Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.  213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

    ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్‌(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్‌ నిస్సాంక(41), అశుతోష్‌ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌ మూడు, నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ తలా వికెట్‌ సాధించారు.

    సంజూ సూపర్ సెంచరీ
    అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 52 బంతుల్లోనే తన నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తంగా సంజూ 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఆయూశ్ మాత్రే(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఓ వికెట్ సాధించాడు.
    చదవండి: IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ
     

  • ఐపీఎల్‌-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.

    కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్‌కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.

    మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు.

    అయూశ్‌ మాత్రే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్‌-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్‌కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.
    చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

  • ఐపీఎల్-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రో ఓట‌మి చ‌విచూసింది. శ‌నివారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలైంది. 220 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు కాపాడుకోలేక‌పోయారు.  ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.5 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్‌ ఆర్య(57), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు.  బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు.

    "మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.

    కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయాము. టీ20 క్రికెట్‌లో  సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్‌లో మ్యాచ్‌కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. 

    ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది?  వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్న‌టి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.

     

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్‌ హెడ్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 27, క్లాసెన్‌ 33 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 39 పరుగులు చేశాడు.

    మిగతా ఆటగాళ్లలో అనికేత్‌ వర్మ 18, సలీల్‌ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్‌ 0, హర్ష్‌ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, శాశాంక్‌ సింగ్‌ తలో 2, జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఓ వికెట్‌ తీశారు.

    అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌కు ధీటుగా జవాబిచ్చింది. తొలి బంతి నుంచి పంజాబ్‌ ఓపెనర్లు ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ప్రియాంశ్‌ ఆర్య (20 బంతుల్లో 57; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్‌ (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. 

    ఆతర్వాత శ్రేయస్‌ అయ్యర్‌  (33 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం కొనసాగించారు. ఫలితంగా పంజాబ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఊదేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో శివాంగ్‌ కుమార్‌ (4-0-33-3) రాణించాడు. 
     

  • Chennai super kings vs delhi capitals live Updates: 

    ఢిల్లీపై సీఎస్‌కే గ్రాండ్‌ విక్టరీ
    ఐపీఎల్‌-2026లో సీఎస్‌కే తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

    ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్‌(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫాథుమ్‌ నిస్సాంక(41), అశుతోష్‌ శర్మ(19) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో జేమీ ఓవర్టన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్‌ మూడు, ఖలీల్‌ అహ్మద్‌, నూర్‌ అహ్మద్‌ తలా వికెట్‌ సాధించారు.

    ఓటమి దిశగా ఢిల్లీ
    ఢిల్లీ విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు కావాలి. క్రీజులో స్టబ్స్‌(60), కుల్దీప్‌ యాదవ్‌(3) ఉన్నారు.

    ఢిల్లీ ఆరో వికెట్‌ డౌన్‌
    అశుతోష్‌ రూపంలో ఢిల్లీ ఆరో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన అశుతోష్‌.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 60 పరుగులు కావాలి.

    ఢిల్లీ ఐదో వికెట్‌ డౌన్‌
    డేవిడ్‌ మిల్లర్‌ రూపంలో ఢిల్లీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన మిల్లర్‌.. ఓవర్టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రీజులో స్టబ్స్‌(34), అశుతోష్‌ శర్మ(9)ఉన్నారు.

    10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 91/4
    10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌(11), డేవిడ్‌ మిల్లర్‌(6) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 57 బంతుల్లో 121 పరుగులు కావాలి.

    ఢిల్లీ నాలుగో వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అక్షర్‌ పటేల్‌.. గుర్‍జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు స్కోర్‌: 73/3

    ఢిల్లీ రెండో వికెట్‌ డౌన్‌
    పాథుమ్‌ నిస్సాంక రూపంలో ఢిల్లీ రెండో వికెట్‌ కోల్పోయింది. 41 పరుగులు చేసిన నిస్సాంక.. అన్షుల్‌ కాంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఢిల్లీ తొలి వికెట్‌ డౌన్‌
    61 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌.. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిస్సాంక(41), రిజ్వీ ఉన్నారు.

    సంజూ సూపర్‌ సెంచరీ.. సీఎస్‌కే భారీ స్కోర్‌
    చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 పరుగులు చేశాడు. అతడితో పాటు అయూశ్‌ మాత్రే(59), దూబే(10 బంతుల్లో 20) రాణించారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు. అయూశ్‌ మాత్రే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

    సంజూ శాంసన్‌ సెంచరీ
    17వ ఓవర్‌లో సంజూ శాంసన్‌ ఫోర్‌ బాది  సెంచరీ నమోదు చేశాడు
    ఈ సీజన్‌లో  52 బంతుల్లో తొలిసెంచరీ చేశాడు
    ఢిల్లీపై 3సిక్స్‌లు,14 ఫోర్లతో సంజూ సెంచరీ పూర్తి చేశాడు      

    ఆయూష్‌ ఔట్‌ 
    17వ ఓవర్‌లో సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది
    17వ ఓవర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో సీఎస్‌కే బ్యాట్స్‌మెన్‌ ఆయూష్‌ ఔటయ్యాడు  

    55 బంతుల్లో సెంచరీ  భాగస్వామ్యం 
    సంజు, ఆయుష్‌ రెండో వికెట్‌కు 55 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు 
    క్రీజులో సంజు 95, ఆయుష్‌ 55 
    17 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 174/1 
    12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 119-1, క్రీజులో సంజూ శాంసన్‌(77), ఆయూష్‌ మాత్రే(25) ఉన్నారు.

    శాంసన్‌ హాఫ్‌ సెంచరీ
    ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో సీఎస్‌కే సూప‌ర్ స్టార్ సంజూ శాంస‌న్ తొలి హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 52 ప‌రుగుల‌తో సంజూ త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. 8.5 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 77/1

    సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌
    సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6.2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 62/. క్రీజులో సంజూ శాంస‌న్‌(46), అయూశ్ మాత్రే ఉన్నారు.

    దూకుడుగా ఆడుతున్న సంజూ
    సంజూ శాంసన్‌ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. 22 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 3 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 27/1

    టాస్‌ గెలిచిన ఢిల్లీ..
    ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. తుది జట్టులోకి అకిబ్‌ నబీ, అశుతోష్‌ శర్మ తుది జట్టులోకి వచ్చారు.

    జమ్మూ కాశ్మీర్‌ పేసర్‌ అకిబ్‌ నబీకి ఇదే తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌. సీఎస్‌కే కూడా రెండు మార్పులు చేసింది. విధ్వంసకర బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ తిరిగి పునరాగమనం చేశాడు. అదేవిధంగా గుర్జప్నీత్ సింగ్‌ సీఎస్‌కే తరపున ఐపీఎల్‌ డెబ్యూ చేశాడు.

    తుది జట్లు
    ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్‌), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్

    చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

  • పాకిస్తాన్ సూప‌ర్ స్టార్‌, పెషావ‌ర్ జెల్మీ కెప్టెన్ బాబ‌ర్ ఆజం ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌లో 4000 ప‌రుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా ఆజం చ‌రిత్ర సృష్టించాడు. శనివారం కరాచీ వేదికగా లహోర్ ఖలంధర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 

    బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి పీఎస్‌ఎల్ కెరీర్‌లో 37 ఫిప్టీలతో పాటు రెండు సెంచరీలు ఉన్నాయి.  ప్రస్తుత పీఎస్‌ఎల్‌ సీజన్‌లో బాబర్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 70.67 సగటుతో 212 పరుగులు చేసి సెకెండ్ లీడింగ్ రనస్కోరర్‌గా బాబర్ కొనసాగుతున్నాడు.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లహోర్‌పై 76 పరుగుల తేడాతో కరాచీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పెషావర్‌ ఇన్నింగ్స్‌లో కుశాల్‌ మెండిస్‌(48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మైఖల్‌ బ్రేస్‌వెల్‌(21), మహ్మద్‌ హ్యారిస్‌(18) రాణించారు.

    లహోర్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ రెండు, ఉబైడ్‌ షా, ఉసమా మీర్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లహోర్‌.. పెషావర్‌ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. పెషావర్‌ బౌలర్లలో స్పిన్నర్లు మైఖల్‌ బ్రేస్‌వెల్‌, సుఫియన్‌ ముఖియమ్‌ తలా మూడు వికెట్లతో లహోర్‌ పతనాన్ని శాసించారు. వీరితో పాటు షోర్‌ఫుల్‌ ఇస్లాం, అమీర్‌ జమీల్‌ ఓ వికెట్‌ సాధించారు.
    చదవండి: టీమిండియాలోకి వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఎప్పుడంటే?

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న భీక‌ర ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.  శుక్ర‌వారం గౌహ‌తి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్ వంటి ప్రపంచస్ధాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. వైభవ్‌ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు.

    దీంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 200 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసల వర్షం కురిపించాడు.

    "వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్‌ను చూడడం ఇదే తొలిసారి. అతి పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి వైభవ్‌ కచ్చితంగా అర్హుడు" అని ధుమాల్ ఎక్స్‌వేదికగా కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే తన 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు అర్హత సాధించాడు.

    ఐపీఎల్‌-2026 సీజన్ తర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశముంది. వైభవ్ ప్రదర్శనలను అజిత్ అగార్కర్ అండ్ కో నిశితంగా పరిశీలిస్తోంది.

    ఒకవేళ త్వరలో జరగనున్న ఐర్లాండ్ సిరీస్‌కు వైభవ్ ఎంపికైతే, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ ఆల్-టైమ్ రికార్డును వైభవ్‌ తిరగరాసే అవకాశం ఉంది. టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.
    చదవండి: ఊచకోత.. చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 11) జరుగుతున్న మ్యాచ్‌లో 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేయడంతో ఐపీఎల్‌ చరిత్రలో 20 లోపు బంతుల్లో 5 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 16 బంతుల్లో ఓసారి.. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు హాఫ్‌ సెంచరీలు చేశాడు.

    ఈ విభాగంలో అభిషేక్‌ తర్వాతి స్థానంలో నికోలస్‌ పూరన్‌ ఉన్నాడు. పూరన్‌ 4 సార్లు ఐపీఎల్‌లో 20 లోపు బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశాడు. అభిషేక్‌, పూరన్‌ తర్వాతి స్థానాల్లో జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (3), వైభవ్‌ సూర్యవంశీ (3) ఉన్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అభిషేక్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ట్రవిస్‌ హెడ్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 38 పరుగులు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 27, క్లాసెన్‌ 33 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌ సాయంతో 39 పరుగులు చేశాడు.

    మిగతా ఆటగాళ్లలో అనికేత్‌ వర్మ 18, సలీల్‌ అరోరా 9 పరుగులు చేయగా.. నితీశ్‌ 0, హర్ష్‌ దూబే ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, శాశాంక్‌ సింగ్‌ తలో 2, జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఓ వికెట్‌ తీశారు.

     

  • రాజస్థాన్‌ రాయల్స్‌ యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ 2026 ఎడిషన్‌లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) తన జట్టుకు తిరుగులేని విజయాన్నందించిన వైభవ్‌.. ఈ ఎడిషన్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న​ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

    గతంలో ఈ రికార్డు గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ పేరిట ఉండేది. సాయి 23 ఏళ్ల 231 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. వైభవ్‌, సాయి తర్వాతి స్థానాల్లో శుభ్‌మన్‌ గిల్‌ (23 ఏళ్ల 263 రోజులు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (24) ఉన్నారు.

    ఈ ఏడిషన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 266.67 స్ట్రయిక్‌రేట్‌తో 50 సగటున 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 18 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో వైభవ్‌ చేసిన రెండు అర్ద సెంచరీలు 15 బంతుల్లోనే (సీఎస్‌కే, ఆర్సీబీ) చేయడం మరో విశేషం. ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో టాప్‌-3 రన్‌ స్కోరర్లు రాయల్స్‌ ఆటగాళ్లే (వైభవ్‌ (200), జైస్వాల్‌ (183), జురెల్‌ (176)) కావడం మరో విశేషం.

    ఇదిలా ఉంటే, గత ఎడిషన్‌లో (2025) 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వైభవ్‌ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. వైభవ్‌ ప్రస్తుతమున్న జోరును కొనసాగిస్తే ఈ సీజన్‌లో చాలా అల్‌టైమ్‌ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. 

    అతి చిన్నవయసులో ఐపీఎల్‌ అరంగేట్రంతో పాటు ఐపీఎల్‌ చరిత్రలో భారత ఆటగాడిచే అత్యంత వేగవంతమైన సెంచరీ (35) రికార్డులు కలిగిన వైభవ్‌.. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా (ఐపీఎల్‌ చరిత్రలో) ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

     

Movies

  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్‌-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్‌ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.  

    మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి.  

  • ముంబై: ప్రముఖ గాయని ఆశా భోస్లే (92)  ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయింత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు.  లోక్‌మత్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.  :ఆమెకు ఐసీయూ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దాని ఆమె కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వెల్లడించారు.

    సినిమా పాటలతో పాటు గజల్స్, ఖవ్వాలీ,  శాస్త్రీయ కచేరీలు తన మధుర గాత్రంతో మెప్పించిన ఆశా భోస్లేకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వేదిక ఏదైనా సరే తన పాటకు తిరుగులేదని లెజెండరీ సింగర్‌గా నిరూపించుకున్నారు. 

    పదేళ్ల వయసు నుంచే తన పాటలతో మెప్పించిన ఆశ సుమారు 800లకు పైగా చిత్రాల్లో 12 వేల పైచిలుకు పాటలు పాడారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. ఎన్నో మరపురాని పాటలు ఆలపించారు. 

  • మైక్రో ఫైనాన్స్‌ పేరుతో రూ.10 కోట్లు మోసం చేశారని గాయని మంగ్లీపై నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ  కొన్ని కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.  మంగ్లీ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

    వేణు ఊడుగుల స్పందిస్తూ..' గాయని మంగ్లీ వివాదంలో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలు చూసి చాలా బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే నేను సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా లేదు. 

    అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా.' అని ఆయన పేర్కొన్నారు.

