Archive Page | Sakshi
Sakshi News home page

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్‌కుమార్‌లతో కూడిన మంత్రుల బృందం ఆర్టీసీ కార్మీకులతో సుదీర్ఘంగా చర్చించింది. 32 డిమాండ్లపై మంత్రులు చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.

    ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన  నెలకొంది. చివరకు అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు.

    2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్‌మెంట్‌కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మీక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం వరకు జరిగిన సమ్మె ముగిసింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్‌ నుంచి బస్సులు యథావిధిగా రోడ్డెక్కుతాయని ప్రకటించారు.  

    ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్‌... 
    గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఈ విలీన ప్రక్రియ జరగ్గా, తెలంగాణలో మాత్రం జరగలేదు. కార్మిక సంఘాల నుంచి కూడా పెద్దగా డిమాండ్‌ లేకపోవటంతో దాని ఊసే లేదు. కానీ ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం ఉన్నట్టుండి ఆ ప్రక్రియ ప్రారంభించింది.

    గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యింది. అపాయింటెండ్‌ డేట్‌ ప్రకటించకుండా, విలీన ప్రక్రియ ఎలా జరగాలో తేల్చే పేరుతో ప్రభుత్వం సీనియర్‌ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి కార్మీకులు కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నా... ప్రభుత్వం మాత్రం దాని ఊసెత్తలేదు. 

    ఎన్నికల సందర్భంగా, ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పినా, అధికారంలోకి వచి్చన తర్వాత మాత్రం పట్టించుకోలేదు. చివరకు కార్మీక సంఘాలు సమ్మెకు దిగటం, సమ్మె రెండో రోజే ముగ్గురు కార్మీకులు ఆత్మహత్యలకు యత్నించటం, అందులో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి చెందటంతో ప్రభుత్వం దిగి వచి్చంది. చాలా దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ వచి్చనా, కార్మీక సంఘాలు సమ్మెకు దిగటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తొలుత కఠినంగానే వ్యవహరించాలని భావించింది. కానీ, శంకర్‌గౌడ్‌ ఆత్మహత్య, మరో ఇద్దరు కార్మీకుల ఆత్మహత్య యత్నంతో ప్రభుత్వం తీరు మార్చుకుంది.  

    13 గంటల పాటు చర్చలు... 
    ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మె పరిష్కార చర్చలు ఏకంగా 13 గంటలపాటు సాగాయి. శుక్రవారం ఉదయం 11.30కు తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్‌రాజ్, దానకిశోర్, ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన అధికారుల కమిటీ సచివాలయంలో ¿బేటీ అయింది. నాలుగు రోజుల క్రితం ఇదే కమిటీతో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ చర్చలు విఫలమైన మరుసటిరోజు తొలి షిఫ్టు నుంచే సమ్మె మొదలైంది. శుక్రవారం ఈ కమిటీతో చర్చలు మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగాయి.

    భోజనానంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్‌కుమార్‌లతో ప్రారంభమయ్యాయి. ఏకబిగిన ఆ చర్చలు అర్ధరాత్రి 12.30 వరకు కొనసాగటం విశేషం. తొలుత రెండు జేఏసీల ప్రతినిధులతో, ఆ తర్వాత సంఘాల వారీగా, మధ్యలో జేఏసీ ప్రతినిధుల వారీగా చర్చలు జరిపారు.

    కొద్దిసేపు మంత్రులు వారిలోవారు విడిగా చర్చించుకోగా, కార్మీక సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్‌మెంట్‌ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు.  
     

    అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చర్చల ప్రణాళిక వెనుక..శంకర్‌గౌడ్‌ అంత్యక్రియలకు ఆర్టీసీ కార్మీక సంఘాల నేతలు హాజరు కావొద్దన్నదేనన్న చర్చ నడుస్తోంది. నేతలు అంత్యక్రియలకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అది రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ అనుమానమన్న చర్చ కార్మీక సంఘాల్లో జరుగుతోంది.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం  మరోసారి ఐఏఎస్‌లను భారీగా  బదిలీ చేసింది. ఈమేరకు  ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్స్‌ పై ఒక ప్రకటన జారీ చేసింది.   ఈ ఏడాది మే 1 నుంచి ఈ నియామకాలు  అమల్లోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన భారీ IPS అధికారుల బదిలీలలో భాగంగా, డాక్టర్ తరుణ్ జోషి 'ఫ్యూచర్ సిటీ' పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే  బి. సుమతి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

    హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా  శిఖా గోయల్ నియమితులయ్యారు. దీంతొ పాటు  సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.  విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా  దేవేంద్ర సింగ్ చౌహాన్  బదిలీ అయ్యారు. మల్టీ జోన్-2 ఐజీపీగా నియమితులైన షాహ్నవాజ్ ఖాసిమ​్‌కు పర్సనల్ ఐజీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు పదవీ విరమణ నేపథ్యంలో  ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా  తరుణ్ జోషి నియమితులయ్యారు. అవినాష్ మహంతి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ కాగా, ఏసీబీ డైరెక్టర్ అదనపు బాధ్యతలను నిర్వర్విస్తారు. కార్తికేయ ఐజీపీ ఇంటెలిజెన్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.  మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా, ప్రస్తుతం SIB (ఇంటెలిజెన్స్) IGPగా ఉన్న బి. సుమతి  నియమితులు కావడం విశేషం.

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులు నేరుగా తల్లిదండ్రులకు చేరాయి. 18 లక్షలకుపైగా విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులు మీ సేవ ద్వారా నేరుగా పేరెంట్స్ వాట్సాప్ నెంబర్‌కు విజయవంతంగా పంపిణీ చేసింది.

    ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా అమలు చేశారు. దీనిద్వారా విద్యార్థుల అకడమిక్ రికార్డులు స్కూల్‌కు వెళ్లకుండానే.. తక్షణం, సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి.

    ఈ రికార్డు ముఖ్యాంశాలు

    • 18,00,000+ విద్యార్థుల రిపోర్ట్ కార్డులు డిజిటల్‌గా పంపిణీ.

    • 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలలు.

    •సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు, హాజరుశాతం కూడా నమోదు.

    •స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యం.

    •పూర్తిగా పేపర్‌లెస్, సురక్షిత విధానం.

    ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించామని వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, ఇది తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌కు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు సులభంగా, వేగవంతమైన సేవలను అందించడంలో మరోసారి విజయవంతం అయిందని ఆయన అన్నారు.

  • సాక్షి,వరంగల్‌: నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల్‌ శంకర్‌గౌడ్‌ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్‌ గౌడ్‌ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా,మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు.

    తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.

    చర్చల్లో ఆర్టీసీ జేఏసీ మూడు డిమాండ్లు ఇవే
    ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ ప్రక్రియను వెంటనే  ప్రారంభించాలి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను పునరుద్ధరించాలి. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలి.2025 వేతన సవరణ అమలు చేయాలి’అని డిమాండ్లు చేస్తున్నారు.

    వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.

    కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్‌గౌడ్‌ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు.

    ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత
    ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్‌ భౌతికకాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్‌గౌడ్‌ భౌతికకాయాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండగా.. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బండి సంజయ్‌ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బండిసంజయ్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్‌ పోలీసులే అంత్యక్రియలు చేయండంటూ ఫైర్‌ అయ్యారు. కుమార్తె ఇంటికి శంకర్‌ గౌడ్‌ మృతదేహం తరలించారు.      

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంత‌గ‌డ్డ‌పై మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), ప‌డిక్క‌ల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. 

    చివ‌ర్లో హైడ్రామా నెల‌కొన్న‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్‌), కృనాల్ పాండ్యా (23 నాటౌట్‌) జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2, సిరాజ్‌, హోల్డ‌ర్‌, మాన‌వ్  సుతార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, సుయాశ్ శ‌ర్మ‌, హాజిల్‌వుడ్ త‌లా ఒక వికెట్ తీశారు.

    సాయి సుదర్శన్ సెంచరీ
    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్‌లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. 

    జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్‌వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్  ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్‌), హోల్డర్ (23 నాటౌట్‌) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.

    కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్‌
    ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో  జాకబ్ బెతల్ (14) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్‌కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. 

    ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్‌,  కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు.  

    ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

     

  • సౌర‌వ్ గంగూలీ నేతృత్వంలోని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్‌, సపోర్ట్ స్టాప్ నియమాకాల్లో పారదర్శకత తీసుకురావడానికి బెంగాల్ క్రికెట్ చారిత్రత్మక అడుగు వేసింది.  సీనియర్ పురుషుల జట్టు హెడ్‌ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లాతో క్యాబ్ తెగదెంపులు చేసుకుంది. 

    అంతర్గతంగా జరిగే నియామకాలకు స్వస్తి పలికి, మెరిట్ ఆధారంగా కొత్త కోచ్‌లను ఎంపిక చేయాలని క్యాబ్ నిర్ణయించింది. ఇందుకోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీసీసీఐ మాదిరిగానే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు మే 1 సాయంత్రం 5 గంటలలోపు ధరఖాస్తు చేసుకోవచ్చు.

    కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అర్హతులు ఇవే

    👉కనీసం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేదా 1 టెస్ట్, 30 వన్డేలు లేదా 45 టీ20లు ఆడి ఉండాలి

    👉బీసీసీఐ లెవల్ 2 లేదా లెవల్ 3 కోచింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి

    👉ఒకవేళ ఆడిన అనుభవం లేకపోతే, సీనియర్ డొమెస్టిక్ జట్లు లేదా వయోపరిమితి జట్లకు 3 నుండి 5 ఏళ్ల పాటు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.

    👉దరఖాస్తుదారుల వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి.

    👉సీనియర్ పురుషల జట్టు, మహిళల జట్టు, ఏజ్ గ్రూపు జట్లు(U-16, U-19, U-23) కోచ్ పదవులను భర్తీ చేయనున్నారు.
     

  • ఐపీఎల్‌-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో 'గోల్డెన్ డక్'  అయిన సుదర్శన్.. ఈమ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు.

    ఈ తమిళనాడు క్రికెటర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.  తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన సుదర్శన్‌, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. సుదర్శన్‌కు ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం​ గమనార్హం.

    ఈ క్రమంలో సాయిసుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్‌లు పరంగా అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డుల​కెక్కాడు. అతడు కేవలం 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో అభిషేక్ శర్మ(1193) అగ్రస్ధానంలో ఉన్నాడు.

    బంతులు పరంగా అత్యంతవేగంగా 2000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే
    1193 - అభిషేక్ శర్మ
    1211 - వీరేంద్ర సెహ్వాగ్
    1306 - రిషబ్ పంత్
    1326 - యశస్వి జైస్వాల్
    1353 - యూసుఫ్ పఠాన్
    1361 - సాయి సుదర్శన్


     

     

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 103 ప‌రుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌రుగుల తేడా ప‌రంగా ముంబై ఇండియ‌న్స్‌కు ఇదే అతి పెద్ద ఓట‌మి.

    దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్‌కు దగ్గరలో ఉన్న ఆకాశ్‌..  సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు.  ఈ నేపథ్యంలో ఆకాశ్‌ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.

    ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్‌లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్‌ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్‌పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. 

    ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్‌ మాత్రం బసిత్‌ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్‌ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్‌ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పీఎస్‌ఎల్‌-2026 సీజన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయింది.
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంత‌గ‌డ్డ‌పై మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), ప‌డిక్క‌ల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. చివ‌ర్లో హైడ్రామా నెల‌కొన్న‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్‌), కృనాల్ పాండ్యా (23 నాటౌట్‌) జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2, సిరాజ్‌, హోల్డ‌ర్‌, మాన‌వ్  సుతార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

    ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
    206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు  ఐదో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన ర‌జ‌త్ ప‌టీదార్ మాన‌వ్ సుత‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి సుంద‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు 15.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఒక్క ప‌రుగుతో క్రీజులో ఉన్నాడు.

    దూకుడుగా ఆడుతున్న పడిక్కల్‌
    5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(16), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(18) ఉన్నారు.

    ఆర్సీబీ తొలి వికెట్ డౌన్‌
    ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బెతల్‌.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌
    చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌ సూపర్‌ సెంచరీతో చెలరేగాడు.  58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.

    అతడితో పాటు శుభ్‌మన్‌ గిల్‌(32), జోస్‌ బట్లర్‌(25), జాసన్‌ హోల్డర్‌(23) రాణించారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.

    గుజరాత్ మూడో వికెట్ డౌన్‌
    గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జోస్ బట్లర్‌.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌
    గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 100 ప‌రుగులు చేసిన సాయి సుద‌ర్శ‌న్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 16 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 170/2

    సాయిసుదర్శన్‌ సెంచరీ
    గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయిసుదర్శన్‌ సెంచరీతో మెరిశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదర్శన్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 155-1

    గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
    128 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌:61/0
    7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 61 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(48), శుభ్‌మ‌న్ గిల్‌(11) ఉన్నారు.

    ఆచితూచి ఆడుతున్న గుజరాత్‌
    2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(8), శుభ్‌మన్‌ గిల్‌(1) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ ఫిల్‌ సాల్ట్‌ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్‌ బెతల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు  వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.

    తుది జ‌ట్లు
    గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్


     

  • న్యూజిలాండ్ దిగ్గజ పేస‌ర్‌ డౌగ్ బ్రేస్‌వేల్ డ్రగ్స్ టెస్టులో పట్టుబట్టాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడు కోకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడిపై ఇంగ్లండ్ అండర్ వేల్స్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. 2025 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బ్రేస్‌వెల్ ఎసెక్స్ క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.

