Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’ తాజా ఎపిసోడ్‌లో ప్రస్తుత విద్యా విధానం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఫ్యూచర్ ఎడ్యుకేషన్' అనే అంశంపై మాట్లాడుతూ.. నేటి స్కూళ్లు పిల్లలపై అధిక ఒత్తిడి పెంచి వారిని డిప్రెషన్‌లోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రస్తుత విద్యావిధానం కేవలం మార్కులు, ఎగ్జామ్స్, కాంపిటీషన్ మీద దృష్టి పెట్టి విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పిల్లలకు చిన్న వయసులోనే నైతిక విలువలు,సమయపాలన, సర్వైవల్ స్కిల్స్ నేర్పాలని ఆయన సూచించారు. అలాగే డిజిటల్ డిసిప్లిన్, మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో 90% మార్కులు తెచ్చుకున్నా ఆ విద్యార్థికి జీవితంలో దాని ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ క్యారెక్టర్, మనోస్థైర్యం, సంస్కారం నేర్పితే వారు మంచి పౌరులుగా తయారవుతారని పూరీ స్పష్టం చేశారు.  

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ.. ప్రతి సంవత్సరం 13,000–15,000 మంది విద్యార్థులు అకాడమిక్ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా.. చదువు కంటే ముఖ్యం సంస్కారం. భవిష్యత్ విద్యావ్యవస్థ పిల్లలకు మనోస్థైర్యం, నైతిక విలువలు, స్వీయ నియంత్రణ నేర్పేలా ఉండాలని పూరీ జగన్నాథ్ కోరుకున్నారు.  

    ఇక సినిమాల విషయానికి వస్తే.. పూరి-విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. దానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి గ్లింప్స్ లేదా ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటివరకు విడుదల కాలేదు. దాని తరువాత సూర్య – పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఫైనల్ కావడం సినీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పూరి స్టైల్ లో సూర్యను ఎలా చూపిస్తారో, ఎలాంటి మాస్ ఎంటర్‌టైనర్ వస్తుందో చూడాలి. 
     

  • బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లో ఉంటోంది. అయితే ఈమె తన పనివాళ్ల కోసం రూ.51 కోట్లు విలువ చేసే ఐదు ఫ్లాట్స్ కొనుగోలు చేసిందనే వార్త నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది. ఇవి కొన్నందుకే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలేం జరిగింది? ఏంటి గొడవ?

    (ఇదీ చదవండి: ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ)

    వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ సోనమ్ కపూర్.. లండన్‌లో ఉంటోంది. అక్కడ నాటింగ్‌హిల్‌లో మూడేళ్ల క్రితం రూ.270 కోట్ల విలువైన మ్యాన్షన్‌ని కొనుగోలు చేసిన ఈ జంట.. ఇంటి లోపల భారీ మార్పులు చేసుకున్నారని, స్మిమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్ కోర్టు లాంటి వాటి కోసం రూ.50 కోట్ల మేర ఖర్చు చేశారని టాక్.

    ఇకపోతే ఈ మ్యాన్షన్‌కి సమీపంలోనే మరో ఐదు ఫ్లాట్స్‌ని సోనమ్ కపూర్ దంపతులు కొన్నారని, ఇవి వాళ్ల పనివాళ్ల కోసమే ఉపయోగించుకుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొనుగోళ్ల ద్వారా భవన నిర్వహణ కమిటీపై పట్టు సాధించి, తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోనమ్ దంపతులపై పోస్టులు పెడుతున్నారు.

    ఇలా వ్యవహారం కాస్త బయటకు రావడంతో సోనమ్ కపూర్ ప్రతినిధి దీనిపై స్పందించారు. ఆ ఫ్లాట్లని పెట్టుబడిలో భాగంగానే కొనుగోలు చేశారని.. దీనికి సోనమ్‌కి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే లండన్ లో స్థానికుల కంటే భారతీయులే ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం వార్తలొచ్చాయి.

    (ఇదీ చదవండి: సీఎం విజయ్ చివరి సినిమాకు ఎట్టకేలకు మోక్షం?)

  • స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయి చాలారోజులు అయింది. కానీ ఈయన చివరి సినిమాకు మాత్రం మోక్షం దొరకట్లేదు. స్వయంగా నిర్మాతే రీసెంట్‌గా ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని చెబుతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ ఇదేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? 'జన నాయగణ్' విడుదల ఎప్పుడు?

    (ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)

    తమిళ స్టార్ హీరో అయిన విజయ్.. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నానని, 'జన నాయగణ్' తన చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే విజయ్ పార్టీ అధికారంలోకి రాకపోతే తిరిగి మూవీస్ చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తమిళనాడుకి విజయ్ ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో ఇక సినిమాలు చేయడం కష్టమే. అందుకే 'జన నాయగణ్' ఎప్పుడొస్తుందా అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

    అయితే సెన్సార్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో 'జన నాయగణ్' అసలు ఎప్పుడొస్తుందా అని మాట్లాడుకుంటున్న టైంలో జూన్ 19న తెలుగు, తమిళంలో రిలీజ్ కానుందని టాక్ బయటకొచ్చింది. డిస్ట్రిక్ట్ టికెట్ బుకింగ్ సైట్‌లో ఈ తేదీనే ఉండటంతో ఇదే ఫైనల్ అని అనుకుంటున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు. సరిగ్గా దీనికి మూడు రోజుల ముందు రిలీజ్ అయితే తెలుగులో ఏమో గానీ తమిళనాడులో మాత్రం థియేటర్ల దగ్గర సందడి వాతావరణం గ్యారంటీ. మరి ఇదెంత వరకు నిజమవుతుందనేది చూడాలి?

    విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ప్రధాన పాత్రల్లో చేసిన 'జన నాయగణ్'.. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. తొలుత ఇది నిజమా కాదా అని అంతా అనుకున్నారు గానీ తమిళనాడు ఎన్నికల రిలీజ్ టైంలో మూవీ పైరసీ ప్రింట్ లీక్ కావడంతో రీమేక్ అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. 

    (ఇదీ చదవండి: ఆస్కార్‌లో 9 నామినేషన్స్.. ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్.. మూవీ రివ్యూ)

  • వీకెండ్ మూడ్‌లో తమిళ హీరోయిన్ ‍త్రిష

    మెరిసిపోతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకుర్

    సన్నగా మారిపోయి షాకిచ్చిన హెబ్బా పటేల్

    ముద్దొచ్చేంత అందంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే

    ఆషికా రంగనాథ్ ఈ వారం గడిచిందిలా

    క్యూట్ లుక్స్‌తో మలయాళ హీరోయిన్ నజ్రియా

  • ఓటీటీలోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులు వెతుకుతూనే ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు తమిళ, మలయాళ, ఇంగ్లీష్ చిత్రాలు డబ్బింగుల రూపంలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే హాలీవుడ్‌లో హిట్ అయిన స్పోర్ట్స్ డ్రామా 'మార్టీ సుప్రీమ్' వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో మన దగ్గర థియేటర్లలో రిలీజైంది. 70 మిలియన్ డాల‍ర్ల బడ్జెట్‌తో తీస్తే 190 మిలియన్ డాలర్ల వసూలు చేసింది. ఈ ఏడాది ఆస్కార్స్‌లో తొమ్మిది విభాగాల్లో నామినేట్ కూడా అయింది. కానీ అవార్డులేం గెలుచుకోలేకపోయింది. ఇప్పుడిది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

    (ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)

    కథేంటంటే?
    అది 1950ల కాలం. అమెరికాలో ఉండే మార్టీ(టిమోతీ చలమెట్) అనే కుర్రాడికి ఓ కల ఉంటుంది. పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని గెలవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ అందుకోసం చాలా డబ్బులు కావాలి. సదరు టోర్నమెంట్ జరగడానికి చాలా తక్కువ సమయముంటుంది. మరి ఇంత తక్కువ టైంలో మార్టీ అంత డబ్బులు ఎలా సంపాదించాడు? టోర్నీలో పాల్గొన్నాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

    ఎలా ఉందంటే?
    సాధారణంగా స్పోర్ట్ డ్రామాలు అనగానే ఓ అనామక వ్యక్తి.. ఏదో ఒక గేమ్ నేర్చుకోవడం, తర్వాత ప్రాక్టీస్ చేయడం, చివరకు విజేత కావడం.. దాదాపు ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. కానీ 'మార్టీ సుప్రీమ్' మాత్రం కాస్త డిఫరెంట్. పేరుకే స్పోర్ట్ డ్రామా కానీ సక్సెస్ కోసం ఓ మనిషి ఎంత దూరం వెళ్తాడు? ఫేమ్ కోసం ఎంతలా స్వార్థపరుడు అవుతాడు అనే అంశాలు చాలా పచ్చిగా చూపించారు.

    రెండున్నర గంటల ఈ మూవీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. టేబుల్ టెన్నిస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అయితే ఈ గేమ్ కంటే మిగతా విషయాల్ని ఎక్కువగా చూపించారు. అంటే మార్టీ జీవితం, చుట్టూ ఉండే మనుషులు, ఎదురైన పరిస్థితులు ఇతడిని ఎలా మార్చేశాయనేది అసలు కథ.

    ఈ సినిమాని మార్టీ రేస్‌మన్ అనే అమెరికన్ దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడి జీవితం ఆధారంగా తీశారు. అయితే నిజ జీవిత సంఘటనలకు కాస్త కల్పితం జోడించారు. ఇందులో హీరోకి ఉన్న ప్లస్సులే కాదు మైసస్సుల కూడా చూపించడం విశేషం. సినిమాలో స్టైల్, టెన్షన్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే నెక్స్ట్ లెవల్ మూవీ అయ్యేది. ఇది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదు. చెప్పాలంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ప్రతి సీన్‌లోనూ ఓ టెన్షన్ ఉంటుంది. ఎమోషనల్ డెప్త్ కంటే స్టైల్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తుంది. 1950లో అమెరికా వాతావరణాన్ని ఫెర్ఫెక్ట్‌గా చూపించారు. దానికి తోడు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.

    ఈ సినిమాలోని హీరో కమ్ ఓ నిర్మాత అయిన టిమోతీ చలమెట్.. మార్టీగా అదరగొట్టేశాడు. అయితే మిగతా వాటిలో కొన్ని పాత్రలని సరిగా ముగించలేదు. వేగంగా ఉండే ఎడిటింగ్ వల్ల కొన్ని సన్నివేశాలు గందరగోళంగా అనిపిస్తాయి. చాలామంది ఇది టేబుల్ టెన్నిస్ డ్రామా అనుకుంటారు కానీ మూవీలో గేమ్ అనేది ఓ స్పోర్ట్ కాదు ఇదో యుద్ధంలా ఫీలై ప్రతి మ్యాచులో టెన్షన్ తెప్పించే విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో గేమ్ కంటే మైండ్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చీటింగ్, మ్యానిపులేషన్, ఈగో క్లాషెస్ లాంటి వాటిని చాలా బాగా చూపించారు. ఈ అంశాలే దీన్ని స్పోర్ట్ డ్రామాలా కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ జోన్‌లోకి తీసుకెళ్తాయి. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు గానీ కొన్ని అసభ్యకర సీన్స్ ఉంటాయి కాబట్టి కుటుంబంతో కలిసి చూడొద్దు. ఏదైనా కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు.

    - చందు డొంకాన

    (ఇదీ చదవండి: ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి: బండ్ల గణేశ్)


  • పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’  ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. 

    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

    నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరు వులవల, నటులు కసిరెడ్డి రాజ్‌ కుమార్‌, విషిక, హాసిని సుధీర్‌, సంధ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. 

  • పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తారక్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ లాంటి మూవీ అంటే అందరూ చెప్పేది 'టెంపర్' గురించే. ఇప్పుడా చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)

    'ఎన్టీఆర్ కెరీర్‌లో రెండు సూపర్ హిట్స్ ఇచ్చాను. 'బాద్‌షా' ముందు ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి. ఆ రోజుకి ఎన్టీఆర్ కెరీర్ 'బాద్‌షా' బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత 'రామయ్య వస్తావయ్యా' అనే డిజాస్టర్ చేశారు హరీశ్ శంకర్‌తో. తర్వాత 'రభస' అనే అట్టర్‌ఫ్లాప్ తీశారు. తర్వాత 'టెంపర్' అనే బ్లాక్‌బస్టర్ తీశాను. ఈ కథ వక్కంతం వంశీ చెప్పగానే.. ఇది పెద్ద హిట్టవుద్దిరా వంశీ అని చెప్పి.. నేను దాన్ని పూరీ దగ్గరకు తీసుకెళ్లా. పూరీ స్టోరీ వినగానే ఇది నీకు మరో 'గబ్బర్‌సింగ్' అని అన్నాడు. ఆ సినిమా ఇప్పుడు గనక తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి. హీరో కూడా ఫెర్ఫార్మెన్స్ చింపి చాటేశాడు' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.

    2015లో రిలీజైన 'టెంపర్' ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. ఒక సినిమా అయితే వరసగా ఫ్లాప్లులు ఎదురయ్యేవి. 'టెంపర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు కాలర్ ఎత్తుకునేలాంటి మూవీస్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్లే మాట మీద నిలబడుతూ వచ్చాడు. కానీ ఈ సెంటిమెంట్‌ని గతేడాది రిలీజైన 'వార్ 2' దారుణంగా బ్రేక్ చేసింది. ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. సాధారణంగా పూరీ జగన్నాథ్ తాను తీసే సినిమాల్లో వేరొకరి స్టోరీ ఉపయోగించుకోడు. కానీ 'టెంపర్' కోసం ఆ సెంటిమెంట్ పక్కనబెట్టాడు. అటు పూరీ, ఇటు ఎన్టీఆర్.. ఇద్దరూ ఈ మూవీతో అదిరిపోయే సక్సెస్ కొట్టారు.

    (ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)

  • ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ అందుకున్న నటి అవికా గోర్‌. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ..తొలి చిత్రంతోనే భారీ హిట్‌ని అందుకుంది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాదిలో పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్‌ అవికాను ఇంకా ‘చిన్నారి పెళ్లికూతురు’గానే చూస్తారు. తాజాగా ఈ బ్యూటీ ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అందమైన లుక్‌ కోసం  ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందనే పుకార్లపై స్పందించింది. లుక్‌ కోసం తాను ఎలాంటి ట్రీట్మెంట్‌ తీసుకోలేదని స్పష్టం చేసింది.

    మొటిమల కోసం ట్రీట్మెంట్‌ తీసుకున్నా
    లుక్‌ కోసం నేనెప్పుడు ట్రీట్మెంట్‌ తీసుకోలేదు. నా జీవితంలో ఒకే ఒక్కసారి మెడికల్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్నా. అది కూడా మొటిమలు పోగోట్టుకోవడానికి. టీనేజ్‌లో నా ముఖంపై చాలా మొటిమలు ఉండేవి. వాటిని తొలగించుకునేందుకు మెడికల్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్నా. అది కూడా సరిగా వర్కౌట్‌ అవ్వలేదు(నవ్వుతూ). ఇప్పటికీ నా ముఖంపై మొటిమలు ఉన్నాయి. సర్జరీలు ఏం చేసుకోలేదు కానీ..స్కీన్‌ పాడవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నా. నేనే కాదు ప్రతి ఒక్క నటీనటులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. నేను 7 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చా. చిన్నప్పటి నుంచే మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే సన్‌స్క్రీన్‌ ఎక్కువగా వాడేదాన్ని.

    అమ్మ తిట్టేది.. 
    లుక్‌ కోసం ట్రీట్మెంట్‌ కాదు..కనీసం నా హెయిర్‌ కట్‌ చేసుకుంటా అని చెప్పిన అమ్మ తిట్టేది. ఇక టాటూ వేసుకుంటా అన్నప్పుడు అయితే పెద్ద గొడవే జరిగింది. అలాంటిది నేను లుక్‌ కోసం ట్రీట్మెంట్‌ ఎలా తీసుకుంటా? వయసు పెరిగేకొద్ది మన ముఖంలో మార్పులు వస్తాయి. నేను చిన్నప్పటి నుంచే అందరికి తెలియడంతో పెద్దయ్యాక నా ముఖంలో వచ్చిన మార్పులు చూసి సర్జరీ చేయించుకుందనే పుకార్లను సృష్టించారు. అంతేకాదు నేను బరువు పెరిగి తగ్గడం వల్ల కూడా ఇలాంటి పుకార్లకు కారణం అయింది. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’ అని అవికా స్పష్టం చేసింది. 

  • ఎస్తర్‌ అనిల్‌.. మలయాళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ దృశ్యం నటిగానే ఎక్కువ ఫేమస్‌. దృశ్యం మూడు భాగాల్లోనూ హీరో చిన్న కూతురిగా నటించింది. మలయాళంతో పాటు తెలుగు దృశ్యం మూవీలోనూ యాక్ట్‌ చేసింది. ఇకపోతే మోహన్‌లాల్‌ దృశ్యం 3 ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే! ఈ సినిమా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    ఏడ్చేసిన దృశ్యం నటి
    ఇక సినిమా రిలీజైనరోజు చిత్రయూనిట్‌ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకుల రెస్పాన్స్‌ కళ్లారా చూసింది. ఈ సమయంలో మోహన్‌లాల్‌ పక్కనే కూర్చున్న ఎస్తర్‌ సంతోషంతో ఏడ్చేసింది. తనకు తెలియకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఈ వీడియో కింద ఓ నెటిజన్‌ ఎస్తర్‌కు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

    నటి కౌంటర్‌
    డియర్‌.. ఆయన కెరీర్‌లో ఇలాంటివి చాలా చూశాడు.. ఇంతకంటే పెద్ద విజయాలు కూడా అందుకున్నాడు. కానీ, నువ్వేంటి? ఆయన పక్కన ఇలా ఏడుస్తూ కూర్చున్నావ్‌? అని సెటైర్‌ వేశాడు. ఈ కామెంట్‌ ఎస్తర్‌ కంట పడింది. దాన్ని అలాగే చూసి వదిలేయలేదు. మధ్యలో నీకేంటి సమస్య? అని రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అతడికి బాగా బుద్ధి చెప్పావ్‌ అని నటికి సపోర్ట్‌ చేస్తున్నారు.

    చదవండి: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. ఎవరూ గుర్తుపట్టట్లే.. ఇంకెందుకు బతకడం?: నటి

  • ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నా వాటిని జనాలు అస్సలు పట్టించుకోవడం లేదు. మరోవైపు డబ్బింగులని మాత్రం ఆదరిస్తున్నారు. అలా ఈ వీకెండ్ రిలీజైన 'దృశ్యం 3' మంచి ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే మూడు రోజులైన కాకముందే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఇంతకీ ఎలా సాధ్యమైంది?

    (ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)

    మోహన్ లాల్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ 'దృశ్యం' ఫ్రాంచైజీ ఈయనకు మరింతలా ఫేమ్ తీసుకొచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రాల్ని వెంకటేశ్‌తో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. ‍అయితే మూడో భాగాన్ని రీమేక్ చేయకుండా మలయాళ వెర్షన్‌నే డబ్బింగ్ రూపంలో ఈ గురవారం థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇందులో సాగదీత తప్పితే ఏం లేదని రివ్యూలు వచ్చాయి. కానీ ఆడియెన్స్ మాత్రం ఈసారి జార్జ్ కుట్టి అండ్ ఫ్యామిలీ ఎలాంటి ఎత్తులు వేశారా అని థియేటర్లకు వెళ్తున్నారు.

    అలా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ మోహన్ లాల్-జీతూ జోసెఫ్ 'దృశ్యం 3'కి మూడు రోజులైనా గడవక ముందు అంటే 58 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోనే పోస్టర్ రిలీజ్ చేసి మరీ ధ్రువీకరించారు. టాక్ బాగోలేకపోయినా ఈ రేంజ్ కలెక్షన్స్‌కి కారణం..ఫ్రాంచైజీపై ఉన్న హైప్, మోహన్ లాల్ లాంటి స్టార్ పవర్ కూడా కారణమని చెప్పొచ్చు. ఎలాంటి ప్రచారం చేయకుండా తెలుగులోనూ రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ కూడా మల్టీప్లెక్స్‌ల్లో మంచి నంబర్లే నమోదవుతుండటం విశేషం.

