలైనవి.

    • రెవెన్యూ రిసీట్స్‌ (రెవెన్యూ వసూళ్లు): పన్నులు, పన్నుయేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం.

    • డైరెక్ట్‌ ట్యాక్స్‌ (ప్రత్యక్ష పన్నులు): ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను వంటి నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులు.

    • ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ (పరోక్ష పన్నులు): జీఎస్టీ వంటి వస్తువులు, సేవలపై విధించే పన్నులు.

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా వేడుక. హల్వా వేడుకతో బడ్జెట్ పత్రాల ముద్రణకు అనుమతి లభిస్తుంది. ప్రింటింగ్ ప్రక్రియ సాధారణంగా ప్రభుత్వ ప్రెస్ ఉన్న నార్త్ బ్లాక్ నేలమాళిగలో (అండర్ గ్రౌండ్) జరుగుతుంది.

    ఒకప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో..
    గతంలో బడ్జెట్‌కు సంబంధించిన డాక్యుమెంట్ ప్రింటింగ్ అనేది.. ఈ నార్త్ బ్లాక్‌లో జరిగేది కాదు. ఎందుకంటే 1950లో జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. అప్పుడు డాక్యుమెంట్ ప్రింటింగ్ రాష్ట్రపతి భవన్ ప్రెస్‌లో జరిగింది. కేంద్ర బడ్జెట్ లీక్ అవ్వడంతో మథాయ్ కూడా రాజీనామా చేశారు.

    తరువాత నార్త్ బ్లాక్‌కు..
    ఎప్పుడైతే బడ్జెట్ లీక్ అయిందో.. వెంటనే ప్రింటింగ్ చేసే ప్రదేశాన్ని కూడా మార్చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్ నుంచి మింటో రోడ్‌లోని మరింత సురక్షితమైన సదుపాయానికి మార్చడానికి దారితీసింది. ఆ తరువాత 1980లో మళ్ళీ బడ్జెట్ ముద్రణ ప్రదేశం నార్త్ బ్లాక్‌కు మారింది. ఆ తరువాత ప్రదేశం మారలేదు, కాబట్టి నేటికీ ఇక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతోంది.

    బడ్జెట్ ముద్రణ సమయంలో చాలా కఠినమైన భద్రతలు ఉంటాయి. ఇది కూడా చాలా రహస్యంగా జరుగుతుందని సమాచారం. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు 'లాక్-ఇన్' వ్యవధికి లోబడి ఉంటారు. అంటే వీరు కొన్ని రోజులు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారందరూ కనీసం ఫోన్‌లను కూడా ఉపయోగించకూడదు. ఆర్థిక మంత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే వాళ్లందరూ బయటకు రావడానికి అనుమతిస్తారు.

    ఇదీ చదవండి: బ్రిటిష్ సంప్రదాయానికి చెక్.. 1999లో మారిన బడ్జెట్ టైమ్

    నిర్మలా సీతారామన్ తొమ్మిదో బడ్జెట్‌
    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 88వ బడ్జెట్ అవుతుంది. అంతే కాకుండా.. 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఇదే సమయాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తారు.  వరుసగా తొమ్మిది కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ఆర్థిక మంత్రులలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతున్నారు.

  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యుచువల్‌ ఫండ్‌ సంస్థ స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) విభాగంలో రెండు కొత్త ఫండ్స్‌ని ప్రవేశపెట్టింది. ఐసిఫ్‌ ఈక్విటీ ఎక్స్‌-టాప్‌ 100 లాంగ్‌-షార్ట్‌ ఫండ్, ఐసిఫ్‌ హైబ్రిడ్‌ లాంగ్‌-షార్ట్‌ ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ రెండు న్యూ ఫండ్‌ ఆఫర్లు జనవరి 30 వరకు అందుబాటులో ఉంటాయి.

    మొదటిది ఎక్స్‌-టాప్‌ 100 స్టాక్స్, వాటి సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. లాంగ్‌–షార్ట్‌ పొజిషనింగ్, డెరివేటివ్‌ వ్యూహాలతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లోని వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇక రెండోది ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈక్విటీ పొజిషన్లలో లాంగ్‌-షార్ట్‌ పొజిషన్లు, ఫిక్సిడ్‌ ఇన్‌కం సాధనాలు, డెరివేటివ్‌ వ్యూహాలతో మార్కెట్‌ దిశతో సంబంధం లేకుండా మెరుగైన రాబడులు అందించేందుకు ప్రయత్నిస్తుంది.

    మ్యుచువల్‌ ఫండ్స్, పీఎంఎస్‌/ఏఐఎఫ్‌ సాధనాల మధ్య అంతరాలను భర్తీ చేసే దిశగా సెబీ ఈ సిఫ్‌ సెగ్మెంట్‌ని ప్రవేశపెట్టింది. దీనికి కనీస పెట్టుబడి రూ. 10 లక్షలుగా ఉంటుంది. వివిధ మార్కెట్‌ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన పనితీరు కనపర్చే వైవిధ్యమైన పెట్టుబడి వ్యూహాలను ఇన్వెస్టర్లకు అందించే లక్ష్యంతో వీటిని ప్రవేశపెడుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ శంకరన్‌ నరేన్‌ తెలిపారు.

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.

    బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.

    ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.

    ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని  స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.
    ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్‌..

    దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్‌లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.

  • గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఊహకందని రీతిలో.. తొలిసారిగా ఔన్స్‌కు 5,000 డాలర్లు దాటేసింది. ఇదే సమయంలో వెండి ధర కూడా ఔన్స్‌కు 100 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతూ.. రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో చీఫ్ ఎకనామిస్ట్ & గ్లోబల్ స్ట్రాటజిస్ట్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    బంగారం ధర 100 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 5,085 డాలర్లు దాటేసింది. వెండి ధర 5 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి.. 108.25 డాలర్లు క్రాస్ చేసింది. ఈ రెండూ కొత్త గరిష్ట స్థాయిలలో ఉన్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన అస్థిరతకు సంకేతం. ఇది రాబోయే రోజుల్లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే విధంగా పీటర్ షిఫ్ పేర్కొన్నారు.

    బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక & రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ విషయంలో.. అమెరికా & నాటో దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పాటు ఉక్రెయిన్, గాజా వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా తీసుకుంటున్న చర్యలు కూడా.. పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచుతున్నాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా చైనాతో ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై 100% సుంకం విధిస్తామని ఆయన బెదిరించిన తర్వాత.. పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటివాటిపై పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇది వీటి ధరలను అమాంతం పెంచేసింది.

    ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా

    ఇదిలా ఉండగా.. విశ్లేషకులు బంగారం ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఔన్సుకు 6000 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. గోల్డ్ & సిల్వర్ ధరల భారీ పెరుగుదల కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అస్థిరతకు, అప్పుల భారానికి, రాజకీయ ఉద్రిక్తతలకు స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి రాబోయే కాలంలో ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరికీ అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

  • యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ బీఎస్‌ఈ సెక్టార్‌ లీడర్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 6 వరకు ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కార్తీక్‌ కుమార్‌ ఫండ్‌ నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

    బీఎస్‌ఈ 500 సూచీలోని 21 రంగాల కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. ప్రతీ రంగం నుంచి టాప్‌ 3 కంపెనీలను ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. దీంతో ఆయా రంగాల్లోని అగ్రగామి కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌ లభిస్తుంది.  

    శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ 
    శామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌.. శామ్కో మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బలమైన ఆదాయం, లాభాలు, ధరల తీరు ఆధారంగా భవిష్యత్తులో బలంగా ఎదిగే మధ్యస్థాయి కంపెనీలను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. ఇందుకు గాను ‘కేర్‌’ విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ విలువ పరంగా 101 నుంచి 250వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌క్యాప్‌ కిందకు వస్తాయి. ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఫిబ్రవరి 4 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది.

  • బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. సోమవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి దాదాపు సగం ఊరటనిచ్చాయి.

    హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర సోమవారం ఉదయం రూ.2250 పెరిగి రూ. 1,49,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.1550లకే పరిమితమై  రూ.1,48,450లకు దిగివచ్చింది.

    ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర సోమవారం ఉదయం రూ.2450 ఎగిసి రూ. 1,62,710 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.1690 లకు నెమ్మదించి రూ.1,61,950లకు చేరుకుంది.

    అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)






     

  • చైనాలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లకుపైన ట్రేడ్ అవుతుండగా, ఒక్కరోజులోనే 3 శాతం పెరిగింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250 శాతాన్ని దాటింది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ వెండి ప్రీమియం కారణంగా స్థానిక ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి.

    భారత్–చైనా వెండి ధరల తేడా
    వెండి ధరలు ఆల్‌టైమ్ హై వద్ద ఉన్నాయి. భారత్‌లో వెండి ధర గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. చైనాతో పోలిస్తే ఇది సుమారు 17% తక్కువ. వివరంగా చూస్తే.. 1 ఔన్సు అంటే సుమారు 28.3 గ్రాములు. భారత్‌లో 1 ఔన్సు వెండి ధర సుమార రూ.9,984. అదే చైనాలో 1 ఔన్సు వెండి ధర 125 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.11,450. అంటే భారత్–చైనా మధ్య ఒక్క ఔన్సుపై సుమారు రూ.1,969 (17%) ధర వ్యత్యాసం ఉంది.

    ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?
    చైనాలో వెండికి భారీ డిమాండ్ ఉండటంతో పాటు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఈ ధర వ్యత్యాసాన్ని మరింత పెంచుతున్నాయి. వెండి బుల్ రన్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ సరఫరా పరిమితులు. దీనికి తోడు, చైనా 2026 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇకపై వెండి ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు అవసరం. ఈ విధానం 2027 వరకు అమల్లో ఉండనుంది.

    ఈ ఆంక్షలు ప్రకటించిన సమయంలో, ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యవసరం” అని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఇప్పటికే సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చైనా ఎగుమతులను పరిమితం చేయడంతో, ధరల అస్థిరత మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    ప్రపంచ వెండి మార్కెట్లో చైనా పాత్ర
    ప్రపంచ వెండి సరఫరాలో చైనా వాటా సుమారు 65%. సిల్వర్ ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పేపర్ ట్రేడింగ్‌లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద వెండి ఫ్యాబ్రికేటర్ కూడా చైనానే. చైనా ఎగుమతి పరిమితులు కొనసాగితే, ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోంది. అంటే డిమాండ్ ఎప్పటికప్పుడు సరఫరాను మించిపోతూనే ఉంది.ఘ
    ఇది చదివారా? రూ.లక్షల బంగారం.. లాకర్‌లో సేఫేనా?

    చైనాలో కొత్త నిబంధనలు
    జనవరి 1, 2026 నుంచి వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాలి. కఠినమైన ఉత్పత్తి, ఆర్థిక ప్రమాణాలు పాటించే పెద్ద, ప్రభుత్వ-ఆమోదిత సంస్థలకే లైసెన్సులు ఇస్తున్నారు. చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చైనా వెండి లభ్యత మరింత తగ్గే అవకాశముంది.

  • ఇటీవల సోషల్ మీడియాలో 2026 జనవరి 1 నుంచి 3 రో కార్లు (6 లేదా 7 సీట్లున్న కార్లు) కోసం ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు చేశారని వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీంతో చాలామంది వాహనదారుల్లో ఒకింత అయోమయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారికంగా స్పందించింది.

    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అదంతా తప్పుడు సమాచారం అని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర కార్లు / జీపులు / వ్యాన్లు యాన్యువల్ పాస్‌కు అర్హత కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది.

    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్
    భారతదేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానం తీసుకొచ్చింది. దీనిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌ను పరిచయం చేసింది. ఈ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

    ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

    ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా వాహనదారుడు గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్స్ చేయవచ్చు. ఈ పాస్ దేశవ్యాప్తంగా ఉన్న NHAI టోల్ ప్లాజాల్లో చెల్లుబాటు అవుతుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ తేదీ నుంచి ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుతుంది.

  • భారతదేశంలో తయారైన కార్లతో పోలిస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటమే. అయితే ఇప్పుడు భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదరబోయే ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ప్రీమియం కార్లు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరటను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే.. దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.

    ప్రస్తుతం యూరప్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లపై సుమారు 110 శాతం వరకు దిగుమతి సుంకం ఉంది. దీనివల్ల అక్కడ తక్కువ ధరకు లభించే కార్లు కూడా భారత్‌లో చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే కొత్త ఒప్పందం ప్రకారం ఈ దిగుమతి సుంకాన్ని నేరుగా 40 శాతానికి తగ్గించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే.. ప్రీమియం కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.

