Archive Page | Sakshi
Sakshi News home page

Politics

  • సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటి సంతకాల ఉద్యమం గురించి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా పోరాటాన్ని మొట్టమొదటి సారిగా రాష్ట్రం చూస్తోందని రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే వాటిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ఈ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.

    ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని, ఇది తిరుగుబాటుకు నాందిగా మారిందని రోజా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదు. అందుకే ప్రజలు విసుగుతో సంతకాల ఉద్యమానికి ముందుకొస్తున్నారు.

    ఎన్నికలకు ముందు పోర్టులు, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దోచుకోవడం దాచుకోవడమే వారి పనిగా చేసుకుంటున్నారని రోజా విమర్శించారు.

    జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు. గాడిద పాలు కడవెడు ఉన్నా,గంగిగోవుపాలు గరిటెడు చాలు అన్న చందంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. 

    రెండు లక్షల అరవైవేల కోట్లు అప్పులు చేసిన నీకు, నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ కట్టిన వాడికి నాలుగువేల కోట్లు లేవా. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.

    ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమీషన్లు ఇస్తామంటే బినామీలకు అంటగట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంకా నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అవుతుందని రోజా మండిపడ్డారు.

  • సాక్షి, తాడేప‌ల్లి: మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లిచ్చిన మెమోలే ఈ కోటి సంత‌కాల‌ని.. ప్ర‌జల నిర్ణ‌యాల‌ను గౌర‌వించ‌కుండా నియంత‌లా ముందుకెళితే కూట‌మి ప్ర‌భుత్వం ప‌త‌నం కావ‌డం ఖాయ‌మ‌ని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని అన్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తే ఆ నిర్ణ‌యమే ఈ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణ‌శాసనంగా మారుతుంద‌న్నారు. 

    మెడిక‌ల్ కాలేజీల ప్రైటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ రెండు నెల‌లుగా రాష్ట్ర‌వ్యాప్తంగా 175 నియోజ‌క‌వర్గాల్లో వైయ‌స్సార్సీపీ నిర్వ‌హించిన ఉద్య‌మానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింద‌ని, యువ‌త, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌లో భాగ‌స్వాముల‌య్యార‌ని విడ‌ద‌ల ర‌జని వివ‌రించారు. 

    కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాదిన్న‌ర కాలంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సూదికి దూదికి కూడా క‌రువొచ్చింద‌ని, అంబులెన్సులు మూత‌బ‌డ్డాయ‌ని, ఆరోగ్య‌శ్రీ నిర్వీర్యం అయిపోయింద‌ని ఆమె మండిపడ్డారు. చివ‌రికి మంత్రి సైతం ఈ విష‌యాన్ని అంగీక‌రించార‌ని వెల్ల‌డించారు. గత వైయ‌స్సార్సీపీ హ‌యాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్ల‌వాత్మ‌క మార్పులు, ఇప్పుడు కూటమి పాల‌న‌లో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్ర‌జ‌లు గ్ర‌హించారు కాబ‌ట్టే కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి స్వ‌చ్చందంగా ముందుకొచ్చి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నార‌ని విడ‌ద‌ల ర‌జ‌ని వివ‌రించారు. 

    వైఎస్సార్సీపీ సేక‌రించిన కోటి సంత‌కాల ప్ర‌తుల‌ను డిజిట‌లైజ్ చేసి ఆ రికార్డుల‌ను డిసెంబ‌ర్ 18న మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్సార్సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ గారి నేతృత్వంలో గ‌వ‌ర్న‌ర్ గారికి అందజేయ‌డం జ‌రుగుతుంద‌ని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని వెల్ల‌డించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. 

    ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌

    ప్ర‌జా ప్ర‌యోజ‌నాల ప‌రిరక్ష‌ణే ధ్యేయంగా వైయ‌స్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయ‌స్సార్సీపీని లేకుండా చేయాల‌న్న కూట‌మి కుట్ర‌ల‌ను అధిగ‌మిస్తూ యువ‌త‌, ఉద్యోగులు, మ‌హిళ‌లు, కార్మికుల ప‌క్షాన పోరాడుతున్నాం. వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్యం, వ్యాపారం.. ఏ వ‌ర్గానికి ఆపదొచ్చిన వారి ప‌క్షాన నిల‌బ‌డి వైయస్సార్సీపీ గ‌ళ‌మెత్తుతోంది. ఆయా వర్గాల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే దిశ‌గా ఏడాదిన్న‌రగా కూట‌మి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌తో వైయ‌స్సార్సీపీ ఒక పెద్ద ప్ర‌జా ఉద్య‌మాన్ని ప్రారంభించింది. 

    చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను కాపాడుకునేందుకు వైయ‌స్సార్సీపీ త‌ల‌పెట్టిన ఉద్యమానికి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు ఇచ్చిన ఈ పిలుపున‌కు ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లి వ‌చ్చి  సంత‌కాలతో మ‌ద్ద‌తు ప‌లికారు. చంద్ర‌బాబు తీసుకున్న ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని కోటి మందికి పైగా ప్ర‌జ‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టికే సంత‌కాలు చేశారు.

    ఫేక్ స‌భ్య‌త్వాలు, ఫేక్ పెట్టుబ‌డులు, ఫేక్ సూప‌ర్ సిక్స్ కాదు

    లోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్య‌త్వాలు మాదిరిగా కాకుండా, చంద్ర‌బాబు ప్ర‌క‌టించే ఫేక్ పెట్టుబ‌డుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూప‌ర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ బ‌హిరంగంగా పేప‌ర్ల‌పైన చేసిన సంత‌కాలు.  కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడిక‌ల్ సీటు క‌ల‌ను ప‌ణంగా పెడుతూ, వైద్యాన్ని పేద‌ల‌కు అంద‌ని ద్రాక్ష‌గా మారుస్తూ జ‌రుగుతున్న కుట్ర‌ల‌ను గుర్తించిన ప్ర‌జ‌లు ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్ద‌ని నిన‌దిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంత‌కాలు. వైద్యారోగ్య రంగాన్ని బ‌లోపేతం చేసేలా నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ 17 ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల‌కు శ్రీకారం చుడితే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చీ రాగానే పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌కుండా ఆ నిర్మాణాల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు క‌నుమ‌రుగు చేసింది. ఫ్యామిలీ డాక్ట‌ర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్య‌శ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య‌ రంగాన్ని బ‌లోపేతం చేయ‌డానికి ఉద్య‌మ స్ఫూర్తితో ప‌నిచేస్తే కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా ప‌క్క‌న పెట్టేసింది.

     ఎక‌రా వంద రూపాయ‌ల చొప్పున మెడిక‌ల్ కాలేజీల భూముల‌ను అప్ప‌నంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. అంతిటితో ఆగ‌కుండా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను వారికే ఇచ్చేసింది. అందులో ప‌నిచేస్తున్న వైద్యులు, ఇత‌ర సిబ్బందికి రెండేళ్ల‌పాటు ప్ర‌భుత్వ‌మే జీతాలు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకుంది. పేద‌ల ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టి క‌మీష‌న్ల కోసం చంద్ర‌బాబు చేస్తున్న ధ‌న య‌జ్ఞాన్ని  రాష్ట్ర ప్ర‌జ‌లు చీద‌రించుకుంటున్నారు. దానికి సాక్ష్య‌మే వైయ‌స్సార్సీపీ నిర్వ‌హించిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌కు వ‌చ్చిన అపూర్వ స్పంద‌న‌. ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం చాలా గొప్ప‌ద‌న్న‌ట్టు కూటమి నాయ‌కులు చేస్తున్న‌ ప్ర‌చారం ఆపేస్తే మంచిది. ఇప్ప‌టికైనా ప్ర‌జల నిర్ణ‌యాన్ని గౌర‌వించి ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకోవాలి.

    గ‌వ‌ర్న‌ర్‌కి డిజిట‌ల్ రికార్డులు సమ‌ర్పిస్తాం

    కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని భారీగా విజ‌యవంతం చేసిన వైయ‌స్సార్సీపీ శ్రేణులంద‌రికీ పార్టీ త‌ర‌ఫున కృతజ్ఞ‌తాభినంద‌న‌లు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న ర‌చ్చబండ పేరుతో ప్ర‌తి గ్రామంలో మొద‌లైన కోటి సంత‌కాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువ‌త‌, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజ‌కీయాల‌కు అతీతంగా పాల్గొని జ‌య‌ప్రదం చేశారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 50 వేల‌కు త‌గ్గ‌కుండా చేయాల‌నుకుంటే అంత‌కుమించి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ కార్య‌క్రమంలో భాగంగా నవంబ‌ర్ 12న రాష్ట్రంలోని 175 నియోజ‌కవ‌ర్గాల్లో ర్యాలీలు నిర్వ‌హించి మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాం. గ‌డిచిన రెండు నెల‌లుగా స్టాప్ ప్రైవేటైజేష‌న్ పేరుతో ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియాల‌లో చ‌ర్చ‌లు జ‌రుపుతూ న‌ష్టాల‌ను వివ‌రిస్తూ వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంతా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను పార్టీ నాయ‌కులు మీడియాకు వివ‌రించ‌డం కూడా జ‌రిగింది. 26 జిల్లాల్లో ఊహించ‌ని స్పంద‌న వచ్చింది. 

    ఇప్ప‌టికే నియోజ‌కవ‌ర్గాల్లో సేక‌రించిన సంత‌కాల‌ను జిల్లా కేంద్రాల‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. ప్ర‌త్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాలయానికి త‌ర‌లించ‌డం జ‌రుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి నేతృత్వంలో పార్టీ నాయ‌కులు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కి స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌జ‌లే త‌మ పేరు నియోజ‌క‌వ‌ర్గం, గ్రామం, మొబైల్ నంబ‌ర్, సంత‌కాల‌ను పేప‌ర్ల‌పై పొందుప‌రిచారు. ఈ మొత్తం సంత‌కాల‌ను డిజిట‌లైజ్ చేసి గ‌వ‌ర్న‌ర్‌కి అందించ‌డం జరుగుతుంది. కోటి మంది ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా ఈ కోటి సంత‌కాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణించి పీపీపీ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. ప్ర‌జా నిర్ణ‌యాన్ని కాద‌ని ముందుకెళితే ఈ కోటి సంత‌కాలు ప్ర‌భుత్వం ప‌త‌నానికి శాస‌నంగా మార‌తాయ‌ని వైయ‌స్సార్సీపీ హెచ్చ‌రిస్తుంది.  

    నియంత పాల‌న‌కు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు

    ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌పై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోతున్నార‌ని మంత్రి స్వ‌యంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయింద‌ని ప్ర‌భుత్వమే అంగీక‌రించిన‌ట్టు. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏడాదిన్న‌ర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని ప‌థ‌కం ప్ర‌కార‌మే నిర్వీర్యం చేస్తూ వ‌చ్చింది. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ ల‌క్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌ను మార్చేశారు. వైద్యం ప్ర‌భుత్వ బాధ్య‌త కాద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

    మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం ఈ ప్ర‌భుత్వానికి మ‌ర‌ణ‌శాస‌నంగా మార‌బోతోంది. ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లే దించేసే రోజులు త్వ‌ర‌లోనే రాబోతున్నాయని స్ప‌ష్టంగా చెబుతున్నా. ఇప్ప‌టికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం మంచిది కాద‌ని వెన‌క్కి తీసుకున్న విష‌యాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్ల‌ర్ మాదిరిగా నియంత పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబుకి హిట్ల‌ర్‌కి ప‌ట్టిన గ‌తే ప‌డుతుందని విడ‌ద‌ల ర‌జ‌ని హెచ్చరించారు.

  • సాక్షి,గుంటూరు: పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్‌ కళ్యాణ్‌ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం గుంటూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

    వైఎస్‌ జగన్‌పై కూటమి నేతలు విషప్రచారం చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. వైఎస్సార్‌సీపీ హయాంలో పరాకామణి భవన నిర్మాణం జరిగింది. కూటమి ప్రభుత్వంలో దేవాలయాల్లో భక్తులు చనిపోయారు. దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణిస్తే పవన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. తిరుమల లడ్డూపై పవన్‌ అసత్య ప్రచారం చేసి టీటీడీ పరువును అప్రతిష్టపాలు చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్‌ రోజుకో వేషం వేస్తున్నారు. చంద్రబాబుకు చెంచాగిరి చేస్తున్నారు.  

    2003లో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చిందెవరు?. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చిందెవరు? చంద్రబాబు తన ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు తీశారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదు. చంద్రబాబు,పవన్‌ ఎంత బురద జల్లిన వైఎస్‌ జగన్‌కు అంటుకోదని స్పష్టం చేశారు. 

  • సాక్షి, తాడేపల్లి: బోరుగడ్డ అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి తమ పార్టీ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని.. అతనితో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ స్పష్టత ఇచ్చింది. పలు ఇంటర్వ్యూలలో అనిల్‌ పలువురు నేతలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియోలు తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగానూ కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. 

    ‘‘బోరుగడ్డ అనిల్‌కుమార్‌తో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అతను మా పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఇటీవల వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. అతని మీద టీవీ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఎలాంటి సంబంధం లేదు. బోరుగడ్డతో మా‌పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

    గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై పలు క్రిమినల్‌ కేసులు నమోదు కావడంతో.. పోలీసులు రోడీ షీటర్‌గా గుర్తించారు. ఇంతకు ముందు పలు కేసుల్లో అరెస్ట్‌ కూడా అయ్యాడు. అయితే.. ఆ సమయంలోనూ తాను వైఎస్సార్సీపీ మనిషినంటూ ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతనికి సంబంధించిన ఇంటర్వ్యూలలోనూ పార్టీ ప్రస్తావన తేవడంతో వైఎస్సార్‌సీపీ ఓ స్పష్టత ఇచ్చింది.

  • సాక్షి,విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు ఖాయమాని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలో బొత్స సత్య నారాయణ  మీడియాతో మాట్లాడారు. 

    ‘మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా కొనసాగింది. సామాన్యులకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారు. నియోజక వర్గాల నుండి వచ్చిన కోటి సంతకాల కార్యక్రమం పత్రాలను గవర్నర్ కు అందచేస్తాం. డిసెంబర్‌ 18న వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసింది. 

    ప్రతినియోజక వర్గంలో వేలాది మంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. చంద్రబాబు ఎప్పడు కార్పొరేట్ కంపెనీలకే మేలు చేస్తారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే పేదలకు వైద్యం అందుతుంది.కోవిడ్ లాంటి విపత్తులు వస్తే పేదల ఆరోగ్యం కాపాడగలం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమైతే పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది.  

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసింది. మరో రెండు కాలేజీలకు అనుమతులు కూడా తెచ్చింది.తరువాత వచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కొనసాగించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన పాపానికి పేద ప్రజలు ఇబ్బంది పడకూడదను సదుద్దేశ్యంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్‌ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేస్తోందని’ స్పష్టం చేశారు.   

    కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
  • సాక్షి, హైదరాబాద్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తైనా కూడా.. ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి(ఆర్థిక) బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితిపై చేసిన అంకెల గారడీపై బుధవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో బుగ్గన మాట్లాడారు. 

    ఏడాదిన్నర అయినా కూడా ఇంకా గతం గురించే మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది అని చంద్రబాబు వ్యూహాత్మకంగా చెప్పారు. ఆదాయం, స్థూల ఉత్పత్తిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 2014-19 బాబు హయాంలో కేంద్రానికి 4.45 శాతం ఇస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో 4.8 శాతం ఇచ్చాం. కోవిడ్ సమయంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థూల ఉత్పత్తిని  పెంచింది..

    .. తలసరి ఆదాయంలో చంద్రబాబు పాలనలో ఏపీ 18వ స్థానంలో ఉంది. అదే.. జగన్‌ పాలనలో 15వ స్థానంలో ఉంది. జగన్‌ హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పు 3 లక్షల 32 వేల కోట్లు.  చంద్రబాబు 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్ల అప్పు చేశారు. కాగ్‌ లెక్కల ప్రకారం.. 2025-2026గానూ ఏపీ అప్పుల్లో నెంబర్‌ వన్‌గా ఉంది. చంద్రబాబు ప్రతీ నెలా 9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఏజెన్సీలే చెబుతున్నాయి. 

    స్థూల ఉత్పత్తి లెక్కల్లో ఆర్బీఐ చెప్పినవి తప్పు..  కాగ్‌ చెప్పినవన్నీ తప్పు చంద్రబాబు అంటున్నారు. కేవలం తాను చెప్పినవే నిజాలు అనట్లు మాట్లాడుతున్నారు. సీఎం స్థాయిలో ఉండి చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆ పిచ్చి లెక్కలు, కాకి లెక్కలు జనం నమ్మరు అని బుగ్గన అన్నారు. 

    చంద్రబాబు పాలన అంటే అసమర్థతతో కూడిన విధ్వంసం. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కోసే పరిస్థితుల్లో కూడా రైతులు లేరు.కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం చేశాం. రెండు పంటలకు ఇచ్చాం. 34 లక్షల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాం.

    Buggana: ప్రతి నెల 9వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేస్తున్నారు

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కొలంబో అవుతుందా బాబు చెప్పాలి. సంపద ఎలా సృష్టిస్తున్నారో బాబు చెప్పాలి. పోలవరం కోసం కేంద్రం అడ్వాన్స్‌ ఇస్తుంది. కేంద్రం ఇచ్చిన ఆ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించారు.

Movies

    • డల్లాస్లో హీరోయిన్ శ్రీలీల సందడి..

    • బ్లాక్డ్రెస్లో బాలీవుడ్ భామ ఆలియా భట్అందాలు..

    • టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాంటి లుక్స్..

    • కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోదావరి టూర్..

    • బ్యూటీఫుల్ డ్రెస్లో ప్రియమణి హోయలు..

    • డిఫరెంట్‌ డ్రెస్‌లో రకుల్‌ ప్రీత్ సింగ్‌ క్రేజీ పిక్స్..

     

     

     

     

     

     

     

     

  • బాలీవుడ్ రణ్వీర్ సింగ్ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

    వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. విషయంలో రణ్వీర్సింగ్కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్సింగ్నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

    అసలేం జరిగిందంటే..

    ఈవెంట్లో స్టేజీపై రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్‌లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్‌లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.

    కాంతార మూవీ..

    రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్‌ 1 రిలీజైంది. జయరామ్‌, రుక్మిణి వసంత్‌, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్‌ వసూలు చేసింది.

  • బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12 థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్గా వస్తోన్న మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. నేపథ్యంలోనే మరో టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్పేరుతో విడుదలైంది.

    తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..

    తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల  ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు.

     

  • టాలీవుడ్ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్వాయిదా .. తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో చిత్రాన్ని వేశారు. ఈనెల 5 విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.

    అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12 థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ఈనెల 12 దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్రాజ్మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.

    కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్కు అడ్డంకిగా మారింది. విషయంపై డైరెక్టర్సందీప్ రాజ్తన ఆవేదన వ్యక్తం చేశారు.

    తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్హైదరాబాద్లో జరిగింది. ఈవెంట్లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

    ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్చేశారు.

    అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసువ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. శుక్రవారం బిగ్స్క్రీన్పై రావాల్సిన చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.

