Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్‌లను పునర్ వ్యవస్థీకరించి నాలుగు కమిషనరేట్‌లుగా విస్తరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (రాచకొండ కమిషనరేట్ స్థానంలో) , ఫ్యూచర్ సిటీ ఇలా నాలుగు ప్రాంతాల్లో నాలుగు కమిషనరేట్లను ప్రభుత్వం విస్తరించనుంది. ఈ మేరకు నలుగురు ఐపీఎస్‌ ఆఫీసర్‌లను బదిలీ చేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న యాదాద్రి-భువనగిరి ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణ నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  

    కమిషనరేట్‌ల పరిధులు
    -హైదరాబాద్ కమిషనరేట్: అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు.  
    - సైబరాబాద్ కమిషనరేట్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్‌పూర్ వంటి ఐటీ , పారిశ్రామిక ప్రాంతాలు.  
    - మల్కాజిగిరి కమిషనరేట్: కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు.  
    - ఫ్యూచర్ సిటీ కమిషనరేట్: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు.  

    కొత్త నియామకాలు  
    1. సుధీర్ బాబు, ఐపీఎస్‌: రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీరిని, కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ (Future City) పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
    2. అవినాష్ మొహంతి, ఐపీఎస్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవినాష్ మొహంతిను రాచకొండ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేసిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
    3. డా. ఎం. రమేష్, ఐపీఎస్: ఐజీపీ (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) గా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ రమేష్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
    4. అక్షంష్ యాదవ్, ఐపీఎస్: యాదాద్రి భువనగిరి డీసీపీగా ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్‌ అక్షంష్‌ను నూతనంగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా (SP) నియమించారు. 

    నాలుగు కమిషనరేట్‌లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి-భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) డిసెంబర్ 29 (సోమవారం) 2025న ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ప్రక్రియ వర్తించనుంది. ఎన్నికల సంఘం అధికారులు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా (01.10.2025 నాటి డేటా) ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.  

    ఓటర్ల జాబితా షెడ్యూల్  
    - ఈసీఐ పోలింగ్ స్టేషన్ల డేటా మున్సిపాలిటీల వారీగా క్రమబద్ధీకరణ – 30.12.2025  
    - వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల డేటా విభజన – 31.12.2025  
    - మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన – 31.12.2025  
    - ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ – 01.01.2026  
    - రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం (జిల్లా స్థాయి) – 05.01.2026 నుండి 06.01.2026 వరకు
    - తుది ఓటర్ల జాబితా విడుదల – 10.01.2026  

    జనవరి 1న విడుదలకానున్న ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే సంబంధిత నోటీసు బోర్డుల ద్వారా తెలియజేయవచ్చు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం జనవరి 10, 2026న తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుంది. ఈ తుది జాబితా ఆధారంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 

  • సాక్షి హైదరాబాద్: ఇటీవల భరత్‌నగర్ ప్రాంతంలో   మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా III స్పెషల్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడు కరణ్ సింగ్‌ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. దానితో పాటు రూ. పదివేలు జరిమానా చెల్లించాలని తెలిపారు. 

    ఈ నెల 18 వతేదీ భరత్‌గర్‌లోని ఫ్లై ఓవర్ సమీపంలోని ఏసీసీ గోదాం పక్కన ఉన్న పొదల్లో ఒక మహిళ మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు వివరాలు అందించగా వారు  అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీదర్‌కు చెందిన కరణ్ సింగ్‌ను నిందితునిగా అనుమానిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు కరణ్ సింగ్‌ను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది.

  • సాక్షి హైదరాబాద్: మహిళా సాధికారదతతో స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం కీలక చర్యలు చేపడుతుంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్‌లోని మహిళలకు డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో  వారికి శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం 21-45 సంవత్సరాల మద్య వయసున్న మహిళలు (కేవలం హైదరాబాద్ వాసులే) అర్హులని ప్రకటించారు. 

    ఈ కార్యక్రమంలో ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు లైసెన్స్ జారీలో సహాయం కల్పించనున్నట్లు తెలిపారు. వాటితో పాటు వాహనానికి లోన్ లేదా లీజ్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. వీటికి డ్రైవింగ్‌లో ఎటువంటి అనుభవం లేకున్నా అప్లై చేసుకోవచ్చన్నారు. జనవరి 3 శుక్రవారం అంబర్‌పేట్ పోలీస్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమం జరపనున్నట్లు ప్రకటించారు. 

    ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిన్ని వివరాలకు 89788 62299 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.


     

     

  • సాక్షి హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి.  మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈసందర్భంగా రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్థావించారు. కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో మాదిరి తిరుపతిలోనూ తెలంగాణ భవన్ నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. 

    రాష్ట్రానికి చెందిన భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాల అంశంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరారు. అదే విధంగా రాష్ట్రం నుంచి ఏటా అయ్యప్పస్వామి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు శబరిమలకు వెళుతుంటారని, సూదూర ప్రాంతం కావడంతో అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించే అంశం ప్రభుత్వం ఆలోచించాలని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి సూచించారు. 

    ఇదివరకే కర్ణాటక,  తమిళనాడు రాష్ట్రాలు తిరుపతిలో ఆ రాష్ట్రాలకు చెందిన భవన్‌లు నిర్మించుకున్నాయని దీంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రజాపతినిధులు అక్కడికి వెళ్లినప్పుడు వారికి  ఇబ్బందులు కలగడం లేదన్నారు. కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం అక్కడ  ఇబ్బందులు ఎదురవుతున్నాయని  అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే ప్రజాప్రతినిధులకు సౌకర్యంగా ఉండడంతో పాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని గంగుల కమలాకర్ ప్రభుత్వానికి నివేదించారు.


     

  • సాక్షి హైదరాబాద్: కృష్ణానది ఎక్కడ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అడగడం హస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్న సంగతి కూడా సీఎంకు తెలియకపోవడం బాధాకరమన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తినే ఈ రోజు ప్రభుత్వం నీటి పారుదల శాఖ సలహాదారుగా నియమించిందని తెలిపారు.

    అసెంబ్లీలో నీటి సమస్యలపై దేనిమీద చర్చపెట్టాలో సైతం కనీసం ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. కేసీఆర్ చర్చకు వస్తున్నారని మంత్రులంతా ప్రిపరేషన్ మెుదలు పెట్టారని  రాష్ట్ర మంత్రులను కేటీఆర్ దుయ్యబట్టారు.  ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అయితే సభా కార్య కలాపాలపై ఈ రోజు బీఎసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు జరపాలని  సమావేశంలో నిర్ణయించారు.

    అయితే అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపాలని బీఆర్ఎస్, 20 రోజులు నడపాలని బీజేపీ పార్టీలు పట్టుబట్టాయి. ఈ అంశంపై తదుపరి నిర్వహించే బీఎసీ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

  • సాక్షి, ఖమ్మం: తల్లాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. మృతులను జనగామ జిల్లా వాసులుగా గుర్తించారు.

    విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. నాలుగు రోజుల క్రితం  బాలకృష్ణ, అనిల్, అజయ్, క్రాంతి, రాకేష్‌ విహారయాత్ర​కు వెళ్లారు. పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జనగామకు వస్తుండగా ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద లారీ.. కారును ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే బాలకృష్ణ, అనిల్ మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్, క్రాంతి మృతి చెందారు. మృతులు బాలకృష్ణ, అనిల్‌ను జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామస్తులుగా గుర్తించారు. క్రాంతి, రాకేష్ స్టేషన్ ఘనపూర్ గ్రామస్తులుగా గుర్తించారు.

Politics

  • తాడేపల్లి :   ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్‌ 29వ తేదీ) పార్టీ లీగల్‌ సెల్‌ నేతలతో ఆయన జూమ్‌ కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు.  దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ..  ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి.  వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.

    చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్‌ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్‌ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, 

    కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్‌  మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. 

  • అస్సాం గణ పరిషత్..! ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలన విజయంతో రాజకీయాల్లో ఓ ఊపు ఊపిన ఏజీపీ ఇప్పుడు చతికిలపడిపోయిందా? విద్యార్థి నేతలు నడిపిన ఉద్యమంతో.. అధికారంవైపు అడుగులు వేసి.. రికార్డులు సృష్టించిన ఈ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏమైంది? నాలుగు దశాబ్దాల క్రితం క్రిస్మస్‌కు ముందు అస్సాంలో అధికారాన్ని చేపట్టిన ఈ పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎందుకు తంటాలు పడుతోంది? ఒకప్పుడు అస్సాం రాజకీయాలను పూర్తిగా మార్చేసిన ఏజీపీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా?  అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే.. 1985 అక్టోబరు 14న భారత రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాం గణ పరిషత్ పేరుతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చరిత్రలో విద్యార్థులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, అదే సంవత్సరం సరిగ్గా క్రిస్మస్ ఈవ్ రోజున.. అంటే.. 1985 డిసెంబరు 24న అధికారాన్ని చేపట్టిన అరుదైన ఘట్టం చోటుచేసుకుంది అప్పుడే..! ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకుని, స్వదేశీయుల అస్తిత్వాన్ని కాపాడేందుకు అప్పట్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే.. వారిని అస్సాంలో అధికారం వైపు నడిపించింది. నిజానికి ఇప్పుడు ఎన్నో దేశాల్లో జెన్-జీ ఉద్యమాలు జరుగుతున్నా.. చైనాలోని తియానన్మనెన్ స్క్వేర్ విద్యార్థి ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచినా.. అస్సాం విద్యార్థుల ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో ఓ విప్లవమేనని చెప్పవచ్చు. 

    బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఆరేళ్ల పాటు జరిగిన అస్సాం విద్యార్థి ఉద్యమంలో రెండు విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఆ తర్వాత.. 1985 ఆగస్టు 15న ఈ రెండు విద్యార్థి సంఘాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. దాని ప్రకారమే అదే ఏడాది అక్టోబరు 14న అస్సాం గణ పరిషత్ పార్టీని ఏర్పాటు చేశాయి. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘన విజయం సాధించింది. క్రిస్మస్ ఈవ్ రోజున అధికార పగ్గాలను చేపట్టింది. అదేరోజున దేశంలోనే అత్యంత యువ ముఖ్యమంత్రిగా ప్రపుల్లకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలా ఏజీపీ ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకుంది. కాలేజీ నుంచి నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నేత కూడా ప్రపుల్ల కావడం గమనార్హం..! ఆ సమయంలో ఆయన వయసు 33 సంవత్సరాలే..!

    ఏజీపీ ప్రస్తానం తెలుసుకోవాలంటే.. 70లలో జరిగిన పరిణామాలను పరిశీలించాల్సిందే..! 1971లో బంగ్లాదేశ్ అవతరణ జరిగాక.. లక్షల మంది భారత్‌కు అక్రమంగా వలస వచ్చారు. ఇప్పటికీ అస్సాంలో అక్రమ వలసల సమస్య తీవ్రస్థాయిలో ఉంది. అక్రమ వలసలు ఓ ముగింపు లేని సమస్యగా మారిపోయాయి. 1971లో భారత్‌లోకి చొరబడ్డ అక్రమ వలసదారులకు స్థానికులుగా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేస్తుండడంతో.. విద్యార్థి సంఘాలు అప్రమత్తమయ్యాయి. ఈ వలసల కారణంగా వెనకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగడం మొదలైంది. 1979 మార్చిలో లోక్‌సభ సభ్యుడు హీరాలాల్ పట్వారీ మరణంతో జరిగిన ఉప ఎన్నికలో.. వేల మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ఓటర్ల జాబితాలో చోటు లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. 

    దాంతో.. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది. అదే ఏడాది జూన్‌లో ఏఏఎస్‌యూ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాంతో.. మరో కీలక విద్యార్థి సంఘం అస్సాం గణ సంగ్రామ్ పరిషత్ కూడా ఉద్యమంలో భాగమైంది. అలా.. 1979 నుంచి 1985 ఆగస్టు వరకు విద్యార్థులు నిరంతరాయంగా తమ పోరాటాన్ని సాగించారు. ఈ సుదీర్ఘ ఉద్యమంతో దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థి నాయకుల డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. 1985 ఆగస్టు 15న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 1971 తరువాత అస్సాంలోకి ప్రవేశించిన వారిని బేషరతుగా బంగ్లాదేశ్‌కు తిప్పిపంపాలి. 1966–71 మధ్యకాలంలో వలస వచ్చిన వారికి మాత్రం షరతులతో కూడిన పౌరసత్వం ఇవ్వాలి. ఈ విజయంతో రెండు విద్యార్థి సంఘాలు కలిసి అస్సాం గణ పరిషత్‌గా రాజకీయ పార్టీని నెలకొల్పాయి. అస్సాం సాహిత్య సభ, అస్సాం జాతీయవాద దళ్, పూర్వాంచల్య లోక్ పరిషత్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాలు కూడా ఏజీపీతో జతకట్టాయి. పార్టీ అధ్యక్షుడిగా ప్రపుల్ల కుమార్ మహంతా ఎన్నికయ్యారు.

    పార్టీగా ఆవిర్భవించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్ అఖండ విజయాన్ని సాధించింది. నిజానికి ఏజీపీ నేతలు ఆ ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేశారు. ఘన విజయం తర్వాత ఏజీపీ గొడుగు కిందకు వచ్చారు. అంటే.. ఏజీపీ ఓ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందక ముందే.. 126 స్థానాలకు గాను 92 చోట్ల స్వతంత్రులుగా విద్యార్థి సంఘాల నేతలు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లకు పరిమితమైంది. ఫలితంగా అస్సాం రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ప్రపుల్లకుమార్ మహంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్యమం ముగిసిన వెంటనే.. ఉద్యమ పార్టీ అధికారంలోకి రావడం భారతదేశ చరిత్రలోనే అది మొదటిసారి. ఆ తర్వాతి కాలంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణలో బీఆర్ఎస్ ఆ ఘనతను సాధించాయి.

    అధికార పగ్గాలను చేపట్టినకప్పటికీ.. అనుభవ లోపం కారణంగా పరిపాలనలో ఏజీపీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ప్రపుల్ల కుమార్ నేతృత్వంలోని సర్కారులో భృగు కుమార్ భూయాన్, కేశబ్ మహంత, అతుల్ బోరా లాంటి యువ నేతలు మంత్రులుగా కొనసాగారు. అధికారంలోకి వచ్చినప్పటికీ అనుభవం లేకపోవడంతో చోటుచేసుకున్న పరిణామాలు.. ఏజీపీ సర్కారును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు దారితీసింది. ఉల్ఫా ఉగ్రవాదం, ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగా.. 1980లో కేంద్రం అస్సాం సర్కారును రద్దు చేసింది. 1991లో ఏజీపీ చీలిపోయింది. నూతన్ ఏజీపీ ఏర్పాటైంది. దాంతో.. ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ పతనం దిశలో అడుగులు వేసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో ఏజీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 19 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారపగ్గాలను చేపట్టింది.

    విడిపోయి ఓటమిపాలైన ఏజీపీ నేతలు తమ తప్పును తెలుసుకుని, మళ్లీ కలిశారు. 1996 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 59 స్థానాల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చారు. అత్తెసరు మెజారిటీ కావడంతో.. పరిపాలన సవ్యంగా సాగలేదనే చెప్పలి. 2001లో ఏజీపీ మరోమారు పరాజయం పాలవ్వగా.. కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అస్సాంలో బలమైన పునాదులను వేసుకుంది. అయితే.. బీజేపీ వైపు మళ్లే ప్రతీ ఓటు.. ఏజీపీ ఖాతా నుంచి మైనస్ కావడం మొదలైంది. 

    అలా బీజేపీ బలపడుతున్న కొద్దీ.. ఏజీపీ పునాదులు దెబ్బతినడం మొదలైంది. అనుభవరాహిత్యంతో పరిపాలనలో లోపాలు.. అవినీతి.. మహంతపై పెరిగిన వ్యతిరేకత వెరసి ఏజీపీ పతనం వేగవంతమైంది. నిజానికి ఏజీపీ ఆలోచనల నుంచే.. అస్సాంలో బీజేపీ ఎదిగిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కాలక్రమంలో ఏజీపీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర మాజీ మంత్రి బిజోయ్ చక్రవర్తి కూడా అలాంటి నేతల్లో కొందరు. అస్తిత్వం కోసం ఏజీపీ అనేక పొత్తులను పరీక్షించింది. బీజేపీ ప్రధాన శక్తిగా మారడంతో.. ఆ పార్టీతో కలిసి నడుస్తోంది. 2016లో బీజేపీతో పొత్తుతో.. 14 స్థానాలను సాధించింది. 

