Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సాక్షి చెన్నై:  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన అఖండ–2 చిత్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. ప్రీమియర్‌ షో గురువారం రాత్రి ప్రదర్శించాల్సి ఉండగా దానిని రద్దుచేసినట్లు తెలిపింది. మద్రాసు హైకోర్టు నుండి వచి్చన తాజా ఉత్తర్వుతో విడుదలకు బ్రేక్‌ పడింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో సినిమా విడుదల వాయిదా పడింది.

    14 రీల్స్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై అనుబంధ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ (ఈరోస్‌) వేసిన అప్పీల్‌ను హైకోర్టు పరిశీలించి ఈమేరకు ఆదేశించింది. ఈ రెండు సంస్థల మధ్య పాత ఆర్బిట్రేషన్‌ కేసు కొనసాగుతోంది, ఇందులో ఈరోస్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆ ఆర్బిట్రేషన్‌ ప్రకారం.. ఈరోస్‌కు దాదాపు రూ.28 కోట్లతో పాటు, అసలు చెల్లింపు తేదీ వరకు 14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది.

    ఇక కోర్టు స్పష్టంచేసిన మేరకు అఖండ–2ను ఏ రూపంలోనైనా విడుదల చేయాలంటే.. థియేటర్లు, ఇంటర్నెట్, ఉపగ్రహం లేదా ఏ ఇతర వాణిజ్య ప్లాట్‌ఫారం అయినాసరే ఈరోస్‌కు మొత్తం ఆర్బిట్రల్‌ అవార్డు మొత్తాన్ని చెల్లించాలి. ఈ చెల్లింపు పూర్తయ్యే వరకు విడుదల పూర్తిగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అఖండ–2 విడుదలైతే ప్రమోటర్లు పాత రుణ బాధ్యతలను పరిష్కరించకుండా వాణిజ్య లాభాలు ఆర్జించే అవకాశముందని ఈరోస్‌ కోర్టుకు తెలిపింది.   

    • మాల్దీవుస్‌ ఫోటోలు షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్..
    • అబుదాబిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ చిల్..
    • వేకేషన్‌లో బిజీగా హీరోయిన్ రీతూ వర్మ..
    • నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్ క్యూట్ లుక్స్..
    • ఎల్లో శారీలో అనసూయ హోయలు..

     

     

     

     

     

     

     

     

  • పుష్ప సంధ్య థియేటర్ ఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఈ విషాద ఘటన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన భాస్కర్‌ సతీమణి రేవతి (35) కన్నుమూయగా, వారి కుమారుడు శ్రీతేజ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు.  భాస్కర్‌ కుటుంబానికి సాయం, శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. భాస్కర్‌, ఆయన సోదరుడితో కలిసి మాట్లాడారు.

    దిల్ రాజు మాట్లాడుతూ..'గతేడాది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో భాస్కర్‌ కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం  కోలుకుంటున్నాడు.  అల్లు అర్జున్‌ ముందుకు వచ్చి శ్రీతేజ్ పేరుపై రూ.2కోట్లు డిపాజిట్‌ చేశారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీతో నెలకు రూ.75వేలు భాస్కర్‌ కుటుంబ ఖర్చులు, శ్రీతేజ్‌ ఆస్పత్రి బిల్లులకు వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ రూ.75 లక్షలు ఇప్పటికే చెల్లించారు. ఇంకా అదనపు సహకారం కావాలని భాస్కర్‌ అడుగుతున్నారు. ఈ విషయాన్ని బన్నీకి తెలిపా' అని దిల్‌ రాజు అన్నారు.
     

    శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ మాట్లాడుతూ..  'ఆ రోజు నుంచి ఇప్పటివరకూ అల్లు అర్జున్‌, బన్నివాస్‌ల సపోర్ట్‌  ఉంది. ఇంకా అదనపు సాయం కావాలని దిల్ రాజు సార్‌కు చెప్పా. బాబుకు ఆర్నెల్ల పాటు రిహాబిలిటేషన్‌ కొనసాగాల్సి ఉంది. ఇదే విషయాన్ని దిల్‌రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చులు గురించి కూడా చెప్పా. అల్లు అర్జున్‌ సార్‌తో మాట్లాడినందుకు దిల్‌ రాజుకు ధన్యవాదాలు' అని అన్నారు.

  • చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద హడావుడి మామూలుగా ఉండదు. కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ నటించిన అఖండ-2 బాక్సాఫీస్ సందడి చేయనుంది. దీంతో పాటు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌ రిలీజవుతోంది. రెండు కూడా అగ్ర హీరోలు కావడంతో సినీ ప్రియుల్లోనూ అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

    ఇక ఫ్రైడే వచ్చిందంటే చాలు.. థియేటర్‌ మూవీస్‌తో పాటు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుంటాయి. అలా ఈ శుక్రవారం పలు సూపర్ హిట్ మూవీస్ రెడీ అయిపోయాయి.  వీటిలో రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటితో పాటు ధూల్ పేట్‌ పోలీస్ స్టేషన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌, డబ్బింగ్ చిత్రాలు, హాలీవుడ్ మూవీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


    నెట్‌ఫ్లిక్స్

    •   ద గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు మూవీ) - డిసెంబరు 05

    •    జే కెల్లీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 05
    •    స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05
    •    ద న్యూయర్కర్ ఎట్ 100 (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 05
    •    ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్ట్‌మస్‌-2-డిసెంబరు 05
    • ది బ్యాడ్ గాయ్స్- బ్రేకింగ్ ఇన్- (యానిమేషన్ సిరీస్)- డిసెంబర్ 06

      ఆహా

    •    ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 05

    జియో హాట్‌స్టార్

    •    డీయస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 05

    జీ5

    •    ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు సినిమా) - డిసెంబరు 05

    •    ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ సిరీస్) - డిసెంబరు 05

    •    బే దునే తీన్ (మరాఠీ సిరీస్) - డిసెంబరు 05

    •    పరియా(బెంగాలీ యాక్షన్‌ థ్రిల్లర్)- డిసెంబరు 05


    సోనీ లివ్

    •    కుట్రమ్ పురిందవన్ (తమిళ సిరీస్) - డిసెంబరు 05


    సన్ నెక్స్ట్

    •    అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ సినిమా) - డిసెంబరు 05

    ఆపిల్ టీవీ ప్లస్

    •    ద ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 05

     

  • కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రముఖ నిర్మాత శరవణన్ పార్థీవదేహనికి నివాళులర్పించిన ఆయన.. తనలోని బాధను ఆపుకోలేకపోయారు. శరవణన్ మృతిని తలచుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

    దిగ్గజ నిర్మాతగా శరవణన్.. 

    నిర్మాత శరవణన్ మృతితో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 300 వందల సినిమాలను నిర్మించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించారు. ఎంజీఆర్‌, శివాజీ, జెమిని గణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్‌, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించారు.

    ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్‌. ఆయన శరవణన్‌ తండ్రి. మద్రాస్‌(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్‌ తొలినాళ్లలో సరస్వతి సౌండ్‌ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్‌ లిమిటెడ్‌, ప్రగతి స్టూడియోస్‌..  మేయప్పన్‌( ఏవీ మేయ్యప్ప చెట్టియార్‌) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్‌ తర్వాత శరవణన్‌ ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. 
     

     

  • నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. అఖండ 2:తాండవం ప్రీమియర్స్‌ షోలు క్యాన్సిల్‌ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్‌ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్‌ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం  అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్‌ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్‌ 4న ప్రీమియర్స్‌  వేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్‌ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్‌ షాకిచ్చారు. 

    “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్‌ చేసింది.  అయితే ఓవర్సీస్‌లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్‌ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. 

  • వైభవ్ కీలక పాత్రలో నటించిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'రణం అరం తవరేల్'. ఈ సినిమాకు షరీఫ్  దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ అభిమానులను ఆకట్టుకుంది. తమిళంలో హిట్ కావడంతో తెలుగులో ది హంటర్‌: చాప్టర్‌-1 పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది.

    తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారు ది హంటర్‌: చాప్టర్‌-1 చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు.  ఒక నగరంలో  జరిగిన వరుసగా హత్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఆ వరుస హత్యల వెనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? అనేది అసలు కథ. 
     

  • ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌  జంటగా నటించిన థ్రిల్లర్‌ మూవీ డ్రైవ్. ఈ మూవీకి  జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ఇవాళ రిలీజైన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సీన్స్ చూస్తే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా  కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓషో వెంక‌ర్ సంగీతమందించారు. 
     

  • సంగీత దర్శకుడు ఇళయరాజా,  మైత్రీ మూవీ మేకర్స్ మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన డ్యూడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలలో ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలను ఉపయోగించారు. దీంతో కాపీరైట్స్‌ వివాదం తలెత్తింది. గుడ్ బ్యాడ్ అగ్లీ  సినిమాలో ఇళయరాజా పాత పాటలను తన అనుమతి లేకుండా ఉపయోగించారని అందుకు గాను రూ 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

    ఇళయరాజాతో మైత్రీ మూవీస్‌ సయోధ్య కుదుర్చుకున్నట్లు సోషల్‌మీడియాలో కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఆయన పాటలను ఉపయోగించినందుకు గాను రూ.50 లక్షలు చెల్లించడానికి మైత్రీ మూవీస్‌ అంగీకరించినట్లు స‌మాచారం. అందుకోసం ఇళయరాజాకు సంబంధించిన న్యాయవాధిని వారు సంప్రదించారట. అయితే, ఈ అంశంపై అధికారికంగా  ఎవరూ ప్రకటించలేదు.
     

  • కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం వా వాతియార్. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో పోలీస్ అధికారి పాత్రలో కార్తీ నటించారు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. అన్నగారు వస్తారు అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అయితే తాజాగా ఈ చిత్రం ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్‌ అర్జున్‌లాల్‌ సుందర్‌దాస్ చెన్నై హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వావాతియార్ విడుదలపై మధ్యంతర స్టే విధించింది. రూ.21.78 కోట్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది.  ఈ మేరకు రిలీజ్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

     

     

  • దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు.  మిసెస్‌ వరల్డ్‌ టైటిల్‌ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్‌ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా  శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. 

    ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్‌ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే.  గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లో టచ్‌ పబ్‌ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్‌ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.

    ఈ నేపధ్యంలోనే  నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత  భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్‌ ఫ్రెండ్‌గా మారింది. మోడలింగ్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనర్‌గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా  ఇష్టపడేది. అలాగే ఫిట్‌నెస్‌ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.

    ఇప్పటికీ  సమంత కి  సినిమా ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటే సింగర్‌ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్‌ నుంచి రిలేషన్స్‌ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని  అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది.  విడాకుల తరువాత విపరీతమైన  ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో  శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. 

    సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్‌ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల  పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారింది.  సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్‌ చేసుకుంది.  శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. 

    ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి.

  • బాలయ్య మూవీ అఖండ-2 సినిమా టికెట్ల పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఏపీలో భారీగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించగా.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అనుమతులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 ఒక్కో టికెట్‌పై పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా డిసెంబర్ 4న ప్రదర్శించే ప్రీమియర్స్‌కు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ ఒక్క షోకు ఏకంగా రూ.600 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా ఇష్టమొచ్చినట్లుగా టికెట్ ధరలకు అనుమతులు ఇ‍వ్వడంపై సగటు సినీ ప్రియులు మండిపడుతున్నారు. 
     

    ఏపీలో భారీగా ధరల పెంపు.. 

    ఏపీలో ఇప్పటికే అఖండ-2 మూవీ టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. సింగిల్స్‌ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. ఏకంగా రూ.600 లుగా టికెట్ ధరలను నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సగటు సినీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


     

  • ‘పుష్ప2’ సినిమా ప్రీమియర్స్‌ నాడు జరిగిన తొక్కిసలాటలో గాయపడిన  శ్రీతేజ్‌ గురించి తాజాగా నిర్మాత బన్ని వాస్‌ మాట్లాడారు. ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. 'ఈషా' సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

    శ్రీతేజ్‌కు అందుతున్న సాయం గురించి బన్నివాస్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. బాబు శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల​్‌రాజు వంటి ఇతర పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్‌ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు  ఎక్కడ ఉంచాలి..?  ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం వంటి అంశపై ఏమైనా మాట్లాడాలంటే వాళ్లు వచ్చి మాతో మాట్లాడవచ్చు. మావైపు నుంచి ఏవైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం.  అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్‌ విషయం  చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం. అని అన్నారు.

  • వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్". ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ - నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. 

    మా చిత్రాన్ని పొయెటిక్ గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం...నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది అన్నారు.

    నటుడు బుగత సత్యనారాయణ మాట్లాడుతూ - నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కళ్లకు కట్టినట్లు మా డైరెక్టర్ ప్రసాద్  ఈ చిత్రంలో చూపించారు. ఆయన తన భుజాలపై ఈ సినిమాను వేసుకుని తెరకెక్కించారు. ఈ మధ్య చిన్న చిత్రాలే ఘన విజయాలు సాధిస్తున్నాయి. మా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

    నటుడు జోగారావు మాట్లాడుతూ - ఇటీవలే నేను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా కూడా నాకు నటుడిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చిన్న చిత్రాలను ఆదరించినప్పుడే మాలాంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ కు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. ప్రేక్షకులు, మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

    డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ - "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్ లో విజువల్ గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం అన్నారు.