  • యాంకర్‌, నటి అనసూయ మరోసారి నటుడు శివాజీపై కౌంటర్‌ వేసింది. కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన చెత్త వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.. అయితే, తాజాగా   చీర కట్టుకుని తన కుటుంబంతో పాటుగా అనసూయ గుడికి వెళ్లింది. కొందరు నెటిజన్లు ఆ వీడియోను షేర్‌ చేస్తూ.. శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ అంటూ పోస్ట్‌ చేశారు. దీంతో ఆమె కూడా కౌంటర్‌ ఇచ్చింది.

    నెటిజన్లు షేర్‌ చేసిన థంబ్‌నైల్‌ ఎలా ఉండాలో తనదైన స్టైల్లో అనసూయ ఒక సలహా కూడా ఇచ్చింది 'శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ థంబ్‌నైల్‌ పెడుతారనుకున్నాను. సరైన హెడ్‌లైన్‌ కూడా ఇదే కదా.. ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు చీరలు కట్టుకోలేదు. ఏమైనా పోస్ట్‌ చేసేముందు చూసుకోవాలి కదా..' అంటూ కౌంటర్‌ ఇచ్చింది. వాస్తవంగా చాలా ఈవెంట్లలో అనసూయ చీరకట్టులోనే కనిపించిన సందర్భాలు ఉన్నాయి. గుడికి వెళ్తున్న సమయంలో దాదాపు చీరకట్టులోనే వెళ్తారనే విషయం తెలిసిందే. అనసూయ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా షేర్‌ చేస్తున్నారు.
     

  • టాలీవుడ్‌ నటుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్‌ కనకరాజు’. ఇందులో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్‌ రచించగా సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. సంగీతం తమన్‌ అందించారు.

  • పాపం ప్రతాప్‌ సినిమా ట్రైలర్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌ దర్శకత్వంలో  పవన్ కల్యాణ్‌ నటించిన  తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'  భారీ డిజాస్టర్‌ అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా హరీష్ దానిని తీవ్రంగా ప్రచారం చేస్తూనే వచ్చారు. అతను వాస్తవాన్ని అంగీకరించడం లేదని  ప్రేక్షకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే,  తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్'  సినిమా కార్యక్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎట్టకేలకు అంగీకరించాడు.

    దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ వేదికపై ఇలా అన్నాడు. "ఈ కార్యక్రమానికి వస్తుండగా యాంకర స్రవంతి  నన్ను ‘పాపం హరీష్’ అని పిలిచింది. నా సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) థియేటర్లలో సరిగ్గా ఆడకపోవడం వల్లే ఆమె అలా పిలిచిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత, ఆమె అందరినీ ‘పాపం’ అనే సంబోధనతో పిలవడం మొదలుపెట్టింది. అందుకే ఫర్వాలేదని అనుకున్నాను," అని హరీష్ శంకర్  అన్నారు. అందుకు సంబంధించిన క్లిప్‌ వైరల్‌ అవుతుంది.
     

  • ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారత మార్కెట్‌లో జోరు పెంచింది. సుమారు మూడేళ్ల క్రితం సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను తగ్గించి వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. భారత్‌లో అమలు చేసిన ఈ ప్లాన్‌ విజయవంతం కావడంతో పలు దేశాల్లో దీనిని అమలు చేస్తుంది. ఎక్కువ కంటెంట్‌తో భారత ప్రజలను అలరించిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోను దాటి నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు వచ్చేసింది.

    నివేదికల ప్రకారం, భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 92 మిలియన్ల (9.2 కోట్లు) నెలవారీ వినియోగదారులు ఉన్నారు.  ప్రైమ్ వీడియోకు 67 (6.7కోట్లు) మిలియన్ల నెలవారీ వినియోగదారులతో వెనుకపడింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో ప్రైమ్ వీడియోపై నెట్‌ఫ్లిక్స్ పైచేయి సాధించింది. నెట్‌ఫ్లిక్స్ రోజురోజుకు కొత్తవారిని తనవైపు తిప్పుకుంటూ వృద్ధిని సాధిస్తుండగా, ప్రైమ్ వీడియో మాత్రం నిరంతర క్షీణతను చవిచూస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చిత్రనిర్మాతలకు ప్రధాన వేదికగా మారింది. 

    భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథలతో కూడిన ఒరిజినల్స్‌పై దృష్టి సారించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ తన స్థాయిని కూడా పెంచుకుంది. ధరలు కొద్దిగా తగ్గించడం కూడా బాగా కలిసొచ్చింది. అయితే, ప్రైమ్ వీడియోలో ప్రకటనలను ప్రవేశపెట్టడం మేలు కంటే కీడే ఎక్కువ చేసింది, ఆపై సబ్‌స్క్రిప్షన్ ఖర్చు కూడా పెరిగింది.  అయితే, భారత్‌లో జియోహాట్‌స్టార్‌ టాప్‌లో ఉంది. ఏకంగా 500 మిలియన్ల ( 50 కోట్ల) నెలవారి వినియోగదారులు ఈ సంస్థకు ఉన్నారు.

International

  • వాషింగ్టన్‌: ఇస్లామాబాద్‌లో జరుగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్‌ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఈ చర్యను ‘ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నం’గా ఆయన అభివర్ణించారు.

    వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నౌకలు తూర్పు నుండి పశ్చిమ దిశగా గల్ఫ్‌లోకి ప్రవేశించి, తిరిగి అరేబియన్ సముద్రానికి చేరుకున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో మాట్లాడుతూ.. మేము హర్మూజ్‌ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తున్న ఉపకారం. వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదు” అని ఎద్దేశించారు.

    అదే సమయంలో ఆయన ఇరాన్‌కి పెద్దగా సైనిక శక్తి లేకపోయినా, సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతుందని సూచించారు. అంటే, ఇరాన్‌కి ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, కానీ మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాలుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మార్గాన్ని తిరిగి తెరవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఇస్లామాబాద్‌లో కొనసాగుతున్నాయి. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ చర్చలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి.

  • అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు 56 ఏళ్ల  హంటర్ బైడెన్ అప్పుల్లో కూరుకుపోయారా? తాజా వార్తలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.  17 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 158 కోట్లు) అప్పు చూపించి  అమెరికానుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తన మాజీ న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల విషయంలో కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    వాషింగ్టన్ డిసిలో, విన్‌స్టన్ & స్ట్రాన్ అనే తన మాజీ న్యాయ ప్రతినిధులు దాఖలు చేసిన ఒక వ్యాజ్యం విచారణలో ఏప్రిల్ 6న అతని న్యాయవాది బ్యారీ కోబర్న్ సమర్పించిన పత్రంలో, బైడెన్ దేశంలోని లేరని, విదేశాలలో నివసిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే, ఆయన కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే సమాచారం తన వద్ద కూడా లేదని వెల్లడించారు.

    విన్‌స్టన్ అండ్ స్ట్రాన్ అనే న్యాయవాద సంస్థకు హంటర్ సుమారు 50,000 డాలర్లు (దాదాపు రూ. 43 లక్షలు) బకాయి ఉన్నారని పేర్కొంటూ, ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకే ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. పన్ను ,తుపాకీ నేరాల కేసులతో పాటు ఇతర న్యాయ పోరాటాలలో కూడా  హంటర్‌ తరపున వాదించిన విన్‌స్టన్ & స్ట్రాన్ న్యాయ సంస్థ, హంటర్‌  తమ బిల్లులు చెల్లించడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తోంది. 

    మరోవైపు బైడెన్ స్వయంగా తన ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను బహిరంగంగా అంగీకరించారు. గత సంవత్సరం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, తాను సుమారు 17 మిలియన్ డాలర్ల  మేర  న్యాయపరమైన అప్పును కలిగి ఉన్నానని ఆయన వివరించినట్లు డైలీ మెయిల్ నివేదించింది.

    అలాగే గత ఏడాది నవంబర్‌లో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, బైడెన్  దక్షిణాఫ్రికాలోని ఒక  నగరాన్ని ఆప్యాయంగా వర్ణిస్తూ, తాము దక్షిణాఫ్రికా , అమెరికా మధ్య సమయాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు అదే నెలలో, విదేశీ ప్రయాణ ఖర్చులను కారణంగా చూపుతూ అధ్యక్షుడు ట్రంప్ అతని సీక్రెట్ సర్వీస్ రక్షణను రద్దు చేసిన నేపథ్యంలో బైడెన్‌ కుటుంబం ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తలదాచుకుంటున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. కేప్ టౌన్ వాస్తవ్యురాలైన బైడెన్ భార్య మెలిస్సాతో 2025 మే నెలలో  దక్షిణాఫ్రికాలో కనిపించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినప్పటికీ, ఈ నెలలో కాలిఫోర్నియాలోని శాంటా యినెజ్‌లో జరిగిన ఒక ఈస్టర్ కుటుంబ సమావేశంలో బైడెన్ పాల్గొనడంతో సుమారు 10,000 మైళ్ల రౌండ్ ట్రిప్‌కు ఎవరు నిధులు సమకూర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హంటర్‌కు ఆర్థికమద్దతు లభించింది  ప్రధానంగా హాలీవుడ్ న్యాయవాది కెవిన్ మోరిస్ నుండే. అతను  బైడెన్‌కు 6.5 మిలియన్ డాలర్లకు పైగా రుణం ఇచ్చారు. అలాగే, తండ్రి  జో బైడెన్‌ అధ్యక్షపదవిలో  ఉన్న సమయంలో కళారంగం ( ఆర్ట్‌ అండ్‌ పెయింటింగ్స్‌) ద్వారా 1.5 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయట.

  • వాషింగ్టన్‌: ఇరాన్ చిత్తుగా ఓడిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ఇరాన్ గెలుస్తోందని చెప‍్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది. కానీ, వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసని తెలిపారు.

    “వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారికి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థ లేదు, రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు, వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి. ముఖ్యంగా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇక లేరు’ అని తెలిపారు.

    సముద్రంలో ఇరాన్‌ మైన్లు వేసిన విషయాన్ని ట్రంప్‌ ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని బాగు చేస్తోందని, ప్రపంచ దేశాలకు సాయంగా ఈ పని చేస్తున్నామని అన్నారు.

    మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో జరుగుతున్న చర్చలు కొన్ని భేదాలు, ముందస్తు షరతుల వల్ల ఆలస్యమయ్యాయయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, చర్చలు 5 గంటలకుపైగా ఆలస్యమయ్యాయని, ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యాయని ట్రంప్‌ చెప్పారు. ఇరాన్ యుద్ధం వేళ ఎరువుల ధరలను నిశితంగా గమనిస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. మార్కెట్‌ను నియంత్రిస్తూ ధరలను అధికంగా పెంచడాన్ని అమెరికా అంగీకరించదని చెప్పారు. 

    కాగా, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ స్పీకర్‌ మహమ్మద్ బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున‍్నారు.

    చర్చలలో అమెరికాకు ఇరాన్ ప్రతిపాదనలు ఇవే..

    • ఇరాన్‌పై దురాక్రమణ చేయొద్దు
    • హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడానికి అంగీకరించడం
    • అన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడం
    • అన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడం
    • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
    • IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
    • ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించడం
    • ఈ ప్రాంతం నుంచి అమెరికా సైనికదళాలను ఉపసంహరించుకోవడం
    • లెబనాన్‌పై దాడులు విరమించుకోవడం 
  • జీవితాన్ని జయించిన ప్రేమ కథ..!.. ఇదొక శీర్షిక మాత్రమే కాదు.. ఆలుమగలకు ఆదర్శమైన ప్రధాన విషయం. ప్రస్తుత రోజుల్లో  భార్యా భర్తల సంబంధాల్లో ప్రేమలు ఎంతవరకూ ఉంటున్నాయనే దానికి ఈ తరహా ఘటనలు ప్రేరణగా నిలుస్తాయి. ఒకరికోసం ఒకరు జీవించే క్షణాలు చాలా అల్పమై స్వల్పమైపోయిన ఈ రోజుల్లో నిజంగా ఇదొక స్ఫూర్తిగానే నిలుస్తుంది. 

    ఏదో యాంత్రిక జీవితంలో ముందుకు సాగుతూ.. ఏదో బ్రతికేస్తున్నాం అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తేనే ఆ దాంపత్యానికి అర్ధం ఉంటుందనేది తాజా ఎపిసోడ్‌ చెప్పకనే చెప్పేసింది. 

    ఇలా ఒకరికోసం ఒకరు అనే జంట ఉండటమే ఇప్పుడు వార్త అయ్యింది.  వార్తా వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన డెంగ్‌ యుకై అనే మహిళకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. నడవలేని స్థితి. బెడ్‌కే పరిమితమై కృంగిపోయింది. తాను చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా భర్తను ప్రాధేయ పడింది. భర్తకు తనవల్ల కష్టం రాకూడదని ఆమె చనిపోవాలని అనుకుంది. తాను చనిపోతే భర్త సుఖంగా ఉంటాడని భావించింది. 

    భర్త నో అన్నాడు.  ‘నేను ఉండగా నీకేం కాదు’ అన్నాడు,. భార్యకు అండగా నిలబడ్డాడు. విధితో పోరాడాడు. తన సంకల్పం ఎంత గట్టిదో చూపించాడు. భార్యను పూర్వపు స్థితికి తీసుకురావడానికి సుమారు రూ. 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టాడు. అదే సమయంలో  ప్రతీ రోజూ ప్రతీ క్షణం భార్య అలా బెడ్‌కే పరిమితమైన భార్య ముందు డ్యాన్స్‌లు చేస్తూ నవ్వించే యత్నం చేశాడు. చివరకు ఆమె కోలుకుంది. మళ్లీ తన పాత రోజుల్లోకి వచ్చేసింది. ప్రేమ శక్తితో భార్య తిరిగి జీవం పోసుకుంది.. లౌకిక జీవితాన్ని మళ్లీ చూడసాగింది. 

     

     


     

  • ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొనసాగుతున్న చర్చల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ హాజరైన సందర్భంలో.. ఇరాన్–అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ధరించిన వేషధారణ ప్రత్యేక చర్చకు దారి తీసింది.   