    పౌరసత్వ సవరణ చట్టం-2019తో మళ్లీ ఈ పొత్తు విఫలమైంది. ఆ తర్వాతి కాలంలో కుదిరిన రాజీతో తిరిగి బీజేపీతో జతకట్టింది. ప్రస్తుతం 9 మంది ఎమ్మెల్యేలున్న ఏజీపీ.. హిమంత బిశ్వ శర్మ సర్కారులో భాగంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ప్రపుల్ల పోటీ చేయలేదు. పార్టీ అధ్యక్షుడిగా అతుల్ బోరా ఉన్నారు. 2024లో బార్‌పేట లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. దీంతో.. రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి ఓ ఎంపీ సీటు దక్కినట్లైంది. పార్టీ తొలినాళ్లలో ప్రభుత్వంలో ఉన్న దినేశ్ గోస్వామి, భృగు భూయాన్ వంటి కీలక నేతల అకాల మరణం పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు. క్రమంగా గ్రాఫ్ పడిపోతున్న ఏజీపీ భవిష్యత్‌లో నిలదొక్కుకుంటుందా? లేదా.. పలు ప్రాంతీయ పార్టీల్లాగా కనుమరుగైపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. 
    -హెచ్.కమలాపతిరావు

  • రాయచోటి:  రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్‌లో  వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి.  జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్‌రెడ్డి. 

    కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం  చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.

    రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి  ఏపీ కేబినెట్‌లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై  మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.

    రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు  ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు.

  • తాడేపల్లి :  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల  ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని,  ప్రైవేటీకరణ  వలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈరోజు(సోమవారం, డిసెంబర్‌ 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. అయినా చంద్రబాబు తన ఆలోచనా విధానాన్ని మార్చుకోలేదు. ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారు. మెడికల్‌ కాలేజీల కోసం ఏ కాంట్రాక్టర్‌ కూడా రాలేదు.  

    కాలేజీలను స్వాధీనం చేసుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని అర్ధం చేసుకున్నారు. కానీ ఆదోని కాలేజ్‌ కోసం కిమ్స్‌ ఆస్పతరికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్‌ వేయించారు. ఒకే ఒక్క టెండర్‌ పెడితే దాన్ని కూడా  ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?,  ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని స్పష్టం చేశారు. 

  • సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.

    కాగా, ఏపీ కేబినెట్‌లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై  మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.

    రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు  ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు.

     

     

  • సాక్షి, వికారాబాద్‌: రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నారనే అనుమానం కలుగుతుందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియా ముందు తొండలు జోర్రగొడతా అంటూ.. అసెంబ్లీలో కేసీఆర్ ముందు దండాలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

    హిల్ట్ పాలసీపై చర్చ ఎందుకు పెట్టడం లేదు? గ్లోబల్ సమ్మిట్, విదేశీ పెట్టుబడులపై చర్చించే దమ్ము దైర్యం ఉందా?. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ పోయాయి?. ప్రతి వర్గానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై చర్చించే దమ్ము దైర్యం ప్రభుత్వానికి ఉందా?. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి సమయం లేదా?. ప్రధాన ప్రతిపక్ష నేతతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని, పాలన గాలికి వదిలేశారు’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌-రేవంత్‌ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్‌ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు.  

    ‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్‌ అన్నారు. 

    శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్‌, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ సైతం  కేసీఆర్‌ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్‌ఎస్‌​ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. 

    రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.

    పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు.

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల మంది పెన్షన్లు కట్‌ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి?. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు.’’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

    పేదలందరికీ రేషన్ బియ్యం  అందాలన్నదే తమ ఆలోచన.. 8 వేల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్న అవినాష్‌రెడ్డి.. రూ.480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీముకు వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాఘ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

    ‘‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో చంద్రబాబు సర్కార్‌ ఘనత సాధించింది. ప్రతి మహిళకు రూ.18 వేలు డబ్బులు ఇస్తామన్నారు. నిరుద్యోగ అభివృద్ధి రూ.3వేలు ఇస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. ఎక్కడ ఇస్తున్నారు? 66 లక్షల పెన్షన్లు వచ్చేవి.. మీ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లను తీసేశారు’’ అంటూ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు వస్తున్నాయంటే వైఎస్సార్‌ పుణ్యమే. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ చేసిన మంచి ఈ ప్రాంత ప్రజలు, రైతులకు తెలుసు. బోగస్ మాటలు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు.

Business

  • భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 29న గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 3170 తగ్గి.. పసిడి ప్రియుల మదిలో ఆశలు చిగురించేలా చేసింది. దీంతో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. ఈ కథనంలో తాజా పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

    సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 650 రూపాయలు తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 2900 తగ్గింది. అంటే గంటల వ్యవధిలోనే 650 రూపాయలు కాకుండా.. అదనంగా మరో 2,250 రూపాయలు (మొత్తం 2,900 రూపాయలు తగ్గింది) తగ్గింది.

    24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా మరింత తగ్గింది. దీంతో తులం ధర రూ. 1,39,250 వద్దకు చేరింది. అంతకు ముందు రోజు రేటు రూ. 1,42,420 వద్ద ఉండేది. దీనిబట్టి చూస్తే ఈ రోజు రూ. 3,170 తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

    ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 3170 రూపాయలు తగ్గి.. రూ. 1,39,400 వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 2950 తగ్గి, రూ. 1,27,800 వద్ద నిలిచింది.

    వెండి ధరలు
    వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.

  • ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఒకటి. ఇక్కడ ఇనుము, బొగ్గు, మాంగనీస్ వంటి వాటితో పాటు బంగారం కూడా ముఖ్యమైన ఖనిజ వనరు. ఇతర ఖనిజాల విషయాన్ని పక్కనపెడితే.. బంగారం భారతీయ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, సంప్రదాయాలలో విశిష్ట స్థానం పొందింది. వివాహాలు, పండుగలు, ఆభరణాలు, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో పసిడిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల భారతదేశంలోని బంగారు గనులు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

    కోలార్ గోల్డ్ ఫీల్డ్స్
    భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బంగారు గనులకు కేంద్రంగా నిలిచింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇండియాలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో విస్తృతంగా తవ్వకాలు జరిపారు. అయితే ప్రస్తుతం కొన్ని ఆర్ధిక సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేశారు.

    హట్టి గోల్డ్ మైన్స్
    కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్.. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీలంగా పనిచేస్తున్న అత్యంత ముఖ్యమైన బంగారు గని. రాయచూర్ జిల్లాలో ఉన్న ఈ గనులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. బంగారు ఉత్పత్తిలో హట్టి గనులు ప్రస్తుతం ప్రధాన వనరుగా నిలుస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఇక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి.

    రామగిరి
    కర్ణాటక మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రామగిరి (అనంతపురం జిల్లా) ప్రాంతం పూర్వకాలంలో బంగారు తవ్వకాలకు ప్రసిద్ధి. కడప, చిత్తూరు జిల్లాల కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు గుర్తించారు. అదే విధంగా తెలంగాణలోని రామగిరి (పెద్దపల్లి జిల్లా) ప్రాంతం కూడా చారిత్రకంగా బంగారు గనులకు ప్రసిద్ధి చెందింది.

    ఇవి కాకుండా.. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్‌భూమ్ జిల్లా, రాజస్థాన్‌లోని బనాస్‌వారా, ఉదయ్‌పూర్ ప్రాంతాలు, కేరళలోని వయనాడు జిల్లా మొదలైన ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగే తవ్వకాలకు పరిమితులు విధించారు. కాబట్టి ఇక్కడ విరివిగా తవ్వకాలు జరపడం నిషిద్ధం.

    బంగారు గనులు - ఎదుర్కొంటున్న సవాళ్లు
    బంగారు గనుల తవ్వకాలు అనుకున్నంత సులభమేమీ కాదు. ఈ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. లోతైన గనులు, అధిక వ్యయం, పర్యావరణ సమస్యలు, ఆధునిక సాంకేతిక అవసరాలు వంటి అంశాలు తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా బంగారు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త అన్వేషణలు, ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోంది.

  • ఇషా అంబానీ నాయకత్వంలో.. రిలయన్స్ రిటైల్ 2025లో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఏడాది ముగిసే సమయానికి దేశంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్య 7000 కంటే ఎక్కువ నగరాల్లో.. 20వేలకు చేరుకుంది. ఇందులో ఒక బిలియన్ కంటే ఎక్కువ కస్టమర్ లావాదేవీలను నెరవేర్చడమే కాకుండా.. లక్షలాది మంది భారతీయులకు ప్రాథమిక షాపింగ్ గమ్యస్థానంగా దాని స్థానాన్ని బలోపేతం చేసింది.

    రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. ఫిజికల్ స్టోర్లే మొత్తం వ్యవస్థకు వెన్నెముక అని ఇషా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది వస్తువులను ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లో డెలివరీ చేసేలా లాజిస్టిక్స్‌ను మార్చారు. 600 కొత్త డార్క్ స్టోర్లు ఏర్పాటు చేశారు. జియోమార్ట్ 1,000కి పైగా నగరాల్లో విస్తరించింది. Ajio Rush ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులు కూడా డెలివరీ చేయడం ప్రారంభమైంది. ఇవన్నీ కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచడంలో దోహదపడ్డాయి.

    గ్లోబల్ బ్రాండ్ ఉత్పత్తులను.. భారతీయులకు చేరువ చేయడంలో ఇషా అంబానీ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'షీన్' బ్రాండ్‌ను ఇండియాకు తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువతను ఆకట్టుకున్నారు. ఫ్రెంచ్ బ్రాండ్ Maje, యువత కోసం Yousta, Azorte వంటివాటిని పరిచయం చేశారు. వీటికి పట్టణాల్లో మంచి ఆదరణ లభించింది.

    ప్రజలను ఆకట్టుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో.. రిలయన్స్ రిటైల్ ఆర్థికంగా 28 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ FMCG విభాగం, రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), దాని రెండవ సంవత్సరంలోనే రూ.11,500 కోట్ల మైలురాయి టర్నోవర్‌ను సాధించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఏటా 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.

  • భారతదేశంలో భారీగా పెరుగుతున్న వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. MCX సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ సోమవారం 8 శాతం లేదా కిలోకు రూ. 21,000 తగ్గింది. నాన్-స్టాప్ ర్యాలీ తర్వాత కేజీ సిల్వర్ రేటు రూ. 254,174 నుంచి రూ. 233,120కు చేరింది. సోమవారం ఉదయం రూ. 2.50 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న వెండి రేటు.. కొన్ని గంటల్లోనే భారీ పతనాన్ని చవిచూసింది.

    రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్లో 50 డాలర్ల దిగువన ట్రేడవుతూ.. ఔన్సుకు 80 డాలర్ల మార్కును దాటేసింది. గరిష్ఠాల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా భారీగా దిగి వచ్చింది.

    వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు
    రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా.. డొనాల్డ్‌ ట్రంప్‌తో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. అంతే కాకుండా శాంతి ఒప్పందానికి అటు పుతిన్ కూడా సుముఖత చూపిస్తున్నారని ట్రంప్ పేర్కొనడంతో, యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇది వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

    సుమారు రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ వెండి ధరలు.. ఏడాది పూర్తి కాకముందే 181 శాతం పెరిగింది. ధర అమాంతం పెరుగుతున్న సమయంలో కొందరు వెండిని కొనడానికి ఆలోచించారు. ఇది కూడా సిల్వర్ రేటు తగ్గడానికి ఒక కారణం.

    వెండి ధరలు ఇంకా తగ్గుతాయా?
    వెండికి ప్రస్తుతం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సిల్వర్ రేటు తప్పకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

    ఇదీ చదవండి: ఉద్యోగమే చేయని కంపెనీ నుంచి లేఆఫ్ మెయిల్: షాకయిన మహిళ

  • డీజిల్ కార్లపై ప్రస్తుతం విధించే గ్రీన్ సెస్‌ను.. ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్, CNG వాహనాలపై విధించే అవకాశం ఉంది. దీనివల్ల కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎలక్ట్రిక్ వాహన విధానం ముసాయిదాలో భాగమైన ఈ ప్రతిపాదన ప్రకారం సెస్ అమలు చేయనున్నారు. మార్చి నాటికి ఈ విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్రభుత్వం.. ఈవీలను ప్రోత్సహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. డీజిల్, పెట్రోల్, CNG వాహనాల కొనుగోలును తగ్గించాలి. దీనికోసం ధరలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు.. రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

    సెంట్రల్ వాహన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఢిల్లీలో ప్రతి నెలా జరిగే అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలు 12-14% వాటా కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం నమోదైన సుమారు 8,00,000 వాహనాలలో, దాదాపు 1,11,000 ఎలక్ట్రిక్ వాహనాలు. ఈ సంఖ్యను మరింత పెంచే యోజనలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది.

  • సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 345.91 పాయింట్లు, లేదా 0.41 శాతం నష్టంతో 84,695.54 వద్ద, నిఫ్టీ 100.20 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 25,942.10 వద్ద నిలిచాయి.

    ప్రకాష్ స్టీలేజ్, రాజనందిని మెటల్, కంట్రీ కాండోస్ లిమిటెడ్, ఓరియంట్ బెల్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోడీ రబ్బరు, బ్రూక్స్ లాబొరేటరీస్, టీమో ప్రొడక్షన్స్ హెచ్‌క్యూ లిమిటెడ్, ఫిలాటెక్స్ ఫ్యాషన్స్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • వెండి ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పటికే సిల్వర్ 80 డాలర్లను దాటుతుందని చెప్పే ఈయన.. తాజాగా కొత్త మార్క్ చేరుతుందని పేర్కొన్నారు.

    బంగారం, వెండి మాత్రమే అసలైన ఆస్తులని కియోసాకి గతంలో కూడా చాలాసార్లు పేర్కొన్నారు. ఇప్పుడు సిల్వర్ 200 డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలు చూస్తుంటే.. కియోసాకి మాటలు నిజమవుతాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

    భారతదేశంలో వెండి రేటు
    హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి రేటు రూ. 2.81 లక్షల వద్ద ఉంది. ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువగా ఉన్నప్పటికీ (కేజీ రూ.2.58 లక్షలు).. కొన్ని రోజులుగా ధరలు మాత్రం ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మాత్రం గరిష్టంగా రూ. 4000 తగ్గినట్లు తెలుస్తోంది.

    వెండి రేటు పెరుగుదలపై మస్క్ ట్వీట్
    వెండి ధరలు పెరగడంపై.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లోని ఒక పోస్ట్‌లో "ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలలో వెండి అవసరం" అని మస్క్ రాశారు. మారియో నవ్ఫాల్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. మస్క్ ఈ పోస్ట్ చేశారు.

    చైనా వెండి ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ పరిశ్రమను కుదిపేస్తాయి. 2026 జనవరి 1 నుంచి చైనా అన్ని వెండి ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సులు తప్పనిసరి చేస్తుంది. కాగా మే నుంచి వెండి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఔన్సుకు దాదాపు 38 డాలర్ల నుంచి 74 డాలర్ల మార్కును దాటేసింది.

  • ప్రభుత్వ ఉద్యోగుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు కల్పించే కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కారుణ్య నియామక ప్రాతిపదికన ఒకసారి ఉద్యోగాన్ని అంగీకరించిన తర్వాత, తమకు అర్హత ఉన్నా అంతకంటే ఉన్నత పదవి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.

