Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • సంక్రాంతి టార్గెట్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి మరో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే వెంకటేశ్, కల్యాణ్‌రామ్ హీరోలుగా ఫిక్స్ అయ్యారు. ఇక హీరోయిన్‌ల ఎంపిక కూడా వేగంగా పూర్తి చేశారు. కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకున్న మేకర్స్, తాజాగా వెంకటేశ్ సరసన కీర్తి సురేష్‌ను లాక్ చేశారు. కీర్తి సురేష్ ఇప్పటివరకు యువ హీరోలతోనే ఎక్కువగా నటించింది. కానీ వెంకటేశ్ లాంటి సీనియర్‌ హీరో సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించే అవకాశం ఉంది.  

    అనీల్ రావిపూడి హీరోయిన్లను ఒప్పించడంలో ప్రత్యేకత కలిగిన దర్శకుడు. ఇటీవల వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రం కోసం నయనతారను ప్రచారానికి ఒప్పించారు. ఇప్పుడు కీర్తి సురేష్‌ను వెంకీ సరసన హీరోయిన్‌గా తీసుకోవడం అనీల్‌కు పెద్ద సవాల్ కాదు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్‌లో విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్థన సినిమాను పూర్తి చేసి, వెంటనే వెంకీతో కొత్త ప్రాజెక్ట్‌లో చేరనుంది కీర్తి. వచ్చే సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలా దూసుకెళ్తుందో చూడాలి.

  • మొదట గీతా ఆర్ట్స్, ఆ తరువాత అంజనా ప్రొడక్షన్స్, కొణెదల ప్రొడక్షన్ కంపెనీ, వి-మెగా పిక్చర్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పింక్ ఎలిఫెంట్, గీతాఆర్ట్స్‌-2 అంటూ మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే చాలా బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్నాయి. మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా గీతాఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. ఇది చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటి.

    అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి అదనంగా మరో బ్యానర్ వచ్చి చేరేలా ఉంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడు, నటుడు అల్లు శిరీశ్ ఓ కొత్త బ్యానర్‌ను స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. శిరీశ్ ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. దాంతో ఇప్పుడు కెరీర్‌ పరంగా కూడా కొత్త దశలోకి ఎంటరయ్యే ప్లాన్స్‌లో ఉన్నాడని తెలుస్తోంది.

    శిరీశ్ ఇప్పటికే ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓవైపు గీతాఆర్ట్స్‌, మరోవైపు గీతాఆర్ట్స్‌-2 వంటి నిర్మాణ సంస్థలున్నప్పటికీ శిరీశ్ ఎందుకీ దిశగా ఆలోచిస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. కాగా 38 ఏళ్ల శిరీశ్‌కు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు.చివరగా బడ్డీ అనే సినిమాలో కనిపించాడు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. దాంతో అతడు నిర్మాతగా మారే అవకాశం ఉందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

  • కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా హీరోయిన్ టీనా శ్రావ్య. ఇప్పుడు మరోసారి గేదెల రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రెండు చిత్రాల ద్వారా ఆమెను ఇప్పటికే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గేదెల రాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

    ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్‌లో టీనా ఫర్మామెన్స్ చూస్తే ప్రామిసింగ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న క్యారెక్టర్స్‌లో టీనా అదరగొడుతోంది. టాలీవుడ్‌లో చిన్న బడ్జెట్ చిత్రాలకు ఈమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె డైలాగ్ డెలివరీతో పాటు అందం, అమాయకపు నటనా శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈనెల 24న విడుదల కానున్న గేదెల రాజు చిత్రంలో ఆమె పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

     

     

  • బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్‌ అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. గతేడాది కాళిధర్ లపట్టా, హౌస్‌ఫుల్-5 చిత్రాలతో మెప్పించారు. అమితాబ్ బచ్చన్‌ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన బచ్చన్.. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఉండగానే నటి ఐశ్వర్య రాయ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈనెల 21న బాలీవుడ్ జంట తమ 19 వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్‌.. ఐశ్వర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

    ఐశ్వర్యతో రిలేషన్‌, ప్రేమ ఎలా మొదలైందన్న సీక్రెట్‌ను అభిషేక్ పంచుకున్నారు. 2000 సంవత్సరంలో ధాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్‌లో ఐశ్వర్యను మొదటిసారి కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు మా మధ్య రిలేషన్‌ కేవలం స్నేహపూర్వకంగా మాత్రమే ఉండేదన్నారు. అప్పుడు తనతో లవ్‌ అనే ఆలోచనే నాకు రాలేదన్నారు. కానీ 2006లో 'ఉమ్రావ్ జాన్' సినిమా చిత్రీకరణ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించిందని అభిషేక్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు' సినిమా టైమ్‌లో మా బంధం మరింత బలపడిందన్నారు.  దర్శకుడు మణిరత్నం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని.. ఆయన ఒక స్నేహితుడిగా మాత్రమే కాదు.. గాడ్‌ఫాదర్‌ అని ప్రశంసించారు. 

    తమ కూతురు ఆరాధ్యను సరైన విలువలతో పెంచిన పూర్తి ఘనత ఐశ్వర్యకే దక్కుతుందన్నారు. ఐశ్వర్య కేవలం నా కూతురికి తల్లి మాత్రమే కాదు.. నా సోల్‌మేట్ కూడా అని కొనియాడారు. కాగా.. న్యూయార్క్‌లో జరిగిన 'గురు' ప్రీమియర్‌లోనే అభిషేక్, ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు. ఇది వారి లైఫ్‌లో ఓ అపూర్వమైన ఘట్టంగా నిలిచింది.  నిశ్చితార్థం తర్వాత ఏప్రిల్ 2007లో వీరిద్దరి వివాహం జరిగింది.
     

  • కమెడియన్ సత్య హీరోగా వస్తోన్న చిత్రం జెట్లీ. ఈ మూవీకి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను  అలరించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

    ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్  ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. 
     

  • చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి  దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం  ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

    మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్
    దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్‌ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ,  సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్‌తకియా, కేడీ వంటి  ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.

    టిక్‌టాక్‌తో ఫేమస్‌..
    టిక్‌టాక్‌తో ఫేమస్‌ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్‌టాక్‌ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్‌టాక్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

  • మరో ఆసక్తికర మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన సోషల్ ఓరియంటెడ్ మూవీ నుక్కడ్‌ నాటక్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఈ నెల 24 నుంచే ఓటీటీ ప్రియులను అలరించింది.  ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

    కాగా.. ఈ చిత్రంలో మోల్‌శ్రీ, శివంగ్ రాజ్‌పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఓ కాలేజీ నుంచి బహిష్కరించిన ఇద్దరు విద్యార్థుల ప్రయాణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాలేజీ క్యాంటీన్‌లో దొంగతనం చేస్తూ  ఇద్దరు స్నేహితులు దొరికిపోతారు. తిరిగి కాలేజీలో చేరేందుకు ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు విద్యనందించే బాధ్యతను తీసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరు తిరిగి కాలేజీకి వెళ్లారా? లేదా అన్నదే మిగతా స్టోరీ. 


     

     

  • నెల రోజులు దాటినా కూడా దురంధర్‌-2 హవా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేసిన ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా రిలీజైన 34 రోజుల్లోనే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్ రికార్డ్‌ను అధిగమించింది. తాజా వసూళ్లతో యూకేలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దురంధర్‌-2 నిలిచింది.

    రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ యూకేలో 34 రోజుల్లోనే రూ. 55.55 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే గతంలో ఉన్న పఠాన్ మూవీ రికార్డ్‌ను(రూ.55.40 కోట్లు) దాటేసింది. ఆ తర్వాత వరుసగా జవాన్, సైయారా, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, దిల్‌వాలే, పద్మావత్, చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ఈ జాబితాలో ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే దురంధర్-2 అంతర్జాతీయంగా రూ. 422 కోట్లకు పైగా వసూలు చేసింది. చైనా మినహా పలు దేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.  ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1,761.88 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా కంటే బాహుబలి-2, దంగల్ చిత్రాలు మాత్రమే ముందున్నాయి.

    కాగా.. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పండోర్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. 
     

  • బిగ్‌బాస్ ద్వారా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ అశ్విని శ్రీ.  బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టి తన టాలెంట్‌తో హౌస్‌లో అలరించింది. ఈ షో ద్వారా టాలీవుడ్‌లో మరింత ఫేమ్ తెచ్చుకుంది.  ఆ తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

    తాజాగా బిగ్‌బాస్ అశ్విని శ్రీ కన్నీటి పర్యంతమైంది. తాను ఎంతగానో ప్రేమించే సోను(పెట్ డాగ్) చనిపోయిన విషాద వార్తను సోషల మీడియాలో షేర్ చేసింది. ఈ బాధ తనకు భరించలేనిదంటూ ఫుల్ ఎమోషనలైంది. సోనుకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లే చనిపోయాడని అశ్విని శ్రీ తెలిపింది.  

    అశ్విని శ్రీ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను నా సోను బాయ్‌ని కోల్పోయా.. ఈ బాధ భరించరానిది. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. కానీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దయచేసి మీకు కుక్క ఉంటే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించండి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. దానికి ఏదైనా సమస్య ఉన్నా అవి మనకు చెప్పలేవు. బయటకు సాధారణంగానే కనిపించేది. లోపల తీవ్రమైన సమస్య కావచ్చు. ముందస్తు పరీక్షలు మాత్రమే వాటి ప్రాణాలను కాపాడగలవు' అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది. 
     

     

  • సినిమా నటులు అనగానే కోట్ల సంపాదన, లగ్జరీ లైఫ్‌ అనుకుంటారు. నిజమే అలానే బతుకుతారు. కానీ వాళ్లు ఆ స్థాయికి చేరుకోవడానికి చాలానే కష్టపడతారు. ఇప్పుడు స్టార్స్‌గా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించి వచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో బాలీవుడ్‌ నటుడు వినోద్‌ సూర్యవంశీ ఒకరు. అక్షయ్‌ కుమార్‌ ‘ఎల్‌ఎల్‌బి 3’, పంచాయత్‌ లాంటి సిరీస్‌తో బాలీవుడ్‌లో మంచి గుర్తించు తెచ్చకున్న  ఈ నటుడు.. ఒకప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాడట. రూ. 500 కోసం సినిమాల్లోకి వచ్చి.. ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి నటుడిగా స్థిరపడిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  వినోద్‌ తన సినిమా జర్నీ ఎలా మొదలైందో వివరించాడు.

    (చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు)

    వాచ్‌ మెన్‌గా పనిచేశా..
    చిన్నప్పుడు నా జీవితం చాలా ఘోరంగా ఉండేది. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. పండగలు వస్తే.. భయపడిపోయేవాళ్లం. అమ్మ-నాన్నల కష్టం చూడలేక.. కొన్నాళ్ల పాటు లిఫ్ట్‌ మ్యాన్‌గా పని చేశారు. ఆ తర్వాత వాచ్‌మెన్‌గా చేశా. ఆ సమయంలో దాదాపు 12 గంటల పాటు నిలబడి ఉండేవాడిని. వర్షం వస్తే.. షూలోకి నీళ్లుపోయి..తీవ్రమైన నొప్పి వచ్చేవి.

    రూ. 500 కోసం.. 
    నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా. వాచ్‌మెన్‌గా చేస్తున్న సమయంలో నా స్నేహితుడు ఒకడు వచ్చి షూటింగ్‌లో నిలబడితే రూ. 500 ఇస్తారని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. అలా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌ ప్రారంభం అయింది. అప్పట్లో రోజుకు రూ. 500 ఇచ్చేవాళ్లు. టిఫిన్‌, లంచ్‌ పెట్టేవాళ్లు. అప్పటికే అది నాకు చాలా గొప్పది. వాన్‌మెన్‌గా 12 గంటలు పని చేస్తే నెలకు రూ. 8000 మాత్రమే వచ్చేవి. కానీ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా రూ. 12000 సంపాదించా.

    తింటుంటే లేపేశారు
    అలా అని జూనియర్‌ ఆర్టిస్ట్‌ లైఫ్‌ గొప్పగా ఉంటుందని నేను చెప్పను. వాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వరు. జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు ఓ సారి నేను సెట్‌లో భోజం చేస్తున్నాను. కొంతమంది వచ్చి..నన్ను పక్కకు వెళ్లమన్నారు. దూరంలోని నిలబడి తనమన్నారు. ఎందుకంటే నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌ని అని. అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నా. నన్ను గౌరవించాలంటే.. నేను కూడా యాక్టర్‌ని కావాలనుకున్నా. చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా.

    బిచ్చగాడి పాత్రకు కూడా సెట్‌ కాదన్నారు
    కెరీర్‌ ప్రారంభంలో నేను చాలా కష్టాలు అనుభవించా. చాలా పాత్రలకు నన్ను రిజెక్ట్‌ చేశారు. కొన్ని పాత్రలు అయితే షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత ఆగిపోయాయి. సెట్‌లోకి వెళ్లిన తర్వాత.. నల్లగా ఉన్నావని చెప్పి రిజెక్ట్‌ చెశారు. చివరకు బిచ్చగాడి పాత్రకి కూడా రిచ్‌ లుక్‌ లేదని నన్ను పక్కన పెట్టారు. ఇలా మొదట్లో నాకు చాలా అవమానాలు జరిగాయి’ అని సూర్య చెప్పుకొచ్చాడు. 

  • టాలీవుడ్‌లో ఇప్పుడంతా అల్లు అర్జున్‌ టాపిక్‌ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్‌ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.

    ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్‌ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే  జూబ్లీహిల్స్‌లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్‌ వినిపిస్తోంది.

    ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం  రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 
     

  •  ఈ మధ్య సంగీత కచేరీకి ప్రాధాన్యత పెరిగింది. స్టార్‌ సింగర్స్‌ అంతా.. మ్యూజిక్‌ కాన్సర్ట్‌ నిర్వహిస్తుండడంతో.. మ్యూజిక్‌ లవర్స్‌ ఆ ఈవెంట్‌ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం లైవ్‌ కాన్సర్ట్‌ అని చెప్పి..రికార్డింగ్‌ పాటను ప్లే చేయడం ఇప్పుడు సంగీత ప్రియులను ఆగ్రహానికి గురి చేస్తుంది. తాజాగా ధురంధర్‌  సింగర్‌ జాస్మిన్‌ సాండ్లాస్‌ కూడా బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతున్న పాటకు లిప్‌ సింక్‌ ఇచ్చి.. లైవ్‌లో పాడుతున్నట్లుగా మోసం చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది.

    లైవ్‌ కాన్సర్ట్‌ కానీ.. 
    ధురంధర్‌ సినిమా రిలీజ్‌ తర్వాత సింగర్‌ జాస్మిన్‌ సాండ్లాస్‌ మరింత ఫేమస్‌ అయ్యాడు. ఆ సినిమాలో ఆమె ఆలపించిన షరారత్, మై ఔర్ తూ, ఆరీ ఆరీ పాటలు సూపర్‌ హిట్‌ అవ్వడం.. సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ కావడంతో జాస్మిన్‌ పేరు మారుమోగిపోయింది. ఆ ఫేమ్‌ని సొమ్ము చేసుకునేందుకు జాస్మిన్‌ రెడీ అయింది. అందులో భాగంగా ఏప్రిల్‌ 19న గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో సంగీత కచేరి నిర్వహించింది. ధురంధర్‌ సింగర్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ అని తెలియడంతో వందలాది మంది సంగీత ప్రియులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఈవెంట్‌కి వెళ్లారు. జాస్మిన్‌ కూడా వారిని నిరాశపరచకుండా తన పాటలతో మంత్రముగ్ధుల్ని చేసింది.