    అమెరికా-పాక్‌ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఆసిమ్‌ మునీర్‌ వ్యహరశైలి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చర్చాంశనీయంగా మారింది. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ ఘాలిబాఫ్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ నేతృత్వంలోని 71 మంది సభ్యుల ఇరాన్‌ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికే సమయంలో మునీర్‌ యుద్ధ దుస్తులు (కామోఫ్లేజ్‌ కాంబాట్‌ డ్రెస్‌)లో కనిపించారు. అయితే, కొన్ని గంటల తర్వాత నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేరుకున్నప్పుడు, మునీర్‌ పూర్తిస్థాయి సూట్‌ ధరించి హాజరయ్యారు

    ఆశ్చర్యంగా ఆసిమ్‌ మునీర్‌ తీరు
    విదేశీ నాయకులను కలిసేటప్పుడు సైనికాధికారి ఎల్లప్పుడూ యూనిఫాంలో ఉండాలి. కానీ ఆసిమ్‌ మునీర్‌ మాత్రం అమెరికన్లతో తాను దౌత్యవేత్తగా.. ఇరాన్‌తో సైనికుడిగా ఉన్నానని చూపిస్తున్నారని, ఆసిమ్‌ మునీర్‌ తీరు సరైంది కాదని సీనియర్ ఆర్మీ జనరల్ ప్రవర్తనకు తగనిది’ అని రిటైర్డ్ మేజర్ జనరల్ సంజయ్ మెస్టన్ తెలిపారు.  

    ఇరాన్‌తో సమావేశంలో యుద్ధ దుస్తులు ధరించడం ద్వారా మునీర్‌ సైనిక శక్తిని ప్రదర్శించాలనే సంకేతం ఇచ్చారని రక్షణ నిపుణులు విశ్లేషించారు. ఇటీవల ఇరాన్–పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు, క్షిపణి దాడుల నేపథ్యం ఈ నిర్ణయానికి కారణమని వారు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా ప్రతినిధులతో సమావేశంలో సూట్‌ ధరించడం ద్వారా తాను కేవలం సైనికాధికారి మాత్రమే కాకుండా దౌత్యవేత్తగానూ ఉన్నానని చూపించుకోవాలనుకున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను ప్రతిబింబిస్తోందని కూడా వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సమావేశాల్లో కూడా మునీర్‌ సూట్‌ ధరించడమే గమనార్హం. ట్రంప్‌ ఆయనను తన ‘ఫేవరెట్‌ ఫీల్డ్‌ మార్షల్‌’ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.

    2024లో ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్‌ బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌పై దాడి చేసింది. బలూచ్‌ వేర్పాటువాద సున్నీ మిలిటెంట్‌ గ్రూప్‌  జైష్‌ అల్‌–అదల్‌  లక్ష్యంగా చేసుకుంది. ఇదే గ్రూప్‌ ఇరాన్‌లోని సిస్తాన్‌ ప్రావిన్స్‌ స్వతంత్రత కోసం పోరాడుతోంది. కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్‌ కూడా ప్రతిగా ఇరాన్‌ సిస్తాన్‌–బలూచిస్తాన్‌ ప్రాంతంలో బలూచ్‌ మిలిటెంట్లపై దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతలు చివరికి చైనా జోక్యంతో తగ్గాయి. అయినప్పటికీ, ఇరాన్‌–పాకిస్థాన్‌ సంబంధాలు అప్పటి నుంచి స్థిరంగా లేవు. అమెరికా వైపు చూస్తే, ఆసిమ్‌ మునీర్‌ సూట్‌ ధరించడం ద్వారా తాను కేవలం సైనిక నాయకుడే కాకుండా దౌత్యవేత్తగా కూడా ఉన్నానని చూపించుకోవాలనుకున్నాడు. ఇది ఆయన రాజకీయ ఆశయాలను స్పష్టంగా తెలియజేస్తోందని రక్షణ నిపుణుడు సందీప్‌ ఉన్నితన్‌ వ్యాఖ్యానించారు.

    అదే సమయంలో మునీర్‌ తన శక్తి సామర్ధ్యాలేమిటో ప్రపంచానికి, అలాగే పాకిస్థాన్‌ ప్రజలకు మరో సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి లేదా అమెరికా ఉపాధ్యక్షుడి వంటి ఉన్నతాధికారులను స్వాగతించేది పాకిస్థాన్‌ అధ్యక్షుడు, ప్రధానమంత్రి లేదా విదేశాంగ మంత్రి కావాలి. కానీ ఈసారి మునీర్‌ ముందుకు రావడం అందుకు ఊతంగా నిలుస్తోంది.   

    జేడీ వాన్స్‌తో రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ, నవ్వుతూ, మాట్లాడుతున్న మునీర్‌ దృశ్యాలు కేవలం ప్రొజెక్షన్‌ కోసం అని నిపుణులు చెబుతున్నారు. ‘పాకిస్థాన్‌లో సైన్యం ఆధిపత్యం వహిస్తుంది. అసిమ్‌ మునీర్‌ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎక్కడైనా ఆయన కనిపిస్తారు. తానే నిర్ణయాలు తీసుకుంటానని స్వయంగా చెప్పకనే చెబుతున్నారని తెలుస్తోంది. 
     
    రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కోసం పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఇరాన్‌ నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శాంతి చర్చల్లో పాల్గొంది.  

  • ఇరాన్‌తో యుద్ధం,  శాంతి  చర్చల మధ్య అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వ్యాఖ్యలు  సంచలనంగా మారాయి. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ  చేయడానికి ఆమె రెడీ అవుతున్నారు.  గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన కమలా శుక్రవారం న్యూయార్క్‌లో జరిగిన 'నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్' (NAN) సదస్సులో  తొలిసారి ఆ విషయంపై స్పందించడం గమనార్హం.


    2024లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, 2028లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. న్యూయార్క్ నగరంలో రెవరెండ్ అల్ షార్ప్టన్ స్థాపించిన 'నేషనల్ యాక్షన్ నెట్‌వర్క్' సమావేశంలో పాల్గొన్న కమలా హారిస్ తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028లో మళ్ళీ పోటీ చేస్తారా అని ప్రశ్నించినపుడు  చేయవచ్చు.. దాని గురించి ఆలోచిస్తున్నాను పోటీ చేసే అవకాశం ఉంది అని  హారిస్ సమాధానమిచ్చారు. 2028లో "అమెరికా ప్రజల కోసం" అధ్యక్షుడిగా ఎవరు ఉత్తమంగా పని చేయగలరు అనే దానిని బట్టి తాను పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తానని హారిస్ తెలిపారు. ఈ సమాధానంతో అక్కడికి వచ్చిన వారంతా హర్షధ్వానాలు చేశారు. 2028 నాటికి అమెరికా ప్రజల కోసం ఎవరు అత్యుత్తమంగా పనిచేయగలరు అనే కోణంలోనే తన పోటీపై నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా మంది ప్రజలకు సంతృప్తిని ఇవ్వడం లేదని, మార్పు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "స్టేటస్ కో" ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రజల కోసం చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని  కమలా హారిస్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌పై  కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

     "> ఈ సమావేశానికి కమలా హారిస్‌తో పాటు 2028లో అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర కీలక డెమోక్రాటిక్ నేతలు కూడా హాజరు కావడం విశేషం. వీరిలో  పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, మాజీ రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ తదితరులు సహా పలువురు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులున్నారు. 

    ఇదీ చదవండి: నో మెన్‌... ఓన్లీ విమెన్‌ : 300మంది వీడియో వైరల్‌

    2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన హారిస్, డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ట్రంప్ ప్రజా ఓటుతో పాటు ఎలక్టోరల్ కాలేజీని కూడా గెలుచుకున్నారు. హారిస్ గతంలో  అమెరికా సెనేటర్‌గా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా  పనిచేశారు. హారిస్ ఓటమి తర్వాత, డెమోక్రాటిక్ పార్టీలో కొత్త నాయకత్వం రావాలని మెజారిటీ ఓటర్లు కోరుకుంటున్నట్లు పోలింగ్ గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు  డెమోక్రాటిక్ పార్టీ తరపున పలువురు రేస్‌లో నిలిస్తే, గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు  ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై యుద్ధం, ఇజ్రాయెల్‌తో దోస్తీ కారణంగా, రాజకీయపరంగా, పరిపాలనా పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్న  నేపథ్యంలో  కమలా హారిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 
     

  • ఇస్లామాబాద్‌లో అ‍మెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతకర పరిణామం చోటు చేసుకుంది. చర్చలకు ముందు అమెరికా రెండు కండీషన్స్‌ అంగీకరించిందని ఇరాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. టెహ్రాన్‌ పెట్టిన షరతులను అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాయిటర్స్‌ కథనం ప్రచురించింది.

    అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు సంబంధించి ఫ్రీజ్‌ చేసిన ఆస్తులను విడుదల చేయడం పై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ నెలకొంది. కాగా అంతకుముందు ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌ సీజ్‌ఫైర్‌, ఖతార్ ఇతర విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ప్రకటన విడుదల చేసింది. కాగా తాజాగా అమెరికా ఈ ప్రకటనను ఖండించింది.

    అయితే ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో ఇరాన్‌- అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్‌ ప్రధాని ఇరు దేశాలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపిన అనంతరం రెండు దేశాల ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన ఆందోళన రేపుతుంది.

  • ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. హైలెవల్ డెలిగేషన్ కావడంతో చర్చలు జరిగే ఇస్లామాబాద్ ప్రాంతం మెుత్తం ఆ దేశ ఆర్మీ కంట్రోల్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కీలక భద్రత కలిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

    ఇరాన్‌- అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో ఏం జరగనుందా అనే అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏ‍ర్పాటు చేశారు. చర్చలలో పాల్గొనడానికి వచ్చే ప్రతినిధులకు సైతం పాక్‌ ప్రత్యేక భద్రత కల్పించింది.

    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ప్రయాణించిన యుఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బోయింగ్‌ సీ-32ఏ విమానం పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించగానే ఆ దేశానికి చెందన ఎఫ్‌-16 ఫైటర్‌ జెట్స్‌ ఎస్కార్ట్‌గా ప్రత్యేక భద్రత కల్పించాయి. ఏవైనా అనుకోని ఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే ఈ రకమైన భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న ఇరాన్‌ ప్రతినిధులకు సైతం పాక్‌ అత్యంత పటిష్టమైన ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది.ఇజ్రాయెల్‌తో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్‌లను ఇరాన్‌ పంపి ఐరన్‌ ఎస్కార్ట్‌ ఏర్పాటు చేసింది.

    కాగా ప్రస్తుతం పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్ షరీప్‌ ఇరాన్ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. వీరితో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ప్రతినిధులతో భేటీ అవనున్నట్లు సమాచారం. రెండు దేశాలతో పరోక్ష చర్చలు ముగిసిన అనంతరం ప్రధాన చర్చలు ప్రారంభం అవనున్నట్లు తెలుస్తోంది.

  • టెహ్రాన్‌: చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్‌ చేరుకున్నారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా-ఇరాన్‌ ప్రతినిధులు మొదట విడివిడిగా కలుస్తున్నారు. ఇరాన్‌ ప్రతినిధులతో షెహబాజ్ షరీఫ్‌ సమావేశం ముగిసింది. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. జేడీ వాన్స్‌తో ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో దీర్ఘకాల శాంతికి దారి తీస్తాయని షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారని పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

    పాక్‌లో చర్చలు ఎంతకాలం కొనసాగుతాయి?
    చర్చలు ఎంతకాలం కొనసాగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో అనుబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. చర్చలు ఒక రోజు మాత్రమే జరగనున్నాయి. శనివారం సాయంత్రం వరకే జరిగే అవకాశం ఉంది.

    ప్రధానంగా అడ్డొస్తున్న అంశాలివే..
    అమెరికా-ఇరాన్‌ మధ‍్య చర్చల్లో ప్రధానంగా మూడు అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్‌ సేకరించిన యురేనియం, హార్మూజ్‌ జలసంధి, లెబనాన్‌ వంటి అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. హార్మూజ్‌ జలసంధిపై పట్టును నిలపుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. లెబనాన్‌లో కొనసాగుతున్న దాడులు ఆపాల్సిందేనని మొదటి నుంచి చెబుతోంది. ఇక యురేనియం నిల్వలపై ఇరాన్‌ వెనక్కి తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి.  

    చర్చల్లో ఎవరెవరు పాల్గొన్నారు? 
    అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇవాళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ప్రత్యేక సలహాదారు జారెడ్ కుష్నర్, శాంతి చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో కలిసి పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చల కోసం పాక్‌ చేరుకున్నారు.

    పాకిస్థాన్ పాత్ర ఏంటి?
    రెండు పక్షాలను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ స్వాగతించారు. యుద్ధం వేళ కాల్పుల విరమణకు పాక్‌ కీలకంగా వ్యవహరించిందని ప్రచారం జరుగుతోంది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో పాక్‌ భాగస్వామ్యం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మొదట ఇరు పక్షాల డిమాండ్లను షెహబాజ్‌ షరీఫ్‌ వింటున్నారు. ఆ తర్వాత ఆయన సమక్షంలో అమెరికా-ఇరాన్‌ ప్రతినిధులు చర్చించుకుంటారు. 

Andhra Pradesh

  • అమరావతి:  ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్‌లో హెరిటేజ్‌ కొత్త యూనిట్‌ను నిర్మించిన భీమా ఇన్‌ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్‌ఫ్రాకి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది ప్రభుత్వం. 

    హైదరాబాద్‌లో కొత్త హెరిటేజ్‌ యూనిట్‌ను  భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్‌ హెరిటేజ్‌, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్‌ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్‌ యూనిట్‌ పూర్తి చేసినట్లు భీమా ఇన్‌ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  భీమా ఇన్‌ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. 

  • విజయవాడ: నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లను పబ్లిక్‌ టాయిలెట్స్‌ వదిలి వెళ్లిందో మహిళ. పసిపిల్లను తీసుకుని ఆటో ఎక్కిన ఓ మహిళ.. కృష్ణలంక స్టేషన్‌కి ఎదురుగా ఉన్న పబ్లిక్‌ టాయిలెట్‌ వద్దకు వచ్చేసరికి ఆటో ఆపింది. బాత్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పిన సదరు మహిళ.. ఆ పసికందును ఆ టాయిలెట్‌లోనే వదిలేసి వెళ్లిపోయింది.  