    కేసు నేపథ్యం

    తమిళనాడు పట్టణ పంచాయతీల్లో స్వీపర్లుగా పనిచేస్తూ మరణించిన ఇద్దరు వేర్వేరు ఉద్యోగుల కుమారులకు (ఎం.జయబల్, ఎస్.వీరమణి) వారి తండ్రుల మరణానంతరం 2007, 2012 సంవత్సరాల్లో స్వీపర్లుగానే ఉద్యోగాలు లభించాయి. వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆ కొలువుల్లో చేరారు. అయితే, సుమారు 3 నుంచి 9 ఏళ్ల తర్వాత తమకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అప్పట్లో అవగాహన లేక తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరామని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

    సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు

    కారుణ్య నియామకం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు)కు ఒక మినహాయింపు మాత్రమే. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబానికి తక్షణ భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇది ఒక హక్కు కాదు లేదా కెరీర్ అభివృద్ధి కోసం ఇచ్చే అవకాశం కాదు. అభ్యర్థికి ఉన్నత పదవికి కావాల్సిన విద్యార్హతలు ఉన్నప్పటికీ ఖాళీలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తదుపరి నియామకం జరుగుతుంది. అర్హత ఉంది కదా అని ఉన్నత పదవిని డిమాండ్ చేసే హక్కు అభ్యర్థికి ఉండదు.

    ఉద్యోగంలో చేరిన చాలా ఏళ్ల తర్వాత (3-9 ఏళ్లు) కోర్టును ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘వేరే ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత పదవి ఇచ్చారు కాబట్టి, మాకూ ఇవ్వాలి’ అనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక అధికారి చేసిన తప్పును మరొకరికి వర్తింపజేయమని కోర్టులు ఆదేశించలేవని చెప్పింది. తప్పును పునరావృతం చేయలేమని స్పష్టం చేసింది.

    న్యాయ నిపుణుల విశ్లేషణ

    ఈ తీర్పుపై న్యాయ నిపుణులు స్పందిస్తూ, ఇది ప్రభుత్వ నియామక ప్రక్రియల సమగ్రతను కాపాడుతుందని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు కేవలం మానవతా దృక్పథంతో చేసేవని, వీటిని సీనియారిటీ పెంచుకోవడానికి లేదా ఉన్నత పదవులు అనుభవించడానికి వాడుకోలేమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అభిప్రాయపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును కొట్టివేస్తూ, పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కారుణ్య నియామకం పొందిన వారు భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం ఇలాంటి క్లెయిమ్స్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.

    ఇదీ చదవండి: మీరు బిజినెస్‌లో కింగ్‌ అవ్వాలంటే..

  • వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి, అమ్మకాలు మాత్రమే అనుకుంటే పొరపాటే! ప్రస్తుత కాలంలో మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో బిజినెస్ రూపురేఖలే మారిపోయాయి. చాలా మంది పాత పద్ధతులతో నష్టపోతుంటే, కొందరు మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏమిటో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఐదు వ్యూహాలను కింద తెలియజేశాం.

    ఆర్థిక నిర్వహణ

    వ్యాపారానికి క్యాష్ ఫ్లో, ఆర్థిక నిర్వహణ చాలా కీలకం. 2025లో గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ 3% వద్ద స్థిరపడినప్పటికీ అంతర్జాతీయ టారిఫ్‌లు, సప్లై చైన్ సమస్యల వల్ల ముడిసరుకుల ధరలలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సేల్స్ పెంచుకోవడం మీద కాకుండా, ప్రాఫిట్ మార్జిన్లపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ‘ప్రాఫిట్‌ ఫస్ట్‌’ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయం రాగానే లాభం, పన్నులు, వేతనాలను పక్కన పెట్టి, మిగిలిన మొత్తంతోనే ఖర్చులను నిర్వహించాలి. మార్కెట్‌లోని కొన్ని సాఫ్ట్‌వేర్‌లు ఇప్పుడు ఏఐ ఆధారిత అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో రాబోయే ఖర్చులను ముందే అంచనా వేసి, ఖర్చులను 20-30% తగ్గించడంలో సహాయపడుతున్నాయి.

    కస్టమర్ ఫోకస్

    కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (కొత్త కస్టమర్‌ను ఆకర్షించే ఖర్చు) భారీగా పెరిగింది. అందుకే ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవడమే అత్యంత లాభదాయకమైన మార్గం. 80 శాతానికిపైగా చిన్న వ్యాపారాలు ఇప్పుడు జనరేటివ్ ఏఐను వాడుతూ కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి. వ్యాపారులు కస్టమర్ డేటాను విశ్లేషించి, వారి అవసరాలకు తగినట్లుగా లాయల్టీ ప్రోగ్రామ్‌లు రూపొందించడం వల్ల రిపీట్ సేల్స్ పెరుగుతాయి. తాజా సర్వేల ప్రకారం, కస్టమర్ రిటెన్షన్ రేటు(అధిక మార్జిన్లు వచ్చే వస్తువులను కొనేలా చేయడం) 5% పెరిగితే, ప్రాఫిట్ మార్జిన్లు 25% నుంచి 29% వరకు మెరుగుపడే అవకాశం ఉంది.

    ఖర్చుల నియంత్రణ

    ఖర్చు తగ్గించడం అంటే నాణ్యతను తగ్గించడం కాదు, వనరులను సమర్థవంతంగా వాడటం అని గుర్తుంచుకోవాలి. ఇంధన ధరలు, కార్మిక వ్యయాలు పెరిగిన తరుణంలో ఆటోమేషన్ ఒక వరంగా మారింది. క్లౌడ్ ఆధారిత టూల్స్, ఎనర్జీ-ఎఫిషియంట్ పరికరాలను వాడటం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు. టెక్నాలజీ సాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ అవుట్‌పుట్ సాధించేలా ఆపరేషన్లను ఆప్టిమైజ్ చేయాలి. దీనివల్ల ఇన్‌ఫ్లేషన్, టారిఫ్‌ల ప్రభావం వ్యాపారంపై తక్కువగా ఉంటుంది.

    డిజిటల్ పరివర్తన

    ‘ఏఐ వ్యాపారాలను భర్తీ చేయదు కానీ, ఏఐని వాడే వ్యాపారస్తులు దాన్ని వాడని వారిని వెనక్కి నెట్టేస్తారు’ అనేది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయలపై 400 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు జరుగుతున్న తరుణంలో దీన్ని విస్మరించడం అసాధ్యం. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌(వస్తు నిర్వహణ)లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడటం ద్వారా స్టాక్ వృధాను అరికట్టవచ్చు. ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్(ఆటోమేటెడ్‌ బిల్లింగ్‌ విధానం) ద్వారా పేమెంట్స్ త్వరగా వచ్చేలా చూడవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఏఐ బాట్‌లను వాడి 24/7 కస్టమర్ సపోర్ట్ అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి.

    మార్కెట్ ట్రెండ్స్

    మార్కెట్ మారుతున్న వేగానికి అనుగుణంగా వ్యాపార సరళి మారకపోతే ఎంతటి పెద్ద బిజినెస్‌ అయినా కుప్పకూలుతుంది. పర్యావరణ హితమైన పద్ధతులు పాటిస్తున్న బిజినెస్‌ల పట్ల కస్టమర్లు మక్కువ చూపుతున్నారు. ఇది బ్రాండ్ విలువను పెంచడమే కాకుండా దీర్ఘకాలంలో పన్ను రాయితీలకు కూడా దోహదపడుతుంది. డేటా అనలిటిక్స్ ద్వారా మార్కెట్ మూడ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే బిజినెస్ మోడల్‌ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

    ఇదీ చదవండి: మార్కెట్‌లో లిస్ట్‌ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?

Movies

  • ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

    మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.

    (ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)

    ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.

    'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్‌ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.

    (ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

  • సినిమాలని పైరసీ చేసి ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దాదాపు 12 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పలు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ దొంగిలించి వాడుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా కస్టడీ పూర్తవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రవి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    'బెట్టింగ్ యాప్స్‌తో నాకు సంబంధాలు ఉన్నాయని, వాటిని ప్రమోట్ చేస్తున్నానని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదు. నా పేరు ఐ బొమ్మ రవి కాదు ఇమంది రవి. ఐబొమ్మ నాదే అనడానికి ఆధారాలు ఏవి? నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు చెబితే నేను నేరం చేసినట్లేనా? నేను ఎక్కడికీ పారిపోలేదు. వేరే దేశంలో పౌరసత్వం మాత్రమే తీసుకున్నాను. నేను కూకట్‌పల్లిలో ఉంటున్నాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను. నాపై ఆరోపణలన్నీ నిరాధారమైనవి. సరైన టైంలో నిజాలు బయటపెడతా' అని మీడియాతో రవి అన్నాడు.

    మరోవైపు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ఐ బొమ్మ రవి కస్టడీ విచారణలో ఫేక్ ఐడీల సమాచారం సేకరించాం. ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే రవి ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఇతడికి చెందిన రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశాం. బెట్టింగ్ యాప్స్‌తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌తో ఉన్న సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాపై ఆరా తీస్తున్నాం. విచారణలో రవితో సంబంధాలు లేవని ప్రహ్లాద్ చెప్పాడు. త్వరలోనే మిగతా ఇద్దరి స్నేహితులను విచారిస్తాం. ఇకపై పైరసీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు.

  • లంగా ఓణీలో మరింత అందంగా 'కోర్ట్' శ్రీదేవి

    నాజూగ్గా మెరిసిపోతున్న కల్యాణి ప్రియదర్శన్

    మోడ్రన్ డ్రస్‌లో నభా నటేశ్‌ హొయలు

    కొంటె చూపులతో మాయ చేస్తున్న అనసూయ

    ఏడాది జ్ఞాపకాల్ని వీడియోగా పోస్ట్ చేసిన కాయదు

  • ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా తమిళ, కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని.. సొంత భాషలో కాకుండా కన్నడ, తమిళంలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన 'గౌరి' సీరియల్ ఈమెకు బోలెడంత పేరు తీసుకొచ్చింది. దీని షూటింగ్ కొన్నాళ్ల ముందు వరకు బెంగళూరులోనే జరిగింది. రీసెంట్‌గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు. మొన్నటివరకు చిత్రీకరణలో పాల్గొన్న నందిని.. కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చింది.

    అలాంటిది సడన్‪‌గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. దీంతో తోటీనటీనటులు షాక్‌కి గురయ్యారు. 'గౌరి' సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్.. నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసింది. తోటినటుడు సతీష్ మాట్లాడుతూ.. నందినికి ఇంకా పెళ్లి కాలేదు. అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

  • తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?

    నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

    తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ‍్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?

    ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.

    విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్‪‌లో ఉంటాడు. 

    రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్‌కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో?

  • కేరళ నటి అభిరామి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతోంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలు చేసింది. తెలుగులో థాంక్యూ సుబ్బారావు, చార్మినార్‌, చెప్పవే చిరుగాలి, లెవన్‌, 12ఎ రైల్వే కాలనీ, సరిపోదా శనివారం వంటి పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. ఇటీవలే ఈ నటి పెళ్లిరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫోటోలు షేర్‌ చేసింది.

    ఇప్పటికీ.. ఎప్పటికీ..
    'హ్యాపీ యానివర్సరీ మై లవ్‌.. 14వ ఏట నుంచి ఇప్పటి (42వ ఏట) వరకు నా సుఖదుఃఖాల్ని, జయాపజయాలను, భయాలను, ఆశనిరాశలను అన్నింటినీ నీతోనే పంచుకున్నాను, ఇకమీదట  కూడా  పంచుకుంటూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఆప్తమిత్రుడిగా నిలబడ్డందుకు థాంక్యూ.. నీ ఊహకందనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని నటి రాసుకొచ్చింది.

    ప్రేమ ఎలా మొదలైందంటే?
    కేరళ తిరువనంతపురానికి చెందిన అభిరామి తల్లిదండ్రులు బ్యాంకు ఉద్యోగులు. వారికి అభిరామి ఒక్కరే సంతానం. స్కూల్‌ పక్కనే వీరి ఇల్లు ఉండేది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే చాలామంది అభిరామికి ప్రేమలేఖలు రాసి పంపేవారు. కొందరైతే నేరుగా ఇంటికొచ్చేవారు. కానీ ఎవరి ప్రేమను యాక్సెప్ట్‌ చేయలేదు నటి. అయితే తనకు స్కూల్‌లో ఓ స్నేహితుడు ఉండేవాడు. అతడే రాహుల్‌. ప్రముఖ రచయిత పవన్‌ మనవడే రాహుల్‌.

    అలా మళ్లీ కలిశారు
    వీరిద్దరూ స్కూల్‌ డేస్‌ నుంచే మంచి మిత్రులు. తర్వాత పై చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోయింది. కొంతకాలానికి రాహుల్‌ కూడా యూఎస్‌ వెళ్లాడు. అలా మళ్లీ ఇద్దరూ కలిశారు. ఈసారి స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. ఆ ప్రేమను జీవితాంతం పదిలంగా కాపాడుకునేందుకు పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. 2023లో ఈ జంట ఓ పాపను దత్తత తీసుకుంది. తనకు కల్కి అని నామకరణం చేసి పెంచుకుంటున్నారు.

    చదవండి: అల్లు శిరీష్‌ పెళ్లి.. సరిగ్గా ఆ హీరోకి ప్రత్యేకమైన రోజే..

  • నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.

    (ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

    సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.

    నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్‌పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

    (ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్‌గా పెరగనున్న సినిమా టికెట్‌ ధరలు)

  • మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్‌ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్‌ థియేటర్‌లో ఇకనుంచి రూ. 50 టికెట్‌ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్‌ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.

    పవన్‌ కల్యాణ్‌తో చర్చలు
    సినిమా విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు.  'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్‌ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్‌ ధర ఉంది. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ. 175 వరకు ఉంది.  

    ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్‌ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్‌ థియేటర్స్‌లలో టికెట్‌ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా  కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ  ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.

    సింగిల్‌ థియేటర్‌ టికెట్‌ ధర రూ. 150
    కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి  బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్‌ ఆధారంగా టికెట్‌ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్‌ థియేటర్‌లో టికెట్‌ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్‌ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.

  • రామ్ చరణ్ 'పెద్ది' మూవీ చివరి దశ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ మధ్య ఢిల్లీ పలు సీన్స్ తీశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. చెప్పినట్లుగానే మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా మూవీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో నటిస్తున్న ఓ స్టార్ నటుడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూసిన వెంటనే ఆయనెవరో గుర్తుపట్టడం కష్టమే.

    (ఇదీ చదవండి: 'రాజాసాబ్' కొత్త ట్రైలర్ రిలీజ్)

    పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి జగపతిబాబు. అప్పట్లో హీరోగా చేశాడు. గత కొన్నాళ్లుగా మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన్ని మాస్ లేదా క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చారు. కాకపోతే లుక్ మాత్రం దాదాపు ఒకేలా ఉండేది. 'పెద్ది' కోసం మాత్రం గుర్తుపట్టలేనంతగా మార్చేశారని చెప్పొచ్చు. అప్పలసూరి అనే పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడని మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఈయనది పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా అనేది సినిమా రిలీజ్ అయితే తప్ప తెలియదు.

    'పెద్ది' చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడు. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం 'చికిరి చికిరి' అనే సాగే పాట రిలీజ్ చేస్తే ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఫస్ట్ లుక్స్‌తోనూ మూవీ టీమ్ ఆశ్చర్యపరుస్తుండటం విశేషం.

    (ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

  • ప్రభాస్ 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ వచ్చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు ఆశపడ్డారు కానీ ఆదికాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాన్ని విడుదల చేశారు. గతంలో తీసుకొచ్చిన ట్రైలర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉంది. ఇందులో కామెడీ, హారర్ లాంటి ఎమోషన్స్ బాగానే చూపించారు.

    (ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

    ఈ సినిమా.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. 8వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రీమియర్లు, టికెట్ రేట్ల గురించి క్లారిటీ రావొచ్చు. లేదంటే మాత్రం 8వ తేదీ సెకండ్ షోల నుంచి సినిమా రిలీజ్ అ‍వుతుంది. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా చేశారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. మారుతి దర్శకుడు. తమన్ సంగీతమందించాడు.

    (ఇదీ చదవండి: 'పెద్ది'లో మరో స్టార్.. ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా?)

  • మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్‌లోనే కొత్త ఏడాది రాబోతుంది. అందుకు తగ్గట్లే న్యూఇయర్ సందర్భంగా థియేటర్లలోకి పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. సైక్ సిద్ధార్థ్, వనవీర, త్రిముఖ, సకుటుంబానాం, నీలకంఠ, వినరా ఓ వేమ, ఘంటసాల, 45, గత వైభవం తదితర స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చాలా తక్కువ చిత్రాలు మాత్రమే స్ట్రీమింగ్ కానున్నాయి.