    పాడడం కోసమా లేదా యాక్టింగ్‌ కోసమా?
    ఈవెంట్‌కి వచ్చినవారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధురంధర్‌ పాటను ఆలపిస్తూ..తలపై నీళ్లు పోసుకుంది. అంతేకాదు పాటతో పాటు డ్యాన్స్‌ కూడా చేసి అలరించింది. దీనికి సంబంధి​ంచిన వీడియో క్లిప్‌ నెట్టింట వైరల్‌ అయింది. అయితే ఆ వీడియో క్లిప్‌ పరిశీలిస్తే.. జాస్మిన్‌ పాట పాడలేదు. బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతున్న పాటకి పెదాలను కదిపారు అంతే. ఇది గమనించిన నెటిజన్స్‌ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో పాటు తలపై నీళ్లు పోసుకోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ‘లైవ్‌ కాన్సర్ట్‌ అని చెబుతారు.. కానీ లైవ్‌లో పాట పాడరు’, ‘ఆమెను పాట పాడడానికి పిలిపించారా లేదా నటించడానికి పిలిపించారా?’, ‘తలపై పోసుకున్న నీళ్లు సరిపోలేదు..ఇంకో బకెట్‌ నీళ్లు పోసుకోవాల్సింది’అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 
     

  • టాలీవుడ్‌లో చిన్న సినిమాలను జనాలు అస్సలు పట్టించుకోరు. వారంలో రెండు, మూడు చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్తుంటాయి. అదీ మన టాలీవుడ్‌లో చిన్న చిత్రాల పరిస్థితి. కంటెంట్ ఉంటేనే అంతో ఇంతో జనాలు ఆదరిస్తున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మలయాళంలో రిలీజైన చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబడుతున్నాయి. ఇటీవలే వాలా-2 మూవీ ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో సినిమాగా ఘనత దక్కించుకుంది.

    మలయాళ ఇండస్ట్రీలో వాలా-2 ప్రభంజనం కొనసాగుతుండగానే మరో సినిమా సైతం దూసుకెళ్తోంది. వారం రోజుల గ్యాప్‌లో రిలీజైన భరతనాట్యం- 2 మోహినియాట్టం అనే చిన్న మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా అదరగొడుతోంది. వాలా-2 నుంచి పోటీ ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. ఇలా చిన్న సినిమాలతో కోట్లు గడించడం కేవలం మలయాళ ఇండస్ట్రీకే సాధ్యమవుతోంది.

    ఈ సినిమా కేవలం కేరళలో మాత్రమే కాదు.. కర్ణాటకలోనూ వసూళ్లు రాబడుతోంది. ఓవర్‌సీస్‌లో రిలీజైన ఈ మూలీ  యునైటెడ్ కింగ్‌డమ్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లోనూ కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో ఈ డార్క్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, సైజు కురుప్  కీలక పాత్రల్లో నటించారు.

     

  • నరేశ్‌ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం ఎంఆర్‌పీ. నీకెంత, నాకెంత అనేది సబ్ టైటిల్. ఈ సినిమాకు శ్రవణ్ జేస్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిస్తీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

    'మన కల కోసం మనం పనిచేయకపోతే.. వేరే వాళ్ల కలల కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది' అనే డైలాగుతో ప్రారభమైన టీజర్‌ సినీ ప్రియులను ‍అలరిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు అజయ్ అరసాడ సంగీతమందిస్తున్నారు. 

Sports

  • ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.

    జస్ప్రీత్ బుమ్రా,  జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్‌.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్‌కు వేసిన మొహ్షిన్ ఖాన్‌..  ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మలిచాడు.

    తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్‌కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటి​కి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.
    చదవండి: PSL 2026: హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

  • ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119  పరుగులకే ఆలౌటైంది.

    రాజస్తాన్‌  బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

    అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

  • పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్‌ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కరాచీ నేష‌న‌ల్ స్టేడియంలో స్మిత్‌ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.

    హునైన్ షా వేసిన ఒకే ఓవర్‌లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్ర‌మంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న స్మిత్‌.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 

    ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌..231 పరుగులు చేశాడు.
    చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

  • ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. వైభవ్‌ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను సూర్యవంశీ కోల్పోయాడు.

    ఈ మ్యాచ్‌లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. 

    వైభవ్ కేవలం  222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాక్సీ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.
    చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

  • క్రికెట్ ప్ర‌పంచానికి ప్ర‌స్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అత‌డే భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్‌ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్‌ను అతడు సూచించాడు.

    "వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్‌కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్‌, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్‌కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.

    ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌పై ఒక అవగాహన వచ్చేది. వైభ‌వ్‌కు జాతీయ జ‌ట్టు త‌ర‌పున కూడా రాణించే స‌త్తాఉంది. బుమ్రా లాంటి బౌల‌ర్‌కు మొద‌టి బంతికి వైభ‌వ్ సిక్స్ బాదాడు. ఆ త‌ర్వాత హేజిల్‌వుడ్‌ను ఓ ఆడుకున్నాడు. 

    బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెట‌ర్ భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. అతనే సచిన్ టెండూల్క‌ర్‌. ఈ రోజు అత‌డిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభ‌వ్‌కు క్రికెట్‌లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ కేవ‌లం 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.
    చదవండి: IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

  • పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ మొహ్మద్ నవాజ్ ప‌ట్టుబడ్డాడు. అత‌డు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది.

    ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఈ విష‌యాన్ని పీసీబీ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలియ‌జేశారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు న‌వాజ్ దూరం కానున్నాడు.

    న‌వాజ్‌కు భారీ షాక్‌..
    అదేవిధంగా న‌వాజ్‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది. వాస్త‌వానికి న‌వాజ్ వ‌చ్చే నెల‌లో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో స‌ర్రే క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాల్సి ఉంది. ఇప్ప‌టికే పీసీబీ అత‌డికి నిరభ్యంతర పత్రం (NOC) కూడా మంజారు చేసింది. కానీ ఈ వివాదం కార‌ణంగా పీసీబీ ఎన్‌వోసీని నిలిపివేసిన‌ట్లు స‌మాచారం. కాగా న‌వాజ్ పాక్ జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.

    భార‌త్‌, శ్రీలంక వేదిక‌ల‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా  టీ20 ఫార్మాట్‌లో నవాజ్‌కు ఘనమైన రికార్డు ఉంది. టీ20ల్లో పాకిస్తాన్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో న‌వాజ్‌(101) నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌల‌ర్ కూడా న‌వాజ్‌నే కావ‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ విచారణలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కాంట్రాక్ట్ రద్దుతో పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది.
    చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

  • IPL 2026 RR vs LSG Live updates: లక్నోపై రాజస్తాన్‌ ఘన విజయం
    ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 18 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.  లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు పడగొట్టాడు.

    లక్నో ఏడో వికెట్ డౌన్‌
    ముకుల్ చౌదరి రూపంలో లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ముకుల్ ఔటయ్యాడు. లక్నో విజయానికి 23 బంతుల్లో 49 పరుగులు కావాలి.

    లక్నో ఆరో వికెట్ డౌన్‌
    లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌.. బర్గర్ బౌలిం‍గ్‌లో ఔటయ్యాడు.
    లక్నో ఐదో వికెట్‌ డౌన్‌
    లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన హిమత్‌ సింగ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లక్నో విజయానికి 33 బంతుల్లో 69 పరుగులు కావాలి.

    రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    54 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74/4

    నిలకడగా ఆడుతున్న మార్ష్‌, పూరన్‌
    7 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌(24), పూరన్‌(14) ఉన్నారు.

    కష్టాల్లో లక్నో
    ఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    లక్నోకు భారీ షాక్‌
    160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. లక్నో కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌ పంత్‌(0), బదోని(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

    రాణించిన జడేజా.. 
    ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
    19 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోరెంతంటే?
    19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.

    రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్‌ హెట్‌మైర్‌.. మోహ్షిన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్‌ స్కోర్‌: 78-5

    రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    20 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 62/4
    రాజస్తాన్‌ మూడో వికెట్‌
    రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 32/3

    నిప్పులు చెరుగుతున్న షమీ
    రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్‌  వరుస బంతుల్లో జైశ్వాల్‌(22), ధ్రువ్‌ జురెల్‌(0) పెవిలియన్‌కు చేరారు.

    ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.

    అవేష్‌ ఖాన్‌,  సిద్దార్ధ్‌  స్ధానాల్లో దిగ్వేష్‌, మయాంక్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్‌ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 

    తుది జట్లు
    రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్

    లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

  • ఐపీఎల్‌-2026లో అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో పంజాబ్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 25న అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ కూప‌ర్ క‌నోలీ దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

    క‌నోలీ ప్ర‌స్తుతం పంజాబ్ క్యాంప్‌ను వీడి ఫిట్‌నెస్ ప‌రీక్షల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండ‌ర్ అయిన క‌నోలీకి ఐపీఎల్‌లో వెన్ను గాయం కార‌ణంగా  కేవ‌లం బ్యాటింగ్ చేసేందుకు మాత్ర‌మే క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి ఇచ్చింది. ఏప్రిల్ చివరి నాటికి బౌలింగ్ చేయడానికి అనుమతి లభించే అవ‌కాశమున్న‌ట్లు ఈ ఏడాది సీజ‌న్ ఆరంభానికే ముందు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. 

    ఈ క్ర‌మంలోనే ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించేందుకు అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా వెనక్కి పిలిపించింది. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధిస్తే బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇవ్వనుంది. క‌నోలీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

    చివరగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కూడా కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. కనోలీ ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 223 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌  వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో ఉంది.
    చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

  • టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిళ్లను అతడి సారథ్యంలోనే భారత్‌ గెలుచుకుంది. దిగ్గజ కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్‌కు.. కెరీర్‌ ఆరంభంలో ఒకానొకనాడు జట్టులో చోటే కరువైంది.

    ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో సెలక్టర్లు రోహిత్‌ శర్మను పక్కనపెట్టారు. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాడు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు వెల్లడిస్తూ.. అతడిని క్షమాపణలు కోరాడు.

     బాధపడుతూనే ఉన్నాను
    ‘‘ప్రతి ఇంటర్వ్యూలో తాను 2011 వరల్డ్‌కప్‌ ఆడటం మిస్సయ్యానని రోహిత్‌ చెబుతూ ఉన్నాడు. నిజంగా అతడి విషయంలో ఆరోజు జరిగిన దానిపట్ల నేటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. గతేడాది అతడిని కలిసి.. ‘సారీ బాస్‌.. ఆనాడు మేము ఉద్దేశపూర్వకంగా ఏదీ చేయలేదు’ అని చెప్పాను.

    అప్పుడు మేము ఆల్‌రౌండ్‌ ప్రతిభ గల వాళ్లకే పెద్దపీట వేయాలని భావించాము. 1983 మాదిరే ఈ టోర్నీలో ఆడించాలనే ఆలోచనతో ఉన్నాము. మేము ఊహించినట్లుగానే ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నిలిచాడు.

    అందుకే రోహిత్‌ను పక్కనపె ట్టాల్సి వచ్చింది
    కొన్ని మ్యాచ్‌లలో హాఫ్‌ ఆల్‌రౌండర్లు కూడా రాణించారు. సెహ్వాగ్‌, సచిన్‌, సురేశ్‌ రైనా కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేశారు. యూసఫ్‌ పఠాన్‌ సైతం హాఫ్‌ ఆల్‌రౌండరే. ఈ హాఫ్‌ ఆల్‌రౌండర్‌ కాన్సెప్టులో పడి రోహిత్‌ శర్మను పక్కనపెట్టాల్సి వచ్చింది.

    పాపం అతడికి జట్టులో చోటు దక్కలేదు. నిజానికి 2011 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడేందుకు అతడు అర్హుడే. కానీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఎంపిక చేయలేకపోయాము’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పేర్కొన్నాడు. కాగా 2011లో ధోని సారథ్యంలో టీమిండియా టైటిల్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

    చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేత

  • ఐపీఎల్‌-2026లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ బ‌రిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇషాన్ కిష‌న్ త‌న బాధ్య‌త‌ల‌ను క‌మ్మిన్స్‌కు అప్ప‌గించ‌నున్నాడు.

    క‌మ్మిన్స్ వెన్ను గాయం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఎస్ఆర్‌హెచ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల‌కు అందుబాటులో లేడు. అత‌డు ఇటీవ‌లే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వ‌హించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.

    కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.

    అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్‌రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్‌లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సంజయ్ బంగర్‌, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
    చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌

  • ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడినా, ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఎస్‌ఆర్‌హెచ్‌ జోరు చూస్తేంటే ఈ సీజన్‌ టైటిల్‌ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.

    సీజన్‌ ప్రారంభంలో బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడిన ఈ జట్టు యువ పేసర్‌ సాకిబ్‌ హుస్సేన్‌ రాకతో ఒక్కసారిగా టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. సాకిబ్‌ తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సాకిబ్‌ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.

    అనంతరం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ సాకిబ్‌ సత్తా చాటాడు. 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి ఓ వికెట్‌ తీశాడు. తాజాగా (ఏప్రిల్‌ 21) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకిబ్‌ మరోసారి జూలు విదిల్చాడు. 4 ఓవర్లలో 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ తీశాడు. 

    రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలింగ్‌ చేసే 21 ఏళ్ల సకీబ్‌ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతూ ఎస్‌ఆర్‌హెచ్‌ పాలిట వరంలా మారాడు. అతను ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా 6 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ గెలుపుయాత్రలో ప్రధాన భాగమయ్యాడు. సాకిబ్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ గెలిచింది. 

    అలాగే సాకిబ్‌ 3 మ్యాచ్‌లు ఆడినా ఒక్క సిక్సర్‌ కూడా ఇవ్వలేదు. ఇదే అతన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. సకీబ్‌ ఇప్పటివరకు వేసిన 72 బంతుల్లో కేవలం 85 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత పిసినారి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మొత్తంగా సకీబ్‌ రాక సన్‌రైజర్స్‌ ఫేట్‌ను మార్చేసింది. ఇతను ఇదే జోరును కొనసాగిస్తే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను టైటిల్‌ గెలవకుండా ఆపడం కష్టం.

    సకీబ్‌కు మరో యువ పేసర్‌ ప్రఫుల్‌ హింగే కూడా తోడయ్యాడు. అతను కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అయితే అతను సకీబ్‌ లాగా పొదుపుగా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో సకిబ్‌తో పాటు అద్భుత ప్రదర్శన (4-34) చేసిన హింగే ఆతర్వాతి మ్యాచ్‌లో ధారాళంగా (1-60) పరుగులు సమర్పించుకున్నాడు. 

    సకీబ్‌, ప్రఫుల్‌ మాత్రమే కాకుండా ఈ సీజన్‌లో మరో ఇద్దరు సన్‌రైజర్స్‌ బౌలర్లు సత్తా చాటుతున్నారు. శ్రీలంకకు చెందిన పేసర్‌ ఎషాన్‌ మలింగ, లెఫ్ట్‌ ఆర్మ్‌ రిస్ట్‌ స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ అద్భుతంగా రాణిస్తూ సన్‌రైజర్స్‌ విజయాల్లో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. 

    వాస్తవానికి సీజన్‌ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌కు బౌలింగే ప్రధాన సమస్యగా ఉండేది. రెగ్యులర్‌ కెప్టెన్‌, జట్టు ప్రధాన పేసర్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా సగం సీజన్‌కు దూరమయ్యాడు. సీనియర్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 

    ఇలాంటి తరుణంలో ప్రఫుల్‌, సకీబ్‌, శివాంగ్‌ లాంటి దేశీయ బౌలర్లు వచ్చి సన్‌రైజర్స్‌ ఫేట్‌నే మార్చేశారు. త్వరలో కమిన్స్‌ కూడా వీరికి జత కలిస్తే సన్‌రైజర్స్‌ను ఆపడం చాలా కష్టమవుతుంది. ఈ జట్టు బ్యాటింగ్‌ బలం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యంత ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌ ఈ జట్టు సొంతం. ఫీల్డింగ్‌లో కాస్త మెరుగుపడితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ గెలుపు తధ్యం.

  • బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 17న తొలి వన్డే జరుగగా కివీస్‌ గెలుపొందింది.

    198 పరుగులకు ఆలౌట్‌
    ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్‌ జయభేరి మోగించింది. యువ పేసర్‌ నహీద్‌ రాణా (5/32) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. 