    ఆ పసిప్రాణానికి బకెట్‌ అడ్డుగా పెట్టి అక్కడ నుంచి పరారైంది. అయితే బాత్‌ రూం కడిగేందుకు వెళ్లిన సమయంలో శానిటరీ సిబ్బంది ఆ పసిపిల్లను గుర్తించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆ పసికందును హుటాహుటీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

    పసిపాపను బాత్‌రూమ్‌లో వదిలేసిన తర్వాత రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అస్సలు ఆ మహిళ ఎవ్వరు?, ఎక్కడ ప్రసవించింది?...ఇక్కడ ఎందుకు వదిలేసింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

  • సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

    తెలంగాణలో హెరిటేజ్‌ సంస్థ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. శామీర్‌పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్‌ ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.

    అయితే, కొత్త ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.

    బయటపడ్డ ఏపీపై చంద్రబాబు కపట ప్రేమ

     

  • ఎన్టీఆర్‌ జిల్లా: కీసర టోల్‌గేట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్‌09ఎఫ్‌టీ662)పై ట్యాంకర్‌ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.

    కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్‌ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

     ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది.  కారు హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్‌ ఏపీ రిజిస్ట్రేషన్‌ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

    కారుపై పడ్డ కాంక్రీట్ లారీ
     

Business

  • బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.

    చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.

    ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.

    ''ఒరాకిల్‌లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్‌గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.

    ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.

    ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా..

  • టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ 2026 ఏప్రిల్ 9న ప్రకటించింది.

    నవంబర్ 2022లో లాంచ్ అయిన ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో రెండు లక్షల అమ్మకాలను పొందింది. కొత్త డిజైన్, లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వంటివాటితో భారతీయ కొనుగోలుదారులను ఈ కారు చాలా వేగంగా ఆకట్టుకుంది. న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఇన్నోవా హైక్రాస్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేసే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 186 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    రూ. 19.53 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు.. భారత్ NCAP కింద 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. కాబట్టి ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

    ఇన్నోవా హైక్రాస్ రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమాన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి వాటితో పాటు.. 65కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. రహదారిపై భద్రతను, డ్రైవర్ అనుభూతిని మెరుగుపరచడానికి రూపొందించిన అధునాతన డ్రైవర్ సహాయక సూట్ అయిన టయోటా సేఫ్టీ సెన్స్‌ను కూడా ఇది కలిగి ఉంది.

  • ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.

    ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.

    ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

    ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.

    గూగుల్ పిక్సెల్ 10
    గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్‌ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది.

  • ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల తీరు చాలా మారిపోయింది. సంస్థలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    ఒక మహిళ తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    రెడ్దిట్ పోస్టు ప్రకారం.. గత సంవత్సరం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆమె పనిని ఎంతో నిబద్ధతతో, 100 శాతం కృషితో నిర్వహించారు. అయినప్పటికీ, తనకు మొదటి నుంచే అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కొత్తగా చేరిన ఉద్యోగులను టీమ్‌లో అధికారికంగా పరిచయం చేసే విధానం ఉన్నప్పటికీ, తనను మాత్రం ఎప్పుడూ సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించిందని పేర్కొన్నారు.

    ఇతర ఉద్యోగులను సమావేశాలకు పిలిచినప్పుడు, తనను మాత్రం తరచూ పక్కన పెట్టేవారు. కొంతమంది సహచరులు కూడా “మీరు మీటింగ్‌లో ఎందుకు లేరు?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆమెకు అసౌకర్యంగా మాత్రమే కాకుండా.. అవమానకరంగా అనిపించాయని అన్నారు.

    కొంతకాలం తర్వాత.. కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థ నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించింది. కానీ తర్వాత.. అదే పని కోసం ఇద్దరిని కొత్తగా నియమించుకున్నారని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంతే కాకుండా.. కొన్ని నెలల తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ సంప్రదించి, తాత్కాలికంగా తిరిగి రావాలని కోరింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో గ్యాప్ రాకుండా ఉండాలని భావించి, ఆమె తిరిగి ఆ ఆఫర్‌ను అంగీకరించారు.

    ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ''నా తర్వాత నియమితులైన వారికి నేను సహాయం చేస్తున్నాను, వారే నాకు రోజువారీ పనులు అప్పగిస్తూ ఏమి చేయాలో చెబుతున్నారు''.

    ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆమె తనకు తాను నిలబడాల్సిందని, కంపెనీ వద్ద తిరిగి చేరినప్పుడు కఠినమైన షరతులు పెట్టాల్సిందని సూచించారు. కొందరు కన్సల్టింగ్ ఫీజులు తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు.. తన స్వభావం కారణంగా తాను మృదువుగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డారు.

  • తమ ‘విడ్స్‌’ ప్లాట్‌ఫామ్‌ను 2024లో పరిచయం చేసింది గూగుల్‌. అప్పటి నుంచి ఇది క్రియేటర్‌లకు ఉపయోగపడుతోంది. ప్రారంభంలో కేవలం సంస్థల కోసమే ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా విషయానికి వస్తే....

    గూగుల్‌ తన వీడియో క్రియేషన్‌ యాప్‌ ‘విడ్స్‌’లో కొత్త ఫీచర్‌లను తీసుకువచ్చింది. ఎడిటింగ్‌లో అనుభవం లేని వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. వీడియో మేకింగ్‌ను సులభతరం, వేగవంతం, మరింత సృజనాత్మకంగా మార్చడానికి కొత్త ఫీచర్‌లు ఉపయోగపడతాయి.

    అప్‌డేట్‌లో ప్రధానమైనది...
    సాధారణ టెక్ట్స్‌ప్రాంప్ట్‌లను ఉపయోగించి డిజిటల్‌ అవతార్‌లను మ్యానేజ్‌ చేసే కొత్త పద్ధతి. క్యారెక్టర్‌లను మాన్యువల్‌గా యానిమేట్‌ చేయడానికి బదులుగా సూచనలు టైప్‌ చేయడం ద్వారా అవతార్‌లు స్పందించేలా చూడవచ్చు.

    టెక్స్ట్‌ టు యాక్షన్‌
    ఈ అప్‌డేట్‌తో యూజర్‌లు సహజమైన భాషను ఉపయోగించి ఒక సన్నివేశంలో అవతార్‌లు నటించేలా చేయవచ్చు. ఒక ప్రొడక్ట్‌ గురించి అవతార్‌ చెప్పడంలాటి వాటి గురించి క్రియేటర్‌లు చెబితే దానికి అనుగుణంగా యాప్‌ ఆ సీన్‌ను జనరేట్‌ చేస్తుంది. వ్యాపారం లేదా బ్రాండెడ్‌ కంటెంట్‌ కోసం ఇది ఉపయోగపడుతుంది.

    ప్రాంప్ట్‌ను బట్టీ అవుట్‌పుట్‌ మారినప్పటికీ, వీడియో అంతటా అవతార్‌లు దృశ్యపరంగా స్థిరంగా ఉంటాయి. ప్రొఫెషనల్‌ లుక్‌తో కనిపించడానికి ఇది ఉపకరిస్తుంది. యూజర్‌లు క్యారెక్టర్‌లను మరింత కస్టమైజ్‌ చేసుకోవచ్చు. ప్రాంప్ట్‌లను ఉపయోగించి క్యారెక్టర్‌ల రూపాన్ని మార్చవచ్చు. వీడియో థీమ్‌కు సరిపోయే కొత్త నేపథ్యాన్ని జోడించవచ్చు. క్రియేటర్‌లకు మరింత సౌలభ్యాన్ని అందించడమే ఈ ఫీచర్‌ లక్ష్యం.

    స్మార్ట్‌ వీడియో క్రియేషన్‌ టూల్స్‌
    ‘అవతార్‌’ కంట్రోల్‌తో పాటు వీయో 3.1 వీడియో–జనరేషన్‌ మోడల్‌ని విడ్స్‌లో అనుసంధానించింది గూగుల్‌. ఎడిటర్‌లోనే నేరుగా షార్ట్, ఎనిమిది సెకన్‌ల వీడియోలను క్రియేట్‌ చేయడానికి ఈ ఫీచర్‌ యూజర్‌లకు ఉపకరిస్తుంది. సాధారణ యూజర్‌లు నెలకు పది వీడియోల వరకు ఉచితంగా క్రియేట్‌ చేసుకోవచ్చు.

    గత నెలలో విడ్స్‌ కోసం లైరియా 3, లైరియా 3 ప్రో మ్యూజిక్‌ మోడల్స్‌ను విడుదల చేసింది గూగుల్‌. అదనపు సాఫ్ట్‌వేర్‌ అవసరం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్, సౌండ్‌ ఎఫెక్ట్‌లను జోడించి పూర్తి వీడియోలు రూపొందించడానికి యూజర్‌లకు వీలు కల్పిస్తుంది.

    చ‌ద‌వండి: ఐఆర్‌సీటీసీ కొత్త రూల్‌.. ట్రైన్ మిస్ అయ్యే చాన్స్ లేదు!

    సులభంగా... షేరింగ్‌ అండ్‌ రీకార్డింగ్‌
    యూజర్‌లు తమ స్క్రీన్‌ రికార్డ్‌ చేయడానికి క్రోమ్‌ ఎక్స్ టెన్షన్‌ డెవలప్‌ చేసింది గూగుల్‌. తద్వారా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్, డెమోనిస్ట్రేషన్స్‌ను సులభతరం చేస్తుంది.

  • ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.

    బోర్డింగ్ స్టేషన్‌ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్‌కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది.  ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.

    ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.

    ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'

  • వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

    శాంతి మంతనాలు - పట్టువిడుపులు

    మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశం

    మార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.

    ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమం

    సంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

    హార్మూజ్‌ జలసంధిపై పట్టు

    ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.

    సైనిక ఉపసంహరణ - పరిహారం

    గత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.

    ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్‌ గిఫ్ట్!

National

  • పట్నా: బిహార్‌లో శనివారం (ఏప్రిల్‌ 11) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటిహార్ జిల్లా వద్ద బస్సు, ట్రక్, పికప్ వాన్ ఢీకొని పది మంది మృతి చెందగా, మరో 25 మందికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

    శనివారం సాయంత్రం ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగిందని ఎస్పీ శిఖర్ చౌధరి మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    "టిహార్ జిల్లా కోఢా పోలీస్ స్టేషన్ పరిధిలో గెరాబారి సమీపంలో బస్సు, పికప్ వాహనం ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన సుమారు 25 మందికి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు" అని కటిహార్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ శిఖర్ చౌధరి తెలపిఇన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కటిహార్‌లో కోఢా బ్లాక్ వద్ద ఎన్‌హెచ్-31పై జరిగింది.

  • కాన్పూర్‌లో వరకట్నం కోసం ఒక మహిళపై నడిరోడ్డుపై జరిగిన అమాను దాడి కలకలం రేపింది. మీనాక్షి పాండే అనే మహిళపై ఆమె మామ, రిటైర్డ్ రైల్వే అధికారి దారుణంగా దాడిచేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    భారతీయ రైల్వేలో అధికారిగా పనిచేసిన రమేష్ దూబే, కోడలు మీనాక్షిని వీధిలోకి  బలవంతంగా ఈడ్చుకుంటూ వచ్చి,  చేయి చేసుకోవడం, తన్నుతూ హింసించాడు. హృదయ విదారంగా  ఆమె సాయం కోసం అర్థించిన వైనం వీడియోలో రికార్డైంది. ఈ క్రమంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. అయినా వదలకుండా వేధింపుల పర్వాన్ని కొనసాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కఠినంగా  శిక్షించాలనే డిమాండ్‌ వెల్లు వెత్తింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో  పోలీసు అధికారులున్నప్పటికీ, వారు జోక్యం చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.

    రూ. 20 లక్షల వరకట్నం కోసం
     రూ. 20 లక్షల  కట్నం తేవాలంటూ గత కొన్నాళ్లుగా  భర్త , అత్తమామలు వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మీనాక్షి పాండే అత్తమామలపై సంచలన ఆరోపణలు గుప్పించింది. నిరంతర వేధింపుల పర్వం  సాగుతోందని, ఏళ్ల తరబడి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. అంతేకాదు తనకు విడాకులివ్వకుండానే, హిందూ వివాహ చట్టానికి విరుద్ధంగా తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని కూడా మీనాక్షి ఆరోపించారు.

    సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం
    ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం, వరకట్నం హింసను నిషేధించే అనేక చట్టాలు ఉన్నప్పటికీ,  మహిళలపై ఈ హింస ఇంకా కొనసాగుతోందనడానికి ఈ సంఘటన ఒక విషాదకరమైన నిదర్శనం. చట్టాలు ఎన్ని ఉన్నా, వరకట్న వేధింపులు ఇంకా కొనసాగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.పట్టపగలు, నడిరోడ్డుపై ఒక మహిళను ఇలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిందితులకు కఠిన శిక్ష పడాలని, ముఖ్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడం, ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో కాన్పూర్ పోలీసులు స్పందించారు.కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మీనాక్షి చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.

    ఇదీ చదవండి: నో మెన్‌... ఓన్లీ విమెన్‌ : 300మంది వీడియో వైరల్‌

Social Media

  • ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్‌స్క్రిప్షన్ అనే ఫీచర్‌తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.

    హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్‌ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.

    అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్‌స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్‌కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.

    అసలు Instagram ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్‌ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్‌క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్‌ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్‌తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.

    ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్‌స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్‌గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్‌గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్‌స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.

    మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్‌.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్‌.

     

Telangana

  • హైదరాబాద్‌: మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగానే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. 

    ‘హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’.. మేనేజ్‌మెంట్ గురించి నగరంలోని అన్ని రంగాల వ్యక్తులకు, విద్యార్థులకు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. 2025-26 సంవత్సరానికి ‘మేనేజ్‌మెంట్ ఇన్ ఏఐ ఎరా’ అనే థీమ్‌తో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

    ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్​ఎంఏ) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అనుసంధానంతో  నారీ శక్తి గురించి ‘ఎమర్జ్’ పేరిట హైదరాబాద్​ బేగంపేట్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం భారీ సదస్సు నిర్వహించారు.  ‘వుమెన్ డెవలప్‌మెంట్ నుంచి వుమెన్- లీడ్​ డెవలప్‌మెంట్’ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు.