    (ఇదీ చదవండి: ‘దృశ్యం 3’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

  • ఉదయభాను..ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై టాప్‌ యాంకర్‌. ఆమె ఎనర్జీ, స్టైల్‌, మాటతీరుతో టెలివిజన్‌ రంగంలో ప్రత్యేకమైన ట్రెండ్‌ చేసిన యాంకర్‌ ఆమె. డాన్స్ బేబీ డాన్స్, సాహసం చేయరా ఢింభకా, ఢీ లాంటి షోల విజయంలో ఉదయభాను కీలక పాత్ర పోషించింది. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎక్కువ షోలు చేయలేకపోయింది. ఇక పిల్లలు(ట్విన్స్‌) పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు పూర్తిగా బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. చాలాకాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు ముఖానికి మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వస్తోంది. ఒకవైపు సినిమాలతో పాటు కొన్ని ఈవెంట్స్‌కి హోస్ట్‌గాను చేస్తోంది. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం పిల్లలు, కుటుంబమే అంటోంది ఉదయ భాను. పిల్లలే తన ప్రపంచం అని.. వాళ్ల కోసం ఏదైనా వదులుసుకుంటానని చెబుతోంది. తాజాగా సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో పడిన బాధల గురించి, అంతకు ముందు జరిగిన అబార్షన్‌ గురించి చెబుతు ఎమోషనల్‌ అయింది.

    విమానం ఎక్కేముందు తెలిసింది
    పెళ్లి తర్వాత కూడా నేను వరుస ఈవెంట్స్‌తో బిజీ అయిపోయాను. ఓ సారి ఈవెంట్‌ కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అంతా రెడీ చేసుకొని వెళ్లే ముందు డౌట్‌ వచ్చి చెక్‌ చేసుకుంటే నేను గర్భం దాల్చిన విషయం తెలిసింది.వెంటనే వైధ్యులను సంప్రదించా. ఫ్లైట్‌ జర్నీ చేయొచ్చా లేదా? అని అడిగా. ఏం పర్లేదు.. వెళ్లమని డాక్టర్లు చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత వరుస ఈవెంట్స్‌ చేశాను. చాలా అలసిపోయా. మరుసటి రోజు ఆస్పత్రికి వెళ్లా.అక్కడ చెక్‌ చేసి బేబీ ఆరోగ్యం చాలా బాగుందని చెప్పారు.

    ఫ్లోర్‌ మొత్తం రక్తమే.. 
    నాకు హారర్‌ సినిమాలంటే చాలా భయం. అస్సలు చూడలేను. భయపడే సీన్స్‌ వస్తే కళ్లు, చెవులు మొత్తం మూసుకుంటా. ఓ రోజు అమెరికాలోనే కజిన్స్‌, ఫ్రెండ్స్‌ హారర్‌ సినిమా చూస్తున్నారు. అప్పుడు నేను కూడా ఇంట్లోనే ఉన్నా. కానీ సినిమా మాత్రం చూడనని చెప్పేశా. అనుకోకుండా ఆ సినిమాలో ఓ సీన్‌ చూశా. చాలా భయపడిపోయా. నా బాడీతో ఏదో తేడా వచ్చిందనే విషయం అర్థమవుతుంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం.డాక్టర్లు ఏదేదో చెక్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటేది చెప్పట్లేదు. నాకు పెద్ద ఎత్తున రక్తస్త్రావం జరుగుతోంది. ఫ్లోర్‌ మొత్తం బ్లడ్‌తో నిండిపోయింది. కాసేపటి తర్వాత మిస్‌ క్యారీ(అబార్షన్‌) అయిందని చెప్పారు.

    ఏడాది పాటు డిప్రెషన్‌.. 
    నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రెగ్నెంట్‌ విషయం తెలియగానే చాలా ఆనంద పడ్డాను. కానీ  అనుకోకుండా మిస్‌ క్యారీ కావడంతో చాలా బాధపడ్డా. ఏడాది పాటు డిప్రెషన్‌లోకి వెళ్లా. కానీ ఆ భగవంతుడు నాకు సహాయం చేశాడు. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతిని అయ్యాను. టెస్ట్‌ చేస్తే కలవలు అని తెలిసింది. మా ఆనందం డబుల్‌ అయింది. వెంటనే ఈవెంట్స్‌ అన్ని క్యాన్సిల్‌ చేసుకున్నా. నేను చేస్తున్న షో కూడా రద్దు చేసుకున్నా. దాదాపు మూడేళ్ల పాటు నేను దేని గురించి ఆలోచించలేదు. ట్రావెల్‌ చేయడం వల్లే అబార్షన్‌ అయిందనే అనుమానంతో ఎక్కడకు వెళ్లలేదు. 

    ప్రెగ్నెంట్‌ సమయంలో 100 కిలోల బరువు పెరిగాను. పొట్టలో ఇద్దరు 3 కిలోల చొప్పున ఉండడంతో బెడ్‌ మీద నుంచి దిగలేకపోయా. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరగానికే దాదాపు 15 నిమిషాల సమయం పట్టేది. డెలివరీ కాస్త ముందుగానే చేసుకోమని వైద్యులు చెప్పారు. కానీ ఎంత బాధనైన భరిస్తా.. సరైన సమయానికే సర్జరీ చేయమని చెప్పా. పిల్లలు పుట్టాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం’ అని ఉదయభాను చెప్పుకొచ్చింది. 

  • ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్క ఛాన్స్‌ కోసం చెప్పులరిగేలా తిరుగుతోంది బుల్లితెర అనిత కన్వాల్‌. ఒకప్పుడు సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన నటి ఇప్పుడీ సైలెన్స్‌ను భరించలేకపోతోంది. బనేగి ఆప్నీ బాత్‌, సోన్‌పరి, సాసురాల్‌ జెండా పూల్‌ వంటి సీరియల్స్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బుల్లితెర ఇండస్ట్రీలో రాణించింది. 

    అదే బాధ
    తాజాగా ఆమె తన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. అనిత కన్వాల్‌ మాట్లాడుతూ.. 'నలభై ఏళ్లు ఇక్కడ పని చేశానన్నమాటే కానీ నన్నెవరూ గుర్తుపట్టడం లేదు. అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయినా ఆడిషన్లకు వెళ్తున్నాను. నా పేరు అనిత కన్వాల్‌.. మీరెవరూ పుట్టకముందు నుంచే నేను ఈ ఇండస్ట్రీలో యాక్ట్‌ చేస్తున్నాను అని నా గురించి పరిచయం చేసుకోగానే అందరూ సైలెంట్‌ అయిపోతున్నారు. నా ఇగో పక్కనపెట్టి మరీ ఆడిషన్స్‌ ఇస్తున్నాను. 

    నా టైం బాగోలేదేమో!
    కానీ ఎవరూ నన్ను సెలక్ట్‌ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. గతంలో టీవీలో ఎక్కువ కనిపించావు అన్న సాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు టీవీలోనూ కనిపించక ఎనిమిదేళ్లవుతోంది. అయినా ఇప్పుడు బుల్లితెరపై పనిచేసేవాళ్లంతా ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ భాగమవుతున్నారుగా! బహుశా నా టైమ్‌ బాగోలేనట్లుంది. ఒకేసారి 13 సీరియల్స్‌ చేసిన రోజులున్నాయి. అలాంటి నన్ను అందరూ మర్చిపోయారు. 

    ఎందుకు బతికున్నా?
    అసలు నేనెందుకు బతికున్నాను? అని కూతురితో చెప్పుకుంటూ బాధపడ్డాను. టీవీలో ఎన్నో రకాల పాత్రలు చేశాను, ఎన్నో అవార్డులు పొందాను. కానీ, ఇప్పుడు ఖాళీ చేతులతో నిలబడ్డాను. నాపై నాకే అసహ్యం వేస్తోంది. నాకు వయసు పెరిగింది, ఒప్పుకుంటాను. కానీ నాకేమీ పడుచు పిల్ల పాత్ర ఇవ్వమని అడగడం లేదుగా.. 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలే ఇవ్వమంటున్నాను. నా వయసులో ఉన్నవాళ్లందరికీ పని దొరుకుతున్నప్పుడు నాకెందుకివ్వరు?

    దేవుడిని తీసుకెళ్లిపోమంటున్నా..
    నేను దేనికీ పనికారానా? అన్న ఆత్మనూన్యతా భావం నాలో ఎక్కువవుతోంది. అప్పుడప్పుడు ఆ దేవుడిని నన్ను తీసుకెళ్లిపోమని వేడుకుంటున్నాను. నేను చాలా ప్రొఫెషనల్‌. 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ సెట్‌కు లేట్‌గా వెళ్లలేదు. మా అమ్మ చావుబతుకుల మధ్య ఉంటే కూడా నేను షూటింగ్‌ చేశాను. నా సీన్‌ పూర్తి చేసుకుని హాస్పిటల్‌ వెళ్లాను. అలాంటి నాకు ఇలాంటి దుస్థితి వచ్చింది' అని అనిత చెప్పుకొచ్చింది. ఈ నటి.. గీతాంజలి, కబీ హా కబీ నా, ముజ్సే దోస్తీ కరోగే, ద హ్యాంగ్‌మ్యాన్‌ వంటి చిత్రాల్లోనూ నటించింది.

    చదవండి: ఇద్దరు భామలతో రామ్‌చరణ్‌ ఐటం సాంగ్‌

  • తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. డబ్బింగ్‌ చిత్రాల నిర్మాత, నెల్లూరు డిస్ట్రిబ్యూర్‌ గుజ్జలపూడి హరి (46) గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా హరి ఎన్నో సినిమాలను పంపిణీ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసింది ఆయనే!

    డబ్బింగ్‌ సినిమాలు
    విశాల్‌, తమన్నా జంటగా నటించిన ఒక్కడొచ్చాడు చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేశారు. విశాల్‌ తమిళంలో నిర్మించిన పలు సినిమాలను తెలుగులో 'హరి వెంకటేశ్వర పిక్చర్స్‌' బ్యానర్‌పై విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రేష్ఠ మూవీస్‌కు చెందిన పలు చిత్రాలను నెల్లూరులో పంపిణీ చేశారు.

    25 ఏళ్లకు పైగా పరిచయం
    హరి మరణంపై హీరో నాగార్జున విచారం వ్యక్తం చేశాడు. 'హరి మరణవార్త విని షాకయ్యాను. ఆయన ఇక లేడన్న విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మా పరిచయం 25 సంవత్సరాలకు పైగా సాగింది. అక్కినేని కుటుంబానికి ఆయన ఒక పిల్లర్‌లా అండగా నిలబడ్డారు. మా జీవితాల్లో ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక మంచి మనిషిని, గొప్ప డిస్ట్రిబ్యూటర్‌ను కోల్పోయింది' అని ట్వీట్‌ చేశాడు.

     

     

    చదవండి: క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్‌

Sports

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యంతో ముగించింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంతో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ నామమాత్రంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆదివారం కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన సీజన్ చివ‌రి మ్యాచ్‌లో కేకేఆర్‌పై  ఢిల్లీ క్యాపిట‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. 

    204 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో  163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ అజింక్య ర‌హానే (63) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, పావెల్ (29), మ‌నీశ్ పాండే (25) ప‌ర్వాలేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్‌, ఎన్గిడి చెరో మూడు వికెట్ల‌తో విజృంభించ‌గా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

    అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థ‌సెంచ‌రీతో త‌న ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (39), డేవిడ్ మిల్ల‌ర్ (28), అశుతోశ్ శ‌ర్మ (18 నాటౌట్‌) రాణించ‌డంతో ఢిల్లీ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సౌర‌భ్ దూబే 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్‌, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డగొట్టారు. 

    కేకేఆర్‌పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది.  మరోవైపు కేకేఆర్ 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో పంజాబ్‌, కేకేఆర్‌లు ఇంటిదారి పట్టాయి.

    చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌ను 30 ప‌రుగుల‌తో ఓడించి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నాలుగో జ‌ట్టుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్ విజ‌యం అనంత‌రం రాజ‌స్తాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ జోఫ్రా ఆర్చ‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. త‌మ జ‌ట్టు ప్లేఆఫ్స్ చేర‌డంలో జోఫ్రా ఆర్చ‌ర్‌దే కీల‌క‌పాత్ర అని, అత‌డు ఆడ‌క‌పోయుంటే ఇవాళ ఇంటికి వెళ్లిపోయేవాళ్ల‌మ‌ని ప‌రాగ్ పేర్కొన్నాడు.  

    రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘మేము అనుకున్న ప్రణాళికలు సఫలం కావడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్చరు నంబర్ 7 స్థానంలో ప్రమోట్ చేయడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. క్రీజులో ఎవరో ఒకరు చొరవ తీసుకుని వేగంగా ఆడాల్సిన పిచ్ ఇది. 

    ఆ బాధ్యతను ఆర్చర్ చక్కగా నిర్వర్తించాడు. ఈ సీజన్లో నేను కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పుడు, అతడిని అవుట్ చేయగల సత్తా ఒక్క జోఫ్రా ఆర్చర్కే ఉందని నేను బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆర్చర్ నిలబెట్టుకున్నాడు. అతడు బండరాయిలా దృఢంగా నిలబడి మ్యాచ్ను మా వైపు తిప్పాడు’ అని కొనియాడాడు.

    ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన ఆర్చ‌ర్ @ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.  జోఫ్రా ఆర్చర్ స్పందిస్తూ.. ‘ఇది నా అత్యుత్తమ ప్రదర్శన అని నేను అనుకోవడం లేదు, దీనికంటే మెరుగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సరైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడానికే ప్రయత్నించాను. 

    నేను ఇంత త్వరగా బ్యాటింగ్కు రావాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇంపాక్ట్ సబ్ నిబంధన వల్ల నాకు సాధారణంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాదు. కోచ్ నన్ను ప్యాడ్లు కట్టుకోమన్నప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ, నేను నన్ను ఒక ఆల్రౌండర్గానే భావిస్తాను. ప్రస్తుతం నా ఫిట్నెస్ చాలా బాగుంది’ అని సంతోషం వ్యక్తం చేశాడు.

    మ్యాచ్ విష‌యానికొస్తే ముంబై ఇండియ‌న్స్‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. ముంబైపై విజ‌యంతో రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంజాబ్‌, కేకేఆర్‌లు కూడా లీగ్ ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టాయి.

     

     చదవండి: ముగిసిన లీగ్‌ దశ.. ప్లేఆఫ్స్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే

  • ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో రాజస్తాన్ రాయల్స్ నాలుగో జట్లుగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. 

    ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులు ప్లేఆఫ్స్ షెడ్యూల్, మ్యాచ్ వేదికలు, మ్యాచ్ సమయంకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు. మే 26న జరగనున్న క్వాలిఫయర్‌-1 పోరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. 

    ఇక మే 27న ఎలిమినేటర్ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్తాన్ తలపడనున్నాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మే 29న జరగనున్న క్వాలిఫయర్‌-2 పోరులో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు తలపడనుంది. 

    ఎలిమినేటర్‌తో పాటు క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముల్లన్‌పూర్ వేదిక కానుంది. ఇక ఆదివారం (మే 31న) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో క్వాలిఫయర్‌-1 విజేతతో క్వాలిఫయర్‌-2 విజేత అమీతుమీ తేల్చుకోనుంది.

    ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్‌
    మే 26- క్వాలిఫయర్‌-1 (ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్ టైటాన్స్‌, ధర్మశాల, రాత్రి 7.30 నుంచి)
    మే 27- ఎలిమినేటర్ (ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్‌, ముల్లన్‌పూర్‌, రాత్రి 7.30 నుంచి)
    మే 29-క్వాలిఫయర్‌-2 (క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ విజేత, ముల్లన్‌పూర్‌, రాత్రి 7.30 నుంచి)
    మే 31- ఫైనల్ (క్వాలిఫయర్‌-1 విజేత వర్సెస్ క్వాలిఫయర్‌-2 విన్నర్‌, అహ్మదాబాద్‌, రాత్రి 7.30 నుంచి)

    చదవండి: పంజాబ్ చేజేతులా.. నిరీక్షణ ఇంకెన్నాళ్లు!

  • ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ నుంచి కొన‌సాగుతున్న జ‌ట్ల‌లో పంజాబ్ ఒక‌టి. మొద‌ట కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌గా, ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌గా 19 సీజ‌న్లుగా ఐపీఎల్ ఆడుతూ వ‌స్తోంది. జ‌ట్టు పేరు మార్చినా, కెప్టెన్లు మారినా పంజాబ్ త‌ల‌రాత మాత్రం మార‌డం లేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ లీగ్ ద‌శ‌కే ప‌రిమిత‌మైంది. 

    అయితే సీజ‌న్ తొలి అంచె పోటీల్లో ఓట‌మి ఎరుగ‌ని పంజాబ్ రెండో అంచె పోటీల్లో అన‌వ‌స‌ర ఒత్తిడికి లోనైంది. త‌ద్వారా వ‌రుస ప‌రాజ‌యాల‌తో చేజేతులా ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను చేజార్చుకుంది. 19 సీజ‌న్లుగా క‌ప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్‌కు ఈ ఏడాది కూడా నిరాశ‌నే మిగిల్చింది.

    ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ (2008)లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన పంజాబ్ మ‌ళ్లీ 2014లో ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్ప‌టికీ తుదిమెట్టుపై బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత ష‌రా మాములే అన్న‌ట్లుగా వారి ఆట‌తీరు సాగింది. అయితే ఐపీఎల్ కెప్టెన్ల‌లో ల‌క్కీ కెప్టెన్‌గా పేరున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ 2025 సీజ‌న్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా రావ‌డంతో ఆ జ‌ట్టులో ఆశ‌లు చిగురించాయి. 

    జ‌ట్టు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కా న్ని నిల‌బెట్టుకున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ ప‌దేళ్ల త‌ర్వాత పంజాబ్‌ను మ‌ళ్లీ ఫైన‌ల్ చేర్చాడు. అయితే తుదిపోరులో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకుంది. గ‌త సీజ‌న్ ఇచ్చిన బూస్ట్‌తో ఈ సీజ‌న్‌లో మంచి అంచ‌నాల‌తోనే పంజాబ్ కింగ్స్ బ‌రిలోకి దిగింది. 

    అందుకు త‌గ్గ‌ట్టుగానే తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజ‌యాలు (ఒక మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు) సాధించి టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. ఇంకేముంది ఈసారి పంజాబ్ టైటిల్ కొడుతుంద‌ని అంతా భావించారు. కానీ రెండో అంచె పోటీలు మొద‌లవ్వ‌గానే అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. 

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో మొద‌లైన ఓట‌ముల ప‌రంప‌ర వ‌రుస‌గా ఆరు మ్యాచ్‌ల వ‌ర‌కు కొన‌సాగింది. అయితే  ల‌క్నో క‌చ్చితంగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చి విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజ‌యాలు, ఆరు ఓట‌ములు, ఒక ర‌ద్దుతో 15 పాయింట్ల‌తో ఉన్న‌ప్ప‌టికీ మిగతా జ‌ట్ల ఫ‌లితాల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

    అలాగాక రెండో అంచె పోటీల్లో ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలో విజ‌యం సాధించినా ఇవాళ పంజాబ్ ప్లేఆఫ్ చేరుకునేది. కానీ అదృష్టం కంటే దుర‌దృష్టంతో ప్ర‌యాణం చేస్తున్న పంజాబ్‌కు ఐపీఎల్ టైటిల్ అంద‌ని ద్రాక్ష‌లానే మిగిలిపోయింది.

