Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • ‘తొలి ప్రేమ, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌’ వంటి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దర్శకుడు కరుణాకరన్. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ హీరోగా కొత్త సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు వీవీ వినాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ కామెడీగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా కరుణాకరన్‌ శైలిలో సున్నితమైన, ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది.

    ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మాటలు రాస్తున్నాడు. కామెడీ సన్నివేశాల్లో కరుణాకరన్‌కు ప్రత్యేకమైన స్టయిల్ ఉండగా, అనుదీప్‌కు కూడా హాస్యంలో మంచి పట్టుంది. వీరి కలయికతో వినోదం మరింత పెరిగే అవకాశం ఉంది. సంగీతం అందించబోతున్నది భీమ్స్.  

    ఈ సినిమాలో బెల్లంకొండ గణేశ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్‌ను తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. హీరోయిన్ ఎంపికతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత వెయిట్ యాడ్ కానుంది. కరుణాకరన్, అనుదీప్ కలయికలో రాబోతున్న ఈ సినిమా వినోదభరితంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. బెల్లంకొండ గణేశ్ కెరీర్‌లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.  

  • రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్‌ శౌర్యువ్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్‌గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

     

     

  • వైఎస్‌కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఓ తండ్రి కథ. ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్వీ క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు ఆడియో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వి సముద్ర, సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

    దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. 'ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్‌లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి  నిబద్ధతకు నిదర్శనం' అని అన్నారు.

    దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…'తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం' అని అన్నారు. ఈ చిత్రంలో అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి. కరుణాకర్, తన్నీరు నాగేశ్వరరావు, విజయలక్ష్మీ , వరేణ్య ఆగ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కుటుంబ కథాచిత్రంం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

     

  • బొమ్మరిల్లు మూవీతో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకున్న బ్యూటీ జెనీలియా. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. బాలీవుడ్ రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ముంబయిలోనే ఉన్న జెనీలియా.. గతేడాది సితారే జమీన్ పర్, జూనియర్ చిత్రాల్లో మెరిసింది.

    జెనీలియా సంగతి పక్కన పెడితే ఆమె భర్త రితేశ్ దేశ్‌ముఖ్ చారిత్రక మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజా శివాజీ పేరుతో వస్తోన్న చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రితేశ్ దేశ్‌ముఖ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాకుండా రితేశ్ తన తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వేదికపైనే చిన్న పిల్లలా ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కన్నీళ్లు..

    చాలా రోజుల నిరీక్షణ తర్వాత 'రాజా శివాజీ' ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సందర్భంగా తన కల సాకారం చేసుకోవడంలో సాయపడిన చిత్ర బృందానికి రితేశ్ ధన్యవాదాలు తెలిపారు. వేదికపై రితేశ్ ఎమోషనల్ కావడంతో.. జెనీలియా దేశ్‌ముఖ్  భావోద్వేగానికి గురైంది. ఈ మాటలు విన్న సంజయ్ దత్ సైతం ఎమోషనల్‌గా కనిపించారు. ఈ కథను తీసుకురావడంలో తనకు మద్దతుగా నిలిచిన జెనీలియాకు సైతం రితేశ్ ధన్యవాదాలు తెలిపారు.

    ఈ కార్యక్రమానికి సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేష్ మంజ్రేకర్, భాగ్యశ్రీ లాంటి స్టార్స్ హాజరయ్యారు. వీరంతా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 'రాజా శివాజీ' చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించారు, ఆయన జీవ మహాల అనే పాత్రను పోషించారు. ఈ మూవీలో  సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మరాఠీ, హిందీ భాషల్లో ఓకేసారి తెరకెక్కించారు. ఈ హిస్టారికల్ మూవీ మే 1, 2026న థియేటర్లలో విడుదల కానుంది. 
     

     

  • వింటేజ్ లుక్‌తో షాకిచ్చిన రుక్మిణి వసంత్

    కశ్మీర్‌లో చిల్ అయిపోతున్న ఐశ్వర్యా రాజేశ్

    ఉంగరాల జుట్టుతో అనుపమ పరమేశ్వరన్

    ‍ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ శర్మ సిస్టర్స్ ఎంజాయ్

    హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే సెలబ్రేషన్

    చిరుతో అనన్య నాగళ్ల మెమొరబుల్ మూమెంట్

  • డిస్కో శాంతి అప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. 1965న జన్మించిన డిస్కో శాంతి దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు.

    టాలీవుడ్ హీరో శ్రీ హరితో పెళ్లి..

    ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన డిస్కో శాంతి.. టాలీవుడ్ హీరో  శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే పరిమితమైంది. కానీ ఊహించని విధంగా శ్రీహరి అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

    మగధీరలో వద్దని బావకు చెప్పా..

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన డిస్కో శాంతి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. మగధీర చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్‌ చేయొద్దని బావ శ్రీహరికి చెప్పానని తెలిపింది. ఒక హీరో భార్యగా.. హీరో వేరు.. సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు కదా అనే ఆలోచన నాలో ఉండేదని పేర్కొంది. రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్ని.. కానీ సపోర్టింగ్‌ రోల్‌ అనే సరికి వద్దని చెప్పానని డిస్కో శాంతి వెల్లడించింది. మొదట బావ నాకు మగధీర కథ చెప్పలేదని తెలిపింది. కానీ మగధీర సినిమాలో ఈ క్యారెక్టర్‌ లేకపోతే సినిమానే లేదనే విషయం నాకు తర్వాత అర్థమైందని శాంతి చెప్పుకొచ్చింది. రాజమౌళి గారు ఈ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారోనని పంచుకుంది. 

    కాగా.. డిస్కో శాంతి 1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు.

  • ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అన్నట్లు ఓ తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో అందుబాటులో ఉంది?

    (ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)

    అనుదీప్, అజయ్ కుమార్, వేద్విక తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'మత్తురా'. గతేడాది సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. పరిమిత బడ్జెట్, నటీనటులు కొత్తవాళ్లు కావడంతో ఇదొచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియెన్స్‌కి తెలీదు. ఇప్పుడీ మూవీ ఏడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.

    'మత్తురా' విషయానికొస్తే.. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. మద్యం అలవాటు వారి జీవితాలని ఎలా నాశనం చేసింది? ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేలా చేసింది అనే అంశాలతో అడ్వెంచరస్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. పువ్వాళ చలపతి దర్శకత్వం వహించారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

  • రెండున్నర వారాల క్రితం మలయాళంలో రిలీజై సెన్సేషన్ సృష్టిస్తున్న సినిమా 'వాలా 2'. స్కూల్ పిల్లల నేపథ్య కథతో కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కట్ చేస్తే ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోనూ ఈ శుక్రవారం(ఏప్రిల్ 24) రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఓం శాంతి డిస్కో శాంతి.. దెయ్యాల్ని భయపెట్టే పిచ్చోళ్లు)

    ట్రైలర్ బట్టి చూస్తే నలుగురు స్టూడెంట్స్ జీవితాల్లో స్కూల్ లైఫ్ ఎలాంటి పాత్ర పోషించింది? చివరకు వాళ్లు ఏం తెలుసుకున్నారు? అనే విషయాల్ని కామెడీ, ఎమోషనల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 'సంక్రాంతికి చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్' తీసిన సాహు గారపాటి.. 'వాలా 2' నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం. మలయాళంలో సంచలనాలు ‍క్రియేట్ చేసిన ఈ చిత్రం.. తెలుగులో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?

    (ఇదీ చదవండి: అనసూయపై అసభ్యకర కంటెంట్.. మరో నిందితుడు అరెస్ట్)

  • రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పెద్ది’.. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కోసం పనిచేసిన ఫ్రేమ్ ఎక్స్ వీఎఫ్ఎక్స్ సంస్థ అధినేత నిలేష్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లీష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ వీఎఫ్‌ఎక్స్‌ పనిగురించి మాట్లాడారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త.

    పెద్ది సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించి ఫ్రేమ్‌ ఎక్స్‌ అనే సంస్ధ పనిచేస్తుంది. మూవీలోని కొన్ని సీన్స్‌ గురించి ఆ సంస్థ అధినేత నిలేష్‌ పలు వ్యాఖ్యలు చేశారు.పెద్ది సినిమాలోని 5 నిమిషాల రెజ్లింగ్‌ సీన్‌ వీఎఫ్‌ఎక్స్‌ కోసం చాలా ఎక్కువ సమయం పడిందని ఆయన అన్నారు. ఈ సీన్‌ పూర్తి చేసేందుకు సుమారు 3నెలల సమయం పడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ పని ఫ్రేమ్ వారీగా ఉంటుందని, ఒక నిమిషానికి 1440 ఫ్రేమ్‌లు ఉంటాయని  ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ప్రతి ఫ్రేమ్‌లో చేసిన మెరుగుదల పరిధిని బట్టి పని ఖర్చు మారుతుంది" అని ఆయన చెప్పారు.

    పెద్ది గురించి నిలేష్‌ ఇచ్చిన అప్‌డేట్ అభిమానులను ఖచ్చితంగా సంతోషపరుస్తుంది. ఎందుకంటే ఎలాంటి రాజీ లేకుండా ప్రేక్షకులకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో చిత్ర బృందం విఎఫ్ఎక్స్ (VFX) కోసం తగినంత సమయాన్ని కేటాయిస్తోంది. పెద్ది మూవీలో  రామ్‌చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శివరాజ్‌ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
     

  • సామాజిక మాధ్యమాలలో టాలీవుడ్ నటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌పై అసభ్యకర పోస్టులు పెడుతున్న నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ లక్ష్యంగా అసభ్యకరమైన సోషల్ మీడియా కంటెంట్‌ పోస్ట్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దొరెపల్లి చంటి(30)గా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను చంటిదొరెపల్లి అనే పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్ నిర్వహిస్తున్నారు.

    కాగా..ఇటీవలే జనార్ధన్ అనే నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్‌ 23న  పలువురు  సోషల్‌ మీడియాలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్‌ చేసి.. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

  • ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ లాంటి సినిమా, సిరీస్ తీసిన మ‌హి వి.రాఘ‌వ్ నుంచి రాబోతున్న మ‌రో స‌రికొత్త కామెడీ హార‌ర్ మూవీ 'ఓం శాంతి డిస్కో శాంతి'. మరోసారి ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బా న‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాలు మ‌నుషుల్ని  భ‌య‌పెట్టాయి. కానీ ఆ దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే? అస‌లు భ‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వ‌స్తే.. దెయ్యాలు వ‌ర్సెస్ పిచ్చివాళ్లు మ‌ధ్య జ‌రిగే ఓ గంద‌ర‌గోళ‌మైన ఫుల్ ఫ‌న్ రైడర్ ఈ చిత్రం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

    దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని భ‌య‌పెట్ట‌గ‌ల‌వా? లేదా పిచ్చివాళ్లే తిర‌గ‌బ‌డి దెయ్యాల్ని భ‌య‌పెడ‌తారా? జంప్ స్కేర్‌, ఫ‌న్నీ డైలాగ్స్‌, ఉహించ‌ని ట్విస్టులతో ఈ స్పూకీ ఫ‌న్ జ‌ర్నీ తెర‌కెక్కుతోంది. ఓం శాంతి డిస్కో శాంతి సినిమాని సెప్టెంబ‌ర్‌ 4న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

    (ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)

  • దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌ ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన శ్రీరాముడిని ఉద్దేశించి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన కామెంట్స్‌పై వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మరింత ముదిరేలా కనిపిస్తోంది.

    ప్రకాశ్‌ రాజ్‌ను సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్‌ చేయాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది. శ్రీరాముడిపై చేసిన కామెంట్స్‌తో ఆయనపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై నిషేధం విధించాలనే డిమాండ్స్‌ రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. సినీ వర్గాలు సైతం ప్రకాశ్ ‍రాజ్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

    ప్రకాశ్ రాజ్‌ తన చేసిన కామెంట్స్‌పై వివరణ ఇచ్చినప్పటికీ వ్యతిరేకత ఏమాత్రం తగ్గడం లేదు. అయితే కొందరు దర్శకులు, నటులు మాత్రం ఈ విషయంపై పునరాలోచన చేయాలంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతంలో కూడా ఆయనపై ఇండస్ట్రీలో వివాదాలు ఉన్నాయని.. అప్పట్లో తాత్కాలికంగా బ్యాన్ జరిగిన సంఘటనలు కూడా తాజాగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

  • అల్లు అర్జున్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ.. ఆ ఇమేజ్‌ని దాటి సొంతంగా తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్నాడు. కలెక్షన్స్‌ పరంగా చూస్తే.. బన్నీ ఇప్పుడు పాన్‌ ఇండియా నెంబర్‌ 1 హీరో అని చెప్పొచ్చు. బన్నీ నటించిన గత మూడు సినిమాలు(అల వైకుంఠపురుములో, పుష్ప, పుష్ప 2) కలిపి రూ. 2,361 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. 

    ఇదంతా గత ఐదేళ్లలోనే జరిగింది. భారీ కలెక్షన్స్‌ మాత్రమే కాదు..జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరో కూడా బన్నీనే. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం(Allu Arjun Remuneration) అందుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. అయితే అందరి హీరోల్లా అల్లు అర్జున్‌(Allu Arjun) ఒక ఫిక్స్‌డ్‌ అమౌంట్‌కి సినిమా ఒప్పుకోడు అట. ఒక నిర్మాత కొడుకుగా తనతో సినిమా చేసే నిర్మాతలపై భారం పడకుండా పారితోషికం తీసుకుంటాడట. అలా అని తక్కువేం తీసుకోడు. ఇంకా చెప్పాలంటే..తోటి హీరోల కంటే కాస్త ఎక్కువే తీసుకుంటాడు. దాని కోసం అల్లు అర్జున్‌ ఓ స్పెషల్‌ రూట్‌ ఎంచుకున్నాడు.

    లాభాల్లో వాటా.. 
    అర్జున్ పారితోషికం తీసుకునే విధానం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత, కాలమిస్ట్ జి. ధనంజయన్ ఇలా వెల్లడించారు. ‘అల్లు అర్జున్‌ సినిమాకు ఇంత అని పారితోషికం తీసుకోరు. లాభాల్లో వాటాను మాత్రమే అడుగుతాడు. రూపాయిలో కేవలం 30 పైసలు ఆయన పారితోషికం కింద తీసుకుంటారు. ఊదహారణకు ఆయన నటించిన ఒక్క సినిమా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేస్తే.. ఆయన పారితోషికంగా రూ. 300 కోట్లు తీసుకుంటారు. మరో సినిమా రూ. 500 కోట్లు వసూలు చేస్తే..కేవలం రూ. 150 కోట్లు మాత్రమే తీసుకుంటారు. ఆయన పారితోషికం గురించి అస్సలు మాట్లాడరు. మంచి సినిమా చేయాలనే ప్రయత్నిస్తాడు’ అని ధనంజయన్‌ చెప్పుకొచ్చాడు.

    నిర్మాతకు భారం తగ్గుతుంది.. 
    బన్నీ ఫాలో అవుతున్న విధానం వల్ల బడ్జెట్‌ తగ్గడమే కాదు.. నిర్మాత ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక సినిమాను రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలనుకుంటే.. లాభాల పంపిణీ విధానం వల్ల అందులో రూ. 25 కోట్లను తగ్గించొచ్చు. అలా చేయడం వల్ల నిర్మాత తీసుకోవలసిన రుణం తగ్గుతుంది, దాని ఫలితంగా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఇది సినిమా త్వరగా బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరుకుని, ఆపై లాభాలను ఆర్జించడానికి సహాయపడుతుంది’ అని ధనంజయన్‌ అన్నారు.

    పుష్ప 2కి ఎంత తీసుకున్నాడు?
    ధనంజయన్ మాటలను బట్టి చూస్తే.. పుష్ప, పుష్ప 2 చిత్రాలకు బన్నీ భారీగానే తీసుకున్నట్లు అర్థమవుతుంది. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,742.10 కోట్లు వసూలు చేసింది. అందులో 30 శాతం అంటే..సుమారుగా రూ. 522 కోట్లు సంపాదించి ఉండాలి. పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ. 350.10 కోట్లు వసూలు చేసింది. దీని కోసం సుమారు రూ. 105 కోట్లు అందుకుని ఉండాలి. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్నాడు. రూ.800 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం బన్నీకి ఎన్ని కోట్లను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి.

  • తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు కూడా 'చిరంజీవి' పేరుతో ఓ సినిమా తీశారు. ఇందులో డెక్స్ట్రోకార్డియా అనే వ్యాధి.. హీరోకు ఉంటుంది. అంటే ఎడమ వైపు ఉండాల్సిన గుండె.. కుడివైపు ఉంటుందనమాట. దీని వల్ల అప్పుడప్పుడు శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. అలా జరిగినప్పుడల్లా బాడీ నీలం రంగులోకి మారిపోతుంటుంది. ఈ మేరకు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)

    అయితే హీరోకి ఆక్సిజన్ సరిపోక స్పృహ తప్పి పడిపోయినప్పుడు హీరోయిన్ ఇచ్చి ముద్దుపెట్టి ఆక్సిజన్ అందించడం మాత్రం కాస్త సినిమాటిక్‌గా అనిపించింది. చివరలో మళ్లీ హీరోకి కుడివైపు కాదు ఎడమవైపే గుండె ఉంది అన్నట్లు చిన్న సస్పెన్స్ పెట్టడం ఆసక్తికరంగా అనిపించింది. గ్లింప్స్ అయితే బాగానే ఉంది గానీ పూర్తి మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. హీరోహీరోయిన్, దర్శకుడు, నిర్మాత అందరూ కొత్తవాళ్లే కావడం విశేషం.