    ఈ సందర్భంగా డాక్టర్​ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ‘వుమెన్ డెవలప్‌మెంట్’ అంటే మహిళల భాగస్వామ్యం మాత్రమే కాదు.. మహిళలు కార్యక్రమాల్లో పాల్గొనేవారుగానే కాకుండా, లీడర్‌షిప్ పొజీషన్లలోకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో గానీ, వ్యాపార రంగంలో గానీ ముందుకు రావాలని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.

    అసోసియేషన్ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరుగుతుండగా, కొత్త తరం మరింత ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్టార్టప్‌లలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. దేశంలో ఈ దిశగా తెలంగాణ ముందంజలో ఉంది.  ఇలాంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి ’ అని పేర్కొన్నారు. 

    గత తరంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత తరం చూస్తే మహిళలు నాయకత్వం లేదా కార్పొరేట్ రంగంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు వారి తదుపరి తరం కూడా ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో రాణించడం, పోటీ పరీక్షలు ఎదుర్కోవడం, అన్ని రంగాల్లో ముందుకు సాగడం జరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్‌లలో కూడా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.  ‘కుర్చీయే కాదు.. కుర్చీని షేక్​ చేసేలా మహిళలు ముందుకొస్తున్నారు.. దేశంలో ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి’ అని చెప్పారు.

    అనంతరం కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవిలో ఉండటం కాదని, మార్పును తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్యూచరిస్టిక్​ సిటీ డైరెక్టర్​ కరుణ గోపాల్ మాట్లాడుతూ.. ఎంట్రప్రెన్యూర్‌షిప్ వైపు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలోనూ వ్యాపార రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. 
     

  • సాక్షి,హైదరాబాద్‌: సింగర్‌ మంగ్లీపై చీటింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తనపై ఆరోపణులు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

    ఆ ఫిర్యాదులో రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు.. నాపై లాయర్‌ సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నారు. గతనెల 21న తానే పరిచయం చేసుకుని అమర్యాదగా మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు.. నేను నిరాకరించా. నోట్ల కట్టల వీడియో చూపించి నన్ను బెదిరించారు. సుబ్బారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరా’నని తెలిపారు. మంగ్లీ ఫిర్యాదుతో న్యాయవాది సుబ్బారావుపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 79,351(3)కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

    అంతకుముందు.. మంగ్లీపై ఆరోపణలు చేస్తూ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. మంగ్లీ పేరుతో మోసం చేశార‌ని రెండు నెల‌ల క్రితం బాధితులు న‌న్ను క‌లిశారు. విచార‌ణ చేప‌ట్ట‌గా ఈ మోసంలో మంగ్లీతో పాటు ఆమో సోద‌రుడు శివ‌,మ‌ధు ఉన్న‌ట్లు తేలింది. బాధితులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం మంగ్లీని క‌లిసే ప్ర‌య‌త్నం చేశా. మంగ్లీతో మాట్లాడిన స‌మ‌యంలో చాలా యార‌గెంట్‌గా మాట్లాడారు. ప్ర‌ధాన నిందితుడు మ‌ధు రూ.200కోట్ల  పెట్టుబ‌డి రూపంలో సేక‌రించారు. భారీ లాభాలు ఇస్తాయ‌ని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో బాధితులు మమ్మల్ని కలిశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేరు చెప్పి న‌న్ను బెదిరించారు. ఇప్ప‌టికే బెదిరింపుల మీద కేసు న‌మోదైంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ బాధితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 

    సింగర్‌ మంగ్లీపై కేసు
    సింగర్‌ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Politics

  • తాడేపల్లి : అమరావతి పేరుతో బారీ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు సజ్జల.   ఈ రోజు(శనివారం,   ఏప్రిల్‌ 11వ తేదీ) తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది.  దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. 

    ‘ప్రజాసమస్యలపై బలమైన గళం వినిపించాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉండాలి. సిస్టమాటిక్‌గా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ జరుగుతున్న అవినీతి దాచిపెడుతున్నారు. జగన్‌పై ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగుతోంది. 2047 పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు.

    రాజధాని పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. లక్షల కోట్ల రూపాయిల అవినీతికి రంగం సిద్ధమైంది. అమరావతి పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ఉద్యమంలా అవినీతిని ఎండగట్టేందుకు సిద్ధం కావాలి’ అని సజ్జల పిలుపునిచ్చారు. 

  • ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్‌ 11) తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్‌లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. 

    ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.

    అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.

    దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.

  • విశాఖ: మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారన్నారు వరుదు కళ్యాణి.  

    ఈ రోజు(శనివారం, ఏప్రిల్‌ 11వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు వరుదు కళ్యాణి. ‘ దేశంలో ఏ నాయకుడు ఇవ్వలేనన్ని పదవులు మహిళలకు వైఎస్ జగన్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. 

    స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళకు 50 శాతం పదవులు, నామినేట్ పనులు కట్టబెడుటు అసెంబ్లీలో చట్టం చేశారు.  మహిళలు కోసం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. చట్ట సభల్లో మహిళలకు కీలకమైన పదవులు అప్పగించారు.

    జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50% పైగా  మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలు మహారాణుల్లా బతికారు.  మహిళల కోసం దిశ చట్టాన్ని యాప్, పోలీస్ స్టేషన్ తెచ్చారు. కుటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి.. ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలంతా జగనన్నకు రుణపడి ఉంటారు’ అని తెలిపారు. ఇక చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి విమర్శించారు. 

  • జగిత్యాల:  సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలపై కాంగ్రెస్‌ మాజీ నేత జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో  ఇక రేవంత్‌ పని అయిపోయిందంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.   తెలంగాణలో తదుపరి వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమేని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పీసీసీ ప్రెసిడెంట్‌ కాకుండా అడ్డుకున్నది  జానారెడ్డినే అంటూ మండిపడ్డారు. 

    ఈరోజు(శనివారం, ఏప్రిల్‌ 11వ తేదీ) జగిత్యాల నుంచి మీడియా మాట్లాడిన జీవన్‌రెడ్డి.. ‘ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. 

    తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు..
    కాంగ్రెస్‌లో చేరేటప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్‌ శానసమండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపకుండా చంద్రబాబుకు పంపినప్పుడే ఆయన విధేయత అర్థమైంది. ఇప్పుడున్నది ఒర్జినల్ కాంగ్రెస్ కాదు. దానికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కడా గెలిపించుకోలేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. 

    ముఖ్యమంత్రి అయినాక కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్. నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఓ టూల్‌గా వాడారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డి. ఉప ఎన్నిక నేపథ్యాన్ని ముందుపెట్టి జానారెడ్డి నన్ను అడ్డుకున్న కుట్రదారులు. కేసీఆర్ దగ్గరకు వెళ్లితే ఏమవుతుందో తెలుసానని చాలామంది మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశాడు, తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు, కేకేను సెక్రటరీ జనరల్ చేశాడు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చాడు. ఇంకేం కావాలి..?, ప్రజల్లో బీఆర్ఎస్ రావాలనే చర్చ ఉధృతంగా జరుగుతోంది

    కేసీఆర్ తో దోస్తీ...రేవంత్ తో కటీఫ్.. పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ..

    కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తా..
    రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీపై సమరశంఖం పూరిస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ఎవరో సంధించే అస్త్రం కాదు.. జీవన్ రెడ్డే అస్త్రాలు సంధించే నాయకుడన్నారు. ఈనెల ఏప్రిల్ 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా. భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. 

    చిన్నారెడ్డికి టిక్కెట్‌ ఇస్తానని మొండిచేయి చూపించారని. రాజ్యసభ ఇస్తానని చెప్పి రేవంత్‌ అనుచరుడికి కట్టబెట్టారన్నారు.  ఇవన్నీ కాంగ్రెస్‌ దృష్టికి తీసుకెళ్లానని, లేఖలు రాశానన్నారు. కాంగ్రెస్‌ వైఖరితో తీవ్రంగా కలత చెందే రాజీనామా చేశాననన్నారు. 

     

Kurnool

  • గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువ నీటిని అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లోకి మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్‌కు చేరిన నీటిని 50 క్యూసెక్కుల నీరు ఎస్కేప్‌ చానల్‌ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు మళ్లించారు. డోన్‌, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎల్లెల్సీ ద్వారా నీటి ని జీడీపీలోకి మళ్లించినట్లు ఏఈ మహమ్మద్‌ అలీ శుక్రవారం తెలిపారు. అలాగే జీడీపీ కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.

  • నంద్యాల(అర్బన్‌): సరదాగా ఈతకు వెళ్లి చెక్‌ డ్యాంలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని పొ న్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షేక్‌ మోదిన్‌కుమారుడు షేక్‌ సోహేల్‌ గురువారం హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద ఉన్న కేసీ కెనాల్‌ చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లాడు. లోతు గమనించని సోహేల్‌ డ్యాంలో దూకడంతో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరని కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం సోహేల్‌ శవమై తేలాడు. ఈ మేరకు మృతుడి తల్లి షేక్‌ షబానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • నేను రూ.50వేలు కౌలుతో 4 ఎకరాలు తీసుకుని అరటి పంట సాగు చేశా. రూ.10 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. పంట బాగానే పండినా ధరల్లేవు. యుద్ధంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను రూ.20 వేలకు పైగా ధరలు యుద్ధం కారణంగా ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. పంట కోనుగోలుకు వ్యాపారులు ఎవరూ రాక దిక్కుతోచడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.

    – ఆకుల శ్రీనివాసులు, కౌలు రైతు, తుగ్గలి

  • నేను తువ్వదొడ్డి గ్రామం వద్ద 8 ఎకరాలు ఏడాదికి రూ.1.76 లక్షల చొప్పున కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశా. తొలి ఏడాది రూ.22 లక్షలు, రెండో ఏడాది రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. తొలి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం జరిగింది. లక్షన్నర మాత్రమే చేతికొచ్చింది. ఇప్పుడు కొనేనాథుడే లేడు. కోత కూలీల ఖర్చులు కూడా రావని పంటంతా వదిలేశా. సాగుకు అయిన రూ.30 లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం.

    – ఆర్‌ సుంకన్న, కౌలు రైతు, రామకొండ

  • తుగ్గలి : ఏ పంట సాగు చేసినా రైతును కుదిపేస్తున్నాయి. లాభాలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడు. ఈ క్రమంలో అరటి రైతు కూడా చేరాడు. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు దెబ్బతీస్తుంటే.. మరో వైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ధరలు పాతాళానికి పడి పోయి అరటి రైతుకు శాపమైంది. పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం 150 ఎకరాల్లో అరటి పంట సాగైంది. పంట సాగు కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అడిగే వారు లేక, మార్కెటింగ్‌ సౌకర్యం లేక తోటల్లోనే అరటిని వదిలేసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు టన్ను రూ.20 వేలకు పైగానే ధర ఉంది. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కోతకు వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు.

    కొనుగోళ్లకు ముందుకురాని వ్యాపారులు..

    అరటి ధరలు మార్కెట్‌లో పడిపోవడంతో కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని పరస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు.

  • బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రోడ్డులో యనకండ్ల వాగు వంతెన వద్ద ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన గౌండ పని చేసే రవితేజ నంద్యాల రోడ్డులోని సీఎంఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు సరదాగా ఈతకు వెళ్లాడు. సమీపంలోని రౌండ్ల వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతు రు, ఎనిమిదేళ్ల కుమారుడిని వెంట తీసుకుని పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడంతో వారు నడుచుకుంటూ బయల్దేరారు. అయితే స్విమ్మింగ్‌పూల్‌ నుంచి ఇంటికి బయల్దేరిన రవితేజ మార్గమధ్యలో బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక వెంట ఉన్న తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. ఈ మేర కు గాయపడిన బాలికను స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కల్పన తెలిపారు.

    యువకుడికి దేహశుద్ధి

    పోలీసులకు అప్పగింత

  • ● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి

    కర్నూలు (టౌన్‌): అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యా లు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యకు, చెల్లెలుకు తేడా తెలియని వ్యక్తి రాధాకృష్ణ అని, చేతిలో పేపరు, టీవీ చానల్‌ ఉంది కదా అని ఏది చెబితే అది రాసి, ఏమంటే అది మాట్లాడి వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపీడీకి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అందరి నోట్లో మావిగన్‌ చర్చ జరుగుతోందని, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు పిచ్చి ప్రేలాపన మాటాలు మాట్లాడుతున్నారన్నారు. తాము ఎర్రనాయుడు గురించి మాట్లాడవచ్చు అయితే తమకు సంస్కారం ఉందన్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ మానుకొని, వెంటనే రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు.

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది

    కర్నూలు: హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కబర్ది మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించడానికి ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి మాట్లాడుతూ..చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు మహదేవ్‌రావ్‌, డాక్టర్‌ పీవీ హరినాథ్‌, కర్నూలు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ చంద్రుడు, వైద్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.

  • కర్నూలు: కర్నూలు చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా న్యాయవాది ఎం.శివరామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం ఉదయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక స్తోమతలేని నిందితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవల్లో భాగంగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తారు. గడచిన రెండు సంవత్పరాల నుంచి డిప్యూటీ చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా పనిచేసి పలు కేసుల్లో తన వాదనలు వినిపించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టువారు ఇచ్చిన నోటిఫికేషన్‌లో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా ధరఖాస్తు చేసుకోవడంతో శివరామచంద్రరావును ఎంపిక చేసి నియమించారు.

  • ఇంటి స్థలం

    తమదే అంటూ బెదిరింపు

    కన్నీటి పర్యంతమైన శివమ్మబాయి

    నందికొట్కూరు: టీడీపీ నాయకులు దౌర్జన్యం శ్రుతిమించి పోయింది. స్థలాలను కబ్జా చేసేందుకు పేదలను బెదిరిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతో శుక్రవారం జంగంపాడు గ్రామంలో శివమ్మ బాయి కన్నీటి పర్యంతమవుతూ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తమకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఈ స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పూరి గుడిసె వేశారని తెలిపారు. ఈ స్థలం కోసం ఇద్దరు గొడవపడి గ్రీవెన్స్‌కు వెళ్లారని, అధికారులు పరిశీలించి పూలు నాయక్‌పై ఈ స్థలం ఉందని తేచ్చి చెప్పారన్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇంటి స్థలాన్ని రద్దు చేయాలని అధికారులతో నోటీసు పంపారన్నారు. తన భర్త పూలునాయక్‌ పక్షవాతం రోగంతో మంచానికే పరిమితమయ్యారని, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Dr B R Ambedkar Konaseema

  • ‘నన్నయ’లో ఘనంగా ‘పట్టాల’ పండగ మొత్తం 722 మందికి అందజేత 14 మందికి బంగారు పతకాలు

    రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం సందడిగా సాగింది. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పట్టాల పండగలో పాల్గొన్నారు. చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా 14 మంది బంగారు పతకాలు అందుకున్నారు.