    చెలరేగిన నహీద్‌
    ఓపెనర్‌ నిక్‌ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (14), హెన్రీ నికోల్స్‌ (13), విల్‌ యంగ్‌ (2), మొహమ్మద్‌ అబ్బాస్‌ (19), డీన్‌ ఫోక్స్‌ క్రాఫ్ట్‌ (15), క్లార్క్‌సన్‌ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. 

    తన్జిద్‌, షంటో హాఫ్‌ సెంచరీలు
    బంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నహీద్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్‌ ఇస్లామ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్‌ హసన్‌ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), నజ్ముల్‌ హసన్‌ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. 

    సైఫ్‌ హసన్‌ (8), సౌమ్య సర్కార్‌ (8), లిటన్‌ దాస్‌ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్‌కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జైడన్‌ లెనాక్స్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ గెలుపొందింది.

    ఫీజులో 10 శాతం కోత
    అయితే, న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్‌- న్యూజిలాండ్‌ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్‌ ఇందుకు వేదిక.

    చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

  • పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆల్‌రౌండర్ మొహమ్మద్‌ నవాజ్‌ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ వ్యవహారంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. నవాజ్‌ ఇటీవల ముగిసిన టీ20 ‍ప్రపంచకప్‌లో డ్రగ్స్‌ వాడినట్లు నిరూపితమైంది. 

    ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో పర్వాలేదనిపించాడు. నవాజ్‌ రాణించినా, ప్రపంచకప్‌లో పాక్‌ ఘోరంగా విఫలమై సూపర్‌-8 దశలోనే ఇంటిముఖం పట్టింది. పీసీబీ విచారణలోనూ నవాజ్‌ నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శాశ్వత నిషేధం అదనంగా భారీ జరిమానా విధించవచ్చు.

    కాగా, క్రికెట్‌లో డ్రగ్స్ వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వినోదం కోసం అయినా నిషేధిత పదార్థాలు వాడితే తీవ్ర శిక్షలు తప్పవు. ఈ ఘటన మరోసారి క్రికెట్‌లో క్రమశిక్షణ, ప్రొఫెషనల్ ప్రవర్తన ఎంత ముఖ్యమో గుర్తు చేసింది.

     

  • టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్‌ ధోని. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.

    సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్‌లో ఉన్నాయి.

    గౌరవ ఆర్మీ ర్యాంకు
    ఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్‌ రెజిమెంట్‌లో 2011లో అతడికి లెఫ్టినెంట్‌ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్‌ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్‌ బెరెట్‌’ (headgear) సొంతం చేసుకున్నాడు.

    మొదట్లో నాకు నచ్చలేదు
    ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.

    ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌. అప్పటి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్‌ బెరెట్‌ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.

    పారాట్రూపర్‌ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్‌ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్‌ బెరెట్‌ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.

    నిజమైన సైనికుడు
    ధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ‍ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌ కూల్‌. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్‌గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.

    యూనిఫామ్‌ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్‌గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.

    ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్‌లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా ధోనిని కొనియాడారు.

    చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేత

  • భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‍రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ‍కంటే పంజాబ్‌ యువ కెరటం​ ప్రియాంశ్‌ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. 

    తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్‌, అయుశ్‌ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం​ లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్‌ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.

    కాగా, అశ్విన్‌ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 248.24 స్ట్రయిక్‌రేట్‌తో 211 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్‌ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.

    వైభవ్‌ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. సీఎస్‌కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్‌ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. 

    అయితే ఇటీవల మ్యాచ్‌లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 236.54 స్ట్రయిక్‌రేట్‌తో 246 పరుగులు చేసి టాప్‌-5 లీడింగ్‌ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.

    మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్‌ ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 201 పరుగులు చేసి సీఎస్‌కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

    మొత్తంగా అశ్విన్‌ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్‌తో పోలిస్తే వైభవ్‌కు అధిక హైప్‌ దక్కింది. టాలెంట్‌ విషయం పక్కన పెడితే, ఏజ్‌ అతనికి అడ్వాంటేజ్‌గా మారింది. 

    14-15 ఏళ్ల వయసులో వైభవ్‌ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్‌ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్‌ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్‌ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు. 
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్‌ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్‌ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

    పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గత సీజన్‌ నుంచి ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్‌ను ఒకే సమయంలో షెడ్యూల్‌ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్‌ఎల్‌ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్‌కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.

    రెండు లీగ్‌లు ఒకేసారి జరుగుతుండటం​ వల్ల సహజంగానే ఐపీఎల్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్‌లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఈ లీగ్‌నే ఫాలో అవుతున్నారు. 

    పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్‌ డేటెడ్‌ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్‌ పరిధి కేవలం​ పాక్‌కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్‌ఎల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

    ప్రస్తుత సీజన్‌లో పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్‌కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో‌ జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్‌లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్‌లకు ఈ సీజన్‌ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.

    ఈ సీజన్‌లో 31 మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్‌లో చెలరేగిపోతున్నారు. రొటీన్‌కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.

    జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. 

    ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్‌ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్‌ మోడ్‌లో సాగుతుంది. ఎల్‌ఎస్‌జీ, ఢిల్లీ, గుజరాత్‌  పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, ఆన్‌ ఫీల్డ్‌లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్‌కే పరిస్థితి ముంబై ఇండియన్స్‌ లాగే ఉంది.

    అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్‌ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్‌ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్‌ ఈ సీజన్‌లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.

    పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఆ లీగ్‌ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ లాగే 31 మ్యాచ్‌లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్‌ విభాగం సప్పగా, వన్డే క్రికెట్‌ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్‌ జనాలకు బోర్‌ కొట్టిస్తుంది. ఫీల్డింగ్‌ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్‌ సిత్రాలన్నీ ఈ లీగ్‌లోనే కనిపిస్తాయి. పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.

    ఈ లీగ్‌ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్‌ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్‌కు ఈ లీగ్‌ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లోకి రావడ​ం​. ఈ పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ ఈ పీఎస్‌ఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.

    ఇది మినహా పీఎస్‌ఎల్‌ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్‌ జల్మీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ముల్తాన్‌ సుల్తాన్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్నాయి.  
     

  • టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి బ్రాండ్‌ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్‌ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్‌.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్‌8 కమ్యూన్‌ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.

    దేశ వ్యాప్తంగా
    దేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్‌ చైన్‌ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్‌, పుణె, కోల్‌కతా, నోయిడా, హైదరాబాద్‌ వంటి సిటీల్లో వన్‌8 కమ్యూన్‌కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్‌8 కమ్యూన్‌ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

    అద్దె కట్టకుండా..
    బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ ఉంది. ట్రియో హిల్స్‌ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్‌ విఫలమైంది. మెయింటెనెన్స్‌ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్‌ కోర్టును ఆశ్రయించారు.

    ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

    బంధం తెంచుకున్న కోహ్లి
    ఈ రెస్టారెంట్‌ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్‌ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్‌ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.

    చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

Politics

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.

    ఉత్తర 24 పరగణాలలో తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో మాట్లాడిన బెనర్జీ.. శాంతిభద్రతలు కాపాడటానికి వచ్చిన సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాల వినియోగం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు, రైల్వే వంటి సంస్థలు కూడా పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యాయని అన్నారు.

    “ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ, ఇది ప్రజలకు హాని చేసే సమయం కాదు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఎవరైనా పోలింగ్‌ వేళ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని తర అనుచరులను కోరారు. సుమారు 2 లక్షల కేంద్ర సిబ్బందిని రాష్ట్రానికి తీసుకువచ్చారని చెప్పారు. “ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడం ద్వారా నన్ను భయపెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.

    బీజేపీకి మమత సవాల్ విసురుతూ.. “సాయుధ వాహనాలకు శక్తి ఎక్కువా లేక ప్రజలకు శక్తి ఎక్కువా చూడాలి. నేను దేనికీ భయపడను. ఇలాంటి సాయుధ వాహనాలను మణిపూర్‌లో వినియోగించాలి. మణిపూర్‌లో మూడు సంవత్సరాలుగా అశాంతి కొనసాగుతోంది. బెంగాల్‌లో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు” అని తెలిపారు.

    జాతీయ భద్రత అంశాలపై కూడా ఆమె మాట్లాడారు. “పహల్గామ్‌లో ఉగ్రవాదులు భారతీయులను హతమార్చినా, కేంద్ర సర్కారు పాకిస్థాన్‌పై చర్య తీసుకోలేకపోతోంది. కానీ బెంగాల్ ఎన్నికల కోసం మాత్రం అన్ని బలగాలను తీసుకువస్తున్నారు” అని అన్నారు. కాగా, గురువారం (ఏప్రిల్‌ 22) పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎ‍న్నికలు జరగనున్నాయి. 

  • పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికల (152 స్థానాలకు)తో పాటు తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గురువారం (ఏప్రిల్‌ 23) ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే4న వెల్లడవుతాయి.  

    పశ్చిమ బెంగాల్‌లో.. 
    పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌లో 16 జిల్లాల్లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 8,000కి పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. 

    • ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 

    • భారీ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    • జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో క్యూలు భారీగా ఉండకుండా ఓటర్లు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

    • అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 3,60,77,171 ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 

    • వీరిలో మంది 1,84,99,496 పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, 465 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

    • మొదటి దశలో పోలింగ్‌ జరిగే ప్రాంతాలు: మొదటి దశలో ఉత్తర బెంగాల్ జిల్లాలు డార్జిలింగ్, జల్పాయిగురి, కూచ్ బేహార్ ప్రాంతాలు, అలాగే జంగల్ మహల్, పురులియా, బాంకురా, పశ్చిమ మేదినిపూర్, బీర్బూమ్, ముర్షిదాబాద్ భాగాలు ఉన్నాయి.

    • వోటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లి వేయాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. 

    తమిళనాడులో

    • తమిళనాడులో 5.73 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు.

    • ఇందులో 2.93 కోట్ల మహిళా ఓటర్లు, 7,728 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 

    • మొత్తం 33,133 ప్రాంతాల్లో 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

    • వాటిలో 249 మోడల్ బూత్‌లు, 325 మహిళలు నిర్వహించే బూత్‌లు, 71 దివ్యాంగులు నిర్వహించే బూత్‌లు ఉన్నాయి.

    • ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) రాష్ట్రవ్యాప్తంగా వినియోగానికి సిద్ధం చేశారు. 

    • మొత్తం 1,06,418 బ్యాలట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, 75,064 వివిప్యాట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 

    • మొత్తం 3,60,068 పోలింగ్ సిబ్బంది ఈ కేంద్రాల్లో విధుల్లో ఉంటారు.

    • అదనంగా 300 పారామిలిటరీ దళాలు, 83,800కు పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 

    • మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.

    • తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 

    • సాయంత్రం 6 గంటలకు ముందు వచ్చి క్యూలో నిలబడిన ప్రతి ఓటరుకు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. 

    • ఏప్రిల్ 23న తమిళనాడులో పబ్లిక్ హాలిడే.

    • బస్సులు, మెట్రో, స్థానిక రవాణా సేవలు సాధారణంగా నడుస్తాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు సౌకర్యంగా ఉంటుంది.

    • పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాలు తెరిచే ఉంటాయి.  
       

  • సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసిన వారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు.. కుంగింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్‌పై చేసిన కుట్రలు. కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చిల్లర ప్రచారం చేసింది. ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎన్నిక అబద్ధాలు చెప్పినా.. తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి చుక్క కేసీఆర్‌ ఇచ్చిందే’’ అని కేటీఆర్‌ తేల్చి చెప్పారు.

    ‘‘అది పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక కాదు.. పీసీసీ ఇచ్చిన రిపోర్ట్‌. కాళేశ్వరం మహత్యాన్ని కనబడకుండా దాచలేరు. మాపై బురదచల్లారు కానీ.. నిప్పులాంటి నిజం బయటకు వచ్చింది. మేడిగడ్డపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేశారు. రెండేళ్లలో ఎన్నో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేశారు. 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత?. ఎల్‌అండ్‌టీపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆగమేఘాల మీద ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టడం నిజం కాదా?. కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టారు.

    ..ఎస్‌బీసీ కూలి.. కార్మికులు చనిపోతే ఇప్పటివరకు బయటకు తీయలేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిపోతే మాట్లాడరు?. కరీంనగర్‌లో చెక్‌డ్యాంలు పేలిస్తే ఎందుకు చర్యలు ఉండవు. కేసీఆర్‌పై కోపంతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రైతులకు కరెంట్‌, రైతుబంధు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు’’ అని కేసీఆర్‌ హితవు పలికారు.

     

     

     

     

     

     

     

  • సాక్షి, తాడేపల్లి: రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు సింగపూర్‌లో షికార్లు చేస్తారా? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం ఖర్చు చేయటానికి డబ్బులు లేవు గానీ.. షికార్లకు డబ్బులుంటాయా? అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏ రైతూ బాగుపడింది లేదు. వ్యవసాయం దండగ అని తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే ఇప్పుడు మళ్లీ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోయినా పట్టించుకోవటం లేదు’’ అంటూ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమోటా, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేదు. అయినా చంద్రబాబు అధికారులతో ఒక్ సమీక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు?. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పని చేస్తుందా?. రైతులను ఆదుకోవడానికి డబ్బుల్లేవంటారా?. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?. చంద్రబాబు రైతు వ్యతిరేకి. మిగతా రాష్ట్రాల్లో రైతులను అందుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ స్పృహ ఎందుకు లేదు?’’ అంటూ అప్పిరెడ్డి ప్రశ్నించారు.

    ‘‘ప్రపంచానికి పాఠాలు నేర్పానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. మరి అలాంటి వ్యక్తి తన మంత్రులకు సింగపూర్‌లో ట్రైనింగ్ ఇస్తారట. రైతుల కోసం డబ్బుల్లేవంటూ మంత్రుల విహార యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారా?. రైతు సమస్యల పరిష్కారానికి ఒక్క సమీక్ష సమావేశాన్నైనా చంద్రబాబు ఏర్పాటు చేశారా?. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే. ఉచిత విద్యుత్ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్‌, వైఎస్‌ జగన్ మాత్రమే చేశారు. చంద్రబాబు ఏనాడూ ఏ రైతుకూ మేలు చేయలేదు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

     

Andhra Pradesh

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.

    ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు.

    వైఎస్‌ జగన్‌ ఉదయం ఇప్పట్ల పర్యటన తర్వాత భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

    వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని..  ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు,  యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు.

    వైఎస్‌ జగన్‌ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కార్యాలయ ప్రాంగణమంతా జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్‌ జగన్‌ నినాదాలతో హోరెత్తింది. వైఎస్‌ జగన్‌ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్‌ నినాదాలతో నినదించారు.

  • సాక్షి, నంద్యాల‌ జిల్లా: రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును త‌క్ష‌ణం మొద‌లుపెట్టి ఎట్టిప‌రిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నాయ‌కులు, రైతు నాయ‌కులు, రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ ఆధ్య‌ర్యంలో నంద్యాలలో జ‌రిగిన రాయ‌ల‌సీమ లిఫ్టు స‌మాలోచ‌న స‌మావేశంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు చేస్తున్న ద్రోహంపై గ‌ళ‌మెత్తారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌తతోపాటు కూట‌మి పాల‌న‌లో ఈ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయంపై గ్రామ స్థాయి నుంచే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేలా ప్ర‌ణాళిక రూపొందించాల‌ని తీర్మానించారు.

    రాయ‌ల‌సీమ లిప్టుతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు, మ‌ల్లిఖార్జున రిజ‌ర్వాయ‌ర్లు కూడా పూర్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబ‌ర్ 98 అమ‌లు చేసి బాధిత కుటుంబాల‌కు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్ర‌భుత్వం స్పందించ‌కుంటే గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు. రాయలసీమ నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు.

    రాయ‌ల‌సీమ ప్రాజెక్టులు, ఈ ప్రాంత అభివృద్దిపై చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధిలేద‌ని, ఆయ‌న ఈ ప్రాంతంలో పుట్ట‌డం దౌర్భాగ్యమ‌ని నాయ‌కులు మండిప‌డ్డారు. త‌న పార్టీకి ఓట్లు వేయ‌డం లేద‌ని రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని చిన్న‌చూపు చూస్తున్న చంద్ర‌బాబు, త‌న సుదీర్ఘ‌ రాజ‌కీయ జీవితంలో రాయ‌ల‌సీమ‌కు ఏం చేశానో త‌న‌ను తానే ప్ర‌శ్నించుకోవాల‌ని సూచించారు.

    రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్ స‌మాలోచ‌న కార్యక్ర‌మంలో నంద్యాల, నెల్లూరు జిల్లాల‌ వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, జిల్లా ప‌రిశీల‌కులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, కాట‌సాని రామిరెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, సాకె శైల‌జానాథ్‌, నందికొట్కూరు స‌మ‌న్వ‌య‌క‌ర్త దారా సుధీర్‌, మాజీ ఎంపీలు త‌లారి రంగ‌య్య‌, పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి, ఎమ్మెల్సీలు క‌ల్ప‌ల‌తారెడ్డి, ఇసాక్ బాషాల‌తోపాటు రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు, రైతు సంఘాల నాయ‌కులు, వివిధ విభాగాలకు చెందిన వైయ‌స్సార్సీపీ నాయ‌కులు, పాల్గొన్నారు.

    రేవంత్‌తో చంద్ర‌బాబు చీక‌టి ఒప్పందం: కాటసాని రాంభూపాల్ రెడ్డి
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్ర‌బాబు ద్రోహం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అంటే చంద్రబాబుకు చులకన భావన ఉంది. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలి. 

    ప‌సుపు పూలు చ‌ల్లి చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
    రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం లేక‌పోతే రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంది. 90 శాతం పనులు పూర్తి చేసి, యంత్ర సామాగ్రి సిద్ధం చేసిన ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టేశాడు. 23 నెల‌ల్లో రూ. 3.56 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన చంద్ర‌బాబు, రాయ‌ల‌సీమ లిఫ్టు పూర్తి చేయ‌క‌పోవ‌డం రాయ‌ల‌సీమ ప్రాంతానికి ద్రోహం చేయ‌డ‌మే. వైయ‌స్ జ‌గ‌న్ కుప్పానికి నీళ్లిస్తే అది కూడా చంద్ర‌బాబు త‌న ఘ‌న‌తగానే చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. ప‌సుపు పూలు చ‌ల్లి క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్న చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌లో పుట్ట‌డం మ‌న ప్రాంత ప్ర‌జ‌ల దౌర్భాగ్యం.

    బాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవ‌ర్థన్‌ రెడ్డి
    రేవంత్‌రెడ్డి ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టం కోసం చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ లిఫ్టును తాక‌ట్టుపెట్టాడు. నిజం కాద‌ని మంత్రులు, కూట‌మి ఎమ్మెల్యేలు చెప్ప‌లేక‌పోతున్నారు. సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణ మీదున్న ప్రేమ చంద్ర‌బాబుకి ఏపీ మీద లేదని తేలిపోయింది. చంద్ర‌బాబు రోజురోజుకీ దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. సాగునీటి రంగం గురించి కానీ, రైతుల గురించి కానీ ఏనాడూ చంద్ర‌బాబు ఆలోచ‌న చేసిన పాపాన పోలేదు.

    చంద్ర‌బాబు సీఎంగా ఉంటే చ‌క‌చ‌కా ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌చ్చ‌ని ప‌క్క రాష్ట్రాలు సంబ‌రాలు చేసుకుంటాయి. రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఆగిపోతే ఆరు జిల్లాల ప్ర‌జ‌ల మ‌నుగడ ప్ర‌శ్నార్థకం అయ్యే ప్ర‌మాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు క‌ట్ట‌కుండా సాగునీటి భ‌ద్ర‌త‌- నీటి సంఘాల బాధ్య‌త అంటూ తెలుగుదేశం నాయ‌కులు జేబులు నింపే కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు. ప్రాజెక్టులు మొద‌లుపెట్టి దోచుకోవ‌డం మిన‌హా చేసిందేమీ లేదు. తెలంగాణ‌కు ఎందుకు అమ్ముడుపోయాడో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. కలిసొచ్చే వారితో ఉద్య‌మించి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్తును తిరిగి ప్రారంభించేలా పోరాడ‌దాం.

    చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి లేదు: బుగ్గన రాజేంద్రనాథ్‌
    దేశంలోనే అత్యంత వెనుక‌బ‌డిన ప్రాంతం రాయ‌ల‌సీమ. రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ ప్రాంత ప్ర‌యోజ‌నాల కోసం అంద‌రూ ఏకం కావాలి. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు నాకు ఓటెయ్య‌రు కాబ‌ట్టి, నేను రాయ‌ల‌సీమ‌కు ఏమీ చేయ‌న‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నాడు. 40 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉండి రాయ‌ల‌సీమ ప్రాంతానికి ఆయ‌న చేసిందేమీ లేదు. ఓటేసిన వారికే ప‌నిచేస్తాన‌ని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న చంద్ర‌బాబు చెప్ప‌డం క‌న్నా నీచం ఇంకోటి ఉండ‌దు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో జ‌రిగిన మంచి ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.

    కృష్ణా న‌ది మీద ఎగువ‌న ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు క‌ట్టుకుంటూ పోతే రాయ‌ల‌సీమకి నీరు ఎలా వ‌స్తాయ‌ని విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు ఆలోచించ‌డం లేదు. రాయ‌ల‌సీమ అభివృద్ధి మీద చంద్ర‌బాబుకి చిత్త‌శుద్ధి లేదు కాబ‌ట్టే ఇవ‌న్నీ ప‌ట్టించుకోవ‌డం లేదు. వైయ‌స్సార్ గారు చేసిన ప్రాజెక్టుల‌ను నేనే చేశాన‌ని చెప్పుకుంటున్నాడు. రాయ‌ల‌సీమ స‌మ‌స్యల‌ గురించి ప‌ట్టించుకునే వాళ్లే క‌రువ‌య్యారు. చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌తిఒక్క‌రూ ఇంటింటికీ వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించాలి.

    రాయ‌ల‌సీమ‌ను ఎడారిగా మార్చే కుట్ర‌: సాకే శైల‌జానాథ్‌
    రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సీఎం చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి. రాయ‌ల‌సీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కూట‌మి నాయ‌కులకు ఖ‌చ్చితంగా బుద్ధి చెబుతాం. వారు ఇప్ప‌టికైనా రాయ‌ల‌సీమ ద్రోహి చంద్ర‌బాబును నిల‌దీయాలి. 20 టీఎంసీలు దేనికి ప‌నికొస్తాయ‌ని చంద్రబాబు చెప్ప‌డం సిగ్గుచేటు. పంట‌లు పండ‌క రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారితే ఈ భూముల‌న్నీ ఎక‌రం 99 పైస‌ల‌కు అమ్ముకోవాల‌ని చంద్ర‌బాబు కుట్ర చేస్త‌న్నాడు. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. రాయ‌లసీమ రైతులు వ‌ల‌స వెళ్లి కూలీలుగా మారే ప‌రిస్థితికి ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాలి.

    గ్రామ స్థాయి నుంచి రిలే నిరాహార దీక్ష‌లు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి
    చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త ప్రయోజ‌నాల కోస‌మే రాయ‌ల‌సీమ లిఫ్టును తాక‌ట్టుపెట్టాడు. ఎన్జీటీ అనుమ‌తులు లేవ‌నేది కేవ‌లం సాకు మాత్ర‌మే. గ‌తంలో ప‌ట్టిసీమ ప్రాజెక్టును చంద్ర‌బ‌బు ఎన్జీటీ అనుమ‌తులు లేకుండానే మొద‌లుపెట్టాడు. తెలంగాణ‌లో ఎన్నో ప్రాజెక్టులకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేకుండానే శ‌ర‌వేగంగా సాగుతున్నా చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదు. రాయ‌ల‌సీమ‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతున్నా చంద్ర‌బాబుకి ప‌ట్ట‌డం లేదు. గ్రామ స్థాయి నుంచి రాయ‌లసీమ లిఫ్టు ఇరిగేష‌న్ సాధ‌న కోసం స‌మిష్టిగా ఉద్య‌మించాల్సిన అస‌వ‌రం ఉంది.

    అందుకోసం గ్రేట‌ర్ రాయ‌ల్ సీమ వ్యాప్తంగా గ్రామ‌, మండ‌ల, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్ష‌లు చేప‌ట్టి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాలి. దీంతోపాటు ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి కృషి చేయాలి. సిద్ధేశ్వ‌రం అలుగు పేరుతో గ‌తంలో హ‌డావుడి చేసిన బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న కుమార్తెకు ఎంపీ ప‌ద‌వి రాగానే నోరు తెర‌వ‌డం లేదు. రాయ‌ల‌సీమ లిప్టు కోసం వైఎస్‌ జ‌గ‌న్‌ చేసిన కృషిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి. పెండింగ్ ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేయ‌డం చేత‌కాని చంద్ర‌బాబు, పోల‌వ‌రం- బ‌న‌క‌చ‌ర్ల అంటూ ప్ర‌జ‌ల‌కు అబ‌ద్ధాలు చెబుతున్నాడు. రైతుల‌కు మేలు జ‌ర‌గాలంటే రాయ‌ల‌సీమ లిఫ్టుని సాధించుకోవాల్సిందే. రాయ‌ల‌సీమ లిఫ్టుపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాలి.

    చంద్ర‌బాబు రాయ‌లసీమ ద్రోహి:  ఎమ్మెల్సీ ఇసాక్ బాషా
    నేను అడ‌గ‌డం వ‌ల్లే చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ స్కీమ్‌ను ఆపేశాడ‌ని రేవంత్ రెడ్డి చెప్పాడు. రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం చేస్తున్నాడు. రాయ‌ల‌సీమ బిడ్డ‌ల కోసం మ‌నం ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చంద్ర‌బాబు చేస్తున్న ద్రోహాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి. ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేదాకా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెస్తాం.

    ప్ర‌భుత్వం మ‌న‌సు పెడితే ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి: దారా సుధీర్‌
    వైఎస్సార్సీపీ హ‌యాంలోనే రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టులో 90 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన యంత్ర‌ సామాగ్రిని కూడా వైఎస్‌ జ‌గ‌న్ స‌మ‌కూర్చారు. చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేశాడు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్‌ జ‌గన్‌కి మంచి పేరొస్తుంద‌నే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మ‌న‌సుపెడితే మిగిలిన 10 శాతం ప‌నులు ఏడాదిలోపే పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావొచ్చు.  

    వ్య‌వ‌సాయం, రైతులంటే చంద్ర‌బాబుకి అస‌హ్యం: పోచ్చా బ్ర‌హ్మానంద‌రెడ్డి
    చంద్ర‌బాబు సాగునీటి ప్రాజెక్టుల‌ నిర్మాణం గురించి ఎప్పుడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. రైతుల‌న్నా, వ్య‌వ‌సాయమ‌న్నా చంద్ర‌బాబుకి న‌చ్చ‌దు. ఘోర‌క‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ సాధ్యం కాద‌ని గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వం తేల్చేసింది. కానీ వైయ‌స్సార్ సీఎం అయ్యాక సాధ్యం చేసి చూపించారు. రైతుల‌తో క‌లిసి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ స్కీమ్ కోసం ఉద్య‌మించాలి. ప్ర‌తి గ్రామంలో అవ‌గాహ‌న స‌దస్సులు నిర్వ‌హించాలి

    రాయ‌ల‌సీమ రైతుల త్యాగం గొప్పది: గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి
    త‌ర‌త‌రాలుగా రాయ‌ల‌సీమ ప్రాంతం తీవ్రంగా న‌ష్టపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన చ‌రిత్ర మ‌న రైతుల‌ది. రాజ‌ధానిని కోల్పోయింది. ఓటుకు కోట్లు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా దొరికిపోయిన చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాడు. సాధ్యం కాద‌ని తెలిసీ వేల కోట్లు అప్పులు తెచ్చి అమ‌రావ‌తి రాజ‌ధాని మీద గుమ్మ‌రిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు. కానీ రాయ‌ల‌సీమ ప్రాంతానికి నీరిచ్చే లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి  వెయ్యి కోట్లు వెచ్చించ‌డానికి మాత్రం చంద్ర‌బాబుకి మ‌న‌సు రావ‌డం లేదు. మంత్రుల‌ను సింగ‌పూర్ కి పంపి ప‌బ్లిసిటీలు, జ‌ల్సాలు చేయ‌డం త‌ప్ప చిత్త‌శుద్ధితో చంద్రబాబు ఆలోచించ‌డం లేదు.  

    చంద్ర‌బాబు సీఎం కావ‌డం రైతుల దౌర్భాగ్యం: బుడ్డా శేషారెడ్డి
    చంద్ర‌బాబు అధికారంలో ఉంటే రైతులంతా రోడ్ల మీద ఉండాల్సిన దుస్థితి. ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధ‌ర‌లు ఏది కావాల‌న్నా రోడ్డెక్కి ధ‌ర్నా చేయాల్సిన దుస్థితి. రాయ‌ల‌సీమ‌లో పుట్టి ఈ ప్రాంతానికి చంద్ర‌బాబు చేసింది శూన్యం. రాయ‌ల‌సీమ రైతాంగాన్ని కాపాడుకోవ‌డం కోసం అంద‌రూ ఉద్య‌మించాలి.  

    అమ‌రావ‌తికైతే డ‌బ్బులున్నాయా?: త‌లారి రంగ‌య్య‌
    రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్రారంభించ‌క‌ పోయుంటే రైతుల ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అమ‌రావ‌తి కోసం ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన చంద్ర‌బాబు, రాష్ట్రంలో స‌గం ప్రాంత‌మైన గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల కోసం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తి చేయ‌డానికి ఖ‌ర్చు చేయ‌డం లేదు. విద్య‌, వైద్యం, సాగునీటి రంగాల విష‌యంలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జ‌రుగుతోంది.

    జ‌గ‌న్‌ ముందుచూపుతో ఆలోచించారు: పాపిరెడ్డి
    రాష్ట్ర సాగునీటి రంగాన్ని 2004కి ముందు 2004 త‌ర్వాత అని చూడాలి. దివంగ‌త వైయ‌స్సార్ కృషితో రాయ‌ల‌సీమ ముఖ‌చిత్రం మారిపోయింది. సాగునీటి రంగానికి ఎన‌లేని కృషి చేశారు. చంద్ర‌బాబు మాట‌ల‌న్నీ నీటి మూట‌లుగానే మిగిలిపోయాయి. రాయ‌ల‌సీమ పెండింగ్ ప్రాజెక్టుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మొద‌లు పెట్టి పూర్తి చేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. రాయ‌ల‌సీమ భావితరాల కోసం దూర‌దృష్టితో ఆలోచించి ప‌నిచేశారు.

    అమ‌రావ‌తిపై ఉన్న శ్ర‌ద్ధ రాయ‌ల‌సీమ మీద‌ లేదు: కాట‌సాని రామిరెడ్డి
    రాయ‌ల‌సీమ లిప్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు ఆవ‌శ్య‌క‌త‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త వైయ‌స్సార్సీపీ నాయ‌కుల మీద‌నే ఉంది. భావిత‌రాల భ‌విష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేయాలి. చంద్ర‌బాబు కార‌ణంగా రాయ‌ల‌సీమ ప్రాంతం ఎడారిగా మారే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. అమ‌రావ‌తి మీద ఉన్న శ్ర‌ద్ధ ఆయ‌న‌కు పుట్టిన గ‌డ్డ రాయ‌ల‌సీమ మీద‌ లేదు. రైతు సంఘాల‌తో క‌లిసి రాయ‌ల‌సీమ ప్రాజెక్టును పునః ప్రారంభించేలా ఉద్య‌మించాలి.

