Archive Page | Sakshi
Sakshi News home page

International

  • ఇరాన్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానీకి ఉరి శిక్ష విధించనున్నట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. రాజధాని టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరంలో జరిగిన నిరసనల సందర్భంగా సోల్తానీని గత వారం అరెస్టు చేశారు. సరైన విచారణ లేకుండా జనవరి 14న అతనికి ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు కుటుంబానికి సమాచారం అందింది. నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) ఈ విషయాన్ని ధృవీకరించింది.  

    ఇప్పటివరకు నిరసనలలో 648 మంది మరణాలు అధికారికంగా నమోదు అయ్యాయని IHR తెలిపింది. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని అంచనాల ప్రకారం, మరణాల సంఖ్య 6,000 దాటే అవకాశం ఉంది. ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా స్వతంత్ర ధృవీకరణ కష్టమవుతోంది. ఇప్పటివరకు 10,000 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరో మానవ హక్కుల సంస్థ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (NUFD) సోల్తానీ ఉరి శిక్షను ఆపాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. సోల్తానీ చేసిన నేరం ప్రజాస్వామ్యం కోసం తన గొంతు వినిపించడం మాత్రమేనని NUFD పేర్కొంది.  

    అమెరికా నివేదిక ప్రకారం, కరాజ్లో శనివారం నిరసనల సమయంలో సోల్తానీని అరెస్టు చేశారు. సోల్తానీపై "దేవునిపై యుద్ధం చేస్తున్నాడు" అనే అభియోగం మోపబడింది. ఈ అభియోగం ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్షకు దారితీస్తుంది. న్యాయవాదిని కలిసే హక్కు కూడా అతనికి నిరాకరించబడిందని NUFD ఆరోపించింది.  సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. సోల్తానీకి ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్నది ఇంకా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు.  

    ఈ ఘటన ఇరాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందా లేదా ప్రభుత్వం మరింత కఠినతర చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.

  • సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో చదువు కొనసాగించాలని కలలుకంటున్న భారతీయ విద్యార్థులకు మరో పెద్ద షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ భారతదేశాన్ని ‘అత్యధిక రిస్క్’ కేటగిరీ (Assessment Level 3 – AL3)లో ఉంచింది.  

    ప్రధాన మార్పులు  
    - భారతదేశం AL3 కేటగిరీకి: ఇంతవరకు AL2లో ఉన్న భారత్ ఇప్పుడు AL3లోకి పడిపోయింది.  
    - డాక్యుమెంటరీ అవసరాలు: విద్యార్థులు తమ ఆర్థిక స్థితి, విద్యా అర్హతలకు మరింత బలమైన రుజువులు సమర్పించాలి.  
    - బ్యాంక్ స్టేట్మెంట్లు: ఆర్థిక స్థితి నిరూపణ కోసం నేరుగా బ్యాంక్ ధృవీకరణ అవసరం.  
    - డిగ్రీల ధృవీకరణ: విద్యా అర్హతలు సంబంధిత సంస్థల నుండి నేరుగా ధృవీకరించబడతాయి.  

    భారతదేశం ఆస్ట్రేలియాకు అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి వనరులలో ఒకటి. ప్రస్తుతం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఈ మార్పులు 2026 జనవరి 8 నుండి అమల్లోకి వస్తాయి. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా అదే ‘హై రిస్క్’ విభాగంలో ఉంచబడ్డాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో నకిలీ డిగ్రీ రాకెట్లు, వీసా మోసం కేసులు పెరగడం వల్ల ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల దక్షిణాసియా విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ప్రవేశం మరింత కఠినతరం అవుతుంది. 

  • ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.

    ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్‌చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.

    2024లో మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినప్పుడు జెలెన్‌స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్‌చుక్ తెలిపారు. జెలెన్‌స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్‌ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్‌లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్‌చుక్‌ తెలిపారు.

    అయితే ఇంతకాలం భారత్‌ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్‌ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్‌ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.

  • భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. షక్సాగామ్ వ్యాలీలో చైనా మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించదని తేల్చిచెప్పారు. 1963లో చైనా-పాక్‌ మధ్య జరిగిన భూబదిలీ ఒప్పందాన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించేది లేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.

    కాగా షక్సాగామ్ వ్యాలిలో చైనా చేపడుతున్న నిర్మాణాలపై జనవరి 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భూమిపై పాక్‌- చైనా చేసుకున్న ఒప్పందం ఎప్పటికీ చెల్లదు. దీనిని భారత్ ఎప్పటికీ గుర్తించదని ప్రకటించింది. అయితే దానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో వింగ్ నిన్న (సోమవారం) స్పందించారు. 1963లోనే ఈ భూభాగంపై పాకిస్థాన్-చైనా అంగీకారం చేసుకున్నాయని ఇప్పుడు దానిపై స్పందించడానికి భారత్‌కు అవకాశం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేదీ తాజాగా స్పందించారు.  

    జనరల్ ద్వివేదీ మాట్లాడుతూ " ఈ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను భారత్ గుర్తించదు. షక్సాగామ్‌పై 1963లో పాక్‌తో చేసుకున్న ఒప్పందం ఎట్టిపరిస్తితుల్లో చెల్లదు. అక్కడ కట్టే నిర్మాణాలను అక్రమ కట్టడాలుగానే భారత్ భావిస్తోంది" అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని కూడా జనరల్ ద్వివేదీ స్పష్టం చేశారు.

    షక్సాగామ్ వివాదం
    షక్సాగామ్ లోయ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉంది. దీనిని పాకిస్థాన్ 1963లో జరిగిన ఒప్పందంలో భాగంగా చైనాకు అప్పగించింది. ఆ భూమిలో ప్రస్తుతం చైనా రహదారులు, సైనికస్థావరాలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తుంది. 

  • ఇరాన్‌లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.

    ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.

    రెండు వేల మంది మృతి
    ఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారి ఒకరు మరణాల సం​ఖ్యను వెల్లడించారు.  ఇరాన్‌ పౌరులు చేపట్టిన ఈనిరసనలను  ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. 

    అయితే ఇరాన్‌ రెడ్‌లైన్‌ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

     

  • వాషింగ్టన్‌:గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తోంది. ఆ దీవిని అమెరికాలో కలపాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు రాండి ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌లాండ్‌ అనక్సీయేషన్‌ అండ్‌ స్టేట్‌హుడ్‌ యాక్ట్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపడం, ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించడం వంటి అంశాలు పొందుపరచబడ్డాయి.

    ఈ మేరకు రాండి ఫైన్ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘బిగ్ న్యూస్. చట్టసభలో  గ్రీన్‌లాండ్‌ అనక్సీయేషన్‌ అండ్‌ స్టేట్‌హుడ్‌ యాక్ట్‌ పేరుతో బిల్లును ప్రవేశపెట్టాను. ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపాలి. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలపాలి’ అని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలుపుకోవడం ద్వారా జాతీయ భద్రత బలోపేతం అవుతుంది. అదే సమయంలో గ్రీన్‌లాండ్‌ను అమెరికా రాష్ట్రంగా మార్చడం ద్వారా ఆర్కిటిక్‌ ప్రాంతంలో చైనా, రష్యా ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి గ్రీన్‌లాండ్ అమెరికా భద్రతకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.

    ప్రస్తుతం గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. దీనికి స్వంత పార్లమెంట్ ఉన్నప్పటికీ, విదేశాంగం, రక్షణ వ్యవహారాలు డెన్మార్క్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ట్రంప్ డెన్మార్క్‌తో చర్చలు జరిపి గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం లేదా అమెరికాలో కలుపుకోవడం కోసం అధికారం పొందుతారు. గ్రీన్‌లాండ్ భౌగోళికంగా చాలా ముఖ్యమైనది. ఇది ఆర్కిటిక్‌ సముద్ర మార్గాలను నియంత్రించగలదు, అలాగే సైనిక రవాణా, వాణిజ్యం, ఇంధన మార్గాలు అన్నీ ఇక్కడి ద్వారా ప్రభావితం అవుతాయి.

    2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డెన్మార్క్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది ఆమోదం పొందితేనే గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. 

  • ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 2026, ఫిబ్రవరి 12న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో, తమకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ దేశంలోని మైనారిటీ సంఘాలు ఎన్నికల సంఘాన్ని (ఈసీ)కోరాయి. తాజాగా ఫెనీ జిల్లాలో సమీర్ దాస్(28) అనే హిందూ యువకుడిని దుండగులు దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి హత్య చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

    ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్య వేదిక ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి, హిందూ ఓటర్లకు తగిన భద్రత కల్పిస్తూ, ఎన్నికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని, దీంతో ఓటు వేయాలంటే భయం కలుగుతోందని మైనారిటీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఎన్నికల సంఘంతో జరిగిన భేటీలో, హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. భయం నీడలో ఓటు వేయడం సాధ్యం కాదని, హింసను నివారించడానికి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కేటాయించాలని వారు  కోరారు. గత డిసెంబర్ నెలలోనే మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించి దాదాపు 51 కేసులు నమోదైనట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు మరింతగా పెరిగాయి. ఫెనీ జిల్లాలో సమీర్ దాస్ హత్యకు గురికాగా, అంతకుముందు జెస్సోర్ జిల్లాలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యాపారిని కాల్చి చంపారు. నర్సింగ్దీ జిల్లాలో శరత్ మణి చక్రవర్తి అనే కిరాణా షాపు యజమాని కూడా దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా దాడులు మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని  మైనారిటీ సంఘాలు పేర్కొన్నాయి.

    బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. సమీర్ దాస్ హత్యను ఖండించిన బీజేపీ నేత అమిత్ మాలవీయ.. యూనస్ నేతృత్వంలోని  ప్రభుత్వం మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ దాడులను కల్పితం అని  ప్రభుత్వం కొట్టిపారేయడం విచారకరమని సీనియర్ పాత్రికేయుడు కాంచన్ గుప్తా పేర్కొన్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ హింసపై మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.

    ఇది కూడా చదవండి: అయోధ్య నుండి పూరి.. ఐఆర్సీటీసీ గోల్డెన్‌ ఆఫర్‌

  • ట్రంప్‌ ఉద్దేశం నిజంగా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీయడమేనా?. అందుకే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించారా?.. ఇక మీదట ఏ దేశం కూడా ఇరాన్‌ వైపు చూడకూడదనేదే ఆయన ఆలోచనా?. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే కాదేమో అనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన కనిపిస్తోంది ఆయన వ్యవహారం.

    ‘‘మోదీ-ట్రంప్‌ది నిజమైన స్నేహం. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారత్‌-అమెరికా రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం అనేది చాలా కీలకం. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇక సుంకాలనేవి పెద్ద విషయమే కాదు. మాకు భారత్‌ తర్వాతే ఎవరైనా’.. ఇది భారత్‌కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన  సెర్గియో గోర్‌ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో.. 

    ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇరాన్‌ సంక్షోభం.. ఏదైనా సరే అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్‌ నిర్ణయాలు భారత్‌ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్‌ యద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్‌ సహకరిస్తోందంటూ ట్రంప్‌ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకున పెడుతున్నామని చెబుతూ.. భారత్‌పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్‌ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్‌తో వాణిజ్యం జరిపే టాప్‌ 5 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. అంటే.. ట్రంప్‌ తీసుకున్న 25 శాతం సుంకాల పెంపు నిర్ణయం భారత్‌కు వర్తించనుంది.  దీంతో ట్రంప్‌ అసలు టార్గెట్‌(రష్యా, ఇరాన్‌..)తో పాటు భారత్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. 

    స్నేహ హస్తం చాస్తూనే..
    రెండో దఫా అధికారంలోకి వచ్చాక భారత్‌తో ట్రంప్‌ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్‌ అమెరికాకు బాగా కావాల్సిన దేశమని.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారాయన. అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం లేదు. కీలక సదస్సులకు కూడా ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహ బంధానికి బీటల వారిందా? అనే చర్చా నడిచింది. అయితే.. ‘‘నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్‌) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి..’’ అంటూ ఓ వారం కిందట కూడా ట్రంప్‌ మాట్లాడారు.

    ఇంకా అయిపోలేదు.. 
    అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్‌ కరెక్ట్‌గా లేదంటూ ప్రతీకార సుంకంగా 25 శాతం.. అటుపై వద్దని చెబుతున్నా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతున్నారంటూ పెనాల్టీ పేరు చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్‌. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలను ఆయన తన మిత్రదేశం పైనే విధించినట్లైంది. అందునా.. ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుండానే(నాన్చుతూ వస్తున్నారు) ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్‌ ఉద్రిక్తతలతో దానిని 75 శాతానికి పెంచారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. 

    రష్యాతో చమురు వాణిజ్యం జరిపే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించే బిల్లుపై ఆయన ఇప్పటికే సంతకాలు చేశారు. ఆ బిల్లును రేపోమాపో అమెరికా చట్ట సభలో ముందుకు కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్‌ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్‌ దెబ్బకు అమెరికాతో భారత్‌ సంబంధాలు బలహీన పడ్డాయి. ఆయన తీరు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరింత అధ్వాన్నం కావొచ్చనే అమెరికా మాజీ విదేశాంగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

    ఇరాన్‌-భారత్‌.. ఎలాంటి ఎఫెక్ట్‌
    రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం వైఖరి మొండిగానే కనిపిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు భారత్‌ తలొగ్గదని.. జాతి ప్రయోజనాలకు తగ్గట్లు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా.. దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇరాన్‌ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించబోతుంది.. 

    ఇరాన్‌ నుంచి భారత్‌ మెథనాల్‌, పెట్రోలియం బిటుమెన్‌,  లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరాలు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ నుంచి ఇరాన్‌కు..  ఆర్గానిక్ కెమికల్స్, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్‌-భారత్‌ మధ్య 2024-2025 వాణిజ్యం విలువ.. అక్షరాల రూ.14,000 కోట్లు. అందులో భారత్‌ నుంచి ఎగుమతుల విలువ రూ.10,000 కోట్లు కాగా, దిగుమతులు రూ.3,700 కోట్ల పైమాటే. అయితే.. ట్రంప్‌ 2018లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షల కారణంగా భారత్‌ ఇరాన్‌ మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. ఎంతగా అంటే.. 2019లో ఆ వాణిజ్యం విలువ రూ.1.5 లక్ష కోట్లుగా ఉండేది. మరి తాజా ఆంక్షలతో ఏం జరుగుతోందో చూడాలి.. 

    నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కొత్త టారిఫ్‌లు కఠినంగా అమలు చేస్తే.. భారత కంపెనీలు అమెరికా మార్కెట్‌ యాక్సెస్‌ కాపాడుకోవడానికి ఇరాన్‌తో వ్యాపారాన్ని తగ్గించవలసి రావొచ్చు. అదే జరిగితే.. ఇరాన్‌కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.