    (ఇదీ చదవండి: అల్లు శిరీష్‌ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ)

    ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఎకో అనే మలయాళ డబ్బింగ్ చిత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ అద్భుతమైన హిట్ కావడంతో కొందరు తెలుగు ఆడియెన్స్ దీనికోసం ఎదురుచూస్తున్నారు. హక్ అనే హిందీ మూవీతో పాటు స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్, ఎల్‌బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • మెంబర్స్ ఓన్లీ (ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్) - జనవరి 29

    • ఎకో (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 31

    • స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01

    • ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 01

    • హక్ (హిందీ మూవీ) - జనవరి 02

    అమెజాన్ ప్రైమ్

    • సూపర్ నోవా (నైజీరియన్ సినిమా) - డిసెంబరు 29

    • సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 02

    హాట్‌స్టార్

    • ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 01

    సన్ నెక్స్ట్

    • ఇతిరి నేరమ్ (మలయాళ సినిమా) - జనవరి 01

    (ఇదీ చదవండి: ప్రభాస్-పవన్ మల్టీస్టారర్.. హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్)

  • ,

    బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!

    బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!!

  • నటుడు అల్లు శిరీష్‌ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన  ప్రియురాలు నయనికతో  ఏడడుగులు వేయబోతున్నాడు.  అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్‌ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్‌, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

    సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్‌ సంగీత్‌ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్‌ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్‌- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్‌ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది.

    అల్లు శిరీష్‌- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్‌- లావణ్యల పెళ్లి సందర్భంగా  హీరో నితిన్‌- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్‌ ఫ్రెండ్‌ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్‌ తరపున శిరీష్‌ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్‌- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.
     

Sports

  • వచ్చే ఏడాదిని భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో మొదలు పెడుతుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియాను జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ జట్టుకు ఎంపికవుతారు.. ఎవరిపై వేటు పడే అవకాశం ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సిరీస్‌ కోసం వేర్వేరు కారణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. ఆ ఐదుగురు ఎవరంటే..

    హార్దిక్ పాండ్యా
    క్వాడ్రిసెప్స్‌ గాయం కారణంగా తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా ఎంపికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా మేనేజ్‌మెంట్‌ ఇతనికి విశ్రాంతినివ్వవచ్చు. హార్దిక్‌ స్థానంలో ఈ సిరీస్‌కు నితీష్‌ కుమార్‌ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.

    జస్ప్రీత్ బుమ్రా
    ఇటీవలే బ్యాక్‌ ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బుమ్రాను కూడా టీ20 వరల్డ్‌కప్‌ దృష్ట్యా న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తుంది. వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బుమ్రాపై వర్క్‌ లోడ్‌ పడటం మేనేజ్‌మెంట్‌కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. దీంతో బుమ్రాకు విశ్రాంతి అనివార్యం కావచ్చు. అతని స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఎంపిక చేయవచ్చు.

    వాషింగ్టన్‌ సుందర్
    సౌతాఫ్రికా సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 14 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి రావచ్చు.

    తిలక్‌ వర్మ
    తిలక్‌ సౌతాఫ్రికా సిరీస్‌లో జట్టులో ఉన్నా, ఫస్ట్‌ ఛాయిస్‌ XIలో చోటు దక్కలేదు. ఇదే సిరీస్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీతో కదంతొక్కి తిలక్‌ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉండటంతో తిలక్‌ వన్డే జట్టులో చోటుపై ఆశలు వదులుకున్నాడు.

    రిషబ్‌ పంత్
    గత కొంతకాలంగా ఒక్క వన్డే కూడా ఆడని రిషబ్‌ పంత్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కేఎల్‌ రాహుల్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌ కీపర్‌గా అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్‌ కూడా వన్డే బెర్త్‌పై ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా, ఇషాన్‌ కిషన్‌ రూపంలో పంత్‌కు మరో ప్రమాదం​ పొంచి ఉంది.

    న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అవకాశాలు లేని ఆటగాళ్లు వీళ్లైతే.. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.

    జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో.. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ కోసం​ ఎంపిక చేసిన జట్టే ఈ సిరీస్‌లో యధాతథంగా కొనసాగుతుంది.

    కివీస్‌తో వన్డేలకు భారత జట్టు (అంచనా)..
    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా

  • విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్‌ ఈ ఏడాది 69 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో భాగంగా గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హోల్డర్‌ (అబుదాబీ నైట్‌రైడర్స్‌) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

    హోల్డర్‌కు ముందు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉండేది. రషీద్‌ 2018లో 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తర్వాతి స్థానాల్లో డ్వేన్‌ బ్రావో, నూర్‌ అహ్మద్‌ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌ ఇదే ఏడాది  64 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీశాడు.

    డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌
    హోల్డర్‌ ఇటీవలికాలంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్‌ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్‌.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌ అయిన హోల్డర్‌ను ఐపీఎల్‌ 2026 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.

    హోల్డర్‌ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్‌) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్‌ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్‌ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్‌ (66) ఉన్నారు. రషీద్ ఖాన్‌ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.

    చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రేస్‌వెల్‌
     

  • క్రీడ ఏదైనా అందులో కెప్టెన్‌ పాత్ర ఎంత ఉంటుందో, వైస్‌ కెప్టెన్‌ పాత్ర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే ఏ నిర్ణయంలో అయినా ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకం. తుది నిర్ణయం కెప్టెన్‌దే అయినా, వైస్‌ కెప్టెన్‌ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

    అయితే ఇటీవలికాలంలో క్రికెట్‌ లాంటి క్రీడల్లో వైస్‌ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. పేరుకే వైస్‌ కెప్టెన్‌ను ప్రకటిస్తున్నారు కానీ, మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో పెత్తనం మొత్తం కెప్టెన్‌దే. మేనేజ్‌మెంట్‌ కెప్టెన్లకు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వైస్‌ కెప్టెన్లు కూడా పట్టీపట్టనట్లు ఉంటున్నారు.

    భారత క్రికెట్‌లో ఈ పోకడ మరీ విపరీతంగా ఉంది. వైస్‌ కెప్టెన్లు పేరుకే పరిమితమవుతున్నారు. మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వీరి పాత్ర సున్నా. వైస్‌ కెప్టెన్లు ఇలా పవర్‌ లేకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది జట్టులో వీరి స్థానానికి భరోసా ఉండకపోవడం.

    ఓ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక​ చేసి, ఆ సిరీస్‌లో విఫలమైతే మరుసటి సిరీస్‌ అతను జట్టులో ఉండడు. తమ స్థానానికే గ్యారెంటీ లేనప్పుడు ఏ ఆటగాడు కూడా జట్టు వ్యూహాల్లో తలదూర్చడానికి ఇష్టడడు.

    వైస్‌ కెప్టెన్లు పవర్‌లెస్‌గా మారిపోవడానికి సిరీస్‌కు ఒకరిని మార్చడం మరో కారణం. భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో ఇలా తరుచూ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాణిస్తున్నా, సిరీస్‌కు ఓ వైస్‌ కెప్టెన్‌ను ఎంపిక చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు, కెప్టెన్ల సంప్రదాయం ఎప్పుడు మొదలైందో, అప్పటి నుంచి వైస్‌ కెప్టెన్లను తరుచూ మారుస్తున్నారు.

    భారత టీ20 జట్టును తీసుకుంటే, ఇటీవలికాలంలో చాలామంది వైస్‌ కెప్టెన్లు మారారు. తాజాగా ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టుకు అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయబడగా.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

    దీనికి ముందు కొన్నాళ్లు హార్దిక్‌ పాండ్యా.. కొన్నాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, ఓ సిరీస్‌కు (సౌతాఫ్రికా) రవీంద్ర జడేజా, ఓ సిరీస్‌కు (జింబాబ్వే) సంజూ శాంసన్‌ ఉప సారథులుగా వ్యవహరించారు.

    టీ20ల పరిస్థితి ఇలా ఉంటే.. టెస్ట్‌ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సిరీస్‌కు ఒకరు.. కొన్ని సందర్భాల్లో సిరీస్‌ ఇద్దరు, ముగ్గురు కూడా వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 నుంచి చూసుకుంటే.. శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, పంత్‌, జడేజా, పుజారా, రహానే వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు.

    టెస్ట్‌లు, టీ20లతో పోల్చుకుంటే, వన్డేల్లో పరిస్థితి కాస్త బెటర్‌గా ఉంది. మొన్నటి వరకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా శుభ్‌మన్‌ గిల్‌, పంత్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి వారు వ్యవహరించారు. 

    ప్రస్తుతం గిల్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా ఉండగా.. డిప్యూటీ పోస్ట్‌ శ్రేయస్‌ అ‍య్యర్‌ కోసం కేటాయించబడింది. టెస్ట్‌ జట్టుకు కూడా గిల్‌ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా రిషబ్‌ పంత్‌ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో పంత్‌ గైర్హాజరీలో రవీంద్ర జడేజా ఓ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

    సాధారణంగా ఏ క్రీడలో అయినా భవిష్యత్త్‌ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైస్‌ కెప్టెన్లను ఎంపిక​ చేస్తుంటారు. కెప్టెన్‌ అండలో వైస్‌ కెప్టెన్‌ పాఠాలు నేర్చుకొని కెప్టెన్‌ స్థాయికి ఎదుగుతాడని అలా చేస్తారు. ఆనవాయితీగా ఇలాగే జరుగుతూ వచ్చింది. 

    భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో చూసుకుంటే.. గంగూలీ తర్వాత ధోని.. ధోని తర్వాత విరాట్‌ కోహ్లి వైస్‌ కెప్టెన్లుగా ఉండి కెప్టెన్లుగా అవతరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆటగాళ్లకు వైస్‌ కెప్టెన్‌గా అనుభవం లేకుండానే కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నారు. 

    భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపిక ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఈ పరిస్థితి భారత క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని జట్లలో పరిస్థితి ఇలాగే ఉంది. వైస్‌ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. కెప్టెన్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది.  
     

  • న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డౌగ్ బ్రేస్‌వెల్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 18 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతన్నట్లు స్పష్టం చేశాడు. 35 ఏళ్ల బ్రేస్‌వెల్‌ న్యూజిలాండ్‌ తరఫున 2011-23 మధ్యలో 28 టెస్ట్‌లు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. 

    కుడి చేతి వాటం బ్యాటర్‌, మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన బ్రేస్‌వెల్‌ బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో మెరుగ్గా రాణించాడు. టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో బ్రేస్‌వెల్‌ ఒకే ఒక హాఫ్‌ సెంచరీ (వన్డేల్లో) చేశాడు.

    2008లో అండర్‌-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రేస్‌వెల్‌.. అన్ని విభాగాల్లో ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రేస్‌వెల్‌ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2012 డ్రాఫ్ట్‌లో అతన్ని ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో ఒకే ఒక మ్యాచ్‌ ఆడిన బ్రేస్‌వెల్‌ 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినా అతనికి ఎందుకో అవకాశాలు రాలేదు.

    డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కుటుంబంలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. అతని తండ్రి (బ్రెండన్‌ బ్రేస్‌వెల్‌), అంకుల్‌ (జాన్‌ బ్రేస్‌వెల్‌) కూడా న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కజిన్స్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, మెలానీ బ్రేస్‌వెల్‌ న్యూజిలాండ్‌ సీనియర్‌ పురుష, మహిళల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

    డౌగ్‌ బ్రేస్‌వెల్‌ కెరీర్‌లో గుర్తుండిపోయే ఘట్టం: 2011లో హోబార్ట్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది.  

    చదవండి: పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం

     

  • పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ ఫార్మాట్‌ చరిత్రలో తొలిసారి ఓ బౌలర్‌ 8 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా 7 వికెట్ల ప్రదర్శనలు మాత్రమే నమోదయ్యాయి.

    తాజాగా మయన్మార్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20లో భూటాన్‌ బౌలర్‌ సోనమ్‌ ఎషే (22 ఏళ్ల లెఫ్డ్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌) 8 వికెట్ల చారిత్రక ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో సోనమ్‌ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి (ఓ మెయిడిన్‌) ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. సోనమ్‌ నమోదు చేసిన ఈ గణాంకాలు యుగయుగాలు గుర్తుండిపోతాయి.

    ఎషే చారిత్రక ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో మయన్మార్‌పై భూటాన్‌ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భూటాన్‌ 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల ఛేదనలో మయన్మార్‌ 9.2 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. ఈ గెలుపుతో భూటాన్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం​ చేసుకుంది.

    పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ గణాంకాలు..
    సోనమ్‌ ఎషే (భూటాన్‌)- మయన్మార్‌పై 4-1-7-8
    శ్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (మలేషినా)- చైనాపై 4-1-8-7
    అలీ దావూద్‌ (బహ్రెయిన్‌)- భూటాన్‌పై 4-0-19-7
    హర్ష భరద్వాజ్‌ (సింగపూర్‌)- మంగోలియాపై 4-2-3-6
    పీటర్‌ అహో (నైజీరియా)- సియెర్రా లియోన్‌పై 3.4-1-5-6
    దీపక్‌ చాహర్‌ (భారత్‌)- బంగ్లాదేశ్‌పై 3.2-0-7-6

    చదవండి: న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్‌ కోహ్లి
     

     

     

  • పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (Shan Masood) స్వదేశీ ఫస్ట్‌ క్లాస్‌ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్‌ కప్‌ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. సూయ్‌ నార్త్రన్‌ గ్యాస్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్‌.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

    గతంలో పాకిస్తాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ పేరిట ఉండేది. ఇంజమామ్‌ 1992లో ఇంగ్లండ్‌పై 188 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్‌ ఇంజమామ్‌ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.

    అయితే, పాకిస్తాన్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఖాతాలో ఉంది. సెహ్వాగ్‌ 2006లో జ‌రిగిన‌ లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు.

    కాగా, యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్‌ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు కే కింబర్‌ పేరిట ఉంది. ఇంగ్లండ్‌ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. 

    షిన్వారి, కింబర్‌ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్‌ అగర్వాల్‌ పేరిట ఉంది. హైదరాబాద్‌కు చెందిన తన్మయ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌పై 119 బంతుల్లో డబుల్‌ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లోనే డబుల్‌ పూర్తి చేశాడు.

  • టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్‌ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌, ఇదే టోర్నీలో మరో మ్యాచ్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. 

    జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్‌ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్‌ ఇచ్చారు.  

    ఈ మ్యాచ్‌ ముగిసిన వెంటనే విరాట్‌ న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. 

    ఈ జట్టులో విరాట్‌ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    ఈ ఫార్మాట్‌లో విరాట్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్‌ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు. 

    విరాట్‌ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.

    విరాట్‌ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్‌ సెంచరీ (65 నాటౌట్‌) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్‌.. చివరి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ (74 నాటౌట్‌) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్‌ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్‌ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.

    చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

     

     

  • విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్‌ రామకృష్ణ ఘోష్‌ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.

    తాజా మ్యాచ్‌లో ఘోష్‌ చెలరేగడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్‌ మన్‌ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్‌కు వైభవ్‌ అరోరా (40), అమన్‌ప్రీత్‌ సింగ్‌ (30), నితిన్‌ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.

    అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, అంకిత్‌ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్‌ అరోరా, ధలివాల్‌ తలో వికెట్‌ తీశారు.

    కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌  2026 వేలానికి ముందు రీటైన్‌ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్‌కే 2025 వేలంలో 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్‌ మీడియ​ం బౌలర్‌ అయిన 28 ఏళ్ల ఘోష్‌ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 

    అయినా సీఎస్‌కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్‌ చేసుకుంది. ఘోష్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌ కూడా. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.

     

  • వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌-2025లో కాంస్య పతకాలు గెలిచిన ఇరిగేశి అర్జున్‌, కోనేరు హంపిల‌ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ అభినందించారు. వారి దృఢ సంకల్పం, ఆటతీరు, పోరాట స్ఫూర్తి అందరికీ గర్వకారణం అంటూ ఎక్స్ వేదిక‌గా ఆయ‌న కొనియాడారు.

    కాగా దోహా వేదిక‌గా జరిగిన ఈ వ‌ర‌ల్డ్ మెగా ఈవెంట్‌లో హంపి మహిళల విభాగంలో ఆఖరి వరకు పోరాడింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జు జినెర్‌ (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ టైబ్రేక్‌ స్కోరులో ఆమె మూడో స్దానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంస్య పతకం హంపి దక్కించుకుంది.