  • సినిమా చూసేందుకు థియేటర్స్‌కి రండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్న ఈ రోజుల్లో.. నిర్మాత బన్నీ వాసు మాత్రం మా సినిమా చూసి ఇబ్బంది పడొద్దని కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే మా బాధ్యత కూడా కాదని ముందే చెబుతున్నాడు. అయితే ఈ హెచ్చరిక హార్ట్‌ వీక్‌ ఉన్నవాళ్లకి మాత్రమే అంటున్నాడు బన్నీవాసు. 

    లిటిల్‌ హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ వాసు(Bunny Vasu)..త్వరలోనే ‘ఈషా’ అనే హారర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్‌ మూవీ రాలేదని.. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా భయపడడం ఖాయమన్నారు.

    (చదవండి: భయపెట్టించే మరో హారర్‌.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’)

    ‘దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైన హంటింగ్‌ ప్లేస్‌ ఉందంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈషా సినిమా గురించి చెప్పినప్పుడు రొటీన్‌గానే ఉంటుందని కూర్చున్నాను. హారర్‌ సినిమాను ఎలా తెరకెక్కిస్తారనేది మాకు తెలుసు కాబట్టి.. సినిమా చూసినప్పుడు భయం కలగలదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను.  దెయ్యం మేకప్‌ ఎలా వేస్తారో, షూటింగ్‌ ఎలా చేస్తారో..ఇలా అన్ని  తెలిసిన నేను కూడా భయపడ్డాను. తెలిసి కూడా భయపడే సినిమా ఇది. 

    ఎడిటింగ్‌ మీద, సౌండింగ్‌ మీద ఎంతో గ్రిప్‌ ఉంటేనే ఇలాంటి సినిమా వస్తుంది. దర్శకుడు శ్రీనివాస్‌ చాలా అద్బుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. చివరి 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్‌ 12న థియేటర్స్‌కి  రండి భయపడి ఎంజాయ్‌ చేయండి. కొంచెం హార్ట్‌ వీక్‌ ఉన్నవాళ్లు మాత్ర దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైన అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెబుతున్నా..హార్ట్‌ వీక్‌ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే ఇబ్బంది పడతారు’ అని బన్నీ వాసు చెప్పారు. 

  • కెవ్వు కేక, చయ్యచయ్య చయ్యా, మున్నీ బద్నాం హూయి.. వంటి పాటలతో దుమ్ములేపింది మలైకా అరోరా. ఆకర్షణీయమైన అందం, అదిరే స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది. ఇటీవలే థామా సినిమాలోనూ 'పాయిజన్‌ బేబీ' పాటలో తళుక్కుమని మెరిసింది. ఐటం సాంగ్స్‌ స్పెషలిస్ట్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ పర్సనల్‌ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను చూసింది.

    పెళ్లి - విడాకులు
    ఓ కాఫీ యాడ్‌ షూట్‌లో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ను కలిసింది మలైకా. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే మరేం ఆలోచించకుండా పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు అర్హాన్‌ ఖాన్‌ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2015లో వీరిద్దరూ విడిపోయారు. 

    యంగ్‌ హీరోతో డేటింగ్‌
    అనంతరం తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్‌ చేసిన వీరు ఆ తర్వాత సడన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హర్ష్‌ మెహతా అనే వ్యాపారితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి ఇచ్చిన సలహాను ఎలా పెడచెవిన పెట్టిందో చెప్పుకొచ్చింది. 

    డేట్‌ చేసినవాడితో పెళ్లెందుకు?
    ఆమె మాట్లాడుతూ.. మా అమ్మ ఎప్పుడూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయమని చెప్తుండేది. ఫస్ట్‌ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేనదే చేశాను. నేను ప్రేమించిన మొదటి వ్యక్తినే పెళ్లాడాను. నా నిర్ణయాన్ని అమ్మ తప్పుపట్టింది. అప్పుడే  పెళ్లి చేసుకుంటే నీకోసం బయట ఏం దాగి ఉందో నీకెలా తెలుస్తుంది? అని కంగారుపడింది. ఏం కాదమ్మా.. అని సర్ది చెప్పాను. మేం ఏం చేయాలనుకున్నా సరే తనెన్నడూ అడ్డు చెప్పలేదు.

    మగవాళ్లను తప్పుపట్టరు
    కానీ ఈ ప్రపంచంలో మగవాడు ఏం చేయాలనుకున్నా ఎవరూ తప్పుపట్టరు. విడాకులు తీసుకున్నా.. తన వయసులో సగం ఏజ్‌ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సరే.. వావ్‌ అని పొగుడుతారు. అదే పని మహిళ చేస్తే మాత్రం ఆమెను నానామాటలంటారు. అంతెందుకు? ఆడవాళ్లు ధైర్యంగా నిలబడి ముందుకెళ్తుంటే కూడా చూసి ఓర్వలేరు అని మలైకా అరోరా (Malaika Arora) చెప్పుకొచ్చింది.

    చదవండి: టికెట్‌ టు ఫినాలే గెలిచేదెవరు?

  • తెలుగులో ప్రాపర్‌ హారర్‌ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కామెడీ హారర్‌ చిత్రాలు తరచు వస్తున్నాయి కానీ.. పూర్తిగా భయపెట్టే చిత్రాలేవి రావట్లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు ‘ఈషా’ వచ్చేస్తుంది.  త్రిగుణ్‌, హెబ్బాపటేల్‌ కీలక పాత్రల్లో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌కి శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

    ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌. సరికొత్త థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం రెండు సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్‌ చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఆత్మలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

Telangana

  • ఢిల్లీ పొగమంచు తెలుగు రాష్ట్రాలకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ హైదరాబాద్‌ కూడా ఇప్పుడు కాలుష్యపు ముప్పును ఎదుర్కొంటోంది, ఈ సంవత్సరం మొదటిసారిగా గాలి నాణ్యత (ఏక్యుఐ) ప్రమాదకరమైన ప్రాంతంలోకి జారుకుంటోంది. వాస్తవానికి, గత ఏడు రోజులుగా నగరపు  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌.. బెంగళూరు,  చెన్నై కంటే అధ్వాన్నంగా మారినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

    గత నవంబర్‌ 28న  నగరం సంవత్సరంలోనే అత్యంత కాలుష్యపు గాలి తాకిడిని చవి చూసింది.  కాలుష్య స్థాయిలు ‘తీవ్రమైన‘ స్థితికి దగ్గరగా చేరుకోవడంతో  నగరంలోని పలు ప్రాంతాలు విషపూరిత పొగమంచుతో కప్పబడిపోతున్నాయి. అనేక స్టేషన్లలో గాలి నాణ్యత సూచిక (ఏక్యుఐ) 200 దాటింది. ఈ పరిమితి, రోజుకు 8–10 సిగరెట్లు తాగడం వల్ల కలిగే నష్టానికి సమాన స్థితిని ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

    హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఏక్యుఐ 209కి పెరిగింది, ఇది కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపు అయింది. ఐఐటిహెచ్‌ కంది 107 నుంచి 195కి పెరిగింది, అయితే గతంలోని 110 రీడింగ్‌ల తర్వాత సనత్‌నగర్‌ పైపైకి ఎగబాకి 206కి చేరుకుంది. జూ పార్క్,  ఐడిఎ పాశమైలారం ఒక్కొక్కటి 204ను నివేదించాయి. పటా¯Œ చెరు కూడా 206 వద్ద అధిక–ప్రమాదకర ప్రాంతాలలోనే ఉంది.

    ఇటీవల వరకు, నగరం ఒక మోస్తరు కాలుష్య స్థాయిల చుట్టూ ఉండేది, కానీ  ఇప్పుడు  ఊపిరితిత్తులను ఒత్తిడికి గురిచేసే, గుండె ఒత్తిడిని ప్రేరేపించే  దీర్ఘకాలిక శ్వాసకోశ హానిని వేగవంతం చేసే పరిస్థితులను నగరవాసులు  ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణుల హెచ్చరిస్తున్నారు.

    నగరానికి చెందిన ప్రముఖ పల్మోనాలజిస్ట్‌  డాక్టర్‌ అరుణ రెడ్డి మాట్లాడుతూ,  ‘అన్ని విధాల ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా  శ్వాస క్రియ ఇబ్బందిగా అనిపించే‘ దశలోకి నగరం ప్రవేశిస్తోందని అన్నారు. బయట తిరగడం, సరైన రక్షణ లేకుండా సంచరించడం ఇతర బహిరంగ కార్యకలాపాలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు తీవ్రమైన బాధ కలిగించేందుకు దారితీయవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.

    హైదరాబాద్‌ శివార్లలో వాహనాల విస్త్రుతి, నిర్మాణ ధూళి, పారిశ్రామిక ఉద్గారాలు  పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తోంది.  ఉపరితలానికి దగ్గరగా కాలుష్య కారకాలను బంధించడం ద్వారా కాలానుగుణ వాతావరణ నమూనాలు ఆ ప్రభావాన్ని బలోపేతం చేశాయి. ఐఎండి శాస్త్రవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణ ఉష్ణ–ద్వీప ప్రభావం వల్ల నగరంలో పెరుగుతున్న వేడి ‘భూస్థాయి ఓజోన్‌ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది ఇది మరో ప్రమాద పొరను జోడిస్తోంది’’ అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నివాసితులు బయట గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు ధరించాలని మరియు అటువంటి పరిస్థితులలో త్వరగా తీవ్రమయ్యే లక్షణాలను పర్యవేక్షించాలని అధికారులు సూచించారు.

  • సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు 42 శాతం కోటాను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారంటూ  ఒక యువకుడు నిప్పంటించుకున్న వైనం కలకలం రేపింది. గురువారం సాయంత్రం  హైదరాబాద్‌లోని  ఎమ్మెల్సీ  తీన్మార్‌ మల్లన్న ఆఫీసు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. 

    ఈరోజు (గురువారం) సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న నీ కలిసేందుకు వచ్చానని  చెప్పాడు. అయితే మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు అక్కడి సిబ్బంది.  

    అక్కడి నుండి కిందకి వచ్చిన  ఆయన Q న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నారు.
     

  • సాక్షి, నిర్మల్‌ జిల్లా: నిర్మల్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్‌ అభ్యర్థి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్వచింతల్‌లో బండారి రవీందర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి వరకు భార్య కోసం ప్రచారం చేసిన రవీందర్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. గెలుపుపై ఆందోళనతో ఆత్మహత్యా? లేక మరో కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    కాగా, రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, అతడి ఆత్మహత్యకు బెదిరింపులే కారణమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్‌ నగర్‌ మండలం కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన అవ శేఖర్‌(25) మంగళవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, రవి ఇటీవలే పంచాయతీ ఎన్నికల సందర్బంగా తన గ్రామంలో వార్డు మెంటర్‌గా పోటీ చేసి ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ క్రమంలో అతడిని ఎన్నికల్లో నుంచి తప్పుకోవాలనే బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.

     


     

  • సాక్షి, హైదరాబాద్: రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన శిక్షలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లే యాత్రికులు రైలులో పూజ సందర్భంగా కర్పూరం వెలిగించకూడదని సూచిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ఇది నేరమని వివరించారు. రైళ్లలో కర్పూరం వెలిగిస్తే.. రూ.1,000 వరకు జరిమానా, లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

    శబరిమల రైళ్లలో భక్తులు కర్పూరం వెలిగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో కర్పూరాన్ని వెలిగించడం నిషేధమన్నారు. రైలులో అగ్గిపుల్ల వెలిగించినా నేరమేనని చెప్పారు. ఇలాంటి చర్యలపై ప్రయాణికులు టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్ చేసి, సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు.

Business

  • టెక్ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధ(ఏఐ) కాదని, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించుకోవడమేనని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగ కోతలను సహజ దిద్దుబాటు(Natural Correction)గా అభివర్ణించారు.

    అతిగా నియామకాలు..

    1990 నుంచి ఐబీఎంలో వివిధ విభాగాలకు నాయకత్వ పాత్రలు నిర్వహిస్తున్న కృష్ణ 2020 నుంచి 2023 మధ్య చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 30% నుంచి 100% వరకు వేగంగా పెంచాయని వివరించారు. దాంతో కొంత సహజ దిద్దుబాటు జరగబోతోందని చెప్పారు.

    ఈ ఏడాది ఐబీఎం తన ప్రపంచ శ్రామిక శక్తిలో వేలాది ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తొలగింపులు ఏఐ కన్సల్టింగ్,  సాఫ్ట్‌వేర్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబీఎం 2,70,000 ప్రపంచ శ్రామిక శక్తిలో సింగిల్ డిజిట్ శాతంగా ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ వంటి అధిక లాభదాయకత గల వ్యాపారాలపై పెట్టుబడులను పెంచుతోంది.

    ఉద్యోగాలపై ఏఐ ప్రభావం

    ఉద్యోగాలపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావం గురించి అడిగినప్పుడు, కొంతమేర ఉద్యోగ స్థానభ్రంశం (Job Displacement) ఉంటుందని కృష్ణ అంగీకరించారు. అయితే అది తీవ్రంగా ఉండదని అన్నారు. ‘రాబోయే రెండేళ్లలో మొత్తం యూఎస్‌ ఉపాధి పూల్‌లో 10 శాతం వరకు ఉద్యోగ స్థానభ్రంశం ఉండవచ్చు’ అని అంచనా వేశారు. ఈ ప్రభావం కొన్ని విభాగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.