    వైఫ‌ల్యం వెనుక కార‌ణాలెన్నో!
    ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేర‌క‌పోవ‌డం వెనుక కార‌ణాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో ప్ర‌ధాన కార‌ణం బౌలింగ్ బ‌ల‌హీనంగా ఉండ‌డం. తొలి అంచె పోటీల్లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజ‌యాలు సాధిస్తే అందులో నాలుగు మ్యాచ్‌ల్లో ఛేద‌న‌లో విజ‌యాలు సాధించింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు ఎంత పెద్ద టార్గెట్ విధించినా పంజాబ్ సులువుగా ఆ ల‌క్ష్యాన్ని అందుకునేది. 

    అప్పుడు బౌలింగ్‌లో లోపాలు క‌నిపించ‌లేదు. కానీ రెండో అంచె పోటీల్లో సీన్ రివ‌ర్స్ అయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు బౌలింగ్ వైఫల్యం వ‌ల్లే ఓడిపోయింది. దీనికి తోడు పేల‌వ ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంప‌ముంచింది. చాలా మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు జార‌విడ‌వ‌డంపై హెడ్‌కోచ్ పాంటింగ్ అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఇలా క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు పంజాబ్ టైటిల్ సాధించే ఒక మంచి అవ‌కాశాన్ని చేజేతులా కోల్పోయింది.

    చదవండి: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు

  • ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది . ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం రాజస్తాన్‌(16 పాయింట్లు).. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాయి.

    ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌(38), జోఫ్రా ఆర్చర్‌(32) జడేజా(19), శనక(29) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్‌ జాక్స్‌, ఘజన్‌ఫర్‌,బాష్‌ తలా వికెట్‌ సాధించారు.

    నిప్పులు చెరిగిన ఆర్చర్‌
    అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్‌(60), హార్దిక్ పాండ్యా(34) క్రీజులో ఉన్నప్పుడు గెలిచేలా కన్పించిన ముంబై .. వారిద్దరూ వరుస క్రమంలో అవుట్ కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 

    ఇక రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. మూడు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు. అతడితో పాటు బర్గర్‌, యశ్‌రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు.  మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా జరగనున్న ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ రోహిత్ శ‌ర్మ నిరాశ‌ప‌రిచాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో ధ్రువ్ జురేల్‌కు క్యాచ్ ఇచ్చిన‌ రోహిత్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. 

    ఈ డకౌట్‌తో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆటగాడిగా గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రోహిత్ శర్మ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు డకౌట్ అయ్యాడు. 

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌ కూడా 19 డకౌట్లతో రోహిత్ శర్మతో పాటే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాత దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ చెరో 18 డకౌట్లతో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే స్పిన్ బౌలర్లు పియూష్ చావ్లా, రషీద్ ఖాన్ లు కూడా చెరో 16 సార్లు సున్నా పరుగులకే అవుట‌య్యి ఆ త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

    మ్యాచ్ విష‌యానికొస్తే ముంబై ఇండియ‌న్స్‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 30 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. 

    అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. ముంబైపై విజ‌యంతో రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్ చేరుకోగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న పంజాబ్‌, కేకేఆర్‌లు కూడా లీగ్ ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టాయి.

    చదవండి: 'మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు ప‌ట్టుకెళ్లాడు!'

  • కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన సీజన్ చివ‌రి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. 204 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ 18.4 ఓవ‌ర్ల‌లో  163 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ ర‌హానే (63) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, పావెల్ (29), మ‌నీశ్ పాండే (25) ప‌ర్వాలేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్‌, ఎన్గిడి చెరో మూడు వికెట్ల‌తో విజృంభించ‌గా, మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థశతకంతో రాణించాడు.

    ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు డౌన్‌
    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఒకే ఓవ‌ర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో మొద‌ట ర‌హానే (63) ఔట‌వ్వ‌గా, మ‌రుస‌టి బంతికి రింకూ సింగ్ గోల్డెన్ డ‌క్‌గా వెనుదిరిగాడు. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కేకేఆర్ 5 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. పావెల్ (15), తేజ‌స్వి (1) ప‌రుగుతో ఆడుతున్నారు.

    13 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 123/3
    13 ఓవ‌ర్లు ముగిసేస‌రికి కేకేఆర్ 3 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. ర‌హానే (59), రోవ్‌మెన్ పావెల్ (14) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
    ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ 87 ప‌రుగుల వ‌ద్ద‌ రెండో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన మ‌నీశ్ పాండే ఎన్గిడి బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 93 ప‌రుగులు చేసింది. ర‌హానే (45), కామెరున్ గ్రీన్ (1) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
    204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఓపెనర్ ఫిన్ అలెన్ ఎన్గిడి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. రహానే (23), మనీశ్ పాండే (4) పరుగులతో ఆడుతున్నారు.

    కేకేఆర్ టార్గెట్ 204 ప‌రుగులు
    రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్‌కు చేర‌డంతో కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్‌ నామ‌మాత్రంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (60) అర్థ‌సెంచ‌రీతో త‌న ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. 

    కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ (39), డేవిడ్ మిల్ల‌ర్ (28), అశుతోశ్ శ‌ర్మ (18 నాటౌట్‌) రాణించ‌డంతో ఢిల్లీ 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సౌర‌భ్ దూబే 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అనుకుల్ రాయ్‌, సునీల్ న‌రైన్‌లు త‌లా ఒక వికెట్ ప‌డగొట్టారు.

    హాఫ్‌ సెంచరీ బాది కేఎల్‌ రాహుల్‌ ఔట్‌
    ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 30 బంతులకే హాఫ్‌ సెంచరీ బాది జోరు మీదున్న కేఎల్‌ రాహుల్‌ అనుకుల్‌ రాయ్‌ బౌలింగ్‌లో రోవ్మన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ స్కోరు 14 ఓవర్లకు 135-3గా ఉంది.

    మరో వికెట్‌ డౌన్‌
    ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో వికెట్‌ కోల్పోయింది. సాహిల్ ప‌రాఖ్ 24 పరుగులు చేసి, సునిల్‌ నరైన్‌ బౌలింగ్‌లో అజింక్యా రహానెకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ స్కోరు 10 ఓవర్లకు 88-2గా ఉంది. 

    8 ఓవర్లలో ఢిల్లీ 70/1
    8 ఓవర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ న‌ష్టానికి 70 ప‌రుగులు చేసింది. సాహిల్ ప‌రాఖ్ (15), కేఎల్ రాహుల్ (31) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
    కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన అభిషేక్ పొరేల్ సౌర‌భ్ దూబే బౌలింగ్‌లో తేజ‌స్వీ ద‌హియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ వికెట్ న‌ష్టానికి 42 ప‌రుగులు చేసింది.

    టాస్ గెలిచిన కేకేఆర్
    టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కేకేఆర్‌కు చాలా కీల‌కం. కాగా ఢిల్లీ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ స్థానంలో అకిబ్‌ నబీ, త్రిపురానా  జట్టులోకి వచ్చారు. ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 36 సార్లు త‌ల‌ప‌డితే ఢిల్లీ 15 సార్లు, కేకేఆర్ 21 సార్లు నెగ్గాయి. సీజ‌న్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

    పంజాబ్‌, రాజ‌స్తాన్‌లు ప్లేఆఫ్ రేసులో ఉన్న‌ప్ప‌టికీ కేకేఆర్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడంతో, ఢిల్లీ విధించే టార్గెట్‌ను 13 ఓవ‌ర్ల‌లో ఛేదించాల్సి ఉంటుంది.

    ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్‌), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి.

    కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్‌), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(వికెట్‌కీపర్‌), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి.

     

  • ఐపీఎల్‌-2026లో వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో కీల‌క మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం  వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. 6 బంతుల్లో కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ త్వ‌ర‌గా అవుట్ అయిన‌ప్ప‌టికి ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 

    ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పిన్న వ‌య‌ష్కుడిగా 15 ఏళ్ల వైభ‌వ్ నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు చేశాడు. 4 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఈ ఫీట్ సాధించాడు. 

    ఇంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ స్టార్‌ దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ పేరిట ఉండేది. 2019/20 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప‌డిక్క‌ల్ కర్ణాటక తరఫున 580 పరుగులు చేశాడు. ప‌డిక్క‌ల్ 19 ఏళ్ల వ‌య‌స్సులో ఈ ఘ‌న‌త సాధించాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో పడిక్కల్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ ‍బ్రేక్ చేశాడు. 

    ఇక ఈ డూ ఆర్‌డై మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.  యశస్వి జైస్వాల్ (27), ధ్రువ్ జురెల్ (38), దసున్ శనక (28), జోఫ్రా ఆర్చర్ (32) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై పోరాడుతోంది.
    చదవండి: మోసగాడు.. వచ్చాడు 18 కోట్లు ప‌ట్టుకెళ్లాడు!'
     

  • శ్రీలంక క్రికెట‌ర్ మ‌తీశా ప‌తీరానా ఐపీఎల్‌లో కేకేఆర్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. డెత్ ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్‌గా ముద్ర‌ప‌డిన ప‌తీరానాను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న ప‌తీరానా సీజ‌న్‌లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్నాడు. 

    గాయం నుంచి కోలుకున్న ప‌తీరానా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన గ‌త‌ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగాడు. వ‌చ్చీ రావడంతోనే త‌న ప్ర‌తాపం చూపిస్తాడ‌ని అంతా భావించారు. కానీ విధి వింత నాట‌కం ఆడింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 8 బంతులు వేసిన అనంత‌రం ప‌తీరానాకు కాలి పిక్క కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో పెవిలియ‌న్ చేరాడు. 

    తాజాగా గాయం తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌డంతో ప‌తీరానా కేకేఆర్ జ‌ట్టును వీడి స్వ‌దేశానికి వెళ్లిపోయిన‌ట్లు ఆ జ‌ట్టు ఫ్రాంచైజీ ఆదివారం తెలిపింది. ఇవాళ కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీల‌క మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌తీరానా స్థానంలో ల‌వ్నిత్ సిసోడియాతో భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు కేకేఆర్ తెలిపింది.

    ఈ సీజ‌న్‌లో త‌న బౌలింగ్‌తో కేకేఆర్‌కు  ఎక్స్‌-ఫ్యాక్ట‌ర్‌గా మార‌తాడ‌ని భావించిన కేకేఆర్‌కు నిరాశే మిగిలింది. పైగా ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆట‌గాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే.  ఈ లెక్క‌న ప‌తీరానా సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్‌లోనే ఆడిన‌ప్ప‌టికీ అత‌నికి రూ. 18 కోట్లు ద‌క్క‌నున్నాయి. 

    దీంతో కేకేఆర్ అభిమానులు ప‌తీరానాపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ప‌తీరానా ఒక మోస‌గాడు.. కోలుకున్నాన‌ని అబ‌ద్ధం చెప్పి స‌ర్టిఫికేట్ చూపించాడు.. కేకేఆర్ త‌ర‌ఫున ఈ సీజ‌న్‌లో ఒక మ్యాచ్ మాత్ర‌మే ఆడిన ప‌తీరానా డ‌బ్బు మూట‌తో లంక‌కు వెళ్లిపోయాడు.. ఏం లాభం వ‌చ్చాడు.. 18 కోట్లు ప‌ట్టుకెళ్లాడు.' అంటూ కామెంట్లు చేశారు.

    చదవండి: ‘హమ్మయ్య ఔట్‌ చేశా’.. వైభవ్‌ అంటే అంత భయమా?

  • ఐపీఎల్‌-2026లో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శనివారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కేవలం 39 బంతుల్లోనే 69 పరుగులు చేసి పంజాబ్‌ విజయంలో సింగ్‌ కీలక  పాత్ర పోషించాడు. 

    ఈ ఇన్నింగ్స్‌తో అతడు ఈ ఏడాది సీజన్‌లో 500 పరుగుల మార్కును దాటాడు. తద్వారా ప్రభ్‌సిమ్రాన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో రెండు వేర్వేరు సీజన్లలో  500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా ఈ పంజాబ్ క్రికెటర్‌ నిలిచాడు. ప్రభ్‌సిమ్రాన్ ఐపీఎల్‌-2025 సీజన్‌లోనూ 500 పరుగులు దాటాడు. అతడి కంటే ముందు ఏ ఇండియన్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కూడా ఈ ఫీట్‌ను అం‍దుకోలేకపోయారు. 

    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు ఇంకో రెండు ఓవర్లు మిగిలూండగానే ఊదిపడేశారు. 

    పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించాడు.  కేవలం 51 బంతుల్లోనే 101 పరుగులతో తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.

     

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ తన ఆట‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ద‌డ పుట్టించాడు. క్రీజులోకి వ‌చ్చిందే మొద‌లు బాదుడే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్న 15 ఏళ్ల బీహార్ చిన్నోడు సీజ‌న్‌లో 14 మ్యాచ్‌ల్లో 583 ప‌రుగులు సాధించి రాజ‌స్తాన్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. 

    అయితే ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో రాజ‌స్తాన్ ఆడిన త‌మ‌ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో వైభ‌వ్‌ నిరాశ ప‌రిచాడు. చాహ‌ర్ వేసిన లెంగ్త్ బంతిని అంచ‌నా వేయ‌డంలో పొర‌బ‌డిన వైభ‌వ్ సూర్య‌వంశీ స్లాగ్ షాట్ ఆడేందుకు య‌త్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచుకు తాకి గాల్లోకి లేచింది. 

    బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్ నుంచి ప‌రిగెత్తుకు వ‌చ్చిన న‌మ‌న్ ధిర్ ఎలాంటి పొర‌పాటు చేయకుండా క్యాచ్ అందుకోవ‌డంతో వైభ‌వ్ ఆట ముగిసింది. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ వికెట్ తీయ‌గానే దీప‌క్ చాహ‌ర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. 'హ‌మ్మ‌య్యా ఔట్ చేశాను' అన్న త‌ర‌హాలో చాహ‌ర్ సైగ‌లు చేయ‌డం క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

    చాహ‌ర్ వింత సెల‌బ్రేష‌న్ వెనుక ఒక బ‌ల‌మైన కార‌ణముంది. అదేంటంటే ఈ సీజ‌న్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు. క్ష‌ణాల్లో ఆట‌ను మార్చేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు త‌ల‌నొప్పిగా మారిపోయాడు. చాలా మ్యాచ్‌ల్లో అత‌డు త‌క్కువ స్కోర్ల‌కే వెనుదిరిగిన‌ప్ప‌టికీ అత‌ని ఇంపాక్ట్ ఆట‌పై బ‌లంగా ప్ర‌భావం చూపించేది. 

    అందుకే వైభ‌వ్‌ను ఆరంభంలోనే ఔట్ చేయాల‌ని అన్ని జ‌ట్లు తీవ్రంగా ప్ర‌య‌త్నించాయి. ఇదే సీజ‌న్‌లో తొలి అంచె పోటీల్లో ముంబైతో మ్యాచ్‌లోనూ వైభ‌వ్ 14 బంతుల్లోనే 39 ప‌రుగులు చేసి ముంబై బౌలింగ్ ద‌ళాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇది దృష్టిలో పెట్టుకున్న దీప‌క్ చాహ‌న్ ఈసారి ప‌క్కా ప్రణాళిక‌తో వైభ‌వ్‌ను త‌క్కువ స్కోరుకే పెవిలియ‌న్ చేర్చాడు. అందుకే ప‌ట్ట‌రాని సంతోషంతో వినూత్న రీతిలో సెల‌బ్రేష‌న్ చేసుకున్నాడు. 

    2025 సీజ‌న్‌లోనూ వైభవ్ సూర్య‌వంశీ మంచి ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ, ఈ సీజ‌న్‌లో అత‌డి బ‌ల‌హీన‌త‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అన్ని జ‌ట్లు భావించాయి. కానీ వైభవ్ సూర్య‌వంశీ మాత్రం అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సీజ‌న్ ఆద్యంతం విధ్వంసక‌ర ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడు.

     

    చదవండి: వెల్ డన్ అర్జున్‌.. నువ్వు రెండింటినీ గెలిచావు: సచిన్‌

  • భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్‌ టెండూల్కర్‌ త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్ ఎట్టకేల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా శ‌నివారం ఏకానా స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో త‌ర‌పున అర్జున్ బ‌రిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ ప‌ర్వాలేద‌న్పించాడు. 

    జూనియ‌ర్ టెండూల్క‌ర్ త‌న 4 ఓవ‌ర్ల కోటాలో ఓ వికెట్ సాధించాడు. బ్యాటింగ్‌లో అత‌డు 5 ప‌రుగులు చేశాడు. అయితే ల‌క్నో త‌ర‌పున అర్జున్ అరంగేట్రం చేసిన సంద‌ర్భంగా  స‌చిన్ టెండూల్క‌ర్ ఎక్స్‌లో భావోద్వేగ పోస్ట్  చేశాడు. తొలి 13 మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైనా, పట్టు వీడకుండా ఆఖరి మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న కొడుకును సచిన్ అభినందించాడు.

    "వెల్ డ‌న్‌, అర్జున్‌. ఈ సీజ‌న్‌లో నీ ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను. నీపై నీకు నమ్మకం ఉంచి, ఓపికగా కష్టపడుతూ, చివరి మ్యాచ్ వరకు అవకాశం రాకపోయినా పాజిటివ్‌గా ఉన్నావు. క్రికెట్ అనేది కేవలం ప్రతిభనే కాదు, మన సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. 

    ఈ రోజు నువ్వు ఆ రెండింటినీ చాలా అద్భుతంగా హ్యాండ‌ల్ చేశావు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండు. ఆటను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండు. నేను కూడా ఎల్ల‌ప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎక్స్ వేదిక‌గా సచిన్ రాసుకొచ్చారు. కాగా ఈ ఏడాది సీజన్‌ వేలానికి ముందు అర్జున్‌ను రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌కు ముంబై ఇండియన్స్‌ నుంచి లక్నో ట్రేడ్‌ చేసుకుంది.

  • ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 24) మధ్యాహ్నం అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగుతుంది. నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఈ మ్యాచ్‌తో దాదాపుగా క్లారిటీ వస్తుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు డూ ఆర్‌ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఓడిందా ఇంటిముఖం పడుతుంది.

    ఇలాంటి కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ దగ్గరే సగం మ్యాచ్‌ కోల్పోయింది. టాస్‌ ఓడిన ఆ జట్టు కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ప్రత్యర్ది కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు. బ్యాటింగ్‌కు వచ్చీ రాగానే రాజస్థాన్‌కు ఒకే స్కోర్‌ వద్ద రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (17 బంతుల్లో 27; ఫోర్‌, 3 సిక్సర్లు), వైభవ్‌ సూర్యవంశీ (6 బంతుల్లో 4) నాలుగు బంతుల వ్యవధిలో 33 పరుగుల టీమ్‌ స్కోర్‌ వద్ద ఔటయ్యారు.

    ఈ పరిణామంతో రాజస్థాన్‌ ఢీలా పడిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు త్వరగా ఔట్‌ కావడంతో ఆ జట్టు డిఫెన్స్‌లో పడింది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌పై రాజస్థాన్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

    ఈ సీజన్‌లో ప్రారంభం​ నుంచి దుమ్మురేపిన వైభవ్‌ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేయడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. వైభవ్‌ ఈ మ్యాచ్‌కు ముందు 13 మ్యాచ్‌ల్లో 232.27 స్ట్రయిక్‌రేట్‌తో 577 పరుగులు చేశాడు. ఇందులో 50 ఫోర్లు, 53 సిక్సర్లు సహా సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. వైభవ్‌, జైస్వాల్‌ వికెట్లు కోల్పోయిన మరికొద్ది సేపటికే రాజస్థాన్‌కు మరో షాక్‌ తగిలింది. 54 పరుగుల వద్ద కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (14) కూడా ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 60-3గా ఉంది. ధృవ్‌ జురెల్‌ (11), దసున్‌ షనక (2) క్రీజ్‌లో ఉన్నారు. 