    దిగుమతి సుంకాలను తగ్గస్తే.. అది 15,000 యూరోలు (సుమారు రూ.16 లక్షలు) కంటే ఎక్కువ విలువ గల అన్ని వాహనాలకు వర్తించే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక పరిమితి కూడా ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా 2 లక్షల యూనిట్ల వరకే.. ఈ తక్కువ సుంకం వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా.. రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా ఈ దిగుమతి సుంకాన్ని మరింత తగ్గించి, చివరికి 10 శాతం వరకు తీసుకువచ్చే అవకాశమూ ఉందని చెబుతున్నారు.

    దిగుమతి సుంకాలను తగ్గిస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ, స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ వంటి స్పోర్టీ కార్ల ధరలు మాత్రమే కాకుండా, మెర్సిడెస్ బెంజ్, ఫెరారీ, లంబోర్ఘిని కార్ల ధరలు కూడా తగ్గాయి. ధరలు తగ్గితే.. భారత మార్కెట్‌లో ప్రీమియం & లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశముంది. అయితే, ఈ సుంకం తగ్గింపు నిబంధనలు మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తించకపోవచ్చని నివేదిక చెబుతోంది.

  • బినామీ ఆస్తి అంటే ఏమిటి.? బినామీ వ్యవహారం ఏమిటి.? బినామీదారు ఎవరు? ప్రయోజనం పొందేవారెవరు? మొదలైన విషయాలు ఇప్పటికే తెలుసుకున్నాము. ఈ వ్యవహారాలు చేయడం వల్ల కలిగే కష్టనష్టాలు ఈ వారం తెలుసుకుందాం.!

    ఆస్తి జప్తు: బినామీ ఆస్తి అని నిర్ధారణ జరిగితే ఆ ఆస్తిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం లేదా జప్తు చేసుకుంటుంది.

    శిక్షార్హులు: బినామీదారు, ప్రయోజనం పొందే వ్యక్తి (ముసుగు మనిషి), ఈ వ్యవహారాన్ని ప్రేరేపించిన లేదా ప్రోత్సహించిన వ్యక్తి, ఈ ముగ్గురూ చట్టం ప్రకారం శిక్షార్హులే. ఆరోపణలు నిరూపణ అయితే ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష (కఠినకారాగార శిక్ష) ఉంటుంది. ఇది కాకుండా, బినామీ ఆస్తి ఫెయిర్‌ మార్కెట్‌ విలువ మీద 25% జరిమానాగా విధిస్తారు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే కొన్ని షరతులకు లోబడి జరిమానాను సడలిస్తారు. బినామీదారు బినామీ ఆస్తిని తిరిగి ‘ప్రయోజకుడు’ లేదా ఏ ఇతర వ్యక్తికి కూడా బదిలీ చేయకూడదు. ఇలాంటి బదిలీలు చెల్లవు. అలాంటి అమ్మకం జరిగినప్పుడు కొన్న వ్యక్తికి ఎటువంటి విషయం తెలియకపోతే.. నిజమని నమ్మించి అమ్మితే, కొన్న వ్యక్తి నుంచి ఆస్తి తీసుకోరు.  

    అధికారుల అధికారాలు 
    ఈ చట్టప్రకారం నాలుగు రకాల అధికారులు ఉన్నారు. వారి అధికారాలు ఏమిటంటే...  
    (1) సమన్లు జారీ చేయడం (2) సమాచారం కోరడం (3) డాక్యుమెంట్లు స్వాధీనపరచుకోవడం (4) విచారణ చేయడం (5). విచారణలో సహకారం కోసం ఇతర అధికారులను కోరడం.  

    ఇంకా ఏం చేస్తారు 
    నోటీసులు ఇస్తారు. విచారిస్తారు. తీర్పు ఇస్తారు. తీర్పు అనుగుణంగా ఆస్తిని స్వాధీనం చేసుకుంటారు. వాటిని ఆధీనంలోకి తీసుకుంటారు.

    ఆద్యులెవరు ..  
    ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికి ముందు.. ఆద్యులు ఎవరంటే ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంటు వారు. వారిచ్చిన సమాచారం, డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని, బినామీ చట్టంలోని అధికారులు రంగంలోకి ప్రవేశిస్తారు. ఈ తరువాత పద్దతి ప్రకారం పని ముగిస్తారు.

    నోటీసు ప్రక్రియ.. 
    నోటీసు ఇవ్వడానికి ప్రక్రియ మారితే.. వ్యక్తిగత పోస్టు ద్వారా లేదా సివిల్‌ కోడ్‌ ప్రకారం నోటీసు ద్వారా విచారణ, ప్రశ్నలు, ఇన్వెస్టిగేషన్, సోదాలు, కాగితాల సేకరణ, పత్రాలు అడగడం, ఆ తరువాత తీర్పు ఇవ్వడం, ఎటాచ్‌మెంట్‌ చేయడం, స్వాధీనపరచుకోవడంలాంటివి జరుగుతాయి. ఆ తరువాత బినామీ ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది. ఎంక్వైరీ మధ్యలో బినామీదారు/ముసుగు మనిషి మరణిస్తే వారి వారసులకు కేసు బదిలీ చేస్తారు. కోర్టు పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఏ స్థాయిలోనైనా తప్పుడు సమాచారం ఇచ్చినా., తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినా కఠిన కారాగార శిక్ష, జరిమానాలు పడతాయి.

    ఈ రెండు చట్టాలు–చుట్టాలు .. 
    అటు అదాయపన్ను చట్టం, ఇటు బినామీ వ్యవహారంలో నిషేధిత చట్టం రెండూ కలిసి పనిచేస్తాయి. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత అంశం వెలుగులోకి వస్తుంది. ఇన్‌కంటాక్స్‌ అధికారులనే సూత్రధారులుగా .. ప్రారంభించే అధికారిని  INITIATING OFFICERS గా వ్యవహరించమంటారు. వారే అన్ని తయారు చేస్తారు. డిపార్టుమెంటు వారు ఈ చట్టం ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు రాబట్టుకుంటారు. వారి చట్టం ప్రకారం పెనాల్టీలు.. ఆదాయం మీద పన్ను వేసి... మిగతా కార్యక్రమం పూర్తి చేసి బినామీ నిషేధ చట్టం అధికారులకు అప్పగిస్తారు. ఈ అధికార్లు ఆస్తిని జప్తు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు. డిక్లేర్‌ చేయని ఆస్తులు.. డిక్లేర్‌ చేయని ఆదాయ వివరాలు తెలుసుకొని వాటిని అసెస్సీ పన్ను పరిధిలోకి తెచ్చి.. అసెస్‌మెంట్‌ చేసి... పన్ను, వడ్డీ, పెనాల్టీలు వసూలు చేసి బినామీ చట్టం అధికార్లకు అప్పగిస్తారు.

    ఇప్పుడు అర్థమైందా... బినామీ వ్యవహారాల వెనుకు ఎంత రిస్క్‌ ఉందో... దగ్గర బంధువులు, వ్యాపారం చేస్తున్న మిత్రులు, బంధువులు, మీరు చిన్న ఉద్యోగి అయితే మీ బాస్‌లు, యజమానులు, అల్లుడు, బావ, వియ్యంకుడు ఇలా అభిమానం అడ్డుపెట్టి, డబ్బులు ఎరచూపి, వారి కష్టాలని మీ దగ్గర వెలిబుచ్చి ట్రాప్‌ చేస్తారు. వారి వలలో పడకండి!

  • బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో బంగారం ఎక్కడికి చేరుతుందో అనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    బంగారం ధర 5000 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగింది. రాబోయే రోజుల్లో 27,000 డాలర్లకు చేరుతుందని కియోసాకి వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు వెండి ధరలు పెరుగుతాయని చెప్పిన కియోసాకి.. ఇప్పుడు గోల్డ్ రేటు భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. నిజంగానే ఆయన చెప్పిన మాటలు బంగారం విషయంలో జరుగుతాయా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.

    భారతదేశంలో బంగారం, వెండి ధరలు
    ఇండియన్ మార్కెట్లో రోజు రోజుకి పెరుగుతున్న గోల్డ్ రేటు.. ఈ రోజు (జనవరి 26) కూడా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,950 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,48,450 రూపాయల వద్ద నిలిచింది. సిల్వర్ రేటు రూ. 10వేలు పెరగడంతో.. కేజీ వెండి ధర రూ. 3.75 లక్షలకు చేరింది.

    బంగారం ధరలు పెరగడానికి కారణాలు
    ద్రవ్యోల్బణం, డాలర్ విలువ తగ్గడం, భౌగోళిక & రాజకీయ కారణాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, బంగారం సరఫరా పరిమితి, బంగారం పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మొదలైన కారణాల వల్ల బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.

    ఇదీ చదవండి: 168 గంటల్లో రూ. 16వేలు పెరిగిన గోల్డ్ రేటు!

National

  • భారత 77వ గణతంత్ర వేడుకలు ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా అంటూ బీజేపీని ప్రశ్నించింది.

    కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు" లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? ఇది సంప్రదాయాలు, మర్యాద, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? ఇది ప్రభుత్వం యెుక్క ఆత్మన్యూనత భావానికి నిదర్శనమనం అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీని అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడిందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా అద్వానీ బీజేపీ నేత అయినప్పటికీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేదన్నారు. 2014లో అద్వానీ లోక్‌సభ ప్రతిపక్ష నేత కాదని అయినప్పటికీ కాంగ్రెస్ ఎంతో గౌరవంతో ఆయనకు ముందు వరసలో కూర్చొబెట్టి గౌరవం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం మోదీ, అమిత్‌షాలు ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అవమానిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ అన్నారు.

    అయితే దీనిపై కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటరిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ మూడో వరుసలో కూర్చోవడంపై ఆందోళన చెందడం లేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన జరగుతున్నప్పుడు ఆయన తన మెుబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

  • ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ టెక్నా లజీ దుర్వి నియోగం ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా మారుతోంది. కేవలం సాంకేతిక ఆవిష్కరణగా భావించిన AI... మోసగాళ్ల చేతిలో ఓ ఆయుధంగా మారగా... బాధితులు... సామాన్యులకు మాత్రం ప్రాణం సంకటంగా మారుతోంది. వ్యక్తిగత రహస్యాలు... వారి గోప్య త... ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే ప్రమాదకర సాధనం గా రూపాంతరం చెందిం ది. ఈ కొత్త రకం సైబర్ నేరాలు మన దేశంలోనూ కలకలం సృ ష్టిస్తున్నా యి.
    ఇటీవల చోటు చేసుకుంటున్న విభిన్నమైన కేసులు AI ఆధారిత మోసాల గురించి జాగ్రత్తలు పాటించడం.. వాటి గురించి అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి.

    కేరళలో ఓ ప్రొఫెసర్‌కు వీడియో కాల్‌ వచ్చింది. సాధారణ కాల్‌ అని వీడియో ఆన్‌ చేశారు... అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది.. వీడియో ద్వారా సంభాషణ సాగిస్తూ... ఆయనను ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ఆయన వాస్తవాన్ని మరిచి ఊహాలోకాల్లోకి వెళ్లిపోయారు... సీన్‌ కట్‌ చేస్తే... ఆయన నగ్న వీడియోలు.. అమ్మాయితో మాట్లాడుతున్న సంభాషణ ఆయన ఫోన్‌కే వచ్చాయి. అసలు అది అమ్మాయి కాదు AI     సృష్టించిన బొమ్మ అని తె
    లిసి... ప్రొఫెసర్‌ మాత్రం ఘోరంగా మోసపోయాడు. మోసగాళ్లకు రూ. 2 లక్షలు ఇచ్చిన తర్వాత వేధింపులు ఆగక పోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

    గతేడాది ఢిల్లీలో విద్యార్థినుల ఫొటోలను న్యూ డ్‌గా మార్ఫ్ చేయడం.... 
    ఛత్తీస్‌గఢ్‌ ఐఐఐటీ విద్యార్థి.... 36 మం ది అమ్మాయిల ఫొటోలను మార్చి వాటిని వైరల్‌ చేసిన కేసు..
    అస్సాం లో ఇంజినీర్ ఆన్‌లైన్‌లో నకిలీ న్యూ డ్ కంటెం ట్ సృ ష్టిం చి డబ్బు సం పాదిం చిన విధానాలు చూస్తుంటే 
    సాంకేతికతను అడ్డం పెట్టుకుని ఎలా మోసం చేస్తున్నారో గమనించవచ్చు.