    కృత్రిమ మేధ కేవలం ఎంట్రీ లెవల్ శ్రమను తగ్గించడానికి మాత్రమే అనుసరించే విధానం అన్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్నందున కంపెనీలు కొత్త రకాల పాత్రల్లో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయని కృష్ణ తెలిపారు.

    ఇదీ చదవండి: యూఎస్‌లో చదువుకు రూ.10 కోట్లు!

  • అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనం (డెప్రిసియేషన్) తీవ్ర రూపం దాల్చింది. నేడు మార్కెట్లో ఒక డాలర్‌ విలువ సుమారు రూ.90.3గా నమోదైంది. దాంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 4.83% మేర క్షీణించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా అంతర్జాతీయ విద్యా ఖర్చులపై దీర్ఘకాలిక ప్రణాళిక గురించి భారతీయ కుటుంబాలను హెచ్చరించారు.

    రూపాయి విలువ 90 మార్కును దాటిన తర్వాత తన ఎక్స్‌ ఖాతాలో కరెన్సీ పతనం ప్రభావాన్ని వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో తమ పిల్లల చదువుల కోసం చూస్తున్న లక్షలాది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు.

    యూఎస్‌ డిగ్రీకి రూ.10 కోట్ల కార్పస్ ఎందుకు?

    మే నెలలో తాను పోస్ట్ చేసిన ఒక విశ్లేషణను గుప్తా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ‘గతంలో యూఎస్‌ ఎడ్యుకేషన్‌ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పినప్పుడు ఈ సంఖ్యపై చాలా సందేశాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు రూపాయి 90కి చేరుకున్న తర్వాత ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఆ పాత పోస్ట్‌లో ఆమె తన చిన్న కుమారుడు యూఎస్‌లోని డిగ్రీ చేయడం కోసం రూ.8-10 కోట్ల కార్పస్ (పెట్టుబడి నిధి) లక్ష్యంగా పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు.

    ‘ఈరోజు సుమారు రూ.2.5 కోట్లు ఖర్చవుతున్న యూఎస్‌ డిగ్రీ 16 సంవత్సరాల్లో దాదాపు రూ.10 కోట్లకు పెరుగుతుంది’ అని ఆమె లెక్కలను పంచుకున్నారు. ఇక్కడ కేవలం దేశీయ ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ఏటా 2-4% చొప్పున జరిగే కరెన్సీ డెప్రిసియేషన్‌ను కూడా లెక్కించాలని ఆమె సూచించారు. దేశీయ ఎగుమతులకు మద్దతు ఇవ్వడానికి పోటీ అవసరం కాబట్టి దీర్ఘకాలంలో కరెన్సీ తగ్గుదలను పరిగణించడం సురక్షితమైన ప్రణాళిక అని ఆమె చెప్పారు.

    విదేశీ ఆస్తుల్లో డైవర్సిఫికేషన్

    అంతర్జాతీయ ఆస్తుల్లో వైవిధ్యీకరణ ఉండాలని రాధికా గుప్తా సిఫారసు చేశారు. విదేశీ కరెన్సీలో ఖర్చు చేయబోయే కుటుంబాలకు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆ కరెన్సీకి లింక్ అయిన ఆస్తుల్లో ఉంచడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని తెలిపారు. అయితే, ఈ వైవిధ్యీకరణకు అడ్డంకిగా ఉన్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితుల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పరిమితులు చాలా మంది భారతీయులకు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను కష్టతరం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.

    గిఫ్ట్‌ సిటీ ద్వారా కొత్త మార్గాలు

    ఈ పరిమితులకు త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశం ఉందని గుప్తా సూచించారు. గిఫ్ట్‌ సిటీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. గుజరాత్‌లోని గ్లోబల్ ఇన్‌ఫర్మేషన్ అండ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిటీ (గిఫ్ట్‌ సిటీ) అనేది ఎల్‌ఆర్‌ఎస్‌ పరిమితులకు లోబడకుండా మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.

    ఇదీ చదవండి: 20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్‌!

  • ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉ​ండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్‌ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.

    ఏఐ వేగాన్ని సూపర్‌సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్‌గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.

    అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్‌ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.

    ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..

  • ప్రియమైన వ్యక్తి కష్టపడి, కన్నీళ్లను దాటి విజయం సాధించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అది కేవలం విజయం కాదు, ఏళ్లుగా పంచుకున్న కలలు, వెన్నుదన్నుగా నిలిచిన నమ్మకానికి దక్కిన ప్రతిఫలంగా నిలుస్తుంది. సరిగ్గా అలాంటి అపురూప క్షణమే ఢిల్లీకి చెందిన ఓపెన్‌సాక్స్.ఏఐ (Opensox.ai) వ్యవస్థాపకుడు అజిత్ జీవితంలో చోటుచేసుకుంది. ఆయన తమ్ముడు నాలుగేళ్ల శ్రమ తర్వాత యూట్యూబ్ నుంచి మొదటి సంపాదన అందుకున్నాడు. దీని వివరాలు అజిత్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

    అనుమానించినా నమ్మకం కోల్పోలేదు

    అజిత్ తన తమ్ముడి విజయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకున్నప్పుడు ఆ పోస్ట్ తక్షణమే వేలమంది దృష్టిని ఆకర్షించింది. ‘నా తమ్ముడు ఈ రోజు కోసం గత నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు’ అని చెప్పాడు. తన చుట్టూ ఉన్నవారంతా తమ్ముడిని అనుమానించినా  అజిత్‌ మాత్రం నిరంతరం అతనికి వెన్నుదన్నుగా నిలిచారు. ‘అతను తన కలలను పంచుకోవడానికి నేను మాత్రమే ఉన్నాను’ అని అజిత్ రాశారు. ‘ప్రతి ఒక్కరూ అతనిని చూసి నవ్వినప్పుడు తనకు అండగా నేను మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. యూట్యూబ్‌ ద్వారా తన తమ్ముడు నాలుగేళ్లు కష్టపడి రూ.9000 సంపాదించినట్లు ఉన్న స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. ఎంత డబ్బు అకౌంట్‌లో క్రెడిట్‌ అయిందనే విషయాన్ని పక్కనుంచితే ఈ పోస్ట్ భావోద్వేగ సంతృప్తిని కలిగించినట్లు చెప్పుకొచ్చారు.

    కష్టానికి దక్కిన ప్రతిఫలం

    తమ్ముడి విజయాన్ని ప్రకటించిన అజిత్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందించారు. ఒక వినియోగదారు తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ ‘ఎవరైనా యూట్యూబ్ వీడియోలు చేస్తే ప్రజలు ఎలాంటి పాయింట్ లేకుండా విమర్శిస్తారు. కానీ చాలా కష్టపడి పనిచేసిన తర్వాత బహుమతి పొందడం చాలా తృప్తిని ఇస్తుంది’ అన్నారు. మరొక వినియోగదారు ‘గత కొన్ని సంవత్సరాలుగా అతను చేసిన కృషికి ఇది ప్రతిఫలం. అతనికి ఆల్ ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు.

    ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..

  • పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలనే ఆశతో లక్షలాది మంది విద్యార్థులు ఏటా జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలను ఎదుర్కొని ఐఐటీల్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, సాంప్రదాయ విద్యా విధానంపై ఉన్న ఈ ఒత్తిడిని తగ్గించాలని, ఉద్యోగాలకు కాలేజీ డిగ్రీ అవసరం లేదని జోహో సీఈఓ, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

    శ్రీధర్ వెంబు తమ కంపెనీ జోహోలో ఏ ఉద్యోగానికీ కాలేజీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై డిగ్రీల కోసం ఒత్తిడి తేవడం మానుకోవాలని కూడా కోరారు.

    కాలేజీ డిగ్రీ ఎందుకు..?

    యూఎస్ ఆధారిత సంస్థ పాలంటిర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్‌లను నేరుగా కీలకమైన సాంకేతిక, జాతీయ భద్రతా ప్రాజెక్టులపై పనిచేయడానికి అనుమతిచ్చింది. ఈ కొత్త నియామక విధానంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ విధానంలో దాదాపు 500 మంది టీనేజర్లు దరఖాస్తు చేసుకోగా 22 మంది ఎంపికయ్యారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు డిగ్రీతో పనిలేకుండా నిజాయతీగా పని చేయాలని కోరుకునే యువతలో వస్తున్న సాంస్కృతిక మార్పును హైలైట్ చేశారు.

    ‘స్మార్ట్ అమెరికన్ విద్యార్థులు ఇప్పుడు కాలేజీకి వెళ్లడం మానేస్తున్నారు. ముందుచూపుతో ఆలోచించే కంపెనీల యజమానులు వారికి అవకాశం ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ ధోరణి వల్ల పేరెంట్స్‌ భారీ అప్పులు చేయకుండానే యువత తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని, చాలా కుటుంబాలు పిల్లల విద్య కోసం లక్షల రూపాయల రుణాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక సానుకూల పరిణామమని చెప్పారు.

    Sridhar Vembu X post

    తల్లిదండ్రులకు విజ్ఞప్తి

    ఈ పరిణామాలను గమనించాలని వెంబు ప్రత్యేకంగా భారతీయ తల్లిదండ్రులను, కంపెనీలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ‘విద్యావంతులైన భారతీయ తల్లిదండ్రులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రముఖ కంపెనీలు శ్రద్ధ వహించాలని నేను కోరుతున్నాను’ అని ఆయన అన్నారు. భారతదేశంలో తరతరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాలేజీ డిగ్రీలకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నైపుణ్యం ఆధారిత నియామకాల వైపు మార్పు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

    జోహో నియామక విధానం

    జోహో నియామక విధానాన్ని వివరిస్తూ వెంబు ‘జోహోలో ఏ ఉద్యోగానికి కాలేజీ డిగ్రీ అవసరం లేదు. కొంతమంది మేనేజర్లు డిగ్రీ అవసరమయ్యే ఉద్యోగాన్ని పోస్ట్ చేస్తే మీ వద్ద ఉన్న నైపుణ్యాలను క్లుప్తంగా వివరిస్తూ డిగ్రీ అవసరాన్ని తొలగించడానికి మర్యాదపూర్వకమైన సందేశాన్ని పంపండి’ అని తెలిపారు. తమిళనాడులోని కంపెనీ యూనిట్‌లో తాను సగటున 19 ఏళ్ల వయసు కలిగిన బృందంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. ‘వారితో కలిసి పనిచేయడానికి నేను చాలా కష్టపడాలి’ అని వెంబు ఆ యువత సామర్థ్యాన్ని కొనియాడారు.

    ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే..

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాలుగేళ్ల తర్వాత అధికారిక పర్యటన కోసం భారత్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట వచ్చే అత్యంత భద్రతా ప్రమాణాలున్న కారు ‘ఆరుస్ సెనాట్’(Aurus Senat) గురించి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సందర్శన రెండు దేశాల చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ‘రష్యన్ రోల్స్-రాయిస్’గా పిలువబడే ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలను చూద్దాం.

    పుతిన్ 2018 నుంచి ఉపయోగిస్తున్న ఈ సెనాట్‌ మోడల్‌ను రష్యన్ ఆటోమోటివ్ ఇంజిన్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. సోవియట్ కాలంలోని జీఐఎస్‌-110 లిమోజీన్‌ను పోలి ఉండే రెట్రో డిజైన్‌తో దీన్ని రూపొందించారు.

    ఆరుస్ సెనాట్ ప్రత్యేకతలు

    • ఆరుస్ సెనాట్ కారును ప్రధానంగా మిలిటరీ గ్రేడ్ భద్రతా వ్యవస్థల కోసం తయారు చేశారు. ఇది ప్రతి వైపు 20 మిల్లీమీటర్ల మందం గల బుల్లెట్‌ప్రూఫ్ ఆర్మర్‌ను కలిగి ఉంటుంది. ఇది కాల్పులను సమర్థవంతంగా తట్టుకోగలదు. అంతేకాకుండా దీని ఫ్లోర్, డోర్స్ బ్లాస్ట్-రెసిస్టెంట్‌గా తయారు చేశారు. గ్రెనేడ్ వంటి పేలుళ్లను కూడా తట్టుకుంటుంది.

    • ఈ కారులో అత్యవసర వ్యవస్థలు కూడా ఉన్నాయి. దీనికి అమర్చిన ప్రత్యేకమైన రన్-ఫ్లాట్ టైర్స్ కారణంగా టైర్లు పంక్చర్ అయినప్పటికీ కారు 50 కిలోమీటర్ల దూరం వరకు సురక్షితంగా ప్రయాణించగలదు. ఇంకేదైనా రసాయన లేదా గ్యాస్ దాడి జరిగినప్పుడు ప్రయాణీకులకు సురక్షితమైన గాలిని అందించడానికి ఇందులో ఆక్సిజన్ సప్లై సిస్టమ్, అగ్ని ప్రమాదం నుంచి రక్షించడానికి ఫైర్ సప్రెషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

    • భద్రతతో పాటు ఆరుస్ సెనాట్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన 598 హార్స్ పవర్ కలిగి ఉండి, 880 ఎన్‌ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తితో భారీ కారు అయినప్పటికీ కేవలం 6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

    • భద్రతా ఫీచర్లతోపాటు కారు లోపల అత్యంత లగ్జరీ, అధునాతన టెక్నాలజీతో నిండి ఉంటుంది. ఇందులో ప్లష్ లెదర్ ఇంటీరియర్ పుతిన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. హై-టెక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని విలాసవంతంగా చేస్తాయి.

    ఇదీ చదవండి: 300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు

  • హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కార్యాచరణ, సాంకేతిక సంబంధిత సమస్యల కారణంగా అనేక సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయి ప్రయాణ ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి.

