Archive Page | Sakshi
Sakshi News home page

Sports

  • డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘనంగా బోణీ కొట్టింది. ఛాంపియన్‌ హోదాకు సార్దకత చేకూరుస్తూ, తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో  6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.

    ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జేకబ్‌ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్‌.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్‌) సాయంతో గట్టెక్కించాడు.

    వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా సన్‌రైజర్స్‌ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా బ్యాటర్లలో హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. డేవిడ్‌ పేన్‌ 6, ఉనద్కత్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

    దంచికొట్టిన పడిక్కల్‌, కోహ్లి
    అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్‌ పాటిదార్‌ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్‌ సిక్సర్‌, హ్యాట్రిక్‌ బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన జేకబ్‌ డఫీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

     

  • బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

    ఆర్సీబీ అరంగేట్రం బౌలర్‌ జేకబ్‌ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్‌.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్‌) సాయంతో గట్టెక్కించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా సన్‌రైజర్స్‌ 200 పరుగుల మార్కును దాట గలిగింది. 

    మిగతా సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. డేవిడ్‌ పేన్‌ 6, ఉనద్కత్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

    తుది జట్లు..
    ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

     

     

  • ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక సారధి ఇషాన్‌ కిషన్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్‌ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు మనీశ్‌ పాండే (69 నాటౌట్‌) పేరిట ఉండేది. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ ఈ రికార్డు నమోదు చేశాడు.

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కష్టాల్లో ఉన్న తన జట్టును అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే క్రమంలో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన ఇషాన్‌.. అభినందన్‌ సింగ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

    ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్‌ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

    ఐపీఎల్‌ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు
    119 - సంజు శాంసన్ (RR) vs PBKS, 2021
    99* - మయాంక్ అగర్వాల్ (PBKS) vs DC, 2021
    93* - శ్రేయస్ అయ్యర్ (DC) vs KKR, 2018
    88 - ఫాఫ్ డు ప్లెసిస్ (RCB) vs PBKS, 2022
    83 - కీరన్ పొలార్డ్ (MI) vs PBKS, 2019
    80 - ఇషాన్ కిషన్ (SRH) vs RCB, 2026*

    కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును ఆదుకున్నాడు. అతనికి క్లాసెన్‌ (31) కాసేపు సహకరించాడు.18 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. అనికేత్‌ వర్మ (27), డేవిడ్‌ పేన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

    సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, రొమారియో షెపర్డ్‌ 2, భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

  • న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ జాక‌బ్ డ‌ఫీ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌పున ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన డ‌ఫీ.. త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌ను డ‌ఫీ బెంబేలెత్తించాడు.

    అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లను అవుట్ చేసి ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మొత్తంగా డ‌ఫీ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌కు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని డఫీ నిలబెట్టుకున్నాడు. జోష్ హాజిల్‌వుడ్‌, నువాన్ తుషారా లేని లోటను డఫీ భర్తీ చేశాడు. అయితే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మాత్రం డఫీ విఫలమయ్యాడు.

    తుది జట్లు..
    ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ
    చదవండి: IPL 2026: అభిషేక్‌ శర్మ అట్టర్‌ ప్లాప్‌
     

  • ఐపీఎల్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు. 

    తద్వారా క్యాష్‌ లీగ్‌ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌ ఈ మైలురాయిని చేరుకునేందుకు 2180 బంతులు తీసుకోగా.. రిషబ్‌ పంత్‌ (2028), యూసఫ్‌ పఠాన్‌ (2082), సూర్యకుమార్‌ యాదవ్‌ (2130), సురేశ్‌ రైనా (2135), ఎంఎస్‌ ధోని (2152) అతని కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస​్‌ఆర్‌హెచ్‌ కష్టాల్లో పడింది. ఆర్సీబీ అరంగేట్రం పేసర్‌ జేకబ్‌ డఫీ నిప్పులు చెరిగే బంతులతో ఎస్‌ఆర్‌హెచ్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ దశలో ఇషాన్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 

    అతనికి జతగా హెన్రిచ్‌ క్లాసెన్‌ క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 54-3గా ఉంది. ఇషాన్‌ (12 బంతుల్లో 25), క్లాసెన్‌ (7 బంతుల్లో 6) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. డఫీ అద్బుతమైన స్పెల్‌ను (4-0-22-3) ముగించాడు.

    నిప్పులు చెరిగిన డఫీ
    ఎస్‌ఆర్‌హెచ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్‌లో ఓపెనర్లు అభిషేక్‌ (7), హెడ్‌ (11) వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్‌ తొలి బంతికే నితీశ్‌కుమార్‌ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు.

    తుది జట్లు..
    ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

     

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పేలవంగా ఆరంభించాడు. చిన్న‌స్వామిస్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌ర‌గుతున్న తొలి మ్యాచ్‌లో అభిషేక్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. 

    8 బంతుల్లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆర్సీబీ స్పీడ్ స్టార్ జాక‌బ్ డ‌ఫీ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఒక్క సిక్స్ మాత్ర‌మే ఉంది. అయితే  డ‌ఫీ మాత్రం తన పేస్‌ బౌలింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తిస్తున్నాడు. 

    అత‌డి బౌలింగ్ ధాటికి స‌న్‌రైజ‌ర్స్ ట్రావిస్ హెడ్‌(11), నితీశ్ కుమార్ రెడ్డి(1) వంటి కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. మొత్తం మూడు వికెట్లు కూడా అత‌డే తీశాడు. ఈ కివీ పేస‌ర్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మెరుగ్గా రాణించిక‌పోయిన‌ప్ప‌టికి.. త‌న తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం దుమ్ము లేపాడు. దీంతో సన్‌రైజర్స్‌ కేవలం 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    తుది జట్లు..
    ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

     

  • క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఐపీఎల్‌-2026 సీజన్‌కు తెరలేచింది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి.

    ఈ సందర్భంగా గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మ్యాచ్ ఆరంభ సమయంలో మైదానంలోకి వెళ్లే ముందు బౌండరీ లైన్ వద్ద రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

    అదేవిధంగా ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్‌కు ముందు జరిగిన వార్మప్ సెషన్‌లో ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ '11' సంఖ్య ఉన్న జెర్సీలను ధరించి ప్రాక్టీస్ చేశారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్టేడియం ఆవరణలో ఆ అభిమానుల కోసం ఒక ప్రత్యేక స్మారక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించింది. 

    అంతేకాకుండా వారికి సంతాపంగా స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచారు.  ఈ సీట్లను ఇకపై ఏ ఐపీఎల్ మ్యాచ్‌కు గానీ, అంతర్జాతీయ మ్యాచ్‌కు గానీ విక్రయించరు.  ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
    చదవండి: నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్‌ శర్మపై యువీ తండ్రి ఫైర్‌



     

     

  • భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన తర్వాత మరో ఫ్రాంచైజీ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. గతేడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడే కల గాయం కారణంగా నెరవేరకపోయినా, ఈసారి అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (MLC)తో ఒప్పందం కుదుర్చుకొని, విదేశీ లీగ్‌ల్లో ఆడాలన్న కలను సాకారాం చేసుకోనున్నాడు.  

    MLCలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ జట్టు ఆశ్విన్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఈ లీగ్‌లో ఆడే తొలి భారతీయ క్యాప్డ్‌ ప్లేయర్‌గా అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ జట్టులో ఇప్పటికే పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌలర్ హారిస్ రౌఫ్ ఉన్నాడు. దీంతో ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్‌ చేసుకోనున్నారు.  

    భారత అభిమానులు లక్ష్యంగా..!  
    MLC ఇప్పటికే ఫాఫ్ డుప్లెసిస్, కీరన్ పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లను కలిగి ఉంది. అశ్విన్ వంటి భారత లెజెండ్ కూడా చేరడం వల్ల ఈ లీగ్ బ్రాండ్ ఇమేజ్‌ మరింత పెరుగనుంది. అశ్విన్‌ చేరికతో ఈ లీగ్‌ను ఫాలో అయ్యే భారత అభిమానుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది.

    BBL, ILT20లో విఫలయత్నాలు  
    అంతర్జాతీయ క్రికెట్‌, ఐపీఎల్‌ రిటైర్మెంట్ తర్వాత అశ్విన్‌ విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు పలు విఫలయత్నాలు చేశాడు.  ILT20 వేలంలో పేరు నమోదు చేసుకున్నా, ఆశ్చర్యకరంగా ఎవరూ అతనిపై ఆసక్తి చూపలేదు. బీబీఎల్‌లో సిడ్నీ థండర్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా, గాయం కారణంగా  సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.  

    IPL 2026లో వ్యాఖ్యాతగా..
    అశ్విన్‌ ఆటగాడిగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా, వ్యాఖ్యాతగా కొనసాగనున్నాడు. JioHotstar హిందీ కామెంటరీ ప్యానెల్‌లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్‌లతో కలిసి పని చేయనున్నాడు. ఆటపై లోతైన అవగాహన కలిగిన అశ్విన్ వ్యాఖ్యాతగా అభిమానులకు కొత్త అనుభవాన్ని అందించనున్నాడు.  

     

  • గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్‌గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్‌ శర్మ. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్‌.

    క్రమశిక్షణ అత్యంత ముఖ్యం
    అయితే, యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) మాత్రం అభిషేక్‌ శర్మ ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. ఈ పంజాబీ ప్లేయర్‌ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తొందరలో మూల్యం చెల్లిస్తున్నాడని యోగ్‌రాజ్‌ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులకు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. అయితే, ఇప్పటి ఆటగాళ్లలో అది కొరవడిందని పేర్కొన్నాడు.

    ఒకే సర్‌ అంటాడు కానీ..
    ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మకు చెప్పీ చెప్పీ నేను విసిగిపోయాను. ఆటను తేలికగా తీసుకోవద్దని అతడికి ఎన్నోసార్లు మెసేజ్‌లు పెట్టాను. అందుకు బదులుగా.. ‘ఒకే సర్‌’ అని సమాధానమిస్తాడు.

    అలా అయితే ఫెయిలై పోతావు
    మైదానంలో అడుగుపెట్టిన తర్వాత షరా మమూలే. అతడి తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. సింగిల్‌, డబుల్‌, బౌండరీ అని ఉంటాయి. కానీ ప్రతిసారి బంతిని గాల్లోకి లేపి సిక్సరే బాదుతానంటే ఎలా?.. మైదానంలో ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిసారి సిక్స్‌ బాదితే నువ్వు విఫలమైపోతావు’’ అంటూ యోగ్‌రాజ్‌ సింగ్‌ అభిషేక్‌ శర్మను ఘాటుగా విమర్శించాడు.

    కాగా ఇటీవల సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. హ్యాట్రిక్‌ డకౌట్ల తర్వాత రెండు హాఫ్‌ సెంచరీలతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో అర్ధ శతకం బాదడంతో అతడిపై విమర్శల జడి కాస్త తగ్గింది. 

    మొత్తానికి భారీ అంచనాలతో తొలిసారి వరల్డ్‌కప్‌ బరిలో దిగిన అభిషేక్‌ శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 141 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2026 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ బరిలోకి దిగాడు.

    చదవండి: IPL 2026: బంగ్లాదేశ్‌ యూటర్న్‌.. కీలక ప్రకటన

  • ఐపీఎల్‌ 2026 ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలో ఊదేసి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

    బౌలింగ్‌లో డఫీ (4-0-22-3).. బ్యాటింగ్‌లో పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అదరగొట్టారు. అంతకుముందు ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌ చేసింది. 

    వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
    ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఆర్సీబీ వరుస బంతుల్లో (2,3) వికెట్లు కోల్పోయింది. డేవిడ్‌ పేన్‌ వరుసగా రజత్‌ పాటిదార్‌ (31), జితేశ్‌ శర్మ (0)ను ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలంటే 45 బంతుల్లో 39 పరుగులు చేయాలి. 

    రెండో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    8.4వ ఓవర్‌-110 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. విధ్వంసకర అర్ద శతకం బాదిన పడిక్కల్‌ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హర్ష్‌ దూబే బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

    తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
    202 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. ఉనద్కత్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ పట్టడంతో ఫిల్‌ సాల్ట్‌ (8) ఔటయ్యాడు. అయితే సాల్ట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పడిక్కల్‌ (11 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి బంతి నుంచే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. అతనికి జతగా విరాట్‌ కోహ్లి (17 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. 4.3 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 61-1గా ఉంది.

    ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే..?
    వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (80) విధ్వంసం.. క్లాసెన్‌ క్లాస్‌ (31), ఆఖర్లో అనికేత్‌ వర్మ (43) మెరుపుల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 

    హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. డేవిడ్‌ పేన్‌ 6, ఉనద్కత్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

    ఇషాన్‌ కిషన్‌ ఔట్‌
    15.6వ ఓవర్‌- 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. అభినందన్‌ సింగ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 155-6గా ఉంది. 

    ఐదో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    14.3వ ఓవర్‌- 137 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి సలీల్‌ అరోరా (9) ఔటయ్యాడు.

    నాలుగో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
    13.1వ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న హెన్రిచ్‌ క్లాసెన్‌ (31) రొమారియో షెపర్డ్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్‌ కిషన్‌కు (72) జతగా సలీల్‌ అరోరా క్రీజ్‌లోకి వచ్చాడు. 

    29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్‌లో ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌ వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్‌ తొలి బంతికే నితీశ్‌కుమార్‌ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు. 