     

  • ‘హీరో, సాంగ్స్, విలన్, ఫైట్స్..ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉన్న సినిమాలు మన దగ్గరే ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి సినిమాలను చూడం. ఆ పర్పెక్ట్ మాస్ కమర్షయిల్ మూవీస్ 80, 90 దశకాల్లోనే వచ్చాయి. సీరియస్ గా కథ జరుగుతున్నప్పుడు మన సినిమాల్లో ఒక పాట పెడతాం, ఆడియెన్స్ ను రిలాక్స్ చేసి మళ్లీ కథలోకి తీసుకెళ్తాం. అది మన సినిమాకే సాధ్యం. అలాంటి స్ట్రక్చర్ కథతో కొత్త మోడరన్ ప్రెజెంటేషన్ తో ‘అన్నగారు వస్తారు’ మూవీ ఉంటుంది’ అన్నారు హీరో కార్తి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్‌ 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

    నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన సూదు కవ్వమ్ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ 8 ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్ లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్ ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది.

    నేను ఊపిరి లాంటి మూవీస్ ఈజీగా చేయగలను కానీ అన్నగారు వస్తారు ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. అయితే రైటర్స్ కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి. లేకుంటే ఎప్పుడూ ఒకే తరహా మూవీస్ చేయాల్సివస్తుంది. అవేంజర్స్ లాంటి విజువల్స్, మ్యూజిక్ తో ఈ సినిమాను నలన్ కొత్తగా ప్రెజెంట్ చేశాడు. అందుకే అన్నగారు వస్తారు మూవీ చేయడం ఎగ్జైటింగ్ గా ఉంది.

    కథల పరంగా కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం నిత్యం చేస్తుంటాను. నటుడిగా నాకు ప్రత్యేకత తీసుకొచ్చేది నా స్క్రిప్ట్ సెలెక్షనే. ఎన్టీఆర్, ఎంజీఆర్ ఇద్దరి కెరీర్స్ లో అక్కడి సినిమాలు ఇక్కడ ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్స్ జరిగాయి. ఈ క్రాసోవర్ వల్ల ఈ ఇద్దరు మహా నటుల కెరీర్ లో ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అవి మా సినిమాలోనూ చూస్తారు.

    డైరెక్టర్ నలన్ గత సినిమాలు శాడ్ ఎండింగ్ తో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఈ సినిమా మాత్రం హీరో సెంట్రిక్ గా ఉంటుంది. పారలల్ వరల్డ్ లో జరిగే సూపర్ హీరో సినిమా ఇది.

    నేను గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను. అన్నగారు వస్తారులో పోలీస్ పాత్ర అయినా దర్శకుడు డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్ తో ఉంటాయి. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడు. సంతోష్ నారాయణన్ ను ఇంట్రడ్యూస్ చేసింది నలన్ కుమారస్వామి. అయితే ఈ సినిమాకు నలన్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడు. కానీ సంతోష్ వచ్చి నేనే వర్క్ చేస్తా అని అడిగి మరీ మూవీకి జాయిన్ అయ్యాడు.

    హీరోయిన్ కృతిశెట్టి ఆకట్టుకునేలా నటించింది. స్పిరిట్ రీడర్ లా ఆమె కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం రీసెర్చ్ చేసి, ప్రిపరేషన్ తో పర్ ఫార్మ్ చేసింది. ఫస్ట్ సీన్ చూసి నేను ఎంత బాగా నటిస్తుంది అనుకున్నా. హీరోయిన్ అంటే కొన్నిసార్లు గ్లామర్ డాల్ లా ఉండాల్సివస్తుంది. కానీ కృతి నటిగా ఎఫర్ట్స్ పెట్టింది. ఆమె డ్యాన్సులు, గ్లామర్ కాకుండా మంచి యాక్టర్ లా పేరు తెచ్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నిస్తోంది.

    నేను టీమ్ వర్క్ ను బిలీవ్ చేస్తాను. దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ గురించి డిస్కషన్స్ చేసుకుంటాం. సెట్ లో సీన్ చేసే ముందు కూడా మాట్లాడుకుంటాం. నాకు అనిపించిన సజెషన్స్ చెబుతాను. నేను క్యారెక్టర్ లో ఉండిపోతాను కాబట్టి ఆ పాత్ర ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. నావంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేస్తుంటా.

    ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. మూవీకి ఏం కావాలన్నా చేశారు. అన్నగారు వస్తారులో కొత్త వరల్డ్ క్రియేట్ చేశామంటే అందుకు జ్ఞానవేల్ రాజా ఇచ్చిన సపోర్ట్ కారణం. ఒకవారం రెండు మూడు సినిమాలు వచ్చినా తప్పులేదు. ప్రేక్షకులు ఒక మూవీ తర్వాత మరొక మూవీ చూస్తారు. నేనూ ఒక ఆడియెన్ గా అలాగే చూసేవాడిని. ఏ సినిమా చూసే ఆడియెన్స్ ఆ సినిమాకు ఉంటారు.

    ఎవరు కొత్త తరహా సినిమా చేసినా కనీసం మన వంతు ప్రోత్సాహం అందించాలి. లేకుంటే కొత్తగా ప్రయత్నించేవారు ముందడుగు వేయలేరు. సత్యం సుందరం లాంటి సినిమాను ఒకవేళ ప్రేక్షకులు ఆదరించకుంటే మరోసారి అలాంటి సినిమా చేసే ప్రయత్నమే ఎవరు చేయరు కదా. అఖండ 2 రిలీజ్ కన్ఫమ్ కావడం హ్యాపీగా ఉంది. ఆ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లోని భావోద్వేగాలు, పాత్రల చిత్రణ అద్భుతంగా ఉంటాయి. విశ్వనాథ్ గారి సినిమాలు ఎప్పుడు చూసినా మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.

  • టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13 వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్ను మేకర్స్రిలీజ్ చేశారు.

    తాజాగా వెంకీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్చెప్పారు మేకర్స్. మూవీని డిసెంబర్ 13 రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్రిలీజ్ చేశారు. దీంతో బర్త్డే రోజు సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ఉండడం వల్లే చిత్రం రీ రిలీజ్వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    కాగా.. 1998లో వచ్చిన మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

     

     

  • బిగ్ బాస్ గేమ్‌ షోతో బాగా పాపులర్‌ అయింది దివి. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా..అంతగా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. బిగ్‌బాస్‌ షో పుణ్యమా అని చిరంజీవి కంటపడింది. గాడ్ ఫాదర్‌లో ఓ చిన్న రోల్‌ చేసి మెప్పించింది. ఆ తర్వా త ‘పుష్ప 2’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ఇక ‘లంబసింగి’తో హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరిగ్గా ఆడలేదు కానీ.. దివి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది దివి. ఆమె ప్రధాన పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా  చిత్రం ‘కర్మస్థలం’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

    ‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్‌లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్‌లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.

    తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
     

  • మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

    ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. తాజాగా మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. లవ్ సాంగ్రవితేజ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది.

     

  • తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న కమెడియన్ సత్య. బ్రహ్మనందం, అలీ తర్వాత టాలీవుడ్కు దొరికిన ఆణిముత్యం ఆయనే. ప్రస్తుతం కమెడియన్గా ఫుల్ స్వింగ్లో ఉన్న సత్య.. ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సత్య నటిస్తోన్న తాజా చిత్రం జెట్లీ. ఇటీవలే మూవీ ఫస్ట్లుక్పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించారు.

    తాజాగా మూవీకి సంబంధించిన హీరోయిన్ఫస్ట్లుక్పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఇవాళ రియా సింగా పుట్టినరోజు కావడంతో విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీతోనే రియా టాలీవుడ్కు పరిచయమవుతోంది. రియా సింగా మిస్యూనివర్స్ఇండియా-2024 టైటిల్ విన్నర్ కావడం విశేషం. కమెడియన్సత్య సరసన ఏకంగా మిస్ యూనివర్స్ హీరోయిన్గా కనిపించడంపై టాలీవుడ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    కాగా.. జైపూర్‌కు చెందిన రియా సింగా గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. మిస్ యూనివర్స్ ఇండియా కంటే ముందు.. ఆమె మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

     

  • నవ్వడం ఓ భోగం. నవ్వించడం యోగం. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే బోలెడంత మంది కమెడియన్స్. ఇలాంటి మూవీస్ తీసే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి చాలామంది దర్శకులు. కానీ ఇప్పుడు కమెడియన్స్ తగ్గిపోయారు. ఆ తరహా చిత్రాలు తీసే డైరెక్టర్స్ కనిపించట్లేదు. ఇంటిల్లిపాదీ చూసే హాస్య భరిత సినిమాలూ తగ్గిపోయాయి. చెప్పాలంటే టాలీవుడ్‌లో 'నవ్వు' సరిగా వినిపించట్లేదు. ఇంతకీ దీనికి కారణమేంటి?

    ఒకప్పుడు కామెడీ సినిమాలకు తెలుగు చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్. దేశంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర పదుల సంఖ్యలో కమెడియన్స్ ఉండేవాళ్లు. వీరిని ప్రధానంగా పెట్టి 'ఎవడి గోల వాడిది', 'జంబలకిడి పంబ' లాంటి సినిమాలు తీసేవారు. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి కూడా విశేషాదరణ ఉండేది. కాల క్రమేణా కమెడియన్స్ చేసే కామెడీ.. హీరోలు చేయడం మొదలుపెట్టారు. పదేళ్ల ముందు ఈ ట్రెండ్ బాగా కనిపించింది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరూ తాము కామెడీ పండించడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు.

    గత కొన్నాళ్ల నుంచి మాత్రం తెలుగులో కామెడీ సినిమాల శాతం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వల్ల చాలావరకు హాస్యం అనేదే సరిగా కనిపించట్లేదు. స్టార్ దర్శకులు.. పాన్ ఇండియా మోజులో పడ్డారంటే ఓ అర్థముంది. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త దర్శకులు కూడా సింపుల్ బడ్జెట్‌లో కామెడీ, ఎంటర్‌టైనర్ కాన్సెప్టులు అస్సలు ఆలోచించడం లేదు. పదుల కోట్లు ఖర్చయ్యే భారీ యాక్షన్ స్టోరీలని సిద్ధం చేసుకుంటున్నారు. పోనీ బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పది చిత్రాలు తీస్తే అందులో ఒకటో రెండు మాత్రం ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నాయి. మిగిలినవి సోషల్ మీడియాలో మాత్రం హిట్ అనిపించుకుంటున్నాయి.

    చెప్పాలంటే పదిహేను ఇరవైళ్ల క్రితం తెలుగు చిత్రసీమకు గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా ఇలానే ఉండేది. ఎందుకంటే దర్శకనిర్మాతలు అందరూ ఇంటిల్లిపాదీ చూసే కథల్ని సినిమాలుగా తీసేవాళ్లు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్.. ప్రతివారం థియేటర్లకు క్యూ కట్టేవారు.  హిట్ టాక్‌తో పాటు కలెక్షన్స్ అలానే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లు నుంచి మాత్రం టార్గెట్ ఆడియెన్స్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది.

    అయితే యూత్ కోసం బోల్డ్ కాన్సెప్ట్ మూవీస్ తీస్తున్నారు. లేదంటే యాక్షన్ సినిమాలు అంటున్నారు. ఇవి కాదంటే పీరియాడిక్ మూవీస్ అని హడావుడి చేస్తున్నారు. తప్పితే తక్కువ బడ్జెట్‌లో మనస్ఫూర్తిగా నవ్వుకునే కామెడీ మూవీస్ చేద్దామని యువ దర్శకులు గానీ సీనియర్ డైరెక్టర్స్ గానీ ఆలోచించట్లేదా అనిపిస్తుంది. ఈ ఏడాదినే తీసుకోండి.. సంక్రాంతికి వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఏకంగా రూ.200-300 కోట్ల వసూళ్లు అందుకుంది. దీనిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఆడియెన్స్ కామెడీ మూవీస్ కోసం ఎంతలా తహతహలాడుతున్నారో.

    'సంక్రాంతికి వస్తున్నాం' రేంజులో కానప్పటికీ.. ఈ ఏడాది 'మ్యాడ్ స్క్వేర్', 'సింగిల్', 'లిటిల్ హార్ట్స్', 'కె ర్యాంప్', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' అనే చిన్న సినిమాలు ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాయి. కాకపోతే వీటిలో స్టార్స్ ఎవరూ లేరు. కాబట్టి వీటికి పెద్దగా రీచ్, గుర్తింపు దక్కలేదు. అయితే మిడ్ రేంజు హీరోలు, చిన్న హీరోలతో కామెడీ సినిమాలు తీయడం కంటే స్టార్ హీరోలతో కామెడీ చిత్రాలు తీస్తే వాటికి ఉండే రేంజ్ వేరని చెప్పొచ్చు. సరైన కామెడీ కాన్సెప్ట్, స్టార్ హీరోలతో మూవీస్ చేస్తే ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్లకు వచ్చే అవకాశముంటుంది. ఎంతసేపు పైరసీ, మరేదో అని బాధపడతారు తప్పితే ఫ్యామిలీ ఆడియెన్స్ వచ్చే కామెడీ చిత్రాల్ని తీద్దామనే విషయాన్ని మాత్రం సరిగా ఆలోచించట్లేదా అనిపిస్తుంది. అందుకే టాలీవుడ్‌లో మనస్ఫూర్తిగా నవ్వుకోవడం అనేది చాన్నాళ్ల మిస్ అవుతూనే ఉంది.

  • సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సులభమే. కానీ స్టార్డమ్ఎప్పటికీ నిలబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతో మంది హీరోయిన్స్‌.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి కనుమరుగయ్యారు. ఒకప్పుడు వరుస చిత్రాలు చేసిన వారు.. పూర్తిగా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు

    అయినప్పటికీ సినిమాపై ఉన్న ఇష్టంతో చాలామంది సీనియర్హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. వారిలో ఏడాది దాదాపు ఐదుగురు టాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్నారు. అయితే సారి హీరోయిన్గా కాదు.. క్యారెక్టర్ఆర్టిస్ట్గా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. అలా 2025లో మరోసారి టాలీవుడ్తలుపు తట్టిన భామలు ఎవరు? వారితో ఎంతమంది సక్సెస్ అయ్యారో స్టోరీలో తెలుసుకుందాం.

    హీరోయిన్ లయ..

    అప్పట్లో టాలీవుడ్హీరో శివాజీతో వరుసగా సినిమాలు చేసింది లయ. కొన్ని చిత్రాలు చేసిన ఆమె అమెరికా చెక్కేసింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ యూఎస్లోనే సెటిలైంది. కానీ ఏడాది నితిన్ మూవీ తమ్ముడుతో మరోసారి తెలుగు తెరపై మెరిసింది. అయితే చిత్రం లయకు పెద్దగా వర్కవుట్ కాలేదు.

    మన్ముధుడు అన్షు..

    నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రంలో తన అందంతో కట్టిపడేసి హీరోయిన్ అన్షు. ఆ తర్వాత ప్రభాస్‌ సరసన రాఘవేంద్ర సినిమాలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్లకే సినిమాలకు గుడ్‌బై చెప్పిన ముద్దుగుమ్మ.. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇటీవల సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మజాకా మూవీతో తెలుగు తెరపై మెరిసింది. కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మన్మధుడు బ్యూటీ అన్షుకు రీ ఎంట్రీ అంతగా కలిసి రాలేదు.

    బొమ్మరిల్లు జెనీలియా..

    బొమ్మరిల్లు మూవీతో ఆడియన్స్ను తనవైపు తిప్పుకున్న బ్యూటీ జెనీలియా. మూవీ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా.. ఏడాది జూనియర్మూవీతో సిల్వర్స్క్రీన్పై మెరిసింది. చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన జెనీలియాకు అంతగా కలిసి రాలేదు. తన గ్లామర్, నటనతో ఆకట్టుకున్నప్పటికీ సక్సెస్మాత్రం అందుకోలేకపోయింది.

    కామ్నా జెఠ్మలానీ..

    2005లో ప్రేమికులు సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కామ్నా జెఠ్మలానీ. తర్వాత తన మూడో చిత్రం రణంతో బాగా పాపులర్‌ అయింది. అల్లరి నరేష్‌తో బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి సినిమాల్లో మెప్పించింది. అంతేకాకుండా కింగ్‌, సైనికుడు వంటి సినిమాల్లో కనిపించింది. 2013లో చివరిగా శ్రీ జగద్గురు ఆది శంకర మూవీలో మాత్రమే నటించింది.

    అయితే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వెండితెరపైకి కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన కె-ర్యాంప్ మూవీలో మెరిసింది. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో రీ ఎంట్రీలో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. అయితే డిసెంబర్‌ 10 జన్మించిన కామ్నా జెఠ్మలానీ.. 2014లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈ ఏడాదిలో ఐదుగురు హీరోయిన్స్‌ తెలుగు ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వగా.. కేవలం కామ్నా జెఠ్మాలానీనే సక్సెస్ వరించింది. ఇవాళ ఆమె బర్త్డే సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

    నువ్వు నేను ఫేమ్ అనిత..

    నువ్వు-నేను చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న అనితా చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. సుహాస్ హీరోగా వచ్చిన ఓ భామ అయ్యో రామాలో కనిపించింది. అయితే మూవీ అనితకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో గట్టిగా రీ ఎంట్రీ ఇద్దామనుకున్న అనితకు నిరాశే ఎదురైంది. సీనియర్ హీరోయిన్‌ల రీ ఎంట్రీలో హిట్కొట్టకపోయినప్పటికీ అభిమానుల ఆదరణ దక్కించుకున్నారు.

    అంతేకాకుండా టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు పొందిన చాలా మంది ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. భూమిక, రంభ, మీనా, విజయశాంతి, సంగీత, మీరా జాస్మిన్, సదా లాంటి సీనియర్ హీరోయిన్లు మరోసారి వెండితెరపై మెరిశారు. వీరిలో కొంతమంది మెప్పించారు. మరికొందరేమో ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

     

  • హరనాథ్ పోలిచర్ల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నా తెలుగోడు’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రీరీలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.

    ఈ సందర్భంగా హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ... తెలుగోడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎలా మంచి కోసం పోరాడేవాడు, ప్రతిభావంతుడు, కష్టపడేవాడు అనేది ఈ సినిమాలో చూపించాను. ఈ సినిమాలో ప్రత్యేకంగా నాలుగు అంశాలను చూస్తాం. అమ్మ గురించి, డ్రగ్స్ పై అవగాహన, సైనికుడు జీవితం గురించి, బాల శిశువులను కాపాడే ప్రయాణం పై ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ అంశాలు అన్నింటినీ ప్రేక్షకులకు అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూస్తాం. 

    ఈ సినిమా కోసం నా చిత్ర బృందం అందరూ నాకు ఎంతో అండగా నిలబడ్డారు. శివ మంచి సంగీతాన్ని అందించారు. ప్రేక్షకులు అందరూ డిసెంబర్ 12వ తేదీన సినిమాను చూసి, సినిమాలోని అంశాలను మీ మనసులోకి తీసుకుంటారు అని కోరుకుంటున్నాను’ అన్నారు.  

    హీరోయిన్ సుఫియా తన్వీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను పాత్ర పోషించడం కాదు, జీవించాను. ఈ పాత్ర పోషించినందుకు గాను నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు అంతా ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.

    ‘ఈ చిత్రంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుంది. కాబట్టి నా పాత్ర గురించి బయటకు ఏమి చెప్పలేకపోతున్నాను’అని హీరోయిన్‌ నైరాపాల్‌ అన్నారు.

  • అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్.. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. జైల్లోని తోటి ఖైదీలపై చేయి చేసుకున్నాడని రెండు రోజుల క్రితం న్యూస్ వచ్చింది. ఇప్పుడు మరో షాకింగ్ ఫొటో వైరల్ అవుతోంది. దర్శన్ హత్య చేసిన రేణుకాస్వామి సమాధి చిత్రదుర్గలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరో ధ్వంసం చేశారు.

    రేణుకా స్వామి హత్య కేసులో వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో సమాధిని ధ్వంసం చేయడం అంటే దర్శన్ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఇతడి అభిమానులే ఈ పని చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. రేపు(డిసెంబరు 11) దర్శన్ కొత్త సినిమా 'డెవిల్' థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం అభిమానులు ఆ హడావుడిలోనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రేణుకా స్వామి సమాధి ధ్వంసం అయిందని ఒకటి రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    హత్య కేసు సంగతేంటి?
    హీరో దర్శన్‌ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళని పెళ్లి చేసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారని, దీని వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందనే బాధతో రేణుకాస్వామి అనే యువకుడు.. తన ఇన్‌‌స్టాలో పవిత్రని టార్గెట్ చేశాడు. అశ్లీల సందేశాలు, దర్శన్‌ని విడిచిపెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

    ఇదే రేణుకాస్వామి హత్యకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు కన్నడనాట తీవ్ర సంచలనం సృష్టించింది. అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని, కరెంట్‌ షాక్‌ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో హైకోర్టు దర్శన్‌కు గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్‌ ఇవ్వగా.. డిసెంబర్‌ 13న రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాలు చేసింది.

    కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ తీర్పును పక్కనపెడుతూ అత్యున్నత న్యాయస్థానం ఆ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ దర్శన్‌ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో దర్శన్ ఉన్నాడు.

    (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్‌'ను తాకిన కులం, ప్రాంతపు రంగు)

  • స్వతహాగా టీవీ నటుడు అయినప్పటికీ ఐపీఎల్‌లో హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ్ కపూర్ ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఇతడి గురించి రూమర్స్ వస్తున్నప్పటికీ తాజాగా వాటిపై క్లారిటీ వచ్చేసింది. గౌరవ్ ఎవరితోనైతే రిలేషన్‌లో ఉన్నాడని పుకార్లు వచ్చాయో సదరు నటి.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. దీంతో కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.

    (ఇదీ చదవండి: అమ్మ ఆశీర్వదించింది.. భగవంతుడు నిజం చేశాడు: పూర్ణ)

    రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన గౌరవ్ కపూర్.. కొన్ని హిందీ సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కాకపోతే 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో హోస్ట్‌గా చేసిన తర్వాత చాలా గుర్తింపు వచ్చింది. అలా 2017 వరకు ఈ లీగ్‌లో హోస్టింగ్ చేశాడు. ప్రస్తుతం క్రిక్‌బజ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు వ్యాఖ్యతగా పనిచేస్తున్నాడు.

    గతంలోనే నటి కిరాట్ బట్టల్‌ అనే నటిని గౌరవ్, 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. గత నాలుగేళ్లుగా గౌరవ్ ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కృతిక కమ్రా అనే నటితో గౌరవ్ డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కృతికనే ఇన్ స్టాలో గౌరవ్‌తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతో బంధం అధికారికం చేసేశారని మాట్లాడుకుంటున్నారు. 37 ఏళ్ల కృతిక ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

    (ఇదీ చదవండి: సినిమాల్లో అవకాశాలు లేవ్‌.. చాలా బాధపడ్డా!: నటి ప్రగతి)

  • సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ మధ్య చాలా మంది  బహిరంగంగా మాట్లాడుతున్నారు. పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన వేధింపుల గురించి మీడియాతో పంచుకుంటున్నారు. అంతేకాదు అలాంటి వేధింపులు వస్తే..ఎలా డీల్‌ చేయాలో కూడా సలహాలు ఇస్తూ.. నూతన నటీనటులుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా నటి యామిని భాస్కర్‌(yamini Bhaskar) కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందిచింది. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఎదవలు ఉంటారని.. ధైర్యంగా ఎదురుతిరిగితేనే కెరీర్‌లో రాణిస్తామని చెబుతోంది.

    రభస(2014) చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి చిత్రంతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల,  భలే మంచి చౌకబేరమ్‌, కొత్తగా మా ప్రయాణం ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా నటిస్తూ వచ్చింది. నర్తనశాల రిలీజ్‌ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన యామిని.. ఇప్పుడు ‘సైక్ సిద్ధార్థ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 12న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు.

    ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా కొంతమంది ఎదవలు ఉంటారు. నా కెరీర్‌ ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు ఆనీ.. మధ్యలో కొంతమంది తగిలారు. వాళ్లని ఎలా డీల్‌ చేయాలో అర్థం కాక.. సినిమాలనే వదులుకున్నాను. కొన్నిసార్లు మనల్ని డ్యామినేట్‌ చేసేవాళ్లు ఉంటారు. మేల్‌ ఈగో చూపిస్తూ.. అమ్మాయిలను ఇబ్బంది చేస్తుంటారు. అప్పట్లో నాకు కాస్త భయం ఉండేది. వాళ్ల గురించి మాట్లాడలేకపోయా. సైలెంట్‌గా ఉండేదాన్ని. దీంతో అందరూ నాకు యాటిట్యూడ్‌ అనుకున్నారు. కానీ అలాంటి వాళ్లకు దూరంగా ఉండడం బెటరనీ నేను భావించా. అయితే ఇండస్ట్రీలో అందరూ చెడ్డవాళ్లు అయితే లేరు. కొంతమంది మంచి వాళ్లు కూడా ఉన్నారు. అమ్మాయిలను గౌరవిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. 

    ఇక కేవలం మగవాళ్లు మాత్రమే ఇబ్బంది పెడతారని నేను చెప్పట్లేదు. ఇక్కడ అమ్మాయిలు కూడా అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్లు ఉన్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే అమ్మాయిలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ రంగంలోనే కాదు ఎక్కడైనా ఇలాంటి వాళ్లు ఉంటారు. మన ప్రవర్తనను బట్టి..మనమేంటో తెలుసుకుంటారు’ అని యామిని చెప్పుకొచ్చారు. అలాగే తనకు గ్యాప్‌ ఎందుకు వచ్చింది? ఆర్‌ఎక్స్‌ 100 చాన్స్‌ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తదిరల విషయాలను కూడా సాక్షితో పంచుకుంది. అవి తెలుసుకునేందుకు  ఈ వీడియోని చూసేయండి

  • బిగ్‌బాస్‌ గేమ్‌ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్‌ సెట్‌ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో  దానికి తగినట్టు  స్ట్రాటజీ ప్లాన్‌ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్‌ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్‌ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదవ సీజన్‌లో కూడా అదే జరగుతోంది. 

    టాప్‌ 2పై ట్రోలింగ్‌
    కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్‌ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్‌ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్‌ టీమ్‌ దానిని వైరల్‌ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్‌ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్‌ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. 

    వేరేవాాళ్లను తొక్కితేనే..
    అతనిపై కామన్‌ మ్యాన్‌, ఆర్మీ మ్యాన్‌, తెలుగు వాడు అంటూ పీఆర్‌ టీమ్స్‌ వైరల్‌ చేస్తున్నాయి. దీంతో​ ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.

    కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?

    బిగ్‌బాస్‌ టైటిల్‌ రేసులో కల్యాణ్‌, తనూజ ఉన్నారు. ఆమె‌ కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్‌ అయి వెళ్లిపోయాడు.

    ఐపీఎల్‌లో ఇలాంటివేం లేదే
    ఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్‌ మాదిరి బిగ్‌బాస్‌ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్‌. ఐపీఎల్‌లో నగరాల పేర్లతో టీమ్స్‌ ఉన్నాయి. అనేక దేశాల నుంచి  క్రికెటర్లు  ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..

    గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్‌
    ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ  ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. 

    గేమ్‌ పక్కట్టి..
    కానీ, సోషల్‌మీడియాలో  ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్‌ టీమ్స్‌ వారిని​ ట్రోలింగ్‌ చేస్తున్నాయి. గత సీజన్‌లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు.  బయట తన పీఆర్ టీమ్‌ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి  ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్‌ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు. 

    ఇదేం బాగోలేదు
    కేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్‌లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్‌ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్‌ చేయడంపైనే స్పెషల్‌ ఫోకస్‌ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్‌ ఆడియన్స్‌ ఫీలవుతున్నారు.

     

     

     

     

     

  • 49 ఏళ్ల వయసులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది టాలీవుడ్‌ నటి ప్రగతి. పవర్‌ లిఫ్టింగ్‌లో మూడేళ్లుగా ప్రతిభ చూపిస్తోన్న ఈ నటి ఇటీవల టర్కీలో జరిగిన ఏసియన్‌ ఓపెన్‌ అండ్‌ మాస్ట్రస్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు మెడల్స్‌ సాధించింది. డెడ్‌ లిఫ్ట్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌, బెంచ్‌, స్క్వాడ్‌ విభాగంలో రెండు వెండి పతకాలు సాధించింది. ఓవరాల్‌గా సిల్వర్‌ పతకం వచ్చిందని పేర్కొంది.

    సినిమాల్లో అవకాశాలు రాలే
    అయితే క్రీడల వైపు అడుగులు వేయడానికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. స్పోర్ట్స్‌కు 100% ఎలా ఇచ్చానో, సినిమాల్లో కూడా అంతే మనసు పెట్టి యాక్ట్‌ చేశాను. కాకపోతే సినిమాల్లో నా టాలెంట్‌ చూపించుకునే అవకాశం దొరకలేదు. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసినంత గొప్ప అవకాశాలు నాకు రాలేదు. కొన్ని పాత్రలకు నన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న బాధ అయితే ఉంది. 

    డిప్రెషన్‌లోకి వెళ్లకుండా..
    అది చాలా బెంగగా ఉండేది. ఒకానొక సమయంలో ఛాన్సులు  తగ్గిపోయాయి. వాళ్లిచ్చిన అవకాశాలు నాకు నచ్చలేదు. నేను కోరుకుంది వారివ్వలేదు. ఆ బాధ నెమ్మదిగా డిప్రెషన్‌కు మారుతుందేమోనన్న భయం ఉండేది. అప్పుడు నేను స్పోర్ట్స్‌లో అడుగుపెట్టాను. ఇక్కడ నా సాయశక్తులా కష్టపడి ఎదిగాను. వెయిట్‌ లిఫ్టింగ్‌ వల్ల అందం పోతుందని నేను అనుకోలేదు. నేను అందంగానే ఉంటాను. 

    మానసిక ధైర్యం
    పైగా ఈ క్రీడలో అడుగుపెట్టాక మానసికంగా మరింత ధృడంగా తయారయ్యాను. ఏదొచ్చినా నేను చూసుకోగలను అన్న ధ్యైర్యం వచ్చింది. ప్రస్తుతం తమిళ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాను. జిమ్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో సినిమా సెట్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే గర్వంగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలే చేయాలనుకుంటున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చింది.

     

     

    చదవండి: కల్యాణ్‌ను విధుల్లో నుంచి తొలగించలేదు

  • స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. ఈ మధ్య కాలంలో డ్యాన్స్ షోలకు జడ్జిగా, సహాయ నటిగా కనిపిస్తూ బిజీ అయిపోయింది. మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టడంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుంది. 'గుంటూరు కారం'లో కుర్చీ మడతపెట్టి పాటతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

    పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నటి అయిపోవడంతో మళ్లీ స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చే అవకాశం రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టేజీపై నృత్య ప్రదర్శన చేసిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. భర్త గురించి చెబుతూ పూర్ణ ఎమోషనల్ అయిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

    'మా అమ్మ కృషి, ప్రోత్సాహం వల్లే నేను డ్యాన్సర్ అయ్యాను. పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు.. అమ్మలా నా డ్యాన్స్‌ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని దేవుడిని కోరుకున్నాను. అలానే 'నువ్వు కోరుకున్న కలలు నెరవేరేలా చూసే వ్యక్తి నీకు భర్తగా రావాలి' అని అమ్మ కూడా నన్ను దీవించింది. అటు అమ్మ కల, ఇటు నా కలని దేవుడు నిజం చేశాడు. నా భర్త.. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారు. అయినా సరే నా డ్యాన్స్‌కి సపోర్ట్ చేశారు. కులం, నేపథ్యం లాంటి తేడాలు పట్టించుకోకుండా ఓ మనిషిగా, ప్రేమ గౌరవం చూపించే ఆయన మంచి మనసుకు నేను ధన్యురాలిని' అని భర్తని పూర్ణ తెగ పొగిడేసింది.

    పూర్ణ లేటెస్ట్‌గా నటించిన సినిమా 'అఖండ 2'. తొలి భాగంలో ఈమె చేసిన పాత్రకు ఇందులోనూ కొనసాగింపు ఉండనుంది. 

    (ఇదీ చదవండి: రోడ్డు మీద దయనీయ స్థితిలో శ్యామల.. కాపాడిన పోలీసులు)

Business

  • క్రికెట్ మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ‘సిక్సర్ కింగ్’ యువరాజ్ సింగ్ ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్నారు. తన అల్ట్రా-ప్రీమియం టెకిలా బ్రాండ్ ‘ఫినో(Fino)’ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేయడం ద్వారా స్పిరిట్‌ విభాగంలోకి ప్రవేశించారు. ఈ లగ్జరీ స్పిరిట్ ఇప్పటికే అభిమానులు, విలాసవంతమైన పానీయాల ప్రియులను ఆకర్షించినట్లు కంపెనీ తెలిపింది.

    యువరాజ్ సింగ్ భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఫినో నాలుగు అల్ట్రా-ప్రీమియం టెకిలా వేరియంట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రతి బాటిల్ ధర రూ.10,000 కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. భారతదేశంలో సగటు నెలవారీ జీతం రూ.25,000 నుంచి రూ.32,000 మధ్య ఉన్నందున చాలా మంది వినియోగదారులు కేవలం ఒక బాటిల్ టెకిలా కోసం దాదాపు ఒక నెల ఆదాయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు చెబుతున్నారు. ఈ అత్యధిక ధర ఈ బ్రాండ్‌ను కేవలం లగ్జరీ స్పిరిట్స్ మార్కెట్‌కే పరిమితం చేసింది. ఫినో స్పిరిట్‌లను 100% బ్లూ వెబర్ అగావే నుంచి రూపొందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.

    ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

  • దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.

    డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ ​క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.

    ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలు

    ఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్‌లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్‌లో కోతలు పెట్టింది.

    ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

  • మైక్రోసాఫ్ట్ భారతదేశంలో 17.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.47 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించిన తరువాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను గౌతమ్ అదానీ తన ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్‌ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.

    ఈ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. ‘సత్య నాదెళ్లను కలవడం, సాంకేతికత భవిష్యత్తుపై ఆయన అమూల్యమైన భావాలను పొందడం ఎప్పుడూ ఆనందకరం. ఏఐ యుగంలో ఫిజికల్‌, డిజిటల్ ప్రపంచాలు కలుస్తున్నందున మైక్రోసాఫ్ట్‌తో మా 360 డిగ్రీల భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్తున్నందుకు సంతోషిస్తున్నాం’ అని అదానీ పేర్కొన్నారు. నాదెళ్ల స్వయంగా నిర్మిస్తున్న ఏఐ యాప్‌ల డెమోను చూడటం పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.

    భారత్ గ్లోబల్ టెక్ లీడర్‌గా..

    అదానీ గ్రూప్ ఎనర్జీ, పోర్ట్‌లు వంటి భౌతిక మౌలిక సదుపాయాల సామర్థ్యాలు మైక్రోసాఫ్ట్ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాలతో జతకట్టడం భారతదేశం సాంకేతిక లక్ష్యాలకు కీలకమౌతుంది. అదానీ-నాదెళ్ల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వృద్ధికి (అదానీకనెక్స్ జాయింట్ వెంచర్ ద్వారా ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణలో సహకారం ఉంది) మరింత ఊతమిస్తుంది. భారత్‌లో గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా భారీగా పెట్టుబడులు ప్రకటించిన నేపథ్యంలో దేశ డేటా సెంటర్ మార్కెట్ వేగంగా విస్తరించనుంది. ఈ పరిణామం మేక్ ఇన్ ఇండియా, వికసిత్‌ భారత్ 2047 లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.

    ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

  • దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌’గా పిలువబడే ఈ ఫండ్‌ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌లకు క్యాపిటల్‌ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

    దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నిర్వహించే మొదటి అకడమిక్‌-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సేవలు అందిస్తున్న ఎస్‌‌ఐఎన్‌ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.

    విస్తృత రంగాలకు మద్దతు

    రొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్‌ ఎన్విరాన్‌మెంట్‌, టెక్ ల్యాబ్‌లు, వ్యవస్థాపక నెట్‌వర్క్‌ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్‌లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.

    ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ

  • దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్‌) పోర్టల్‌ల్లో అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

    భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్‌ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.

    ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్‌ పోర్టల్స్‌లో ఏఐ చాట్‌బాట్‌లు

    ఇండియా ‘ఏఐ-ఫస్ట్‌ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్‌సీఎస్‌లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.

    ఈ చాట్‌బాట్‌లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్‌ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్‌ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.

    ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు

  • ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.

    న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ‍ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్‌ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.

    డిజిటలైజేషన్, ఉద్యోగాలు

    కొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్‌వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్‌వర్క్‌లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.

    అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్‌ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.

    ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

  • హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెద్ద సంచలనం.. ప్రసిద్ధ స్టార్హోటల్‌ ‘తాజ్‌ బంజారా’ చేతులు మారింది. అరోబిందో గ్రూప్‌కి చెందిన ఆరో రియాల్టీ తాజ్ బంజారా హోటల్‌ను రూ.315 కోట్లకు అధికారికంగా కొనుగోలు చేసింది.

    గత అక్టోబర్ 31న పూర్తైన ఈ లావాదేవీ బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. కొనుగోలుకు స్టాంప్ డ్యూటీ కింద రూ.17.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. సుమారు 3.5 ఎకరాల్లో న్న తాజ్ బంజారా మొత్తం విస్తీర్ణం 16,645 చదరపు గజాలు. ఇందులో బిల్ట్-అప్ ఏరియా 1.22 లక్ష చదరపు అడుగులు. హోటల్లో మొత్తం 270పైగా గదులు ఉన్నాయి.

    ఐకానిక్ తాజ్ బంజారా

    ఒకప్పుడు తాజ్ గ్రూప్‌కి చెందిన ఫ్లాగ్‌షిప్ లగ్జరీ హోటల్‌గా తాజ్ బంజారా ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగిన హోటల్గా నిలిచింది. అయితే గత కొన్నేళ్లుగా ఆపరేషనల్ సమస్యలు, జీహెచ్ఎంసీ నుంచి క్లోజర్ నోటీసులు అందుకోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. ఈ కొనుగోలు తర్వాత ఆ ప్రాపర్టీ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు ఉన్నాయి.

    ఆరో రియాల్టీ ఏం చేస్తుందో..

    హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న ఆరొ రియాల్టీ, రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ సెగ్మెంట్‌ల్లో నిరంతరం పెద్ద ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పుడు తాజ్ బంజారా కొనుగోలు ఆ విస్తరణలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. కాగా దీంతో ఆతిథ్య రంగంలోకి ప్రవేశించి తాజ్బంజారా హోటల్ను కొనసాగిస్తుందా.. లేదా కూల్చేసి హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌కు తెరతీస్తుందా అన్నది చూడాలి.

  • హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్‌గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్‌వర్క్‌ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

    ఏం చేస్తుందీ కేంద్రం?

    తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్‌లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్‌షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్‌లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

    గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్‌ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్‌షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్‌తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.

    తెలంగాణకు పెద్ద అడుగు

    గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్‌లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్‌ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.

    గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్‌ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్‌తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్‌లకు సహాయపడుతుంది” అన్నారు.

International

  • జపాన్‌ ప్రజల ముఖాల్లో కొత్త ఏడాది సంబురం ఏ మూలన కనిపించడం లేదు. నాన్నా-పులి కథలో మాదిరి.. ఎప్పుడు ఏ ముప్పు ముంచెత్తుతుందా? అని వణికిపోతున్నారు. తాజాగా ఆవోమోరి తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా.. జపాన్ వాతావరణ సంస్థ (JMA) హొక్కైడో–సన్రికు తీరానికి అరుదైన మెగాక్వేక్‌(megaquake) అడ్వైజరీ జారీ చేసింది.

    జేఎంఏ లెక్క ప్రకారం.. మరో వారం రోజుల్లో అక్కడ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సునామీ ముప్పు పొంచి ఉంటుంది. దాదాపు 98 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడతాయి. ఫలితంగా ఊహకు అందని విషాదం నెలకొనే అవకాశం లేకపోలేదు. భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ఇదే అక్కడ ఆందోళనకు కారణమైంది. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన జారీ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. 

    భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 8.0 కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా (Mega Earthquake) పరిగణిస్తారు. భూ ఫలకాల్లో కదలికలు అంటే.. ఒక టెక్టోనిక్‌ ప్లేట్‌ మరో దానిలో కూరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర చీలిక ఏర్పడొచ్చు. అదే జరిగితే గనుక సముద్ర గర్భం కింద పరిస్థితులతో భారీ సునామీకి కారణమవుతుంది.

    అలా అప్రమత్తమై.. 
    జపాన్‌ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన భూకంపం (Great East Japan Earthquake) 1923లో (కాంటో భూకంపం) సంభవించింది. అప్పుడు రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. దాదాపు లక్ష నుంచి 1.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపై 2011లో వచ్చిన టోహోకు భూకంపం ఇటీవలి సంవత్సరాల్లో అతిపెద్దది. 9.0 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం దాదాపు ఆరు నిమిషాల పాటు కొనసాగింది. 23 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన సునామీ అలలతో దాదాపు 20వేల మంది ప్రాణాల్ని బలిగొంది. ఆ విషాదం నుంచి జపాన్‌ కొత్త పాఠాలు నేర్చుకుంది. ప్రపంచంలోనే భూకంపాలను ఎదుర్కొనడం కోసం అత్యాధునికమైన ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 

    లక్షల్లో మరణాలు?.. 
    జపాన్ వాతావరణ సంస్థ ఊహించిందే జరిగితే.. భారీగా ప్రాణ నష్టం ఉంటుంది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. 

    అంతా తూచేనా?
    జపాన్‌ ఉంది ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (Pacific Ring of Fire) వెంట. ఇక్కడ టెక్టానిక్‌ ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉండటంతో..  ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఎక్కడో ఓ చోట ప్రకంపనలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జులై 5వ తేదీన ఏదో జరగబోతోందంటూ ఓ ప్రచారం బాగా జరిగింది. రియో టుత్సుకి అనే కళాకారిణి 1999లో రాసిన ది ఫ్యూచర్‌ ఐ సా అనే బుక్‌ ఆధారంగా జపాన్‌ జనాలు వణికపోయారు. 

    2025 జూలైలో జపాన్‌లో 2011 తూర్పు జపాన్ సునామీ కంటే 3 రెట్లు పెద్ద విపత్తు వస్తుందని హడావిడి చేశారు. ఊళ్లు ఖాళీ చేసి తరలిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలో ఉండిపోయారు. ఈ భయాందోళనను ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. చివరకు.. ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆ సమయంలో సైస్మాలజిస్టులు.. వాతావరణ సంస్థ (JMA) హెచ్చరికలను మాత్రమే నమ్మాలని సూచించారు. ప్రస్తుతం చిషిమా ట్రెంచ్‌ (హొక్కైడో ద్వీపం), జపాన్‌ ట్రెంచ్‌ (సన్‌రికు) వెంట తీవ్ర భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్‌ వాతావరణ విభాగం అలర్ట్‌ జారీ చేసింది. ఇప్పుడు.. నిజంగానే అలాంటి హెచ్చరిక రావడంతో వణుకు మొదలైంది. 

    లైట్‌ తీస్కోవద్దు!
    జపాన్‌ మెగా క్వేక్‌ అడ్వైజరీ హొక్కైడో నుంచి చిబా ప్రిఫెక్చర్‌ వరకు సుమారు 800 మైళ్ళ (1,300 కిలోమీటర్ల) పసిఫిక్ తీర ప్రాంతం మొత్తానికి జారీ చేయబడింది. మధ్యలో సన్రికు, ఆఓమోరి, మియాగి, ఫుకుషిమా వంటి తీర ప్రాంతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మెగాక్వేక్‌ అడ్వైజరీని తేలికగా తీసుకోవద్దని.. అవసరమైతే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. 

    ప్రభావం ఎంత.. 
    జపాన్‌ తీరానికే మెగాక్వేక్‌ పరిమితం కావడంతో.. ఇతర దేశాలపై ప్రభావం చూపించే అవకాశం తక్కువ. ఒకవేళ భారీ భూకంపం, సునామీ తీవ్ర ప్రభావం చూపితే మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దేశాలు ప్రభావితం కావొచ్చు. కాబట్టి.. భారతదేశానికి ఎలాంటి ముప్పు పొంచి లేదు.

  • రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీ కొడితే ఎలా ఉంటుంది?.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన సోమవారం చోటుచేసుకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. 

    బ్రెవర్డ్‌ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్‌-95 జాతీయరహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కారు రోడ్డు మీద ‍ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

     

  • మొరాకోలోని  రెండు భవనాలు కూలిపోవడంతో కనీసం 22 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు.  అత్యంత పురాతనమైన ఫెజ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల నివాస భవనాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భవనాల్లో ఎనిమిది కుటుంబాలు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

    గాయపడినవారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రక్షణ ఆపరేషన్ కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా నివారణ సమీపంలోని భవనాల నివాసితులను ఖాళీ చేయించారు. ఈశాన్య 

    మొరాకోలోని ఫెజ్, ఉత్తర ఆఫ్రికా దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. 8వ శతాబ్దం నాటి మాజీ సామ్రాజ్య రాజధాని అయిన ఫెజ్‌లో ఈ విషాదం జరిగింది. అల్-ముస్తాక్బాల్ ప్రాంతంలోని ఈ భవనాలలో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనాలు చాలా కాలంగా సరిగా పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.

    మే నెలలో ఫెజ్‌లోని వేరే ప్రాంతంలో ఒక శిథిలావస్థకు చేరుకున్న భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.  అంతకుముందు ఫిబ్రవరి 2024లో భారీ వర్షాలు,  బలమైన గాలుల కారణంగా పాత నగరంలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు.

    ఇటీవలి సంవత్సరాలలో, మొరాకోలో ఇలాంటి భవనాలు కూలిపోయిన అనేక సంఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 8, 2023న అట్లాస్ పర్వత ప్రాంతంలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత అనేక నిర్మాణాలు బలహీనపడ్డాయని కొందరు అధికారులు చెబుతున్నారు.



     

  • బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఎస్తెటిషియన్, కాలిఫోర్నియాకు చెందిన సెలబ్రిటీ ఫేషియలిస్ట్,  సోనియా డకార్‌కు భారీ  ఎదురు దెబ్బ తగిలింది. 2021, ఏప్రిల్‌లో  సోనియాకు చెందిన  బెవర్లీ హిల్స్ స్టూడియోలో జరిగిన కెమికల్ పీల్ ట్రీట్‌మెంట్ వల్ల తన ముఖం శాశ్వతంగా పాడైపోయిందని  ఆరోపిస్తూ  ఒక మహిళ దావా వేసింది.

    మొటిమలనివారణ కోసం చికిత్స సమయంలో సోనియా తన ముఖంపై తెలియని పదార్థాన్ని పూయడంతో తనకు తీవ్రమైన గాయాలు, దాని వలన వచ్చాయని  బాధితురాలు విక్టోరియా నెల్సన్ పేర్కొంది. మోసం, చట్టవిరుద్ధమైన వ్యాపార పద్ధతులు , లైసెన్స్ లేని వైద్య వృత్తి ద్వారా తనకు జరిగిన నష్టానికి గాను రూ.  31.48 లక్షలకు మించి  నష్టపరిహారం  చెల్లించాలని పేర్కొంది. తనతోపాటు యువతులు నమ్మిన పరిశ్రమలో  మరింత పారదర్శకత తీసుకురావాలనేదే తన దావా లక్ష్యమని ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించింది.

     నవంబర్ 18న, అటార్నీ జనరల్ కార్యాలయం సోనియా డకార్‌పై ఫిర్యాదు చేసింది, ఆమె ఎస్టాబ్లిష్‌మెంట్ ,ఎస్తెటిషియన్స్ లైసెన్స్ రెండింటినీ శాశ్వతంగా రద్దు చేయాలని కూడా  విక్టోరియా డిమాండ్‌ చేసింది. తన తరపున నా లీగల్ టీమ్ కూడా సోనియాపై సివిల్ దావా వేసిందని తెలిపింది. విక్టోరియా గతంలో తన సోషల్ మీడియాలో ఎస్తెటిషియన్ క్లయింట్‌గా తన అనుభవాన్ని పంచుకుంది.తాను 2019 నుండి సోన్యా క్లయింట్‌గా ఉన్నానని ,  గతంలో పీల్‌తో సానుకూలప్రభావం ఉండటంతో,  ఇది మరొక చికిత్స కోసం  వారిని విశ్వసించేలా చేసింది. అయితే కెమికల్ పీల్ సమయంలో,  ముఖంపై తీవ్రమైన మంట, దురద వచ్చాయని తెలిపింది.  అయితే ద్రావణాన్ని కడిగిన తర్వాత, విక్టోరియా తనకు తీవ్రమైన కాలిన గాయాలు అయినట్లు గుర్తించింది. నెల రోజుల పాటు చికిత్స తీసుకుంటే చికిత్సలో గాయాలు నయమవుతాయని సోనియా ఆమెకు హామీ ఇచ్చిందని కూడా తెలిపింది. అయితే, 2021లో 18 సెషన్‌లు, 2022లో 12 సెషన్స్‌ కోసం దాదాపు  60 వేల డాలర్లు  ఖర్చు చేసింది. అయినా ముఖంపై ఇంకా కాలిన గాయాలు పోలేదని చెప్పింది. 2023 నుంచి సోనియా మాట్లాడటంమానేసింది. ఆమె చేస్తున్న మైక్రోనీడ్లింగ్ చికిత్సలు కూడా ఆ లైసెన్స్ పరిధిలోకి  రావని తనచు సమాచార అందిందని చెప్పుకొచ్చింది. అందుకే తనకు నష్టపరిహారం కావాలని డిమాండ్‌ చేస్తోంది. 

    ఇదీ చదవండి: ప్రెస్‌ సెక్రటరీ సౌందర్యంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

    మరోవైపు బోర్బరింగ్ అండ్ కాస్మోటాలజీ బోర్డు ప్రకారం, సౌందర్య నిపుణులకు మెడికల్-గ్రేడ్ ఉత్పత్తులను ఉపయోగించడానికి లేదా మైక్రోనీడ్లింగ్ వంటి విధానాలను నిర్వహించడానికి లైసెన్స్ లేదు. సంబంధిత నిబంధనలలో వివరించిన విధంగా వారి అభ్యాస పరిధిని అర్థం చేసుకోవడం లైసెన్స్‌ దారుడి బాధ్యత అని బోర్డు  స్పష్టం చేసింది. 

    కాగా కాలిఫోర్నియాకు చెందిన బెవర్లీ హిల్స్‌లోని ఫేషియలిస్ట్ సెలబ్రిటీ క్లయింట్లలో ప్రియాంక చోప్రా, మడోన్నా, గ్వినేత్ పాల్ట్రో, సోఫియా వెర్గారా, కిమ్ కర్దాషియాన్, మేగాన్ ఫాక్స్, డ్రూ బారీమోర్, కామెరాన్ డియాజ్ ఉన్నారు.

    ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్‌ గోయెంకా నో డిలే, నో డైవర్షన్‌ వైరల్‌ వీడియో

  • అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరోసారి  తన నోటికి పని చెప్పారు.పెన్సిల్వేనియాలో జ‌రిగిన  ఒక ర్యాలీలో ప్ర‌సంగిస్తూ,  అకస్మాత్తుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అందాన్ని పొగడటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సూప‌ర్‌స్టార్ కరోలిన్ కూడా ఈ మీటింగ్‌కు వ‌చ్చింద‌ంటూ  ఆమె వ్యక్తిగత సౌందర్యాన్ని, అందాన్ని ఆకాశానికెత్తేశారు. తన పరిపాలన ఆర్థిక విజయాలపై ప్రసంగాన్ని పక్కన పెట్టి  మరీ  అందమైన ముఖం, గన్నులాంటి పెదవులు చీప్‌ కామెంట్స్‌  చేయడం విస్తుగొల్పింది.

    79 ఏళ్ల ట్రంప్  తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నదైన 28 ఏళ్ల క‌రోలిన్  శారీరక సౌందర్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆమె పెద‌వుల్ని ఏకంగా మెషీన్‌గ‌న్‌తో పోల్చేశారు. ఆమె గొప్పది కాదా? కరోలిన్ గొప్పదా?" అని ఆయన  ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను అడిగారు. 28 ఏళ్ల ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.  తెలుసా, ఆమె టెలివిజన్‌లో, ఫాక్స్ వంటి టీవీ స్క్రీన్ పై  ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనీ,  చిన్న మెషీన్‌గన్‌లాంటి పెదవులు, అందంతో కట్టి పడేస్తుందన్నారు.  ఈ సందర్భంగా ట్రంప్ వింతైన  శబ్దాలను చేయడం సభికులను ఆశ్చర్యపరిచింది. క‌రోలిన్ నిర్భ‌యంగా వాదిస్తుంద‌ని, ఎందుకంటే మ‌న విధానాల‌ను ఆమె సూటిగా చెప్పేస్తుంద‌న్నారు. ఆగ‌స్టులో న్యూస్‌మ్యాక్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా క‌రోలిన్ బ్యూటీపై  దాదాపు ఇలాంటి కమెంట్స్‌ చేశారు.

    కాగా డొనాల్డ్‌ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నసమయంగా అసిస్టెంట్ ప్రెస్ సెక్ర‌ట‌రీగా 2019 నుంచి 2021 వ‌ర‌కు లివియ‌ట్ ప‌నిచేశారు. న్యూహ్యాంప్‌షైర్‌కు చెందిన ఆమె రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్ నికోల‌స్ రిక్కోను( 60) ను పెళ్లాడింది. ఎన్నిక‌ల్లో ఓడిన ఆమె మ‌ళ్లీ జ‌న‌వ‌రిలో వైట్‌హౌజ్‌లో ప్రెస్ కార్య‌ద‌ర్శిగా చేరింది.చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె. ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఐదో వ్యక్తి, రెండోసారి అధ్యక్ష పదవిని  చేపట్టాక తొలి  వ్యక్తి ఆమె.

    ట్రంపు.. కంపు..
    మరోవైపు ఆమె నైపుణ్యం, శక్తి సామర్థ్యాలపై కాకుండా, కేవలం అందంపై, ముఖ్యంగా పెదవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు నెటిజన్లు. మహిళలపై ఇలాంటి సెక్సిస్ట్‌ కామెంట్లు చేయడం ట్రంప్‌నకు కొత్తేమీ కాదనీ, తన కంపు నోరును మరోసారి బయటపెట్టుకున్నాడని మండిపడుతున్నారు.

  • లాహోర్‌: పాకిస్తాన్‌లోని ఓ సెషన్స్‌ కోర్టు జడ్జి ఛాంబర్‌ నుంచి రెండు యాపిల్స్‌తో పాటు ఒక హాండ్‌వాష్‌ బాటిల్‌ చోరీకి గురైన ఘటనపై కేసు నమోదైంది. దీనిపై పాకిస్తానీ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 380 కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే, దొంగకు కనీసంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు పడే అవకాశా లున్నాయి. 

    ఈ నెల 5వ తేదీన జరిగిన చోరీపై అదనపు సెషన్స్‌ జడ్జి నూర్‌ ముహ మ్మద్‌ బసాŠమ్ల్‌ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిబ్బంది తెలిపారు. దొంగ ఎత్తుకుపోయిన రెండు యాపిల్స్, హ్యాండ్‌ వాష్‌ బాటిల్‌ మొత్తం విలువ వెయ్యి పాకిస్తానీ రూపాయలుగా పేర్కొంటూ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని లాహోర్‌ నగర పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్‌ చరిత్రలో అతిపెద్ద చోరీ కేసుగా పేర్కొంటూ దీనిపై హక్కుల కార్యకర్తలు జోకులు పేలుస్తున్నారు.  

  • దెయ్యపు వెలుగులు? 
    ఎర్రని ఎరుపు రంగుతో వింతగా మెరిసిపోయే వెలుతురు స్తంభాలు. రకరకాల ఆకృతుల్లో చూపరులకు కనువిందు చేసే తీరు వర్ణించనలవి కాదు. ఇంతా చేసి విను వీధిలో అవి కనువిందు చేసేది రెప్పపాటు కన్నా కూడా తక్కువసేపు మాత్రమే. అలా ఇటీవల ఆకాశంలో కనిపించిన ఈ వింత వెలుగులను అమెరికాకు చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్‌ ఒకరు కెమెరాలో బంధించి ఇదుగో, ఇలా అందరి కంటికీ విందు చేశారు...!

    స్ప్రైట్స్‌ స్ప్రైట్స్‌...! 
    ఈ అందాల వెలుగులను సైంటిస్టులు స్ప్రైట్స్‌ గా పిలుస్తారు. కనిపించేది ఒక క్షణంలో కొద్దిసేపు పాటే అయినా, ఆకాశంలో అల్లంత ఎత్తు నుంచి అమాంతం రాలిపడుతూ విస్మయపరచడం వీటి ప్రత్యేకత. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగాత్మకంగా చేపట్టిన స్ప్రైటాక్యులర్‌ సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టులో భాగస్వామి అయిన నికోలస్‌ ఎస్క్యూరాట్‌ అనే సామాన్య పౌరుడు ఈ స్ప్రైట్స్‌ ను తన సాధారణ కెమెరాలో బంధించడం విశేషం. వాటిని నాసా తన ఎక్స్‌ అకౌంట్‌ లో తాజాగా షేర్‌ చేసింది.  

    అతీత శక్తుల పనా? 
    ఈ వింత వెలుగులను అతీత శక్తులే సృష్టిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. అసలు ఆ వెలుగులు స్వయానా దెయ్యాలేనని విశ్వసించేవారికి కూడా కొదవ లేదు. అయితే అదంతా కేవలం అభూత కల్పన మాత్రమేనని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ‘కుండపోత వర్షాల వేళ ఆకాశంలో కమ్ముకునే కరి మబ్బుల మీదుగా ఈ వెలుగులు పుట్టుకొస్తుంటాయి. అయితే ఇవి మన కంటికి కనిపించడమన్నది నిజానికి చాలా అరుదు. ఎందుకంటే ఉరుములు, మెరుపులమయంగా ఆ మబ్బులు సృష్టించే విలయమే ఆ వెలుగులను చాలాసార్లు కప్పేస్తూ ఉంటుంది. వీటిని స్పష్టంగా పట్టిస్తూ ఫొటోలు రావడం, అందులోనూ అవి తీసింది ఒక ఔత్సాహికుడు కావడం ఈ కారణం చేతనే చాలా విశేషమైనది‘ అని నాసా పేర్కొంది.