    భోపాల్‌కు రూ.1.3 లక్షలు

    ఇండిగో కొన్ని విమానాలను రద్దు చేసుకున్న కారణంగా ఎయిర్ ఇండియా అనేక మార్గాల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెంచేసినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్-భోపాల్ మార్గంలో ఎయిర్ ఇండియా ఛార్జీలు దాదాపు రూ.1.3 లక్షలకు చేరుకోవడం ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని సంస్థలు వెల్లడించించిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి భోపాల్‌ వెళ్లే కనెక్టెడ్‌ ఫ్లైట్స్‌లో రాత్రిపూట టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

    • ఎకానమీ: రూ. 1.03 లక్షలు

    • బిజినెస్ క్లాస్: రూ. 1.3 లక్షలు

    ఎయిరిండియా పోర్టల్‌లో ఈ అత్యధిక ధరలున్నా కేవలం ఒక సీటు మాత్రమే మిగిలి ఉన్నట్లు చూపించింది.

    ఇండిగో విమానాల రద్దు ప్రభావం

    హైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఇండిగో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీనితో మిగిలిన విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌లో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. విమానాశ్రయ అథారిటీ సైతం ఈ అంతరాయాలను ధ్రువీకరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. అనేక ఇండిగో విమానాలు ‘విమానయాన సంబంధిత సాంకేతికత, కార్యాచరణ సమస్యల వల్ల రద్దు అయ్యాయి’ అని పేర్కొంది.

    ఇండిగో ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలను పర్యవేక్షించి ప్రయాణీకుల ఫిర్యాదులను సమీక్షించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇదీ చదవండి: రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..

  • గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.

    ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.

    ‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.

    ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం

  • ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్న రాబర్ట్ కియోసాకి.. దాన్నుంచి బయటపడి ధనవంతులు కావాలంటే ఏం చేయాలో 10 సూచనలు ఇస్తానన్నారు. వాటిలో మూడోది ఇప్పుడు వెల్లడించారు. మేరకురిచ్డాడ్పూర్డాడ్‌’ రచయిత తాజాగాఎక్స్‌’లో పోస్ట్చేశారు.

    ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటేనెట్ వర్క్ మార్కెటింగ్లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని సలహా ఇస్తున్నారు.

    కృత్రిమ మేధస్సు త్వరలో మిలియన్ల ఉద్యోగాలను తొలగిస్తుందని ఇటీవలి ట్వీట్లలో వాదించారు. ఇందులో సాంప్రదాయకంగా స్థిరంగా పరిగణించబడే లేదా చట్టం, వైద్యం, వినోదం వంటి విస్తృతమైన విద్య అవసరమయ్యే వృత్తులకు కూడా మినహాయింపు ఉండదన్నారు. కియోసాకి ప్రకారం.. ఈ మార్పు చాలా మందిని స్వయం ఉపాధి, ప్రత్యామ్నాయ ఆదాయ నమూనాల వైపు నెట్టివేస్తుంది.

    అల్లకల్లోలమైన ఆర్థిక వాతావరణంలో వృద్ధి చెందడానికి అవసరమైన ప్రధాన నైపుణ్యాలను పొందడానికి మల్టీ-లెవల్ మార్కెటింగ్ (MLM) అని కూడా పిలువబడే నెట్ వర్క్ మార్కెటింగ్ ఒక మార్గంగా నిలుస్తుందని కియోసాకి వర్ణిస్తున్నారు. అటువంటి వ్యాపారాలు అందించే అనేక ప్రయోజనాలను వివరించారు.

  • రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై అడుగు పెడుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్‌ రెండు రోజుల పర్యటన కోసం డిసెంబర్ 4న మన దేశానికి వస్తున్నారు. ఇందు కోసం భారత్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

    పుతిన్‌ భారత్‌ పర్యటనపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మోదీ-పుతిన్ ముఖాముఖి సంభాషణ జరుగుతోంది. దీంతో ఉత్సుకత మరింత పెరిగింది. దేశాధినేతలు పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు ఎంత ఖర్చు అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం..

    రూ.150 కోట్లు!
    భద్రతాపరమైన కారణాలతో సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయదు. అయినప్పటికీ మీడియా అంచనాలు, గత పర్యటనల వ్యయ నమూనాల ప్రకారం.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నిమిత్తం ప్రభుత్వానికి రూ.50 కోట్ల నుండి రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అధికారిక గణాంకాలు విడుదల కానప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది మరింత ఖరీదైన దౌత్య పర్యటనగా విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఢిల్లీ స్టార్‌ హోటళ్ల ధరలకు రెక్కలు
    పుతిన్ పర్యటన కారణంగా న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆక్యుపెన్సీ అమాంతం పెరిగింది. దీంతో ఆయా హోటళ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యకు చెందిన 4,700 చదరపు అడుగుల 'గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్'లో పుతిన్ ఉంటారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక తెలిపింది. ఇప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు  ఆయనకు ముందు అధ్యక్షులు జో బైడెన్, బిల్ క్లింటన్ వంటి అగ్రశ్రేణి ప్రముఖులు కూడా గతంలో ఇదే సూట్‌లో బస చేశారు.

    హై ప్రొఫైల్‌ ప్రతినిధుల రాక, పెరిగిన భద్రతా అవసరాలు కూడా హోటల్ సుంకాలను గణనీయంగా పెంచాయి. రష్యన్ బృందం, ఇతర దౌత్య మిషన్ల డిమాండ్ కారణంగా ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటళ్లు రేట్లను ఒక్క రాత్రి బసకు రూ.85వేల నుంచి రూ.1.3 లక్షలకు పెంచినట్లు తెలుస్తోంది.
     

Andhra Pradesh

  • పుట్లూరు:  అరటి ధరల భారీ పతనం ఓ రైతు ప్రాణాన్ని బలి తీసుకుంది. గిట్టుబాటు ధర లేక  రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలోని పుట్లూరులో చోటు చేసుకుంది. గురువారం(డిసంబర్‌ 4వ తేదీ) నాగలింగం అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 

    అరటి ధరలు దారుణంగా పతనం కావడంతో పెట్టుబడులు రాకు ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన సమయంలో ధర పడిపోవడంతో నాగలింగం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • పల్నాడు, సాక్షి :  పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు.

    ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి మారుతి షిప్ట్‌ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదు మంది మృతి చెందారు. తీవ్ర గాయాపాలైన ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి ఒకరు పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

    ఇటీవల  కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో  ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తెలిసిందే. 

    గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.

    గత నెలలో హైదరాబాద్‌–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది.  ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్‌ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.  అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్‌ స్పీడింగ్‌ ప్రధాన కారణంగా తెలుస్తోంది.  కార్లు, బస్సులు, బైక్‌లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

    ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

  • విజయవాడ:  ఏపీ ఫైబర్‌నెట్‌ కేసులో కీలక పరిణామం చోటు రేసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్‌ చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ గౌతమ్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ కేసును ఏసీబీ కోర్టు  ఈనెల 8వ తేదీన విచారించనుంది. 

    ఫైబర్‌నెట్‌ కేసులో అక్రమాలపై చంద్రబాబుపై గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఇటీవల తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా చంద్రబాబు క్లోజ్‌ చేయించుకుంటున్న తరుణంలో గౌతమ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఫైబర్‌నెట్‌ కేసు కూడా క్లోజ్‌ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌతమ్‌రెడ్డి రెడ్డి కోఓర్టులో పిటిషిన్‌ దాఖలు చేశారు. దాంతో ఆ కేసును ఏసీబీ కోర్టు 8వ తేదీన విచారణ చేపట్టనుంది. 

  • కర్నూలు: జిల్లాలోని గోనెగండ్లలో జాయింట్‌ కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎనగండ్ల, ఐరన్‌బండ గ్రామాల పర్యటనకు వెళ్లారు జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్ కమర్. అయితే జాయింట్‌ కలెక్టర్‌ కారుకు అడ్డుపడి తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపైనే బైఠాయించాచు. గాజులదిన్నె ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ద్వారా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ను రైతులు నిలదీశారు. 

    ప్రతీ సంవత్సరం బ్యాక్‌ వాటర్‌తో పంట పొలాలు మునిగి పోతున్నా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నష్టపోయిన రైతులకు సరిహారం అందించాలని అదే సమయంలో భూములు కోల్పోయిని రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

    కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు
  • ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి పార్లమెంట్‌ వేదికగా స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్‌ 4వ తేదీ) పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎక్సైజ్‌ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ ఏపీలో పొగాకు, పత్తి, వరి, మామిడి, అరటి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. 

    వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పొగాకు ఉత్పత్తి పెరగడంతో ధరలు పడిపోయి రైతులు కష్టాలు పడుతున్నారు. పొగాకు రైతులు కనీసం తమ పంట ఖర్చును కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వేలాదిమంది రైతులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. రకరకాల కారణాలతో పొగాకును బోర్డు తిరస్కరిస్తుంది. పొగాకు బోర్డు తగిన చర్యల వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. 

    ఏపీ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి. పొగాకు ఉత్పత్తి , మార్కెట్ స్థిరీకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఉపాధిని దెబ్బతీసేలా ఎక్సైజ్ పన్నులు ఉండొద్దు’ అని పేర్కొన్నారు.

  • సాక్షి, విజయవాడ: భవానీపురంలో ఇళ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ఇంటి ముందు బాధితులు బైఠాయించారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని భవానీపురం బాధితులు కోరుతున్నారు. నిన్న విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాల కూల్చివేతలు అధికారులు చేపట్టారు. తక్షణమే కూల్చివేతలు నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్డర్‌ కాపీ అందేలోపే ఇళ్లను అధికారులు కూల్చేశారు. బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరు విలపిస్తున్నాయి.

    విజయవాడలో ఇళ్ల కూల్చివేత దారుణమని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ అన్నారు. ఎందుకు తొందరపాటు చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఇందులో పలువురు నేతల హస్తం ఉందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పోతిన మహేష్‌ అన్నారు.

    బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌ను బాధితులు ముట్టడించారు. ఓట్ల కోసం మా దగ్గరకు వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఫ్లాట్స్‌ను అన్యాయంగా కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కూల్చొద్దని సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అన్యాయంగా మా ఫ్లాట్లను కూల్చేశారు. లక్ష్మి రామ సొసైటీపై ఎంక్వయిరీ చేయాలి. మాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేష్ వద్దకు కూడా వెళ్తామని బాధితులు అన్నారు.

     

  • రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రబ్‌ టైఫస్‌  (Scrub typhus )విజృంభిస్తోంది. అతి సులభ చికిత్స గల వ్యాధి గనుక భయాందోళనలు లేవు గానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని అర్థమవుతున్నది. ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ‘ఓరియంటా సుట్స్‌ గమిషి’ అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో వ్యాధిగ్రస్థులు బయటపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి.

    ఈ స్క్రబ్‌ టైఫస్‌ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవే శించలేదు. బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని రోజులలోనే ఎండిపోతుంది. దీనినే ‘ఎస్కార్‌’గా పేర్కొంటారు. కుట్టిన ప్రదేశం నుండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజుల తర్వాత వ్యాధి లక్ష ణాలు బయట పడటం మొదలవు తుంది. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలితో లక్షణాలు మొదలవుతాయి. కండ రాల నొప్పులు ఉంటాయి. లింఫు గ్రంథుల వాపు ఉంటుంది. 50%మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో కళ్ళు ఎర్రబడవచ్చు. దగ్గు ఉండవచ్చు. నీరసం ఉంటుంది. పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధు లలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వయసు వారిలోనైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుంది.

    ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

    స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్‌ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలీసా, ఇమినో ఫ్లోరోసెంట్‌ ఎస్సే(ఐ.ఎఫ్‌.ఎ.), పి.సి.ఆర్‌. వంటి మాలిక్యులర్‌పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు లున్నాయి. తొలి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చు. చికిత్స ప్రారంభించిన 24 నుండి 48 గంటలలోనే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం లేదు. కానీ వ్యాప్తిని నియంత్రించి వ్యక్తుల ఆరోగ్య, ఆర్థిక నష్టాలను అరికట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.
    – డా.టి. సేవకుమార్‌ , వైద్య నిపుణులు, గుంటూరు

Sports

  • సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్‌.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

    తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్‌ మైదానంలో అభిషేక్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్‌దీప్‌ సింగ్‌(34), శన్వీర్‌ సింగ్‌(38) కీలక నాక్స్‌ ఆడారు. 

    ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్‌ తండా, జయంత్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. 

    సైదక్‌ సింగ్‌(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్‌ గోయల్‌ మూడు, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండు వికెట్లు సాధించారు.

    కాగా ఈ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన  మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు నుంచి అభిషేక్‌ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది.
    చదవండి: దుమ్ములేపిన మ‌హ్మ‌ద్ ష‌మీ.. ఇప్పటికైనా క‌ళ్లు తెర‌వండి!
     

  • దేశ‌వాళీ క్రికెట్‌లో టీమిండియా సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ సెల‌క్ట‌ర్లు స‌వాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. గురువారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.

    తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ కేవలం  13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి సంచలన ప్రదర్శన ఫలితంగా సర్వీస్‌పై 7 వికెట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్వీసస్‌ 18.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మోహిత్‌ అహ్లావాట్‌(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నకుల్‌ శర్మ(32), వినీత్‌(32) రాణించారు. బెంగాల్‌ బౌలర్లలో షమీతో పాటు ఆకాష్‌ దీప్‌ మూడు,  ఆఫ్-స్పిన్నర్ వ్రిత్తిక్ ఛటర్జీ రెండు వికెట్లు సాధించాడు.