    మరోవైపు ఓపెన్ విభాగంలో అర్జున్ 9.5 పాయింట్లతో మూడో స్దానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్‌కు ఇదే తొలి పతకం. ఇక 10.5 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచిన  నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. ఆరోసారి  ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
     

  • న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌క‌టించ‌నుంది. ఈ నేప‌థ్యంలో సెల‌క్ట‌ర్ల‌కు టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ధ్రువ్ జురెల్ సూప‌ర్‌ సెంచ‌రీతో స‌వాల్ విసిరాడు. విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ధ్రువ్ జురెల్‌.. రాజ్‌కోట్‌లో బ‌రోడా జ‌రుగుతున్న మ్యాచ్‌లో భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు.

    మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ధ్రువ్.. టీ20 త‌ర‌హాలో ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఓ వైపు వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి అత‌డు మాత్రం త‌న జోరును త‌గ్గించ‌లేదు. యూపీ కెప్టెన్ రింకూ సింగ్‌తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో జురెల్ కేవ‌లం 78 బంతుల్లోనే త‌న‌ తొలి లిస్ట్‌-ఎ క్రికెట్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

    ఓవ‌రాల్‌గా ఓవరాల్‌గా 101 బంతులు ఎదుర్కొన్న జురెల్‌.. 15 ఫోర్లు, 8 బంతుల్లో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రింకూ సింగ్‌ 67 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 369 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బరోడా బౌలర్లలో యువ పేసర్‌ రాజ్‌ లింబానీ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

    రేసులో కిషన్‌-డిజే
    కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎవరికి చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్ మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉండగా.. అతడికి బ్యాకప్‌గా కిషన్‌-పంత్‌-జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది.

    ఈ క్రమంలో కిషన్‌-జురెల్‌లో ఎవరికో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. ఇద్దరూ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జురెల్ గత కొన్ని సిరీస్‌ల‌కు వ‌న్డే జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి.. ఇప్ప‌టివ‌ర‌కు మాత్రం ఇంకా డెబ్యూ చేయ‌లేదు. కిష‌న్ కూడా ఈ దేశ‌వాళీ వ‌న్డే టోర్నీ తొలి మ్యాచ్‌లోనే శ‌త‌క్కొట్టాడు. దీంతో సెల‌క్ట‌ర్లు మ‌రి ఎవ‌రి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.
    చదవండి: ఆస్ట్రేలియా బ్యాటర్‌ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!

  • మహిళల టీ20 క్రికెట్‌లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్‌ న్యూజిలాండ్‌లో జరుగుతున్న టి20 లీగ్‌లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్‌ లీగ్‌ టోర్నీ ఉమెన్‌ సూపర్‌ స్మాష్‌ (డబ్ల్యూఎస్‌ఎస్‌)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగింది.

    అలెగ్జాండ్రాలోని మోలినెక్స్‌ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్‌షైర్‌ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్‌లో బోనస్‌ పాయింట్‌తో  గెలిచింది.

    ఈ సీజన్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్‌లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్‌ టి20 లీగ్‌లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.

    మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్‌ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్‌లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు. 
    చదవండి: మ‌హ్మద్ ష‌మీకి బీసీసీఐ భారీ షాక్‌..!

Andhra Pradesh

  • తిరుమల: జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల తేదీలన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు జనవరి మాసం విశేష తేదీలను వెల్లడించింది. 

    • జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం
    • జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర
    • జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.
    • జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.
    • జనవరి 14న భోగి.
    • జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
    • జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.
    • జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
    • జనవరి 23న వసంత పంచమి.
    • జనవరి 25న రథ సప్తమి
  • విజయవాడ:  మెడికల్‌ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం మరోసారి బట్టబయలైంది. సింగిల్‌ బిడ్‌కే మెడికల్‌ కాలేజీ అప్పగించాలనే నిర్ణయంతో ప్రభుత్వం బండారం బయటపడింది. ఆదోని మెడికల్ కాలేజి రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా కి అప్పగించాలని తీసుకున్న నిర్ణయంతో అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది వెల్లడైంది. సింగిల్ బిడ్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటామని మంత్రి సత్య కుమార్‌ ప్రకటించారు. అయితే సింగిల్‌ బిడ్‌కి ఇవ్వడం నిబంధనలకు విరుద్దవం కాదా అని మీడియా ప్రశ్నించగా, అన్ని పట్టించుకుంటే ఎలా ? అని తిరిగి ప్రశ్నించారు. సింగిల్‌ బిడ్‌కే అప్పగిస్తామని మంత్రి ప్రకటించారు. 

    దీనిపై వైఎస్సారసీపీ మండిపడుతుంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.  ‘ఆదోని కాలేజ్‌ కోసం కిమ్స్‌ ఆస్పత్రికి చెందిన ఒక డాక్టర్‌తో టెండర్‌ వేయించారని,. ఒకే ఒక్క టెండర్‌ పెడితే దాన్ని కూడా  ఆమోదించడం చూస్తే ప్రభుత్వం ఎటు పోతుంది?,  ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి చేతిలో ఎలా పెడతారు?, కోటి సంతకాలతో ప్రజల ఆకాంక్షలు తెలిసినా ప్రభుత్వం బరితెగించింది. రాష్ట్రంలో విద్య వ్యాపారం చేశారు. జగన్ తెచ్చిన సంస్కరణలను నాశనం చేశారు. ఇక వైద్య విద్యలాంటిది పేదలకు అసలు అందే అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించరు’ అని హెచ్చరించారు.

  • విజయవాడ: నగరంలోని భవానీపురం పున్నమి ఘాట్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఎగ్జిబిషన్‌ను ఉన్నపళంగా కూల్చివేయడానికి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సిద్ధమైన తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ కూల్చివేత కార్యక్రమానికి నిర్వాహకులు అడ్డుకున్న నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పున్నమి ఘాట్‌లో  ఆవకాయ అమరావతి పెస్టివల్‌ నిర్వహించడానికి అంతా సిద్ధం చేసుకున్నారు 

    ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు. అయితే దాన్ని తీసువేయాలని చెప్పి.. ఇవాళ కూల్చివేత కార్యక్రమం చేపట్టడంతో ఎగ్జిబిషన్‌ నిర్వహాకులు ఆందోళనకు దిగారు.  నోటీసుల్లో వారం రోజులు గడువు అని  ఉండగా, ఉన్నపళంగా కూల్చివేయడంపై మండిపడుతున్నారు.  ఎగ్జిబిషన్‌ను ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్ల రూపాయిలు నష్టం వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఇచ్చారని, ఇవాళ కూల్చివేతలకు దిగారని మండిపడుతున్నారు.  ఇప్పటివరకూ ఐదు కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టామని, ఉన్నపళంగా తీసేసేమంటే రోడ్డున పడే పరిస్ధితి వస్తుందని అంటున్నారు. 

     

  • ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం.. వాటికి లక్షలు.. కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు చెప్పేది మాత్రం పెట్టుబడుల సాధన.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు. రాష్ట్రానికి పరిశ్రమలు. వ్యాపారాలు తీసుకురావడం.. కానీ లోపల ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఏడాదిన్నరలోనే పదుల సంఖ్యలో ఢిల్లీ.. హైద్రాబాదు వంటి చోట్లకు షికార్లకు వెళ్లారు. 

    అంతేకాకుండా  తండ్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్..  అమెరికా.. ఇలా ఎన్నిసార్లు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు.. అట్నుంచి వచ్చి రాష్ట్రానికి ఏం లాభం చేసారో చెప్పలేరు.. కానీ అయన ఎక్కినా విమానాలు మాత్రం రయ్యి రయ్యిన ఆకాశంలో ఎగురుతూనే ఉంటాయి.  నవంబర్లో తండ్రితో కలిసి సింగపూర్ వెళ్లొచ్చారు.. ఆ తరువాత కొద్దీ రోజులకే డిసెంబర్ మొదటి వారంలో డల్లాస్ వెళ్లిన లోకేష్ అక్కడ తెలుగువారితో భేటీ అయ్యారు.

    దీనికోసం ఐటీడీపీ .. ఎల్లోమీడియా ఇచ్చిన ఎలివేషన్లు అంతా ఇంతా కాదు.. లోకేష్  విదేశాలకు వెళ్లడం.. అక్కడి ఐటి ప్రముఖులతో ఫోటోలు దిగడం.. అంతే.. ఇక ఆ కంపెనీ ఆంధ్రా వచ్చేసినట్లు చెప్పడం.. ఆ మధ్య గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ను కలిసిన ఫోటోలు మీడియాకు విడుదల చేయడం లేటు.. వెంటనే ఇక గూగుల్ తో ఏపీకి చుట్టరికం కలిపేయడం.  రాష్ట్రంలోని యువతకు ఐటీ జాబులు వచ్చినట్లు ప్రచారం చేయడం రొటీన్ అయింది.

    తాజాగా నేడు  ఏపీ కేబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో లోకేష్ మళ్ళీ ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అసలు ఈ పర్యటన గురించి ప్రభుత్వంలో ఎక్కడా ప్రకటన కానీ సమాచారం కానీ లేదు.ఈ నేపథ్యంలో ఆయన లండన్ ఎందుకు వెళ్తున్నారు.. అది వ్యక్తిగతమా ? ప్రభుత్వ పరంగా  వెళ్తున్నారా అన్నది ఎక్కడ లీక్ చేయడం లేదు. డిసెంబర్ 29న కేబినెట్ భేటీ ఉన్నప్పటికీ అయన ఇక్కడ లేకుండా లండన్ పర్యటనకు ఎందుకు వెళ్ళారన్నది సందేహాస్పదంగా అనిపిస్తోంది. ఆయన రహస్యంగా ఎవరినైనా కలుస్తున్నారా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
     

  • సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్‌లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై  మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానం జరిగింది.

    అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తున్నారు.

     

Family

  • కొత్త సంవ‌త్స‌ర సంబ‌రాల‌కు ప్ర‌పంచం సిద్ధ‌మ‌వుతోంది. 2026 నూత‌న ఏడాదిని స్వాగ‌తిస్తూ ఘ‌నంగా వేడుక‌లు చేసుకునేందుకు జ‌న‌మంతా రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రపంచంలోనే టాప్‌ 10 న్యూ ఇయర్‌ పార్టీస్ గురించి తెలుసుకుందాం. 

    1. నెంబర్‌ వన్‌ రియో...
    ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్‌–ఎయిర్‌ నూతన సంవత్సర వేడుకగా కోపకబానా బీచ్‌ వేడుకలతో రియో బీచ్‌ నంబర్‌ 1 స్థానాన్ని పొందింది. బ్రెజిల్‌ దేశపు ఈ ప్రపంచ ప్రసిద్ధ బీచ్‌కు ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తుతారు. అద్భుతమైన రీతిలో 12–15 నిమిషాల బాణసంచా ప్రదర్శన, ప్రత్యక్ష కచేరీలు, సాంబా ప్రదర్శనలు రియోలో అర్ధరాత్రిని కూడా కాంతులీనేలా చేస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి సముద్ర తీర ఆచారాలు ఇక్కడి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో ఒకటి ఏడు అలలపై దూకే ఆధ్యాత్మిక చర్య, ప్రతి ఒక్కటి రాబోయే సంవత్సరం కోసం ఒక కోరికను సూచిస్తుంది. ఆధ్యాత్మికత, ఆధునికతలను మిళితం చేస్తూ, రియో వేడుక ప్రపంచ ప్రసిద్ధి  పొందింది.

    2. ట‘పాస్‌’లతో... సిడ్నీ..
    ఆస్ట్రేలియాలోని ప్ర‌ధాన న‌గ‌ర‌మైన‌  సిడ్నీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాణసంచా ప్రదర్శనను వీక్షించడానికి 1.6 మిలియన్లకు పైగా సందర్శకులు హార్బర్‌ వద్ద బారులు తీరుతారు. నగరంలోని డబుల్‌ బాణసంచా ప్రదర్శనలు – కుటుంబాల కోసం రాత్రి 9 గంటల ప్రారంభ ప్రదర్శన  గ్రాండ్‌ మిడ్‌నైట్‌ బాణసంచా  ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. హార్బర్‌ క్రూయిజ్‌ల నుంచి లూనా పార్క్‌లోని థీమ్‌–పార్క్‌ పార్టీల వరకు, సిడ్నీ ప్రపంచ స్థాయి నూతన సంవత్సర వేడుకను అందిస్తుంది.

    3. వెల్‌డన్‌.. లండన్‌..
    లండన్‌ నూతన సంవత్సర వేడుక  సమయానికి లండన్‌ (London) నుంచి బాణసంచా మెరుపుల్ని చూడటానికి థేమ్స్‌ నది వెంబడి 100,000 మందికి పైగా పోగవుతారు. అర్ధరాత్రి దాటి, వేడుక నది క్రూయిజ్‌లు, రూఫ్‌టాప్‌ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకారులను కలిగి ఉన్న ఐకానిక్‌ లండన్‌ న్యూ ఇయర్‌ డే పరేడ్‌తో కొనసాగుతుంది.

    4. హాయ్‌.. దుబాయ్‌..
    ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక నూతన సంవత్సర వేడుకలలో ఒకటిగా దుబాయ్‌ (Dubai) నాల్గవ స్థానంలో నిలిచింది. సింక్రొనైజ్‌ చేయబడిన పైరోటెక్నిక్‌లు, లేజర్‌ ప్రొజెక్షన్‌లు డ్రోన్‌ ప్రదర్శనలకు బుర్జ్‌ ఖలీఫా ఒక పెద్ద వేదికగా మారుతుంది. ఆకర్షణీయమైన రూఫ్‌టాప్‌ పార్టీల నుంచి లగ్జరీ హోటళ్లలో గ్రాండ్‌ డైనింగ్‌ అనుభవాల వరకు, దుబాయ్‌ అత్యాధునిక వినోదాన్ని సాంస్కృతిక సౌరభాలతో మిళితం చేస్తుంది నూతన సంవత్సరానికి విలాసవంతమైన ప్రారంభాన్ని కోరుకునే పర్యాటకులకు ఇది మొదటి ఎంపికగా మారింది.

    5. ప్యార్‌ హుషార్‌.. పారిస్‌
    యూరప్‌లోని అత్యంత సొగసైన నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటిగా ఫ్రాన్స్‌లోని పారిస్‌ (Paris) ప్రకాశిస్తూనే ఉంది. లైటింగ్‌ డిస్‌ప్లేలు, అద్భుతమైన విందులు నదీతీర ఉత్సవాల్లో పాల్గొనడానికి దాదాపు పది లక్షల మంది సందర్శకులు చాంప్స్‌–ఎలిసీస్, ఐఫిల్‌ టవర్‌  సీన్‌ చుట్టూ గుమిగూడతారు. ఫ్రెంచ్‌ సంప్రదాయమైన రెవిల్లాన్‌ విందులు – షాంపైన్‌ పొంగులు, క్లాసిక్‌ ఫ్రెంచ్‌ విందులు ఇక్కడి  వేడుకకు గొప్ప  వైభవాన్ని జోడిస్తాయి.

    6. న్యూయార్క్‌.. ఓ బెంచ్‌  మార్క్‌..
    ఈ జాబితాలో అమెరికా నగరం న్యూయార్క్‌ (New York) ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ టైమ్స్‌ స్క్వేర్‌ బాల్‌ డ్రాప్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టీవీక్షణ పొందిన నూతన సంవత్సర కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కచేరీలు, ఐకానిక్‌ వాటర్‌ఫోర్డ్‌ క్రిస్టల్‌ బాల్‌ అవరోహణ కోసం పది లక్షలకు పైగా సందర్శకులు స్క్వేర్‌ను చుట్టుముడతారు. సెంట్రల్‌ పార్క్‌ న్యూయార్క్‌ హార్బర్‌ అంతటా బాణసంచా వేడుకలు సందడి చేస్తాయి, రూఫ్‌టాప్‌ పార్టీల నుండి జాజ్‌ క్లబ్‌ల వరకు ప్రతీ ఒక్కరి అభిరుచినీ సంతృప్తి పరిచే ఈవెంట్స్‌ ఉంటాయి.