    ముంబై బౌలర్లలో విల్‌ జాక్స్‌, దీపక్‌ చాహర్‌, ఘజన్‌ఫర్‌ తలో వికెట్‌ తీశారు. కాగా, ఈ మ్యాచ్ రాజస్థాన్‌కు ప్రాణసంకటమే అయినా ముంబైకి మాత్రం సాధారణ మ్యాచ్‌గా ఉంది. ఎందుకంటే ఈ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

    ముంబైతో పాటు లక్నో, సీఎస్‌కే, ఢిల్లీ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. మిగిలిన నాలుగో బెర్త్‌ కోసం రాజస్థాన్‌తో పాటు పంజాబ్‌, కేకేఆర్‌ పోటీపడుతున్నాయి. 

    ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడిపోతే టోర్నీ నుంచి వైదొలుగుతుంది. అప్పుడు రేసులో పంజాబ్‌, కేకేఆర్‌ మిగిలి ఉంటాయి. రాత్రి ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిస్తే, పంజాబ్‌తో పాటు 15 పాయింట్లు కలిగి ఉంటుంది. అప్పుడు మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కలిగిన జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు సిద్దడపడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో ఉన్న ఆర్సీబీ-గుజరాత్‌ క్వాలిఫయర్‌లో పోటీపడతాయి. 

  • ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓ అనవసర రికార్డు విషయంలో చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న జరిగిన కీలక మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకోవడంతో ఈ సీజన్‌లో అతను మొత్తంగా ఇచ్చిన పరుగుల సంఖ్య 541కు చేరింది. దీంతో వరుసగా మూడు ఐపీఎల్‌ సీజన్లలో 500కు పైగా పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా చరిత్రలో నిలిచాడు.

    డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న అర్ష్‌దీప్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఎప్పటిలాగే భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, అతను వరుసగా మూడు సీజన్ల పాటు నిరాశపరిచాడు. వికెట్లు తీస్తున్నా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనై వైడ్లు, నో బాల్స్‌తో విసుగు తెప్పిస్తున్నాడు.  ముఖ్యంగా యార్కర్లు, బౌన్సర్లు  వేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

    లక్నో మ్యాచ్‌లో అయితే అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు పూర్తిగా టార్గెట్‌ చేశారు. ఈ మ్యాచ్‌తో అర్ష్‌దీప్‌ మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ తరఫున అత్యధికసార్లు ఒక మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు అతడు ఏడు సార్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతడి తర్వాత సామ్‌ కర్రన్‌ (4), కగిసో రబాడా, మహ్మద్‌ షమీ, జేవియర్‌ బార్ట్‌లెట్‌ (తలో 3 సార్లు) 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు.

    అర్ష్‌దీప్‌ పేలవ ఫామ్‌ ప్రస్తుతం పంజాబ్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకవేళ పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అతడి పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.

    మరోవైపు అర్షదీప్‌పై సోషల్‌మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆటపై దృష్టి పెట్టాల్సిందిపోయి సోషల్‌మీడియా, స్నాప్‌చాట్‌ వీడియోలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ కొందరు అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల తిలక్‌ వర్మతో చేసిన వీడియో, అభిమానితో జరిగిన ఆన్‌లైన్‌ వాగ్వాదం వివాదాస్పదమయ్యాయి.

    ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్‌ చివరి బెర్త్‌ కోసం పంజాబ్‌తో పాటు రాజస్థాన్‌, కేకేఆర్‌ పోటీపడుతున్నాయి. నేటితో ఏ జట్టుకు బెర్త్‌ దక్కుతుందో తేలిపోతుంది. తొలి మూడు బెర్త్‌లు దక్కించుకున్న జట్లుగా ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఉన్నాయి. తొలి క్వాలిఫయర్‌లో టాప్‌-2 జట్లు ఆర్సీబీ-గుజరాత్‌ తలపడనుండగా.. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకునే జట్టు అమీతుమీ తేల్చుకుంటుంది. 

  • RR vs MI live updates and highlights: వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. దీంతో రాజస్తాన్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రాజస్తాన్ క్వాలిఫై కావడంతో పంజాబ్ కింగ్స్‌, కేకేఆర్ ఇంటిముఖం పట్టాయి. 

    206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులకు పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌(60) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్‌ పాండ్యా(34), విల్‌ జాక్స్‌(33) పర్వాలేదన్పించారు.

    సూర్యకుమార్ అవుట్‌
    ముంబై ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

    ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన కార్భిన్‌ బాష్‌.. యశ్‌రాజ్‌ పుంజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 21 బంతుల్లో 54 పరుగులు కావాలి.

    దూకుడుగా ఆడుతున్న హార్దిక్‌ పాండ్యా
    13 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు. పాండ్యా కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు.

    ముంబై ఐదో వికెట్‌ డౌన్‌
    ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. 33 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌.. యశ్‌రాజ్‌ పుంజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముంబై విజయానికి 51 బంతుల్లో 105 పరుగులు కావాలి.

    ముంబై మూడో వికెట్‌ డౌన్‌
    ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ర్యాన్‌ రికెల్టన్‌.. నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్‌: 35-3. క్రీజులో సూర్యకుమార్‌ యాదవ్‌(16), తిలక్‌ వర్మ(1) ఉన్నారు.

    తిలక్‌ వర్మ అవుట్‌
    తిలక్‌ వర్మ(3) రూపంలో ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. బ్రిజేష్‌ శర్మ బౌలింగ్‌లో తిలక్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు ముంబై స్కోర్‌: 81/4

    పంజాబ్‌ రెండో వికెట్‌ డౌన్‌
    నమన్‌ ధీర్‌ రూపంలో ముంబై రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన నమన్‌ ధీర్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌
    206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

    రాణించిన రాజస్తాన్‌ బ్యాటర్లు.. ముంబై టార్గెట్‌ ఎంతంటే?
    వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌జురెల్‌(38), జోఫ్రా ఆర్చర్‌(32) జడేజా(19), శనక(29) రాణించారు. ముంబై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. విల్‌ జాక్స్‌, ఘజన్‌ఫర్‌,బాష్‌ తలా వికెట్‌ సాధించారు.

    రాజస్తాన్‌ ఏడో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభమ్ దూబే.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17.4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 174/7

    👉16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 6 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగులు చేసింది. క్రీజులో జోఫ్రా ఆర్చ‌ర్‌(10), శుభబ్ దూబే(3) ఉన్నారు.

    రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ధ్రువ్‌ జురెల్‌.. కార్భిన్‌ బాష్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 122/5

    రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగో వికెట్లు కోల్పోయింది. 29 పరుగులు చేసిన దసున్‌ శనక.. రనౌట్‌గా వెనుదిరిగాడు.

    రాజస్తాన్ మూడో వికెట్ డౌన్‌
    రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన రియాన్ పరాగ్‌.. ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 84/3

    రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌
    వైభ‌వ్ సూర్య‌వంశీ రూపంలో రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన సూర్య‌వంశీ.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో న‌మ‌న్ ధీర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 4.1 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌ ఉన్నాడు.

    రాజస్తాన్‌ తొలి వికెట్‌ డౌన్‌
    యశస్వి జైశ్వాల్‌ రూపంలో రాజస్తాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 27 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్‌.. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్‌
    3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్‌(21), వైభవ్‌ సూర్యవంశీ(3) ఉన్నారు.

    ఐపీఎల్‌-2026లో మ‌రో కీల‌క పోరుకు తెరలేచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ చివరి మ్యాచ్‌లో ముంబై మేనెజ్‌మెంట్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది.

    మరోవైపు రాజస్తాన్‌ మూడు మార్పులు చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌తో పాటు రవీంద్ర జడేజా, బర్గర్‌ తుది జట్టులోకి వచ్చారు. కాగా ఈ మ్యాచ్ రాజ‌స్తాన్‌కు అత్యంత కీల‌కం. ముంబైపై గెలిస్తే రాజ‌స్తాన్ నాలుగో జ‌ట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తోంది. లేదంటే ఇంటిముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు.

    తుది జ‌ట్లు
    రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్ (కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ పుంజా, బ్రిజేష్ శర్మ

    ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, రఘు శర్మ, అల్లా మహ్మద్ గజన్‌ఫర్, శార్దూల్ ఠాకూర్

  • క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌కు ఐపీఎల్‌ 2026లో ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. నిన్న (మే 23) పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో అర్జున్‌ లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు బంతితో ఆక​ట్టుకున్నా, బ్యాటింగ్‌ సమయంలో సహచరుడి నుంచి ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు.

    లక్నో ఇన్నింగ్స్‌ చివర్లో (17.6వ ఓవర్‌) ముకుల్‌ చౌదరి ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్‌కు, ఆ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న అబ్దుల్‌ సమద్‌ ఉద్దేశపూర్వకంగా స్ట్రయిక్‌ ఇవ్వలేదు. అప్పటికే అర్జున్‌ నిదానంగా ఆడుతున్నాడని భావించిన సమద్‌.. చివరి ఓవర్‌లో మూడు బంతులు వృధా చేసి కూడా అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు.

    ఈ ఉదంతకం వెంటనే సోషల్‌మీడియాలో వైరలైంది. సమద్‌కు స్వార్దపరుడని కొందరు.. కరెక్ట్‌గానే చేశాడని మరికొందరు అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇవ్వకపోయినా సమద్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. చివరి ఓవర్‌ తొలి మూడు బంతులకు పరుగులు సాధించలేకపోయినా, వైడ్లు పక్కకు పెటి,​ చివరి మూడు అధికారిక బంతులకు 6, 4, 4 పరుగులు చేశాడు. సమద్‌ అర్జున్‌కు స్ట్రయిక్‌ ఇవ్వకపోవడం వల్లనే లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ (196-6) చేయగలిగింది.

    అనంతరం ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో బంతిని అందుకున్న అర్జున్‌ తొలి ఓవర్‌లోనే ఆకట్టుకున్నాడు. అప్పటికే మంచి టచ్‌లో ఉండిన శ్రేయస్‌, ప్రభ్‌సిమ్రన్‌ను కంట్రోల్‌ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసిన అర్జున్‌.. భీకర ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్‌ వికెట్‌ తీసి కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

    శ్రేయస్‌ సూపర్‌ శతకం కారణంగా ఈ మ్యాచ్‌లో లక్నో ఓడినా అర్జున్‌ ప్రదర్శన మాత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ సమయంలో స్ట్రయిక్‌ దక్కలేదన్న విషయం మినహా వ్యక్తిగతంగా ఈ మ్యాచ్‌ అర్జున్‌కు అన్నీ తీపి గుర్తులే మిగిల్చింది. 

    ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌, లభించిన ఏకైక అవకాశాన్ని  సద్వినియోగం చేసుకొని తదుపరి సీజన్‌కు బాటలు వేసుకున్నాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌తో ఉండిన అర్జున్‌ను ఈ సీజన్‌ వేలంలో లక్నో రూ. 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. 

  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు రంజుగా సాగుతుంది. మూడు బెర్త్‌లు ఖరారైనా, నాలుగో బెర్త్‌పై చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల వరకు సందిగ్దత నెలకొంది. తొలి మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లను ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకోగా.. నాలుగో బెర్త్‌ కోసం పంజాబ్‌, రాజస్థాన్‌, కేకేఆర్‌ పోటీపడుతున్నాయి. ఈ బెర్త్‌ ఏ జట్టుతో ఇవాళ తేలిపోతుంది.

    నాలుగో బెర్త్‌ కోసం రేసులో ఉన్న మూడు జట్లలో ముందుగా పంజాబ్‌ అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు ఆడాల్సిన లీగ్‌ మ్యాచ్‌లన్నీ పూర్తి చేసుకొని తమ అదృష్టాన్ని ఇతర జట్ల జయాపజయాలపై వదిలేసింది. నిన్న (మే 23) లక్నోపై గెలుపుతో రేసులో నిలబడిన ఈ జట్టు.. ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది.

    ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిచిందా, పంజాబ్‌తో పాటు కేకేఆర్‌ కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి, ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీకి సిద్దమవుతుంది.

    ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడిందా.. రాత్రి కేకేఆర్‌-ఢిల్లీ మ్యాచ్‌ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్‌, కేకేఆర్‌ మాత్రమే ఉంటాయి.

    రాత్రి జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో కేకేఆర్‌ ఓడితే, పంజాబ్‌ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు (మధ్యాహ్నం రాజస్థాన్‌ ఓడిన పక్షంలో) చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీపై కేకేఆర్‌ గెలిస్తే అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ (కేకేఆర్‌, పంజాబ​్‌కు చెరి 15 పాయింట్లు ఉంటాయి) కీలకమవుతుంది. ఏ జట్టుకు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీకి సిద్దమవుతుంది.

    కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే ముందుగా ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడాలి. ఆపై ఢిల్లీతో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. ఎంత తేడాతో గెలవాలనే దానిపై ఓ వివరణ (ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ స్కోర్‌ 200 పరుగుల ఆధారంగా).

    * ముందుగా బ్యాటింగ్‌ చేస్తే కనీసం 77 పరుగుల తేడాతో.
    * ఛేజింగ్‌ చేయాల్సి వస్తే 12.1 ఓవర్లలోపే చేధించాలి.
    * స్కోర్లు సమం అయిన తర్వాత సిక్సర్‌తో మ్యాచ్‌ ముగిస్తే 12.4 ఓవర్ల వరకు అవకాశం ఉంటుంది.

    ఈ సమీకరణల్లో ఏదీ సాధించలేకపోతే.. ముంబై రాజస్థాన్‌ను ఓడించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (మే 23) జరిగిన డు ఆర్‌ డై మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ భారీ మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో తన జట్టును గెలిపించిన అతడు.. టీ20ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

    తద్వారా కేఎల్‌ రాహుల్‌ (197 ఇన్నింగ్స్‌), విరాట్‌ కోహ్లి (212), శిఖర్‌ ధవన్‌ (246) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా (247) రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఫాస్టెస్ట్‌ 7000 రన్స్‌ రికార్డు పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజం (187) పేరిట ఉంది. బాబర్‌ తర్వాతి స్థానాల్లో క్రిస్‌ గేల్‌ (192), కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు.

    నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నోపై పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 197 పరుగుల ఛేదనలో శ్రేయస్‌ సిక్సర్‌తో సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకోవడంతో పాటు జట్టును కూడా విజయతీరాలకు చేర్చాడు. అతడికి ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (69) సహకరించాడు.

    ఈ గెలుపుతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఇదివరకే బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్‌ కోసం పంజాబ్‌తో పాటు రాజస్థాన్‌, కేకేఆర్‌ పోటీపడుతున్నాయి.

    ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఈ జట్టే దక్కించుకుంటుంది. పంజాబ్‌, కేకేఆర్‌ రేసు నుంచి నిష్క్రమిస్తాయి.

    ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడిందా.. రాత్రి కేకేఆర్‌-ఢిల్లీ మ్యాచ్‌ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్‌, కేకేఆర్‌ ఉంటాయి.

    ఢిల్లీపై కేకేఆర్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. పంజాబ్‌, కేకేఆర్‌ జట్లలో ఏ జట్టుకు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీకి సిద్దమవుతుంది.

    ఒకవేళ ఢిల్లీ చేతిలో కేకేఆర్‌ ఓడిందా పంజాబ్‌ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మధ్యాహ్నం మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచినా భారీ తేడాతో గెలవకపోయినా పంజాబ్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుంది.

    ఒకవేళ కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడాలి. ఢిల్లీపై ఆ జట్టు భారీ తేడాతో గెలవాలి.

    రాజస్థాన్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ముంబైపై తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాత్రి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 
     

Politics

  • తిరుపతి:  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య  విభేదాలు తారస్థాయికి చేరాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి జనసేన పార్టీ నేత మురళి రెడ్డి చెప్పు చూపిస్తూ వార్నింగ్‌ ఇవ్వడంతో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 

    చంద్రగిరి మండలం  తొండవాడ  గ్రామానికి వచ్చారు ఎమ్మెల్యే పులవర్తి నాని. ముక్కోటి అగస్తేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇందుమూలిరెడ్డిని కలిసేందుకు వచ్చిన తొండవాడ గ్రామానికి వచ్చారు పులవర్తి నాని. అయితే అంతకుముందు తొండవాడ గ్రామాన్ని శత్రుదేశం పాకిస్థాన్ తో పోల్చడం పై ఎమ్మెల్యే ముందుగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  జనసేన నేత మురళి రెడ్డి చెప్పు చూపించారు.  

    తమ ఊరిని పాక్‌తో పోలుస్తావా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. గడచిన ఎన్నికల్లో 566 ఓట్లు మెజారిటీ ఇచ్చిన తొండవాడ గ్రామాన్ని పాకిస్థాన్ తో ఎలా పోల్చుతావు అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే కాలుకున్న చెప్పు తీసి..  సమాధానం చెప్పు అంటూ హెచ్చరించారు. అయితే జనసేన నేత మురళీరెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 

  • కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.

    తృణమూల్ కాంగ్రెస్‌ అభ్యర్థి, తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్న జహంగీర్ ఖాన్‌ గత వారం రీపోలింగ్‌ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘పుష్ప’’ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ముఖ‍్యమంత్రి సువేందు అధికారి కూడా అన్నారు. ‘‘పుష్ప’’ సినిమాలో అల్లు అర్జున్‌లా జహంగీర్ ఖాన్‌ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను ‘‘పుష్ప’’ అని అంటుంటారు.

    ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సమయంలో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదుల తర్వాత ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన రీపోలింగ్‌లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

    రీపోలింగ్ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో భద్రతను రెట్టింపు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిపేందుకు కేంద్ర బలగాల 25 కంపెనీలను మోహరించారు.

    ఫల్తా నియోజక వర్గం తృణమూల్‌కు బలమైన కోటగా ఉండేది. లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ స్థానం ఉంది. 2011 నుంచి ఈ స్థానంలో తృణమూల్ గెలుస్తోంది. అయినప్పటికీ తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కొన్ని రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నారు.

    ఈ ఎన్నికలో దేవాంగ్షు పాండా (బీజేపీ)తో పాటు అబ్దుర్ రజాక్ మోల్లా (కాంగ్రెస్), శంభు నాథ్ కుర్మీ (సీపీఎం), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పాండాకు 1,49,666 ఓట్లు, కుర్మీకి 40,645 ఓట్లు, మోల్లాకు 10,084 ఓట్లు, ఖాన్‌కు 7,783 ఓట్లు వచ్చాయి. ఖాన్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా అయిపోవడంతో ఆయన పేరు, టీఎంసీ గుర్తు ఈవీఎంలపై ఉంది.

    రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫల్తా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినందుకు తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. “బీజేపీ బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం” అని పేర్కొంది.

International

  • వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్‌ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.

    అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్‌ అణ‍్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.

    ‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ‍్మినిస్ట్రేటివ్‌లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ‍్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

    చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్‌ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.

    ఇరాన్‌ అణ‍్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు.

  • మాడ్రిడ్: మన దేశంలోని పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతెందుకు హైదరాబాద్‌లో అద్దెకు ఉండి ఉద్యోగాలు చేసుకునే చాలా మంది .. తమ జీతం అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుందంటూ వాపోతుంటారు. అయితే, అద్దెల బాధల వల్ల వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వార్తను ఎప్పుడైనా విన్నారా? స్పెయిన్‌లో ఆదివారం అదే జరిగింది.

    మాడ్రిడ్, బార్సెలోనా లాంటి నగరాల్లో పెరుగుతున్న  ఇంటి అద్దె ఖర్చులు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు, కొంత డబ్బు కూడబెట్టుకున్న వారు ఇళ్లు కొందామన్నా అందుబాటు ధరల్లో ఉండడం లేదని నిరసనకారులు చెప్పారు. స్పెయిన్ ప్రజలను ఇళ్ల మార్కెట్‌కు దూరం చేస్తున్నాయంటూ మాడ్రిడ్‌లో నిరసన చేపట్టారు.