    (ఇదీ చదవండి: విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం)

  • కన్నబిడ్డను కాపాడుకునేందుకు ప్రతి తల్లి పోరాటమే చేస్తుంది.  దాచుకున్న డబ్బంతా బిడ్డ ఆరోగ్యం కోసమే ఖర్చు చేసిన తల్లి తన బిడ్డను కాపాడాలని నటుడు సోనూసూద్‌ను వేడుకుంది. ఎన్నోచోట్ల ఆసుపత్రిలలో చూపించినా బతకడం కష్టమని చెప్పడంతో ఆమె తల్లడిల్లిపోయింది. సాయం కోసం సోనూ ఇంటవద్ద కన్నీళ్లతో నిల్చుంది. ఆమెను చూసిన సోనూ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. ఆ చిన్నారికి మరో జన్మనిచ్చిన దేవుడిలా ఆ కుటుంబానికి నిలిచాడు.

    తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారి పరిస్థితి తెలుసుకున్న సోనూసూద్‌ వెంటనే స్పందించారు. ముంబైలోని జూపిటర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో శస్త్రచికిత్స చేయించి ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని అందించారు. ఎన్నో  ఆసుపత్రులను తిరిగిన నీరా తల్లి దాదాపు ఆశ వదులుకుంది. అయితే, సోనూ ముందుకు రావడం ఆపై వైద్యం కోసం సాయం చేయడంతో ఆ చిన్నారి ఊపిరిపోసుకుంది.  అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోనూ ఒక పోస్ట్‌ చేశారు. ఎవరి జీవితంపైనా ఆశ వదులుకోవద్దు. మనం కలిసికట్టుగా నిలబడితే, ఎంతటి కఠినమైన యుద్ధాలనైనా గెలవవచ్చని ఆయన పేర్కొన్నారు.
     

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. 

    వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. 

    టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ (101 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం చెల‌రేగ‌గా,  న‌మ‌న్ ధిర్ (45) బాధ్య‌తాయుతంగా ఆడారు. గుజ‌రాత్‌బౌల‌ర్ల‌లో ర‌బాడ 3 వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచ‌రీతో చెల‌రేగిన తిల‌క్ వ‌ర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 

    సీజ‌న్‌లో రెండో విజ‌యం సాధించిన ముంబై 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి ఎగ‌బాకింది. మ‌రోవైపు గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌తో ప‌ట్టిల‌క‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

     

     

  • ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ తిల‌క్ వ‌ర్మ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తిల‌క్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. న‌రేంద్ర మోడీ స్టేడియంలో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.

    ముంబై ఇండియన్స్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్.. తొలుత ఆచితూచి ఆడాడు. ఈ హైదరాబాదీ తను ఎదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. 

    అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. తొలి 50 పరుగులను 33 బంతుల్లో పూర్తి చేసిన తిలక్.. చివరి 50 పరుగులను కేవలం 12 బంతుల్లోనే బాది తన మొదటి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న తిలక్‌ వర్మ 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

    ఫాస్టెస్ట్ సెంచరీ
    ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే శతకొట్టిన తిలక్ వర్మ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జై సూర్య రికార్డును తిలక్ సమం చేశాడు. జైసూర్య 2008 సీజన్‌లో సీఎస్‌కేపై 45 బంతుల్లోనే శతక్కొట్టాడు.

    ఇప్పుడు మళ్లీ 18 ఏళ్ల తర్వాత తిలక్ 45 బంతుల్లో సెంచరీ చేశాడు. ముంబై ఇండియన్స్‌ తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఇండియన్‌ మాత్రం తిలక్‌ వర్మనే కావడం గమనార్హం.

    అదేవిధంగా ముంబై ఇండియన్స్‌ తరపున సెంచరీ చేసిన రెండువ అతి పిన్నవయష్కుడిగా తిలక్‌ నిలిచాడు. 23 ఏళ్ల 163 రోజుల్లో తిలక్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఈ జాబితాలో కామోరూన్‌ గ్రీన్‌(22 ఏళ్ల 352 రోజులు) అగ్రస్ధానంలో ఉన్నాడు.
    చదవండి: IPL 2026: ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ బాల్‌.. దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి


     

     

  • ఐపీఎల్‌-2026లో వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు భారీ షాక్ త‌గిలింది. సౌతాఫ్రికా స్పీడ్ అన్రిచ్ నోకియా సీజ‌న్ మ‌ధ్య‌లోనే లక్నో జ‌ట్టును వ‌దిలి స్వ‌దేశానికి వెళ్లిపోయాడు. అత‌డి భార్య త్వ‌ర‌లోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. 

    దీంతో త‌న భార్య వ‌ద్ద ఉండేందుకు నోర్జే పితృత్వ సెలవు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సీజన్‌లో నోకియా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

    దీంతో తర్వాత మ్యాచ్‌లలో అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో కూడా పంత్ టీమ్‌కు ఏదీ కలిసి రావడంలేదు. లక్నో బౌలింగ్‌ పరంగా కాస్త బలంగా ఉన్నప్పటికి, బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
    చదవండి: అత‌డిని ఎంత పొగిడినా తక్కువే.. కచ్చితంగా స్టార్ అవుతాడు: శ్రేయస్‌

  • ఐపీఎల్‌-2026లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న పేలవ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సూర్య తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్‌కు క‌గిసో ర‌బాడ ఆరంభంలోనే బిగ్ షాకిచ్చాడు.

    అత‌డు బౌలింగ్ ధాటికి ఓపెన‌ర్లు వికెట్లు కోల్పోయి ముంబై క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్‌పై ముంబై ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే 6 ఓవ‌ర్ వేసిన ర‌బాడ బౌలింగ్‌లో సూర్య‌  ఓ సిక్స్, ఫోర్ బాది మంచి ట‌చ్‌లో క‌న్పించాడు. కానీ అదే ఓవ‌ర్‌లో ర‌బాడ అద్భుత‌మైన బంతితో సూర్య‌కుమార్‌ను బోల్తా కొట్టించాడు.

    ఐదో బంతిని ర‌బాడ లెంగ్త్ బాల్ సంధించాడు. ఆ డెలివరీని సూర్య స్ట్రైట్ డ్రైవ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఇన్ స్వింగ్ అయ్యి బ్యాట్‌, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సూర్య కేవలం 15 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.


     

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్నాడు. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.

    ఓవరాల్‌గా ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 236.54 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేశాడు. కాగా ఈ యంగ్ కిడ్ బ్యాటింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. వైభవ్ ఒక ఫ్యూచర్ స్టార్ అని శ్రేయస్ కొనియాడాడు.

    వైభవ్ సూర్యవంశీ ఒక భిన్నమైన ఆటగాడు. అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. కచ్చితంగా అతడు కచ్చితంగా భవిష్యత్ స్టార్ అవుతాడనే చెప్పాలి" అని జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ పేర్కొన్నాడు.

    ఇక ఈ ఏడాది సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్‌, బ్యాటర్‌గా అదరగొడుతున్నాడు.  శ్రేయస్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 208 పరుగులు సాధించాడు. అతడి కెప్టెన్సీలో పంజాబ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది.
    చదవండి: NZ vs BAN 2nd ODI: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది.

    గుజరాత్‌ మూడో వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌.. అశ్విన్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 45/3

    గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
    గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన జోస్‌ బట్లర్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

    గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌
    200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. బుమ్రా వేసిన మొద‌టి ఓవ‌ర్‌లో తొలి బంతికే సాయిసుద‌ర్శ‌న్ పెవిలియ‌న్‌కు చేరాడు.

    తిలక్‌ వర్మ విధ్వంసం
    అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. తిలక్‌ వర్మకు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ. 

    అతడితో పాటు నమన్‌ ధీర్‌(32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 45) రాణించాడు. ఫలితంగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.
    తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీ
    తిలక్‌ వర్మ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అహ్మాదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్‌ హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. 59 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

    దూకుడుగా ఆడుతున్న తిలక్‌
    16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో తిలక్‌ వర్మ(37), హార్దిక్‌ పాండ్యా(7) ఉన్నారు.
    ముంబై నాలుగో వికెట్‌ డౌన్‌
    98 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన నమన్‌ధీర్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్‌: 103/4

    ముంబై మూడో వికెట్‌ డౌన్‌
    44 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. రబాడ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు

    ముంబై రెండో వికెట్‌ డౌన్‌
    23 ప‌రుగుల వ‌ద్ద ముంబై ఇండియ‌న్స్ రెండో వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన క్వింట‌న్ డికాక్‌.. క‌గిసో ర‌బాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌చ్చాడు.

    తొలి వికెట్‌ డౌన్‌
    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. అరంగేట్ర ఆటగాడు డానిష్‌ మాలెవర్‌(2).. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ముంబై స్కోర్‌: 21/1

    ఐపీఎల్‌-2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ​కూడా ముంబై స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు.

    కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున యువ ఆటగాళ్లు డానిష్ మలేవార్, క్రిష్‌ భగత్‌ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా మిచెల్‌ శాంట్నర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

    తుది జట్లు
    గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ

    ముంబై ఇండియన్స్ : డానిష్ మాలెవార్, క్వింటన్ డి కాక్(వికెట్‌కీపర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(సి), తిలక్ వర్మ, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా,  ఘజన్‌ఫర్

  • న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ బదులు తీర్చుకుంది. సోమవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో కివీస్‌పై 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవ‌ర్ల‌లో 198 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

    కివీస్ బ్యాట‌ర్ల‌లో నిక్ కెల్లీ (102 బంతుల్లో 83 పరుగులు, 14 ఫోర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు ప‌డుతున్నా కెల్లీ మాత్రం ఒంట‌రిపోరాటం చేశాడు. మిగితా బ్యాట‌ర్ల నుంచి అత‌డి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  రాణా 5 వికెట్లు ప‌డ‌గొట్టి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. అత‌డితో పాటు షోర్‌ఫుల్ ఇస్లాం రెండు.. రిషాద్‌, టాస్కిన్ అహ్మ‌ద్‌, సౌమ్య సర్కార్ త‌లా వికెట్ సాధించారు.

    తాంజిద్ మెరుపులు
    అనంత‌రం 199 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ 35.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ తాంజిద్ హసన్ (58 బంతుల్లో, 76 పరుగులు, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అత‌డితో నజ్ముల్ హొస్సేన్ శాంటో(50) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. కివీస్ బౌల‌ర్ల‌లో జేడెన్ లెనాక్స్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. స్మిత్‌, ఓ రూర్క్ త‌లా వికెట్ సాధించారు. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే ఏప్రిల్ 23న ఛటోగ్రామ్‌లో జరగనుంది.
    చదవండి: IPL 2026: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరింది.

    రూ. 27 కోట్ల భారీ ధరకు
    అయితే, సంజీవ్‌ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్‌ రిషభ్‌ పంత్‌ను కొనుగోలు చేసింది.

    రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ సొంతం
    మరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్‌ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌, శ్రేయస్‌ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.

    కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌..  పంత్‌ విఫలం
    అయితే, శ్రేయస్‌ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్‌ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్‌.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.

    ఇక తాజాగా ఐపీఎల్‌-2026లోనూ పంజాబ్‌ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్‌ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్‌ గోయెంకాకు పంజాబ్‌ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.

    రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి
    ‘‘గోయెంకా సాబ్‌! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్‌.. అతడు పంజాబ్‌ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.

    అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్‌ పంత్‌ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.

    ఆరోజు పంత్‌ అన్న మాటనే తిప్పి కొట్టి..
    వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్‌.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్‌ అది’’ అని పంత్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్‌ జట్టు ఫ్యాన్స్‌ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్‌ చేతిలో పంత్‌ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్‌ గురించి సలహా ఇచ్చారు.

    చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో వ‌రుస‌గా నాలుగు విజయాల‌తో మంచి జోష్‌లో క‌న్పించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్పుడు ఢీలా ప‌డింది. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓట‌మి పాలైంది. రాజ‌స్తాన్‌కు ఇది వ‌రుస‌గా రెండో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

    మొన్న‌టి వ‌ర‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగిన రాయ‌ల్స్‌.. ఇప్పుడు మూడో స్ధానానికి పడిపోయింది. అయితే సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే నుంచి జడేజాను రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది.

    కానీ జడేజా లాంటి ఆల్‌రౌండ‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డంలో రాజ‌స్తాన్ విఫ‌ల‌మైంద‌నే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన జ‌డ్డూ..కేవ‌లం 10 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. అప్ప‌టికి ఐదు వికెట్లు జ‌డేజా ప‌డ‌గొట్టాడు. ఓ రెండు మ్యాచ్‌ల్లో అత‌డితో పూర్తిగా ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌లేదు.

    కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా జడేజా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన జడేజా, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి అతడితో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారత మాజీ స్పి‍న్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజాలాంటి సీనియర్ స్పిన్నర్‌తో పూర్తి కోటాను పూర్తి చేయించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు.

    "రవీంద్ర జడేజా రూపంలో అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీ జట్టులో ఉన్నాడు. అతడి గణంకాలను చూస్తే ఎలాంటి బౌలరో మీకే ఆర్ధమవుతోంది. కేకేఆర్ మ్యాచ్‌లో జడ్డూ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రింకూ సింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

    అయినప్పటికి అతడితో మరో ఓవర్ వేయించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నారని బహుశా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటా. రవి బిష్ణోయ్ వంటి రైట్ ఆర్మ్ లెగ్ బౌలర్ అయితే బాగా బౌలింగ్ చేస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ చివరి ఏమి జరిగింది. బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. దీని బట్టి జడేజా బౌలింగ్‌పై మీకు నమ్మకం లేదని నాకు ఆర్ధమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!
     

  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్‌, స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న సూప‌ర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం క‌రాచీ స్టేడియం వేదిక‌గా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.

    గ్లాడియేట‌ర్స్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.

    బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్‌లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్‌కు ఇది 12వ సెంచ‌రీ.

    టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో బాబ‌ర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొద‌టి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొన‌సాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవ‌లం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొద‌టి ఆట‌గాడిగా బాబ‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.
    చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!
     

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ పట్ల పీసీబీ వ్యవహారశైలి ఇందుకు కారణం. టీ20 ప్రపంచకప్‌-2026లో ఆస్ట్రేలియా జట్టుపై సత్తా చాటడంతో ముజర్‌బానీకి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది.

    ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)కు చెందిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్రాంఛైజీ ముజర్‌బానీని సొంతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసింది. వెస్టిండీస్‌ యువ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానంలో ఈ జింబాబ్వే పేసర్‌ను తమ జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

    కేకేఆర్‌లో చేరిన ముజర్‌బానీ
    అయితే.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) నుంచి ముజర్‌బానీకి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్‌తో ఉద్రికత్తల నేపథ్యంలో తమ జట్టు నుంచి తొలగించిన ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానాన్ని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.. ముజర్‌బానీతో భర్తీ చేయాలని భావించింది.

    రెండేళ్ల నిషేధం
    ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వైపు మొగ్గుచూపిన ముజర్‌బానీ.. పీఎస్‌ఎల్‌ను వీడి కేకేఆర్‌లో చేరాడు. దీంతో పీసీబీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడేవాళ్లు పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. ముందుగా ఒప్పందం కుదుర్చుకొని అది అమలులో ఉండగా... దానికి విరుద్ధమైన ఒప్పందంలోకి ప్రవేశించడం ఆట ప్రమాణాలను పాటించకపోవడమే. ముజర్‌బానీపై రెండేళ్లు నిషేధం విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో అతడిపై పాక్‌ ఫ్యాన్స్‌ విద్వేష విషం చిమ్మారు.

    ఈ క్రమంలో ముజర్‌బానీ ఏజెంట్‌ తాజాగా ఘాటుగా స్పందించాడు. అసలు ముజర్‌బానీ ఏ కాంట్రాక్టుపైనా సంతకం చేయలేదని.. అలాంటి ఆటగాడిపై నిషేధం ఎలా విధిస్తారని ప్రశ్నించాడు. 

    అంతేకాదు.. అభిమానుల ముసుగులో పిరికిపందలు అతడిపై విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు. అకారణంగా బ్లెస్సింగ్‌పై చర్యలు తీసుకున్నారని.. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.

    తప్పు ఒప్పుకొన్న పాక్‌ బోర్డు.. ఊహించని ట్విస్ట్‌!
    దీంతో వివాదం ముదిరిపోగా.. పీసీబీ స్పందించినట్లు తెలుస్తోంది. PTI అందించిన వివరాల ప్రకారం.. ముజర్‌బానీ ఏజెంట్‌ చేసిన ఆరోపణలు నిజమేనని పీసీబీ ధ్రువీకరించింది. పీసీబీ గానీ.. ఇస్లామాబాద్‌ గానీ ఈ జింబాబ్వే పేసర్‌తో రాతపూర్వక ఒప్పందం చేసుకోలేదని అంగీకరించింది.