    అయితే ఈ టోర్నీలో  భాగంగా సోమ‌ర్‌సెట్‌తో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం సెప్టెంబ‌ర్ 24న బ్రేస్‌వెల్ నమూనాలను సేకరించారు. లండన్‌లోని వాడా (WADA) గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో జరిపిన పరీక్షల్లో, అత‌డు కోకైన్ వాడిన‌ట్లు తేలింది.  బ్రేస్‌వెల్ కూడా త‌ను కోకైన్ తీసుకున్న‌ట్లు త‌న త‌ప్పును అంగీక‌రించాడు.

    దీంతో ఎలాంటి విచార‌ణ అవ‌స‌రం లేకుండానే ఈ కేసును ఈసీబీ ముగించింది. అయితే ఈ నిషేదం గ‌తేడాది నవంబ‌ర్ 27 నుంచి అమలులోకి వ‌స్తోంది. అంటే నవంబర్ 23, 2027 వరకు అత‌డు ఎలాంటి అధికారిక క్రికెట్‌లో పోటీల్లో పాల్గోన‌లేడు.

    కాగా 35 ఏళ్ల‌ బ్రేస్‌వెల్‌.. న్యూజిలాండ్ త‌ర‌పున ఆడిన అత్యుత్త‌మ ఫాస్ట్ బౌల‌ర్లలో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి చేసిన బ్రేస్‌వేల్‌.. త‌న మూడ‌వ టెస్టులోనే 9 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. అతడు టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు.

  • ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. తమ ఆఖ‌రి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఓట‌మిపాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్‌.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగే అవకాశముంది. రొమారియో షెపర్డ్ స్దానంలో బెతల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బెత‌ల్ మూడు రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తూ క‌న్పించాడు.

    బెత‌ల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్ర‌పంచ‌కప్‌-2026 సెమీఫైన‌ల్లో భార‌త్‌పై సంచ‌ల‌న సెంచ‌రీతో మెరిశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులు చేసి టీమిండియాను వణికించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే దూకుడును కనబరిచేందుకు జాకబ్ సిద్దమయ్యాడు.

    ఇక జోష్ హాజిల్‌వుడ్ స్ధానంలో ​కివీస్ పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. డఫీ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్‌వుడ్ రావడంతో అతడు గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

    ఇప్పుడు అతడిని తిరిగి మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ మేనెజ్‌మెంట్ సిద్దమైంది. ఇక ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. నాలుగింట విజయం సాధిం‍చి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.

    ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
    ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, జాకబ్‌ బెతల్‌, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
    చదవండి: టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా?

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్లు తాజాగా వైభ‌వ్ ప్రదర్శనపై  'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర చర్చ జరిపారు.

    ఈ సంద‌ర్భంగా వీరంతా వైభ‌వ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఐర్లాండ్‌తో టూర్‌తో వైభ‌వ్ సీనియ‌ర్ జ‌ట్టులోకి అరంగేట్రం చేస్తాడ‌ని వాన్ జోస్యం చెప్పాడు. వైభ‌వ్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, అత‌డి టాలెంట్ చూస్తుంటే ముచ్చ‌టెస్తుంద‌ని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

    కాగా త‌న అరంగేట్ర ఐపీఎల్ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీతో చెల‌రేగిన 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఐపీఎల్‌-2026లో కూడా అదే దూకుడును కొన‌సాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌వంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.

    ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ ఇదే

    మైఖ‌ల్ వాన్: సూర్య‌వంశీ నిజంగా ఒక సంచ‌ల‌న ఆట‌గాడు, ఈ ఏడాది ఐపీఎల్‌లో అత‌డి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.

    డేవిడ్ లాయిడ్:  అత‌డు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాలి క‌దా?  మ‌ధ్య‌లో స్కూల్ అలా మానేయ‌కూడ‌దు క‌దా వాన్‌!

    వాన్‌: అత‌డు మ‌ళ్లీ స్కూల్‌కు వెళ్తాడ‌ని నేను అనుకోను డేవ్‌. వైభ‌వ్ ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో ఉంటాడ‌ని నేను అనుకుంటా? ఒక‌వేళ నేను సెల‌క్ట‌ర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభ‌వ్‌ను క‌చ్చితంగా ఎంపిక చేస్తాను.

    టఫ్నెల్: అవును క‌చ్చితంగా సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అత‌డు అర్హుడు.

    అలస్టైర్ కుక్: ఇంత‌కి వైభ‌వ్ ద‌గ్గ‌ర పాస్‌పోర్ట్ ఉందా?(న‌వ్వుతూ)

    వాన్‌: అత‌డికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్ల‌లోనే ఇలా ఆడుతున్నాడు కాబ‌ట్టి అంద‌రూ జాగ్ర‌త్తగా ఉండాలి. బుమ్రాను సైతం అత‌డు వ‌ద‌ల్లేదు.

    హార్ట్లీ: వైభ‌వ్‌కు ఆత్మ‌విశ్వాసం ఎక్కువ‌. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. క‌చ్చితంగా అత‌డిని భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాలి.

    వాన్‌:  భార‌త టీ20 జ‌ట్టుకు కొత్త ఓపెన‌ర్ అత‌డే. మరో ఎండ్‌లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌నల కార‌ణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేక‌పోతున్నాడు.
     

  • భారత దేశీ క్రికెట్‌లో కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌కు మంచి పేరుంది.   అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్‌ తొలి రంజీ టైటిల్‌ అందుకుంది. రంజీ 2021-22 సీజన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ బాధ్యతలు చేపట్టాడు.

    చంద్రకాంత్‌ మార్గ నిర్దేశనం, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్‌ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్‌ గౌతం గంభీర్‌కే క్రెడిట్‌ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్‌ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

    ఏకంగా ఫైనల్‌కు
    అందుకు తగినట్లుగానే శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్‌ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.

    ఈ నేపథ్యంలో కేకేఆర్‌ మాజీ హెడ్‌కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్‌ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.

    అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్‌ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.

    అందుకే అతడిని వదులుకున్నాము
    అయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్‌ ఒక్కడినే కాదు.. ఫిల్‌ సాల్ట్‌ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. 

    ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్‌ యజమానులు షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్‌ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్‌ పండిట్‌ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.

    కాగా 2025 సీజన్‌ తర్వాత చంద్రకాంత్‌ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్‌.. 2026కు గానూ అభిషేక్‌ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. 

    చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

  • న్యూజిలాండ్ మ‌హిళా క్రికెట్ దిగ్గ‌జం, వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ సూజీ బేట్స్ సంచ‌ల‌న  నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌-జూలైలో ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రగనున్న ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు బేట్స్ ప్ర‌క‌టించింది.

    2006లో భార‌త్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన బేట్స్‌.. త‌న 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది.  38 ఏళ్ల బేట్స్ ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. ఇటీవ‌ల సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో బేట్స్ తొడ కండరాల గాయం బారిన ప‌డింది. ప్ర‌స్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న బేట్స్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది.

    20 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జెర్సీ ధరించినందుకు నేను ఎంతో గ‌ర్వ‌పడుతున్నాను. ఈ కాలం ఇంత వేగంగా గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన యూకే గడ్డపై మరో ప్రపంచకప్ గెలవడమే నా చివరి లక్ష్యం. అందుకోసం  నా శక్తి మొత్తాన్ని ధారపోస్తాను.

    ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాను అని బేట్స్ న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. సూజీ బేట్స్ వ‌న్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఉమెన్స్ క్రికెట‌ర్‌గా కొన‌సాగుతోంది. 181 వ‌న్డేల్లో బేట్స్ 5,964 పరుగులు చేసింది.

    అదేవిధంగా ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా బేట్స్ (4,717 ప‌రుగులు) కొన‌సాగుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 350 మ్యాచ్‌లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్ సూజీనే కావ‌డం గ‌మ‌నార్హం.
    చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

  • ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడింట గెలిచింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించి పాయింట్ల సంఖ్యను ఆరుకు పెంచుకుంది. సొంతమైదానం వాంఖడేలో ముంబైని చెన్నై చిత్తు చేయడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

    మూడు మ్యాచ్‌లలో రెండు శతకాలు
    అయితే, టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) మాత్రం చెన్నై విషయంలో భిన్నంగా స్పందించాడు. ఒక్కరిపై ఆధారపడితే చెన్నై ఈసారి కూడా గట్టెక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా చెన్నై ఇప్పటికి మూడు విజయాలు సాధించగా.. ఈ మూడింటిలో సంజూ శాంసన్‌ రెండు అజేయ సెంచరీలతో జట్టును గెలిపించాడు.

    ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 115 పరుగులు చేసిన సంజూ.. తాజాగా ముంబైపై 101 పరుగులు సాధించాడు. ఈ రెండు మ్యాచ్‌లలో మిగతా బ్యాటర్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ సంజూ 48 పరుగులతో టాప్‌రన్‌స్కోరర్‌గా నిలిచి జట్టుకు విజయం అందించాడు.

    అతడు ఫెయిలైతే చెన్నైది మళ్లీ పాత కథే
    ఈ నేపథ్యంలో వీరేందర్‌ సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం చెన్నై జట్టును అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ ఆ జట్టు గెలిచిన ప్రతి సందర్భంలోనే ఒకే ఒక్క బ్యాటర్‌ పరుగులు రాబట్టాడు. అతడు పరుగులు చేయడంలో విఫలమైన రోజు కథ వేరుగా ఉంటోంది.

    ఒకవేళ అతడు మళ్లీ గనుక ఫెయిలైతే పాత కథే పునరావృతం అవుతుంది. కాబట్టి ఒకే ఒక్క బ్యాటర్‌పై ఆధారపడటం సరికాదు. సంజూతో పాటు పరుగులు రాబట్టే ఆయుశ్‌ మాత్రే దురదృష్టవశాత్తూ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.

    కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ మీద చెన్నై ఆశలు పెట్టుకుంది. సంజూతో కలిసి వాళ్లు కూడా రాణిస్తేనే సీఎస్‌కే ప్రయాణం ముందుకు సాగుతుంది’’ అని క్రిక్‌బజ్‌ షోలో పేర్కొన్నాడు. 

    ఏదేమైనా సంజూ శాంసన్‌ సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైపై చెన్నైకి విజయం అందించాడని సెహ్వాగ్‌ ప్రశంసించాడు.కాగా రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై.. కొన్నేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.

    చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Andhra Pradesh

  • సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరానికి చెందిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తెలుగుదేశం పార్టీ నేతను కాపాడేందుకు పోలీసులు బరితెగించడంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీకు సిగ్గు అనిపించట్లేదా? బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? దేవుడు మీకు దివ్యదృష్టి ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదారుడు స్పష్టమైన ఆరోపణలు చేసినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టి దర్యాప్తు కొనసాగించాలి. 

    బాధితురాలు తనపై అఘాయిత్యం జరిగిందన్న‌ దానికి సంబంధించి 164 స్టేట్మెంట్ వాంగ్మూలాలు ఇతర ఆధారాలు ఉన్నాయని చెబితే దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారు? బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి కేసు ఉపసంహరించుకోమని బెదిరిస్తారా? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్లిపోండి. 

    మీరు దర్యాప్తు సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వహించట్లేదు కాబట్టే న్యాయం కోసం బాధితురాలు కోర్టుకు రావాల్సి వచ్చింది. మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే ఒకసారి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు చదవండి’ అంటూ హైకోర్టు  పోలీసుల‌పై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు వివరణ సంతృప్తిగా లేదని హైకోర్టు పేర్కొంది. 

    ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ మే ఒకటో తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

  • విజయవాడ: అతను భిక్షగాడే కాదు.. దివ్యాంగుడు కూడా. అవేమీ పోలీసులకు కనిపించలేదు. అతన్ని చితక బాదారు. వాతలు తేలేలా కొట్టారు పోలీసులు. ఇదెక్కడో కాదు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై.   ఆ దివ్యాంగ భిక్షగాన్ని కొట్టింది ఇంద్రకీలాద్రి ఔట్‌పోస్ట్‌ పోలీసులు.

    బ్రహ్యం అనే వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను ఇంద్రకీలాద్రిపై భిక్షాటన చేసుకుంటుండగా పోలీసులు అతన్ని చితక్కొట్టారు. అతను అయ్యప్ప మాలలో సైతం ఉన్నాడు. 

    ఓ భిక్షగాడిని, అందులోనూ దివ్యాంగుడైన అతన్ని అంతలా కొట్టాల్సిన అవసరం లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. కర్రలతో వాతలు తేలేలా కొట్టడంతో చేసేది లేక మళ్లీ పోలీసులకే ఫిర్యాదు చేశాడు. విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
     



     

  • రంగంపేట(తూర్పు గోదావరి జిల్లా):  వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్తను పోలీసులే అదుపులోకి తీసుకుని హైడ్రామా సృష్టించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేటలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్తను పోలీసులే నిర్బంధించారనే ఆరోపణలతో పార్టీ శ్రేణులు నిరసనను ఉధృతం చేయడంతో అసలు నిజం బయటకొచ్చింది.  

    తమకు ఏమీ తెలియదంటూ,  ఎంపీటీసీ భర్త నిర్బంధంతో ఏమీ సంబంధం లేదని తొలుత చెప్పిన పోలీసులు.. చివరకు ఆయన్ను చూపిస్తామంటూ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కడంతో చేసేదిలేక పోలీసులు దిగివచ్చారు. ఎంపీటీసీ భర్త వెంకట్రావును తామే అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు పోలీసులు. 