    చాబహార్‌పై డైలమా?
    భారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ పాత్ర అత్యంత వ్యూహాత్మకం. పైగా భారత్‌ అక్కడ షహీద్ బెహేష్తీ టెర్మినల్ అభివృద్ధి చేస్తోంది. అయితే.. 2018 ఆంక్షల సమయంలో భారత్‌ విజ్ఞప్తి మేరకు ట్రంప్‌ సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చారు. తిరిగి.. 2025 సెప్టెంబర్‌లో పరిస్థితుల ‍ప్రభావమని చెబుతూ ఆ మినహాయింపును రద్దు చేశారు. దీంతో ఆ మినహాయింపు ఏప్రిల్‌ 29తో ముగియనుంది. దీంతో మినహాయింపు గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

    ఏమై ఉండొచ్చు.. 
    తనను తాను శాంతి కాముకుడిగా చెప్పుకుని తిరుగుతున్న ట్రంప్‌.. పెద్దన్న హోదాలో వరుసగా యుద్ధాలను ఆపుతున్నానంటూ హడావిడి చేస్తున్నారు. ఈ వంకతో నోబెల్‌ శాంతి బహుమతి అందుకోవాలని పక్కా ప్లాన్డ్‌తో ముందుకు సాగారు. కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ట్రంప్‌ను నోబెల్‌ వరించలేదు. దానికి భారత్‌ మోకాలు అడ్డుపెట్టిందని ఆయన బలంగా భావించి ఉండొచ్చు. పాక్‌తో ఉద్రిక్తతలు చల్లారడంలో ట్రంప్‌ ప్రేమయం(మూడో వ్యక్తి) లేదని ఢిల్లీ వర్గాలు తేల్చేశాయి. ఈ ప్రకటన ఆయనకు స్వతహాగా కోపం.. అసహనం తెప్పించి ఉండొచ్చు. పోనీ ఉక్రెయిన్‌ యుద్ధంతోనైనా నోబెల కల నెరవేరిందా? అంటే అదీ లేదు. వాణిజ్యం ఆపేయకుండా ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు భారత్‌ పరోక్షంగా సహకరించిందనే కోపమూ ఉండొచ్చు. వీటన్నింటితో పాటు షాంగై సదస్సు వేదికగా.. పుతిన్‌-జింగ్‌పిన్‌-మోదీల స్నేహంగా మెదలడమూ ట్రంప్‌కు నచ్చకపోయి ఉండొచ్చు. కారణాలేవైనా.. భారత్‌ విషయంలో ఆయన అనుకున్నది చేస్తూ పోతున్నారు.

Telangana

  • హైదరాబాద్‌: నగరంలోని కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం( జనవరి 13వ తేదీ) రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసకుంది.

    గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తుండగా గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. భారీ ఎత్తున మంటల ఎగిసి పడుతూ ఉండటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. 

     

  • సాక్షి హైదరాబాద్: బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) రాష్ట్ర బృందం ప్రపంచ ప్రసిద్ధ కూలూవెన్ యూనివర్సిటీతో  కీలక చర్చలు నిర్వహించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ విధానాలపై భారత్-బెల్జియం దేశాల మధ్య పోలికలు ప్రధాన అంశంగా ఈ భేటీ సాగింది.

    ఈ సందర్భంగా కూలూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్‌, ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్లపై వివరాలను భారత బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ విస్తృతి, సామాజిక వైవిధ్యం, సమాఖ్య స్వరూపం వంటి విశిష్ట లక్షణాలను ప్రస్తావిస్తూ భారత ఎన్నికల ప్రక్రియపై తులనాత్మక సమీక్ష ప్రవేశపెట్టారు.

    అనంతరం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌రెడ్డి మాట్లాడారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్‌మెంట్ ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ అనుభవాల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూ లూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఈ సందర్భంగా  ఆయన ఆహ్వానించారు.

    ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో 99 కోట్ల మందికిపైగా ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న కఠిన చర్యలు, పారదర్శకత, ఎన్నికల సమగ్రత పరిరక్షణ అంశాలను  భారత బృందం ఈ సందర్భంగా వారికి  వివరించింది.ఈ సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డితో పాటు అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె. అనంత్‌రెడ్డి, ధృవ కుమార్‌రెడ్డి తదితర అధికారులు  పాల్గొన్నారు.

  • సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో రంగోళీ పోటీలో వినూత్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటో తెలిస్తే.. మీరూ షాకవుతారు..! అందమైన రంగవల్లుల స్థానంలో చేతబడి ముగ్గులు వేస్తున్నారు కొందరు పిల్లలు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టినట్లుగా.. చేతబడి బొమ్మలు.. అదే వుడూలను ముగ్గులో పెడుతున్నారు.

    ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్ మండల పరిధిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ జరిగింది. అంతకు ముందురోజు ఓ కుర్రాడు ముగ్గుల పోటీకి పేరు ఇచ్చాడు. టీచర్లు ఆశ్చర్యంతో.. అదేంట్రా? అమ్మాయిలు కదా? ముగ్గులు వేసేది? అని ప్రశ్నిస్తే.. నేను కూడా ముగ్గు వేస్తాను అంటూ సమాధానమిచ్చాడు. సరేనని అవకాశమిస్తే.. పోటీరోజున సీరియస్‌గా ముగ్గు వేశాడు.

    జడ్జిమెంట్‌కు టీచర్ల బృందం ఒక్కోముగ్గును పరిశీలిస్తూ.. ఆ కుర్రాడి ముగ్గు వద్దకు వచ్చి అవాక్కయ్యారు. కొందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. కారణమేంటంటే.. అచ్చంగా క్షుద్ర పూజల్లో మాంత్రికులు వేసినట్లుగా ఆ కుర్రాడు చేతబడి ముగ్గు వేశాడు. అంతేకాదు..! ఆ ముగ్గు మధ్యలో ఓ చేతబడి బొమ్మను పెట్టి.. దాన్ని సూదులతో గుచ్చాడు. కంగారుపడ్డ టీచర్లు వెంటనే బకెట్ నీళ్లతో ఆ ముగ్గుని చెరిపివేయించారు. ఈ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉండే ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూనియర్ ఇంటర్ చదివే ఓ అమ్మాయి రంగోళీ పోటీలో ఇదేవిధంగా చేతబడి ముగ్గు  వేసి.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి టీచర్లు ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు.

     ఈ ఉదంతాలను గురించి వింటుంటే మీకేమనిపిస్తోంది? పిల్లల్లో చేతబడిపై ఆసక్తి పెరుగుతోందా? లేక.. ఈ మధ్యకాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మూఢనమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సైకాలజిస్టులు అనేక కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్విరాన్‌మెంట్.. అంటే.. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా సులభంగా పడుతుందంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చేతబడి సీన్లు ఎక్కువగా ఉండడంతో.. అనుకున్నది సాధించాలంటే.. ఇదొక్కటే షార్ట్‌కట్ అనే భావన పిల్లల్లో త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమాల్లో మంచి కంటే.. చెడు అనేది చాలా త్వరగా పిల్లల్లో నాటుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సినిమాల్లో మంత్రగాళ్లు చదివే చేతబడి మంత్రాలను పిల్లలు వల్లెవేయడం వంటి కేసులు తమ వద్దకు వచ్చాయని చెబుతున్నారు.

    ఇక పేరెంటింగ్ నిపుణులు, స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు సైతం తప్పు తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకుండా తమ పనుల్లో బిజీ అవుతున్నారని, చిన్నారులు ఏంచేస్తున్నారో చూసే తీరిక కూడా వారికి ఉండడం లేదని పేర్కొంటున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూడడంలో బిజీగా మారిపోతున్న చిన్నారులు క్రమంగా ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉండే యాప్స్, మంత్రసాధన సంబంధిత యాప్స్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు వివరిస్తున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ముమ్మాటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోపమే కారణమంటున్నారు. 

  • హైదరాబాద్ : ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్ కుమార్, దనసరి అనసూయలు అన్నారు. 

    మేడారం జాతరపై నేడు డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర గిరిజన, ఎస్సి సంక్షేమ, ... శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్, రాష్ట్ర పంచాయితీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి దనసరి అనసూయ (సీతక్క) లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు  అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు,  ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. 

    ఈ సందర్బంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో  జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని  వివరించారు. సమ్మక్క–సారలక్క జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు  పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

    దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.   

    ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.  

    ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

    తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు–సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.   

    రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.  రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్ లను మరింత పెంచాలని కోరారు. 

    జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు   

    రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి  సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్బంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకుగాను డ్రోన్ లను ఉపయోగించుకోవాలన్నారు. 

    అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్ ను/ క్యూ.ఆర్ కోడ్  రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. 

    ఈ సందర్బంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్ కుమార్, సి.ఎస్ రామకృష్ణ రావు లు ఆవిష్కారించారు.

  • ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి.. యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు.

    ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్ ఈ సందర్బంగా సుదర్శన్‌ రెడ్డికి వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల వివరాలు ఆయనకు తెలిపారు.

    అనంతరం ఈవో సుదర్శన్‌రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాల వివరాలు ఆయనకు తెలిపారు. ఈ వివరాలు తెలుసకున్న మాంగోల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల విధానంపై ప్రశంసలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.

    2025 జనవరి  నుంచి యూరోపియన్ పార్లమెంట్‌లో డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్‌గా క్రిస్టియన్ మాంగోల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతృత్వంలోని తెలంగాణ బృందం యూరప్ పర్యటనలో ఉన్నారు.  అందులో భాగంగా  ఈ భేటీ జరిగినట్లు అధికారులు తెలిపారు.

  • సాక్షి, హైదరాబాద్‌: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. నివేదిక కోరిన కమిషన్.. ఫిబ్రవరి 26వ తేదీలోపు రిపోర్ట్‌ అందజేయాలని టీహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.

    కాగా, నిషేధిత చైనా మాంజా నగరవాసుల ప్రాణాల మీదకు తెస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాగా తాజాగా, సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్‌ఐని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

     

     

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన కేసుల్లో సిట్‌ ఏర్పాటైంది. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫోటోలు అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టివి వాట్సాప్ గ్రూప్‌లో కావలి వెంకటేష్ పై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

    తాజాగా మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహరంలో సీసీఎస్‌లో కేసు నమోదైంది. రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ చానళ్లపై కేసు నమోదైంది. వీరిపై 75, 78, 79, 351(1), 352(2) BNS సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో సిట్‌ దర్యాప్తు చేయనుంది.

    సజ్జనార్ నేతృత్వంలో సిట్‌ సభ్యులు
    ఎన్. శ్వేత, ఐపీఎస్ (జాయింట్ సిపి నార్త్ రేంజ్)
    యోగేష్ గౌతమ్, ఐసీఎస్ (డీసీపీ, చేవెళ్ల, ఫ్యూచర్ సిటీ)
    కె. వెంకట లక్ష్మి(డీసీపీ అడ్మిన్ హైదరాబాద్ సిటీ)
    వి. అరవింద బాబు (డీసీపీ, సైబర్ క్రైమ్స్, హైదరాబాద్ సిటీ)
    బి. ప్రతాప్ కుమార్ (అదనపు ఎస్పీ, విఅండ్‌ఇ)
    జి. గురు రాఘవేంద్ర (ఏసీపీ, సీసీఎస్, హైదరాబాద్ సిటీ
    సి. శంకర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్)
    పి. హరీష్ (ఎస్ఐ, షీ సైబర్ సెల్)

     

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌-విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇనాంగూడ వద్ద కర్రల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ బోల్తా పడింది. లారీ పల్టీ కొట్టిన కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కర్రలు మొత్తంగా రోడ్డుపై పడిపోయాయి.

    ఈ కారణంగా హైవేపై సుమారు ఆరు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇనాంగూడ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. 
     

  • సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అనగానే గుర్తుకొచ్చే పేరు.. మదిలో మెదిలే చిహ్నం.. ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే పర్యాటక ప్రాంతం.. హైదరాబాద్‌ ఐకాన్‌గా ప్రసిద్ధి.. అదే చార్మినార్‌. దీని పరిసరాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా, ప్రత్యేకంగా కనిపించేలా వెలుగుజిలుగులతో స్పెషల్‌ లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. చారి్మనార్‌ నాలుగువైపులా ఉన్న వీధిదీపాల స్థానే ఆకర్షణీయంగా కనిపించే విద్యుత్‌ స్తంభాలు, ప్రకాశవంతమైన స్పెషల్‌ ఎల్‌ఈడీ లైటింగ్‌ ఏర్పాట్లు చేయనున్నారు.  

    చార్మినార్‌ చుట్టూ, పరిసరాల్లోని పత్తర్‌ఘట్టి, చార్‌కమాన్‌ ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు పాతబస్తీలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్న కులీ కుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) అధికారులు ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు ఆహ్వానించారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువుంది. పాతబస్తీలో వివిధ పనులు చేసేందుకు వెనుకాడుతున్న కాంట్రాక్టు ఏజెన్సీలు ఈ పనులు చేసేందుకు ఏమేర ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే. చారి్మనార్‌ పరిసరాల్లోనే ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన డిజిటల్‌ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసేందుకు కూడా టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు మొదలుకాలేదు.    

  • హైదరాబాద్: విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారులు అనాథలయ్యారు.. హత్యకేసులో తండ్రి జైలుకు వెళ్లగా.. తల్లి నిర్దయగా పిల్లలను వదిలి వెళ్లింది. దీంతో 40 రోజులుగా ఆ చిన్నారులు స్థానికులు ఇచ్చే ఆహారం తిని బతుకుతున్నారు. ఇలా ఎన్నాళ్లు? అని ఆలోచించిన ఓ న్యాయవాది సహకారంతో.. కోర్టు ఆదేశంతో చిన్నారుల బాధ్యతను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ తీసుకుంది. సోమవారం కుషాయిగూడలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ సత్తు రవీందర్, సిడబ్ల్యూసి మేడ్చల్‌ జిల్లా చైర్మన్‌ రాజారెడ్డితో కలిసి వెల్లడించారు.  

    • మల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉండే దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు (13) కూతురు (9), చిన్న కూతురు (2).  తండ్రి హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఇక పిల్లల బాగోగులు చూసుకోవాల్సిన  తల్లి వారిని వదిలివెళ్లి అనాథలుగా మార్చింది. దీంతో అభం శుభం ఎరుగని ఆ పిల్లలు చుట్టు పక్కలవారు ఏమైన పెడితే తింటూ అర్థాకలితో గత 40 రోజులుగా కాలం గడుపుతున్నారు. 

    • ఇరుగు పొరుగువారు, ఇంటి యజమాని పిల్లల దుస్థితిని గోపాల్‌రెడ్డి అనే న్యాయవాది సాయంతో మేడ్చల్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకెళ్లారు.  స్పందించిన జిల్లా న్యాయమూర్తి పిల్లల బాగోగులు చూసుకోవాలంటూ మేడ్చల్‌ జిల్లా చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.  స్పందించిన జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్‌ రాజారెడ్డి ముగ్గురు పిల్లలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరిని హోంకు తరలించగా మరో చిన్నారి ఆరు సంవత్సరాల లోపు కావడంతో అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్‌లో అప్పగించారు.  

    • ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురుదుష్టకరమని, అనాథలు, అభాగ్యులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసులను కానీ.. న్యాయసేవాధికార సంస్థలను కాని ఆశ్రయిస్తే తగిన న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాల భాస్కర్‌ స్పష్టం పేర్కొన్నారు. పిల్లల దీనస్థితిపై స్పందించి చేరదీసిన పెంటయ్య, శ్రీనివాస్, అనితలను అభినందించారు.   

    • ప్రజల్లో అవగాహన పెరగాలి  
      చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. చట్టంపై సరైన అవగాహన కొరవడి ఉచిత న్యాయసేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి అనాథ పిల్లలు, దిక్కులేని అభాగ్యులను ఆశ్రయం కలి్పంచే అనేక మార్గాలున్నాయి. అలాంటి వారు ఏవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌లు, న్యాయసేవాధికార సంస్థలను ఆశ్రయిస్తే వారికి తగిన న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలి. 
      – బాల భాస్కర్, మేడ్చల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి   

Sports

  • మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ జెయింట్స్ బ్యాట‌ర్లు త‌మ సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో మెరుపులు మెరిపించిన సోఫీ డివైన్.. ముంబైపై మాత్రం నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డివైన్ ఔటైంది.

    అయితే జార్జియా వేర్‌హామ్(33 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43), భారతి ఫుల్మాలి(15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు. వీరిద్దరితో పాటు మూనీ(33), కనిక అహుజా(35) రాణించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్‌, హీలీ మాథ్యూస్‌, అమీలియా కేర్‌, కారీ తలా వికెట్‌ సాధించారు.
    చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియాకు మ‌రో భారీ షాక్‌..

  • టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్‌వుడ్‌, ప్యాట్ కమ్మిన్స్‌, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిష్( మెల్‌బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.