    AI దుర్వి నియోగం ఎంతటి మానసిక క్షోభకు గురి చేస్తుందో హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 19 ఏళ్ల డిగ్రీ
    విద్యార్థి... తన ముగ్గురు సోదరీమణులకు సంబంధించిన   ఏఐ సృష్టించిన అశ్లీల ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
    ఇలా ఒకటి రెండు ఘటనలు మాత్రమే కాదు... నిత్యం కొన్ని వందల సంఖ్యలో బాధితులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోసాల బారిన పడుతున్నారు. 

    ఇలాంటి మోసాల నుంచి బయట పడాలంటే ప్రజలు... 
    సమాజం సమష్టిగా కృ షి చేయాల్సిన అవసరం ఉంది. ఏఐ దుర్వినియోగం చేసిన వారిని గుర్తించి కఠిన శిక్షలు విధించాలి. ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. 
    యువతలో డిజిటల్ భద్రత, ప్రైవసీ, సైబర్ నేరాలపై తప్ప నిసరిగా అవగాహన పెంచాలి.
    సోషల్‌ మీడియాలో కంటెంట్ తొలగిం పు వ్య వస్థ ఉండాలి. 
    సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ లు తమ వేదికలపై AI-జనరేటెడ్ అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తిం చి, వెం టనే తొలగించేం దుకు బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
    బాధితులకు మద్దతుగా సహాయ కేంద్రాలు ఏర్పా టు చేయాలి. 
    బాధితులకు మానసిక, చట్టపరమైన సహాయం
    అం దిం చే కేం ద్రాలను ఏర్పా టు చేయాలి. మహిళలు ఎటువం టి భయం లేకుండాఫిర్యా దు చేసే వాతావరణాన్ని కల్పించాలి.
    ఫరీదాబాద్‌ ఘటప యావత్ సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది... 
    టెక్నా లజీ మనిషి జీవితాన్ని మెరుగుపరచాలి....

     

  • బనారస్ హిందూవిశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ మంగళ కపూర్‌కి పద్మశ్రీ అవార్డు లభించింది.  మంగళ కపూర్ తన సంగీత కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.'కాశీ లత'గా ప్రసిద్ధి చెందిన మంగళకపూర్‌ భారతదేశంలో తొలి యాసిడ్ దాడి బాధితురాలు. 12 ఏళ్ల వయసులోనే యాసిడి దాడికి  గురైన బాధితురాలు. ఆమె దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయక సంగీత విద్వాంసురాలిగా,  ప్రొఫెసర్‌గా ఎలా ఎదిగిగారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశీ అవార్డు సాధన  వెనుక  ఆమె చేసిన కృషి ఏంటి? తెలుసుకుందాం.

    ఇక బతకలేమోమో ప్రయాణం ముగిసిపోయిందన్న తీవ్రమైన కష్టాలనుంచి బతికి బట్టకట్టడమే కాదు, అత్యంత ఉన్నతంగా ఎదిగిన ధీర ఆమె. బలమైన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ అడ్డంకీ అడ్డుకోలేదు అనడానికి ప్రొఫెసర్ మంగళ జీవితం మనకు బోధిస్తుంది. ఆమె పోరాటం,విజయ గాథ స్ఫూర్తిదాయకం. అంతేనా సంగీతం , విద్య ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలమని కూడా  గుర్తు చేసిన ఘనత ఆమె  సొంతం. 

    ఉత్తరప్రదేశ్‌లోకి వారణాసికి చెందిన ఆమెపై  1965లో యాసిడ్ దాడి జరిగింది.  బట్టల వ్యాపారంలో ఉన్న అసూయ కారణంగా కొంతమంది ప్రత్యర్థులు రాత్రి 2 గంటల సమయంలో దాడి  చేశారు.  యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియని 12 ఏళ్ల వయసులో ఆమె నరకం అనుభవించింది. ఆరేళ్లపాటు ఆసత్పికే పరిమితం అయింది. ఒకటీ రెండు కాదు ఏకంగా 37 ఆపరేషన్లు .అందమైన మొహం అందవికారమైంది. మరోవైపు సమాజం సూటిపోటీ మాటలు. దీంతోచదువు కొనసాగించ లేకపోయింది. సంగీతం ఉన్న మక్కువతో ఇంట్లోనే ఉండి సంగీతం నేర్చుకుంది. 

    సూసైడ్‌ చేసుకుందామనుకుంది
    బయటకు వెళ్ళినప్పుడు సూటిపోటి మాటలు వ్యంగ్య వ్యాఖ్యలు వినేదానినని మంగళ కపూర్ గతంలో చెప్పారు. పాఠశాలలో పిల్లలు ఆమెను చూసి భయపడేవారట. కొన్నిసార్లు ఆమెను ఎగతాళి కూడా చేసేవారు. 'ముక్కులేనిది' అని వెక్కిరించేవారు. దీంతో ఆమె చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది.  కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ముందుకు సాగాలని, వెనక్కి తిరిగితే మరింత బలహీనుమవుతామని చెప్పే తండ్రి గుర్తుకు వచ్చేవారట దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడం అలవాటుగా మారిపోయింది.  అలా  దూరవిద్యలో పీజీ, తర్వాత  మెరిట్‌ స్కాలర్‌ షిప్‌తో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంగీతం, కళల విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడే శాస్త్రీయ సంగీత న ప్రొఫెసర్‌గా నియమితుల య్యారు. 

    సంగీత కచేరీలను ప్రారంభించారు. మంగళ స్వరమాధుర్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు. దేశంలో ఆమె కార్యక్రమాలు నిర్వహించని మూల లేదు అంటే అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచంలో ఆమె గాత్రం ఎంతో ఆదరణ పొందింది. అటు టీచర్‌గా అనేకమంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందించారు. అందుకే ఆమెను "కాశీ లతా మంగేష్కర్" అని కూడా పిలుస్తారు.  ఆమె కృషికి, అంకిత భావానికి  అనేక అవార్డులు వచ్చి వరించాయి. తరంగ్ ఫౌండేషన్ ఆమెకు "కాశీ లత" బిరుదును ప్రదానం చేయగా, రాజ్యసభ ఆమెకు "రోల్ మోడల్" అవార్డును ప్రదానం చేసింది.  తాజాగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవకు ,స్ఫూర్తిదాయకమైన పోరాట ప్రస్థానానికి గాను, కళారంగంలో 2026 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని  ప్రకటించడం విశేషం.

    మంగళ కపూర్ సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటారు. ఆమె ఉచితంగా సంగీతం నేర్పుతుంది, సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకు రావడానికి కృషి చేస్తుంది. 2018లో 'సీరత్'​ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఇది మరాఠీలో "మంగళ" మూవీగా జనవరి 17, 2025న విడుదలైంది. ఈ చిత్రం ఆమె పోరాటాలు , విజయాలను వివరిస్తుంది.

  • చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్రినాథ్, కేదారినాథ్, గంగోత్రి తీర్థయాత్రలకు కేవలం హిందుా మతస్థులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది. ఇక నుంచి అన్య మతస్థులను ఎట్టి పరిస్థితుల్లో తీర్థయాత్రలకు అనుమతించమని స్పష్టం చేసింది.

    బద్రినాథ్, కేదారినాథ్ టెంపుల్ కమిటీ (BKTS) ఛైర్మన్ హిమంత్ ద్వివేదీ మాట్లాడుతూ.  "హిందుయేతరులకు ధామ్, ముఖ్భాలో ప్రవేశం పూర్తిగా నిషేదం ఉత్తరాఖండ్ లోని ఆలయాల సంస్కృతిని పరిరక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా కేదారినాథ్ చుట్టుప్రక్కల ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం ఉండేది కాదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఈ నియమం తరచుగా ఉల్లంఘించబడింది." అన్నారు. అంతేకాకుండా BKTS పరిధిలోని అన్ని ఆలయాలలోకి హిందుయేతరులు ప్రవేశించకుండా త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    ఉత్తరాఖండ్ ఆలయాల పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం ఆలయాల కమిటీలతో కలిసి పనిచేస్తుందని ఆలయ కమిటీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.  అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆలయ కమిటీల సిపార్సులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయతృతీయ సందర్భంగా తెరుచుకోగా బద్రినాథ్ ఆలయం ఏప్రిల్ 23న తెరుచుకుంటుంది . వీటితో పాటు రుద్రప్రయాగ్‌లోని కేదారినాథ్  ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుంది అనే విషయం మహా శివరాత్రి రోజున ప్రకటిస్తారు.

    యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ధామాలను కలిపి చార్ ధామ్ అంటారు. హిందువులకు ఈ యాత్ర ఎంతో ప్రత్యేకం.  చార్ ధామ్ యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభించి, తర్వాత గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు చివరగా బద్రీనాథ్ దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రారంభమై వాతావరణ పరిస్థితులను బట్టి అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది.

     

  • వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభోత్సవం తర్వాత ఆహార నాణ్యతపై మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమకు పాడైపోయిన ఆహారాన్ని అందిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి  ప్రయాణీకులు క్యాటరింగ్ సిబ్బందితో తలపడుతున్నవీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో  తెగ వైరల్‌ అవుతున్నాయి. వందే భారత్ రైళ్లలో ఆహార నాణ్యతపై  మరో కొత్త దుమారం చెలరేగింది.


    కోల్‌కతాకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందినవిగా ఈ వీడియోలో అన్‌లైన్‌ షేర్‌ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది తినడానికి పనికి వచ్చే ఆహారమైనా అని ప్రశ్నిస్తూ క్యాటరింగ్  సిబ్బందితో ప్రయాణీకులు వాదనకు  దిగారు.తమ ఆహార ప్యాకెట్లను తిరిగిచ్చారు.  “ఈ పప్పు చూడండి కుళ్ళిపోయింది, కూర  కంపు కొడుతోంది  అంటూ  ఒక  ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.  సెమీ-హై-స్పీడ్ ‌  రైళ్లలో అధిక ధరల పాటు భోజనానికి ప్రయాణికులకు ప్రీమియం  ధరలు వసూలు చేస్తారని మండిపడ్డారు.

     దీంతో వందే భారత్‌  పేరుతో తీసుకొచ్చిన సెమీ-హై-స్పీడ్ భారతదేశ ప్రధాన రైళ్లలో ఆహార ప్రమాణాలపై మరోసారి చర్చకు తెరలేచింది. చాలామంది వినియోగదారులు ఇలాంటి అనుభవాలను కామెంట్లలో హెరెత్తించారు. ఈ సమస్య ఒకే రూట్‌కే పరిమితం కాదని  ఎక్కడ చూసినా ఇదే తంతు అని విమర్శించారు. వారణాసి-పట్నా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో  జరిగిన ఇలాంటి సంఘటనను ఒక యూజర్ గుర్తు చేసుకుంటూ, ప్రయాణీకులు ఎక్కువ చెల్లించినప్పటికీ మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అధిక ఛార్జీలు చెల్లిస్తున్నాం దీనిపై మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని మరొకరు రాశారు.

     

    మరికొందరు  పరిష్కారాలను సూచించారు. నాణ్యమైన ఫుడ్‌ అందించలేకపోతేఇండియన్ రైల్వేలు భోజనాన్ని అందించడం పూర్తిగా నిలిపివేయాలని కొందరు వాదించారు.   ఇలాంటి ఫుడ్‌ తీసుకోవద్దు, బిస్కెట్లు, చిప్స్ వంటి ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినండి" అని ఒకరు సూచించారు, వందే భారత్ రూట్లలో ఆహారం పేరుకే ప్రీమియం,  క్వాలిటీ యావరేజ్‌ కంటే తక్కువే అని కామెంట్‌ చేయడం గమనార్హం.  

    ఇదీ చదవండి: ఏడాదికి రూ. 39 కోట్లు : ఈ బిజినెస్‌ గురించి తెలుసా?

     

     IRCTC   వివరణ 

    మరోవైపు ఈ  ఆరోపణలను ఖండిస్తూ  IRCTC ఒక ప్రకటన జారీ చేసింది. వందేభారత్‌ రైళ్లలో అందించే ఆహారం, ప్రారంభం, వాణిజ్య ప్రకటనల సమయంలో ఎంత నాణ్యంగా ఉండో ఇపుడు కూడా అలాగే ఉంటుందని తెలిపింది. పప్పు, బియ్యం లేదా పులావ్, కూరగాయలు లేదా పన్నీర్ గ్రేవీ, పొడి కూరగాయలు, చపాతీ లేదా స్వీట్‌ను భోజనంలో  అందిస్తారని,  స్థానిక  ఆహారాన్ని అందించేందుకు ఒక గొప్ప క్యాటరింగ్‌ సంస్థ బాధ్యత వహిస్తోందని కూడా ఐఆర్‌సీటీసీ వివరించింది.  ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్న ఒకవీడియోను కూడా  ట్వీట్‌  చేసింది.