    కుటుంబ సభ్యులకు అతణ్ని చూపిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఏ కారణంతో వెంకటరావును అరెస్ట్ చేశారో ఇప్పటివరకు పోలీసులు స్పష్టం చేయలేదు. వెంకట్రావును పోలీసులు భౌతికంగా తీవ్రంగా హింసించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిరసన తీవ్రతరం చేస్తే వరకూ పోలీసులు నిజం ఒప్పుకోకపోవడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. వెంకట్రావును హింసించిన సీఐను సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. 

    రాష్ట్రంలో అరాచక పాలన
    రంగంపేటలో పరిస్థితి పై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని  మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు.



    వారే తీసుకెళ్లి.. తెలియదని బుకాయించడం దారుణం
    పట్టపగలే పోలీసులు దళిత నాయకుడిని తీసుకెళ్లి, తమకు తెలియదని బుకాయించడం దారణమని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బాధితున్ని భౌతికంగా వేధించిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూటమిపాలనను ప్రజలు గమనిస్తున్నారు.‌. కచ్చితంగా రానున్న కాలంలో చర్యలు ఉంటాయన్నారు. 

    లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు
    కూటమి హాయాంలో రాష్ట్రంలో ఘోరమైన పాలన నడుస్తోందని మాజీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. ‘ పోలీసులు, టిడిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.  దళిత ప్రజా ప్రతినిధి కుటుంబాన్ని వేధించడం అత్యంత దారుణం’ అని మండిపడ్డారు. 

  • సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో చిక్కుకుందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాబు ధరలేదు. అధికార పార్టీ, దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారు. సమస్యలు గాలికొదిలేసి మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారని’ధ్వజమెత్తారు. 

    రైతు విభాగం సమావేశంలో వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డీనేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి  పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌ వడ్డి రఘురామ్‌, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు సహా రైతు విభాగం నేతలు పాల్గొన్నారు.

    రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, సింగపూర్ లో షికారు చేస్తున్నాడు

     

  •  సాక్షి, రంగంపేట: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.   వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ భర్త  నిర్బంధాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి.  తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త ఎక్కడున్నాడో తెలపాలంటూ స్టేషన్‌ వద్ద  వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.  

    ఎంపీటీసీ భర్తని పోలీసులే నిర్బంధించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.   అయితే  అతను  తమ వద్ద లేడని, తాము ఎవర్నీ నిర్బంధించలేదని పోలీసులు వాదిస్తున్నారు.  

    దీనిలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి  కాకినాడ రాజమండ్రి ఏడిపి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారితో వాగ్వాదానికి దిగారు.  మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పోటీగా రంగంపేట స్టేషన్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సంఘటనా  స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

    దమ్ముంటే చెయ్యి వెయ్యి.. జక్కంపూడి ఉగ్రరూపం

     

  • సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్‌ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.

    ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్‌ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్‌ నవీన్‌ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది.

    తన భర్త ఈశ్వర్‌రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్‌ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో ఈశ్వర్‌రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ  విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు.

     

Business

  • అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. గురువారం ఆయన నికర సంపద పెరగడంతో.. 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో తిరిగి ప్రవేశించడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కూడా అధిగమించారు.

    బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద ఒక్క రోజులోనే 7.16 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలతో, ఆయన మొత్తం సంపద 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకారు. అంటే 2026లో, గౌతమ్ అదానీ నికర సంపద 21.4 బిలియన్ డాలర్లు పెరిగింది.

    నికర సంపద పెరగడంతో అదానీ బిల్‌గేట్స్ (104 బిలియన్ డాలర్స్)ను అధిగమించారు. కాగా.. 90.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్నారు.

  • భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

    వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్‌లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.

    ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

    ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా!

  • ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్‌ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.

    పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

    పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్‌బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్‌ 22(4) కింద రద్దు చేసింది.

    ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్‌ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్‌ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది.

  • ఇండియన్ మార్కెట్లో ఆటోమాటిక్ కార్లకు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉంది. అయితే వీటికోసం ఎక్కువ డబ్బు కేటాయించాలేమో అనుకుంటే పొరపాటే? ఎందుకంటే దేశీయ విఫణిలో రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరకు లభించే కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఆ కార్ల గురించి తెలుసుకుందాం.

    కియా సోనెట్
    రూ. 10 లక్షల లోపు సెగ్మెంట్‌లోని అత్యంత ప్రీమియం కాంపాక్ట్ SUVలలో ఒకటి కియా సోనెట్. దీని ప్రారంభ ధర రూ.9.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందింది. ఇందులోని 83 పీఎస్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్ అందించే 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 116 పీఎస్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్స్ అన్నీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్స్ పొందుతాయి.

    ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 385-లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్ ప్రారంభం: రూ. 9.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి పనితీరును అందించడంతో.. దీనిని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది 1-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 115 PS పవర్ 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెగ్మెంట్‌లో స్కోడా పూర్తిగా పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లపై దృష్టి సారించినందున, డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు. ఇందులోని 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

    టాటా పంచ్
    టాటా పంచ్ ప్రారంభం: రూ. 7.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇటీవల ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 88 PS, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పంచ్‌లో డీజిల్ ఇంజన్ అందుబాటులో లేదు.

    మారుతి సుజుకి డిజైర్
    రూ. 7.62 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే మారుతి సుజుకి డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 90 PS పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, చుట్టూ LED లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎయిర్-కాన్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 8.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 72 PS, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపిక లభిస్తుంది. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ క్లస్టర్, కీలెస్‌ ఎంట్రీ, 625 లీటర్ల బూట్ స్పేస్ మొదలైనవి ఉన్నాయి.

  • ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా నియమితులైన శ్రీకాంత్‌ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్‌ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

    టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.

    ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్‌ వివరించారు.

  • ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.

    నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్‌లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.

    నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్‌ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్‌ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

    చదరపు అడుగుకు రూ. 2,60,592
    1,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

    ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.

    కేవలం మరమ్మతులు మాత్రమే..
    అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.

    ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.

    ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!

  • గత వారం రోజులుగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశీయ మార్కెట్లో మారుతున్న సమీకరణాలు పసిడి ధరను కిందకు దింపుతున్నాయి. గత వారం రోజులుగా దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అక్షయ తృతీయ వంటి పర్వదినాల వేళ కూడా డిమాండ్ ఊహించిన స్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం వంటి అంశాలు పసిడి వెలుగులను తగ్గించాయి.

    దేశంలో ముఖ్యంగా హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ 19వ తేదీన 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 1,42,800 గా ఉండగా, ఏప్రిల్ 24 నాటికి అది రూ. 1,40,200 కి చేరి, మొత్తం రూ. 2,600 మేర తగ్గింది. అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ఏప్రిల్ 19న రూ. 1,55,780 గా ఉన్న ధర, ఏప్రిల్ 24 నాటికి రూ. 1,52,950కి పడిపోయింది, అంటే తులంపై సుమారు రూ. 2,830 మేర ధర తగ్గింది. గత ఐదు రోజులుగా వరుసగా ధరలు క్షీణించడంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించింది.

    ధరలు తగ్గడానికి దారితీసిన 4 కీలక అంశాలు
    బలపడుతున్న అమెరికన్ డాలర్
    అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పెరగడం బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతోంది. డాలర్ ఇండెక్స్ బలపడినప్పుడల్లా పెట్టుబడిదారులు పసిడి కంటే డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తున్నాయి.

    ముడిచమురు సెగ.. వడ్డీ రేట్ల భయం
    ప్రస్తుతం అంతర్జాతీయంగా (ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద) నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పుడప్పుడే తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడటంతో, బంగారంపై పెట్టుబడులు తగ్గాయి.

    లాభాల స్వీకరణ
    ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు (తులం దాదాపు రూ.1,50,000 పైచిలుకు) చేరాయి. ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెద్ద ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం (Profit Booking) మొదలుపెట్టారు. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరగడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణం.

    దేశీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్
    భారత్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, పాత బంగారాన్ని ఇచ్చి కొత్తది తీసుకోవడం లేదా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల రిటైల్ మార్కెట్లో సందడి తగ్గింది.

    ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చి, డాలర్ విలువ స్థిరపడితే తప్ప ధరల్లో స్పష్టత రాదు. అయితే, ధరలు తగ్గుతున్న ఈ సమయం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుముందు ధరలు మరింత తగ్గుతాయా లేదా మళ్లీ పుంజుకుంటాయా అన్నది అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పసిడి ప్రేమికులు మాత్రం ఈ ధరల తగ్గింపును ఆస్వాదిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.

  • న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,504 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడానికితోడు ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 5,316 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.  

    ట్రెజరీ వీక్‌ 
    తాజా క్యూ4లో యూనియన్‌ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 1 శాతం క్షీణించి రూ. 9,406 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 2.87 శాతం నుంచి 2.64 శాతానికి నీరసించడం ప్రభావం చూపింది. ట్రెజరీ ఆదాయం మందగించడంతో 3 శాతం తక్కువగా రూ. 5,412 కోట్ల వడ్డీయేతర ఆదాయం అందుకుంది. ఈ కాలంలో రుణ నాణ్యత మెరుగుపడటంతో స్లిప్పేజీలు, రుణ వ్యయాలు తగ్గినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

    దీంతో ప్రొవిజన్లు 3 శాతం తగ్గి రూ. 2,640 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 2,715 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.6 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,483 కోట్ల నుంచి రూ. 2,023 కోట్లకు వెనకడుగు వేశాయి. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈల నుంచి రూ. 895 కోట్లు నమోదయ్యాయి.

  • క్లాసిక్‌ లెజెండ్స్‌ తాజాగా యెజ్డీ, బీఎస్‌ఏ బ్రాండ్స్‌ కింద స్క్రాంబ్లర్‌ మోటర్‌సైకిల్స్‌ని ప్రవేశపెట్టింది. వీటిలో యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350 ప్రారంభ ధర రూ. 1,99,950గా ఉంటుంది. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది.  బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ప్రారంభ ధర రూ. 3,24,950గా ఉంటుంది.

    కంపెనీ సహ వ్యవస్థాపకుడు అనుపమ్‌ తరేజా గురువారం వీటిని ఆవిష్కరించారు. బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ దేశీయంగా ఈ సెగ్మెంట్లో ఏకైక 650 సీసీ సింగిల్‌ సిలిండర్‌ వాహనమని సంస్థ తెలిపింది. ఈ రెండు వాహనాలకు 4ఏళ్లు లేదా 50,000 కి.మీ. స్టాండర్డ్‌ వారంటీ, 6 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ, 8 ఏళ్ల వరకు రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ మొదలైనవి ఉంటాయి.

  • ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

    తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

    ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

    నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా?

  • వేతన జీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజులు త్వరలోనే రానున్నాయి. తమ కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్ (PF) నగదును పొందే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈపీఎఫ్ఓ (EPFO) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 మధ్య నాటికి 'ఈపీఎఫ్ఓ 3.0' పేరుతో సరికొత్త అప్‌గ్రేడెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త మార్పులతో పీఎఫ్ ఉపసంహరణలు ఇకపై బ్యాంక్ లావాదేవీలంత సులభం కానున్నాయి. ఈ వ్యవస్థలో రాబోయే ప్రధాన మార్పులు ఇవే..

    ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ
    ఈపీఎఫ్ఓ 3.0 లో అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. ఇకపై మీరు మీ పీఎఫ్ నగదును నేరుగా ఏటీఎంల ద్వారా లేదా యూపీఐ (UPI) యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. పేపర్ వర్క్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో నేరుగా లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ అవుతుంది.

    రూ. 5 లక్షలకు పెరిగిన ఆటో-సెటిల్‌మెంట్ పరిమితి
    గతంలో ఆటో-సెటిల్‌మెంట్ పరిమితి కేవలం రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. దీన్ని ఇప్పుడు ఏకంగా రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే లేదా మరుసటి రోజు కల్లా నగదు చేతికి అందుతుంది.

    కంపెనీ ఆమోదం అక్కర్లేదు!
    చాలా సందర్భాల్లో కంపెనీలు క్లెయిమ్‌లను ధ్రువీకరించడంలో ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. కొత్త వ్యవస్థలో ఈ డిపెండెన్సీని తొలగిస్తున్నారు. ఆధార్ ఓటీపీ ద్వారా లేదా స్వీయ-ధ్రువీకరణ  ద్వారా క్లెయిమ్‌లను వేగంగా సెటిల్ చేసుకోవచ్చు.

    ఫోన్ పే, గూగుల్ పేతో అనుసంధానం
    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనివల్ల ఫోన్‌పే (PhonePe) గూగుల్‌ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి పాపులర్ డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా పీఎఫ్ లావాదేవీలను సులభంగా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది.

    ఉపసంహరణ నిబంధనల సరళీకరణ
    వినియోగదారుల సౌకర్యార్థం ఉపసంహరణ కేటగిరీలను ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 
    వైద్య అవసరాలు: సర్వీస్ నిబంధన లేకుండా ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.
    చదువు/వివాహం: నిర్ణీత సర్వీసు కాలం తర్వాత అనుమతి ఉంటుంది.
    గృహ అవసరాలు: ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి కనీసం 5 ఏళ్ల సర్వీసు ఉండాలి.
    నిరుద్యోగం: ఒక నెల పాటు ఖాళీగా ఉంటే 75% నగదు, రెండు నెలలు దాటితే పూర్తి నగదు ఉపసంహరించుకోవచ్చు.

    ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే మీ యూఏఎన్‌ (UAN) యాక్టివ్‌గా ఉండటంతో పాటు, దానికి ఆధార్, పాన్, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి 32 ప్రముఖ బ్యాంకులతో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

    ఇక పన్ను నిబంధనల విషయానికి వస్తే.. 5 ఏళ్ల నిరంతర సర్వీసు తర్వాత ఉపసంహరించుకునే నగదుపై పన్ను ఉండదు. అయితే, రూ. 50,000 మించిన విత్ డ్రాయల్స్ విషయంలో పాన్ కార్డు లింక్ చేయకపోతే టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. మొత్తానికి, ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వస్తే కోట్లాది మంది వేతన జీవుల డిజిటల్ కల సాకారమై, పీఎఫ్ సెటిల్‌మెంట్లలో కొత్త శకం మొదలుకానుంది.

  • శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 982.71 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 76,681.29 వద్ద.. నిఫ్టీ 275.10 పాయింట్లు లేదా 1.14 శాతం నష్టంతో 23,897.95 వద్ద నిలిచాయి.

    ఇమామి రియల్టీ లిమిటెడ్, ఖైతాన్ (ఇండియా) లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్, శేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ , మాస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ఖైతాన్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్‌ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

    క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్‌ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్‌ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్‌ ఎగుమతులను 250 బిలియన్‌ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం.

    గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్‌ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్‌ డాలర్లు, కొరియాకి 3 బిలియన్‌ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి.  

    ఇవి ఎక్కువ – ఇవి తక్కువ 
    గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్‌ అండ్‌ స్టీల్, ఎలక్టరిక్‌ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్‌ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి.

  • సాక్షి, ముంబై:  ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తీసుకున్న నిర్ణయం చర్చకు దారి తీసింది. ఒకవైపు సీఈఓకు భారీగా బోనస్‌లు  స్టాక్ ఇన్సెంటివ్‌లను ప్రకటించింది. మరోవైపు సాధారణ ఉద్యోగుల జీతాల పెంపుపై కంపెనీ ఇంకాఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

    సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌కు సుమారు రూ.52 కోట్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్‌లను (స్టాక్ గ్రాంట్లు) ఆమోదించింది. ఈ గ్రాంట్లలో పనితీరు, ఈఎస్‌జీ, టీఎస్‌ఆర్, వార్షిక ఈక్విటీ అవార్డులు ఉన్నాయి. నామినేషన్  అండ్‌ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బోర్డు ఆమోదించిన ఈ గ్రాంట్లు, పరేఖ్ వార్షిక పనితీరు ఆధారిత పరిహార నిర్మాణంలో భాగమని ఈ ఐటీ దిగ్గజం ఏప్రిల్ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

    దీని ప్రకారం వార్షిక పనితీరు ఈక్విటీ గ్రాంట్:  రూ.34.75 కోట్లు, ESG (పర్యావరణ, సామాజిక, పాలన): రూ.2 కోట్లు, TSR (మొత్తం వాటాదారుల రాబడి): రూ.5 కోట్లు, 2019 పనితీరు ప్రణాళిక కింద: రూ.10 కోట్లు, మొత్తం విలువ: సుమారు రూ.51.75 కోట్లు ఈ స్టాక్ యూనిట్లు (RSUs) మే 2 నుండి అమల్లోకి వస్తాయి. బోర్డు నిర్ణయించిన పనితీరు మైలురాళ్లను బట్టి ఇవి ఒకటి నుండి రెండు ఏళ్లలోపు ఆయనకు అందుతాయి. గత ఏడాది కూడా ఆయనకు సుమారు  రూ.50 కోట్ల విలువైన స్టాక్ ఇన్సెంటివ్‌లు లభించాయి.

    ఉద్యోగుల జీతాల పెంపు మాట ఏంటి?
    ఐటీ రంగంలో వృద్ధి నెమ్మదించడం, కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవాలని చూడటం వల్ల జీతాల పెంపుపై సందిగ్ధత నెలకొంది. దీనిపై వివరణ ఇస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీతాల పెంపు సమయం, పరిమాణంపై ఇంకా సమీక్ష జరుగుతోందని ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ (CFO) జయేష్ సంఘరాజ్కా తెలిపారు.

    ఇదీ చదవండి: 3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌

    6 శాతం  కుప్పకూలిన షేర్‌
    శుక్రవారం నాటి స్టాక్‌మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ షేర్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.  దాదాపు 6 శాతం  దాకా కుప్పకూలింది.  దీంతో షేర్‌ విలువ ఐదేళ్లకు పైగా కనిష్ట స్థాయికి పడిపోయింది . FY27 వృద్ధి అంచనాలు మందకొడిగా ఉండటంతో ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పడిపోయాయి. బలహీనమైన అంచనాలు, తీవ్రమవు తున్న పోటీ కారణంగా ఎనలిస్టులు వెల్లడించారు.  నాలుగో త్రైమాసికంలో నికర లాభం 27.8 శాతం పెరిగి, రూ.8,501 కోట్లుగా నమోదైంది.ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.46,402 కోట్లుగా ఉంది.2026-27 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి 1.5 శాతం నుండి 3.5 శాతం మధ్య ఉండవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. కానీ ఆదాయ వృద్ధి మాత్రం నిరాడంబరంగా ఉంది.

    ఇదీ చదవండి: అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు

  • ‘1980వ దశకంలో దేశం విడిచి వెళ్లేటప్పుడు నా మనసులో ఒకటే ప్రశ్న.. మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం? కానీ నేడు అదే భారత్ ప్రపంచానికి టాలెంట్ హబ్‌గా మారింది. ఒకప్పుడు సంస్థను స్థాపించడం గగనమైతే, నేడు అది అత్యంత సులభతరమైంది’ ఇవి ప్రముఖ ఐటీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యక్తం చేసిన భావాలు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న తన జీవిత అనుభవాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

    నిరాశ నిండిన కాలం అది..

    శ్రీధర్ వెంబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, 1989లో తాను ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాలు అశాంతితో రగులుతుండేవన్నారు. ‘అప్పట్లో ఐఐటీయన్లు దేశం దాటి వెళ్లడమే ఏకైక మార్గంగా భావించేవారు. నేను దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను గుర్తుచేశారు.

    వృథా అవుతున్న ప్రతిభ

    ఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ వెంబు దృష్టి అంతా ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రంపైనే ఉండేది. ‘మనం ఎందుకు పేదవాళ్లం?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన దశాబ్దాల పాటు అన్వేషించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారతదేశం పేద దేశంగా ఉండటానికి కారణం మనం మన ప్రతిభను భారీ స్థాయిలో వృథా చేయడమే’ అని విశ్లేషించారు. జోహో సంస్థను ఏ గొప్ప నేపథ్యం లేని సామాన్య భారతీయులతోనే నిర్మించామని, అటువంటి ప్రతిభ భారత్‌లో ప్రతిచోటా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టాలెంట్‌ను సరైన దిశలో ఉపయోగిస్తే దేశం అద్భుతమైన సంపదను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    సంస్కరణల పర్వం

    1989 నాటికే తాను సోషలిస్టు విధానాలకు వ్యతిరేకిగా మారానని వెంబు తెలిపారు. 1991 సంక్షోభం సమయంలో విదేశీ మారక నిల్వలు అడుగంటి, ఐఎంఎఫ్ వద్ద బంగారం కుదువ పెట్టాల్సిన దుస్థితి నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వరకు ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ పతనం, చైనాలో అశాంతి వంటి అంశాలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని చెప్పారు.

    నేటి భారతం అవకాశాల గని

    ప్రస్తుత పరిస్థితులపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సంస్థను ప్రారంభించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించవచ్చని ఆయన ఉదహరించారు. ‘మనం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన జీవన ప్రమాణాలు ఉన్న చోట నుంచి కూడా కంపెనీలను మొదలు పెట్టవచ్చు. మీ దగ్గర ప్రతిభ ఉంటే భారతదేశంలో ఏదైనా సాధించవచ్చు’ అని చెప్పారు.

    ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

  • ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.

    ఏమిటీ బైఅవుట్?

    సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.

    మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?

    కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్‌లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్‌ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.

    అసలు సమస్య ఏమిటి?

    టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్‌వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్‌ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.

    జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.

    ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Movies

  • టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.  మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ..  వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.

    తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్‌ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి.

     

  • ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు.

    టీజర్ చూస్తుంటే అన్యాయంపై పోరాడే పాత్రలో ధనుశ్ నటించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో సన్నివేశాలు చూస్తుంటే ఈ ఫుల్ అగ్రెసివ్‌గా కథ ఉండనున్నట్లు అర్థమవుతోంది. 'తాను నాటింది తానే నరుక్కోవాలి.. నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకు వచ్చింది. అంతకంటే ముందు నా మీద పడ్డ మచ్చను తుడిచేయాలి. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకెళ్లాలి' అనే డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు. 
     

  • మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్‌ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. 

    తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్‌లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్‌ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్‌లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్‌ ఫ్యాన్స్‌కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్‌లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది.  
     

  • టాలీవుడ్ కొన్ని నెలలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీని కూడా బిగ్‌ స్క్రీన్‌పై విడుదల చేశారు. విడుదలైన 16 సంవత్సరాల తర్వాత థియేటర్లలో మళ్లీ సందడి చేసింది. 2010లో ఏప్రిల్ 23న రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజైంది. ఈ మూవీలో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు.

    ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్‌లోనూ సత్తా చాటింది. మొదటి రోజు ఏకంగా రూ.7.59 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రీ-రిలీజ్‌ మూవీస్‌లో  మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేశ్ బాబు ఖలేజా చిత్రాల వసూళ్లను అధిగమించింది.

    ఈ సినిమా కంటే ముందు 'బాహుబలి: ది ఎపిక్' తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ.19.65 కోట్లు వసూలు చేసింది. కాగా.. డార్లింగ్ మూవీని 4కె వర్షన్‌లో రిలీజ్ చేశారు. బాహుబలి: ది ఎపిక్  ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీ-రిలీజ్‌గా నిలిచింది. కాగా.. డార్లింగ్ మూవీకి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో నిర్మించారు.

  • 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి క్యూట్ లుక్స్

    తెల్లి చీరలో జిగేలుమంటున్న అనంతిక

    మెరిసిపోతున్న 'టిల్లు' భామ నేహా శెట్టి

    చీరలో నిండుగా హీరోయిన్ కాయదు లోహర్

    గ్లామర్ షోతో రచ్చ లేపుతున్న కృతి సనన్

    నవ్వుతూ మాయ చేస్తున్న శ్రీలీల

  • 'కేరింత' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుకృతి ఇప్పుడు శుభవార్త చెప్పేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని సంగతి బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.

    (ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)

    ఢిల్లీకి చెందిన సుకృతి అంబటి.. చదువుతున్న టైంలో డ్యాన్స్, యాక్టింగ్‌కి సంబంధించి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేది. అలా  దిల్ రాజు నిర్మించిన 'కేరింత' సినిమాలో భావన అనే పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రంతో మంచి గుర్తింపే వచ్చినప్పటికీ ఏ భాషలోనూ మరో మూవీ చేయలేదు. పూర్తిగా యాక్టింగ్ కెరీర్ పక్కనబెట్టేసింది.

    2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఓవైపు జాబ్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తల్లి కాబోతున్న విషయాన్ని రివీల్ చేసింది. బీచ్ ఒడ్డున్న బేబీ బంప్‌తో దిగిన ఫొటోలని ఈ సందర్భంగా షేర్ చేసింది.

    (ఇదీ చదవండి: ‍'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్)

  • 'ఠాగూర్' పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గుర్తొస్తారు. ఇందులో ఆయన చెప్పిన డైలాగ్స్, అద్భుతమైన యాక్టింగ్ మరోసారి మదిలో మెదులుతాయి. చెప్పాలంటే చిరు కెరీర్‌లోనే మైలురాయి లాంటి సినిమా ఇది. ‍అయితే ఇదో రీమేక్ అని చాలామందికి తెలీదు. అలానే రాజశేఖర్ చేయాల్సిన ఈ మూవీ.. చిరంజీవి చేతుల్లోకి వచ్చిందనే సంగతి కూడా ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడీ విషయంపై స్వయంగా రాజశేఖర్ స్పందించారు. అప్పట్లో ఏం జరిగిందో బయటపెట్టారు.

    (ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

    ''ఠాగూర్' నేను కొనుక్కున్న సినిమా. అడ్వాన్స్ అంతా ఇచ్చేశా. నిర్మాత నా ఫ్రెండే కదా అని ‍అగ్రిమెంట్ చేసుకోలేదు. ఠాగూర్ మధు ఉన్నారు కదా! చిరంజీవి కోసం ఆయన వెళ్లి, ప్రొడ్యూసర్‌ని కలిసి ఎక్కువ డబ్బులిస్తానని చెప్పి పట్టుకెళ్లిపోయారు. నేను అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు. ఇది జరిగింది' అని రాజశేఖర్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

    శంకర్ దర్శకత్వంలో అర్జున్ చేసిన 'జెంటిల్మన్' సినిమా కూడా తానే చేయాలని.. కానీ 'అల్లరి ప్రియుడు' షూటింగ్ టైంలోనే ఆ అవకాశం రావడంతో తప్పక వదులుకున్నానని రాజశేఖర్ చెప్పారు. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీలో తెర వెనక చాలా జరుగుతుంటాయి. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లాంటివి లేకపోవడం నిజాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఈయనే చెప్పడంతో జరిగింది ఇది అని అందరికీ క్లారిటీ వచ్చింది.

    తమిళంలో విజయకాంత్ హీరోగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో 'రమణ' సినిమా వచ్చింది. ఇది బ్లాక్‌బస్టర్ కాగా తెలుగులో దీన్నే 'ఠాగూర్'గా రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. సూపర్‌హిట్‌గా నిలిచింది. ఒకవేళ ఇది రాజశేఖర్ చేసుంటే ఎలా ఉండేదో మరి?