    అయితే, మౌఖికంగా మాత్రం అతడు పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఆమోదం తెలిపాడని పేర్కొంది. ఏదేమైనా ముజర్‌బానీ నిబంధనలను ఉల్లంఘించాడని.. అందుకే అతడిపై నిషేధం కొనసాగుతుందని పీసీబీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో పీసీబీ తప్పును సగమే ఒప్పుకొందని.. అకారణంగా ముజర్‌బానీపై చర్యలు తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ముజర్‌బానీతో పాటు ఈ ఏడాది శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక, ఆస్ట్రేలియా స్టార్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరిన సంగతి తెలిసిందే.

    చదవండి: టీ20 క్రికెట్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా క్రిస్‌ గేల్‌

  • ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్‌-19, అండర్‌-23 జట్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భార‌త యువ జ‌ట్లు శ్రీలంక అండర్‌-19, లయన్స్ టీమ్స్‌తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను  బీసీసీఐ త్వ‌ర‌లోనేఖరారు చేయ‌నుంది.

    అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్‌లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను  నిర్వహించనుంది. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది.  వీరింతా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు.

    ఈ యువ ఆట‌గాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్ర‌ద‌ర్శ‌న ఆట‌గాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్క‌నున్నారు. ఐపీఎల్‌-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రే కూడా సీజ‌న్ ముగిసిన త‌ర్వాత ఈ క్యాంప్‌లో చేరనున్నారు.

    కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?
    అయితే శ్రీలంక టూర్‌కు ముందు భారత అండర్‌-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్‌స్ట్రింగ్‌) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. 

    అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జ‌రిగితే రోహిత్ ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్‌-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వ‌ల్ప గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

    వియాన్ మల్హోత్రాను ఐపీఎల్‌-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక‌వేళ శ్రీలంక టూర్‌కు మాత్రే, వియాన్ ఇద్ద‌రు అందుబాటులో లేక‌పోతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ అవ‌కాశ‌ముంది. సూర్య‌వంశీ గ‌తంలో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

  • వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ క్రిస్‌ గేల్‌ కీలక ముందడుగు వేశాడు. ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ (ETPL)లో యూనివర్సల్‌ బాస్‌ భాగమయ్యాడు. గ్లాస్గో ముగాఫియాన్స్‌ అనే జట్టుకు సహ యజమానిగా గేల్‌ వ్యవహరించనున్నాడు.

    జట్టు కొనుగోలు
    ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో ఆరు జట్లు భాగం కానుండగా.. స్కాట్లాండ్‌ దేశం నుంచి గ్లాస్గో ముగాఫియాన్స్‌ (Glasgow Mugafians) ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మహిళా వ్యాపారవేత్త తన్షా బాత్రాతో కలిసి క్రిస్‌ గేల్‌ ఈ జట్టును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ ఫ్రాంఛైజీకి గేల్‌ గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

    కాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లన్నింటిలో కలిపి క్రిస్‌ గేల్‌ ఏకంగా 463 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు ఫ్రాంఛైజీ ఓనర్‌గా కొత్త అధ్యాయం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే.. ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌ ఈ ఏడాది ఆరంభం కానుంది. బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఈ లీగ్‌ సహయజమానిగా ఉన్నాడు.

    ‍ది యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌లో క్రికెట్‌ ఐర్లాండ్‌, క్రికెట్‌ స్కాట్లాండ్‌, రాయల్‌ డచ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. గ్లాస్గో, ఆమ్‌స్టర్‌డ్యామ్‌, ఎడిన్‌బర్గ్‌, డబ్లిన్‌, బెల్‌ఫాస్ట్‌, రాటర్‌డ్యామ్‌ రూపంలో ఆరు జట్లు ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి.

    యజమానులుగా మాజీ క్రికెటర్లు
    ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఫ్రాంఛైజీని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా, హాకీ స్టార్‌ జేమీ డైయర్‌ సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సారథి.

    బెల్‌ఫాస్ట్‌ జట్టుకు గ్లెన్‌​ మాక్స్‌వెల్‌ సహ యజమానిగా ఉండగా.. ఎడిన్‌బర్గ్‌ ఫ్రాంఛైజీని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు కైలీ మిల్స్‌, నాథన్‌ మెకల్లమ్ దక్కించుకున్నారు. ఈ జట్టుకు న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌.

    చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

International

  • ప‌శ్చిమాసియా సంక్షోభం మరింత ముదురుతోంది. రెండో విడ‌త చ‌ర్చ‌ల కోసం పాక్‌కు వ‌చ్చేది లేద‌ని ఇరాన్ మొండికేసి కూర్చుంది. మ‌రోవైపు అమెరికా ప్ర‌తినిధులు మాత్రం ఇరాన్‌తో రెండో విడ‌త చ‌ర్చ‌ల కోసం పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన వేళ ఒక కీల‌క అప్‌డేట్ వెలుగులోకి వ‌చ్చింది. 

    ఇరాన్‌తో చ‌ర్చ‌ల నిమిత్తం అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్ల‌లేద‌నే రాయిట‌ర్స్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌కు చెందిన కాన్వాయ్ వైట్‌హౌస్‌కు చేరుకోవ‌డం ఈ విషయానికి మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. బుధ‌వారంతో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ముగియ‌నుంది. 

    ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు జేడీ వాన్స్ అస‌లు పాక్‌కు వెళ్ల‌లేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో మ‌లి విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌గడం అనుమానమే. తొలి విడ‌త చ‌ర్చ‌ల‌కు అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌, వైట్‌హౌస్ ప్ర‌తినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంంప్ అల్లుడు జారెడ్ కుష్న‌ర్‌లు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 

    కానీ ఆ చ‌ర్చ‌లు ఎటూ తేల‌కుండానే ముగిశాయి. మ‌రోవైపు శాంతి చ‌ర్చ‌ల‌కు హాజ‌ర‌య్యే విష‌యాన్ని తాము ఇంకా ప‌రిశీలిస్తూనే ఉన్నామ‌ని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఇరాన్ అధికారి ఒక‌రు రాయిట‌ర్స్‌కు పేర్కొన్నారు.

     

     

  • టెహ్రాన్‌: ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధానికి చర్చలతో ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు మొదటి నుంచి సూచిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లో మొదటి దశ చర్చలు జరిగి, అవి విఫలమయ్యాయి. సోమవారం రెండో దశ చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినప్పటికీ నేడు చర్చలు జరగలేదు. ఇరాన్‌ చర్చలకు వెళ్లకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు బుధవారం (ఏప్రిల్‌ 22)తో అమెరికా-ఇరాన్‌ మధ్య కాల‍్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. మళ్లీ యుద్ధం మొదలైతే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయి.

    సోమవారం చర్చలు జరుగుతాయని భావించడంతో ఇస్లామాబాద్‌లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సి ఉంది. ముందుగా ట్రంప్.. వాన్స్ హాజరు కావడంలేదని చెప్పినప్పటికీ చివరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.  

    వాన్స్ ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి చర్చల రౌండ్‌కూ నాయకత్వం వహించిన విషయంతెలిసిందే. ఈ సారి అమెరికా ప్రతినిధి బృందంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా ఉన్నారు. 
     
    అమెరికాతో తదుపరి దశ చర్చల రౌండ్‌పై ఎలాంటి ప్లాన్‌లూ లేవని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రెండో దశ చర్చలు జరగాలని అంతర్జాతీయ మధ్యవర్తులు చెప్పినప్పటికీ ఇరాన్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది.

    చర్చలు ఎందుకు జరగలేదు? 
    ప్రస్తుత కాల్పుల విరమణ ఏప్రిల్ 22న ముగియనున్న నేపథ్యంలో చర్చలు జరగకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం నెలకొన్న వాతావరణం చర్చలకు అనుకూలం కాదని ఇరాన్‌ అధికారులు అంటున్నారు. దేశ ప్రయోజనాలు, భద్రత కోసం ఏం చేయడానికైని సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ చెబుతోంది. అయితే, అమెరికన్లు తమ బెదిరింపు విధానంతో అధిక డిమాండ్లను సాధించుకునేందుకు చర్చల వేదికలను వాడుకుంటే కుదరదని హెచ్చరిచింది. 

    అమెరికా నావికాదళ నిర్బంధం, అణు డిమాండ్లపై ఇరాన్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్లపై అమెరికా వైపు నుంచి సానుకూల సంకేతం వస్తేనే ఇరాన్ దౌత్య బృందం ఇస్లామాబాద్‌ వెళ్లే అవకాశం ఉందని ఇరాన్‌ తెలిపింది. హార్మూజ్ జలసంధి, లెబనాన్‌, అణు కార్యక్రమం, సీజ్‌ చేసిన ఆస్తులను రిలీజ్‌ చేయడం వంటి వాటిపై ఇరాన్‌ డిమాండ్లను పెడుతోంది. తాజాగా ఇరాన్‌ వాణిజ్య నౌకను అమెరికా సీజ్‌ చేయడంతో ఇరాన్‌ రగిలిపోతోంది. దీనిపై ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ తెలిపింది. చర్చల ముందు ఇరాన్‌ నౌకను అమెరికా సీజ్‌ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస‍్తున్నాయి.

    నెక్ట్స్‌ ఏం జరుగుతుంది?

    చర్చలు పునఃప్రారంభం కాకపోతే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఈ కింది పది ప్రమాదాలు పొంచి ఉంటాయి.

    • కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత సైనిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది

    • పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది

    • హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం వల్ల చమురు సరఫరా దెబ్బతినే అవకాశం ఉంది

    • గ్యాస్, ఇంధన కొరత పలు దేశాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది

    • అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది

    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది

    • స్టాక్ మార్కెట్లు కుదేలయ్యే పరిస్థితి రావచ్చు

    • పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది

    • ఇతర దేశాలు ఈ ఘర్షణలో చేరే ప్రమాదం ఉంది

    • దౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయి దీర్ఘకాలిక అస్థిరత నెలకొనే అవకాశం ఉంది

  • టోక్యో: జపాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం జపాన్ ఈశాన్య తీరానికి సమీపంగా ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. రవాణా సేవలకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని కోరారు.

    జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీట‍ర్ల లోతులో సంభవించింది. ఇవాటే, ఆఓమోరి, హొక్కైడో ప్రిఫెక్చర్ ప్రాంతాల తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తుకి సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

    ప్రధాన మంత్రి సనఏ తకైచి అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

    కొనసాగుతున్న నౌకల తరలింపు
    జపాన్‌లోని ఉత్తర తోహోకు ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య రేవు ‘హచినోహే పోర్ట్’ నుంచి నౌకలు వెంటనే తరలిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలలు త్వరలో తీరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోక్యో నుంచి ఆఓమోరి వరకు బుల్లెట్ రైలు సేవలను భూకంపం తర్వాత నిలిపివేశారు. 

National

  • న్యూఢిల్లీ: వేసవి కాలం నేపథ‍్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికులు సాఫీగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్ల సర్వీసులకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్ 15 నుంచి 2026 జులై 15 వరకు మొత్తం 908 వేసవి ప్రత్యేక రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. 

    ఇవి 18,262 ట్రిప్స్ నడు‍స్తాయి. వాటిలో 660 రైళ్లను ఇప్పటికే నోటిఫై చేశారు. ఇవి 11,294 ట్రిప్స్ కు సంబంధించినవి. దీని వల్ల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం, మీ జర్నీ ప్లాన్‌ను రూపొందించడం సులభమవుతుంది. సెలవులు, పండుగలు, పీక్ ట్రావెల్ సమయాల్లో ఇటువంటి ప్రత్యేక సర్వీసులు ఎంతో కీలకంగా మారతాయి. వేసవి ప్రత్యేక రైళ్ల నిర్వహణ భారతీయ రైల్వేల అన్ని ప్రధాన జోన్లలో జరుగుతోంది. 

    • సౌత్ సెంట్రల్ రైల్వే 124 రైళ్లు (1,184 ట్రిప్స్)కు ఆమోదం తెలిపి, 76 రైళ్లు (324 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • వెస్ట్రన్ రైల్వే 106 రైళ్లు (2,078 ట్రిప్స్) ఆమోదం తెలిపి 92 రైళ్లు (1,667 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • నార్త్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (2,245 ట్రిప్స్) ఆమోదం తెలిపి 62 రైళ్లు (1,878 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • నార్తర్న్ రైల్వే 76 రైళ్లు (2,090 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (1,535 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • సెంట్రల్ రైల్వే 74 రైళ్లు (3,082 ట్రిప్స్) ఆమోదం తెలిపి 70 రైళ్లు (2,238 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • సదర్న్ రైల్వే 72 రైళ్లు (558 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (133 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • ఈస్ట్ సెంట్రల్ రైల్వే 64 రైళ్లు (2,711 ట్రిప్స్) ఆమోదం తెలిపి 38 రైళ్లు (1,060 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • నార్త్ సెంట్రల్ రైల్వే 54 రైళ్లు (1,163 ట్రిప్స్) ఆమోదం తెలిపి 46 రైళ్లు (688 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • నార్త్ ఈస్ట్రన్ రైల్వే 52 రైళ్లు (814 ట్రిప్స్) ఆమోదం తెలిపి 34 రైళ్లు (477 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • ఈస్ట్ కోస్ట్ రైల్వే 28 రైళ్లు (410 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (88 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • వెస్ట్ సెంట్రల్ రైల్వే 28 రైళ్లు (408 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (192 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • ఈస్ట్రన్ రైల్వే 24 రైళ్లు (392 ట్రిప్స్) ఆమోదం తెలిపి 10 రైళ్లు (276 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • నార్త్ ఫ్రంట్ియర్ రైల్వే 24 రైళ్లు (220 ట్రిప్స్) ఆమోదం తెలిపి 20 రైళ్లు (141 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • సౌత్ ఈస్ట్రన్ రైల్వే 20 రైళ్లు (276 ట్రిప్స్) ఆమోదం తెలిపి 18 రైళ్లు (250 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 10 రైళ్లు (122 ట్రిప్స్) ఆమోదం తెలిపి 8 రైళ్లు (70 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    • సౌత్ వెస్ట్రన్ రైల్వే 76 రైళ్లు (509 ట్రిప్స్) ఆమోదం తెలిపి 56 రైళ్లు (277 ట్రిప్స్) నోటిఫై చేసింది.

    వేసవి ప్రత్యేక రైళ్ల వల్ల పీక్ సీజన్ సమయంలో వెయిటింగ్ లిస్ట్ తగ్గే అవకాశం ఉంది. అదనపు బెర్తులు లభించడంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధాన నగరాలు, ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుంది. అధిక డిమాండ్ ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గుతాయి.

  • "ఆ రోజు నేను చూసిన దారుణ‌ దృశ్యాన్ని మరెవరూ జీవితంలో అలాంటిది చూడకూడదని ప్రార్థిస్తున్నాను" అని అబ్దుల్ వహీద్ వానీ అన్నారు. పహల్గామ్‌లో స‌మీపంలోని బైసార‌న్ ప‌ట్ట‌ణంలో ఏడాది క్రితం ముష్క‌ర మూక సాగించిన రాక్ష‌స ప‌ర్వాన్ని గుర్తు చేసుకుని ఆయ‌న ఈ మాట‌లు అన్నారు. క‌శ్మీర్‌లోని పహల్గామ్‌లో అతిపెద్ద గుర్రపు బగ్గీ కార్మికుల సంఘాలలో ఒకదానికి వహీద్ అధ్యక్షుడిగా ఉన్నారు. పహల్గామ్ దాడి జ‌రిగి ఏడాది పూర్త‌వుతున్న త‌రుణంలో ఆనాటి బాధాక‌ర‌ విష‌యాల‌ను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నారు.

    అది 2025, ఏప్రిల్ 22.. మధ్యాహ్నం స‌మ‌యం. బైసారన్‌లో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందని అబ్దుల్ వహీద్ వానీకి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. అక్క‌డికి స‌మీపంలోనే ఉన్న ఆయ‌న త‌న‌కు బాగా తెలిసిన అడ్డ‌దారిలో పోలీసుల కంటే ముందే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాడు. “నేను అక్కడికి చేరుకునేట‌ప్ప‌టికి.. ఒక మహిళ ఏడుస్తూ, ఒక చిన్నారి ఏడుస్తూ కనిపించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

    ఇదంతా చూశాక ఒక్క క్షణం నేను తిరిగి వెళ్ల‌నేమో అనిపించింది. వెంట‌నే తేరుకుని సమీపంలోని దుకాణం వద్దకు పరుగెత్తి నీళ్ల సీసా తీసుకుని ఆమె వద్దకు తిరిగి వచ్చాను. వాట‌ర్ బాటిల్ ఆమె అందించి.. పోలీసులు, అధికారులు వ‌స్తున్నార‌ని ధైర్యం చెప్పాను. ఆ తర్వాత వెంటనే  సుమారు 700 మంది గుర్రపు బగ్గీ కార్మికులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో స‌హాయం కోసం మెసేజ్ పెట్టాను. సంఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి సాయం చేయాల‌ని కోరారు. అయితే, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో సుమారు 15 మంది మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకోగలిగారు. గాయపడిన వారికి సహాయం చేయడానికి మేము శాయ‌శ‌క్తులా ప్రయత్నించాం.