     

  • ఢిల్లీ:  పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ)  ఉదయం గం. 11లకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.  ఉభయ సభల్లో  సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన ఆర్థికసర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది.  అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. 

    జనవరి 28 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండగా, మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తారు. 

    ఇదిలా ఉంచితే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్‌ఐఆర్‌లపై  కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు  విపక్షాలు  సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం  పలు కీలక బిల్లులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా  ఈసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  విద్యారంగంలో సంస్కరణల కోసం  వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

  • న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి కలబోతగా ఆయన ధరించిన దుస్తులు నిలిచాయి. ముఖ్యంగా ఆయన ధరించిన రాజస్థానీ శైలి తలపాగా ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.

    పశ్చిమ భారతదేశంలో శుభప్రదమైన రంగులుగా భావించే ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ‘లహరియా’ డిజైన్‌తో ప్రధాని మోదీ ధరించిన  తలపాగాను రూపొందించారు. ఏటా ఒక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక తలపాగాను ధరించాలన్న తన ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ప్రధాని ఈ  తరహా ఎంపిక చేసుకున్నారు.
     

    తలపాగాకు జతగా ప్రధాని లేత నీలం రంగు స్లీవ్‌లెస్ జాకెట్‌ను ధరించారు. ఇది సంప్రదాయ నెహ్రూ జాకెట్‌కు ఆధునిక రూపం. దీనిని ప్రస్తుతం ‘మోదీ జాకెట్’ అని పిలుస్తున్నారు. నాణ్యమైన ఖాదీ, చేనేత పట్టుతో తయారైన ఈ జాకెట్.. దేశీయ వస్త్ర పరిశ్రమపై ఆయనకున్న  అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. తలపాగా రంగులను పోలిన పాకెట్ స్క్వేర్ ఆయన వస్త్రధారణకు మరింత హుందాతనాన్ని  ఇచ్చింది.

    ప్రధాని ధరించిన తలపాగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ‘బందేజ్’శైలిని పోలి ఉంది. కాగా ప్రధాని మోదీ ‘ఎక్స్’వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవం మన దేశ గౌరవానికి, కీర్తికి ప్రతీక అని, ఇది పౌరుల జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని’ ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ సంకల్పం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ!

Telangana

  • సాక్షి హైదరాబాద్ : కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు చైనా మాంజా మెడకు చుట్టుకొని గాయాలు కావడంతో  ఓ బాలిక మృతి చెందింది. తండ్రితో బైక్‌పై వెళుతున్న ఓ బాలికకు చైనా మాంజా మెడకు చుట్టుకొని తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఆ బాలిక  తండ్రి హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. 

    ఇటీవల జరిగిన బొటానికల్ గార్డెన్ వద్ద  ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా చైనా మాంజా తగిలి  యువకులకు తీవ్రగాయాలయ్యాయి. అంతేకాకుండా ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు అనే వ్యక్తికి సైతం మంజా తగిలి గోంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమయ్యింది. కర్ణాటకలో ఓ వ్యక్తి చైనా మాంజా  ప్రమాదంలో మృతి చెందారు. 

    అయితే చైనా మాంజాపై రాష్ట్ర పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంజాను అమ్మినా కొన్నా వారిపై కేసులుపెడతామని ఆదేశాలు జారీ చేశారు. నగరంలో పెద్దమెుత్తంలో మాంజాను పట్టుకొని సీజ్‌ చేశారు. అయినప్పటికీ కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకులు ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

    ఆ చిన్నారి చావుకు బాధ్యులెవరు..?
    చైనా మాంజాతో గాలి పటాలు ఎగరేయకండని, అవి ప్రమాదమని చెప్పినా ఇంకా ప్రాణాలే పోతున్నాయ్‌
    కూకట్‌పల్లిలో ఓ చిన్నారి తండ్రితో పాటు బైక్‌పై వెళుతూ ప్రాణాలు కోల్పోయింది
    నాన్నా.. నాన్నా అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్ర గాయమైంది
    ఆస్పత్రికి తరలించినా ప్రాణం మాత్రం దక్కలేదు
    ఆ చిన్నారికి చావుక ఎవరు బాధ్యులు.. 
    మనకి మనం మారదాం.. మనకు మనం తెలుసుకుందాం
    ఆ చిన్నారి ప్రాణాన్ని తీసుకొచ్చేదెవరూ..?
    ఆ కుటుంబం అరణ్య రోదనకు కారణం ఎవ్వరూ..?
    మనం మారాలి.. ఈ సమాజం మారాలి. 
    సరదా కంటే ప్రాణం ముఖ్యమనే సంగతి తెలుసుకోవాలి

  • హైదరాబాద్‌:  రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌రావు సిట్‌ నోటీసులు ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి సంతోష్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.  

    ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోష్‌కు సోమవారం(జనవరి 26వ తేదీ) నోటీసుల ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం  మూడు గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.  సీఆర్సీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్‌ నోటీసులపై సంతోష్‌రావు స్పందించారు. రేపు సిట్‌ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్‌రావు.

    కాగా, ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్‌ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్‌ వాదన.  ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్‌ఎస్‌ నేతలు ఇలా చేశారని సిట్‌ చెబుతోంది.

  • సాక్షి, భువనగిరి జిల్లా: చౌటుప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగరాజు అనే  అమరావతి APSRTC డ్రైవర్ దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతిచెందారు. మియాపూర్ నుండి విజయవాడ వెళుతున్న ఏపీఎస్సార్టీసీ బస్సు డ్రైవర్‌ నాగరాజుకు  చౌటుప్పల్‌ వద్ద గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ఆ నొప్పిని భరిస్తూ బస్సును పక్కకు ఆపారు. దీంతో హుటాహుటీన చికిత్స నిమిత్రం ఆటోలో అక్కడి ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

    ఆ సమయంలో అక్కడ డాక్టర్లు లేకపోవడంతో వెంటనే అక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే బాధితుడిని పరీక్షించిన డాక్టర్లు నాగరాజు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అయితే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో బస్సులో 18మంది ప్రయాణికులు ఉన్నారు. ఆయన అప్రమత్తతతో వారికి పెను ప్రమాదం తప్పింది.

  • హైదరాబాద్‌:  నాంపల్లి ఫర్నిచర్‌ షాపులో రెండు రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి చూపించిన తెగువను సీపీ సజ్జనార్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. నేటి సమాజంలో ఈ తరహా మనుషులతో మానవత్వం ఇంకా చనిపోలేదనే విషయం అర్థమవుతుందని సజ్జనార్‌ కొనియాడారు.. ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు సజ్జనార్‌

    ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది. ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క బాధితుల ఆర్తనాదాలు.. అయినా దినేష్ వెనకడుగు వేయలేదు.

    తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది. 

    ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కేవలం దినేష్ మాత్రమే కాదు.. ఆపద సమయంలో మతసామరస్యం వెల్లువిరిసింది. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కష్టం వస్తే 'మేమంతా ఒక్కటే' అని నిరూపించి, హైదరాబాద్ గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారు. వారందరికీ సెల్యూట్!!

     

  • కరీంనగర్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డలో చోటు చేసుకంది. స్కూల్‌ బస్సును బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్కూల్‌ బస్సు ముందు వెళుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ మృతి చెందారు. 

    ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిని వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో ఒకర గణేష్‌ అనే యువకుడు కాగా, మరొకరు సందీప్‌రెడ్డి అనే మరో యువకుడిగా నిర్దారించారు. 

     

  • ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత కథనానికి దారి చూపిస్తూ సినిక్‌ సంస్థ ఏర్పాటు చేసిన జెన్‌ ఏఐ మైక్రోఫిలిం హ్యాకథాన్‌లో యువ చిత్రకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌లో  నిర్వహించిన ఫిలిం హ్యాకథాన్‌లో 60 మందికి పైగా ప్రతిభావంతులైన ఫిలిం చిత్రాకారులు పాల్గొని సత్తా చాటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగిన ఈ హ్యాకథాన్‌లో వారు ఏఐని వినియోగించి 90 సెకన్ల మైక్రో సినిమాలను రూపొందించారు. మొత్తంగా వచ్చిన మైక్రో ఫిలింలలో మూడింటిని ఉత్తమ చిత్రాలుగా గుర్తించి వారికి సినిక్‌ వ్యవస్థాపకుడు భరత్‌ గుప్తా, సహ వ్యవస్థాపకులు పద్వీ రెడ్డి దేవిరెడ్డి, ఆకాశ్‌ చోడే బహుమతులు అందజేశారు.

  • సాక్షి హైదరాబాద్: మల్లాపూర్‌లో  తప్పుడు ప్రచారంతో తమను బురిడీ కొట్టిద్దామని చూసిన నిర్వాహకులకు ప్రజలు దేహశుద్ధి చేశారు. మల్లాపూర్‌లో రూ.26 వేలకే కారు అందిస్తామని కొద్దిరోజుల ఇన్‌స్టాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇది నమ్మిన ప్రజలు ఈ రోజు ( సోమవారం) పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే అది మోసం అని తేలింది. దీంతో ఆగ్రహాం చెందిన ‍ప్రజలు కర్రలతో నిర్వాహాకులపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని శాంతిపజేశారు. అనంతరం నిర్వాహకులను అదుపులోకి తీసుకొని నాచారం పీఎస్‌కు తరలించారు.

     

     

     

  • హైదరాబాద్: ఆమె వివాహిత. వయసు 46.  అతడు 23 ఏళ్ల యువకుడు. వీరిద్దరికీ ఇన్‌స్టాలో పరిచయం ప్రణయానికి దారి తీసింది. ఆదివారం వీరు నగరం నుంచి  అదృశ్యమయ్యారు.  జూబ్లీహిల్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. బిహార్‌కు చెందిన మహిళ (46)కు భర్త, 19, 16 ఏళ్లున్న కుమారుడు, కూతురు ఉన్నారు. 2004లో నగరానికి వలస వచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఆమె భర్త వంట మనిషిగా, సదరు మహిళ పని మనిషిగా పని చేస్తున్నారు. 

    ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఆమెకు ఇన్‌స్టాలో పరిచయమైంది. ప్రేమలో పడిన వీరు నగరంలో తరచూ కలుసుకునేవారు. ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి పరారయ్యారు. భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు  మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో వివాహితతో పాటు యువకుడు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీరి కోసం గాలిస్తున్నట్లు  జూబ్లీహిల్స్‌ పోలీసులు పేర్కొన్నారు.    

  • గీసుకొండ/నెక్కొండ: కేరళలో వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన సింగారపు కుమారస్వామి, మంజుల దంపతుల కూతురు శ్వేత (25)కు రెండేళ్ల క్రితం సంగెం మండలం కుంటపల్లికి చెందినసీ  సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగం విక్రంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా విక్రం కేరళలో విధులు నిర్వర్తిస్తుండగా బీటెక్‌ చదివిన శ్వేత అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. 

    వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈనెల 21న శ్వేత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ జాన్‌పాకలోని విక్రం ఇంటికి తీసుకొచ్చారు. తన కూతురు      మృతికి అల్లుడే కారణం అంటూ మృతురాలి బంధువులు, సూరిపల్లి గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. 

    కొట్టడంతోపాటు ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో అక్కడే నిరసన తెలిపారు. విక్రంకు సంబంధించిన జాన్‌పాక, కుంటపల్లిలోని ఆస్తిని మృతురాలి బంధువులకు రాసి ఇవ్వాలంటూ పట్టుబట్టి అంగీకార పత్రం రాయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కు మార్, సిబ్బంది వెళ్లి గొడవ చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి రాత్రి బంధువులు శ్వేత మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సూరిపల్లికి  తీసుకెళ్లారు.

     

  • సాక్షి,కామారెడ్డి: బాన్సువాడ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆటో నుంచి కిందకు దూకి ఎనిమిదవ తరగతి విద్యార్థిని సంగీత ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని మృతికి ఇన్‌ ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌ సునీతే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

    పోలీసుల వివరాల మేరకు.. మద్నూర్ మండలం కొడిచిర గ్రామానికి చెందిన సంగీత బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఈ క్రమంలో ఇన్‌ ఛార్జ్‌ ప్రిన్సిపల్‌ సునీత ఇంట్లో ఓ శుభకార్యం కోసం విద్యార్థినులే పాఠశాల ఫర్నిచర్ తరలించారు. తిరిగి ఫర్నిచర్ తీసుకొస్తున్న సమయంలో విద్యార్థిని ఆటోలో ప్రయాణిస్తుండగా జారి పడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. తలకు తీవ్ర గాయాలు రావడంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

    తల్లిదండ్రుల ఆందోళన
    సంగీత మృతి వార్త తెలిసిన వెంటనే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సునీత ఇంటి కార్యక్రమం కోసం విద్యార్థులను పనుల్లో ఉపయోగించడం, ఫర్నిచర్ తరలింపులో పాల్గొనడం వంటి చర్యలపై తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేశారు.

    పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోవడంతో గురుకుల పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన, పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి స్పష్టంగా చూపించింది. సంగీత మృతి కుటుంబాన్ని, సహ విద్యార్థులను కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.   

  • ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: కీకారణ్యంలో కొలువై ఉన్న వనదేవతలను దర్శించుకునేందుకు నాడు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని రెండు రోజుల ముందే మేడారం జాతరకు బయలుదేరేవారు. గ్రామాల్లో ఎడ్లబండ్ల చక్రాలు, బండికానీలకు రంగులు వేసి, ఎడ్ల కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లను చుట్టి ముస్తాబు చేసేవారు. ఎడ్లబండిని గుడారంగా తయారు చేసుకునే బయలుదేరేవారు. ఎడ్లకు సైతం కావాల్సినంత ఎండుగడ్డి మోపును బడిలో వేసుకొని వచ్చేవారు. 

    చెట్లే గుడారాలు..
    అడవిమార్గంలో జాతరకు వెళ్లే భక్తులు చెట్లనే గుడారాలుగా మల్చుకొని అక్కడే విడిది చేసేవారు. స్థానిక అడవుల్లో లభించే వెదురు కర్రలతో బండ్లకు పందిళ్లను వేసుకొని చీరలను అడ్డుగా కట్టుకునేవారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, పడిగాపూర్, ఎలుబాక, మేడారం ప్రాంతాల్లోనే బస చేసేవారు. 

    అడవి మార్గంలో మేడారానికి.. 
    ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నుంచి భక్తులు అడవిమార్గంలో ఎడ్ల బండిలో పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రయాణం సాగించేది. రాత్రి వేళ అడవుల్లో నెగడ్లు పెట్టుకొని అక్కడ బస చేసి తెల్లవారి మేడారానికి బయలుదేరేవారు. మంగళవారం సాయంత్రానికి జంపన్నవాగుకు చేరుకొని అక్కడ స్నానాలు, తలనీలాలను సమర్పించి నిద్రచేసేవారు. తెల్లారి బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించేది.  ఆరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి శుక్రవారం రాత్రి బయలుదేరి వారి గ్రామాలకు బయలుదేరేవారు.

    ఇంటికాడి నుంచే యాటపోతు, నాటు కోళ్లు
    ఎడ్ల బండిలో బయలుదేరిన భక్తులు ఇంటి నుంచి యాటపోతులు, నాటుకోళ్లు, ఆహారం పదార్థాలు, వంట పాత్రలు, నీటి బుర్రలతో జాతరకు వచ్చేవా రు. అడవిలో విడిది చేసి సారలమ్మ వచ్చిన రోజు యాట పోతులను కోసి అమ్మవారికి మొక్కు చెల్లించేవారు. తిరుగు ప్రయాణం శుక్రవారం కోడి కొసుకొని చల్లంగా చూడు తల్లి అని పయనమయ్యేవారు. 

    తంబి హెలికాప్టర్‌ సేవలు..
    ఎడ్లబండి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులు హెలికాప్టర్‌లో సైతం మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆ కాలంలో రెండు రోజుల ప్రయాణం చేసిన భక్తులు ఇప్పుడు హెలికాప్టర్‌లో 45 నిమిషాల నుంచి గంటలోపు అమ్మవార్లను దర్శించుకొని మేడారం ఏరియల్‌ సర్వే చేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. హెలికాప్టర్‌లో వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయిస్తున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అయినప్పటికీ భక్తులు సౌకర్యాలపై మొగ్గు చూపుతున్నారు. దాంతో తంబి హెలికాప్టర్‌ సర్వీస్‌లను కొనసాగిస్తోంది.

    కాలినడక నుంచి కార్ల వరకు..
    మేడారం జాతరకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల భక్తులు ఒక రోజు ముందు సద్దికట్టుకొని జాతరకు చేరుకునేవారు. కోడి కూయగానే ఇంటివద్ద స్నానాలను చేసుకొని కాలినడకన అడవి మార్గం, ఎడ్లబండ్ల దారుల నుంచి నడుచుకుంటూ మేడారం జాతరకు చేరుకునేవారు. వచ్చే దారిలో చీకటి పడితే ఆ ఇంటి వద్ద ఒక కునుకు తీసి మళ్లీ ప్రయాణాన్ని సాగించేవారు. తెచ్చుకున్న సద్దిమూటలే తిని సేద దీరేవారు. అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణాలు జరగడంతో అనేక మంది భక్తులు వాహనాలు, కార్లు, బైక్‌లపై మేడారానికి తరలివస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిని పడవల ద్వారా దాటేవారు. ఎడ్లబండ్లను కాలిరేవు ఉన్న గోదావరి నీటిలో నుంచి దాటించేవారు. అలా వారి ప్రయాణం సాగేది. ఇప్పుడు గోదావరి నదిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించడంతో అనేక మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ప్రయాణ మార్గం సులభతరంగా మారింది.

    రెండు రోజుల ప్రయాణం..
    మేడారం జాతరకు ఎడ్లబండిలో రెండు రోజుపాటు ప్రయాణం చేసే వాళ్లం. జాతర ముగిసే వరకు అక్కడే వండుకొని తినే వాళ్లం. అడవి మార్గంలో వెళ్లే వాళ్లం. అందరం కలిసి ఉంటూ వనదేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణం చేసేది. అప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సంతోషంగా గడిపేవాళ్లం. 
    – బలభద్ర రవీందర్, ఏటూరునాగారం 

  • రంగారెడ్డి జిల్లా: ఓ ఎస్‌ఐ విధుల్లో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాడు.. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆయనను ఢీకొట్టింది.. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ కిలోమీటర్‌ మేర వెళ్లిన తర్వాత కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకుంది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధు సిబ్బందితో సాగర్‌ హైవేపై డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. మద్యం మత్తులో మాల్‌ నుంచి కారులో ఇబ్రహీంపట్నం వైపు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. 

    డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ మధును బలంగా ఢీకొట్టారు. బ్యానెట్‌ను పట్టుకున్న ఎస్‌ఐ అలా ఉండగానే మరింత వేగంగా దూసుకెళ్లారు. అదే క్రమంలో యాచారం బస్టాండ్‌ నుంచి బైకుపై మొండిగౌరెల్లి గ్రామానికి వెళ్తున్న మొగిలి వెంకట్‌రెడ్డి, అతని కోడలు దివ్య, చిన్న బాలుడిని ఢీకొట్టి అలాగే దూసుకెళ్లారు. కారు బ్యానెట్‌పైనే ఉండి కిలోమీటర్‌ దూరం వెళ్లిన ఎస్‌ఐ కారుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆయనకు మాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 

    అతి వేగంగా వెళ్తున్న కారును వెంబడించిన పోలీస్‌ సిబ్బంది 15 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఇబ్రహీంపట్నంలో పట్టుకున్నారు. కారులో (టీఎస్‌ 11ఏ–8519) ఉన్నది అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ్, హయత్‌నగర్‌కు చెందిన శ్రీకర్, నితిన్‌లుగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన సమయంలో తీవ్రంగా గాయపడిన వారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దివ్య భర్త లండన్‌లో ఉండగా రెండుమూడు రోజుల్లో ఆమె కూడా భర్త వద్దకు లండన్‌ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం సమయంలో కారును నడిపింది శ్రీకర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ప్రమాదంపై ఫ్యూచర్‌సిటీ సీపీ సు«దీర్‌బాబు సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ మధుతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.   

  • సాక్షి, ఖమ్మం: మామిళ్లగూడెం హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి రాథోడ్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారనే కారణంతో ఆమెను విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌పై గౌతమి కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకనే రీల్స్ చేశానంటూ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడు పని చేయలేదని వాపోయింది. మొదటిసారి తాను ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా చెప్పుంటే బావుండేదన్నారు.

    ‘‘సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని వాళ్లు పిలిస్తే నేను వెళ్లాను. మా గవర్నమెంట్‌ స్కూల్‌కి అన్యాయం చేయను. నన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు నేనేమైనా హత్యలు చేశానా? గంజాయి లాంటివి ఏమైనా అమ్మానా?.

    ..నన్ను ఇలా టోల్ చేస్తుంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నన్ను ఎవరు హెచ్చరించలేదు. నేను సబ్జెక్టుకి సంబంధించిన రిలీస్ తప్ప ఏమి చేయలేదు.. విధి నిర్వహణకు వ్యతిరేకంగా నేను రీల్స్ చేయలేదు... ఈ రీల్ కూడా చేయవచ్చో లేదో కూడా నాకు తెలియదు’’ అంటూ గౌతమి భావోద్వేగానికి లోనయ్యారు.

     

     

  • యాదాద్రి భువనగిరి జిల్లా: మనం ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించిన 24 గంటల గడియారంను మాత్రమే చూశాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న మల్లేశం తన అద్భుతమైన ఆలోచనతో ఒకే సారి 176 దేశాలకు సంబంధించిన సమయాన్ని ఒకేదగ్గర చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. గతంలో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని రూపొందించిన మల్లేశం తాజాగా ప్రపంచ గడియారంను తయారుచేసి తన నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాడు. 

    గతంలో కలియుగ కేలండర్‌.. 
    యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో పున్న భారతమ్మ, పిచ్చయ్యలది సాధారణ చేనేత కుటుంబం. వారి మొదటి సంతానమైన మల్లేశం చేనేత వృత్తిలో రాణిస్తూనే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం హయత్‌నగర్‌లో మెడికల్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. విద్యార్థి దశనుంచే గణితంతోపాటు సామాజిక చైతన్యం, రచనా వ్యాసంగంలో ఆసక్తిగల మల్లేశం సాధారణ జీవనానికి భిన్నంగా సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలనే తలంపుతో తన ఆలోచనలకు పదును పెట్టాడు. గతంలో కలియుగ కేలండర్‌ను, కలియుగ పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేశాడు. మేధావుల ప్రశంసలు పొందాడు. 1,200 సంవత్సరాల ఐరిష్‌ కేలండర్‌ను ఆవిష్కరించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. తాజాగా 176 దేశాలకు సంబంధించిన సమయాలను ఒకేసారి చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. ఈ గడియారంలో చూపించే సమయం ఆధారంగా విదేశాల్లో ఉన్న తమ వారి పనులకు ఆటంకం కలగకుండా మాట్లాడటం వీలవుతుంది.  

    భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు  
    ప్రపంచంలో ఎవరూ చేయని దాన్ని చేయాలనేది నా సంకల్పం. అదే సంకల్పంతో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని తయారు చేశాను. తాజాగా 176 దేశాలకు సంబంధించిన ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాను. భవిష్యత్‌లో మరిన్ని కొత్తకొత్త ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక.                         
    పున్న మల్లేశం ఆవిష్కర్త  

Family

  • గద్దెలే గర్భగుడులుగా..గిరిజనులే పూజారులుగా..వెదురుకర్రలే ఉత్సవమూర్తులుగా..కుంకుమ భరిణెలే అమ్మల ప్రతిరూపాలుగా..బెల్లమే నిలువెత్తు బంగారంగా... ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండుగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర. 

    ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే జనారణ్యంగా మారుతుంది. ‘జంపన్న వాగులో తడవని వ్యక్తి.. సమ్మక్క, సారలమ్మ జాతరకు పోయిరాని ఊరు’ ఉండదంటే అతిశయోక్తి కాదు.. కొండకోనల నడుమ ఓ మారుమూల గ్రామంలో జరిగే జాతరకు ఇంత ఖ్యాతి రావడానికి వెనుక వందల ఏళ్ల నాటి చరిత్ర, లక్షలాది మంది భక్తుల నమ్మకం దాగి ఉంది. 

    వీరత్వానికి ప్రతీకలు..
    సమ్మక్క– సారలమ్మలు ధీర వనితలు.. 800 ఏళ్ల క్రితమే నారీభేరి మోగించిన వీరత్వానికి ప్రతీకలు. నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం కాకతీయ సేనలకు ఎదురొడ్డి నిలిచారు. అపార పోరాట పటిమను ప్రదర్శించారు. ప్రాణాలు త్వజించి అందరి హృదయాల్లో నిలిచారు. మట్టిలో కలిసిపోయి పుడమితల్లిని పుణ్యభూమిగా  మార్చారు. అయిన వారి కోసం అసువులు బాసి దేవతలయ్యారు. కాలక్రమేణా అందరికీ అమ్మలయ్యారు. అందుకే ఆదివాసీలు ఆ తల్లులకు గుండెల్లో గుడి కట్టారు. రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తూ వారి త్యాగనిరతిని గుర్తు తెచ్చుకుంటారు. 

    ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతి గాంచిన ఈ జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారు.. అమ్మల ఆశీర్వాదాలు అందుకుంటారు.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకునే సంప్రదాయం ఉంది. ఆడపిల్లలు జన్మిస్తే సమ్మక్క లేదా సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకొని కన్నవారు మురిసిపోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు అన్ని సమయాల్లోనూ మహిళలూ రావొచ్చు.  

    నాలుగు రోజుల వైభవం
    జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకొస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వీరిని తీసుకొచ్చే సమయంలో భక్తులు పూనకంతో ఊగి΄ోతారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తుల పూజలందుకుంటారు. నాలుగవ రోజు సాయంత్రం వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. ఇంతితై.. వటుడింతై అన్నట్లు.. మేడారం నిత్య నూతనమై అమ్మల ఆశీర్వాదంతో దేదీప్య మానంగా కాంతులీనుతోంది. 

    హైద్రాబాద్‌ నుంచి మేడారం 245 కి.మీ. కారులో వెళ్లేవారికి 5.20 గంటల సమయం పడుతుంది. ఎన్‌హెచ్‌ –163 రహదారి పై ప్రయణించే భక్తులు హైద్రాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవాలి.

    ఈ రోడ్డు పై పెంబర్తి శివారులో 90 – 90.5 కి.మీలు, వీఓ హోటల్‌ నుంచి అక్షయ హోటల్‌ 9.5–94 కి.మీలలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.

    జనగామ – నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు. పెంబర్తి, నిడిగొండ, యశ్వంతపూర్, రాఘవపూర్, చాగళ్లు, పెండ్యాల అండన్‌పాస్‌లు లేక΄ోవడంతో జాతీయ రహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు.

    నెల్లుట్ల బైపాస్‌ రోడ్డు ఆర్టీసీ కాలనీ బ్రిడ్జి, నడిగొండ యూటర్న్, రఘునాథ్‌పల్లి శివారు, చాగళ్లు, స్టేషన్‌ ఘన్‌పూర్, కరుణాపురం, ధర్మసాగర్‌ మండల రాంపూర్‌ క్రాస్‌ రోడ్డు, మడికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్‌ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైవర్, సుబేదారి పారెస్టు ఆఫీస్, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌ రోడ్, కటాక్షపూర్‌లను ‘బ్లాక్‌స్పాట్‌’లుగా అధికారులు గుర్తించారు.

    మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్‌ మూలమలుపులు ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్లే.

    హైద్రాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారి పై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్‌స్టేజీ నుంచి వంగాలపల్లి – కరుణాపురం బస్‌స్టేజీల వరకు మూడు యూటర్న్‌లు ఉన్నాయి

    చిన్నపెండ్యాల నుంచి ఘనాపూర్‌ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్‌ సమీపంలో యూటర్న్‌ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్‌ సమీపంలో రాంగ్‌ రూట్‌లో యూటర్స్‌ తీసుకుంటున్నారు.

    హైద్రాబాద్‌ టు మేడారం : 3 టోల్‌ గేట్లు
    హైద్రాబాద్‌ నుంచి మేడారం జాతర వచ్చే ప్రయాణికులు మూడు టోల్‌గేట్లు దాటాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్‌నగర్‌ వద్ద ఇంకో టోల్‌గేట్‌ ఉంటుంది. అయితే జాతర జరిగే నాలుగు రోజుల పాటు జవహర్‌నగర్‌ టోల్‌ ఎత్తేస్తారు. కరీంనగర్‌ నుంచి మేడారం 153 కి.మీ

    కరీంనగర్, కేశవపట్నం, హుజురాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకుని వెంకటాపూర్, చల్వాయిల మీదుగా మేడారానికి 3.40 గంటల సమయం పడుతుంది.భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కి.మీ. 

    మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లాపూర్‌ల మీదుగా 1.10 గంటల నుంచి 1.30 గంటల వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు.

    జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం – మహదేవపూర్‌ మధ్య మూలమలుపు ప్రమాద భరితంగా ఉన్నాయి.

    కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353 సీ జాతీయ రహదారి పై ప్రయాణిస్తాయి. ఒక్కోసారి వీటిని రోడ్డు పక్కనే నిలుపుతారు. వీటివల్ల ప్రమాదాలు జరిగే అస్కారం ఎక్కువ.

    భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌ శివారు ్ర΄ాంతాల్లోనూ రహదారి పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. వరంగల్‌ నుంచి మేడారం 95.5 కి.మీ.

    ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుంటే భక్తులు ఎన్‌హెచ్‌ 163 రహదారి గుండా 2.20 గంటల నుంచి 2.40 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్‌ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరెపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లాపూర్‌ ద్వారా మేడారం చేరుకుంటారు. 

    వరంగల్‌ నుంచి ములుగుకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీసులు నడుపుతోంది. ఇక ట్రావెల్‌ బస్సులు, కార్లు, ఇతర వాహనాలలో వివిధ ్ర΄ాంతాల నుంచి జనం మేడారం చేరుకుంటాం.

    కాజిపేట/వరంగల్‌ రైల్వే స్టేషన్‌లలో దిగిన భక్తులు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మేడారంగద్దెల వరకు చేరుకోవచ్చు.

    హనుమకొండ నుంచి మేడారానికి హెలికాఫ్టర్‌ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. 
    మహబూబాబాద్‌ నుంచి మేడారం 134 కి.మీ

    సూర్యపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంతో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3.20 గంటల్లో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవచ్చు.

    నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్‌ హెచ్‌ఏఐ అధికారులు గుర్తించారు. 

    జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణ ΄పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రై వేటు వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భూపాలపట్నం, బీజాపూర్‌ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్‌ల నుంచి ఈ దారిగుండా మేడారం జాతరకు వస్తారు. 

    ఇతర పర్యాటక ప్రదేశాలు..
    ములుగు జిల్లాలోని మేడారం నుంచి 50–60 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ చారిత్రక ఆలయం అద్భుతమైన కళా నైపుణ్యంతో విలసిల్లుతుంది. ఈ చారిత్రక ఆలయం ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడింది. వరంగల్‌లోనే వేయిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్‌ను సందర్శించుకోవచ్చు. ములుగు జిల్లాకు 17 కి.మీ దూరంలో లక్నవరం సరస్సు ఉంది. 

    ఈ సరస్సుపై వేలాడే వంతెనలపై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. బోటింగ్‌ సదు΄ాయం కూడా ఉంది. ఇదే జిల్లాలో వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో తెలంగాణ నయాగారగా పిలిచే బొగత జలతం ఉంది. వరంగల్‌ పట్టణానికి 51 కి.మీ దూరంలో భీముని పాదం జలపాతం ఉంటుంది. పాకాల సరస్సు, ఏటూరు నాగారం అభయారణ్యం, పాండవుల గుట్టలు..., ఈ ప్రాంతపు ఆకర్షణీయ పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందాయి. 

    (చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!)


     

  • కొన్ని ఇంటి పేర్లు, ఊర్లు, గ్రామాల పేర్లుగా ఉండటం చూశాం. అంతేగానీ మెట్రో నగరాల్లాంటి మహా నగరాల పేరే ఇంటిపేరుగా ఉండటం గురించి విన్నారా?. వాట్‌ సీటీ పేరు ఇంటి పేరుగానా అని అనుకోకండి. ఇది నమ్మక తప్పని నిజం. ఓ మహిళ ఇంటిపేరే బెంగళూరు. ఎందుకలా వింటే.. ఆలోచన వేరేలెవెల్‌ అని అంటారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకుందో ఆమె చకచక చదివేయండి మరి..!.

    బెంగళూరుకు చెందిన  విప్రా బెంగళూరు అనే మహిళ తను పుట్టి.. పెరిగిన నగరంతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఓ వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమేకాదు ఆమె తాత ఆలోచనకు ఫిదా అయ్యారు కూడా. మీ తాతగారి ముందుచూపుకి హ్యాట్సాఫ్‌ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. 

    ఆమె తన వాయిస్‌ ఓవర్‌తో వివరించి వ్యక్తిగత కథ అందరి మనసులను తాకింది. ఆ వీడియోలో క్లిప్‌లో విప్రా ఇలా చెప్పడం ప్రారంభించింది. తన ఇంటి పేరు బెంగళూరు అని ఉండటం గమనించారా. ఇదేంటని అనుకుంటున్నారా..?. అయితే నగరం పేరు ఇంటిపేరుగా ఎలా మారిందో మీకు తెలియాలి అంటూ వివరించడం మొదలుపెట్టింది ఆమె.."మా తాతయ్య నిజానికి తన పిల్లలకు అంటే మా నాన్నకు ఇంటి పేరు పెట్టలేదు. 

    ప్రజలు వారి ఇంటి పేరుని బట్టి వారి నేపథ్యం, హోదాను అంచనా వేస్తారనే ఉద్దేశంతో తన పిల్లలకు ఇంటిపేరు పెట్టేందుకు ఇష్టపడ లేదు. దాంతో మా నాన్నకు ఇంటిపేరు లేదు. ఇక నా వద్దకు వచ్చేటప్పటికీ..ఇంటి పేరు తప్పనిసరి కావడంతో..నేను పుట్టిన బెంగుళూరు నగరమే నా ఇంటి పేరుగా మారింది అని వివరించింది "విప్రా బెంగళూరు. 

    ఈ మహిళ కథ తన తాతయ్య సామాజిక కట్టుబడులకు దూరంగా ఉంచడానికి ఆయన ఎలాంటి స్పృహతో వ్యవహరించారో అవగతమవుతోంది. తన పిల్లలకు ఇంటి పేరు పెట్టకుండా..వ్యక్తిగతంగా వారి నేపథ్యం, గుర్తింపుతోనే బతికేలా చేసేందుకు ఆయన​ ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అలాగే ఇంటి పేరు తప్పనిరి పరిస్థితులో తను పుట్టిన నగరమే తన గుర్తింపుగా మార్చుకోవడం కూడా తాత ఆశయాలకు అనుగుణంగా చాలా అర్థవంతంగా ఉంది కదూ..!. నెటిజన్లు కూడా ఆ మహిళ ఇంటి పేరు వెనుక ఉన్న ఆలోచన చాలా గొప్పగా, ఆదర్శంగా ఉందంటూ ఆమె తాతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!)

     

  • హిందూ ధర్మంలోని పదహారు సంస్కారాల్లో వివాహం ప్రధానమైనది. అందుకే వివాహాలు చేసే   సమయాల్లో మంచి ముహూర్తాలు చూస్తుంటారు. తిథులు, నక్షత్రాలు, రాశులు, ఫలాలు..ఇలా అన్నీ కలిసివచ్చే ముహూర్తం కోసం ఎదురుచూస్తారు. ఇలాంటివన్నీ కలిసివచ్చే రోజులు మాఘమాసం నుంచి ప్రారంభమవుతాయి. గడిచిన మూడునెలల గ్యాప్‌ తరువాత పెళ్లిళ్లకు మంచి రోజులు వస్తుండడంతో ఒక్కటవ్వాలనుకునే జంటలు సిద్ధమవుతున్నాయి. ముందుగా పెళ్లి చూపులకు అనువైన రోజులు చూస్తున్నారు.  

    వరుసగా ఆరు నెలలు
    ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. జూలైవరకూ అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయని పంచాంగాలు సూచిస్తున్నాయి.  ఫిబ్రవరి నెలలో 5, 6, 8,10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో మంచి ఘడియలు ఉండగా, మార్చి నెలలో 1, 2, 3, 4, 7, 8, 9,  11,12 తేదీల వరకూ పెళ్లి ముహూర్తాలే. ఏప్రిల్‌ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీలు వివాహాలు చేసుకునేందుకు అనుకూల రోజులు ఉన్నాయి. మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీలు మంచి రోజులు కనిపిస్తున్నాయి. జూన్‌ నెలలో 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 వరకూ «శుభముహూర్తాలే ఉన్నాయి. జూలై 1, 6, 7, 11 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పలువురు పురోహితులు వెల్లడిస్తున్నారు. 