    (ఇదీ చదవండి: నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు: రకుల్ ప్రీత్ సింగ్ భర్త)

  • ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అన్ను కపూర్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో తమన్నాపై డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తమన్నా చాలా తెల్లగా ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా.. స్త్రీ 2 చిత్రంలోని ఆజ్ కీ రాత్ ఐటమ్ సాంగ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో తమన్నా డ్యాన్స్ గురించి మాట్లాడారు. అదే సమయంలో ఆమె శరీర రంగుపై కామెంట్స్ చేయడంతో వివాదానికి దారితీసింది.

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అన్ను కపూర్‌ ఈ వివాదంపై స్పందించారు. తన కామెంట్స్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అదే మాటను తాను మిల్కీ బాడీ అని చెబితే సమస్య వచ్చేది కాదేమోనని అన్నారు. కేవలం లాంగ్వేజ్ మారినంత మాత్రాన అర్థం మారదన్నారు. తమన్నాను ప్రశంసించడానికే అలా అన్నానని.. అంతే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని తెలిపారు. నా కామెంట్స్‌తో తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికైనా రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు. నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు.. ఆమె కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయం కాదన్నారు. 
     

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్‌గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్‌షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.

    (ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)

    ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.

    ఇక సిట్యుయేషన్‌షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్‌గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్‌షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.

    (ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

  • రణ్‌వీర్‌ సింగ్ దురంధర్‌-2 నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన ఈ సినిమా బాహుబలి-2 రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్‌ కావడంతో దురంధర్‌ నటీనటులు ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయారు. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాకేశ్ బేడీ. ఈ మూవీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జమిల్ జమాలి పాత్రలో తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు.

    ఈ సినిమాలో నటించిన రాకేశ్ బేడీకి పారితోషికం దాదాపు రూ.50 లక్షలు తీసుకున్నారని టాక్. అయితే తాజాగా ఆయనకు సంబంధించి మరో న్యూస్ వైరలవుతోంది. దురంధర్-2 బ్లాక్‌బస్టర్ కావడంతో ఏకంగా ఆయనకు కోటి రూపాయలు ముట్టజెప్పారని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాకేశ్ బేడీకి కోటి రూపాయల చెక్ కూడా అందజేశారని వార్తలొస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో రాకేశ్ బేడీ స్పందించారు. తనకు కోటి బోనస్ ఇచ్చారని వస్తోన్న వార్తలపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. నాకు ఆ డబ్బు ఇచ్చి ఉంటే ఎక్కడుందో చెప్తే వెళ్లి తెచ్చుకుంటానని అన్నారు. నా ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదన్నారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చారన్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది. 
     
     

  • ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన అర్జున్‌ అంబటి..ఇప్పుడు వెండితెరపై దూసుకెళ్తున్నాడు. రామ్‌ చరణ్‌ పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం  'పరమపద సోపానం'. నాగ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు నిర్మించారు. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌ నటించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే.. 
    హెల్త్ కమిషనర్ సత్యప్రకాశ్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ క్లిష్టమైన కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అశ్వద్ధామ(అజయ్‌ రత్నం) రంగంలోకి దిగుతాడు. అయితే  మృతదేహంపై తర్వాత  చావబోయే వ్యక్తి వేలిముద్రలు దొరకడం కేసును మరింత మిస్టరీగా మారుస్తుంది. చివరకు ఈ కేసులో ప్రధాన సాక్షిగా అర్జున్‌(అర్జున్‌ అంబటి) గుర్తిస్తారు.

    అర్జున్ ఒక గేమ్ డిజైనర్. మల్టీనేషనల్ కంపెనీలో చేసుకునే అతను పీటీఎస్‌డీ(Post-Traumatic Stress Disorder) అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఎవరో తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారనే భయం అతన్ని వెంటాడుతుంటుంది.అర్జున్ భద్రత కోసం సీఐ నేహా((జెనిఫర్ ఇమాన్యుయేల్)ను నియమిస్తారు. కానీ హత్యలు అక్కడితో ఆగవు… ప్రభుత్వ ఉద్యోగులు షబీనా భేగమ్ పాటు  జాన్ రాజ్ కూడా క్రూరంగా హత్యకు గురవుతారు. ఈ  హత్యల వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అర్జున్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? హెల్త్ మినిస్టర్ పురుషోత్తం రెడ్డి పాత్ర ఏమిటి? ఈ మొత్తం కథకు ‘పాలకడలి’ గ్రామంతో ఉన్న రహస్య సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లి  ‘పరమపద సోపానం’ మూవీ చూడాల్సిందే .

    విశ్లేషణ
    ఇదొక డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. దర్శకుడు నాగ శివ తన తొలి చిత్రానికే బలమైన కథను ఎంచుకుని, సోషల్ ఎలిమెంట్‌తో కూడిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు. ఇలా తక్కువ బడ్జెట్‌లో పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అందించడం పెద్ద ఛాలెంజ్.  ఈ విషయంలో  దర్శకుడు విజయం సాధించాడు. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థం వచ్చే ప్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కొంత సాగదీతగా అనిపిస్తుంది.అయితే అందులో టచ్‌ చేసిన సోషల్‌ ఎలిమెంట్‌ బాగుంటుంది.క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.

    అర్జున్‌ పాత్రకు అర్జున్‌ అంబటి న్యాయం చేశాడు.ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే  ఫైట్‌లో అదరగొట్టేశాడు. హీరోయిన్ జెనిఫర్ ఇమ్మాన్యుల్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించింది. ఆమెకు ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ లభించింది అని చెప్పాలి. అజయ్ రత్నంకి చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ దొరికింది. సీనియర్ నటుడు పిల్లా ప్రసాద్ కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు.సాంకేతికంగా సినిమా బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే..  ‘పరమపద సోపానం’  ఎంటర్‌టైన్‌ చేస్తుంది.
    - రేటింగ్‌: 2.5/5

  • రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్‌కు షిఫ్ట్ చేశారు.

    అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్‌గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ కూడా రానుందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.

    కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
     

  • టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతర వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక బాబీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవితో జతకట్టారు. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.  బాబీతో ‘మెగా 158’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించనున్న చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ కాకాజీ అని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
     

     

  • రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతం సమకూర్చిన తాజా చిత్రం ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.  రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి ఇతర పాత్రలు పోషించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించిన ఈ మూవీ నేడు(ఏప్రిల్‌ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

    కథేంటంటే.. 
    కాకినాడకు చెందిన రౌడీ షీటర్‌ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్‌ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) కూడా టికెట్‌ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. 

    ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్‌ (వికాస్‌)-మీరా(మౌనిక), విజయ్‌ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే..
    నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అని ఈ సినిమాకు క్యాప్షన్‌ పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.  హత్య చేసిందెవరు అనేది సినిమా చూసే ప్రేక్షకులు చివరి వరకు కనిపెట్టకుండా ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు చైతన్య మోటూరి. అయితే దీని కోసం రెండు లవ్‌స్టోరీలతో పాటు మొత్తం ఐదు ఉపకథలను రాసుకున్నాడు. వాటికి ఈ హత్యకు సంబంధం ఉన్నప్పటికీ.. తెరపై చూస్తుంటే మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.  స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది.

    గేదెల రాజు మర్డర్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది.  ఆ తర్వాత దుర్గ పాత్ర ఎంట్రీ.. కార్పోరేటర్‌ బరిలో ఇద్దరూ ఉండడంతో ఈ హత్య అతనే చేయించాడేమో అనుకునేలోపు అతనికి  సంబంధం చూపించారు. ఆ తర్వాత రిచ్‌ పాత్ర ఎంట్రీ..అతని నేపథ్యం.. మీరాతో ప్రేమాయణం చూపిస్తూనే మరోవైపు విజయ్‌-సత్యల ప్రేమకథను నడిపించారు.  

    గేదెల రాజు హత్యకు ఈ జంటలకు ఏదో సంబంధం ఉంటుందని అనుకునేలోపు.. డెక్క, శివయ్య పాత్రలను పరిచయం చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు.  చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ సీన్‌ ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సాగదీతగా అనిపిస్తుంది.  గేదెల రాజు శత్రువులు ఎవరు?  రెండు ప్రేమ కథలతో అతనికి  ఉన్న సంబంధం ఏంటనేది చూపించడానికి కథను సాగ..దీశారు.  పెద్ద రౌడీ షీటర్‌ అని మాటల్లో చెప్పడమే కానీ...తెరపై అతని చూసి భయపడేలా ఒక్క సన్నివేశం కూడా ఉండదు.  పైగా హత్య రోజు జరిగిన సీన్‌ కూడా గొప్పగా అనిపించదు.  ట్విస్ట్‌ మాత్రం ఎవరూ ఊహించరు.  మహాభారతంలోని కనిక నీతి కథకు ఈ కథను ముడిపెట్టిన తీరు బాగుంది.

    ఎవరెలా చేశారంటే.
    గేదెల రాజు పాత్రకు రఘు కుంచె న్యాయం చేశాడు. ఒక రౌడీ షీటర్  మాట తీరు ఎలా ఉంటుందో,  ఎలా కోపంగా చూస్తాడో తెరపై రఘు కుంచె అలానే నటించాడు. గోదావరి యాసను కూడా బాగా మ్యానేజ్‌ చేశాడు. శివయ్యగా రవి ఆనంద్‌ బాగా నటించాడు. రిచ్‌గా వికాస్‌, విజయ్‌గా రామచంద్రంతో పాటు టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.  సాంకేతికంగా సినిమా ఓకే. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా వరకు సాగదీత సీన్లు ఉన్నాయి. వాటిని కట్‌ చేసి నిడివి తగ్గించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

    తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.  ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

     

     

  • మృణాల్ ఠాకుర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల్లో ఈమె పోషించిన పాత్రలు, అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్‌లే గుర్తొస్తాయి. అంతెందుకు ఈ నెల ప్రారంభంలోనే రిలీజైన 'డెకాయిట్'లోనూ సరస్వతి అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మూవీ ఓకే ఓకే అనిపించుకుంది గానీ మృణాల్ యాక్టింగ్‌ని అందరూ మెచ్చుకున్నారు.

    (ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)

    అయితే తెలుగులో ఫెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న మృణాల్.. బాలీవుడ్‌లో మాత్రం పూర్తిగా గ్లామరస్ రోల్స్ చేస్తోంది. ఇప్పుడు కూడా వరుణ్ ధావన్‌తో 'హే జవానీ తో ఇష్క్ హోనా హై' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసింది. ఇందులో మృణాల్‌తో పాటు పూజా హెగ్డే కూడా హీరోయిన్‌గా చేసింది.

    వచ్చే నెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా టీజర్ కొన్నిరోజుల క్రితం రిలీజ్ చేయగా పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ట్రయాంగిల్ లవ్-ఫ్యామిలీ తరహా రొటీన్ స్టోరీనే అని చాలామంది పెదవి విరిచారు. కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో పక్కనబెడితే గ్లామర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అన్నట్లు ఉంది. తాజాగా 'వావ్' పేరిట మూవీలోని వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో మృణాల్ అదిరిపోయే గ్లామర్ షో చేసింది. పూజా హెగ్డే కూడా ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం.

    (ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)

National

  • సాక్షి, న్యూఢిల్లీ:  భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, 'నజఫ్‌గఢ్ నవాబ్' నివాసముండే బంగ్లా 'కృష్ణ నివాస్' విశేషాలు  నెట్టింట  సందడిగా మారాయి. న్యూఢిల్లీలోని విలాసవంత మైన ప్రాంతమైన హౌజ్ ఖాస్‌(Hauz Khas) లో 'కృష్ణ నివాస్' అనే విశాలమైన బంగ్లాలో నివసిస్తోంది సెహ్వాగ్‌ కుటుంబం.  ఢిల్లీ లాంటి  నగరంలో ఇంత పెద్ద పచ్చని తోట ఉండటం చాలా అరుదు. అద్భుతమైన ఇంటీరియర్‌తో అందంగా తీర్చిదిద్దిన ఆయన నివాసానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే  ఈ కథనం చదవాల్సిందే.

    సెహ్వాగ్ తన తల్లి పేరు మీద ఈ బంగళాకు 'కృష్ణ నివాస్' అని పేరు పెట్టారు. బంగ్లా విలువ సుమారు రూ. 130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 12 విలాసవంతమైన గదులు, ఒక పెద్ద తోట, అలాగే ఆయన తన కుటుంబంతో సమయం గడిపే ఒక పార్క్ ఉన్నాయి.   ఉండే ఈ ఇంటిలో జంతువుల కోసం ప్రత్యేకంగా లాన్ నిర్మించడం విశేషం.

    ఇంటి ప్రత్యేకతలు:
    లివింగ్‌ రూమ్ : అతిథులు లోపలికి రాగానే పెద్దదైన, అద్భుతంగా అలంకరించబడిన లివింగ్ రూమ్ కనిపిస్తుంది. సెహ్వాగ్ తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడి ఫోటోలను షేర్ చేస్తుంటారు.

    విజిటర్స్ రూమ్: ఈ భవనంలో ప్రత్యేకంగా విజిటర్స్ బుక్ ఉంటుంది. సెహ్వాగ్ ఇంట్లో ఉన్నప్పుడు వంటవారు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, అర్చకులు మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు, జర్నలిస్టులు కూడా వస్తుంటారు.

    8 మాస్టర్ బెడ్‌రూమ్‌లు: ఈ ఇంట్లో 8 విశాలమైన మాస్టర్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి, వీటిలో ప్రతి గదికి ప్రత్యేకమైన జాకూజీ (Jacuzzi విశ్రాంతికోసం, హైడ్రోథెరపీ కోసం మసాజ్, బబుల్‌ బాత్‌, నీటిలో మునిగి ఉండే పవర్డ్ జెట్‌ల వ్యవస్థతో కూడిన పెద్ద స్నానపు తొట్టి లేదా పూల్‌) సదుపాయం ఉంది. సెహ్వాగ్ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారు. దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి ఇంట్లో అందమైన పూజ గది ఉంది.