    బైసారన్ చాలా పెద్ద ప్రాంతం, మృతదేహాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఒకచోట చేర్చడానికి సమయం పట్టింది. మృతుల్లో ఎక్కువ మందికి త‌ల‌కు బుల్లెట్ గాయాలున్నాయి. ఘ‌ట‌నా స్థలాన్ని వ‌దిలి రావ‌డానికి ఓ మ‌హిళ నిరాక‌రించింది. త‌న భ‌ర్త అక్క‌డే ఉన్నార‌ని, తామిద్దరం ఇప్పుడే నడుస్తూ ఫోటోలు తీసుకుంటున్నామ‌ని, తాను ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలంటూ ఆమె రోదించింది. మృతదేహాల మధ్య ప్రాణాలతో పడి ఉన్న మ‌రో వ్యక్తిని మేము గుర్తించాం. మేము అతడిని తాకినప్పుడు, అతను మాట్లాడాడు. అతని మెడ, చేతిపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఏం జరిగిందో అతడు మాతో చెప్పాడు.

    పరిమిత వనరులు ఉన్నప్పటికీ, స్థానికుల స‌హాయంతో గాయపడిన వారిలో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాం. ఒక వ్యక్తిని మేము భుజాలపై, ఆ తర్వాత మంచంపై మోసుకెళ్లాం. అతడు ప్రాణాలతో బయటపడ్డాడని అబ్దుల్ వహీద్ వానీ చెప్పారు. ఆ రోజు తాను చూసిన దృశ్యాలు ఇప్ప‌టికీ క‌ళ్ల‌ముందే మెదులుతున్నాయ‌ని, మ‌ర‌పున‌కు రావ‌డం లేద‌న్నారు. ఇలాంటి దారుణ‌ విషాద దృశ్యాలను మరెవరూ చూడకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ చీక‌టి జ్ఞాప‌కాలు త‌ర‌చుగా గుర్తుకు వ‌స్తుంటాయ‌ని తెలిపారు. “ఆ జ్ఞాపకాలు తిరిగి వచ్చినప్పుడల్లా నన్ను నేను ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అటూ ఇటూ తిరుగుతాను, చేయడానికి ఏదైనా పని వెతుక్కుంటాను లేదా ఎవరికైనా ఫోన్ చేస్తాను” అని అబ్దుల్ వహీద్ వానీ వెల్ల‌డించారు.

    చ‌ద‌వండి: అందుకే మ‌హిళా బిల్లును ఓడించామ‌న్న రాహుల్ గాంధీ

    కాగా, గతేడాది ఏప్రిల్ 22న బైసారన్‌లో ప‌ర్యాట‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో స్థానిక గుర్ర‌పు బ‌గ్గీ కార్మికుడు కూడా ఉన్నాడు. న‌వ‌వ‌ధువు క‌ళ్లెదుట ఆమె భ‌ర్త‌ను అతి దారుణంగా కాల్చిచంప‌డం జాతి యావ‌త్తును దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గామ్ దాడిపై కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించి పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో దాయాది దేశంలోని ఉగ్ర‌తండాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. 

  • జేఈఈ మెయిన్స్ 2026 సెషన్–2 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్‌కార్డ్‌ను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు డిజిలాకర్‌  యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 11.23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో సుమారు 2.5 లక్షల మంది మాత్రమే జేఈఈ  అడ్వాన్స్‌డ్‌కు అర్హులు అయ్యారు.  

  • జనాదరణ పొందిన బరువు తగ్గించే మందుల వల్ల కండరాలు మరింత క్షీణించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి (UNC) చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బరువు తగ్గడానికి ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన సెమాగ్లుటైడ్ (Semaglutide) మరియు తిర్జెపాటైడ్ (Tirzepatide) వంటి ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల ఆశించిన దానికంటే ఎక్కువగా కండరాల క్షీణత (Muscle Loss) జరుగుతున్నట్లు ఈ పరిశోధన తేల్చింది.ఈ మందులు టైప్ 2 డయాబెటిస్ , ఊబకాయం తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ, కండరాల నష్టం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, బరువు తగ్గే ఇంక్రిటిన్ ఆధారిత మందుల వల్ల, ఊహించిన దానికంటే ఎక్కువ కండరాల క్షీణతకు దారితీస్తుందని తేలింది. ఈ అధ్యయనం 'అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైనాయి. దీనికి యూఎన్‌సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు యూఎన్‌సీ గిల్లింగ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఊబకాయం మరియు పోషణ నిపుణుడైన డాక్టర్ జాన్ ఎ. బాట్సిస్ నాయకత్వం వహించారు.

    ఈ అధ్యయనం ప్రకారం ఈ మందులు వాడుతున్న వారిలో తగ్గుతున్న మొత్తం బరువులో దాదాపు 35శాతం కండరాలకు సంబంధించిందే అని తేలింది. సాధారణంగా ఆహార నియమాల ద్వారా బరువు తగ్గితే కండరాల నష్టం 2-10శాతం మాత్రమే ఉంటుంది, కానీ ఈ మందుల వల్ల అది చాలా ఎక్కువగా ఉంది.

    ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?

    కండరాల నష్టం ఎందుకు జరుగుతుంది?
    మనం కేలరీలను తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ కొత్త మందులు ఆకలిని 16-39% వరకు తగ్గిస్తాయి. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు, కానీ తగినంత వ్యాయామం (Resistance training) లేకపోతే కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి.

    ఇదీ చదవండి: కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

    కండరాల క్షీణత, నష్టాలు
    మెటబాలిజం మందగిస్తుంది. కండరాలు విశ్రాంతి సమయంలో కూడా కేలరీలను ఖర్చు చేస్తాయి. అవి తగ్గితే మెటబాలిక్ రేటు తగ్గి, భవిష్యత్తులో బరువు పెరగడం సులభం అవుతుంది.  అలాగే దైనందిన పనులు (మెట్లు ఎక్కడం, బరువులు మోయడం) చేసుకోవడం కష్టమవుతుంది. త్వరగా అలసట వస్తుంది. కండరాలు బలహీనపడితే శరీర సమతుల్యత దెబ్బతిని, కింద పడటం మరియు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రికవరీ ఆలస్యమవుతుంది.  గాయాలు త్వరగా మానవు. వ్యాయామం తర్వాత వచ్చే నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి.  ముఖ్యంగా  వృద్ధులలోఈ  ప్రమాదం ఎక్కువ అని తేల్చారు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది మరింత ప్రమాదకరం. ఇది వారిని ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది.

    ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్‌ కన్నుమూత

    దీన్ని ఎలా అరికట్టవచ్చు
    బరువు తగ్గే ప్రక్రియలో కండరాలను కాపాడుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు కండరాల మరమ్మత్తుకు అవసరమైన ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరం. అ​ంటే బరువులు ఎత్తడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల కండరాల సాంద్రత పెరిగి, అవి కరిగిపోకుండా ఉంటాయి. బరువు తగ్గే క్రమంలో కేవలం మెషిన్ మీద అంకెలను మాత్రమే కాకుండా, శరీరంలోని 'లీన్ మాస్'ఎంత ఉందో  నిరంతరం గమనిస్తూ ఉండాలి.
     

  • సాక్షి, పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జేడీయూ (JD-U) అధ్యక్షుడు నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బిహార్ అభివృద్ధి , పురోగతిపై తాను ఒక కన్నేసి ఉంచుతానని పేర్కొన్నారు. తన పార్టీ శాసనసభ్యులతో సమావే మైన సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి , పురోగతిపై తన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

    పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉండాల్సిన సమయం మినహా, మిగిలిన గరిష్ట సమయాన్ని తాను బిహార్‌లోనే గడుపుతానని నితీష్ కుమార్ పార్టీ నేతలకు తెలిపారు.  ప్రభుత్వ పనులను నిశితంగా పర్యవేక్షిస్తూ, రాష్ట అభివృద్దిపై దృష్టి పడతానని వ్యాఖ్యానించారు. 

     ప్రస్తుత ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నందున, గతంలో తాను ప్రారంభించిన మంచి పనులు కొనసాగేలా చూస్తానని, దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జేడీయూ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకునే అధికారాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా నితీష్ కుమార్‌కే అప్పగించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.

    ఇదీ చదవండి: కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

    ఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నితీష్ కుమార్ ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ గత నెలలోనే జేడీయూలో చేరారు. అయితే, సామ్రాట్ చౌదరి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరించారు.నిశాంత్‌ను పార్టీ భవిష్యత్తు నాయకుడిగా అందరూ అంగీకరించారని, అయితే తాజా సమావేశంలో ఆయన పాత్ర గురించి ఎటువంటి చర్చ జరగలేదని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు.  

    ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?
     

  • ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే భారీగా పరిపాలనా విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ భారీ నిర్ణయం తీసుకుంది.2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్‌పాల్‌ (Durga Shakti Nagpal) ను దేవీపటన్ డివిజన్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపింది. అప్పటి అఖిలేష్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను సస్పెన్షన్‌. కట్‌ చేస్తే.. ఇపుడు యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు. ఇంతకీ ఎవరీ దుర్గా శక్తి నాగ్‌పాల్‌?

    24 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అధికారి అయిన దుర్గా శక్తి నాగ్‌పాల్‌ ఘజియాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలు వాహనాలను అదుపులోకి తీసుకుని,  పలువురిని అరెస్టు చేసిన తర్వాత 2013లో వార్తల్లో నిలిచారు. ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై పోరాడి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్‌పాల్‌. గతంలో ఆమె తన సాహసోపేతమైన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  తాజాగా రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశాలను ధైర్యంగా ఎదుర్కొనే అధికారిణిగా పేరున్న దుర్గా శక్తి నాగ్‌పాల్‌కు కమిషనర్‌గా పదోన్నతి కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ బదిలీల్లో భాగంగా 15 జిల్లాల మేజిస్ట్రేట్లు (DMs), పలువురు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, సెక్రటేరియట్ స్థాయి అధికారులను మార్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక బాధ్యతలతో  అందరి దృష్టిని ఆకర్షించి, పేరు దుర్గా శక్తి నాగ్‌పాల్.

    ఎవరీ దుర్గా శక్తి నాగ్‌పాల్?
    నోయిడాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఇది ఒక రాజకీయ దుమారాన్ని రేపడంతో పాటు, ఐఏఎస్ అసోసియేషన్ నుండి నిరసనలకు దారితీసింది. అంతేకాదు నిర్మాణంలో ఉన్న ఒక మసీదుకు అనుసంధానంగా ఉన్న గోడను కూల్చివేయమని ఆమె ఆదేశించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2013లొ సెప్టెంబర్‌లో ఆమె సస్పెన్షన్‌ను రద్దు చేశారు. ఆ వెంటనే ఆమె తిరిగి పరిపాలనా విధుల్లో చేరడం విశేషం.

    ఆగ్రాకు చెందిన దుర్గాశక్తి ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత ఐఆర్‌ఎస్‌కు అర్హత సాధించిన ఈమె, రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో  ఆల్ ఇండియాలో 20వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించారు. మొదట పంజాబ్ కేడర్‌లో మొహాలీలో పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకోవడంతో యూపీ కేడర్‌కు మారారు. (అభిషేక్ సింగ్ ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేసి నటనారంగంలో ఉన్నారు). గడిచిన సంవత్సరాలుగా, రాజకీయంగా సున్నితమైన సమస్యలను చేపట్టడానికి ముందుకొచ్చే దృఢమైన అధికారిణిగా నాగ్‌పాల్‌ పేరు సంపాదించు కున్నారు. అదే ఆమెకు ప్రతిష్టాత్మకంగా మారింది.  

    ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

    రాష్ట్ర స్థాయిలో, కీలకమైన శాఖలలో మార్పులు చోటుచేసుకున్నాయి. అశుతోష్ నిరంజన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా, కింజల్ సింగ్‌ను మాధ్యమిక విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. పాలనా దక్షతను పెంచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ 40 మంది అధికారుల బదిలీలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

    మరికొన్ని కీలక మార్పులు:

    • జిల్లా మేజిస్ట్రేట్ల మార్పు: ఆగ్రా, సహారన్‌పూర్, బులంద్‌షహర్, రాయ్‌బరేలీ వంటి కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.

    • మనీష్ బన్సల్: ఆగ్రా డిఎంగా నియామకం.

    • ఇంద్రజిత్ సింగ్: సుల్తాన్‌పూర్ డిఎంగా నియామకం.

    • కుమార్ హర్ష్: బులంద్‌షహర్ డిఎంగా బాధ్యతలు.

    • రాష్ట్ర స్థాయి మార్పులు: శుతోష్ నిరంజన్: రవాణా శాఖ కమిషనర్‌గా నియామకం.

    •  కింజల్ సింగ్: సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా బదిలీ.

    ఇదీ చదవండి: కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

     

  • రాయ్‌పూర్‌: ఛత్తీస్‌ఘడ్‌లో ప్రైట్‌ జెట్‌ కుప్పకూలింది. సోమవారం జష్‌పూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ విమానం కొండచరియను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో విమానం చెట్టును ఢీకొట్టింది. అనంతరం కొండ చరియల్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు.    

    కొండను ఢీకొట్టడంతో విమానం నుండి దట్టమైన పొగ, మంటలు వెలువడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

     

  • డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు  చెందిన ఉన్నతాధికారి అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  డీజీసీఏలో పెండింగ్‌లో ఉన్న అనుమతులు మరియు ఆమోదాలను మంజూరు చేయడానికి  లంచం డిమాండ్ చేసిన కేసు విచారణలో  భాగంగా  సీబీఐకి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి.


    రూ. 2.5 లక్షల  లంచం ఆరోపణలతో డీజీసీఏ ఎయిర్‌వర్దినెస్ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న అధికారిని, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని సిబీఐ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 18న  కేసు నమోదు చేసిన సీబీఐ లంచం తీసుకుంటుండగా నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేసింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు  దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో  నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన భారీ నగదు , ఆస్తులు  చూసి అధికారులే విస్తుపోయారు.  

    ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

     ఏకంగా రూ. 37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు, వెండి నాణేలను గుర్తించారు. వీటితోపాటు పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై లోతైన విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ ఒక  ప్రకటనలో తెలిపింది.

    ఇదీ చదవండి: కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

     

  • సాక్షి, చెన్నై: టీవీకే అధినేత విజయ్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడిపై మండిపడింది. ఈ మేరకు విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

    విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెరంబదూర్‌, తూర్పు తిరుచ్చి‌ ఈ రెండు అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇందులో ఒక చోట రూ.111కోట్లు..మరో చోట రూ.220 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాఖలైన పిటిషన్‌లో విజయ్‌ దాదాపూ 100కోట్ల ఆస్తుల వివరాలు దాచారంటూ కోర్టు తెలిపారు. ఆ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.  

    విచారణలో ఒక చోట రూ.111కోట్లు ఒక చోట రూ.220 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఆస్తుల వివరాల ఎందుకు వెల్లడించారని విజయ్‌ని మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇది క్లరికల్‌ పొరటపాటు అనుకోవడానికి వీల్లేదు. రూ.100కోట్ల ఆస్తుల వివరాల్ని ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇవ్వాలని విజయ్‌కు జారీచేసిన నోటీసుల్లో సూచించింది. విజయ్‌తో పాటు ఆదాయపు పన్ను, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

     

     

  • హర్మూజ్‌ జలసంధిని దాటే క్రమంలో రెండు వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో భారత్‌ అప్రమత్తమైంది. మొన్నటి వరకూ హర్మూజ్‌ను జలసంధిని దాటే క్రమంలో భారత్‌కు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, రెండు రోజుల క్రితం భారత్‌ నౌకలపై ఇరాన్‌ దాడి చేయడం కాస్త ఆందోళన కల్గించింది. ఇరాన్‌ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ నౌకలు హర్మూజ్‌ను దాటుతున్నప్పటికీ  ఒక్కసారిగా దాడి జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 

    అయితే అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడమ హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనాన్ని ఇరాన్‌ మరింత పటిష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హర్మూజ్‌ను తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసిన ఇరాన్‌.. అందుకు అమెరికా వైఖరే కారణమని ధ్వజమెత్తింది. 

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరితో విసుగెత్తిపోయిన ఇరాన్‌.. ఇక చేసేది లేక హర్మూజ్‌ను దిగ్బంధనాన్ని కొనసాగించడమే కాకుండా దానిని మరింత పటిష్టంగా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏ నౌకలకు ఇరాన్‌ అనుమతి ఇవ్వడం లేదు. ఆ క్రమంలోనే భారత నౌకలపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

    అప్పటివరకూ హర్మూజ్‌ను దాటకండి
    ఈ పరిస్థితుల నడుమ భారత్‌ కొన్ని నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ ఆదేశాలు వచ్చే వరకూ హర్మూజ్‌ను భారత నౌకలు దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లారక్ దీవి దగ్గరికి వెళ్లకుండా ఉండాలని తమ ఆదేశాల్లో పేర్కొంది, భారత నౌకాదళం సూచించినప్పుడు మాత్రమే హోర్ముజ్ జలసంధి దాటాలని పేర్కొంది. 