    ఏమి జరిగిందంటే?
    ఈ మ్యాచ్‌లో మొదట ‍బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

    అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో..  జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్‌.. ఫిజియో సూచనతో  'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.

    అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్‌కు తరలించారు. అతడి గాయంపై అప్‌డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.

    టీ20 ప్రపంచకప్‌-2026కు ఆసీస్‌ జట్టు
    మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
    చదవండి: 'భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్‌ వైఖరి

  • టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తన పట్టు వీడటం లేదు. మంగళవారం ఐసీసీతో జరిగిన స‌మావేశంలోనూ టోర్నమెంట్ కోసం భారత్‌కు వెళ్లకూడదని తమ నిర్ణయాన్ని బీసీబీ పునరుద్ఘాటించింది.

    భద్రతా కారణాలను సాకుగా చూపుతూ త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని, తమ మ్యాచ్‌లను శ్రీలంక లేదా మరేదైనా ఇతర వేదిక‌కు మార్చాలని మ‌రోసారి బీసీబీ డిమాండ్ చేసింది. అయితే షెడ్యూల్ ఇప్పటికే ఖ‌రారు కావ‌గ‌డంతో ఆఖ‌రి నిమిషంలో వేదికలను మార్చడం అసాధ్యమని, బీసీబీ తన వైఖరి పునఃపరిశీలించుకోవాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. కానీ బంగ్లా క్రికెట్ బోర్డు మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కు త‌మ చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని, ఆట‌గాళ్లు భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని బీసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

    కాగా భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య గ‌త కొంత కాలంగా దౌత్య‌ప‌ర‌మైన ఉద్రిక్త‌లు నెల‌కొన్నాయి. అయితే బంగ్లా పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయ‌డంతో మ‌రింత పెరిగాయి. ఐపీఎల్‌-2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ.9.20 కోట్ల భారీ ధ‌ర‌కు కేకేఆర్ కొనుగోలు చేసింది.

    అయితే బంగ్లాలో హిందువుల‌పై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించాల‌ని చాలామంది డిమాండ్ చేశారు. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి రిలీజ్ చేయాల‌ని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. దీంతో అత‌డిని కేకేఆర్ విడుద‌ల చేసింది.

    ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టు ఆట‌గాడిని రిలీజ్ చేయ‌డాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు ఘోర అవ‌మానంగా భావించింది. దీంతో వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడేందుకు భార‌త్‌కు త‌మ జ‌ట్టును పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను మార్చాల‌ని  ఐసీసీని బీసీబీ డిమాండ్ చేసుకుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే, టోర్నమెంట్ రూల్స్ ప్రకారం వారు పాయింట్లు కోల్పోయే అవకాశం ఉంది
    చదవండి: IND vs NZ: భారత జట్టులోకి అనూహ్య ఎంట్రీ.. బదోని ఎంపికకు గల కారణాలివే?

  • ఢిల్లీ స్టార్ బ్యాట‌ర్ అయూశ్ బదోని తన చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. 26 ఏళ్ల బదోని భారత తరపున అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి  స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వైదొలగడంతో అనుహ్యంగా బదోనికి సెలెక్టర్లు పిలుపునిచ్చారు.

    అయితే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో బదోని డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. వాషీ స్ధానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అతడిని తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ కుమార్ రెడ్డి మరో ఆల్‌రౌండర్‌గా ఉన్నప్పటికి.. బదోని వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

    ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్‌, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ ఎలాగో తుది జట్టులో ఉంటారు.  స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్‌, జడేజా ఇద్దరు మాత్రమే ఉన్నారు. బ్యాకప్‌గా మరొక స్పిన్ అప్షన్‌(బదోని) ఉంటే బెటర్  అని గంభీర్ అండ్ కో భావిస్తుందంట.

    బదోని సెలక్షన్ వెనుక కారణాలు ఇవే..
    అయితే అనుహ్యంగా బదోనిని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. కానీ టీమ్ మేనెజ్‌మెంట్‌, సెలక్టర్లు అతడిపై నమ్మకం ఉంచడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బదోనికి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా అతడికి  ఉంది.

    ఢిల్లీ తరపున నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత జట్టుకు సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరమని భావించిన గంభీర్.. బదోనిని రికమెండ్ చేశాడు. అంతేకాకుండా సుందర్ లాగే బదోని కూడా ఆఫ్-బ్రేక్ బౌలింగ్ చేయగలడు. డొమాస్టిక్ క్రికెట్ టోర్నీలో అతడు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి స్కిల్స్ ఉన్నాయి.

    క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో బదోని దిట్ట. పరిస్థితులకు తగ్గట్టు అతడు బ్యాటింగ్ చేయగలడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో బదోని ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులతో పాటు పది వికెట్లు పడగొట్టాడు. అతడిని ఫినిషర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

    ఐపీఎల్‌లో కూడా అతడు లక్నో తరపున ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆల్‌రౌండర్‌గా బదోని సత్తాచాటాడు. అయితే క్వార్టర్ ఫైనల్‌కు అతడు దూరం కావడంతో విదర్భ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది.

    పంత్ స్దానంలో జురెల్‌..
    అదేవిధగా కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా గాయం కారణంగా తప్పుకొన్నాడు. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినప్పటికి జురెల్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు.
    చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌
     

  • విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీ తుది ద‌శ‌కు చేరుకుంది. మంగ‌ళ‌వారంతో క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లు ముగిశాయి. బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మూడో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మధ్య‌ప్ర‌దేశ్‌ 183 ప‌రుగుల తేడాతో పంజాబ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో పంజాబ్ జ‌ట్టు త‌మ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

    ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 345 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 88 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. అన్మోల్‌ప్రీత్ సింగ్(70),నేహల్ వధేరా(56 ), హర్నూర్ సింగ్(51) హాఫ్ సెంచ‌రీలతో రాణించారు.

    ఎంపీ బౌల‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్, త్రిపురేష్ సింగ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ 31.2 ఓవ‌ర్ల‌లో 162 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో పాటిదార్‌(38) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో సంవీర్ సింగ్ మూడు, గుర్నూర్ బ్రార్, రమణ్‌దీప్ సింగ్,కృష్ భగత్ త‌లా రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.

    ఢిల్లీ చిత్తు..
    మ‌రోవైపు నాలుగో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఢిల్లీని 76 ప‌రుగుల తేడాతో విద‌ర్భ చిత్తు చేసింది. దీంతో విద‌ర్భ వ‌రుస‌గా రెండో ఏడాది సెమీఫైనల్‌కు అర్హ‌త సాధించింది. 301 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో ఢిల్లీ చ‌తిక‌ల ప‌డింది. 45.1 ఓవ‌ర్ల‌లో 224 ప‌రుగుల‌కు ఆలౌటైంది. నచికేత్ భూటే 4 వికెట్లు ప‌డ‌గొట్టి ఢిల్లీ ప‌త‌నాన్ని శాసించారు. ఇక తొలి రెండు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో క‌ర్ణాట‌క‌, సౌరాష్ట్ర విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో క‌ర్ణాట‌క‌, సౌరాష్ట్ర, విద‌ర్భ‌, పంజాబ్ జ‌ట్లు సెమీఫైన‌ల్లో అడుగుపెట్టాయి.

    సెమీఫైనల్ షెడ్యూల్
    తొలి సెమీఫైన‌ల్‌- కర్ణాటక vs విదర్భ‌- జనవరి 15
    రెండో సెమీఫైన‌ల్‌-సౌరాష్ట్ర vs పంజాబ్‌- జ‌న‌వ‌రి 16
    చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌

  • సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌లో జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా జనవరి 10న ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా డుప్లెసిస్ కుడి చేతి బొటనవేలికి తీవ్రమైన గాయమైంది.

    దీంతో ఆ మ్యాచ్‌లో అత‌డు బ్యాటింగ్‌కు రాలేదు. అనంత‌రం అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి స్కాన్ నిర్వ‌హించ‌గా.. బొటనవేలి లిగమెంట్ తెగిపోయిన‌ట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్ర‌మంలో ఫాప్‌ త్వ‌ర‌లోనే త‌న గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.

    ఈ విష‌యంపై జేఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ఫాఫ్ కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడ‌ని, అందుకే టోర్నీ నుండి వైదొలిగాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 135 ప‌రుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 151.69 గా ఉంది.

    డుప్లెసిస్‌ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు జేఎస్‌కే సైతం ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడువ‌ స్థానంలో ఉంది. మిగిలిన మ్యాచ్‌లకు జేమ్స్‌ విన్స్‌ జేఎస్‌కే సారథిగా వ్యవహరించే అవకాశముంది.

    జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌ జట్టు ఇదే
    జేమ్స్ విన్స్, మాథ్యూ డి విలియర్స్, వియాన్ ముల్డర్, మైఖేల్-కైల్ పెప్పర్ (కీపర్), డోనవన్ ఫెరీరా, ప్రెనెలన్ సుబ్రాయన్, డయాన్ ఫారెస్టర్, అకీల్ హోసేన్, నాండ్రే బర్గర్, డేనియల్ వోరల్, శుభమ్ రంజనే, రిచర్డ్ గ్లీసన్, జారెన్ బాచర్, నీల్ టిమ్మర్స్, జాంకో స్మిత్, స్టీవ్ స్టోల్క్, దువాన్ జాన్సెన్, రివాల్డో మూన్సామి.

  • వ‌డోద‌ర వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన‌ విషయం తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జ‌ట్టుకు కివీస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో న్యూజిలాండ్ జ‌ట్టుపై భార‌త మాజీ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

    సీనియ‌ర్లు లేన‌ప్ప‌టికి ప‌ర్యాట‌క జ‌ట్టు పోరాట ప‌టిమ‌ను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఈ ల‌క్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌల‌ర్లు ఆఖ‌రి వ‌ర‌కు శ్ర‌మించారు. కానీ దుర‌దృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్‌క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది.

    "చాలా అగ్ర‌శ్రేణి జ‌ట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజ‌య‌వంతంగా అమలు చేయ‌డంలో కివీస్ దిట్ట‌. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్‌లలో పాల్గోవ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను.

    అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌కు కేన్‌ విలియమ్సన్‌, టామ్‌ లాథమ్‌, రచిన్‌ రవీంద్ర, మాట్‌ హెన్రీ, శాంట్నర్‌ వంటి కివీ స్టార్‌ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్‌ క్యాప్స్‌ జట్టు కెప్టెన్‌గా మైఖల్‌ బ్రెస్‌వేల్‌ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది.
    చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్‌ అయ్యర్‌

  • భారత బాక్సింగ్‌ దిగ్గజం, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌పై ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. మేరీ కోమ్‌కు పలువురితో వివాహేతర సంబంధాలు ఉండేవని ఆరోపించాడు. అదే విధంగా.. ఆస్తిని కాజేశానంటూ తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు.

    మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు. వ్యక్తిగత విషయానికొస్తే.. కరుంగ్‌ ఓన్‌కోలర్‌ను 2005లో వివాహం చేసుకున్నారు.‌ ఈ జంటకు ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్‌ ఓన్‌కోలర్‌ ఒక పాపను దత్తత తీసుకున్నాడు.

    అయితే, 2023లో తమకు సంప్రదాయం (​కోమ్‌ చట్టాలు) ప్రకారం విడాకులు మంజూరు అయ్యాయని గతేడాది మేలో మేరీ కోమ్‌ ప్రకటించింది. అయితే, వీరిద్దరికి కోర్టు ద్వారా మాత్రం ఇంకా విడాకులు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా IANSతో మాట్లాడిన కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చాడు.

    జూనియర్‌ బాక్సర్‌తో
    ‘‘లోక్‌ అదాలత్‌లో నేను తనను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని ఆమె చెబుతోందేమో!. మొదట 2013లో ఓ జూనియర్‌ బాక్సర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు చెప్పిన తర్వాత రాజీకి వచ్చాము.

    వాట్సాప్‌ మెసేజులు ఉన్నాయి
    2017 నుంచి మేరీ కోమ్‌ బాక్సింగ్‌ అకాడమీలో పని చేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. సాక్ష్యంగా వాళ్లిద్దరి వాట్సాప్‌ మెసేజులు నా దగ్గర ఉన్నాయి. ఆమెకు ఎవరితో సంబంధం ఉందో నాకు కచ్చితంగా తెలుసు. అయినా సరే నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఆమె ఒంటరిగా బతుకుతూ.. అతడితో రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంది.

    అందుకే విడాకులు తీసుకున్నాం. ఒకవేళ తను వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నన్ను నిందిస్తే మాత్రం ఊరుకోను. ఆధారాలు ఉంటేనే నాపై ఆరోపణలు చేయాలి. పద్దెనెమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తన నుంచి ఏమీ తీసుకోలేదు.

    కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు
    ఆమె ఓ సెలబ్రిటీ. అయినా సరే నేను ఇప్పటికీ ఢిల్లీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాను. తను చెప్పింది అందరూ వింటారు కాబట్టి నచ్చినట్లు మాట్లాడుతోంది. మేము సంప్రదాయం ప్రకారమే విడాకులు తీసుకున్నాం. కోర్టు నుంచి విడాకులు మంజూరు కాలేదు.

    అయినా నేను కోర్టుకు వెళ్లను. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను తన డబ్బులు దొంగిలించానని.. రూ. 5 కోట్లు కొట్టేశానని అంటోంది. ఒక్కసారి నా అకౌంట్‌ చూడండి. నా దగ్గర ఎంత ఉందో తెలుస్తుంది.

    నన్ను వాడుకొని వదిలేసింది
    నన్ను వాడుకొని వదిలేసింది. ఆమె అకాడమీకి బీజం వేసింది నేను. కానీ ఇప్పుడు చైర్మన్‌గా ఎవరు ఉన్నారో చూడండి. ఆమె ప్రవర్తన నన్ను బాధపెట్టింది. నా పిల్లలు బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుతున్నారు. ఆమె సంపాదిస్తోంది కాబట్టి.. వారి ఫీజులను చెల్లిస్తోంది. కానీ వాళ్లను పెంచింది నేను.

    హాస్టల్‌లో ఉన్న నా పిల్లల్ని చూడనివ్వడం లేదు. వాళ్లు తన పిల్లలు అని వాదిస్తోంది. నిజానికి వాళ్లు నా రక్తం కూడా. భార్యాభర్తల బంధంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. నేను ఆల్కహాల్‌ తీసుకుంటానని తను చెబుతోంది. ఆమె కూడా వోడ్కా, రమ్‌ తాగుతుంది.

    గుట్కా తింటుంది. అయినా సరే మీడియా ముందు నేను ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. నేను పార్టీల్లో తాగినందుకు నా గురించి ప్రచారం చేసింది’’ అంటూ మేరీ కోమ్‌పై కరుంగ్‌ ఓన్‌కోలర్‌ సంచలన ఆరోపణలు చేశాడు. కాగా ఓ వ్యాపారవేత్తతో మేరీకి సంబంధం ఉందని వార్తలు రాగా.. ఆమె తరఫు లాయర్‌ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇకపై ఎవరూ వీటిని ప్రస్తావించకూడదని విజ్ఞప్తి చేశారు.

    చదవండి: ‘నిశ్చితార్థం చేసుకున్నాం’

  • టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ త‌న రీఎంట్రీలో స‌త్తాచాటిన సంగతి తెలిసిందే. వ‌డోద‌ర వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో అయ్య‌ర్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 ప‌రుగులు చేసి భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

    ఇప్పుడు రాజ్‌కోట్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేలోనూ అదే జోరును కొన‌సాగించాల‌ని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉవ్విళ్లురుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అయ్య‌ర్‌కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. శ్రేయస్ తన వన్డే కెరీర్‌లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు.

    రాజ్‌కోట్ వ‌న్డేలో శ్రేయ‌స్ మ‌రో 34 ప‌రుగులు చేస్తే.. అత్యంతవేగంగా(ఇన్నింగ్స్‌లు పరంగా) ఈ ఫీట్ అందుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ముంబైకర్ ఇప్పటివరకు 68 వన్డే ఇన్నింగ్స్‌లలో 2966 పరుగులు చేశాడు.

    ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌(72 ఇన్నింగ్స్‌లు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(75), కేఎల్ రాహుల్‌(78) ఉన్నారు. ఇప్పుడు వీరిందరిని అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్దమయ్యాడు.

    శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాలుగో స్ధానంలో అయ్యర్‌ను మించిన ఆటగాడు కన్పించడం లేదు. 2017 నుండి 2021 మధ్య కాలంలో టీమిండియా మెనెజ్‌మెంట్ దాదాపు నాలుగవ స్దానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కరు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్ధానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.
    చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆసీస్ క్రికెట్‌ దిగ్గజం

  • సన్‌రైజర్స్‌ యాజమాన్యం తమ జట్టు హెడ్‌కోచ్‌ పేరును ప్రకటించింది. డానియెల్‌ వెటోరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ స్థానంలో వెటోరిని నియమించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    2023 సీజన్‌ నుంచి 
    కన్‌ఫ్యూజ్‌ అయ్యారా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఆటగాడిగా సత్తా చాటిన న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానియెల్‌ వెటోరి చాన్నాళ్లక్రితమే కోచ్‌ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. గతంలో ఆర్సీబీతో మమేకం అయిన వెటోరి.. 2023 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు హెడ్‌కోచ్‌గా కొనసాగుతున్నాడు.

    వెటోరి మార్గదర్శనంలో SRH ఐపీఎల్‌-2024లో ఫైనల్‌కు కూడా చేరింది. ఈ క్రమంలో యాజమాన్యం అతడినే హెడ్‌కోచ్‌గా కొనసాగిస్తోంది. 2026లోనూ SRH కోచ్‌గా వెటోరీనే మార్గదర్శనం చేయనున్నాడు. తాజాగా.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌ జట్టుకు కూడా హెడ్‌కోచ్‌గా మేనేజ్‌మెంట్‌ అతడిని నియమించింది.

    భారీ ధరకు కొనుగోలు
    ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్‌ లీగ్‌లో భాగమైన నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌ను సన్ గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1100 కోట్ల భారీ ధరకు ఈ ఫ్రాంఛైజీని దక్కించుకుని.. సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా పేరు మార్చింది. ఈ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ హెడ్‌కోచ్‌గా ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని డానియెల్‌ వెటోరీతో భర్తీ చేసింది.

    ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు
    కాగా గత రెండు సీజన్లుగా ‘నార్తర్న్‌ సూపర్‌చార్జర్స్‌’కు కోచ్‌గా వ్యవహరించాడు ఫ్లింటాఫ్‌. అతడి శిక్షణలో 2024లో నాలుగో స్థానంతో సీజన్‌ ముగించిన జట్టు.. 2025లో ఎలిమినేటర్‌ వరకు చేరుకుంది. అయితే, వెటోరీపై నమ్మకంతో ఫ్లింటాఫ్‌నకు వీడ్కోలు పలికి.. అతడిని తమ హెడ్‌కోచ్‌గా నియమించింది సన్‌ గ్రూపు.

    ఫ్లింటాఫ్‌నకు గుడ్‌బై 
    కాగా లీగ్‌లోని అన్ని ఫ్రాంఛైజీల కంటే తనకు తక్కువ జీతం చెల్లించేందుకు సన్‌రైజర్స్‌ సిద్ధపడిందని ఫ్లింటాఫ్‌ బహిరంగంగానే ఆరోపించాడు. అయితే, యాజమాన్యం మాత్రం.. తాము భారీగానే ఆఫర్‌ చేసినా.. తన స్థాయికి అది తగదంటూ అతడే బంధం తెంచుకున్నాడని పేర్కొంది. 

    కాగా సన్‌ గ్రూప్‌ ఐపీఎల్‌లో హైదరాబాద్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్‌కేప్‌ ఫ్రాంఛైజీలను కలిగి ఉన్న విషయం తెలిసిందే. కావ్యా మారన్‌ ఈ జట్ల వ్యవహారాలు చూసుకుంటారు.

    చదవండి: ఐసీసీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

  • ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ అలిసా హేలీ కీలక ప్రకటన చేసింది. స్వదేశంలో భారత్‌తో ఆడబోయే సిరీస్‌ తన కెరీర్‌లో చివరిదని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది.

    నా కెరీర్‌లో చివరిది
    ఈ మేరకు.. ‘‘మిశ్రమ భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఆస్ట్రేలియా తరఫున భారత్‌తో ఆడబోయే సిరీస్‌ నా కెరీర్‌లో చివరిది.  ఆసీస్‌ తరఫున ఇంకా ఇంకా ఆడాలనే ఉంది. అయితే, నాలో పోటీతత్వం కొరవడిందని అనిపిస్తోంది.

    అందుకే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈసారి టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు నేను వెళ్లడం లేదని తెలుసు. ఈ మెగా టోర్నీ సన్నాహకాలకు చాలా తక్కువ సమయం ఉంది. టీమిండియాతో టీ20లలోనూ నేను ఆడలేను.

    ఇండియాతో వీడ్కోలు మ్యాచ్‌ ప్రత్యేకం
    అయితే, సొంతగడ్డపై భారత్‌తో మ్యాచ్‌లో వన్డే, టెస్టు కెప్టెన్‌గా కెరీర్‌ ముగించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నాకు దక్కిన గొప్ప అవకాశం ఇది. మాకు క్యాలెండర్‌ ఇయర్‌లో వచ్చే అతిపెద్ద సిరీస్‌ ఇదే’’ అంటూ అలిసా హేలీ ‘ది విల్లో టాక్‌’ పాడ్‌కాస్ట్‌లో తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించింది.  

    దిగ్గజ క్రికెటర్‌గా
    కాగా 2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసింది వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలిసా హేలీ. ఆమె నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్‌ మహిళా క్రికెట్‌ జట్టు పటిష్ట జట్టుగా మారింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 టోర్నీ గెలిచిన జట్లలో అలిసా సభ్యురాలు. అంతేకాదు.. 2013, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులోనూ అలిసా ఉంది.

    ఇక 2018, 2019 ఇయర్లకు గానూ ‘ఐసీసీ టీ20 క్రికెర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును 35 ఏళ్ల అలిసా హేలీ అందుకుంది. కాగా అలిసా నిష్క్రమణ తర్వాత తహీలా మెగ్రాత్‌ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. భారత్‌తో, టీ20 ప్రపంచకప్‌-2026లో ఆసీస్‌ను ఆమె ముందుకు నడుపనున్నట్లు తెలుస్తోంది.

    స్టార్క్‌ జీవిత భాగస్వామి
    కాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌- అలిసా హేలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత మహిళా క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది.

    చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్‌ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!

  • అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సయీద్‌ అజ్మల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.

    అతిపెద్ద మార్కెట్‌ 
    క్రికెట్‌ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్‌ అజ్మల్‌ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్‌ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.

    ఐపీఎల్‌ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్‌ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.

    శ్రీలంక క్రికెట్‌ జట్టుపై గతంలో ఉగ్రదాడి
    ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్‌ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్‌ మహేళ జయవర్ధనే సహా కుమార్‌ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.

    పాకిస్తాన్‌కు చెందిన అహ్సాన్‌ రజా అనే అంపైర్‌ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి జట్లు  మళ్లీ పాక్‌ పర్యటన మొదలుపెట్టాయి.

    భద్రతా కారణాల దృష్ట్యా
    ఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.

    ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది.  మరోవైపు ఆతిథ్య పాక్‌ చెత్త ప్రదర్శనతో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్‌ టోర్నీలో పాక్‌ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.

    ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

    ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ప్లేయర్‌ ముస్తాఫిజుర్‌ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్‌ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్‌ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్‌ మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.

    ఎలాంటి లాజిక్‌ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?
    ‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్‌ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్‌ లేదు.

    ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్‌ అజ్మల్‌ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్‌లో పహల్గామ్‌ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్‌ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు.  ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.

    చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!

Politics

  • సాక్షి,అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

    అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

    ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్‌మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్‌మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు అనంతపురం రాజకీయ వాతావరణంలో కొత్త మలుపు తిప్పింది. 
     

  • అనంతపురం.  దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు అధికారం అండతో సొంత కేసుల మూసివేత ప్రక్రియ కొనసాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్‌ కేసు, లిక్కర్‌ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు అత్యంత హేయంగా స్కిల్‌ కేసు కూడా క్లోజ్‌ చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు. డొల్ల కంపెనీలకు రూ.371 కోట్ల ప్రభుత్వ నిధులు మళ్లించి, అక్కణ్నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు, అన్ని ఆధారాలతో సహా దొరికి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో జైలుకి కూడా వెళ్లారని చెప్పారు. 

      స్కిల్‌ స్కాంలో చంద్రబాబు దోషిత్వంపై అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపిన సీఐడీ.. ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌) తుది నివేదిక ఇవ్వడం, వెంటనే ఆ నివేదికను ఆమోదించి ఏసీబీ కోర్టు కేసు మూసివేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని శైలజానాథ్‌ అన్నారు. ఇది చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని స్పష్టం చేశారు. నాడు తీవ్ర అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌ పొందిన చంద్రబాబు, తిరిగి అధికారంలోకి రాగానే, తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారని గుర్తు చేశారు.

    స్కిల్‌ స్కామ్‌ కేసు మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ అని చెప్పిన సీఐడీ.. మరి అప్పుడు సేకరించిన ఆధారాలు, నాటి ఈడీ ఛార్జిషీట్‌ అన్నీ అబద్ధాలేనా? అని అనంతపురంలోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్‌ ప్రశ్నించారు.

    శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

    చంద్రబాబు కేసుల మాఫీ రాజ్యాంగ విరుద్ధం
    సీఎం చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని నేరాలు, దందాలు చేసినా తమ కార్యకర్తల్ని కాపాడుకుంటున్నారు. అనంతపురంలో వారానికో భూకుంభకోణం బయటపడుతోంది. ఎవరో ఒక ప్రజాప్రతినిధి బెదిరించారని చెప్తుంటారు. అధికారులు మాత్రం మౌనంగా ఉండిపోతుంటారు. 

    ఇదే క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు తన సొంత కేసుల్ని ఎత్తేసుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. తనకు తానే కితాబిచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్‌నెట్‌ కేసు, లిక్కర్‌ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, తాజాగా స్కిల్‌ కేసు కూడా క్లోజ్‌ చేయించుకున్నారు. నిజానికి స్కిల్‌ కేసులో సీమెన్స్‌ కంపెనీ తమకు ఏ మాత్రం సంబంధం లేదని కూడా చెప్పింది. దీంతో చంద్రబాబు దోషిత్వం పూర్తి ఆధారాలతో సహా బయటపడింది, అయినా అలా వరసగా కేసులు మూసివేయించుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్‌తో పాటు, హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

    కేసుల ఎత్తివేతపై న్యాయపోరాటం కొనసాగిస్తాం
    చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న సీఐడీ విభాగమే గతంలో అన్ని ఆధారాలు సేకరించి కేసు పెడితే.. ఈడీ కూడా కేసు పెడితే.. ఇవన్నీ కేసుల మాఫీకి అడ్డు రాలేదంటే ఈ వ్యవస్థల్ని ఎలా ధ్వంసం చేస్తున్నారో అర్దమవుతోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, సాక్ష్యాలు మార్పించి నేరాల్ని మాఫీ చేయించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు ఓ చెడ్డ ఒరవడిని సృష్టిస్తున్నారు. మీ పార్టీ ఆఫీసు ఖాతాల్లో రూ.77 కోట్లు రాలేదా?. మీరు అంత కడిగిన ముత్యమైతే కోర్టుల్లో పోరాడి ఎందుకు గెలవలేకపోయారు? చివరికి ఈడీ కూడా బోగస్‌ ఇన్‌వాయిస్‌లు ఇచ్చారని కేసు పెట్టింది కదా? మరి ఆ రిపోర్ట్‌ కూడా మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ అంటారా?.

    ఈ ధోరణి అస్సలు మంచిది కాదు. ఎవరూ ఎవర్నీ కాపాడలేరు. నిజానికి, సత్యానికి దూరంగా ఓ మనిషి కోసం  అధికారులు సాగిస్తున్న హననం ఎంతో కాలం సాగదు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. చంద్రబాబు కేసుల మాఫీపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుంది అని స్పష్టం చేశారు.

  • కోల్‌కతా: బీజేపీ-ఈసీ టార్గెట్‌గా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపణలు చేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో జరుగుతునన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) లో ఇప్పటివరకూ 54 లక్షల ఓటర్లను తొలగించారని మండిపడ్డారు.  ప్రస్తుతం ‘సర్‌’ ఇంకా  ఓటర్ల జాబితా సవరణ చేస్తున్న క్రమంలో  కోటి వరకూ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విషయం అర్దమవుతుందన్నారు. బీజేపీ తయారు చేసిన ఏఐ టూల్స్‌ను ఈసీ వాడటం వల్లే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతుందని మండిపడ్డారు. 

    తొలగించబడిన ఓటర్లలో మహిళలు, మైనార్టీలు, పేదలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారన్నారు. 2002 నాటి పాత ఓటరు జాబితాలను డిజిటైజ్ చేయడానికి బీజేపీ రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ వాడటం వల్ల తప్పులు జరగుతున్నాయని మమతా స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో చేసిన సవరణలను పట్టించుకోకుండా, ప్రజలు తమ గుర్తింపును మళ్లీ నిరూపించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ తొలగింపులు బీజేపీ వ్యూహంలో భాగమని, టీఎంసీ ఓటర్లను బలహీనపరచడమే లక్ష్యంగా ఉందన్నారు. 

  • కాకినాడ:  చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, దర్యాప్తు సంస్థలను ఇంట్లో సంస్థలుగా మార్చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.  ఇందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును చంద్రబాబు కొట్టేయించుకోవడమే ఉదాహరణ అని అన్నారు.  ‘ ఈ సంక్రాంతికి చంద్రబాబు ఆయనకు ఆయనే కానుక ఇచ్చుకున్నారు. ఆయన మీద ఉన్న స్కిల్‌ స్కామ్‌ కేసున ఎత్తివేసుకున్నాడు. ఈ కేసులో ఆయనే నిందితుడు ,ఆయనే న్యాయవాది, ఆయనే తీర్పు ఇచ్చేసుకున్నారు. 

    ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా తన మీద తన కేసునే ఎత్తివేసుకున్నాడు. ఉద్యోగుల డిఎలు, కాంట్రాక్టులకు బిల్లు చెల్లింపులను సంక్రాంతి కానుక అని ఎల్లో మీడియాలో రాశారు. కూటమి  ప్రభుత్వం వచ్చాక 8 కేసులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో  ఎత్తివేశారు. దర్యాప్తు సంస్ధలను తన గుప్పెట్లో పెట్టుకుని తన కేసులను ఎత్తివేసుకుంటున్నాడు. జగన్ జన్మదినం‌ సందర్భంగా మేకను కోస్తే వైఎస్ఆర్ సిపి కార్యకర్తల మీద కేసులు పెట్టి ధర్డ్ డిగ్రీ వారిపై ప్రయోగించారు.రేపు కొబ్బరి కాయ కొడితే కేసు పెట్టేలా ఉన్నారు. *చంద్రబాబు మీద ఉన్న స్కామ్ కేసులపై వైఎస్ఆర్ సిపి న్యాయపోరాటం చేస్తుంది’ అని స్పష్టం చేశారు.