    స‍్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఏంటంటే..
    సెహ్వాగ్ సాధించిన విజయాలకు గుర్తుగా ఒక ప్రత్యేకమైన ట్రోఫీ గది ఉంది. ఇందులో ఆయన ఉపయోగించిన బ్యాట్లు, మెడల్స్, జ్ఞాపికలు మరియు బంగారు పూత పూసిన షీల్డ్‌లు ఉన్నాయి. ఇక్కడ సెహ్వాగ్ తన కుమారులతో క్రికెట్ ఆడటం, యోగా, బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఏంతో ప్రేమగా నిర్మించుకున్న భవనం కేవలం విలాసానికి చిహ్నం మాత్రమే కాదు, సెహ్వాగ్ కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం. తల్లి పేరు మీద ఇంటికి పేరు పెట్టడం నుండి, మదర్స్ డే వంటి వేడుకలను ఇక్కడే జరుపుకోవడం వరకు ఈ ఇల్లు సెహ్వాగ్ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ప్రశాంతంగా సమయం గడపడానికి ఈ విశాలమైన ప్రాంగణం  చక్కటి వేదిక అనడంలో సందేహం లేదు

    కాగా 2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు. 2007లో ఆర్యవీర్ సెహ్వాగ్, 2010లో వేదాంత్ సెహ్వాగ్ పుట్టాడు. అయితే దాదాపు 20 ఏళ్ల తరువాత ఇటీవల భార్యతో అభిప్రాయ భేదాల వల్ల సెహ్వాగ్ విడాకులు తీసుకున్నాడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం అతడు వ్యాఖ్యాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
     

  • న్యూఢిల్లీ: త‌మ‌ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమవుతున్న‌ట్టు ఎంపీ రాఘవ్ చద్దా చేసిన ప్ర‌క‌ట‌నపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. 'బీజేపీ మరోసారి పంజాబీలకు గట్టి దెబ్బ కొట్టింద'ని ఎక్స్‌లో ఆయ‌న‌ పోస్ట్ పెట్టారు. ఒకే ఒక్క వాక్యంతో త‌న స్పంద‌న తెలియ‌జేశారు. ఈ ప‌రిణామంపై ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

    పంజాబ్‌కు బీజేపీ ద్రోహం
    పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ కూడా ఇదే విధంగా స్పందించారు. పంజాబ్‌కు బీజేపీ ద్రోహం చేసిందని మండిప‌డ్డారు. ఆప‌రేష‌న్ లోట‌స్‌ను గ‌తంలో శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీల‌పైనా ప్ర‌యోగించింద‌ని గుర్తు చేశారు. పంజాబ్‌లో క‌మ‌లం పార్టీ ఆట‌లు చెల్ల‌వ‌ని వ్యాఖ్యానించారు.

    ''పంజాబ్‌కు బీజేపీ ద్రోహం చేసింది. ఇదే వాషింగ్ మెషీన్‌ను శరద్ పవార్, శివసేన (యూబీటీ), కాంగ్రెస్ పార్టీల పైకి ఉపయోగించారు. పంజాబ్‌లో బీజేపీకి పట్టు లేదు. బీజేపీలో చేరుతున్న ఆ ఏడుగురు ఎంపీలు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించరు, వాళ్లు దేశద్రోహులు. ఫిరాయింపు ఎంపీల‌కు బీజేపీలో ఏమీ దక్కదు. పొత్తు పెట్టుకున్న పార్టీని నాశనం చేయ‌డం బీజేపీ నైజం. పంజాబ్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. పంజాబ్ ప్రజలు నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నార''ని భ‌గ‌వంత్ మాన్ అన్నారు.

    త‌మ‌ పార్టీ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు అనురాగ్ ధంధా మాట్లాడుతూ.. ''ఈ నాయకుల స్వభావాన్ని దేశం మొత్తం చూసింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలో ఆప్ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారికి తెలుసు. పంజాబ్ ప్రజలు వారికి తగిన విధంగా సమాధానం ఇస్తార''ని వ్యాఖ్యానించారు. 

    న‌బిన్‌ను క‌లిసిన ఆప్ ఎంపీలు
    కాగా,  ఆమ్ ఆద్మీ పార్టీ  ఎంపీలు రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ శుక్ర‌వారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను క‌లిశారు. బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో వారికి పుష్ప‌గుచ్చాల‌తో న‌బిన్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. స్వ‌యంగా స్వీట్లు తినిపించారు. 

    చ‌ద‌వండి: రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి ప‌ద‌వి?

  • అనుకున్న‌దే జ‌రిగింది. కొంత కాలంగా కేజ్రీవాల్‌కు కంట్లో న‌లుసులా త‌యారైన రాజ్య‌స‌భ స‌భ్యుడు రాఘ‌వ్ చ‌ద్దా త‌న అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీతో జ‌ట్టుక‌డుతున్నట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు ఆరుగురు ఆప్‌ ఎంపీలు కూడా బీజేపీ గూటికి వ‌స్తున్నారంటూ బాంబు పేల్చారు. రాజ్య‌స‌భ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌క్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించి రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపారు. గోడ దూకుతున్న ఎంపీల్లో మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, స్వాతి మ‌ల్లివాల్, సందీప్ పాఠ‌క్‌, (Sandeep Pathak) అశోక్ మిట్ట‌ల్‌, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని ఉన్నారు.

    కొంత కాలంగా సొంత‌ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న రాఘ‌వ్ చ‌ద్దా.. కేంద్రంలోని మోదీ స‌ర్కారుపై మెత‌క‌వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప‌లు అంశాల్లో ఎన్డీఏ స‌ర్కారు విధానాల‌ను ఆమ్ ఆద్మీ పార్టీ వ్య‌తిరేకించినా ఆయ‌న మాత్రం మిన్న‌కుండిపోయారు. అంతేకాదు ప‌లుమార్లు పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చిపెట్టారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసు నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియాను కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించినా.. చ‌ద్దా నుంచి క‌నీస స్పంద‌న కూడా రాలేదు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే ఆయ‌న క‌నీసం ఒక ట్వీట్ కూడా పెట్ట‌లేదు.  

    చ‌ద్దాతో పాటు మిట్ట‌ల్ కూడా..
    అలాగే పార్ల‌మెంట్‌లో మోదీ స‌ర్కారును ఇబ్బంది పెట్ట‌కుండా న‌డుచుకున్నార‌నే అప‌వాదును సొంత పార్టీ నుంచే ఎదుర్కొన్నారు చ‌ద్దా. కేంద్రం తీసుకున్న వివాదాస్ప‌ద అంశాల‌ జోలికి వెళ్ల‌కుండా సాధార‌ణ స‌మ‌స్య‌ల‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించార‌నే ఆరోప‌ణ‌లూ ఆయ‌నపై ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో ఉప నాయ‌కుడి ప‌ద‌వి నుంచి ఇటీవ‌ల చ‌ద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఆయ‌న స్థానంలో అశోక్ మిట్ట‌ల్‌ను (Ashok Mittal) నియ‌మించింది. అయితే చ‌ద్దాతో పాటు మిట్ట‌ల్ కూడా ఇప్పుడు కాషాయ పార్టీలోకి జంప్ చేయ‌డం గ‌మ‌నార్హం.

    రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు
    రాఘ‌వ్ చ‌ద్దా.. ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెబుతార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ‌లో పార్టీ డిప్యూటీ లీడ‌ర్‌ ప‌ద‌వి నుంచి తొల‌గించడం, త‌న‌కు ఇచ్చిన జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను పంజాబ్ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకోవ‌డంతో క‌మ‌లం గూటికి చ‌ద్దా చేర‌తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా త‌నతో పాటు ఆరుగురు ఎంపీల‌ను పార్టీని వీడేలా చేసి రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపారు. రాజ్య‌స‌భ‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప‌క్షాన్ని బీజేపీలో క‌లిపేసి కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు.

    కేంద్ర కేబినెట్‌లోకి చ‌ద్దా?
    పార్టీ ఫిరాయింపును ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా స‌మ‌ర్థించుకున్నారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీకి దూర‌మై ప్ర‌జ‌ల‌కు చేరువుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు కేంద్ర కేబినెట్‌లో చ‌ద్దాకు చోటు క‌ల్పించేందుకు రంగం సిద్ధ‌మైంద‌న్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కాగా, ప‌శ్చిమ బెంగాల్ రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఈ ప‌రిణామం చోటుచేసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అయింది.

    చ‌ద‌వండి: 'ఆ ఏడుగురిని గుర్తుపెట్టుకుంటాం'

    టార్గెట్ పంజాబ్ ఎన్నిక‌లు
    పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీ ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల‌ను త‌మ‌వైపు తిప్పుకుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఢిల్లీలో ఆప్‌ను దెబ్బ‌కొట్టిన క‌మ‌లం పార్టీ పంజాబ్‌లోనూ కేజ్రీవాల్‌కు చెక్ పెట్టాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తోంద‌ని చెబుతున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాఘ‌వ చ‌ద్దాను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్యపోవాల్సిన అవ‌స‌రం లేదని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఇంటా బ‌య‌ట స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత తాజా సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

  • న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్‌ చద్దా రాజీనామా చేయడం సంచలనం రేపింది. వరుసగా ఏడుగురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా శుక్రవారం చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. దీనిపై తొలిసారిగా ఆప్‌ ఘాటుగా స్పందించింది.  పార్టీకి, ప్రజలకు వారు తీరని ద్రోహం చేశారంటూ మండిపడింది.

    రాఘవ్‌ చద్దా ప్రకటన తరువాత విలేకరుల సమావేశం నిర్వహించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వారు పార్టీకి, పంజాబ్ ప్రజలకు "ద్రోహం" చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపీగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బీజేపీ పంచన చేరారని విమర్శించారు.

    'ఆపరేషన్ లోటస్' సిగ్గు చేటు

    పంజాబ్‌ ప్రభుత్వంపై 'ఆపరేషన్ లోటస్' అమలు జరుగుతోందని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆపరేషన్ లోటస్ అమలు చేయడం సిగ్గు చేటన్నారు. ఈ ఆపరేషన్ లోటస్‌ను అమలు చేయడానికి ED, CBI సంస్థలను వాడుకుంటోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ ద్రోహులను పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

    ఇదీ చదవండి: అమెరికా సంచలన ప్రకటన : ఆ నేతను పట్టిస్తే రూ.94 కోట్లు

    పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని AAP ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు బీజేపీ అడ్డుపడుతోందని సంజయ్ సింగ్  విమర్శించారు. బీజేపీలో చేరుతున్న ఏడుగురినీ గుర్తుంచుకుంటామనీ,  ముఖ్యంగా పంజాబ్ ప్రజలు వారిని ఎప్పటికీ మర్చిపోరని పేర్కొన్నారు.  

    ఇదీ చదవండి: 3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌

  • ఢిల్లీ:  ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. రాజ్యసభ సభ్యులు రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిట్టల్‌ ఆప్‌కు రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మరో నలుగురు పంజాబ్‌  ఆప్‌ ఎంపీలు కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. 

    ఆపరేషన్‌ కమలం కలకలం
    పంజాబ్‌లో ఆపరేషన్‌ కమలం కలకలం రేపుతోంది. మొత్తం ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు.  పంజాబ్‌ నుంచి  ఉన్న ఆప్‌ రాజ్యసభ సభ్యుల్లో అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్ (క్రికెటర్), రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, బల్బీర్ సింగ్ సీచేవాల్, విక్రమ్‌జీత్ సింగ్ సహ్నేలు ఉండగా వీరంతా ఆ  పార్టీకి  గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు.   

    కేంద్ర కేబినెట్‌లోకి రాఘవ్‌ చద్దా
    ఈ మేరకు ఎంపీ రాఘవ్‌ చద్దా శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు అవినీతిపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. ‘నేను నా జీవితంలోని 15 ఏళ్లను అంకితం చేసిన ఆప్‌ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమైంది. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని. నేను పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను. నాతో పాటు మొత్తం రాజ్యసభలో ఆప్‌కు చెందిన 10 మంది ఎంపీలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది (ఆంటే ఆరు నుంచి ఏడుగురు ఎంపీలు) బీజేపీలో చేరుతున్నారు’అని ప్రకటించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్ర కేబినెట్‌లోకి రాఘవ్‌ చద్దాకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.  

    రాఘవ్ చద్దాకు కేంద్ర మంత్రి పదవి..!

    కేజ్రీవాల్‌కు నమ్మిన బంటు 
    అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది.2011లో అర్వింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌తో పాటు పలువురు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాది అంటే 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. అప్పుడే రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా ఆప్‌లో చేరారు. నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు నమ్మిన బంటుగా, అనుచరుడిగా కొనసాగారు. 

    కాగా, ఇప్పటివరకూ ఆమ్‌ ఆద్మీకి  రాజ్యసభలో 10 ఎంపీ బలం ఉండగా,  పంజాబ్‌ నుంచి ఏడుగురు,  ఢిల్లీ నుంచి  ముగ్గురు ఉన్నారు.  తాజా రాజీనామాల ఎపిసోడ్‌తో ఆప్‌ రాజ్యసభ  సభ్యుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌కి వచ్చేసింది. 

  • గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్‌టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి

    ఏం జరిగింది అంటే?
    ఒక వ్యక్తి తన భార్య చేతిలో  దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు.  దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన  ల్యాప్‌టాప్‌లో రికార్డ్‌ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో  తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్‌టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది.  దీంతో హాట్‌ టాపిక్‌గా మారింది.

    నెటిజన్ల స్పందన
    ఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. 

    అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. 

    ఇదీ చదవండి: 3 అపార్ట్‌మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్‌ మేనేజర్‌

    నోట్‌ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్‌తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి  వ్యతిరేకంగా సంబంధిత చట్ట  వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. 
     

  • నిన్న జరిగిన బెంగాల్‌ తొలివిడత ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు దక్కించుకోబోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ ఏకంగా 110 సీట్లను సొంతం చేసుకోబోతుందన్నారు. బెంగాల్ ప్రజలు ప్రస్తుత పాలన పట్ల విసిగిపోయారని, రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

    ఓటర్లు ఎనలేని ఉత్సాహంతో, ఆవేశంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని అందుకే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందన్నారు. ఇది అధికార పక్షానికి వ్యతిరేకంగా జరిగిన  నిశ్శబ్ద విప్లవమని అభిప్రాయపడ్డారు. అయితే నిన్న (గురువారం) ప్రధాని మోదీ సైతం ఈ విధంగానే మాట్లాడారు. బెంగాల్‌లో జరిగిన భారీ ఓటింగ్‌ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. మే 4 తర్వాత బెంగాల్‌లో విజయోత్సవ సభ నిర్వహిస్తామని బెంగాల్‌ ప్రజలకు ఝాల్‌మురీ, స్వీట్లు పంపిణీ చేస్తానని తెలిపారు.  

    కాగా  ఎన్నికల ఫలితాలు రాకముందే ఇంత భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంటామని ప్రకటించడం వెనుక బీజేపీ పక్కా వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మిగిలిన విడతల ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా బెంగాల్ తొలివిడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 92.72శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. కాగా రెండో విడత పోలింగ్ ఏప్రిల్‌ 29న జరగనుంది.

Politics

  • ఢిల్లీ: బీజేపీ తలపెట్టిన ఆపరేషన్‌ లోటస్‌ సక్సెస్‌ అయ్యింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పది మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురుని బీజేపీ ఆకర్షించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సమక్షంలో ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా,అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ బీజేపీలో చేరారు. ఏడుగురు ఎంపీలు వీడడంతో ఆప్‌ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది.

    ఆమ్ ఆద్మీ పార్టీకి  రాజీనామా ప్రకటించిన రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధినేత నితిన్ నబిన్ సమక్షంలో బీజేపీలో చేరారు. మిగిలిన నలుగురు ఎంపీలు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీలు ఉన్నారు. వారి ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత లేదు. అయితే, ఆ నలుగురు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్‌కు రాజీనామా వార్తలతో ఆ నలుగురు ఎంపీలతో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.

    మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ లక్ష్యంగా బీజేపీ భారీ  ‘ఆపరేషన్ లోటస్’కు శ్రీకారం చుట్టింది. గతంలో పంజాబ్ ఇంఛార్జిగా పని చేసిన రాఘవ్ చద్దాను ఆప్ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌  పక్కన బెట్టారు. ఈ అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.అదే సమయంలో కమలం నేతలు రాఘవ్‌ చద్దా ద్వారా ఆప్‌లో చీలిక తెచ్చింది.

    పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం  ఆశిస్తోంది. మొన్నటి దాకా అకాలీ దళపై ఆధారపడ్డ బీజేపీ..ఇక నుంచి పంజాబ్‌లో సొంతంగా ఎదగాలని దూకుడుగా వెళ్తోంది.   

     

  • తాడేపల్లి : విద్యుత్‌ చార్జీలపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ భాబు మండిపడ్డారు.  ఎన్నికలకు ముందు విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు..  ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  ఇది కాకుండా 23 నెలల్లోనే రూ. 20 వేల కోట్ల భారాన్ని జనం మీద మోపారని టీజేఆర్‌ విమర్శించారు.

    ఈరోజు(శుక్రవారం, ఏప్రిల్‌ 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్‌..  చంద్రబాబు ఇచ్చిన హామీలపై మాట్లాడకుండా.. సొల్లు కబుర్లు, ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నారన్నారు. 

    ‘విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ 2003లో మహిళలు ధర్నాకు దిగితే గుర్రాలతో తొక్కించిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి మళ్లీ మాయమాటలతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. విద్యుత్ కొనుగోళ్లలోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. సెకీ నుంచి వైఎస్ జగన్ 2.49 రూపాయలకు కొంటే.. చంద్రబాబు 4.49 రూపాయలకు కొన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ బయట పెడుతున్నారనే వైఎస్‌ జగన్ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, మంత్రులు నిద్రలో కూడా జగన్ జపమే చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. 

    జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?
  • ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కథనమే ఇది. అందులోను ఎల్లో మీడియా ఈ రకమైన స్టోరీలు ఇచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో  జీతాలు  తగ్గించారని,  ఏపీ ఆర్ధిక పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని, జాగ్రత్తపడకపోతే అధోగతే అంటూ టీడీపీ పక్షాన  పనిచేసే ఆంధ్రజ్యోతి బానర్ వార్తను  ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు,  ఉన్నతాధికారుల జీతాలలో ఆరు నెలలపాటు  ముప్ఫై శాతం    కోత పెట్టాలని , మూడు,నాలుగు  రోజుల క్రితం  రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.

    ఖర్చు తగ్గించుకుంటున్నట్లు కనిపించడానికి ఆ రాష్ట్రం ఈ చర్య చేపట్టింది. .తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం దీనిని  క్లూగా వాడుకుని తన మీడియాకు ఒక లీక్ ఇచ్చినట్లు  కనిపిస్తుంది.ఏపీలో ఆర్ధిక పరిస్థితి అంతంతేనని, అప్పుల భారం అదికం అవుతోందని,అందువల్ల ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని రాయండని ఎల్లో మీడియాకు పురమాయించి ఉండాలి.

    తదనుగుణంగా ఆ మీడియా రాజభక్తితో ఆ కధనాన్ని ఇచ్చి ఉండాలి.  విశేషం ఏమిటంటే  తమిళనాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ఎన్నికల సభలలో మాట్లాడుతూ  కేంద్రం సహకారంతో ఏపీ  బుల్లెట్ వేగంతో అభివృద్ది చెందుతోందని చెప్పారని కూడా ఇదే  ఎల్లో మీడియా రాసింది.చంద్రబాబు చెప్పినదానిలో వాస్తవం ఉంటే  ప్రభుత్వం పక్షాన పేద ఏడుపులు ఏడుస్తూ ఎల్లో మీడియా ప్రజలను ఎందుకు భయపెట్టింది? చంద్రబాబు అబద్దం చెప్పినట్లా?లేక ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లా?ఇదే  ఎల్లో మీడియా 2024 ఎన్నికల సమయంలో కూటమి మానిఫెస్టోకి భజన చేస్తూ అద్భుతం, అమోఘం, చంద్రబాబు సంపద సృష్టించగలరు.తద్వారా సూపర్ సిక్స్ హామీలతో సహా ఎన్నికల మానిఫెస్టో అంతటిని చిటికిన వేలుతో అమలు చేసేయగలరు అని ఎందుకు ప్రచారం చేశారు.

    అందులో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తామని, అంటే జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? ఉద్యోగుల ఇతర కోర్కెలను నెరవేరుస్తామని ఎలా చెప్పారు?ఇప్పుడేమో ఆర్ధిక క్రమశిక్షణ అవసరం అని సన్నాయి నొక్కులు ఎందుకు రాస్తున్నారు?ఇది ప్రజలను ,అందులోను ప్రభుత్వ ఉద్యోగులను  మోసం చేయడం కాదా ?అన్న ప్రశ్న వస్తుంది కదా!ఉద్యోగుల జీతాలవల్ల ఆర్దిక భారం అధికంగా ఉందని చెప్పడం తో పాటు సంక్షేమ స్కీముల అమలు వల్ల కూడా బాగా ఖర్చు అవుతోందని,  ఇందులో చాలా దుబారా ఉందని ఎల్లో మీడియా అంటోంది. ఇది చంద్రబాబు అభిప్రాయంగా తీసుకునే అవకాశం సహజంగానే ఉంటుంది. ఎందుకంటే  ఆయన ఎప్పుడు ఏది చేసినా ముందుగా ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంటుందా?నెగిటివ్ గా ఉంటుందా?అన్నది చూసుకుంటారు.మొదటిసారి సీఎం అయినప్పుడే ఆయన  ఇలాంటి సర్వేలు చేసుకునేవారు.

    1996 ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేయకపోతే  నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే  సబ్సిడి బియ్యం ధర ఐదు రూపాయలు అవుతుందని ప్రచారం చేసేవారు. తమకు ఎక్కువ సీట్లు వస్తేనే మద్య నిషేధం కొనసాగించగలుగుతామని చెప్పేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ తో దాదాపు  సమానంగా టీడీపీ, సిపిఐ, సిపిఎమ్ కూటమికి  సీట్లు వచ్చాయి. తర్వాత ఆయన  రూటు  మార్చారు.  ప్రజాభిప్రాయ సేకరణ  అంటూ కొత్త కధ ఆరంభించారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, సబ్సిడి బియ్యం రేట్లు పెంచకపోతే ప్రభుత్వం భరించలేదని చెప్పేవారు. అంతకు ముందు ఎన్.టి.రామారావు అమలు చేసిన  మద్య నిషేధాన్ని కొనసాగించలేమని, అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోందని, దానిని నియంత్రించలేకపోతున్నామని, ఆదాయం కూడా రావడం లేదని ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందేమో  ఎన్.టి.ఆర్ అనుమతించిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేశారు.

    తద్వారా మద్య  నిషేధం పై సీరియస్ గా ఉన్నట్లు చంద్రబాబు  పిక్చర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాతేమో మొత్తం ఎత్తివేశారు.ఆ టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదేమో!ప్రజాభిప్రాయ సేకరణలో తన వాదనకు  అనుకూలంగా ఎక్కువమంది మాట్లాడేలా చూసుకునేవారు.తదుపరి జనం అంతా అలాగే కోరుకుంటున్నారని చెప్పి నిర్ణయాలను  మార్చివేసేవారు. ఇదేకాదు.1999లో బిజెపితో కలిసి కూటమి కట్టడంతో మళ్లీ గెలవగలిగారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలపై సమీక్షలు చేసి,వాటిలో లాభాలు  ఆర్జించని సంస్థలను మూసివేసే ప్రక్రియ ఆరంభించారు.ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశారు.అప్పుడు  ప్రభుత్వరంగ సంస్థలు తెల్ల ఏనుగులుగా మారాయని, వృధా వ్యయం అని పబ్లిసిటీ చేసేవారు.ఆ సంస్థలకు ఉన్న భూములను ప్రైవేటువారికి అప్పగించేశారు.ఆ భూములను ఆ సంస్థలు  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నాయని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.

    ప్రభుత్వ ఉద్యోగులు అవసరానికి మించి ఉన్నారన్న భావన కల్పిస్తుంటారు.అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు  పాలనపై మండిపడుతుండేవారు. అది ఎంతవరకు వెళ్లిందంటే  చంద్రబాబు రిటైర్ మెంట్ వయసును  55 ఏళ్లకు తగ్గించబోతున్నారని ఉద్యోగులంతా నమ్మేవారు.నిజానికి ఆ ప్రతిపాదన లేదని అంటారు.కాని చంద్రబాబు ప్రభుత్వ సరళి చూశాక ఉద్యోగులంతా ఆ వదంతిని   నమ్మారు.2004లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణం అయింది. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిలో విద్యుత్ రంగం ఒకటి.దానిద్వారా తనకు క్రెడిట్ వస్తుందని అనుకున్న చంద్రబాబు  ఆ సంస్కరణలు అన్నీ తనవే  అని ప్రచారం చేసుకునేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని అప్పటి ప్రతి పక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే  అలా చేస్తే  తీగెలపై  బట్టలు ఆరేసుకోవల్సిందేనని అనేవారు. తదుపరి వైఎస్ అధికారంలోకి రావడం, దానిని అమలు చేయడం జరిగింది.  ఆ తర్వాత ఆ ఘనత తనదేనని  కూడా చంద్రబాబు చెప్పుకునేవారు.

    తదుపరి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన  కూడా ఉచిత విద్యుత్ ను కొనసాగించారు.అలా ఉంటుంది ఆయన  తీరు.గత టరమ్ లో ఉద్యోగుల జీతాభత్యాలపై ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో ఆయన  చేసిన సంభాషణ  వీడియో బయటకు వచ్చింది.ఇద్దరూ కూడా ఉద్యోగుల జీతాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లుగా ఆ వీడియో ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు నష్టం చేసింది.అధికారంలో ఉంటే సంస్కరణలు  గురించి మాట్లాడే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అన్ని ఫ్రీ అని, ఎక్కడలేని వాగ్దానాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే  మహిళలకు  ప్రతి నెల 1500 రూపాయలు, బలహీనవర్గాలకు ఏభై  ఏళ్లకే  పెన్షన్ తదితర సుమారు 150 హామీలు ఇచ్చారు.వాటన్నిటి ఖర్చు ఏడాదికి లక్షన్నర కోట్లు అవుతుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు తాము సంపద సృష్టిస్తామని, వాటిని అమలు చేసి చూపిస్తామని గప్పాలు  పలికేవారు.అధికారంలోకి వచ్చాక  మాత్రం తెల్లముఖం వేసి వారి హామీలను నమ్మిన ప్రజలను వెర్రివాళ్లుగా చేశారు.