    ఏప్రిల్ 18వ తేదీన ఐఆర్‌జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ )రెండు భారత నౌకలపై కాల్పులు జరిపిన ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది భారత నౌకాదళం.

    ఇప్పటివరకు పదకొండు భారత నౌకలు జలసంధిని విజయవంతంగా దాటాయి. చివరి ట్యాంకర్ దేశ్ గరీమా ఏప్రిల్ 18న దాటింది. అదే రోజు జగ్‌ అర్ణవ్‌, సన్మార్‌ హెరాల్డ్‌ నౌకలు.. ఇరాన్‌ కాల్పుల కారణంగా వెనక్కి తిరగాల్సి వచ్చింది. 

    పర్షియన్ గల్ఫ్‌లో తమ దేశ నౌకల భద్రతకు సంబంధించి లారక్ దీవి వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బారత నౌకాదళం. దీనిలో భాగంగానే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 

    లారాక్ ద్వీపం
    ఇరాన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. 
    అంతర్జాతీయ నౌకాయానానికి కీలకమైన మార్గం. ముఖ్యంగా హోర్ముజ్‌ జలసంధి నియంత్రణలో భాగంగా ఇరాన్‌ ఈ ద్వీపాన్ని సైనికంగా ఉపయోగిస్తుంది.

  • జైపూర్‌ : రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరికొన్ని గంటల్లో  ప్రధాని మోదీ చేతులు మీదిగా ప్రారంభం కానున్న ఆయిల్‌ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  

    ప్రధాని మోదీ మంగళవారం (ఏప్రిల్ 21, 2026) రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బలోత్రాలోని పచ్‌పద్రలో దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను దేశానికి అంకితం చేయనున్నారు. రూ.79,450 కోట్లకు పైగా పెట్టుబడితో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ భారత్‌ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అంచనా. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే,ఇప్పుడీ ఈ రిఫైనరీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

    హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్.ఇందులో క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేయడమే కాకుండా,పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు కానున్నాయి. 

    రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం

     

     

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌, కిద్వాయ్ నగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

    పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. 

    ఆర్థిక ఇబ్బందులు
    నిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.

    ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరు
    సీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే  11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని  పోగొట్టుకున్న తల్లి  తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. 

    ఘటన పూర్వాపరాలు 
    కాన్పూర్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త  తల్లి  గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.

    నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.   

    ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

    సీసీటీవీ  నిఘా, దృశ్యాలు 
    మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.  వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం  అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్‌లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.

    మనసెలా ఒప్పింది..
    ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్‌ కన్నుమూత

  • క‌న్యాకుమారి: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఓడించిన పాపం విప‌క్షాల‌దే అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ స్పందించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబ‌ద్ధంగా నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభజన చేయాల‌నుకున్న బీజేపీ ప‌న్నాగాన్ని అడ్డుకున్నామ‌ని చెప్పారు. అందుకే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామ‌ని వెల్ల‌డించారు. త‌మిళ‌నాడు ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం క‌న్యాకుమారిలో బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ స‌ర్కారు ప్ర‌తిపాదించిన నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభజనతో ద‌క్షిణాది రాష్ట్రాలు న‌ష్ట‌పోతాయ‌న్నారు.

    ''మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పార్ల‌మెంట్‌లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గాల‌ పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాల‌న్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్ర‌తిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బ‌ల‌హీనప‌డుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మ‌హిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా త‌క్కువ చేసే ప్ర‌య‌త్నాల‌ను ఎప్ప‌టికీ ఒప్పుకోమ‌''ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు.  

    డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్‌స‌భ‌లో మ‌హిళా బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేంద్రం ప్ర‌తిపాదించిన‌ డీలిమిటేషన్‌ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వ‌ర్ణించారు. కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.

    చ‌ద‌వండి: హ‌మ్మ‌య్య‌! అమిత్ షా న‌వ్వారు.. రాహుల్ గాంధీ స‌ర‌దా కామెంట్స్‌

Business

  • ఈ రోజుల్లో కార్ల వినియోగం సర్వ సాధారణం అయిపోయింది. కేవలం విలాసానికి మాత్రమే కాకుండా.. ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అయితే కారు కొనేవారిలో చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. కానీ కారు లోన్‌లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి బహుశా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

    ➤యూనియన్ బ్యాంక్: 7.40 శాతం నుంచి 9.45 శాతం వరకు
    ➤పంజాబ్ నేషనల్ బ్యాంక్: 7.60 శాతం నుంచి 10.70 శాతం వరకు
    ➤బ్యాంక్ ఆఫ్ బరోడా: 7.60 శాతం నుంచి 11.35 శాతం వరకు
    ➤కెనరా బ్యాంక్: 7.45 శాతం నుంచి 11.45 శాతం వరకు
    ➤బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.60 శాతం నుంచి 12.55 శాతం వరకు
    ➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.70 శాతం నుంచి 9.85 శాతం వరకు
    ➤ఇండియన్ బ్యాంక్: 7.50 శాతం నుంచి 9.65 శాతం వరకు
    ➤ఐసీఐసీఐ బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభం
    ➤HDFC బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభం

    కారు లోన్ తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లోన్ ఇచ్చే బ్యాంకులు కొంతవరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కాకుండా ఇతర ఫీజులను కూడా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.

  • గత కొంత కాలంగా.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు (ఏప్రిల్ 20) కొంత తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒక శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. దీనికి కారణం ఏమిటి?, ఇతర లోహాల పరిస్థితి ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.

    పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. సాధారణంగా డాలర్ విలువ పెరిగితే.. ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసే వారు మరింత వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి డిమాండ్ తగ్గి ధరలు పతనమవుతాయి.

    భారతదేశంలో ఇలా..
    భారతదేశంలో కీలకమైన పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అక్షయ తృతీయ సందర్భంగా ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో జువెలరీ డిమాండ్ తగ్గింది. అయితే పెట్టుబడి రూపంలో బంగారం కొనుగోలు కొంత పెరిగింది. ఇతర లోహాల విషయానికి వస్తే, వెండి ధర 1.7% తగ్గింది. ప్లాటినం, పల్లాడియం కూడా స్వల్పంగా తగ్గాయి.

    ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు..
    మరోవైపు.. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు సరిగ్గా ముందుకు సాగకపోవడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల చమురు ధరలు పెరిగాయి. చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులకు లోనయ్యాయి.

    అమెరికా ఒక ఇరానియన్ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడం, దానికి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. ఇప్పటికే అమలులో ఉన్న తాత్కాలిక ఒప్పందం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే అనుమానాలు పెరిగాయి. అంతే కాకుండా.. ఇరాన్ తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ప్రకటించడం కూడా అనిశ్చితిని పెంచింది.

    ద్రవ్యోల్బణ భయం!
    అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి క్రిస్టోఫర్ వాలర్ మాట్లాడుతూ.. ఈ యుద్ధ పరిస్థితులు తాత్కాలికంగా ద్రవ్యోల్బణం పెంచవచ్చని చెప్పారు. అయితే పరిస్థితి త్వరగా సద్దుమణిగితే భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించారు.

    ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

  • భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    ముంబై - అహ్మదాబాద్
    డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.

    ఢిల్లీ - జైపూర్
    ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.

    చెన్నై - బెంగళూరు
    చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్‌లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.

    విశాఖపట్నం - విజయవాడ
    విశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.

    హౌరా - ధన్‌బాద్
    హౌరా-ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్.. కోల్‌కతాను జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

    సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్‌ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.

    ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!

  • పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.

    చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండి
    చాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.

    ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధం
    ఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్‌లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.

    తెలివితేటలే అసలైన పెట్టుబడి
    తెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు  కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.

    కాంపౌండింగ్ మాయాజాలం
    బఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.

    కేవలం ఎఫ్‌డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది.

  • కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్‌ ప్రకారం కేవలం సీనియర్‌ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! 
        ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్‌మెంట్‌ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు.  

    •     స్టాండర్డ్‌ డిడక్షన్‌ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్‌ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది.  

    •     80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్‌ చెకప్‌కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది.  

    •     గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్‌ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్‌ సబి్మట్‌ చేస్తే టీడీఎస్‌ చేయరు. చేయకపోతే టీడీఎస్‌ రివకరీ చేసి గవర్నమెంట్‌ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్‌ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్‌ ఇన్‌కం. ఇప్పుడు దీని లిమిట్‌  రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్‌ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్‌ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు.  

    •     75 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే...   
      (ఎ) కేవలం పెన్షన్‌ ఉండాలి 
      (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు  
      (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్‌ రికవరీ అయ్యి గవర్నమెంట్‌ ఖజానాలో జమ అయ్యి ఉండాలి 
      ఈ సదుపాయం కొనసాగుతుంది. 

    •     ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. 

    •     ఫైలింగ్‌ విధానంలో ఎటువంటి మార్పులు లేవు.  

    •     ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్‌ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. 

    •     మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. 

    •     ప్రీ ఫిక్స్‌డ్‌ ఫారమ్‌లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి.  

    •     సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

    •     రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్‌గా రిటర్ను వేయవచ్చు. 
      తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్‌ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి.

  • నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్‌ ప్లాన్‌ను టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.

    ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్‌ ఫోకస్డ్‌ టర్మ్‌ ప్లాన్‌’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్‌లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్‌ ఇన్సూర్డ్‌తో ప్లాన్‌ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది.

  • సోలార్‌ సెల్, మాడ్యూళ్ల తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. ఈ బాటలో టెక్స్‌టైల్స్‌ కంపెనీ సోనాసెలక్షన్‌ ఇండియా, చెన్నై సంస్థ గ్రాండ్‌ హౌసింగ్‌ సైతం ఐపీవో ద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతి పొందాయి. ఈ కంపెనీలన్నిటికీ ఏప్రిల్‌ 15–17 మధ్య సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

    భారీస్థాయిలో..
    ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా అవాడా ఎలక్ట్రో 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.1-1.3 లక్షల కోట్ల మధ్య నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేశాయి. కంపెనీ 2025 అక్టోబర్‌లో గోప్యతా మార్గాన సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. నిధులను సామర్థ్య విస్తరణకు వినియోగించనుంది.

    అత్యున్నత సామర్థ్యంగల సోలార్‌ సెల్, మాడ్యూల్‌ తయారీపై వెచ్చించనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న 5.1 గిగావాట్ల సమీకృత సౌకర్యాలతోపాటు.. మహారాష్ట్రలోని బ్యూటిబోరీ ప్లాంటు విస్తరణకు నిధులు కేటాయించనుంది. పీఈ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌కు పెట్టుబడులున్న శుద్ధ ఇంధన అవాడా గ్రూప్‌ సంస్థ ఇది. సోలార్‌ పీవీ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్‌ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజీ, గ్రీన్‌ డేటా సెంటర్లపై దృష్టిపెట్టి ముందుకు సాగుతోంది.

    ఈక్విటీ జారీ..
    బిల్వారా కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన సోనాసెలక్షన్‌ ఇండియా ఐపీవోలో భాగంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులలో రూ. 80 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 48 కోట్లు ప్లాంట్, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా గ్రాండ్‌ హౌసింగ్‌ 3.55 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా అవాడా ఎలక్ట్రో, సోనాసెలక్షన్, గ్రాండ్‌ హౌసింగ్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ)లలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి.

  • న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్‌) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్‌డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.

    ప్రతిపాదిత పెన్షన్‌ చట్టం బిల్లులో ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్‌పీఎస్‌ను పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి.

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెన్యూ నైట్‌ను రూ. 9.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉండటం చేత.. చూడటానికి సాధారణ వెన్యూ కంటే కొంత భిన్నంగా అనిపిస్తుంది.

    హ్యుందాయ్ వెన్యూ నైట్‌.. నలుపు రంగు ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రైల్స్, ఓఆర్వీఎంలు పొందుతుంది. అంతే కాకుండా.. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ నలుపు రంగులోని 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అయితే బ్రేక్ కాలిపర్స్ ఎరుపు రంగులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్ హ్యుందాయ్ లోగోలు, ప్రత్యేకమైన నైట్ లోగోలు పొందుతుంది.

    వెన్యూ నైట్ ఇంటీరియర్ కూడా నలుపు రంగులోనే ఉంది. ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ వెన్యూలో మాదిరిగానే ఉంటాయి. రంగులో మాత్రం వ్యత్యాసం కనిపిస్తుంది. ఇందులో డ్రైవింగ్, ఎమర్జెన్సీ & ఈవెంట్, వెకేషన్, ఆన్-డిమాండ్ మరియు ఫోటో క్యాప్చర్ వంటి బహుళ రికార్డింగ్ మోడ్‌లు ఉన్నాయి.

    2026 హ్యుందాయ్ వెన్యూ, పాత వెర్షన్‌లోని అవే ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. కాబట్టి 1.2-లీటర్ పెట్రోల్, డీసీటీతో జత చేసిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్,  మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి.

  • సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్లు లేదా 0.074 శాతం నష్టంలో 78,435.12 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు లేదా 0.11 శాతం వద్ద 24,326.65 వద్ద నిలిచింది.

    అరిహంత్ ఫౌండేషన్స్ & హౌసింగ్ లిమిటెడ్, బట్లిబోయ్ లిమిటెడ్, రాజపాలయం మిల్స్ లిమిటెడ్, సికాజెన్ ఇండియా లిమిటెడ్, కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రావెయిల్ అండ్ వెయిల్ (ఇండియా) లిమిటెడ్, గుడ్‌ఇయర్ ఇండియా లిమిటెడ్, ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, శ్రీ రామ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.

    Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

  • ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన కస్టమర్లకు ఏప్రిల్ 2026 కానుకగా అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. తన లైనప్‌లోని ఎంపీవీ (MPV), ఎస్‌యూవీ (SUV) మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందిస్తోంది. క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. మోడళ్ల వారీగా ఆఫర్ల వివరాలు ఇక్కడ తెలుసుందాం.

    కియా కార్నివాల్ 
    ఈ నెల ఆఫర్లలో అత్యధిక లబ్ధి పొందుతున్న మోడల్ కార్నివాల్ (Kia Carnival). 2025లో తయారైన (PY25) యూనిట్లపై గరిష్టంగా రూ. 3.20 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇందులో రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 2 లక్షల భారీ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 50,000 కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక 2026 మోడల్‌ ఇయర్‌ (MY26) కొత్త స్టాక్‌పై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

    కియా సెల్టోస్ 
    మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెల్టోస్‌ (Kia Seltos)పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. 2025 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై మొత్తం రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 60,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి.

    కియా సైరోస్ 
    కియా కొత్త మోడల్ సైరోస్ (Kia Syros) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై కూడా కంపెనీ భారీ రాయితీలు ఇస్తోంది. 2025లో తయారైన యూనిట్లపై రూ. 70,000 నగదు తగ్గింపుతో కలిపి మొత్తం రూ. 1.55 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే 2026 మోడల్‌ ఇయర్‌ యూనిట్లపై రూ. 60,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

    కియా కారెన్స్ క్లావిస్ ఈవీ 
    ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV)పై సైతం భారీ ఆఫర్లు ప్రకటించారు. 2025లో తయారైన HTM వేరియంట్‌పై ఏకంగా రూ. 2.15 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ. 85,000 నగదు తగ్గింపు, రూ. 75,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రధాన ఆకర్షణ.అదే విధంగా కొత్త మోడళ్లపై (MY26 యూనిట్లు) రూ. 90,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

    అయితే పైన పేర్కొన్న ఆఫర్లు డీలర్‌షిప్ లొకేషన్‌, స్టాక్ లభ్యత, కొనుగోలుదారు అర్హతపై ఆధారపడి మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని అధీకృత కియా డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

  • భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్‌ హాల్‌మార్కింగ్, ఆరు అంకెల హెచ్‌యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

    హాల్‌మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?

    ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్‌) నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.

    బీఐఎస్‌ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.

    బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.

    22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.

    18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.

    హెచ్‌యూఐడీ నంబర్ (హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.

    బీఐఎస్‌ కేర్‌ యాప్‌తో డిజిటల్ వెరిఫికేషన్

    మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్‌ కేర్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లోని ‘Verify HUID’ సెక్షన్‌లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్‌ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్‌మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్‌తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.

    క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్‌ టెస్ట్‌

    నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్‌ఆర్‌ఎఫ్‌ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.

    మ్యాగ్నెట్‌ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.

    ట్యాక్స్‌ ఇన్వాయిస్‌ తప్పనిసరి

    కొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.

    • ప్రతి వస్తువు హెచ్‌యూఐడీ నంబర్.

    • బంగారం బరువు, దాని స్వచ్ఛత.

    • ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.

    • తయారీ ఖర్చులు, జీఎస్‌టీ.

    ఇదీ చదవండి: డిమాండ్‌ భళా.. నిర్మాణాలు డీలా!

  • తవ్వే కొద్దీ వస్తున్నట్లు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పుకు సంబంధించిన సంఘటనలు మాత్రమే కాకుండా.. స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు కూడా బయటపడింది.