    అభిషేక్, అభిమన్యు మెరుపులు
    అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్ పోరెల్‌(56),  అభిమన్యు ఈశ్వరన్(58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో బెంగాల్( 16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

    సెలక్టర్లపై విమర్శలు..
    ఇక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీకి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ల సైతం షమీని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. 

    సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేల్లోనూ భారత బౌలింగ్‌లో అనుభవం లేమి కన్పించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమీని ఎందుకు జట్టులోకి తీసుకు రావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. 

    అప్పటి నుంచి ఫిట్‌నెస్ లోపం పేరిట అతడిని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు.
    చదవండి: ENG vs AUS: 'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్‌ పరువు కాపాడిన జో రూట్

  • యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో రూట్ ఆసీస్ గడ్డపై తన 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాడు. రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. అయితే రూట్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ ‌ను న్యూడ్ రన్ నుంచి కాపాడాడు.

    హేడెన్‌  సవాల్‌..
    ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు రూట్‌పై ఒత్తిడి పెంచేలా హేడెన్‌  ఓ సవాల్ విసిరాడు. ఈ టూర్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు స్పందిచిన హేడెన్‌  కుమార్తె గ్రేస్ హేడెన్‌ ‌.. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్నను కాపాడు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు రూట్ నిజంగానే సెంచరీ చేసి హేడెన్‌ ‌ను సేవ్ చేశాడు.

    గత 12 ఏళ్లగా ఆస్ట్రేలియా గడ్డపై రూట్ సెంచరీ కోసం పోరాడతున్నాడు. ఇంతకుముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89గా ఉంది. ఎట్టకేలకు మూడెంకల స్కోర్‌ను అందుకుని తన సుదీర్ఘ స్వప్నాన్ని అతడు నేరవేర్చుకున్నాడు. రూట్ సెంచ‌రీ చేయ‌గానే హేడెన్ కామెంట‌రీ బాక్స్ నుంచి బ‌య‌ట‌కు సెల‌బ్రేష‌న్ చేసుకుంది. అనంత‌రం ఇంగ్లండ్ లెజెండ్‌ను అత‌డు అభినందించాడు.

    "ఆస్ట్రేలియాలో ఎట్ట‌కేల‌కు సెంచ‌రీ చేసిన జో రూట్‌కు నా అభినంద‌న‌లు. మిత్రమా  కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ సెంచ‌రీ కోసం నేను ఎంత‌గానో ఎదురు చూశాను. ప‌ది ఏభైలు త‌ర్వాత నీవు అనుకున్న ల‌క్ష్యానికి చేరుకున్నావు. చాలా సంతోషంగా ఉంది" అని హేడెన్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.
     

  • బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక అద్భుతం చేశాడు. మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలాండ్ లాంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం కారీ స్టంప్స్‌కు దగ్గరలో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు.

    స్టంప్స్‌కు దగ్గరలో నిలబడే బౌన్సర్లను సైతం అతడు అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో క్యారీ అందుకున్న ఓ క్యాచ్ తొలి రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. 

    కారీ సంచలన క్యాచ్‌..
    ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్‌.. నాలుగో బంతిని గాస్ అట్కిన్సన్స్‌కు లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. అట్కిన్స‌న్ ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. బంతి కీపర్ వెనుకకు వెళ్లగా క్యాచ్ అందుకోవడానికి కారీ, మార్నస్ లబుషేన్ ఇద్దరూ ప‌రిగెత్తారు. అందుకోసం ఇద్ద‌రు కూడా డైవ్ చేశారు. 

    అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగ‌లిగాడు. లబుషేన్ అత‌డిని  ఢీకొన్నప్పటికీ కారీ మాత్రం బంతిని విడిచిపెట్ట‌లేదు. అత‌డి క్యాచ్‌ను చూసి ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌క్క‌న ఉన్న ల‌బుషేన్ సైతం కారీ హ‌త్తుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి నెటిజన్లు కొనియాడుతున్నారు.

    రూట్‌ సెంచరీ..
    ఈ యాషెస్‌ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ విరోచిత సెంచరీతో చెలరేగాడు. ఆసీస్‌ గడ్డపై రూట్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌(135), ఆర్చర్‌(32 నాటౌట్‌) ఉన్నాడు. మరోవైపు ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.
    చదవండి: వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్‌


     

     

  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్‌ అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో పర్వాలేదన్పిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

    ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అర్జున్ తన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. గురువారం కోల్‌కతా వేదికగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ జూనియర్ టెండూల్కర్ బిహార్ పేసర్ సురాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

    వైభవ్, గనీ మెరుపులు వృథా..
    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ గనీ(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 

    కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. గోవా బౌలర్లలో దీప్‌రాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్జున్‌ 2 వికెట్లు సాధించాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(79) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కశ్యప్ బఖలే(64) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.
    చదవండి: ENG vs AUS: శతక్కొట్టిన జో రూట్‌.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

  • ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ జో రూట్‌.. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై త‌న టెస్టు సెంచ‌రీ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు. గత 12 ఏళ్ల ప్రయత్నిస్తున్న జోరూట్‌ ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో రూట్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.

    ఓపెనర్ జాక్ క్రాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రూట్ 181 బంతుల్లో తన 40వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది అతడికి 59వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇంగ్లీష్ వెటరన్ బ్యాటర్ 2025 ఏడాదిలో  ఇప్పటికే 4 టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. రూట్‌ ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. 

    తొలి రోజు ఇంగ్లండ్‌దే..
    యాషెస్‌ రెండో టెస్టు తొలి రోజు ఆటలో కంగారుల జట్టుపై ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌తో పాటు ఆర్చర్‌(32 నాటౌట్‌) ఉన్నాడు.

    వీరిద్దరూ పదో వికెట్‌కు 61 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్‌ తొలి రోజే ఆలౌటైట్లు కన్పించింది. కానీ రూట్‌, ఆర్చర్‌ ఆఖరి వికెట్‌ కోల్పోకుండా పోరాడారు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ మరోసారి ఆరు వికెట్లు పడగొట్టగా.. నసీర్‌, బోలాండ్‌ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?

     

  • రాయ్‌పూర్ వేదిక‌గా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైనప్పటికి.. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర స్టార్..  ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై త‌నదైన శైలిలో విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలో గైక్వాడ్‌ 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేశాడు.

    ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ చీఫ్ సెలెక్టర కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రుతురాజ్ త‌న స‌త్తా నిరూపించుకున్నాడ‌ని, అతడికి వ‌న్డేల్లో మ‌రిన్ని అవ‌కాశాలు ఇవ్వాల‌ని టీమ్ మెనెజ్‌మెంట్‌ను సూచించాడు. 

    కాగా శ్రేయ‌స్ అయ్య‌ర్ గాయం కార‌ణంగా స‌ఫారీల‌తో వ‌న్డే సిరీస్‌కు దూరం కావ‌డంతో రుతురాజ్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. రెండో వ‌న్డేలో మాత్రం క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. సెంచ‌రీతో పాటు విరాట్ కోహ్లీతో కలిసి 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

    "జ‌ట్టు సెల‌క్ష‌న్ విష‌యంలో ఇకపై పెద్ద‌గా ప్ర‌యోగాలు చేయ‌ర‌ని ఆశిస్తున్నాను . రతురాజ్ అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డికి మూడు ఫార్మాట్‌ల‌లోనూ రాణించే స‌త్తా ఉంది. క‌చ్చితంగా రుతురాజ్ ఆల్ ఫార్మాట్ జ‌ట్టులో ఉండ‌టానికి అర్హుడు. 

    అత‌డికి అవ‌కాశాలు ఇవ్వండి. టెస్టుల్లో కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్ప‌టికే రంజీ ట్రోఫీలో త‌న‌ను నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అయితే రుతురాజ్ అద్భుతంగా ఆడాడు. భార‌త జ‌ట్టులోకి వ‌చ్చి రాగానే సెంచ‌రీ సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది.

    అత‌డు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌతాఫ్రికా వంటి బౌలింగ్ అటాక్‌పై సెంచరీ కొట్టడం గొప్ప విషయం "అని శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?
     

  • రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 359 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ దారుణ ప్రదర్శన కనబరిచాడు.

    పదే పదే షార్ట్ పిచ్ బంతులను సంధిస్తూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ద్‌ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి భారీగా పరుగులివ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

    మ్యాచ్ మధ్యలో భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం ప్రసిద్ద్ కృష్ణపై అగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో ఎంతో ప్రశాతంగా ఉండే రాహుల్‌.. ప్రసిద్ద్ కృష్ణ చెత్త బౌలింగ్ కారణంగా తన సహనాన్ని కోల్పోయాడు.

    ఏమి జరిగిందంటే?
    ఈ మ్యాచ్‌లో ప్రసిద్ద్ షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా సంధించి బ్యాటర్లకు టార్గెట్‌గా మారాడు. ఈ క్రమంలో ప్రోటీస్ ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన ప్రసిద్ద్‌.. టోనీ డి జోర్జి హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అలా బౌలింగ్ చేయవద్దని రాహుల్ అంతకుముందే అతడికి చెప్పాడు. 

    కానీ ప్రసిద్ద్ మరోసారి అలానే బౌలింగ్ చేయడంతో కేఎల్ తన నోటికి పనిచెప్పాడు. ప్రసిద్ద్ నీ సొంత తెలివితేటలు ఉపయోగించవద్దు. నేను చెప్పినట్లు చెయ్యి. ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాను కదా. అదే చేయ్యి అని రాహుల్ గట్టిగా అరుస్తూ ప్రసిద్ద్‌తో కన్నడలో అన్నాడు. అందుకు బదులుగా హెడ్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయాలా అని ప్రసిద్ద్ బదులిచ్చాడు.

    అరే షార్ట్ పిచ్ బంతులు వేయాల్సిన అవసరం లేదు. నీకు ఇప్పుడే చెప్పాను కదా. మళ్లీ అదే చేస్తున్నావు అని రాహల్ అన్నాడు. ఈ సంభాషణంతా స్టంప్ మైక్‌లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అవుతోంది. ఇక సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే డిసెంబర్‌ 6న వైజాగ్‌ వేదికగా జరగనుంది.
    చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌



     

     

  • ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమ క్రీడాకారులకు చెప్పుకోదగ్గ ఊరటనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలతో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాలు కలి్పస్తోంది. కానీ ఈవెంట్ల కోసం వెళ్లినపుడు, శిక్షణ శిబిరాలకు హాజరైనపుడు గైర్హాజరైన కాలాన్ని సెలవులుగా పరిగణిస్తూ వచ్చారు.

    అయితే ఇకపై పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లినా... శిక్షణలో ఉన్న కాలాన్ని సైతం ఆన్‌ డ్యూటీగానే పరిగణించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఆన్‌ డ్యూటీగా పరిగణించే ప్రతిపాదనను ఆమోదించింది.

    చాన్నాళ్లుగా అగ్రశ్రేణి అథ్లెట్లకు సంబంధిత శాఖాధిపతుల నుంచి సెలవు అనుమతులు పొందడం ఇబ్బందికరంగా మారింది. తాజా ఆమోదం వల్ల దీనికి సంబంధించిన సరీ్వస్‌ రూల్స్‌లో ఆయా అథ్లెట్లకు వెసులుబాటు లభిస్తుంది. దీంతో క్రీడా ఈవెంట్లు, శిక్షణ శిబిరాలకు వెళ్లినపుడు సులువుగా అనుమతుల మంజూరు లభించడంతో పాటు ఆన్‌ డ్యూటీ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.   

  • ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ తొలి రోజు ఇది జరిగింది. హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీయడంతో స్టార్క్‌ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. వసీం అక్రమ్‌ 104 టెస్ట్‌ల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 102వ టెస్ట్‌లోనే ఈ ఘనత సాధించాడు.

    టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు (టాప్‌-5)
    స్టార్క్‌-415*
    వసీం అక్రమ్‌-414
    చమింద వాస్‌-355
    బౌల్ట్‌-317
    జహీర్‌ ఖాన్‌-311

    మ్యాచ్‌ విషయానికొస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇవాళే మొదలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్‌ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌, అదే స్కోర్‌ వద్ద (5) వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను డకౌట్‌ చేశాడు. అనంతరం కొద్ది గ్యాప్‌ ఇచ్చి హ్యారీ బ్రూక్‌ను (31) పెవిలియన్‌కు పంపాడు.

    42 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 182/4గా ఉంది. డకెట్‌, పోప్‌, క్రాలే, బ్రూక్‌ ఔట్‌ కాగా.. జో రూట్‌ (65), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్‌ 3 వికెట్లు తీయగా.. మైఖేల్‌ నెసర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

    స్టార్క్‌ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆతర్వాత కుదురుకుంది. రూట్‌, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. క్రాలే 76 పరుగుల వద్ద ఉండగా నెసర్‌ అద్బుతమైన బంతితో క్రాలే వికెట్‌ తీశాడు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్‌ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు.

    ఈ దశలో మరోసారి బంతినందుకున్న స్టార్క్‌ బ్రూక్‌ను బోల్తా కొట్టించి, ఇంగ్లండ్‌ను మరోసారి కష్టాల్లోకి నెట్టేశాడు. రూట్‌, స్టోక్స్‌ ఇంగ్లండ్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.   
     