    హెడ్‌ ఔట్‌.. 23 పరుగులకే ఓపెనర్లు డౌన్‌
    23 పరుగులకే (3 ఓవర్లు) ఎస్‌ఆర్‌హెచ్‌ ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డేంజరెస్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ (11) డఫీ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

    అభిషేక్‌ ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌  
    టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌  18 పరుగుల వద్ద (2.1వ ఓ‍వర్‌) తొలి వికెట్‌ కోల్పోయింది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (7) జేకబ్‌ డఫీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

    డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య ఇవాల్టి (మార్చి 28) మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2026 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

    తుది జట్లు..
    ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

    సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

  • ఇంగ్లండ్ క్రికెట్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ దేశ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కొంతకాలం​ ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు ముందు ఈ వార్త వెలువడింది. స్టోక్స్‌ కౌంటీ జట్టు (డర్హమ్‌) కోచ్‌ ర్యాన్‌ క్యాంప్‌బెల్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

    అతని మాటల్లో.. స్టోక్స్ త్వరలో ప్రారంభం కానున్న కౌంటీ సీజన్‌కు అందుబాటులో ఉండాల్సింది. కానీ వైద్యులు అతనికి అనుమతి ఇవ్వలేదు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండవపోవచ్చు.

    క్యాంప్‌బెల్‌ ఇచ్చిన ఈ సమాచారం మేరకు స్టోక్స్‌ సమీప భవిష్యత్తులో క్రికెట్‌ ఆడటం కష్టమేనని స్పష్టమవుతుంది. స్టోక్స్‌ ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు బంతి ముఖానికి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీని వల్ల అతని ముఖానికి  శస్త్రచికిత్స కూడా జరిగింది. గాయమైన ముఖంతో స్టోక్స్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలైంది.

    స్టోక్స్ చివరిగా జనవరి 8న సిడ్నీలో జరిగిన యాషెస్ టెస్ట్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌కు ముందు కూడా అతను గాయపడ్డాడు. వరుస గాయాలు అతని కెరీర్‌ను సందిగ్దంలో పడేశాయి. స్టోక్స్‌ వ్యక్తిగతంగా, నాయకుడిగా విఫలం కావడంతో ఇంగ్లండ్‌ ఇటీవలి యాషెస్‌ సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. ఈ దారుణ పరాభవం తర్వాత కూడా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్టోక్స్‌ను టెస్ట్‌ కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా గాయం స్టోక్స్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మర్చేసింది.

    ఆటకు దూరంగా ఉన్నా, స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్‌కు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు. ఇంగ్లండ్‌ లయన్స్ జట్టుకు అతను కోచ్‌గా సేవలందిస్తున్నాడు. 

  • ఐపీఎల్‌-2026 సీజన్‌కు స‌ర్వం సిద్ద‌మైంది. మ‌రి కాసేపట్లో ఈ ధ‌నాధ‌న్ క్రికెట్ లీగ్‌కు తెరలేవ‌నుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

    అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ పై చేయి సాధించే అవకాశముందని పఠాన్ జోస్యం చెప్పాడు. ఎస్‌ఆర్‌హెచ్ కంటే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కాస్త వీక్‌గా కన్పిస్తోందని అతడు అభిప్రాయపడ్డారు.

    కాగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్ సీజన్‌కు జోష్ హాజిల్‌వుడ్‌, నువాన్ తుషారాలు గాయం కారణంగా దూరమయ్యారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అయినప్పటికి జయదేవ్ ఉనద్కట్‌, హర్షల్ పటేల్ వంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.

    గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్సీబీ బౌలింగ్ పరంగా కాస్త బలహీనంగా కన్పిస్తోంది. ముఖ్యంగా హేజిల్‌వుడ్‌, యశ్ దయాల్ పేస్ బౌలర్ల సేవలను ఆర్సీబీ కోల్పోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో బెంగళూరుపై ఎస్‌ఆర్‌హెచ్ పైచేయి సాధిస్తుందని నేను భావిస్తున్నాను.

    ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌నే సొంతమైదానంలో ఆడుతామని అస్సలు ఊహించిండదు. చిన్నస్వామి స్టేడియం బౌండరీలు చాలా చిన్నవి. ఇరు జట్లకు స్పిన్నర్లు కీలకం మారనున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ మరి స్పిన్నర్‌గా ఎవరిని ఆడిస్తుందో చూడాలి. ఏదేమైనప్పటికి ఎస్‌ఆర్‌హెచ్‌కే గెలిచే అవకాశాలు ఉన్నాయని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

    కాగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో హర్ష్ దూబే, శివాంగ్ కుమార్‌, జీషాన్ అన్సారీ వంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. జీషాన్ అన్సారీ గత సీజన్‌లో ఆడగా.. దూబే, శివాంగ్‌లకు ఇదే తొలిసారి. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ మరి ఎవరికి తుది జట్టులో చోటు ఇస్తుందా? అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్యాట్ క‌మ్మిన్స్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్‌రౌండ‌ర్ బ్రైడ‌న్ కార్స్‌కు చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది.
    చదవండి: IPL 2026: చరిత్రకు అడుగు దూరంలో భువనేశ్వర్‌ కుమార్‌
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు శనివారం తెరలేవనుంది. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌.. గాయాల వల్ల తప్పుకొన్న ఆటగాళ్లు.. వారి స్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్లు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ తదితర వివరాలు తెలుసుకుందామా?

    ఈసారి ఐపీఎల్‌కు దూరమైన ఆటగాళ్లు వీరే
    👉హర్షిత్‌ రాణా (ఇండియా)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- మోకాలి సర్జరీ
    👉ఆకాశ్‌ దీప్‌ (ఇండియా)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- వెన్ను నొప్పి
    👉ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (బంగ్లాదేశ్‌)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- బీసీసీఐ ఆదేశాల మేరకు 
    👉సామ్‌ కర్రాన్‌ (ఇంగ్లండ్‌)- రాజస్తాన్‌ రాయల్స్‌- గజ్జల్లో గాయం
    👉నాథన్‌ ఎల్లిస్‌ (ఆస్ట్రేలియా)- చెన్నై సూపర్‌ కింగ్స్‌- తొడ కండరాల గాయం
    👉జాక్‌ ఎడ్వర్డ్స్‌ (ఆస్ట్రేలియా)- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కాలి గాయం
    👉పృథ్వీరాజ్‌ ఎర్రా (ఇండియా)- గుజరాత్‌ టైటాన్స్‌- గాయం

    ఎవరి స్థానంలో ఎవరు?
    👉హర్షిత్‌ రాణా స్థానంలో నవ్‌దీప్‌ సైనీ
    👉ఆకాశ్‌ దీప్‌ స్థానంలో సౌరభ్‌ దూబే
    👉ముస్తాఫిజుర్‌ రహమాన్‌ స్థానంలో బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ
    👉నాథన్‌ ఎల్లిస్‌ స్థానంలో స్పెన్సర్‌ జాన్‌సన్‌
    👉జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్థానంలో డేవిడ్‌ పైన్‌
    👉పృథ్వీరాజ్‌ ఎర్రా స్థానంలో కుల్వంత్‌ ఖెజ్రోలియా.
     

  • ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌, ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ భారత మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్‌ 2026 నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్‌ మీడియాపై చిందులేశాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

    అసలేం జరిగిందంటే.. స్టార్క్‌ ఐపీఎల్‌ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరుకాలేదు. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్‌లోడ్‌ కారణంగా ఐపీఎల్‌ ఆడకూడదన్న కండీషన్‌ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే, స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలకు తెరదించాడు. 

    ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం మరియు మోచేతి గాయాలు ఉన్నాయని, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని వెల్లడించాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు. 

    నిజానికి నేను ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నాను. ఈ గాయం ఢిల్లీ జట్టుకు, అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చాడు. మేనేజ్‌మెంట్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, వీలైనంత త్వరగా జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.

    కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది. కైల్‌ జేమీసన్‌, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా వంటి విదేశీ పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్‌ లేని లోటు భర్తీ చేయలేనిదని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది.

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో త‌ల‌ప‌డేందుకు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు సిద్ద‌మ‌య్యాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ త‌ర‌పున బ‌రిలోకి దిగుతున్న భార‌త సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

    ఆర్సీబీపై భువీ కేవ‌లం రెండు వికెట్లు ప‌డగొడితే.. ఐపీఎల్‌లో  200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు.  ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు కేవలం యుజువేంద్ర చాహల్ (221 వికెట్లు) మాత్రమే 200 వికెట్ల మార్కును దాటాడు. ఇప్పుడు భువనేశ్వర్ కూడా చహల్ సరసన చేరేందుకు సిద్దమయ్యాడు. 

    కాగా ఈ ఏడాది సీజన్‌కు ఫస్ట్‌హాఫ్‌కు స్టార్‌ పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీ బౌలింగ్‌ బాధ్యత అంతా భువీపైనే పడింది. పవర్‌ప్లేతో వికెట్లు తీయడంతో పాటు డెత్‌ ఓవర్లలో పరుగులను కట్టడి చేయడంలోనూ భువీ కీలకం కానున్నాడు. ఇప్పటివరకు  భువనేశ్వర్‌ కుమార్ ఐపీఎల్‌లో మొత్తంగా 190 మ్యాచ్‌లు 198 వికెట్లు పడగొట్టాడు.

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే
    యజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు 
    భువనేశ్వర్ కుమార్: 198 వికెట్లు 
    సునీల్ నరైన్ : 192 వికెట్లు
    పీయూష్ చావ్లా : 192 వికెట్లు 
    రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లు
    చదవండి: ఇదేం పద్ధతి?.. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఓవరాక్షన్‌.. నెటిజన్లు ఫైర్‌

  • పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ముస్తాక్‌ అహ్మద్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీకసలు కామన్‌సెన్స్‌ ఉందా? అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డొమినిక్‌ కార్క్‌ పట్ల ముస్తాక్‌ ప్రవర్తించిన తీరే ఇందుకు కారణం.

    అసలు విషయం ఏమిటంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో క్వెటా గ్లాడియేటర్స్‌- కరాచీ కింగ్స్‌కు మధ్య మ్యాచ్‌కు ముందు పిచ్‌ పరిస్థితుల గురించి చర్చించే క్రమంలో డొమినిక్‌, ముస్తాక్‌ మైదానంలోకి వచ్చారు.

    నువ్వు జీనియస్‌
    ఈ క్రమంలో పిచ్‌ను చూపిస్తూ.. ‘నువ్వు జీనియస్‌. రెండు చేతులతోనూ బంతిని తిప్పేయగలవు. ఇక్కడ ఆడం జంపా ఉన్నాడు. ఈ పిచ్‌పై బౌలింగ్‌ చేసే విషయంలో అతడికి నువ్వు ఎలాంటి సలహాలు ఇస్తావు?’ అని డొమినిక్‌ ముస్తాక్‌ను అడిగాడు.

    ఇందుకు బదులుగా.. ‘ఆడం జంపా కంటే ముందు నీకు ఓ విషయం చెప్పాలి. టెస్టు, వన్డే, ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో నేను ఎన్నిసార్లు నిన్ను అవుట్‌ చేశానో గుర్తుందా? నాకైతే ఆ విషయం చాలా బాగా గుర్తుంది’ అని ముస్తాక్‌ పొంతనలేని సమాధానం ఇచ్చాడు.

    నన్ను ఒకసారి అవుట్‌ చేశావు
    అయితే, డొమినిక్‌ కార్క్‌ .. ‘ముషీ.. నువ్వు నన్ను ఒకసారి అవుట్‌ చేశావు’ అని బదులిచ్చాడు. అయితే, ముస్తాక్‌ మాత్రం.. ‘లేదు.. లేదు.. చాలాసార్లు నిన్ను అవుట్‌ చేశాను’ అని పునరుద్ఘాటించాడు.

    ఇందుకు డొమినిక్‌ కార్క్‌.. ‘నేనైతే బ్యాటింగ్‌ చేయలేను కదా!.. నన్ను అవుట్‌ చేసే విషయం గురించి ఇప్పుడెందుకు గానీ.. టాపార్డర్‌పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది’ అని కౌంటర్‌ వేశాడు.

    ముందు ఈ పిచ్‌ గురించి మాట్లాడదామా?
    అయితే, ముస్తాక్‌ మరోసారి అదే టాపిక్‌ తీసుకువచ్చాడు. ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నువ్వు ఇంగ్లండ్‌ తరఫున ఆల్‌రౌండర్‌గా ఆడేవాడివి’ అని పేర్కొన్నాడు. దీంతో డొమినిక్‌కు చిర్రెత్తుకు వచ్చింది. ‘మనం ముందు ఈ పిచ్‌ గురించి మాట్లాడదామా? ఆడం జంపా గురించే నేను మాట్లాడదలచుకున్నాను’ అని బదులిచ్చాడు.

    వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో డొమినిక్‌ హుందాగా పిచ్‌ గురించి మాట్లాడుతుంటే.. ముస్తాక్‌ మాత్రం అతడిని తక్కువ చేసే విధంగా పాత విషయాలు తవ్వడం ఏమిటని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

    ఇదేం పద్ధతి?
    ‘ఇదేం పద్ధతి? కాస్తైనా సంస్కారం లేదా? పిచ్‌ గురించి అభిప్రాయం చెప్పమంటే ఇలా మాట్లాడటం సరికాదు’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌ తరఫున 37 టెస్టులు, 32 వన్డేలలో కలిపి పేస్‌ బౌలర్‌ డొమినిక్‌ కార్క్‌ 172 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. ముస్తాక్‌ పాక్‌ తరఫున 52 టెస్టులు, 144 వన్డేలుఆడి 300కు పైగా వికెట్లు పడగొట్టాడు.

    చదవండి: PSL: పాకిస్తాన్‌కు మరో షాక్‌!.. ఈసారి..

  • ఐపీఎల్‌-2026 సీజన్‌ మరో కొన్ని గంటల్లో షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశముందని అశ్విన్‌ జోస్యం చెప్పాడు. క్లాసెన్ గతేడాది నుంచి చెప్పుకోదగ్గ ప్రదరన్శన చేయలేకపోతున్నాడు. ఐపీఎల్‌-2025తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ క్లాసెన్‌ నిరాశపరిచాడు.