    7. ‘బాత్‌’ బెస్ట్‌.. బుడాపెస్ట్‌..
    హంగేరీ దేశంలోని ప్రధాన నగరమైన బుడాపెస్ట్‌లో తనకే ప్రత్యేకమైన థర్మల్‌ బాత్‌ పార్టీలు ఓ హైలెట్‌. అలాగే ప్రకాశవంతమైన డానుబే నది క్రూయిజ్‌లు వీధి ఉత్సవాలతో నూతన సంవత్సరపు రోజున ఈ నగరం చరిత్ర, నైట్‌ లైఫ్, వెల్నెస్‌ను మిళితం చేస్తుంది. బార్‌ల నుంచి స్పా రేవ్‌ల వరకు, బుడాపెస్ట్‌ ఒక ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన వేడుకను అందిస్తుంది, ఇది పర్యాటకులు తన దగ్గరకు ప్రతి సంవత్సరం తిరిగి వచ్చేలా చేస్తుంది.

    8. కల్చరల్‌ మార్గ్‌.. ఎడిన్‌ బర్గ్‌..
    ఎడిన్‌బర్గ్‌లోని హాగ్‌మనే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలలో ఒకటి, మండే టార్చ్‌లైట్‌ ఊరేగింపు, సీలిడ్‌ నృత్యం, సాంప్రదాయ స్కాటిష్‌ సంగీతం ఎడిన్‌బర్గ్‌ కోటపై అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. సంస్కృతి, శతాబ్దాల నాటి సంప్రదాయాలతో జరిగే ఈ మూడు రోజుల పండుగ మొత్తం నగరాన్ని సందడిగా మారుస్తుంది. ఇక్కడ వారసత్వం, సమాజం పండుగ స్ఫూర్తి ప్రధానంగా కలబోసి ఉంటాయి.

    9. భళా.. బాలి
    ఇండోనేసియాలోని బాలి ఉష్ణమండల సౌందర్యం విద్యుదీకరణ శక్తిని మేళవిస్తూ నూతన సంవత్సర వేడుకను (New Year Celebration) అందిస్తుంది. బీచ్‌ పార్టీలు, నియాన్‌–లైట్‌ క్లబ్‌లు, ఆధ్యాత్మిక ఆలయ ఆచారాలు తాటి చెట్ల నీడన బాణసంచా కాల్చడం వంటివి ఆకట్టుకుంటాయి. ఉలువాటులోని కొండ అంచున ఉన్న క్లబ్‌లో నృత్యం చేస్తున్నా లేదా ప్రశాంతమైన వేడుకలో పాల్గొంటున్నా, బాలి మరపురాని రాత్రి జీవితం ప్రపంచవ్యాప్త ఎంపికగా నిలిచింది.

    10. రొమాంటిక్‌గా ఉన్నా.. వియన్నా..
    ఆస్ట్రియా దేశంలోని వియన్నా(Vienna) రొమాంటిక్‌ పర్యాటకులకు చిరునామాగా నిలుస్తుంది. అక్కడ ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలో నగరాన్ని శాస్త్రీయ కచేరీలు, పండుగ మార్కెట్లు, ఉల్లాసమైన డ్యాన్స్‌ ఫ్లోర్స్, గ్రాండ్‌ బాల్‌రూమ్‌ పార్టీలతో ఈ నగరం జోష్‌ నింపుతుంది. యూరోపియన్‌ సంస్కృతి, రొమాన్స్, గ్లామర్‌ కోరుకునే పర్యాటకుల ఎంపిక ఇది.

    చ‌ద‌వండి: 2025లో ఎక్కువ మంది ఫాలో అయిన ఫిట్‌నెస్ సూత్రాలివే

  • ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది టాలీవుడ్‌ హీరోహియిన్‌ సమీరా రెడ్డి ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫిట్‌నెస్ టిప్స్‌ షేర్‌ చేసుకుంటుంటారు. హెల్దీగా ఉండే రెసిపీలు, బరువు తగ్గించే వర్కౌట్లను తన అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారామె. ఈసారి అలానే ఆరోగ్యకరమైన రెసిపీతో ముందుకొచ్చారు. తాను చేసే రెసిపి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరిస్తూ..ఆ కర్రీ తయార చేసే విధానాన్ని తెలియజేశారామె. ఇంతకీ ఏంటా హెల్దీ రెసిపీ అంటే..

    సమీరా రెడ్డి కడుపుకి మేలు చేసే అరటికాండం పప్పు కూర తయారీ విధానాన్ని పంచుకున్నారు. అందుకోసం ఏమేమి పదార్థాలు కావాలంటే..

    అరటి కాండం-1(శుభ్రం చేసి, సన్నగా తరిగి నానబెట్టింది)
    కంది పప్పు లేదా పెసర పప్పు: ¼ కప్పు
    కరివేపాకు 1
    పసుపు టీ స్పూన్‌
    ఆవాలు టీ స్పూన్‌
    తాజా కొబ్బరి పేస్ట్‌-1
    కాశ్మీరీ మిరపకాయ-1
    జీలకర్ర- 1 టీస్పూన్‌
    ఉప్పు రుచికి సరిపడా

    తయారీ విధానం: ముందుగా అరటికాండం, పప్పు, పసుపు, ఉప్పు వేసి ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించాలి. మొత్తం 6 విజల్స్‌ వచ్చాక కొబ్బరి పచ్చిమిర్చి,జీలకర్ర కలిపిని పేస్ట్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి అందులో ఆవాలు, కాశ్మీరీ మిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చారు. అంతేగాదు దీన్నితినడం వల్ల కలిగే లాభాలు కూడా వివరించారు. 

    అవేంటంటే..

    • ఇందులో ఫైబర్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. 

    • అలసటను తగ్గించడంలో హెల్ప్‌ అవుతుంది

    • హార్మోన్ల సమతుల్యతకు మద్దతిస్తుంది

    • ప్రేగు ఆరోగ్యం, డిటాక్స్ కోసం అద్భుతమైనది

    • కడుపు ఉబ్బరం, నీరు నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది

    • బరువు నిర్వహణకు సహాయపడుతుంది

    • రుతుక్రమ ఆరోగ్యానికి మంచిది

    • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

    • జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. 

    అలాగే పోస్ట్‌ చివరలో సమీరా ఉడికించిన తర్వాత ఆ అరటికాండం పోగులను తీసివేయాలని, అవి తినకూడదని, జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుందని హెచ్చిరించారు. అలాగే ఇలాగే ఇలా తొలగించడం వల్ల కూర మృదువుగా, మెత్తగా ఉండి సులభంగా తినేయగలుగుతామని కూడా అన్నారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

     

    (చదవండి: తెగిపోయిన చెవిని పాదంపై అతికించారు..! ఆ తర్వాత..)
     

  • అనుకోని ప్రమాదాల్లో బాధితులు అవయవాలు కోల్పోవ‌డం సర్వసాధారణం. ఒక్కోసారి కొన్నిటిని కృత్రిమ అవయవాలతో భర్తి చేస్తే.. కొన్ని సున్నితమైన అవయవాల విషయాల్లో అది అస్సలు సాధ్యం కాదు. ఇక్కడ ఒక్క మహిళ కూడా అలానే ఎడమ చెవిని కోల్పోయింది. అయితే దాన్ని చక్కగా తిరిగి ఆమెకు అతికించేందుకు విన్నూతమైన వైద్యవిధానాన్ని ఉపయోగించారు. తెగిన చెవిని తిరిగి అతికించడం కాస్తం కష్టం. అయితే దాన్ని పాడవ‌కుండా కాపాడి మరి అతికించారు. అది ఏవిధంగానే తెలిస్తే.. ఇదేం వైద్య విధానం అని విస్తుపోతారు.

    చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సన్ అనే మహిళ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె జుట్టు యంత్రంలో చిక్కుకుంది. ఆ వేగానికి తల ఎడమవైపు చర్మంతో సహా చెవి కూడా పూర్తిగా తెగిపోయింది. దాంతో స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆ ప్రమాదంలో సదరు మహిళకు రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందువల్ల చెవిని తిరిగి అమర్చడం క్లిష్టంగా మారింది. అయితే తెగిపోయిన చెవికి గనుక  రక్తప్రసరణ అందకపోతే అది కుళ్లిపోయే ప్రమాదం ఉంది. 

    దాంతో వైద్యులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెగిపోయిన చెవి పాడవ్వకుండా ఉండేలా.. పాదం పైభాగానికి అతికించారు. ఎందుకంటే అక్కడ చర్మం పల్చగా ఉండటమే గాక అక్కడి ఉండే రక్తనాళాలు సరిగ్గా చెవి రక్తనాళాల పరిమాణంలోనే ఉంటాయి. ఆ నేపథ్యంలో పాదానికి చెవిని అతికించారు. అక్కడ తలవెంట్రుకల కంటే సన్నగా ఉండే రక్తనాళాలు ఉండటంతో ఈ క్లిష్టమైన మైక్రో సర్జరీకి సుమారు 10 గంటల సమయం పట్టింది. 

    చెవి సురక్షితంగా పెరగడానికి సుమారు ఐదు నెలలు పైనే పట్టింది. ఆ ఐదు నెలలు నిరీక్షణ అనంతరం పాదంపై ఉన్న చెవిని తీసి తల భాగంలో విజయవంతంగా అమర్చారు వైద్యులు. అలాగే ఆ మహిళ తల చర్మాన్ని పునరుద్ధరించడానికి కడుపు నుంచి తీసిన చర్మాన్ని అతికించారు. ఈ సరికొత్త చికిత్సా విధానం విజయవంతం అవ‌డమే గాక సదరు మహిళ సైతం పూర్తిగా కోలుకుంటోంది కూడా. ఇలాంటి శస్త్ర చికిత్సలు చైనాకేం కొత్త కాదు. ఎందుకంటే గతంలో కూడా చైనా వైద్యులు రోగి భుజంపై చెవిని పెంచి అరుదైన రికార్డు క్రియేట్‌ చేశారు. 

    చదవండి: భావోద్వేగ మ‌ద్ద‌తుకు పెరుగుతున్న డిమాండ్‌..! ఈ ఏడాదిలోనే ఏకంగా..

  • దేశవ్యాప్తంగా భావోద్వేగ మ‌ద్ద‌తుకు డిమాండ్ పెరుగుతోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఈ ఏడాది ఎక్కువగా వినిపించాయి. ఏడాది పొడ‌వునా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, చదువుపై ఒత్తిడి, ఉద్యోగ భారం, గుర్తింపు సంక్షోభం, సామాజిక ముద్ర వంటి అంశాలతో బాధపడుతున్నవారి నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్‌ 1లైఫ్‌ (www.1life.org.in – 7893078930)కు నిరంతరంగా, భారీగా కాల్స్‌ వచ్చాయి. మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన పెర‌గంతో పాటు భావోద్వేగ సమస్యల తీవ్రత, సంక్లిష్టత కూడా పెరిగినట్టు ఇది స్పష్టం చేసింది. 

    2025లో జనవరి నుంచి డిసెంబర్‌ మధ్య వరకు 1లైఫ్‌కు మొత్తం 38,437 కాల్స్‌ వచ్చాయి. ఈ సంఖ్య అవసరం ఎంత పెద్దదో తెలియజేయడమే కాకుండా, సాధార‌ణ బాధలు సంక్షోభం స్థాయికి చేరకముందే వాటిని అడ్డుకునే విషయంలో అనుభూతితో వినడం, సమయానికి స్పందించడం ఎంత కీలకమో స్పష్టం చేసింది. సంవత్సరం మొత్తం కాల్స్‌ సంఖ్య క్రమంగా పెరిగింది. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్‌ సెప్టెంబరులో గరిష్ఠంగా 4,135కు చేరాయి. 

    ఈ పెరుగుదల 86%. జులై నుంచి అక్టోబర్‌ వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్ వ‌చ్చాయి. ఈ పెరుగుదల సీజ‌న‌ల్ కాదని, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలు నిరంతరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచించాయి. ఏడాది మొత్తం వాలంటీర్లు కాలర్లకు మద్దతు ఇవ్వడానికి 1,838 గంటలు కేటాయించారు. సగటు కాల్‌ వ్యవధి కూడా పెరిగింది. ఈ సేవ‌ల గురించి 1లైఫ్‌ కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ రెబెక్కా మారియా మాట్లాడుతూ, “ప్రతి కాల్‌ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనం కథలుంటాయి. 

    ఆ బాధను ఇతరులతో పంచుకోవడానికి చాలామందికి భద్రత అనిపించదు. మేము చూస్తున్నది సంఖ్యల పెరుగుదల కాదు, బాధ తీవ్రత పెరుగుదల. చాలామంది కాలర్లు సమయం, సహనం, తమ భావాలకు విలువ ఉందన్న భరోసా కోరుతున్నారు. సంక్షోభ త‌రుణం దాటిన తర్వాత కూడా మద్దతు ఉంటుందన్న నమ్మకాన్ని వారు ఆశిస్తున్నారు” అని తెలిపారు. 1లైఫ్‌కు వచ్చిన కాల్స్‌ స్వరూపం కాలర్ల సవాళ్ల విస్తృతి, లోతును ప్రతిబింబించింది. 

    ఆర్థిక ఒత్తిడి, సంబంధాలు చెడిపోవ‌డం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్‌, వ్యాపార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారి నుంచి భారీగా కాల్స్‌ వచ్చాయి. ఇటీవల దక్షిణ, ఉత్తర భారతదేశాల నుంచి కూడా కాల్స్‌ పెరిగాయి. “నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భావోద్వేగ సహాయానికి పెరుగుతున్న డిమాండ్‌ అదే విషయాన్ని తెలియజేస్తోంది. 

    ఎవరికీ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1లైఫ్‌ పనిచేస్తోంది. కాల్స్‌ సంఖ్య పెరుగుతుండటం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య అవగాహన, వాలంటీర్‌ శిక్షణ, అందుబాటులో ఉండే మద్దతు వ్యవస్థలపై మరింత పెట్టుబడి అవసరమని స్పష్టం చేస్తోంది” అని 1లైఫ్‌ డైరెక్టర్ టి.శ్రీకర్‌ రెడ్డి తెలిపారు. ఇటీవలి పలు సంఘటనలు ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాయి. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌ పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించాడు. 

    అత‌డు ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశకు, ఆత్మహత్య ఆలోచనలకు నెట్టింది. 1లైఫ్ సానుభూతితో వినడం ద్వారా అతడికి తన బాధను చెప్పుకొనే అవకాశం కల్పించింది. సహాయం అందుబాటులో ఉందన్న భావనను అతడిలో మళ్లీ తీసుకొచ్చింది. 

    మరో ఘటనలో ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల మహిళ ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత 1లైఫ్‌ను సంప్రదించారు. తామిద్ద‌రం దూరంగా ఉన్న‌ప్పుడు తన భాగస్వామి సహోద్యోగితో సంబంధం పెట్టుకున్నట్టు ఆమెకు తెలిసింది. ఆ మోసం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. మాన‌సికంగా కుంగిపోయిన ఆ క్షణంలో ఆమె మద్దతు కోరారు. 

    వివక్షను ఎదుర్కొంటున్నవారి నుంచి కూడా 1లైఫ్‌కు కాల్స్‌ వస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్‌జెండర్‌.. స‌మాజ‌ధోర‌ణి త‌న‌ను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చింద‌ని చెప్పారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళన, దూరం పెట్టడం ఎదురయ్యాయి. అవి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. సంభాషణలో తీర్పు ఏమీ ఇవ్వ‌కుండా ఆమె అనుభవాలను గుర్తించి, అంగీకరించారు. 

    2025 గణాంకాలు, అనుభవాలు దేశవ్యాప్తంగా వేలమందికి 1లైఫ్‌ కీలక జీవనాధారంగా నిలుస్తున్నట్టు స్పష్టం చేశాయి. అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అవి సూచించాయి. సామాజిక, ఆర్థిక, వృత్తిరంగాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల నియామకం, శిక్షణ, నిర్వహణ మద్దతుపై నిరంతర పెట్టుబడి అత్యవసరమని ఈ అనుభవాలు తెలియజేశాయి. 

    (చదవండి: సెరిబ్రల్ పాల్సీ బాధితుడి సక్సెస్‌ స్టోరీ..తొలి ప్రయత్నంలోనే ఇంజనీరింగ్‌ సర్వీస్ సత్తా చాటి..)

  • అవయవ లోపంకి మించిన రుగ్మతలతో పోరాడుతూ ప్రతిభను చాటుకుంటున్నారు చాలామంది. అన్ని బాగుండి విజయం సాధించడం కాదు..సమస్యతో పోరాడుతూ విజయం సాధించడం వేరేలెవల్‌ అంటూ సత్తా చాటి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ మన్వేందర్ సింగ్‌. చిన్నానాటి నుంచి సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతూ..మరోవైపు తండ్రి మరణం భుజాలపై ఇంటి బాధ్యతలు..ఇన్ని సమస్యలతో పోరాడుతూ అసామాన్యమైన ప్రతిభను చాటి శెభాష్‌ అనిపించుకుని యువతకు ప్రేరణగా నిలిచాడు. 