Politics

  • 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రాలపై బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఒడిశా లాంటి రాష్ట్రాలను సైతం కైవసం చేసుకున్న కాషాయదళం.. పశ్చిమ బెంగాల్ మాదే అంటోంది..! అయితే.. ఈశాన్యంలో వాస్తు దోషమో.. వ్యూహాత్మక తప్పిదాలో తెలియదు కానీ, నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి. 

    ఈశాన్య రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఉనికి అనేది లేకుండా బీజేపీ చేసింది. కానీ, ఇప్పుడు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసలు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే రాజకీయ వేడి రాజుకుందా? ఎవరిది పైచేయిగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఈ వివరాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.

    ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం అత్యంత కీలకమైన రాష్ట్రం. 2016లో అనూహ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని.. రెండో సారి కూడా విజయలక్ష్మి వరించింది. నిజానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడం 2016లోనే మొదటిసారి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తూనే.. బహుభార్యత్వ నిరోధక చట్టం.. అక్రమ చొరబాటు దారుల నిరోధం వంటి అంశాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. 

    పౌరసత్వ సవరణ చట్టం అమలు సమయంలో విద్యార్థి సంఘాల నిరసనను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం జెన్-జీ ఉద్యమాలు బీజేపీని గద్దెదింపే స్థాయిలో ఉధృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణంతో అభిమానుల ప్రవాహం ఉప్పొంగి కనిపించగా.. షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఆరు ఓబీసీ వర్గాలను చేర్చాలంటూ హిమంత సర్కారు చేసిన సిఫార్సు ఇప్పుడు ఎస్టీల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలకు కారణమవుతోంది. ఇప్పటికే శక్తిమంతమైన బోడో తెగలోని విద్యార్థి నాయకులు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ఖండించారు. అదే సమయంలో.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ అంశాలను ఎజెండాగా మలచుకుని, ప్రజావ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతోంది. 

     

    హిమంత సర్కారు ఎస్టీ జాబితా అనే తేనెతుట్టెను కదలించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఓబీసీలుగా ఉన్న థాయ్ అహోమ్, టీ తెగలు, కుచ్ రాజ్ బంశీ వంటి వర్గాలను ఎస్టీల్లో చేర్చాలని అస్సాం సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 27శాతం. ఈ నిర్ణయంపై అస్సాంలో రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వర్గాలను ఎస్టీల్లో చేర్చడంతో తనకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గాలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. 

    అదేసమయంలో ఈ జాబితాపై ఎస్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో ఎస్టీల జనాభా 13శాతం. వీరిలో బోడోలాండ్, కర్బీ అంగ్లాంగ్, దిమహాసావోలోని స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో ఉంటున్నారు. నిజానికి బీజేపీ అస్సాంలో పాగా వేయడానికి దోహదపడ్డ ప్రాంతాలు ఇవే. ఇప్పుడు ఈ తెగల వారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో.. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణం కూడా హిమంత సర్కారును చిక్కుల్లో పడేసింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు జుబిన్‌ది హత్యేనని ముఖ్యమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే 8 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే.. బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐయూడీఎఫ్ ఈ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అదే జరిగితే.. ఇండియా కూటమికి ఓట్ల చీలిక పోటు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

    అసోంతో పాటు.. ఈశాన్యంలో మరో కీలక రాష్ట్రం మణిపూర్. కుకీలు-మైటీలకు మధ్య వివాదాలతో జరిగిన అల్లర్లు మణిపూర్‌ను అట్టుడికించాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తప్పించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో బీజేపీ అధిష్ఠానం రాజీనామా చేయించింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన మొదలైంది. ఇప్పుడు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను స్వయానా బీజేపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరో ఆర్నెల్లపాటు రాష్ట్రపతి పాలనను పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. 2027లో మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తాజా పరిణామాలు బీజేపీని చిక్కులోకి నెట్టేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇక మేఘాలయ, త్రిపురలో కూడా రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్‌కు చెందిన రోనీలింగ్డో నేషన్ పీపుల్స్ పార్టీలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీ మేఘాలయ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే..! అయితే.. మాజీమంత్రి ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. ఎన్‌పీపీ నేతృత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతోంది. 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ(వీపీపీ)తో పొత్తుతో అధికారపీఠాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అదే జరిగితే.. ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అటు త్రిపురలో రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య నేతృత్వంలోని టీఎంపీ బలాన్ని పుంజుకుంటోంది. అస్సాం, త్రిపురలో నిరసనలు.. మణిపూర్ అల్లర్లు, మేఘాలయలో పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. ఈశాన్యంలో బీజేపీకి చిక్కులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నికలు వచ్చినప్పుడే  రాజకీయాలని.. తర్వాత అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావాలని కేంద్రంలోని నేతలను కూడా ఆహ్వానించానన్నారు. గురువారం.. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ఒక్కరోజైనా సెలవు తీసుకోలేదని.. విపక్ష నేతలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సభల్లో విపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా? అంటూ రేవంత్‌ ప్రశ్నించారు.

    ‘‘ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తాం. ఎర్రబస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా. ఆదిలాబాద్‌కు నీళ్ల కోసం ప్రాణిహిత​- చేవెళ్ల ప్రాజెక్టు పనులను వైఎస్‌ ప్రారంభించారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి  చేసే  బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

    ‘‘జిల్లా అభివృద్ధికి రెండు నెలల్లో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. మళ్లీ తొందరలోనే ఆదిలాబాద్‌ వచ్చి సమీక్ష చేస్తాను. ఇంద్రవెల్లిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇచ్చారా?. మేం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు 61 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కాళేశ్వరం.. కూలేశ్వరం అయింది. ప్రజల సొమ్ము తిన్నవారు బాగుపడరు’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

    CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

     

     

  • పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి  ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి. పారిశ్రామిక వాడలలో, లేదా ఇతరత్రా  వచ్చే  పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.

    కాని ఆచరణలో  కాలం గడిచే కొద్ది ఆ  పరిశ్రమలు  మూతపడడం, లేదా వేరే  ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం  వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని  ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి  భూములు  ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. 

    ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది.దీనిపై బిఆర్ఎస్ ,బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి.  ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. 

    అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ, లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో, పరిసరాలలో ఉన్న  పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న  గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు  ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. 

    ఏపీలో ఐటి కంపెనీలను  స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి  ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి.పారిశ్రామికవాడలలో, లేదా ఇతరత్రా  వచ్చే  పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ  పరిశ్రమలు  మూతపడడం, లేదా వేరే  ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం  వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని  ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి  భూములు  ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. 

    ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. దీనిపై బిఆర్ఎస్ , బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి.  ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ,లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ,పరిసరాలలో ఉన్న  పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న  గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. 

    కాని చంద్రబాబు  ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను  స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా ప్రభుత్వమే  అవకాశం కల్పిస్తున్నదన్న  వార్తలు ఆందోళన కలిగిస్తాయి.  కొన్ని రియల్ ఎస్టేట్  కంపెనీలకు ఇచ్చే  భూములలో నలభై నుంచి ఏభై శాతం స్థలంలో ఐటి కార్యకలాపాలకు కాకుండా ఇళ్ల నిర్మాణం,కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించుకోవచ్చట.వాటిని అమ్ముకుని రియల్ ఎస్టేట్  వ్యాపారం చేసుకోవచ్చట. ఇలాంటివి  ఐటి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఎందుకంటే అవి ఐటి కంపెనీలు కావు కనుక.  కాకపోతే అవి నిర్మించే భవనాలను ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తాయి. 

    ఆ ఐటి కంపెనీలలో ఉండే ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుని ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రోత్సహాకాలను ఇవి   పొందుతాయట.విశాఖలోని కోట్ల విలువ చేసే భూములను ఈ రకంగా పందారం చేస్తున్నారు.ఇప్పటికే ఉర్సా అనే పేరుతో వెలసిన  కొత్త సంస్థకు అరవై ఎకరాల భూమి కేటాయించి ప్రభుత్వం విమర్శలపాలైంది. అయినా అదేతరహాలో రహేజా, కపిల్ చిట్ ఫండ్స్ ,బివిఎమ్  ఎనర్జీ,ఎఎస్ఎస్ ఆర్  మొదలైన  రియల్  ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం భూమిని ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుండడం శోచనీయమని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.రహదారులు,నీరు,విద్యుత్, వంటి మౌలిక వసతులకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందట. ఇవి కాకుండా పెట్టుబడిలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రోత్సాహకాల  పేరుతో వారికి చెల్లింపులు జరుగుతాయట.ఇటీవల రహేజ గ్రూప్ కు విశాఖపట్నంలో  27 ఎకరాల భూమిని 99 పైసలకే ప్రభుత్వం ఇచ్చేసింది. 

    ఈ భూమి విలువ సుమారు 1300 కోట్ల పై మాటే అని చెబుతున్నారు.ఈ కంపెనీ నిర్మించే ఐటి క్యాంపస్ ద్వారా 15వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.దీనిపై భిన్నాభిప్రాయాలు   ఉన్నాయి.  బెంగుళూరు కు చెందిన సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1500 కోట్ల రూపాయల విలువైన  భూమిని 45 కోట్లకే ఇచ్చేశారు.విశేషం ఏమిటంటే సత్వా కంపెనీ హైదరాబాద్ లో కోకాపేటలో ఇటీవలే వేల కోట్లు వ్యయం చేసి 25 ఎకరాలు కొనుగోలు చేసింది.ఈ కంపెనీ హైదరాబాద్ లో  తన భవనాలను లక్షల రూపాయలకు  అద్దెకు  ఇస్తోంది. విశాఖలో సైతం అదే రీతిలో ఐటి కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేసే  అవకాశం ఉంటుంది. 

    అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ఏ ఇతర రాష్ట్రంలోలేని విధంగా కారుచౌకగా భూములు ఇవ్వడం ఎంతవరకు ఏపీ కి లాభదాయకమన్న ప్రశ్న వస్తోంది.విశాఖ ఇమేజీని చివరికి పైసలలోకి తీసుకువచ్చి ఇక్కడి భూమిని  పప్పు బెల్లాలమాదిరి  పంచుతారా అన్న బాధను  పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక  సంగతి చెప్పాలి. గతంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా చోట్ల పరిశ్రమలవారికి నిర్దిష్ట మొత్తాలకు భూములను కేటాయించితే దానిని క్విడ్ ప్రోకో గా టిడిపి ప్రచారం చేసింది.  వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే  పాట అందుకుని రాజశేఖరరెడ్డి కుమారుడిపై కేసులు పెట్టించింది. చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేయడాన్ని ఇదే కోవలో వేసి జగన్ కు అంటకట్టారు.

    ఇప్పుడు ఏకంగా 99 పైసలకే వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చేస్తున్న చంద్రబాబు అండ్ కో కు ఎలాంటి లావాదేవీలు ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తెలంగాణ  ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే ఎకరా 130 కోట్ల నుంచి 170 కోట్ల వరకు అమ్ముడుపోయింది.  హైదరాడబాద్ కు విశాఖ కూడా పోటీ ఇచ్చే  నగరమే.  కోట్లలో భూమి ధర పలుకుతోంది.  అలాంటి విశాఖలో ఇంత ఘోరంగా భూములు  కట్టబెట్టడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం కిందకు రాదా?అన్న ప్రశ్నకు జవాబు దొరకదు.పైగా ఈ కంపెనీలు కొన్ని అసలు  తమకు తక్కువ ధరకు భూమి ఇవ్వాలని కోరకపోయినా ఎందుకు కేటాయిస్తున్నారో అర్ధ కాదు. పరిశ్రమలు రావల్సిందే.కాని ఆ పేరుతో ఇలా భూములు కాజేస్తున్నారన్న భావన రానివ్వరాదు. భవిష్యత్తులో ఎంతకాలం  ఇవి సంబంధిత పరిశ్రమలు కొనసాగిస్తాయో లేదో తెలియదు. లూలూ మాల్ వంటివాటికి ఎకరాలకు ఎకరాలు లీజు పేరిట తక్కువ ధరకు భూములు ఇచ్చారు. 

    ఒక నిపుణుడు చెబుతున్నదాని ప్రకారం 33 ఏళ్లు లీజ్ అయినా, ఆ తర్వాత దానిని అరవైఆరు ఏళ్లు,తదుపరి తొంభైతొమ్మిది ఏళ్లు  పొడిగించుతారు. చివరికి ఆ భూమి  లీజుదారుడికే  సొంతం అవుతున్నట్లే భావించాలి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో  పారిశ్రామిక భూమిని అప్పట్లో ప్రభుత్వం లీజుకు ఇచ్చినా, తాజాగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారం 9వేల ఎకరాలలో  పరిశ్రమల బదులు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి వీలు కల్పించబోతున్నారు. ఒకప్పుడు అజామాబాద్ పారిశ్రామికవాడ ను లీజు పద్దతిన ప్రభుత్వం ఇచ్చింది.కాని ఆ చుట్టుపక్కల నివాసాలు ఏర్పడడంతో అక్కడనుంచి పరిశ్రమలను తరలించాలన్న  ప్రతిపాదన వచ్చింది.