    ఇటీవల ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే  సరిపోతోందని, అప్పులు చేసి సంక్షేమం అమలు చేస్తున్నామని చంద్రబాబు  చెప్పడం ఆరంభించారు.అంటే జనాన్ని మానసికంగా తయారు చేయడం అన్నమాట.దాని కొనసాగింపుగా ఎల్లో మీడియా దీనిని భుజాన వేసుకుని సంక్షేమంలో చాలా వృదా అవుతోందని అనర్హులకు స్కీములు వెళుతున్నాయని  ప్రచారం మొదలుపెట్టారు.అవన్ని అర్జంట్ గా మార్చేయాలని అంటున్నారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తే  ఇదే ఎల్లో మీడియా జగన్ పై శరాలను వదిలి, జాకీలుపెట్టి టీడీపీని లేపడానికి యత్నించింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే నిజంగానే ఆ హామీలన్నీ అమలు అవుతాయేమో అన్నంతగా నమ్మేలా ప్రచారం చేశారు. 

    ఇప్పుడేమో యధా ప్రకారం వారి శైలిలో అదంతా వృధా ఖర్చు. వాటిలో కోత  పెట్టాలి అంటూ వాదన తీసుకు వస్తున్నారు.విశేషం ఏమిటంటే చంద్రబాబు టీమ్ కాని, ఎల్లో మీడియాకాని అమరావతిలో మాత్రం అప్పులు చేసి అయినా  లక్షల కోట్లు వ్యయం చేయాలని చెబుతున్నారు.మరి అది ఎవరి ప్రయోజనాల కోసం?ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చిన హామీల గురించి అడగకుండా, పిఆర్సి, బకాయిల చెల్లింపు మొదలైనవాటి గురించి అడగకుండా ఎల్లో మీడియా ద్వారా ఈ రకమైన  బెదిరింపులు చేశారా అన్న అనుమానం వస్తుంది.

    జీతాలు ఇస్తే చాలు.. ఉద్యోగాలు ఉంటే చాలు అన్న అభిప్రాయం కలిగిస్తే ఏ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగుల తరపున  డిమాండ్ల ఊసెత్తడానికి గజగజలాడడానికి ఈ కధనాలు సృష్టించినట్లుగా ఉంది. ప్రజలు సంక్షేమ హామీల గురించి అడగకుండా రాష్ట్ర ప్రయోజనాలపైనే మాట్లాడుకోవాలన్నదే వీరి లక్ష్యం. ఏరు దాటేవరకు  ఓడ మల్లన్న, ఏరు  దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా కూటమితో పాటు ఎల్లో మీడియా పనిచేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.  ఏది ఏమైనా ఈ కధనాలను చూస్తే  ఉద్యోగులతో పాటు ఏపీ ప్రజలు మరోసారి మోసపోయారని అనుకోవల్సిందేనా?

    -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత 

  • సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్‌ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

    ‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్‌ దుయ్యబట్టారు.

    ‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్‌ ప్రశ్నించారు.

    నీ డప్పు ఆపు... ప్రజల కష్టాల వైపు కొంచెం చూడు...

Family

  • తీవ్రమైన వేడి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రమాదం అంచుకు నెడుతోంది. ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వడగాలులు తీవ్రతరం అవుతుండటంతో పంటలు, పశుసంపదపై ఒత్తిడి పెరుగుతోంది. యావత్‌ సమాజం ఉద్గారాలను తగ్గించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప ఆహార, వ్యవసాయ వ్యవస్థలకు, 120 కోట్లకు పైగా ప్రజల జీవనోపాధులు, ఆహార భద్రత పెను ముప్పును ఎదుర్కోక తప్పదని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఐక్యరాజ్యసమితి సంస్థలు ఉమ్మడి నివేదికను విడుదల చేశాయి. 

    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని దెబ్బతింటున్నది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పని గంటలు కోల్పోతున్నామని, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రతరం కానున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.

    పశువులు, పంటలకు కష్టం
    వ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఉష్ణోగ్రత పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రధాన పంటలదిగుబడులు తగ్గడం మొదలవుతోంది. దీనివల్ల పంట మొక్కలు బలహీనపడి, ఉత్పాదకత తగ్గుతోంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. వేడిని తట్టుకోలేనందున వాటి పెరుగుదల తగ్గిపోతుంది. 

    పాల దిగుబడి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుందని నివేదిక హెచ్చరించింది. సముద్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్‌ స్థాయిలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించి, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచుతుండటంతో అడవులు కూడా ప్రభావితమవుతున్నాయి. 

    తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచటమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం ప్రేరేపిస్తుంది. కరువులను ప్రేరేపించగలదు, నీటి కొరతను మరింత తీవ్రతరం చేయగలదు, కార్చిచ్చు ప్రమాదాలను పెంచగలదు. అంతేకాదు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేయగలదు. ఇలాంటివన్నీ కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపే స్థితికి చేర్చుతాయని నివేదిక తెలిపింది.

    పనులు చెయ్యలేని రోజులు..
    తీవ్రమైన వేడి ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పంటలు, పశువులకే కాదు మనుషులకు కూడా నష్టం అంతే తీవ్రంగా ఉంది. దక్షిణాసియా, సహారా ఉప–ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట పనులు చేయడానికి వీలుకాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరగొవచ్చు. ఇది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేసి, ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది.

    ఉదాహరణకు, 2025లో కిర్గిజ్‌స్థాన్‌లో సంభవించిన వడగాడ్పుల కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగాయి. ఇది ధాన్యం దిగుబడుల్లో 25 శాతం తగ్గుదలకు కారణమవ్వటానికే కాకుండా, ఎడారి మిడతల దండును ప్రేరేపించి, నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది.

    ఇతర ప్రాంతాలలో, 2023 మరియు 2024లో బ్రెజిల్‌లో దీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మరియు కరువు పరిస్థితులు సోయాబీన్‌ దిగుబడులను 20 శాతం వరకు తగ్గించాయి , అదే సమయంలో 2021లో ఉత్తర అమెరికా అంతటా సంభవించిన తీవ్రమైన వడగాలులు పండ్ల పంటలలో గణనీయమైన నష్టాలకు మరియు అటవీ అగ్నిప్రమాదాలలో తీవ్రమైన పెరుగుదలకు దారితీశాయి.

    తక్షణ చర్యలు తీసుకోవాలి
    అధిక వేడిని తట్టుకునే పంట రకాలను తయారు చేసుకోవటం, నాట్లు వేసే సమయాలను వేడికి అనుగుణంగా సర్దుబాటు చేయటం, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి తక్షణ చర్యలతో నష్టనివారణకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలకులకు పిలుపునిచ్చింది. 

    పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడటానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, బీమా, సామాజిక భద్రత వంటి ఆర్థిక సహాయ పథకాలను అందుబాటులోకి తేవటం కూడా చాలా కీలకం. 

    చదవండి: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!

    వ్యవసాయ భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణకు, వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని పంటలకు పెంపొందించాలి. కర్బన ఉద్గారాలను భవిష్యత్తులో భారీగా తగ్గించుకోవటం కూడా అవసరమని ΄పాలకులకు ఎఫ్‌ఏఓ, ఐడబ్ల్యూఓ పిలుపునిచ్చాయి.

    బలహీనతలు తీవ్రతరం
    వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పంపిణీ వ్యవస్థల్లో పని పరిస్థితులను తీవ్రమైన వేడిమి అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ, ఆహార పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత తీవ్రతరం చేసే ఒక ‘సంక్లిష్ట ప్రమాద కారకం’గా అధిక వేడి పనిచేస్తోందని ΄ాలకులు గుర్తించాలి.
    – సెలెస్ట్‌ సౌలో, డైరెక్టర్‌ జనరల్, ప్రపంచ వాతావరణ సంస్థ  

    ఆహార భద్రతపై ఒత్తిడి
    తీవ్రమైన వేడి పంటలు, పశుసంపద, మత్స్య సంపద, అడవులపై, అలాగే వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఆహార భద్రతపై ఒత్తిడిని పెంచుతోంది. 
    – క్యు డోంగ్యు, డైరెక్టర్‌ జనరల్, ఐక్యరాజ్యసమితి ఆహార–వ్యవసాయ సంస్థ  

    నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్‌ 

  • ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య పరీక్షల పట్ల అప్రమత్తంగా ఉండటం ప్రాణాలను కాపాడుతుందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు నిరూపించారు. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకపోయినప్పటికీ, సాధారణ హెల్త్ చెకప్‌తో ఓ వ్యక్తికి ప్రాణాంతక కిడ్నీ ​కేర్‌ను గుర్తించి విజయవంతంగా చికిత్స అందించారు.

    నగరానికి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు (బీపీ, షుగర్ వంటివి) లేవు. ధూమపానం అలవాటు కూడా లేదు. అయితే, ఇటీవల ఆయన చేయించుకున్న సాధారణ మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా చేసిన అబ్డామినల్ అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎడమ కిడ్నీలో సుమారు 8 సెంటీమీటర్ల మేర పెరిగిన గడ్డ (మాస్) బయటపడింది. వెంటనే సీటీ స్కాన్ నిర్వహించగా అది కిడ్నీ కేన్సర్‌గా నిర్ధారణ అయింది.

    AINU యూరాలజీ హెచ్‌ఓడి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస నారాయణం నేతృత్వంలోని బృందం ఆ రోగికి రాడికల్ నెఫ్రెక్టమీ (సర్జరీ ద్వారా కిడ్నీ తొలగింపు) నిర్వహించింది. పరీక్షల్లో అది 'క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా'గా తేలింది. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 

    ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస నారాయణం మాట్లాడుతూ.. "ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4.3 లక్షల కొత్త కిడ్నీ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. విచారకరమైన విషయం ఏమిటంటే.. 70 నుంచి 80 శాతం కిడ్నీ కణితులు ఎటువంటి లక్షణాలు లేకుండానే పెరుగుతాయి. మూత్రంలో రక్తం రావడం, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది వ్యాధి ముదిరినట్లు లెక్క. అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం" అని వివరించారు. ధూమపానం, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారికి ముప్పు ఎక్కువ. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు.

    చిన్న గడ్డలను 'పార్షియల్ నెఫ్రెక్టమీ' ద్వారా కిడ్నీని కాపాడుతూనే తొలగించవచ్చు. పెద్ద గడ్డలకు మొత్తం కిడ్నీ తొలగించాల్సి ఉంటుంది. ఏడాదికి ఒకసారి కనీసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఇలాంటి సైలెంట్ కిల్లర్స్ నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా స్కానింగ్‌లో ఏవైనా తేడాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన యూరాలజిస్టులను సంప్రదించాలని AINU యాజమాన్యం కోరింది.

     డాక్టర్ శ్రీనివాస నారాయణం,AINU సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్

    (చదవండి: చిన్నారుల కోసం అపర'కాళి'లా ఆ శునకం!)

  • మూగజీవులు మనుషులకు మించి ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే గాదు..అలా రక్షించిన ఘటనలు కోకొల్లలు. తనకు ఎలాంటి ప్రమాదం లేదంటేనే రక్షించేందుకు ముందొకస్తాడు మనిషి.  కానీ ఈ శునకం తనకు అపాయం అని తెలిసి చిన్నారుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది .

    అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో,కాళి అనే వీధి కుక్క చేసిన సాహసం అక్కుడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ పాఠశాల సమీపంలో ఆరుబయట సుమారు 30 మందికి పైగా చిన్నారులు ఆడుకుంటారు. తమ వైపు బుస్సు బుస్సు మని నిశబ్దంగా వస్తున్న ప్రమాదం గురించి వారికి ఏ మాత్రం తెలియదు. దాన్ని తత్‌క్షణమే పసికట్టిన కాళీ అనే వీధి కుక్క ఆ చిన్నారులందర్నీ కాపాడేందుకు ఆ విషసర్పంతో పోరాడేందుకు ముందుకు దూకింది. 

    ఆ పాము వైపుకి దూసుకెళ్లి మరి నిర్విరామంగా పోరాటం చేసింది. చిన్నారుల వైపుకి ఆ పాముని రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది. చెప్పాలంటే ప్రమాదానికి పిల్లలకు మధ్య నిలబడి ఆ కాళి అనే కుక్కతో అపరకాళిలా పోరాడింది. పామును చంపేంత వరకు పోరాటం చేయడం విశేషం. అయితే ఆ పోరాటంలో ఆ పాము ఆ కుక్క ముఖం, నోటిపై కాటేసినా.. లెక్కచేయకుండా  పోరాడి దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టింది. 

    ఆ తర్వాత కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది ఆ శునకం. అప్పటికే ఆ కుక్కకి తక్షణ సహాయం అందడంలో ఆలస్యమైపోయింది. ఆ విషం అప్పటికే దాని ప్రాణాలను బలిగొంది. ఒక్క బిడ్డకు కూడా హానికలగకుండా వీరోచితంగా పోరాడి యావత్తు గ్రామం మనసుని దోచుకుంది. నిజానికి  ఆ కాళి అనే కుక్క వీది కుక్క కాదు, తమ రక్షకురాలు అని భావోద్వేగంగా అంటున్నారు స్థానికులు. 

    దాని త్యాగానికి గుర్తుగా మొత్తం గ్రామమే కదిలివచ్చి మరి వీడ్కోలు పలికారు. దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలమాలతో అలంకరించి, గ్రామం గుండా అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకువెళ్తూ..ఆ శునకానికి నివాళులు అర్పించారు. విశ్వాసంలో కుక్కకు మించిన వారు లేరని రుజువు చేసే ఘటన ఇది.  

    (చదవండి: జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!)