    25 రంగాలకు ఊరట
    ఓ వైపు సంక్షేమ పథకాలు లేక, మరో వైపు రాయితీ పెట్టుబడి రుణాలు లేక ఇబ్బందులు పడుతున్న పలు రంగాల్లో చిన్న, సన్నకారు వేతనదారులకు, సంస్థల నిర్వాహకులకు ఈ మంచి రోజులు కలిసిరానున్నాయి. వేలాది జంటలు ఒక్కటవుతున్నవేళ ఈ రంగాలకు పనిదొరకనుంది.  25 రంగాలకు చెందిన వందలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ ఆరు నెలల్లో సగానికి పైగా రోజుల్లో వివాహాలకు ముందస్తుగా కల్యాణ మంటపాలు బక్‌ అయ్యాయి. వేలాది వివాహాలు జరుగనున్న నేపథ్యంలో పురోహితులు, ఈవెంట్‌ ఆర్గనైజర్లకు డిమాండ్‌ ఉంటుంది. క్యాటరింగ్, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు కళకళలాడనున్నాయి. అలంకరణæ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్‌లు, డీజేలు, టెంట్‌హౌస్‌లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఎంతో డిమాండ్‌ ఉంటుంది.

    మంచి ఘడియలు
    మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం కావడం వల్ల మాఘాది పంచకం అంటారు. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మంచి రోజులు కావడంతో ఎక్కువ పెళ్లిళ్లు  జరుగుతాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో వేలమందికి ఉపాధి లభిస్తుంది. 

    అంపోలు ఉమారుద్రకోటేశ్వరశర్మ(కోటిబాబు),
    పురోహితుడు, ఖండ్యాం, రేగిడి మండలం 

  • మహానటి హిరోయిన్‌ కీర్తి సురేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటన అశేష ఆదరాభిమానాలు పొందిన ముద్దుగుమ్మ. విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న నటి. ఆమె తన చిరకాల స్నేహితుడు ఆంథోని థటిల్‌ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడచక్కగా ఉండే ఈ జంట ఇల్లు కూడా వారిలానే ఆద్యంత అందంగా..అద్భుతాలకు నెలవుగా బహు సుందరంగా ఉంది. అది ఇల్లా లేక ఏదైనా టూర్‌కి వెళ్లామా అనేలా కళాకృతులకు నిలయంగా మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. మరీ హీరోయిన్‌ కీర్తి ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకుందో తిలకిద్దాం రండి..!.

    "హౌస్ ఆఫ్ ఫన్"గా పిలచే కీర్తి ఇల్లు ఆధునికత, సంప్రదాయాల మేళవింపుగా అత్యంత అందంగా తీర్చిదిద్దారు. ఆరుబయట బ్యాక్‌ వాటర్స్‌ ఉత్కంఠభరిత దృశ్యాలు ఉత్సాహాన్ని అందిస్తే..లోపటి సుందర దృశ్యాలు సౌందర్యాలి ఆలవలంగా ఉంది. అందమైన చిన్న వంటగది, బ్యాక్‌వాటర్స్‌తో చుట్టబడిన బాల్కనీ, వాక్‌ ఇన్‌ వార్డ్‌రోబ్‌తో విశాలమైన బెడ్‌రూమ్‌ మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక అక్కడే గోకు వేలాడిదీసిన చంద్రుడి కళలు..వారే డేటింగ్‌ ప్రారంభించిన రోజు, వివాహం చేసుకున్న రోజున చంద్రుని కళల దశల జాబితాను అందించే కళాకృతి కళ్లను పక్కకు తిప్పనివిధంగా కట్టిపడేస్తుంది. నటిగా తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మహానటి మూవీకి సంబంధించిన ఛాయచిత్రాలతో కూడిన ఫ్రేమ్‌ కీర్తి నటనను గుర్తు చేస్తోంది. 

    డైనింగ్‌టేబుల్‌ వద్ద వారి వివాహ ఫోటోలు, వెడ్డింగ్‌ కార్డ్‌ ఫ్రేమ్‌ స్పెషల్‌ ఎంట్రాక్షన్‌గా ఉంటుంది. ఇక బెడ్‌రూమ్‌ కేరళ శైలిలో బూడిద రంగు గోడలు నిండా వ్యక్తిగత ఫోటోలతో కనువిందు చేయగా, అక్కడ సమీపంలోని ఫలకంపై “ఎవరూ హుందాగా బయటకు రారు” అని రాసి ఉంది. దాన్ని చూపిస్తూ..ఈ దృశ్యం, అక్కడి వైబ్స్‌ చాలా మత్తునిస్తాయని హాయిగా నిద్రపట్టేస్తుందని అంటోంది కీర్తి. 

    లివింగ్‌ రూమ్‌లో మెత్తటి బూడిద రంగు సోఫాలు, రిలాక్స్డ్‌  వైబ్స్‌ అందిస్తున్నాయి. అక్కడ కూడా వాల్స్‌పై ఫోటోలు అలంకరించి ఉన్నాయి. అలాగే ఒక ప్రైవేట్‌ హోమ్‌ థియేటర్‌, టెర్రస్‌పై యోగా, సాధారణ ఫోటోషూట్‌లు, సూర్యాస్తమయాలను ఆస్వాదించేలా అందంగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ అందమైన ఇల్లు బిజీగా ఉండే ఆమె ప్రొఫెషనల్‌ జీవితానికి దూరంగా చక్కటి విశ్రాంతి అందించే ప్లేస్‌.

     

    (చదవండి: ఒత్తిడికి మూలం డబ్బేనా..!)

     

     

     

  • ఆదివారం ఉదయం... అప్పట్లో కేవలం ఒక సెలవు దినం కాదు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారి, దేశమంతా ఒకే నిశ్శబ్దంలో మునిగిపోయే సమయం. సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రజలు పనులన్నీ పక్కనపెట్టి టీవీల ముందు చేరేవారు. ఇళ్లలో ఒక రకమైన భక్తి వాతావరణం నెలకొనేది. దేశవ్యాప్తంగా ఈ స్తబ్ధతకు, ఐక్యతకు కారణం రామానంద సాగర్‌ (Ramanand Sagar) సృష్టించిన ‘రామాయణ్‌’ టీవీ సీరియల్‌. 1987 జనవరి 25న ప్రారంభమైన ఈ ధారా వాహిక కేవలం ఒక వినోద కార్యక్రమంగా కాకుండా భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక అపు రూప ఘట్టంగా నిలిచిపోయింది.

    ప్రస్తుతం ఈ దృశ్యకావ్యం నలభయ్యో వసంతంలోకి అడుగు పెట్టింది. గత నాలుగు దశాబ్దాలలో మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయింది. చేతిలో మొబైల్, ఓటీటీలు, వంద లాది ఛానెళ్లు అందుబాటు లోకి వచ్చాయి. అయినా, ‘రామాయణ్‌’ సాధించిన ఐక్యత, అది నేర్పిన విలువలు నేటికీ ప్రత్యేకమే. భారతీయ జనజీవనాన్ని అంతలా ప్రభావితం చేసిన మరో కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు.

    దూరదర్శన్‌ వేదికగా తొలిసారి ఒక మహా కావ్యాన్ని ధారావాహికగా మలిచిన ఘనత రామానంద సాగర్‌కు దక్కుతుంది. సుమారు 300 మంది నటీనటులతో సాగర్‌ ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. ప్రధానంగా గోస్వామి తులసీదాస్‌ ‘రామచరిత్‌ మానస్‌’ను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ, వాల్మీకి రామాయణంతో పాటు ప్రాంతీయ భాషల్లోని కంబన్, భావార్థ, కృతివాస్, రంగనాథ రామాయణాలలోని విశేషాలను పొందుపరిచారు. సీనియర్‌ నటుడు అశోక్‌ కుమార్‌ వ్యాఖ్యానం ఈ సీరియల్‌కు జాతీయ సమగ్రతా చిహ్నంగా గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మొదట 52 ఎపిసోడ్లుగా ప్లాన్‌ చేసినా, ప్రేక్షకుల అపూర్వ స్పందన దృష్ట్యా దీనిని 78 ఎపిసోడ్లకు పెంచాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘లవకుశ’ సీక్వెల్‌ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

    వ్యాపారపరంగానూ ‘రామాయణ్‌’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన ‘బుని యాద్‌’, ‘చిత్రహార్‌’ వంటి టీవీ కార్యక్రమాలను వెనక్కి నెట్టి ప్రకటనల ఆదాయంలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రారంభంలో ఒక్కో ఎపిసోడ్‌కు 15గా ఉన్న ప్రకటనలు, కొద్ది నెలల్లోనే 40కి పెరిగాయి. దూరదర్శన్‌ ఆదాయంలో ఎనిమిదో వంతు కేవలం ఈ ఒక్క సీరియల్‌ నుంచే వచ్చేదంటే దీని క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో 10 సెకన్ల ప్రకటన కోసం రూ. 40 వేలు చెల్లించేందుకు 135 సంస్థలు క్యూ కట్టేవి. వారానికి సుమారు రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన ఘనత దీని సొంతం.

    అప్పట్లో దూరదర్శన్‌ వీక్షకుల సంఖ్య 6 నుంచి 8 కోట్ల మధ్య ఉండగా, రామాయణంలోని కీలక ఎపిసోడ్లను సుమారు 10 కోట్ల మంది చూశారు. ఇది అప్పటి దేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం. ఈ సీరియల్‌ ప్రసార సమయంలో వీధులు కర్ఫ్యూను తలపించేవి. జనం అపాయింట్‌మెంట్లు రద్దు చేసుకునే వారు. ఫ్యాక్టరీల్లో కార్మికులు దొరకని పరిస్థితి ఉండేది.

    సినిమా హాళ్లలో ఉదయం షోలు (Morning Show) రద్దయ్యేవి. గ్రామాల్లో ఒకటి, రెండు టీవీలు మాత్రమే ఉన్న ఆ రోజుల్లో, జనం కమ్యూనిటీ హాళ్ల వద్ద సామూహికంగా కూర్చుని రామాయణాన్ని వీక్షించే వారు. చాలా ఇళ్లలో ‘రామాయణ్‌’ వీక్షణ ఒక మతపరమైన ఆచారంగా మారింది. టీవీ సెట్లను శుభ్రం చేసి, పూలమాలలు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ధూపదీపాలతో పూజలు చేసేవారు. శంఖం ఊది మరీ సీరియల్‌ ప్రారంభించే వారు. 1988 జూలై 31న ప్రసారమైన చివరి ఎపిసోడ్‌ రోజున ప్రజలు దీపాలు వెలిగించి ముందస్తు దీపావళిలా పండుగ చేసుకున్నారు. ఇందులో రాముడు, సీత పాత్రలు పోషించిన అరుణ్‌ గోవిల్, దీపికా చిఖిలియాలను ప్రజలు నిజమైన దైవస్వరూపాలుగా కొలిచారు.

    చ‌ద‌వండి: నాటి రోజుల్లో రెండో పెద్ద పండుగ‌

    ‘రామాయణ్‌’ విజయంతో భారతీయ బుల్లితెరపై పురాణ గాథల పరంపర మొదలైంది. ‘మహాభారత్‌’, ‘శ్రీకృష్ణ’, ‘విష్ణు పురాణ్‌’ వంటి ఎన్నో సీరియళ్లకు ఇది మార్గదర్శిగా నిలిచింది. కరోనా లాక్డౌన్‌ సమయంలో ప్రజలు భయాందోళనల్లో ఉన్నప్పుడు, దూరదర్శన్‌ మళ్లీ ఈ సీరియల్‌ను ప్రసారం చేసింది. ఆ అనిశ్చిత సమయంలో ‘రామాయణ్‌’ ప్రజలకు గొప్ప మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. భారతీయ సంస్కృతికి, ఆత్మకు రామాయణం ఒక ప్రతిబింబం. తులసీదాస్‌ చెప్పినట్లు రాముడు అనంతుడు, ఆయన కథ కూడా అపారమైనది. నిన్నటి కథగా కాకుండా, నేటి తరం జీవన విలువల మార్గదర్శిగా ఈ దృశ్యకావ్యం నిలిచిపోతుంది.