    స్పెయిన్‌లో హౌసింగ్‌ క్రిసిస్‌, సోషలిస్టు ప్రధాని పెర్డో సాంచెజ్‌కు తలనొప్పిగా మారింది. 2027 ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద సవాలు. ఆ దేశంలో సొంత ఇల్లు ఉండాలన్న సంప్రదాయం బలంగా ఉంది. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా కారణంగా డిమాండ్ పెరగడంతో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.

    నిరసనకారులు నినాదాలు చేస్తూ ఇంటి హక్కును గుర్తు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. “మాకు పర్యాటకులు కాదు, నేబర్స్‌ కావాలి” అని ఒక బ్యానర్‌లో రాసి ఉంది.

    ఓ ర్యాలీని మరవకముందే మరొకటి
    స్పెయిన్‌లో శనివారం కూడా ఓ ర్యాలీ జరిగింది. సాంచెజ్‌కు వ్యతిరేకంగా మాడ్రిడ్‌లో వేలాది మంది నిరసన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అసంతృప్తితో రాజకీయ ఉద్రిక్తతలు, విమర్శలు పెరిగాయి. దీంతో స్పెయిన్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

    ఆ ర్యాలీ మరవకముందే ఆదివారం మరో ర్యాలీ జరగడం గమనార్హం. స్పెయిన్‌లో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది. మార్కెట్ ఒత్తిళ్లు, ఊహాగానాలు ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలు, తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.

    గత నెలలో స్పెయిన్ ప్రభుత్వం 7 బిలియన్ యూరోల ($8.23 బిలియన్) విలువైన భారీ ప్రణాళికను ఆమోదించింది. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలు, ఇళ్ల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.

    గత కొన్ని ఏళ్లుగా స్పెయిన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక నిరసనల్లో పాల్గొంటున్నారు. అధిక అద్దెలు, ఇళ్ల ధరలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 97 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు. 

    నగర కేంద్రాల్లో విస్తరించిన పర్యాటక అద్దె ఇళ్లపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్‌గా ఉంది. 2025 చివర్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెరిగాయని యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ తెలిపింది. బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌ అంచనా ప్రకారం.. 50 మిలియన్ జనాభా ఉన్న స్పెయిన్‌లో 7,00,000 ఇళ్ల కొరత ఉంది. డిమాండ్‌తో పోల్చితే కొత్త నిర్మాణాల వేగం తక్కువగా ఉంది.

  • టెహ్రాన్‌ : ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.   

    న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్‌ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.

    భారత్‌లోని వారణాసిలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్‌ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్‌ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్‌ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కూడా ఇరాన్‌ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్‌ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్ కూడా ఇరాన్‌ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్‌ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి.

  • కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. కొన్ని వందల డ్రోన్లు, డజన్లకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతమంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇళ్లకు, పాఠశాలలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

    బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్‌సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఆ నగరం కీవ్ ప్రాంతంలో ఉంది. ఒరెష్నిక్ హైపర్‌సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

    ఉక్రెయిన్ శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల వసతి గృహంపై దాడి చేసిందని ఆరోపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే ఆదివారం దాడులు చేశారు. రష్యా దాడులు చేయడానికి ముందే జెలెన్‌ స్కీ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. 

    రష్యా ఒరెష్నిక్ క్షిపణి వాడే అవకాశం ఉందని ఉక్రెయిన్ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఆ క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీవ్ ప్రాంతంలో 50కు పైగా చోట్ల దాడి జరిగింది. ఇళ్లు, షాపింగ్ కేంద్రాలు, అత్యవసర సేవల భవనాలు, పోలీస్ భవనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.

    నీటి సరఫరా కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు జెలెన్‌స్కీ చెప్పారు. “రాజధానిపై భారీ బాలిస్టిక్ దాడి జరిగింది. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది” అని కీవ్ సైనిక పరిపాలన అధిపతి టిమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్‌లో గత అర్ధరాత్రి తర్వాత పోస్ట్‌ చేశారు.

    కీవ్ మేయర్ విటలి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చిన్నారులు సహా 30 మంది ఆసుపత్రిలో చేరారు. మధ్య షెవ్చెంకో జిల్లాలో 9 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒకరు చనిపోయారు.

    అదే జిల్లాలో పాఠశాల వద్ద ఉన్న ఎయిర్ రైడ్ షెల్టర్ సమీపంలో దాడి జరిగింది. శిథిలాలు పడటంతో ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. పలువురు లోపల చిక్కుకున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకుని మంటలు ఆర్పారు. శిథిలాలను తొలగించారు. గాయపడిన వారికి చికిత్స అందించారు.

    రాజధాని చుట్టూ ఉన్న కీవ్ ప్రాంతంలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రాంతీయ అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. కీవ్ బయట చెర్కాసీ, ఖార్కివ్, క్రోపీవ్నిట్స్కీ, ఒడెసా, పోల్టావా, సుమీ, జైటోమిర్ ప్రాంతాలపైనా దాడులు జరిగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబియా తెలిపారు.

  • న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.

    రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగా
    రష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం,  మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు  తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.

    ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లు
    ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్‌ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.

    కోర్టు ముందు వాస్తవాలు
    సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్‌లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది.

  • కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో మళ్లీ రక్తపాతం చోటుచేసుకుంది. షటిల్‌ రైలులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 24 మంది మరణించారు. దాదాపు 70 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ(బీఎల్‌ఏ) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్‌ నుంచి బయలుదేరి సిటీ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఈ రైలును చమన్‌ ఫాటక్‌ సమీపంలో ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్‌ ప్రెస్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ వెల్లడించింది. 

    కంటోన్మెంట్‌ ప్రాంతం నుంచి మిలటరీ జవాన్లను రైలులో తరలిస్తుండగా తాము దాడికి దిగామని బీఎల్‌ఏ ప్రతినిధి తెలిపారు. అయితే, ఇప్పటిదాకా 14 మంది మరణించారని, వీరిలో ముగ్గురు సైనికులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, కనీసం 24 మంది మృతిచెందారని స్థానిక పోలీసులు స్పష్టంచేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. షటిల్‌ రైలులో సాధారణ ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారని, పేలుడు ప్రభావంతో ఇంజన్, మూడు కోచ్‌లు దెబ్బతిన్నాయని పాకిస్తాన్‌ రైల్వేశాఖ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ ప్రకటించారు. పేలుడు శబ్దాలు చాలా దూరం వినిపించాయి. సమీపంలోని వాహనాల అద్దాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

    ఈద్‌ పండుగ కోసం పెద్ద సంఖ్యలో జనం స్వస్థలాలకు వెళ్తుండగా పేలుడు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  బీఎల్‌ఏ ముష్కరుల దుశ్చర్యను పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్‌ ప్రజల సంకల్పాన్ని బలహీనపర్చలేవని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించివేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు షటిల్‌ రైలులో పేలుడుతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పెషావర్‌కు చేరాల్సిన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముందుజాగ్రత్త చర్యగా క్వెట్టా రైల్వేస్టేషన్‌లోనే నిలిపివేశారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని క్వెట్టా కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్‌లో 2024 నవంబర్‌లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 32 మంది మరణించిన సంగతి తెలిసిందే.  

Business

  • మెటా సంస్థ ఇటీవలే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో జూలీ బోన్ అనే ఉద్యోగిని కూడా ఉన్నారు. అయితే.. ఈమె తనకు తానుగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు.. లింక్డ్‌ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.

    జూలీ బోన్ కంపెనీలో జరుగుతున్న ఉద్యోగాల కోతల్లో తన పేరును కూడా చేర్చాలని స్వయంగా కోరినట్లు వెల్లడించింది. ఈమె సంస్థలో ఆరేళ్లు పనిచేసింది. అయితే ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. చాలా కాలంగా కంపెనీ లక్ష్యాలు, తన వ్యక్తిగత ఆశయాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఆమె భావించింది. అందుకే తన వ్యక్తిగత జీవితానికి సరైన సమయం వచ్చిందని భావించి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుందన్నారు.

    అంతేకాకుండా.. తాను స్వచ్ఛందంగా బయటకు వస్తే సంస్థలో కొనసాగాలని కోరుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కవచ్చనే ఆలోచన కూడా తనలో ఉందని పేర్కొన్నారు. మెటాలో పని చేసిన కాలంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలను కూడా నేర్చుకున్నానని జూలీ వెల్లడించింది. కొత్త ఆలోచనలను రూపొందించడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్నానని తెలిపింది.

    ప్రస్తుతం మెటాలో 'AI-first' విధానం అమల్లో ఉందని, ఉద్యోగులు ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. అయితే.. ఏఐ నేర్చుకోవడం మాత్రమే ఉద్యోగ భద్రతకు హామీ కాదని జూలీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను రక్షించాలంటే.. సంస్థలు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

    టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, మానవ సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలు ఎంతో ముఖ్యమని జూలీ నమ్మకం. మెటాలో చేసిన పనుల్లో ముఖ్యంగా బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ రంగాల్లో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.

    ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న జూలీ, భవిష్యత్తులో సృజనాత్మకతకు, ఎడిటోరియల్ తీర్పుకు, స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో అవకాశాలను వెతుకుతానని వెల్లడించింది. మొత్తం మీద ఈమె వ్యాఖ్యలు.. ప్రస్తుతం ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రత, టెక్నాలజీ రంగంలో మారుతున్న పని సంస్కృతి వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీశాయి.

  • డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ 2025–26 ఆర్థిక సంవత్సరానికి 73 శాతం వృద్ధితో రూ.109 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)లో నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. మరోవైపు  వార్షిక ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

    2024–25లో రూ.2,709 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025–26 నాటికి రూ.3,207 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్‌ కస్టమర్ల డిపాజిట్‌ బ్యాలెన్స్‌ కూడా 26 శాతం వృద్ధితో రూ.4,612 కోట్లకు చేరింది.

    యూపీఐ ఆటోపేలో దూకుడు: ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్‌ అందిస్తున్న ‘సేఫ్‌ సెకండ్‌ అకౌంట్‌’ కు కస్టమర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పేర్కొంది. ‘యూపీఐ ఆటోపే’ మ్యాండేట్స్‌ విభాగంలో రెండో అతిపెద్ద ప్లేయర్‌గా బ్యాంక్‌ అవతరించింది.

  • పెట్టుబడులకు సంబంధించిన విషయాలను గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. కొంతమంది ఆర్ధిక నిర్ణయాలు, సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, చివరికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలను వివరాయించారు.

    ప్రపంచంలో అత్యంత ధనవంతులైన లేదా శక్తివంతులైన కొంతమంది వ్యక్తులు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం, పన్నులు చెల్లించడం వంటి నియమాలను పాటిస్తూ జీవితం సాగిస్తారు. ఇవన్నీ పాటించినప్పటికీ.. ఆర్థికంగా స్వేచ్ఛ ఉండదు.

    డబ్బు వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు.. ఉదాహరణకు, బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజల ఆదాయం, పొదుపు, అద్దె, రిటైర్మెంట్ వంటి విషయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఈ వ్యవస్థలో రెండు రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి డబ్బును నియంత్రించే వారు, మరొకటి కష్టపడి పనిచేసే సాధారణ ప్రజలు.

    ఇదీ చదవండి: అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..

    సాధారణ ప్రజలు చిన్ననాటి నుంచే ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, దాని నియమాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. ఇలా జీవితం గడిపి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా.. ఎక్కడ మొదలయ్యారో దాదాపు అక్కడే ఉంటారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నిజానికి పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు తొందరగా ధనవంతులు అవుతారు. ఉద్యోగం చేసి సాఫీగా జీవితం సాగించేవాళ్లకు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన నమ్మకం.

  • బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించింది. కేవలం వారం రోజుల్లో (మే 17 నుంచి 23 వరకు) రేట్లు తగ్గుతూ.. పెరుగుతూ.. వారాంతంలో స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం వెండి రేటు ఎలా ఉంది?, ధరల తేడాకు ప్రధాన కారణం ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

    మే 17న (ఆదివారం) రూ.2,90,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు మే 23 (శనివారం) నాటికి రూ.2,95,000 వద్దకు చేరింది. అయితే వారం మధ్యలో వెండి రేటు రూ.3 లక్షలకు కూడా చేరింది. చివరకు కొంత తగ్గుదల కనిపించింది.

    హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కేజీ వెండి రేటు రూ.2.95 లక్షల వద్ద ఉండగా.. ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశ రాజధాని నగరంలో సిల్వర్ రేటు తక్కువని స్పష్టమవుతోంది.

    వెండి ధరలు పెరగడానికి కారణం!
    మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.

    పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.

    అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.

    వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.

    ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!

  • రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్ & వ్యవస్థాపకురాలు 'నీతా అంబానీ' విద్య, క్రీడలు ప్రతి చిన్నారి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలని ముంబై ఇండియన్ జట్టుకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    'అందరికీ విద్య, క్రీడలు' అనే కార్యక్రమంలో నీతా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈ సందర్భంగా.. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు దాదాపు 20 వేల మంది నిరుపేద పిల్లలను ఆహ్వానించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్ చిన్నారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు భావన పెంచుతాయని నీతా అంబానీ పేర్కొన్నారు.

  • ఓపెన్ఏఐ కంపెనీ.. ఏఐ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా.. సంస్థ ప్రకటించిన ఒక ప్రత్యేక ఉద్యోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి దాదాపు 4,45,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.7 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు సమాచారం.

    ఓపెన్ఏఐ ప్రకటించిన ఈ జాబ్ సాధారణ AI అభివృద్ధికి సంబంధించినది కాదు. భవిష్యత్తులో ఏఐ మనుషుల సహాయం లేకుండానే తనను తాను మరింత తెలివిగా మార్చుకుంటే.. ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో భాగం. ఈ ఉద్యోగం ప్రిపేర్డ్‌నెస్ సేఫ్టీ టీమ్‌లో భాగం.

    ప్రిపేర్డ్‌నెస్ సేఫ్టీ టీమ్‌ అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికి ఎలాంటి ప్రమాదాలు కలిగించవచ్చో.. ముందుగానే అంచనా వేసి వాటికి రక్షణ మార్గాలు రూపొందిస్తుంది.

    ఈ ఉద్యోగ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు కేవలం సాంకేతికంగా బలంగా ఉండడమే కాకుండా.. వ్యూహాత్మక ఆలోచన, సరైన తీర్పు వంటివి కలిగి ఉండాలని సంస్థ స్పష్టంగా వెల్లడించింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే.. ప్రస్తుతం లేని, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.

    ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!

  • వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. భారతదేశంలో కొత్త తరం విన్‌ఫాస్ట్ VF8 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ క్యాబిన్.. మెరుగైన టెక్నాలజీ వంటివి పొందుతుంది. కంపెనీ దీనికోసం మే 27 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై నుంచి ప్రారంభమవుతాయి.

    విన్‌ఫాస్ట్ VF8 మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో వింగ్స్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, వీ షేప్ లైటింగ్ ఎలిమెంట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనితో పాటు పెద్ద గ్లాస్-బ్లాక్ ఫేషియా కూడా ఉంటుంది. బంపర్‌లో పెద్ద ఎయిర్ ఛానెల్స్ కూడా ఉన్నాయి, ఇవి ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

    సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మరింత స్పోర్టీ లుక్ అందిస్తుంది. వెనుక డిజైన్‌ను కూడా కనెక్టెడ్ V-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

    విన్‌ఫాస్ట్ VF8 పూర్తిగా కొత్త డిజైన్ క్యాబిన్‌ను పొందుతుంది. డాష్‌బోర్డ్‌లో 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఈ కారు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్-కాలమ్‌పై అమర్చిన గేర్ సెలెక్టర్‌ను కూడా పొందుతుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్‌తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వైర్‌లెస్ కనెక్టెడ్ టెక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి.

    ఈ ఎలక్ట్రిక్ SUVలో ఏడీఏఎస్ ఫీచర్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హైవే అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. ఈ కారులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు.. 228 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే సంస్థ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది.

    ఇదీ చదవండి: 2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్!

  • కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్‌లోని అందమైన సముద్రతీర నగరం కేన్స్‌లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, దర్శకులు, ఫ్యాషన్ ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై మెరిసిపోతారు. ఈ ఏడాది భారతీయ నటి అలియా భట్ ధరించిన సాఫ్ట్ బ్లష్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

    ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే ప్రముఖులు ఎక్కువగా దిగే హోటళ్లలో 'హోటల్ మార్టినెజ్' ఒకటి. ఇది కేవలం ఒక విలాసవంతమైన హోటల్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల అభిమాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గతంలో దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బెల్లా హడిడ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్‌లో బస చేశారు.

    1929లో ప్రారంభమైన ఈ హోటల్.. అద్భుతమైన ఆర్ట్ డెకో శైలిలో ఉంది. దీని నిర్మాణం కేవలం 14 నెలల్లో పూర్తయింది. ఈ హోటల్‌లోని బాల్కనీల నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సినీ ప్రముఖులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.

    2013లో ఈ హోటల్‌ను హయత్ కొనుగోలు చేసింది. ఆ తరువాత దీనిని 'ది అన్‌బౌండ్ కలెక్షన్ బై హయత్'లో విలీనం చేసింది. ఈ హోటల్ ఆతిథ్యానికి, సౌకర్యానికి, విలాసానికి ప్రతీకగా నిలిచింది.

    బౌలేవార్డ్ డి లా క్రోయిసెట్ అనే వీధిలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి పలైస్ డెస్ ఫెస్టివల్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన వేదికకు కొన్ని నిమిషాల దూరమే ఉంటుంది. అందువల్ల ఫెస్టివల్ సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. హోటల్‌లోని గదులు సాధారణ డీలక్స్ రూమ్స్ నుంచి సముద్ర వీక్షణం కలిగిన విలాసవంతమైన సూట్స్ వరకు ఉంటాయి. ఫెస్టివల్ సమయంలో ధరలు మరింత పెరుగుతాయి. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి గరిష్టంగా రూ.8.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

    సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు, కుటుంబ విహార యాత్రల కోసం కూడా ఈ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు శతాబ్దకాల చరిత్ర కలిగిన హోటల్ మార్టినెజ్.. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, ఫ్యాషన్‌కు, సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

    ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!

  • హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్‌లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్‌ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.

    ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్‌హౌస్‌లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్‌వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.

    భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్‌టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్‌తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్‌హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది.

  • వచ్చే వారం ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అలర్ట్‌. మే 25 నుండి మే 31 మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు పరిమిత రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ వారంలో శని, ఆదివారాలతో పాటు అదనంగా మరో రోజు కూడా మార్కెట్లు మూతపడనున్నాయి. దీంతో మొత్తం 3 రోజుల పాటు ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

    సెలవులు ఇలా..

    కేంద్ర ప్రభుత్వం తాజాగా చంద్ర దర్శనం ఆధారంగా బక్రీద్ (ఈదుల్ అజ్హా) సెలవు దినాన్ని సవరించింది. మొదట ప్రకటించిన తేదీకి బదులుగా, మే 28 (గురువారం) నాడు అధికారిక సెలవుగా ఖరారు చేసింది. దీనిని అనుసరిస్తూ దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు మే 28న ట్రేడింగ్‌కు విరామం ప్రకటించాయి.

    ఆ తర్వాత మే 30 (శనివారం), మే 31 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో ఆ రోజుల్లోనూ మార్కెట్లు యథావిధిగా మూసివుంటాయి. ఫలితంగా వచ్చే వారంలో కేవలం 4 రోజులు (సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు) మాత్రమే ట్రేడింగ్ సాగుతుంది.

    ఏయే విభాగాల్లో ట్రేడింగ్ బంద్?

    మే 28 గురువారం నాడు బక్రీద్ సందర్భంగా మార్కెట్లోని దాదాపు అన్ని ప్రధాన విభాగాలు పనిచేయవు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్స్ సెగ్మెంట్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (MCX కూడా ఉదయం సెషన్ మూసివుంటుంది)లో కార్యకలాపాలు ఉండవు.