  • ప్రముఖ నటుడు,  టీవీకే అధినేత విజయ్‌ నటించిన జన నాయకన్‌ సినిమాకు  ఏఐసీసీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతు తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో టీవీకేతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా రాహుల్‌ పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి,

    వ్యూహాత్మక ఎత్తుగడా.?
    రాహుల్‌ గాంధీ తాజా ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ,.. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమి కొనసాగుతుందా? లేక విజయ్ పార్టీ టీవీకేతో కలిసి కొత్త వ్యూహం రూపొందిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి.2017లో విజయ్ నటించిన మెర్సల్ సినిమా మీద కేంద్రం అభ్యంతరాలు తెలిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒకవైప విజయ్‌.. తమిళ రాజకీయాల్లో బలంగా ఎదిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు రాహుల్‌ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, దీనిలో భాగంగానే విజయ్‌కు మరోసారి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

     

    అయితే డీఎంకేతోనే పొత్తు కొనసాగించాలని అధిక శాతం మంది కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒక పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి.. విజయ్‌కు ఈ రకంగా రాహుల్‌ మద్దతు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఆ పార్టీకి చెందినే పలువురు నేతలు అంటున్నారు.  తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సినిమాలపై కేంద్రం చూపుతున్న అడ్డంకులు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి.

    గతంలో కూడా చర్చ..
    కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్‌-టీవీకేల పొత్తు అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇరు పార్టీలు త్వరలో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే అధికారంలో ఉన్న డీఎంకేతో బంధం తెంచుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది. దాంతోనే విజయ్‌ పార్టీతో పొత్తుపై అధిష్టానం కూడా ఎటువంటి ముందుకు సాగడం లేదు. కేవలం మద్దతు ఇస్తూ ట్వీట్లు పెట్టడం తప్పితే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోకాంగ్రెస్‌ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డీఎంకే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే అంశాన్ని అతి దగ్గరగా పర్యవేక్షిస్తోంది.   

  • సాక్షి, తాడేపల్లి: గ్రూప్‌–1, గూప్‌–2 మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి ఏడాది కావొస్తున్నా, దీనిపై వేసిన కేసులన్నీ క్లియర్‌ అయినప్పటికీ ఇంకా ఫలితాలు వెల్లడించకుండా నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫలితాలు వెల్లడించవచ్చని కోర్టు ఆదేశించినా ఏపీపీఎస్సీని చంద్రబాబు తన జేబు సంస్థగా మార్చేసుకుని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

    అత్యంత కీలకమైన ఈ విభాగానికి ఇప్పటికీ శాశ్వత చైర్మన్‌ను నియమించకుండా కాలక్షేపం చేయడం నిరుద్యోగులను వంచించడమేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే నియామకాలు పూర్తి కావాల్సి ఉన్నా, వైఎస్‌ జగన్‌కి మంచి పేరొస్తుందన్న అక్కసుతో చంద్రబాబు తన వారితో కేసులు వేయించి మెయిన్స్‌ పరీక్షలు జరగకుండా అడ్డుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:

    కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు:
    గత వైయస్సార్సీపీ  హయాంలోనే గ్రూప్‌–1లో 90 పోస్టులకు, గ్రూప్‌–2లో 905 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి 2024 ఫిబ్రవరిలోనే ప్రిలిమ్స్‌ పరీక్ష కూడా నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం అదే ఏడాది మే నెలలో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి, ఆ పరీక్షను అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాకుండా, దాదాపు ఏడాది తర్వాత, 2025 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మరో ఏడాది పూర్తవుతున్నా, ఆ ఫలితాలు ప్రకటించకుండా, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.

    Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

    నిజానికి టీడీపీ వేయించిన కేసుల వల్లే ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ నియామకాలు జరగడం లేదు. కోర్టు ఆదేశాలను సైతం ఈ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒకసారి ఏపీపీఎస్సీ చైర్మన్‌ని కలిసి ఫలితాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకుని, వెంటనే గ్రూప్స్‌ మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించి, నియామకాలు పూర్తి చేయాలని ఎ.రవిచంద్ర డిమాండ్‌ చేశారు.

  • సాక్షి, తాడేపల్లి: స్కిల్ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. చంద్రబాబే ఈ కేసులో ప్రధాన దోషి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఐడీ పక్కా ఆధారాలు సేకరించిందని.. రూ.372 కోట్లు పక్కదారి పట్టినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. అలాంటి కేసును కొట్టేయటం విడ్డూరం అని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.

    ‘‘చంద్రబాబే తన‌ కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం దారుణం. ప్రభుత్వంలో ఉండి మాఫీ చేసుకోవడం అభ్యంతరకరం. చంద్రబాబు కేసును ఎదుర్కొని తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంతేగానీ ఇలా కేసును నీరు గార్చటం సబబు కాదు. దీనిపై మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు సర్వనాశనం చేశారు. అది నిరర్ధక ప్రాజెక్టు అయితే మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.

    ‘‘ప్రాజెక్టు సందర్శన చేస్తున్న నెల్లూరు నేతలను అడ్డుకోవడం ఎందుకు?. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుండి నీరు తీసుకెళ్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా?. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తే ప్రకాశం జిల్లా సస్యశ్యామలమవుతుంది. కానీ చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.

    ..రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబు అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. 19వ తేదీ లోపల అందరినీ తీసుకెళ్లాలి. లేకపోతే మేమే స్వయంగా పరిశీలనకు వెళ్తాం. అక్కడ ఏమాత్రం పనులు జరుగుతున్నాయో ప్రపంచానికి తెలుపుతాం. కాంట్రాక్టర్ల నుండి 25-30 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వర రావుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు?. నీళ్ల విలువ గురించి ఏబీవీకి ఏం తెలుసు?. ఒకసారి ఆయన రాయలసీమ వచ్చి ప్రాజెక్టులను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రాయలసీమ లిఫ్టు నిరర్థకం అంటున్న చంద్రబాబే నిరర్థకం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అక్కడి ప్రజలే తగిన బుద్ది చెప్తారు. నామమాత్రపు సీట్లు కూడా సాధించలేరు’’ అని సతీష్‌రెడ్డి అన్నారు.

    Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా చేయాలని భావించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌ను విభజించాలని సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

    అనంతరం, తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై తలసాని తాజాగా స్పందించారు. సాక్షితో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ..‘సీఎం రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడంతో నాకేమీ అభ్యంతరం లేదు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని నేను. సికింద్రాబాద్ ప్రాంతం మా ఎమోషన్. సికింద్రాబాద్‌ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్‌గిరిలో కలుపుతున్నారు. పదవిలో ఉన్నామని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ది చెబుతారు.

    గతంలో కేసీఆర్‌ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీసు కమిషనరేట్లు చేశారు. ఇప్పుడు ఏ పోలీసు స్టేషన్ ఎవరికీ వస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవి అన్నీ అబద్దాలే. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజిగిరి జోన్‌లో కలిపింది వాస్తవం కాదా?. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేస్తే మల్కాజ్‌గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం ఇచ్చారు.  

    Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

    సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజిగిరి జోన్ పరిధిలోని బోయిన్‌పల్లి సర్కిల్‌లోకి చేర్చారు. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి’ అని పిలుపునిచ్చారు. 

Movies

    • వైట్‌ డ్రెస్‌లో బాలీవుడ్ భామ కాజోల్ హోయలు..
    • బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..
    • ఫిట్‌నెస్‌ ముఖ్యమంటోన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్..
    • సంక్రాంతి మూడ్‌లో యాంకర్‌ శ్రీముఖి..
    • రెడ్ శారీలో కవ్విస్తోన్న బుల్లితెర భామ జ్యోతిపూర్వాజ్..

     

     

     

     

     

     

     

     

  • మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంటోంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

    అయితే ఈ చిత్రంలో అబ్బాయిగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది చిన్నారి గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ బుజ్జాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆమె చిన్నారి పేరు ఊహ కాగా.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బుజ్జితల్లి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలపై ఇష్టంతో ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవికి కుమారుడిగా నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ తెగ మురిసిపోతోంది. షూటింగ్‌ సెట్‌లో చిరంజీవి తనను ఎంత ప్రేమగా చూసుకునేవారని అంటోంది. 
     

  • మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబో అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెంకీ మామ కూడా ఈ మూవీలో కనిపించడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    చిన్నప్పుడు మా నాన్న నన్ను తిట్టేవాడని భీమ్స్ సిసిరోలియో అన్నారు. నువ్వు దేనికి రావు రా.. నీవల్ల ఏంటి ఉపయోగం అని అనేవారని గుర్తు చేసుకున్నారు. నాన్న ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను.. నా ముందు అనిల్ రావిపూడి ఉన్నారు.. నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని ఎమోషనలయ్యారు. ఇది ఒక మాటతోనో.. చేసిన పాటలతోనో చెప్పుకునేది కాదు.. మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు.. నన్ను తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. ఈ వేదిక నుంచి చెబుతున్నా.. నీ తల్లిదండ్రులకు, నీకు నా పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

    భీమ్స్ మాట్లాడుతూ..' చిన్నప్పుడు నీ వల్ల ఏంటిరా ఉపయోగం అని నాన్న తిట్టేవారు. నాన్నా.. ఇప్పుడు ఇక్కడున్న.. నా ముందు అనిల్‌గారు.. నా వెనుక చిరంజీవిగారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా భీమ్స్‌ ఉంటే బాగుంటుందని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నా కష్టానికి మీరు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా.  సినిమా మొదలైనప్పటి నుంచి నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌ కొడుకు మెగాస్టార్‌ అయ్యాడు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కొడుకు గొప్ప దర్శకుడు అయ్యాడు. ఒక సాధారణ రైతు కొడుకునైన నేను వాళ్లతో కలిసి పనిచేశాను. కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు.. ఇలా ముగ్గురు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది' అని అన్నారు. 
     

  • దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.  కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.

    అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్‌ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.

  • శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా రూరల్ ఎంటర్‌టైనర్ ‘రాయుడి గారి తాలుకా’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ‘జాతరొచ్చింది’ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ పొందింది. తాజాగా రెండో పాటను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా విడుదల చేశారు.

    ‘ఏలేలో..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ ట్రాక్‌కు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. జయశ్రీ పల్లెం, సాయి సందీప్ పక్కి మధురమైన స్వరాలతో ఆలపించారు. ఈ పాట ద్వారా సినిమాలోని గ్రామీణ నేపథ్యం, రొమాన్స్ ఎలిమెంట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి, కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

  • శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.

    ఈ మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    ఏ క్యారెక్టర్‌ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్‌కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్‌లో బాత్‌రూమ్‌లో సీన్‌ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్‌ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ  చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

     

  • ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్‌’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్‌ సాధించింది. సినిమాకు మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. 

    అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్‌ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్‌ థియేటర్‌లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్‌లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్‌ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్‌ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్‌ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. 

    రాజాసాబ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా  ‘మీ కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్‌ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్‌ రిలీజ్‌ రోజు కూడా చాలా టెన్షన్‌ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్‌ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున​ వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్‌ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్‌ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు. 


     

  • కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన పొంగల్ చిత్రం పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వ వహించారు. జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆది నుంచే వివాదాలు ఎదురయ్యాయి. రిలీజ్‌కు ముందు సెన్సార్‌ సమస్య ఈ సినిమా చివరికి అనుకున్న తేదీకే విడుదలైంది.

    తాజాగా ఈ మూవీ రిలీజ్‌ తర్వాత మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రంలో చరిత్రను వక్రీకరించారని.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో పాటు కాంగ్రెస్ నాయకుల పరువుకు నష్టం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపించింది.

    చరిత్రను తప్పుదోవ పట్టించే సన్నివేశాలు ఉన్నాయని.. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు.. చరిత్రలో జరగని సంఘటనలతో రూపొందించారని అ‍న్నారు. ఈ మూవీలో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌  పేర్కొన్నారు. కాగా.. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 
     

  • బాలీవుడ్ బ్యూటీ, ఆదిపురుష్ భామ కృతి సనన్ తన సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లిలో సందడి చేసింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్ అన్నీ తానై దగ్గరుండి నడిపించింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

    అంతకుముందే వీరిద్దరు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహబంధంలోకి ‍అడుగుపెట్టారు. తాజాగా హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన చెల్లి పెళ్లిలో హంగామా చేస్తూ కనిపించింది. కాగా.. నుపుర్ సనన్.. తన ప్రియుడు, సింగర్ అయిన స్టెబిన్‌ను పెళ్లాడింది.  ఉదయపూర్‌లో జరిగిన వివాహ  వేడుకలో  కృతి సనన్ ప్రియుడు కబీర్ బహియా కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా దిశా పటాని, మౌనీ రాయ్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.

    నుపుర్ సనన్ సినీ కెరీర్..

    నుపుర్‌ సనన్‌.. 'టైగర్‌ నాగేశ్వరరావు' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత ఒకటీరెండు ఆల్బమ్‌ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం 'నూరని చెహ్రా' అనే హిందీ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఇదే తన తొలి సినిమా కావడం విశేషం.

     

     

     

     

  • రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్‌’మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్ర భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే రూ. 112 కోట్లు వసూలు చేసిన ‘రాజాసాబ్‌’... నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ మేరకు మేకర్స్అధికారికంగా పోస్టర్ని విడుదల చేశారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రేంజ్లో కలెక్షన్స్రాబట్టడం చూసి ట్రేడ్వర్గాలు షాకవుతున్నాయి. అయితే ప్రభాస్స్థాయికి కలెక్షన్స్తక్కువే కానీ.. పోటీలో చిరంజీవి లాంటి సినిమాలు ఉన్నప్పటికీ స్థాయిలో రావట్టడం గొప్ప విషయం.

    మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పిపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.  కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  హాలీడేస్ సీజన్ లో ఫస్ట్ వీక్ "రాజా సాబ్" హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.

  • మెగాస్టార్ చిరంజీవి నటించిన  'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ మూవీని చిత్ర నిర్మాతలు కూడా చాలా దూకుడుగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఫస్ట్‌ డే రూ. 84 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ప్రకటించారు. సినిమా బాగుందని టాక్‌ రావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే, రెండు తెలుగురాష్ట్రాల్లో టికెట్‌ ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఫ్యామిలీతో పాటు కలిసి థియేటర్‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో సినిమా కలెక్షన్స్‌పై ప్రభావం చూపవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

    సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే ది రాజా సాబ్‌ రీవర్షన్‌ చేయడంతో బాగుందని టాక్‌ వచ్చింది. ఆపై రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి థియేటర్‌లోకి వచ్చేసింది. సినిమా బాగుందని టాక్‌ కనిపిస్తోంది. జనవరి 14న మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. వీటికి కూడా మంచి టాక్‌ వస్తే.. టికెట్‌ ధరలు తక్కువ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిన్న చిత్రాలవైపే మొగ్గు చూపే ఛాన్స్‌ ఉంది. టికెట్‌ ధరలు తగ్గిన తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు చూద్దాంలే అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 

    ఇంతలో పండగ సందడి ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎవరిపనుల్లో వారు పడిపోవడం సహజం. చిరు సినిమాకు మంచి టాక్‌ ఉంది కాబట్టి టికెట్‌ ధరల విషయంలో స్వల్ప సర్దుబాటు చేయడం వల్ల సినిమాకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. టికెట్ ధరలను తగ్గించడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లడం కంటే ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్‌ ఉందని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

    రెండు రాష్ట్రాల్లో టికెట్‌ ధరలు ఇలా..
    'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి జనవరి 19 వరకు తెలంగాణలో టికెట్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్‌లో కూడా జనవరి 22 వరకు అధిక ధరలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలకు అధనంగా  సింగిల్‌ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి) మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) ఉంటుంది.