    టీసీఎస్ నాసిక్ యూనిట్‌లో అసోసియేట్‌గా పనిచేసిన ఒక మహిళకు ఎదురైన అనుభవం వివరించారు. బాధితురాలు కొత్తగా వివాహం చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత సహోద్యోగుల నుంచి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు, శారీరక వేధింపులు ఎదుర్కొన్నట్లు పోలీసులకు తెలిపింది.

    ఆమె ప్రకారం.. కొంతమంది సహోద్యోగులు వ్యక్తిగత, దాంపత్య జీవితంపై అసభ్యంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. అనుమతి లేకుండా తాకడానికి ప్రయత్నించడం, ఆన్‌లైన్‌లో కూడా వేధించడం జరిగింది. ఈ చర్యలు మహిళలపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. బాధితురాలు భయంతో మొదట్లో ఎవరికి చెప్పలేకపోయినప్పటికీ, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఒకరోజు ''నేను చీర కట్టుకుని.. లాబీ గుండా, ప్యాంట్రీకి ఎదురుగా నడుస్తుండగా, ఎవరో నా చీర కొంగును లాగినట్లు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి, నా కొంగు అక్కడే పనిచేస్తున్న పురుష ఉద్యోగి చేతిలో ఉంది. నేను వెంటనే నా కొంగును వెనక్కి లాక్కున్నాను, దాంతో అతను నా వైపు చూసి నవ్వాడు'' అని ఆమె ఆరోపించింది.

    ఈ కేసులో నాసిక్ పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ మేనేజర్ కూడా ఉన్నారు. మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటన సంస్థలోని అంతర్గత వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది, ఎందుకంటే సంస్థకు ముందుగా ఈ తరహా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ తెలిపింది.

    మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని, దీనిపై మరింత సమగ్రమైన విచారణ జరపాలని కోరుకున్నారు. కాగా టీసీఎస్ కంపెనీ నాసిక్ యూనిట్‌లో తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.

    ఇదీ చదవండి: 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్

Telangana

  • సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సోమవారం  జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. 

    పొద్దున లేస్తే కేసీఆర్‌ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్‌ వన్‌గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు. 

    ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్‌ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్‌లో హైడ్రా, నిజామాబాద్‌లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్‌ ఎస్టేట్‌ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు. 

     

  • జగిత్యాల: మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గుండె ధైర్యమున్న నేత అని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. జగిత్యాల జిల్లాలో సోమవారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. జీవ‌న్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌క‌టించారు కేసీఆర్‌. 

    అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. బీఆర్ఎస్ రాగానే మొదటి సంతకంతోనే హైడ్రాను ఎత్తిపారేస్తామన్నారు. గరీబోళ్లను ఏడిపిస్తూ మూసీ వెంట పడ్డారని తెలిపారు. మూసీ సుందరీకరణ ఓ రియల్ ఎస్టేట్ దందా అని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టారని వ్యాఖ్యానించారు.

    40 ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డితో తనకు మంచి స్నేహం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి పార్టీలోకి వచ్చారని తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీల్లో పనిచేశామని చెప్పారు. జగిత్యాల ప్రాంతం కోసం జీవన్‌రెడ్డి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. 

    ఎమ్మెల్యేగా మంత్రిగా చిత్తశద్ధితో పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌రెడ్డి ఏదైనా చేస్తారని తెలిపారు. 

    ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా..
    ‘ఇవాళ తెలంగాణ అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ అనొద్దని నాడు దాడి చేసిన్రు. చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా. తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా. బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను.

    రోషయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణ వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా. చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు. వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం. బిహార్ లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం. మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం. మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప..?’ అని వ్యాఖ్యానించారు. 

    100% బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది..
    చీకట్లో దడుసుకుంటే చెట్టే నీ చుట్టూరా భయపెడతదంటూ జగిత్యాల దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌ను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ‘జీవన్ రెడ్డి జగిత్యాలకు మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. నేను ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్ లో నన్ను బోర్నపల్లి గురించి అడిగిండు. 

    తన నియోజకవర్గం పట్ల జీవన్ రెడ్డి కన్సర్న్ ఏంటో అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే మంచి ప్రభావం ఉంటుందని సర్వేల్లో కూడా చాలా మంది చెప్పారు. నేను, జీవన్ రెడ్డి ఇకపై ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లా పని చేయనున్నాం. నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు. ఈ కాంగ్రెసోళ్లు రాగానే కరెంట్ కాకెత్తుకుపోయింది. అనేక చోట్ల రైతుల పొలాలు ఎండుతున్నాయి. రైతులు చనిపోతున్రు. గుండెల్లో తడి లేని దుర్మార్గులు గెలిస్తే రైతుబంధుకు రాం రాం పాడిన్రు. లోన్స్ మాఫీ అన్నాడు ఐనయా? అడ్డమైన హామీలతో  ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్. 1.7 శాతంతో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. 

    వచ్చినోళ్లు మంచిగా పని చేయాలిగా..? చిల్లర మాటలు తప్ప ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక పథకం చేపట్టిందా? బంగారుమయమైన తెలంగాణను రెండున్నర ఏళ్లల్లో ఆగం చేసిన్రు. దుకాణాల్లో లేని బస్తాలు యాప్ లో వస్తయా? కాంగ్రెస్ వస్తే చెప్పులతో క్యూలు తప్పుతలేవు. ఇది అసమర్థమైన ప్రభుత్వం.తెలంగాణా ఆగమాగమైపోయింది. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి అన్నివర్గాల ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’ అని తెలిపారు.

     

  • భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజ్‌ లోపాలపై ఎలా ముందకెళ్లాలో క్లారిటీ వచ్చిందన్నారు సీఎం రేవంత్‌. దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలతో చర్చించిన తర్వాత దీనిపై ఒక అంచనా వచ్చిందన్నారు. ఎన్‌డీఎస్‌ఏ గైడ్‌లైన్స్‌ అనుగుణంగా ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్‌. 

    మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాలులు సందర్శించారు. వీరితో పాటు ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలోనే కాళేశ్వరం కూలిందని, ప్రాజెక్టు రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఢిల్లీలో హరీష్‌ ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

     

     

     

     

  • బోయినపల్లి:  రాజన్న సిరిసిల్లా జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు పరిధిలో మండలంలోని వరదవెల్లి గుట్టపై స్వయంభూగా వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం అప్రోచ్‌ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. రోడ్డు నిర్మాణంలో భాగంగా నిధుల మంజూరుకు ఎదురుచూపులు తప్పడం లేదు. గుట్టపై దత్త ఆలయానికి వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌తో పాటు గ్రామానికి చెందిన పలువురు భక్తులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పలుసార్లు వినతిపత్రాలు అందించారు. వారి ఆదేశాలతో ఇరిగేషన్‌శాఖ రూ.8.80 కోట్లతో గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించింది. ఈమేరకు అప్రోచ్‌ రోడ్డు నిధుల మంజూరుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి రాసినన లేఖలో కోరారు. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా 318 వరకు  హార్టింగ్‌ జోన్‌ ఏర్పాటు, కట్ట నిర్మాణం, ఇరువైపులా డ్రైరిట్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ వాల్‌ ఇతర పనులు అంచనాల్లో చేర్చారు. 

    వేసవికాలం అనువు
    వర్షాకాలం నుంచి ఫిబ్రవరి వరకు ఆలయం చుట్టూ మిడ్‌మానేరు బ్యాక్‌ వాటర్‌ ఉంటుంది. మధ్యలో ద్వీపకల్పంలా ఆలయం కనిపిస్తుంది. ఏటా డిసెంబర్‌లో ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వర్షాకాలంలో ఆలయం చుట్టూ బ్యాక్‌ వాటర్‌ చేరడంతో భక్తులు, పూజారులు నిత్య పూజలు, పౌర్ణమిరోజు ప్రత్యేక పూజలు బోటులో వెళ్లి చేసేవారు. కాగా ఇప్పుడు వేసవి కావడంతో నీరులేక ఆలయం కనిపిస్తోంది. ఆలయం వెళ్లేందుకు భక్తులు ఏర్పాటు చేసుకున్న మట్టి దారి కనిపిస్తోంది. వేసవిలో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి అనువైన సమయం అని భక్తులు తెలుపుతున్నారు. ప్రభుత్వం అప్రోచ్‌ రోడ్డుకు త్వరగా నిధులు మంజూరుచేస్తే ఆలయం వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని భక్తులు తెలుపుతున్నారు. 

    ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?
     

    గిరి ప్రదక్షిణలు.. ప్రత్యేక పూజలు
    గురు దత్తాత్రేయస్వామి ఆలయం రోజురోజుకూ ప్రసిద్ధికెక్కుతోంది. ప్రాజెక్టులో నీరున్న సమయంలో ఆలయానికి వెళ్లేందుకు ప్రభుత్వం టూరిజంశాఖ ఆధ్వర్యంలో బోటు సౌకర్యం కల్పిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ముంబై ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు. ఇటీవల నీరు లేకపోవడంతో భక్తులు ప్రతీ పౌర్ణమి, అమవాస్యకు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సామూహిక దత్త సత్యవ్రతాలు, సామూహిక హనుమాన్‌ చాలీసా, భగవద్గీత పారాయణం, నిత్య పూజలు, అభిషేకాలు వైభవంగా జరుగుతాయి. మిగతా రోజుల్లో సైతం వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక హోమాలు చేస్తారు.

    ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

    సెలవు రోజుల్లో రద్దీ
    నీరు ఉన్న సమయంలో సెలవు రోజు వచ్చిందంటే ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. బోటులో ఆలయానికి వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.150 టికెట్‌ ధర తీసుకుంటున్నారు. మా నీటిలో ఆలయం వెళ్లి అక్కడి ప్రకృతి ఒడిలో సేద తీరేందకు పలువురు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ప్రభుత్వం వెంటనే ఆలయం అప్రోచ్‌ రోడ్డుకు నిధులు మంజూరుచేస్తే ఆలయానికి శాశ్వత రోడ్డు సౌకర్యం కలుగుతుందని భక్తులు తెలుపుతున్నారు. 

     రూ.8.80కోట్లతో అప్రోచ్‌ రోడ్డుకు అంచనాలు 
    వరదవెల్లి గురు దత్తాత్రేయస్వామి గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లేందుకు సీఈసీడీఓ (చీఫ్‌ ఇంజినీర్‌ సెట్రల్‌ డిజైన్స్‌ ఆఫీస్‌) వారికి డిజైన్‌తో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంకోసం రూ.8.80 కోట్ల మేర అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. నిధులు మంజూరుచేస్తే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రాసెస్‌ మొదలుపెడతాం.     –జగన్, మిడ్‌మానేరు, ఈఈ    

     

Advt

  • ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. నెలల తరబడి కఠినమైన ప్రిపరేషన్, నిద్రలేని రాత్రులు, కేవలం ఒక జేఈఈ అభ్యర్థికి మాత్రమే తెలిసిన ఆ ఒత్తిడి.. వీటన్ని టి తర్వా త మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వచ్చేశాయి. మీలో కొందరికి ఈరోజు పండగలా ఉండొచ్చు . కానీ చాలా మందికి అనుకున్న ఫలితం రాకపోయి ఉండొచ్చు. స్కోరు చూసిన తర్వా త కలిగే బాధ ఉందే.. అది మీరు ఇప్పటిదాకా మోసిన ఏ బరువు కంటే కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు.

    మీరు అలా ఫీలవ్వడం సహజమే..
    కానీ ఒక్క నిమిషం ఆగి మీరు ఏం చేశారో ఆలోచించండి. మీరు పోరాడారు, కష్టపడ్డారు, మీ తప్పు లేకుండా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఒక్కటి చాలు మిమ్మల్ని అభినందించడానికి.

    మీ జేఈఈ ర్యాంక్ బట్టి మీరేంటో డిసైడ్ చేసేసుకోకండి. ఒక్కసారి నేను చెప్పే విషయం ఆలోచించండి. ఈ ఏడాది సుమారుగా 14.5 లక్షల మంది జేఈఈ రాశారు. ఉన్న ఐఐటీ సీట్లు మాత్రం సుమారుగా 18,000 మాత్రమే. అంటే ప్రతి వంద మందిలో ఒక్కరికి మాత్రమే సీటు వస్తుంది. మరి మిగిలిన 99 శాతం మంది పరిస్థితి ఏంటి? వాళ్లంతా ఫెయిల్ అయినట్టా? వాళ్లకు తెలివితేటలు లేవనా? వాళ్లు ఇక దేనికి పనికిరారని అర్థమా?, ఖచ్చి తంగా కాదు!

    అసలు జేఈఈ అంటే ఏంటో నిజాయితీగామాట్లాడుకుందాం..
    జేఈఈ అనేది ఒక 'ఫిల్టర్'మాత్రమే. ఉన్న కొన్ని సీట్లను నింపడానికి పెట్టిన ఒక పద్దతి. అంతే తప్ప, మీ తెలివితేటలను జడ్జ్ చేయడానికి పెట్టింది కాదు ఇది. సాధారణంగా మంచి ర్యాంకు ఉంటేనే తెలివైనవాళ్లు అని అందరూ అనుకుంటారు, కానీ మీలో ఉన్న టాలెంట్ కొలవడానికి ఇది సరైన కొలమానం కాదు. ఒక యువకుడి జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి అసలే కాదు. అయినా సరే, లక్షలాది కుటుంబాలు ఈ ఒక్క ఎగ్జామ్ చుట్టూనే తమ పిల్లల జీవితాలను తిప్పు తున్నాయి. కానీ రిజల్ట్స్ రోజున ఎవరూ బయటకు చెప్పని ఒక చేదు నిజం ఉంది. ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధించాడా లేదా అన్నదానికి, వాళ్లు భవిష్యత్తులో ఎంత సక్సెస్ అవుతారన్నదానికి అసలు సంబంధం లేదు.

    ఐఐటీలో చదవకపోయినా సరే.. అద్భు తమైన కెరీర్ బిల్డ చేసుకున్న వాళ్లని, టాప్ పొజిషన్లలో ఉన్నవాళ్లని, విజయవంతంగా స్టార్టప్లను నడుపుతున్న వాళ్లని నేను చాలా మందిని చూశాను. వాళ్లకు అప్పట్లో వచ్చి న జేఈఈ ర్యాంకుకు, ఈరోజు వాళ్లు ఉన్న పొజిషన్‌కు అసలు పోలికే లేదు.

    ఈ ఒక్క రోజుతో అంతా అయిపోలేదు.. ఇదొక కొత్తమలుపు మాత్రమే. ర్యాంకుపైన కాకుండా, స్కి ల్స్ మీద ఫోకస్ పెట్టడమే ఇప్పు డు మీరు తీసుకోబోయే అత్యంతముఖ్యమైన నిర్ణయం. నిన్నటి వరకు మీ సక్సెస్‌ను స్కోర్లు, కటాఫ్స్, పర్శంటేజీలతో కొలిచారు. అందులో ఉన్నది ఒకే ఛాన్స్, ఒకే నంబర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది... ఆ పాత విధానం ఇక్కడితోముగిసింది!

    ముందున్న దశ పూర్తిగా వేరుగా ఉంటుంది. స్కిల్స్ అనేవి 'సింగిల్ అటెంప్ట్' మీద ఆధారపడవు. ప్రతి రోజూ కొత్తగా నేర్చు కోవడానికి, ఏదైనా సృష్టించడానికి మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. "సరైన సమయం" కోసం ఎదురుచూడకుండా ఈమార్పు ను ఎవరైతే ముందుగా గుర్తిస్తారో, వారికి మిగిలిన విద్యార్థుల కంటే అవకాశాలు కూడా ఎక్కు వగా ఉండి నాలుగేళ్లతర్వా త ఎవరూ ఊహించని గొప్ప స్థాయిలో ఉంటారు.

    'ఇంటెలిజెన్స్ ఏజ్' ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇందులో మీ స్థానం ఏంటి అని కేవలం ఒక పరీక్ష నిర్ణయించలేదు. ఈ నాలుగేళ్లలో ప్రపంచంపూర్తిగా మారిపోయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్లో చేరుతున్న స్టూడెంట్స్.. ఇంటర్ ఫస్ట ఇయర్లో ఉన్నప్పు డు(2022లో) చాట్ జీపీటీ, క్లాడ్, లేదా జెమిని లాంటివి లేనేలేవు.

    మీరు నాలుగేళ్ల తర్వాత డిగ్రీపూర్తి చేసి బయటకు వచ్చే సరికి (2030 నాటికి) ప్రపంచం ఇంకోలా ఉంటుంది. అప్పుడు సక్సె స్ అనేది ర్యాంకులతో నిర్ణయించబడదు.. ఈ నాలుగేళ్లలో నిజమైన టెక్ ప్రాజెక్ట్స్ చేస్తూ, టెక్నాలజీపై పట్టు సాధించి, ఎక్సపీరియన్స్ సంపాదించిన వాళ్లే రేపటి లీడర్లుగా నిలుస్తారు.