    90 కి.మి. ఎత్తున... 
    ఈ స్ప్రైట్స్‌ మామూలు ఉరుములు, మెరుపుల మాదిరిగా తక్కువ ఎత్తులో ఏర్పడే బాపతు కావు. భూ ఉపరితలానికి ఏకంగా 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో మెసోస్పియర్‌ లో పలుచని గాలి గుండా పుట్టుకొస్తాయి. దిగువన మేఘ మండలంలో పుట్టుకొచ్చే ఉరుములు, మెరుపుల వాతావరణం కారణంగా వీటి ఉత్పత్తి జరుగుతుంది. దిగంతాలను ధిక్కరిస్తూ అంతరిక్షంలో సుదూరాల దాకా విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కదలబారుస్తాయి. దాంతో మెసోస్పియర్‌ లో విద్యుదావేశం భారీ పరిమాణంలో ఒక్కపాటున వచ్చిపడుతుంది. ఆ ఫలితమే ఈ స్ప్రైట్స్‌.

    1989లో తొలిసారిగా... 
    ఈ స్ప్రైట్స్‌ ’ట్రాన్సియెంట్‌ ల్యూమినస్‌ ఈవెంట్స్‌’ తరహాకు చెందినవి. ఎగువ ఆకాశంలో ఈ తరహా వెలుగులను గురించి విమాన పైలట్లు దశాబ్దాలుగా రిపోర్ట్‌ చేస్తూనే వచ్చారు. అయితే వీటి తాలూకు కాస్తో కూస్తో స్పష్టమైన ఫోటో 1989లో తొలిసారిగా కెమెరాకు చిక్కింది. తాజాగా గత జూలై 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి నికోలస్‌ అయెర్స్‌ శక్తిమంతమైన కెమెరాల బంధించిన రాకాసి స్ప్రైట్స్‌ తాలూకు అపరిమితమైన వెలుగులు అందరినీ విస్మయపరిచాయి. అంతకుముందు 2022లో ఇద్దరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు టిబెట్‌ పీఠభూమి ఎగువన ఒకేసారి ఏకంగా 105 స్ప్రైట్స్‌ వెలుగులను కెమెరాల్లో బంధించారు. దక్షిణాసియా ప్రాంతం మీదుగా ఒకే విడతలో అత్యంత ఎక్కువ సంఖ్యలో పుట్టుకొచి్చన స్ప్రైట్స్‌ గా ఇవి నెలకొలి్పన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది!  

Sports

  • ఐసీసీ తాజాగా (డిసెంబర్‌ 10) విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్‌ రెండో టెస్ట్‌ (పింక్‌ బాల్‌) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్‌లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

    ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్‌ తాత్కాలిక సారధి స్టీవ్‌ స్మిత్‌ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్‌-10లో ఉండిన ఆసీస్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ట్రవిస్‌ హెడ్‌, హ్యారీ బ్రూక్‌ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.

    తాజాగా విండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన కేన్‌ విలియమ్సన్‌ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్‌ల్లో ఫాబ్‌-4గా పిలువబడే వారిలో విరాట్‌ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్‌-3లో (రూట్‌, కేన్‌, స్టీవ్‌) ఉన్నారు. విరాట్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ర్యాంకింగ్స్‌లో అతని పేరే లేదు.

    ఈ వారం బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్‌ రవీంద్ర, టామ్‌ లాథమ్‌, జాక్‌ క్రాలే, షాయ్‌ హోప్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ఉన్నారు. విండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో రచిన్‌, లాథమ్‌ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీతో చెలరేగిన హోప్‌, గ్రీవ్స్‌ 48, 60 స్థానాలకు ఎగబాకారు.

    ఇంగ్లండ్‌తో రెండో యాషెస్‌ టెస్ట్‌లో బ్యాట్‌తోనూ రాణించిన మిచెల్‌ స్టార్క్‌ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన జాక్‌ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.

    బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో స్టార్క్‌తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్‌ రోచ్‌ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్‌ కార్స్‌ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్‌ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్‌-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్‌ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్‌, జడేజా, కుల్దీప్‌ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.

    ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, జన్సెన్‌, స్టోక్స్‌ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల​్‌య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. 

  • క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్‌ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్‌ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా వదిలేశాడు.

    విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్‌ తరఫున టీమ్‌, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకుంది. క్రికెట్‌ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో జరిగింది.

    ఈ లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 9) డెజర్ట్‌ వైపర్స్‌-ఎంఐ ఎమిరేట్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్‌ హోల్డన్‌ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. 

    ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ నికోలస్‌ పూరన్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా హోల్డన్‌ను ఔట్‌ చేయలేదు. బంతిని కనెక్ట్‌ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్‌ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్‌.

    అయితే పూరన్‌ ప్లాన్‌ను పసిగట్టిన వైపర్స్‌  కెప్టెన్‌ ఫెర్గూసన్‌ హోల్డన్‌ను రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో జరిగింది. అప్పటికి వైపర్స్‌ స్కోర్‌ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్‌ క్రీజ్‌ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్‌ స్కోర్‌ అంతిమంగా 159 పరుగులకు చేరింది.

    ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్‌ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్‌లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

    చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్‌ డైరెక్ట్‌ త్రోతో ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

  • జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ టీ20 క్రికెట్‌ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్‌లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్‌ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్‌ టీవీతో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.

    ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బిగ్‌ టీవీ టీమ్‌.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్‌ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

    సాక్షి టీమ్‌కు చెందిన సతీష్‌ 48 పరుగులు చేయగా.. రమేష్‌ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.

    బుధవారం జరిగిన సెమీస్‌లో సాక్షి టీమ్‌ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే విజయం​ సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్‌, రమేష్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి తలో 2 వికెట్లు తీశారు.

    అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్‌ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్‌ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్‌లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్‌ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది.

     

  • క్రికెట్‌ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్‌లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్‌ (స్టీవ్‌-మార్క్‌). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్‌లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.

    పురుషుల క్రికెట్‌లో మరో ట్విన్స్‌ జోడీ జేమ్స్‌ మరియు హేమిష్‌ మార్షల్‌. వీర్దిదరు న్యూజిలాండ్‌ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్‌, వన్డే క్రికెట్‌ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.

    ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్‌ బ్రదర్స్‌ (క్రెయిగ్‌-జేమీ). జేమీ మరియు క్రెయిగ్‌ ఓవర్టన్‌ కలిసి ఇంగ్లండ్‌ తరఫున టెస్ట్‌, వన్డే క్రికెట్‌ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్‌ సోదరులలాగే ఒకే స్టయిల్‌ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్‌ ఇద్దరూ ఫాస్ట్‌ బౌలింగ్‌ చేయడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. 

    పురుషుల క్రికెట్‌ తొలినాళ్లలో మరో ట్విన్స్‌ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్‌, ఎరిక్‌ బెడ్సర్‌. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్‌లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్‌ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.

    మహిళల క్రికెట్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ మరియు కేట్‌ బ్లాక్‌వెల్‌ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్‌ ఆసీస్‌ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది.

    మహిళల క్రికెట్‌లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్‌ కాదు. ట్రిప్లెట్స్‌ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్‌, ఎస్సీ షెవిల్‌ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.

    ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్‌ కుమారులు కావడం మరో విశేషం​.

    బ్లిగ్నాట్‌ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్‌-కియాన్‌ బ్లిగ్నాట్‌ జోడీ. ఈ ఇ‍ద్దరు త్వరలో జరుగబోయే అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.

    వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్‌ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.

     

  • జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్‌ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్‌-గ్రాంట్‌ ఫ్లవర్‌, గై విటల్‌-ఆండీ విటల్‌, గావిన్‌ రెన్నీ-జాన్‌ రెన్నీ, పాల్‌ స్ట్రాంగ్‌-బ్రియాన్‌ స్ట్రాంగ్‌ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్‌ ఉన్నతికి దోహదపడ్డాయి.

    తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్‌ గతంలో జింబాబ్వే సీనియర్‌ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్‌ కొడుకులు కావడం విశేషం. 

    బ్లిగ్నాట్‌ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్‌-కియాన్‌ బ్లిగ్నాట్‌ జోడీ త్వరలో జరుగబోయే అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.

    వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్‌ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.

    కాగా, అండర్‌ 19 ప్రపంచకప్‌ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.

    ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్‌ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్‌-కియాన్‌ బ్లిగ్నాట్‌ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.

    జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు  
    సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే  
     

  • ఒకప్పుడు ప్రేమ.. పెళ్లి.. అత్యంత వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు సెలబ్రిటీలు మొదలు సాధారణ వ్యక్తులూ తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఈ రెండు విషయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ఫాలోవర్లు, అభిమానులను కూడా తమ సంతోషంలో భాగం చేయాలనే ఉద్దేశంతో కొందరు.. హోదాను, రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ను చాటి చెప్పుకొనేందుకు మరి కొంతమంది ఇలాంటి పోకడలకు పోతున్నారు.

    అయితే, నెట్టింట ఇందుకు సానుకూల కామెంట్ల కంటే.. ప్రతికూల, చెత్త కామెంట్లే ఎక్కువసార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై శ్రుతిమించిన స్థాయిలో ట్రోల్స్‌ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ పెళ్లి వాయిదా- ఆపై రద్దు నేపథ్యంలో సోషల్‌ మీడియాలో జరిగిన రచ్చ ఇందుకు నిదర్శనం.

    కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ..
    ఆరేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హల్ది, సంగీత్‌, మెహందీ అంటూ స్మృతి- పలాష్‌ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. సహచర ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ తదితరులు కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ, అతడితో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి.

    ‘ప్రైవేటు సంభాషణ’ బహిర్గతం
    అయితే, అనూహ్య రీతిలో స్మృతి- పలాష్‌ పెళ్లి వాయిదా పడింది.  వివాహ తంతుకు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆ వెంటనే పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ పరిణామాలు సందేహాలకు తావిచ్చాయి. ఇందుకు తోడు ఓ అమ్మాయి పలాష్‌ తనతో చాట్‌ చేశాడంటూ ‘ప్రైవేటు సంభాషణ’ను బహిర్గతం చేసింది.

    ఇంకేముంది.. సోషల్‌ మీడియాలో చిన్నగా అంటుకున్న ఈ ‘మంట’ దావానంలా వ్యాపించింది. మెజారిటీ మంది పలాష్‌ను తప్పుపడితే.. మరికొంత మంది స్మృతిని కూడా ట్రోల్‌ చేశారు. ఆరేళ్ల ప్రేమలో అతడి గురించి ఏమీ తెలియలేదా?.. పెళ్లికి ముందు రోజు రాత్రే.. ‘అఫైర్‌’ ఉందని తెలిసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

    పలాష్‌ అక్కపైనా ట్రోలింగ్‌
    మరోవైపు.. పలాష్‌పై తీవ్ర స్థాయిలో నెగటివ్‌ కామెంట్లు వచ్చాయి. దెబ్బకు అతడు బృందావనంలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సేదదీరాడు. ఈ విషయంలో కాబోయే వధూవరులతో పాటు ట్రోలింగ్‌కు గురైన మరో వ్యక్తి పాలక్‌ ముచ్చల్‌. పలాష్‌ అక్క, బాలీవుడ్‌ సింగర్‌గా ప్రాచుర్యం పొందిన పాలక్‌ సమాజ సేవలోనూ ముందే ఉంటుంది.

    ఎంతో మంది చిన్నారులకు తన ఎన్‌జీవో ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచింది పాలక్‌. అయితే, పలాష్‌ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ పాలక్‌ను కూడా కొంత మంది విపరీతపు వ్యాఖ్యలతో ట్రోల్‌ చేశారు. 

    డబ్బు, అందం ఉందన్న కారణంగానే స్మృతి వెంటపడమని సలహా ఇచ్చిందని.. అసలు విషయం బయటపడేసరికి ఆస్పత్రి పాలయ్యాడంటూ తమ్ముడికి సానుభూతి వచ్చేలా చేయాలని చూసిందని ఇష్టారీతిన ఆమెను నిందించారు.

    గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి
    నిజానికి ప్రేమ- పెళ్లి.. స్మృతి- పలాష్‌లకు సంబంధించినది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా అతిగా జోక్యం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. నిజానికి స్మృతి మీద ఉన్న అభిమానం.. అనేకంటే దురభిమానమే పాలక్‌ మీద కామెంట్ల దాడికి కారణమైందని చెప్పవచ్చు. 

    మరోవైపు.. పలాష్‌కు మద్దతు పలికేవాళ్లు స్మృతిని తక్కువ చేసేలా మాట్లాడటం తెలిసిందే. ఆఖరికి తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇరువురూ  స్పందించి.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసేదాకా వచ్చింది.

    తప్పు ఎటువైపు ఉన్నా.. బాధితులు వారే
    మొత్తం మీద తప్పు ఎటువైపు ఉందో తెలియకపోయినా.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ బారిన పడేది అమ్మాయిలే అన్నది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. నైతిక విలువలకు పాతరేసి మహిళలను కించపరిచే ఈ ‘సంస్కృతి’ని నీచమైనదిగా అభివర్ణించవచ్చు. ఇలాంటి ట్రోల్స్‌ వేసే వాళ్లలో చాలామందికి తమ వ్యక్తిగత జీవితంపై ఓ అవగాహనా, స్పష్టత ఉండదు.

    స్మృతి, సమంత, శోభిత
    అయినప్పటికీ పక్కవాళ్ల జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా దిగజారుడుగా వ్యవహరిస్తారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్‌ సమంతపై కూడా కొంతమంది నీచంగా కామెంట్లు చేశారు. ఆమె పాత జీవితాన్ని తెర మీదకు తెస్తూ మోసగత్తెగా అభివర్ణిస్తూ రాక్షసానందం పొందారు.

    అంతేకాదు.. సమంత మాజీ భర్త నాగ చైతన్యపై కూడా విడాకుల సమయంలో.. అతడి రెండో పెళ్లి విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ చైతూ భార్య శోభిత ధూళిపాళ వాళ్లకు ప్రధాన టార్గెట్‌గా మారింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇటు శోభిత.. అటు సమంత.. ఇలా ఇద్దరు మహిళలు బాధితులుగా మారారు. 

    మరోవైపు.. సెలబ్రిటీలను ఫాలో చేస్తూ వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసే పాపరాజీలపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    తన ప్రేయసి, మోడల్‌ మహీక శర్మను తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారని.. కాస్తైన బుద్ధి ఉండాలంటూ పాపరాజీలకు పాండ్యా చురకలు అంటించాడు. కాగా హార్దిక్‌ పాండ్యాతో డేటింగ్‌ మొదలుపెట్టిన నాటి నుంచి మహీకపై నెట్టింట ట్రోల్స్‌ వస్తున్న విషయం తెలిసిందే. 

    మహీక, ధనశ్రీ, నటాషా
    మరోవైపు.. హార్దిక్‌ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ను సైతం అతడి దురభిమానులు వదిలిపెట్టలేదు. డబ్బు కోసమే ప్రేమ నటించి, పిల్లాడిని కని భారీ స్థాయిలో భరణం గుంజాలనే స్కెచ్‌ వేసిందని ఆమెపై నిందలు వేశారు.

    ఇక టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మాజీ భార్య, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మపై కూడా ‘గోల్డ్‌ డిగ్గర్‌’ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే స్త్రీ అనే అర్థంలో) అంటూ నీచస్థాయిలో ట్రోల్‌ చేశారు. 

    ఇతరులతో పోల్చుకోవడం, ఈర్ష్య, అసూయ.. ముఖ్యంగా తరతరాలుగా మెదళ్లలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే మహిళల పట్ల సోషల్‌ మీడియాలో వికృత వాంతి రూపంలో బయటకు వస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కొంతమంది మహిళలు సైతం ఇలాంటి ట్రోల్స్‌కు మద్దతు పలకడం విషాదకరం.

    చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్‌.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?

  • టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 33వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

    హార్దిక్‌కు ముందు రోహిత్‌ శర్మ (205), సూర్యకుమార్‌ యాదవ్‌ (155), విరాట్‌ కోహ్లి (124) భారత్‌ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్‌ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్‌ సెంచరీ చేయలేదు.

    హార్దిక్‌ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్‌) కటక్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ (175/6) చేయగలిగింది.

    అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్‌ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 

    భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్‌ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్‌ పాండ్యాకే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

    ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్‌ 11న ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది. 

  • ఐసీసీ తాజాగా (డిసెంబర్‌ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్‌ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు. 

    గత వారం ర్యాంకింగ్స్‌లో విరాట్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్‌లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

    రోహిత్‌కు విరాట్‌కు మధ్య కేవలం 7 రేటింగ్‌ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్‌ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 773 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్‌-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.

    సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించిన తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్‌కు చేరుకోగా.. అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు. 

    ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.

    బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్‌ ఖాన్‌, ఆర్చర్‌ టాప్‌-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్‌ మినహా టాప్‌-10లో ఒక్క భారత బౌలర్‌ కూడా లేడు. 

    రవీంద్ర జడేజా 16, సిరాజ్‌ 21, షమీ 23, అక్షర్‌ పటేల్‌ 33, వాషింగ్టన్‌ సుందర్‌ 81, హార్దిక్‌ పాండ్యా 95, వరుణ్‌ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్‌ సింగ్‌ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్‌ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు. 

    ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్‌, సికందర్‌ రజా, నబీ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు.

     

  • టీమిండియా మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్‌ లీగ్‌ 2026 సీజన్‌ కోసం పురుషుల లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి బ్యాటింగ్‌ కోచ్‌ మరియు మెంటర్‌గా ఎంపికయ్యాడు. హండ్రెడ్‌ లీగ్‌లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్‌గా) ఇదే మొదటిసారి.

    డీకే 2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్‌ఫోలియోతో లండన్‌ స్పిరిట్‌తోనూ జతకట్టాడు.

    లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్  మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్‌ స్పెషలిస్ట్‌ లండన్‌ స్పిరిట్‌లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు.  

    లండన్‌ స్పిరిట్‌తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్‌లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్‌లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్‌తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు.  

    40 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే ఐపీఎల్‌లో ప్రారంభ సీజన్‌ (2008) నుంచి 2024 ఎడిషన్‌ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్‌లు ఆడాడు.

     

  • భారత క్రికెట్‌లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్‌ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.

    ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్‌-19 క్రికెట్‌ కోచ్‌ వెంకటరామన్‌ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.

    హత్యాయత్నం కింద నిందితులపై కేసు
    ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.

    విరిగిన భుజం, ఇరవై కుట్లు
    క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి వెంకటరామన్‌ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్‌, అర్వింద్‌రాజ్‌, సంతోష్‌ కుమారన్‌గా గుర్తించినట్లు తెలిపారు.

    అత్యంత హింసాత్మకంగా
    ప్రస్తుతం అసోసియేషన్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్‌ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.

    కాగా ఈ ఘటనపై క్రికెట్‌ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్‌పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్‌ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్‌ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్‌లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

    స్కామ్‌ చేశారా?
    అయితే, సెలక్షన్‌ విషయంలో పుదుచ్చేరి క్రికెట్‌ అసోసియేషన్‌ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్‌ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్‌ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.

    చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

  • ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ 2025 ఎడిషన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్‌ వైపర్స్‌తో  జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్‌లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్‌ బౌలర్‌ డేవిడ్‌ పేన్‌ 19వ ఓవర్‌లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. 

    చివరి ఓవర్‌లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.

    19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. వైపర్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ హోల్డన్‌ (42 రిటైర్డ్‌ ఔట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఫకర్‌ జమాన్‌ (35) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2, ఫజల్‌ హక్‌ ఫారూఖీ ఓ వికెట్‌ తీశారు.

    ఎంఐ ఇన్నింగ్స్‌లో టామ్‌ బాంటన్‌ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. పూరన్‌ (31), ముహమ్మద్‌ వసీం (24), పోలార్డ్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్‌ బౌలర్లలో పేన్‌ 4, తన్వీర్‌ 2, ఫెర్గూసన్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ తీశారు.

  • వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న బౌలర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ దారుణంగా గాయపడ్డాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

    కివీస్‌ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌ (NZ vs WI)తో ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచిన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అనంతరం క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా తొలి టెస్టులో కివీస్‌ విజయం సాధించే దిశగా పయనించగా.. అద్భుత పోరాటంతో విండీస్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

    205 పరుగులకే ఆలౌట్‌
    ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య వెల్లింగ్‌టన్‌ వేదికగా బుధవారం రెండో టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. విండీస్‌ బ్యాటింగ్‌కు దిగింది. కివీస్‌ బౌలర్ల ధాటికి తాళలేక 75 ఓవర్లు ఆడి కేవలం 205 పరుగులకే ఆలౌట్‌ అయింది.

    నాలుగు వికెట్లతో చెలరేగిన టిక్నర్‌ 
    విండీస్‌ ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (44), బ్రాండన్‌ కింగ్‌ (33) ఓ మోస్తరుగా రాణించగా.. షాయీ హోప్‌ (48) కూడా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు. ఇక కివీస్‌ బౌలర్లలో పేసర్లు బ్లెయిర్‌ టిక్నర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మైకేల్‌ రే మూడు వికెట్లు పడగొట్టాడు.

    మరోవైపు.. జేకబ్‌ డఫీ ఒక వికెట్‌ తీయగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ (Glenn Phillips) సైతం ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్‌ టెయిలెండర్‌ ఆండర్సన్‌ ఫిలిప్‌ (5) రనౌట్‌ రూపంలో కివీస్‌కు ఓ వికెట్‌ దక్కింది. ​

    నొప్పితో విలవిల్లాడుతూ
    ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో మైకేల్‌ రే బంతితో రంగంలోకి దిగగా.. ట్రవిన్‌ ఇమ్లాచ్‌ ఫైన్‌ లెగ్‌ దిశగా బాల్‌ను గాల్లోకి లేపాడు. ఇంతలో ఫీల్డర్‌ టిక్నర్‌ బంతిని ఆపే క్రమంలో పల్టీ కొట్టాడు. ఈ క్రమంలో తన ఎడమ భుజం (Shoulder Injury)పై భారం మొత్తం పడగా.. నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో పడుకుండిపోయాడు.

    ఏడ్చేసిన బౌలర్‌!
    దీంతో కివీస్‌ శిబిరంలో ఆందోళన చెలరేగగా.. టిక్నర్‌ పరిస్థితి చూసి బౌలర్‌ మైకేల్‌ దాదాపుగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంతలో ఫిజియో వచ్చి టిక్నర్‌ను మైదానం వెలుపలికి తీసుకువెళ్లగా.. అటు నుంచి అటే ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో టిక్నర్‌ ఎడమ భుజం విరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు.. బుధవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 9 ఓవర్లలో కివీస్‌ 24 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 7, డెవాన్‌ కాన్వే 16 పరుగులతో క్రీజులో నిలిచారు. విండీస్‌ కంటే కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్‌గా తొలిరోజు ఆతిథ్య న్యూజిలాండ్‌దే పైచేయి కాగా.. టిక్నర్‌ గాయం ఆందోళనకరంగా పరిణమించింది. 

    చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్‌.. నమ్మశక్యంగా లేదు

National

  • దేశంలో అత్యున్న‌త ప్ర‌భుత్వ‌ స‌ర్వీసు అయిన సివిల్స్ ప‌ట్ల యువ‌త మొగ్గుచూపుతోంది. ఏటా ల‌క్ష‌లాది మంది యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్షలు రాసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. భ‌ద్ర‌మైన ఉద్యోగం, మంచి హోదా, స‌మాజంలో గౌర‌వం, ప్ర‌భుత్వ విధానాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క భాగ‌స్వామ్యం.. వంటి అంశాలు యువ‌త‌ను ఈవైపుకు న‌డిపిస్తున్నాయి. ఫ‌లితంగా సివిల్స్ రాస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. నాణేనికి మ‌రోవైపు చూస్తే.. సివిల్స్ వైపు వ‌చ్చే ఐఏఎస్‌ల‌ పిల్ల‌ల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 2018లో లోక్‌సభలో ప్రసంగిస్తూ.. ఆసక్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. ఐఏఎస్ అధికారుల వార‌సుల్లో చాలా మంది సివిల్ సర్వీసుల్లో చేరడానికి ఆసక్తి చూప‌డం లేద‌ని, వారు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు మొగ్గు చూపుతున్నార‌ని తెలిపారు. ఐఏఎస్ అధికారులే త‌న‌తో స్వ‌యంగా ఈ విష‌యం చెప్పిన‌ట్టు పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థుతుల‌ను బ‌ట్టి చూస్తే ట్రెండ్ అలాగే ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. ఈ మార్పును ట్రాక్ చేసే అధికారిక డేటా ఏదీ లేనప్పటికీ.. సోష‌ల్ మీడియాలో వివిధ ర‌కాలుగా అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అంచ‌నాకు రావొచ్చు.

    భిన్న‌మైన జీవ‌న‌శైలి
    ఐఏఎస్ సాధించ‌డం అనేది ఆశావ‌హుల‌కు జీవితకాల స్వ‌ప్నం. సివిల్స్‌లో పాస్ కావ‌డానికి సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ప్ర‌యత్నిస్తుంటారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకుని త‌మ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు శ్ర‌మిస్తుంటారు. కానీ ఐఏఎస్ అధికారుల పిల్ల‌లు దృక్పథం మ‌రోలా ఉంటుంది. ఎందుకంటే త‌మ త‌ల్లిదండ్రులు అప్ప‌టికే  ఐఏఎస్ అధికారులు (IAS Officials) కాబ‌ట్టి వారికి ఆ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఐఏఎస్ అధికారులు ఎలా ప‌నిచేస్తార‌నే దానిపై అవగాహ‌న ఉంటుంది. దీంతో అలాంటి ఉద్యోగం త‌మ‌కు స‌రిప‌డుతుందో, లేదోన‌న్నఅంచ‌నాకు వ‌చ్చేస్తారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే.. త‌మ త‌ల్లిదండ్రుల కంటే భిన్న‌మైన జీవ‌న‌శైలిని బ్యూరోక్రాట్ పిల్ల‌ల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నట్టుగా క‌న‌బ‌డుతోంది.  

    అమెరికాలో చ‌దువుతున్న ఓ సీనియ‌ర్ ఐఏఎస్ కుమారుడు మాట‌లు వింటే కొంత వ‌ర‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ''మా నాన్న‌ తెల్లవారుజామున 2 గంటలకు ప‌నిచేయ‌డం నేను చూశాను. నేను ఆయనను ఆరాధిస్తాను. కానీ దాని ప్రభావం కూడా నాకు తెలుసు. నా సమయం నాదే అనే కెరీర్ నాకు కావాల''ని అత‌డు అన్నాడు.

    కర్ణాటకలో ఓ సీనియర్ మ‌హిళా ఐఏఎస్ కుమార్తె కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాన్ని వ్య‌క్తప‌రిచారు. ''మా అమ్మ త‌రం వాళ్లు స‌మాజంపై ప్ర‌భావం చూపించ‌డానికి ఏకైక మార్గంగా ఐఏఎస్‌ను ఎంచుకున్నారు. టెక్నాల‌జీ రాజ్య‌మేలుతున్న‌ మా త‌రంలో ప్ర‌తిచోట ప్ర‌భావం చూపించే అవ‌కాశాలు ఉన్నాయి. అది వాతావరణ సాంకేతికతలో కావొచ్చు. AIలో కావొచ్చు. సోష‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కావొచ్చు. దీనికి యూపీఎస్సీ సివిల్స్ మాత్ర‌మే ఏకైక మార్గం కాద‌''ని అన్నారు.

    అంత‌ర్జాతీయ అవ‌కాశాలు
    దీన్ని బ‌ట్టి చూస్తే త‌మ త‌ల్లిదండ్రుల ఉద్యోగ జీవితం లాంటి లైఫ్‌స్టైల్ వారు కోరుకోవ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. తరచుగా బదిలీలు, రాజ‌కీయ ఒత్తిడి, సుదీర్ఘమైన ప‌నివేళ‌లు వంటి అంశాలు వీరిని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. అందుకే వీరి వార‌సులు అంత‌ర్జాతీయ అవ‌కాశాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్, కన్సల్టింగ్, పబ్లిక్ పాలసీ, పరిశోధన, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లా, డిజైన్, సృజనాత్మక రంగాలలో గ్లోబ‌ల్‌ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునే  దిశ‌గా సాగుతున్నారు. ఫ‌లితంగా ఎక్కువ మంది ఐఏఎస్‌ల పిల్ల‌లు అమెరికా, బ్రిట‌న్ దేశాల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా స్థాయి ఎక్స్‌పోజర్ కంటే కార్పొరేట్ లేదా రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లను ఇష్టపడుతున్నారు. దీంతో UPSC కోచింగ్‌లో చేరే వారి సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతోంది. అటు త‌ల్లిదండ్రులు కూడా ఈ మార్పును నిశ్శ‌బ్దంగా అంగీక‌రిస్తున్నట్టు క‌న‌బ‌డుతోంది.

    యువ‌త ఆలోచ‌నా ధోర‌ణిలో మార్పు
    గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ క‌ల్చ‌ర్‌ (start-up culture) పెర‌గడం కూడా యువ‌త ఆలోచ‌నా ధోర‌ణిలో మార్పు క‌న‌బ‌డుతోంది. ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ, సరళమైన పని సంస్కృతి, వేగవంతమైన కెరీర్ వృద్ధి, అధిక రాబ‌డులు వంటి అంశాలు స్టార్ట‌ప్‌ల‌పైపు యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ప్ర‌మోష‌న్ల కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎదురు చూడ‌టం, రాజ‌కీయ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో మెల‌గ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌ను పాతవిగా పరిగ‌ణిస్తున్నారు. త‌మ సొంత ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం ఇచ్చే ప్రొఫెష‌న‌ల్ స్పెస్‌ల‌ను వారు ఇష్ట‌ప‌డుతున్నారు. నేను కలిసిన విద్యార్థుల్లో సగం మంది తమ సొంతంగా ఏదైనా చేయాల‌నుకుంటున్నారు. ప్రమోషన్ల కోసం 30 సంవత్సరాలు పనిచేయాలనే ఆలోచన వారికి నచ్చదని ఇంటర్న్‌లకు మార్గదర్శకత్వం వహించే ఒక యువ IAS అధికారి చెప్పారు.

    చ‌ద‌వండి: శ‌భాష్.. గోలూ భాయ్‌!

    విజయానికి కొత్త నిర్వచనం
    యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త‌ సాధించ‌డం అనేది దశాబ్దాలుగా భారతీయ కుటుంబాల్లో ఉత్కృష్ట విజ‌యంగా ప‌రిగ‌ణించ‌బ‌డింది. ప్ర‌స్తుత స‌మాజంలో ఇలాంటి విజ‌యాలకి నిర్వ‌చ‌నాలు మారుతున్నాయి. ఐఏఎస్ అధికారుల వార‌సులు సివిల్ స‌ర్వీసుల‌ను తిర‌స్క‌రించ‌డం లేదు, త‌మ ఆకాంక్ష‌ల‌ను పున‌ర్ నిర్వ‌చిస్తున్నారు. వారి ఎంపికలు భారతీయ సమాజంలో విస్తృత మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ప్ర‌భుత్వ ప‌ద‌విలో ఉంటేనే స‌మాజంలో మార్పు సాధ్య‌మ‌న్న భావ‌న‌ను నుంచి వారు బ‌య‌ట‌ప‌డుతున్నారు. కొత్త త‌రం (New Generation) మితిమీరిన‌ అదుపాజ్ఞ‌ల కంటే స్వేచ్ఛ‌ను.. భద్రత కంటే ఆవిష్కరణను.. సాంప్రదాయ ప్రతిష్ట కంటే వ్యక్తిగత ఏజెన్సీని ఎంచుకుంటోంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ప్ర‌తి వ్య‌వ‌స్థ యొక్క‌ వార‌స‌త్వాన్ని పున‌ర్ లిఖిస్తున్నారు. 

  • సాక్షి, ముంబై: రెస్టారెంట్లు, కేఫ్‌లు, హోటల్‌ కెళ్లినపుడో విహార యాత్రకెళ్లినపుడో, మనకు సర్వీసు అందించిన ఉద్యోగులకు,టాక్సీ డ్రైవర్లు  టూర్ గైడ్‌లకు కొద్దో గొప్పో టిప్‌ ఇవ్వడం చాలా సాధారణం.,అలా టిప్పుల ద్వారా వచ్చిన సొమ్ముతో ఖరీదైన కారు కొన్నాడు. తన విజయంతో పొదుపు గొప్పతనాన్ని, తాను ఆచరించిన ఆర్థిక క్రమ శిక్షణ  విశిష్టత గురించి చెప్పకనే చెప్పాడు.

    ఇటాలియన్ క్రూయిజ్ షిప్‌లో బట్లర్‌గా పనిచేస్తున్నాడు మహారాష్ట్రలోని మాథెరన్‌కు చెందిన ప్రవీణ్ జోషిల్కర్. ఇండియాలోని  ముంబైకి చెందిన క్రూయిజ్ షిప్ ఉద్యోగి  ప్రవీణ్‌ కేవలం టిప్స్‌తోనే రూ. 10 లక్షల విలువైన కారు కొన్నాడు: "జీతం పొదుపు కోసమే" అంటూ తన ఆర్థిక వ్యూహాన్ని వివరించాడు.  అలాగే ఈ టిప్స్ తన జీవన ఖర్చులు కొనుగోళ్లను కవర్ చేస్తాయని చెప్పుకొచ్చాడు.

    యూరోపియన్, అమెరికన్ అతిథుల నుండి అందుకున్న నగదు ద్వారానే ఈ కారును కొనుగోలు చేశానని పేర్కొన్నాడు. క్రూయిజ్ షిప్‌లో తన జీవితాన్ని డాక్యుమెంట్ చేసే కంటెంట్ సృష్టికర్తగా కూడా  ఉన్నాడు. కొత్త కారుతో పోజులిచ్చిన ఫోటోతో తన విజయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా  ఏంతో ఉదారంగా టిప్స్‌ ఇచ్చిన అతిథులకు  కృతజ్ఞతలు తెలిపాడు.

    క్రూయిజ్ షిప్‌లో పనిచేసేటప్పుడు టిప్స్‌తో ఏదైనా కొనుక్కోవచ్చు. జీతం భవిష్యత్ పొదుపు కోసం బ్రో," అనే క్యాప్షన్‌తో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు  అతనికి విషెస్‌ అందించారు. క్రూయిజ్ పరిశ్రమలో కెరీర్ అవకాశాల గురించి అడిగిన అనేక మంది ఆరా తీయగా, అభినందనలు బ్రో అని చాలామంది వ్యాఖ్యానించారు.

    "> జోషిల్కర్ ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ  అండ్‌ అప్లైడ్ న్యూట్రిషన్ గ్రాడ్యుయేట్. మహారాష్ట్రలోని మాథెరన్‌లో నివసిస్తున్న ప్రవీన్‌ పగటిపూట, అతను ఇటాలియన్ క్రూయిజ్ కంపెనీలో బట్లర్‌గా పనిచేస్తాడు . రాత్రిపూట, అతను క్రూయిజ్ షిప్‌లో తన అనుభవాలతో  కంటెంట్‌ క్రియేటర్‌ అవతారమెత్తుతాడు.

     

    ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్‌ గోయెంకా నో డిలే, నో డైవర్షన్‌ వైరల్‌ వీడియో

  • కరూర్‌ విషాదం నేపథ్యంలో.. టీవీకే సభలు, ర్యాలీలకు షరతులు, పరిమితులతో నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా పుదుచ్చేరిలో జరిగిన విజయ్‌ ర్యాలీ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పరిమిత సంఖ్యలో కార్యకర్తలు(అభిమానుల్ని) అనుమతించడంతో కొందరు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే లేడీ సింగం గర్జించింది.. 

    మంగళవారం ఉదయం ఉప్పలం ఎక్స్‌పో గ్రౌండ్‌ వద్ద విజయ్‌ ర్యాలీ జరుగుతున్న సమయంలో టీవీకే నేత బస్సీ ఆనంద్‌.. బారికేడ్ల వద్దకు వచ్చి ‘‘లోపల స్థలం ఉంది.. రండి..’ అంటూ జనాల్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఐపీఎస్‌ అధికారిణి ఇషా సింగ్‌ వెంటనే ఆయన చేతిలో ఉన్న మైక్‌ను లాగిపడేశారు. 40 మంది ప్రాణాలు పోయాయి కదా.. మళ్లీ అలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారా? అని ఆయన్ని ఆమె నిలదీశారు. ఈ క్రమంలో.. అనుమతించిన సంఖ్యకు మించి ఒక్కరినీ కూడా లోపలికి అనుమతించబోమని కుండబద్ధలు కొట్టారామె. దీంతో.. ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. 

    కరూర్ ఘటన తర్వాత పుదుచ్చేరి పోలీసులు కఠిన నియమాలు అమలు చేశారు. రోడ్షోకు అనుమతి లేదు, ప్రజల సంఖ్యను 5,000కి పరిమితం చేశారు. QR కోడ్ పాస్ ఉన్నవారికే ప్రవేశం ఇచ్చారు. అయితే అంత జాగ్రత్తలు పాటించినా కూడా ఓ వ్యక్తి తుపాకీతో రావడం కలకలం రేపింది.

     

    ఇషాసింగ్‌(28) 2020లో యూపీఎస్సీ ఆల్‌ ఇండియా 191 ర్యాంకర్‌. 2021 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇషా సింగ్.. ప్రస్తుతం పుదుచ్చేరి పోలీస్‌ సూపరింటెండెంట్‌. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్‌ వైపీ సింగ్‌(ముంబై పోలీస్‌​ కమిషనర్‌గానూ పని చేశారు). తల్లి అభాసింగ్‌ లాయర్‌, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్‌ నేషనల్‌ లా స్కూల్‌నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఐపీఎస్‌ కాకముందు.. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు.

  • విమానయాన రంగంలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభం ఎంతటి గందరగోళానికి, నష్టానికి దారి తీసిందో తెలిసిందే. పైలట్ల విషయంలో రెస్ట్‌ రూల్స్‌ అమల్లోకి రావడం.. దాంతో కొరత తలెత్తి విమాన సర్వీసులు ఆగిపోవడం(కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలున్నాయ్‌).. చివరకు తాత్కాలికంగా ఆ రూల్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆ ఫోకస్‌ భారతీయ రైల్వే వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. 