  • అల్లు అర్జున్‌ తన కుటుంబంతో పాటు జపాన్‌లో అడుగుపెట్టారు. తను నటించిన పుష్ప-2 చిత్రం జనవరి 16న 'పుష్ప కున్రిన్‌' పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించారు.  ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణను పొందింది. ఇప్పుడు జపాన్‌లో ఏంతమేరకు మెప్పిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

    ‘పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌’ అంటూ అల్లు అర్జున్‌ కొట్టిన డైలాగ్‌కు ఇప్పుడు కెరెక్ట్‌గా సెట్‌ అయిందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. పుష్ప-2 మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ.. గీక్‌ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్‌లో విడుదల చేస్తుంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ టోక్యో చేరుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. సినిమాలో జపాన్‌ నేపథ్యం కూడా ఉండటంతో అక్కడి ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జపాన్‌ ప్రజలకు ఎర్రచందనం వుడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి పుష్ప కలెక్షన్స్‌ పెరగవచ్చని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

  • దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) మరణం తర్వాత కుటుంబంలో గొడవలు వచ్చాయని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర  మొదటి భార్య ప్రకాష్ కౌర్  ద్వారా సన్నీ డియోల్ , బాబీ డియోల్ , అజీతా డియోల్ , విజేతా డియోల్ అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రెండో భార్య హేమా మాలిని  ద్వారా ఈషా డియోల్ , అహానా డియోల్  అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ధర్మేంద్ర మరణం తర్వాత ఆస్తి విషయంలో విభేదాలు వచ్చినట్లు బాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా నటి హేమా మాలిని స్పందించారు.

    ధర్మేంద్ర మరణం తర్వాత కూడా సన్నీ డియోల్ , బాబీ డియోల్‌ సోదరులు కలిసి ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, తమ పిన్ని హేమ మాలినితో పాటు తన కుమార్తెలు ఇద్దరు హాజరు కాలేదు. అయితే, అదే రోజు హేమ మాలిని తన ఇంట్లో గీతోపదేశం ఏర్పాటు చేసుకుంది. రెండు వారాల తర్వాత, హేమ మాలిని ఢిల్లీలో ప్రత్యేకంగా ధర్మేంద్ర సంతాప సమావేశాన్ని నిర్వహించింది.  ఇలాంటి ఘటనల తర్వాత వారి కుటుంబంలో గొడవలు వచ్చాయని వార్తలు వైరల్‌ అయ్యాయి.

    వివరణ ఇచ్చిన హేమ మాలిని
    హేమ మాలిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవలకు సంబంధించి మాట్లాడారు. తాము ఎల్లప్పుడూ బాగున్నామని క్లారిటీ ఇచ్చారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చాలా స్నేహపూర్వకంగానే ఉన్నామన్నారు. కానీ, ప్రజలు ఎప్పుడూ కూడా తమ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఎప్పుడూ గాసిప్ వార్తలనే కోరుకుంటున్నారని తెలుస్తోంది. 'అలాంటి వారికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి..?  వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా..? ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితం, మా వ్యక్తిగత జీవితం. మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము. 

    ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము. అంతే.. అవసరంలేని విషయాలను మా కుటుంబంలోకి తీసుకురాకండి. దీని గురించి నేను ఇంకేమీ చెప్పలేను. నెటిజన్లు ఎలాంటి కథనాలు అల్లుతున్నారో నాకు తెలియదు. ఇతరులకు సంబంధించిన బాధను ఉపయోగించుకుని కొన్ని వ్యాసాలు రాయడం చాలా బాధాకరం. అందుకే నేను అలాంటి ఊహాగానాలకు సమాధానం చెప్పను" అని హేమ మాలిని అన్నారు.

    ఢిల్లీలో సంతాప కార్యక్రమం జరపడానికి ప్రధాన కారణం తాను రాజకీయాల్లో ఉండటమేనని హేమ మాలిని అన్నారు.  ఆ రంగానికి చెందిన తన స్నేహితుల కోసం మాత్రమే అక్కడ సమావేశం నిర్వహించానని తెలిపారు. ఆపై మధుర తన నియోజకవర్గం కావడంతో వారితో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. జనపథ్‌లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన  ధర్మేంద్ర సంతాప సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, ఓం బిర్లాతో పాటు కంగనా రనౌత్, రంజిత్, అనిల్ శర్మ వంటి ఇతర రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

     

  • టైటిల్‌ : భర్త మహాశయులకు విజ్ఞప్తి
    నటీనటులు: రవితేజ, డింపుల్హయతి, ఆషికా రంగనాథ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, సునీల్తదితరులు
    నిర్మాణ సంస్థ: ఎస్ఎల్‌వి సినిమాస్
    నిర్మాత: చెరుకూరి సుధాకర్
    దర్శకత్వం: కిషోర్తిరుమల
    సంగీతం: భీమ్స్ సిసిరోలియో
    విడుదల తేది: జనవరి 13, 2023

    ముగ్గుల పండక్కి టాలీవుడ్ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమాభర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజ.. తన రూట్మార్చి చేసిన ఫ్యామిలీ డ్రామా ఇది. సంక్రాంతి పండగనే టార్గెట్గా పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. మరి చిత్రంతో అయినా రవితేజ హిట్ట్రాక్ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.

    కథేంటంటే..
    రామ సత్యనారాయణ అలియాస్రామ్‌(రవితేజ) వైన్యార్ట్ఓనర్‌. తాను కొత్తగా రెడీ చేసినఅనార్కలివైన్‌ని స్పెయిన్‌లోని ఓ కంపెనీకి శాంపిల్ పంపిస్తే వాళ్లు రిజెక్ట్‌ చేస్తారు.  కారణం తెలుసుకునేందుకు స్పెయిన్‌ వెళ్లిన రామ్‌.. అక్కడ అనుకోకుండా కంపెనీ ఎండీ మానసా శెట్టి(ఆషికా రంగనాథ్‌)తో ఫిజికల్గా దగ్గరవుతాడు. విషయాన్ని తన భార్య బాలామణి(డింపుల్హయతి) దగ్గర గోప్యంగా ఉంచుతాడు. తన డ్రెస్తో సహా ప్రతి విషయంలోనూ ఎంతో కేర్తీసుకునే భార్య బాలమణిని కాదని రామ్‌ .. మానసకు ఎలా దగ్గరయ్యాడు. విషయం బాలమణికి తెలియకుండా చేయడానికి రామ్ఏం చేశాడు? స్పెయిన్లో ఉన్న మానస మళ్లీ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఒకవైపు ప్రియురాలు, మరోవైపు సతీమణి.. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇరుక్కున్న రామ్‌.. చివరకు ఏం చేశాడు? తన సమస్యను పరిష్కరించుకునేందుకు బెల్లం అలియాస్విందా(సత్య), లీలా(వెన్నెల కిశోర్‌), సుదర్శన్‌(సునీల్‌)లను ఎలా వాడుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే.. 
    ఒకవైవు భార్య.. మరోవైపు ప్రియురాలు.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పురుషుడి కథతో ‘ఇంట్లో ఇల్లాలు..వంటింట్లో ప్రియురాలు’ తో పాటు  తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథ కూడా అదే.  ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఇరుకున్న ఓ భర్త.. ఆ ఇరకాటం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే  ఈ సినిమా కథ.  దర్శకుడు తిరుమల కిషోర్‌ ఎంచుకున్న పాయింట్‌ చాలా రొటీన్‌. కానీ దాని చుట్టూ అల్లుకున్న కామెడీ సన్నివేశాలు మాత్రం ట్రెండ్‌కు తగ్గట్లు ప్రెష్‌గా ఉన్నాయి.  

    మీమ్స్‌ కంటెంట్‌ని బాగా వాడుకున్నాడు.  సోషల్‌ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు  కొన్ని సీన్లకు బాగా కనెక్ట్‌ అవుతారు. అయితే ఏ జోనర్‌ సినిమాకైనా ఎమోషన్‌ అనేది చాలా ముఖ్యం.  ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితేనే.. ఆ కథతో ప్రయాణం చేస్తాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో అది మిస్‌ అయింది.  మగాళ్లు ఎలా ఉండాలో చెప్పడానికి తన భర్త ఒక రోల్‌ మోడల్‌ అని బాలమణి పదే పదే చెబుతుంది. అయితే అమె అంతలా తన భర్తను నమ్మడానికి గల కారణం ఏంటనేది చూపించలేదు. 

    అలాగే హీరో చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతన్నట్లుగా, భార్య దగ్గర దాచినందుకు టెన్షన్‌ పడుతున్నట్లుగా చూపించేందుకు రాసుకున్న సన్నివేశాల్లోనూ బలం లేదు.  ఫస్టాఫ్‌లో సత్య, కిశోర్‌ల కామెడీ  సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. స్పెయిన్‌ ఎపిసోడ్‌ వరకు చాలా ఎంటర్‌టైనింగ్‌గా కథనం సాగుతుంది. ఎప్పుడైతే హీరో తిరిగి ఇండియాకొస్తాడో.. అక్కడ నుంచి కథనం నీరసంగా సాగుతుంది.  హైదరాబాద్‌ వచ్చిన మానస.. భార్య కంట పడకుండా హీరో పడే తిప్పలు కొన్ని చోట్ల నవ్విస్తే..మరికొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. 

    మొత్తంగా పస్టాఫ్‌లో కథ లేకుండా కామెడీతో లాక్కొచ్చి..  బోర్‌ కొట్టకుండా చేశారు. కానీ సెకండాఫ్‌లో మాత్రం ఆ కామెడీ డోస్‌ తగ్గిపోయింది. ఊహకందేలా కథనం సాగడం.. కామెడీ సీన్లు కూడా పేలకపోవడంతో సెకండాఫ్‌లో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కీలకమైన క్లైమాక్స్‌ సీన్‌ని కూడా హడావుడిగా ముగించేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది.  ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌కి వెళితే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కొంతమేర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. 

    ఎవరెలా చేశారంటే.. 
    రవితేజకు ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లోనూ రామ్‌ లాంటి పాత్రలు పోషించాడు. అందుకే చాలా అవలీలలా ఆ పాత్రను పోషించాడు. ఇక హీరోయిన్లలో ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ పోటీ పడి మరీ అందాలను ప్రదర్శించడమే కాదు.. నటన పరంగానూ ఆకట్టుకున్నారు. వెన్నెల కిశోర్‌, సత్య, సునీల్‌ల కామెడీ ఈ సినిమాకు ప్లస్‌ అయింది. మరళీధర్‌ గౌడ్‌ కూడా తెరపై కనిపించేదే కాసేపే అయినా.. తనదైన నటనతో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే.  పిన్నీ సీరియల్‌ సాంగ్‌తో సహా పాత సినిమాల పాటలు ఇందులో చాలానే వాడారు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి.  సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

National

  • న్యూఢిల్లీ: కరూర్‌ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, హీరో విజయ్‌కు సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న కరూర్‌ తొక్కిసలాట కేసు దర్యాప్తుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

    టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై సోమవారం ఢిల్లీలోని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

    గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.

    కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు.

    తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. అధికార డీఎంకే కుట్రగా ఆరోపణలు గుప్పించారు.  పోలీసులే సరైన క్రౌడ్‌మేనేజ్మెంట్‌ చేయలేకపోవడం, రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రించ లేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అన్నారు.

    ఈ ఘటన తమిళనాడులో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఈ కేసు ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • ఢిల్లీ సాక్షి: దేశవ్యాప్తంగా వీదికుక్కల బెడద తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే కఠిన చర్యలు విధిస్తామని ప్రకటించింది. శునకాలు కరవడం వల్ల పిల్లలు లేదా పెద్దలు ఎటువంటి ప్రమాదానికి గురైనా దాని సంబంధించి రాష్ట్రాలే  పరిహారం చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది.

    దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరగడంతో ప్రజలలో రేబీస్‌తో పాటు ఇతర ప్రమాదకర వ్యాదులు పెరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, క్రీడా సముదాయాలు, రైల్వే స్టేషన్ల వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. అయితే  తాజాగా ఈ కుక్కల బెడద కేసును సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్‌నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌.వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు( మంగళవారం) మరోసారి విచారించింది.

    ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు "వీధి కుక్కల బెడద నివారణకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకుంటే పెద్దలను, పిల్లలను కుక్కలు కరిస్తే అధిక మెుత్తంలో రాష్ట్రాలు  పరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. అదేవిధంగా కుక్కలకు పుడ్‌ పెట్టేవారు వారి ఇంట్లోని వాటిని పెంచుకొని అక్కడే వాటికి తిండిపెట్టండి". అని జస్టిస్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. జంతు ప్రేమికులము అని చెప్పుకునే సంస్థలు తొమ్మిదేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేసినప్పుడు ఏందుకు బాధ్యత తీసుకోలేదు అని జస్టిస్ ప్రశ్నించారు.

    అదే విధంగా కుక్కలకు ఆహారం ఇచ్చేవారిపై వేదింపులకు గురవుతున్నాయి అని వచ్చిన పిటిషన్‌ను తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అది శాంతిభద్రతల సమస్యని అలా వేధింపులకు గురైన వారు వ్యక్తిగతంగా కేసు నమోదు చేసుకోవాలని సూచించింది. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదని యనిమల్ బర్త్ రూల్ ప్రకారం చికిత్స కాని వాటిని షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

  • సాక్షి, ఢిల్లీ: అవినీతి చట్టంలోని 'సెక్షన్ 17A' రాజ్యాంగ బద్ధతపై ఎటూ తేలలేదు. ఈ సెక్షన్‌ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం వేర్వేరు తీర్పులు ఇచ్చింది.  

    జస్టిస్ విశ్వనాథన్ ఈ సెక్షన్‌ను సమర్థించగా, జస్టిస్ నాగరత్న దీనిని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. ఈ అంశాన్ని తగిన బెంచ్‌కు(స్పెషల్‌) బదిలీ చేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.

    ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే, ఆ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదు. అధికారులను వేధించకుండా ఉండేందుకు ఈ నిబంధన అవసరం. సెక్షన్ 17ఎ రాజ్యాంగబద్దమే. అయితే  లోక్ పాల్  లేదంటే లోకాయుక్త అనుమతి ఉండాలి
    ::జస్టిస్ విశ్వనాథన్ 

    సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోంది. అవినీతికి పాల్పడే వారికి ఎలాంటి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు
    ::జస్టిస్ నాగరత్న

    సెక్షన్ 17 ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ  సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్.. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ సెక్షన్‌ గురించి గతంలోనూ విచారణ జరిగింది. అంతెందుకు స్కిల్‌స్కాం కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరిపే  అంశంలో ఈ సెక్షన్‌ కీలకంగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. 

    17A-చట్టం పూర్వాపరాలు…
    2018 లో అవినీతి నిరోధక యాక్టులో సవరణ చేస్తూ 17-A అనే కొత్త సెక్షన్‌ను చేర్చింది. నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది. అయితే..17A అనేది పూర్తిగా 2018 తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసంది. ఈ చట్టం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు… ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నేరాల్లో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు లేదు.

    a)    నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా  ఉండాలి
    (b)    నేరము జరిగిన సమయములో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా  ఉండాలి.
    (c)    నేరము జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని పదవి నుంచి తొలగించగల అధికారం ఉన్నవారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి అయితే.. 

    ►ఏసీబీ ట్రాప్‌తో పాటు సంఘటన స్థలంలోనే నేరం చేసిన ఉద్యోగిని అరెస్టు చేసిన సందర్భాలలో ఎలాంటి అనుమతి అవసరం లేదు. ►ప్రభుత్వ ఉద్యోగిపై విచారణ కోసం అనుమతి అడిగిన సమయంలో సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయం వెల్లడించాలి. ఈ గడువు మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉంది.

    చంద్రబాబు కేసులో జరిగింది ఇదే.. 
    స్కిల్‌ కేసులో నాడు(సెప్టెంబర్‌ 9, 2023)  తనను గవర్నరు అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారు గనుక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ద్వారా రక్షణ కావాలని.. మొత్తం కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను వేశారు.  కాకపోతే స్కిల్‌ కుంభకోణం 2018కి ముందే జరగటం.. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఉండటం వల్ల సెక్షన్‌ 17ఏ వర్తించదని చంద్రబాబు కేసులో సీఐడీ వాదించింది కూడా.  చంద్రబాబుపై సెక్షన్‌ 13 (సీ),(డీ) కింద అభియోగాలు మోపారని, వాటిని తర్వాత రద్దు చేసినప్పటికీ, రద్దుకు ముందే నేరం జరిగిందని సీనియర్‌ న్యాయవాది రోహత్గీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘సెక్షన్‌ 17ఏ జూలై 2018లో అమలులోకి వచ్చింది. నేరం 2015–2016 మధ్య జరిగింది. ఆ సమయంలో చట్టంలో సెక్షన్‌ 17ఏ లేదు. చట్ట సవరణకు ముందు కేసు కాబట్టి 17ఏ వర్తించదు. అలాగే.. చంద్రబాబు కేసుకు 17ఏ వర్తించదని నాలుగు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి’ అని సుప్రీం కోర్టుకు గుర్తు చేశారు. ఇదిలా ఉండగానే.. ఏపీ సీఐడీ ఈ కేసులో ఆధారాల్లేవని చెప్పడంతో.. ఏసీబీ కోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసిన సంగతి తెలిసిందే.

  • ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోందన్నారు. దాయాది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.

    చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆర్మీ చీఫ్‌ ద్వివేది తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోంది. భారత్‌లో త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం. దేశంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ సైనిక సంసిద్దంగా ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా అది స్పష్టమైంది. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా.. ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉండటం కీలకం. భారత మోహరింపులు బలంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఆపరేషన్‌ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. కవ్వింపు చర్యలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని’ అని అన్నారు.

    ఇదే సమయంలో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. వారిలో దాదాపు 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారే ఉన్నారు. వీరిలో ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. స్థానికంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. అయితే, ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపుగా లేవు. మా సమాచారం ప్రకారం దాదాపు ఎనిమిది శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. వీటిలో, రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా.. ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. ఈ శిబిరాల్లో కొంత ఉనికి లేదా శిక్షణ కార్యకలాపాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మేము నిశితంగా గమనిస్తూ ఇన్‌పుట్‌లను సేకరిస్తున్నాం. అలాంటి కార్యకలాపాలు మళ్ళీ గుర్తించబడితే, అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటాం అని హెచ్చరించారు. 

  • ధార్వాడ్‌: కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

    విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్‌కు గురయ్యారని అనుమానించారు.  దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.

    పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Guest Columns

  • డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.

    “ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..

    మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.

    అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.

    మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది.

     ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు.

    "నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.

    గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.

    -జాన్‌సన్‌ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

Business

  • వాషింగ్టన్‌: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్‌ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్‌ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్‌‌ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా?  

    కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్‌,స్కిల్స్‌,ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు.    

    ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్‌ పటేల్‌ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.

    అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్‌ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్‌ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్‌. మార్కెట్‌లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.

    ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్‌కు సంబంధించిన స్కిల్‌ను బిల్డ్‌ చేశాను. కంటెంట్‌ క్రియేట్ చేయడం, నెట్‌వర్కింగ్‌ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్‌ మలుపు తిరిగింది.

    నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్‌,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్‌ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు. 
     

     

  • దేశంలోని కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం ఉంది. ఉద్యోగుల సామాజిక భద్రతా పథకాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈపీఎఫ్‌ఓ (ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ), ఈఎస్‌ఐసీ (ఉద్యోగుల స్టేట్‌ బీమా సంస్థ)ల వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ రెండు సంస్థల వేతన పరిమితిని నెలకు రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య స్థాయికి పెంచాలని భావిస్తోంది.

    ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీల మధ్య వేతన పరిమితుల్లో భారీ వ్యత్యాసం ఉంది.

    ఈపీఎఫ్‌ఓ పరిమితి: నెలకు రూ.15,000 (ఇది 2014 సెప్టెంబర్ నుంచి మార్పు చేయలేదు).

    ఈఎస్‌ఐసీ పరిమితి: నెలకు రూ.21,000.

    ఈ వ్యత్యాసం వల్ల వేతనాల పెరుగుదల కారణంగా చాలా మంది ఉద్యోగులు సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, పెరిగిన కనీస వేతనాలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రెండు పథకాలను ఏకరీతిగా చేయడం ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.

    సుప్రీంకోర్టు ఆదేశాలు

    ఈ తాజా పరిణామాల్లో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు అత్యంత కీలకంగా మారాయి. జనవరి 2026 ప్రారంభంలో (జనవరి 5 నాటి సమాచారం ప్రకారం) సుప్రీం కోర్టు, ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి, ఈపీఎఫ్‌ఓ బోర్డుకు నాలుగు నెలల గడువు విధించింది. దశాబ్ద కాలంగా పరిమితి మారకపోవడంపై పిటిషనర్లు, ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటానికి ఇది ఒక విజయంగా భావించవచ్చు.

    లబ్ధిదారులపై ప్రభావం

    ఈ మార్పు అమల్లోకి వస్తే సామాజిక భద్రతా వలయం గణనీయంగా విస్తరిస్తుంది. ఈపీఎఫ్‌ఓ పరిధిలో ప్రస్తుతం ఉన్న 8.5 కోట్ల మంది సభ్యుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈఎస్‌ఐసీలో ప్రస్తుతం ఉన్న 14 కోట్ల మంది లబ్ధిదారులకుతోడు పరిమితి పెంపుతో మరిన్ని కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభిస్తుంది.

    పెరగనున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్

    ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం వాటా జమ చేస్తారు. యజమాని వాటాలో 8.33 శాతం పెన్షన్ స్కీమ్ (EPS)కు, 3.67 శాతం పీఎఫ్‌ ఖాతాకు వెళ్తుంది. వేతన పరిమితి పెరిగితే ఈ కాంట్రిబ్యూషన్‌ మొత్తం పెరిగి ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ మరింత మెరుగ్గా మారుతాయి.

    సాధారణంగా ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న రూ.15,000 గరిష్ట వేతన పరిమితి ఆధారంగా లెక్కలు కింది విధంగా ఉంటాయి.

    1. ఉద్యోగి వాటా (12%): గరిష్టంగా కట్ అయ్యే మొత్తం: రూ.15000*12%= రూ.1,800.

    2. యజమాని వాటా (12%): రెండు భాగాలుగా విడిపోతుంది.

    EPF (3.67%): 15000*3.67%= రూ.550.

    EPS (పెన్షన్ - 8.33%): 15000*8.33%= రూ.1250.

    కాబట్టి, ప్రస్తుత అధికారిక పరిమితి ప్రకారం మీ జీతం నుంచి నెలవారీ గరిష్టంగా కట్ అయ్యే పీఎఫ్‌ మొత్తం రూ.1,800.

    ఒకవేళ వేతన పరిమితి రూ.25,000 లేదా రూ.30,000 కి పెరిగితే..

    వేతన పరిమితిఉద్యోగి వాటా (12%)యజమాని వాటా (EPS + EPF)మొత్తం నెలకు జమ అయ్యేది
    రూ.25,000రూ.3,000రూ.3,000 (EPS: రూ.2,083 + EPF: రూ.917)రూ.6,000
    రూ.30,000రూ.3,600రూ.3,600 (EPS: రూ.2,499 + EPF: రూ.1,101)రూ.7,200
  • జీతం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లేకపోవడంతో పాటి.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ వంటివాటిని నిరసిస్తూ గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించారు. దీనిపై కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పందిస్తూ.. 10 నిమిషాల డెలివరీ సర్వీస్ విధానాన్ని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు.

    కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడానికంటే ముందు.. డెలివరీ సమయపాలనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్లింకిట్ , జెప్టో, జొమాటో & స్విగ్గీ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఒక సమావేశం నిర్వహించారు. బ్లింకిట్ ఇప్పటికే 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించింది. ఇక త్వరలోనే ఇతర అగ్రిగేటర్లు కూడా దీనిని అనుసరిస్తారని పేర్కొన్నారు.

    10 నిమిషాల డెలివరీ వల్ల సమస్యలు!
    ప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’ పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్‌ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.

    10 నిమిషాల డెలివరీ ఉద్దేశ్యం.. 
    10 నిమిషాల డెలివరీ సర్వీస్.. డెలివరీ ఏజెంట్స్ లేదా రైడర్లపై ఒత్తడి తెస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, దీపిందర్ గోయల్ స్పందిస్తూ..ఇళ్ల చుట్టుపక్కల్లో దుకాణాలు ఎక్కువ కావడం వల్లనే 10 నిమిషాల డెలివరీ అనేది తీసుకొచ్చాము. దీని ఉద్దేశ్యం డెలివరీ ఏజెంట్ వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలని కాదని అన్నారు. అంతే కాకుండా డెలివరీ కోసం కస్టమర్లకు ఇచ్చిన టైమర్.. డెలివరీ ఏజెంట్లకు కనిపించదని వెల్లడించారు.

    కార్మికుల భద్రత గురించి వివరిస్తూ.. డెలివరీ భాగస్వాములకు వైద్య, జీవిత బీమా ఉందని గోయల్ అన్నారు. ఆలస్యానికి జరిమానాల విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ.. డెలివరీ ఏజెంట్స్.. సమయానికి అందించకపోతే ఏమీ జరగదు. కొన్నిసార్లు అనుకోకుండా ఆలస్యాలు జరుగుతాయని గోయల్ వెల్లడించారు.

  • భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువాహతి (కామాఖ్య) మధ్య ఈ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన టికెట్ ధరలు, రిజర్వేషన్ నిబంధనలను రైల్వే బోర్డు అధికారికంగా వెల్లడించింది.

    జనవరి 17న ప్రారంభం

    రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్, టెస్టింగ్, భద్రతా సర్టిఫికేషన్ ప్రక్రియలు విజయవంతంగా పూర్తయ్యాయి. జనవరి 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సాధారణ ప్రయాణికులకు జనవరి 18 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులకు అత్యుత్తమ అనుభూతిని అందించేందుకు రైల్వే బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో కేవలం ‘కన్ఫర్మ్’ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. సాధారణ రైళ్లలో ఉండే ఆర్‌ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్ ఇందులో ఉండదు. అంటే, రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత సీటు కేటాయించబడని వారికి ప్రయాణించే అవకాశం ఉండదు. అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి (ARP) మొదటి రోజు నుంచే అన్ని బెర్తులు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

    టికెట్ ధరలు, కనీస ఛార్జీ

    రైల్వే బోర్డు ఇటీవల ప్రకటించిన సర్క్యులర్ ప్రకారం, వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరు ప్రాతిపదికన నిర్ణయించారు.

    • కనీస ఛార్జీ: ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

    • 3 ఏసీ కిలోమీటరుకు రూ.2.4 (కనీస ధర రూ.960)

    • 2 ఏసీ: కిలోమీటరుకు రూ.3.1 (కనీస ధర రూ.1,240)

    • 1 ఏసీ: కిలోమీటరుకు రూ.3.8 (కనీస ధర రూ.1,520)

    హౌరా-గువాహతి మార్గంలో పూర్తి ప్రయాణానికి 3 ఏసీకి సుమారుగా రూ.2,300, 2 ఏసీకి రూ.3,000, ఫస్ట్ ఏసీకి రూ.3,600 (కేటరింగ్ ఛార్జీలతో కలిపి) ఉండొచ్చని అంచనా. వీటికి అదనంగా జీఎస్టీ ఛార్జీలు ఉండే అవకాశం ఉందని గమనించాలి.

    రిజర్వేషన్ కోటాలు

    ఈ రైలులో అన్ని రకాల కోటాలు వర్తించవు. కేవలం కింద పేర్కొన్న ముఖ్యమైన విభాగాలకు మాత్రమే రిజర్వేషన్ కోటా ఉంటుంది.

    1. మహిళలు

    2. దివ్యాంగులు

    3. సీనియర్ సిటిజన్లు

    4. డ్యూటీ పాస్ కోటా (రైల్వే సిబ్బంది కోసం). మిగిలిన ఇతర ప్రత్యేక కోటాలకు ఈ రైలులో చోటు లేదు.

    ఈ రైలు ప్రత్యేకతలు

    మొత్తం 16 కోచ్‌లతో (11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ) నడవనున్న ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక ‘కవచ్’ భద్రతా వ్యవస్థ, ఆటోమేటిక్ డోర్స్, విమాన స్థాయి సౌకర్యాలతో ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని భారీతీయ రైల్వే తెలిపింది.

    ఇదీ చదవండి: ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.

    చారిత్రక తప్పిదమే పునరావృతం?

    మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్‌ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.

    పెరుగుతున్న విద్యుత్ డిమాండ్

    ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్‌లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్‌తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్‌ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్‌ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.

    శక్తి వనరులే అసలైన అడ్డంకి

    కేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్‌ డాలర్లను వెచ్చించింది.

    ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్‌ వీసాల రద్దు..

Andhra Pradesh

  • సాక్షి, తిరుపతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ఓఎన్జీసీ మోరి బావి–5లో భారీ బ్లోఅవుట్‌పై సందేహాలు వ్యక్తం చేస్తూ.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు ఒక వీడియో రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో భూమన కరుణాకర్‌రెడ్డి ఏమన్నారంటే..

    ఏ అనుభవం లేని డీప్‌ ఇండస్ట్రీస్‌:
    భారీ డ్రిల్లింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేని డీప్‌ ఇండస్ట్రీస్‌కు ఇరుసుమండలో ఓఎన్జీసీ కాంట్రాక్ట్‌ ఇచ్చారు. దీని వల్ల మోరి బావి–5 వద్ద భారీ బ్లోఅవుట్‌ జరిగి, 150 అడుగలకు పైగా మంటలు చెలరేగి వేలాది ఎకరాల్లో పంటలు తగలబడి, వందల కోట్ల నష్టం జరిగింది. ఈ దుర్ఘటన వెనుక ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంటే, దీన్ని సహజంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించి ప్రభుత్వ పెద్దలు మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    డీప్‌ ఇండస్ట్రీస్‌ అనే ఓ అమెరికన్‌ కంపెనీకి అనుభవం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అందుకే బ్లోఅవుట్‌ జరగ్గానే తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు సీరియస్‌గా సహాయ పనులు చేయాల్సిన అధికారులు నవ్వుతూ కనిపించారు. అందువల్లే బ్లోఅవుట్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

    లోతైన విచారణ జరపాలి:
    అందుకే డీప్‌ ఇండస్ట్రీస్‌ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది. అసలు ఎవరి ద్వారా ఈ కంపెనీ సహజ వాయువును వెలికి తీసే కాంట్రాక్టు దక్కించుకుందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాగా, ప్రమాద ఘటనను కూడా కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్నారని, అది మరీ దారుణమని భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపించారు.

     

  • సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దుర్గమ్మ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చేస్తోంది. కనకదుర్గానగర్‌ పార్కింగ్‌ వద్ద భక్తులపై దాడి ఘటన కలకలం రేపింది. విచక్షణ కోల్పోయి భక్తులపై పార్కింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు భక్తులపై దాడి చేశారు.

    భక్తులపై దాడి చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో దాడి దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై స్పష్టత లేదంటూ దుర్గగుడి అధికారులు ప్రకటించారు. దుర్గగుడి అధికారుల బాధ్యతా రాహిత్యంపై భక్తులు మండిపడుతున్నారు.

    కాగా, ఇటీవల దుర్గమ్మ సన్నిధిలో జరిగే శ్రీ చక్ర నవావరణార్చన పూజకు వినియోగించే పాలలో పురుగులు కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి సన్నిధిలోని నూతన పూజా మండపంలో ఈ ఘటన చోటుచేసుకోగా వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన రోజు పూజను అర్ధగంట పాటు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ పాల కోసం ఆలయ అర్చకులు దేవస్థాన వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశాన్ని పెట్టడంతో విషయం బయకొచ్చి దావానంలా వ్యాపించింది.

  • సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

    మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని  సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 

  • సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.

    కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్‌పేట్‌ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్‌ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్‌ఎస్‌ మూర్తి కుమారులు, కుమార్తె రమా­దేవి ఉన్నారు.

    గతేడాది డిసెంబర్‌ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు.  మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్‌ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.

  • గుంటూరు:  ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది.

     అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్‌ జగన్‌ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. 

    అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది.   