    గత 20 నెలలలో 65 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్‌.. 28.80 సగటుతో కేవలం 1440 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్లాసెన్‌ ఎలా రాణిస్తాడోనని అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.

    తొలి మ్యాచ్‌లో ఓ అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నాను. గత 18 నెలలగా పెద్దగా రాణించకపోయిన హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఈ మ్యాచ్‌లో "గుర్తుండిపోయే ఇన్నింగ్స్" ఆడే అవకాశముంది. అదేవిధంగా ఆర్సీబీ తరపున జాకబ్‌ బెతల్‌ కీలక ఆటగాడిగా నిలవనున్నాడని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ పేర్కొన్నాడు.

    కాగా చిన్నస్వామి స్టేడియంలో క్లాసెన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే వేదికగా ఐపీఎల్‌-2023లో ఆర్సీబీపై అతడు కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మరోవైపు జాకబ్‌ బెతల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2026లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో బెతల్‌ విధ్వంసకర సెంచరీతో సత్తాచాటాడు.
    చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్‌?

  • న్యూఢిల్లీ: హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీతో ఎలాంటి విబేధాలు లేవని... వెటరన్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించాడు. భారత్‌ తరఫున టిర్కీ అత్యధికంగా 412 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ సిద్ధంగా ఉన్నాడు. 

    ఇప్పటి వరకు మన్‌ప్రీత్‌ కెరీర్‌లో 411 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ ప్రాబబుల్స్‌ నుంచి మన్‌ప్రీత్‌ పేరును తొలగించడంతో... ఇద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదనే పుకార్లు వినిపించగా... మన్‌ప్రీత్‌ వాటిని కొట్టేశాడు. 

    ‘ఆసియా క్రీడల వరకు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా దానిపైనే ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ను బట్టి కెరీర్‌ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా. దిలీప్‌ టిర్కీతో వ్యక్తిగతంగా మాట్లాడా. ఆయన పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడితే సంతోషిస్తా అని ప్రోత్సహించారు. 

    మా మధ్య చక్కటి అనుబంధం ఉంది. 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలవాలని ఆకాంక్షించారు’ అని మన్‌ప్రీత్‌ వెల్లడించాడు. మరోవైపు టిర్కీ స్పందిస్తూ... ‘అదంతా మీడియా, సోషల్‌ మీడియా సృష్టే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు’ అని అన్నాడు.

    కాగా 2020, 2024 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడైన మన్‌ప్రీత్‌... ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో మూడేసి పతకాలు సొంతం చేసుకున్నాడు. శుక్రవారం నిర్వహించిన హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకుగాను మన్‌ప్రీత్‌ ప్రత్యేక బహుమతిని తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.    

  • ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు ఓ గుడ్ న్యూస్‌, బ్యాడ్ న్యూస్ అందింది. మొన్న‌టివ‌ర‌కు బెంగళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా తిరిగి ముంబై జ‌ట్టులో చేరాడు. వాంఖ‌డే స్టేడియంలో ముంబై ట్రైనింగ్ క్యాంపులో బుమ్రా క‌న్పించ‌క‌పోవ‌డంతో ఏమైనా గాయ‌ప‌డ్డాడా? అన్న అనుమానాలు త‌లెత్తాయి.

    కానీ బుమ్రా ఇప్పుడు జ‌ట్టుతో చేరి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టాడు. మార్చి 29న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌ర‌గ‌నున్న ముంబై తొలి మ్యాచ్‌లో బుమ్రా బ‌రిలోకి దిగ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కీల‌క ఆట‌గాళ్లు విల్ జాక్స్‌, మిచెల్ శాంట్న‌ర్‌ దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.  ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను పూర్తి చేసుకున్న శాంట్నర్‌ ఇంకా న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు.

    మరోవైపు టీ20 ప్రపంచకప్‌-2026లో నాలుగు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న విల్‌ జాక్స్‌ కూడా ఇంకా ముంబై జట్టుతో చేరలేదు. దీంతో తుది జట్టులో కరేబియన్‌ ఆల్‌రౌండర్‌ షేర్ఫన్‌  4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

    తొలి మ్యాచ్‌లో ముంబై గెలుస్తుందా?
    కాగా ముంబై ఇండియ‌న్స్‌కు తొలి మ్యాచ్ గండం పొంచి ఉంది. 2012 నుండి ఇప్పటివరకు ఆ జట్టు సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి ఈసెంటిమెంట్‌ను బ్రేక్ చేయాల‌ని ముంబై భావిస్తోంది. బుమ్రా, సూర్య‌కుమార్‌, హార్దిక్,  రోహిత్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌తో ముంబై ఇండియ‌న్స్ ప‌టిష్టంగా క‌న్పిస్తోంది.
    చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్‌?
     

  • బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రసారాలపై తమ దేశంలో ఎలాంటి నిషేధం లేదని ప్రకటించింది. బంగ్లాదేశ్‌ సమాచార, ప్రసార శాఖా మంత్రి జాహిర్‌ ఉద్దీన్‌ స్వపన్‌ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించాడు.

    కాగా గత కొంతకాలంగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించాలని భారత్‌లో డిమాండ్లు రాగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.

    తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్‌ను తొలగించాల్సిందిగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఆదేశించింది. దీంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) టీ20 ప్రపంచకప్‌-2026 వేదికపై అభ్యంతరం లేవనెత్తింది. భారత్‌లో కాకుండా.. పాకిస్తాన్‌ కోసం ఏర్పాటు చేసిన తటస్థ వేదికైన శ్రీలంకలోనే తాము కూడా మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టింది.

    భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ గగ్గోలు పెట్టగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో బంగ్లా వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ ప్రసారాలను బంగ్లాలో నిషేధిస్తూ అప్పటి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    అయితే, తాజాగా ఎన్నికైన ప్రభుత్వం మాత్రం భారత్‌తో స్నేహం కావాలని.. బీసీసీఐతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ఇటీవలే సంకేతాలు ఇచ్చింది. క్రీడా శాఖా మంత్రి అమినుల్‌ హక్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో మంత్రి జహీర్‌ ఉద్దీన్‌ స్వపన్‌ మాట్లాడుతూ..

    ‘‘ఐపీఎల్‌ ప్రసారాల కోసం ఇంత వరకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. మేము రాజకీయాలు, క్రీడలను కలపాలని అనుకోవడం లేదు. వాణిజ్యపరంగా మాకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై దృష్టి సారిస్తాము.

    ఏదేని చానెల్‌ ఐపీఎల్‌ ప్రసారాల కోసం అనుమతి కోరితే తప్పక సానుకూలాంగా స్పందిస్తాం. ఎవరికీ మేము అడ్డుచెప్పము. ఒకవేళ స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ను ఇక్కడ ప్రసారం చేయాలనుకుంటే అందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఏ చానెల్‌కైనా మేము అనుమతినిస్తాం’’ అని తెలిపాడు.

    కాగా బీసీసీఐతో సంబంధాలు తెంచుకుంటే బంగ్లాదేశ్‌ బోర్డు, ఆటగాళ్లు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగి భారీ మూల్యం చెల్లించిన బంగ్లా క్రికెట్‌.. ఇకపై సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఆర్థికంగా లబ్ది పొందాలనే యోచనలో ఉంది. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందేమోనన్న భయంతో ఇలా యూటర్న్‌లు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  • ఎస్ఆర్‌హెచ్‌ ఓన‌ర్ కావ్య మార‌న్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే ఆంశంపై అనిరుధ్ స్పందించిన తీరు ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

    గ‌తేడాది జూన్‌లో కూడా వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్న‌ట్లు ప్రచారం జ‌రిగింది. కావ్య-అనిరుధ్ క‌లిసి అమెరికాకు వెళ్లార‌నే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే వీటిన్న‌టికి అనిరుధ్ ఒక్క స‌మాధానంతో చెక్ పెట్టాడు.

    పెళ్ళా? హాహా.. ప్లీజ్ గాయ్స్, కాస్త కూల్ అవ్వండి. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి" అని ఎక్స్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో అనిరుధ్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్ట‌ర్ త‌న పెళ్లి గురించి అడ‌గ‌గా.. అందుకు అనిరుధ్  "మళ్లీ ఇదేనా " అని అసహనంతో సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

    ఈ వార్తలను అత‌డు పూర్తిగా ఖండించకపోవడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. అయితే అటు కావ్య మారన్ నుంచి కానీ, ఇటు అనిరుధ్ కుటుంబం నుంచి కానీ వీరి వివాహం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    కావ్య పాప దృష్టి మొత్తం ఐపీఎల్‌-2026 సీజన్‌పైనే ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు అనిరుధ్‌ వరుస సినిమాలో బీజీగా ఉన్నాడు.
    చదవండి: ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్‌ చేస్తున్నారు: చిక్కుల్లో పాక్‌ క్రికెటర్‌

  • పాకిస్తాన్‌ పేసర్‌ నసీం షా చిక్కుల్లో పడ్డాడు. పాక్‌లోని పంజాబ్‌ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) నసీం షాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

    సీఎంను ఆహ్వానించిన పీసీబీ
    అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) మార్చి 26న ఆరంభమైన సంగతి తెలిసిందే. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌ వీక్షించాల్సిందిగా పీసీబీ పంజాబ్‌ సీఎం మరియం నవాజ్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలో లాహోర్‌ ఖలందర్స్‌, హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ జట్ల ఫ్రాంఛైజీ యజమానులకు పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ.. మరియంను పరిచయం చేశాడు.

    ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్‌ చేస్తున్నారు
    ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు అత్యంత గౌరవం ఇవ్వడాన్ని తప్పుబట్టిన నసీం షా.. ‘లార్డ్స్‌ (ఇంగ్లండ్‌ మైదానం)లో రాణిలా.. ఇక్కడిలా ఈమెను ఎందుకు చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని నసీం షా ఎక్స్‌ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది.

    నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది
    ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన నసీం షా.. తన సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ అయిందని.. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. అయితే, పీసీబీ మాత్రం నసీం షా చర్యను తీవ్రంగా పరిగణించింది. 

    అతడు సెంట్రల్‌ కాంట్రాక్టు, మీడియా నిబంధనలు ఉల్లంఘించాడని.. అలాంటి ట్వీట్‌ చేయడానికి గల కారణం ఏమిటో తెలపాలంటూ షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. కాగా పీఎస్‌ఎల్‌లో నసీం షా రావల్పిండి పిండిజ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

    ఇక పాకిస్తాన్‌ తరఫున ఇప్పటికి 20 టెస్టులు, 34 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు నసీం షా. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్‌బౌలర్‌ ఖాతాలో 60 టెస్టు వికెట్లు, 60 వన్డే వికెట్లు, 32 టీ20 వికెట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో చివరగా పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు నసీం షా.

    చదవండి: PSL: పాకిస్తాన్‌కు మరో షాక్‌!.. ఈసారి..

  • గోల్ఫ్ దిగ్గ‌జం టైగ‌ర్‌వుడ్స్‌ను ఫ్లోరిడా పోలీసులు శ‌నివారం అరెస్ట్ చేయడం ఆసక్తి కలిగించింది. వాహ‌నాన్ని ఓవ‌ర్‌టేక్ చేసే క్ర‌మంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డ‌మేగాక‌, ప్రమాదానికి కార‌ణమైన టైగ‌ర్‌వుడ్స్‌ను డ్రైవింగ్ అండ‌ర్ ది ఇన్‌ఫ్లూయెన్స్ (డీయూఐ) కింద అదుపు లోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. 

    పోలీసుల వివ‌రాల ప్ర‌కారం జూపిట‌ర్ ఐలాండ్‌లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

    అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బ్రీత్ అన‌లైజ్‌ప‌రీక్ష నిర్వ‌హించారు. టెస్టులో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూత్ర పరీక్షకు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ కేసు నమోదు చేసి టైగ‌ర్‌వుడ్స్‌ను జైలుకు తరలించారు.  

    2017లో కూడా టైగర్ వుడ్స్ ఇదే త‌ర‌హాలో కారు ప్ర‌మాదానికి గురయ్యారు. మోతాదుకు మించి పెయిన్ కిల్ల‌ర్స్ తీసుకోవ‌డంతో నిద్ర‌మ‌త్తులోకి జారుకోవ‌డంతో కారు ప‌ల్టీలు కొట్టింది. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌మాదం నేప‌థ్యంలో త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్‌లో టైగ‌ర్‌వుడ్స్ పాల్గొన‌డం అనుమానంగా మారింది.

    చదవండి: IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!

Andhra Pradesh

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో  ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. కమిటీ వారు నిన్న ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామస్థులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే సుమారు 50 మంది గ్రామస్థులను అత్యవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. 

    కాగా జరిగిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు. వంటకు ఉపయోగించిన సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపనున్నారు. ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  

    ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదానం ఇలా విషాదానికి దారితీసినందుకు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా ఫుడ్ పాయిజన్‌కు కారణం ఏమిటో త్వరలో వెల్లడించనున్నారు.  

  • సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఈనాడు పత్రిక​పై పోలీసులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురించారని.. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

    బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేశారు. జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • రాజమహేంద్రవరం: దళితుల గురించి దళిత సంఘాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి  ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్‌ఫైల్‌ ఇవ్వడానికి సీఐ బాజీలాల్‌ నిరాకరించారు. దాంతో వైఎస్సార్‌సీపీ నేతలు, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఐ తీరును మాజీ ఎంపీ భరత్‌ నిలదీశారు. 

    దీనిలో భాగంగా మీడియాతో భరత్‌ మాట్లాడుతూ.. ‘ దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆడియోలో ఆదిరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ జరగాలని డిమాండ్ చేశాం. ఆడియోలో అప్పారావు ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. 

    ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్‌కు పంపాలి. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలి. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గంటసేపు వాగ్వాదం చేస్తే అకనాలెడ్జిమెంట్ కాఫీఇచ్చారు’ అని స్పష్టం చేశారు.

    రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

International

  • మార్చి 24 మంగళవారం రోజు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య ఫోన్‌ కాల్ సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంపై చర్చలు జరిపారు. అయితే ఈ హైలెవల్‌ కాల్‌లో టెస్లా అధినేత మస్క్‌ చేరాడంటూ కథనాలు వచ్చాయి. కాగా తాజాగా భారత్‌ ఈ అంశంపై స్పందించింది.

    ట్రంప్‌, మోదీ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలో ఎలాన్‌ మస్క్ కూడా చేరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన హైలెవల్‌ మీటింగ్‌లో ఎటువంటి అధికార హోదా లేని సభ్యుడు రావడంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఎంత బిలియనీర్‌ అయితే మాత్రం ప్రోటోకాల్‌ పాటించరా అని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

    కాగా తాజాగా దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది. "ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలను మేము గమనిస్తున్నాం. మార్చి 24న జరిగిన ఫోన్‌ సంభాషణ కేవలం ప్రధాని మోదీ, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యే జరిగింది". అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

    కాగా హర్మూజ్ జలసంధి మూసివేతపై ట్రంప్, మోదీ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే  ప్రభుత్వ పరమైన నిర్ణయాల లోపంతో ట్రంప్, మస్క్ మధ్య గతంలో విభేదాలు తలెత్తాయి. దీంతో ట్రంప్‌ని మస్క్‌ బహిరంగంగానే విమర్శించారు. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం హైలెవల్  ఫోన్‌కాల్‌ మీటింగ్‌లో మస్క్‌ చేరాడంటూ వార్తలు రావడం చర్చనీయాంశమైంది.

  • అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది. ఎన్పీటీకి బైబై చెప్పే పక్షంలో ఇరాన్ అణు విధానంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయి. అణుబాంబు ఇరాన్ వద్ద గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా ఎన్పీటీపై ఇరాన్ 1968 జులైలో సంతకం చేసింది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనంటూ ఓ అణ్వస్త్రరహిత దేశంగా అది 1970 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని ధృవీకరించింది కూడా. 

    1967 జనవరి 1 నాటికి అణ్వస్త్రాలను పరీక్షించిన ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలను ఈ ఒప్పందం అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. ఆ ఐదు దేశాలు క్రమంగా నిరాయుధం కావాలని, ఇతర అణ్వస్త్రరహిత దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని లేదా వాటిని సేకరించకూడదని ఎన్పీటీ ఉద్బోధిస్తోంది. ఈ ఒడంబడిక వివక్షాపూరితమని విమర్శకులు వాదిస్తారు. ఎన్పీటీలో 191 దేశాలు పార్టీలుగా ఉన్నాయి. ఆయుధ నియంత్రణలో ఈ ఒప్పందానికి విస్తృత ప్రాముఖ్యం ఉంది. విశేషమేంటంటే... అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఎన్పీటీలో భాగస్వాములు కాదు. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ ఎన్నడూ ‘ఎన్పీటీ కూటమి’లో సభ్యదేశాలుగా చేరనేలేదు. ఉత్తర కొరియా మాత్రం 1985లో సభ్యత్వం స్వీకరించినా 2003లో నిష్క్రమించింది. 

    అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడానికి, అణ్వాయుధాల విస్తరణను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒప్పందాల్లో ఎన్పీటీ ఒకటి. దీని ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అణు పారదర్శకత, కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఎన్పీటీకి ఇరాన్ చెల్లుచీటీ ఇచ్చే పక్షంలో ఆ పరిణామం ప్రపంచ అణు రాజకీయాల్లో ఓ ప్రధాన మలుపు అవుతుంది. ఎన్పీటీ నుంచి బయటికొచ్చేస్తే అణు కార్యక్రమం పరంగా పలు కీలక బాధ్యతల నుంచి ఇరాన్ విముక్తమవుతుంది. అప్పుడిక అణ్వాయుధం తయారుచేయబోమని అది ఎవరికీ ప్రమాణాలు చేయాల్సిన పని లేదు. అంతేకాదు... ఇరాన్ అణుకేంద్రాలపై ఐక్యరాజ్యసమితి కాపలాదారైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణ, నిపుణుల తనిఖీలు కూడా ఉండబోవు! అంటే... ఇరాన్ అణు కార్యకలాపాలు ఇకపై అంతగా ప్రపంచ దేశాల కంటబడవు. 

    అసాధారణ పరిణామాలు తమ మహోన్నత జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడవేశాయని ఏ దేశమైనా భావించినప్పుడు మూడు నెలలు ముందుగా నోటీసు ఇచ్చి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి ఎన్పీటీలోని ‘ఉపసంహరణ క్లాజు’ వీలు కల్పిస్తోంది. ఒప్పందంలో 11 ఆర్టికల్స్ ఉండగా వాటిలో ఒకటి సభ్యత్వ ఉపసంహరణ గురించి వివరిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆరంభమైన గత నెల 28 నుంచి ఇరాన్ పార్లమెంటు ఇప్పటివరకు సమావేశమవలేదు. ఎన్పీటీ ‘ఉపసంహరణ బిల్లు’ను పార్లమెంటుకు సమర్పించారని ఇరాన్ ఎంపీ మాలిక్ షరియతి తాజాగా వెల్లడించారు. 

    అయితే ఆ బిల్లుపై ఎప్పుడు లాంఛనంగా చర్చిస్తారు? అది ఎప్పుడు ఆమోదం పొందుతుంది? వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా నిరోధించాలంటే అణ్వాయుధాలు కలిగివుండటం  అవసరమా? అనే అంశంపై ఇరాన్ అంతర్గతంగా చర్చించింది. తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సైనిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నందున ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఇరాన్ నిరుడే భావించింది. ఒకవైపు పౌర అణు కార్యక్రమానికి కట్టుబడుతూనే సాధ్యమైనంత త్వరగా ఎన్పీటీ నుంచి ఇరాన్ తప్పుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) అనుబంధ తస్నిమ్ వార్తాసంస్థ గురువారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్పీటీకి ఇరాన్ టాటా చెబితే అందరికీ అర్థమయ్యేదొకటే... ఆ దేశానికి అణుబాంబే ముఖ్యమని! అణ్వస్త్రాన్ని తయారుచేయడమే దాని లక్ష్యమని!!
    - జమ్ముల శ్రీకాంత్

  • పిల్లలూ!  ప్రపంచంలో అత్యధిక పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా? అదే అమెరికా. యునైటెడ్‌ స్టేట్స్‌లో సుమారు ఏడు కోట్ల పెంపుడు కుక్కలున్నాయి. అంతేకాదు, ఇక్కడ 7.4 కోట్ల పెంపుడు పిల్లులు ఉన్నాయి. ఆ దేశంలో కుక్కలు పిల్లుల పట్ల ప్రేమను చూపించడంలో వారు ఏమాత్రం వెనుకాడరు. అక్కడి పెంపుడు జంతువుల యజమానులు వాటికి ప్రొఫెషనల్‌ ఫోటోలు తీయిస్తారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. తమ ఇళ్లలో కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేక నివాస స్థలాలను ఏర్పాటు చేస్తారు. యునైటెడ్‌ స్టేట్స్‌లోని సగానికి పైగా కుటుంబాల ఇళ్లలో కనీసం ఒక కుక్క లేదా ఒక పిల్లి ఉంటుంది.

    అమెరికా తర్వాత పెంపుడు జంతువులు అధికంగా ఉన్న దేశంగా చైనా ముందుంది. గత పదేళ్లలో చైనాలో పెంపుడు జంతువుల పరిశ్రమ విపరీతంగా పెరిగింది. 2019లో పెంపుడు జంతువుల పెంపకంలో చైనా కొద్దికాలం యునైటెడ్‌ స్టేట్స్‌ను అధిగమించింది. 

    (రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్‌)

    చైనా జనాభా అమెరికా జనాభా కంటే ఐదు రెట్లు ఎక్కువ. పెంపుడు పిల్లులు ఉన్న దేశాల సంఖ్యలో చైనా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. చైనా సరిహద్దుల్లో సుమారు 5.3 కోట్ల పెంపుడు పిల్లులు ఉన్నాయి. చైనాతోపాటు బ్రెజిల్‌లోనూ పెంపుడు జంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.

    ఇదీ చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో ?

  • టెహ్రాన్: శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని గల్ప్‌ దేశాలను ఇరాన్‌ హెచ్చరించింది. గల్ఫ్‌ గగనతలాలను యూఎస్‌, ఇజ్రాయెల్‌ వినియోగించుకోకుండా నిషేధం విధించాలని.. తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్‌పై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రతను కోరుకుంటే.. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా-ఇజ్రాయెల్‌లు తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా-ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

    ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాం. కానీ మా మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము గట్టిగా సమాధానం ఇస్తాం. గల్ఫ్‌ దేశాలకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు అభివృద్ధి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డల నుండి యుద్ధం చేయనివ్వకండి’’ అంటూ పెజెష్కియాన్ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక "దాగుడు స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' నివేదించింది.

    మరోవైపు, హార్మూజ్‌ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్‌ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్‌ లిస్ట్‌ ఇంటలిజెన్స్‌ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి.  

    ఇరాన్‌ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్‌ ఆఫ్‌ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్‌ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్‌ జనరల్‌ కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్‌లకు కూడా ఇలాగే ఇరాన్‌ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్‌ ఒకటని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే.

  • చదువు పూర్తి అయినా ఉద్యోగాలు దొరక్క యువత నానా పాట్లు పడుతోంది. దీంతో  చైనాలోని "యీయాంగ్ సీనియర్ హౌస్" వినూత్నంగా ఆలోచించింది. ఈ ప్లాన్‌తో చైనాలో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, ఇటు నిరుద్యోగ  యువతకు కూడా భారీ ఉపశమనం లభిస్తోంది. ఏంటా ప్లాన్‌? తెలుసుకోవాలని ఉందా? పదండి మరి,

    చైనాలోని సుజౌ (Suzhou) నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జిన్ (Zhang Jin) అనే యువతి, నేటి తరం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని, ఒంటరితనాన్ని అధిగమించేలా సరికొత్త నిర్ణయం తీసుకని వార్తల్లో నిలిచింది.  నెలకు కేవలం 200 యువాన్ల (సుమారు రూ.2,820) మాత్రమే అద్దె చెల్లిస్తోంది. సాధారణంగా  అక్కడి మార్కెట్‌ ధరలతో పోలిస్తే  దాదాపు 10 రెట్లు తక్కువ. దీనికి  ఆమె చేయాల్సిందల్లా ఏమిటంటే  వృద్ధాశ్రమంలో నివసిస్తూ, అక్కడి వృద్ధులకు తోడుగా ఉండటమే.

    తూర్పు చైనాలోని తూర్పు జియాంగ్జీ ప్రావిన్స్ నుండి కొత్తగా పట్టభద్రురాలైన జాంగ్, అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌకు మారింది.జాంగ్ వారంలో ఐదు రోజులు ఆఫీసుకి  వెళ్తుంది. సాయంత్రం వేళల్లో ,వారాంతాల్లో (Weekends) వృద్ధులతో కలిసి డ్యాన్స్ క్లాసులు, ఇతర యాక్టివిటీస్‌లో పాల్గొంటుంది. తద్వారా తక్కువ అద్దెకు ఇల్లు, పెద్దవారితో అనుబంధంతోపాటు,  మానసిక  ఉల్లాసాన్ని బోనస్‌గా అందుకుంటోంది.

    ఈ ఆశ్రమం స్వచ్ఛంద సేవ కోసం దరఖాస్తు చేసుకునే వారు 35 ఏళ్లలోపు వారై ఉండాలి, నగరంలో సొంత ఇల్లు ఉండకూడదు . పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రతి మూడు నెలలకు కనీసం 45 గంటల పాటు వృద్ధులకు సేవ చేయాల్సి ఉంటుంది. 

    పెద్దలతో ఆత్మీయ అనుబంధం
    ఈ క్రమంలో ఆశ్రమంలోని పెద్దవాళ్లతో యువతకు అనుబంధం, ఇటు వృద్ధులకు కూడా మంచి కాలక్షేపం  తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా అంటుంది జాంగ్‌.  ఆశ్రమంలో ఆమెకు 89 ఏళ్ల వృద్ధుడిని పార్ట్నర్‌గా కేటాయించారు. ఆయన ఆమెను తన సొంత మనవరాలిలా చూసుకుంటారు. ఒకసారి జాంగ్ అనారోగ్యానికి గురైతై, ఆయన తెల్లవారుజామున 5 గంటలకే లేచి ఆమె కోసం వేడి  వేడి  సూప్ తయారు చేసి ఇచ్చారట. "ఈ నగరంలో నాకు ఎవరూ తెలియదు. కానీ ఈ ఆశ్రమం నాకు సొంత ఇల్లులా అనిపిస్తోంది. ఇక్కడ నాకు లభించే ప్రేమాభిమానాలు నా ఒత్తిడిని తగ్గిస్తున్నాయి," అంటుంది సంతోషంగా.

    ఇదీ చదవండి: ఆలయంలో ప్రీ-వెడ్డింగ్‌ షూట్‌ వివాదం : కెమెరామెన్లపై దాడి

    ఎందుకు ఈ నిర్ణయం?
    చైనాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా మరియు యువతపై ఉన్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ "యీయాంగ్ సీనియర్ హౌస్" (Yiyang Senior House) ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనివల్ల యువతకు అద్దె భారం తగ్గుతుంది. వృద్ధులకు ఒంటరితనం పోయి కొత్త ఉత్సాహం లభిస్తుంది. అలాగే నగరంలో ఒంటరిగా ఉండే యువతకు ఒక కుటుంబం దొరికినట్లు అవుతుంది.ప్రస్తుతం ఆ ఆశ్రమంలో ఉన్న ఏకైక వాలంటీర్ జాంగ్ మాత్రమే (మిగిలిన వారు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు). అందుకే యాజమాన్యం మరికొంత మంది వాలంటీర్లను చేర్చుకోవాలని భావిస్తోంది.

    ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

Movies

  • ఈ సీక్వెల్, పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌కి రాజమౌళి ఓ రకంగా ఆద్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి'తో భారతీయ దర్శకుల్ని ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ పెట్టి సరైన కంటెంట్ వదిలితే.. వందల వేల కోట్ల వసూళ్లు సాధించొచ్చని చూపించాడు. ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ పాతబడిపోయింది. పుష్ప 2, ధురంధర్ 2 లాంటివి ఒకటో రెండో మాత్రమే బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఈ ట్రెండ్ షురూ చేసిన రాజమౌళి కూడా దీని నుంచి దూరంగా జరగాలనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మనసు మారిపోయినట్లు తెలుస్తోంది.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

    రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా 'వారణాసి' చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కూడా. సాధారణంగా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ చేస్తారు. రాజమౌళి మాత్రం తన సంప్రదాయానికి భిన్నంగా హాలీవుడ్‌కి చెందిన పలు మీడియా సంస్థలకు తన టీమ్‌తో కలిసి ఈ పాటికే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులోనే 'వారణాసి' ఒకే సినిమాగా రాబోతుందని రాజమౌళి బల్లగుద్ది చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మారినట్లు అనిపిస్తుంది.

    దాదాపు ఏడున్నర గంటల నిడివి ఉన్నా సరే 'ధురంధర్' రెండు భాగాల్ని ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్‌గా రిలీజైన సీక్వెల్‌కి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇదంతా చూసిన రాజమౌళి.. 'వారణాసి'ని కూడా రెండు భాగాలుగా తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. ఎందుకంటే త్రేతా యుగంలోని రాముడు నుంచి వర్తమాన,భవిష్యత్ కాలాల వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇదివరకే రిలీజ్ చేసిన వీడియోతో ఆ క్లారిటీ ఇచ్చారు. దీన్నంతటినీ ఒకే భాగంలో చూపించే బదులు రెండు భాగాల్లో చూపిస్తే ఎలా ఉంటుందా అని జక్కన్న ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే.

    'ధురంధర్' రెండు భాగాల్ని కేవలం మూడు నెలల వ్యవధిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామనుకుంటే ఇలా మూడు నాలుగు నెలల గ్యాప్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తే బెటర్. లేదంటే ఆడియెన్స్  డిసప్పాయింట్ అయ్యే అవకాశముంది. చూడాలి మరి ఏం చేస్తారో?

    (ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్)

  • అనిరుధ్‌తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

    ఇప్పటివరకు సింగర్‌గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?

    (ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్)

  • టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌-అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. చిన్నారి ఫోటోని రివీల్‌ చేయలేదు కానీ.. పేరుని మాత్రం వెల్లడించారు. అతనికి ‘ఇషాన్‌ కార్తీక్‌’ అనే పేరు పెట్టారు.  ఈషాన్‌ అంటే శివుడు, కార్తీక్‌ అంటే.. కార్తీకేయ స్వామి. ఇలా ఇద్దరి దేవుళ్ల పేర్లు కలిసేలా తమ కొడుకు పేరును పెట్టుకున్నారు. 

    శివుడితో పాటు కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ అని పేరు పెట్టామని ఆది సాయికుమార్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఆది సాయికుమార్‌, అరుణల పెళ్లి 2014లో జరిగింది. అరుణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇప్పటికే  ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది జనవరి 2న పండంటి బాబుకు జన్మనిచ్చారు.

    ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘శంబాల’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈగో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

  • నీలి రంగు చీరలో మెరిసిపోతున్న నిధి 

    కాశీలో పాన్ తింటూ ఎంజాయ్ చేస్తున్న రష్మి

    తల్లి అయినా సరే కియారా అడ్వాణీ తగ్గేదే లే

    యువరాణిలా ఆకట్టుకునేలా నభా నటేశ్

    క్యూట్‌గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ సుప్రీత

    సిల్క్ చీరలో మాయ చేస్తున్న శ్రుతి హాసన్

  • ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్‌ మాత్రం ఈ మూవీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు. హింసను ప్రేరేపించేలా సినిమాను తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సినిమాలను వాడుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

    శ్రీలంక సివిల్‌ వార్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న'నీలిర' సినిమా ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌లో వెట్రిమారన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం ఒక జాతిని, ఒక మతాన్ని కానీ  అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ అన్నారు. 

    ఇంకా మాట్లాడుతూ..‘ఈ రోజుల్లో ప్రతీది  ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’అని  వెంట్రిమారన్‌ విమర్శించాడు.

    కాగా, ధురంధర్‌ 2 చిత్రంలో 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూపించారు. వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నోట్ల రద్దు కారణంగా దేశంలో చిన్న వ్యాపారాలు అన్ని మూతబడ్డాయి. కొంతమంది  డబ్బుల కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్‌లో నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.  రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. 

    అయితే ఇదే విష‌యాన్ని వెట్రిమార‌న్ ప్ర‌స్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వెంట్రిమారన్‌ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధురంధర్‌ 2 గురించే ఆయన మాట్లాడారంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

  • అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

    (ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)

    'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

    (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)

  • హీరోయిన్‌గా అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలు చేసిన రాధిక.. ప్రస్తుతం టీవీ షోలు, అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. తెలుగులోనూ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్న ఈమె.. రీసెంట్‌గా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా అనిపించాయి. బన్నీకి డ్యాన్స్ నేర్పింది నేనే అని అనేసరికి అతడి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఓ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షోలో రాధిక ఈ వ్యాఖ్యలు చేశారు.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్)

    ఆట డ్యాన్స్ షోలో ప్రీతి అనే కంటెస్టెంట్.. 'పుష్ప 2'లోని జాతర పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ క్రమంలోనే సదరు కంటెస్టెంట్‌ని పొగిడిన జడ్జి రాధిక.. అల్లు అర్జున్ ఇంత గొప్ప డ్యాన్సర్ కావడానికి నేనే కారణం అని చమత్కరించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో గతంలో తాను ఓ సినిమా చేశానని, అప్పుడు షూటింగ్ సందర్భంగా బన్నీకి డ్యాన్స్ నేర్పించానని గుర్తుచేసుకుంది. అలానే సమయానికి చిన్న పిల్లాడు ఎవరూ లేకపోవడంతో బన్నీ తనతో పాటు ఓ సీన్‌లో కలిసి నటించాడని, ఇందులో భాగంగా అల్లు అర్జున్‌ని ఎత్తుకుని రైల్వే ట్రాక్‌పై పరుగెత్తిన విషయాన్ని రాధిక గుర్తుచేసుకుంది. ఈ విషయాలన్నీ రాధిక చెబుతున్న ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    రాధిక ఈ కామెంట్స్ ఫన్నీగానే చేశారు. నెటిజన్లు కూడా అంతే సరదాగా రియాక్ట్ అవుతున్నారు. బన్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా అని మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప, పుష్ప 2 చిత్రాలు ఇతడి స్థాయిని పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లతో మూవీస్ చేస్తున్నాడు. వీటిపై బోలెడంత బజ్ ఉంది. 

    (ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)

  • క్రిష్, వార్ 2 తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. గత నాలుగేళ్లుగా షబా ఆజాద్ అనే నటి, సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. గతంలో సుస్సానే ఖాన్‌ని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెకు విడాకులు ఇచ్చేసి షబాతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈమెకు భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. స్వయంగా దాని గురించి ఈమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్‌.. వ్యక్తిపై కేసు)

    'సైక్లోస్పోరా కయోటానెన్సిస్' అనే పారాసైట్(పరాన్నజీవి) వల్ల కలిగే వ్యాధిని 'సైక్లోస్పోరియాసిస్' అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అవుతుంది. షబా అజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులు తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని చెప్పుకొచ్చింది. రోజుకు రెండుసార్లు జిమ్‌లో వర్కౌట్లు చేసే తాను.. ఇప్పుడు కనీసం టూత్ పిక్ ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్నిబట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.

    ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనకున్న కారణం తెలిసి షబా షాకయ్యింది. ఎప్పుడూ ఇంటిలో వండిందే తింటానని, బయటకెళ్లినా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్తానని, ఇంత శుభ్రత పాటించినా ఈ పరాన్నజీవి తన శరీరంలోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పింది. మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలని చెప్పుకొచ్చింది. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ కష్టకాలంలో హృతిక్ రోషన్(ప్రియుడు) తనకు కొండంత అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. నా మూడ్ ఎంత బాగోలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని, ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోని షబా షేర్ చేసింది.

    (ఇదీ చదవండి: 'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్‌డేట్)

  • 'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్‌గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.

    (ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్‌కి అర్థం కావట్లేదు!)

    హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

    ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ‍ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.

    (ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్‌.. వ్యక్తిపై కేసు)

  • హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను ఓ వ్యక్తి ‘ఎక్స్‌’లో చిరంజీవి అభిమానులు ఆందోళన చెందేవిధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలో నివసించే గూడెపు భాస్కర్‌సాయి (22) ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ‘ఎక్స్‌’లో చిరంజీవి ఫొటోను ఆయన మరణించినట్లు భావించే విధంగా పోస్ట్‌ చేశాడు. 

    ఈ విషయం గమనించిన భాస్కర్‌ సదరు సూరిబాబుకు ఫోన్‌ చేసి ఆ ఫొటోను, పోస్ట్‌ను తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్ట్‌ను అలాగే కొనసాగించాడు. ఈ ఫొటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురికావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్‌ ఉందని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

  • విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకునే నటుడు ఫహద్‌ ఫాజిల్‌. ఈ మలయాళ నటుడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన  ‘డోన్ట్ ట్ర‌బుల్ ద ట్ర‌బుల్‌’ మినహా..తెలుగులో ఇంకో చిత్రమేది చేయడం లేదు. తెలుగులోని బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నా.. ఒక్క ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు. దానికి కారణం రెమ్యునరేషన్‌.

    తెలుగు సినిమాలో విలన్‌గా నటించడానికి భారీ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్‌గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్‌ పెడుతున్నారట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అందుకే ఫహద్‌కు టాలీవుడ్‌లో అవకాశాలు రావడం లేదు.

    అనిల్‌ రావిపూడి తెరకెక్కించే కొత్త సినిమాలో వెంకటేశ్‌తో పాటు ఫహద్‌ని కూడా అనుకున్నాడట. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్‌ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్‌ రామ్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్‌ సినిమాలోనూ విలన్‌గా ఫహద్‌నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. ఫహద్‌ని తీసుకుంటే మలయాళంతో పాటు పాన్‌ ఇండియా మార్కెట్‌కి కూడా ప్లస్‌ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. 

    అయితే భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో.. అంత ఇచ్చుకోలేక ఇతర నటులవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు ఫహద్‌ కూడా రొటీన్‌ విలన్‌ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదట. తనకు గుర్తింపు తెచ్చేలా ఉంటేనే ఆ పాత్రలో నటించేందుకు ముందుకు వస్తున్నాడట. లేదంటే హీరోగా సినిమాలు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారట. విలన్‌ కంటే హీరో పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

  • మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. 

    మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600 మంది తెలుగు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

    ముఖ్యఅతిథి పోలీస్ కమిషనర్ విజయరావు మాట్లాడుతూ మన తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గాధను మన్యం ధీరుడు పేరును తరికెక్కిచ్చిన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఆర్ వి వి సత్యనారాయణకు ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సినిమాలో దేశభక్తిని చాటుతూ ఒక దేశభక్తి గీతాన్ని ఆలపించి ఆ గీతం భారతదేశంలో ప్రతి పౌరుడు ఆలపించే విధంగా ఆ పాటను తీర్చిదిద్దారు ఆర్ వి సత్యనారాయణ గారు అని కొనియాడారు.

Business

  • చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.

    బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్‌పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.

    ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

    బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్‌తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఉన్నాయి.

  • బంగారం ధరలు ఈ నెల ప్రారంభం నుంచి బాగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. గత రెండు రోజులుగా పెరుగుతున్నాయి. గత ఆదివారం (మార్చి 22) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు రూ.1,48,090 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారంలో ఎంతలా మారిపోయాయి అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో ఈ వారం.. గోల్డ్ రేట్లు ఇలా పెరిగాయనే వివరాలు తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో మార్చి 22న (ఆదివారం) 1,45,970 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్.. ఈ రోజుకు (శనివారం) రూ.1,48,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,800 రూపాయల నుంచి 135750 రూపాయల వద్దకు చేరింది. వారం రోజుల్లో పసిడి ధర గణనీయంగా పెరిగినట్లు పరిస్థితులు చెబుతున్నాయి.

    చెన్నైలో గత ఆదివారం (మార్చి 22) 1,45,850 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజుకు (మార్చి 28) రూ. 1,49,020 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,36,200 రూపాయల దగ్గర నుంచి 1,36,600 రూపాయల వద్దకు చేరింది.

    ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. మార్చి 22న 1,46,120 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు ఈ రోజుకి (శనివారం) 1,48,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,33,950 రూపాయల దగ్గర నుంచి రూ. 1,35,900 వద్దకు చేరింది.

    వెండి ధరలు
    వెండి విషయానికి వస్తే.. కేజీ వెండి రేటు గత ఆదివారం ఎలా ఉందో (రూ.2.5 లక్షలు), శనివారం నాటికి (రూ.2.5 లక్షలు) అదే మార్క్ దగ్గర ఉంది. అయితే వారం మధ్యలో ధరల్లో మార్పులు సంభవించినప్పటికీ.. చివరికి రూ.2.5 లక్షల వద్దనే నిలిచింది.

    ఇదీ చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌లో సగం సెలవులే!

  • మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.

    ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
    ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
    ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
    ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్‌కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
    ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.
    ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)
    ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)

    అందుబాటులో ఆన్‌లైన్ సేవలు
    బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు చేసుకోవచ్చు.

  • కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.

    2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.

    కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.

    ఏప్రిల్ 1 నుంచి.. ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్ 2025
    భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.

    కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.

    మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.

    ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!

  • ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.

    నివేదికలోని ముఖ్యాంశాలు
    భారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్‌ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.

    రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.

    లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.

    వ్యూహం మారింది..
    గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.

    తగ్గిన చమరు ఆదాయం 
    అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.

    ప్రపంచంలో ఐదో స్థానం
    వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.

    ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం
    యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. 
    నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.
    పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
    బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.

    ఉక్రెయిన్‌తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • ఇప్పటికే చాలామంది సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ముంబైలో ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టీమిండియా క్రికెటర్ 'శుభ్‌మన్ గిల్' కూడా చేరారు.

    శుభ్‌మన్ గిల్.. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. ఈ అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.20.7 కోట్లు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ ఫ్లాట్‌ను పూజా లీజర్ అండ్ లైఫ్‌స్టైల్ అనే సంస్థ నుంచి కొనుగోలు చేశారు.

    శుభ్‌మన్ గిల్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్‌మెంట్.. ముంబైలోని జుహూ తారా రోడ్డుపై ఉన్న పూజా ల్యూమినేర్ అనే భవనంలో 12వ అంతస్తులో ఉంది. గిల్ ఈ 12వ అంతస్తు మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 3,369 చదరపు అడుగులు. ఈ లావాదేవీ కోసం రూ.1.24 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు మార్చి 26, 2026న జరిగింది. మహారాష్ట్ర RERA వివరాల ప్రకారం.. ఈ భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. 2029 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది.

    ముంబైలో ఇతర క్రికెటర్ల అపార్ట్‌మెంట్స్
    ఇటీవల కాలంలో భారత క్రికెటర్లు ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం గమనించదగ్గ విషయం. ఇందులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.

    👉సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా యాదవ్ ముంబైలోని డియోనార్ ప్రాంతంలో రూ.7.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
    👉రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ ప్రాభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నారు.
    👉జహీర్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ.11 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

  • భారతదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే.. తెల్లవార్లు కోడింగ్, అర్ధరాత్రి వరకు మీటింగ్స్, వీకెండ్స్‌లో కూడా ఆఫీస్ కాల్స్. కానీ, అదే వృత్తిలో ఉంటూ స్వీడన్‌లో స్థిరపడిన ఓ భారతీయ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. "నిజంగా ఆఫీసులు ఇలా కూడా ఉంటాయా?" అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

    వైరల్ వీడియోలో ఏముంది?
    స్వీడన్‌లో టెక్నాలజీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న స్వాతి అనే యువతి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం.. ఆమె పనిచేసే ఆఫీసులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందరూ తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ కార్యాలయాన్ని చూపిస్తూ, అక్కడి పని సంస్కృతి గురించి ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

    పని కంటే మనిషికే ప్రాధాన్యం!
    స్వీడన్ కార్యాలయాల్లో అనుసరించే విధానాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయని స్వాతి పేర్కొన్నారు. అక్కడ పని గంటల కంటే నాణ్యతకే పెద్దపీట వేస్తారు. ఆఫీసులో ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, చేసిన పనిలో ఎంత క్వాలిటీ ఉందన్నదే అక్కడ ముఖ్యం.

    వ్యక్తిగత సమయం: ఉద్యోగులు ఆలస్యంగా ఉండాలని గానీ, వారాంతాల్లో పనిచేయాలని గానీ అక్కడి కంపెనీలు కోరుకోవు. పని ముగిశాక మిగిలిన సమయం పూర్తిగా వారి వ్యక్తిగత జీవితానికే (Work-Life Balance).

    కుటుంబానికి ప్రాముఖ్యత: కుటుంబంతో గడపడం, సొంత అభిరుచులను (Hobbies) కొనసాగించడం వల్ల ఉద్యోగులు మానసిక ప్రశాంతతతో ఉంటారని, అది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని స్వీడన్ యాజమాన్యాలు నమ్ముతాయి.

    నెటిజన్ల రియాక్షన్ 
    వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "భారతదేశంలో రాత్రి 9 గంటలైనా ఆఫీసు లైట్లు ఆరవు, ఇలాంటి వాతావరణం మాకెప్పుడు వస్తుందో?" అని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. "అందుకే విదేశాల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వ్యక్తిగత శ్రేయస్సు (Well-being), వృత్తిపరమైన బాధ్యతల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ వీడియో మరోసారి పెద్ద చర్చకే దారితీసింది.

  • యాపిల్ కంపెనీ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం.. భారతదేశంలో ఐఫోన్ ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో పాత మోడల్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 15 కొనాలనుకునే వినియోగదారులకు ఇది కొంత భారంగా మారనుంది.

    డిమాండ్ జనరేషన్ (DG) సపోర్ట్ అందుబాటులో ఉన్నప్పుడు.. దీని ద్వారా యాపిల్ తన రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని రాయితీలు (ఇన్సెంటివ్‌లు) ఇస్తుంది. ఈ ఇన్సెంటివ్‌ల వల్ల రిటైలర్లు ఫోన్లను తక్కువ ధరకు అమ్మగలిగేవారు. అంటే.. ఫోన్ అధికారిక ధర (MRP) మారకపోయినా, వినియోగదారులకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ DG సపోర్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.

    కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల.. రిటైలర్లు ఇకపై అంతటి తగ్గింపులు ఇవ్వలేరు. అందువల్ల.. వినియోగదారులు అదే ఫోన్ కొనడానికి సుమారు రూ.5,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా కొంచెం పాత మోడళ్లను.. తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ప్రభావం చూపుతుంది.

    ఇది మాత్రమే కాకుండా.. యాపిల్ ముందుగా ఇచ్చిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా గణనీయంగా తగ్గించింది. గతంలో రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తే, ఇప్పుడు అది కేవలం రూ.1,000కు తగ్గింది. దీంతో కొత్త మోడళ్లైన iPhone 17 సిరీస్ కూడా వినియోగదారులకు కొంత ఖరీదైనదిగా అనిపిస్తోంది. అయితే, ఈ DG సపోర్ట్ తొలగింపు కొత్త iPhone 17 మోడళ్లకు వర్తించదు. ఇది ప్రధానంగా పాత మోడళ్లకే పరిమితం.

    ఇదీ చదవండి: అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర!

  • హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన వెన్యూ ధరలను పెంచింది. పెంచిన ధరలు పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ.20000 వరకు పెరిగింది. దీంతో ధరలు శ్రేణి రూ. 7.99 లక్షల నుంచి రూ. 15.51 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.

    పెట్రోల్ వేరియంట్స్
    హ్యుందాయ్ కంపెనీ అత్యధికంగా 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ఇంజన్ ఎంపికలో లభించే HX5 ట్రిమ్‌ వేరియంట్ ధరలను రూ.20000 పెంచింది. కాబట్టి ఈ వేరియంట్ ధర రూ. 9.55 లక్షలకు చేరింది. బేస్ మోడల్ ధర రూ.8.00 లక్షల వద్ద ఉంది. అయితే ఇక HX5+, HX6T వంటి వేరియంట్స్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

    1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ DCT వేరియంట్స్ ధరలు స్వల్పంగా పెరిగాయి. HX5 DCT ధర రూ. 10.90 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX6 DCT ధర రూ. 12.16 లక్షలు (రూ. 9,000 పెరిగింది), HX8 DCT ధర రూ. 12.99 లక్షలు (రూ. 5,000 పెరిగింది). బేస్ మోడల్ HX2 టర్బో ధర రూ. 8.89 లక్షల వద్ద ఉంది. అయితే ఎన్ లైన్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

    డీజిల్ వేరియంట్స్
    1.5-లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 8,000 పెరిగాయి. దీంతో HX2 ధర ఇప్పుడు రూ. 9.87 లక్షలు, HX5 రూ. 10.87 లక్షలు, HX5 AT రూ. 11.81 లక్షలు, HX7 రూ. 12.69 లక్షలు వద్దకు చేరాయి. టాప్-ఎండ్ HX8 AT, HX10 AT ధరలు వరుసగా రూ. 13.69 లక్షలు, రూ. 15.51 లక్షలుగా ఉన్నాయి.

    కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన హ్యుందాయ్ వెన్యూ ధరలు పెరగడం అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆన్-రోడ్ ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా, పన్నులు, బీమా కారణంగా నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

  • మొబైల్‌ రీచార్జ్‌కు సంబంధించి సాధారణంగా మంత్లీ రీచార్జ్‌ ప్లాన్లు అంటే 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంటాయి. కానీ నెలంతటికీ అంటే 30 రోజులూ వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియోలో రెండు చౌకైన రీచార్జ్‌ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.  వీటిలో నెలకు సరిపడా డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు కళ్లు చెదిరే అదనపు బెనిఫిట్స్, ముఖ్యంగా ఏఐ (AI) ప్రియుల కోసం ఈ ప్లాన్‌లో భారీ ఆఫర్లను చేర్చింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

    జియో రూ. 365 ప్లాన్
    జియో తన వెబ్‌సైట్, యాప్‌లో రూ. 365 ధరతో కూడిన ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్‌లకు భిన్నంగా ఇది పూర్తి 30 రోజుల కాలపరిమితితో వస్తుంది.

    ప్రయోజనాలు
    డేటా: మొత్తం 25 GB హై-స్పీడ్ డేటా
    కాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.
    SMS: రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.
    టాక్ టైమ్: అదనంగా రూ. 7.47 విలువైన టాక్ టైమ్ లభిస్తుంది.

    ఈ ప్లాన్ కేవలం డేటాకే పరిమితం కాకుండా, భారీ సబ్-స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తోంది. రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్-స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 2000 GB క్లౌడ్ స్టోరేజ్, అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటాయి. (గమనిక: ఈ బెనిఫిట్ కొనసాగాలంటే రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉండాలి).

    డిస్నీ+ హాట్‌స్టార్: 3 నెలల పాటు మొబైల్/టీవీ సబ్-స్క్రిప్షన్.
    జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud): 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.
    ఇతర యాప్‌లు: జియో టీవీ, జియో సినిమా సబ్-స్క్రిప్షన్లు.

    రూ. 355 'ఫ్రీడమ్ ప్లాన్'

    దాదాపు ఇవే ప్రయోజనాలతో జియో రూ. 355 కేటగిరీలో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది కూడా 30 రోజుల వ్యాలిడిటీ, 25 GB డేటా, అపరిమిత కాలింగ్ , పైన పేర్కొన్న ఏఐ (AI), ఓటీటీ సబ్-స్క్రిప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులో అదనంగా నానో బనానా వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    ఈ రూ. 365 ప్లాన్‌లో అపరిమిత 5G డేటా గురించి జియో అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం 4G డేటా వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

Telangana

  • సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది. గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా ఈ వేడుకకు హాజరై సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.

    భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారి వచ్చిన తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛం అందజేసి గవర్నర్ స్వాగతం పలికారు.

    భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించిన గవర్నర్
    గవర్నర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రాచలంలో భద్రగిరి మార్ట్‌ను గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. మార్ట్‌లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్‌లు  గవర్నర్‌కు వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించి, పలు ఉత్పత్తులను గవర్నర్ దంపతులు కొనుగోలు చేశారు.

     

  • ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్‌) లేఖ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని రాహుల్‌గాంధీకి ఆయన లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలనిపార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్‌లకు లేఖలు రాసినట్లు వీహెచ్‌ తెలిపారు.

    ‘‘రాహుల్ గాంధీ బీసీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందినా.. పొందకపోయినా బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టాలని కోరా. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం అవుతుంది. మోదీ బీసీ అయినా బీసీలకు న్యాయం చేయడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జంతర్ మంతర్‌లో ధర్నా కూడా చేశాము. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో శ్రీరాముని కళ్యాణం జరపాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కోరుతాను’’ అని వీహెచ్‌ తెలిపారు.

  • కరీంనగర్‌: ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 13 మందిని రిమాండ్‌కు ఇవ్వాలన్న అభ్యర్ధనను కరీంనగర్‌ కోర్టు తిరస్కరించింది. వారిని రిమాండ్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని, స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని సీపీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు లేకుండా అక్రమాలు జరిగాయని ఎలా నిర్దారిస్తారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. 

    స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని సీపీకి సూచించింది. దాంతో ఈ కేసులో అరెస్టైన 13 మందికి స్టేషన్‌ బెయిల్‌ లభించింది. సొంత పూచీకత్తుపై 13 మందికి బెయిల్‌ మంజూరు చేశారు.

    కాగా, కరీంనగర్‌ ఆర్బీఎల్ బ్యాంకులో నిన్న(శుక్రవారం, మార్చి 27వ తేదీ) భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 130 కోట్ల కుంభకోణం జరిగినట్లు సమాచారం. నకిలీ ఖాతాలు తెరిచి, మ్యూల్‌ ఖాతాలో డబ్బులు మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది.  సైబర్‌ క్రైమ్‌​, హవాలా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

    ఈ కుంభకోణం ఘటనకు సంబంధించి 13 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో ఆర్బీఎల్‌ కిసాన్‌ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌తో పాటు ఇతర ఉద్యోగులు, కొందరు మధ్యవర్తులు ఉన్నట్లు సమాచారం.

  • సాక్షి, హైదరాబాద్‌: కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని  అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), గుడిమల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కేడీ కాలనీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ బేకరీ తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు. భారీ మొత్తంలో నిల్వ ఉంచిన బేకరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

    రూ.12,54,280 విలువైన ముడి పదార్థాలు, యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు.  తయారు చేసిన బిస్కెట్లు (ఉస్మానియా, కాజు, చాయ్, ఫ్యాన్ బిస్కెట్లు), రస్కులు, బటర్ బన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ రజా లైసెన్స్ లేకుండా.. అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్‌లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

     

  • సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో బెట్టింగ్ ముఠాలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.  క్రికెట్ క్రీడను జూదంగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గతంలో చేపట్టిన #SayNoToBettingApps ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందన..  తద్వారా కేంద్ర ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించడమే కాకుండా కఠినమైన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కూడా తీసుకువస్తోందన్నారు

    అయితే ప్రస్తుతం ఈ వంచన కొత్త రూపం దాల్చిందని.. యాప్‌లు పోయినా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త వెబ్‌సైట్లను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం ఆన్‌లైన్ మాత్రమే కాకుండా, నివాస గృహాలు, ఫామ్ హౌస్‌లు, ఇతర రహస్య స్థావరాల్లో గుంపులుగా చేరి ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. స్థానిక బుకీలు యువతను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

    తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ చివరికి కన్నీళ్లే మిగిలిస్తుందని, బెట్టింగ్‌లో గెలిచేది కేవలం నిర్వాహకులు మాత్రమేనని, ఆడేవారు సర్వస్వం కోల్పోతారని హెచ్చరించారు. ఒక్కసారి ఈ వ్యసనానికి బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్‌ను ఒక క్రీడగా ఆస్వాదించాలి తప్ప జూదంగా మార్చుకోవద్దని హితవు పలికారు.

    యువతను ఈ బెట్టింగ్ భూతం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని,  పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా మిమ్మల్ని వేధిస్తున్నా వెంటనే డయల్ 100కు గానీ, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 94906 16555కు గానీ సమాచారం అందించాలని కోరారు. 

  • హైదరాబాద్‌:  నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్‌ జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్‌ అంశంపై హరీష్‌రావు మాట్లాడారు. 

    ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలి. నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులతోపాటు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. 

    రెండవసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని క్రషర్ ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ పంపినా చర్యలు లేవు.  నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఊరి తీయండి. మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు క్లస్టర్ లో చిన్న తప్పు జరిగితే రాత్రికి రాత్రే జైల్లో పెట్టారు. 

    మంత్రి పొంగులేటి రాజీనామ చేయాలి
    ‘తప్పులు చేశారు కాబట్టే ముఖ్య నెత సంస్థకు నోటీసులు ఇచ్చారు. ముఖ్య నేత క్లస్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ కు నైతిక బాధ్యత వహిస్తూ  మంత్రిగా పొంగులేటి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు

    హరీష్‌ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు
    అక్రమ మైనింగ్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. హరీష్‌రావు డిమాండ్‌ చేసినట్లు విచారణ చేయిస్తామని, అంతే కానీ స్లీపింగ్‌ రిమార్క్స్‌ చేస్తాం అంటే ఊరుకోమన్నారు. పొంగులేటిపై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. సభ రికార్డుల నుంచి హరీష్ రావు వ్యాఖ్యలను తొలగించాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

    ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..

Family

  • Parenting పిల్లలు చిన్నప్పటినుంచి ధైర్యంగా ఉంటేనే పెద్దయ్యాక వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనగలిగే సత్తా వస్తుంది. సరైన మార్గదర్శకత్వం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం.

    ముందుగా చేయాల్సింది... పిల్లలకు చిన్నప్పటినుంచి అన్నం తినకపోతే బూచాడొచ్చి పట్టుకుపోతాడని  బోదిరించడం మానెయ్యాలి. వారు సాధించిన చిన్న చిన్న విజయాలను సైతం మనం గుర్తించి అభినందించాలి. అలాగే వారు చేసిన తప్పులను విమర్శించకుండా వాటి నుండి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉందని వారికి అర్థమయ్యేలా విడమరచి చెప్పాలి.

    అలాగని పిల్లలు ఏం చేసినా ΄÷గడాలని లేదా వారు ఏం చెప్పినా అంగీకరించాలని కాదు. నిపుణులు సూచించిన కొన్ని మార్గాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించవచ్చు.

    పిల్లలు చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తారు. అందుకే ఇంట్లో సానుకూలమైన వాతావరణం కల్పించాలి. ప్రేమతో... అభిమానంతో పెంచితే వారి ఆత్మవిశ్వాసం మెల్లగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పెరిగిన పిల్లలకి భయాలు తక్కువగా ఉంటాయి.

    పిల్లవాడు ఏదైనా సాధించినప్పుడు అది చిన్న విజయమే అయినా గమనించాలి. నిజాయితీతో పొగడాలి. అలాంటి ప్రశంసలు పిల్లలకు కృషి పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. వారికిచ్చే ప్రశంసలే వారికి టానిక్‌లా పని చేసి మంచి దిశగా నడిపిస్తాయి.
    తప్పులు చేయడం సహజమని, ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేస్తారని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. ఈ మాటలు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తాయి.

    స్వయంగా చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ఉదాహరణకి ఏ వస్త్రాలు వేసుకోవాలి..? ఏ ఆట ఆడాలి వంటి చిన్న విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు పిల్లలు తమపై నమ్మకం పెంచుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.

    పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. రోజూ లాగా లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే... ఏదో జరిగినట్లే. అది మీకు చెప్పాలంటే వారితో మీరు సుతిమెత్తగా మాట్లాడుతూ... దగ్గరకు తీసుకొని... అడగాల్సి ఉంటుంది. వాళ్లు ఏదైనా తప్పు చేస్తే... మీరు దాన్ని సున్నితంగా మందలిస్తూ సరిదిద్దాలే తప్ప... కోపం తెచ్చుకొని కొట్టినా, తిట్టినా వాళ్లలో భయం మరింత పెరిగి... అది మానసికంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. 
    పిల్లలు ఏడుస్తున్నప్పుడో, బాధ పడుతున్నప్పుడో మీరు పక్కనే ఉండి వారు చెప్పేది సహనంతో వినండి.. వారు తమ ఇబ్బందిని ధైర్యంగా చెప్పుకునేలా చెయ్యండి. దాంతో వారిలో భారం దిగి΄ోయి మీరు వారికి రక్షణగా ఉన్నారనే భావనతో ధైర్యం వస్తుంది. 

    పిల్లలు ప్రతీదీ తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. కాబట్టి క్లిష్ట పరిస్థితులలో కూడా పేరెంట్స్‌ ధైర్యంగా ఉంటేనే పిల్లలు కూడా ధైర్యంగా ఉంటారు. అలాగే పిల్లల ముందు ఇతరులను గట్టి గట్టిగా అరవడం, తిట్టడం మంచిది కాదు. అది అది చూసి పిల్లలు భయపడతారు. భయం వారిలో చురుకుదనాన్ని పోగొట్టి... మానసికంగా చాలా ఇబ్బందులు తెస్తుంది. 

    ఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్‌

    చాలా మానసిక సమస్యల్లో తల్లిదండ్రులు వారికి సరిగా అండగా నిలవక΄ోవడం వల్లే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలకు అవసరమైన సమయంలో మీ సాయం అందాలి. మీరు ఎంత చెప్పినా వారిలో ధైర్యం పెరగకపోతే... కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. 

    వారి ప్రతి కదలికలో మీ అండదండలు ఉంటే... ఓ మంచి సిటిజన్‌ను మీరు ఈ ప్రపంచానికి ఇచ్చినట్లు అవుతుంది. పిల్లల దృష్టిలో కూడా మీరు మంచి పేరెంట్స్‌గా నిలుస్తారు. 

    ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

  • శరీర నిర్మాణానికి, కండరాల బలానికి  ప్రోటీన్‌ ఎంతగానో అవసరం. శాకాహారం, మాంసాహారం ఏదైనా సరే, శరీరానికి సరిపడా ప్రోటీన్‌ అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి

     

    • మన శరీరంలోని అవయవాల నిర్మాణానికి ప్రోటీన్‌ ప్రాథమిక పునాది. ఇది దెబ్బతిన్న కణజాలాలను త్వరగా రిపేర్‌ చేయడంలో సహాయపడుతుంది.  ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 
    • ఇది అనవసరమైన ఆకలిని తగ్గించి, క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
    • ఆహారం అరగడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్‌ ఈ ప్రక్రియలో మెటబాలిజం రేటును పెంచి, శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది. 
    • వ్యాయామం లేకపోవడం వల్ల, వయస్సు పెరగడం వల్ల కండరాల క్షీణత జరుగుతుంది. ప్రోటీన్‌ కండరాల ద్రవ్యరాశిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
    • వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. 
    • చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పనీర్, గింజలు, చియా సీడ్స్‌లో ప్రోటీన్‌ సమృద్ధిగా లభిస్తుంది. నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 

    ఇదీ  చదవండి: క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో ?
    రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్‌

  • Shashankasana (Pose of the Moon) యోగాలో చాలా ప్రశాంతతను కలిగించే ఆసనం.‘‘శశాంక’’ అనే సంస్కృత పదానికి చంద్రుడు అని అర్థం. చంద్రుడు శాంతి, చల్లదనం, సమతుల్యతకు ప్రతీక. ఈ ఆసనం కూడా మన శరీరం, మనసుకు అలాంటి శాంతిని ఇస్తుంది. ఈ ఆసనం ప్రత్యేకంగా మెదడు, నాడీవ్యవస్థ, వెన్నెముకకు చాలా ఉపయోగకరం. ఒత్తిడి, టెన్షన్, అలసట తగ్గించడంలో ఇది మంచి యోగాసనం.

    శశాంకాసనం చేసే విధానం.. 
    స్టెప్‌ 1... ముందుగా నేలపై యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చోవాలి. (మోకాళ్లు మడిచి, ΄ాదాలపై కూర్చోవాలి.) స్టెప్‌ 2... వెన్నెముకను సూటిగా ఉంచి, చేతులను మోకాళ్ళపై ఉంచాలి. స్టెప్‌ 3... నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను తలపైకి ఎత్తాలి. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని ముందుకు వంచాలి. స్టెప్‌ 4... చేతులను ముందుకు చాపి, నుదుటిని నేలకు తాకేలా వంచాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మళ్లీ నెమ్మదిగా పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి. ఇదే విధంగా 3 నుంచి 5 సార్లు సాధన చేయాలి.

    ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

    జాగ్రత్తలు..
    మోకాళ్ల నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. వెన్నెముకకు తీవ్రమైన సమస్యలు ఉన్నవారు యోగా గురువు సలహాతో చేయాలి. హై బీపీ లేదా తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువసేపు వంగి ఉండకూడదు. ఆసనం వేస్తూ శ్వాసను బలవంతంగా ఆపకూడదు. ఖాళీ కడుపుతో చేయడం మంచిది. శశాంకాసనాన్ని  ప్రాణాయామం లేదా ధ్యానం ముందు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది.
    -పాతర్ల అనిత, యోగా ట్రైనర్‌

    ఇదీ చదవడి: గ్రేట్‌ ప్లాన్‌ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు

  •  Hot Summer రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయితే, కేవలం నీటి రూపంలోనే కాకుండా, మనం తినే ఆహారం ద్వారా కూడా శరీరానికి అవసరమైన తేమను అందించవచ్చు. దీన్నే నీటిని తినండి (ఈట్‌ యువర్‌ వాటర్‌) అని అంటుంటారు. 

    ముఖ్యంగా వేసవి కాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

    • దోసకాయలో 97శాతం నీరు ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 
    • సలాడ్లలో ఎక్కువగా వాడే లెట్యూస్‌ శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో 95% నీరుంటుంది
    • టమాటాల్లో 94% నీటితో పాటు లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. 
    • పుచ్చకాయలో 92% నీరుంటుంది. ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌– ఇ లు సమృద్ధిగా ఉంటాయి. 
    • స్ట్రాబెర్రీలు రుచికరంగా ఉండటమే కాకుండా, 90% నీటిని కలిగి, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌– ఇ ని కలిగి ఉంటాయి. 
    • పియర్స్‌లో 83% నీరు ఉంటుంది. వీటిల్లో ఫైబర్, నీరు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
    • అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటమే కాకుండా, తగినంత నీటి శాతం (73%) కూడా ఉంటుంది. 

    ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

    కేవలం దాహం వేసినప్పుడే నీరు తాగడం కాకుండా, ఈ పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా, ఉత్సాహంగా ఉంటుంది.

    ఇదీ చదవండి: గ్రేట్‌ ప్లాన్‌ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు


     

  • ఈ అందమైన పులిని చూసారా? దీని పేరు ‘అవా’. ఇప్పుడు ఇది సోషల్‌ మీడియా స్టార్‌. థాయిలాండ్‌లోని ‘చియాంగ్‌ మై నైట్‌ సఫారి’లో ఉన్న ఒక అరుదైన పులి ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం అవుతోంది. దాని అందమైన రూపాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ‘అవా’ అనే మూడేళ్ళ ఈ బంగారు వర్ణం పులిని అందరూ ‘స్ట్రాబెర్రీ టైగర్‌’ అని ముద్దుగా పిలుస్తున్నారు. పులులు సాధారణంగా నారింజ, నలుపు గీతల్లో ఉంటాయి. ఇది అలా లేదు. తన క్యూట్‌ లుక్‌ తో సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయింది. చాలా మంది అవాను తమ జీవితంలో చూసిన అత్యంత అందమైన జంతువుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు.

    అవా ఫిబ్రవరి 16, 2021న తన సోదరి లూనాతో కలిసి జన్మించింది. అవా తల్లిదండ్రులను కొన్ని సంవత్సరాల క్రితం వేర్వేరు దేశాల నుండి ఈ సఫారి పార్క్‌కు తీసుకువచ్చారు. వాటి జన్యు నిర్మాణం (జెనెటిక్‌ మేకప్‌) అవాకు వచ్చిన ప్రత్యేకమైన గోల్డెన్‌ రంగుకు కారణంగా భావిస్తున్నారు.  నిపుణుల ప్రకారం, గోల్డెన్‌ పులులు వైట్‌ టైగర్ల కంటే కూడా అరుదైనవి.

    చియాంగ్‌ మై నైట్‌ సఫారి సందర్శించిన వారు సోషల్‌ మీడియాలో అవాను చాలా ఆటపాటలతో ఉండే, స్నేహపూర్వక పులిగా వర్ణించారు. దాని మృదువైన రూపం వల్ల పర్యాటకులకు దాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరు ఈ పులిని చూసి ‘‘ఇది పులి కంటే ఒక పెంపుడు పిల్లిలా కనిపిస్తోంది’’ అని సరదాగా అన్నారు. మరికొందరు ఇంత అందమైన పులి నిజంగా ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

Politics

  • కాకినాడ:  పదకొండేళ్ల క్రితం హైదరాబాద్‌ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. 

    మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. 

    రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.

    అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?
    రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్‌ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్‌లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్‌లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు.

  • సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

    ‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్‌ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.

    ‘‘వైఎస్‌ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్‌ జగన్‌కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం  పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్‌ చేశారు.

    2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
  • విశాఖ:  అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విశాఖ నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కేకేరాజు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా  వైఎస్‌ జగన్‌ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేకే రాజు ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని వైఎస్‌ జగన్‌ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే  వ్యతిరేకించారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. 

    అమరావతిని  వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ జరుగుతోంది. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారు. అమరావతి పేరు చెప్పి చంద్రబాబు రూ. 50 వేల కోట్లు తెచ్చారు. చంద్రబాబు కరకట్ట మీద తన నివాసానికి తప్ప అమరావతిలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు.

    సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొండ పోరంబోకు, స్థానిక సంస్థల భూములు విద్యా సంస్థలకు ఇవ్వకూడదని తీర్పు ఉంది. ఆక్రమించిన భూమిలో గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపడుతోంది. కూటమి పాలనలో విశాఖలో జరిగిన భూ కేటాయింపుపై సీబీఐ విచారణ జరిపించాలి. జోడుగుళ్ళ పాలెంలో రూ. 50 కోట్లు విలువ చేసే 84 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను పార్కులను కూటమి నేతలు కబ్జా చేస్తున్నారు.’ అని మండిపడ్దారు.

    అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
  • చెన్నై: వచ్చే నెలలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార డీఎంకే పార్టీ- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఈ మేరకు డీఎంకేతో జట్టు కట్టిన కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సీట్ల సర్దుబాటును ఈరోజు(శనివారం, మార్చి 28వ తేదీ) ప్రకటించారు. తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గాను డీఎంకే 164, కాంగ్రెస్‌ 28, డీఎండీకే 10 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక వీసీకే 8 స్థానాల్లో, సీపీఐ 5, సీపీఎం 5, ఎండీఎంకే 4 స్థానాలను కేటాయించారు. 

    ఇక డీఎంకే పోటీ చేసే పలు స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొలతూర్‌ నుంచి సీఎం స్టాలిన్‌ బరిలోకి దిగుతుండగా, చెపాక్‌ నుంచి ఉదయనిధి పోటీ చేయనున్నారు. బోడినాయక్కనూర్‌ నుంచి పన్నీరు సెల్వం పోటీ దిగుతుండగా, కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి బరిలోకి సెంథిల్‌ బాలాజీ బరిలో ఉండనున్నట్లు డీఎంకే వెల్లడించింది. 

     

     

     

     

National

  • ఐపీఎల్‌  2026 (IPL-2026) సీజన్  ప్రారంభమైంది.  బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌తో మొదలుకానుంది.  మార్చి 28 నుండి మే 31  వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. మొత్తం మొత్తం 84 మ్యాచ్‌లతో   10 జట్ల తలపడతాయి.  ఈ సీజన్‌ ఫైనల్ బెంగళూరులో జరగనుంది.

    అయితే ఐపీఎల్‌ జట్లలో ప్రదానమైంది ముంబై ఇండియన్స్ (Mumbai Indians). ఆర్సీబీ జట్టు కో-ఓనర్‌ నీతా అంబానీకి సంబంధించి ఒక ఆసక్తికర సంగతి నెట్టింట  వైరల్‌గా మారింది.


    నీతా అంబానీ ముద్ర స్పెషల్‌ 
    ముఖ్యమైన కార్యక్రమాలకు,మరీ ముఖ్యంగా ఐపీఎల్‌ స్పెషల్‌ ఈవెంట్లకు ముందు నీతా అంబానీ సూక్ష్మ హస్త ముద్రలు వేయడం విశేషంగా నిలుస్తోంది. ఇది అంగ న్యాసను ప్రతిబింబిస్తుందని విశ్వాసం. మనస్సును కేంద్రీకరించి, అంతర్గత శక్తిని సమతుల్యం చేయడానికి ఉద్దేశించిన ప్రాచీన వేద పద్ధతి అని పండితుల మాట.  60 సెకన్ల పాటు ఇలా చేస్తే మనసుకు ప్రశాంతత, శక్తిని లభిస్తుందట. క్లిష్ట సమయాల్లో నీతా అంబానీ హస్త ముద్ర, స్పెషల్‌ ఏంటో?

    ఎలా చేయాలి?
    ప్రశాంతంగా కూర్చోండి (వీలైతే తూర్పు వైపు ముఖం పెట్టి) మూడుసార్లు లోతుగా శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత పూర్తి ఏకాగ్రతతతో “ఓం నమః శివాయ” లేదా మీ ఇష్ట దేవతా మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత శరీర భాగాను సున్నితంగా స్పృశించాలి.

    శిరస్సు – స్పష్టత
    కళ్ళు – ఏకాగ్రత
    హృదయం – భావోద్వేగాల సమతుల్యత
    నాభి – అంతర్గత శక్తిని ఉత్తేజం
    పాదాలు – భూమిపై నిలదొక్కుకున్న అనుభూతి

    చివరగా ఒక క్షణం మౌనం పాటించి, శ్వాసమీద ధ్యాసపెట్టి  ఆలోచనలను ఆలోచనలను గమనించాలి ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది.

  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్టు తెలుస్తోంది.  తద్వారాఉత్తరప్రదేశ్ రైతుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయని పలు నివేదిల సమాచారం

    'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'  కథనం ప్రకారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక రైతుకు దాదాపు  రూ.15 కోట్ల పరిహారం అందింది. ఈ భారీ సొమ్ముతో ఆయన ఏకంగా ఒక హెలికాప్టర్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, విహారయాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.

    ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల  గ్రామీణ ముఖచిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా నెరవేరుతున్నాయి ఈ కథనం పేర్కొంది. ఉదాహరణకు ఈ క్రింది వివరాలు చూద్దాం.

    శివమ్ ప్రజాపతి : బన్వారీ బాస్ గ్రామానికి చెందిన ఈ యువకుడు శివమ్ ప్రజాపతి (26) ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ మరియు సోలార్ ప్లాంట్‌కు లేబర్‌ను సరఫరా చేసే సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. పెరిగిన ఆదాయంతో తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తనకు ఇది  ఊహకందని విషయం అని ఆయన చెబుతున్నారు.

    అజయ్ బేనివాల్: కిశోర్‌పూర్ గ్రామానికి చెందిన అజయ్ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు ఇప్పుడు విమానాశ్రయ పనులకు వచ్చే కూలీలు తమ హెల్మెట్లు, తాళాలు భద్రపరుచుకునే చిన్న సర్వీస్ సెంటర్‌ను నడుపుతూ నెలకు  రూ.60వేలు సంపాదిస్తున్నాడు.

    (ఆలయంలో ప్రీ-వెడ్డింగ్‌ షూట్‌ వివాదం : కెమెరామెన్లపై దాడి)

    56 ఏళ్ల నానక్ చంద్ : వలస కూలీలకు అద్దెకు ఇవ్వడం కోసం తన ఇంట్లో ఆరు అదనపు గదులను నిర్మించాడు. ఒకప్పుడు మంచి ఆదాయం వచ్చినా, ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో కూలీల సంఖ్య తగ్గి గదులు ఖాళీగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

    సోషల్ మీడియాలో చర్చ
    అయితే దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ నాయకులకు, బడాబాబులకు హెలికాప్టర్‌ ఒక స్టేటస్‌ సింబల్‌. కానీ రైతు కూడా అదే అనుభవించాలని అనుకుంటున్నాడా అని ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ముల్షీ ప్రాంత విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఇలాగే పరిహారం వచ్చిన వారు విలాసవంత మైన కార్లు కొని, ఆ తరువాత కొన్నేళ్లకే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పరిహారం సొమ్మును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని  మరో యూజర్‌  హెచ్చరించారు.

    ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు

  • కోల్‌కతా: బెంగాల్‌ మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన హోంమంత్రి అమిత్‌ షా.. టీఎంసీ ప్రభుత్వ పదిహేనేళ్ల పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బెంగాల్‌ అవినీతి ప్రయోగశాలగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. చొరబాటు దారులకు బెంగాల్‌ అడ్డాగా ఉందని.. బెంగాల్‌లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అమిత్‌ షా.. మమత పాలనలో అరాచకం రాజ్యమేలుతోందంటూ దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే(బెంగాల్‌) పరిమితం కాదని.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని.. అందుకే అత్యంత కీలకమంటూ వ్యాఖ్యానించారు.

    గత 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ చొరబాట్లకు, బుజ్జగింపు రాజకీయాలకు, సరిహద్దు అభద్రతకు ప్రధాన కారిడార్‌గా మారిందని షా ఆరోపించారు. కేంద్రం పదేపదే కోరినప్పటికీ, సరిహద్దు కంచె ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని అంటూ ఆయన విమర్శించారు. చొరబాటుదారులతో ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యమంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలను భయం- విశ్వాసం మధ్య జరుగుతున్న పోరాటంగా అమిత్‌ షా అభివర్ణించారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అబద్ధాలు, హింస, అవినీతి రాజకీయాలను పెంచి పోషించారు. ఈసారి బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    కాగా, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందే పరివర్తన్‌ ర్యాలీల పేరిట ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ.. మమత సర్కారు వైఫల్యాలపై బహిరంగ సభలు, చిన్న స్థాయి భేటీల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ పేరుతో ప్రజలను మరింతగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి–కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, శాంతిభద్రతల పతనం, మహిళలపై నేరాలు– భద్రతా లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల క్షీణత, రైతు సమస్యలు, తేయాకు తోట కార్మికుల దుస్థితి, కోల్‌కతా నగర పరిస్థితి, ‘సిండికేట్‌ రాజ్‌’వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి.

    తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

     

  • చెన్నై: తమిళ చలనచిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ప్రముఖ దర్శకుడు, నటుడు, సుందర్‌ సి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ (PTR) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    ఈయననే డీఎంకే (DMK) మళ్ళీ బరిలోకి దించే అవకాశం ఉండటంతో, ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ నెలకొననుంది. సుందర్ సి భార్య, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

    దర్శకుడి భార్య ఖుష్బూ స్పందిస్తూ.. ‘సినీ కెరీర్‌లో మూడు దశాబ్దాల పాటు నా భర్తకు ఈ రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని.. అందుకే ఇప్పుడు వారికి సేవ చేయడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్యగా నేను గర్వపడుతున్నా’’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

    సుందర్ సి (సుందర్వేల్ చిదంబరం) జనవరి 21, 1968న జన్మించారు. ఆయన 1990లో ‘వాళ్కై చక్కరం’తో నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. 1995లో ‘మురై మానమ్‌’తో దర్శకుడిగా మారారు. దాదాపు 37 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 10కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కళైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. తన భార్యతో కలిసి పలు  టెలివిజన్ సిరీస్‌లను నిర్మించారు.

     

  • ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.

    ‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్‌పోర్ట్‌ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్‌పోర్ట్‌ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.

    రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు.

  • ముంబై: మహారాష్ట్రలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌ (ఎంఎంఆర్‌)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించనున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో జనం పెట్రోల్‌ బంకుల వద్ద క్యూలు కడుతుండటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

    వదంతులు వ్యాపింపజేస్తే జైలుకే..
    లాక్‌డౌన్ వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కనీసం వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తాం’ అని ఫడ్నవీస్ తీవ్రంగా హెచ్చరించారు. ముంబై సహా థానే, పాల్ఘర్, రాయగడ జిల్లాల్లో పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్ కేంద్రాల వద్ద జనం ఎగబడుతుండటంతో  గందరగోళం మొదలైంది. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళనతో బంకుల వద్దకు పరుగులు తీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

    నిందితుడు అరెస్ట్
    లాక్‌డౌన్ రాబోతున్నదంటూ ఫేక్ వీడియో సృష్టించి, వైరల్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఉద్రిక్తతలకు కారణమయ్యే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ మాట్లాడుతూ భారత్‌లో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ‘అంతర్జాతీయ పరిస్థితులను మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఇంధన సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అసత్య వార్తలను నమ్మవద్దు’ అని ఆయన ట్వీట్ చేశారు.

    ఇది కూడా చదవండి: ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్