    పట్టభద్రులు దేశాభివృద్ధిలో కీలకం :

    చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

    ఉన్నత చదువులతో పట్టభద్రులైన వారందరూ సమాజ హితంగా పయనాన్ని కొనసాగిస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ చాన్సలర్‌, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన ‘నన్నయ’ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా అభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ‘వసుదైక కుటుంబం’ అనే భావనతో ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీలోని కన్వెన్షన్‌ హాలులో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి 16, 17 స్నాతకోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. 45 మందికి బంగారు పతకాలు, పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. పట్టాలు అందుకునేందుకు 722 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారికి వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి, అతిథులు జేఎన్‌టీయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ మహేంద్ర పి.లామా, యాప్షీ చైర్మన్‌ ఆచార్య కె.మధుమూర్తిల చేతుల మీదుగా అందజేశారు.

    ‘నన్నయ’ కీర్తిని ఇనుమడింపజేసేలా..

    వీసీ ప్రసన్న శ్రీ

    ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య ఎస్‌. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి జిల్లావాసుల చిరకాల కోరిక మేరకు ఆవిర్భవించిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను అందస్తోందన్నారు. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయిన నన్నయ భట్టారకుని కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఆరు జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా నిలిచిందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులను సమాజానికి కావలసిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు.

    డిగ్రీ ప్లస్‌ విధానం అవసరమే :

    ప్రొఫెసర్‌ మహేంద్ర పి.లామా

    జేఎన్‌టీయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ మహేంద్ర పి.లామా మాట్లాడుతూ విద్యార్థులు ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్‌ శాఖల అధ్యయనం వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీ ప్లస్‌ విధానం అవసరాన్ని ప్రస్తావిస్తూ, పాఠ్యాంశాలతోపాటు నైపుణ్యాలు, సృజనాత్మకత, అనుభవాత్మక అభ్యాసం కూడా అవసరమనే విషయాన్ని గ్రహించాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చదువును మరచిపోకుండా నిరంతరం పుస్తక పఠన చేయాలన్నారు. అందుకు అనుగునంగా తల్లిదండ్రులు కూడా నచుకోవాలని, ఇంటిలోని ర్యాక్‌లలో భాగవత, రామాయణాలతోపాటు చరిత్రను తెలియజేసే పుస్తకాలను కూడా పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉంచాలని సూచించారు.

    ఘన స్వాగతం

    స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కులపతి హోదాలో వచ్చిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీలోని హెలీపాడ్‌ వద్ద ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.

    722 మందికి పట్టాల ప్రదానం

    2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు చెందిన పీహెచ్‌డీ, పీజీ, పీజీ డిప్లమా, యూజీ అండ్‌ పీజీ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసి, దరఖాస్తు చేసుకున్న 722 మంది విద్యార్థులకు పట్టాలను ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అందజేశారు. వీరిలో 21 మంది పీహెచ్‌డీ, 14 మంది గోల్డ్‌ మెడల్స్‌, 10 ప్రైజ్‌లు పొందిన వారున్నారు. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన 6,113 మంది పోస్టు గ్రాడ్యుయేషన్‌, 45,337 మంది అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించేందుకు చాన్సలర్‌ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య మునిరత్నంనాయుడు, జీజీయూ చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

  • డీఎస్‌వో ఉదయ్‌ భాస్కర్‌

    ముమ్మిడివరం: రబీలో ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్‌ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి, టెక్నికల్‌ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులకు ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్‌ పోర్టర్‌ వినియోగం, రైతుల వివరాల నమోదు, ఈకేవైసీ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు 24 గంటల లోనే రైతుల ఖాతాలలోకి జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఫౌర సరఫరాల మేనేజర్‌ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

    26 నుంచి క్రీడా

    అకాడమీల ప్రారంభం

    అమలాపురం రూరల్‌: విజయవాడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖ, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పునఃస్థాపన ప్రక్రియను ప్రారంభించినట్టు కోనసీమ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వైవీ రుద్ర తెలిపారు. రాష్ట్‌ట్ర క్రీడాకారుల అభివృద్ధికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు దిశగా ముఖ్యమైన ముందడుగని అన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్ల లోపు వయసు గల క్రీడాకారులు జనవరి ఒకటి, 2008 నుంచి జనవరి ఒకటి, 2011 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా వివిధ క్రీడా విభాగాలలో ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు.

    13న మినీ ఉద్యోగ మేళా

    అమలాపురం రూరల్‌: ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్‌ వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తెలిపారు. తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 19–35 ఏళ్ల మధ్య ఉన్న మహిళా అభ్యర్థులు ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ పీజీ పూర్తి చేసిన వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న అభ్యర్థులకు జాయినింగ్‌ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు.

    సిబ్బంది సమస్యలపై

    ‘ఎస్పీ సంపర్క్‌’

    అమలాపురం టౌన్‌: పోలీస్‌ సిబ్బంది బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, ఇతర సర్వీస్‌ సమస్యలపై జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా ‘ఎస్పీ సంపర్క్‌’ను శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పోలీసులు కొందరు నేరుగా, మరికొందరు ఫోన్ల ద్వారా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకొన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించేందుకు సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలి

    ఆర్జేడీ నాగమణి

    అమలాపురం టౌన్‌: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్దేశిత సమయంలోనే త్వరగ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఈవో పి. నాగేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీవైఈవోలు జి.సూర్య ప్రకాశం, లక్ష్మణమూర్తి, కె.వెంకటేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ బీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

  • మహిళలకు క్షమాపణలు చెప్పాలి

    నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ డిమాండ్‌

    అమలాపురం పోలీస్‌ స్టేషన్‌లో

    వైఎస్సార్‌ సీపీ నేతల ఫిర్యాదు

    అమలాపురం టౌన్‌: వైఎస్సార్‌ సీపీ నేతలు, మహిళలపైన అనుచిత వ్యాఖలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ శ్రేణులు శుక్రవారం ఫిర్యాదు చేశాయి. నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎంపీ, పార్టీ జోన్‌ –2 మహిళా విభాగం అధ్యక్షురాలు చింతా అనురాధ, పార్టీ నాయకులు పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పినిపే శ్రీకాంత్‌ విలేకర్లతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ చంద్రబాబుకు రాధాకృష్ణ కొమ్ము కాస్తూ వైఎస్సార్‌ సీపీపై బురద చల్లేందుకు సిగ్గు లేకుండా జర్నలిజం విలువలు మరిచి రోత రాతలు రాస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ తక్షణమే ఏబీఎన్‌ రాధాకృష్ణపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జగన్‌పైన, పార్టీ మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణను వదిలే ప్రసక్తే లేదని, ఆయనకు మానసిక శిక్ష వేసే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి బాబి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్‌, ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, అమలాపురం పట్టణం, రూరల్‌, ఉప్పలగుప్తం మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవిరావు, బద్రి బాబ్జీ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు గొవ్వాల రాజేష్‌, ఉండ్రు బాబ్జీ, మట్టపర్తి నాగేంద్ర, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, వంగా గిరజాకుమారి, చొల్లంగి సుబ్బిరామ్‌, ఉండ్రు వెంకటేష్‌, తిరుకోటి సతీష్‌, సుంకర లక్ష్మి, విత్తనాల మూర్తి, సూదా గణపతి, పొగాకు శ్రీను, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • జిల్లాలో 36 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఉడుకు

    ఐ.పోలవరం: మార్తాండుడు మనుషుల్ని మిడతల్లా వేయించేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం వర్షం పడిన తరువాత నుంచి ఎండలు మరింత ముదిరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. అమలాపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదు కాగా, రామచంద్రపురంలో 37 నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా ఉంది. రెండు రోజులుగా జిల్లాలో రెండు నుంచి మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం అధికంగా ఉండడంతో రాత్రి వేళ జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐ.పోలవరం, తాళ్లరేవు, ముమ్మిడివరం, అమలాపురం బైపాస్‌ రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉక్కపోతలకు తోడు విద్యుత్‌ కోతలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వ్యవసాయ, ఉద్యాన పంటలపై ప్రభావం చూపుతాయని, రబీ సాగు ఆలస్యమైన చోట తరచూ తడులు అందించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు కొబ్బరి, అరటి, కోకో, కూరగాయ తోటలకు తడులు పెంచాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇదే సమయంలో మోటార్ల సౌకర్యం లేక డెల్టా కాలువల మీద ఉద్యాన పంటలకు నీరందించే రైతులు డీజిల్‌ మోటార్లపై ఆధారపడుతున్నారు.

Karimnagar

  • సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

    శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్‌కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్‌ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్‌ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్‌ కుమార్‌, బాటనీ పార్ట్‌టైం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెంచాల శ్రీనివాస్‌ తమను అర్బన్‌ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్‌ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్‌ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

    ‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్‌ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్‌ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్‌ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్‌ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్‌ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్‌ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

    వీసీ ఉమేశ్‌కుమార్‌ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్‌టైం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పెంచాల శ్రీనివాస్‌ తనను అర్బన్‌ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్‌ అడ్వైజరీ మెంబర్‌, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్‌ నక్సలైట్‌గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్‌షాట్లు, వారి ఫోన్‌ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్‌నైన తనను అసభ్యపదజాలంతో సోషల్‌ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్‌ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్‌ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు.

  • కరీంనగర్‌: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని రాంనగర్‌ ఆయుష్‌ హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా హెల్త్‌ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. హెల్త్‌క్యాంపును డీఎంహెచ్‌వో వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో సుధా ప్రారంభించారు. మెడికల్‌ ఆఫీసర్లు యశ్రబ్‌ సుల్తానా, శేఖర్‌, సదానందం, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

    రామయ్య హుండీ లెక్కింపు

    ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల హుండీని ఎండోమెంట్‌ కరీంనగర్‌ డివిజన్‌ పరిశీలకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కించారు. రూ.20,39,551లక్షల ఆదాయం వచ్చిందని ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్‌ తెలిపారు. ఆరు గ్రాముల మిశ్రమ బంగారం, 225 గ్రాముల వెండి వచ్చినట్లు సుధాకర్‌ తెలి పారు. అర్చకుడు శేషం వంశీధరచార్యులు, నవీన్‌ కుమార్‌ శర్మ, మోహన్‌, మల్లారెడ్డి, సు రేందర్‌రావు, రమేశ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

    పత్తి మార్కెట్‌కు సెలవు

    జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. గురువారం రూ.8000 పలికిన ధర శుక్రవారం రూ.100 తగ్గి క్వింటాల్‌కు రూ.7,900 పలికింది. మార్కెట్‌కు ఆరు వాహనాల్లో 69 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. శని, ఆదివా రాలు సాధారణ సెలవులు ఉంటాయని సోమవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.

    16న జాబ్‌మేళా

    విద్యానగర్‌(కరీంనగర్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతకు కరీంనగర్‌లోని టాటా మోటార్స్‌, ధని టెక్నాలజీ సొల్యూషన్‌లో ఉద్యోగాలు కల్పించడానికి ఈనెల 16న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలు, సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9908530384 నంబర్‌లో సంప్రదించాలని అన్నారు.

    విదేశాల్లో ఉద్యోగావకాశాలు

    విద్యానగర్‌(కరీంనగర్‌): భవన నిర్మాణ కార్మి కులకు, వారి పిల్లల్లో అర్హులైన వారికి విదేశాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్‌ కోల ప్రసాద్‌ తెలిపారు. నమోదైన నిర్మాణ కార్మికుల పిల్లల్లో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండి 8వ తరగతి విద్యార్హత ఉన్న వారికి విదేశీ భాష, సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షణ అందించి, ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపా రు. ఆసక్తి ఉన్నవారు ఆధార్‌, లేబర్‌ కార్డుతో సంప్రదించాలని సూచించారు.

    కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.కమాన్‌ ఫీడర్‌ పరిధిలోని కోతిరాంపూర్‌, లక్ష్మీనగర్‌, అమీర్‌నగర్‌, గాయత్రీనగర్‌, పోచమ్మ ఆల యం, పార్వతినగర్‌, వరసిద్ధినగర్‌, అన్నమనేని గార్డెన్‌, సెయింట్‌ మేర్రీస్కూల్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1 ఏడిఈ పంజాల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

    బొమ్మకల్‌, కొత్తపల్లి, రేకుర్తిలో

    విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల నిర్వహణలో భాగంగా శనివారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీపురం కాలనీ, రజ్వీచమన్‌, సిటిజన్‌కాలనీ, ప్రియదర్శినికాలనీ, క్రిష్ణనగర్‌, ఆటోనగర్‌, ధర్మనగర్‌, బైపాస్‌ రోడ్‌, బొమ్మకల్‌, గుంటూర్‌పల్లి, దుర్శేడ్‌, గోపాల్‌పూర్‌, నల్లగుంటపల్లి, మరియాపూర్‌, సలాపినగర్‌ ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొత్తపల్లి, రేకుర్తి సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్‌ రూరల్‌ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.

  • కరీంనగర్‌క్రైం: అవును కరీంనగర్‌ పోలీసుశాఖలో దొంగలు పడ్డారు. కంచే చేను మేసినట్లు చనిపోయి న తోటి ఉద్యోగుల జీతాలు స్వాహా చేశారు. ప్రజ లను రక్షించాల్సిన వారు భక్షక భటులుగా మారి అక్రమార్జనకు తెగపడ్డారు. సొంతశాఖకే కన్నం వేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు. చనిపోయిన వారిస్థానంలో ఇతరులకు నెలనెలా జీతాలు ముట్టజెప్పుతూ రూ.కోట్లు గడించారు. బండారం బయటపడి కటకటాల్లోకి వెళ్లారు. ప్రజలకు న్యా యం చేయాల్సిన పోలీసులే దొంగలుగా మారి సొంతశాఖకే కన్నం వేయడం చర్చనీయాంశమైంది.