    ఏఐ వల్లమార్పులు వస్తున్నమాట నిజమే. అది ఎంట్రీ లెవల్ ఉద్యోగాల మీద ప్రభావంచూపుతోంది. కానీ 'వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్' ఇదే ఏఐ వల్ల 1.7 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెబుతుంది. ఈ అవకాశాలు ఎవరికి వస్తాయో తెలుసా? ర్యాంకు చూసి కాదు.. ఒక సమస్యను గుర్తించి, దానికి టెక్నాలజీతో పరిష్కారం వెతికే 'బిల్డర్ మైండ్సెట్' ఉన్నవాళ్లకి.

    మార్కుల కంటే స్కిల్స్‌కు ప్రాధాన్యత ఇస్తే ఫలితం ఎలా ఉంటుందంటే.. జేఈఈ పరీక్షఅయిపోయిన తర్వా త, కొందరు విద్యార్థులు ర్యాంకుల గురించి అనవసరంగా టెన్షన్ పడకూడదని నిర్ణయించుకున్నారు. రేపటి భవిష్యత్తుకు ర్యాంకుల కంటే స్కి ల్స ముఖ్యమని ముందే గ్రహించారు.

    ఉదాహరణకు, హరీష్ అనే విద్యార్థి ఒకఘోరమైన రోడ్డు ప్రమాదాన్ని చూశాడు. అక్కడ సకాలంలో సాయం అందకపోవడం వల్లప్రాణాలు పోవడం అతన్ని కలిచివేసింది. ఆ సమస్యకు పరిష్కారం కోసం 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' సహాయంతో ప్రాణాలు కాపాడే ఒక 'స్మార్టహెల్మెట్'ను తయారు చేశాడు. కేవలం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి తన ఆలోచనకు ప్రాణం పోశాడు. ఈరోజు ఆ ప్రాజెక్ట్ చూసి ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నా రు.

    అలాగే నితీష్ కటకం మరియు హర్షిణి లాంటి వాళ్లు, కంపెనీలు అసలు అభ్యర్థుల నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకుని, టెక్నికల్ స్కిల్స్ మీద పట్టు సాధించి, మొదటి ఏడాదిలోనే మంచి స్టైపెండ్‌తో ఇంటర్నషిప్ సాధించారు. సాధారణంగా ఫస్ట ఇయర్ విద్యార్థులకు ఇలా స్టైపెండ్‌తో ఇంటర్నషిప్ అవకాశం రావడం చాలా అరుదు.

    అలాగే, జి. హృషికేష్ అనే ఒక 19 ఏళ్ల విద్యార్థి తన రోజువారీ పనిలో పదే పదే ఎదురవుతున్న ఒక సమస్యను గమనించాడు. ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని నెలల వ్యవధిలోనే దానికి పరిష్కారంగా 'జిఎస్' అనే ఒక ఏఐ ఆటోమేషన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేసాడు. తను ఇంకా చదువుకుంటున్న దశలోనే, ఆ ప్లాట్ఫామ్ ద్వారా నెలకు సుమారు 10 లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు 'ఎన్ఐఏటి 5.0 ఇన్నోవేషన్ ల్యాబ్స్' ద్వారా రైతులకు సాయపడే ఏఐ సిస్టమ్స్, హ్యూమనాయిడ్ రోబోలు, ఏఐ డ్రోన్లు.. ఇలా ఎన్నో తయారు చేస్తున్నా రు. ఇలాంటి వందలాది ఇన్నోవేషన్ కథల వెనుక ఉన్న అసలు నిజం ఒక్కటే.

    ర్యాంకుల కంటే స్కిల్స్ గొప్పవని ఈ విద్యార్థులు చాలా త్వరగా తెలుసుకున్నారు. పరిశ్రమలకు ఖచ్చి తంగా ఎలాంటి నైపుణ్యాలు కావాలో, అవే నేర్పి ంచడానికి ఎన్ఐఏటి అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. సరైన వేదికను, వాతావరణాన్ని అందించడం ద్వారా విద్యార్థులను మొదటి రోజు నుంచే 'టెక్ బిల్డర్స్'గా ఎన్ఐఏటి తీర్చి దిద్దుతుంది.

    దీని ఫలితంగానే, కేవలం మొదటి ఏడాదిలోనే 200 మందికి పైగా విద్యార్థులు స్టైపెండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్స్ సాధించగలిగారు. 22 మందికి పైగా విద్యార్థులు సొంత స్టార్టప్స్ స్థాపించగలిగారు. ఎన్నో సమస్యలకు ‘ఎన్ఐఏటి 5.0 ల్యాబ్స్’ ద్వారా పరిష్కారం చూపగలిగారు. మీ టాలెంట్ కేవలం ఒక జేఈఈ ర్యాంకుతో ముడిపెట్టకుండా, దాన్ని ఒక ఆరంభంలా భావిస్తే వచ్చే మార్పు ఇదే!

    స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక్కమాట..
    మీ జేఈఈ రిజల్ట్స్ అనేది ఒక మైలురాయి మాత్రమే, అదే మీ కెరీర్‌పై ఫైనల్ నిర్ణయం కాదు. రాబోయే నాలుగేళ్లలో మీరు ఏం చేస్తారన్నదే ముఖ్యం. ఈ రోజు రిజల్స్ కంటే మీలో ఉన్న టాలెంట్ చాలా గొప్పది. ఇది కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన సమయం, అనవసరమైన టెన్షన్ పడే టైమ్ కాదు. భవిష్యత్తులో మీకు ఎన్నో దారులు ఉన్నాయి. మీరు ఎంచుకునే వాతావరణం, నేర్చు కునే స్కి ల్స్, మీరు పరిష్కరించే సమస్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీలు 'బిల్డర్స్' కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ బిల్డర్ అయ్యే అవకాశం మీ అందరికీ ఉంది. రాబోయే 4 ఏళ్లలో స్కిల్స్ నేర్పించే చోటునే మీ గమ్యంగా ఎంచుకోండి. ఆల్ ది బెస్ట్! 

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
     

Andhra Pradesh

  • విశాఖ: సింహాచలం చందనోత్సవంలో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి భక్తులు భారీగా తరలిరావడంతో కనీస ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. దాంతో భక్తులు గంటల తరబడి సింహాచలం బస్టాండ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో సైతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని కంట్రోల్‌ చేయలేకపోతున్నారు.  

    బస్టాండ్‌కు నుంచి సింహాచలం కొండపైకి వెళ్లే బస్సుల్లో భక్తులు తోసుకుంటూ ఎక్కుతున్నారు.  బస్సులు ఎక్కడానికి ఎగబడిపోతున్నారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంత భక్తుల అవస్థలు తప్పడం లేదు. తాగునీరు, వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో భక్తులు నరకం చూస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంటున్నామని, కనీస సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


     

  • సాక్షి,విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘం నాయకుడిపై కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కక్ష సాధింపులకు దిగింది.

    చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై పగబట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనపై చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

  • విజయవాడ: టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు తనను విపరీతంగా నిందిస్తున్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ చెప్పారు. తనకు కొంతమంది నేరుగా ఫోన్ చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అడుగుతున్నారని తెలిపారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా తప్పులు చేస్తే ప్రశ్నించడం తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు.

    విజయవాడలో ఇవాళ జడ శ్రవణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత ఐదేళ్లలో జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారని అప్పట్లో ప్రచారం చేశారు. ఏబీఎన్, టీవీ 5లో వారానికి మూడు రోజులు డిబేట్లు నడిపించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని చంద్రబాబు చెప్పగానే.. ఏపీ శ్రీలంక అయిపోయిదంటూ డిబేట్లు పెట్టారు. ఏబీఎన్, టీవీ5, మహాటీవీలో కొన్ని వేల డిబేట్లు పెట్టారు. మరి, రెండేళ్లు కూడా నిండని కూటమి ప్రభుత్వం 3  లక్షల 56 వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఆరోగ్య శ్రీ ఇవ్వడం లేదు. రైతుకు మద్దతు ధర లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అటకెక్కింది.

    దేనికోసం ప్రభుత్వం 3లక్షల 56 వేల కోట్లు అప్పు చేసింది? ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో లెక్క ఉందా? ప్రతి నెలా ప్రభుత్వానికి పన్నుల ద్వారా 20 వేల కోట్లు ఆదాయం వస్తుంది. వస్తున్న ఆదాయం చేసిన అప్పు సొమ్మంతా ఏమైపోయింది? జగన్ ఐదేళ్లలో 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుచేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టారు. 

    రెండేళ్లలో 3 లక్షల 60 వేల కోట్ల రూపాయల అప్పుతో చంద్రబాబు గత ప్రభుత్వ రికార్డులను బద్దలు కొట్టారు. జగన్ అప్పు చేస్తే ఏపీ శ్రీలంక... చంద్రబాబు అప్పు చేస్తే అద్భుతమైన పరిపాలనాదక్షుడు అయిపోయాడా? సంపద సృష్టించడానికి తనకే పేటెంట్ ఉందని చంద్రబాబు డబ్బాలు కొట్టారు. నెలకు 15 వేల కోట్లు అప్పు చేయడమంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉందా? సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా? 

    ఎకరా 99 పైసలకు అమ్మేసుకుని లోకేష్ తన ఆస్తులను పెంచుకుంటున్నాడు. మైనార్టీ కూడా తీరని దేవాన్ష్‌ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయ్. పాలు, పెరుగు అమ్ముకునే హెరిటేజ్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు పెరిగాయ్. రెండెకరాలతో జీవితం మొదలుపెట్టిన చంద్రబాబు ఆస్తులు 937 కోట్ల రూపాయలు. 

    వెస్ట్ బెంగాల్ కు మూడు సార్లు సీఎంగా చేసిన మమతా బెనర్జీ ఆస్తులు 15 లక్షల రూపాయలే. దేశంలో మరే ముఖ్యమంత్రి అందుకోలేని ఎత్తులో అత్యంత ధనికుడిగా చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు దోచుకోవడానికే అమరావతి. రాజధానిలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎందుకు కలపరు? 

    మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాళ్లు మీకు అంటరానివారుగా కనిపిస్తున్నారు. మావిగన్ ప్రతిపాదనను ఎందుకు వద్దంటున్నారో సమాధానం చెప్పాలి.  ఈ మూడు ప్రాంతాల వాళ్లు రాజధానిలో భాగం అవ్వడం మీకు ఇష్టం లేదా? ఎందుకు మావిగన్ ను వ్యతిరేకిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. 

    అమరావతి దోపిడీలో ఎవరికీ భాగస్వామ్యం దక్కకూడదనేది మీ ఆలోచన. లింగమనేని దగ్గర డబ్బులు తీసుకుని పార్టీ ఆఫీస్ కట్టారు. పవన్ కు గుర్తొచ్చినప్పుడల్లా మాదాపూర్ వెళ్లడానికి ఫ్లైట్ ఇచ్చారు. లింగమనేని చేసిన తప్పుడు పనులకు చంద్రబాబు , పవన్ వత్తాసు పలుకుతున్నారు. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు , నెలకు 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే నిరుద్యోగ భృతి వడ్డీతో సహా చెల్లించాలి. లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామని క్షమాపణ చెప్పండి. ప్రజలను చీట్ చేశామని చంద్రబాబు , పవన్ , లోకేష్ ఒప్పుకోవాలి’ అని చెప్పారు.

  • నెల్లూరు : ‘ పవన్‌ సార్‌..  మేం అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కదా.. ఇవేనా రోడ్లు’ అంటూ పశ్నించాడు కూటమి కార్యకర్త.   శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం కలిచేడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని నడిరోడ్డుపైనే మంచం వేసుకుని నిరసన తెలిపాడు కూటమికి చెందిన కార్యకర్త.  నెల్లూరు-గూడూరులను కలిపే ఈ రోడ్లపై వెళుతుంటే తమ ప్రాణాలు పోతున్నాయని,  ఎటు చూసినా గుంతలు, గోతులతో చాలా అథ్వాన్నంగా ఉందని ఫైర్‌ అయ్యాడు.  

    కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేయిస్తామన్నారు కదా..  ఇవే నా మీరు వేసిన రోడ్లు అంటూ నడిరోడ్డుపై మంచంపై కూర్చొని మరీ నిరసన తెలిపాడు.  ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోని  పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను ఏకిపారేశాడు.

    ‘అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌.  ఇప్పటివరకూ వేయలేదు. నేను ఆరు నెలల క్రితం చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మళ్లీ ఈ విషయాన్ని ఇలా చెబుతున్నా. మా కడుపులు మండిపోతున్నాయ్‌. గతంలో టెంట్‌లు వేసుకుని రోడ్లు వేయమని అడిగాం. ఇప్పుడు  ఇలా నులక మంచం వేసుకుని నిరసన తెలపాల్సి వచ్చింది.

    పుట్టిన రోజు వేడుకల్లో బిజిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇక్కడ(ఈ రోడ్లపై) పుట్టినరోజు చేసుకుని చూడండి.  మా బాధ ఏంటో అర్ధమవుతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానండి.. కడుపు మండిపోతుంది. నేను అడిగేది ఒక్కటే అబ్బా.. మీరు వారం రోజుల్లో రోడ్లు వేయిస్తారా.. లేక నిధులు పోగు చేసుకుని మేమే రోడ్డు వేసుకోవాలా? చెప్పండి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు.

    సొంత కార్యకర్తకే కడుపు మండి రోడ్డుపై మంచం వేసుకుని నిరసన

     

  • విశాఖ: గాజువాకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకన్య థియేటర్‌ దగ్గర ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌ పై అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరొకవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

     

     

     

     

     

     

     

     

  • పిఠాపురం: ఆవకాయ– ఈ మాట వింటే ఎవ్వరికైనా నోరూరిపోతూంటుంది. ముద్దపప్పు అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచికి వేరేదీ సాటి రాదని భోజన ప్రియులు అంటూంటారు. ఆంధ్రాలో పుట్టిన ఈ ఆవకాయ రుచికి తెలుగువాళ్లే కాదు.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు సైతం ఫిదా అవుతూంటారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో దాదాపు ప్రతి ఇంటా ఆవకాయల తయారీ ఊపందుకుంటోంది. దీనికి తగినట్టుగానే మార్కెట్లో పచ్చి మామిడికాయల అమ్మకాలు కూడా జోరందుకుంది. అంతేకాదు.. మిరప పంటకు పెట్టింది పేరైన గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఎండు మిర్చి అమ్మకాలు సైతం ఊపందుకున్నాయి. 

    ఎన్ని రకాలో.. 
    ఆవకాయలో మళ్లీ ఎన్నో రకాలున్నాయి. బెల్లం ఆవకాయ, అల్లం ఆవకాయ, నూపిండి ఆవకాయ, పులిహోర ఆవకాయ, పెసర ఆవకాయ, పచ్చ ఆవకాయ, శనగల ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ, ఎండు ఆవకాయ వంటి రకాలున్నాయి. వీటితో పాటు మెంతికాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి (తురుము మాగాయ), ఉడుకు మాగాయ, పిందె మాగాయ వంటి ఊరగాయలను ఎక్కువ మంది పెడుతూంటారు. వీటి కోసం చెరకురసాలు, కొత్తపల్లి కొబ్బరి, కలెక్టర్‌ తదితర అనేక రకాల మామిడి కాయలను ఉపయోగిస్తూంటారు. దీంతో, సీజన్‌ ప్రారంభం నుంచీ వీటికి మంచి గిరాకీ ఉంటుంది. 

    ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

    విదేశాలకు సైతం.. 
    జిల్లావ్యాప్తంగా సుమారు 48 వేల హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ప్రస్తుతం చిన్న సైజులో ఉన్న కాయలను రోజువారీ వంటల కోసం విక్రయిస్తున్నారు. ముదిరిన కాయలను ఊరగాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఊరగాయలకు ఉపయోగించే కేజీ పచ్చి మామిడి కాయల ధర రూ.35 నుంచి రూ.45 వరకూ పలుకుతోంది. సైజును బట్టి కేజీకి ఐదారు కాయల వరకూ వస్తాయి. జిల్లావ్యాప్తంగా నిత్యం సుమారు 120 టన్నులకు పైగా మామిడి కాయల అమ్మకాలు జరుగుతున్నాయన్నది అధికారుల అంచనా. మన జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు సైతం మామిడి కాయలు ఎగుమతి అవుతున్నాయి. గత ఏడాది 30 శాతం కాయలు శ్రీలంకకు ఎగుమతి అయ్యాయట. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఒమన్, కువైట్, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నాం తదితర దేశాలున్నాయి. దాదాపు 50కి పైగా దేశాలకు మన ఆవకాయ తదితర ఊరగాయలు సైతం ఎగుమతి అవుతున్నాయి.