    గత వారం ఎలా ముగిసిందంటే?

    గత ట్రేడింగ్ వారంలో భారత మార్కెట్లు అత్యంత అస్థిరత మధ్య సాగినప్పటికీ, ముగింపులో సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి. నిఫ్టీ 50 (Nifty 50) గత వారంతో పోలిస్తే 1.50% వృద్ధితో 23,719 వద్ద ముగసింది. సెన్సెక్స్ (Sensex) 1.55% వృద్ధితో 75,415 దగ్గర స్థిరపడింది. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలత, విదేశీ పెట్టుబడుల మద్దతుతో సూచీలు బలపడ్డాయి.

    వచ్చే వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ అందుబాటులో ఉండటం, అందులోనూ గురువారం సెలవు రావడం వల్ల వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ (Expiry) బుధవారమే (మే 27) జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు తమ పొజిషన్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అస్థిరతను గమనిస్తూ తగిన స్టాప్-లాస్‌లు నిర్వహించడం మంచిది.

Andhra Pradesh

  • గుంటూరు: రాజధాని అంశానికి సంబంధించి ఉండవల్లి రైతులు కీలక తీర్మానం చేశారు. రాజధానికి భూములిచ్చే ప్రసక్తే లేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఉండవల్లిని రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని తీర్మానం చేశారు. 

    రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని కానీ దానికి విరుద్ధంగా రైతులు దగ్గర నుంచి బలవంతంగా భూములు ప్రభుత్వం సేకరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ భూములిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ మేరకు ఆదివారం(మే 24వ తేదీ) ఉండవల్లి రైతులు సమావేశమయ్యారు. 

    రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ అమలు చేస్తే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏమి అభివృద్ధి చేసిందని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములు కొట్టేసి లాభపడితే... మేము మా సొంత భూములు త్యాగం చేయాలా అని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఉండవల్లి రైతులు తీర్మానం చేశారు. 

     

     

  • తాడేపల్లి: ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహితీ విమర్శకుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్‌ మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 

    తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని  జగన్ పేర్కొన్నారు. రచయితగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

    అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనేక రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ప్రముఖ సామాజిక సంస్కర్త తాపి ధర్మారావు జీవితంపై ఆయన చేసిన పరిశోధనలు, వెలువరించిన గ్రంథాలు తెలుగు సాహిత్యానికి విలువైన ఆస్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

    విశాలాంధ్ర పత్రిక సంపాదకుడిగా ఆయన జర్నలిజం రంగానికి అందించిన సేవలు కూడా విశేషమని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం తెలుగు సాహిత్య రంగానికి, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  కాగా, హైదరాబాద్‌ నారాయణగూడలోని స్వగృహంలో వృద్దాప్య సమస్యలతో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణించిన సంగతి తెలిసిందే. 

  • సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.

    వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్‌ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ‍ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.

    కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్‌పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా  చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని  మాజీ మంత్రి మండిపడ్డారు. 

  • తాడేపల్లి:  చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు.  ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్‌ జగన్‌ ’ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. 

    ‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్‌, జూపూడి ప్రభాకర్‌, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్‌ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. 

    జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు చూపిస్తున్నారు? 

    మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్‌లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?

    మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్‌ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌ చేశారు చంద్రబాబూ.

     

    మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు.

     
     
     
     

     
  • సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్‌ చేసిన గోడౌన్‌ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు  గోడౌన్‌ సీజ్‌ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. 

    రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ‍ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్‌ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు. 

    మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్‌సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే  వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం.   పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది.  అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్‌ చేసిన గోడౌన్‌ను తెరిచింది. 

  • సాక్షి,గుంటూరు: కుమారి వావిలాల లీలా మహేశ్వరి మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.  

    ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య గారి కుటుంబానికి చెందిన లీలా మహేశ్వరి జీవితాంతం సేవా భావంతో జీవించారు. వావిలాల గోపాలకృష్ణయ్య  చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో పనిచేశారు.

    విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి సమాజానికి ఆదర్శనీయం. కుమారి వావిలాల లీలా మహేశ్వరి గారి మరణం సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పేర్కొన్నారు. 

     

  • సాక్షి, విజయనగరం జిల్లా: పార్టీ కమిటీలను సమర్థవంతంగా నియమించాలని, వైఎస్సార్‌సీపీని సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ప్రతి ఓటరు పేరు తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. పక్క రాష్ట్రాల్లో SIR వలన పార్టీలు ఓడిపోయాయి. అందువలన ఓటర్ లిస్ట్‌లపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సూచించారు.

    ‘‘కొందామంటే ఎరువులు లేవు. అమ్ముదామంటే పంటలకు గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం పేదల కోసం ఆలోచించడం లేదు. మాయ, మోసం, దగాతో మళ్లీ రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఒక్క స్కూల్ కట్టారా? స్కూల్స్ ఓపెన్ అయితే పుస్తకాలు, యూనిఫామ్‌లు లేవు అంటున్నారు. ప్రభుత్వ సంస్థను మూసేసి ప్రైవేట్‌కి ఇచ్చేయాలనే తాపత్రయం తప్ప పాలన పై ధ్యాస లేదు.

    ఉత్తరాంద్ర ఎమ్మెల్యేకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఏం ఉపయోగం. ఎరువులు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు. యూరియా ఇవ్వలేని దిక్కుమాలిన దుస్థితి లో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో అన్ని శాఖలు పడుకున్నాయి. హోమ్ శాఖ మాత్రం తప్పుడు కేసులు పెట్టడానికి, ఇతరులను అవమానించడానికి పని చేస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     

National

  • బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో నత్తల వేట కోసం వెళ్లిన పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతిచెందారు. మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మెుత్తం 11 మంది గల్లంతు కాగా మిగతా వారి కోసం ఆచూకీ కోసం గాలింపులు చేపడుతున్నారు.

    మృతులందరూ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో ఉన్న బెంకెట్టిపురనదిలో వేటకు నత్తల వేట కోసం వీరంతా నదిలో దిగారు గుల్లలు ఏరుతుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతయ్యారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి 8 మంది మృతదేహాలను బయిటకి తీశారు.

    మృతులలో ఏడుగురు మహిళలున్నారు. అయితే మిగతా వారి కోసం గాలింపులు చేపడుతున్నారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది అత్యంత విషాదకరమైన, బాధకరమైన ఘటన అని పేర్కొన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. 

  • ఢిల్లీ: భారతీయులపై అమెరికా జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశంలోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారని వారిని పరిగణలోకి తీసుకోకూడదన్నారు. వారు అమెరికాకు ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి  మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఒక జర్నలిస్టు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనల గురించి రూబియోను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలోనూ ఆన్‌లైన్‌లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి,  దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో అన్నారు.

    అమెరికాలో భారతీయులపై  కొంతమంది చూపే జాత్యహంకారాన్ని మొత్తం అమెరికన్ సమాజపు గుర్తింపుగా అభివర్ణించడం తప్పు అవుతుందని రూబియో స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన తోడ్పాటు అందించారని కొనియాడారు. ప్రత్యేకంగా  భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం, ప్రజా సేవలతో సహా అనేక కీలక రంగాలలో భారతీయ-అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారని ఈ సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.

    భారత్, అమెరికా మధ్య సంబంధం కేవలం సహకారానికే పరిమితం కాదని, అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.  భారత్, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని మార్కోరూబియో ప్రశంసించారు.

  • న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

    ఆదివారం ఎక్స్‌లో ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఎన్‌ఎస్‌యూఐ నిరసన తెలిపిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. “లక్షలాది మంది యువత రోడ్లపై ఉన్నారు.. 22 లక్షల పిల్లల భవిష్యత్ ఏంటో తెలియట్లేదు. అయినా ప్రధాని మౌనంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పడంపై కాదు, బాధ్యత నుంచి తప్పించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, నీట్ లాంటి ప్రశ్నపత్ర లీకులు ఆగేలా పూర్తిస్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసే వరకు మేము ఆగము” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

    నీట్ ప్రశ్నపత్రం లీక్ అంశం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని, “ప్రశ్నపత్ర లీక్ మాఫియా” పెరగడానికి అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.

    ఎక్స్‌లో కాంగ్రెస్ ట్వీట్‌ చేస్తూ.. “నీట్ ప్రశ్నపత్ర లీక్ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను చీకటిలోకి నెట్టింది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్ర లీక్ మాఫియా విస్తరిస్తోంది. బాధ్యులు మాత్రం మౌనంగా చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వినోద్‌ జాఖర్‌ నాయకత్వంలో కార్యకర్తలు పాదయాత్ర చేపట్టి, యువత వ్యతిరేక మోదీ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌తో చేసే ఈ చెలగాటాన్ని ఏ మాత్రం సహించం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కాంగ్రెస్ పేర్కొంది.

    అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్ర లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

    ఇదిలా ఉండగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.

    నిరసనకారులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ అక్రమాల్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్‌ మీడియా వేదికగా పుట్టుకొచ్చి కేవలం ఒక వారం వ్యవధిలోనే ప్రధాన పార్టీల సోషల్ మీడియా సభ్యత్వాన్ని దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు. అతని నివాసం వద్ద అవాంచనీయ ఘటనలు జరగకుండా నిరంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.  

    నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యా సంబంధిత సమస్యలపై మీమ్స్,రాజకీయ వ్యాఖ్యానాల ద్వారా గతవారం సోషల్‌మీడియాలో పురుడుపోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే రెండుకోట్లకు పైగా ఫాలోవర్స్‌ను దాటిపోయింది. సీజేఐ ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వాఖ్యల నేపథ్యంలో ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది.  

    అయితే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతాపార్టీ సంచలనం సృష్టిస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇంటికి పోలీసులు రక్షణ కల్పించారు. అతని నివాసం వద్ద రద్దీ లేకుండా చూసేందుకు, ఎంఐడీసీ వాలుజ్ ప్రాంతంలోని ఆయన నివాసానికి తాము ఇరవై నాలుగు గంటల సాధారణ పోలీసు భద్రతను కల్పించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంకజ్ అతుల్కర్  తెలిపారు. అంతేకాని ఎటువంటి బెదిరింపులు దీనికి కారణం కాదని పేర్కొన్నారు. 

    కాగా కాక్రోచ్‌ జనతా పార్టీకి పాకిస్థాన్‌, బిలియనీర్ జార్జ్‌ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు.  ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు నిరాదారమైనవన్నారు. పార్టీ ఉద్దేశ్యం కేవలం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, యువతలో అవగాహన పెంచడమేనని స్పష్టం చేశారు. 

    కాక్రోచ్ జనతా పార్టీకి కేవలం భారత్‌లోనే 94శాతం మంది ఫాలోవర్స్‌ ఉన్నారని తెలిపారు. పార్టీ డిజిటల్ ఉద్యమంపై విస్తృతమైన అణచివేత జరుగుతోందని, తమ సోషల్ మీడియా ఖాతాలన్నింటినీ, వెబ్‌సైట్‌ను తొలగించారని లేదా హ్యాక్ చేశారని, దీంతో తమ అధికారిక వేదికల్లో దేనికీ తమకు ప్రాప్యత లేకుండా పోయిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు.

  • ముంబై: మహారాష్ట్రలో బీభత్సం సృష్టించి నలుగురు మహిళల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు. ఈ రోజు( ఆదివారం) పులిని బంధించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో పులి చిక్కినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.

    కాగా రెండురోజుల క్రితం చంద్రపూర్‌ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.

    మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.  పులిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు బోనులో చిక్కింది.

  • బెంగళూరు: కర్ణాటకలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఆమె మృతికి ముందు తన చెల్లికి ఫోన్‌ పాస్‌వర్డ్‌ పంపించడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, భర్త, అత్తమామలు కలిసి ఆమెను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మృతురాలి పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు.

    ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  బెంగళూరుకు చెందిన లక్ష్మీ ప్రియ (26)కు మైసూర్ నివాసి అయిన రాజేష్ ఆరాధ్యతో మే 11, 2023న వివాహం జరిగింది. రాజేష్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బెంగళూరులోని కేఆర్‌పుర ఏరియాలోని పోలీస్ క్వార్టర్స్‌లో  వీరు నివాసం ఉంటున్నారు. కాగా, పెళ్లయిన కొద్ది రోజుల నుండే భర్త రాజేష్, మామ పాలక్షారాధ్య, అత్త భాగ్యమ్మ కలిసి అదనపు కట్నం కోసం లక్ష్మీ ప్రియను వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎనిమిది నెలల క్రితం లక్ష్మీ ప్రియ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన ఆమె, దాదాపు ఆరు నెలల పాటు అక్కడే ఉండి, ఇటీవలే తిరిగి బెంగళూరులోని పోలీస్ క్వార్టర్స్‌కు వచ్చింది.

    ఇంతలో.. మే 22, 2026 మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో లక్ష్మీ ప్రియ తన చెల్లెలు జయశ్రీకి వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపింది. అందులో తన మొబైల్ ఫోన్ 'పాస్‌వర్డ్'ను షేర్ చేసింది. సాధారణంగా కాకుండా అకస్మాత్తుగా ఫోన్ పాస్‌వర్డ్ పంపడంతో చెల్లెలికి అనుమానం వచ్చి, వెంటనే అక్కకు ఫోన్ చేసింది. కానీ లక్ష్మీ ప్రియ ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మీ ప్రియ భర్త రాజేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే లక్ష్మీ ప్రియ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాజేష్ వారికి సమాచారం అందించాడు.

    అయితే, చనిపోయే ముందు ఫోన్ పాస్‌వర్డ్ చెల్లికి పంపడం, అప్పటికే ఇంట్లో వేధింపులు జరుగుతుండటంతో.. ఇది ఆత్మహత్య కాదని, లక్ష్మీ ప్రియ మృతి వెనుక భర్త, అత్తమామల హస్తం ఉందంటూ పుట్టింటి వారు గట్టిగా నమ్ముతున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేఆర్ పుర పోలీసులు కానిస్టేబుల్ రాజేష్, అతని తల్లిదండ్రులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ క్వార్టర్స్‌లోనే కానిస్టేబుల్ భార్య ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.

  • నాందేడ్‌: మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి 47 రోజుల పాటు అదృశ్యమై, చివరకు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ పోలీసుల కంటపడ్డాడు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడు, ఇన్ని రోజుల తరువాత తన కుటుంబానికి చేరువకావడంతో స్థానికలు కంట తడి పెట్టుకున్నారు.

    నాందేడ్ జిల్లాకు చెందిన అభయ్ సురేష్ బెల్కోని, హోమియోపతి మెడిసిన్ (బీహెచ్‌ఎంఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఏప్రిల్ 4న జల్గావ్‌లోని తన కళాశాలకు బయలుదేరిన అభయ్, దారిలో తన బ్యాగ్, ఫోన్ ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకున్నాడు. తరువాత ముంబైకి చేరుకున్న అతను, ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు. అభయ్ అదృశ్యంపై అతని కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6 నుండే తీవ్ర ఆందోళన చెందుతూ, మే 16న తమ్సా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ముంబై పోలీసుల చొరవతో..
    ముంబైలోని మలాడ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన యాంటీ-బెగ్గింగ్ (బిచ్చగాళ్లపై) డ్రైవ్‌లో అభయ్ పోలీసులకు దొరికాడు. అతను శారీరకంగా చాలా బలహీనంగా ఉండటమే కాకుండా, మానసిక పరిస్థితి సరిగా లేక తన గురించి స్పష్టంగా చెప్పలేకపోయాడు. అయినప్పటికీ, పోలీసులు ఎంతో ఓపికగా ప్రయత్నించి, అతని పేరు, ఊరు వివరాలను సేకరించారు. ఆ వివరాలను నాందేడ్ పోలీసులకు తెలియపరచగా, అతను గల్లంతైన విద్యార్థి అని నిర్ధారణ అయ్యింది. అభయ్ దొరికిన విషయాన్ని పోలీసులు అతని తండ్రికి తెలియజేశారు. 47 రోజుల సుదీర్ఘ వేదన తర్వాత, తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

  • బెంగళూరు: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అందుకు కారకులు పరారవుతుంటారు. కానీ ఓ డ్రైవరు గాయపడినవారిని తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు, మరింత పరిహారం ఇస్తానన్నందుకు హైకోర్టు శిక్షను తగ్గించింది. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లా పక్షికెర నివాసి, డ్రైవరు రియాజ్‌ అహ్మద్‌ కారులో వెళ్తూ ఓ బైకిస్టును ఢీకొనడంతో గాయపడ్డాడు. అతనిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

    చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జిïÙటు దాఖలు చేశారు. స్థానిక కోర్టు రియాజ్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. తరువాతి రోజుల్లో రియాజ్‌ గాయపడి, చేతికి రాడ్‌ వేయించుకున్నాడు. డ్రైవరు వృత్తి చేయలేక కూలిపనులు చేస్తున్నాడు.

     ఈ నేపథ్యంలో శిక్షను రద్దుచేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తి జస్టిస్‌ వీ.శ్రీషానంద విచారించారు. నిందితుని పరిస్థితిని చూసి, బాధిత కుటుంబానికి మరింత పరిహారం ఇస్తే శిక్ష తగ్గిస్తానని తెలిపారు. రూ. లక్ష ఇవ్వడానికి నిందితుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఏడాది కారాగార శిక్షను ఒక్కరోజుకు జడ్జి తగ్గించారు. జూన్‌ 30లోగా పరిహారం చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే,  సంవత్సరం శిక్ష తప్పదని జడ్జి హెచ్చరించారు. 

  • యశవంతపుర: బెంగళూరు లో వీధి కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. రోడ్డుపై నడిచి వెళుతున్న మేఘన అనే యువతిపై వీధి కుక్కలు దాడికి యతి్నంచిన ఘటన రామమూర్తి నగరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హొయ్సళ నగరలో గురువారం రాత్రి యువతి ఫోన్‌లో మాట్లాడుతూ నడిచి వెళుతుండగా 15 వీధి కుక్కలు ఆమెను వెంబడించాయి. తప్పించుకోవడానికి యువతి పరుగులు తీసింది. మేఘన కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు కుక్కలను తరిమివేసి ఆమెను రక్షించారు. ఈ సంఘటనలో ఆమెకు చిన్నచిన్న గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.

     

  • చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. టీవీకే విజయ్‌ ప్రభుత్వంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ ప్రభుత్వం కేవలం డీఎంకే దయతోనే నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని స్టాలిన్ ఒక రాజకీయ పవనంగా కాకుండా 'సినిమా సునామీ'గా అభివర్ణించారు. ఓటర్లు రాజకీయ విశ్వాసంతో కాకుండా, ఒక ప్రముఖ సినీ నటుడిపై ఉన్న ఉత్సాహంతోనే విజయ్‌కు మద్దతు ఇచ్చారని ఆయన వాదించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘తమ అభిమాన నటుడు విజయ్‌ ఒక పార్టీని ప్రారంభించాడనే ఉత్సాహంతో ప్రజలు ఓటు వేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆటబొమ్మపై వారికి ఆసక్తి పోతుంది. ఒక బిడ్డ తన తల్లి కోసం వెతికినట్లే, ఓటర్లు చివరికి మళ్లీ డీఎంకే కోసం వెతుకుతారు’ అని జోస్యం చెప్పారు.

    అలాగే, టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. విజయ్‌ పార్టీ సొంతంగా 118 సీట్ల మెజారిటీ మార్కును దాటడంలో విఫలమైంది. వారు కనీసం మెజారిటీ కూడా సాధించలేకపోయారు. తమిళనాడు ప్రభుత్వం మా దయ వల్లే మనుగడ సాగిస్తోంది. ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా అది కూలిపోవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కచ్చితంగా ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదు’ అంటూ బాంబు పేల్చారు.