    చంద్ర‌బాబు మోసాల‌పై గ్రామ గ్రామాన చ‌ర్చ జ‌ర‌గాలి: గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి
    సాగునీటి రంగాన్ని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింది. రాయ‌ల‌సీమ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ళ‌మెత్తాలి. 90 శాతం పూర్త‌యిన రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ప‌క్క‌న‌పెట్టేయ‌డం దుర్మార్గం. యావ‌త్తు రాయ‌ల‌సీమ ప్రాంతానికే అన్యాయం జ‌రిగే ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చంద్ర‌బాబు చేస్తున్న అన్యాయంపై గ్రామగ్రామాన చ‌ర్చ‌జ‌ర‌గాలి.

    ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంది: ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తా రెడ్డి
    లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఆపేసి ప్ర‌జ‌ల మ‌నుగ‌డను చంద్ర‌బాబు ప్ర‌శ్నార్థ‌కం చేశాడు. త‌న వ్యక్తిగ‌త స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం రాయ‌లసీమ రైతాంగం భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్టడం దుర్మార్గం. 90 శాతం పనులు పూర్త‌యిన ప్రాజెక్టు విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి అనుమానాస్ప‌దంగా ఉంది. రాయ‌ల‌సీమ‌కు వెన్నుపోటు పొడిచిన కూట‌మి ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పే స‌మ‌యం ఆస‌న్నమైంది. త‌క్ష‌ణం ప‌నులు మొద‌లుపెట్ట‌క‌పోతే రాయ‌ల‌సీమ కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నా.

  • సాక్షి,విజయవాడ : మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రైవేట్‌పరం చేసేందుకే మొగ్గుచూపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

    పీపీపీ పనులు నెలరోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని సూచించారు. ఫేజ్ 1లో నాలుగు, ఫేజ్ 2లో ఆరు మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్పగించనుంది. 

    గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేట్‌ సంస్థలు స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
     

  • సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.

    గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు.

     

  • సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వర్మకు సీఎం చంద్రబాబు షాకిచ్చారు. పిఠాపురం ప్రోటోకాల్ వివాదంపై  చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రొటో కాల్‌ పేరుతో తన్నుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే జనసేన నేతలు వర్మపై దాడి చేస్తే.. చంద్రబాబు క్లాస్‌ పీకడంపై వర్మ అనుచరులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిఠాపురం పంచాయితీ చంద్రబాబుకు తలనొప్పిగా మారినట్లైంది. 

    కడుపులో కత్తులు 
    చంద్రబాబు సారథ్యంలో జత కట్టిన టీడీపీ, జనసేన నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. పైకి పొత్తులంటూనే కత్తులు దూసుకుంటున్నారు. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన, టీడీపీ ముఖ్య నేతలు నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు.  

    తాజాగా పట్టణంలోని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయం వద్ద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీ, బ్యానర్లపై కూడా చంద్ర బాబు ఫొటో పెట్టకపోవడంపై టీడీపీ చూజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ఎన్ వర్మ మండిపడ్డారు.

    ఈ క్రమంలో ఆయనను జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నెట్టేసీ ప్రయత్నం చేశారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య ఆరుపులు, కేకలతో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు బాహాబాహీకి దిగాయి. ఈసారి వర్మపై జనసేన వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే పెండెం దోర బాబు దూకుడు ప్రదర్శించడం చూస్తూంటే వారిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరిందని చెప్పుకొంటున్నారు. 

    పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చిన చంద్రబాబు

    పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయన ఫొటోకు ప్రాధాన్యం ఇచ్చినా చంద్రబాబు ఫొటో కూడా పెడుతున్నామన్నది జనసేన నేతల వాదనగా ఉంది.  ఏదో ఒక అంశాన్ని ఆసరాగా చేసుకుని వర్మ తరచూ రాద్దాంతం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

    నియోజకవర్గం ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబుకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది వర్మతో పాటు టీడీపీ నేతలు డిమాండ్‌గా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో కావాలనే చంద్రబాబు ఫొటో పెట్టకుండా అవమానిస్తున్నారనేది వర్మ వాదన. ఒకటీ రెండు కాదు నాలుగైదు. పర్యాయాలుగా ఇలానే ఆవమానిస్తున్నారని, దీనికి అధికారులు కూడా వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఈ సంఘటన మీదే ఆయన అగ్గి మీద గుగ్గిలమే అయ్యారు. 

  • సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ  పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

    కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  

  • సాక్షి, నంద్యాల జిల్లా: సీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేసారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాసేపట్లో మమ్మల్ని టీడీపీ నాయకులతో తిట్టించే పని మొదలు పెడతారు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.

    చంద్రబాబు, రేవంత్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రతి విషయంలో ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతి సారి చంద్రబాబు ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు. ఏ రోజు చంద్రబాబు అధికారంలోకి వస్తాడో ఆ రోజు నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుచెప్పుకొని నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. రైతుల పేరుతో దోచుకోవడం తప్ప సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు. ఏ ప్రాంత ప్రజల ఆత్మభిమానం కోసం చంద్రబాబు పని చేయడు ఆయనకు ఆత్మభిమానం లేదు

    ..చంద్రబాబు కన్ను అర్పకుండా చెబుతాడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట. చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకుందాం అందరూ సిద్ధం కావాలి’’ అంటూ కాకాణి పిలుపునిచ్చారు.

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.

    బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్ఫ్రా స్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

    అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆమోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

    రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జూన్ 8 లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం , నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని  తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

  • హైదరాబాద్‌: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు దక్కాయి. వీరంతా 1995, 1996 బ్యాచులకు చెందిన ఐపీఎస్‌లే. ప్రమోషన్లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు (1995 బ్యాచ్‌), స్వాతి లక్రా (1995 బ్యాచ్‌), మహేశ్‌ భగవత్ (1995 బ్యాచ్‌), చారుసిన్హా (1996 బ్యాచ్‌) డా.అనిల్ కుమార్ (1996 బ్యాచ్‌), వీసీ సజ్జనార్ (1996 బ్యాచ్‌) ఉన్నారు. 

    వీరంతా అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం (ఏప్రిల్‌ 22) ఉత్తర్వులు జారీ చేశారు.

    ప్రస్తుతం మహేశ్‌ భగవత్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్నారు. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా ఇన్నాళ్లు కొనసాగుతున్నారు. వీవీ శ్రీనివాసరావు పోలీసు నియామక మండలి చైర్మన్‌గా ఉన్నారు. చారు సిన్హా సీఐడీ, మహిళా భద్రతా విభాగం, ఏసీబీ ఏడీజీగా కొనసాగుతున్నారు. అనిల్ కుమార్ గ్రేహౌండ్స్ ఏడీజీగా ఉన్నారు. వీసీ సజ్జనార్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. 

  • హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది. 

    ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయని లీగల్ టీమ్‌ చెబుతోంది. మొదటిది సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదా రెండోది కొత్త కమిషన్‌ను నియమించడం. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. 

    కోర్టు తీర్పుపై రేపు కేబినెట్‌లో చర్చించనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేబినెట్‌కు అడ్వకెట్ జనరల్‌ను పిలవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. రేపటి సమావేశానికి అడ్వకేట్‌ జనరల్‌ హాజరుకానున్నారు. కేబినెట్‌ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. 

    కాగా, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌ నిబంధనలు పాటించలేదని పేర్కొంది.  
     

International

  • వాషింగ్టన్: అమెరికా, ఇరాన్‌ రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రెండో విడత చర్చలపై శుక్రవారం నాటికి శుభవార్త రావచ్చని.. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'న్యూయార్క్‌ పోస్ట్’ పేర్కొంది. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. 

    మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ అభ్యర్థన మేరకు.. ఇరాన్‌తో కాల్పుల విరమణను ట్రంప్‌ పొడిగించిన సంగతి తెలిసిందే. ఏడు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకత్వం ఒక ఏకీకృత ప్రతిపాదనతో రావడానికి సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ కీలక ప్రకటన వెలువడింది. దీంతో పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధి బృందం పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.

    ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో కూడిన బృందం మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే, హార్మూజ్‌ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్‌ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులు నిలిపివేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, చర్చల కోసం ఇరాన్ ఏకీకృత ప్రతిపాదనను తెచ్చే వరకు మాత్రమే అమెరికా దాడులకు దూరంగా ఉంటుందని.. కానీ ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

    అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. ఓడరేవులను దిగ్బంధించడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇది ఒక ‘యుద్ధ చర్య’గా ఆయన అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం అన్యాయమని, తమ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో ఇరాన్‌కు తెలుసని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఆసియాలో ఇరాన్ ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్న 'M/T టిఫానీ' అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

    ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా.. ఇరాన్‌పై దాడులు చేయడంతో ఈ యుద్ధం మొదలైంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టుతో అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు 30 శాతం పెరిగి, బ్యారెల్ ధర 95 డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన మొదటి విడత చర్చలు విఫలం కావడంతో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

  • టెహ్రాన్‌: ఇరాన్‌ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్‌ సక్సెస్‌ - పేషెంట్‌ డెడ్‌’ అన్న చందంగా ఇరాన్‌ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్‌లో ఏం జరుగుతోంది. 

    ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది.

    ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.

    అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్‌ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్‌ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.

    ఇంటర్నేషనల్‌ క్రైసిస్‌ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్‌ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్‌ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్‌ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.

    ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్‌ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్‌ఎన్‌ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్‌ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.

    ఇరాన్‌ ప్రభుత్వంలో కుమ్ములాట
    ఇరాన్‌లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.

    మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్‌జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్య​మవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

    ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్‌జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు

  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్‌ పవర్‌గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్‌ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్‌ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.

    అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్‌లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అ‍త్యధికంగా మోహరించింది మాత్రం జపాన్‌లోనే!!. ఎందుకిలా?.. జపాన్‌కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..

    అణుబాంబుల తర్వాత..
    రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్‌  అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్‌ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్‌. ఆ తర్వాత తన వీక్‌నెస్‌ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్‌ సమూలంగా మార్చుకుంది.

    1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్‌ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.

    ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. 
    2026 నాటికి జపాన్‌లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి.  చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్‌లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.

    అక్కడే ఎక్కువ.. 
    అమెరికా సైన్యం జపాన్‌లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్‌లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.

    అభ్యంతరాలు కూడా..
    అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్‌లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్‌ జపాన్‌ పేరుతో ఇరు దేశాలు ఎయిర్‌షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్‌ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది.  

    సైన్యం ఉంది, కానీ..
    జపాన్‌కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు. 

    జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్‌ ప్రకారం.. జపాన్  “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్‌డీఎఫ్‌ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్‌లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది.

  • కాఠ్మాండు: నేపాల్‌లో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కొత్త ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లే వ్యవహరిస్తోందా? ఎన్నెన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నేపాల్‌ ప్రజలు. ఆ దేశంలో కొన్ని నెలల క్రితం ఉవ్వెత్తున ఎగిసిన జెన్‌ జీ ఉద్యమం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక వ్యవస్థ కుదేలు అవ్వడం, ప్రభుత్వంలో అవినీతి వంటి పలు అంశాలు జెన్‌ జీ ఉద్యమానికి కారణమయ్యాయి.

    ఆ తర్వాత జెన్‌ జీ నిరసనలతో రాజకీయాల్లోకి ప్రవేశించారు రాపర్‌ బాలేంద్ర షా (బాలెన్). నేపాల్ ప్రధాని అయ్యారు. ప్రభుత్వంలో పారదర్శకత, విద్యా సంస్కరణలు, వీఐపీ సంస్కృతి తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. చెప్పినట్లుగానే ప్రభుత్వంలో పారదర్శకత పెంచుతున్నారు. ఏప్రిల్ 9న లేబర్, ఎంప్లాయ్‌మెంట్, సోషల్ సెక్యూరిటీ మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై పదవి నుంచి తొలగించారు.

    నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్‌ 22) తన పదవికి రాజీనామా చేశారు. తన ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ, న్యాయంగా దర్యాప్తు జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని భావించి స్వచ్ఛందంగా పదవిని వదులుకున్నారు. దీంతో బాలేంద్ర షా నిజంగానే జవాబుదారీతనంతో ఉంటున్నారని, ప్రభుత్వానికి అవినీతి మచ్చ అంటనివ్వట్లేదని విశ్లేషకులు అంటున్నారు.  

    నేపాల్ హోం మంత్రి సుదాన్ గురుంగ్ బుధవారం తన పదవి నుంచి రాజీనామా చేశారు, తన ఆర్థిక ఆస్తులపై వచ్చిన ఆరోపణలపై నైతిక బాధ్యత స్వీకరించి, దర్యాప్తు న్యాయంగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాజీనామా విషయాన్ని ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజా జీవితంలో నైతిక ప్రమాణాలు నిలబెట్టేందుకు పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు.

    "నేను, సుదాన్ గురుంగ్‌ను.. 2026 మార్చి 26 నుంచి హోం మంత్రిగా అత్యంత నిజాయితీతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఇటీవల నా షేర్లు, సంబంధిత విషయాలపై పౌరులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, ఆందోళనలను నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. నా దృష్టిలో నైతిక విలువలు అన్ని పదవులకన్నా ఎక్కువ. ప్రజా విశ్వాసానికి మించిన శక్తి లేదు. నేటి 'జెన్ జీ' ఉద్యమం కూడా ఇదే సందేశం ఇస్తోంది. ప్రజా జీవితం స్వచ్ఛంగా ఉండాలి, నాయకత్వం బాధ్యత వహించాలి" అని చెప్పారు. దేశ రాజకీయ నేపథ్యం, గతంలో జరిగిన త్యాగాలను ప్రస్తావిస్తూ.. ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత తప్పనిసరి అని అన్నారు.

    తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. పారదర్శకత ఉండేందుకు, ఒకే వ్యక్తికి రెండు విరుద్ధ ప్రయోజనాలు ఉండే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఓ వైపు తాను పదవిలో ఉండి, మరోవైపు తనపై దర్యాప్తు జరిగే విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందన్నారు. అందుకే నేటి నుంచే హోం మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

    పౌరులు, మీడియా, యువత నిజాయితీ, బాధ్యతాయుత మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. "నా నైతిక బాధ్యతను నేను పూర్తి చేశాను. ఇప్పుడు నా మీడియా స్నేహితులు, నేపాల్ సోదరులు, సోదరీమణులు, యువత అందరూ సత్యం, నిజాయితీ, ఆత్మశుద్ధి మార్గంలో నడవాలి. కొన్ని మీడియా వ్యక్తులు పొందిన 'స్వీట్ షేర్లు' (ప్రత్యేక లాభాల కోసం ఇచ్చే వాటాలు) గురించి సమాచారం త్వరలో బయటపడుతుంది. రామ రాజ్యం కోరుకునేవారు త్యాగం చేయడానికి, నైతిక ధైర్యం చూపడానికి సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.

    ఏప్రిల్ 9నే మరో మంత్రి ఔట్‌ 
    ఇంతకుముందు ఏప్రిల్ 9న నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా.. మంత్రి దీపక్ కుమార్ సాహ్‌ను క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలపై, పదవి నుంచి తొలగించారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన ప్రకారం.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు సాహ్‌ను తొలగించారు. కమిషన్ అధ్యయనం ప్రకారం.. తన పదవిని దుర్వినియోగం చేసి, తన భార్య జును శ్రేష్ఠాను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా కొనసాగించారు. ఆ పదవి చాలా కాలంగా నిర్వీర్యంగా ఉంది. కమిషన్ తన నివేదికను పార్టీకి సమర్పించి, చర్యలు తీసుకోవాలని సూచించింది.

    దీంతో బాలేంద్ర షా తన మంత్రివర్గంలో అవినీతి జరగకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. జెన్‌ జీ కోరుకున్న అంశాల్లో ఇది ప్రధానం. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, జవాబుదారీతనంలో ఉండేవి కాదు. దేశ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా మంత్రులు తమ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పటి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కావట్లేదు. అప్పుడే పాలనలో పారదర్శకతను చూపిస్తోంది.