    – డాక్ట‌ర్‌ అజేయ్‌ శివర్ల, ఆంగ్ల అధ్యాపకుడు 
    (2026, జ‌న‌వ‌రి 25తో నలభయ్యో పడిలో దూరదర్శన్‌ ‘రామాయణ్‌’ సీరియల్‌) 

  • ఇన్నాళ్లు పని ఒత్తిడి, ఎగ్జామ్‌ భయం, కె​రీర్‌ భయం వాటివల్ల ఒత్తిడికిలోనై అనారోగ్యం పాలవ్వుతున్నాం అనుకున్నాం. కానీ మంచి ఉన్నత పొజిషన్లలలో ఉన్నవాళ్లు సైతం ఒత్తిడి లేదా ఆందోళనల బాధితులే. ఎందుకంటే మనందరం 'సమయం' అంటే 'డబ్బు' అనే భావనతో కూడిన విధానంలో బతుకుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం.  సింపుల్‌గా చెప్పాలంటే..యావత్తు ప్రపంచం కూడా స్టాక్‌ మార్కెట్‌ వార్తలతోనే మేల్కొంటోంది. అస్థిర మార్కెట్లు, త్రైమాసిక లక్ష్యాలు, క్లయింట్‌ అంచనాలు..తదితర ఒత్తిళ్లను ఆహ్వానించే వాళ్లం అని చొప్పొచ్చు. ఆ ఆలోచన తీరు మనల్ని ఏ స్థాయిలో ఒత్తిడి అనే గందరగోళంలో కొట్టుకుపోయేలా ..ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. 

    అంతేగాదు ఈ ఒత్తిడి ఎంత భయంకరమైనదో..రోజువారి జీవిత పోరాటంలో అది మనల్ని ఎంతలా చిత్తుచేసి..అనారోగ్యం పాలు చేస్తుందో కళ్లకుకట్టినట్లుగా వివరించారు ఆరోగ్య నిపుణులు. దాన్ని అధిగమించేలే మన ధోరణి మారకపోతే అంతేసంగతులు అని గట్టిగా హెచ్చరిస్తున్నారు కూడా. 

    సాధారణ వ్యక్తులు కంటే ఆర్థిక రంగంలో ఉన్న నిపుణులే ఒత్తిడి బాధితులుగా మారుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఫైనాన్స్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వంటి ఫైనాన్స్‌ నిపుణులకు రోజు టెన్షన్‌తో ప్రారంభం..ముగింపు ఉంటుందట. ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో దీర్ఘకాలికి ఒత్తిడి శరీరంలోని కార్డిసాల్‌ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఇది బ్రెయిన్‌ నుంచి, జీవక్రియ, సంతానోత్పత్తి తదితర అన్నిటిని ప్రభావితం చేసి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. 

    ఈ కార్డిసాల్‌ స్థాయిల్లోని హెచ్చు తగ్గులు..మహిళలు, పురుషల్లోని, ఈస్ట్రోజెన్-టెస్టోస్టెరాన్ సమతుల్యతకు అంతరాయం ఏర్పరుస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్‌, ధైరాయిడ్‌ హార్మోన్లపై దుష్ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. దాంతో మహిళలు, పురుషులు పునరుత్పత్తి సమస్యలు, అధిక బరువు, నిద్రలేమి, చెడు కొలెస్ట్రాల్‌, త్వరితగతిన అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పదని చెబుతున్నారు. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. ఒక్కోసారి అతిగా తినడం లేదా ఆకలిని కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 

    ఏవిధంగా చిత్తు చేస్తోందంటే..
    సాధారణంగా ఈ అధిక ఒత్తిడి నిద్రలేమికి దారితీస్తుంది. ఈ నిద్రలేమి అనేది సంతానోత్పత్తి సమస్యలను తీవ్రతరం చేసే కీలక అంశం. ఈ నిద్రలేమి మెలటోనిన్‌ సాధారణ ఉత్పత్తిని దెబ్బతీసి పునరుత్పత్తికి సంబంధించిన హర్మోన్లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి తగిని నిద్ర బాడీకి మంచి రీచార్జ్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచిస్తునన్నారు నిపుణులు. 

    ముఖ్యంగా డిజిటల్‌ డిటాక్స్‌, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, సూర్యకాంతికి బహిర్గతం అవ్వడం, ప్రతి 20 నిమిషాలకు కదలికలు, మంచి నిద్ర తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు కార్టిసాల్‌ స్థాయిలు ఆటోమేటిగ్గా తగ్గి హర్మోన్ల బ్యాలెన్స్‌కు మద్దతిస్తుంది, ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నిజానికి ఆర్థిక ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం..నిరంతర వృద్ధి..పతనం అనేవి ఒక చక్రంలా సాగుతుంటుంది. 

    కానీ ఆరోగ్య విషయంలో అలా కాదు. ఒక్కసారి పాడైతే బాగుచేసుకోవడం అంత సులభం కాదు..ఆ నష్టాన్ని అంత వేగంగా పూడ్చుకోలేమనేది గుర్తెరగాలి అని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అందువల్ల ఆరోగ్యమే అసలైన సంపద అనేది అస్సలు మరువ్వద్దు అని హితవు పలుకుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

     

    (చదవండి: మోదీ మెచ్చిన 'కిచెన్‌'..! అక్కడ అంతా ఒకేసారి..)
     

Andhra Pradesh

  • నందిగామ:  కూటమి సర్కార్‌ కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు టార్గెట్‌ చేస్తున్నారు. వీరులపాడు మండలం కొణతాలపల్లిలో షేక్ సైదాబీ ఇల్లు కూల్చివేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి మారినందుకు ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగారు టీడీపీ నేతలు. 

    పార్టీ మారిందనే కోపంతో షేక్‌ సైదాబి ఇంటిని కూల్చివేశారు. 30 ఏళ్ల నుంచి అదే ఇంట్లో నివాసముంటుంది షేక్‌ సైదాబి కుటుంబం.  ఎప్పట్నుంచో ఉన్న ఇంటిని కూల్చివేయడంతో షేక్‌ సైదాబి, ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటిని కూల్చివేయడంతో పాటు ఆమెకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 

  • కాకినాడ రూరల్‌ / సామర్లకోట: ఓ మహిళతో వివాహం జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఓ యువకుడు విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన, యువకుడు, జేసీబీ డ్రైవర్‌ వానపల్లి వెంకట సురేష్‌ ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం అవంతినగర్‌లో టవర్‌ ఎక్కి బెదిరింపులకు దిగాడు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ స్తంభం కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తీగలను తాకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడంతో పాటు దాదాపు రెండు గంటల పాటు టవర్‌పైనే ఉండిపోయాడు. 

    సమాచారం అందుకున్న తిమ్మాపురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పనసపాడ గ్రామస్తులు టవర్‌ వద్దకు చేరుకుని వెంకట సురేష్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. పనసపాడు సర్పంచ్‌ చీకట్ల వెంకటేశ్వరరావు, తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్‌ సెల్‌ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. టవర్‌ ఎక్కి బెదిరింపులకు పాల్పడిన వెంకట సురేష్‌ తాను ప్రేమించిన మహిళ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడడంతో, వారు అల్లరి చేయవద్దని మాట్లాడుకుందామని నచ్చజెప్పడంతో కొద్దిసేపటికి స్తంభం నుంచి తాను కిందకు రావడంతో పోలీసులు, పనసపాడు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

     అనంతరం యువకుడిని తిమ్మాపురం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం టవర్‌ ఎక్కి ఆందోళన చేస్తానని హెచ్చరించినట్టుగా వెంకట సురేష్‌ గురించి గ్రామస్తులు పేర్కొన్నారు. మాధవపట్నంకు చెందిన ఓ మహిళ భర్తను విడిచి ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. పెళ్లి కోసం ఒత్తిడి తీసుకు రావడంతో ఆమె వెంకట సురేష్‌ సెల్‌ నంబరు, వాట్సాప్‌ బ్లాక్‌లో పెట్టినట్టు పోలీసులు తెలిపారు. దీంతో సెల్‌ టవర్‌ ఆ యువకుడు బెదిరింపులకు దిగాడు. 

  • విశాఖపట్నం: మండలంలోని మత్సవానిపాలెంలో సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. నాలుగు రోజులుగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విలేజ్‌ టాకీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న  చీన్‌ టపాక్‌ డుం డుం సినిమా  షూటింగ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు.  రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన యువ నిర్మాత నాగులపల్లి శ్రీను దీనిని నిర్మిస్తున్నారు.తాతగారి ఊరు కావడంతో మత్సవానిపాలెంలోనే షూటింగ్‌ ప్రారంభించారు. వై.ఎన్‌ లోహిత్‌  దర్శకత్వం వహిస్తున్నారు. 

    గవిరెడ్డి శ్రీనివాస్‌ (శుభం ఫేం) హీరోగా, బ్రిగిడా సాగ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, అద్యంతం వినోదాత్మక  చిత్రంగా చీన్‌ టపాక్‌ డుం డుం  చిత్రం  తెరకిక్కిస్తున్నారు.ఈ సినిమాలో దివ్వెల మాధురి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.ఆమె పై ఆదివారం కొన్ని సన్నివేషాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్‌కు స్పాట్‌కు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రావడంతో పలువురు మర్యాద పూర్వకంగా కలిశారు.

     

     

  • సాక్షి, శ్రీకాకుళం: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రధాని మోదీకి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. కేంద్రం తెచ్చిన చట్టాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేశారు’’ అని లేఖలో ధర్మాన పేర్కొన్నారు.

    ‘‘మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మక నిర్ణయం. 566. 23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో మీరు ఉన్నారు. 'భూమి' అనే రాష్ట్ర జాబితాలోని అంశంపై చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది.

    భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ తో కలిసి ఈ ముసాయిదా చట్టం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించింది. పౌరుల మధ్య వివాదరహిత సామరస్యాన్ని పెంపొందించడానికి ఈ చర్యలు మీ ప్రభుత్వం చేపట్టింది. మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది (AP LAND TITLING ACT 2023 (ACT 27 of 2023)ను 31.10.2023).

    2024లోచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు  అమలు చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలి’’ అని ధర్మాన ప్రసాదరావు లేఖలో కోరారు.

Politics

  • సాక్షి ఎన్టీఆర్ జిల్లా: రెడ్‌బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇబ్రహీంపట్నంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. అయితే అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగిరమేశ్‌కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని  వైస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైళ్లో తోస్తుందన్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు ఎంత హింసిస్తే వైఎస్సార్సీపీ నేతలు అంత పట్టుదలగా  పార్టీ బలోపేతానికి సిద్ధపడతారని తెలిపారు. 

    ప్రజలంతా  మళ్లీ వైఎస్ జగన్‌నే సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే పరోక్షంగా జనం సంతృప్తిగా లేరని  తెలిపారన్నారు.  ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని తప్పుదోవ పట్టించడానికి కూటమి ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందన్నారు. చంద్రబాబు , లోకేష్‌ల పోకడే  వారి పతనానికి నాంధి అని ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచిన వారు  రెడ్ బుక్  పేరుతో చేస్తున్న బెదిరింపులకు భయపడతారా అని అంబటి రాంబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. 

    తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని లడ్డూ కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. తిరుమలలో లడ్డూ తయారికీ దశలవారిగా నెయ్యిపరీక్ష చేస్తారన్న సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబుకు ఆయన విగ్రహాం పెట్టే అర్హత ఎంతమాత్రం లేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైఎస్సారీపీ నేతలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
     

  • తాడేపల్లి : రాష్ట్ర గవర్నర్‌తో కూడా కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడించిందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.  చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌లు అబద్ధాలతోనే బతుకుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. రిపబ్లిక్‌ డే రోజున కూడా గవర్నర్‌తో పచచి అబద్ధాలు చెప్పించడం దుర్మార్గమన్నారు.  

    ఈరోజు(సోమవారం, జనవరి 26వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ చంద్రబాబు ఎన్నికలలో గెలవటానికి సూపర్ సిక్స్ పేరుతో పచ్చి మోసం చేశారు. జనవరి 1న జాబ్ కేలండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు మోసపు మాటలు మాట్లాడారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వలేదు. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్ పథకాల పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారు. 

    జగన్ చేయూత పథకం కింద రూ.18 వేలు ఇచ్చారు. చంద్రబాబు పీ4 పేరుతో మోసం చేశారు. పీ4ని గొప్పగా అమలు చేస్తన్నామంటూ గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు. పెన్షన్ 5 లక్షల మందికి తగ్గించి వృద్దులు, వితంతువులను మోసం చేశారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగటం తప్ప ప్రభుత్వ పెద్దలు ఏమీ చేయటం లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గమూ హ్యాపీగా లేదు. మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ స్కూళ్లు సర్వం నాశనం అయ్యాయి. అమరావతి రైతులను చంద్రబాబు దగా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధిస్తున్నారు. మందడంలో రైతు రామారావు చావుకు ప్రభుత్వమే కారణం. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం  అమరావతిని అడ్డం పెట్టుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారు. 

    మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి సైలెంట్ గా ఉన్నారు. జగన్‌ని విమర్శించటం తప్ప హోంమంత్రికి మరేం పనిలేదు. సిగ్గులేని మాటలు మాట్లాడటం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అలవాటే. 2014-19 మధ్య మా పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే ఈ స్పీకర్ ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.