    ఇదే సమ​యంలో అన్నాడీఎంకే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అన్నాడీఎంకేను చీల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవన్నీ విఫలమయ్యాయని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితి అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ, కమ్యూనిస్టు పార్టీలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) వంటి పార్టీలు మొదట్లో టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మాత్రమే మద్దతు ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత మంత్రివర్గంలో చేరాయని ఆయన పేర్కొన్నారు.

    ఇక, ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 మంది సభ్యులున్న సభలో మెజారిటీ మార్కుకు అది కొద్దిలో ఆగిపోయింది. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే పార్టీలు డీఎంకే నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేశాయి. అయితే, ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సంపాదించే ప్రయత్నంలో విజయ్‌కు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకేకు ఈ ఎన్నికలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈసారి ఆ పార్టీ కేవలం 59 స్థానాలకే పరిమితమైంది. స్టాలిన్ స్వయంగా కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు.

  • సాక్షి,ఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ..‘కాక్రోచ్ జనతా పార్టీ’కి పాకిస్థాన్‌, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుంచి మద్దతు లభిస్తోంది అని వ్యాఖ్యానించారు.

    అయితే, ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. రిజిజు చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం. మా పార్టీ ఉద్దేశ్యం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడమే” అని స్పష్టం చేశారు. అభిజీత్ దిప్కే తమ పార్టీకి భారత్‌లోనే 94 శాతం మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు.

    దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ నెట్‌వర్క్‌ల నుండి ఫాలోవర్స్ సంపాదించుకునే వారిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన దేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన ఫాలోవర్స్‌. భారత్ వ్యతిరేక నెట్‌వర్క్‌ల నుంచి గుర్తింపు కోరాల్సిన అవసరం లేదు” అని అన్నారు.

     

Crime

  • హైదరాబాద్‌: న్యాయవాది మొయిజుద్దీన్‌ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్‌ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్‌తో సహా నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. 

    కాగా,  శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్‌ చేశారు. 

    ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Telangana

  • సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

    దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్‌ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. 

    ఈ సందర్భంగా.. కేటీఆర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్‌ గాలికొదిలేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్‌ఎస్‌లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్‌ఎస్‌లో పని చేసేవారికే గుర్తింపు. 

    రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్‌ఎస్‌దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్‌ఐఆర్‌పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. 

  • సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణంక కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... దీనికితోడు పడగాలులతో ప్రజలు అక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల 26 వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచి ర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, అయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో త్రీవ వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెరిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజె అలర్ట్ జారీ చేసింది.

    రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల మేర ఉంటాయని వివరించింది. శని వారం రాష్ట్రంలో అత్యవరంగా ధర్మపురి మండలం బుద్ధిశిపల్లిలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఇష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం. లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు చురుకుగా నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు శీలిస్తే గరిష్ఠ ఉష్ణోగ్రత అమ్మంలో 44.8 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలోకి విస్తరించమన్నాయి. ఈనెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. 

    నైరుతి బిహార్, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్ర వాహత ఆవర్తనం శనివారం జార్ఖండ్ ఉత్తర రత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అది, సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్గాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.

  • సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల్లోని కొన్ని కులాల పేర్లు ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కులాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    బీసీ కులాల్లో గ్రూప్‌–ఏ లోని వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులాన్ని శివ క్షత్రియగా మార్పు చేశారు. ఇదే కేటగిరీలోని వన్నార్‌ను తొలగించి ధోబీగా మార్పు చేసి రజక, చాకలి, ధోబీగా.. ఏదైనా ఒక పేరును వాడుకలోకి తీసుకోవచ్చన్నారు. వరుస సంఖ్య 7లోని దొమ్మర అనే పదాన్ని తొలగించి గడ వంశీయగా మార్పు చేశారు.

    వరుస సంఖ్య 18లో ఉన్న పిచ్చకుంట్ల పేరును వంశరాజ్‌గా మార్పు చేశారు. వరుస సంఖ్య 23లో ఉన్న వీరభద్రియను వీరముష్టి, నెట్టి కోటల, వీరభద్రియగా మార్చారు. గ్రూప్‌ డీ, వరుస సంఖ్య 5లో ఉన్న మేర కులం పేరును మేరుగా మార్పు చేశారు. వరుస సంఖ్య 29లో ఉన్న శూద్ర కులం పేరును తొలగించి తమ్మలిగా మార్చారు.  

     

Family

  • మోడు వారిని భూమిని కొంచెం మనసుపెట్టి, శ్రమించి పచ్చదనంతో కళకళలాడేలా చేయొచ్చు. అదే ఎడారిలో అంత ఈజీకాదు. చాలామటుకు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎడారిలో అడవిని పెంచడం మాటల్లో చెప్పినంత సులభం అస్సలు కాదు. ఒక వేళ పెంచినా.. మనుగడ సాధించగలడంమనేది ప్రశ్నార్థకమే. అలాంటిది సుసాధ్యం చేసి చూపించింది ఓ మహిళ. ఆనాడు ఆ చేస్తున్న పనికి సాయం అందిస్తూ కూడా..ఎడారిలో పచ్చదనం వస్తుందా అన్న ప్రశ్న ఎదురైన వెరవక ముందుకు సాగిన పచ్చని తల్లి ఆమె.

    అంతర మంగోలియాలోని మావోవుసు ఎడారిలో ఎడారీకరణను ఎదుర్కోవడానికి దశాబ్దాలుగా చెట్లను నాటుతోంది చైనాకు చెందిన 60 ఏళ్ల యుజెన్‌. 1980లలో వివాహం అనంతరం భర్తతో కలిసి మంగోలియాలోని మావోసు ఎడారికి వెళ్లింది. ఆ ప్రదేశం బలమైన గాలులు, కరువుతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అలాంటి వాతావరణంలో నివశిస్తూ..ఎడారి వ్యాప్తిని ఆపేలా చెట్లను నాటే ప్రయత్నం చేశారు ఆ దంపతులు. ఆ పని అత్యంతకష్టమైనప్పటికీ ఆ జంట ఏళ్ల తరబడి ఆ ప్రయత్నం కొనసాగించింది. 1996లో ఆమె కథ చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీలో ప్రసారమైంది. 

    దాంతో ఒక్కసారిగా యుజెన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆమె అంకిత భావానికి స్ఫూర్తి పొందిన రోనాల్డ్‌ సకోల్స్కీ అనే అమెరికన్‌ ఉపాధ్యాయుడు ఆమె లక్ష్యానికి మద్దతుగా సుమారు రూ. 4,80,000 ఇచ్చాడు. అంత పెద్ద మొత్తం చూసి ఆశ్చర్యపోయిన యుజెన్‌..ఆ డబ్బులు మొత్తం మొక్కలు నాటేందుకే వినియోగించింది. సకోల్స్కీ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ స్కూల్‌లో పనిచేస్తుండేవారు. ఆయన ఒక రోజు ఎడారిలో మొక్కలు నాటుతున్న యుజెన్‌ను చూసి అబ్బురపడ్డారు. 

    కానీ ఆమె ప్రయత్నం సాధ్యమవుతందా? లేక నిరర్థకం అవుతుందో? తెలియదు గానీ..తన వంతుగా మద్దతు అంటూ అంత సొమ్ము ఇచ్చారాయన.  కాలక్రమేణ ఎడారిలో 50 వేలకు పైగా చెట్లు పెరిగి బీడు వారిని ఎడారి కాస్తా పచ్చని భూమిలా కనువిందు చేయడం ప్రారంభించింది. ఆ అడవిని ఎలాగైనా.. ఆ ఉపాధ్యాయుడు సకోల్స్కీకి చూపించాలని యుజెన్‌ ఎంతో ప్రయాసపడి సదరు స్కూల్‌ సాయంతో అతడి ఆచూకిని తెలుసుకుని మరి ఆ అడవిని చూసేందుకు ఆహ్వానించింది. అతను ఆ ఆహ్వానానికి ఉబ్బితబ్బిబవ్వుతూ..ఆ ఫలితాన్ని చూడాలని ఎంతో కుతూహలంగా ఉందని చెప్పాడు. 

    ఈ కథ చైనాలోని ప్రతిఒక్కరిని కదలించింది. యుజెన్‌ ప్రయత్నమే అభినందనీయం అనుకుంటే.. ఆయన ఆమె ప్రయత్నానికి మద్దుతివ్వడం మరింత విశేషం. పైగా చాలామంది దీనిని సరిహద్దులు దాటి చూపిన దయ, నమ్మకం, సహకారానికి సంబంధించి..హృదయాన్ని తాకే కథగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పర్యావరణ ప్రయత్నాల ద్వారా ఇటీవల సంవత్సరాలలో ఎడారీకరణకు గురైన భూమిని తగ్గించడంలో చైనా గణనీయమైన పురోగతి సాధించిందని అధికారులు కూడా పేర్కొన్నారు.

    (చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌)

     

  • ప్రముఖ బ్యూటీ అప్లయన్స్‌ బ్రాండ్‌ ‘షార్క్‌ బ్యూటీ’ హెయిర్‌ కేర్‌ విభాగంలో సరికొత్త పరికరాన్ని ప్రవేశపెట్టింది. జుట్టును వేగంగా, సురక్షితంగా స్ట్రెయిటనింగ్‌ చేసేలా రూపొందించిన ‘సిల్కీప్రో స్ట్రెయిట్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. 

    సిల్కీప్రో స్ట్రెయిట్‌ అత్యాధునిక ‘ఎయిర్‌ పవర్డ్‌’ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది వేడికి బదులుగా గాలి ప్రవాహం ద్వారా జుట్టును స్ట్రెయిట్‌ చేస్తుంది. దీనివల్ల జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పరికరం అందరికీ అనుకూలంగా ఉంటుంది. కర్లీ, కాయిల్డ్, టెక్స్చర్డ్‌ హెయిర్‌ ఉన్నవారు కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే మృదువైన, పిన్‌–షార్ప్‌ స్ట్రెయిటనింగ్‌ పొందవచ్చు. 

    దీనికోసం ప్రత్యేకమైన ఇంటర్‌చేంజబుల్‌ కోంబ్స్‌  కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటిగ్రేటెడ్‌ హీట్‌ సెన్సర్‌ ఉంటుంది. అంటే ఇది సెకనుకు వెయ్యిసార్లు టెంపరేచర్‌ని పర్యవేక్షిస్తూ, జుట్టుకు నష్టం కలగకుండా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌ చేస్తుంది. స్నానం చేసిన వెంటనే తడి జుట్టుపై కూడా దీనిని నేరుగా ఉపయోగించవచ్చు. ఇది జుట్టును ఆరబెట్టడంతో పాటు స్ట్రెయిటెనింగ్‌ కూడా చేస్తుంది.

    కొద్దిపాటి జాగ్రత్తలతోనే ..
    ఖరీదైన క్రీములు మేనిని మెరిపిస్తాయని అనుకుంటుంటారు. కాని, మేని మెరుపు కేవలం మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులతోనే సాధ్యం కాదు. మనం పాటించే జాగ్రత్తలతోనే మేని మెరుపును కాపాడుకోవచ్చు. చాలామంది ఇంటి నుంచి బయలుదేరే ముందు సన్‌స్క్రీన్‌ రాసుకుని వదిలేస్తారు. చెమట వల్ల అది త్వరగా పోతుంది. అందుకే ప్రతి మూడు గంటలకోసారి సన్‌ స్క్రీన్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. 

    చాలామంది గంటల తరబడి ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటారు. దీని వల్ల వేడి పెరిగి చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు హెడ్‌సెట్‌ వాడటం మేలు. తాత్కాలిక మెరుపు కోసం వాడే ఉత్పత్తులు దీర్ఘకాలంలో మీ చర్మానికి హాని చేయవచ్చు. ముఖం పదేపదే కడగడం వల్ల చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతిని, చర్మం త్వరగా కమిలిపోతుంది. అలసట పోవడానికి వేడి నీళ్ల స్నానం హాయిగానే ఉన్నా, అది మీ చర్మంలోని తేమను హరిస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా పొడిబారిపోయి ముడతలు వస్తాయి.

    ముఖాన్ని మెరిపించే ముత్యాలు
    ముత్యాలు అలంకారానికే కాదు, మేనిని మెరిపించడానికీ ఉపయోగపడతాయని ప్రపంచానికి పరిచయం చేసింది చైనా. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన చైనా మహారాణి వు జెషియన్‌ అందం కోసం ముత్యాల పొడిని వాడేది. రసాయనాలతో కాకుండా సహజసిద్ధంగా తయారుచేసే ఈ పొడిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. 

    ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఒకప్పుడు కేవలం రాజకుటుంబీకులకే పరిమితమైన ఈ ప్రాచీన పద్ధతి, ప్రస్తుతం ఆధునిక చర్మ సంరక్షణ పరిశ్రమలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతోంది. నేడు అనేక ప్రముఖ బ్యూటీ బ్రాండ్లు తమ ఉత్పత్తులలో ఈ ముత్యాల పొడిని ఉపయోగిస్తూ, పురాతన చైనా అందాల రహస్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.  

    (చదవండి: ఐదు నెలల్లో 30 కేజీలు..! నో షార్ట్‌కట్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌)

  • ‘జోసెఫ్‌ కాన్రాడ్, వ్లదిమీర్‌ నబాకఫ్, వి.ఎస్‌. నైపాల్‌ తదితరులు సొంత దేశాలూ– భాషలూ– ఖండాలూ– సంస్కృతులూ– ఒక్కమాటలో చెప్తే సొంత నాగరికతలను అధిగమించి, వేర్వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆ వలసలు వారి ఊహాశక్తికి పదునుపెట్టి, పోషణనిచ్చాయి. అవి వలసల వల్ల సంక్రమించినవి. నా విషయంలో అలా చెప్పుకోడానికేమీ లేదు! ఒకే నగరం– ఒకే వీథి– ఒకే భవనంలో నా జీవితంలో అత్యధికభాగం గడిచిపోయింది. 

    అక్కడి నుంచే, అదే దృశ్యాన్ని, అదే కోణంలోంచి చూస్తూ ఇన్నాళ్ళూ గడిపేశాను. నన్ను ‘నేను’గా మార్చిన నగరంతో నాకున్న ప్రగాఢ అనుబంధం అలాంటిది’ అన్నారు ఫెరీత్‌ (ఫరీద్‌) అర్హాన్‌ పముక్‌. 2006లో నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకునే నాటికే అర్హాన్‌ పముక్‌ సుప్రసిద్ధుడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా వున్న అర్హాన్‌ పముక్, యాభయ్యేళ్ళకు పైగా సాహిత్యరంగంలోనూ కృషి కొనసాగిస్తూనే వున్నారు.

    దాదాపు డజను నవలలు రాసిన పముక్‌ కాల్పనికేతర సాహిత్యం కూడా బోలెడంత రాశారు. ‘ఇస్తాంబుల్‌– జ్ఞాపక నగరి’ అనే రచన అలాంటిదే! అది సగం జ్ఞాపకాల నెమరువేత ఐతే, మరికొంత ఇస్తాంబుల్‌ నగర జాతక చక్రం! ఆసియా–ఐరోపా ఖండాల మధ్య యుగయుగాలుగా విస్తరించి ఉన్న భూమార్గంలో చిట్టచివరి మజిలీ ఇస్తాంబుల్‌. ఈ చారిత్రక నగరం తూర్పు భాగం ఆసియాలో వుండగా, పడమటి భాగం యూరపులో చేరింది. 

    తూర్పు ఇస్తాంబుల్‌లోని ‘పముక్‌ భవంతి’ పే...ద్ద అపార్టుమెంట్‌ సముదాయం. అర్హాన్‌ పముక్‌ బంధువులందరూ ఆ భవంతిలోని ఒక్కో అపార్టుమెంట్‌లో సకుటుంబంగా జీవిస్తూ వుంటారు. మధ్యలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వుండివచ్చినా, ఎక్కువ కాలం ఆ భవంతిలోనే వున్నానంటారు పముక్‌. వలస జీవన విధానం ఒకరకం శక్తినిస్తే, ఒకే చోట పాతుకుపోయి జీవించడం మరోరకం శక్తిని ఇస్తుందని పముక్‌ రుజువు చేశారు. ప్రపంచంలోని ప్రతి చెప్పుకోదగిన నగరంలోని జీవిత విధానం పైనా ఎవరో ఒకరు ఏదో ఓ రూపంలో రాస్తూనే వున్నారు. అంచేత పముక్‌ గొప్పతనం ఆయనొక్కడే వాళ్ళ నగరం గురించి రాయడంలో లేదు– అది రాసిన పద్ధతిలో ఉంది!

    సామాన్య శకం నాలుగో శతాబ్దిలో, తూర్పు రోమన్‌ సామ్రాజ్య రాజధానిగా నిర్మితమైన కాన్‌స్టాంటినోపుల్‌ నగరమే, ఆరేడు వందల సంవత్సరాల తర్వాత ఇస్తాంబుల్‌గా మారిందని యూరపియన్‌ చరిత్ర రచయితలు అంటారు. కానీ, అంతకు రెండువేల యేళ్ళకు ముందునుంచీ ఈ నగరం ఉన్న ప్రాంతం జనావాసంగా వుంటూనే వచ్చిందని ఆసియన్‌ చరిత్ర గ్రంథాల సమాచారం. బైజాంటియన్‌ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. మూడువేల సంవత్సరాల కిందట మతం– రాజకీయం రెండు స్వతంత్ర శాఖలుగా చీలక ముందటి మాట యిది. అసలు ‘బిజాంతీన్‌’ అంటేనే సంక్లిష్ట సమన్వయమని అర్థం! ఈ ప్రాంత చరిత్ర వరకూ ఇది అక్షరాలా సార్థకం!!

    ‘ప్రాక్పశ్చిమ నాగరికతల మధ్య నిర్మించిన వారధులు’గా పముక్‌ రచనలను పేర్కొన్నారు నోబెల్‌ పురస్కారం ఎంపిక సంఘంలోని నిపుణులు! ‘రెండు నాగరికతల మేలికలయిక ఇస్తాంబుల్‌. దాని ‘వ్యాకులిత ఆత్మ’ను సరికొత్త ప్రతీకల సాయంతో శోధించిన వాడు పముక్‌. భిన్న సంస్కృతుల మధ్య తలెత్తే ఘర్షణలనూ– సమన్వయాన్నీ కూడా గొప్పగా చిత్రించినందుకు ఈ జ్యూరీ పముక్‌ను అభినందించింది. భిన్న భాషలూ, సంస్కృతులూ, మతాల మధ్య ఏర్పడే ఘర్షణలకు నూతన భాష్యాలు చెప్తూ, వాటికి ‘అనూహ్య సమన్వయాలను సూచించినందుకు’ పముక్‌ను జ్యూరీ కొనియాడింది. 

    అంతటితో ఆగితే బావుండేది– ‘వర్తమాన సాహిత్య ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వ్యక్తి పముక్‌’ అని జ్యూరీ ప్రకటించడంతో ఇంటా బయటా కూడా పెద్ద దుమారమే చెలరేగింది. కొందరు దాన్ని ‘కేవలం రాజకీయ ప్రకటన’గా చిత్రించి కొట్టిపారేశారు. మరికొందరు ఈ ప్రకటనను ‘టర్కిష్‌ సాహిత్యం సాధించిన ఘనవిజయం’గా జమకట్టారు. అయినా, మన సాహిత్య వేత్తల సుహృద్భావం మనకు తెలియనిదా? నక్కలెక్కడికెళ్ళినా ఊళలే వేస్తాయి–కోయిల ఏ దేశంలోనైనా తియ్యగానే పాడుతుంది! ఆ విషయం అలా వుంచండి!!