  • బెర్లిన్‌: శాంతి చర్చల్లో భారత్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని.. పశ్చిమాసియా యుద్ధంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపాలని ఇప్పటికే ఇరుదేశాలను ప్రధాని మోదీ కోరారని గుర్తు చేశారు. బెర్లిన్‌(జర్మనీ)లోని భారత రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడంలో న్యూఢిల్లీ తన వంతు పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

    పశ్చిమాసియా సంక్షోభంలో భారతదేశానికి ఏదైనా పాత్ర ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ రేపు ఒక సమయం రావచ్చు.. అప్పుడు భారత్ ఈ విషయంలో తన పాత్రను పోషించి విజయం సాధించడం కూడా సాధ్యమేనని తేల్చిచెప్పారు. ‘‘యుద్ధాన్ని ముగించాలని ప్రధాని మోదీ రెండు వైపులా విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన విషయాల్లో మా ప్రధానికి చాలా సమతుల్యమైన దృక్పథం ఉంది’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.

    కాగా, ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమంపై తలెత్తిన విభేదాల కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన ఇరాన్-అమెరికా రెండో రౌండ్ శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ పొడిగింపును ప్రకటించారు. ఇరుపక్షాలను తిరిగి చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు, ఇరాన్ నాయకులు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చే వరకు దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో రాసుకొచ్చారు.

    అయితే, ఈ కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ త్రోసిపుచ్చింది. ఇది అకస్మాత్తుగా దాడి చేయడానికి సమయాన్ని పొందేందుకు పన్నుతున్న కుట్రగా  ఇరాన్ అభివర్ణించింది. ఓడిపోయే పక్షం షరతులు విధించలేదు. దిగ్బంధం కొనసాగితే దానికి సైనికపరమైన సమాధానం తప్పదంటూ ఇరాన్ ప్రతినిధి మహదీ మొహమ్మదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

  • పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్‌ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్‌ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్‌ దాడులకు దిగింది. అలాగే భారత్‌కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

    జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్‌ షిప్‌లపై ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్‌ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్‌, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్‌ నౌకలుగా వాటిని గుర్తించారు. 

    తొలుత.. ఈ ఉదయం గ్రీక్‌ ఆపరేటెడ్‌ కంటైనర్‌ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్‌ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై  దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్‌ మీడియా.. హర్ముజ్‌ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

    భారత నౌకపై కూడా.. 
    భారత్‌కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్‌ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్‌ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్‌ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది.  

    మొన్నీమధ్య కూడా హర్ముజ్‌లో భారత నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్‌జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్‌ నుంచి స్పష్టమైన హామీ కోరింది.

    ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్‌ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్‌(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్‌ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్‌.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు.

  • ఇటీవల ‍అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ ఆయుధ సంపత్తిపై మాట్లాడారు. టెహ్రాన్‌ వద్ద ప్రస్తుతం ఎటువంటి ఆయుధ సంపత్తి లేదని ఆ దేశ నావికాదళం, వైమానిక దళం దాదాపుగా తుడిచిపెట్టుకపోయిందన్నారు. అయితే తాజా సర్వే కథనాలు మాత్రం అందుకు విభిన్నంగా ఉన్నాయి.  ఇరాన్‌ వద్ద ఇప్పటికీ వేలాదిగా క్షిపణులు, డ్రోన్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

    ఇరాన్‌పై అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌ ఏక కాలంలో విరుచుకపడ్డాయి. ఆ దేశంలోని రక్షణ,మౌళిక స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలోనే వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని, వారి నౌకాదళం సముద్ర గర్భానికి చేరుకుందని  ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్‌కు తమతో యుద్దం చేసే సీన్‌ లేదని బిల్డప్‌ ఇచ్చారు. అయితే ఇరాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులు చేసినప్పటికీ వారి వద్ద  ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, కామికేజ్ డ్రోన్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.

    అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ జేమ్స్ ఆడమ్స్ ప్రకారం.. ఇరాన్ వద్ద ఇంకా వేల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. క్షిపణి లాంచర్లలో సగానికి పైగా ఇంకా సురక్షితంగా ఉన్నాయి. తీరప్రాంత రక్షణ క్షిపణులు  కూడా  పెద్ద సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే  గత వారం CNN జరిపిన దర్యాప్తులో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. ఇరాన్ క్షిపణి ప్రయోగ వాహనాల్లో దాదాపు సగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, అలాగే వేలాది  డ్రోన్‌లు ఆయుధాగారంలోనే  దాడులకు సిద్ధంగా ఉన్నాయని ఆ దర్యాప్తులో తేలింది.

    అయితే ప్రస్తుతం సీజ్‌ఫైర్‌ నడుస్తున్నప్పటికీ.. యుద్ధం విషయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా డిమాండ్లకు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని ఇరాన్ తెగేసి చెబుతుంది. మరోవైపు ట్రంప్ సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆయుధ సంపత్తిపై నివేదికలు చూస్తుంటే మరోసారి యుద్దం తలెత్తితే తీవ్రపరిణామాలు తలెత్తి అవకాశాలు కనిపిస్తున్నాయి.

Business

  • టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్‌ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

    స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!

    సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.

    సమస్యల పరిష్కర్తగా కుక్..

    తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్‌ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్‌ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.

    15 ఏళ్ల ప్రస్థానం..

    దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.

    ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..

    టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్‌ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్‌జాబ్స్‌ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • భారతీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. జర్మనీలోని హ్యాంబర్గ్‌లో జరిగిన ‘వరల్డ్ ట్రావెల్ క్యాటరింగ్ అండ్‌ ఆన్‌బోర్డ్ సర్వీసెస్ ఎక్స్‌పో (డబ్ల్యూటీసీఈ) 2026’ వేదికగా ఇండిగో ప్రవేశపెట్టిన ప్రీమియం బిజినెస్ క్లాస్ సర్వీస్ ‘ఇండిగో స్ట్రెచ్’ పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. వినియోగదారులకు అందించే అత్యుత్తమ సౌకర్యాలు, వినూత్న డిజైన్లు, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచిన తీరుకు గాను ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ తెలిపింది.

    ప్రధాన విభాగాల్లో అగ్రస్థానం

    ‘ట్రావెల్‌ప్లస్ ఎయిర్‌లైన్ ఎమెనిటీ అవార్డ్స్ 2026’లో ఇండిగో ప్రవేశపెట్టిన ‘బ్లాంకెట్ కలెక్టబుల్ - ఇండిగో స్ట్రెచ్ ఓవర్‌లే’కు స్వర్ణ పతకం లభించింది. ప్రాంతీయ కళలు, సాంప్రదాయక డిజైన్లతో రూపొందించిన ఈ ఓవర్‌లేలు కేవలం ప్రయాణ సమయంలోనే కాకుండా ప్రయాణికులు జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లేలా డిజైన్ చేయడం విశేషం. దీనితో పాటు లభించే బుక్‌లెట్, రియూజబుల్ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఇండిగో వినూత్న శైలిని ప్రతిబింబిస్తాయి.

    ఆన్‌బోర్డ్ హాస్పిటాలిటీ అవార్డ్స్ 2026లో భాగంగా ‘బెస్ట్ ఆన్‌బోర్డ్ టెక్స్‌టైల్స్’ విభాగంలో ఇండిగో ‘హైలీ కమెండెడ్’ గౌరవాన్ని పొందింది. బిజినెస్ క్లాస్‌లో అందించే జాక్వర్డ్ ఓవర్‌లేలు, గ్లోబల్ మ్యాప్ డిజైన్‌తో కూడిన పిల్లో కవర్లు, ఐ-మాస్క్‌లు, యాంటీ-స్కిడ్ సాక్స్‌ల నాణ్యత, సౌకర్యానికి గాను ఈ పురస్కారం దక్కింది. పాక్స్ ఇంటర్నేషనల్ రీడర్‌షిప్ అవార్డ్‌లో భాగంగా సుమారు 15,500 మందికి పైగా ఏవియేషన్ నిపుణులు పాల్గొన్న ఓటింగ్‌లో ‘బెస్ట్ బిజినెస్ క్లాస్ బెడ్డింగ్/సాఫ్ట్ ప్రొడక్ట్ – సౌత్ ఆసియా’ విభాగంలో ఇండిగో విజేతగా నిలిచింది.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్‌) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

    రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలు

    రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్‌ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    • నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

    • ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

    • ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

    దర్యాప్తు వెనుక అసలు కారణం?

    ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్‌ రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్‌-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్‌ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    ఆర్థిక అంశాలే కీలకం

    పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్‌పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్‌ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది.

    ‘సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు’ అని ఆయూష్‌ వివరించారు.

    స్వదేశీ మార్కెట్‌కు కలిసొచ్చే అవకాశం

    దుబాయ్‌లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.

    ఏం జరిగింది?

    శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్‌కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్‌మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్‌ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    దర్యాప్తులో తేలిన కీలక అంశాలు

    • నిందితుడు ఆల్ట్‌మాన్‌కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.

    • నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.

    • ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

    పరిశ్రమ విమర్శలే కారణం

    ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్‌మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్‌మాన్ విమర్శించారు.

    ఓపెన్‌ఏఐ vs ఆంత్రోపిక్

    ఓపెన్‌ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్‌మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్‌ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్‌మాన్ ఆరోపిస్తున్నారు.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. గత మూడు రోజులుగా కొనసాగుతున్న సానుకూల ధోరణికి బ్రేక్ వేస్తూ బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్ 756 పాయింట్లు పతనమై 78,516 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 24,378 వద్ద ముగిసింది.

    విశ్లేషకుల అంచనా ప్రకారం పతనానికి కారణాలు

    ముదురుతున్న అనిశ్చితి

    పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ ప్రతిచర్యల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి మూతపడటం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలోని 20% చమురు రవాణా జరుగుతుంది. తాజా దాడుల వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన నింపడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.

    చమురు ధరల సెగ - ద్రవ్యోల్బణ ముప్పు

    యుద్ధం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడం భారత్ వంటి దిగుమతి దేశాలకు పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తాజా గణాంకాల ప్రకారం, మార్చి నెలలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 3.3% కి పెరగడం, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉండటం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

    వడ్డీ రేట్ల తగ్గింపుపై సందేహాలు

    ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న ఆశలు ఆవిరయ్యాయి. ‘వడ్డీ రేట్లు తగ్గకపోగా, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బ్యాంకులు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అనే వార్తలు టెక్నాలజీ, బ్యాంకింగ్ షేర్లలో భారీ అమ్మకాలకు దారితీశాయి.

    ఇప్పుడేం చేయాలి?

    ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ తీవ్రమైన ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలను బట్టి రానున్న రోజుల్లో మార్కెట్ దిశ నిర్దేశించబడుతుంది. చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి అమ్మకాలు జరపకుండా నాణ్యమైన షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం ఉత్తమం.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తన గ్లోబల్ సెంటర్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (ఐకమ్) వ్యవస్థాపక సీఈఓ ఫణి నాగార్జున, రెడ్‌వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్ మాట్లాడుతూ, అటానమస్ ఎంటర్‌ప్రైజ్ నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏజెంటిక్ AI ఆవిష్కరణలు, గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఈ కేంద్రం ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన టాలెంట్, ఎకోసిస్టమ్ తమ కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అందుకే ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ పేర్కొన్నారు.

    ఉద్యోగ కల్పన విషయంలో కూడా రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ భారీ లక్ష్యాలను ప్రకటించింది. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు మూడొంతులకు సమానం.

  • టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్‌ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

    ఏమిటీ వివాదం?

    మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.

    సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్‌లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్‌దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

    నియంత్రణ సంస్థల నిఘా నీడలో..

    కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

    మైక్రోసాఫ్ట్ వాదన

    ఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)గా విభా పడల్కర్‌ పదవీ కాలాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. నామినేషన్, రిమ్యూనరేషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో పడల్కర్‌ పునర్నియామకానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.

    2026 సెప్టెంబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చేలా ఆమెను అయిదేళ్లపాటు కొనసాగించనున్నట్లు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ పునర్నియామకం అమలుకు రానున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో షేర్‌హోల్డర్ల ఆమోదంతో పాటు ఐఆర్‌డీఏఐ అనుమతి అవసరమని పేర్కొంది.

    హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో పడ్కలర్‌ 2008లో చేరారు. సంస్థలో పలు కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ కంపెనీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2017లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లిస్టింగ్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. తర్వాత 2018 సెప్టెంబర్‌ 12 నుంచి మూడేళ్ల కాలానికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.

  • ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అది ఆహార ధరలను పెంచుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు కీలక సంస్థలు ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా విడుదల చేసిన ఉమ్మడి నివేదికలో హెచ్చరికలు జారీ చేశాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రపంచ ఆహార వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీనివల్ల వంద కోట్ల మంది ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

    గ్లోబల్ వార్మింగ్

    వాతావరణ మార్పుల ధాటికి పంటలు, పశువులు, మత్స్య సంపద, అడవులు విలవిలలాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో 2025వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన మొదటి మూడు సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది.

    నివేదికలోని అంశాలు..

    • ప్రధాన పంటల దిగుబడిపై ఉష్ణోగ్రత ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌లు దాటితే మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.

    • ప్రపంచ సగటు ఉష్ణోగ్రతపై పెరిగే ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ మన ప్రధాన ఆహార వనరులైన మొక్కజొన్న, వరి, సోయా, గోధుమల దిగుబడిని దాదాపు 6% మేర తగ్గిస్తుంది.

    • మొరాకో ఉదాహరణ: ఆరేళ్ల కరువు తర్వాత అక్కడ సంభవించిన వడగాల్పుల వల్ల తృణధాన్యాల దిగుబడి 40% పడిపోయింది. ఆలివ్, సిట్రస్ తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

    సముద్రాల్లో సెగలు

    నేల మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ వేడి సెగలు పుడుతున్నాయి. 2024లో ప్రపంచ మహాసముద్రాల్లో 91% భాగానికి పైగా కనీసం ఒక్కసారైనా మెరైన్ హీట్ వేవ్(సముద్రపు వడగాల్పులు) సంభవించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి చేపల నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది.

    పరిష్కారం ఏమిటి?

    • వాతావరణ మార్పుల సమాచారాన్ని నేరుగా రైతుల చేతుల్లోకి (మొబైల్స్ ద్వారా) చేరవేయాలి. తద్వారా పంటలు వేసే సమయాన్ని, కోత సమయాన్ని సర్దుబాటు చేసుకోగలరు.

    • ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.

    • కేవలం తాత్కాలిక సర్దుబాట్లు సరిపోవని, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది.

    అన్నదాత ఆవేదన, ప్రకృతి ఆగ్రహం కలిసి ప్రపంచ ఆహార భద్రతను అంచుకు నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడే మేల్కొని పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల సారాంశం.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

  • హైదరాబాద్‌: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,283 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 8 శాతం బలపడి రూ. 34,605 కోట్లను తాకాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 12 శాతంపైగా పెరిగి రూ. 46,548 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 4.33 శాతానికి మెరుగుపడ్డాయి.

    స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 2.1 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు నమోదుకాలేదు. రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌(ఆర్‌వోఏ) 2.13 శాతంకాగా.. ఆర్‌వోఈ 14.1 శాతంగా నమోదైంది. గతేడాది బ్యాంక్‌ అత్యుత్తమ పనితీరు చూపినట్లు సంస్థ చైర్మన్‌ కె.ప్రతాప రెడ్డి పేర్కొన్నారు. నికర లాభం దాదాపు రెట్టింపైనట్లు తెలియజేశారు.
     

  • ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ఆర్థిక విషయాలపై ఎప్పటికప్పుడు వ్యాఖ్యానించే రాబర్ట్ కియోసాకి.. మరోసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుత ప్రపంచ గందరగోళ పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

    ప్రపంచం పిచ్చెక్కిపోతోంది!
    ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, ఆర్థిక అనిశ్చితిని ఉద్దేశిస్తూ... "ఈ ప్రపంచం పిచ్చెక్కిపోతోంది" (The World is Nuts) అంటూ కియోసాకి వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, ద్రవ్యోల్బణం లేదా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

    ఈవీపై ఆసక్తికర వ్యాఖ్య
    ఇదే క్రమంలో తన వద్ద ఉన్న వాహనాల గురించి ప్రస్తావిస్తూ.. "నా దగ్గర ఉన్న కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అయినందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. సాంప్రదాయ ఇంధన ధరల పెరుగుదల లేదా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

    రాబర్ట్‌ కియోసాకి వద్ద ఫెరారీ, రోల్స్-రాయిస్‌ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అయితే ఈ  కార్ల కోసం వ్యక్తిగత ఆదాయాన్ని ఉపయోగించకూడదని, ఆస్తుల నుండి వచ్చే ఆదాయంలో  ఖర్చులన్నీ పోయాక మాత్రమే విలాసవంతమైన కార్లను కొనాలని ఆయన సూచిస్తారు.