    సీజన్‌ మొదలైంది 
    ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్‌ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్‌లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. పిల్లి లక్ష్మి, పిఠాపురం 

    ఇక నుంచి ఖాళీ ఉండదు
    వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు.  – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం

Politics

  • సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగం 

    •  జీవన్‌ రెడ్డి గుండె ధైర్యమున్నోడు

    • 40ఏళ్ల నుంచి జీవన్‌రెడ్డి,నేను స్నేహితులం  

    • భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాం

    • తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ కోసం బీఆర్‌ఎస్‌లో చేశారు

    • జగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారు

    • ఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారు

    • తన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్‌ రెడ్డి ఏదైనా చేస్తారు

    • జీవన్‌ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శం

    • పదవులు జీవన్‌రెడ్డికి కొత్తకాదు

    • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి నియామకం

    • సభలో ప్రకటించిన కేసీఆర్‌

    • ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్‌రెడ్డికి చెప్పా

    • మేం అధికారంలోకి రాగానే జీవన్‌రెడ్డికి మంచి పదవి కల్పిస్తా

    • కరీంనగర్‌ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డి పని చేయాలి

    • తెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేది

    • ఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్‌ ఛార్జీలు పెంచారు

    • ఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారు

    • పక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడింది

    • తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ చచ్చుడో అని ముందుకు సాగాం

    • ఐదేళ్లలో మిషన్‌ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాం

    • పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసు

    • మా హాయంలో మిషన్‌ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదు

    • నూటి నూరుశాతం మళ్లీ బీఆర్‌ఎస్సే వస్తుంది

    • జీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారు

    • జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్

    • ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

    • వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రు

    • చంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశా

    • తెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించా

    • బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించాను

    • రోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడు

    • ఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరా

    • చిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారు

    • వచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయం

    • బిహార్‌లో  పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్‌ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాం

    • మిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాం

    • మిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?

    మాజీ మంత్రి జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్‌. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్‌.  40 మంది అనుచరులతో పాటు బీఆర్‌ఎస్‌లో చేరారు జీవన్‌రెడ్డి. 

    ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రస్థానానికి జీవన్‌రెడ్డి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్‌పై అసంతృప్తిలో బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారు జీవన్‌రెడ్డి.  జీవన్‌ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్‌ఎస్‌లో చేరికతో అధికార కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

    ముందుగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అంటూ కొనియాడారు. కేసీఆర్‌ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్‌ కాలేజ్‌ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్‌ అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 

  • చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార‍్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్‌ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు.

    ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్‌ వద్దకు వచ్చింది. వారిని విజయ్‌ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్‌ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

    కొత్త దంపతులు విజయ్‌ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.  విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్‌ను ఆలింగనం చేసుకున్నాడు. 

    విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరుగుతుంది. ఓట‍్ల కౌంటింగ్‌ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. 
     

Family

  • ఇటీవల కాలంలో కోడళ్లు ఎలా ఉంటున్నారో తెలిసిందే. ఆధునిక కాలం అత్తలకు కోడళ్లు దడవడం లేదు. కోడళ్లే అత్తలను భయపెట్టే రేంజ్‌లో ఉంటున్నారు. పైగా ఏ మాత్రం తేడా వచ్చినా..వేరు కాపురం, ఆస్తులు కావాలని డిమాండ్‌ ఒకటి కాదు..రెండు కాదు ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. అత్తలకు భయపడే కోడళ్ల కాలం చెల్లినదిగా మారిపోయింది. 

    అంత వరకు ఓకేగానీ కనీసం అత్తమామలను స్నేహితుల్లా లేదా సాటి మనిషిగా చూడకుండా నానాయాతను పెడుతున్నారు నేటితరం కొందరు కోడళ్లు. దానికి పుట్టింటివాళ్లు వత్తాసు పలికి పెళ్లిని మూణ్ణాళ్ల ముచ్చటలా మార్చేస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి కాలంలో నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఘటన అత్యంత అరుదైనది , రికార్డు ఘటనగా చెప్పొచ్చు.

    ఇంతకీ ఏం జరిగిందంటే..కోడలు తన అత్తమామల కోసం వంట చేయలేదు.  ఆ విషయం తెలుసుకున్న తల్లి అక్కడకు చేరుకుని నేరుగా కూతరు వద్దకు పోయి చితకబాదింది. అంతేగాదు అత్తమామలకు భోజనం వడ్డించమని ఆదేశించింది. ఇటీవలకాలంలో ఇది అత్యంత అరుదైన ఘటన అంటూ నెటిజన్లు కామెంట్‌  చేస్తూ పోస్టులు పెట్టారు.

     

    (చదవండి: కూరగాయలు అమ్మడం నుంచి సైనికుడిగా! కట్‌చేస్తే..)

     

  • కాశ్మీర్‌ వేసవి అనుభవం కేవలం ఒక ప్రయాణం కాదు..  ప్రకృతి, సంస్కృతి ప్రశాంతత కలిసిన ఒక సజీవ కావ్వధార. ‘భూమిపై స్వర్గం’గా పేరొందిన ఈ ప్రాంతం, వేసవి కాలంలో తన సంపూర్ణ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మంచుతో కప్పబడిన శిఖరాలు, పచ్చని పర్వత లోయలు, నీలిరంగు సరస్సులు, పూలతో నిండిన తోటలు... ఇవన్నీ కలిపి కాశ్మీర్‌ను ఒక కలల ప్రపంచంలా మార్చేస్తాయి.. 

    పూలతో నిండి బోట్‌లు
    శ్రీనగర్‌కి ఆభరణంలా వెలుగొందే దాల్‌ సరస్సు, కాశ్మీర్‌ పర్యాటకానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును వెంటనే ఆకర్షిస్తుంది. శికారా పడవలో సరస్సు మీద నెమ్మదిగా ప్రయాణించడం ఒక మధురమైన అనుభవం. నీటి మీద తేలియాడే తోటలు, పూలతో నిండిన హౌస్‌బోట్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యేకంగా తెల్లవారుజామున జరిగే తేలియాడే కూరగాయల మార్కెట్‌ అనుభవం మరచిపోలేనిది. స్థానిక రైతులు తమ పడవలలో తాజా కూరగాయలను విక్రయించే ఈ దృశ్యం, కాశ్మీర్‌ జీవనశైలిని దగ్గరగా పరిచయం చేస్తుంది.

    మొఘల్‌ తోటలు
    వేసవి ప్రారంభంలో శ్రీనగర్‌ చుట్టూ ఉన్న తోటలు పుష్పాలతో కళకళలాడుతుంటాయి. టులిప్‌ ఉత్సవం ఏప్రిల్‌లో ముగిసినా, షాలిమార్‌ బాగ్‌ మరియు నిషాత్‌ బాగ్‌ వంటి మొఘల్‌ తోటలు ఇంకా అందంగా వికసిస్తూనే ఉంటాయి. ఈ తోటల్లో విహరించడం ఒక రొమాంటిక్‌ అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి మూలలోనూ ప్రకృతి అందాల పరిమళం మనసును హత్తుకుంటుంది.

    పచ్చని స్వర్గధామం..
    ‘పూల మైదానం’గా పేరొందిన గుల్మార్గ్‌ వేసవిలో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. మంచు కరిగిపోయిన తర్వాత పచ్చని గడ్డి మైదానాలు విస్తరించి, కనిపిస్తాయి. గుల్మార్గ్‌ గోండోలా రైడ్‌ ఆసియాలోనే అత్యంత ఎతైన కేబుల్‌ కార్‌లలో ఒకటి. ఈ ప్రయాణంలో హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.

    దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా, వసతి సదుపాయాలు ఉన్నాయి. 

    ఐఆర్‌సిటితోపాటు ఇతర ప్రైవేట్‌ ట్రావెల్‌ సంస్థలు కూడా ప్యాకేజీని అందిస్తున్నాయి.

    నాలుగు, ఐదు, ఎనిమిది రోజులకు గాను రూ.20 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. 

    కాశ్మీర్‌ వేసవి అనుభవం ఒక కలలా ఉంటుంది. ప్రతి ప్రదేశం ఒక కథ చెబుతుంది. ప్రకృతి అందాలు, సాంస్కృతిక సంపద, ప్రశాంత జీవనం కలిసిన ఒక అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.  

    నూతన సంవత్సరాది బోహాగ్‌ బిహు
    దేశంలో చల్లని ప్రదేశంగా పేరొందిన అస్సాంలో ఆనందంగా జరుపుకునే సంవత్సరాది పండగ బోహాగ్‌ బిహె. దీనిని ‘రొంగలీ బిహు’ అని కూడా పిలుస్తారు. ఉత్సాహభరితమైన పండుగగా పేరొందింది ఇది అస్సామీ నూతన సంవత్సరాన్ని, వసంతకాలం ఆగమనాన్నీ సూచిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరాది ఉగాది. అస్సామీల సంవత్సరాది బోహాగ్‌ బిహు. ఈ పండుగ సాధారణంగా ఏప్రిల్‌ నెల మధ్యలో (అస్సామీ నెల ’బోహాగ్‌’ మొదటి రోజు) వస్తుంది. దీనిని వాళ్లు వారం రోజుల పాటు జరుపుకుంటారు.

    పంటల కోసం దేవుని ఆశీర్వాదం..
    ఈ పండగ వ్యవసాయ సీజన్‌ ప్రారంభాన్ని సూచిస్తుంది. రైతులు ఏడాది అంతా పంటలు బాగా పండాలని, ఈ రోజున వారు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు. ‘రొంగలి’ అంటే ఆనందం, రంగుల పండుగ అని కూడా అర్థం.

    పండగ మొదటి రోజును గోరు బిహు అంటారు. ఆ రోజున ఆవులను, ఎద్దులను పసుపు, ఇతర ఔషధ మూలికలతో కడిగి, పూల దండలు వేసి, పూజలు జరుపుతారు. బెండకాయలు, పొట్లకాయలు తినిపిస్తారు.

    పండగ రెండవ రోజున మనుహ్‌ బిహు అంటారు. ఆ రోజున ప్రజలు కొత్త బట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గరకు వెళ్లి, పిఠా అనే సంప్రదాయ వంటకాన్ని, రుచికరమైన పదార్థాలను పంచుకుంటారు.

    ఆనందంగా నృత్యాలు..
    యువతీ–యువకులు సంప్రదాయ దుస్తులను అలంకరించుకుంటారు. డ్రమ్స్‌ వాయిస్తూ, కొమ్ముతో చేసిన వాయిద్యాలతో శబ్ధం చేస్తూ నృత్యం ఆనందంగా చేస్తారు. ఈ ఏడురోజుల పండగను చూడటానికి టూరిస్టులు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెళుతుంటారు. 

    (చదవండి: సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!)

  • యూరోప్‌లో అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్‌ ఉన్న ప్రాంతంగానే కాదుఅందమైన కిరీటంగా భాసిల్లుతోంది జంగ్‌ఫ్రాజోచ్‌ భూమి మీద నుంచి ఆకాశాన్ని హత్తుకున్నట్టుమంచు కొండల మధ్యలో గడిపిన క్షణాలు...ఎండాకాలంలో చల్లని గాలి పలకరింపు.. మాటలకు అందని ప్రయాణానుభూతిని జంగ్‌ఫ్రాజోచ్‌ అందిస్తుంది. స్వర్గపు తలుపు తెరిచి కొత్త లోకంలోకి వెళ్లామా..! అనే ఆశ్చర్యానందంలో ముంచెత్తుతుంది.

    స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్‌ దగ్గర మొదలై.. పచ్చని కొండల మధ్య నుంచి మెల్లిగా మంచు మెరుపుల వైపు వెళ్లే జంగ్‌ఫ్రాజోచ్‌ ప్రయాణం మనసును మృదువుగా తాకుతోంది. జీవితకాలపు అనుభూతిని అందిస్తుంది.

    సందర్శనీయ ప్రదేశాలు
    ఐగర్‌ గ్లేషియర్‌ నుంచి మొదలై స్పింక్స్‌ అబ్జర్వేటరీ దాకా వెళ్లే ప్రతీ అడుగు ఒక కొత్త పరిశోధనలా ఉంటుంది. ఐస్‌ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో నడస్తుంటే మనం ఒక డ్రీమ్‌ వరల్డ్‌లో ఉన్నాం అనే ఫీలింగ్‌ కలుగుతుంది. 

    ఐస్‌తో చేసిన కళాఖండాలు మనిషి, ప్రకృతి కలిసే చేసే సృజన అద్భుతంగా ఎలా ఆవిష్కరిస్తుందో అర్థం అవుతుంది.

    ఐస్‌ ప్యాలెస్‌లో అనుభవాలు
    గ్లేషియర్‌ లోపల తవ్విన ఈ టన్నెల్స్‌లో నీలి రంగు మెరుపులు మన కళ్ల ముందు ఒక మేజిక్‌లా కదులుతూ ఉంటాయి. ఇక్కడ గద్ద, ఎలుగుబంటుల రూపంలో చేసిన మంచు శిలలు చాలా సహజసిద్ధంగా అనిపిస్తాయి. ఉదయం వేళలో ఈ ఐస్‌ ప్యాలెస్‌కి వెళ్లడం ఎంతో మధురానుభూతిని కలుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో క్రౌడ్‌ తక్కువగా ఉంటాయి. ఆ ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.

    ఎక్కడ ఉండాలి?
    ఇంటర్లేకన్‌ లేదా గ్రైండెల్వాల్డ్‌ విలేజెస్‌లోని ట్రెడిషనల్‌ స్విస్‌ చాలెటట్స్‌ ఉంటే ప్రతీ ఉదయం మంచు కొండలు పలకరిస్తాయి. వుడెన్‌ వాల్కనీస్‌ నుంచి కనిపించే వ్యూ, రాత్రి పూట మెరిసే నక్షత్రాలు మనకు మర్చిపోలేని మధురానుభూతులను ఇస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే హోటల్స్‌లో బస ప్రకృతికి దగ్గరగా ఉన్నాం అనే ఫీలింగ్‌ని ఇస్తుంది.

    ఎలా వెళ్లాలి? 
    ప్రయాణం స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లేకన్‌ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి గ్రైండెల్వాల్డ్‌ టర్మినల్‌ రీచ్‌ అయ్యి, అక్కడి నుండి ఐగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కేబుల్‌ కార్‌ ఎక్కితే గంటలోనే పీక్స్‌ వరకు వెళ్లిపోవచ్చు.
    ట్రైన్‌ వెళ్లేప్పుడు విండో సీట్‌ దగ్గర ఉంటే నేచర్‌లో వచ్చే వ్యూస్‌ని కెమెరాలో బంధించవచ్చు.

    ఏం చూడాలి?
    స్పింక్స్‌ అబ్జర్వేటరీ నుంచి ఆలెష్‌ గ్లేషియర్‌ను చూడటం ఒక సీ ఎక్స్‌పీరియెన్స్‌ అవుతుంది.

    యూరోప్‌లోని పెద్ద గ్లేషియర్‌లో అలెష్‌ గ్లేషియర్‌ని చూస్తే తెల్లని నదిలా పర్వతాల మధ్యలో నుంచి ప్రవహిస్తుందా అనిపించక మానదు. మధ్యాహ్నం సమయంలో     

    గ్లేషియర్‌పై సూర్య కిరణాలు ఒక కొత్త రంగును పరిచయం చేస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కనులు సరిపోవు.

    ఏం తినాలి ?
    ఇక్కడ చాకొలెట్‌ షాప్‌లో దొరికే ఫ్రెష్‌ స్విస్‌ ఛాకోలేట్స్‌ ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేస్తాయి. చల్లగా ఉన్న శిఖరాల మధ్యలో వేడిగా ఉండే స్విస్‌ ఛీజ్‌ లేదా ట్రెడిషనల్‌ సూప్‌ సేవిస్తూ ఉంటే ఆ టేస్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేం. 

    లిండ్ట్‌ చాకొలేట్‌ హెవెన్లో దొరికే హాట్‌ చాకొలేట్‌ ఆ కోల్డ్‌ వెదర్‌లో ఒక వేడిని, ఎనర్జీని ఇస్తుంది. 
    యాక్టివిటీస్‌

    స్నో ఫన్‌ పార్క్‌లో మంచు మీద ప్రయాణం, ఐస్‌ ప్యాలెస్‌లోని టన్నెల్స్‌లో ఫోటోస్‌ తీసుకోవడం, ఆల్పైన్‌ సెన్సేషన్‌ కారిడార్‌లో నడుస్తూ జంగ్‌ఫ్రాజోచ్‌ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.

    యూరోప్‌లోని హయ్యెస్ట్‌ పోస్ట్‌ ఆఫిస్‌ నుంచి ఒక పోస్ట్‌ కార్డు పంపడం మర్చిపోలేని ఙ్ఞాపకంగా. స్పింక్స్‌ డెక్‌పై నుంచి చుట్టూ ఉన్న పీక్స్‌ని అబ్జర్వ్‌ చేస్తూ ప్రశాంతంగా కూర్చోవచ్చు.

    సమ్మర్‌లో ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే సన్‌గ్లాసెస్‌ మర్చిపోకండి. స్నో రిఫ్లెక్షన్‌ కంటి చూపుపై ప్రభావం చూపిస్తుంది.

    – ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు 

    (చదవండి: పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌..! అక్కడ సమయం గడవదు..)

  • చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్‌ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.

    అతడే రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్‌ సింగ్‌. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో పోస్టింగ్‌తో సహా 16 ఏళ్లు పనిచేశాడు. 

    సర్వీస్‌లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్‌ సింగ్‌. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్‌ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు. 

    తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,  ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ. 

    (చదవండి: ఆలయాన్ని తలపించే కేఫ్‌..! ఏకంగా ప్రపంచంలోనే..)