    ‘ప్రతి మనిషీ జీవితంలో ఒకసారైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పరిసరాలు అప్పుడెలా వుండేవో, ఇప్పుడెల వున్నయో పునఃపరిశీలించుకోడానికి అది వుపయోగపడుతుంది. ఈ విశ్వం ఎంతో విశాలమైంది. దానిలోని ఒకానొక మూలనే, ఒకానొక రోజునే, ఒకానొక కుటుంబంలోనే మనం పుట్టాలని జీవితమనే లాటరీ ఎందుకు నిర్ణయించింది? ఆ కుటుంబం మనల్ని ఎందుకంతగా ప్రేమిస్తుంది? మనమెందుకు వాళ్ళను అంతగా అభిమానిస్తాం? ఏమో– ఇంతకన్నా మెరుగైన జీవితానికి అర్హులమేమో మనం? వయసుడిగిన ఓ నగరంలో పుట్టడం నా దురదృష్టమేమో అనిపిస్తుంది ఒక్కోసారి’ అన్నారు పముక్‌ ‘ఇస్తాంబుల్‌  నగరం – కొన్ని జ్ఞాపక కథలు’ పుస్తకానికి రాసిన ముందు మాటలో. 

    ఆ పుస్తకం చదువుతూ పోతుంటే అవి ఓ వ్యక్తి జ్ఞాపకాలో, ఒకానొక నగరం స్వగతమో మర్చిపోతూ వుంటాం. ఒక వ్యక్తి విరాట్‌ రూపంలో ఓ చారిత్రక మహానగరాన్ని ఆక్రమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!! అదే పముక్‌ వేసిన మంత్రం. ఇది అందరికీ చేతనయ్యే ట్రిక్కు కాదు. కనుకనే, ఫెరీత్‌ అర్హాన్‌ పముక్‌కు నోబెల్‌ సాహిత్య పురస్కారం దక్కింది.

    -మందలపర్తి కిషోర్‌

  • శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్‌ సైన్స్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.

    ‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్‌!
    ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్‌ (సైన్స్‌ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!

    నెట్‌వర్క్‌గా సాగుతోంది
    నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.

    అబద్దపు నివేదికలు, ప్రసంశలు
    ప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్‌వెస్టర్న్‌ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం;  నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్‌ ఆథర్‌) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్‌ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్‌ అమరల్‌ కలవరపడుతున్నారు. అమరల్‌ నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీకి చెందిన సోషల్‌ సిస్టమ్స్, ఇంజనీరింగ్‌ సైన్సెస్‌ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్‌ రిచర్డ్‌సన్‌తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్‌.ఎ.ఎస్‌. (ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌) జర్నల్‌లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ మద్దతు కూడా వీరికి లభించింది. 

    తవ్వి తీశారు
    అమరల్‌ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్‌ ఆఫ్‌ సైన్స్‌’, ‘స్కోపస్‌’, ‘పబ్‌మెడ్‌’ వంటి పేరున్న డేటాబేస్‌ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్‌ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్‌ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్‌వర్క్‌లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్‌ వాచ్‌’, ‘పబ్‌పీర్‌’ వంటి వాచ్‌డాగ్‌ ప్లాట్‌ఫామ్‌లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.

    ఎంత డబ్బుకు అంత హోదా!
    శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్‌వర్క్‌లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్‌లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు.  ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్‌ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్‌ టీమ్‌ పసిగట్టింది.

    నివారించటం ఎలా?!
    ఈ వ్యవస్థీకృత ‘ఫేక్‌ రీసెర్చ్‌’ వైరస్‌ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్‌సన్‌ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్‌ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్‌ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్‌ ఆధారంగా సరికొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా      చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్‌ హౌస్‌లు తప్పనిసరిగా వాడాలి.

    ఏఐతో మరింత ముప్పు!
    శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్‌ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్‌సన్‌ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్‌ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. 

    అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్‌ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్‌ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!
    ∙ సాక్షి స్పెషల్‌ డెస్క్‌

    మేధా దోపిడీకి పరాకాష్ఠ
    నకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్‌ అమరల్‌ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్‌లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి,  తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్‌సైట్‌ డొమైన్‌లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్‌కు చెందిన ‘హెచ్‌.ఐ.వి. నర్సింగ్‌’ జర్నల్‌ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్‌ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్‌ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్‌ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

    ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌
    నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్‌ అమరల్‌ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్‌ సైన్సెస్, ఇంజినీరింగ్‌ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్‌ స్కానింగ్‌ సిస్టమ్‌’ సాఫ్ట్‌వేర్‌ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే  క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్‌ వన్‌’  జర్నల్‌ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది.

  • మీ చెప్పుకు స్ట్రిప్‌ ఉందా?.. ఇదేంటి.. మీ పేస్టులో ఉప్పుందా అని యాడ్‌ చూశాం కానీ చెప్పు స్ట్రిప్‌ గురించి అడుగుతున్నారేంటి? అనుకుంటున్నారా? అంతే కాదండోయ్‌.. మీరు వేసుకుంది చెప్పులా? శాండిల్సా? ఇవేం ప్రశ్నలని ఆశ్చర్యపోతున్నారా?  కానీ, ఇదే ప్రశ్న దేశ రాజధానిలో సుమారు 14 ఏళ్ల పాటు ఓ సంస్థను కార్యాలయాల చుట్టూ తిప్పింది. కోర్టు మెట్లు ఎక్కించింది. న్యాయపోరాటానికి కారణమైంది. చెప్పులు అని వేటిని అంటారు. శాండిల్స్‌కు ఉండాల్సిన అర్హత ఏంటనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఏవి చెప్పులో.. ఏవి శాండిల్సో చివరికి ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఓ పరిష్కారం లభించింది.

    చెన్నైకి చెందిన విశాల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ 2003 మే 15న మహిళల పాదరక్షలను విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ వాటిని ‘లేడీస్‌ లెదర్‌ శాండిల్స్‌’గా పేర్కొంటూ, ఆ కేటగిరీకి వర్తించే 10 శాతం డ్రా బ్యాక్‌ రాయితీని కోరింది. అయితే ఇవి శాండిల్స్‌ కాదు చెప్పులు అని కస్టమ్స్‌ శాఖ సుంకం రాయితీని ఐదు శాతానికి తగ్గించింది. దీంతో అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘చప్పల్‌’ నిర్వచనాన్ని సంస్థ అంగీకరించలేదు. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇది దేశవ్యాప్తంగా ఎగుమతిదారుల్లో చర్చనీయాంశంగా మారింది. 

    రెండు సంస్థలు.. విభిన్న నివేదికలు
    ఎగుమతి వస్తువు ఏ కేటగిరీ కిందికి వస్తుందనేది నిర్ధారించేందుకు పాదరక్షల నమూనాను న్యూఢిల్లీలోని లెదర్‌ ఎక్స్‌పోర్టు కౌన్సిల్‌కు విశాల్‌ సంస్థ పంపింది. ఆ కౌన్సిల్‌లోని సభ్యులు వాటిని పరిశీలించి అవి లెదర్‌ శాండిల్స్‌గా నిర్ధారించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ఎస్‌ఐఐబీ  ఆ నమూనాను కౌన్సిల్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థకు(ఎఫ్‌డీడీఐ) పంపించింది. ఆ ఎగుమతి వస్తువులు ‘చెప్పుల’ కేటగిరీకి చెందినవిగా పేర్కొంది. ఈ కేటగిరీకి 10% సుంకం రాయితీ రాదని, 5% మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. 

    సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ
    లెదర్‌ ఎక్స్‌పోర్టు కౌన్సిల్‌ లేఖ ఆధారంగా కస్టమ్స్‌ శాఖ విశాల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కేటగిరీని తప్పుగా నమోదు చేసి చెల్లించిన వ్యత్యాస డ్యూటీ డ్రా బ్యాక్‌ మొత్తం రూ. 1,30,800 నెలకు 15% వడ్డీతో కలిపి ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. కస్టమ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 114 ప్రకారం జరిమానా విధించే ప్రతిపాదన కూడా నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం కల్పించింది.

    జరిమానా విధింపు
    ఎఫ్‌డీడీఐ నిర్ణయంతో ఏకీభవించడం లేదంటూ విశాల్‌ సంస్థ షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇచ్చింది. 
    అనంతరం డ్రా బ్యాక్‌ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, అదనంగా రూ. 1.25 లక్షల జరిమానా చెల్లించాలని కస్టమ్స్‌ అదనపు కమిషనర్‌ ఆర్డర్‌ జారీ చేశారు. దీనిపై సంస్థ కస్టమ్స్‌ కలెక్టర్‌ (అప్పీల్స్‌) వద్ద అప్పీలు దాఖలు చేసింది. ఆ అప్పీల్‌ను తిరస్కరించారు. దీంతో  కేంద్ర ప్రభుత్వానికి రివిజన్‌ దరఖాస్తు సమర్పించింది. ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ నైపుణ్యం కలిగిన సంస్థ కావున ఆ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది.  జరిమానా మొత్తాన్ని రూ. 10,000కు తగ్గించింది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారపరంగా ఆ పుట్‌వేర్‌ను ‘లెదర్‌ శాండల్స్‌’గానే వర్గీకరిస్తున్నారని విశాల్‌ సంస్థ పేర్కొంది. 

    ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌
    చివరకు సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కస్టమ్స్‌ శాఖ వర్గీకరణ సరైంది కాదని, తాము ఎగుమతి చేసిన పుట్‌వేర్‌ను శాండిల్స్‌గా పరిగణించాలని, శాండిల్స్‌కు వర్తించే సుంకం రాయితీ వర్తింపజేయాలని, కస్టమ్స్‌ శాఖ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. 

    ఏది చప్పల్‌? ఏది శాండల్‌?
    వెనుక భాగంలో స్ట్రిప్‌ లేకపోతే అది శాండిల్‌ కాదు చప్పల్‌గానే పరిగణించాలన్న కస్టమ్స్‌ శాఖ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఒకే ఒక లక్షణం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. వ్యాపారులు, వినియోగదారులు ఒక ఉత్పత్తిని ఎలా పిలుస్తారో అదే ప్రామాణికమని పేర్కొంది. టెక్నికల్‌గా అధికారులు ఏ పేరు పెట్టినా మార్కెట్‌లో అది లేడీస్‌ లెదర్‌ శాండిల్స్‌గానే గుర్తింపు పొందిందనే అంశాన్ని గుర్తించాలని పేర్కొంది. 

    కోర్టు తీర్పు ఇలా..
    లెదర్‌ ఫుట్‌వేర్‌ వర్గీకరణపై దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఢిల్లీ హైకోర్టు 2017లో ముగింపు పలికింది. 
    కస్టమ్స్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎగుమతి చేసిన ఉత్పత్తిని చప్పల్స్‌’గా వర్గీకరించిన విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పుట్‌వేర్‌లో అనేక నమూనాలు ఉంటాయని, వాటన్నింటికీ ఒకే కొలమానం పెట్టలేమని స్పష్టం చేసింది. చెప్పులు, శాండిల్స్‌కు ఉన్న టెక్నికల్‌ తేడాలను పేర్కొంది.  సంబంధిత శాఖ ఆదేశాల్ని కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది. 
    సాధారణంగా చట్టంలో ఒక ఉత్పత్తికి స్పష్టమైన నిర్వచనం లేని సందర్భంలో ‘కమర్షియల్‌ పారాలెన్స్‌ టెస్ట్‌’ను కోర్టులు ప్రామాణికంగా భావిస్తాయి.. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కాంపోజిషన్, టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ను కూడా చూడాలని న్యాయ స్థానాలు పలు కేసుల్లో స్పష్టం చేశాయి. 

    ∙దిలీప్‌ మాదిరెడ్డి

  • బరువు తగ్గడం అనగానే కఠినమైన వ్యాయామాలు, స్ట్రిక్ట​ డైట్‌నే ఫాలో అయిపోతుంటారు. నిజానికి ఇలా ఎప్పుడైతే శరీరాన్ని ఒకేసారి కష్టపెడతామో అదికాస్తా సహకరించడానికి బదులుగా వ్యతిరేకించడం మొదలుపెడుతుంది. ఫలితంగా బరువు తగ్గడం దేవుడెరుగు మొత్తానికి మరిన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవ్వుతాయని అంటోంది ఈ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. చిన్నచిన్న మార్పులే అద్భుతం చేస్తాయని..త్వరిగతిన బరువు తగ్గుతామని అంటున్నారామె. అదెలాగంటే..

    ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్‌ కేవలం ఐదు నెలల్లో 30 కేజీలు తగ్గారు. అందుకోసం ఎలాంటి టెక్నిక్స్‌ ఫాలో అయ్యారో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారు. నిజానికి కఠినమైన వ్యాయామాలు, డైట్‌లు త్వరిగతగతిన అలిసిపోయేలా చేసి, బరువు తగ్గడాన్న మధ్యలోనే వదిలేస్తారని చెబుతోందామె. అదే చిన్నగా శరీరం అలవాటుపడేలా నెమ్మదిగా పెంచుకుంటూ పోతే అద్భుతమైన ఫలితాలు పొందుతామని అంటోంది. తానేమి కఠినమైన డైట్‌లు, రెండు గంటల జిమ్‌ సెషన్‌లు వంటివి చేయలేదన్నారామె. 

    తాను అనుసరించిన విధానం అందరు చూసి నవ్వేలా, సిగ్గుపడేంతగా మొదలైందని చెబుతోంది. అంటే అంతా రోజూ పదివేల అడుగులతో దినచర్య మొదలుపెడితే, తానే కేవలం 4000 అడుగులతో తన వెయిట్‌లాస్‌ని మొదలుపెట్టానని అంటోంది. ఎందుకంటే అధిక బరువు ఉన్నవాళ్లకు ప్రారంభంలోనే అధిక వర్కౌట్లు సమస్యాత్మకమవుతాయని అంటోందామె. శరీరం మనం చేసే వ్యాయామాలకు అలవాటుపడుతుందనగా, నెమ్మదిగా, నిధానంగా వర్కౌట్లు, అడుగులు పెంచాలని సూచిస్తోంది. 

    ఇక్కడ లక్ష్యం కేవలం కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడం కాదని అంటోంది. అలాగే ఆయాసం, శ్రమతో కూడిన విధంగా వర్కౌట్లు చేయొద్దని అంటున్నారు. సంతోషంగా ఎంజాయ్‌ చేసేలా మొదలుపెట్టండి, బాడీ అలవాటు పడుతుందనగా చిన్నగా కార్డియోసెషన్‌ వంటి వేగవంతమైనవి మొదలు పెట్టమని అంటోంది. అలా చేయడం వల్ల కీళ్లు మరింత బలపడతాయి, తెలియకుండానే ఆ వర్కౌట్లకు అలవాటుపడేలా కోలుకుంటారు. 

    అదీగాక భారాన్ని తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. నెమ్మదగా దశల వారీగా సాగే ప్రక్రియని, రాత్రికి రాత్రే జరిగేది కానీ తేల్చి చెప్పారామె. కేవలం స్థిరంగా నిదానంగా, ఓపికతో చేస్తుకుంటూ వెళ్తే..అనుకున్నది సాధ్యమవుతుందని చెబుతోందామె.

     

    (చదవండి: 40 డిగ్గ్రీల ఉష్ణోగ్రతల్లో సైతం ఇళ్లను కూల్‌గా..! ఆ ఐడియాకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా)

     

     

  • అనగనగా ఒక  అడవి. ఆ అడవికి సింహం రాజు. తోటి ప్రాణులను అది హీనంగా చూసేది. ఒకనాడు ఆ సింహం నీళ్లు తాగడానికి వాగు దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది.సింహం ఏనుగును చూసి గర్జిస్తూ ఇలా అంది, ‘ఓయ్‌ ఏనుగు! ఈ రోజు పొట్ట నిండా అరటిపండ్లు తిన్నట్లు ఉన్నావు కదా?’ఏనుగు ప్రశాంతంగా, ‘అవును రాజా, నా ఆకలి తీర్చుకున్నాను’ అని బదులిచ్చింది.అప్పుడు సింహం అధికారాన్ని ప్రదర్శిస్తూ, ‘విను! రేపటి నుండి నువ్వు ఆహారం తినే ముందు రెండు గెలల అరటిపండ్లను నా గుహలో పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు ముట్టాలి, అర్థమైందా?’ అని గర్జించింది.ఏనుగు ఏమాత్రం తడబడకుండా, ‘క్షమించు రాజా! నేను నీకు సేవకుడిని కాదు. 

    నీ ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధంగా లేను’ అని చెప్పింది.సింహం కోపంతో కళ్లెర్రజేసింది. ఏనుగు భయపడకుండా, ‘నీవు అడవికి రాజువు మాత్రమే, యజమానివి కాదు అని గుర్తుంచుకో! నీ అంత శక్తి నాకూ ఉంది.’ అంది.ఏనుగు అలా సమాధానం చెప్పేసరికి, సింహం అవమానంతో వెనుదిరిగింది. దారిలో ఒక ఎలుగుబంటి తేనె తాగుతూ కనిపించింది.సింహం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ‘ఒరేయ్‌ ఎలుగుబంటి! రేపటి నుండి నువ్వు సంపాదించే తేనెలో రెండు పెద్ద పట్టులు నా గుహలో సమర్పించాలి’ అని ఆజ్ఞాపించింది.ఎలుగుబంటి నవ్వుతూ, ‘రాజా! తేనెటీగలతో కుట్టించుకుని, ప్రాణాలకు తెగించి తెచ్చుకునే నా కష్టార్జితాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించింది.

    సింహం ఆశ్చర్యపోతూ ఉండగా, ఎలుగుబంటి మళ్ళీ ఇలా అంది: ‘కష్టపడి సంపాదించేది మేము, కూర్చుని తినేది నువ్వా? ఇది న్యాయం కాదు. నేను నీ సేవకుడిని కాను.’మరోసారి పరాభవం ఎదురవడంతో సింహం ముందుకు సాగింది. ఒక చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతి దానికి కనిపించింది.సింహం కోతిని చూసి, ‘ఓయ్‌ కోతి! రేపటి నుండి రెండు బుట్టల మామిడి పండ్లను నా గుహలో పెట్టాలి. నేను తిన్నాకే నువ్వు తినాలి’ అని çహూంకరించింది.కోతి కిచకిచ నవ్వుతూ, ‘రాజా! నీ గర్జనలకు భయపడే కాలం పోయింది. మేము గౌరవించేది నీ పదవిని మాత్రమే, నీ గర్వాన్ని కాదు’ అని చెప్పింది.

    కోతి ఇంకా ఇలా అంది: ‘మేము నిన్ను రాజుగా చూస్తున్నాము కాని, నీకు దాసోహం అనడం లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికీ ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదు.’సింహం తన గుహకు వెళ్లి దీర్ఘంగా ఆలోచించసాగింది.‘ఏనుగు ధిక్కారం, ఎలుగుబంటి నిజాయితీ, కోతి చెప్పిన హితవు అన్నీ నిజమే కదా!’ అని మనసులో అనుకుంది.తన గర్వం వల్లే అందరూ తనను వ్యతిరేకిస్తున్నారని గ్రహించింది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని దానికి అర్థమైంది.మరుసటి రోజు నుండి సింహం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అడవిలో ఏ ప్రాణి కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మొదలుపెట్టింది.

    ఒక కుందేలును చూసి సింహం, ‘ఏమ్మా! బాగున్నావా? నీకు ఏమైనా సహాయం కావాలా?’ అని ప్రేమగా అడిగింది.సింహంలోని ఈ మార్పు చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. క్రమంగా అవి మళ్ళీ రాజు దగ్గరకు చేరడం ప్రారంభించాయి.ఏనుగు వచ్చి, ‘రాజా! నీలోని ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పొగిడింది.ఎలుగుబంటి కూడా వచ్చి, ‘నిజమైన రాజువంటే నువ్వే రాజా! ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాము’ అని అంది.అప్పటి నుండి సింహం ఎవరినీ ఆహారం అడగలేదు, ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. అడవిలోని జీవులన్నీ సింహాన్ని నిజమైన మృగరాజుగా కీర్తించాయి.

    అల్పతోయశ్చలత్కుంభో అల్పదుగ్ధాశ్చ ధేనవఃఅల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితఃనీళ్లు తక్కువున్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలిస్తుంది. చదువు తక్కువున్న వాడికి గర్వం ఎక్కువగా ఉంటుంది. కురూపికి అతిచేష్టలు ఎక్కువగా ఉంటాయి.