    ఎప్పుడూ బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడులు పెట్టాలని సూచించే కియోసాకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని గత కొంతకాలంగా ఆయన హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

  • ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్‌జీసీ సముద్ర గర్భంలో చమురు అన్వేషణ కోసం నిర్వహించిన జాక్-అప్ రిగ్‌(సముద్ర తీర ప్రాంతాల్లో చమురు బావులను తవ్వడానికి ఉపయోగించే తేలియాడే ప్లాట్‌ఫామ్) టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ధరల అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయనే అనుమానాల నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

    ధరల పెరుగుదలపై అనుమానాలు

    ఈ టెండర్ ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్జీసీ తెలిపింది. ‘కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిడ్డింగ్ ధరలు సుమారు 60% మేర పెరిగాయి. గతంలో రోజుకు 35,606 డాలర్లుగా ఉన్న రేటు తాజా బిడ్డింగ్‌లో ఏకంగా 56,195 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అంచనాలతో పోల్చి చూస్తే ఈ స్థాయి పెరుగుదల ఏమాత్రం సహేతుకం కాదని, ఇది ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్ పరిమితులను మించి ఉందని సంస్థ స్పష్టం చేసింది.

    కుట్ర కోణంపై ఆందోళన

    టెండర్లలో పాల్గొన్న సంస్థల మధ్య కుట్ర పద్ధతులు ఉండవచ్చనే ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేసింది. బిడ్ల నమూనాను విశ్లేషించగా సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు ఉండవచ్చని, తద్వారా కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని సంస్థ భావిస్తోంది. ‘ప్రజా సేకరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, ప్రభుత్వ నిధులను వివేకవంతంగా వినియోగించడం మా బాధ్యత. ఈ టెండర్ ప్రక్రియలో సమగ్రత లోపించిందని భావించినందుకే రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని ఓఎన్జీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

    పారదర్శకతకే ప్రాధాన్యత

    మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఓఎన్జీసీ తమ నిర్ణయం పూర్తిగా సంస్థాగత ప్రయోజనాలు, పారదర్శకతపై ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ‘ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ సేకరణ సూత్రాలను కచ్చితంగా పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యం. పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని లేదా సిండికేట్‌గా ఏర్పడి ధరలను శాసించే ధోరణులను అడ్డుకుంటాం’ అని కంపెనీ తెలిపింది.

    భవిష్యత్తు కార్యాచరణ

    పరిశ్రమ వర్గాలతో పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే బిడ్ల సేకరణ ప్రక్రియల్లో న్యాయమైన, పోటీతత్వంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తద్వారా ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా జాగ్రత్త పడతామని సీనియర్ అధికారులు వెల్లడించారు.

    ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

National

  • ముంబై: నగరంలో ఓ మహిళ.. ఏకంగా మంత్రిని నడిరోడ్డుపై నిలదీసిన ఘటన సంచలనం రేపింది. వర్లీ ప్రాంతంలో రాజకీయ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో ఆ మహిళా.. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌, స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ  చేపట్టారు.

    సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని నినాదాలు చేశారు. వర్లీలోని జంబోరి మైదాన్ నుండి డోమ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తన బిడ్డను స్కూలు నుండి తీసుకురావడానికి కారులో వెళ్తున్న ఒక స్థానిక మహిళ.. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన వాహనం దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి మహాజన్‌తో వాగ్వాదానికి దిగారు. రాజకీయ ర్యాలీల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యంపై ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి!" అంటూ ప్రదర్శనకారులపై అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సమీపంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ వందలాది మంది వేచి చూస్తున్నారు. అక్కడ ఖాళీ మైదానం ఉంది కదా! అంటూ మంత్రిపై ఆ మహిళ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె ముంబై పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. ఆమె ఒక పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ వాగ్వాదం తర్వాత, పోలీసులు ఆమెను రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఆమె సమస్యను వినే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     

  • న్యూఢిల్లీ: కేంద్ర సంస్థ దర్యాప్తు జరుపుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోకి వెళ్లడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో గురువారం (ఏప్రిల్‌ 23)న మొదటి దశ పోలింగ్‌ జరగాల్సి ఉండగా, బుధవారం కోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.

    జనవరిలో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ అధికారులు కొందరు కలిసి తమ దర్యాప్తు, సోదాల్లో జోక్యం చేసుకున్నారని ఈడీ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.

    "ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు మధ్యలోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. దీన్ని రాష్ట్ర -కేంద్ర వివాదంగా మార్చవద్దు అని చెప్పలేరు" అని సుప్రీంకోర్టు తెలిపింది.

    ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో కలిసి ఐ-ప్యాక్ కార్యాలయం, దాని స్థాపకుడు ప్రతిక్ జైన్ నివాసంలోకి వెళ్లి, ఈడీ దర్యాప్తు జరుగుతుండగా ల్యాప్‌టాప్, ఫోన్, పత్రాలు తీసుకెళ్లారు.

    అందుకే, "ఇది ఒక వ్యక్తి చేసిన చర్య అయినా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది" అని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. అయితే, ఈడీ దాడులు రాజకీయ ఉద్దేశంతో జరిగాయని, ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను బలహీనపరచే ప్రయత్నం చేశారని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వాదించింది. 

  • మున్నార్: 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. భూటాన్ నుంచి అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణలో భాగంగా భూటాన్ కస్టమ్స్ ప్రతినిధుల బృందం కేరళకు చేరుకుంది. భూటాన్ కస్టమ్స్ కమిషనర్ నేతృత్వంలోని 10 మంది బృందం.. మున్నార్‌లో భారత కస్టమ్స్ అధికారులతో సమావేశమైంది. సరిహద్దు కార్ల అక్రమ రవాణాపై భూటాన్ కస్టమ్స్ బృందం దృష్టి పెట్టింది.

    కాగా, భారీ వాహనాల స్మగ్లింగ్ ముఠాను ‘ఆపరేషన్‌ నుంఖోర్‌’ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో భారీ పన్ను ఎగవేత రాకెట్ ఇటీవల బయటపడింది. దీని ద్వారా సుమారు 15,849 లగ్జరీ కార్లను ఎటువంటి కస్టమ్ డ్యూటీ (పన్నులు) చెల్లించకుండా భూటాన్ నుండి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు తేలింది. భూటానీ భాషలో 'నుంఖోర్' అంటే 'వాహనం' అని అర్థం.

    ఈ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సినీ పరిశ్రమకు కూడా పాకింది, ముఖ్యంగా పలువురు ప్రముఖ నటుల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. కేరళలో 35-40 లగ్జరీ కార్లపై జరిగిన ప్రాథమిక విచారణతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేషనల్ వెహికల్ రిజిస్ట్రీని డిజిటల్ ఆడిట్ చేయగా.. నకిలీ పత్రాలు, సర్టిఫికేట్లు సృష్టించినట్లు తేలింది. ఈ వాహనాలను రాయబార కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలకు చెందినవంటూ నమ్మించేలా హై-క్వాలిటీ నకిలీ డాక్యుమెంట్లను తయారు చేశారు.

    భూటాన్‌తో సరిహద్దులు ఈశాన్య రాష్ట్రాల గుండా లగ్జరీ కార్లను భారత్‌లోకి తెచ్చారు. భారీ కస్టమ్ డ్యూటీని తప్పించుకోవడానికి వీటిని హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించారు. కేవలం అస్సాంలోనే ఇలాంటి 464 వాహనాలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. కేరళలో ఇప్పటివరకు 50కి పైగా వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ రాకెట్ వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. తప్పుడు మార్గాల్లో వీరు లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ నటీనటులు ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

    భారత్-భూటాన్ సరిహద్దు నిర్వహణ సదస్సు 20వ తేదీన (సోమవారం) మున్నార్‌లో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 'ఆపరేషన్ నమ్‌ఖోర్'పై కీలక విషయాలు వెల్లడించే అవకాశముంది. CBIC స్పెషల్ సెక్రటరీ యోగేంద్ర గార్గ్, భూటాన్ ప్రతినిధి సోనమ్ జామ్త్సో అధ్యక్షత వహించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కఠినమైన భద్రతా చర్యలు, సరిహద్దు తనిఖీలను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా విస్తరించింది. కస్టమ్స్ మరియు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విచారణలో మరికొందరి ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.

    ఇటీవల కస్టమ్స్ అధికారులు 'ఆపరేషన్ నుంఖోర్' పేరుతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పన్ను ఎగవేసి, నకిలీ పత్రాలతో దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ వాహనాలను టార్గెట్‌గా చేసుకుని కేరళలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆఫరేషన్‌లో మొత్తం 38 విలాసవంతమైన కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకలక్కల్ చెందిన వాహనాలు కూడా ఉండటం గమనార్హం.

  • ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా ఆ మారణహోమానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఎన్‌ఐఏ విచారణలో తేలిన వివరాల ప్రకారం పహల్గాం ఉగ్రదాడి ముందు రోజు (ఏప్రిల్‌ 21, 2025 రాత్రి) ముగ్గురు పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు ఇద్దరు కాశ్మీర్‌ స్థానికులు ఫర్వేజ్‌ అహ్మద్‌, బషీర్‌ అహ్మద్‌  ఆశ్రయం కల్పించారు. ఉగ్రవాదుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే   అవకాశమున్నప్పటికీ, వారు చెప్పలేదు. ఇందుకోసం ఉగ్రవాదుల నుంచి రూ.3,000 తీసుకున్నట్లు విచారణలో బయటపడింది.

    ఆ రాత్రి ఫైజల్‌ జాట్‌ అలియాస్‌ సులేమాన్‌ షాక్‌, హబీబ్‌ తాహీర్‌ అలియాస్‌ జిబ్రాన్‌, హంజ్జా ఆఫ్గానీ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలతో ఆ ఇద్దరి ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుతుండగా, పెద్ద దాడి జరగబోతుందనే విషయం స్థానికులకు అర్థమైంది. సుమారు ఐదు గంటల పాటు అక్కడే గడిపి, భోజనం చేసి, అవసరమైన వంట పాత్రలు, బ్లాంకెట్‌, టార్పాలిన్‌ షీట్‌ తీసుకెళ్లారు.

    ఏప్రిల్‌ 22న మధ్యాహ్నం 12:30 వరకు ఫర్వేజ్‌, బషీర్‌ ఇళ్ల వద్దే ఉన్న ఉగ్రవాదులు ఆ తర్వాత బైసరీన్‌ వ్యాలీలో దాక్కున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఫర్వేజ్‌, బషీర్‌ పహల్గాంలో టూరిస్టులను గుర్రాలపై బైసరీన్‌ వ్యాలీకి తీసుకెళ్లారు. అక్కడే మారణహోమం జరిగింది. దాడి జరుగుతున్నా తమకేం పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎన్‌ఐఏ విచారణలో తేలింది. జూన్‌ 22, 2025న ఎన్‌ఐఏ ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుని, ఛార్జ్‌షీట్‌లో వారి పేర్లను చేర్చింది.

    ఫర్వేజ్‌, బషీర్‌ తీసుకున్న ఆ మూడు వేల రూపాయలే 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటన జరిగి ఏడాది గడిచినా, బాధితుల కళ్ల ముందు ఆ దృశ్యాలు ఇంకా కదలాడుతూనే ఉన్నాయని, వారు కన్నీటి పర్యంతమవుతున్నారని తెలుస్తోంది.

  • గంజాయి మత్తులో.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి అటుపై పైశాచికంగా ప్రవర్తించింది ముస్కాన్‌ రాజ్‌పుత్‌. ఆపై ప్రియుడితో కలిసి జాలీ ట్రిప్‌ వేసి.. చివరకు భయంతో పోలీసులకు లొంగిపోయింది. మీరట్‌(ఉత్తర ప్రదేశ్‌) బ్లూడ్రమ్‌ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

    తన కొడుకు హత్యలో ముస్కాన్‌ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపిస్తోంది సౌరభ్‌ రస్తోగీ కుటుంబం. మంగళవారం కోర్టు విచారణ కోసం మీరట్‌ జిల్లా కోర్టుకు ఆరు నెలల చంటి బిడ్డ రాధతో ముస్కాన్‌, సాహిల్‌ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ కోర్టు హాల్‌లోకి రాగానే సౌరభ్‌ తల్లి రేణు దేవి భావోద్వేగానికి లోనయ్యారు.  

    ‘‘మరో మాట లేకుండా ఇద్దరినీ ఉరి తీయండి. చంటి బిడ్డ చేతిలో ఉందని కనికరించొద్దు. నా బిడ్డ నెలకు రూ.50 ఈమె కుటుంబానికి ఇచ్చేవాడు. ప్రతిగా వాళ్లు వాడ్ని దారుణంగా చంపారు. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు. కానీ, వాళ్లను వదిలేసి ఈ ఇద్దరినే అరెస్ట్‌ చేశారు. అందరినీ శిక్షించాల్సిందే’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుందామె.

    ఆ సమయంలో న్యాయమూర్తి భావోద్వేగాలను నియంత్రించుకోవాలని ఆమెకు సూచించారు. ఈ నేరంలో అభియోగాల ఆధారంగా చెరో 32 ప్రశ్నలు వేశారు జడ్జి. అందుకు సాక్ష్యం చూపించాలని సాహిల్‌ అడగ్గా.. ముస్కాన్‌ వాటిని తోసిపుచ్చింది. ఆపై కేసు విచారణను వాయిదా వేశారు.

    బిడ్డను స్వీకరిస్తారా?
    సౌరభ్‌-ముస్కాన్‌లకు ఓ కూతురు ఉంది. ఈ కేసు తర్వాత ఆ బిడ్డ సౌరభ్‌ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే అరెస్ట్‌ అయ్యేనాటికి ముస్కాన్‌ గర్భవతి. రిమాండ్‌ ఖైదీగా ఉన్న టైంలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్‌ఏ టెస్టులో నిర్ధారణ అయితే స్వీకరిస్తామని రేణు దేవి ఆ టైంలో చెప్పారు. కానీ, ఇప్పుడేమో ముస్కాన్‌ వల్ల ఆ బిడ్డ ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇటు ముస్కాన్‌ కుటుంబం కూడా ఆ పసికందును స్వీకరించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది.

    సౌరభ్‌ రాజ్‌పుత్‌, ముస్కాన్‌ రస్తోగీ ఇద్దరూ 2016లో ప్రేమవివాహం చేసకున్నారు. భార్యతో సమయం గడిపేందుకు మర్చంట్‌ నేవీ జాబ్‌ను సైతం వదిలేశాడు సౌరభ్‌. ఇది ఇంట్లో గొడవలకు దారి తీయడంతో ఆమెతో వేరు కాపురం పెట్టాడు. మూడేళ్ల తర్వాత ఇద్దరికీ ఓ పాప పుట్టింది. అదే సమయంలో.. సాహిల్‌ అనే వ్యక్తితో ముస్కాన్‌ సంబంధం నడుపుతున్నట్లు సౌరభ్‌ గుర్తించాడు. ఈ వ్యవహారం దంపతుల మధ్య గడవలకు దారి తీసి.. విడాకుల దాకా తీసుకెళ్లింది. ఆ పంచాయతీ నడుస్తుండగానే.. భార్యలో మార్పు వస్తుందన్న ఆశతో ఎదురు చూశాడు సౌరభ్‌. ఆపై మర్చంట్‌ నేవీ ఉద్యోగంలో మళ్లీ చేరాడు సౌరభ్‌. ఉద్యోగం నిమిత్తం 2023లో బయట దేశాలకు వెళ్లాడు.