    అతడే బులంద్‌షహర్‌ జిల్లాలోని ఆవాస్‌ వికాస్‌ నివాసి మన్వేంద్ర సింగ్‌. అతడు సెరిబ్రల్‌ పాల్సి బాధితుడు. ఇది కదలిక, కండరాలను నియంత్రణను ప్రభావితం చేసే నాడీ సంబంధిత వ్యాధి. అతడికి ఆరునెలల వయసులో వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. రెండేళ్లకే మెడను సరిగా నిలబెట్టడంలో ఇబ్బందిపడ్డాడు, పెద్దయ్యాక శరీరం కుడివైపుకి వండిపోవడంతో..రోజువారీ పనులు చేసుకోలేక చాలా అవస్థలు పడ్డాడు. తనకు ప్రతిబంధంగా ఉన్న శరీరంతో పోరాడుతూ..సవాలుగా మారిన రోజువారీ సాధారణ పనులను ఎలా చేయాలో తెలుసుకుంటూ సాగింది అతడి ప్రయాణం.

    అతడి ప్రతిభను వెలికతీయడంలో తల్లి పాత్ర కీలకం..
    అతని తల్లి రేణు సింగ్, బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్. తన కుమారుడు ప్రతీది చాలా ఆలస్యంగా నేర్చుకునేవాడు. పెన్సిల్ ‌పట్టుకోవడమే చాలా కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అతడి బాల్యం మొత్తం శారీరక, సామాజిక అడ్డంకులతో నిండి ఉందని చెప్పుకొచ్చారామె. తన కుడివైపు ఉన్న శారీరక పరిమితులను భర్తీ చేసేలా ఎడమ చేతితో అన్ని పనులు చేసుకునేలా శిక్షణ తీసుకున్నాడు. 

    వైద్యులు అతడి నడకను సైతం ఆ వ్యాధి ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. దాంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఆస్పత్రులన్ని తిరిగామని చెప్పుకొచ్చారామె. వైద్య సంరక్షణ తోపాటు అతడి సంకల్ప బలం తోడవ్వడంతో ..అతడు ఆ సమస్యను అధిగమించగలిగాడు. ఇంతలో విధి మరోలా తలచింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారామె. 

    ఈ శారీరక కష్టానికి తోడు ఇంటి బాధ్యతలు..
    మన్వేంద్రకు 17 ఏళ్ల వయసులో, అతని తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాడు. ఇంటి పెద్దను కోల్పోవడం ఆ  కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మన్వేందర్‌ని ఈ ఘటన మరింతగా కుంగదీసింది. అయితే ఒకరకంగా అతడిలో దాగున్న అంతర్లీన శక్తిని తట్టిలేపి..ఇంటికి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను స్వీకరించేలా చేసిందని చెప్పుకొచ్చారామె. ఇక మన్వేందర్‌ ఇంటర్‌ తర్వాత ఐఐటీ లక్ష్యంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌కి ప్రిపేరయ్యి..ఐఐటీ పాట్నాలో సీటు సంపాదించాడు. 

    అక్కడ బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, యూపీఎస్సీ ఆల్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2025కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేసి, ఆల్‌ ఇండియా 112ర్యాంకు సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎగ్జామ్‌లో గెలుపొందితే  టెలికాం, విద్యుత్‌ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్‌ ఏ, లేదా బీ కేటగిరీలో ఇంజనీర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. చివరగా అతడి తల్లి రేణుసింగ్‌ మాట్లాడుతూ.. "ప్రతిదీ భారంగా అనిపించిన క్షణాలు ఉన్నాయి. అయితే నేను నువ్వు ఇది  చేయగలవు అనే నమ్మకాన్ని ఇస్తూనే ఉన్నా. 

    ఈ విజయం అతడి ఏళ్ల తరబడి కృషి, పట్టుదల, ఓర్పుల ప్రతితిఫలమే ఈ సక్సెస్‌ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది ". మన్వేంద్ర తల్లి. బిడ్డ ఎలా ఉన్నా తల్లికి  గొప్ప అందగాడు, హీరో.. అది నిజం చేసేలా ప్రపంచం ముందు గొప్పవాడిగా తీర్చిదిద్దేలా తల్లి ఎంతగా పరితపిస్తుంది అనేందుకు ఈ కథే ఉదాహరణ.

    (చదవండి: పేరెంట్స్‌ చేత ట్రీట్‌ ఇప్పించుకోండి..! వైరల్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్‌)

     

     

  • కొన్ని చిన్న చిన్న పనులు..చాలా ఎఫెక్ట్‌వ్‌గా ఉంటాయి. చాలా చాలా సాధాసీదా పనులే అయినా వాటి ప్రభావం మాములుగా ఉండదు. మనకు మన తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి మంచి మంచి విందులు ఇప్పిస్తారు. అదులో పెద్ద విషయం ఏం లేదు. కానీ మనం సంపాదించే రేంజ్‌కి వచ్చినప్పుడు కూడా వారి చేత ట్రీట్‌ ఇప్పించుకునే తింటే ఆ ఆనందమే వేరు. అది మన తల్లిదండ్రలకు గొప్ప అనుభూతి కూడా. అదెలాగో అందుకు సంబంధించిన వీడియోని జత చేస్తూ పోస్ట్‌లో వివరించారు చాయ్ సుట్టా బార్ సహ-వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే . 

    ఆయన తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం గురించి చేసిన పోస్ట్‌ నెటిజన్ల మనసును దోచుకుంది. ఆ వీడియోలో వ్యాపారవేత్త దూబే తన తల్లిదండ్రులను ఒక కేఫ్‌లో డేట్‌ కోసం తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. అంతేగాదు మీరు కూడా ఇలా పేరెంట్స్‌ని ట్రీట్‌ కోసం వెళ్దామని ప్రోత్సహించడంని పిలుపునిస్తూ..అక్కడ జరిగిన దృశ్యాన్ని ఇలా పంచుకున్నారు. తన కోసం కూడా తన తండ్రినే ఆర్డర్‌ చేయమని ఆ వ్యాపారవేత్త అడిగారు. 

    ఆయన తమ ముగ్గురు కోసం భోజనం ఆర్డర్‌ చేసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ తర్వాత చివరిలో బిల్లు కూడా తండ్రి చేత పే చేయించాడు ఆ వ్యాపారవేత్త. ఆ తర్వాత చివరగా నాన్న కొంచెం ఛేంజ్‌ ఉంటే ఇ‍వ్వరూ అని అడిగి మరి తీసుకున్నాడు. ఆయన కూడా చాలా ఆనందంగా ఇచ్చారు. ఇలా ఎందుకు చేశానో వివరిస్తూ..ఇలా చెప్పుకొచ్చారు. "మనం పేరంట్స్‌చేత బిల్లు కట్టించి ఫ్రీగా ట్రీట్‌లు తీసుకోమని కాదు నా ఉద్దేశ్యం. మనం మంచి ఉన్నత స్థాయిలో డబ్బులు సంపాదించే రేంజ్‌లో ఉన్నా..వారి చేతనే డబ్బులు కట్టించి వారికి నచ్చిన ఐటెం ఆర్డర్ చేయిపించి తింటే మనం ఎప్పటికీ వారిపై ఆధారపడి ఉన్నామని, మనం ఎప్పటికీ వారి పిల్లలమే అనే భావన కలుగుతుంది. 

    అదే సమయంలో వారికి తాము వృద్ధులం అనే భావన కలగదు. మన పిల్లలు చిన్న వాళ్లు వాళ్ల కోసం మనం దృఢంగా ఉండాలనే భావన, ఆశ కలుగుతుంది. మన పిల్లలు ఎప్పటికీ పిల్లలే, చిన్నవాళ్లు మనపై ఆధారపడుతున్నవాళ్లు అన్న ఫీలింగ్‌ వారికి గొప్ప అనుభూతిని, జీవితంపై గొప్ప ఆశను రేకెత్తిస్తుందంటూ". పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుభవ్‌ దూబే. ఇది చాలామంది మనసుని తాకడమే కాదు..ఇలాంటి చిన్న చిన్న పనులు తల్లిదండ్రులకు మంచి అనుభూతిని కలిగించడంలో సహయపడటమే గాక, పిల్లలతో వారి బంధాన్ని మరింత బలపరుస్తాయని అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: పక్షవాతం బారినపడిన వ్యక్తి అసామాన్య ప్రతిభ..! జస్ట్‌ ఒక్క చేతి వేలు, కాలి బొటనవేలితో..)

     

International

  • బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్థాన్‌పై విరుచుకపడుతోంది. గత కొద్ది రోజులుగా పాక్‌లోని కీలక ప్రాంతాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడులలో 15మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.

    ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. సరిహాద్దు వెలుపల భారత్, ఆప్గాన్‌లతో ఆ దేశానికి ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఇవి చాలవన్నట్లు పాకిస్థాన్‌ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్  దాడులను తీవ్రతరం చేసింది. దీంతో  ఆ దేశ ఆర్మీ ఊక్కిరిబిక్కిరవుతోంది.

    ఇటీవల పాక్‌పై జరిపిన దాడులలో 15 మంది ఆదేశ సైనికులు మృతి చెందినట్లు బిఎల్‌ఎఫ్ అధికార ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. డిసెంబర్ 23న కేచ్ జిల్లా తేజ్‌బాన్ ఆర్మీ పోస్టుపై జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం డిసెంబర్ 25వ తేదీన పంజూర్ జిల్లాలో చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ వద్ద మిలటరీ వాహనంపై రిమోట్ కంట్రోల్ ఎక్స్‌ప్లోసివ్స్‌తో దాడులు జరిపామని ఆ ఘటనలో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మృతిచెందగా నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.

    అదే విధంగా పాకిస్థాన్ సెక్యూరిటీ వెహికిల్స్ పై చేసిన దాడిలో ఐదుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ఈ ఆదివారం మరో దాడి చేసి ఆ దేశ కమ్యూనికేషన్ టవర్స్‌ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ స్వాతంత్ర్యం సాధించేవరకూ ఈ పోరాటాన్ని ఆపేది లేదని బీఎల్ఎఫ్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

    1948లో పాక్‌లో బలూచిస్థాన్ విలీనం చేసే సందర్భంలో ఆ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ బలంవంతంగా ఆప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపారు. అప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి స్వతంత్ర్యం కోసం బలూచిస్థాన్ ప్రాంత వాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బలూచ్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఆప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని అక్కడి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ పై బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను తీవ్రతర చేసింది.

  • లకురవా..! ఒకప్పుడు నైజీరియాలో దోపిడీ దొంగల నుంచి గ్రామీణులను కాపాడతారనే పేరున్న ఈ ముఠా సభ్యులు.. క్రమంగా కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌తో జతకట్టారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలో పాగా వేశారు. ఇప్పుడు పెద్దన్న...... అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా మారారు. అందుకే ట్రంప్ క్రిస్మస్ రోజున ‘హ్యపీ క్రిస్మస్’ సందేశమిస్తూ.. నైజీరియా వాయవ్య సరిహద్దుల్లోని సోకోటో రాష్ట్రంలో ఐఎస్ ఉగ్రవాదులను టార్గెట్‌గా చేసి, దాడులు జరిపిన విషయాన్ని బహిర్గతం చేశారు. ఏమిటా లకురవా ముఠా? ట్రంప్ వారిపై ఎందుకు కక్షకట్టాడు?? 

    లకురవా అంటే రిక్రూటింగ్ అని అర్థం. 2016-17 మధ్యకాలంలో లకురవా ముఠా టంకాసాలోని గోంగానో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాలపై దాడులు జరిపి, దోపిడీలకు పాల్పడే మూకల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేది. తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడే ఈ గ్రామాలను దోచుకునే బందిపోట్ల పీచమణిచేది. వ్యవసాయాధారితమైన ఈ గ్రామాల్లో రాజకీయ అస్థిరతకు తోడు.. నైజీరియా సైన్యం రక్షణ లేకపోవడంతో.. దోపిడీదారులు విజృంభించేవారు. ఈ పరిస్థితుల్లో నైజర్, మాలి నుంచి వచ్చిన కొంతమంది యువకులు దోపిడీదారులపై ఎదురుదాడి చేశారు. గ్రామస్థులు కూడా వీరికి మద్దతిచ్చారు. 2018 నాటికి ఈ ముఠా శక్తిమంతమైంది. 

    తమ ముఠాకు లకురవా అని నామకరణం చేసింది. స్థానికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని స్థిరపడింది. ఆ తర్వాత.. తన నిజస్వరూపాన్ని బయటపెట్టడం ప్రారంభించింది. ఇస్లామిక్ నిబంధనలను అమలు చేయడం మొదలు పెట్టింది. మ్యూజిక్ వినేవారికి కొరడాలతో శిక్షలు విధించింది. 2023 నాటికి లకురవా ముఠా.. సోకోటోలోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. గతంలో ఈ ప్రాంతాలను బెంబేలెత్తించిన దోపిడీదారులను మించి.. ప్రజలను హింసించడం మొదలు పెట్టింది. క్రమంగా క్రూరత్వానికి మారుపేరుగా లకురవా మారిపోయింది. గ్రామాలపై పన్నులు విధించి.. దారుణంగా వసూలు చేసేది. దాదాపు 500 గ్రామాల్లో లకురవా పాగా వేసింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వచ్చే నైజీరియా సైన్యంపై అత్యంత క్రూరంగా దాడులు జరిపేది.

    క్రమంగా లకురవా ముఠాలు రిక్రూట్‌మెంట్లను తీవ్రతరం చేశాయి. 18-35 ఏళ్ల యువకులను ఆకట్టుకున్నాయి. తమతో జతకట్టే యువకుల కుటుంబాలకు డబ్బులివ్వడమే కాకుండా.. వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, విత్తనాలను అందజేసేది. అలా.. దారుల్ ఇస్లాం అనే పేరుతో శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. దీంతో.. నైగర్, నైజీరియా సైన్యాలు చర్యలకు ఉపక్రమించాయి. 2024 నవంబరులో ఈ రెండు దేశాలు లకురవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీంతో లకురవా ఉగ్రదాడులను మరింతగా పెంచింది. అదే నెలలో కేబ్బీలోని మెరా అనే గ్రామంపై దాడి చేసి, 25 మంది గ్రామస్థులను హతమార్చింది.

    లకురవాను ఉగ్రసంస్థగా ప్రకటించడానికి సరిగ్గా రెండు నెలల ముందు.. అంటే.. 2024 సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి ఓ కీలక సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. లకురవా నేతలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారనేది ఆ సమాచారంలో ప్రధానాంశం. ఐఎస్‌లో చేరి ఐఎస్‌జీఎస్.. అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ద గ్రేటర్ సహారాను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అంతేకాకుండా.. ఐఎస్ నుంచి అధునాతన ఆయుధాలు, డ్రోన్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలను సేకరించింది. ఐఎస్‌జీఎస్ ఇప్పుడు బోకోహరామ్‌తో కూడా చేతులు కలిపే ప్రమాదాలున్నట్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

     

    ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో.. లకురవా మాత్రం అరాచకాలను మరింత పెంచింది. క్రైస్తవులు అధికంగా ఉండే గ్రామాలను టార్గెట్‌గా చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను టార్గెట్‌గా చేసుకుంది. లకురవా చర్యలపై ఉప్పందుకున్న అమెరికా రంగంలోకి దిగింది. ఈ ఏడాది నవంబరు నుంచే అమెరికా గూఢచర్య సంస్థలు వాయవ్య నైజీరియాలో నిఘాను పెంచినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ కూడా ఈ నెల 22న ఓ కథనాన్ని ప్రచురించింది. 

    అందుకు తగిన ఆధారాలుగా అమెరికా సైన్యం ఫైటర్ జెట్ల రాకపోకలకు సంబంధించిన ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను పాఠకుల ముందుంచింది. అంతేకాదు.. క్రైస్తవులపై హింస పెరుగుతుండడంతో మత అసహన దేశాల జాబితాలో నైజీరియాను ట్రంప్ ప్రభుత్వం చేర్చింది. అయితే.. క్రిస్మస్ సందర్భంగా ట్రంప్ ప్రపంచానికి షాకిచ్చారు. నైజీరియా వాయవ్య ప్రాంతంలోని బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపినట్లు ప్రకటించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకే ఈ దాడులు జరిపానంటూ తననుతాను సమర్థించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతంచేస్తానని ప్రతినబూనారు.