    కాని ఆ సమయంలో ఆ భూములు తమకే ఇవ్వాలని పరిశ్రమలవారు పట్టుబట్టారు. తాజాగా  హైదరాబాద్, పరిసరాలలో ఉన్న పారిశ్రామికవాడలలోని భూముల వినియయోగాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ,కొన్ని కండిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజ్  లో 30 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయించింది.  దీనిపైనే బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు,బీజేపీ శాసనసభ పక్షనేత మహేష్ రెడ్డిలు ఇది లక్షల కోట్ల కుంభకోణం అని విమర్శిస్తున్నారు.ప్రభుత్వం ఖండించి తమ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి ఐదువేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెబుతోంది. 

    దీనిని చెడగొట్టడానికి విపక్షం కుట్ర పన్నుతోందని మంత్రులు బదులు ఇచ్చారు.అయినప్పటికీ  రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే గురువుకు తగ్గ శిష్యుడు అన్న విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉందన్నది కొందరి వ్యాఖ్య.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  సుమారు  ఏభైప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి ,వాటి ఆస్తులను  ప్రైవేటు  పారిశ్రామికవేత్తలకు  తక్కువ  ధరకే అప్పగించారు. వారు  కూడా అక్కడ పరిశ్రమలు నడపడం లేదని, రియల్ఎస్టేట్   వ్యాపారంగా మార్చారని చెబుతున్నారు.  

    ఇది చంద్రబాబు మోడల్ ఆర్ధిక విధానంగా కొందరు చమత్కరిస్తుంటారు. తెలంగాణలో ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రైవేటు పరం అవుతుంటే,ఏపీలో కొత్తగా ఇస్తున్న భూములు    ప్రైవేటువారికి  మొదటే సంపద చేకూర్చి పెడుతున్నాయన్న అభిప్రాయం  కలుగుతుంది. విశాఖలో మాదిరి అమరావతిలో కూడా ఇలాగే అణా,బేడాకు  భూములు ఇవ్వడానికి  చంద్రబాబు సిద్దపడతారా?అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఐటి కంపెనీల ముసుగులో ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం సరైనదేనా?అన్నది వారి ఆవేదన.  ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావల్సిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా? 
     
    -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్‌ కండీషన్స్‌ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్‌ చేయించుకుంటున్నారు. ఇది  బెయిల్‌ కండీషన్స్‌ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

    ‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్‌ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్‌నెట్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్‌ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్‌ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్‌ బ్యాంక్‌ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

    ‘‘స్కిల్‌ స్కామ్‌లో రూ.370 కోట్లు షెల్‌ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ప్రివిలేజ్‌ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దు ఫైల్‌పై బాబు సంతకం చేశారు. బాబు అండ్‌కో గోబెల్స్‌ను మించిపోయారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

    తానే దొంగ.. తానే పోలీస్..  జగన్ సెటైర్లు..
  • తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

    దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్‌ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలి. సర్టిఫికెట్‌ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్‌ అయితే వెనక్కి పంపిస్తారు..

    అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్‌ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్‌ రిపోర్టులో సిట్‌ పేర్కొంది..

    అలాంటప్పుడు టీటీడీ చైర్మన్‌, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.

    లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని  ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్‌ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్‌ ప్రచారం చేస్తున్నాయి?. 

    చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.

    పరకామణి కేసులో.. 
    పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్‌ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి.  అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ‍ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు. 

    పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్‌ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్‌ కథనాలు రాయించారు.. అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

    తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు... జగన్ స్ట్రాంగ్ కౌంటర్

    చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్‌ 1వ తేదీన రమణ, సురేష్‌ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్‌ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

  • సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్‌పై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. రెడ్‌ బుక్‌ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్‌ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్‌ దందా చేస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్‌ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్‌, బెల్టు షాపులు, పర్మిట్‌ రూమ్‌లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

    ‘‘జోగి రమేష్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్‌ చేస్తున్నారు. జోగి రమేష్‌పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్‌ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్‌ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్‌ చేశారు

    ‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ​ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్‌ఆర్‌ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్‌ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్‌కు జీపీఎస్‌ ట్రాక్‌ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్‌ బుక్‌ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

    YS Jagan: వెర్రితలల.. రెడ్ బుక్ రాజ్యాంగం

    లిక్కర్‌ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్‌రెడ్డి బెయిల్‌ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్‌ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్‌ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్‌ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్‌ మెసేజ్‌లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

     

National

  • గిగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఎవరైనా మెరుగైన ఉద్యోగం  కావాలని కోరుకుంటాడు.  నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే కార్పొరేట్‌ ఉద్యోగం వస్తే ఎగిరి గంతేస్తాడు కదా. కానీ ఏడాదికి 25 లక్షల రూపాయల వేతనం ఇచ్చే ఉద్యగాన్ని వదిలిపెట్టేశాడు. విచిత్రంగా ఫుడ్ డెలివరీ రైడర్‌గా పని చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే సాహసోపేత నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేమిటీ అంటే..

    బెంగళూరులో ఒక వ్యక్తి తన సంవత్సరానికి రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగాన్ని  వదిలేసి, సొంతంగా  వ్యాపారం మొదలు పెట్టాలనే కల సాకారం కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌ అవతార మెత్తాడు. ఎంజి వి (@original_ngv)  అనే ఎక్స్‌ యూజర్‌  పోస్ట్‌తో ఈ వైనం వెలుగులోకి వచ్చింది. ఆయన కథనం ప్రకారం  తన స్నేహితుడి ఆకస్మిక కెరీర్ మార్పు వ్యూహం అతని కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.  త్వరలో పెళ్లి చేసుకోబోతుండటం, కొత్తగా కారు కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబం, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  కొందరు స్నేహితులు అతణ్ని ఎగతాళి చేశారు. డెలివరీ బాయ్‌గా అనేక అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు. అయినా వెన‌క్కి తగ్గలే. కుటుంబం, సన్నిహితుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, తన కలను కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు

     సొంత క్లౌడ్‌కిచెన్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నాడు. కస్టమర్ ప్రాధాన్యతలను స్వయంగా అర్థం చేసుకోవాలనేది అతని ప్లాన్‌. విశ్వవిద్యాలయం పక్కనే ఉన్న ప్రాంతంలో ఏ మెనూ ఐటెమ్స్‌కు డిమాండ్‌ ఉంది. అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహారం ఏంటి? ఏ ధరలకు, , ఏ ప్రదేశాలు అధిక-వాల్యూమ్ ప్రాంతాలు అనే దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. 

     

    చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా

    ఏం సాధించాడు
    తను అనుకున్నది సాధించడంకోసం మార్కెట్‌ను బాగా పరిశీలించాడు. తన అనుభవం ద్వారా, తక్కువ ధరకే కానీ అధిక పరిమాణంలో విక్రయించగల 12 సంభావ్య స్టాక్ కీపింగ్ యూనిట్లను (SKUలు) అతను గుర్తించాడు, వీటిని అతను తన క్లౌడ్ కిచెన్‌లో ప్రదర్శించాలని యోచిస్తున్నాడు.ఈ మోడల్‌తో 3-4 నెలల్లోనే లాభాలు సాధించగలనని అతను ధీమాగా ఉన్నాడు. డెలివరీ బాయ్‌ అనేచులకన భావంతో, వాచ్‌మెన్ కూడా తనపై ఎలా అరుస్తారో స్నేహితుడు కథలు కథలుగా చెబుతాడని,  అయినా కానీ, వ్యాపారంలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడని  తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. అతనికి తన సపోర్ట్‌ వంత శాతం ఉంటుందని, అంతా మంచే జరుగుతందని ఆశిస్తున్నానని  తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆల్‌ ది బెస్ట్‌ బ్రో అంటున్నారు నెటిజన్లు. 

    ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!

  • న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. రష్యా నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచి్చన పుతిన్‌ను చిన్నారులు సంప్రదాయనృత్యాలతో స్వాగతించారు. 

    పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురూ ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ప్రధానమంత్రి ప్రైవేట్‌ విందు ఇచ్చారు. పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్‌ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

     ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌ చిరకాల మిత్రదేశమైన ఇండియాలో పర్యటిస్తుండడం విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ పుతిన్‌ కోసం ఎయిర్‌పోర్టుకు స్వయంగా రావడం విశేషం.

     తన మిత్రుడు పుతిన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆయనతో చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్‌–రష్యా బంధం ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచిందని ఉద్ఘాటించారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. అనంతరం పుతిన్‌ ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు.   

    నేడు వరుస భేటీలు  
    వరుస భేటీతో పుతిన్‌ షెడ్యూల్‌ శుక్రవారం బిజీబిజీగా సాగిపోనుంది. పుతిన్‌కు ఉదయం రాష్ట్రపతి భవన్‌ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే 23వ ఇండియా–రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. 

    సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్‌ను పుతిన్‌ ప్రారంభిస్తారు. భారత్‌ మండపంలో ఫిక్కి, రాస్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్‌ పాల్గొంటారు. అనంతరం పుతిన్‌ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్‌ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. 

    కీలక ఒప్పందాలు?  
    ఇండియా–రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు 
    జరుగనున్నాయి.  

     

     

    కారు పూలింగ్‌ ఆలోచన నాదే: పుతిన్‌   
    చైనాలోని తియాంజిన్‌లో సెపె్టంబర్‌ 1న భారత ప్రధాని మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించాలన్న ఆలోచన తనదేనని పుతిన్‌ తెలిపారు. ఇది తమ స్నేహానికి గుర్తు అని వివరించారు. ఇండియా టుడే వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఘటన కాదని అన్నారు. సదస్సు వేదిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన కారు సిద్ధంగా ఉందని, కలిసి వెళ్దామని తాను కోరడంతో మోదీ అంగీకరించారని చెప్పారు. షాంఘై సహకార సదస్సు ఎజెండాతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు.

     

    పుతిన్‌కు భగవద్గీత బహూకరణ 
    ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్‌ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు. భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

  • న్యూఢిల్లీ : మిజోరం మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ (డిసెంబర్ 4 శుక్రవారం) కన్నుమూశారు ఆయనకు 73 సంవత్సరాలు. స్వరాజ్ కౌశల్  మాజీ విదేశాంగ మంత్రి  దివంగత సుష్మా స్వరాజ్ భర్త . అలాగే బీజేపీ ఎంపి బన్సూరి స్వరాజ్ తండ్రి.  లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీ విభాగం   ప్రకటించింది. 

    కౌశల్‌కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సహా, పలువురు బీజేపీ నేతలు  ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు.

    తిరిగి అమ్మ దగ్గరికే
    బన్సూరి స్వరాజ్ తన తండ్రి  మరణంపై ఒక భావోద్వేగ  ట్వీట్‌ చేశారు. తండ్రిగారు ఇక లేరని చెప్పడానికి చింతిస్తున్నాను అంటూ ఇలా రాశారు ‘‘ మీ నిష్క్రమణ   చాలా బాధిస్తోంది. మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో, శాశ్వత శాంతితో తల్లితో తిరిగి కలిశారనే ఈ నమ్మకం. అపరిమితమైన ఓర్పు నా జీవితానికి వెలుగు మీ కుమార్తె కావడం నా జీవితంలో గొప్ప గర్వం,, మీ వారసత్వం, మీ విలువలు , మీ ఆశీర్వాదాలు ముందుకు సాగే ప్రతి ప్రయాణానికి పునాదిగా ఉంటాయి." అంటూ బన్సూరి స్వరాజ్ తన తండ్రికి నివాళులర్పించారు.

    ఎవరీ స్వరాజ్‌ కౌశల్‌ 
    జూలై 12, 1952న సోలన్‌లో జన్మించిన స్వరాజ్ కౌశల్ 1990లో 37 సంవత్సరాల వయసులో మిజోరాం గవర్నర్‌గా నియమితులయ్యారు. భారతదేశంలో నియమితులైన అతి పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. సుప్రీంకోర్టు ఆయనను కేవలం 34 ఏళ్ల వయసులో సీనియర్ న్యాయవాదిగా నియమించింది. స్వరాజ్ కౌశల్ - సుష్మా స్వరాజ్ 1975లో వివాహం చేసుకున్నారు. కౌశల్ పార్లమెంటులో హర్యానాకు ప్రాతినిధ్యం వహించారు. 1998 నుండి 2004 వరకు హర్యానా వికాస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2019 ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. 

     

  • దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో మదీనా-హైదరాబాద్ విమానాన్ని  దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ అయిందో  లేదో మరో బెదిరింపు కాల్‌  రావడం కలకలం  రేపుతోంది.

    ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల‌తోపాటు ఇతర ప్రాంతాల‌కు చెందిన‌ 300కి పైగా విమానాల రద్దుతో విమాన ఆలస్యాన్ని, ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండిగో. తాజాగా మరో  బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో  షార్జా నుంచి హైదరాబాద్  బయలుదేరిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం షార్జా నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా, గాలిలో ఉండగానే  బెదిరింపు  కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ,ముంబై విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి సహాయం చేశారు. రెండవ బాంబు బెదిరింపుపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

    ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

    గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు రావడంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి  పీల్చుకున్నారు. దీనిపై  పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

     

  • అమృత్‌సర్‌: పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేసి, సమాచారాన్ని చేరవేసిన ఆరోపణలపై అరెస్టయిన గుర్గామ్‌ న్యాయవాది రిజ్వాన్‌ కేసులో దర్యాప్తు సంస్థలకు పలు కీలక విషయాలు తెలిశాయి. అరెస్టయిన రిజ్వాన్‌కు రెండు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని, డబ్బు సేకరించేందుకు అతను ఏకంగా ఏడుసార్లు అమృత్‌సర్‌ వెళ్లాడని, అతని స్నేహితుడు, న్యాయవాది ముషారఫ్‌ అలియాస్‌ పర్వేజ్‌ పోలీసులకు తెలిపాడు. 