    ఇదే అదనుగా ముస్కాన్‌, సాహిల్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. 2025 ఫిబ్రవరి 24న కూతురి పుట్టినరోజు వేడుకల కోసం చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చాడు సౌరభ్‌. ఇది భరించలేకపోయింది ముస్కాన్‌. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పెద్ద ప్లానే వేసింది.

    మార్చి 4వ తేదీన సౌరభ్‌ తినే తిండిలో మత్తు బిళ్లలు కలిపింది ముస్కాన్‌. గాఢ నిద్రలోనే జారుకోగానే గంజాయి మత్తులో ఉన్న ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని 15 ముక్కలుగా చేసి ఓ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో నింపేశారు. సౌరభ్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి.. ఇద్దరూ వారంపాటు షికారుకు వెళ్లారు.  

    కొన్నాళ్లకు డ్రమ్ము నుంచి కుళ్లిన వాసన రావడం.. ఆపై శవం చేయి బయటపడడంతో.. ఆందోళనకు గురైన ముస్కాన్‌ తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో ముస్కాన్‌ తండ్రే ఆమెను తమకు అప్పగించాడని పోలీసులు చెబుతున్నారు. అలా.. వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇటు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

  • బెంగళూరు: కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి కేఎన్‌.రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో మాట్లాడిన కేఎన్‌.రాజణ్ణ.. సీఎం ఇంత అసహాయకుడిగా ఉండటం చూస్తే అతడిపై ఎవరైనా చేతబడి చేశారా అనిపిస్తుందని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

    సీఎం సైలెంట్‌గా ఉన్నారని ఎవరైనా చెబితే అది నిజమే అనిపిస్తుందన్నారు. చేతబడి ఎవరు చేశారు అనే దానిపై విచారిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు పాత ఇంటి చుట్టూ పసుపు నీరు చల్లి చేతబడి చేశారని గుర్తు చేశారు. అయినా దానిని పట్టించుకోలేదని.. ఎన్నికల్లో గెలుపొందినట్లు పేర్కొన్నారు. మే నెలలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు. సీఎం చేతగాని వ్యక్తి కాదని.. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  

Family

  • రైలు ప్రయాణం అనగానే సర్వసాధారణంగా చిన్న బాక్స్‌లో భోజనం పెట్టుకుని తెచ్చుకుంటారు. ఓవర్‌నైట్‌ ప్రయాణమైతే సాధ్యమైనంత వరకు చాలామంది ప్రయాణికులు ఇలానే తెచ్చుకుంటారు. మరికొందరు ట్రైన్‌లో అమ్మే ఆహారాలతో పనికానిస్తారు.  కానీ ఈ అమ్మ అంతకు మించి ఆలోచించింది తన పిల్లలు గురించి. వాళ్ల ఆరోగ్యం బేషుగా ఉండాలని ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆగదు.

    అందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో రాత్రిపూట రైలు ప్రయాణం  చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పాపం ఆ తల్లి సామాన్లు సర్దడంలో ఎంత శ్రమపడిందో ఆమె ఆహారం సర్వ్‌ చేసిన విధం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆ వీడియో ఒక అమ్మాయ్‌ ప్రెషర్ కుక్కర్‌ను బ్యాలెన్స్ చేస్తూ నవ్వడంతో మొదలవుతుంది. 

    తన తల్లి బ్యాగ్‌ నుంచి కుక్కర్‌ బయటకు తీసి..రైలులోనే తన కుటుంబ సభ్యులకు వేడి వేడి పలావ్‌ను చాలా మామూలుగా వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వీడియోకి “అమ్మకు ఇది రాత్రిపూట రైలు ప్రయాణం అని చెప్పాను... ఆమె కుక్కర్ సర్దింది.” అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

    నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మా కుటుంబంతో కలిసి ‍ప్రయాణించిన రోజులు గుర్తొస్తున్నాయని కొందరు,  ఇంకొందురు వేడిగా పెట్టాలన్న ఆత్రం, ఆ తల్లి ప్రేమ రెండు కనిపిస్తున్నాయ్‌ అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

     

    (చదవండి: గెలిచా అనుకునేలోపే ఓటమి హగ్‌ ఇచ్చిందిగా..!)
     

  • నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య ఇంజినీరింగ్‌ చేసింది కానీ కావాలనే ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉంటోంది. ఇటీవల కొంతకాలంగా నా భార్య – ఆమె కుటుంబ సభ్యులతో నాకు తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆమె నాపై కేసులు వేస్తానని, నా ఆస్తులను, డబ్బును తీసుకుంటానని హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగానే భవిష్యత్తులో అలాంటిదేమైనా జరిగితే, నా ఆర్థిక వనరులను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. నా సంపాదన ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీఎఫ్‌ రూపంలో దాచుకున్నాను. కొంత భూమి కూడా కొన్నాను. స్టాక్‌ పెట్టుబడులను భరణం/మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారా? ముందుగా నా తల్లితండ్రులకు నగదు, స్థిరాస్తులు అన్నీ బదిలీ చేస్తే సరిపోతుందని, వీలైతే జీతం కూడా వేరే అకౌంట్‌లోకి తీసుకుంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మిత్రులు చెప్తున్నారు. నిజానికి నా భార్యకి చాలా ఆస్తి ఉంది కానీ ప్రస్తుతం వాళ్ళ నాన్న పేరిట ఉంది. తన తదనంతరం నా భార్యకేనని రిజిస్టర్డ్‌ వీలునామా కూడా ఉంది. అయినా నేను భరణం ఇవ్వాలా?
    – రఘురామ్, విజయవాడ 

    ఆస్తులను/నగదును దాచిపెట్టే ఉద్దేశంతో చేసే ఏ విధమైన నిధుల బదిలీలు అయినా బ్యాంకింగ్‌ రికార్డుల ద్వారా సులభంగా గుర్తించబడతాయి. కోర్టులకు బ్యాంకులనుండి, కంపెనీల నుండి, ఇతర సంస్థల నుండి కూడా ఆర్థిక వివరాలను సమీకరించే అధికారాలు ఉన్నాయి. వివాహ సంబంధిత కేసుల్లో, కోర్టు సాధారణంగా వివాహం జరిగిన తేదీ నుండి మీ ఆదాయం, ఆస్తులు ఆర్థిక ప్రవర్తనను పరిశీలిస్తుంది. 

    మెయింటెనెన్స్/భరణం కోరిన తేదీ నుండి గత మూడు సంవత్సరాల ఆర్థిక వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్, ఆస్తుల వివరాలు, ఖర్చులు, ఐటీ చరిత్ర మొదలగు అంశాలు వెలువరిస్తూ ఆస్తులు– అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. జీతాన్ని ఇతరుల ఖాతాలకు మళ్లించడం వంటి ప్రయత్నాలు వంటివి చేసినా, అనవసర ఆస్తి బదిలీ చేసినా, సులభంగా దొరికి΄ోతారు. అవి దురుద్దేశపూర్వక చర్యలుగా పరిగణించబడతాయి. పీఎఫ్, పీపీఎఫ్, ఫిక్స్‌డ్‌ డి΄ాజిట్లు, స్టాక్‌ పెట్టుబడులు వంటి అన్ని ఆర్థిక ఆస్తులను భరణం లేదా మెయింటెనెన్స్ నిర్ణయించేటప్పుడు సాధారణంగా పరిగణనలోకి తీసుకుంటారు. కోర్టు మీ నిజమైన ఆర్థిక స్థితి, సంపాదన సామర్థ్యాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా చేసుకుంటుంది. 

    ఆస్తులను దాచడం లేదా మాయ మాటలు చెప్పడం చట్టపరంగా ప్రమాదకరం, మీ కేసులో హానికరం. ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం కోర్టు ముందు మీ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా, ఒక నిపుణుడైన కుటుంబ న్యాయవాదిని సంప్రదించి చట్టబద్ధమైన వ్యూహాన్ని రూపొందించాలి. మీపై మెయింటెనెన్స్ క్లెయిమ్‌ వస్తే, మీరు కింది అంశాల ఆధారంగా దాన్ని వ్యతిరేకించవచ్చు.

    మీ భార్య విద్యార్హతలు, ఉద్యోగం చేసే సామర్థ్యం ∙ఆమె సంపాదించగలగడం, ఉద్యోగం చేయాల్సిన అవసరం 

    కావాలని ఉద్యోగం మానేయటం గురించిన వివరాలు 

    మీ ఆర్థిక బాధ్యతలు, అప్పులు, మొత్తం ఆర్థిక పరిస్థితి స్పష్టతతో, చట్టబద్ధంగా వ్యవహరించడం ద్వారా మీ ప్రయోజనాలను మెరుగ్గా రక్షించుకోవచ్చు. మైనర్‌ పిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు ఉంటే మాత్రం, మీరు ఎంత ప్రయత్నించినా కాస్తో కూస్తో తగ్గవచ్చు గానీ మెయింటెనెన్స్ మాత్రం కట్టాల్సిందే. 

     

     

Advt

  • శాస్త్రీయ ఆధారాలు, వినూత్న విధానాలతో జుట్టు రాలడం (హెయిర్ లాస్) చికిత్సలో కొత్త దారులు చూపుతున్నారు. నాన్-సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా లక్షలాది మందికి నమ్మకాన్ని కలిగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రోగులకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిష్కారాలు అందిస్తున్నారు. జుట్టు రాలడం అనేది అన్ని వయస్సులు, అన్ని ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేసే అత్యంత సాధారణమైన అంశం. అయినా, మానసికంగా బాధ కలిగించే సమస్యలలో ఒకటిగా ఉంది. వైద్య శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నా శస్త్రచికిత్స, ఎక్కువ కాలం విశ్రాంతి అవసరమయ్యే చికిత్సకు చాలా మంది సంకోచిస్తున్నారు. ఈ సమస్యకు శాస్త్రాన్ని, సౌకర్యాన్ని కలిపి పరిష్కారం చూపుతున్న వైద్యురాలు డాక్టర్ స్తుతి ఖరే శుక్లా. ఆమెను భారతదేశంలోని ప్రముఖ చర్మ వైద్య నిపుణురాలిగా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్టుగా గుర్తిస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలలో అద్భుత ఫలితాలు అందిస్తున్నందుకు రోగులు ఆమెను ప్రేమతో 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.

    అమెరికాలో శిక్షణ పొందిన డెర్మటాలజిస్ట్, డెర్మాటో-సర్జన్, కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ స్తుతి ఖరే శుక్లా ప్రస్తుతం ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్తెటిక్స్ క్లినిక్‌ల చైన్‌కు చీఫ్ డెర్మటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ క్లినిక్‌లు ముంబై, హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్, బాలాఘాట్ నగరాల్లో ఉన్నాయి. ఇటీవల ఆమె ఫెమినా మిస్ ఇండియా 2026 పోటీలో హెయిర్ కేర్ నిపుణురాలు, జ్యూరీ సభ్యురాలిగా సేవలందించారు. శస్త్రచికిత్స లేకుండా జుట్టు పునరుద్ధరణలో ఆమె చేసిన కృషి వల్ల దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. హెయిర్ లాస్ చికిత్స విధానం వైద్య పరిశోధన, అంతర్జాతీయ అనుభవంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేసిన తర్వాత, ఆమె అమెరికా, సింగపూర్, బ్యాంకాక్‌లలో అధునాతన సూపర్ స్పెషాలిటీ ఫెలోషిప్‌లు చేశారు. ఈ అంతర్జాతీయ శిక్షణ వల్ల వివిధ దేశాల ప్రజల్లో కనిపించే జుట్టు సమస్యలు, చికిత్స పద్ధతులు, సాంకేతికతను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది.

    ఆమెకు ఉన్న ఈ అంతర్జాతీయ అనుభవమే తర్వత ప్రత్యేక చికిత్స విధానం అభివృద్ధికి పునాది అయింది. అదే హెయిర్ గ్రోత్ బూస్టర్. శస్త్రచికిత్స అవసరం లేని, సుమారు ఐదు నిమిషాల్లో పూర్తయ్యే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ ఇది. శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇష్టపడని, అర్హత లేని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించినది ఈ చికిత్స. నొప్పి లేకుండా, తక్కువ సమయంలో పూర్తయ్యే విధంగా ఉండటం వల్ల ఆదరణ పొందింది. ఈరోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విధానాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో శస్త్రచికిత్స అవసరం లేని ప్రత్యామ్నాయాలపై మళ్లీ దృష్టిని ఆకర్షించింది. ఆమె చికిత్స విధానం శస్త్రచికిత్స చేయకుండా, శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతుల ద్వారా నిద్రలో ఉన్న హెయిర్ ఫాలికల్స్‌ను ప్రేరేపించడంపై కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల ఇది ప్రారంభ దశలో ఉన్న వారికి అనగా జుట్టు ఊడిపోవడం, ఒత్తిడి కారణంగా వచ్చే హెయిర్ లాస్, జుట్టు పలుచబడే సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

    గ్లోబల్ పరిధిని మరింత విస్తరించిన అంశం ఏమిటంటే, ఆమె రూపొందించిన వ్యవస్థీకృత ఆన్‌లైన్ కన్సల్టేషన్ మోడల్. పురుషులలో కనిపించే ప్యాటర్న్ బాల్డ్నెస్, మహిళలలో వచ్చే హెయిర్ లాస్, అలోపేషియా వంటి సమస్యలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆమె వర్చువల్ కన్సల్టేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల భౌగోళిక పరిమితులు లేకుండా నిపుణుల సేవలను అందుకోవడం సాధ్యమవుతుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన చికిత్స ప్రణాళికలు, నిరంతర మార్గదర్శకత్వాన్ని రోగులు తమ ఇళ్ల నుంచే పొందగలుగుతున్నారు. ఈ విధంగా ఆధునిక హెయిర్ రీస్టోరేషన్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

    అనేక మంది రోగుల అనుభవాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని చికాగో నగరానికి చెందిన నెల్సన్ జోసెఫ్ అనేక సంవత్సరాలుగా జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇతర చోట్ల ఎన్నో చికిత్సలు చేయించినా ఫలితం లేకపోవడంతో, ఆయన ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ స్తుతిని సంప్రదించారు. ఆమె సూచించిన చికిత్సను అనుసరించిన తర్వాత, ఆయన జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని, ఆ ఫలితాలు జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.

    క్లినికల్ ప్రాక్టీస్‌కు మాత్రమే పరిమితం కాకుండా, డాక్టర్ స్తుతి పరిశోధన రంగంలో కూడా చురుకుగా ఉన్నారు. హెయిర్, స్కాల్ప్ విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికతలు ఉపయోగించే పారిస్‌లోని ప్రముఖ ప్రయోగశాలతో కలిసి పని చేస్తున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో కలిసి చికిత్స పద్ధతులను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. ఆమె చేసిన పరిశోధనలు ప్రముఖ అమెరికన్ వైద్య జర్నల్స్‌లో కూడా ప్రచురితమయ్యాయి. ఒక లక్షకు పైగా విజయవంతమైన హెయిర్ గ్రోత్ కేసులు ఉన్నాయి. వైద్య నైతికత ఆధారంగా బలమైన అంతర్జాతీయ రోగుల వర్గాన్ని నిర్మించారు. ఆమె చేసిన పని ఏస్థెటిక్ మెడిసిన్ రంగంలో ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తుంది. అది అధిక శస్త్రచికిత్సల కంటే భద్రత, శాస్త్రీయ ఆధారాలు, రోగుల సౌకర్యాన్ని ప్రాధాన్యంగా చూసే విధానం. శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సలపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో డాక్టర్ స్తుతి సేవలు ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. శాస్త్రీయ ఆధారాలు, అంతర్జాతీయ అనుభవంతో కూడిన నవీన ఆవిష్కరణలు ఎలా హెయిర్ లాస్ చికిత్సను ప్రపంచవ్యాప్తంగా మారుస్తాయో ఆమె నిరూపిస్తున్నారు.

    మరిన్ని వివరాలకు..
    వాట్సాప్ నంబర్ : +91 6261 967 835
    ఇన్‌స్టాగ్రామ్:  https://www.instagram.com/dr.stutikhareshukla?