    లకురవా అరాచకాలు ఒక్కటని చెప్పలేం. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో కూడా క్రిస్మస్ రోజున దాడులు జరిపింది. కొన్ని వారాల క్రితం ఉత్తర నైజీరియాలో ఓ క్యాథలిక్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, 300 మంది పిల్లలను అపహరించింది. నైజీరియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక అపహరణ ఉదంతం. చాలా మంది పిల్లలను ఆ తర్వాత విడుదల చేసినా.. మిగతావారెక్కడ? అనేదానిపై స్పష్టత లేదు. ఓ క్రైస్తవ మిషనరీ సంస్థ కోసం పనిచేసే ఓ పైలట్ కూడా ఇటీవల అపహరణకు గురయ్యారు. 

    నైజీరియాలో ముస్లిం-క్రిస్టియన్ల జనాభా దాదాపుగా చెరిసగం ఉంటుంది. ఈ నేపథ్యంలో నైజీరియాలో క్రైస్తవులపై దాడులు కొనసాగితే.. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఆ మేరకే క్రిస్మస్‌కు ముందు సోకోటోలోని అనేక ఉగ్రవాద స్థావరాలను అమెరికా, నైజీరియా సైన్యాలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. ఈ ఉదంతాన్ని బహిర్గతం చేస్తూనే ట్రంప్ ‘హ్యాపీ క్రిస్మస్’ అంటూ పోస్టు చేశారు. ట్రంప్ పట్టుదలను చూస్తుంటే.. నైజీరియాలో అమెరికా సైన్యాన్ని మరింతగా మోహరించి, మున్ముందు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
    -హెచ్.కమలాపతిరావు

  • బంగ్లాదేశ్‌ హింసతో అట్టుడుకుపోతుంది. అక్కడి హిందువుల టార్గెట్‌గా జరుగుతున్న దాడులు భారత్‌ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆదేశంలోని మతఛాందస వాదులు అక్కడి ఇద్దరు హిందు యువకులని అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటన మరవకముందే మరో ప్రమాదం వెలుగు చూసింది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో హిందువులకు చెందిన ఐదు గృహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.

    షేక్ హాసీనా బంగ్లాను వీడి భారత్‌లో ఆశ్రయం పొందిన నాటి నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత తీవ్రరూపం దాల్చింది. ఇదే అనువుగా భావించిన అక్కడి టెర్రరిస్టు గ్రూపులు, మత ఛాందస సంస్థలు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ హిందు కుటుంబాలపై దాడులు జరిగిన ఘటనలు దాదాపు 71కి పైగా నమోదయ్యాయి. ఈ విషయాలను స్వయంగా బంగ్లాదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకటించింది. అధికారిక నివేదికలే ఇలా ఉన్నాయంటే ఇంకా అనధికార ఘటనల వివరాల సంగతులు ఏలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

    అయితే డిసెంబర్ 28 ఆదివారం ముస్లిం సామాజిక వర్గం అధికంగా గల ఫిరోజ్‌పుర్ జిల్లా దుమ్రితల గ్రామంలో ఘోరం జరిగింది. హిందూ సామాజిక వర్గానికి వ్యక్తులకు సంబంధించిన ఐదు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఐదు ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియలేదు.

    ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడుతూ "మేము ఉదయం లేచే సరికి ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాము. అయితే బయిటినుంచి ఎవరో తలుపులు లాక్ చేశారు. దీంతో వెనుకనుంచి బాంబో ఫెన్సింగ్‌ను తెంపి తప్పించుకోగలిగాం. మా ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు జంతువులు చనిపోయాయి". అని కన్నీటి పర్యంతమయ్యారు.

     

    అగ్నిప్రమాద వివరాలు తెలుసుకున్న ఫిరోజ్‌పుర్ ఎస్పీ మంజూర్ అహ్మద్ సిద్దీఖీ ఘటన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం చేస్తామని ఇప్పటికే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ ఘటనపై ఎన్డీటీవీ ప్రతినిధులు ఢాకాలోని బాధితులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.  బాధితులు భయంగా ఉన్నారని ప్రమాద వివరాలను రికార్డింగ్‌లో తెలపాలని కోరగా వారు నిరాకరించినట్లు  పేర్కొన్నారు.
      
     


     

  • జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా శివార్లలోని ఒక ప్రైవేట్ వృద్ధాశ్రమంలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 16 మంది వృద్ధులు సజీవ దహనమయ్యారని అధికారులు ధృవీకరించారు. ప్రమాదం నుంచి మరో 15 మందిని అక్కడి సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. తూర్పు జకార్తాలోని ‘కాసిహ్ సయాంగ్’ వృద్ధాశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    ప్రమాదం జరిగిన సమయంలో  ఆశ్రమంలోని వృద్ధులంతా గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
    తూర్పు జకార్తా అగ్నిమాపక, రక్షణ విభాగం అధిపతి గటోట్ సులేమాన్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. చనిపోయిన 16 మందిలో 10 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా 65 నుండి 85 ఏళ్ల మధ్య వయస్సు గలవారని’ ఆయన వివరించారు.

    ప్రమాదం నుంచి బయటపడిన 15 మందిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని చికిత్స  కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. సుమారు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వంటగదిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. వృద్ధాశ్రమంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించారా లేదా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జకార్తా తాత్కాలిక గవర్నర్ హెరు బూడి హర్తోనో సందర్శించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

    ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో ‘నేరాలు- ఘోరాలు’.. ‘సాక్ష్యం’ తెచ్చిన పంజాబీ?

National

  • ''ఇలాంటిది మరెవరికీ జరగకూడదు. ఇది ఎంతమాత్రం ఆమోద్య‌యోగ్యం కాదు. మ‌రే బిడ్డా ఇలా చ‌నిపోకూడ‌దు'' అంటూ తీవ్ర మ‌నోవేద‌న చెందారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్ తరుణ్ ప్రసాద్ చక్మా. త‌మ‌కు న్యాయం చేయాల‌ని, క‌డుపుకోత మిగిలిచ్చిన బాధ్యుల‌కు మరణశిక్ష విధించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన జాతి వివక్ష దాడిలో త‌న పెద్ద‌ కుమారుడు ఏంజెల్ చక్మా ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆయ‌నీ విధంగా స్పందించారు. జాతి వివక్ష పేరుతో దాడులు చేయ‌డం దారుణ‌మ‌ని ఖండించారు. దేశంలో ఇలాంటి దాడులు ఇంత‌కుముందెన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.  

    అస‌లేం జ‌రిగింది?
    త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఏంజెల్ చక్మా (Anjel Chakma).. డెహ్రాడూన్‌లోని యూనివ‌ర్సిటీలో ఎంబీఏ చ‌దువుతున్నాడు. డిసెంబర్ 9న త‌న త‌మ్ముడితో క‌లిసి స‌రుకులు కొనేందుకు బ‌య‌ట‌కు వెళ్లాడు. కొంత మంది వారిని ఉద్దేశించి జాతివ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేస్తూ, దుర్భాష‌లాడారు. అంతేకాదు వారిని చైనీయులుగా భావించి మ‌రింత రెచ్చిపోయారు. తాము ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన వారమ‌ని, చైనీయులం కాద‌ని ఎంత చెప్పినా దుండ‌గులు వినిపించుకోలేదు. దీంతో అంజెల్ చక్మా.. వారిని వారించే ప్ర‌య‌త్నంగా చేయ‌గా అత‌డిపై దాడికి తెగ‌బ‌డ్డారు. ప‌దునైన ఆయుధంతో మెడ‌, క‌డుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాల‌పాలైన అత‌డిని స‌మీపంలోని గ్రాఫిక్ ఎరా ఆసుపత్రికి త‌ర‌లించారు. 17 రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఏంజెల్.. ఈనెల 26న ప్రాణాలు విడిచాడు. అత‌డు చివ‌రిగా అన్న మాట‌లు ''మేము చైనీయులం కాదు. మేము భార‌తీయులం''.  

    జాత్యాంహ‌కార దాడికి నిర‌స‌న‌
    త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మా మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. జాత్యాంహ‌కార దాడుల‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ పార్టీల‌తో పాటు ప్ర‌జ‌లు గ‌ళ‌మెత్తారు. జాతి వివ‌క్ష వ్య‌తిరేక చ‌ట్టం తేవాలంటూ త్రిపుర‌లో ఆందోళ‌నలు చేప‌ట్టారు. సోష‌ల్ మీడియాలో #JusticeForAnjelChakma హ్యాష్‌టాగ్‌తో గ‌ళం విన్పిస్తున్నారు.

    విద్వేష‌దాడులు ప్ర‌మాద‌క‌రం: రాహుల్ గాంధీ
    డెహ్రాడూన్‌లో జ‌రిగిన జాత్యాహంకార ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పాల‌న‌లో విద్వేష‌దాడులు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. డెహ్రాడూన్‌లో అంజెల్ చక్మా,అతని సోదరుడు మైఖేల్‌పై జ‌రిగిన దాడిని భయంకరమైన ద్వేషపూరిత నేరంగా ఆయ‌న పేర్కొన్నారు. విద్వేష దాడులు దేశానికి ప్ర‌మాద‌క‌ర‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

    చ‌ద‌వండి: మ‌మ్మ‌ల్ని జైలులో పెట్టండి.. బాధితుల మొర‌

    క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు: ధామి
    ఏంజెల్ చక్మాపై దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ కుమార్ ధామి (Pushkar Singh Dhami) ప్ర‌క‌టించారు. ఏంజెల్ తండ్రి తరుణ్ ప్రసాద్ చక్మాతో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీయిచ్చారు. ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశామ‌ని, మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నాడ‌ని తెలిపారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి కూడా త‌న‌తో మాట్లాడార‌ని వెల్ల‌డించారు. ఏంజెల్ చక్మా కుటుంబానికి అన్నివిధాలా అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. 

  • పథనంతిట్ట: శబరిమల ఆలయంలో ఆరోపణలు వెల్లువెత్తిన యోగా దండం, జపమాల మరమత్తుల కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. అసలు యోగా దండం, జప మాల స్థానంలో కొత్త వస్తువులు పెట్టారని నిందితుల్లో ఒకరు చేసిన ప్రకటనను అనుసరించి ఈ చర్య తీసుకుంది.

    2014 నాటి అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్ను కోరుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ విస్తృత దర్యాప్తు జరుగుతోంది. 2019 ఏప్రిల్లో విషు పండుగ సందర్భంగా ఎ. పద్మకుమార్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. మరమ్మతులను ఆయన కుమారుడు అందించాడని చెప్పుకున్నారు. దేవస్వం బోర్డు సన్నిధానం (ఆలయ ప్రాంగణం) వద్ద పనులు జరిగాయని పేర్కొంది.

    జూలై 2019లో బంగారు పూత కోసం ద్వారపాలక (సంరక్షక దేవత) శిల్పాలను తొలగించే ముందు మరమ్మతులు జరిగాయి. మార్చి 16 , 2019 నాటి దేవస్వం బోర్డు నిర్ణయం ప్రకారం , యోగా దండను బంగారంతో చుట్టడానికి బయటకు తీసుకెళ్లారు. మరమ్మతులు చేపట్టే బాధ్యతను జయశంకర్ పద్మన్‌కు అప్పగించారని కూడా ఈ నిర్ణయంలో పేర్కొన్నారు.

    యోగా దండం, రుద్రాక్ష మాల అనేవి గర్భగుడి లోపల ప్రత్యేకంగా ఉంచబడిన పవిత్ర వస్తువులు. ఆలయ ప్రతిష్ట సమయంలో పండలం ప్యాలెస్ మొదట యోగా దండను అందించేది.

    సన్నిధానంలో మరమ్మతులు హైకోర్టు అనుమతితో జరిగాయని అధికారులు పేర్కొన్నప్పటికీ, రికార్డులలో పని జరిగిన ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం లేదా కోర్టు ఆర్డర్ నంబర్ వంటి వివరాలను అందించకపోవడంతో సిట్ ఆందోళన వ్యక్తం చేసింది.

    మరమ్మతులను డాక్యుమెంట్ చేసే మహాజర్ను ఏప్రిల్ 14 , 2019న తయారు చేశారు. దీనిలో అప్పటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ప్రస్తుతం జైలులో ఉన్న) మురారి బాబు , ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. సుధీష్ కుమార్ మరియు తిరువాభరణం కమిషనర్ కె. ఎస్. బైజు సంతకాలు ఉన్నాయి. ఈ అధికారులలో ఒకరి ప్రకటనలు సిట్ యోగా దండ సమస్యను నిశితంగా పరిశీలించడానికి కారణమయ్యాయని వర్గాలు తెలిపాయి.

    మహాజర్ ప్రకారం , యోగా దండపై ఉన్న బంగారు ఉంగరాలు మొదట్లో 19.2 గ్రాముల బరువు ఉండేవి. తరువాత , 18 ఉంగరాలు మరియు బేస్ వద్ద బంగారు టోపీని తయారు చేయడానికి 44.54 గ్రాముల బంగారాన్ని ఉపయోగించారు. రుద్రాక్ష మాలను చింతపండుతో కడిగి శుభ్రం చేశారని కూడా పత్రం పేర్కొంది.

    సాంప్రదాయ ఆలయ కళాకారుల కుటుంబానికి చెందిన ఆలయ శిల్పి తట్టవిల మహేష్ పనికర్ మాట్లాడుతూ, అసలు యోగా దండ ఎబోనీ (కరుంగలి) కలపతో తయారు చేయబడిందని మరియు దాని స్థానంలో బంగారంతో చుట్టబడిన వెదురు కర్రను ఉంచారని ఆరోపించారు. కాగా, 2018 నుంచే శబరిమల అయ్యప్ప ఆలయంలోని యోగదండం, ఏకముఖీ రుద్రాక్షల మాల మిస్సయినట్లు క్రైమ్ బ్రాంచఠ్ భావిస్తోంది. అప్పట్లో యోగదండాన్ని బంగారు పూత కోసం తరలించారు. అలా తరలించడం ఆలయ ఆభరణాల స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్‌(మజహర్ రికార్డు)లో నమోదు కాలేదు. అప్పట్లోనే అత్యంత ఖరీదైన పురాతన ఏకముఖీ రుద్రాక్షల మాలను కూడా బంగారు పూతకు తీసుకెళ్లారు. హైకోర్టు అనుమతి లేకుండానే.. ఓ అధికారి వీటిని బయటకు పంపేందుకు అనుమతినిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

    (చదవండి: శబరిమల యోగదండం మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఈడీ)

     

  • న్యూఢిల్లీ: అరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని పరిమితం చేస్తూ, గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. సముద్ర మట్టం నుండి కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న భూభాగాలను మాత్రమే అరావళి పర్వతాలుగా పరిగణించాలంటూ, ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు కోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, తన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది.

    గత నవంబర్ 20న సుప్రీంకోర్టు.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించిన నిర్వచనాన్ని ఆమోదించింది. దీని ప్రకారం స్థానిక భూతలానికి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలనే అరావళి శ్రేణిగా గుర్తించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఎత్తును ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు 90 శాతం అరావళి ప్రాంతం రక్షణ కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారుతుందని వారు  పేర్కొన్నారు.

    ఈ వివాదాస్పద నిర్వచనంపై పలు విమర్శలు  వచ్చిన దరిమిలా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తిరిగి విచారించాలని నిర్ణయించింది. థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అరావళి పర్వతాలు ఒక రక్షణ కవచం మాదిరిగా  ఉపకరిస్తున్నాయని, దేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణులైన వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది. కాగా గతంలో సర్వే ఆఫ్ ఇండియా సహాయంతో మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తాజా స్టే ఆర్డర్ నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోనుంది. సోమవారం జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఆరావళి’పై విచారణ జరిపింది.

    ఇది కూడా చదవండి: Indonesia: అగ్నిప్రమాదం.. 16 మంది వృద్ధులు సజీవ దహనం

NRI

  • హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో  వేడుకలు ఘనంగా జరిగాయి.

    కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.

    ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

    జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.

    తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ షో నిర్వహించారు.

    రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.