    రూ.1,40,18,308 కోట్లు స్వాహా

    కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సంచలనం సృష్టించిన జీతాల కుంభకోణం కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపారు. పోలీస్‌శాఖలో గతంలో మరణించిన ఉద్యోగుల స్థానంలో ఇతరుల పేరిట నకిలీ అకౌంట్లు తీసి, రూ.1,40,18,308 దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ ఫిర్యాదుతో కరీంనగర్‌ వన్‌టౌన్‌లో కేసు నమోదుకాగా, ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.

    ప్రైవేటు వ్యక్తుల పేరిట

    ప్రస్తుతం చిగురుమామిడిలో పనిచేస్తున్న హెడ్‌కాని స్టేబుల్‌ నీలం రామ్మోహన్‌(52) గతంలో కమిషనరేట్‌ సీపీవో కార్యాలయంలోని పే సెక్షన్‌లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో మరణించిన కాని స్టేబుళ్లు సీహెచ్‌.రవీందర్‌, కె.గంగస్వామి, కె.రవి ఎంప్లాయీ ఐడీలు సేకరించాడు. సదరు ఉద్యోగుల పోర్టల్‌లో నగరానికి చెందిన ప్రైవేటు వ్యక్తులైన లావుడ్య రవి(42), చుక్క గంగరాజు(33), శంకర్‌ నామతాబాబ్‌(44) పేర్లు నమోదు చేసి, కరీంనగర్‌లోని భగత్‌నగర్‌, బొమ్మకల్‌ హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌లో ఖాతాలు తీశాడు. ఈ ఖాతాలకు తన సొంత ఈ మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేశాడు. జూన్‌ 2022 నుంచి మార్చి 2026 వరకు ప్రతినెలా కానిస్టేబుళ్ల జీతాలు ఆయా ఖాతాల్లో జమయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా ఖాతాలపై బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. ఇందుకు రిటైర్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ వైవీ.ముని రామయ్య(61) సహకారం తీసుకున్నాడు. ఆ సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకుని, సొంతానికి వాడుకుంటూ ఈఎంఐలు సైతం చెల్లించాడు.

    జీతాలపై సీపీ ఫోకస్‌తో..

    ఇటీవల జీతాల చెల్లింపుల్లో అనుమానాస్పద లావాదేవీలను గమనించిన సీపీ గౌస్‌ ఆలం సమగ్ర విచారణ చేపట్టాలని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ను ఆదేశించారు. విచారణలో రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చినట్లు ఆధారాలు లభించాయి. దీంతో ప్రధాన సూత్రధారి హెడ్‌ కానిస్టేబుల్‌ నీలం రామ్మోహన్‌, రిటైర్డ్‌ ఏవో వైవీ.మునిరామయ్య, లావుడ్య రవి, చుక్కా గంగరాజు, శంకర్‌ నామతాబాబ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీపీ తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: కో ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో నగరపాలకసంస్థ పరిధిలోని రాజకీయ పార్టీల్లో వేడి రాజుకొంటోంది. ఐదు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో, ఆ లోగా అభ్యర్థుల ఎంపికపై అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది. ఐదింటిలో ప్రతిపక్షాలకు ఒకటి ఇచ్చి ఏకగ్రీవ ఎన్నిక ద్వారా కొత్త సాంప్రదాయానికి బాటలు వేయాలని కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తోంది. పార్టీ పరంగా బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకొనప్పటికీ వ్యక్తిగతంగా పోటీచేసేందుకు ఆ పార్టీ మాజీ కార్పొరేటర్లు సమాయత్తమవుతున్నారు. పోటీ నెలకొంటేనే తమకు గుర్తింపు ఏర్పడే అవకాశం ఉండడంతో ఇతర కార్పొరేటర్లు ఎన్నికలపై ఆసక్తితో ఉన్నారు.

    బీజేపీ దరఖాస్తుల స్వీకరణ

    కో ఆప్షన్‌ పదవులు ఆశిస్తున్న వారి నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ చేపడుతోంది. వచ్చిన దరఖాస్తుల నుంచి ఐదుగురిని ఎంపిక చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు తదితరులతో పార్టీ కమిటీ ఏర్పాటు చేసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ కార్పొరేటర్లు పలువురు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని పార్టీకి శుక్రవారం దరఖాస్తు చేసుకొన్నారు.

    ప్రతిపక్షాలకు ఒకటివ్వాలి

    కో ఆప్షన్‌ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదిస్తోంది. ఐదు కో ఆప్షన్‌ సభ్యులకు గాను ఒక స్థానం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చి, ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని అధికార బీజేపీని కోరింది. దీని ద్వారా నగరపాలకసంస్థలో మంచి సంప్రదాయానికి బాటలు వేయాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం అంత సులువుగా కనిపించడం లేదు. నగరపాలకసంస్థలో అధికార బీజేపీ ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉండగా, ప్రతిపక్ష పార్టీలకు ఒక స్థానం ఇవ్వడానికి ఆ పార్టీ పెద్దలు అంగీకరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తం 69 ఓట్లకు గాను బీజేపీ ఓట్లు 34, బీజేపీయేతర ఓట్లు 35 ఉండడాన్ని కాంగ్రెస్‌ చూపుతోంది.

    పోటీలో బీఆర్‌ఎస్‌ మాజీలు

    కో ఆప్షన్‌ ఎన్నికల్లో పార్టీ పరంగా బీఆర్‌ఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికి, ఆ పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు పోటీచేసేందుకు సిద్దపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపొందిన మాజీ కార్పొరేటర్లు ఐదు సంవత్సరాల పాటు మరోరూపంలో బల్దియాలో ఉండే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే పనిలోపడ్డారు. ఇప్పటికే వివిధ పార్టీల కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు.

    పోటీ ఉంటేనే గుర్తింపు

    ఐదు కోఆప్షన్‌ సీట్లపై అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆసక్తితో ఉన్నారు. అధికార బీజేపీకి నగరపాలకసంస్థలో అధిక బలం ఉండడంతో, ఎన్నిక ఏకపక్షం, ఏకగ్రీవమే అని బీజేపీ చెబుతోంది. ఏకగ్రీవం కా కుండా పోటీ ఏర్పడితేనే తమకు గుర్తింపు లభి స్తుందని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఎక్స్‌అఫిషి యో సభ్యులతో సహా బీజేపీ ఓట్ల కన్నా బీజేపీయేతర ఓట్లు అధికంగా ఉండడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా కో ఆప్షన్‌ ఎన్నికలు రావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది.

  • కరీంనగర్‌ అర్బన్‌: జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్‌ లిస్టింగ్‌, విలేజ్‌ మ్యాప్స్‌ ఫైనలైజేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. 150– 200 ఇండ్ల వరకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని, 800 ఇండ్లకు ఒక బ్లాక్‌గా విభజించాలన్నారు. సదరు ప్రక్రియపై ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు. హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియ మే 11 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు సాగుతుందన్నారు. సెన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సుబ్బరాజు, అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మికిరణ్‌, ఆర్డీవోలు కే.మహేశ్వర్‌, రమేశ్‌ బాబు పాల్గొన్నారు.

    నిబంధనలు పాటించాల్సిందే

    ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, లే అవుట్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌, విద్యుత్‌శాఖ, టౌన్‌ ప్లానింగ్‌, ల్యాండ్స్‌ అండ్‌ సర్వే, నీటిపారుదల శాఖ తదితర శాఖల అధికారులతో లేఅవుట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో లే అవుట్‌ అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. పది ఎకరాల లే అవుట్‌కు కలెక్టరే అనుమతులు మంజూరు చేస్తారని.. అంతకు మించి పెరిగితే టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌ అనుమతులు జారీ చేస్తారని అధికారులు వివరించారు.

    సకల వర్గాలకు సముచిత స్థానం

    సకల వర్గాలకు సముచిత స్థానమిస్తూ బ్యాంకు మరింత పురోగతి సాధించాలని కేడీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి, కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం స్థానిక కేడీసీసీ బ్యాంకును సందర్శించారు. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల కృషిని ప్రశంసించి, ఆర్థిక ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు నిర్ణయించిన రూ.10వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించేందుకు సంఘటితంగా సాగాలని అన్నారు. కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు, జనరల్‌ మేనేజర్లు శ్రీధర్‌, రియాజోద్దీన్‌ పాల్గొన్నారు.

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని డంప్‌యార్డ్‌ను తొలగించాలంటూ శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట డంప్‌యార్డ్‌ బాధితులు మోకాళ్లపై కూర్చొని ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. డంప్‌యార్డ్‌ నుంచి వెలువడుతున్న దుర్వాసనలు, హానికరవాయువులు, పొగ వల్ల సమీప ప్రాంత డివిజన్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త గుట్టలు,, దోమలతో డెంగీ, మలేరియా వ్యాధుల ముప్పు పెరిగిపోతుందన్నారు. డంప్‌యార్డ్‌ను నగరానికి దూరంగా, ప్రజల నివాస ప్రాంతాలకు హాని కలగని ప్రదేశానికి తరలించాలని కోరారు.

  • కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదాల రహిత సమాజమే లక్ష్యంగా ‘అరైవ్‌–అలైవ్‌’ రోడ్‌ సేఫ్టీ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నామని సీపీ గౌస్‌ఆలం తెలిపారు. శుక్రవారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13న ప్రతీ గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 14న వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15న బ్లాక్‌ స్పాట్లు గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్‌, రోడ్‌ మార్కింగ్‌లు పునరుద్ధరించాలన్నారు. 16న పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ క్రమశిక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ప్రాముఖ్యతను వివరించాలన్నారు. 17న గోల్డెన్‌ అవర్‌లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సాయం గురించి వివరించాలన్నారు. 18న వారంలో ఒక రోజు ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానాలు విధించకుండా, కౌన్సెలింగ్‌ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావాలన్నారు. అడిషినల్‌ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు.

  • మానకొండూర్‌: సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేసే వరకు నేషనల్‌ హైవే పనులు సాగనివ్వమని గ్రామస్తులు ఏడాదిగా అడ్డుకోగా.. అధికారులు అర్ధరాత్రి పోలీసు పహారాలో రోడ్డు పనులు పూర్తి చేశారు. మానకొండూర్‌ మండలం ఈదులగట్టెపల్లి స్టేజీ వద్ద 563 నేషనల్‌ హైవేలో భాగంగా సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేయాలని, పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్‌కు సమస్యను విన్నవించారు. ఇటీవలే కలెక్టర్‌ నిలిచిపోయిన పనులు పరిశీలించి, సమస్యను తెలుసుకున్నారు. సర్వీస్‌ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురించాయి. గురువారం అర్ధరాత్రి ఈదులగట్టెపల్లి స్టేజీవద్ద భారీ బలగాలతో జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ యంత్రాంగం రోడ్డు పనులు కొనసాగించి, తెల్లవారుజామున వరకు పూర్తిచేశారు. దీంతో గ్రామస్తులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

  • ప్రతీ ఆదివారం సిరిసిల్లకు వస్తాం. బట్టలు అమ్మితేనే బతుకుదెరువు. అప్పుడప్పుడు పెద్దగా గిరాకీ ఉండదు. రోజుకో ఊరికి వెళ్తాం కాబట్టి బట్టకు, పొట్టకు తిప్పలు లేకుండా బతుకుతున్నాం. నేను చిన్నప్పటి నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాం. నచ్చినవి ఏరుకుని కొంటారు. చిన్న దందా అయినా పాత బట్టలే మాకు బువ్వ పెడుతున్నాయి.

    – ఈ.శ్రీకాంత్‌, పాత బట్టల వ్యాపారీ

    ఏం చదువుకోలేదు

    నేను ఏం చదువుకోలేదు. మా అమ్మానాన్నల ఇదే చేశారు. నేను కూడా ఈ పనిలోనే ఉన్నా. సిరిసిల్లలో మంచిగా గిరాకీ అవుతుంది. ప్రతీ ఆదివారం రూ.1000 నుంచి రూ.1500 వస్తాయి. అప్పుడప్పుడు ఎక్కువనే వస్తాయి. పొద్దంతా ఇక్కడ ఉండి అమ్ముకుని వెళ్తాం. డ్రెస్‌లు మంచివి ఉంటేనే కొంటారు. లేకుంటే కొనరు.

    – బొర్రత్‌ అర్జున్‌, బట్టల వ్యాపారీ

    40 ఏళ్లుగా ఇదే దందా

    మా పూర్వీకులు కూడా ఇదే దందా చేశారు. నాకు తెలిసి 40 ఏళ్లుగా ఇదే వ్యాపారం సాగుతోంది. సిరిసిల్ల, సిద్దిపేట, వేములవాడ, చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్‌ ఇలా రోజుకో ఊరుకు పోతాం. గిరాకీ అయినా కాకున్నా మా బతుకుదెరువు ఇదే. తక్కువ ధరకే డ్రెస్‌లు రావడంతో మంచివి ఏరుకుని కొంటారు.