  • పచ్చ ఖద్దరు చొక్కాల ముందు ..ఖాకీ యూనిఫాం తెల్లబోయిందా...!అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసు మాట తమ్ముళ్ల పాదాల కింద చిక్కి నలిగిపోయిందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పండుగ మాటున పట్ట పగలే బరులు రూపుదిద్దుకుంటున్నాయ్‌... కోడి పందాలకు షామియానాలు లేస్తున్నాయ్‌.. జూదశాలల కోసం లక్షలు చేతులు మారుతున్నాయ్‌...అధికారం ఉందనే అహంకారమో.. పోలీసులు ఏం చేయలేరనే ధీమానోగానీ పచ్చ నేతలు బరి తెగించారు.

    సాక్షి, పులివెందుల:  సంక్రాంతి పండుగ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కోడి పందేలు, జూదాలు కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి నిర్వహణ ద్వారా టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జూదాలను అరికట్టాల్సిన పోలీ సులు వారికి  సహకరిస్తున్నట్లు సమాచారం.  

    పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగు, మురారిచింతల, పార్నపల్లె గ్రామా ల్లో టీడీపీ నాయకులు కోడి పందాలు నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోడి పందాలు, జూదాలు, గుండాట, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు ఉన్నతాధికారులు సైతం పర్మిషన్‌ ఇచ్చారని టీడీపీ నాయకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా వాటి నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ మేరకు గుండాట, పేకాట ఆడించేందుకు వివిధ ప్రాంతాల వారిచే నిర్వాహకులు డబ్బులు కూడా తీసుకున్నారని సమాచారం. డబ్బులు ఇచ్చిన వారు తప్ప వేరేవారు ఆడేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

    నియోజకవర్గంలో భారీగా జూదాలు 
    లింగాల మండలానికి చెందిన టీడీపీ నాయకుడొకరు వారం రోజుల నుంచి జూదాలు నిర్వహించడానికి దొండ్లవాగులో 5నుంచి 7ఎకరాల స్థలాన్ని చదును చేశాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో జూదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షామియానాలను కూడా సిద్ధం చేశాడు. దీనికోసం జూద నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 14, 15, 16వ తేదీల్లో  లోపల.. బయట అనే పేకాట (మంగతాయి) ఆడించేందుకు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి  సదరు లింగాల మండల నాయకుడికి లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. అలాగే అక్కడే గుండాట నిర్వహించడానికి కడపకు చెందిన వ్యక్తి టీడీపీ నాయకుడికి రూ.15లక్షలు సమరి్పంచినట్లు సమాచారం. ఇవే కాకుండా కోడి పందాల నిర్వహణలో ఇప్పటికే పందెం దారులు కోట్లల్లో పందాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై కూడా టీడీపీ నిర్వాహకుడైన మండల నాయకుడికి లక్షల్లో సమరి్పంచినట్లు సమాచారం.  

    పోలీసులతో పనిలేదంటున్న టీడీపీ నాయకులు  
    జూదరులకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని సదరు టీడీపీ మండల నాయకుడు గట్టిగా భరోసా ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు తమను ఏమి చేయలేరని వారితో తమ నాయకుడు ముందుగానే మాట్లాడారని ఎలాంటి ఇబ్బంది ఉండదని, స్వేచ్చగా మూడు రోజులపాటు జూదం ఆడుకోవచ్చునని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున జూదం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

    నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు  
    ఇంత జరుగుతున్నా ఖాకీలు కన్నెత్తి చూడడం లేదు. నిన్నా మొన్నటి వరకు సంక్రాంతి పర్వదినాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు విరివిరిగా ప్రచారాలు నిర్వహించారు. పైగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జూదశాలలు నిర్వహించకూడదని, అలా జూదాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఇదివరకే మీడియా సమావేశంలో హెచ్చరించారు. పులివెందులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక లింగాల మండలంలోనే కాకుండా పులివెందుల మండలంలోని కొత్తపల్లె, అచ్చివెళ్లి ఇతర గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జూదశాలలు నిర్వహించేందుకు ఆయా మండలాలకు చెందిన టీడీపీ నాయకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పేకాటశాలలు వెలుస్తున్నా.. కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నా స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు పోలీసుల తీరును తూర్పారబడుతున్నారు.  

  • రాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్‌, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. 

    భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్‌ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్‌కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్‌ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు.

    ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్య
    భర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్‌ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు.

     రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్‌ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది.

Family

  • నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్‌ స్పెషల్‌ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు.  




     

  • ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా  ఉండాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన ‘ఆర్ యూ డెడ్?’ (Are You Dead?) అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.

    ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్‌గా నిలిచింది.  ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా  ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతోంది. ఈ యాప్‌లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్‌ యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్‌ను ఓపెన్ చేసి, తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్‌పై  కనిపించే బటన్‌ను నొక్కాలి.

    ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నంబర్‌కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి సన్నిహితులు గ్రహించి, వెంటనే స్పందించేందుకు అవకాశం  ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్, ప్రస్తుతం 8 యువాన్ల (సుమారు రూ. 95) ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

    వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం మారుతున్న సామాజిక పరిస్థితుల  కారణంగా ఈ యాప్  ఆదరణం పొందుతోంది. ఈ యాప్ పేరు ‘ఆర్ యూ డెడ్?’ (మీరు చనిపోయారా?) అని ఉండటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు  ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ‘ఆర్ యూ అలైవ్?’ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.

    ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి

  • హైదరాబాద్: 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా ఆమెకు కొత్త జీవితం అందించారు.

    జార్ఖండ్‌కు చెందిన గృహిణి (పేరు మార్చారు – పల్లవి) గత దశాబ్దానికి పైగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర ప్రవాహం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాత్‌రూమ్‌లో ఒక్కసారి మూత్ర విసర్జనకు 15–20 నిమిషాల వరకు సమయం పట్టేది. అనేక చోట్ల చికిత్సలు తీసుకున్నా, తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య పూర్తిగా తగ్గలేదు.

    ఈ పేషెంట్ కి ఏఐఎన్‌యూ బంజారాహిల్స్‌లోని కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ భవతేజ్ ఎంగంటి కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల్లో ఆమె మూత్ర ప్రవాహం పూర్తిగా సాధారణ స్థాయికి చేరింది.

    డాక్టర్ సారికా పాండ్యా మాట్లాడుతూ, మహిళకు ఫీమేల్ యూరేత్రల్ స్ట్రిక్చర్ అనే మూత్ర సంబంధ సమస్య ఉందని తెలిపారు. మూత్రనాళం సన్నబడటం వల్ల ఈ సమస్య వస్తుందని, దీని లక్షణాలుగా మూత్రం చుక్కలుగా రావడం, మధ్యలో ఆగిపోవడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన, తరచూ ఇన్ఫెక్షన్లు ఉంటాయని వివరించారు.

    తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, సిజేరియన్ లేదా గర్భాశయ తొలగింపు వంటి శస్త్రచికిత్సల సమయంలో క్యాథెటర్ వాడకం, సరైన నిర్ధారణ లేకుండా పదేపదే యూరేత్రల్ డైలటేషన్ చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశముందని చెప్పారు.

    “యూరేత్రల్ డైలటేషన్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేయించుకోవడం వల్ల మూత్రనాళం మరింత దెబ్బతిని సమస్య తీవ్రమవుతుంది,” అని డాక్టర్ సారిక తెలిపారు.

    పురుషుల్లో చాలాకాలంగా ఉపయోగిస్తున్న బకల్ మ్యూకోసల్  గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీని ఇప్పుడు మహిళల్లోనూ విజయవంతంగా చేస్తున్నారు. నోటిలోని లోపలి పొర నుంచి తీసుకున్న కణజాలంతో మూత్రనాళాన్ని పునర్నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ శస్త్రచికిత్స వల్ల మూత్ర అదుపు కోల్పోయే ప్రమాదం లేదని కూడా స్పష్టం చేశారు.

    గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూలో ఈ విధమైన శస్త్రచికిత్సను 60 మంది మహిళలకు నిర్వహించగా, దాదాపు అందరిలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మరో పేషెంట్ కి కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండగా, శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు.

    డాక్టర్ భవతేజ్ ఎంగంటి మాట్లాడుతూ, “మహిళల్లో యూరేత్రల్ స్ట్రిక్చర్  పెద్ద సమస్యగా గుర్తించరు. దీంతో వారు సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. సరైన సమయంలో నిర్ధారణ చేసి ఆధునిక శస్త్రచికిత్స చేయిస్తే, ఎంతకాలంగా ఉన్న సమస్యనైనా సమర్థంగా నయం చేయవచ్చు  అన్నారు.

    మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు ఉన్న మహిళలు తప్పనిసరిగా నిపుణ వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సారిక సూచించారు. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో కనిపిస్తుందని, మూత్ర సంబంధిత సమస్యలతో వచ్చే మహిళల్లో 10–20 శాతం మందిలో ఇది ఉండొచ్చని తెలిపారు. 

    మహిళల్లో మూత్ర సమస్యలు కేవలం వైద్య పరమైన సమస్యలే కాకుండా సామాజిక, భావోద్వేగ భారం కూడా అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఇబ్బందులపై మాట్లాడటాన్ని చాలామంది మహిళలు ఇబ్బందిగా భావిస్తారని, ఇదే సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతోందని అన్నారు. అవగాహన, సమయానుకూల చికిత్స ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని వారు స్పష్టం చేశారు.

  • శ్రీకాకుళం జిల్లా: గార మండలంలోని బూరవిల్లి గ్రామం భోగి ఉత్సవానికి దూరంగా ఉంటోంది. అన్ని గ్రామాల మాదిరిగా వేకువజామున వేసే భోగి మంట అక్కడ వేయరు. పెద్దల కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని తామంతా కొనసాగిస్తున్నామని అక్కడి గ్రామపెద్దలు చెబుతుంటారు. ఇక్కడ ఉగాది రోజున రైతులు ఏరువాక చేయకుండా, మరో రోజు ముహూర్తం చూసి ఏరువాక చేస్తారు. నాగుల చవితి రోజు కాకుండా అదే నెలలో వచ్చే  సుబ్రహ్మణ్య షష్టి రోజున పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు.  

    మంట వేస్తే అరిష్టమని 
    నరసన్నపేట: నరసన్నపేట మండలం చోడవరం, చింతు వానిపేట, బసివలస, గోకయ్యవలస, సుందరాపురం గ్రామాల ప్రజలు భోగి మంటలకు దూరంగా ఉంటారు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మంట వేస్తే గ్రామానికి అరిష్టం కలుగుతుందని వీరి నమ్మకం. అయితే పూజలు, పిల్లలకు భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుపుతారు. 

     

    150 ఏళ్లుగా.. 
    జలుమూరు: లింగాలవలస గ్రామం భోగి పండుగ జరుపుకోదు. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి భోగి మంటే వేయలేదు. 150 ఏళ్ల కిందట గ్రామంలో భోగి పండగ చేసేందుకు కర్రలు, పిడకలు సిద్ధం చేశారు. మంట వెలిగించేందుకు నిప్పు పెడుతుండగా ఒక పెద్ద పులి వచ్చి గ్రామంలో ఓ వ్యక్తిని  నోట కరుచుకొని తీసుకెళ్లిపోయిందనే కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి ఇక్కడ భోగి మంట వేయకూడదని పెద్దలు తీర్మానం చేశారు.

    ఆ రెండు గ్రామాల్లో.. 
    కొత్తూరు: మండలంలోని ఓండ్రుజోల, బడిగాం గ్రామాల్లో భోగి పండుగ జరుపుకోరు. అప్పట్లో మంట దగ్గరకు పులి వచ్చి ఒకరిని ఎత్తుకుపోవడంతో నాటి నుంచి రెండు గ్రామాల్లో భోగి చేసుకోవడం లేదని వృద్ధులు చెబుతున్నారు.  

    ముందురోజే.. 
    కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామంలో భోగి పండుగను ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంప్రదాయంగా వచ్చే భోగికి ముందు రోజు రాత్రి మంట వెలిగిస్తారు. రాత్రి సుమారు 9 గంటలు తర్వాత భోగి మంటకు గ్రామ పెద్దలు నిప్పు పెడతారు. భోగి రోజు యథావిధిగా పిల్లలు పిడకలను మంటలో వేస్తారు.  

     కక్క.. ముక్క.. పెరిగిన లెక్క 
    సంక్రాంతికి ముందే మాంసాహార ధరలు పెరిగాయి. నాటుకోళ్లు, చేపలు, మటన్‌ ధరలన్నీ బాగా పెరిగాయి.  సోమవారం సంతలో నాటు కోళ్లు కిలో రూ. 800కు విక్రయించారు. నాటు కోడి చికెన్‌ ధర రూ. 1200 ఉంది. మటన్‌ రూ.900 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి తాకింది. చెరువు చేపల ధరలు కూడా పెరిగాయి.  

    –నరసన్నపేట

    హరిలో రంగ హరి 
    సంక్రాంతి అతిథులు వచ్చేశారు. హరిలో రంగా.. హరీ అంటూ హరిదాసులు, భలే దొడ్డ దొరండీ మా బసవన్న అంటూ గంగిరెద్దుల వారు, అంబ పలుకు అంటూ కోయిదొరలు, హరోం హరా అంటూ జంగమ దేవరలు ఊరికి కళ తీసుకువచ్చారు. వీరు వేకువ జాము మొదలు ఆయా గ్రామాల్లో శంఖారావం చేస్తూ ఇంటింటా తిరిగి దీవిస్తున్నారు.   –జలుమూరు 

  • న్యూఢిల్లీ: దేశంలోని ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తరచూ సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ ద్వారా ఒక  ఆధ్యాత్మిక యాత్రను ప్రకటిచింది. తొమ్మిది రాత్రులు, 10 పగటి రోజులు సాగే ఈ సుదీర్ఘ యాత్ర ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభమై, ఫిబ్రవరి 14వ తేదీతో ముగుస్తుంది.

    ఈ యాత్ర చేయాలనుకునేవారు గయ, పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కోల్‌కతా, గంగాసాగర్, బైద్యనాథ్ ధామ్, వారణాసి,  అయోధ్య తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలను  సందర్శించవచ్చు.ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ పర్యటనలో గయలోని విష్ణుపాద ఆలయం, పూరిలోని జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్‌లోని సూర్య దేవాలయం, కోల్‌కతాలోని గంగాసాగర్, జసిదిహ్‌లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హి తదిరత పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

    ఈ రైలులో మొత్తం 767 సీట్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో 2 ఏసీ విభాగంలో 49, 3 ఏసీ విభాగంలో 70, స్లీపర్ క్లాస్‌లో 648 సీట్లు  ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ లేదా స్లీపర్ క్లాస్ ప్రయాణ సౌకర్యంతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో శాకాహార భోజనం అందిస్తారు. అలాగే స్థానిక ప్రాంతాల సందర్శన కోసం ఏసీ లేదా నాన్-ఏసీ బస్సుల సౌకర్యం ఉంటుంది. ధరల విషయానికి వస్తే ఎకానమీ (స్లీపర్) క్లాస్‌కు ఒక్కొక్కరికి రూ. 19,110, స్టాండర్డ్ (థర్డ్ ఏసీ) క్లాస్‌కు రూ. 31,720, కంఫర్ట్ (సెకండ్ ఏసీ) క్లాస్‌కు ₹41,980 గా నిర్ణయించారు. ఐదేళ్ల నుండి 11 ఏళ్ల లోపు పిల్లలకు స్వల్ప రాయితీతో కూడిన ధరలు వర్తిస్తాయి.

    ఈ ఆధ్యాత్మిక యాత్రను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ప్యాకేజీని ఈఎంఐ (ఈఎంఐ) పద్ధతిలో కూడా పొందే అవకాశం కల్పించారు. ఐఆర్సీటీసీ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా సులభ వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించే వెసులుబాటు ఉంది. తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

    ఇది కూడా చదవండి: షాకింగ్‌ రిపోర్ట్‌: ఆ వ్యాధితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం