Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.

    అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.

    నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్‌లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది.

  • అనన్య నాగళ్ల హీరోయిన్‌గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

    హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో  చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా.  డిఫరెంట్‌గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్‌గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు  ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని  అన్నారు.

    దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్‌లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్‌కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు.
     

  • టాలీవుడ్‌ యాంకర్ విష్ణు ప్రియ పేరు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పోస్ట్ చేస్తున్న అసభ్యకర ఫొటోలు, అర్థనగ్న వీడియోలపై . ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణుప్రియకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించేందుకు యత్నించగా మొహం చాటేసుకున్నారు. మీరు ఎంత డబ్బులు సంపాదించారని కొందరు ఆమెను అడిగారు. దీంతో తన చేతులను మొహానికి అడ్డుగా పెట్టుకుని.. మమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. 

    అసలేం జరిగిందంటే?..

    ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్‌ని కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చారు. అయితే పలువురు హీరోయిన్లు, చాలామంది మహిళా ఇన్ఫ్లూయెన్సర్స్.. అందరూ చూసే ఫొటోలు, వీడియోలు కాకుండా ప్రత్యేకమైనవి చూడాలనుకుంటే రూ.399 లేదా అంతకంటే కాస్త తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రీసెంట్‌గా విష్ణుప్రియ మరీ మితిమీరిపోయేలా ఫొటోలు, వీడియోలు సదరు సబ్‌స్కైబర్స్ పోస్ట్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
     

     

  • ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియా కపూర్ తన తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసింది.  తన భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను గుర్తు చేసుకుంది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన మొదటి వివాహా వార్షికోత్సవం కావడంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ లేఖను ఆమె పంచుకున్నారు. తమ బంధం ఇప్పటికీ కూడా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పంజాబీ సాంప్రదాయంలో జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆ సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకున్నారు.

    ప్రియా కపూర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'హ్యాపీ యానివర్సరీ జే . గతేడాది మన 8వ వార్షికోత్సవాన్ని నీ స్నేహితులతో కలిసి జరుపుకున్నాం. ఆ వేడుక చాలా సందడిగా, ఆత్మీయంగా, నవ్వులతో నిండిపోయింది. నువ్వు నా వైపు చూసి, మనం రాబోయే 7 జన్మల పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పావు. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటా. మన ఏడ వార్షికోత్సవం రోజు నువ్వు నా కోసం అందమైన లేఖ రాశావు. అత్యంత అమూల్యమైన బహుమతి. అందులోని ప్రతి పదాన్ని నేను నా హృదయంలో పదిలపరుచుకున్నా. నువ్వు కేవలం నా భర్తవి మాత్రమే కాదు. నువ్వు నా ఆత్మబంధువువి. నా హృదయ స్పందనవి. నిన్ను ప్రేమించడం అనేది నాకు తెలిసినంతలో అత్యంత సులభమైన విషయం. నువ్వు సాధారణమైనదాన్ని కూడా అద్భుతంగా మార్చావు.' అంటూ రాసుకొచ్చింది.

    నటి ప్రియా సచ్‌దేవ్ కపూర్ తన లేఖను అత్యంత భావోద్వేగంగా రాసుకొచ్చారు. సంజయ్ కపూర్ కేవలం తన గతం మాత్రమే కాదని.. తన భవిష్యత్తులో కూడా ఒక భాగమని ఆమె తెలిపారు.  మా కథ ఇంకా ముగియలేదని.. మాబంధం శాశ్వతమైనదని కూడా ఆమె పేర్కొన్నారు. మనం అనేక జన్మల పాటు కలిసి ఉంటామని అతను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రియా గుర్తుచేసుకున్నారు. ఆ క్షణాలన్నీ తిరిగి తీసుకువస్తే.. మళ్లీ నీతోనే జీవిస్తానని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.

    కాగా.. జూన్ 12, 2025న, ఇంగ్లాండ్‌లో ఒక పోలో మ్యాచ్ ఆడుతుండగా సంజయ్ కపూర్ మరణించారు. ఆయన 2017లో ప్రియ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. అంతకుముందు సంజయ్‌కు కరిష్మా కపూర్‌తో గతంలో జరిగిన వివాహం జరిగింది. వీరిద్దరికి సమైరా, కియాన్ అనే పిల్లలు ఉన్నారు.

     

     

     

  • మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ఈ మూవీ నుంచి బావ బావ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. బావ, మరదళ్ల లవ్ సాంగ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను ప్రశాంత్ ఆర్.విహారి కంపోజ్ చేశారు.

    కాగా.. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఓ ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మ ఎలా కాపాడిందనే కోణంలో కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు.
     
     

  • బ్లాక్ ‍డ్రస్‌లో రచ్చ లేపుతున్న తృప్తి దిమ్రి

    గోవాలో 'చిచ్చుబుడ్డి' సాంగ్ ఫేమ్ జోనితా గాంధీ

    బైక్‌తో అనన్య నాగళ్ల గ్లామరస్ పోజులు

    పింక్ డ్రస్‌లో మాయ చేస్తున్న రీతూ చౌదరి

    చీర కట్టిన ట్రెండింగ్ బ్యూట జైన్ మేరీ ఖాన్

    చీరలో క్యూట్‌నెస్ పంచేస్తున్న శివానీ నాగారం

  • ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్‌-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్‌ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్‌తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది. 2024లో వచ్చిన ది గోట్ లైఫ్‌ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

    యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కేరళ బయట సైతం ఈ మూవీకి క్రేజ్ వస్తోంది. పాఠశాల జీవితం, ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చూస్తే వసూళ్లపరంగా రూ. 89.75 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్‌సీస్‌ మార్కెట్‌లో రూ. 73.75 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఇండియాలో రూ. 77.50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ కీలక పాత్రల్లో నటించారు.

    హిట్‌ మూవీకి సీక్వెల్‌.. 

    2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్‌గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్‌ ఆఫ్‌ బిలియన్‌ బ్రోస్‌' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్‌ దాస్‌ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్‌ డైరెక్ట్‌ చేశాడు. సీక్వెల్‌కు రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు.

  • ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ అప్పుడప్పుడు కొందరు యాక్టర్స్, హీరోలు అనిపించుకుంటుంటారు. తమిళ హీరో శివకార్తికేయన్ కూడా అలాంటి ఓ పని చేశాడు. కాకపోతే ఇది చాన్నాళ్ల క్రితం జరిగినప్పటికీ సాయం పొందిన నటుడు ఇప్పుడా విషయం బయటపెట్టడంతో అదికాస్త వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    తమిళ హీరో శివకార్తికేయన్ చేసిన 'హీరో' సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా చేశాడు. అయితే ఈ చిత్రం చేస్తున్న టైంలోనే తన కొడుకు చదువు కోసం నెదర్లాండ్స్ వెళ్లాలని, సమయానికి చేతిలో డబ్బుల్లేవని.. పోని ఇల్లు తాకట్టు పెడదామా అంటే అది ఈఎమ్ఐలో ఉండటంతో బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు నిరాకరించాయని ప్రేమ్ అన్నాడు. ఈ విషయం శివకార్తికేయన్‌కి చెప్పగా బ్యాంకులో తన పేరిట పూచీకత్తుగా రూ.50 లక్షలు ఇప్పించాడని.. అలా తనకు సాయం చేయడంతో ఇప్పుడు తన కొడుకు నెలకు రూ.4-5 లక్షలు సంపాదిస్తున్నాడని, దీనంతటికీ శివకార్తికేయన్ కారణమని ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చాడు.

    ప్రేమ్-శివకార్తికేయన్ కలిసి ఓ సినిమాకు మాత్రమే పనిచేశారు. పరిచయం కూడా కొన్నాళ్లముందే జరిగింది. అయినా సరే తనని శివకార్తికేయన్ ఆదుకున్నాడని ప్రేమ్ చెప్పారు. హీరో, నిర్మాతగా బిజీగా ఉన్న శివకార్తికేయన్.. 'సెయాన్' అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ఇది థియేటర్లలోకి రానుంది. రీసెంట్‌గా 'తాయ్ కిళవి' మూవీతో నిర్మాతగానూ ఈ హీరో సూపర్ హిట్ కొట్టారు.

    (ఇదీ చదవండి: ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా)

  • టాలీవుడ్‌ హీరో అడివి శేష్‌, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్‌. ఈ నెల ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్‌గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్‌లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్‌సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.

    ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.  అడివి శేష్ నటించిన  హిట్‌-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2  విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్‌ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌ నిర్మించగా.. మృణాల్‌ ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
    .
     

  • రెండు నెలల క్రితం 'ఫంకీ'తో వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఎన్టీఆర్‌తో 'దేవర' తీసిన నిర్మాణ సంస్థలో నటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మూవీ అధికారికంగా సోమవారం లాంచ్ అయింది.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ఐదేళ్ల క్రితం అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో సినిమాని ప్రకటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.. దాన్ని అలా పక్కనబెట్టేసి ఎన్టీఆర్-కొరటాల శివతో 'దేవర'ని అనౌన్స్ చేసింది. 2024 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. ‍దీని సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటున్నారు గానీ అసలు వస్తుందా రాదా అనేది తెలియట్లేదు. అదలా ఉండగానే విశ్వక్ సేన్‌తో ఈ సంస్థ, కొత్త మూవీ ప్రకటించింది.

    రొమాంటిక్ కామెడీ స్టోరీతో తీసే ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకుడు. కొరటాల శివనే ఈ మూవీకి క్లాప్ కొట్టారు. ఇకపోతే 'దేవర' రిలీజైన దగ్గర నుంచి కొరటాల ఖాళీగానే ఉన్నారు. దేవర సీక్వెల్ చేస్తారా వేరే హీరోతో మూవీస్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.

    (ఇదీ చదవండి: హీరో రామ్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?)

  • బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. అయితే అతియా చేసిన చిన్న పొరపాటుతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు.  ఆశా భోస్లే మృతికి సంతాపం తెలుపిన అతియా.. పొరపాటున లతా మంగేష్కర్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. అది పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే అతియా శెట్టిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి.

    ఆ తర్వాత తన పొరపాటును గుర్తించిన అతియాశెట్టి.. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. గాయని ఆశా భోస్లే ఫోటోను మరోసారి సంతాపం ప్రకటిస్తూ షేర్ చేశారు. ఆ పోస్ట్‌ తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించాయి. దీంతో అతియాపై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అతియా శెట్టికి అందం ఉంది.. కానీ తెలివి లేదు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.

    నెపో కిడ్స్ కష్టపడకుండానే ఎలాగోలా ఫేమస్ అవ్వాలని చూస్తారు.. అందుకే వారి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.. అందుకే వారు ఇలాంటి ఘోరాలు చేస్తారని కామెంట్ చేశాడు. అతియా శెట్టికి పిచ్చి పట్టింది.. అందుకే ఆశా భోస్లే ఫోటోకు బదులుగా లతా మంగేష్కర్ ఫోటోను అప్‌లోడ్ చేసిందని మరో నెటిజన్ ట్రోల్ చేశాడు. ‍అయితే తనపై వచ్చిన ట్రోల్స్‌పై అతియా శెట్టి మాత్రం స్పందించలేదు. చిన్న పొరపాటుపై ఇలా ట్రోల్స్‌ చేయడమేంటని మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు.

    a

    కాగా.. ఆదివారం  ఏప్రిల్ 12న లెజెండరి సింగర్‌  ఆశా భోస్లే(92) తుదిశ్వాస విడిచారు. శనివారం ఆమె ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె కన్నుమూశారు.  చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మరణించారు.  ఆమె మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
     

     

     

  • తెలుగు హీరోల్లో బ్యాచిలర్స్ అనుకున్న వాళ్లకు కూడా ఒక్కొక్కళ్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ప్రభాస్, రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి కొందరు మాత్రమే ఇంకా సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ప్రభాస్ చేసుకుంటాడా అంటే సందేహమే. సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ ఏడాదో వచ్చే ఏడాదో శుభవార్త చెప్పేలా ఉన్నాడు. రామ్ మాత్రం ఇప్పుడు తన సింగిల్ స్టేటస్, పెళ్లి వాటిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించాడు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    'చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఉండటం అలవాటుపడ్డా. ఖాళీ టైంని ఒక్కడినే ఆస్వాదిస్తుంటా. స్నేహితులు, మిగతా వాళ్లతో గడపటం ఇష్టమే ‍కానీ నాకోసం నేను టైమ్ కేటాయించుకోవడంలో ఆనందముంది. ఆ ఏకాంతం నాకు ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వాళ్లతో సమయం గడిపేందుకు సిద్ధమే. రాకపోయినా ఒంటరిగా సంతోషంగా ఉంటాను. ఇదేదో కావాలని తీసుకున్న నిర్ణయమైతే కాదు' అని రామ్ చెప్పుకొచ్చాడు.

    రామ్ మాటల బట్టి చూస్తుంటే జీవితాంతం సింగిల్‌గానే ఉండిపోతాడేమో అనిపిస్తుంది. ఇతడి గత సినిమా 'ఆంధ్ర కింగ్ తాలుకా' టైంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు రామ్ మాటల బట్టి చూస్తుంటే అవన్నీ ప్రమోషన్స్ కోసం సృష్టించినట్లే అనిపిస్తున్నాయి.

    ఇకపోతే ఇండస్ట్రీలో వందలాది మందితో పనిచేయడం గురించి మాట్లాడుతూ.. అది తప్పదని చెబుతూనే, అందరి మధ్య కూడా తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే బతికానని గుర్తుచేసుకున్నాడు.  

    (ఇదీ చదవండి: రష్మి కాదు మరో యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్?)

  • ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

    ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?

    (ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

  • జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం యాంకర్‌గా పలు షోలకు హోస్టింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ గురించి ఇప్పుడో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. యాంకర్ దీపిక పిల్లితో ఇతడు ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరూ కలిసి విదేశాల్లో షికార్లు కూడా చేసేస్తున్నారని నిన్నంతా సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకున్నారు. దానికి కారణం ఓ ఫొటో. స్వయంగా దీపికనే దీన్ని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసేసరికి అంతా నిజమనే అనుకున్నారు. ఇంతలోనే దీపిక ట్విస్ట్ ఇస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.

    (ఇదీ చదవండి: ఆమెతో బ్రేకప్‌.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్‌)

    సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే రష్మినే గుర్తొస్తుంది. ఎందుకంటే నిజంగా వీళ్లిద్దరూ ప్రేమికులే అన్నట్లు ఆన్ స్క్రీన్‌ కెమిస్ట్రీ పండించారు. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చాలాసార్లు చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమికులే, త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని నెటిజన్లు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ ఇప్పటివరకు సింగిల్‌గా ఉండటమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే సుధీర్.. యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్‌గా ఉన్న ఫొటో బయటకొచ్చేసరికి అంతా షాకయ్యారు. ఇదసలు ఊహించనేలేదుగా అనుకున్నారు.

    ఇప్పుడు ఆ వైరల్ ఫొటోపై స్వయంగా దీపిక పిల్లి క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టింది. 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. గతరాత్రి నా స్టోరీలో షేర్ అయింది 'ఏఐ' జనరేటెడ్ ఫొటో. నా అనుమతి లేకుండా దాన్ని పోస్ట్ చేశారు. దీన్ని మీరెవరూ షేర్ చేయొద్దు. గత 24 గంటల్లో నా ఖాతాలో పోస్ట్ అయిన ఏ కంటెంట్‌తోనూ నాకు సంబంధం లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఈ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నా' అని దీపిక చెప్పుకొచ్చింది. సుధీర్-దీపిక కలిసి పలు షోలకు గతంలో హోస్టింగ్ చేశారు.

    (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

  • మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ', 'బ్యాడ్ బాయ్ కార్తిక్', 'పాపం ప్రతాప్', 'తెరచాప' తదితర తెలుగు సినిమాలతో పాటు 'పల్లి చట్టంబి' అనే డబ్బింగ్ మూవీ.. భూత్ బంగ్లా అనే హిందీ చిత్రం రాబోతున్నాయి. మన దగ్గర రిలీజయ్యేవన్నీ కూడా చిన్న మూవీస్, దానికి తోడు వేటిపైనా అస్సలు బజ్ లేదు.

    (ఇదీ చదవండి: నా కూతురి రూపంలో ఆమె తిరిగొచ్చింది.. పూర్ణ ఎమోషనల్)

    మరోవైపు ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి సిద్ధమయ్యాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం వన్', యూత్, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', మృణాల్ ఠాకుర్ 'దో దివానే షెహర్ మై' మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు టోస్టర్ చిత్రం, పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు చూడొచ్చనేలా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా రానుందంటే?

    ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 13 నుంచి 19వ తేదీ వరకు)

    నెట్‌ఫ్లిక్స్

    • టోస్టర్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 15

    • యూత్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఏప్రిల్ 16

    • ఉస్తాద్ భగత్ సింగ్ (తెలుగు సినిమా) - ఏప్రిల్ 16

    • బీఫ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16

    • WWE రెజ్ల్ మేనియా 42 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16

    • దో దివానే షెహర్ మే (హిందీ సినిమా) - ఏప్రిల్ 17

    • ఏ గొరిల్లా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17

    • రూమ్ మేట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 17

    అమెజాన్ ప్రైమ్

    • ఇరవిన్ విళిగళ్ (తమిళ సినిమా) - ఏప్రిల్ 13

    • యుఫోరియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 13

    • అమెరికన్ గ్లాడియేటర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17

    • మట్కా కింగ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఏప్రిల్ 17

    హాట్‌స్టార్

    • సంభవం అధ్యాయం వన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఏప్రిల్ 15

    • ట్రైబ్ వర్స్ (హిందీ రియాలిటీ సిరీస్) - ఏప్రిల్ 17

    ఆహా

    • పోచమ్మ (తెలుగు సిరీస్) - ఏప్రిల్ 17

    జీ5

    • రుబాబ్ (మరాఠీ మూవీ) - ఏప్రిల్ 14

    • భానుప్రియ భూటేర్ హోటల్ (బెంగాలీ సినిమా) - ఏ‍ప్రిల్ 15

    ఆపిల్ టీవీ ప్లస్

    • మార్గోస్ గాట్ మనీ ప్రాబ్లమ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15

    లయన్స్ గేట్ ప్లే

    • గుడ్ బాయ్ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 17

    బుక్ మై షో

    • ద బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 17

    (ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

Sports

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్‌ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ సునాయసంగా గెలుపొందింది. 

    మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91)  సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్‌, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 

    అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

    చదవండి: తొలి బౌల‌ర్‌గా రికార్డు.. ఎవ‌రీ ప్ర‌ఫుల్ హింగే!

  • ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్ర‌ఫుల్ హింగే సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిశాడు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్లోనే మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ఔరా అనిపించాడు. 

    ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ రెండో బంతికి వైభ‌వ్ సూర్య‌వంశీని గోల్డెన్ డ‌కౌట్‌గా వెన‌క్కి పంపిన ప్ర‌ఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత ఇన్నింగ్స్ చివ‌రి బంతికి ప్రిటోరియ‌స్‌ను వెన‌క్కి పంపాడు. త‌ద్వారా ప్ర‌ఫుల్ హింగే అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఒక‌సారి వాటిని ప‌రిశీలిద్దాం.

    • ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవ‌ర్లోనే మూడు వికెట్లు తీయ‌డం ఇదే తొలిసారి. ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి బౌల‌ర్‌గా ప్ర‌ఫుల్ నిలిచాడు. గ‌తంలో తొలి ఓవ‌ర్లో బౌల‌ర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సంద‌ర్భాలున్నాయి. 

    • ఇక ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున 2024లో ఇదే రాజ‌స్తాన్‌పై భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇన్నింగ్స్‌ తొలి ఓవ‌ర్లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కాగా ప్ర‌ఫుల్ ప‌టేల్ బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు డ‌కౌట్‌లుగానే వెనుదిర‌గ‌డం విశేషం.

    • ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలి ఆరు ఓవర్ల‌లో నాలుగు అంత‌కంటే ఎక్కువ ప‌డ‌గొట్టిన బౌల‌ర్ల జాబితాలోనూ ప్ర‌ఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్‌హింగే కంటే ముందు ఇషాంత్ శ‌ర్మ‌, షోయ్ అక్త‌ర్‌, అజిత్ చండీలా, దావ‌ల్ కుల‌క‌ర్ణి, పాట్ క‌మిన్స్‌, దీప‌క్ చాహ‌ర్‌, మ‌హ్మ‌ద్ ష‌మీ ఈ ఫీట్ సాధించారు.

    ఎవరీ ప్రఫుల్‌ హింగే?
    విదర్భకు చెందిన ప్రఫుల్‌ హింగే రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌. వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రఫుల్‌ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్యాకప్‌ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్‌ హింగే రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్‌ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. 

    ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.

    చదవండి: గోల్డెన్‌ డక్‌.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ర‌వి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డ‌క్ అయ్యాడు. త‌ద్వారా అభిషేక్ శ‌ర్మ త‌న పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగ‌ట్టుకున్నాడు. అదేంటంటే..

    • 2026 సీజ‌న్ టీ20 క్రికెట్‌లో అభిషేక్‌ శ‌ర్మ‌కు ఇది ఏడో గోల్డెన్ డ‌క్‌. 2026 సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 18 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు గోల్డెన్ డ‌కౌట్ అయ్యి అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా నిలిచాడు.అంత‌క‌ముందు కూప‌ర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

    • ఇక ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాట‌ర్‌గా అభిషేక్ శ‌ర్మ మ‌రో చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. గ‌తంలో శిఖ‌ర్ దావ‌న్ 2018 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో తొలి బంతికే ఔట‌య్యి గోల్డెన్ డ‌క్‌ అయి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

    • భార‌త్ త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డ‌కౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండ‌గా, రోహిత్ శ‌ర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంస‌న్ (2024లో ఆరు సార్లు), గురుకీర‌త్ సింగ్ (2103లో 5 సార్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    • ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీయ‌డం ఆర్చ‌ర్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా వెట‌ర‌న్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఐపీఎల్‌లో ఈ ఫీట్‌ను 5 సార్లు న‌మోదు చేయ‌డం విశేషం.

    • ఐపీఎల్ చ‌రిత్ర‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి బంతికే వికెట్ తీయ‌డం ఇది 24వ సారి. ఐపీఎల్‌లో ఏ జ‌ట్టుకైనా ఇదే అత్య‌ధికం. ముంబై ఇండియ‌న్స్ 22సార్లు ఈ ఫీట్ న‌మోదు చేసింది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీల‌క మార్పు చేసింది. అహ్మ‌దాబాద్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ్యాచ్‌ల‌కు సంబంధించి మ్యాచ్ వేదిక‌ల‌ను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్‌ సైకియా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

    విష‌యంలోకి వెళితే.. సీజ‌న్ తొలి ద‌శలో ఏప్రిల్ 26న అహ్మ‌దాబాద్ వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదిక‌ను చెన్నై చిదంబ‌రం స్టేడియానికి మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ్యాచ్ స‌మ‌యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 

    ఇక మే 21 ఈ రెండు జ‌ట్లు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా రాత్రి 7.30 గంట‌ల‌కు మ‌రోసారి త‌ల‌ప‌డాల్సి ఉంది. తాజాగా ఈ వేదిక‌ను అహ్మ‌దాబాద్‌కు మారుస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 మ్యాచ్‌​ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్‌ టైటాన్స్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.

    చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌!

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, ష​కీబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్‌ఆర్‌హెచ్ సునాయసంగా గెలుపొందింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ప్రఫుల్‌ హెంగే, సాకిబ్‌లు చెరో 4 వికెట్లతో మెరిశారు.

    ఫెరీరా అర్థసెంచరీ..
    రాజస్తాన్‌ రాయల్స్‌ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. డొనోవన్‌ ఫెరీరా అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఫెరీరా (63 బ్యాటింగ్‌), జడేజా (43 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

    8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (21 బ్యాటింగ్‌), ఫెరీరా (24 బ్యాటింగ్‌) ఉన్నారు. 

    ఐదో వికెట్‌ డౌన్‌
    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పేలవ ఆటతీరు కనబరుస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 10 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఫ్రపుల్‌ హింగే బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన పరాగ్‌ అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

    ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షాకిబ్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ (1) నితీశ్‌రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    తొలి ఓవర్లోనే మూడు వికెట్లు..
    217 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఫ్రపుల్‌ హెంగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్‌ సూర్యవంశీ గోల్డెన్‌ డక్‌ కాగా.. ధ్రువ్‌ జురేల్‌,, ప్రిటోరియస్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు వద్దే రాయల్స్‌ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    రాజ‌స్తాన్ ల‌క్ష్యం 217 పరుగులు
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌.. రాజస్తాన్‌ ముంగిట 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ 91 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, క్లాసెన్ 40 ప‌రుగులు చేశాడు.

    చివర్లో సాహిల్‌ అరోరా (24 నాటౌట్‌) మెరిశాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌లు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ 2 వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ‌, తుసషార్ దేశ్ పాండే, ప‌రాగ్ త‌లా ఒక వికెట్ తీశారు.

    నాలుగో వికెట్‌ డౌన్‌
    హెన్రిచ్‌ క్లాసెన్‌ (40) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్లాసెన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

    ఇషాన్‌ కిషన్‌ ఔట్‌ 
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్‌ కిషన్‌ (91) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ గా వెనుదిరిగాడు.  ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

    13 ఓవర్లకు ఎస్‌ఆర్‌ఎస్‌ హెచ్‌ స్కోరు: 140/2

    హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌
    ఇషాన్ కిషన్ హఫ్‌ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్‌ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

    హెడ్‌ ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో డొనొవన్‌ ఫెరీరాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. 

    ఆరు ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 51/1
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డక్‌ అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు​ ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్‌ (35 బ్యాటింగ్‌), హెడ్‌ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

    తొలి వికెట్‌ కోల్పోయిన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌
    రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి షాక్‌ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అభిషేక్‌ శర్మ రవి బిష్ణోయ్‌ క్యాచ్‌  ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

     టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌
    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తికర పోరుకు తెరలేచింది. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన రాజ‌స్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్‌మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. 

    కాగా ప్రిటోరియస్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి మ్యాచ్‌. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఉనాద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లను త‌ప్పించిన‌ట్లు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయి. ఇరుజ‌ట్ల మ‌ధ్య 21 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా ఎస్ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో, రాజ‌స్తాన్ 9 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించాయి.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌/ కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.

    రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.

     

  • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తన ప్రవర్తనతో అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా టిమ్‌ డేవిడ్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

    ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించినట్లు ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. జరిమానా విధించడం ద్వారా టిమ్‌ డేవిడ్‌ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్లు చేశారు. 

    పాండ్యాకు జరిమానా..
    మరోవైపు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఆదివారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసినందుకు పాండ్యాకు జ‌రిమానా విధిస్తూ ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

    ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని వెల్లడించింది.

    టిమ్‌ డేవిడ్‌ ఏం చేశాడంటే?
    ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. 

    అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

    చదవండి: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడి పరాజయంతో తాజా ఎడిషన్‌ మొదలుపెట్టింది ఎస్‌ఆర్‌హెచ్‌. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది.

    జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు
    సొంతమైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌.. చివరగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలోనూ చిత్తుగా ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

    ఆస్ట్రేలియా స్టార్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టుతో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జహీర్‌ ఖాన్‌ అన్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాడని విమర్శించాడు.

    కమిన్స్‌లా కాదు.. క్లారిటీ లేదు!
    ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఇషాన్‌ కిషన్‌ మాత్రం బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరంభంలో బాగానే ఆడినా అదే జోరును కొనసాగించలేకపోతున్నాడు.

    కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్యాట్‌ కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇషాన్‌ విషయంలో అది మిస్సయ్యింది. తాను ఏమనుకుంటున్నాడో జట్టుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.

    తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న ఇషాన్‌ కిషన్‌ నాయకత్వ ప్రణాళికల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొరపాటును సరిచేసుకుంటేనే సానుకూల ఫలితాలు వస్తాయి’’ అని జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ చేసిన పరుగులు వరుసగా.. 80, 14, 1, 27.

    చదవండి: ‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’

  • రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక ప‌ని చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విష‌యంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. 

    దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. 

    లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫ‌న్నీ మోడ్‌లోనే చేసిన‌ప్ప‌టికీ చూసేవాళ్ల‌కు మాత్రం అత‌డి ప్ర‌వ‌ర్త‌న విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్‌ను ఏకిపారేశారు. ‘అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్‌కు ఇచ్చే మ‌ర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్ర‌శ్నించాడు. ‘అందుకే క్రికెట్‌లో యెల్లో, రెడ్ కార్డులు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంది’ అని మ‌రొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్ల‌ర చేష్ట‌లు చేయ‌కుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడ‌ని’ మ‌రికొంత‌మంది కామెంట్ చేశారు.  

    ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఆర్సీబీ 18 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్‌, ప‌టిదార్‌లు అర్థ‌సెంచ‌రీల‌తో మెరిశారు. అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.

    చదవండి: ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే!

  • ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ ఒకటి మాత్రమే గెలిచింది.

    ఆసక్తికర పోరు
    మరోవైపు.. రాజస్తాన్‌ నాలుగు విజయాలతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్‌ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. ఇటు సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌  విధ్వంసకర బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

    ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్‌ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్‌రూమ్‌ అందుబాటులో ఉండదని తెలిపింది.

    స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే
    👉కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు
    👉బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎయిర్‌పాడ్స్‌
    👉సిగరెట్లు, లైటర్‌, అగ్గిపెట్టె
    👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు
    👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్‌, కూల్‌డ్రింక్స్‌
    👉పెంపుడు జంతువులు
    👉తినుబండారాలు
    👉బ్యాక్‌పాక్స్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌
    👉ల్యాప్‌టాప్స్‌, సెల్ఫీ స్టిక్కులు
    👉హెల్మెట్స్‌, బైనాక్యులర్స్‌
    👉పేలుడు పదార్థాలు, ఫైర్‌ క్రాకర్స్‌
    👉డ్రగ్స్‌.

    చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ భీక‌ర ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ‌రిలోకి దిగిందే మొద‌లు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్‌రేట్‌తో 200 ప‌రుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొన‌సాగుతున్నాడు. 

    తాను క్రీజులో ఉంటే బౌల‌ర్ ఎవ‌రైతే నాకేంటి.. బంతిపైనే త‌న దృష్టి ఉంటుంద‌ని ఇటీవ‌లే ఆర్సీబీతో మ్యాచ్ అనంత‌రం డైరెక్ట్ స్టేట్‌మెంట్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌స్తాన్ ఆడిన ప్ర‌తీ జ‌ట్టులో ఒక ప్ర‌ధాన బౌల‌ర్‌ను వైభ‌వ్ ఒక ఆట ఆడుకున్నాడు.  

    చెన్నైతో మ్యాచ్‌లో మాట్ హెన్రీని, గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ర‌బాడను, ముంబైతో మ్యాచ్‌లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. ఇక ఇవాళ వైభ‌వ్ సూర్యవంశీ ఎస్ఆర్‌హెచ్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్‌వుడ్‌, ర‌బాడ వంటి టాప్ బౌల‌ర్ల‌ను ఉతికారేసిన వైభ‌వ్ ముందు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చిన్న‌బోతోంది. 

    క‌మిన్స్ లేక‌పోవ‌డంతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బ‌ల‌హీనంగా త‌యార‌య్యింది. ఒక్కరు కూడా చెప్పుకోద‌గ్గ బౌల‌ర్ లేకపోవ‌డం మైన‌స్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు దారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. యావ‌రేజ్‌గా చూసుకుంటే ప్ర‌తీ ఓవ‌ర్‌కు 10.42 ప‌రుగులివ్వ‌డం గ‌మ‌నార్హం. 

    ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బౌలింగ్ ప‌రంగా అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఎస్ఆర్‌హెచ్‌దే. ఇక పేస‌ర్ల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా కనిపిస్తోంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ఉనాద్క‌ట్‌, ఇషాన్ మ‌లింగ‌ల‌తో కూడిన పేస్ త్ర‌యం ప్ర‌తీ ఓవ‌ర్‌కు స‌గ‌టున 11.47 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఈ లెక్క‌న ఇవాళ్టి మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోమారు చెల‌రేగితే మాత్రం ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు మూడిన‌ట్లేన‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 

    మొత్తంగా చూసుకుంటే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ అంటేనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల బౌల‌ర్లు హ‌డ‌లెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ. ఇక ఐపీఎల్‌లో ఇరుజ‌ట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరుజ‌ట్లు 21 సార్లు త‌ల‌పడితే ఎస్ఆర్‌హెచ్ 12 సార్లు, రాజ‌స్తాన్ 9 సార్లు విజ‌యాలు అందుకున్నాయి. 

    సీజన్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్‌ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.

    చదవండి: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?
     

  • రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్‌లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.

    ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్‌గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్‌లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని  బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    ఏమి జరిగిదంటే?
    ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్‌లో  రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై  ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.

    దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్‌ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.

    వైభవ్‌పై వేటు!
    కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్‌పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన వైభ‌వ్ సూర్య‌వంశీపై  కూడా బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకునే ఛాన్స్ ఉంది. అత‌డిపై జ‌రిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశ‌ముందని క్రికెట్ నిపుణ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
    చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?
     

  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో శ్రేయస్‌ అయ్యర్‌ హవా కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా ఈ టీమిండియా మిడిలార్డర్‌ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సారథిగా టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

    అంతేకాదు 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్‌. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 137 పరుగులు చేశాడు.

    శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా..
    ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్‌, ఐపీఎల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్‌ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గతంలో పేర్కొన్నాడు.

    ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి శ్రేయస్‌ అయ్యర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

    టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా
    అయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్‌ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించారు.

    ఇలాంటి సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

    చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం. దీంతో హార్దిక్ సేన పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయింది.

    ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఫామ్ లేమి ముంబై జట్టు మేనెజ్‌మెట్ కలవరపెడుతోంది. ఈ ఏడాది సీజన్‌లో తిలక్ ఇప్పటివరకు ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లోనూ తిల‌క్ నిరాశ‌ప‌రిచాడు. 3 బంతుల్లో కేవలం ఒక్క‌ పరుగు చేసి ఔట‌య్యాడు.

    మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన‌ తిలక్ కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేప‌థ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్‌లా తిలక్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించలేకపోతున్నాడని శ్రీకాంత్ అన్నాడు. కాగా పాటిదార్ కూడా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

    "తిల‌క్ వ‌ర్మ ప్ర‌స్తుతం ఫామ్‌లో లేడు. అత‌డికి భారీ షాట్లు ఆడే స‌త్తా లేదు. దూకుడుగా ఆడే బ్యాట‌ర్ కూడా కాదు. తిలక్ వర్మ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడే కావచ్చు, కానీ ఫిల్ సాల్ట్ లేదా రజత్ పాటిదార్ లాగా బౌల‌ర్ల‌ను టార్గెట్ చేయ‌లేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోయాడు.

    టీ20ల్లో క్రికెట్‌లో నిల‌క‌డ అవ‌స‌రం లేదు. పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో 30-40 పరుగులు చేయడం కంటే, నాలుగింటిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించడం మేలు. ఇప్పుడు పాటిదార్ అదే చేస్తున్నాడు. తిల‌క్‌ను లోయార్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు పంపిస్తే బెట‌ర్‌.

    160 లేదా 170 పరుగులను ఛేజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే తిలక్ అద్భుతంగా ఆడతాడు. కానీ 200 లేదా 220 పరుగులను ఛేజ్ చేసేటప్పుడు తిలక్ వర్మ సరిపోడు" అని శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.
    చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శ‌ర్మ అవుట్‌?

  • తమీమ్‌ ఇక్బాల్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదటి సంతకమే ఆటగాళ్ల జీతాల పెంపు ఫైల్‌పై చేసిన అతను.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

    షర్మిన్‌ సుల్తానా అనే ప్లేయర్‌ను ఏడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చేలా చేశాడు. షర్మిన్‌ చివరిగా 2019లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఆమె ఇటీవల ఎమర్జింగ్‌ ఏసియా కప్‌లో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించింది. షర్మిన్‌ గతంలో బంగ్లాదేశ్‌ తరఫున 13 వన్డేలు ఆడి కేవలం​ 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్వరలో శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం షర్మిన్‌ బంగ్లా జట్టుకు ఎంపికైంది.

    తమీమ్‌ అథ్వర్యంలోని బంగ్లా సెలెక్టర్లు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఇవాళ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో షర్మిన్‌తో పాటు మరిన్ని ఆసక్తికర ఎంపికలు జరిగాయి. వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జువైరియా ఫిర్దౌస్‌ జట్టులో చోటు దక్కించుకుంది. అయితే కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఫిర్దౌస్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగనుంది.

    శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఏప్రిల్‌ 20 నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్‌లు 20, 22, 25 తేదీల్లో రాజ్‌షాహీ మైదానం వేదికగా జరుగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. ఈ సిరీస్‌ ఏప్రిల్‌ 28, 30, మే 2 తేదీల్లో సిల్హెట్‌ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్‌కు బంగ్లా జట్టును ప్రకటించాల్సి ఉంది.

    శ్రీలంక సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే జట్టు..
    నిగర్ సుల్తానా జోటీ (సి), నహిదా అక్టర్ (విసి), ఫర్జానా హక్, శోభనా మోస్తరీ, ఫాహిమా ఖాతున్, షర్మిన్ అక్తర్ సుప్తా, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, షర్మిన్ సుల్తానా, మరుఫా అక్టర్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, సుల్తానా ఖాతున్, శంజిదా అక్తేర్ మగ్లా, జువైరియా ఫిర్దౌస్‌

  • భారతీయ సంగీత ప్రపంచంలో ఒక‌ శ‌కం ముగిసింది. లెజెండరీ గాయని ఆశా భోంస్లే మ‌ర‌ణ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంగీత ప్రియుల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. 

    ఆశా భోంస్లే అంత్యక్రియలు సోమవారం ముంబైలోని  శివాజీ పార్క్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం ముంబైలోని స్వగృహంలో ఆశా భోంస్లే భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో ఆమె పార్ధివ దేహానికి భార‌త క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త‌న భార్య అంజలితో క‌లిసి నివాళులు అర్పించారు.

    ఈ సంద‌ర్భంగా స‌చిన్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆశా భోంస్లేతో సచిన్ కుటుంబానికి దశాబ్దాల కాలంగా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆమెను తన కుటుంబ సభ్యురాలిగానే సచిన్ భావించేవారు.

    చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • ఐపీఎల్‌-2026లో గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

    నిప్పులు చెరిగిన ప్రసిద్‌ కృష్ణ
    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్‌ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగి లక్నో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు.

    ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (40 బంతుల్లో 56) ఆడగా.. జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 60), వాషింగ్టన్‌ సుందర్‌ (13 బంతుల్లో 21 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టారు. ఫలితంగా గుజరాత్‌ జయభేరి మోగించింది.

    స్టాండ్స్‌లో సచిన్‌ కుమార్తె, కోడలు
    ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ కుమార్తె సారా టెండుల్కర్‌, కోడలు సానియా చందోక్‌ ఏకనా స్టేడియానికి విచ్చేశారు. కాగా ముంబై ఇండియన్స్‌  ఈ సీజన్‌ ఆరంభానికి ముందు సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ను లక్నోకు ట్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే.

    అయితే, ఇప్పటికి లక్నో నాలుగు మ్యాచ్‌లు ఆడినా అర్జున్‌ టెండుల్కర్‌కు ఒక్కసారి కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయినప్పటికీ అర్జున్‌ ఉన్న లక్నో జట్టుకు మద్దతు ఇచ్చేందుకు అతడి అక్క సారా, భార్య సానియా స్టేడియానికి రావడం విశేషం.

    లక్నో జెర్సీలో సానియా.. సారా  మాత్రం
    సారా, సానియా పక్క పక్కనే కూర్చుని మ్యాచ్‌ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ కాగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. సానియా లక్నో జెర్సీ ధరించి రాగా.. సారా మాత్రం నార్మల్‌ కుర్తీసెట్‌ వేసుకుంది. దీంతో సారా ఇప్పటికీ ముంబై ఇండియన్స్‌నే తన ఫేవరెట్‌ జట్టుగా భావిస్తోందని అందుకే వేరే జెర్సీ వేసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

    మరికొందరు మాత్రం తమ్ముడు ఎలాగో తుదిజట్టులో లేడు.. అందుకే ఈసారి ఆమె గుజరాత్‌ కెప్టెన్‌ గిల్‌కు మద్దతు ఇచ్చి ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా సారా- గిల్‌ ప్రేమలో ఉన్నారంటూ గతంలో వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇటు సారా గానీ.. అటు గిల్‌ గానీ ఎప్పుడూ స్పందించలేదు.

    చదవండి: హార్దిక్‌తో విభేదాలు.. స్పందించిన కృనాల్

  • టీమిండియా స్టార్‌ సోదర ద్వయం కృనాల్‌-హార్దిక్‌ పాండ్యాల మధ్య గొడవలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ అంశం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 12) రాత్రి జరిగిన ఆర్సీబీ-ఎంఐ మ్యాచ్‌లో అన్నదమ్ములిద్దరూ ఎడముఖం​ పెడముఖంగా వ్యవహరించారు. పైగా హార్దిక్‌ ఔటయ్యాక కృనాల్‌ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.

    దీంతో పాండ్యా సోదరుల మధ్య విభేదాల ప్రచారానికి బలం చేకూరింది. అన్నదమ్ముల మధ్య గతంలో ఉన్న సఖ్యత లేదని స్పష్టమైంది. మ్యాచ్‌ అనంతరం అన్న కృనాల్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ‍ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బరిలో ఇద్దరు పాండ్యాలు ఉన్నా, గెలవాల్సింది ఒక పాండ్యానే అంటూ కృనాల్‌ చేసిన వ్యాఖ్యలు హార్దిక్‌పై అతని వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కృనాల్‌ వేరే ఉద్దేశంతో చేసినా, ఇందులో డబుల్‌ మీనింగ్‌ ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అన్నదమ్ముల వివాదంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇంతకీ ఎందుకు అన్నదమ్ముల మధ్య విభేదాలు..?
    కృనాల్-హార్దిక్‌ మధ్య విభేదాలు ఓ అమ్మాయి విషయంలో ఉన్నట్లు తెలుస్తుంది. హార్దిక్‌ తన మొదటి భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చి  మహీకా శర్మ అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ఇది కృనాల్‌కు నచ్చలేదని సమాచారం. అలాగే మరో సోదరుడు (సవితి సోదరుడు వైభవ్‌) విషయంలోనూ వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని ప్రచారం జరుగుతుంది.

    ఏదిఏమైనా రామలక్ష్మనుల్లా కలిసుండే కృనాల్‌-హార్దిక్‌ వేర్వేరుగా ఉండటాన్ని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్‌లో హార్దిక్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా.. కృనాల్‌ ఆర్సీబీలో కీలక ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న విషయం తెలిసిందే. 

    నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో మట్టి కరిపించి సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ (4-0-39-1, 40), కృనాల్‌ (4-0-26-1) ఇద్దరూ రాణించినప్పటికీ.. అన్న కృనాల్‌ జట్టే అంతిమంగా పైచేయి సాధించింది. 

  • వైభ‌వ్ సూర్య‌వంశీ.. కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌తేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభ‌వ్ త‌న ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్‌గా మ‌లిచి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లో శ‌తక్కొట్టిన వైభ‌వ్‌.. ఐపీఎల్‌లో యంగెస్ట్ సెంచరియన్‌గా చ‌రిత్రను తిరగరాశాడు.

    గత సీజ‌న్‌లో ఎక్క‌డైతే త‌న విధ్వంసాన్ని ఆపాడో ఇప్పుడు అక్క‌డే తిరిగి మొద‌లు పెట్టాడు. ఐపీఎల్‌-2026లో వైభ‌వ్ దుమ్ములేపుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తున్నాడు. బౌల‌ర్ ఎవ‌రైనా త‌న‌కు తెలిసింది మాత్రం బంతిని బాద‌డం అన్న‌ట్లగా దూసుకుపోతున్నాడు.

    జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం ఈ బిహార్ చిన్నోడు వ‌దల్లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జబితాలో వైభ‌వ్(200) అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ సూర్య‌వంశీ నెట్‌వ‌ర్త్‌, తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం. వైభవ్ తన ఆటలోనే సంపాదనలో కూడా దూసుకుపోతున్నాడు.

    వైభవ్ సంపాదన ఎంతంటే?
    15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తన కొడుకును క్రికెటర్‌ను చేసేందుకు తనకున్న కొంత భూమిని కూడా అమ్మేశాడు. ఇప్పుడు వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. వైభవ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

    15 ఏళ్ల వయస్సులోనే కోటీశ్వరుడయ్యాడు. ఐపీఎల్‌-2025 వేలంలో రాజస్తాన్ రాయల్స్ సూర్యవంశీని రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌కు ముందు కూడా అతడిని రిటైన్ చేసుకుంది. అంటే రెండు సీజన్లకు గాను రూ. 2.20 కోట్లు జీతంగా అతడు అందుకున్నాడు.

    అదేవిధంగా ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. లీగ్ కాంట్రాక్ట్ వాటా, మ్యాచ్ ఫీజులు కలిపితే.. వైభవ్ ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.15.35 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు ఇందుకు అదనం.

    డొమెస్టిక్ మ్యాచ్‌లు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ), అండర్-19 మ్యాచ్‌ల ద్వారా కూడా బీసీసీఐ నుండి ఫీజులు పొందుతున్నాడు. అండర్‌-19 సిరీస్‌లో వైభవ్‌కు ఫీజు రూపంలో రోజుకు రూ.20 వేలు లభిస్తోంది. బీహార్ రంజీ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌కు రూ.1.6 లక్షల మ్యాచ్ ఫీజు అందుకున్నాడు. 

    ఐపీఎల్‌-2025లో సెంచరీ చేసినందుకు అతడికి  రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. అదే సీజన్‌లో స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఈ అవార్డ్ కింద రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు రూ. 20 లక్షల టాటా కర్వ్ ఎస్‌యూవీ కార్ బహుమతిగా లభించింది. అత‌డి వ‌ద్ద టాటా క‌ర్వ్‌తో పాటు ఖ‌రీదైన‌ మెర్సిడెస్-బెంజ్ కారు కూడా ఉంది. మొత్తంగా అత‌డి నెట్ వర్త్ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది.
    చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శ‌ర్మ అవుట్‌?
     

  • వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడి సన్‌రైజర్స్‌ వెనుకబడగా.. నాలుగింటికి నాలుగూ గెలిచి రాజస్తాన్‌ జోరు మీదుంది.

    కమిన్స్‌ లేనిలోటు తెలుస్తోంది
    కాబట్టి టేబుల్‌ టాపర్‌ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గెలవాలంటే సన్‌రైజర్స్‌ తీవ్రంగా శ్రమించకతప్పదు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై మంచి స్కోరు సాధించినా రైజర్స్‌ నిలబెట్టుకోలేకపోయింది.  రెగ్యులర్‌ కెప్టెన్‌, ప్రధాన పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ లేనిలోటు మరోసారి స్పష్టంగా కనిపించింది.

    బౌలర్ల ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్‌ 219 పరుగులు చేయగా.. పంజాబ్‌ 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్లు జయదేవ్‌ ఉనాద్కట్‌ (3 ఓవర్లలో 40), ఇషాన్‌ మలింగ (3 ఓవర్లలో 46), నితీశ్‌ రెడ్డి (2 ఓవర్లలో 20 పరుగులు) ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.

    దారుణ ప్రదర్శన
    శివాంగ్‌ కుమార్‌ (3 ఓవర్లలో 33) మెరుగ్గా రాణించి మూడు వికెట్లు తీయగా.. హర్ష్‌ దూబే (4 ఓవర్లలో 38) ఒక వికెట్‌ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు కూర్పులో.. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగంలో మార్పులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్లు గత మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఉనాద్కట్‌ 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చుకోగా.. నితీశ్‌ రెడ్డి ఇంచుమించు అదే స్థాయిలో బౌలింగ్‌ చేశాడు. అయితే, బ్యాటర్‌గా మాత్రం ఈ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన బాగుంది. దీంతో నితీశ్‌ రెడ్డి తుదిజట్టులో పదిలంగా ఉండటం ఖాయం.

    నాలుగేళ్ల తర్వాత అతడి రీఎంట్రీ?
    అయితే, ఉనాద్కట్‌ను రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేసి.. ఆటను మెరుగుపరుచుకునేలా సమయం ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. అతడికి బదులు టీమిండియాకు ఆడిన శివం మావిని రంగంలోకి దించితే.. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు కడా తీయగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే బిహార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సకీబ్‌ హుసేన్‌ను ఆడించినా బాగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    కాగా 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన శివం మావి.. ఇప్పటికి 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీయగలిగాడు. ఈ యూపీ పేసర్‌ చివరగా 2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సన్‌రైజర్స్‌ శివం మావిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. మరి రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అతడికి రీఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కుతుందేమో చూడాలి!

    రాజస్తాన్‌తో మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ తుదిజట్టు అంచనా
    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్‌ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ/బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనాద్కట్‌/శివం మావి.

    చదవండి: BCCI: ఫోన్‌ చూసిన రోమీ, వైభవ్‌ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!

Business

  • పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.

    శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి.

    చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.

    2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు.

  • మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్‌ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఆర్‌బీఐ అభ్యంతరం ఏమిటి?

    స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్‌ఫోలియోపై ఆర్‌బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్‌బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్‌కు ఉండాల్సిన సమతుల్య లోన్‌ బుక్‌ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సలహా ఇచ్చింది.

    యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?

    స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్‌గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.

    ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

  • దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపి డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు వేసింది. స్మార్ట్‌ఫోన్ లేని సామాన్యులకు కూడా అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను చేరువ చేస్తూ ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ ‘బాబ్ వరల్డ్ లైట్’ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది.

    ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జియోఫోన్ ‘ప్రైమా 4జీ’ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆశిస్తున్న ఆర్థిక సమగ్రత లక్ష్య సాధనలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా నిలవనుంది.

    సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు కేవలం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లకే పరిమితమవుతుంటాయి. కానీ, 'బాబ్ వరల్డ్ లైట్' దీనికి భిన్నం. బ్యాంకు, జియో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నా ఈ యాప్ నిరాటంకగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ అవసరం లేకుండా కీప్యాడ్‌తోనే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా సులభమైన నమోదు ప్రక్రియ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.

    ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే..

    • యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పే

    • మనీ ట్రాన్స్‌ఫర్ (డబ్బు పంపడం)

    • బిల్లుల చెల్లింపులు, రీచార్జ్‌లు

    • ప్రొఫైల్ మేనేజ్‌మెంట్

    జియోఫోన్ ప్రైమా 4జీ పరికరాల్లో ఈ యాప్ ముందే లోడ్ చేయబడి ఉంటుంది. పాత వినియోగదారులు జియో స్టోర్ ద్వారా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘డిజిటల్ బ్యాంకింగ్‌ను కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఈ ‘లైట్’ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని దేవదత్త చంద్ర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెలిపారు.

    ఈ భాగస్వామ్యం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ‘జియో ఎప్పుడూ సామాన్యుడికి డిజిటల్ సేవలను అందుబాటు ధరలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపి మేము అందిస్తున్న ఈ సేవలు దేశవ్యాప్తంగా ఉన్న జియోఫోన్ వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.

    ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

  • దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) నాసిక్ బ్రాంచ్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణల కలకలంపై టాటా గ్రూప్ కఠినంగా స్పందించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం స్పష్టం చేశారు.

    విచారణాధికారిగా సీఓఓ

    ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించేందుకు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైన చోట సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

    అసలేం జరిగింది?

    గత మార్చి నెలలో టీసీఎస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని తేలింది. ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. బాధితులను బలవంతంగా మతమార్పిడికి ప్రేరేపించడం, మాంసం తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవతలను అవహేళన చేస్తూ ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

    ఏడుగురు అరెస్ట్..

    నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్‌లుగా గుర్తించారు. వీరిపై లైంగిక వేధింపులు, మత విద్వేషాల ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద 8 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

    హెచ్ఆర్ అధికారుల వైఫల్యంపై విచారణ

    బాధితులు గతంలోనే కంపెనీకి చెందిన హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పుణెకు చెందిన టీసీఎస్ హెచ్ఆర్ అధికారిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆమె నిందితులకు పరోక్షంగా సహకరించారా అనే కోణంలో నోటీసులు జారీ చేశారు.

    ప్రభుత్వం సీరియస్.. సిట్‌ ఏర్పాటు

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘ఇది సమాజంలో విద్వేషాలు నింపే అత్యంత తీవ్రమైన విషయం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. నాసిక్ పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, నైతిక విలువలపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.

    ఇదీ చదవండి: ఇరాన్‌ సమీపంలో అమెరికా నౌకా దళాలు

  • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్‌ బ్లాకేడ్‌) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.

    యురేనియం తరలింపునకు ప్రతిపాదన

    ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.

    అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

    హార్మూజ్‌ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయం

    పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్‌ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.

    అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.

    యుద్ధం ముగిసేది ఎప్పుడు?

    ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

    ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..

  • దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.

    వేతనాల పెంపు

    ప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

    హరియాణాతో పోలిక

    ఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.

    12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలి

    హోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

    ఓవర్ టైం, బోనస్ బకాయిలు

    కార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్‌ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.

    పని ప్రదేశంలో భద్రత - గౌరవం

    ఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.

    పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపు

    అనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్‌మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.

    ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

  • ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ బ్రిటన్ రాజధాని లండన్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.

    కీలక కేంద్రంగా లండన్..

    లండన్‌లోని ప్రముఖ ‘కింగ్స్‌ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్‌మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్‌కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్‌ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్‌లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్‌ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.

    స్టార్ గేట్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. కారణం అదేనా?

    ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్‌ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్‌ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్‌లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.

    ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

  • భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా మారడంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి.

    మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు

    విఫలమైన శాంతి చర్చలు

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగియడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు, హార్మూజ్‌ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలవైపు మళ్లుతున్నారు.

    సెగ పుట్టిస్తున్న క్రూడాయిల్ ధరలు

    యుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 102 డాలర్ల మార్కును అధిగమించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న ఆందోళన మార్కెట్‌ను కుంగదీసింది.

    ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో 2026లో వడ్డీ రేట్ల తగ్గింపు కేవలం ఒక్కసారి మాత్రమే ఉండొచ్చన్న సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్‌ఐఐ) ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా భారత మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ జరిగింది.

    నేటి మార్కెట్ గణాంకాలు (క్లోజింగ్ సమయానికి)

    సూచీముగింపునష్టం (పాయింట్లు)శాతం (%)
    సెన్సెక్స్76,842-702-0.90%
    నిఫ్టీ23,842-207-0.86%
  • ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్‌ బ్లాకేడ్‌) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్‌ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.

    ఎస్కార్ట్ మిషన్లు

    ఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్‌) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్‌లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.

    ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'

    తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్‌కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.

    ఇంధన సంక్షోభం వైపు తైవాన్?

    ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్‌కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్‌ఎన్‌జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.

    తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.

    ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

  • టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్‌లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.

    ఏమిటీ మార్పు? ఎందుకు?

    ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్‌ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్‌లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.

    వినియోగదారులపై ప్రభావం ఇలా..

    మే 25 తర్వాత మీ ఫోన్‌లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్‌లుక్ మొబైల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    ఇప్పుడేం చేయాలి?

    అంతరాయం లేని అవుట్‌లుక్‌ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్‌లుక్ లైట్ యాప్‌లోనే అప్‌గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్‌కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్‌లుక్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్‌మెంట్లు ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్‌కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.

    సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్‌కు మారడం ఉత్తమం.

    ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

  • సాంకేతిక రంగం అంటేనే సృజనాత్మకతకు, అపారమైన సంపదకు నిలయం. తాజాగా ఈ రంగంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన 22 ఏళ్ల కిమ్ జంగ్-యున్ (Kim Jung-youn) ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా టెక్ బిలియనీర్‌గా ఫోర్బ్స్-2026 జాబితాలో నిలిచారు. గేమింగ్ రంగంలో ఆమె కుటుంబం సృష్టించిన సామ్రాజ్యం, నేడు ఆమెను ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.

    వారసత్వ సంపద.. అంతర్జాతీయ గుర్తింపు
    గేమింగ్ దిగ్గజం 'నెక్సాన్' (Nexon) వ్యవస్థాపకుడు, దివంగత కిమ్ జంగ్-జు కుమార్తె జంగ్-యున్. 2022లో తన తండ్రి మరణం తర్వాత, నెక్సాన్ హోల్డింగ్ కంపెనీ అయిన NXCలో ఆమెకు, ఆమె సోదరి జంగ్-మిన్‌కు భారీగా వాటాలు దక్కాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 12, 2026 నాటికి జంగ్-యున్ నికర ఆస్తి విలువ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,520 కోట్లు)

    ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నివసిస్తున్నారు. సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణ విషయాల్లో చాలా గోప్యంగా ఉండటానికే మొగ్గు చూపుతారు.

    నెక్సాన్.. గేమింగ్ రంగంలో ట్రెండ్ సెట్టర్
    1994లో ప్రారంభమైన నెక్సాన్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మాపుల్ స్టోరీ (MapleStory), డంజియన్ & ఫైటర్ (Dungeon & Fighter) వంటి ప్రపంచ ప్రసిద్ధ గేమ్స్ ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఏటా బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆసియా డిజిటల్ గేమింగ్ మార్కెట్‌లో నెక్సాన్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ బలమైన పునాదే నేడు జంగ్-యున్ సంపదకు ప్రధాన వనరు.

    2026లో యువ బిలియనీర్ల హవా
    ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 30 ఏళ్లలోపు వయస్సున్న బిలియనీర్ల సంఖ్య 35కు చేరింది. వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 92.4 బిలియన్ డాలర్లు. వీరిలో అత్యధికులు వారసత్వంగా ఆస్తులు పొందిన వారే అయినప్పటికీ, AI (కృత్రిమ మేధ) వంటి రంగాల్లో సొంతంగా ఎదిగిన వారు (Self-made) కూడా 12 మంది ఉండటం విశేషం. టెక్ రంగంలో జంగ్-యున్‌తో పాటు లువానా లోపెస్ లారా(కల్షి), లూసీ గువో (స్కేల్ ఏఐ) వంటి యువ మహిళామణులు కూడా సత్తా చాటుతున్నారు.

  • ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్‌ ఇన్వెస్టింగ్‌పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్‌ని అందిస్తున్నట్లు వివరించింది.

    2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్‌ ఫండ్‌ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్‌ ఫండ్‌ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఫండ్‌ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్‌ క్యాప్‌ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్‌కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.

    యాక్టివ్‌గా మేనేజ్ చేసే ఫండ్స్‌తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్‌లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు.

  • జపాన్‌లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్‌కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.

    ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలు
    ప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.

    గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వం
    ఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు. 

    అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.

    పెంపునకు కారణం ఏంటి?
    మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

International

  • ఇస్లామాబాద్‌లో జరిగిన సుదీర్ఘ శాంతి చర్చల అనంతరం అమెరికా ప్రతినిధి బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జరిపిన టెలిఫోన్ సంభాషణలోని విషయాలను.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.

    ''నేను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. ఆయన ఇస్లామాబాద్ నుంచి తిరిగి వస్తున్న విమానంలో నుంచి నాకు ఫోన్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రతిరోజూ చేసే విధంగానే, ఆయన చర్చల పురోగతి గురించి నాకు వివరంగా నివేదించారు. ఈ సందర్భంలో.. చర్చలు విఫలం గురించి తెలియజేశారు'' అని నెతన్యాహు పేర్కొన్నారు.

    సుదీర్ఘ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం.. ఇరాన్ ఒప్పందాన్ని పాటించకపోవడమే. ఒప్పందం ప్రకారం.. ఇరాన్ వెంటనే కాల్పుల విరమణ చేయాలి, హోర్ముజ్ జలసంధిని తెరవాలి. అయితే.. ఇరాన్ ఈ నిబంధనలను అమలు చేయలేదు. అందువల్ల, అమెరికా ఈ పరిస్థితిని అంగీకరించలేక చర్చల నుంచి వెనక్కి తగ్గిందని తెలిపారు.

    ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, అమెరికా ఇరాన్‌పై నౌకాదళ నిర్బంధం విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇజ్రాయెల్ పూర్తిగా మద్దతు ఇస్తోందని నేతన్యాహు స్పష్టం చేశారు. అంతే కాకూండా.. ఇజ్రాయెల్ - అమెరికా మధ్య ఉన్న సమన్వయం ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

    ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి (Abbas Araghchi) ప్రకారం.. ఈ చర్చల సమయంలోనే నేతన్యాహు వాన్స్‌కు ఫోన్ చేయడం వల్ల చర్చల దృష్టి మారిపోయిందని ఆరోపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. అమెరికా చర్చల ద్వారా సాధించలేనిది యుద్ధం ద్వారా సాధించాలని ప్రయత్నిస్తోంది.

    మొత్తం మీద.. ఈ ఘటన అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. శాంతి చర్చలు విఫలమవడం వల్ల ప్రాంతీయ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

  • న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించాయని వస్తున్న ప్రచారాన్ని ఇరాన్‌ ఖండించింది. భారత ట్యాంకర్లు టోల్ ఫీజు చెల్లించలేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. 

    ఈ కష్టకాలంలో భారత్‌-ఇరాన్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాలు ఒకే రకమైన ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా, ఇరాన్‌కు టోల్‌ చెల్లింపులు చేసే నౌకలను అడ్డుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

    “ఇప్పటి వరకు ఇరాన్‌ ఏమైనా వసూలు చేసిందా? అని మీరు భారత ప్రభుత్వాన్ని అడగవచ్చు” అని మహమ్మద్ ఫతాలి ఇరాన్ దౌత్య కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.

    ఎల్పీజీ తీసుకెళ్తున్న 9 నౌకలు బయలుదేరేందుకు ఎలాంటి టోల్ చెల్లించలేదని భారత్ ఇప్పటికే పలుసార్లు తెలిపింది. మరోవైపు, పర్షియన్ గల్ఫ్‌లో 15 భారత జెండా ఉన్న నౌకలు ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాయని భారత్ చెబుతోంది. భారత్ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాల్లో సుమారు సగం హార్మూజ్ జలసంధి గుండా వెళ్తుంది.

    కాగా, అమెరికా-ఇరాన్‌ మధ్య ఇటీవల కుదిరిన కాల‍్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హార్మూజ్‌ జలసంధి మీదుగా నౌకలను అనుమతించలేదు. తమ మిత్రదేశాలకు మాత్రమే ఇరాన్‌ అనుమతి ఇచ్చింది.

    నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటిని నాశనం చేస్తామని ఇరాన్ చెప్పింది. వాటి సురక్షిత ప్రయాణం కోసం ఫీజులు వసూలు చేస్తామని కూడా తెలిపింది. అయితే, టోల్ చెల్లించడం సరైన మార్గం కాదని ట్యాంకర్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్టాంకో సంస్థకు చెందిన ఫిలిప్ బెల్చర్ చెప్పారు.

  • వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్‌ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్‌ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్‌ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.

    నిన్న ఇదే అంశంపై ట్రంప్‌ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్‌లో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్‌ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్‌ జలసంధి ఇరాన్‌ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.

    యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్‌ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్‌ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్‌ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.

    మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్‌ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్‌ ఇప్పటికే హర్మూజ్‌ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.

    ఇరాన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్‌ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు.

  • వాషింగ్టన్‌: ఇరాన్‌ సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలను అడ్డుకుంటామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. ఇరాన్‌ పోర్టులను అమెరికా సైన‍్యం నిర్బంధించడం ప్రారంభించింది. అంతేగాక, ఇరాన్ నౌకలకు ట్రంప్ హెచ్చరిక జారీచేశారు. “గల్ఫ్‌లో మా నిర్బంధాన్ని లెక్క చేయకుండా ఏ నౌక వచ్చినా దాన్ని వెంటనే నాశనం చేస్తాం” అని అన్నారు.

    ఇరాన్ నౌకాదళం ఇక పనిచేయలేని స్థితిలో ఉందన్నట్లు ట్రంప్‌ అతిశయోక్తితో ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. “ఇరాన్ నౌకాదళం సముద్ర అడుగునే ఉంది. 158 నౌకలు పూర్తిగా నాశనమయ్యాయి. మేము దాడి చేయని వాటి సంఖ్య తక్కువగా ఉంది. ఇరాన్‌ వాటిని ‘ఫాస్ట్ అటాక్ షిప్స్’ అని పిలుస్తోంది.. కానీ, అవేమో చిన్న నౌకలు. అవి ప్రమాదమని మేము భావించడంలేదు. 

    హెచ్చరిక చేస్తున్నాను.. ఈ నౌకల్లో ఏదైనా మేము చేపట్టిన మా నిర్బంధానికి దగ్గరగా వస్తే, సముద్రంలో పడవలపై మత్తు పదార్థాల వ్యాపారులను ఎదుర్కొనే విధానంలో వీటిని కూడా ఎదుర్కొని వెంటనే నాశనం చేస్తాం. ఈ చర్య వేగంగా, క్రూరంగా ఉంటుంది. పీఎస్ సముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి వచ్చే మత్తు పదార్థాల్లో 98.2% ఆగిపోయాయి” అని ట్రంప్ తెలిపారు.

    కాగా, డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్ జలసంధిని నిర్బంధించడానికి వేసుకున్న ప్లాన్‌లో తాము పాల్గొనబోమని నాటో మిత్ర దేశాలు సోమవారం తెలిపాయి.  యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే జోక్యం చేసుకుంటామని సూచించాయి, ఈ నిర్ణయం ట్రంప్‌కు అసహనం కలిగించి, కూటమిలో ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది.

     

  • ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌  తీవ్ర  స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని  ఇరాన్  తాజాగా హెచ్చరించింది.  యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

    అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని  ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.  అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24  డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్  102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది.

     ఇదీ చదవండి: రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?

    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే  ఆందోళన నెలకొంది.  

    ఇదీ చదవండి: పోప్‌కు కౌంటర్‌ : ట్రంప్‌ సంచలన పోస్ట్‌

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,పోప్ లియో XIV మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పోప్‌ను విమర్శించిన కొద్దిసేపటికే, ట్రంప్ తనను తాను ఏసు క్రీస్తు తరహాలో చిత్రీకరించుకున్న ఒక AI చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పోప్ లియోతో వివాదం మధ్య, ట్రంప్‌ తాజా పోస్ట్‌  సంచలనంగా మారింది. 

    .ప్రపంచ సంఘర్షణలపై పోప్ లియో XIV వైఖరిని విమర్శిస్తూ, బలహీనుడు, అతి ఉదారవాది అని  అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ తర్వాత క్రీస్తును పోలిన తన చిత్రాన్ని  సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ చిత్రంలో, ట్రంప్ దైవిక కాంతితో కూడిన వస్త్రాలతో,  ఒక వ్యక్తిని "స్వస్థత" పరుస్తున్నట్లుగా, పక్కనే దేవదూతలు లేదా సైనికులు ఉన్నట్లుగా ఆ చిత్రం ఉంది.  

    ఇదీ చదవండి: రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?

    ఫ్లోరిడా నుండి వాషింగ్టన్‌కు తిరిగి వస్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడుతూ, తాను పోప్‌కు ఫ్యాన్‌కు కాదని, అందుకే ప్రపంచ సమస్యలపై ఆయన వైఖరిని విమర్శించానని ట్రంప్‌ పేర్కొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించే తన ప్రయత్నాలను పోప్ వ్యతిరేకిస్తున్నారని, తద్వారా అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని  ట్రంప్‌ ఆరోపించారు.

    కాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌  చేస్తున్న యుద్ధాన్ని పోప్‌ తీవ్రంగా ఖండించారు. 'సర్వశక్తిమంతులమనే భ్రమ' ఆజ్యం పోస్తోందని పోప్‌ ఘాటుగా విమర్శించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పోప్ నేరుగా ట్రంప్ పేరు ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు అమెరికా నాయకత్వాన్ని ఉద్దేశించినవిగా కనిపించాయి. దీనికి ప్రతిస్పందనగా, లియో 'విదేశాంగ విధానానికి పనికిరాడని' ట్రంప్ ఆరోపించారు ,నేరం, అణు ముప్పు వంటి విషయాలపై మెతక వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటం సరైనదేనని భావించే పోప్ తనకు అవసరంలేదంటూ మరోసారి  విమర్శనాస్త్రాలను సంధించారు.  మరోవైపు పోప్‌తో విభేదాల నేపథ్యంలో తనను తాను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం ఇది అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

    ట్రంప్ తనను తాను దైవంగా అభివర్ణించుకున్న వైనం మిత్రదేశాలు, శత్రువులు ఈ పోరాటాన్ని చూసే విధానాన్ని మార్చి వేస్తుందా?  ఒకవేళ ఈ ఇరాన్ యుద్ధాన్ని 'పవిత్ర యుద్ధం'గా చిత్రీకరిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్కులు ముఖ్యంగా అమెరికాలో నవంబర్ మధ్యంతర ఎన్నికలలో ఓటు వేయనున్న 7 కోట్ల మందికి పైగా క్యాథలిక్కులను ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    ఇదీ చదవండి : ట్రంప్‌ అంటే నాకేమీ భయం లేదు.. పోప్‌ లియో సంచలన వ్యాఖ్యలు

  • వాటికన్,వైట్ హౌస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పోప్‌ లియో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటే తనకు  భయం లేదని, యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని పోప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను  అన్యాయం, క్రూరమైనవిగా  అభివర్ణించారు. ఏ మత సిద్ధాంతం కూడా యుద్ధాన్ని సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.

    ట్రంప్ ఎన్ని విమర్శలు చేసినా, శాంతి కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని పోప్‌ లియో (Pope Leo) చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటన ప్రారంభంలో భాగంగా అల్జీర్స్‌కు వెళ్తున్న పోప్ విమానంలో రాయిటర్స్‌తో మాట్లాడారు.  అయితే తాను ట్రంప్‌తో నేరుగా ఘర్షణకు దిగబోనని, కానీ మత బోధనలను దుర్వినియోగం చేయవద్దని  లియో హెచ్చరించారు. 

    ఇదీ చదవండి: రిషబ్‌శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలను  పోప్‌ ఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు.   ముఖ్యంగా అమెరికా నేతృత్వంలో ఇరాన్‌పై యుద్ధాన్ని పోప్ ఇటీవల విమర్శించిన నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో సంయమనం,శాంతి కోసం పిలుపునిచ్చారు లియో.  "సర్వశక్తిమంతులమనే భ్రమ" ఈ యుద్ధానికి కారణం అంటూ ధ్వజమెత్తారు. స్వార్థం, డబ్బుపై ఆరాధన చాలు!", అధికార ప్రదర్శన చాలు! యుద్ధం చాలు! అని లియో గట్టిగా హెచ్చరించారు.

    పోప్‌ వ్యాఖ్యలపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోప్‌ను నేరాల విషయంలో బలహీనమైన వ్యక్తి అని, విదేశీ విధానంపై అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్  తనకు  వద్దు,  తాను ఏ పని కోసం అయితే  అఖండ మెజారిటీతో ఎన్నికయ్యానో, ఆ పనిని కచ్చితంగా చేస్తున్నానని సోషల్‌మీడియా వేదికగా ట్రంప్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోప్‌ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వాదోప వాదాలు, ఈ సంఘర్షణ  వైట్ హౌస్ , వాటికన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి.

    కాగా ముంబైలో పుట్టి పెరిగి, అమెరికా పౌరసత్వం కలిగి ఉండి, గత ఏడాది (మే 2025) క్యాథలిక్ చర్చికి తొలి అమెరికన్ పోప్‌గా ఎన్నికైన వ్యక్తి పోప్ లియో XIV (రోబర్ట్ ప్రివోస్ట్). ప్రస్తుతం పోప్ లియో 11 రోజుల ఆఫ్రికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో అల్జీరియా, అంగోలా, కెమెరూన్, ఈక్వటోరియల్ గినియా దేశాలను సందర్శించనున్నారు. అమెరికాలోని 70 మిలియన్ల క్యాథలిక్ ఓటర్లపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్‌ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం

  • ఖార్టూమ్: యుద‍్ధం సృష్టించే విధ్వంసాలు అన్నీఇన్నీ కాదు. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతాం. ఇదే విధంగా నష్టపోయింది సూడాన్‌. అక్కడ లక్షలాది మంది రోజుకు ఒక్క పూట భోజనంతోనే జీవిస్తున్నారని ఎన్జీఓలు చెబుతున్నాయి. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఇక్కడితోనూ ఆగకుండా మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఎన్జీఓల తాజా నివేదిక చెబుతోంది. చిన్నారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

    “సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది. ఈ యుద్ధం సూడాన్‌లో ప్రజలు ఆకలి కేకలు పెట్టేలా చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఇది ఒకటి. లక్షలాది మందిని నిరాశ్రయులుగా మార్చింది” అని యాక్షన్ అగైనెస్ట్ హంగర్, కేర్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ, మెర్సీ కార్ప్స్, నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ తాజాగా నివేదికలో పేర్కొన్నాయి.

    దాదాపు మూడు సంవత్సరాల ఘర్షణ, హింస, సూడాన్ ఆహార వ్యవస్థను క్రమంగా దెబ్బతీసింది. ఘర్షణ తీవ్రంగా ఉన్న ఉత్తర దార్ఫూర్, దక్షిణ కొర్డోఫాన్ రాష్ట్రాల్లో లక్షల కుటుంబాలు రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయగలుగుతున్నాయి. వారు ఒక్కోసారి పూర్తిగా ఒక రోజు మొత్తం భోజనాన్ని మానేస్తున్నారు. అలాగే, జీవించేందుకు చాలా మంది ఆకులు, పశువుల మేత తినే స్థితికి చేరుకున్నారు. చిన్నారులకూ ఈ కష్టాలు తప్పడం లేదు. ఇది ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతోందని ఎన్జీఓల నివేదిక తెలిపింది.

    వేలాది మంది మృతి
    సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య 2023 ఏప్రిల్‌లో యుద్ధం ప్రారంభమైంది, ఇది తీవ్ర హింసకు దారి తీసి ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా మారింది. 1.2 కోట్ల మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలివెళ్లాల్సి వచ్చింది. 3.3 కోట్లకు పైగా ప్రజలకు మానవతా సాయం అవసరం ఉంది.

    గత మూడేళ్లలో 40,000 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సహాయ సంస్థలు నిజమైన మరణాల సంఖ్య దీనికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నాయి. 2026 మానవతా అవసరాలు, ప్రతిస్పందన ప్రణాళిక ప్రకారం, సూడాన్ జనాభాలో 61.7 శాతం (2.89 కోట్లు) మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.

    సైన్యం మద్దతుతో ఉన్న సూడాన్ ప్రభుత్వం కరువు పరిస్థితి లేదని చెబుతుండగా, తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో అలాంటి పరిస్థితులకు తాము బాధ్యత కాదని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ చెబుతోంది.

    ఉమ్ బారు ప్రాంతంలో తీవ్రమైన పోషకాహార లోపం కరువు స్థాయిని మించి ఉందని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ గుర్తించింది. అక్కడ ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం రేటు కరువు స్థాయికి దాదాపు రెట్టింపు ఉంది. అలాగే కర్నోయి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.

    యుద్ధం వల్ల మహిళలు, బాలికలు అధికంగా ప్రభావితమయ్యారు. ఎందుకంటే వారు పొలాలకు, మార్కెట్లకు, నీటికి వెళ్లినప్పుడు అత్యాచారం, వేధింపులను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది.

  • వాషింగ్టన్‌: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌కు అయుధ సాయం చేస్తే 50 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో టారిఫ్‌ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. 

    త్వరలో ఇరాన్‌కు చైనా పెద్దమొత్తంలో ఆయుధ సాయం చేయనుందంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. చైనా అందించే క్షిపణులతో ఇరాన్‌ తన శత్రు దేశాల విమానాలను కూల్చేందుకు, ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఉపయోగించనుందని కథనాలు హైలెట్‌ చేశాయి.

    ఈ క్రమంలో ఫాక్స్‌ న్యూస్‌ రిపోర్టర్‌ మరియా సారా బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్రికా కథనాలపై ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధ సాయం చేసే దేశాల జాబితాలో చైనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని రిపోర్టర్‌ మరియా ట్రంప్‌ను ప్రశ్నించారు. 

    అందుకు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఆయుధ చేసే దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. చైనా-ఇరాన​ ఆయుధ ఒప్పందంపై వెలుగులోకి వచ్చిన మీడియా కథనాల్లో వాస్తవం ఉండకపోవచ్చు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. అదే నిజమైతే చైనాతో పాటు ఇతర దేశాలపై 50 అంతకంటే ఎక్కువ శాతం సుంకం విధిస్తాం. మీరన్నట్లు ఇరాన్‌కు చైనా ఆయుధ సాయం చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే చైనాకు మాకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి వారు అలా చేస్తారని నేను అనుకోను. అలా చేయరు కూడా. బహుశా యుద్ధం ప్రారంభంలో తక్కువ మొత్తంలో పంపిస్తే.. పంపించి ఉండొచ్చు. కానీ ఇకపై అలా చేస్తారని నేను అనుకోను.  ఆయుధ సాయం చేస్తూ దొరికిపోతే వారిపై 50 శాతం సుంకం విధిస్తాం’ అని స్పష్టం చేశారు.

    అనంతరం చైనా చమురు కొనుగోళ్ల కోసం అమెరికాకు, వెనుజువెలాకు షిప్పులు పంపుకోవచ్చు. వెనెజువెలా నుంచి చమురు కొనుక్కోమని మేమే చెప్పాం. మన దగ్గర అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. మేమే వారికి వెనెజువెలా అమ్మే ధరకంటే తక్కువ ధరకే అమ్ముతాము’అని ట్రంప్‌ అన్నారు. 

Crime

  • దేశ రాజధాని నగరంలో మరో సెక్స్‌ రాకెట్‌ బట్టబయలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సెంట్రల్‌ ఢిల్లీలో, అజ్మేరీ గేట్‌ సమీపంలోని ఎస్‌.ఎన్‌. మార్గ్‌లో ఉన్న ఒక ఇంటిపై 12వతేదీన పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ ఎనిమిది మంది యువతులు, పలువురు పురుషులు అక్రమ అశ్లీల కార్యకలాపాలలో నిమగ్నమై ఉండటాన్ని  కనుగొన్నారు. ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లు కూడా నిండని మైనర్‌ అని తేలింది. ఈ ముఠా సూత్రధారి రాహుల్, తన భార్య కుమారితో కలిసి ఈ మొత్తం కార్యకలాపాన్ని నడుపుతున్నాడు. మేనేజర్లు గోపీ రామ్‌ పరిహార్, లుమాకాంత్‌ పాండే,  ఆలియా పింకీలను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ఆ సంస్థ నిర్వహణను పర్యవేక్షించే బాధ్యత వహించారు.  

    పోలీసులు ఆ ప్రాంగణంలో సోదాలు నిర్వహించగా, ఎనిమిది వేర్వేరు గదులలో పలువురు పురుషులు, మహిళలు  అశ్లీల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ మొత్తంలో నగదు (సుమారు రూ.1.97 లక్షలు), విదేశీ కరెన్సీ, గంజాయి, లైంగిక సామర్థ్యాన్ని పెంచే క్యాప్సూల్స్, వందలాది మద్యం సీసాలు, బీర్‌ క్యాన్లు,  కండోమ్‌లు, లావాదేవీల లెడ్జర్లు, కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళల్లో ఒకరు 17 ఏళ్లలోపు మైనర్‌ అని సమాచారం.

    నగ్నంగా వచ్చెయ్‌.. నచ్చిన  వారితో ఎంజాయ్‌
    ఆ ఇంటిలో నడుస్తున్న వ్యభిచారం మరింత కొత్త పుంతలు తొక్కినట్టు తెలుస్తోంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే నగ్నంగా మారాలనేది నిబంధన కాగా అక్కడ అందరూ నగ్నంగానే సంచరిస్తారట. ఆ తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిల్లో నచ్చిన వారితో ఎంజాయ్‌ చేయవచ్చునట. ఇక అక్కడ జరిగే తంతు పోర్న్‌ వీడియోలకు తీసిపోని రీతిలో ఉంటుందట. వీరి క్లయింట్లు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, భిన్న రంగాల ప్రముఖులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇప్పటి వరకూ దీనిపై పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ సోషల్‌ మీడియా లో ఈ వార్త వైరల్‌ అవుతోంది.

    దేశరాజధానిలో విచ్చలవిడిగా...
    గత కొంత కాలంగా ఢిల్లీలో పెద్ద సంఖ్యలో వ్యభిచార అడ్డాలు, సెక్స్‌ రాకెట్‌లు వెలుగు చూస్తుండడం దేశ రాజధాని నగర ప్రతిష్టను మసకబారుస్తోంది. ఢిల్లీ–ఎన్ సిఆర్‌ ప్రాంతంలో నకిలీ డేటింగ్‌ యాప్‌ ప్రొఫైల్‌ల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుని అశ్లీల చిత్రాల దందాలు  ఆన్ లైన్‌ దోపిడీ (సెక్స్‌టార్షన్‌) పెరిగాయని పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి, అలాగే ఢిల్లీ పోలీసులు, తరచుగా స్పా సెంటర్లు లేదా క్లబ్‌ల ముసుగులో నడుస్తున్న అక్రమ సెక్స్‌ రాకెట్‌లు బయటపడుతున్నాయి.

    గత  ఏడాది మార్చి లో పహర్‌గంజ్‌ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఒక సెక్స్‌ రాకెట్‌ను ఛేదించారు. ఆ సమయంలో 10 మంది నేపాలీ జాతీయులు ముగ్గురు మైనర్లతో సహా 23 మంది మహిళలను రక్షించారు. మానవ అక్రమ రవాణాలో పాల్గొన్న ఏడుగురిని అరెస్టు చేశారు. అదే  మార్చి నెలలో గ్రాండ్‌ ప్లాజాలోని బ్లిస్‌ వెల్నెస్‌ స్పాపై  జరిపిన దాడిలో, విదేశీయులు మైనర్లతో కూడిన సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్నందుకు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌ నగర్‌లో రెండు స్పా సెంటర్ల పేరిట నడుస్తున్న వ్యభిచార రాకెట్‌పై దాడి అనంతరం ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేశారు.

    ఈ ఆపరేషన్ లో తొమ్మిది మంది మహిళలను రక్షించారు. ఇలా చెప్పుకుంటూ పోతే  పోలీసులు దాడులు, అరెస్టులు కు దొరుకుతున్నవే పెద్ద జాబితా అవుతుంది. ఇక. దొరకని ముఠాలు ఎన్ని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా ఉండాల్సిన దేశ రాజధాని నగరంలో ఇలాంటి పరిస్థితి ఉండడం అవాంఛనీయం. దీనిని  యుద్ధ ప్రాతిపదికన  పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Andhra Pradesh

  • సాక్షి,నెల్లూరు: వైఎ‍స్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న జువ్వలదిన్నె హార్బర్‌కు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం తెలిపారు.

    ‘కూటమి ప్రభుత్వం హార్బర్‌ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గ సమస్యకు అండగా నిలవడానికి వైఎస్‌ జగన్‌ వస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మితమైంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతం అవడం ఖాయం’ అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. 

  • తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అత్యాశ వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం (ఏప్రిల్‌ 13) పేర్నినాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

    ‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి? బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.

    రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మావిగన్‌ అనే ప్రతిపాదనతో రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మితమవుతుంది. 

    ప్రజలు అమాయకులేం కాదు.. అన్నీ ఆలోచిస్తారు. చంద్రబాబుకు విశ్వాసం లేదని ఎన్టీఆర్‌ విమర్శించారు. 224 మంది ఎమ్మెల్యేలను కాసులతో కొనుక్కున్నారని ఎన్టీఆర్‌ అన్నారు. వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే అన్నారు. కేబినెట్‌లో ఉన్న తొమ్మిది మంది మంత్రులే చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారు

    రాజధానికి అప్పులు చేసి ఏం ఏస్తారు? అప్పులతో 7 కోట్ల ప్రజలను తాకట్టు పెడుతున్నారు. రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామని జబ్బలు చరుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు మా ప్రాంతానికి చేసిందేంటి?’ అని పేర్ని నాని అన్నారు.

    అమరావతి వలన కలిగే‌ ప్రయోజనం ఏంటో? మావిగన్ వలన కలిగే నష్టం ఏంటో చంద్రబాబు చెప్పటం లేదని పేర్ని నాని అన్నారు. ‘మావిగన్ ప్రకటనకు 48 గంటల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  మావిగన్‌కు అడవిలో ఉండే గిరిజనులు సైతం మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయకూడదు. 

    మావిగన్ పై జనంలో మంచి రెస్పాన్స్ రాగానే బొత్స, ధర్మానపై కూటమి నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు వాడుకుని వదిలేసేరకం అని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో అన్నారు. మళ్లీ వచ్చి ఏం చేస్తావ్? అని పవన్ కల్యాణ్ విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకాలే రాశారు. 

    కాంట్రాక్టర్లను రాత్రి సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడని చంద్రబాబుకు టార్చ్‌లైట్ మంత్రి అనే పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు చూపిస్తాం. టీటీపీ నేతలు వీటిని కూడా ప్రెస్‌మీట్ లో చూపించగలరా? చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలకు చూపించే టైం వస్తుంది. 

    అమరావతి, మావిగన్ లలో దేనికి  సత్తా ఉందో ప్రజలకు ఎందుకు చెప్పటం లేదు? మావిగన్ ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోనే ఉందని చంద్రబాబు అంటున్నారు. పామర్రు వరకు సీఆర్‌డీఏ లో మరి మాస్టర్ ప్లాన్ ఎందుకు లేదు? జగన్ మావిగన్ అనగానే ఇప్పుడు సర్వే సంస్థలను కొన్ని గ్రామాలకు ఎందుకు పంపారు? 

    అమరావతిలో రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామన్న ప్రభుత్వం మా ప్రాంతంలో ఏం అభివృద్ధి చేస్తున్నారు? మేము కూడా రాజధానిలోనే ఉంటే మరి మావైపు ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? మావైపు ఒక్క టవర్ కూడా ఎందుకు కట్టలేదు? జడ్జీల బంగ్లాలు, అసెంబ్లీ, ఇతర బిల్డింగులు మా ఏరియాలో ఎందుకు కట్టటం లేదు? అసలు అమరావతిలో నిర్మించే భవనాలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. బేసిక్ నిర్మాణాలకే రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట. 

    ఇక కరెంటు, నీరు, డ్రైనేజీలు ఇతరత్రా పనులకు ఎంత ఖర్చు చేస్తారు? ఇవి కాకుండా అంతర్గత రోడ్లకు ఎంత ఖర్చు చేస్తారు? చంద్రబాబు, మంత్రి నారాయణ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరినీ మానసిక వైద్యులకు చూపించాలి. ఎకరంలో జగన్ ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అన్నారు. మరి ఐదు ఎకరాల్లో చంద్రబాబు కట్టేదాన్ని ఏం అనాలి? వెలగపూడిలో సచివాలయం లిఫ్టులే పని చేయటం లేదు, ఇక ఏం రాజధాని బిల్డింగులు కడతారు? అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?

    ఇంకా ఎంత అప్పు చేస్తారు? మావిగన్ ఎందుకు అవసరం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి చట్టబద్ధత అనగానే చంద్రబాబు, లోకేష్ పండుగ చేసుకున్నారు. కానీ భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు అయినా సంబరాలు చేసుకున్నారా? జనానికి అప్పులు, చంద్రబాబుకు సంపద మిగులుతుంది. టీడీపీ వారు కూడా మావిగన్ ప్రతిపాదనను మెచ్చుకుంటున్నారు’ అని పేర్ని నాని చెప్పారు. 

  • తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రత్యర్థి పార్టీల వారిని వేధించడానికే అన్నట్టుగా ఆ వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. డీజీపీ, కొందరు ఎస్పీలు, సీఐలు పనిగట్టుకుని మరీ జులుం ప్రదర్శిస్తున్నారని చెప్పారు.

    తాడేపల్లిలో టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ‘నేరస్థులను వదిలేసి వైఎస్సార్‌సీపీ క్యాడర్ వెంట పడుతున్నారు. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ అనేదే లేకుండా పోయింది. గత రెండేళ్లుగా రాజకీయ కక్షసాధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారు.

    బాధితుల మనోభావాలు, పరువు- ప్రతిష్ట గురించి ఆలోచించరా? పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు చెంపలేసుకోవాలి. కోర్టు ఆదేశాలను సైతం పోలీసు అధికారులు పట్టించుకోవటం లేదు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మహిళను మోసం చేసిన అరవ శ్రీధర్ ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఎస్పీ ఆఫీసులో దూరిన ఎమ్మెల్యే అరవిందబాబుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 

    టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మరొక మహిళతో స్వామి వారిని దర్శించుకోవటం సిగ్గుచేటు. సంస్కృతిని సర్వనాశనం చేసిన బీఆర్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నసీర్ అహ్మద్, కోనేటి ఆదిమూలం మహిళలను వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారు? రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారిపోయారు. అలాంటి పోలీసుల ఆటలు సాగనివ్వం. 
    ఎల్లాకాలం చంద్రబాబు పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకావని గుర్తుంచుకోవాలి’ అని టీజేఆర్ సుధాకర్ బాబు చెప్పారు.

  • గుంటూరు: తక్కువ ధరలకే భూములు కట్టబెట్టడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు. అక్రమ భూకేటాయింపులపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించారు.

    ఇందులో పాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువచేసే భూములను బడా బాబులకు కట్టబెడుతోందని తెలిపారు. 99 పైసలకి భూములు కేటాయించిన జీవోలు కొన్ని మాత్రమే బయటపడ్డాయని, కనిపించకుండా ప్రభుత్వం దాచిపెట్టిన జీవోలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల భూములపైనే కాకుండా దేవుడి భూములపై కూడా కన్నేశారని తెలిపారు. ఇలా ప్రభుత్వం భూముల కేటాయింపులో ఇప్పుడు కొత్తరకం మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు.  

    మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రజల ఆస్తులకు ధర్మ కర్త మాత్రమే. ప్రజల ఆస్తులు ఎవరికిబడితే వారి కట్టబెట్టడానికి వీల్లేదు. విశాఖలో 99 పైసలకే కొన్ని కంపెనీలకు భూములు కేటాయించడం దారుణం. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతికి ఓఆర్ఆర్ వేస్తామని చెప్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని చెన్నై కంపెనీకి ఇవ్వాలని ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లే అడ్డుకున్నాం. ఇవాళ కూడా బెజవాడలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ను కేటాయిస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాం’ అని చెప్పారు.

     

  • సాక్షి,విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం అధికారులు ఆమె భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బదులుగా ఇవ్వాల్సిన రూ.24 లక్షల నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని వృద్ధురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అనేక సార్లు కలెక్టరేట్‌లో వినతిపత్రాలు సమర్పించినా, అధికారులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. 

    ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన బాధితురాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కారం చల్లారు. తన భూమి తీసుకుని వేరే వారికి డబ్బులు చెల్లించారని ఆరోపించారు. అధికారుల తీరుతో విసుగెత్తి ఈ చర్యకు దిగినట్లు వృద్ధురాలు మీడియా ఎదుట వెల్లడించారు.
     

Telangana

  • సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేయనున్నాం. మేనిఫెస్టోలో ఉన్నవే మేం అడుగుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.   

  • సాక్షి,కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యూనిక్‌ మర్కంటైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.800 కోట్లకు టోకరా వేసింది.

    మల్టినెట్‌ వర్కింగ్‌ సంస్థ యూనిక్‌ ఎస్‌ఎంసీఎస్‌ పేరుతో భారీ ఎత్తున జిల్లా వాసుల నుంచి డిపాజిట్లు, ప్రీమియం వసూళ్లు చేపట్టింది. పెట్టిన మొత్తం కంటే ఎక్కువ మొత్తంలో తిరిగి చెల్లిస్తామని ఆశ చూపించింది. అధిక లాభాలకు ఆశపడిన పెట్టుబడి దారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.    

    భారీ ఎత్తున వసూళ్ల అనంతరం బోర్డు తీప్పేసింది. సంస్థకు తాళాలు వేసి ఉండడంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

     

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్‌తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! 

    వరుడిని ‘బాహుబలి’ గెటప్‌లో స్టైలిష్‌గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్‌లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

    ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు!

  • బౌన్సర్లు.. సినీ తారలు, బడా పారిశ్రామికవేత్తల పక్కన మాత్రమే కనిపించేవారు. నగరాల్లో పబ్బులు, క్లబ్బుల్లోనే వీరి హడావుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరైనసెలబ్రిటీ బయట అడుగు పెట్టినా,వేడుకై నా, ప్రారంభోత్సమైనా వీరిని నియమించుకోవడం సర్వసాధారణమైంది. అయితే, నగరాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ కల్చర్‌ కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకూ విస్తరించింది.

    నల్లగొండ టూటౌన్‌ : ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను అట్టహాసంగా జరుపుకుంటున్నారు. శుభకార్యం చిన్నదైనా, పెద్దదైనా బంధుమిత్రుల ముందు తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి కొందరు ప్రత్యేకంగా బౌన్సర్లను నియమించుకుంటున్నారు. వేడుకలో కొత్తదనం చూపించేలా, తోపులాట జరిగినా అదుపు చేసేలా పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ ట్రెండ్‌ నడుస్తోంది. 

    ఏ వేడుకలో చూసినా నల్లకోటు, దృఢమైన శరీరంతో కనిపించే బౌన్సర్లు సందడి చేస్తున్నారు. సంపన్న కుటుంబాల వారి వేడుకల్లో ఫంక్షన్‌ హాల్‌ గేటు నుంచి వేదిక వరకు వీరి హడావుడి కనిపిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు పోలీసుల బందోబస్తుతో పాటు బౌన్సర్ల సేవలను వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు పెట్టే బహిరంగ సభలకూ బౌన్సర్లను వినియోగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహిరంగ సభలకు సైతం బౌన్సర్లను వినియోగించారు. వివిధ పట్టణాల్లో షాపింగ్‌ మాల్స్‌, ఆస్పత్రులు ప్రారంభించేందుకు సినీనటులు, మంత్రులు వచ్చే సందర్భంలోనూ బౌన్సర్లను పెడుతున్నారు.

    బౌన్సర్‌కు రూ.1500 
    బౌన్సర్ల వినియోగం పెరగడంతో సంబంధిత ఏజెన్సీలకు మంచి ఆదరణ లభిస్తోంది. యువతకు కూడా ఇదొక ఉపాధిగా మారింది. పదవ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ రంగంలో ఉపాధి పొందవచ్చు. బౌన్సర్లు ప్రతిరోజూ జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, డైట్‌ పాటిస్తూ తమ శరీర ఆకృతిని కాపాడుకుంటున్నారు. ఫంక్షన్ల నిర్వాహకులు ఒక్కో బౌన్సర్‌కు రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. అందులో కొంత సెక్యూరిటీ సంస్థ కమీషన్‌గా తీసుకుంటుంది. అయితే నల్లగొండ జిల్లాలో పురుషులు మాత్రమే బౌన్సర్లుగా సేవలందిస్తున్నారు. మహిళా బౌన్సర్లు లేరు. ఏదైనా వేడుకకు మహిళా బౌన్సర్లు కావాలని కోరితే హైదరాబాద్‌ నుంచి పిలిపిస్తామని సెక్యూరిటీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

    ఆడంబరం కాకుండా.. అవసరం కోసం 
    కేవలం ఆడంబరమే కాకుండా, అవసరం కోసం వీరిని నియమించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వేడుకల్లో స్టేజీ మీదకు వెళ్లే సమయంలో తోపులాట జరగకుండా, అతిథులు క్రమ పద్ధతిలో వెళ్లేందుకు బౌన్స ర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకుల సొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ శుభకార్యం చేసుకునేవారు సొంతంగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు.

    బౌన్సర్లకు డిమాండ్‌ ఉంది 
    శుభకార్యాలు జరుపుకునేవారు బౌన్సర్ల కోసం మా సంస్థను ఆశ్రయిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించుకోవడానికి బౌన్సర్లను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఆలయాల వద్ద కూడా మా బౌన్సర్ల సేవలు అందిస్తున్నాం. రాజకీయ పార్టీల సభలకు కూడా పంపిస్తున్నాం. దీంతో బౌన్సర్లకు డిమాండ్‌ పెరిగింది.
    – జానీపాషా, సురక్ష సెక్యూరిటీ అండ్‌ బౌన్సర్‌ సర్వీసెస్‌, నల్లగొండ

National

  • న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్‌ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్‌ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    మోడరన్ వార్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్‌ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్‌ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.

    ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.

    దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది.  చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.

    భారత్‌ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. 

  • ప్రముఖ గాయని ఆశా భోంస్లే (Asha Bhosle)  అనారోగ్య కారణాలతో  92 ఏళ్ల వయసులో  (ఏప్రిల్ 12, 2026న) కన్నుమూశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు, సంగీతాభిమానులు శోక సంద్రంలో ముగినిపోయారు. ఆమె పార్థివ దేహాన్ని దర్శించి , తుది నివాళులర్పించేందుకు వేలాదిగా  అభిమానులు  ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఆమె నివాసం 'కాసా గ్రాండే'కు తరలి వచ్చారు.  వీరితోపాటు, ప్రధాని మోదీ సహా, పలువురు రాజకీయ,  సినీ రంగాలప్రతినిధులు, ఇతర సెలబ్రిటీలు ఆశామరణంపై తీవ్ర సంతాపం ప్రకటించారు.  ఈ సందర్బంగా ఆమె వారసురాలు, గాయని జానై భోంస్లే  (Zanai Bhosle) వార్తల్లోనిలిచారు. 

    భారతీయ సినీ సంగీత దిగ్గజం ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే. తన  నాన్నమ్మలా  ఈమె గాయని మాత్రమే కాదు, శిక్షణ పొందిన కథక్ నర్తకి , రచయిత్రి, నటి కూడా. ఈమె ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే కుమార్తె. ఆమె లెజెండరీ గాయని లతా మంగేష్కర్ మేనకోడలు కూడా. ముంబైలోని ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారు. సంగీతం , కళల పట్ల ఆమెకు చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. 

    ఇదీ చదవండి: రిక్షా డ్రైవర్‌ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం

    నాయనమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జానై శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాయనిగా రాణించారు. వివిధ స్టేజ్ షోలలో తన నాయనమ్మ ఆశా భోంస్లేతో కలిసి  ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ మ్యూజిక్ బ్యాండ్ "6-ప్యాక్ బ్యాండ్" (6-Pack Band) లో పాటలు పాడారు.  2022 సెప్టెంబర్ 8న, ఆశా  89వ పుట్టినరోజు సందర్భంగా  జానై భోస్లే, మంచి  కవితను పోస్ట్‌ చేశారు.

    సినిమా రంగ ప్రవేశం

    జానై భోంస్లే త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. రిషబ్ శెట్టి సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది.  "ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్" (The Pride of Bharat: Chhatrapati Shivaji Maharaj) అనే భారీ పీరియడ్ డ్రామాతో సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంస్లే పాత్రను పోషిస్తున్నారు.  ప్రముఖ దర్శకుడు సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    వ్యాపారవేత్తగా
    సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జునై గాయనిగా, నటి మాత్రమే కాదు.  వ్యాపారవేత్త కూడా. ముంబైలో ఆమెకు సొంతంగా యాపిల్ ఐఫోన్ (Apple iPhone) రిటైల్ స్టోర్ ఉంది, ఆశా భోంస్లే స్వయంగా తన మనవరాలి గురించి  చాలా సార్లు ప్రస్తావించేవారు. జునై చాలా ప్రతిభావంతురాలని, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి అని పలు సందర్భాల్లో ప్రశంసించారు.

    సిరాజ్‌తో షికార్లు అంటూ పుకార్లు
    2025 ప్రారంభంలో జానై భోస్లే, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ల మధ్య ఉన్న సంబంధం గురించిన పుకార్లు షికార్లు చేశాయి.  అయితే, రక్షాబంధన్ రోజున సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ ఈ పుకార్లకు ఇద్దరూ  చెక్‌ పెట్టారు.

    దివంగత ఆశాకు కడసారి నివాళి అర్పించేందుకు  క్రికెటర్ సిరాజ్‌ ముంబైలోని ఆమె నివాసానికి వచ్చారు. సిరాజ్‌ను చూడగానే జానై భోస్లే భోరున విలపించింది. సిరాజ్ ఆమెను ఓదారుస్తూ అక్కున చేర్చుకోవడం విశేషం.

  • సోషల్‌ మీడియా సెన్సేషన్‌ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్‌ అంటూ భర్త మహ్మద్‌ ఫర్మాన్‌ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్‌ను ఇప్పట్లో అరెస్ట్‌ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  

    కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్‌రాజ్‌(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్‌ కంట పడి ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్‌ అటుపై మూవీ ఆఫర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.

    ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్‌ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్‌ కిడ్నాప్‌, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్‌ ట్రైబ్స్‌ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. 

    అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్‌కార్డ్‌, బర్త్‌ సర్టిఫికెట్‌) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్‌ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్‌ వేశారు. ఇంతకు ముందు..

    మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్‌ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్‌ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది.  తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్‌ను అరెస్ట్‌ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్‌ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.

    మిస్సింగ్‌ కలకలం?
    మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్‌ ఖాన్‌ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్‌ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్‌కు వెళ్లామని.. అజ్మీర్‌లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే..  ఆమె మిస్‌ కావడం వెనుక ఫర్మాన్‌ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు.

  • రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో  ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్‌ పూజా మందిరంగా మార్చేసి, కాషాయ వస్త్రాలు, పూలమాలలు, దేవతా విగ్రహాలతో అలంకరించి, కదులుతున్న రైలులోనే హారతుల్విడం ఈ వీడియోలో చూడవచ్చు.

    భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'భారత్ గౌరవ్' అనే థీమ్డ్ రైల్వే రైలులో ఈ సంఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణికులంతా గుమిగూడి   పూజాకార్యక్రమాలు  భక్తి గీతాలు పాడుతూ, ఆచారాలలో  నిర్వహించడం గమనార్హం. భారత్ గౌరవ్ రైళ్లు సాధారణంగా భారతదేశం అంతటా తీర్థయాత్రలకుద్దేశించినవేఅయినప్పటికీ  కానీ ఈ వీడియో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన ఆచారాలపై చర్చను రేకెత్తించింది.

    సోషల్ మీడియా స్పందన
    ఈ వీడియో ఇంటర్నెట్‌లో భారీ  వ్యూస్‌ను సంపాదంచుకుంది. కొంతమంది వినియోగదారులు ప్రజా రవాణాలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు రైల్వే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  చాలామంది ఈ చర్యను సమర్థించారు. ఇది భారతదేశపు లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మికతలో భాగమని పేర్కొన్నారు. “ఒక ముస్లిం వ్యక్తి రైలులో నమాజ్ చేస్తే అది తప్పా... మరి దీని సంగతేంటి... నేను హిందువునే, కానీ అన్నిటికంటే ముందు నేను భారతీయుడిని.” అని  ఒకరు ‍వ్యాఖ్యానించారు. “సందర్భం ముఖ్యం! ఇది తీర్థయాత్రల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ రైలు. ఈ భక్తి కార్యక్రమాలకు సిబ్బంది అధికారికంగా మద్దతు ఇస్తున్నారు, ఇవి థీమ్ ఆధారిత ప్రయాణ అనుభవంలో భాగం. ప్రజలు వివరణ చదవకుండా లేదా ఇది ఒక సాధారణ పబ్లిక్ కోచ్ కాదని అర్థం చేసుకోకుండా స్పందిస్తున్నారు.” ఇంకొకరు ఆగ్రహం ప్రకటించారు. “వారిని ఇప్పటికే జైల్లో ఎందుకు పెట్టలేదు? బహిరంగ ప్రదేశంలో ఇలాంటి అర్థంలేని పనులను ఎలా సహిస్తున్నారు? ఇది కేవలం వైరల్ రీల్స్ కోసమా లేక ఏంటి?”  ఒకరు, “ పనీ పాటా, జ్ఞానం లేని ప్రజలు, ఇలా తయారవుతున్నారు.”  అని ఒకరు ఆగ్రహం  వ్యక్తం చేశారు.

     హితవు చెప్పిన NCIB
    ఈ వీడియో బాగా  వైరల్‌గా మారడంతో, NCIB  అధికారిక ఖాతా ద్వారా స్పందించింది. బహిరంగ ప్రదేశాల నిబంధనలను గౌరవించాలని ప్రయాణికులను కోరింది.

  • ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

    పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు (Fingers), కంటి (Iris)‌ సంబంధిత బయో మెట్రిక్‌ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్‌ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్‌ పెట్టవచ్చని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత, జస్టిస్‌ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. 

    అదే సమయంలో.. బయో మెట్రిక్‌ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని సీజే బెంచ్‌ తోసిపుచ్చింది. అది సాధ్యమయయే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.

    అడ్వొకేట్‌ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ వేసిన ఈ పిటిషన్‌లో.. ఒక ఓటర్‌ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డూప్లికేట్‌ ఓటింగ్‌, గోస్ట్‌ ఓటింగ్‌.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలింగ్‌ బూత్‌ల వద్ద బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ అమలు చేయాలి.

    సీజే బెంచ్‌ ఏమందంటే.. ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్‌ అవసరమా?. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్‌ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేనికంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉంది.

    ఇప్పటికే ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్‌ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్‌ ఎలక్షన్స్‌ కోసం బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలనుకోవడం విశేషం.

  • కోల్‌కతా:  ఎన్నికల సమయంలో మైకులు పట్టుకుని, నాయకుల వెంటపడే జర్నలిస్టులను మనం చూసేవుంటాం. అయితే ఇప్పుడు  ఓటర్ల ముందు చేతులు కట్టుకుని నిలుచుని, ఓట్లు అడుగుతున్న జర్నలిస్టులు తారసపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైనం కనిపిస్తోంది. దశాబ్దాల పాటు వార్తలు రాసి, ఎన్నికల విశ్లేషణలు చేసి, నాయకులకు  ప్రశ్నలు వేసిన నలుగురు రిపోర్టర్లు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. న్యూస్ రూమ్ నుంచి నామినేషన్ సెంటర్ల వరకు వీరి ప్రయాణం పలు మలుపులు తిరిగింది. బెంగాల్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

    ఖర్దహా నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయి అవగాహన తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కల్యాణ్ చక్రవర్తి (బీజేపీ), జాయ్‌దేబ్ ఘోష్ (కాంగ్రెస్), దేబ్‌జ్యోతి దాస్ (సీపీఐ-ఎం)గట్టి పోటీ ఇస్తున్నారు. సియురి (Siuri) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో జర్నలిస్ట్ జగన్నాథ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు నాయకుల ప్రసంగాలు కవర్ చేసిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఇంటింటి ప్రచారంలో మునిగిపోయి ప్రజల మద్దతు కూడగడుతున్నారు.

    మరోవైపు మేమారి నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న మానబ్ గుహక్.. బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీకి చెందిన రాసబిహారి హల్దర్ పోటీలో ఉన్నారు. అలాగే తారకేశ్వర్ నుంచి మరో రిపోర్టర్ సంతు పాన్ సైతం బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వీరి జర్నలిజం అనుభవం ఓట్లుగా మారుతుందో లేదో వేచిచూడాలి.

    ఇది కూడా చదవండి: అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్

  • సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. 

    వన్నియర్‌ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన  ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి  రచ్చకు దారితీయబోతున్నదో అన్న  ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో  అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. 

    ప్రచార బాట 
    సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు  ప్రచారం చేయనున్నారు.  35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన  పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్‌ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం.  రాందాసు మద్దతు దారులకు సిలిండర్‌ గుర్తును ఎన్నికల కమిషన్‌ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో  తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్‌దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు  సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. 

    కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్‌కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న  చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న  విక్రవాండి, సెంజి, కీల్‌పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

  • మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రశ్రేణి మహిళా మావోయిస్టు నాయకురాలు రూపి మరణించారు. మరికొంత మంది మావోయిస్టులు అడవిలోనే ఉన్నట్లు సమాచారం అందడంతో  కుంబింగ్ సాగుతోంది.

    కంకేర్ జిల్లాలోని ఛోటేబేఠియా-పర్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్‌పల్లి-ఆరంఝోరా-హిదుర్ అడవి ప్రాంతంలో మావోయిస్టులున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో భద్రత బలగాలు కూంబింగ్‌ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో  ఏరియా కమిటీ మెంబర్ రూపి మృతిచెందారు. ఘటనా స్థలం నుండి రూపితో పాటు ఒక పిస్టల్, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

    కాగా కంకేర్ అడవుల్లో మరో 10 మంది వరకు మావోయిస్టులు ఉన్నారని  సమాచారం అందిందని వారికోసం గాలింపులు చేపడుతున్నామని భద్రతా బలగాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో  భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అయితే మావోయిస్టు పార్టీ దాదాపు అంతర్ధాన దశకు చేరుకుంది. ఇదివరకే మావోయిస్టు అగ్రనాయకత్వం పోలీసుల ఎదుట లొంగిపోయింది. మరికొంతమంది ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు.

    కేంద్ర మంత్రి అమిత్‌షా మావోయిస్టు పార్టీని అంతం చేస్తానని ప్రకటించడంతో వారిపై దాడులు తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది.

  • న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడే చైనాకు నెట్టింట మనవారు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెట్టుకుని ఆనందం పొందుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రయోగం వైరల్‌గా మారింది. డ్రాగన్ దేశం చేస్తున్న పనులకు కౌంటర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాయంతో చైనాలోని ప్రముఖ నగరాలకు అచ్చమైన మన భారతీయ పేర్లు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

    అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దేశంలోని జాంగ్నన్ ప్రాంతంగా పిలుచుకునే చైనా.. ఇటీవల అక్కడి 15 పర్వతాలు, ఐదు నివాస ప్రాంతాలు, నాలుగు కనుమలు, రెండు నదులు, ఒక సరస్సు సహా పలు ప్రాంతాలకు తమ భాషలో పేర్లు పెడుతూ ఓ జాబితాను విడుదల చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఇలాంటి తప్పుడు వాదనలతో వాస్తవాలను మార్చలేరని, చైనా కుటిల యత్నాలను తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది.

    ఈ  నేపధ్యంలో చైనా నగరాలకు భారతీయ పేర్లు సూచించమని ఏఐని అడగగా, అది ఇచ్చిన సమాధానాలు  ఆశ్యర్యపోయేలా ఉన్నాయి. రాజధాని బీజింగ్‌ పేరును మన ఆధ్యాత్మిక నగరం బైజ్నాథ్‌గా మార్చేసింది. షాంఘై పేరును శంకరుని పేరు గుర్తు తెచ్చేలా శంఖై గా, గ్వాంగ్జౌను గంగా జ్యోతిగా, షెన్జెన్‌ను శాంతివనంగా మార్చింది. చెంగ్డూను చంద్రాపూర్ అని, జియాన్‌ను మహాశివుడిని గుర్తు చేసేలా శివాన్ అని, నాన్జింగ్‌ను నందిగ్రామ్ అని, హాంగ్జౌను హరిధామ్ అని, టియాంజిన్‌ను తేజస్ నగర్ అని, ఇక వుహాన్‌కు విశ్వనగర్ అని పేరు పెట్టింది.

    2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత మొదలైన ఈ కవ్వింపు చర్యలను 2021, 2023, 2024లో కూడా చైనా కొనసాగించింది. గత ఏడాదీ 27 ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. 2020 గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీఓ సమ్మిట్ కోసం చైనా వెళ్లి అధ్యక్షుడు జిన్ పింగ్‌తో సమావేశం కావడం రెండు దేశాల మధ్య కాస్త సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఇలాంటి తరుణంలో చైనా మళ్లీ పాత పద్ధతిలోనే రెచ్చగొట్టే చర్యలకు దిగడం, దానికి మన నెటిజన్లు ఏఐ ద్వారా ఇలా ఫన్నీగా బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.

    ఇది కూడా చదవండి: దేశంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. అలర్ట్ జారీ

  • ఇంట్లో వాడని వస్తువులను,  దుస్తులను  ఇంట్లో పనిచేసే సహాయకులకు  గిఫ్ట్‌గా ఇవ్వడం కాలా కామన్‌. కానీ తన ఓనర్ ఇచ్చిన బహుమతికి ఒక ఇంటి పనిమనిషి  ఉబ్బితబ్బిబ్బైన ఘటన నెట్టింట తెగ సందడి  చేస్తోంది. ఆ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌ చూసి ఆమె మొదట చాలా ఆశ్చర్యపోయింది. ఆ తరువాత భావోద్వేగానికి లోనైంది. మనుషుల మధ్య ఉండాల్సిన అసలైన బంధానికి, మానవత్వానికి ఈ వీడియో ఒక నిదర్శనంగా నిలిచిందిఇంతకీ ఆమెకు లభించిన గిఫ్ట్‌ ఏంటి?


    దేశవ్యాప్తంగా వేసవి ఎండలు తీవ్ర స్థాయికి  చేరాయి. ఏప్రిల్‌ మాసంలో ఎండలు మండిపోతున్న వేళ, ఒక కుటుంబం తమ ఇంట్లో పనిచేసే మహిళకు ఎయిర్ కూలర్ (Air Cooler) బహుమతిగా ఇచ్చింది.  ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొన్న కూలర్ అని చెప్పగానే  ఆ మహిళ ఆనందంతో పొంగిపోయింది.  ప్రేమతో ఇచ్చిన చల్లని కానుకను చూసి యజమానిని గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి లోనైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హృద్యమైన ఘటనకు  సంబంధించిన వీడియో  వైరల్ అవుతోంది.ఈ వీడియోకు ఇప్పటివరకు 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.


    నెటిజన్లు స్పందన
    ఈవీడియో చూసి నెటిజన్లు నిజమైన అనుబంధం అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె అవసరాలను గుర్తించి,  ఆమెను సంతోషపెట్టడానికి కొంచెం కరుణ, చిరు సాయం, కొంచెం సానుభూతి ఉంటే చాలు అంటూ ప్రశంసించారు.  ప్రపంచమంతా ఇలాంటి మానవత్వం,  ప్రేమ, గౌరవంతో ఉంటే ఎంత బాగుంటుందో అని మరికొందరు వ్యాఖ్యానించారు.  

    గతంలోనూ ఇలాంటి ఘటనే..
    తమ ఇంట్లో సభ్యురాలిలా చూసుకుంటూ, తమ పెంపుడు కుక్కలను కూడా తన బిడ్డల్లా ప్రేమించే గృహకార్మికులకు  ఇలాంటి చిన్న చిన్న బహుమతులు  ఎంతో సంతృప్తినిస్తాయి అనడంలో సందేహం లేదు.  ఇదే తరహాలో గతంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో జ్యోతి అనే పనిమనిషి తన పుట్టినరోజున "ఈరోజు మా అమ్మ బతికి ఉంటే నన్ను ఎంతో ప్రేమించేది" అని ఏడుస్తుంటే, ఆమె యజమాని (కృతార్థ)అతని స్నేహితులు ఐస్‌క్రీమ్ కేక్ తీసుకొచ్చి ఆమెతో పుట్టినరోజు వేడుకలు జరిపి ఆమెను ఆశ్చర్యపరిచిన ఘటన  నెటిజనులను  బాగా ఆకట్టుకుంది.

    ఇదీ సంగతి: రిక్షా డ్రైవర్‌ కొడుకు, అమెరికాలో టెకీ, అంతలోనే విషాదం
     

  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం పది గంటలకే భానుడు భగభగలాడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రెండు వారాల్లో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులుల వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి)  హెచ్చరికలు జారీ చేసింది.

    ఏప్రిల్ 17 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 41 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుందని ఐఎండి అంచనా వేసింది. ఏప్రిల్ 12 నుంచి 18 వరకు వాయువ్య భారతదేశంలో 4 నుంచి 6 డిగ్రీలు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మధ్య ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు, గుజరాత్, మహారాష్ట్రల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగనున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో వడగాల్పుల ముప్పు తీవ్రంగా పొంచి ఉంది.
     

    రాబోయే వారం రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎండల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

     ఇది కూడా చదవండి: యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’

Family

  • ఎండాకాలం చల్లని ప్రయాణాలు చేయాల్సిందే అనుకుంటారు. కానీ, చాలా మందికి ఎక్కడికి వెళ్లాలి అనే కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. అలా కన్‌ఫ్యూజ్‌ అయ్యేవారికి కూర్గ్‌ ఒక పర్ఫెక్ట్‌ సమ్మర్‌ డెస్టినేషన్‌. తొలిసారి వెళ్లినా కూడా చాలా నేచురల్‌గా అనిపిస్తుంది.

    కూర్గ్‌లో రోడ్ల పక్కనే కాఫీ ప్లాంటేషన్స్‌ మధ్య మధ్యలో జలపాతాలు, చిన్న చిన్న ఇళ్లతో కలిసి ఒక కామ్‌ అండ్‌ ఫ్రెష్‌ ఎన్విరాన్‌మెంట్‌ కనిపిస్తుంది. ఉదయం వేళలో వీచే గాలి కాఫీ ఘుమఘుమలను మోసుకొచ్చే మెసెంజర్‌లా మారి΄ోతుంది.

    సందర్శనీయ స్థలాలు
    అబ్బే ఫాల్స్‌ దగ్గర నీరు పడే శబ్దంలో ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది. రాజాస్‌ సీట్‌ నుండి వ్యాలీ చూస్తూ సూర్యోదయం మెల్లిగా విస్తరించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. దుబారే ఎలిఫెంట్‌ క్యాంప్‌ దగ్గర నేచర్‌ మధ్య రిలాక్స్‌ అయ్యే అవకాశం లభిస్తుంది.

    ఏం తినాలి?
    కూర్గ్‌ స్టైల్‌ మీల్స్‌లో స్పైసెస్‌ మైల్డ్‌గా, ఫ్లేవర్‌ రిచ్‌గా ఉంటాయి. ఇక్కడి నాన్‌ వెజ్‌ వంటకాలకు స్థానిక మసాలాలే ప్రత్యేకత. ఫ్రెష్‌ కాఫీ సిప్‌ చేస్తూ అక్కడి వైబ్‌ను పూర్తిగా ఎంజాయ్‌ చేయవచ్చు.

    ఎప్పుడు వెళ్లాలి?
    అక్టోబర్‌ నుంచి మార్చి వరకు వెదర్‌ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అయితే చాలా మంది ఎండాకాలంలో కూడా వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. చలికాలంలో అయితే మిస్ట్, గ్రీనరీ, కూల్‌ బ్రీజ్‌ కలిసి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఎండాకాలం ఒక ప్రశాంతమైన అనుభవాన్ని సొంతం చేసుకునేందుకు, చల్లదనం కోసం కూర్గ్‌ వెళ్లవచ్చు.

    హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి?
    హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వరకు ప్లైట్‌లో సుమారు 90 నిమిషాలు ప్రయాణించాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5–6 గంటలు ప్రయాణించి కూర్గ్‌కు చేరుకోవచ్చు. కూర్గ్‌లో గడిపిన రోజులను గుర్తుచేసుకుంటే గాలిలో కాఫీ సువాసన, ప్రశాంతత గుర్తుకొస్తాయి. అక్కడి స్లో లైఫ్‌ మనసులో చిరకాలం నిలిచిపోతుంది.  

    బాలి, ఇండోనేషియా..!
    కొన్ని ప్రదేశాల్లో మొదటి అడుగు వేయగానే మనసు తేలికపడిపోతుంది. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఒక అందమైన ప్రదేశమే ఇండోనేషియాలోని బాలి. ఫస్ట్‌ టైమ్‌ ఇంటర్నేషనల్‌ ట్రిప్‌ చేసే ట్రావెలర్స్‌కు కూడా సులభంగా కనెక్ట్‌ అయ్యే వైబ్‌ ఉన్న ప్రదేశం ఇది. ఇక్కడి ప్రతీ చిన్న మూమెంట్‌లో ఒక రిలాక్స్‌డ్‌ ఫ్లో ఉంటుంది.

    బాలి రోడ్‌ సైడ్‌లో కొబ్బరి చెట్లు, ఆలయాలు, చిన్న కేఫ్స్‌ కలిసి ఒక నేచురల్‌ రిథమ్‌ను క్రియేట్‌ చేస్తాయి. ఉదయం వేళలో పలచని సూర్యకాంతి, సాయంత్ర వేళలో సముద్రం పక్కనే చల్లని గాలి.. ఇవన్నీ కలిపి ఈ ప్రదేశాన్ని చాలా కంఫర్టబుల్‌గా మార్చేస్తాయి. నడుస్తూ చూస్తూ వెళ్తే టైమ్‌ స్లోగా అయి΄ోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

    సందర్శనీయ స్థలాలు
    ఉబుద్‌లో గ్రీనరీ మధ్య ఉన్న ఆలయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. తనాహ్‌ లాట్‌ ఆలయం సముద్రం పక్కన నిలిచిన దృశ్యంలో ఒక కామ్‌ ప్రెజెన్స్‌ ఉంటుంది. ఉలువాటు ఆలయం దగ్గర క్లిఫ్స్‌ మీద వేవ్స్‌ చూస్తూ ఉండటం ఒక స్మూత్‌ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది.

    ఏం తినాలి?
    బాలిలో నాసి గొరేంగ్‌ అనే రైస్‌ డిష్‌ వార్మ్‌గా, లైట్‌ స్పైసెస్‌తో చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. సాటే స్టిక్స్‌ ఫ్రెష్‌గా గ్రిల్‌ చేసి పక్కన సాస్‌తో సర్వ్‌ చేస్తారు. ఫ్రెష్‌ ఫ్రూట్స్, జ్యూసులు అక్కడ నేచురల్‌గా రిఫ్రెషింగ్‌ ఫీలింగ్‌ను ఇస్తాయి.

    ఎప్పుడు వెళ్లాలి?
    ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు వెదర్‌ చాలా క్లియర్‌గా ఉంటుంది. ఈ సమయంలో బీచ్‌ వాక్స్, టెంపుల్‌ విజిట్స్, స్ట్రీట్స్‌లో నడవడం ఇవన్నీ మంచి మెమోరీస్‌గా మిగిలిపోతాయి. స్థానికులు నవ్వుతూ పలకరిస్తారు, దీంతో ఈ ప్రదేశం అందరికీ నచ్చేలా అనిపిస్తుంది.

    హైదరాబాద్‌ నుంచి ఎలా చేరుకోవాలి?

    హైదరాబాద్‌ నుంచి బాలి కి కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ అందుబాటులో ఉంటాయి. ట్రావెల్‌ టైమ్‌ సుమారు 10 నుంచి 12 గంటలు ఉంటుంది. ఎయిర్‌పోఒర్ట్‌ నుంచి సిటీకి వెళ్లే రోడ్‌ జర్నీ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.

    బాలీలో గడిపిన సమయం ఓ అందమైన జ్ఞాపకంలా గుర్తుండిపోతుంది. అక్కడి స్లో లైఫ్‌ రిథమ్‌ మనసులో మరికొంత కాలం అలాగే నిలిచిపోతుంది.

    (చదవండి: సమ్మర్‌లో ఆ ప్రదేశాలకు వెళ్తే..వేసవి కూడా చిల్‌గా..!)

     

  • విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్‌. మా అబ్బాయి ఫారెన్‌లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్‌లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్‌స్టైల్‌కి అడ్జెస్ట్‌ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్‌కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. 

    అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్‌ని మధ్యలో వదిలేసి భారత్‌కి వచ్చాశాడో సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. ఆ పోస్ట్‌లో మానవ్‌ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్‌ని లీడ్‌ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్‌ బిందాస్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. 

    కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్‌ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్‌గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్‌ అయిన లైఫ్‌, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. 

    తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్‌ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. 

    అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్‌ డ్రీమ్‌ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం.

     

    (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)

     

  • దక్షిణ భారతదేశంలో ఎండాకాలం వేడిని భరించలేం అనుకుంటారు. కానీ, వేసవిలోనూ సౌత్‌లో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి. వాతావరణం ఆహ్లాదంగా, వినసొంపైన పాటలా సాగిపోతుంది. చిక్‌మగళూరు నుంచి వల్పరై వరకు అటు నుంచి అరకు వరకు.. ఈ ప్రదేశాలు వేడిలో కూడా చల్లని ప్రయాణపు ఆనందాన్ని ఇస్తాయి. ఇక్కడ చల్లదనాన్ని ఆస్వాదిస్తే వేసవి వేడిని ఇట్టే మర్చిపోతాం. చిరుగాలి పంచే చల్లదనం, నేలంతా పరుచుకున్న పచ్చదనం, మధ్య మధ్యలో మేఘాల నడక .. ఇవన్నీ కలిసి ఈ వేసవిని చిల్‌గా మార్చేస్తాయి.

    చిక్‌మగళూరు
    కర్ణాటకలోని చిక్‌మగళూరులో ఉదయ వేళలో కాఫీ తోటల మధ్య రోజు మొదలవుతుంది. పొగ మంచు మధ్య నుంచి ప్రకాశించే వెలుగు, స్లోప్స్‌ మీద పడిన నీడలు ఇవన్నీ కలిసి ఒక సాఫ్ట్‌గా ఉండే దృశ్యాన్ని క్రియేట్‌ చేస్తాయి. స్థానిక ముల్లయనగిరి పర్వత రేఖలు చూసినప్పుడు భూమిపై ఒక జెంటిల్‌ ఎలివేషన్‌లా అనిపిస్తుంది.

    తమిళనాడులోని వల్పరైలో రోడ్డుపై నడవడం అనేది టీ ఎస్టేట్స్‌ మధ్య ఒక ఎండ్‌లెస్‌ గ్రీన్‌ కారిడార్‌లో నడవడంలా ఉంటుంది. చుట్టూ ఉన్న స్లోప్స్‌ మీద ప్లాంటేషన్‌ లైన్స్‌ ఒక రిథమ్‌లో కనిపిస్తాయి. మధ్య మధ్యలో కనిపించే చిన్న చిన్న జలపాతాలు, రోడ్డు పక్కన నడిచే సమయంలో వీచే గాలిం ఒక నిశ్చలమైన దశ్యాన్ని ఫీల్‌ అయ్యేలా చేస్తాయి. ఇక్కడ ప్రతీ టర్న్‌లో ఒక వ్యాలీ కనిపిస్తుంది. ప్రతీ వ్యాలీలో ఒక సైలెంట్‌ స్పేస్‌ ఉంటుంది.

    ఎలా వెళ్లాలి?
    హైదరాబాద్‌ నుంచి ఈ ఐదు ప్రదేశాలకు ప్రయాణం..  చాలా సులభంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాలకు బెంగుళూరు వరకు ప్లైట్‌లో చేరడం, ఇంకొన్ని ప్రదేశాలను చేరుకునేందుకు కోయంబత్తూరు వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

    అక్కడి నుంచి ఘాట్‌ రోడ్డు మార్గంలో వెళ్లినప్పుడు ప్రతి టర్న్‌లో ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది.

    రోడ్డు పక్కనే చెట్లు, మధ్య మధ్యలో కనిపించే వ్యాలీస్, గాలిలో మారి΄ోయే ఉష్ణోగ్రతలు ఇవన్నీ ప్రయాణాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.

    ఎక్కడ ఉండాలి?
    ఈ హిల్‌ స్టేషన్స్‌లో పెద్ద బిల్డింగ్స్‌ కన్నా చిన్న హోమ్‌ స్టేలు, కాటేజీలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ స్టే చేయడం అంటే గాలి మధ్య కాఫీ సువాసనలు పీల్చుతూ , ప్రకృతి పలికించే స్వరాలను వింటూ సమయం గడపడం లాంటిదే.

    ఇక్కడ ప్రతి మూమెంట్‌ మెల్లిగా నడుస్తుంది. సాయంత్రం అయితే స్లోప్స్‌పై వెలుగు తగ్గుతూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది.

    అరకు లోయ 
    అరకు లోయలో ప్రయాణం అంటే కాఫీ తోటల మధ్య నడిచే కథల మధ్య వెళ్లడంలా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్లినప్పుడు టన్నెల్స్‌ నుంచి బయటికి వచ్చిన ప్రతీసారి కొత్త దృశ్యం కనిపిస్తుంది. వ్యాలీ మధ్య గ్రామాలు, పక్కన హిల్స్, మధ్య నడిచే గాలి ఇవన్నీ కలిసి ఒక మధురమైన అనుభూతిని అందిస్తాయి. కాఫీ అరోమా గాలిలో కలిసినప్పుడు ప్రతి మూమెంట్‌ ఇంకా గుర్తుగా నిలిచిపోతుంది.

    ఏం చూడాలి?

    ఉదయం వేళలో పొగ మంచు మధ్య నడవడం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది.

    గాలిలో మాయిశ్చర్‌ టచ్, చెట్ల మధ్య నడిచే వెలుగు ఇవన్నీ కలిసి ఒక నిశ్చలమైన దృశ్యాన్ని క్రియేట్‌ చేస్తాయి.

    మధ్యాహ్నంలో టీ ఎస్టేట్స్‌ మధ్య తిరగడం, ఫారెస్ట్‌ ఎడ్జెస్‌లో కూర్చుని గాలిని ఎంజాయ్‌ చేయడం ఈ చిన్న మూమెంట్స్‌ ప్రయాణంలో గుర్తుగా నిలిచిపోతాయి.

    సాయంత్రం అయితే సన్‌సెట్‌ చూడటం, ఆకాశం రంగులు మారడం చూస్తూ సమయం గడపడం ఒక సైలెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది.

    ఏం తినాలి?

    ఈ ప్రదేశాలలో భోజనం కడుపుతోపాటు మనసును సంతోషపెట్టేలా ఉంటుంది. లోకల్‌ కర్రీస్, కొబ్బరితో చేసిన వంటలు, తాజా మసాలాలతో చేసిన వంటకాలుఇవన్నీ కలిసి భోజనాన్ని ఒక అనుభవంగా మార్చేస్తాయి.

    కాఫీ ప్లాంటేషన్‌ దగ్గర దొరికే ఫ్రెష్‌ కాఫీని సిప్‌ చేస్తే ఫ్లేవర్‌ ఇంకా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. చల్లని వాతావరణంలో హాట్‌ ఫుడ్‌ తినడం ఒక సౌఖ్యమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.

    యాక్టివిటీస్‌
    మార్నింగ్‌ సమయంలో సూర్యోదయం చూడటం, పొగమంచులో నడవడం, అడవుల నుంచి వచ్చే శబ్దాలను వినడం, సైట్‌ సీయింగ్, స్థానికులతో మాట్లాడటం, లోకల్‌ మార్కెట్‌లో తిరగడం, హిల్‌ స్లోప్స్‌లో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడం ఇవన్నీ ఈ ప్రదేశాలలో చేయాల్సిన యాక్టివిటీస్‌లో కొన్ని మాత్రమే. 

    ఎం. జి.కిశోర్‌, ప్రయాణికుడు.. 

    (చదవండి: ప్రకృతి, హిమాలయాల అనుభవం కోసం ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..!)

  • నటి శృతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్‌ షేర్‌ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్‌ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్‌ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..

    కూలీ నటి శృతి తాను ఆయిల్‌ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్‌) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. 

    నిపుణులు ఏమంటున్నారంటే..
    జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల  కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్‌ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ ఈ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. 

    అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్‌గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్‌లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. 

    ఈ నువ్వుల నూనెని సౌందర్యం,  ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.

    గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సం‍ప్రదించడం ఉత్తమం. 

    (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..)

     

  • రోడ్డుపై అనునిత్యం ఎన్నో ప్రమాదాలు జరుతుంటాయి. ఇది సర్వసాధారణ. కానీ క్షణంలో స్పందించి చేతనైన సాయం అందిస్తే..ప్రాణాలను రక్షించిన వాళ్లం అవుతాం. అయితే అందుకు ఎవ్వరూ ముందుకురారు. పోలీసు కేసులని, రిస్క్‌ అని భయంతో దూరంగా ఉండిపోతారు. కొందరు ముందుకొచ్చినా..మిగతా వాళ్లు సహకరించకపోవడంతో వెనకడుగువేస్తుంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం దీనిపై అవగాహన కార్యక్రమాలతో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది కూడా. కానీ ఈ అమ్మాయి దాన్ని అక్షరాల తూచా తప్పకుండా పాటించి ఘెర ప్రమాదాన్ని తప్పించింది.

    ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో అందుకు సంబంధించిన ఘటన రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోని గమనించకపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. 

    ఆ మహిళను తప్పించబోయి ఆ ఆటోనే ఆమెపై బోర్లపడింది. స్కూల్‌ నుంచి వస్తున్న ఆ చిన్నారి రెప్పపాటులో స్పందించి ఒక్కసారిగా ఆ ఆటోని ఎత్తేసింది. అదంతా సీసీటీవి కెమెరాలో రికార్డు అయ్యింది. దాన్ని చూసిన సిటీ కమిషనర్‌ ఆ విద్యార్థిని పిలిపించి మరి ఆమె సాహసాన్ని మెచ్చుకోవడమే గాక సన్మానం చేసి అభినందించారు. ఇదీ సామాజిక బాధ్యతంటే అని నొక్కి చెప్పారు సిటీ కమిషనర్‌. 

     

    (చదవండి: Asha Bhosle and Lata Mangeshkar: తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్‌ ఇదే..!)
     

  • దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్‌ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. 

    అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్‌కాస్ట్‌లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. 

    ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..
    గతేడాది ఆర్జే అన్మోల్‌, అతని భార్య నటి అమృతరావు హోస్ట్‌ చేసిన  'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్‌కాస్ట్‌తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. 

     

    "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం.  ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. 

    కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్‌ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. 

    భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్‌గ్రీన్‌ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె.

     

    (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!)

     

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: పురుషులతో పాటు మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. అలాంటి పార్టీ మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇంతకాలం అడ్డుకుంది ఎన్డీయేనేనని ఆరోపించారాయన. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ చేస్తున్న ప్రచారంపై సోమవారం సెక్రటేరియట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

    కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ రెండింటినీ ఒకేలా చూపించే ప్రయత్నం చేస్తోంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమనట్లు బీజేపీ ప్రచారం చేస్తోంది. బిల్లుకు విపక్షాలు సహకరించడం లేదని అపవాదు వేస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది.  రాజ్యాంగబద్ద పదవుల్లోనూ మహిళకు అవకాశం ఇచ్చింది. మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. 

    చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని సోనియా భావించారు. గతంలో కాంగ్రెస్‌ బిల్లు పెడితే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. 2013లో బిల్లు తీసుకొస్తే బీజేపీ సహకరించలేదు.  అందుకే మహిళా బిల్లు ఆగింది. గత పదేళ్లుగా బీజేపీ ఈ బిల్లు ఊసే ఎత్తలేదు. చట్టంలో ఫిట్టింగ్‌ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందే ఎన్డీయే అని సీఎం రేవంత్‌ ఆరోపించారు.

    2024లోనే రిజర్వేషన్లు వర్తింపజేసి ఉంటే మహిళలకు లాభం జరిగేదన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు చర్చే అవసరమే లేదన్న ఆయన.. అయినా కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

    శిక్షించే హక్కు ఎవరిచ్చారు?
    మహిళా బిల్లు, డీలిమిటేషన్‌కు లింకు పెడుతున్నారు. ఇక్కడే అసలు కుట్ర ఉంది. డీలిమిటేషన్‌పై కేంద్రం హడావిడి చేస్తోంది. 50 శాతం సీట్లు పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌ను గతంలో ఇందిరా గాంధీ నియంత్రించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. అందుకే ఇక్కడ జనాభా తగ్గింది. మోదీ చర్యలతో ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి.. దక్షిణాదిలో తగ్గుతాయి. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరాన్ని పెంచుతుంది.

    జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. చిన్న రాష్ట్రాలు మనుగడ కోల్పోతాయి. రాజకీయంగా దక్షిణాది వాళ్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ప్రయత్నం జరుగుతోంది.  సీట్లు పెంచాలనుకుంటే ముందు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎక్స్‌పర్ట్‌ కమిటీ వేయండి.. అసెంబ్లీల అభిప్రాయం తెలుసుకోండి. జనగణన పూర్తయ్యే లోపు పూర్తి చేయండి. మేం హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నాం. పెంచాలనుకున్న 272 సీట్లలో 136 ప్రొరేటా ప్రకారం చేయండి. మిగిలిన 136 సీట్లను జీఎస్‌డీపీ ప్రకారం చేయండి. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు సీట్లు పెంచండి. దేశానికి మేం అత్యధిక ఆదాయం అందిస్తున్నాం. అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాం. అలాంటి రాష్ట్రాలను శిక్షించే హక్కు మీకెవరు ఇచ్చారు?’’ అని కేంద్రాన్ని సీఎం రేవంత్‌ నిలదీశారు.

    డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు
  • సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు పంపించారు. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె.  

    ‘‘బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్‌దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.

    మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్‌ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. 

    ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్‌ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.

Cartoon