    2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు రిజ్వాన్‌తో స్నేహం ఏర్పడిందని ముషారఫ్‌ చెప్పాడు. జూలైలో, ఇద్దరూ కలిసి ముషారఫ్‌ కారులో అమృత్‌సర్‌ వాఘా సరిహద్దుకు వెళ్లారు. అక్కడ స్వర్ణ దేవాలయం వద్ద, ద్విచక్ర వాహనంపై వచ్చిన కొందరి నుండి రిజ్వాన్‌ ఒక సంచి నిండా డబ్బు తీసుకున్నాడు. అయితే, వారిని గుర్తించలేక పోయానని ముషారఫ్‌ తెలిపాడు. తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో.. కారును అక్కడే వదిలి రైలులో ప్రయాణించారు. ఆగస్టు 1న కారు తీసుకురావడానికి మళ్లీ అమృత్‌సర్‌ వెళ్లారని ముషారఫ్‌ చెప్పాడు.

    ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

    రూ.41 లక్షలు సేకరించి..
    రిజ్వాన్‌ మొత్తం రూ.41 లక్షల నగదును సేకరించినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ డబ్బును అతను అజయ్‌ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు తెలిపాడు. స్కార్పియో, స్కోడా కార్లలో వచ్చిన వ్యక్తుల నుండి డబ్బు సేకరించడానికి.. రిజ్వాన్‌ ఏడుసార్లు అమృత్‌సర్‌ వెళ్లాడు. రిజ్వాన్‌కు తౌరులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఖాతా, సోహ్నాలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఖాతా ఉన్నాయి. రిజ్వాన్‌ ల్యాప్‌టాప్, ఫోన్‌లో అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ కేసులో నుహ్‌ పోలీసు బృందాలు పంజాబ్‌ అంతటా దాడులు నిర్వహిస్తున్నాయి. 

  • పతనంతిట్ట: శబరిమల యాత్రికులకు తృటిలో ప్రమాదం తప్పింది. శబరిమల యాత్రికులతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. పంపా చలకాయం సమీపంలో కారు నుంచి పొగలు వస్తున్నట్లు గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తయ్యారు.

    కారును నిలిపివేసి భక్తులను అలర్ట్‌ చేయడంతో వారు కారు నుంచి వెంటనే బయటకు దిగిపోయారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది కారులో చెలరేగిన మంటలను ఆర్పివేశారు. ఈ కారులో హైదరాబాద్ భక్తులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
     

  • ఢిల్లీ: ఏపీలో అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. కేంద్రాన్ని కోరారు. ఏపీలో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారిని వెంటనే ఆదుకోవాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి. 

    ‘టన్ను 25 వేల రూపాయల ఉండే అరటి...ఇప్పుడు కిలో 50 పైసలకు  ధర పడిపోయింది. 50 పైసలకు ఒక బిస్కెట్ ఒక అగ్గిపెట్ట కూడా రాదు. అరటి కోత ధర కూడా కనీసం రైతుకు దక్కడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ، ప్రత్యేక రైళ్లతో అరటి సరఫరా చేశాం.  

    తక్షణమే ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వాలి. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. అరటి పండ్ల సరఫరాకు ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేయాలి. అరటి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. నా నియోజకవర్గంలోని కోడూరు అరటి పంటకు కేంద్రంగా ఉంది. కేంద్ర బృందాలు ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతుల కష్టాలను స్వయంగా చూడాలి . భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

  • బెంగళూరు ఐటీ ఉద్యోగి అకాల మరణం ఆందోళన రేపింది.  నల్లురహళ్లిలో నిర్మాణంలో ఉన్న భవనంలో  మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మురళి గోవిందరాజు గురువారం ఆత్మహత్య చేసుకున్నడు. అయితే  ఒక స్థలం కొనుగోలు విషయంలో లంచాలకు ఆశపడిన అధికారులు వేధింపుల కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

    మురళి గోవిందరాజుకు భార్య దుర్గాదేవి, పిల్లలు కనిష్ఠ, దేశిత ఉన్నారు. 2018లో నల్లురహళ్లిలో ఒక బంధువు నుండి ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు.  ఆ స్థలంలో ఇల్లు కట్టే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న, ఉషా నంబియార్, శశి నంబియార్ అనే ఇద్దరు వ్యక్తులు మురళిని పలుసార్లు  (సుమారు 10 నుంచి 15 సార్లు) ఇంటికొచ్చి మరీ రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి మృతుడు నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి.  వారు కొంతమంది గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులతో కుమ్మక్కయ్యారని, నిర్మాణ స్థలాన్ని పదేపదే సందర్శించి, తమ కుమారుడిని మానసికంగా వేధించి, బెదిరించారని కుటుంబం ఆరోపించింది. 

    నిరంతర వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని  పోలీసులకు దాఖలు చేసిన ఫిర్యాదులో తల్లి  పేర్కొంది. సంఘటన జరిగిన రోజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఉదయం 6 గంటలకు  నిర్మాణంలో ఉన్న భవనానికి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ కోసం ఉద్దేశించిన ఇనుప హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పని కోసం వచ్చిన వడ్రంగి గణేష్ మృతదేహాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.ఉష, శశిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మురళి తల్లి కోరింది. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నామని  పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

    ఇదీ చదవండి: నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!


     

  • న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒక కేసును ‘జాతీయ అవమానం’గా ధర్మాసనం అభివర్ణించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో పెండింగ​్‌లో ఉన్న యాసిడ్‌ దాడి కేసులను నాలుగు వారాల్లోగా విచారణ జరిపి, వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.

    యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుండి పెండింగ్‌లో ఉన్న బాధితురాలి కేసులో పదేపదే జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తన కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ, ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణను కూడా చేపట్టవచ్చని కూడా సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ, ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్థులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి  ఉంటుందన్నారు.

    తక్షణ న్యాయం అందించేందుకు, యాసిడ్ దాడి కేసులను ప్రత్యేక కోర్టులు విచారించడం ఉత్తమమని ప్రధాన న్యాయమూర్తి కాంత్ సూచించారు. అంతేకాకుండా యాసిడ్ దాడి బాధితులను వైకల్యం ఉన్న వ్యక్తులుగా వర్గీకరించాలని,  వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వీలు కల్పించాలని మాలిక్ చేసిన విజ్ఞప్తిపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నిరంతర వైద్య సంరక్షణలో ఉంటూ, బాధితులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను మాలిక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

    ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాక.. ఢిల్లీలో హై అలర్ట్..

International

  • పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు పెద్దపీట వేస్తుండగా.. అమెరికా ఎంపీలు మాత్రం మునీర్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 44 మంది అమెరికా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపారు. 

    పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ ఇకపై అమెరికాలోకి రాకుండా.. ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. 44 మంది ఎంపీలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియోకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికాలో సంచలనంగా మారింది. ఆసిమ్ మునీర్ ఒక నేరగాడని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పైనా చర్యలు తీసుకోవాలని అమెరికా ఎంపీలు తమ లేఖలో పేర్కొన్నారు. మునీర్‌పై తక్షణమే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. 

    ఈ లేఖ రాసిన వారిలో డెమోక్రటిక్ సభ్యులు ప్రమీలా జయపాల్, గ్రేగ్ కస్సార్ వంటివారు ఉన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, ఆ దేశంలో నియంతృత్వం, హింసా పెరిగాయని, జర్నలిస్టులను బెదిరిస్తున్నారని, కిడ్నాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. వర్జీనియా జర్నలిస్టు నూరానీ కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావించారు 

    వర్జీనియా జర్నలిస్టు అహ్మద్ నూరానీ పాకిస్థాన్ సైన్యంలో అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ, పాకిస్థాన్‌లో ఉంటున్న అతని ఇద్దరు సోదరులు అపహరణకు గురయ్యారు. నెలరోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత విడుదల చేసింది. వీరితోపాటు.. ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమరిది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం తర్వాతే అతను విడుదలైన విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్థాన్‌లో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా.. వారిని జైలులో నిర్బంధిస్తున్నారని, సోషల్ మీడియాలో గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని, మహిళలు, మైనారిటీలు, బలూచిస్థాన్ పౌరులు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు.

    ఇంకా ఆ లేఖలో ఏయే అంశాలను ప్రస్తావించారు?
    2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంపై దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు.  ఇందుకు సంబంధించిన పటాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చింది కేవలం తోలుబొమ్మ ప్రభుత్వమేనని విమర్శించారు. సైన్యమే డీఫాక్టోగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు కూడా సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని తీర్పునివ్వడం సహజ న్యాయసూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. 

    ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్థాన్‌లో పరిపాలన సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి ప్రస్తావించారు. అమెరికా చట్టాల ప్రకారం 44 మంది ఎంపీలు రాసిన లేఖను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఆరోపణలను ఎదుర్కొనేవారి వీసాపై  అమెరికా నిషేధం విధించాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే.. వాటిని జప్తు చేసే అవకాశాలుంటాయి.

NRI

  • మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్‌లో అవకాశాలు  వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను  కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్‌ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం  చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ  అందుకే ఒక ఎన్‌ఆర్‌ఐ   ఏం చేశాడో తెలుసా?

    కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్‌ఆర్‌ఐ ఇక నావల్ల కాదు బాబోయ్‌ అంటూ ఇండియాకు  తిరిగి  రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో  నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్‌గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ,  కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని  పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.

    చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడా

    కెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్‌ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో  గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస  పౌర జ్ఞానం లేకపోవడం  లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.

    నెటిజన్లు అతని  నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు  నచ్చినట్టు  జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్‌గా  ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్‌.. అనే  కమెంట్లు వెల్లువెత్తాయి.

    ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
     

Family

  • డిసెంబర్‌ 7, ఆదివారం సంకష్టహర చతుర్థి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. సాధారణంగా క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహర చతుర్థి ఎప్పుడనేదీ ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.

    ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. సూర్యాస్తమయం (Sunrise) అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి.

    ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం (Fasting) చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు పఠించి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఉపవాసం చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం పఠించినా ఫలితం ఉంటుంది.

    చ‌ద‌వండి: దత్తజయంతి నాడు ఏమి చేయాలి?

  • సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒక దానితో మరొకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలో ఉండే రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఏ విధంగా ఇడా, పింగళా నాడులు ఒక దానితో ఒకటి మెలికలు తిరిగి ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే చంద్ర నాడి, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషుమ్నానాడి ద్వారా పైకి వచ్చి మన మాడు పై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో ఐక్యం చెందుతుంది. అప్పుడే ఒక సాధకునికి యోగ్ర ప్రాప్తి జరుగుతుంది. ధ్యానంలో కుండలినీ శక్తి జాగృతిని, దాని ఊర్థ్వ గమనాన్ని అనుభూతి చెందితే, సాధకుడు నిరానంద అనుభూతిని పొంద గలుగుతాడు.

    మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమయ్యే కొద్దీ మన లోపల అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ విధంగా కుడి వైపు మూలాధార చక్రం మన లోపల సమతుల్యత ఏర్పడడానికి, నిర్విచార స్థితి నెలకొనడానికి సహాయ పడుతుంది.

    మితిమీరిన క్రియాశీలత, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అవసరానికి మించి పని చేయడం, అతిగా ప్రణాళికలు వేయడం, నిద్ర లేమి, మొండితనం, మూర్ఖత్వం, చిరాకు, కోపం, అతిగా మాట్లాడడం, అతిగా ఆటలు ఆడటం, క్రూరత్వం, కాఠిన్యం ఇటువంటివన్నీ మన కుడివైపు పింగళానాడిని బలహీన పరుస్తాయి. ఆ సమయంలో శ్రీ కార్తికేయుని ధ్యానం ద్వారా మనం మన లోపల గల అసమతుల్యత లను తొలగించు కోవచ్చును.  శ్రీ కార్తికేయుని ధ్యానం వలన మన చిత్తం నిర్మలంగా మారి మనకు నిర్విచార స్థితి లభిస్తుంది.

    ఒక గురువుకు తన మీద తనకు ఆత్మనిగ్రహం ఉంటుంది. అంటే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు. కానీ శ్రీ కార్తికేయుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించ గలుగుతాడు. ఆ విధంగా శాసించగల శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాల ద్వారా లభిస్తే, స్త్రీలకు వారి ప్రేమించే గుణం, సహనం, హుందాతనం, క్షమా గుణం, కరుణల ద్వారా లభిస్తుంది.

    శ్రీ కార్తికేయుని శక్తి మన లోపల పసితనం లాంటి అమాయకత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ అమాయకత్వం వలనే మానవులు ఆనందంగా ఉండగలుగుతారు. మనలో కుండలినీ శక్తి వెన్నెముక అడుగున ఉన్న త్రికోణాకార ఎముక నుండి బయలు దేరి, షట్చక్రాలనూ దాటుకుంటూ వెళ్ళి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించడానికి మార్గ మధ్యంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగించడానికి కుడి మూలాధార చక్రం సహకరిస్తుంది. శ్రీ కార్తికేయుని శక్తి పరిపూర్ణంగా స్వచ్ఛమైన క్రియాశీలక శక్తి. అందులో ఎటువంటి అనవసరమైన, పనికిమాలిన ఆలోచనలకు తావు లేదు. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది.
    – డా. పి. రాకేశ్‌
    (మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాలు, ప్రసంగాల ఆధారంగా)