    దేశవ్యాప్తంగా రైళ్లను నడిపే లొకో పైలట్లు (train drivers) తమకూ విశ్రాంతి అవసరమనే గళం వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోట్లాది ప్రయాణికుల భద్రతను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.  ‘‘రైల్వేలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కానీ, మేం తీసుకునేది అతికొద్ది విశ్రాంతి. చేసేది 14 నుంచి 23 గంటలపాటు నిరంతరంగా పని. ఇలాంటి దీర్ఘకాలిక డ్యూటీలు అలసటను పెంచి, ఏకాగ్రతను తగ్గిస్తాయి. ఫలితంగా.. లక్షల మంది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఎఫ్‌ఆర్‌ఎంఎస్‌(Fatigue Risk Management System) ఆధారంగా డ్యూటీ అవర్స్ పరిమితులు అమలు చేయాలి’’ అని లోకోపైలట్లు డిమాండ్ చేస్తున్నారు.

    ప్రస్తుతం రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, రైళ్లను నడిపే పైలట్లపై ఒత్తిడి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కఠిన డ్యూటీ అవర్స్‌పై పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం రైల్వేలో అలాంటివేం లేకపోవడంతో వాళ్ల ఆందోళనను తీవ్ర తరం చేస్తోంది. ఒకవైపు భారతీయ రైల్వేస్‌ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు లోకో పైలట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానవ తప్పిదాలు జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

    డిమాండ్లు:

    • భద్రతాపరమైన నియమాలు.. లోకో పైలట్లకు అలసటను తగ్గించే విధానాలు, నియమాలు అమలు చేయాలి.

    • రోస్టర్‌.. షిఫ్ట్‌లను శాస్త్రీయంగా, సమయపూర్వకంగా కేటాయించాలి.

    • వారంతాపు విశ్రాంతి.. వారానికి కనీసం ఒక విశ్రాంతి రోజు తప్పనిసరిగా ఇవ్వాలి.

    పోలిక సబబేనా?.. 
    విమానయానం.. రైల్వే.. ఈ రెండు రంగాల్లో పైలట్లు, లోకో పైలట్ల అలసట, దీర్ఘకాలిక డ్యూటీలు, విశ్రాంతి లేకపోవడం వల్ల ప్రయాణికుల విషయంలో భద్రతా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి పైలట్ల విశ్రాంతి నియమాలను పాటించకపోవడం వల్ల విమానయాన రంగంలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. కానీ, ఇదే సమస్య రైల్వేలోనూ ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతోందని ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ(All India Loco Running Staff Association) చెబుతోంది. 

    ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. అదే ప్రైవేట్ కార్పొరేషన్లు (ఇండిగో వంటి సంస్థలు) భద్రతా నియమాలను పాటించకపోతే.. ప్రభుత్వం వారికి తలొగ్గుతుంది అని కొందరు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

    దశాబ్దాలుగా.. 
    రోజుకు 6 గంటల డ్యూటీ పరిమితి. ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటల విశ్రాంతి. వారానికి ఒక కంపల్సరీ రెస్ట్‌.. డిమాండ్‌లను 1970 నుంచే ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ వినిపిస్తోంది. 80-90 మధ్య కాలంలో నిరంతర ఆందోళనలు జరిగాయి. కాస్త గ్యాప్‌ తర్వాత.. 2000 సంవత్సరం నుంచి మళ్లీ ఉద్యమాలు జరిగాయి. 2024 అక్టోబర్‌లో దేశవ్యాప్త నిరసన నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది లొకో పైలట్లు సమావేశమై, రైల్వే బోర్డుకు మెమోరాండం సమర్పించారు. అయినా చలనం లేకపోవడంతో.. ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

    ‘‘లొకో పైలట్ల ఆందోళనలు ప్రజల భద్రతకు సంబంధించిన కీలక హెచ్చరికగా భావించాలి. రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమలు చేయకపోతే, రైళ్ల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. విమానయాన రంగంలో జరిగిన సంక్షోభం తర్వాత, రైల్వేలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడే చర్యలు అత్యవసరం’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

  • సాక్షి, ఢిల్లీ: ఓట్‌ చోరీ వ్యవహారంతో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్‌ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ సవాల్‌ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్‌ షా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  

    లోక్‌సభలో ఎస్‌ఐఆర్‌పై  చర్చకు అమిత్‌ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్‌ అన్నారు.  దీనికి అమిత్‌ షా స్పందిస్తూ.. 

    నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్‌ గాంధీ ఓట్‌ చోరీ పేరిట హైడ్రోజన్‌ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. 

    నెహ్రూ హయాంలోనే ఓట్‌ చోరీ జరిగింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్‌ చోరీకి పాల్పడ్డారు.  అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్‌ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్‌ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్‌ షా అన్నారు. 

    ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు.

    లోక్ సభలో అమిత్ షా స్పీచ్
  • కోల్‌కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్‌లో సంచలనం  సృష్టించిన సందేశ్‌ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో  భోలానాథ్ ఘోష్  తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా,   అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం  అనేక అనుమానాలకు తావిస్తోంది.

    ఈకేసుకు సంబంధించి బుధవారం  కోర్టుకు  వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్‌ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు  అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది.  ట్రక్కు  కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి  నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్‌లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్‌ను మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రికి తరలించారు.

    సందేశ్‌ఖాలి  కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

    చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావా

    హత్యకు కుట్ర
    ఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య  చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్  పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్‌ఖాలిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్‌కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా  ఉన్నారు.

    ఏంటీ సందేశ్‌ఖాలీ కేసు
    పశ్చిమ బెంగాల్లోని  ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం  స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్​  నివాసంపై  ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు  షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    షాజహాన్‌ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. 

    ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్‌ గోయెంకా నో డిలే, నో డైవర్షన్‌ వైరల్‌ వీడియో

  • శబరిమలలో అంతకంతకు పెరుగుతున్న భక్తుల జనసందోహం. కేవలం నిన్న ఒక్కరోజే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. స్థానిక సంస్థల ఓటింగ్‌ రోజు(పంచాయతీ ఎన్నికలు) అయినప్పటికీ.. సన్నిధానం, పంపా, శబరిపీఠం, శరణ్‌గుత్తి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచినప్పుడూ.. ఒక గంటలో ఏకంగా 13 వేల మందికి పైగా భక్తులు శబరికొండ ఎక్కారు. 

    సాయంత్రం 6 గంటలకు దర్శనం కొచ్చే వారి సంఖ్య 75,463 కు చేరుకుంది. 18వ మెట్టు ఎక్కేందుకు శరణ్‌గుత్తి, మరంకూట్ట మధ్య భారీ క్యూ ఉంది. గత కొన్ని రోజులతో పోలిస్తే.. నిన్న ఒక్కరోజే రద్దీ అధికం. శబరిమలకు వస్తున్న భక్తుల్లో 50 శాతం మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే ఉంటున్నారు. అలాగే నిన్న దర్శనానికి వచ్చిన మలయాళీలలో చాలామంది మలబార్‌ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.

    (చదవండి: Sabarimala: ‘ఉరక్కుళి జలపాతం వైపు వెళ్లొద్దు’)

     

  • ప్రశంసలతో మొదలైన ప్రయాణం… అవమానంతో ముగిసింది. దేశంలోకెల్లా బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌గా బిరుదు పొందిన కొద్ది రోజుల్లోనే… ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇటు కోర్టు ముందు అవమానానికి గురైంది. ఇందుకు కారణం ఆ పీఎస్‌ సిబ్బంది చేసిన నిర్వాకమే.

    పోలీస్‌ వ్యవస్థను కుదిపేసిన సంచలన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మల్హర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్ దేశంలో అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే అమాయకుడైన ఓ స్టూడెంట్‌ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నంలో కోర్టులో పరువు పొగొట్టుకుంది.

    సోహన్ అనే ఇంటర్‌ విద్యార్థిని ఆగస్టు 29న మల్హర్‌గఢ్‌ పోలీసులు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేశారు. అతని నుంచి నిషేధిత మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసు నేపథ్యంతో..  కోర్టు అతనికి రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిందితుడి కుటుంబం డిసెంబర్‌ 5వ తేదీన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్రమ అపహరణ, తప్పుడు అరెస్ట్‌, నకిలీ సాక్ష్యాలు అంటూ.. కొన్ని ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. అందులో..

    పోలీసులు చెప్పినట్లు డ్రగ్స్‌ లేదు. చేజింగ్‌ లేదు. ఎలాంటి సీజ్‌లు లేవు. బస్సులో వెళ్తున్న సోహాన్‌ను మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. పైగా ఎఫ్‌ఐఆర్‌లో అతని అరెస్ట్‌కు సంబంధించిన వివరాలతో పొంతన కుదరలేదు. దీంతో.. కోర్టు ఎస్పీని తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

    డిసెంబర్‌ 9వ తేదీన మాందసౌర్‌ జిల్లా ఎస్పీ వినోద్‌ కుమార్‌ మీనా కోర్టులో చేతులు కట్టుకుని నిల్చోవాల్సి వచ్చింది. సోహాన్‌ను బస్సులోనే సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పీఎస్‌ సిబ్బంది అరెస్ట్‌ చేసినట్లు అంగీకరించారు. ఇదంతా ఓ కానిస్టేబుల్‌ ఆధ్వర్యంలో జరిగిందని.. అరెస్ట్‌ మొదలు ఏదీ ప్రొసీజర్‌ ప్రకారం జరగలేదని కోర్టుకు వివరించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఆరుగురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేసి డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వైయిరీకి ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసు పోలీస్‌ వ్యవస్థలో హాట్‌ టాపిక్‌గా మారింది.

    నిరపరాధులను బలవంతంగా తీసుకెళ్లడం.. తర్వాత తప్పుడు కేసులు నమోదు చేయడం.. CCTVలో ఒకటి ఉంటే.. తప్పుడు సాక్ష్యాలతో  మానిఫులేషన్‌ చేయడం.. పోలీసుల కథనం వాస్తవానికి విరుద్ధంగా ఉండడం.. కుటుంబాలు కోర్టులను ఆశ్రయించడం.. కోర్టు ముందు పోలీస్‌ అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సి రావడం.. కోర్టులతో ఆక్షింతలు వేయించుకోవడం.. మధ్యప్రదేశ్‌ ఘటన ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల కేసులను గుర్తు చేస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

  • భిక్షాటన చేసే యాచ‌కుల‌ను చూసి అయ్యో పాపం అనుకుంటాం. కుదిరితే సాయం కూడా చేస్తాం. చీద‌రించుకునే వారు కూడా ఉంటారు. కానీ ఆ యువ‌కుడు అలా కాదు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స్పందించి అంద‌రి దృష్టిలో హీరోగా నిలిచాడు. అత‌డు చేసిన పని ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇంత‌కీ ఎవ‌ర‌త‌డు, ఏం చేశాడు?

    బిహార్‌లోని బక్సర్ జిల్లాకు (Buxar district) చెందిన గోలు యాదవ్ అనే యువకుడు ఒక రోజు రైలు ప్ర‌యాణిస్తున్నాడు. అదే స‌మ‌యంలో త‌న బోగిలో ఓ అనాథ బాలిక భిక్షాటన చేస్తూ క‌నిపించింది. ప్రయాణికుల అసౌకర్యకరమైన చూపులు, అనుచిత వ్యక్తీకరణల‌ న‌డుమ ఆమెను అలా చూడటం గోలు యాదవ్‌కు బాధ‌నిపించింది. ఆమె కోసం ఏదైనా చేయాల‌ని గ‌ట్టిగా అనుకున్నాడు. క్షణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా ముంద‌డుగు వేశాడు. త‌నతో పాటు ఇంటికి వ‌స్తే బాగా చూసుకుంటాన‌ని ఆమెను అడిగాడు. ఆ బాలిక ఒప్పుకోవ‌డంతో త‌న ఇంటికి తీసుకెళ్లాడు.

    ఇంటికి చేరుకున్న తర్వాత.. గోలు ఆ అమ్మాయి దుస్థితిని తన తల్లిదండ్రులకు వివరించాడు. వారు ఆ అమ్మాయిని మ‌న‌స్ఫూర్తిగా స్వాగతించారు. ఆమెకు భ‌ద్ర‌మైన జీవితంతో పాటు ప్రేమ‌ను పంచాల‌ని గోలు భావించాడు. కొద్దిరోజుల త‌ర్వాత‌ త‌ల్లిదండ్రుల అనుమ‌తితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా (Viral) మారడంతో గోలు గొప్ప‌ద‌నం గురించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలిసింది. సంస్కార్ కుమార్ అనే యూజ‌ర్ వీరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమాజంలో మంచి మ‌నుషులు ఉన్నార‌ని చెప్ప‌డానికే సోష‌ల్ మీడియాలో కనిపించిన వీరి స్టోరీని తాను పంచుకున్నాన‌ని, మెయిన్ స్ట్రీమ్ మీడియా ధ్రువీక‌రించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

    చ‌ద‌వండి: మా వాళ్లు వ‌ద్దంటున్నారు.. నేను రాజీనామా చేయ‌ను

    నెటిజ‌న్ల స్పంద‌న‌
    రియ‌ల్ లైఫ్ హీరో అంటూ గోలు యాద‌వ్‌పై నెటిజ‌నులు (Netizens) ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమెకు ఇల్లు మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని కూడా ఇచ్చాడ‌ని అంటున్నారు. మరీ ముఖ్యంగా నిస్స‌హాయురాలికి ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ముందుకు రావ‌డం అనేది అత్యంత ప్ర‌శంసార్హ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. గోలు యాద‌వ్ చేసింది త‌ప్పా, ఒప్పా అనేది ప‌క్క‌పెట్టి.. అత‌డు స్పందించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు.

     

  • ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళా డీఎస్‌పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్‌ థండన్‌ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.

    ఛత్తీస్‌గఢ్‌ రాయిపూర్‌కు చెందిన దీపక్‌ థండన్‌ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్‌ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్‌పూర్‌లో ఉన్న ఒక హోటల్‌ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.

    ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్‌ అన్నారు.

    ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది.

  • సాక్షి, ఢిల్లీ: ఇండిగో సంక్షోభం వేళ.. విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది.  ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారణ జరిపింది.

    ఒకవైపు సంక్షోభం కొనసాగుతుంటే.. దాని నుంచి ప్రయోజనం పొందేందుకు ఇతర విమానయాన సంస్థలకు అనుమతి ఎలా లభించింది?.  టికెట్ ధరలు kp.35,000 నుంచి 39,000 వరకు ఎలా పెరిగాయి? ఇతర ఎయిర్‌లైన్స్‌ కూడా ఇలాంటి అధిక ధరలు వసూలు చేయడం ఎలా సాధ్యమైంది? ఇది ఎలా జరుగుతుంది? అని జస్టిస్‌ గెడెలా కేంద్రాన్ని ప్రశ్నించారు. 

    అయితే.. కేంద్రం చర్యలు తీసుకుందని అదనపు సాలిసిటర్‌ జనరల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇండిగో సంక్షోభాన్ని (Indigo) పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే.. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి ఎవరు కారణం..? అని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ కోర్టుకు వెల్లడించారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.

    ఇండిగో వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయింది. పరిస్థితి ముందుగా అంచనా వేయలేకపోయారు. ఇటు ఇతర ఎయిర్‌లైన్సులు ధరలు పెంచుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు?.. ఎయిర్‌లైన్స్‌ అధిక ధరలు వసూలు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు? అని పౌరవిమానయాన శాఖను ఢిల్లీ హైకోర్టు సమగ్ర వివరణ కోరింది. 

    "మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్‌లపై అధిక పనిభారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని కోరింది. అదే సమయంలో.. ఇండిగో తగినంతమంది పైలట్లను నియమించుకోవాలని, ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.

    ‘ఇండిగో వందల సంఖ్యలో సర్వీసుల్ని రద్దు చేయడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఆ ఎఫెక్ట్‌తో ఇతర విమానయాన సంస్థల్లో టికెట్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా స్పందించిన కేంద్రం.. ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ మధ్యలోనే.. ఎయిర్‌లైన్స్‌లు అసాధారణంగా అధిక ధరలు వసూలు చేస్తున్నాయని, ప్రయాణికులకు సమయానికి సమాచారం ఇవ్వడం లేదని.. ఇది ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

  • భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి.  అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్‌మీడియాలో అనేక మీమ్స్‌,  కామెడీ పంచ్‌లు తెగ  వైరల్‌ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

    ‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్‌’’ అనే శీర్షికతో  పోస్ట్‌ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక  ఆటో రిక్షాను మనం  చూడవచ్చు.  పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్‌లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ  వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో  రావడం గమనార్హం.  

    కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్‌లో దాదాపు 65 శాతం  వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త  పనిగంటలు, నైట్‌ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్‌లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు.  దీనిపై  కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ,  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై  దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి  కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్‌లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు.

     

  • కాంగ్రెస్ ఎంపీ ఎంపీ శశిథరూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయనకు ప్రకటించిన వీర్ సావర్కర్‌ అవార్డును తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అసలు ఆ ‍పురస్కారాన్ని ఎందుకు ప్రదానం చేస్తారో తనకు తెలియదని దాని గురించి ఎటువంటి సమాచారం లేదని  మీడియాతో అన్నారు.

    వీర్ సావర్కర్ అవార్డు ప్రకటించడంపై ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ "మీడియా ప్రతినిధుల ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. నేను నిన్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు నన్ను ఈ విషయం అడిగారు. అప్పుడు ఈ ‍అవార్డు నాకు ప్రకటించారని, ఢిల్లీలో ఈ రోజు దానిని అందుకోవాలని తెలిసింది. అవార్డు ఇచ్చే సంస్థ కనీసం నన్ను సంప్రదించకుండా నాకు అవార్డు ప్రకటించడం మంచి పద్దతి కాదు. ఇది చాలా నిర్లక్ష‍మైన చర్య" అని శశి థరూర్ అన్నారు.

    అసలు ఆ అవార్డు యెుక్క ఉద్దేశం ఏమిటో? దానిని ఎందుకు ఇస్తారో తెలియకుండా.. పురస్కారం తీసుకునే ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతోంది ‍అర్ధం కావడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నలనుద్దేశించి శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. వీర్ సావర్కర్ ఇంపాక్ట్ అవార్డు-2025 ను హైరేంజ్ రూరల్ సొసైటీ అనే ఎన్జీవో సంస్థ అందిస్తుంది. ఈ పురస్కారాన్ని సమాజాన్నిప్రభావితం  సాంస్కృతిక కృషి చేసిన వ్యక్తులకు అందిస్తారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హాజరుకానున్నారు.

    కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశిథరూర్‌ తీరుపై ఆ పార్టీ ‍అధిష్ఠానం కొంత అసహానంతో ఉంది. ఈ మధ్య కొన్ని సార్లు కేంద్రానికి మద్దతుగా శశిథరూర్ మాట్లాడారు. దీంతో ఆయన వ్యవహారంపై కాంగ్రెస్ కొంత కోపంగా ఉంది.

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను  ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ తెలియజేయనున్నారు.

    ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్‌ జగన్‌ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. 

    గవర్నర్‌ కార్యాలయం షెడ్యూల్‌ ప్రకారం..  తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్‌ కార్యాలయం వైఎస్సార్‌సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. 

    ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలుస్తారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి..  ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు.

  • సాక్షి,అమరావతి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విషయంలో క్రెడిట్‌ కొట్టేద్దామని చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ ప్రయత్నించిందని, సీన్‌ రివర్స్‌ కావడంతో సైలెంటయ్యిందని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

    మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి.. ‘బాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పేరుతో చేసింది ఏమీ లేదు. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. బాబు పాలన అంతా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం బాబుకు అలవాటు కాదు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ మాత్రమే ఆయనకు తెలిసిన మార్గం.

    టీటీడీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. టీటీడీలో తప్పు జరిగితే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడు. అనవసరంగా బురద చల్లితే ఆ పాపం ఊరికే పోదు’అని ఆయన హెచ్చరించారు.
     

  • సాక్షి,అమరావతి: రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్‌ఓడీల (హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్స్‌) సమావేశంలో ఆయన మంత్రుల పని తీరు, శాఖల నిర్వహణ, కేంద్ర నిధుల సమీకరణపై ​స్పందించారు. 

    గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్‌ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు.  

    మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
     

  • సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం ఈ మేరకు వినతి పత్రం అందజేసింది. 

    ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మెడికల్  కోర్సులు చదవడం కష్టంగా మారుతుంది. పేద వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర ఇది. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. ఈనెల 17న ఈ కోటి సంతకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు అందిస్తారు. అందుకే ప్రభుత్వం వేగంగా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలి.. 

    .. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హాయంలో 17 కొత్త ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను లీజుకు ఇస్తున్నారు. వంద రూపాయలకు ఎకరం చొప్పున ఒక్కో సంస్థకు 50 ఎకరాలు అప్పజెప్తున్నారు. దొడ్డి దారిన వారి నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విధానాల వల్ల ప్రభుత్వ కాలేజీలలో డాక్టర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని వినతి పత్రంలో ఎంపీలు పేర్కొన్నారు. 

     కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో.. వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, రఘునాథ్ రెడ్డి , సుభాష్ చంద్రబోస్ , బాబురావు , అయోధ్య రామిరెడ్డి తదితరులు ఉన్నాయి. 

    ప్రభుత్వ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామను కలిసి కుట్రను వివరించాం. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి  ఆమెనే నిధులు కేటాయించారు. ఏపీలో ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు ఫండింగ్ వచ్చింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు ఫండ్ ఇవ్వాలని కోరాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని కోరాం

    ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్కు YSRCP ఎంపీల ఫిర్యాదు

    ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేదల విద్యార్థులకు పేదలకు అన్యాయం జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పిన అమరావతికి ఇప్పుడు అప్పు ఎందుకు తెచ్చారు?. మెడికల్‌ కాలేజీల రూపంలో లక్ష కోట్ల రూపాయలు ఆస్తి వస్తున్నా.. తనకు కావలసిన మనుషులకు పంచడానికి ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది రాబోయే తరాలకు, పేదలకు నష్టం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను విద్యార్థులు తమ టాపు ప్రయారిటీగా  ఎంచుకుంటారు. వైద్య రంగాన్ని  ప్రైవేటీకరించడం వల్ల ఇండిగో లాంటి సంక్షోభం తలెత్తుతుంది అని ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు.

  •  

    సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం నగరంలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్‌ పర్సన్‌, వైఎస్సార్‌సీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవలె అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఆమెను  పరామర్శించారు. 

    కేదారేశ్వరపేటలోని జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లిన వైఎస్‌ జగన్‌.. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు ఆయన భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని స్థానిక నేతలకు పురమాయించారు. వైఎస్‌ జగన్‌ రాకతో లోటస్‌ రోడ్లు కిటకిటలాడాయి. పార్టీ కార్యకర్తలు, జగన్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు.

    Tipparamalli Jamalapurnamma: వైఎస్ జగన్ లేటెస్ట్ విజువల్స్

Family

  • 90 ఏళ్ల ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ప్రేమ్ చోప్రాకు తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆయనకు ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (TAVI) ప్రక్రియ జరిగింది. దీన్ని గుండె సంబంధిత పరిస్థితిగా పేర్కొన్నారు వైద్యులు. గుండె కవాటాలు పనిచయకపోవడం వల్లే వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అంటే గుండె, శరీరంలోని వివిధ భాగాల మధ్య ప్రధాన రక్త వాహక ధమని అయిన  అయోర్టాకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు అల్లుడు షర్మాన్ జోషి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.

    అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏమిటి?
    అయోర్టిక్ స్టెనోసిస్ (AS) అనేది అయోర్టిక్ వాల్వ్  తీవ్రమైన పరిస్థితి. ఈ స్థితిలో, బృహద్ధమని కవాటం ఇరుకుగా మారి పూర్తిగా తెరుచుకోదు. ఈ సంకుచితం గుండె నుంచి బృహద్ధమనిలోకి, తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుందని కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు.

    ఎందువల్ల ఇలా అంటే..
    "రక్త ప్రవాహం తగ్గినప్పుడు, గుండె కండరం బలహీనపడవచ్చు. నిజానికి ఇది తీవ్రమైన సమస్య సకాలంలో సమస్యను నిర్థారించి చికిత్స అందించకపోతే తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ గుండె వైఫల్యంతో  తీవ్ర సమస్యలకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.

    వయసు పెరిగే కొద్దీ, గుండె కవాటాల కాల్సిఫికేషన్ కారణంగా ఈ పరిస్థితి తరచుగా అభివృద్ధి చెందుతుంది. కాలక్రమేణా, కాల్షియం నిక్షేపాలు గట్టిపడతాయి వాల్వ్ కరపత్రాలను గట్టిపరుస్తాయి. దాంతో వాల్వ్ పూర్తిగా తెరవడం కష్టతరం చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది ఇరుక్కుపోయిన తలుపును తెరవడానికి ప్రయత్నించడం లాంటిది.  అంటే ఊపిరిరాడని పరిస్థితి ఎదురవ్వుతుంది. బలవంతంగా ప్రయత్నిస్తే మరో సమస్య ఎదురుకావొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

    లక్షణాలు ఎలా ఉంటాయంటే..
    ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి లేదా మూర్ఛపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే.. ఇరుకైన వాల్వ్ గుండెపై ఒత్తిడి తెస్తుందని అర్థం. ఇది గుండె వైఫల్య అవకాశాలను పెంచుతుంది. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

    ముందస్తుగా గుర్తించగలమా..?
    బృహద్ధమని స్టెనోసిస్ గమ్మత్తైనది.  ఎందుకంటే ప్రారంభ దశల్లో గుర్తించడ కష్టం. ఇరుకైన బృహద్ధమని కవాటం ఉన్న చాలా మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఇది ప్రారంభ రోగ నిర్ధారణలను కోల్పోవడానికి దారితీస్తుంది.  
    మితమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు ఉండవని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా పేర్కొంది. 

    మరి ఎలా నిర్ధారిస్తారు?
    లక్షణాలు వెంటనే స్పష్టంగా కనిపించకపోవచ్చు కాబట్టి బృహద్ధమని స్టెనోసిస్‌ను గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి, ఇమేజింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. బృహద్ధమని స్టెనోసిస్ తీవ్రతను విశ్లేషించడానికి, అంచనా వేయడానికి ఉత్తమ ప్రారంభ పరీక్ష ట్రాన్స్‌థొరాసిక్ ఎకోకార్డియోగ్రఫీ (TTE) ఈ పరీక్ష వాల్వ్ ప్రాంతం, రక్త ప్రవాహ వేగం, అలాగే వాల్వ్ అంతటా పీడన ప్రవణతలతో సహా సమాచారాన్ని అందిస్తుంది.వాటి తోపాటు ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు (ECGలు), ఛాతీ ఎక్స్-కిరణాలు వంటి పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి.

    TAVI  ఒక్కటే ప్రత్యామ్నాయమా..
    ప్రేమ్ చోప్రా వంటి వృద్ధాప్య రోగులకు, TAVI నిజమైన ఆశను అందిస్తుంది. సాంప్రదాయకంగా, తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్‌కు చికిత్స చేయడం అంటే ఓపెన్-హార్ట్ సర్జరీ కిందకు వస్తుంది. దానికంటే ఈ TAVI తక్కువ ప్రమాదంతో సులభంగా బయటపడతారు. ఈ చికిత్సలో తక్కువ రోజులో ఆస్పత్రిలో ఉంటే వెసులుబాటు తోపాటు తొందరగా కోలుకోగలం కూడా. అలాగే ఇది జీవన నాణ్యతను కొనసాగించే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

    (చదవండి: 

  • భారతదేశం అంతటా,  అలాగే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జరుపుకునే దీపాల పండుగ 'దీపావళికి' అరుదైన గౌరవం లభించింది. ఈ దీపావళి పండుగను యునెస్కో(UNESCO) అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఘనా, జార్జియా, కాంగో, ఇథియోపియా, ఈజిప్ట్  వంటి దేశాలలో సాంస్కృతికంగా జరుపుకునే వాటిలో ఈ పండుగకు చోటు కల్పించింది. 

    ఈ మేరకు ఢిల్లీలోని ఎర్రకోటలో భారతదేశం నిర్వహిస్తున్న అవ్యక్త సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం అంతర్-ప్రభుత్వ కమిటీ  కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగను భారతదేశంలో అత్యంధికమంది జరుపుకునే పండుగలలో ఒకటి. ఇది చీకటిపై వెలుగు (అజ్ఞానంపై జ్ఞానం) సాధించిన విజయాన్ని సూచిస్తుంది.

     

    యునెస్కో నిర్ణయాన్ని స్వాగతించిన భారత్‌..
    ఈ ప్రకటనపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. నిజానికి ఈ నిర్ణయం భారతీయులకు ఎంతో లోతైన భావోద్వేగ విలువలతో ముడిపడి ఉన్న సంప్రదాయానికి దక్కిన అపురూపమైన గౌరవం. ఈ దీపావళి పండుగని తరతరాలుగా జరుపుకుంటున్నారని, జీవన వారసత్వానికి శక్తివంతమైన చిహ్నంగా కొనసాగుతోందని అన్నారు. 

    మాకు “ఈ యునెస్కో ట్యాగ్ కూడా ఒక బాధ్యత; దీపావళి జీవన వారసత్వంగానే ఉండేలా చూసుకోవాలి”  అని షేకావత్‌ పేర్కొన్నారు. యునెస్కో చర్యపై నెట్టింట హర్షాతిరేకలు పెద్దఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీన్ని చాలామంది చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. భారతదేశ సంస్కృతి, కాలాతీత సంప్రదాయానికి దక్కిన ప్రపంచ గుర్తింపు. నిజంగా ఇది భారతదేశానికి, ప్రపంచ సంస్కృతికి గర్వకారణమైన క్షణం. 

    భారతదేశ దీపాల పండుగును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలి. అలాగే ప్రతి హృదయంలో శాంతిని ప్రకాశవంతంగా నెలకొల్పాలి. చివరగా ఇలా ప్రతిష్టాత్మకమైన జాబితా మా 'దీపావళి' పండుగను చేర్చినందుకు ధన్యవాదాలు, అలాగే భారతీయులందరికి అభినందనలు అంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.

     

    (చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!)

     

  • ఇటీవల కాలంలో ప్రజలలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా పోషకాహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను తీసుకునేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ చిరుధాన్యాలలో ఒకటి ఈ రాగులు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే..సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ భార్య, మెగా ఇంటి కోడలు ఉపాసన సైతం ఇది డైట్‌లో తప్పనిసరని ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా చెప్పడం విశేషం. అంతలా అందిరి మదిని దోచిన ఈ చిరుధాన్యం రాగులతో కలిటే లాభాలు, ఎలా తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.

    ఉపాసన కూడా క్రమశిక్షణతో కూడిన డైట్‌కే ప్రాధాన్యత ఇస్తారామె. 36 ఏళ్ల ఆమె ప్రతి రోజు ఆరోగ్యకరమైన పోషకాహారాన్నే తీసుకోవాలనే విశ్వసిస్తానంటోంది. చిరుధాన్యాల్లో తనకు బాగా నచ్చింద రాగులని పేర్కొంది. అంతేగాదు తనకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఇచ్చిన సలహాలను గుర్తు చేసుకుంటూ..ఉపాసన రాగులను ఏదోరూపంలో మీ డైట్‌ బాగంగా చేసుకోండని సూచించినట్లు వెల్లడించింది. అలాగే ఆయన కుమార్తే రాధా జగ్గీతో జరిగిన సంభాషణను కూడా షేర్‌ చేసుకున్నారామె. 

    భరతనాట్య నృత్యకారిణి అయిన ఆమెకు సద్గురువే స్వయంగా రాగి గంజిని చేసి ఇచ్చేవారని, అదే తనను ఇంతలా ఫిట్‌గా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తోందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు ఉపాసన. అందుకే దీన్ని తన కుమార్తె డైట్‌లో కూడా భాగం చేశానని చెప్పుకొచ్చింది. అయితే తన కూతురు ఈ రాగులను ఇష్టపడిందా అని అడిగితే మాత్రం..ఆరోగ్యం కోసం తప్పదు, తనకు మరో ఛాయిస్‌ లేదని నవ్వేశారామె. మరి నిజంగానే రాగులు అంత పోషకవంతమైనదా అంటే..

    ఎముకలకు బలం..
    రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగుల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌కుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జ‌రుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఎముక‌లు బ‌లంగా మారుతాయి. చ‌క్క‌గా ఎదుగుతారు.

    మధుమేహం రోగులకు..
    డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువల్ల రాగుల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నెమ్మ‌దిగా పెరుగుతాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్‌, పాలిఫినాల్స్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించేందుకు స‌హాయం చేస్తాయి. రాగుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణంగా జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అధికంగా బ‌రువు ఉన్న‌వారు బ‌రువును త‌గ్గించుకునేందుకు గాను రాగులు స‌హాయం చేస్తాయి.

    ర‌క్త‌హీన‌త‌కు..
    రాగుల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధంగా మ‌న‌కు ల‌భిస్తుంది. అందువ‌ల్ల రాగుల‌ను తింటుంటే ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ముఖ్యంగా మ‌హిళ‌లు, చిన్నారుల‌లో వ‌చ్చే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌వ‌చ్చు. రాగుల్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. దీని వ‌ల్ల క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరానికి జ‌రిగే న‌ష్టం త‌గ్గుతుంది. ఫ‌లితంగా గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

    మితంగానే మంచిది..
    ఇన్నిప్రయోజనాలు కలిగించే రాగులున తగు మోతాదులోనే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణుల. న్యూట్రిషన్ల ప్రకారం..రాగుల‌ను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వ‌ర‌కు తీసుకోవ‌చ్చు. మ‌రీ అధికంగా తింటే శ‌రీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ల‌ను క‌ల‌గ‌జేస్తుంది

     

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్‌ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

    పటాన్‌ చెరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రవణ్‌ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్‌ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

    పెళ్లి చేస్తామని నమ్మించి  
    పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్‌ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్‌ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్‌ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్‌పై దాడి దిగారు. క్రికెట్‌ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

    పోలీసుల దర్యాప్తు ప్రారంభం
    సమాచారం అందుకున్న పటాన్‌ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    స్థానికులు ఆగ్రహం 
    ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: రేపటి మొదటి దశ సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ జరిగినట్లు స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాణి కుమిదిని దేవి ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు.  

    రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్ల, మైక్రో అబ్జార్వుల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్ల్ లు పంపిణి దాదాపు పూర్తి అయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తి అయిందని వెల్లడించారామె. 

    సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు పైనా ఆమె స్పందించారు. ఆ ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎంసీసీ(Model Code of Conduct) కమిటీకి పంపాం. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారు. మేం అనుమతి ఇచ్చాం అని అన్నారామె. 

    👇

    • మొత్తం మండలాలు నోటిఫై: 189
    • గ్రామ పంచాయతీలు నోటిఫై: 4236
    • వార్డులు నోటిఫై: 37,440
    • పోలింగ్ స్టేషన్లు: 37,562
    • ఫేజ్–1 ఓటర్ల సంఖ్య: 56,19,430
    • పురుషులు: 27,41,070
    • మహిళలు: 28,78,159
    • ఇతరులు: 201

    👇

    పోలింగ్‌కు వెళ్లే GPలు: 3,834

    పోలింగ్‌కు వెళ్లే వార్డులు: 27,628

    సర్పంచ్ అభ్యర్థులు: 12,960

    వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 65,455

    ROలు నియామకం: 3,591

    పోలింగ్ సిబ్బంది: 93,905

    మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడూ దశలకు)

    వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,461

    బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 45,086
     

    👉ఇక ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన కేసులు.. సీజ్‌లు తదితర వివరాలను ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. 

    • ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు: 3,214 FIRలు
    • ప్రివెంటివ్ యాక్షన్‌లో బౌండ్ ఓవర్ వ్యక్తులు: 31,428
    • డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాలు: 902
    • సీజ్ చేసిన నగదు: ₹1,70,58,340
    • సీజ్ చేసిన మద్యం: ₹2,84,97,631
    • డ్రగ్స్ / నార్కోటిక్స్: ₹2,22,91,714
    • విలువైన లోహాలు / ఆభరణాలు: ₹12,15,500
    • ఇతర వస్తువులు: ₹64,15,350

    మొత్తం సీజ్ విలువ: ₹7,54,78,535

    రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ డబుల్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. 

  • సాక్షి,హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని అంటే ఎందుకంత ధైర్యం చేస్తున్నావని నన్ను కొంతమంది అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలంటే కావాల్సింది ధైర్యం కాదు.. అభిమానం. 

    గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీకి అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చా.. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చా. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగింది.

    మన సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే తెలంగాణ సాధనతోనే. జరుగుతుందని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది.  మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచింది. 

    నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ  
    తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారుప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా.. నాకు విదేశీ భాష రాకపోవచ్చు.. కానీ నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు..

    పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు. పేదలకు, నిస్సహాయులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా. చరిత్ర గుర్తుంచుకునేలా  పరిపాలన ఉండాలన్నదే నా ఆకాంక్ష. రెండేళ్లల్లో మీరేం చేశారని కొందరు అడుగుతున్నారు

    జయ జయహే తెలంగాణ గీతాన్ని తొక్కిపెడితే రాష్ట్ర గీతంగా గుర్తించాం. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారు

    చదువు లేకపోవడం వెనుకబాటుతనం
    భూమి లేకపోవడం పేదరికం కావచ్చు .. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనం. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది.ఇప్పుడు విద్య అందుబాటులో ఉంది.. కానీ నాణ్యమైన విద్య కావాలి. అందుకే అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. జీవితాల్లో వెలుగులు నింపుతుంది. 

    కులవివక్షను రూపి కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.ఆనంద్ మహీంద్రా చైర్ పర్సన్ గా, గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. 

    రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని
    2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. గొప్ప గొప్ప వ్యక్తులను బోర్డ్ డైరెక్టర్లుగా నియమించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. పేదలకు ఏదైనా చేయాలనేదే నా తపన. అందుకే రూ. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. 

    తెలంగాణకు పట్టిన చీడ, పీడను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. ఇంగ్లీషు భాష ఒక కమ్యూనికేషన్ మాత్రమే.. అది నాలెడ్జ్ కాదు. మనకు నాలెడ్జ్, కమిట్ మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఆబ్లిగేషన్ లేదు. పిల్లల భవిష్యత్‌ను చెడగొట్టే అధికారం ఎవరికీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే కమిట్ మెంట్ ఉన్న వారిని నియమించుకొండి

    విద్యార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి. నిబద్ధతతో నిరంతరం కష్టపడండి.. తప్పకుండా ఫలితం వస్తుంది.మీరంతా డాక్టర్లు లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నానని’ ఆకాంక్షించారు