    – ఇగ్గెవి రాజేశ్‌, సిద్దిపేట

  • సిరిసిల్ల క్రైం: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి డీ–ఆడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ సద్దాం(32), పాత బస్టాండ్‌కు చెందిన ఎంబేరి ఆకాశ్‌(26), రాజీవ్‌నగర్‌కు చెందిన మరో బాలుడు కలిసి మహారాష్ట్ర నాందేడ్‌ నుంచి గంజాయి తెచ్చి, సేవిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పరీక్షించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, గంజాయి అలవాటు నుంచి బయటపడేందుకు స్వచ్ఛందంగా ముందుకురావడంతో న్యాయస్థానం అనుమతితో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ–ఆడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు. సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై శ్రీకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

    డీ ఆడిక్షన్‌ సెంటర్‌కు తరలింపు

  • తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘సెస్‌’ సంస్థను ఎన్పీడీసీఎల్‌ స్వాధీనం చేసుకున్న తర్వాత తంగళ్లపల్లి మండల కేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలోని సీసీ కెమెరాల కనెక్షన్‌ను తొలగించారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కనెక్షన్‌ను ఎన్పీడీసీఎల్‌ విజిలెన్స్‌ అధికారులు తొలగించడం చర్చకు దారితీసింది. సాధారణంగా సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కొత్తవాటిని బిగించి రక్షణ కల్పించాల్సి ఉండగా ఉన్నవాటిని తొలగించడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

    యువకుడి ఆత్మహత్యాయత్నం

    పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన కడారి మహేశ్‌(28) శుక్రవారం క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలో ట్రాక్టర్‌ నడుపుతూ జీవించే మహేశ్‌.. మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మహేశ్‌ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

  • గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట కారు ఢీకొన్న ప్రమాదంలో ఇందారపు రాయపోశం(60) అనే మున్సిపల్‌ పర్మినెంట్‌ కార్మికుడు మృతి చెందాడు. వన్‌టౌన్‌ ఎస్సై మనోహర్‌ కథనం ప్రకారం.. కాకతీయనగర్‌లోని తన ఇంటినుంచి నైట్‌ డ్యూటీ కోసం మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చాడు. అనంతరం ఎలక్ట్రీషియన్‌ చిన్నయ్యతో కలిసి టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయపోశంతో ఉన్న చిన్నయ్య స్వల్పగాయాల పాలయ్యాడు. రాయపోశం వచ్చేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. అనూహ్యంగా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన ఎంఏ జాన్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫలితాల్లో సత్తాచాటాడు. బీసీ– సీ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌, జనరల్‌ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో 239వ ర్యాంక్‌ సాధించాడు. జాన్‌ ప్రస్తుతం కథలాపూర్‌ మండలం తక్కళ్లపెల్లిలో ఎంఎల్‌హెచ్‌పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మిట్టపెల్లి కిషన్‌– దివ్య దంపతుల చిన్న కుమారుడు జాన్‌ పదో తరగతి వరకు కథలాపూర్‌ మోడల్‌స్కూల్‌లో చదివాడు. హైదరాబాద్‌లో ఇంటర్‌, సికింద్రాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి గోల్డ్‌మెడల్‌ సాధించాడు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రిలో నర్సింగ్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.

    అదనపు జిల్లా జడ్జీల బదిలీ

    జగిత్యాలజోన్‌/కరీంనగర్‌క్రైం: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌ రెండో అదనపు జిల్లా జడ్జి డి.సాధనను రంగారెడ్డి జిల్లా 8వ అదనపు జిల్లా జడ్జిగా, జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణను నిజామాబాద్‌ రెండో అదనపు జిల్లా జడ్జిగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ తట్ట శ్రీనివాస్‌రావును హనుమకొండ ఇండస్ట్రీయల్‌ అండ్‌ లేబర్‌ కోర్టు జడ్జిగా బదిలీ చేశారు. అలాగే, సంగారెడ్డి మూడో అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న జి.సునీత రవీందర్‌రెడ్డిని జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జిగా, సంగారెడ్డి నాలుగవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కోట్ల లావణ్య బాల్‌రెడ్డిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అదనపు జిల్లా జడ్జిగా, రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి ఆరవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న సి.పావనిని కరీంనగర్‌ రెండో అదనపు జిల్లా జడ్జిగా, హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ కమర్షియల్‌ కోర్టు స్పెషల్‌ జడ్జిగా పనిచేస్తున్న నామ సంతోష్‌కుమార్‌ను కరీంనగర్‌ ఆరవ అదనపు జిల్లా జడ్జిగా నియమించారు.

    హత్యకేసులో జీవితఖైదు

    జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్‌లో అల్లుడిని బండిరాయితో మోది హత్య చేసిన కేసులో జడి కానుకయ్యకు జీవితఖైదు విధిస్తూ పెద్దపల్లి ప్రిన్సిపల్‌ జడ్జి కె.సునీత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కాచాపూర్‌ గ్రామానికి చెందిన జాడి కనుకయ్య – శంకరవ్వ భార్యాభర్తలు. వీరి అల్లుడు జేజేల చెత్తయ్య(అశోక్‌)కు శంకరవ్వతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఈక్రమంలో జాడి కనుకయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. ఈక్రమంలో 18 ఫిబ్రవరి 2024న చెత్తయ్య ఇంటికి వెళ్లిన జాడి కనుకయ్య.. తన భార్య శంకరవ్వ విషయంలో పథకం ప్రకారం గొడవపడ్డాడు. ఆ వెంటనే బండరాయి, రాడ్డుతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై చెత్తయ్య మృతి చెందాడు. ఈ మేరకు సుల్తానాబాద్‌ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ఎస్సై శ్రీధర్‌ కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జాడి కనుకయ్య నేరం చేసినట్లు రుజువు కావడంతో జీవితఖైదు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించారు. శిక్ష పడడంలో పీపీ డొంకెన రవి, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, ఏసీప కృష్ణ, సాక్షులను ప్రవేశ పెట్టడంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై సనత్‌కుమార్‌, కోర్టు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కీలకంగా వ్యవహరించారు.

  • రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని గోకుల్‌నగర్‌లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఏరవేని శ్రీకాంత్‌కు చెందిన నాటుకోళ్లు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేసింది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాంత్‌ తన ఇంటివద్ద పెంచుకుంటున్న నాటుకోళ్లు ఒక్కసారిగా చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషపూరిత మందు కలిపిన ఆహారం ఇచ్చి చంపినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాలు ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. విచారణ జరపాలని గ్రామపెద్దలు అధికారులను కోరారు.

    డి అడిక్షన్‌ సెంటర్‌కు తరలింపు

    ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ట సాయి ఓ ఇంట్లో చొరబడి కొట్టిన కేసులో అతడిని శుక్రవారం పట్టుకోగా మత్తులో ఉన్నట్లు గుర్తించామని ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. అతడికి ఆధునిక సాంకేతిక విధానంలో పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లు తేలింది. అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు అతడిని కరీంనగర్‌లో డి అడిక్షన్‌ సెంటర్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

    సైబర్‌ వలలో చిక్కిన మహిళ

    జమ్మికుంట: పార్ట్‌టైం ఉద్యోగం పేరిట సైబర్‌ క్రైం వలలో చిక్కి ఓ మహిళ రూ.60వేలు పోగొట్టుకుంది. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని కోరపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని కాపులపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజలి మార్చి 10వ తేదీన ఇన్‌స్ట్రాగామ్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం వెతికింది. జాబ్‌టాస్క్‌లు ఇచ్చి రివ్యూస్‌ ఎంటర్‌ చేసి పోస్టు చేయమని సైబర్‌ నేరగాళ్లు తెలపగా, మొదట రూ.200, మరోసారి రూ.20వేలు, చివరగా రూ.40వేలు ఫోన్‌ పే ద్వారా పంపించింది. మళ్లి డబ్బులు ఇవ్వాలని అడగగా మోసపోయినట్లు తెలుసుకొని, సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

    గంజాయి విక్రేత అరెస్ట్‌

    జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని పట్టణ ఎస్సై సదాకర్‌ పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్‌ జగిత్యాల విద్యానగర్‌ బైపాస్‌రోడ్‌లో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారు. అతడి వద్ద 270 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

  • జ్యోతినగర్‌: ‘బిడ్డా వెంకటేశ్‌.. నేను వస్తున్నా.. ఎవుసం పనులు ఎట్లున్నయ్‌’ అని ఫోన్‌లో మాట్లాడి ఇంటినుంచి బయలు దేరిన కాసేపటికే సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు మహంకాళి ఉరఫ్‌ గంగారపు కిష్టయ్య(71) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్‌నగర్‌ కు చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు కిష్టయ్య తన భార్య లక్ష్మితో కలిసి శుక్రవారం తన స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఎన్టీపీసీ సమీ ప మల్యాలపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి మూలమలుపు వద్దకు వెళ్లగానే బైక్‌ అదుపు తప్పి పోయాడు. తలకు హెల్మెట్‌ ఉడడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఇంతలో అదేమార్గంలో వస్తున్న మోహన్‌ అనే వ్యక్తి.. తన వాహనం ఆపి కిందపడిన కిష్టయ్యను రోడ్డుపక్కకు తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో అదేమార్గంలో వస్తున్న కారు, పాలవ్యాన్‌ డ్రైవర్లు వీరిని చూసి ఆగారు. కానీ, వాటివెనకాలే అతివేగంగా వస్తున్న ట్యాంకర్‌ కారును ఢీకొంది. ఆ వెంటనే కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతటితో ఆగని ట్యాంకర్‌ పాలవ్యాన్‌తోపాటు కిష్టయ్య, మోహన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కిష్టయ్య కాలు నుజ్జునుజ్జు అయి దుర్మరణం చెందాడు. మోహన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్న కిష్టయ్య అదేస్థలంలో ట్యాంకర్‌ రూపంలో మృతి చెందడం విషాదం నింపింది. స్వగ్రామానికి వస్తానని చెప్పిన తండ్రి కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు వెంకటేశ్‌తోపాటు కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్టీపీసీ ఎస్సై–2 లచ్చన్న, ఏఎస్సై బుచ్చిన్నాయుడు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

    అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన రిటైర్డ్‌కార్మికుడు

    హెల్మెట్‌ ధరించడంతో సురక్షితంగా బయటపడిన వైనం

    రోడ్డు పక్కకు వెళ్తుండగా వేగంగా వచ్చిఢీకొన్న ట్యాంకర్‌

    దుర్మరణం చెందిన కిష్టయ్య, గాయాలపాలైన మరో వ్యక్తి

  • డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను సోమిడి నగేశ్‌(45). జిల్లా కేంద్రంలోని బీ.వై.నగర్‌కు చెందిన నగేశ్‌ పెయింటర్‌గా పనిచేస్తారు. నిత్యం పనిలో బట్టలపై రంగులు పడడంతో పాడవుతుంటాయి. అందుకే పాత డ్రెస్సులను కొనుగోలు చేసి పనిలో వాడుతుంటారు. డ్రెస్సులు బాగుంటే.. ఫంక్షన్లకు కూడా వినియోగిస్తారు. నగేశ్‌ తనకు కావాల్సిన డ్రెస్సులను ఏళ్లుగా ఇక్కడే కొనుగోలు చేయడం విశేషం.

    సిరిసిల్ల పట్టణంలోని గాంధీచౌక్‌లో డ్రెస్సులు కొనుగోలు చేస్తున్న ఇతను నాగిండ్ల నర్సయ్య(40). కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన నర్సయ్య సిరిసిల్ల లేబర్‌ అడ్డాపై కూలీ పని కోసం వస్తారు. సిరిసిల్లలో ప్రతీ ఆదివారం పాతబట్టలు(డ్రెస్‌లు) అమ్మకాలు సాగుతుంటే తక్కువ ధరకే లభించడంతో పనిలో అక్కరకు వస్తాయని తనకు అవసమైనవి ఇలా కొనుగోలు చేస్తూ ఉంటాడు.

  • సిరిసిల్ల క్రైం: పద్నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భార్య, ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన నిందితుడిని సిరిసిల్ల పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మొర్రాయిపల్లికి చెందిన బోయిని ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి(5), నైపున్య(2). 2012లో భాగ్యలక్ష్మి మూడోసారి గర్భవతిగా ఉన్న సమయంలో మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త, అత్తమామలు ఆమెను వేధింపులకు గురిచేశారు. వేధింపులను తట్టుకోలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై అదే ఏడాది కేసు నమోదు కాగా.. అప్పటి నుంచి ఆంజనేయులు పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం అతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. బాధితురాలి తల్లి ఎల్లవ్వ ఈనెల 6న ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ నటేశ్‌, ముస్తాబాద్‌ ఎస్సై గణేశ్‌లను అభినందించారు.

    భార్యాపిల్లల మృతికి కారణం

    తప్పించుకుని తిరుగుతున్న తీరు

    ఎట్టకేలకు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు

  • రామగుండం: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన విపిన్‌కుమార్‌, వికాస్‌కుమార్‌, దీపక్‌తోపాటు మరోబాలుడు ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో వీరికి గుర్తుతెలియని వ్యక్తి 20 కేజీల డ్రైగంజాయి అప్పగించాడు. అక్కడి నుంచి తిరునవంతపురం–కోర్భా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించి రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై సంధ్యారాణి తన సిబ్బందితో తనిఖీలు చేశారు. బ్యాగులు పట్టుకున్న నలుగురు యువకులను ప్రశ్నించి సోదా చేశారు. ఇందులో డ్రై గంజాయి కనిపించగా అదుపులోకి తీసుకొన్నారు. గంజాయి స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి విలువ సుమారు రూ.పది లక్షలు ఉంటుందని అంచనా వేశారు. శనివారం ఇందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. స్థానికంగా వీరికి ఉన్న నెట్‌వర్క్‌పై నిఘా పెట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రమేశ్‌, ఎస్సై సంధ్యారాణి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

    రూ.10లక్షల విలువైన 20 కేజీల గంజాయి స్వాధీనం

    వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి

Family

  • గర్భం ధరించి మొదలు పండంటి పాపాయిని ప్రసవించే దాకా  ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు.   ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆహారం విషయంలో సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. 

     గర్భిణీలు తీసుకోనే ఆహారం,  అపోహలపై  ఈవిషయాలను   తెలుసుకోవాలి.

    • గర్భిణులు  ఇద్దరి కోసం తినాలలా?  నిజం ఏమిటంటే  అవసరం లేదు. మోతాదు కంటే పోషక విలువలపై దృష్టి ముఖ్యం.
    • బొప్పాయి, పైనాపిల్‌ తింటే గర్భస్రావం అవుతుంది?  నిజమేనా?  నిజం లేదు. బాగా పండిన బొప్పాయి, పైనాపిల్‌ తక్కువ మోతాదులో  తీసుకోవడం సురక్షితమే.
    • కుంకుమపువ్వు తింటే బిడ్డ తెల్లగా పుడతారు. బిడ్డ చర్మం రంగు తల్లిదండ్రుల జీన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది.
    • చేపలు అస్సలు  తినకూడదు. చేపలలో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ బిడ్డ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి.
    • నెయ్యి ఎక్కువగా తింటే  సుఖ ప్రసవం అవుతుంది : ఇందుకు శాస్త్రీయ  ఆధారాలు ఏమీ లేవు. 

    ఇదీ చదవండి: నో మెన్‌... ఓన్లీ విమెన్‌ : 300మంది వీడియో వైరల్‌